-
French Open: పీవీ సింధుకు పరభావం.. క్వార్టర్స్లో ఓటమి
ఫ్రెంచ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు కథ ముగిసింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్స్లో చైనాకు చెందిన చెన్ యు ఫీ చేతిలో ఓటమి పాలైంది. క్వార్టర్స్లో అద్భుతమైన పోరాట పటిమ చూపించిన సింధు.. ఆఖరికి 24-22,17-21, 18-21తో పరాజయం చవిచూసింది. హోరాహోరీగా సాగిన తొలి సెట్లో 24-22 తేడాతో చెన్ యు ఫీని ఓడించిన సింధూ.. రెండు, మూడు సెట్లను మాత్రం ప్రత్యర్థికి కోల్పోయింది. రెండు, మూడు సెట్లలో ప్రత్యర్ధి చెన్ యు ఫీ అద్బుతమైన కమ్బ్యాక్ ఇచ్చింది. ఎటువంటి తప్పిదాలు చేయకుండా సెమీస్బెర్త్ను ఖారారు చేసుకుంది. మరోవైపు పురుషుల డబుల్స్లో సాత్విక్సాయిరాజ్, చిరాగ్శెట్టి జోడీ 21-19, 21-13తో సుపక్ జొంకో, కెడ్రెన్(థాయ్లాండ్) జోడీని ఓడించి సెమీఫైనల్లోకి ప్రవేశించింది. తొలి గేమ్ను కష్టంగా గెలిచిన సాత్విక్, చిరాగ్ జంట.. రెండో గేమ్ను అలవోకగా దక్కించుకున్నారు. సెమీస్లో మిన్ హ్యుక్ కాంగ్, సెయింగ్ జయె(కొరియా) జోడీతో తలపడనున్నారు. చదవండి: IPL 2024: ఫ్యాన్స్కు బ్యాడ్ న్యూస్.. రోహిత్ శర్మ సంచలన నిర్ణయం..!? -
సాత్విక్-చిరాగ్ జోడి సంచలనం.. కొరియా ఓపెన్ కైవసం
భారత స్టార్ డబుల్స్ జోడి సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టిలు కొరియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ విజేతగా నిలిచారు. ఆదివారం జరిగిన పరుషుల డబుల్స్ ఫైనల్లో ఈ ద్వయం.. ఇండోనేషియాకు చెందిన టాప్ సీడ్ ఫజర్ అల్పయాన్–ముహమ్మద్ రియాన్ జంటపై 17-21, 21-13, 21-14 తేడాతో విజయాన్ని సాధించారు. కాగా గత నెల ఈ జోడి ఇండోనేషియా ఓపెన్ టైటిల్ గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఇక మ్యాచ్లో తొలి గేమ్ను 17-21తో ఓడిపోయినప్పటికి రెండో గేమ్లో ఫుంజుకున్న సాత్విక్-చిరాగ్ శెట్టి జోడి ప్రత్యర్థి జంట సర్వీస్ను పదే పదే బ్రేక్ చేస్తూ ఆధిక్యంలో దూసుకెళ్లారు. 21-13తో రెండో గేమ్ను సొంతం చేసుకున్నారు. ఇక కీలకమైన మూడో గేమ్లోనూ బలమైన స్మాష్ సర్వీస్లతో విరుచుకుపడిన సాత్విక్-చిరాగ్ జోడి ప్రత్యర్థికి ఏ మాత్రం అవకాశమివ్వకుండా 21-14తో గేమ్ను ముగించి చాంపియన్స్గా అవతరించారు. ఓవరాల్గా ఈ జంటకు ఇది మూడో BWF వరల్డ్ టూర్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నీ టైటిల్ కావడం విశేషం. 𝐂𝐇𝐀𝐌𝐏𝐈𝐎𝐍𝐒 🏆🤩 Satwik-Chirag win their 3️⃣rd #BWFWorldTour Super 500 title 🥳 📸: @badmintonphoto @himantabiswa | @sanjay091968 | @lakhaniarun1 #KoreaOpen2023#IndiaontheRise#Badminton pic.twitter.com/t0osXuHCFS — BAI Media (@BAI_Media) July 23, 2023 Korea Open: SatChi defeated Alfian/Ardianto in a 3 setter battle to win the title, 3rd title of the year.. What a great pair they have become, df. WN2 pair in SF and WN1 pair in Final.. #Badminton #KoreaOpen pic.twitter.com/JQt8p3BegQ — Aditya Narayan Singh (@AdityaNSingh87) July 23, 2023 చదవండి: #Gianluigi Donnarumma: దోపిడి దొంగల బీభత్సం.. గోల్కీపర్, అతని భార్యను బంధించి -
గర్వంగా ఉంది: సాత్విక్- చిరాగ్లకు సీఎం జగన్ అభినందనలు
Satwiksairaj- Chirag Shetty: బ్యాడ్మింటన్ క్రీడాకారులు సాత్విక్ సాయిరాజ్- చిరాగ్ శెట్టిలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్షిప్-2023లో పసిడి పతకం గెలిచిన సాత్విక్- చిరాగ్లను ఆయన అభినందించారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కు చెందిన సాత్విక్ విజయాల పట్ల గర్వపడుతున్నానని పేర్కొన్నారు. ఈ మేరకు సీఎం వైఎస్ జగన్ సోమవారం ట్వీట్ చేశారు. కాగా సుదీర్ఘ విరామం తర్వాత.. ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో భారత్కు ఎట్టకేలకు రెండో స్వర్ణం లభించిన విషయం తెలిసిందే. 1965లో పురుషుల సింగిల్స్లో దినేశ్ ఖన్నా చాంపియన్గా నిలవగా.. 58 ఏళ్ల తర్వాత పురుషుల డబుల్స్లో సాత్విక్- చిరాగ్ తమ అద్భుత ఆటతీరుతో భారత్కు పసిడి పతకం అందించారు. ఈ భారత జోడీ పురుషుల డబుల్స్ ఫైనల్స్లో ప్రపంచ ఎనిమిదో ర్యాంక్ ఒంగ్ యె సిన్–తియో ఈ యి (చైనీస్ తైపీ) జంటను ఓడించి విజేతగా అవతరించింది. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి భారతీయ జోడీగా సరికొత్త చరిత్ర సృష్టించారు సాత్విక్- చిరాగ్. సాత్విక్ సాయిరాజ్ ఆంధ్రప్రదేశ్కు చెందినవాడు కాగా.. చిరాగ్ శెట్టి స్వరాష్ట్రం మహారాష్ట్ర. చదవండి: IPL 2023: మిస్టర్ కూల్కు ఆగ్రహం! వైరల్ వీడియో చూశారా? -
సాత్విక్- చిరాగ్ సరికొత్త చరిత్ర.. తొలి భారతీయ జోడీగా రికార్డు
Satwiksairaj Rankireddy- Chirag Shetty- బాసెల్: కీలకదశలో పట్టుదల కోల్పోకుండా ఆడిన భారత బ్యాడ్మింటన్ జోడీ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి స్విస్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–300 టోర్నీలో పురుషుల డబుల్స్ టైటిల్ను సొంతం చేసుకుంది. 68 ఏళ్ల ఈ టోర్నీ చరిత్రలో పురుషుల డబుల్స్ టైటిల్ నెగ్గిన తొలి భారతీయ జోడీగా సాత్విక్–చిరాగ్ గుర్తింపు పొందింది. ఆదివారం హోరాహోరీగా జరిగిన ఫైనల్లో రెండో సీడ్ సాత్విక్–చిరాగ్ జంట 54 నిమిషాల్లో 21–19, 24–22తో రెన్ జియాంగ్ యు–టాన్ కియాంగ్ (చైనా) జోడీపై విజయం సాధించింది. ఆంధ్రప్రదేశ్కు చెందిన సాత్విక్, మహారాష్ట్ర ప్లేయర్ చిరాగ్ శెట్టిలకు ఈ ఏడాది ఇదే తొలి టైటిల్ కాగా, ఓవరాల్గా ఐదో టైటిల్. ఐదో టైటిల్! ఇక విజేతగా నిలిచిన సాత్విక్–చిరాగ్ జోడీకి 16,590 డాలర్ల (రూ. 13 లక్షల 66 వేలు) ప్రైజ్మనీ, 7000 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. కాగా సాత్విక్–చిరాగ్ కెరీర్లో గెలిచిన వరల్డ్ టూర్ డబుల్స్ టైటిల్స్. స్విస్ ఓపెన్ కంటే ముందు ఈ జంట హైదరాబాద్ ఓపెన్ (2018), థాయ్లాండ్ ఓపెన్ (2019), ఫ్రెంచ్ ఓపెన్ (2022), ఇండియా ఓపెన్ (2022) టోర్నీల్లో విజేతగా నిలిచారు. ఏడోసారి స్విస్ ఓపెన్లో భారత్ ప్లేయర్లకు టైటిల్ దక్కడం ఇది ఏడోసారి. మహిళల సింగిల్స్లో సైనా నెహ్వాల్ (2011, 2012), పీవీ సింధు (2022)... పురుషుల సింగిల్స్లో కిడాంబి శ్రీకాంత్ (2015), హెచ్ఎస్ ప్రణయ్ (2016), సమీర్ వర్మ (2018)... పురుషుల డబుల్స్లో సాత్విక్–చిరాగ్ (2023) విజేతగా నిలిచారు. ఇవి కూడా చదవండి: బోపన్న జోడీకి షాక్ ఫ్లోరిడా: గతవారం ఇండియన్ వెల్స్ మాస్టర్స్ సిరీస్ టైటిల్ నెగ్గిన రోహన్ బోపన్న (భారత్)–మాథ్యూ ఎబ్డెన్ (ఆస్ట్రేలియా) జోడీ... మయామి ఓపెన్ మాస్టర్స్ సిరీస్ టోర్నీలో మాత్రం నిరాశపరిచింది. ఆదివారం జరిగిన పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో బోపన్న–ఎబ్డెన్ ద్వయం 5–7, 6–4, 4–10తో ‘సూపర్ టైబ్రేక్’లో కెవిన్ క్రావిట్జ్ (జర్మనీ)–ఫాబ్రిస్ మార్టిన్ (ఫ్రాన్స్) జంట చేతిలో ఓడిపోయింది. 84 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో బోపన్న–ఎబ్డెన్ 11 ఏస్లు సంధించి, ఐదు డబుల్ ఫాల్ట్లు చేశారు. కీలకమైన సూపర్ టైబ్రేక్లో మాత్రం బోపన్న, ఎబ్డెన్ తడబడి ఓటమి చవిచూశారు. తొలి రౌండ్లో ఓడిన బోపన్న–ఎబ్డెన్ జోడీకి 18,020 డాలర్ల (రూ. 14 లక్షల 83 వేలు) ప్రైజ్మనీ లభించింది. హంపి, హారిక తొలి గేమ్ ‘డ్రా’ న్యూఢిల్లీ: అంతర్జాతీయ చెస్ సమాఖ్య (ఫిడే) మహిళల గ్రాండ్ప్రి టోర్నీని భారత గ్రాండ్మాస్టర్లు కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక ‘డ్రా’తో ప్రారంభించారు. ఆదివారం జరిగిన తొలి రౌండ్ గేమ్లో వీరిద్దరు ముఖాముఖిగా తలపడ్డారు. తెల్లపావులతో ఆడిన హంపి 31 ఎత్తుల్లో గేమ్ను ‘డ్రా’గా ముగించింది. భారత్కే చెందిన అంతర్జాతీయ మాస్టర్ (ఐఎం) వైశాలికి తొలి గేమ్లో ‘వాకోవర్’ లభించింది. ఆమెతో తొలి రౌండ్లో తలపడాల్సిన జర్మనీ గ్రాండ్మాస్టర్ ఎలిజబెత్ పాట్జ్ టోర్నీ నుంచి వైదొలిగింది. దాంతో తొలి గేమ్లో వైశాలిని విజేతగా ప్రకటించారు. టోర్నీ నిర్వాహకుల నిర్వహణ వైఫల్యాల కారణంగానే తాను టోర్నీ నుంచి తప్పుకుంటున్నానని ఎలిజబెత్ తెలిపింది. నిర్వాహకుల తీరుపై ఆగ్రహంతో కజకిస్తాన్ గ్రాండ్మాస్టర్ జాన్సయ అబ్దుమలిక్ కూడా ఈ టోర్నీ నుంచి వైదొలిగింది. చదవండి: Nikhat Zareen: అంచనాలు లేవు.. ఫర్వాలేదన్నవారే తప్ప అద్భుతం అనలేదు! కానీ ఇప్పుడు.. BCCI: బీసీసీఐ కాంట్రాక్ట్ల ప్రకటన.. జడ్డూకు ప్రమోషన్.. రాహుల్కు షాక్.. భరత్కు చోటు -
Malaysia Open 2023: సెమీస్లో సాత్విక్–చిరాగ్ జోడీ
కౌలాలంపూర్: మలేసియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–1000 టోర్నీ పురుషుల డబుల్స్ విభాగంలో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) జోడీ సెమీఫైనల్లోకి ప్రవేశించింది. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో ఏడో సీడ్ సాత్విక్ సాయిరాజ్– చిరాగ్ ద్వయం 17–21, 22–20, 21–9తో లియు యు చెన్–జువాన్ యి ఒయు (చైనా) జోడీపై విజయం సాధించింది. పురుషుల సింగిల్స్లో భారత నంబర్వన్ ప్రణయ్ 16–21, 21–19, 12–21తో ప్రపంచ ఏడో ర్యాంకర్ కొడాయ్ నరోకా (జపాన్) చేతిలో ఓడిపోయాడు. ప్రణయ్కు 6,875 డాలర్ల (రూ. 5 లక్షల 60 వేలు) ప్రైజ్మనీతోపాటు 6,600 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement