సింగపూర్ ఓపెన్లో భారత డబుల్స్ ద్వయం సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి ఫైనల్స్కు దూసుకెళ్లింది. శనివారం పురుషుల డబుల్స్ సెమీస్లో సాత్విక్ జోడీ 21-19, 21-18తో ప్రపంచ నంబర్వన్ జోడీ, కొరియాకు చెందిన కిమ్ వోన్-సియో సుంగ్ జె జంటను ఓడించింది.
సాత్విక్-చిరాగ్ జోడీ 52 నిమిషాల్లోనే ప్రత్యర్థులను మట్టికరిపించడం విశేషం. సాత్విక్ జంట ఫైనల్ చేరడంతో కనీసం రజతం ఖరారు చేసుకున్నట్లయింది. ఆద్యంతం హోరాహోరీగా జరిగిన సెమీఫైనల్లో భారత జోడీ టాప్ గేర్లో ఆడింది. ఆరంభం నుంచి కొరియా జంటకు ముచ్చెమటలు పట్టించిన భారత ద్వయం రెండు గేమ్స్ల్లోనే జయభేరి మోగించింది.
రేపు జరగనున్న ఫైనల్లో సాత్విక్-చిరాగ్ జోడీ.. ఫజర్ అల్ఫియాన్ – ముహమ్మద్ షోహిబుల్ ఫిక్రీ(ఇండోనేషియా) లేదా లియాంగ్ వీ కెంగ్ – వాంగ్ ఛాంగ్ జంటలో ఒకరిని ఢీ కొట్టనుంది.
SatChi Into The Finals ✅️
Massive Victory For Satwik/Chirag . They Defeated Korean WR 1 Pair Kim Won Ho / Seo Seung Jae In Straight Games 21-19 , 21-18 . The Last Time The Korean Pair Lost A Match Was At The 2025 Denmark Open .
Final vs Alfian/Fikri 🇮🇩 (OR) Liang/Wang 🇨🇳 https://t.co/VcZBKAHLy0 pic.twitter.com/zp2ryhVL2T— Badminton Media (@BadmintonMedia1) May 30, 2026


