విండీస్‌ను చిత్తు చేసిన ఇంగ్లండ్‌.. 238 పరుగుల తేడాతో విక్టరీ | England Beat West Indies By 238 Runs In First ODI, Check Out Score Details Inside | Sakshi
Sakshi News home page

ENG vs WI: విండీస్‌ను చిత్తు చేసిన ఇంగ్లండ్‌.. 238 పరుగుల తేడాతో విక్టరీ

May 30 2025 8:42 AM | Updated on May 30 2025 9:14 AM

England Beat West Indies by 238 runs

వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌లో ఇంగ్లండ్‌ శుభారంభం చేసింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా గురువారం బర్మింగ్‌హామ్‌ వేదికగా జరిగిన తొలి వన్డేలో ఇంగ్లండ్‌ 238 పరుగుల తేడాతో విండీస్‌పై గెలుపొందింది. మొదట బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లండ్‌ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 400 పరుగులు చేసింది. బ్రూక్‌ కెప్టెన్సీలో ఆడిన తొలి మ్యాచ్‌లోనే ఇంగ్లండ్‌ భారీ స్కోరుతో విజృంభించింది. 

జాకబ్‌ బెథెల్‌ (53 బంతుల్లో 82; 8 ఫోర్లు, 5 సిక్స్‌లు), బెన్‌ డకెట్‌ (60; 6 ఫోర్లు, 1 సిక్స్‌), జో రూట్‌ (57; 5 ఫోర్లు), హ్యారీ బ్రూక్‌ (58; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) హాఫ్‌ సెంచరీలతో అదరగొట్టారు. జెమీ స్మిత్‌ (37), బట్లర్‌ (37), విల్‌ జాక్స్‌ (39) కూడా రాణించారు. విండీస్‌ బౌలర్లలో జైడెన్‌ సీల్స్‌ 4, అల్జారీ జోసెఫ్, జస్టిన్‌ గ్రేవ్స్‌ చెరో 2 వికెట్లు పడగొట్టారు. 

అనంతరం లక్ష్యఛేదనలో వెస్టిండీస్‌ 26.2 ఓవర్లలో 162 పరుగులకు ఆలౌటైంది. జైడెన్‌ సీల్స్‌ (29; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు), కెపె్టన్‌ షై హోప్‌ (25) కాస్త పోరాడగా... మిగిలిన వాళ్లు ప్రభావం చూపలేకపోయారు. ఇంగ్లండ్‌ బౌలర్లలో సాఖీబ్‌ మహమూద్, జేమీ ఓవర్టన్‌ చెరో 3 వికెట్లు పడగొట్టారు. ఇరు జట్ల మధ్య ఆదివారం రెండో వన్డే జరగనుంది.
చదవండి: నేను అత‌డికి పెద్ద అభిమానిని.. ఇంకా ఒకే ఒక మ్యాచ్‌: ఆర్సీబీ కెప్టెన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement