-
పూర్వ వైభవం దిశగా అడుగులు వేస్తున్న విండీస్
వివిధ కారణాల చేత పరిమిత ఓవర్ల స్పెషలిస్ట్లంతా ఒక్కసారిగా జట్టు నుంచి తప్పుకోవడంతో వన్డే ప్రపంచకప్కు సైతం అర్హత సాధించలేక ఇంటాబయటా విమర్శలు ఎదుర్కొన్న వెస్టిండీస్ క్రికెట్ జట్టు ఇటీవలికాలంలో పూర్వ వైభవం దిశగా అడుగులు వేస్తుంది. రసెల్, పూరన్ లాంటి సీనియర్లు తిరిగి జట్టులో చేరడంతో కరీబియన్ జట్టు ఇంటాబయటా వరుస సిరీస్ విజయాలతో దూసుకుపోతుంది. తాజాగా స్వదేశంలో ఇంగ్లండ్తో జరిగిన వన్డే, టీ20 సిరీస్లను కైవసం చేసుకున్న ఈ మాజీ వరల్డ్ ఛాంపియన్.. దీనికి ముందు స్వదేశంలోనే భారత్పై 3-2 తేడాతో టీ20 సిరీస్ నెగ్గింది. దీనికి ముందు సౌతాఫ్రికాలో వారిపై 2-1 తేడాతో టీ20 సిరీస్ గెలిచింది. వచ్చే ఏడాది స్వదేశంలో టీ20 వరల్డ్కప్ ఉండటంతో ఇప్పటినుంచే సన్నాహకాలను మొదలుపెట్టిన విండీస్ బోర్డు జట్టును వీడిన సీనియర్లనంతా ఒక్కొక్కరిగా తిరిగి జట్టులోకి ఆహ్వానిస్తుంది. ప్రస్తుతం విండీస్ ఉన్న ఊపు చూస్తుంటే మూడోసారి టీ20 ఛాంపియన్గా నిలవడం ఖయామని అనిపిస్తుంది. కాగా, ట్రినిడాడ్ వేదికగా ఇంగ్లండ్తో జరిగిన నిర్ణయాత్మక ఐదో టీ20లో వెస్టిండీస్ 4 వికెట్ల తేడాతో గెలుపొంది, 3-2 తేడాతో సిరీస్ కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్.. 19.3 ఓవర్లలో 132 పరుగులకే ఆలౌటైంది. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన వెస్టిండీస్.. 19.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరుకుంది. -
రీఎంట్రీలో రసెల్ బ్యాటింగ్ విధ్వంసం.. విండీస్ చేతిలో ఇంగ్లండ్ చిత్తు
West Indies vs England, 1st T20I: వెస్టిండీస్ క్రికెటర్ ఆండ్రీ రసెల్ జాతీయ జట్టులో పునరాగమనాన్ని ఘనంగా చాటాడు. ఇంగ్లండ్తో తొలి టీ20లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. తొలుత బంతితో చెలరేగిన ఈ ఆల్రౌండర్.. అనంతరం లక్ష్య ఛేదనలో విధ్వంసకర ఇన్నింగ్స్తో విరుచుకుపడ్డాడు. ఇంగ్లండ్ బౌలర్ల ఎత్తులను చిత్తు చేస్తూ ధనాధన్ బ్యాటింగ్తో జట్టును విజయతీరాలకు చేర్చాడు. తద్వారా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచి రీఎంట్రీ అదుర్స్ అనిపించాడు. కాగా మూడు వన్డే, ఐదు టీ20 మ్యాచ్ల సిరీస్ ఆడేందుకు ఇంగ్లండ్ వెస్టిండీస్ పర్యటనకు వెళ్లింది. మూడు వికెట్లు పడగొట్టిన రసెల్ ఈ క్రమంలో వన్డే సిరీస్ను 2-1తో గెలిచి ఇంగ్లిష్ జట్టుకు షాకిచ్చిన వెస్టిండీస్.. టీ20 సిరీస్ను విజయంతో ఆరంభించి సత్తా చాటింది. బార్బడోస్ వేదికగా బుధవారం తెల్లవారుజామున జరిగిన మ్యాచ్లో టాస్ గెలిచిన విండీస్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ నేపథ్యంలో ఆతిథ్య జట్టు ఆహ్వానం మేరకు బ్యాటింగ్కు దిగిన ఇంగ్లండ్ 19.3 ఓవర్లలో 171 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఓపెనర్లు ఫిలిప్ సాల్ట్ 20 బంతుల్లో 40, జోస్ బట్లర్ 31 బంతుల్లో 39 పరుగులతో శుభారంభం అందించగా.. మిగతా వాళ్లలో లియామ్ లివింగ్ స్టోన్(27) ఒక్కడే ఇరవై పరుగుల పైచిలుకు స్కోరు రాబట్టాడు. కరేబియన్ బౌలర్ల ధాటికి మిగిలిన ఇంగ్లిష్ బ్యాటర్లంతా చేతులెత్తేశారు. ఇక ఇంగ్లండ్ ఇన్నింగ్స్లో పేస్ ఆల్రౌండర్ ఆండ్రీ రస్సెల్, మరో ఫాస్ట్బౌలర్ అల్జారీ జోసెఫ్ చెరో మూడు వికెట్లు పడగొట్టారు. మిగిలిన వాళ్లలో పేసర్లు జేసన్ హోల్డర్ ఒకటి, రొమారియో షెఫర్డ్ రెండు వికెట్లు కూల్చారు. ఇక స్పిన్నర్ అకీల్ హొసేన్కు ఒక వికెట్ దక్కింది. Unstoppable Russell Mania! . .#WIvENG #WIvENGonFanCode pic.twitter.com/VjbBCJMMIV — FanCode (@FanCode) December 13, 2023 పావెల్ కెప్టెన్ ఇన్నింగ్స్.. ఈ క్రమంలో లక్ష్య ఛేదనకు దిగిన వెస్టిండీస్కు ఓపెనర్లు బ్రాండన్ కింగ్(22), కైలీ మేయర్స్(35) మంచి ఆరంభం అందించగా.. వన్డౌన్ బ్యాటర్ షాయీ హోప్ 36 పరుగులతో రాణించాడు. ఆ తర్వాతి స్థానాల్లో వచ్చిన నికోలస్ పూరన్ 13, షిమ్రన్ హెట్మెయిర్ ఒక్క పరుగుకే పరిమితమయ్యారు. అయితే, ఆరో నంబర్ బ్యాటర్, కెప్టెన్ రోవ్మన్ పావెల్, ఎనిమిదో స్థానంలో వచ్చిన ఆండ్రీ రసెల్ ధనాధన్ ఇన్నింగ్స్తో చెలరేగారు. పావెల్ 15 బంతుల్లో మూడు ఫోర్లు, రెండు సిక్సర్లతో 206.67 స్ట్రైక్రేటుతో 31 పరుగులు రాబట్టి అజేయంగా నిలిచాడు. సునామీ ఇన్నింగ్స్తో రసెల్ విధ్వంసం మరోవైపు రసెల్ కూడా 14 బంతులు ఎదుర్కొని 207కు పైగా స్ట్రైక్రేటుతో 29 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్లో రెండు ఫోర్లు, రెండు సిక్సర్లు ఉన్నాయి. కాగా రసెల్ దాదాపు రెండేళ్ల తర్వాత వెస్టిండీస్ తరఫున బరిలోకి దిగడం ఇదే తొలిసారి. Russell roars back! . .#WIvENG #WIvENGonFanCode pic.twitter.com/zdlJBWJdWA — FanCode (@FanCode) December 13, 2023 ఈ నేపథ్యంలో ఇంగ్లండ్పై టీ20 సిరీస్లో వెస్టిండీస్ 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. దీంతో జోస్ బట్లర్ బృందానికి మరోసారి నిరాశే మిగిలింది. ఇరు జట్ల మధ్య గురువారం రెండో టీ20 జరుగనుంది. చదవండి: Ind vs SA: అందుకే ఓడిపోయాం.. మాకు ఇదొక గుణపాఠం: సూర్యకుమార్ -
వెస్టిండీస్ టీ20 జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాడు రీ ఎంట్రీ
ఇంగ్లండ్తో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్కు 15 మంది సభ్యులతో కూడిన జట్టును తమ జట్టును క్రికెట్ వెస్టిండీస్ ప్రకటించింది. దాదాపు రెండేళ్ల పాటు జాతీయ జట్టుకు దూరమైన స్టార్ ఆల్ రౌండర్ ఆండ్రీ రస్సెల్కు ఇంగ్లండ్ సిరీస్ కోసం విండీస్ సెలక్టర్లు పిలుపునిచ్చారు. రస్సెల్ చివరగా వెస్టిండీస్ తరపున 2021లో ఆస్ట్రేలియాపై టీ20 మ్యాచ్ ఆడాడు. ఇటీవల కాలంలో రస్సెస్ మెరుగైన ప్రదర్శన కనబరుస్తుండంతో మళ్లీ సెలక్టర్లు అతడిని పరిగణలోకి తీసుకున్నారు. అదే విధంగా ఇంగ్లండ్తో వన్డేలకు దూరమైన స్టార్ ఆటగాళ్లు జాసన్ హోల్డర్, నికోలస్ పూరన్ లు టీ20 జట్టులో మాత్రం చోటు దక్కించుకున్నారు. ఈ జట్టుకు రోవ్మన్ పావెల్ కెప్టెన్ గా వ్యవహరించనుండగా.. షాయ్ హోప్ వైస్ కెప్టెన్గా ఎంపికయ్యాడు. డిసెంబర్ 12న బార్బోడేస్ వేదికగా జరగనున్న తొలి టీ20తో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. కాగా ఇప్పటికే ఇంగ్లండ్తో జరిగిన మూడు వన్డేల సిరీస్ను 2-1తో వెస్టిండీస్ సొంతం చేసుకుంది. ఇంగ్లండ్తో టీ20లకు విండీస్ జట్టు: రోవ్మన్ పావెల్ (కెప్టెన్), షాయ్ హోప్ (వైస్ కెప్టెన్), రోస్టన్ చేజ్, మాథ్యూ ఫోర్డ్, షిమ్రాన్ హెట్మెయర్, జాసన్ హోల్డర్, అకేల్ హోసేన్, అల్జారీ జోసెఫ్, బ్రాండన్ కింగ్, కైల్ మేయర్స్, గుడాకేష్ మోటీ, నికోలస్ పూరన్, ఆండ్రీ రస్సెల్, షెర్ఫేన్ రూథర్ఫోర్డ్, రొమారియో షెపర్డ్. చదవండి: ENG vs WI: ఇంగ్లండ్ను చిత్తు చేసిన వెస్టిండీస్.. 24 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి -
ఇంగ్లండ్ను చిత్తు చేసిన వెస్టిండీస్.. 24 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి
బార్బడోస్ వేదికగా ఇంగ్లండ్తో జరిగిన నిర్ణయాత్మక మూడో వన్డేలో 4 వికెట్ల తేడాతో వెస్టిండీస్ విజయం సాధించింది. తద్వారా మూడు వన్డేల సిరీస్ను 2-1తో విండీస్ కైవసం చేసుకుంది. కాగా కరేబియన్ దీవుల్లో ఇంగ్లీష్ జట్టుపై విండీస్ వన్డే సిరీస్ను సొంతం చేసుకోవడం 24 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి కావడం విశేషం. విండీస్ చివరగా తమ స్వదేశంలో 1998లో ఇంగ్లండ్పై వన్డే సిరీస్ విజయం సాధించింది. తాజా విజయంతో 24 ఏళ్ల నిరీక్షణకు వెస్టిండీస్ తెరదించింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. వర్షం కారణంగా మూడో వన్డేను 40 ఓవర్లకు కుదించారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. ఇంగ్లండ్ బ్యాటర్లలో బెన్ డకెట్(71) పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. విండీస్ బౌలర్లలో మాథ్యూ ఫోర్డే, జోషఫ్య తలా 3 వికెట్లు పడగొట్టగా.. షెపెర్డ్ రెండు వికెట్లు సాధించాడు. అనంతరం విండీస్ టార్గెట్ను డక్వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం 188గా నిర్ణయించారు. 188 లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ 31.4 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కరేబియన్ బ్యాటర్లలో ఆథనాజ్(45), కార్టీ(50) పరుగులతో రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో విల్ జాక్స్ 3 వికెట్లు.. అటిక్కినిసన్ 2, ఆహ్మద్ ఒక్క వికెట్ పడగొట్టారు. సిరీస్ ఆసాంతం అద్భుత ప్రదర్శన కనబరిచిన విండీస్ కెప్టెన్ షాయ్ హోప్కు మ్యాన్ ఆఫ్ది సిరీస్ అవార్డు దక్కింది. -
రాణించిన కర్రన్, బట్లర్.. విండీస్పై ప్రతీకారం తీర్చుకున్న ఇంగ్లండ్
ఆంటిగ్వా వేదికగా వెస్టిండీస్తో జరిగిన రెండో వన్డేలో ఇంగ్లండ్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో ఇంగ్లండ్ తొలి వన్డేలో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకుని మూడు మ్యాచ్ల సిరీస్లో 1-1తో సమంగా నిలిచింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్.. ఇంగ్లండ్ బౌలర్లు మూకుమ్మడిగా రాణించడంతో 39.4 ఓవర్లలో 202 పరుగులకు ఆలౌటైంది. సామ్ కర్రన్, లివింగ్స్టోన్ చెరో 3 వికెట్లు.. అట్కిన్సన్, రెహాన్ అహ్మద్ తలో 2 వికెట్లు పడగొట్టారు. విండీస్ ఇన్నింగ్స్లో కెప్టెన్ షాయ్ హోప్ (68), షెర్ఫాన్ రూథర్ఫోర్డ్ (63) అర్ధసెంచరీలతో రాణించారు. తొలి వన్డేలో మెరుపు శతకంతో విండీస్ను గెలిపించిన హోప్ ఈ మ్యాచ్లోనూ బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అనంతరం 203 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్.. విల్ జాక్స్ (73), కెప్టెన్ జోస్ బట్లర్ (58 నాటౌట్) అర్ధసెంచరీలతో రాణించడంతో 32.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. జాక్స్, బట్లర్లతో పాటు హ్యారీ బ్రూక్ (43 నాటౌట్) కూడా రాణించాడు. విండీస్ బౌలర్లలో గుడకేశ్ మోటీకి రెండు, రొమారియో షెపర్డ్, షెర్ఫాన్ రూథర్ఫోర్డ్లకు తలో వికెట్ దక్కింది. నిర్ణయాత్మకమైన మూడో వన్డే డిసెంబర్ 9న జరుగనుంది.
Pagination
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
IPL 2024: ఇవెక్కడి క్యాచ్లు రా బాబు.. చూస్తే ఫ్యూజ్లు ఎగిరిపోవాల్సిందే..!
'ఛీ, నీ బతుకు'.. చురకలంటించిన కలర్స్ స్వాతి
12 పరుగులకే ఆలౌట్.. టీ20ల్లో రెండో అత్యల్ప స్కోర్
జగనన్న పాలనతో పెత్తందార్ల కడుపు మండుతోంది: నాగార్జున యాదవ్
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం
ఆది సాయికుమార్ కొత్త మూవీ.. గోవాలో మ్యూజిక్ సిట్టింగ్స్
కాంగ్రెస్కు శామ్ పిట్రోడా రాజీనామా
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
ఫ్రెండ్ కోసం పెళ్లినే వాయిదా వేసుకున్న హీరోయిన్ (ఫోటోలు)
ఓట్ల తాయిలాలు షురూ.. బీజేపీపై దీదీ ఫైర్
తప్పక చదవండి
- ఓట్ల తాయిలాలు షురూ.. బీజేపీపై దీదీ ఫైర్
- ఒక్క క్లిక్తో ‘ఏపీ పాలిసెట్’ ఫలితాలు
- సుప్రీత మైండ్ బ్లోయింగ్ గ్లామర్.. ఫారెన్ వీధుల్లో కేతిక!
- పిట్రోడా వ్యాఖ్యల దుమారం.. నిర్మలా సీతారామన్ ఆగ్రహం
- పవన్ మూవీ రిలీజ్ డేట్కి టెండర్ వేసిన 'దేవర'?
- టీ20 వరల్డ్కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్గా కేఎల్ రాహుల్..!
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- ల్యాండ్ టైట్లింగ్ చట్టం నిజాలివిగో..
- బాబోస్తే ఆరోగ్యశ్రీ గో..వింద
Advertisement