
ప్రొ కబడ్డీ లీగ్ వేలంలో తొలిసారి
మొహమ్మద్ రెజాకు రూ. 2.23 కోట్లు
నేడూ సాగనున్న వేలం
ముంబై: ప్రొ కబడ్డీ లీగ్ సీజన్–12 కోసం జరిగిన వేలంలో ఆటగాళ్ల పంట పండింది. లీగ్ వేలం చరిత్రలో ఒకే సీజన్లో తొలిసారి 10 మందికి పైగా ఆటగాళ్లు రూ. 1 కోటికి మించి విలువ పలకడం విశేషం. గత సీజన్లో ‘అత్యంత విలువైన ఆటగాడి’ అవార్డు పొందిన ఇరాన్ ప్లేయర్ మొహమ్మద్ రెజా షాద్లుయికి రికార్డు స్థాయిలో రూ. 2.23 కోట్లు దక్కడం విశేషం. ఈ భారీ మొత్తానికి గుజరాత్ జెయింట్స్ రెజాను సొంతం చేసుకుంది.
వరుసగా మూడు సీజన్లోనూ రూ. 2 కోట్లకు మించిన ధర పలికిన ఆటగాడిగా రెజా నిలవడం అతని స్థాయిని చూపిస్తోంది. భారత ఆటగాళ్లలో దేవాంక్ దలాల్ టాపర్గా నిలిచాడు. అతడిని వేలంలో బెంగాల్ వారియర్స్ రూ. 2.20 కోట్లకు గెలుచుకుంది. గత సీజన్లో దేవాంక్ బెస్ట్ రైడర్గా నిలిచి పట్నా పైరేట్స్ ఫైనల్ చేరడంలో కీలక పాత్ర పోషించాడు. తెలుగు టైటాన్స్ జట్టు వేలంలో భరత్ (రూ.81.50 లక్షలు), విజయ్ మలిక్ (రూ.51.50 లక్షలు), శుభమ్ షిండే (రూ. 80 లక్షలు)లను ఎంచుకుంది.