మహిళల ప్రీమియర్ ఎలిమినేటర్ మ్యాచులో ఢిల్లీ క్యాపిటల్ ఉమెన్స్ ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 167 పరుగులు సాధించింది. అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ కేవలం ముడు వికెట్లు కోల్పోయి అలవోకగా 169 పరుగులు చేసి టార్గెట్ చేధించింది. ఢిల్లీ బ్యాటర్లలలో లివెల్లీ 43 పరుగులు, జెమామీరోడ్రిగ్స్ 41 పరుగులు షపాలీ వర్మ 31 పరుగులు సాధించారు.
అంతకు ముందు గుజరాత్ బ్యాటర్ బెత్మూనీ అర్థశతకం సాధించి జట్టుకు భారీస్కోరు అందించారు. ఢిల్లీ బౌలర్లలో చిన్నెల్లి హెన్రీ 3 వికెట్లు తీయగా నందాని శర్మ రెండు వికెట్లు తీసింది. ఈ గెలుపుతో ఢిల్లీ క్యాపిటల్స్ ఫైనల్ చేరుకుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇదివరకే ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకుంది.
గుజరాత్
బెత్ మూనీ (వికెట్ కీపర్), సోఫీ డివైన్, అనుష్క శర్మ, ఆష్లే గార్డ్నర్ (కెప్టెన్), జార్జియా వరేహమ్, భారతి ఫల్మలి, కనిక అహుజా, కశ్వీ గౌతం, తనుజా కన్వేర్, రేణుకా సింగ్ ఠాకూర్, రాజేశ్వరి గైక్వాడ్.
ఢిల్లీ
లిజెల్లి లీ (వికెట్ కీపర్), షఫాలి వర్మ, లారా వల్వర్ట్, జెమీమా రోడ్రిగ్స్ (కెప్టెన్), మరిజానే కాప్, చినెల్లి హెన్రీ, నికీ ప్రసాద్, స్నేహ్ రాణా, మిన్ను మణి, శ్రీచరణి, నందాని శర్మ.


