
ఐపీఎల్ టికెట్ల వ్యవహారంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) పాత్రపై విజిలెన్స్ విచారణ పూర్తయ్యింది. ప్రాథమిక నివేదికను విజిలెన్స్ ప్రభుత్వానికి పంపింది. విచారణలో సంచలన విషయాలు వెలుగు చూశాయి. టికెట్ల విషయంలో హెచ్సీఏ అధ్యక్షుడు సన్రైజర్స్ యాజమాన్యంపై ఒత్తిడి తెచ్చి, తీవ్ర ఇబ్బందులకు గురి చేసినట్లు నిర్ధారణ అయ్యింది.
ఎస్ఆర్హెచ్ యాజమాన్యం పది శాతం టికెట్లు ఉచితంగా ఇస్తున్నా.. మరో పది శాతం టికెట్లు అదనంగా ఇవ్వాలని హెచ్సీఏ కార్యదర్శి ఒత్తిడి చేసినట్లు రుజువైంది. విజిలెన్స్ తమ నివేదికలో హెచ్సీఏపై చర్యలకు సిఫార్సు చేసింది.
కాగా, అదనపు టికెట్ల కోసం హెచ్సీఏ ఒత్తిడి తెస్తుందని సన్రైజర్స్ యాజమాన్యం బీసీసీఐకి ఫిర్యాదు చేసింది. మరో పది శాతం టికెట్లు అదనంగా ఇచ్చే ప్రసక్తే లేదని సన్రైజర్స్ యాజమాన్యం తేల్చి చెప్పింది. ఓపెన్ మార్కెట్లో కొనుగోలు చేసుకునేందుకు అవకాశం ఇవ్వాలని హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు డిమాండ్ చేశాడు.
వ్యక్తిగతంగా తనకు మరో పది శాతం టికెట్లు ఇవ్వాలని ఒత్తిడి తెచ్చాడు. వ్యక్తిగతంగా టికెట్లు ఇచ్చే ప్రసక్తే లేదని సన్రైజర్స్ మేనేజ్మెంట్ తేల్చి చెప్పింది. సన్రైజర్స్ యాజమాన్యం టికెట్లు ఇవ్వకపోవడంతో మ్యాచ్ల సందర్భంగా జగన్మోహన్ రావు ఇబ్బందులకు గురి చేశాడు. లక్నో మ్యాచ్ సందర్భంగా వీఐపీ గ్యాలరీలకు తాళాలు వేయించాడు.