breaking news
Vigilance enquiry
-
ఐపీఎల్ టికెట్ల వ్యవహారంలో హెచ్సీఏ పాత్ర.. విచారణలో సంచలన విషయాలు
ఐపీఎల్ టికెట్ల వ్యవహారంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) పాత్రపై విజిలెన్స్ విచారణ పూర్తయ్యింది. ప్రాథమిక నివేదికను విజిలెన్స్ ప్రభుత్వానికి పంపింది. విచారణలో సంచలన విషయాలు వెలుగు చూశాయి. టికెట్ల విషయంలో హెచ్సీఏ అధ్యక్షుడు సన్రైజర్స్ యాజమాన్యంపై ఒత్తిడి తెచ్చి, తీవ్ర ఇబ్బందులకు గురి చేసినట్లు నిర్ధారణ అయ్యింది. ఎస్ఆర్హెచ్ యాజమాన్యం పది శాతం టికెట్లు ఉచితంగా ఇస్తున్నా.. మరో పది శాతం టికెట్లు అదనంగా ఇవ్వాలని హెచ్సీఏ కార్యదర్శి ఒత్తిడి చేసినట్లు రుజువైంది. విజిలెన్స్ తమ నివేదికలో హెచ్సీఏపై చర్యలకు సిఫార్సు చేసింది.కాగా, అదనపు టికెట్ల కోసం హెచ్సీఏ ఒత్తిడి తెస్తుందని సన్రైజర్స్ యాజమాన్యం బీసీసీఐకి ఫిర్యాదు చేసింది. మరో పది శాతం టికెట్లు అదనంగా ఇచ్చే ప్రసక్తే లేదని సన్రైజర్స్ యాజమాన్యం తేల్చి చెప్పింది. ఓపెన్ మార్కెట్లో కొనుగోలు చేసుకునేందుకు అవకాశం ఇవ్వాలని హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు డిమాండ్ చేశాడు. వ్యక్తిగతంగా తనకు మరో పది శాతం టికెట్లు ఇవ్వాలని ఒత్తిడి తెచ్చాడు. వ్యక్తిగతంగా టికెట్లు ఇచ్చే ప్రసక్తే లేదని సన్రైజర్స్ మేనేజ్మెంట్ తేల్చి చెప్పింది. సన్రైజర్స్ యాజమాన్యం టికెట్లు ఇవ్వకపోవడంతో మ్యాచ్ల సందర్భంగా జగన్మోహన్ రావు ఇబ్బందులకు గురి చేశాడు. లక్నో మ్యాచ్ సందర్భంగా వీఐపీ గ్యాలరీలకు తాళాలు వేయించాడు. -
యూనిఫామ్స్లో అవినీతి; విచారణకు సీఎం ఆదేశాలు
సాక్షి, అమరావతి : గత టీడీపీ పాలనలో పచ్చ నాయకుల అవినీతికి అడ్డులేకుండా పోయింది. అసలే సర్కారీ బడుల్లో పిల్లల్ని చేర్చేందుకు తల్లిదండ్రులు వెనకడుగేస్తున్న వేళ.. విద్యార్థుల యూనిఫామ్స్ పంపిణీలో అవినీతికి పాల్పడ్డారు. ఆప్కో పేరుతో యూనిఫామ్స్ సరఫరాలో టీడీపీ నేతల అవినీతి బాగోతాన్ని డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన చర్యలు చేపట్టారు. స్కూల్ యూనిఫామ్స్లో అవినీతిపై విజిలెన్స్ విచారణకు ఆదేశించారు. గత ఐదేళ్లలో యూనిఫామ్స్ పేరుతో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని, విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని విజిలెన్స్ అధికారులకు స్పష్టం చేశారు. వచ్చే ఏడాది నుంచి స్కూళ్లు తెరిచేసరికే యూనిఫామ్స్ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. -
‘నీరు-చెట్టు’పథకంలో 22వేల కోట్లు దుర్వినియోగం
సాక్షి, అమరావతి: గత చంద్రబాబు ప్రభుత్వం అమలు చేసిన ‘నీరు-చెట్టు’ పథకంలో భారీ దోపిడీ జరిగిందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే మేరుగ నాగార్జున అన్నారు. గురువారం అసెంబ్లీ సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ.. నీరు-చెట్టు నిధులను టీడీపీ నేతలు పందికొక్కుల్లా దోచుకున్నారని మండిపడ్డారు. మరో సభ్యుడు కాటసాని రాంభూపాల్రెడ్డి మాట్లాడుతూ.. నీరు-చెట్టులో జరిగిన అవినీతిపై పూర్తి విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ వ్యవహారంపై విచారణ పూర్తయ్యేవరకు బిల్లులు మంజూరు చేయొద్దని సూచించారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పందిస్తూ.. నీరు-చెట్టు నిధులు పక్కదారి పట్టిన విషయం వాస్తవమేనన్నారు. ఈ పథకం కింద రూ. 22వేల కోట్ల నిధులు దుర్వినియోగం చేశారని పేర్కొన్నారు. జన్మభూమి కమిటీల పేరుతో టీడీపీ కార్యకర్తలకు ఈ నిధులను దోచి పెట్టారని ఆయన ఆరోపించారు. నీరు-చెట్టు పథకంలో జరిగిన అవినీతిపై విచారణ జరిపిస్తామని మంత్రి పెద్దిరెడ్డి స్పష్టం చేశారు. నీరు-చెట్టు అక్రమాలపై విజిలెన్స్ విచారణ జరిపిస్తామని, ఈ పథకంలో అవినీతికి పాల్పడిన వారి నుంచి సొమ్ము తిరిగి రాబడతామని ఆయన వెల్లడించారు. -
అమ్మవారి గర్భగుడిలో లక్ష్మీహారం ప్రత్యక్షం
చిత్తూరు జిల్లా తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో మూడు రోజుల క్రితం మాయమైన లక్ష్మీ హారం శుక్రవారం ఆలయ గర్భగుడిలో లభ్యమైంది. దాంతో అటు ఆలయ అధికారులు ఇటు అర్చకులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే లక్ష్మీ హారం లభ్యం కావడంపై ఆలయ అర్చకులు భిన్న కథనాలు వెల్లడిస్తుండటంతో పలు అనుమానాలకు తావిస్తుంది. తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారికి అలంకరించే లక్ష్మీహారం మంగళవారం మాయమైంది. ఆ విషయాన్ని గ్రహించిన అర్చకులు గోప్యంగా ఆలయ ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. రూ.10 లక్షల విలువైన ఆమ్మవారి హారం కనిపించకపోవడంతో ఆలయ ఉన్నతాధికారులు అగమేఘాలపై స్పందించారు. ఆలయ సిబ్బంది చేత అంతటా వెతికించారు. అయిన హారం జాడ తెలియలేదు. ఇంతలో అమ్మవారి హారం మాయమైన విషయం మీడియాకు పొక్కింది. దీంతో మీడియా లక్ష్మీ హారం అదృశ్యంపై పలు కథనాలు వెలువరించింది... శుక్రవారం ఉదయం అమ్మవారి ఆలయం గర్బగుడిలో లక్ష్మీ హారం ప్రత్యక్షమైంది. లక్ష్మీ హారం అదృశ్యంపై ఉన్నతాధికారులు విజిలెన్స్ విచారణకు ఆదేశించారు. అయితే గర్బగుడిలోని సీసీ కెమెరాలు పనిచేయకపోవడం కొసమెరుపు.