
న్యూఢిల్లీ: ఇంగ్లండ్ పర్యటనలో భారత క్రికెట్ జట్టు మేనేజర్గా యుధ్వీర్ సింగ్ ఎంపికయ్యాడు. ఈ నెల 20 నుంచి టీమిండియా ఇంగ్లండ్తో 5 మ్యాచ్ల టెస్టు సిరీస్ ఆడనుంది. ఈ టూర్ కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) యు«ద్వీర్ను మేనేజర్గా ఎంపిక చేసింది.
ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ క్రికెట్ సంఘం (యూపీసీఏ) కార్యదర్శిగా పనిచేస్తున్న యుధ్వీర్... గతంలో యూపీసీఏ అధ్యక్షుడిగానూ వ్యవహరించారు. క్రికెట్ వ్యవహారాల్లో అతడికి విశేష అనుభవం ఉందని ఓ బీసీసీఐ అధికారి తెలిపారు. ఈ సిరీస్ కోసం సెలెక్షన్ కమిటీ ఇప్పటికే జట్టును ప్రకటించగా... యువ ఓపెనర్ శుబ్మన్ గిల్ను కెప్టెన్గా ఎంపిక చేసింది.
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి టెస్టు ఫార్మాట్కు రిటైర్మెంట్ ప్రకటించిన నేపథ్యంలో గిల్ సారథ్యంలోని యువ జట్టు ఈ సిరీస్లో ఎలాంటి ప్రదర్శన చేస్తుందో చూడాలి. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) 2025–27 సీజన్ను భారత జట్టు ఇదే సిరీస్తో ప్రారంభించనుంది.
చదవండి: పది మందికి రూ. 1 కోటికి పైగా...