breaking news
South India
-
ఓటీటీకి కాంతార చాప్టర్ 1.. అఫీషియల్ డేట్ వచ్చేసింది
రిషబ్ శెట్టి కాంతార చాప్టర్-1 బాక్సాఫీస్ వద్ద రికార్డుల ప్రభంజనం సృష్టిస్తోంది. దసరా కానుకగా థియేటర్లలో వచ్చిన ఈ సినిమా ఇప్పటికే రూ.800 కోట్లకు పైగా వసూళ్లతో దూసుకెళ్తోంది. ఇప్పటికే ఈ సినిమా 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. కేవలం మూడు వారాల్లోనే ఈ ఘనతను సొంతం చేసుకుంది. ఈ క్రమంలోనే విక్కీ కౌశల్ మూవీ ఛావాను దాటేసింది.ప్రస్తుతం ఈ మూవీ థియేటర్లలో సందడి చేస్తోంది. బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోన్న ఈ మూవీ ఓటీటీ రిలీజ్పై సస్పెన్స్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే కాంతార మూవీ మేకర్స్ ఉత్కంఠకు తెరదించారు. అంతా ఊహించినట్లుగానే అక్టోబర్ 31 నుంచే అమెజాన్ ప్రైమ్లో అధికారికంగా ప్రకటించారు. ఈ విషయాన్ని ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. కన్నడతో పాటు తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో అందుబాటులో ఉండనుందని వీడియోను షేర్ చేసింది. హిందీ భాషలో స్ట్రీమింగ్కు సంబంధించి ఎలాంటి ప్రకటనైతే రాలేదు.చాప్టర్ 1 కథేంటంటే?'కాంతార 1' విషయానికొస్తే.. తొలిభాగం ప్రస్తుతంలో జరిగితే ఈసారి మాత్రం శతబ్దాల వెనక్కి వెళ్తుంది. విజయేంద్ర (జయరామ్) బాంగ్రా రాజ్యాన్ని పాలిస్తుంటాడు. ఇతడికి కులశేఖరుడు (గుల్షన్ దేవయ్య) అనే కొడుకు. అతనికి మహారాజ పట్టాభిషేకం చేసి విశ్రాంతి తీసుకుంటాడు తండ్రి. మందుకొట్టడం తప్ప అసలు పాలన ఏం చెయ్యడు. యువరాజు చెల్లెలు కనకవతి (రుక్మిణి వసంత్). ఈ రాజ్యానికి దగ్గరలోని కాంతార అనే ప్రాంతంలో కొన్ని తెగలు ఉంటాయి.కాంతార తెగకు ప్రత్యర్థులు కడపటి దిక్కువాళ్లు. వాళ్ల మధ్యలో పోరు ఎలా ఉన్నా, ఈ కాంతార తెగలో కొందరు బాంగ్రా రాజ్యానికి వస్తారు. వారి నౌకాతీరాన్ని ఆక్రమించుకుంటారు. ఈ గొడవ వల్ల బాంగ్రా రాజుకి, కాంతార నాయకుడు బెర్మే (రిషబ్)కి గొడవ అవుతుంది. ఈ క్రమంలో కులశేఖరుడు బెర్మే తల్లిని చంపేసి, అతని ఊరిని తగలబెట్టేస్తాడు. తర్వాత ఏమైంది? అసలు విలన్ ఎవరనేది మిగతా స్టోరీ. get ready to witness the LEGENDary adventure of BERME 🔥#KantaraALegendChapter1OnPrime, October 31@hombalefilms @KantaraFilm @shetty_rishab @VKiragandur @ChaluveG @rukminitweets @gulshandevaiah #ArvindKashyap @AJANEESHB @HombaleGroup pic.twitter.com/ZnYz3uBIQ2— prime video IN (@PrimeVideoIN) October 27, 2025 -
'కన్నడ హీరో దర్శన్ కేసు.. మరణ శిక్ష వేసినా ఓకే'
శాండల్వుడ్ హీరో దర్శన్(Darshan Thoogudeepa) కేసు కీలక దశకు చేరుకుంది. ఇప్పటికే ఈ కేసులో రెండోసారి అరెస్టైన దర్శన్ ప్రస్తుతం జైలులోనే మగ్గుతున్నారు. ఈ నేపథ్యంలోనే తనకు కనీస సౌకర్యాలు కల్పించడం లేదని చాలాసార్లు విచారణ సందర్భంగా న్యాయస్థానాన్ని వేడుకున్నారు. కానీ దర్శన్ అడిగిన సౌకర్యాలు ఇవ్వడం సాధ్య కాదని.. అందులో కొన్ని మాత్రమే ఇవ్వగలమని కోర్టు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఈ కేసులో బెయిల్ కోసం ఇప్పటికే పిటిషన్పై వేయగా.. తాజాగా న్యాయస్థానం విచారణ చేపట్టింది.ఈ సందర్భంగా దర్శన్ తరఫు న్యాయవాది కోర్టులో వాదనలు వినిపించారు. జైలులో దర్శన్కు కనీస సదుపాయాలు కల్పించడం లేదని వివరించారు. ఎన్నిసార్లు మొర పెట్టుకున్నా కనీసం పట్టించుకోవడం లేదని కోర్టుకు తెలిపారు. ఈ కేసు విచారణ త్వరగా పూర్తి చేసి.. ఏ శిక్ష విధించినా దర్శన్ సిద్ధంగా ఉన్నాడని చెప్పారు. త్వరగా విచారణ జరిపి.. మరణశిక్ష విధించినా సరే తమకు సమ్మతమేనని దర్శన్ తరఫు న్యాయవాది వాదించారు. వెన్నునొప్పి సమస్య మళ్లీ తిరగబెట్టిందని.. గతంలో తనకు విషమిస్తే ఆత్మహత్య చేసుకుంటానని దర్శన్ చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా న్యాయవాది గుర్తు చేశారు. ఈ వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వు చేసి తదుపరి విచారణను అక్టోబర్ 29వ తేదీకి వాయిదా వేసింది.కాగా.. చిత్రదుర్గకు చెందిన రేణుకా స్వామి అనే అభిమాని హత్య కేసులో బెంగళూరు పరప్పన జైల్లో ఉన్న దర్శన్కు కనీస సౌకర్యాలు కల్పించాలని న్యాయస్థానాన్ని కోరారు. ఆయన ఆరోపణలతో వాస్తవాలను పరిశీలించేందుకు ఉన్నత న్యాయస్థానం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. బెంగళూరు 57వ సీసీహెచ్ కోర్టుకు న్యాయసేవ ప్రాధికార కార్యదర్శి వరదరాజ నివేదికను అందించారు. ఆయనకు నిబంధనల ప్రకారం అందాల్సిన సౌకర్యాలు ఉన్నాయని తెలిపారు. తనకు ఫంగస్ సోకిందని దర్శన్ అబద్ధం చెబుతున్నారంటూ చర్మవ్యాధుల చికిత్స నిపుణురాలు జ్యోతిబాయితో చేయించిన పరీక్ష నివేదికను కూడా న్యాయస్థానంలో అందజేశారు. రేణుకాస్వామి హత్య కేసులో తమకు బెయిలు మంజూరు చేయాలని దర్శన్, పవిత్రాగౌడ పిటిషన్ దాఖలు చేశారు. -
ఒక్క సినిమాతో తెలుగు, తమిళంలో విలన్గా క్రేజ్.. గుర్తుపట్టారా?
భారతీయ సినిమాల్లో పరాయి దేశ నటీనటులు అప్పుడప్పుడు కనిపిస్తుంటారు. అయితే వాళ్లలో క్రేజ్ తెచ్చుకున్న వాళ్లు మాత్రం చాలా తక్కువమంది ఉంటారు. అలాంటి వారిలో ఇతడు ఒకడు. చేసింది ఒక్కటే సౌత్ మూవీ అయినప్పటికీ. తెలుగు, తమిళ భాషల్లో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. మళ్లీ ఇన్నాళ్లకు ఇతడి ఫొటోలు వైరల్ అయ్యేసరికి సినీ ప్రేమికులు ఆశ్చర్యపోతున్నారు. ఇతడెవరో గుర్తుపట్టారా?(ఇదీ చదవండి: తెలుగు ఫోక్ డ్యాన్సర్ నాగదుర్గకి తమిళంలో హీరోయిన్ ఛాన్స్)పైన ఫొటోలో కనిపిస్తున్న నటుడి పేరు జానీ ట్రింగ్యుయెన్. ఇలా చెబితే మీకు గుర్తురాకపోవచ్చు. డాంగ్లీ అని చెబితే ఇచ్చే కనిపెట్టేస్తారు. సూర్య హీరోగా చేసిన '7th సెన్స్' చిత్రంలో విలన్ ఇతడే. వియత్నాంలో పుట్టిన ఇతడు.. సొంత భాషతో పాటు హాలీవుడ్లోనూ పలు చిత్రాలు చేశాడు. మార్షల్ ఆర్ట్స్ గురువుగానూ మంచి పేరు తెచ్చుకున్నాడు. 2017 వరకు పలు భాషల్లో నటించాడు. తర్వాత మాత్రం యాక్టింగ్ పక్కనబెట్టేశాడు.రీసెంట్గా సోషల్ మీడియాలో ఇతడు మాట్లాడుతున్న వీడియో ఒకటి వైరల్ అయ్యేసరికి.. డాంగ్లీ ఇంతలా మారిపోయాడేంటి అని నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు. సూర్య సినిమా వచ్చి దాదాపు 14 ఏళ్లు అయిపోయింది. వయసు కూడా 50 ఏళ్లు దాటేసింది. దీంతో కాస్త వృద్ధాప్య ఛాయలు కూడా డాంగ్లీ ముఖంలో కనిపిస్తున్నాయి. ఏదేమైనా ఒక్క సినిమాతో అటు తెలుగు, ఇటు తమిళంలో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడనే చెప్పొచ్చు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 20 సినిమాలు.. ఆ రెండు డోంట్ మిస్) View this post on Instagram A post shared by trippy[FX] (@trippy__reels) -
తెలుగు ఫోక్ డ్యాన్సర్కి తమిళంలో హీరోయిన్ ఛాన్స్
ఒకప్పుడు ఎంటర్టైన్మెంట్ అంటే సినిమాలు మాత్రమే. ఇప్పుడు టెక్నాలజీ చాలా మారిపోయింది. యూట్యూబ్లోనూ పలు ఆల్బమ్ సాంగ్స్ మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుంటున్నాయి. అందులో యాక్ట్ చేసిన వాళ్లు మంచి క్రేజ్ తెచ్చుకుంటున్నారు. అలాంటి వాళ్లలో నాగదుర్గ ఒకరు. గత కొన్నేళ్లలో ఫోక్ సాంగ్స్ చేస్తూ పేరు తెచ్చుకున్న ఈమె ఇప్పుడు ఏకంగా తమిళంలో హీరోయిన్గా ఛాన్స్ కొట్టేసింది.(ఇదీ చదవండి: థియేటర్లలో ఉండగానే ఓటీటీలోకి 'కాంతార-1')దారిపొంటత్తుండు, నా పేరు ఎల్లమ్మ, ఎర్ర రుమాల్, కాపోళ ఇంటికాడ తదితర సాంగ్స్తో ఈమె బోలెడంతమంది అభిమానుల్ని సంపాదించుకుంది. అయితే 'కలివనం' అనే తెలుగు సినిమాలో హీరోయిన్గా చేసినప్పటికీ ఇది రిలీజైందో, ఎప్పుడో రిలీజ్ అవుతుందో కూడా తెలియని పరిస్థితి. కొన్నిరోజుల క్రితం ఈమె.. తెలుగు బిగ్బాస్ 9వ సీజన్లోనూ పాల్గొంటుందని అన్నారు. కానీ అవి రూమర్స్ మాత్రమే అని తేలిపోయింది.అలాంటిది ఇప్పుడు తమిళ సినిమాలో నాగదుర్గకు అవకాశం దక్కింది. ప్రముఖ హీరో ధనుష్ మేనల్లుడు పవీష్.. గతేడాది 'జాబిలమ్మ నీకు అంత కోపమా' అనే డబ్బింగ్ చిత్రంతో హీరోగా మారాడు. ఇప్పుడు ఈ కుర్రాడు కొత్త సినిమాలోనే నాగదుర్గ హీరోయిన్గా చేయనుంది. ఒకవేళ ఇది క్లిక్ అయితే తమిళంలో మరిన్ని అవకాశాలు రావొచ్చు. ఈమె కంటే ముందు శాన్వి మేఘన, గౌరీప్రియ లాంటి పలువురు తెలుగమ్మాయిలు తమిళ సినిమాల్లో ఛాన్సులు దక్కించుకున్నారు. బాగానే పేరు సంపాదించారు. ఎటొచ్చి టాలీవుడ్లోనే తెలుగమ్మాయిలు హీరోయిన్స్గా కనిపించట్లేదు!(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 20 సినిమాలు.. ఆ రెండు డోంట్ మిస్) -
'మిరాకిల్ మ్యాన్' జి.డి.నాయుడు.. మూడో తరగతితోనే ఎన్నో అద్భుతాలు
ఆర్. మాధవన్(R. Madhavan) హీరోగా నటిస్తున్న కొత్త సినిమాకు ‘జి.డి.ఎన్’ అనే టైటిల్ ఖరారైంది. ‘ఎడిసన్ ఆఫ్ ఇండియా, మిరాకిల్ మేన్, వెల్త్ క్రియేటర్ ఆఫ్ కోయంబత్తూరు’ వంటి పేర్లను గడించిన గోపాల స్వామి దొరైస్వామి నాయుడు(Gopala Swamy Doraiswamy Naidu) (జీడీఎన్) జీవితం ఆధారంగా ‘జి.డి.ఎన్’(GDN) మూవీ తెరకెక్కుతోంది. ఈ బయోపిక్కు కృష్ణకుమార్ రామకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే, ఈ దేశానికి జి.డి.నాయుడు చేసిన సేవా ఎలాంటిదో తెలుసుకుందాం.1983లో కోయంబత్తూర్కు చెందిన ఒక వ్యవసాయ కుటుంబంలో జి.డి.నాయుడు జన్మించారు. ఆయనొక బహుముఖ ప్రజ్ఞాశాలి. ప్రయోగాలపై ఆసక్తితో పలు రంగాల్లో ఎన్నో ఆవిష్కరణలు చేశారు. ముఖ్యంగా ఎలక్ట్రికల్ రంగంలో ఒక విప్లవం సృష్టించారు. భారతదేశంలో ఎలక్ట్రిక్ మోటార్ను రూపొందించి ఎంతో కీర్తి సంపాదించారు. దీంతో ఆయన్ను మిరాకిల్ మ్యాన్గా ఈ దేశం గుర్తించింది. జి.డి.నాయుడు వ్యక్తిగత జీవితంతో పాటు వృత్తిపరంగా ఎదుర్కొన్న సవాళ్లు ఏంటి.. ఆపై ఆయన సాధించిన విజయాల ఎలాంటివి అనేది ఈ సినిమాలో చూపించనున్నారు.చదివింది మూడో తరగతి మాత్రమేజి. డి. నాయుడు మూడవ తరగతి వరకు మాత్రమే చదువుకున్నారు. కానీ, భారతదేశపు మొట్టమొదటి విద్యుత్ మోటారును తయారు చేశారు చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. ప్రఖ్యాతి గాంచిన ఇంజనీరుగానే కాకుండా నిరంతర అన్వేషకుడిగా గుర్తింపు పొందారు. ఆటోమొబైల్, అగ్రికల్చర్, టెక్స్టైల్, ఫొటోగ్రఫీ వంటి సెక్టార్స్లో ఎన్నో పరికరాల ఆవిష్కరణలు చేశారు. దక్షిణ భారత్లో పారిశ్రామిక విప్లవానికి కారణభూతుడై భారతదేశపు ఎడిసన్ అని పేరు తెచ్చుకున్నారు. 1920లో ఒక చిన్న మోటారు వాహనాన్ని కొనుగోలు చేసి పొల్లాచి, పళనిల మధ్య నడిపారు. తర్వాత వెంటనే యునైటెడ్ మోటార్ సర్వీస్ (UMS) సంస్థను స్థాపించి దాని ద్వారా ద్వారా 1937లో భారత దేశపు మొదటి మోటారు వాహనాన్ని తయారు చేశారు.జి. డి. నాయుడు తనే సొంతంగా కొన్ని మార్పులు చేర్పులు చేసి ఒక కెమెరాను తయారు చేశారు. ఆ కెమెరాతో అడాల్ఫ్ హిట్లర్, లండన్లో జార్జి రాజు అంత్యక్రియలు (1936), గాంధీ, నెహ్రు, సుభాష్ బోస్ వంటి గొప్ప వ్యక్తుల ఫొటోలు తీశారు. ఆయన తయారు చేసిన పరికరాలు, పనిముట్లు, కోయంబత్తూరులోని 'జి.డి. నాయుడు ప్రదర్శనశాల'లో ఇప్పటికీ ఉన్నాయి. తొలి ఇంజనీరింగ్ కళాశాల1944లో పారిశ్రామిక రంగానికి స్వస్తి చెప్పి నాయుడు.. సంఘసేవ వైపు అడుగులు వేశారు. బడుగు ప్రజల సేవకు అంకితమయ్యారు. పేద విద్యార్ఠులకు పలు ఉపకారవేతనాలు, సంక్షేమ కార్యక్రమాలు, కళాశాలకు దానధర్మాలు చేశారు. 1945లో కోయంబత్తూరులో తొలి ఇంజనీరింగ్ కళాశాలకు నాంది పలికారు. ఈ క్రమంలోనే ఆర్థర్ హోప్ పాలిటెక్నిక్, ఆర్థర్ హోప్ ఇంజినీరింగ్ కళాశాలలు స్థాపించారు. 1974లో అనారోగ్యంతో ఆయన మరణించారు.ఈ మధ్యకాలంలో మాధవన్ నటిస్తున్న రెండో బయోపిక్ ఇది. ఇస్రో మాజీ శాస్త్రవేత్త నంబి నారాయణన్ జీవితం ఆధారంగా ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్’ సినిమా (2022)లో నటించడంతో పాటు డైరెక్షన్ కూడా చేసి మెప్పించారు మాధవన్. ఈ సినిమాకు జాతీయ అవార్డు వచ్చింది. ఇప్పుడు మళ్లీ మరో బయోపిక్లో మాధవన్ నటిస్తుండటం విశేషం. వెండితెరపై మిరాకిల్ మేన్గా మాధవన్ ఏ స్థాయిలో ప్రేక్షకులను మెప్పిస్తారో చూడాలి. -
బైసన్ మూవీ టీమ్పై సీఎం ప్రశంసలు
మారి సెల్వరాజ్ దర్శకత్వంలో ధ్రువ్విక్రమ్ (Dhruv Vikram) కథానాయకుడిగా నటించిన చిత్రం బైసన్ (Bison Movie). అనుపమ పరమేశ్వరన్, రజీషా విజయన్, పశుపతి తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని అప్లాస్ సంస్థతో కలిసి నీలం ప్రొడక్షన్స్ పతాకంపై దర్శకుడు పా.రంజిత్ నిర్మించారు. నివాస్ కే ప్రసన్న సంగీతాన్ని అందించిన ఈ చిత్రం తమిళనాడులో అక్టోబర్ 17న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది.బైసన్ టీమ్ను అభినందించిన సీఎంబైసన్ మూవీ చూసిన ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, ఉపముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్.. ఆఫీసుకు పిలిచి మరీ మారిసెల్వరాజ్, ధ్రువ్విక్రమ్లను అభినందించారు. బైసన్ చిత్రం గురించి ఎక్స్లో ముఖ్యమంత్రి స్టాలిన్ మాట్లాడుతూ.. మారిసెల్వరాజ్ సినీమకుటంలో ఇది మరో వజ్రం. ప్రతిభను మాత్రమే నమ్ముకున్న ఒక యువకుడు అటు కబడ్డీ కోర్టులో, ఇటు బయట ఎదురైన సమస్యలను ఎదుర్కొని విజయం సాధించిన కథను చాలా గొప్పగా తీర్చిదిద్దారు. చక్కగా చూపించారుక్రీడలు నేపథ్యంగా చేసుకుని ఒక యువకుడు చేరుకోవాల్సిన మార్గాన్ని దర్శకుడు మారిసెల్వరాజ్ చక్కగా చూపించారన్నారు. అద్భుతమైన నటనతో మారిసెల్వరాజ్ కథకి ప్రాణం పోసిన నటుడు ధ్రువ్విక్రమ్, పశుపతి, అనుపమ పరమేశ్వరన్, రెజీషా విజయన్.. ఇతర నటినటులు, తెర వెనుక శ్రమించిన సాంకేతిక వర్గానికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేశారు. సీఎం రివ్యూతో పొంగిపోయిన మారి సెల్వరాజ్ ఎక్స్ మీడియా ద్వారా స్టాలిన్కు కృతజ్ఞతలు తెలిపారు. #BisonKaalamaadan: மாரி செல்வராஜின் திரைமகுடத்தில் மற்றுமொரு வைரக்கல்!தன் திறமையை மட்டுமே நம்பி, கிராமத்தில் இருந்து சாதிக்கக் கிளம்பிய ஓர் இளைஞன், கபடிக் கோட்டுக்கு உள்ளேயும் வெளியேயும் சந்திக்கும் போராட்டங்களை எதிர்கொண்டு வெற்றி பெற்ற கதையை மிகச் சிறப்பான திரை அனுபவமாக… pic.twitter.com/q345pPYkxl— M.K.Stalin - தமிழ்நாட்டை தலைகுனிய விடமாட்டேன் (@mkstalin) October 25, 2025 చదవండి: హిట్ మూవీలో వేశ్యగా నటించిన బ్యూటీ.. 'ప్రభాస్' ఫౌజీలో ఛాన్స్ -
'డ్యూడ్' హీరోయిన్ మమితా బైజుకు బిగ్ ఛాన్స్
ధనుష్తో నటి మమితా బైజుకు(Mamitha Baiju) జత కుదిరింది. రీసెంట్గా డ్యూడ్తో ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. మొదట మలయాళం మూవీతో తెరపైకి వచ్చిన ఈ బ్యూటీ తమిళం, తెలుగు అంటూ చుట్టేస్తోంది. ప్రేమలుతో దక్షిణాది చిత్ర పరిశ్రమనే తన వైపు తిప్పుకున్న ఈ అమ్మడు కోలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన తొలి చిత్రం రెబెల్ నిరాశపరచడంతో అక్కడ ఈ భామ పప్పులు ఉడకవు అనే విమర్శలను ఎదుర్కొంది. బాలా దర్శకత్వంలో వణంగాన్ చిత్రంలో కొన్ని రోజులు నటించి వైదొలగింది. దీంతో కోలీవుడ్లో చిన్న గ్యాప్ కూడా వచ్చింది. అలాంటిది ఇప్పుడు తమిళంలో బిజీ హీరోయిన్ అయిపోయింది. ప్రదీప్ రంగనాథన్తో జతకట్టిన ద్విభాషా ( తమిళం, తెలుగు) చిత్రం డ్యూడ్ దీపావళి సందర్భంగా తెరపైకి వచ్చి ప్రేక్షకుల ఆదరణతో విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. ప్రస్తుతం విజయ్ హీరోగా నటించిన జననాయకన్ చిత్రంలో ఆయనకు చెల్లెలిగా కీలక పాత్రను పోషించింది. ఈచిత్రం వచ్చే ఏడాది జనవరి 9న తెరపైకి రానుంది. తాజాగా సూర్య కథానాయకుడిగా నటిస్తున్న ద్విభాషా చిత్రంలో కథానాయికిగా నటిస్తోంది. అదేవిధంగా ఇరెండు వారమ్ అనే మరో చిత్రంలో నటించిన మమితబైజు మలయాళంలోనూ ఒక చిత్రంలో నటిస్తోంది. కాగా తాజాగా మరో లక్కీచాన్స్ ఈ అమ్మడిని వరించింది. ధనుష్ సరసన నటించడానికి మలయాళీ బ్యూటీ రెడీ అవుతోంది. నటుడు ధనుష్ ప్రస్తుతం తేరే ఇష్క్మేన్ అనే హిందీ చిత్రంలో నటిస్తున్నారు. తదుపరి వేల్స్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై ఐసరి కే.గణేశ్ నిర్మించనున్న చిత్రంలో నటించడానికి సిద్ధం అవుతున్నారు. ఇది ఈయన నటించే 54వ చిత్రం అవుతుంది. దీనికి పోర్ తొళిల్ చిత్రం ఫేమ్ విఘ్నేష్ రాజా దర్శకత్వం వహించనున్నారు. దీనికి జీవీ.ప్రకాష్కుమార్ సంగీతాన్ని అందిస్తున్నారు. దీని గురించిన అధికారిక పోస్టర్ను నిర్మాతల వర్గం విడుదల చేసింది. వచ్చే నెలలోనే ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది. ఇందులో మమితబైజు నాయకిగా నటించనుందని సినీ వర్గాల సమాచారం. -
సూపర్ షీ మూవీ రెడీ
‘శుక్ర, మాటరాని మౌనమిది, ఏ మాస్టర్ పీస్’ వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు పూర్వాజ్ తెరకెక్కించిన తాజా చిత్రం ‘కిల్లర్’. ఉర్వీష్ పూర్వాజ్ సమర్పణలో పూర్వాజ్, ప్రజయ్ కామత్, ఎ. పద్మనాభరెడ్డి నిర్మించిన ఈ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ మూవీలో జ్యోతి పూర్వాజ్ లీడ్ రోల్ చేశారు. విశాల్ రాజ్, దశరథ, చందు, గౌతమ్ కీలక పాత్రల్లో నటించారు.‘‘ఈ సూపర్ షీ మూవీని త్వరలో రిలీజ్కి రెడీ చేస్తున్నాం. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన గ్లింప్స్కు మంచి స్పందన లభించింది. మైథాలజీ, సైన్స్ ఫిక్షన్... ఇలాంటి ఎలిమెంట్స్తో ఈ సినిమా ఆసక్తికరంగా సాగుతుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రోడక్షన్ పనులు జరుగు తున్నాయి’’ అని దర్శక–నిర్మాతలు తెలిపారు. -
పరిచయమే పదనిసలా...
విష్ణు విశాల్ హీరోగా సెల్వరాఘవన్, శ్రద్ధా శ్రీనాథ్, మానసా చౌదరి కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘ఆర్యన్’. ఈ నెల 31న ఈ చిత్రం విడుదల కానుంది. ఆదివారం ఈ చిత్రం నుంచి ‘పరిచయమే పదనిసలా...’ అంటూ సాగే పాటను విడుదల చేశారు. విష్ణు విశాల్, మానసా చౌదరి మధ్య ఈ పాట సాగుతుంది. వీరి పరిచయం ప్రేమకు దారి తీయడం నుంచి పెళ్లి చేసుకునే వరకూ... అంతా ఈ పాటలో కనిపించింది.ప్రవీణ్ .కె దర్శకత్వంలో శుభ్రా, ఆర్యన్ రమేశ్, విష్ణు విశాల్ నిర్మించిన ఈ చిత్రానికి జిబ్రాన్ సంగీతదర్శకుడు. లవ్ మెలోడీ సాంగ్ ‘పరిచయమే...’కు సామ్రాట్ సాహిత్యం అందించగా, అభి .వి, భృత్త ఆలపించారు. ఈ చిత్రాన్ని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో శ్రేష్ట్ మూవీస్ అధినేత సుధాకర్ రెడ్డి విడుదల చేయనున్నారు. -
ఈ పాన్ ఇండియా నటుడిని గుర్తుపట్టారా? బయోపిక్ కోసం ఇలా
ఇతడు అప్పట్లో హీరోగా పలు హిట్ సినిమాలు చేశాడు. అమ్మాయిలకు ఫేవరెట్ అయిపోయాడు. వయసు పెరిగి 50 ఏళ్లు దాటినా సరే కుర్రహీరోలు అసూయ పడేలా ఫిజిక్ మెంటైన్ చేస్తుంటాడు. తెలుగు, తమిళ, హిందీ.. ఇలా దేశవ్యాప్తంగా క్రేజ్ సొంతం చేసుకున్నాడు. అలాంటిది ఇప్పుడు ఓ మూవీ కోసం గుర్తుపట్టలేనంతగా మారిపోయి కనిపించాడు. ఎవరో కనిపెట్టారా? చెప్పేయమంటారా?పైన ఫొటోలో కనిపిస్తున్న నటుడి పేరు మాధవన్. అవును మీరు విన్నది నిజమే. 'సఖి' సినిమాతో అప్పట్లోనే తెలుగులోనూ అద్భుతమైన ఫ్యాన్ బేస్ సొంతం చేసుకున్న ఇతడు.. ఇప్పటికీ చకచకా మూవీస్ చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. నంబీ నారాయణన్ అనే శాస్త్రవేత్త బయోపిక్లో నటించి మెప్పించిన ఈ నటుడు.. ఇప్పుడు మరో క్రేజీ బయోపిక్ చేస్తున్నాడు. ఆ మూవీ ఫస్ట్ లుక్కే ఇది.మాధవన్ చేస్తున్న లేటెస్ట్ బయోపిక్ మూవీ 'జీడీ నాయుడు'. బల్బ్ కనిపెట్టింది థామస్ అల్వా ఎడిసన్. జీడీ నాయుడుని.. ఎడిసన్ ఆఫ్ ఇండియా అని ముద్దుగా పిలుస్తారు. ఈయన పూర్తిపేరు గోపాలస్వామి దొరైస్వామి నాయుడు. తమిళనాడులోని కోయంబత్తూర్ ఈయన స్వస్థలం. మనం రోజూ ఉపయోగిస్తున్న ఎన్నో ఆవిష్కరణలు ఈయనుంచి వచ్చినవే. ఓటు రికార్డింగ్ మెషీన్, జ్యూస్ పిండే మెషీన్, కాయిన్తో పనిచేసే ఫొనోగ్రాఫ్, ఎలక్ట్రానిక్ క్యాలిక్యులేటర్, 16 ఎమ్ఎమ్ ప్రొజెక్టర్ లాంటివి రావడంలో ఈయన పాత్ర మరువలేనిది. అలానే దేశంలో తొలి పాలిటెక్నిక్ కాలేజీ పెట్టింది కూడా ఈయనే కావడం విశేషం.ఇలాంటి వ్యక్తి బయోపిక్లో మాధవన్ లీడ్ రోల్ చేస్తున్నాడంటే కాస్త ఆసక్తికరంగానే అనిపిస్తుంది. ఎలా చూపిస్తారనేది తెలియాలంటే వచ్చే ఏడాది వేసవి వరకు ఆగాల్సిందే. తాజాగా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ చూస్తే ఫొటోలో ఉన్నది మాధవన్యేనా అనిపిస్తుంది. అంతలా మారిపోయి కనిపిస్తున్నాడు. మాధవన్ మూవీస్ విషయానికొస్తే.. తెలుగులో నిశ్శబ్దం, సవ్యసాచి అనే మూవీస్ మాత్రమే చేశాడు. ఇవి రెండు ఘోరంగా ఫ్లాప్ అయ్యాయి. -
మళ్లీ ప్రాణం పోసుకున్న పునీత్ రాజ్కుమార్.. ఫ్యాన్స్తో మాట్లాడతాడు!
కన్నడ సినిమా పరిశ్రమకు మాత్రమే కాకుండా, కర్ణాటక ప్రజల హృదయాల్లో శాశ్వత స్థానం సంపాదించుకున్న లెజెండరీ నటుడు డాక్టర్ పునీత్ రాజ్కుమార్(Puneeth Rajkumar). ఆయన మరణించి నాలుగేళ్లు(2021లో గుండెపోటుతో మరణించాడు) అవుతున్నా.. అభిమానులు ఇప్పటికీ మర్చిపోవడం లేదు. ఏదో రకంగా ఆయనను గుర్తు చేసుకుంటూనే ఉన్నారు. ఆ మధ్య ఏఐ(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్)ని ఉపయోగించి ఓ వెబ్ సిరీస్లో పునీత్ రాజ్ కుమార్ని చూపించారు. ఇప్పుడు అదే టెక్నాలజీతో ఏకంగా ఫ్యాన్స్తో మాట్లాడేలా ఓ యాప్ని తీసుకొచ్చారు స్టార్ ఫ్యాండమ్ LLP సంస్థ. తాజాగా ఈ యాప్ని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ లాంచ్ చేశారు. పునీత్ భార్య అశ్విని పునీత్ రాజ్కుమార్ సహకారంతో, స్టార్ ఫ్యాండమ్ LLP వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ సమర్థ రాఘవ నాగభూషణం నాయకత్వంలో అభివృద్ధి చేయబడిన ఈ యాప్, భారతదేశంలో మొదటి ఫ్యాన్డమ్ ఆధారిత డిజిటల్ ప్లాట్ఫామ్గా చరిత్ర సృష్టించింది.పునీత్ రాజ్కుమార్ వర్ధంతి(అక్టోబర్ 29)కి మూడు రోజుల ముందే ఈ యాప్ని విడుదల చేశారు. 'అప్పు ఫ్యాండమ్ యాప్' (Appu Fandom App) అని కూడా పిలువబడే ఈ అప్లికేషన్, ఏఐ టెక్నాలజీ ద్వారా పునీత్ యొక్క ఆకర్షణ, క్రమశిక్షణ, సానుకూలత, మానవత్వ గుణాలను డైనమిక్గా ప్రతిబింబించడానికి రూపొందించబడింది. ఇది కేవలం ఒక ట్రిబ్యూట్ మాత్రమే కాకుండా, ఫ్యాన్స్తో పునీత్ ఆత్మను డిజిటల్గా కనెక్ట్ చేసే జీవంతమైన అనుభవంగా మారుతుంది.ఈ యాప్ పునీత్ రాజ్కుమార్ యొక్క 'పవర్ స్టార్' ఇమేజ్ను కొత్త తరాలకు అందించడమే కాకుండా, కన్నడ సినిమా పరిశ్రమకు డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్లో మైలురాయిగా నిలుస్తుందని నిపుణులు చెబుతున్నారు. PRK ప్రొడక్షన్స్ ద్వారా అశ్విని నిర్వహించబడుతున్న ప్రాజెక్ట్గా, ఇది పునీత్ యొక్క సినిమాలు, గ్రామీణ సేవలు, యువత ప్రేరణలను కలిగి ఉంటుంది. ఫ్యాన్స్ ఇప్పటికే యాప్ను డౌన్లోడ్ చేసి, పవర్ స్టార్తో 'కనెక్ట్' అవుతున్నారు. -
'కాంతార' హిట్.. మమ్నల్నే అంటారెందుకు?: 'కబాలి' డైరెక్టర్
రీసెంట్ టైంలో పాన్ ఇండియా రేంజులో 'కాంతార 1' సినిమాకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఇంకా వస్తూనే ఉంది. తమిళనాడులోనూ ఈ చిత్రాన్ని బాగానే ఆదరించారు. అయితే ఇలాంటి మూవీస్ హిట్ అయిన ప్రతిసారి మా ముగ్గురు దర్శకుల్నే కొందరు తమిళ ఫ్యాన్స్ ఎందుకు తిడుతున్నారో అర్థం కావట్లేదని ప్రముఖ డైరెక్టర్ పా. రంజిత్ అసహనం వ్యక్తం చేశాడు. 'బైసన్' సక్సెస్ మీట్లో ఈ వ్యాఖ్యలు చేశాడు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి సూపర్ హీరోల సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్)ఇంతకీ అసలేమైంది?''కాంతార' లాంటి సినిమాలు భారీ విజయాన్ని అందుకున్నప్పుడు.. కొందరు కోలీవుడ్ ఫ్యాన్స్ ముగ్గురు తమిళ దర్శకుల్ని తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటారు. మేమే తమిళ ఇండస్ట్రీని చెడగొట్టామని విమర్శిస్తుంటారు. గత రెండేళ్లలో కోలీవుడ్లో 600కి పైగా మూవీస్ రిలీజ్ అయ్యాయి. మరి వీళ్లలో ఎంతమంది తమిళ సినిమా స్థాయిని పెంచగలిగారు?' అని పా. రంజిత్ ఫైర్ అయిపోయాడు.తెలుగు, కన్నడ ఇండస్ట్రీలో కమర్షియల్, రూటెడ్ సినిమాలు వస్తున్నాయి. వందల వేల కోట్ల వసూళ్లు సాధిస్తున్నాయి. తమిళంలో మాత్రం ఏ దర్శకులు కూడా ఆ ఫీట్ సాధించలేకపోతున్నారు. దీంతో రీసెంట్ టైంలో కొందరు తమిళ నెటిజన్లు, రివ్యూయర్స్.. డైరెక్టర్స్ పా. రంజిత్, వెట్రిమారన్, మారి సెల్వరాజ్పై పడ్డారు. కులం, అణిచివేత సబ్జెక్ట్స్తో మాత్రమే వీళ్లు సినిమాలు తీస్తున్నారని, అందువల్లే తమిళ ఇండస్ట్రీ నాశనమైపోతుందని విమర్శించారు. ఆ కామెంట్స్కి హర్ట్ అయిన పా.రంజిత్.. ఇప్పుడు కౌంటర్ ఇచ్చాడు.ఇదే ఈవెంట్లో పా.రంజిత్ మాట్లాడుతూ.. 'సోషల్ మెసేజ్ ఉండే సినిమాలని అర్థం చేసుకోకుండా వాటిపై కులం అనే ముద్ర వేయొద్దు. ప్రేక్షకులు ప్రేమతో సినిమాల్ని చూస్తారు. కానీ ట్రోల్స్.. ఓ మూవీని చూడకముందే చాలామందికి ఓ అభిప్రాయాన్ని కలుగజేస్తున్నాయి' అని చెప్పుకొచ్చాడు.పా.రంజిత్ విషయానికొస్తే.. రజినీకాంత్తో కబాలి, కాలా లాంటి మూవీస్ తీశాడు. తమిళంలో వీటికి ఓ మాదిరి ఆదరణ వచ్చింది. తెలుగులో మాత్రం రెండు ఫ్లాప్ అయ్యాయి. గతేడాది 'తంగలాన్' అనే మూవీతో వచ్చాడు. ఇది కూడా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టేసింది.(ఇదీ చదవండి: 9 నెలల పిల్లాడు.. దెయ్యమై పగ తీర్చుకుంటే?) -
సెట్కు ఆలస్యం.. షాలిని తండ్రిని చితకబాది అవమానించారా?
'హీరోయిన్ షాలిని తండ్రి హోటల్లో గిన్నెలు కడిగేవాడు.. కూతురిని లేటుగా సెట్కు తీసుకెళ్లినందుకు ఓ డైరెక్టర్ చేతిలో తన్నులు తిన్నాడు.. ఒకప్పుడు పేదవాడిగా ఉండి ఇప్పుడు కోట్లకు పడగలెత్తాడు' అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు తమిళ దర్శకుడు అలెప్పీ అష్రఫ్. మీడియాకు దూరంగా ఉండే షాలిని తండ్రి బాబు... ఈ వ్యాఖ్యాలపై స్పందించాడు. అవన్నీ నిజం కాదని కొట్టిపారేస్తున్నాడు. నన్ను కొడుతుంటే షాలిని ఏడుస్తూ ఉందా?మనోరమ ఆన్లైన్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బాబు మాట్లాడుతూ.. అలెప్పీ అష్రఫ్ (Alleppey Ashraf) నాకు చాలా ఏళ్లుగా తెలుసు. మా కుటుంబానికి చాలా క్లోజ్. మేమెలాంటివాళ్లమో తనకు బాగా తెలుసు. అయినప్పటికీ మా గురించి అలాంటి వీడియో ఎందుకు చేశాడో అర్థం కావడం లేదు. పోనీ, చేసేముందు మాకో మాటైనా చెప్పలేదు. తను చెప్పినదాంట్లో దాదాపు అన్నీ అబద్ధాలే.. మలయాళ నటుడు కుంచకొ తండ్రి, దర్శకనటుడు బొబన్ నన్ను చెంపదెబ్బ కొట్టి.. చితకబాదుతుంటే నా కూతురు చూసి ఏడ్చిందట! అది పూర్తిగా అసత్యం. ఒకటి నిజంబొబన్ అలాంటివారు కానే కాదు. అయితే ఒకటి మాత్రం నిజం. Aazhi (1985) మూవీ సెట్కు సమయానికి వెళ్లలేకపోయాం. ఎందుకంటే బొబన్ సినిమాకు సంతకం చేయడానికి ముందే నా కూతురు షాలిని (Shalini) మరో సినిమా చేస్తోంది. ఆ మూవీ షూటింగ్ నిమిత్తం మేము విదేశాల్లో ఉన్నాం. దానివల్ల ఒకరోజు ఆలస్యంగా సెట్కు వచ్చాం. అప్పుడప్పుడు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇది మాకంటే సినీ ఫ్యామిలీలో పుట్టిన బొబన్కే బాగా తెలుసు. అయినప్పటికీ మాపై కాస్త కోప్పడ్డాడు. షాలిని కుటుంబంఇది మరీ కామెడీ!పరిస్థితి ఇదీ.. అని మేము వివరించేసరికి తను కాస్త శాంతించాడు. అంతే తప్ప ఆయన నాపై చేయి ఎత్తలేదు. ఆయనే కాదు, ఎవరూ నన్ను కొట్టే పరిస్థితి నేను తెచ్చుకోలేదు. మేమెప్పుడూ ప్రేమగానే మసులుకునేవాళ్లం. అలాంటిది బొబన్ కొడితే ఆ దెబ్బకు నేను చెరువులో పడ్డానని, దెబ్బలు తగిలాయని, వేరేవాళ్లు నన్ను కాపాడారని చెప్తుంటే హాస్యాస్పదంగా ఉంది. పైగా నాకు ఈత వచ్చు. చెరువులోనే కాదు, సముద్రంలోనూ ఈత కొట్టగలను.అదేమైనా చేయకూడని పనా?అష్రఫ్ ఇంకా ఏమన్నారు.. షాలిని సినిమాల్లోకి రాకముందు హోటల్లో పని చేశానా? మురికివాడలో నివసించానా? నేను గిన్నెలు కడగడం, టేబుల్ క్లీన్ చేయడం అష్రఫ్ చూశాడా? ఎందుకీ అబద్ధాలో అర్థం కావడం లేదు. ముందుగా.. హోటల్లో పని చేయడం చిన్నతనమేమీకాదు. పొట్టకూటికోసం ఏదైనా చేసుకోవచ్చు. దేవుడి దయవల్ల నాకలాంటి అవసరం రాలేదు. నేను ఓ ఫ్యాన్సీ షాప్ రన్ చేసేవాడిని. మరో విషయం ఏమన్నాడు? నా భార్య జూనియర్ ఆర్టిస్టా? తనకసలు సినిమాలంటేనే ఆసక్తి లేదు. ఇల్లు వదిలి బయటకు రాదు. నా పిల్లలిద్దరికీ సినిమా ఛాన్సులు వచ్చినప్పుడు నేనే వాళ్లను పట్టుకుని తిరిగానే తప్ప తనెప్పుడూ మాతో రాలేదు. రమ్మని అడిగితే ఇంట్లోనే ఉంటాననేది. రూ.100 కోట్ల ఆస్తి?ఒకప్పుడు కటిక పేదరికం అనుభవించానని, ఇప్పుడు రూ.100 కోట్ల ఆస్తి ఉందన్నాడు. అంత కరెక్ట్గా ఎలా చెప్పగలడో మరి? దేవుడి దయవల్ల మేము మంచి స్థాయిలోనే ఉన్నాం. ఇంకోటి.. అజిత్ (Ajith Kumar) రూ.180 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు పేర్కొన్నాడు. అవును, తన రేంజ్ను బట్టి ఎంతైనా తీసుకుంటాడు. దాని ప్రకారమే ట్యాక్స్ కూడా కరెక్ట్గా కడతాడు. మరింకేంటి సమస్య? అష్రఫ్ మీద నాకెలాంటి కోపం లేదు. మేమిద్దరం గల్ఫ్ దేశంలో ఓ స్కిట్ కూడా చేశాం. అదిప్పటికీ నాకు బాగా గుర్తు. మరి తనెందుకు ఇలా అనుచిత వ్యాఖ్యలు చేశాడో అంతు చిక్కడం లేదు అని బాబు చెప్పుకొచ్చాడు.సినిమాఎలైస్-బాబు దంపతులకు కూతుర్లు షాలిని, షామిలి, కొడుకు రిచర్డ్ సంతానం. ఈ ముగ్గురూ సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. చైల్డ్ ఆర్టిస్ట్గా, హీరోయిన్గా అనేక సినిమాలు చేసిన షాలిని.. 2000వ సంవత్సరంలో అజిత్ను పెళ్లాడింది. వీరికి ఓ కూతురు, కుమారుడు సంతానం. వివాహం తర్వాత షాలిని మూవీస్కు గుడ్బై చెప్పింది.చదవండి: పసిబిడ్డను చంపేయమని అడిగా.. నాపై ఉమ్మేశారు!: కస్తూరి -
పసిబిడ్డను చంపేయమని అడిగా.. నాపై ఉమ్మేశారు!: కస్తూరి
ముక్కుసూటి వైఖరితో ఎప్పుడూ వివాదాల్లో నానుతూ ఉంటుంది నటి కస్తూరి శంకర్ (Kasthuri Shankar). తమిళనాడులోని అంతఃపురంలో సేవలు చేసేందుకు తెలుగువారు వచ్చారని.. అందులో కొందరు ఇప్పుడు తమిళులుగా చెలామణి అవుతున్నారని వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకుగానూ జైలుకు కూడా వెళ్లొచ్చింది. తాజాగా ఆమె తన సినీ జీవితం, జైలు జీవితం గురించి ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చిందిఅపార్థం చేసుకున్నారుకస్తూరి మాట్లాడుతూ.. 'నేను యాంకర్గా కెరీర్ ప్రారంభించాను. ఆ సమయంలో నాగార్జున షేక్హ్యాండ్ ఇచ్చారు. తర్వాత ఆయనతోనే అన్నమయ్య సినిమాలో నటించాను. అందుకు చాలా హ్యాపీ. గతేడాది నాకు అస్సలు కలిసిరాలేదు. ఓ రాజకీయ వేదికపై నేను చెప్పిన మాటల్ని ట్విస్ట్ చేసి వైరల్ చేశారు. నాపై నింద వేసి మరీ జైల్లో వేశారు. తెలుగు భాష అన్నా, ఇక్కడివారన్నా నా ఫ్యామిలీలాగా భావిస్తాను. ఆ అభిమానంతోనే ఇక్కడ సెటిలయ్యాను. అలాంటిది వీళ్లందరూ నన్ను అపార్థం చేసుకున్నారన్నదే నా పెద్ద బాధ!బ్లడ్ క్యాన్సర్సినిమాల్లో చూపించినట్లుగా జైలు జీవితం ఉండదు. జైలుకు వెళ్లిన రోజు నా జీవితంలోనే వరస్ట్. ఇకపోతే నా జీవితం అయిపోయింది అని బాధపడిన సందర్భాలు చాలా ఉన్నాయి. మా అమ్మ ఆరోగ్యం బాగుచేయాలని ఆరేళ్లు కష్టపడ్డాం. కానీ చనిపోయింది. అమ్మ పోయిన ఐదు నెలలకే నాన్న మరణించాడు. తర్వాత మా అమ్మాయిని చావు అంచుల నుంచి బయటకు తీసుకొచ్చాం. తనకు బ్లడ్ క్యాన్సర్.. ట్రీట్మెంట్ పని చేయలేదు. ప్రపంచంలో 200 మందికి మాత్రమే వచ్చే అరుదైన బ్లడ్ క్యాన్సర్ వచ్చింది. తనను పోగొట్టుకోవడానికి కూడా సిద్ధంగా ఉండాలన్నారు. అదే నాకు పెద్ద పరీక్ష, బాధ! నా కూతురి పేరిట మను మిషన్ అని ఓ స్వచ్చంద సంస్థను ప్రారంభించాను. రైల్వే ట్రాక్పై పసిబిడ్డ దొరికిందిఈ చారిటీ ద్వారా అనారోగ్యంతో బాధపడుతున్న చిన్నారులకు ఏదైనా బహుమతులు, దుస్తులు ఇవ్వడం లాంటి చిన్నచిన్న పనులు చేస్తుంటాం. అలా చేస్తుండగా ఓసారి రైల్వే ట్రాక్పై ఓ పసిబిడ్డను చూశాను. తనకు రెండేళ్లు.. కానీ చూసేందుకు ఐదు నెలల పిల్లాడిలా ఉంటాడు. రోడ్లపై అడుక్కోవడం కోసం ఆ చిన్నారిని ఎదగనివ్వలేదు. నోట్లో సారా పోసి పడుకోబెట్టేవారు. ఆ బిడ్డను అవసరమైనంతవరకు వాడుకుని తర్వాత రైల్వే ట్రాక్పై పడేశారు. ఆ బాబును ఆస్పత్రికి తీసుకెళ్తే కాలేయం పూర్తిగా పాడైందన్నారు.చావును ప్రసాదించమన్నా..మానసిక ఎదుగుదల లేదని చెప్పారు. వారంపాటు నేన ట్రీట్మెంట్ చేయించాను. ఏమాత్రం బెటర్మెంట్ లేకపోయేసరికి నేను ధైర్యం తెచ్చుకుని ఓ మాట అడిగాను. తనకు ఎదుగుదల లేనప్పుడు వైద్యం చేయించి ఇంకా నరకంలోకి తోయడం ఎందుకు? తనను మెర్సీ కిల్లింగ్(చావు ప్రసాదించడం)కి వదిలేయొచ్చుగా అని అడిగాను. అందుకు డాక్టర్.. అలా చావాలని రాసుంటే ఆకలిదప్పికలతో ఎప్పుడో చచ్చిపోయేవాడు. బతికున్నాడంటే అతడొక ఫైటర్. నాపై ఉమ్మేశారుతనను బతికించడం మా బాధ్యత అన్నారు. ప్రస్తుతానికైతే బాబు పరిస్థితి కాస్త మెరుగ్గానే ఉంది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే చావును మనం నిర్ణయించకూడదు. బతకడం మాత్రమే మన కర్తవ్యం అని చెప్పుకొచ్చిందిది. తనకు ఎదురైన ఓ చెత్త అనుభవం గురించి చెప్తూ.. ఓసారి దగ్గర్లో ఉన్న ఏటీఎమ్ కోసం నడుచుకుంటూ వెళ్లాను. ఇంతలో ఓ బస్సులో నుంచి ఒకరు నా మీద ఉమ్మేశారు అని తెలిపింది.చదవండి: 'రూ.2 కోట్లిస్తావా? ప్రైవేట్ వీడియోలు బయటపెట్టమంటావా?' -
'రూ.2 కోట్లిస్తావా? ప్రైవేట్ వీడియోలు బయటపెట్టమంటావా?' బుల్లితెర నటి
యశవంతపుర (కర్ణాటక): టీవీ సీరియళ్ల కథల గురించి అందరికీ తెలిసిందే. అందులో పాత్రధారులు నిరంతరం కుట్రలు, కుతంత్రాలు చేస్తూ ఎత్తుకు పైఎత్తులు వేస్తుంటారు. అదేమాదిరి ఓ నటి నిజ జీవితంలోనూ ప్రవర్తించింది. కన్నడ టీవీ సీరియల్స్లో నటించి పేరుపొందిన నటీమణి ఆశా జోయిస్ (Asha Jois) నేరారోపణల్లో చిక్కుకుంది. ఓ మహిళ ప్రైవేట్ వీడియో, ఫోటోలను దొంగతనం చేసి రూ.2 కోట్లు ఇవ్వాలని బెదిరించినట్లు బెంగళూరు నగర తిలక్ నగర ఠాణాలో ఫిర్యాదు దాఖలైంది. పార్వతి (61) అనే మహిళ ఈ మేరకు ఫిర్యాదు చేసింది. డబ్బు ఇవ్వకపోవడంతో.. ఆశా జోయిస్.. 2016లో మిస్ ఇండియా ప్లానెట్ పోటీలలో విజేతగా నిలిచింది. టీవీ సీరియల్స్లోనూ నటించింది. తర్వాత బాధిత మహిళ పార్వతితో స్నేహం పెంచుకుంది. తాను టీవీ నటి అని చెప్పుకుంది. ఈ నేపథ్యంలో ఆశా.. బాధితురాలి వీడియోలను సేకరించి ఆమె భర్తను డబ్బు కోసం ఒత్తిడి చేయడం ప్రారంభించింది. ఇందుకు వారు తిరస్కరించడంతో వీడియోలు, ఫోటోలు, వాయిస్ రికార్డ్లను బాధితురాలికి తెలిసినవారికి పంపించింది. దీనివల్ల అందరి ముందు అభాసుపాలయ్యాని, ఘోర అవమానం జరిగిందంటూ బాధిత మహిళ ఫిర్యాదు చేయడంతో పోలీసులు విచారణ చేపట్టారు.చదవండి: నారా రోహిత్-శిరీష పెళ్లి సందడి: హల్దీ వీడియో చూశారా? -
డాడా హీరో కొత్త మూవీ.. రిలీజ్ ఎప్పుడంటే?
డాడా చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్నాడు హీరో కెవిన్ (Kavin). అయితే ఆ తర్వాత నటించిన బ్లడీ బెగ్గర్, ఇటీవల విడుదలైన కిస్ చిత్రాలు ఈయన్ని పూర్తిగా నిరాశపరిచాయి. ఈయన కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం మాస్క్. ఆండ్రియా హీరోయిన్గా నటించారు. అంతేకాకుండా ఈమె చిత్ర నిర్మాణంలో భాగస్వామ్యం కావడం విశేషం. ఇందులో మరో హీరోయిన్గా రుహాని శర్మ కూడా నటించారు. చార్లీ, రమేష్ తిలక్, కల్లూరి విను, అర్చన చాందోక్ తదితరులు ముఖ్యపాత్రులు పోషించారు. దర్శకుడు వెట్రిమారన్ మెంటార్గా వ్యవహరిస్తున్న ఈ మూవీ ద్వారా విక్రమన్ అశోక్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. జి. ప్రకాష్ కుమార్ సంగీతాన్ని, ఆర్డీ రాజశేఖర్ ఛాయాగ్రహణం అందిస్తున్న ఈ సినిమా నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని నవంబర్ 21వ తేదీన తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. ఈ చిత్ర పోస్టర్ ఇటీవల దీపావళి సందర్భంగా విడుదల చేయగా మంచి స్పందన తెచ్చుకుంది. ఈ చిత్ర ఓటీటీ హక్కులను జీ 5 సంస్థ, ఆడియో హక్కులను టి సిరీస్ సంస్థ పొందినట్లు చెప్పారు. ఇది పూర్తిగా చెన్నై నేపథ్యంలో సాగే డార్క్ కామెడీ కథాచిత్రంగా ఉంటుందని దర్శకుడు పేర్కొన్నారు. View this post on Instagram A post shared by Kavin M (@kavin.0431) చదవండి: కొద్దిరోజులుగా మాస్క్తోనే రష్మిక.. కారణం ఇదేనా..? -
అందులో అసభ్యత ఎక్కడుంది: లియో నటి
బహు భాషా కథానాయికల్లో ఒకరు నటి మడోనా సెబాస్టియన్(Madonna Sebastian). ఈ మాలీవుడ్ బ్యూటీ మాతృభాషతో పాటు కన్నడం, తమిళం, తెలుగు భాషల్లో నటిస్తూ దక్షిణాది కథానాయకిగా గుర్తింపు పొందారు. తమిళంలో విజయ్ సేతుపతికి కాదలుమ్ కడందు పోగుమ్, కవన్, జూంగా చిత్రాల్లో నటించారు. అదేవిధంగా ఇటీవల ప్రభుదేవా సరసన జాలీ ఓ జింఖానా చిత్రంలో నటించారు. అయితే తన 13 ఏళ్ల కెరీర్లో చాలా తక్కువ చిత్రాల్లోనే నటించారు. ఏదేమైనా ఎందుకనో అనుకున్న స్థాయిలో క్రేజ్ తెచ్చుకోలేక పోయారు. ఇటీవల లియో చిత్రంలో విజయ్కు చెల్లెలిగా నటించారు. హీరోయిన్లకు అవకాశాలు రావాలంటే ఇప్పుడు ఏకైక మార్గం గ్లామర్గా మారింది. ఇందుకు నటి మడోనా సెబాస్టియన్ అతీతం కాదనిపించారు. ఇటీవల గ్లామరస్ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తూ వార్తలో నానుతున్నారు. ఇదే క్రమంలో నెటిజన్ల విమర్శలను ఎదుర్కొంటున్నారు. అయితే విమర్శలు హీరోయిన్లకు కొత్తవి కాదు కాబట్టి ఈ అమ్మడు కూడా వాటిని తిప్పి కొడుతున్నారు. పైగా అందాలు ఆరబోత తప్పేమీ కాదు అంటూ సమర్ధించుకుంటున్నారు. గ్లామర్కు అసభ్యతకు మధ్య వ్యత్యాసం తెలిస్తే చాలు అని అన్నారు. గ్లామర్ను విమర్శించడానికి ఏమీ లేదన్నారు. మొత్తం మీద తను గ్లామర్కు గేట్లు తెలిసినట్లు ఈ అమ్మడు చెప్పకనే చెప్పారని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Madonna B Sebastian (@madonnasebastianofficial) -
సినీ ఇండస్ట్రీలో పురుషాహంకారం.. ఎన్నో పోరాటాలు చేశా!
సినిమా ఇండస్ట్రీలో కొనసాగాలంటే పురుషాహంకారాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుందని, ఈ విషయంలో తాను ఎన్నో పోరాటాలు చేశానని జాన్వీ కపూర్ వెల్లడించారు. ‘టూ మచ్ విత్ కాజోల్ అండ్ ట్వింకిల్’ టాక్ షోలో సినిమా ఇండస్ట్రీలో తాను ఎదుర్కొన్న కొన్ని సమస్యలపై జాన్వీ కపూర్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ‘‘ఫిల్మీ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుంచే నేను ఇండస్ట్రీకి వచ్చినప్పటికీ.. ఇక్కడికి వచ్చాకే కొన్ని కొత్త విషయాలు నేర్చుకున్నాను. సినిమా ఇండస్ట్రీలో రాణించాలంటే పురుషాహంకారాన్ని ఎదుర్కోవాలి. ఈ విషయంలో ఎన్నో పోరాటాలు చేశాను.నలుగురు మహిళలు ఉన్న ప్రదేశంలో నా అభిప్రాయాన్ని ధైర్యంగా చెప్పగలను. అదే ప్రదేశంలో నలుగురు పురుషులు ఉంటే మాత్రం నా అభిప్రాయాన్ని నేను స్వేచ్ఛగా చెప్పలేక పోతున్నాను. ఎందుకంటే వారు నొచ్చుకోకుండా చె ప్పాలి. ఇందుకు చాలా నేర్పు కావాలి. ఒక్కోసారి మనల్ని మనం తక్కువ చేసుకోవాలి. కొన్నిసార్లు మనకు నచ్చని విషయాలను నచ్చలేదని స్ట్రయిట్గా చెప్పకుండా నాకు అర్థం కావడం లేదు అని చెప్పుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయి.కొన్నిసార్లు మౌనంగా ఉండి పోవాల్సి వచ్చింది. ఇలా ఎన్నో రాజకీయాలను ఎదుర్కొన్నాను’’ అని చెప్పుకొచ్చారు జాన్వీ కపూర్. ఈ షోకు ఓ వ్యాఖ్యాతగా ఉన్న ట్వింకిల్ ఖన్నా కూడా జాన్వీ కపూర్ మాటలను స పోర్ట్ చేస్తూ, 1990 సమయంలో తాను ఈ తరహా పరిస్థితులను ఫేస్ చేశానని చె ప్పారు. -
బాలీవుడ్ ఎంట్రీ?
తమిళ హీరో శివ కార్తికేయన్ బాలీవుడ్ ఎంట్రీ దాదాపు ఖరారు అయిందనే టాక్ తెరపైకొచ్చింది. ‘దేవదాస్, రామ్లీల, పద్మావత్’ వంటి సూపర్హిట్ సినిమాలను తెరకెక్కించిన బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ ఆఫీస్కు వెళ్లొచ్చారు శివ కార్తికేయన్. దీంతో భన్సాలీతో ఈ హీరో ఓ సినిమా చేయనున్నారనే టాక్ బాలీవుడ్లో ఊపందుకుంది.మరి... భన్సాలీ దర్శకత్వంలోని సినిమాలో శివ కార్తికేయన్ హీరోగా నటిస్తారా? లేక శివ కార్తికేయన్ హిందీలో నటించే తొలి సినిమాకు భన్సాలీ నిర్మాతగా ఉంటారా? అనే విషయాలపై ఓ స్పష్టత రావాల్సి ఉంది. ఇక ప్రస్తుతం రణ్బీర్ కపూర్, ఆలియా భట్, విక్కీ కౌశల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న హిందీ చిత్రం ‘లవ్ అండ్ వార్’తో బిజీగా ఉన్నారు సంజయ్ లీలా భన్సాలీ. ఈ సినిమా రిలీజ్ తర్వాత శివ కార్తికేయన్తో భన్సాలీ సినిమా గురించి ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. -
లెక్క తగ్గేదే లే! నవంబరులోనూ సినిమాల సందడి
అక్టోబరు నెలలో చిన్నా పెద్దా కలుపుకుని దాదాపు డజను సినిమాలకు పైగానే విడుదలయ్యాయి. ఫైనల్లీ ‘మాస్ జాతర, ‘బాహుబలి: ది ఎపిక్’ సినిమాల విడుదల (అక్టోబరు 31)తో ఈ నెల ముగుస్తుంది. ఆ తర్వాత మొదలయ్యే నవంబరులోనూ ‘లెక్క తగ్గేదే లే’ అంటూ... సినిమాల సందడి జోరుగా ఉండబోతోంది. ‘జటాధర, కాంత, ఆంధ్ర కింగ్ తాలూకా, ది గర్ల్ ఫ్రెండ్’ వంటి పలు సినిమాలు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉన్నాయి. అదే విధంగా పలు బాలీవుడ్, హాలీవుడ్ మూవీస్ కూడా ఆడియన్స్ ముందుకు రానున్నాయి. ఆ సినిమాలేంటో చూద్దాం...యాక్షన్ డ్రామా... మలయాళ స్టార్ హీరోల్లో ఒకరైన మోహన్లాల్ లీడ్ రోల్లో నటించిన తాజా పాన్ ఇండియన్ చిత్రం ‘వృషభ’. రాగిణి ద్వివేది, సమర్జిత్ లంకేష్, నయన సారిక ముఖ్య పాత్రలు పోషించారు. నందకిశోర్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాని కనెక్ట్ మీడియా, బాలాజీ టెలీ ఫిల్మ్స్, అభిషేక్ ఎస్. వ్యాస్ స్టూడియోస్ బ్యానర్లపై శోభా కపూర్, ఏక్తా ఆర్. కపూర్, సి.కె. పద్మ కుమార్, వరుణ్ మాథుర్, సౌరభ్ మిశ్రా, అభిషేక్ ఎస్. వ్యాస్, ప్రవీర్ సింగ్, విశాల్ గుర్నాని, జూహి పరేఖ్ మెహతా నిర్మించారు. తెలుగు, మలయాళ భాషల్లో ఏకకాలంలో రూపొందిన ఈ చిత్రం నవంబరు 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. తెలుగు, మలయాళ భాషల్లోనే కాదు... హిందీ, కన్నడలోనూ ఈ మూవీ రిలీజ్ కానుంది. ‘‘హిస్టారికల్ యాక్షన్ డ్రామాగా రూపొందిన ‘వృషభ’లో అద్భుతమైన విజువల్స్ ఉంటాయి. బంధాలు, త్యాగాల కలయికగా రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులకు గొప్పగా కనెక్ట్ అవుతుంది. అలాగే చక్కని అనుభూతిని పంచుతుంది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. సరికొత్త ప్రేమకథ ఓ వైపు హీరోయిన్గా నటిస్తూనే మరోవైపు లేడీ ఓరియంటెడ్ సినిమాలతో బిజీగా దూసుకెళుతున్నారు రష్మికా మందన్నా. ఆమె ప్రధాన పాత్రలో నటించిన పాన్ ఇండియన్ మూవీ ‘ది గర్ల్ ఫ్రెండ్’. ఈ సినిమాలో రష్మికకి జోడీగా దీక్షిత్ శెట్టి నటించారు. నటుడు, దర్శకుడు రాహుల్ రవీంద్రన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్పై ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి ఈ మూవీ నిర్మించారు.ఈ సినిమా నవంబరు 7న తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో వరల్డ్ వైడ్గా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కాబోతోంది. ‘‘సరికొత్త ప్రేమకథగా తెరకెక్కిన చిత్రం ‘ది గర్ల్ ఫ్రెండ్’. ఈ బ్యూటిఫుల్ లవ్స్టోరీని తనదైన శైలిలో చక్కగా తెరకెక్కించారు రాహుల్ రవీంద్రన్. రష్మికా మందన్నా, దీక్షిత్ శెట్టిల జోడీ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. హేషమ్ అబ్దుల్ వాహబ్ అందించిన సంగీతం మా మూవీకి ప్లస్ అవుతుంది’’ అని పేర్కొన్నారు మేకర్స్. సూపర్ నేచురల్ బ్యాక్డ్రాప్లో... సుధీర్ బాబు హీరోగా రూపొందిన పాన్ ఇండియన్ చిత్రం ‘జటాధర’. ఈ సినిమాలో సోనాక్షీ సిన్హా, శిల్పా శిరోద్కర్, ‘శుభలేఖ’ సుధాకర్, రాజీవ్ కనకాల, ఝాన్సీ, అవసరాల శ్రీనివాస్, రవిప్రకాశ్, ఇందిరా కృష్ణన్, రోహిత్ పాఠక్ తదితరులు ఇతర పాత్రలు పోషించారు. జీ స్టూడియోస్, ప్రేరణ అరోరా సమర్పణలో ఉమేశ్ కుమార్ బన్సాల్, శివన్ నారంగ్, అరుణ అగర్వాల్, ప్రేరణ అరోరా, శిల్పా సింఘాల్, నిఖిల్ నంద నిర్మించిన ఈ చిత్రం తెలుగు, హిందీ భాషల్లో నవంబరు 7న విడుదల కానుంది. సూపర్ నేచురల్ థ్రిల్లర్గా రూపొందిన ఈ చిత్రంలో సుధీర్ బాబు పాత్ర కొత్తగా ఉండనుంది.బాలీవుడ్ నటి సోనాక్షీ సిన్హా ధన పిశాచి అనే పవర్ఫుల్ రోల్ చేశారు. ఆమె నటించిన తొలి తెలుగు చిత్రం ఇదే కావడం విశేషం. ‘‘సూపర్ నేచురల్ థ్రిల్లర్గా రూపొందిన చిత్రం ‘జటాధర’. అద్భుతమైన కథ, భావోద్వేగాలతో రూపొందిన ఈ మూవీ ప్రేక్షకులకు ఓ గొప్ప అనుభూతి ఇచ్చేలా ఉంటుంది. ఈ సినిమా కోసం సుధీర్ బాబు ఎంతో కష్టపడ్డారు. రాయిస్, జైన్, సామ్ సంగీతం అందించిన ఈ సినిమాలోని పాటలు ఇప్పటికే విడుదల కాగా అద్భుతమైన స్పందన వచ్చింది. నటీనటులు, సాంకేతిక నిపుణుల సినీ ప్రయాణంలో ‘జటాధర’ ఓ మైలురాయిగా నిలుస్తుంది’’ అని చిత్రబృందం పేర్కొంది.మైథలాజికల్ థ్రిల్లర్ రాజ్ తరుణ్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘చిరంజీవ’. ఈ సినిమాకి ‘జబర్దస్త్’ ఫేమ్ అభినయ కృష్ణ (అదిరే అభి) దర్శకత్వం వహించారు. ఈ మూవీలో కుషిత హీరోయిన్ గా నటించగా, శ్రీరంజని, అమిత్ భార్గవ్, గడ్డం నవీన్, ఇమ్మాన్యుయేల్, టేస్టీ తేజ కీలక పాత్రధారులు. స్ట్రీమ్ లైన్ ప్రోడక్షన్ బ్యానర్పై రాహుల్ యాదవ్, సుహాసిని నిర్మించారు. ఈ మూవీని నేరుగా ఆహా ఓటీటీలో నవంబరు 7న రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. దసరా పండగ సందర్భంగా విడుదలైన ఈ చిత్రం టీజర్లో ‘నీ స్పీడుకు నువ్వు చేయాల్సిన జాబ్ ఏంటో తెలుసా?.. అంబులెన్స్ డ్రైవర్.. ’ వంటి డైలాగ్స్ ఆసక్తిగా ఉన్నాయి. ‘‘మైథలాజికల్ థ్రిల్లర్గా రూపొందిన చిత్రం ‘చిరంజీవ’. ఈ చిత్రంలో శివ అనే పాత్రలో రాజ్ తరుణ్ కనిపించనున్నారు. తనకి సూపర్ పవర్స్తో పాటు ఎవరి చావు ఎప్పుడు వస్తుందో ముందే తెలిసే పవర్ ఉంటుంది. ఈ పవర్స్ వల్ల శివ ఎలా లాభపడ్డాడు? ఎలాంటి ఇబ్బందులకు గురయ్యాడు? వంటి విషయాలు మా చిత్రంలో ఆసక్తిగా ఉంటాయి’’అని మేకర్స్ తెలిపారు. నవ్వుల్ నవ్వుల్ ‘మసూద’ (2022) సినిమాతో తొలి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న తిరువీర్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’. రాహుల్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో టీనా శ్రావ్య హీరోయిన్గా నటించారు. 7 పి.ఎం ప్రోడక్షన్స్, పప్పెట్ షో ప్రోడక్షన్స్ బ్యానర్స్పై సందీప్ అగరం, అస్మితా రెడ్డి బాసిని నిర్మించిన ఈ చిత్రం నవంబరు 7న విడుదల కానుంది. పూర్తి స్థాయి వినోదాత్మకంగా ఈ చిత్రం రూపొందింది. డైరెక్టర్ శేఖర్ కమ్ముల విడుదల చేసిన ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ మూవీ టీజర్కి మంచి స్పందన వచ్చింది. ‘‘ఈ మూవీ టీజర్ చూడగానే సినిమా చూడాలనిపిస్తోంది. ఇలాంటి కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలు నిర్మించడానికి ధైర్యం, ΄్యాషన్ ఉండాలి’’ అంటూ శేఖర్ కమ్ముల చెప్పడంతో ఈ సినిమాపై మంచి బజ్ నెలకొంది. ‘‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ కథ వింటున్నప్పుడు నవ్వుతూనే ఉన్నాను. మా సినిమా ప్రారంభం నుంచి చివరి వరకు ప్రేక్షకులను నవ్విస్తుంది. ఈ కథ నచ్చడంతో పప్పెట్ షో అనే బ్యానర్ని స్థాపించి, పారితోషికం తీసుకోకుండా ఈ సినిమా నిర్మాణంలో భాగం అయ్యాను’’ అని తిరువీర్ పేర్కొనడం విశేషం. పీరియాడికల్ డ్రామా ‘మహానటి, సీతారామం, లక్కీ భాస్కర్’ వంటి విజయవంతమైన చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్నారు దుల్కర్ సల్మాన్. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘కాంత’. సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే కథానాయిక. సముద్ర ఖని కీలక పాత్ర పోషించారు. స్పిరిట్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్, వేఫేరర్ ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకాలపై రానా దగ్గుబాటి, దుల్కర్ సల్మాన్, ప్రశాంత్ ΄÷ట్లూరి, జోమ్ వర్గీస్ నిర్మించిన ఈ చిత్రం నవంబరు 14న రిలీజ్ కానుంది.‘‘పీరియాడికల్ డ్రామాగా రూపొందిన చిత్రం ‘కాంత’. 1950 చెన్నై నేపథ్యంతో పాటు గోల్డెన్ ఏజ్ బ్యాక్డ్రాప్లో రూపొందిన చిత్రమిది. అద్భుతమైన ప్రేమకథ కూడా ఉంటుంది. ఝను చంతర్ సంగీతం అందించిన ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పాటలకు అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ చిత్రంలో దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బోర్సే మధ్య కెమిస్ట్రీ, వింటేజ్ లవ్స్టోరీ ఆకట్టుకుంటుంది’’ అని చిత్రయూనిట్ తెలిపింది. వినోదాల సంతాన ప్రాప్తిరస్తు విక్రాంత్, చాందినీ చౌదరి జంటగా నటించిన చిత్రం ‘సంతాన ప్రాప్తిరస్తు’. సంజీవ్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ‘వెన్నెల’ కిశోర్, తరుణ్ భాస్కర్, శ్రీలక్ష్మి, అభినవ్ గోమటం, మురళీధర్ గౌడ్, హర్షవర్ధన్, బిందు చంద్రమౌళి, జీవన్ కుమార్, సత్యకృష్ణ, తాగుబోతు రమేశ్ కీలక పాత్రలు పోషించారు. మధుర ఎంటర్టైన్మెంట్, నిర్వి ఆర్ట్స్ బ్యానర్స్పై మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం నవంబరు 14న రిలీజ్ అవుతోంది.‘‘మ్యూజికల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందిన చిత్రం ‘సంతాన ప్రాప్తిరస్తు’. ఒక సమకాలీన అంశాన్ని కథలో చూపిస్తూ వినోదాత్మకంగా తీశాడు సంజీవ్ రెడ్డి. విక్రాంత్, చాందినీ చౌదరి జోడీ ప్రేక్షకులను అలరిస్తుంది. ఈ సినిమాలోని వినోదం ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంది. కల్యాణి ఓరుగంటి పాత్రలో చాందినీ చౌదరి ఆకట్టుకోనున్నారు. రచయిత షేక్ దావూద్ జి. అందించిన స్క్రీన్ ప్లే మా చిత్రానికి అదనపు ఆకర్షణ. సునీల్ కశ్యప్ సంగీతం హైలైట్గా నిలుస్తుంది’’ అని మేకర్స్ పేర్కొన్నారు. వీరాభిమాని సందడి రామ్ పోతినేని హీరోగా రూపొందుతోన్న చిత్రం ‘ఆంధ్ర కింగ్ తాలూకా’. ‘మిస్ శెట్టి మిస్టర్ ΄÷లిశెట్టి’ మూవీ ఫేమ్ పి. మహేశ్బాబు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ‘మిస్టర్ బచ్చన్’ చిత్రం ఫేమ్ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్. ఈ మూవీలో ఉపేంద్ర, రావు రమేశ్, మురళీ శర్మ, సత్య, రాహుల్ రామకృష్ణ, తులసి రామ్ ఇతర పాత్రలు పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రం నవంబరు 28న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సినిమాలో సూర్య కుమార్ అనే ఆన్ స్క్రీన్ సూపర్ హీరో పాత్రలో నటిస్తున్నారు ఉపేంద్ర. ఆయన వీరాభిమానిగా రామ్ కనిపించనున్నారు.వివేక్– మెర్విన్ సంగీతం అందించిన ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజైన పాటలకు సూపర్ రెస్పాన్స్ వస్తోంది. ఈ చిత్రం కోసం రామ్ స్వయంగా ఓ పాట పాడటం విశేషం. ‘‘ఈ చిత్రంలో సూపర్ స్టార్ సూర్య కుమార్ (ఉపేంద్ర) వీరాభిమాని సాగర్గా రామ్ నటిస్తున్నారు. ఆయన నటన సూపర్బ్గా ఉంటుంది. ప్రతి హీరో అభిమాని... రామ్ పాత్రలో తమను తాము చూసుకుంటారు. భాగ్యశ్రీ అందం, అభినయం ఈ చిత్రానికి ప్లస్. తొలి చిత్రం ‘మిస్ శెట్టి మిస్టర్ ΄÷లిశెట్టి’తో పెద్ద విజయాన్ని అందించిన డైరెక్టర్ మహేశ్బాబు ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ అనే మరో మంచి కథతో రాబోతున్నాడు. టీజర్తో సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి’’ అని చిత్రబృందం పేర్కొంది.పైన పేర్కొన్న సినిమాలే కాదు.. మరికొన్ని చిత్రాలు నవంబరులో విడుదలకు ముస్తాబయ్యే అవకాశాలున్నాయి. టాలీవుడ్లోనే కాదు... బాలీవుడ్లో, హాలీవుడ్లోనూ పలు చిత్రాలు నవంబరులో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఇమ్రాన్ హష్మి, యామీ గౌతమ్ జోడీగా నటించి ‘హక్’ చిత్రం నవంబరు 7న విడుదల కానుంది. అలాగే ‘ప్రిడేటర్: బాడ్ల్యాండ్స్’ అనే హాలీవుడ్ మూవీ కూడా అదే రోజు రిలీజ్ అవుతోంది. ఇక అజయ్ దేవగన్, ఆర్. మాధవన్, రకుల్ప్రీత్ సింగ్ ప్రధాన పాత్రల్లో నటించిన బాలీవుడ్ మూవీ ‘దే దే ΄్యార్ దే 2’ నవంబరు 14న విడుదల కానుంది. అదే విధంగా అమితాబ్ బచ్చన్, ఫర్హాన్ అక్తర్, రాశీ ఖన్నా లీడ్ రోల్స్లో నటించిన ‘120 బహదూర్’ అనే హిందీ చిత్రం, ‘వికెడ్ 2’ అనే హాలీవుడ్ మూవీ నవంబరు 21న రిలీజ్ అవుతున్నాయి. అలాగే ధనుష్, కృతీ సనన్ జోడీగా నటించిన హిందీ చిత్రం ‘తేరే ఇష్క్ మే’, ‘జూటోపియా 2’ అనే హాలీవుడ్ మూవీ నవంబరు 28న విడుదలకు ముస్తాబయ్యాయి. వీటితో పాటు మరికొన్ని మూవీస్ కూడా రిలీజ్కి రెడీ అవుతున్నాయి. – డేరంగుల జగన్ మోహన్ -
నా దొంగ మొగుడు.. ప్రశాంత్ నీల్ భార్య పోస్ట్ వైరల్
డైరెక్టర్ ప్రశాంత్ నీల్ పేరు చెప్పగానే అభిమానులకు గుర్తొచ్చేది బొగ్గు. ఎందుకంటే ఇప్పటివరకు తీసిన సినిమాలన్నింటినిలోనూ హీరోలు మసి లేదంటే బొగ్గుతో కనిపిస్తారు. డ్రస్సులు కూడా డార్క్ కలర్లోనే ఉంటాయి. ప్రస్తుతం ఎన్టీఆర్తో తీస్తున్న 'డ్రాగన్' కూడా దీనికి ఏ మాత్రం తీసిపోదు. ఎందుకంటే ఇదివరకే పోస్టర్ రిలీజ్ చేస్తే అందులోనూ డార్క్ థీమ్ కనిపించింది.(ఇదీ చదవండి: 'కాంతార' రిషభ్ ఇంట్లో ఇన్ని కార్స్ ఉన్నాయేంటి?)అయితే ప్రశాంత్ నీల్.. డార్క్ కలర్ డ్రస్సుల్లో కాకుండా వేరే వాటిలో కనిపించడం అరుదని చెప్పొచ్చు. అలాంటిది ఇప్పుడు పూర్తిగా వైట్ షర్ట్, పంచెతో కనిపించి ఆశ్చర్యపరిచాడు. ఇదే విషయాన్ని ప్రశాంత్ నీల్ భార్య కూడా ఫీలైనట్లుంది. దీంతో సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టేసింది. 'నా దొంగమొగుడి ఫైనల్లీ వైట్ దుస్తుల్లో..' అని ఫన్నీ క్యాప్షన్ రాసుకొచ్చింది. దీంతో నెటిజన్లు కూడా సరదాగా నవ్వుకుంటున్నారు.ప్రశాంత్ నీల్ తొలి సినిమా 'ఉగ్రం' నుంచి సినిమాటోగ్రాఫర్ చేస్తున్న భువన్ గౌడకి రీసెంట్గా పెళ్లి జరిగింది. 'కేజీఎఫ్' హీరోహీరోయిన్ యష్, శ్రీనిధి శెట్టితో పాటు మూవీ టీమ్లోని చాలామంది హాజరయ్యారు. ఇదే వేడుకలో భార్య లిఖిత రెడ్డితో పాటు ప్రశాంత్ నీల్ కూడా కనిపించాడు. డార్క్ కలర్ డ్రస్సులో కాకుండా తెల్లని దుస్తుల్లో కనిపించేసరికి అందరూ షాకవుతున్నారు. ఈ పెళ్లిలో హీరోయిన్ శ్రీలీల కూడా తల్లితో కలిసి కనిపించడం విశేషం.(ఇదీ చదవండి: ఎట్టకేలకు ఓటీటీలోకి 'లోక' సినిమా.. స్ట్రీమింగ్ తేదీ) View this post on Instagram A post shared by Likitha (@likithareddyneel) -
'కాంతార' రిషభ్ ఇంట్లో ఇన్ని కార్స్ ఉన్నాయేంటి?
మూడేళ్ల క్రితం సెన్సేషన్ సృష్టించి, రీసెంట్గా మరోసారి పాన్ ఇండియా లెవల్లో రచ్చ చేసిన హీరో రిషభ్ శెట్టి. 2022లో వచ్చిన 'కాంతార'తో గుర్తింపు తెచ్చుకున్న ఇతడు.. కొన్నాళ్ల క్రితం వచ్చిన 'కాంతార-1'తో మరో బ్లాక్బస్టర్ అందుకున్నాడు. రూ.800 కోట్ల మార్క్ దాటి ప్రస్తుతం రూ.1000 కోట్ల కలెక్షన్స్కి చేరువలో ఉంది. సరే ఇదంతా పక్కనబెడితే తాజాగా రిషభ్.. కుందాపురలోని తన ఇంట్లో దీపావళిని గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నాడు. ఆ ఫొటోలు ఇప్పుడు బయటకు రాగా అందులోని ఓ విషయం ఆసక్తికరంగా అనిపించింది.వాటర్ క్యాన్ బిజినెస్తో కెరీర్ మొదలుపెట్టిన రిషభ్ శెట్టి.. తర్వాత సినిమాల్లోకి వచ్చాడు. తొలుత దర్శకుడిగా, తర్వాత హీరోగా పలు సినిమాలు చేశాడు. అయితే 'కాంతార'తో పాన్ ఇండియా ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. ఆ చిత్రానికి ప్రీక్వెల్తో వచ్చి మరో సక్సెస్ అందుకున్నాడు. రీసెంట్గా కుటుంబంతో కలిసి దీపావళి సెలబ్రేట్ చేసుకున్నాడు. అయితే రిషభ్ ఇంట్లో ఏకంగా ఐదు ఖరీదైన కార్లు ఉండటం ఇంట్రెస్టింగ్గా అనిపించింది.(ఇదీ చదవండి: మరో సీక్వెల్లో ప్రభాస్.. రెండేళ్లు ఆగాల్సిందే?)రిషభ్ భార్య ప్రగతి శెట్టి.. సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫొటోల్లో వీళ్ల ఇల్లు అంతా క్లియర్గా చూడొచ్చు. అలానే ఆడీ క్యూ7, మహీంద్రా థార్, టయోటా వెల్ ఫైర్, జీప్ కంపాస్ ట్రైల్హాక్ తదితర కార్లు కూడా కనిపించాయి. దీంతో రిషభ్ దగ్గర చాలానే కార్లు ఉన్నాయని నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు. కార్లతో పాటు రాయల్ ఎన్ఫీల్డ్ ఇంటర్ సెప్టార్ 650 లాంటి కాస్ట్ లీ బైక్స్ కూడా రిషభ్ దగ్గర ఉన్నాయట.రిషభ్ తర్వాత సినిమాల విషయానికొస్తే కొన్నాళ్ల పాటు దర్శకత్వం పక్కనబెట్టబోతున్నాడు. త్వరలో ప్రశాంత్ వర్మ తీయబోయే 'జై హనుమాన్' సెట్స్లో అడుగుపెడతాడు. ఇది కాకుండా ఛత్రపతి శివాజీ బయోపిక్, తెలుగులో సితార సంస్థలో ఓ పీరియాడిక్ మూవీ చేయబోతున్నాడు. ఈ మూడు పూర్తయ్యేసరికి 2028 అయిపోవచ్చు. తర్వాతే 'కాంతార ఛాప్టర్ 2' ఉండొచ్చేమో చూడాలి?(ఇదీ చదవండి: సైలెంట్గా ఓటీటీల్లోకి వచ్చిన తెలుగు సినిమాలు) ಬೆಳಕಿನ ಈ ಹಬ್ಬ, ಪ್ರೀತಿ ಹಂಚುವ ಸುಂದರ ಕ್ಷಣಗಳು..✨A festival of lights, a lifetime of memories..Grateful for family, love, and laughter this Deepavali..#Deepavali20251/2 pic.twitter.com/wL6WMXzsW4— Pragathi Rishab Shetty (@PragathiRShetty) October 25, 2025 -
సౌత్ సినిమాలు ఇప్పటికైనా చూస్తున్నారు: ప్రియమణి
ఇప్పుడంటే దక్షిణాది సినిమాలను దేశమంతా ఎగబడి చూస్తున్నారు కానీ, ఒకప్పుడు ఇక్కడి సినిమాలను పెద్దగా పట్టించుకునేవారు కాదు! ఈ పరిస్థితి మారినందుకు ఆనందంగా ఉందని చెప్తోంది హీరోయిన్ ప్రియమణి (Priyamani). దశాబ్ద కాలంగా పాన్ ఇండియా స్థాయిలో దక్షిణాది సినిమాలు ఆడుతున్నందుకు సంతోషం వ్యక్తం చేసింది. అందుకు హ్యాపీఇండియా టుడేతో ప్రియమణి మాట్లాడుతూ.. జనాలు ఇప్పటికైనా దక్షిణాది సినిమా (South Indian Movies)లను చూస్తున్నందుకు హ్యాపీ. ప్రాంతీయ భాషా చిత్రాలను ఎంతో బాగా ఆదరిస్తున్నారు. అక్కడ ఎప్పటినుంచో మంచి సినిమాలున్నాయి. కానీ, గతంలో వాటికంత ప్రాధాన్యత దక్కకుండా పోయింది. ప్రతి భాషలోనూ అద్భుతమైన సినిమాలు వస్తూనే ఉంటాయి. కాకపోతే వాటి గురించి ఎవరూ మాట్లాడేవారు కాదు. ఇప్పుడలాంటి చిత్రాలు భారీ విజయాలు అందుకోవడం నిజంగా గొప్ప విషయం. గీత చెరిగిపోవాలని కోరుకుంటున్నాసినిమాలే కాదు, దానికోసం పని చేసిన నటీనటులు, దర్శకులు, టెక్నీషియన్ల గురించి కూడా చర్చించుకుంటున్నారు. ఇది మంచి పరిణామం. ప్రాంతీయ సినిమాకు, హిందీ సినిమాకు మధ్య ఉన్న అడ్డుగోడలు నెమ్మదిగా తొలగిపోతున్నాయి. ఏదో ఒకరోజు ఆ సరిహద్దులు పూర్తిగా చెరిగిపోవాలని కోరుకుంటున్నాను అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ప్రియమణి ద ఫ్యామిలీ మ్యాన్ 3 వెబ్ సిరీస్లో నటిస్తోంది. ఈ సిరీస్లో మనోజ్ బాజ్పాయ్ ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు.చదవండి: ఆయేషాకు టైఫాయిడ్, డెంగ్యూ.. తనూజ కోసం వెక్కెక్కి ఏడ్చిన కల్యాణ్ -
కమల్-రజనీ మూవీ.. శృతి హాసన్, సౌందర్య ఏమన్నారంటే?
స్టార్ హీరోలు కమల్ హాసన్ (Kamal Haasan), రజనీకాంత్ గతంలో పలు హిట్ చిత్రాల్లో కలిసి నటించారు. ఆ తరువాత ఇద్దరూ కావాలనే విడివిడిగా నటించడం మొదలెట్టారు. అలాంటిది దాదాపు 46 ఏళ్ల తర్వాత ఈ క్రేజీ కాంబినేషన్ రిపీట్ కానుందన్న వార్త సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తున్న విషయం తెలిసిందే! ఈ విషయాన్ని కమల్ హాసన్, రజనీకాంత్ కూడా నిజమేనని ధ్రువీకరించారు. రజనీ కూతురి రియాక్షన్అయితే ఇది ఎప్పుడు ప్రారంభం అవుతుంది? దర్శకుడు ఎవరు? అనేది మాత్రం ప్రశ్నార్థకంగా మారింది. దీంతో అసలు ఈ చిత్రం తెరకెక్కుతుందా? అన్న ప్రశ్న కూడా తలెత్తుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో రజనీకాంత్ రెండవ కూతురు సౌందర్య.. కమల్, రజనీల మల్టీస్టారర్ మూవీ కచ్చితంగా ఉంటుందని ఓ అవార్డుల ప్రదానోత్సవంలో పేర్కొన్నారు. తన తండ్రి రజనీకాంత్, కమల్ హాసన్ కలిసి నటించే చిత్రాన్ని కమల్హాసన్ తన రాజ్ కమల్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై నిర్మిస్తారని ఆమె స్పష్టం చేశారు. శ్రుతి హాసన్ ఏమందంటే?అదే వేడుకలో పాల్గొన్న హీరోయిన్ శ్రుతిహాసన్ (Shruti Haasan) కూడా కమల్, రజనీ మరోసారి కలిసి నటిస్తే చూడాలన్న ఆశ తనకూ ఉందన్నారు. దీంతో ఈ క్రేజీ కాంబోలో చిత్రం రావడం ఖాయం అనిపిస్తోంది. కాగా కెరీర్ తొలినాళ్ళలో ‘అపూర్వ రాగంగాళ్, మూండ్రు ముడిచ్చు, అంతులేని కథ’... ఇలా దాదాపు ఇరవైకి పైగా సినిమాల్లో కలిసి నటించారు రజనీకాంత్, కమల్హాసన్. 1979లో వచ్చిన ‘అల్లావుద్దీనుమ్ అద్భుత విళక్కుమ్’ తర్వాత వీరు కలిసి నటించింది లేదు.చదవండి: పూజా హెగ్డేకు రూ. 5 కోట్లా..? -
ఛావాను బీట్ చేసిన కాంతార చాప్టర్.. ఎన్ని కోట్లు వచ్చాయంటే?
రిషబ్ శెట్టి కాంతార చాప్టర్-1 బాక్సాఫీస్ వద్ద రికార్డుల ప్రభంజనం సృష్టిస్తోంది. దసరా కానుకగా థియేటర్లలో వచ్చిన ఈ సినిమా ఇప్పటికే రూ.800 కోట్లకు పైగా వసూళ్లతో దూసుకెళ్తోంది. తాజాగా ఈ సినిమా మరో రికార్డ్ను తన ఖాతాలో వేసుకుంది. 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. కేవలం మూడు వారాల్లోనే ఈ ఘనతను సొంతం చేసుకుంది. ఈ క్రమంలోనే విక్కీ కౌశల్ మూవీ ఛావాను దాటేసింది.కాంతార చాప్టర్ 1 తెలుగు రాష్ట్రాల్లో రూ.100 కోట్లు సాధించిన రెండో డబ్బింగ్ చిత్రంగా నిలిచింది. కేజీఎఫ్-2 తర్వాత ఈ రికార్డ్ సాధించింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా రూ.818 కోట్ల వసూళ్లతో బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. ఈ క్రమంలోనే విక్కీ కౌశల్, రష్మిక మందన్నా నటించిన ఛావా (రూ.807 కోట్లు) రికార్డ్ను అధిగమించింది. ఈ విషయాన్ని ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ రమేశ్ బాలా ట్విటర్లో పోస్ట్ చేశారు. 2025లో అత్యధిక వసూళ్లు చేసిన భారతీయ చిత్రంగా కాంతార చాప్టర్-1 నిలిచిందన్నారు. తమిళనాడులోనూ 3వ అత్యధిక వసూళ్లు రాబట్టిన డబ్బింగ్ చిత్రంగా ఘనత సొంతం చేసుకుంది.ఇంగ్లీష్లోనూ కాంతార చాప్టర్-1ఈ ప్రీక్వెల్కు వస్తున్న ఆదరణ చూసి మేకర్స్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మూవీని ఇంగ్లీష్లోకి డబ్ చేసి రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. కాంతార చాప్టర్ 1 ఇంగ్లీష్ వర్షన్ అక్టోబర్ 31 విడుదల చేస్తామని పోస్టర్ పంచుకున్నారు. ఈ మూవీ రన్టైమ్ రెండు గంటల 14 నిమిషాల 45 సెకన్లుగా ఉంటుందని వెల్లడించారు. ఇండియన్ భాషల్లో రిలీజైన ఒరిజినల్ రన్టైమ్ రెండు గంటల 49 నిమిషాలు కాగా.. ఆంగ్ల వర్షన్లో ఏకంగా 35 నిమిషాలకు తగ్గించారు. ఇప్పటికే పలు రికార్డ్లు సాధించిన ఈ చిత్రం మరో ఘనతను సొంతం చేసుకుంది. ఇంగ్లీష్లోకి డబ్ చేసిన తొలి ఇండియన్ చిత్రంగా కాంతార చాప్టర్-1 నిలవనుంది. కాగా.. ఈ చిత్రంలో రుక్మిణి వసంత్, గుల్షన్ దేవయ్య, జయరామ్ కీలక పాత్రల్లో నటించారు. #KantaraChapter1 is now the Highest Grossing Indian Film of 2025.. 🔥 Joining the elite league after #KGF2…#KantaraChapter1 becomes only the 2nd dubbed film to storm past ₹100 Cr in Telugu States!3rd highest Dubbed film in TN..And its worldwide roar now crosses… pic.twitter.com/gCzgfUL8l9— Ramesh Bala (@rameshlaus) October 24, 2025 -
సలార్ సినిమాటోగ్రాఫర్ పెళ్లి.. సందడి చేసిన కేజీఎఫ్ హీరో..!
కేజీఎఫ్ హీరో యశ్ (yash) తాజాగా ఓ పెళ్లి వేడుకలో సందడి చేశారు. ప్రముఖ కన్నడ ఇండస్ట్రీకి చెందిన సినిమాటోగ్రాఫర్ భూవన్ గౌడ వివాహానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా వధూవరులను ఆశీర్వదించిన యశ్.. వారితో కలిసి ఫోటోలు దిగారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. కాగా.. సినిమాటోగ్రాఫర్ భువన్ గౌడ.. ఎంటర్ప్రెన్యూరర్ నిఖితను పెళ్లాడారు. భువన్ గౌడ, నికిత వివాహానికి కన్నడ చిత్ర పరిశ్రమ ప్రముఖులు కూడా హాజరయ్యారు.కాగా..హీరో యశ్, భువన్ గౌడ కేజీఎఫ్ చిత్రాలకు కలిసి పనిచేశారు. ఈ సినిమాలకు గానూ అతను ప్రశంసలు అందుకున్నారు. కాగా.. సినిమాటోగ్రాఫర్ భువన్ గౌడ.. ప్రశాంత్ నీల్ 'ఉగ్రం' తో కన్నడ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టాడు. ఆ తర్వాత'సలార్: పార్ట్ 1 - సీజ్ ఫైర్ చిత్రానికి కూడా పనిచేశాడు. జూనియర్ ఎన్టీఆర్తో ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తోన్న మూవీకి కూడా భువన్ గౌడ సినిమాటోగ్రాఫర్గా చేస్తున్నాడు. అంతేకాకుండా కన్నడలో 'లోడ్డే', 'రథావర', 'భరాతే' వంటి చిత్రాలకు పనిచేశాడు.కాగా.. పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు కేజీఎఫ్ హీరో యశ్ (yash) ప్రస్తుతం టాక్సిక్(toxic) మూవీలో నటిస్తున్నారు. ఈ సినిమాకు గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తున్నారు. కేవీఎన్ ప్రొడక్షన్స్, యశ్ మాన్ స్టర్ మైండ్ క్రియేషన్స్ బ్యానర్లపై వెంకట్ కె.నారాయణ నిర్మిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. -
ముద్దు సన్నివేశం.. డిలీట్ చేయమన్న తెలుగు హీరోయిన్
కథ డిమాండ్ చేస్తే ఎలాంటి సన్నివేశంలోనైనా నటించేందుకు సిద్ధమే అంటుంటారు తారలు. కొందరు మాత్రం అసభ్యత, అశ్లీలతకు ఇసుమంత చోటు కూడా ఇవ్వని సినిమాలే చేస్తామంటారు. మరికొందరు మాత్రం మూడో కేటగిరీ.. ఫస్ట్ సీన్లో నటిస్తారు.. తర్వాత మళ్లీ మనసు మార్చుకుని అది లేకపోయుంటే బాగుండంటూ లోలోనే మథనపడుతుంటారు. వారి ఇబ్బందిని గమనించి ఆయా సీన్లను ఎత్తేసేవాళ్లు చాలా అరుదుగా కనిపిస్తుంటారు.హీరోయిన్ అభ్యంతరంహీరో విష్ణు విశాల్ (Vishnu Vishal) ఇప్పుడదే పని చేశాడు. ఇతడు ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ఆర్యన్. శ్రద్ధా శ్రీనాథ్, మానస చౌదరి హీరోయిన్లుగా యాక్ట్ చేశారు. ఈ మూవీ అక్టోబర్ 31న విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్లో విష్ణు విశాల్ మాట్లాడుతూ.. ఈ మూవీలో ఒక రొమాంటిక్ సాంగ్ ఉంది. అందులో ఒక ముద్దు సన్నివేశం షూట్ చేశాం. అంతా అయిపోయాక దానిపై మానస (Maanasa Choudhary) అభ్యంతరం చెప్పింది. ఆ సీన్ను తీసయమని దర్శకుడిని కోరింది.కత్తిరించేశాంఅదే మాట డైరెక్టర్ నాకొచ్చి చెప్పాడు. తన ఇబ్బంది నాకర్థమైంది. సరే, ఆ సీన్ తీసేద్దాం.. అది లేకుండా డిఫరెంట్గా పాటను పూర్తి చేద్దాం అని చెప్పాను. సినిమా ఫైనల్ ఎడిటింగ్లో ఆ సన్నివేశాన్ని కత్తిరించేశాం అని చెప్పుకొచ్చాడు. మానస చౌదరి తెలుగమ్మాయి. చిత్తూరుకు చెందిన ఈ బ్యూటీ.. యాంకర్ సుమ తనయుడు రోషన్ హీరోగా నటించిన బబుల్గమ్ మూవీతో తెరంగేట్రం చేసింది. లక్కీ భాస్కర్ చిత్రంలో చిన్న పాత్రలో మెరిసింది. ఇప్పుడు ఆర్యన్తో కోలీవుడ్లో అడుగుపెట్టనుంది.చదవండి: ట్రెండింగ్లోకి 'ఇదేమిటయ్యా మాయా..'. ఆ హీరోయిన్ ఇప్పుడెలా? -
హీరోగా ఎంట్రీ ఇస్తున్న బ్లాక్బస్టర్ డైరెక్టర్!
సూపర్ హిట్ చిత్రాలకు కేరాఫ్గా మారాడు దర్శకుడు లోకేష్ కనకరాజ్ (Lokesh Kanagaraj). కార్తీతో ఖైదీ, విజయ్తో మాస్టర్, లియో, కమల్ హాసన్తో విక్రమ్, రజనీకాంత్తో కూలీ వంటి భారీ చిత్రాలను తెరకెక్కించారు. అయితే కూలీ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించకపోవడంతో ఈయన ట్రోలింగ్కు గురయ్యారు. ఇకపోతే కమల్ హాసన్, రజనీకాంత్ కలిసి నటించనున్న చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నట్లు జోరుగా ప్రచారం జరిగింది. అయితే అది నిజం కాదన్నది తాజా సమాచారం. ఇక కార్తీ హీరోగా తెరకెక్కనున్న ఖైదీ – 2 చిత్రం ఎప్పుడు ప్రారంభం అవుతుందో తెలియని పరిస్థితి!హీరోగా లోకేశ్అదేవిధంగా హిందీలో అమీర్ ఖాన్ హీరోగా చిత్రం చేయబోతున్నట్లు జరిగిన ప్రచారానికి కూడా ఇప్పుడు ఫుల్ స్టాప్ పడింది. ఇలాంటి పరిస్థితుల్లో దర్శకుడు లోకేష్ కనకరాజ్ కథానాయకుడిగా అవతారమెత్తడం విశేషం. కెప్టెన్ మిల్లర్ చిత్రం ఫ్రేమ్ అరుణ్ మాదేశ్వరన్ (Arun Matheswaran) దర్శకత్వంలో హీరోగా నటించబోతున్నట్లు చాలా రోజులనుంచే ప్రచారం జరుగుతోంది. ఈ మూవీ పూజా కార్యక్రమాలు గురువారం జరిగినట్లు తెలిసింది. ఈ సినిమా కోసం లోకేష్ కనకరాజ్ ఫైట్స్, ఆత్మ సంరక్షణ విద్యల్లో ప్రత్యేకంగా శిక్షణ పొందారట! అలా ఈ చిత్రం కోసం ఆయన తన బాడీ లాంగ్వేజ్ను పూర్తిగా మార్చుకున్నట్లు తెలుస్తోంది.చదవండి: తెలుసు కదా కొన్నేళ్లు మీతో ఉండి పోతుంది -
ప్రముఖ సంగీత దర్శకుడు కన్నుమూత
ప్రముఖ సినీ సంగీత దర్శకుడు సబేష్ (68) ఇక లేరు (MC Sabesh). కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం ఉదయం 12.15 గంటల ప్రాంతంలో చైన్నెలో కన్నుమూశారు. ఈయన ప్రఖ్యాత సంగీత దర్శకుడు దేవా సోదరుడు. మరో సోదరుడు మురళితో కలిసి పలు చిత్రాలకు సంగీతాన్ని అందించారు. అదేవిధంగా పలు సంగీత కచేరీలను నిర్వహించారు. వీరు సంగీతాన్ని అందించిన చిత్రాలలో సముద్రం, మాయాండి కుటుంబత్తార్, పొక్కిషం, తవమాయ్ తవమిరుందు వంటి విజయవంతమైన చిత్రాలు ఉన్నాయి.నివాళులు అర్పించిన కార్తీసబేష్.. సినీ సంగీత కళాకారుల సంఘానికి అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తూ వచ్చారు. స్థానిక వలసరవాక్కంలోని చౌదరినగర్లో నివసిస్తున్న సబేష్కు గీత, అర్చన అనే ఇద్దరు కూతుర్లు, కార్తీక్ అనే కొడుకు ఉన్నారు. ఈయన భార్య తార ఇంతకుముందే కన్నుమూశారు. సబేష్ భౌతికకాయానికి పలువురు సినీ ప్రముఖులు నివాళులు అర్పించారు. దక్షిణ భారత సినీ నటినటుల సంఘం (నడిగర్) కోశాధికారి, హీరో కార్తీ, ఉపాధ్యక్షుడు కరుణాస్ తదితరులు నివాళులు అర్పించారు. శుక్రవారం సాయంత్రం స్థానిక బృందావన్ నగరంలోని శ్మశానవాటికలో సబేష్ అంత్యక్రియలు జరగనున్నాయి. చదవండి: తెలుసు కదా కొన్నేళ్లు మీతో ఉండి పోతుంది -
ముచ్చటగా మూడో సినిమాకు సెంచరీ కొట్టిన 'డ్యూడ్'
కాస్త నెగెటివ్ టాక్ వచ్చిందంటే సినిమా బండి ముందుకెళ్లడం కష్టమే! కానీ ప్రదీప్ రంగనాథన్ (Pradeep Ranganathan) మాత్రం మిక్స్డ్ టాక్నే ఇంజనుగా మార్చుకుని రయ్యిమని బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్నాడు. అతడు ప్రధాన పాత్రలో నటించిన డ్యూడ్ సినిమా (Dude Movie) ఐదు రోజుల్లోనే సెంచరీ కొట్టేసింది. బ్లాక్బస్టర్ దివాళీ సీజన్ అంటూ రూ.100 కోట్ల పోస్టర్ను మైత్రీ మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో రిలీజ్ చేసింది. మూడు సినిమాలకు వరుస సెంచరీ సాధించిన హ్యాట్రిక్ హీరోగా ప్రదీప్ చరిత్ర సృష్టించాడు. డ్యూడ్ సినిమాలో మమిత బైజు హీరోయిన్గా నటించగా శరత్కుమార్ కీలక పాత్ర పోషించాడు.సినిమాప్రదీప్ రంగనాథన్.. ఎల్కేజీ సినిమాకు డైలాగ్స్ రాశాడు. కోమలి సినిమాతో దర్శకుడిగా మారాడు. ఇందులో అతిథి పాత్రలోనూ మెరిశాడు. లవ్ టుడే మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. స్వీయదర్శకత్వం వహించిన ఈ సినిమా వంద కోట్లపైనే వసూళ్లు రాబట్టింది. రెండో సినిమా డ్రాగన్ సైతం సెంచరీ దాటేసి ఏకంగా రూ.150 కోట్ల కలెక్షన్స్ కొల్లగొట్టింది. ముచ్చటగా మూడో సినిమా కూడా సెంచరీ దాటేసింది. మరి డ్యూడ్ ఇంకా ఎన్ని రికార్డులు తిరగరాస్తుందో చూడాలి! DUDE SMASHES A CENTURY AT THE BOX OFFICE 💥💥💥#Dude collects a gross of over 100 CRORES WORLDWIDE, making it the biggest blockbuster of the Diwali season ❤🔥Book your tickets now and celebrate #DudeDiwali 🔥🎟️ https://t.co/JVDrRd4PZQ🎟️ https://t.co/4rgutQNl2n⭐ing… pic.twitter.com/maxHJwy3uo— Mythri Movie Makers (@MythriOfficial) October 23, 2025 చదవండి: బిగ్బాస్ 9: సడన్గా రౌడీ బేబి ఎలిమినేట్! ఎందుకంటే? -
ధ్రువ్ విక్రమ్ సినిమా.. భారీగా 'బైసన్' కలెక్షన్స్
తమిళ స్టార్ హీరో విక్రమ్ తనయుడు ధ్రువ్ వ్రికమ్, హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్ జోడీగా నటించిన చిత్రం బైసన్(Bison).. దర్శకుడు మారి సెల్వరాజ్ తెరకెక్కించిన ఈ మూవీని పా.రంజిత్కు చెందిన నీలం ప్రొడక్షన్స్, అప్లాజ్ ఎంటర్టెయిన్మెంట్, శాంతి సినిమా సంస్థలు కలిసి నిర్మించాయి. అక్టోబర్ 17న కేవలం తమిళ్లో మాత్రమే విడుదలైన బైసన్ భారీ కలెక్షన్స్తో దూసుకుపోతుంది. ఐదు రోజుల్లోనే రూ. 35 కోట్లు రాబట్టినట్లు మేకర్స్ ప్రకటించారు. దీంతో ధ్రువ్ కెరీర్లోనే అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా రికార్డ్ క్రియేట్ చేసింది.బైసన్ సినిమా ఎలాంటి అంచనాలు లేకుండానే కోలీవుడ్లో విడుదలైంది. దీంతో మొదటిరోజు అనుకున్నంత రేంజ్లో ఓపెనింగ్స్ రాలేదు. కానీ, సినిమా బాగుందని టాక్ రావడంతో కలెక్షన్ల జోరు పెరిగింది. దీంతో కేవలం ఐదు రోజుల్లోనే రూ. 35 కోట్లు రాబట్టినట్లు మేకర్స్ ప్రకటించారు. ప్రస్తుతం తమిళ్లో మాత్రమే బైసన్ విడుదలైంది. ఇప్పుడు తెలుగులో కూడా అక్టోబర్ 24న విడుదల కానుంది. టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా ఈ మూవీ కనెక్ట్ అయితే ఇక్కడ కూడా ధ్రువ్ మార్కెట్ పెరగనుంది. ఫైనల్గా వంద కోట్లకు దగ్గర్లో బైసన్ కలెక్షన్స్ ఉండొచ్చని అంచనా వేయవచ్చు. కబడ్డీ ప్లేయర్ మానతీ గణేశన్ జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కించారు. ఒక కుగ్రామానికి చెందిన పేద కుర్రాడు అత్యున్నత పురస్కారం అర్జున్ అవార్డును గెలుచుకునే స్థాయికి ఎలా ఎదిగాడు అనే ఇతివృత్తంతో తెరకెక్కిన చిత్రం బైసన్.ఈచిత్రంలో హీరో అక్కగా రజిషా విజయన్, ఆయన తండ్రిగా పశుపతి, హీరోయిన్గా అనుపమ పరమేశ్వరన్ నటించారు. వీరితో పాటు దర్శకుడు అమీర్, లాల్ ముఖ్యపాత్రలు పోషించారు. నివాస్ కే.ప్రసన్న సంగీతాన్ని అందించిన ఈ చిత్రంలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ధ్రువ్ నటన గురించే. ఆయన సహజత్వంగా తన పాత్రలో అంకితమై నటించారు. కొన్ని సన్నివేశాల్లో తన తండ్రి విక్రమ్ను గుర్తు చేశారు. Extremely grateful for all your love! #BisonKaalamaadan grows over a hundred percent over day one and is roaring at the box office. Just Tamil version collects 35cr gross collections worldwide New Raid #Bison ready for Telugu release 🦬#BisonKaalamaadan 🦬 #DiwaliWinner 💥… pic.twitter.com/FqeV8unvls— Mari Selvaraj (@mari_selvaraj) October 22, 2025 -
దీపికా పదుకొణెతో డ్యుయెట్కు నేను రెడీ!
ప్రదీప్ రంగనాథన్, మమిత బైజు జంటగా నటించిన చిత్రం డ్యూడ్ (Dude Movie). శరత్ కుమార్, రోహిణి, సిద్ధూ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. కీర్తీశ్వరన్ కథ, దర్శకత్వం బాధ్యతలు నిర్వహించగా మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యేర్నేని, వై రవి శంకర్ నిర్మించారు. సాయి అభ్యంకర్ సంగీతాన్ని అందించారు. అక్టోబర్ 17వ తేదీన తమిళం, తెలుగు భాషల్లో విడుదల అయిన ఈ చిత్రం విశేష ప్రేక్షకాదరణతో దూసుకుపోతోంది. థాంక్స్ గివింగ్ మీట్ఈ సందర్భంగా చిత్ర యూనిట్ బుధవారం మధ్యాహ్నం చెన్నైలో థాంక్స్ గివింగ్ మీట్ నిర్వహించింది. చిత్ర నిర్మాతలు నవీన్ యేర్నేని, రవి శంకర్ మాట్లాడుతూ డ్యూడ్ చిత్రం తమిళనాడు, ఆంధ్ర, తెలంగాణ, కేరళ, కర్ణాటకలోనే కాకుండా, ఉత్తరాదిలో, అమెరికాలోనూ విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది అని పేర్కొన్నారు. ఇంత మంచి విజయాన్ని అందించిన దర్శకుడు కీర్తీ శ్వరన్, ప్రదీప్ రంగనాథన్, మమిత బైజు, శరత్ కుమార్ యూనిట్ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేశారు.దీపికాతో డ్యుయెట్కు రెడీడ్యూడ్ చిత్ర షూటింగ్కు వెళుతున్నామనగానే మనసులో సంతోషం కలిగేదని, అంత జాలీగా షూటింగ్ సాగిందని మమిత బైజు అన్నారు. ఈ చిత్రంలో నటించే అవకాశాన్ని ఇచ్చిన నిర్మాతలకు, దర్శకుడు, హీరోకు కృతజ్ఞతలు తెలిపారు. చక్కని సందేశంతో కూడిన యూత్ ఫుల్ లవ్ స్టొరీ డ్యూడ్ అని నటుడు శరత్ కుమార్ పేర్కొన్నారు. తాను ఇప్పుడు హీరోయిన్ దీపికా పదుకొణె (Deepika Padukone)తో డ్యుయెట్ పాడటానికి కూడా రెడీ అన్నారు. చాలా సెన్సిబుల్ కథను నిర్మించడానికి ముందుకొచ్చిన నిర్మాతలకు అభినందనలు తెలియజేశారు.చదవండి: బ్రేకప్.. గుండెలోతులో బాధ.. : రష్మిక మందన్నా -
బ్రేకప్.. గుండెలోతులో బాధ.. : రష్మిక మందన్నా
తెలుగు, తమిళం, హిందీ భాషల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది రష్మిక మందన్నా (Rashmika Mandanna). ఇటీవలే హారర్ కామెడీ థ్రిల్లర్ థామాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఇకపోతే ఈ మధ్యే తెలుగు హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda)తో రష్మిక ఎంగేజ్మెంట్ జరిగింది. దీనికంటే ముందు రష్మికకు లవ్ బ్రేకప్ అనుభవం ఉన్న విషయం తెలిసిందే. గతంలో కన్నడ హీరో రక్షిత్ శెట్టి (Rakshit Shetty)తో ప్రేమాయణం సాగించి నిశ్చితార్థం కూడా జరుపుకుంది. పెళ్లి బంధంతో ఒక్కటవుతారనుకుంటే.. బ్రేకప్ చెప్పుకుని ఎవరి దారి వారు చూసుకున్నారు.మగవారిలా గడ్డం పెంచలేంఇటీవల ఓ భేటీలో రష్మిక.. ప్రేమ, బ్రేకప్ గురించి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ప్రేమ, బ్రేకప్లో విషయంలో మహిళల కంటే పురుషులే ఎక్కువగా బాధపడతారనే మాటను అంగీకరించనంది. బ్రేకప్ వల్ల మహిళలే ఎక్కువ బాధ, వేదనకు గురవుతున్నారని పేర్కొంది. తమ బాధను వ్యక్తం చేయడానికి మగవారిలా గడ్డం పెంచడం, మద్యం తాగడం వంటివి చేయలేమంది. మనసులోనే బాధను భరిస్తుంటామని, బయటకు వ్యక్తం చేయలేమని తెలిపింది. ఆమె వ్యాఖ్యలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. కాగా రష్మిక మందన్నా ఉమెన్ సెంట్రిక్ పాత్రలో నటించిన ది గర్ల్ ఫ్రెండ్ చిత్రం నవంబర్ 7న విడుదల కానుంది.చదవండి: ప్రభాస్ బ్రాండ్.. రూ. 7వేల కోట్ల మార్కెట్ -
తెరపైకి గుమ్మడి నర్సయ్య జీవితం
ప్రఖ్యాత రాజకీయ నాయకుడు గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర ఆధారంగా ఓ సినిమా రూపొందనుంది. పేద ప్రజల మనిషిగా తెలుగు రాష్ట్రాల్లో పేరు సంపాదించుకున్న గుమ్మడి నర్సయ్య పాత్రను కన్నడ స్టార్ శివ రాజ్కుమార్ పోషించనున్నారు. ప్రవల్లిక ఆర్ట్స్ క్రియేషన్స్పై పరమేశ్వర్ హివ్రాలే దర్శకత్వంలో ఎన్. సురేష్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.ఈ చిత్రం పోస్టర్ను, మోషన్ పోస్టర్ను రిలీజ్ చేశారు. ‘‘రాజీపడకుండా ఈ చిత్రాన్ని నిర్మించనున్నాం. త్వరలో మరిన్ని వివరాలు తెలియజేస్తాం’’ అని యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: సురేష్ బొబ్బిలి, కెమెరా: సతీష్ ముత్యాల. -
కాంతార చాప్టర్ 1 మరో ఘనత.. తొలి ఇండియన్ చిత్రంగా!
రిషబ్ శెట్టి కాంతార చాప్టర్-1 బాక్సాఫీస్ వద్ద రికార్డుల ప్రభంజనం సృష్టిస్తోంది. దసరా కానుకగా థియేటర్లలో వచ్చిన ఈ సినిమా ఇప్పటికే రూ.700 కోట్లకు పైగా వసూళ్లతో దూసుకెళ్తోంది. ఈ క్రమంలోనే పలు చిత్రాల ఆల్ టైమ్ వసూళ్లు రికార్డులను తుడిచిపెట్టేసింది. ఈ మూవీకి ప్రపంచవ్యాప్తంగా అభిమానుల నుంచి విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. దీపావళి కూడా కలిసి రావడంతో మరిన్ని రికార్డ్స్ క్రియేట్ చేయనుంది.ఈ ప్రీక్వెల్కు వస్తున్న ఆదరణ చూసి మేకర్స్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మూవీని ఇంగ్లీష్లోకి డబ్ చేసి రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. కాంతార చాప్టర్ 1 ఇంగ్లీష్ వర్షన్ అక్టోబర్ 31 విడుదల చేస్తామని పోస్టర్ పంచుకున్నారు. ఈ మూవీ రన్టైమ్ రెండు గంటల 14 నిమిషాల 45 సెకన్లుగా ఉంటుందని వెల్లడించారు. ఇండియన్ భాషల్లో రిలీజైన ఒరిజినల్ రన్టైమ్ రెండు గంటల 49 నిమిషాలు కాగా.. ఆంగ్ల వర్షన్లో ఏకంగా 35 నిమిషాలకు తగ్గించారు. ఇప్పటికే పలు రికార్డ్లు సాధించిన ఈ చిత్రం మరో ఘనతను సొంతం చేసుకుంది. ఇంగ్లీష్లోకి డబ్ చేసిన తొలి ఇండియన్ చిత్రంగా కాంతార చాప్టర్-1 నిలవనుంది.కాగా.. కాంతార చాప్టర్-1 ఇప్పటికే ఈ ఏడాది ఆస్ట్రేలియాలో అత్యధిక గ్రాస్ వసూళ్లు సాధించిన ఇండియన్ చిత్రంగా ఘనత దక్కించుకుంది. అంతేకాకుండా కేరళలోనూ రూ.55 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లతో దూసుకెళ్తోంది. రిషబ్ శెట్టి స్వీయదర్శకత్వం వహించిన ఈ చిత్రం అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ చిత్రంలో రుక్మిణి వసంత్, గుల్షన్ దేవయ్య, జయరామ్ కీలక పాత్రల్లో నటించారు. A divine saga that resonates beyond borders and languages! 🕉️✨#KantaraChapter1 𝐄𝐧𝐠𝐥𝐢𝐬𝐡 𝐕𝐞𝐫𝐬𝐢𝐨𝐧 releasing in cinemas worldwide from 𝐎𝐜𝐭𝐨𝐛𝐞𝐫 𝟑𝟏𝐬𝐭.Experience the epic journey of faith, culture, and devotion in all its glory ❤️🔥#KantaraInCinemasNow… pic.twitter.com/lOwFGoFzKb— Hombale Films (@hombalefilms) October 22, 2025 A divine saga that resonates beyond borders and languages! 🕉️✨#KantaraChapter1 becomes the FIRST INDIAN FILM TO HAVE AN ENGLISH DUBBED VERSION RELEASE 🌍🔥The English Version releases in cinemas worldwide from October 31st.Experience the epic journey of faith, culture, and… pic.twitter.com/845DvoFT6E— Prathyangira Cinemas (@PrathyangiraUS) October 22, 2025 -
నటి గ్లామర్ పిక్స్ షేర్ చేసిన ఉదయనిధి స్టాలిన్.. ఎంత పనైపోయింది!
పొరపాట్లనేవి జరుగుతూ ఉంటాయి. కానీ, సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు అవి జరగకుండా జాగ్రత్తపడాలి. లేదంటే, ఇదిగో.. ఇలా ట్రోలింగ్ బారిన పడటం ఖాయం! బిగ్బాస్ కంటెస్టెంట్, నటి, మోడల్ నివాశియ్ని కృష్ణన్ (Nivaashiyni Krishnan) గ్లామర్ ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ పోస్ట్ను హీరో, తమిళనాడు ఉపముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ (Udhayanidhi Stalin) తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో రీపోస్ట్ చేశారు.చిన్న తప్పిదం!ఇది గమనించిన కొందరు నెటిజన్లు వెంటనే దాన్ని స్క్రీన్షాట్ తీసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. జరిగిన తప్పును గ్రహించిన ఉదయనిధి.. వెంటనే సదరు పోస్ట్ను డిలీట్ చేశారు. కానీ, అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. అటు నివాశి గ్లామర్ పోస్ట్కు కామెంట్లను ఆఫ్ చేసింది. అప్పటికీ నెటిజన్లు ఆగడం లేదు.. వేరే పోస్టుల కిందకు వెళ్లి మరీ కామెంట్స్ చేస్తున్నారు. మా అన్న ఎలా ఉన్నారు? డీఎంకే పార్టీలోకి స్వాగతం అంటూ సెటైర్లు వేస్తున్నారు.ఎవరా బ్యూటీ?అటు ఉదయనిధి అభిమానులు మాత్రం ఆయన్ను వెనకేసుకొస్తున్నారు. పొరపాటను ఉదయనిధి చేయి టచ్ అయి అలా రీపోస్ట్ అయిందని సమర్థిస్తున్నారు. నివాశి విషయానికి వస్తే.. తమిళనాడు మూలాలున్న నివాశి సింగపూర్లో మోడల్గా రాణిస్తోంది. అక్కడ అసిస్టెంట్ డైరెక్టర్గానూ పని చేసినట్లు తెలుస్తోంది. తమిళ బిగ్బాస్ ఆరో సీజన్లో కామనర్గా పాల్గొంది. ఓహో ఎంతన్ బేబీ అనే సినిమాలోనూ యాక్ట్ చేసింది. Udhaya Anna 🤣❤️🔥 Sunday rowdy time Monday Ena time ??? 🤣 pic.twitter.com/tTjI2UkpNT— விழுப்புரம் கிருபா (@Admk_Kiruba) October 21, 2025 చదవండి: నేను, ఎన్టీఆర్.. ఆయన్ని నమ్మాం.. దొరికిపోయాం!: నాగవంశీ -
టాప్ హీరోకు జోడీగా ఇద్దరు హీరోయిన్లు!
హీరో విశాల్ (Vishal) వరుసగా చిత్రాలు చేసుకుంటూ పోతున్నారు. అంతేకాదు అనూహ్యంగా మెగాఫోన్ పట్టడం విశేషం. ప్రస్తుతం మగుడం అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. సూపర్గుడ్ ఫిలింస్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మొదట రవి అరసును దర్శకుడిగా అనుకున్నారు. ఏమైందో ఏమో కానీ, ఇప్పుడు ఈ చిత్ర దర్శకత్వం బాధ్యతలను విశాల్ తన భుజాన వేసుకున్నారు. ఈ విషయాన్ని ఆయన దీపావళి పండగ సందర్భంగా మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. అందులో ఇది అనుకోకుండా జరిగిన విషయం కాదని, ముందుగా నిర్ణయించుకున్న విషయమేనని పేర్కొన్నారు. నిర్మాణ సంస్థ సహకారంతోనే మగుడం చిత్రానికి దర్శకత్వం బాధ్యతలను చేపట్టినట్లు చెప్పారు. దర్శకుడిగా..ఈయన మొదట తుప్పరివాలన్– 2 చిత్రానికి దర్శకత్వం వహించాల్సి ఉంది. దానికంటే ముందే మగుటం చిత్రంతో దర్శకుడిగా మారుతున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్లుక్ పోస్టర్ను విడుదల చేశారు. ఇకపోతే ఈ చిత్రం తరువాత సుందర్.సీ దర్శకత్వంలో విశాల్ హీరోగా నటించనున్నట్లు సమాచారం. ఇంతకు ముందు వీరి కాంబోలో 12 ఏళ్ల క్రితం మదగజరాజా తెరకెక్కింది. ఈ మూవీ ఎన్నో ఏళ్ల జాడ్యం తర్వాత ఈ ఏడాది విడుదలై సంచలన విజయాన్ని సాధించింది. తాజాగా ఈ హిట్ కాంబో మరో చిత్రానికి సిద్ధం అవుతోంది. ఇద్దరు హీరోయిన్లుసుందర్.సీ చిత్రాల్లో కమర్షియల్ అంశాలు మెండుగా ఉంటాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా హీరోయిన్ల అందాల ఆరబోత కచ్చితంగా ఉంటుంది. వీరి కాంబినేషన్లో వస్తున్న సినిమాలో విశాల్కు జంటగా మిల్కీబ్యూటీ తమన్నా, క్రేజీ బ్యూటీ కయాదు లోహర్ నటించడానికి సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది ఈ చిత్రం వచ్చే నెలలో సెట్స్ పైకి వెళ్లనుంది. వచ్చే ఏడాది సమ్మర్లో ఈ మూవీ రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. -
బ్యూటీ హీరోయిన్ నీలఖి పాత్ర లేటేస్ట్ లుక్.. బిగ్బాస్ దివి దీపావళి వైబ్స్!
ఫ్యామిలీతో హీరోయిన్ స్నేహ దీపావళి వేడుకలు..బ్యూటీ హీరోయిన్ నీలఖి పాత్ర దివాళీ లుక్..మెగా డాటర్ నిహారిక దీపావళి సెలబ్రేషన్స్..బిగ్బాస్ బ్యూటీ దివి దివాళీ లుక్స్..ఫ్యామిలీతో అల్లు అర్జున్ సతీమణి స్నేహరెడ్డి ..కొరియోగ్రాఫర్ ధనశ్రీ వర్మ దివాళీ వైబ్స్.. View this post on Instagram A post shared by Allu Sneha Reddy (@allusnehareddy) View this post on Instagram A post shared by Varun Tej Konidela (@varunkonidela7) View this post on Instagram A post shared by Divi (@actordivi) View this post on Instagram A post shared by Niharika Konidela (@niharikakonidela) View this post on Instagram A post shared by Nilakhi patra (@__officialnilakhipatra__) View this post on Instagram A post shared by Sneha (@realactress_sneha) View this post on Instagram A post shared by Dhanashree Verma (@dhanashree9) -
నాకు ఒక ఛాన్స్ ఇచ్చి ఈ సినిమా చూడండి: విక్రమ్ వారసుడు
కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ వారసుడు ధ్రువ్(Dhruv Vikram) నటించిన కొత్త సినిమా బైసన్(Bison Kaalamaadan) . ఇప్పటికే కోలీవుడ్లో విడుదలైన విషయం తెలిసిందే. ధృవ్కు జంటగా అనుపమ పరమేశ్వరన్ నటించింది. ఈ సినిమాని మారి సెల్వరాజ్ తెరకెక్కించగా.. పా.రంజిత్ సమర్పించారు. స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ కోసం ధ్రువ్ చాలానే కష్టపడ్డాడు. తమిళ్లో సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న బైసన్ ఈనెల 24న తెలుగులో కూడా విడుదల కానుంది.ఈ నేపథ్యంలో బైసన్ మూవీ యూనిట్ హైదరాబాద్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో హీరో విక్రమ్ తనయుడు ధ్రువ్తో పాటు అనుపమ పరమేశ్వరన్ పాల్గొన్నారు. అయితే, టాలీవుడ్ ప్రేక్షకుల కోసం ధ్రువ్ తెలుగులో మాట్లాడి అందరినీ ఆశ్చర్యపరిచారు. 'మీతో మాట్లాడటానికి మూడేళ్లు వెయిట్ చేశాను.. ఈ సినిమా కోసం నేను ప్రొఫెషనల్ కబడ్డీ నేర్చుకున్నాను. మా నాన్న విక్రమ్ మాదిరే నేను చాలా కష్టపడతాను. నాకు ఒక ఛాన్స్ ఇచ్చి ఈ సినిమా చూడండి. నచ్చితే మాకు సపోర్ట్ చేయండి. నాకు తెలుగులో సినిమాలు చేయాలని ఉంది.. నాకు మీ అందరి సపోర్ట్ కావాలి.' అంటూ తెలుగులోనే స్పీచ్ అదరగొట్టారు. ఏదో ఒక రోజు నాకు కొడుకు పుట్టి ఇలాగే సూట్కేస్ కొనడానికి వెళ్తే షాప్ ఓనర్ మీ నాన్న #Dhruv అంటే నాకు చాలా ఇష్టం అనిపించుకోవాలి... రాసుకొచ్చి తెలుగులో ఎక్సలెంట్ స్పీచ్ ఇచ్చిన Hero #DhruvVikram 👌👏 pic.twitter.com/ZthsjHBCks— Rajesh Manne (@rajeshmanne1) October 21, 2025 -
బీఫ్ బిర్యానీ, బుర్కాలో హీరోయిన్.. కేరళ హైకోర్టు కీలక నిర్ణయం
కేరళ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. వివాదాస్పద మలయాళ చిత్రం ‘హాల్’ను స్వయంగా వీక్షిస్తామని ప్రకటించింది. మలయాళ నటుడు షేన్ నిగమ్ నటించిన తాజా చిత్రం హాల్ వివాదంలో చిక్కుకుంది. త్వరలో విడుదలకు సిద్ధమైన ఈ సినిమాలోని బీఫ్, బిర్యానీ, బురఖా సన్నివేశాలపై సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఏ సర్టిఫికేట్ మంజూరు చేసింది.‘హాల్’ అనే చిత్రం ముస్లిం మహిళల జీవితం,వారి ఆహారపు అలవాట్లు, మతపరమైన ఆచారాలు వంటి అంశాలపై ఆధారపడి ఉంది. ఈ క్రమంలో ఈ సినిమాను వీక్షించిన సీబీఎఫ్సీ ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలను తొలగించాలని సూచించింది. ముఖ్యంగా బీఫ్ తినే సన్నివేశం, బురఖా ధరించిన మహిళల సంభాషణలతో పాటు పలు సున్నిత అంశాలపై అభ్యంతరం వ్యక్తం చేసింది.తన సినిమాపై సీబీఎఫ్సీ తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ చిత్రదర్శకుడు కేరళ హైకోర్టును ఆశ్రయించారు. సీబీఎఫ్సీ సాంస్కృతిక స్వేచ్ఛను హరిస్తుందని కోర్టులో తన వాదనలు వినిపించారు. ‘హాల్ ఒక సామాజిక కథ. మతాన్ని కించపరచడం కాదు. ముస్లిం మహిళల జీవితాన్ని నిజంగా చూపించడమే లక్ష్యం’అని పేర్కొన్నారు.విచారణ చేపట్టిన కేరళ హైకోర్టు న్యాయమూర్తులు కీలక నిర్ణయం తీసుకున్నారు. హాల్ సినిమాను ఈనెల 25న స్వయంగా వీక్షిస్తామని తెలిపారు. న్యాయస్థానం ఈ చిత్రంలోని సన్నివేశాలు మతపరమైన భావోద్వేగాలను దెబ్బతీసేలా ఉన్నాయా? లేదా? అన్నది పరిశీలించనుంది. సీబీఎఫ్సీ అభ్యంతరాలు సరైనవా? లేక సృజనాత్మక స్వేచ్ఛను అడ్డుకుంటున్నాయా? అనే అంశంపై సినిమా చూసిన తర్వాత తీర్పును వెలువరించనుంది. -
పేరు మార్చుకున్న రిషబ్ శెట్టి.. ఎందుకు? అసలు పేరు ఏంటి?
ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒకటే పేరు హాట్ టాపిక్. కేవలం రెండంటే రెండే సినిమాలతో ఆకాశమంత ఎత్తుకు ఎదిగిపోనయి, జాతీయ అవార్డు సహా కలెక్షన్ల రికార్డులు కూడా అందుకుంటూ ఒక్కసారిగా భారతీయ సినిమా ప్రభంజనానికి కేంద్ర బిందువుగా నిలిచిందా పేరు. ప్రస్తుతం ప్రతీ సినీ అభిమాన ప్రేక్షకుడికీ చిరపరిచితమైన ఆ పేరు రిషబ్ శెట్టి(Rishab Shetty). అయితే నిజానికి అది ఆయన అసలు పేరు కాకపోవడం విశేషం. మన భారతదేశ సంప్రదాయాలు, ఆధ్యాత్మికత, భక్తి, విశ్వాసాలు, దైవ బలం ఇలాంటివి తన కాంతారా, కాంతారా చాప్టర్ 1(kantara: Chapter 1) చిత్రాల ద్వారా బలంగా చాటి చెప్పిన రిషబ్ ఆ సినిమాకు కేవలం కధానాయకుడు మాత్రమే కాదనీ అన్నీ తానే అయి నడిపించిన దర్శకుడు కూడా అనేది మనకు తెలుసు. అయితే కోస్తా కర్ణాటకలోని ఒక చిన్న పట్టణం నుంచి వచ్చిన అతను నటుడిగా చిత్ర నిర్మాతగా అద్భుతమైన కెరీర్ను నిర్మించుకున్నాడు. ప్రతిభావంతుడైన నట దర్శకుడు రిషబ్ శెట్టి తన సినిమాల ద్వారా ప్రవచించిన ఆధ్యాత్మిక విశ్వాసాలు కేవలం వ్యాపార మెళకువలు అనుకుంటే పొరపాటు. ఆయన తూచ తప్పకుండా నమ్మే, అనుసరించేవి కూడా. అది ఆయన స్వంత ఇంటి అలంకరణ దగ్గర నుంచి ఆయన తన వంటిని అలంకరించుకునే తీరు, వస్త్రధారణలో కూడా అది ప్రస్ఫుటమవుతుంది. ప్రస్తుతం కాంతారా చాప్టర్ 1 విజయాన్ని సవినయంగా స్వీకరిస్తూ ఆస్వాదిస్తున్న రిషబ్ పేరు మార్పు వెనుక కూడా ఆయన నమ్మే జ్యోతిష్యశాస్త్ర ప్రభావం ఉంది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించాడు. ‘నేను నా పేరు ఎందుకు మార్చుకున్నాననే దాని వెనుక ఓ కథ ఉంది. నా అసలు పేరు ప్రశాంత్ శెట్టి. అదే పేరుతో సినిమా పరిశ్రమకు ప్రవేశించాను. అయితే సినిమా ఇండస్ట్రీలో తొలి నాళ్లలో నాకు ఎలాంటి విజయం లేదా సినిమాలు రాలేదు‘ అని చెప్పాడు. అదే సమయంలో తనను పేరు మార్చుకోమని అలా చేస్తే విజయాలు, మంచి అవకాశాలు వస్తాయని తన తండ్రి సూచించాడని ఆయన వెల్లడించాడు. అప్పటికే ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత పెద్ద స్టార్లు తమ పేర్లు మార్చుకున్నారనే విషయం కూడా తాను విన్నానని చెప్పాడు. దాంతో తాను కూడా అలాగే చేయాలని నిర్ణయించుకున్నానని రిషబ్ శెట్టి తెలిపాడు. పేరు మార్పు తన కెరీర్లో మంచి విజయాన్ని తెస్తుందని తన తండ్రి గట్టిగా నమ్మారని ఆయనే తన పేరును రిషబ్గా మార్చమని సూచించినట్టు వివరించాడు. విశేషం ఏమిటంటే రిషబ్ షెట్టి గా పేరు మార్చిన తండ్రే ప్రశాంత్ షెట్టి అనే పేరు కూడా పెట్టడం. మరో విశేషం రిషబ్ తండ్రి స్వయంగా జ్యోతిష్కుడు కావడం. ఏదేమైనా ప్రతిభా సామర్ధ్యాలకు తోడైన పేరు మార్పు కూడా తనను ఇలా శిఖరాగ్రానికి చేర్చిందని రిషబ్ షెట్టి నమ్ముతున్నాడనేది నిస్సందేహం. -
బిగ్బాస్ వేదికపై మ్యారేజ్ డే.. స్టార్ హీరో భార్య ఎమోషనల్!
శాండల్వుడ్ హీరో కిచ్చా సుదీప్ ప్రస్తుతం బిగ్బాస్ (Bigg Boss) రియాలిటీ షోకు హోస్ట్గా వ్యవహరిస్తున్నారు. కన్నడలో ఈ ఏడాది సీజన్-12 నడుస్తోంది. ఈ రియాలిటీ షోపై ఇటీవల వివాదం మొదలైంది. రెండు రోజుల పాటు మూసేసిన ఈ షోను మళ్లీ ప్రారంభించారు అయితే ఈ ఏడాది రియాలిటీ షో కిచ్చా సుదీప్కు మరింత స్పెషల్గా నిలిచింది. ఈ ఆదివారం జరిగిన ఎపిసోడ్లో సుదీప్ తన పెళ్లి రోజును సెలబ్రేట్ చేసుకున్నారు. తన భార్య ప్రియతో 24 ఏళ్ల తమ వివాహ జీవితాన్ని గ్రాండ్గా జరుపుకున్నారు. బిగ్ బాస్ వేదికపై కిచ్చా సుదీప్ సతీమణి ప్రియా ఎమోషనలయ్యారు. సుదీప్ హోస్ట్గా తిరిగి రావాలనే నిర్ణయం వెనక ప్రియా ప్రోత్సాహం ఉందని సుదీప్ తండ్రి వెల్లడించారు. ఈ మాటలకు ప్రియ భావోద్వేగానికి గురైంది. దాదాపు దశాబ్దం తర్వాత ప్రియ మొదటిసారిగా సుదీప్తో కలిసి వేదికపై కనిపించింది. ఈ సందర్భంగా శివ రాజ్కుమార్, నాగార్జున, శ్రీమురళి, ధనంజయ, రమేష్ అరవింద్ లాంటి శాండల్వుడ్ ప్రముఖులు ఈ జంటకు వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ಬಿಗ್ ಬಾಸ್ Grand Launch 2.0 | ಇಂದು ರಾತ್ರಿ 8 #BiggBossKannada12 #BBK12 #ColorsKannada #AdeBeruHosaChiguru #ಕಲರ್ಫುಲ್ಕತೆ #colorfulstory #KicchaSudeep #ExpectTheUnexpected #CKPromo pic.twitter.com/BEsTuEYre4— Colors Kannada (@ColorsKannada) October 19, 2025 -
కాంతార చాప్టర్-1 మరో రికార్డ్.. ఆ దేశంలోనూ ఘనత!
రిషబ్ శెట్టి కాంతార చాప్టర్-1 బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. గతంలో వచ్చిన బ్లాక్బస్టర్ మూవీకి ప్రీక్వెల్గా వచ్చిన ఈ చిత్రం రూ.700 కోట్లకు పైగా వసూళ్లతో దూసుకెళ్తోంది. దీపావళి కలిసి రావడంతో కలెక్షన్స్ పరంగా సరికొత్త రికార్డులు తిరగరాసింది. ఇప్పటికే పలువురు స్టార్ హీరోల సినిమాలను అధిగమించింది.తాజాగా మరో రికార్డ్ను కాంతార చాప్టర్-1 తన ఖాతాలో వేసుకుంది. ఈ ఏడాది ఆస్ట్రేలియాలో అత్యధిక గ్రాస్ వసూళ్లు సాధించిన ఇండియన్ చిత్రంగా ఘనత దక్కించుకుంది. ఈ విషయాన్ని హోంబలే ఫిల్మ్స్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. అంతేకాకుండా కేరళలోనూ రూ.55 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లతో దూసుకెళ్తోంది. రిషబ్ శెట్టి స్వీయదర్శకత్వం వహించిన ఈ చిత్రం అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.తెలుగులో రాష్ట్రాల్లోనూ రికార్డు..కాంతార చాప్టర్-1 తెలుగు రాష్ట్రాల్లో కేవలం రెండు వారాల్లోనే రూ.105 కోట్లు రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.717.50 కోట్లు కలెక్ట్ చేసి వెయ్యి కోట్ల దిశగా పరుగులు తీస్తోంది. అలాగే హిందీలో అత్యధిక వసూళ్లు సాధించిన సౌత్ సినిమాల లిస్టులోనూ చేరిపోయింది. శాండల్వుడ్లో అత్యధిక వసూళ్లు సాధించిన రెండో చిత్రంగా ఘనత సాధించింది. ఈ మూవీలో రుక్మిణి వసంత్, గుల్షన్ దేవయ్య, జయరామ్ కీలక పాత్రలు పోషించారు. హోంబలే ఫిలింస్ బ్యానర్పై విజయ్ కిరగందూర్ నిర్మించిన ఈసినిమాకు అజనీష్ లోకనాథ్ సంగీతం అందించారు.The divine roar echoes across oceans! 🌊#KantaraChapter1 emerges as 2025’s Highest-Grossing Indian Film in Australia 🇦🇺❤️🔥#BlockbusterKantara running successfully in cinemas near you ✨#KantaraInCinemasNow #DivineBlockbusterKantara #KantaraEverywhere#Kantara @hombalefilms… pic.twitter.com/658jFJTaQz— Hombale Films (@hombalefilms) October 20, 2025 -
దుల్కర్ సల్మాన్ థ్రిల్లర్ మూవీ.. రిలీజ్ డేట్ ఫిక్స్
గతేడాది లక్కీ భాస్కర్తో సూపర్ హిట్ కొట్టిన మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ మరోసారి ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఆయన హీరోగా నటించిన కాంత మూవీ రిలీజ్కు సిద్ధమైంది. దీపావళి సందర్భంగా కాంత రిలీజ్ డేట్ను ప్రకటించారు. ఈ సినిమాను నవంబర్ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు పోస్టర్ను పంచుకున్నారు. ఈ సినిమాకు దుల్కర్తో పాటు రానా దగ్గుబాటి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాకు సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహించారు. 1950ల్లో మద్రాసులో జరిగే పీరియాడికల్ హర్రర్ థ్రిల్లర్గా ఈ మూవీని తెరకెక్కించారు. ఈ చిత్రంలో సముద్రఖని, భాగ్యశ్రీ బోర్సే నటించారు. ఈ కథ ఒక ప్రముఖ చిత్రనిర్మాత రహస్య జీవితం చుట్టే తిరుగుతుంది. ఇటీవల వచ్చిన కొత్త లోకా సూపర్ హిట్ కావడంతోనే కాంతను వాయిదా వేశారు. వచ్చేనెలలో విడుదల చేయనున్నారు. Diwali just got a whole lot more explosive!💥#Kaantha will be lighting up theatres worldwide from NOVEMBER 14th!⚡Wishing you all a happy Diwali and we’ll see you in the theatres very soon.✨❤A @SpiritMediaIN and @DQsWayfarerFilm production 🎬#Kaantha #DulquerSalmaan… pic.twitter.com/dJqhbA5uev— Rana Daggubati (@RanaDaggubati) October 20, 2025 -
అమ్మాయితో అసభ్య వీడియో కాల్స్? నా కెరీర్ నాశనం..!
ప్రముఖ నటుడు అజ్మల్ అమీర్ (Ajmal Ameer) అమ్మాయిలతో అసభ్యంగా మాట్లాడాడంటూ ఓ వీడియో క్లిప్పింగ్ నెట్టింట వైరల్గా మారింది. హద్దులు దాటి మాట్లాడటంతో పాటు చాటింగ్ కూడా చేశాడంటూ ప్రచారం జరిగింది. ఈ వివాదంపై అజ్మల్ స్పందించాడు. అవన్నీ ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్) సాయంతో సృష్టించిన ఫేక్ వీడియో కాల్స్ అని కొట్టిపారేశాడు.నాకు పీఆర్ లేదుఅజ్మల్ మాట్లాడుతూ.. ఈ కల్పిత కథలు, ఏఐ వాయిస్ ఇమిటేటింగ్, ఎడిటింగ్స్.. నన్ను కానీ, నా కెరీర్ను కానీ నాశనం చేయలేవు. దేవుడి దయ వల్ల రెండు పెద్ద (తెలుగు, తమిళ) ఇండస్ట్రీలలో నేనేంటో నిరూపించుకోగలిగాను. నాకంటూ ఓ గుర్తింపు సంపాదించుకుని సినీ పరిశ్రమలో కొనసాగుతున్నాను. నా ఇమేజ్ను కాపాడేందుకు నాకెటువంటి మేనేజర్ లేడు, పీఆర్ అసలే లేదు. రెండురోజులుగా నా గురించి తప్పుడు ప్రచారం జరుగుతోంది.సినిమాఇలాంటి సమయంలో నాకు అండగా నిలబడ్డ అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు. మీవల్లే నేను ఈ స్థాయిలో ఉన్నాను. మీరే నా ధైర్యం అని వీడియో రిలీజ్ చేశాడు. అజ్మల్ విషయానికి వస్తే.. ఫిబ్రవరి 14 అనే తమిళ సినిమాతో ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చాడు. రంగం మూవీతో తెలుగులోనూ మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. రచ్చ, అభినేత్రి 2, వ్యూహం, బడ్డీ, గోట్(The Greatest of All Time) వంటి పలు సినిమాలతో అలరించాడు. View this post on Instagram A post shared by Ajmal Amir (@ajmal_amir) చదవండి: నీకెందుకే అంత యాటిట్యూడ్? రీతూపై విషం కక్కిన ఆయేషా -
పటాకులు.. బిర్యానీ, ఈ రెండూ ఉంటేనే పండగ: వరలక్ష్మీ శరత్కుమార్
‘‘దీపావళి అంటే దీపాలు... రంగు రంగుల ముగ్గులు... లక్ష్మీ పూజ. టపాసులకు మాత్రం నేను దూరం’’ అంటున్నారు వరలక్ష్మీ శరత్కుమార్. అది మాత్రమే కాదు... తన జీవితంలో వెలుగులు నింపిన వ్యక్తి ఎవరో కూడా చెప్పారు. ఈ విశేషాలతో పాటు దీపావళి ముచ్చట్లను ‘సాక్షి’తో వరలక్ష్మి ప్రత్యేకంగా పంచుకున్నారు.⇒ నా చిన్నప్పటి దీపావళి పండగలన్నీ నాకు తీపి గుర్తులే. పండగ అంటే నాకు ముఖ్యంగా నచ్చేది కుటుంబ సభ్యులందరం కలవడం. ఇక దీపావళి అంటే మాకు పిండి వంటలు మాత్రమే కాదు... బిర్యానీ కూడా. టపాసులు, బిర్యానీ... ఈ రెండూ ఉంటేనే నాకు పరిపూర్ణంగా పండగ జరుపుకున్నట్లు ఉంటుంది. నేను టపాసులు కాల్చను... జస్ట్ చూడడం వరకే. ఇప్పుడు ఈ దీపావళికి బిర్యానీ లాగించడానికి రెడీ అయిపోయాను (నవ్వుతూ).⇒ మా ఫ్యామిలీలో ఎవరు ఎంత బిజీగా ఉన్నా పండగల సమయంలో అందరం ఇంట్లో ఉండాలనే నియమం పెట్టుకున్నాం. నేను వేరే షూటింగ్స్తో బిజీగా ఉన్నప్పటికీ బ్రేక్ తీసుకుని, చెన్నై వెళ్లాను. నా పుట్టింటివాళ్లు, అత్తింటివాళ్లు, స్నేహితులు... ఇలా అందరం కలుసుకునేలా ఏర్పాట్లు చేసుకున్నాం. మాకు అత్తింటిల్లో దీపావళి పండగకి ప్రత్యేకంగా ఆచరించాల్సిన నియమాలు ఏమీ లేవు. సో... చిన్నప్పట్నుంచి మా ఇంట్లో జరుపుకున్నట్లే అత్తింటికి వెళ్లిన తర్వాత కూడా జరుపుకుంటున్నాను.⇒ దీపావళి అంటే రంగు రంగుల లైట్లు... బోలెడన్ని పువ్వులు. చాలా చక్కగా అలంకరిస్తాం. ఉదయం లక్ష్మీ పూజ చేయడం నుంచి సాయంత్రం దీపాలు పెట్టడం వరకూ ఇంట్లో ఉన్న అందరం కలిసి అన్నీ చేస్తాం. చిన్నప్పట్నుంచి నేను క్రాకర్స్కి కాస్త దూరం అని చెప్పాను కదా... నా హజ్బెండ్ (నికొలయ్ సచ్దేవ్) కూడా క్రాకర్స్కి దూరమే. కుటుంబం అంతా పండగపూట కలిసి ఉండటం ఆయనకు ఇష్టం. ఇక టపాసులు కాల్చాలనే మా సరదా పర్యావరణానికి హాని కలిగించేదిగా ఉండకూడదన్నది మా ఇద్దరి ఒపీనియన్. ⇒ నా జీవితంలో వెలుగులు నింపిన వ్యక్తి అంటే మా ఆయనే. ఎందుకంటే నిక్ నన్ను బాగా అర్థం చేసుకున్నారు. సపోర్టివ్గా ఉంటారు. డైరెక్షన్ చేయాలనే నా ఇష్టం తెలిసి, చేయమని ఆయనే ఎంకరేజ్ చేశారు. నిక్ నన్ను ప్రేమించడంతో పాటు నా మాటలకు విలువ ఇస్తారు. భార్యాభర్తల మధ్య ప్రేమతో పాటు ఒకరంటే మరొకరికి గౌరవం ఉండాలి. అప్పుడే ఆ బంధం బాగుంటుంది. దీపావళి స్పెషల్ డైరెక్షన్ఈ దీపావళికి నా కెరీర్ పరంగా స్పెషల్ అంటే ‘డైరెక్షన్’. దర్శకురాలిగా మారాలనే ఆలోచన ఎప్పట్నుంచో ఉంది. అయితే టైమ్ కుదరాలి. ఇప్పుడు సెట్ అయింది. దోస డైరీస్ బేనర్పై నా డైరెక్షన్లో ‘సరస్వతి’ టైటిల్తో రానున్న ఈ సినిమాని నా∙సోదరి పూజా శరత్కుమార్ నిర్మిస్తారు. ఈ సినిమాలో నేను నటిస్తాను కూడా. థ్రిల్లర్ మూవీగా ‘సరస్వతి’ ఉంటుంది. త్వరలో షూటింగ్ ఆరంభిస్తాం. -
Bomb Movie Review: రెండు ఊళ్ళను కలిపిన మరణం
ఓటీటీలో ‘ఇది చూడొచ్చు’ అనే ప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో తమిళ చిత్రం ‘బాంబ్’ ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం. ఆలోచన... ఓ అణువంత ఆలోచన కూడా పరమాణువంత ఫలితాన్ని ఇస్తుందనడంలో సందేహం లేదు. ఇక ఇదే ఆలోచనకు సృజనాత్మకత తోడైతే వెండితెరకు ప్రేక్షకులు పూర్తిగా కట్టుబడిపోతారు. అదే పంథాలో విడుదలైన సినిమా ‘బాంబ్’(Bomb Movie Review). ఈ టైటిల్ చూసి ఇదేదో ఫక్తు క్రైమ్ థ్రిల్లర్ అనుకునేరు! అస్సలు కానే కాదు. ఈ సినిమా ప్రేక్షకుడి అంచనాలకు ఏమాత్రం అందదు. అందుకే ఈ సినిమా ఆలోచన ఓ అద్భుతం. మణికందన్, అభిషేక్తోపాటు విశాల్ వెంకట్ అందించిన ఈ కథను విశాల్ వెంకట్ దర్శకత్వం వహించి దృశ్య కావ్యంగా మలిచిన విధానం అభినందనీయం. అంతలా ఈ ‘బాంబు’లో ఏముందో ఓసారి చూద్దాం. కాలకమ్మాయిపట్టి అనే ఊరు పెద్ద గాలివాన సమయంలో ఓ బండ పగలడం వల్ల కాలపట్టి, కమ్మాయిపట్టి అని రెండు గ్రామాలుగా విడిపోతుంది. బండ పగిలి ఒకటి చిన్న ముక్కగా, మరొకటి పెద్ద ముక్కగా... రెండు వేరు వేరు ప్రాంతాలలో పడడం వల్ల ఆ ఊరులోని జనాల మధ్య భేదాభ్రిపాయాలు రగిలి రెండు ఊళ్ళుగా విడిపోతారు. ఎంతో అన్యోన్యంగా ఉండే ఆ ఊరు ముక్కలవడంతో ఊరిలో పాటించే కట్టుబాట్లతో పాటు జరగబోయే పండగ పబ్బాలు కూడా కళ తప్పుతాయి. ఊరు కలిసున్నప్పటి నుండి ఉంటున్న కదిరవన్ అనే వ్యక్తి రెండుగా విడిపోయిన ఊరుని చూసి బాధతో ఉన్నట్టుండి చనిపోతాడు. కదిరవన్నే అంటిపెట్టుకుని ఉండే స్నేహితుడైన మణిముత్తు మాత్రం తను చనిపోలేదనే వాదిస్తుంటాడు. దానికి తోడు చనిపోయిన కదిరవన్ శరీరం నుండి అపానవాయువు వింత వింత శబ్దాలతో ఇంకా వస్తూనే ఉంటుంది. ఇంతలో కదిరవన్ శరీరాన్ని ఊరు మధ్యలో ఉన్న ఓ కుర్చీలో శవంగా కూర్చోపెడతారు. చనిపోయిన కదిరవన్ శరీరం విడిపోయిన రెండు గ్రామాలను ఎలా కలుపుతుందనేది మాత్రం ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతున్న ‘బాంబ్’ సినిమాలోనే చూడాలి. రాబోయే దీపావళికి చెవులు దద్దరిల్లే శబ్దాలతో ఎన్నో బాంబులు మన చెవులను అదరగొడతాయి. కానీ ఈ సినిమా బాంబు మాత్రం మీ అంచనాలకు అందకుండా ఆహ్లాదపరుస్తుంది. కాబట్టి మీ దీపావళి బాంబులతో పాటు ఈ ‘బాంబు’ను కూడా ఓసారి చూసేయండి. వర్త్ టు వాచ్ ఫర్ దిస్ దివాలి. – హరికృష్ణ ఇంటూరు -
దీపావళి సినిమాలు.. జోరు మీదున్న హీరో.. వెనకబడ్డ సిద్ధు!
ఈసారి దీపావళి పండగ అక్టోబర్ 20వ తారీఖున వస్తోంది. కానీ బాక్సాఫీస్ వద్ద మాత్రం అప్పుడే పండగ మొదలైంది. తెలుగులో పోటాపోటీగా సినిమాలు రిలీజయ్యాయి. అందులో ఒకటి ఉల్లిగడ్డ బాంబ్లా సౌండ్ చేస్తుంటే మరోటి చిచ్చుబుడ్డిలా వెలుగుతోంది. ఒకటైతే మందుగుండు లేని పటాకాలా మిగిలిపోయింది. అవేంటి? వాటి కలెక్షన్స్ ఏంటో చూద్దాం..రేసులో లేని మిత్రమండలిప్రియదర్శి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం మిత్రమండలి. అక్టోబర్ 16న రిలీజైన ఈ మూవీ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది అన్న చందంగా మారింది పరిస్థితి! మొదటిరోజే ఈ పటాకా ఎవరికీ నచ్చలేదు. ఇప్పుడిక వేరే సినిమాల ఆప్షన్స్ ఉండటంతో రేసులో చివరి స్థానానికి వెళ్లిపోయింది. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన మూవీ తెలుసు కదా. ఈ మూవీ అక్టోబర్ 17న విడుదలైంది. కథ బాగున్నా కాస్త ల్యాగ్ అవడంతో మిక్స్డ్ టాక్ అందుకుంటోంది.స్పీడు మీదున్న డ్యూడ్తొలి రోజు ఈ సినిమా రూ.3 కోట్ల మేర వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఇది జాక్ కంటే కూడా తక్కువ! అయితే మొదటి రోజు కంటే రెండో రోజు వసూళ్లు కాస్త మెరుగయ్యాయని చెప్తున్నారు. ఇక అక్టోబర్ 17న తమిళ హీరో ప్రదీప్ రంగనాథన్ నటించిన డ్యూడ్ (Dude Movie) కూడా రిలీజైంది. ఈ మూవీ సెకండాఫ్పై కాస్త అసంతృప్తి ఉన్నప్పటికీ ప్రేక్షకులు ఎగబడి మరీ చూస్తున్నారు. ఈ సినిమా రెండు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.45 కోట్లు రాబట్టిందని అధికారిక ప్రకటన విడుదల చేశారు.కె-ర్యాంప్ ఫస్ట్ డే కలెక్షన్స్అన్నిటికంటే ఆలస్యంగా (అక్టోబర్ 18న) వచ్చిన మూవీ కె-ర్యాంప్ (K-Ramp Movie). ఎప్పుడొచ్చామన్నది కాదు, బుల్లెట్టు దిగిందా? లేదా? అంటూ బరిలోకి దిగిన కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) సినిమాకు హిట్ టాక్ వస్తోంది. తొలిరోజు ఈ చిత్రానికి రూ.4.5 కోట్ల కలెక్షన్స్ వచ్చాయని చిత్రయూనిట్ ప్రకటించింది. మరి ఏ సినిమా వసూళ్లు పెరగబోతున్నాయి? దీపావళి హిట్ బొమ్మ ఏదనేది చూడాలి! DAY 2 > DAY 1 for #TelusuKada ❤🔥DIWALI'S RADICAL BLOCKBUSTER sees massive growth on Saturday with housefulls all over 💥💥Book your tickets now!🎟️ https://t.co/QvC10IjSqS#LoveU2 #UnapologeticallyRadicalSTAR BOY @Siddubuoyoffl @NeerajaKona #RaashiiKhanna… pic.twitter.com/UdtkfHUrmu— People Media Factory (@peoplemediafcy) October 18, 2025 DUDE DIWALI BLAST is unstoppable at the box office with massive love from the audience ❤️#Dude collects a gross of 45 CRORES WORLDWIDE in 2 days & going super strong ❤🔥Book your tickets now and celebrate #DudeDiwali 🔥🎟️ https://t.co/JVDrRd4PZQ🎟️ https://t.co/4rgutQNl2n… pic.twitter.com/TLNPYTpNsV— Mythri Movie Makers (@MythriOfficial) October 19, 2025Box-Office daggara tana Mass Madness chupinchina Kumar Abbavaram 🤙🔥𝟰.𝟱 𝗖𝗿𝗼𝗿𝗲 Day1 GROSS for the 𝐃𝐈𝐖𝐀𝐋𝐈 𝐖𝐈𝐍𝐍𝐄𝐑 #KRamp 💥❤️🔥Grab Your Seats Now!!— https://t.co/nS9p8rSUlZ#KRampKaDiwali pic.twitter.com/BoeIifohez— Hasya Movies (@HasyaMovies) October 19, 2025చదవండి: కోటిలో బ్యాగులు అమ్ముకున్నా.. బాత్రూమ్లు కడిగా: ‘జబర్దస్త్’ కమెడియన్ -
'కాంతార' హిట్ సాంగ్.. వీడియో వర్షన్ విడుదల
కన్నడ నటుడు రిషబ్శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం ‘కాంతార:చాప్టర్1’ (Kantara Chapter 1). అక్టోబర్ 2న విడుదలైన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 720 కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబట్టింది. అయితే, తాజాగా ఈ మూవీ నుంచి రావే ఇక ప్రియ భామిని అనే సాంగ్ను విడుదల చేశారు. రిషబ్, రుక్మిణి వసంత్ మధ్య చిత్రీకరించిన ఈ పాటను అనురాగ్ కులకర్ణి, చిన్మయి శ్రీపాద ఆలపించారు. అజనీష్ లోక్నాథ్ సంగీతం ఇచ్చారు. కాంతార ఛాప్టర్-1 విజయవంతమైన తర్వాత రిషబ్ శెట్టి పలు ఆలయాలను సందర్శిస్తున్నారు. తాజాగా చాముండి బెట్టపై చాముండేశ్వరి ఆలయంలో పూజలు నిర్వహించారు. కాంతార సినిమా విజయంలో కన్నడిగుల పాత్ర చాలా ఉందన్నారు. దైవాన్ని తాను ఎక్కువగానే విశ్వసిస్తానని చెప్పారు. ఈ చిత్రం ద్వారా మూఢ నమ్మకాలను ప్రోత్సహించానని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. తన తదుపరి చిత్రం ‘జై హనుమాన్’ అని ఆయన వెల్లడించారు. ఇప్పటివరకు అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన కన్నడ చిత్రాల లిస్ట్లో ‘కాంతార -1’ రెండో స్థానంలో ఉంది. రూ.1200 కోట్ల కలెక్షన్లతో ‘కేజీయఫ్ 2’ తొలి స్థానంలో నిలిచింది. -
రివాల్వర్ రీటా.. హ్యాపీ బర్త్డే సాంగ్ రిలీజ్
మహానటి చిత్రంతో జాతీయ ఉత్తమ నటి అవార్డు గెలుచుకున్న కీర్తి సురేశ్ (Keerthy Suresh)కు 2024 పెద్దగా కలిసి రాలేదు. వృత్తిపరంగా వరుస అపజయాలను చవి చూసిన ఆమె వ్యక్తిగతంగా మాత్రం మధురమైన ఘట్టానికి చేరుకున్నారు. తన చిరకాల మిత్రుడు ఆంటోనితో పెళ్లి చేరుకున్నారు. అయితే సినిమాలకు మాత్రం కాస్త దూరం అయ్యారనే చెప్పాలి. ఈమె నటించిన రఘు తాత, హిందీ చిత్రం మేరీజాన్ చిత్రాలు నిరాశపరిచాయి. ఉప్పు కప్పరంబు అనే వెబ్సీరీస్లో నటించినా, అది ఓటీటీలో స్ట్రీమింగ్ కావడంతో పెద్దగా రీచ్ కాలేదు. అయితే వాణిజ్య ప్రకటనల్లో నటిస్తూ బాగానే డబ్బు సంపాదించారు.సినిమాఇప్పుడు కీర్తి సురేశ్ మళ్లీ బిజీ అయ్యారు. ఇప్పటికే తెలుగులో రెండు కొత్త చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇంతకుముందు నటించిన రెండు చిత్రాలు విడుదల కావాల్సి ఉంది. వాటిలో ఒకటి రివాల్వర్ రీటా (Revolver Rita Movie). ఉమెన్ సెంట్రిక్ కథాంశంతో రూపొందిన ఈ చిత్రానికి చంద్రు దర్శకుడు. ఫ్యాషన్ స్టూడియోస్, ది రూట్ సంస్థలు నిర్వహించిన ఈ చిత్రం త్వరలో తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. శుక్రవారం (అక్టోబర్ 17) కీర్తిసురేష్ 34వ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ రివాల్వర్ రీటా చిత్ర యూనిట్ ఒక సాంగ్ విడుదల చేసింది. -
హిట్ కొట్టిన విక్రమ్ వారసుడు.. తెలుగులో కూడా విడుదల
చియాన్ విక్రమ్ వారసుడు ధ్రువ్కు నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. ఈయన తండ్రి విక్రమ్ నటనను చూసి ఎదిగిన వారసుడు. తొలి చిత్రం వర్మతోనే నటుడిగా తానేమిటో నిరూపించుకున్నారు. అయితే ఆ చిత్రం సక్సెస్ కాకపోవడం, ఆ తరువాత తన తండ్రి విక్రమ్తో కలిసి నటించిన మహాన్ చిత్రం నేరుగా ఓటీటీలో విడుదల కావడంతో ధ్రువ్విక్రమ్ ఇప్పటివరకు విజయానికి దూరంగా ఉన్నారు. సరైన కథ, దర్శకుడి చేతిలో పడితే తన సత్తా చాటగలనని ఈ యువ నటుడు బైసన్ చిత్రంతో నిరూపించుకున్నారు. మారీ సెల్వరాజ్ దర్శకత్వంలో ధ్రువ్ కథానాయకుడిగా నటించిన బైసన్ చిత్రం దీపావళి పండుగ సందర్భంగా శుక్రవారం తెరపైకి వచ్చింది. కబడ్డీ క్రీడ నేపథ్యంలో యథార్థ సంఘటన ఆధారంగా రూపొందించిన ఈ చిత్రాన్ని దర్శకుడు పా.రంజిత్కు చెందిన నీలం ప్రొడక్షన్న్స్, అప్లాజ్ ఎంటర్టెయిన్మెంట్, శాంతి సినిమా సంస్థలు కలిసి నిర్మించాయి. ఒక కుగ్రామానికి చెందిన పేద కుర్రాడు అత్యున్నత పురస్కారం అర్జున్ అవార్డును గెలుచుకునే స్థాయికి ఎలా ఎదిగాడు అనే ఇతివృత్తంతో తెరకెక్కిన చిత్రం బైసన్.ఈచిత్రంలో హీరో అక్కగా రజిషా విజయన్, ఆయన తండ్రిగా పశుపతి, హీరోయిన్గా అనుపమ పరమేశ్వరన్ నటించారు. వీరితో పాటు దర్శకుడు అమీర్, లాల్ ముఖ్యపాత్రలు పోషించారు. నివాస్ కే.ప్రసన్న సంగీతాన్ని అందించిన ఈ చిత్రంలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ధ్రువ్ నటన గురించే. ఆయన సహజత్వంగా తన పాత్రలో అంకితమై నటించారు. కొన్ని సన్నివేశాల్లో తన తండ్రి విక్రమ్ను గుర్తు చేశారు. ఈ చిత్రం తెలుగులో కూడా ఇదే టైటిల్తో అక్టోబర్ 24న విడుదల కానుంది. దర్శకుడు మారీ సెల్వరాజ్ గతంలో తెరకెక్కించిన మామన్నన్, కర్ణన్, వాజై చిత్రాలు భారీ విజయాన్ని అందుకున్నాయి. ఇప్పుడు బైసన్ మూవీ కూడా మంచి విజయం సాధించింది. -
హైదరాబాద్లో షూటింగ్స్ సందడి
కొందరు సెట్స్లో... కొందరు నేచురల్ లొకేషన్స్లో... ఇలా హైదరాబాద్లో షూటింగ్ చేస్తూ ఈ వారం అంతా బిజీ బిజీగా గడిపారు కొందరు స్టార్స్. ఆదివారం, దీపావళికి సోమవారం బ్రేక్ తీసుకోనున్న స్టార్స్ కొందరైతే... హాలిడే లేకుండా షూట్లో పాల్గొననున్న స్టార్స్ కూడా ఉన్నారు. ఇక గత ఆరేడు రోజులుగా హైదరాబాద్లో ఏయే సినిమాల షూటింగ్స్ జరి గాయో తెలుసుకుందాం.సెట్లో శంకరవరప్రసాద్... చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ‘మన శంకరవరప్రసాద్ గారు’. ‘పండక్కి వస్తున్నారు’ అనేది ఉపశీర్షిక. వెంకటేశ్ హీరోగా నటించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ (2025) వంటి బ్లాక్బస్టర్ మూవీ తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది. ఈ మూవీలో నయనతార హీరోయిన్గా నటిస్తున్నారు. ‘సైరా: నరసింహారెడ్డి’ చిత్రం తర్వాత చిరంజీవి, నయనతార జోడీగా కలిసి నటిస్తున్న సినిమా ఇది. అయితే ‘గాడ్ఫాదర్’ సినిమాలో చిరంజీవికి చెల్లెలుగా నయనతార నటించిన సంగతి తెలిసిందే. ‘మన శంకరవరప్రసాద్ గారు’ చిత్రంలో హీరో వెంకటేశ్, హీరోయిన్ కేథరిన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అర్చన సమర్పణలో షైన్ స్క్రీన్ బ్యానర్పై సాహు గారపాటి, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై సుస్మిత కొణిదెల నిర్మిస్తున్నారు.ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న ఈ చిత్రం కీలక షెడ్యూల్ ప్రస్తుతం హైదరాబాద్లో జరుగుతోంది. అన్నపూర్ణ సెవన్ ఎకర్స్ స్టూడియోలో వేసిన ప్రత్యేకమైన సెట్లో చిరంజీవి, నయనతార, కేథరిన్, నటుడు సచిన్ ఖేడేకర్లతో పాటు ఇతర తారాగణంపై కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు అనిల్ రావిపూడి. చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి నటిస్తున్న పూర్తి స్థాయి వినోదాత్మక చిత్రం ఇది. ఈ మూవీలో చిరంజీవి–నయనతార భార్యాభర్తలుగా నటిస్తున్నారు. ‘మన శంకరవరప్రసాద్ గారు’ చిత్రం 2026 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే.. చిరంజీవి హీరోగా మల్లిడి వశిష్ట దర్శకత్వం వహించిన ‘విశ్వంభర’ సినిమా 2026 వేసవిలో రిలీజ్ కానుంది.ఆర్ఎఫ్సీలో అడ్వెంచర్ మహేశ్బాబు హీరోగా అంతర్జాతీయ స్థాయిలో రూపొందుతోన్న చిత్రం ‘ఎస్ఎస్ఎమ్బీ 29’ (వర్కింగ్ టైటిల్). రామ్చరణ్, ఎన్టీఆర్లతో ‘ఆర్ఆర్ఆర్’ (2022) వంటి బ్లాక్బస్టర్ మూవీ తర్వాత ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. ఈ సినిమాలో ప్రియాంకా చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రధారులు. దుర్గా ఆర్ట్స్ బ్యానర్పై కేఎల్ నారాయణ నిర్మిస్తు్త్తన్నారు. ఈ సినిమా కోసం మహేశ్బాబు పొడవాటి హెయిర్ స్టైల్, గెడ్డంతో ప్రత్యేకంగా మేకోవర్ అయిన సంగతి తెలిసిందే. ఆయన లుక్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ సినిమా నుంచి ఇప్పటివరకూ మహేశ్బాబుకి సంబంధించిన ఎలాంటి లుక్ అధికారికంగా చిత్రయూనిట్ విడుదల చేయలేదు. అయితే చిత్రీకరణ సమయంలోని కొన్ని ఫొటోలు లీక్ అయిన సంగతి తెలిసిందే.అమేజాన్ అడవుల నేపథ్యంలో భారీ అడ్వెంచరస్ మూవీగా తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. ఈ మూవీ కోసం ప్రత్యేకంగా వేసిన సెట్లో మహేశ్బాబుతో పాటు ప్రధాన తారాగణంపై ముఖ్యమైన సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారట రాజమౌళి. సూపర్ స్టార్ మహేశ్బాబు, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన రాజమౌళి కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాపై ప్రపంచ వ్యాప్తంగా ఇండస్ట్రీ వర్గాల్లో, ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ చిత్రాన్ని దాదాపు రూ. 1000 కోట్ల బడ్జెట్తో పాన్ వరల్డ్ రేంజ్లో నిర్మిస్తున్నారనే టాక్ నడుస్తోంది.ఈ చిత్రాన్ని 120 దేశాల్లో విడుదల చేయనున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో ఇప్పటివరకు ఏ భారతీయ సినిమాకీ లభించని ఘనత ‘ఎస్ఎస్ఎమ్బీ 29’కి దక్కనుందని టాక్. హైదరాబాద్ షెడ్యూల్ పూర్తయిన తర్వాత కెన్యా దేశంలో ఈ సినిమా చిత్రీకరణని ΄్లాన్ చేశారు రాజమౌళి. ఇప్పటికే ఆయన అక్కడి లొకేషన్స్ని కూడా పరిశీలించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించిన మొదటి బిగ్ రివీల్ ఈ నవంబరులో రానుండటంతో అందరిలో ఎంతో క్యూరియాసిటీ నెలకొంది.యాక్షన్ ఎంటర్టైనర్... పవన్ కల్యాణ్ హీరోగా రూపొందుతోన్న తాజా చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’. ‘గబ్బర్సింగ్’ (2012) తర్వాత హీరో పవన్ కల్యాణ్– డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్లో రూపొందుతోన్న ద్వితీయ చిత్రమిది. ఈ సినిమాలో శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్ గచ్చిబౌలిలోని అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతోంది. ప్రధాన తారాగణంపై ముఖ్యమైన సీన్స్ని తెరకెక్కిస్తున్నారట హరీష్ శంకర్. ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా దాదాపు పూర్తి కావొచ్చిందట. నవంబరు చివరికల్లా చిత్రీకరణ మొత్తం పూర్తవుతుందని ఫిల్మ్నగర్ టాక్.హిట్ కాంబినేషన్లో... హీరో నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల, నిర్మాత సుధాకర్ చెరుకూరిలది హిట్ కాంబినేషన్ అని చెపొ్చ్చు. వీరి ముగ్గురి కాంబినేషన్లో వచ్చిన ‘దసరా’ (2023) మూవీ బ్లాక్బస్టర్ అయిన సంగతి తెలిసిందే. ఈ హిట్ కాంబోలో వస్తున్న ద్వితీయ చిత్రం ‘ది ΄్యారడైజ్’. ఎస్ఎల్వీ సినిమాస్పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్లో జరుగుతోంది. ఈ మూవీ కోసం వేసిన ప్రత్యేకమైన సెట్స్లో చిత్రీకరిస్తున్నారు. నానితో పాటు చిత్రంలోని ప్రధాన తారాగణం ఈ షెడ్యూల్లో పాల్గొంటోందట.ఈ చిత్రంలో నాని పాత్ర పేరు జడల్. గతంలో విడుదల చేసిన స్టిల్లో నాని రెండు జడలు వేసుకుని, పక్కా మాస్ లుక్లో కనిపించిన సంగతి తెలిసిందే. హీరో లుక్, స్టోరీ, టేకింగ్... ఇలా ప్రతిదీ వైవిధ్యంగా ఉండేలా తెరకెక్కిస్తున్నారట శ్రీకాంత్. ‘దసరా’ వంటి హిట్ కాంబినేషన్లో వస్తున్న ‘ది ΄్యారడైజ్’ పై ఇండస్ట్రీలో, ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాని తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ, బెంగాలీ, ఇంగ్లిష్, స్పానిష్ భాషల్లో 2026 మార్చి 26న విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ ఇప్పటికే ప్రకటించింది.ఓ వీరాభిమాని కథ రామ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఆంధ్ర కింగ్ తాలూకా’. ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ మూవీ ఫేమ్ పి. మహేశ్బాబు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో ‘మిస్టర్ బచ్చన్, కింగ్డమ్’ చిత్రాల ఫేమ్ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటిస్తున్నారు. ఉపేంద్ర, రావు రమేశ్, మురళీ శర్మ, సత్య, రాహుల్ రామకృష్ణ కీలక పాత్రలుపోషిస్తున్నారు. గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్, టి సిరీస్ ఫిలిమ్స్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా తాజా షెడ్యూల్ హైదరాబాద్లో జరుగుతోంది.ఇటీవల రామోజీ ఫిల్మ్ సిటీలోని రైల్వేస్టేషన్లో హీరో రామ్పై కొన్ని సన్నివేశాలను తెరకెక్కించారు మహేశ్బాబు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్లో జరుగుతోంది. రామ్తో పాటు ఇతర ప్రధాన తారాగణంపై పలు సన్నివేశాలను తీస్తున్నారట దర్శకుడు. ఈ సినిమాలో ఉపేంద్ర ఓ స్టార్ హీరోగా నటిస్తుండగా ఆయన వీరాభిమాని పాత్రలో రామ్పోతినేని నటిస్తున్నారు. తన అభిమాన హీరో కోసం ఈ వీరాభిమాని ఏం చేశాడు? అన్నది తెలియాలంటే నవంబరు 28 వరకు వేచి ఉండాలి. ఈ చిత్రం అదే రోజు విడుదల కానుంది. అల్యూమినియం ఫ్యాక్టరీలో... హీరో నాగచైతన్య నటిస్తున్న తాజా చిత్రం ‘ఎన్సీ 24’ (వర్కింగ్ టైటిల్). ‘తండేల్’ సినిమాతో బ్లాక్బస్టర్ అందుకోవడంతో పాటు తొలిసారి వంద కోట్ల క్లబ్లో చేరారాయన. ‘తండేల్’ వంటి హిట్ మూవీ తర్వాత ‘విరూపాక్ష’ (2023) మూవీ ఫేమ్ కార్తీక్ దండు దర్శకత్వంలో నాగచైతన్య నటిస్తున్న ‘ఎన్సీ 24’ చిత్రంలో మీనాక్షీ చౌదరి హీరోయిన్గా నటిస్తున్నారు. బాపినీడు సమర్పణలో సుకుమార్ రైటింగ్స్, శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్లో బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు.భారీ బడ్జెట్తో రూపొందుతోన్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ గచ్చిబౌలిలోని అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతోంది. నాగచైతన్య, మీనాక్షీ చౌదరితో పాటు ఇతర నటీనటులు ఈ చిత్రీకరణలో పాల్గొంటున్నారట. ‘తండేల్’లో ఫుల్ మాస్ లుక్లో కనిపించిన నాగచైతన్య ‘ఎన్సీ 24’లో స్టైలిష్గా సరికొత్త లుక్తో కనిపించనున్నారు. అదే విధంగా మీనాక్షీ చౌదరి కూడా సరికొత్త పాత్రలో కనిపిస్తారు. రాయలసీమ నేపథ్యంలో... అఖిల్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘లెనిన్’. ‘ప్రేమ కన్నా ఏ యుద్ధం హింసాత్మకమైనది’ కాదు అనేది ఉపశీర్షిక. కిరణ్ అబ్బవరం హీరోగా ‘వినరో భాగ్యము విష్ణుకథ’ వంటి విజయవంతమైన సినిమా తెరకెక్కించిన మురళీ కిశోర్ అబ్బూరి దర్శకత్వం వహిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్, సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ ‘లెనిన్’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్లోని బూత్ బంగ్లాలో జరుగుతోంది. అఖిల్తో పాటు ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు మురళీ కిశోర్.రాయలసీమ నేపథ్యంలో సాగే రొమాంటిక్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రం రూపొందుతోంది. ఈ సినిమా కోసం పొడవాటి హెయిర్, గెడ్డంతో మాస్ లుక్లోకి మారిపోయారు అఖిల్. ఈ సినిమాలో తొలుత శ్రీలీల హీరోయిన్గా ఫిక్స్ అయ్యారు. అయితే ఆమె ఈ సినిమా నుంచి తప్పుకున్నారు. శ్రీలీల స్థానాన్ని ‘మిస్టర్ బచ్చన్, కింగ్డమ్’ సినిమాల ఫేమ్ భాగ్యశ్రీ బోర్సే రీప్లేస్ చేశారట. అయితే హీరోయిన్ విషయంపై అధికారిక ప్రకటన చేయలేదు మేకర్స్.యాక్షన్... ఎమోషన్ విజయ్ సేతుపతి హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ‘పూరిసేతుపతి’ (వర్కింగ్ టైటిల్) అనే పాన్ ఇండియా చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో సంయుక్త హీరోయిన్గా నటిస్తున్నారు. టబు, విజయ్ కుమార్, బ్రహ్మాజీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. పూరి కనెక్ట్స్, జేబీ మోషన్ పిక్చర్స్ బ్యానర్పై పూరి జగన్నాథ్, చార్మీ కౌర్, జేబీ నారాయణరావు కొండ్రోల్లా నిర్మిస్తున్నారు. యాక్షన్, ఎమోషన్ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్ గచ్చిబౌలిలోని అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతోంది. విజయ్ సేతుపతి, సంయుక్త, టబు, విజయ్కుమార్, బ్రహ్మాజీలతో పాటు ఇతర నటీనటులపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట పూరి జగన్నాథ్. తనదైన మాస్, కమర్షియల్ స్టయిల్లో ఒక యునిక్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతున్నారట పూరి. ఈ సినిమా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానుంది.ముచ్చింతల్లో మహాకాళి ‘హనుమాన్’ మూవీ ఫేమ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్లో భాగంగా రూపొందుతోన్న తాజా చిత్రం ‘మహాకాళి’. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్లో రూపొందిన తొలి చిత్రం ‘హను–మాన్’ (2024) పాన్ ఇండియా బ్లాక్బస్టర్గా నిలిచిన సంగతి తెలిసిందే. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్లో 12 సూపర్ హీరోస్ సినిమాలను తెరకెక్కించనున్నట్లు గతంలో ప్రకటించారు ప్రశాంత్ వర్మ. అందులో భాగంగా ఈ యూనివర్స్లో రూపొందుతోన్న ద్వితీయ చిత్రం ‘మహాకాళి’. ప్రశాంత్ వర్మ క్రియేటర్, షో రన్నర్గా వ్యవహరిస్తున్న ఈ సినిమాకి పూజ అపర్ణ కొల్లూరు దర్శకత్వం వహిస్తున్నారు.ఆర్కే దుగ్గల్ సమర్పణలో ఆర్కేడీ స్టూడియోస్ బ్యానర్పై రివాజ్ రమేశ్ దుగ్గల్ నిర్మిస్తున్నారు. అమ్మవారి చుట్టూ అల్లుకున్న కథతో బెంగాల్ సంస్కృతి, సంప్రదాయాల నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతోందని సమాచారం. నటీనటుల వివరాలను మేకర్స్ ఇప్పటివరకూ అధికారికంగా ప్రకటించలేదు. అయితే అసురుల గురువు శుక్రాచార్యుడిగా బాలీవుడ్ నటుడు అక్షయ్ ఖన్నా నటిస్తున్నట్లు ప్రకటించి, ఆయన ఫస్ట్ లుక్ని మాత్రం ఇటీవల రిలీజ్ చేశారు మేకర్స్. ఇదిలా ఉంటే.. ‘మహాకాళి’ సినిమా షూటింగ్ ప్రస్తుతం శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్లో జరుగుతోంది. నటీనటులపై కీలకసన్నివేశాలు తీస్తున్నారు మేకర్స్. డిసెంబరు నెలాఖరుకి ఈ సినిమా చిత్రీకరణ పూర్తవుతుంది. పైన పేర్కొన్న సినిమాలే కాదు... మరికొన్ని చిత్రాలు కూడా ప్రస్తుతం హైదరాబాద్తో పాటు పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపుకుంటున్నాయి. – డేరంగుల జగన్ మోహన్ -
'డ్యూడ్' ఫస్ట్ డే కలెక్షన్స్.. ప్రదీప్ కెరీర్లోనే రికార్డ్
డ్యూడ్ సినిమాతో తమిళ నటుడు ప్రదీప్ రంగనాథన్ రికార్డ్ క్రియేట్ చేశాడు. ఈ మూవీ తొలిరోజు బాక్సాఫీస్ వద్ద కుమ్మేసింది. ఫస్ట్ డే నాడు లవ్ టుడే, రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ సినిమాల కలెక్షన్స్ కంటే డ్యూడ్ ఎక్కువే కొల్లగొట్టాడు. అక్టోబర్ 17న విడుదలైన ఈ చిత్రాన్ని నూతన దర్శకుడు కీర్తిశ్వరన్ తెరకెక్కించాడు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది. ఇందులో మితా బైజు, శరత్ కుమార్, రోహిణి,హృదు హరూన్,నేహా శెట్టి తదితరులు నటించారు. ప్రదీప్ గత రెండు చిత్రాలు భారీ విజయం అందుకోవడంతో డ్యూడ్ మూవీకి బాగానే కలిసొచ్చింది.తొలిరోజే డ్యూడ్ దుమ్ములేపాడు. ప్రపంచవ్యాప్తంగా రూ. 22 కోట్ల గ్రాస్ కలెక్షన్స్తో సత్తా చాటాడు. ప్రదీప్ రంగనాథ్ కెరీర్లోనే మొదటిరోజు అత్యధిక కలెక్షన్స్ సాధించిన చిత్రంగా డ్యూడ్ రికార్డ్ క్రియేట్ చేసింది. ప్రదీప్ గత చిత్రం రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ ఫస్ట్ డే రూ. 14 కోట్లు మాత్రమే రాబట్టింది. అయితే, ఆ సినిమా విజయం ఇప్పుడు ప్రదీప్కు బాగా కలిసొచ్చింది. ఆపై ఈ మూవీకి మొదటి రోజు కంటే రెండో రోజు బుకింగ్స్ బాగున్నాయని సమాచారం. దీపావళి సెలవు కూడా ఉండటంతో డ్యూడ్ బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ మార్క్ను చేరుకోవచ్చని తెలుస్తోంది.సినిమా విడుదల కంటే ముందే సోషల్మీడియాలో ఈ మూవీకి బజ్ క్రియేట్ అయింది. ఆపై యూత్కు బాగా కనెక్ట్ కావడంతో థియేటర్స్ కూడా హౌస్ఫుల్ అవుతున్నాయి. తమిళనాడు కంటే తెలుగు రాష్ట్రాల్లోనే డ్యూడ్ చిత్రానికి ఎక్కువ కలెక్షన్స్ వచ్చినట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. అయితే, డ్యూడ్ యూనిట్ నేడు అభిమానులను కలవనుంది. హైదరాబాద్లోని మల్లిఖార్జున థయేటర్ వద్దకు సాయంత్రం 6:30 షో టైమ్లో రానున్నారు. అక్కడి నుంచి మైత్రీ విమల్ థియేటర్కు రాత్రి 10:20గంటల షో టైమ్లో చేరుకుంటారు.The DUDE DIWALI BLAST takes off on a BLOCKBUSTER note at the box office 🎇#Dude collects a gross of 22 CRORES WORLDWIDE on Day 1 ❤🔥A massive festive weekend loading 💥💥Book your tickets now and celebrate #DudeDiwali 🔥🎟️ https://t.co/JVDrRd4PZQ🎟️… pic.twitter.com/SjFiSw1cuq— Mythri Movie Makers (@MythriOfficial) October 18, 2025 -
కాంతార చాప్టర్ 1 బ్లాక్బస్టర్ హిట్.. వారణాసిలో ప్రత్యేక పూజలు
రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో వచ్చిన కాంతార: చాప్టర్ 1 బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. ఇప్పటికే రూ.700 కోట్లకు పైగా వసూళ్లతో దూసుకెళ్తోంది. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో కన్నడ హీరో వారణాసిలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పవిత్ర గంగా హారతిలో పాల్గొన్నారు. కాంతార మూవీ తర్వాత పాన్ ఇండియా రేంజ్లో రిషబ్ శెట్టి ఫేమస్ అయిన సంగతి తెలిసిందే.ఈ ఏడాది దసరా కానుకగా కాంతార: చాప్టర్ 1 ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. కాంతారకు ప్రీక్వెల్గా వచ్చిన ఈ సినిమా.. కేవలం 16 రోజుల్లోనే రూ. 717 కోట్ల వసూళ్లు సాధించి బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డ్ సృష్టించింది. ఇప్పటికే పలు స్టార్ హీరోల చిత్రాలను సైతం అధిగమించింది. శాండల్వుడ్ చరిత్రలోనే రెండో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. కన్నడ ఇండస్ట్రీలో కేజీఎఫ్-2 మొదటి స్థానంలో ఉంది. ఈ సినిమాను హోంబలే ఫిల్మ్స్ బ్యానర్లో నిర్మించారు. ఈ చిత్రానికి బి. అజనీష్ లోక్నాథ్ సంగీతమందించారు. -
మెగా కోడలి సస్పెన్స్ థ్రిల్లర్.. సడన్గా ఓటీటీకి!
మెగా కోడలు లావణ్య త్రిపాఠి హీరోయిన్గా నటించిన చిత్రం టన్నెల్(Tunnel). కోలీవుడ్ హీరో అథర్వా మురళి సరసన ఈ చిత్రంలో కనిపించింది. తమిళంలో తనల్(Thanal) పేరుతో ఈ మూవీని తెరకెక్కించారు. సెప్టెంబర్ 19న థియేటర్లలో రిలీజైన ఈ చిత్రానికి బాక్సాఫీస్ వద్ద పెద్దగా రాణించలేకపోయింది. ఈ మూవీకి రవీంద్ర మాధవ దర్శకత్వం వహించారు. ఈ సినిమాను లచ్చురామ్ ప్రొడక్షన్స్పై ఎ. రాజు నాయక్ తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ క్రైమ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రంలో అథర్వ పోలీస్ ఆఫీసర్గా నటించారు. అశ్విన్ కాకుమాను విలన్గా మెప్పించారు.తాజాగా ఈ చిత్రం నెల రోజులైనా కాకముందే ఎలాంటి ప్రకటన లేకుండానే ఓటీటీకి వచ్చేసింది. ఈ రోజు సాయంత్రం ఆరు గంటల నుంచే అమెజాన్ ప్రైమ్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. తమిళంతో పాటు తెలుగు, హిందీ భాషల్లో అందుబాటులోకి వచ్చేసింది. క్రూరమైన హత్యలకు పాల్పడుతున్న ఓ సైకోను పోలీసులు ఎలా పట్టుకున్నారు? అనే కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కించారు. కాగా.. ఈ సినిమాకు జస్టిన్ ప్రభాకరన్ సంగీతమందించారు. -
విక్రమ్ తనయుడి బైసన్.. ఎమోషనల్ సాంగ్ రిలీజ్
కోలీవుడ్ హీరో విక్రమ్ తనయుడు ధ్రువ్ నటిస్తోన్న తాజా చిత్రం బైసన్(Bison Kaalamaadan). ఈ మూవీలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా కనిపించనుంది. మారి సెల్వరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం తమిళంలో ఈ రోజు రిలీజ్ అయింది. వచ్చేవారంలో తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ నేపథ్యంలోనే బైసన్ మూవీ నుంచి ఓ సాంగ్ను మేకర్స్ రిలీజ్ చేశారు. మంచి మనసు అంటూ సాగే పాటను విడుదల చేశారు. మారి సెల్వరాజ్ రాసిన ఈ సాంగ్ను తెలుగులోకి యనమండ్ర రామకృష్ణ ట్రాన్స్లేట్ చేశారు. ఈ పాటను మనువర్ధన్, గాయత్రీ సురేశ్ ఆలపించారు. -
బాక్సాఫీస్ షేక్ చేస్తున్న కాంతార 1.. ఇప్పటివరకు ఎంతొచ్చిందంటే?
మూడేళ్ల క్రితం ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చిన కాంతార సినిమా (Kantara Movie) బాక్సాఫీస్ను షేక్ చేసింది. కేవలం రూ.15- 20 కోట్లతో నిర్మిస్తే ఏకంగా రూ.450 కోట్ల వరకు వసూళ్లు రాబట్టింది. ఈ సినిమా ప్రీక్వెల్గా కాంతార: చాప్టర్ 1 (Kantara: Chapter 1 Movie) తెరకెక్కించారు. కాంతార లాగే.. కాంతార 1 బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేస్తుందా? ప్రేక్షకుల్ని మెప్పిస్తుందా? లేదా? అన్న అనుమానాలు ఉండేవి.తెలుగులో రికార్డుఆ అనుమానాలన్నింటినీ పటాపంచలు చేసింది కాంతార 1. రిషబ్ శెట్టి స్వీయదర్శకత్వం వహించి హీరోగా నటించిన ఈ చిత్రం అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాక్సాఫీస్ రికార్డులు తిరగరాస్తూ వసూళ్ల ఊచకోత కొనసాగిస్తూనే ఉంది. ఈ రెండు వారాల్లో తెలుగు రాష్ట్రాల్లో రూ.105 కోట్లు రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.717.50 కోట్లు కలెక్ట్ చేసి వెయ్యి కోట్ల దిశగా పరుగులు తీస్తోంది. సినిమాఅలాగే హిందీలో అత్యధిక వసూళ్లు సాధించిన సౌత్ సినిమాల లిస్టులోనూ చేరిపోయింది. కాంతార విషయానికి వస్తే రిషబ్ శెట్టి (Rishab Shetty) హీరోగా నటించిన ఈ మూవీలో రుక్మిణి వసంత్, గుల్షన్ దేవయ్య కీలక పాత్రలు పోషించారు. హోంబలే ఫిలింస్ బ్యానర్పై విజయ్ కిరగందూర్ నిర్మించిన ఈసినిమాకు అజనీష్ లోకనాథ్ సంగీతం అందించారు. A divine storm at the box office 💥💥#KantaraChapter1 roars past 717.50 CRORES+ GBOC worldwide in 2 weeks.Celebrate Deepavali with #BlockbusterKantara running successfully in cinemas near you! ❤️🔥#KantaraInCinemasNow #DivineBlockbusterKantara #KantaraEverywhere#Kantara… pic.twitter.com/rd92Dch1mS— Hombale Films (@hombalefilms) October 17, 2025The unstoppable divine saga takes over the box office 🔥#KantaraChapter1 crosses 717.50 CRORES+ GBOC worldwide, including a phenomenal 105 CRORES+ from Telugu states in just 2 weeks.Experience the magic of #BlockbusterKantara this Deepavali in cinemas ❤️🔥#KantaraInCinemasNow… pic.twitter.com/dD584CNPMp— Ramesh Bala (@rameshlaus) October 17, 2025చదవండి: నడవలేని స్థితిలో ఒకప్పటి చైల్డ్ ఆర్టిస్ట్.. రాఘవతో ఫోటో -
కొత్త దర్శకుడితో విక్రమ్ సినిమా ప్లాన్
పాత్రల్లో పరకాయ ప్రవేశం చేసే అతికొద్ది మంది కథానాయకులలో నటుడు విక్రమ్ ఒకరు. ఈయన జయాపజయాలకు అతీతుడనే చెప్పాలి. విక్రమ్ చిత్రం వస్తుందంటేనే అభిమానుల్లో అంచనాలు వేరే లెవెల్లో ఉంటాయి. ఈయన ఇటీవల హీరోగా నటించిన వీర ధీర సూరన్ చిత్రం కమర్షియల్గా మంచి విజయాన్ని సాధించింది. ముఖ్యంగా విక్రమ్ నటన, శారీరక భాషకు ప్రశంసలు లభించాయి. తదుపరి రెండు మూడు చిత్రాల్లో విక్రమ్ నటించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అవన్నీ చర్చల దశలో ఉన్నాయి. కాగా ప్రస్తుతం శాంతి టాకీస్ సంస్థ నిర్మిస్తున్న చిత్రంలో నటించడానికి సిద్ధం అవుతున్నారని సమాచారం. కాగా తాజాగా విక్రమ్ మరో చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. యువ దర్శకుడు విష్ణు ఎడవన్ దర్శకత్వంలో విక్రమ్ హీరోగా నటించనున్నారు. ప్రస్తుతం నయనతార, కెవిన్ కలిసి నటిస్తున్న హాయ్ చిత్రం ద్వారా విష్ణు ఎడవన్ దర్శకుడిగా పరిచయం అయ్యారు. దీన్ని జి.స్టూడియోస్, లలిత్ కుమార్, దర్శకుడు విఘ్నేష్ శివన్ కలిసి నిర్మిస్తున్నారు. కాగా ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు తుది దశకు చేరుకున్నాయి. తదుపరి విక్రమ్ హీరోగా చిత్రం చేయడానికి సిద్ధం అవుతున్నట్లు తాజా సమాచారం. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతాన్ని అందించనున్నట్లు తెలిసింది. ఈ చిత్రాన్ని వేల్స్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై ఐసరి కె.గణేశ్ నిర్మించనున్నట్లు సమాచారం. హాయ్ చిత్రాన్ని పూర్తి చేసిన తరువాత విక్రమ్ హీరోగా నటించే చిత్రానికి విష్ణు ఎడవన్ దర్శకత్వం వహించనున్నట్లు తెలిసింది.దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది. -
నడవలేని స్థితిలో ఒకప్పటి చైల్డ్ ఆర్టిస్ట్.. రాఘవతో ఫోటో
ఊహ తెలియని వయసులో కెమెరా ముందు చురుకుగా యాక్ట్ చేశాడు. దాదాపు 25కి పైగా సినిమాలు చేశాడు. కానీ, విక్రమార్కుడు సినిమా చైల్డ్ ఆర్టిస్ట్గానే అందరికీ ఎక్కువగా గుర్తుండిపోయాడు. అతడే రవి రాథోడ్ (Ravi Rathod).. అతడి టాలెంట్ చూసిన రాఘవ.. ముందుగా పిల్లాడికి మంచి చదువు అవసరం అని భావించాడు. రవిని దత్తత తీసుకుని పెద్ద స్కూల్లో చేర్పించాడు. కానీ అతడికి చదువు అబ్బలేదు. అసలు చదవాలన్న ఆసక్తే లేకపోవడంతో లారెన్స్కు ఒక్క మాటైనా చెప్పకుండా స్కూలు మానేశాడు.తాగుడుకు బానిసతర్వాతికాలంలో చిన్నాచితకా పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తూ వస్తున్నాడు. మద్యానికి బానిసై మందు తాగకపోతే బతకను అనే స్టేజీకి దిగజారిపోయాడు. అతిగా మద్యం సేవించడం వల్ల అనారోగ్య సమస్యలు వచ్చాయి. కిడ్నీలో రాళ్లు చేరి.. సరిగా నడవలేని స్థితికి చేరుకున్నాడు. అతడి పరిస్థితి తెలుసుకున్న రాఘవ లారెన్స్ (Raghava Lawrence)కు గుండె తరుక్కుపోయింది. రవిని ఒక్కసారి కలవమని సోషల్ మీడియా వేదికగా కోరాడు.రాఘవతో రవి రాథోడ్దీంతో రవి రాథోడ్.. చెన్నై వెళ్లి లారెన్స్ను కలిశాడు. మద్యానికి బానిసైన విషయం తెలిసి రాథోడ్పై కోప్పడ్డాడు. తన మంచి కోరుతున్న లారెన్స్ కోసం.. జీవితంలో మళ్లీ మందు ముట్టనని మాటిచ్చాడు. ఆయన ఇచ్చిన డబ్బుతో తనకంటూ ఓ ఫోన్ కొనుక్కుని ఆరోగ్యంపై ఫోకస్ చేశాడు. తాజాగా అతడు లారెన్స్తో కలిసి దిగిన ఫోటో షేర్ చేశాడు. ఇది చూసిన జనాలు.. రాఘవ మంచి మనసును మరోసారి మెచ్చుకుంటున్నారు. ప్రస్తుతం ఇతడి ఆస్పత్రి బిల్లులు కూడా లారెన్సే చూసుకోవడం విశేషం! View this post on Instagram A post shared by actor ravi raj rathod (@actor_ravi_child_artist) చదవండి: డ్యూడ్ X రివ్యూ: టాక్ ఎలా ఉందంటే? -
సినీ ఇండస్ట్రీలో వివక్ష? ప్రేమలు బ్యూటీ ఆన్సరిదే!
హీరోయిన్గా క్రేజ్ సంపాదించుకోవడం అంత సులభం కాదు. అలాగే ఏ మూవీ కెరీర్ను ఎటు మలుపు తిప్పుతుందో చెప్పలేని పరిస్థితి. మలయాళంలో అనేక సినిమాలు చేసిన మమిత బైజు (Mamitha Baiju) 'ప్రేమలు' అనే ఒక్క మూవీతో సెన్సేషన్ అయింది. ఈ ఒక్క చిత్రంతోనే తమిళంలో అవకాశాలు వచ్చాయి. అలా జి. ప్రకాష్ కుమార్ సరసన రెబల్ చిత్రంలో నటించే అవకాశాన్ని అందుకుంది. కానీ, ఈ మూవీ పూర్తిగా నిరాశపరిచింది. సాధారణంగా తొలి చిత్రం ఆశించిన విజయాన్ని సాధించకపోతే అవకాశాలు మందగిస్తాయి. కానీ, మమిత బైజు విషయంలో ఇది రివర్స్ అయిందనే చెప్పాలి. తమిళంలో అవకాశాలుప్రస్తుతం విజయ్ కథానాయకుడిగా నటిస్తున్న చివరి చిత్రం జననాయకన్లో ముఖ్య భూమిక పోషిస్తోంది. అదేవిధంగా క్రేజీ నటుడు ప్రదీప్ రంగనాథన్కు జంటగా డ్యూడ్ చిత్రంలో నటించింది. ఈ చిత్రం శుక్రవారం రిలీజైంది. ఈ సందర్భంగా నటి నమిత బైజు మాట్లాడుతూ.. తమిళ సినిమాల్లో నటించాలని తాను ఎప్పుడు ప్లాన్ చేసుకోలేదని తెలిపింది. అయినప్పటికీ తమిళంలో పలు వైవిద్యభరిత పాత్రల్లో నటించే అవకాశాలు వస్తున్నాయని సంతోషం వ్యక్తం చేసింది. అలా వచ్చిన వాటిలో మంచి కథలను ఎంపిక చేసుకొని నటిస్తున్నట్లు చెప్పింది.తమిళం వచ్చేసిందిఇతర భాషా చిత్రాల్లో నటిస్తున్నప్పుడు వివక్ష ఎదుర్కొన్నారా ? అన్న ప్రశ్నకు.. అలాంటి పరిస్థితులు తనకు ఎదురవ్వలేదని స్పష్టం చేసింది. మొదట్లో తమిళ భాష మాట్లాడటం తనకు ఛాలెంజింగ్ అనిపించినా, తన యూనిట్లో మేకప్ మాన్, హెయిర్ స్టైలిస్ట్ వంటి వారు తమిళులు కావడంతో వారి మాటలే తాను తమిళం నేర్చుకోవడానికి హెల్ప్ అయ్యాయంది. ఇప్పుడు తాను తమిళ భాషలో మాట్లాడటం, రాయడం కూడా నేర్చుకున్నానంది. డ్యూడ్ చిత్రంలో నటుడు ప్రదీప్ రంగనాథన్తో కలిసి నటించడం మంచి అనుభవంగా పేర్కొంది. ఆయన ఫ్రెండ్లీగా ఉంటారని, ఆయన నుంచి ఎంతో నేర్చుకున్నానని మమిత బైజు పేర్కొంది.చదవండి: ముచ్చటగా మూడోసారి! -
ముచ్చటగా మూడోసారి!
హీరో రజనీకాంత్, డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్లది హిట్ కాంబినేషన్. వీరి కాంబోలో వచ్చిన తొలి చిత్రం ‘జైలర్’ 2023 ఆగస్టు 10న విడుదలై, బ్లాక్బస్టర్గా నిలిచింది. తాజాగా వీరిద్దరి కలయికలో ‘జైలర్ 2’ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. సన్ పిక్చర్స్ బ్యానర్పై కళానిధి మారన్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ‘జైలర్’ సూపర్ హిట్ కావడంతో ‘జైలర్ 2’ సినిమాపై ఇటు ఇండస్ట్రీలో అటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.2026 జూన్లో ‘జైలర్ 2’ విడుదల కానుంది. ఇదిలా ఉంటే... రజనీకాంత్– నెల్సన్ దిలీప్ కుమార్ కాంబినేషన్ ముచ్చటగా మూడోసారి రిపీట్ కానుందని కోలీవుడ్ టాక్. ఇప్పటికే ‘జైలర్ 2’ చిత్రీకరణ సుమారు 70 శాతం పూర్తయిందట. ఈ సినిమా తర్వాత మరోసారి రజనీకాంత్తో ఓ మూవీ కోసం నెల్సన్ దిలీప్ స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నారని టాక్. ఈ స్టోరీ లైన్ని ఇటీవల రజనీకాంత్కి వినిపించగా ఆయన కూడా పచ్చజెండా ఊపారట. మరి... రజనీ–నెల్సన్ కాంబినేషన్లో మూడో చిత్రం ఉంటుందా? అనే విషయం తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాలి. -
నీకోసం మారి తీరతాను...
విష్ణు విశాల్ హీరోగా నటించిన ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా ‘ఆర్యన్’. శ్రద్ధా శ్రీనాథ్, మానసా చౌదరి, సెల్వ రాఘవన్ ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. ప్రవీణ్ .కె దర్శకత్వం వహించారు. శుభ్ర, ఆర్యన్ రమేశ్లతో కలిసి విష్ణు విశాల్ స్టూడియోస్ పతాకంపై విష్ణు విశాల్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 31న విడుదల కానుంది. శ్రేష్ట్ మూవీస్ పతాకంపై హీరో నితిన్ తండ్రి, నిర్మాత సుధాకర్ రెడ్డి తెలుగులో రిలీజ్ చేస్తున్నారు.ఈ సినిమా నుంచి ‘ఐయామ్ ది గై... ఐయామ్ ది గై ఫర్ యు...’ అంటూ సాగే పాట లిరికల్ వీడియోను ఇటీవల రిలీజ్ చేశారు మేకర్స్. ‘ఆవేశం అస్సలాపుకోను... నీ కోసం మారి తీరతాను... సన్యాసం స్వర్గమయ్యే నేడు... నీకేం తెలుసులే..’ అన్న లిరిక్స్తో ఈ పాట సాగుతుంది. సామ్రాట్ ఈ సినిమాకు సాహిత్యం అందించగా, ఈ చిత్రసంగీతదర్శకుడు జిబ్రాన్తో కలిసి శ్రీకాంత్ హరిహరన్ పాడారు. సాయి రోనక్, తారక్ పొన్నప్ప, మాల పార్వతి, అవినాష్ ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటించారు. -
వెండితెరపై సినీ జీవితం
సైన్స్, స్పోర్ట్స్, పాలిటిక్స్... ఇలా వివిధ రంగాల్లోని ప్రముఖుల జీవితాల ఆధారంగా రూపొందే బయోపిక్స్లో సినీ తారలు నటించడం చూస్తూనే ఉన్నాం. ఈ కోవలో ఇప్పటివరకు చాలా బయోపిక్స్ వచ్చాయి. మరికొన్ని బయోపిక్స్ రానున్నాయి. అయితే వీటిలో సినీ తారల బయోపిక్స్ చాలా తక్కువగా వస్తుంటాయి. కానీ సడన్గా ఇప్పుడు బాలీవుడ్లో సినీ తారల జీవితం ఆధారంగా రూపొందే బయోపిక్స్ సంఖ్య ఎక్కవైంది. మరి... ఏ స్టార్స్ బయోపిక్స్ వెండితెరపైకి రానున్నాయి? ఈ తారల బయోపిక్స్లో ఎవరు నటించనున్నారు? అన్న వివరాలపై ఓ లుక్ వేయండి.ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమా దాదా సాహెబ్ ఫాల్కేను ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమాగా చెప్పుకుంటాం. పూర్తి నిడివితో తొలి భారతీయ సినిమా తీసిన వ్యక్తిగా దాదా సాహెబ్ ఫాల్కే ఘనత గొప్పది. అందుకే కేంద్ర ప్రభుత్వం కూడా ప్రతి ఏటా దాదా సాహెబ్ ఫాల్కే పేరిట అవార్డును ప్రదానం చేస్తుంది. ఇలాంటి ప్రముఖ వ్యక్తి జీవితం ఆధారంగా సినిమా అంటే ప్రేక్షకుల్లోనే కాదు... ఇండస్ట్రీ వర్గాల్లోనూ క్రేజ్ ఉంటుంది. దాదా సాహెబ్ ఫాల్కే జీవితం ఆధారంగా తెరకెక్కనున్న బయోపిక్లో ఆమిర్ ఖాన్ నటించనున్నారు. దాదా సాహెబ్ ఫాల్కేగా ఆయన కనిపిస్తారు.ఆమిర్ ఖాన్తో గతంలో ‘పీకే, 3 ఇడియట్స్’ వంటి సూపర్ డూపర్ హిట్ ఫిల్మ్స్ తీసిన రాజ్కుమార్ హిరాణి ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. దాదా సాహెబ్ ఫాల్కే బయోపిక్లో నటించనున్నట్లుగా ఆమిర్ ఖాన్ కూడా వెల్లడించారు. రాజ్కుమార్ హిరాణి, అజిభిత్ జోషి, హిందుకుష్ భరద్వాజ్, ఆవిష్కర్ భరద్వాజ్ ఈ సినిమా స్క్రిప్ట్పై నాలుగు సంవత్సరాలుగా పని చేస్తున్నారు. ఈ బయోపిక్కు సంబంధించిన ప్రీ ప్రోడక్షన్ పనులు ఇటీవలి కాలంలో మరింత ఊపందుకున్నాయట. వచ్చే ఏడాది రెగ్యులర్ షూటింగ్ ఆరంభం కానుందని సమాచారం. ఈ సినిమాకు దాదా సాహెబ్ మనవడు చంద్రశేఖర్ శ్రీకృష్ణ స పోర్ట్ చేస్తున్నారు. మేడ్ ఇన్ ఇండియా: ‘మేడ్ ఇన్ ఇండియా’ సినిమాకు సమర్పకుడిగా వ్యవహరించనున్నట్లుగా ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి 2023 సెప్టెంబరులో ప్రకటించిన సంగతి తెలిసిందే. హిందీ చిత్రం ‘నోట్ బుక్’ ఫేమ్ నితిన్ కక్కర్ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నట్లుగా, కార్తికేయ, వరుణ్ గుప్తా నిర్మించనున్నట్లుగా ఈ ‘మేడ్ ఇన్ ఇండియా’ అనౌన్స్మెంట్లో ఉంది.అయితే దాదా సాహెబ్ ఫాల్కే జీవితం ఆధారంగా ఈ సినిమా తీస్తున్నారని, అందుకే రాజమౌళి ఈ సినిమాలో భాగమయ్యారని, ఇందులో దాదా సాహెబ్ ఫాల్కేగా ఎన్టీఆర్ నటిస్తారనే ప్రచారం సాగుతోంది. ఇక ఈ సినిమాను 2023 సెప్టెంబరులో ప్రకటించినప్పటికీ ఇంకా సెట్స్పైకి వెళ్లలేదు. సో... ఈ చిత్రంపై స్పష్టత రావాల్సి ఉంది.మ్యూజిక్ మేస్ట్రో ప్రముఖ సంగీత దర్శకులు ఇళయరాజా బయోపిక్ వెండితెరపైకి రానున్న సంగతి తెలిసిందే. ఈ బయోపిక్లో ఇళయరాజాగా ధనుష్ నటిస్తారు. గత ఏడాది మార్చిలో ఇళయరాజా బయోపిక్ను అధికారికంగా ప్రకటించారు. ధనుష్తో ‘కెప్టెన్ మిల్లర్’ సినిమా తీసిన అరుణ్ మాథేశ్వరన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈపాటికే పూర్తి స్థాయిలో ప్రారంభం కావాల్సి ఉంది. కొన్ని కారణాల వల్ల ఈ సినిమా చిత్రీకరణ అనుకున్న సమయానికన్నా కాస్త ఆలస్యంగా ప్రారంభం కానుందట.ప్రస్తుతం ధనుష్ రెండు, మూడు సినిమాలతో బిజీగా ఉన్నారు. మరో వైపు దర్శకుడు లోకేశ్ కనగరాజ్ను హీరోగా పరిచయం చేసే సినిమా పనుల్లో అరుణ్ బిజీగా ఉన్నారు. ఇలా ధనుష్, అరుణ్ల ప్రస్తుత కమిట్మెంట్స్ పూర్తయిన తర్వాత ‘ఇళయరాజా’ బయోపిక్ సెట్స్కు వెళ్లే అవకాశాలు ఉన్నాయని కోలీవుడ్ సమాచారం. అంతేకాదు... ఇళయరాజా బయోపిక్లో రజనీకాంత్, కమల్హాసన్లు గెస్ట్ రోల్స్లో నటిస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది. అయితే ఈ అంశాలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కనెక్ట్ మీడియా, పీకే ప్రైమ్ ప్రోడక్షన్, మెర్క్యూరీ మూవీస్ సంస్థలు ఈ బయోపిక్ను నిర్మించనున్నట్లు అనౌన్స్మెంట్ పోస్టర్పై ఉంది.ఆమిర్ లేదా రణ్బీర్ ప్రఖ్యాత గాయకులు కిశోర్ కుమార్ బయోపిక్ వెండితెర పైకి రానుంది. ఈ బయోపిక్పై దర్శకుడు అనురాగ్ బసు ఎప్పట్నుంచో వర్క్ చేస్తున్నారు. ఈ బయోపిక్లో రణ్బీర్ కపూర్ నటించాల్సింది. కానీ కొన్ని కారణాల వల్ల ఆయన నటించలేక పోయారు. ‘‘కిశోర్ కుమార్గారి బయోపిక్లో రణ్బీర్ కపూర్ను అనుకున్న మాట వాస్తవమే. కాక పోతే ఈ బయోపిక్కు బదులు ‘రామాయణ’ సినిమాను రణ్బీర్ కపూర్ ఎంపిక చేసుకున్నాడు. అప్పటి పరిస్థితుల్లో అతను మంచి నిర్ణయమే తీసుకున్నాడని నేను అనుకుంటున్నాను’’ అని చెప్పుకొచ్చారు అనురాగ్ బసు.కాగా కిశోర్ కుమార్ బయోపిక్లో ఆమిర్ ఖాన్ నటించనున్నారనే వార్తలు ప్రస్తుతం బాలీవుడ్లో తెరపైకి వచ్చాయి. ఇటీవల ఓ సందర్భంలో కిశోర్ కుమార్గారి బయోపిక్లో నటించే చాన్స్ వస్తే తప్పుకుండా చేస్తానన్నట్లుగా ఆమిర్ ఖాన్ కూడా చె΄్పారు. ఈ నేపథ్యంలో ఈ బయోపిక్లో ఆమిర్ ఖాన్ నటించే అవకాశం ఉందని ఊహించవచ్చు. కానీ కిశోర్ కుమార్ బయోపిక్కు అనురాగ్ బసు తొలుత రణ్బీర్ కపూర్ను అనుకున్నారు. అప్పట్లో కుదర్లేదు. అయితే ఇప్పుడు ‘రామాయణ’ సినిమా పూర్తి కావొచ్చింది. రణ్బీర్ కపూర్ చేస్తున్న మరో సినిమా ‘లవ్ అండ్ వార్’ చిత్రీకరణ కూడా తుది దశకు చేరుకుంటోంది.ఈ నేపథ్యంలో కిశోర్ కుమార్ బయోపిక్లో రణ్బీర్ కపూర్ నటించే అవకాశం లేక పోలేదు. పైగా దాదా సాహెబ్ ఫాల్కే బయోపిక్తో ఆమిర్ ఖాన్ బిజీ కానున్నారు. ఒకేసారి రెండు బయోపిక్స్లో ఆమిర్ ఖాన్ నటించడం సాధ్యం కాక పోవచ్చు కనుక కిశోర్ కుమార్గా వెండితెరపై రణ్బీర్ కపూర్ కనిపించే అవకాశం లేక పోలేదు.ఫైనల్గా కిశోర్ కుమార్ బయోపిక్లో ఎవరు నటిస్తారు? అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయక తప్పదు. మరోవైపు కిశోర్కుమార్ బయోపిక్ చేయాలని బాలీవుడ్ దర్శకుడు సూజిత్ సర్కార్ ఓ కథ రెడీ చేశారు. ఈ చిత్రంలో అభిషేక్ బచ్చన్ను హీరోగా అనుకున్నారు. కానీ అనురాగ్ బసు చేస్తున్న ప్రాజెక్ట్ గురించి తెలుసుకున్న సూజిత్ సర్కార్ తన ప్రయత్నాలను ఆపేశారు. ఈ విషయాలను సుజిత్ సర్కార్ ఇటీవల ఓ సందర్భంలో వెల్లడించారు.గురుదత్ బయోపిక్లో విక్కీ? ‘సైలాబ్, కాగజ్ కె పూల్, ఫ్యాసా’ వంటి ఎన్నో క్లాసిక్ హిట్ ఫిల్మ్స్ తీసిన లెజెండరీ దర్శకుడు గురుదత్ జీవితం వెండితెర పైకి రానుందని బాలీవుడ్ సమాచారం. అల్ట్రా మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ సంస్థ ఇందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ బయోపిక్కు భావనా తల్వార్ దర్శకత్వం వహిస్తారని, ‘ ఫ్యాసా’ అనే టైటిల్ను అనుకుంటున్నారనే ప్రచారం బాలీవుడ్లో జరుగుతోంది. అంతేకాదు... ఈ సినిమాలో గురుదత్గా విక్కీ కౌశల్ నటిస్తారని, ఇందుకోసం మేకర్స్ ఆల్రెడీ ఈ హీరోతో సంప్రదింపులు జరుపుతున్నారని బాలీవుడ్ భోగట్టా. మరి... వెండితెరపై గురుదత్గా విక్కీ కౌశల్ నటిస్తారా? లెట్స్ వెయిట్ అండ్ సీ.మధుబాల బయోపిక్ ‘ ఫ్యార్ కియాతో డర్నా క్యా...’ అంటూ వెండితెరపై అనార్కలిగా మధుబాల నటన అద్భుతం. 1960లో విడుదలైన ‘మొఘల్ ఏ అజం’ సినిమా మధుబాలకు అప్పట్లో దేశవ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చింది. ఈ సినిమాయే కాదు... పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించారు మధుబాల. దాదాపు 60 సినిమాల్లో నటించిన మధుబాల 36 సంవత్సరాల చిన్న వయసులో తుది శ్వాస విడిచారు. కాగా, మధుబాల బయోపిక్ రానుంది. గత ఏడాది మార్చిలో ఈ బయోపిక్ను అధికారికంగా ప్రకటించారు. ఆలియా భట్ హీరోయిన్గా నటించిన ‘డార్లింగ్స్’ సినిమాతో దర్శకురాలిగా పరిచయం అయిన జస్మీత్ కె. రీన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు.సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రోడక్షన్స్ సంస్థతో బ్రిజ్ భూషణ్ (మధుబాల సోదరి) మధుబాల బయోపిక్ను నిర్మించనున్నారు. ఈ చిత్రంలో మధుబాలగా ఆలియా భట్ లేదా ‘యానిమల్’ ఫేమ్ త్రిప్తి దిమ్రీ నటించనున్నారని టాక్. వచ్చే ఏడాది ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు మనీష్ మల్హోత్రా కూడా మధుబాల బయోపిక్ను నిర్మించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని, ఇందులో మధుబాలగా కృతీ సనన్ నటిస్తారనే ప్రచారం సాగుతోంది. కానీ మనీష్ మల్హోత్రా నిర్మించే మధుబాల బయోపిక్పై తమకు సమాచారం లేదన్నట్లుగా బ్రిజ్ భూషణ్ ఓ సందర్భంలో వెల్లడించారనే వార్తలు బాలీవుడ్ ఉన్నాయి.ట్రాజెడీ క్వీన్ దివంగత ప్రముఖ నటి, ట్రాజెడీ క్వీన్గా ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్న మీనా కుమారి జీవితం ఆధారంగా హిందీలో ‘కమల్ ఔర్ మీనా’ అనే సినిమా రానుంది. ఆల్రెడీ ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన వెల్లడైంది. కానీ ఇంకా పూర్తిస్థాయిలో ఈ సినిమా ప్రారంభం కాలేదు. తొలుత ‘కమల్ ఔర్ మీనా’ చిత్రానికి మనీష్ మల్హోత్రా దర్శకత్వం వహిస్తారనే టాక్ వినిపించింది. ప్రస్తుతం ఈ మూవీకి దర్శకుడిగా సిద్ధార్థ్. పి మల్హోత్రా ఉన్నారు. అలాగే ఈ ‘కమల్ ఔర్ మీనా’లో మీనా కుమారిగా తొలుత కృతీ సనన్ పేరు వినిపించింది.కానీ ఆ తర్వాత కియారా అద్వానీ పేరు తెరపైకి వచ్చింది. అలాగే ఈ చిత్రంలోని దర్శకుడు కమల్ అమ్రోహిగా ఆయుష్మాన్ ఖురానా, రాజ్కుమార్ రావు వంటి హీరోల పేర్లు బాలీవుడ్లో వినిపిస్తున్నాయట. అయితే ఈ అంశాలపై ఎటువంటి అధికారిక ప్రకటన లేదు. ఇక ఈ ఏడాది జూలైలో కియారా అద్వానీ ఓ పాపకు జన్మనిచ్చారు. దీంతో కియారాకు సెట్స్కు వచ్చేందుకు వీలుపడదు. ఇలా ఈ సినిమా చిత్రీకరణ ఆలస్యం అవుతోందట. వచ్చే ఏడాదిలో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కావొచ్చని బాలీవుడ్ సమాచారం. అమ్రోహీ ఫ్యామిలీతో కలిసి సిద్ధార్థ్. పి. మల్హోత్రా, సరెగమా సంస్థలు ఈ సినిమాను నిర్మించనున్నాయి.ది అన్టోల్డ్ స్టోరీ గ్లామరస్ క్వీన్గా వెండితెరపై ఓ వెలుగు వెలిగారు సిల్క్ స్మిత. ఆ తరం స్టార్ హీరోల సినిమాల్లో ఎన్నో స్పెషల్ సాంగ్స్ చేశారు. అయితే సిల్క్ స్మిత జీవితంలో ఎన్నో ఒడిదొడుకులు ఉన్నాయి. జీవితంలో ఎన్నో చేదు అనుభవాలను కూడా ఎదుర్కొన్నారామె. ఎవరూ ఊహించని రీతిలో 1996 సెప్టెంబరు 23న సిల్క్ స్మిత ఆత్మహత్య చేసుకున్నారు. ఆమె జీవితం ఆధారంగా హిందీలో ‘డర్టీ పిక్చర్’ అనే సినిమా వచ్చింది.విద్యాబాలన్ టైటిల్ రోల్ చేసిన ఈ సినిమా సూపర్ హిట్గా నిలిచింది. తాజాగా సిల్క్ స్మిత జీవితం ఆధారంగానే మరో సినిమా రానుంది. ‘సిల్క్ స్మిత: ది అన్టోల్డ్ స్టోరీ’గా వస్తున్న ఈ పాన్ ఇండియా సినిమాలో సిల్క్ స్మితగా చంద్రికా రవి నటిస్తున్నారు. ఈ మూవీతో జయరామ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ జరుగుతోంది. ఇలా సినిమా తారల జీవితాల ఆధారంగా రూపొందనున్న మరికొన్ని బయోపిక్స్ చర్చల దశల్లో ఉన్నాయి. – ముసిమి శివాంజనేయులు -
రెండో పెళ్లి చేసుకున్న హీరోయిన్.. సోషల్ మీడియాలో వైరల్!
ప్రముఖ హీరోయిన్, సోషల్ మీడియా ఇన్ఫ్లూయన్సర్ అర్చన కవి మూడుముళ్ల బంధంలోకి అడుగుపెట్టింది. తన ప్రియుడు రిక్ వర్గీస్ను ఆమె పెళ్లాడింది. ఈ విషయాన్ని ప్రముఖ టీవీ హోస్ట్ ధన్య వర్మ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది. ఈ విషయం తెలుసుకున్న నటీనటులు, అభిమానులు అర్చనకు విషెస్ చెబుతున్నారు. వీరిద్దరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.కాగా.. అర్చన కవికి ఇది రెండో వివాహం. ఆమె గతంలో 2016లో హాస్యనటుడు, యూట్యూబర్ అబీష్ మాథ్యూను వివాహం చేసుకుంది. కానీ ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో 2021లో తమ వివాహా బంధానికి గుడ్ బై చెప్పేశారు. విడాకులు తీసుకుని కొత్త జీవితాలను ప్రారంభించారు. డివోర్స్ అయిన నాలుగేళ్ల తర్వాత అర్చన మరోసారి పెళ్లి పీటలెక్కింది. అయితే రిక్ వర్గీస్ తనకు ఓ డేటింగ్ యాప్లో పరిచయమయ్యాడని గత ఇంటర్వ్యూలో వెల్లడించింది. ఆ తర్వాత పరిచయం కాస్తా ప్రేమగా మారడంతో పెళ్లి పీటల వరకు తీసుకెళ్లింది.ఇక సినిమాల విషయానికొస్తే.. 2009లో నీలతామర అనే రీమేక్ మూవీతో ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. గతంలో పలు సినిమాలు చేసిన అర్చన ఇటీవలే ఐడెంటిటీ చిత్రం ద్వారా రీ ఎంట్రీ ఇచ్చింది. ఇందులో టోవినో థామస్, త్రిష కృష్ణన్ కూడా నటించారు. అర్చన అంతకుముందు మమ్మీ అండ్ మీ, బెస్ట్ ఆఫ్ లక్, సాల్ట్ అండ్ పెప్పర్, మజవిల్లినాట్టం వారే, అరవాన్, మోనై అంగనే ఆనాయి, డే నైట్ గేమ్, వన్స్ అపాన్ ఎ టైమ్ దేర్ వాస్ ఎ కల్లన్ లాంటి మలయాళ సినిమాల్లో మెప్పించింది. అంతేకాకుండా ఎంతే ప్రియా గణంగల్, బ్లడీ లవ్, టాక్ విత్ ఆర్చీ, ట్రావెల్, సుందరి నీయుమ్ సుందరన్ జానుమ్ వంటి షోలలో కనిపించింది. -
స్టేజీపై హీరోయిన్ బుగ్గ గిల్లి, జుట్టు పట్టుకుని లాగిన హీరో!
'లవ్టుడే', 'డ్రాగన్' సినిమాలతో తెలుగులో పాపులారిటీ సంపాదించుకున్నాడు తమిళ హీరో ప్రదీప్ రంగనాథన్ (Pradeep Ranganathan). ఇతడు కథానాయకుడిగా నటించిన లేటెస్ట్ మూవీ డ్యూడ్. ప్రేమలు బ్యూటీ మమిత బైజు (Mamitha Baiju) హీరోయిన్గా యాక్ట్ చేసింది. ఈ మూవీ తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో అక్టోబర్ 17న రిలీజవుతోంది. ఈ క్రమంలో బుధవారం (అక్టోబర్ 15న) స్వాగ్ ఈవెంట్ నిర్వహించారు.హీరోయిన్ జుట్టు పట్టుకుని లాగి..ఈ కార్యక్రమంలో హీరోహీరోయిన్లు సినిమాలోని ఓ సన్నివేశాన్ని రీక్రియేట్ చేశారు. డ్యూడ్ చిత్రంలో హీరోను బుగ్గగిల్లి క్యూట్గా ఫీలవుతుంది మమిత. ఈ సీన్ను స్టేజీపై రివర్స్ రోల్స్లో చేశారు. మమిత బుగ్గలు గిల్లి, జుట్టు పట్టుకుని లాగి, కొడుతున్నట్లుగా సీన్లో లీనమైపోయాడు ప్రదీప్. ఇది క్యూట్గా లేదు అని మమిత డైలాగ్ చెప్పింది. వీళ్ల యాక్టింగ్ చూసేవారి ఫీలింగ్ కూడా అదే! అదే విషయాన్ని యాంకర్ బయటకు చెప్పేసింది. ఇది నిజంగానే క్యూట్గా లేదమ్మా.. ఇంత వైలెంట్గా ఉన్నారేంటి? అని నవ్వేసింది. ఈ క్లిప్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇదే వేడుకలో మమిత ఎంతో గ్రేస్తో డ్యాన్స్ చేసింది. చదవండి: యూత్కి ప్రేమ సలహాలు.. అబ్బాయిలు.. ఏడ్చినా పర్లేదు, కానీ! -
'పృథ్వీరాజ్ సుకుమారన్' కొత్త సినిమా.. పవర్ఫుల్ గ్లింప్స్
మలయాళ నటుడు 'పృథ్వీరాజ్ సుకుమారన్'(Prithviraj Sukumaran) నేడు 43వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన నటించిన మలయాళ కొత్త సినిమా 'ఖలీఫా'(Khalifa) నుంచి పవర్ఫుల్ గ్లింప్స్ను మేకర్స్ విడుదల చేశారు. దర్శకుడు వైశాఖ్ తెరకెక్కిస్తున్న రివెంజ్ థ్రిల్లర్ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సుమారు 15ఏళ్ల తర్వాత 'పోక్కిరి రాజా' (2010) మళ్లీ వారిద్దరూ కలిసి ఈ మూవీ కోసం పనిచేస్తున్నారు. అమీర్ అలీగా ఆయన ఈ సినిమాలో కనిపిచనున్నారు. గోల్డ్ స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ చిత్రం ఉండనుంది. ఇందులో విద్యుత్ జమ్వాల్, సత్యరాజ్, కృతి శెట్టి, ప్రియంవద కృష్ణన్ నటించనున్నారు. 2026 ఓనమ్ పండుగ సందర్భంగా పాన్ ఇండియా రేంజ్లో ఈ మూవీ విడుదల కానుంది. -
రిషబ్ శెట్టి కాంతార చాప్టర్-1.. దీపావళికి బిగ్ బ్లాస్ట్.. అదేంటంటే!
రిషబ్ శెట్టి తెరకెక్కించిన కాంతార చాప్టర్-1 బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. రికార్డుల మీద రికార్డులు తిరగరాస్తూ పలు సూపర్ హిట్ సినిమాలను దాటేసింది. ఇప్పటికే కూలీ, జైలర్, బాహుబలితో పాటు కాంతార రికార్డ్ను సైతం బ్రేక్ చేసింది. కన్నడలో అత్యధిక వసూళ్ల సాధించిన చిత్రాల జాబితాలో రెండోస్థానంలో కొనసాగుతోంది.అయితే ఒకవైపు బాక్సాఫీస్ ప్రభంజనం కొనసాగిస్తుంటే.. తాజాగా మరో ట్విస్ట్ ఇచ్చారు మేకర్స్. దీపావళి పండుగ సందర్భంగా ట్రైలర్ రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం కాంతార చాప్టర్-1 థియేటర్లలో రన్ అవుతోంది. ఇలాంటి సమయంలో ట్రైలర్ ఏంటని సినీ ప్రియులు పెద్ద డైలమాలో పడ్డారు. సినిమా విడుదలై రెండు వారాలు అయ్యాక ట్రైలర్ ఏంటని తెగ చర్చించుకుంటున్నారు. దీపావళి ట్రైలర్ పేరుతో ప్రేక్షకులకు బిగ్ సర్ప్రైజ్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. రేపు 12 గంటల 7 నిమిషాలకు ట్రైలర్ రిలీజ్ చేయనున్నట్లు పోస్టర్ను పంచుకున్నారు మేకర్స్. దీంతో ఆడియన్స్లో మరింత ఆసక్తి నెలకొంది. ప్రేక్షకులకు ఏదైనా బిగ్ ట్విస్ట్ ఇవ్వనున్నారేమో తెలియాలంటే రేపటి దాకా ఆగాల్సిందే. The divine roar continues to light up screens worldwide 💥#KantaraChapter1 Deepavali Trailer out Tomorrow at 12:07 PM.Experience the ultimate cinematic celebration of Dharma.#BlockbusterKantara running successfully in cinemas near you! 🔥#KantaraInCinemasNow… pic.twitter.com/1R6xFJR2P9— Hombale Films (@hombalefilms) October 15, 2025 -
కొత్త లోకా నటి బర్త్ డే.. తనకు తానే బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
బర్త్ డే వచ్చిందంటే చాలు.. సెలబ్రిటీల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పార్టీలు, ఖరీదైన బహుమతులు సర్వ సాధారణం. తాజాగా అలాగే ఓ ప్రముఖ నటి తన పుట్టినరోజును గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంది. మలయాళ ఇండస్ట్రీకి చెందిన ముద్దుగుమ్మ అహానా కృష్ణ తన బర్త్డేను స్పెషల్గా మార్చేసుకుంది. 30 ఏట అడుగుపెడుతున్న వేళ ఖరీదైన బహుమతిని తనకు తానే ఇచ్చుకుంది. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ క్రమంలో తన తల్లిదండ్రులపై ప్రశంసలు కురిపించింది.తన బర్త్ డే కానుకగా ఖరీదైన బీఎండబ్ల్యూ కారును కొనుగోలు చేసింది. దీని విలువ దాదాపు రూ.93 లక్షలుగా ఉన్నట్లు తెలుస్తోంది. 20 ఏళ్ల వయస్సు నుంచి 30లోకి అడుగుపెట్టినందుకు కొంచెం బాధగా ఉందని రాసుకొచ్చింది. నాకు ఫుల్ సపోర్ట్గా నిలిచిన తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపింది. ఎందుకంటే నాకు నచ్చినట్లుగా జీవించే హక్కు కల్పించినందుకు ధన్యవాదాలు అంటూ పోస్ట్ చేసింది. నేను సాధించిన ప్రతిదానికీ మీరే కారణమంటూ పేరేంట్స్ను కొనియాడింది. నా కలలును నిజం చేసినందుకు మీకెప్పటికీ రుణపడి ఉంటానని అహానా కృష్ట ఫోటోలను షేర్ చేసింది.కాగా.. నటుడు కృష్ణ కుమార్ కుమార్తె అయినా అహాన కృష్ణ 2014లో సినిమాల్లో అడుగుపెట్టింది. జాన్ స్టీవ్ లోపెజ్ మూవీతో తెరంగేట్రం చేసింది. ఆ తర్వాత లూకా, అడి వంటి చిత్రాల్లో నటించింది. ఆమె చివరిసారిగా ఈ ఏడాది నాన్సీ రాణిలో కనిపించింది. కల్యాణి ప్రియదర్శన్ నటించిన లోకా: చాప్టర్ 1 - చంద్ర(కొత్త లోకా) చిత్రంలో అతిథి పాత్రలో మెరిసింది. View this post on Instagram A post shared by Ahaana Krishna (@ahaana_krishna) -
బెస్ట్ఫ్రెండ్ని పెళ్లాడిన బుల్లితెర నటుడు
ప్రముఖ సీరియల్ నటుడు దర్శన్ (Darshan K Raju) అలియాస్ సార్థక్ వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టాడు. బెస్ట్ ఫ్రెండ్ కాశిన్ను పెళ్లాడాడు. అక్టోబర్ 13న వీరి వివాహం జరిగింది. ఇరుకుటుంబ సభ్యులు సహా అతి దగ్గరి బంధుమిత్రుల సమక్షంలోనే ఈ వేడుక జరిగింది. నూతన జంట వెడ్డింగ్ స్టిల్స్కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.సీరియల్స్ నుంచి సినిమాలుజీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభించిన దర్శన్ జంటకు బుల్లితెర తారలు సహా అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. దర్శన్.. తమిళంలో 'కట్రుకెన్న వేలి' సీరియల్లో సూర్య మహదేవన్ పాత్రతో ఫేమసయ్యాడు. అవను మాతే శ్రావణి, అరణ్మనై కిలి వంటి పలు సీరియల్స్ చేశాడు. సౌత్ ఇండియన్ హీరో అనే కన్నడ సినిమాలోనూ హీరోగా నటించాడు. View this post on Instagram A post shared by Darshanraju_ExpressionKing (@darshanraju_expressionking)చదవండి: తొలి తెలుగు సింగర్ ఇక లేరు -
30లోకి ఎంటరైన హీరోయిన్.. లగ్జరీ కారు కొన్న బ్యూటీ
మలయాళ బ్యూటీ అహానా కృష్ణ (Ahaana Krishna) తన పుట్టినరోజు (అక్టోబర్ 13)కు కొత్త కారును ఇంటికి తెచ్చేసుకుంది. BMW X5 మోడల్ కారు కొనాలన్న కలను ఎట్టకేలకు నెరవేర్చుకుంది. తనకు తానే ఈ లగ్జరీ కారును గిఫ్ట్ ఇచ్చుకుంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. 20's నుంచి 30'sలోకి అడుగుపెడుతున్నందుకు కొంత బాధగా ఉంది. ఏదేమైనా 30 ఏళ్ల వయసుకు హాయ్ చెప్పేందుకు రెడీ అయ్యాను. హీరో సలహాతో..ఇప్పటివరకు నేనేం చేయాలి? ఏం చేయకూడదు? అని ఆంక్షలు విధించని అమ్మానాన్నకు థాంక్యూ. నా జీవితాన్ని నాకు నచ్చినట్లుగా బతకనిచ్చే స్వేచ్ఛ ఇచ్చినందుకు ధన్యవాదాలు. నేను ఏదీ కోరుకోకపోయినా అన్నీ అనుకూలంగా జరుగుతున్నాయి. అందుకు ఈ ప్రపంచానికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అని రాసుకొచ్చింది. ఎలాంటి కారు కొనాలి? ఏదైతే బాగుంటుంది? అని దుల్కర్ సల్మాన్ సలహాలు సూచనలు ఇచ్చిన తర్వాతే అహానా ఈ కారు కొనుగోలు చేయడం విశేషం. ఈ కారు ధర రూ.95 లక్షల నుంచి రూ.1 కోటి మధ్య ఉన్నట్లు తెలుస్తోంది.సినిమాఅహానా కెరీర్ విషయానికి వస్తే.. గృహప్రవేశం అనే సీరియల్లో చైల్డ్ ఆర్టిస్ట్గా నటించింది. తండ్రితో కలిసి ఓ సీరియల్ కూడా చేసింది. ఎంజన్ స్టీవ్ లోపేజ్ (2014) అనే మలయాళ సినిమాతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది. పదినెట్టం పడి, ఆడి, నాన్సీ రాణి సినిమాల్లో హీరోయిన్గా నటించింది. చివరగా కొత్త లోక: చాప్టర్ 1 మూవీలో అతిథి పాత్రలో మెరిసింది. View this post on Instagram A post shared by Ahaana Krishna (@ahaana_krishna) View this post on Instagram A post shared by Ahaana Krishna (@ahaana_krishna) చదవండి: వివాదాలతో సతమతం.. అప్పుడే ఫుల్స్టాప్ అంటున్న హన్సిక -
వివాదాలతో సతమతం.. అప్పుడే ఫుల్స్టాప్ అంటున్న హన్సిక
దక్షిణాదిలో క్రేజీ హీరోయిన్గా రాణించినవారిలో హన్సిక మొత్వానీ (Hansika Motwani) ఒకరు. ముఖ్యంగా తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోల సరసన నటించి స్టార్డమ్ అందుకున్నారు. దాదాపు 50కిపైగా చిత్రాల్లో కథానాయికగా నటించిన హన్సిక.. 2022లో సోహైల్ అనే వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుని సంసార జీవితంలోకి అడుగుపెట్టారు. అయితే ఈమె పెళ్లి కూడా చాలామంది హీరోయిన్లలాగానే మనస్పర్థలతో ముగిసిపోయిందంటూ ప్రచారం జరుగుతోంది.రెండు వివాదాల మధ్య హన్సికభర్తకు దూరంగా తన తల్లితోనే ఉండడంతో ఈ రూమర్లకు మరింత బలం చేకూరుతోంది. మరోవైపు హన్సికపై ఆమె సోదరుని భార్య గృహహింస ఆరోపణలు చేసింది. ఇలాంటి సమస్యల నుంచి బయటపడడానికి, మనశ్శాతి కోసం ఈ బ్యూటీ విహారయాత్రలు చేసి వచ్చినట్లు సమాచారం. ఇలాంటి పరిస్థితుల్లో మళ్లీ సినిమాలపైనే ఫుల్ ఫోకస్ చేయాలనే నిర్ణయానికి వచ్చిన హన్సిక తనపై వస్తున్న విమర్శలను తెలుసుకోవడంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిసింది.ఈ ఏడాది పూర్తయ్యేసరికి..దక్షిణాది చిత్ర పరిశ్రమలో తన గురించి ఎవరేం అనుకుంటున్నారు? ఎలాంటి వదంతులు ప్రసారం అవుతున్నాయి? అని తన సన్నిహితుల ద్వారా వివరాలను సేకరిస్తున్నట్లు సమాచారం. ఈ ఏడాది చివరికల్లా తన సమస్యలు తొలగిపోతాయని తన అత్యంత సన్నిహితురాలు వద్ద హన్సిక అన్నట్లు తెలిసింది. ఈ విషయం ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. హన్సిక ఆ మధ్య నాలుగు సినిమాలు చేసింది. కానీ, అవింకా రిలీజ్ కాలేదు.చదవండి: పవన్ గురించి ప్రశ్న.. 'వద్దు' అని కిరణ్ అబ్బవరం -
కబడ్డి... కబడ్డి
ప్రముఖ తమిళ హీరో విక్రమ్ తనయుడు ధృవ్ హీరోగా అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్గా నటించిన చిత్రం ‘బైసన్’. మారి సెల్వరాజ్ దర్శకత్వం వహించారు. పా. రంజిత్ సమర్పణలో నీలం స్టూడియోస్, అప్లాజ్ ఎంటర్టైన్మెంట్పై సమీర్ నాయర్, దీపక్ సెగల్, పా. రంజిత్, అదితీ ఆనంద్ నిర్మించిన ఈ చిత్రం తమిళంలో ఈ నెల 17న విడుదల కానుంది. తెలుగులో జగదాంబే ఫిలిమ్స్ పై బాలాజీ ఈ నెల 24న విడుదల చేస్తున్నారు.ఈ సినిమా ట్రైలర్ను హీరో రానా రిలీజ్ చేసి, సినిమా విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా బాలాజీ మాట్లాడుతూ– ‘‘1990 బ్యాక్డ్రాప్లో కబడ్డి నేపథ్యంలో రూపొందిన చిత్రం ‘బైసన్’. ట్రైలర్ ఎంత ఆసక్తికరంగా ఉందో సినిమా కూడా థ్రిల్లింగ్ అంశాలతో అందర్నీ ఆకట్టుకునేలా ఉంటుంది. స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ సినిమాలకు తెలుగులో మంచి ఆదరణ దక్కుతుంది. కబడ్డి నేపథ్యంలో రాబోతున్న మా సినిమా కూడా మంచి విజయం అందుకుంటుందని నమ్ముతున్నాను’’ అన్నారు. -
సస్పెన్స్కు తెర.. రూ.300 కోట్ల సినిమా ఓటీటీ ఫ్లాట్ఫామ్ ఫిక్స్!
కల్యాణి ప్రియదర్శన్ కీలక పాత్రలో వచ్చిన చిత్రం 'లోకా'. మలయాళంలో సూపర్ హిట్ అయిన సినిమాని తెలుగులో 'కొత్త లోక' పేరుతో రిలీజ్ చేశారు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.300 కోట్లు వసూళ్లు సాధించినట్లు ఇటీవలే పోస్టర్ పంచుకున్నారు మేకర్స్. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. దుల్కర్ సల్మాన్ నిర్మించిన ఈ చిత్రం మలయాళంలో ఆగస్టు 28న రిలీజైంది. ఆ తర్వాత తెలుగులో ఒక రోజు ఆలస్యంగా విడుదలైంది. టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద కూడా ఫర్వాలేదనిపించింది.అయితే ఈ సినిమా ఇప్పటి వరకు ఓటీటీకి రాలేదు. ఈ మూవీ రిలీజై 50 రోజులు కావొస్తోంది. పెద్ద పెద్ద సినిమాలే కేవలం నాలుగైదు వారాల్లోనే స్ట్రీమింగ్కు వచ్చేస్తున్నాయి. అలాంటిది ఈ సినిమా ఇంకా ఓటీటీకి రాలేదు. ఈ మూవీ కోసం సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గతంలోనే ఓటీటీకి రానుందని వార్తలొచ్చినా అలాంటిదేం జరగలేదు. రూమర్స్ రావడంతో దుల్కర్ సైతం ఓటీటీ రిలీజ్పై క్లారిటీ ఇచ్చారు.తాజాగా కొత్త లోక స్ట్రీమింగ్ ఓటీటీ ఫ్లాట్ఫామ్ను రివీల్ చేశారు. జియో హాట్స్టార్ వేదికగా స్ట్రీమింగ్ కానున్నట్లు ప్రకటించారు. త్వరలోనే రిలీజ్ తేదీని రివీల్ చేస్తామని పోస్టర్ పంచుకున్నారు. దీంతో కొత్త లోక మూవీ కోసం ఎదురు చూస్తున్న ఆడియన్స్లో సస్పెన్స్కు తెరపడింది. (ఇది చదవండి: హీరోయిన్కి సూపర్ పవర్స్ ఉంటే.. 'కొత్త లోక' రివ్యూ)కొత్త లోక కథేంటంటే..'లోక' విషయానికొస్తే.. చంద్ర (కల్యాణి ప్రియదర్శన్) సూపర్ పవర్స్ ఉన్న ఓ అమ్మాయి. ఈమె గురించి కొందరికి తెలుసు. ఓ సందర్భంలో చంద్ర, బెంగళూరు రావాల్సి వస్తుంది. తన పవర్స్ బయటపెట్టకుండా సాధారణ అమ్మాయిలా బతుకుతుంది. రాత్రిపూట ఓ కేఫ్లో పనిచేస్తుంటుంది. ఎదురింట్లో ఉంటే సన్నీ(నస్లేన్).. ఈమెని చూసి లవ్లో పడతాడు. పరిస్థితులు కలిసొచ్చి ఇద్దరు ఫ్రెండ్స్ అవుతారు. కానీ ఓ రోజు రాత్రి జరిగిన సంఘటనల దెబ్బకు చంద్ర జీవితం తలకిందులవుతుంది. ఇంతకీ చంద్ర గతమేంటి? ఎస్ఐ నాచియప్ప(శాండీ)తో గొడవేంటి? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ. The beginning of a new universe.Lokah Chapter 1: Chandra — coming soon on JioHotstar.@DQsWayfarerFilm @dulQuer @kalyanipriyan @naslen__ @NimishRavi @SanthyBee#Lokah #LokahChapter1 #Wayfarerfilms #DulquerSalmaan #DominicArun #KalyaniPriyadarshan #Naslen #SuperheroFantasy… pic.twitter.com/BMlsbEJM0q— JioHotstar Malayalam (@JioHotstarMal) October 14, 2025 -
ఇంకా నయం.. ఆ సీన్స్ చూపలేదు.. ఇప్పటికైనా బిగ్బాస్ నిషేధించకపోతే!
ప్రస్తుతం బుల్లితెర ప్రియులను అలరిస్తోన్న రియాలిటీ షో బిగ్బాస్. ఆడియన్స్లో ఈ షోకు ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో ఈ షో రన్ అవుతోంది. టాలీవుడ్లో బిగ్బాస్ షో ఇప్పుడిప్పుడే ఆదరణ దక్కించుకుంటోంది. వైల్డ్ కార్డ్స్ ఎంట్రీతో బిగ్బాస్ షో మరింత ఆసక్తికరంగా మారింది.తెలుగులో మినహాయిస్తే.. ఇటీవల బిగ్బాస్ కన్నడలో జరిగిన వివాదం మనందరికీ తెలిసిందే. ఈ షో కోసం వేసిన సెట్ వల్ల వ్యర్థాలు వస్తున్నాయని ఫిర్యాదు చేయడంతో సడన్గా మూసివేయాల్సి వచ్చింది. ఆ తర్వాత రెండు రోజుల తర్వాత మళ్లీ రీ స్టార్ట్ చేశారు. శాండల్వుడ్లో ఈ రియాలిటీ షో హోస్ట్గా హీరో కిచ్చా సుదీప్ వ్యవహరిస్తున్నారు. ఈ వివాదం ముగిసిపోవడంతో కన్నడలో బిగ్బాస్ ఎలాంటి అటంకం లేకుండా కొనసాగుతోంది.అయితే తాజాగా తమిళ బిగ్బాస్ షో చుట్టు వివాదం మొదలైంది. తమిళనాడులో 'బిగ్ బాస్' షోను నిషేధించాలని అధికార డీఎంకే ప్రభుత్వ మిత్రపక్షం తమిజ్హగ వజ్వురిమై కట్చి (టీవీకే) డిమాండ్ చేస్తోంది. ఈ షోలో చిత్రీకరించిన కొన్ని సన్నివేశాలు తమిళ సంస్కృతిని కించపరిచే విధంగా ఉన్నాయని టీవీకే లీడర్, ఎమ్మెల్యే వేల్మురుగన్ ఆరోపించారు. బిగ్ బాస్ షో తమిళ సంస్కృతి, సంప్రదాయంతో పాటు విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేయడానికి ప్రయత్నిస్తోందని విమర్శించారు. అసహ్యకరమైన శరీర కదలికలు, ముద్దు సన్నివేశాలు, బెడ్ రూమ్ దృశ్యాలు.. టీనేజ్ అమ్మాయిలు, పిల్లలు సమక్షంలో చూడకూడదని అన్నారు. ఇంకా నయం ఈ షోలో ఇప్పటివరకు లైంగిక పరమైన దృశ్యాలను చూపించలేదని వేల్మురుగన్ సీరియస్ కామెంట్స్ చేశారు.ఈ విషయంపై ఇప్పటికే తమిళనాడు అసెంబ్లీ స్పీకర్ సంప్రదించానని ఆయన పేర్కొన్నారు. స్పీకర్ నా తీర్మానాన్ని చర్చకు అనుమతించకపోతే నిరసనలు చేపడతామని హెచ్చరించారు. ముఖ్యమంత్రి, ఐటీ, ప్రసార శాఖలు ఈ షోను నిషేధించకపోతే.. బిగ్ బాస్ సెట్తో పాటు విజయ్ టెలివిజన్ వద్ద వేల మంది మహిళలతో పెద్దఎత్తున ఆందోళనకు దిగుతామని వేల్మురుగన్ హెచ్చరించారు. కాగా.. విజయ్ సేతుపతి హోస్ట్ చేస్తోన్న బిగ్ బాస్ తమిళ సీజన్ -9 అక్టోబర్ 5న గ్రాండ్గా ప్రారంభమైంది. ఈ సీజన్లో దాదాపు 20 మంది కంటెస్టెంట్స్గా హౌస్లో అడుగుపెట్టారు. -
వావ్.. సూపర్.. 72 గంటలు కూడా ఆడని సినిమాకు ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్!
ఇటీవల ప్రకటించిన ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్లో చిన్న సినిమా లపత్తా లేడీస్ అరుదైన ఘనత సాధించింది. ఈ మూవీ ఏకంగా 12 విభాగాల్లో అవార్డ్స్ దక్కించుకుంది. ది కేరళ స్టోరీ డైరెక్టర్ సుదీప్తో సేన్ విమర్శలు చేశారు. గతేడాది రిలీజైన సినిమాలైన'ఐ వాంట్ టు టాక్' చిత్రానికి అభిషేక్ బచ్చన్, 'చందు: ఛాంపియన్' సినిమాకు కార్తీక్ ఆర్యన్ ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్డు అందుకున్నారు. జిగ్రా చిత్రానికిగానూ ఆలియా భట్ (Alia Bhatt) ఉత్తమ నటి పురస్కారం గెలుచుకుంది. 2023లో వచ్చిన లాపతా లేడీస్ ఉత్తమ చిత్రంగా నిలిచింది.అయితే లపత్తా లేడీస్క ఏకంగా 12 అవార్డులు రావడంపై ది కేరళ స్టోరీ డైరెక్టర్ సుదీప్తో సేన్ విమర్శించారు. 2024లో వచ్చిన మంచి చిత్రాలకు గుర్తింపు లేకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. ఫిల్మ్ఫేర్ అవార్డుల ఎంపిక ప్రక్రియ, భారతీయ చిత్ర పరిశ్రమపై దాని ప్రభావంపై సోషల్ మీడియా ద్వారా ఆందోళన వ్యక్తం చేశారు.సుదీప్తో సేన్ ఇన్స్టాలో రాస్తూ.. 'ఈ ఏడాది ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ చూస్తే కొత్త ధోరణి బయటపడింది. కేవలం 72 గంటలకు పైగా కూడా బాక్సాఫీస్ వద్ద నిలబడలేని.. కాపీరైట్ ఆరోపణలు ఎదుర్కొన్న చిత్రం లపత్తా లేడీస్. అందరూ ఊహించినట్లుగానే 2024లో అత్యుత్తమ సినిమా ఏదనేది ఇంకా క్లారిటీ రాలేదు. ది కేరళ స్టోరీ జాతీయ అవార్డులను అందుకోవడానికి వ్యతిరేకంగా ఫిల్మ్ఫేర్ ఎందుకు అంతలా గొంతు విప్పిందో నాకిప్పుడు అర్థమైంది. ఈ ఉడ్(పరోక్షంగా బాలీవుడ్ ఇండస్ట్రీని ఉద్దేశించి) సమాజం మమ్మల్ని గుర్తించకపోవడం.. ఆహ్వానించకపోవడంపై నేను చాలా సంతోషంగా ఉన్నా" అని అన్నారు.అంతే కాకుండా ఫేక్ నవ్వులు ముఖ్యంగా ఫేక్ పొగడ్తల నుంచి మేము తప్పించుకున్నామని సుదీప్తో సేన్ రాసుకొచ్చారు. ముంబయిలో సినిమా పేరుతో ఈ తమాషాలు.. కేన్స్లో సెల్ఫీలు తీసుకోకుండా మమ్మల్ని రక్షించనందుకు చాలా సంతోషంగా ఉన్నానని పోస్ట్ చేశారు. ఏదేమైనా సినిమా పేరుతో చేసే మోసం, నకిలీ వస్త్రధారణ నుంచి మేము బయటపడ్డామని వ్యంగ్యంగా కామెంట్ చేశారు.ముఖ్యంగా మీడియా, సినిమా జర్నలిజం ఉన్నప్పుడు.. ఏ భారతీయ సినిమా సంస్థ నుంచి గొప్పగా ఆశించనని సుదీప్తో సేన్ స్పష్టం చేశారు. ఎందుకంటే గొప్ప గ్లామర్, సంపన్నమైన స్టార్స్కే ప్రపంచం గుర్తిస్తుందన్నారు. గ్రామాలు, చిన్న నగరాల నుంచి వచ్చే ప్రజలు మిస్టర్ బచ్చన్, షారూఖ్ ఖాన్ ఇంటి ముందు గుమిగూడే విధానమే ఇలాంటి సరైన ఉదాహరణ అని బాలీవుడ్పై విమర్శలు చేశారు.కాగా.. గత నెలలోనే సుదీప్తో సేన్ దర్శకత్వంలో వచ్చిన 'ది కేరళ స్టోరీ' చిత్రానికి ఉత్తమ దర్శకుడిగా జాతీయ అవార్డును అందుకున్నాడు. ఈ సినిమాను కేరళ యువతులను ఇస్లాం మతంలోకి మార్చడంపై రియల్ స్టోరీగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ చిత్రం ఉత్తమ సినిమాటోగ్రఫీ జాతీయ అవార్డ్ కూడా గెలుచుకుంది. అయితే జాతీయస్థాయిలో సత్తా చాటిన ఈ సినిమాకు ఫిల్మ్ఫేర్ నుంచి ఎలాంటి అవార్డ్స్, ప్రశంసలు రాలేదు. దీంతో డైరెక్టర్ సుదీప్తో సేన్ తనదైన శైలిలో విమర్శించారు. View this post on Instagram A post shared by Sudipto Sen (@sudipto_sen) -
కాంతార మరో రికార్డ్.. ఏకంగా రాజమౌళి బాహుబలినే!
రిషబ్ శెట్టి డైరెక్షన్లో వచ్చిన కాంతార చాప్టర్-1 (Kantara Chapter 1) బాక్సాఫీస్ వద్ద తగ్గేదేలే అంటోంది. ఇప్పటికే పలు రికార్డులు కొల్లగొట్టిన ఈ సినిమా తాజాగా మరో సెన్సేషన్ క్రియేట్ చేసింది. కూలీ, జైలర్, లియో కలెక్షన్స్ రికార్డ్స్ తుడిచిపెట్టేసిన ఈ మూవీ టాలీవుడ్ బ్లాక్బస్టర్ బాహుబలి ది బిగినింగ్ ఆల్టైమ్ వసూళ్లను దాటేసింది. కేవలం 12 రోజుల్లోనే ఈ ఘనత సాధించింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే రూ.675 కోట్ల వసూళ్లు సాధించినట్లు తెలుస్తోంది. త్వరలోనే రూ.700 కోట్ల మార్క్ను చేరుకోనుంది.ఇప్పటికే ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన జాబితాలో రెండోస్థానం దక్కించుకుంది. ఈ జాబితాలో ఛావా(రూ.808 కోట్లు) మొదటిస్థానంలో ఉంది. దేశవ్యాప్తంగా చూసుకుంటే ఈ చిత్రానికి రూ.451.90 కోట్ల నికర వసూళ్లు రాగా..రూ.542 కోట్ల గ్రాస్ సంపాదించింది. ఉత్తర అమెరికాలో కాంతారా చాప్టర్ -1.. పదకొండు మిలియన్ డాలర్లకు పైగా వసూలు చేసింది. ఇండియాలో అత్యధిక కలెక్షన్స్ సాధించిన సినిమాల లిస్ట్లో 17వ స్థానంలో కొనసాగుతోంది. తాజా వసూళ్లతో సల్మాన్ ఖాన్ సుల్తాన్ (రూ.628 కోట్లు), రాజమౌళి బాహుబలి (రూ.650 కోట్లు)ని అధిగమించింది. ఈ రెండు చిత్రాల కంటే తక్కువ బడ్జెట్తో వచ్చిన ఈ సినిమా అరుదైన ఫీట్ను సాధించడం విశేషం.రిషబ్ శెట్టి దర్శకత్వం వహించిన కాంతారా చాప్టర్ 1 ప్రీక్వెల్గా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.హోంబల్ ఫిల్స్మ్ బ్యానర్లో వచ్చిన ఈ చిత్రంలో రుక్మిణి వసంత్, జయరామ్, గుల్షన్ దేవయ్య కీలక పాత్రలు పోషించారు. -
రిషబ్ శెట్టి నివాసం..విశేషాల ఆవాసం... రేటు ఎంతంటే..?
కాంతారా: చాప్టర్ 1 బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొడుతూ అభిమానులను ఆకట్టుకుంటోంది. సినిమాతో పాటు, కర్ణాటకలోని ఉడిపిలోని కుందాపురలో ఉన్న రూ. 12 కోట్ల విలువైన రిషబ్ శెట్టి భవనం కళ, సంప్రదాయం సంస్కృతి పట్ల ఆయనకున్న ప్రేమను ప్రతిబింబిస్తుంది,ఆ ఇంట్లోని ప్రతీ చోటూ ఒక కధను చెబుతుంది. ఆ ఇంటిలోని పలు చోట్ల కాంతారా సినిమా ప్రభావం కనిపిస్తుండడం ఆసక్తికరం.ఆయన ముత్తాత యాజమాన్యంలోని పూర్వీకుల భూమిపై నిర్మింతమైన ఈ భవనం ఓ క్లాసిక్ గా అభిమానులు పేర్కొంటారు. అది దక్షిణ భారత వాస్తుశిల్పాన్ని ఆధునిక సౌకర్యాలతో నేర్పుగా మిళితం చేయడం దీని విశేషం. ఘనమైన ప్రవేశ ద్వారం ఇత్తడితో కప్పబడిన బర్మా టేకు కలప తలుపు చేతితో లాగే ఆలయ గంటను కలిగి ఉంటుంది, ఇది ఇంట్లో అడుగుపెట్టిన తక్షణమే ఆధ్యాత్మికతో స్వాగతించే వైబ్ను అందిస్తుందిలోపలికి అడుగు పెట్టగానే ఈ స్థలం నాలుగు మూలల్లో ప్రతి ఒక్కటి ఒక ప్రత్యేకమైన కథను చెబుతుంది, ఇల్లు సూర్యకాంతి తో చుట్టుముట్టేలా...300 కిలోల గ్రానైట్తో నిర్మితమైన తులసికోటతో మన ముందు కొలువు దీరుతుంది. ఇక ఇంటిలో కనపడే యక్షగాన శిరస్త్రాణం, కాంతారా లోని రైఫిల్, యువరాజ్ సింగ్ సంతకం చేసిన క్రికెట్ బ్యాట్ వరకు సావనీర్లు కళలు, క్రీడలు భారతీయ జానపద సంప్రదాయాల పట్ల శెట్టికి ఉన్న ప్రేమను చూపుతాయి.కానీ ఈ భవనంలోని తమ అత్యంత ఆసక్తికరమైన భాగాన్ని శెట్టి ’ఛాంటింగ్ కార్నర్’ అని పిలుస్తారు. ఎవరైనా ఆ ఇంట్లోని ఆ నార్త్ ఈస్ట్ కార్నర్లో ఒక నిర్దిష్ట నల్ల రాయిపై ఏడు సెకన్ల పాటు గానీ నిలబడితే, గాలి భూత కోల శ్లోకాలతో నిండిపోతుంది, దాదాపుగా కాంతారా లోని ఆధ్యాత్మిక శక్తిని గుర్తుచేసే అనుభవాన్ని అందిస్తుంది.ఈ భవనంలో విలాసవంతమైన ప్రైవేట్ స్క్రీనింగ్ గది కూడా ఉంది. ఇటాలియన్ లెదర్ రిక్లైనర్లు, 150–అంగుళాల రిట్రాక్టబుల్ స్క్రీన్ డాల్బీ అట్మోస్ సరౌండ్ సౌండ్తో అమర్చబడి ఉంటుంది. ఇది పూర్తి స్థాయి సినిమాటిక్ అనుభవాన్ని అందిస్తుంది. స్థానిక టచ్ ఇస్తూ గదిలోని షాండ్లియర్ను మంగళూరు టైల్స్తో తయారు చేశారు. కాంతారా నుంచి ఇచ్చిన అటవీ స్ఫూర్తితో సెలియరాయ అని పేరు కలిగిన ప్రొజెక్టర్, ఆ ఇంటి విశేషాలకు మరో వ్యక్తిగత కథ ను జోడిస్తుంది.తమ మూలాలతో కుటుంబానికి ఉన్న సంబంధం వంటగది వరకూ కొనసాగుతుంది. నల్ల రాయి కౌంటర్ ను కొబ్బరి నూనెను ఉపయోగించి పాలిష్ చేస్తుంటారు. కోరి గస్సీ (చికెన్ కర్రీ) వంటి సాంప్రదాయ వంటకాలను వారసత్వంగా వచ్చే వంటశైలులను ఉపయోగించి తయారు చేస్తారు. పై అంతస్తులోని గదిలో 1,200 కంటే ఎక్కువ పుస్తకాలు కలిగిన లైబ్రరీ ఉంది, వీటిలో ఉండే భారతీయ జానపద కథల నుంచి స్టీఫెన్ కింగ్ థ్రిల్లర్ల వరకు, శెట్టి విస్త్రుత సేకరణను పుస్తకాభిరుచిని ప్రతిబింబిస్తాయి.పురాతన కాలం నాటి ఆకర్షణ సంప్రదాయ విశేషాలు ఎన్నో ఉన్నప్పటికీ, ఈ భవనం అత్యాధునిక భద్రతతో పటిష్టంగా ఉంటుంది. ఫేస్ రికగ్నైజేషన్, కెమెరాలు ప్రవేశ ద్వారం దగ్గర కాపలాగా ఉంటాయి యక్ష అనే రిటైర్డ్ కోస్టల్ పోలీసు శునకం సైతం ఇంటికి కాపలా కాస్తుంటుంది. సందర్శకులు ప్రవేశించే ముందు వారి ఫోన్ లను ఇత్తడి లాకర్లలో జమ చేయాలి ఆసక్తికరంగా, కాంతారా సంభాషణల నుంచి ప్రేరణ పొంది ప్రతి నెలా వైఫై పాస్వర్డ్ మారుతుంటుంది. View this post on Instagram A post shared by PragathiRishabShetty (@pragathirishabshetty) -
'కాంతార'కు అక్కడ భారీ నష్టాలే.. కారణం ఇదే
కన్నడ సినిమా కాంతార చాప్టర్ 1 ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్స్తో దూసుకుపోతుంది. ఇప్పటికే రూ. 500 కోట్ల క్లబ్లో చేరిపోయిన ఈ చిత్రం కలెక్షన్ల జోరు మాత్రం తగ్గడం లేదు. సోమవారం కూడా సుమారు రూ. 20 కోట్లకు పైగానే రాబట్టినట్లు బాక్సాఫీస్ వర్గాలు చెబుతున్నాయి. 12 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.675 కోట్ల గ్రాస్ మార్క్ను అందుకున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు తెలుపుతున్నాయి. దీంతో బాహుబలి-1 ఫైనల్ కలెక్షన్స్ మార్క్ను కాంతార దాటేసింది. అయితే, కాంతారా చాప్టర్ 1 అమెరికాలో బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు రాబట్టినప్పటికీ గణనీయమైన నష్టాలను చవిచూసే ఛాన్స్ ఉంది. ఇప్పటివరకు, ఈ చిత్రం దాదాపు రూ. 4 మిలియన్ల డాలర్స్ (రూ. 36 కోట్లు) వసూలు చేసింది. అందుకు సంబంధించిన పోస్టర్ను కూడా తాజాగా మేకర్స్ షేర్ చేశారు. ఈ కలెక్షన్స్ నంబర్ పర్వాలేదనిపించినప్పటికీ బ్రేక్-ఈవెన్ మార్కుకు చాలా దూరంలో ఉంది. ఈ సినిమాను చాలా ఎక్కువ ధరకు అమెరికాలో కొనుగోలు చేశారని తెలుస్తోంది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ చేయడానికి దాదాపు రూ. 8 మిలియన్ల డాలర్స్ అవసరం అవుతుంది. ఆ మార్క్ను కాంతార అందుకోవడం దాదాపు అసాధ్యమనే చెప్పాలి. దీంతో అమెరికాలో కాంతార నష్టాలు మిగల్చడం తప్పదని సమాచారం.అయితే, తెలుగు, కన్నడ, తమిళ్, హిందీ బెల్ట్లో మాత్రం భారీ లాభాల దిశగా కాంతార దూసుకుపోతుంది. దీపావళి సందర్భంగా ఈ వారంలో మరో నాలుగు ప్రధాన సినిమాలు విడుదల కానున్నడంతో కాంతారా చాప్టర్ 1 కలెక్షన్స్ ప్రపంచవ్యాప్తంగా మరింత తగ్గే ఛాన్స్ ఉంది. ఏదేమైనా మరో మూడు రోజులు మాత్రమే కాంతార సందడి కనిపించనుంది. ఈ ఏడాదిలో ఛావా సినిమా రూ. 800 కోట్ల కలెక్షన్స్తో టాప్ వన్లో ఉంది. ఇప్పుడు కాంతార కూడా ఆ మార్క్ను అందుకోవాలని చూస్తుంది. 2022లో విడుదలైన కాంతార చిత్రానికి ప్రీక్వెల్గా కాంతార చాప్టర్ 1 నిర్మించారు. రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రుక్మిణి వసంత్, జయరామ్, గుల్షన్ దేవయ్య కీలక పాత్రల్లో నటించారు. -
పదేళ్ల తర్వాత ధనుష్తో పనిచేయనున్న స్టార్ సంగీత దర్శకుడు
సౌత్ ఇండియాలో ప్రస్తుతం క్రేజీ సంగీత దర్శకుడిగా వెలుగొందుతున్న అనిరుధ్ తన సంగీత పయనాన్ని ప్రారంభించింది నటుడు ధనుష్ కథానాయకుడిగా నటించిన 3 చిత్రంతోననే విషయం తెలిసిందే. ఈ చిత్రం పెద్దగా సక్సెస్ కాకపోయినా, అందులోని వై దిస్ కొలవెరి పాట ప్రపంచ వ్యాప్తంగా మార్మోగింది. తరువాత 'రఘువరన్ బి.టెక్ , మారి, నవమన్మధుడు' చిత్రాల వరకూ ధనుష్ కోసం అనిరుధ్ సంగీతాన్ని అందించారు. వీరిద్దరి మధ్య బంధుత్వం కూడా ఉండటంతో అలా వారి జర్నీ కొనసాగింది. కానీ, వీరిద్దరి మధ్య బేధాబిప్రాయాలు వచ్చాయనే ప్రచారం కోలీవుడ్లో జరిగింది. కుటుంబ విషయంలో ఇద్దరి మధ్య కాస్త గ్యాప్ వచ్చిందని కొందరు చెబితే... ఐశ్వర్యతో ధనుష్ విడాకులు తీసుకోవడం వల్ల అనిరుధ్ కాస్త దూరం జరిగాడని అంటారు. అయితే ఇందులో నిజం ఎంత అన్నది పక్కన పెడితే.. సుమారు పదేళ్లుగా వీరిద్దరి కాంబోలో ఒక్క సినిమా కూడా రాలేదు. దీంతో ఈ హిట్ కాంబినేషన్లో చిత్రం కోసం అభిమానులు చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. అలాంటి సందర్భం ఇప్పుడు వస్తోందన్నది తాజా సమాచారం. ధనుష్ ప్రస్తుతం పలు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. అదే విధంగా అనిరుధ్ నటుడు రజనీకాంత్ చిత్రాలకు వరుసగా పని చేస్తూ బిజీగా ఉన్నారు. తాజాగా ధనుష్ హీరోగా లబ్బరు బంత్తు చిత్రం ఫేమ్ పచ్చుముత్తు తమిళరసన్ దర్శకత్వంలో ఒక సినిమా చేసేందుకు ఓకే చెప్పారు. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతాన్ని అందించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇదే నిజం అయితే ధనుష్ అభిమానులకు ఖుషీనే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. -
రాత్రంతా డైలాగ్స్ ప్రాక్టీస్ చేశాను: మమిత బైజు
‘‘డ్యూడ్’ సినిమాలోని కొన్ని భావోద్వేగమైన సన్నివేశాలు నాకు సవాల్గా అనిపించాయి. ఆ సన్నివేశాల కోసం నేను రాత్రంతా డైలాగ్స్ ప్రాక్టీస్ చేశాను. అలా చేయడం నాకు సవాల్గా, ఉత్సాహంగా అనిపించింది’’ అని హీరోయిన్ మమిత బైజు తెలి పారు. ప్రదీప్ రంగనాథన్, మమిత బైజు జంటగా శరత్ కుమార్ కీలక పాత్రలో నటించిన చిత్రం ‘డ్యూడ్’. కీర్తీశ్వరన్ దర్శకత్వంలో మైత్రీ మూవీపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 17న రిలీజ్ అవుతోంది.మమిత బైజు మాట్లాడుతూ– ‘‘డ్యూడ్’లో నేను చేసిన కురల్ పాత్రకు చాలా ప్రాధాన్యం ఉంది. ఇప్పటి వరకు నేను అలాంటి పాత్ర చేయలేదు. ఈ సినిమాని కీర్తీశ్వరన్ అద్భుతంగా తీశారు. ప్రదీప్ రంగనాథ్ సెట్స్లో చాలా హెల్ప్ ఫుల్గా ఉంటారు. శరత్ కుమార్గారి లాంటి సినియర్తో పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నాను. సాయి అభ్యంకర్ మ్యూజిక్ మా సినిమాకి బిగ్ ఎసెట్. నవీన్ , రవిశంకర్గార్లు చాలా ప్యాషనేట్ ప్రోడ్యూసర్స్. సినిమాని చాలా గ్రాండ్గా తీశారు. మా చిత్రం అందర్నీ అలరిస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. -
కాంతార చాప్టర్-1 బాక్సాఫీస్ జోరు.. జైలర్, లియో రికార్డ్స్ బ్రేక్!
రిషబ్ శెట్టి కాంతార ప్రీక్వెల్ బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. ఇప్పటికే పలు సూపర్ హిట్ సినిమాలను రికార్డ్స్ తుడిచిపెట్టిన ఈ మూవీ అరుదైన మార్క్ చేరుకుంది. ఈ సినిమా రిలీజైన 11 రోజుల్లోనే రూ.600 కోట్ల క్లబ్లో చేరింది. రెండో వారంలోనూ కలెక్షన్స్ పరంగా తగ్గేదేలే అంటోంది. ఇప్పటికే కన్నడలో కేజీఎఫ్-2 తర్వాత రెండో స్థానంలో కాంతార చాప్టర్-1 నిలిచింది. ఈ వారంలో పెద్ద సినిమాలేవీ లేకపోవడం మరింత కలిసి రానుంది.కాంతారా చాప్టర్ 1 ఆదివారం నాటికి ప్రపంచవ్యాప్తంగా రూ.615 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. దీంతో రజినీకాంత్ జైలర్(రూ.605 కోట్లు), విజయ్ లియో(రూ.606 కోట్లు) లాంటి బ్లాక్బస్టర్ హిట్స్ను అధిగమించింది. అంతేకాకుండా 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన రెండో చిత్రంగా ఘనత సాధించింది. ఈ మూవీకంటే విక్కీ కౌశల్, రష్మిక నటింటిన ఛావా (రూ.808 కోట్లు) తొలిస్థానంలో ఉంది. అయితే త్వరలోనే ఈ రికార్డ్ను సైతం బద్దలు కొట్టే ఛాన్స్ ఉంది. దేశవ్యాప్తంగా చూస్తే రూ.439 కోట్ల నెట్ వసూళ్లు సాధించగా.. రూ.525 కోట్ల గ్రాస్ రాబట్టింది.అంతేకాకుండా ఓవర్సీస్లో అదిరిపోయే కలెక్షన్స్ రాబడుతోంది.రిషబ్ శెట్టి దర్శకత్వం వహించిన కాంతారా చాప్టర్ 1 2022 బ్లాక్బస్టర్ కాంతారకు ప్రీక్వెల్గా తెరకెక్కించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.400 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ చిత్రంలో రుక్మిణి వసంత్, జయరామ్, గుల్షన్ దేవయ్య కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీని హోంబాలే ఫిల్మ్స్ బ్యానర్లో భారీ బడ్జెట్తో తెరకెక్కించారు. -
కాంతార ఛాప్టర్-1.. క్లైమాక్స్ సీన్ కోసం ఇంతలా కష్టపడ్డారా?
రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో వచ్చిన కాంతార ఛాప్టర్-1 బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. ఈ మూవీ రిలీజైన పది రోజుల్లోనే బిగ్ హిట్ సినిమాలను దాటేసింది. ప్రస్తుతం రూ.600 కోట్లకు చేరువలో ఉంది. ఇప్పటికే కూలీ, సైయారా, వార్-2 లాంటి సూపర్ హిట్స్ను సైతం దాటేసింది. ఇదే జోరు కొనసాగితే త్వరలోనే మరిన్ని రికార్డులు బద్దలు కొట్టేలా కనిపిస్తోంది. కాంతార చాప్టర్-1 అక్టోబర్ 2న థియేటర్లలోకి వచ్చిన సంగతి తెలిసిందే. కాంతారకు ప్రీక్వెల్గా వచ్చిన ఈ సినిమా గురించి రిషబ్ శెట్టి ఆసక్తికర పోస్ట్ చేశారు. ఈ మూవీలోని క్లైమాక్స్ సీన్ కోసం తాను పడిన కష్టాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. క్లైమాక్స్ సీన్ షూటింగ్ సమయంలో తన కాలికి వాపు వచ్చిందని తెలిపారు. ఆ సమయంలో చాలా అలసిపోయాయని రిషబ్ వెల్లడించారు . కానీ ఈ రోజు మా సినిమాకు వస్తున్న ఆదరణ చూస్తుంటే క్లైమాక్స్ లక్షలాది మంది అభిమానం ముందు నా కష్టమంతా చిన్నబోయిందని తెలిపారు. ఇదంతా మేము విశ్వసించే దైవిక శక్తి ఆశీర్వాదం ద్వారా మాత్రమే సాధ్యమైందని సంతోషం వ్యక్తం చేశారు. మాకు మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు అంటూ ఇన్స్టాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్గా మారింది.కాగా.. కాంతారా చాప్టర్ 1 క్లైమాక్స్ సీక్వెన్స్ ఇప్పటివరకు అత్యంత పవర్ఫుల్ సన్నివేశాలలో ఒకటిగా ప్రశంసలు అందుకుంది. ఈ సినిమాకు రిషబ్ శెట్టి దర్శకత్వం వహించగాయ.. హోంబాలే ఫిల్మ్స్ బ్యానర్లో విజయ్ కిరగందూర్ భారీ బడ్జెట్తో నిర్మించారు. ఈ చిత్రానికి అరవింద్ ఎస్. కశ్యప్ సినిమాటోగ్రఫీ అందించగా..అజనీశ్ లోక్నాథ్ సంగీతమందించారు. ఈ చిత్రంలో రుక్మిణి వసంత్, గుల్షన్ దేవయ్య, జయరామ్ కీలక పాత్రల్లో కనిపించారు. View this post on Instagram A post shared by Rishab Shetty (@rishabshettyofficial) -
యూరిన్ తాగి 48 రోజులు బతికాడు: హీరో
కోలీవుడ్ హీరో హరీశ్ కల్యాణ్ (Harish Kalyan), అతుల్య రవి జంటగా నటించిన చిత్రం 'డీజిల్' (Diesel Movie). తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన ఈ సినిమా షూటింగ్ 2022లోనే పూర్తయింది. ఎట్టకేలకు మూడేళ్ల తర్వాత ఈ సినిమా రిలీజ్కు నోచుకుంది. దీపావళి పండగ సందర్భంగా అక్టోబర్ 17న విడుదల కాబోతోంది. పార్కింగ్, లబ్బర్ పండు మూవీతో హిట్లు అందుకున్న హరీశ్.. ఈ సినిమాతో ముచ్చటగా మూడో హిట్ కొట్టాలని ఆశగా ఎదురుచూస్తున్నాడు.షూటింగ్కు ముందు ప్రిపరేషన్ఈ సినిమా చిత్రీకరణ సమయంలో జరిగిన ఓ ఆసక్తికర సంభాషణ గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో ముచ్చటించాడు. హరీశ్ కల్యాణ్ మాట్లాడుతూ.. డీజిల్ మూవీ షూటింగ్ ప్రారంభించడానికి ముందు రెండుమూడు రోజులు సముద్రతీరానికి వెళ్లాం. ఆ వాతావరణాన్ని అలవాటు చేసుకునేందుకు సముద్రంలోకి కూడా వెళ్లొచ్చాం. అప్పుడు 70 ఏళ్ల మత్య్సకారుడు నాకో విషయం చెప్పాడు. జీవితం విలువ తెలిసొచ్చిందికొన్నేళ్ల క్రితం ఓ తుపాను వల్ల అతడి పడవ సముద్రంలో నెల రోజులకు పైగా చిక్కుకుపోయింది. తర్వాత బంగ్లాదేశ్ సరిహద్దువైపు లాక్కొనిపోయింది. బక్కచిక్కిపోయి పీలగా మారినప్పటికీ ప్రాణాలతోనే బతికిబయటపడ్డాడు. సముద్రంలో ఉన్న 48 రోజులు అతడు తన యూరిన్ తాగి ప్రాణాలు కాపాడుకున్నాడు. సముద్రపు నీళ్లు తాగితే శరీరం డీహైడ్రేట్ అవుతుంది. అందుకని ఆ పని చేశాడు. అతడు చెప్పింది విన్నాక జీవితం విలువ మరింత తెలిసొచ్చింది అని చెప్పుకొచ్చాడు. చదవండి: ఏయ్, ఎందుకు అరుస్తున్నావ్? ఫస్ట్రోజే ఏడ్చేసిన దువ్వాడ మాధురి -
కాంతార చాప్టర్ 1.. రజినీకాంత్ కూలీ రికార్డ్ బ్రేక్!
రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో వచ్చిన కాంతార ఛాప్టర్-1 రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తోంది. ఇప్పటికే రూ.500 కోట్ల మార్క్ దాటేసిన ఈ సినిమా పదో రోజు కూడా అదే జోరును కొనసాగిస్తోంది. సెకండ్ వీకెండ్ కలిసి రావడంతో బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డ్ నెలకొల్పింది. 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన మూడో ఇండియన్ మూవీగా నిలిచింది. పదో రోజు శనివారం ఒక్క రోజే రూ.37 కోట్ల నికర వసూళ్లు సాధించింది. దీంతో దేశవ్యాప్తంగా రూ. 396.65 నెట్ వసూళ్లు రాగా.. రూ.476 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఈ క్రమంలోనే రజనీకాంత్ కూలీ, సైయారా, వార్-2 లాంటి రీసెంట్ హిట్ సినిమాలను అధిగమించింది.మొదటి రోజు నుంచే ఈ మూవీకి పాజిటివ్ టాక్ రావడంతో కలెక్షన్ల పరంగా దూసుకెళ్తోంది. ఇదే జోరు కొనసాగితే బాక్సాఫీస్ వద్ద మరిన్ని రికార్డులు క్రియేట్ చేయనుంది. అయితే ఈ ఏడాది బ్లాక్ బస్టర్ మూవీ ఛావా కంటే వెనకే ఉంది. కాంతారా చాప్టర్ -1 ప్రపంచవ్యాప్తంగా చూస్తే పది రోజుల్లోనే రూ.560 నుంచి రూ.590 కోట్ల మధ్య గ్రాస్ వసూళ్లు సాధించినట్లు తెలుస్తోంది. ఈ లెక్కన కూలీ(రూ.518 కోట్లు), టైగర్ జిందా హై (రూ.558 కోట్లు), ధూమ్ 3 (రూ.558 కోట్లు) సైయారా (రూ.570 కోట్లు), పద్మావత్ (కూ.585 కోట్లు), సంజు (రూ.589 కోట్లు) లాంటి లైఫ్టైమ్ గ్రాస్ కలెక్షన్స్ కూడా దాటేసినట్లే అవుతుంది. దీంతో ఈ సినిమా త్వరలోనే ఆరు వందల మార్క్ చేరుకునే అవకాశముంది.ఈ మూవీని 2022లో వచ్చిన బ్లాక్బస్టర్ మూవీ కాంతారకు ప్రీక్వెల్గా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.హోంబాలే ఫిల్మ్స్ బ్యానర్లో భారీ బడ్జెట్తో తెరకెక్కించారు. ఈ చిత్రంలో రుక్మిణి వసంత్, జయరామ్, గుల్షన్ దేవయ్య కీలక పాత్రల్లో నటించారు. -
కాటాలన్ మూవీ.. మాస్ అవతార్లో హీరో
అంటోని వర్గీస్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ “కాటాలన్”. క్యూబ్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై షరీఫ్ మహమ్మద్ నిర్మిస్తున్న ఈ మూవీ నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది. ఇందులో హీరో మాస్ అవతార్లో కనిపిస్తున్నాడు. మంటల చుట్టూ సిగరెట్తో, కళ్లలో జ్వాలలతో కనిపిస్తున్న అతని లుక్ అదిరిపోయింది. రక్తంతో తడిసిన ముఖం, చేతులు యాక్షన్ ఇన్టెన్సిటీని సూచిస్తున్నాయి.పాన్-ఇండియా బ్లాక్బస్టర్ “మార్కో” తర్వాత, క్యూబ్స్ ఎంటర్టైన్మెంట్స్ నుంచి వస్తున్న సినిమా కావడంతో కాటాలన్పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగ్గట్లుగానే పాన్-ఇండియా కాన్సెప్ట్గా భారీ స్థాయిలో నిర్మిస్తునారు. పాల్ జార్జ్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. థాయ్లాండ్ యాక్షన్ సన్నివేశాలను ప్రపంచ ప్రఖ్యాత ఒంగ్-బాక్ సిరీస్ యాక్షన్ డైరెక్టర్ కెచా ఖాంఫఖ్డీ తన టీమ్తో కలిసి రూపొందించారు. అదే సిరీస్లో నటించిన పాంగ్ కూడా ఈ సినిమాలో కనిపించనుంది.ఈ మూవీకి అజనీష్ లోకనాథ్ మ్యూజిక్ అందిస్తున్నారు. కాటాలన్ లో తెలుగు నటుడు సునీల్, కబీర్ దుహాన్ సింగ్, రాపర్ బేబీ జీన్, రాజ్ తిరందాసు (పుష్ప ఫేమ్), బాలీవుడ్ నటుడు పార్థ్ తివారి (కిల్ ఫేమ్), అలాగే మలయాళ సినీ నటులు జగదీష్, సిద్ధిక్, వ్లాగర్-సింగర్ హనాన్ షా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. కథ, స్క్రీన్ప్లేలను జోబీ వర్గీస్, పాల్ జార్జ్, జెరో జేకబ్ సంయుక్తంగా రాశారు. ఈ మూవీ మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో గ్రాండ్ రిలీజ్ కానుంది. View this post on Instagram A post shared by Cubes Entertainments®️ (@cubesentertainments) చదవండి: అల్లు అర్జున్ గొప్పోడయ్యాడు.. దేశంలోనే..: సాయిదుర్గ తేజ్ -
ఓటీటీలో సూపర్ హీరో సినిమా.. ఎలా ఉందంటే?
టైటిల్: మిన్నల్ మురళినటీనటులు- టొవినో థామస్,గురు సోమసుందరం, అజు వర్గీస్, సాజన్సంగీతం: సుశీన్ శ్యామ్, షాన్ రెహమాన్సినిమాటోగ్రఫీ: సమీర్ తాహిర్ఎడిటింగ్: లివింగ్స్టోన్ మాథ్యూదర్శకత్వం: బాసిల్ జోసెఫ్ఓటీటీ: నెట్ఫ్లిక్స్ఓటీటీల్లో చిత్రాలకు ఆడియన్స్ నుంచి విపరీతమైన క్రేజ్ ఉంటోంది. భాషతో సంబంధం లేకుండా సినిమాలను ఆదరిస్తున్నారు. మరీ ముఖ్యంగా మలయాళ చిత్రాలకైతే ప్రత్యేకమైన ఫ్యాన్స్ ఉన్నారు. అలా వచ్చి ఓటీటీలో సూపర్ హిట్గా నిలిచిన మిన్నల్ మురళి సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.సినీ ఇండస్ట్రీలో గతంలో సూపర్ మ్యాన్ తరహాలో చాలా సినిమాలొచ్చాయి. ఇలాంటి చిత్రాలకు ప్రత్యేకమైన ఫ్యాన్స్ ఉన్నారు. ఈ చిత్రాలు ఎక్కువగా హాలీవుడ్, బాలీవుడ్లోనే ఎక్కువగా వస్తుంటాయి. అయితే మలయాళ సినీ పరిశ్రమ ప్రేక్షకులకు ఆ స్థాయి ఎక్స్పీరియన్స్ వచ్చే సినిమాను తీసుకొచ్చింది. టొవినో థామస్ ప్రధాన పాత్రలో వచ్చిన మిన్నల్ మురళి ఓటీటీ ప్రియులను ఆకట్టుకుంది. అసలు మిన్నల్ మురళి కథేంటి? అతను సూపర్ హీరో ఎలా అయ్యాడో చూసేద్దాం.మిన్నల్ మురళి కథేంటంటే..అనంతపురంలోని ఉరవకొండ గ్రామంలో నివసించే జేసన్ (టొవినో థామస్ ఓ టైలర్. కానీ చిన్నప్పుడే తండ్రి చనిపోవడంతో ఓ పెద్దాయన అతన్ని చేరదీస్తాడు. అతని జీవిత లక్ష్యం అమెరికా వెళ్లడమే. అందుకు సంబంధించిన ప్రయత్నాలు చేస్తుంటాడు. అదే క్రమంలో పోలీస్ ఆఫీసర్ కూతురిని ప్రేమించి విఫలమవుతాడు. అయితే అదే గ్రామంలో హోటల్లో పని చేసే శిబు (గురు సోమసుందరం), జేసన్ (టోవినో థామస్) ఒకరోజు మెరుపు దాడి(పిడుగుపాటు) గురవుతారు. ఆ సమయంలో వీరిద్దరికీ ఊహించని శక్తులు వస్తాయి. మరీ ఆ శక్తులను వాళ్లు ఎలా ఉపయోగించారు? మంచి కోసం వాడారా? వీరి వల్ల ఆ గ్రామ ప్రజలు ఎందుకు ఇబ్బందులు పడ్డారు? అన్నది తెలియాలంటే మిన్నల్ మురళి చూడాల్సిందే.ఎలా ఉందంటే..సూపర్ హీరో ఒక్కరే ఉంటే.. అతను విలన్ అంతం చేయడమనేది ఉంటుంది. కానీ ఇద్దరికీ ఓకే రకం పవర్స్ ఉంటే సరాసరి పోరాటం ఉంటుంది. అదే ఈ మిన్నల్ మురళి. తెరపై ఇద్దరు సూపర్ హీరోలు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. హాలీవుడ్లో మార్వెల్, డీసీ కామిక్స్ లాంటి ఎందరో సూపర్ హీరోలను మనం చూశాం. కానీ ఇండియా సినీ చరిత్రలో ఇద్దరు సూపర్ హీరోల పాత్రలు అరుదనే చెప్పలి. జేసన్ తన అమెరికా కల కోసం పోరాటం.. శిబు తన ప్రియురాలి కోసం ఆరాటం.. ఈ క్రమంలోనే తమ సూపర్ పవర్ని ఎలా ఉపయోగించారనే స్టోరీని అద్భుతంగా తెరకెక్కించాడు బాసిల్ జోసెఫ్.ఈ సూపర్హీరో కథను ఇండియన్ ఆడియన్స్కు అర్థమయ్యేలా రూపొందించడంలో బాసిల్ జోసెఫ్ సక్సెస్ అయ్యారు. ఈ మూవీలో జేసన్ కంటే శిబు పాత్ర హైలెట్గా అనిపిస్తుంది. లేటు వయసులో తన ప్రియురాలి కోసం చేసే పోరాటం ఎమోషనల్గా టచ్ చేస్తుంది. కానీ శిబు లవ్ స్టోరీ మాత్రం ప్రేక్షకులను కన్నీళ్లు పెట్టిస్తుంది. చివరికీ క్లైమాక్స్లో ఇద్దరు సూపర్ హీరోల పోరాటం సీట్ నుంచి కదలకుండా చేస్తుంది. ఇద్దరు సూపర్ హీరోలను ఒకరికి తెలియకుండా ఒకరి కథను తీసుకెళ్లిన విధానం బాగుంది. ఈ సూపర్ హీరోల స్టోరీలో ఎమోషనల్ టచ్ ఇవ్వడం ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే కథ నెమ్మదిగా సాగడం.. కొన్ని సీన్స్ ముందుగానే ప్రేక్షకులు ఊహించేలా ఉండడం మైనస్.ఎవరెలా చేశారంటే..మలయాళ హీరో టొవినో థామస్ గురించి చెప్పాల్సిన పనిలేదు. సూపర్హీరో పాత్రలో టొవినో ఒదిగిపోయాడు. మరో సూపర్ హీరో గురు సోమసుందరం శిబు పాత్రలో మెప్పించాడు. ఇతర నటీనటులు తమ పాత్రలకు న్యాయం చేశారు. సాంకేతికంగా ఫర్వాలేదు. సుశీన్ నేపథ్య సంగీతం.. సమీర్ సినిమాటోగ్రఫీని ఓకే అనిపించాయి. ఈ వీకెండ్ ఓటీటీల్లో సినిమా చూసేవారు మిన్నల్ మురళిపై ఓ లుక్కేయొచ్చు. -
నా తండ్రి ఇప్పటికీ అక్కడే పనిచేస్తున్నారు: ప్రదీప్ రంగనాథ్
ప్రదీప్ రంగనాథన్, మమితా బైజు హీరో హీరోయిన్లుగా నటిస్తున్న యూత్ఫుల్ సినిమా ‘డ్యూడ్’. కీర్తీశ్వరన్ దర్శకత్వంలో నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అక్టోబరు 17న ఈ చిత్రం విడుదల కానుంది. కొద్దిరోజులుగా ప్రదీప్ రంగనాథన్ పేరు టాలీవుడ్లో వైరల్ అవుతుంది. ఆయన తండ్రి చేస్తున్న పని గురించి కొందరు చర్చించుకుంటే.. మరికొందరు మాత్రం అతనిపై ఒక జర్నలిస్ట్ చేసిన వ్యాఖ్యల గురించి మాట్లాడుకుంటున్నారు. 'మీరు హీరో మెటీరియల్లా లేరు.. కానీ, రెండు సినిమాలకే ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా అరుదు' అంటూ ఒక జర్నలిస్ట్ కామెంట్ చేశారు. దీంతో నెటిజన్లు కూడా ప్రదీప్కు మద్ధతుగా నిలిచారు. జర్నలిస్ట్ వ్యాఖ్యలను తప్పుబట్టారు. రీసెంట్గా కిరణ్ అబ్బవరం కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయకండి అంటూ సదరు జర్నలిస్ట్ను కోరారు.వెండితెరపై ప్రదీప్ రంగనాథ్ ఒక సాధారణ యువకుడిలా కనిపించడమే కాదు నిజ జీవితంలో కూడా అంతేనని చెప్పవచ్చు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండానే సినీ పరిశ్రమలోకి ఆయన ఎంట్రీ ఇచ్చారు. ఎన్నో ఏళ్ల పాటు సరైన ఛాన్స్ కోసం ఆయన కష్టపడ్డారు. ఫైనల్గా విజయం సాధించారు. డబ్బు, పేరు అన్నీ ప్రదీప్కు వచ్చాయి. కానీ, ఇప్పటికీ ఆయన కుటుంబం సాధారణ జీవితమే గడుపుతుంది. ఇదే విషయాన్ని తాజాగా ఒక ఇంటర్వ్యూలో ప్రదీప్ పంచుకున్నారు.నా తండ్రి చెన్నైలో సాధారణ జీవితమే గడుపుతున్నారు. ఒక జిరాక్స్ షాపు నడుపుతూనే మా కుటుంబాన్ని నాన్న పోషించారు. నాకు సినిమా ఛాన్సులతో పాటు పేరు, డబ్బు వచ్చింది. అయినప్పటికీ నాన్న మాత్రం జిరాక్స్ షాప్ నడుపుతూనే ఉన్నారు. ఎప్పటికీ మన మూలాలను మరిచిపోవద్దని ఆయన చెబుతుంటారు. రోజూ ఉదయాన్నే బస్సులోనే షాప్కు వెళ్తారు.. ఒక కారు కొనిస్తానని చెప్పినా సరే దానిని తిరస్కరించారు. ఇప్పటికీ బస్సులోనే ఆయన ప్రయాణం చేస్తారు. సింపుల్గా ఉండటమే నాన్నకు ఇష్టం.' అని ప్రదీప్ చెప్పారు.ప్రదీప్ రంగనాథ్ తన కాలేజీ రోజుల గురించి కూడా గుర్తు చేసుకున్నారు. ఇంటర్మీడియట్లో 98 శాతం మార్కులతో పాస్ అయ్యానని చెప్పారు. కానీ, తనకు ఎక్కువ సినిమాలంటే పిచ్చి అని కూడా తెలిపారు. దీంతో తన తల్లిదండ్రులు తీవ్రంగా ఆందోళన చెందే వారని గుర్తుచేసుకున్నారు. అయితే, చదువును అశ్రద్ధ చేయనని వారికి చెప్పాను. జయం రవితో కొమలి సినిమాను డైరెక్ట్ చేసిన తర్వాత పరిశ్రమలో ఫేమ్ దక్కిందన్నారు. ఆ తర్వాత లవ్ టుడేతో మరింత గుర్తింపు వచ్చిందన్నారు. ప్రదీప్ డైరెక్ట్ చేసిన ఈ రెండు సినిమాలు భారీ విజయాన్ని అందుకున్నాయి.Reacting to the "Hero Material" Controversy, #KiranAbbavaram asks the media personnel to ask him anything but be gentle about the likes of #PradeepRanganathan terming him as our Guest from Other State! pic.twitter.com/xdQ3dATvTi— AndhraBoxOffice.Com (@AndhraBoxOffice) October 11, 2025 -
నా ఫస్ట్ చాయిస్ డైరెక్షన్: రిషబ్ శెట్టి
ఎన్టీఆర్గారు నాకు సోదరుడులాంటివారు. మా కుందాపూర్ మూలాలు ఉన్న అబ్బాయి. ఆయన చేసిన సపోర్ట్కి రుణపడి ఉంటాను. ఇక ప్రశాంత్ నీల్గారితో ఎన్టీఆర్గారు చేస్తున్న సినిమాలో నేను నటిస్తున్నానన్న విషయంపై ప్రస్తుతానికి నేను ‘మ్యూట్’.‘‘భారతదేశం జానపద కథలకు నిలయం. నాకు జానపద కథలు చేయడం అంటే ఇష్టం. ‘కాంతార’ సినిమా కథను నిజాయితీగా చెప్పాలనుకున్నా. అది ప్రేక్షకులకు నచ్చింది’’ అని దర్శక–నిర్మాత–నటుడు రిషబ్ శెట్టి అన్నారు. రిషబ్ శెట్టి హీరోగా నటించి, దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘కాంతార:చాప్టర్ 1’. ‘కాంతార’ (2022) సినిమాకు ప్రీక్వెల్గా ‘కాంతార:చాప్టర్ 1’ రూపొందింది.విజయ్ కిరగందూర్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 2న విడుదలైంది. ఇప్పటికే ఈ సినిమా రూ. 509 కోట్ల వసూళ్లు సాధించి, సక్సెస్ఫుల్గా ప్రదర్శితమవుతోందని యూనిట్ పేర్కొంది. ఈ సందర్భంగా శనివారం విలేకరులతో రిషబ్ శెట్టి చెప్పిన విశేషాలు.⇒ ‘కాంతార’ సినిమాకు ఎలాంటి స్పందన లభించిందో, ‘కాంతార: చాప్టర్ 1’కూ అలాంటి గొప్ప రెస్పాన్సే ప్రేక్షకుల నుంచి లభిస్తోంది ‘కాంతార’ చేసేటప్పుడే ‘కాంతార: చాప్టర్ 1’ గురించిన ఆలోచన ఉంది. ‘కాంతార’ చిత్రానికి వచ్చిన అద్భుతమైన స్పందన చూసి, ‘కాంతార: చాప్టర్ 1’ కథ రాయడం మొదలుపెట్టాను. ⇒ చిన్నప్పట్నుంచి మా ఊరి (కుందాపూర్) కథలు చెప్పాలని ఉండేది. ‘కాంతార’ మా ప్రాంతంలో జరిగిన కథ. అందుకే లొకేషన్స్ను మా ప్రాంతంలోనే తీసుకోవడం జరిగింది. మేజర్ షూటింగ్ని మా ఊర్లో వేసిన ఓ ప్రత్యేకమైన సెట్లో జరిపాం.⇒ నాలో దర్శకుడు ఉన్నాడు... యాక్టర్ ఉన్నాడు. ఈ రెండింటిలో ఏది ఫస్ట్ అంటే డైరెక్షనే అని చెబుతాను. ⇒ ముంబైలోని ఓ నిర్మాణ సంస్థలో డ్రైవర్గా పని చేశాను. ఇప్పుడు మంచి సక్సెస్లో ఉన్నాను. ఆర్టిస్టుగా జాతీయ అవార్డు అందుకున్నాను. నా జర్నీలో భాగమైన అందరికీ ధన్యవాదాలు. అలాగే ‘కాంతార’ జర్నీలో, నా జీవితంలో నా భార్య (ప్రగతి శెట్టి) ఇచ్చిన స పోర్ట్ను మర్చి పోలేను. ఒకవైపు ‘కాంతార’ సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్గా చేస్తూనే, మరోవైపు నన్ను, నా పిల్లలను జాగ్రత్తగా చూసుకుంది. తను డబుల్ రోల్ చేసింది.⇒ ప్రస్తుతం తెలుగులో ఓ పీరియాడికల్ మూవీ, హిందీలో ఛత్రపతి శివాజీ మహారాజ్ బయోపిక్ చిత్రాల అనౌన్స్మెంట్ వచ్చాయి. కానీ నా నెక్ట్స్ ప్రాజెక్ట్ ‘జై హనుమాన్’. -
ర్యాప్ సింగర్ జీవిత ఇతివృత్తంతో బాటిల్
ఎలైట్ టాకీస్ పతాకంపై కే.భాస్కరన్ నిర్మిస్తున్న చిత్రం బాటిల్. 'తంగలాన్' ఫేమ్ అన్భుడన్ అర్జున్, 'గాంధీ కణక్కు' చిత్రంలో చిన్న వయసు అర్చనగా నటించిన ఆరాధ్య హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. నారాయణన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈయన ఇటీవల విడుదలైన దండకారణ్యం చిత్రానికి సహాయ రచయితగానూ, దర్శకుడు శక్తివేల్ వద్ద కోడైరెక్టర్గా పని చేశారు. ఈ మూవీలో దర్శకుడు సుబ్రమణియం శివ, శరవణన్ సుబ్బయ్య, గాయత్రి, మునీశ్కాంత్, సురుళి, ఇడ్లీకొట్టు చిత్రంలో చిన్న వయసు ధనుష్గా నటించిన దిహాన్, దివ్యశ్రీ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. ఆరు పాటలుదర్శకుడు నారాయణన్ మాట్లాడుతూ.. ఒక ర్యాప్ గాయకుడి పూర్తి జీవిత సంఘటనలతో తెరకెక్కుతున్న తొలి తమిళ చిత్రం ఇదే అన్నారు. ఆ గాయకుడు ఎదుర్కొనే సమస్యలతోపాటు ఒక ముఖ్య విషయాన్ని ఈ చిత్రంలో చెప్పబోతున్నట్లు తెలిపా. సరిగ్గా రెండు గంటల పాటు సాగే ఈ చిత్రంలో ఆరు పాటలు ఉంటాయన్నారు. ఈ చిత్రానికి జీవా సంగీతం, ప్రముఖ చాయాగ్రహకుడు సెళియన్ శిష్యుడు యువరాజ్ సినిమాటోగ్రాఫర్గా వ్యవహరిస్తున్నారు. బాటిల్ చిత్ర ఫస్ట్లుక్ పోస్టర్ను విడుదల చేయగా విశేష స్పందన వస్తోందని దర్శకుడు పేర్కొన్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని విషయాలను త్వరలోనే వెల్లడిస్తామన్నారు.చదవండి: ఓటీటీలో హృతిక్ స్టార్మ్ -
కాంతార విజయం.. రిషబ్కు మరో నేషనల్ అవార్డ్ రావచ్చు: స్టార్ డైరెక్టర్
కన్నడ హీరో రిషబ్ శెట్టి నటించిన కాంతారా: చాప్టర్ 1 బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్తో దూసుకుపోతుంది. ఇందులో ఆయన నటన చూసిన ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు. స్వయంగా దర్శకత్వం వహిస్తూనే ఇలా గొప్పగా నటించడం మామూలు విషయం కాదంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే, ఈ సినిమాకు ప్రధాన బలం రిషబ్ శెట్టి మాత్రమేనని చెప్పవచ్చు. దీంతో ఏకంగా ఈ చిత్రం రూ. 500 కోట్ల క్లబ్లో మొదటి వారంలోనే చేరిపోయింది. ఈ క్రమంలో తాజాగా ప్రముఖ దర్శకుడు అట్లీ కుమార్ కాంతార చాప్టర్ 1పై ప్రశంసలు కురిపించారు. రిషబ్ శెట్టి మరోసారి జాతీయ అవార్డ్ అందుకుంటారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.ఇండియా టుడేతో అట్లీ మాట్లాడుతూ.. కాంతార గురించి ఇలా చెప్పారు. 'సినిమా విడుదలైనప్పుడు నేను ఆమ్స్టర్డామ్లో ఉన్నాను. మొదటి రోజు సినిమా చూడటానికి సుమారు రెండున్నర గంటల పాటు కారులో వెళ్లాను. ఫైనల్గా ఫస్ట్ డే సినిమా చూశాను. థియేటర్ నుంచి వచ్చిన వెంటనే రిషబ్కు ఫోన్ చేసాను. అతను నాకు మంచి స్నేహితుడు. అతనంటే నాకు చాలా గౌరవం కూడా.. రిషబ్ శెట్టి చిత్రనిర్మాతలతో పాటు దర్శకులకు కూడా ఎంతోమందికి స్ఫూర్తి అని చెప్పగలను. కాంతార కోసం ఎవరూ చేయలేని పని అతను చేశారు. కాంతారలో నటించడమే కాకుండా దర్శకుడిగా పనిచేయడం అంటే సాధారణమైన విషయం కాదు. మరోకరికి ఇది సాధ్యం కాదని ఒక దర్శకుడిగా నేను చెప్పగలను. ఈ చిత్రంతో రిషబ్ తన నటనకు లేదా దర్శకుడిగా జాతీయ అవార్డ్ అందుకోవాలని ఆశిస్తున్నాను.' అని అట్లీ పేర్కొన్నారు.2022లో విడుదలైన కాంతార చిత్రానికి గాను ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డ్ను రిషబ్ శెట్టి అందుకున్నారు. అయితే, కాంతార చాప్టర్-1తో మరోసారి రిషబ్ నేషనల్ అవార్డ్ అందుకుంటారని దర్శకుడు అట్లీ పేర్కొన్నారు. 'జవాన్' చిత్రంతో బాలీవుడ్లో అట్లీ గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ మూవీతో ఉత్తమ నటుడిగా షారుఖ్ ఖాన్ కూడా జాతీయ అవార్డ్ అందుకున్నారు. -
'బెస్ట్ ఫేక్ న్యూస్' అవార్డ్ ఇవ్వండి.. సైమాకు సుదీప్ కౌంటర్
కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ విలన్గా నటించబోతున్నారంటూ SIIMA (సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్) తన ఎక్స్ ఖాతాలో ఒక పోస్ట్ చేసింది. దీంతో సుదీప్( Sudeep) కూడా తనదైన స్టైల్లో సైమాపై పంచ్లు వేశారు. తమిళ హీరో శింబు, వెట్రిమారన్ మూవీలో విలన్ పాత్ర కోసం సుదీప్, ఉపేంద్ర ముందు వరుసలో ఉన్నారంటూ సైమా ఒక పోస్ట్ చేసింది. ఈ క్రమంలోనే సుదీప్ రియాక్ట్ అయ్యారు.సైమా గురించి సుదీప్ ఇలా అన్నారు. మీరు సైమా అవార్డ్స్ పేరుతో సాయంత్ర సమయంలో చేసే వేడుకపై నాకు అపారమైన గౌరవం ఉంది. కానీ, మీ ఈ వార్తల విషయానికొస్తే.. ఒక సూచన ఇవ్వాలనిపించింది. ఇక నుంచి మీ మూలాలను మార్చుకొని గాసిప్స్ వార్తలు ప్రచారం చేసుకోండి. వచ్చే ఏడాది నుంచి బెస్ట్ ఫేక్ న్యూస్ అవార్డ్ పేరుతో సైమాలో చోటు కల్పించండి. అందులోనైనా మీ వార్తకు అవార్డ్ వస్తుందో లేదో తెలుసుకోవాలనుకుంటున్నాను. అని సుదీప్ కౌంటర్ ఇచ్చారు. అందుకు సైమా కూడా సరదాగా స్పందించింది. మీరు ఇచ్చిన సలహా తప్పకుండా పాటిస్తాం అంటూ మరో ట్వీట్ చేసింది. తమకు వచ్చే సమాచారాన్ని ఇంకాస్త మెరుగుపరుచుకుంటామని చెప్పింది. అయితే మొదట చేసిన పోస్ట్ను సైమా వెంటనే తొలగించింది.కన్నడ బిగ్బాస్కు హోస్ట్గా ఉన్న సుదీప్.. తను నటించిన కొత్త చిత్రం 'మార్క్' కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. 2025 క్రిస్మస్ కానుకగా ఈ మూవీ విడుదల కానుంది. ఈ చిత్రానికి విజయ్ కార్తీకేయ దర్శకత్వం వహించారు. గతేడాది విడుదలై 'మాక్స్' చిత్రానికి కూడా ఆయనే దర్శకత్వం వహించారు. అయితే, శివరాజ్కుమార్, ఉపేంద్ర, రాజ్ బి. శెట్టి నటించిన 45తో మార్క్ చిత్రానికి గట్టి పోటీ తప్పదని తెలుస్తోంది. ఆపై అదే సమయంలో దర్శన్ నటించిన ది డెవిల్ కూడా విడుదల కానుంది.Well @siima ...Huge respect for wat u do wth ua awards evenings. As for these news are concerned I have a suggestion.Whisper🤫: change ur sources. 🤗Also wanted to know if there is a "Best Fake News Award" coming up next SIIMA!! 😁 https://t.co/ydkA7k1E4W— Kichcha Sudeepa (@KicchaSudeep) October 10, 2025 -
శ్రీలీలకు గోల్డెన్ ఛాన్స్.. క్రేజీ హీరోతో రెండు సినిమాలు
ఇటీవల అమరన్ చిత్రంతో సంచలన విజయాన్ని అందుకుని మదరాసి చిత్రంతో కమర్షియల్ సక్సెస్ను సాధించిన నటుడు శివకార్తికేయన్. ఈయన తాజాగా సుధా కొంగర దర్శకత్వంలో పరాశక్తి చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. ఇది ఈయన నటిస్తున్న 25వ చిత్రం అన్నది గమనార్హం. నటుడు రవి మోహన్ ప్రతి నాయకుడిగా నటిస్తున్న ఇందులో నటుడు అధర్వ ముఖ్యపాత్రను పోషిస్తున్నారు. టాలీవుడ్లో క్రేజీ కథానాయకిగా గుర్తింపు పొందిన శ్రీలీల( Sreeleela) కోలీవుడ్ ఎంట్రీకి లైన్ క్లియర్ అయింది. ఈ చిత్రం ద్వారా నేరుగా తమిళ ప్రేక్షకులకు ఆమె పరిచయం అవుతున్నారు. కాగా రాజకీయ నేపథ్యంతో రూపొందుతున్న ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ ప్రాజెక్ట్ పూర్తి అయిన వెంటనే సిబి చక్రవర్తి దర్శకత్వంలో శివకార్తికేయన్ నటించబోతున్నారని సమాచారం. ఇంతకు ముందే వీరిద్దరి కాంబినేషన్లో డాన్ వంటి సూపర్ హిట్ చిత్రం రూపొందిందన్నది గమనార్హం. ఈ చిత్రం నవంబర్ నెలలో సెట్స్ పైకి వెళ్లనున్నట్లు కోలీవుడ్లో వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందించనున్నారట.టీ మూవీలో కూడా నటి శ్రీలీల కథానాయకిగా నటించనున్నట్లు గట్టిగానే ప్రచారం జరుగుతోంది. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే లేదు. ఇదే గనుక నిజం అయితే ఈ బ్యూటీ బ్యాక్ టు బ్యాక్ శివకార్తికేయన్తో సినిమాలు చేసిన హీరోయిన్గా గుర్తింపు పొందుతుంది. -
నా డైరెక్షన్లోనే ఆ బయోపిక్ ఉంటుంది
‘‘ప్రస్తుతం షూటింగ్ సమయంలో షాట్ ఓకే అయిన తర్వాత నటీనటులు వెళ్లి తాము ఎలా చేశామో అని మానిటర్లో చూస్తుంటారు. ప్రతిసారీ వెళ్లి మానిటర్ చూడటం వల్ల సమయం వృథా అని నా భావన. మానిటర్ చూడటం డైరెక్టర్ పని. ఆయనకి సన్నివేశం బాగా వచ్చిందంటే ఓకే.. లేకుంటే మరో టేక్ చెబుతారు’’ అని శరత్ కుమార్ తెలిపారు. ప్రదీప్ రంగనాథన్, మమిత బైజు జంటగా నటించిన చిత్రం ‘డ్యూడ్’. కీర్తీశ్వరన్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 17న విడుదల కానుంది.ఈ సినిమాలో కీలకపాత్ర చేసిన శరత్ కుమార్ విలేకరులతో మాట్లాడుతూ–‘‘నెనెప్పుడూ కథలో ముఖ్య భాగమయ్యేపాత్రలు చేయడానికే ఇష్టపడతాను. డైరెక్టర్ కీర్తీశ్వరన్ ‘డ్యూడ్’ కథ చెప్పినప్పుడు ప్రదీప్కి మావయ్యపాత్ర అన్నారు. నాపాత్ర కథలో చాలా కీలకం. ఒక కుటుంబంలో ఇలాంటి ఓ ఘటన జరిగితే సమాజం ఎలా స్పందిస్తుంది? అనే కోణంలో ‘డ్యూడ్’ని డైరెక్టర్ చాలా అద్భుతంగా చూపించారు. వినోదం, భావోద్వేగాలు కొత్తగా ఉంటాయి. నాపాత్రలో డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి. సెట్స్లో ఉన్నప్పుడు సీనియర్ని అనే ఆలోచనతో కాకుండా నేను కేవలం శరత్ కుమార్ అనే ఆలోచనతో ఉంటాను.ఇంట్లో నేను, రాధిక, వరలక్ష్మి సినిమాల గురించి మాట్లాడుతుంటాం. వరలక్ష్మి ఇప్పుడు డైరెక్టర్ అవుతోంది. తన కథని రెండు మూడు రోజుల్లో వింటాను. ఇన్నేళ్ల కెరీర్లో ఎన్నోపాత్రలు చేశాను. అయితే సుభాష్ చంద్రబోస్గారి బయోపిక్ చేయాలని ఉంది. ఈ సినిమాకి నేనే దర్శకత్వం వహిస్తాను. ప్రస్తుతం ‘మిస్టర్ ఎక్స్’ సినిమా చేస్తున్నాను. బాలీవుడ్లో ఓ మూవీ, గౌతమ్ మీనన్తో ఒక సినిమా చేస్తున్నాను’’ అని చెప్పారు. -
జైలులో దర్శన్.. కొత్త సినిమా రొమాంటిక్ సాంగ్ విడుదల
కన్నడ హీరో దర్శన్ జైలులో ఉండగానే ఆయన నటించిన సినిమా విడుదల కానుంది. రేణుకాస్వామి హత్య కేసులో జైలుకెళ్లిన దర్శన్..బెయిల్పై బయటకొచ్చినప్పటికీ సుప్రీం కోర్టు ఎంట్రీతో ఆయన మళ్లీ జైలుకెళ్లారు. అయితే, దర్శన్ నటించిన కొత్త సినిమా 'డెవిల్' విడుదలకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే ఒక పాటను తాజాగా విడుదల చేశారు. దీనిని సింగర్స్ కపిల్ కపిలన్, చిన్మయి శ్రీపాద ఆలపించారు. ఈ మూవీ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. డిసెంబర్ 12న ఈ మూవీని విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఇందులో దర్శన్కు జోడీగా రచన రాయ్ నటించింది. దర్శకుడు ప్రకాష్ వీర్ తెరకెక్కించారు. ఈ మూవీ ప్రమోషన్ టైమ్లో ఆయన బెయిల్ నుంచి బయటకు రావచ్చని సమాచారం. -
అందాల బ్యూటీ రాశి ఖన్నా.. రీ ఎంట్రీ ఇవ్వనుందా?
తన పేరులోనే రాశిని పొందుపరచుకున్న నటి రాశిఖన్నా. హీరోయిన్గానూ తన రాశి బాగానే ఉంది. తమిళం, తెలుగు, హిందీ భాషల్లో నటిస్తూ పాన్ ఇండియా రేంజ్కు ఎదిగిన భామ తమిళంలో ఇమైకా నొడికల్ చిత్రంతో ఎంట్రీ ఇచ్చారు. నయనతార ప్రధాన పాత్రను పోషించిన ఈ చిత్రంలో అధర్వ కథానాయకుడిగా నటించారు. ఆ చిత్రం కమర్షియల్గా మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత నటి రాశిఖన్నా తమిళంలో కొన్ని చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.రాశి ఖన్నా చివరిగా ధనుశ్, నిత్యామీనన్ జంటగా నటించిన తిరుచిత్రంబలం చిత్రంలో కీలకపాత్రను పోషించారు. ఆ చిత్రం కూడా మంచి విజయాన్ని సాధించింది. అయినా ప్రస్తుతం రాశి ఖన్నా వరుసగా చిత్రాలు చేయడం లేదు. ఆమెకు అవకాశాలు రాకపోవడం లేక ఇతర భాషల్లో నటించడంతో సమయం సరిపోవడం లేదా అనేది తెలియాల్సి ఉంది. అయితే సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్గా ఉండే ఈ అమ్మడు అవసరమైతే అందాల ఆరబోతకు సై అంటున్నారు. అదేవిధంగా కోలీవుడ్లో మంచి చిత్రాల్లో నటించాలన్న కోరికను ఈ బ్యూటీ వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఒక ఈవెంట్లో పాల్గొన్న రాశిఖన్నా తన భావాలను వ్యక్తం చేస్తూ అభిమానులు ఇష్టపడే కథానాయకగా సినిమాల్లో కొనసాగడం సంతోషంగా ఉందన్నారు. అయితే ఇంకా తన జీవితంలో పెద్ద కల కోసం ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. అంతా మంచే జరుగుతుందని ఆశిస్తున్నట్లు రాశిఖన్నా తెలిపారు -
కమల్ హాసన్పై తిరగబడ్డ నటి.. తెలుగు బిగ్బాస్లో వైల్డ్కార్డ్ ఎంట్రీ
తెలుగు బిగ్బాస్ తొమ్మిదో సీజన్ ప్రారంభమై నెలరోజులవుతోంది. మొదటి రెండు వారాల్లో ఉన్నంత ఊపు ఇప్పుడు లేకుండా పోయింది. గొడవలతో అట్టుడికిన హౌస్ తర్వాత చప్పున చల్లారిపోయింది. కంటెస్టెంట్లకు ఎక్కువ హింట్స్ వెళ్లడం వల్లే అందరూ సైలెంట్ అయిపోయారు. ఏం చేస్తే ఏమవుతుందో? అన్న జంఝాటంలో పడిపోయారు. ఇలాగైతే ఈ సీజన్.. ఆరో సీజన్ కంటే అట్టర్ ఫ్లాప్గా మారడం ఖాయం. ఆరుగురు కన్ఫార్మ్!అందుకే బిగ్బాస్ (Bigg Boss Telugu 9) వైల్డ్ కార్డులను దింపబోతున్నాడు. ఈ ఆదివారం ఆరుగురు కంటెస్టెంట్లు హౌస్లో ఎంట్రీ ఇస్తున్నారు. దివ్వెల మాధురి, రమ్య మోక్ష(అలేఖ్య చిట్టి పికిల్స్ సోదరి), నటులు నిఖిల్ నాయర్, గౌరవ్, ఆయేషా, శ్రీనివాస్ సాయి హౌస్లో అడుగుపెట్టడం ఖాయంగా కనిపిస్తోంది. వీరిలో ఆయేషా జీనత్పై కాస్త హైప్ ఎక్కువగా ఉంది. ఊర్వశివో రాక్షసివో, సావిత్రమ్మగారి అబ్బాయి సీరియల్తో తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరైంది. కిర్రాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్ షోలోనూ మెరిసింది. తమిళ బిగ్బాస్లో..తమిళంలో అనేక సీరియల్స్ చేసింది. ఉప్పు పులి కారం అనే తమిళ వెబ్ సిరీస్లోనూ యాక్ట్ చేసింది. తమిళ చిత్రం రాంబోలోనూ నటించింది. అయితే ఆమెకు క్రేజ్ తీసుకొచ్చింది మాత్రం బిగ్బాస్ షో! అవును, ఆయేషా తమిళ బిగ్బాస్ ఆరో సీజన్లో పాల్గొని వివాదాస్పద కంటెస్టెంట్గా నిలిచింది. ఓపక్క అల్లరి చేస్తూ, మరోపక్క తనను విమర్శిస్తే ఉగ్రరూపం చూపిస్తూ ఆడియన్స్ను ఎంటర్టైన్ చేసింది. ఆ సమయంలో ఆయేషాపై ఆమె మాజీ ప్రియుడు దేవ్ సంచలన ఆరోపణలు చేశాడు.రెండుసార్లు పెళ్లి?ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో అవకాశాలు రాగానే తనను వదిలేసిందన్నాడు. పెళ్లి చేసుకుందామని ఇంటికి వెళ్లి అడిగితే అందరూ కలిసి అవమానించారని, కొట్టి పంపించారన్నాడు. తనతో బంధం తెంచేసుకుని కొంతకాలం నటుడు విష్ణుతో ప్రేమాయణం నడిపిందని, ఆ తర్వాత అతడిని వదిలేసి యోగేశ్తో రిలేషన్షిప్ మొదలుపెట్టిందని ఆరోపించాడు. తనకిప్పటికే రెండుసార్లు పెళ్లయిందని బాంబు పేల్చాడు. వీటన్నింటి గురించి ఆయేషా క్లారిటీ ఇవ్వలేదు. అయితే యోగేశ్తో ఎంగేజ్మెంట్ వరకు వెళ్లిన ఆయేషా.. తర్వాత ఆ నిశ్చితార్థాన్ని రద్దు చేసుకుంది.కమల్ హాసన్నే ఎదిరించిన లేడీఇక షోలో ఆయేషాతో వేరే కంటెస్టెంట్లకు మధ్య ఉన్న గొడవను సద్దుమణిగించే ప్రయత్నం చేశాడు కమల్ హాసన్. హోస్ట్ బుజ్జగిస్తున్నట్లుగా మాట్లాడుతుంటే ఆయేషా మాత్రం.. నన్ను తప్పుగా చిత్రీకరించొద్దు అని ఎదురుతిరిగింది. అప్పట్లో ఈ సంఘటన బాగా వైరల్ అయింది. బిగ్బాస్ షోలో రెండు నెలలవరకు కొనసాగింది. మరి ఈ బ్యూటీ ఇక్కడ కూడా వైల్డ్ఫైర్లా ఉంటుందా? తన ఆటతో ఆకట్టుకుంటుందా? అనేది చూడాలి! View this post on Instagram A post shared by AYSHA🦋 (@aysha7__official) చదవండి: ఆ హీరోలు 8 గంటలే పని చేస్తున్నారు: దీపికా పదుకొణె -
'కాంతార' రూ.500 కోట్లు.. రెండో స్థానంలో రిషబ్
‘కాంతార చాప్టర్ 1’ (Kantara Chapter 1) రూ.500 కోట్ల క్లబ్లో చేరింది. కన్నడ చిత్ర పరిశ్రమలో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన సినిమాల జాబితాలో ఈ మూవీ రెండో స్థానాన్ని దక్కించుకుంది. అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం కేవలం మొదటి వారంలోనే రూ. 509 కోట్లు రాబట్టినట్లు తాజాగా మేకర్స్ ప్రకటించారు. ఈమేరకు ఒక పోస్టర్ను కూడా షేర్ చేశారు. కేవలం ఒక వారంలోనే ఈ రేంజ్ కలెక్షన్స్ రాబట్టడం విశేషం.రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా వారం రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 509 కోట్లు రాబట్టడంతో అభిమానులో పోస్టులు పెడుతున్నారు. రీసెంట్గా విడుదలైన రజనీకాంత్ కూలీ సినిమా జీవితకాల కలెక్షన్స్ను కూడా కాంతార చాప్టర్1 అధిగమించింది. రిషబ్ శెట్టి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రుక్మిణి వసంత్, గుల్షన్ దేవయ్య, జయరామ్ కూడా కీలక పాత్రలు పోషించారు. 2022లో వచ్చిన కాంతారకు ప్రీక్వెల్గా ఈ మూవీనికి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.అత్యధిక వసూళ్లు సాధించిన కన్నడ చిత్రాలలో రోండో స్థానంలో కాంతార చాప్టర్ 1 ఉంది. అయితే, మొదటి స్థానంలో యష్ నటించిన కేజీఎఫ్ చాప్టర్ 2 (రూ. 1,215 కోట్లు) ఉంది. కానీ, కేజీఎఫ్ రికార్డ్ను కాంతార చేరుకోవడం అంత సులువైన విషయం కాదని చెప్పవచ్చు. సుమారు రూ. 800 కోట్ల ఫైనల్ కలెక్షన్స్తో ఈ మూవీ సత్తా చాటే ఛాన్స్ ఉంది. అయితే, కన్నడలో అత్యధికంగా కలెక్షన్స్ రాబట్టిన టాప్ ఫైవ్ చిత్రాలు ఇలా ఉన్నాయి. మొదటి స్థానంలో కేజీఎఫ్ చాప్టర్ 2 (రూ. 1,215 కోట్లు), కాంతార చాప్టర్-1 (రూ. 509 కోట్లు), కాంతార (రూ. 450 కోట్లు), కేజీఎఫ్ చాప్టర్-1 (రూ. 250 కోట్లు), విక్రాంత్ రోణా (రూ. 210 కోట్లు) వరుసగా ఉన్నాయి. -
నయనతార, కవిన్ కొత్త సినిమా టైటిల్ ఎలా ఉందంటే..?
నయనతార కథానాయకిగా, కవిన్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం 'హాయ్'.. జి.స్టూడియోస్, ది రౌడీ పిక్చర్స్, సెవెన్ స్క్రీన్ స్టూడియో సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి విష్ణుఎడవన్ కథ, దర్శకత్వం నిర్వహిస్తున్నారు. ఈయన దర్శకుడు లోకేష్ కనకరాజ్ వద్ద ఖైదీ, మాస్టర్, విక్రమ్ చిత్రాలకు అసోసియేట్గా పనిచేశారన్నది గమనార్హం. ఇందులో దర్శకుడు కె.భాగ్యరాజ్, ప్రభు, రాధిక, సత్యన్, ఆదిత్య కదిర్, ఖురేషి ఇతర సినీ ప్రముఖులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. నయనతార, కవిన్ కలిసి నటిస్తున్న తొలి చిత్రం కావడంతో హాయ్పై మంచి అంచనాలు నెలకొంటున్నాయి. ఈ చిత్ర ఫస్ట్లుక్ పోస్టర్లు తాజాగా విడుదల చేశారు. పోస్టర్ కొత్తగా ఉండడంతో దీనికి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వస్తోందని యూనిట్ సభ్యులు తెలిపారు. చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ ఇది ప్రేమ, వినోదం కలగలిపిన సహజత్వంతో కూడిన కుటుంబ కథా చిత్రంగా ఉంటుందని పేర్కొన్నారు. ఈ చిత్ర షూటింగ్ను చెన్నై పరిసర ప్రాంతాల్లో నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికి 20 రోజులపాటు షూటింగ్ నిర్వహించినట్లు చెప్పారు. ఈ చిత్రానికి జెన్ మార్టిన్ సంగీతాన్ని, రాజేష్ శుక్లా చాయాగ్రహణం అందిస్తున్నారు. -
అందుకే బిగ్బాస్ ఇంటికి తాళం.. రెండురోజుల్లో మళ్లీ షురూ
కన్నడ బిగ్బాస్ సీజన్– 12 (Kannada Bigg Boss 12) ఊపిరి పీల్చుకుంది. గురువారం నుంచి పునఃప్రారంభమైంది. బిడది వద్ద ఓ స్టూడియోలో నిర్వహిస్తున్న బిగ్బాస్కు కాలుష్య నియంత్రణ మండలితో సహా వివిధ శాఖల అనుమతులు లేవంటూ మంగళవారం నాడు జిల్లా కలెక్టరు, ఇతర అధికారులు ఆగమేఘాలపై షోను బంద్ చేసి హౌస్కు తాళం వేయడం తెలిసిందే. ఈ వ్యవహారం తీవ్ర దుమారం రేకెత్తించింది. డిప్యూటీ సీఎం డీకే శివకుమారే మూసివేయించారని కేంద్రమంత్రి హెచ్డీ కుమారస్వామి ఆరోపించారు. ఇది కక్ష సాధింపు చర్యగా అభిప్రాయపడ్డారు. అయితే చివరకు హౌస్ మళ్లీ తెరుచుకుంది. సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రిసార్టులో ఉంచిన పోటీదారులను గురువారం తెల్లవారుజామున బిగ్బాస్ స్టూడియోకు తరలించారు. హౌస్కు వెళ్లగానే కార్యక్రమం తిరిగి మొదలైంది.డిప్యూటీ సీఎం చెప్పారు: కలెక్టరుఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సూచనల మేరకే బిగ్బాస్కు అనుమతించినట్లు జిల్లా కలెక్టర్ యశవంత్ గురకర్ తెలిపారు. జిల్లా కలెక్టర్, సబ్ కలెక్టర్ ఇద్దరు కలిసి మూతపడిన గేటును తెరిచారు. ఆ తరువాత పోటీదారులు లోపలకు వెళ్లారు. దీంతో శివకుమార్కు యాంకర్, హీరో కిచ్చా సుదీప్ ధన్యవాదాలు తెలిపారు.బెస్కాం నోటీసులుబిగ్బాస్ స్టూడియోలో అన్ని సమస్యలను 10 రోజుల్లోగా పరిష్కరించుకోవాలని, లేదంటే కరెంటు కట్ చేస్తామని బిడది బెస్కాం ఎఈఈ మోహిత నోటీసులిచ్చి వెళ్లారు. అనుమతులు లేనందువల్ల స్టూడియోకు ఎందుకు కరెంట్ను కట్ చేయాకూడదో చెప్పాలని నోటీసులో కోరారు. పర్యావరణ అనుమతులు లేవన్న కారణంతోనే.. బిగ్బాస్ ఇంటికి ఒకరోజు తాళం వేశారు. కాగా, బిగ్బాస్కు వ్యతిరేకంగా స్టూడియో ముందు కన్నడ సంఘాలు ధర్నా చేశాయి. ఇకపోతే కన్నడ బిగ్బాస్ 12వ సీజన్.. సెప్టెంబర్ 28న ప్రారంభమైంది.చదవండి: సినిమాల విషయంలో చిన్న, పెద్ద అని తేడా చూడను: హీరోయిన్ -
సినిమాల విషయంలో చిన్న, పెద్ద అని తేడా చూడను: హీరోయిన్
సినిమాల విషయంలో చిన్న, పెద్ద అని ఎటువంటి తారతమ్యం చూపనని సోనియా అగర్వాల్ (Sonia Agarwal) అన్నారు. ఈమె ప్రధాన పాత్ర పోషించిన తాజా చిత్రం విల్. ఫుడ్ స్టెప్స్ ప్రొడక్షన్స్, కొత్తారి మద్రాస్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ బ్యానర్లపై ఈ మూవీ తెరకెక్కింది. ఎస్.శివరామన్ కథ, దర్శకత్వం బాధ్యతలు నిర్వహించగా.. సోనియా అగర్వాల్ ప్రధాన పాత్ర పోషించారు. విక్రాంత్ ఇన్వెస్టిగేషన్ అధికారిగా నటించారు. ఈ మూవీ శుక్రవారం (అక్టోబర్ 10న) రిలీజైంది. ఈ క్రమంలో గురువారం చెన్నైలో నిర్వహించిన మీడియా సమావేశంలో దర్శకుడు శివరామన్ మాట్లాడుతూ.. ఇది కోర్టు నేపథ్యంలో సాగే వైవిధ్య భరిత కథాచిత్రంగా ఉంటుందన్నారు. చిన్న, పెద్ద అన్న బేధాలు చూడనుసోనియా అగర్వాల్ జడ్జిగా నటించగా, అలోకియా చిన్న వివాదాస్పద పాత్రలో కనిపించనున్నారని చెప్పారు. సోనియా అగర్వాల్ సోదరుడు సౌరబ్ అగర్వాల్ను సంగీత దర్శకుడుగా పరిచయం చేసినట్లు చెప్పారు. సోనియా అగర్వాల్ మాట్లాడుతూ.. శివరామన్ దర్శకత్వంలో తాను ఇంతకుముందు తనిమై అనే చిత్రంలో నటించానని, ఆ తర్వాత ఇప్పుడు విల్ చిత్రంలో నటించినట్లు చెప్పారు. తాను చిత్రాల విషయంలో చిన్న, పెద్ద అన్న తారతమ్యాన్ని చూడనని, ఇంతకుముందు రూ.కోటి వ్యయంతో రూపొందించిన కాదల్ కొండేన్ చిత్రం ఘనవిజయాన్ని సాధించిందన్న విషయాన్ని గుర్తు చేశారు.చదవండి: అప్పట్నుంచే తెలుగు నేర్చుకుంటున్నా!: శ్రీనిధి శెట్టి -
అప్పట్నుంచే తెలుగు నేర్చుకుంటున్నా!: శ్రీనిధి శెట్టి
‘‘నాకు తెలుగు భాష అంటే చాలా ఇష్టం. ఇంజనీరింగ్ చదివే రోజుల్లో కొంతమంది తెలుగు ఫ్రెండ్స్ నాకు ఉన్నారు. వారిని అడిగి తెలుగు పదాలు, వాక్యాలు ఓ లిస్ట్గా రాసుకుని, నేర్చుకోవడం మొదలుపెట్టాను. అప్పట్నుంచే తెలుగు మాట్లాడటం అలవాటైంది. సినిమా సెట్స్లో తెలుగువాళ్లను తెలుగులోనే మాట్లాడమని చెప్పి, నేను కూడా వారితో తెలుగులోనే మాట్లాడతాను. అయితే తెలుగులో నేను ఇంకాస్త బెటర్ కావాలి.అందుకే ‘తెలుసు కదా’ చిత్రానికి డబ్బింగ్ చెప్పలేకపోయాను. ఇకపై నా ప్రతి సినిమాకు నేనే డబ్బింగ్ చెబుతాను’’ అని హీరోయిన్ శ్రీనిధి శెట్టి అన్నారు. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన చిత్రం ‘తెలుసు కదా’. ఈ చిత్రంలో రాశీ ఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్లుగా నటించారు. టీజీ విశ్వప్రసాద్, కృతీప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 17న విడుదల కానుంది. ఈ సందర్భంగా గురువారం హైదరాబాద్లో జరిగిన విలేకరుల సమావేశంలో శ్రీనిధి శెట్టి చెప్పిన సంగతులు. ⇒ ‘తెలుసు కదా’ మంచి ఫీల్ గుడ్ ఎంటర్టైన్మెంట్ సినిమా. ఒక హీరో, ఇద్దరు హీరోయిన్లు అనగానే అందరూ ఇది ట్రయాంగిల్ లవ్స్టోరీ మూవీ అనుకుంటారు. కానీ ఇందులో మేం ఓ కొత్త అంశాన్ని చూపించాం. ఆ అంశం ఏమిటి? అనేది థియేటర్స్లో చూసినప్పుడు ఆడియన్స్ సర్ప్రైజ్ అవుతారు. వరుణ్ (సిద్ధు పాత్ర పేరు), రాగ (శ్రీనిధి), అంజలి (రాశీ ఖన్నా) క్యారెక్టర్స్కు ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతారు. మా పాత్రల్లో కొంచెం గ్రే షేడ్స్ ఉన్నాయి. దర్శకురాలు నీరజ విజన్ ప్రేక్షకులకు నచ్చుతుంది. ⇒ తెలుగులో నా తొలి సినిమాగా ‘హిట్ 3’ విడుదలైంది. కానీ తెలుగులో నేను సైన్ చేసిన తొలి సినిమా ‘తెలుసు కదా’. ‘కేజీఎఫ్, కోబ్రా, హిట్ 3’ వంటి వరుస యాక్షన్ సినిమాలు చేసిన తర్వాత చేసిన రొమాంటిక్ మూవీ ‘తెలుసు కదా’ నాకు కొత్తగా అనిపించింది. ఇందులో నేను పోషించిన రాగ పాత్రకు, రియల్ లైఫ్లో నాకు పెద్దగా పోలికలు లేవు.⇒ ఓ నటిగా అన్ని రకాల జానర్ సినిమాలు చేయాలని ఉంది. ప్రస్తుతం తెలుగులో ఓ సినిమా కమిట్ అయ్యాను. -
టైటిల్ ప్లీజ్ గురూ!
ఒక సినిమాకు అందులోని హీరో, దర్శకుడు, హీరోయిన్ సెంట్రాఫ్ ఎట్రాక్షన్గా ఉంటారు. అలాగే ఆ సినిమా ప్రేక్షకులకు చేరువ కావడానికి, మరింత ప్రమోషన్కు ఆ సినిమా టైటిల్ చాలా ముఖ్యం. అందుకే టైటిల్ విషయంలో చాలా కేర్ తీసుకుంటుంది యూనిట్. స్టార్ హీరో సినిమా అయితే ఏ టైటిల్ పెడతారా? అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తారు. ఆ కోవకు చెందిన తెలుగు చిత్రాలు పదికి పైనే ఉన్నాయి.ఈ చిత్రాలకు వర్కింగ్ టైటిల్స్ ఉన్నప్పటికీ, హీరో అభిమానులు ఒరిజినల్ ‘టైటిల్ ప్లీజ్ గురూ..!’ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇందుకు తగ్గట్లుగానే ఆయా చిత్రబృందాల మేకర్స్ కొన్ని టైటిల్స్ను పరిశీలిస్తున్నారు. మరి... ఏ హీరో సినిమాకు, ఏ టైటిల్ పరిశీలిస్తున్నారనే విషయంపై మీరూ ఓ లుక్ వేయండి.కింగ్ 100నాగార్జున కెరీర్లోని వందో సినిమా షూటింగ్ పనులు ఊపందుకున్నాయని తెలిసింది. తమిళ దర్శకుడు ఆర్ఏ కార్తీక్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఆల్రెడీ ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభమైందని సమాచారం. నాగార్జున పాల్గొంటుండగా కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట మేకర్స్. ఈ సినిమా టైటిల్ను గురించి కూడా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.నాగార్జున కెరీర్లోని ఈ వందో సినిమాకు ‘కింగ్ 100’, ‘కింగ్ 100 నాటౌట్’, ‘లాటరీ కింగ్’ అనే టైటిల్స్ తెరపైకి వచ్చాయి. మరి... ఈ టైటిల్లో ఏ టైటిల్ని ఖరారు చేస్తారో మరికొన్ని రోజుల్లో తెలుస్తుంది. వచ్చే ఏడాది ఈ సినిమా విడుదల కానుంది. ఇదిలా ఉంటే... నాగార్జున హీరోగా నటించిన ‘మన్మథుడు 2’ సినిమాలో కీర్తీ సురేష్ ఓ చిన్న గెస్ట్ రోల్ చేశారు. అలాగే కథ రీత్యా ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్స్కు చాన్స్ ఉందట.కీర్తీ సురేష్ ఓ లీడ్ హీరోయిన్గా చేస్తారనే ప్రచారం సాగుతోంది. ఇంకా నాగార్జున, టబుల కాంబినేషన్లో ‘నిన్నే పెళ్లాడతా’ ఎంతటి బ్లాక్బ స్టర్ హిట్ సాధించిందో తెలిసిందే. నాగార్జున వందో సినిమాలోనూ టబు భాగమయ్యారనే టాక్ కూడా వినిపిస్తోంది. ఈ విషయాలపై పూర్తి స్థాయి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అన్నపూర్ణ స్టూడియోస్పై నాగార్జున నిర్మిస్తున్న ఈ మూవీ వచ్చే ఏడాది విడుదల కానుంది.ఆనంద నిలయం? హీరో వెంకటేశ్, దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో ఓ మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమా రానుంది. ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటిస్తారనే ప్రచారం సాగుతోంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై సూర్యదేవర రాధాకృష్ణ (చిన బాబు) నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ సినిమాకు చెందిన ఫొటోషూట్ కూడా జరిగింది. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఈ నెలలోనే ప్రారంభం కానుందని తెలిసింది. వెంకటేశ్ కెరీర్లోని ఈ 77వ సినిమా ప్రధాన కథాంశం వైజాగ్ నేపథ్యంలో సాగుతుందని, హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందించనున్నారని సమాచారం.కాగా, ఈ సినిమా టైటిల్ ఇదంటూ పేర్లు తెరపైకి వచ్చాయి. ఈ చిత్రానికి ‘ఆనంద నిలయం’, ‘వెంకట రమణ’, ‘వెంకటరమణ కేరాఫ్ ఆనంద నిలయం’ అనే టైటిల్స్ పరిశీలనలో ఉన్నట్లుగా ఫిల్మ్నగర్ సమాచారం. కాగా, త్రివిక్రమ్ దర్శకత్వంలోని సినిమాల టైటిల్స్ ప్రధానంగా ‘అ ఆ’ అక్షరాలతోనే ప్రారంభం అవుతుంటాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు ‘ఆనంద నిలయం’ అనే టైటిల్ తెరపైకి రావడం ఆసక్తికరమైన విషయం.మరోవైపు వెంకటేశ్ హీరోగా నటించిన బ్లాక్బస్టర్ చిత్రాలు ‘మల్లీశ్వరి’ ‘నువ్వు నాకు నచ్చావ్’ సినిమాలకు త్రివిక్రమ్ రైటర్గా పని చేశారు. ఇప్పుడు వెంకటేశ్ హీరోగా త్రివిక్రమ్ సినిమా చేస్తున్న నేపథ్యంలో ఈ మూవీపై ఇటు ఇండస్ట్రీలో అటు ఆడియన్స్లో అంచనాలు ఉండటం సహజం. వచ్చే ఏడాది వేసవిలో ఈ సినిమాను రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని తెలిసింది.భర్త మహాశయులకు విజ్ఞప్తి‘భర్త మహాశయులకు విజ్ఞప్తి, రోల్ మోడల్, అనార్కలి’... ఇప్పటివరకు రవితేజ 76వ సినిమాకు సంబంధించి వినిపిస్తున్న టైటిల్స్ ఇవి. ఈ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ సినిమాను కిశోర్ తిరుమల దర్శకత్వంలో సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ స్పెయిన్లో జరుగుతోంది. కొంత టాకీ పార్టుతో పాటు పాటలను కూడా చిత్రీకరిస్తున్నారు. చిత్రీకరణ తుది దశకు చేరుకుంది.పైగా, ఈ మూవీని వచ్చే సంక్రాంతికే విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా టైటిల్ను అతి త్వరలోనే మేకర్స్ అధికారికంగా ప్రకటిస్తారని ఊహించవచ్చు. మరి... ప్రచారంలో ఉన్న టైటిల్స్లో ఏదో ఒకటి రవితేజ 76వ సినిమాకు ఫిక్స్ అవుతుందా? లేక మరో టైటిల్ ఏదైనా తెరపైకి వస్తుందా? అనేది చూడాలి.వారణాసిహీరో మహేశ్బాబు–దర్శకుడు రాజమౌళి కాంబినేషన్లో అంతర్జాతీయ స్థాయిలో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ప్రియాంకా చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు ‘ఎస్ఎస్ఎమ్బీ 29’ అనే వర్కింగ్ టైటిల్ ఉంది. అయితే ‘రాజకుమారుడు’, ‘జెన్ 63’ వంటి టైటిల్స్ తెరపైకి వచ్చాయి. తాజాగా ఈ సినిమాకు ‘వారణాసి’ అనే టైటిల్ను పరిశీలిస్తున్నారనే టాక్ ఫిల్మ్నగర్ సర్కిల్స్లో వినిపిస్తోంది.ఈ భారీ బడ్జెట్ సినిమా కోసం దాదాపు రూ. 50 కోట్లతో చిత్రయూనిట్ హైదరాబాద్ శివార్లలో ‘వారణాసి’ సినిమా సెట్స్ వేయడం, ఈ సినిమాకు కాశీ బ్యాక్డ్రాప్ ఉంటుందనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు ‘వారణాసి’ అనే టైటిల్ తెరపైకి రావడం చర్చనీయాంశమైంది. కాగా, నవంబరు నెలలో ‘ఎస్ఎస్ఎమ్బీ 29’ సినిమా అప్డేట్ను విడుదల చేస్తామని ఇటీవల రాజమౌళి అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నవంబరులో ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్ టైటిల్ అనౌన్స్మెంట్నే అని, ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ కావొచ్చని, ఇందుకోసం నవంబరు రెండో వారంలో ఓ పెద్ద ఈవెంట్ను రాజమౌళి అండ్ టీమ్ ప్లాన్ చేస్తున్నారని ఫిల్మ్నగర్ సమాచారం.ప్రస్తుతం ‘బాహుబలి: ది ఎపిక్’ సినిమా పోస్ట్ ప్రోడక్షన్ పనుల్లో ఉన్నారు రాజమౌళి. ఈ చిత్రం ఈ నెల 31న విడుదల కానుంది. దీంతో నవంబరులో మళ్లీ ‘ఎస్ఎస్ఎమ్బీ 29’ సినిమాపై ఫుల్ ఫోకస్ పెట్టనున్నారు రాజమౌళి. నవంబరులో మహేశ్బాబు, ప్రియాంకా చోప్రాలపై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తారని, ఓ పాట చిత్రీకరణ కూడా ఉంటుందని, డిసెంబరులో చిత్రయూనిట్ కెన్యాకు వెళ్లనుందని ఫిల్మ్నగర్ సమాచారం. కేఎల్ నారాయణ నిర్మిస్తున్న ఈ చిత్రం 2027 ప్రారంభంలో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.ఫౌజి... బ్రహ్మరాక్షసప్రభాస్ ప్రస్తుతం ‘ది రాజాసాబ్’ సినిమా సెట్స్లో ఉన్నారు. ఈ సినిమా చిత్రీకరణ యూరప్లో జరుగుతోంది. సాంగ్స్ చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాతో పాటు దర్శకుడు హను రాఘవపూడితో ప్రభాస్ ఓ పీరియాడికల్ యాక్షన్ సినిమా చేస్తున్నారు. ఇందులో ఇమాన్వీ ఇస్మాయిల్ హీరోయిన్గా నటిస్తుండగా, మిథున్ చక్రవర్తి, జయప్రద, అనుపమ్ ఖేర్ ఇతర ప్రధాన పాత్రలు చేస్తున్నారు. ‘ప్రభాస్హను’ అనే వర్కింగ్ టైటిల్తో ఈ సినిమా చిత్రీకరణ జరుగుతోంది.కాగా, ఈ సినిమాకు మేకర్స్ ‘ఫౌజి’ అనే టైటిల్ను అనుకుంటున్నారని, త్వరలోనే ఈ విషయంపై ఓ క్లారిటీ రానుందని, వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ సినిమా టైటిల్ను అధికారికంగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయిని తెలిసింది. వచ్చే ఏడాది సెకండాఫ్లో ఈ సినిమా థియేటర్స్లో రిలీజ్ కానుంది. అలాగే దర్శకుడు ప్రశాంత్ వర్మతో హీరో ప్రభాస్ ఓ సినిమా చేస్తున్నారని, ఈ సినిమాకు ‘బ్రహ్మరాక్షస’ అనే టైటిల్ను మేకర్స్ పరిశీలిస్తున్నారనే టాక్ తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే.డ్రాగన్హీరో ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కలిసి ఓ పీరియాడికల్ యాక్షన్ డ్రామా సినిమా చేస్తున్నారు. ‘ఎన్టీఆర్నీల్’ అనే వర్కింగ్ టైటిల్తో ఈ సినిమా చిత్రీకరణ జరుగుతోంది. ఇందులో రుక్మిణీ వసంత్ హీరోయిన్గా నటిస్తున్నారు. కన్నడ దర్శక– నటుడు రిషబ్ శెట్టి, మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణకు చిన్న బ్రేక్ పడింది. ఓ యాడ్ షూటింగ్లో ఎన్టీఆర్ గాయపడ్డారు. ఎన్టీఆర్ పూర్తిగా కోలుకున్న తర్వాత ఈ సినిమా కొత్త షూటింగ్ షెడ్యూల్ ప్రారంభం అవుతుంది.నెక్ట్స్ షూటింగ్ షెడ్యూల్ విదేశాల్లో జరుగుతుందని, ముందుగా యూకేలో ప్లాన్ చేశారని ఫిల్మ్నగర్ సమాచారం. కాగా, ఈ సినిమాకు ‘డ్రాగన్’ అనే టైటిల్ను మేకర్స్ పరిశీలిస్తున్నారని తెలిసింది. ఈ సినిమా షూటింగ్ ఓ కొలిక్కి వచ్చిన తర్వాత టైటిల్ను అధికారికంగా ప్రకటిస్తారట. కల్యాణ్రామ్, నవీన్ ఎర్నేని, వై. రవి శంకర్, కె. హరికృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జూన్ 25న విడుదల కానుంది.బ్లడీ రోమియో!సిల్వర్ స్క్రీన్పై నాని ఓ రోమియోగా కనిపించనున్నారట. నాని హీరోగా సుజిత్ డైరెక్షన్లో ఈ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం రానుంది. ఇందులో ప్రియాంకా మోహన్ హీరోయిన్గా నటిస్తారనే ప్రచారం సాగుతోంది. ఈ దసరా సందర్భంగా ఈ సినిమా ప్రారంభోత్సవం జరిగింది. ఈ ఏడాది చివర్లో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ను ప్రారంభించాలనుకుంటున్నారు. ఈ సినిమాకు ‘బ్లడీ రోమియో’ అనే టైటిల్ను మేకర్స్ పరిశీలిస్తున్నారని తెలిసింది.లవ్, యాక్షన్ ప్రధానాంశాలుగా ఈ చిత్రం కొనసాగుతుందట. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు ఈ టైటిల్ అయితే బాగుంటుందని మేకర్స్ అనుకుంటున్నారని తెలిసింది. నిహారిక ఎంటర్టైన్మెంట్స్, యునానిమస్ ప్రోడక్షన్స్ పతాకాలపై నాని, వెంకట్ బోయనపల్లి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది చివర్లో ఈ సినిమా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. అలాగే సుజిత్ సినిమాటిక్ యూనివర్స్లో భాగంగా ఈ సినిమా తెరకెక్కనుందనే టాక్ వినిపిస్తోంది.కొరియన్ కనకరాజు? సిల్వర్ స్క్రీన్పై వరుణ్ తేజ్ దెయ్యాలను ఎలా అదుపు చేస్తారనే విషయం వచ్చే ఏడాది వెండితెరపై చూడొచ్చు. వరుణ్ తేజ్ హీరోగా మేర్ల పాక గాంధీ దర్శకత్వంలో ఓ హారర్ కామెడీ చిత్రం రూ పొందుతోంది. ఈ చిత్రంలో హాస్యనటుడు సత్య ఓ కీ రోల్ చేస్తున్నారు. యూవీ క్రియేషన్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. కాగా, ఈ సినిమాకు ‘కొరియన్ కనకరాజు’ అనే టైటిల్ను మేకర్స్ పరిశీలిస్తున్నారని, త్వరలోనే ఈ టైటిల్ను అధికారికంగా ప్రకటించే చాన్సెస్ ఉన్నాయని ఫిల్మ్నగర్ భోగట్టా.స్లమ్ డాగ్విజయ్ సేతుపతి హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ‘పూరీ సేతుపతి’ అనే వర్కింగ్ టైటిల్తో ఓ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఈ చిత్రంలో సంయుక్త హీరోయిన్గా నటిస్తుండగా టబు, దునియా విజయ్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇందులో బెగ్గర్గా విజయ్ సేతుపతి, విలన్గా టబు నటిస్తున్నారని తెలిసింది. వచ్చే వారం ఈ సినిమా కొత్త షూటింగ్ షెడ్యూల్ ప్రారంభం కానుంది.ఈ సెప్టెంబరు 28న పూరి జగన్నాథ్ బర్త్ డే. ఈ సందర్భంగా ఈ సినిమా టైటిల్ను అధికారంగా ప్రకటించాలనుకున్నారు మేకర్స్. కానీ తమిళనాడులో జరిగిన కరూర్ దుర్ఘటన కారణంగా టైటిల్ రిలీజ్ ఈవెంట్ను క్యాన్సిల్ చేశారు మేకర్స్. అయితే ఈ సినిమాకు ‘స్లమ్ డాగ్, బెగ్గర్, భవతీ భిక్షాందేహి’ అనే టైటిల్స్ను పరిశీలించారట. త్వరలోనే ఈ సినిమా టైటిల్ను అధికారికంగా ప్రకటించనున్నారు. పూరి జగన్నాథ్, జేబీ నారాయణరావు కొండ్రోల్లా, చార్మి కౌర్ నిర్మిస్తున్న ఈ సినిమాకు హర్షవర్థన్ రామేశ్వర్ సంగీతం అందిస్తారు. ఇలా రెండు, మూడు టైటిల్స్ను పరిశీలిస్తూ, త్వరలోనే ఓ టైటిల్ను ప్రకటించనున్న మరికొన్ని సినిమాలు ఉన్నాయి.‘చుక్కలు తెమ్మన్నా తెంచుకురానా... చూస్తావా నా మైనా’... ఈ పాట వినగానే, ‘ఏప్రిల్ 1 విడుదల’ సినిమా గుర్తుకు వస్తుంది. కానీ ‘చుక్కలు తెమ్మన్నా... తెంచుకురానా..’ అనే టైటిల్తో ఓ ఉమెన్ సెంట్రిక్ సినిమా రానుందని, వైజయంతీ మూవీస్ సంస్థ ఈ సినిమాను నిర్మించనుందని ఫిల్మ్నగర్ సమాచారం. అలాగే ఈ ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్లోని ప్రధాన పాత్ర పోషించేందుకు భాగ్యశ్రీ భోర్సే, శ్రీలీల వంటి వార్ల పేర్లను పరిశీలిస్తున్నారట మేకర్స్. ఈ విషయాలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. – ముసిమి శివాంజనేయులు -
బ్లాక్ డ్రెస్లో శోభిత గ్లామర్..శారీలో అనన్య నాగళ్ల అందాలు!
హీరోయిన్ అనన్య నాగళ్ల గ్లామరస్ పిక్స్..బ్లాక్ డ్రెస్లో అక్కినేని శోభిత ధూళిపాల అందాలు..బర్త్ డే సెలబ్రేషన్స్ వీడియోను పంచుకున్న మంచు లక్ష్మీ..పెట్స్తో చిల్ అవుతోన్న హీరోయిన్ స్నేహ.. View this post on Instagram A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu) View this post on Instagram A post shared by Sobhita Dhulipala (@sobhitad) View this post on Instagram A post shared by Laya Gorty (@layagorty) View this post on Instagram A post shared by Ananya nagalla (@ananya.nagalla) View this post on Instagram A post shared by Sahithi Dasari (@sahithi_dasari7) View this post on Instagram A post shared by Sneha (@realactress_sneha) -
పది రోజుల్లో క్లోజ్.. రెండు రోజులకే ఇలా.. బిగ్బాస్లో అసలేం జరుగుతోంది?
ప్రస్తుతం బుల్లితెర రియాలిటీ షో బిగ్బాస్ హవా నడుస్తోంది. తెలుగులో మొదలైన ఈ షో ఆ తర్వాత తమిళం, కన్నడలోనూ ప్రారంభమైంది. కన్నడ హీరో సుదీప్ బిగ్బాస్ 12వ సీజన్కి హోస్టింగ్ చేస్తున్నాడు. గత నెల అంటే సెప్టెంబరు 28న ఆదివారంతో మొదలైన షో పట్టుమని పది రోజులకే మూసేయాల్సి వచ్చింది. దీనికి ప్రధాన కారణం స్థానిక పర్యావరణ అధికారులే. జాలీవుడ్ ఎంటర్టైన్మెంట్ పార్క్లోని బిగ్బాస్ హౌస్ సెట్ వ్యర్థాలన్నీ బయటికి వస్తున్నాయని ఫిర్యాదు రావడంతో అధికారులు చర్యలు తీసుకున్నారు.ఈ క్రమంలోనే బిగ్బాస్ షో నిర్వాహకులకు పర్యావరణ నియంత్రణ మండలి నోటీసులు జారీ చేసింది. ఆ తర్వాత వెంటనే బిగ్బాస్ ఆపేయాలని కర్ణాటక కాలుష్య బోర్డ్ కూడా ఆదేశించింది. విద్యుత్ సరఫరా కూడా నిలిపేయాలని సంబంధిత శాఖకు సూచించింది. దీంతో కన్నడ బిగ్బాస్ నిర్వాహకులకు పెద్ద షాకిచ్చారు అక్కడ అధికారులు. బిగ్బాస్ హౌస్కు తాళం వేసి అందరినీ బయటికి పంపించారు.అయితే ఇది జరిగిన రెండు రోజుల్లోనే మళ్లీ బిగ్బాస్ హౌస్ తెరుచుకుంది. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఆదేశాలతో బిగ్బాస్ షోను తిరిగి ప్రారంభించారు. రెండు రోజుల అనంతరం కంటెస్టెంట్స్ 17 మంది మళ్లీ హౌస్లోకి తిరిగి వచ్చారు. ఈ సందర్భంగా ఈ షోను తిరిగి ప్రారంభించేందుకు సహకరించిన డీసీఎం డీకే శివకుమార్కు హోస్ట్ కిచ్చా సుదీప్ ధన్యవాదాలు తెలిపారు. కాగా.. ఇప్పటికే జాలీవుడ్ స్టూడియోస్ మూసివేతను సవాలు చేస్తూ హైకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్ విచారణకు రానుంది. I sincerely thank Hon. @DKShivakumar sir for the timely support.Also want to thank the concerned authorities for acknowledging that #BBK was not involved or was a part of the recent chaos or disturbances.I truely appreciate the DCM for promptly responding to my call, and thank… https://t.co/94n6vh2Boc— Kichcha Sudeepa (@KicchaSudeep) October 8, 2025 -
కాంతార చాప్టర్-1.. ప్రపంచంలోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా!
రిషబ్ శెట్టి కాంతార చాప్టర్ వన్ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. ఇప్పటికే కేజీఎఫ్, కాంతార రికార్డులను బద్దలు కొట్టిన ఈ సినిమా కన్నడలో అత్యధిక వసూళ్లు సాధించిన రెండో చిత్రంగా నిలిచింది. ప్రస్తుతం ఈ మూవీ రూ.400 కోట్లకు పైగా కలెక్షన్స్తో దూసుకెళ్తోంది. ఈ క్రమంలోనే పలు రికార్డులు బద్దలు కొట్టింది. ఈ చిత్రం వారం రోజుల్లోనే ఏకంగా హాలీవుడ్ సినిమాలనే అధిగమించింది. ఈ వారంలో ప్రపంచంలోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా కాంతారా చాప్టర్ -1 నిలిచింది. ఈ క్రమంలో ఏకంగా రెండు హాలీవుడ్ చిత్రాలను అధిగమించింది. టేలర్ స్విఫ్ట్ సినిమా పార్టీ ఆఫ్ ఏ షో గర్ల్, లియోనార్డో డికాప్రియో నటించిన 'వన్ బ్యాటిల్ ఆఫ్ అనదర్' చిత్రాల వసూళ్లను దాటేసింది. కాంతార చాప్టర్-1 ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 50 మిలియన్ డాలర్ల పైగా వసూళ్లు సాధించింది. ఈ మూవీ మొదటి వారంలో దాదాపు 53 మిలియన్ డాలర్లకు పైగానే కలెక్ట్ చేసింది. ఈ వారాంతంలో 50 మిలియన్ల డాలర్లు వసూలు చేసిన టేలర్ స్విఫ్ట్ చిత్రం పార్టీ ఆఫ్ ఎ షోగర్ల్ను దాటేసింది. లియోనార్డో డికాప్రియో నటించిన వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ సినిమాను కూడా కాంతార చాప్టర్-1 బ్రేక్ చేసింది. ఈ సినిమా రెండవ వారంలో ప్రపంచవ్యాప్తంగా 40 మిలియన్ల డాలర్లు మాత్రమే వసూలు చేసింది. ఇటీవలే రీ రిలీజ్ అయిన అవతార్: ది వే ఆఫ్ వాటర్ కూడా కాంతార కంటే వెనకే ఉంది.రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా వారం రోజుల్లోనే దేశవ్యాప్తంగా రూ..379 కోట్లు రాగా.. ప్రపంచవ్యాప్తంగా చూస్తే రూ.451 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. దీంతో బ్రహ్మాస్త్ర పార్ట్ వన్ (రూ.431 కోట్లు), 3 ఇడియట్స్ (రూ.450 కోట్లు) వంటి సూపర్ హిట్ సినిమాల జీవితకాల కలెక్షన్స్ అధిగమించింది. ఇదే జోరు కొనసాగితే రెండో వారంలోనే రూ.500 కోట్ల మార్క్ దాటడం ఖాయంగా కనిపిస్తోంది.రిషబ్ శెట్టి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో లో రుక్మిణి వసంత్, గుల్షన్ దేవయ్య, జయరామ్ కూడా కీలక పాత్రలు పోషించారు. 2022లో వచ్చిన కాంతారకు ప్రీక్వెల్గా ఈ మూవీనికి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. -
మోహన్ లాల్ పాన్ ఇండియా మూవీ రిలీజ్.. దీపావళికి కాదు!
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటిస్తోన్న ద్విభాషా చిత్రం వృషభ. ఈ చిత్రానికి నంద కిశోర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే టీజర్ రిలీజ్ చేయగా ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాను మలయాళంతో పాటు.. తెలుగులోనూ ఓకేసారి తెరకెక్కించడం విశేషం. ఈ పాన్ ఇండియా చిత్రంపై మోహన్ లాల్ అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ ఫుల్ యాక్షన్ మూవీ దీపావళికి రిలీజ్ కావాల్సి ఉంది. మొదట అక్టోబర్ 23 రిలీజ్ చేస్తామని ప్రకటించారు.కానీ ఈ దీపావళికి థియేటర్లలో వృషభ రిలీజ్ కావడం లేదు. తాజాగా కొత్త రిలీజ్ తేదీని మేకర్స్ రివీల్ చేశారు. వచ్చేనెల అంటే నవంబర్ 6న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుందని స్పెషల్ పోస్టర్ను పంచుకున్నారు. ఇప్పటికే రిలీజైన టీజర్ చూస్తుంటే ఈ మూవీని పురాణాల నేపథ్యంలోనే తెరకెక్కించినట్లు అర్థమవుతోంది. విజువల్స్, యాక్షన్ సీన్స్ బాహుబలి తరహాలో మోహన్ లాల్ ఫ్యాన్స్ను ఆకట్టుకున్నాయి. ఈ చిత్రంలో మోహన్ లాల్ తొలిసారిగా రాజు పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రంలో సమర్జిత్ లంకేష్, రాగిణి ద్వివేది కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాను అభిషేక్ ఎస్ వ్యాస్ స్టూడియోస్, కనెక్ట్ట్ మీడియా, బాలాజీ టెలిఫిల్మ్స్ బ్యానర్లపై నిర్మించారు. The ground shakes. The sky burns. Destiny has chosen its warrior. #Vrusshabha arrives on 6th November! #RoarOfVrusshabha #VrusshabhaOn6thNovember#SamarjitLankesh @ursnayan @raginidwivedi24 @Connekktmedia @balajimotionpic #AbishekSVyasStudios @FilmDirector_NK #ShobhaKapoor… pic.twitter.com/emyiIFJ5uR— Mohanlal (@Mohanlal) October 9, 2025 -
వ్యక్తిగత జీవితంలోకి కెమెరా రాకూడదు: రష్మిక మందన్నా
సెలబ్రిటీల వృత్తిపరమైన విషయాల కంటే వ్యక్తిగత విషయాలపైనే చాలా మందికి ఆసక్తి ఉంటుంది. అలాంటిది సినీ హీరోయిన్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. వాళ్లు ఏం చేసినా వార్తే అవుతోంది. వారి వ్యక్తిగత జీవితాల గురించి రకరకాల వార్తలు వెలువడుతుంటాయి. ఇదే మంచిది కాదంటున్నారు నటి రష్మికా మందన్నా. ఈ భామ క్రేజ్ ఇప్పుడు మామూలుగా లేదు. నేషనల్ క్రష్గా వెలుగొందుతున్న రస్మికా మందన్నా ప్రస్తుతం బాలీవుడ్ను దున్నేస్తున్నారనే చెప్పాలి.ఇక తెలుగు,తమిళం భాషల్లోనూ నటిస్తూ పాన్ ఇండియా కథానాయకిగా రాణిస్తున్న ఈ బ్యూటీ టాలీవుడ్ నటుడు విజయ్ దేవరకొండతో ప్రేమలో ఉన్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఆయన్ని పెళ్లి చేసుకోనున్నట్లు ఆ మద్య చెప్పకనే చెప్పారు. కాగా ఇటీవల విజయ్దేవరకొండ, రష్మిక మందన్నాల వివాహ నిశ్చితార్థం చాలా నిడారంబరంగా జరిగినట్లు వార్తలు బలంగానే వెలువడ్డాయి. అయితే ఈ విషయాన్ని ఈ ఇద్దరిలో ఎవరూ బహిరంగంగా వెల్లడించలేదు. ఇలాంటి సరిస్థితుల్లో నటి రష్మిక మందన్నా ఇటవల ఒక భేటీలో పేర్కొంటూ లోపల ఏం జరుగుతోందన్నది ప్రపంచానికి తెలియదన్నారు. అదేవిధంగా మన వ్యక్తిగత జీవితాల్లోకి కెమెరా రాకూడదని అన్నారు.తాము వ్యక్తిగత విషయాలను ఆన్లైన్ వంటి సామాజిక మాధ్యమాల్లో వెల్లడించే వాళ్లం కాదన్నారు. అదే విధంగా ప్రజలు తమ వ్యక్తిగత జీవితాల గురించి ఏం అనుకుంటున్నారు అన్నది ముఖ్యం కాదనీ, తమ వృత్తిపరమైన జీవితాల గురించే ముఖ్యం అని పేర్కొన్నారు. రష్మిక మందన్నాకు వివాదాలు కొత్తేమీ కాదు. ఈమెను కన్నడ చిత్ర పరిశ్రమ బ్యాన్ చేసిందనే ప్రచారం వాడివేడిగా సాగింది. అయితే ఇప్పటి వరకూ తాను బ్యాన్ చేయబడలేదని రష్మిక మందన్నా స్పష్టం చేశారు. అదే విధంగా ఇంతకు ముందే కన్నడ నటుడు రక్షిత్ శెట్టితో నటి రష్మిక మందన్నా ప్రేమ వివాహ నిశ్చితార్థం వరకూ వెళ్లి ఆ తరువాత విడిపోయారు. ఆపై రష్మిక మందన్నా కన్నడ చిత్రాల్లో నటించలేదు. కాంతార చిత్రం విడుదలయిన సమయంలోనూ రష్మిక మందన్నా వివాదాలకు గురయ్యారు. ఆ చిత్రాన్ని తాను ఇంకా చూడలేదని పేర్కొనడంతో పెద్ద రచ్చే జరిగింది. అలాంటిది ఇటీవల కాంతారకు ఫ్రీక్వెల్గా రూపొందిన కాంతార ఛాప్టర్ 1 చిత్రాన్ని చూసిన తరువాత ఆ చిత్ర బృందానికి మెసేజ్ పెట్టినట్లు, వాళ్లు అందుకు థ్యాంక్స్ చెప్పినట్లు నటి రషి్మకా మందన్నా పేర్కొన్నారు. మొత్తం మీద ఈ అమ్మడు ఏదో ఒక విషయంతో నిత్యం వార్తల్లో ఉంటున్నారు. -
సర్ప్రైజ్.. స్టార్ హీరోని మళ్లీ బతికించారు
ఎవరైనా నటుడు లేదా నటి మరణిస్తే.. జ్ఞాపకాలుగా మిగిలేవి వాళ్లు చేసిన సినిమాలు మాత్రమే. అయితే ఇదంతా ఒకప్పుడు. ఇప్పుడు టెక్నాలజీ చాలా మారిపోయింది. ఏఐ(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్)ని ఉపయోగించి మరణించిన గాయనీగాయకుల గాత్రాన్ని కొత్త పాటల్లో వినిపించేలా చేస్తున్నారు. నటీనటుల్ని కూడా మళ్లీ బతికిస్తున్నారు. ఇప్పుడు అలానే ఓ ఓటీటీ సిరీస్ కోసం కన్నడ పవర్స్టార్ పునీత్ రాజ్ కుమార్ని మళ్లీ తెరపై చూపించారు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి తెలుగు ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్)కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ వారసుడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన పునీత్ రాజ్ కుమార్.. చాలా చిన్న వయసులోనే కోట్లాది మంది అభిమానుల ప్రేమని సంపాదించుకున్నారు. తెలుగులోనూ ఇతడు నటించిన పలు చిత్రాలు డబ్బింగ్గా రిలీజ్ అయ్యాయి. 2021లో కేవలం 46 ఏళ్ల వయసులోనే గుండెపోటుతో మరణించాడు. ఈయన చనిపోయిన తర్వాత జేమ్ అనే సినిమా, గంధగ గుడి అనే డాక్యుమెంటరీ రిలీజయ్యాయి. తర్వాత నుంచి ఇప్పటికీ ఈయన్ని కన్నడ దర్శకనిర్మాతలు గుర్తుచేసుకుంటూనే ఉన్నారు.అయితే 'మారిగల్లు' అనే ఓటీటీ సిరీస్ కోసం ఇప్పుడు ఈయన్ని మరోసారి తెరపై చూపించారు. ఏఐ టెక్నాలజీ ఉపయోగించి పునీత్ రాజ్ కుమార్ని ఈ సిరీస్లో చూపించారు. కాదంబ రాజ్యానికి చెందిన మయూర వర్మ అనే రాజుగా పునీత్ కనిపించనున్నారు. మిగతా పార్ట్ అంతా నటీనటులే కనిపిస్తారు గానీ పునీత్కి సంబంధించిన సీన్స్ మాత్రం ఏఐ టెక్నాలజీతో తెరకెక్కించారు. ఈ సిరీస్ జీ5 ఓటీటీలో ఈనెల 31 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఒకవేళ ఈ సిరీస్ గనక వర్కౌట్ అయి పునీత్ పాత్రకు పేరొస్తే గనక రాబోయే రోజుల్లో ఈ తరహా ప్రయోగాలు చాలానే చూడొచ్చు. ఈ సిరీస్ నిర్మించింది పునీత్ కుటుంబ సభ్యులే కావడం విశేషం.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 23 సినిమాలు) -
నటికి క్షమాపణలు.. ఎట్టకేలకు ముగిసిన వివాదం
పరస్పరం బేషరతుగా క్షమాపణలు చెప్పుకోవడంతో సీమాన్, నటి విజయలక్ష్మిల వివాదానికి ఎండ్ కార్డ్ పడింది. 'నామ్ తమిళర్ కట్చి' పార్టీ నేత సీమాన్.. తనను వాడుకుని మోసం చేసినట్టుగా దశాబ్దం కాలంగా నటి విజయలక్ష్మి పోరాటం చేస్తోంది. ఈ ఇద్దరి మధ్య వివాదం పోలీసు స్టేషన్లు చుట్టూ తిరిగింది. చివరకు హైకోర్ట్ వరకు చేరింది. ఈ కేసును రద్దు చేయాలని సీమాన్ దాఖలు చేసుకున్న విజ్ఞప్తిని మద్రాసు హైకోర్టు తిరస్కరించింది.అయితే ఈ ఇద్దరిమధ్య వివాదాన్ని కొలిక్కి తెచ్చే విధంగా పంచాయితీలు సాగాయి. అదే సమయంలో సుప్రీంకోర్టును సీమాన్ ఆశ్రయించారు. ఈ సమయంలో సీమాన్పై తాను ఇచ్చిన కేసును వెనక్కు తీసుకుంటున్నట్టు లిఖిత పూర్వకంగా విజయలక్ష్మి పోలీసులకు సమర్పించారు. పెద్దల పంచాయితీతో వివాదం సద్దుమణిగినా, వ్యవహారం కోర్టులో ఉండటంతో విచారణ ఎదుర్కోక తప్పలేదు.ఎట్టకేలకు సీమాన్, విజయలక్ష్మి పరస్పరం క్షమాపణలు చెప్పుకోవడంతో వివాదం కోర్టులోనూ సమసినట్లయ్యింది. బుధవారం విచారణ సమయంలో ఈ క్షమాపణల ప్రస్తావన సుప్రీంకోర్టు న్యాయమూర్తుల బెంచ్ ముందుకు వచ్చింది. ఇరువురి వాదనల అనంతరం క్షమాపణలను పరస్పరం అంగీకరించిన నేపథ్యంలో కేసును ముగించారు. ఇక మీదట అఫిడవిట్లో పేర్కొన్నట్టుగా నడుచుకోవాలని హితవు పలికారు. -
కాంతార చాప్టర్ 1.. ఫుల్ వీడియో సాంగ్ వచ్చేసింది!
రిషబ్ శెట్టి (Rishab Shetty) డైరెక్షన్లో వచ్చిన బ్లాక్బస్టర్ మూవీ కాంతార. ఈ సినిమాకు ప్రీక్వెల్గా భారీ బడ్జెట్తో కాంతార చాప్టర్-1(Kantara Chapter 1) తెరకెక్కించారు. ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకొచ్చింది. రిలీజైన మొదటి రోజు నుంచే అద్భుతమైన కలెక్షన్స్తో దూసుకెళ్తోంది. కేవలం ఆరు రోజుల్లోనే కాంతార మూవీ రికార్డ్ను బ్రేక్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా రూ.427 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.తాజాగా ఈ చిత్రం నుంచి బ్రహ్మ కలశ అనే ఫుల్ వీడియో సాంగ్ను విడుదల చేశారు మేకర్స్. ఈ పాట థియేటర్లలో కాంతార ఫ్యాన్స్ను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సాంగ్కు కృష్ణకాంత్ లిరిక్స్ అందించగా.. అబ్బి ఆలపించారు. వరాహరూపం థీమ్తో వచ్చిన ఈ సాంగ్ థియేటర్లలో అభిమానులను అలరించింది. కాగా.. ఈ చిత్రానికి అజనీశ్ లోక్నాథ్ సంగీతమందించిన సంగతి తెలిసిందే. ఈ మూవీలో రుక్మిణి వసంత్, గుల్షన్ దేవయ్య, జయరామ్ కీలక పాత్రల్లో నటించారు. A symphony of faith, a celebration of devotion 🔱🔥#Brahmakalasha Video Song from #KantaraChapter1 out now 🎵▶️ https://t.co/wzi1h7ek5l#BlockbusterKantara in cinemas now!#KantaraInCinemasNow #DivineBlockbusterKantara #KantaraEverywhere #Kantara @hombalefilms @KantaraFilm… pic.twitter.com/VKVnnqXmrq— Hombale Films (@hombalefilms) October 8, 2025 -
కాంతార రికార్డ్ బ్రేక్ చేసిన కాంతార.. ఆరు రోజుల్లో ఎన్ని కోట్లంటే?
రిషబ్ శెట్టి (Rishab Shetty)స్వీయ దర్శకత్వంలో వచ్చిన కాంతార చాప్టర్-1(Kantara Chapter 1) బాక్సాఫీస్ వద్ద అలరిస్తోంది. తొలి రోజే పాజిటివ్ టాక్ అందుకున్న ఈ సినిమా వసూళ్లపరంగా దూసుకెళ్తోంది. ఇప్పటికే మూడు వందల కోట్ల మార్క్ దాటేసిన ఈ చిత్రం తాజాగా రూ.400 కోట్ల క్లబ్లో చేరింది. ఈ మూవీ రిలీజైన ఆరు రోజుల్లోనే అరుదైన మార్క్ చేరుకుంది. ప్రపంచవ్యాప్తంగా రూ.427 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది.(ఇది చదవండి: 'నా జీవితం సర్వనాశనం చేశారు'.. బిగ్బాస్ సంజనా గల్రానీ ఆవేదన!)కాంతార రికార్డ్ బ్రేక్.. ఈ క్రమంలోనే కాంతార చాప్టర్ 1 ప్రపంచవ్యాప్తంగా పలు రికార్డులను బద్దలు కొట్టింది. ఆరు రోజుల్లోనే కాంతార లైఫ్ టైమ్ కలెక్షన్స్ను దాటేసింది. కేజీఎఫ్- 2 తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన రెండవ కన్నడ చిత్రంగా నిలిచింది. కాగా.. 2022లో విడుదలైన 'కాంతార' సినిమా రూ.408 కోట్ల ఆల్ టైమ్ వసూళ్లు రాబట్టింది. శాండల్వుడ్లో కన్నడ హీరో యశ్ నటించిన కేజీఎఫ్-2 ప్రపంచవ్యాప్తంగా రూ.1215 కోట్లతో మొదటిస్థానంలో ఉంది. కాంతార చాప్టర్-1 జోరు చూస్తుంటే వారం రోజుల్లోనే రూ.500 కోట్ల మార్క్ చేరుకునేలా కనిపిస్తోంది. కాగా.. ఈ చిత్రం ఈ చిత్రం అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా కన్నడ, హిందీ, తెలుగు, మలయాళం, తమిళం, బెంగాలీ, ఆంగ్ల భాషల్లో రిలీజైన సంగతి తెలిసిందే. -
కన్నడలో బ్యాన్.. స్పందించిన రష్మిక!
ఈ మధ్య రష్మిక(Rashmika Mandanna ) పేరు సోషల్ మీడియాలో బాగా వినిపిస్తోంది. ఒకపక్క కెరీర్..మరోపక్క పర్సనల్ విషయాల్లో రకరకాల పుకార్లు వినిపిస్తున్నాయి.ఇటీవల విజయ్ దేవరకొండతో ఎంగేజ్మెంట్ చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే అధికారికంగా మాత్రం ప్రకటించలేదు. మరోవైపు రష్మిక నటించిన తాజా చిత్రం ‘థామా’(Thama)ని కన్నడ ఇండస్ట్రీ బ్యాన్ చేసినట్లు పుకార్లు వచ్చాయి. అక్టోబర్ 21న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. అఅయితే రష్మిక సొంత రాష్ట్రం అయిన కర్ణాటకలో మాత్రం విడుదల కాదని.. కన్నడ ఇండస్ట్రీ ఆమెను బహిష్కరించిందనే వార్తలు గత కొన్నాళ్లుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ఈ రూమర్స్పై రష్మిక స్పందించింది. ఇప్పటివరకు తనను ఏ ఇండస్ట్రీ బ్యాన్ చేయలేదని వెల్లడించింది. అపార్థం చేసుకోవడం వల్లే ఇలాంటి పుకార్లు పుట్టుకొస్తాయని ఆమె అన్నారు.ప్రతి విషయాన్ని ఆన్లైన్లో పంచుకోలేను కన్నడ చిత్రం ‘కాంతార: చాప్టర్ 1’ ఇటీవల ప్రపంచ వ్యాప్తంగా విడుదలై సూపర్ హిట్గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సినిమాపై పలువురు సినీ ప్రముఖులు స్పందించారు. రిషబ్ శెట్టిని ప్రశంసిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. కానీ అదే ప్రాంతానికి చెందిన రష్మిక మాత్రం ఈ చిత్రంపై స్పందించలేదు. దీంతో ఆమెపై సోషల్ మీడియాలో విమర్శలు వచ్చాయి. తాజాగా దీనిపై రష్మిక స్పందించింది. థామా సినిమా ప్రమోషన్స్లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో రష్మిక మాట్లాడుతూ..‘ఏ సినిమా రిలీజ్ అయినా..నేను రెండు, మూడు రోజుల్లోనే చూడలేను. కాంతార కూడా విడుదలైన కొన్ని రోజుల తర్వాత చూశాను. చిత్రబృందాన్ని అభినందిస్తూ మెసేజ్ కూడా చేశా. వాళ్లు నాకు ధన్యవాదాలు కూడా తెలిపారు. తెర వెనుక ఏం జరిగిందో ఎవరికీ తెలియదు. మన వ్యక్తిగత విషయాలన్నీ కెమెరా ముందుకు తీసుకురాలేం కదా. ప్రతి విషయాన్ని ఆన్లైన్లో పంచుకునే వ్యక్తిని కాదు. . అందుకే ప్రజలు ఏమనుకున్నా పట్టించుకోను. వాళ్లు నా నటన గురించి ఏం మాట్లాడతారు అనేదే నాకు ముఖ్యం. దానిని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటాను’ అని రష్మిక అన్నారు. -
స్టార్ హీరోయిన్స్ బెల్లీ డ్యాన్స్.. వీడియో సాంగ్ రిలీజ్
రీసెంట్గా 'లోక' సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న కల్యాణి ప్రియదర్శన్, అలానే 'ఉప్పెన' బ్యూటీ కృతిశెట్టి.. బెల్లీ డ్యాన్స్తో అదరగొట్టేశారు. రవి మోహన్ (జయం రవి) హీరోగా చేస్తున్న లేటెస్ట్ తమిళ సినిమా 'జీనీ'. దీని నుంచి అబ్దీ అబ్దీ అంటూ సాగే వీడియో సాంగ్ని తాజాగా రిలీజ్ చేశారు. అయితే ఇందులో కల్యాణి-కృతి స్టెప్పులు సోషల్ మీడియాలో వైరల్ అయిపోయాయి.(ఇదీ చదవండి: రీతూ దొంగ తెలివితేటలు.. మిగతా వాళ్లందరూ బలి)ఏఆర్ రెహమాన్ కంపోజ్ చేసిన ఈ పాటలో హీరో రవి మోహన్ కూడా ఉన్నప్పటికీ కృతి శెట్టి, కల్యాణి ప్రియదర్శన్ తమ డ్యాన్స్ మూమెంట్స్తో తెగ హైలెట్ అయిపోతున్నారు. గతంలో ఇలాంటి పాట ఎక్కడో చూశామే అన్నట్లు అనిపిస్తుంది కానీ చూస్తున్నంతసేపు డ్యాన్ మాత్రం భలే చేశారు కదా అనిపిస్తుంది. 'జీనీ' అర్జునన్ చిత్రానికి అర్జునన్ దర్శకుడు కాగా.. ఈ ఏడాది థియేటర్లలోకి తీసుకురానున్నారు.(ఇదీ చదవండి: హిట్ సినిమా.. ఇప్పుడు మరో ఓటీటీలోనూ స్ట్రీమింగ్) -
'డ్రాగన్' తెచ్చిన లక్.. కాయదు లోహర్కి మరో ఛాన్స్!
హీరోయిన్లకు మొదట ఒకే ఒక్క ఛాన్స్ వస్తుంది. అదృష్టం కలిసొచ్చి ఆ మూవీ హిట్ అయితే తర్వాత అవకాశాలు వెల్లువలా వస్తాయి. కాయదు లోహార్ పరిస్థితి ఇప్పుడు అలానే ఉన్నట్లు కనిపిస్తోంది. 2021లో కన్నడ చిత్రంతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. తర్వాత తెలుగులోనూ 'అల్లూరి' అనే మూవీ చేసింది. కానీ పెద్దగా వర్కౌట్ కాలేదు. గతేడాది తమిళంలో వచ్చిన 'డ్రాగన్'.. ఈమె కెరీర్ని మలుపు తిప్పేసింది. దీంతో ప్రస్తుతం తమిళ, మలయాళ, తెలుగు భాషల్లో నాలుగైదు సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా మారిపోయింది.(ఇదీ చదవండి: వీడియో: పుట్టపర్తిలో విజయ్ దేవరకొండ.. ముఖంలో పెళ్లికళ)తమిళంలో ఇదయం మురళి అనే సినిమా చేయగా.. ఇది విడుదలకు సిద్ధమైంది. తెలుగులోనూ విశ్వక్ సేన్ 'ఫంకీ'లో ఈమెనే హీరోయిన్. ఇప్పుడు తమిళంలో విశాల్ సరసన ఛాన్స్ కొట్టేసినట్లు వార్తలొస్తున్నాయి. దర్శకుడు సుందర్.సి-విశాల్ కాంబోలో ఈ ఏడాది 'మదగజరాజా' వచ్చింది. హిట్ అయింది. దీంతో ఇప్పుడు రిపీట్ కాబోతున్న కాంబోలోకి కాయదు వచ్చి చేరినట్లు తెలుస్తోంది.సుందర్.సి చిత్రాల్లో హీరోయిన్లకు ప్రాముఖ్యత ఉంటుంది. అలానే ఒకరికి మించి హీరోయిన్లు ఉంటారు. గ్లామర్ కూడా అధిక మోతాదులోనే ఉంటుంది. త్వరలో విశాల్ హీరోగా తీయబోయే సినిమాలో ఇద్దరు బ్యూటీస్కి చోటు ఉంది. అందులో ఒక హీరోయిన్గా కాయదు లోహర్ని ఎంపిక చేసినట్లు సమాచారం. మరో హీరోయిన్ ఎంపిక జరుగుతున్నట్లు తెలుస్తోంది. (ఇదీ చదవండి: పవన్ సినిమాలో మూడు కోట్ల ఆఫర్.. నేను ఒప్పుకోలేదు: మల్లా రెడ్డి) -
యూరప్లో ఫ్యామిలీ డ్రామా
సూర్య హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఓ ద్విభాషా (తెలుగు, తమిళం) చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సూర్య కెరీర్లోని ఈ 46వ సినిమాలో మమితా బైజు హీరోయిన్ గా నటిస్తుండగా, రవీనా టాండన్, రాధికా శరత్కుమార్ ఇతరపాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా కొత్త షెడ్యూల్ ఇటీవల యూరప్లో మొదలు పెట్టారట. సూర్యతోపాటుగా ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారని టాలీవుడ్ టాక్.ఫ్యామిలీ డ్రామా, యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న ఈ చిత్రానికి ‘విశ్వనాథన్ అండ్ సన్స్’ అనే టైటిల్ను మేకర్స్ పరిశీలిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్ మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే వేసవిలో రిలీజ్ కానుంది. ఈ సినిమాకి సంగీతం: జీవీ ప్రకాష్కుమార్. -
శింబు @ అరసన్
హీరో శింబు, దర్శకుడు వెట్రిమారన్ కాంబినేషన్ లో రూపొందనున్న సినిమాకు ‘అరసన్ ’ అనే టైటిల్ని ఖరారు చేశారు. కలైపులి ఎస్. థాను నిర్మించనున్న ఈ మూవీ టైటిల్ను మంగళవారం ప్రకటించారు. ‘అరసన్ ’ కథ నార్త్ చెన్నై నేపథ్యంతో సాగే గ్యాంగ్స్టర్ డ్రామా అని టాక్. ఈ నెలలోనే రెగ్యులర్ చిత్రీకరణను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారట మేకర్స్.శింబు కెరీర్లోని ఈ 49వ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం సమంత, సాయిపల్లవి, రుక్మిణీ వసంత్లను సంప్రదించాలనే ఆలోచనలో ఉందట చిత్రయూనిట్. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తార ని కోలీవుడ్ టాక్. ఈ విషయాలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. -
తమిళంలో ఇచ్చేది అంతే.. తెలుగులో ఎందుకింత డిమాండ్..!
కోలీవుడ్ స్టార్ హీరో ధనుశ్ ఇటీవలే ఇడ్లీ కడాయి మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. నిత్యామీనన్ జంటగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అంతగా మెప్పించలేకపోయింది. ఈ మూవీని తెలుగులో ఇడ్లీ కొట్టు పేరుతో రిలీజ్ చేశారు. ఈ సినిమా విడుదలైన తర్వాతే కాంతార థియేటర్లలోకి రావడంతో ఇడ్లీ కొట్టును ఆడియన్స్ పెద్దగా పట్టించుకోలేదు.అయినప్పటికీ కోలీవుడ్ హీరో ధనుశ్కు ఫ్యాన్స్ ఫాలోయింగ్ బాగానే ఉంది. ముఖ్యంగా తెలుగులోనూ ఆయన సినిమాలకు ప్రత్యేకమైన క్రేజ్ ఉంటోంది. ఈ నేపథ్యంలోనే ఓ టాలీవుడ్ డైరెక్టర్, నిర్మాతతో కలిసి ధనుశ్తో ఓమూవీ చేసేందుకు సంప్రదించారట. ఆయనను కలిసి కథ కూడా వివరించినట్లు తెలుస్తోంది. అయితే ఈ కథ విన్న ధనుశ్ ఏకంగా రూ.50 కోట్ల పారితోషికం డిమాండ్ చేశారని లేటేస్ట్ టాక్. ఈ విషయం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.ప్రస్తుతం టాలీవుడ్లో ఈ విషయం హాట్ టాపిక్గా మారింది. తమిళంలో ధనుశ్కు ఇచ్చేది కేవలం రూ.35 కోట్లలోపే రెమ్యునరేషన్ ఉంటుందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అలాంటిది తెలుగులో రూ.50 కోట్లు డిమాండ్ చేయడమేంటని ప్రశ్నిస్తున్నారు. అయితే ధనుశ్ను ఎవరు కలిశారన్న వివరాలు మాత్రం బయటకు రాలేదు. రాబోయే రోజుల్లో ఈ విషయంపై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశముంది. -
కాంతార చాప్టర్-1.. 90 శాతం అక్కడే పూర్తి చేశాం: రిషబ్ శెట్టి
రిషబ్ శెట్టి స్వీయ డైరెక్షన్లో వచ్చిన తాజా చిత్రం కాంతార చాప్టర్-1. భారీ బడ్జెట్తో నిర్మించిన ఈ సినిమా దసరా కానుకగా థియేటర్లలో సందడి చేసింది. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద రూ.300 కోట్లకు పైగా వసూళ్లతో దూసుకెళ్తోంది. సూపర్ హిట్ మూవీ కాంతారకు ప్రీక్వెల్గా వచ్చిన ఈ సినిమా అదిరిపోయే కలెక్షన్స్ రాబడుతోంది. కర్ణాటకలోని ప్రాచీన కళ భూతకోల ఆధారంగా ఈ సినిమాలను తెరకెక్కించారు.తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తకర విషయం బయటకొచ్చింది. ఈ మూవీ షూటింగ్ రిషబ్ శెట్టి తన సొంత గ్రామంలోనే తెరకెక్కించినట్లు వెల్లడించారు. అంతేకాకుండా దాదాపు 90 శాతం ఎడిటింగ్ తన ఊర్లోనే పూర్తి చేశామని రిషబ్ శెట్టి తెలిపారు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన రిషబ్ ఈ విషయాన్ని పంచుకున్నారు. కాగా.. కర్ణాటకలోని ప్రత్యేక ప్రాంతానికి సంబంధించిన సంస్కృతి, జానపద కథ నిర్మాణం కోసం రిషబ్ శెట్టి తన స్వగ్రామంలోనే ఎక్కువగా ఈ మూవీని చిత్రీకరించినట్లు తెలుస్తోంది.రిషబ్ శెట్టి మాట్లాడుతూ..'ఈ సినిమా దాదాపు 90 శాతం పోస్ట్, ప్రొడక్షన్ పనులన్నీ మా సొంత గ్రామంలోనే జరిగాయి. మేము కేవలం మిగిలిన పదిశాతం పనికోసమే బెంగళూరు, కొచ్చికి వచ్చాం. ఈ సినిమా కోసం ఏకంగా సంగీత దర్శకుడిని కూడా గ్రామానికి తీసుకువచ్చి అక్కడే మొత్తం రికార్డింగ్ పూర్తి చేశాం. సినిమా ఎడిటింగ్లో దాదాపు 90 శాతం మా గ్రామంలోనే జరిగింది. మా గ్రామంలోని ప్రజలు పెద్దఎత్తున షూటింగ్ వద్దకు రావడంతో ఒకరకంగా ఫిల్మ్ టౌన్గా మారిపోయింది. ప్రతి రోజు కనీసం 100 వాహనాలు షూటింగ్కు వచ్చేవి. దాదాపు ప్రతి రోజు వెయ్యిమందిని సెట్లో ఉంచాం. కాంతార కోసమే నేను, నా భార్య, పిల్లలతో కలిసి నా స్వగ్రామానికి వెళ్లా' అని అన్నారు.కాగా.. కాంతార: చాప్టర్ 1 కేవలం నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 300 కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ చిత్రం అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ సినిమాలో రుక్మిణి వసంత్, జయరామ్, గుల్షన్ దేవయ్య కీలక పాత్రల్లో నటించారు. -
కాంతారలో ఇలా కనిపించిన స్టార్ నటుడు ఎవరో తెలుసా?
కాంతార ఛాప్టర్–1 చిత్రం అక్టోబర్ 2వ తేదీన విడుదలై వసూళ్ల వర్షం కురిపిస్తున్న విషయం తెలిసిందే. నటుడు రిషబ్శెట్టి కథానాయకుడిగా నటించి, దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నటి రుక్మిణి వసంత్ కీలక పాత్రను పోషించారు. హోంబలే సంస్థ నిర్మించిన ఈ చిత్రంలో నటుడు సంపత్రామ్ ఒక ముఖ్య పాత్రను పోషించారు. ఈయన తమిళం, తెలుగు, మలయాళం తదితర భాషల్లో నటిస్తూ పాన్ ఇండియా నటుడిగా రాణిస్తున్నారు. సలార్, కన్నప్ప, డాకు మహరాజ్, విక్రమ్, నారప్ప, తంగలాన్ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు కూడా ఆయన పరిచయమే. తమిళ్లో సుమారు 80కి పైగా సినిమాల్లో ఆయన నటించారు. రిషబ్శెట్టి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్న సమయంలోనే సంపత్తో పరిచయం కావడం ఆ నాటి నుంచి వారిద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. మంచి స్నేహితులుగా ఉన్న ఈ ఇద్దరూ కలిసి ఇప్పటికే ఒక సినిమాలో నటించారు.తాజాగా కన్నడంలో రూపొంది తమిళం, తెలుగు, మలయాళం, బెంగాలీ, ఆంగ్లం భాషల్లో అనువాదమై విడుదలైన కాంతార ఛాప్టర్–1 చిత్రంలో కొండజాతి ప్రజల నాయకుడిగా నటించారు. దీనిపై ఆయన తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఈ చిత్రంలో ముఖ్య పాత్రను పోషించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ చిత్రంలో కొండజాతి ప్రజల నాయకుడిగా తక్కువ సన్నివేశాల్లో నటించినా చాలా సంతృప్తిగా ఉందన్నారు. ఈ చిత్రంలో వైవిధ్యభరిత గెటప్లో కనిపిస్తాననీ, ఆ గెటప్ కోసం గంటన్నర పాటు మేకప్కు సమయం పట్టేదని, అదే విధంగా మేకప్ తీయడానికి గంటకు పైగా సమయం పట్టేదని చెప్పారు. అయినప్పటికీ మంచి విజయం సాధించిన చిత్రంలో నటించే అవకాశం రావడం భాగ్యంగా భావిస్తున్నట్లు చెప్పారు. ఇంత మంచి అవకాశాన్ని కల్పించిన నటుడు, దర్శకుడు రిషబ్శెట్టికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు నటుడు సంపత్రామ్ పేర్కొన్నారు. -
సూపర్ హిట్ మూవీ.. తెలుగు ట్రైలర్ రిలీజ్
షేన్ నిగమ్, ప్రీతి అస్రానీ, శాంతను భాగ్యరాజ్, సెల్వరాఘవన్, ప్రేమమ్ డైరెక్టర్ ఆల్పాన్స్ పుదిరన్ ప్రధాన పాత్రల్లో వస్తోన్న చిత్రం బల్టీ . ఇప్పటికే తమిళ, మలయాళం భాషల్లో సూపర్ హిట్గా నిలిచిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు వస్తోంది. ఉన్ని శివలింగం దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రం అక్టోబర్ 10న టాలీవుడ్లో రిలీజ్ అవుతోంది. కబడ్డీ ఆట నేపథ్యంలో సాగే ఈ సినిమాలో రాజకీయాలు, గ్యాంగ్ స్టర్ కథలతో కలిపి వైవిధ్యంగా రూపొందించారు. ఈ చిత్రాన్ని తెలుగులో ఎల్మా పిక్చర్స్ సంస్థ విడుదల చేస్తోంది.ఈ సందర్భంగా సంస్థ అధినేత ఎన్. ఎథిల్ రాజ్ మాట్లాడుతూ.. 'తమిళ, మలయాళ భాషల్లో రూపొందిన ఈ సినిమా ఘనవిజయం సాధించింది. క్రిటిక్స్ కూడా చక్కటి రివ్యూలు ఇవ్వడంతో ఈ సినిమాను తెలుగులోకి డబ్ చేసి విడుదల చేస్తున్నాం. ప్రస్తుతం మంచి ఫామ్లో ఉన్న యువ సంగీత దర్శకుడు సాయి అభయంకర్ సంగీతాన్ని అందించారు. మలయాళంలో మంచి గుర్తింపు తెచ్చుకున్న యువ నటుడు షేన్ నిగమ్ ఇందులో హీరోగా అద్భుతమైన నటన కనబరిచారు. ప్రీతి అస్రానీ, శాంతను భాగ్యరాజ్ నటన ఆకట్టుకుంటుంది. ప్రముఖ దర్శకుడు సెల్వరాఘవన్ విలన్ పాత్రలో అద్భుతంగా నటించారు' అని అన్నారు.దర్శకుడు ఉన్ని శివలింగం మాట్లాడుతూ..'తమిళనాడు, కేరళ సరిహద్దులో ఉన్న వెలంపాళయంలో జరిగే ఔట్ అండ్ ఔట్ రా రస్టిక్ విలేజ్ డ్రామాగా సినిమా ఉంటుంది. ఆ ఊరిని శాసించే ముగ్గురు పెద్దలు వారి మధ్య జరిగే వ్యాపార రాజకీయాల్లో నలుగురు కబడ్డీ ప్లేయర్స్ చిక్కుకోవడం, ఆపై వచ్చే ఘర్షణలు, భావోద్వేగాల సమాహారంగా బల్టీ సినిమా ఉండనుంది' అని అన్నారు. -
రామాయణలో సీత రోల్.. నేను ఆ పని చేయలేదు: కేజీఎఫ్ హీరోయిన్
'కేజీఎఫ్' సినిమాతో పాన్ ఇండియా బ్యూటీగా గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ శ్రీనిధి శెట్టి. యశ్ సరసన నటించిన ముద్దుగుమ్మ తన గ్లామర్తోనూ అభిమానులను ఆకట్టుకుంది. కేజీఎఫ్ తర్వాత నాని హీరోగా వచ్చిన హిట్ -3 మూవీలో కనిపించింది. ప్రస్తుతం టాలీవుడ్లో 'తెలుసు కదా' అనే తెలుగు చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూకు హాజరైంది.ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. రణ్బీర్ కపూర్, సాయి పల్లవి జంటగా వస్తోన్న రామాయణ చిత్రంలో ఛాన్స్ గురించి క్లారిటీ ఇచ్చింది. సీతగా సాయి పల్లవి చేస్తోన్న రోల్ను రిజెక్ట్ చేశానన్న వార్తలపై శ్రీనిధి శెట్టి స్పందించింది. ఆడిషన్కు వెళ్లిన మాట నిజమే కానీ.. తాను ఆ పాత్రకు ఎంపిక కాలేదని తెలిపింది. సీత రోల్కు ఎవరైతే సెట్ అవుతారో నిర్మాతలు డిసైడ్ చేశారని వెల్లడించింది. ఆ మూవీ ఆడిషన్కు వెళ్లడమే తనకు గొప్ప గౌరవమని ఆనందం వ్యక్తం చేసింది. అంత పెద్ద రోల్కు నేను ఆడిషన్ ఇచ్చినందుకు గర్వంగా ఉందని తెలిపింది.సీత పాత్రకు ఆడిషన్లో నన్ను సెలెక్ట్ చేయలేదని.. అంతకుమించి ఏం జరగలేదని శ్రీనిధి బ్యూటీ చెప్పింది. నేను ఎంపిక కాకపోయినా.. సౌత్ నుంచి సాయి పల్లవిని తీసుకోవడం నాకు ఆనందంగా అనిపించిందన్నారు. అంతే కానీ ఈ పాత్రను తాను రిజెక్ట్ చేయలేదని కేజీఎఫ్ భామ చెప్పుకొచ్చింది.శ్రీనిధి కెరీర్ విషయానికొస్తే.. 2018 నుంచి ఇప్పటివరకు ఐదు సినిమాలు మాత్రమే చేసింది. కేజీఎఫ్ రెండు పార్ట్స్ హిట్ అయ్యాయి. తమిళంలో విక్రమ్ సరసన 'కోబ్రా' చేసింది. ఇది ఫ్లాప్ అయింది. తెలుగులో నానితో చేసిన 'హిట్ 3' ఆకట్టుకుంది. ప్రస్తుతం టాలీవుడ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ చిత్రం 'తెలుసు కదా'లో ఓ హీరోయిన్గా చేసింది. -
కేజీఎఫ్ను దాటేసిన కాంతార చాప్టర్-1.. నాలుగు రోజుల్లో ఎన్ని కోట్లంటే?
కన్నడ హీరో రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో వచ్చిన లేటేస్ట్ మూవీ 'కాంతార: చాప్టర్ 1'. ఈ ఏడాది దసరా కానుకగా అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. కాంతార మూవీకి ప్రీక్వెల్గా వచ్చిన ఈ సినిమాకు తొలి రోజే పాజిటివ్ టాక్ రావడంతో వసూళ్లపరంగా దూసుకెళ్తోంది. తొలి మూడు రోజుల్లోనే రూ.235 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది.దేశవ్యాప్తంగా చూస్తే కాంతార చాప్టర్-1 నాలుగు రోజుల్లోనే రూ. 232.75 కోట్ల నెట్ కలెక్షన్స్ వసూలు చేసింది. గ్రాస్ పరంగా చూస్తే రిలీజైన నాలుగు రోజుల్లో రూ.300 కోట్ల క్లబ్కు చేరువలో ఉంది. తొలి రోజు రూ. 89 కోట్ల భారీ వసూళ్లను నమోదు చేసిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అదే జోరు కొనసాగిస్తోంది. ఇలాగే ఆడియన్స్ నుంచి రెస్పాన్స్ వస్తే కాంతార: చాప్టర్ 1 రూ. 300 కోట్ల మార్క్ త్వరలోనే అధిగమించనుంది.కాగా.. ఇప్పటికే ఈ సినిమా కన్నడలో ఆల్ టైమ్ అత్యధిక వసూళ్లు సాధించిన మూడో చిత్రంగా నిలిచింది. ఈ జాబితాలో యశ్ నటించిన కేజీఎఫ్: చాప్టర్ 1ను అధిగమించింది. కాంతార, కేజీఎఫ్ చాప్టర్ 2 తర్వాత స్థానంలో ఈ చిత్రం నిలిచింది. కాంతార రూ. 408 కోట్లు సాధించగా.. కేజీఎఫ్-2 రూ. 1,215 కోట్లు వసూలు చేసింది. ఈ చిత్రంలో రుక్మిణి వసంత్, జయరామ్, గుల్షన్ దేవయ్య ప్రధాన పాత్రల్లో నటించారు. -
'కాంతార 1'లో రిషభ్ శెట్టి భార్య కూడా నటించింది.. గుర్తుపట్టారా?
'ప్రతి మగాడి విజయం వెనక ఓ ఆడది ఉంటుంది'.. అందరి విషయంలోనూ అని చెప్పలేం గానీ ఈ సామెత చాలాసార్లు నిజమవుతూ ఉంటుంది. దానికి లేటెస్ట్ ఉదాహరణ 'కాంతార 1'తో మరో పాన్ ఇండియా హిట్ కొట్టిన రిషభ్ శెట్టి. ఎందుకంటే హీరోగా ఇప్పుడు ఇతడు సక్సెస్ అయిండొచ్చు. కానీ ఏ ఫేమ్ లేని టైంలోనే ఇతడిని నమ్మిన ప్రగతి శెట్టి.. తోడునీడలా నిలిచింది. ఇప్పుడు ఫెర్ఫెక్ట్ కపుల్ అనిపించుకుంటున్నారు. ఇంతకీ వీళ్ల ప్రేమకథ ఏంటి? 'కాంతార 1'లో రిషభ్తో పాటు ప్రగతి కూడా నటించిందనే విషయం మీలో ఎందరు కనిపెట్టారు?కన్నడ ఇండస్ట్రీలో 'ఆర్ఆర్ఆర్' (RRR) గురించి తెలియని వాళ్లు ఉండరు. వీళ్లే రక్షిత్ శెట్టి, రిషభ్ శెట్టి, రాజ్ బి శెట్టి. వీరిలో రక్షిత్, రాజ్ బి శెట్టి.. లోకల్ వరకు మాత్రమే గుర్తింపు తెచ్చుకోగా రిషభ్ శెట్టి మాత్రం 'కాంతార' చిత్రాలతో ఎనలేని క్రేజ్ సొంతం చేసుకున్నాడు. వాటర్ కాన్ బిజినెస్ నుంచి ఇండస్ట్రీలోకి వచ్చిన రిషభ్ శెట్టి.. ప్రొడక్షన్ బాయ్, క్యారెక్టర్ ఆర్టిస్టు, డైరెక్టర్.. ఇలా ఒక్కో మెట్టు ఎదుగుతూ ఇక్కడివరకు వచ్చాడు. అయితే 2016లో 'కిరిక్ పార్టీ' మూవీతో హిట్ కొట్టిన తర్వాత రిషభ్ గురించి కన్నడ ఇండస్ట్రీలో తెలిసింది.(ఇదీ చదవండి: 'కాంతార'లో నవ్వించిన ఈ నటుడు ఎలా మరణించాడో తెలుసా?)అయితే 'కిరిక్ పార్టీ' సినిమా రావడానికి చాన్నాళ్ల ముందు నుంచే రిషభ్, ప్రగతి ప్రేమించుకున్నారు. ఓ మూవీ ఈవెంట్లో తొలుత వీళ్లిద్దరూ కలసుకోగా.. తర్వాత ఫేస్బుక్ ఫ్రెండ్స్ అయ్యారు. కొన్నాళ్లకు ప్రేమ విషయాన్ని ఒకరితో ఒకరు పంచుకున్నారు. అయితే ప్రగతి తన ప్రేమ విషయాన్ని ఇంట్లో చెప్పగా.. రిషభ్ ఇంకా జీవితంలో సక్సెస్ కాలేదని ఆమె తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. కొన్నాళ్లపాటు కష్టపడి పెద్దల్ని ఒప్పించిన తర్వాత 2017లో రిషభ్-ప్రగతి పెళ్లి చేసుకున్నారు. వీళ్లకు రణ్విత్, రాధ్య అని కొడుకు, కూతురు ఉన్నారు.అసలు విషయానికొస్తే.. రిషభ్ శెట్టి హీరోగా చేసిన బెల్ బాటమ్ సినిమాకు కాస్ట్యూమ్ డిజైనర్గా చేసిన ప్రగతి, 2022లో వచ్చిన 'కాంతార'కి కూడా పనిచేసింది. లేటెస్ట్ సెన్సేషన్ 'కాంతార 1'కి కూడా కాస్ట్యూమ్ డిజైనర్గా చేసి ప్రశంసలు అందుకుంటోంది. అయితే ఈ సినిమా ప్రారంభంలో రాజు పక్కన ఓ పిల్లాడిని ఎత్తుకునే ఓ మహిళ నిలబడి ఉంటుంది. ఆమె ప్రగతినే. అలా ఫస్టాప్లో అద్భుతమైన రెస్పాన్స్ అందుకుంటున్న రథం సీన్లోనూ ప్రగతి శెట్టి తన కొడుకుతో కనిపిస్తుంది. కాకపోతే ఒకటి రెండు సెకన్ల పాటు కనిపించే ఆ సీన్ని చాలామంది నోటీస్ కూడా చేసి ఉండరు. అలా తన భార్య, పిల్లలతో కూడా రిషభ్ శెట్టి యాక్టింగ్ చేయించేశాడు!(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 23 సినిమాలు) -
'కాంతార'లో నవ్వించిన ఈ నటుడు ఎలా మరణించాడో తెలుసా?
కాంతార చాప్టర్-1 సినిమా చూసిన వారందరూ నటుడు రాకేశ్ పూజారి (34) (Rakesh Poojary) గురించి ప్రశంసిస్తూ కామెంట్లు పెడుతున్నారు. ఆయన గురించి తెలుసుకునేందుకు ప్రయత్నం కూడా చేస్తున్నారు. అయితే, ఆయన ఈ సినిమా షూటింగ్ సమయంలోనే మరణించారు. దీంతో చిత్ర యూనిట్ కూడా ఆ సమయంలో సంతాపం తెలిపింది.ఈ ఏడాది మే 13న రాకేశ్ పూజారి గుండెపోటుతో మరణించారు. కర్ణాటకలోని ఉడుపి జిల్లాలో తన సన్నిహితులు నిర్వహించిన ఓ మెహందీ వేడుకలో ఆయన పాల్గొన్నారు. అక్కడ డ్యాన్స్ చేస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ఆసుపత్రిలో చేర్పించేలోపే ఆయన మరణించారు. కన్నడలో ప్రముఖ టెవిలిజన్ షో ‘కామెడీ ఖిలాడిగలు’ సీజన్ 3 విన్నర్గా ఆయన నిలిచాడు. దీంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న రాకేశ్కు చాలా సినిమా ఛాన్సులు దక్కాయి. కన్నడ, తుళు భాషల్లోని పలు సినిమాల్లో నటించి పేరు తెచ్చుకున్నారు. అయితే, ‘కాంతార చాప్టర్-1’లో తన పాత్ర చిత్రీకరణను పూర్తి చేసిన తర్వాతే ఆయన మరణించారు. ఇప్పుడు ఈ సినిమా చూసిన వారికి రాకేశ్ పూజారి పాత్ర గుర్తిండిపోయేలా ఉండటంతో అతని గురించి ఆరా తీస్తున్నారు. అయితే, రాకేశ్ పూజారి పాత్రకు తెలుగు వాయిస్ డబ్బింగ్ కమెడియన్ బబ్లూ చెప్పారు.కాంతార చిత్రానికి ప్రీక్వెల్గా ‘కాంతార చాప్టర్ 1’ అక్టోబర్ 2న విడుదలైంది. కేవలం నాలుగురోజుల్లోనే రూ.300 కోట్ల క్లబ్లో చేరింది. అత్యధిక కలెక్షన్లు రాబట్టిన కన్నడ సినిమాల జాబితాలో ఈ చిత్రం చోటు సంపాదించుకుంది. స్వీయ దర్శకత్వంలో రిషబ్శెట్టి హీరోగా నటించగా.. రుక్మిణీ వసంత్, గుల్షన్ దేవయ్య కీలక పాత్రలలో కనిపించారు. View this post on Instagram A post shared by Comedian Babloo (@babloo_cheee) -
అందుకే ఎక్కువ సినిమాలు చేయడం లేదు: హీరోయిన్
దక్షిణాదిలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న హీరోయిన్ శ్రద్ధ శ్రీనాథ్ (Shraddha Srinath). ఈమె తొలిసారిగా నటించిన వెబ్ సిరీస్ 'ది గేమ్: యు నెవర్ ప్లే ఎలోన్' (The Game: You Never Play Alone Web Series). సంతోష్ ప్రతాప్ కథానాయకుడిగా నటించిన ఈ వెబ్ సిరీస్ను దర్శకుడు రాజేష్ ఎం.సెల్వ రూపొందించారు. దసరా పండుగ సందర్భంగా ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్లో విడుదలై స్ట్రీమ్ అవుతోంది. వెబ్ సిరీస్ఈ సందర్భంగా శ్రద్ధ శ్రీనాథ్ మాట్లాడుతూ.. ఈ సిరీస్లో తాను, సంతోష్ ప్రతాప్ గేమ్ డెవలపర్స్గా నటించామని చెప్పారు. గేమ్ డెవలపర్స్ అయిన తమను సామాజిక మాధ్యమాలు ఎలా బాధింపునకు గురిచేశాయి? తమ చుట్టూ ఉన్న వారిని ఎలా సమస్యల వలయంలో చిక్కుకునేటట్లు చేశాయి? అనే ఆసక్తికరమైన అంశాలతో రూపొందిన వెబ్ సిరీస్ ది గేమ్ అని చెప్పారు. 7 ఎపిసోడ్స్తో కూడిన ఈ సిరీస్ కోసం యూనిట్ అంతా ఎంతగానో శ్రమించినట్లు చెప్పారు. నాకు అదే ముఖ్యంతాను అధికంగా పద్ధతిగల పాత్రల్లో నటించడానికి కారణం.. తనను ప్రేక్షకులు అలాంటి పాత్రల్లో చూడాలని కోరుకోవడమే అన్నారు. అయితే తనకు లవ్, రొమాన్స్తో పాటు సీక్రెట్ ఏజెంట్ వంటి అడ్వెంచర్, థ్రిల్లర్, యాక్షన్ కథాచిత్రాల్లోనూ యాక్ట్ చేయాలని ఆశగా ఉందన్నారు. ఎక్కువ సినిమాలు చేయడం లేదని కొందరు అడుగుతున్నారని.. తనకు ఎక్కువ చిత్రాలు నటించడం లక్ష్యం కాదని పేర్కొన్నారు. చేసింది తక్కువ సినిమాలే అయినా అందులో మంచిగా నటించి అభిమానులను అలరించడమే ముఖ్యమని పేర్కొన్నారు.చదవండి: రజినీకాంత్ను దృష్టిలో పెట్టుకుని ఈ కథ రాశా! -
సిగ్గులేని మనిషి.. పుట్టబోయే బిడ్డ శాపం తగులుతుంది!
జిల్లా, వేలైక్కారన్, మెర్సల్ తదితర చిత్రాల్లో కాస్ట్యూమ్ డిజైనర్గా పని చేసిన జాయ్ క్రిజిల్డా (Joy Crizildaa) ప్రముఖ చెఫ్, నటుడు మాధంపట్టి రంగరాజ్తో పరిచయం పెంచుకుంది. మాధంపట్టి రంగరాజ్కు అప్పటికే వివాహితుడు కాగా, జాయ్ క్రిజిల్డాను రెండో పెళ్లి చేసుకున్నాడు. జాయ్ క్రిస్టిల్డా ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ తాను గర్భవతి అని ప్రకటించింది. కానీ ఈ సంతోషం ఎంతోకాలం నిలవలేదు.మోసం చేశాడన్న కాస్ట్యూమ్ డిజైనర్మాధంపట్టి రంగరాజ్ తనను మోసం చేశాడని ఆరోపిస్తూ జాయ్ క్రిజిల్డా చెన్నై పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది. తన కడుపులో పెరిగే బిడ్డకు రంగరాజ్ బాధ్యత వహించాలంటూ ఫిర్యాదులో పేర్కొంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు గత వారం జాయ్ను దాదాపు 6 గంటలపాటు విచారించారు. త్వరలోనే మాధంపట్టి రంగరాజ్ను కూడా విచారించనున్నారు. ఈ స్థితిలో జాయ్ క్రిజిల్డా శనివారం తన సోషల్ మీడియా పేజీలో ఒక సంచలనాత్మక పోస్ట్ చేసింది.సిగ్గులేని మనిషి“ఒక వ్యక్తి ఎలాంటి అపరాధ భావన లేకుండా తిరుగుతాడు. అతను గర్వంగా తల పైకెత్తి నడుస్తాడు. నువ్వు మంచివాడివిగా నిన్ను నువ్వు నిరూపించుకుంటూనే ఉన్నావు. నీలాంటి సిగ్గులేని మనిషిని ఇంతవరకు చూడలేదు. నువ్వు పరిగెత్తినా, దాక్కున్నా, పుట్టబోయే బిడ్డ శాపం నీడలా నిన్ను అనుసరిస్తుంది. అది నిన్ను ఎప్పటికీ వదిలి వెళ్లదు’ అని రాసుకొచ్చింది. మరో పోస్ట్లో బిడ్డ పుట్టకముందే వదిలేసి వెళ్లిపోయావ్, నువ్వేం తండ్రివి అని తిట్టిపోసింది. View this post on Instagram A post shared by J Joy (@joycrizildaa) చదవండి: రజినీకాంత్ను దృష్టిలో పెట్టుకుని ఈ కథ రాశా! -
రజినీకాంత్ను దృష్టిలో పెట్టుకుని ఈ కథ రాశా!
ప్రదీప్ రంగనాథన్, నటి మమిత బైజు జంటగా నటిస్తున్న చిత్రం డ్యూడ్ (Dude Movie). సుధా కొంగర వద్ద ఏడెనిమిది సంవత్సరాలు సహాయ దర్శకుడిగా పని చేసిన కీర్తిశ్వరన్ ఈ మూవీతో డైరెక్టర్గా పరిచయం కాబోతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్పై నిర్మితమైన ఈ చిత్రం దీపావళి సందర్భంగా తెరపైకి రానుంది. తాజాగా ఈ సినిమా నుంచి సింగారి అనే పాటను రిలీజ్ చేశారు.అలా కథ చెప్పాఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ.. సినిమాటోగ్రాఫర్ నికేత్ బొమ్మి ద్వారా మైత్రి మూవీ మేకర్స్ సంస్థ అధినేతలకు ఈ కథను చెప్పే అవకాశం కలిగిందన్నారు. వాళ్లకు కథ నచ్చడంతో వెంటనే షూటింగ్ కార్యక్రమాలను ప్రారంభించామన్నారు. రజనీకాంత్ 30 ఏళ్ల వయసును దృష్టిలో పెట్టుకొని డ్యూడ్ కథ రాసినట్లు తెలిపారు. ఈ పాత్రలో నటుడు ప్రదీప్ రంగనాథన్ ఒదిగిపోయారన్నారు. ఇది లవ్ సబ్జెక్ట్ అయినప్పటికీ మాస్ యాంగిల్స్ కూడా ఉంటాయన్నారు. ఒక దర్శకుడిగా తన తొలి చిత్రం దీపావళికి విడుదల కావడం అనేది.. తన కల నిజం అవుతున్నట్లు అనిపిస్తోందన్నారు. ప్రేమలుకు ముందే..ప్రేమలు చిత్రం విడుదలకు ముందే నటి మమిత బైజు నటించిన సూపర్ శరణ్య చిత్రాన్ని చూసి ఆమెను తమ చిత్రం కోసం ఎంపిక చేసినట్లు చెప్పారు. ఆమె ఈ చిత్రంలోకి రాగానే రజనీకాంత్, శ్రీదేవి జంటగా నటించినట్లు అనిపిస్తోందన్నారు. నటుడు శరత్ కుమార్, రోహిణి, పరిదాపంగాల్ ఫేమ్ డేవిడ్ తదితరులు ముఖ్య పాత్ర పోషించిన ఈ చిత్రానికి సాయి అభ్యంకర్ సంగీతాన్ని అందించారు.చదవండి: విలన్ రోల్స్ చేస్తున్న హీరోయిన్స్ -
హై హై ప్రతి నాయికా
డ్యూయెట్స్ పాడుతూ, కాసిన్ని జోక్స్ వేస్తూ, ఎమోషనల్ సీన్స్లో కన్నీళ్లు పెట్టుకుంటూ... కథానాయికల పాత్రలు దాదాపు ఇలానే ఉంటాయి. అందుకే విభిన్న తరహా పాత్రలు దక్కితే ‘సై’ అనేస్తారు. అదే నెగటివ్ క్యారెక్టర్ అయితే... నటించడానికి చాలా స్కోప్ ఉంటుంది కాబట్టి వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తారు. ఇప్పటికే స్టార్ హీరోయిన్స్ సమంత, తమన్నా వంటివారు విలన్ రోల్స్ చేసి, సక్సెస్ అయ్యారు.శ్రద్ధా శ్రీనాథ్, అనన్యా నాగళ్ల, సంయుక్త, రచితా రామ్, రుక్మిణీ వసంత్... ఇలా యువ తారలు సైతం విలన్ రోల్స్ చేసేందుకు ఆలోచించడం లేదు. ప్రతి నాయిక పాత్రల్లో నటనపరంగా విజృంభించి, ‘హై హై ప్రతినాయికా’ అని ప్రేక్షకులు అనేలా తమ సత్తా నిరూపించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో లేడీ విలన్గా చేస్తున్న కొందరు హీరోయిన్స్ గురించి తెలుసుకుందాం.స్లమ్ డాగ్లో... వెంకటేశ్ ‘కూలీ నెం.1’, నాగార్జున ‘నిన్నే పెళ్ళాడతా’ వంటి చిత్రాల్లో హీరోయిన్గా, అల్లు అర్జున్ ‘అల..వైకుంఠపురములో..’ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా టబు తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలే. ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలోని ‘స్లమ్ డాగ్’ (ప్రచారంలో ఉన్న టైటిల్) చిత్రంలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు టబు. విజయ్ సేతుపతి హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో టబు విలన్గా కనిపిస్తారని సమాచారం. పూరి కనెక్ట్స్, జేబీ మోషన్ పిక్చర్స్ సంస్థలు ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఇదిలా ఉంటే... గతంలో ‘మక్బూల్’, ‘అంధా ధూన్’ వంటి హిందీ చిత్రాల్లో టబు నెగటివ్ రోల్స్ చేసిన విషయం తెలిసిందే.ధన పిశాచి... టాలీవుడ్కి విలన్గా ఎంట్రీ ఇస్తున్నారు బాలీవుడ్ నటి సోనాక్షీ సిన్హా. తెలుగు, హిందీ భాషల్లో రూపొందుతున్న ‘జటాధర’లో సోనాక్షీ సిన్హా విలన్ రోల్ చేస్తున్నారు. ఇందులో ఆమె ధన పిశాచిగా కనిపించనున్నారు. సుధీర్బాబు హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో సోనాక్షీ సిన్హాతో పాటు దివ్య ఖోస్లా, శిల్పా శిరోద్కర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. శిల్పా శిరోద్కర్ పాత్రలోనూ నెగటివ్ షేడ్స్ ఉంటాయట. వెంకట్ కల్యాణ్, అభిషేక్ జైస్వాల్లు ‘జటాధర’ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. కేరళలోని తిరువనంతపురంలో గల అనంత పద్మనాభస్వామి దేవాలయం నేపథ్యంలో సాగే ఈ చిత్రం నవంబరు 7న విడుదల కానుంది. దెయ్యంగా పూజ? దర్శక–నిర్మాత–నటుడు–కొరియోగ్రాఫర్ రాఘవా లారెన్స్ ‘కాంచన’ ఫ్రాంచైజీ నుంచి రానున్న తాజా చిత్రం ‘కాంచన 4’. ఈ చిత్రంలో రాఘవా లారెన్స్తో పాటు పూజా హెగ్డే, నోరా ఫతేహీ మెయిన్ లీడ్ రోల్స్లో నటిస్తున్నారని తెలిసింది. ఈ చిత్రంలో దెయ్యం పాత్రలో పూజా హెగ్డే కనిపిస్తారట. పూజ లేదా నోరా ఫతేహీ... ఇలా ఎవరో ఒకరి పాత్ర నెగటివ్ షేడ్స్లో ఉంటుందనే టాక్ కోలీవుడ్లో వినిపిస్తోంది. దాదాపు సగం చిత్రీకరణ పూర్తి చేసుకున్న ‘కాంచన 4’ సినిమా వచ్చే వేసవిలో విడుదల కావొచ్చు. వారియర్ విలన్...కాలేజీ అమ్మాయి, ప్రేయసి, భార్య... ఇలా హీరోయిన్గా విభిన్న రకాల పాత్రల్లో నటించి, మెప్పించారు రష్మికా మందన్నా. ఇప్పుడు తనలోని నెగటివ్ యాంగిల్ని తెరపై ఆవిష్కరించేందుకు రెడీ అవుతున్నారట రష్మిక. హీరో అల్లు అర్జున్, దర్శకుడు అట్లీ దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇందులో ఓ హీరోయిన్గా దీపికా పదుకోన్ ఖరారయ్యారు.ఇంకా రష్మికా మందన్నా, జాన్వీ కపూర్, మృణాల్ ఠాకూర్, ఆలియా. ఎఫ్... వంటి వారు ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారనే టాక్ తెరపైకి వచ్చింది. రష్మికా మందన్నా నెగటివ్ షేడ్స్ ఉన్న వారియర్ విలన్ పాత్రలో కనిపిస్తారని సమాచారం. ఇదే నిజమైతే రష్మిక విలన్గా కనిపించనున్న తొలి చిత్రం ఇదే కావొచ్చు. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమా 2027లో విడుదల కానుంది. ఇంకా మరికొందరు కథానాయికలు ‘ప్రతి నాయిక’లుగా కనిపించనున్నారు. -
ఉప్పెన బ్యూటీ స్టన్నింగ్ లుక్.. బ్లాక్ డ్రెస్లో సంక్రాంతికి వస్తున్నాం బ్యూటీ!
సెప్టెంబర్ జ్ఞాపకాలు గుర్తు చేసుకున్న శ్రద్ధా శ్రీనాథ్..డిఫరెంట్ శారీ లుక్లో ఉప్పెన బ్యూటీ కృతిశెట్టి..టాలీవుడ్ నటి అనసూయ స్టన్నింగ్ లుక్..బ్లాక్ డ్రెస్లో సంక్రాంతికి వస్తున్నాం బ్యూటీ ఐశ్వర్య రాజేశ్..బ్లాక్ బ్యూటీలా ఓజీ భామ శ్రియా రెడ్డి.. View this post on Instagram A post shared by Shraddha Rama Srinath (@shraddhasrinath) View this post on Instagram A post shared by Shalini Pandey (@shalzp) View this post on Instagram A post shared by Krithi Shetty (@krithi.shetty_official) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Aishwarya Rajesh (@aishwaryarajessh) View this post on Instagram A post shared by Sriya Reddy (@sriya_reddy) -
కాంతార ఛాప్టర్-1.. పంజర్లి లుక్లో సందడి చేసిన అభిమాని!
2022లో వచ్చిన కాంతార మూవీ పాన్ ఇండియా రేంజ్లో బ్లాక్బస్టర్గా హిట్గా నిలిచింది. కన్నడ హీరో రిషబ్ శెట్టి నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ను షేక్ చేసింది. ఈ సినిమాకు ప్రీక్వెల్గా కాంతార ఛాప్టర్-1ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. అభిమానుల భారీ అంచనాల మధ్య రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. తొలి రోజే పాజిటివ్ టాక్ రావడంతో వసూళ్లపరంగా దూసుకెళ్తోంది. కాంతారా మూవీతో కన్నడ హీరో రిషబ్ శెట్టికి దేశవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది.తాజాగా కాంతారా మూవీ థియేటర్లో ఆసక్తికర సన్నివేశం కనిపించింది. తమిళనాడులో దిండిగల్లో ఈ సంఘటన జరిగింది. రిషబ్ శెట్టి అభిమాని కాంతార చిత్రంలో పంజర్లి దేవత అవతారంలో సందడి చేశారు. పంజర్లి లుక్లో థియేటర్లో డ్యాన్స్ చేస్తూ ఆడియన్స్ను అలరించాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. After the screening of Kantara Chapter 1 at a cinema in Dindigul, a fan dressed as a Daiva stunned the audience there.Goosebumps Thank you Divine star @shetty_rishab @hombalefilms for making such a Divine movie #KantaraChapter1 pic.twitter.com/sPd3bNmNHN— ಸನಾತನ (@sanatan_kannada) October 5, 2025 -
గేమ్ ఛేంజర్ రికార్డ్ బ్రేక్.. మూడు రోజుల్లో ఎన్ని కోట్లంటే?
కన్నడ హీరో రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో వచ్చిన భారీ బడ్జెట్ చిత్రం కాంతార ఛాప్టర్-1. గతంలో బ్లాక్బస్టర్ హిట్గా నిలిచిన కాంతారకు ప్రీక్వెల్గా ఈ మూవీని తెరకెక్కించారు. ఈ ఏడాది విజయదశమి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. తొలి రోజే ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ రావడంతో వసూళ్లపరంగా దూసుకెళ్తోంది. మొదటి రోజు రూ.89 కోట్ల గ్రాస్ సాధించిన కాంతార ఛాప్టర్-1.. మూడు రోజుల్లోనే రూ.150 కోట్ల మార్క్ను దాటేసింది. కేవలం మూడు రోజుల్లోనే దేశవ్యాప్తంగా రూ. 162.85 కోట్ల నెట్ వసూళ్లు సాధించింది. ఇక ప్రపంచవ్యాప్తంగా చూస్తే మూడు రోజుల్లో రూ.235 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ క్రమంలోనే బాక్సాఫీస్ వద్ద పలు రికార్డులు సృష్టించింది. ఇప్పటికే ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన కన్నడ చిత్రాల జాబితాలో మొదటిస్థానంలో నిలిచింది. ఈ మూవీ సు ఫ్రమ్ సో (రూ. 92 కోట్ల నికర) జీవితకాల కలెక్షన్స్ను అధిగమించింది. అంతేకాకుండా ఈ ఏడాది విడుదలైన సల్మాన్ ఖాన్ సికందర్(రూ. 110 కోట్లు), రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' (రూ. 131 కోట్లు) లాంటి పెద్ద సినిమాల ఆల్ టైమ్ కలెక్షన్స్ను దాటేసింది. అదే సమయంలో రూ. 150 కోట్ల మార్కును దాటేసిన నాల్గవ కన్నడ చిత్రంగా రికార్డ్ క్రియేట్ చేసింది. అంతేకాకుండా రిషబ్ శెట్టి కాంతార ఛాప్టర్-1 విదేశాల్లోనూ సత్తా చాటుతోంది. మొదటి రెండు రోజుల్లోనే దాదాపు రూ. 22 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. కాగా.. ఈ చిత్రంలో రుక్మిణి వసంత్, గుల్షన్ దేవయ్య, జయరామ్ కూడా కీలక పాత్రల్లో నటించారు. -
హిమాలయాల్లో రజనీకాంత్.. వారం రోజులు అక్కడే!
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) ప్రధాన పాత్రలో నటించిన జైలర్ (Jailer Movie) బ్లాక్బస్టర్ విజయం సాధించింది. 2023లో వచ్చిన ఈ మూవీకి సీక్వెల్గా జైలర్ 2 తెరకెక్కుతోంది. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జూన్ 12న విడుదల కానుంది. ఇకపోతే ఈ మధ్యే రజనీ నటించిన కూలీ సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చిన సంగతి తెలిసిందే! రూ.500 కోట్లు రాబట్టినప్పటికీ సినిమా విషయంలో మాత్రం అభిమానుల్లో కాస్త అసంతృప్తి అలాగే ఉంది.హిమాలయాల్లో ప్రత్యక్షందీంతో జైలర్ 2 విషయంలో చిత్రయూనిట్ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటోంది. ఈ మధ్యే కేరళ షెడ్యూల్ పూర్తయింది. తాజాగా జైలర్ 2కి షూటింగ్కు బ్రేక్ ఇస్తూ రజనీకాంత్ హిమాలయాలకు వెళ్లారు. బిజీ షూటింగ్స్కు బైబై చెప్తూ వారంరోజుల సెలవు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు రిషికేశ్ ఆశ్రమంలో రజనీ సేద తీరుతున్న ఫోటోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. బద్రీనాథ్, బాబా గుహ వంటి పవిత్ర స్థలాలను సైతం సందర్శించినట్లు తెలుస్తోంది.జైలర్ 2రజనీకి ఆధ్యాత్మిక చింతన ఎక్కువన్న విషయం తెలిసిందే! ప్రతి ఏడాది హిమాలయాలకు వెళ్లొస్తుంటారు. జైలర్ రిలీజ్కు ముందు కూడా అక్కడికి వెళ్లొచ్చారు. జైలర్ 2 విషయానికి వస్తే.. ఇందులో మోహన్లాల్, శివరాజ్కుమార్, జాకీ ష్రాఫ్ కీలక పాత్రల్లో నటించనున్నారు. ఫస్ట్ పార్ట్కు సంగీతం అందించిన అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికీ పని చేస్తున్నారు. ఎస్జే సూర్య కూడా ఈ సినిమాలో యాక్ట్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ బ్యానర్పై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు.చదవండి: నేను ఇంటింటికి వెళ్లి చెత్త తీస్తా.. అంత చులకనా?: శ్రీజ తండ్రి -
అమ్మ మరణం తర్వాత సినిమాలు వద్దనుకున్నా: బిగ్బాస్ బ్యూటీ
కమలహాసన్ హోస్ట్గా వ్యవహరించిన బిగ్బాస్ రియాల్టీ షోలో పాల్గొని పాపులర్ అయింది అక్షర రెడ్డి (Akshara Reddy). తాజాగా రైట్ చిత్రం ద్వారా హీరోయిన్గా కోలీవుడ్కు పరిచయం అయింది. ఈ సందర్భంగా తను ఆసక్తికర విషయాలు పంచుకుంది. 2021లో తమిళ బిగ్బాస్ సీజన్ 5లో పాల్గొన్నాను. అప్పుడు 87 రోజులు బిగ్బాస్ ఇంట్లో ఉన్నాను. అది నాకు ఎన్నో రకాల అనుభవాలనిచ్చింది. ఆ హీరోయిన్స్ అంటే ఇష్టంకమల్తో కలిసి నటించాలన్నది నా కల. బిగ్ బాస్ రియాల్టీ షో (Bigg Boss Reality Show)లో ఆయనతో కలిసి మాట్లాడే అవకాశం లభించింది. అప్పుడు ఆయన అందరికీ ఒక మాట చెప్పారు. నీ జీవిత స్క్రిప్టును నువ్వే రాసుకుంటున్నావు. నీ జీవితంలో రేపు ఏమి జరగాలన్నదీ నువ్వే నిర్ణయించుకోవాలి. అని ఆయన చెప్పిన విషయం నా మనసులో నాటుకు పోయింది. నా జీవితాన్ని నేనే నిర్ణయించుకుంటున్నాను. సూపర్ స్టార్ రజనీకాంత్ అంటే కూడా నాకు చాలా ఇష్టం. ఐశ్వర్యారాయ్, శ్రీదేవిలకు వీరాభిమానిని. అలాగే శ్రుతిహాసన్ అంటే చాలా ఇష్టం. సినిమాలు వద్దనుకున్నా..ప్రస్తుతం తమిళ్లో నేను రైట్ చిత్రం ద్వారా కథానాయికగా పరిచయం అయ్యాను. మా అమ్మ మరణం తర్వాత సినిమా రంగమే వద్దనే భావనకు వచ్చాను. కానీ, దర్శకుడు చెప్పిన కథ నచ్చడంతో రైట్ చిత్రంలో నటించేందుకు అంగీకరించాను. నేను ఇంతకుముందే బిల్ గేట్స్ అనే కన్నడ చిత్రంలో హీరోయిన్గా చేశాను. కాలేజీ అయిపోగానే జార్జియాకు వెళ్లి సైకాలజీ చదివాను. తమిళం, తెలుగు, హిందీ, ఇంగ్లిష్ ధారాళంగా మాట్లాడగలను అని అక్షర రెడ్డి చెప్పుకొచ్చింది.చదవండి: 80's స్టార్స్ రీయూనియన్.. 31 మంది నటులందరూ ఒకేచోట! -
80's స్టార్స్ రీయూనియన్.. 31 మంది నటులందరూ ఒకేచోట!
స్టార్ హీరోలందరూ ఒక్కచోటకు చేరారు. 80వ దశకంలో వెండితెరపై సందడి చేసిన అగ్రనటులందరూ ఒకేచోట కలిసి ఎంతో ఘనంగా రీయూనియన్ (The 80s Stars Reunion) పార్టీ చేసుకున్నారు. 80's రీయూనియన్ అంటూ ప్రతి ఏడాది సెలబ్రిటీలందరూ ఒకేచోటకు చేరి సంతోషంగా గడుపుతారన్న విషయం తెలిసిందే! ఈ ఏడాది అక్టోబర్ 4న చెన్నైలో ఘనంగా గెట్ టు గెదర్ సెలబ్రేట్ చేసుకున్నారు. ఈసారి కోలీవుడ్ స్టార్ జంట రాజ్కుమార్ సేతుపతి- శ్రీప్రియ తమ ఇంట్లోనే ఈ పార్టీని ఏర్పాటు చేశారు.31 మంది స్టార్స్టాలీవుడ్ నుంచి చిరంజీవి (Chiranjeevi Konidela), వెంకటేశ్, నరేశ్ ఈ పార్టీలో పాల్గొన్నారు. కోలీవుడ్, మాలీవుడ్, సాండల్వుడ్, అలాగే బాలీవుడ్ నుంచి కూడా స్టార్స్ వచ్చారు. జాకీ ష్రాఫ్, మీనా, శరత్కుమార్, నదియా, రాధ, సుహాసిని, రమ్యకృష్ణ, జయసుధ, సుమలత, ఖుష్బూ, లిస్సీ, శోభన, మేనక, సురేశ్, భాను చందర్, ప్రభు, రెహ్మాన్, రేవతి తదితరులు ఈ వేడుకలో సందడి చేశారు. దాదాపు 31 మంది నటీనటులు ఈ పార్టీలో పాల్గొన్నారు. ఈసారి చిరుత థీమ్ ప్లాన్ చేశారు. అందరూ చీతా ప్రింట్స్ ఉన్న డ్రెస్సులోనే మెరిశారు. మొదటిసారి కలిసినట్లే ఉంది: చిరు80s స్టార్స్ రీయూనియన్కు సంబంధించిన ఫోటోలను మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలో షేర్ చేశారు. 80's స్నేహితులతో ప్రతి రీయూనియన్ మధుర జ్ఞాపకాల వీధిలో ఒక నడకలా ఉంటుంది. నవ్వులు, ఆప్యాయత, పాత జ్ఞాపకాలు తలుచుకుంటూ ఆనందం, ప్రేమతో గడుస్తుంది. ఎన్ని సార్లు కలిసినా, ప్రతి సారి కొత్తగా, మొదటిసారి కలిసినట్టే సంతోషంగా అనిపిస్తుంది అన్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్గా మారాయి.అప్పుడు మొదలైంది80's స్టార్స్ రీయూనియన్ 2009లో ప్రారంభమైంది. లిస్సీ, సుహాసిని తొలిసారి ఈ పార్టీ ఏర్పాటు చేశారు. 2019లో మెగాస్టార్ చిరంజీవి తన నివాసంలో 10వ రీయూనియన్ పార్టీ నిర్వహించారు. 2022లో చివరిసారి గెట్ టు గెదర్ జరిగింది. అప్పుడు బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్, నటి పూనమ్ ధిల్లాన్ పార్టీ హోస్ట్ చేశారు. 2023లో రీయూనియన్ జరగలేదు. 2024లో చెన్నైలో వరదల కారణంగా పార్టీ వాయిదా వేశారు. ఇన్నాళ్లకు మళ్లీ పార్టీ చేసుకుని ఎంజాయ్ చేశారు. పార్టీలో సరదా ఆటలు, పాటలు, డ్యాన్సులు ఉండనే ఉంటాయి. ఇలా ప్రతి ఏడాది జరగే ఈ “80s Stars Reunion” స్నేహం, ఐక్యత, భిన్నత్వంలో ఏకత్వం విలువలకు ప్రతీకగా నిలుస్తోంది. View this post on Instagram A post shared by Chiranjeevi Konidela (@chiranjeevikonidela) చదవండి: ట్రెండింగ్లో దెయ్యం సినిమా..'సుమతి వలవు' మూవీ రివ్యూ -
ట్రెండింగ్లో దెయ్యం సినిమా..'సుమతి వలవు' మూవీ రివ్యూ
తక్కువ బడ్జెట్లో క్వాలిటీ సినిమాలు తీయడం, భారీ వసూళ్లు రాబట్టడంలో మలయాళ ఇండస్ట్రీ దిట్ట! ఈ ఏడాది మాలీవుడ్లో అనేక సినిమాలు హిట్గా నిలిచాయి. అందులో ఒకటి సుమతి వలవు. హారర్ కామెడీ జానర్లో తెరకెక్కిన ఈ సినిమా రూ.25 కోట్లు వసూలు చేసింది. ఈ మధ్యే ఓటీటీ ప్లాట్ఫామ్ జీ5లోకి వచ్చేసింది. తెలుగులోనూ అందుబాటులో ఉంది. ప్రస్తుతం ఓటీటీలో టాప్ ట్రెండింగ్లో ఉంది. మరి ఈ సినిమా ఎలా ఉందో చూసేద్దాం..రియల్ స్టోరీసుమతి వలవు (Sumathi Valavu Movie Review) అంటే తెలుగులో సుమతి మలుపు. ఇది సినిమాలోనే కాదు నిజంగా ఉంది. కేరళ రాష్ట్రం తిరువనంతపురం జిల్లాలోని మైలమ్మూడుకు సమీపంలో ఈ మలుపు ఉంది. 1950ల ప్రాంతంలో సుమతి అనే అమ్మాయిని అక్కడ చంపేశారని, తను దెయ్యమై అక్కడే తిరుగుతోందన్న కథ ప్రచారంలో ఉంది. దాన్ని ఆధారంగా చేసుకుని ఈ మూవీ తీశారు.కథఅడవిని ఆనుకుని కల్లేలి అనే గ్రామం ఉంది. ఆ గ్రామానికి వెళ్లాలంటే అడవి గుండా వెళ్లాలి. అక్కడే సుమతి వలవు అనే టర్నింగ్ పాయింట్ ఉంటుంది. అక్కడే సుమతి అనే దెయ్యం తిరుగుతూ ఉంటుంది. రాత్రి 8 గంటల తర్వాత ఎవరూ అక్కడకు వెళ్లరు. కానీ ఓ రోజు రాత్రి ఆ ఊర్లోని శేఖరన్ పెద్ద కూతురు ప్రేమించినవాడితో పారిపోతుంది. హీరో అప్పూ (అర్జున్ అశోకన్)యే ఏదో చేసుంటాడని శేఖరన్ కుటుంబం అతడిపై పగపెంచుకుంటుంది. ఈ క్రమంలో శేఖరన్ రెండో కూతురు భామ (మాళవిక మనోజ్)తో ప్రేమలో పడతాడు అప్పు. మరి వీరి ప్రేమకథను ఒప్పుకుంటారా? శేఖరన్ పెద్ద కూతురు పారిపోయిందా? లేదా దెయ్యం చంపేసిందా? అన్నది ఓటీటీలో చూసి తెలుసుకోవాల్సిందే!విశ్లేషణహీరో అప్పుకు చీకటంటే పిరికి. ఓరోజు రాత్రి ఊర్లోని నిండు గర్భిణి పురిటినొప్పులతో బాధపడుతుంటే ఆస్పత్రికి తీసుకెళ్లాలంటారు. అందరూ భయపడుతుంటే హీరో గ్యాంగ్ మాత్రం బండి సిద్ధం చేసుకుని తీసుకెళ్తారు. మలుపు దాకా వెళ్లాక బండి దానంతటదే ఆగిపోతుంది. ఈ ఇంటర్వెల్లో జరిగే సీన్లు బాగుంటాయి. కానీ సెకండాఫ్లో కాస్త పస తగ్గినట్లు అనిపిస్తుంది. ఏదేమైనా సినిమాను చాలా సహజంగా తెరకెక్కించారు. మూవీలో ఓ పక్క ప్రేమకథ.. మరోపక్క హారర్ రెండూ ఉంటాయి. మరీ ఎక్కువ భయపెట్టకుండా నవ్విస్తూ, అలరిస్తూ కథ అలా ముందుకు సాగుతుంది. ఫ్యామిలీతో కలిసి ఎంచక్కా చూసేయొచ్చు. అన్నట్లు దీనికి సీక్వెల్ కూడా ప్రకటించారు. The Curve That Everyone’s Talking About — 100 M+ Streaming Minutes Strong 🚀 #ArjunAshokan #SidharthBharathan #GokulSuresh #BaluVarghese #SaijuKurup #BobyKurian #MalavikaManoj #JoohiJu #SijaRoseGeorge #Shivada #GopikaAnil@GokulamMovies @DreamBig_film_s @jsujithnair… pic.twitter.com/0CjoYEX6EL— ZEE5 Malayalam (@zee5malayalam) October 3, 2025 -
'నేషనల్ క్రష్' గురించి ఎక్కువగా ఆలోచించను: రుక్మిణీ వసంత్
కాంతార చాప్టర్-1 విడుదల తర్వాత రుక్మిణీ వసంత్(Rukmini Vasanth) పేరు పాన్ ఇండియా రేంజ్లో ట్రెండ్ అవుతుంది. అందుకు ప్రధాన కారణం ఆమె అందంగా ఉండటమే కాకుండా తన నటన, అభినయంతో ప్రేక్షకులను మెప్పించింది. ఏకంగా శాండల్వుడ్లో స్టార్ హీరోయిన్గా ముద్ర వేసింది. కాంతార సినిమా చూసిన వాళ్లు అందరూ ఆమెనే నేషనల్ క్రష్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. పుష్ప సినిమా తర్వతా రష్మిక మందన్నకు దక్కిన గుర్తింపే రుక్మిణీకి దక్కుతుంది. ఆపై వీరిద్దరూ కూడా కన్నడ నుంచే రావడం విశేషం. తనను నేషనల్ క్రష్ అని పిలువడంపై రుక్మిణీ వసంత్ రియాక్ట్ అయింది.ఇటీవల శివకార్తికేయన్ సరసన ‘మదరాసీ’లో మెప్పించిన రుక్మిణీ.. ‘కాంతార చాప్టర్-1’తో పాన్ ఇండియా ప్రేక్షకులకు దగ్గరైంది. ప్రస్తుతం తన చేతిలో యశ్ టాక్సిక్, ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ సినిమాలు ఉన్నాయి. ఈ రెండు కూడా పాన్ ఇండియా రేంజ్ సినిమాలే.. ఇందులో ఆమె పాత్ర కూడా బలంగా ఉండబోతుందని తెలుస్తోంది.నేషనల్ క్రష్ గురించినేషనల్ క్రష్ ట్యాగ్లైన్ గురించి రుక్మిణీ ఇలా చెప్పింది. 'కొద్దిరోజుల నుంచి చాలా మంది నేషనల్ క్రష్ అంటూన్నారు. ఈ విషయం నా వరకు కూడా వచ్చింది. ఇలాంటివి వినడానికి మాత్రమే చాలా బాగుంటాయి. సంతోషాన్ని కూడా ఇస్తాయి. కానీ, ఇలాంటి ప్రశంసల గురించి నేను ఎక్కువగా ఆలోచించను. ఇలాంటివి ఏమైనా సరే తాత్కాలికంగానే ఉంటాయి. కాలంతో పాటు ఎందరో వస్తుంటారు.. అవి కూడా మారిపోతుంటాయని నేను నమ్ముతాను. కానీ, ప్రేక్షకులకు దగ్గరగా ఉంటే చాలనుకుంటాను. ‘సప్తసాగరాలు దాటి’ సినిమాతో చాలామంది నన్ను ప్రియ పాత్రతో పిలుస్తుంటారు. ఇలా ప్రేక్షకులకు చేరువయ్యితే చాలనుకుంటాను. చాలా సింప్లిసిటీతో కూడిన ఆ పాత్రను కూడా సినీప్రియులు ఆదరించినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది.'అని ఆమె అన్నారు. -
సినీ హీరోలను తలపై పెట్టుకొని ఊరేగకండి: సత్యరాజ్
తమిళనాడులో సినిమాలను, రాజకీయాలను వేరుచేసి చూడలేం. ఈ రెండింటి మధ్య అంత అవినాభావ సంబంధం ఉంది. ప్రఖ్యాత దివంగత రాజకీయ నాయకులు కామరాజర్, అన్నాదురై నుంచి ప్రస్తుత ముఖ్యమంత్రి ఎంకే. స్టాలిన్ వరకు సినిమాలతో చాలా దగ్గర సంబంధం ఉన్న వాళ్లే. ఇప్పుడు కూడా చాలా మంది నటీనటుల దృష్టి రాజకీయాలపైనే ఉందని చెప్పవచ్చు. తాజాగా విజయ్ రాజకీయ రంగప్రవేశం ప్రకంపనలు పుట్టిస్తోందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇటీవల ఆయన ప్రచారంలో జరిగిన దురదృష్టకర సంఘటన అనేక చర్చలకు దారి తీస్తోంది. సినీ రంగంలోనూ విమర్శలు, ప్రతి విమర్శలతో వేడి పుట్టిస్తోంది. ఉదాహరణకు సత్యరాజ్(Satyaraj ), విజయ్ను విమర్శించే విధంగా తన ఇన్స్టాలో ఒక పోస్ట్ చేశారు. అందులో నటులను తలపై పెట్టుకొని ఊరేగకండి.., వాళ్లకు చాలా తెలుసని మీరు భావించకండి, నటించడం మాత్రమే తెలుసు. ఈ సమాజంలో జరుగుతున్న పెద్ద తప్పు నటులను ఐన్ స్టిన్ రేంజ్లో భావిస్తుండడమే. మమ్మల్ని నెత్తినెక్కించుకోకండి. మేము జస్ట్ పాటిస్తాం అంతే. మేము పెరియార్, అంబేడ్కర్ కాదని గుర్తుంచుకోవాలంటూ పేర్కొన్నారు. ఈ కామెంట్పై దర్శకుడు పేరరసు తీవ్రంగా స్పందించారు. ఈయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నటులకు ఏమీ తెలియదు. ఒట్టి మట్టే అంటే ఎలా.. మీరూ నటుడే కదా.. మీరెందుకు సందేశం ఇవ్వడానికి రెడీ అయ్యారు. ఎంజీఆర్ ఉన్నప్పుడు మీకు ఇలా అనే ధైర్యం ఉండేదా ? కమలహాసన్కు ఎంపీ పదవి ఇచ్చారని, మీరు డీఎంకేను అడగాల్సింది. పార్టీ కోసం శ్రమించిన వాళ్లు ఎందరో ఉండగా వారి కూతుళ్లకు పదవి ఇవ్వకుండా సత్యరాజ్ కూతురికి పదవి ఎందుకు ఇచ్చారని మీరు డీఎంకే పార్టీని అడగాలి. నటన అనేది ఒక వృత్తే. అందులోనూ ప్రపంచ జ్ఞానం కలవారు ఎందరో ఉన్నారు. వారిని అరకొర తెలిసిన వాళ్లు అని కించపరచరాదు అని దర్శకుడు పేరరసు సత్యరాజ్పై ఫైర్ అయ్యారు. -
అక్టోబర్లో రిలీజయ్యే సినిమాలివే..
చిత్ర పరిశ్రమలో సినిమాల విడుదలకు సంక్రాంతి సరైన పండగ అని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. పందెం కోళ్లులాగా సంక్రాంతి బరిలో నిలిచేందుకు హీరోలు, దర్శక–నిర్మాతలు తెగ ఆసక్తి చూపుతుంటారు. ఈ కారణంగానే సంక్రాంతికి భారీపోటీ ఉంటుంది. సంక్రాంతి తర్వాత దసరా, దీపావళి పండగలు తమ సినిమాల విడుదలకు మంచి సమయం అని మేకర్స్ ఆలోచన. ఈ ఏడాది దసరా, దీపావళి పండగలు అక్టోబరులోనే రావడం విశేషం. సో.. సినిమా ప్రేమికులకు ఈ నెల సినిమాల పండగే అని చెప్పాచ్చు.ఈ నెల ఆరంభంలో ‘ఇడ్లీ కొట్టు, కాంతారా: చాప్టర్ 1’ వంటి డబ్బింగ్ సినిమాలు విడుదలయ్యాయి. ఇక ఈ నెలలోనే రవితేజ ‘మాస్ జాతర’, సిద్ధు జొన్నలగడ్డ ‘తెలుసు కదా’, ప్రియదర్శి ‘మిత్ర మండలి’, ప్రదీప్ రంగనాథన్ ‘డ్యూడ్’, కిరణ్ అబ్బవరం ‘కె.ర్యాంప్’, సాయికుమార్, అనసూయ ‘అరి’, రక్షిత్ అట్లూరి ‘శశివదనే’ వంటి పలు తెలుగు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. అదే విధంగా ప్రభాస్ ‘బాహుబలి’ రెండు భాగాలు కలిపి. ‘బాహుబలి: ది ఎపిక్’గా ఆడియన్స్ ముందుకు రానుంది. ఇవి మాత్రమే కాదు... ఇంకా పలు చిత్రాలు విడుదల కానున్నాయి. ఆ వివరాల్లోకి వెళదాం.బాహుబలి: ది ఎపిక్ తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పిన చిత్రం ‘బాహుబలి’. ప్రభాస్ హీరోగా, అనుష్క, తమన్నా హీరోయిన్లుగా, రానా, రమ్యకృష్ణ, సత్యరాజ్, నాజర్ ముఖ్య తారలుగా నటించారు. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించారు. శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మించిన ‘బాహుబలి: ది బిగినింగ్’ 2015 జూలై 15న, ‘బాహుబలి 2: ది కన్క్లూజన్’ 2017 ఏప్రిల్ 28న రెండు భాగాలుగా విడుదలై, బ్లాక్బస్టర్గా నిలవడంతో పాటు పలు రికార్డులు, రివార్డులు సాధించింది.‘బాహుబలి: ది బిగినింగ్’ విడుదలై పదేళ్లయిన సందర్భంగా ఈ చిత్రాన్ని మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు మేకర్స్. తొలి, ద్వితీయ భాగాలను కలిపి ‘బాహుబలి: ది ఎపిక్’ పేరుతో ఈ నెల 31న రిలీజ్ చేస్తున్నారు. ఇండియాలోనే కాదు... ఇంటర్నేషనల్ వైడ్గా ఈ చిత్రాన్ని రీ–రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా టీజర్ని ఇప్పటికే విడుదల చేయగా అద్భుతమైన స్పందన వచ్చింది. ఇక సినిమా ఎన్ని గంటలు ఉంటుంది? ఎలాంటి రికార్డులు సొంతం చేసుకుంటుంది? అనే వివరాలు తెలియాలంటే విడుదల వరకూ వేచి చూడాలి.థియేటర్లలో జాతర రవితేజ హీరోగా నటించిన చిత్రం ‘మాస్ జాతర’. భాను భోగవరపు దర్శకత్వం వహించారు. రవితేజ నటించిన 75వ చిత్రం కావడంతో ఈ సినిమాపై ఇటు ఇండస్ట్రీ వర్గాల్లో, అటు ప్రేక్షకుల్లో క్రేజ్ నెలకొంది. పైగా ‘ధమాకా’ (2022) వంటి బ్లాక్బస్టర్ మూవీ తర్వాత హీరో రవితేజ, హీరోయిన్ శ్రీలీల ‘మాస్ జాతర’లో రెండోసారి జోడీగా నటించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్ మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. పలుమార్లు విడుదల వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా ఫైనల్గా ఈ నెల 31 ప్రేక్షకుల ముందుకు వస్తోంది.‘‘రవితేజ నుంచి అభిమానులు, ప్రేక్షకులు కోరుకునే విందు భోజనంలాంటి మాస్ ఎంటర్టైనర్గా ‘మాస్ జాతర’ రూపొందింది. అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చేలా ఈ చిత్రాన్ని మలిచారు భాను భోగవరపు. ‘ధమాకా’ చిత్రానికి అద్భుతమైన మ్యూజిక్ అందించిన భీమ్స్ సిసిరోలియో మరోసారి రవితేజ ఎనర్జీకి ఏమాత్రం తగ్గకుండా ‘మాస్ జాతర’ కోసం సూపర్ మ్యూజిక్ అందించారు. మా సినిమా థియేటర్లలో అసలు సిసలైన మాస్ పండగను తీసుకురాబోతోంది’’ అని చిత్రబృందం పేర్కొంది. మనసు హత్తుకునే తెలుసు కదా! ‘డీజే టిల్లు, టిల్లు స్క్వేర్’ చిత్రాల ఫేమ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన తాజా చిత్రం ‘తెలుసు కదా’.ఈ సినిమాలో రాశీ ఖన్నా, శ్రీనిధీ శెట్టి హీరోయిన్లుగా నటించగా, వైవా హర్ష కీలక పాత్రపోషించారు. స్టైలిస్ట్ నీరజ కోన ఈ చిత్రం ద్వారా దర్శకురాలిగా పరిచయవుతున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్, టీజీ కృతీ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 17న విడుదల కానుంది.‘‘మోస్ట్ ఎవైటెడ్ మ్యూజికల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘తెలుసు కదా’. మనసుని హత్తుకునే కథ, స్వచ్ఛమైన ప్రేమ, అనుబంధాల నేపథ్యంలో ఈ చిత్రకథ సాగుతుంది. అద్భుతమైన భావోద్వేగాలు, వినోదాలు ప్రేక్షకులని అలరిస్తాయి. నీరజ కోన యునిక్ కాన్సెప్ట్తో తెరకెక్కించారు. సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. ఇటీవల విడుదల చేసిన మా మూవీ టీజర్కు అద్భుతమైన స్పందన వచ్చింది. తమన్ మ్యూజిక్ మా సినిమాకి అదనపు ఆకర్షణగా నిలుస్తుంది’’ అని మేకర్స్ తెలిపారు. ప్రేమ, వినోదాల ర్యాంప్ ‘ఎస్ఆర్ కళ్యాణ మండపం, వినరో భాగ్యము విష్ణుకథ, క’ చిత్రాల ఫేమ్ కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన తాజా చిత్రం ‘కె ర్యాంప్’. జైన్ ్స నాని రచన, దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో యుక్తి తరేజా హీరోయిన్గా నటించారు. హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యులాయిడ్ బ్యానర్లపై రాజేశ్ దండ, శివ బొమ్మకు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 18న విడుదల కానుంది.‘‘లవ్, రొమాన్ ్స, యాక్షన్, ఫన్తో కంప్లీట్ ఎంటర్టైనర్గా రూపొందిన చిత్రం ‘కె–ర్యాంప్’. కిరణ్ అబ్బవరం కెరీర్లో ఈ చిత్రం మరో ఫ్రెష్ అటెంప్ట్ అవుతుంది. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే వాణిజ్య అంశాలు మా సినిమాలో ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన మా టీజర్ సినిమా మీద మరిన్ని అంచనాలు పెంచింది.. ఆ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా మా చిత్రం ఉంటుంది. చేతన్ భరద్వాజ్ సంగీతం మా మూవీకి ప్లస్ అవుతుంది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. నవ్వులు పంచే మిత్ర మండలి ‘బలగం, కోర్ట్’ చిత్రాల ఫేమ్ ప్రియదర్శి హీరోగా నటించిన తాజా చిత్రం ‘మిత్ర మండలి’. నూతన దర్శకుడు విజయేందర్ ఎస్. దర్శకత్వం వహించారు. సోషల్ మీడియాలో ట్రెండింగ్గా మారిన నిహారిక ఎన్ఎం ఈ చిత్రం ద్వారా హీరోయిన్గా పరిచయమవుతున్నారు. బ్రహ్మానందం, రాగ్ మయూర్, ప్రసాద్ బెహ్రా ప్రధాన పాత్రలుపోషించారు. బీవీ వర్క్స్(బన్నీ వాసు) సమర్పణలో సప్త అశ్వ మీడియా వర్క్స్, వైరా ఎంటర్టైన్మెంట్స్పై కల్యాణ్ మంతిన, భాను ప్రతాప, డా. విజయేందర్ రెడ్డి తీగల నిర్మించిన ఈ సినిమా ఈ నెల 16న విడుదల కానుంది.‘‘స్నేహం ప్రధానంగా నడిచే కథతో రూపొందిన చిత్రం ‘మిత్ర మండలి’. ప్రేక్షకులు మనస్ఫూర్తిగా నవ్వుకునేలా ఈ సినిమా ఉంటుంది. ఏ ఒక్కర్ని కూడా మా చిత్రం నిరుత్సాహపరచదు. ఆర్ఆర్ ధృవన్ సంగీతం అందించిన ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదల చేసిన పాటలకు మంచి స్పందన వచ్చింది’’ అంటూ పేర్కొన్నారు మేకర్స్.తండ్రీ కొడుకుల అనుబంధం ‘పలాస 1978, నరకాసుర, ఆపరేషన్ రావణ్’ వంటి చిత్రాలతో ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నారు రక్షిత్ అట్లూరి. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘శశివదనే’. సాయి మోహన్ ఉబ్బన దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కోమలి ప్రసాద్ హీరోయిన్. తమిళ నటుడు శ్రీమాన్ కీలక పాత్రపోషించారు. గౌరీ నాయుడు సమర్పణలో ఏజీ ఫిల్మ్స్ కంపెనీ, ఎస్.వి.ఎస్ స్టూడియోస్పై అహితేజ బెల్లంకొండ, అభిలాష్ రెడ్డి గోడల నిర్మించారు.ఈ సినిమా ఈ నెల 10న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ‘‘తండ్రీ కొడుకుల అనుబంధం, భావోద్వేగాల నేపథ్యంలో రూపొందిన చిత్రం ‘శశివదనే’. ఇలాంటి కథా నేపథ్యం ఉన్న చిత్రం ఇదివరకు రాలేదు. కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమా ఇది. ప్రేక్షకులను నిరాశపరచదు. ఓ మంచి సినిమా చూశామనే అనుభూతితో ప్రేక్షకులు థియేటర్ నుంచి బయటకు వస్తారు’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. దీపావళికి డ్యూడ్ ‘ప్రేమలు’ వంటి అద్భుతమైన విజయం తర్వాత ప్రదీప్ రంగనాథన్, మమిత బైజు జంటగా నటించిన చిత్రం ‘డ్యూడ్’. ఈ సినిమాలో శరత్ కుమార్ కీలక పాత్రపోషించారు. ఈ మూవీ ద్వారా కీర్తీశ్వరన్ డైరెక్టర్గా పరిచయం అవుతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 17న తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదలవుతోంది. ‘‘రొమాంటిక్ ఎంటర్టైనర్గా రూపొందిన చిత్రం ‘డ్యూడ్’. న్యూ ఏజ్ కథాంశంతో పూర్తి స్థాయి వినోదాత్మకంగా తెరకెక్కిన ఈ మూవీ యువతరంతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుంది. సాయి అభ్యంకర్ అందించిన అద్భుతమైన మ్యూజిక్ ఆడియన్స్ని అలరిస్తుంది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది.సమాజానికి సందేశం సాయి కుమార్, అనసూయ భరద్వాజ్, వినోద్ వర్మ, శ్రీకాంత్ అయ్యంగార్ ముఖ్య తారలుగా నటించిన చిత్రం ‘అరి’. ‘మై నేమ్ ఈజ్ నో బడీ’ అనేది ఉపశీర్షిక. ‘పేపర్ బాయ్’ మూవీ ఫేమ్ జయశంకర్ దర్శకత్వం వహించారు. ఆర్వీ సినిమాస్ పతాకంపై రామిరెడ్డి వెంకటేశ్వర రెడ్డి (ఆర్వీ రెడ్డి) సమర్పణలో శ్రీనివాస్ రామిరెడ్డి, డి. శేషురెడ్డి మారంరెడ్డి, నాయుడు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 10న విడుదల కానుంది. ఈ చిత్రాన్ని ఏషియన్ సురేష్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ రిలీజ్ చేస్తోంది. ‘‘మా సినిమా ద్వారా సమాజానికి ఒక మంచి సందేశం ఇవ్వనున్నాం. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని మెప్పించే వాణిజ్య అంశాలున్న మా చిత్రం విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అని చిత్రబృందం తెలిపింది. పోలీస్ కానిస్టేబుల్ ‘కొత్త బంగారు లోకం’ మూవీ ఫేమ్ వరుణ్ సందేశ్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘కానిస్టేబుల్’. ఆర్యన్ సుభాన్ ఎస్.కె. దర్శకత్వం వహించారు. ఈ సినిమా ద్వారా మధులిక వారణాసి హీరోయిన్గా పరిచయమవుతున్నారు. జాగృతి మూవీ మేకర్స్ పై బలగం జగదీష్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 10న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ చిత్రంలో వరుణ్ సందేశ్పోలీస్ కానిస్టేబుల్ పాత్రపోషించారు.సుభాష్ ఆనంద్ సంగీతం అందించిన ఈ చిత్రం నుంచి ‘కానిస్టేబుల్..’ అంటూ సాగే టైటిల్ సాంగ్ని హైదరాబాద్ మాజీపోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ చేతుల మీదుగా విడుదల చేసిన సంగతి తెలిసిందే. పైన పేర్కొన్న సినిమాలే కాదు.. మరికొన్ని చిత్రాలు కూడా ఈ నెలలో విడుదలకు ముస్తాబవుతున్నాయి. – డేరంగుల జగన్ మోహన్ -
పైరసీ వెబ్సైట్లు ఎక్కువ చూసేది వాళ్లే!
ఇటీవల హైదరాబాద్ పోలీసులు దేశంలోనే అతిపెద్ద సినీ పైరసీ గుట్టు రట్టు చేశారు. ఐదేళ్లలో 1,050 సినిమాలను పైరసీ చేసిన ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా పైరసీపై చర్చ మొదలైంది. భారత వినోద పరిశ్రమకు పైరసీ ‘బొమ్మ’ చూపిస్తోంది. విడుదలైన రోజే పైరసీ వెబ్సైట్లలో సినిమా దర్శనమిస్తోంది. అంతేకాదు పైరసీ భూతం చట్టానికే సవాల్ విసురుతోంది. పైరసీ సమస్య (Piracy Problem) ఒక్క సినిమా పరిశ్రమకే కాదు.. టీవీ, మ్యూజిక్, సాఫ్ట్వేర్, పబ్లిషింగ్ రంగాలకూ విస్తరించింది.ప్రపంచవ్యాప్తంగా గత ఏడాది పైరసీ వెబ్సైట్ల విజిట్స్ 21,630 కోట్లు నమోదయ్యాయి. 2024లో మొత్తం పైరసీ ట్రాఫిక్లో మనదేశ వాటా 8.12%. అంటే మన దేశం నుంచి 1,756 కోట్ల విజిట్స్ నమోదయ్యాయన్నమాట. పబ్లిక్, ప్రైవేట్ టొరెంట్స్, వెబ్ ఆధారంగా ఫిల్మ్, టీవీ, మ్యూజిక్ స్ట్రీమింగ్; సాఫ్ట్వేర్, పబ్లిషింగ్ రంగాలలో ప్రపంచ పైరసీ ట్రెండ్స్ను పర్యవేక్షిస్తున్న డేటా కంపెనీ ‘మ్యూసో’.. ‘పైరసీ ట్రెండ్స్ అండ్ ఇన్ సైట్ రిపోర్ట్ 2024’ అనే నివేదిక రూపొందించింది. దీని ప్రకారం పైరసీ వెబ్సైట్ల వీక్షకుల సంఖ్యలో 12% వాటాతో అమెరికా (America) తొలి స్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానంలో భారత్ ఉంది. మొదటి స్థానం మనదేమొదటి స్థానం మనదే మ్యూసో 2023 నివేదిక ప్రకారం ప్రపంచ చలనచిత్ర పైరసీలో మనదే పైచేయి. మొత్తం పైరసీలో 30.58% వాటా మన దేశానిదే. యూఎస్ 6.26%, టర్కీ 5.75% వాటాతో ఆ తరువాతి స్థానాల్లో ఉన్నాయి. పైరసీ కంటెంట్ను డౌన్లోడ్ చేసుకుని చూసేవారితో (49.6 శాతం) పోలిస్తే.. అప్పటికప్పుడే చూసే (స్ట్రీమింగ్) వాళ్లు కాస్త ఎక్కువ ఉండటం (50.4 శాతం) గమనార్హం. వినోదం ఇప్పటికీ ఖరీదుగా ఉండడం, అందుబాటు విషయంలో కస్టమర్ల అంచనాలను అందుకోలేకపోవడం వల్లే పైరసీ కొనసాగుతోందని నివేదిక వెల్లడించింది. అయితే ప్రపంచవ్యాప్తంగా 2023తో పోలిస్తే గత ఏడాది ఈ–బుక్స్, ఆడియో బుక్స్, పేపర్స్, మ్యాగజైన్స్ వంటి పబ్లిషింగ్ రంగంలో పైరసీ 4.3% పెరిగింది.జీఎస్టీ నష్టం రూ.4,313 కోట్లుఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ‘ద రాబ్ రిపోర్ట్ 2024’ ప్రకారం.. 2023లో భారత వినోద పరిశ్రమ పైరసీ కారణంగా రూ.22,400 కోట్ల నష్టాన్ని చవి చూసింది. ఓటీటీ (OTT) ప్లాట్ఫామ్లకు రూ.8,700 కోట్లు, థియేటర్లకు రూ.13,700 కోట్ల నష్టం వాటిల్లింది. మొత్తంగా ప్రభుత్వానికి జరిగిన జీఎస్టీ నష్టం రూ.4,313 కోట్లు.- సాక్షి, స్పెషల్ డెస్క్ -
ఓపక్క రష్మిక ఎంగేజ్మెంట్.. మాజీ ప్రియుడి పోస్ట్ వైరల్
హీరోయిన్ రష్మిక మందన్నా (Rashmika Mandanna) ప్రేమలో పడి చాలాకాలమే అయింది. విజయ్ దేవరకొండతో లవ్లో ఉన్న ఈ బ్యూటీ ఈ విషయాన్ని చాలాసార్లు పరోక్షంగా బయటపెట్టింది. దసరా సందర్భంగా వీరిద్దరూ ఎంగేజ్మెంట్ చేసుకుని అప్పుడే సగం పెళ్లి అయిపోయిందనిపించారు. కానీ, ఇది రష్మికకు రెండో ఎంగేజ్మెంట్ కావడం గమనార్హం!ఫస్ట్ సినిమాకే లవ్రష్మిక కన్నడ మూవీ 'కిరిక్ పార్టీ' (2016)తో సినీ ఇండస్ట్రీలో తొలి అడుగు వేసింది. రిషబ్ శెట్టి దర్శకత్వం వహించిన ఈ మూవీలో రక్షిత్ శెట్టి (Rakshit Shetty) హీరోగా నటించాడు. ఫస్ట్ సినిమాకే హీరోతో ప్రేమలో పడింది రష్మిక. ఇద్దరి మనసులు కలవడంతో పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకున్నారు. పెద్దలను ఒప్పించి ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేశారు. 2017 జూలై 3న వీరి నిశ్చితార్థం అంగరంగ వైభవంగా జరిగింది. ఇక పెళ్లి చేసుకోవడమే ఆలస్యం అనుకున్న తరుణంలో ఊహించని షాకిచ్చారు. పెళ్లిపీటలు ఎక్కకముందే తమ బంధం ముక్కలైందని ప్రకటించారు. ఇద్దరూ విడిపోయి ఎవరి దారి వారు చూసుకున్నారు. అలా అని వీరి మధ్య ఎటువంటి శత్రుత్వమూ లేదు. ఇప్పటికీ ఫోన్లో మెసేజ్ చేసుకుంటామని, సినిమాలు విడుదలైనప్పుడు ఒకరికొకరం విషెస్ తెలియజేసుకుంటామని రక్షిత్ శెట్టి 2023లో ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు.రష్మిక- రక్షిత్ ఎంగేజ్మెంట్ ఫోటోవిజయ్తో లవ్..రక్షిత్తో విడిపోయాక రష్మిక సినిమాలతో బిజీ అయింది. 2018లో గీత గోవిందం సినిమాలో తొలిసారి విజయ్ దేవరకొండ (Vijay Devarakonda)తో జత కట్టింది. ఈ మూవీ సమయంలోనే విజయ్- రష్మిక ప్రేమలో పడ్డట్లు ప్రచారం జరిగింది. అయితే తాము ఫ్రెండ్స్ మాత్రమేనని హీరోయిన్ క్లారిటీ ఇచ్చింది. కానీ తర్వాత ఆ రూమర్సే నిజమయ్యాయి. రష్మిక కలలు చాలా పెద్దవి అని రక్షిత్ చెప్పినట్లుగా... ఆమె కేవలం దక్షిణాదికే పరిమితం కాకుండా హిందీలోనూ సినిమాలు చేస్తూ నేషనల్ క్రష్ ట్యాగ్ అందుకుంది. పుష్పతో పాన్ ఇండియా సెన్సేషన్ అయింది.ఉత్తమ నటుడిగా అవార్డుఅటు రక్షిత్ కూడా.. 777 చార్లీ (777 Charlie Movie), సప్తసాగరాలు దాటి సైడ్ A, సప్తసాగరాలు దాటి సైడ్ B సినిమాలతో ఘన విజయాలు అందుకున్నాడు. ఇప్పుడు లేటెస్ట్గా మరో ఘనత అందుకున్నాడు. 2021లో సెన్సార్ అయిన సినిమాలకుగానూ కర్ణాటక ప్రభుత్వం రాష్ట్ర చలనచిత్ర అవార్డులు ప్రకటించింది. అందులో 777 చార్లి సినిమాకు నాలుగు పురస్కారాలు వరించాయి. ఉత్తమ రెండో చిత్రంతో పాటు ఉత్తమ నటుడిగా రక్షిత్ శెట్టి, ఉత్తమ ఎడిటర్గా ప్రతీక్ శెట్టి, ఉత్తమ గేయరచయితగా నాగార్జున శర్మకు అవార్డులు ప్రకటించారు. హీరో ట్వీట్దీంతో రక్షిత్ సంతోషంలో తేలియాడుతున్నాడు. '777 చార్లీ సినిమాకు 4 అవార్డులు.. మనసు ఆనందంతో ఉప్పొంగుతోంది. జ్యూరీకి, ప్రేక్షకులకు, చిత్రయూనిట్కు ధన్యవాదాలు. దర్శకుడు కిరణ్ రాజ్ విజన్.. ప్రతీక్ అద్భుతమైన ఎడిటింగ్, నాగార్జున చేతినుంచి జారిపడ్డ అందమైన మాటలు అందరి హృదయాలను తాకాయి' అంటూ ఈ ముగ్గురికి స్పెషల్ థాంక్స్ చెప్తూ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ వైరల్గా మారింది. Feeling grateful and humbled! 777 Charlie wins 4 State Awards.. 2nd Best Film, Best Actor, Best Editing & Best Lyricist. Heartfelt thanks to the jury, our amazing audience, and this incredible team.. @Kiranraj61 for his vision, Pratheek for the flawless editing, and…— Rakshit Shetty (@rakshitshetty) October 4, 2025 చదవండి: పెళ్లయ్యాక ఎంజాయ్మెంట్ లేదు, డిప్రెషన్.. అప్పుడు చచ్చిపోవాలనుకున్నా -
కూలీ ఫేమ్ రచిత రామ్ 'కల్ట్' పోస్టర్ విడుదల
కన్నడ హీరోయిన్ రచిత రామ్ పుట్టినరోజు సందర్భంగా కొత్త సినిమా పోస్టర్ను మేకర్స్ విడుదల చేశారు. రీసెంట్గా కూలీ సినిమాలో లేడీ విలన్గా నటించిన ఈ బ్యూటీ తాజాగా ‘కల్ట్’ పేరుతో ఒక రొమాంటిక్ థ్రిల్లర్ సినిమాలో నటించనున్నారు. ఈ మూవీకి ‘బ్లడీ లవ్’ అనే ట్యాగ్లైన్ కూడా ఇచ్చారు. ఈ చిత్రాన్ని దర్శకుడు అనిల్ కుమార్ తెరకెక్కించనున్నారు. ఇందులో రచిత రామ్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా ఆమెకు జోడీగా జైద్ ఖాన్ కనిపించనున్నారు. ఈ సినిమా కథలో రచిత రామ్ ఒక లవ్ ఫెయిల్యూర్ యువతిగా కనిపించనున్నారు. ఆ తర్వాత ఆమె జీవితం ఎలా మలుపులు తిరుగుతుంది అనే అంశం చుట్టూ కథ సాగుతుంది.రచిత రామ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన కల్ట్ పోస్టర్లో ఆమె లేడీ డాన్ లుక్లో కనిపించారు. బాత్రూమ్లో టాయిలెట్ సీటింగ్పై కూర్చొని, సిగరెట్ తాగుతూ.. ఆమె మాస్ లుక్ అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. పక్కన గిటార్ కాలిపోతుండగా, వెనకాల ఒక వ్యక్తి బాధతో చూస్తున్న ఫొటో కూడా ఉంది. ‘‘నీ జ్ఞాపకాలను ఫ్లష్ చేసి తుడిచి పెట్టలేను’’ అనే డైలాగ్తో పోస్టర్ మరింత ఆసక్తికరంగా మారింది. ఈ సినిమా ద్వారా రచిత రామ్ మరోసారి తన నటనలో విభిన్నతను చూపించబోతున్నారు. ఇలాంటి పాత్రలతో రచిత రామ్ తన కెరీర్లో కొత్త మలుపు తీసుకుంటున్నట్లు కనిపిస్తోంది. ఈ మూవీ వచ్చే ఏడాది జనవరి 23న తెలుగులో కూడా విడుదల కానుంది. View this post on Instagram A post shared by R R (@rachita_instaofficial) -
అమ్మోరు తల్లి సీక్వెల్.. మహాశక్తిగా నయనతార
హీరోయిన్ నయనతార (Nayanthara) దేవతగా నటించిన చిత్రం మూకుత్తి అమ్మన్(ఈ మూవీ తెలుగులో అమ్మోరు తల్లి పేరిట విడుదలైంది). వేల్స్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై ఐసరి గణేష్ నిర్మించిన ఈ చిత్రం 2020లో విడుదలైన మంచి విజయాన్ని సాధించింది. ఈ చిత్రానికి సీక్వెల్గా మూకుత్తి అమ్మన్–2 తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. చిత్రంలో నయనతార అమ్మవారిగా నటిస్తున్నారు. ఐసరి గణేష్ తన వేల్స్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రానికి సుందర్.సి దర్శకత్వం వహిస్తున్నారు. పార్ట్–1 కంటే మరింత భారీ బడ్జెట్లో రూపొందుతున్న మూక్కుత్తి అమ్మన్–2 షూటింగ్ గత మార్చి నెలలో ప్రారంభమైంది. నయనతార, కమర్షియల్ దర్శకుడు సుందర్.సి కాంబోలో రూపొందుతున్న తొలి చిత్రం ఇదే కావడం గమనార్హం. విజయదశమి పండుగ సందర్భంగా గురువారం ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు. అమ్మవారి గెటప్లో ఉన్న నయనతార పోస్టర్కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోందని యూనిట్ వర్గాలు ఆనందాన్ని వ్యక్తం చేశాయి. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సమ్మర్ స్పెషల్గా తెరపైకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సీక్వెల్ను తెలుగులో మహాశక్తి పేరిట విడుదల చేయనున్నారు. View this post on Instagram A post shared by Vels Film International (@velsfilmintl) చదవండి: రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్న 'బేబీ' సింగర్ -
లగ్జరీ వాచ్ గిఫ్ట్ ఇచ్చిన హీరోయిన్.. ఎన్ని లక్షలంటే?
హీరోయిన్ కల్యాణి ప్రియదర్శన్ మాలీవుడ్లో సెన్సేషన్గా మారింది. ఆమె ప్రధాన పాత్రలో నటించిన కొత్త లోక: చాప్టర్ 1 బాక్సాఫీస్ వద్ద అద్భుతాలు సృష్టిస్తోంది. మలయాళ సినీ చరిత్రలో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా ఇప్పటికే రికార్డుకెక్కింది. ఇప్పటివరకు రూ.294 కోట్లు అందుకున్న ఈ మూవీ త్వరలోనే రూ.300 కోట్ల క్లబ్లో చేరనుంది. అరుణ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని దుల్కర్ సల్మాన్ నిర్మించారు. జేక్స్ బిజాయ్ సంగీతం అందించగా నిమిష్ రవి (Nimish Ravi) సినిమాటోగ్రాఫర్గా వ్యవహరించాడు.చేతి గడియారంతాజాగా నిమిష రవికి కల్యాణి ప్రియదర్శన్ ఖరీదైన బహుమతినిచ్చింది. రూ.9.8 లక్షల విలువైన చేతి గడియారాన్ని కానుకగా ఇచ్చింది. ఈ వాచ్ను ధరించిన రవి.. ఈమేరకు ఓ ఫోటో షేర్ చేశాడు. ప్రియమైన కల్యాణి, ఈ కానుక ఇచ్చినందుకు థాంక్యూ సో మచ్.. ఎప్పుడూ కష్టపడి పనిచేస్తే ఫలితం దానంతటదే వస్తుందనడానికి లోక సినిమాయే నిదర్శనం. వాచ్ చూసుకున్నప్పుడల్లా ఈ లైన్ గుర్తు చేసుకుంటూ ఉంటాను. నిజమైన హార్డ్ వర్క్కు ఇదొక బహుమానం అని రాసుకొచ్చాడు. View this post on Instagram A post shared by Nimish Ravi (@nimishravi) చదవండి: బాపు.. ఈ బతుకొద్దే, నా భార్య నరకం చూపిస్తోంది: నటుడి సెల్ఫీ వీడియో


