breaking news
South India
-
లోకేశ్ కనగరాజ్ని పక్కనబెట్టేశారా? నెక్స్ట్ 'ఖైదీ 2'
లోకేశ్ కనగరాజ్.. ప్రస్తుతం తమిళ ఇండస్ట్రీలో క్రేజీ డైరెక్టర్. ఇతడితో సినిమా చేసేందుకు ఇతర భాషల హీరోలు కూడా రెడీ అంటున్నారు. కానీ 'కూలీ' దెబ్బకు మొత్తం పరిస్థితి మారిపోయినట్లు కనిపిస్తుంది. ఎందుకంటే రజినీకాంత్ హీరోగా చేసిన 'కూలీ'పై బీభత్సమైన అంచనాలు ఏర్పడ్డాయి. దాన్ని అందుకోవడంలో ఈ చిత్రం కాస్త విఫలమైంది. ఈ క్రమంలోనే ఓ క్రేజీ ప్రాజెక్ట్ నుంచి లోకేశ్ని సైడ్ చేశారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇంతకీ ఏంటి విషయం?దాదాపు 35 ఏళ్ల తర్వాత కమల్ హాసన్, రజినీకాంత్ కలిసి నటించబోతున్నారు. కొన్నిరోజుల క్రితం జరిగిన సైమా అవార్డ్స్ వేడుకలో పాల్గొన్న కమల్.. స్వయంగా ఈ విషయాన్ని ప్రకటించాడు. అప్పటినుంచి ఈ మూవీ తీయబోయేది లోకేశ్ కనగరాజ్ అని రూమర్స్ మొదలయ్యాయి. అందరూ ఇది నిజమని అనుకున్నారు కూడా. కానీ లేటెస్ట్గా విమానాశ్రయంలో కనిపించిన రజినీకాంత్ని పలువురు మీడియా ప్రతినిధులు ఇదే విషయం అడగ్గా.. కమల్తో మూవీ చేయబోతున్నానని చెప్పారు. కాకపోతే స్టోరీ, డైరెక్టర్ ఇంకా ఫైనల్ కాలేదని పేర్కొన్నారు.(ఇదీ చదవండి: 'మిరాయ్' హిట్.. తేజ సజ్జాకి లగ్జరీ కారు గిఫ్ట్)అయితే లోకేశ్ ఈ ప్రాజెక్ట్కి దర్శకుడు కాదని తెలిసి కొందరు తమిళ ఫ్యాన్స్ బాధపడుతుండగా.. మరికొందరు సంతోషపడుతున్నారు. ఎందుకంటే లోకేశ్ తీసిన వాటిలో చాలా గుర్తింపు తెచ్చుకున్న సినిమా 'ఖైదీ'. దీని సీక్వెల్ కోసం మూవీ లవర్స్ ఎప్పటినుంచో వెయిటింగ్. ఒకవేళ లోకేశ్ గనక.. కమల్-రజినీ మూవీ తీస్తే ఈ సీక్వెల్ రావడం లేటు అయిపోతుంది. మరోవైపు లోకేశ్ కాకుండా ఈ మల్టీస్టారర్ హ్యాండిల్ చేసే డైరెక్టర్ ఎవరున్నారా అనే డిస్కషన్ కూడా సోషల్ మీడియాలో నడుస్తోంది.ప్రస్తుతం లోకేశ్ కనగరాజ్.. హీరోగా ఓ సినిమా చేస్తున్నాడు. అరుణ్ మాతేశ్వరన్ అనే డైరెక్టర్ తీస్తున్న ఈ మూవీ షూటింగ్ పూర్తయిన తర్వాత అంటే వచ్చే ఏడాది ప్రారంభంలో 'ఖైదీ 2'ని లోకేశ్ మొదలుపెట్టే అవకాశముంది. మరి 'కూలీ' రిజల్ట్ చూసి.. కమల్-రజినీ ప్రాజెక్ట్ నుంచి లోకేశ్ని పక్కనబెట్టేశారా? లేదంటే నిజంగానే లోకేశ్ పేరుని పరిగణలోకి తీసుకోలేదా అనేది తెలియాల్సి ఉంది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చిన తెలుగు హారర్ సినిమా)Director is Not Confirmed Yet 👀So There is an Option other than #Lokeshkanagaraj 💥pic.twitter.com/pGN4okSvJP— SillakiMovies (@sillakimovies) September 17, 2025 -
ఒక్క డైలాగ్తో ఫేమస్.. నా గొంతు మార్చేశారు, ఇది చాలా తప్పు!
కోలీవుడ్ స్టార్ విజయ్ 'బీస్ట్' సినిమాతోనే తెలుగులో ఫుల్ బిజీ అయిపోయానంటున్నాడు తమిళ నటుడు వీటీవీ గణేశ్ (VTV Ganesh). టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తున్నానని చెప్తున్నాడు. తాజాగా ఇతడు తమిళ చిత్రం కిస్ ప్రెస్మీట్కు హాజరయ్యాడు. కెవిన్, ప్రీతి అస్రాని జంటగా నటించిన ఈ సినిమాకు కొరియోగ్రాఫర్ సతీశ్ కృష్ణన్ దర్శకత్వం వహించాడు. ఈ మూవీ తమిళ, తెలుగు, హిందీ భాషల్లో సెప్టెంబర్ 19న విడుదల కానుంది.ఒక్క డైలాగ్తో పాపులర్ఈ మూవీ ప్రెస్మీట్లో గణేశ్ మాట్లాడుతూ.. బీస్ట్ సినిమాలో ఎవర్రా, నువ్వు ఇంత టాలెంటెడ్గా ఉన్నావ్ అనే ఒక్క డైలాగ్తో నేను తెలుగు ఇండస్ట్రీలో ఫేమసయ్యాను. ఈ సినిమాలో ఛాన్సిచ్చిన విజయ్ సర్కు థాంక్స్ చెప్పుకుంటున్నా.. నా గొంతే నా బలం. ఇప్పుడు తెలుగులో చిరంజీవి, నాగచైతన్య.. వంటి స్టార్ హీరోలతో దాదాపు 8 సినిమాలు చేస్తున్నాను. ఇకపోతే కిస్ మూవీ తెలుగు ట్రైలర్లో నా గొంతు మార్చేశారు. ఇది కరెక్ట్ కాదు. ఈజీగా తప్పించుకుంటారునాకు తెలుగొచ్చు. రేపే డబ్బింగ్ చెప్పమన్నా చెప్తాను. నా వాయిస్ ఎందుకు ఉపయోగించుకోలేదని దర్శకుడిని అడిగినప్పుడు ఏమో, నాకు తెలీదు, చూద్దాం అని తప్పించుకున్నాడు. అదే లేడీ డైరెక్టర్ అయ్యుంటే సరే, నేను చెక్ చేస్తాను అని సరి చేసుకోవడానికి ప్రయత్నించేది. మేల్ డైరెక్టర్లు ఈజీగా తెలీదని తప్పించుకుంటారు అని కాస్త అసహనం వ్యక్తం చేశాడు. గణేశ్.. తెలుగులో భగవంత్ కేసరి, డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం, సింగిల్ సినిమాల్లో నటించాడు. తమిళ 'జైలర్', 'వారసుడు', 'డాడా'(పాపా), 'ప్రిన్స్' మూవీస్తోనూ అలరించాడు.చదవండి: ఐదు రోజుల్లోనే సెంచరీ కొట్టిన 'మిరాయ్' -
ఇళయరాజా ఫిర్యాదు.. నెట్ఫ్లిక్స్ నుంచి అజిత్ మూవీ తొలగింపు
సంగీత దర్శకుడు ఇళయరాజా ఫిర్యాదు కారణంగా నెట్ఫ్లిక్స్ నుంచి అజిత్ కుమార్ నటించిన ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ మూవీ తొలగించారు. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అనుమతి లేకుండా తన పాటలను ఉపయోగించారంటూ ఇళయరాజా కోర్టులో పిటిషన్ వేశారు. కాపీరైట్ చట్టానికి ఇది విరుద్దమని, ఆ పాటలను తొలగించడమే కాకుండా.. ఉపయోగించినందుకుగానూ తనకు పరిహారం ఇవ్వాలని ఇళయరాజా కోరారు. దీనిపై విచారణ జరిపిన మద్రాసు కోర్టు.. ఇళయరాజా పాటలను సినిమాలో ప్రదర్శించొద్దంటూ ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు ఆదేశాలతో నెట్ఫ్లిక్స్ సంస్థ ఈ చిత్రాన్ని తొలగించింది. పాటలను తొలగించి..మళ్లీ సినిమాను అందుబాటులోకి తీసుకొస్తారా లేదా మొత్తానికి స్ట్రీమింగ్ చేయకుండా వదిలేస్తారో చూడాలి.కాగా,ఈ వివాదం గురించి చిత్ర నిర్మాత రవి గతంలో మాట్లాడుతూ.. ఇళయరాజా పాటలకు సంబంధించి అన్ని అనుమతులు తీసుకున్నామని, నిబంధనలకు అనుగుణంగానే పాటలను ఉపయోగించామని చెప్పారు. ఈ ఏడాది ఏప్రిల్లో థియేటర్స్లో విడుదలైన ఈ చిత్రం దాదాపు రూ. 250 కోట్లకు పైగా వసూళ్లను సాధించి రికార్డు సృష్టించింది. ఈ ఏడాది మే 8 నుంచి ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చింది. తెలుగు,హిందీ,తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ అయిన ఈ చిత్రం.. ఇప్పుడు కోర్డు ఆదేశాలతో సడెన్గా నెట్ఫ్లిక్స్ నుంచి తొలగించారు. -
రూ.2వేల కంటే ఎక్కువ ఖర్చుపెట్టను: మృణాల్ ఠాకూర్
సినీ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్గా రాణిస్తోంది మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur). మహారాష్ట్రలోని ధూలే నగరానికి చెందిన ఈ భామ టీవీ సీరియల్స్లో నటించి ఆ తర్వాత సినీ రంగప్రవేశం చేసింది. మొదట్లో మరాఠీ చిత్రాల్లో నటించి ఆపై హిందీ చిత్రాల్లో నటిస్తుండగా టాలీవుడ్ కన్ను ఈ అమ్మడిపై పడింది. అలా సీతారామం అనే తెలుగు చిత్రంలో దుల్కర్ సల్మాన్కు జంటగా నటించి పాపులర్ అయింది. హాయ్ నాన్నతో మరింత స్టార్డమ్ అందుకుంది. కానీ తర్వాత ఆమె నటించిన సినిమాలు కొన్ని పెద్దగా ఆదరణ పొందలేవు. దీంతో హిందీ చిత్రాలపైనే దృష్టి సారిస్తున్న ఈ అమ్మడికి తాజాగా మరో లక్కీచాన్స్ వరించినట్లు సమాచారం. పాన్ ఇండియా మూవీలో..అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ కథానాయకుడిగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రంలో మృణాల్ఠాకూర్ ఒక కథానాయికగా నటిస్తున్నట్లు తెలుస్తోంది. తమిళంలో ఇంతకుముందు శివకార్తికేయన్కు జంటగా మదరాశి చిత్రంలో నటించే అవకాశం రాగా దాన్ని ఆమె చేజార్చుకుంది. ఆ తర్వాత కోలీవుడ్లో ఇప్పటివరకు ఒక్క అవకాశం కూడా ఈ అమ్మడికి రాలేదు. ఇకపోతే హీరోయిన్గా తెలుగు, హిందీ చిత్రాల్లో నటిస్తూ చేతినిండా సంపాదిస్తూ కోట్లు కూడబెడుతున్న ఈ బ్యూటీ ఖర్చు చేయడంలో మాత్రం మహా పొదుపరి!అంతకంటే ఎక్కువ పెట్టనుదీనిపై మృణాల్ ఇటీవల చెప్పిన విషయం ఇప్పుడు సామాజిక మాధ్యమంలో వైరల్ అవుతోంది. తనకు ఖరీదైన దుస్తులు కొనడం ఇష్టం ఉండదని, ఎంతో డబ్బులు పోసిన కొన్నప్పటికీ అవి బీరువా అరల్లో మూలుగుతుంటాయంది. తాను కొనుగోలు చేసిన దుస్తుల ఖరీదు అత్యధికంగా రూ.2వేలు దాటి ఉండవన్నారు. అయితే సినీ కార్యక్రమాలకు ఇతర ఫంక్షన్లకు వెళ్లినప్పుడు మాత్రం లక్షల ఖరీదైన దుస్తులు ధరిస్తానని, అయితే అవన్ని సొంతం కాదని, అద్దెకు తెచ్చుకునేవేనని మృణాల్ తెలిపింది.చదవండి: కథ నచ్చి ఓజీ ఒప్పుకున్నాను: ప్రియాంక మోహన్ -
ఇక నటనపైనే ఫోకస్: శాండీ
‘‘లియో, లోక, కిష్కింధపురి’... ఇలా వరుసగా నేను నటించిన చిత్రాలు హిట్ అయినందుకు హ్యాపీగా ఉంది. నా చిన్నప్పుడు అందరూ నా కళ్లను చూసి, ‘డెత్ గోట్ ఐస్’ అని ఆటపట్టించేవారు. ఆ కళ్లు నచ్చే ‘లియో’కు లోకేశ్గారు నన్ను నటుడిగా ఎంపిక చేసుకున్నారు’’ అన్నారు కొరియోగ్రాఫర్–యాక్టర్ శాండీ. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమా పరమేశ్వరన్ హీరో హీరోయిన్లుగా, శాండీ మాస్టర్ విలన్గా నటించిన చిత్రం ‘కిష్కింధపురి’. కౌశిక్ పెగల్లపాటి దర్శకత్వంలో సాహు గారపాటి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 12న విడుదలైంది. ఈ సందర్భంగా శాండీ మాస్టర్ మాట్లాడుతూ– ‘‘కిష్కింధపురి’ సినిమా కోసం లుక్ టెస్ట్ చేసి, ఫైనల్గా దివ్యాంగుడు లుక్ను ఓకే చేశాం. ఓ సీన్లో డమ్మీ సిలిండర్తో హీరో నన్ను కొట్టాలి. కానీ అనుకోకుండా నిజమైన సిలిండర్తో కొట్టడంతో నా తలకు దెబ్బతగిలింది.ఎమ్ఆర్ఐ స్కానింగ్ తీశారు. ఇప్పుడు బాగానే ఉంది. ఇక ‘కూలీ’లోని ‘మోనికా..పాట, ‘విక్రమ్’లోని పాతల...పాతల’, ‘ఓజీ’ సినిమాలోని ఓ ప్రమోషనల్ సాంగ్కు కొరియోగ్రఫీ చేశాను. ఇప్పుడు నా ఫోకస్ అంతా యాక్టింగ్పైనే. ప్రస్తుతంపా. రంజిత్ నిర్మాణంలో హీరోగా ఓ సినిమా, మలయాళ ‘కథనార్’లో విలన్ రోల్ చేస్తున్నాను’’ అని చెప్పారు. ‘కిష్కింధపురిని’ అందరూ చూడాలి: చిరంజీవి ‘కిష్కింధపురి’ని హీరో చిరంజీవి ప్రత్యేకంగా వీక్షించి, ఓ వీడియో విడుదల చేశారు. ‘‘నా రాబోయే చిత్రం ‘మన శంకర వరప్రసాద్గారు’ నిర్మాత సాహు గారపాటిగారు నిర్మించిన ‘కిష్కింధపురి’ మంచి విజయాన్ని సాధించింది. హారర్ సినిమాలంటే భయాన్ని ఎలివేట్ చేస్తూ దెయ్యం కథ చెబుతుంటారు. కానీ, ఈ సినిమాలో హారర్తోపాటు మంచి సైకలాజికల్పాయింట్ని యాడ్ చేసి చెప్పడం చాలా బాగుంది. శారీరక వైకల్యం కంటే మానసిక వైకల్యం ప్రమాదకరమని చెప్పారు డైరెక్టర్ కౌశిక్. ఈ సినిమా ద్వారా సాయి శ్రీనివాస్, అనుపమ మంచి హిట్ని తమ ఖాతాలో వేసుకున్నారు. చేతన్ మ్యూజిక్ బాగుంది. ఈ సినిమాని అందరూ చూడాల్సిన అవసరం ఉంది’’ అని చిరంజీవి పేర్కొన్నారు. -
ఓటీటీలో దూసుకెళ్తోన్న మలయాళ సస్పెన్స్ థ్రిల్లర్..!
దసరా విలన్ షైన్ టామ్ చాకో నటించిన కామెడీ సస్పెన్స్ థ్రిల్లర్ సూత్రవాక్యం. ఈ మూవీ ఈ ఏడాది జూన్లో థియేటర్లలో విడుదలైంది. అయితే బాక్సాఫీస్ వద్ద అంతగా అభిమానులను మెప్పించలేకపోయింది. ప్రస్తుతం ఈ చిత్రంలో ఓటీటీలో అందుబాటులో ఉంది. ఈ మలయాళ సస్పెన్స్ థ్రిల్లర్ అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతోంది. తాజాగా ఈ చిత్రం ఓటీటీలో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఓటీటీలో రిలీజయ్యాక 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్కు పైగా దూసుకెళ్తోంది. థియేటర్లలో అంతగా రాణించకపోయినా.. ఓటీటీలో మాత్రం అదరగొడుతోంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ మూవీకి యూజీన్ జోస్ చిరమ్మెల్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో షైన్ టామ్ చాకోతో పాటు విన్సీ అలోషియస్, దీపక్ పరంబోల్ నటించారు. ఈ సినిమాలో క్రిస్టో జేవియర్ అనే పోలీస్ ఆఫీసర్ పాత్రలో షైన్ టామ్ చాకో కనిపించారు. నిర్మాత శ్రీకాంత్ కండ్రాగుల నిర్మాత ఓ కీలక పాత్రలో కనిపించి, తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. -
'లోక'తో డబ్బులు పోతాయని ఫిక్సయ్యా: దుల్కర్ సల్మాన్
సినిమాలు తీయడం అనేది జూదం లాంటిది. వస్తే భారీ లాభాలు. లేదంటే భారీ నష్టాలు. కొన్నిసార్లు మాత్రం ఊహించని సక్సెస్, కోట్ల కొద్దీ కలెక్షన్ వస్తుంటాయి. తాజాగా రిలీజైన సినిమాలు చూస్తుంటే అదే అనిపిస్తోంది. తెలుగులో 'లిటిల్ హార్ట్స్' ఎంతలా సంచలనం సృష్టిస్తుందో చూస్తునే ఉన్నాం. దీని కంటే ముందు రిలీజైన ఓ మలయాళ చిత్రం కూడా ఊహించని వసూళ్లతో రికార్డ్స్ బద్దలుకొడుతుంది. ఈ మూవీ గురించి హీరో కమ్ నిర్మాత దుల్కర్ సల్మాన్ ఆసక్తికర విషయాలు చెప్పాడు.(ఇదీ చదవండి: కోర్ట్ని ఆశ్రయించిన 'కాంతార' నిర్మాతలు?)'నిర్మాతగా 'లోక' కోసం పెట్టిందంతా నష్టపోతానని అనుకున్నాను. స్టోరీ బాగా నచ్చింది. మంచి సినిమా అవుతుందని తెలుసు. కానీ బడ్జెట్ ఎక్కువైపోయింది. మలయాళంలో ఇంత బడ్జెట్ చాలా రిస్క్. కానీ కథని నమ్మి పెట్టాను. థియేటర్లలో రిలీజ్ చేద్దామంటే డిస్ట్రిబ్యూటర్స్ అంతగా ఆసక్తి చూపించలేదు. లోక ఫ్రాంచైజీ మొదలుపెడితే సీక్వెల్స్తో లాభాలొస్తాయని అనుకున్నాను. ఆ నమ్మకంతోనే రిలీజ్ చేశాం. కానీ ఈ సక్సెస్ మాత్రం ఊహించలేదు. మొదటిరోజు నుంచే సూపర్ హిట్ టాక్, భారీ కలెక్షన్తో సెన్సేషన్ సృష్టిస్తోంది. మా సంస్థకు భారీ లాభాలు తెచ్చిపెట్టింది' అని దుల్కర్.. లేటెస్ట్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.మలయాళంలో వచ్చిన తొలి లేడీ సూపర్ హీరో సినిమా ఇది. తెలుగులోనూ దీన్ని 'కొత్త లోక' పేరుతో రిలీజ్ చేశారు గానీ ఇక్కడ ఓ మాదిరిగానే లాభపడింది. కల్యాణి ప్రియదర్శన్ లీడ్ రోల్ చేసిన ఈ చిత్రానికి డొమినిక్ అరుణ్ దర్శకుడు కాగా.. ఇందులో దుల్కర్ సల్మాన్, టొవినో థామస్, సౌబిన్ షాహిర్ తదితరులు అతిథి పాత్రల్లో కనిపించారు. థియేటర్లలోకి వచ్చి మూడు వారాలైనా సరే ఇప్పటికీ ఈ చిత్రానికి థియేటర్లలో రెస్పాన్స్ వస్తుండటం విశేషం.(ఇదీ చదవండి: సింపతీ కార్డ్ ప్లే చేయొద్దు.. రీతూని ఏడిపించిన మాస్క్ మ్యాన్!)"As Producer, we thought that we'll lose money on #Lokah😳. we know it's good film, but Budget is high & Buyers are not interested🙁. I thought if this franchise is established, we might do profit🤞. But this success was unimaginable🥶♥️"- #DulquerSalmaanpic.twitter.com/pmy1Bum8a1— AmuthaBharathi (@CinemaWithAB) September 15, 2025 -
విజయ్ ఎన్నికల బస్సుకు అదే నంబర్.. గుండెను కదిలించే స్టోరీ తెలుసా?
కోలీవుడ్ ప్రముఖ నటుడు, తమిళగ వెట్రి కళగం(టీవీకే) అధినేత విజయ్ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారారు. మరో 6 నెలల్లో తమిళనాడులో శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో తిరుచ్చి నుంచి రాష్ట్రవ్యాప్త ప్రచారం మొదలుపెట్టారు. అందుకు ప్రత్యేకమైన ఒక బస్సును కొనుగోలు చేశారు. ఆ వాహనానికి తీసుకున్న రిజిస్ట్రేషన్ నంబర్ వైరల్గా మారింది. తన జీవితంలో ఎంతో సెంటిమెంట్గా మిగిలిపోయిన సంఘటన ఈ నంబర్ను సూచిస్తుంది.విజయ్ కొనుగోలు చేసే కారు ధర ఎంత ఉన్నా సరే నంబర్ మాత్రం మారదు.. తన వద్ద ఉన్న ప్రతి వాహనానికి 0277 అనే నంబర్ ఉంటుంది. TN 14 అనేది సాధారణం. దాని తర్వాత వచ్చే ఇంగ్లీష్ అక్షరాలు మాత్రమే మారుతుంటాయి. ప్రస్తుతం అతని ప్రచార వాహనం నంబర్ ప్లేట్ కూడా TN 14 AS 0277 ఉండటం విశేషం. అతని వాహనాలపై 14-02-77 రూపంలో ఒక తేదీని ఎల్లప్పుడూ సూచిస్తుంది.ఈ నంబర్ వెనుక విజయ్ సెంటిమెంట్ స్టోరీ ఉంది. విజయ్ చెల్లెలు విద్య అదే 14-02-1977లో జన్మించింది. అయితే, 1984 మే 20న ఆనారోగ్యంతో చిన్న వయసులోనే ఆమె మరణించింది. చెల్లి మరణంతో విజయ్ బాగా కుంగిపోయాడని ఆయన తల్లి ఓ ఇంటర్వ్యూలో పేర్కొంది. స్కూలు నుంచి వచ్చాక విజయ్ ఎక్కువగా విద్యతోనే ఆడుకునేవాడని తెలిపింది. అమ్మతోపాటూ ఆ పాపకు తనూ స్నానం చేయించేవాడు, అన్నం తినిపించేవాడు.అలాంటిది ఒక్కసారిగా విద్య దూరం కావడంతో విజయ్ ఒకలాంటి డిప్రెషన్లోకి వెళ్లిపోయాడు. చెల్లెలు విద్య అకాల మరణంతో తీవ్ర మనో వేదనకు గురైన విజయ్.. తన కూతురికి చెల్లెలు విద్య పేరుని గుర్తుకు తెచ్చేలా దివ్య అని పేరుపెట్టాడు. విజయ్ వద్ద ఇప్పటికే TN 14 AH 0277, TN 14 AL 0277, TN 14 AM 0277, TN 14 AS 0277 నంబర్ ప్లేట్లతో వాహానాలు ఉన్నాయి. View this post on Instagram A post shared by Nithin Barath SR (@theactorvijayteamoff) -
కోర్ట్ని ఆశ్రయించిన 'కాంతార' నిర్మాతలు?
మరో రెండు వారాల్లో 'కాంతార' కొత్త సినిమా థియేటర్లలో రిలీజ్ కానుంది. అయితే ఇంతవరకు ప్రమోషన్స్ మొదలుపెట్టకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అయితే మిగతా అన్నీ పనులు పూర్తయినప్పటికీ సొంత రాష్ట్రంలోనే ఓ సమస్య ఇబ్బందిగా మారింది. దీంతో నిర్మాతలు ఇప్పుడు కోర్టుని ఆశ్రయించారని టాక్. ప్రస్తుతం ఈ విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. ఇంతకీ ఏంటి విషయం?రీసెంట్గానే కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం.. సినిమా టికెట్స్ విషయమై సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో టికెట్ ధరలు తగ్గించేసింది. మల్టీప్లెక్స్ల్లో గరిష్ఠ టికెట్ ధర రూ.236 మాత్రమే ఉంది. ఇంతకంటే పెంచడానికి వీలు లేదని తీర్మానించింది. దీన్ని ఇప్పటికే అమలు చేస్తున్నారు కూడా. చిన్న బడ్జెట్ మూవీస్కి దీని వల్ల ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ 'కాంతార' లాంటి చిత్రానికి పెట్టిన బడ్జెట్ తిరిగి రావాలంటే టికెట్ ధరలు పెంచాల్సి ఉంటుంది. ఇప్పుడు ఆ విషయమై నిర్మాతలు హొంబలే ఫిల్మ్స్ న్యాయస్థానాన్ని ఆశ్రయించినట్లు తెలుస్తోంది.(ఇదీ చదవండి: అరుంధతి రీమేక్లో శ్రీలీల.. 'మెగా' డైరెక్టర్!)టికెట్ ధరలు పెంచుకునేందుకు వీలుగా అనుమతి ఇవ్వాలని 'కాంతార' నిర్మాతలు రిట్ పిటిషన్ వేసినట్లు సమాచారం. ఒకవేళ ఇది వర్కౌట్ అయితే.. వీళ్లతో పాటు భారీ బడ్జెట్ పెట్టే నిర్మాతలకు మార్గం సుగమమం అవుతుంది. లేదంటే 'కేజీఎఫ్' రికార్డులు కాదుకదా రూ.1000 కోట్ల మార్క్ కూడా దాటడం కష్టమైపోతుంది. అలానే కర్ణాటకలో తక్కువ రేట్, తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ ధర పెడితే మాత్రం కచ్చితంగా విమర్శలు వస్తాయి. మరి ఈ పిటిషన్పై ఫలితం ఏమొస్తుందో చూడాలి?దసరా కానుకగా అక్టోబరు 2న 'కాంతార: ఛాప్టర్ 1' థియేటర్లలోకి రానుంది. తొలి పార్ట్ సింపుల్గా రూ.15-20 కోట్లతో తీస్తే రూ.400 కోట్ల వరకు వసూలు చేసింది. దీంతో రెండో భాగాన్ని కళ్లు చెదిరే బడ్జెట్ పెట్టారు. అలానే రుక్మిణి వసంత్ లాంటి నటుల్ని సినిమాలో భాగం చేశారు. మరి ఈసారి 'కాంతార' ఎలాంటి అద్భుతాలు సృష్టిస్తుందో?(ఇదీ చదవండి: మాస్క్ మ్యాన్ కాదు టార్చర్ మ్యాన్.. ఉతికారేసిన తనూజ!) -
'ఇడ్లీ కొట్టు' టైటిల్ ఎందుకు పెట్టామంటే..: ధనుష్
నటుడు ధనుష్ తాజాగా స్వీయ దర్శకత్వంలో కథానాయకుడిగా నటించిన చిత్రం ఇడ్లీ కడై (ఇడ్లీ కొట్టు). నటి నిత్యామీనన్ నాయకిగా నటించారు. శాలిని పాండే, సత్యరాజ్, అరుణ్విజయ్, రాజ్కిరణ్, పార్తీపన్, సముద్రఖని తదితరలు ముఖ్య పాత్రలు పోషించారు. డాన్ పిక్చర్స్, వండర్బార్ ఫిలింస్ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి జీవీ.ప్రకాశ్కుమార్ సంగీతాన్ని అందించారు. కాగా నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం అక్టోబర్1వ తేదీన విడుదల కానుంది. ఈ సినిమా విడుదల సందర్భంగా నటుడు ధనుష్ మాట్లాడుతూ ఈ చిత్రానికి ఇడ్లీ కొట్టు అని పేరు పెట్టడానికి కారణం గురించి చెబుతూ చిన్నతనంలో తనకు రోజూ ఇడ్లీ తినాలని ఆశగా ఉండేదన్నారు. అయితే చేతిలో డబ్బు ఉండేది కాదన్నారు. దీంతో తోటల్లో పూలు కోసే పనికి వెళితే రోజుకు రూ. 2 లేదా 2.50 రూపాయలు ఇచ్చేవారన్నారు. ఆ డబ్బుతో నాలుగు లేదా ఐదు ఇడ్లీ వస్తే కొనుక్కుని తినేవాడినన్నారు. ఆ ఇడ్లీ రుచి ఇప్పుడు పెద్ద పెద్ద ఫైవ్స్టార్ హోటళ్లలోనూ లభించడం లేదన్నారు. ఆ ఇడ్లీ కొట్టు ఇతి వృత్తంతో చిత్రం చేయాలని అనిపించిందన్నారు. అలా నిజమైన కథ, నిజమైన పాత్రలతో చిత్రం చేసినట్లు ధనుష్ చెప్పారు. అదే విధంగా తన హేటర్స్ గురించి స్పందిస్తూ అసలు హేటర్స్ అనే కాన్సెప్టే పరిశ్రమలో లేదన్నారు. అలాంటి వారు కూడా ఇక్కడ లేరన్నారు. అందరూ అన్ని చిత్రాలు చూస్తుంటారని, అలాంటిది హేటర్స్ ఎవరని చెప్పాలంటూ పేర్కొన్నారు. అయితే ఒక 30 మంది తమ జీవనం కోసమో లేదా మరేదైనా ఆశించో 300 ఐడియాలతో ఏదైనా తప్పుడు ప్రచారం చేయడమే హేట్ అని తెలిపారు. ఆ 30 మంది కూడా చిత్రాలను చూస్తారని ధనుష్ పేర్కొన్నారు. ఇకపోతే ఈ వేదికపై మాట్లాడిన నటుడు పార్తీపన్ నటుడు ధనుష్ను సకలకళావళ్లభుడిగా పేర్కొన్నారు. ఇక ఆయన అభిమానులైతే యువ సూపర్స్టార్ అంటూ పోస్టర్లతో ప్రచారం చేశారు. -
భద్రకాళి నిరుత్సాహ పరచదు: విజయ్ ఆంటోని
‘‘భద్రకాళి’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నందుకు సంతోషంగా ఉంది. ఈ సినిమా ఎవర్నీ నిరుత్సాహ పరచదని కచ్చితంగా చెప్పగలను’’ అని విజయ్ ఆంటోని చెప్పారు. ‘అరువి’ ఫేమ్ అరుణ్ ప్రభు దర్శకత్వంలో విజయ్ ఆంటోని హీరోగా, తృప్తి రవీంద్ర, రియా హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘భద్రకాళి’. విజయ్ ఆంటోని ఫిల్మ్ కార్పొరేషన్, మీరా విజయ్ ఆంటోని సమర్పణలో రామాంజనేయులు జవ్వాజీ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 19న రిలీజ్ కానుంది.ఏషియన్ సురేష్ ఎంటర్టైన్ మెంట్, రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా కలిసి తెలుగులో విడుదల చేస్తున్నాయి. హైదరాబాద్లో జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో సురేష్ బాబు మాట్లాడుతూ–‘‘విజయ్గారి క్రమశిక్షణే ఆయన్ను గొప్పస్థాయికి తీసుకువెళ్తుంది’’ అన్నారు. ‘‘మంచి పొలిటికల్ థ్రిల్లర్ ఇది’’ అని తెలిపారు అరుణ్ ప్రభు. ‘‘ప్రేక్షకులకు నచ్చే సినిమా ఇది’’ అన్నారు రామాంజనేయులు. ఈ వేడుకలో తృప్తి రవీంద్ర, రియా, రైటర్ భాష్యశ్రీ మాట్లాడారు. -
ఆయన వల్లే నా పేరు మార్చుకున్నా: కేజీఎఫ్ మ్యూజిక్ డైరెక్టర్
కేజీఎఫ్ మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. వీర చంద్రహాస మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్కు హాజరైన రవి తనకు సాయం చేసిన వ్యక్తిపై ప్రశంసలు కురిపించారు. తాను ఆర్థికంగా కష్టాల్లో ఉన్నప్పుడు రవి అనే వ్యక్తి అండగా నిలిచారు. అందుకే ఆయన పేరును పెట్టుకున్నానని తెలిపారు. ఆయన వల్లే నేను ఈ రోజు ఇక్కడ ఉన్నానని తెలిపారు. ఆ తర్వాత నా జీవితాన్ని పూర్తిగా మార్చింది మాత్రం ప్రశాంత్ నీల్ అన్నారు.రవి బస్రూర్ మాట్లాడుతూ.. ఎనిమిదో తరగతి ఫెయిల్ అయినా నాలో సంగీత దర్శకుడిని గుర్తించిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్. నాపై నమ్మకంతో ఉగ్రం సినిమాలో అవకాశమిచ్చారు. అప్పటికే నా లైఫ్ అంతా గందరగోళంగా ఉంది. నేను కష్టాల్లో ఉన్నప్పుడు రవి అనే వ్యక్తి ఆర్థిక సాయం చేశారు. ఆయన వల్లే నేను ఈ రోజు ఇక్కడ ఉన్నా. లేకుంటే ఉండేవాడిని కాదు. అందుకే కృతజ్ఞతగా నా పేరును రవి అని పెట్టుకున్నా. వృత్తిపరంగా నన్ను గుర్తించి అవకాశమిచ్చిన ప్రశాంత్ నీల్ నాకు దైవంతో సమానం. నా సంపాదనతో వచ్చిన డబ్బులతో ఏడాది ఒక సినిమా తీయాలని అనుకున్నా. అందుకే వీర చంద్రహాస తెరకెక్కించా. ఇది నా 12 ఏళ్ల కల’’ అని అన్నారు.కాగా.. వీర చంద్రహాస చిత్రం ఇప్పటికే కన్నడలో రిలీజైంది. అక్కడ సూపర్ హిట్ కావడంతో తెలుగులోనూ రిలీజ్ చేస్తున్నారు. ఈనెల 19న తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు వస్తోంది. కేజీఎఫ్ సినిమాకు సంగీత దర్శకుడిగా పని చేసిన రవి బస్రూర్ నిర్మాతగా మారారు. ఈ సినిమాకు సంగీతం అందించడంతో పాటు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్- నీల్ కాంబోలో వస్తోన్న మూవీకి సంగీత దర్శకుడిగా పనిచేస్తున్నారు రవి బస్రూర్. -
నేను ధనుష్ని వెన్నుపోటు పొడవలేను: జీవీ
డబ్బింగ్ సినిమాల మూలాన తమిళ హీరోహీరోయిన్లతో పాటు టెక్నిషియన్లు కూడా తెలుగు ప్రేక్షకులకు చాలావరకు పరిచయమైపోతున్నారు. పాన్ ఇండియా మూవీస్ వల్ల చాలామంది కోలీవుడ్.. మన దగ్గర పనిచేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఇలాంటి వారిలో సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్ కుమార్ ఒకడు. తెలుగు, తమిళంలో పలు చిత్రాలు సంగీతమందిస్తూ బిజీగా ఉండే ఇతడు.. ఇప్పుడు ఓ సీక్రెట్ బయటపెట్టాడు. ధనుష్ని తాను వెన్నుపోటు పొడవలేనని చెప్పుకొచ్చాడు.ధనుష్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన లేటెస్ట్ సినిమా 'ఇడ్లీ కడై'. దీన్ని 'ఇడ్లీ కొట్టు' పేరుతో తెలుగులోనూ రిలీజ్ చేస్తున్నారు. అక్టోబరు 01న థియేటర్లలోకి రానుంది. నిన్న అంటే ఆదివారం ఈ చిత్ర ఆడియో లాంచ్ ఈవెంట్ చెన్నైల్లో గ్రాండ్గా జరిగింది. ఈ వేడుకలోనే మాట్లాడిన సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్ కుమార్.. గతేడాది రిలీజైన ధనుష్ 'రాయన్'లో తనకు నటించే అవకాశం వచ్చిందని, కానీ దాన్ని వద్దనుకున్నట్లు చెప్పాడు.(ఇదీ చదవండి: Bigg Boss 9 తెలుగు 2వ వారం నామినేషన్స్లో ఎవరెవరంటే?)'రాయన్ మూవీలో తమ్ముడి పాత్ర చేయమని ధనుష్ నన్ను మొదట అడిగారు. అయితే ఆ పాత్ర ధనుష్ పాత్రని వెన్నుపోటు పొడుస్తుంది. ఆ పాయింట్ నచ్చక నేను నో చెప్పేశాను. సినిమాలో కూడా నా స్నేహితుడిని మోసం చేసే పాత్రని చేయను' అని జీవీ ప్రకాశ్ కుమార్ చెప్పుకొచ్చాడు. ఇప్పడు ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 'రాయన్'లో ధనుష్ తమ్ముళ్లుగా కాళిదాస్, సందీప్ కిషన్ నటించారు. ఇందులో ఓ పాత్రనే జీవీ చేయాల్సింది కానీ వద్దనేశాడనమాట.ఇకపోతే 'ఇడ్లీ కొట్టు' సినిమా.. పూర్తిగా ఎమోషన్స్ బేస్ చేసుకుని తీశారు. ధనుష్, నిత్యామేనన్, సత్యరాజ్, అరుణ్ విజయ్, షాలినీ పాండే లీడ్ రోల్స్ చేశారు. దసరా కానుకగా తెలుగు, తమిళంలో థియేటర్లలో రిలీజ్ అవుతుంది. దీనికి ఐదు రోజుల ముందు పవన్ కల్యాణ్ 'ఓజీ', ఓ రోజు తర్వాత 'కాంతార' సీక్వెల్ విడుదల కానున్నాయి. మరి వీటితో నిలబడి బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి ఫలితం అందుకుంటుందో చూడాలి?(ఇదీ చదవండి: రూ.100 కోట్లకు చేరువలో 'మిరాయ్' కలెక్షన్) -
నా ఫోన్ హ్యాక్ చేశారు.. అభిమానులకు స్టార్ హీరో హెచ్చరిక
కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర అభిమానులకు విజ్ఞప్తి చేశారు. దయచేసి ఎవరూ కూడా నా ఫోన్ నుంచి కాల్ వస్తే స్పందించవద్దని కోరారు. తన ఫోన్ హ్యాక్ చేశారని ఉపేంద్ర తెలిపారు. తన భార్య ఫోన్ నుంచి కూడా కాల్ చేసి డబ్బులు అడిగితే ఎవరూ కూడా ఇవ్వొద్దని తెలిపారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఓ వీడియోను రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.ఇప్పటికే దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఉపేంద్ర వెల్లడించారు. తన భార్య ప్రియాంక ఆర్డర్ చేసిన వస్తువుకు సంబంధించి సోమవారం ఉదయం ఒకరు కాల్ చేశారని.. కొన్ని హ్యాష్ట్యాగ్స్, నంబర్లు ఎంటర్ చేస్తే డెలివరీ అవుతుందని చెప్పాడని ఉపేంద్ర అన్నారు. ఆ కాల్ తర్వాతే ఫోన్ హ్యాక్ అయిందని తెలిపారు. ఇలాంచి సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఉపేంద్ర తన అభిమానులకు సూచించారుBeware… pic.twitter.com/ftbQDFodTf— Upendra (@nimmaupendra) September 15, 2025 -
ఆరోజు సౌందర్యతో పాటు నేనూ చనిపోయేదాన్నే..: మీనా
అందం, అమాయకత్వం కలబోసినట్లు ఉంటుంది హీరోయిన్ మీనా (Actress Meena). బాలనటిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఆమె తర్వాత హీరోయిన్గా దక్షిణాది భాషల్లో అనేక సినిమాలు చేసింది. స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగింది. తాజాగా 'జయమ్ము నిశ్చయమ్మురా' అనే టాక్ షోకి హాజరైంది. ఈ సందర్భంగా హీరోయిన్ సౌందర్యతో తన అనుబంధాన్ని గుర్తు చేసుకుంది.క్యాంపెయిన్కు నన్నూ పిలిచారుసౌందర్య, నేను చాలా క్లోజ్. తను చాలా మంచి అమ్మాయి. ప్రచారానికి వెళ్లి చనిపోవడం బాధాకరం. నిజానికి ఆ క్యాంపెయిన్కు నన్ను కూడా రమ్మని పిలిచారు. అప్పుడు నేను షూటింగ్స్తో బిజీగా ఉన్నాను. పైగా ప్రచారాలపై నాకంత ఆసక్తి కూడా లేదు. అందుకే నాకు కుదరదని చెప్పి వెళ్లలేదు. లేకపోయుంటే తనతోపాటు నేనూ వెళ్లాల్సింది. ఆ హెలికాప్టర్ ప్రమాదంలో తనను కోల్పోయినందుకు చాలా బాధపడ్డాను అని చెప్పుకొచ్చింది.భర్తను కోల్పోయిన బాధలో..మీనా భర్త విద్యాసాగర్ 2022 జూన్ 28న కన్నుమూశారు. ఆ సమయంలో తనపై వచ్చిన రూమర్స్ చూసి మరింత బాధేసిందని పేర్కొంది. నా భర్తను కోల్పోయినప్పుడు ఎంతో బాధపడ్డా.. రెండేళ్లపాటు ఆ బాధ నుంచి బయటపడలేకపోయా.. నా ఫ్రెండ్స్ ఆ విషాదం నుంచి నన్ను బయటకు తీసుకొచ్చారు. అలాంటి మంచి ఫ్రెండ్స్ ఉన్నందుకు నేను చాలా లక్కీ. మళ్లీ పెళ్లంటూ రూమర్స్అయితే నా భర్త చనిపోయిన వారానికే నేను మళ్లీ పెళ్లి చేసుకుంటున్నానని వార్తలు రాశారు. వీళ్లకసలు మనసుండదా? ఫ్యామిలీ ఉండదా? అనిపించింది. తర్వాత కూడా ఈ రూమర్స్ కొనసాగించారు. ఎవరికి విడాకులైనా వారితో నా పెళ్లి జరగబోతోందని రాశారు. బాధలో ఉన్న నన్ను మరింత బాధపెట్టారు అని తెలిపింది. కాగా జయమ్ము నిశ్చయమ్మురా టాక్ షో జీ5లో స్ట్రీమ్ అవుతోంది.చదవండి: అందరిముందు అలా అనేసరికి షాకయ్యా!: హీరోయిన్ -
అందుకే ఆ పెద్దాయన అప్లికేషన్ తీసుకోలేదు: కేంద్రమంత్రి సురేశ్ గోపీ
మలయాళ ప్రముఖ నటులు, త్రిశ్శూర్ ఎంపీ, కేంద్రమంత్రి సురేష్ గోపీని సాయం చేయాలని కొద్దిరోజుల క్రితం ఓ వృద్ధుడు కోరాడు. అయితే, దానిని ఆయన తిరస్కరించారు. దీంతో ఆయనపై నెటిజన్లు విమర్శలు గుప్పించారు. ఆపై అక్కడి రాజకీయ ప్రత్యర్దులు కూడా ఆయనపై విరుచుకపడ్డారు. ఈ అంశంపై తాజాగా కేంద్రమంత్రి సురేష్ గోపీ రియాక్ట్ అయ్యారు.ఇటీవల కేరళలో జరిగిన ఓ ర్యాలీలో సురేశ్ గోపీ పాల్గొన్నారు. ఆ సమయంలో ఇల్లు కట్టుకోవడానికి సహాయం కోరుతూ ఒక వృద్ధుడు ఇచ్చిన దరఖాస్తును ఆయన స్వీకరించలేదు. అందుకు సంబంధించి సురేష్ గోపీ ఇలా వివరణ ఇచ్చారు. ఈ విషయాన్ని కొందరు రాజకీయ ఎజెండాగా ఉపయోగిస్తున్నారని ఆయన తప్పుబట్టారు.'ఒక ప్రజా సేవకుడిగా, ఏమి చేయవచ్చు, ఏమి చేయకూడదు అనే దానిపై నాకు స్పష్టమైన అవగాహన ఉంది. నిలబెట్టుకోలేని వాగ్దానాలు నేను చేయలేను. గృహ నిర్మాణం అనేది రాష్ట్ర సమస్య. కాబట్టి, అలాంటి అభ్యర్థనలను నేను ఒక్కడినే మంజూరుచేయలేను. రాష్ట్ర ప్రభుత్వమే దాని గురించి ఆలోచించాలి. ఈ సంఘటన ద్వారా, రాష్ట్ర ప్రభుత్వం తనకు ఇంటిని మంజూరు చేసింది.ఈ విషయం తెలిసిన తర్వాత నేను సంతోషంగా ఉన్నాను. ఇది రాజకీయంగా ప్రేరేపించబడినప్పటికీ, నా వల్ల అతనికి మంచి జరిగింది. గత రెండు సంవత్సరాలుగా ప్రజలు దీనిని గమనిస్తున్నారు.నా వల్ల ఇల్లు అందించడానికి వారు ముందుకు వచ్చారనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. నా ప్రయత్నాలు ఎల్లప్పుడూ వ్యవస్థలో పనిచేయడం, ప్రజలకు నిజమైన ప్రయోజనాలను అందించడంపైనే ఉంటాయి.' అని ఆయన అన్నారు. -
అందరిముందు అలా అనేసరికి షాకయ్యా!: హీరోయిన్
సన్నగా ఉంటే అస్థి పంజరంలా ఉన్నావని, బొద్దుగా ఉంటే బాగా లావైపోయావని ఏదో ఒకరకంగా కామెంట్లు చేస్తూనే ఉంటారు. తనను కూడా ఇలాంటి కామెంట్లతో బాడీ షేమింగ్ చేశారంటోంది మలయాళ హీరోయిన్ అపర్ణ బాలమురళి (Aparna Balamurali). తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. కొందరు అదే పనిగా ఏదేదో వాగుతారు. ఏం చేస్తున్నావ్? ఇలా అయిపోతున్నావ్? అని కామెంట్లు చేస్తుంటారు. లెక్క చేయట్లేమొదట్లో ఫీలయ్యేదాన్ని. నా ఆత్మవిశ్వాసం సన్నగిల్లేది. కానీ ఇప్పుడవేవీ పట్టించుకోవడం లేదు. ఇలా ధృడంగా మారడానికి నాకు చాలా సమయం పట్టింది. ఒకసారేమైందంటే.. చాలాదూరం ప్రయాణించి విమానాశ్రయంలో దిగాను. ఇంతలో సడన్గా నాకు పరిచయమే లేని వ్యక్తి ఎదురొచ్చి.. ఏంటి? ఇంత లావైపోయావ్? అన్నాడు. షాకయ్యాఅందరి ముందు సడన్గా అలా అనేసరికి షాకయ్యాను. తర్వాత ఒక్కమాట కూడా మాట్లాడకుండా వెంటనే అక్కడినుంచి వెళ్లిపోయాను. ఇలాంటివి జరిగినప్పుడు మనసుకు కష్టంగా అనిపించేది. కానీ, ఒకానొక సమయంలో ఈ బాధను అధిగమించాను. ఇప్పుడలాంటి కామెంట్లను పట్టించుకోవడమే మానేశాను అని చెప్పుకొచ్చింది. సినిమాఅపర్ణ బాలమురళి 2015లో ఒరు సెకండ్ క్లాస్ యాత్ర అనే మలయాళ సినిమాతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది. సూరరై పొట్రు (ఆకాశమే నీ హద్దురా) సినిమాతో విశేషమైన ఆదరణ సంపాదించుకుంది. మలయాళంలో సండే హాలీడే, 2018, ధూమం, రుధిరం వంటి చిత్రాల్లో నటించింది. తమిళంలో 8 తొట్టకాల్, వీట్ల విశేషం, రాయన్ సినిమాలు చేసింది. ప్రస్తుతం మలయాళంలో మూడు సినిమాలు చేస్తోంది.చదవండి: 'మిరాయ్' రివ్యూ ఇచ్చిన ఆర్జీవీ.. నన్ను నేనే కొట్టుకున్నానంటూ.. -
ఇడ్లీ తినాలని కోరిక.. డబ్బులుండేవి కావు: ధనుష్ ఎమోషనల్
తమిళ స్టార్ హీరో ధనుష్ (Dhanush) ప్రధాన పాత్రలో నటించి, స్వీయ దర్శకత్వం వహించిన మూవీ ఇడ్లీ కడై (Idli Kadai Movie). ఇది తెలుగులో ఇడ్లీ కొట్టు పేరుతో రానుంది. నిత్యామీనన్ హీరోయిన్గా నటిస్తుండగా జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందించాడు. ధనుష్, ఆకాశ్ భాస్కరన్ నిర్మించిన ఈ మూవీ అక్టోబర్ 1న విడుదల కానుంది. ఈ క్రమంలో ఆదివారం (సెప్టెంబర్ 14న) ఇడ్లీ కొట్టు ఆడియో లాంచ్ నిర్వహించారు. రోజూ తినాలనిపించేదిఈ ఈవెంట్లో ధనుష్ మాట్లాడుతూ.. చిన్నప్పుడు ప్రతిరోజు నాకు ఇడ్లీ తినాలనిపించేది. కానీ నాదగ్గర అంత డబ్బుండేది కాదు. అప్పుడేం చేశానంటే తోటలో పూలు తెంపడానికి పనికెళ్లేవాడిని. ఉదయం నాలుగు గంటలకే నిద్ర లేచి త్వరగా తోటకు వెళ్లి రెండు గంటలు పనిచేసేవాడిని. అప్పుడు నాకు రూ.2 ఇచ్చేవారు. అది తీసుకున్నాక ముందు చేతి పంపు దగ్గరకు వెళ్లి రోడ్డుపైనే స్నానం చేసేవాళ్లం. తర్వాత ఇడ్లీ కొట్టుకు వెళ్తే.. ఆ డబ్బుతో నాలుగైదు ఇడ్లీలు వచ్చేవి. హ్యాపీగా ఉందిమనం కష్టపడి సంపాదించిన డబ్బుతో కొనుక్కుని తింటే వచ్చే టేస్ట్ దేంట్లోనూ రాదు. మిమ్మల్నందరినీ మళ్లీ పాత రోజుల్లోకి తీసుకెళ్లాలనుకుంటున్నాను. ఈ మధ్యకాలంలో నేను చాలామంది అభిమానులను కలిశాను. వారిలో ఇంజనీర్లు, డాక్టర్లు, లాయర్లు ఉన్నారు. నా ఫ్యాన్స్ ఇంత మంచి స్థాయిలో ఉన్నందుకు సంతోషంగా ఉంది. మీ జీవితాన్ని ఉన్నత స్థాయిలో నిలబెట్టుకునేదానిపైనే ఎక్కువ దృష్టి పెట్టండి అని చెప్పుకొచ్చాడు.చదవండి: ఆ నలుగురు ఫేక్.. నమ్మకం పోతే మళ్లీరాదంటూ ఏడ్చేసిన శ్రష్టి -
ఇండస్ట్రీకి కొత్త హీరోయిన్.. స్టార్ హీరో సినిమాతో ఎంట్రీ!
కోలీవుడ్లోకి కొత్త హీరోయిన్ వచ్చేసింది. తృప్తి రవీంద్ర (Trupti Ravindra) ప్రధాన పాత్రలో నటించిన శక్తి తిరుమగన్ (భద్రకాళి) చిత్రం సెప్టెంబర్ 19న విడుదల కానుంది.. మహారాష్ట్రలోని ధూలే నగరానికి చెందిన ఈ బ్యూటీ ఇంజినీరింగ్ పట్టభద్రురాలు, అలాగే స్టేజీ ఆర్టిస్ట్ కూడా! ఐదేళ్లపాటు నాటకాల్లో నటించిన తృప్తి రవీంద్ర పలు వాణిజ్య ప్రకటనల్లోనూ నటించింది. డాన్స్, యోగ వంటి వాటిలోనూ ప్రావీణ్యం ఉంది. ఈ చిత్రంలో నటిస్తున్న సమయంలో తృప్తి తమిళ భాషను నేర్చుకోవడం విశేషం. విజయ్ ఆంటోనీ కథానాయకుడిగా నటించి, నిర్మించిన ఈ చిత్రానికి అరుణ్ ప్రభు కథ, దర్శకత్వం అందించారు.సంతోషంగా ఉందితాజాగా తృప్తి రవీంద్ర మాట్లాడుతూ.. థియేటర్ నాటకాల ద్వారా నటనలో శిక్షణ పొందినట్లు చెప్పింది. దర్శకుడు అరుణ్ ప్రభు, విజయ్ ఆంటోనితో కలిసి పనిచేయడం సంతోషంగా ఉందని పేర్కొంది. శక్తి తిరుమగన్ మూవీ ద్వారా కథానాయక పరిచయం అవుతుండటం గొప్ప విషయంగా భావిస్తున్నానంది. ఈ చిత్రం ద్వారా చాలా నేర్చుకున్నట్లు తెలిపింది. ఇలాంటి అర్థవంతమైన కథాపాత్రల్లో, ఇతర భాషల్లోనూ నటించడానికి రెడీ అని సిగ్నల్ ఇచ్చేసింది. అదేవిధంగా ప్రేక్షకులపై మంచి ప్రభావాన్ని చూపించే సినిమాలను అందించే ప్రతిభావంతులైన దర్శకులతో కలిసి పని చేయాలని కోరుకుంటున్నట్లు పేర్కొంది. View this post on Instagram A post shared by Trupti Ravindra (@trupti_ravindra_) -
స్టార్ కొరియోగ్రాఫర్.. సైకో పాత్రలతో కేరాఫ్.. ఇతడెవరో తెలుసా?
సాధారణంగా కొరియోగ్రాఫర్స్ అనగానే దాదాపు తెర వెనకే ఉంటారు. అప్పుడప్పుడు మాత్రమే తెరపై కనిపిస్తుంటారు. కానీ ఇతడు మాత్రం ఓవైపు స్టార్ హీరోల సినిమాలకు కొరియోగ్రఫీ చేస్తూనే మరోవైపు సైకో విలన్గా తెగ భయపెడుతున్నాడు. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో రీసెంట్ టైంలో వచ్చిన సినిమాల్లో సైకో పాత్రలతో క్రేజ్ తెచ్చుకుంటున్నాడు. ఇంతకీ ఎవరితడు? బ్యాక్ గ్రౌండ్ ఏంటి?శాండీ మాస్టర్ అలియాస్ సంతోష్ కుమార్.. తమిళ ఇండస్ట్రీకి చెందిన కొరియోగ్రాఫర్ కమ్ నటుడు. చెన్నైకి చెందిన ఇతడు.. 2005లో డ్యాన్స్ మాస్టర్గా కెరీర్ ప్రారంభించాడు. తెలుగులోనూ ఓంకార్ హోస్ట్ చేసిన ఛాలెంజ్ షోలో కొరియోగ్రాఫర్గా చేశాడు. రీసెంట్ టైంలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన 'మోనికా' పాటకు ఇతడే స్టెప్పులు కంపోజ్ చేశాడు. అంతకు ముందు విక్రమ్, థగ్ లైఫ్, ఆవేశం, తంగలాన్ తదితర సినిమాలకు పనిచేశాడు.(ఇదీ చదవండి: 'మిరాయ్'లో శ్రీరాముడు ఇతడే.. ఈ నటుడు ఎవరో తెలుసా?)ఇక నటన విషయానికొస్తే.. లోకేశ్ కనగరాజ్ 'లియో' సినిమా ప్రారంభంలో చాక్లెట్ కాఫీ అంటూ నవ్వుతూనే భయపెట్టి సైకో విలన్గా చేసింది ఇతడే. ఈ మూవీతో చాలా క్రేజ్ వచ్చింది. అలా రీసెంట్ మలయాళ హిట్ 'లోక: ఛాప్టర్ 1'లోనూ నాచియప్ప అనే ప్రతినాయక పాత్ర చేశాడు. తాజాగా రిలీజైన తెలుగు మూవీ 'కిష్కింధపురి'లోనూ విస్త్రవ పుత్ర అనే సైకో పాత్ర చేశాడు. రీసెంట్ టైంలో ఇలా వరసగా సైకో పాత్రలే చేస్తున్నాడు గానీ ప్రతిసారి తన యాక్టింగ్తో మెస్మరైజ్ చేస్తున్నాడు.ప్రస్తుతం శాండీ మాస్టర్ మలయాళ సినిమాలైన 'కథనార్', 'బాబాబా'ల్లో లీడ్ రోల్స్ చేస్తుండటం విశేషం. ఇలా ఓవైపు కొరియోగ్రాఫీ చేస్తూ హిట్స్ కొడుతున్నాడు. మరోవైపు విలన్ పాత్రలు చేస్తూ ప్రేక్షకుల్ని భయపెడుతూ ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ద టౌన్ అయిపోయాడు. శాండీ వ్యక్తిగత జీవితం విషయానికొస్తే.. తమిళ నటి కాజల్ పశుపతిని 2009లో పెళ్లి చేసుకున్నాడు. కానీ మూడేళ్లకే వీళ్లు విడాకులు తీసుకున్నారు. తర్వాత 2017లో సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ దొరతి స్లవియాని వివాహం చేసుకున్నాడు. వీళ్లకు ఇద్దరు పిల్లలు. (ఇదీ చదవండి: 'మిరాయ్'తో తేజ సజ్జా ఇండస్ట్రీ రికార్డ్) -
ఓటీటీకి మరో మలయాళ మూవీ.. కేవలం వారికి మాత్రమే!
ఓటీటీలు వచ్చాక మలయాళ చిత్రాలకు ఫుల్ డిమాండ్ పెరిగిపోయింది. ఇటీవల ఓటీటీల్లో మాత్రమే కాకుండా థియేటర్లలో సూపర్ హిట్గా నిలుస్తున్నాయి. కంటెంట్ బాగుంటే చాలు ఆడియన్స్ తెగ చూసేస్తున్నారు. సినిమా ఎప్పుడు రిలీజ్ అన్నది ముఖ్యం కాదు.. స్టోరీ ముఖ్యమంటున్నారు. దీంతో ఓటీటీల్లో మలయాళ సినిమాలకు ఆడియన్స్లో ఫుల్ క్రేజ్ వస్తోంది.మలయాళంలో తెరకెక్కించిన మరో చిత్రం ఓటీటీ స్ట్రీమింగ్కు వచ్చేస్తోంది. అసిఫ్ అలీ, దివ్య ప్రభ జంటగా నటించిన సర్కీట్ మూవీ ఓటీటీలో సందడి చేయనుంది. ఈనెల 26 నుంచి సింప్లీ సౌత్లో స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ వెల్లడించారు. అయితే కేవలం ఓవర్సీస్ ఆడియన్స్కు మాత్రమే అందుబాటులో ఉండనుందని ప్రకటించారు. 'ముగ్గురు ఆత్మలు. ఒక రోజు. ఒక మలుపు' అంటూ పోస్టర్ను పంచుకున్నారు.కాగా.. ఈ చిత్రం మే 8న థియేటర్లలో విడుదలైంది. రిలీజైన నాలుగు నెలల తర్వాత ఓటీటీకి వస్తోంది. అయితే బాక్సాఫీస్ వద్ద పెద్దగా రాణించలేకపోయిన ఈ మూవీ.. ఓటీటీలోనైనా రాణిస్తుందేమో వేచి చూడాల్సిందే. ఈ మూవీని ఫుల్ కామెడీ అండ్ ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది.Three souls. One day. A turning point.#Sarkeet, streaming on Simply South from September 26 worldwide, excluding India. pic.twitter.com/YJjcbmJRwG— Simply South (@SimplySouthApp) September 12, 2025 -
బిగ్బాస్ సీజన్-9 డేట్ వచ్చేసింది.. హోస్ట్గా ఆ స్టార్ హీరోనే!
బిగ్బాస్ రియాలిటీ షోకు ఆడియన్స్లో ఉన్న క్రేజ్తో అన్ని భాషల్లో సక్సెస్గా కొనసాగుతోంది. ఇప్పటికే హిందీ, తెలుగు భాషల్లో ఈ రియాలిటీ షో ప్రారంభమైంది. తెలుగులో సెప్టెంబర్ 7న గ్రాండ్గా మొదలైంది. ఇప్పుడు తమిళ ప్రియులను అలరించేందుకు సిద్ధమైంది. అక్కడ తమిళ బిగ్బాస్ సీజన్-9 కావడం మరో విశేషం.ఈ సీజన్ను వచ్చే నెల ఐదో తేదీ నుంచి ప్రారంభిస్తున్నట్లు మేకర్స్ రివీల్ చేశారు. ఈ మేరకు స్పెషల్ పోస్టర్ను రిలీజ్ చేశారు. ఈ సీజన్కు కూడా స్టార్ హీరో విజయ్ సేతుపతి హోస్ట్గా వ్యవహరిస్తున్నారు. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న బుల్లితెర ప్రియులకు మేకర్స్ గుడ్ న్యూస్ చెప్పారు. బిగ్బాస్ సీజన్ -7 తర్వాత కమల్ హాసన్ తప్పుకోవడంతో విజయ్ సేతుపతి హోస్ట్గా ఎంట్రీ ఇచ్చారు. ఈ రియాలిటీ షో విజయ్ టీవీతో పాటు జియో హాట్స్టార్లోనూ స్ట్రీమింగ్ కానుంది. అక్టోబర్ 5 నుంచి ప్రారంభమయ్యే ఈ సీజన్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. பாக்க பாக்க தான் புரியும்.. போக போக தான் தெரியும்Bigg Boss Tamil Season 9 | Grand Launch - அக்டோபர் 5 முதல்..😎 #BiggBossSeasonTamil9 #OnnumePuriyala #BiggBoss9 #VijaySethupathi #BiggBossTamil #BB9 #VijayTV #VijayTelevision pic.twitter.com/ZdbtAolWH8— Vijay Television (@vijaytelevision) September 13, 2025 -
కాంతార ప్రీక్వెల్... రంగంలోకి నేషనల్ అవార్డ్ సింగర్!
కన్నడ ఇండస్ట్రీలో నుంచి బ్లాక్బస్టర్ మూవీ కాంతార. ఈ సినిమాను రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించారు. ఈ చిత్రం కర్ణాటకలోనే కాకుండా అన్ని దేశవ్యాప్తంగా అనూహ్య విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని హోంబలే సంస్థ నిర్మించిన విషయం తెలిసిందే. కాగా.. తాజాగా ఆ చిత్రానికి ప్రీక్వెల్గా కాంతారా చాప్టర్– 1 పేరుతో అత్యంత భారీ బడ్జెట్లో రూపొందిస్తున్నారు. ఇప్పటికే దాదాపు షూటింగ్ పూర్తయిన ఈ సినిమా దసరా కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సందర్భంగా ఓ ప్రత్యేక పాటను ఇటీవల రికార్డ్ చేశారు.ఈ సాంగ్ను జాతీయ ఉత్తమ అవార్డు గ్రహీత నటుడు, గాయకుడు దిల్జిత్ దోసాంజ్ పాడడం విశేషం. ఈ సందర్భంగా ఈయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కాంతార వంటి అద్భుతమైన చిత్రాన్ని రూపొందించిన తన సోదరుడు రిషబ్ శెట్టికి తన ప్రణామాలు అని పేర్కొన్నారు. ఈ చిత్రానికి తనకు ప్రత్యేక అనుబంధం ఉందని అన్నారు. అదేమిటి అన్నది ఇప్పుడే చెప్పలేనని అయితే వారాహరూపం అనే పాట ధ్వనిస్తున్నప్పుడు మాత్రం ఆనందభాష్వాలు వచ్చాయన్నారు. ఇకపోతే త్వరలో తెరపైకి రానున్న కాంతార చాప్టర్ –1 లో పాడిన అనుభవం మరువలేనిదన్నారు.ఈ సందర్భంగా ఈ చిత్ర సంగీత దర్శకుడు బి. అజనీష్ లోకనాథ్ ధన్యవాదాలు తెలుపుకుంటున్నా అని అన్నారు. ఒక్క రోజులోనే ఆయన నుంచి తాను చాలా నేర్చుకున్నట్లు చెప్పారు. దీంతో నటుడు దర్శకుడు రిషబ్ శెట్టి, గాయకుడు దిల్జిత్ దోసాంజ్, హోంబలే ఫిల్మ్స్ కాంబోలో రూపొందిన ఈ చిత్ర ఆల్బమ్పై ఆసక్తి నెలకొంది. కాగా ఈ చిత్రం అక్టోబర్ రెండో తేదీన ప్రపంచవ్యాప్తంగా తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. Excited to join hands with @diljitdosanjh for the Kantara album 🙏✨By Shiva’s grace, everything fell into place. Much love, Paji ❤️🔥Another Shiva bhakt meets Kantara.#KantaraChapter1 #KantaraChapter1onOct2 pic.twitter.com/44ya4cyL8S— Rishab Shetty (@shetty_rishab) September 12, 2025 -
100 రోజులు ఆడిన శ్రీలీల మూవీ.. ఇప్పుడు తమిళంలో..
వైరల్ వయ్యారి శ్రీలీల (Sreeleela) త్వరలో శివకార్తికేయన్కు జంటగా పరాశక్తి చిత్రంతో తమిళ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది. దీనికంటే ముందు 'కిస్ మీ ఇడియట్' అనే చిత్రంతో తమిళ ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అవుతోంది. ఇది ఆమె కన్నడంలో నటించిన రెండవ చిత్రం కిస్కు రీమేక్ కావడం గమనార్హం. కన్నడలో కిస్ మూవీ 2019లో విడుదలై శతదినోత్సవం జరుపుకుంది. విరాట్ కథానాయకుడిగా నటించిన ఇందులో రోబో శంకర్, నాంజిల్ విజయమన్, అస్వతి తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు ఏపీ అర్జున్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి జయశంకర్ రామలింగం ఛాయాగ్రహణం, ప్రకాష్ నిక్కి సంగీతాన్ని అందించారు. కథేంటంటే?మాతృకకు పనిచేసిన డైరెక్టర్ అర్జున్ తమిళ వర్షన్కూ పని చేస్తున్నారు. కిస్ మీ ఇడియట్ చిత్రం సెప్టెంబర్ 26వ తేదీన తెరపైకి రానుంది. ఈ చిత్ర వివరాలను దర్శకుడు మీడియాకు వెల్లడించాడు. 'కాలేజీలో చదువుకునే శ్రీలీల తన తోటి విద్యార్థులతో కలిసి ఆట పట్టించినందుకు గాను ప్రిన్సిపల్ ఆమెను తరగతి గది నుంచి ఒక రోజు బహిష్కరిస్తాడె. దీంతో కోపంతో బయటికి వచ్చిన శ్రీలీల కళాశాల వెలుపల ప్రిన్సిపల్ ఫొటో ఉన్న బ్యానర్పై రాయి విసురుతుంది. ఆ రాయి అటుగా వస్తున్న విరాట్ కారుపై పడటంతో అద్దం పగులుతుంది. తప్పని స్థితిలో..దీంతో శ్రీలీలను విరాట్ నష్టపరిహారంగా రూ.4 లక్షలు ఇవ్వమని డిమాండ్ చేస్తాడు. లేకపోతే పోలీసులకు ఫిర్యాదు చేస్తానని బెదిరిస్తాడు. అంత డబ్బు తన వద్ద లేదని శ్రీలీల ప్రాధేయ పడితే ఒక ముద్దు ఇవ్వు లేదా తన వద్ద రెండు నెలలు సహాయకురాలిగా పనిచేయమని చెబుతాడు. దీంతో శ్రీలీల అతని వద్ద రెండు నెలలు సహాయకురాలుగా పనిచేయడానికి అంగీకరిస్తుంది. అలా శ్రీలీల విరాట్పై ప్రేమ పెంచుకున్న తరుణంలో గడువు పూర్తి కావడంతో ఆమెను పని నుంచి తొలగిస్తాడు. ఆ తర్వాత ఆమె లేకుండా తాను ఉండలేనన్న భావన విరాట్కు కలుగుతుంది అలాంటి వారి ప్రేమ ఫలించిందా ? లేదా అన్న పలు ఆసక్తికరమైన అంశాలతో కిస్ మీ ఇడియట్ రూపొందింది అని దర్శకుడు చెప్పారు. -
కాపీరైట్.. ఆయన కోసం కన్నీళ్లు పెట్టుకున్న ఇళయరాజా : రజనీకాంత్
సినీ జీవితంలో ప్రముఖ సంగీత దర్శకులు ఇళయరాజా 50 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా తమిళనాడు ప్రభుత్వం సన్మాన కార్యక్రమం నిర్వహించింది. ఇళయరాజా పేరును భారతరత్న పురస్కారం కోసం ప్రతిపాదించనున్నట్లు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ తెలిపారు. అనంతరం ఆయన్ను జ్ఞాపికతో సీఎం సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్, రజనీకాంత్, కమల్ హాసన్, కార్తి వంటి స్టార్స్ పాల్గొన్నారు.ఇళయరాజా తన 50ఏళ్ల సినీ జీవితంలో ఎన్నో ఒడిదిడుకులు చూశారని సీఎం స్టాలిన్ అన్నారు. కృషి ఉంటే ఎంతటి ఉన్నత శిఖరానికైనా చేరవచ్చని ఇళయరాజా జీవితం చెబుతుందన్నారు. ఆయన సంగీతం విజయ ప్రస్థానానికి ప్రేరణ అందించడమే కాకుండా బాధలను కూడా ఓదార్చుతోందని సీఎం తెలిపారు. సంగీత కళాకారులను ప్రోత్సహించేందుకు ఏటా తమిళనాడు ప్రభుత్వం తరఫున ఇళయరాజా పేరుతో ఒక పురస్కారం అందిస్తామని స్టాలిన్ ప్రకటించారు.SP బాలు, ఇళయరాజా వివాదంపై రజనీ వ్యాఖ్యలు'ఇళయరాజా పాటలు నేడు చాలా సినిమాల్లో ఉపయోగిస్తున్నారని రజనీకాంత్ అన్నారు. దీంతో పలు సినిమా మేకర్స్పై కాపీరైట్ చట్టం ప్రకారం ఆయన కోర్టుకు వెళ్లారు. కోర్టు కూడా ఆయనకు అనుకూలంగానే తీర్పు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయని గుర్తు చేశారు. ఇళయరాజా తను స్వరపరచిన పాటలపై కాపీరైట్ హక్కులు తనకే ఉన్నాయని.. ఎస్.పీ బాలసుబ్రహ్మణ్యం కూడా ఆ పాటలు మళ్లీ పాడకూడదని కోరారు. దీంతో బాలు కూడా మళ్లీ ఎక్కడా ఆ పాటలు పాడలేదు. కానీ, కోవిడ్ సమయంలో SPB మరణించినప్పుడు, ఇళయరాజా కన్నీళ్లు పెట్టుకున్నారు. అందరి ముందే విలవిల ఏడ్చారు. గతంలో తన సోదరుడు, కూతురు, భార్య మరణించిన సమయంలో కూడా ఆయన కన్నీళ్లు పెట్టలేదు. కానీ బాలు కోసం ఏడ్చేశారు. వారి మధ్య స్నేహం ఎంత బలమైనదో ఇదొక్కటి చాలు.' అని రజనీకాంత్ అన్నారు. -
డిప్రెషన్.. చనిపోవాలని చాలాసార్లు ట్రై చేశా..: హీరోయిన్
ఒకానొక సమయంలో జీవితంపై విరక్తి వచ్చి తనువు చాలించాలనుకున్నాను అంటోంది హీరోయిన్ మోహిని (Actress Mohini). తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో హీరోయిన్గా అనేక సినిమాలు చేసింది. పెళ్లి తర్వాత అమెరికా వెళ్లిపోయిన ఆమె అక్కడే సెటిలైపోయింది. మోహిని- భరత్ దంపతులకు ఇద్దరు కుమారులు సంతానం. తాజాగా తన వైవాహిక జీవితం గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడింది మోహిని. డిప్రెషన్లో..నా పెళ్లయ్యాక భర్త, పిల్లలతో సంతోషంగా ఉన్నాను. కానీ, ఒకానొక సమయంలో నాలో తెలియని బాధ మొదలైంది. డిప్రెషన్లోకి వెళ్లిపోయాను. పోనీ, నా జీవితంలో ఏమైనా కష్టాలున్నాయా? అంటే ఏమీ లేవు. అంతా ఎప్పటిలాగే ఉంది. కానీ, నేను మాత్రం డిప్రెషన్ నుంచి బయటకు రాలేకపోయాను. ఆత్మహత్యకు ప్రయత్నించాను. అలా ఒక్కసారి కాదు, పలుమార్లు చనిపోయేందుకు ట్రై చేశాను. ఆ సమయంలోనే ఓ జ్యోతిష్యుడిని కలవగా నాపై చేతబడి జరిగిందని చెప్పాడు. దాన్నుంచి బయటపడ్డా..మొదట నవ్వుకున్నాను. కానీ ఆలోచిస్తే అదే నిజమనిపించింది. నా అంతట నేనుగా చనిపోవాలని ఎందుకు ప్రయత్నిస్తాను? అని నన్ను నేను ప్రశ్నించుకున్నాను. తర్వాత ఆ భగవంతుడిని నమ్ముకుని దాన్నుంచి బయటపడ్డాను అని చెప్పుకొచ్చింది. కాగా మోహిని తెలుగులో ఆదిత్య 369 సినిమాతో పాపులర్ అయింది.ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.comచదవండి: ఏళ్ల తరబడి డిప్రెషన్లో.. ఆ బాధతోనే బిగ్బాస్కు.. ఎవరీ మాస్క్ మ్యాన్ -
రెండోసారి ప్రసవం.. మానసికంగా ఇబ్బందిపడ్డా: ఇలియానా
టాలీవుడ్లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా మెప్పించిన బ్యూటీ ఇలియానా. దేవదాసు సినిమాతో ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత ఇండస్ట్రీలో స్టార్డమ్ను సొంతం చేసుకుంది. మహేశ్ బాబు హీరోగా వచ్చిన పోకిరి మూవీతో బ్లాక్బస్టర్ హిట్ను తన ఖాతాలో వేసుకుంది. గతేడాది హిందీ చిత్రాల్లో కనిపించిన ఇలియానా.. ప్రస్తుతం సినిమాలేవీ చేయట్లేదు. అయితే తాజాగా ఇంటర్వ్యూకు హాజరైన పోకిరి భామ.. రెండో బిడ్డ పుట్టాక ఎదురైన అనుభవాలను పంచుకుంది.అంతకుముందే అమెరికా నటుడు మైఖేల్ డోలన్ను సీక్రెట్గా పెళ్లి చేసుకున్న ఇలియానా.. 2023లో మొదటి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ ఏడాది జూలైలో రెండో బిడ్డకు వెల్కమ్ చెప్పింది. రెండోసారి ప్రసవం తర్వాత తనకు ఎదురైన ఇబ్బందులను తాజా ఇంటర్వ్యూలో వివరించింది. మానసికంగా చాలా ఇబ్బంది పడ్డానని తెలిపింది. ఆ సమయంలో చాలా కష్టంగా అనిపించిందని వెల్లడించింది.ఇలియానా మాట్లాడుతూ..' మొదటిసారి బిడ్డ పుట్టినప్పుడు వారిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఒంటరి మహిళగా బిడ్డను ఆరోగ్యంగా కాపాడుకోవాలి. అయితే రెండోసారి కేవలం బిడ్డ కాదు..నాతో పాటు మరో ఇద్దరు చిన్నపిల్లల బాధ్యత నాదే. ఇలాంటి సందర్భాల్లో మనం శారీరకంగా.. మన బలాన్ని తిరిగి పొందడానికి ప్రయత్నించాలి. ఆ సమయంలో మానసికంగా పూర్తి గందరగోళంగా అనిపించింది. అది చాలా కష్టంగా ఫీలయ్యాను. ఏమి జరగబోతోందో నాకు తెలిసినప్పటికీ.. మానసికంగా ఇది చాలా ఇబ్బందిగా భావించా. అదే సమయంలో ముంబయిని మిస్సయిన బాధ కూడా ఉంది. అక్కడైతే నాకు సాయం చేసేందుకు ఫ్రెండ్స్ ఉండేవారని" తెలిపింది.కాగా.. ఇలియానా, మైఖేల్ 2023 ఒక ప్రైవేట్ వేడుకలో వివాహం చేసుకున్నారు. ఆమె చివరిసారిగా 2024 చిత్రం దో ఔర్ దో ప్యార్లో కనిపించింది. తెలుగులో 2006లో దేవదాస్ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది ఇలియానా. చివరిగా 2018లో రవితేజతో ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ చిత్రంలో కనిపించింది . -
'కూలీ'లో నటించి తప్పు చేశా.. ఆమిర్ అంత మాటన్నాడా?
గత నెలలో మంచి హైప్తో థియేటర్లలోకి వచ్చిన సినిమా 'కూలీ'. రజినీకాంత్, నాగార్జున, సౌబిన్ షాహిర్, ఉపేంద్ర, ఆమిర్ ఖాన్.. ఇలా చాలామంది స్టార్స్ ఉండేసరికి ప్రేక్షకులు అంచనాలు పెట్టుకున్నారు. కానీ మూవీ ఓ మాదిరిగా ఉండటం వాళ్లని నిరాశపరిచింది. అసలు లోకేశ్ కనగరాజ్ ఈ చిత్రం తీశాడా? అని సోషల్ మీడియాలో కామెంట్స్ చేశారు. ఇప్పుడు ఆమిర్ కూడా ఈ సినిమాలో నటించానని తప్పు చేశానని అన్నట్లు ఓ న్యూస్ తెగ వైరల్ అవుతోంది.ఇంతకీ నిజమేంటి?'కూలీ'లో బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ అతిథి పాత్రలో కనిపించాడు. క్లైమాక్స్లో దహా అనే రోల్ చేశాడు. అయితే ఇది కేవలం రజినీకాంత్ కోసమే చేశానని ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆమిర్ చెప్పాడు. తీరా మూవీలో చూస్తే అది ఏ మాత్రం ప్రభావం చూపించకపోగా, సీరియస్ సీన్లో ఆమిర్ కామియో మరీ కామెడీగా అనిపించింది. విపరీతమైన ట్రోల్స్ కూడా వచ్చాయి.(ఇదీ చదవండి: Bigg Boss 9 డేంజర్ జోన్లో వీళ్లే.. లక్స్ పాపపై ఎలిమినేషన్ వేటు?)అసలు విషయానికొస్తే రెండు మూడు రోజుల నుంచి బాలీవుడ్ మీడియాలో ఆమిర్-లోకేశ్ కనగరాజ్ చేయాల్సిన సూపర్ హీరో సినిమా ఆగిపోయిందనే రూమర్స్ వినిపిస్తున్నాయి. మరి వీటిలో ఎంత నిజముందనేది తెలియదు గానీ ఇప్పుడు ఏకంగా ఆమిర్ మాట్లాడినట్లు ఓ పేపర్ క్లిప్పింగ్ వైరల్ అవుతోంది. 'కూలీలో నటించి పెద్ద తప్పు చేశా' అని ఆమిర్ అన్నట్లు అందులో రాసుకొచ్చారు. అయితే ఎక్కడ ఎప్పుడు ఆమిర్ ఇలా మాట్లాడారనేది వెతికితే మాత్రం అలాంటి సమాచారం కనిపించలేదు.అయితే ఈ రూమర్స్ని దళపతి విజయ్ ఫ్యాన్స్ కావాలనే స్ప్రెడ్ చేస్తున్నారని ట్విటర్లో కొందరు కామెంట్స్ చేస్తున్నారు. అందుకు తగ్గట్లు కొన్ని స్క్రీన్ షాట్స్ని పోస్ట్ చేస్తున్నారు. తమిళంలో విజయ్-రజినీకాంత్ అభిమానుల మధ్య అప్పుడప్పుడు ఇలా ఫ్యాన్ వార్స్ జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు కూడా విజయ్ ఫ్యాన్సే ఈ పుకారు సృష్టించారా అనే సందేహం వస్తోంది.(ఇదీ చదవండి: ‘మిరాయ్’పై మంచు విష్ణు ట్వీట్.. రిప్లై ఇచ్చిన మనోజ్!) -
సింహాలతో ఆటలాడిన బ్యూటీ.. ఇంత ధైర్యం ఎలా?
'ఫ్లూటు జింక ముందు ఊదు, సింహం ముందు కాదు' అన్నది సినిమా డైలాగ్. ఎహె.. ఫ్లూటు ఊదడం కాదు, డైరెక్ట్గా వెళ్లి వాటితో ఆడుకుంటానంటోంది నటి వైగా రోజ్. థాయిల్యాండ్లో బ్యాంకాక్ ట్రిప్కు వెళ్లిన ఈ బ్యూటీ ఓ రెండు సింహాల దగ్గరకు వెళ్లి వాటిని నిమురుతూ సరదాగా ఆడుకుంది. సివంగిపై చేయి వేసి తను కూడా ఆడసింహంలా కెమెరాకు ఫోజిచ్చింది. సింహాలతో ఆటఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ జైలర్కా హుకుం పాటను యాడ్ చేసింది. ఇది చూసిన అభిమానులు వీడియోలో మాకు మూడు సింహాలు కనిపిస్తున్నాయి, ఇంత ధైర్యం ఎక్కడినుంచి వచ్చింది? సివంగిలా ఉన్నావ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. వైగా రోస్.. అలెగ్జాండర్ ద గ్రేట్ మూవీతో మలయాళంలో ఎంట్రీ ఇచ్చింది. ఆర్డినరీ, ఎన్ను నింటె మొయిదీన్ వంటి పలు చిత్రాల్లో నటించింది. View this post on Instagram A post shared by VAIKHA ROSE (@vaikharose) View this post on Instagram A post shared by VAIKHA ROSE (@vaikharose) View this post on Instagram A post shared by VAIKHA ROSE (@vaikharose) చదవండి: డేంజర్ జోన్లో ఉన్నది వీళ్లే.. లక్స్ పాపపై ఎలిమినేషన్ వేటు? -
ఆ తెలుగు మూవీలో హీరోయిన్గా చేస్తానన్నా.. కాజల్కు ఇచ్చారు!
శివ మనసులో శృతి (2012) సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది తమిళ మద్దుగుమ్మ రెజీనా కసాండ్రా (Regina Cassandra). తొలి సినిమాతోనే బాగా క్లిక్ అవడంతో టాలీవుడ్లో బిజీ హీరోయిన్గా మారిపోయింది. కొత్త జంట, రారా.. కృష్ణయ్య, పిల్లా నువ్వు లేని జీవితం, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, అ, ఎవరు.. ఇలా అనేక సినిమాలు చేసింది. ఆచార్య మూవీలో సానా కష్టం అనే స్పెషల్ సాంగ్లోనూ తళుక్కుమని మెరిసింది. హీరోయిన్ ఛాన్స్ అడిగాఒకప్పుడు తెలుగులో టాప్ హీరోయిన్గా రాణించిన రెజీనా ప్రస్తుతం మాత్రం తమిళ, హిందీ భాషల్లో బిజీ అయింది. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఓ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టింది. రెజీనా మాట్లాడుతూ.. ప్రశాంత్ వర్మ అ సినిమా స్క్రిప్ట్ చెప్పారు. నాకు హీరోయిన్గా ఛాన్స్ ఇస్తే చేస్తానన్నాను, లేదంటే అందులోనే బలమైన పాత్ర అడిగాను. అందుకాయన హీరోయిన్ పాత్ర కోసం అప్పటికే కాజల్ను సంప్రదించినట్లు చెప్పాడు. సరే, పర్లేదని మరో (మీరా) పాత్ర ఇవ్వమన్నాను. అది కూడా లేదంటే మాత్రం నేను సినిమా చేయనని తెగేసి చెప్పాను.జాట్లో ఆ పాత్ర కోసం అడిగారుజాట్ సినిమాలో గోపీచంద్ మలినేని నాకు పోలీసాఫీసర్ పాత్ర ఆఫర్ చేశాడు. కథ మొత్తం విన్నాక నాకు భారతి రోల్ ఇస్తేనే చేస్తానన్నాను. ఎందుకంటే అంతకుముందెన్నడూ అలాంటి పాత్ర చేయలేదు. అలా జాట్ సినిమాలో భారతిగా కనిపించాను అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం రెజీనా.. తమిళంలో మూకుత్తి అమ్మన్ 2 మూవీ చేస్తోంది. హిందీలో ద వైఫ్స్, సెక్షన్ 108 సినిమాల్లో నటిస్తోంది.చదవండి: హనుమాన్ రికార్డు బద్ధలు కొట్టిన మిరాయ్! ఫస్ట్డే కలెక్షన్స్ -
స్టంట్ స్టార్ట్
కమల్హాసన్ కొత్త చిత్రం ప్రారంభమైంది. కమల్హాసన్ కెరీర్లోని ఈ 237వ సినిమాతో ‘కేజీఎఫ్, ఖైదీ, అమరన్, కల్కి 2898 ఏడీ’ వంటి సూపర్హిట్ సినిమాలకు పని చేసిన స్టంట్ కొరియోగ్రాఫర్స్ అన్బు–అరివు ద్వయం దర్శకులుగా పరిచయం అవుతున్నారు. 2024 ప్రారంభంలోనే ఈ చిత్రాన్ని ప్రకటించారు. కానీ ఇప్పటివరకు సెట్స్కు వెళ్లలేదు.కాగా ఈ సినిమా పనులు ప్రారంభమయ్యాయని, ‘ప్రేమలు, రైఫిల్క్లబ్’ వంటి హిట్ చిత్రాలకు స్క్రీన్ రైటర్గా పని చేసిన శ్యామ్ పుస్కరన్ ఈ సినిమాకు అసోసియేట్ అయ్యారని చిత్రయూనిట్ శుక్రవారం అధికారికంగా పేర్కొంది. రాజ్కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ పతాకంపై కమల్హాసన్, ఆర్. మహేంద్రన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.ఇదిలా ఉంటే... ఫైట్ మాస్టర్స్ దర్శకత్వం వహిస్తున్నారు కాబట్టి ఈ చిత్రం యాక్షన్ ప్రాధాన్యంగా ఉంటుందని, కమల్ రిస్కీ స్టంట్స్ చేయనున్నారని కోలీవుడ్ టాక్. -
శారీలో మెరిసిపోతున్న మలయాళ బ్యూటీ.. వేకేషన్లో హంసానందిని చిల్!
వైట్ డ్రెస్లో బాలీవుడ్ బ్యూటీ సిమ్రత్ కౌర్.. 8 హీరోయిన్ అనంతిక సనీల్కుమార్ స్మైలీ లుక్స్... బ్లాక్ బ్యూటీ శృతిహాసన్ హోయలు.. వేకేషన్లో ఫుల్గా చిల్ అవుతోన్న హంసానందిని.. శారీలో మెరిసిపోతున్న మలయాళ బ్యూటీ మడోన్నా సెబాస్టియన్.. View this post on Instagram A post shared by Ananthika Sanilkumar (@ananthika_sanilkumar) View this post on Instagram A post shared by Simratt Kaur Randhawa (@simratkaur_16) View this post on Instagram A post shared by Hamsa Nandini (@ihamsanandini) View this post on Instagram A post shared by Madonna B Sebastian (@madonnasebastianofficial) View this post on Instagram A post shared by Shruti Haasan (@shrutzhaasan) View this post on Instagram A post shared by Surveen Chawla (@surveenchawla) -
పొంగల్కు పెరుగుతోన్న పోటీ.. రేసులో శ్రీలీల చిత్రం!
టాలీవుడ్ సంక్రాంతి సినిమాలకు ఉండే క్రేజే వేరు. అంతేకాదు ఈ పండుగకు రిలీజ్కు పెద్దఎత్తున పోటీ ఉంటుంది. దాదాపు ఏడాది ముందు నుంచే ప్లాన్ చేస్తారు మేకర్స్. సినీ ఇండస్ట్రీలో అంతలా డిమాండ్ ఉన్న ఫెస్టివల్ ఇదొక్కటే. ఇప్పటికే టాలీవుడ్ నుంచి నవీన్ పొలిశెట్టి అనగనగా ఒకరాజు, మెగాస్టార్ చిరంజీవి మనశివశంకర వరప్రసాద్ గారు చిత్రాలు పోటీలో నిలిచాయి. వీటితో పాటు ప్రభాస్ ది రాజాసాబ్, శర్వానంద్ నారీ నారీ నడుమ మురారి సినిమాలు సైతం పొంగల్ పోటీకి సై అంటున్నాయి. వీటితో పాటు కోలీవుడ్ నుంచి విజయ్ మూవీ జన నాయగన్ సైతం వచ్చే ఏడాది సంక్రాంతికి జనవరి 9న విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు.ఇంతలా పోటీ ఉన్న పొంగల్కు మరో చిత్రం రిలీజ్ కానుంది. ఇటీవలే మదరాసితో ఆకట్టుకున్న శివ కార్తికేయన్ మూవీ పరాశక్తి సైతం సంక్రాంతి పోటీకి సై అంటోంది. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ మేకర్స్ రివీల్ చేశారు. వచ్చే ఏడాది పొంగల్ కానుకగా జనవరి 14న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ నిర్మాణ సంస్థ రెడ్ జైయింట్ మూవీస్ ఓ వీడియోను పోస్ట్ చేసింది. దీంతో వచ్చే ఏడాది సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద తెలుగు సినిమాలతో పాటు డబ్బింగ్ చిత్రాలకు సైతం పోటీ తప్పేలా కనిపించడం లేదు. ఇంకా సమయం ఉండడంతో మరిన్ని సినిమాలు వచ్చే ఛాన్స్ కూడా ఉంది.కాగా.. శివ కార్తికేయన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రానికి ‘పరాశక్తి’ అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ సినిమాకు సుధా కొంగర దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో రవి మోహన్, అథర్వ, శ్రీలీల ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాలో శివ కార్తికేయన్ విద్యార్థి సంఘం నాయకుడుగా కనిపించనున్నారని తెలుస్తోంది. பராசக்(தீ) பரவட்டும்🔥🔥 A stunning ride through history awaits#Parasakthi in Theatres from 14th January 2026@siva_kartikeyan @Sudha_Kongara @iam_ravimohan @Atharvaamurali @gvprakash @redgiantmovies_ @Aakashbaskaran @sreeleela14 @dop007 @editorsuriya @supremesundar… pic.twitter.com/SdgUEdwQCK— Red Giant Movies (@RedGiantMovies_) September 12, 2025 -
దృశ్యం-3 మూవీ.. ఎక్కువగా ఆశలు పెట్టుకోవద్దు: డైరెక్టర్
మలయాళంలో తెరకెక్కించిన దృశ్యం.. అన్ని భాషల్లోనూ సత్తా చాటింది. మోహన్ లాల్, మీనా ప్రధాన పాత్రల్లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. ఈ మూవీకి సీక్వెల్గా వచ్చిన దృశ్యం-2 సైతం అభిమానుల ఆదరణ దక్కించుకుంది. ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్లో దృశ్యం-3 కూడా తెరకెక్కించనున్నారు. ఇప్పటికే ఈ మూవీని ప్రకటించిన దర్శకుడు జీతూ జోసెఫ్ స్క్రిప్ట్ పూర్తయిందని తెలిపారు.అయితే దృశ్యం-3 మూవీకి సంబంధించి క్రేజీ అప్డేట్ ఇచ్చారు. ఈ నెలలోనే చిత్రీకరణ ప్రారంభం కానుందని జీతూ జోసెఫ్ తెలిపారు. అయితే ఆడియన్స్కు మాత్రం గట్టి ఝలక్ ఇచ్చారు. ఈ మూవీపై మొదటి రెండు పార్ట్స్లా ఎక్కువగా అంచనాలు పెట్టుకోవద్దని సూచించారు. ఈ సినిమా నుంచి ఎక్కువగా ఆశించవద్దని కోరారు.జీతూ జోసెఫ్ మాట్లాడూతూ.. 'రెండవ భాగం దృశ్యం-2లా ఈ సినిమాను ఆశించవద్దు. అలా ఎక్కువగా ఆశలు పెట్టుకుంటే నిరాశ చెందుతారు. ఇప్పుడు రాబోయే భాగం 'దృశ్యం' చిత్రాల మైండ్ గేమ్కు భిన్నంగా ఉండనుంది. దృశ్యం 3 కథాంశాలపై తక్కువ దృష్టి సారించి.. కథలోని మెయిన్ పాత్రపై ఎక్కువ దృష్టి పెట్టాం. దృశ్యం 1, 2 సినిమాలతో నేను సంతోషంగా ఉన్నా. 'దృశ్యం 3' కూడా మంచి సినిమా అవుతుంది. బాక్సాఫీస్ గురించి నాకు తెలియదు'అని వివరించారు. ఈ మూవీతో పాటు జీతూ జోసెఫ్ మరో రెండు ప్రాజెక్టులను తెరెకెక్కిస్తున్నారు. ఆయన డైరెక్షన్లో వస్తోన్న మిరాజ్ ఈనెల 19న విడుదల కానుంది. అంతేకాకుండా జోజు జార్జ్తో 'వలతు వశతే కల్లన్' ప్రాజెక్ట్ను రూపొందిస్తున్నారు.కాగా.. ఈ చిత్రాన్ని మోహన్ లాల్, మీనా ప్రధాన పాత్రల్లో దర్శకుడు జీతూ జోసెఫ్ తెరకెక్కించారు. మలయాళంలో తెరకెక్కిన ఈ చిత్రం సూపర్ హిట్గా నిలిచింది. ఆ తర్వాత సీక్వెల్గా వచ్చిన దృశ్యం-2 కూడా సక్సెస్ అందుకుంది. ఆ తర్వాత తెలుగులో వెంకటేశ్ నటించగా.. భారీ హిట్ను సొంతం చేసుకుంది. హిందీలో అజయ్ దేవ్గణ్, శ్రియ ప్రధాన పాత్రల్లో నటించారు. తమిళంలో కమల్ హాసన్, గౌతమి ప్రధాన పాత్రల్లో నటించారు. -
నాభర్తకు డిగ్రీలేదు, నేనే పోషిస్తున్నా.. నా తల్లి బంగారం కూడా తాకట్టు పెట్టా!
కన్నడ దర్శకనటుడు ఎస్ నారాయణ్ (S Narayan)పై వరకట్నం వేధింపుల కేసు నమోదైంది. నారాయణ్ కుటుంబం వరకట్నం కోసం వేధిస్తోందంటూ ఆయన కోడలు పవిత్ర బెంగళూరు పోలీసులను ఆశ్రయించింది. తనకేదైనా జరిగితే భర్త, అత్తమామలదే పూర్తి బాధ్యత అని ఫిర్యాదులో పేర్కొంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణకు రమ్మని నారాయణ్, అతడి భార్య భాగ్యవతి, కుమారుడు పవన్కు నోటీసులు పంపారు.ఫిర్యాదులో ఏముందంటే?'నా భర్త పవన్ డిగ్రీ కూడా పూర్తి చేయలేదు. అతడికి ఎటువంటి ఉద్యోగం లేదు. దీంతో నేనే కుటుంబాన్ని చూసుకుంటున్నాను. ఓసారి అతడు కారు కొనాలంటూ నా దగ్గర రూ.1 లక్ష, నా తల్లి దగ్గరి నుంచి రూ.75 వేలు తీసుకున్నాడు. నా భర్త కుటుంబం కళా సామ్రాట్ ఫిలిం అకాడమీ స్థాపించినప్పుడు నేను నా తల్లి బంగారం కూడా తాకట్టు పెట్టి వారికి ఆర్థిక సాయం చేశాను. కానీ, ఆ అకాడమీ ఎంతోకాలం నడపలేదు, కొంతకాలానికి మూసివేశారు. నేను సంపాదించి పోషించా..తర్వాత మళ్లీ నన్ను డబ్బు అడగడం ప్రారంభించారు. రూ.10 లక్షలు లోన్ తీసుకునిచ్చాను. కొన్నినెలలు సరిగానే చెల్లించి తర్వాత ఆపేశారు. నా పెళ్లి సమయంలో నాన్న పవన్కు రూ.1 లక్ష విలువైన బంగారు ఉంగరాన్ని బహుమతిగా ఇచ్చాడు. మా పెళ్లి విషయంలో నారాయణ్ దంపతులు గొడవపడ్డారు. పెళ్లయిన కొన్ని నెలలకే ఇంట్లోంచి బయటకు వచ్చి ఓ అద్దెగదిలో ఉన్నాం. ఓ సంవత్సరం తర్వాత తిరిగి మళ్లీ అత్తింట్లో అడుగుపెట్టాం' అని పవిత్ర పేర్కొంది.సినిమాచైత్రద ప్రేమాంజలి (1992) కన్నడ సినిమాతో నారాయణ్ దర్శకుడిగా కెరీర్ మొదలుపెట్టాడు. అనురాగద అలెగలు, మేఘ మాలె, తవరిన తొట్టిలు, బేవు బెల్ల, సూర్యవంశం, సింహాద్రియా సింహ, దక్ష, చంద్ర చకోరి, మనసు మల్లిగె.. ఇలా ఎన్నో సినిమాలు డైరెక్ట్ చేశాడు. తమిళంలో జై సినిమా తీశాడు. చైత్రద ప్రేమాంజలి, కురిగలు సార్ కురిగలు, హనీమూన్ ఎక్స్ప్రెస్, తిప్పరల్లి తర్లెగలు, ఓల్డ్ మాంక్ వంటి పలు చిత్రాల్లో నటించాడు.చదవండి: మద్యానికి, సిగరెట్కు గుడ్బై.. శాకాహారిగా మారిపోయిన రణ్బీర్! -
నా కడుపులో తన్నాడు, ముఖంపై పిడిగుద్దులు..: బుల్లితెర నటి
ప్రేమించిన ప్రియుడు తనను అష్టకష్టాలు పెట్టాడని వాపోయింది మలయాళ బుల్లితెర నటి జసీలా ప్రవీణ్ (Jaseela Parveen). మాటలతోనే కాకుండా చేతలతో నరకం చూపించాడని పేర్కొంది. ఈ మేరకు సాక్ష్యాలను సోతం సోషల్ మీడియాలో బయటపెట్టింది. అందులో ఓ ఫోటోలో జసీలా తలపై గాయాలున్నాయి, పెదవి చిట్లిపోయి ఉంది. డిసెంబర్ 31న కొత్త సంవత్సరం వేడుకలు జరుపుకుంటున్న సమయంలో ఈ దాడి జరిగిందని నటి తెలిపింది.చర్మం ఊడివచ్చేలా..జసీలా మాట్లాడుతూ.. 'నా కడుపులో రెండుసార్లు తన్నాడు. తన చేతి కడియంతో నా ముఖంపై పిడిగుద్దులు కురిపించాడు. దానివల్ల నా చర్మం ఊడివచ్చింది. అతడు నన్ను ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు కూడా ఇష్టపడలేదు. నేను కాలు జారి కిందపడిపోవడం వల్లే ఈ గాయాలయ్యాయని చెప్తేనే ఆస్పత్రికి తీసుకెళ్తానన్నాడు. హాస్పిటల్ వెళ్లాక అదే అబద్ధం చెప్పాడు. డాక్టర్ నా ముఖంపై చీలిన చర్మాన్ని చూసి ప్లాస్టిక్ సర్జరీ చేయాలన్నారు. కొన్ని రోజుల తర్వాత ధైర్యం కూడదీసుకుని జరిగిందంతా పోలీసులకు చెప్పాను. ప్రస్తుతం ఈ కేసు విచారణలో ఉంది.అందవిహీనంగా మారిపోయాశారీరక హింస, మానసిక వేదన అనుభవించాక నన్ను నేనే కోల్పోయినట్లుగా అనిపించింది. అందవిహీనంగా మారిపోయాను. అద్దంలో చూసుకోవడం కూడా మానేశాను. సరిగా తినలేకపోయాను, కంటినిండా నిద్రపోలేకపోయాను. దాదాపు పది కిలోలు తగ్గాను. అతడు మాత్రం హాయిగా నార్మల్ లైప్ గడుపుతున్నాడు. అసలేదీ జరగనట్లే ఉన్నాడు. కొంచెం కూడా బాధపడలేదు, నా గురించి ఆలోచించనేలేదు. కనీసం జరిగినదానికి క్షమాపణలు కూడా చెప్పలేదు.సారీ చెప్తే వదిలేస్తానన్నా కూడా..అతడికి చిట్టచివరగా ఓ ఛాన్స్ ఇచ్చి చూశాను. నాకు సారీ చెప్తే ఇంతటితో దీన్ని వదిలేస్తానన్నాను. కానీ అతడు క్షమాపణలు చెప్పడానికి బదులుగా కోర్టుకెళ్లి బెయిల్ తీసుకోవడానికే సుముఖత చూపించాడు. తనే ఏదీ జరగనట్లు ఉంటే నేను మాత్రం ఎందుకు కుమిలిపోతూ ఉండాలి. బాధపడుతూ కూర్చుంటే ఏదీ మారదు.. అందుకే ఇప్పుడిప్పుడే గతాన్ని మర్చిపోయి మళ్లీ మామూలు మనిషినయ్యేందుకు ప్రయత్నిస్తున్నాను. అతడితో తెగదెంపులు చేసుకున్నాను అని చెప్పుకొచ్చింది. జసీలా పర్వీన్.. మలయాళ సీరియల్స్లో నెగెటివ్ పాత్రలు పోషించింది.చదవండి: రైలు నుంచి దూకేసిన బాలీవుడ్ హీరోయిన్ -
ఇన్నాళ్లూ భరణి, ఇమ్మాన్యుయేల్ మగాళ్లనుకున్నా.. అంతమాటన్నాడేంటి?
బిగ్బాస్ (Bigg Boss Telugu 9) అన్నాక గొడవలుంటాయి. అవి లేకపోతే షో పసే ఉండదు. కానీ కొందరు మరీ హద్దులు మీరి మాట్లాడుతుంటారు. మాస్క్ మ్యాన్ హరీశ్ ఇప్పుడదే చేశాడు. హౌస్లో కెప్టెన్సీ టాస్క్ జరుగుతోంది. సంచాలక్ మర్యాద మనీష్ వల్ల ఈ టాస్క్ గందరగోళంగా మారింది. ఫైనల్గా ఈ గేమ్లో శ్రీజ గెలిచి సంజనాను కెప్టెన్ చేసిందన్న విషయం ఇదివరకే లీకైంది.భరణి, ఇమ్మాన్యుయేల్.. ఆడవాళ్లు!అయితే తాజా ప్రోమోలో హరీశ్ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. తనూజ, భరణి, ఇమ్మాన్యుయేల్.. ఇన్నాళ్లూ వీళ్లు ఒకమ్మాయి, ఇద్దరబ్బాయిలనుకున్నాను. ముగ్గురు ఆడవాళ్లతో ఫైట్ చేశానని ఇప్పుడర్థమైంది అని కామెంట్స్ చేశాడు. మరోవైపు పవన్ కల్యాణ్ తనను బాడీ షేమింగ్ చేశాడని ఇమ్మాన్యుయేల్ బాధపడ్డాడు. బాడీ షేమింగ్ చేసినట్లు ఎపిసోడ్లో క్లిప్ వస్తే మాత్రం కచ్చితంగా నాగ్ చేతిలో పవన్ కల్యాణ్కు తిట్లు ఖాయం! అలాగే హరీశ్, మనీష్లకు కూడా క్లాస్ పడేట్లు కనిపిస్తోంది. చదవండి: మర్యాద మర్చిపోయిన మనీష్.. ఎందుకు పట్టుకొచ్చావ్ శ్రీముఖి? -
ఆ హీరోతో కలిసి పనిచేసినందుకు హ్యాపీ: లావణ్య త్రిపాఠి
హీరోయిన్ లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi) రెండు రోజుల క్రితమే తల్లిగా ప్రమోషన్ పొందారు. ఉత్రరప్రదేశ్లోని అయోధ్యకు చెందిన ఈ బ్యూటీ ప్రస్తుతం మాతృత్వాన్ని ఆస్వాదిస్తున్నారు. అలాగే ఈమె కథానాయికగా నటించిన తమిళ చిత్రం టన్నెల్ నేడు (సెప్టెంబర్ 12) ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. కానీ వారం వాయిదా పడింది. ఈ నెల 19న విడుదల కానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సందర్భంగా లావణ్య మాట్లాడుతూ.. టన్నెల్ చిత్రం చూసినవారందరూ నా నటనను ప్రశంసిస్తుంటే సంతోషంగా ఉందన్నారు. సంతోషంగా ఉందిచిత్ర ప్రథమార్థం రొమాంటిక్ సంఘటనలతోనూ, రెండవ భాగం ఎమోషనన్స్ అంశాలతో ఉంటుందని చెప్పారు. సినిమాలో తన పాత్ర సాధారణంగా కాకుండా కథకు కీలకంగా ఉంటుందన్నారు. నటనకు అవకాశం ఉన్న పాత్రలో నటించే అవకాశం కల్పించిన దర్శకుడు రవీంద్ర మాధవకు ధన్యవాదాలు తెలిపారు. ఎంతో అంకిత భావంతో పని చేసే హీరో అధర్వతో కలిసి నటించడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు.కెరీర్లావణ్య త్రిపాఠి 2012లో అందాల రాక్షసి చిత్రంతో కథానాయికగా తెలుగు తెరకు పరిచయమయ్యారు. ఆ తరువాత బ్రహ్మ చిత్రంతో కోలీవుడ్లో ఎంట్రీ ఇచ్చారు. అయితే తెలుగులోనే వరుస చిత్రాలు చేస్తూ టాలీవుడ్లో బిజీ అయ్యారు. కాగా 2017లో మాయాన్ అనే తమిళ మూవీలో నటించారు. మళ్లీ ఇన్నాళ్లకు టన్నెల్ అనే తమిళ చిత్రంలో నటించారు. తమిళ హీరో అధర్వ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని అన్నై ఫిలిమ్ ప్రొడక్షనన్స్ పతాకంపై ఎం.జాన్ పీటర్ నిర్మించారు. రవీంద్ర మాదవ దర్శకత్వం వహించారు. View this post on Instagram A post shared by Annai Film Production (@annaifilmproductionofficial)చదవండి: మర్యాద మర్చిపోయిన మనీష్.. ఎందుకు పట్టుకొచ్చావ్ శ్రీముఖి? -
కాంత వాయిదా
‘కాంత’ చిత్రం రిలీజ్ వాయిదా పడింది. దుల్కర్ సల్మాన్, భాగ్య శ్రీ భోర్సే హీరో హీరోయిన్లుగా సముద్ర ఖని ఓ కీలక పాత్రలో నటించిన పీరియాడికల్ చిత్రం ‘కాంత’. 1950 మద్రాస్ నేపథ్యంలో సాగే ఈ ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రానికి సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహించారు. స్పిరిట్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్, వేఫేరర్ ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకాలపై రానా దగ్గుబాటి, దుల్కర్ సల్మాన్, ప్రశాంత్ పొట్లూరి, జోమ్ వర్గీస్ ఈ చిత్రాన్ని నిర్మించారు.ఈ సినిమాను ఈ నెల 12న విడుదల చేయనున్నట్లుగా గతంలో చిత్రయూనిట్ పేర్కొంది. కానీ ఆ తేదీకి విడుదల చేయడం లేదని, త్వరలోనే కొత్త విడుదల తేదీని ప్రకటిస్తామని గురువారం చిత్రయూనిట్ ఓ నోట్ను విడుదల చేసింది. ‘‘కాంత’ సినిమా టీజర్ విడుదలైనప్పట్నుంచి మీరు చూపించిన ప్రేమ, ఆ ప్యాయత, మద్దతు మా హృదయాలను హత్తుకుంది. ఈ చిత్రానికి సంబంధించి మీకు మరింత మెరుగైన అనుభూతిని ఇవ్వాలనుకుంటున్నాం. ఆ దృష్ట్యా విడుదలను వాయిదా వేశామని తెలియజేస్తున్నాం. కొత్త విడుదల తేదీని త్వరలోనే ప్రకటిస్తాం’’ అని ‘కాంత’ చిత్రం యూనిట్ పేర్కొంది. -
కొత్త విలన్ గురూ
తెలుగు తెరపై కొత్త విలన్లు కనిపించనున్నారు. ఈ విలన్లకు తెలుగు తెలియదు. అయినా ఫైట్ చేయడానికి భాషతో పనేం ఉంది? ఇప్పుడు తెలుగులో సినిమాలు చేస్తున్న ఈ పరభాష విలన్లు తమ నటనతో ప్రేక్షకులకు కొత్త విలనిజమ్ని పరిచయం చేయనున్నారు. ఇక తెలుగులో చేస్తున్న ఈ కొత్త విలన్స్ గురించి తెలుసుకుందాం. ఓజీ వర్సెస్ ఓమి బాలీవుడ్ పాపులర్ యాక్టర్ ఇమ్రాన్ హష్మి తెలుగు ఎంట్రీ ‘ఓజీ’ సినిమాతో ఖరారైంది. పవన్ కల్యాణ్ హీరోగా నటించిన గ్యాంగ్స్టర్ ఫిల్మ్ ఇది. ఈ చిత్రంలో పవన్ కల్యాణ్ ఓజాస్ గంభీర (ఓజీ)గా నటించగా, విలన్ ఓమీ పాత్రలో ఇమ్రాన్ హష్మి నటించారు. డివీవీ దానయ్య, దాసరి కల్యాణ్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 25న విడుదల కానుంది. ప్రియాంకా మోహన్ హీరోయిన్గా నటించగా, అర్జున్ దాస్, ప్రకాశ్రాజ్, శ్రియా రెడ్డి ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. అలాగే అడివి శేష్ హీరోగా నటిస్తున్న ‘జీ2’ (గూఢచారి 2) చిత్రంలోనూ ఇమ్రాన్ హష్మి నటిస్తున్నారు. ఈ చిత్రంలోనూ ఇమ్రాన్ విలన్గా నటిస్తున్నారని తెలిసింది. రామ్ బుజ్జిగా వస్తున్నాడు హిట్ వెబ్ సిరీస్ ‘మిర్జాపూర్’లో మున్నాగా మంచి నటన కనబరిచారు దివ్యేందు శర్మ. ఈ పాపులర్ సిరీస్ను తెలుగు ప్రేక్షకులూ వీక్షించారు. ఈ ‘మిర్జాపూర్’ మున్నా ఇప్పుడు టాలీవుడ్కు వచ్చారు. రామ్చరణ్ హీరోగా నటిస్తున్న మల్టీ స్పోర్ట్స్ పీరియాడికల్ యాక్షన్ డ్రామాలో దివ్యేందు శర్మ ఓ లీడ్ రోల్లో నటిస్తున్నారు. రామ్బుజ్జిగా దివ్యేందు కనిపిస్తారు. రామ్చరణ్ క్రికెట్ బ్యాటింగ్ – దివ్యేందు బౌలింగ్ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు ఆసక్తికరంగా ఉంటాయట.అలాగే దివ్యేందు పాత్రలో కొంత నెగటివ్ షేడ్స్ ఉంటాయని టాక్. జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో జగపతిబాబు, శివ రాజ్కుమార్ ఇతర లీడ్ రోల్స్లో నటిస్తున్నారు. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ పతాకాల సమర్పణలో వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ చిత్రం 2026 మార్చి 27న విడుదల కానుంది. ఇక ‘మిర్జాపూర్’ సిరీస్తో పాటు ‘టాయిలెట్: ఏక్ ప్రేమ్కథ, 2016: ది ఎండ్, అగ్ని’ వంటి చిత్రాల్లో నటించారు దివ్యేందు. ఈ బాలీవుడ్ నటుడికి తెలుగులో ‘పెద్ది’ తొలి చిత్రం. వృషకర్మలో.. సూపర్ హిట్ హిందీ చిత్రం ‘లాపతా లేడీస్’లో తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు స్పర్ష్ శ్రీవాత్సవ్. ఈ బాలీవుడ్ యువ నటుడిని నాగచైతన్య తెలుగులోకి ఆహ్వానించారు. నాగచైతన్య హీరోగా నటిస్తున్న అడ్వెంచరస్ అండ్ మిథికల్ మూవీ ‘వృషకర్మ’ (ప్రచారంలో ఉన్న టైటిల్). ఈ చిత్రంలో స్పర్‡్ష శ్రీవాత్సవ్ ఓ లీడ్ రోల్ చేస్తున్నారు. అయితే ‘లాపతా లేడీస్’లో పాజిటివ్ రోల్ చేసిన స్పర్‡్ష శ్రీవాత్సవ్ ‘వృషకర్మ’ చిత్రంలో మాత్రం నెగటివ్ రోల్ చేస్తున్నారట. ‘విరూ పాక్ష’ ఫేమ్ కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో ఈ సినిమాను బాపినీడు సమర్పణలో బీవీఎస్ఎన్ ప్రసాద్, సుకుమార్. బి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే వేసవిలో విడుదల కానుంది. పోటా పోటీ బాలీవుడ్ యాక్షన్ హిట్ ఫిల్మ్ ‘కిల్’ (2023)లో విలన్గా నటించి, ఆడియన్స్ను మెప్పించారు రాఘవ్ జూయల్. లక్ష్య హీరోగా నటించిన ఈ చిత్రంలో రాఘవ్ విలనిజం యాక్షన్ ప్రియులకు కూడా కొత్తగా అనిపించింది. దీంతో రాఘవ్ జూయల్ పేరు బాలీవుడ్తో పాటు ఇతర ఇండస్ట్రీలోనూ కాస్త గట్టిగానే వినిపించింది. అలా పాన్ ఇండియన్ మూవీ ‘ది ప్యారడైజ్’లో నటించే అవకాశం రాఘవ్కు లభించింది. ‘దసరా’ వంటి హిట్ తర్వాత హీరో నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో రూపొందుతున్న పీరియాడికల్ యాక్షన్ సినిమా ‘ది ప్యారడైజ్’.ఈ చిత్రంలో రాఘవ్ జూయల్ నటిస్తున్నట్లుగా ఆల్రెడీ చిత్రయూనిట్ స్పష్టం చేసింది. ఓ మెయిన్ విలన్ రోల్ని రాఘవ్ చేస్తున్నారని, నానీతో రాఘవ్కు పోటా పోటీ సన్నివేశాలు ఉంటాయని టాక్. ‘ది ప్యారడైజ్’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 2026 మార్చి 26న విడుదల కానుంది. ఇక బాలీవుడ్లో ‘కిల్’తో పాటు ప్రభుదేవా ‘ఏబీసీడీ 2, సల్మాన్ ఖాన్ ‘కిసీ కా భాయ్ కిసీ కీ జాన్’, సిద్ధాంత్ చతుర్వేది ‘యుద్ర’ వంటి చిత్రాల్లో మంచి నటన కనబరిచి, నార్త్ ఆడియన్స్ను అలరించారు రాఘవ్. మరి... టాలీవుడ్లోనూ రాణిస్తారా? లెట్స్ వెయిట్ అండ్ సీ. ఇన్స్పెక్టర్ స్వామి అడివి శేష్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియన్ సినిమా ‘డెకాయిట్’. ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటిస్తున్నారు. కెమెరామేన్ షానియల్ డియో ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. కాగా ఈ చిత్రంలో ప్రకాశ్రాజ్, సునీల్తో పాటు బాలీవుడ్ దర్శక–నిర్మాత–నటుడు అనురాగ్ కశ్యప్ ఓ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో ఆయన ఇన్స్పెక్టర్ స్వామి అనే పాత్రలో కనిపిస్తారు. అయితే కథ రీత్యా ఇన్స్పెక్టర్ స్వామి క్యారెక్టరైజేషన్లో కాస్త నెగటివ్ షేడ్స్ ఉంటాయని ఫిల్మ్నగర్ సమచారం. అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై సుప్రియ యార్లగడ్డ నిర్మిస్తున్న ఈ సినిమా డిసెంబరు 25న విడుదల కానుంది. కాగా దొంగతనాన్ని వృత్తిగా స్వీకరించిన ఓ అబ్బాయి, అమ్మాయి ప్రేమించుకుంటారు. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల ఈ ఇద్దరూ బ్రేకప్ చెప్పుకుంటారు. కానీ ఊహించని పరిస్థితుల కారణంగా ఈ ఇద్దరూ కలిసి ఓ క్రైమ్ చేయాల్సి వస్తుంది? అప్పుడు ఏం జరుగుతుంది? అన్నదే క్లుప్తంగా ‘డెకాయిట్’ సినిమా కథాంశం.డ్రాగన్తో పోటీ! ‘మిన్నల్ మురళి, 2018, ఏఆర్ఎమ్’ వంటి మలయాళ చిత్రాల్లో హీరోగా నటించి, తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు టొవినో థామస్. కాగా, ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘డ్రాగన్’ సినిమాలో టొవినో థామస్ ఓ లీడ్ రోల్ చేస్తున్నారని సమాచారం. అయితే ఈ చిత్రంలో టొవినో థామస్ చేస్తున్నది విలన్ రోల్ అని, ఆల్రెడీ ‘డ్రాగన్’ షూటింగ్లో ఆయన పాల్గొంటున్నారనే ప్రచారం జరుగుతోంది.త్వరలోనే ఈ సినిమా విదేశీ షూటింగ్ షెడ్యూల్ ప్రారంభం కానుంది. ఎన్టీఆర్తో పాటు ఈ చిత్రం కీలక తారాగణం అంతా షూటింగ్లో పాల్గొంటారని తెలిసింది. రుక్మీణీ వసంత్ ఈ చిత్రంలో హీరోయిన్గా నటిస్తున్నారు. గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్, టీ సిరీస్ ఫిల్మ్స్, మైత్రీ మూవీ మేకర్స్ల సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకాలపై కల్యాణ్ రామ్ నందమూరి, నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి, హరికృష్ణ కొసరాజు నిర్మిస్తున్న ఈ చిత్రం 2026 జూన్ 25న విడుదల కానుంది.తెలుగులో విలన్స్గా చేస్తున్న నటీమణులూ ఉన్నారు..బాలీవుడ్ నటి సోనాక్షీ సిన్హా నటిస్తున్న తొలి తెలుగు చిత్రం ‘జటాధర’. సుధీర్బాబు హీరోగా నటిస్తున్న ఈ ద్విభాషా (తెలుగు, హిందీ) చిత్రంలో సోనాక్షీ సిన్హాతో పాటు దివ్య ఖోస్లా, శిల్పా శిరోద్కర్ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సూపర్ నేచురల్ మైథలాజికల్ థ్రిల్లర్ చిత్రంలో సోనాక్షీ సిన్హా, శిల్పా శిరోద్కర్ పాత్రల్లో నెగటివ్ షేడ్స్ ఉంటాయని సమాచారం. దాదాపు పదిహేనేళ్ల తర్వాత శిల్పా శిరోద్కర్ సిల్వర్ స్క్రీన్ పై కనిపించనున్న చిత్రం ఇది. జీ స్టూడియోస్, ప్రేరణా అరోరా సమర్పణలో ఉమేష్ కుమార్ బన్సల్, శివిన్ నారంగ్, నిఖిల్ నందా, అరుణ అగర్వాల్, శిల్ప సింగాల్లు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది. ⇒ హీరో అల్లు అర్జున్, దర్శకుడు అట్లీ కాంబినేషన్లో అంతర్జాతీయ స్థాయిలో ఓ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఐదుగురు హీరోయిన్స్ ఉంటారనే ప్రచారం జరుగుతోంది. దీపికా పదుకోన్ ఆల్రెడీ కన్ఫార్మ్ అయ్యారు. హీరోయిన్ మృణాల్ ఠాకూర్ ఈ సినిమా షూటింగ్లో పాల్గొంటున్నారని తెలిసింది. అయితే మృణాల్ గురించిన అధికారక ప్రకటన లేదు. అలాగే ఈ చిత్రంలో రష్మికా మందన్నా కూడా నటిస్తున్నారనే టాక్ తెరపైకి వచ్చింది.అయితే ఈ సినిమాలో రష్మికా మందన్నా పాత్రలో నెగటివ్ షేడ్స్ ఉంటాయని, ఆమె విలన్ రోల్లో కనిపిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం 2027 ఆగస్టులో విడుదలవుతుందనే ప్రచారం సాగుతోంది. ఈ సంగతి ఇలా ఉంచితే... అల్లు అర్జున్, రష్మికా మందన్నాలు ‘పుష్ప’ ఫ్రాంచైజీలోని ‘పుష్ప: ది రైజ్, పుష్ప: ది రూల్’ చిత్రాల్లో హీరో, హీరోయిన్లుగా నటించారు. ఇటీవల ‘పుష్ప 3’ కూడా ఉంటుందని సుకుమార్ ఓ సందర్భంలో కన్ఫార్మ్ చేశారు. ఈ నేపథ్యంలో అట్లీ డైరెక్షన్లో అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న చిత్రంలో రష్మికా మందన్నా విలన్గా నటిస్తే, ఆమె పాత్ర ఎలా ఉండబోతుందన్న ఆసక్తి సినిమా లవర్స్లో ఉండటం సహజం.నెగటివ్ క్యారెక్టర్స్ చేయడానికి సీనియర్ హీరోలు సైతం చాలా ఉత్సాహం చూపిస్తున్నారు. రజనీకాంత్ హీరోగా నటించిన ‘కూలీ’ చిత్రంలో నాగార్జున విలన్గా చేశారు. షారుక్ ఖాన్, ఆయన తనయ సుహానా ఖాన్ లీడ్ రోల్స్లో నటిస్తున్న ‘కింగ్’ (ప్రచారంలో ఉన్న టైటిల్) చిత్రంలో అభిషేక్ బచ్చన్ విలన్ రోల్ చేస్తున్నారు. ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘కల్కి2898 ఏడీ’ చిత్రంలో కమల్హాసన్ విలన్ రోల్ చేస్తున్నారు.‘దోశె కింగ్’ అనే కొత్త చిత్రం కోసం మోహన్ లాల్ కాస్త నెగటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ చేయనున్నారనే టాక్ వినిపిస్తోంది. ‘భ్రమయుగం’ చిత్రంలో మమ్ముట్టి విలన్ రోల్ చేశారు. అలాగే జితిన్ కే జోస్ డైరెక్షన్లోని మరో సినిమాలో మమ్ముట్టి విలన్ రోల్ చేయనున్నారనే టాక్ వినిపిస్తోంది. ఇలా... మరికొందరు సీనియర్ యాక్టర్స్ విలన్ రోల్ చేసేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు.కెరీర్లో హీరోగా మంచి పీక్ స్టేజ్లో ఉన్న యంగ్ యాక్టర్స్ కూడా విభిన్నమైన విలన్ రోల్ వస్తే చేయడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. హృతిక్ రోషన్ హీరోగా నటించిన ‘వార్ 2’లో ఎన్టీఆర్ విలన్గా నటించారు. హిందీలో ఎన్టీఆర్కు ఇది తొలి చిత్రం. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ‘భైరవం’ చిత్రంలో విలన్గా నటించారు మంచు మనోజ్. తేజ సజ్జా హీరోగా నటించిన ‘మిరాయ్’లోనూ మనోజ్ ప్రతినాయకుడి పాత్ర పోషించారు. మలయాళ దర్శక–నిర్మాత పృథ్వీరాజ్ సుకుమారన్ (బడే మియా చోటే మియా), ఫాహద్ ఫాజిల్ (పుష్ప 3), అర్జున్ కపూర్ (సింగమ్ ఎగైన్) వంటి చిత్రాల్లో విలన్ రోల్ చేశారు. మహేశ్బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలోనూ పృధ్వీరాజ్ విలన్గా చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. శివ కార్తికేయన్ హీరోగా నటిస్తున్న ‘పరాశక్తి’ చిత్రంలో తొలిసారిగా పూర్తి స్థాయి విలన్గా నటిస్తున్నారు జయం రవి. తెలుగు నటుడు సుహాస్ తమిళ చిత్రం ‘మండాడి’లో విలన్ రోల్ చేస్తున్నారు. ఈ కోవలో మరికొంతమంది ఉన్నారు. – ముసిమి శివాంజనేయులు -
రజినీకాంత్ కూలీ.. పూజా హెగ్డే మోనికా వచ్చేసింది!
రజినీకాంత్ హీరోగా వచ్చిన మాస్ యాక్షన్ చిత్రం కూలీ. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ సినిమా బ్లాక్బస్టర్గా నిలిచింది. ఈ మూవీలో టాలీవుడ్ కింగ్ నాగార్జున విలన్ పాత్రలో మెప్పించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.400 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. తాజాగా ఈ మూవీ నుంచి సూపర్ హిట్ సాంగ్ వచ్చేసింది. పూజాహెగ్డే తన డ్యాన్స్తో మెప్పించిన మోనికా ఫుల్ వీడియో సాంగ్ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ పాటలో సౌబిన్ షాహిర్ ఆడియన్స్ను మెప్పించారు.కాగా.. పాటను తమిళంతో పాటు మొత్తం ఐదు భాషల్లో రిలీజ్ చేశారు. తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ వర్షన్స్ కూడా విడుదల చేశారు. గతంలో కుర్రకారును ఓ రేంజ్లో ఊపేసిన మోనికా ఫుల్ సాంగ్ చూసి ఎంజాయ్ చేయండి. మరోవైపు ఈ సూపర్ హిట్ చిత్రం ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతోంది. కాగా.. ఈ సినిమాను సన్ పిక్చర్స్ బ్యానర్లో నిర్మించారు. ఈ చిత్రంలో నాగార్జున, ఉపేంద్ర, సత్యరాజ్, సౌబిన్ షాహిర్, శ్రుతి హాసన్, అమీర్ ఖాన్ వంటి స్టార్స్ నటించారు. ఈ సినిమా హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ నటించిన వార్ -2తో బాక్సాఫీస్ వద్ద పోటీ పడిన సంగతి తెలిసిందే. Finally, Our Monica Bellucci erangi vandhachi 💃🏻 #Monica video song is out now! 💘Tamil ▶️ https://t.co/HqBfqY7AdbTelugu ▶️ https://t.co/tnMJvrUCZBHindi ▶️ https://t.co/SDtC7RjCdyKannada ▶️ https://t.co/BrwN1rAbV7Malayalam ▶️ https://t.co/viT48NIpOR@rajinikanth… pic.twitter.com/Qoy1Y3rhdc— Sun Pictures (@sunpictures) September 11, 2025 -
అమ్మవారికి రూ.4 కోట్ల విలువైన కిరీటం సమర్పించిన ఇళయరాజా
కర్ణాటకలోని కొల్లూరు మూకాంబిక అమ్మవారికి ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా రూ. 4 కోట్ల విలువైన వజ్రాలు పొదిగిన వెండి కిరీటాన్ని బహుకరించారు. తాజాగా అమ్మవారి ఆలయాన్ని సందర్శించిన ఆయన.. స్వయంగా ఈ కిరీటంతో పాటు వీరభద్ర స్వామికి వెండి ఆయుధాన్ని అందజేశారు. గుడి అర్చకులు దగ్గర ఉండి ఇళయరాజాతో పూజలు చేయించారు. అనంతరం తీర్థ ప్రసాదాలతోపాటు అమ్మవారి ఫొటో అందజేశారు. ఇళయరాజా వెంట ఆయన తనయుడు కార్తిక్, మనవడు యతీశ్ తదితరులు ఉన్నారు. ఇళయరాజాకు దైవభక్తి ఎక్కువే. తరచు ఆయన మూకాంబిక అమ్మవారి దర్శనానికి వెళ్తుంటారు. 2006లో కూడా ఆయన అమ్మవారికి ఓ కిరీటం బహుమతిగా ఇచ్చారు.కర్ణాటక రాష్ట్రంలోని మంగళూరుకు సుమారు 130 కిలోమీటర్ల దూరంలో... దట్టమైన అడవుల మధ్యన నెలకొని ఉంది మూకాంబికాలయం. ఆ రాష్ట్రంలోని ఏడు మోక్షపురాల్లో కొల్లూరు మూకాంబిక గుడి ఒకటి. ఆలయం ఉన్నది కర్ణాటక రాష్ట్రంలో అయినా, ఆమెను ఎక్కువగా సందర్శించుకునేది కేరళీయులే కావడం విశేషం. -
తెలుగు సీరియల్.. నా కూతురికి నరకం చూపించారు: చైల్డ్ ఆర్టిస్ట్ తల్లి
ఓ తెలుగు సీరియల్ వల్ల తన కూతురు నరకం చూసిందంటోంది చైల్డ్ ఆర్టిస్ట్ నిషిత (Nishita) తల్లి ప్రియ. అందుకు సంబంధించిన సాక్ష్యాలను సైతం బయటపెట్టింది. సెట్లో చిన్నారికి కరెంట్ షాక్ కొట్టిందని, ఆరోగ్యం బాగోలేకపోయినా షూటింగ్ చేయించారని వాపోయింది. ఈ మేరకు ఇన్స్టాగ్రామ్లో ఓ వీడియో రిలీజ్ చేసింది.చిన్నారికి కరెంట్ షాక్'అందులో నిషితను గార్డెన్ ఏరియాలో లైట్స్ ఉన్న దగ్గర పడుకోబెట్టారు. అక్కడున్న లైట్స్ ద్వారా కరెంట్ షాక్ రావడంతో ఆ పాప నిస్సహాయ స్థితిలో కేకలేసింది. మరో సీన్లో తను భయపడుతున్నా సరే బలవంతంగా స్విమ్మింగ్ పూల్లోకి లాగారు. అక్కడ తనకోసం ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు? కొన్నిసార్లు ఆరోగ్యం బాగోలేక బెడ్పై ఉన్నా సరే.. తనకు విశ్రాంతి ఇవ్వకుండా షూటింగ్కు రమ్మని ఒత్తిడి తెచ్చారు. అనారోగ్యంతోనే తను సెట్కు వచ్చి షూట్ చేయాల్సి వచ్చింది. రెమ్యునరేషన్ ఆపేశారుచిన్నపాప అని ఆలోచించకుండా రాత్రిపూట షూటింగ్స్కు రమ్మనేవారు. సీరియల్ నిర్మాతలు చైల్డ్ ఆర్టిస్టుల పట్ల ఇలాగే ప్రవర్తిస్తారా? అలాగే వీరు ఏప్రిల్ నుంచి రెమ్యునరేషన్ ఇవ్వకుండా ఆపేశారు. పని చేయించుకున్నారు, కానీ డబ్బులివ్వలేదు. దాదాపు 150 ఎపిసోడ్ల తర్వాత సడన్గా నా కూతురిని తొలగించి మరొకరిని తీసుకున్నారు. తనకు ఒంట్లో బాగోలేకపోయినా, ఎంత ఇబ్బందిపడ్డా సరే అవన్నీ ఓర్చుకుని పని చేసింది. చివరకు ఇదా మీరు తనకిచ్చే బహుమతి?టీఆర్పీ కోసం వాడుకున్నారుమీరు నా కూతురిని రీప్లేస్ చేయగలరేమో కానీ తన టాలెంట్ను కాదు. టీఆర్పీ కోసం నెలల తరబడి తనను వాడుకున్నారు. ఇప్పుడేమో ఎక్స్పెన్సివ్ కిడ్ అని పక్కన పెట్టేశారు. ఈ సీరియల్ కోసమే ఎన్నో ప్రాజెక్టులను కాదనుకున్నాం. ఇప్పుడు ఒక్క మాటైనా చెప్పకుండా తీసేశారు' అని నిషిత తల్లి ఆవేదన వ్యక్తం చేసింది. కాగా నిషిత.. కన్నడంలో లక్ష్మీ నివాస సీరియల్లో నటించింది. ఇందులో పోషించిన ఖుషి పాత్రతో ఎక్కువ పాపులారిటీ సంపాదించుకుంది. View this post on Instagram A post shared by Priya v (@priyaseervi321) View this post on Instagram A post shared by Priya v (@priyaseervi321) చదవండి: హౌస్ మొత్తాన్ని అల్లాడించేసిన సంజనా, ఇప్పుడేకంగా కెప్టెన్! -
'అతని వివరాలు తెలిస్తే చెప్పండి.. లక్ష రూపాయలు ఇస్తా'
కోలీవుడ్ స్టార్ హీరో రాఘవ లారెన్స్ సినిమాలు మాత్రమే కాదు.. సమాజ సేవలో దూసుకెళ్తున్నారు. ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నారని తనకు తెలిసిన మరుక్షణమే వెళ్లి దేవుడిలా సాయం చేస్తున్నారు. ఇప్పటికే చాలామంది పేద రైతులకు, విద్యార్థులకు తనవంతుగా ఆర్థికంగా అండగా నిలిచారు. ఇటీవలే పూరి గుడిసెలో జీవిస్తున్న ఓ దివ్యాంగురాలు శ్వేత కుటుంబానికి స్కూటీ బహుమతిగా ఇచ్చాడు.ఇది జరిగిన మూడు రోజుల్లోనే మరో వృద్ధ దంపతులకు అండగా నిలిచేందుకు ముందుకొచ్చారు రాఘవ లారెన్స్. చెన్నైలో లోకల్ ట్రైన్స్లో దాదాపు 80 ఏళ్ల వృద్ధుడు స్వీట్స్ విక్రయించడం సోషల్ మీడియాలో వైరలైంది. ఆ వయసులో తన భార్య చేసిన స్వీట్లను విక్రయిస్తూ జీవనోపాధి పొందుతున్నారు. ఈ వార్త పలు మీడియా ఛానెల్స్లో ఈ న్యూస్ రావడంతో ఇది చూసిన రాఘవ లారెన్స్ చలించిపోయారు.వెంటనే వారి వివరాలు కనుక్కుని రూ.లక్ష సాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. ఎవరికైనా వారి వివరాలు తెలిస్తే తనకు తెలియజేయాలని ట్విటర్ వేదికగా కోరారు. వారి కోసం వివరాల కోసం ప్రయత్నిస్తున్నా సాధ్యం కావడం లేదన్నారు. మీరు వారిని రైలులో చూసినట్లు అయితే అతని స్వీట్లు కొని వీలైన విధంగా వారికి మద్దతు నిలవండి అని లారెన్స్ విజ్ఞప్తి చేశారు. కాగా.. లారెన్స్ ప్రస్తుతం బుల్లెట్టు బండి సినిమా చేస్తున్నాడు. ఆ తర్వాత కాంచన 4 స్టార్ట్ చేయనున్నాడు.Today, A post reached me through social media about an 80 year old man and his wife in Chennai who make sweets and polis, selling them on trains to survive. Their resilience moved me deeply. 🙏I am ready to contribute ₹1,00,000 to support their journey, hoping it brings them… pic.twitter.com/yRYZj677Ze— Raghava Lawrence (@offl_Lawrence) September 10, 2025 -
ఐస్క్రీమ్ తిన్నందుకే నా భార్య చనిపోయింది: ప్రముఖ విలన్
మలయాళ నటుడు దేవన్ (Devan Sreenivasan ) భార్యను కోల్పోయి ఆరేళ్లపైనే అవుతోంది. దేవా సతీమణి సుమ 2019లో అలర్జీతో మరణించింది. తాజాగా భార్యను గుర్తు చేసుకున్న నటుడు ఆమె మరణానికి గల కారణాన్ని వెల్లడించాడు. దేవన్ మాట్లాడుతూ.. తను బాగానే ఉండేది. ఏమైందో ఏమో కానీ ఐస్క్రీమ్ తింటే మాత్రం పడేది కాదు. అదెలా తెలిసిందంటే.. చెన్నైలో ఉన్నప్పుడు ఓసారి ఐస్క్రీమ్ తిన్నాం. కాసేపటికే తనకు ఊపిరి తీసుకోవడం కష్టమైంది. డాక్టర్ వార్నింగ్వెంటనే హాస్పిటల్కు తీసుకెళ్లడంతో పెద్ద ప్రమాదం తప్పింది. తను ఎప్పటికీ ఐస్క్రీమ్ తినకూడదని డాక్టర్ గట్టి వార్నింగ్ ఇచ్చింది. మేము కూడా దాన్ని ఫాలో అయ్యాం. ఒకరోజు నా కూతురు లక్ష్మి దాని బిడ్డను తీసుకుని మా ఇంటికి వచ్చింది. అప్పుడు నేను ఇంట్లో లేను. షూటింగ్ కోసం వేరే లొకేషన్లో ఉన్నాను. పిల్లల కోసమని ఐస్క్రీమ్ కొన్న ఆమె కాస్త మిగిలితే దాన్నలాగే వదిలేసి తిరిగెళ్లిపోయింది. ఇంట్లో ఉన్న సుమ.. డాక్టర్ వార్నింగ్ మర్చిపోయి కాస్తం ఐస్ క్రీమ్ తింది. అంతే.. మళ్లీ తనకు ఊపిరి తీసుకోవడం కష్టమైంది.వెళ్లేసరికే..నేలపై పడి గిలగిల కొట్టుకుంటోందని పనివాళ్లు ఫోన్ చేసి చెప్పారు. నేను ఇంటికెళ్లేసరికి తన పరిస్థితి మరింత దిగజారింది. హాస్పిటల్కు తీసుకెళ్లాం, కానీ తనను కాపాడుకోలేకపోయాం. ఐస్క్రీమ్ అలర్జీ వల్ల ఊపిరితిత్తుల్లో రంధ్రాలు ఏర్పడ్డాయి. అలా నా భార్య కన్నుమూసింది అని చెప్పుకొచ్చాడు. దక్షిణాదిన వందలాది చిత్రాల్లో నటించిన దేవన్ తెలుగులో ఆశయం, పెళ్లి చేసుకుందాం, మా అన్నయ్య, దేశముదురు, ఏమాయ చేసావె, హార్ట్ ఎటాక్, సాహొ వంటి పలు చిత్రాల్లో నటించాడు. ఎక్కువగా విలన్ పాత్రలతోనే మెప్పించాడు.చదవండి: 'లోక' @ రూ.200 కోట్లు.. గర్వాన్ని తలకెక్కించుకోవద్దన్న తండ్రి -
'లోక' @ రూ.200 కోట్లు.. గర్వాన్ని తలకెక్కించుకోవద్దన్న తండ్రి
లేడీ ఓరియంటెడ్ సినిమాలకు కలెక్షన్స్ పెద్దగా రావంటుంటారు! కానీ కల్యాణి ప్రియదర్శన్ (Kalyani Priyadarshan) ప్రధాన పాత్రలో నటించిన 'కొత్త లోక మూవీ' ఆ వాదనను కొట్టిపారేసింది. సెంచరీలు కొడుతోంది. బాక్సాఫీస్ వద్ద రిలీజైన 13 రోజుల్లోనే రూ.202 కోట్లు రాబట్టింది. ఈ విషయాన్ని చిత్రయూనిట్ అధికారికంగా వెల్లడించింది. ఇంతటి ఘన విజయం సాధించినందుకు అందరూ సంతోషంలో మునిగి తేలుతున్నారు. ఇదే నా సలహా: తండ్రి మెసేజ్ఇలాంటి సమయంలో కల్యాణికి తండ్రి, దర్శకుడు ప్రియదర్శన్ నుంచి ఓ మెసేజ్ వచ్చింది. అదేంటనేది ఇన్స్టాగ్రామ్ పేజ్లో షేర్ చేసింది. 'ఒక్కటి బాగా గుర్తుపెట్టుకో.. విజయ గర్వాన్ని తలకెక్కించుకోకు, ఫ్లాప్ వచ్చినప్పుడు ఆ బాధను మనసులో మోయకు.. నేను నీకు ఇచ్చే మంచి సలహా ఇదే! లవ్యూ..' అని కూతురికి మెసేజ్ పెట్టాడు. అందుకు కల్యాణి.. తప్పకుండా మీరు చెప్పింది పాటిస్తాను నాన్నా, లవ్యూ అని రిప్లై ఇచ్చింది.సినిమాతన సినిమాను ఆదరించిన ప్రేక్షకులకు సైతం అభినందనలు తెలిపింది. 'మీ వల్లే సినిమాకు ఈ రేంజ్లో కలెక్షన్స్ వస్తున్నాయి. మీరు చూపిస్తున్న ప్రేమాభిమానాలకు నాకు మాటలు రావడం లేదు. మన ఇండస్ట్రీలో కంటెంటే కింగ్. కథలో దమ్ముంటే మీరు దాన్ని అందలం ఎక్కిస్తారని మరోసారి రుజువు చేశారు' అని రాసుకొచ్చింది. సూపర్ హీరో కాన్సెప్ట్తో వచ్చిన మూవీ 'కొత్త లోక: చాప్టర్ 1 చంద్ర'. కల్యాణి ప్రియదర్శన్, నస్లీన్ ప్రధాన పాత్రలు పోషించారు. డొమినిక్ అరుణ్ దర్శకత్వం వహించాడు. దుల్కర్ సల్మాన్ నిర్మించాడు. ఈ మూవీ ఆగస్టు 28న మలయాళంలో రిలీజైంది. ఒకరోజు ఆలస్యంగా ఆగస్టు 29న సాయంత్రం తెలుగులో విడుదలైంది. View this post on Instagram A post shared by Kalyani Priyadarshan (@kalyanipriyadarshan) చదవండి: అంత వైరల్ చేశారేంటి? నేనేదో సరదాగా అన్నా!: హీరో -
కన్నడ స్టార్ రాజ్కుమార్ కిడ్నాప్పై సినిమా
కన్నడ కంఠీరవ రాజ్కుమార్ (Dr. Rajkumar) జీవితంలోని కీలక అంశమైన కిడ్నాప్ నేపథ్యంలో ఓ సినిమా రానుంది. రాజ్కుమార్ని వీరప్పన్ (Veerappan) కిడ్నాప్ చేసిన విషయం తెలిసిందే! అశోక్, ముని, నాగేశ్ ప్రధాన పాత్రధారులుగా కట్టా శ్రీకర్ ప్రసాద్ దర్శకత్వంలో వి.లీలా మనోహర్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. అక్టోబరులో షూటింగ్ ప్రారంభం కానుంది. శ్రీకర్ ప్రసాద్ మాట్లాడుతూ.. ‘‘రాజ్కుమార్గారిని వీరప్పన్ కిడ్నాప్ చేయడం అందర్నీ షాక్కి గురి చేసింది. అప్పటి కిడ్నాప్ కోణంలో పలు అంశాలను ఈ చిత్రంలో చర్చించబోతున్నాం. ఈ చిత్రానికి ప్రతిభగల టెక్నీషియన్లు పని చేయనున్నారు. పూర్తి వివరాలు దసరా తర్వాత వెల్లడిస్తాం’’ అని చెప్పారు. అసలేం జరిగింది?కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్కుమార్ తండ్రి రాజ్కుమార్ను 2000వ సంవత్సరం జూలై 30న వీరప్పన్ కిడ్నాప్ చేశాడు. రాజ్కుమార్తో పాటు ఆయన అల్లుడు గోవింద్రాజ్, బంధువు నగేష్, అసిస్టెంట్ దర్శకుడు నాగప్పను కూడా కిడ్నాప్ చేశాడు. ఆ సమయంలో తమిళనాడులో కరుణానిధి అధికారంలో ఉన్నారు. వీరప్పన్.. రాజ్కుమార్ను టార్గెట్ చేశాడని 1999లోనే సిట్ (వీరప్పన్ను పట్టుకోవడం కోసం నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం) ప్రభుత్వాన్ని హెచ్చరిచింది.అయినా నటుడికి భద్రత కల్పించడంలో ప్రభుత్వం విఫలమైంది. ఈ క్రమంలో తమిళనాడు ప్రభుత్వం వీరప్పన్తో పలుమార్లు చర్చలు జరిపింది. అలా 108 రోజులపాటు రాజ్కుమార్ను బంధించిన వీరప్పన్ 2000 సంవత్సరం నవంబర్ 15న ఆయన్ను వదిలేశాడు. చర్చలు జరిపినా వినని వీరప్పన్.. సడన్గా రాజ్కుమార్ను విడుదల చేయడం మిస్టరీగానే మిగిలిపోయింది. 2004లో సిట్ బృందం చేతిలో వీరప్పన్ మృతి చెందగా, 2006 ఏప్రిల్ 12న రాజ్కుమార్ తుదిశ్వాస వదిలారు.చదవండి: బిగ్బాస్: 5 నెలల పాప.. అయితే గుడ్డు దొంగిలించడానికి సిగ్గు లేదా? -
విషమివ్వాలని దర్శన్ విజ్ఞప్తి.. బెంగళూరు కోర్టు కీలక ఆదేశాలు!
కన్నడ హీరో దర్శన్ ప్రస్తుతం జైల్లో ఉన్నారు. రేణుకాస్వామి అనే అభిమాని హత్యకేసులో నిందితుడైన ఆయనను బెయిల్ రద్దు కావడంతో అరెస్టై జైలుకు వెళ్లారు. ఈ కేసులో దర్శన్తో పాటు అతని ప్రియురాలు పవిత్ర గౌడను కూడా అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ కేసులో విచారణకు వర్చువల్గా హాజరైన దర్శన్.. న్యాయమూర్తికి తన బాధలను చెప్పుకొచ్చారు. జైల్లో ఉండలేకపోతున్నానని.. తన పరిస్థితి అత్యంత దుర్భరంగా మారిందని అన్నారు. దయచేసి తనకు ఇంత విషమివ్వాలని జడ్జిని అభ్యర్థించాడు. నా జీవితం దారుణంగా తయారైందని జడ్జి ముందు ఆవేదన వ్యక్తం చేశారు.అయితే దర్శన్ పరిస్థితిని అర్థం చేసుకున్న బెంగళూరు కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. అతనికి జైలులో ప్రాథమిక సౌకర్యాలు కల్పించాలని జైలు అధికారులను ఆదేశించింది. అదే సమయంలో దర్శన్ను బెంగళూరు పరప్పన అగ్రహార జైలు నుంచి బళ్లారి జైలుకు బదిలీ చేయాలన్న అధికారుల విజ్ఞప్తిని కోర్టు తిరస్కరించింది. దర్శన్ను బళ్లారి జైలుకు మార్చడానికి ఎటువంటి బలమైన కారణం లేదని పేర్కొంది. కాగా.. రేణుకాస్వామి హత్య కేసులో 7 మంది నిందితులు వర్చువల్గా విచారణకు హాజరయ్యారు. దర్శన్ తరపు న్యాయవాదులు కనీసం ఒక మంచం, దిండును అందించాలని జైలు అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.అంతకుముందు దర్శన్ జడ్జితో మాట్లాడుతూ.. 'నెల రోజులకు పైనే అవుతుంది ఎండ అన్నది చూడలేదు. దీంతో నా చేతులకు ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చేశాయి. బట్టలు కంపు కొడుతున్నాయి. ఇలా నేను బతకలేను. ఒక్క చుక్క విషం ఇవ్వండి నేను చనిపోతా. నా జీవితం దారుణంగా తయారైంది' అని దర్శన్ ముందు విలపించాడు. దీనిపై స్పందించిన జడ్జి.. అలాంటివి మీరు అడగకూడదు. ఇది జరగదు' అని సమాధానమిచ్చారు. -
కాంతార ప్రీక్వెల్.. ఆ రాష్ట్రంలో విడుదలకు నో!
కాంతార మూవీతో పాన్ ఇండియా స్టార్గా గుర్తింపు తెచ్చుకున్న హీరో రిషబ్ శెట్టి. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్బస్టర్ హిట్గా నిలిచింది. ప్రస్తుతం ఈ చిత్రానికి ప్రీక్వెల్ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. కాంతార చాప్టర్-1 పేరుతో ఈ మూవీని తెరకెక్కించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 2న థియేటర్లో సందడి చేసేందుకు రెడీ అయిపోయింది.అయితే రిలీజ్ తేదీ దగ్గర పడుతున్న సమయంలో ఈ మూవీకి అడ్డంకులు ఎదురువుతున్నాయి. కేరళలో ఈ చిత్రాన్ని విడుదల చేయనివ్వమని ఎగ్జిబిటర్స్ యూనియన్ ప్రకటించింది. ఈ సినిమాను కేరళలో రిలీజ్ చేస్తున్న సలార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్తో లాభాల వాటాపై డీల కుదరకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఈ సినిమా రిలీజైన మొదటి రెండు వారాలు లాభాల్లో 55 శాతం వాటా ఇవ్వాలని ఎగ్జిబిటర్స్ యూనియన్ డిమాండ్ చేసింది. అయితే ఇందుకు పృథ్వీరాజ్ సుకుమారన్కు చెందిన పృథ్వీరాజ్ ప్రొడక్షన్స్ నిరాకరించింది. దీంతో కేరళలో సినిమా ప్రదర్శనను నిలిపిస్తున్నట్లు యూనియన్ నిర్ణయం తీసుకుంది. ఈ ప్రకటనతో కాంతార ప్రీక్వెల్ వీక్షించాలనుకున్న మలయాళీలకు నిరాశే తప్పేలా లేదు.మలయాళ సినిమాలు ఇతర రాష్ట్రాల్లో రిలీజైనప్పుడు కేవలం 40 శాతం లాభాల వాటా మాత్రమే పొందుతున్నామని ఎగ్జిబిటర్ల యూనియన్ అధ్యక్షుడు విజయకుమార్ అన్నారు. మలయాళ చిత్ర నిర్మాతలకు అంత వాటా రానప్పుడు.. ఈ పంపిణీదారులు ఎందుకు అంత మొండిగా వ్యవహరిస్తున్నారని ఆయన ప్రశ్నించారు. వారి నుంచి ఈ విషయంలో చొరవ తీసుకోకపోతే తమ నిర్ణయాన్ని ఉపసంహరించుకోబోమని ఎగ్జిబిటర్ల యూనియన్ పేర్కొంది. కాగా.. రిషబ్ శెట్టి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రుక్మిణి వసంత్, జయరామ్, రాకేష్ పూజారి, గుల్షన్ దేవయ్య ప్రధాన పాత్రల్లో నటించారు. -
నయనతార డాక్యుమెంటరీ.. ఎప్పుడు వివాదాలే.. రూ.5 కోట్లు డిమాండ్!
లేడీ సూపర్ స్టార్గా గుర్తింపు తెచ్చుకున్న నయనతార ప్రస్తుతం మెగాస్టార్ సరసన నటిస్తోంది. అనిల్ రావిపూడి- చిరంజీవి కాంబోలో వస్తోన్న ఈ చిత్రం టైటిల్ను ఇటీవలే మేకర్స్ రివీల్ చేశారు. చిరు బర్త్ డే సందర్భంగా మెగా టైటిల్ను పరిచయం చేశారు. ఈ సినిమాకు మనశంకర వరప్రసాద్ గారు అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.అయితే కోలీవుడ్ భామ నయనతారం ఎప్పుడు ఏదో ఓ వివాదంలో చిక్కుకుంటూనే ఉంటోంది. గతంలో చాలాసార్లు వివాదాలకు కేరాఫ్గా అడ్రస్గా మారిన ముద్దుగుమ్మను మరోసారి ఇబ్బందుల్లో పడింది. గతేడాది నవంబర్లో రిలీజైన డాక్యామెంటరీ నయనతార-బియాండ్ ది ఫెయిరీ టేయిల్లో అనుమతి లేకుండా తమ సినిమా క్లిప్స్ వాడారని నిర్మాణ సంస్థ ఏబీ ఇంటర్నేషనల్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. క్లిప్లను తొలగించాలని డిమాండ్ చేస్తూ.. రూ.5 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని లీగల్ నోటీసు అందజేసినప్పటికీ.. అదే కంటెంట్తో డాక్యుమెంటరీ ప్రసారం అవుతోందని ఎబి ఇంటర్నేషనల్ వాదించింది. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం కౌంటర్ దాఖలు చేయాలంటూ డాక్యుమెంటరీ నిర్మాణ సంస్థ టార్క్ స్టూడియోస్ను ఆదేశించింది. ఇందుకోసం అక్టోబర్ 6 వరకు గడువు ఇచ్చింది. టార్క్ స్టూడియోస్ నిర్మించిన నయనతార-బియాండ్ ది ఫెయిరీ టేల్ నవంబర్ 2024లో నెట్ఫ్లిక్స్లో విడుదలైంది. కాగా.. గతంలో ఈ డాక్యుమెంటరీ విడుదలైన ధనుశ్కు చెందిన వుండర్బార్ ఫిల్మ్స్ తమ సినిమా నానుమ్ రౌడీ దాన్ నుంచి సన్నివేశాలను అనుమతి లేకుండా ఉపయోగించారని ఆరోపిస్తూ కోటి రూపాయల నష్టపరిహారం కోరింది. ఆ కేసు ఇప్పటికీ పెండింగ్లో ఉంది. తాజాగా ఈ డాక్యుమెంటరీపై మరో వివాదం మొదలైంది. కాగా.. 2005లో వచ్చిన చంద్రముఖి సినిమాలో రజినీకాంత్, జ్యోతిక, నయనతార కీలక పాత్రల్లో నటించారు. -
'96' సీక్వెల్ డ్రాప్.. ఫహాద్తో డిఫరెంట్ సినిమా
'96'.. ఈ సినిమాకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఎందుకంటే ప్రేమకథలు ఇప్పటివరకు చాలా వచ్చాయి గానీ ఈ చిత్రంలో ఎమోషన్స్, స్టోరీ.. అద్భుతమైన ఎక్స్పీరియెన్స్ ఇచ్చాయి. ఓ రకంగా చెప్పాలంటే విజయ్ సేతుపతి, త్రిషకు ఓ రేంజు గుర్తింపు తీసుకొచ్చాయి. అయితే ఈ మూవీకి సీక్వెల్ ఉందని కొన్నాళ్ల క్రితం చెప్పిన దర్శకుడు ప్రేమ్ కుమార్.. ఇప్పుడు మనసు మార్చుకున్నట్లు అనిపిస్తుంది. డిఫరెంట్ చిత్రాలతో రాబోతున్నట్లు ప్రకటించాడు.(ఇదీ చదవండి: కొత్త ట్రెండ్.. ఓటీటీలో యానిమేషన్ 'కురుక్షేత్రం')చివరగా ప్రేమ్ కుమార్.. 'సత్యం సుందరం' సినిమాతో వచ్చాడు. గతేడాది ఇది రిలీజైంది. దీని తర్వాత తమిళ హీరో విక్రమ్తో ఓ ప్రాజెక్ట్ సెట్ చేసుకున్నాడు. అయితే ఇది ఇంకా ఆలస్యం కానుంది. ఇంతలో ఫహాద్ ఫాజిల్తో ప్రేమ్ కుమార్ ఓ ప్రాజెక్ట్ లాక్ చేసుకున్నాడు. 45 నిమిషాల స్క్రిప్ట్ చెప్పానని, అది ఫహాద్కి చాలా నచ్చేసిందని చెప్పాడు. ఇదో యాక్షన్ థ్రిల్లర్ అని పేర్కొన్నాడు. అయితే 96, సత్యం సుందరం చిత్రాలతో పోలిస్తే ఇందులో చాలా తక్కువ క్యారెక్టర్స్ ఉంటాయని క్లారిటీ ఇచ్చాడు.ఫహాద్ ఫాజిల్కి హీరోగా ఇది తొలి తమిళ సినిమా కానుంది. జనవరి నుంచి షూటింగ్ మొదలుపెట్టనున్నారు. ఇదివరకే తమిళంలో ఫహాద్ పలు చిత్రాల్లో నటించినప్పటికీ.. వాటిలో సహాయ పాత్రలు చేశాడు. ఇప్పుడు ప్రేమ్ కుమార్తో మూవీ అనగానే కాస్త ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. ఈ ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత విక్రమ్తో ప్రేమ్ కుమార్ మూవీ చేస్తారు. అయితే ఈ విషయాన్ని చెప్పిన ఈ దర్శకుడు.. 96 సీక్వెల్ గురించి మాత్రం ఎక్కడా ప్రస్తావించలేదు. అంటే ఇది లేనట్లే అనిపిస్తుంది.(ఇదీ చదవండి: నాతో బలవంతంగా ఆ సీన్స్ చేయించారు: 'ఆదిత్య 369' హీరోయిన్)"My Next film is with #FahadhFaasil😲, It'll be a thriller with Action, but my core emotion touch will be there♥️🔥. Narrated 45 mins to Fafa & he liked a lot👌. It's direct Tamil film & shoot from Jan🎬. #ChiyaanVikram film will be delayed👀"- #Premkumar pic.twitter.com/YL1IVVYMrm— AmuthaBharathi (@CinemaWithAB) September 9, 2025 -
ఏడుస్తున్నా వినకుండా ఆ సీన్స్ చేయించారు.. నాపై చేతబడి చేశారు!
చిరంజీవి, మోహన్బాబు, బాలకృష్ణ.. ఇలా స్టార్ హీరోలందరితోనూ నటించింది హీరోయిన్ మోహిని. ఆదిత్య 369 సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. దక్షిణాదిన అన్ని భాషల్లో కలుపుకుని దాదాపు 100కి పైగా సినిమాలు చేసింది. తమిళ, మలయాళంలో స్టార్ హీరోయిన్గా రాణిస్తున్న సమయంలో పెళ్లి చేసుకుని అమెరికా వెళ్లిపోయింది. పిల్లలు పుట్టాక సినీ ఇండస్ట్రీకి దూరమైంది.వద్దని ఏడ్చా..చాలాకాలం తర్వాత ఆమె ఓ ఇంటర్వ్యూకు హాజరైంది. ఈ సందర్భంగా సినీజ్ఞాపకాలను పంచుకుంది. మోహిని (Tamil Actress Mohini) మాట్లాడుతూ.. ఓ సినిమాలో దర్శకుడు రొమాంటిక్ సాంగ్ను స్విమ్మింగ్ పూల్లో ప్లాన్ చేశాడు. నాకసలే ఈత రాదు, అందులోనూ స్విమ్ సూట్ వేసుకోవడం చాలా అసౌకర్యంగా అనిపించింది. అదే మాట చెప్పి ఏడ్చాను. నావల్ల కాదన్నాను.ఇష్టం లేకుండా నటించాఅప్పట్లో ఈత నేర్పించడానికి ఆడవాళ్లు లేరు, మగవాళ్లే ఉన్నారు. వాళ్ల ముందు సగం బట్టలే వేసుకుని ఈత నేర్చుకోవడానికి ఎంతో ఇబ్బందిగా అనిపించింది. అయినా సరే ఆ పాటలో నాతో బలవంతంగా సగం దుస్తులు వేయించి స్విమ్మింగ్ పూల్లో షూట్ పూర్తి చేశారు. తర్వాత ఊటీలో మళ్లీ అలాంటి సీన్ చేయాలన్నారు. అప్పుడు నేనసలు ఒప్పుకోలేదు. ఆల్రెడీ సీన్ అయిపోయాక మళ్లీ ఇదేంటి? నేను చేయనని తెగేసి చెప్పాను. నాకు ఇష్టం లేకపోయినా మరీ గ్లామరస్గా కనిపించేలా చేశారు.చేజారిన సినిమాలు'సూర్య సన్నాఫ్ కృష్ణన్' మూవీలో సిమ్రాన్కు బదులుగా నేనే నటించాల్సింది. ముందు నన్నే అడిగారు. కానీ నేను సినిమాలు మానేశానని ఎవరో డైరెక్టర్కు చెప్పారట! దీంతో నా స్థానంలో సిమ్రాన్ను తీసుకున్నారు. ఈ విషయం దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ స్వయంగా నాతో చెప్పాడు. రజనీకాంత్ 'ముత్తు' సినిమాలో హీరోయిన్గా నన్ను తీసుకోవాలా? మీనాను సెలక్ట్ చేసుకోవాలా? అని దర్శకనిర్మాతలు సందిగ్ధంలో పడ్డారు. నన్నోసారి వచ్చి కలవమన్నారు. పనికోసం వెతుక్కుంటూ వెళ్లడం నాకిష్టం లేదు. నాపై చేతబడిమనకని రాసిపెట్టుంటే అది మనకే వస్తుందని ఊరుకున్నాను. వాళ్లు ఫైనల్గా మీనాను సెలక్ట్ చేశారు. ఇది పోతే నాకు ఎక్కడో మంచి అవకాశం ఉండే ఉంటుందనుకున్నాను. డేట్స్ కుదరకపోవడంతో చిన్న తంబి చేజారింది అని చెప్పుకొచ్చింది. పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడుతూ.. నా భర్త కజిన్ నాపై చేతబడి చేయించింది. అప్పుడు నన్ను ఆ భగవంతుడే కాపాడాడు అని పేర్కొంది. మోహిని చివరగా కలెక్టర్ (2011) అనే మలయాళ మూవీలో మెరిసింది.చదవండి: IVF ద్వారా గర్భం.. బొడ్డుతాడులో రివర్స్లో రక్తం.. ప్రాణం లేని బిడ్డకు జన్మనిచ్చిన నటి -
IVF ద్వారా గర్భం.. బొడ్డుతాడులో రివర్స్లో రక్తం.. ప్రాణం లేని పాప!
తల్లవాలంటే ముందు పెళ్లవాలా? అక్కర్లేదు, ఏ తోడూ లేకుండానే అమ్మనవుతాను అని నిర్ణయించుకుంది కన్నడ నటి భావన రామన్న. అందుకే 40 ఏళ్లొచ్చినా పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా మిగిలిపోయిన ఆమె ఐవీఎఫ్ ఎంచుకుంది. కడుపులో కవలలను మోసింది. సీమంతం కూడా బాగా జరిగింది. కానీ డెలివరీ రోజు ఒక శిశువు మాత్రమే ప్రాణంతో దక్కింది. ఓ శిశువును కోల్పోయింది.టైం బాంబ్పై కూర్చున్నావ్ఈ విషాదం గురించి భావన (Bhavana Ramanna) మాట్లాడుతూ.. సీమంతం తర్వాత నేను ఎక్కువసేపు కూర్చోలేకపోయాను. కొన్నిసార్లు స్పాటింగ్ (రక్తస్రావం) కనిపించేది. నేను వెళ్లే హాస్పిటల్ చాలా దూరంలో ఉండటంతో దగ్గర్లోనే మంచి డాక్టర్ను చూసుకుంటే అయిపోతుందన్నారు. మా బంధువులు ఎక్కువగా డెలివరీ అయిన డాక్టర్ దగ్గరకు వెళ్లి కలిశాను. ఆమె నన్ను చూడగానే.. భావన, నువ్వో టైం బాంబ్ మీద కూర్చున్నావ్.. తెలుసా? అంది. పాప చనిపోయిందివెంటనే నాకు అన్ని పరీక్షలు చేసింది. సాధారణంగా బొడ్డుతాడు ద్వారా శిశువుకు రక్తం అందుతుంది. కానీ టెస్ట్లో అది రివర్స్లో జరుగుతుందని తేలింది. అలాగే ఓ శిశువు గుండె కొట్టుకునే వేగం సగానికి సగం తగ్గిపోయిందని తెలిసింది. పైగా సరైన బరువు కూడా లేదని డాక్టర్ చెప్పింది. అప్పటికప్పుడు నాకు ఆపరేషన్ చేశారు. ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు. ఒక బిడ్డ చనిపోయిందని చెప్పగానే నాకు మాటలు రాలేదు. అమ్మమ్మ పేరే పెట్టా..పుట్టిన బిడ్డ కోసం సంతోషపడాలా? చనిపోయిన పాప కోసం ఏడవాలా? ఏదీ అర్థం కాని స్థితిలో ఉండిపోయాను. నా కూతురికి రుక్మిణి అని మా అమ్మమ్మ పేరు పెట్టాను. తను ఆగస్టు 20న జన్మించింది అని చెప్పుకొచ్చింది. కన్నడలో అనేక సినిమాలు చేసిన భావన రామన్న తమిళంలోనూ పలు చిత్రాల్లో నటించింది. చివరగా మలయాళంలో ఒట్ట మూవీ చేసింది. తెలుగులో అమ్మాయి నవ్వితే (2001) అనే ఏకైక మూవీలో కనిపించింది.చదవండి: రీతూ తలకు గాయం.. అదో పెద్ద సైకో! దాన్ని చూస్తేనే చిరాకు! -
హీరోగా ఎంట్రీ ఇస్తున్న బిగ్బాస్ రన్నరప్
బిగ్బాస్ రియాల్టీ గేమ్ షో (Bigg Boss Reality Show) నుంచి బయటికి వచ్చిన పలువురు సినిమాల్లో హీరోగా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. తాజాగా బిగ్ బాస్ ఫేమ్ విక్రమన్ కథానాయకుడిగా ఎంట్రీ ఇస్తున్నారు. ఈయన హీరోగా నటిస్తున్న చిత్రాన్ని గోల్డెన్ గెట్ స్టూడియోస్ నిర్మిస్తోంది. ఈ చిత్రానికి ప్రీతి కరికాలన్ కథ, దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా పూజా కార్యక్రమాలను ఇటీవల చైన్నెలో నిరాడంబరంగా నిర్వహించారు. బుధవారం నుంచి రెగ్యులర్ షూటింగ్ను ప్రారంభిస్తున్నట్లు పేర్కొన్నారు. దర్శకురాలు మాట్లాడుతూ.. బిగ్బాస్ ఫేమ్ విక్రమన్ను హీరోగా ఎంపిక చేయడానికి కారణం అతని పర్సనాలిటీ అందర్నీ ఆకట్టుకునే విధంగా ఉండడమేనన్నారు. ఈ చిత్రంలోని కథానాయకుడి పాత్రకు తను పర్ఫెక్ట్గా ఉంటారన్నారు. చిత్ర కథ వాస్తవానికి దగ్గరగా, చాలా ఫ్రెష్గా కలర్ ఫుల్ ఎంటర్టైనర్గా ఉంటుందని చెప్పారు. సంగీతం, విజువల్స్ అదనపు ఆకర్షణగా నిలుస్తాయన్నారు. టోటల్గా ఈ చిత్రం ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగిస్తుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ సినిమాకు శ్రీధర్ ఛాయాగ్రహణం, అజేష్ అశోకన్ సంగీతాన్ని అందిస్తున్నారు. కాగా విక్రమన్.. తమిళ బిగ్బాస్ ఆరో సీజన్లో ఫస్ట్ రన్నరప్గా నిలిచాడు. -
హిజ్రాగా నటించాలి.. ఒకప్పటి టాలీవుడ్ హీరోయిన్ ఆశ
ఎన్ని సినిమాలు చేసినా సరే నటీనటులకు ఏదో ఒక డ్రీమ్ పాత్ర మిగిలే ఉంటుంది. అలా ప్రముఖ నటి శోభన కూడా ఓ పాత్ర పోషించేందుకు ఎదురుచూస్తున్నానని చెప్పింది. తెలుగు, తమిళం, మలయాళం ఇలా పలు భాషల్లో హీరోయిన్గా చేసిన ఈమె.. గొప్ప నాట్య కళాకారిణి కూడా. నటించడం తగ్గించి భరతనాట్యం పైనే ఎక్కువ మక్కువ చూపిస్తోంది. అలా చైన్నెలో డ్యాన్స్ స్కూలు నిర్వహిస్తోంది. మరోవైపు అడపా దడపా చిత్రాల్లో నటిస్తున్నారు. అదీ తనకు నచ్చిన పాత్రలు అయితేనే.(ఇదీ చదవండి: బిగ్బాస్ 9 తొలివారం నామినేషన్స్.. మొత్తం 9 మంది!)ఇటీవల మలయాళంలో మోహన్ లాల్కు జంటగా 'తుడరుమ్' మూవీలో శోభన లీడ్ రోల్ చేశారు. ఈ చిత్రం అద్భుతమైన హిట్ అయింది. శోభన నటనకు ప్రశంసలు దక్కాయి. ఈ క్రమంలోనే తాజాగా ఓనం సందర్భంగా ఓ న్యూస్ ఛానెల్కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో మాట్లాడుతూ.. తాను ఓ హిజ్రా పాత్రని పోషించాలని అనుకుంటున్నట్లు చెప్పుకొచ్చారు. ఈ విషయమై దర్శకులతోనూ మాట్లాడానని అన్నారు. కానీ వారు మాత్రం.. ప్రేక్షకులు మిమ్మల్ని ఆ పాత్రలో అంగీకరించరని తనతో చెప్పినట్లు గుర్తుచేసుకున్నారు.మమ్ముట్టి నటిస్తే స్వాగతించలేదా? అని సదరు దర్శకుల్ని తాను ప్రశ్నించినట్లు శోభన చెప్పారు. మలయాళ మెగాస్టార్ అయిన మమ్ముట్టి.. రీసెంట్గా 'కాదల్ ది కోర్' అనే సినిమా చేశారు. ఇందులో స్వలింగ సంపర్కుడిగా (హిజ్రా) నటించడం విశేషం. దీంతో హిజ్రా పాత్రలో నటించడానికి తాను ఎదురుచూస్తున్నట్లు శోభన పేర్కొన్నారు. ఆ తరహా పాత్రలో నటించడం చాలా కష్టమని చెప్పిన ఈమె.. అందుకు రూపురేఖలు, మాట్లాడే తీరు, గొంతు లాంటివి చాలా ముఖ్యమని అన్నారు అందువల్ల అలాంటి పాత్రలో నటించడం తనకు చాలా ఛాలెంజ్గా ఉంటుందని పేర్కొన్నారు. కాగా శోభనని హిజ్రాగా నటింపజేయడానికి ఏ దర్శకుడు ముందుకు వస్తారో చూడాలి?(ఇదీ చదవండి: నా సినిమా.. అలా చేస్తే ఇండస్ట్రీ వదిలేస్తా: బెల్లంకొండ) -
నాపై అలాంటి కేసు.. చాలా బాధాకరం: శ్వేతా మీనన్
ప్రముఖ మలయాళ నటి శ్వేతా మీనన్ ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఇటీవలే మలయాళ సినీ నటుల సంఘం (AMMA) అధ్యక్షురాలిగా ఎన్నికైన శ్వేత మీనన్ తనపై నమోదైన కేసుపై స్పందించింది. ఓ ఈవెంట్కు హాజరైన ఆమె.. 12 ఏళ్ల క్రితం తాను నటించిన చిత్రంపై కేసు నమోదు చేయడం బాధాకరమైన సంఘటన అని తెలిపింది. కేవలం డబ్బు సంపాదించే ఉద్దేశ్యంతో తాను సినిమాలు చేయడం లేదన్నారు. తనకు శత్రువులు ఎక్కువయ్యే కొద్ది.. మరింత రాణిస్తానని శ్వేతా మీనన్ అన్నారు.శ్వేతా మీనన్ మాట్లాడుతూ.. "శత్రువులు ఎక్కువైతే నేను మరింత ఎక్కువగా రాణిస్తా. ఒక వ్యక్తిగా నాపై కేసు పెట్టడం చాలా బాధాకరం. 12 సంవత్సరాల క్రితం వచ్చిన నా చిత్రాల గురించి ఇలా చేయడం కరెక్ట్ కాదు. ఆ సినిమాలు నాకు రాష్ట్ర అవార్డును తెచ్చిపెట్టాయి. ఇలాంటి కేసును ఎవరూ ఎదుర్కోలేదు. ఆ సమయంలో అమ్మా ఎన్నికల నుంచి వెనక్కి తగ్గాలా అనే అయోమయంలో పడ్డా. కానీ నా కుటుంబం మద్దతు నన్ను ముందుకు తీసుకెళ్లింది. ఇప్పుడు మీ ముందు దెబ్బతిన్న ఆడపులిగా నిలబడ్డా' అని పంచుకుంది.కాగా.. అధికంగా డబ్బు సంపాదించే ఉద్దేశ్యంతో అశ్లీల, అసభ్యకరమైన కంటెంట్తో కూడిన సినిమాల్లో నటించారని ఆరోపిస్తూ శ్వేతా మీనన్పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. మలయాళ మూవీ ఆర్టిస్టుల సంఘం (AMMA) ఎన్నికలకు పోటీ చేస్తున్న సమయంలో ఆమెపై ఆరోపణలు వచ్చాయి. ప్రముఖ సామాజిక కార్యకర్త మార్టిన్ మెనాచేరి మీనన్పై కంప్లైంట్ చేశారు. అయినప్పటీకీ అమ్మా మొదటి మహిళా అధ్యక్షురాలిగా నియమితులయ్యారు. అంతేకాకుడా శ్వేతా మీనన్కు గతంలో కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డులలో రెండుసార్లు ఉత్తమ నటిగా గెలుచుకున్నారు. ఫెమినా మిస్ ఇండియా ఆసియా పసిఫిక్ 1994 కిరీటాన్ని కూడా సొంతం చేసుకున్నారు. -
ఒక ప్రాణం పోయాక నువ్వు పుట్టావ్.. హీరోయిన్ తల్లి
ప్రాణానికి ప్రాణంగా ప్రేమించినవాళ్లు మనల్ని వదిలేసి ఎక్కడికీ వెళ్లరు. ఒకవేళ తనువు చాలించి వెళ్లిపోయినా మళ్లీ ఏదో ఒక రూపంలో మనముందుకు వస్తారని చాలామంది బలంగా నమ్ముతారు. హీరోయిన్ అనస్వర రాజన్ (Anaswara Rajan) ఇంట అదే నిజమైంది. సూపర్ శరణ్య, నెరు, రేఖా చిత్రం వంటి పలు హిట్ సినిమాల్లో నటించింది అనస్వర.నా పాపాయికి హ్యాపీ బర్త్డేనేడు (సెప్టెంబర్ 8) ఆమె బర్త్డే. ఈ సందర్భంగా హీరోయిన్ తల్లి ఉషా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఓ పోస్ట్ పెట్టింది. ఆరోజు నేనెంతో ప్రేమించిన వ్యక్తిని కోల్పోయాను.. అదే రోజు నువ్వు జన్మించావు. 23 ఏళ్ల ఈ పాపాయి ఆయురారోగ్యాలతో జీవించాలని మనసారా కోరుకుంటున్నాను. అమ్మ నీకోసం వేవేల బర్త్డే విషెస్ తెలియజేస్తోంది అని రాసుకొచ్చింది. ఈ పోస్ట్కు అనస్వర ఫోటోను జత చేసింది. దీంతో అభిమానులు హీరోయిన్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.సినిమాకాగా ఉషా- రాజన్ దంపతులకు 2002 సెప్టెంబర్ 8న అనస్వర జన్మించింది. ఈమె పుట్టడానికి ముందు ఉషా తల్లి మరణించింది. తల్లిని కోల్పోయి పుట్టెడు శోకంలో మునిగిన ఉషాకు కూతురే ప్రపంచంగా మారింది. అనస్వరలోనే తల్లిని చూసుకుని సంతోషపడిపోయింది. అనస్వర రాజన్ సినిమాల విషయానికి వస్తే.. 7/G రెయిన్బో కాలనీ 2 సినిమా చేస్తోంది. ఇది తెలుగులో7/G బృందావన కాలనీ 2గా విడుదల కానుంది. దీనితో పాటు మరో రెండు మూవీస్ చేస్తోంది. View this post on Instagram A post shared by Usha Rajan (@usharajan_) చదవండి: 15 మంది పనోళ్లు.. కూతుళ్లు లేరు, కొడుకూ లేడు, అందుకే.. -
సీక్రెట్గా పెళ్లి చేసుకున్న యువ హీరోయిన్
మరో హీరోయిన్ పెళ్లి చేసుకుంది. కానీ ఎలాంటి ప్రకటన లాంటివి లేకుండా సీక్రెట్గా వివాహం చేసుకుని అందరికీ షాకిచ్చింది. 'జనాల్లేరు.. లైట్స్ లేవు.. సౌండ్ లేదు. ఫైనల్లీ మా పెళ్లి అయిపోయింది' అని మలయాళ నటి గ్రేస్ ఆంటోని పోస్ట్ పెట్టింది. ఈ క్రమంలోనే తోటి హీరోహీరోయిన్లు అందరూ కొత్త పెళ్లికూతురికి శుభాకాంక్షలు చెబుతున్నారు.(ఇదీ చదవండి: జైల్లో ఉండలేకపోతున్నా.. ఇంత విషం ఇవ్వండి: హీరో దర్శన్)2016 నుంచి ఇండస్ట్రీలో ఉన్న గ్రేస్ ఆంటోని.. కుంబళంగి నైట్స్, నునక్కుళి, పరంతు పో, రోర్చా తదితరులు చిత్రాలతో గుర్తింపు తెచ్చుకుంది. రీసెంట్గా వచ్చిన తమిళ చిత్రం 'పరంతు పో'లో ఈమెనే హీరోయిన్. అయితే మలయాళ మూవీస్ ఓటీటీల్లో చూసే తెలుగు ప్రేక్షకులకు ఈమె కాస్త పరిచయమే.ఇప్పుడు సడన్గా తను పెళ్లి చేసుకున్నానని చెప్పి గ్రేస్ బయటపెట్టింది. కానీ భర్త ఎవరు? ఇండస్ట్రీకి వ్యక్తి అనే విషయాల్ని మాత్రం రివీల్ చేయలేదు. ప్రస్తుతానికైతే రెండు ఫొటోలు అవి కూడా ఇద్దరి ముఖాలు కూడా కనిపించకుండా తీసుకున్న వాటిని మాత్రమే సోషల్ మీడియాలో షేర్ చేసింది. మరికొన్ని రోజుల్లో భర్త ఎవరు ఏంటి అనేది చెబుతుందేమో చూడాలి?(ఇదీ చదవండి: అందుకే తమిళ సినిమాలకు రూ.1000 కోట్లు రావట్లేదు: హీరో శివకార్తికేయన్) View this post on Instagram A post shared by Grace (@grace_antonyy) -
జైల్లో ఉండలేకపోతున్నా.. ఒక చుక్క విషమివ్వండి: స్టార్ హీరో
కన్నడ స్టార్ హీరో దర్శన్.. జడ్జి ముందు బోరున విలపించాడు. తన అభిమాని రేణుకస్వామి అనే వ్యక్తిని హతమార్చిన కేసులో జైల్లో ఉన్న దర్శన్.. నెలవారీ హియరింగ్లో భాగంగా మంగళవారం జైలు నుంచే వీడియో కాల్ ద్వారా కోర్ట్ హియరింగ్లో పాల్గొన్నాడు. జైల్లో అస్సలు ఉండలేకపోతున్నానని, తన జీవితం దుర్భరంగా మారిపోయిందని ఆవేదన వ్యక్తం చేశాడు. తనకు విషమివ్వాలని జడ్జిని అభ్యర్థించాడు.'నెల రోజులకు పైనే అవుతుంది. ఎండ అన్నది చూడలేదు. దీంతో నా చేతులకు ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చేశాయి. బట్టలు కంపు కొడుతున్నాయి. ఇలా నేను బతకలేను. ఒక్క చుక్క విషం ఇవ్వండి నేను చనిపోతా. నా జీవితం దారుణంగా తయారైంది' అని దర్శన్ ముందు విలపించాడు. దీనిపై స్పందించిన జడ్జి.. 'అలాంటివి మీరు అడగకూడదు. ఇది జరగదు' అని సమాధానమిచ్చారు.(ఇదీ చదవండి: మంచు ఫ్యామిలీ నుంచి కొత్త సినిమా.. ట్రైలర్ రిలీజ్)గతేడాది తన అభిమాని రేణుకస్వామిని.. హీరో దర్శన్ హత్య చేశాడు. తన రూమర్ గర్ల్ ఫ్రెండ్ పవిత్ర గౌడకు సదరు రేణుకస్వామి అసభ్యకర మెసేజులు పంపుతుండటమే దీనికి కారణం. తొలుత అతడిని కిడ్నాప్ చేసిన దర్శన్.. బెంగళూరులోని ఓ షెడ్లో పెట్టి చిత్రహింసలు చేశాడు. తర్వాత రేణుకస్వామి బాడీ.. దగ్గరలోని ఓ నాళాలో దొరికింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్శన్తో పాటు పవిత్ర గౌడ తదితరుల్ని గతేడాది జూన్లో అరెస్ట్ చేశారు.అయితే కొన్ని నెలల పాటు దర్శన్ జైల్లో ఉన్నాడు. గతేడాది డిసెంబరులో కర్ణాటక హైకోర్ట్ బెయిల్ మంజూరు చేయడంతో బయటకొచ్చాడు. కానీ సుప్రీం కోర్ట్ ఆ బెయిల్ని రద్దు చేసింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న దర్శన్.. బయట ఉంటే సాక్ష్యాలు తారుమారు చేసే ప్రమాదం ఉందని, అతడిని వెంటనే అరెస్ట్ చేయాలని ఆదేశించింది. దీంతో మళ్లీ దర్శన్ అరెస్ట్ అయ్యాడు. తాజాగా తనకు జైలులో దారుణమైన పరిస్థితులు ఉన్నాయని బోరున ఏడ్చేశాడు. కనీసం తలగడ, బెడ్ షీట్స్, ఇంటిలో తయారు చేసిన ఆహారం లాంటివి అయినా సరే అనుమతించాలని దర్శన్.. జడ్జిని కోరాడు.(ఇదీ చదవండి: అందుకే తమిళ సినిమాలకు రూ.1000 కోట్లు రావట్లేదు: హీరో శివకార్తికేయన్) -
15 మంది పనోళ్లు.. కూతుళ్లు లేరు, కొడుకూ లేడు, అందుకే..
కోలీవుడ్ స్టార్ దంపతులు శరత్కుమార్- రాధిక (Radhika Sarathkumar) తమ లగ్జరీ బంగ్లా నుంచి బయటకు వచ్చేశారు. చెన్నైలోని ఈసీఆర్లో ఉన్న విలాసవంతమైన భవనంలో కొన్నేళ్లుగా నివసిస్తున్న వీరు మరో ఇంటికి షిఫ్ట్ అయ్యారు. అందుకు గల కారణాన్ని శరత్కుమార్ వెల్లడించాడు. ఆయన మాట్లాడుతూ.. మేము ఉన్న ఇల్లు 15 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. మా ఇంటికి ఏడు ద్వారాలున్నాయి. అందుకే ఇల్లు మారాంప్రతిరోజు రాత్రి ఆ తలుపులకు గడియపెట్టడం కూడా ఇబ్బందవుతోంది. కొడుకు విదేశాల్లో చదువుకుంటున్నాడు. కూతుళ్లకు పెళ్లిళ్లయిపోయి ఎవరి జీవితంలో వారు బిజీగా ఉన్నారు. మా ఇంట్లో 15 మంది పనివాళ్లున్నా సరే.. రాధిక ఒక్కరే ఆ పెద్ద ఇంటిని చూసుకోవడం కష్టమవుతోంది. అందుకే ఇల్లు మారాం. ప్రస్తుతం ఆ ఇంటిని ఓ ఐటీ కంపెనీకి అద్దెకిచ్చాం అని చెప్పుకొచ్చాడు. శరత్కుమార్ చివరగా 3BHK సినిమాలో కనిపించాడు. గణేశ్ దర్శకత్వం వహించిన ఈ మూవీ మంచికు పాజిటివ్ రెస్పాన్స్ లభించింది. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ సైతం 3BHK మూవీపై ప్రశంసలు కురిపించాడు. ప్రస్తుతం ఈ చిత్రం ఓటీటీ ప్లాట్ఫామ్ అమెజాన్ ప్రైమ్లో అందుబాటులో ఉంది. పర్సనల్ లైఫ్రాధిక.. 1985లో నటుడు ప్రతాప్ పోతన్ను పెళ్లాడింది. ఏడాదికే అతడికి విడాకులిచ్చేసి బ్రిటీష్ వ్యక్తి రిచర్డ్ హార్డీని పెళ్లి చేసుకుంది. వీరికి కూతురు రయానే జన్మించింది. రెండేళ్లకే ఈ దంపతులు కూడా విడిపోయారు. 2001లో నటుడు శరత్కుమార్ను మూడో పెళ్లి చేసుకుంది. శరత్కుమార్కు ఇది రెండో పెళ్లి! ఈయన మొదటగా 1984లో చాయాదేవిని పెళ్లి చేసుకోగా వీరికి వరలక్ష్మి, పూజ అని ఇద్దరు కూతుర్లు జన్మించారు. 2000వ సంవత్సరంలో చాయాతో విడాకులు తీసుకున్న శరత్కుమార్ మరుసటి ఏడాది రాధికను పెళ్లాడాడు. రాధిక- శరత్ జంటకు రాహుల్ జన్మించాడు.చదవండి: మిరాయ్.. టికెట్ రేట్లు పెంచడం లేదు: తేజ సజ్జా -
సినిమాలు ప్రేక్షకులకోసం.. అవార్డులిచ్చేవారికోసం కాదు: హీరో
కేంద్ర ప్రభుత్వం రెండు నెలల క్రితం జాతీయ చలన చిత్ర అవార్డులు ప్రకటించింది. జవాన్, 12th ఫెయిల్, సామ్ బహదూర్, పార్కింగ్, బేబి, బలగం, హనుమాన్.. ఇలా పలు సినిమాలకు వివిధ కేటగిరీల్లో పురస్కారాలు వరించాయి. అయితే రూ.150 కోట్లకిపైగా కొల్లగొట్టిన 'ఆడుజీవితం సినిమా' (Aadujeevitham: The Goat Life Movie)కు మాత్రం ఎటువంటి అవార్డు రాలేదు. ఆడుజీవితం నవల ఆధారంగా దర్శకుడు బ్లెస్సీ ఈ సినిమా తెరకెక్కించాడు. ఇందులో పృథ్వీరాజ్ సుకుమారన్ అద్భుతంగా నటించాడు. ప్రేక్షకుల కోసమే మా సినిమాహృదయాలను కదిలించిన ఈ సినిమాకు జాతీయ అవార్డు రాకపోవడంపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. తాజాగా ఈ వ్యవహారంపై హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ తొలిసారిగా స్పందించాడు. ఆయన మాట్లాడుతూ.. సినిమా అనేది ప్రేక్షకుల కోసం తీస్తాం. అంతేకానీ జ్యూరీ కోసమో, మార్కులిచ్చే పదిమంది కోసమో కాదు. కేవలం అంతర్జాతీయ చలనచిత్ర వేడుకల్లో ప్రదర్శితమయ్యేందుకే సినిమాలు తీయము. అవార్డులకు.. వాటి విలువ వాటికి ఉండొచ్చు. కానీ అంతిమంగా ప్రేక్షకుల మనసు గెలుచుకోవడం ముఖ్యం.అదే పెద్ద అవార్డుటికెట్ కొని థియేటర్కు వచ్చిన ప్రేక్షకులు సినిమాను ఆస్వాదించగలగాలి. వాళ్లంతా ఆడుజీవితాన్ని ఆస్వాదించారు, ఆదరించారు. అదే మాకు గొప్ప అవార్డు. అందుకు నేను సంతోషంగా ఉన్నాను అని చెప్పుకొచ్చాడు. కాగా ఆడు జీవితం 6 'కేరళ స్టేట్ ఫిలిం అవార్డులు' సాధించింది. జాతీయ అవార్డు కోసం 14 కేటగిరీల్లో పోటీపడినప్పటికీ ఒక్క పురస్కారం కూడా గెలుచుకోలేకపోయింది.చదవండి: నోరు తెరిస్తే అబద్ధాలు, నీవల్లే గొడవలు.. నామినేషన్స్లో హీరోయిన్ -
అందుకే తమిళ సినిమాలకు రూ.1000 కోట్లు రావట్లేదు
ఇప్పుడంతా పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తోంది. భారీ బడ్జెట్ పెట్టి సినిమా తీశామా? దక్షిణాదితో పాటు హిందీలోనే రిలీజ్ చేద్దామా అని నిర్మాతలు ఆలోచిస్తున్నారు. రూ.1000 కోట్ల కలెక్షన్ అందుకునేందుకు ఆరాటపడుతున్నారు. ఈ మార్క్ని తెలుగు చిత్రాలు ఇదివరకే అందుకోగా, 'కేజీఎఫ్'తో కన్నడ ఇండస్ట్రీ కూడా ఈ ఫీట్ సాధించేసింది. కానీ తమిళ పరిశ్రమకు మాత్రం అది అందని ద్రాక్షలానే మిగిలిపోయింది.గత నెలలో వచ్చిన 'కూలీ' కూడా ఈ మార్క్ అందుకుంటుందేమో అని అందరూ అనుకున్నారు. రిలీజ్కి ముందు ఆ రేంజ్ హైప్ ఏర్పడింది. కానీ కంటెంట్ అంతంత మాత్రమే ఉండేసరికి రూ.400-500 కోట్ల వసూళ్ల వరకు వచ్చి ఆగిపోయింది. అయితే తమిళ మూవీస్ అసలు రూ.1000 కోట్ల మార్క్ ఎందుకు చేరుకోలేకపోతున్నాయ్ అనే విషయమై హీరో శివకార్తికేయన్ ఇప్పుడు మాట్లాడాడు. తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చాడు.(ఇదీ చదవండి: అల్లు కుటుంబానికి GHMC షాక్)'తమిళ సినిమా ఆ నంబర్కి చేరువలో ఉంది. మరికొన్నేళ్లలో రూ.1000 కోట్ల కలెక్షన్ ఫీట్ సాధిస్తుందని నమ్మతున్నాను. చాలా తమిళ సినిమాలు ఈ మార్క్ని అందుకోలేకపోతున్నాయి. స్టోరీలో సత్తా లేకపోవడమో లేదా పాన్ ఇండియా సబ్జెక్ట్ కాకపోవడం వల్లనే దీనికి కారణం. మూవీ క్వాలిటీ సంగతి పక్కనబెడితే టికెట్ రేట్లు కూడా తమిళనాడులో చాలా తక్కువ. బెంగళూరు, ముంబైలో ఉన్నట్లు ఇక్కడా ఉంటే 'జైలర్'కి రూ.800-1000 కోట్లు వచ్చి ఉండేవి. అలా అని టికెట్ రేట్లు పెంచమని నా ఉద్దేశం కాదు. మా సినిమాలు.. ఉత్తరాది ప్రేక్షకుల మనసులు గెలుచుకోవాల్సిన అవసరముంది' అని శివకార్తికేయన్ అన్నాడు.ఇతడు చెప్పిన దానిలో కొంత నిజముంది. బెంగళూరు, ముంబై సంగతి పక్కనబెడితే హైదరాబాద్లో ఓ మల్టీప్లెక్స్లో టికెట్ రేటు రూ.250-300 ఉంటే.. అదే సంస్థకు చెందిన చెన్నై మల్టీప్లెక్స్లో టికెట్ ధర రూ.180 మాత్రమే. అలానే తమిళ సినిమాల్లో ఎక్కువగా ప్రాంతీయత అనే అంశం కనిపిస్తుంది. అందుకే కొన్ని చిత్రాలు తమిళనాడులో తప్పితే మరో చోట ఆడవు. ఓవరాల్ అప్పీల్ ఉన్న మూవీస్ వచ్చినప్పుడు బహుశా తమిళ చిత్రం రూ.1000 కోట్ల మార్క్ అందుకోవచ్చేమో?(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 17 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్) -
భద్రకాళి కొత్త అనుభూతినిస్తుంది: తృప్తి రవీంద్ర, రియా జిత్తు
‘‘తెలుగు ప్రేక్షకులు సినిమాలను గొప్పగా సెలబ్రేట్ చేసుకుంటారు. అన్ని రకాల చిత్రాలను గొప్పగా ఆదరిస్తారు. వైవిధ్యమైన కథతో రూపొందిన మా ‘భద్రకాళి’ సినిమా ప్రేక్షకులకు మంచి అనుభూతిఇస్తుంది’’ అని హీరోయిన్లు తృప్తీ రవీంద్ర, రియా జిత్తు పేర్కొన్నారు. విజయ్ ఆంటోని నటించిన 25వ చిత్రం ‘భద్రకాళి’. అరుణ్ ప్రభు దర్శకత్వం వహించారు. మీరా విజయ్ ఆంటోని సమర్పణలో విజయ్ ఆంటోని ఫిల్మ్ కార్పొరేషన్, సర్వంత్ రామ్ క్రియేషన్స్ బ్యానర్పై రామాంజనేయులు జవ్వాజీ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 19న రిలీజ్ కానుంది.ఈ సందర్భంగా తృప్తి రవీంద్ర మాట్లాడుతూ–‘‘మాది మహారాష్ట్ర. సినిమాలపై ఆసక్తితో సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని వదిలేశాను. నా తొలి ఫీచర్ ఫిలిం ‘భద్రకాళి’. విజయ్గారితో నటించడం మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. మీరా, రామాంజనేయులుగార్లు చాలా సపోర్ట్ చేశారు’’ అన్నారు. రియా జిత్తు మాట్లాడుతూ– ‘‘మలయాళి అయిన నేను మలయాళ, తమిళ సినిమాలు చూస్తూ పెరిగాను. దాదాపు 15 సినిమాల్లో బాలనటిగా చేశాను. కొంచెం బ్రేక్ తీసుకుని, చదువు పూర్తయిన తర్వాత మళ్లీ సినిమాల్లోకి వచ్చాను. ‘భద్రకాళి’ లాంటి కథ సమాజానికి చాలా అవసరం. ఈ సినిమా అందరికీ కనెక్ట్ అయ్యేలా ఉంటుంది’’ అన్నారు. -
మల్లెపూలు ఎంత పనిచేశాయ్.. నటికి రూ.1.14 లక్షల జరిమానా
జడకు పెట్టుకున్న మల్లెపూలు.. ప్రముఖ నటిని చిక్కుల్లో పడేశాయి. ఏకంగా రూ.లక్ష ఫైన్ కట్టించేలా చేశాయి. ఈ విషయాన్ని సదరు నటి బయటపెట్టింది. దీంతో ఇది కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ అసలేం జరిగింది?మలయాళ నటి నవ్య నాయర్.. రీసెంట్గా ఓనం సెలబ్రేషన్స్ కోసం ఓ ఈవెంట్కి హాజరయ్యేందుకు ఆస్ట్రేలియా వెళ్లింది. అయితే మెల్బోర్న్ విమానాశ్రయంలో దిగేటప్పుడు మల్లెపూలని తన బ్యాగులో పెట్టుకుంది. వీటిని చూసి ఎయిర్పోర్ట్ అధికారులు.. ఈమెకు 1980 ఆస్ట్రేలియన్ డాలర్స్ జరిమానా విధించారు. మన కరెన్సీలో చెప్పాలంటే రూ.1.14 లక్షలు.(ఇదీ చదవండి: నేను వెళ్లిపోవడానికి కూడా రెడీ.. బిగ్బాస్ 9 Day 1 ప్రోమోస్ రిలీజ్)కఠినమైన బయోసెక్యూరిటీ ఉన్న విమానాశ్రయాల్లో మెల్బోర్న్ ఒకటి. పండ్లు, విత్తనాలు, పూలు తీసుకెళ్లడం ఇక్కడ నిషిద్ధం. వీటి వల్ల వివిధ రకాల వ్యాధులు, తెగుళ్లు వచ్చే ప్రమాదం ఉండటంతోనే అధికారులు ఈ నిబంధన పెట్టారు. ఇది తెలియని నటి నవ్య నాయర్.. తన బ్యాగులో మల్లెపూలు పెట్టేసింది. దాన్ని గుర్తించిన సిబ్బంది.. జరిమానా విధించారు. 28 రోజుల్లోపు ఈ మొత్తం కట్టాలని లేదంటే కఠిన చర్యలు తీసుకుంటామని ఈమెకు చెప్పారు.విమానాశ్రయంలో ఈ తతంగమంతా జరిగిన తర్వాత మెల్బోర్న్లో ఓనం ఈవెంట్ లో పాల్గొన్న నవ్య నాయర్.. అక్కడ మాట్లాడుతూ ఈ విషయాన్ని బయటపెట్టింది. తాను తీసుకువచ్చిన పూలు.. లక్ష రూపాయలు ఖరీదైనవనని ఫైన్ వేసేవరకు తనకు తెలియదని తనపై తానే కౌంటర్ వేసుకుంది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 17 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్) View this post on Instagram A post shared by Navya Nair (@navyanair143) -
46 ఏళ్ల తర్వాత క్రేజీ మల్టీస్టారర్.. బాక్సాఫీస్ బద్దలే!
రజనీకాంత్, కమల్ హాసన్.. భారతీయ చిత్రపరిశ్రమలో అగ్ర హీరోలుగా ఉన్న వీరిద్దరు కలిసి ఒక సినిమా చేయాలని చాలా మంది సినీ ప్రియులు కోరుకుంటున్నారు. వీళ్ల కాంబోలో సినిమా రాబోతున్నట్లు గత కొంతకాలంగా వార్తలు కూడా వస్తున్నాయి. కానీ అది ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు. పైగా ఈ సినిమాపై అటు రజనీ కానీ, ఇటు కమల్ కానీ స్పందించకపోవడంతో.. ఇదంతా పుకారే అనుకున్నారు. కానీ త్వరలోనే సినీ ప్రియుల కల నిజం కాబోతుంది. కమల్, రజనీలను ఒకే స్క్రీన్పై చూడబోతున్నారు. తాజాగా ఈ విషయాన్ని కమల్ హాసన్ అధికారికంగా ప్రకటించాడు.ఇటీవల జరిగిన సైమా అవార్డుల వేడుకల్లో పాల్గొన్న కమల్.. రజనీతో సినిమాపై స్పందించాడు. ‘ప్రేక్షకుల సంతోషమే మాకు ముఖ్యం. మేమిద్దరం కలిసి నటించాలని చాలా ఏళ్లుగా ప్రయత్నిస్తున్నాం. కానీ ఇన్నాళ్లు అది కుదరలేదు. త్వరలోనే మేమిద్దరం మీ ముందుకు రాబోతున్నాం. ఆ సినిమా మిమ్మల్ని సర్ప్రైజ్ చేస్తుంది’ అని కమల్ అన్నారు. దీంతో ఇరువురి ఫ్యాన్స్తో పాటు సగటు సినీ ప్రేక్షకుడు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 1979 లో వచ్చిన అల్లాయుద్దీన్ అద్భుత దీపం తర్వాత వీరిద్దరు కలిసి నటించలేదు. దాదాపు 46 ఏళ్ల తర్వాత మరోసారి స్క్రీన్ షేర్ చేసుకోబుతున్నారు. సినిమాకు కాస్త హిట్ టాక్ వచ్చినా బక్సాఫీస్ బద్దలవుతుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలను మాత్రం కమల్ వెళ్లడించలేదు. గతంలో లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో వీరిద్దరి సినిమా ఉంటుందని రూమర్స్ వచ్చాయి. -
దోశె కింగ్గా...
మలయాళ సూపర్ స్టార్ మోహన్లాల్ దోశె కింగ్గా మారనున్నారట. వెండితెరపై ఈ హీరోని ఇలా మార్చనున్న దర్శకుడు ఎవరో కాదు... సూర్యతో ‘జై భీమ్’ వంటి ఆలోచన రేకెత్తించే సినిమా తీసి, విజయం సాధించిన దర్శకుడు టీజే జ్ఞానవేల్. శరవణ భవన్ హోటల్ యజమాని రాజగో పాల్ జీవితం ఆధారంగా జ్ఞానవేల్ ఓ కథ తయారు చేశారని కోలీవుడ్ టాక్. ఈ కథని మోహన్లాల్కి వినిపించారట. ఆయనకు నచ్చి, ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నారని సమాచారం. శరవణ భవన్ అధినేతగా రాజగో పాల్ గొప్ప పేరు సం పాదించుకున్నారు.చిన్న స్థాయి నుంచి చాలా పెద్ద స్థాయికి చేరుకున్న ఆయన జీవితంలో ‘డార్క్ షేడ్’ కూడా ఉంది. ఓ హత్య కేసులో జీవిత ఖైదుగా ఆయనకు శిక్ష పడిన విషయం తెలిసిందే. అయితే ఖైదీగా ఉన్న కొద్ది రోజులకే రాజగో పాల్ గుండె పోటుతో మరణించారు. రాజగో పాల్ సాధారణ వ్యా పారవేత్తగా మొదలై, ఎంతో ఎత్తుకి ఎదిగి, హత్య కేసులో ఇరుక్కుని డౌన్ ఫాల్ అయినంతవరకూ సినిమాలో చూపించనున్నారట జ్ఞానవేల్. సో... ఈ సినిమాలో మోహన్లాల్ని డార్క్ షేడ్లోనూ చూసే అవకాశం ఉందన్నమాట. ‘దోశె కింగ్’ టైటిల్తో ఈ చిత్రాన్ని రూ పొందించనున్నారట. ఈ చిత్రం గురించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. -
పెళ్లి కాకుండా IVF.. విషాదంలో నటి భావన
ప్రముఖ కన్నడ నటి, నృత్యకారిణి భావన రామన్న ఇటీవల ఐవీఎఫ్ విధానంలో గర్భం దాల్చి కవల పిల్లలకు జన్మనివ్వడం తెలిసిందే. అలా ఆమె మాతృత్వ ఆనందాన్ని చవిచూస్తున్న తరుణంలో విషాద సంఘటన జరిగింది. కవల పిల్లల్లో ఒకరు కన్నుమూశారు. 40 ఏళ్ల భావన ఒంటరి మహిళగానే ఉన్నారు. అయితే మాతృత్వానికి అది అడ్డంకి కాదని చాటాలనే లక్ష్యంతో ఐవీఎఫ్ విధానంలో గర్భం చేసినట్లు ఇటీవల సోషల్ మీడియాలో ప్రకటించడంతో పాటు ఫోటోలను కూడా అప్లోడ్ చేశారు.దీంతో అభిమానులు, స్త్రీవాదులు హర్షం వ్యక్తంచేశారు. రెండు వారాల క్రితం ఒకే కాన్పులో కవలలకు జన్మనిచ్చారు. ఇద్దరు అడ పిల్లలు జన్మించగా ఒక శిశువు శనివారంనాడు అస్వస్థతతో మృతి చెందినట్లు తెలిసింది. ఒక శిశువు అరోగ్యవంతురాలిగా ఉన్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. 20, 30 ఏళ్లలో తాను తల్లి కావడం గురించి ఆలోచించలేదని, కానీ 40లలో ఆ భావన వెంటాడిందని ఆమె చెప్పేవారు. అందుకే పిల్లల కోసం నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ ఘటనతో ఆమె విషాదంలో మునిగిపోయారు. -
లారెన్స్ మనసు బంగారం.. దివ్యాంగురాలి కోసం..
స్టార్ హీరో రాఘవ లారెన్స్ (Raghava Lawrence) మంచి చేయడంలో ఎప్పుడూ ముందుంటాడు. ఎవరి పరిస్థితైనా బాగోలేదని తెలిస్తే క్షణం ఆలోచించకుండా సాయం చేస్తుంటాడు. ఈమధ్యే కూతురి చదువు కోసం చనిపోయిన భార్య మంగళసూత్రాన్ని తాకట్టు పెట్టిన ఓ తండ్రి కథ విని చలించిపోయాడు. భార్య జ్ఞాపకంగా మిగిలున్న మంగళసూత్రాన్ని విడిపించి ఇవ్వడమే కాకుండా ఆ కుటుంబానికి అండగా ఉంటానని మాటిచ్చాడు.అప్పుడు స్కూటీ గిఫ్ట్తాజాగా పూరి గుడిసెలో జీవిస్తున్న ఓ దివ్యాంగురాలు శ్వేత కుటుంబానికి సాయం చేసేందుకు ముందుకు వచ్చాడు. నిజానికి ఆ దివ్యాంగురాలు నడవలేని స్థితిలో ఉంటే ఆమె కాలికి సపోర్ట్గా ఉండే పరికరాన్ని కొనిచ్చి ఆమె నడిచేలా చేశాడు. ఎక్కడికంటే అక్కడికి వెళ్లేందుకు వీలుగా స్కూటీ బహుమతిగా ఇచ్చాడు. అయినా ఇంకా ఏదో వెలితిగా అనిపించింది. ఆమెను పూరి గుడిసె నుంచి మంచి ఇంటికి మార్చాలని బలంగా నిర్ణయించుకున్నాడు. ఇంటి బాధ్యతమంచి ఇంటికి మారితేనే తన జీవితం కూడా బాగుంటుందని భావించాడు. ఇంటి నిర్మాణం కోసం అడ్వాన్స్ కూడా ఇచ్చాడు. ఈ మేరకు ఓ వీడియో షేర్ చేశాడు. ఇది చూసిన అభిమానులు.. లారెన్స్ మంచి మనసును మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. లారెన్స్ ప్రస్తుతం బుల్లెట్టు బండి సినిమా చేస్తున్నాడు. ఆ తర్వాత కాంచన 4 స్టార్ట్ చేయనున్నాడు. Hi everyone, this is Swetha. Earlier, I was able to support her with leg support for walking. Later, I gifted her a scooty so she could move around independently. Now, I feel building a house for her will truly change her life. She is a girl with a golden heart, and my own heart… pic.twitter.com/vp0KUS1jsZ— Raghava Lawrence (@offl_Lawrence) September 7, 2025 చదవండి: Bigg Boss 9 : ఊహకందని మార్పులు.. ప్రోమోతోనే ట్విస్ట్ -
నిన్ను పెళ్లి చేసుకుంటే భార్యను కాదు తల్లినవుతా!: హీరోయిన్ కౌంటర్
కొందరు సెలబ్రిటీలతో సెల్ఫీ వరకే ఆగరు.. నన్ను పెళ్లి చేసుకుంటావా? గుండెల్లో పెట్టి చూసుకుంటా! అని సినిమా డైలాగులు కూడా పేలుస్తుంటారు. అలా చాలామంది హీరోయిన్లకు ఇలాంటి ప్రపోజల్స్ వస్తూనే ఉంటాయి. అందరూ ఇవి చూసి ఓ చిన్న నవ్వు నవ్వేసి లైట్ తీసుకుంటారు. తాజాగా మలయాళ హీరోయిన్ అవంతిక మోహన్ (Avantika Mohan)కు కూడా ఇలాంటి ప్రపోజలే వచ్చిందట! కాకపోతే ఆ కుర్రాడికింకా 17 ఏళ్లే! నువ్వింకా పిల్లాడివిపదేపదే పెళ్లి చేసుకోమని మెసేజ్లు చేస్తూ ఉండటంతో ఇన్స్టాగ్రామ్ వేదికగా స్పందించింది అవంతిక. కొంతకాలంగా నాకు మెసేజ్లు చేస్తూ ఉన్న ఓ చిన్ని అభిమానికి నేను ఓ విషయం చెప్పాలనుకుంటున్నాను. నీకింకా 16 లేదా 17 ఏళ్లు ఉంటాయనుకుంటా.. జీవితమంటే ఏంటో నీకింకా పూర్తిగా తెలీదు. ఏడాదికాలంగా నన్ను పెళ్లి చేసుకోమని వెంటపడుతున్నావ్.. కానీ, నువ్వింకా చిన్నపిల్లాడివి. మ్యారేజ్కు బదులుగా పరీక్షల కోసం ఆలోచించాల్సిన వయసులో ఉన్నావ్!నేను తల్లి అనుకుంటారునీకంటే నేను చాలా పెద్దదాన్ని. ఒకవేళ మనిద్దరం పెళ్లి చేసుకున్నామనుకో.. అందరూ నన్ను నీ భార్య అనుకోరు, నీ తల్లిగా పొరబడుతారు. కాబట్టి బుద్ధిగా చదువుకో.. సరైన సమయం వచ్చినప్పుడు నీ లైఫ్లోనూ మంచి లవ్స్టోరీ ప్రారంభమవుతుంది అని చెప్పుకొచ్చింది. అవంతిక.. యక్షి- ఫేత్ఫుల్లీ యువర్స్, గర, ఆలమరం వంటి పలు మలయాళ చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం ఆమె కీలక పాత్రలో నటించిన ధీరమ్ మూవీ రిలీజ్కు రెడీ అవుతోంది. ఈమె సినిమాలతో పాటు పలు సీరియల్స్ చేసింది. 2017లో అనిల్ కుమార్ను పెళ్లాడగా వీరికి రుద్రాన్ష్ అనే కుమారుడు సంతానం.చదవండి: బిగ్బాస్ 9 లో యూట్యూబ్ సెన్సేషన్? ఒక్క పోస్ట్తో తేల్చేసిందిగా! -
'పుష్ప'గాడి రూల్.. అవార్డ్స్లో అల్లు అర్జున్ ఆధిపత్యం
దుబాయ్లో జరుగుతున్న సైమా అవార్డ్స్ (South Indian International Movie Awards 2025) వేడుకలో ఐకాన్స్టార్ అల్లు అర్జున్ సత్తా చాటారు. పుష్ప2 సినిమాకు గాను ఉత్తమ నటుడిగా ఆయన అవార్డ్ సొంతం చేసుకున్నారు. సైమా నుంచి ఇప్పటి వరకు ఐదు అవార్డ్స్ బన్నీకి లభించాయి. గతంలో సన్నాఫ్ సత్యమూర్తి (2015), రుద్రమదేవి (2016), అలా వైకుంఠపురంలో (2021),పుష్ప (2022) చిత్రాలకు సంబంధించి అవార్డ్ దక్కించుకున్న విషయం తెలిసిందే. కొద్దిరోజుల క్రితమే దుబాయ్లో జరిగిన 'గామా' అవార్డ్స్ -2025లో కూడా బన్నీ సత్తా చాటారు. 'గామా' నుంచి బెస్ట్ యాక్టర్ (పుష్ప 2) అవార్డును తొలిసారి అందుకున్నారు. ఆపై తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించిన గద్దర్ అవార్డ్స్-2025లో కూడా అల్లు అర్జున్ రికార్డ్ క్రియేట్ చేశారు. ఉత్తమ నటుడిగా గద్దర్ తొలి అవార్డ్ అందుకుని తెలంగాణ చరిత్ర పుటల్లో చేరారు. అల్లు అర్జున్ తన కెరీర్లో 20కి పైగా ఎంతో ప్రతిష్టాత్మక అవార్డులు అందుకున్నారు. ఇది ఆయన నటనా ప్రతిభకు నిదర్శనమని చెప్పవచ్చు.పుష్ప2 ఖాతాలో సైమా అవార్డ్స్సైమా అవార్డ్స్-2025లో 'పుష్ప2' చిత్రం పంట పండింది. ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్, ఉత్తమ నటిగా రష్మిక మందన్నా, ఉత్తమ దర్శకుడిగా సుకుమార్, ఉత్తమ సంగీత దర్శకుడిగా దేవి శ్రీ ప్రసాద్, ఉత్తమ సింగర్గా శంకర్ బాబు కందుకూరి (పీలింగ్స్) పాటకు అందుకున్నారు. ఏకంగా ఈ చిత్రానికి 5 అవార్డ్స్ రావడం విశేషం.అల్లు అర్జున్కు అవార్డ్స్.. సీక్రెట్ ఏంటి..?గత ఐదేళ్లుగా అల్లు అర్జున్ పేరు దేశవ్యాప్తంగా ఒక సంచలనం.. సినిమా కలెక్షన్స్తో పాటు అనేక రికార్డ్స్ను దాటుకుంటూ ముందుకు వెళ్తున్నారు. అల్లు అర్జున్కు అవార్డులు రావడానికి గల కారణాలు చాలా ఉన్నాయి. ఆయన నటనలో అభినయం, శ్రమ, వైవిధ్యం కనిపిస్తాయి. ప్రేక్షకుల మనసు గెలుచుకునేందుకు తన శక్తిని అంతా ఉపయోగిస్తారు. ఆయన నటనా ప్రస్థానమే కాకుండా.. పాత్రల ఎంపిక ఆపై సినిమా ఏదైనా సరే అందులో ఆయన చూపించే మెథడ్ యాక్టింగ్ తనను ప్రత్యేకంగా నిలబెట్టాయి. పాత్ర కోసం ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్, డ్యాన్స్ ప్రాక్టీస్, యాసలు నేర్చుకోవడం వంటి అంశాలపై ఆయన చేసిన కృషి.. ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. పుష్ప పాత్రలో అల్లు అర్జున్ ఒదిగిపోయే విధానం ఏకంగా జాతీయ స్థాయిలో గుర్తింపు పొందేలా చేసింది. అల్లు అర్జున్కి అవార్డులు రావడం కేవలం గెలుపు మాత్రమే కాదు.. తెలుగు సినిమా స్థాయిని దేశవ్యాప్తంగా పెంచిన ఘనత కూడా అని చెప్పవచ్చు.నటన, డ్యాన్స్తో ఆధిపత్యం ఆర్యలో అమాయక ప్రేమికుడిగా కనిపించిన బన్నీ.. వేదంలో స్ట్రీట్ కుర్రాడిగా మెప్పించారు. రుద్రమదేవిలో గోన గన్నా రెడ్డి పాత్రలో తెలుగు చరిత్రకు ప్రాణం పోసినట్టు చేశారు. పుష్పలో చిత్తూరు యాస, మాస్ బాడీ లాంగ్వేజ్తో దేశవ్యాప్తంగా ఉన్న గ్రామీణ గడ్డపై ఆధిపత్యం చూపించారు. పుష్పలో “తగ్గేదే లే” అనే డైలాగ్కి ఆయన ఇచ్చిన ఎమోషనల్ వెయిట్ మామూలుగా ఉండదు. ఇలా ప్రతి సినిమాలో కూడా తన ప్రత్యేకతను చూపారు. అల్లు అర్జున్కి 'ఇండియా బెస్ట్ డాన్సర్' అనే ట్యాగ్ రావడానికి కారణం వెండితెరపై ఆయన వేసిన స్టెప్పులని చెప్పవచ్చు. బుట్ట బొమ్మ, సీటీ మార్, టాప్ లేచిపోద్ది వంటి పాటల్లో స్పీడ్, గ్రేస్, కంట్రోల్ అన్నీ కలిపి మనకు ఒకేసారి చూపిస్తారు. అల్లు అర్జున్ తెలుగు ప్రేక్షకులకే కాదు, మలయాళం, తమిళం, హిందీ ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యారు. బన్ని నటనా శైలి అంటే ఒకే ఫార్ములా కాదు.. ప్రతి పాత్రకు తనదైన శైలి, శక్తికి మించిన శ్రమతో ప్రాణం పోసేలా కష్టపడం ఆయన ప్రత్యేకత. అందుకే ఆయనకు అవార్డులతో పాటు అభిమానుల గుండెల్లో స్థానం సంపాదించుకున్నారు. -
మురిసె... మెరిసె...
ఓనమ్ పండగ ఆనందంలో మాత్రమే కాదు... సక్సెస్ సంబరంలోనూ ఉన్నారు మాళవికా మోహనన్. మోహన్లాల్ హీరోగా మాళవికా మోహనన్ హీరోయిన్గా నటించిన మలయాళ చిత్రం ‘హృదయపూర్వం’ ఇటీవల విడుదలై, సూపర్ హిట్గా నిలిచింది. దీంతో జోష్గా పండగ చేసుకున్నారు మాళవిక. మరో మాట.. ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘ది రాజాసాబ్’తో తెలుగులోకి వస్తున్నారీ బ్యూటీ. ఈ సినిమా జనవరి 9న విడుదల కానుంది. ⇒ ‘8 వసంతాలు’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు అనంతికా సనీల్కుమార్. ఈ యంగ్ బ్యూటీ ఓనమ్ సెలబ్రేషన్స్ను కాస్త ముందుగా మొదలుపెట్టి, ఆ ఫొటోలు షేర్ చేసి, ఆనందాన్ని వ్యక్తపరిచారు. ⇒ తెలుగు ప్రేక్షకుల ప్రేమను ఆల్రెడీ గెలుచుకున్న హీరోయిన్ కృతీ శెట్టి ప్రస్తుతం తమిళ సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రేమ, శాంతి, ఆనందం... మనందరి జీవితాల్లో నెలకొనాలనే ఆకాంక్షను వ్యక్తపరిచారీ బ్యూటీ. ⇒ అరడజను సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు హీరోయిన్ సంయుక్త. అయినా పండగకి ఓ కాల్షీట్ కేటాయించారీ సుందరి. ఓనమ్ ఫెస్టివల్ను సంతోషంగా జరుపుకుని, అందరికీ ఓనమ్ శుభాకాంక్షలు తెలిపారు. ⇒ ఒకప్పటి హీరోయిన్ మీనా గురించి ప్రత్యేకంగా చెప్పేది ఏముంది. సక్సెస్ఫుల్ హీరోయిన్గా మీనా గురించి, తెలుగు ప్రేక్షకులకు తెలుసు. మీనా ఓనమ్ ఫెస్టివల్ను సెలబ్రేట్ చేసి, ఆ ఫొటోలను షేర్ చేశారు. ఇక వెంకటేశ్ కాంబినేషన్లో మీనా నటించనున్న ‘దృశ్యం 3’ సినిమా ఈ నవంబరులో ప్రారంభం కానుంది. ఇంకా హీరోయిన్లు మడోనా సెబాస్టియన్, అంజు కురియన్, అనిఖా సురేంద్రన్ వంటి మరికొందరు ఓనమ్ పండగను జరుపుకున్నారు. కొందరు పండగ రోజున, మరికొందరు ప్రీ ఫెస్టివల్ సెలబ్రేషన్స్ అంటూ సందడి చేశారు. -
వీర చంద్రహాస సిద్ధం
ప్రముఖ నటుడు శివ రాజ్కుమార్ కీలక పాత్రలో నటించిన చిత్రం ‘వీర చంద్రహాస’. ‘కేజీఎఫ్, సలార్’ వంటి చిత్రాల సంగీతదర్శకుడు రవి బస్రూర్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. శిథిల్ శెట్టి ఓ లీడ్ రోల్లో హోంబలే ఫిల్మ్స్ సమర్పణలో ఎన్ఎస్ రాజ్కుమార్ నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 18న కన్నడలో విడుదలై, హిట్గా నిలిచింది.ఈ సినిమాని ఈ నెల 19న తెలుగులో విడుదల చేస్తున్న ఎమ్వీ రాధాకృష్ణ మాట్లాడుతూ– ‘‘హోంబలే ఫిల్మ్స్పై ఇటీవల విడుదలై, సూపర్ హిట్గా నిలిచిన ‘మహావతార్ నరసింహ’ చిత్రం తరహాలోనే ‘వీర చంద్రహాస’ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని నమ్ముతున్నాం’’ అని తెలిపారు. రవి బస్రూర్ మాట్లాడుతూ– ‘‘వీర చంద్రహాస’ అనేది మహాభారతంలోని అశ్వమేధిక పర్వంలోని కథ. ఇది ఒక అనాథ కుర్రాడి గొప్ప కథను చెబుతుంది’’ అన్నారు. -
46 ఏళ్ల వయసులో తండ్రి కాబోతున్న స్టార్ కమెడియన్
సినిమా ఇండస్ట్రీలో చాలామంది పెళ్లి విషయంలో ఆలస్యం చేస్తుంటారు. కొందరు పూర్తిగా చేసుకోకుండా కూడా ఉండిపోతుంటారు. అయితే తమిళ స్టార్ కమెడియన్ ప్రేమ్ జీ మాత్రం 45 ఏళ్ల వయసులో గతేడాది సింపుల్గా వివాహం చేసుకున్నాడు. ఇందు అనే అమ్మాయిని ప్రేమించి ఇప్పుడు కొత్త జీవితాన్ని ప్రారంభించాడు. ఏడాది పూర్తయిందో లేదో శుభవార్త చెప్పేశాడు.(ఇదీ చదవండి: రెండు వారాలకే ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమా)గతేడాది జూన్లో ఇందుని పెళ్లి చేసుకున్న కమెడియన్ ప్రేమ్ జీ.. ఇప్పుడు తండ్రి కాబోతున్నాడు. తాజాగా ఇందుకి సీమంతం చేశారు. అందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ మేరకు ఇందు-ప్రేమ్ జీ దంపతులకు తోటీ నటీనటులు శుభాకాంక్షలు చెబుతున్నారు.ప్రేమ్జీ విషయానికొస్తే.. ఇతడు ప్రముఖ సంగీత దర్శకుడు గంగై అమరన్ కుమారుడు. తండ్రిలానే తొలుత సంగీత రంగంలోకి వచ్చాడు. యువన్ శంకర్ రాజా దగ్గర కెరీర్ మొదలుపెట్టాడు. ప్లే బ్యాక్ సింగర్గా ర్యాప్ సాంగ్స్ పాడాడు. కానీ 2006లో వల్లవన్ మూవీతో నటుడిగా మారాడు. ఇతడి సోదరుడు, డైరెక్టర్ వెంకట్ ప్రభు తీసిన 'చెన్నై 600028' సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ చిత్రం సూపర్ హిట్ అవడంతో పాటు కమెడియన్గా ప్రేమ్జీకి మంచి క్రేజ్ తీసుకొచ్చింది.(ఇదీ చదవండి: శివకార్తికేయన్ 'మదరాసి' సినిమా రివ్యూ) -
ఓనం స్పెషల్.. మలయాళ బ్యూటీస్ అందం చూడతరమా?
మలయాళీలు ఎంతో ఇష్టంగా సెలబ్రేట్ చేసుకునే ఓనం వచ్చేసింది. దీంతో తెలుగు ఇండస్ట్రీలో సినిమాలు చేసే మలయాళ బ్యూటీస్తో పాటు దక్షిణాది చిత్రాల్లో నటించే పలువురు బ్యూటీస్.. అందమైన చందమామల్లా రెడీ అయిపోయారు. సోషల్ మీడియాలో ఫొటోలు షేర్ చేశారు. వీరిలో మాళవిక మోహనన్, సంయుక్త, ఐశ్వర్య లక్ష్మి, అపర్ణ బాలమురళి, సానియా అయ్యప్పన్ తదితరులు ఉన్నారు. మీరు ఆ ఫొటోలపై ఓ లుక్కేయండి. View this post on Instagram A post shared by Malavika Mohanan (@malavikamohanan_) View this post on Instagram A post shared by Aparna Das💃🏻 (@aparna.das1) View this post on Instagram A post shared by ISWARYA MENON (@iswarya.menon) View this post on Instagram A post shared by Samyuktha (@iamsamyuktha_) View this post on Instagram A post shared by Aparna Balamurali✨ (@aparna.balamurali) View this post on Instagram A post shared by Aishwarya Lekshmi (@aishu__) View this post on Instagram A post shared by Athulyaa Ravi (@athulyaofficial) View this post on Instagram A post shared by Mirnalini Ravi (@mirnaliniravi) View this post on Instagram A post shared by Sakshi Agarwal |Actress |Fitness & Lifestyle (@iamsakshiagarwal) View this post on Instagram A post shared by Gouri G Kishan (@gourigkofficial) View this post on Instagram A post shared by Mirnaa (@mirnaaofficial) View this post on Instagram A post shared by Saniya (@_saniya_iyappan_) View this post on Instagram A post shared by Krithi Shetty (@krithi.shetty_official) -
సెంచరీలతో స్టార్ హీరో దూకుడు.. మరో హాఫ్ సెంచరీ!
ప్రేక్షకుల్ని మెప్పించడం, వరుస విజయాలు అందుకోవడం అంత ఈజీ కాదు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే కొన్నిసార్లు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడుతుంటారు. కానీ ఈ సీనియర్ హీరో మాత్రం అదంతా తనకు మామూలు విషయం అన్నట్లుగా వరుస హిట్లతో స్పీడుమీదున్నాడు. ఆయనే మలయాళ స్టార్ మోహన్లాల్ (Mohanlal). 2025లో ఇప్పటివరకు మూడు హిట్స్మోహన్లాల్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ చిత్రం హృదయపూర్వం. సత్యన్ అంతికడ్ దర్శకత్వం వహించిన ఈ మూవీ రూ.50 కోట్ల క్లబ్లో చేరింది. ఈ విషయాన్ని చిత్రయూనిట్ వెల్లడించింది. దీనికంటే ముందు మోహన్లాల్ ఈ ఏడాది ఎంపురాన్ (లూసిఫర్ సీక్వెల్), తుడరుమ్ సినిమాలతో పలకరించాడు. ఈ రెండు కూడా మంచి విజయాలే అందుకున్నాయి. కేవలం రూ.28 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన తుడరుమ్ ఏకంగా రూ.230 కోట్లు వసూలు చేసింది. హృదయపూర్వం సినిమా స్టిల్మలయాళ ఇండస్ట్రీలోనే అత్యధికంరూ.150 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఎంపురాన్ ఏకంగా రూ.260 కోట్లు సాధించింది. మలయాళ చరిత్రలోనే రూ.250 కోట్లు దాటిన మొట్టమొదటి చిత్రంగా ఎంపురాన్ రికార్డు సృష్టించింది. ఓపక్క హీరోలు ఒక్క హిట్టు కోసం పరితపిస్తుంటే.. మోహన్లాల్ మాత్రం కేవలం ఆరు నెలల్లోనే వరుసగా మూడు హిట్లు సాధించి అందరూ ఆశ్చర్యపోయేలా చేశాడు.నెక్స్ట్ ఏంటి?మోహన్లాల్ నెక్స్ట్ మూవీ ‘వృషభ’ ఈ ఏడాది అక్టోబరు 16న రిలీజ్ కానుంది. ఇందులో హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ మేక కీలక పాత్ర పోషించాడు. ఈ పాన్ ఇండియా సినిమాకు నందకిశోర్ దర్శకత్వం వహించారు. అలాగే సూపర్ హిట్ థ్రిల్లర్ ఫ్రాంచైజీ 'దృశ్యం పార్ట్ 3'లోనూ మోహన్లాల్ భాగం కానున్నాడు. ఈ మూవీ వచ్చే నెలలోనే ప్రారంభం కానుంది. View this post on Instagram A post shared by Mohanlal (@mohanlal) చదవండి: మజిలీ తర్వాత మారిపోయా.. లవ్స్టోరీ మిస్సవుతున్నా.. -
ఆ హీరోయిన్ నాకు చెల్లెలు లాంటిది: దుల్కర్ సల్మాన్
‘‘కల్యాణి ప్రియదర్శన్ నాకు చెల్లిలాంటిది. మేమిద్దరం ఒకేలా ఉంటాం, ఒకేలా ఆలోచిస్తాం. చంద్ర పాత్ర కోసం తను తప్ప మా మైండ్లోకి వేరే ఎవరి పేరు రాలేదు. నన్ను ఎలాగైతే మీవాడిగా భావించారో అలాగే నేను నిర్మించిన ‘కొత్త లోక’ చిత్రాన్ని కూడా మీ సినిమాగా భావించి ఆదరిస్తున్నందుకు తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు’’ అని దుల్కర్ సల్మాన్ అన్నారు. కల్యాణీ ప్రియదర్శన్ లీడ్ రోల్లో, నస్లెన్ కీలక పాత్రలో నటించిన మలయాళ చిత్రం ‘లోక చాప్టర్ 1: చంద్ర’. ఈ మూవీ వారం రోజుల్లోనే రూ.100 కోట్లు వసూలు చేసింది.బడ్జెట్ గురించి ఆలోచించలేడొమినిక్ అరుణ్ దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ నిర్మించిన ఈ చిత్రాన్ని తెలుగులో ‘కొత్త లోక’ పేరుతో ఆగస్టు 29న నిర్మాత సూర్యదేవర నాగవంశీ విడుదల చేశారు. హైదరాబాద్లో నిర్వహించిన ఈ చిత్ర విజయోత్సవానికి దర్శకులు నాగ్ అశ్విన్, వెంకీ అట్లూరి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా దుల్కర్ సల్మాన్ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా బడ్జెట్ తక్కువని మీరు అనుకోవచ్చు. కానీ, మలయాళ పరిశ్రమలో ఈ బడ్జెట్ చాలా ఎక్కువ. అయితే నేను బడ్జెట్ గురించి ఆలోచించలేదు. డైరెక్టర్, డీఓపీ మధ్య బాండింగ్ బాగుంటే మంచి సినిమాలు చేయొచ్చు’’ అని చెప్పారు. రూ.30 కోట్లు ఎక్కువనాగ్ అశ్విన్ మాట్లాడుతూ.. ‘‘అందరిలాగే నేను కూడా ఈ సినిమా రెండో భాగం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను’’ అని పేర్కొన్నారు. ‘‘ఈ సినిమా ప్రారంభించినప్పుడు మలయాళంలో రూ.30 కోట్లు అనేది చాలా ఎక్కువ. నిర్మాతగా ధైర్యం చేసిన దుల్కర్ సల్మాన్ని అభినందించాలి’’ అన్నారు వెంకీ అట్లూరి. ‘‘ఇలాంటి సూపర్ హీరో సినిమాని డిస్ట్రిబ్యూట్ చేయడం హ్యాపీగా ఉంది’’ అన్నారు నాగవంశీ. కల్యాణీ ప్రియదర్శన్ మాట్లాడుతూ– ‘‘మా సినిమాకి, మాకు ఇంత పెద్ద హిట్ ఇచ్చిన తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు’’ అని తెలిపారు. ‘‘తెలుగు ప్రేక్షకులు మా సినిమాపై కురిపిస్తున్న ప్రేమకు హ్యాపీగా ఉంది’’ అన్నారు డొమినిక్ అరుణ్. తండ్రి రియాక్షన్ ఇదే!ఈ చిత్రాన్ని తమిళనాడులో ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ సంస్థ విడుదల చేసింది. గురువారం మధ్యాహ్నం చైన్నెలో సక్సెస్ మీట్ నిర్వహించారు. ఇందులో కల్యాణి ప్రియదర్శన్ మాట్లాడుతూ.. యాక్షన్ హీరోగా నటించనున్నట్లు తండ్రి ప్రియదర్శన్కు చెప్పగా నువ్వా.. యాక్షన్ హీరో పాత్రలోనా! అని ఆశ్చర్యపోయారన్నారు. ఆ తరువాత చెయ్యి, కాళ్లు, చేతులు విరగ్గొట్టుకోకుండా ఉంటే సరి అని అన్నారన్నారు.చదవండి: కమెడియన్కు పక్షవాతం.. నటుడి ఆర్థిక సాయం -
అభిమానులకు ఐకాన్ స్టార్ స్పెషల్ విషెస్.. ట్వీట్ వైరల్!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్కు క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పుష్ప తర్వాత పాన్ ఇండియా నుంతి పాన్ వరల్డ్ రేంజ్కు ఎదిగిపోయారు. పుష్ప-2 మూవీతో బాక్సాఫీస్ రికార్డ్స్ను షేక్ చేశారు. దేశంలోని అత్యధిక వసూళ్లు సాధించిన రెండో చిత్రంగా నిలిచింది. అల్లు అర్జున్కు తెలుగులో మాత్రమే కాదు.. కేరళలో ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. ఐకాన్ స్టార్ సినిమా వచ్చిందంటే చాలు మలయాళీలు థియేటర్లకు క్యూ కడతారు. అంతలా మాలీవుడ్లోనూ క్రేజ్ ఉన్న టాలీవుడ్ హీరో మన ఐకాన్ స్టారే.ఇవాళ కేరళలో ప్రతిష్టాత్మక ఓనం పండుగ కావడంతో అల్లు అర్జున్ శుభాకాంక్షలు తెలిపారు. మలయాళీలందరికీ హృదయపూర్వక ఓనం పండుగ శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశారు. ఈ పండుగ మీ శ్రేయస్సు, శాంతితో కొత్త ప్రారంభానికి నాంది పలకాలని ఆకాంక్షించారు. ఇట్లు మీ దత్తపుత్రుడు అంటూ అల్లు అర్జున్ పోస్ట్ చేశారు. ఇది చూసిన మలయాళ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.ఇక సినిమాల విషయానికొస్తే అల్లు అర్జున్ ప్రస్తుతం కోలీవుడ్ డైరెక్టర్ అట్లీతో జతకట్టారు. వీరిద్దరి కాంబోలో వస్తోన్న మొదటి చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.Heartfelt Onam wishes to all Malayalis!May this Onam mark a new beginning filled with prosperity and peace. 🤍🙏🏽Your adopted son pic.twitter.com/c1EIxyc76S— Allu Arjun (@alluarjun) September 5, 2025 -
వరుసగా మూడు రోజుల సెలవులు.. ఓటీటీల్లో ఒక్కరోజే 15 సినిమాలు!
చూస్తుండగానే మరో వీకెండ్ వచ్చేస్తోంది. అంతేకాకుండా వరుసగా మూడు రోజులు సెలవులు వచ్చేశాయి. దీంతో సినీ ప్రియులు కొత్త మూవీస్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక థియేటర్ల విషయానికొస్తే అనుష్క శెట్టి ఘాటి, శివ కార్తికేయన్ మదరాసితో పాటు లిటిల్ హార్ట్స్ లాంటి చిత్రాలు సందడి చేయనున్నాయి. వీటిలో అనుష్క ఘాటిపైనే ఎక్కువగా అంచనాలు నెలకొన్నాయి. ఇక వీటి సంగతి పక్కనపెడితే శుక్రవారం వచ్చిందంటే చాలు.. ఓటీటీలకు సినిమాలు క్యూ కడుతుంటాయి. ఈ శుక్రవారం కూడా బోలెడు సినిమాలు, వెబ్ సిరీస్లు స్ట్రీమింగ్కు వచ్చేందుకు రెడీ అయిపోయాయి. ఇప్పటికే కన్నప్ప ఓటీటీలో సందడి చేస్తుండగా.. మాలిక్, ఇన్స్పెక్టర్ జెండే లాంటి సినిమాలు ఆసక్తి పెంచుతున్నాయి. వీటితో మరికొన్ని డబ్బింగ్ చిత్రాలు, వెబ్ సిరీస్లు అలరించేందుకు వచ్చేస్తున్నాయి. ఏయే సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో మీరు కూడా ఓ లుక్కేయండి.నెట్ఫ్లిక్స్ఇన్స్పెక్టర్ జెండే (హిందీ మూవీ) - సెప్టెంబరు 05క్వీన్ మాంటిస్-(కొరియన్ మూవీ)- సెప్టెంబరు 05లవ్ కాన్ రివేంజ్-(డాక్యుమెంటరీ సిరీస్)- సెప్టెంబరు 05డాక్టర్ సెస్ రెడ్ ఫిష్, బ్లూ ఫిష్(యానిమేషన్ చిత్రం)- సెప్టెంబరు 05జియో హాట్స్టార్సు ఫ్రమ్ సో(సులోచన ఫ్రమ్ సోమేశ్వరం)- సెప్టెంబర్ 05(రూమర్ డేట్)ఎన్సీఐఎస్-టోని అండ్ జీవా(హాలీవుడ్ మూవీ)- సెప్టెంబర్ 05ఏ మైన్క్రాఫ్ట్ -(హాలీవుడ్ మూవీ)- సెప్టెంబర్ 05ది పేపర్- (హాలీవుడ్ మూవీ)- సెప్టెంబర్ 05అమెజాన్ ప్రైమ్మాలిక్- (హిందీ మూవీ)- సెప్టెంబర్ 05డిష్ ఇట్ అవుట్-(ఒరిజినల్ సిరీస్)-సెప్టెంబర్ 05సన్ నెక్స్ట్ ఫుటేజ్ (మలయాళ సినిమా) - సెప్టెంబరు 05జీ5 అంఖోన్ కీ గుస్తాకియాన్ (హిందీ మూవీ) - సెప్టెంబరు 05 కమ్మట్టం (మలయాళ సిరీస్) - సెప్టెంబరు 05ఆపిల్ ప్లస్ టీవీ హైయస్ట్ టూ లోయెస్ట్ (ఇంగ్లీష్ సినిమా) - సెప్టెంబరు 05ఎమ్ఎక్స్ ప్లేయర్ రైజ్ అండ్ ఫాల్ (హిందీ సిరీస్) - సెప్టెంబరు 06లయన్స్ గేట్ ప్లేలాక్డ్- (హాలీవుడ్ థ్రిల్లర్ మూవీ)- సెప్టెంబరు 05 -
500 ఎకరాల నుంచి అంతా పోగొట్టుకుని.. సైలెన్సర్ స్టోరీ ఇదే!
కొన్ని సినిమాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. అలాగే కొన్ని పాత్రలు ఎప్పుడు గుర్తు చేసుకున్నా పెదవులపై చిరునవ్వు వస్తుంటుంది. అలాంటి పాత్రలో నటించి సినిమా విజయంలో భాగమయ్యాడు సత్యన్ (Tamil Actor Sathyan). ఇతడు స్నేహితుడు (తమిళంలో నంబన్) మూవీలో సైలెన్సర్గా నటించాడు. క్లాస్ ఫస్ట్ వచ్చేయాలని తెగ కష్టపడే ఇతడిని హీరో ముప్పుతిప్పలు పెడుతూ ఉంటాడు. ఈ సన్నివేశాలు చూసి ప్రేక్షకులు పొట్టచెక్కలయ్యేలా నవ్వుతుంటారు.500 ఎకరాల ఆసామిఇదే కాదు, రాజా రాణి, తుపాకి, గజిని, పులి, రాధే శ్యామ్, జిగర్తాండ డబుల్ ఎక్స్.. ఇలా 70కిపైగా సినిమాల్లో నటించాడు. నిర్మాత మదంపట్టి శివకుమార్ ఏకైక కుమారుడే సత్యన్. శివకుమార్కు 500 ఎకరాల పొలం, ఐదు ఎకరాల విస్తీర్ణంలో పెద్ద బంగ్లా ఉండేవి. విలాసవంతమైన జీవితం గడిపేవారు. కానీ పైకి కలర్ఫుల్గా కనిపించే సినిమా ప్రపంచం ఆ ఆస్తిని కర్పూరంలా కరిగించేసింది. శివకుమార్ నిర్మాతగా మారడంతోనే కష్టాలు మొదలయ్యాయి. సినిమాలు తీసి చేతులు కాల్చుకున్నాడు, భారీ నష్టాలు మూటగట్టుకున్నాడు. దాన్నుంచి గట్టెక్కే క్రమంలో ఆస్తులు కూడా అమ్ముకున్నాడు.హీరోగా అట్టర్ ఫ్లాప్నిజానికి సత్యన్ కమెడియన్ అవుదామని ఇండస్ట్రీకి రాలేదు. 2000వ సంవత్సరంలో ఇలయవన్ అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. తండ్రి నిర్మాతగా వ్యవహరించాడు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద దారుణ ఫలితాల్ని ఎదుర్కొంది. కొడుకును హీరోగా పెట్టి 'కన్న ఉన్నై తెడుకిరెన్' అని మరో సినిమా చేయగా అది కూడా ఘోర పరాజయం పాలైంది. ఈ రెండు ఫ్లాపులు వారి కుటుంబాన్ని ఆర్థికంగా మరింత దెబ్బతీశాయి. తండ్రి మరణం తర్వాత పరిస్థితి మరింత అధ్వాణ్నంగా మారడంతో సత్యన్.. బంగ్లాను కూడా అమ్మక తప్పలేదు.టాప్ కమెడియన్.. అయినా!హీరోగా కలిసొచ్చేలా లేదని సత్యన్ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్గానే స్థిరపడిపోయాడు. కమెడియన్గా, హీరో ఫ్రెండ్ పాత్రలు చేసుకుంటూ పోతున్నాడు. స్నేహితుడు, రాజా రాణి వంటి చిత్రాలు అతడిని టాప్ కమెడియన్గా నిలబడెట్టాయి. కానీ పోగొట్టుకున్న ఆస్తులు మాత్రం తిరిగి సంపాదించుకోలేకపోయాడు. ప్రముఖ నటుడు సత్యరాజ్ ఇతడికి దగ్గరి బంధువు అవుతాడు. సత్యరాజ్ ఇండస్ట్రీకి వచ్చిన తొలినాళ్లలో సత్యన్ తండ్రే పాకెట్మనీ ఇచ్చేవాడు!చదవండి: అంత భయం దేనికి? విజయ్ దేవరకొండకు కౌంటర్! -
జెర్సీ హీరోయిన్ తొలి వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఈ ఏడాది సంక్రాంతికి టాలీవుడ్ ప్రియులను అలరించిన హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్. బాలయ్య హీరోగా వచ్చిన డాకు మహారాజ్ చిత్రంతో అభిమానులను ఆకట్టుకుంది. ఒకవైపు సినిమాలతో బిజీగా ఉన్న ముద్దుగుమ్మ.. ఓటీటీలోనూ ఎంట్రీ ఇస్తోంది. శ్రద్ధా శ్రీనాథ్ నటించిన లేటేస్ట్ వెబ్ సిరీస్ ది గేమ్: యు నెవర్ ప్లే అలోన్. ఈ సిరీస్కు రాజేశ్ ఎం. సెల్వ దర్శకత్వం వహించారు.తాజాగా ది గేమ్ యు నెవర్ ప్లే అలోన్ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ డేట్ను మేకర్స్ ప్రకటించారు. ప్రముఖ ఓటీటీ నెట్ఫ్లిక్స్ ఓరిజినల్ సిరీస్గా తెరకెక్కించారు. దసరా కానుకగా అక్టోబర్ 2న ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానున్నట్లు నెట్ఫ్లిక్స్ తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. గేమ్ డెవలపర్ జీవితంలో ఇది క్లిష్టమైన సమయం అంటూ శ్రద్ధా శ్రీనాథ్ పోస్టర్ను పంచుకుంది. అయితే ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అవుతుందనేది మాత్రం చెప్పలేదు. తనకు ఎదురైన సవాళ్లను మహిళా గేమ్ డెవలపర్ ఎలా అధిగమించిందన్న పాయింట్తో రూపొందిన సిరీస్ను రూపొందించారని పోస్టర్ చూస్తేనే అర్థమవుతోంది. ఈ సిరీస్లో సంతోశ్ ప్రతాప్, చాందిని కీలక పాత్రలు పోషించారు.Oru game developer oda life la hardest level idhuva thaan irukum. Watch The Game, out 2 October, only on Netflix.#TheGameOnNetflix@NetflixIndia @ApplauseSocial @nairsameer @SegalDeepak @CheruvalathP #AmalgaCreationsMedias @RajeshMSelva @ShraddhaSrinath @ActorSanthosh pic.twitter.com/hKFzPxFMIU— Shraddha Srinath (@ShraddhaSrinath) September 4, 2025Oru game developer oda life la hardest level idhuva thaan irukumWatch The Game, out 2 October, only on Netflix.#TheGameOnNetflix pic.twitter.com/Op3JfnSWWv— Netflix India South (@Netflix_INSouth) September 4, 2025 -
అఫీషియల్: ఓటీటీలో 'కూలీ' రిలీజ్ ఎప్పుడంటే?
రజనీకాంత్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ కూలీ (Coolie Movie). టాలీవుడ్ నుంచి నాగార్జున, బాలీవుడ్ నుంచి ఆమిర్ ఖాన్, మాలీవుడ్ నుంచి సౌబిన్ షాహిర్, సాండల్వుడ్ నుంచి ఉపేంద్ర కీలక పాత్రలు పోషించారు. భారీ తారాగణంతో ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మిక్స్డ్ టాక్ను అందుకుంది. టాక్ సంగతి ఎలా ఉన్నా.. కలెక్షన్లు మాత్రం బాగానే వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా రూ.500 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఓటీటీ డేట్ వచ్చేసిందిఅయితే వెయ్యికోట్ల మైలురాయి మాత్రం అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. తాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ప్రకటించారు. సెప్టెంబర్ 11న అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు స్పెషల్ పోస్టర్ వదిలారు. తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో కూలీ అందుబాటులోకి రానుందని తెలిపారు. అయితే హిందీ రిలీజ్ గురించి మాత్రం ఎటువంటి అప్డేట్ ఇవ్వలేదు. అంటే కూలీ హిందీ వర్షన్ మరో ఓటీటీ ప్లాట్ఫామ్లోకి రానుందని తెలుస్తోంది.సినిమాకూలీ సినిమా విషయానికి వస్తే.. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో రజనీ హీరోగా నటించాడు. సన్ పిక్చర్స్ బ్యానర్పై కళానిధి మారన్ నిర్మించాడు. శృతి హాసన్, సత్యరాజ్, రచిత రామ్ ముఖ్య పాత్రలు పోషించారు. హీరోయిన్ పూజా హెగ్డే మోనికా అనే స్పెషల్ సాంగ్లో స్టెప్పులేసింది. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించాడు. View this post on Instagram A post shared by prime video IN (@primevideoin) చదవండి: అల్లు అర్జున్ సినిమాలో యాక్ట్ చేశా.. నా భార్య తిట్టింది: నిర్మాత -
అందుకే మదరాసి టైటిల్ పెట్టాను: ఏఆర్ మురుగదాస్
‘‘మామూలుగా మన దక్షిణాది వారిని ఉత్తరాదిలో మదరాసి అని పిలుస్తుంటారు. ‘మదరాసి’ చిత్రం ఎక్కువగా విలన్ పాయింట్ ఆఫ్ వ్యూలో సాగుతుంది. ఈ మూవీలో హీరోని మదరాసి అని పిలుస్తుంటాడు విలన్. అందుకే టైటిల్ ‘మదరాసి’ అని పెట్టాను’’ అని డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ తెలిపారు. శివ కార్తికేయన్, రుక్మిణీ వసంత్ జోడీగా విద్యుత్ జమాల్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘మదరాసి’. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ నెల 5న విడుదల కానుంది. ఈ చిత్రాన్ని తెలుగులో శ్రీ లక్ష్మీ మూవీస్ రిలీజ్ చేస్తోంది. ఈ నేపథ్యంలో మురుగదాస్ మాట్లాడుతూ– ‘‘వెస్ట్రన్ కంట్రీస్లో ఇప్పటికే ఉన్న సమస్యలు, మన దేశంలోకి వస్తున్న ఓ కొత్త సమస్యను బేస్ చేసుకుని ‘మదరాసి’ కథ రాశాను. ఈ కథ మొత్తం తమిళనాడు నేపథ్యంలో సాగుతుంది. అయినప్పటికీ ఇందులోని కంటెంట్, కథ అన్ని ప్రాంతాలకు కనెక్ట్ అవుతుంది. ఈ కథ చెప్పిన వెంటనే శివ కార్తికేయన్ ఒప్పుకున్నారు. ప్రస్తుతం ఆయనకు మాస్లో మంచి ఇమేజ్ ఉంది. అలాంటి మాస్ హీరోతో నేను చెప్పాలనుకున్న ఈ పాయింట్ను చెబితే ఎక్కువ రీచ్ అవుతుంది. విద్యుత్ జమాల్ ప్రస్తుతం హీరోగా చేస్తున్నారు. అయితే ‘మదరాసి’ కథ నచ్చడంతో విలన్గా చేసేందుకు ఒప్పుకున్నారు. శ్రీ లక్ష్మీ మూవీస్ ఎన్వీ ప్రసాద్గారితో నాకు ఎన్నో ఏళ్ల నుంచి అనుబంధం ఉంది. ఆయన ఈ మూవీ కోసం ఎంతో ఖర్చు పెట్టారు. దక్షిణాది ప్రేక్షకులు సినిమాని ఎక్కువగా ప్రేమిస్తారు. ప్రస్తుతం మన ఇండియన్ మూవీ ఇండస్ట్రీ ప్రపంచవ్యాప్తంగా సత్తా చాటుతుండటం సంతోషం. ఓ యానిమేషన్ ప్రాజెక్ట్ కోసం చాలా పని చేశాను. కానీ, చివరకు అది పట్టాలెక్కలేదు. అందువల్లే దాదాపు ఐదేళ్లు గ్యాప్ వచ్చింది. స్క్రిప్ట్ ఫైనలైజ్ అయ్యాక నా తర్వాతి ప్రాజెక్ట్ గురించి చెబుతాను’’ అని పేర్కొన్నారు. -
'ఆ ప్రాజెక్ట్ వల్లే ఐదేళ్ల గ్యాప్'.. మదరాసి డైరెక్టర్
కోలీవుడ్ హీరో శివ కార్తికేయన్, రుక్మిణి వసంత్ జంటగా నటించిన తాజా చిత్రం మదరాసి. ఈ మూవీకి ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా ఆడియన్స్ను అలరించేందుకు వచ్చేస్తోంది. తెలుగులో ఈ చిత్రాన్ని శ్రీలక్ష్మీ మూవీస్ బ్యానర్పై విడుదల చేస్తున్నారు.. సెప్టెంబర్ 5న మదరాసి థియేటర్లలో సందడి చేయనుంది.ఈ సందర్భంగా డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఈ కథలో హీరో పాత్ర చాలా భిన్నంగా ఉంటుందని తెలిపారు. ఈ కథ చెప్పిన వెంటనే శివ కార్తికేయన్కు నచ్చడంతో వెంటనే ఒప్పుకున్నారుని మురుగదాస్ వెల్లడించారు. ఈ చిత్రంలో రుక్మిణి వసంత్ పాత్ర కూడా చాలా రియలిస్టిక్గా ఉంటుందని పేర్కొన్నారు.అయితే గత ఐదేళ్లలో నేనెప్పుడూ ఖాళీగా ఉండలేదని ఏఆర్ మురుగదాస్ తెలిపారు. కానీ మధ్యలో ఓ యానిమేషన్ ప్రాజెక్ట్ కోసం చాలా పని చేసినట్లు వెల్లడించారు. దాని వల్లే చాలా సమయం వృథా అయిందని.. అందువల్లే ఐదేళ్ల గ్యాప్ వచ్చిందన్నారు. -
వద్దు వద్దంటూనే మళ్లీ హోస్ట్గా.. కన్నడ బిగ్బాస్ ఎప్పటినుంచంటే?
తెలుగు బిగ్బాస్ తొమ్మిదో సీజన్ (Bigg Boss 9 Telugu) ప్రారంభానికి రెడీ అయింది. మూడో సీజన్ నుంచి నాగార్జునే హోస్ట్గా ఉన్నాడు. ఈసారి కూడా ఆయనే వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నాడు. ఈ సీజన్ సెప్టెంబర్ 7 నుంచి ప్రారంభం కానుంది. మరోవైపు కన్నడ బిగ్బాస్ కొత్త సీజన్ కూడా ఇదే నెలలో షురూ అవనుంది. ఈ షో నేను చేయను, నా వల్ల కాదు అని కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ (Kichcha Sudeep) పక్కకు తప్పుకున్నాడు. కానీ, షో నిర్వాహకులు బతిమాలి మళ్లీ ఆయన్నే హోస్ట్గా ఒప్పించారు.ఈ నెలలోనే..ఈమేరకు ఓ ప్రోమో కూడా రిలీజ్ చేశారు. కర్ణాటక సాంప్రదాయాలు, రకరకాల మనుషులను, సినిమా, సీరియల్స్, రీల్స్.. ఇలా చాలానే చూపించారు. అవన్నీ చూస్తుండగా సడన్గా డిష్ పోతుంది. అప్పుడు కిచ్చా సుదీప్ కాఫీ చేత పట్టుకుని ఎంట్రీ ఇస్తాడు. సర్.. సెట్, కంటెస్టెంట్లు రెడీ, ఏడు కోట్ల కన్నడిగులు రెడీ.. మరి మీరు అని కొంత బెరుకుతో అమ్మాయి అడగ్గా నేనూ రెడీ అంటూ కాఫీ సిప్ చేస్తూ రెట్టింపు ఉత్సాహంతో చెప్పాడు సుదీప్. చివర్లో సెప్టెంబర్ 28 నుంచి బిగ్బాస్ ప్రారంభం అని ప్రకటించారు. View this post on Instagram A post shared by Colors Kannada Official (@colorskannadaofficial) చదవండి: ఆ బాధ భరించలేకపోతున్నా: కిచ్చా సుదీప్ భావోద్వేగం -
గెస్ట్ రోల్లో జూనియర్ ఎన్టీఆర్కే ఛాన్స్.. :శివకార్తికేయన్
తమిళ స్టార్ హీరో శివకార్తికేయన్ (Sivakarthikeyan) ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ మదరాసి (Madarasi Movie). ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో రుక్మిణి వసంత్ కథానాయికగా యాక్ట్ చేసింది. యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రం సెప్టెంబర్ 5న విడుదల కావాల్సి ఉంది. ఈ క్రమంలో హీరోయిన్ రుక్మిణి వసంత్తో కలిసి శివకార్తికేయన్ ప్రమోషన్స్కు హాజరయ్యాడు.గెస్ట్ రోల్ఈ సందర్భంగా హీరోకు ఓ ప్రశ్న ఎదురైంది. మదరాసి మూవీలో గెస్ట్ రోల్ ఉన్నట్లయితే తెలుగు ఇండస్ట్రీ నుంచి ఏ హీరోను పెట్టుకుంటారు? అని యాంకర్ సుమ అడిగింది. అందుకు శివకార్తికేయన్ ఓ క్షణం ఆలోచించి.. జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) అని బదులిచ్చాడు. మీపై వచ్చిన రూమర్స్ గురించి చెప్పండి అని సుమ అడిగింది. అందుకు హీరో.. అమరన్ మూవీ టైంలో నేను 8 ప్యాక్ బాడీ చేసినట్లుగా ఫోటో సృష్టించారు. అందులో నా ముఖాన్ని సాగదీశారు. స్టెరాయిడ్స్ వాడానని రూమర్నేను స్టెరాయిడ్స్ వాడటం వల్లే ఆరోగ్యం చెడిపోయిందని రాశారు. అది చూసి లైట్ తీసుకున్నా అని తెలిపాడు. తెలుగు హీరోతో మల్టీస్టారర్ మూవీ చేసే అవకాశం వస్తే నానితో కలిసి నటించాలనుందన్నాడు. ఇక మదరాసి విషయానికి వస్తే.. విద్యుత్ జమాల్, బిజు మీనన్, షబ్బీర్, విక్రాంత్ కీలక పాత్రల్లో నటించారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించాడు. మరోవైపు ఇదే ఇంటర్వ్యూలో రుక్మిణి.. ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ మూవీ ప్రారంభమైందని అప్డేట్ ఇచ్చింది. ఎన్టీఆర్తో మదరాసి హీరోయిన్ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న డ్రాగన్(ప్రచారంలో ఉన్న టైటిల్) మూవీలో రుక్మిణి వసంత్ కథానాయికగా నటిస్తోంది. ప్రశాంత్ నీల్.. ‘కేజీఎఫ్’లో ‘కోలార్ గోల్డ్ ఫీల్డ్’, ‘సలార్’లో ఖాన్సార్ ప్రాంతాలు క్రియేట్ చేసినట్లు ‘డ్రాగన్’ మూవీలో కూడా ఓ కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తున్నారని సమాచారం. ఈ మూవీకి ఇంటర్నేషనల్ టచ్ ఉంటుందని భోగట్టా! గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్, టీ–సిరీస్ ఫిల్మ్స్ సమర్పణలో కల్యాణ్రామ్, కొసరాజు హరికృష్ణ, నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మిస్తున్న ఈ మూవీ వచ్చే ఏడాది జూన్ 25న విడుదల కానుంది.చదవండి: మాజీ ప్రియుడిని ఫ్యామిలీ అంటున్న భార్యలు.. జర జాగ్రత్త!: నటుడి వార్నింగ్ -
ఆ బాధ భరించలేకపోతున్నా: కిచ్చా సుదీప్ భావోద్వేగం
కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ (Kichcha Sudeep) తల్లి సరోజ గతేడాది మరణించింది. తల్లి లేదన్న బాధ నుంచి హీరో ఇంకా బయటకు రాలేకపోతున్నాడు. అది ఆయన మాటలు చూస్తేనే అర్థమవుతోంది. ఇటీవల ఓ ఈవెంట్కు హాజరైన సుదీప్ తల్లిని తల్చుకుని ఎమోషనలయ్యాడు. బాధ ఎలా ఉంటుందో అందరూ అంటుంటే విన్నాను. కానీ, తొలిసారి దాన్ని అనుభవిస్తున్నాను. మా అమ్మ ఎప్పుడూ హాల్లో ఓ కుర్చీలో కనిపిస్తూ ఉండేది. ఇప్పుడు ఇంటికి వెళ్లగానే ఆ కుర్చీ ఖాళీగా కనిపిస్తుంటే మనసుకు చాలా కష్టంగా ఉంటోంది!ఎమోషనల్నా ఫోన్లో గ్యాలరీ ఓపెన్ చేసి ఏడాది కిందటి ఫోటోలు చూసినప్పుడు.. అమ్మతో కలిసున్న రోజులు, ఆ జ్ఞాపకాలు గుర్తొచ్చి ఎమోషనలైపోతున్నాను. నాకు తెలియకుండానే ఏడ్చేస్తున్నాను. అన్నింటికంటే కూడా మా నాన్నను ఇలా ఒంటరిగా చూడలేకపోతున్నాను. అమ్మతో 50 ఏళ్లు కలిసున్నాడు. తనెంత కుమిలిపోతున్నాడో! ఈ బాధ భరించలేకపోతున్నాము అని చెప్పుకొచ్చాడు. కాగా సుదీప్ తల్లి సరోజా 2024 అక్టోబర్ 20న అనారోగ్యంతో కన్నుమూశారు.చదవండి: కాబోయే అత్తకు బిగ్బాస్ బ్యూటీ సర్ప్రైజ్. -
ఓటీటీకి సూపర్ హిట్ దెయ్యం సినిమా.. పోస్టర్ వైరల్
కన్నడలో ఎలాంటి అంచనాల్లేకుండా రిలీజై సూపర్ హిట్గా నిలిచిన హిలారియస్ కామెడీ ఎంటర్టైనర్ సు ఫ్రమ్ సో(సులోచన ఫ్రమ్ సోమేశ్వరం). కేవలం నాలుగు కోట్ల బడ్జెట్తో తెరకెక్కించిన ఈ సినిమా.. బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ.40 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. శాండల్వుడ్లో సూపర్ హిట్గా నిలిచిన ఈ చిత్రాన్ని అదే పేరుతో తెలుగులోనూ విడుదల చేశారు. ఈ హారర్ కామెడీ మూవీ ఆగస్టు 8న థియేటర్లలో సందడి చేసింది.తాజాగా ఈ మూవీ ఓటీటీకి రానుందని సోషల్మీడియాలో పలు పోస్టర్లు వైరల్ అవుతున్నాయి. ఈ నెల ఐదో తేదీ నుంచి జియో హాట్ స్టార్ వేదికగా స్ట్రీమింగ్ కానున్నట్లు ప్రచారం జరుగుతుంది. అయితే, ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించలేదు. ఈ చిత్రానికి జేపీ తుమినాద్ దర్శకత్వం వహించారు. ఈ మూవీని లైటర్ బుద్ధ ఫిల్మ్స్ బ్యానర్పై శశిధర్ శెట్టి బరోడా, రాజ్ బీ శెట్టి, రవి రాయ్ కలిసి నిర్మించారు. సు ఫ్రమ్ సో కథేంటంటే?కర్ణాటక తీరప్రాంతంలోని ఓ పల్లెటూరు. అశోక్(జేపీ తుమినాడు) అనే కుర్రాడికి ఓ రోజు దెయ్యం పడుతుంది. దగ్గరలోని సోమేశ్వరం అనే ఊరికి చెందిన సులోచన అనే దెయ్యమే ఇతడికి ఆవహించిందని ఊరి ప్రజలందరూ అనుకుంటారు. దీంతో ఎలాగైనా సరే ఈ దెయ్యాన్ని వదిలించాలని ఊరి పెద్ద రవన్న (షనీల్ గౌతమ్).. ఓ స్వామిజీని(రాజ్ బి శెట్టి) తీసుకొస్తాడు. ఆత్మని వదిలించే క్రమంలో ఇది కాస్త ఊరి సమస్యగా మారుతుంది. ఇంతకీ ఆ యువకుడికి నిజంగానే దెయ్యం పట్టిందా? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ. -
'కొత్త లోక' సరికొత్త రికార్డ్.. దీనిదే అగ్రస్థానం
హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్ అనగానే చాలామంది ప్రేక్షకులకు చిన్నచూపు. హా ఏముందిలే అని అనుకుంటారు. కానీ అప్పట్లోనే విజయశాంతి లాంటి హీరోయిన్స్.. 'కర్తవ్యం' లాంటి సినిమాలు చేశారు. బాగానే గుర్తింపు తెచ్చుకున్నారు. కానీ తర్వాత కాలంలో హీరోలు, కమర్షియల్ చిత్రాల హవా పెరిగేసరికి ఫిమేల్ సెంట్రిక్ మూవీస్ రావడం బాగా తగ్గిపోయింది. కానీ గత దశాబ్ద కాలంలో మాత్రం దక్షిణాదిలో అడపాదడపా వస్తూనే ఉన్నాయి.గత కొన్నేళ్లలో హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్ అనగానే అనుష్క గుర్తొస్తుంది. 'అరుంధతి'తో ట్రెండ్ సెట్ చేసిన ఈ బ్యూటీ.. తర్వాత రుద్రమదేవి, భాగమతి తదతరత చిత్రాలతో తన సకెస్స్ని కొనసాగించింది. తర్వాత కాలంలో పలువురు సౌత్ హీరోయిన్లు.. ఫిమేల్ సెంట్రిక్ మూవీస్ తీసినప్పటికీ అనుష్క దరిదాపుల్లోకి చేరుకోలేకపోయారు. కానీ 'మహానటి' మూవీతో కీర్తి సురేశ్ ఆ ఫీట్ సాధించింది. ఈ మూవీకి ఏకంగా రూ.84 కోట్లకు పైగా కలెక్షన్స్ వచ్చాయి.(ఇదీ చదవండి: 2 వారాలకే ఓటీటీలోకి వచ్చేసిన యాక్షన్ థ్రిల్లర్)2018లో 'మహానటి' రాగా ఆ రికార్డ్ అలానే ఉంటూ వచ్చింది. కానీ ఇప్పుడు 'కొత్త లోక' సినిమా సరికొత్త రికార్డ్స్ సృష్టిస్తోంది. కేవలం రూ.30 కోట్ల బడ్జెట్తో తీసిన ఈ చిత్రం.. రిలీజైన 7 రోజుల్లోనే రూ.100 కోట్ల కలెక్షన్ మార్క్ అందుకుంది. సాధారణంగా చూస్తే ఇదేమంత ఎక్కువ మొత్తంలా అనిపించకపోవచ్చు. కానీ మిడ్ రేంజ్ హీరోయిన్ అయిన కల్యాణి ప్రియదర్శన్ని లీడ్ రోల్లో పెట్టి తీసిన సూపర్ హీరో సినిమాకు ఈ రేంజ్ వసూళ్లు అంటే కచ్చితంగా విశేషమే.ఇప్పటికే లాభాల్లోకి వెళ్లిపోయిన 'కొత్త లోక'.. ఇప్పుడు రూ.100 కోట్ల మార్క్ కూడా దాటేసినట్లు తెలుస్తోంది. తద్వారా మహానటి, రుద్రమదేవి, భాగమతి, అరుంధతి చిత్రాల కంటే ఎక్కువ వసూళ్లు సాధించిన సౌత్ ఫిమేల్ ఓరియెంటెడ్ మూవీగా నిలిచింది. థియేట్రికల్ రన్ పూర్తయ్యేసరికి ఇది ఇంకెన్ని కోట్లు కలెక్ట్ చేస్తుందో చూడాలి?(ఇదీ చదవండి: 'కూలీ' విలన్.. దుబాయి వెళ్లడానికి నో పర్మిషన్) -
'కూలీ' విలన్.. దుబాయి వెళ్లడానికి నో పర్మిషన్
ఈనెల 5-6 తేదీల్లో దుబాయి వేదికగా సైమా అవార్డ్స్ వేడుక జరగనుంది. దీనితి భారతీయ సినిమా ఇండస్ట్రీలకు చెందిన స్టార్స్ అందరూ హాజరు కాబోతున్నారు. అందుకు తగ్గ ఏర్పాట్లు ఇప్పటికే జరుగుతున్నాయి. అయితే ఈ వేడుకకు ఆహ్వానం వచ్చినా సరే 'కూలీ' ఫేమ్ సౌబిన్ షాహిర్ వెళ్లలేకపోతున్నాడు. ఇతడు దుబాయి వెళ్లేందుకు ఎర్నాకులం కోర్ట్ అనుమతి ఇవ్వలేదు. ఇంతకీ ఏంటి విషయం? అసలేం జరిగింది?మలయాళ ఇండస్ట్రీలో అంచెలంచెలుగా ఎదుగుతూ గుర్తింపు తెచ్చుకున్న సౌబిన్ షాహిర్.. రీసెంట్గానే 'కూలీ'తో దక్షిణాదిలోని మిగతా భాషా ప్రేక్షకుల్ని కూడా ఆకట్టుకున్నాడు. గతేడాది ఇతడు లీడ్ రోల్ చేస్తూ 'మంజుమ్మల్ బాయ్స్' అనే చిత్రాన్ని నిర్మించాడు. మూవీ హిట్ అయినప్పటికీ పెట్టుబడిదారుడిని మోసం చేయడంతో ఇతడిపై చీటింగ్ కేసు నమోదైంది. జూలై నెలలో అరెస్ట్ కూడా అయ్యాడు. వెంటనే బెయిల్పై విడుదలైనప్పటికీ ఇంకా ఇబ్బందులు తప్పట్లేదు.(ఇదీ చదవండి: మూడేళ్ల తర్వాత ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమా)'మంజుమ్మల్ బాయ్స్' సినిమాకు సౌబిన్తో పాటు అతడి తండ్రి, మరొకరు నిర్మాతగా వ్యవహరించారు. అలానే సిరాజ్ అనే ఇన్వెస్టర్ కొంత పెట్టుబడి పెట్టారు. వచ్చిన లాభాల్లో 40 శాతం వాటా ఇస్తానని ముందే మాట్లాడుకున్నారట. ఈ లెక్క ప్రకారం రూ.40 కోట్ల వరకు ఇవ్వాలని, కానీ తనకు రూ.5.99 కోట్లు మాత్రమే ఇచ్చారని సిరాజ్.. కొన్నాళ్ల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో సౌబిన్తో పాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. వెంటనే మధ్యంతర బెయిల్ కూడా ఇచ్చారు.ఈ క్రమంలోనే ఇప్పుడు దుబాయి వెళ్లేందుకు న్యాయస్థానాన్ని ఆశ్రయించగా.. ఎర్నాకులం కోర్ట్ సౌబిన్కి అనుమతి నిరాకరించింది. దీంతో అతడు సైమా అవార్డ్స్ కోసం దుబాయి వెళ్లలేకపోతున్నాడు. (ఇదీ చదవండి: 'వీరమల్లు'కు జీఎస్టీ చెల్లించలేదు.. ఎలా అనుమతిచ్చారు?) -
వివాదంలో కొత్త లోకా మూవీ.. దుల్కర్ సల్మాన్ నిర్మాణ సంస్థ క్షమాపణలు!
మలయాళ చిత్రాలకు తెలుగులోనూ విపరీతమైన క్రేజ్ ఉంటోంది. కంటెంట్ బాగుంటే మనవాళ్ల థియేటర్లకు ఎగబడుతున్నారు. ఇటీవల రిలీజైన మరో మలయాళ చిత్రం కొత్త లోక ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. ఇప్పటికే ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ. 30 కోట్లకు పైగా నికర వసూళ్లను సాధించింది. ఈ మూవీలో కళ్యాణి ప్రియదర్శన్, నస్లెన్, శాండీ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాకు డొమినిక్ అరుణ్ దర్శకత్వం వహించారు.అయితే ఈ సినిమాలోని ఓ సీన్ వివాదానికి దారితీసింది. బెంగళూరు మహిళలను కించపరిచేలా ఉందంటూ విమర్శలొచ్చాయి. దీంతో దుల్కర్ సల్మాన్కు చెందిన నిర్మాణ సంస్థ వేఫరర్ ఫిల్మ్స్ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. మీ మనోభావాలు దెబ్బతీసేలా ఉన్న ఆ సన్నివేశాన్ని తొలగిస్తామని ట్వీట్ చేసింది. కన్నడ ప్రజల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నందుకు విచారం వ్యక్తం చేస్తున్నామని తెలిపింది. ఈ విషయంలో తమను క్షమించాలని కోరుతూ వేఫరర్ ఫిల్మ్స్ లేఖను పోస్ట్ చేశారు.ఈ సినిమాలో ఇన్స్పెక్టర్ నాచియప్ప గౌడ (కొరియోగ్రాఫర్ శాండీ పోషించిన పాత్ర) బెంగళూరుకు చెందిన మహిళలను వివాహం చేసుకోవడం ఇష్టం లేదని.. వారు క్యారెక్టర్ లెస్ అంటూ మాట్లాడారు. ఈ సీన్ బెంగళూరు మహిళలను కించపరిచేలా ఉందని సోషల్ మీడియాలో పెద్దఎత్తున విమర్శలొచ్చాయి. కన్నడ డైరెక్టర్ మన్సూర్ సైతం ఈ సినిమాపై విమర్శలు చేశారు. కన్నడ భీమ, మలయాళ చిత్రాలు ఆఫీసర్ ఆన్ డ్యూటీ, ఆవేశం, ఇప్పుడు కొత్త లోకా లాంటి సినిమాలతో బెంగళూరును మాదకద్రవ్యాలు, నేరాలకు రాజధానిగా చిత్రీకరించారని అన్నారు. ఒకప్పుడు, సినిమాల్లో అందమైన పట్టణంగా చూపించిన బెంగళూరు.. నియంత్రణ లేని వలసల కారణంగా ఇలాంటి స్థితికి చేరుకుందని ట్వీట్లో రాసుకొచ్చారు.#Lokah pic.twitter.com/q18SX8dh7G— Wayfarer Films (@DQsWayfarerFilm) September 2, 2025According to movies like Kannada Bhima, Malayalam films Officer on Duty, Avesham, and now Lokah,Bengaluru is being portrayed as the capital of drugs and crime.Once upon a time,it was represented in movies as a beautiful town,has come to such a state due to uncontrolled migration.— ಮಂಸೋರೆ/ManSoRe (@mansore25) September 1, 2025 -
'కొత్త లోక'.. ఏకంగా ఐదు పార్ట్స్
గత వీకెండ్లో మూడు నాలుగు తెలుగు సినిమాలు రిలీజైతే వాటిలో కొన్నింటికి పాజిటివ్ టాక్ వచ్చింది. కానీ జనాలు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించట్లేదు. మరోవైపు మలయాళ డబ్బింగ్ మూవీ 'కొత్త లోక'కి తెలుగులో ఓ మాదిరి రెస్పాన్స్ వచ్చింది. మెట్రో సిటీల్లో ఆదివారం వరకు మంచి ఆక్యుపెన్సీ చూపించింది. తొలి నుంచి ఇది సూపర్ హీరో తరహా యూనివర్స్ అని చెప్పిన టీమ్.. ఇప్పుడు మరిన్ని ఆసక్తికర విషయాల్ని రివీల్ చేసింది.మనం పురాణాల్లో విన్న యక్షిణి పాత్రని తీసుకుని, దానికి సూపర్ పవర్స్ జోడించి 'కొత్త లోక' సినిమాని తీశారు. కల్యాణి ప్రియదర్శన్ లీడ్ రోల్ చేసింది. బడ్జెట్ కూడా రూ.35-40 కోట్ల మధ్యనే అని టాక్. అయితే ఇంత తక్కువ బడ్జెట్ పెట్టి ఈ రేంజు ఔట్ పుట్ చూపించడంపై ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు. సినిమా పాజిటివ్ టాక్ రావడంతో పాటు రూ.60-70 కోట్ల వరకు కలెక్షన్స్ వచ్చినట్లు తెలుస్తోంది. అంటే లాభాల్లోకి ఎంటరైనట్లే.(ఇదీ చదవండి: ప్రియుడితో కలిసి సమంత దుబాయి ట్రిప్.. వీడియో వైరల్)తాజాగా ఈ చిత్రానికి వస్తున్న ఆదరణ గురించి మాట్లాడిన దర్శకుడు డొమినిక్ అరుణ్.. ఈ మూవీ ఫ్రాంచైజీలో మొత్తం ఐదు పార్ట్స్ ఉంటాయని చెప్పుకొచ్చాడు. అలానే 'కొత్త లోక' సినిమా ప్రారంభంలోనే మెయిన్ విలన్ ఎవరనేది హింట్ ఇచ్చామని పేర్కొన్నాడు. ఐదు భాగాలకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ అంతా షూటింగ్ మొదలవకముందే పూర్తి చేశామని క్లారిటీ ఇచ్చాడు.ఈ మూవీలో అతిథి పాత్రలో కనిపించి ఆకట్టుకున్న టొవినో థామస్.. రెండో పార్ట్లో లీడ్ రోల్ చేస్తాడనే రూమర్స్ వినిపిస్తున్నాయి. అయితే 'కొత్త లోక' తొలి పార్ట్ చివరలో దుల్కర్ సల్మాన్ కూడా కనిపించాడు. రాబోయే పార్ట్స్లో ఏదో ఒకదానిలో దుల్కర్ కూడా కచ్చితంగా ఉండటం గ్యారంటీ. ఇప్పటివరకు కమర్షియల్గా గుర్తింపు తెచ్చుకున్న కల్యాణి.. ఈ సినిమాతో మరింతగా క్రేజ్ సంపాదిస్తుండటం విశేషం.(ఇదీ చదవండి: 'ఓజీ' కొత్త గ్లింప్స్ రిలీజ్) -
కన్నడ నటి రన్యా రావుకు బిగ్ షాక్.. ఏకంగా వందకోట్లకు పైగా!
బంగారం స్మగ్లింగ్ కేసులో అరెస్టైన కన్నడ బ్యూటీ రన్యారావుకు బిగ్ షాక్ తగిలింది. ఆమెకు ది డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. అంతేకాకుండా రూ.102.55 కోట్ల జరిమానా విధించారు. ఆమెతో సహా నలుగురు నిందితులకు మొత్తంగా రూ.270 కోట్ల పెనాల్టీ విధిస్తూ జైల్లోనే నోటీసులు ఇచ్చారు. ఒకవేళ ఆ మొత్తాన్ని చెల్లించకపోతే ఆస్తులు జప్తు చేస్తామని డీఆర్ఐ అధికారులు హెచ్చరించారు. దుబాయ్ నుంచి బంగారాన్ని అక్రమంగా తరలిస్తూ మార్చి తొలి వారంలో రన్యారావు బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో రెడ్హ్యాండెడ్గా పట్టుబడిన సంగతి తెలిసిందే. ఆమె నుంచి 14.3 కిలోల బంగారాన్ని డీఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకొని అరెస్టు చేశారు. నిందితులకు ఏడాది పాటు జైలు శిక్ష పడిన సంగతి తెలిసిందే. విదేశీ మారక ద్రవ్య పరిరక్షణ, స్మగ్లింగ్ నిరోధక చట్టం కింద ఆమెకు కోర్టు ఏడాది జైలు శిక్షను ఖరారు చేసింది. ఆమెతోపాటు సహచరుడు తరుణ్ కొండూరు రాజు, బంగారం వ్యాపారి సాహిల్ జైన్లకూ శిక్ష పడింది. రన్యా రావు 2023 నుంచి 2025 వరకు దుబాయ్కు ఏకంగా 56 సార్లు ప్రయాణించినట్లు డీఆర్ఐ దర్యాప్తులో స్పష్టమైంది. దుబాయ్ పర్యటనలో భాగంగా భారత్ నుంచి తరుణ్తో కలిసి 20 సార్లు ప్రయాణించింది. ఇది గుర్తించిన అధికారులు విచారించగా నటి పొంతన లేని సమాధానాలు ఇచ్చింది. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు ఆమె నివాసంలో సోదాలు నిర్వహించారు. సోదాల్లో రూ. 2.06 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు రూ.2.67 కోట్ల విలువైన కరెన్సీ కట్టలను స్వాధీనం చేసుకున్నారు. రన్యా రావు నుంచి మొత్తంగా రూ. 17.29 కోట్ల నగదు, బంగారాన్ని అధికారులు స్వా«దీనం చేసుకున్నారు. రన్యా రావు గత 12 నెలలకాలంలో 27 సార్లు విదేశాలకు వెళ్లిందని, కస్టమ్స్ సుంకం మోసానికి పాల్పడినట్లు విచారణలో తేలింది. -
కిచ్చా సుదీప్ మాస్ యాక్షన్ చిత్రం.. టైటిల్ ఫిక్స్
కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ మరో యాక్షన్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఆయన కెరీర్లో 47వ చిత్రంగా ఈ మూవీ నిలవనుంది. తాజాగా ఈ సినిమా టైటిల్ రివీల్ చేస్తూ గ్లింప్స్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ చిత్రానికి విజయ్ కార్తికేయ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ పాన్ ఇండియా మూవీకి మార్క్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. గ్లింప్స్ చూస్తుంటే ఫుల్ మాస్ యాక్షన్ సినిమాగా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది.ఈ సినిమాను ఈ ఏడాది క్రిస్మస్కు థియేటర్లలో విడుదల చేస్తామని ప్రకటించారు. ఈ మూవీని సత్య జ్యోతి ఫిల్మ్స్, కిచ్చా క్రియేషన్స్ బ్యానర్లపై సెంధిల్ త్యాగరాజన్, అర్జున్ త్యాగరాజన్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు అజనీష్ లోక్నాథ్ సంగీతమందిస్తున్నారు. -
'ఇదే చివరి సినిమా..'.. స్టార్ డైెరెక్టర్ షాకింగ్ నిర్ణయం
కోలీవుడ్లో పలు సూపర్ హిట్ సినిమాలు తెరకెక్కించిన దర్శకుడు వెట్రిమారన్. అసురన్, పొల్లధవన్, వడ చెన్నై, విడుదలై లాంటి చిత్రాలతో హిట్స్ తన ఖాతాలో వేసుకున్నారు. ప్రస్తుతం శింబు హీరోగా ఓ మూవీని తెరకెక్కిస్తున్నారు. అయితే ఒకవైపు డైరెక్టర్గా రాణిస్తూనే సొంతంగా ప్రొడక్షన్ హౌస్ నడిపిస్తున్నారు. తన సొంత నిర్మాణ సంస్థ గ్రాస్ రూట్ ఫిల్మ్ బ్యానర్లో పలు సినిమాలు నిర్మించారు. ప్రస్తుతం ఈ బ్యానర్లో బ్యాడ్ గర్ల్ అనే మూవీని నిర్మించారు.అయితే తాజా పరిణామాల నేపథ్యంలో తన నిర్మాణ సంస్థను మూసివేస్తున్నట్లు వెట్రిమారన్ ప్రకటించారు.. సినిమా నిర్మాణం సవాల్తో కూడుకున్నదని అన్నారు. మూవీ తీయడానికి డబ్బు అప్పుగా తీసుకోవడం వల్ల కలిగే ఆర్థిక ఇబ్బందుల గురించి ఆయన మాట్లాడారు. బ్యాడ్ గర్ల్ మూవీ మా నిర్మాణ సంస్థ చివరి చిత్రం అవుతుందని వెట్రిమారన్ వెల్లడించారు. నిర్మాత చేయడం టాక్సింగ్గా ఉందని కామెంట్స్ చేశారు.కాగా.. వర్ష భారత్ దర్శకత్వం వహించిన 'బ్యాడ్ గర్ల్' చిత్రంలో అంజలి శివరామన్, శాంతి ప్రియ నటించారు. ఇటీవలే టీజర్ విడుదల కాగా.. వివాదం తలెత్తింది. దీంతో సినిమాను రివైజింగ్ కమిటీకి పంపగా.. చివరికి యూ/ఏ సర్టిఫికేట్ ఇచ్చారు. పిల్లలకు సంబంధించిన సన్నివేశాలపై అభ్యంతరాలు రావడంతో ఈ చర్య తీసుకున్నారు.దర్శకుడు వెట్రి మారన్ మాట్లాడుతూ.. "నిర్మాతగా ఉండటం అనేది ఒక టాక్సింగ్ జాబ్ లాంటిది. దర్శకుడిగా ఉండటం అనేది సృజనాత్మకమైన పని. ఆ ఉద్యోగంలో ఎటువంటి ఒత్తిడి ఉండదు. మన పని మనం చేసుకోవాలి. కానీ, మీరు నిర్మాత అయితే మాత్రం ప్రతి విషయం గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలి. చివరికీ టీజర్ కింద వచ్చే కామెంట్స్ కూడా చదవాలి. నటీనటులు, ప్రకటనలు సినిమా వ్యాపారాన్ని ప్రభావితం చేస్తాయి. ఒక నిర్మాతగా అది చాలా ఒత్తిడిగా అనిపిస్తుంది. దర్శకుడు మిస్కిన్తో కొన్ని రోజుల క్రితం దీని గురించి మాట్లాడా" అని అన్నారు. తన నిర్మాణ సంస్థలో వస్తోన్న మానుషి చిత్రం రివైజింగ్ కమిటీ వద్ద ఉందని పేర్కొన్నారు. కాగా.. బ్యాడ్ గర్ల్ సెప్టెంబర్ 5న విడుదలకు సిద్ధమవుతోంది. -
తను లేకుండా ఇకపై ఏ సినిమా చేయను: కూలీ డైరెక్టర్
తమిళ స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ (Lokesh Kanagaraj) సినిమా ఇండస్ట్రీకి వచ్చి దాదాపు పదేళ్లవుతోంది. మానగరం, ఖైదీ, విక్రమ్, మాస్టర్, లియో సినిమాలతో వరుస బ్లాక్బస్టర్స్ కొట్టి ఇతడు ఇటీవలే కూలీ సినిమా తెరకెక్కించాడు. రజనీకాంత్ కథానాయకుడిగా యాక్ట్ చేసిన ఈ మూవీ దాదాపు రూ.500 కోట్లు వసూలు చేసింది.ఆయన లేకుండా సినిమా చేయనుతాజాగా ఈయన కోయంబత్తూరులో జరిగిన ఓ సదస్సుకు హాజరయ్యాడు. ఈ సందర్భంగా ఓ సంచలన ప్రకటన చేశాడు. మీ సినిమాల్లో సంగీతం కోసం ఏఐ(ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్) సాయం కోరతారా? అన్న ప్రశ్నకు లోకేశ్ ఇలా స్పందించాడు. నేను అనిరుధ్ లేకుండా ఏ సినిమా చేయను. ఒకవేళ అతడు సినిమాల నుంచి రిటైర్మెంట్ తీసుకుంటే అప్పుడు ఏఐ గురించి ఆలోచిస్తాను. ప్రస్తుతానికైతే అటువంటి ఆలోచనలు లేవు అని చెప్పాడు.అది జరగకుండానే డైరెక్టర్ అయిపోయాఇదే సదస్సులో లోకేశ్ ఇంకా మాట్లాడుతూ.. నేను రూ.4వేలతో షార్ట్పిలిం చేశా. కెమెరా ఎవరిదగ్గరైతే ఉందో వాడే సినిమాటోగ్రాఫర్, ల్యాప్టాప్ ఉన్నవాడే ఎడిటర్. కాబట్టి ఏదైనా మొదలుపెట్టాలనుకున్నప్పుడు పెద్ద బడ్జెట్లు అవసరం లేదు. ఎవరైనా దర్శకుడి దగ్గర అసిస్టెంట్గా చేయాలనుకున్నాను. కానీ అది జరగకుండానే డైరెక్ట్ అయిపోయాను అని చెప్పుకొచ్చాడు. కాగా లోకేశ్ తెరకెక్కించిన మాస్టర్, విక్రమ్, లియో, కూలీ చిత్రాలకు అనిరుధ్ రవిచందర్ దర్శకత్వం వహించాడు. Director #LokeshKanagaraj drops a BIG STATEMENT! 😮"In future as well, I wouldn't do any films without @anirudhofficial" pic.twitter.com/nTicUPOWCZ— Anirudh FP (@Anirudh_FP) September 1, 2025చదవండి: బిపాసా బసు వివాదం.. మరో స్టార్ హీరోయిన్పై మృణాల్ ఠాకూర్ -
వృద్ధ తల్లిపై నటి దాడి! ఏ నుయ్యో గొయ్యో చూసుకునేవాళ్లం..
తల్లి కోసం భర్తను, పిల్లల్ని వదిలేసింది మలయాళ నటి లవ్లీ బాబు (Lovely Babu). మంచానపడ్డ తల్లిని తీసుకుని కేరళ కొల్లంలోని గాంధీ భవన్ ఆశ్రమంలో జీవిస్తోంది. కేవలం ఆమెను చూసుకోవడానికే సినిమాలకు సైతం విరామం ఇచ్చినట్లు చెప్పింది. అయితే ఆమె తన తల్లి చేతులు కట్టేసి ఆమెపై దాడి చేస్తున్న వీడియో ఒకటి నెట్టింట వైరల్గా మారింది.డబ్బుకే విలువదీంతో కొందరు నటిని తప్పుపడుతుండగా మరికొందరు ఆమెను వెనకేసుకొస్తున్నారు. సేవలు చేసినప్పుడు కొన్నిసార్లు అసహనం, కోపం రావడం సహజం.. అందులో లవ్లీ తప్పేమీ లేదని కామెంట్లు చేస్తున్నారు. తాజాగా లవ్లీ మాట్లాడుతూ.. గతంలో నాకు క్యాన్సర్ ఉండేది. అప్పుడు క్యాన్సర్ ట్రీట్మెంట్ ఖర్చు, నా పిల్లల చదువులు, ఇంటి ఖర్చులు.. ఇలా నాపై చాలా భారం ఉండేది. నా భర్త ఎప్పుడూ డబ్బు ముఖ్యం అని నమ్మేవాడు. తను బంధాలకు విలువ ఇవ్వడు.దీనస్థితిలో అమ్మఒకసారి నేను ఊరెళ్లి పది రోజుల తర్వాత వచ్చాను. అప్పుడు అమ్మ పరిస్థితి చూసి షాకయ్యాను. వాంతులు చేసుకున్న ప్లేస్లోనే పది రోజులుగా పడుకుని ఉంది. మరోసారేమో తన డైపర్ ఎవరూ మార్చకపోవడంతో గదంతా కంపు కొడుతోంది. అమ్మ పరిస్థితి అధ్వాణ్నంగా తయారైనప్పుడు నాకు కోపం వచ్చేది. నాకు చచ్చిపోవాలనిపించేది. కానీ నేను పోతే అమ్మను ఎవరు చూసుకుంటారనిపించేది. పట్టలేనంత కోపం వచ్చినప్పుడు అమ్మను కొట్టేదాన్ని. అది కావాలని చేసింది కాదు.. తర్వాత మళ్లీ నేనే బాధపడేదాన్ని.ఏ రైలు కిందో పడేవాళ్లంఅమ్మను వదిలించుకోమని ఇంట్లోవాళ్లన్నారు. కానీ తనను అనాథగా వదిలేందుకు మనసొప్పలేదు. బయటకు వెళ్లి బతికేంత ఆర్థిక స్థోమత లేదు. అందుకే భర్తను, పిల్లల్న వదిలి ఆశ్రమానికి వచ్చేశాను. గాంధీ భవన్ మాకు ఆశ్రయం కల్పించుండకపోతే మేము ఏ రైలు కిందో పడేవాళ్లం, లేదంటే ఏ చెరువులోనో దూకి చనిపోయేవాళ్లం అని లవ్లీ బాబు భావోద్వేగానికి లోనైంది. View this post on Instagram A post shared by Amal Gandhibhavan (@amalgandhibhavan) చదవండి: పోలీస్ స్టేషన్లో దెయ్యాలు.. ఆర్జీవీ కొత్త సినిమా పోస్టర్ -
సూపర్స్టార్ సినిమాని దాటేసిన 'కొత్త లోక'.. కలెక్షన్ ఎంతంటే?
గతవారం వినాయక చవితి సందర్భంగా లాంగ్ వీకెండ్ వచ్చింది. కానీ స్టార్ హీరోలు, మిడ్ హీరోల చిత్రాలేవి థియేటర్లలోకి రాలేదు. త్రిబాణధారి బార్బరిక్, అర్జున్ చక్రవర్తి, సుందరకాండ తదితర చిన్న మూవీస్ వచ్చాయి ఏ మాత్రం ప్రభావం చూపించలేకపోయాయి. మరోవైపు స్క్రీనింగ్ సమస్యలు ఎదుర్కొని, ఎలాంటి పబ్లిసిటీ లేకుండా విడుదలైన 'కొత్త లోక' అనే డబ్బింగ్ సినిమా.. మౌత్ టాక్తో బాక్సాఫీస్ దగ్గర ప్రభావం చూపిస్తోంది. ఇంతకీ ఈ మూవీ సంగతేంటి? ఓవరాల్గా ఇప్పటివరకు వచ్చిన కలెక్షన్స్ ఎంత?మలయాళ ఇండస్ట్రీలో ఎప్పటికప్పుడు వైవిధ్యమైన సినిమాలు తీస్తుంటారు. ఇప్పుడు సూపర్ హీరో యూనివర్స్ సృష్టించారు. అందులో వచ్చిన తొలి సినిమానే 'లోక'. దీన్ని తెలుగులో 'కొత్త లోక' పేరుతో రిలీజ్ చేశారు. దుల్కర్ సల్మాన్ నిర్మించిన ఈ మూవీలో కల్యాణి ప్రియదర్శన్ లీడ్ రోల్ చేసింది. పురాణగాథల్లో ఉన్న యక్షిణి పాత్రని తీసుకుని, సూపర్ హీరో కాన్సెప్ట్ జోడించడంతో ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. ఈ క్రమంలోనే మలయాళంతో పాటు తెలుగులోనూ పాజిటివ్ టాక్ వచ్చింది.(ఇదీ చదవండి: 'కొత్త లోక' రివ్యూ)మలయాళంలో ఆగస్టు 28న రిలీజ్ కాగా.. ఓ రోజు ఆలస్యంగా తెలుగులో విడుదలైంది. ఇప్పటివరకు నాలుగు రోజులు పూర్తి కాగా దాదాపు రూ.40-45 కోట్ల మేర గ్రాస్ కలెక్షన్ వచ్చినట్లు తెలుస్తోంది. కేవలం తెలుగులోనే రూ.3.5 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయని సమాచారం. ప్రస్తుతానికైతే ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర దూకుడు చూపిస్తోంది.మలయాళంలో దీనితో పాటు సూపర్స్టార్ మోహన్ లాల్ 'హృదయపూర్వం' సినిమా కూడా రిలీజైంది. పాజిటివ్ టాక్ తెచ్చుకుంది కానీ దీనికి రూ.11-15 కోట్లు మాత్రమే కలెక్షన్స్ వచ్చాయని తెలుస్తోంది. ఈ లెక్కన చూసుకుంటే 'కొత్త లోక'నే ముందంజలో ఉంది. అయితే ఈ సినిమాని కేవలం రూ.30-40 కోట్ల బడ్జెట్తోనే తీశారట. అంటే లాంగ్ రన్లో ఈ సినిమాకు మంచి లాభాలు రావడం గ్యారంటీ.(ఇదీ చదవండి: నిశ్చితార్థం చేసుకుని బిగ్బాస్ జంట సర్ప్రైజ్) -
నిశ్చితార్థం చేసుకుని బిగ్బాస్ జంట సర్ప్రైజ్
మరో బిగ్బాస్ జంట పెళ్లి చేసుకుంది. సీరియల్ నటిగా గుర్తింపు తెచ్చుకున్న అర్చన.. బిగ్బాస్ 7వ తమిళ సీజన్లో పాల్గొని విజేతగా నిలిచింది. అంతకు ముందు ఈమె.. తమిళ హిట్ సీరియల్ 'రాజా రాణి 2'తో ఆకట్టుకుంది. ఈమెకు మంచి ఫాలోయింగ్ కూడా ఉంది. ఈ క్రమంలోనే ఇప్పుడు తనకు నిశ్చితార్థం అయిపోయినట్లు చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచింది.(ఇదీ చదవండి: పెళ్లి గురించి శుభవార్త చెప్పిన నారా రోహిత్)సీరియల్ నటిగా కెరీర్ మొదలుపెట్టిన అర్చన రవిచంద్రన్.. నటుడు అరుణ్ ప్రశాత్తో ప్రేమలో పడింది. దాదాపు ఐదేళ్ల నుంచి వీళ్లిద్దరూ రిలేషన్లో ఉన్నారు. ఈ ఏడాది వాలంటైన్స్ డే సందర్భంగా తమ ప్రేమ విషయాన్ని మరోసారి బయటపెట్టారు. అప్పటినుంచి వీళ్ల పెళ్లి గురించి రూమర్స్ వస్తూనే ఉన్నాయి. కానీ ఇప్పుడు నిశ్చితార్థం చేసుకుని శుభవార్త చెప్పకనే చెప్పారు.అర్చన.. బిగ్బాస్ 7వ సీజన్ లో పాల్గొని విజేతగా నిలవగా, అరుణ్ ప్రశాత్ గతేడాది జరిగిన 8వ సీజన్ లో కంటెస్టెంట్గా వచ్చాడు. విజేత కాలేకపోయాడు. గత సీజన్లోనే ప్రియుడు కోసం అర్చన కూడా కాసేపు అలా వచ్చి వెళ్లింది. ప్రస్తుతానికి తమకు ఎంగేజ్మెంట్ జరిగిన విషయం బయటపెట్టడంతో సహ నటీనటులు కొత్త జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. త్వరలో పెళ్లి తేదీ తదితర వివరాలు చెబుతారేమో!(ఇదీ చదవండి: ఐదేళ్ల ప్రేమ.. పెళ్లి అప్పుడే చేసుకుంటాం: హీరోయిన్ నివేతా) View this post on Instagram A post shared by Arun Prasath (@arun_actor) -
దీనస్థితిలో 'కేజీఎఫ్' నటుడు.. సాయం చేయాలని వేడుకోలు
'కేజీఎఫ్' సినిమా కన్నడ ఇండస్ట్రీ స్థాయిని పెంచింది. హీరో యష్ని పాన్ ఇండియా సూపర్ స్టార్ హీరో చేసింది. దర్శకుడు ప్రశాంత్ నీల్ అయితే ఓవర్ నైట్ సెన్సేషన్ అయిపోయాడు. ఈ మూవీలో నటించిన కొందరు యాక్టర్స్ కూడా బాగానే పేరు తెచ్చుకున్నారు. కానీ ఇదే చిత్రంలో నటించిన ఓ నటుడు మాత్రం ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయాడు. తీవ్ర అనారోగ్య సమస్యలతో తనకు ఆర్థిక సాయం చేయాలని వేడుకుంటున్నాడు. ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.'కేజీఎఫ్' తొలి భాగంలో హీరో ముంబైలో ఉంటాడు. అతడితో పాటు ఛాఛా అనే ముస్లిం వ్యక్తి ఒకరు ఉంటారు. ఆ పాత్ర చేసిన నటుడి పేరు హరీశ్ రాయ్. చాన్నాళ్లుగా కన్నడలో సినిమాలు చేస్తున్నారు. 'కేజీఎఫ్'తో కాస్తంత ఫేమ్ వచ్చింది. అయితే రెండో పార్ట్ రిలీజైన నాటికే ఇతడు క్యాన్సర్తో బాధపడుతున్నాడు. ఇప్పుడు అది నాలుగో స్టేజీకి చేరింది. దీంతో నటుడు హరీశ్.. మరీ బక్కపలుచగా మారిపోయాడు. ఆ వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.(ఇదీ చదవండి: 'జెర్సీ' వదులుకున్నా.. ఇప్పటికీ బాధపడుతున్నా: జగపతి బాబు)ప్రస్తుతం నాలుగో స్టేజీ థైరాయిడ్ క్యాన్సర్తో బాధపడుతున్న హరీశ్ రాయ్.. ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. దాతలు ఎవరైనా తనకు సాయం చేయాలని మీడియా ద్వారా వేడుకున్నాడు. ఈ క్రమంలోనే హీరో ధ్రువ్ సర్జా తనకు తోచినంత డబ్బులు ఇచ్చాడు. దీనిపై స్పందించిన హరీశ్.. సదరు హీరోకి ధన్యవాదాలు తెలిపాడు. ఆ వీడియోని కూడా సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు.రెండు భాగాలగా వచ్చిన 'కేజీఎఫ్'.. బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. అయితే ఈ సినిమాలో చేసిన సీనియర్ నటులు గత కొన్నేళ్లలో అనారోగ్య కారణాలతో చనిపోయారు. కొన్నిరోజుల ముందు కూడా శెట్టి పాత్రధారి దినేశ్ మంగళూరు.. బ్రెయిన్ స్ట్రోక్తో చనిపోయాడు. ఇప్పుడు ఛాఛా పాత్రధారి క్యాన్సర్తో ఇబ్బంది పడుతుండటంతో ప్రేక్షకులు, నెటిజన్ల మనసు కలత చెందుతోంది.(ఇదీ చదవండి: 'హరిహర'.. మరోసారి స్పందించిన క్రిష్) -
ధనుష్ కంటే గొప్ప నటులెవరున్నారు?: ఆదిపురుష్ డైరెక్టర్
తమిళ స్టార్ ధనుష్ (Dhanush).. ఎలాంటి పాత్రలోనైనా జీవించేయగలడు. తన నటనతో ప్రేక్షకులను కట్టిపడేయగలడు. అందుకే రెండుసార్లు (ఆడుకాలం, అసురన్ సినిమాలకుగానూ) ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు అందుకున్నాడు. ప్రస్తుతం ఇతడు దివంగత శాస్త్రవేత్త, మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం బయోపిక్ చేస్తున్నాడు. ఆదిపురుష్ ఫేం ఓం రౌత్ దీనికి దర్శకత్వం వహించనున్నాడు.కలాం బయోపిక్ఈ సినిమాకు కలాం: ద మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా (Kalam: The Missile Man of India Movie) అనే టైటిల్ ఖరారు చేశారు. మే నెలలో ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. తాజాగా ఓం రౌత్ మాట్లాడుతూ.. చిన్నప్పుడు నేను కలాంను ఇన్స్పిరేషన్గా తీసుకున్నాను. ఆయన పుస్తకాలు నన్నెంతో ప్రభావితం చేశాయి. ఆయన గురించి వెండితెరపై చెప్పినప్పుడు మరెంతో మంది ఇన్స్పైర్ అవుతారు.ధనుష్ ఎందుకంటే?ధనుష్ అద్భుతమైన యాక్టర్. ఆయనకంటే గొప్ప నటుడు మరొకరు లేరు. కలాం బయోపిక్లో నటించేందుకు ధనుష్ ఒప్పుకోవడం సంతోషంగా ఉంది. ఆయనతో కలిసి పనిచేసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను అని ఓం రౌత్ చెప్పుకొచ్చాడు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభించనున్నారు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంస్థ అధినేత అభిషేక్ అగర్వాల్, టీ సిరీస్ సంస్థ అధినేత భూషణ్కుమార్ సంయుక్తంగా నిర్మించనున్నారు.సినిమాధనుష్ విషయానికి వస్తే ఇటీవలే శేఖర్ కమ్ముల 'కుబేర'తో భారీ హిట్ కొట్టాడు. ప్రస్తుతం అతడి స్వీయ దర్శకత్వంలో కథానాయకుడిగా నటించిన ఇడ్లీ కడై రిలీజ్కు రెడీ అవుతోంది. ఓం రౌత్ విషయానికి వస్తే.. బయోపిక్తోనే దర్శకుడిగా ప్రయాణం ప్రారంభించాడు. బాలగంగాధర్ తిలక్ బయోపిక్ 'లోకమాన్య: ఏక్ యుగపురుష్' మూవీతో దర్శకుడిగా మారాడు. తానాజీ, ఆదిపురుష్ సినిమాలు తెరకెక్కించాడు.చదవండి: కన్నీళ్లు పెట్టించే మూవీ.. చేయని తప్పుకు అమ్మాయి జీవితం బలి! -
జీవితంపైనే అసహ్యం.. నాకు చావే దిక్కు!: హీరో రెండో భార్య ఆవేదన
స్టేజీపై హీరోయిన్తో అసభ్యంగా ప్రవర్తించి విమర్శలపాలయ్యాడు భోజ్పురి స్టార్ హీరో పవన్ సింగ్ (Pawan Singh). ఈ ఘటన వల్ల ఏకంగా భోజ్పురి సినీ ఇండస్ట్రీ నుంచే తప్పుకున్నట్లు ప్రకటించింది సింగర్, హీరోయిన్ అంజలి రాఘవ్. దాంతో పవన్ సింగ్ ఆమెకు క్షమాపణలు చెప్పాడు. తనకు ఎలాంటి దురుద్దేశం లేదని, తన వల్ల ఇబ్బంది కలిగినందుకు క్షమించమని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. మరో వివాదంలో హీరోతనకంటే సీనియర్ ఆర్టిస్ట్ అయినందున అతడిని క్షమిస్తున్నానంటూ ఈ వివాదానికి ముగింపు పలికింది అంజలి. కానీ ఇప్పుడు మరో వివాదం తెరపైకి వచ్చింది. పవన్ తనను పట్టించుకోవట్లేదని ఘొల్లుమంటోంది అతడి రెండో భార్య జ్యోతి. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ సుదీర్ఘ పోస్ట్ పెట్టింది. నీతో మాట్లాడాలని కొన్ని నెలలుగా ప్రయత్నిస్తున్నాను. నువ్వు లేదా నీ చుట్టూ ఉన్నవాళ్లో నాకు తెలీదు కానీ.. నా కాల్స్, మెసేజ్లకు ఎటువంటి రిప్లై ఇవ్వడం లేదు.ఏ పాపం చేశా?నీతో మాట్లాడాలని లక్నో వస్తే నన్ను కలవడానికి కూడా నువ్వు ఇష్టపడలేదు. రెండు నెలల క్రితం నా తండ్రి కూడా నిన్ను కలిసేందుకు ప్రయత్నించగా.. ఎటువంటి ఉపయోగం లేకుండా పోయింది. నేను ఏ తప్పు చేశానని నన్ను ఇలా శిక్షిస్తున్నావు? నీ భార్యగా ఉండే అర్హత నాకు లేకపోతే నన్నెప్పుడో వదిలేసి ఉండేవాడివి. కానీ, అలా చేయలేదు. పైగా లోక్సభ ఎన్నికల సమయంలో నాకు లేనిపోని ఆశలు ఎందుకు కల్పించావు? చావే దిక్కుఈరోజు ఆత్మాహుతి తప్ప నాకు మరో మార్గం కనిపించడం లేదు. కానీ, నేను చావాలనుకోవడం లేదు. ఎందుకంటే నేను చనిపోతే నన్ను, నా పేరెంట్స్నే తప్పుబడతారు. నేను నీ భార్యని, నీ కుటుంబంలో ఒకదాన్ని.. ఒకప్పుడు నీపై విషం చిమ్మినవారితో నువ్వు చేతులు కలుపుతున్నావ్.. కానీ, నీ భార్య బాధను గుర్తించలేకపోవుతన్నావ్.. అది తల్చుకుంటేనే కన్నీళ్లొస్తున్నాయి. ఏడేళ్లుగా ఈ బాధలతో సతమతమవుతున్నా.. చివరిసారిగా అడుగుతున్నా..నా జీవితంపై నాకే అసహ్యమేస్తోంది. చివరిసారిగా అడుగుతున్నా.. నాతో మాట్లాడు. నా ఫోన్ ఎత్తు, నా బాధను ఒక్కసారైనా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు అని జ్యోతి సింగ్ రాసుకొచ్చింది. పవన్ సింగ్ గతంలో(2014లో) ప్రియకుమారి సింగ్ను పెళ్లాడాడు. కేవలం ఏడాది మాత్రమే వీరు కలిసున్నారు. తర్వాత విడాకులు తీసుకున్నారు. 2018లో పవన్.. జ్యోతి సింగ్ను రెండో పెళ్లి చేసుకున్నాడు. View this post on Instagram A post shared by Jyoti P Singh (@jyotipsingh999) ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.comచదవండి: కన్నీళ్లు పెట్టించే మూవీ.. చేయని తప్పుకు అమ్మాయి జీవితం బలి! -
కన్నీళ్లు పెట్టించే మూవీ.. చేయని తప్పుకు అమ్మాయి జీవితం బలి!
హీరోహీరోయిన్ల లవ్స్టోరీ, విలన్ ఎంట్రీ, నాలుగు ఫైట్లు, డ్యుయెట్లు.. శుభం పలికే క్లైమాక్స్.. దాదాపు అన్ని సినిమాల్లో ఇవే ఉంటాయి. కానీ ఇప్పుడు చెప్పబోయే సినిమాలో ఇవేవీ ఉండవు. అయినా ఎంతోమందిని ఈ చిత్రం కదిలించింది. సూపర్స్టార్ రజనీకాంత్ ఈ సినిమా చూసి నవ్వుతూనే ఏడ్చేశారు. అందుకే హీరోయిన్ అదితి బాలన్, దర్శకుడు అరుణ్ ప్రభును ఇంటికి పిలిచి మరీ బంగారు గొలుసులు బహుకరించారు. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సైతం సినిమా అద్భుతమని, చివరి పావుగంట నమ్మలేకుండా ఉంటుందని ప్రశంసలు కురిపించారు. ఇంతకీ ఆ సినిమా పేరు అరువి. 2017లో వచ్చిన ఈ తమిళ చిత్రం రూ.1 కోటితో తెరకెక్కి రూ.35 కోట్లకు పైగా వసూలు చేసింది. దర్శకుడు అరుణ్ ప్రభుకు, హీరోయిన్గా అదితి బాలన్కు ఇదే మొదటి సినిమా కావడం విశేషం. ఈ సినిమాలో ఏముందో చూద్దాం..కథఏ అమ్మాయికైనా తండ్రంటే పంచ ప్రాణాలు. తల్లి కోప్పడినా తండ్రి మాత్రం గారాబం చేస్తుంటాడు. అరువి అనే అమ్మాయి కూడా తండ్రి చేతిలో అల్లారుముద్దుగా పెరిగింది. కానీ ఓ యాక్సిడెంట్ వల్ల తన జీవితం అనుకోని మలుపు తిరుగుతుంది. తనకో సమస్య ఉందని ఇంట్లోవాళ్లే ఆమెను ఛీ కొడతారు. తాను ఏ తప్పూ చేయలేదని చెప్పినా ఎవరూ లెక్కచేయరు. ఇంట్లో నుంచి గెంటేస్తారు. కన్నీళ్లతో ఇంటినుంచి బయటకు వస్తుంది. (Aruvi Movie Review)హృదయ విదారక కథకానీ, ఆ కన్నీళ్లను చూసి సమాజం జాలిపడదు సరికదా! దాన్నే అలుసుగా తీసుకుంటుంది. అలా ముగ్గురు మగవారి చేతిలో మోసపోతుంది. ఎమిలీ అనే ట్రాన్స్జెండర్ స్నేహితురాలితో కలిసి ఈ విషయాన్ని ఓ టీవీ డిబేట్లో వెల్లడిస్తుంది. అక్కడి నుంచి సినిమా మరో మలుపు తిరుగుతుంది. అసలు అరువి జీవితాన్ని తలకిందులు చేసిన సమస్య ఏంటి? కంటిరెప్పలా చూసుకున్న కన్నతండ్రే ఆమెను ఎందుకు గెంటేశాడు? చావు తథ్యమని తెలిసి ఆమె ఏం చేసింది? అనేది తెలియాలంటే అమెజాన్ ప్రైమ్లో అరువి చూడాల్సిందే!క్లైమాక్స్లో ఏడ్చేస్తారుసినిమా ప్రారంభంలో కాస్త బోరింగ్గా అనిపిస్తుంది. కానీ ఒక్క సంఘటన తర్వాత కథ ఇంట్రస్టింగ్గా మారుతుంది. చేయని తప్పుకు అరువి జీవితాంతం శిక్ష అనుభవిస్తుంది. ఎవరూ తనను నమ్మకపోవడమనేది ఆమెను మానసికంగా చిత్రవధ చేస్తుంది. సినిమా చివర్లో హీరోయిన్ మాట్లాడే మాటలు కంటతడి పెట్టిస్తాయి. ఐఎమ్డీబీలో 8.3 రేటింగ్ ఉన్న ఈ సినిమా తప్పకుండా చూడండి! -
రకుల్ ప్రీత్ సింగ్ మెడపై స్టిక్కర్.. ఇంతకీ అదేంటో తెలుసా?
హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంది. ఈ ఏడాది మేరీ హస్బెండ్ కీ బీవీ చిత్రంతో అభిమానులను మెప్పించింది. ప్రస్తుతం అజయ్ దేవగణ్ హీరోగా వస్తోన్న దేదే ప్యార్ దే-2 చిత్రంలో కనిపించనుంది. ఈ మూవీలో ఆర్ మాధవన్, టబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా ఈ ఏడాది చివర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.ఇక సినిమాల సంగతి పక్కనపెడితే రకుల్ ప్రీత్ సింగ్ తన ఫిట్నెస్ కోసం తీవ్రంగా కసరత్తులు చేస్తూ ఉంటోంది. జిమ్లో వర్కవుట్స్ చేస్తూ శ్రమిస్తూ సోషల్ మీడియాలో పంచుకుంటుంది. ఆరోగ్యంపై అత్యంత శ్రద్ధ వహిస్తూ ఫుల్ గ్లామరస్గా మెయింటెన్ చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. తన ఫిట్నెస్ రొటీన్, వ్యాయామ నియమావళికి సంబంధించిన స్నీక్ పీక్లను ఇన్స్టాగ్రామ్లో ఎప్పటికప్పుడు షేర్ చేస్తూనే ఉంటుంది.అయితే ఇటీవల రకుల్ ప్రీత్ సింగ్ ముంబయి విమానాశ్రయంలో కనిపించింది. ఈ సందర్భంగా రకుల్ మెడపై ఉన్న ఓ ప్యాచ్ కెమెరాలకు చిక్కింది. ఈ వీడియో కాస్తా నెట్టింట వైరల్ కావడంతో ఇంతకీ అదేంటా అని నెటిజన్స్ తెగ వెతికేస్తున్నారు. చివరికీ ఆ ఈ ప్యాచ్ను లైఫ్వేవ్ ఎక్స్39 స్టెమ్ సెల్ ప్యాచ్గా నెటిజన్స్ గుర్తించారు. ఇది మన శరీరంలోని స్టెమ్ సెల్స్ ఉత్తేజపరిచేందుకు రూపొందించిన వెల్నెస్ ప్రొడక్ట్గా తేల్చేశారు. ఈ ప్యాచ్ ఎటువంటి మందులు లేకుండా శక్తిని, ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయని తెలుస్తోంది. ప్రస్తుతం హెల్త్ కోసం చాలా మంది సెలబ్రిటీస్ వీటిని వినియోగిచండం ట్రెండ్గా మారింది. వీటి ధర దాదాపు వేల రూపాయల్లోనే ఉండనుంది. View this post on Instagram A post shared by Instant Bollywood Videos (@instantbollywoodvideos) -
ఇలాంటి సినిమాలు అరుదు: సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్
‘‘ఉఫ్ఫ్ యే సియా పా’ చిత్రానికి పని చేయడం సవాలుతో కూడుకున్నది. కానీ పనిలో స్వేచ్ఛ దొరికింది. చాలా సినిమాల్లో సంభాషణలకు ప్రాధాన్యం ఉండి, సంగీతం ఒక అడుగు వెనక్కి వెళ్తుంటుంది. కానీ ఇక్కడ సంగీతం కూడా కథనంలో ఒక భాగం. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కథనాన్ని నడిపించే ఇలాంటి అవకాశాలు చాలా అరుదు. సంగీతంలో కొత్త శైలితో ప్రయోగాలు చేయడాన్ని నిజంగా ఆనందించాను’’ అని ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ పేర్కొన్నారు.సోహుమ్ షా, నుష్రత్, నోరా ఫతేహి ప్రధాన పాత్రధారులుగా జి. అశోక్ దర్శకత్వంలో లవ్ రంజన్, అంకుర్ గార్గ్ నిర్మించిన కామెడీ థ్రిల్లర్ చిత్రం ‘ఉఫ్ఫ్ యే సియా పా’. సంభాషణలు లేకుండా నటీనటుల హావభావాలతో రూ పొందిన ఈ చిత్రం సెప్టెంబరు 5న విడుదల కానుంది. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. ఓ పార్సిల్ డెలివరీ వల్ల కేసరి లాల్ సింగ్ (సోహుమ్ షా) జీవితం గందరగోళంలో పడుతుంది. తమ పొరుగింటి కామినితో తన భర్త కేసరి లాల్ సరసాలాడుతున్నాడని అనుమానించి, పుష్ప (నుష్రత్) పుట్టింటికి వెళ్తుంది. ఆ తర్వాత కేసరి లాల్ జీవితంలో ఏం జరిగింది? అనే అంశాల నేపథ్యంలో ఈ సినిమా సాగుతుందని చిత్రబృందం పేర్కొంది. -
కుమారుడి పెళ్లి.. ఎంతో స్పెషల్ అంటూ నటుడి భావోద్వేగం
తమిళ నటుడు ప్రేమ్ కుమార్ (Tamil Actor Prem Kumar) ఇంట పెళ్లి బాజాలు మోగాయి. ప్రేమ్కుమార్ తనయుడు కౌశిక్ సుందరం.. పూజిత మెడలో తాళికట్టాడు. వీరిద్దరి వివాహం చెన్నైలో ఘనంగా జరిగింది. ఇందుకు సంబంధించిన ఫోటోలను ప్రేమ్ కుమార్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఎమోషనలయ్యాడు. రెక్కలు విప్పుకుని ఎదిగే కొడుకుని చూస్తుంటే తండ్రికి ఎంతో గర్వంగా ఉంటుంది. ఎంతో ప్రత్యేకం..ఆగస్టు 28 మా కుటుంబానికి ఎంతో ప్రత్యేకమైన రోజు. నా కొడుకు పెళ్లి అనే బంధంతో జీవితంలో ముందడుగు వేశాడు. అది చూసి తండ్రిగా నా మనసు ఉప్పొంగిపోతోంది. నూతన వధూవరులు కౌశిక్- పూజిత జంట సుఖసంతోషాలతో కలకాలం కలిసుండాలని మనసారా కోరుకుంటున్నాను. మీరిద్దరూ గొప్ప స్థాయికి చేరుకోవాలి. ఈ పెళ్లి వేడుకకు విచ్చేసి కొత్త జంటను ఆశీర్వదించినవారికి ప్రత్యేక కృతజ్ఞతలు అంటూ ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ పెట్టాడు. సినిమాఈ పెళ్లి వేడుకకు హీరో శివకార్తికేయన్ హాజరయ్యాడు. రిసెప్షన్ కార్యక్రమానికి హీరో కార్తీ అటెండయ్యాడు. ప్రేమ్ కుమార్.. ధనం, గురుసామి, బిర్యానీ, ఖిలాడీ, సర్కార్, కాపన్, విక్రమ్ వేద, హీరో, మాస్టర్, తునివు(తెగింపు), కంగువా, రెట్రో.. వంటి పలు తమిళ చిత్రాల్లో నటించాడు. తెలుగులో ఈనాడు (2009) సినిమాలో ఫ్రాన్సిస్గా యాక్ట్ చేశాడు. ఓటీటీలో సుడల్: ద వోర్టెక్స్ వెబ్ సిరీస్లో మెరిశాడు. As a parent, nothing rivals the feeling of pure pride in watching your kid grow and spread their wings in their life with style. In that regard, 28th of August will always be a very special day for our family.My boy took a very big step yesterday, and as a father, my heart is… pic.twitter.com/POfWmAljRw— Prem Kumar (@premkumaractor) August 29, 2025 చదవండి: స్టార్ హీరోతో నటించే ఛాన్స్.. చేజారడంతో ఏడ్చేశా: ప్రేమలు బ్యూటీ -
ఎంగేజ్మెంట్తో మారిపోయా.. ఇకపై అలాంటి సీన్లు చేయను: విశాల్
'నడిగర్ సంఘం భవనం పూర్తయినప్పుడే నా పెళ్లి' అని శపథం చేశాడు స్టార్ హీరో విశాల్ (Vishal). దానికోసం తన వివాహాన్ని వాయిదా వేస్తూ వస్తున్నాడు. నిన్న (ఆగస్టు 29న) విశాల్ 48వ బర్త్డే.. ఈ పుట్టినరోజే తన పెళ్లిరోజు కానుందని గతంలో ప్రకటించాడు. కానీ ఇంకా నడిగర్ సంఘం భవంతి పూర్తి కాకపోవడంతో ప్రస్తుతం ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. హీరోయిన్ సాయిధన్సిక వేలికి ఉంగరం తొడిగాడు.చివరి బ్యాచిలర్ బర్త్డే..నిశ్చితార్థం తర్వాత విశాల్ మాట్లాడుతూ.. ఇది నా చివరి బ్యాచిలర్ బర్త్డే. ఎంగేజ్మెంట్ విషెస్ చెప్పిన ప్రతిఒక్కరికీ కృతజ్ఞతలు. తొమ్మిదేళ్లుగా నడిగర్ సంఘం భవంతి కోసం ఎదురుచూస్తున్నాం. ఇంకో రెండు నెలల్లో అది పూర్తయిపోతుంది. ఈ బిల్డింగ్ కోసం పనిచేస్తున్నప్పుడే ధన్సిక, నేను కలుసుకున్నాం. ఇప్పుడు ఒక్కటి కాబోతున్నాం. మేమిద్దరం ఇంతవరకు ఏ సినిమాలోనూ జంటగా నటించలేదు. అలాంటి సీన్లు చేయనుబిల్డింగ్ ప్రారంభోత్సవం అయిన మరుసటిరోజే నా పెళ్లి జరుగుతుంది. నా బ్యాచిలర్ లైఫ్ ముగియబోతోంది. కాబట్టి నేను చాలా మారాలి. అలా అని రొమాంటిక్ సినిమాలు చేయననుకునేరు, చేస్తాను! కానీ ఇకమీదట ముద్దు సన్నివేశాల్లో నటించను అని చెప్పుకొచ్చాడు. విశాల్ ప్రస్తుతం 'మకుటం' మూవీ చేస్తున్నాడు. నిర్మాత ఆర్బీ చౌదరి కెరీర్లో ఇది 99వ చిత్రంగా రాబోతోంది. రవి అరసు దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో విశాల్ మూడు డిఫరెంట్ లుక్స్లో కనిపించనున్నాడు. View this post on Instagram A post shared by Vishal (@actorvishalofficial)చదవండి: ఐశ్వర్యరాయ్ మూవీ.. నటించేందుకు ఏ హీరో సాహసం చేయలేదు! -
ఐశ్వర్యరాయ్ మూవీ.. నటించేందుకు ఏ హీరో సాహసం చేయలేదు!
మలయాళ స్టార్ మమ్ముట్టి (Mammootty), హీరోయిన్ ఐశ్వర్యరాయ్ (Aishwarya Rai) జంటగా నటించిన చిత్రం కందుకొండైన్ కందుకొండైన్ (Kandukondain Kandukondain). 2000వ సంవత్సరంలో వచ్చిన ఈ మూవీలో టబు, అజిత్, అబ్బాస్ కీలక పాత్రలు పోషించారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. అయితే ఈ మూవీకి మొదట మమ్ముట్టిని అనుకోలేదంటున్నాడు దర్శకుడు రాజీవ్ మీనన్.దివ్యాంగుడిగా నటించలేమన్నారుతాజాగా ఓ ఇంటర్వ్యూలో రాజీవ్ మీనన్ మాట్లాడుతూ.. ఈ మూవీలో కథానాయకుడి పాత్ర కోసం చాలామంది హీరోలను సంప్రదించాను. కానీ, ఎవరూ ముందుకు రాలేదు. ఇందులో హీరో యుద్ధంలో పాల్గొని కాలు కోల్పోతాడు. మరోవైపు తాగుబోతుగా మారతాడు. అది విన్నాక ఏ హీరో కూడా ఈ సినిమా చేసేందుకు ఆసక్తి చూపించలేదు. దివ్యాంగుడిగా నటించలేమని మొహం మీదే చెప్పారు. మమ్ముట్టి మాత్రం..కానీ, మమ్ముట్టి అదొక లోపంగా అస్సలు భావించలేదు. వెంటనే ఒప్పేసుకున్నాడు. మేజర్ బాలాగా నటించాడు. మేజర్ బాలా యుద్ధంలో కుడి కాలు కోల్పోతాడు. దీంతో ఒకవైపు ఒరిగి వంగుతూ నడుస్తాడు. కానీ సెట్లో ఒక్కోసారి తను కోల్పోయింది కుడి కాలా? ఎడమ కాలా? అని మర్చిపోయేవాడు. మళ్లీ వచ్చి అడిగేవాడు. అప్పుడు సరదాగా నవ్వుకునేవాళ్లం అని చెప్పుకొచ్చాడు.చదవండి: అల్లు అరవింద్ కుటుంబంలో విషాదం -
స్టార్ హీరోతో నటించే ఛాన్స్.. చేజారడంతో ఏడ్చేశా: ప్రేమలు బ్యూటీ
ప్రేమలు సినిమాతో సెన్సేషన్ అయింది మమిత బైజు (Mamitha Baiju). ప్రస్తుతం ప్రదీప్ రంగనాథన్తో, దళపతి విజయ్తో సినిమాలు చేస్తోంది. అయితే ఓ స్టార్ హీరోతో నటించే అవకాశం చేతికి వచ్చినట్లే వచ్చి చేజారిపోయిందంటోందీ బ్యూటీ. నాకు పెద్దగా గుర్తింపు లభించని సమయంలో హీరో సూర్య సర్తో కలిసి నటించే ఛాన్స్ వచ్చింది. అప్పుడు ఎగిరి గంతేశాను. కానీ, దురదృష్టవశాత్తూ ఆ అవకాశం చేజారింది. అప్పుడు చాలా బాధపడ్డాను, ఏడ్చాను. కానీ ఇప్పుడు సూర్య సర్తో ఓ సినిమా చేస్తున్నందుకు చాలా థ్రిల్ ఫీలవుతున్నాను అని చెప్పుకొచ్చింది.అప్పుడు మిస్సయిన ఛాన్స్..బాలా డైరెక్ట్ చేసిన వణంగాన్ మూవీలో మొదట సూర్య, మమిత బైజును సెలక్ట్ చేశారు. కొన్ని సీన్లు కూడా చిత్రీకరించారు. కానీ పలు కారణాల వల్ల సూర్య, మమిత బైజు ఈ మూవీ నుంచి తప్పుకున్నారు. దీంతో దర్శకుడు బాలా.. అరుణ్ విజయ్ను హీరోగా పెట్టి సినిమా పూర్తి చేశాడు. ఇదిలా ఉంటే.. వెంకీ అట్లూరి దర్శకత్వంలో సూర్య ఓ సినిమా చేస్తున్నాడు. రాధికా శరత్ కుమార్, రవీనా టండన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇందులో మమితా బైజు హీరోయిన్గా నటిస్తోంది. View this post on Instagram A post shared by Mamitha Baiju (@mamitha_baiju) చదవండి: ‘మారీశన్’ మూవీ రివ్యూ: ఒక్క సీన్ కూడా ఊహించలేరు! -
నన్ను తక్కువ చేసి మాట్లాడే హక్కు ఎవరికీ లేదు: యశ్ తల్లిపై హీరోయిన్ ఫైర్
కన్నడ స్టార్ హీరో యశ్ (Yash), హీరోయిన్ దీపికా దాస్ వరుసకు కజిన్స్ అవుతారు. కానీ, ఎక్కడా తమ చుట్టరికాన్ని బయటకు చెప్పకుండా ఎవరి కెరీర్ వారే నిర్మించుకున్నారు. అయితే యశ్ తల్లి పుష్ప ఇటీవల నిర్మాతగా మారి కొత్తలవాడి సినిమా తీసింది. ఆగస్టు 1న రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద నిరాశపర్చింది. అయితే ఈ మూవీ ప్రమోషన్స్లో పుష్ప.. దీపికా దాస్పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది.ఆమె గురించి ఎందుకు?నెక్స్ట్ సినిమాలో దీపికా దాస్ను ఎంపిక చేసుకునే ఆలోచనలున్నాయా? అన్న యాంకర్ ప్రశ్నపై పుష్ప అసహనం వ్యక్తం చేసింది. అస్తమానూ ఆమె గురించే ఎందుకు అడుగుతారు? రమ్య రక్షిత.. ఇలా ఇండస్ట్రీలో వేరే హీరోయిన్లు చాలామందే ఉన్నారు. దీపిక పెద్ద స్టార్ హీరోయినా? ఆమె ఏం సాధించిందని తన గురించి ప్రత్యేకంగా అడుగుతున్నారు? అని మండిపడింది. ఆమె వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో ట్రోల్ జరిగింది.గౌరవం ఇవ్వడం నేర్చుకోండిరెండు కుటుంబాల మధ్య సఖ్యత లేదా? అన్న అనుమానాలు కూడా తలెత్తాయి. తాజాగా ఈ వివాదంపై దీపికా దాస్ స్పందించింది. కొత్తగా ఇండస్ట్రీకి కొత్త ఆర్టిస్టులకు పరిచయం చేయాలనుకునేవారు, ముందుగా ఆ ఆర్టిస్టులకు గౌరవం ఇవ్వడం నేర్చుకోండి. సినీ ఇండస్ట్రీలో నాకంటూ గుర్తింపు సంపాదించుకునేందుకు ఎవరి పేరు కూడా వాడుకోలేదు. అవతల ఉన్నది అమ్మ అయినా పుష్పమ్మ అయినా సరే.. నా గురించి చెడుగా మాట్లాడే హక్కు ఎవరికీ లేదు.అందుకే మౌనంగా ఉన్నాఏదో వారిపట్ల గౌరవంతో ఇంతవరకు సైలెంట్గా ఉన్నాను తప్ప భయంతో కాదు! నేను పెద్దగా ఏదీ సాధించలేకపోవచ్చు. అంత మాత్రాన నాగురించి నోటికొచ్చినట్లు మాట్లాడతారా? కనీస గౌరవం ఇవ్వడం నేర్చుకోండి అని ఘాటుగా రియాక్ట్ అయింది. నాగిని సీరియల్తో గుర్తింపు తెచ్చుకున్న దీపికా దాస్ కన్నడ బిగ్బాస్ ఏడో సీజన్లో పాల్గొంది. పలు సినిమాల్లో కథానాయికగా నటించింది.చదవండి: ప్రెగ్నెన్సీ ఇష్టం లేదు.. ఆమెకు చాలా డబ్బిచ్చా..: సన్నీలియోన్ -
8 ఏళ్లుగా భార్య సంపాదనతో బతుకుతున్నా..: డైరెక్టర్
భార్య, నటి శ్రీవిద్య సంపాదనతోనే బతుకుతున్నానంటున్నాడు తమిళ దర్శకుడు రాహుల్ రామచంద్రన్ (Rahul Ramachandran). 8 ఏళ్లుగా తన ఖర్చులన్నీ శ్రీవిద్యే చూసుకుందని చెప్తున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అతడు మాట్లాడుతూ.. నా భార్య చిన్ను (శ్రీవిద్య) ఎనిమిదేళ్లుగా నన్ను బంగారంలా చూసుకుంటోంది. ఎటువంటి లోటుపాట్లు రానివ్వలేదు. అంతకుముందు మా అమ్మ నన్ను చూసుకునేది. ఆరేళ్లుగా ఏ సినిమా చేయని డైరెక్టర్కు సంపాదన ఎక్కడినుంచి వస్తుంది?అమ్మ ఇచ్చే డబ్బుతో గిఫ్ట్ఇలాంటి సమయంలో చిన్ను నాకోసం నిలబడింది. ఇప్పుడు నావంతు వచ్చింది. చిన్న బ్రాండ్ ప్రమోషన్స్ వల్ల కొంత డబ్బు సంపాదించగలిగాను. దానితోనే ఈ మధ్య తనకు ఓ గిఫ్ట్ కూడా ఇచ్చాను. ఇలా బహుమతిచ్చి చాలాకాలమే అవుతోంది. తన పుట్టినరోజు వచ్చినప్పుడు మా అమ్మ దగ్గర కొంత డబ్బు తీసుకుని ఏదో ఒక గిఫ్ట్ కొనిస్తుంటాను.భార్య సంపాదనతో బతుకుతున్నా.. తర్వాతి పుట్టినరోజువరకల్లానైనా నా సొంత డబ్బుతోనే తనకు బహుమతి కొనివ్వాలని కోరుకుంటున్నాను. భార్య సంపాదనతో సంతోషంగా బతుకుతున్నానని చెప్పడానికి నాకే అభ్యంతరమూ లేదు. ఏదో ఒకరోజు నేనూ నిలబడి తనకు అండగా నిలబడతాను. అదే నమ్మకంతో ఉన్నాను. ఎప్పుడైనా తినడానికి బయటకు వెళ్లినప్పుడు కూడా తన ఫోన్ నాకిచ్చేసి పేమెంట్ చేయమంటుంది అని చెప్పుకొచ్చాడు. శ్రీవిద్య క్యాంపస్ డైరీ, ఒరు కట్టనందన్ బ్లాగ్, నైట్ డ్రైవ్.. సహా పలు చిత్రాల్లో నటించింది. సీరియల్స్లోనూ తళుక్కుమని మెరిసింది. రాహుల్.. జీబూంబా సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యాడు. తర్వాత మరే సినిమా చేయలేదు. కొన్నేళ్ల పాటు ప్రేమాయణం సాగించిన రాహుల్- శ్రీవిద్య.. 2024 సెప్టెంబర్ 8న పెళ్లి చేసుకున్నారు. ప్రేమలో ఉన్నప్పటినుంచే రాహుల్ ఆలనాపాలనా చూస్తున్న శ్రీవిద్య నిజంగా గ్రేట్ అని అభిమానులు కొనియాడుతున్నారు.చదవండి: శివాజీ సినిమా రిజెక్ట్.. 18 ఏళ్ల తర్వాత కారణం వెల్లడించిన నటుడు -
సింపుల్గా నిశ్చితార్థం చేసుకున్న హీరో విశాల్
తమిళ హీరో విశాల్ సడన్ సర్ప్రైజ్ ఇచ్చాడు. హీరోయిన్ సాయిధన్సికతో నిశ్చితార్థం చేసుకున్నాడు. చెన్నైలో కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ వేడుక జరిగింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే కొత్త జంటకు అందరూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.తమిళం హీరోగా గుర్తింపు తెచ్చుకున్న విశాల్.. హీరోయిన్గా చేస్తున్న ధన్సిక ప్రేమించుకున్నారు. ఈ ఏడాది మే నెలలో జరిగిన ఓ సినిమా ఫంక్షన్లో ఈ విషయాన్ని ప్రకటించారు. తామిద్దరం ఆగస్టు 29నలో పెళ్లి చేసుకుంటామని చెప్పుకొచ్చారు. కానీ నటుల సంఘం కార్యదర్శిగా ఉన్న విశాల్.. ఆ సంఘ(నడిగర్) భవనం ప్రారంభోత్సవం తర్వాత వివాహం చేసుకోనున్నట్లు చెప్పుకొచ్చాడు. దీంతో చెప్పిన తేదీన ఇప్పుడు నిశ్చితార్థం చేసుకున్నారు. చాలా సింపుల్గా ఈ వేడుక జరిగింది.(ఇదీ చదవండి: హీరోయిన్ ఖుష్బూ ఫ్యామిలీ ఫిట్నెస్ గోల్.. అందరూ ఒకేసారి)సాయి ధన్సిక.. తమిళనాడు తంజావూరుకి చెందిన అమ్మాయి. 2006లో 'మనతోడు మజైకాలం' అనే తమిళ సినిమాతో నటిగా మారింది. మెరీనా అనే స్క్రీన్ నేమ్తో ప్రేక్షకులకు పరిచయమైంది. 2009లో 'కెంప' మూవీతో తనుషిక పేరుతో కన్నడ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. తర్వాత సాయి ధన్సిక పేరుతోనే సినిమాలు చేస్తూ వచ్చింది. 'కబాలి' చిత్రంలో రజనీకాంత్ కూతురిగా నటించి తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరైంది. 'షికారు' సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. 'అంతిమ తీర్పు', 'దక్షిణ' లాంటి స్ట్రెయిట్ తెలుగు మూవీస్ చేసింది.విశాల్-ధన్సిక ఇప్పటివరకు ఒక్క సినిమా కూడా కలిసి చేయలేదు. కానీ విశాల్తో తనకు 15 ఏళ్ల పరిచయం ఉందని ధన్సిక చెప్పింది. గత కొన్నేళ్లుగా స్నేహితులుగా ఉన్నామని, కొన్నాళ్ల క్రితమే తామిద్దరి మధ్య ప్రేమ పుట్టిందని చెప్పుకొచ్చింది. ఇప్పుడు నిశ్చితార్థం చేసుకున్నారు. త్వరలో పెళ్లి కబురు కూడా చెబుతారేమో? (ఇదీ చదవండి: ఆరో నెల గర్బిణితో నటుడి రెండో పెళ్లి.. ఇప్పుడు మరో ట్విస్ట్)Thank u all u darlings from every nook and corner of this universe for wishing and blessing me on my special birthday. Happy to share the good news of my #engagement that happend today with @SaiDhanshika amidst our families.feeling positive and blessed. Seeking your blessings and… pic.twitter.com/N417OT11Um— Vishal (@VishalKOfficial) August 29, 2025 -
శివాజీ సినిమా రిజెక్ట్.. 18 ఏళ్ల తర్వాత కారణం వెల్లడించిన నటుడు
రజనీకాంత్ (Rajinikanth) నటించిన బ్లాక్బస్టర్ చిత్రాల్లో శివాజీ (Sivaji Movie) ఒకటి. 2007లో వచ్చిన ఈ సినిమాలో తలైవాను ఢీ కొట్టే విలన్గా నటించమని మొదట సత్యరాజ్ను సంప్రదించారట! రజనీతో సమానంగా పారితోషికం ఇస్తామని చెప్పినా ఆయన నో చెప్పారట! నేనెంత కష్టపడ్డా సరే.. రజనీకాంత్ వచ్చి స్టైల్గా ఏదో ఒకటి చేసేసరికి తనకే గుర్తింపు వస్తోందని బాధపడేవారట! శివాజీలో విలన్గా చేస్తే మరి తను హీరోగా నటించే మూవీలో రజనీ విలన్గా నటిస్తాడా? అని ఎదురు ప్రశ్నించాడని ప్రచారం జరిగింది. విలన్గా ముద్ర వేస్తారని..రజనీ సినిమాల్లో నటించడం ఇష్టం లేక సత్యరాజ్ ఆ అవకాశాన్ని తిరస్కరించారంటూ ఈ అంశంపై పెద్ద చర్చ జరిగింది. దాదాపు 18 ఏళ్ల తర్వాత ఈ వివాదంపై స్పందించాడు సత్యరాజ్ (Sathyaraj). ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. అప్పుడు నేను హీరోగా నిలదొక్కుకునేందుకు ప్రయత్నిస్తున్నాను. నా సినిమాలు ఫ్లాప్ అవుతుండటంతో నాకంటూ మళ్లీ మార్కెట్ సృష్టించుకునే పనిలో పడ్డాను. సరిగ్గా ఆ సమయంలో డైరెక్టర్ శంకర్ శివాజీ సినిమా ఆఫర్ చేశాడు. ఒక్కసారి విలన్గా చేస్తే ఇక అన్నీ ప్రతినాయకుడి పాత్రలే వస్తాయి. అందుకే తిరస్కరించాను అని క్లారిటీ ఇచ్చాడు.39 ఏళ్లు పట్టింది!కాగా సత్యరాజ్.. విలన్ దగ్గర పనిచేసే రౌడీల్లో ఒకరిగా కెరీర్ మొదలుపెట్టాడు. నూరవత్తు నాల్ (1984) చిత్రంతో గుర్తింపు సంపాదించుకున్నాడు. తర్వాత మెయిన్ విలన్గా మారాడు. ఓపక్క విలనిజం పండిస్తూనే మరో పక్క హీరోగానూ మారాడు. రజనీకాంత్తో కలిసి పలు సినిమాల్లోనూ యాక్ట్ చేశాడు. వీరిద్దరూ చివరగా నటించింది 1986లో వచ్చిన మిస్టర్ భరత్ మూవీలో! ఇందులో రజనీ తండ్రిగా సత్యరాజ్ యాక్ట్ చేశాడు. ఆ తర్వాత వీరిద్దరూ మళ్లీ స్క్రీన్ షేర్ చేసుకోవడానికి 39 ఏళ్లు పట్టింది. శివాజీ, ఎంతిరన్ (రోబో) సినిమాలకు నో చెప్పుకుంటూ పోయిన సత్యరాజ్ ఎట్టకేలకు కూలీ చిత్రంలో రజనీ ఫ్రెండ్గా యాక్ట్ చేశాడు.చదవండి: ఆ టాలీవుడ్ హీరో అంటే ఫుల్ క్రష్.. సురేఖవాణి కూతురు సుప్రీత -
ఆరో నెల గర్బిణితో నటుడి రెండో పెళ్లి.. ఇప్పుడు మరో ట్విస్ట్
సరిగ్గా నెల క్రితం తమిళ నటుడు, చెఫ్ మదంపట్టి రంగరాజ్.. రెండో పెళ్లితో వార్తల్లో నిలిచాడు. నటీనటులు మరో పెళ్లి చేసుకోవడం పెద్ద విషయమేమి కాదు. కానీ ఇక్కడ రంగరాజ్ పెళ్లి చేసుకున్న మహిళ సెలబ్రిటీ స్టైలిష్ట్.. అప్పటికే ఆమె ఆరో నెల ప్రెగ్నెన్సీతో ఉండటం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇదే అనుకుంటే ఇప్పుడో ఈ స్టోరీలో మరో ట్విస్ట్.(ఇదీ చదవండి: స్టేజీపై హీరో షాకింగ్ ప్రవర్తన.. హీరోయిన్ నడుము తాకుతా)జూలై 26న తమిళ నటుడు రంగరాజ్.. స్టైలిష్ట్ జాయ్ క్రిసిల్డాని పెళ్లి చేసుకున్నాడు. తర్వాత రోజే తాను ఆరు నెలల ప్రెగ్నెన్సీతో ఉన్నానని జాయ్.. ఇన్ స్టాలో పోస్ట్ పెట్టింది. దీంతో చాలామంది ఆశ్చర్యపోయారు. రీసెంట్గా పదిరోజుల క్రితం కూడా భర్తతో ఎంజాయ్ చేస్తున్నట్లు ఓ రీల్ పోస్ట్ చేసింది. అలాంటిది ఇప్పుడు భర్తపై జాయ్.. పోలీస్ కేసు పెట్టింది. గర్భం దాల్చిన తర్వాత పెళ్లయితే చేసుకున్నాడు గానీ తనని పట్టించుకోవట్లేదని, మోసం చేశాడని చెప్పి చెన్నై పోలీస్ కమిషనరేట్లో ఫిర్యాదు చేసింది.రంగరాజ్ స్వతహాగా చెఫ్. పలు రియాలిటీ షోలకు జడ్జిగా వ్యవహరిస్తూ మంచి ఫేమ్ సొంతం చేసుకున్నాడు. ఈ క్రమంలోనే తమిళంలో మెహందీ సర్కస్, పెంగ్విన్ సినిమాల్లో నటుడిగానూ చేశాడు. ఇదివరకే ఇతడికి పెళ్లయింది. ఇద్దరు కొడుకులు కూడా ఉన్నారు. నెల క్రితం స్టైలిష్ట్ జాయ్ని పెళ్లి చేసుకున్నాడు. కానీ ఈమెతో పాటు కాకుండా తొలి భార్యతోనే ఉంటున్నాడు. రీసెంట్గా మొదటి భార్యతో కలిసి ఓ కార్యక్రమానికి కూడా హాజరయ్యాడు. ఈ విషయం గురించే అడిగితే రంగరాజ్ తనపై దాడి చేశాడని జాయ్ అంటోంది. పెళ్లి తర్వాత నుంచి తనతో కలిసి ఉండేందుకు రంగరాజ్ ఇష్టపడట్లేదని చెబుతోంది. (ఇదీ చదవండి: హీరోయిన్ ఖుష్బూ ఫ్యామిలీ ఫిట్నెస్ గోల్.. అందరూ ఒకేసారి) View this post on Instagram A post shared by J Joy (@joycrizildaa) -
హీరోయిన్ ఫ్యామిలీ ఫిట్నెస్ గోల్.. అందరూ ఒకేసారి
ప్రస్తుతం మనలో చాలామందిని వేధిస్తున్న సమస్య బరువు. అరె ఇలా అయిపోయామేంటి? వెంటనే ఎక్సర్సైజ్ చేయాలి, సన్నగా అవ్వాలని అనుకుంటాం. కానీ దాన్ని అమల్లోకి తీసుకొచ్చేటప్పుడు చాలా కష్టాలు పడుతుంటాం. కానీ ఒకప్పటి హీరోయిన్ ఖుష్బూ మాత్రం ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకున్నట్లు ఉంది. తను మాత్రమే కాదు తన కుటుంబాన్ని కూడా ఫిట్నెస్పై దృష్టి పెట్టేలా చేసింది. దీంతో ఇప్పుడు ఈమె కుటుంబాన్ని చూసి అందరూ షాకవుతున్నారు.దక్షిణాదిలో దాదాపు అన్ని భాషల్లో సినిమాలు చేసిన ఖుష్బూ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. తమిళ దర్శకుడు సుందర్ని పెళ్లి చేసుకున్న ఈమెకు ఇద్దరు కుమార్తెలు అవంతిక, ఆనందిత కూడా ఉన్నారు. గతంలో ఖుష్బూతో పాటు కూతుళ్లు కూడా కాస్త లావుగా కనిపించేవారు. ఆ ఫొటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసినప్పుడు ట్రోల్స్ వచ్చేవి. బరువుపై పలువురు నెటిజన్లు కామెంట్స్ చేసేవాళ్లు. మరి ఈ విషయాన్ని ఖుష్బూ చాలా సీరియస్గా తీసుకున్నట్లుంది.(ఇదీ చదవండి: ‘త్రిబాణధారి బార్బరిక్’ రివ్యూ)ఏడాది తిరిగేలోపు ఖుష్బూ కుటుంబంలోని అందరూ లుక్ మార్చేశారు. పైన కనిపిస్తున్న ఫొటోల్లో ఒకటి గతేడాది సెప్టెంబరులో తీసుకున్నది. ఇందులో అందరూ కాస్త బొద్దుగా కనిపించారు. ఇప్పుడు సరిగ్గా ఏడాది తర్వాత అందరూ సన్నగా మారిపోయి కనిపించారు. తాజాగా వినాయక చవితి సందర్భంగా ఖుష్బూ తన ఫ్యామిలీ ఫొటోని పోస్ట్ చేసింది. ఇది చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. ఇంతలోనే ఇంత మార్పు అని మాట్లాడుకుంటున్నారు.చాన్నాళ్ల క్రితమే యాక్టింగ్ పక్కనబెట్టిన ఖుష్బూ.. ఓవైపు రాజకీయాల్లోనూ ఉంటూనే మరోవైపు 'జబర్దస్త్' లాంటి రియాలిటీ షోల్లో జడ్జిగా కనిపిస్తోంది. ఈమె కూతుళ్లు కూడా ఇండస్ట్రీలోకి వచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. బహుశా అందుకే అందరూ ఒకేసారి ఇలా లుక్ మార్చి కనిపించారా అనే సందేహం వస్తోంది.(ఇదీ చదవండి: స్టేజీపై హీరో షాకింగ్ ప్రవర్తన.. హీరోయిన్ నడుము తాకుతా) View this post on Instagram A post shared by Kushboo Sundar (@khushsundar) -
దర్శన్ భార్యకు అసభ్యకర సందేశాలు.. మహిళా కమిషన్ సీరియస్!
కన్నడ స్టార్ దర్శన్ ఓ అభిమాని హత్యకేసులో జైలుకెళ్లిన సంగతి తెలిసిందే. ఇటీవలే సుప్రీం కోర్టు ఆయన బెయిల్ రద్దు చేయడంతో మరోసారి పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనతో పాటు ప్రియురాలి పవిత్ర గౌడను కూడా అదుపులోకి తీసుకున్నారు. రేణుకస్వామి అనే అభిమాని పవిత్ర గౌడకు అసభ్యకరమైన సందేశాలు పంపాడని అతన్ని హత్య చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఆ తర్వాత కేసు నమోదు చేసిన పోలీసులు వీరిద్దరిని అరెస్ట్ చేసి జైలుకు పంపారు.అయితే ఈ ఘటన తర్వాత దర్శన్ కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ కొందరు అసభ్యకరంగా పోస్టులు పెడుతున్నారు. దర్శన్ భార్య విజయలక్ష్మీతో పాటు ఆయన కుమారుడు వినీశ్పై సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. తాజాగా ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ నెలమంగళకు చెందిన భాస్కర్ ప్రసాద్ మహిళా కమిషన్కు ఫిర్యాదు చేశారు. విజయలక్ష్మి దర్శన్, ఆమె కొడుకును సోషల్ మీడియాలో అసభ్యకరమైన పదాలతో దుర్భాషలాడుతూ మానసికంగా వేధిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. మహిళల గౌరవాన్ని దెబ్బతీసేలా సోషల్ మీడియాలో పోస్ట్ చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మహిళా కమిషన్కు విజ్ఞప్తి చేశారు.ಶ್ರೀಮತಿ ವಿಜಯಲಕ್ಷ್ಮೀ ದರ್ಶನರವರ ಗೌರವಕ್ಕೆ ಧಕ್ಕೆ ಬರುವ ರೀತಿಯಲ್ಲಿ ಸಾಮಾಜಿಕ ಜಾಲತಾಣದಲ್ಲಿ ಮಾನಸಿಕ ಹಿಂಸೆ ನೀಡುತ್ತಿರುವುದರ ಕುರಿತಂತೆ ಕರ್ನಾಟಕ ರಾಜ್ಯ ಮಹಿಳಾ ಆಯೋಗಕ್ಕೆ ದೂರು ಸಲ್ಲಿಕೆಯಾಗಿದ್ದು, ಈ ಕುರಿತು ಸೂಕ್ತ ಕ್ರಮ ಕೈಗೊಂಡು ವರದಿ ಸಲ್ಲಿಸುವಂತೆ ಪೊಲೀಸ್ ಆಯುಕ್ತರಿಗೆ ತಿಳಿಸಲಾಗಿದೆ.#vijaylakshmi #DarshanThoogudeepa pic.twitter.com/eFz5sNs3Zp— Dr Nagalakshmi | ಡಾ. ನಾಗಲಕ್ಷ್ಮಿ (@drnagalakshmi_c) August 28, 2025ఈ ఫిర్యాదుపై స్పందించిన మహిళా కమిషన్ చర్యలకు దిగింది. అసభ్యకరమైన పోస్టులు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని మహిళా కమిషన్ ఛైర్పర్సన్ నాగలక్ష్మి పోలీసులను ఆదేశించింది. దీనిపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి నివేదిక సమర్పించాలని పోలీసు కమిషనర్ను ఆదేశించింది. 15 రోజుల్లోగా నివేదిక సమర్పించాలని కోరింది. ఇటీవల నటి రమ్యపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని మహిళా కమిషన్ పోలీస్ కమిషనర్కు లేఖ రాసిన సంగతి తెలిసిందే.ನಮ್ಮ ವಿಜಯಲಕ್ಷ್ಮಿ ದರ್ಶನ್ ಅತ್ತಿಗೆ ಅವರ ಬಗ್ಗೆ ಕೆಟ್ಟದಾಗಿ ಪೋಸ್ಟ್ ಹಾಕುತ್ತಿದ್ದ ಕೆಲವು ಕ್ರಿಮಿ ಕೀಟಗಳ ವಿರುದ್ಧ ಇಂದು TV14 ಭಾಸ್ಕರ್ ಪ್ರಸಾದ್ ಅವರು ಕರ್ನಾಟಕ ರಾಜ್ಯ ಮಹಿಳಾ ಆಯೋಗಕ್ಕೆ ದೂರು ನೀಡಿದ್ದರು, ಅದರಂತೆಮಹಿಳಾ ಆಯೋಗದ ಅಧ್ಯಕ್ಷರಾದ ಗೌರವಾನ್ವಿತ ಡಾ.ನಾಗಲಕ್ಷ್ಮಿ ಅವರು ಬೆಂಗಳೂರು ಪೊಲೀಸ್ ಕಮಿಷನರ್ ಅವರಿಗೆ ಬರೆದ ಪತ್ರ🙏 pic.twitter.com/9O469sMuUB— Thoogudeepa Team - R (@DTEAM7999) August 28, 2025 -
అభిమానుల ముందే స్టార్ హీరో డ్యాన్స్.. వీడియో వైరల్!
కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్ నటిస్తోన్న తాజా చిత్రం 'మదరాసి' (Madharaasi ). ఈ మూవీని మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్గా రుక్మిణీ వసంత్ కనిపించనుది. ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన ట్రైలర్, సాంగ్స్కు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ట్రైలర్ చూస్తుంటే ఫుల్ యాక్షన్ మూవీగానే తెరకెక్కించినట్లు తెలుస్తోంది.ఇక రిలీజ్ తేదీ దగ్గర పడడంతో మదరాసి ప్రమోషన్స్తో బిజీగా ఉన్నారు శివ కార్తికేయన్. తాజాగా బెంగళూరులో మదరాసి ప్రీ రిలీజ్ ఈవెంట్ను నిర్వహించారు. ఈ సందర్భంగా వేదికపైనే డ్యాన్స్తో అలరించాడు హీరో శివ కార్తికేయన్. ఈ చిత్రంలోని సలంబల అనే పాటకు తన స్టెప్పులతో అదరగొట్టేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.Witnessing this madness is real 😭🧿🫵#skgirlism #Sivakarthikeyan #nexus #Madharaasi pic.twitter.com/gIvFKpanEi— •𝚜haranya•ツ (@Sk_girl_ism) August 28, 2025కాగా.. శ్రీ లక్ష్మీ మూవీస్ బ్యానర్పై నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని సెప్టెంబరు 5న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఫుల్ హై యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందించారు. ట్రైలర్ చూస్తేనే సరికొత్త ఎగ్జయిటింగ్ యాక్షన్ ప్యాక్డ్ కథను చూపించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీలో విద్యుత్ జమాల్, బిజు మీనన్, షబ్బీర్, విక్రాంత్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు.#Madharaasi - Sivakarthikeyan performed the Hook steps of 'Salambala' at Bangalore pre release event 🕺🔥pic.twitter.com/mepInRSVyQ— AmuthaBharathi (@CinemaWithAB) August 28, 2025 -
రక్తంతో రాసిన ఘటనలు..!
పద్నాలుగో శతాబ్దం నేపథ్యంలో రూపొందుతున్న ద్విభాషా (తెలుగు, తమిళ్) చిత్రం ‘ద్రౌపతి–2’. రిచర్డ్ రిషి, రక్షణ ఇందుసూదన్ ప్రధానపాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు మోహన్ .జి దర్శకుడు. నేతాజీ ప్రోడక్షన్స్ తరఫున చోళ చక్రవర్తి, జి.ఎం. ఫిల్మ్ కార్పొరేషన్ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ను విడుదల చేశారు.‘‘14వ శతాబ్దంలోనే మొఘల్ చక్రవర్తులు తమిళనాడులోకి ప్రవేశించారు. రక్తంతో రాసిన చారిత్రక ఘటనల ఆధారంగా ఈ సినిమాని రూపొందిస్తున్నాం. దక్షిణ భారత దేశానికి చెందిన హోయసాల చక్రవర్తి మూడవ వీర వల్లలార్, సేంద మంగలాన్నిపాలించిన కడవరాయుల రాజులు, వీరత్వం, త్యాగం వంటి అంశాలు కీలకంగా ఉంటాయి’’ అని యూనిట్ పేర్కొంది. ఈ ఏడాది చివర్లో ఈ సినిమా విడుదల కానుంది. -
ఈ వీకెండ్ ఓటీటీల్లో పండగే.. శుక్రవారమే 18 చిత్రాలు స్ట్రీమింగ్!
చూస్తుండగానే మరో వీకెండ్ వచ్చేస్తోంది. ఈ వినాయక చవితి పెద్ద సినిమాలేవీ రాలేదు. థియేటర్లలో సుందరకాండ, కన్యాకుమారి లాంచి చిన్న చిత్రాలు సందడి చేశాయి. ఈ శుక్రవారం కూడా తెలుగులో పెద్ద మూవీస్ రావడం లేదు. త్రిబాణధారి బార్బరిక్, అర్జున్ చక్రవర్తి లాంటి సినిమాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి.ఇక వీకెండ్లో ఓటీటీ సినిమాలకు సైతం ఫుల్ డిమాండ్ ఉంటుంది. దాదాపు ఓటీటీల్లోనూ ఫ్రైడే రోజే ఎక్కువ చిత్రాలు స్ట్రీమింగ్కు వస్తుంటాయి. ఈ వారాంతంలో మిమ్మల్ని అలరించేందుకు పలు హిట్ సినిమాలు రెడీ అయిపోయాయి. బాలీవుడ్కు చెందిన మెట్రో ఇన్ డినో, సాంగ్స్ ఆఫ్ ప్యారడైజ్ సినిమాలతో పాటు రాంబో ఇన్ లవ్ అనే తెలుగు వెబ్ సిరీస్ కాస్తా ఆసక్తి పెంచుతున్నాయి. వీటితో పాటు సౌత్, హాలీవుడ్కు చెందిన చిత్రాలు, వెబ్ సిరీస్లు అలరించేందుకు వచ్చేస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం ఏయే సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు ఓ లుక్కేసేయండి.నెట్ఫ్లిక్స్మెట్రో ఇన్.. డైనో (హిందీ మూవీ) - ఆగస్టు 29టూ గ్రేవ్స్ (స్పానిష్ సిరీస్) - ఆగస్టు 29అన్నోన్ నంబర్ (ఇంగ్లీష్ మూవీ) - ఆగస్టు 29లవ్ అన్ ట్యాంగిల్డ్(కొరియన్ మూవీ)- ఆగస్టు 29కరాటే కిడ్: లెజెండ్స్ (హాలీవుడ్ చిత్రం) - ఆగస్టు 30అమెజాన్ ప్రైమ్సాంగ్స్ ఆఫ్ ప్యారడైజ్ (హిందీ సినిమా) - ఆగస్టు 29జియో హాట్స్టార్అటామిక్- వన్ హెల్ ఆఫ్ ఏ రైడ్(హాలీవుడ్ చిత్రం)- ఆగసటు 29హౌ ఐ లెఫ్ట్ ద ఓపస్ దే (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 29రాంబో ఇన్ లవ్ (తెలుగు సిరీస్) - ఆగస్టు 29జీ5శోధా (కన్నడ సిరీస్) - ఆగస్టు 29సోనీ లివ్సంభవ వివరణమ్ నలరసంఘం (మలయాళ సిరీస్) - ఆగస్టు 29ఆహాఇండియన్ ఐడల్ సీజన్ 4 (తెలుగు సింగింగ్ షో) - ఆగస్టు 29లయన్స్ గేట్ ప్లేబెటర్ మ్యాన్ (హాలీవుడ్ మూవీ) - ఆగస్టు 29ఎరోటిక్ స్టోరీస్ (హాలీవుడ్ వెబ్ సిరీస్) - ఆగస్టు 29ఆపిల్ టీవీ ప్లస్కే పాప్డ్(కొరియన్ సిరీస్)- ఆగస్టు 29క్రాప్డ్ (హాలీవుడ్ వెబ్ సిరీస్) - ఆగస్టు 29షేర్ ఐలాండ్ సీజన్ 2 (హాలీవుడ్ వెబ్ సిరీస్) - ఆగస్టు 29మనోరమ మ్యాక్స్సార్కిట్- (మలయాళ సినిమా)- ఆగస్టు 29సైనా ప్లేరవీంద్ర నీ ఎవిడే-(మలయాళ సినిమా)- ఆగస్టు 29 -
ఆస్కార్ అఫీషియల్ ఎంట్రీ.. తొలిసారి ఘనత సాధించిన దేశంగా!
సినిమా రంగంలో అందించే ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డుకు తమ చిత్రం ఎంపికైందని కోలీవుడ్ డైరెక్టర్ పా రంజిత్ ట్వీట్ చేశారు. పాపా బుకా అనే చిత్రం అంతర్జాతీయ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో 98వ అకాడమీ అవార్డులకు అఫీషియల్ ఎంట్రీగా ప్రకటించారని పోస్ట్ చేశారు. ఈ మూవీ నిర్మాతల్లో ఒకరిగా ఉన్నందుకు గర్వంగా ఉందన్నారు. ఈ సినిమా నిర్మాణంలో ఇండియా నుంచి భాగం కావడం మా నీల ప్రొడక్షన్స్కు లభించిన గౌరవమని సంతోషం వ్యక్తం చేశారు. కాగా.. ఈ మూవీ పుపువా న్యూ గినియా దేశం నుంచి అధికారిక ఎంట్రీని దక్కించుకుంది. దీంతో తొలిసారి ఆస్కార్ ఎంట్రీ ఘనతను ఆ దేశం సొంతం చేసుకుంది. పా రంజిత్ తన ట్వీట్లో రాస్తూ.. 'అంతర్జాతీయ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో 98వ అకాడమీ అవార్డులకు పాపా బుకా అధికారికంగా ఎంపికైంది. పపువా న్యూ గినియా దేశం ఎంట్రీగా ఎంపికైందని చెప్పడానికి గర్వంగా ఉంది. భారతదేశం నుంచి నిర్మాతలలో ఒకరిగా..రెండు దేశాల సహ-నిర్మాణంలో భాగం కావడం నీలం ప్రొడక్షన్స్కు దక్కిన గౌరవంగా భావిస్తున్నా. ఈ ప్రయాణానికి మద్దతుగా, అలాగే ఈ కథను ప్రపంచ వేదికకు తీసుకెళ్లడంలో కలిసి వచ్చిన ప్రతి ఒక్కరికీ దక్కిన గౌరవమిది. ఈ సినిమా ద్వారా మరిన్ని ప్రశంసలు పొందడం రెండు దేశాలకు గర్వకారణం. ఈ ఘనత సాధించిన పాపా బుకా చిత్ర బృందానికి శుభాకాంక్షలు' అంటూ పోస్ట్ చేశారు.కాగా.. ఈ సినిమాకు డాక్టర్ బిజు దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని పపువా న్యూగినియాకు చెందిన నోయెలీన్ తౌలా వునమ్, ఇండియాకు చెందిన అక్షయ్ కుమార్ పరిజా, పా రంజిత్, ప్రకాష్ బేర్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం సెప్టెంబర్ 19, 2025న పపువా న్యూ గినియా దేశంలోని థియేటర్లలో రిలీజ్ కానుంది. ఆ తర్వాత అంతర్జాతీయ చలనచిత్రోత్సవ ప్రదర్శనలు, అకాడమీ అవార్డుల కోసం లాస్ ఏంజిల్స్లో ప్రదర్శించనున్నారు. డైరెక్టర్ బిజు ఇప్పటికే సైరా, వీట్టిలెక్కుల్ల వాజి, పెరారియథావర్, వేయిల్మరంగల్ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు. మూడుసార్లు జాతీయ అవార్డు గ్రహీత, ఆయన సినిమాలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సాధించాయి.It is a proud moment for me to state that Papa Buka has been officially selected as Papua New Guinea’s entry for the 98th Academy Awards in the International Feature Film category. As one of the producer from India, it has been an honour for Neelam Productions to be part of this… pic.twitter.com/3aEkSFP1DM— pa.ranjith (@beemji) August 27, 2025 -
దారుణంగా మోసపోయా.. నా జీవితం ఇలా అవుతుందనుకోలేదు.. సింగర్
సుచీ లీక్స్తో కోలీవుడ్లో వైరలైన వివాదాస్పద సింగర్ సుచిత్ర. గతంలో ఆమె పలువురు స్టార్స్పై తీవ్రమైన ఆరోపణలు చేసి కోలీవుడ్లో హాట్టాపిక్గా మారింది. అంతేకాకుండా తన మాజీ భర్త కార్తీక్ గే అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఆ విషయం తెలిసిన తర్వాతే ఆయనతో విడాకులు తీసుకున్నానని ఆమె బాంబ్ పేల్చింది. ఈ వివాదంలోకి హీరో ధనుష్ను కూడా లాగింది. పూటుగా మద్యం సేవించి హీరో ధనుష్, కార్తీక్ ఒకే గదిలో ఉండేవారని తెలిపింది. అప్పట్లో ఆమె వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపాయి.తాజాగా సింగర్ సుచిత్ర మరోసారి వార్తల్లో నిలిచింది. తనకు కాబోయే భర్త షణ్ముగరాజ్ మోసం చేశాడంటూ ఆరోపించింది. అంతేకాకుండా తన ఇంటితో పాటు డబ్బులను లాక్కున్నాడని వీడియోను రిలీజ్ చేసింది. అతనితో తనకు నిశ్చితార్థం అయిందని.. ఆ తర్వాత అతని చేతిలో తీవ్రమైన గృహ హింసకు అనుభవించానని సుచిత్ర ఆవేదన వ్యక్తం చేసింది. షణ్ముగరాజ్ పెద్ద మోసగాడని.. అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని తెలిపింది.గతంలో తనను చెన్నై నుంచి వెళ్లగొట్టారని సింగర్ సుచిత్ర పోస్ట్ చేసింది. అందుకే ముంబైకి వెళ్లి ఉద్యోగం దొరికిన తర్వాత అక్కడే స్థిరపడినట్లు తెలిపింది. సుచీ లీక్స్ వివాదం తర్వాత.. నా జీవితంలో ఇంతకంటే దారుణమైన పరిస్థితులు రావని అనుకున్నా.. కానీ మళ్లీ నా లైఫ్లో అదే జరిగిందని ఆవేదన వ్యక్తం చేసింది. నేను 48 ఏళ్ల వయసులో మళ్లీ ప్రేమలో పడ్డాను.. నా జీవితంలో ఎప్పుడూ జరగకూడదనుకున్నవన్నీ జరిగాయని బాధను వ్యక్తం చేసింది. ఈ వయసులో గృహ హింసను ఎదుర్కొంటానని కలలో కూడా ఊహించలేదన్నారు. అతను ఒక రెజ్లర్ లాగా కొట్టేవాడని.. నన్ను బూట్లతో తన్నేవాడని.. ఒక రోజంతా ఏడుస్తూ మూలన కూర్చున్నేదాన్ని అని వాపోయింది.అతను తన మొదటి భార్య కారణంగా ఇలా ప్రవర్తిస్తున్నాడని అందరూ అనేవారని సింగర్ తెలిపింది. కానీ అతను విడాకులు తీసుకోలేదని నాకు తరువాత తెలిసిందని.. ఈ విషయంలో తనతో అబద్ధం చెప్పాడని వెల్లడించింది. ఒక రోజు అతని మొదటి భార్య వచ్చి అతన్ని విడిచి పెట్టాలని నన్ను వేడుకుందని వీడియోలో మాట్లాడింది. నేను నిజంగా ప్రేమలో పడడం వల్లే డబ్బులు ఇచ్చానని.. లేకపోతే ఒక్క రూపాయి కూడా ఇచ్చేదాన్నికాదని.. నా ప్రతి పైసా తిరిగి చెల్లించే వరకు పోరాడతానని అంటోంది సుచిత్ర. మరో ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో అతని ఫోటో, ఆధార్ కార్డుతో సహా వివరాలను పోస్ట్ చేసింది. View this post on Instagram A post shared by Suchi (@suchislife_official) -
ఆమె నాకు దేవుడిచ్చిన వరం.. భార్యను వదిలేసి ప్రియురాలిపై ప్రశంసలు!
ఓపక్క భార్యకు విడాకులు.. మరోపక్క సింగర్తో రిలేషన్ రూమర్స్తో తరచూ వార్తల్లో నిలుస్తున్నాడు తమిళ హీరో రవి మోహన్ అలియాస్ జయం రవి (Ravi Mohan). ఇతడు ఆర్తి రవిని 2009లో పెళ్లి చేసుకున్నాడు. 15 ఏళ్ల దాంపత్య జీవితం తర్వాత దంపతులిద్దరూ విడిపోవాలని నిర్ణయించుకున్నారు. అయితే తమ విడాకులకు మూడో వ్యక్తికే కారణమని సంచలన ఆరోపణలు చేసింది ఆర్తి. ఆ మూడో వ్యక్తి మరెవరో కాదు, సింగర్ కెనీషా అంటూ ప్రచారం జరిగింది.పార్ట్నర్షిప్గుడికి వెళ్లినా, బయట పార్టీకి వెళ్లినా రవి, కెనీషా (Kenishaa Francis) జంటగా కనిపిస్తూ ఉండటంతో వీరిమధ్య సమ్థింగ్ సమ్థింగ్ ఉందని బలంగా నమ్ముతున్నారు. తాజాగా ఆమెపై తనకున్న ప్రేమను పరోక్షంగా చెప్పకనే చెప్పాడు రవి. తన సొంత బ్యానర్ రవి మోహన్ స్టూడియోస్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి కెనీషాతో కలిసి వచ్చాడు. అంతే కాదు, తన బ్యానర్లో ఆమెను పార్ట్నర్గా ప్రకటించాడు. ఈ సందర్భంగా అతడు మాట్లాడుతూ.. ఈరోజు ఈ కార్యక్రమం జరగడానికి ఏకైక కారకురాలు కెనీషా! నా జీవితంలో తనలా ఇంతవరకు ఎవరూ సాయం చేయలేదు. కెనీషా ఎమోషనల్జీవితంలో ఏమీ తోచని స్థితిలో చిక్కుకున్నప్పుడు భగవంతుడు మనకు ఏదో రకంగా సాయం చేస్తాడు. అలా నాకు ఆ దేవుడు పంపిన బహుమతి కెనీషా. నేనెవరు?అనేది నాకు తెలిసేలా చేసింది. రవి మోహన్ స్టూడియోలో కెనీషాకి కూడా భాగముంది. ప్రతి ఒక్కరి జీవితంలో ఇలాంటి వ్యక్తి ఒకరుండాలని మనసారా కోరుకుంటున్నాను అన్నాడు. అతడి స్పీచ్ వింటున్నప్పుడు కెనీషా కళ్లలో నీళ్లు తిరిగాయి. ఇది చూసిన జనాలు.. మీరు ప్రేమలో ఉన్నారని చెప్పడానికి ఇంతకంటే ఇంకేం కావాలి? అని కామెంట్లు చేస్తున్నారు. View this post on Instagram A post shared by Ravi Mohan (@iam_ravimohan) చదవండి: టాప్ 15లో తనే చెత్త కంటెస్టెంట్.. దమ్మున్న శ్రీజకు సూపర్ పవర్ -
ఒంటరితనం నా వల్లకాదు, నీకోసం ప్రతిరోజు కన్నీళ్లు.. పూర్ణ భర్త భావోద్వేగం
సీమ టపాకాయ్, అవును చిత్రాలతో హీరోయిన్గా పేరు తెచ్చుకుంది పూర్ణ (Poorna). మొదట్లో కథానాయికగా నటించినా తర్వాత సహాయ నటిగా మారింది. అఖండ, దృశ్యం 2, దసరా, భీమా.. ఇలా పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా యాక్ట్ చేసింది. గుంటూరు కారం సినిమాలో కుర్చీ మడతపెట్టి పాటలో నటించింది. ఇదిలా ఉంటే పూర్ణ.. 2022లో వ్యాపారవేత్త షానిద్ అసిఫ్ అలీని పెళ్లి చేసుకుంది. ఆ మరుసటి ఏడాదే పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. రాత్రిళ్లు నీ జ్ఞాపకాలే..తల్లయ్యాక కూడా ఏదో ఒక షోలు, ఈవెంట్స్ అంటూ బిజీగానే గడిపేస్తోంది. అయితే భార్య కోసం తాను కన్నీళ్లు పెట్టుకున్నానంటూ పూర్ణ భర్త చేసిన పోస్ట్ ఒకటి నెట్టింట వైరల్గా మారింది. 'ఈ 45 రోజులు నా జీవితంలోనే మర్చిపోలేను. ఒంటరితనపు నిశ్శబ్ధాన్ని భరించలేకపోయాను. రాత్రిళ్లు నీ జ్ఞాపకాలతోనే గడిపేశాను. ప్రతిరోజు ఉదయం నిన్ను తల్చుకుని ఏడ్చేవాడిని.నా భార్య తిరిగొచ్చిందిఈ 45 రోజుల్లో నాకు ప్రేమ గొప్పదనం తెలిసొచ్చింది. మనల్ని ప్రేమించేవారు మనతో ఉండటమే జీవితంలో అన్నిటికంటే గొప్పనైన వరం. ఈరోజు నా భార్య నా దగ్గరకు తిరిగొచ్చేసింది. ఎన్నో ఎదురుచూపుల తర్వాత జరిగిన ఈ రీయూనియన్ వల్ల ఆనందభాష్పాలు వస్తున్నాయి అని చెప్పుకొచ్చాడు. ఇది చూసిన చాలామంది ఈ దంపతుల మధ్య ఏం జరిగింది? వీరిద్దరూ కలిసి లేరా? అన్న అనుమానాలు వ్యక్తం చేశారు. క్లారిటీ ఇచ్చిన పూర్ణ భర్తదీనికి పూర్ణ భర్త స్పందిస్తూ.. నా భార్య 20 రోజులు చెన్నైలో, 15 రోజులు మలప్పురంలో, ఆ తర్వాత జైలర్ 2 మూవీ కోసం అక్కడ తనింట్లో ఉంది. అంటే మొత్తం 45 రోజులు నాకు దూరంగా ఉంది. మాకు పెళ్లయి మూడేళ్లవుతున్నా.. ఇన్నిరోజులు దూరంగా ఎప్పుడూ లేము. అందుకే, అలా పోస్ట్ పెట్టాను. దాన్ని మీరు తప్పుగా అర్థం చేసుకోకుండి. దేవుడి దయ వల్ల మేమంతా సంతోషంగా ఉన్నాం అని వివరణ ఇచ్చాడు. ఇందుకు తన ఫ్యామిలీ ఫోటోలు జత చేశాడు. View this post on Instagram A post shared by DrShanid Thalekoden (@dr.shanid_asifali) View this post on Instagram A post shared by DrShanid Thalekoden (@dr.shanid_asifali) చదవండి: భర్తతో వినాయక చవితి సెలబ్రేషన్స్.. లావణ్య బేబీ బంప్ ఫోటో -
పరారీలో మలయాళ హీరోయిన్.. సాఫ్ట్వేర్ ఇంజినీర్ కిడ్నాప్
హీరోయిన్లు అయితే సినిమాలు చేస్తుంటారు. లేదంటే సైలెంట్గానే ఉంటారు. పెద్దగా వార్తల్లో నిలవాలని అనుకోరు. కానీ కొందరు మాత్రం అతిగా ప్రవర్తిస్తుంటారు. ప్రముఖ హీరోయిన్ ఇప్పుడు అలానే ఓ ఐటీ ఉద్యోగిని కిడ్నాప్ చేసిన కేసులో ఇరుక్కుంది. ప్రస్తుతానికైతే ఈమె పరారీలో ఉంది. కానీ హీరోయిన్ ఫ్రెండ్స్ ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ విషయం చర్చనీయాంశంగా మారింది.ఇంతకీ ఏమైంది?కేరళ కొచ్చికి చెందిన లక్ష్మీ మేనన్.. తమిళ, మలయాళంలో హీరోయిన్గా చేసింది. 2011 నుంచి సినిమాలు చేస్తోంది. ఈ ఏడాది 'శబ్దం' అనే మూవీ చేసింది. గజరాజు, ఇంద్రుడు, చంద్రముఖి 2 లాంటి డబ్బింగ్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు ఈమె కాస్త పరిచయమే. అలాంటిది ఇప్పుడు నిజ జీవితంలోనూ రౌడీలా ప్రవర్తించింది. ఆ వీడియో వైరల్ అవుతోంది.(ఇదీ చదవండి: భాగ్యశ్రీ ఫ్యాన్స్ని హర్ట్ చేసిన 'కింగ్డమ్' ఓటీటీ వెర్షన్)ఆదివారం (ఆగస్టు 24) రాత్రి కొచ్చిలోని ఓ బార్ దగ్గర లక్ష్మీ మేనన్, ఆమె ఫ్రెండ్స్కి మరికొందరితో గొడవ జరిగింది. ఈ క్రమంలోనే తమపై అరుస్తున్న సాఫ్ట్వేర్ ఉద్యోగిని కిడ్నాప్ చేశారు. తమ కారులో ఎక్కించుకుని బెదిరించి, బూతులు తిట్టి హింసించారు. కాసేపటి తర్వాత ఆమెని మరో చోట విడిచిపెట్టారు. ఈ సంఘటన తర్వాత బాధితురాలు ఎర్నాకులం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.విచారించిన పోలీసులు.. గొడవకు కారణమైన లక్ష్మీ మేనన్ స్నేహితులు ముగ్గురిని అరెస్ట్ చేశారు. నటి కోసం ప్రయత్నిస్తుంటే ఆమె ఫోన్ స్విచ్ఛాప్ వస్తోంది. ప్రస్తుతం పరారీలో ఉన్న లక్ష్మీ మేనన్ని పట్టుకునేందుకు పోలీసులు వెతుకుతున్నారు. ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. లక్ష్మీ మేనన్ గ్యాంగ్.. ఐటీ ఎంప్లాయ్ని బెదిరిస్తున్న ఓ వీడియో కూడా వైరల్ అవుతోంది.(ఇదీ చదవండి: ఓటీటీలో తమిళ హిట్ సినిమా.. ఇప్పుడు తెలుగులోనూ)ஐ.டி ஊழியர் கடத்தல் வழக்கில் விசாரணைக்கு அழைக்கப்பட்ட நடிகை லட்சுமிமேனன் தலைமறைவான நிலையில் காரை வழிமறித்து தகராறு செய்வது போன்ற வீடியோ வெளியாகி வைரல்..#Polimer | #Police | #Kerala | #LakshmiMenon | #Arrest pic.twitter.com/zipPD6H8PN— Polimer News (@polimernews) August 27, 2025 -
రోబోగా అనిరుధ్.. 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' గ్లింప్స్
తమిళ యువ హీరో ప్రదీప్ రంగనాథన్ లేటెస్ట్ మూవీ 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ'. నయనతార నిర్మిస్తుండగా ఈమె భర్త విఘ్నేశ్ శివన్ దర్శకత్వం వహించాడు. టైటిల్ విషయమై అప్పట్లో కాస్త కాంట్రవర్సీ అయిన ఈ చిత్రం.. ఇప్పుడు విడుదలకు సిద్ధమైంది. అక్టోబరు 17న థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలోనే ఫస్ట్ పంచ్ పేరుతో ఇప్పుడు గ్లింప్స్ రిలీజ్ చేశారు. సమ్థింగ్ డిఫరెంట్గా ఉంటూనే ఆకట్టుకుంటోంది.(ఇదీ చదవండి: 'సుందరకాండ' సినిమా రివ్యూ)2040లో చెన్నైలో జరిగే స్టోరీతో ఈ సినిమా తీశారని గ్లింప్స్ చూస్తుంటే అర్థమైపోయింది. ఎస్జే సూర్య విలన్. సంగీతమందించిన అనిరుధ్.. ఇదే మూవీలో కనిపించిన రోబోకు డబ్బింగ్ చెప్పడం విశేషం. అలానే సినిమాలో యష్.. మిషన్ ఇంపాజిబుల్-14లో నటించాడని, రజినీకాంత్ 189 కూడా చేస్తున్నాడని లాంటి రిఫరెన్సులు ఉన్నాయి. అలానే కొండపై హాలీవుడ్ అక్షరాలు ఉన్నట్లు ఇక్కడ కోలీవుడ్ అని ఉండటం లాంటివి డిఫరెంట్గా అనిపించాయి.2040లో స్వచ్ఛమైన ప్రేమని వెతికే ఓ అమ్మాయి.. హీరోని కలిస్తే తర్వాత ఏమైంది అనే కాన్సెప్ట్తో మూవీ తీసినట్లు ఉంది. ఇందులో ఎస్జే సూర్య గెటప్ కూడా కాస్త విచిత్రంగానే ఉంది. ప్రస్తుతానికి తమిళ గ్లింప్స్ మాత్రమే రిలీజ్ చేశారు. త్వరలో తెలుగుది కూడా తీసుకొస్తారేమో చూడాలి.(ఇదీ చదవండి: ప్రియురాలికే తన ఫ్లాట్ అద్దెకిచ్చిన 'వార్ 2' హీరో) -
'సందర్భం లేకుండా అడగొద్దు.. మీడియాపై ప్రముఖ నటి అసహనం'!
ప్రముఖ మలయాళ నటి రీమా కల్లింగల్ తాజాగా కేరళ ఫిల్మ్ క్రిటిక్స్ అవార్డ్ను సొంతం చేసుకుంది. థియేటర్: ది మిత్ ఆఫ్ రియాలిటీ మూవీలో పాత్రకు గానూ ఈ ఘనత దక్కించుకుంది. ఈ అవార్డ్ అందుకున్న రీమా సినీ ఇండస్ట్రీ, కెరీర్ గురించి పలు ఆసక్తికర కామెంట్స్ చేసింది. తాను ఒక నటినేనని.. తన ప్రదర్శన గురించి మాట్లాడాల్సిన చోట అమ్మా గురించి ప్రస్తావించడం సరికాదని హితవు పలికింది.ఈ అవార్డ్ ఈవెంట్లో రీమాకు ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. మలయాళ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (AMMA)లో నాయకత్వ మార్పుపై మాట్లాడాలని ఆమెను అడిగారు. తన అవార్డ్ అందుకునే సమయంలో ఇలా అడగడం సరైంది కాదని రీమా అసంతృప్తి వ్యక్తం చేసింది. అమ్మాలో ఎక్కువగా మహిళల ప్రాతినిధ్యం కోసం తన మద్దతును ఉంటుందని తెలిపింది. కానీ ఇలాంటి ప్రతిష్టాత్మక ప్రశంసను అందుకున్న సమయంలో అమ్మా రాజకీయాల గురించి అడగడం తనను ఆశ్చర్యానికి గురి చేసిందని పేర్కొంది.రిమా కల్లింగల్ మాట్లాడుతూ..'నా సినిమాలో నటనకు నేను అవార్డు గెలుచుకున్నా. కానీ ఈ సినిమా గురించి ఎటువంటి ప్రశ్నలు మీరు అడగలేదు. నేను మొదట నటిని. అందరూ ఆ విషయం మర్చిపోయినట్లున్నారు' అని అన్నారు. కాగా.. సజిన్ బాబు దర్శకత్వం వహించిన థియేటర్: ది మిత్ ఆఫ్ రియాలిటీ చిత్రం అక్టోబర్ 16న థియేటర్లలో సందడి చేయనుంది. కాగా.. రీమా కల్లింగల్ ఉమెన్ ఇన్ సినిమా కలెక్టివ్ (WCC) సహ వ్యవస్థాపకురాలిగా ఉన్నారు. ఈ కమిటీలో మలయాళ చిత్ర పరిశ్రమకు చెందిన పది మంది సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీలో మంజు వారియర్, పార్వతి, రెమ్య నంబీసన్ లాంటి ప్రముఖులు కూడా ఉన్నారు. View this post on Instagram A post shared by Anjana Talkies (@anjanatalkies) -
ది రాజాసాబ్ బ్యూటీ కొత్త సినిమా.. ట్రైలర్ వచ్చేసింది!
మలయాళ సూపర్ స్టార్ మోహన్లాల్ హీరోగా వస్తోన్న తాజా చిత్రం హృదయపూర్వం. ఈ చిత్రంలో ది రాజాసాబ్ బ్యూటీ మాళవికా మోహనన్, సంగీత్ ప్రతాప్ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు సత్యన్ అంతికాడ్ దర్శకత్వం వహించగా.. ఆశీర్వాద్ సినిమాస్ బ్యానర్పై ఆంటోని పెరుంబవూర్ నిర్మించారు.ఈ నేపథ్యంలోనే హృదయపూర్వం ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ట్రైలర్ చూస్తే ఫ్యామిలీ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్గా తెరకెక్కించినట్లు తెలుస్తోంది.ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగస్టు 28న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రంలో సంగీత, సిద్ధిక్, నిషాన్, బాబురాజ్, లాలూ అలెక్స్, జనార్దనన్ కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీకి జస్టిన్ ప్రభాకరన్ సంగీతమందించారు. -
నాన్నకు ఆ హీరోయిన్తో లవ్.. తన కోసమే నేర్చుకున్నారు: శృతి హాసన్
ఇటీవలే కూలీ మూవీతో అలరించిన కోలీవుడ్ ముద్దుగుమ్మ శృతిహాసన్. రజినీకాంత్- లోకేశ్ కనగరాజ్ కాంబోలో వచ్చిన ఈ చిత్రంలో ప్రీతి అనే అమ్మాయి పాత్రలో కనిపించింది. ఈ మూవీలో నటనకు శృతిహాసన్ ప్రశంసలు అందుకుంది. ఈ చిత్రంలో టాలీవుడ్ కింగ్ నాగార్జున, బాలీవుడ్ హీరో అమిర్ ఖాన్ సైతం కీలక పాత్రలు పోషించారు. ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.400 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.అయితే రిలీజ్కు ముందు కూలీ మూవీ ప్రమోషన్లలో శృతిహాసన్ పాల్గొన్నారు. నటుడు సత్యరాజ్తో కలిసి ఇంటర్వ్యూకు హాజరయ్యారు. ఈ సందర్భంగా తండ్రిలాగే శృతిహాసన్ కూడా చాలా భాషలు నేర్చుకుందని ప్రశంసించారు. కమల్ హాసన్ ఒక బెంగాలీ సినిమా చేశాడని..ఆ మూవీ కోసమే భాష నేర్చుకున్నాడని సత్యరాజ్ అన్నారు.అయితే కమల్ హాసన్ బెంగాలీ నేర్చుకోవడంపై శృతిహాసన్ ఆసక్తికర కామెంట్స్ చేసింది. అయితే తన తండ్రి సినిమా కోసం భాష నేర్చుకోలేదని సీక్రెట్ను రివీల్ చేసింది. బెంగాలీ నటి అపర్ణ సేన్తో ప్రేమలో పడ్డారని.. ఆమె కోసమే తన తండ్రి బెంగాలీ నేర్చుకున్నారని శృతి హాసన్ వెల్లడించింది. కూలీ ప్రమోషన్స్ సందర్భంగా శృతి ఈ విషయాన్ని పంచుకుంది.శృతి హాసన్ మాట్లాడుతూ.. ' మా నాన్న బెంగాలీ ఎందుకు నేర్చుకున్నాడో తెలుసా? ఆ సమయంలో బెంగాలీ నటి అపర్ణ సేన్తో ప్రేమలో పడ్డారు. ఆమెను ఆకట్టుకోవడానికి నాన్న బెంగాలీ నేర్చుకున్నాడు. అంతేకానీ సినిమా కోసం కాదని' తెలిపింది. అంతేకాకుండా కమల్ హాసన్ దర్శకత్వం వహించిన హే రామ్ మూవీ గురించి కూడా మాట్లాడింది. ఆ చిత్రంలో రాణి ముఖర్జీ పాత్ర పేరు అపర్ణ అయితే.. అపర్ణ సేన్ అని పేరు పెట్టారని ఆమె వెల్లడించింది.అపర్ణ సేన్ ఎవరంటే?అపర్ణ సేన్ బెంగాలీ స్టార్ నటీమణుల్లో ఆమె ఒకరు. అంతేకాదు.. ఆమె చిత్రనిర్మాత కూడా. అపర్ణ సేన్ తొమ్మిది జాతీయ చలనచిత్ర అవార్డులను గెలుచుకుంది. అంతేకాకుండా 1987లో పద్మశ్రీతో సత్కరించారు. బాలీవుడ్ నటి కొంకోన సేన్ శర్మ ఆమె కూతురే కావడం విశేషం. -
విజయ్తో సినిమా.. ఆస్తులన్నీ అమ్ముకున్నా: నిర్మాత
దళపతి విజయ్(Vijay)పై ఆయన మాజీ మేనేజర్, ‘పులి’ నిర్మాత పీటీ సెల్వకుమార్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ‘పులి’ సినిమాతో తాను భారీగా నష్టపోతే.. ఆయన రెమ్యునరేషన్ మాత్రం డబుల్ అయిందన్నారు. సినిమా కోసం ఆస్తులన్నీ అమ్ముకున్న తనకు.. ఈ రోజు వరకు విజయ్ నుంచి ఓదార్పు మాట రాలేదన్నారు. విజయ్ హీరోగా చింబు దేవన్ దర్శకత్వంలో 2015లో పులి అనే సినిమాను వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను ఎస్ కే టీ స్టూడియోస్ బ్యానర్ పై శిబు తమీన్స్, పీటీ సెల్వకుమార్ నిర్మించారు. అప్పటి వరకు వచ్చిన తమిళ సినిమాల కంటే ఎక్కువ బడ్జెట్తో ఈ సినిమాను రూపొందించారు. విజయ్ తో పాటు కిచ్చా సుదీప్, అతిలోక సుందరి శ్రీదేవి, హన్సిక వంటి స్టార్స్ నటించిన ఈ చిత్రం భారీ అంచనాల మధ్య విడుదలై..తొలి రోజే డిజాస్టర్ టాక్ సంపాదించుకుంది. దీంతో నిర్మాలతకు, బయ్యర్లుకు భారీ నష్టాలు వచ్చాయి. అయితే చాలా కాలం తర్వాత నిర్మాత సెల్వకుమార్ ఈ సినిమాపై స్పందించారు.రిలీజ్కి ముందే కుట్ర..ఎన్నో అవాంతరాలు ఎదుర్కొని సినిమాను విడుదల చేశాం. రిలీజ్కి ఒక్క రోజు ముందు ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు దాడి చేశారు. ఇది పక్కా ప్లాన్ ప్రకారం జరిగింది. నా పక్కన ఉన్నవారే కుట్ర చేశారు. సినిమా విడుదల కాదనే వార్తలను వ్యాప్తి చేశారు. ఆ సమయంలో నేను ఎదుర్కొన్న అవమానం, ఒత్తిడి వర్ణనాతీతం. నా 27 ఏళ్ల కష్టార్జితం మొత్తం ఈ ఒక్క సినిమా కోసమే ఖర్చు చేశా. నా కలలతో ముందుకు సాగాలని కోరుకున్నాను. కానీ ఆ కష్టార్జితం నాశనమైంది.మధ్యలో బయటకు వచ్చేశారుఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని సినిమాను థియేటర్స్కి తీసుకొచ్చాం. తొలి రోజు నెగెటివ్ రివ్యూస్ వచ్చాయి. స్టోరీ, గ్రాఫిక్స్ వర్క్పై ఫ్యాన్స్ సైతం ఫైర్ అయ్యారు. తీవ్ర ఆందోళనకు గురయ్యాను. ప్రేక్షకులు మధ్యలోనే థియేటర్స్ నుంచి బయటకు వెళ్లడం కళ్లారా చూశాను. అప్పుడు నా స్థానంలో ఇంకా ఎవరైనా ఉంటే కచ్చితంగా ఆత్మహత్య చేసుకునే వాళ్లు.విజయ్ దూరం పెట్టాడు.. సినిమా అపజయం చెందడంతో విజయ్ నన్ను దూరం పెట్టేశాడు. సినిమా రిలీజ్ తర్వాత ఐదారు రోజుల పాటు విజయ్తో మాట్లాడే అవకాశం రాలేదు. ఈ అపజయం విజయ్ కెరీర్పై కొంచెం కూడా పడలేదు. ఇంకా చెప్పాలంటే ఆయన పారితోషికం డబుల్ అయింది. పులి చిత్రానికి రూ. 25 కోట్లు తీసుకున్న విజయ్.. ఆ తర్వాత చిత్రానికి రూ. 45 కోట్ల రెమ్యునరేషన్ పుచ్చుకున్నాడు. కానీ వాళ్లు మాత్రం నన్ను దేశ ద్రోహిగా, వైఫల్యం చెందిన వ్యక్తిగానే చూశారు. కొన్ని విషయాలను బయటపెట్టలేను కానీ.. పులి సినిమాతో నా 27 ఏళ్ల కల, కృషి నాశనం అయ్యాయి’ అని ఓ ఈవెంట్లో సెల్వకుమార్ ఎమోషనల్గా చెప్పుకొచ్చాడు. -
'సింగర్తో తిరుమలకు హీరో'.. జయం రవి భార్య ఆసక్తికర పోస్ట్!
కోలీవుడ్ హీరో జయం రవి విడాకుల వివాదం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉంది. తన భార్య ఆర్తితో విభేదాలు రావడంతో ఇప్పటికే డివోర్స్ తీసుకునేందుకు కోర్టును ఆశ్రయించారు. ఆ తర్వాత ఒకరిపై ఒకరు తీవ్రంగా ఆరోపణలు చేసుకున్నారు. ఆ తర్వాత ప్రముఖ సింగర్ కెన్నీషాతో జయం రవి కనిపించడంతో వారిద్దరిపై డేటింగ్ రూమర్స్ మొదలయ్యాయి. ఓ పెళ్లిలో వీరిద్దరు అత్యంత సన్నిహితంగా ఉంటూ కనిపించారు. అంతేకాకుండా తమ మధ్య విభేదాలకు మూడో వ్యక్తి ప్రమేయం ఉందని ఆర్తి కూడా ఆరోపించింది.తాజాగా సింగర్ కెన్నీషా ఫ్రాన్సిస్తో కలిసి జయం రవి తిరుమలను సందర్శించారు. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్గా మారాయి. దీంతో మరోసారి వీరిద్దరి విడాకుల టాపిక్ తెరపైకి వచ్చింది. ఇది చూసిన ఆర్తి సోషల్ మీడియా వేదికగా ఆసక్తికర పోస్ట్ చేసింది.ఆర్తి తన ఇన్స్టాలో రాస్తూ..'నువ్వు ఇతరులను మోసం చేయొచ్చు. నిన్ను నువ్వు మోసం చేసుకోవచ్చు. కానీ, దేవుడిని మోసం చేయలేవు' అని తన స్టోరీస్లో పోస్ట్ చేసింది. అయితే జయం రవి- కెన్నీషా తిరుమల దర్శనాన్ని ఉద్దేశించే ఈ పోస్ట్ చేసినట్లు తెలుస్తోంది. అందుకే ఈ పోస్ట్ పెట్టి ఉంటారని అభిమానులు కామెంట్ చేస్తున్నారు. కాగా.. చెన్నైలో తన ప్రొడక్షన్ హౌస్ ప్రారంభోత్సవానికి ముందు రవి, కెనీషా తిరుపతి వెంకటేశ్వర ఆలయాన్ని సందర్శించారు.మరోవైపు ఈ జంట విడాకులు ప్రకటించిన సమయంలో ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకున్నారు. ఆ తర్వాత ఆర్తి తన భర్త నుంచి నెలకు రూ.40 లక్షల భరణం ఇప్పించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. -
దిగ్గజ సచిన్ని ఫిదా చేసిన సౌత్ సినిమా
సినిమాకు ఒకప్పుడు హద్దులు ఉండేవి. ఏ ఇండస్ట్రీ మూవీస్ ఆయా రాష్ట్రాల్లో మాత్రమే ఆడేవి. ఇప్పుడు ఓటీటీ పుణ్యమా అని భాషా హద్దులు లేకుండా పోయాయి. దీంతో సామాన్యుల నుంచి స్టార్స్ వరకు కొత్త మూవీస్ ఎప్పటికప్పుడు చూస్తున్నారు. వాటి గురించి సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెడుతున్నారు. అలా దిగ్గజ సచిన్ టెండుల్కర్కి కూడా ఈ మధ్య రిలీజైన ఓ తమిళ సినిమా నచ్చేసింది. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే చెప్పారు.(ఇదీ చదవండి: లావు తప్ప మరేదీ కనపడదా..? హీరోయిన్ ఆక్రోశం)రిటైర్మెంట్ తర్వాత జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్న సచిన్.. రీసెంట్గా రెడిట్లో అభిమానులతో ముచ్చటించారు. ఇందులో భాగంగా సినిమాల గురించి అడగ్గా.. ఈ మధ్య కాలంలో తనకు 3 బీహెచ్కే, అత తంబైచ నాయ్ అనే చిత్రాలు నచ్చాయని చెప్పుకొచ్చారు. వీటిలో ఒకటి తమిళ్ కాగా, మరొకటి మరాఠీ మూవీ. 3 బీహెచ్కే సినిమా విషయానికొస్తే.. తెలుగు ప్రేక్షకులకు తెలిసిన సిద్ధార్థ్, శరత్ కుమార్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు.మధ్య తరగతి కుటుంబం.. సొంత ఇంటి కలని నిజం చేసుకునే క్రమంలో ఎలాంటి కష్టాలు ఎదుర్కొంది? చివరకు సొంత ఇల్లు కట్టుకోగలిగారా లేదా అనే స్టోరీతో తీసిన ఈ చిత్రం.. చాలామంది మిడిల్ క్లాస్ యువతకు కనెక్ట్ అయింది. శ్రీ గణేశ్ దీనికి దర్శకుడు. థియేటర్లలో పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం.. అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి వచ్చిన తర్వాత కూడా మంచి రెస్పాన్స్ అందుకుంది. ఇప్పుడు సచిన్ కూడా ఈ మూవీ తనకు నచ్చిందని చెప్పడంతో సోషల్ మీడియాలో మరోసారి ట్రెండ్ అవుతోంది.(ఇదీ చదవండి: రజనీకాంత్ సలహా.. ఆ పని ఎప్పటికీ చేయను: కార్తీ) -
రజనీకాంత్ సలహా.. ఆ పని ఎప్పటికీ చేయను: కార్తీ
కొందరు హీరోలు.. కేవలం నటన అనే కాకుండా మిగతా విభాగాల్లోనూ తమ ప్రతిభ చూపిస్తుంటారు. హీరోగా చేస్తూనే నిర్మాణం, దర్శకత్వం, ఎడిటింగ్.. ఇలా పలు డిపార్ట్మెంట్స్ హ్యాండిల్ చేస్తుంటారు. కొందరు మాత్రం యాక్టింగ్ తప్పితే మరో పని చేసేందుకు పెద్దగా ఆసక్తి చూపించారు. అయితే వాళ్ల కారణాలు వాళ్లకు ఉంటాయి. ఇప్పుడు తమిళ హీరో కార్తీ కూడా అలాంటి ఓ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టాడు. రజనీకాంత్ తనకు ఇచ్చిన సలహా గురించి కూడా చెప్పుకొచ్చాడు.తమిళ హీరో జయం రవి అలియాస్ రవి మోహన్.. గత కొన్నాళ్లుగా భార్య ఆర్తితో విడాకులు, కుటుంబ సమస్యల కారణంగా వార్తల్లో నిలిచాడు. ఇప్పుడు ఆ గొడవ అంతా సైలెంట్ అయిపోయింది. ఈ క్రమంలోనే రవి మోహన్.. ఇప్పుడు నిర్మాణ రంగంలోకి కూడా అడుగుపెట్టాడు. రవి మోహన్ స్టూడియోస్ పేరుతో సంస్థని ప్రారంభించాడు. చెన్నైలో ఈ రోజు(ఆగస్టు 26) రెండు కొత్త చిత్రాలతో ఈ సంస్థ ప్రారంభమైంది.(ఇదీ చదవండి: రష్మిక 'గర్ల్ ఫ్రెండ్'.. మెలోడీ సాంగ్ రిలీజ్)ఈ వేడుకకు తమిళ హీరోలైన కార్తీ, శివకార్తికేయన్, ఎస్జే సూర్యతో పాటు పలువురు దర్శకనిర్మాతలు కూడా వచ్చారు. ఇందులోనే మాట్లాడిన కార్తీ.. తాను ఎప్పటికీ నిర్మాణ రంగంలోకి రానని తేల్చి చెప్పాడు. ఈ విషయమై రజనీకాంత్ తనకు ఎప్పుడో సలహా ఇచ్చారని అన్నాడు. చాన్నాళ్ల క్రితం రవి.. తనకు ఓ స్టోరీ చెప్పాడని, అందులో తాను-రవి హీరోలు ఉంటామని చెప్పుకొచ్చాడు. స్క్రిప్ట్ చెబుతున్న టైంలోనే నటిస్తూ నెరేషన్ ఇవ్వడం చాలా నచ్చేసిందని కార్తీ చెప్పాడు. కార్తి-జయం రవి.. గతంలో 'పొన్నియిన్ సెల్వన్' రెండు చిత్రాల్లో కలిసి నటించారు.నిర్మాతగా అసలు ఎప్పటికీ మారనని కార్తి చెప్పాడు కదా.. అయితే ఇతడి అన్నయ్య సూర్య మాత్రం ఓవైపు హీరోగా సినిమాలు చేస్తూనే మరోవైపు 2డీ ఎంటర్టైన్మెంట్స్ పేరుతో నిర్మాతగా హిట్స్ కొడుతుండటం విశేషం. మరి కార్తీ ఎందుకు వద్దనుకుంటున్నాడో ఏమో?(ఇదీ చదవండి: లావు తప్ప మరేదీ కనపడదా..? హీరోయిన్ ఆక్రోశం)I am always scared of producing movies, and I strongly go by the advice of #SuperstarRajinikanth sir not to enter production - #Karthipic.twitter.com/HYGseiV2SK— Trendswood (@Trendswoodcom) August 26, 2025 -
కన్నడ స్టార్ హీరోకి క్షమాపణ చెప్పిన నటుడు
కన్నడ యువ నటుడు మను.. స్టార్ హీరో శివరాజ్ కుమార్కి సారీ చెప్పాడు. దాదాపు కాళ్లపై పడినంత పనిచేశాడు. కొన్నిరోజుల క్రితం మనుకు సంబంధించిన ఓ ఆడియో లీకైంది. దీంతో కన్నడ ఇండస్ట్రీ.. ఇతడిపై నిషేధం విధించింది. ఫలితంగానే ఇప్పుడు కాళ్లవేళ్ల పడి బతిమాలడుకున్నాడు. ఇంతకీ ఏంటి విషయం?కన్నడ చిత్రసీమకు చెందిన మదెనురు మను.. ఈ ఏడాది 'కులదల్లి కీలయావదు' సినిమా చేశాడు. అయితే మే 23న రిలీజ్ అనగా సరిగ్గా ఓ రోజు ముందు ఇతడిపై రేప్ కేసు నమోదైంది. తనపై అత్యాచారం చేశాడని మూవీలో ఇతడితో పాటు పనిచేసిన నటి కేసు పెట్టింది. దీంతో పోలీసులు ఇతడిని అరెస్ట్ కూడా చేశారు. కొన్నాళ్లకు ఆమె కేసు వాపస్ తీసుకోవడంతో పోలీస్ స్టేషన్ నుంచి విడుదలయ్యాడు.(ఇదీ చదవండి: బిగ్బాస్లోకి మరో కన్నడ నటి.. హిట్ సీరియల్తో గుర్తింపు)మరోవైపు ఇదే నటుడికి సంబంధించిన ఓ ఆడియో లీకైంది. స్టార్ హీరోలు శివరాజ్ కుమార్, దర్శన్, ధృవ్ సర్జా త్వరలో చనిపోతారని షాకింగ్ కామెంట్స్ చేశారు. దీంతో సదరు హీరోల ఫ్యాన్స్.. మనుపై ఓ రేంజులో రెచ్చిపోయాడు. ఫలితంగా హీరో దర్శన్కి పబ్లిక్గా సారీ చెప్పాడు. ఇప్పుడు హీరో శివరాజ్ కుమార్ని కలిసి మను.. క్షమాపణ చెప్పుకొన్నాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.కన్నడలో హీరోగా సినిమాలు చేస్తున్న శివరాజ్ కుమార్.. 2023లో రిలీజైన 'జైలర్' సినిమాలో అతిథి పాత్రలో కనిపించాడు. ప్రస్తుతం రామ్ చరణ్ 'పెద్ది'లోనూ కీలక పాత్ర పోషిస్తున్నాడు.(ఇదీ చదవండి: అన్న ఎప్పుడూ అన్నే.. తమ్ముడు ఎప్పుడూ తమ్ముడే: శివ కార్తికేయన్) -
హాలీవుడ్ యాక్షన్
‘కేజీఎఫ్’ ఫేమ్ యశ్ హీరోగా గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘టాక్సిక్: ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోన్–అప్స్’. ఈ ద్విభాషా(ఇంగ్లిష్, కన్నడ) చిత్రాన్ని కేవీఎన్ ప్రోడక్షన్స్, మాన్ స్టర్ మైండ్ క్రియేషన్స్పై వెంకట్ కె.నారాయణ, యశ్ నిర్మిస్తున్నారు. ‘జాన్ విక్’, ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్’, ‘డే షిఫ్ట్’ వంటి హాలీవుడ్ సినిమాలకు పని చేసిన యాక్షన్ కొరియోగ్రాఫర్ జేజే పెర్రీ ‘టాక్సిక్’ సినిమాకు వర్క్ చేస్తున్నారు.తన హాలీవుడ్ స్టంట్ టీమ్తో కలిసి ఈ సినిమా కోసం కొన్ని యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించారు. తాజాగా ‘టాక్సిక్’ కోసం 45రోజుల సుదీర్ఘమైన యాక్షన్ షూటింగ్ షెడ్యూల్ను ముంబైలో ప్లాన్ చేశారు మేకర్స్. ఈ షెడ్యూల్లో పెర్రీ తన రెగ్యులర్ స్టంట్ టీమ్ని పక్కన పెట్టి, ఇండియన్ స్టంట్ టీమ్తో వర్క్ చేయనుండటం విశేషం.ఈ అంశంపై జేజే పెర్రీ మాట్లాడుతూ–‘‘నా 35 ఏళ్ల కెరీర్లో 39 దేశాల్లో పని చేశాను. భారతీయ సంస్కృతి, నాగరికత ఎంతో గొప్పది. మా అమెరికన్ కల్చర్ కొన్ని వందల ఏళ్ల క్రితంనాటిదే. భారతీయ చిత్రాలకు నేను పెద్ద అభిమానిని. ఇండియన్ స్టంట్ టీమ్ వరల్డ్ క్లాస్గా ఉంది. ‘టాక్సిక్’ కొత్త షెడ్యూల్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను’’ అని తెలిపారు. -
వారి కోసం రెండు షిఫ్టులు పని చేస్తాను: శ్రీలీల
ఈ మధ్య సీనియర్ హీరో జగపతిబాబు కొత్తగా టాక్ షోను మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. అందులో శ్రీలీల తన తల్లితో కలిసి పాల్గొంది. కాగా ఈ షోలో శ్రీలీలకు రామ్ చరణ్, జూ.ఎన్టీఆర్ ఒకేసారి కాల్షీట్లు అడిగితే ముందు ఎవరికి కాల్షీట్ ఇస్తావ్? అనే ప్రశ్న ఎదురైంది. దానికి శ్రీలీల ఎప్పట్లానే తన స్టైల్లో గడసరి సమాధానం చెప్పింది. ఈ ఇద్దరి కోసం రెండు షిఫ్టులు పనిచేస్తుందట. ఇక మహేష్ బాబు, రవితేజలో ఎవరు ఎక్కువ అల్లరి చేస్తారనే ప్రశ్నకు రవితేజ పేరు చెప్పింది.పెళ్లి సందD మూవీతో వెండితెరపై హీరోయిన్గా శ్రీలీల ఎంట్రీ ఇచ్చింది. తర్వాత ధమాకా, గుంటూరు కారం, భగవంత్ కేసరి, స్కంద, రాబిన్హుడ్, జూనియర్.. ఇలా అనేక సినిమాలు చేసింది. పుష్ప 2లో 'కిస్ కిస్ కిస్సిక్..' అనే ఐటం సాంగ్లోనూ ఆడిపాడింది. జూనియర్ మూవీలోని వైరల్ వయ్యారి పాటతో మరోసారి ట్రెండింగ్లోకి వచ్చింది. తాజాగా రవితేజ సరసన నటించిన మాస్ జాతర త్వరలోనే రిలీజ్ కానుంది. -
30 ఇయర్స్ ఇండస్ట్రీ.. బాలీవుడ్ అది మర్చిపోయి..: సిమ్రాన్
హీరోయిన్ సిమ్రాన్ (Simran) ఇండస్ట్రీకి వచ్చి నేటి(ఆగస్టు 25)కి 30 ఏళ్లు పూర్తవుతుంది. హర్జై అనే హిందీ చిత్రంతో 1995లో కెరీర్ ప్రారంభించింది సిమ్రాన్. బాలీవుడ్లో కన్నా సౌత్లోనే ఎక్కువ స్టార్డమ్ తెచ్చుకుంది. తెలుగు, తమిళ భాషల్లో అనేక సినిమాలు చేసింది. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. హిందీలో నేను గుల్మొహర్ అనే సినిమా చేశాను. ఆ మూవీ టీమ్ అంతా కూడా చాలామంచివారు. అదే సమయంలో మరో ప్రాజెక్ట్ కూడా చేశాను. కానీ, అక్కడ ఎవరితోనూ కనెక్ట్ కాలేకపోయాను.వీడియో క్లిప్స్ పంపాలా?పైగా ఇక్కడ పాత్రకు నేను సూట్ అవుతానా? లేదా? అని లుక్ టెస్ట్ చేస్తుంటారు. అందుకు నేను అభ్యంతరమేమీ చెప్పను. ఓకే కానీ, కొందరు నాగురించి తెలియక.. పాత్రకు సరిపోతానో? లేదోనని వీడియో చేసి పంపించమంటారు. అంతేకాకుండా.. సౌత్ ఇండస్ట్రీలో ఇచ్చే రెమ్యునరేషన్లో పదో వంతు మాత్రమే చెల్లిస్తారు. అందుకే నా గురించి పూర్తిగా తెలుసుకున్నవారి దగ్గరే సినిమాలు చేయాలని నిర్ణయించుకున్నాను.పెద్ద సినిమాల నుంచి ఆఫర్లు లేవ్టూరిస్ట్ ఫ్యామిలీ తర్వాత చిన్న, మధ్య తరహా సినిమా అవకాశాలు చాలానే వచ్చాయి. అందులోనూ మహిళా ప్రాధాన్యత ఉన్న స్క్రిప్టులే ఎక్కువ! కానీ, పెద్ద ప్రొడక్షన్ హౌస్ నుంచి, బడా దర్శకనిర్మాతల నుంచి మాత్రం ఒక్క ఆఫర్ కూడా రాలేదు. నా కెరీర్లో చాలా హిట్లు ఉన్నాయి. ఎంతోమంది యంగ్ టాలెంట్ నన్ను ఆదర్శంగా తీసుకుంటున్నందుకు సంతోషంగా ఉంది అని చెప్పుకొచ్చింది.సినిమాఈ ఏడాది సిమ్రాన్ ఫుల్ బిజీ. శబ్ధంతో అలరించిన ఆమె గుడ్ బ్యాడ్ అగ్లీలో అతిథి పాత్రలో మెరిసింది. టూరిస్ట్ ఫ్యామిలీతో సూపర్ హిట్టు అందుకుంది. ప్రస్తుతం ద లాస్ట్ వన్ అనే మూవీలో యాక్ట్ చేస్తోంది. విక్రమ్ సరసన నటించిన ధ్రువ నక్షత్రం ఇప్పటికీ విడుదలకు నోచుకోలేదు.చదవండి: క్యాన్సర్ బారిన పడ్డ నటి.. అన్నిటికంటే అదే దారుణమంటూ. -
సింగర్తో తిరుమలకు జయం రవి.. సోషల్ మీడియాలో వైరల్!
కోలీవుడ్ హీరో జయం రవి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తన గర్ల్ఫ్రెండ్గా భావిస్తోన్న సింగర్ కెన్నీషాతో కలిసి తిరుమలకు వచ్చారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. తన భార్య ఆర్తితో విడాకుల వివాదం తర్వాత వీరిద్దరు జంటగా పలుసార్లు కనిపించారు. తాజాగా తిరుమలలో సందడి చేశారు.జయం రవి సొంత నిర్మాణ సంస్థ ప్రారంభోత్సవానికి ముందు తిరుమల ఆలయాన్ని సందర్శించారు. సంప్రదాయ దుస్తుల్లో వచ్చిన వీరిద్దరు స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. కాగా.. జయం రవి తొలి నిర్మాణ సంస్థ రవి మోహన్ స్టూడియోస్ను చెన్నైలో ప్రారంభించనున్నారు. ప్రస్తుతం ఈ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.మరోవైపు జయం రెండు సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం గణేష్ కె బాబు దర్శకత్వం వహించిన 'కరాటే బాబు', సుధా కొంగర దర్శకత్వం వహించిన 'పరాశక్తి' లాంటి ప్రాజెక్టుల్లో నటిస్తున్నారు. అయితే గత కొన్ని నెలలుగా తన భార్య ఆర్తితో విడాకుల వివాదంతో వార్తల్లో నిలిచారు. వీరిద్దరు విడిపోవడానికి సింగర్ కెనీషా ప్రమేయం ఉందని వార్తలొచ్చాయి. నటుడు గణేష్ కుమార్తె వివాహంలో చేతులు పట్టుకుని కనిపించడంతో రూమర్స్ మరింత ఊహందుకున్నాయి.ఈరోజు ఉదయం సుప్రభాత సేవలో తమిళ హీరో జయం రవి (రవి మోహన్), సింగర్ కెనిషా ఫ్రాన్సిస్ తో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. @iam_RaviMohan @kenishaafrancis #tirumala #tirupatiupdates #Tirupati #TTD #jayamravi #RaviMohan #KenishaaFrancis #tamilhero pic.twitter.com/k5K8tLXKLZ— Tirupati Updates (@TirupatiUpdates) August 25, 2025 -
భార్య, కూతురు వదిలేశారు.. నన్ను చూస్తేనే అసహ్యం: నటుడు ఎమోషనల్
అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురు పొమ్మంది, ప్రాణంగా చూసుకున్న భార్య తరిమేసింది. ఎక్కడికి వెళ్లాలో తోచని స్థితిలో కొంతకాలం వృద్ధాశ్రమంలో గడిపాడు ప్రముఖ మలయాళ నటుడు కొల్లం తులసి (Kollam Thulasi). తాజాగా ఈ విషయాన్ని గాంధీ భవన్ ఆశ్రమంలో జరిగిన ఓ ఈవెంట్లో బయటపెట్టాడు. కొల్లం తులసి మాట్లాడుతూ.. నేను ఈ ఆశ్రమంలో ఆరునెలలు ఉన్నాను. అందరూ ఉన్న ఒంటరివాడినై ఇక్కడ చేరాను. భార్య, కూతురు వదిలేశారునా భార్య నన్ను వదిలేసింది. నా కూతురు కూడా వదిలించుకుంది. అల్లారుముద్దుగా పెంచుకున్న నా బిడ్డకు నేను పరాయివాడినైపోయాను. తనొక ఇంజనీర్. ఆస్ట్రేలియాలో సెటిలైంది. వాళ్లు నాకు కనీసం ఫోన్ కూడా చేయరు. నన్ను చూసి అసహ్యించుకుంటారు, ద్వేషిస్తారు. ఈ ఆశ్రమంలో నాతో పాటు పని చేసిన ఓ గొప్ప నటి కూడా ఉంది. ఎంతో కష్టపడి పిల్లలను చదివించింది. కుటుంబాన్ని పోషించింది. నటిగా రాష్ట్రస్థాయిలో అవార్డు గెల్చుకుంది. తల్లిని వదల్లేక కుటుంబాన్ని..కానీ, ఇప్పుడు తను కూడా ఇదే ఆశ్రమంలో ఉంటోంది. తనకు వయసుపైబడ్డ తల్లి ఉంది. ఆమెను వదిలించుకోమని ఇంట్లోవాళ్లు చెప్పారు. కన్నతల్లిని అనాథలా వదిలేసేందుకు ఆమెకు మనసొప్పలేదు. బయటకు వెళ్లి బతికేంత స్థోమత లేదు. అందుకే భర్తను, పిల్లల్ని వదిలేసి తల్లిని తీసుకుని ఆశ్రమానికి వచ్చింది. మనుషులు ఎప్పుడెలా మారిపోతారో మనకు తెలియదు. అందుకే మనం జాగ్రత్తగా ఉండాలి. ఇది అందరికీ ఓ గుణపాఠం అని చెప్పుకొచ్చాడు. ఇది ఒక గుణపాఠంకొల్లం తులసి.. కిరీటం, జాగ్రత్త, అర్థం, గాడ్ ఫాదర్ (1991), ద కింగ్, సత్యం, రావణన్, ఆయుధం, ద్రోణ 2010, రింగ్ మాస్టర్.. వంటి పలు చిత్రాల్లో నటించాడు. థియేటర్ ఆర్టిస్ట్ లవ్లీ బాబు.. ద గిఫ్ట్ ఆఫ్ గాడ్, నలు పెన్నుంగళ్, భాగ్యదేవత, మేరిక్కుండోరు కుంజాడు, తన్మత్ర, పుతియ ముఖం, ప్రణయం వంటి పలు చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం తల్లిని చూసుకోవడం కోసం సినిమాలు కూడా మానేసింది. View this post on Instagram A post shared by Amal Gandhibhavan (@amalgandhibhavan) View this post on Instagram A post shared by Amal Gandhibhavan (@amalgandhibhavan) చదవండి: ఎంతో ఒత్తిడి, బాధ అనుభవించా.. నాకు పెళ్లి వల్ల గుర్తింపు రాలేదు! -
విషాదం.. 'కేజీఎఫ్' నటుడు కన్నుమూత
'కేజీఎఫ్' సినిమాతో చాలామంది నటీనటులు గుర్తింపు తెచ్చుకున్నారు. అలా ఈ మూవీలో శెట్టి అనే పాత్రలో కనిపించిన నటుడు దినేష్(63) ఇప్పుడు తుదిశ్వాస విడిచాడు. గతవారం ఈయన బ్రెయిన్ స్ట్రోక్ రాగా.. కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో చేర్పించారు. ఐదురోజుల పాటు చికిత్స అందించారు. అయితే ఇంటికి తీసుకొచ్చి వైద్యం అందించారు. తాజాగా ఆరోగ్య పరిస్థితి విషమించింది. దీంతో సోమవారం ఉదయం 3:30 గంటల సమయంలో కన్నుమూశారు.(ఇదీ చదవండి: ఎంతో బాధ అనుభవించా.. పెళ్లి వల్ల గుర్తింపు రాలేదు: ఉపాసన)కర్ణాటకలోని కుందపురకు చెందిన ఈయన.. మంగళూరు దినేష్గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇండస్ట్రీలో పనిచేసేందుకు బెంగళూరు వచ్చేశారు. అలా తొలుత ఆర్ట్ డైరెక్టర్గా కెరీర్ ఆరంభించారు. తర్వాత సైడ్ క్యారెక్టర్స్, విలన్ రోల్స్ చేశారు. మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే పలు కన్నడ సినిమాల్లో నటించినప్పటికీ.. 'కేజీఎఫ్' మూవీలో శెట్టి పాత్రతో పాన్ ఇండియా ఫేమ్ సొంతం చేసుకున్నారు.ఈయన మృతి చెందిన విషయాన్ని ప్రకటించిన కుటుంబ సభ్యులు.. బెంగళూరులోని నివాసంలో సందర్శనార్థం భౌతిక కాయాన్ని ఉంచుతామని చెప్పుకొచ్చారు. ఈయనకు భార్య, ఇద్దరు కొడుకులు ఉన్నారు. దినేష్ హఠాన్మరణం కన్నడ ఇండస్ట్రీలో విషాదం నింపింది. పలువురు నటీనటులు ఈయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు. దినేష్ కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 27 సినిమాలు) View this post on Instagram A post shared by Sangeetha Bhat Sudarshan(Mahalakshmi) (@sangeetha_bhat) -
ఆసక్తికరంగా 'లోక' ట్రైలర్.. సూపర్ హీరో కాన్సెప్ట్
తెలుగు సినిమాతోనే హీరోయిన్ అయిన కల్యాణి ప్రియదర్శన్.. ఇప్పుడు పూర్తిగా మలయాళ ఇండస్ట్రీకే పరిమితమైంది. అక్కడే స్టార్ హీరోలతో కలిసి మూవీస్ చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు ఈమె ప్రధాన పాత్రలో, 'ప్రేమలు' ఫేమ్ నస్లేన్ మరో కీ రోల్ చేసిన చిత్రం 'లోక'. తెలుగులో 'కొత్త లోక' పేరుతో రిలీజ్ చేస్తున్నారు. తాజాగా ట్రైలర్ విడుదల చేశారు.(ఇదీ చదవండి: 'ఇది నా ఊరు సర్'.. ఫుల్ యాక్షన్తో 'మదరాశి' ట్రైలర్)పూర్తిగా సూపర్ హీరో కాన్సెప్ట్తో తీసిన మూవీ అని ట్రైలర్ చూస్తుంటేనే అర్థమవుతోంది. సాధారణంగా ఇలాంటివి హీరోలు చేస్తుంటారు. కానీ యంగ్ హీరోయిన్తో ఈ జానర్ సినిమా చేయడం విశేషం. మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ దీన్ని నిర్మించాడు. డొమినిక్ అరుణ్ దర్శకుడు.తెలుగులో ఈ సినిమా 'కొత్త లోక' పేరుతో ఈనెల 28న థియేటర్లలోకి రానుంది. సితార ఎంటర్టైన్మెంట్స్ విడుదల చేస్తోంది. ట్రైలర్ బట్టి చూస్తే.. సూపర్ హీరో లక్షణాలుండే లోక(కల్యాణి ప్రియదర్శన్) అనుకోని పరిస్థితుల్లో ఓ ఊరికి వెళ్తుంది. అక్కడే లో-ప్రొఫైల్ మెంటైన్ చేస్తూ బతుకుతుంటుంది. అలాంటి ఊరిలో కొన్ని సమస్యలు వస్తాయి. వాటిని లోక ఎలా ఎదుర్కొంది? చివరకు ఏమైందనేదే స్టోరీలా అనిపిస్తుంది.(ఇదీ చదవండి: 100వ సినిమా తర్వాత విశ్రాంతి తీసుకుంటా: దర్శకుడు ప్రియదర్శన్) -
100వ సినిమా తర్వాత విశ్రాంతి తీసుకుంటా: ప్రముఖ దర్శకుడు
ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్ (Priyadarshan) రిటైర్మెంట్ ప్లాన్స్ ప్రకటించాడు. వంద సినిమాల మైలురాయిని చేరగానే మూవీ ఇండస్ట్రీ నుంచి విశ్రాంతి తీసుకుంటానన్నాడు. ప్రస్తుతం ఇతడు కొచ్చిలో హైవాన్ మూవీ షూట్ చూస్తున్నాడు. ఇందులో సైఫ్ అలీ ఖాన్, అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. మలయాళ మూవీ ఒప్పమ్కు ఇది రీమేక్గా తెరకెక్కుతోంది.100వ సినిమాతో గుడ్బైతాజాగా దర్శకుడు ప్రియదర్శన్ మాట్లాడుతూ.. ప్రస్తుతం హైవాన్ సినిమా చేస్తున్నాను. ఇందులో ఒప్పం హీరో మోహన్లాల్ అతిథి పాత్రలో కనిపించనున్నాడు. ఆయన రోల్ ప్రేక్షకులను కచ్చితంగా సర్ప్రైజ్ చేస్తుంది. అలాగే మోహన్లాల్ను హీరోగా పెట్టి ఓ సినిమా చేయాలనుకుంటున్నాను. మరోపక్క హెరా ఫెరి 3 సినిమా బాధ్యత నాపై ఎలాగో ఉంది. నా 100వ సినిమా అయిపోయాక రిటైర్ అవ్వాలనుకుంటున్నాను. ఇప్పటికే చాలా అలిసిపోయాను అని చెప్పుకొచ్చాడు. ఫస్ట్, లాస్ట్ సినిమా ఆ హీరోతోనే!కాగా మోహన్లాల్, ప్రియదర్శన్ చిన్ననాటి స్నేహితులు. మోహన్లాల్ హీరోగా నటించిన పూచక్కొరు మూకుత్తి (1984) మూవీతోనే ప్రియదర్శన్ దర్శకుడిగా పరిచయమయ్యాడు. దీనికంటే ముందు మోహన్లాల్ నటించిన తిరనోత్తం (1978)సినిమాకు దర్శకుడు వి. అశోక్ కుమార్ వద్ద ప్రియదర్శన్ అసిస్టెంట్గా పని చేశాడు. పలు కారణాల వల్ల దశాబ్దాల తరబడి వాయిదా పడుతూ వచ్చిన ఈ మూవీ 2005లో రిలీజైంది. ప్రియదర్శన్ ఏ హీరో (Mohanlal)తో అయితే తన ప్రస్థానం మొదలుపెట్టాడో అదే హీరోతో చివరి సినిమా చేసి రిటైర్ అవ్వాలనుకుంటున్నాడు.చదవండి: ఓపక్క ఓటీటీలో.. మరోపక్క బాక్సాఫీస్ వద్ద సెంచరీ -
ఓపక్క ఓటీటీలో.. మరోపక్క బాక్సాఫీస్ వద్ద సెంచరీ
థియేటర్లో రిలీజైన సినిమాలు నాలుగైదు వారాలకే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. విజయ్ సేతుపతి- నిత్యామీనన్ ప్రధాన పాత్రలో నటించిన సార్ మేడమ్ మూవీ (Sir Madam Movie) కూడా నెలరోజుల్లోనే ఓటీటీలో ప్రత్యక్షమైంది. పాండిరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం తమిళంలో తలైవాన్ తలైవి పేరిట జూలకై 25న విడుదలైంది. తెలుగులో సార్ మేడమ్ పేరిట ఆగస్టు 1న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సెంచరీ క్లబ్లో మూవీబాక్సాఫీస్ వద్ద మంచి టాక్ సంపాదించుకున్న ఈ మూవీ ఆగస్టు 22న అమెజాన్ ప్రైమ్లో అందుబాటులోకి వచ్చింది. తెలుగు, తమిళంతో పాటు హిందీ, కన్నడ, మలయాళ భాషల్లోనూ అందుబాటులో ఉంది. అయితే ఓటీటీలోకి వచ్చినా ఇంకా కొన్నిచోట్ల ఈ సినిమా ఆడుతూనే ఉంది. ఈ క్రమంలోనే సార్ మేడమ్ రూ.100 కోట్ల క్లబ్లో చేరింది. ఈ విషయాన్ని చిత్రనిర్మాణ సంస్థ సత్యజోతి ఫిలింస్ ఎక్స్ (ట్విటర్) వేదికగా వెల్లడించింది.సినిమాసార్ మేడమ్ విషయానికి వస్తే.. యోగిబాబు, చెంబన్ వినోద్ జోస్, శరవణన్, కాళి వెంకట్, ఆర్కే సురేశ్, మైనా నందిని తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఎమ్.సుకుమార్ సినిమాటోగ్రాఫర్గా వ్యవహరించగా సంతోష్ నారాయణన్ సంగీతం అందించాడు. ప్రదీప్ రాఘవ్ ఎడిటర్గా పని చేశాడు. భార్యాభర్తల మధ్య జరిగే కొట్లాటల సమూహారమే సార్ మేడమ్ సినిమా కథ! Families’ favourite #ThalaivanThalaivii marks 100 CR worldwide gross with your endless love & support ❤️🫶@VijaySethuOffl @MenenNithya @pandiraaj_dir @iYogiBabu@Music_Santhosh @SathyaJyothi @Lyricist_Vivek @thinkmusicindia @studio9_suresh@Roshni_offl @kaaliactor @MynaNandhini… pic.twitter.com/VdDkK7opoL— Sathya Jyothi Films (@SathyaJyothi) August 24, 2025 చదవండి: భిక్షాటన చేశా, వేశ్యగా పని చేశా.. బిగ్బాస్లో ఛాన్స్, మా వాళ్లే.. -
కూలీ పాత్ర అన్యాయంగా అనిపించలేదా?.. శృతిహాసన్ రిప్లై ఇదే!
కోలీవుడ్ భామ శృతిహాసన్ ఇటీవలే కూలీ మూవీతో ప్రేక్షకులను అలరించింది. రజినీకాంత్ హీరోగా వచ్చిన ఈ చిత్రంలో కీలక పాత్రలో కనిపించింది. ఈ సినిమాలో ప్రీతి అనే పాత్రలో శృతిహాసన్ నటించింది. ఈ మూవీలో టాలీవడ్ హీరో నాగార్జున, బాలీవుడ్ స్టార్ అమిర్ ఖాన్ సైతం కీలక పాత్రల్లో మెప్పించారు.అయితే తాజాగా ఓ నెటిజన్ శృతి హాసన్ పాత్రపై ఆమెను ప్రశ్నించాడు. ఆస్క్ మీ సమ్థింగ్ అంటూ శృతిహాసన్ సోషల్ మీడియాలో చాట్ నిర్వహించింది. ఇది చూసిన ఓ నెటిజన్.. ఆపదలో ఉన్న అమ్మాయిగా ప్రీతి పాత్రను అలా చిత్రీకరించడం మీకు అన్యాయంగా అనిపించలేదా? అని అడిగాడు. దీనికి శృతిహాసన్ కూడా రిప్లై ఇచ్చారు.ఇక్కడ ఆమె బాధలో ఉంది.. కానీ అది మరొకరి విజన్.. ఇక్కడ మీరు చూడాల్సింది న్యాయమా? అన్యాయమా కాదు?.. ఆ పాత్రను మాత్రమే అంటూ సమాధానమిచ్చింది. ఇదంతా దర్శకుడి దృష్టి కోణానికి సంబంధించినది అని అన్నారు. గత ఇంటర్వ్యూలో ప్రీతి పాత్ర గురించి శృతిహాసన్ మాట్లాడింది. తన పాత్ర చాలా భిన్నంగా ఉండడంతో పాటు లోతుగా సంబంధం కలిగి ఉందని అభివర్ణించింది. ప్రీతి పాత్ర మహిళలందరికీ నచ్చుతుందని.. ఆ పాత్ర గురించి నాకు నిజంగా నచ్చింది అదేనని తెలిపింది. ఆమె పాత్రలోని కొన్ని అంశాలతో తాను కనెక్ట్ అయ్యానని వెల్లడించింది. ప్రీతి చాలా బాధ్యతాయుతంగా, చాలా స్ఫూర్తిదాయకంగా ఉంటుందని పేర్కొంది.కాగా.. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ.400 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. -
అదంతా ఫేక్.. రజినీకాంత్ ఫ్యాన్స్కు హెచ్చరిక!
కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ ఇటీవలే కూలీ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. లోకేశ్ కనగరాజ్ డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. తొలిరోజే పాజిటివ్ టాక్ రావడంతో తమిళ ఇండస్ట్రీ చరిత్రలోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఈ మూవీలో టాలీవుడ్ కింగ్ నాగార్జున, బాలీవుడ్ హీరో అమిర్ ఖాన్, శృతిహాసన్ కీలక పాత్రలు పోషించారు.అయితే తాజాగా తలైవాకు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్గా మారింది. రజినీకాంత్ తన ఫ్యాన్స్తో మలేసియాలో మీట్ అవుతున్నారని సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. మాలిక్ స్ట్రీమ్స్ కార్పొరేషన్ పేరుతో ఈ ప్రచారం జరుగుతోంది. దీనిపై రజినీకాంత్ ప్రతినిధులు స్పందించారు. మలేసియాలో ఫ్యాన్స్ గ్రీట్ అండ్ మీట్ లాంటివీ తాము నిర్వహించడం లేదన్నారు. అలాంటి వాటిని నమ్మి అభిమానులు మోసపోవద్దని రజినీకాంత్ టీమ్ హెచ్చరించింది. ఏదైనా ఉంటే తామే అధికారికంగా ప్రకటిస్తామని క్లారిటీ ఇచ్చారు. ఈ మేరకు అధికారిక ప్రకటన రిలీజ్ చేశారు.రజినీకాంత్ టీమ్ లేఖలో రాస్తూ.. "ప్రియమైన అభిమానుంలదరికీ.. ప్రస్తుతం మాలిక్ స్ట్రీమ్స్ ప్రమోట్ చేస్తున్న 'మీట్ అండ్ గ్రీట్ తలైవార్' అనేది పూర్తిగా అనధికారిక ప్రకటన. ఇలాంటి ఫేక్ ప్రకటనలు ఎటువంటి ముందస్తు అనుమతి పొందకుండానే ప్రమోట్ చేస్తున్నారు. ఫేక్ వాటిపట్ల అభిమానులు, ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి వాటితో అభిమానులను తప్పుదారి పట్టించే అవకాశం ఉంది. తప్పుడు ప్రకటనలు నమ్మి ఎవరు కూడా పాల్గొనవద్దని అభిమానులను, ప్రజలను గట్టిగా హెచ్చరిస్తున్నాం' అని ప్రకటన విడుదల చేశారు. -
అజిత్ భాయ్.. ఏంటా స్పీడ్.. ఇదేమైనా రేసింగ్ అనుకున్నావా?
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ ఈ ఏడాది రెండు చిత్రాలతో ప్రేక్షకులను అలరించాడు. ఈ ఏడాది ప్రారంభంలో విడుదలైన విదాముయార్చి బాక్సాఫీస్ వద్ద అభిమానులను అంతగా మెప్పించలేకపోయింది. ఆ తర్వాత వచ్చిన గుడ్ బ్యాడ్ అగ్లీ మాత్రం సూపర్ హిట్గా నిలిచింది. ఈ సినిమాకు అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్తో నిర్మించింది. ఈ మూవీలో అజిత్ సరసన త్రిష హీరోయిన్గా నటించింది.ఇక సినిమాల సంగతి పక్కనపెడితే అజిత్ కుమార్కు కార్ రేసింగ్ అంటే ఇష్టమన్న సంగతి తెలిసిందే. విదేశాల్లో ఎక్కడ రేసింగ్ జరిగినా తన టీమ్తో సహా వాలిపోతుంటారు. ఈ ఏడాదిలో ఇప్పటికే పలు కార్ రేసింగుల్లో టైటిల్స్ సాధించారు. అంతేకాదు కొన్ని సినిమాల్లో ఏకంగా కారుతో రియల్ స్టంట్స్ కూడా చేశారు. డూప్ లేకుండానే చాలాసార్లు కారుతో స్టంట్స్ చేశారు.తాజాగా అజిత్కు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్గా మారింది. కారును ఏకంగా 232 కిలోమీటర్ల స్పీడ్తో నడుపుతూ కనిపించారు. ఎవరికైనా వంద స్పీడ్కే గుండెల్లో గుబులు మొదలవుతుంది. అలాంటి ఏకంగా 232 కిలోమీటర్లు స్పీడ్తో దూసుకెళ్లడమంటే మామూలు విషయం కాదు. కార్ రేసింగ్ల్లో దూసుకెళ్లే అజిత్కు ఈ స్పీడ్ ఒక లెక్కేనా అని అందరికీ అనిపించి ఉండొచ్చు. కానీ అంతవేగంతో వెళ్లాలంటే కాస్తా గుండె ధైర్యం కూడా ఉండాలి. అయితే ఈ వీడియో ఇప్పటిదా.. పాతదా అనే విషయంపై మాత్రం క్లారిటీ లేదు. ఇది చూసిన తలా ఫ్యాన్స్ మాత్రం ఫుల్ ఖుషీ అవుతున్నారు.Ajith Kumar FULL SPEED RACING VIDEO!😎🔥Is this possible-aa!? 😯🔥#AjithKumar #AK64 #GoodBadUgly pic.twitter.com/NrKM9nQ2Cr— nallurwood (@nallurwood) August 22, 2025 -
ఓటీటీకి మరో హిట్ సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీకి మరో హిట్ సినిమా వచ్చేందుకు సిద్ధమైంది. జూలై 18న విడుదలైన కోలీవుడ్ సోషల్ డ్రామా గెవి డిజిటల్ ప్రీమియర్కు వచ్చేస్తోంది. ఈ చిత్రంలో షీలా, జాక్విలిన్ లిడియా ముఖ్య పాత్రల్లో నటించారు. కోలీవుడ్ డైరెక్టర్ దయాలన్ దర్శకత్వం వహించారు. తమిళంలో థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ను సొంతం చేసుకుంది. ఐఎండీబీలో 9.2 రేటింగ్ సాధించింది.ఈ చిత్రం ఓటీటీ రిలీజ్ డేట్ను మేకర్స్ ప్రకటించారు. ఈ వినాయక చవితి కానుకగా ఆగస్టు 27న స్ట్రీమింగ్ చేయనున్నట్లు వెల్లడించారు. ఈ మూవీ సన్ నెక్స్ట్ ఓటీటీలో వచ్చే బుధవారం నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు పోస్టర్ను రిలీజ్ చేస్తూ ఓటీటీ సంస్థ ట్వీట్ చేసింది. న్యాయం కోసం పోరాటం అనే కాన్సెప్ట్తో ఈ మూవీని తెరకెక్కించారు. ఈ చిత్రంలో ఆధవన్, చార్లెస్ వినోద్, జీవా సుబ్రమణియన్, గాయత్రి, వివేక్ మోహన్, ఉమర్ ఫరూక్, జగత్రామన్, అభిమన్యు మీనా కీలక పాత్రలు పోషించారు.Landslides may bury lives, but not courage.Gevi streams Aug 27 on SunNXT.#Gevi #SunNXT #StreamingFromAug27 #PoliticalDrama #MustWatch #FightForJustice pic.twitter.com/1HhqtYWDhJ— SUN NXT (@sunnxt) August 22, 2025 -
దీపావళి బరిలో డ్రాగన్ హీరో.. మరో హిట్ కొడతాడా?
లవ్టుడే, డ్రాగన్ చిత్రాల విజయంతో క్రేజీ స్టార్గా ఎదిగిన కోలీవుడ్ హీరో ప్రదీప్ రంగనాథన్. తాజాగా కథానాయకుడిగా నటిస్తున్న చిత్రాల్లో ఎల్ఐకే (లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ) ఒకటి. ఈ సినిమాకు నయనతార భర్త విఘ్నేశ్ శివన్ కథ, దర్శకత్వ బాధ్యతలు నిర్వహిస్తున్తారు. ఈ చిత్రాన్ని రౌడీ పిక్చర్స్ పతాకంపై నటి నయనతార నిర్మిస్తున్నారు. కృతిశెట్టి హీరోయిన్గా నటిస్తోన్న ఈ సినిమాలో ఎస్జే సూర్య, యోగిబాబు, గౌరీకిషన్, షారా ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.ఈ చిత్రంలో సీమాన్ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. కాగా ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. కాగా ఇందులోని తీమా తీమా అనే పల్లవితో సాగే తొలి పాటను ఇటీవల విడుదల చేయగా విశేష ఆదరణ పొందింది. చిత్రం ఆడియోను వినాయక చవితి పండగ సందర్భంగా ఈ నెల 27వ తేదీన విడుదల చేయనున్నట్లు యూనిట్ వర్గాలు తెలిపారు. అలాగే ఎల్ఐకే చిత్రాన్ని దీపావళి పండగ సందర్భంగా అక్టోబర్ 17వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్ర వర్గాలు అధికారికంగా ప్రకటించాయి. కాగా ప్రదీప్ రంగనాథన్, విఘ్నేశ్ శివన్, అనిరుధ్ కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం కావడంతో దీనిపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.