South India
-
గాయంతో తిరిగి సెట్స్పైకి రామ్ చరణ్
టాలీవుడ్ స్టార్ హీరో, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ షూటింగ్ సమయంలో గాయపడిన విషయం తెలిసిందే. ఆయన ఎడమ కంటికి తగిలిన దెబ్బ కారణంగా చిన్నపాటి సర్జరీ చేయాల్సి వచ్చింది. యూనిట్ ఈ గాయం పెద్దది కాదని ప్రకటించినప్పటికీ, తన అభిమానులు మాత్రం కొంత ఆందోళన చెందారు. అయితే గాయమైన గంటల వ్యవధిలోనే చరణ్ తిరిగి సెట్స్పైకి వచ్చాడు. గురువారం 'పెద్ది' చిత్ర షూటింగ్లో పాల్గొన్నాడు. దాంతో వందల సంఖ్యలో మెగా అభిమానులు సెట్స్కు చేరుకుని ఆయనను కలుసుకున్నారు. చరణ్ వారందరితో మాట్లాడి, సెల్ఫీ వీడియో కూడా దిగాడు. ఆ వీడియోను యూనిట్ సోషల్ మీడియాలో పోస్టు చేసింది. దీంతో చరణ్ స్వయంగా తన గాయంపై వస్తున్న ఊహాగానాలకు చెక్ పెట్టాడు. చరణ్కు సుధాకర్ ప్రసాద్ అనే వైద్యుడు మైనర్ సర్జరీ చేసినట్లు చిరంజీవి స్వయంగా వెల్లడించారు. డాక్టర్కు ప్రత్యేకంగా ధన్యవాదాలు కూడా తెలిపారు. ఇక మార్చి 27 (శుక్రవారం) రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఉదయం 9.45 గంటలకు పెద్ది నుంచి సర్ప్రైజ్ రాబోతోందని యూనిట్ ఇప్పటికే ప్రకటించింది. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్లో ఏప్రిల్ 30న సినిమా రిలీజ్ అవుతుందని మరోసారి ధృవీకరించారు. -
సినీ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ డైరెక్టర్ కన్నుమూత
సినీ ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ మలయాళ నటుడు, దర్శకుడు ఈఏ రాజేంద్రన్ తీవ్ర అనారోగ్యంతో (71) కన్నుమూశారు. కేరళలోని కొల్లాం జిల్లా పట్టతానంలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. నాటకరంగంతో పాటు సినిమా, టీవీ రంగాల్లో సేవలందించారు. ఆయన చేసిన సేవలకు గాను రాజేంద్రన్ మలయాళ ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకున్నారు.తన కళా జీవితాన్ని నాటకరంగంలో ప్రారంభించిన రాజేంద్రన్.. సినిమాల్లోకి రాకముందు రంగస్థల నటుడిగా మంచి పేరు సంపాదించారు. తన కెరీర్లో దాదాపు 60 చిత్రాలలో నటించారు. విలన్గా, సహాయ పాత్రలతో అభిమానులను మెప్పించారు. పలు సీరియల్స్ ద్వారా ఇండస్ట్రీలో ఫేమస్ అయ్యారు. కేరళ త్రిస్సూర్ జిల్లాలోని త్రితల్లూరులో గల ఎంగూర్ తారవాడులో అయ్యప్పన్, సుమతి దంపతులకు రాజేంద్రన్ జన్మించారు. చిన్న వయసులోనే కళలపై ఆసక్తి కనబరిచారు. పూణేలోని ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో టెలివిజన్ కోర్సు అభ్యసించిన ఆయన.. ప్రముఖ నటుడు మాధవన్ కుమార్తె సంధ్యను వివాహం చేసుకున్నారు.వీఆర్ గోపీనాథ్ దర్శకత్వం వహించిన గ్రీష్మం చిత్రంతో రాజేంద్రన్ తొలిసారిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ మూవీ తర్వాత రాజేంద్రన్కు సినిమారంగంలో అవకాశాలొచ్చాయి. జయరాజ్ దర్శకత్వం వహించిన కాళియాట్టం చిత్రంలోనూ నటించారు. అంతేకాకుండా ప్రణయ వర్ణంగల్, దయ, పట్టాభిషేకం వంటి మూవీస్లో కూడా కనిపించారు. అంతేకాకుండా రాష్ట్ర ఉద్యానవన సంస్థ అధ్యక్షుడిగానూ రాజేంద్రన్ సేవలందించారు. -
చరణ్కు గాయం.. 'పెద్ది' నుంచి ప్రత్యేక గ్లింప్స్?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్కు ఇటీవల ప్రమాదవశాత్తూ గాయపడ్డారని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దాంతో చరణ్ నటిస్తున్న 'పెద్ది' సినిమా నుంచి రాబోయే అప్డేట్ ఆలస్యమవుతుందేమోనని అభిమానుల్లో సందేహాలు మొదలయ్యాయి. అయితే యూనిట్ తాజాగా ఇచ్చిన స్పష్టతతో ఆ అనుమానాలన్నీ తొలగిపోయాయి. చరణ్ ఎడమ కంటికి చిన్నపాటి గాయం మాత్రమే జరిగింది. దానికి వెంటనే ట్రీట్మెంట్ జరిగిందని 'పెద్ది' టీమ్ తెలిపింది. రేపట్నుంచే ఆయన తిరిగి సెట్స్లో పాల్గొనబోతున్నారని కూడా ప్రకటించింది. ఇక అభిమానులకు గుడ్ న్యూస్ ఏమిటంటే.. చరణ్ పుట్టినరోజు కానుకగా 'పెద్ది' నుంచి ప్రత్యేక గ్లింప్స్ రాబోతోంది. మార్చి 27 ఉదయం 11:07 గంటలకు దర్శకుడు బుచ్చిబాబు ఇప్పటికే రెడీ చేసిన టీజర్ విడుదల కానుంది. ఇప్పటికే చరణ్ చేసిన బ్యాట్ విన్యాసం సోషల్ మీడియాలో సూపర్ హిట్ అయింది. అదే తరహాలో ఈ బర్త్డే టీజర్ కూడా భారీ విజయాన్ని సాధిస్తుందనే అంచనాలు ఉన్నాయి. అంటే రామ్ చరణ్ గాయంపై ఎలాంటి ఆందోళన అవసరం లేదు. పెద్ది సినిమాకు సంబంధించిన అప్డేట్స్, సంబరాలు ఎలాంటి ఆటంకం లేకుండా కొనసాగనున్నాయి. ఈ విషయాన్ని తెలియజేస్తూ పెద్ది టీమ్ ఓ పోస్టర్ను కూడా విడుదల చేసింది. -
కేడీ సాంగ్ వివాదం.. నాకు అర్థం కాదన్న డైరెక్టర్..!
కన్నడలో తెరకెక్కుతోన్న లేటేస్ట్ మూవీ కేడీ ది డెవిల్. ఈ చిత్రాన్ని పాన్ ఇండియాలో రేంజ్లో విడుదల చేస్తున్నారు. ఈ మూవీలో ధ్రువ్ సర్జా హీరోగా నటిస్తున్నారు. ఇటీవల ఈ చిత్రం నుంచి సర్కే చునార్ తేరీ సర్కే అనే సాంగ్ను విడుదల చేశారు. దక్షిణాది భాషలతో పాటు హిందీలోనూ ఈ పాటను రిలీజ్ చేశారు. కానీ ఊహించని విధంగా హిందీ లిరిక్స్ వర్షన్పై తీవ్ర విమర్శలొచ్చాయి. ఆ తర్వాత వెంటనే హిందీ వర్షన్ సాంగ్ను యూట్యూబ్ నుంచి తొలగించారు.ఈ నేపథ్యంలో హిందీ లిరిక్స్ వివాదానికి దారి తీయడంపై డైరెక్టర్ ప్రేమ్ స్పందించారు. హిందీ భాషపై తనకు పట్టులేదని.. ఆ లిరిక్స్ అర్థం కూడా తనకు తెలియదన్నారు. నేను కన్నడలో మాత్రమే లిరిక్స్ రాశానని తెలిపారు. ప్రస్తుతం దేశంలో ఎన్నో సమస్యలు ఉన్నాయని.. ఒకవైపు యుద్ధం.. మరోవైపు గ్యాస్ కొరత ఉందని.. వాటిపై చర్చించాలని అన్నారు. అంతేకానీ ఈ పాటను వివాదం చేయాల్సిన అవసరం లేదన్నారు. ఆ పాట కేవలం ఒక పార్టీలో భాగంగా సరదా కోసమే ఉంచామని వెల్లడించారు. కాగా.. ఈ మూవీలో నోరా ఫతేహి, సంజయ్దత్ కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం ఏప్రిల్ 30న థియేటర్లలో విడుదల కానుంది. -
దురంధర్, బోర్డర్-2 కాదు.. ఆ చిన్న సినిమానే నంబర్వన్..!
ప్రియాంక మోహన్ ప్రధాన పాత్రలో నటించిన ఓటీటీ చిత్రం మేడ్ ఇన్ కొరియా. ఆర్.ఏ కార్తీక్ దర్శకత్వం వహించిన ఈ మూవీ మార్చి 12న నేరుగా నెట్ఫ్లిక్స్లో అందుబాటులోకి వచ్చేసింది. తన కోరికతో కొరియా వెళ్లిన యువతి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొందన్న కోణంలో ఈ మూవీని తెరకెక్కించారు. ఇప్పటికే ఈ మూవీపై పలువురు సౌత్ స్టార్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. ముఖ్యంగా ప్రియాంక మోహన్ నటనను కొనియాడుతున్నారు.ఈ మూవీ ఓటీటీకి వచ్చిన తొలివారంలోనే నంబర్ ప్లేస్లో ట్రెండింగ్లోకి వచ్చేసింది. రెండు వారాలు పూర్తి అయినా కూడా ఈ సినిమాకు క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. నెట్ఫ్లిక్స్లో నానా-ఇంగ్లీష్ కేటగిరీలో బోర్డర్-2, దురంధర్ చిత్రాలను వెనక్కి నెట్టి మొదటిస్థానంలో కొనసాగుతోంది. ఈ విషయాన్ని డైరెక్టర్ కార్తీక్ సోషల్ మీడియాలో పంచుకున్నారు.వరుసగా రెండవ వారం కూడా మేడ్ ఇన్ కొరియా ప్రపంచవ్యాప్తంగా నంబర్ 1 స్థానంలో ట్రెండ్ అవ్వడం చూస్తుంటే చాలా సంతోషంగా ఉందని ట్వీట్ చేశారు. మొట్టమొదటిసారిగా ఒక దక్షిణాది చిత్రం ఇటువంటి ప్రపంచ స్థాయి గుర్తింపును సాధించడం మరింత ప్రత్యేకంగా నిలిచిందని రాసుకొచ్చారు. ఈ మూవీకి వివిధ రాష్ట్రాలు, దేశాల నుంచి వచ్చిన మీ ప్రేమకు, సందేశాలకు, ఫోన్ కాల్స్కు ధన్యవాదాలు.. మీ అందరికీ కృతజ్ఞతలు అంటూ పోస్ట్ చేశారు. ఓ మహిళా ఓరియంటెడ్ మూవీ ఇంతటి ఆదరణను పొందడం మాకు ఎంతో గర్వకారణమన్నారు. ప్రియాంక మోహన్.. నీ నీ కృషికి తగిన ఫలితం రావడం నాకు చాలా సంతోషంగా ఉందని రాసుకొచ్చారు. కాగా.. ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులో ఉంది. ఇంకెందుకు ఆలస్యం.. వెంటనే ఈ మూవీని ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి. Really happy to share that #madeinkorea is trending globally NO 1 for the 2nd week in the Non-English Movies category on Netflix 🌍For the first time, a South Indian film has reached this kind of global scale and to sustain it into the second week makes it even more special ❤️… pic.twitter.com/3LNAdVkxpM— Ra.Karthik (@Rakarthik_dir) March 25, 2026 -
న్యూ లుక్... ఫ్యాన్స్కి కిక్
రజనీకాంత్ హీరోగా సిబీ చక్రవర్తి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. రజనీకాంత్ కెరీర్లోని ఈ 173వ సినిమాను కమల్హాసన్, ఆర్. మహేంద్రన్ నిర్మించనున్నారు. వచ్చే నెలలో ఈ సినిమా షూటింగ్ను మొదలుపెట్టనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.ఈ సినిమాలోని ఇతర నటీనటుల ఎంపిక, లుక్ డిజైనింగ్ వంటి అంశాలపై సిబీ ఫోకస్ పెట్టారు. ఈ చిత్రంలో రజనీకాంత్ను సరికొత్తగా చూపించేందుకు దాదాపు 80 రకాల లుక్స్ను పరిశీలించారట సిబీ. ఈ లుక్స్లో మూడు లుక్స్ను ఎంపిక చేసి, వీటిలో రజనీకాంత్ మెచ్చిన లుక్ను ఫైనలైజ్ చేయనున్నారని సమాచారం. ఈ లుక్ రజనీ ఫ్యాన్స్కి కిక్ ఇచ్చేలా ఉంటుందని కోలీవుడ్ టాక్. -
కాంతార ఇమిటేషన్.. దురంధర్ హీరో అలా చేయాల్సిందే..!
బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ ప్రస్తుతం దురంధర్-2 సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నారు. దురంధర్ మూవీకి సీక్వెల్గా వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ను షేక్ చేస్తోంది. ఆదిత్య ధర్ దర్శకత్వంలో పార్ట్-2 కాసుల వర్షం కురిపిస్తోంది. ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ హిందీతో పాటు దక్షిణాది భాషల్లోనూ విడుదలైంది. ఈ చిత్రంపై సౌత్ స్టార్స్ అంతా ప్రశంసలు కురిపిస్తున్నారు. అంతేకాకుండా ఈ మూవీని కాంతార హీరో రిషబ్ శెట్టి సైతం కొనియాడారు. అద్బుతంగా ఉందంటూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టారు. కాంతార ఇమిటేషన్ కేసులో ఊరట..అయితే గతంలో రణ్వీర్ సింగ్ కాంతార మూవీ దేవతను ఇమిటేట్ చేయడం వివాదానికి దారితీసింది. గోవాలో జరిగిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో రణ్ వీర్ సింగ్ ఇమిటేట్ చేశారు. ఆ తర్వాత తన ప్రవర్తనపై రణ్వీర్ క్షమాపణలు కూడా చెప్పారు. ప్రజల భక్తి, సెంటిమెంట్ కావడంతో రణ్వీర్ సింగ్ తీరుపై తీవ్రస్థాయిలో వ్యతిరేకత వచ్చింది. కాగా.. చాముండి దేవత పాత్రలో రిషబ్ శెట్టి నటించారు. అయితే దైవాంశమైన పాత్రలను రణవీర్ సింగ్ కామెడీగా ఇమిటేట్ చేశారని ఆరోపిస్తూ గత డిసెంబర్లో ప్రశాంత్ మితల్ అనే న్యాయవాది బెంగళూరులోని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సోషల్ మీడియాలో చెప్పిన క్షమాపణ సరిపోదని.. ప్రత్యక్షంగా వచ్చి సారీ చెప్పాలని పిటిషన్లో కోరారు. తాజాగా దీనిపై విచారణ చేపట్టిన కర్ణాటక హైకోర్టు రణ్వీర్ సింగ్కు ఊరటనిచ్చింది. చాముండి ఆలయాన్ని సందర్శించి క్షమాపణ చెప్పాలంటూ రణ్వీర్ సింగ్ను ఆదేశించింది. ఫిర్యాదుదారుడు క్షమాపణ కోసం కోర్టుకు హాజరు కావాలని కోరితే.. అందుకు అంగీకరించాలని కోర్టు సూచించింది.దీనిపై క్షమాపణ అఫిడవిట్ దాఖలు చేస్తామని.. రణ్వీర్ సింగ్ త్వరలోనే ఆలయాన్ని సందర్శిస్తారని హీరో తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీంతో తదుపరి విచారణ ఏప్రిల్ 10వ తేదీకి వాయిదా వేసింది. ఈ విచారణ సమయంలో రణవీర్ సింగ్ తండ్రి హాజరయ్యారు. కోర్టు సూచనలతో బాలీవుడ్ నటుడు రణ్వీర్ సింగ్ కోర్టులో క్షమాపణ చెప్పి.. చాముండి ఆలయాన్ని సందర్శించనున్నారు.కాగా.. గతేడాది పాన్ ఇండియా చిత్రంగా విడుదలైన కాంతారా చాప్టర్-1 మూవీ బాక్సాఫీసు వద్ద ఘన విజయం సాధించింది. రూ.800 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి రికార్డులు సృష్టించింది. 2022లో విడుదలైన కాంతారా చిత్రానికి ఇది ప్రీక్వెల్గా కాంతారా చాఫ్టర్-1 విడుదలైంది. -
ఏడాది తర్వాత ఓటీటీలోకి వచ్చిన హారర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఈ మధ్య సూపర్ హిట్ సినిమాలు కూడా నాలుగు వారాల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. థియేటర్స్లో రిలీజ్కు ముందే ఓటీటీ రైట్స్ని అమ్మేసుకొని.. టాక్తో సంబంధం లేకుండా నెలలోపే ఓటీటీల్లో స్ట్రీమింగ్ చేస్తున్నారు. కానీ ఓ హారర్ చిత్రం మాత్రం రిలీజ్ అయినా ఏడాది తర్వాత ఓటీటీలోకి దర్శనం ఇచ్చింది. అది కూడా తమిళ్ భాషలోనే స్ట్రీమింగ్ అవ్వడంతో తెలుగు ప్రేక్షకులు నిరాశ చెందుతున్నారు. ఇంతకీ ఏ సినిమా? ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది?'వైశాలి’తో సూపర్ హిట్ అందుకున్న హీరో ఆది పినిశెట్టి, దర్శకుడు అరివళగన్ కాంబినేషన్లో వచ్చిన రెండో చిత్రం ‘శబ్దం’. గతేడాది ఫిబ్రవరిలో తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ అయిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన లభించింది. కథ, కథనం రొటీన్గా ఉన్నా, టైటిల్కి తగ్గట్టే డిఫరెంట్ శబ్దాలతో ప్రేక్షకులను భయపెట్టారనే టాక్ని సంపాదించుకుంది కానీ, కలెక్షన్స్ మాత్రం రాబట్టలేకపోయింది. అన్ని సినిమాల మాదిరే నాలుగు వారాల్లో ఈ సినిమా ఓటీటీలోకి వస్తుందని అంతా భావించారు. కానీ, ఊహించని విధంగా ఏడాది తర్వాత ఇప్పుడు జీ5 లో స్ట్రీమింగ్ అవుతుంది. అది కూడా కేవలం తమిళ భాషలో మాత్రమే ఈ సినిమా అందుబాటులోకి రావడం తెలుగు ప్రేక్షకులను నిరాశకు గురిచేసింది. తెలుగు స్ట్రీమింగ్కు సంబంధించి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోవడం గమనార్హం.శబ్దం కథేమింటి?కేరళలోని ఓ మెడికల్ కాలేజీలో విద్యార్థులు వరుసగా ఆత్మహత్యలు చేసుకుంటారు. శృతి అనే వైద్య విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మరణిస్తుంది. విద్యార్థుల మరణం వెనుక దెయ్యాలు ఉన్నాయనే ప్రచారం జరుగుతుంది. దీంతో యాజమాన్యం ఆహ్వానం మేరకు మరణాల వెనుక ఉన్న మిస్టరీ ఛేదించేందుకు ఘోస్ట్ ఇన్వెస్టిగేటర్ వ్యోమ వైద్యలింగం(ఆది పినిశెట్టి) రంగంలోకి దిగుతాడు. ఇన్వెస్టిగేషన్లో వ్యోమ వైద్యలింగంకి తెలిసిన నిజాలు ఏంటి? కాలేజీ లెక్చరర్ అవంతిక(లక్ష్మీ మీనన్) ఎందుకు అనుమానస్పదంగా ప్రవర్తిస్తుంది? డయానా(సిమ్రాన్) ఎవరు? కాలేజీలో జరుగుతున్న మరణాలతో ఆమెకు ఉన్న సంబంధం ఏంటి? నాన్సీ(లైలా) ఎవరు? కాలేజీలో ఉన్న లైబ్రరీ నేపథ్యం ఏంటి? మరణాల వెనుక ఉన్న అసలు కారణం ఏంటి? 42 దెయ్యాల స్టోరీ ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. -
అలనాటి హీరోయిన్ భానుప్రియ ఇంట తీవ్ర విషాదం
అలనాటి హీరోయిన్లు భానుప్రియ, శాంతిప్రియ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. వారి తల్లి ఎం. లక్ష్మి (83) ఆదివారంనాడు గుండెపోటుతో కన్నుమూశారు. సోమవారం మధ్యాహ్నం మూడు గంటలకు చెన్నైలో ఆమె అంత్యక్రియలు నిర్వహించారు. ఎం.లక్ష్మికి భానుప్రియ, శాంతిప్రియతో పాటు గోపాలకృష్ణ అనే కుమారుడు ఉన్నాడు. ఇద్దరు కూతుర్లను సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లుగా తీర్చిదిద్దారు లక్ష్మి. భానుప్రియకాగా భానుప్రియ 1998లో ఆదర్శ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని అమెరికా వెళ్లిపోయింది. వీరికి కూతురు అభినయ సంతానం. కొంతకాలానికి భార్యాభర్తల మధ్య బేధాభిప్రాయాలు వచ్చాయి. దీంతో 2005లో అతడి నుంచి విడిపోయి కూతుర్ని తీసుకుని చెన్నైకి వచ్చి తల్లితోనే కలిసి ఉంటోంది. 2018లో నటి మాజీ భర్త ఆదర్శ్ కౌశల్ గుండెపోటుతో మరణించాడు. శాంతిప్రియభానుప్రియ చివరగా అయాలన్ అనే తమిళ సినిమాలో కనిపించింది. శాంతిప్రియ విషయానికి వ్తే.. ఈమె ప్రముఖ దర్శకుడు వి.శాంతారాం మనవడు, నటుడు సిద్దార్థ్ రాయ్ను పెళ్లి చేసుకుంది. 1992లో వీరి వివాహం జరగ్గా ఈ దంపతులకు ఇద్దరు కుమారులు సంతానం. 2004లో సిద్దార్థ్ కూడా గుండెపోటుతోనే కన్నుమూశాడు. -
భర్త లేకుండా బతకలేనని ఏడ్చా.. చివరకు విడిపోయాం: నటి
మలయాళ ఇండస్ట్రీలో దశాబ్దకాలంగా సహాయ నటిగా రాణిస్తోంది నటి మంజు పాత్రోస్. వెండితెరతో పాటు బుల్లితెరపైనా పలు సీరియల్స్ చేస్తోంది. కొంతకాలంగా ఆమె తన వర్క్ గురించి కాకుండా పర్సనల్ లైఫ్ గురించి వార్తల్లో నిలుస్తోంది. భర్త సునిచన్తో విడిపోయిందని ప్రచారం జరుగుతోంది.అవును, విడిపోయాంతాజాగా ఈ వ్యవహారంపై మంజు పాత్రోస్ స్పందించింది. ఆమె మాట్లాడుతూ.. చట్టపరంగా విడిపోలేదు కానీ కొంతకాలంగా వేర్వేరుగానే జీవిస్తున్నాం. సునిచన్తో నేను మాట్లాడటం లేదు. ఎప్పుడైనా ఒకసారి ఫోన్ చేసి నా కొడుకుతో మాట్లాడుతుంటాడు. వాడిని చూసేందుకు అప్పుడప్పుడు వస్తుంటాడు కూడా! దాన్ని నేనేమీ అడ్డుకోను. మేమింకా చట్టపరంగా విడిపోలేదు. అలా అని మళ్లీ కలిసే ఆలోచనలు కూడా చేయడం లేదు.ఎంతో ఏడ్చా..ఇతరులకు నచ్చినట్లుగా ఎక్కువకాలం బతకలేం. మనకంటూ కొన్ని ఇష్టాయిష్టాలుంటాయి. వాటిని కూడా గౌరవించాలికదా! ఇకపోతే ఇలా విడిపోతామని ఎన్నడూ అనుకోలేదు. నా భర్త లేకుండా ఎలా బతకాలని ఎంతగానో ఏడ్చాను. ఒంటరిగా ఎలా జీవిస్తానని భయపడ్డాను. కానీ, ఇప్పుడా భయం పోయింది.. చేతిలో డబ్బుంది కాబట్టి నిర్భయంగా జీవిస్తున్నారని మీరంటారేమో! ఇక్కడ విషయం డబ్బు కాదు.. అలాగైతే నా అకౌంట్లో ఇప్పటికీ చాలా తక్కువ మొత్తమే ఉంది. చిల్లి గవ్వ లేని స్థితిలో..ఓపక్క అప్పు తీరుస్తున్నాను, మరోపక్క కొడుకును చదివిస్తున్నాను. ఒకానొక సమయంలో ముక్కుపుడక తప్ప నా చేతిలో ఏమీ లేని నిస్సహాయ స్థితికి వెళ్లిపోయాను. అప్పుడు నా చుట్టూ ఉండేవాళ్లు నాకు మద్దతుగా నిలబడ్డారు, సాయం చేశారు అని చెప్పుకొచ్చింది. మంజు మలయాళంలో జిలేబి, కమ్మటిపాదం, స్కూల్ బస్, కల్యాణం, ప్రేమసూత్రం, తోటప్పన్, మై సాంటా, హెవెన్, క్వీన్ ఎలిజబెత్, ఎఎమ్ఐ, భూతకాలం వంటి పలు సినిమాల్లో నటించింది. మలయాళ బిగ్బాస్ రెండో సీజన్లోనూ పాల్గొంది.చదవండి: జూన్లో ధురంధర్ 3? నిజమెంత? -
కరుప్పు ఫస్ట్ విజయ్కే చెప్పా.. ఆయనకు నచ్చింది.. కానీ!
స్టార్ హీరో ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రాల్లో కరుప్పు ఒకటి. అయితే ఈ ప్రాజెక్ట్ సూర్య కంటే ముందు దళపతి విజయ్ చేతికి వెళ్లిందట. ఈ విషయాన్ని దర్శకుడే స్వయంగా వెల్లడించాడు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. రజనీకాంత్ కెరీర్లో భాష, ముత్తు, పడయప్ప (నరసింహ) వంటి సినిమాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఇప్పటికీ చాలామంది జనాలు వీటిని మళ్లీ మళ్లీ చూస్తుంటారు. 2023లోనే..అలాంటి ఒక ఫుల్ ఎంటర్టైనర్ సినిమాని తీయాలని నా కోరిక. యాక్టింగ్ అంటే గట్టిగా అరవడం, ఏడవడం కాదు. అన్ని రకాల ఎమోషన్స్ను సమపాళ్లలో పండించాలి. అది సూర్యకు వెన్నతో పెట్టిన విద్య.. తను బాగా డ్యాన్స్ చేస్తాడు, అద్భుతంగా నటిస్తాడు, ఏదైనా సింపుల్గా చేసేస్తాడు. తన స్క్రీన్ ప్రజెన్స్ చాలా బాగుంటుంది. నిజానికి 2023లో కరుప్పు కథ రాయడం మొదలుపెట్టాను. విజయ్కు కథ చెప్పా..ఈ కథకు బలమైన స్టార్ ఉంటే బాగుంటుందనిపించింది. అలా హీరో విజయ్ను కలిశాను.. పైగా ఆయన 2021లోనే ఏదైనా కథ ఉంటే చెప్పమని అడిగాడు. ఈ రెండు కారణాల వల్ల తనను కలిశాను. కరుప్పు విజయ్కు చాలా బాగా నచ్చింది. ఇది భారీ సినిమా.. వెంటనే మొదలుపెడదాం అన్నారు. కానీ విజయ్ వంటి స్టార్ హీరోతో సినిమా తీయడం అంటే పెద్ద బాధ్యత.. నచ్చింది కానీ..అలా హడావుడిగా మొదలుపెట్టలేనని చెప్పాను. తర్వాత కొన్నిసార్లు కలిశాం, మాట్లాడుకున్నాం.. కానీ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. ఆయన నా నుంచి కుటుంబ కథా చిత్రం ఆశించాడు. అయినప్పటికీ ఈ కథ తనకెంతో నచ్చింది.. అదే సంతోషం అని ఊరుకున్నాను. తర్వాత సూర్యను సంప్రదించగా ఆయన ఓకే చెప్పాడు అని తెలిపాడు.సినిమాకరుప్పు విషయానికి వస్తే.. ఇందులో త్రిష కథానాయికగా నటిస్తోంది. స్వాశిక, ఇందిరన్స్, యోగిబాబు, శివదా, సుప్రీత్ రెడ్డి, అనకా, మాయారవి, నట్టి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్పై ఎస్ఆర్. ప్రకాశ్బాబు, ఎస్ఆర్.ప్రభు నిర్మిస్తున్నారు. సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్నాడు. రిలీజ్ డేట్ ప్రకటించాల్సి ఉంది.చదవండి: ధురంధర్ 2 ప్రభంజనం.. 28 ఏళ్ల కిందటి లేఖ వైరల్ -
తమిళ సాంగ్ రిలీజ్.. స్టెప్పులేసిన రోజా
మిలియన్ డాలర్స్ స్టూడియోస్, నీయో కాస్టిల్స్ క్రియేషన్స్ సంస్థల అధినేతలు సత్య కరికాలన్, యువరాజ్ గణేశన్ కలిసి నిర్మిస్తున్న చిత్రం అన్బే డయానా. జమా చిత్రం ఫేమ్ పారి ఇళవళగన్ కథానాయకుడిగా నటిస్తుండటంతో పాటు కథ, కథనం, దర్శకత్వ బాధ్యతలను నిర్వహిస్తున్నాడు. ఈ చిత్రంలో ఆయనకు జంటగా రమ్య రంగనాథన్ నటిస్తోంది.సాంగ్ రిలీజ్తమిళనాడులోని ఒక గ్రూప్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీ.. షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. తాజాగా ఈ సినిమా నుంచి సింగిల్ సాంగ్ను విడుదల చేశారు. ఇందులో హీరోహీరోయిన్లతో పాటు నటి రోజా కూడా స్టెప్పులేశారు. జెస్సీ గిఫ్ట్ ఆలపించిన ఈ పాటను ఇప్పుడు సంగీత ప్రియులు రిపీట్ మోడల్ వింటున్నారు. సినిమారొమాంటిక్ వైబ్తో పాటు ఫ్యామిలీ ఎంటర్టైనర్గా సాగే అన్బే డయానా ఆడియో, ట్రైలర్ లాంచ్ వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు పేర్కొన్నారు. నటుడు చేతన్, వైరల్ యూట్యూబర్ పరితాపంగల్ గోపి, ఇస్మత్ భాను, సుదర్శన్ గాంధీ, సెల్ మురుగన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి భరత్ శంకర్ సంగీతాన్ని, షెల్లీ గెలిస్ట్ ఛాయాగ్రహణాన్ని అందిస్తున్నారు. -
పిడుగులాంటి వార్త.. నిస్సహాయస్థితిలో నటుడు
మలయాళ నటుడు, మిమిక్రీ ఆర్టిస్ట్ కన్నన్ సాగర్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడు. తనకు వీలైనంత త్వరగా బైపాస్ సర్జరీ చేయాలని వైద్యులు సూచించారు. అయితే ఆపరేషన్ చేయించుకునే స్థోమత తనకు లేదని, దాతలు సాయం చేయాలని కోరుతున్నాడు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ ఎమోషనల్ నోట్ వదిలాడు.కుటుంబ బాగోగులు ఆర్థిక సమస్యలు, ఇబ్బందులు, ఒడిదుడుకులు ఎదుర్కోనివారు ఈ ప్రపంచంలో ఉండరు. అలాగే సంతోషాన్ని, ఆరోగ్యాన్ని, మానసిక ప్రశాంతతని ఎవరు కాదనగలరు? మన సంపాదనతో కుటుంబాన్ని పోషిస్తాం, పిల్లల్ని చదివిస్తాం.. వాళ్ల బాగోగులు చూసుకుంటాం. అలాగే మనకున్నదాంట్లోనే పక్కవాళ్లకు కూడా సంతోషాన్ని పంచే ప్రయత్నం చేస్తాం.పిడుగులాంటి కుదుపుకానీ సడన్గా అనారోగ్యం అనే ఓ పిడుగులాంటి వార్త మన జీవితాలను కుదిపేస్తుంది. మోయలేనంత భారాన్ని, బాధను తీసుకొస్తుంది. మన దారుల్ని మూసేస్తుంది.. ఇప్పుడెలా ముందుకెళ్తావని ప్రశ్నిస్తుంది. దృడ సంకల్పంతో దాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నా ఆర్థిక అంశాలు వెనక్కులాగుతాయి. అప్పుడే మన నిస్సహాయ స్థితి అర్థమై.. ఇతరుల సాయం కోసం వెతకడం మొదలుపెడతాం. గుండె సమస్యఇలా సాయం కోసం అర్థించడం బలహీనత అని నేననుకోను. ఎందుకంటే మన పరిస్థితి గురించి తెలిసినప్పుడే మంచి మనసున్నవారు మనకు సాయం చేసేందుకు ముందుకు వస్తారు. కొద్ది రోజులుగా నేను ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నాను. నిన్ననే యాంజియోగ్రామ్ చేయించుకున్నాను. గుండె రక్తనాళాల్లో పూడిక ఉందని తెలిసింది. ఓదారుస్తున్నాతక్షణమే బైపాస్ సర్జరీ చేయాలన్నారు. ఈ విషయం తెలిసినప్పటినుంచి నా భార్యాపిల్లలు బాధతో ఏడుస్తూనే ఉన్నారు. వారిని ఓదార్చేందుకు ప్రయత్నిస్తున్నాను. కానీ, ఆపరేషన్ చేయించుకునేంత స్థోమత నాకు లేదు. సాయం కోసం చూస్తున్నా అన్నాడు. కన్నన్ సాగర్.. మలయాళంలో చార్లీ, అన్వేషిప్పిన్ కండేతుమ్, కర్ణన్ నెపోలియన్ భగత్ సింగ్ సినిమాల్లో నటించాడు.చదవండి: లాభాల్లో 70% వాటా డిమాండ్ చేస్తున్న స్టార్ హీరో -
లాభాల్లో 70% వాటా డిమాండ్ చేస్తున్న హీరో
అమరన్ సినిమా తర్వాత శివకార్తికేయన్ గ్రాఫ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. తన సినిమాలకు మార్కెట్ వాల్యూ కూడా పెరిగింది. అది దృష్టిలో పెట్టుకున్న హీరో కేవలం పారితోషికం కాకుండా లాభాల్లో వాటా అడుగుతున్నాడు. మదరాసి, పరాశక్తికి ఇదే రూల్ ఫాలో అయ్యాడట.. ఇప్పుడు తన నెక్స్ట్ సినిమాకు కూడా ఇదే విధానం అమలు చేయనున్నాడంటూ కోలీవుడ్లో తెగ ప్రచారం జరుగుతోంది.సెయాన్ అంటే..శివకార్తికేయన్ ప్రస్తుతం సెయాన్ సినిమా చేస్తున్నాడు. స్టార్ హీరో కమల్ హాసన్ నిర్మిస్తున్నాడు. అమరన్ వంటి బ్లాక్బస్టర్ తర్వాత రాజ్కమల్ ఫిలింస్ ఇంటర్నేషనల్ బ్యానర్పై శివకార్తికేయన్ చేస్తున్న రెండో చిత్రమిది. ఈ మూవీతోనే శివకుమార్ మురుగేశన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. సెయాన్ అంటే కుమారస్వామికి మరో పేరు. ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నాడు.లాభాల్లో వాటాఈ మూవీకి శివకార్తికేయన్ భారీ పారితోషికాలు గట్రా అడగలేదట! లాభాల్లో వాటా అడిగాడట! ఇప్పటికే రూ.10 కోట్ల అడ్వాన్స్ తీసుకున్న హీరో సినిమా రిలీజయ్యాక 70% లాభాలను డిమాండ్ చేశాడని తెలుస్తోంది. అంటే మిగిలిన 30% మాత్రం కమల్ హాసన్ బ్యానర్కు వెళ్తాయి. సెయాన్ బడ్జెట్ రూ.35 కోట్లని తెలుస్తోంది. మరి ఈ చిత్రానికి ప్రీరిలీజ్ బిజినెస్ ఎంత జరగనుంది? బాక్సాఫీస్ వద్ద ఎంత రాబడుతుంది? అన్నది చూడాలి!చదవండి: 50 ఏళ్ల వయసులో తండ్రయిన బాలీవుడ్ నిర్మాత -
పిచ్చి రీల్స్ పంపుతాడు.. ఆంటీ బాలేదు నాన్న అనగానే..
బ్యాక్గ్రౌండ్ ఉంటే ఇండస్ట్రీలో ఎంట్రీ ఈజీ అవుతుందని చాలామంది వాదన. ఆ విషయం తాను కూడా అంగీకరిస్తానంటోంది హీరోయిన్ శృతి హాసన్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. నెపోకిడ్ వంటి అంశాల గురించి ఎవరైనా మాట్లాడుతుంటే నేనస్సలు ఫైట్ చేయను. ఎందుకంటే నాకు తొలిసారి పాట పాడే అవకాశం చాలా ఈజీగా లభించింది. నా గొంతు ఇబ్బందిఇళయారాజా సర్ సంగీత దర్శకత్వంలో నాన్న సినిమాలోనే తొలిసారి పాట పాడాను. నా వాయిస్ గంభీరంగా ఉంటుందని ఇళయరాజా అంటుండేవారు. ఒకసారి ఆయన ఇంటికి వచ్చినప్పుడు నేను మా పేరెంట్స్పై అరుస్తున్నాను. అప్పుడాయన నీ గొంతులో మంచి రేంజ్ ఉందన్నారు. అయితే ఆయన్ని ఇంప్రెస్ చేసిన నా గొంతు చాలామందికి మాత్రం డామినెంట్గా అనిపించింది.నాన్న సలహా తీసుకోనునేను చిన్నప్పుడే పండిత్ మనోహర్ కులకర్ణి, సురేశ్ వాడక్కర్ వంటి మహామహుల వద్ద సంగీతం నేర్చుకున్నాను. అలా నాకు మంచి గురువులు లభించారు. కెరీర్లో ఏం చేయాలి? ఎటువైపు అడుగులు వేయాలి? అనే విషయంలో ఎన్నడూ నాన్న సలహా తీసుకోలేదు. అలాగే రజనీకాంత్ను కూడా సలహా అడగలేదు. కాకపోతే వాళ్లిద్దరూ చాలా కష్టపడతారు. పిచ్చి రీల్స్ దాన్ని ఇబ్బందిగా ఫీలవకుండా ఇష్టంగా, నిశ్శబ్ధంగా కష్టపడతారు. సినిమా కోసం ప్రాణాలైనా ఇస్తారు.. ఇద్దరూ పని రాక్షసులు. అటు ఆఫీసును, ఇటు ఇంటిని చక్కగా నిర్వహిస్తారు. నాన్నయితే ఇన్స్టాగ్రామ్లో కనిపించే పిచ్చి రీల్స్ ఏవేవో పంపుతాడు. అది చూసినప్పుడు ఈ ఆంటీ ఫన్నీగా ఏం లేదు నాన్నా అంటుంటాను. అప్పుడాయన కొన్ని మంచి రీల్స్ పంపుతాడు.. అలాంటి వీడియోలు ఇష్టంచిన్న పాప అందంగా పాడుతున్నట్లు, గ్రామాల్లో వంట చేసే వీడియోలు.. ఇలాంటివి చూసి ఆయనెంతగానో సంతోషిస్తూ ఉంటాడు అని చెప్పుకొచ్చింది. కాగా ఐదేళ్లకే సింగర్గా పరిచయమైంది శృతి హాసన్. తేవార్ మగన్ (1992) మూవీలో పొట్రి పాడది పొన్నె అనే పాట ఆలపించింది. తర్వాత హీరోయిన్గా ఎక్కువ క్రేజ్ తెచ్చుకుంది. ప్రస్తుతం సింగర్గా, హీరోయిన్గా రాణిస్తోంది.చదవండి: మహేశ్బాబు సెట్లో ఎలా ఉంటారంటే?: బాలీవుడ్ నటి -
ఆ మాత్రం దానికి పెళ్లి ఎందుకు?, 34 ఏళ్ల నటి షాకింగ్ కామెంట్స్
ఈ మధ్య చాలా మంది హీరోయిన్లు పెళ్లి చేసుకోమనే చెబుతున్నారు. మరికొంతమంది అయితే తనకు నచ్చిన అబ్బాయి దొరికితే చేసుకుంటా..లేదంటే సింగిల్గానే ఉంటామని అంటున్నారు. తాజాగా కన్నడ బ్యూటీ ఐశ్వర్య లక్ష్మి కూడా అదే కామెంట్ చేసింది. జీవితంలో పెళ్లి అనేది తప్పనిసరి కాదని, తోడు కావాలనుకుంటే సహజీవనం బెటర్ అని చెబుతోంది ఈ 34 ఏళ్ల సుందరి. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..‘గత 30 ఏళ్ల నా జీవితంలో పెళ్లి చేసుకున్న జంటలను ఎన్నో చూశా. వారిలో సంతోషంగా జీవితం గడుపుతున్నవారు చాలా తక్కువ. పెళ్లి తర్వాత భాగస్వామి కెరియర్లో ఆటంకాలు కలగడం నన్ను ఆలోచింపజేశాయి. ఒకప్పుడు అందరి అమ్మాయిల్లాగానే నేను కూడా పెళ్లి చేసుకోవాలని కలలు కన్నాను. నా ఫ్రొఫైల్ని మ్యాట్రిమోనీ వెబ్సైట్లోనూ పెట్టాను. అయితే నా ఫోటో చూసి ఫేక్ ప్రొఫెల్ అనుకున్నారు. అదే సమయంలో నాకు పెళ్లి వ్యవస్థపై నమ్మకం పోయింది.నా ఆలోచనలు పూర్తిగా మారిపోయాయి. ఇద్దరు వ్యక్తుల మధ్య మనశ్శాంతి, తృప్తి ఉండాలి. అయితే అది పెళ్లితోనే సాధ్యం కాదని అర్థమైంది. నాకు కూడా తోడుగా ఉండే భాగస్వామి కావాలి. కానీ ఆ బంధం నిలబడడానికి పెళ్లి అనే ట్యాగ్ అవసరం లేదు. ఇద్ధరి మధ్య మంచి అవగాహన, గౌరవం ఉంటే.. సహజీవనం చేయడం బెటర్. పెళ్లి చేసుకుని విడిపోవడం కంటే పెళ్లి కంటే ముందే సహజీవనం చేయడమే మంచిది.’ అని ఐశ్వర్య చెప్పుకొచ్చింది.ఐశ్వర్య లక్ష్మి సినీ కెరీర్ విషయానికొస్తే.. ఎంబీబీఎస్ పూర్తి చేసిన డాక్టర్ అయ్యాక 2017లో నందలవర నాడు నాడ్ ఒరు ఆవాలా సినిమాతో తన సినీ కెరీర్ని ప్రారంభించింది. మణిరత్నం తెరకెక్కించిన పొన్నియన్ సెల్వన్ సినిమాలో నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది. ప్రస్తుతం రోహిత్ కెపి దర్శకత్వంలో వస్తున్న ‘సంబరాల ఏటిగట్టు’ సినిమాలో సాయి ధరమ్ తేజ్కి జోడీగా నటిస్తోంది. -
దురంధర్-2 రిలీజ్.. టాక్సిక్ సేఫ్.. మరి ఉస్తాద్ సంగతేంటి?
సినీ ఇండస్ట్రీలో ఇప్పుడు ఎక్కడ చూసినా దురంధర్ పేరే వినిపిస్తోంది. గతేడాది రిలీజైన దురంధర్ బాక్సాఫీస్ను షేక్ చేయడంతో సీక్వెల్గా భారీ హైప్ క్రియేట్ చేసింది. అందుకు తగ్గట్టుగానే మార్చి 19న రిలీజైన దురంధర్-2 బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. రెండు రోజుల్లోనే రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సరికొత్త రికార్డ్ సృష్టించింది. కేవలం ఇండియాలోనే కాకుండా ఓవర్సీస్లోనూ వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. ఈ సినిమా నార్త్ అమెరికాలోనూ 3.95 మిలియన్ల ఓపెనింగ్ వసూళ్లు సాధించింది. అడ్వాన్స్ బుకింగ్స్తో కలిపి ఇప్పటికే 10.5 మిలియన్ డాలర్ల మార్క్ దాటేసినట్లు తెలుస్తోంది. టాక్సిక్ టీమ్ సేఫ్.. మరీ ఉస్తాద్ సంగతేంటి?యశ్ హీరోగా వచ్చిన టాక్సిక్ మార్చి 19న రిలీజ్ కావాల్సి ఉంది. కానీ దురంధర్ క్రేజ్ చూసి మేకర్స్ తెలివిగా తప్పుకున్నారు. ఈ లెక్కన చూస్తే టాక్సిక్ టీమ్ చేసిన పని కరెక్టే అనిపిస్తోంది. కానీ తెలుగు హీరో పవన్ కల్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ మాత్రం బాక్సాఫీస్ పోటీకి దిగింది. దురంధర్-2 మానియాకు ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ రిలీజ్ అయిందన్న విషయం కూడా చాలామంది సినీ ప్రియులకు తెలియడం లేదు. దురంధర్ దెబ్బకుఉస్తాద్ భగత్ సింగ్ మూవీ కూడా రిలీజ్ అయిందా? అని కొంతమంది ఆడియన్స్ అడుగుతున్నారు. మరోవైపు చాలా థియేటర్లలో దురంధర్-2 మూవీకి టికెట్స్ కూడా దొరకడం లేదు. ఉస్తాద్ భగత్ సింగ్ థియేటర్లు మాత్రం ఖాళీగా దర్శనమిస్తున్నాయి.ఇంత భారీ హైప్ ఉన్న మూవీ రిలీజ్ అయ్యే సమయంలో ఉస్తాద్ భగత్ సింగ్ మేకర్స్ కాస్తా ఆలోచించి ఉండాల్సిందనే ఆడియన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా దురంధర్-2 బాక్సాఫీస్ను షేక్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. గతేడాది డిసెంబర్ 5న కేవలం హిందీలో మాత్రమే విడుదలైన ఈ సినిమా ఏకంగా రూ.1300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ సీక్వెల్ మూవీ క్రేజ్ చూస్తుంటే రూ.2 వేల కోట్ల మార్క్ చేరుకోవడం పక్కా అని తెలుస్తోంది. ఈ చిత్రాలను బాలీవుడ్ దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించారు. -
'ఐటమ్ సాంగ్లో ఛాన్స్.. అలా అడుగుతారని భయపెట్టారు'
దక్షిణాదిలోనే కాదు, ఇండియన్ సినిమాలోనే నటి నయనతార ప్రత్యేక జీవితం అని చెప్పక తప్పదు. కేరళ రాష్ట్రంలోని మారు మూల గ్రామానికి చెందిన ఈ మలయాళీ కుట్టి తనను నటిగా మలచుకోవడానికి చాలానే శ్రమించారు. పలు అవమానాలను, అవరాధాలను ఎదుర్కొని అగ్ర కథానాయకి స్థాయికి చేరుకున్నారు. కోలీవుడ్లో హరి దర్శకత్వంలో శరత్కుమార్ హీరోగా నటించిన అయ్యారు. ఈ చిత్రం ద్వారా కథానాయకిగా పరిచయం అయ్యి తొలి చిత్రంతోనే విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ఆ తరువాత రజనీకాంత్ హీరోగా నటించిన చంద్రముఖ చిత్రంలో నటించి దక్షణాది వ్యాప్తంగా పేరు తెచ్చుకున్నారు. అలా వరుసగా విజయాలను అందుకుంటూ అందాల ప్రదర్శనలతోనూ, అభినయంతోనూ అందరినీ మెప్పిస్తూ, ఉమెన్స్ సెంట్రిక్ కథాపాత్రల్లో నటిస్తూ లేడీ సూపర్స్టార్గా గుర్తింపు పొందారు.ఆ తర్వాత నటుడు శింబు, ప్రభుదేవాతో ప్రేమాయణం బెడిసి కొట్టడంతో సింగిల్గానే జీవితాన్ని గడపాల్సిందే అని అనుకుంటున్న సమయంలో నానురౌడీదాన్ చిత్ర షూటింగ్లో ఆ చిత్ర దర్శకుడు విఘ్నేశ్ శివన్ ప్రేమలో పడ్డారు. కొంతకాలం సహజీవనం తరువాత ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. వారి పెళ్లి చెన్నైలో చాలా గ్రాండ్గా జరిగింది. ఆ వెంటనే ఈ దంపతులు సరోగసి విధానం ద్వారా ఇద్దరు కవల పిల్లలకు తల్లిదండ్రులు అయ్యారు. ఈ విషయంలోనూ పలు సమస్యలను ఎదుర్కొని సురక్షితంగా బయటపడ్డారు.స్టార్ హీరోయిన్గా రాణిస్తున్న తరుణంలోనూ ప్రత్యేక పాటల్లో నటించి తన ప్రత్యేకతను చాటుకున్నారు. ఇటీవల తన గతంలో జరిగిన ఒక సంఘటన గురించి నయతార గుర్తు చేసుకుంటూ విజయ్ హీరోగా నటించిన శివకాశీ చిత్రంలో ప్రత్యేక పాటలో నటించే అవకాశం రావడంతో తాను అందుకు సమ్మతించానన్నారు. అయితే ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారంటూ పలువురు తనను ప్రశ్నించారన్నారు. ఇకపై అందరూ అలాంటి పాటల్లోనే నటించమని అడుగుతారని భయపెట్టారన్నారు. అయితే స్పెషల్ పాట అయితే స్పెషలేగా అని.. ఏదో ఒక ఇమేజ్ ఉంటేనే తనకు స్పెషల్ సాంగ్లో నటించే అవకాశం వచ్చిందని దాని ద్వారా పలు విషయాలు నేర్చుకోవచ్చని భావించానన్నారు. అలా తాను నటించిన రెండు స్పెషల్ సాంగ్స్తో చాలా విషయాలు నేర్చుకోగలిగానని నయనతార తెలిపారు. -
3D టెక్నాలజీతో పాన్ ఇండియా సినిమా 'కొరగజ్జ'
కర్ణాటకలోని తులునాడు ప్రాంతంలో అత్యంత పవిత్రంగా పూజించే కొరగజ్జ దైవం కథ ఆధారంగా ఓ సినిమా రాబోతోంది. 'కొరగజ్జ' పేరుతో తీస్తున్న ఈ చిత్రాన్ని త్రివిక్రమ సినిమాస్, సక్సెస్ ఫిల్మ్స్ బ్యానర్లపై త్రివిక్రమ్ సాపల్య నిర్మిస్తున్నారు. సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత సుధీర్ అత్తవర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీని రీసెంట్గా విడుదల చేయాలని అనుకున్నారు కానీ చివరి నిమిషంలో ఆ నిర్ణయాన్ని మార్చుకుని వాయిదా వేశారు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చిన తెలుగు సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా)'కొరగజ్జ' చిత్రాన్ని చూసిన అంతర్జాతీయ బృందం ఇచ్చిన సలహా మేరకే వాయిదా వేశారట. ఈ మూవీని త్రీడీ ఫార్మాట్లోకి మార్చితే ఇంకా ఎక్కువ ప్రభావవంతంగా ఉంటుందని, మరింతమందికి రీచ్ అవుతుందని చెప్పారట. దీంతో సినిమాని 2డీ నుంచి 3డీకి మార్చేందుకు టీంకి చాలా టైం కావాల్సి వస్తోంది.ఈ అప్గ్రేడ్పై దర్శకుడు సుధీర్ అత్తవర్ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుతం దాదాపు 40 మంది నిపుణులతో కూడిన ఒక ప్రత్యేక బృందం ఈ త్రీడీ ఫార్మాట్ కోసం పనిచేస్తోంది. క్లైమాక్స్ను నీటి అడుగున తిరిగి తీశారు. ఈ సన్నివేశాన్ని కేరళలోని తిరువనంతపురంలో ఉన్న మలయాళ స్టార్ మోహన్లాల్కు చెందిన 'విస్మయ' స్టూడియోలో చిత్రీకరించారు.(ఇదీ చదవండి: క్రికెట్ రాజకీయాలకు బలైన 'ధురంధర్' దర్శకుడు) -
ఐశ్వర్యరాయ్కు సారీ చెప్పిన హీరోయిన్, ఎందుకంటే?
పిల్లి కళ్ల హీరోయిన్ అనగానే అందరికీ మొదట గుర్తొచ్చే పేరు ఐశ్వర్యరాయ్.. ఆ తర్వాత కాస్త అటూఇటుగా ఐష్లాగే కనిపించే స్నేహా ఉల్లాల్ గుర్తొస్తుంది. తను కూడా హీరోయిన్ అయినప్పటికీ తనను ఐశ్వర్యతో పోల్చినందుకు తెగ సంబరపడిపోయింది. అదే సమయంలో ఒకసారి ఆమెను నేరుగా కలిసి క్షమాపణలు కూడా చెప్పింది.. అదెందుకో ఓసారి చూసేద్దాం..సినిమా'ఉల్లాసంగా ఉత్సాహంగా' సినిమాతో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైంది స్నేహా ఉల్లాల్. అప్పటికే 'లక్కీ: నో టైం ఫర్ లవ్' (2005) చిత్రంతో బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది. అలా ఓపక్క హిందీ సినిమాలు చేస్తూ మరోపక్క తెలుగు చిత్రాల్లో నటించింది. మధ్యలో కొంతకాలం సినిమాలకు గ్యాప్ ఇవ్వగా ఆ తర్వాత అడపడాదడపా సినిమాల్లో కనిపిస్తోంది.సల్మాన్ ఎలాంటివాడంటే?తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్నేహ తన కెరీర్ తొలినాళ్ల గురించి ఓపెన్ అయింది. ఆమె మాట్లాడుతూ.. లక్కీ మూవీతో నా సినీరంగ ప్రవేశం జరిగింది. చిత్రీకరణ సమయంలో హీరో సల్మాన్ ఖాన్ నాకెంతో సపోర్ట్ చేశాడు. ఎప్పుడూ ఓపిక, సహనంతో మెదిలేవాడు. తానో పెద్ద హీరో అని ఎన్నడూ యాటిట్యూడ్ చూపించలేదు.అలా ఫేమస్నిజానికి నేను సినిమాల్లోకి రావాలని ఎప్పుడూ అనుకోలేదు. కాలేజీలో చదువుకుంటున్న రోజుల్లో ఐశ్వర్యరాయ్ మిస్ వరల్డ్ కిరీటం అందుకుంది. చూడటానికి నేను ఐశ్వర్యరాయ్లాగే ఉంటానని చాలామంది అంటుంటారు. అలా ఆమె మిస్ వరల్డ్ కిరీటం ద్వారా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు అందుకుంటే నా చుట్టూ ఉన్న చిన్నప్రపంచంలో నేను సెలబ్రిటీ అయిపోయాను.ఐశ్వర్యకు సారీనేను ఒకే ఒక్కసారి ఐశ్వర్యను కలిశాను. నన్ను చూడగానే ఆమె 'వెల్కమ్ టు ద ఫ్యామిలీ.. బాలీవుడ్కు స్వాగతం' అని సాదరంగా ఆహ్వానించింది. అప్పుడు వెంటనే నేను ఆమెకు సారీ చెప్పాను. మీడియాలో పదేపదే నన్ను ఐష్తో పోలుస్తూనే ఉన్నారు. దాని గురించే చెప్తూ నన్ను క్షమించండి, దయచేసి నన్ను ద్వేషించకండి అన్నాను. మరి ఆమె దాన్ని ఎలా తీసుకుందో నాకు తెలీదు అని స్నేహా ఉల్లాల్ పేర్కొంది.చదవండి: ప్రియుడిని పెళ్లి చేసుకున్న పునర్నవి -
కాంబినేషన్ ఫిక్స్
విజయ్ సేతుపతి, సాయిపల్లవి కాంబినేషన్ ఫిక్స్ అయ్యింది. ఈ ఇద్దరూ జోడీగా నటించనున్న సినిమా ఖరారైంది. ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు మణిరత్నం తెరకెక్కించనున్నారు. సుభాస్కరన్ సమర్పణలో లైకా ప్రోడక్షన్స్, మద్రాస్ టాకీస్, ఇండియా టాకీస్ సంస్థలు నిర్మించనున్న ఈ సినిమాని శుక్రవారం అధికారికంగా ప్రకటించారు మేకర్స్. ఏఆర్ రెహమాన్ ఈ సినిమాకు సంగీతం అందించనున్నారు.సోని మ్యూజిక్ సంస్థ ఈ మూవీ ఆడియో హక్కులను పొందింది. ఇక ఈ ఏడాదిలోనే ఈ సినిమా చిత్రీకరణను ఆరంభించి, వచ్చే ఏడాది ప్రారంభంలోనే రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని కోలీవుడ్ సమాచారం. కాగా, మణిరత్నం దర్శకత్వం వహించిన తమిళ చిత్రం ‘చెక్క చివంద వానమ్’లో (తెలుగులో ‘నవాబ్’ టైటిల్తో విడుదలైంది) విజయ్ సేతుపతి ఓ లీడ్ రోల్లో నటించిన విషయం గుర్తుండే ఉంటుంది. -
చండీగఢ్లో జైలర్
చండీగఢ్లో ల్యాండ్ అయ్యారట ముత్తువేల్ పాండ్యన్ . రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘జైలర్ 2’. ఈ చిత్రంలో రమ్యకృష్ణ, ఎస్జే సూర్య, యోగిబాబు ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. మిథున్ చక్రవర్తి, మోహన్ లాల్, శివరాజ్కుమార్, విజయ్సేతుపతి కీలక పాత్రల్లో నటిస్తున్నట్లుగా తెలిసింది. జైలర్ ముత్తువేల్ పాండ్యన్గా నటిస్తున్నారు రజనీకాంత్.ఇందులోని మరో కీలకమైన పోలీస్ పాత్రలో హీరో షారుక్ఖాన్ నటించనున్నారని సమాచారం. ‘జైలర్ 2’ సినిమా తాజా షెడ్యూల్ చిత్రీకరణ ప్రస్తుతం చండీగఢ్లో జరుగుతోందని కోలీవుడ్ టాక్. ఈ షెడ్యూల్లో రజనీకాంత్, షారుక్ఖాన్ లపై ఓ యాక్షన్ సీక్వెన్స్ను తీస్తున్నారట నెల్సన్ అండ్ టీమ్. కార్ క్రషింగ్ ఫ్యాక్టరీలో ఈ యాక్షన్ సీక్వెన్స్ను తీస్తున్నారట. ఈ షెడ్యూల్తో ‘జైలర్ 2’ చిత్రీకరణ తుదిదశకు చేరుకుంటుందని సమాచారం. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమా ఈ ఏడాదే థియేటర్స్లో రిలీజ్ కానుంది. -
'దురంధర్-2 చెత్త సినిమా.. థియేటర్కు అస్సలు వెళ్లకండి'.. నటి షాకింగ్ రివ్యూ
కన్నడ నటి, రాజకీయ నాయకురాలు దివ్య స్పందన గురించి పరిచయం అక్కర్లేదు. గతేడాది హీరో దర్శన్పై కామెంట్స్ చేసిన ఒక్కసారిగా వార్తల్లో నిలిచింది. ఓ అభిమానిని హీరో దర్శన్ హత్య చేయడంపై దివ్య స్పందన మండపడింది. దర్శన్.. తన జీవితంలో సరిదిద్దుకోలేని తప్పు చేశాడని నటి రమ్య గతంలో పేర్కొంది. ఆ తర్వాత దర్శన్ ఫ్యాన్స్ దివ్యపై సోషల్ మీడియాలో ట్రోల్స్ చేశారు.తాజాగా ఈ ముద్దుగుమ్మ మరోసారి వార్తల్లో నిలిచింది. ఈనెల 19న రిలీజైన రణ్వీర్ సింగ్ దురంధర్-2పై అభిప్రాయాన్ని తెలిపింది. ఈ మూవీ తనను తీవ్రంగా నిరాశపర్చిందని.. చూస్తున్నంతసేపు నిద్ర వచ్చిందని ఎద్దేవా చేసింది. అసలు ఇది థియేటర్స్లో చూసే సినిమానే కాదంటూ ట్వీట్ చేసింది.మొదటి పార్ట్లో ఉన్న సాంకేతిక విలువలు ఈ సినిమాలో కొరవడ్డాయాని దివ్య స్పందన విమర్శించారు. దర్శకత్వం, డైలాగ్స్, ఎడిటింగ్, నేపథ్య సంగీతం, నటనలో దురంధర్-2 పూర్తిగా తేలిపోయిందని దివ్య స్పందన కామెంట్స్ చేసింది. మార్చి 19న విడుదల ఉందని వారికి ఎవరూ చెప్పలేదేమోనని మేకర్స్ను ఉద్దేశించిన వ్యంగ్యంగా మాట్లాడింది. ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో పెద్దఎత్తున చర్చకు దారితీశాయి. దివ్య తన ట్వీట్లో రాస్తూ..' ఇప్పుడే ధురందర్ 2 చూశాను. మన సహనానికి పరీక్షలా ఉంది. దయచేసి థియేటర్లో మీ సమయాన్ని, డబ్బును వృధా చేసుకోకండి. ఇది ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్లో చూసే మూవీ. దర్శకత్వం, సంభాషణలు, ఎడిటింగ్, నేపథ్య సంగీతం, నటన అన్నీ చెత్తగా ఉన్నాయి. మార్చి 19న విడుదల ఉందని వాళ్లకు ఎవరూ చెప్పలేదేమోనని అనిపించింది. పార్ట్-1 ఫర్వాలేదు కానీ.. సింపుల్గా చెప్పాలంటే ధురందర్ 2 ప్రేక్షకుడిని పూర్తిగా నిరాశపర్చే సినిమా. మరీ అంతంత మాత్రంగానే ఉంది. ఇది ప్రేక్షకుడిని నిద్రపుచ్చే ఓ కామెడీ సినిమా. అసలు ఈ సినిమా 'ఎందుకని మనల్ని ప్రశ్నించేలా చేస్తుంది. రణ్వీర్.. నువ్వు ఇంతకంటే బాగా చేయగలవు. ఆదిత్య ధర్.. జాతీయవాదం, ప్రాపగండ నుంచి మీరు బయటికి రండి.' అంటూ రాసుకొచ్చింది. Just watched Dhurandhar 2 and wow! what a masterclass in how to turn something promising into an endurance test.It’s like reading a textbook of the most boring subject with never-ending chapters and at some point, your brain just gives up and starts laughing out of sheer despair…— Ramya/Divya Spandana (@divyaspandana) March 20, 2026 -
తమిళ హీరోలతో రొమాన్స్.. తెలుగు హీరోలపై కోపం?
తమిళ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాశ్ కుమార్ హీరోగా నటించిన చిత్రం హ్యాపీ రాజ్. శ్రీగౌరీ ప్రియ హీరోయిన్గా నటించింది. ఒకప్పటి హీరో అబ్బాస్ దాదాపు పదేళ్ల తర్వాత వెండితెరపై రీఎంట్రీ ఇస్తున్నాడు. లవ్టుడే సినిమాకు ప్రదీప్ రంగనాథన్ వద్ద సహాయ దర్శకుడిగా పని చేసిన మరియ రాజ్ (మరియ ఇళంజెళియన్) దర్శకత్వం వహించాడు. ఈ సినిమా తమిళంతోపాటు తెలుగులోనూ విడుదల కానుంది. మార్చి 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.తెలుగు హీరోలపై కోపం?ఈ క్రమంలో శుక్రవారం నాడు హ్యాపీరాజ్ తెలుగు ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్ శ్రీ గౌరీప్రియకు వింత ప్రశ్న ఎదురైంది. మీరు సినిమాల్లో తమిళ హీరోలతో రొమాంటిక్గా ప్రవర్తిస్తారు.. అదే తెలుగు హీరోలతో యారొగెంట్గా ప్రవర్తిస్తున్నారు, అంటే వాళ్లను కొడతారు. తెలుగు హీరోలపై ఎందుకంత కోపం? అని ఓ విలేకరి ప్రశ్నించాడు.నేనేమైనా కంకణ కట్టుకున్నానా?ఆ ప్రశ్న విని గౌరీప్రియ అవాక్కయింది. నేను ఒక్క సినిమాలోనే హీరోను కొట్టాను.. నేనేమైనా హీరోలను కొట్టాలని కంకణం కట్టుకున్నానా? అసలు నాకు ఎవరి మీదా కోపం లేదు. ఆ లెక్కన చూస్తే.. నేను అన్ని సినిమాల్లో ఏడుస్తానని అంటారు. తమిళ సినిమాల్లో ఏడుస్తుంది, తెలుగు మూవీస్లో మాత్రం సంతోషంగా నవ్వుతుందంటారు. అవేవీ నిజం కాదు.. సినిమాలో నా పాత్ర అలా డిజైన్ చేస్తున్నారు అని బదులిచ్చింది.సినిమాతెలుగమ్మాయి అయిన శ్రీ గౌరీ ప్రియ.. లవర్, మ్యాడ్, మెయిల్ వంటి సినిమాల్లో నటించింది. మ్యాడ్ మూవీలో ఈమె.. హీరో రామ్ నితిన్ చెంప చెళ్లుమనిపిస్తుంది. ఆ క్లిప్పింగ్ సోషల్ మీడియాలో తెగ వైరలయింది. ప్రస్తుతం ఆమె చేతిలో వింటారా సరదాగా, చెన్నై లవ్స్టోరీ చిత్రాలున్నాయి.చదవండి: 10 ఏళ్ల కిందట విడాకులు.. కలిసిపోయిన స్టార్ కపుల్ -
మళ్లీ పెళ్లి చేసుకోలేదు, కానీ కలిసిపోయాం: స్టార్ డైరెక్టర్
మలయాళ స్టార్ డైరెక్టర్ ప్రియదర్శన్, హీరోయిన్ లిస్సీ 2016లో విడాకులు తీసుకున్నారు. 26 ఏళ్ల వైవాహిక బంధానికి స్వస్తి పలుకుతూ విడిపోయారు. అయితే ఈ ఏడాది ప్రారంభంలో వీరిద్దరూ ఓ పెళ్లిలో జంటగా కనిపించారు. దీంతో ప్రియదర్శన్-లిస్సీ కలిసిపోయారా? అన్న ప్రచారం మొదలైంది. అది మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి చెవిలో పడింది.సంతోషంలో మమ్ముట్టిమమ్ముట్టి.. ప్రియదర్శన్ డైరెక్షన్లో, అలాగే లిస్సీతో కలిసి సినిమాలు చేశాడు. అలా ఇద్దరూ తనకెంతో సన్నిహితులు. వారు కలిసిపోవడంతో మమ్ముట్టి చెన్నైలోని ప్రియదర్శన్ స్టూడియోకి ఇద్దర్ని రమ్మని పిలిచాడట! మీ ఇద్దరినీ ఇలా జంటగా చూడటం సంతోషంగా ఉందని వారితో చెప్పాడట! విడిపోయిన పదేళ్ల తర్వాత ఈ దంపతులు మళ్లీ కలవడానికి వారి పిల్లలు కల్యాణి, సిద్దార్థ్ ప్రధాన కారణమని తెలుస్తోంది. పెళ్లిఅయితే వారు కలిసిపోయారు కానీ పెళ్లి చేసుకునే ఆలోచన మాత్రం చేయడం లేదు. మ్యారేజ్ అనేది కేవలం సర్టిఫికెట్ అని.. తమ మధ్య స్నేహం, అన్యోన్యత, ప్రేమ ముఖ్యం అని చెప్తున్నారట! దీనిపై ప్రియదర్శన్ సైతం స్పందిస్తూ.. అవును, మేము కలిసే ఉంటున్నాం అని ధ్రువీకరించాడు.సినిమాకాగా ప్రియదర్శన్, లిస్సీ.. 1990 డిసెంబర్ 13న పెళ్లి చేసుకున్నారు. వీరికి కూతురు కల్యాణి, కుమారుడు సిద్ధార్థ్ సంతానం. కల్యాణి ప్రియదర్శన్ లోక సినిమాతో ఇటీవలే సెన్సేషన్ సృష్టించింది. ప్రియదర్శన్.. హిందీలో అక్షయ్కుమార్ హీరోగా భూత్ బంగ్లా సినిమా చేశాడు. ఈ మూవీ ఏప్రిల్ 10న విడుదల కానుంది.చదవండి: నడిరోడ్డుపై వేధింపులు.. పోలీసులకు నటి ఫిర్యాదు -
విజయ్- సాయిపల్లవితో మణిరత్నం కొత్త మూవీ
సాయిపల్లవికి పెద్ద అభిమానిని అని చెప్పుకునే మణిరత్నం తనతో సినిమా ప్రకటించాడు. థగ్ లైఫ్ డిజాస్టర్ తర్వాత కొంత గ్యాప్ తీసుకున్న ఆయన ఓ ప్రేమకథతో కంబ్యాక్ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. ఈ క్రమంలోనే శుక్రవారం తన కొత్త సినిమాను ప్రకటించాడు. ఇందులో విజయ్ సేతుపతి, సాయిపల్లవి జంటగా నటించనున్నారు.అదిరిన కాంబినేషన్లైకా ప్రొడక్షన్స్, మణిరత్నంకు చెందిన మద్రాస్ టాకీస్ సంయుక్తంగా ఈ సినిమా నిర్మిస్తున్నాయి. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించనున్నారు. ఈ కాంబో చూస్తుంటే సినిమా ఓ రేంజ్లో ఉండబోతుందని అభిమానులు అప్పుడే ఆశలు పెట్టేసుకుంటున్నారు. రూమర్స్నిజానికి ఈ సినిమాలో మొదటగా ధ్రువ్ విక్రమ్, రుక్మిణి వసంత్ నటించనున్నట్లు ప్రచారం జరిగింది. కానీ, తర్వాత వారి స్థానంలో విజయ్ సేతుపతి, సాయిపల్లవిని తీసుకున్నట్లు రూమర్స్ రాగా.. చివరకు అదే నిజమైంది. అలాగే సాయి అభ్యంకర్ సంగీతం అందించనున్నట్లు రూమర్స్ రాగా.. చివరకు ఆయన స్థానంలో రెహమాన్ను తీసుకున్నారు.సినిమాకాగా విజయ్ సేతుపతి స్లమ్డాగ్, జైలర్ 2 సహా మరికొన్ని సినిమాలతో బిజీగా ఉన్నాడు. అటు సాయిపల్లవి హిందీలో రామాయణ, ఏక్ దిన్ సినిమాల్లో హీరోయిన్గా నటిస్తోంది. విలక్షణ నటులుగా పేరు తెచ్చుకున్న వీరిద్దరి కాంబినేషన్ ఎలా ఉంటుందో చూడాలి మరి! View this post on Instagram A post shared by Madras Talkies (@madrastalkies) -
రెండు ఫ్లాట్లు అమ్మేసిన ప్రభుదేవా.. ఇంత తక్కువ లాభమా?
కొరియోగ్రాఫర్, నటుడు ప్రభుదేవా రెండు ఫ్లాట్లు అమ్మేశాడు. దక్షిణ ముంబైలోని మహాలక్ష్మి ప్రాంతంలోని మినర్వా బిల్డింగ్లోని ఫ్లాట్లను తక్కువ లాభానికే వదిలేసుకున్నాడు. సుమారు రూ.14.80 కోట్లకు ఈ ఫ్లాట్స్ అమ్మేశాడు. మార్చి 13న ఈ లావాదేవీ జరిగినట్లు తెలుస్తోంది.అప్పట్లో..కాగా వీటిని ప్రభుదేవా 2012లో రూ.14.45 కోట్లు పెట్టి కొనుగోలు చేశాడు. ఒక ఫ్లాట్ 32వ అంతస్తులో ఉండగా, మరొకటి 33వ అంతస్తులో ఉంది. ఒక్క ఫ్లాట్ సుమారు 1295 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగుంది. పద్నాలుగు సంవత్సరాల తర్వాత వాటిని అమ్మితే ప్రభుదేవాకు కేవలం రూ.35 లక్షలు మాత్రమే లాభం వచ్చింది. ఇది చూసి పలువురు ఆశ్చర్యపోతున్నారు.చదవండి: సూర్య అడుగుజాడల్లో చిరంజీవి.. త్వరలోనే.. -
కేడీ సాంగ్ వివాదం.. సింగర్ మంగ్లీ పోస్ట్ వైరల్
కేడీ మూవీ సాంగ్ వివాదం సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. హిందీ వర్షన్ లిరిక్స్పై తీవ్రస్థాయిలో విమర్శలు రావడంతో ఏకంగా సాంగ్నే యూట్యూబ్ నుంచి తొలగించారు. కన్నడ హీరో ధృవ సర్జా హీరోగా కేడీ చిత్రానికి సంబంధించి సర్కే చునార్ తేరి సర్కే అనే పాటను ఇటీవలే రిలీజ్ చేశారు. అయితే ఈ సాంగ్ను సింగర్ మంగ్లీ పాడారు. తాజాగా ఈ సాంగ్ వివాదంపై సింగర్ మంగ్లీ స్పందించారు. ప్రజల మనోభావాలను తాను ఎప్పుడు గౌరవిస్తానని అన్నారు. అనుకోకుండా జరిగిన ఈ పొరపాటుకు క్షమాపణలు కోరుతూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. ఈ వివాదం పట్ల బాధగా ఉందని.. ఎవరి మనోభావాలను దెబ్బతీసే ఉద్దేశం తనకు లేదన్నారు. లిరిక్స్లో మార్పు చేశారని.. అప్డేట్ అయిన సాంగ్ త్వరలో విడుదల చేస్తారని మంగ్లీ రాసుకొచ్చారు. మరోసారి ఇలాంటి పొరపాటు జరగదని హామీ ఇస్తున్నా తన నోట్లో ప్రస్తావించారు.కేడీ: ది డెవిల్ మూవీ సాంగ్ను అన్ని భాషల్లో రిలీజ్ చేశారు. అయితే కేవలం హిందీ వర్షన్ లిరిక్స్పై మాత్రమే తీవ్ర అభ్యంతరాలొచ్చాయి. ఈ చిత్రాన్ని పాన్ ఇండియాలో రేంజ్లో విడుదల చేస్తున్నారు. తాజాగా ఈ సాంగ్ వివాదం పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. View this post on Instagram A post shared by Mangli 🎙️ (@iammangli) -
'యూత్' ట్రైలర్: హీరో వెనక పడుతున్న ముగ్గురమ్మాయిలు
తమిళ నటుడు కరుణాస్ వారసుడు కెన్ కరుణాస్ హీరోగా పరిచయమవుతున్న చిత్రం యూత్. ఈ మూవీకి కెన్ కరుణాస్ స్వీయ దర్శకత్వం వహించడం విశేషం. జీవీ ప్రకాశ్ కుమార్ పైసా పారితోషికం తీసుకోకుండా ఫ్రీగా సంగీతం అందించాడు. ఇటీవలే తమిళ ట్రైలర్ రిలీజ్ చేయగా మంచి స్పందన లభించింది. తాజాగా యూత్ తెలుగు ట్రైలర్ వదిలారు. యూత్ తెలుగు ట్రైలర్'మీకు పుట్టినవాడు సాధారణమైన అబ్బాయి కాదు మేడమ్.. ఆ దేవుడే మీకు బిడ్డగా పుట్టాడు. వాడిని బ్యాడ్ బాయ్స్తో చేరనివ్వకండి' అన్న సంభాషణతో వీడియో మొదలవుతుంది. తీరా హీరో.. తనను ముగ్గురమ్మాయిలు ప్రేమిస్తున్నారని తెగ సంబరపడిపోతాడు. ఫైటింగ్, లవ్, కామెడీకి ఏమాత్రం కొదవ లేనట్లుగా చూపించారు. ఎంటర్టైన్మెంట్ గ్యారెంటీ అనేలా ట్రైలర్ కట్ చేశారు. ఈ సినిమా మార్చి 26న విడుదల కానుంది. -
నోరు జారా.. క్షమించండి: ఉస్తాద్ భగత్ సింగ్ నటుడు
అడుసు తొక్కనేల.. కాలు కడగనేల! గడిచిన పది రోజుల్లో రెండుసార్లు సారీ చెప్పాడు తమిళ దర్శకుడు, నటుడు ఆర్.పార్తీబన్. ఓపక్క హీరో విజయ్ విడాకుల వ్యవహారం కోర్టులో కొనసాగుతుండగా త్రిషతో కలిసి పెళ్లికి వెళ్లాడీ హీరో. దీంతో కొన్నాళ్లపాటు త్రిష బయటకు రాకుండా ఇంట్లోనే ఉంటే బాగుంటుందని పార్తిబన్ కామెంట్స్ చేశాడు. ఈ వ్యాఖ్యలపై దుమారం చెలరేగగా.. క్షమాపణలు చెప్పడంతో ఆ వివాదం ముగిసింది.కుల ప్రస్తావనఇంతలోనే మరో వివాదంలో ఇరుక్కున్నాడు పార్తిబన్. ఉస్తాద్ భగత్ సింగ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో తన కులం గురించి ప్రస్తావిస్తూ స్పీచ్ మొదలుపెట్టాడు. స్టేజీపై కులం ప్రస్తావన తేవడంపై విమర్శలు వచ్చాయి. దీంతో మరోసారి క్షమాపణలు చెప్తూ పోస్ట్ పెట్టాడు. నేను ఎలాంటి తప్పునైనా సరే వెంటనే సరిదిద్దుకునే వ్యక్తిని. నిజం చెప్తున్నా.. ఉద్దేశపూర్వకంగా అలా మాట్లాడలేదు. ఇదే మొట్టమొదటిసారిఏదో నోరు జారాను. ఇన్నేండ్ల అనుభవంలో కుల ప్రస్తావన తేవడం ఇదే మొట్టమొదటిసారి. కానీ, కులానికి ప్రాధాన్యతనిచ్చేవారిని నేను అస్సలు ఇష్టపడను. కుల వ్యవస్థను తప్పుపడుతూ ఎన్నో సినిమాలు చేశాను. అనుకోకుండా పొరపాటు జరిగింది. అందుకు నేను తీవ్రంగా చింతిస్తున్నాను. నా వ్యాఖ్యలతో ఎంతోమందిని బాధపెట్టానని అర్థమైంది.క్షమించండినేను కేవలం నా ప్రతిభను నమ్ముకుంటానే తప్ప కులాన్ని వాడుకునే వ్యక్తిని కాను. ఇంకెప్పుడూ ఇలాంటి పొరపాటు జరగదని మాటిస్తున్నాను. వాస్తవానికి ఈ విషయం గురించి మీకంటే నేనే ఎక్కువ బాధపడుతున్నాను. నా వల్ల బాధపడ్డ ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక క్షమాపణలు. దయచేసి ఈ విషయాన్ని ఇంతటితో మర్చిపోయి ఎప్పటిలాగే నన్ను ప్రోత్సహించండి. సినిమామీరు నాపై ఉంచిన ప్రేమను, నమ్మకాన్ని కాపాడుకునేందుకు కృషి చేస్తాను అని ఫేస్బుక్లో రాసుకొచ్చాడు. ఉస్తాద్ భగత్ సింగ్ విషయానికి వస్తే పవన్ కల్యాణ్ హీరోగా నటించిన ఈ మూవీ మార్చి 19న విడుదల కానుంది. హరీశ్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో శ్రీలీల, రాశీఖన్నా హీరోయిన్లుగా యాక్ట్ చేశారు.చదవండి: పీలింగ్స్ సాంగ్ బానే చూశారుగా.. ఈ పాటకెందుకంత రాద్ధాంతం? -
పీలింగ్స్ చూశారుగా, ఈ పాటకే అంత రాద్ధాంతమా?
'కేడీ: ద డెవిల్' సినిమా నుంచి రిలీజైన ఐటం సాంగ్ సర్కే చునర్ వివాదాస్పదమైంది. సంజయ్ దత్, నోరా ఫతేహి డ్యాన్స్ చేసిన ఈ సాంగ్లోని లిరిక్స్ డబుల్ మీనింగ్ డైలాగులతో నిండి ఉంది. దీంతో వెంటనే ఆ పాటను తొలగించాలని కేంద్రం ఆదేశించింది. దాంతో హిందీ వర్షన్ను యూట్యూబ్ నుంచి తొలగించారు. ఈ పరిణామాలపై కేడీ సినిమా డైరెక్టర్ ప్రేమ్ భార్య, నటి రక్షిత సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేసింది.పీలింగ్స్ అప్పుడు ఓకేనేనంతా చూస్తూనే ఉన్నాను. మీరందరూ రకరకాల పోస్టులకు నన్ను ట్యాగ్ చేస్తూనే ఉన్నారు. ఏం జరుగుతుందో నాకు బాగా తెలుసు. పీలింగ్స్.., డ్రీమమ్ వేకపమ్.., చోలీకే పీచే క్యా హై.. ఇలాంటి వందలాది పాటలు బయటకు వచ్చినప్పుడు అందరికీ బాగానే అనిపించాయి. శృంగారమే ప్రధానంగా సినిమాలు వచ్చినప్పుడు కూడా అందరూ బానే ఉన్నారు. ఎవరికీ ఏ ఇబ్బంది కలగలేదు. చెత్త రచయిత అయిపోడుకానీ ఇప్పుడు ఒక్క పాట విషయంలో మాత్రం పెద్ద రాద్ధాంతమే జరుగుతోంది. అదెందుకో నాకర్థం కావడం లేదు. అలా అని నేను ఈ పాటను సమర్థించడం లేదు. కాకపోతే ఈ వివక్షను అర్థం చేసుకోవాలని కోరుతున్నాను. ఒక్క పాట సరిగా లేనంత మాత్రాన ఆయనను చెత్త రచయిత అయిపోడు. తను ఇదంతా కావాలని చేస్తున్నారని అనడం కూడా తప్పే! కొన్ని సినిమాలు ఆడనంత మాత్రాన ఆయన్ని మంచి దర్శకుడు కాదని అనలేం. మీకు ఆయన్ని ప్రశ్నించే హక్కుంది, కానీ దూషించే హక్కు ఎవరికీ లేదు.ప్రశ్నించే హక్కుందిఈరోజుల్లో మంచి, చెడు అన్నిరకాల పాటలు నిత్యం వస్తూనే ఉన్నాయి. రక్తపాతం, లైంగికతకు సంబంధించిన సినిమాలను జనాలు ఓపెన్గా చూస్తున్నారు. ప్రేమ్ కన్నడిగుడు. అతడిపై మీకు పూర్తి హక్కులున్నాయి. ఏది తప్పు? ఏది ఒప్పు? అని ప్రశ్నించే హక్కుంది. కానీ అతడి పనితీరును తప్పుపడుతున్నారు. ఒక కన్నడ డైరెక్టర్కు సినిమాను ఓటీటీలో అమ్మడమనేది ఎంత పెద్ద ఛాలెంజో మీకు తెలుసా? అలాగే జనాల్ని థియేటర్కు రప్పించడం కూడా సవాలుగానే మారింది. కొంచెం సమయం ఇవ్వండిఇది కేవలం మా ఒక్క కథే కాదు, కన్నడ చిత్రపరిశ్రమలోని ప్రతి సినిమా కథ ఇంతే! రాబోయే రోజుల్లో అంతా సర్దుకుంటుందన్న నమ్మకం ఉంది. కొంచెం సమయం ఇవ్వండి. కేడీ మాకు బిడ్డలాంటిది. దానికి ఏది సరైనదో చివరకు అదే చేస్తాం. మమ్మల్ని నమ్మండి అని ఇన్స్టాగ్రామ్ స్టోరీలో వరుస పోస్టులు పెట్టింది. ప్రేమ్ దర్శకత్వంలో ధ్రువ సర్జా హీరోగా నటించిన కేడీ మూవీ ఏప్రిల్ 30న విడుదల కానుంది.చదవండి: చికిరి చికిరి నేనే రాశా.. ఈ పాటకు మాత్రం అవమానం: గేయరచయిత -
ఆ 'చికిరి చికిరి' పట్టించుకోలేదు.. ఈ పాట వల్ల తీవ్ర అవమానం!
తమిళ హీరో ధ్రువ సర్జా ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం "కేడీ: ద డెవిల్". బాలీవుడ్ నటుడు సంజయ్ దత్, శిల్పాశెట్టి కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంలో నోరా ఫతేహి ఐటం సాంగ్లో మెరిసింది. ఇటీవలే కన్నడతో పాటు తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో ఆ ఐటం సాంగ్ను విడుదల చేశారు.బూతు పాటఅయితే హిందీలో ఆ పాట లిరిక్స్ పచ్చిబూతులతో అసభ్యంగా ఉంది. డ్యాన్స్ కూడా అశ్లీలంగా ఉండేసరికి అభ్యంతరాలు వెల్లువెత్తాయి. ఆలిండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ ఫిర్యాదుతో కేంద్రం.. ఈ పాటను తొలగించాలని ఆదేశించింది. అలా హిందీ వర్షన్ను యూట్యూబ్ నుంచి తీసేశారు. తాజాగా ఈ వివాదంపై హిందీలో 'సర్కే చునర్' పాటకు లిరిక్స్ అందించిన గేయరచయిత రఖీబ్ ఆలం స్పందించాడు. నేను సొంతంగా రాయలేదుఆ లిరిక్స్ సొంతంగా తాను రాసినవి కావన్నాడు. కన్నడలో దర్శకుడు ప్రేమ్ రాసిన లిరిక్స్నే యథాతథంగా హిందీలో అనువదించాను. నిజానికి ఈ పాటను హిందీలో రాయమన్నప్పుడే నేను తిరస్కరించాను. ఇలాంటివి సెన్సార్ ఒప్పుకోవు, వర్కవుట్ కాదన్నాను. కన్నడ వర్షన్ను అచ్చుగుద్దినట్లుగా హిందీలో మార్చమని అప్పగించారు. చాలా డబుల్ మీనింగ్ లైన్స్ ఉన్నాయి. కానీ అదంతా ఒక మద్యం సీసా గురించి అని వారు చిట్టచివర్లో బయటపెట్టారు. అవేవీ గుర్తించలేదుఅయితే అది తెలిసేవరకు ఆ లైన్స్ అన్నీ అసభ్యకరంగానే అనిపిస్తాయి. అదే విషయం నేనూ చెప్పాను. అసలు ఇలాంటి పాటలు రాయాల్సిన అవసరం నాకేంటి? నేను మంచి పాటలు రాసినప్పుడు ప్రజలు వాటిని పట్టించుకోరు. రామ్చరణ్ పెద్ది సినిమాలోని చికిరి చికిరి పాటకు హిందీలో నేనే సాహిత్యాన్ని అందించాను. పుష్ప మూవీలోని అన్ని పాటలు హిందీలో నేనే రాశాను. అవేవీ గుర్తించలేదు.. కొత్త వర్షన్ వస్తుందికానీ సర్కే చునర్ సాంగ్ వల్ల అభాసుపాలయ్యాను, ఎంతో అవమానకరంగా ఉంది. నేను చెప్పినట్లే పాటపై అభ్యంతరాలు వచ్చాయి. దాంతో మేకర్స్ ఎటువంటి అసభ్యతకు చోటు లేకుండా కొత్త వర్షన్ రాయమని అడిగారు. అది ఆల్రెడీ రాసి పంపాను. త్వరలోనే చిత్రయూనిట్ క్షమాపణలు చెప్పి కొత్త లిరిక్స్తో ఉన్న పాట రిలీజ్ చేస్తుంది అని రఖీబ్ చెప్పుకొచ్చాడు.చదవండి: సినిమాపై భయం.. అబ్బాస్కు మంచి కమ్బ్యాక్: జీవీ ప్రకాశ్ కుమార్ -
సినిమాపై భయం.. అబ్బాస్కు మంచి కమ్బ్యాక్!: హీరో
ప్రముఖ సంగీత దర్శకుడు, నటుడు జీవీ ప్రకాశ్ కుమార్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం హ్యాపీ రాజ్. నటి శ్రీగౌరి హీరోయిన్గా నటించిన ఈ మూవీ ద్వారా నటుడు అబ్బాస్ రీఎంట్రీ ఇస్తున్నాడు. మరియరాజు ఇళంజెలియన్ దర్శకుడిగా పరిచయం అయ్యారు. బియాండ్ పిక్చర్స్ పతాకంపై జయవర్ధ నిర్మించిన ఈ మూవీకి జయకాంత్ సురేశ్ సహనిర్మాతగా వ్యవహరించాడు.దేనికీ భయపడని వ్యక్తి జస్టిన్ ప్రభాకరన్ సంగీతాన్ని అందించిన ఈ మూవీ నిర్మాణ కార్యక్రమం పూర్తి చేసుకుని ఈ నెల 27న తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా సోమవారం సాయంత్రం చెన్నైలో నిర్వహించిన ప్రీరిలీజ్ కార్యక్రమంలో జీవీ ప్రకాశ్ కుమార్ మాట్లాడుతూ.. దర్శకుడు మరియరాజు దేనికీ భయపడని వ్యక్తి అన్నారు. ఆయన చెప్పిన కథ నచ్చిందని, అయితే మంచి నిర్మాత కోసం ఎదురుచూస్తున్న సమయంలో జయకాంత్, జయవర్ధ ఈ సినిమా చేసేందుకు ముందుకు వచ్చారన్నారు. మధ్యలోనే వదిలేస్తారా?కొత్త దర్శకుడు, కొత్త నిర్మాతలు కావడంతో ఈ మూవీని పూర్తి చేస్తారా? మధ్యలోనే వదిలేస్తారా? అన్న భయం కలిగిందన్నారు. ఇదే విషయాన్ని వారిని అడిగానన్నారు. అయితే వారు ఈ సినిమాను చాలా బాగా రూపొందించి, బిజినెస్ పూర్తి చేసి రిలీజ్కు సిద్ధమవడం సంతోషంగా ఉందన్నారు. హ్యాపీరాజ్ చిత్రం తనకు చాలా సంతోషం కలిగించిందన్నారు. అందరికీ ఏమో కానీ అబ్బాస్కు కచ్చితంగా ఈ మూవీ కంబ్యాక్గా నిలవాలని ఆకాంక్షించారు. ఆయన అంత బాగా నటించారని కితాబిచ్చారు. -
మార్చిందిరా...
సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్కుమార్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘హ్యాపీ రాజ్’. ఈ చిత్రంలో శ్రీగౌరీ ప్రియ హీరోయిన్గా నటించారు. దర్శక–నటుడు ప్రదీప్ రంగనాథన్ వద్ద సహాయ దర్శకుడిగా పని చేసిన రాజా ఇళంజెళియన్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని జైవర్ద నిర్మించారు. మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఎల్ఎల్పీ ద్వారా ఈ నెల 27న ఈ ‘హ్యాపీ రాజ్’ సినిమా తెలుగు రాష్ట్రాల్లో విడుదల కానుంది.మంగళవారం ఈ చిత్రంలోని ‘అద్దిరా లెక్క..’ పాట లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్. ‘‘పక్షిలాగా ఉండే నన్ను చెట్టు లాగా మార్చింది రా... సాదాసీదా పిల్లోణ్ణి నేను... మహాస్మార్టుగా చేసేసిందిరా..’ అంటూ ఈ పాట సాగుతుంది. సంగీత దర్శకుడు జస్టిన్ ప్రభాకరన్ స్వరకల్పనలో ఈ పాటకు రెహమాన్ సాహిత్యం అందించగా, గోవింద్ ప్రసాద్ ఆలపించారు. -
అనిరుధ్తో జట్టుకట్టిన యూనివర్సల్ మ్యూజిక్ ఇండియా
యూనివర్సల్ మ్యూజిక్ గ్రూప్నకు చెందిన యూనివర్సల్ మ్యూజిక్ ఇండియా.. ప్రముఖ గాయకుడు, సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ ఇటీవల ప్రారంభించిన స్వతంత్ర రికార్డ్ లేబుల్ అల్బుక్వెర్క్ రికార్డ్స్తో ప్రత్యేక భాగస్వామ్యాన్ని ప్రకటించింది. ఈ భాగస్వామ్యం ద్వారా యూనివర్సల్ మ్యూజిక్ ఇండియా, అల్బుక్వెర్క్ రికార్డ్స్, అనిరుధ్ రూపొందించే పాప్, హిప్-హాప్ సంగీతాన్ని విడుదల చేయనున్నారు. ఈ లేబుల్ ద్వారా విడుదలయ్యే తొలి సంగీత ప్రాజెక్ట్లో అనిరుధ్ పాల్గొనగా, వచ్చే నెల ప్రారంభంలో దీన్ని విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.(ఇదీ చదవండి: నాకు నయనతార కావాలి.. ఎంపీ షాకింగ్ కామెంట్స్)2012లో అరంగేట్రం చేసిన అనిరుధ్.. 'వై దిస్ కొలవెరి డి' ద్వారా విపరీతమైన గుర్తింపు సంపాదించాడు. తర్వాత విడుదలైన తన 770కి పైగా పాటల ద్వారా మొత్తం 13 బిలియన్కు పైగా ఆడియో స్ట్రీమ్స్ సాధించాడు. దీంతో మొత్తం స్ట్రీమ్స్ పరంగా స్పాటిఫైలో అత్యధిక స్ట్రీమ్స్ పొందిన దక్షిణ భారతీయ కళాకారుడిగా అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. తమిళ ఒరిజినల్ సౌండ్ట్రాక్ (ఓఎస్టీ) రంగంలో ఎక్కువగా కోరుకునే సంగీత దర్శకుల్లో ఇతడొకరు. హుకుమ్, వాతీ కమింగ్, అరబిక్ కుతు, మోనికా, ఏ23 థీమ్, ఆజా రాజా, అయా షేర్ తదితర గ్లోబల్ హిట్లు ఇతడి ఖాతాలో ఉన్నాయి.(ఇదీ చదవండి: బూతు పాటపై కేంద్రం సీరియస్) -
నాకు నయనతార కావాలి.. ఎంపీ షాకింగ్ కామెంట్స్
తమిళనాడులో ఎన్నికల సంగతేమో గానీ పలువురు అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులు.. స్టార్ హీరోయిన్లని అవసరంగా రాజకీయాల్లోకి లాగుతున్నారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. కొన్నిరోజుల క్రితం నైనర్ నాగేంద్రన్ అనే నాయకుడు.. విజయ్ని విమర్శిస్తూ, ముందు నువ్వు త్రిష ఇంటి నుంచి బయటకు రావాలి అని అనేశాడు. తర్వాత త్రిష సీరియస్ కావడంతో సదరు నాయకుడు క్షమాపణ చెప్పాడు. ఇప్పుడు ఏకంగా ఓ ఎంపీ.. నయనతారని ఉద్దేశిస్తూ చీప్ కామెంట్స్ చేశారు.(ఇదీ చదవండి: చిరంజీవితో సినిమా.. హరీశ్ శంకర్ ఆశ పెద్దదే!)మహిళల భద్రత, గౌరవం కోసం అన్నాడీఎంకే(AIADMK) పార్టీ.. మంగళవారం చెన్నైలో నిరసన ప్రదర్శన నిర్వహించింది. ఇందులోనే ఆ పార్టీకి చెందిన ఎంపీ సీవీ షణ్ముగం చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తమిళనాడు అంతటా పెను దుమారాన్ని రేపుతున్నాయి. హీరోయిన్ నయనతారని ఉద్దేశిస్తూ అసభ్యకర రీతిలో మాట్లాడేసరికి విమర్శలు గట్టిగానే వస్తున్నాయి.అసలు విషయానికొస్తే.. కొన్నిరోజుల క్రితం తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, ప్రజలని ఉద్దేశిస్తూ మాట్లాడారు. తమ కలలని పంచుకోవాలని, వాటిని ప్రభుత్వం నెరవేర్చేందుకు కృషి చేస్తుందని పిలుపునిచ్చారు. వీటి గురించి మాట్లాడిన అన్నాడీఎంకే ఎంపీ షణ్ముగం.. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలం, నయనతార పేర్లని ప్రస్తావిస్తూ అసభ్యకర కామెంట్స్ చేశారు.'అబ్దుల్ కలాం గారు మనల్ని కలలు కనమన్నారు. స్టాలిన్ కూడా తనతో కలలు పంచుకోమంటున్నారు. ఒకవేళ నాకు నయనతార కావాలని కల వస్తే.. నా కోరికని స్టాలిన్ తీరుస్తారా? ఎవరైనా వెళ్లి నయనతారతో తమకు పెళ్లి చేయమని అడిగితే.. ఆ కల కూడా నెరవేరుస్తారా?' అని ఎంపీ అన్నారు. అయితే ఈయన ఇలా మాట్లాడుతున్నప్పుడు పక్కనే నిలుచుని ఉన్న పార్టీ నేతలు.. వారించాల్సింది పోయి, నవ్వుతుండేసరికి విమర్శలు గట్టిగా వస్తున్నాయి. మరి ఈ వివాదం ఎంత దూరం వెళ్తుందో చూడాలి?(ఇదీ చదవండి: త్వరలోనే విజయ్తో పెళ్లి.. ఇలా హింట్ ఇచ్చిన త్రిష తల్లి!)‘எனக்கு நயன்தாரா வேண்டும்’சி.வி.சண்முகம் அநாகரீக பேச்சு#ADMK #CVShanmugam #SPARK pic.twitter.com/dFBcCXmGjj— Spark+ (@SparkPluz_) March 17, 2026 -
విజయ్- త్రిష ఎపిసోడ్పై మరో కొత్త పుకారు!
కోలీవుడ్లో విజయ్- త్రిష ఎపిసోడ్ ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. విజయ్ భార్య సంగీత విడాకులకు దరఖాస్తు చేయడంతో అనూహ్యంగా త్రిష పేరు తెరమీదకొచ్చింది. ప్రస్తుతం తమిళ ఇండస్ట్రీలో ఇది హాట్ టాపిక్గా మారింది. ఇప్పటికే ఈ వివాదంపై పలువురు నటీనటులు కామెంట్స్ చేస్తున్నారు. ఈ వివాదం తర్వాత విజయ్- త్రిష జంటగా పెళ్లిలో కనిపించడంతో రూమర్స్ మరింత ఊపందుకున్నాయి. వీరిద్దరు డేటింగ్లో ఉన్నారంటూ వరుస కథనాలొచ్చాయి.అయితే అందరూ అనుకుంటున్నట్లుగానే ఈ జంట పెళ్లి చేసుకుంటారనే టాక్ వినిపిస్తోంది. దీనికి ప్రధాన కారణం త్రిష తల్లి ఉమా కృష్ణన్ అలా చేయడంతో ఈ రూమర్స్కు మరింత బలం చేకూరుతోంది. విజయ్- త్రిష కృష్ణన్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని పేర్కొంటూ అభిమానులు ఓ రీల్ రూపొందించారు. ఎన్నికలు ముగిసిన వెంటనే ఈ జంట తమ బంధాన్ని అధికారికంగా ప్రకటించడానికి ఆసక్తిగా ఉన్నారని అందులో పేర్కొన్నారు. దీనికి సంబంధించి త్వరలోనే ఒక భారీ ప్రకటన వెలువడుతుందని వీడియోను పోస్ట్ చేశారు. అది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఇది చూసిన త్రిష మదర్ ఉమా కృష్ణన్ ఆ వీడియోను లైక్ కొట్టింది.ఈ రీల్కు త్రిష తల్లి ఉమా కృష్ణన్ లైక్ కొట్టడంతో వీరిద్దరి పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లేనని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. త్రిష, విజయ్ల బంధాన్ని అధికారికంగా ప్రకటించడానికి ఉమా కృష్ణన్ కూడా ఆసక్తిగా ఉన్నారని సోషల్ మీడియాలో నెటిజన్స్ తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇది చూసిన కొందరు త్రిష అభిమానులు సైతం ఉమా కృష్ణన్ పొరపాటున ఈ రీల్కు లైక్ చేసి ఉండొచ్చని భావిస్తున్నారు. గతంలో కూడా త్రిష మదర్ 'థగ్ లైఫ్' మూవీ రిల్స్కు లైక్స్ కొట్టారని మరికొందరు గుర్తు చేస్తున్నారు. ఏదేమైనా విజయ్- త్రిష పెళ్లిపై క్లారిటీ రావాలంటే తమిళనాడు ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు ఆగాల్సిందే. -
'ఇతరుల జీవితాల్లోకి చూడడమే వారి పని'.. త్రిష వ్యవహారంపై ఖుష్బు కామెంట్స్
కోలీవుడ్లో విజయ్- త్రిష వ్యవహారం హాట్టాపిక్గా మారింది. విజయ్ భార్య విడాకుల పిటిషన్ తర్వాత అందరి దృష్టి ఒక్కసారిగా త్రిషపై పడింది. అంతేకాకుండా వీరిద్దరు జంటగా ఓ వివాహా వేడుకకు హాజరు కావడంతో మరించ చర్చకు దారితీసింది. ఆ తర్వాత తమిళ నటుడు, దర్శకుడు పార్తీబన్ త్రిషను ఉద్దేశించి అనుచిత కామెంట్స్ చేశారు. అతని కామెంట్స్పై తీవ్ర వ్యతిరేకత రావడంతో ఆ తర్వాత క్షమాపణలు కోరాడు. అయితే తాజాగా విజయ్, త్రిషలపై వస్తోన్న వార్తలపై నటి ఖుష్బూ స్పందించారు. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె త్రిష గురించి మాట్లాడారు. ఆమె చాలా హుందాగా ఉంటుందని తెలిపారు. త్రిష గురించి తెలియనివారు చేసే కామెంట్స్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదన్నారు. అలాంటి వారికి మనం స్పందించాల్సిన పనిలేదని తెలిపారు. నాకు త్రిష గురించి బాగా తెలుసని.. తను చాలా సెన్సిటివ్ పర్సన్ అని ఖుష్బూ వెల్లడించారు. దురదృష్టవశాత్తూ మనం తుమ్మినా కూడా నిందించే రోజుల్లో ఉన్నామని అన్నారు. తనకు తెలిసిన వారిలో త్రిష అత్యంత సౌమ్యురాలైన వ్యక్తి అని ఖుష్బూ తెలిపారు. పెళ్లికి కలిసి వెళ్లడం అనేది వారి వ్యక్తిగతమని.. దానివల్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగదని ఆమె అన్నారు.ఖుష్బూ మాట్లాడుతూ.. 'దురదృష్టవశాత్తు మనం తుమ్మినా కూడా నిందను మరొకరిపై వేయాలనుకునే కాలంలో ఉన్నాం. నాకు తెలిసినంత వరకు త్రిష అత్యంత హుందాగా ఉండే మహిళ. అత్యంత సౌమ్యురాలైన వ్యక్తి. కొందరు తమ సమస్యలను పట్టించుకోకుండా.. ఇతరుల జీవితాల్లోకి తొంగి చూసి ఆనందించే వ్యక్తులు ఉంటారు. ఇతరులపై కామెంట్స్ చేస్తూ ఒక రకమైన వికృత ఆనందాన్ని పొందుతారు. వారిలో 99.9 శాతం మంది ఎవరో కూడా మనకు తెలియదు. ఎవరైనా సరే ఇతరులు చేసే వ్యాఖ్యలకు మనం బాధ్యులు కాదు. వాటికి స్పందిస్తూ మన సమయాన్ని వృధా చేసుకోవాల్సిన అవసరం ఉందని నేను అనుకోను. ఎయిర్పోర్టుల్లో ఫోటోగ్రాఫర్లను ఉద్దేశించి మాట్లాడారు. ఈ కల్చర్ ముంబయిలో మాత్రమే ఉండేదని.. కానీ దురదృష్టవశాత్తు ఇప్పుడు చెన్నైకి కూడా పాకిపోయింది" అని అన్నారు.Trisha is most DIGNIFIED WOMEN I've ever met & most GENTLEST SOUL:- Actress #Kushboo #Trisha #Trishakrishnan pic.twitter.com/BVZHqZPYJK— Milagro Movies (@MilagroMovies) March 17, 2026 -
సాయి పల్లవి మొదటి సినిమా.. అందుకేనా టెన్షన్..!
ఎవరికైనా తొలి చిత్రం రిజల్ట్స్ కోసం ఆసక్తి ఉంటుంది. ఇంతకు ముందు పలు విజయవంతమైన చిత్రాల్లో నటించిన నటీనటులకు కూడా తమ కొత్త సినిమాకు ప్రేక్షకుల ఆదరణ పొందుతుందో లేదో అన్న టెన్షన్ ఉంటుంది. నటి సాయిపల్లవి కూడా ఇప్పుడు అలాంటి టెన్షన్లోనే ఉన్నట్లు సమాచారం. ఏమిటీ తొలి చిత్రం అని ఆశ్యర్యంగా ఉందా? డాక్టర్ అయ్యి యాక్టర్ అయిన తమిళనాడు, నీలగిరి ప్రాంతానికి చెందిన భామ సాయిపల్లవి.నటనపై ఆసక్తితో నాట్యాన్ని కూడా నేర్చుకున్న ఈమె మొదట్లో కొన్ని చిత్రాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించారు. అలా మలయాళంలో నటించిన ప్రేమలు చిత్రం సాయిపల్లవి దశను మార్చేసింది. ఆ చిత్ర విజయం ఈ అమ్మడిని దక్షిణాది చిత్రపరిశ్రమలో పాపులర్ చేసింది. అలా తెలుగులో నటించిన పలు చిత్రాలు హిట్ అవ్వడం, తమిళంలోనూ అవకాశాలు రావడంతో స్టార్ హీరోయిన్ అయ్యారు.ఇటీవల సాయిపల్లవి తమిళంలో శివకార్తికేయన్కు జంటగా నటించిన అమరన్ చిత్రం సంచలన విజయాన్ని సాధించింది. ఇందులో సాయిపల్లవి నటన పలువురు సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకుంది. ప్రస్తుతం తమిళంలో ధనుష్కు జంటగా నటించడానికి సిద్ధం అవుతున్నారు.ఈ విషయాన్ని పక్కన పెడితే పక్కింటి అమ్మాయి ఇమేజ్ను తెచ్చుకున్న సాయిపల్లవి ఏక్దిన్ అనే చిత్రంతో హిందీ చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చారు. దీని తరువాత రామాయణం ఇతిహాసంతో తెరకెక్కుతున్న రామాయణ చిత్రంలో సీతగా నటిస్తున్నారు. ఏక్ దిన్ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని మే నెలలో తెరపైకి రానుంది. ఇది థాయ్లాండ్ భాషలో రూపొందిన ఒన్ డే చిత్రానికి రీమేక్ అని తెలిసింది. ఇందులో అమీర్ఖాన్ వారసుడు జునైద్ఖాన్ హీరోగా నటించారు.జునైద్ ఖాన్ ఈయన ఇంతకు ముందు కొన్ని చిత్రాల్లో నటించినప్పటికీ.. అవీ పెద్దగా ఆశించిన విజయాలను అందుకోలేదు. దీంతో ఏక్దిన్ నటి సాయిపల్లవికి.. నటుడు జునైద్ఖాన్లకు చాలా ముఖ్యమైన చిత్రంగా నిలవనుంది. వైవిధ్యభరిత ప్రేమ కథా చిత్రంగా తెరకెక్కిన ఈ చిత్ర ఫలితాలపై నటి సాయిపల్లవి చాలా ఆతృతగా ఉన్నట్లు సమాచారం. ఈ చిత్ర ఫలితం తన కెరీర్పై చాలా ప్రభావం చూపుతుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. -
ఊహించని కాంబో.. స్టార్ డైరెక్టర్తో రానా దగ్గుబాటి..!
సినీ ఇండస్ట్రీలో ఒక రేర్ కాంబినేషన్ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఓ వైవిద్య భరితమై కథా చిత్రం తెరకెక్కింది. టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాహుబలి తరువాత ఈయన పేరు ప్రపంచవ్యాప్తంగా మార్మోగిపోయింది. ప్రస్తుతం రానా కేవలం నటుడు మాత్రమే కాకుండా నిర్మాత కూడా రాణిస్తున్నారు. ఈయన 2005లోనే స్పిరిట్ మీడియా పేరుతో చిత్ర నిర్మాణ సంస్థను ప్రారంభించి పలు చిత్రాలను నిర్మించారు. ఇటీవలే దుల్కర్ సల్మాన్తో కలిసి కాంత చిత్రాన్ని నిర్మించిన విషయం తెలిసిందే.అయితే కోలీవుడ్ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ గురించి తెలియని వారు ఉండరు. పలు విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా నటుడు రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా.. కార్తీక్ సుబ్బరాజ్కు చెందిన స్టోన్బెంట్ సంస్థ కలిసి నీళిరా అనే వైవిధ్యభరిత కథా చిత్రాన్ని నిర్మించాయి. దీనికి శ్రీలంక తమిళుడు సోమిధరన్ దర్శకత్వం వహించారు. ఇందులో నటుడు నవీన్ చంద్ర, విదూ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 3వ తేదీన విడుదల చేయనున్న ట్లు యూనిట్ వర్గాలు ఎక్స్ మీడియాలో పేర్కొ న్నారు. ఆ చిత్ర టైటిల్తో కూడిన పోస్టర్ను పోస్ట్ చేశారు. -
శారీలో బుల్లితెర భామ మౌనీ రాయ్.. హల్దీ పిక్స్ షేర్ చేసిన రష్మిక
ఆస్కార్ వేడుక పిక్స్ షేర్ చేసిన ప్రియాంక చోప్రా..శారీలో బుల్లితెర భామ మౌనీ రాయ్ అందాలు..బ్లూ డ్రెస్లో టాలీవుడ్ నటి వితికాశేరు పిక్స్..ఈవెంట్లో మెరిసిన టాలీవుడ్ భామ మెహరీన్..హల్దీ పిక్స్ షేర్ చేసిన రష్మిక మందన్నా.. View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) View this post on Instagram A post shared by Sonali Bendre (@iamsonalibendre) View this post on Instagram A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa) View this post on Instagram A post shared by Vithika Sheru (@vithikasheru) View this post on Instagram A post shared by mon (@imouniroy) View this post on Instagram A post shared by Priyanka (@priyankachopra) -
ప్రియుడితో పెళ్లి.. మెసేజ్ పెట్టిందన్న హీరోయిన్ తండ్రి
మలయాళ హీరోయిన్ అహానా కృష్ణ త్వరలో పెళ్లి పీటలెక్కబోతోంది. ప్రియుడు నిమిష్ రవితో ఏడడుగులు వేయనుంది. ఈ విషయాన్ని స్వయంగా ఆమె తండ్రి, నటుడు కృష్ణ కుమార్ ధ్రువీకరించాడు. వెరైటీ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కూతురి పెళ్లి గురించి ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు.మా ఇంటిక్కూడా..అతడు మాట్లాడుతూ.. అహానా పెళ్లి చేసుకుంటానని నాకు మెసేజ్ పెట్టింది. ఆ అబ్బాయిని మాకు ప్రత్యేకంగా ఓ కార్యక్రమం ఏర్పాటు చేసి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అతడు మా ఇంటికి ఎన్నోసార్లు వచ్చి వెళ్తుంటాడు. నేను కుర్రవయసులో ఉన్నప్పుడు కూడా అచ్చం నా కూతురిలాగే ఉండేవాడిని. ఏమాత్రం మొహమాటం లేకుండా నా భార్య సింధును పెళ్లికి ముందే ఇంటికి తీసుకెళ్లేవాడిని. దానివల్ల నేనెవర్ని పెళ్లి చేసుకోబోతున్నాను? వాళ్లు ఎలాంటివాళ్లు? అనేది అందరికీ ముందే తెలుస్తుంది. ఏ టెన్షన్ లేకుండా పెళ్లి ప్రశాంతంగా సాగిపోతుంది.30 ఏళ్లుగా తెలుసునిమిష్ తండ్రి, నిర్మాత రవి నాకు 30 ఏళ్లుగా తెలుసు. వాళ్ల కుటుంబంలో ఏ అవసరం వచ్చినా నేను చనువుతో సలహాలు ఇస్తుంటాను. అహానా, నిమిష్ ఓ షార్ట్ ఫిలింలో కలిసి పని చేసినప్పుడు అతడిని కలిశాను. తను చాలా సింపుల్గా ఉంటాడు. అతడి ఎదుగుదల చూస్తుంటే ముచ్చటేస్తేంటుంది. అతడి తండ్రికి ఎన్నో కలలుండేవి. సినిమాకోసం ఎంతో ఖర్చుపెట్టాడు.. ఈ క్రమంలో చాలా కోల్పోయాడు. కానీ దేవుడు అతడి త్యాగాలకు.. పిల్లల రూపంలో ప్రతిఫలాన్ని ఇచ్చాడు అని చెప్పుకొచ్చాడు.సినిమాకాగా అహానా కృష్ణ సినిమాటోగ్రాఫర్ నిమిష్ రవితో ప్రేమలో ఉన్నట్లు కొన్నేళ్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు అహానా తండ్రి మాటల్ని బట్టి వీరిద్దరూ తమ ప్రేమను నెక్స్ట్ స్టెప్కు తీసుకెళ్తున్నట్లు తెలుస్తోంది. మరి ఆ విషయాన్ని అధికారికంగా ఎప్పుడు ప్రకటిస్తారో చూడాలి! నిమిష్ రవి.. చివరగా లోక:చాప్టర్ 1 సినిమాతో పెద్ద హిట్ అందుకున్నాడు. అహానా.. ఎంజన్, స్టీవ్ లోపెజ్, లూకా, పతినేట్టం పది, ఆడి, నాన్సీ రాణి వంటి మలయాళ చిత్రాలతో గుర్తింపు పొందింది.చదవండి: ఆస్కార్ గెలిచిన సినిమాలు.. ఏయే ఓటీటీలో ఉన్నాయంటే? -
అజిత్ కేరవాన్లో వంట చేసిపెట్టాడు: తమన్నా
సినిమారంగంలో భాషాబేధాలకు తావుండదు. ప్రతిభే కొలమానం. అలా స్వశక్తితో ఎదిగిన నటీమణుల్లో మిల్కీబ్యూటీ తమన్నా భాటియా ఒకరు. ఈ ఉత్తరాది బ్యూటీ దక్షిణాదిలో అగ్ర హీరోయిన్గా పేరు తెచ్చుకుంది. కథానాయికగా సత్తా చాటుతూనే మరోపక్క ఐటమ్ సాంగ్స్లో నటిస్తూ అలరిస్తోంది. అలా ప్రత్యేక పాటల కోసం తమన్నా దాదాపు రూ.6 కోట్ల పారితోషికం తీసుకుంటున్నట్లు టాక్!ఆ మూవీ ఎంతో స్పెషల్ఇకపోతే ఈ హీరోయిన్ ఇటీవల చెన్నైలోని ఒక విశ్వవిద్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తాను తమిళంలో కల్లూరి చిత్రంలో నటించానని, అది తన సినీజీవితంలో చాలా ముఖ్యమైనదని పేర్కొంది. ఆ సినిమాలోలాగే కాలేజీ లైఫ్ను విద్యార్థులు ఎంజాయ్ చేయాలంది. కాలేజీడేస్ మళ్లీ తిరిగిరావంది.స్వయంగా వంట చేసి..తాను సినీ పరిశ్రమలో 21 ఏళ్లుగా కొనసాగుతున్నానని, ఇంతలా ఆదరిస్తున్న అందరికీ ధన్యవాదాలు అని సంతోషం వ్యక్తం చేసింది. తమిళంలో విజయ్, అజిత్ వంటి స్టార్ హీరోల సరసన నటించినట్లు తెలిపింది. నటుడు విజయ్ చాలా నిరాడంబరుడు, మంచి మనసు కలవాడంది. విజయ్, జూనియర్ ఎన్టీఆర్ బెస్ట్ డ్యాన్సర్స్ అని కితాబిచ్చింది. అజిత్ గురించి చెప్పాలంటే వీరం సినిమా సమయంలో తనకు ఆయన కేరవాన్లో ఇడ్లీ వండిపెట్టారని గుర్తు చేసుకుంది. ఆయనకు వంట చేయడం చాలా ఇష్టమని, మంచి కుటుంబ సభ్యుడిలా ఉంటాడని పేర్కొంది.చదవండి: ఆస్కార్ పండగ.. అత్యధికంగా ఆ చిత్రానికే ఎక్కువ అవార్డులు -
ఆ సినిమాలన్నీ ఫ్లాప్.. లాభమే లేదు: విజయ్ సేతుపతి
సినిమాలు తీయడమంటే ఆషామాషీ కాదు. ఏమాత్రం తేడా వచ్చినా బాక్సాఫీస్ వద్ద వైఫల్యం మూటగట్టుకోవడం తథ్యం. దీనివల్ల ఎక్కువ నష్టపోయేది నిర్మాతలే.. కొడితే కుంభస్థలాన్ని కొడతారు.. లేదంటేనేమో తీవ్ర నష్టాలు చూస్తారు. అలా తాను నిర్మాతగా తెరకెక్కించిన సినిమాలేవీ బాక్సాఫీస్ వద్ద వర్కవుట్ కాలేదంటున్నాడు తమిళ స్టార్ నటుడు విజయ్ సేతుపతి.ఆ నాలుగు ఫ్లాప్తాజాగా ఓ ఇంటర్వ్యూలో విజయ్ సేతుపతి మాట్లాడుతూ.. నా బ్యానర్లో సంగుతేవన్ అనే సినిమా స్టార్ట్ చేశాను. కానీ, అది మధ్యలోనే ఆగిపోయింది. దానివల్ల రూ.1.75 కోట్ల నష్టం వాటిల్లింది. ఆ తర్వాత నాలుగు సినిమాలు తీశాను. అవే.. ఆరెంజ్ మిఠాయి, మేకు తొడర్చి మలై, జుంగ, లాభం. వీటిలో ఒక్కటి కూడా నాకు లాభాల్ని తెచ్చిపెట్టలేదు. కనీసం పెట్టిన పెట్టుబడి వెనక్కు తీసుకురావడంలో కూడా విఫలమయ్యాయి. సినిమాబాక్సాఫీస్ లెక్కలపరంగా అవి ఫ్లాప్ అయినప్పటికీ నాకు మాత్రం ఆ సినిమాలన్నీ ఇష్టం. కాబట్టి వాటిని నిర్మించినందుకు నేనేం బాధపడటం లేదు అన్నాడు. ప్రస్తుతం విజయ్ సేతుపతి నటుడిగా సినిమాలతో బిజీగా ఉన్నాడు. తమిళంలో మిస్కిన్ దర్శకత్వంలో ట్రైన్ మూవీ చేస్తున్నాడు. తెలుగులో పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో స్లమ్డాగ్: 33 టెంపుల్ రోడ్ చేస్తున్నాడు. ఇది కాకుండా పాకెట్ నోవెల్, జైలర్ 2, అరసన్తో పాటు మణిరత్నం మూవీ ఒకటి ఆయన చేతిలో ఉన్నాయి.చదవండి: నాగార్జున వల్లే నా కూతురు సినిమాల్లోకి: ప్రియదర్శన్ -
నా కూతుర్ని సినిమాల్లో ఊహించలేదు.. నాగార్జున వల్లే..
మలయాళ టాప్ డైరెక్టర్ ప్రియదర్శన్ కూతురు కల్యాణి తండ్రికి తగ్గ తనయగా పేరు తెచ్చుకుంది. 2017లో తెలుగు సినిమా హలోతో ఆమె హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. కొద్దికాలంలోనే మంచి పేరు సంపాదించుకుంది. తెలుగుతోపాటు తమిళ, మలయాళ సినిమాలు చేసింది. గతేడాది లోక చాప్టర్ 1 చిత్రంతో పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ సంపాదించింది.కలలో కూడా అనుకోలేఅయితే ఆమె హీరోయిన్ అవడానికి కింగ్ నాగార్జునే ప్రధాన కారణం అంటున్నాడు ప్రియదర్శన్. పింక్విల్లాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అతడు మాట్లాడుతూ.. నా కూతురు కెమెరా ముందుకు వస్తుందని కలలో కూడా ఊహించలేదు. ఎందుకంటే సినిమా సెట్కు రావడానికి తనెప్పుడూ ఇష్టపడలేదు. తను ఆర్కిటెక్చర్ చదివింది. ఆర్కిటెక్ట్ అవ్వాలనుకుంది. నాగార్జున ఫోన్ చేయడంతో..కానీ, సడన్గా ఒకసారి నాగార్జున ఫోన్ చేసి కల్యాణిని సినిమాలో తీసుకోవాలనుకుంటున్నాం అన్నాడు. తనకు నటించడం రాదని చెప్పాను. కానీ నా కూతురు ఒకసారి ట్రై చేస్తే పోలా అంది. ఇక్కడ నేను కోల్పోయేదేం లేదు, నాకు సినిమాలు సెట్టవకపోతే మళ్లీ ఆర్కిటెక్చర్ వైపు వెళ్లిపోతానంది. అలా తను సినిమాల్లో ఎంట్రీ ఇచ్చింది. తండ్రిగా తన సినీజర్నీ చూస్తుంటే సంతోషంగా ఉంది. కాకపోతే నా సినిమాల గురించి తనతో మాట్లాడను. తను చేసే ప్రాజెక్టుల గురించి నాతో చర్చించదు. సినిమా తప్ప..ఎందుకంటే తను ఇప్పటి జెనరేషన్ అమ్మాయి. ఈతరం వాళ్లు సినిమాను ఒకలా చూస్తారు. నేనేమో పాత స్కూల్కు చెందినవాడిని. మేమిద్దరం సినిమా తప్ప అన్నింటిగురించి మాట్లాడుకుంటాం అని ప్రియదర్శన్ చెప్పుకొచ్చాడు. కాగా హలో మూవీతో కింగ్ నాగార్జున చిన్న కుమారుడు అఖిల్ హీరోగా పరిచయమయ్యాడు. విక్రమ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంతోనే కల్యాణి ప్రియదర్శన్ కూడా కథానాయికగా వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది.చదవండి: దేవుడు నాకిలా రాసిపెట్టాడు: డిమాన్ పవన్ -
పురుషులే అసలైన బాధితులు.. హీరో భార్య కౌంటర్
ఇటీవలి కాలంలో విడాకుల సంఖ్య పెరుగుతోంది. భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి దూరడం వల్లే ఈ విడాకులు ఎక్కువవుతున్నాయి. తమ విడాకుల వ్యవహారానికి కూడా మూడో మనిషే (సింగర్ కెనీషా ఫ్రాన్సిస్) కారణమని తీవ్రమైన ఆరోపణలు చేసింది ఆర్తి. తమిళ స్టార్ జంట రవి మోహన్- ఆర్తి 18 ఏళ్ల వైవాహిక జీవితానికి స్వస్తి పలుకుతూ గతేడాది విడిపోవాలని నిర్ణయించుకున్నారు. వీరి విడాకుల కేసు చెన్నై ఫ్యామిలీ కోర్టులో కనసాగుతోంది.పురుషులే అసలైన బాధితులుఇదిలా ఉంటే రవి ఇటీవల ఓ పోస్ట్ పెట్టాడు. అందులో మహిళలే కరెక్ట్ అని అందరూ అనుకుంటారు, కానీ పురుషులే అసలైన బాధితులు. అది మన న్యాయవ్యవస్థకు కూడా అర్థమవుతోంది. నేను ప్రేమించినవారికోసం ఏం చేశాను? నా మనసేంటి? అనేది ఏదో ఒకరోజు మీక్కూడా అర్థమవుతుంది. దయచేసి ప్రశాంతంగా బతకనివ్వండి.. మీ వికారమైన ఆలోచనలను మీదగ్గరే ఉంచుకోండి అని రాసుకొచ్చాడు.పిల్లల్ని ఎవరు పెంచారు?అతడి వ్యాఖ్యలపై సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కరుత్తు కన్నమ్మ ఆగ్రహం వ్యక్తం చేసింది. విడాకులు మంజూరవకముందే మరో అమ్మాయితో తిరుగుతున్న ఈయన సుద్దపూసలా మాట్లాడుతున్నాడు. ఇంతకూ పిల్లల్ని నువ్వే పెంచావా? లేదా ఆ బాధ్యతను ఆర్తిపై వేశావా? న్యాయవ్యవస్థ గురించి మాట్లాడేముందు పిల్లల్ని ఎవరు పెంచారో చెప్పు.. భరణం గురించి కాదు!ఎందుకీ దొంగ ఏడుపు?నువ్వేమో మరో అమ్మాయితో దర్జాగా తిరుగుతున్నావు. నీ భార్య మాత్రం నీ పిల్లలను చూసుకోవడంలోనే మునిగిపోయింది. పైగా నువ్వే అసలైన బాధితుడివి అని ఏడుస్తున్నావ్. నువ్వు చేసిన పని నీ భార్య చేసుంటే? విడాకులు ఫైనలైజ్ కాకముందే మరో మగాడితో ఆర్తి బయట తిరుగుతే ఈ ప్రపంచం ఊరుకుంటుందా? అదే పని ఆర్తి చేస్తే..ఒకవేళ తిరిగిన తర్వాత కూడా నేనే అసలైన బాధితురాలిని అని చెప్తే అందరూ నమ్ముతారా? లేదు కదా.. నువ్విలా విక్టిమ్ కార్డ్ ప్లే చేయడం చాలా చెండాలంగా ఉంది అని ఆగ్రహించింది. ఈ పోస్ట్ను ఆర్తి తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసింది. నిశ్శబ్ధంగా ఉండటానికి బదులుగా నిజాయితీగా గొంతెత్తి ప్రశ్నించినందుకు గర్వంగా ఉంది.. అంటూ చేతులెత్తి నమస్కరిస్తున్న ఎమోజీని జత చేసింది. View this post on Instagram A post shared by Karuththu Kannammaa (@karuththu_kannammaa2015) చదవండి: వారి కాళ్లకు నమస్కరించడం తప్ప ఏం చేయగలం?: మోహన్బాబు -
హన్సిక విడాకులు.. మాజీ వదిన షాకింగ్ పోస్ట్!
దేశముదురు సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసును దోచుకున్న బ్యూటీ హన్సిక మోత్వానీ వ్యక్తిగత జీవితంపై ఇప్పుడు నెట్టింట పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. తన భర్త సోహైల్ నుంచి ఆమె విడాకులు తీసుకోవడమే ఈ చర్చకు కారణం. 2022లో సోహైల్ను పెళ్లి చేసుకున్న ఆమె నాలుగేళ్ల పాటు కలిసి కాపురం చేసి..ఇటీవల విడిపోయారు. ఈ విషయం బయటకు వచ్చిన తర్వాత హన్సిక పర్సనల్ లైఫ్పై సోషల్ మీడియాలో రకరకాల పుకార్లు ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో హన్సిక మాజీ వదిన ముస్కాన్ నాన్సీ చేసిన పోస్ట్ ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. అదంతా ఒక నకిలీ ప్రపంచం అంటూ చేసిన వ్యాఖ్యలపై రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి.ముస్కాన్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఇలా రాసుకొచ్చింది. ‘దయచేసి నన్ను ఇతరుల జీవితాల్లో జరిగే డ్రామాల్లోకి లాగవద్దు. నాకు ఎలాంటి పెయిడ్ పీఆర్ టీమ్స్ లేవు. ఎవరిదో ఫేక్ ప్రపంచంతో నన్ను ముడిపెట్టడం ఆపేయండి. కాలమే అన్ని నిజాలను బయటపెడుతుంది. అంతా సమయమే నిర్ణయిస్తుంది. సబ్ సమయ్ కా ఖేల్ హై. పీస్, లవ్ అండ్ కర్మ’ అని ఇన్స్టా స్టోరీలో పోస్ట్ చేసింది. ఎవరి పేరు నేరుగా చెప్పకపోయినా, ఈ పోస్ట్ హన్సిక విడాకులను ఉద్దేశించేనని నెటిజన్లు అంటున్నారు.వాస్తవానికి హన్సికకు, ముస్కాన్కు మధ్య గతంలోనే విభేదాలు ఉన్నాయి. హన్సిక వల్లే తన సంసార జీవితం నాశనం అయిందని ముస్కాన్ ఆరోపించింది. 2020లో హన్సిక సోదరుడు ప్రశాంత్ మోత్వానీతో ముస్కాన్ పెళ్లి జరిగింది. వివాహమైన కొంతకాలానికే డబ్బు, ఖరీదైన బహుమతులు కావాలని అత్త, ఆడపడుచు హన్సిక వేధించారని ముస్కాన్ అప్పట్లోనే పోలీసులకు ఫిర్యాదు చేసింది.వీరిద్దరి జోక్యం వల్లే తన కాపురం కూలిపోయిందని, మానసిక ఒత్తిడి కారణంగా తనకు 'బెల్స్ పాల్సీ' కూడా వచ్చిందని ఆమె గతంలో తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రస్తుతం ఈ కేసు కోర్టులోనే ఉంది.ఈ కేసును కొట్టివేయాలని హన్సిక వేసిన పిటిషన్ను గత సెప్టెంబర్లో బాంబే హైకోర్టు తిరస్కరించడం గమనార్హం.ముస్కాన్ నాన్సీ విషయానికొస్తే.. ఈమె ఒక బుల్లితెర నటి. తొడి ఖుషి తొడె ఘమ్ సీరియల్లో సహాయక నటిగా యాక్ట్ చేసింది. ఈ ధారావాహికతో విశేష గుర్తింపు తెచ్చుకున్న నాన్సీకి మాతా కీ చౌకి సీరియల్ ఆఫర్ వచ్చింది. ఇందులో ప్రధాన పాత్రలో నటించింది. అదాలత్, ఫియర్ ఫైల్స్, క్రైమ్ పెట్రోల్ షోలలో పాల్గొంది. భారత్ కా వీర్ పుత్ర: మహారాణ ప్రతాప్, ఏజెంట్ రాఘవ్- క్రైమ్ బ్రాంచ్ షోలలో నటించింది. 2020లో హన్సిక సోదరుడిని పెళ్లి చేసుకుంది. పెళ్లైన కొద్ది రోజులకే విబేధాలు రావడంతో విడి విడిగా ఉంటున్నారు. గత కొన్నేళ్లుగా నటనకు దూరంగా ఉంటోంది. -
వివాదాస్పద లిరిసిస్ట్పై ప్రశంసలు.. కమల్ హాసన్కు చిన్మయి చురకలు..!
వివాదాస్పద లిరిసిస్ట్ వైరముత్తును ఏకంగా జ్ఞానపీఠ్ అవార్డు వరించింది. దీంతో ఆయనకు తమిళనాడు సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా అభినందనలతో ముంచెత్తుతున్నారు. సీఎం స్టాలిన్, హీరో కమల్ హాసన్ సైతం వైరముత్తుకు అభినందనలు తెలిపారు. దేశంలోని సాహిత్య రంగంలో అందించే అత్యున్నత పురస్కారమే జ్ఞానపీఠ్ అవార్డు. ఈ అవార్డ్తో జ్ఞాన్పీఠ్ అవార్డ్ అందుకున్న మూడో తమిళ వ్యక్తిగా వైరముత్తు నిలిచాడు.చిన్మయి చురకలు..వైరముత్తుకు జ్ఞాన్పీఠ్ అవార్డ్ రావడంపై సింగర్ చిన్మయి స్పందించింది. కమల్ హాసన్ వైరముత్తును ప్రశంసించడంపై ట్విటర్ వేదికగా మండిపడింది. కమల్ హాసన్ కూడా వైరముత్తును అభినందించారని ఎద్దేవా చేసింది. సినిమాల్లో ఉన్న మగవాళ్లు రాజకీయాలకు మారడం, తన మామ-గురువు తమను లైంగికంగా వేధించాడని చెప్పిన మహిళలను పూర్తిగా పట్టించుకోకపోవడం ఆయనకే చెల్లుతుందని పోస్ట్ చేసింది. పురుషులు ఎప్పటికీ మన వైపు ఉండరని ఓటు వేసే మహిళలు గుర్తు పెట్టుకోవాలని సూచించింది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే తన సొంత పార్టీలోని మహిళ బహిరంగంగా కవి పేరును ప్రస్తావించినా పట్టించుకోకపోవడం మరి దారుణమని చిన్మయి తెలిపింది. చివరగా పురుషులు కేవలం సోదరులు, మామలు, నాన్నలు, స్నేహితులు, సలహాదారులకు మాత్రమే అండగా నిలుస్తారని.. మహిళలను ఎవరు పట్టించుకోరని వ్యంగ్యంగా రాసుకొచ్చింది. ఈ పోస్ట్ నెట్టింట వైరల్ కావడంతో నెటిజన్స్ సైతం క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ ఆయనపై గతంలో సింగర్ చిన్మయి శ్రీపాద ఆరోపించింది. ఈ నేపథ్యంలోనే వైరముత్తుకు భారతీయ సాహిత్యానికి చేసిన కృషికి జ్ఞానపీఠ్ అవార్డు రావడంపై సింగర్ చిన్మయి తనదైన శైలిలో ఇచ్చిపడేసింది. For God’s sake 🤦🏽♀️🤦🏽♀️🤦🏽♀️🤦🏽♀️🤦🏽♀️P.S.: Men in such power in cinema transitioning to politics completely turning a deaf ear to women who come on record to say they were molested by “his uncle-mentor” must remind women who vote - that men will never be on our side.The weirdest thing -… https://t.co/KB7VNAevu5— Chinmayi Sripaada (@Chinmayi) March 14, 2026 -
సూర్య లేటేస్ట్ మూవీ.. టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటిస్తోన్న టాలీవుడ్ మూవీ విశ్వనాథ్ అండ్ సన్స్. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. వెంకీ అట్లూరి డైరెక్షన్లో వస్తోన్న ఈ సినిమాని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్ను రిలీజ్ చేయగా ఆడియన్స్ను తెగ ఆకట్టుకుంది. పోస్టర్ చూస్తే ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది.తాజాగా ఈ మూవీకి సంబంధించిన మరో క్రేజీ అప్డేట్ వచ్చేసింది. ఈ సినిమా టీజర్ రిలీజ్ డేట్ను మేకర్స్ రివీల్ చేశారు. ఈనెల 16న సాయంత్రం 04:06 నిమిషాలకు రిలీజ్ చేస్తామని ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఓ పోస్టర్ను సితార ఎంటర్టైన్మెంట్స్ పోస్ట్ చేసింది. కాగా.. ఈ చిత్రాన్ని జూలైలో రిలీజ్ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు మేకర్స్. ఈ మూవీలో ప్రేమలు హీరోయిన్ మమిత బైజు కథానాయికగా నటిస్తోంది. రవీనా టాండన్, రాధికా శరత్ కుమార్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్ సంగీతం అందిస్తున్నారు. A journey filled with heart. ❤️The teaser of #VishwanathAndSons is on its way.🥳Sanjay Vishwanath arrives on March 16th @ 04:06 PM! 😎In cinemas from this JULY 2026. 🤩@Suriya_offl #VenkyAtluri @_mamithabaiju @realradikaa @TandonRaveena @gvprakash @vamsi84 @NavinNooli… pic.twitter.com/FKoOht3Oz0— Sithara Entertainments (@SitharaEnts) March 14, 2026 -
ఆ జంట పతనం కోసం అందరు వెయిటింగ్: ఆర్జీవీ షాకింగ్ కామెంట్స్
టాలీవుడ్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ ఆసక్తికర కామెంట్స్ చేశారు. దురంధర్ మూవీ హిట్ కావడం చాలామందిని భయపెట్టిందన్నారు. ఆదిత్య ధర్కు ఆదరణ పెరగడం కొందరికీ నచ్చడం లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. అతన్ని చూసి చాలామంది అసూయ పడుతున్నారని అన్నారు. ఆదిత్య ధర్, ఆయన సతీమణి యామీ గౌతమ్ పతనం కోసం సినీ పరిశ్రమలో ఎంతోమంది ఎదురు చూస్తున్నారని వ్యాఖ్యానించారు.తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆర్జీవీ దురంధర్ డైరెక్టర్పై ప్రశంసలు కురిపించారు. ఈ స్పై థ్రిల్లర్ మూవీ భారతీయ సినిమా గతిని మార్చిందని అన్నారు. ఆయన వల్ల సినీ ఇండస్ట్రీలో మిగిలిన వాళ్లంతా పునరాలోంచించేలా చేసిందని తెలిపారు. ఇలాంటి సమయంలో ఆదిత్య ధర్, యామి గౌతమ్ మరింత జాగ్రత్తగా ముందడుగు వేయాలని సూచించారు.ఆర్జీవీ మాట్లాడుతూ..' తెరపై కథ చెప్పే విధానం, మేకింగ్ స్టైల్ ఆదిత్య ధర్ పూర్తిగా మార్చేశారు. మన సినిమాలు ఎప్పటికీ ఒకేలా ఉండవు. ఇక్కడ నేను హిందీ మాత్రమే కాకుండా అన్ని భాషల గురించి మాట్లాడుతున్నా. తెలుగులో రాబోయే అనేక పెద్ద-బడ్జెట్ యాక్షన్ చిత్రాలు భారీ రీ షూటింగ్కు రెడీ అవుతున్నాయి. దీనివల్ల నిర్మాతలపై అదనపు భారం తప్పదు. ఆదిత్య ధర్ వల్లే ఇలా చేయాల్సి రావడం పరిశ్రమలోని కొందరికి నచ్చడం లేదు. అందుకే వారంతా అతన్ని ద్వేషిస్తారు. ఆయన అందరిని కంఫర్ట్ జోన్ల నుంచి బయటకు తీసుకొచ్చేలా చేశాడు. అందుకే ఆదిత్య ధర్ ఫెయిల్యూర్ కోసం అందరూ ఆసక్తిగా ఉన్నారని' అన్నారు. కాగా.. ఆదిత్య ధర్ దర్శకత్వంలో వస్తోన్న దురంధర్-2 ఈనెల 19న థియేటర్లలో సందడి చేయనుంది. -
సెన్సార్ బోర్డ్ కీలక నిర్ణయం.. ఇకపై అవీ తప్పనిసరి..!
ఇండియన్ సినిమాలపై సెన్సార్ బోర్డ్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై సబ్ టైటిల్స్ తప్పనిసరిగా ఉండాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ నెల 15 నుంచి అన్ని ఇండియన్ చిత్రాలకు సబ్ టైటిల్స్ ఉండాలని సూచించింది. ఈ నిర్ణయంతో వినికిడి లోపం ఉన్నవారికి సినిమా అర్థం చేసుకునేందుకు వీలవుతుందని తెలిపింది. అయితే ఈ మార్పులు థియేటర్లలో ఎలా ప్రభావితం చేస్తాయనే దానిపై నెట్టింట చర్చకు దారితీసింది.ఈ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు..సెన్సార్ బోర్డ్ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సినిమాను అన్ని రకాల ప్రేక్షకులకు అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నంలో ఈ నిర్ణయం మొదటి అడుగుగా భావిస్తున్నారు. అయినప్పటికీ ఇలాంటి నిర్ణయాలతో సినిమాపై ప్రేక్షకుడి దృష్టిని మరల్చినట్లు అవుతుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. హాలీవుడ్ సినిమాలకు ఓకే కానీ.. మన హిందీ చిత్రాలకు సబ్ టైటిల్స్ ఎందుకని ఓ నెటిజన్ ప్రశ్నించాడు. కింద ఉన్న పదాలు ప్రేక్షకుడి దృష్టిని మరల్చడం, కొన్నిసార్లు నటీనటులు మాట్లాడనప్పుడు కూడా సబ్ టైటిల్స్ వస్తే కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుందని కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు ఈ కొత్త నియమం అన్ని భారతీయ భాషలు, ప్రాంతాలలోని చిత్రాలకు వర్తిస్తుందని సెన్సార్ బోర్డ్ స్పష్టం చేసింది. -
పండంటి బిడ్డకు జన్మనిచ్చిన పూర్ణ
నటి షామ్నా ఖాసిం అలియాస్ పూర్ణ రెండోసారి తల్లయింది. గతేడాది ఆగస్టులో గర్భం దాల్చిన ఆమె మార్చి 14న ఉదయం పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. దేవుడి ఆశీస్సులతో ఈరోజు ఉదయం 4 గంటల 25 నిమిషాలకు పాప పుట్టింది. తను మాకు లభించిన అపురూపమైన కానుక.సాఫీగా డెలివరీఎటువంటి ఇబ్బందులు లేకుండా సాఫీగా డెలివరీ అయినందుకు ఆ భగవంతుడికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఆస్పత్రి బృందానికి కూడా ధన్యవాదాలు అని రాసుకొచ్చింది. ఇది చూసిన అభిమానులు పూర్ణకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కాగా పూర్ణ 2022లో వ్యాపారవేత్త షానిద్ అసిఫ్ అలీని పెళ్లి చేసుకుంది. ఈ దంపతుల ప్రేమకు గుర్తుగా 2023లో బాబు పుట్టాడు.సినిమాపూర్ణ మలయాళ నటి. సీమటపాకాయ్, అవును సినిమాలతో తెలుగులో గుర్తింపు తెచ్చుకుంది. శ్రీ మహాలక్ష్మి, నువ్వలా నేనిలా, రాజుగారి గది, అఖండ 2 ఇలా పలు చిత్రాల్లో నటించింది. మహేశ్బాబు గుంటూరు కారం సినిమాలో 'కుర్చీ మడతపెట్టి..' పాట ప్రారంభంలో కనిపిస్తుంది. తెలుగుతో పాటు మలయాళ, తమిళ, కన్నడ భాషల్లోనూ మూవీస్ చేసింది. View this post on Instagram A post shared by DrShanid Thalekoden (@dr.shanid_asifali) చదవండి: గోటీల ఫ్యాక్టరీ.. స్పందించిన జీవిత -
పైసా తీసుకోని మ్యూజిక్ డైరెక్టర్.. మెచ్చుకున్న హీరో
సీనియర్ నటుడు, రాజకీయ నాయకుడు కరుణాస్ వారసుడు కెన్ కరుణాస్. అసురన్, విడుదలై వంటి చిత్రాల్లో కీలక పాత్రలు పోషించి గుర్తింపు పొందాడు. అలాగే హీరో ధనుష్, దర్శకుడు వెట్రిమారన్ దృష్టిలో పడ్డాడు. అంతేకాకుండా వెట్రిమారన్ సహాయ దర్శకుడిగానూ మారాడు. అలాంటి కెన్ తాజాగా ఒకేసారి హీరోగా, దర్శకుడిగా అవతారమెత్తి చేసిన మూవీ యూత్. రిలీజ్ ఎప్పుడంటే?పర్వతా ఎంటర్టైన్మెంట్ పతాకంపై కరుప్పయ్య సి.రామ్, కౌసల్యకుమార్ నిర్మించిన ఈ చిత్రంలో అనిష్మా, మీనాక్షి, ప్రయాన్సీ, ప్రియదర్శిని యాదవ్ హీరోయిన్లుగా నటించారు. నళిని, దేవదర్శిని, సురాజ్ వెంజారముడు ముఖ్యపాత్రలు పోషించారు. జీవీ.ప్రకాశ్కుమార్ సంగీతాన్ని, విక్కీ చాయాగ్రహణం అందించారు. కళాశాల నేపథ్యంలో సాగే ఈ యూత్ఫుల్ ఎంటర్టైనర్ కథా చిత్రం ఈనెల 19వ తేదీన విడుదలకు సిద్ధమవుతోంది. వాళ్లే కారణంశుక్రవారం ఉదయం చైన్నెలోని సత్యం థియేటర్లో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఇందులో దర్శకుడు వెట్రిమారన్, ధనుష్ పాల్గొన్నారు. తాను నటుడిగా, దర్శకుడిగా మారడానికి వెట్రిమారన్, ధనుష్లే కారణం అని కెన్ కరుణాస్ ఈ వేదికపై పేర్కొన్నారు. ధనుష్ మాట్లాడుతూ.. కెన్ ఈ స్థాయికి చేరుకోవవానికి కారణం ఆయన తల్లి దండ్రులేనన్నారు. జీవీ ప్రకాశ్ అందించిన సంగీతం ఈ చిత్రానికి ప్రధాన బలం అని పేర్కొన్నారు. ఆయన ఈ చిత్రానికి పారితోషికం తీసుకోకుండా పనిచేయడం విశేషం అన్నారు. -
రిచ్ కావాలంటే...
సముద్ర ఖని ప్రధాన పాత్రలో, గౌతమ్ వాసుదేవ్ మీనన్, లక్ష్మీ ప్రియా కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘కార్మేని సెల్వం’. రామ్ చక్రి దర్శకత్వంలో అరుణ్ రంగరాజులు తెలుగు, తమిళ భాషల్లో నిర్మించారు. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 3న తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించి, తెలుగు టీజర్ను విడుదల చేశారు మేకర్స్. ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ ఈ మూవీ థియేట్రికల్ డిస్ట్రిబ్యూషన్లో భాగస్వామిగా ఉంది.‘డబ్బు సంపాదించడానికి చాలా మార్గాలు ఉన్నాయి’ అంటూ సముద్ర ఖని చెప్పే డైలాగ్తో టీజర్ ప్రారంభం అవుతుంది. ‘రిచ్ కావాలంటే రిచ్ మనిషిలా ఖర్చు చేయడం నేర్చుకోవాలి. డబ్బు లేకపోతే అప్పు తీసుకుని ఖర్చు చేయాలి’ అంటూ సముద్ర ఖని చెప్పే డైలాగ్స్ కూడా టీజర్లో ఉన్నాయి. -
అలాంటి సినిమాలు తీస్తే జోకర్లా చూస్తారు: డైరెక్టర్
మలయాళ స్టార్ దర్శకుడు ప్రియదర్శన్ సొంత భాషలోనే సెటిలైపోకుండా బాలీవుడ్లోనూ అనేక సినిమాలు చేశాడు. హీరా ఫెరి, హంగామా, భూల్ భులయ్యా వంటి పలు చిత్రాలతో ప్రేక్షకులకు వినోదాన్ని పంచాడు. ప్రస్తుతం అక్షయ్ కుమార్ హీరోగా హారర్ కామెడీ మూవీ భూత్ బంగ్లా చేస్తున్నాడు. ఇది ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.ఇష్టం లేదుఅయితే తనకు కామెడీ చిత్రాలకంటే సీరియస్ సినిమాలు చేయడమే ఇష్టం అంటున్నాడు తాజాగా పింక్విల్లాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రియదర్శన్ మాట్లాడుతూ.. సీరియస్ చిత్రాలు తెరకెక్కించడమంటే నాకు చాలా ఇష్టం. కామెడీ మూవీస్ చేయడం నాకేమాత్రం ఇష్టం లేదు. కానీ నాకు వేరే ఆప్షన్ లేక కామెడీ జానర్లో సినిమాలు చేయాల్సి వస్తోంది.ఎందుకు చూడరు?సీరియస్ సినిమాలు చేస్తున్నప్పుడు ఇండస్ట్రీలో ప్రత్యేక గౌరవం చూపిస్తారు అదే కామెడీ జానర్లో ఉంటే మాత్రం ఎవరూ పట్టించుకోరు. ఒక మంచి దర్శకుడిగా పరిగణించరు. ఈ విషయంలో నాకు చాలా బాధేస్తుంది. కామెడీ సినిమాలు తీసేవాళ్లను మంచి దర్శకులుగా ఎందుకు చూడరు? మనదగ్గరే కాదు, ప్రపంచమంతటా అలాగే ఉంది. హాస్యభరిత చిత్రాలు చేసేవారిని జోకర్లా చూస్తున్నారు. కామెడీ సినిమాలకు ఆస్కార్ రావడం కూడా చాలా అరుదు. ఇది నిజంగా బాధాకరం.. కానీ ఇదే జరుగుతోంది అని ప్రియదర్శన్ చెప్పుకొచ్చాడు. -
MGRపై చౌకబారు వ్యాఖ్యలు.. క్షమాపణలు చెప్పిన రాజేంద్రప్రసాద్
తెలుగు సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ క్షమాపణలు చెప్పాడు. తమిళ లెజెండరీ నటుడు ఎంజీఆర్పై తాను చేసిన వ్యాఖ్యల పట్ల చింతిస్తున్నానన్నాడు. అవి ఉద్దేశపూర్వకంగా అన్న మాటలు కాదని, అనుకోకుండా దొర్లాయని విచారం వ్యక్తం చేశాడు. ఈ మేరకు తమిళంలో క్షమాపణలు చెప్తూ ఓ వీడియో రిలీజ్ చేశాడు. ఇంకెప్పుడూ అలాంటి వ్యాఖ్యలు చేయనని తెలిపాడు.కొద్దిగా నోరు జారా..ఆ వీడియోలో రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. తమిళ సినీ ప్రేక్షకులు ఎంజీఆర్ను దైవంలా భావిస్తారు. నేను కూడా ఆయన్ను దేవుడిలాగే భావిస్తాను. తెలుగు నటుడు కాంతారావును ప్రశంసించే క్రమంలో కొద్దిగా నోరు జారాను. అది కావాలని అనలేదు. కొందరు దీన్ని పెద్దది చేశారు. ఆయనపై కామెంట్స్ చేసేంత ధైర్యం నాకెక్కడిది? నేను చెన్నై ఫిలిం ఇన్స్టిట్యూట్లో ఉన్నప్పుడు ఆయన తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మేము నటిస్తుంటే వచ్చి చూసేవారు. అలాంటి గొప్ప వ్యక్తి గురించి నేను తప్పుగా మాట్లాడతానా? ఏదేమైనా నా మాటల వల్ల ఎవరైనా బాధపడి ఉంటే క్షమించండి. భవిష్యత్తులో ఇంకెప్పుడూ అలాంటి కామెంట్స్ చేయను అని క్షమాపణలు తెలిపాడు.ఏం జరిగింది?కాగా ఇటీవల ఓ ఈవెంట్లో రాజేంద్రప్రసాద్ కాస్త నోరు జారాడు. తెలుగు నటుడు కాంతారావును పొగిడే క్రమంలో ఎంజీఆర్పై చులకన వ్యాఖ్యలు చేశాడు. కాంతారావును చూసి ఎంజీఆర్ ప్యాంటు తడుపుకునేవాడని కామెంట్స్ చేశాడు. ఈ వ్యాఖ్యలపై కోలీవుడ్ సెలబ్రిటీలు విశాల్, నాజర్ మండిపడ్డారు. రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యలు ప్రతి తమిళుడి మనసును నొచ్చుకునేలా ఉన్నాయన్నారు. వెంటనే ఆయన క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో రాజేంద్రప్రసాద్ తన తప్పు తెలుసుకుని క్షమాపణలు కోరాడు. வருத்தம் தெரிவித்த நடிகர் ராஜேந்திர பிரசாத்!#ActorRejendraprasad #mgr #nadigarsangam #nasser#vishal pic.twitter.com/8dpyBRPW5Z— FridayCinema (@FridayCinemaOrg) March 13, 2026 -
గుండె ముక్కలైందన్న హీరో! బ్రేకప్ పోస్ట్?
తమిళ హీరో అర్జున్దాస్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ ఒకటి నెట్టింట వైరల్గా మారింది. ఎప్పుడూ సినిమా అప్డేట్స్ తప్ప పర్సనల్ విషయాలను పెద్దగా ఫ్యాన్స్తో పంచుకోడు. అలాంటిది ఆయన హార్ట్ బ్రేక్ అయినట్లు ఓ పోస్ట్ పెట్టడంతో అభిమానులు ఆశ్చర్యపోయారు.అంతలా ప్రేమిస్తే..ఇంతకీ ఆ పోస్ట్లో ఏముందంటే.. మనం ఎవర్నైనా గాఢంగా ప్రేమిస్తే.. వాళ్లు మనల్ని వదిలేసి వెళ్లిపోతారు. అసలు ఒక మనిషి ఇంత సులభంగా ఎలా మూవ్ ఆన్ అవుతారు? అంటూ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టాడు. దీనికి హృదయం ముక్కలైన ఎమోజీని జత చేశాడు. అర్జున్దాస్కు బ్రేకప్ఇది చూసిన అభిమానులు అర్జున్దాస్కు బ్రేకప్ అయిందా? అని చర్చిస్తున్నారు. మరికొందరు మాత్రం ఇదేదో కొత్త సినిమా ప్రమోషన్స్ అయుంటుంది, అంతా పబ్లిసిటీ స్టంట్ అని భావిస్తున్నారు. మరి ఈ పోస్ట్ వెనక మర్మమేంటో అర్జున్ దాసే క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.సినిమాకాగా అర్జున్ దాస్ గతంలో ఐశ్వర్య లక్ష్మితో ప్రేమలో ఉన్నట్లు ప్రచారం జరిగింది. కానీ అందులో నిజం లేదని, తాము స్నేహితులం మాత్రమేనని ఐశ్వర్య క్లారిటీ ఇచ్చింది. అటు అర్జున్ కూడా ప్రేమ పెళ్లి చేసుకుంటారా? పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకుంటారా? అన్న ప్రశ్నకు పెళ్లే చేసుకోను అని బదులిచ్చాడు. ఇకపోతే ఇతడు చివరగా ఓజీ సినిమాలో యాక్ట్ చేశాడు. ప్రస్తుతం కాన్ సిటీ సినిమా చేస్తున్నాడు.చదవండి: ఆశను కోల్పోవద్దు.. విడాకుల తర్వాత హన్సిక ఫస్ట్ పోస్ట్ -
ప్రేమ్ రక్షిత్పై మైఖేల్ జాక్సన్ కొరియోగ్రాఫర్ ప్రశంసలు
ప్రపంచ ప్రఖ్యాత పాప్ స్టార్, కింగ్ ఆఫ్ పాప్ 'మైఖేల్ జాక్సన్'కు లెజెండరీ కొరియోగ్రాఫర్ 'విన్సెంట్ ప్యాటర్సన్' ఐకానిక్ డాన్స్ స్టెప్స్ కంపోజ్ చేశారు. అమెరికన్ డైరెక్టర్, కొరియోగ్రాఫర్ అయిన విన్సెంట్.. మైఖేల్ జాక్సన్, మడోన్నా వంటి సూపర్ స్టార్లతో కలిసి పనిచేశారు. ప్రసిద్ధ మ్యూజిక్ ఆల్బమ్స్, సినిమాలు, బ్రాడ్వే, కచేరీలను విన్సెంట్ రూపొందించారు. అలాంటి ప్రముఖ వ్యక్తి.. భారతీయ కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ టాలెంట్ను ప్రశంసించడం ఆసక్తికరంగా మారింది. వీడియో వైరల్ప్రపంచ స్థాయి కొరియోగ్రాఫర్ ప్రశంసించడం భారతీయ డాన్స్ టాలెంట్కు గ్లోబల్ గుర్తింపు లభించడమే అని అభిమానులు భావిస్తున్నారు. ఇటీవల ప్రేమ్ రక్షిత్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఒక వీడియోను షేర్ చేయగా.. అది సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆ వీడియోలో ప్రేమ్ ప్రతిభకు విన్సెంట్ పాటర్సన్ ఫిదా అయ్యారు. 'హలో ప్రేమ్.. నేను విన్సెంట్ ప్యాటర్సన్. నేను అమెరికన్ డైరెక్టర్, కొరియోగ్రాఫర్. ఏదో ఒక రోజు కలుస్తా..చాలా ఏళ్లు మైఖేల్ జాక్సన్తో కలిసి పనిచేశా. నేను మీకు ఓ విషయం చెప్పాలి. నేను మిమ్మల్ని నిజంగా అభినందిస్తున్నా. మీ కొరియోగ్రఫీ అద్భుతం. మీరు అకాడమీ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ సభ్యుడిగా ఉన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇండియాలో యంగ్ కొరియోగ్రాఫర్లు ఉన్నారు. వారి కలలు సాధించుకుంటున్నారు. ఏదో ఒక రోజు నిన్ను కలుస్తా రక్షిత్' అంటూ విన్సెంట్ వీడియోలో చెప్పారు.ఎంతో ప్రత్యేకం'నేను చిన్నప్పటి నుంచే స్మూత్ క్రిమినల్ పాటకు పెద్ద అభిమానిని. మైఖేల్ జాక్సన్తో కలిసి పనిచేసిన ఒక లెజెండ్ నుంచి అభినందనలు అందుకోవడం కొరియోగ్రాఫర్గా ఎంతో ప్రత్యేకమైన విషయం. థాంక్స్ డియర్ విన్సెంట్ సర్' అని ప్రేమ్ రక్షిత్ రిప్లై ఇచ్చారు. 'ఆర్ఆర్ఆర్' సినిమాలో ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీ చేసిన నాటు నాటు పాటకు ఆస్కార్ వరించిన విషయం తెలిసిందే. దాంతో ఆయన అంతర్జాతీయ ఖ్యాతి పొందారు. చెన్నైలో పెరిగిన రక్షిత్.. ప్రభాస్'ఛత్రపతి'తో ప్రయాణం మొదలుపెట్టి.. 'బాహుబలి' వంటి అనేక పెద్ద చిత్రాలకు పనిచేశారు. తెలుగు, తమిళంలో దాదాపు 200కి పైగా చిత్రాలకు కొరియోగ్రఫీ చేశారు. View this post on Instagram A post shared by Prem Rakshith (@premrakshith_choreographer) -
8 ఏళ్లు ఎంత బాధపెట్టినా మౌనంగా భరించా.. ఇకనావల్ల కాదు!
స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా మనసుపడ్డవాడిని పెళ్లి చేసుకుని కొత్త జీవితానికి నాంది పలికింది. ఫిబ్రవరి 26ప ఉదయ్పూర్లో తెలుగు హీరో విజయ్దేవరకొండను పెళ్లాడింది. ఈ సంతోషకర సమయంలో ఆమె తల్లి సుమన్ మందన్నాకు సంబంధించిన ఓ పాత ఆడియో క్లిప్ కటి నెట్టింట తెగ వైరలవుతోంది. దీన్ని ఆధారంగా చేసుకుని చాలామంది రష్మిక గురించి, ఆమె కుటుంబం గురించి సోషల్ మీడియాలో అసత్యప్రచారాలు చేస్తున్నారు. ఈ విషయంపై రష్మిక ఆగ్రహం వ్యక్తం చేసింది.అన్నీభరించా..ఒక మీడియా వర్గం ఎనిమిదేళ్లుగా నాపై అసత్యప్రచారం చేస్తూ, నన్ను టార్గెట్ చేస్తూ వేధిస్తూనే ఉంది. వాళ్ల వ్యూస్, రీచ్ కోసం నేను అనని మాటల్ని కూడా అన్నట్లుగా తప్పుడు కథనాల్ని రాసింది. అది నన్నెంతో బాధపెట్టినా నేను మౌనంగా ఉన్నాను. కానీ గడిచిన 24 గంటల్లో వారు హద్దులు దాటి నాపై తీవ్ర దుష్ప్రచారం చేశారు. ఎనిమిదేళ్ల క్రితం జరిగిన ఓ ప్రైవేటు సంభాషణలోని కొంత భాగాన్ని ఉద్దేశపూర్వకంగా ప్రచారం చేస్తున్నారు. ఎంతదూరం వెళ్తారు?ఇప్పుడు నా జీవితంలో మార్పు చేసుకున్న పరిణామాల కారణంగా కావాలనే వాటిని వైరల్ చేస్తున్నారు. ఇంకా ఎంతదూరం వెళ్తారు? మీరిలా చేయడం వల్ల నా కుటుంబసభ్యులే కాకుండా నాకు సంబంధం ఉన్న వ్యక్తుల్ని కూడా ఇబ్బందిపెడుతున్నారు. ఇది నా వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించడమేకాదు, నా ప్రతిష్టను దిగజార్చడమే అవుతుంది. మేమిద్దరం (రక్షిత్, నేను) ఎవరి జీవితాల్లో వారు బిజీగా ఉన్నాం. 24 గంటల్లో డిలీట్అయినా సరే కొందరు కావాలని వివాదం సృష్టిస్తున్నారు, విషాన్ని చిమ్ముతున్నారు. ఎనిమిదేళ్లుగా మీరేం చేసినా మౌనంగా ఉన్నాను. కానీ, ఈరోజు మిగతావారిని కూడా ఇందులోకి లాగుతూ హద్దులు దాటి ప్రవర్తించారు. ఇక నేను సహనంగా ఉండలేను. మీడియా సంస్థలు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు వెంటనే తప్పుడు కథనాల్ని తొలగించండి. మీకు 24 గంటలు టైం ఇస్తున్నా.. ఆలోపు వాటిని తొలగించకపోతే రేపటి నుంచి సంబంధిత వ్యక్తులు, సంస్థలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాను అని ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చింది.వివాదం ఏంటి?2016లో కిరిక్ పార్టీ మూవీ షూటింగ్లో రష్మిక, రక్షిత్ శెట్టి ప్రేమలో పడ్డారు. ఆ మరుసటి ఏడాది నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. కానీ, ఆ ప్రేమ పట్టాలెక్కకముందే 2018లో ఎవరి దారి వారు చూసుకున్నారు. అయితే ఆ సమయంలో రష్మిక ఎదుర్కొన్న వేధింపుల గురించి ఆమె తల్లి మాట్లాడినట్లుగా ఓ ఆడియో వైరలవుతోంది. దాదాపు ఎనిమిదేళ్ల కిందటి సంభాషణను ఇప్పుడు రష్మిక పెళ్లి జరిగిన సమయంలో బయటపెట్టడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. 🙏🏻 pic.twitter.com/DdJwFIjeP3— Rashmika Mandanna (@iamRashmika) March 12, 2026 -
డబ్బులిచ్చి మరీ నాపై ట్రోలింగ్.. స్టార్ హీరోయిన్ ఆవేదన
దక్షిణాది చిత్ర పరిశ్రమలో వేగంగా ఎదిగిన కథానాయకి ప్రియాంక మోహన్. ఈ కన్నడ భామ డాక్టర్ చిత్రం ద్వారా కోలీవుడ్కు ఎంట్రీ ఇచ్చారు. ఆ తరువాత సూర్య, ధనుష్ వంటి స్టార్ హీరోలతో జతకట్టి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటీవల ధనుష్ దర్శకత్వం వహించిన నిలవుక్కు ఎన్ మేల్ ఎన్నడీ కోపం చిత్రంలో ప్రత్యక పాటలో మెరిసి ప్రేక్షకులను అలరించారు. ఇటీవల ఆమెకు అవకాశాలు తగ్గాయనే చెప్పాలి.కాగా ఈమె తాజాగా నటించిన మేడిన్ కొరియా చిత్రం శుక్రవారం నుంచి నేరుగా నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఇలాంటి పరిస్థితుల్లో తాను చాలా విషయాలను ఎదుర్కొంటున్నానని ఓ ఇంటర్వ్యూలో ప్రియాంక మోహన్ పేర్కొన్నారు. విమర్శలతో పాటూ చాలా ట్రోలింగ్లు చేయడానికే ఓ టీమ్ పని చేస్తోందని ఆవేదనను వ్యక్తం చేశారు. తనపైనే కాకుండా పెద్ద పెద్ద హీరో హీరోయిన్లు గురించి ట్రోలింగ్ చేస్తున్నారన్నారు. డబ్బులిచ్చి మరీ ఇలా ట్రోలింగ్ ఎందుకు చేయిస్తున్నారో అర్థం కావడం లేదన్నారు.తాను జీవితంలో చాలా విషయాలు జరిగాయని, వాటి గురించి ఇప్పుడు పూర్తిగా వివరించడం ఇష్టం లేదన్నారు. అయితే అలాంటి విషయాలతో చాలా నేర్చుకుంటూ, తనను తాను మెరుగుపరచుకునే ప్రయత్నం చేస్తున్నానన్నారు. తనవరకు అయితే సినిమా ఇండస్ట్రీ అనేది స్థిరత్వం లేని పరిశ్రమ అన్నారు. ఇక్కడ ఏదైనా, ఎవరికై నా జరుగుతుందన్నారు. ఇక్కడ అణగదొక్కడానికి కొందరు ఉంటారని, అయితే జీవితంలో కిందపడితే అది ఒక మెట్టు పైకి ఎక్కడానికే అని తాను భావిస్తానని అన్నారు. ఇలా చాలా విషయాలను నేర్చుకుంటూ దాన్ని తన పనిలోనూ, జీవితంలోనూ ఉపయోగించుకుంటున్నానని ప్రియాంక మోహన్ పేర్కొన్నారు. -
ధురందర్ 2 టికెట్ రేటు రూ. 3100
భారీ అంచనాలతో విడుదలకు సిద్ధమైన ధురంధర్-2 సినిమా టికెట్ ధరల విషయంలో కొత్త రికార్డు సృష్టించింది. దేశంలోనే అత్యధిక టికెట్ ధరగా రూ.3100ను ఢిల్లీలోని ఐనాక్స్ మెగాప్లెక్స్లోని ఒక ప్రత్యేక స్క్రీన్లో ఫిక్స్ చేశారు. కేవలం 42 సీట్లు మాత్రమే ఉన్న ఈ స్క్రీన్లో ప్రీమియర్స్ కోసం ఈ రేటు అమలు చేస్తున్నారు. బుక్ మై షో చార్జీలతో కలిపితే ధర రూ.3145కి చేరుతుంది. ప్రస్తుతం అదే స్క్రీన్లో ప్రదర్శితమవుతున్న ది కేరళ స్టోరీ-2 టికెట్ ధర కేవలం రూ.500 మాత్రమే. అయితే ధురంధర్-2 క్రేజ్ కారణంగా ప్రీమియర్ షోలకు టికెట్ ధరను అమాంతం పెంచేశారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఇప్పటికే సగానికి పైగా టికెట్లు అమ్ముడయ్యాయి. దేశవ్యాప్తంగా ఒక రోజు ముందే పెయిడ్ ప్రివ్యూలు ప్లాన్ చేశారు. బెంగళూరులో కొన్ని స్క్రీన్లలో టికెట్ ధరలు రూ.800 వరకు ఉన్నాయి. హైదరాబాద్లో కూడా ఎప్పటిలాగే రేట్లు పెంచారు. సాయంత్రం 5 గంటలకే అన్ని ప్రాంతాల్లో ప్రీమియర్స్ ప్రారంభం కానున్నాయి. అడ్వాన్స్ బుకింగ్స్ అద్భుతంగా సాగుతున్నాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా 3 లక్షలకు పైగా టికెట్లు అమ్ముడయ్యాయి. -
ఇప్పటికీ భార్యనే డబ్బు అడుగుతా: శివకార్తికేయన్
తనకు డబ్బు కావాల్సి వస్తే భార్య దగ్గర చేయి చాస్తానంటున్నాడు తమిళ స్టార్ హీరో శివకార్తికేయన్. తన బ్యాంకులో ఎంత డబ్బుందన్న విషయం కూడా తనకు తెలియదని చెప్తున్నాడు. ఈయన నిర్మాతగా వ్యవహరించిన 'తాయ్ కిళవి' బాక్సాఫీస్ వద్ద బ్లాక్బస్టర్గా నిలిచింది. రాధికా శరత్కుమార్ ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రం రూ.50 కోట్ల మైలురాయిని దాటేసింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విజయోత్సవ సభలో శివకార్తికేయన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.చేయి చాచి అడుగుతాఆయన మాట్లాడుతూ.. పెళ్లయినప్పటి నుంచి నా ఆర్థిక వ్యవహారాలన్నీ భార్య ఆర్తియే చూసుకుంటోంది. నా అకౌంట్లో ఎంత డబ్బుందన్న విషయం కూడా నాకు తెలీదు. నేను ఎప్పుడు, ఏ ఖర్చు పెట్టాలన్నా తనను అడిగి తీసుకుంటాను. ఒక టికెట్ కొనాలన్నా కూడా తనను చేయి చాచి మనీ అడుగుతాను. అందుకు నేను ఏమీ బాధపడను, పైగా గర్వపడుతున్నాను. తన ముందుచూపు, దూరదృష్టి, పొదుపు చేసే వైఖరి వల్లే ఈరోజు నేను నిర్మాతగా సినిమాలు తీయగలుగుతున్నాను. వాళ్లందరికీ సినిమా అంకితంతను అవన్నీ చూసుకోకపోయుంటే ఇవేవీ సాధ్యమయ్యేవి కావు. రేపటికోసం జాగ్రత్తపడే ప్రతి మహిళకు మా సినిమా అంకితం. సంపాదన ఎంతున్నా సరే దానిలో ఎంతో కొంత వెనకేయాలనే ఆడవారు ఆలోచిస్తారు అని చెప్పుకొచ్చాడు. కాగా కొత్త డైరెక్టర్ శివకుమార్ మురుగేశన్ దర్శకత్వం వహించిన తాయ్ కిళవి ఫిబ్రవరి 27న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో సింగం పులి, అరుళ్ దాస్, బాల శరవణన్, ముత్తుకుమార్, రేచల్ రెబెకా, జార్జ్ మరియణ్ ప్రధాన పాత్రలు పోషించారు. నివాస్ కె.ప్రసన్న సంగీతం అందించాడు.చదవండి: భర్తకు విడాకులిచ్చిన హీరోయిన్ హన్సిక -
భర్తకు హన్సిక విడాకులు.. భరణం ఆశించని హీరోయిన్
హీరోయిన్ హన్సిక మొత్వానీ నాలుగేళ్ల వైవాహిక బంధానికి ముగింపు పలికింది. భర్త, వ్యాపారవేత్త సోహెల్ ఖతూరియా నుంచి విడాకులు తీసుకుంది. పరస్పర అంగీకారంతో విడిపోవాలని నిర్ణయించుకున్నామంటూ హన్సిక బాంద్రా ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించింది. దీంతో న్యాయస్థానం వీరికి విడాకులు మంజూరు చేసింది. భర్త నుంచి ఎలాంటి భరణం అడగకుండానే హన్సిక విడాకులు కోరడం గమనార్హం!రెండేళ్ల నుంచే వేర్వేరుగాతమ మధ్య చిన్న విషయాలు కూడా తగాదాలుగా మారుతున్నాయని, ఒకే ఇంట్లో ఉండటం కూడా కష్టంగా ఉందని హన్సిక పిటిషన్లో పేర్కొంది. 2024 జూలై 2 నుంచే వీరు విడివిడిగా జీవిస్తున్నట్లు హన్సిక తరపు న్యాయవాది కోర్టుకు వెల్లడించారు. కాగా హన్సిక 2022 డిసెంబర్ 4న సోహెల్ను పెళ్లాడింది. ఇది హన్సికకు మొదటి పెళ్లి కాగా అతడికి రెండోది కావడం గమనార్హం! హన్సిక - సోహెల్ వివాహ వేడుకకు రాజస్థాన్లోని జైపూర్ ప్యాలెస్ వేదికగా నిలిచింది. పెళ్లయి రెండేళ్లు కూడా కాకముందే దంపతుల మధ్య విభేదాలు మొదలయ్యాయి. దీంతో చాలాకాలంగా వేర్వేరుగా జీవిస్తున్న వీరు ఇప్పుడు విడాకులతో దూరమయ్యారు.సినిమాహన్సిక హిందీ సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్గా నటించింది. దేశముదురు అనే తెలుగు చిత్రంతో హీరోయిన్గా మారింది. తొలి సినిమాకే విశేషమైన గుర్తింపు తెచ్చుకుంది. కంత్రి, మస్కా, కందిరీగ, ఓ మై ఫ్రెండ్, దేనికైనా రెడీ, పవర్.. ఇలా అనేక సినిమాలు చేసింది. తెలుగులోనే కాకుండా తమిళ, మలయాళ, హిందీ భాషల్లోనూ మూవీస్ చేసింది.చదవండి: సర్జరీ ఫెయిల్, దేవుడి ముందు మోకరిల్లి: కమెడియన్ -
నాన్న చితికి అల్లుడి స్థానంలో నిలబడి నిప్పు పెట్టాడు: సింగర్
మలయాళ సింగర్ అమృత సురేశ్కు ప్రేమ కలిసి రావడం లేదు. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త (నటుడు బాల) కూతురు పుట్టాక విడాకులు తీసుకున్నాడు. ఆ సమయంలో ఒంటరితనంతో కుమిలిపోతున్న తనకు మ్యూజిక్ కంపోజర్ గోపీ సుందర్ దగ్గరయ్యాడు. కానీ, ఇది కూడా మూణ్నాళ్ల ముచ్చటే అయింది. ఈ జంట కొంతకాలానికే బ్రేకప్ చెప్పుకున్నారు. అయితే గోపీ సుందర్ తాను జీవితంలో మర్చిపోలేని ఓ పని చేశాడంటోంది.ప్రియుడి తల్లిని..అమృత సురేశ్ మాట్లాడుతూ.. కొన్నేళ్లపాటు నరకం, బాధ అనుభవించిన సమయంలో గోపీ సుందర్ నాకు సపోర్ట్గా నిలబడ్డాడు. మేము ఎంతో బాగా కలిసిపోయాం. ఎంతలా అంటే అతడి తల్లిని కూడా నేను నా తల్లిగానే భావించాను. అంతలా ఆ కుటుంబాన్ని ప్రేమించాను. ఇప్పటికీ అతడి కుటుంబంపై ప్రేమ అలాగే ఉంది. మా రిలేషన్షిప్ ఎప్పటికీ ఇలాగే కొనసాగాలనుకున్నాం. కానీ, అది జరగలేదు. అలా అని అతడెప్పుడూ నన్ను బాధపెట్టలేదు. అల్లుడి స్థానంలో నిలబడిమా నాన్న చనిపోయినప్పుడు ఒక కొడుకులా ముందు నిలబడి అంత్యక్రియలు జరిపించాడు. మా నాన్న చితికి అల్లుడి స్థానంలో నిలబడి నిప్పు పెట్టాడు. అది నేనెప్పటికీ మర్చిపోలేను. కానీ రానురానూ మేము కలిసి ఉండటం కష్టమని అర్థమైంది. గొడవపడుతూ కలిసుండటం కన్నా అర్థం చేసుకుని విడిపోవడమే మంచిదని భావించాం. ఇద్దరం విడిపోయాం. బర్త్డే, పండగల సమయంలో మాత్రం ఒకరినొకరం విష్ చేసుకుంటాం అని చెప్పుకొచ్చింది.పెళ్లిఅమృత సురేశ్ గతంలో నటుడు బాలాను ప్రేమించి పెళ్లి చేసుకుంది. 2010లో వివాహం చేసుకున్న వీరిద్దరికీ 2012లో కూతురు అవంతిక జన్మించింది. 2015లో భార్యాభర్తలిద్దరూ విడివిడిగా జీవిస్తున్నట్లు రూమర్స్ వచ్చాయి. చివరకు అవే నిజం చేస్తే 2019లో వీరు విడాకులు తీసుకున్నారు.చదవండి: చేసిన రెండు మూవీస్ ఫ్లాప్.. అయినా మరో బంపరాఫర్ -
విజయ్-త్రిష వ్యవహారం.. ఖుష్బూ ఆసక్తికర వ్యాఖ్యలు
గతకొన్ని రోజులుగా నటుడు, టీవీకే అధినేత విజయ్ , నటి త్రిషకు సంబంధించిన వార్తలు నెట్టింట వైరల్ అవుతోన్న విషయం తెలిసిందే. ఇటీవల వీరిద్దరూ కలిసి ఓ కార్యక్రమానికి వెళ్లడంతో ఆ వార్తలు ఊపందుకున్నాయి. తాజాగా ఈ అంశంపై సీనియర్ నటి,రాజకీయ నాయకురాలు ఖుష్భూ సుందర్ స్పందించారు. అది వాళ్ల పర్సనల్ విషయం అని, అది ప్రజలను ప్రభావితం చేయనంతవరకు ఇతరులు జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదన్నారు. తాజాగా ఆమె ఓ మీడియా ఏజెన్సీతో మాట్లాడుతూ.. ‘ఈ అంశం(త్రిష-విజయ్ల రిలేషన్)తో ప్రజలకు ఏమి సంబంధం ఉందో నాకు అర్థం కావడం లేదు. ఇది వారి వ్యక్తిగత జీవితం. అది ప్రభావితం చేస్తే, మనం దాని గురించి మాట్లాడవచ్చు. వారి వ్యక్తిగత జీవితానికి ప్రజలతో సంబంధం లేదు. ప్రజలు దీనిని ఎందుకు పెద్ద విషయంగా చూస్తున్నారు? వారు తమకు నచ్చినట్లుగా జీవితాన్ని కొనసాగిస్తారు. దాని వల్ల ప్రజలు ఏ విధంగానూ ప్రభావితం కారు’ అని ఖుష్భూ అన్నారు.త్రిష అంశం విజయ్ రాజకీయ జీవితంపై ప్రభావితం చూసే అవకాశం ఉందా అనే ప్రశ్నలు బదులుగా.. ‘ప్రజలు తెలివైన వాళ్లు. ఎవరికి, ఎందుకు ఓటు వేయాలో వాళ్లకు బాగా తెలుసు. పర్సనల్ లైఫ్ దానిని ప్రభావితం చేస్తుందని నేను అనుకోను. ఆయన నాయకుడైనా కాకపోయినా.. మనలాగే ఒక మనిషి. ప్రజల వ్యక్తిగత జీవితంతో అతనికి కూడా ఎలాంటి సంబంధం ఉండదు’ అని ఖుష్భూ చెపుకోచ్చింది. -
ఓటీటీకి మలయాళ సూపర్ హిట్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
మలయాళ చిత్రాలకు ఓటీటీలో ఫుల్ డిమాండ్ ఉంటోంది. అక్కడ సూపర్ హిట్ అయినా సినిమాలను డబ్ చేసి అన్ని భాషల్లో అందుబాటులోకి తీసుకొస్తున్నారు. తాజాగా మరో మలయాళ హిట్ మూవీ ఓటీటీకి వచ్చేందుకు సిద్ధమైంది. బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచిన మూవీ పెన్నుమ్ పోరాట్టమ్.తాజాగా ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్కు సిద్ధమైంది. ఈ చిత్రం మార్చి 13 నుంచి నెట్ఫ్లిక్స్ వేదికగా అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని ఓటీటీ సంస్థ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. ఈ చిత్రాన్ని మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో అందుబాటులో ఉండనుంది.ఈ సినిమాకు రాజేశ్ మాధవన్ దర్శకత్వం వహించారు. ఈ మూవీలో రాజేశ్ మాధవన్, రైనా రాధాకృష్ణన్, సుభాష్ చంద్రన్ కీలక పాత్రలు పోషించారు. కేరళలోని ఓ గ్రామం చుట్టూ తిరిగే కథాంశంగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఆ గ్రామంలోని రూల్స్ను ఓ యువతి, ఓ కుక్క ఎలా బ్రేక్ చేశారనే కోణంలో సెటైరికల్గా తెరకెక్కించారు. ఈ కామెడీ ఎంటర్టైనర్ ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి. Watch Pennum Porattum on Netflix, out 13 March, in Malayalam, Hindi, Tamil, Telugu and Kannada#PennumPorattumOnNetflix@dawn1720 @ArunCThampi22 @stkframes @binugeorgealex@akhilvishnu_vs— Netflix India South (@Netflix_INSouth) March 10, 2026 -
ఆయన్ని తట్టుకోలేను.. అందుకే 16 సినిమాలు తిరస్కరించా
ఇండస్ట్రీలో నటీనటులు అందరూ ఒకేలా ఉండరు. కొందరు వచ్చామా పనిచేశామా వెళ్లిపోయామా అన్నట్లు ఉంటారు. మరికొందరు మాత్రం తమ చర్యలతో తోటి నటీనటుల్ని చాలానే ఇబ్బందులు పెడుతుంటారు. తాజాగా తమిళ నటి సోనా.. ప్రముఖ కమెడియన్ వడివేలు గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. ఆయన వల్ల నరకం చూశానన చెప్పుకొచ్చింది. అందుకే 16 సినిమాల్లో ఆయనకు జంటగా నటించే అవకాశమొచ్చినా తిరస్కరించినట్లు మరోసారి స్పష్టం చేసింది.(ఇదీ చదవండి: మరోసారి నోరుజారిన రాజేంద్ర ప్రసాద్)'కుశేలన్ (తెలుగులో 'కథానాయకుడు') తర్వాత వడివేలుతో కలిసి నటించమని నాకు 16కు పైగా సినిమాల్లో ఛాన్సులు వచ్చాయి. అయితే వాటిని మర్యాదపూర్వకంగా తిరస్కరించాను. ఎందుకంటే నా ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడం నాకు ముఖ్యం. నిజాయితీగా చెప్పాలంటే ఆయనని నేను తట్టుకోలేనేమో అనిపించింది. ఓ రకంగా నరకం చూశాను. అందుకే ఆయనతో కలిసి నటించకూడదని నిర్ణయించుకున్నాను. దీని గురించి ఇంకా ఎక్కువగా మాట్లాడకపవడమే మంచిదని అనుకుంటున్నాను' అని సోనా చెప్పుకొచ్చింది.తమిళంలో నటి, నిర్మాతగా గుర్తింపు తెచ్చుకున్న సోనా.. ఎక్కువగా శృంగార తరహా పాత్రలే చేసింది. రజనీకాంత్ హీరోగా నటించిన కుశేలన్ చిత్రం తెలుగులో కథానాయకుడు పేరుతో రిలీజైంది. మూవీ ఇక్కడ ఫ్లాప్ అయినప్పటికీ.. ఇందులో కొన్ని సీన్స్ బాగానే ఉంటాయి. సోనా-వడివేలు కాంబినేషన్లోని కామెడీ సీన్స్ వర్కౌట్ అయ్యాయి. అయితే సెట్లో సోనాని వడివేలు ఎంతలా ఇబ్బంది పెట్టాడో ఏమో గానీ ఇలా ఇప్పుడు ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. వడివేలుపై గతంలోనూ పలువురు నటీనటులు ఇలాంటి ఆరోపణలే చేశారు. అందుకే చాన్నాళ్ల పాటు సినిమాలకు దూరమయ్యాడు. కొన్నాళ్ల క్రితమే సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టాడు. అడపాదడపా మూవీస్ చేస్తున్నారు. మళ్లీ ఇలాంటి టైంలో సోనా, వడివేలుపై చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి. సోనా తెలుగులోనూ ఆయుధం, వీడే, విలన్, ఆంధ్రావాలా తదితర సినిమాలు చేసింది. ప్రస్తుతానికైతే తమిళ, మలయాళ మూవీస్లోనే కనిపిస్తోంది.(ఇదీ చదవండి: రెమ్యునరేషన్ ఇవ్వట్లేదు.. టాలీవుడ్ హీరోయిన్ ఆవేదన) -
పర్సనల్ లైఫ్ జడ్జ్ చేయడానికి మీరెవరు?.. విజయ్- త్రిష వివాదంపై స్టార్ డైరెక్టర్
కోలీవుడ్లో విజయ్- త్రిష పేర్లే ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్నాయి. విజయ్ భార్య విడాకుల పిటిషన్ దాఖలు చేయడంతో ఒక్కసారిగా త్రిష పేరు తెరపైకొచ్చింది. ఇటీవల వీరిద్దరు జంటగా ఓ వివాహానికి కూడా హాజరు కావడంతో మరింత హాట్ టాపిక్గా మారింది. ఇప్పటికే త్రిషపై కోలీవుడ్ దర్శకుడు పార్తిబన్ చేసిన కామెంట్స్ తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఆ తర్వాత దర్శకుడు తన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పారు.తాజాగా విజయ్- త్రిష వివాదంపై ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ విక్రమ్ భట్ స్పందించారు. మనం కేవలం నటీనటుల సినిమాల గురించి మాత్రమే చర్చించాలని సూచించారు. వారి వ్యక్తిగత జీవితాలపై చర్చించే హక్కు.. వారిని జడ్జ్ చేసే రైట్ మనకు లేదన్నారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తాజాగా ఈ వివాదం కోలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకూ హాట్ టాపిక్గా మారింది..విక్రమ్ భట్ తన పోస్ట్లో రాస్తూ.. ' విజయ్- త్రిషల వ్యక్తిగత జీవితాలపై చర్చ జరుగుతోంది. సోషల్ మీడియాలో వస్తోన్న రూమర్స్ నిజమో, కాదో నాకు తెలియదు. ఒకవేళ అవి నిజమైతే నేను కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నా. వారిద్దరూ ఎంతో హుందాగా ఉన్నారు. ఏ విషయాన్ని దాచిపెట్టడం లేదు. ఇప్పుడు వాళ్లను ఎంతోమంది జడ్జ్ చేస్తున్నారు. ఆ ఇద్దరి గురించి మాట్లాడేవారంతా ఒక్కసారి ప్రశ్నించుకోవాలి. నటీనటుల సినిమాలు మాత్రమే మనం చూడాలి. వారి పర్సనల్ లైఫ్ గురించి మనకు అవసరం లేదు' అని రాసుకొచ్చారు.కాగా.. ఇటీవల రూ.30కోట్ల చీటింగ్ కేసు విషయంలో విక్రమ్ భట్ జైలుకు వెళ్లిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో విక్రమ్, అతడి భార్య శ్వేతాంబరి భట్లకు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఈ దంపతులు దాదాపు రూ.30 కోట్ల మోసానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. -
'ఆర్ఆర్ఆర్'కి నాటునాటు.. 'వారణాసి'కి లాటిన్ స్టయిల్!
ఆర్ఆర్ఆర్ సినిమాలోని 'నాటు-నాటు' పాట అప్పట్లో ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఆస్కార్ వేదికపై కూడా మెరిసింది ఈ పాట. అది తెలుగు సినీ పరిశ్రమకు గర్వకారణమైంది. అయితే ఇప్పుడు దర్శకధీరుడు రాజమౌళి మరోసారి అలాంటి మ్యాజిక్ను రిపీట్ చేయాలని ప్రయత్నిస్తున్నాడట. రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న వారణాసిలో ఓ ప్రత్యేకమైన డాన్స్ నంబర్ ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఈ పాటను లాటిన్ స్టయిల్లో తెరకెక్కించాలని ఆయన భావిస్తున్నారని సీనియర్ కొరియోగ్రాఫర్ శంకర్ వెల్లడించారు. మహేష్ బాబు, ప్రియాంక చోప్రా జంటపై తెరకెక్కనున్న ఈ పాట కోసం వందలమంది లాటిన్ డాన్సర్లను తీసుకురావాలని రాజమౌళి ఆలోచిస్తున్నాడట.నాటు-నాటు తరహాలోనే, వారణాసిలో లాటిన్ స్టయిల్లో సాగే ఈ పాట కూడా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించనుంది. ఇప్పటికే వారణాసి టైటిల్ గ్లింప్స్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. తాజాగా కొరియోగ్రాఫర్ వ్యాఖ్యలతో అంచనాలు మరింత పెరిగాయి. జార్జియాలోని షెడ్యూల్ను పూర్తి చేసుకొని మహేష్ బాబు హైదరాబాద్కి తిరిగొచ్చాడు. ఎయిర్పోర్టులో ఆయన కొత్త లుక్ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. త్వరలోనే అంటార్కిటికాలో కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుంది. హీరోయిన్ ప్రియాంక చోప్రా స్వయంగా ఈ విషయం వెల్లడించింది. వారణాసి అంటార్కిటికాలో షూటింగ్ జరుపుకోనున్న తొలి తెలుగు చిత్రంగా గుర్తింపు పొందనుంది. -
మిషన్ నొక్కితే డబ్బే డబ్బు.. కాన్ సిటీ టీజర్ చూశారా?
డబ్బులేమైనా చెట్లకు కాస్తున్నాయా? అన్న డైలాగ్ ఎప్పుడో ఒకసారి వినే ఉంటారు. ఆ మాట నిజమైతే బాగుండు అనుకునేవాళ్లూ లేకపోలేదు. దాదాపు అలాంటి కాన్సెప్ట్తో వస్తున్న తమిళ సినిమా "కాన్ సిటీ". కాకపోతే ఇక్కడ డబ్బులు చెట్లకు కాకుండా ఓ మిషన్కు కాస్తున్నాయి. అవును, బటన్ నొక్కితే చాలు లిమిట్ అనేదే లేకుండా ఎన్నిసార్లంటే అన్నిసార్లు డబ్బులు ప్రింట్ చేస్తూనే ఉంది.డబ్బులు ప్రింట్ చేసే మిషన్సోమవారం సాయంత్రం కాన్సిటీ తెలుగు టీజర్ రిలీజ్ చేశారు. ఇందులో.. డబ్బులు ఎప్పుడు తిరిగిస్తావని ఓ గంభీర స్వరం ఫోన్లో హీరోను నిలదీస్తుంది. దాంతో అసహనానికి లోనైన హీరో వస్తువులన్నింటినీ కిందపడేస్తాడు. అప్పుడే ఒక మిషన్ను సైతం కిందపడేయబోతాడు. సరిగ్గా అదే సమయంలో ఒక పిడుగు పడి యంత్రం ఆన్ అవుతుంది, అందులో నుంచి రూ.500 నోటు బయటకు వస్తుంది. ఇంకేముంది.. నొక్కిన ప్రతిసారి నోట్ల వర్షం కురుస్తూనే ఉంటుంది.చేతులు మారిన యంత్రందాంతో ఆ డబ్బంతా బ్యాగులో సర్దుకున్న హీరో ఆ యంత్రాన్ని జాగ్రత్తగా అల్మారాలో పెడతాడు. కట్ చేస్తే బట్టలు సర్దే సమయంలో భార్యకు ఆ మిషన్ కనిపిస్తుంది. బటన్ నొక్కితే డబ్బు వస్తుండటంతో దాన్ని తీసుకెళ్లి వంటగదిలో దాచేస్తుంది. అక్కడి నుంచి అది హీరో తల్లి చేతికి వెళ్తుంది. ఆమె దాన్ని పూజగదిలో దేవుడి ఫోటో వెనకాల భద్రపరుస్తుంది. తర్వాత సడన్గా మిషన్ కనిపించకుండా పోతుంది. వీధిలో నోట్ల వర్షంఇంటిల్లిపాది అంతా వెతుకుతారు. తీరా చూస్తే హీరో కొడుకు ఆ యంత్రంతో బాల్కనీలో ఆడుకుంటాడు. ఇంకేముంది, నడిరోడ్డులో డబ్బుల వర్షం.. దాన్ని దక్కించుకునేందుకు వీధిలో జనం ఎగబడుతుంటారు. మరిం తర్వాతేం జరిగిందో తెలియాలంటే కాన్ సిటీ చూడాల్సిందే! హరీశ్ దురైరాజ్ దర్శకత్వం వహించిన ఈ డిఫరెంట్ మూవీకి సేన్ రోల్డన్ సంగీతం అందించాడు. అర్జున్ దాస్, అన్నాబెన్, యోగిబాబు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ తమిళ చిత్రాన్ని టీ సిరీస్ తెలుగులో తీసుకురానుంది. -
రూ.50 కోట్లు కొల్లగొట్టిన రాధిక శరత్ కుమార్ మూవీ
ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా అలరించిన రాధిక శరత్కుమార్ ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తోంది. అయితే 'తాయ్ కిళవి' కోసం ఆమె ముసలమ్మగా నటించింది. ఈ మూవీ నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ చేసినప్పటినుంచి మంచి బజ్ క్రియేట్ చేసింది. 75 ఏళ్ల బామ్మగా రాధిక నటించడం, హీరో శివకార్తికేయన్ నిర్మాతగా వ్యవహరించడంతో సినిమాకు పాజిటివ్ బజ్ ఏర్పడింది. శివకుమార్ మురుగేశన్ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఫిబ్రవరి 27న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.హాఫ్ సెంచరీపాజిటివ్ రివ్యూలతో తొలిరోజు నుంచే బాక్సాఫీస్పై మంచి పట్టు సాధించింది. కేవలం పది రోజుల్లోనే రూ.50 కోట్ల క్లబ్లో చేరిపోయింది. ఈ విషయాన్ని చిత్రయూనిట్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా తాయ్ కిళవి రూ.50 కోట్లు వసూలు చేసిందంటూ పోస్టర్ రిలీజ్ చేసింది. ఇక సినిమా రిలీజైనప్పటినుంచి టాప్ హీరోలు, దర్శకుడు, హీరోయిన్లు అందరూ సినిమాను, ముఖ్యంగా రాధికను ప్రశంసిస్తూ పోస్టులు పెడుతూనే ఉన్నారు. #ThaaiKizhavi crosses ₹50 Crore Worldwide GBOC in just 10 days! 💥Overwhelmed by the incredible love and support from everywhere. Thank you for making it a #MegaBlockbusterThaaiKizhavi ❤️#MorattuVasool@Siva_Kartikeyan @Sudhans2017 @KalaiArasu_ @SKProdOffl… pic.twitter.com/4aKJASW3hg— Sivakarthikeyan Productions (@SKProdOffl) March 9, 2026 చదవండి: వానిటీ వ్యాన్స్, వాష్రూమ్స్ ఏవీ లేవు: నటి -
జన నాయగన్కు మరో షాక్.. స్క్రీనింగ్ వాయిదా..!
కోలీవుడ్ స్టార్ విజయ్ హీరోగా వస్తోన్న మూవీ జన నాయగన్. పొలిటికల్ ఎంట్రీ తర్వాత విజయ్ నటించిన చివరి చిత్రం ఇదే. ఈ ఏడాది సంక్రాంతికి రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం.. సెన్సార్ బోర్డ్ వివాదంతో వాయిదా పడుతూ వస్తోంది. ఇప్పటికీ ఈ మూవీకి సెన్సార్ బోర్డ్ రివైజింగ్ కమిటీ క్లియరెన్స్ ఇవ్వకపోవడంతో జన నాయగన్ రిలీజ్ మరింత ఆలస్యమవుతోంది. అయితే తాజాగా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ రివైజింగ్ కమిటీ ఈ మూవీని సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు రివ్యూ చేయాల్సి ఉంది. కానీ ఊహించని విధంగా జన నాయగన్ రివైజింగ్ కమిటీ స్క్రీనింగ్ వాయిదా పడింది. కమిటీలోని ఓ సభ్యుడు అనారోగ్యానికి గురి కావడంతో వాయిదా వేయాల్సి వచ్చింది. చివరి నిమిషంలో ప్రదర్శన రద్దు చేశారు. దీని వల్ల సినిమా సర్టిఫికేషన్ ప్రక్రియ మరింత ఆలస్యం కానుంది. ఇప్పటికే పలుసార్లు వాయిదా పడుతూ వస్తోన్న జన నాయగన్ మేకర్స్కు మరోసారి నిరాశే ఎదురైంది. అయితే దీనిపై సెన్సార్ బోర్డ్ సభ్యులు మరింత క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. అయితే స్క్రీనింగ్ కోసం మరో తేదీని కేటాయిస్తారో? లేదో తెలియాల్సి ఉంది. కాగా.. ఈ చిత్రంలో మమిత బైజు, బాబీ డియోల్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, ప్రకాష్ రాజ్, ప్రియమణి, పూజా హెగ్డే, నరైన్ కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రం జనవరి 9న విడుదల కావాల్సిన ఉన్నా వాయిదాల పర్వం కొనసాగుతోంది. అయితే గతేడాది రివ్యూ చేసిన సెన్సార్ బోర్డ్ కొన్ని సవరణలు సూచించింది. అయినప్పటికీ కొన్ని మతపరమైన అంశాలు, సాయుధ దళాల లోగోలను ఉపయోగించడంపై సెన్సార్ కమిటీ సభ్యుడు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ మూవీని మరోసారి సెన్సార్ చేయాలని రివైజింగ్ కమిటీ స్క్రీనింగ్కు పంపారు. ప్రస్తుతం ఈ ప్రక్రియ మరింత ఆలస్యమవుతోంది. -
లైంగిక వేధింపుల కేసు.. మంజుమ్మెల్ బాయ్స్ డైరెక్టర్కు ఊరట
మలయాళ సూపర్ హిట్ మూవీ మంజుమ్మెల్ బాయ్స్ డైరెక్టర్ చిదంబరానికి ఊరట లభించింది. లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో ఆయన బెయిల్ లభించింది. కొన్ని కఠినమైన షరతులతో ఎర్నాకుళం జిల్లా సెషన్స్ కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. 2022లో దర్శకుడు తనపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది.దీంతో మంజుమ్మెల్ బాయ్స్ డైరెక్టర్పై ఎర్నాకుళం పోలీసులు కేసు నమోదు చేశారు. 2022లో కొచ్చిలోని ఒక అపార్ట్మెంట్లో చిత్రనిర్మాత తనతో అనుచితంగా ప్రవర్తించాడని మహిళ తన ఫిర్యాదులో ఆరోపించింది అయితే చిదంబరం మంజుమ్మెల్ బాయ్స్ తెరకెక్కించే సమయంలో ఆమెను కలిశానని.. కేవలం ఆమెను ఒక పాత్ర కోసం మాత్రమే పరిగణించారని చెప్పారు. ఆమె ప్రవర్తన తన ప్రతిష్టను దెబ్బతీసేలా ఉందని తన పిటిషన్లో పేర్కొన్నారు. దీంతో చిదంబరం తరఫున వాదనలు విన్న న్యాయస్థానం ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. -
ఆమె గొప్ప హీరోయిన్.. ఇలా సినిమాల్ని వదిలేయడం బాధాకరం!
బాలనటిగా వెండితెరకు పరిచయమైంది. నేరం అనే ద్విభాషా(తమిళ, మలయాళ) చిత్రంతో హీరోయిన్గా మారింది. రాజా రాణి సినిమాతో ఎక్స్ప్రెషన్స్ క్వీన్గా పేరు తెచ్చుకుంది నజ్రియా నజీమ్. ఈ ఒక్క మూవీతో సౌత్లో సెన్సేషన్ అయిపోయింది. ఆ క్రేజ్తోనే వరుసగా సినిమాలు చేసింది. 2014వ సంవత్సరంలో నాలుగు మలయాళ మూవీస్లో మెరిసింది.పెళ్లి తర్వాత సినిమాలకు దూరం!అదే ఏడాది ఆగస్టులో మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ను పెళ్లి చేసుకుని సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. పన్నెండేళ్ల కాలంలో మలయాళంలో కేవలం నాలుగంటే నాలుగే సినిమాలు చేసింది. అందులోనూ ఒకటి గెస్ట్ రోల్! నజ్రియా మలయాళంలో అదే స్పీడుతో సినిమాలు చేసుంటే బాగుండేదంటోంది సీనియర్ నటి ఊర్వశి.ఫహద్ గొప్ప యాక్టర్తాజాగా ఊర్వశి మాట్లాడుతూ.. నా ఫేవరెట్ యాక్టర్ ఫహద్ ఫాజిల్. అతడెప్పుడూ హీరోయిజం చూపించే పాత్రలు చేయడు. తన గుండును విగ్గుతో కవర్ చేయడానికీ ప్రయత్నించడు. తను తనలాగే ఉంటాడు. ఏ పాత్ర ఇచ్చినా అద్భుతంగా చేస్తాడు. ఎమోషనల్ సీన్స్లో చాలా బాగా నటిస్తాడు. ఇంకాస్త గట్టిగా కష్టపడితే తనకు మంచి కెరీర్ ఉంది. బసిల్ జోసెఫ్ కూడా గొప్ప నటుడే!నజ్రియా గొప్ప నటిహీరోయిన్స్ విషయానికి వస్తే మీరా జాస్మిన్, నవ్య నాయర్.. ఇలా చాలా మంది మంచి పర్ఫామెన్స్ ఇస్తారు. కానీ, నజ్రియా సినిమాల్లో యాక్టివ్గా ఉండుంటే తనంత గొప్ప నటి మరొకరు ఉండేవారు కాదు. పల్లెటూరి అమ్మాయి, మోడ్రన్ గర్ల్, తెలివైన యువతి.. ఇలా అన్ని రకాల పాత్రలు ఇట్టే చేయగలదు. తనకు మంచి టాలెంట్ ఉంది.. అయినా ఇలా సినిమాలను వదిలేయడం కాస్త విచారకరంగా అనిపిస్తుంది అని ఊర్వశి చెప్పుకొచ్చింది. నజ్రియా అంటే సుందరానికి సినిమాతో టాలీవుడ్లో డైరెక్ట్ ఎంట్రీ ఇచ్చింది.చదవండి: ధురంధర్ 2 తర్వాత ఆ సినిమాకు సంతకం చేసిన సారా అర్జున్? -
థియేటర్లలో మళ్లీ కాంచన.. రీ రిలీజ్ ఎప్పుడంటే?
తమిళ స్టార్, దర్శకుడు రాఘవ లారెన్స్ స్వీయ డైరెక్షన్లో తెరకెక్కించిన చిత్రం కాంచన(ముని-2). 2011లో రిలీజైన ఈ హీరర్ థ్రిల్లర్ అభిమానులను ఓ రేంజ్లో భయపెట్టేసింది. ముని సిరీస్లో వచ్చిన రెండో చిత్రమే కాంచన. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. ఈ చిత్రంలో శరత్ కుమార్, కోవై సరళ, లక్ష్మీ రాయ్, దేవదర్శిని, శ్రీమాన్ ప్రధాన పాత్రల్లో నటించారు.దాదాపు 15 ఏళ్ల తర్వాత ఈ మూవీని మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. సరికొత్త 4కె వర్షన్లో ఈ సినిమాను రీ రిలీజ్ చేస్తున్నారు. ఈనెల 13న కాంచన థియేటర్లలో విడుదల కానుంది. ఈ చిత్రాన్ని హార్రర్- కామెడీ నేపథ్యంలో తెరకెక్కించారు. ఈ చిత్రానికి అప్పట్లోనే రూ.7 కోట్ల బడ్జెట్తో రూపొందించారు. ఈ మూవీ రీ రిలీజ్కు సంబంధించిన టికెట్స్ బుకింగ్స్ త్వరలోనే ప్రారంభం కానున్నాయి. #Kanchana4K Grand Re - Releasing on March 13th 🔥More Details SoonTHE FIRST EVER HORROR RE-RELEASE MOVIE IN TELUGU🤕BOOKING OPENING TODAY..#ThamanS@offl_Lawrence @iamlakshmirai @MusicThaman @D_films09 #nellore @DayaArjun2 @NelloreSSMBFC_ pic.twitter.com/uHuDVYCvld— rkfilmsnlr (@rkfilmsnlr) March 9, 2026 -
విడాకులు.. తాగుడుకు బానిసయ్యా.. చావే దిక్కనుకున్నా!
విడాకుల బాధ భరించలేక మద్యపానానికి బానిసయ్యానంటున్నాడు మలయాళ నటుడు భగత్ మాన్యుయెల్. చావు అంచులదాకా వెళ్లిన తనను స్నేహితులే కాపాడారని చెప్తున్నాడు. భగత్ మాన్యుయెల్ గతంలో డాలియాను పెళ్లి చేసుకున్నాడు. వీరికి 2017లో బాబు పుట్టాడు. కొంతకాలానికి భార్యాభర్తల మధ్య భేదాభిప్రాయాలు రావడంతో విడిపోయారు. అనంతరం 2019లో జుంబా ట్రైనర్ షెలిన్ చెరిన్ను పెళ్లి చేసుకున్నాడు. ప్రస్తుతం తనతో సంతోషంగా ఉంటున్నాడు.లవ్ మ్యారేజ్మొదటి పెళ్లి గురించి భగత్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన తర్వాతే నేను పెళ్లి చేసుకున్నాను. మాది ప్రేమ వివాహం. మా దాంపత్యానికి గుర్తుగా బాబు పుట్టాడు. మేము విడాకులు తీసుకుంటామని కలలో కూడా అనుకోలేదు. మా బంధం తెగిపోయిన విషయాన్ని జీర్ణించుకోలేకపోయాను. తాగడం మొదలుపెట్టాను. నా కొడుకు బాధ్యత నేనే తీసుకున్నాను. ఏరోజూ ఒంటరిగా..వాడి బాగోగులు మా అమ్మానాన్నే చూసుకున్నారు. నేను సమస్యలతో సతమతమవుతున్న సమయంలో నా ఫ్రెండ్స్ అందరూ బిజీగా ఉన్నారు. వాళ్లందరూ నేను కూడా బిజీగా ఉన్నానని అనుకున్నారు. కానీ ఒంటరిగా కూర్చుని తాగుతూ ఉండేవాడిని. జీవితం నా చేతుల్లోంచి చేజారిపోయింది. చచ్చిపోవాలనుకున్నాను. తర్వాత నా పరిస్థితి తెలుసుకుని స్నేహితులే నన్ను ఆ బాధ నుంచి బయటకు తీసుకొచ్చారు. ఆరేడునెలలపాటు నన్ను ఏ రోజూ ఒంటరిగా వదిలేయలేదు.ఆటోలోనే షూటింగ్కు..ఏడేళ్ల క్రితం నేను మళ్లీ పెళ్లి చేసుకున్నాను. నా భార్య నాకెంతో సపోర్ట్గా నిలబడింది. కరోనా సమయంలో అమ్మకు ఆరోగ్యం బాగోలేకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయి. నా ఫ్రెండ్స్ వల్లే అమ్మ ఈరోజు జీవించి ఉంది. ఇప్పుడు నాకు కారు కూడా లేదు. ఆటో, బస్సుల్లోనే షూటింగ్స్కు వెళ్తున్నాను అని చెప్పుకొచ్చాడు. భగత్.. మలర్వాడి ఆర్ట్స్ క్లబ్, మాస్టర్స్, ఉస్తాద్ హోటల్, ఆడు 2, గూడలోచన, మందారం, ఉయరె, ఫోనిక్స్, గెట్ సెట్ బేబీ వంటి పలు మలయాళ చిత్రాల్లో నటించాడు.చదవండి: ముక్కలైన జీవితాన్ని మళ్లీ నిర్మించుకున్నా: హంసనందిని -
త్రిషపై అనుచిత కామెంట్స్.. సారీ అంటూ పోస్ట్
కోలీవుడ్ స్టార్ విజయ్ విడాకుల వివాదం తెరపైకి వచ్చాక అనూహ్యంగా హీరోయిన్ త్రిష పేరు వైరలవుతోంది. విజయ్కు అమెతో రిలేషన్ ఉందంటూ ఆయన భార్య సంగీత ఆరోపించడంతో ఈ వివాదం మరింత ముదిరింది. ఇదిలా ఉండగా కోలీవుడ్ సీనియర్ నటుడు, దర్శకుడు త్రిషపై అనుచిత కామెంట్స్ చేశారు. ఓ ఈవెంట్లో పొన్నియిన్ సెల్వన్'లోని త్రిష చేసిన కుందవై పాత్రని ప్రస్తావిస్తూ.. 'ఈ కుందవై కొన్నాళ్ల పాటు ఇంట్లోనే ఉండాలి. బయటకు రావొద్దు. అలా చేస్తే ఇలాంటి సమస్యలు రావు' అని వ్యంగ్యంగా కామెంట్స్ చేశారు.ఇది కోలీవుడ్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీనిపై హీరోయిన్ త్రిష కూడా అదేస్థాయిలో ఇచ్చిపడేసింది. ఆ నటుడికి అసలు బుర్రనే లేదంటూ ఎద్దేవా చేసింది. దీంతో ఈ వివాదం మరింత ముదిరింది. ఈ నేపథ్యంలో పార్తిబన్ స్పందించారు. ఈ మేరకు ఆయన క్షమాపణలు కోరారు. ఇప్పుడు జరిగిన దానికి నేనే సారీ చెప్పడం తప్ప వేరే మార్గం లేదంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ వివాదానికి ఇకపై ఫుల్స్టాప్ పడినట్లే.అసలేం జరిగిందంటే..తాజాగా ఓ మూవీ ఈవెంట్లో యాంకర్ మాట్లాడుతూ.. త్రిష గురించి అభిప్రాయం చెప్పాలని పార్తిబన్ని అడిగింది. 'పొన్నియిన్ సెల్వన్'లోని త్రిష చేసిన కుందవై పాత్రని ప్రస్తావిస్తూ.. 'ఈ కుందవై కొన్నాళ్ల పాటు ఇంట్లోనే ఉండాలి. బయటకు రావొద్దు. అలా చేస్తే ఇలాంటి సమస్యలు రావు' అని అన్నాడు. అయితే పార్తిబన్ చేసిన వ్యాఖ్యలు.. త్రిషని అవమానించేలా ఉన్నాయని పలువురు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా.. మరికొందరు మాత్రం ఆయన సరదాగానే అన్నాడని, మిగతా వాళ్లు తప్పుగా అర్థం చేసుకుంటున్నారని అంటున్నారు.పార్తిబన్ విషయానికొస్తే.. యుగానికి ఒక్కడు, నేనూ రౌడీనే, పొన్నియన్ సెల్వన్, పొన్నియన్ సెల్వన్ 2 తదితర సినిమాల్లో నటించాడు. తెలుగులోనూ 'రచ్చ'లో చరణ్ తండ్రిగా చేశాడు. ఇతడు నటించిన 'ఉస్తాద్ భగత్ సింగ్' అనే తెలుగు మూవీ త్వరలోనే థియేటర్లలోకి రానుంది. నటి సీతని 1990లో పెళ్లి చేసుకున్న పార్తిబన్.. 2001లో ఆమెకు విడాకులు ఇచ్చేశాడు. -
రీమేక్ల కాలం ముగిసింది.. ఒరిజినల్ కథలే ఆయుధం
ఒకప్పుడు రీమేక్ హక్కులు దక్కించుకోవడం అంటే నిర్మాతలు గర్వంగా చెప్పుకునేవారు.అది వారకి ఎంతో గర్వకారణం. మినిమం గ్యారెంటీ అనే భరోసా కూడా ఉండేది. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు ఒక సినిమా రీమేక్ చేస్తున్నారని తెలిసిన వెంటనే ప్రేక్షకులు ఒరిజినల్ వెర్షన్ను చూసి పోల్చడం అలవాటుగా మారింది. దాంతో ఈ పోలికల్లో సినిమాలోని లోపాలు ఎక్కువగా బయటపడటంతో రీమేక్ చేస్తున్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద విఫలమవుతున్నాయి. ఇటీవల సూర్య హీరోగా నటిస్తున్న ‘విశ్వనాధ్ అండ్ సన్స్’ చిత్ర యూనిట్ తమ సినిమా మలయాళ నటుడు పృధ్వీరాజ్ సుకుమారన్ నటించిన కంగారూ రీమేక్ అని వచ్చిన ప్రచారంతో తీవ్రంగా ఇబ్బంది పడింది. ఆ సినిమా పోస్టర్లు ఒకేలా కనిపించడంతో ఈ పుకారు మొదలైంది. దాంతో వెంటనే యూనిట్ మీడియా ముందుకు వచ్చింది. తమ సినిమా ఒరిజినల్ కథతో వస్తోందని స్పష్టం చేశారు. అలాగే పవన్ కళ్యాణ్ నటించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రాజెక్ట్ కూడా మొదటి నుంచి ‘తేరి’ రీమేక్ అని ప్రచారం నడిచింది. ఇప్పుడు విడుదల సమయం దగ్గరపడుతున్న కొద్దీ దర్శకుడు ప్రతి ఇంటర్వ్యూలోనూ ఇది రీమేక్ కాదని సుదీర్ఘంగా వివరణలు ఇస్తున్నాడు. ప్రేక్షకులు ఇప్పుడు పొరుగు రాష్ట్రంలో హిట్ అయితే ఏంటి గొప్ప? అని ప్రశ్నిస్తున్నారు.సోషల్ మీడియా విజృంభనతో రీమేక్ విషయాలు దాచిపెట్టడం అసాధ్యం అయ్యింది.రీమేక్ అని తెలిసిన వెంటనే ట్రోలింగ్ మరింత పెరిగింది.ఫలితంగా నిర్మాతలు రీమేక్లకు పూర్తిగా దూరమవుతున్నారు. ఇప్పుడు ఎక్కడైనా తమ సినిమా రీమేక్ అని ప్రచారం జరిగితే చిత్ర యూనిట్లు వెంటనే మీడియా ముందుకొచ్చి ఖండించడం మొదలుపెట్టాయి. రీమేక్ అనే ముద్ర పడకుండా కిందామీద పడుతున్నారు. మొత్తానికి రీమేక్ల కాలం ముగిసింది. ఒరిజినల్ కథలే ఇప్పుడు ప్రేక్షకులను ఆకర్షించే ప్రధాన ఆయుధం. -
నటుడు పార్తిబన్ పరువు తీసేసిన త్రిష.. ట్వీట్ వైరల్
హీరోయిన్ త్రిష రీసెంట్ టైంలో పెద్దగా సినిమాలు చేయలేదు. అయినా సరే సోషల్ మీడియా అంతా ఈమె గురించే మాట్లాడుకుంటున్నారు. విజయ్తో ఈమె రిలేషన్లో ఉందనే రూమర్సే దీనికి కారణం. ఎక్కడా ఈ విషయాన్ని అధికారికం చేయనప్పటికీ.. దాదాపు అందరూ వీళ్లిద్దరి గురించే మాట్లాడుకుంటున్నారు. తమిళ నటుడు పార్తిబన్ కూడా వీళ్ల బంధం గురించి పరోక్షంగా అర్థం వచ్చేలా చిల్లర కామెంట్స్ చేశాడు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలపై త్రిష ఘాటుగా స్పందించింది. ఈ మేరకు ట్వీట్ చేసింది.శనివారం రాత్రి చెన్నైలో జరిగిన ఓ అవార్డ్ వేడుకలో నటుడు దర్శకుడు పార్తిబన్, త్రిష గురించి మాట్లాడుతూ.. ఆమె ఇంట్లో ఉంటేనే మంచిది. బయటకు వస్తే ఎక్కడలేని సమస్యలన్నీ వస్తున్నాయి అని అన్నాడు. ఈ వ్యాఖ్యల పట్ల సోషల్ మీడియాలోనూ గట్టిగానే విమర్శలు వస్తున్నాయి. ఇప్పుడీ విషయం కాస్త త్రిష వరకు చేరడంతో ఆమె కుడా ఆగ్రహం వ్యక్తం చేసింది. పార్తిబన్కి అసలు బుర్ర లేదనేలా రాసుకొచ్చింది.'ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో నా పేరు, ఫొటో చేర్చుతున్నామని చివరి నిమిషంలో నిర్వాహకులు సమాచారం ఇచ్చారు. ఓ వ్యక్తి తన సహాయుకుడిని పంపించి నన్ను అడిగారు. అయితే మైక్రోఫోన్లో మాట్లాడినంత మాత్రాన అది తెలివైన వ్యాఖ్య లేదా కామెడీనో అవదు. అది కేవలం మూర్ఖత్వాన్ని ఎక్కువ వినిపించేలా చేస్తుంది. జ్ఞానం లేకుండా మాట్లాడే అసభ్య పదాలు, అవి ఎవరిని లక్ష్యంగా చేసుకున్నాయో అనేదాని కంటే మాట్లాడిన వ్యక్తి తత్వాన్ని బయటపెడతాయి' అని త్రిష ట్వీట్ చేసింది. పార్తిబన్కి అసలు బుర్ర లేదు అని అర్థం వచ్చేలా త్రిష రాసుకొచ్చింది. -
పెళ్లి వద్దన్నాడు, ఆరోజు బోరున ఏడ్చాడు: విజయ్ మేనమామ
చాలామంది పెళ్లంటేనే జంకుతారు. మ్యారేజ్ అనేది మాకు సెట్టవదు, దాని జోలికి వెళ్లమని బీరాలు పలుకుతారు. కానీ అందరికంటే ముందు వారే పెళ్లిపీటలెక్కుతారు. హీరో విజయ్ దేవరకొండ విషయంలోనూ ఇదే జరిగింది. వివాహం అంటే నాలుగడుగులు వెనక్కు వేసే విజయ్ ఫిబ్రవరి 26న రష్మిక మెడలో మూడు ముళ్లు వేశాడు. అయితే గతంలో మాత్రం తనకు పెళ్లి సెట్ అవదని అంటుంటేవాడని విజయ్ మేనమామ, నటుడు, నిర్మాత యశ్ రంగినేని చెప్తున్నాడు.పెళ్లి వద్దని..తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన విజయ్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు. యశ్ రంగినేని మాట్లాడుతూ.. విజయ్ పెళ్లి గురించి పాజిటివ్గా ఉండేవాడు కాదు. కెరీర్ చూసుకోకుండా పెళ్లి అవసరమా? అనేవాడు. కానీ, రష్మిక పరిచయమయ్యాక అతడి ఆలోచన విధానమే మారిపోయింది. డియర్ కామ్రేడ్ నుంచి విరోష్ (విజయ్- రష్మిక) మధ్య ప్రేమ మొదలైంది. ఇంట్లో చెప్పగానే..ఇప్పుడు వాళ్లిద్దరినీ జంటగా చూస్తుంటే చూడముచ్చటగా అనిపిస్తుంది. విరోష్ పెళ్లి పట్ల మేమంతా సంతోషంగా ఉన్నాం. విజయ్.. రష్మికతో ప్రేమలో ఉన్నానని చెప్పినప్పుడు ఇంట్లో కొంత కంగారుపడ్డారు. ఎందుకంటే ఇండస్ట్రీలో ఏదో ఒక కుటుంబంలో ఏదో ఒక గొడవ(విడాకులు) జరుగుతూనే ఉంది. ఆ భయమైతే మా అందరిలో ఉంది. విజయ్ అమ్మానాన్న ఈ విషయం గురించి మాట్లాడారు. కానీ రష్మిక చాలా మంచి అమ్మాయి. తలరాత చెప్పలేంఈ జంటను చూస్తే తర్వాతెలా ఉంటారో? ఏంటో? అన్న అనుమానమే రాదు. వాళ్లిద్దరి మధ్య అంత మంచి అనుబంధం ఉంది. జంటగా సంతోషంగా ఉన్నారు. కానీ, తలరాత ఎలా ఉంటుందో మనం చెప్పలేం. అయితే ఇద్దరూ జీవితాంతం సంతోషంగా ఉండాలన్నదే మా అందరి కోరిక. విజయ్ను రౌడీ బాయ్లా చూస్తారు. కానీ తను చాలా ఎమోషనల్. టాక్సీవాలా రిలీజ్కు రెండురోజుల ముందే సినిమా మొత్తం లీకైంది. దుఃఖం ఆపుకోలేక..ఆ విషయం తెలిసి విజయ్ బోరున ఏడ్చాడు. ఇక రిలీజ్ చేయడం వృథా అనుకుంటున్న సమయంలో విజయ్ పోరాడి సినిమాను విడుదల చేయించాడు. తీరా అది పెద్ద హిట్టయింది. ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి ఇంత ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. ఎవరైనా ఏదైనా సాధించొచ్చు అని ఈ జనరేషన్కు ఒక నమ్మకాన్ని తీసుకొచ్చాడు అని యశ్ చెప్పుకొచ్చాడు.చదవండి: ఆ ఫోన్ రాకపోయుంటే చనిపోయేవాడిని: నాగమణికంఠ -
త్రిషపై చిల్లర కామెంట్స్.. నోరు జారిన సీనియర్ నటుడు
తమిళనాడులో ఓవైపు ఎన్నికల హడావుడి ఉంది. మరోవైపు స్టార్ హీరో విజయ్ వైవాహిక బంధం గురించి పెద్ద చర్చే నడుస్తోంది. రీసెంట్గానే ఇతడి భార్య సంగీత, కోర్టులో విడాకుల పిటిషన్ దాఖలు చేసింది. ఓ నటితో తన భర్తకు అక్రమ సంబంధం ఉందనే కారణాన్ని పిటిషన్లో పేర్కొంది. ఇదలా ఉండగానే త్రిషతో కలిసి విజయ్ ఏకంగా ఓ పెళ్లికి వెళ్లడం టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీ అయిపోయింది. వీళ్లిద్దరి మధ్య ఏముందనేది కాలమే నిర్ణయిస్తుంది. ఇంతలోనే తమిళ నటుడు, దర్శకుడు పార్తిబన్.. త్రిషపై దారుణమైన వ్యాఖ్యలు చేశాడు.(ఇదీ చదవండి: నిశ్చితార్థం చేసుకున్న హీరో బెల్లంకొండ శ్రీనివాస్)తాజాగా ఓ మూవీ ఈవెంట్లో యాంకర్ మాట్లాడుతూ.. త్రిష గురించి అభిప్రాయం చెప్పాలని పార్తిబన్ని అడిగింది. 'పొన్నియిన్ సెల్వన్'లోని త్రిష చేసిన కుందవై పాత్రని ప్రస్తావిస్తూ.. 'ఈ కుందవై కొన్నాళ్ల పాటు ఇంట్లోనే ఉండాలి. బయటకు రావొద్దు. అలా చేస్తే ఇలాంటి సమస్యలు రావు' అని అన్నాడు. అయితే పార్తిబన్ చేసిన వ్యాఖ్యలు.. త్రిషని అవమానించేలా ఉన్నాయని పలువురు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా.. మరికొందరు మాత్రం ఆయన సరదాగానే అన్నాడని, మిగతా వాళ్లు తప్పుగా అర్థం చేసుకుంటున్నారని అంటున్నారు.ఏదేమైనా పార్తిబన్ లాంటి ఓ సీనియర్ నటుడు, దర్శకుడు.. త్రిష లాంటి హీరోయిన్ గురించి పబ్లిక్గా ఇలా మాట్లాడటం సరికాదనే అభిప్రాయం పలువురు నెటిజన్ల నుంచి వ్యక్తమవుతోంది. గతంలోనూ ఈ నటుడు హీరోయిన్ల గురించి నోరు జారిన సందర్భాలు ఉన్నాయి. ప్రస్తుతం సినిమాలో కథ ఉందా? లేదా అనేది ప్రేక్షకులు చూడటం లేదు. హీరోయిన్ డ్యాన్స్ కోసమే సినిమాలు చూస్తున్నారు. తమన్నా ఉంటే చాలు.. కథ లేకపోయినా ఫర్వాలేదు.. సినిమా హిట్టవుతుంది అని అన్నారు. తర్వాత తన మాటలపై విమర్శలు రావడంతో క్షమాపణ చెప్పుకొచ్చాడు.పార్తిబన్ విషయానికొస్తే.. యుగానికి ఒక్కడు, నేనూ రౌడీనే, పొన్నియన్ సెల్వన్, పొన్నియన్ సెల్వన్ 2 తదితర సినిమాల్లో నటించాడు. తెలుగులోనూ 'రచ్చ'లో చరణ్ తండ్రిగా చేశాడు. ఇతడు నటించిన 'ఉస్తాద్ భగత్ సింగ్' అనే తెలుగు మూవీ త్వరలోనే థియేటర్లలోకి రానుంది. నటి సీతని 1990లో పెళ్లి చేసుకున్న పార్తిబన్.. 2001లో ఆమెకు విడాకులు ఇచ్చేశాడు.(ఇదీ చదవండి: విడాకుల గురించి తొలిసారి స్పందించిన విజయ్)Parthiban attacks Trisha😝“Intha Kunthavai ah veetukullaye Kunthavaikirathu nalathu”😀pic.twitter.com/X5St5Ycnvk— Christopher Kanagaraj (@Chrissuccess) March 8, 2026 -
10 రోజులకే అన్ని కోట్లా? కమల్కు కళ్లు చెదిరే పారితోషికం
రెండేళ్ల క్రితం వచ్చిన కల్కి 2898 ఏడీ బాక్సాఫీస్ వద్ద సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ కళాఖండంలో ప్రభాస్ హీరోగా అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె, కమల్ హాసన్ ప్రముఖ పాత్రలు పోషించారు. దాదాపు రూ.600 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ చిత్రం రెట్టింపు స్థాయిలో వసూళ్లు రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.1200 కోట్లు వసూలు చేసింది.రెమ్యునరేషన్కే అంత బడ్జెట్అయితే ఈ బడ్జెట్లో ఎక్కువ భాగం తారల రెమ్యునరేషన్కే సరిపోయిందని అప్పట్లో వార్తలు వినిపించాయి. ప్రభాస్ రూ.150 కోట్లు తీసుకోగా అమితాబ్, బిగ్బీ, దీపికా పదుకొణె చెరో రూ.20 కోట్లు తీసుకున్నట్లు ప్రచారం జరిగింది. అంతలోనే సౌత్ ఇండియా స్టార్ కమల్ హాసన్ ఏకంగా రూ.100 కోట్ల మేర పుచ్చుకున్నట్లు సోషల్ మీడియాలో కథనాలు చక్కర్లు కొట్టాయి. అయితే ఇవేవీ కాదు, అంతకుమించి పారితోషికం తీసుకున్నాడని తమిళ నటుడు యుగి సేతు వెల్లడించాడు.10 రోజులకే అన్ని కోట్లా?తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. కమల్ సర్ కల్కి సినిమాలో 20 రోజుల కాల్షీట్లకు గానూ రూ.150 కోట్లు తీసుకున్నాడు. ఆయన దేశంలోనే అత్యధిక పారితోషికం తీసుకుంటున్న నటుడు అని కమల్ బర్త్డేరోజే చెప్పాను. ఓసారి కల్కి నిర్మాత అశ్వినీదత్ను కలిశాను. నా స్నేహితుడిని అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న వ్యక్తిగా మార్చినందుకు థాంక్యూ సర్..20 రోజులు ఎక్కడ?20 రోజులకు రూ.150 కోట్లు ఇచ్చారంటే మామూలు విషయం కాదన్నాను. వెంటనే ఆయన కలగజేసుకుని నాకు 20 రోజులు ఎక్కడిచ్చారు, 10 రోజుల డేట్సే ఇచ్చారు అని చెప్పాడు. అప్పటిదాకా కమల్ రోజుకు సుమారు రూ.8 కోట్లు సంపాదించాడనుకున్నాను, కానీ రోజుకు రూ.15 కోట్లు ఇచ్చారని తర్వాతే తెలిసింది అని యుగి పేర్కొన్నాడు.సినిమాబ్లాక్బస్టర్గా నిలిచిన కల్కి 2898 ఏడీకి ప్రస్తుతం సీక్వెల్ తెరకెక్కుతోంది. ఫస్ట్ పార్ట్లో ఉన్న స్టార్ నటీనటులందరూ సెకండ్ పార్ట్లోనూ కనిపించనున్నారు. దీపికా పదుకొణెను మాత్రం సీక్వెల్ నుంచి తప్పించారు. ఈ రెండో భాగంలో కమల్ హాసన్ పోషించిన సుప్రీం యాస్కిన్ క్యారెక్టర్కు ఎక్కువ నిడివి దక్కనుంది.చదవండి: అదృష్టవంతురాలిని.. కన్నీళ్లు ఆగడం లేదు: తనూజ -
కథ కలిపింది
ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక్కోసారి ఒక్కో ట్రెండ్ కనిపిస్తుంటుంది. ఇటీవల పాన్ ఇండియా ట్రెండ్ కనిపించింది. పాన్ వరల్డ్ (భారతీయ భాషలతో పాటు విదేశీ భాషల్లోనూ సినిమా రిలీజ్ కావడం) ట్రెండ్ కూడా ఊపందుకుంది. ఇప్పుడు మల్టీస్టారర్ మూవీ ట్రెండ్ మరోసారి ఊపందుకుంది. ఇలా ఏ కథ ఏయే స్టార్స్ని కలిపింది? ఆ సినిమాల విశేషాలపై ఓ లుక్ వేయండి...కాకాజీతో మోహన్లాల్ మల్టీస్టారర్ మూవీస్ చేయడానికి చిరంజీవి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ‘వాల్తేరు వీరయ్య’ సినిమాలో చిరంజీవి హీరోగా నటించగా, ఇందులో రవితేజ కీలక పాత్రలో నటించారు. బాబీ డైరెక్ట్ చేసిన ఈ సినిమా సూపర్ హిట్గా నిలిచింది. ఈ ఏడాది చిరంజీవి హీరోగా నటించిన ‘మన శంకరవరప్రసాద్గారు’ బ్లాక్బస్టర్గా నిలిచింది. ఇందులో వెంకటేశ్ ఓ కీ రోల్ చేశారు. అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన సినిమా ఇది. ఇలా కథలో స్కోప్ ఉంటే చిరంజీవి సినిమాలో మరో స్టార్ హీరో కూడా నటిస్తున్నారు. మరోసారి ఈ అవకాశం ఉన్నట్లుగా తెలిసింది.‘వాల్తేరు వీరయ్య’ వంటి హిట్ ఫిల్మ్ తర్వాత చిరంజీవి, దర్శకుడు బాబీ కాంబోలో ఓ సినిమా రానుంది. పక్కా మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్గా రానున్న ఈ సినిమాలో కథ రీత్యా మరో హీరోకు చాన్స్ ఉందని తెలిసింది. ఈ రోల్లో తొలుత ఓ తెలుగు హీరోను అనుకున్నప్పటికీ ఫైనల్గా మలయాళ నటుడు మోహన్లాల్ ఫైనలైజ్ అయ్యారని ఫిల్మ్నగర్ సమాచారం. తండ్రీకూతుళ్ల ఎమోషనల్ డ్రామాగా రూపొందనున్న ఈ సినిమాలో చిరంజీవి భార్య పాత్రలో ప్రియమణి, చిరంజీవి కుమార్తెగా అనస్వరా రాజన్ కనిపిస్తారని తెలిసింది. ఇక మోహన్లాల్ పోలీస్ ఆఫీసర్ రోల్లో నటిస్తారని టాక్.చిరంజీవి వంటి స్టార్ హీరో, తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులైన మోహన్లాల్ ఒకే ఫ్రేమ్లో కనిపిస్తే ఆడియన్స్ కచ్చితంగా ఆ సినిమాను ఎంజాయ్ చేస్తారని చెప్పవచ్చు. ఇక ఈ సినిమా చిత్రీకరణను ఈ ఏడాది మార్చిలోనే స్టార్ట్ చేయాలనుకున్నారు. కానీ ఇటీవల చిరంజీవి భుజానికి చిన్న సర్జరీ జరిగిన నేపథ్యంలో సినిమా చిత్రీకరణను ఈ నెల ఆరంభించడంలేదట.ఏప్రిల్లోనే ఈ సినిమా చిత్రీకరణను స్టార్ట్ చేసి, వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేయాలని మేకర్స్ ΄్లాన్ చేస్తున్నారని తెలిసింది. కెవీఎన్ ప్రోడక్షన్స్ పతాకంపై వెంకట్ కె. నారాయణ ఈ సినిమాను నిర్మించనున్నారు. ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా తొలుత ఏఆర్ రెహమాన్ పేరు వినిపించినప్పటికీ ఇటీవల తమన్ పేరు తెరపైకి వచ్చింది. అలాగే ఈ సినిమాకు ‘కాకా, కాకాజీ’ అనే టైటిల్ను పరిశీలిస్తున్నారని టాక్. అయితే ఈ విషయాలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. సంక్రాంతి సోగ్గాళ్ళు ‘మనం’ సినిమాలో నాగార్జున, నాగచైతన్య కలిసి నటించారు. ఈ చిత్రం క్లైమాక్స్లో అఖిల్ కూడా కనిపించారు. అలా ఒకే ఫ్రేమ్లో నాగార్జున, నాగచైతన్య, అఖిల్ కనిపించగానే అక్కినేని అభిమానులు ఫుల్ హ్యాపీ ఫీలయ్యారు. అలాంటిది ఒకే సినిమాలో ఫుల్ లెంగ్త్ రోల్స్లో నాగార్జున, నాగచైతన్య, అఖిల్ కలిసి నటిస్తే అక్కినేని ఫ్యాన్స్కు అంతకుమించిన ఆనందం ఏముంటుంది. ఇదంతా సాధ్యమయ్యే సానుకూల పరిస్థితులు కనిపిస్తున్నాయి. కల్యాణ్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ‘సోగ్గాడే చిన్ని నాయనా’ ఫ్రాంచైజీ నుంచి మూడో భాగం రానుందని తెలిసింది.తొలి భాగంలో నాగార్జున హీరోగా నటించగా, మలి భాగంలో నాగార్జున–నాగచైతన్య కలిసి నటించారు. లేటెస్ట్ మూవీలో నాగార్జున–నాగచైతన్య–అఖిల్ కలిసి హీరోలుగా నటించనున్నారని తెలిసింది. ‘వాసివాడి తస్సాదియ్యా.. వచ్చే 15 జనవరి 2027 సంక్రాంతికి సోగ్గాళ్ళు వస్తే పండగ ఇంకా కలర్ఫుల్గా ఉంటాది కదా... డేట్ మార్క్ చేసుకోండి’’ అని ఫిబ్రవరి 9న అన్నపూర్ణ స్టూడియో సంస్థ ‘ఎక్స్’లో పోస్ట్ చేసింది. ఇది... ‘సోగ్గాడే చిన్ని నాయనా’ సినిమా ఫ్రాంచైజీలోని థర్డ్ పార్ట్ మూవీకి సంబంధించినదే అని, ఈ సినిమా వచ్చే సంక్రాంతికి రిలీజ్ అవుతుందనే ప్రచారం తెరపైకి వచ్చింది. అంతేకాదు... ఈ చిత్రంలో నాగార్జున–నాగచైతన్య–అఖిల్ కలిసి నటించనున్నారనే టాక్ కూడా తెరపైకి వచ్చింది.ప్రస్తుతం ఆర్కే కార్తీక్ డైరెక్షన్లో ‘కింగ్ 100’ అనే సినిమా చేస్తున్నారు నాగార్జున. ఇది నాగార్జున కెరీర్లోని వందో సినిమా. ఈ సినిమా చిత్రీకరణ పూర్తయిన తర్వాత ‘సోగ్గాడే చిన్నినాయనా’ ఫ్రాంచైజీలోని కొత్త సినిమా షూటింగ్లో నాగార్జున పాల్గొంటారని ఊహించవచ్చు. మరోవైపు ఇటీవల కాలంలో మల్టీస్టారర్ సినిమాలు చేసేందుకు నాగార్జున ఆసక్తి చూపిస్తున్నారు.రణ్బీర్ కపూర్ ‘బ్రహ్మాస్త్ర’, ధనుష్ ‘కుబేర’ చిత్రాల్లో నాగార్జున లీడ్ రోల్స్ చేశారు. అలాగే నాగార్జున మెయిన్ హీరోగా, అల్లరి నరేశ్, రాజ్ తరుణ్ ఇతర ప్రధాన పాత్రధారులుగా ‘నా సామి రంగ’ సినిమా వచ్చింది. ఇలా కథ నచ్చితే, మల్టీస్టారర్ సినిమాలు చేసేందుకు నాగార్జున సుముఖంగా ఉన్నట్లే తెలుస్తోంది. ఇక గతంలో వెంకటేశ్తో కలిసి ‘వెంకీ మామ’ చిత్రం చేశారు నాగచైతన్య. అలాగే ఆమిర్ ఖాన్ హీరోగా నటించిన ‘లాల్ సింగ్ చద్దా’ మూవీలో నాగచైతన్య ఓ కీ రోల్ చేసిన సంగతి గుర్తుంటే ఉంటుంది. బామ్మర్ది బాల్రెడ్డి టాలీవుడ్లో మల్టీస్టారర్ సినిమాలు చేయడంలో ముందు వరుసలో ఉంటారు హీరో వెంకటేశ్. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ (వెంకటేశ్–మహేశ్బాబు), ‘మసాల’ (వెంకటేశ్–రామ్), ‘గోపాల గోపాల’ (వెంకటేశ్–పవన్కల్యాణ్), ‘ఎఫ్ 2, ఎఫ్ 3’ (వెంకటేశ్–వరుణ్ తేజ్) వంటి చిత్రాలే ఇందుకు నిదర్శనం. ఇటీవల చిరంజీవి హీరోగా నటించిన ‘మన శంకరవరప్రసాద్గారు’ చిత్రంలో వెంకటేశ్ ఓ రోల్లో నటించిన సంగతి తెలిసిందే. తాజాగా మరో మల్టీస్టారర్ సినిమాకు గ్రీన్సిగ్నల్ ఇచ్చారు వెంకటేశ్. ‘ఎఫ్ 2, ఎఫ్ 3, సంక్రాంతికి వస్తున్నాం’ వంటి బ్లాక్బస్టర్ చిత్రాల తర్వాత హీరో వెంకటేశ్, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్లో మరో సినిమా రానుంది. ఈ చిత్రంలో కల్యాణ్రామ్ మరో హీరోగా నటించనున్నారు.ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రోడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. స్క్రిప్ట్ ప్రిపరేషన్లో బిజీగా ఉన్నారు అనిల్ రావిపూడి. జూలైలో ఈ సినిమా షూట్ను స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయనున్నట్లుగా ఆల్రెడీ మేకర్స్ ప్రకటించారు. అయితే ఈ సినిమాను ఎవరు నిర్మించబోతున్నారనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. డి. సురేష్బాబు, సాహు గారపాటి వంటి నిర్మాతల పేర్లు తెరపైకి వచ్చాయి. అలాగే ఈ సినిమా బావా బామ్మర్దిల మధ్య నడిచే కథ అని, రాయలసీమ నేపథ్యంలో కథనం సాగుతుందని, ఈ చిత్రానికి ‘బామ్మర్ది బాల్రెడ్డి’ అనే టైటిల్ను అనుకుంటున్నారనే టాక్ తెరపైకి వచ్చింది. అంతేకాదు... ఈ సినిమాలో వెంకటేశ్ సరసన కీర్తీ సురేష్ హీరోయిన్గా నటిస్తారనే ప్రచారం సాగుతోంది. ఈ విషయాలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఏకే 47లో... వెంకటేశ్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెంబరు 47 – ఏకే47’. వెంకటేశ్ కెరీర్లోని ఈ 77వ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటిస్తున్నారు. కాగా, ఈ చిత్రంలోని మరో కీలక పాత్రలో నారా రోహిత్ నటించనున్నారని సమాచారం. ఎస్. రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమా ఈ ఏడాదే థియేటర్స్లో రిలీజ్ కానుంది. ఎవరు హీరో? సూపర్ స్టార్ హీరోలు రజనీకాంత్, కమల్హాసన్ వారి కెరీర్ స్టార్టింగ్లో ‘ఆపూర్వ రాగంగళ్, మూండ్రు ముడిచ్చు, 16 వయదినిలే, నినైత్తాలే ఇనిక్కుమ్’ వంటి చిత్రాల్లో కలిసి నటించారు. వీరి కాంబినేషన్లో దాదాపు ఇరవై సినిమాలొచ్చాయి. కానీ ‘అలావుద్దీనుమ్ అద్భుత విళక్కుమ్’ చిత్రం తర్వాత రజనీకాంత్, కమల్హాసన్ కాంబోలో మరో సినిమా రాలేదు. ఆ సమయం ఇప్పుడు వచ్చింది. 47 సంవత్సరాల తర్వాత రజనీకాంత్, కమల్హాసన్ కలిసి ఓ మల్టీస్టారర్ సినిమా చేయనున్నారు. రజనీకాంత్ దర్శకుడిగా ‘జైలర్’ సినిమా తీసి, సూపర్ హిట్ సాధించి, మళ్లీ రజనీకాంత్తోనే ‘జైలర్ 2’ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్న నెల్సన్ దిలీప్కుమార్ ఈ మల్టీస్టారర్ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు.ఇటీవల ఈ సినిమా ప్రోమోను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ ప్రోమోలో కమల్హాసన్, రజనీ కాంత్ ‘ఈ సినిమాలో ఎవరు హీరో’ అని దర్శకుడు నెల్సన్ను అడగటం, నెల్సన్ సైలెంట్గా ఉండటంతో ప్రోమో కంప్లీట్ కావడం చూశాం. అయితే రజనీకాంత్–కమల్హాసన్ లేటెస్ట్ కాంబో మూవీలో ఎవరు మెయిన్ హీరోగా నటిస్తారనే చర్చ కోలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. ఇక ఈ సినిమా గురించి ఇద్దరి హీరోల ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాను రెడ్ జెయింట్ మూవీస్ సంస్థ నిర్మించనుంది. త్వరలోనే ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది.వచ్చే ఏడాది వేసవి తర్వాత ఈ మూవీ రిలీజ్ కావొచ్చు. మరోవైపు రజనీకాంత్ కెరీర్లోని 173వ సినిమాను కమల్హాసన్ నిర్మిస్తున్నారు. సిబి చక్రవర్తి ఈ సినిమాకు దర్శకుడు. రజనీకాంత్ హీరోగా నటించనున్న ఈ చిత్రంలో కమల్హాసన్ ఓ గెస్ట్ రోల్ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. ఇదే నిజమైతే... రజనీకాంత్–కమల్హాసన్ ఒకే ఫ్రేమ్లో ఉన్న సినిమాలు బ్యాక్ టు బ్యాక్ స్క్రీన్పైకి వస్తాయని ఊహించవచ్చు. పేట్రియాట్ 1980, 1990లలో మలయాళ స్టార్ హీరోలు మోహన్లాల్, మమ్ముట్టి కలిసి దాదాపు 50 సినిమాలు చేశారు. కానీ 2008లో వచ్చిన ‘ట్వంటీ:20’ చిత్రం తర్వాత మోహన్లాల్–మమ్ముట్టి కాంబినేషన్లో మరో సినిమా రావడానికి, వారి అభిమానులు 18 సంవత్సరాలు ఎదురుచూడాల్సి వచ్చింది. ‘ట్వంటీ:20’ మూవీ తర్వాత మోహన్లాల్, మమ్ముట్టి కలిసి ‘పేట్రియాట్’ అనే సినిమా చేస్తున్నారు. అలాగే ఈ చిత్రంలోనే ఫాహద్ ఫాజిల్, కుంచాకో బోబన్, నయనతార, రేవతి వంటి స్టార్ యాక్టర్స్ కూడా నటిస్తున్నారు.దేశభక్తి ప్రధానాంశంగా రూపొందుతున్న ఈ సినిమాలో మోహన్లాల్ మిలటరీ ఆఫీసర్ పాత్రలో నటిస్తుండగా, మమ్ముట్టి మిస్టరీ రోల్లో నటిస్తున్నట్లుగా టీజర్ స్పష్టం చేస్తోంది. మహేశ్ నారాయణన్ దర్శకత్వంలో ఈ సినిమాను ఆంటో జోసెఫ్, కేజీ అనిల్కుమార్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఈ ఏడాది ఏప్రిల్ 23న రిలీజ్ కానుంది. మరోవైపు ‘లూసీఫర్, లూసీఫర్ 2, బ్రో డాడీ’ వంటి సూపర్హిట్ చిత్రాల్లో మోహన్లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్ కలిసి నటించిన సంగతి తెలిసిందే. ఈ ఇద్దరు స్టార్ యాక్టర్స్ మరోసారి స్క్రీన్ షేర్ చేసుకోనున్నారు.పృథ్వీరాజ్ సుకుమారన్ మెయిన్ లీడ్ రోల్ చేస్తున్న ‘ఖలీఫా’ చిత్రంలో మోహన్లాల్ ఓ కీలక పాత్ర పోషించనున్నారు. ఈ విషయం గురించి ఆల్రెడీ అధికారిక ప్రకటన వచ్చింది. కృతీ శెట్టి హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో మలయాళ యువ హీరో టోవినో థామస్ మరో లీడ్ రోల్ చేస్తున్నారని మాలీవుడ్ సమాచారం. అరసన్ శింబు, విజయ్ సేతుపతి కలిసి నటిస్తున్న తమిళ సినిమా ‘అరసన్’. వెట్రిమారన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా కలైపులి ఎస్. థాను నిర్మిస్తున్నారు. ఆల్రెడీ ఈ సినిమా చిత్రీకరణ మొదలైంది. శింబు, విజయ్ సేతుపతి కాంబినేషన్లో కొన్ని సన్నివేశాల చిత్రీకరణ కూడా జరిగిందట. శింబు–విజయ్ సేతుపతిల కాంబోలో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు ఉన్నాయి. నార్త్ చెన్నై బ్యాక్డ్రాప్లో సాగే పీరియాడికల్ గ్యాంగ్స్టర్ మూవీ ఇది. వచ్చే ఏడాది ఈ సినిమాను రిలీజ్ చేయాలనుకుంటున్నారు.ఒకే ఇండస్ట్రీలోని స్టార్ హీరోలు కలిసి మల్టీస్టారర్ మూవీస్ చేస్తున్న సినిమాలు కొన్ని ఉన్నాయి. అయితే పాన్ ఇండియా ట్రెండ్ వచ్చిన తర్వాత వివిధ ఫిల్మ్ ఇండస్ట్రీలకు చెందిన స్టార్ హీరోలు ఒకే సినిమాలో నటించే ధోరణి స్పష్టంగా కనిపిస్తోంది. ప్రభాస్ మెయిన్ హీరోగా చేస్తున్న ‘కల్కి 2898 ఏడీ’ ఫ్రాంచైజీలో బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్, కోలీవుడ్ యాక్టర్ కమల్హాసన్ ఇతర మెయిన్ లీడ్ రోల్స్ చేస్తున్నారు. తెలుగు దర్శకుడు ప్రశాంత్ వర్మ నేతృత్వంలో ‘ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్’లోని లేటెస్ట్ మూవీ ‘జై హనుమాన్’.ఇందులో ‘కాంతార’ ఫేమ్ రిషబ్ శెట్టి హీరోగా నటిస్తున్నారు. కాగా ఈ మూవీలో టాలీవుడ్ హీరోలు ‘హను–మాన్’ ఫేమ్ యువ హీరో తేజ సజ్జా, రానా కీలక పాత్రల్లో నటిస్తున్నారని ఫిల్మ్నగర్ సమాచారం. టి సిరీస్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్ర ప్రారంభోత్సవం ఇటీవల హంపీలో జరిగిన తెలిసిందే. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ఆరంభం కానుంది. ఈ తరహాలో క్రాస్ ఓవర్ మల్టీస్టారర్ సినిమాలు మరికొన్ని ఉన్నాయి.ఇంకా నిర్మాణంలో ఉన్న మల్టీస్టారర్ మూవీస్ మరికొన్ని ఉన్నాయి. – ముసిమి శివాంజనేయులు -
చిరంజీవికి ఎన్టీఆర్ జాతీయ అవార్డు
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ సినీ నటుడు చిరంజీవికి 2025 సంవత్సరానికి గాను రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్ నేషనల్ ఫిల్మ్ అవార్డును ప్రకటించింది. అలాగే, పైడి జయరాజ్ అవార్డుకు సహజనటుడు కమల్ హాసన్ను ఎంపిక చేసింది. ఈ మేరకు 2025 సంవత్సరం గద్దర్ చలనచిత్ర అవార్డులను జ్యూరీ శనివారం మీడియా సమావేశంలో ప్రకటించింది. ఉత్తమ నటుడిగా నాగచైతన్య (తండేల్), ఉత్తమ నటిగా రష్మిక మందన్నా (ది గర్ల్ఫ్రెండ్)ను ఎంపిక చేసింది. అలాగే, తొలి ఉత్తమ చిత్రంగా రాజు వెడ్స్ రాంబాయి, ద్వితీయ ఉత్తమ చిత్రంగా ‘దండోరా’, తృతీయ ఉత్తమ చిత్రంగా ‘ద గ్రేట్ ప్రీవెడ్డింగ్ షో’ ఎంపికయ్యాయి. అలాగే, జాతీయ సమైక్యతను చాటే చిత్రంగా ‘తండేల్’ నిలిచింది. రఘుపతి వెంకయ్యనాయుడు అవార్డును ప్రసాద్ ఐ మ్యాక్స్ యజమాని రమేష్ప్రసాద్కు ప్రకటించారు. పలువురు పాతతరం వారికి స్పెషల్ అవార్డులను ప్రకటించారు. ఈ పురస్కారాలను ఉగాది (ఈనెల 19న) పర్వదినాన హైటెక్స్లో ప్రదానం చేయనున్నారు. మెయిన్ స్ట్రీమ్ అవార్డ్స్ అధ్యక్షుడిగా ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ వ్యవహరించారు. షార్ట్ ఫిలిమ్స్, డాక్యుమెంటరీ విభాగానికి కనకమేడల విజయకృష్ణ చైర్మన్ కాగా, పుస్తకాలు– సమీక్షల పరిశీలనకు తనికెళ్ల భరణి చైర్మన్గా వ్యవహరించారు. ప్రత్యేక అవార్డుల కమిటీకి తమ్మారెడ్డి భరద్వాజ అధ్యక్షుడిగా వ్యవహరించారు. జ్యూరీ 2025వ సంవత్సరానికి ఎంపిక చేసిన తుది జాబితాను ప్రజా భవన్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు, సమాచార శాఖ స్పెషల్ కమిషనర్ ప్రియాంక, జ్యూరీ సభ్యులు తనికెళ్ల భరణి, రోజా రమణి, మణిశర్మ, ప్రగతి తదితరులు అందచేశారు. అవార్డుల ఎంపిక ప్రక్రియ, ప్రదానోత్సవ నిర్వహణపై వారు చర్చించారు. అనంతరం చలన చిత్ర అభివృద్ధి సంస్థ కార్యాలయంలో జ్యూరీ పురస్కారాల జాబితాను ప్రకటించింది. -
విడాకుల గురించి తొలిసారి స్పందించిన విజయ్
తమిళ స్టార్ హీరో విజయ్ గురించి గత కొన్నిరోజులుగా సోషల్ మీడియాలో పెద్ద చర్చ నడుస్తోంది. ఇతడి భార్య సంగీత.. కోర్టులో విడాకుల కోసం పిటిషన్ వేయడం, త్రిషతో విజయ్కి రిలేషనే ఉందనే రూమర్స్ ఓ వైపు చక్కర్లు కొడుతుండగానే ఓ పెళ్లికి ఆమెతోనే కలిసి రావడం లాంటివి హాట్ టాపిక్ అయిపోయాయి. అలానే విడాకులు మంజూరు అయ్యేంతవరకు తనని ఇంట్లోనే ఉండనివ్వాలని చెప్పి సంగీత మరో పిటిషన్ వేయడం, భరణంగా రూ.250 కోట్లు ఇవ్వనున్నాడనే కామెంట్స్ చర్చనీయాంశమైపోతున్నాయి. ఇలాంటి టైంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా విజయ్.. తన విడాకులపై తొలిసారి స్పందించాడు.(ఇదీ చదవండి: బెస్ట్ ఎక్స్ బాయ్ఫ్రెండ్ని.. బ్రేకప్ తర్వాత చాలా ఏడ్చా: షణ్ముఖ్ జస్వంత్)అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా విజయ్.. తన టీవీకే పార్టీ ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించారు. తాము అధికారంలోకి వస్తే ఇవ్వబోయే సూపర్ సిక్స్ పథకాల గురించి వివరించారు. వీటితో పాటు తన విడాకుల వ్యవహారం గురించి కూడా పరోక్షంగా విజయ్ మాట్లాడారు.'నా జీవితంలో జరుగుతున్న పలు సంఘటనల గురించి మీరు కంగారు పడకండి. వాటి గురించి ఆలోచించి మీరు సమయాన్ని వృథా చేసుకోవద్దు. వాటిని నేను పరిష్కరించుకుంటాను. నా సమస్యల గురించి ఆలోచిస్తూ మీరు ఒత్తిడికి లోనవడం నన్ను మరింతగా బాధపెడుతోంది' అని విజయ్.. తన విడాకుల గురించి ఇన్ డైరెక్ట్గా మాట్లాడారు. ఇప్పుడీ వ్యాఖ్యలు, వీడియో వైరల్ అవుతున్నాయి.(ఇదీ చదవండి: 'ధురంధర్ 2'ని చూసి టాలీవుడ్ చాలా నేర్చుకోవాలి!)Recently, there have been a few problems happening. I see that you are getting hurt while fighting for it. I’m getting hurt seeing you guys getting hurt. I’ll take care of the problems. Don’t get hurt. Nothing to worry about..- #ThalapathyVijay's speech pic.twitter.com/8QFSWVjklU— Laxmi Kanth (@iammoviebuff007) March 7, 2026 -
త్రిష గతంలో ఎవర్ని ప్రేమించిందో తెలుసా?
హీరోయిన్ త్రిష రెండు దశాబ్దాలకు పైగా సినీప్రేక్షకులను అలరిస్తూ వస్తోంది. వర్షం సినిమాతో తెలుగులో సెన్సేషన్ సృష్టించిన ఈ బ్యూటీ తమిళంలో విజయ్ సరసన గిల్లిలో హీరోయిన్గా యాక్ట్ చేసి స్టార్ స్టేటస్ అందుకుంది. అలా తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో అనేక సినిమాలు చేసింది. 42 ఏళ్లు వచ్చినా ఇంకా పెళ్లి చేసుకోకుండా సింగిల్గానే ఉండిపోయింది. అయితే ఈ బ్యూటీ దళపతి విజయ్తో ప్రేమాయణం నడుపుతుందని చాలాకాలంగా రూమర్లు వస్తున్నాయి. ఇటీవల విజయ్, త్రిష జంటగా ఓ పెళ్లికి హాజరవడంతో ఈ ఊహాగానాలు మరింత బలపడ్డాయి. అయితే త్రిష విజయ్ కంటే ముందు వేరే హీరోలతో లవ్లో పడింది. ఆ కథేంలో ఇప్పుడు చూసేద్దాం..హీరోలతో లవ్త్రిష తమిళంలో పలువురు స్టార్స్తో ప్రేమాయణం నడిపినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. హీరో శింబుకి జోడీగా సినిమాలు చేస్తున్న సమయంలో ఇద్దరి మధ్య పరిచయం ముదిరి ప్రేమగా మొగ్గలు తొడిగిందట. బయటకు వెళ్లినప్పుడు కూడా చేతిలోన చెయ్యేసి మరీ నడిచేవారు.. కానీ ఈ ప్రేమ ఎంతోకాలం నిలవలేదు. ఆ తర్వాత దళపతి విజయ్తో ఎక్కువ సినిమాలు చేసిన సమయంలో వీరిద్దరూ డేటింగ్లో ఉన్నట్లు ప్రచారం జరిగింది. కానీ, కొంతకాలానికి ఆ రూమర్స్ దానంతటవే ఆగిపోయాయి.ప్రకంపనలు రేపిన సుచీలీక్స్అనంతరం త్రిష టాలీవుడ్ హీరో రానాకు క్లోజ్ అయింది. మొదట్లో వీరిద్దరూ క్లోజ్ ఫ్రెండ్స్. ఒకానొక సమయంలో ఈ స్నేహం ప్రేమగా మారింది. కొంతకాలం పాటు డేటింగ్లో ఉన్న వీరిద్దరూ తర్వాతెందుకో విడిపోయారు. కోలీవుడ్లో ప్రకంపనలు సృష్టించిన సుచీలీక్స్ వ్యవహారంలో త్రిష-రానా క్లోజ్ ఫోటో ఒకటి బయటకు రావడం అప్పట్లో సంచలనం రేపింది. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్తోనూ ప్రేమాయణం నడిపినట్లు అప్పట్లో కథనాలు వెలువడ్డాయి. త్రిష వల్లే ధనుష్- ఐశ్వర్య వైవాహిక జీవితంలో సమస్యలు వచ్చినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది.పెళ్లి క్యాన్సిల్వీటన్నింటికీ ఫుల్స్టాప్ పెడుతూ 2015లో పెళ్లికి రెడీ అయింది త్రిష. చెన్నైకి చెందిన వ్యాపారవేత్త వరుణ్తో ఆమె ఎంగేజ్మెంట్ జరిగింది. పెళ్లి చేసుకోవడమే ఆలస్యం అనుకుంటున్న తరుణంలో వివాహం రద్దు చేసుకున్నారు. పెళ్లయ్యాక సినిమాలు చేయకూడదని కండీషన్ పెట్టాడని, అది నచ్చకనే అతడిని పెళ్లి చేసుకోలేదని త్రిష ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. అయితే ధనుష్తో త్రిష అంత క్లోజ్గా ఉండటం నచ్చకే అతడు పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నాడని అంటుంటారు.విజయ్తో లవ్ఇప్పుడు మరోసారి విజయ్తో ప్రేమలో మునిగి తేలుతోంది త్రిష. విజయ్ నుంచి విడాకులు కోరుతూ కోర్టుకెక్కింది హీరో భార్య సంగీత. ఈ సమయంలో విజయ్తో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ అందరికీ తాము ప్రేమలో ఉన్నామని చెప్పకనే చెప్తోంది. మరి విజయ్- సంగీత విడాకులు తీసుకున్నాక వీరు ప్రేమను పెళ్లి బంధంతో బలపర్చుకుంటారేమో చూడాలి!చదవండి: నోటికి ఎంతొస్తే అంత అనేస్తారా? బుర్రసాయి మాధవ్కు వరలక్ష్మి శరత్కుమార్ కౌంటర్ -
కరీనా కపూర్లా చూపిస్తానన్నాడు.. అందుకే బికినీ ధరించా!
హీరోయిన్ ప్రియమణి సినీ జర్నీ తెలుగు సినిమాతోనే మొదలైంది. ఎవరే అతగాడు (2003) మూవీతో కథానాయికగా మారింది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో అనేక సినిమాలు చేసింది. తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ స్టేటస్ అందుకుంది. తాజాగా సరస్వతి సినిమాతో పలకరించింది.డైరెక్టర్ అడగడంతో..ఈ మూవీ ప్రమోషన్స్లో భాగంగా ఓ ఇంటర్వ్యూకి హాజరైంది ప్రియమణి. ఈ సందర్భంగా కెరీర్ తొలినాళ్లలో బికినీ ధరించిన ఘటన గురించి గుర్తు చేసుకుంది. ప్రియమణి మాట్లాడుతూ.. స్విమ్మింగ్ పూల్ దగ్గరకు చీర కట్టుకుని వెళ్లం కదా.. ఏది కంఫర్ట్గా ఉంటే ఆ దుస్తులే ధరిస్తాం. ద్రోణ సినిమాలో స్విమ్ సూట్ వేసుకోమని డైరెక్టర్ అడిగాడు. కరీనా కపూర్లా..టషన్ మూవీలో కరీనా కపూర్లా నిన్ను డిఫరెంట్గా చూపించాలనుకుంటున్నా అన్నాడు. ఇంతవరకు నేను ఎప్పుడూ స్విమ్సూట్ వేయలేదు, ఒకసారి ట్రై చేద్దాం అని ఓకే చెప్పాను. ఆ తర్వాత చాలా కామెంట్స్ వచ్చాయి. ట్రోలింగ్స్ జరిగాయి. నటిగా ఉన్నప్పుడు పరిస్థితి డిమాండ్ చేస్తే అలాంటి డ్రెస్ వేసుకోక తప్పదు. కానీ మన సౌకర్యం కూడా చూసుకోవాలి. ఇప్పుడు అడిగితే మాత్రం నేను కచ్చితంగా చేయనని చెప్పేస్తాను అని ప్రియమణి పేర్కొంది.చదవండి: ఇది కరెక్ట్ కాదు.. విజయ్పై నటి ఫైర్ -
ఇది కరెక్ట్ కాదు.. భార్య బాధను లెక్కచేయవా? విజయ్పై ఫైర్
స్టార్ హీరో విజయ్- సంగీత విడాకుల వ్యవహారం తమిళనాట సంచలనంగా మారింది. దాదాపు 27 ఏళ్ల వైవాహిక బంధానికి స్వస్తి పలుకుతూ విడిపోవాలని నిర్ణయించుకున్నారు. కొన్నేళ్లుగా ఓ నటితో ఎఫైర్ పెట్టుకున్నాడని, ఆ కారణంగా విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు సంగీత తన విడాకుల పిటిషన్లో పేర్కొంది. దీంతో విజయ్- సంగీత విడాకులకు హీరోయిన్ త్రిష కారణమా? అన్న చర్చ మొదలైంది.విడాకులుఆన్స్క్రీన్పైనే కాకుండా ఆఫ్ స్క్రీన్లోనూ విజయ్- త్రిష ప్రేమాయణం నడుపుతున్నారని చాలాకాలంగా ప్రచారం జరుగుతోంది. సంగీత విడాకుల పిటిషన్ వేసిన తర్వాత విజయ్.. దర్జాగా త్రిషను తీసుకుని ఓ పెళ్లికి హాజరయ్యాడు. జంటగా నిల్చుని ఫోటోకు పోజిచ్చాడు. ఇది చాలామంది అభిమానులకు మింగుడుపడలేదు. ఇప్పటికే విజయ్- సంగీత కలిసుండాలని చాలామంది ప్రార్థిస్తున్నారు. అలాంటి సమయంలో భార్యతో కలిసుండే ప్రసక్తే లేదని హింటిస్తూ ఇలా త్రిషతో పెళ్లికి వెళ్లడం అందర్నీ షాక్కు గురి చేసింది.అవతలివారి బాధను లెక్కచేయరా?ఈ వ్యవహారంపై విజయ్ అభిమాని, నటి సనం శెట్టి ఆగ్రహం వ్యక్తం చేసింది. విజయ్, త్రిష పెళ్లికి హాజరైన వీడియోను ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేస్తూ.. ఇది కరెక్ట్ కాదు.. భార్య బాధను ఇసుమంతైనా పట్టించుకోకపోవడం విచారకరం. ఎంతోకాలంగా అభిమానిస్తున్న మాలాంటివాళ్లను మీరు తీవ్రంగా నిరాశపర్చారు అని రాసుకొచ్చింది. ఆమె కామెంట్స్ను కొందరు సపోర్ట్ చేస్తుండగా మరికొందరు మాత్రం విమర్శించారు.ఎవరీ సనం శెట్టి?కాగా సనం శెట్టి విజయ్కు వీరాభిమాని. కరూర్ తొక్కిసలాట జరిగినప్పుడు కూడా విజయ్ తప్పు లేదని బాధితులే చెప్పారంటూ అతడిని వెనకేసుకొచ్చింది. కానీ, ఈసారి మాత్రం భార్య బాధను పట్టించుకోకుండా ఇలా ప్రేయసితో చెట్టాపట్టాలేసుకుని తిరగడం సభ్యత కాదని చురకలంటించింది. సనం శెట్టి.. తమిళ బిగ్బాస్ నాలుగో సీజన్లో పార్టిసిపేట్ చేసింది. తెలుగులో శ్రీమంతుడు, ప్రేమికుడు, సింగం 123 చిత్రాల్లో యాక్ట్ చేసింది.చదవండి: అప్పుడు భార్యను కొట్టి.. ఇప్పుడు అందరి ముందు క్షమాపణలు చెప్పిన మాస్క్ మ్యాన్ -
చాన్నాళ్లకు ఓ ఫొటో పోస్ట్ చేసిన రక్షిత్ శెట్టి.. రష్మిక పెళ్లి ఎఫెక్టేనా?
హీరోయిన్ రష్మిక పెళ్లి తంతు ముగిసింది. వారం-పదిరోజుల క్రితం హీరో విజయ్ దేవరకొండతో ఏడడుగులు వేసిన ఈమె.. తర్వాత రిసెప్షన్స్లో పాల్గొంటూ బాగానే సందడి చేసింది. ఓ వారం గ్యాప్ తీసుకుని 'రణబాలి' షూటింగ్లో భార్యభర్తలిద్దరూ పాల్గొంటారు. సరిగ్గా ఈ టైంలోనే రష్మిక మాజీ ప్రియుడు, కన్నడ హీరో రక్షిత్ శెట్టి ఓ ఫొటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. సాధారణంగా అయితే ఇదేమంత పెద్ద విషయం కాదు. కానీ రష్మిక పెళ్లి జరిగిన కొన్నాళ్లకే ఇలా ఫొటో షేర్ చేయడం హాట్ టాపిక్గా మారింది.(ఇదీ చదవండి: తిరుమలలో రుక్మిణి వసంత్.. ఈమె చెల్లిని చూశారా?)'కిరిక్ పార్టీ' సినిమాలో రక్షిత్ శెట్టి, రష్మిక కలిసి నటించారు. రష్మికకు హీరోయిన్గా ఇదే తొలి మూవీ. దీని షూటింగ్ టైంలోనే వీళ్లిద్దరూ ప్రేమించుకున్నారు. పెద్దల అంగీకారంతో నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. మరి ఏమైందో ఏమో గానీ పెళ్లి రద్దు చేసుకున్నారు. అప్పటి నుంచి కెరీర్ పరంగా ఎవరికి వాళ్లు బిజీ అయిపోయారు. టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత రష్మిక స్థాయి మారిపోయింది. పాన్ ఇండియా రేంజుకి వెళ్లిపోయింది. అలా విజయ్ దేవరకొండతో ప్రేమలో పడి పెళ్లి కూడా చేసుకుంది.మరోవైపు రక్షిత్ శెట్టి మాత్రం 42 ఏళ్లు వచ్చినా సరే ఇప్పటికీ ఒంటరిగానే ఉండిపోయాడు. అప్పుడెప్పుడో 2023లో 'సప్త సాగర ఎల్లో దాచే' అనే సినిమా రెండు భాగాలతో వచ్చాడు. తర్వాత నుంచి కొత్తగా మరో మూవీ చేయలేదు. ప్రస్తుతం ఎక్కడున్నాడో కూడా తెలీదు. ఇతడు స్నేహితుడు రిషభ్ శెట్టి.. కొన్నాళ్ల క్రితం ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రస్తుతం రక్షిత్.. అమెరికాలో ఉన్నాడని, కొత్త సినిమా కోసం స్టోరీ రాసుకుంటున్నాడని అన్నాడు. తాజాగా రక్షిత్ శెట్టి.. ఫేస్బుక్లో తన 'చార్లీ' మూవీకి సంబంధించిన ఓ ఫొటోని పోస్ట్ చేశాడు. దీంతో ఇతడి అభిమానులు.. రష్మిక పెళ్లిని లింక్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. గత ఏడాది కాలం నుంచి రక్షిత్, సోషల్ మీడియాలో కనిపించలేదు. ఉన్నట్లుండి ఇప్పుడీ ఫొటో పెట్టడం చర్చనీయాంశమవుతోంది.రక్షిత్ శెట్టి స్నేహితులైన రిషభ్ శెట్టి 'కాంతార' సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. ప్రస్తుతం ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో 'జై హనుమాన్' మూవీ చేస్తున్నాడు. దీని తర్వాత ఛత్రపతి శివాజీ బయోపిక్లోనూ నటించబోతున్నాడు. మరో స్నేహితుడు రాజ్ బి శెట్టి కూడా తమిళ, మలయాళ ఇండస్ట్రీల్లోనూ నటుడిగా పలు మూవీస్ చేస్తూ బిజీగా ఉన్నాడు. రక్షిత్ మాత్రం దాదాపు మూడేళ్ల నుంచి సినిమాల్లో నటించక, నిర్మాతగానూ కొత్త చిత్రాలేం చేయక సైలెంట్ అయిపోవడం అతడి ఫ్యాన్స్ని ఆలోచనలో పడేసింది.(ఇదీ చదవండి: అల్లు శిరీష్ పెళ్లి.. నయనిక ఇంట సందడి.. ఫొటోలు వైరల్) -
తండ్రి లేకపోయినా ఆయన కల నెరవేర్చిన కూతురు
పిల్లలు ప్రయోజకులైతే చూడాలని ఏ తల్లిదండ్రులు ఆశపడరు. కానీ ఆ ఆశ తీరకముందే తనువు చాలించాడు కళాభవన్ మణి. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విలన్గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా గుర్తింపు తెచ్చుకున్న ఈయన 2016 మార్చి 6న మరణించాడు. తండ్రి లేకపోయినా ఆయనకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంది కూతురు శ్రీలక్ష్మి. తనను డాక్టర్గా చూడాలన్న తండ్రి కలను నిజం చేసింది.తండ్రి కల సాకారంఈ విషయాన్ని కళాభవన్ మణి సోదరుడు, డాక్టర్ ఆర్ఎల్వీ. రామకృష్ణన్ వెల్లడించాడు. మణి ఏకైక కుమార్తె శ్రీలక్ష్మి ఎంబీబీఎస్ పూర్తి చేసుకుని డాక్టర్గా ప్రాక్టీస్ చేస్తోంది. ఆమెను పేదలకు వైద్యం చేసే డాక్టర్గా చూడాలని మణి ఎన్నో కలలు కన్నాడు. అతడు కోరుకున్నట్లే తను వైద్యురాలయింది. తన కుమార్తెను డాక్టర్ చేయాలని, పేదలకు ఉచిత చికిత్స అందించే ఆస్పత్రి ప్రారంభించాలన్నది మణి ఆశయం.డాక్టర్ విద్య పూర్తిఈ విషయాన్ని తనెప్పుడూ బయటకు చెప్తూ ఉండేవాడు. తండ్రి మరణించిన బాధలోనే శ్రీలక్ష్మి పదో తరగతి పరీక్షలు రాసింది. అయినా తనకు మంచి మార్కులొచ్చాయి. కాలేజీలోనూ అద్భుతమైన మార్కులు సాధించింది. డాక్టర్ కోర్సులో చేరేందుకు రెండేళ్ల శిక్షణ తీసుకుంది. అలా MBBSలో సీటు సంపాదించుకుంది. కూతురి కోసం నిమ్మి (కళాభవన్ భార్య) కూడా కాలేజీ దగ్గర్లో ఒక ఫ్లాట్ అద్దెకు తీసుకుని అక్కడే నివసించింది అని పేర్కొన్నాడు.ఆటో నడిపి సినిమాల్లో..కళాభవన్ మణి మిమిక్రీ ఆర్టిస్టుగా కెరీర్ మొదలుపెట్టాడు. బతుకు బండి ముందుకు సాగడం కోసం ఆటో నడిపాడు. కెప్టెన్ ప్రభాకరన్ అనే తమిళ చిత్రంలో జూనియర్ ఆర్టిస్ట్గా పని చేశాడు. 1996లో వచ్చిన సల్లప్పం అనే మలయాళ చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్నాడు. కమెడియన్గా అనేక సినిమాలు చేశాడు. ఆ తర్వాత సహాయక పాత్రలు చేశాడు.తెలుగు సినిమావాసంతియుమ్ లక్ష్మియుం పిన్నె నిజానుం సినిమాలో అంధ సింగర్గా నటించగా జాతీయ అవార్డు గెలుచుకున్నాడు. ఆ తర్వాత కామెడీ, సహాయక పాత్రలకే పరిమితం కాకుండా విలన్గా ట్రై చేశాడు. తెలుగులో జెమిని, అర్జున్, ఆయుధం, నరసింహుడు, ఎవడైతే నాకేంటి, నగరం.. ఇలా అనేక సినిమాలు చేశాడు. ప్లే బ్యాక్ సింగర్గానూ టాలెంట్ చూపించాడు. నటుడిగా దాదాపు 200 సినిమాలు చేసిన ఆయన అతిగా మద్యం తాగి రక్తం కక్కుకుని చనిపోయాడు.చదవండి: డూప్లెక్స్ అపార్ట్మెంట్ కొనుగోలు చేసిన నయనతార దంపతులు -
తిరుమలలో రుక్మిణి వసంత్.. ఈమె చెల్లిని చూశారా?
'కాంతార' ఫేమ్ కన్నడ హీరోయిన్ రుక్మిణి వసంత్.. తిరుమల శ్రీవారిని శుక్రవారం ఉదయం దర్శించుకుంది. చెల్లితో పాటు కలిసి సంప్రదాయబద్ధంగా చాలా సింపుల్ లుక్లో కనిపించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అలానే రిపోర్టర్లు అడిగిన ప్రశ్నకు తెలుగులోనూ సమాధానాలు చెప్పి ఆశ్చర్యపరిచింది.(ఇదీ చదవండి: టాలీవుడ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ ప్రేమ పెళ్లి.. అమ్మాయి ఎవరంటే?)మూవీస్ అప్డేట్ గురించి అడగ్గా.. ఇప్పుడేం లేదు. త్వరలో వస్తుంది, అప్పుడు చెబుతా అని రుక్మిణి వసంత్ చెప్పుకొచ్చింది. ఈమె నటించిన 'టాక్సిక్'.. ఈ నెలలోనే థియేటర్లలో రిలీజ్ కావాల్సి ఉండగా ఏకంగా జూన్ 4కి వాయిదా పడింది. ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ కాంబోలో తీస్తున్న 'డ్రాగన్'లోనూ ఈమెనే హీరోయిన్. కాకపోతే అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.రీసెంట్గా కన్నడ ఇండస్ట్రీలో ఫొటోగ్రాఫర్ల తీరుపై హీరోయిన్లు సప్తమి గౌడ, ఆషికా రంగనాథ్ తదితరులతో పాటు తన ఆగ్రహం వ్యక్తం చేసింది. అనుచితంగా జూమ్ చేస్తూ తమని ఫొటోలు తీస్తున్నారని దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొంది. హీరోయిన్లని ఈ విధంగా ఇబ్బందులకు గురిచేసేవారిపై చర్యలకూ తీసుకునేందుకు సిద్ధమవుతున్నామని రుక్మిణి వసంత్ చెప్పింది.(ఇదీ చదవండి: అల్లు శిరీష్ పెళ్లి.. నయనిక ఇంట సందడి.. ఫొటోలు వైరల్)How cute is the way of she talking in Telugu 😘😘❤️❤️❤️❤️#RukminiVasanth pic.twitter.com/1YmiuruNV3— . (@urstrulyHarshha) March 6, 2026 -
డూప్లెక్స్ అపార్ట్మెంట్ కొన్న నయనతార.. ఎన్ని కోట్లంటే?
కోలీవుడ్ స్టార్ జంట నయనతార-విఘ్నేశ్ శివన్ కొత్తిల్లు కొనుగోలు చేశారు. తమిళనాడు చెన్నైలోని పోయిస్ గార్డెన్లో డూప్లెక్స్ అపార్ట్మెంట్ సొంతం చేసుకున్నారు. దీని ధర దాదాపు రూ.31.5 కోట్లు అని తెలుస్తోంది. సూపర్స్టార్ రజనీకాంత్, స్టార్ హీరో ధనుష్ ఉన్న ఏరియాలోనే నయన్ జంట ఈ ఇల్లు కొనడం విశేషం. డూప్లెక్స్ అపార్ట్మెంట్ తేనాంపేటలోని లెగసీ ప్రాజెక్ట్లో నాలుగు, ఐదవ అంతస్తుల్లో ఈ డూప్లెక్స్ అపార్ట్మెంట్ ఉంది. ఇది 14,369 చదరపు అడుగుల బిల్టప్ ఏరియాను కలిగి ఉంది. దీని ధర చదరపు అడుగుకు రూ.21,946గా ఉంది. ఈ అపార్ట్మెంట్కు 8 కార్ పార్కింగ్ స్లాట్లు కేటాయించారు. కాగా లేడీ సూపస్టార్ నయనతారకు కేరళలో పూర్వీకుల ఇల్లు ఉంది. సినిమాహైదరాబాద్లోని బంజారాహిల్స్లో రెండు ఇళ్లు ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే చెన్నై, కేరళలోని ఇతర ప్రాంతాల్లోనూ తనకు ప్రాపర్టీలు ఉన్నాయని తెలుస్తోంది. సినిమాల విషయానికి వస్తే నయనతార చివరగా మన శంకరవరప్రసాద్ గారు సినిమాతో అలరించింది. ప్రస్తుతం టాక్సిక్ సహా నాలుగైదు మూవీస్ చేస్తోంది.చదవండి: హీరోయిన్ను అవమానించిన యామీ గౌతమ్? -
లీడర్ ప్రతీకారం
శరవణన్ హీరోగా నటించి, నిర్మించిన చిత్రం ‘లీడర్’. పాయల్ రాజ్పుత్, శ్యామ్, ఆండ్రియా, సంతోష్ ప్రతాప్, లాల్ ప్రధాన పాత్రల్లో నటించారు. లెజెండ్ శరవణ స్టోర్స్ప్రొడక్షన్స్ పతాకంపై ఆర్ఎస్ దురై సెంథిల్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఏప్రిల్లో రిలీజ్ కానుంది.తాజాగా ఈ సినిమా టీజర్ను రిలీజ్ చేశారు. ‘‘నా కూతురితో పాటే నేనుండాలి. దాని కోసం ఈ ప్రపంచాన్నే ఎదరించమన్నా ఎదిరించి గెలుస్తాను’ వంటి సంభాషణలు టీజర్లో ఉన్నాయి. ‘‘తన కుటుంబానికి జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకునే శక్తివేల్ పాత్రలో శరవణన్ నటించారు. మాస్, యాక్షన్, సస్పెన్స్, థ్రిల్లర్ అంశాలతో ఈ సినిమా ప్రేక్షకులను ఆలరించేలా ఉంటుంది’’ అని యూనిట్ పేర్కొంది. -
నేడు థియేటర్లలోకి ఒకేసారి 10 సినిమాలు.. బాక్సాఫీస్కు ఊపిరి పోస్తాయా?
తెలుగు రాష్ట్రాల్లో గత వారం నుంచి థియేటర్లు పెద్దగా సందడిగా కనిపించడం లేదు. ఇటీవల విడుదలైన సినిమాలు ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోకపోవడంతో చాలా థియేటర్లలో ఖాళీ సీట్లు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బాక్సాఫీస్కు ఊపిరి పోయేలా ఈ శుక్రవారం ఒకేసారి దాదాపు 10 సినిమాలు థియేటర్లలోకి రాబోతున్నాయి. అయితే వీటిలో ఎక్కువగా చిన్న చిత్రాలే ఉండటం విశేషం. పెద్దగా బజ్ లేకుండానే ఈ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి.ఈ వారం విడుదలవుతున్న సినిమాల్లో కొంతమేరకు ఆసక్తి రేకెత్తిస్తున్న చిత్రం మృత్యుంజయ. హీరో శ్రీ విష్ణు ఇందులో ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. గత వారం విష్ణు విన్యాసంతో ప్రేక్షకులను పలకరించిన ఆయన, ఈ వీకెండ్ మృత్యుంజయతో మరోసారి థియేటర్లలోకి వస్తున్నాడు. ఈ సినిమా సాధారణ కమర్షియల్ ఫార్ములాకు భిన్నంగా ఉంటుందని, ఇందులో కామెడీ, రొమాన్స్, ఫ్యామిలీ ఎలిమెంట్స్ కంటే థ్రిల్లింగ్ అంశాలకే ఎక్కువ ప్రాధాన్యం ఉంటుందని చిత్ర బృందం చెబుతోంది. మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్తో ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేసే కథగా ఈ చిత్రం తెరకెక్కిందని తెలిపారు.మరో చెప్పుకోదగ్గ సినిమా సరస్వతి. ఈ చిత్రాన్ని నటి వరలక్ష్మీ శరత్కుమార్ స్వయంగా తెరకెక్కించారు. ఇందులో ఆమె ప్రధాన పాత్రలో నటించడమే కాకుండా దర్శకత్వ బాధ్యతలు కూడా చేపట్టారు. అంతేకాదు ఈ సినిమాను ఆమెనే నిర్మించారు. ప్రముఖ రచయిత బుర్రా సాయి మాదవ్ కథ అందించారు. తమన్ సంగీతాన్ని సమకూర్చారు. కథ బలంగా ఉండటంతో ఈ సినిమా ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుందని చిత్ర యూనిట్ నమ్మకం వ్యక్తం చేస్తోంది.ఇవే కాకుండా సంప్రదాయని సుప్పిని సుద్ధపూసని అనే చిత్రం కూడా ఈ వారం విడుదలవుతోంది. ఇందులో శివాజీ , లయ ప్రధాన పాత్రల్లో నటించారు. కామెడీ క్రైమ్ డ్రామాగా రూపొందిన ఈ సినిమాను మొదట ఓటీటీలో విడుదల చేయాలని భావించారు. కానీ చివరి నిమిషంలో నిర్ణయం మార్చుకుని థియేటర్లలో రిలీజ్ చేయాలని నిర్ణయించారు.ఇవి కాకుండా కాన, మాన్షన్ హౌజ్ మల్లేష్, కాక్రోచ్, విధాత వంటి మరికొన్ని చిన్న సినిమాలు కూడా ఈ వారం థియేటర్లలోకి వస్తున్నాయి. మరోవైపు ప్రభాస్ నటించిన మున్నా సినిమాను రీ-రిలీజ్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే నటి లావన్య త్రీపాఠి ప్రధాన పాత్రలో నటించిన సతీ లీలావతి సినిమా మాత్రం చివరి నిమిషంలో వాయిదా పడింది. మొత్తానికి పెద్ద సినిమాలు లేకపోయినప్పటికీ ఒకేసారి పది సినిమాలు విడుదలవుతుండటంతో ఈ వారం బాక్సాఫీస్లో కొంత కదలిక కనిపిస్తుందా అనే ఆసక్తి సినీ వర్గాల్లో నెలకొంది. ప్రేక్షకులు ఈ సినిమాలను ఎలా స్వీకరిస్తారో చూడాలి. -
పెళ్లి వేడుకలో విజయ్, త్రిష.. వీడియో వైరల్
కోలీవుడ్ నటుడు, టీవీకే అధ్యక్షుడు విజయ్, త్రిష కలిసి ఒక పెళ్లి వేడుకకు తాజాగా హాజరయ్యారు. చెన్నైలో జరిగిన ఈ కార్యక్రమంలో వారిద్దరూ సరదాగ పలకరించుకున్నారు. వీరిద్దరి గురించి కొద్దిరోజుల క్రితం తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నయినార్ నాగేంద్రన్ సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ముందుగా త్రిష ఇంటి నుంచి విజయ్ బయటకు రావాలని, తన కుటుంబంతో అనుబంధాన్ని కలిగి ఉండాలని ఆయన విమర్శించిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలకు కొద్దిరోజల గ్యాప్లోనే విజయ్ సతీమణి సంగీత విడాకుల కోసం పిటిషన్ దాఖలు చేసింది. విజయ్ మరో మహిళతో సాన్నిహిత్యంగా ఉన్నారని అందుకే విడాకులు కావాలంటూ పేర్కొంది. అయితే, ఈ కథలో త్రిష పేరు ప్రధానంగా వైరల్ అయింది. ఇప్పుడు విజయ్, త్రిష కలిసి చెన్నైలో జరిగిన ఒక పెళ్లికి వెళ్లడంతో వీడియో వైరల్ అవుతుంది.#Thalapathy @TVKVijayHQ President #Vijay and #Trisha attend #KalpathiSSuresh - #MeenakshiSuresh 's son wedding reception @actorvijay @trishtrashers pic.twitter.com/iQOQet9Z0A— Nikil Murukan (@onlynikil) March 5, 2026 -
విజయ్ సేతుపతికి జోడీగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్!
చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు నటుడు విజయ్ సేతుపతి. తమిళం, తెలుగు, హిందీ భాషల్లో ఎడాపెడా చిత్రాలు చేస్తున్నాడు. తెలుగులో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నాడు. ప్రస్తుతం వెట్రిమారన్ డైరెక్షన్లో శింబు హీరోగా నటిస్తున్న అరసన్ చిత్రంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. అలాగే మరికొన్ని సినిమాల్లోనూ యాక్ట్ చేస్తున్న ఈయన తాజాగా మరో కొత్త చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.బాలీవుడ్ బ్యూటీవిడాముయుర్చి ఫేమ్ మగిళ్ తిరుమేణి దర్శకత్వంలో సినిమా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ప్రతినాయకుడిగా నటించనున్నట్లు భోగట్టా! ఇకపోతే ఇందులో విజయ్ సేతుపతికి జంటగా బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ను నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. ఈ ఆఫర్కుగానీ ఆమె ఒప్పుకుంటే కోలీవుడ్లో మరో క్రేజీ కాంబో షురూ అయినట్లే! మరి ఇదెంతవరకు నిజమన్నది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేవరకు ఆగాల్సిందే! -
క్రేజీ కాంబో ఫిక్స్.. సూర్యతో పూరి జగన్నాధ్..!
తమిళ స్టార్ హీరో సూర్యతో దర్శకుడు పూరి జగన్నాధ్ కొత్త సినిమా ఫైనల్ అయింది. ప్రస్తుతం సూర్య సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు. ఆ ప్రాజెక్ట్ పూర్తయిన వెంటనే పూరి దర్శకత్వంలో సూర్య చేయబోయే సినిమా ఉండే అవకాశం ఉంది. అసలు ముందుగా వెంకీ అట్లూరి సినిమా తరువాత సూర్య మరో ప్రాజెక్ట్ చేయాలని అనుకున్నారు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ వాయిదా పడింది. దాంతో ఆ స్థానంలో పూరి జగన్నాధ్కు అవకాశం దక్కింది. అయితే సూర్యతో సినిమా చేయడానికి దర్శకుడు చందు మొండేటి కూడా చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారు. తండేల్ సినిమా ముందు నుంచే ఆయన ప్రయత్నాలు మొదలయ్యాయి. కానీ ఎందుకో ఆ కాంబినేషన్ సెట్ కాలేదు. దాంతో ప్రస్తుతం ఆయన కార్తికేయ 3 ప్రాజెక్ట్ పై దృష్టి పెట్టినట్లు సమాచారం. హీరోల డేట్స్ సంపాదించడం పూరి జగన్నాధ్ కు పెద్ద సమస్య కాదు. పూరి-విజయ్ సేతుపతితో చేసిన సినిమా చాలా కాలం క్రితమే మొదలు పెట్టారు. దానికి ‘స్లమ్ డాగ్ ’(Slum Dog) అనే టైటిల్ని ఖరారు చేశారు. కానీ దానికి సంబంధించిన గ్లింప్స్ లేదా ప్రమోషనల్ మెటీరియల్ ఇప్పటివరకు విడుదల కాలేదు. సూర్య – పూరి జగన్నాధ్ కాంబినేషన్ ఫైనల్ కావడం సినీ అభిమానుల్లో ఆసక్తి రేపుతోంది. పూరి స్టైల్ లో సూర్యను ఎలా చూపిస్తారో, ఎలాంటి మాస్ ఎంటర్టైనర్ వస్తుందో చూడాలి. -
ఓజీ హీరోయిన్ ఓటీటీ మూవీ.. ఎమోషనల్గా ట్రైలర్
మొబైల్ ఫోన్ వినియోగం పెరిగాక ప్రపంచమే అరచేతిలోకి వచ్చింది. అలాగే ఓటీటీలు వచ్చాక ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంటెంట్ అంతా ఎంచక్కా ఉన్నచోటునే చూసే అవకాశం లభించింది. అలా చాలామంది కొరియన్ సినిమాలు, సిరీస్లకు ఫిదా అయ్యారు. మరీ ముఖ్యంగా కొందరమ్మాయిలైతే బానిసలైపోయారు!ఓటీటీ సినిమాదీంతో ఈ కొరియన్ కాన్సెప్ట్తో ఓ మూవీ తీశారు. ఓజీ హీరోయిన్ ప్రియాంక మోహన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా మేడ్ ఇన్ కొరియా. ఆర్.ఏ కార్తీక్ దర్శకత్వం వహించిన ఈ మూవీ మార్చి 12న నేరుగా నెట్ఫ్లిక్స్లో రిలీజ్ కానుంది. ఈ క్రమంలో తాజాగా సినిమా ట్రైలర్ వదిలారు. అందులో ఓ అమ్మాయికి చిన్నప్పటినుంచి కొరియా అంటే చాలా ఇష్టం. కనీసం ఒక్కసారైనా అక్కడికి వెళ్లాలన్నది తన కోరిక. అనుకున్నట్లుగా పెద్దయ్యాక ఎలాగోలా కొరియా వెళ్తుంది. కానీ అక్కడ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటుంది. అదే ట్రైలర్లో చూపించారు.మనసు చెప్పేది వినండిమనకు నచ్చిన పనిచేయడం కోసం ఎంతదూరమైనా వెళ్లొచ్చు. నీవల్ల కాదు అంటారు. తెలియనివారు మనపై ప్రేమ చూపిస్తారు.. బాగా తెలిసినవారు మనల్ని బాధపెడతారు. ఎంత ఏడ్చినా, ఎంత నవ్వినా.. మనల్ని చీరప్ చేసి మేమున్నామంటూ మనకోసం నలుగురు వస్తారు. ఈ అనుభవాల్ని మీకు ఎదురవ్వాలంటే మీ మనసు చెప్పేది వినండి అని హీరోయిన్ చెప్పే డైలాగ్ బాగుంది. మేడ్ ఇన్ కొరియా తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో మార్చి 12న విడుదల కానుంది. చదవండి: ఆస్తుల్లేవ్.. అద్దె ఇంట్లో ఉంటున్నా: వరలక్ష్మి -
నాకంటూ పెద్దగా ఆస్తుల్లేవ్.. అద్దింట్లో ఉంటున్నా: వరలక్ష్మి
ఇప్పటివరకు హీరోయిన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా సినిమాలు చేసిన వరలక్ష్మి శరత్కుమార్ సరస్వతి చిత్రంతో దర్శకురాలిగా పరిచయమవుతోంది. ఈ చిత్రానికి స్వీయ దర్శకత్వం వహించడంతో పాటు ప్రధాన పాత్రలో నటించింది. ఈ మూవీ మార్చి 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా ప్రమోషన్స్లో భాగంగా ఓ ఇంటర్వ్యూ హాజరైన వరలక్ష్మి అనేక ఆసక్తికర విషయాలు పంచుకుంది.రాజకీయాల్లోకి వస్తా..నాకంటూ పెద్ద ప్రాపర్టీలు ఏం లేవు. ప్రస్తుతం అద్దె ఇంట్లోనే ఉన్నాను. నా సంపాదనతో నాకంటూ ఒక కారు కొనుక్కున్నాను. అలాగే ఒక చిన్న ఇల్లు కొన్నానంతే! భారీగా ఆస్తులుంటే ఇక్కడెందుకు ఉంటాను? ఇకపోతే నాకు రాజకీయాలంటే ఇష్టం. యువత రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటున్నాను. నేను కూడా భవిష్యత్తులో తమిళనాడులో లేదా తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాల్లో అడుగుపెట్టే అవకాశం ఉంది.పెళ్లికి రూ.800 కోట్ల ఖర్చుసరస్వతి సినిమా విషయానికి వస్తే.. షూటింగ్ అయిపోయాక చిత్రయూనిట్ అందరికీ ఒక బంగారు నాణెం బహుమతిగా ఇచ్చాను. కాగా నన్ను తమిళ చిత్రపరిశ్రమ సరిగ్గా వాడుకోలేదు. నాలుగైదు సినిమాలు మినహా తర్వాత అక్కడ ఎవరూ నా టాలెంట్ను పట్టించుకోలేదు అని వరలక్ష్మి చెప్పుకొచ్చింది. తనపై వచ్చిన ఓ ఆసక్తికర రూమర్ గురించి చెప్తూ.. నా పెళ్లికి రూ.800 కోట్ల ఖర్చయిందని సోషల్ మీడియాలో రాశారు. అది చూసి బాగా నవ్వుకున్నాను. నా దగ్గర అంత డబ్బుంటే నేనెందుకు ఇక్కడుంటాను? అని వరలక్ష్మి నవ్వేసింది.చదవండి: ఒంటరితనం భరించలేకున్నా.. తోడు కావాలి: నటి -
ఒంటరితనం భరించలేకపోతున్నా.. తోడు కావాలి!
దాదాపు 40 సినిమాలు చేసిన కమెడియన్, మిమిక్రీ ఆర్టిస్ట్ కొల్లం సుధి 2023లో మరణించాడు. అతడి మరణంతో ఎంతగానో కుంగిపోయింది కమెడియన్ రెండో భార్య, నటి రేణు సుధి. అయితే రానురానూ ఆ బాధ నుంచి తేరుకుంటూ తనకిష్టమైన వ్యాపకాలపై శ్రద్ధ పెట్టింది. రీల్స్ చేయడం, సాంగ్స్లో యాక్ట్ చేయడం, రకరకాలుగా ఫోటోషూట్స్ చేయడంతో సోషల్ మీడియాలో తన పేరు మారుమోగిపోయేది. బిగ్బాస్ షోతో గుర్తింపుకొందరైతే వితంతువై ఉండి ఈ పిచ్చి చేష్టలేంటి? సుధికి చెడ్డ పేరు తీసుకొస్తున్నావ్ అని విమర్శించారు కూడా! అలా ట్రోలింగ్ బారిన పడ్డ సమయంలో మలయాళ బిగ్బాస్ ఏడో సీజన్లో పార్టిసిపేట్ చేసింది. అక్కడ వచ్చిన క్రేజ్తో రెండు, మూడు సినిమాల్లోనూ యాక్ట్ చేసింది. తాజాగా రేణు సుధికి భాగస్వామి కావాలనిపిస్తోందట. ఈ విషయాన్ని తనే స్వయంగా ఇన్స్టాగ్రామ్ స్టోరీలో వెల్లడించింది. తోడు కావాలిఒంటరితనం భరించలేకపోతున్నాను. నాకు ఒక పార్ట్నర్ కావాలనిపిస్తోంది. నన్ను అర్థం చేసుకుని, నా బాగోగులతో పాటు పిల్లల్ని చూసుకునే తోడు కావాలనిపిస్తోంది అని రాసుకొచ్చింది. గతంలో కూడా రేణు మళ్లీ పెళ్లిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తనకు నచ్చిన వ్యక్తి తారసపడితే పెళ్లి చేసుకుంటానంది. అప్పుడు ప్రస్తుతం ఉంటున్న ఇల్లు వదిలేసి అతడితో మరో ఇంట్లో స్థిరపడతానంది. అలాగే తన పేరు పక్కన ఉన్న సుధిని చెరిపేస్తానంది.రెండో పెళ్లిమిమిక్రీ ఆర్టిస్ట్గా పేరు తెచ్చుకున్న కొల్లం సుధిని మొదటి భార్య వదిలేసింది. అప్పటికే వీరికి కుమారుడు రాహుల్ సంతానం. భార్య వదిలేశాక సింగిల్ పేరెంట్గా చాలా ఇబ్బందులు పడ్డాడు సుధి. కొన్నేళ్ల తర్వాత అతడికి రేణుతో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారడంతో పెళ్లి చేసుకున్నారు. వీరికి కుమారుడు రితుల్ సంతానం. రేణుకు కూడా ఇది రెండో పెళ్లి కావడం గమనార్హం! -
'ధురంధర్ 2'కి లైన్ క్లియర్.. 'టాక్సిక్' వాయిదా
ఈ నెలలో రావాల్సిన పెద్ద సినిమాల్లో 'టాక్సిక్' ఒకటి. కేజీఎఫ్ లాంటి పాన్ ఇండియా బ్లాక్బస్టర్ సక్సెస్ తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకుని హీరో యష్ చేసిన మూవీ ఇది. లెక్క ప్రకారం మార్చి 19నే థియేటర్లలో రిలీజ్ అన్నారు. నిన్నటి వరకు అదే మాటపై ఉంటూ వచ్చారు. కానీ ఇప్పుడు ఉన్నట్లుండి పరిస్థితులు మారిపోయేసరికి వాయిదా వేయక తప్పని పరిస్థితి ఏర్పడింది. దీంతో కొత్త విడుదల తేదీని అధికారికంగా ప్రకటించారు.(ఇదీ చదవండి: మా బాడీ పార్ట్స్ జూమ్ చేసి ఫొటోలు.. 'కాంతార' హీరోయిన్ ఫైర్)మార్చి 19న రావాల్సిన 'టాక్సిక్' చిత్రాన్ని జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. పశ్చిమ ఆసియా దేశాల్లో యుద్ధ ప్రభావమే దీనికి కారణమని చెప్పుకొచ్చారు. విదేశాల్లో ఆడియెన్స్ కోసం ఈ చిత్రాన్ని తెరకెక్కించామని ప్రస్తుతం యుద్ధ కారణంగా మిడిల్ ఈస్ట్ దేశాల్లో అనిశ్చితి నెలకొందని, తమ పార్ట్నర్స్ ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు నిర్మాణ సంస్థ అధికారికంగా ఓ నోట్ రిలీజ్ చేసింది.'టాక్సిక్' వాయిదా పడింది. దీంతో 'ధురంధర్ 2'కి లైన్ క్లియర్ అయిపోయినట్లే. గతేడాది డిసెంబరులో పెద్దగా హడావుడి లేకుండానే 'ధురంధర్' వచ్చింది. రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఇప్పుడు సీక్వెల్ రాబోతుంది. ట్రైలర్ రిలీజ్ చేస్తే ఇది కూడా వస్తుందా లేదా అనేది క్లారిటీ వస్తుంది. 'ధురంధర్ 2' గురించి వాయిదా లాంటివి రూమర్స్ అయితే ఇప్పటివరకు ఏం రావట్లేదు.(ఇదీ చదవండి: టాలీవుడ్పై ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం ఎంత?) -
సరస్వతి చాలా బలమైన కథ: పూజా శరత్కుమార్
వరలక్ష్మీ శరత్కుమార్ నటించి, స్వీయ దర్శకత్వం వహించిన చిత్రం ‘సరస్వతి’. ఆమె సోదరి పూజా శరత్కుమార్ ఈ సినిమాకు ఓ నిర్మాత. ప్రియమణి, ప్రకాశ్రాజ్, రావు రమేశ్, రాధికా శరత్ కుమార్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఈ నెల 6న విడుదల కానుంది. ఈ సందర్భంగా మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో పూజా శరత్కుమార్ మాట్లాడుతూ – ‘‘సరస్వతి’ మంచి క్రైమ్ థ్రిల్లర్ సినిమా. సోషల్ మెసేజ్ కూడా ఉంది. ‘ప్రతి అమ్మాయి సరస్వతిలాగా ఉండదు. సమయం వచ్చినప్పుడు కాళీలా మారుతుంది’ అనే డైలాగ్ ఈ సినిమా ట్రైలర్లో ఉంది. కథ వెనక ఉన్న ఆలోచన అదే... చాలా బలమైన కథ.ఒక స్ట్రాంగ్ ఉమన్ క్యారెక్టర్ను థియేటర్స్లో చూస్తారు. ఈ చిత్రంలోని ప్రతి పాత్ర ముఖ్యమైనదే. అలాగే కీలకమైన కోర్టు సీన్ ఉంది. ఈ ఏడు నిమిషాల సింగిల్ షాట్ చాలా ఆసక్తిగా ఉంటుంది. సినిమా థ్రిల్లింగ్, ట్విస్ట్లతో గ్రిప్పింగ్గా సాగుతుంది. ఫ్యామిలీతో చూడదగ్గ చిత్రం. వరలక్ష్మి ఇప్పుడు హైదరాబాద్ అమ్మాయి అయిపోయింది. తన డైరెక్షన్లోని తొలి సినిమా తెలుగులోనే ఉండాలని బలంగా అనుకుంది. పరిశ్రమలో వరలక్ష్మి జర్నీ స్ఫూర్తిదాయకమైనది. ఆమెకు ‘సరస్వతి’ ప్రౌడ్ మూమెంట్.ఈ సినిమా ప్రోగ్రెస్ గురించి మా నాన్న (నటుడు శరత్కుమార్)గారు ఎప్పటికప్పుడు తెలుసుకునేవారు. అవుట్పుట్ పట్ల ఆయన హ్యాపీగా ఉన్నారు. ఇక నేను కొన్ని మ్యూజిక్ షోలు చేశాను. ఇందులో రెహమాన్గారివి కూడా ఉన్నాయి. ఆ తర్వాత రాడార్ (నటి రాధిక బేనర్)లో కొన్నేళ్ళు పని చేశాను. అయితే నాకు కెమెరా వెనక ఉండటమే ఇష్టం.యాక్టింగ్ అస్సలు రాదు. ‘సరస్వతి’ కథ గురించి బాపినీడుగారికి చెబితే, మేమూ నిర్మాణంలో భాగమవుతాం అన్నారు. బన్నీ వాసుగారికి కంటెంట్ నచ్చింది. ఇలా గీతా ఫిలిం డిస్ట్రిబ్యూషన్ ద్వారా మా సినిమా రిలీజ్ అవుతోంది. మార్చి 5న మా ‘సరస్వతి’ సినిమా ప్రీమియర్స్ను ప్లాన్ చేస్తున్నాం. మా బ్యానర్లో కొత్త సినిమాల కోసం స్క్రిప్ట్స్ వింటున్నాం’’ అన్నారు. -
రామ్ చరణ్ 'పెద్ది' రన్టైమ్.. 4 గంటలపైనే?
పెద్ద సినిమాలు భారీ నిడివితో రావడం ఇప్పుడు సాధారణమైపోయింది. ఇటీవల యానిమల్ సినిమా రన్టైమ్ చూసి ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు. ఇకపై వస్తున్న ధురంధర్-2 కూడా అంతకుమించిన నిడివితో వస్తోందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే క్రమంలో పెద్ది కూడా భారీ రన్టైమ్తో వస్తోందనే ప్రచారం మొదలైంది. సినిమా టోటల్ ఫుటేజ్ 4 గంటలపైనే ఉందని, ఫైనల్ రన్టైమ్ 3 గంటలకు పైగా ఉంటుందనే కథనాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే దీనిపై పెద్ది యూనిట్ స్పందించింది. పెద్ది రన్టైమ్పై వస్తున్న ప్రచారాన్ని నమ్మొద్దని విజ్ఞప్తి చేసింది. ప్రస్తుతం కేవలం తొలి సగం మాత్రమే లాక్ అయింది. రెండో భాగానికి సంబంధించిన షూటింగ్ ఇంకా కొనసాగుతోందని స్పష్టం చేసింది. ప్రస్తుతం పెద్ది నుంచి విడుదలైన రెండో పాట 'రయ్ రయ్ రారా'పై చర్చ జోరుగా సాగుతోంది. చరణ్ డాన్స్ను చిరంజీవి ప్రత్యేకంగా మెచ్చుకున్నారు. దాంతో అభిమానుల్లో పెద్ది చిత్రంపై ఆసక్తి మరింత పెరిగింది. దీనిపై దర్శకుడు బుచ్చిబాబు మాట్లాడుతూ, ఆ డాన్స్ చేస్తున్న సమయంలో చరణ్ తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్నారు. షూట్ ఆపుదామని చెప్పినా వినకుండా జ్వరంతోనే డాన్స్ చేశారని గుర్తుచేసుకున్నారు.ప్రస్తుతం 'రయ్ రయ్ రారా' సాంగ్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. దీంతో సినిమా మీద హైప్ మరింత పెరిగింది. పెద్ది సినిమా రన్టైమ్పై వస్తున్న ప్రచారాలు నిజం కావని యూనిట్ స్పష్టతనిచ్చింది. అభిమానులు మాత్రం సినిమా ఫైనల్ రన్టైమ్పై అధికారిక అప్డేట్ కోసం ఎదురుచూస్తున్నారు. -
మా బాడీ పార్ట్స్ జూమ్ చేసి ఫొటోలు.. 'కాంతార' హీరోయిన్ మండిపాటు
కొన్నేళ్ల ముందు వరకు పాపారాజీ కల్చర్ ఎక్కువగా ముంబైలో కనిపించేది. కానీ రీసెంట్ టైంలో దక్షిణాది సినీ పరిశ్రమల్లోనూ ఎక్కువగా కనిపిస్తోంది. పాపారాజీ అంటే ఫొటోగ్రాఫర్స్ గుంపుగా కనిపిస్తూ సెలబ్రిటీల ఫొటోలు తీస్తుంటారు. వీళ్లలో కొందరు అనవసరమైన జూమ్ చేస్తూ హీరోయిన్ల ఫొటోలు, వీడియోలు తీస్తూ వాటిని సోషల్ మీడియాలో, యూట్యూబర్లో పోస్ట్ చేస్తుంటారు. ఇలాంటి వాళ్ల వల్ల హీరోయిన్ల ఇబ్బంది పడిన సందర్భాలు చాలానే ఉన్నాయి. 'కాంతార' హీరోయిన్ సప్తమి గౌడ కూడా ఇప్పుడు అలాంటి అసౌకర్యాన్ని ఎదుర్కొంది. సదరు ఫొటోగ్రాఫర్స్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇన్ స్టాలో స్టోరీ పెట్టింది.(ఇదీ చదవండి: 8 నెలలు మంచానికే పరిమితం.. ఆ దర్శకుడే లేకపోయుంటే: హీరోయిన్ స్నేహ)'ఇండస్ట్రీలోని మహిళందరి తరఫున నేను ఈ విషయాన్ని మాట్లాడుతున్నాను. పబ్లిక్ ఈవెంట్స్లో మా పని గురించి కాకుండా, మా శరీర భాగాలని అనుచితంగా జూమ్ చేస్తూ ఫొటోలు, వీడియోలు తీస్తున్నారు. ఇది చాలా అసౌకర్యంగా ఉండటంతో పాటు మమ్మల్ని అవమానించడమే అవుతుంది. కొందరు వ్యక్తులు చేస్తున్న ఇలాంటి పనులు ఏ మాత్రం సహించలేం. నటన కోసం, వృత్తి కోసమే ఇక్కడ ఉన్నాం. అలాంటిది హద్దులు దాటి ప్రవర్తించడం సభ్యత అనిపించుకోదు. మా హుందాతనాన్ని ఇది దెబ్బతీస్తోంది. మీడియ మిత్రులు ప్రొఫెషనలిజం పాటిస్తూ కనీస గౌరవం ఇవ్వాలని ఆశిస్తున్నాం' అని సప్తమి గౌడ.. ఇన్ స్టాలో స్టోరీ పెట్టింది.తమతో చాలామంది జర్నలిస్టులు గౌరవంతో వ్యవహరిస్తున్నారని చెప్పిన సప్తమి గౌడ.. అలాంటి మీడియా మిత్రులు కూడా ఈ అనుచిత ప్రవర్తనకు వ్యతిరేకంగా నిలవాలని విజ్ఞప్తి చేసింది. మహిళలని ఫొటోలని తీసే విధానంలో దారుణంగా వ్యవహరిస్తున్న కొందరిని అరికట్టేందుకు అందరూ కలిసి పనిచేయాలని చెప్పుకొచ్చింది. ఇప్పుడీ విషయం ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. గతంలోనూ జాన్వీ కపూర్, మృణాల్ ఠాకుర్, నోరా ఫతేహి లాంటి హీరోయిన్లు.. ఈ తరహా ఫొటోగ్రాఫర్ల తీరుని తప్పుబట్టారు. తమని అసభ్యంగా చిత్రీకరిస్తూ సోషల్ మీడియాలో వ్యూస్ కోసం ఉపయోగించుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.సప్తమి గౌడ విషయానికొస్తే.. 'పాప్ కార్న్ మంకీ టైగర్' అనే సినిమాతో నటిగా కెరీర్ ఆరంభించింది. 2022లో రిలీజైన 'కాంతార'లో రిషభ్ శెట్టి సరసన నటించి పేరు తెచ్చుకుంది. ది వ్యాక్సిన్ వార్ అనే హిందీ మూవీ, యువ అనే కన్నడ చిత్రాలు చేసింది. నితిన్ 'తమ్ముడు'తో తెలుగులోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ ఘోరమైన డిజాస్టర్ కావడంతో టాలీవుడ్లో మరో ఛాన్స్ రాలేదు. ఈమె నటించిన 'ద రైజ్ ఆఫ్ అశోక'.. గతవారమే థియేటర్లలోకి వచ్చింది. దీని ప్రమోషన్లలో భాగంగానే సప్తమికి ఈ చేదు అనుభవం ఎదురైనట్లు తెలుస్తోంది.(ఇదీ చదవండి: యాంకర్ సుమ కూతురిని చూశారా? ఇప్పుడెలా ఉందంటే) -
8 నెలలు మంచానికే పరిమితం.. ఆ దర్శకుడే లేకపోయుంటే
హీరోయిన్ స్నేహ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. టాలీవుడ్లో హోమ్లీ పాత్రలకు ఒకప్పుడు కేరాఫ్ అడ్రస్గా నిలిచింది. దక్షిణాదిలోని ఇతర భాషల్లోనూ చాలానే మూవీస్ చేసి ఆకట్టుకుంది. ప్రస్తుతం ఓవైపు ఫ్యామిలీ లైఫ్ చూసుకుంటూనే మరోవైపు క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ అడపాదడపా సినిమాలు చేస్తూనే ఉంది. తనకు గతంలో పెద్ద ప్రమాదం జరిగిందని, 8 నెలల పాటు మంచానికే పరిమితమయ్యాయని చెప్పి అందరికీ షాకిచ్చింది. ఓ దర్శకుడి వల్లే మళ్లీ ఇలా ఇప్పుడు మీ ముందున్నానని చెప్పుకొచ్చింది. కొన్నాళ్ల క్రితం జరిగిన ఓ అవార్డ్ ఫంక్షన్లో మాట్లాడుతూ ఈ విషయాల్ని బయటపెట్టింది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమాలు)'కెరీర్ పీక్ స్టేజీలో వరస సినిమాలతో బిజీగా ఉన్నప్పుడు ఓ ఘోర ప్రమాదం జరిగింది. అందులో నా చేతులు, కాళ్లు, వీపు భాగాలకు తీవ్ర గాయాలయ్యాయి. కనీసం నిలబడటానికి కూడా ఎనిమిది నెలలు పడుతుందని డాక్టర్స్ చెప్పారు. నిజంగా చెప్పాలంటే ఆ రోజుల్లో నరకం అనుభవించాను. కెరీర్ అక్కడితో ముగిసిపోయిందని అనుకున్నాను. ఆ టైంలో దర్శకుడు కరు పళనియప్పన్ 'పార్థిబన్ కనవు' స్టోరీతో నా దగ్గరకు వచ్చారు. కదల్లేని పరిస్థితుల్లో ఉన్నానని తెలిసినా సరే నాపై నమ్మకం ఉంచి ఛాన్స్ ఇవ్వడం నిజంగా ఆశ్చర్యం. ఆయన ఇచ్చిన ధైర్యం, ప్రోత్సాహంతోనే మళ్లీ కెమెరా ముందుకు వచ్చనాను. ఆ దశ చాలా కష్టమైనది. కానీ అదే నన్ను మరింత బలంగా మార్చింది' అని స్నేహ ఎమోషనల్ అయింది.తెలుగు కుటుంబానికే చెందిన స్నేహ అసలు పేరు సుహాసిని. ముంబైలో పుట్టి, షార్జాలో పెరిగింది. ఓ క్రికెట్ మ్యాచ్ సందర్భంగా ఈమెని చూసిన ఓ మలయాళ నిర్మాత.. హీరోయిన్గా అవకాశమిచ్చాడు. అలా 2000లో నటిగా కెరీర్ మొదలుపెట్టింది. 'ప్రియమైన నీకు' చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. తర్వాత రాధాగోపాలం, సంక్రాంతి, శ్రీరామదాసు, మధుమాసంతో పాటు చాలానే మూవీస్ చేసింది. 2012లో తమిళ నటుడు ప్రసన్నని పెళ్లి చేసుకుంది. అనంతరం సన్నాఫ్ సత్యమూర్తి, వినయ విధేయ రామ తదితర చిత్రాల్లో సహాయ పాత్రలు చేసింది. రీసెంట్ టైంలో అయితే దళపతి విజయ్ 'గోట్'లో కనిపించింది.(ఇదీ చదవండి: 'విరోష్' పెళ్లి కానుక.. శుభవార్త చెప్పిన విజయ్ దేవరకొండ) -
తెలుగు సినిమాలు చేయమని నేనే చెప్పా: రాధికా శరత్కుమార్
తెలుగు సినిమాల్లో నటించమని తానే సలహా ఇచ్చానని సీనియర్ హీరోయిన్ రాధిక అన్నారు. వరలక్ష్మి చేసిన తొలి సినిమా చూసినప్పుడే మంచి నటి అవుతుందనుకున్నామని తెలిపారు. వరలక్ష్మీ శరత్కుమార్ స్వీయ దర్శకత్వంలో వస్తోన్న సరస్వతి ఈవెంట్లో ఆమె మాట్లాడారు. తెలుగు ఆడియన్స్ నిన్ను బాగా ఆదరిస్తారని చెప్పానని రాధిక వెల్లడించారు.రాధిక శరత్కుమార్ మాట్లాడుతూ.. 'తను అద్భుతమైన నటి. ఆమెకు నేను ఒక సలహా ఇచ్చాను. ఇది కొందరికీ తప్పుగా అనిపించొచ్చు. కానీ వరలక్ష్మికి తెలుగు సినిమాలు చేయమని చెప్పా. వాళ్లు నిన్ను చాలా గౌరవిస్తారని చెప్పా. నేను కూడా తెలుగులో చాలా సినిమాలు చేశా. తెలుగు సినిమా నిన్ను గొప్పస్థాయికి తీసుకెళ్తుంది. నీకు తగిన క్యారెక్టర్స్ తెలుగులోనే వస్తాయని తనతో చెప్పానని' అన్నారు. కాగా.. వరలక్ష్మీ శరత్కుమార్ నటిస్తూ దర్శకత్వం వహించిన తెలుగు సినిమా మార్చి 6న థియేటర్లలో సందడి చేయనుంది. వరలక్ష్మీ సోదరి పూజా శరత్కుమార్ ఈ సినిమాకు మరో నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. తెలుగు సినిమాలు చేయమని వరలక్ష్మికి చెప్పాను..తమిళ సినిమా కంటే తెలుగు సినిమా గొప్పది..Proud to be a TELUGIAN 🥺💙pic.twitter.com/fd2PAxQjEK— Hari SaaHo (@HariSaaho19) March 1, 2026 -
యంగ్ హీరోలని డామినేట్ చేసిన డీ గ్లామర్ బామ్మ
రాధిక.. ఈ పేరు ఇప్పటి జనరేషన్కి పెద్దగా తెలియకపోవచ్చు. ఎందుకంటే ముప్పై ఏళ్ల క్రితం తెలుగు, తమిళ స్టార్ హీరోలతో బోలెడన్ని సినిమాలు చేసింది. వయసు పెరిగిపోవడంతో తల్లి, పిన్ని తరహా పాత్రలు చేస్తూ వస్తోంది. అలాంటిది 63 ఏళ్ల వయసులో ఈమెని లీడ్ రోల్గా పెట్టి సినిమా తీస్తే కళ్లు చెదిరే కలెక్షన్స్ వస్తున్నాయి. ఓ రకంగా చెప్పాలంటే చాలామంది యంగ్ హీరోలనే డామినేట్ చేస్తోందని చెప్పొచ్చు.(ఇదీ చదవండి: 'విరోష్' పెళ్లి కానుక.. శుభవార్త చెప్పిన విజయ్ దేవరకొండ)తమిళ హీరో శివకార్తికేయన్ నిర్మాతగా రాధిక ప్రధాన పాత్రలో తీసిన సినిమా 'తాయ్ కిళవి'. పూర్తిగా తమిళ నేటివ్ టచ్ ఉన్న విలేజ్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో దీన్ని తెరకెక్కించారు. టీజర్, ట్రైలర్లో రాధిక లుక్ చూసి చాలామంది ఆశ్చర్యపోయారు. ఎందుకంటే పూర్తిగా డీ గ్లామర్ లుక్. చాలామంది ఈ తరహా పాత్రలు చేయడానికి సాహసిస్తారు. కానీ రాధిక డేర్ చేసింది. ఇప్పుడది వసూళ్ల రూపంలో కనిపిస్తుంది. కేవలం 3 రోజుల్లో రూ.22 కోట్లకు పైగా కలెక్షన్స్ వచ్చినట్లు అధికారికంగా ప్రకటించారు.రీసెంట్ టైంలో అటు తెలుగులో గానీ తమిళంలో గానీ చాలామంది మిడ్ రేంజ్ హీరోలే వీకెండ్ అయ్యేసరికి రూ.20 కోట్లు తెచ్చుకోవడం అనేది కష్టంగా మారిపోయింది. అలాంటిది రాధికని పెట్టి ఓ సినిమా తీస్తే దానికి ఈ రేంజు వసూళ్లు రావడం నిజంగా ఆశ్చర్యమే అని చెప్పొచ్చు. అయితే 'తాయ్ కిళవి' చిత్రం సక్సెస్ కావడానికి మరో కారణం కూడా ఉంది. అదే తమిళనాడులో ఈ మధ్య కాలంలో సరైన మూవీస్ లేకపోవడం. లెక్క ప్రకారం సంక్రాంతికి 'జన నాయగణ్' రావాలి. కానీ నిరవధిక వాయిడా పడింది. వచ్చిన మిగతా మూవీస్ అన్ని తేలిపోయాయి. పెద్ద హీరోలు, మిడ్ హీరోల సినిమాలేం లేకపోవడం రాధిక చిత్రానికి కొంతవరకు ప్లస్ అయిందని చెప్పొచ్చు.'తాయ్ కిళవి' విషయానికొస్తే.. కోపం ఎక్కువగా ఉండే ఓ బామ్మ(రాధిక).. డబ్బులు వడ్డీలకు ఇస్తూ కాలం వెల్లదీస్తుంటుంది. ముక్కుసూటిగా మాట్లాడటం, తేడా వస్తే చితక్కొట్టేస్తూ ఉంటుంది. ముగ్గురు కొడుకులకు బాధ్యత లేకపోవడంతో వాళ్లని ఇంటి నుంచి తరిమేస్తుంది. అయితే ఈమె దగ్గర బంగారు నిధి ఉందనే ప్రచారం ఒకటి మొదలవుతుంది. మరోవైపు హఠాత్తుగా పక్షవాతం వచ్చేసరికి బామ్మ మాట పడిపోతుంది. దీంతో కొడుకులు తిరిగి వస్తారు. వాళ్లకు సైగ ద్వారా ఏదో చెప్పాలనే ప్రయత్నిస్తూ ఉంటుంది. ఇంతకీ అదేంటి? చివరకు ఏమైందనేదే స్టోరీ.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 13 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్) -
తండ్రిగా ప్రమోషన్ పొందిన 'పార్కింగ్' హీరో
తమిళ హీరో, పార్కింగ్ ఫేమ్ హరీశ్ కల్యాణ్ గుడ్ న్యూస్ చెప్పాడు. తాను తండ్రిగా ప్రమోషన్ పొందినట్లు వెల్లడించాడు. తనకు కూతురు పుట్టిందన్న శుభవార్తను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. నా జీవితంలోని అద్భుతమైన విషయాన్ని మీతో పంచుకుంటున్నందుకు సంతోషంగా ఉంది. మా జీవితాల్లో కొత్త అధ్యాయం మొదలైంది. నాకు, నర్మదకు ఈరోజు (మార్చి 2న) పాప పుట్టింది. ఆనందంగా ఉందితల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారు. కుటుంబసభ్యులు, బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు మాపై చూపిస్తున్న ప్రేమాభిమానాలకు మాకెంతో ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఓం నమఃశివాయ అంటూ ఓ లేఖ షేర్ చేశాడు. కాగా హరీశ్ కల్యాణ్- నర్మద ఉదయకుమార్ 2022 అక్టోబర్లో పెళ్లి చేసుకున్నారు.సినిమా2010లో వచ్చిన సింధు సామావెల్లి చిత్రంతో కోలీవుడ్కు హీరోగా పరిచయమయ్యాడు. చందమామ, పొరియాలన్, ప్యార్ ప్రేమ కాదల్, లెట్స్ గెట్ మ్యారీడ్, పార్కింగ్, లబ్బర్ పండు, డీజిల్ సినిమాలు చేశాడు. తెలుగులో జై శ్రీరామ్, జెర్సీ సినిమాల్లో సహాయక పాత్రలు పోషించాడు. కెరీర్ తొలినాళ్లలో తమిళ బిగ్బాస్ మొదటి సీజన్లో పాల్గొని సెకండ్ రన్నరప్గా నిలిచాడు. ప్రస్తుతం తమిళ ఇండస్ట్రీలో హీరోగా నిలదొక్కుకున్న హరీశ్ కల్యాణ్ నూరు కోడి వానవిల్ మూవీ చేస్తున్నాడు. Elated to share the most wonderful news with all my dear family ❤️🤗God willing 🙏 pic.twitter.com/11Icq8OMMz— Harish Kalyan (@iamharishkalyan) March 2, 2026 చదవండి: పెళ్లికి ముందు సహజీవనం.. నాకు అవకాశం ఇచ్చుంటే..: లయ -
చదువుకోకపోవడం వల్లే ఈ దుస్థితి! స్పందించిన కమెడియన్
చెక్ బౌన్స్ కేసు కారణంగా కమెడియన్ రాజ్పాల్ యాదవ్ పేరు కొంతకాలంగా వార్తల్లో నానుతూ వస్తోంది. ఇటీవలే తీహార్ జైలు నుంచి బెయిల్ మీద బయటకు వచ్చిన అతడు తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ ప్రారంభించాడు. అందులో వ్లాగ్స్, కామెడీ, మినీ సిరీస్.. ఇలా ఏదో ఒకటి చేస్తూ అందరికీ వినోదాన్ని పంచుతానన్నాడు. విద్య కారణం కాదుఇకపోతే అతడికి చదువు రాకపోవడం వల్లే ఇలా కేసులో చికుక్కున్నాడని మలయాళ దర్శకుడు ప్రియదర్శన్ ఇటీవల వ్యాఖ్యానించాడు. అతడు మంచివాడే కానీ, పెద్దగా చదువుకోకపోవడం వల్లే ఇలా ఇబ్బందులు పడాల్సి వస్తుందని సానుభూతి చూపించాడు. ఈ వ్యాఖ్యలపై రాజ్పాల్ యాదవ్ తాజాగా స్పందించాడు. తనకు చదువు రాదని ఎవరు చెప్పారని ప్రశ్నించాడు. కొన్ని సమస్యలకు చదువు సంద్య కారణం కాదు. నేను చదువుకోకపోవడం వల్లే ఇలాంటి పరిస్థితి వచ్చిందనడం కరెక్ట్ కాదు.కొన్నిసార్లు తప్పవునేను బాగానే చదువుకున్నాను. ఇప్పుడు నాకు 55 ఏళ్లు. 11 ఏళ్ల వయసులోనే పని చేయడం మొదలుపెట్టాను. నేను చదువురాని వాడినైతే ఇండస్ట్రీలో 30 ఏళ్లుగా కొనసాగేవాడినే కాదు. ఇక్కడ పెద్ద పెద్ద స్టార్స్ కూడా ఒకానొక సందర్భంలో సమస్యల్లో చిక్కుకుంటారు. దానికి చదువుతో సంబంధమే లేదు అని చెప్పాడు. అదే సమయంలో ప్రియదర్శన్ అలా అన్నందుకు తనపై ఎటువంటి కోపం లేదన్నాడు. నీ కొడుకులాంటివాడినిఇంకా మాట్లాడుతూ.. నా జీవితంలో ముగ్గురు దర్శకులకు ప్రత్యేక స్థానం. రామ్ గోపాల్ వర్మ, డేవిడ్ ధావన్, ప్రియదర్శన్.. వీరిపై నాకు అపారమైన గౌరవం. కేవలం ఈ ముగ్గురి డైరెక్షన్లోనే దాదాపు 50 సినిమాలు చేసుంటాను. ప్రియదర్శన్కైతే నేనొక కొడుకులాంటివాడిని. కాకపోతే ఆయనకు పూర్తి విషయం తెలీదు.సినిమాకాబట్టి ఆయన వ్యాఖ్యలను పట్టించుకోవాల్సిన పని లేదు అని వివరణ ఇచ్చాడు. ఇకపోతే రాజ్పాల్ యాదవ్ ప్రస్తుతం భూత్ బంగ్లా సినిమా చేస్తున్నాడు. ప్రియదర్శన్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో అక్షయ్ కుమార్ హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాతో పాటు రాజ్పాల్ యాదవ్.. వెల్కమ్ టు ద జంగిల్, హైవాన్, మరో రెండు సినిమాలు, రెండు వెబ్ సిరీస్లు చేస్తున్నాడు.చదవండి: వారణాసి అప్డేట్ ఇచ్చిన ప్రియాంక -
ఫ్యామిలీ మ్యాన్గా సూర్య.. టైటిల్ ఏంటో తెలుసా?
సార్, లక్కీ భాస్కర్ చిత్రాలతో ఇతర భాషా హీరోలకు ఘన విజయాలను అందించాడు తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరి. ఇప్పుడు ఈయన కోలీవుడ్ స్టార్ హీరో సూర్యతో సినిమా చేస్తున్నాడు. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ను సోమవారం (మార్చి 2న) రిలీజ్ చేశారు. సూర్య కెరీర్లో 46వ చిత్రంగా రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్కు విశ్వనాథ్ అండ్ సన్స్ అనే టైటిల్ ఖరారు చేశారు. ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామాపోస్టర్లో కళ్లజోడు ధరించిన హీరో సూర్య చిన్న బాబును ఎత్తుకుని స్టైలిస్ట్గా కనిపిస్తున్నాడు. ఇది మనసును తాకే ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా అని మూవీ టీం ప్రకటించింది. జూలైలో సినిమా రిలీజ్ చేస్తామని పేర్కొంది. ఈ మూవీలో ప్రేమలు హీరోయిన్ మమిత బైజు కథానాయికగా నటిస్తోంది. రవీనా టండన్, రాధికా శరత్ కుమార్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. జీవీ ప్రకాశ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు.సినిమామరోవైపు సూర్య చేతిలో ఇంకో రెండు సినిమాలున్నాయి. ఒకటి.. ఆర్జే బాలాజీ దర్శకత్వం వహిస్తున్న కరుప్పు మూవీ.. ఇందులో సూర్య ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో త్రిష కథానాయిక. మరోటి.. మలయాళ డైరెక్టర్ జిత్తు మాధవన్ డైరెక్షన్లో మూవీ చేస్తున్నాడు. ఇందులో సూర్య పోలీసాఫీసర్గా నటిస్తున్నాడు. ఇందులో నజ్రియా హీరోయిన్గా కనిపించనుంది. Power in his presence. 🔥Warmth in his embrace.🤍Bringing back the vintage magic of @Suriya_offl in a heart-touching family spectacle. 🤩#VishwanathAndSons ~ The biggest family drama of the year arrives this July. 🫶🏻#VenkyAtluri @_mamithabaiju @realradikaa @TandonRaveena… pic.twitter.com/frvwNwuU8f— Sithara Entertainments (@SitharaEnts) March 2, 2026 చదవండి: అల్లు ఫ్యామిలీలో నయనిక సిస్టర్స్.. ఫోటో వైరల్ -
ఏఆర్.రెహ్మాన్ని పెళ్లి చేసుకోవాలని ఆశపడ్డా : హీరోయిన్
యుక్త వయసులో ప్రేమలో పడడం సహజం. అదేవిధంగా లవ్అట్ ఫస్ట్ సైట్ అనేది జరుగుతుంది. నటి మోహిని గుర్తుందా 90 ప్రాంతంలో దక్షిణాదిలో ప్రముఖ కథానాయకిగా వెలిగారు. అప్పట్లో తమిళం, తెలుగు, మలయాళం, కన్నడం భాషల్లో నటించి బహుభాషా నటిగా రాణించారు. 1987లో కూత్తు పుళక్కంగళ్ అనే చిత్రం ద్వారా నటిగా రంగప్రవేశం చేసిన ఈమె ఆ తరువాత ఈరమాన రోజావే చిత్రంతో హీరోయిన్గా పరిచయం అయ్యారు. అలా పలు చిత్రాల్లో నటించిన ఈ అమ్మడు తెలుగులోనూ ఆదిత్య 367 చిత్రంలో ఎంట్రీ ఇచ్చారు. అలా మామా బాగున్నావా చిత్రాల్లో నటించారు. 2011 వరకు నటించిన మోహిని భరత్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని సంసార జీవితంలో సెటిల్ అయ్యారు. అయితే అప్పుడప్పుడు సామాజిక మాద్యమాల్లో పోస్ట్లు పెడుతూ వార్తల్లోకి ఎక్కుతున్నారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఈ భామ పేర్కొంటూ తనకు సంగీత దర్శకుడు ఏఆర్.రెహ్మాన్ అంటే చాలా అభిమానం అన్నారు. హిందూ మతానికి చెందిన ఆయన ఆ తరువాత ఇస్లామ్ మతానికి మారినట్లు గుర్తు చేశారు. అప్పుడు తాను చాలా బాధ పడ్డానన్నారు. అయితే రెహ్మాన్ హిందువుగా ఉన్నప్పుడు ఆయన్ని తాను చాలా ఇష్టపడ్డానని తెలిపారు. ఆయన అదే మతంలో కొనసాగుంటే తన తల్లిదండ్రులను ఒప్పించి ఆయన్నే పెళ్లి చేసుకోవాలన్నంత ఆశ కలిగిందన్నారు. ఏఆర్.రెహ్మాన్ ప్రస్తుతం పలు చిత్రాలకు సంగీతాన్ని అందిస్తూ బిజీగా ఉన్నారు. ఈయన హిందీలో తెరకెక్కుతున్న రామాయణ 1, 2 చిత్రాలకు ప్రఖ్యాత సంగీత దర్శకుడు హన్స్ జిమ్మీర్తో కలిసి పనిచేస్తున్నారన్నది గమనార్హం. ఏఆర్.రెహ్మాన్ మూన్వాక్ అనే చిత్రానికి సంగీతాన్ని అందించడంతోపాటు పూర్తి స్థాయి పాత్రలో నటించడం విశేషం. ఇందులో ప్రభుదేవా కథానాయకుడిగా నటిస్తున్నారు. ఇకపోతే రెహ్మాన్ గురించి మోహిని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. -
అమ్మాయిలకు ధైర్యాన్నిచ్చే సినిమా సరస్వతి: రాధిక
‘‘సరస్వతి’లాంటి కథ చెప్పడానికి ధైర్యం కావాలి. ఈ కథను వరలక్ష్మి చెప్పడం నాకు గర్వంగా ఉంది. మౌనంగా ఉన్న చాలామంది అమ్మాయిలకు ధైర్యాన్నిచ్చే సినిమా ఇది. వరలక్ష్మి చేసిన తొలి సినిమా చూసినప్పుడే మంచి నటి అవుతుందనుకున్నాం. అప్పుడే తనకి తెలుగు సినిమాలపై దృష్టి పెట్టమని చెప్పాను. నేను నా బెస్ట్ సినిమాలన్నీ తెలుగులోనే చేశాను’’ అని రాధికా శరత్కుమార్ అన్నారు. వరలక్ష్మీ శరత్కుమార్ నటించి, స్వీయ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘సరస్వతి’. వరలక్ష్మీ సోదరి పూజా శరత్కుమార్ ఈ సినిమాకు మరో నిర్మాత.ఈ థ్రిల్లర్ చిత్రం ఈ నెల 6న రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో శరత్కుమార్ మాట్లాడుతూ– ‘‘నటిగా వరలక్ష్మి విజయంలో నా పాత్ర ఏమీ లేదు. కాకపోతే ఈ ప్రపంచం ఎలా ఉంటుంది? ఎలా నడుచుకోవాలనే విషయాలను మాత్రం తనకు చిన్నప్పటుంచి చెప్తుండేవాడిని. స్త్రీలను గౌరవించడం మనందరి కర్తవ్యం. ‘సరస్వతి’ మంచి సబ్జెక్ట్. పూజకి ప్రోడక్షన్లో మంచి స్కిల్స్ ఉన్నాయి’’ అన్నారు. ‘‘ఈ సినిమాలోని ప్రతి పాత్ర అర్థవంతంగా ఉంటుంది. ప్రోడక్షన్ పరంగా ఈ సినిమాను పూజ చాలా కంట్రోల్ చేసింది. మా నాన్నగారిని గర్వపడేలా చేస్తానని నమ్ముతున్నాను.నా భర్త సపోర్ట్తోనే ఈ జర్నీ స్టార్ట్ అయ్యింది. ఫస్ట్ టైమ్ మా సినిమాను చూసిన వారు, ఇందులోని ట్విస్ట్ను రివీల్ చేయొద్దని కోరుతున్నా’’ అన్నారు వరలక్ష్మి. ‘‘మనసులో నిలిచిపోయే కథ ఇది’’ అన్నారు ప్రియమణి. ‘‘మా సినిమాను ఆడియన్స్ థియేటర్స్కు వచ్చి చూడాలని కోరుకుంటున్నాను’’ అని చె΄్పారు పూజా శరత్కుమార్. ‘‘సరస్వతి’ మంచి సినిమాగా నిలిచిపోతుంది’’ అని తెలిపారు సిమ్రాన్, స్వప్నా దత్.‘‘నటిస్తూ, డైరెక్షన్ చేయడమనేది పెద్ద చాలెంజ్. ఈ సినిమా చూసేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను’’ అని చెప్పారు దర్శకురాలు బి. నందినీ రెడ్డి. ‘‘స్వరస్వతి’లాంటి మంచి సినిమాను వరలక్ష్మి చేయడం ఆనందాన్నిచ్చింది’’ అని చె΄్పారు ఆమె భర్త నికోలాయ్ సచ్దేవ్. నటుడు సప్తగిరి, ఈటీవీ విన్ కంటెంట్ హెడ్ నితిన్ చక్రవర్తి మాట్లాడారు. -
వరలక్ష్మి నటించడం శరత్కు ఇష్టం లేదు.. నిర్మాతకు వార్నింగ్ ఇచ్చేవాడు: రాధిక
ప్రముఖ నటుడు శరత్ కుమార్ వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి,తనదైన నటనతో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది వరలక్ష్మీ శరత్ కుమార్. కేవలం హీరోయిన్గా మాత్రమే కాకుండా..విలన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నటించి..మెప్పించింది. క్రాక్, యశోద, వీరసింహారెడ్డి తదితర సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. ఇలా తనదైన నటనతో తండ్రికి తగ్గ తనయగా పేరు సంపాదించింది. అయితే కూతురు సినిమాల్లోకి రావడం మొదట్లో శరత్కుమార్కి ఏమాత్రం నచ్చలేదట. యాక్టింగ్ వదంటూ ఆమెపై సీరియస్ కూడా అయ్యాడట. ఒకానొక దశలో ఆమెకు చాన్స్ ఇచ్చిన నిర్మాతలకు ఫోన్ చేసి వార్నింగ్ కూడా ఇచ్చాడట. ఈ విషయాలన్నీ శరత్ కుమార్ సతీమణి రాధికా చెప్పారు. వరలక్ష్మీ స్వీయ దర్శకత్వంలో నటించిన తాజా చిత్రం ‘సరస్వతి’.ఈ నెల 6న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా హైదరాబాద్లో ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రాధికా మాట్లాడుతూ.. ‘వరలక్ష్మి సినిమాల్లోకి రావాలనుకున్నప్పుడు శరత్ వ్యతిరేకించారు. ‘ఎలా నటిస్తావ్? నువ్వు యాక్ట్ చేయకూడదు’ అంటూ సీరియస్ అయ్యేవారు. ‘మా కుమార్తెను నటిగా ఎంపిక చేయొద్దు’ అంటూ నిర్మాతలకూ ముందే చెప్పేవారు. ఈ విషయాలన్నింటినీ తన తల్లితో కలిసి వరలక్ష్మి ఓ రోజు నాతో పంచుకుంది. దీనిపై నిర్ణయం తీసుకోలేనని చెప్పి.. సినిమా సెట్స్లో ఉన్న శరత్ వద్దకు వారిని తీసుకెళ్లా. అప్పుడు ఆయన.. నమితతో కలిసి ఓ సాంగ్కు డ్యాన్స్ చేస్తున్నారు. నమితతో సినిమా పాట అంటే ఎలా ఉంటుందో అర్థం చేసుకోండి(నవ్వుతూ..). మమ్మల్ని చూడగానే ఆయన కారవాన్లోకి వెళ్లిపోయారు. తర్వాత వరలక్ష్మి నటించేందుకు అంగీకరించారు. వరలక్ష్మి తొలి సినిమా (పోడా పోడి)ని చూడగానే.. తను గొప్ప నటి అవుతుందని చెప్పా. తెలుగు సినిమాపై దృష్టి పెట్టమని వరలక్ష్మికి సలహా ఇచ్చా. ఆమె అదే ఫాలో అయింది. ఇప్పుడు వరలక్ష్మీని చూస్తుంటే గర్వంగా ఉంది’ అని రాధిక అన్నారు. -
శరత్ కుమార్ రెండో భార్యని తెగ పొగిడేసిన మొదటి భార్య
ఇండస్ట్రీలో చాలామంది హీరోలు గానీ నటీనటులు రెండో పెళ్లి చేసుకున్నారు. అయితే భార్యకు విడాకులు ఇచ్చేసిన తర్వాత ఆమెతో పెద్దగా సంబంధాలు ఉండవు. కలిసే, మాట్లాడే లాంటివి కూడా ఉండకపోవచ్చు. కానీ తమిళ నటుడు శరత్ కుమార్ మాత్రం వీటన్నింటికీ అతీతుడులానే కనిపిస్తున్నాడు. తాజాగా ఇతడి మొదటి భార్య ఛాయాదేవి.. రెండో భార్య అయిన రాధికని ప్రశంసలతో ముంచెత్తించారు.(ఇదీ చదవండి: హీరో విజయ్ను అన్ఫాలో కొట్టిన కుమారుడు!)ప్రముఖ నటుడు శరత్ కుమార్ కూతురు వరలక్ష్మి ప్రధాన పాత్ర పోషించి, తొలిసారి దర్శకత్వం వహించిన సినిమా 'సరస్వతి'. థ్రిల్లర్ కథతో తెరకెక్కించారు. ఈ శుక్రవారమే(మార్చి 06) థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్లో ఆదివారం మధ్యాహ్నం ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన వరలక్ష్మి తల్లి, శరత్ కుమార్ మొదటి భార్య ఛాయాదేవి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.'తొలినాళ్లలో దూరదర్శన్లో యాంకర్గా పనిచేశాను. ఓసారి రాధికని ఇంటర్వ్యూ చేశాను. దీపావళి సందర్భంగా అది రిలీజైంది. కుటుంబానికి అండగా నిలబడినందుకు థ్యాంక్స్. అలానే 'థాయ్ కెలవి' మూవీ హిట్ అయినందుకు శుభాకాంక్షలు. అందులో మీరు యాక్టింగ్ అద్భుతంగా చేశారు' అని ఛాయాదేవి.. రాధికని ప్రశంసలతో ముంచెత్తింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.నటుడు శరత్ కుమార్.. ఛాయాదేవిని 1984లో పెళ్లి చేసుకున్నాడు. వీళ్లకు వరలక్ష్మి, పూజా అని ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. 2000లో ఈమెకు విడాకులు ఇచ్చేసిన శరత్ కుమార్.. తర్వాత ఏడాది నటి రాధికని వివాహమాడాడు. వీళ్లకు రాహుల్ అనే కొడుకు పుట్టాడు. ఛాయాదేవి ప్రస్తుతం శరతు కుమార్తో కలిసి ఉండట్లేదు. కాకపోతే వరలక్ష్మి మాత్రం రాధికతో మంచి బాండింగ్ మెంటైన్ చేస్తోంది. వరలక్ష్మి పెళ్లి కూడా రాధికనే దగ్గరుండి జరిపించింది.(ఇదీ చదవండి: నచ్చినవాడితో జీవితం పంచుకుంటా.. త్రిష ఓల్డ్ కామెంట్స్ వైరల్) -
హీరో విజయ్ను అన్ఫాలో కొట్టిన కుమారుడు!
తమిళ స్టార్ హీరో విజయ్ నుంచి విడాకులకు కోరుతూ ఆయన భార్య సంగీత కోర్టును ఆశ్రయించింది. ఓ నటితో విజయ్కు ఉన్న వివాహేతర సంబంధం కారణంగానే విడిపోవాలని నిశ్చయించుకున్నట్లు తెలిసిందే! దీంతో ఈ వ్యవహారం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది.విజయ్ను అన్ఫాలో కొట్టిన జేసన్ఇదే సమయంలో నెటిజన్లు ఓ విషయాన్ని గుర్తించారు. విజయ్ కుమారుడు జేసన్ సంజయ్.. తన తండ్రిని దూరం పెట్టినట్లు గమనించారు. ఇన్స్టాగ్రామ్లో దళపతిని అన్ఫాలో కొట్టాడంటున్నారు. అయితే జేసన్.. తన తల్లి విడాకులకు దరఖాస్తు చేశాకే తండ్రిని అన్ఫాలో చేశాడని కొందరు అంటుంటే.. అంతకుముందు నుంచే అతడు తండ్రిని ఫాలో అవట్లేదని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.పెళ్లి - విడాకులుఏదేమైనా జేసన్.. ఇన్స్టాగ్రామ్, ఎక్స్ (ట్విటర్) ఖాతాల్లో తన తండ్రిని ఫాలో అవకపోవడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. కాగా విజయ్- సంగీత 1999లో పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక కుమారుడు, కూతురు సంతానం. రెండున్నర దశాబ్దాలుగా కలిసున్న ఈ జంట మధ్య కొంతకాలంగా మనస్పర్థలు తలెత్తినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో సంగీత విడాకులకు దరఖాస్తు చేసింది. ఈ విడాకుల పిటిషన్పై ఏప్రిల్ 20న విచారణ జరగనుంది. ఆరోజు విజయ్ న్యాయస్థానం ఎదుట హాజరు కానున్నాడు.చదవండి: ఓటీటీలో విత్ లవ్.. రిలీజ్ ఎప్పుడంటే? -
యశ్ టాక్సిక్.. ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్
కేజీఎఫ్ హీరో, కన్నడ స్టార్ హీరో యశ్ నటించిన భారీ యాక్షన్ మూవీ టాక్సిక్. ఇటీవలే టీజర్, గ్లింప్స్ చేయగా అభిమానులను ఆకట్టుకున్నాయి. కానీ గ్లింప్స్ మరింత బోల్డ్గా ఉండటంతో చాలా విమర్శలు వచ్చాయి. కేజీఎఫ్ 2 వంటి బ్లాక్బస్టర్స్ తర్వాత యష్ నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం కావడంతో ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు.తాజాగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ డేట్ ప్రకటించారు మేకర్స్. మార్చి 8న టాక్సిక్ ట్రైలర్ రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించారు. బెంగళూరులో ఈ చిత్ర ట్రైలర్ను విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాకు గీతు మోహన్దాస్ దర్శకత్వం వహించారు.కాగా.. ఈ చిత్రంలో నయనతార, కియారా అద్వానీ, హుమా ఖురేషి, తారా సుతారియా కూడా కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీని కన్నడ, ఆంగ్లంలో ఓకేసారి చిత్రీకరించారు. ఈ సినిమాను హిందీ, తెలుగు, తమిళం, మలయాళం కూడా రిలీజ్ చేస్తున్నారు. కెవిఎన్ ప్రొడక్షన్స్, మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ బ్యానర్లపై నిర్మించిన ఈ చిత్రం మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. -
ఓటీటీలో హిట్ సినిమా.. విత్ లవ్ రిలీజ్ ఎప్పుడంటే?
దర్శకుడిగా, హీరోగా తొలి సినిమాలకే హిట్టు కొట్టి సెన్సేషన్ అయ్యాడు అభిషన్ జీవింత్. ఇతడు టూరిస్ట్ ఫ్యామిలీ చిత్రంతో డైరెక్టర్గా పరిచయమయ్యాడు. సుమారు రూ.7 కోట్ల బడ్జెట్తో తీసిన ఈ చిత్రం ఏకంగా రూ.90 కోట్లు రాబట్టి సంచలనం సృష్టించింది. నెక్స్ట్ సినిమా ఎవరితో అనుకుంటున్న తరుణంలో ఈ యంగ్ డైరెక్టర్ హీరోగా మారాడు. విత్ లవ్ చిత్రంతో కథానాయకుడిగా ఆకట్టుకున్నాడు.ఓటీటీలో విత్ లవ్అభిషన్ జీవింత్, అనస్వర రాజన్ జంటగా నటించిన ఈ మూవీకి మదన్ దర్శకత్వం వహించాడు. సౌందర్య రజనీకాంత్ నిర్మాతగా వ్యవహరించింది. గత నెలలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం దాదాపు రూ.35 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. తాజాగా విత్ లవ్ ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్లోకి వచ్చేస్తుంది. మార్చి 6 నుంచి నెట్ఫ్లిక్స్లో అందుబాటులోకి రానుంది. థియేటర్లలో మిస్ అయినవారు ఎంచక్కా ఓటీటీలో చూసేయండి మరి.కథేంటంటే?సత్య (అభిషన్ జీవింత్) ఆర్కిటెక్ట్.. ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తుంటారు. అలా ఒకరోజు అక్క బలవంతంతో కాఫీ షాప్లో ఓ అమ్మాయిని చూసేందుకు వెళ్తాడు. ఆ అమ్మాయే మోనీషా (అనస్వర రాజన్). మాటల మధ్యలో ఇద్దరూ ఒకే స్కూల్లో చదివామని, ఇద్దరూ సీనియర్- జూనియర్ అని తెలుస్తుంది. తమ చిన్నతనంలో ఎవర్నైతే ప్రేమించారో వారిని ఒకసారి కలవాలనుకుంటారు. మరి తర్వాతేం జరిగింది? వాళ్లని కలిశారా? ఈ పెళ్లి చూపులు ఏమయ్యాయి? అనేది తెలియాలంటే ఓటీటీలో మూవీ చూడాల్సిందే! #WithLove will be streaming from March 6 on NETFLIX. pic.twitter.com/IoSzc2TXwW— Christopher Kanagaraj (@Chrissuccess) March 1, 2026 చదవండి: దుబాయ్లో చిక్కుకున్నా.. నన్ను భారత్కు తీసుకురండి: బాలీవుడ్ నటి -
దుబాయ్లో చిక్కుకుపోయా.. నన్ను భారత్కు తీసుకురండి!
ఇరాన్పై యుద్ధం నేపథ్యంలో ఇజ్రాయెల్, బహ్రెయిన్, ఖతర్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లలో ఉన్న భారతదేశ ప్రజలు బిక్కుబిక్కుమంటూ భయం గుప్పిట్లో బతుకుతున్నారు. దుబాయ్లో టాలీవుడ్ హీరో మంచు విష్ణుతో పాటు బాలీవుడ్ నటి సోనాల్ చౌహాన్ కూడా చిక్కుకుపోయింది. విమాన రాకపోకలు నిలిపివేయడంతో తిరిగొచ్చే దారి కనిపించడం లేదని సోషల్ మీడియాలో వాపోయింది.సాయం చేయండిగౌరవనీయులైన ప్రధాని నరేంద్ర మోదీగారు.. ప్రస్తుత సంక్షభ పరిస్థితుల్లో నేను దుబాయ్లో చిక్కుకున్నాను. విమానాల రాకపోకలు ఆగిపోయాయి. ఇండియాకు ఎలా రావాలో తెలియడం లేదు. నేను సురక్షితంగా ఇంటికి చేరేందుకు ప్రభుత్వం సాయం చేయాలని కోరుతున్నాను అంటూ చేతులు జోడించి నమస్కరిస్తున్న ఎమోజీని జత చేసింది సోనాల్.సినిమాసోనాల్ చౌహాన్ మోడల్, సింగర్, హీరోయిన్. జన్నత్ చిత్రంతో హిందీలో, రెయిన్బో మూవీతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. లెజెండ్, పండగ చేస్కో, షేర్, సైజ్ జీరో, డిక్టేటర్, ఎఫ్ 3, ద ఘోస్ట్ వంటి చిత్రాల్లో నటించింది. తెలుగులో చివరగా ఆదిపురుష్ మూవీలో మండోదరిగా యాక్ట్ చేసింది. చివరగా దర్ద్ (2024) అనే ద్విభాషా చిత్రంలో తళుక్కుమని మెరిసింది.చదవండి: తల్లి జీవితం ఇలాగే ఉంటుంది: ఇషితా దత్తా -
ఆ హీరోయిన్ బయోపిక్లో నటించాలనుంది!
వివిధ భాషల్లో హీరోయిన్గా రాణిస్తోంది ప్రియాంక మోహన్. ఒంద్ కథే హెల్లా అనే కన్నడ చిత్రంతో కథానాయికగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిందీ బ్యూటీ. అదే ఏడాది నాని గ్యాంగ్ లీడర్ సినిమాతో తెలుగువారికీ పరిచయమైంది. ఆ వెంటనే డాక్టర్ చిత్రంతో తమిళ ప్రేక్షకులకు పరిచయమైంది. ఇలా తక్కువ కాలంలోనే మూడు భాషల్లో నటించే అవకాశాలను అందుకుని పక్కింటి అమ్మాయి ఇమేజ్ సొంతం చేసుకుంది.సినిమాఅయితే ఈ బ్యూటీకి 2025 పెద్దగా కలిసి రాలేదు, సరైన హిట్ పడలేదు. అంతే కాకుండా ఇప్పుడు తన చేతిలో భారీ ప్రాజెక్టులు కూడా ఏమీ లేవు. ప్రస్తుతం తమిళంలో నటుడు కెవిన్ సరసన ఒక సినిమాలో నటిస్తోంది. కన్నడలో 666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ అనే చిత్రంలో యాక్ట్ చేస్తోంది. మరోవైపు ఈమె ప్రధాన పాత్రలో నటించిన మేడిన్ కొరియా నేరుగా నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానుంది.ఆమె బయోపిక్లో నటించాలనుందిఇకపోతే ప్రతి నటికి ఏదో ఒక బయోపిక్లో నటించాలనే కోరిక ఉంటుంది. అలాంటి కోరిక మీకు ఏదైనా ఉందా? అన్న ప్రశ్నకు ప్రియాంక ఇలా స్పందించింది. దివంగత నటి సౌందర్య బయోపిక్లో నటించాలని ఉందని మనసులో మాట బయటపెట్టింది. కన్నడ నటి సౌందర్య.. మాతృభాషలో కన్నా తెలుగు, తమిళం భాషల్లోనే స్టార్ హీరోయిన్గా క్రేజ్ అందుకుంది. స్టార్ హీరోలందరితోనూ జోడీ కట్టింది. తక్కువకాలంలోనే మంచి పేరు తెచ్చుకుంది. అంతే తక్కువ కాలంలో విమాన ప్రమాదంలో దుర్మరణం పాలైంది. మరి సౌందర్య బయోపిక్ తెరకెక్కిస్తారా? ఒకవేళ తీస్తే ప్రియాంకను హీరోయిన్గా తీసుకుంటారా? చూడాలి! -
ది కేరళ స్టోరీ-2 మేకర్స్కు బిగ్ రిలీఫ్
ది కేరళ స్టోరీ-2 మూవీకి బిగ్ రిలీఫ్ దక్కింది. ఈ సినిమాపై విధించిన స్టేను కేరళ హైకోర్టు తొలగించింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన స్టేను డివిజన్ బెంచ్ కొట్టేసింది. దీంతో ఈ సినిమాకు రిలీజ్కు మార్గం సుగమమైంది. ఈ రోజే ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ సినిమా స్టే వల్ల విడుదల కాలేదు. తాజాగా స్టే ఎత్తివేయడంతో ఈ మూవీ రిలీజ్ కానుంది. కాగా.. గతంలో రిలీజైన 'కేరళ స్టోరీ' చిత్రానికి సీక్వెల్గా 'కేరళ స్టోరీ 2' ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈనెల 27న రిలీజ్ కావాల్సిన ఈ సినిమాపై సింగిల్ బెంచ్ న్యాయస్థానం స్టే విధించింది. సినిమాలో వివాదాస్పద అంశాలు ఉన్నాయన్న పిటిషనర్ల వాదనతో ఏకీభవించిన కోర్టు.. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ప్రదర్శనను నిలిపివేయాలని ఆదేశించింది. ఈ సందర్భంగా సెన్సార్ బోర్డుపై కూడా హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. సమాజంలో విద్వేషాలను ప్రేరేపించే విధంగా, ఒక వర్గాన్ని కించపరిచేలా ఉన్న దృశ్యాలను సెన్సార్ బోర్డు ఎలా అనుమతించిందని ధర్మాసనం ప్రశ్నించింది.సుదీప్తో సేన్ దర్శకత్వంలో తెరకెక్కించిన ది కేరళ స్టోరీ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించింది. రెండేళ్ల క్రితం వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్గా నిలిచింది. తాజాగా ఈ మూవీకి సీక్వెల్గా ది కేరళ స్టోరీ-2 ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ చిత్రాన్ని దర్శకుడు కామాఖ్య నారాయణ్ తెరకెక్కించారు. ఇటీవల ట్రైలర్ రిలీజ్ చేయగా పెద్దఎత్తున విమర్శలొచ్చాయి. -
అదో చెత్త మూవీ.. ఇంత అపహాస్యం చేస్తారా?: నటుడు
ప్రముఖ మలయాళ స్టార్ జయరామ్ కుమారుడు, నటుడు కాళిదాస్ జయరామ్ ఓ బాలీవుడ్ సినిమాపై తీవ్ర విమర్శలు గుప్పించాడు. కేరళ సాంప్రదాయాన్ని ఖూనీ చేశారంటూ 'పరమ్ సుందరి'ని చెత్త సినిమాగా అభివర్ణించాడు. అతడు ప్రధాన పాత్రలో నటించిన ఆశాకల్ ఆయిరం అనే మలయాళ మూవీ ప్రమోషన్స్లో భాగంగా ఓ ఇంటర్వ్యూకి హాజరయ్యాడు.చెత్త మూవీఈ సందర్భంగా అతడు మాట్లాడుతూ.. ఇటీవలి కాలంలో నేను చూసిన చెత్త సినిమా పరమ్ సుందరి. ఈ మాట చెప్పడానికి కూడా నేను ఏమాత్రం సంకోచించడం లేదు. ఈ మూవీలో కేరళను చాలా చెత్తగా చిత్రీకరించారు. మన సంస్కృతిని అపహాస్యం చేయడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. సినిమా చూసి చాలా అసంతృప్తికి లోనయ్యాను. పరమ్ సుందరి ఒక చెడ్డ అనుభవాన్ని ఇచ్చింది అని పేర్కొన్నాడు.సినిమాపరమ్ సుందరి విషయానికి వస్తే.. సిద్దార్థ్ మల్హోత్రా కథానాయకుడిగా నటించిన ఈ సినిమాలో హీరోయిన్ జాన్వీ కపూర్ కేరళ కుట్టిగా యాక్ట్ చేసింది. తుషార్ జలోటా దర్శకత్వం వహించిన ఈ మూవీ 2025 ఆగస్టు 29న విడుదలైంది. రిలీజైన నాటి నుంచి విమర్శలు ఎదుర్కొన్న ఈ చిత్రం వసూళ్లు మాత్రం పర్వాలేదనిపించింది.చదవండి: విరోష్ పెళ్లి.. ఇది చూడటం నా అదృష్టం: కల్యాణి -
మండపంలో విరోష్ ఆనందభాష్పాలు.. కల్యాణి పోస్ట్
గతకొంతకాలంగా ప్రేమలో మునిగి తేలుతున్న విజయ్ దేవరకొడ- రష్మిక మందన్నా జంట మూడు ముళ్ల బంధంలో అడుగుపెట్టారు. ఫిబ్రవరి 26న వేదమంత్రాల సాక్షిగా ఒక్కటయ్యారు. రాజస్థాన్ ఉదయ్పూర్లోని మెమొంటోస్ ప్యాలెస్ ఈ వివాహ వేడుకకు వేదికగా నిలిచింది. ఈ పెళ్లి సెలబ్రేషన్స్కు ఇరు కుటుంబ సభ్యులతో పాటు దగ్గరి బంధుమిత్రులు హాజరై నూతన జంటను ఆశీర్వదించారు.ఇది నా అదృష్టంవారిలో మలయాళ హీరోయిన్ కల్యాణి ప్రియదర్శన్ ఒకరు. విరోష్ (విజయ్-రష్మిక జంటను ఫ్యాన్స్ ముద్దుగా విరోష్ అనే పిల్చుకుంటారు) జంట పెళ్లి చూడటం తన అదృష్టమంటూ ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఓ పోస్ట్ పెట్టింది. ఎంతో మంచి మనసున్న అమ్మాయి తన బెస్ట్ ఫ్రెండ్ను పెళ్లాడిన మధుర క్షణాలను కళ్లారా చూశాను. ఆమె అతడివైపు అడుగులు వేస్తూ వస్తున్నప్పుడు అతడు స్తబ్ధుగా కూర్చుని ఆ శబ్ధాన్ని వింటున్నాడు.ఆనంద భాష్పాలుఆమె అలా మండం వైపు వస్తుంటే ఇద్దరి కళ్లలో కనిపించిన ఆనంద భాష్పాలు వారి మధ్య ప్రేమను తెలియజేస్తున్నాయి. డీప్ ఫ్రెండ్షిప్, పరస్పర గౌరవంతో ఒక్కటైన ఈ జంటను ఇలా చూడటం నాకు దక్కిన అదృష్టంగా భావిస్తున్నాను. రష్మిక- విజయ్కు ఇది మరో అందమైన ప్రారంభం అని రాసుకొచ్చింది.చదవండి: విరోష్ పెళ్లి.. ఇద్దరూ ఎంత చదువుకున్నారంటే? -
అమ్మో.. రుక్మిణినా?.. భయపడిపోతున్న దర్శకనిర్మాతలు!
ఈ తరం హీరోయిన్లు నటనపై కంటే ధనార్జన పైనే ఎక్కువ దృష్టి పెడుతున్నారా? అలా అవకాశాలను కోల్పోతున్నారా ? నటి రుక్మిణి వసంత్ లాంటి నటీమణులను చూస్తుంటే అలానే అనిపిస్తోంది. ఈ కన్నడ భామ సినీ పయనం జస్ట్ ఆరేళ్లే. అయితే ఈ అమ్మడు ఇంత తక్కువ కాలంలోనే పాన్ ఇండియా కథానాయకిగా మారడం విశేషమే. 2019లో ఒక కన్నడ చిత్రం ద్వారా నటిగా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఆ వెంటనే బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తరువాత తమిళం, తాజాగా తెలుగు భాషల్లో చిత్రాలు చేశారు. ఇటీవల కన్నడం చిత్రం కాంతార –2లో నటించి విశేష గుర్తింపును పొందారు. పారితోషికం పెంచాలంటే ఎవరైనా, మంచి విజయం కోసం ఎదురు చూడాలి. అలాంటి హిట్ రుక్మిణి వసంత్కు కాంతారా– 2 చిత్రంతో వచ్చింది. తాజాగా ఓ తెలుగు, కన్నడ చిత్రంలో నటిస్తున్నారు. తమిళంలో ఇంతకు ముందు విజయ్ సేతుపతికి జంటగా ఏస్ చిత్రంలో ఎంట్రీ ఇచ్చారు. ఆ చిత్రం పూర్తిగా నిరాశ పరిచింది. ఆ తరువాత శివకార్తికేయన్ సరసన నటించిన మదరాసి చిత్రం ఓకే అనిపించుకుంది. అదే విధంగా తెలుగులోనూ రంగప్రవేశం చేశారు. అక్కడ నటించిన తొలి చిత్రం అప్పుడో ఇప్పుడో ఎప్పుడో చిత్రం విజయాన్ని ఇవ్వలేదు. అయినప్పటికీ ఈ అమ్మడికి లక్కు ఉన్నట్లుంది ఇప్పుడు డ్రాగన్ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ సరసన నటించే అవకాశం వరించింది. ఇకపోతే కన్నడంలో యశ్తో కలిసి నటించిన టాక్సిక్ చిత్రం త్వరలో తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. కాగా ఈ అమ్మడి చేతిలో డ్రాగన్ అనే ఒక్క చిత్రం మాత్రమే ఉంది. కొత్తగా అవకాశాలు రావడం లేదు. దీనికి కారణం ఈ భామ తన పారితోషికాన్ని అమాంతంగా పెంచేయడమేనట. ఇలాంటి ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుండటం వల్లే దర్శక నిర్మాతలు ఈ బ్యూటీని ఎంపిక చేయడానికి వెనుకడుగు వేస్తున్నారట. రుక్మిణి వసంత్ ఇప్పటికి అన్ని భాషల్లో కలిపి 12 చిత్రాలు మాత్రమే చేశారు. అప్పుడే కోట్లలో పారితోషికం డిమాండ్ చేస్తుండడం చర్చనీయాశంగా మారుతోంది. -
హైకోర్టులో ‘ది కేరళ 2’ చిత్రానికి భారీ షాక్
సంచలనం సృష్టించిన 'కేరళ స్టోరీ' చిత్రానికి సీక్వెల్గా వస్తున్న 'కేరళ స్టోరీ 2' విడుదలకు కేరళ హైకోర్టు షాక్ ఇచ్చింది. రేపు (ఫిబ్రవరి 26) విడుదల కావాల్సిన ఈ సినిమాపై న్యాయస్థానం స్టే విధించింది. సినిమాలో వివాదస్పద అంశాలు ఉన్నాయన్న పిటిషనర్ల వాదనతో ఏకీభవించిన కోర్టు, తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ప్రదర్శనను నిలిపివేయాలని ఆదేశించింది. ఈ సందర్భంగా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) పై హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. సమాజంలో విద్వేషాలను ప్రేరేపించే విధంగా, ఒక వర్గాన్ని కించపరిచేలా ఉన్న దృశ్యాలను సెన్సార్ బోర్డు ఎలా అనుమతించిందని ధర్మాసనం ప్రశ్నించింది.అసలేం జరిగింది?2023లో వివాదాల మధ్య విడుదలైన ‘ది కేరళ స్టోరి’ చిత్రానికి సీక్వెల్గా వస్తున్న చిత్రం ది కేరళ స్టోరీ 2. కామాఖ్య నారాయణ్ సింగ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు సెన్సార్ బోర్టు యూ/ఏ సర్టిఫికేట్ జారీ చేసింది. ఈ సినిమాలో కేరళను తప్పుగా చూపించారని ఆరోపణలు చేస్తూ పలువురు కోర్టు మెట్లు ఎక్కారు. దీంతో ఫిబ్రవరి 25న ముందుగా ఈ సినిమాను కోర్టులో ప్రదర్శించాలని, ఆ తర్వాతే సెన్సార్ విషయంలో జోక్యం చేసుకుంటామని ధర్మాసనం పేర్కొంది. ఈ రోజు సినిమాను వీక్షించిన హైకోర్టు.. సినిమాలో వివాదస్పద అంశాలు ఉన్నాయని, తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ప్రదర్శనను నిలిపివేయాలని ఆదేశించింది. -
రష్మికకు మూడోసారి.. విజయ్కు మాత్రం తొలిసారి!
సినిమాలు, పనులు ఎప్పుడూ ఉండేవే.. కానీ పెళ్లి జీవితంలో ఒక్కసారే వస్తుంది. కల్యాణం వచ్చినా ఆగదు, కక్కొచ్చినా ఆగదన్నట్లు ఆ శుభఘడియలు ముంచుకొచ్చాక ఎవరూ దాన్ని వాయిదా వేయలేరు. టాలీవుడ్ సెలబ్రిటీ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా విషయంలో ఇదే జరుగుతోంది. చాలాకాలంగా ప్రేమలో ఉన్న వీరిద్దరూ దాన్ని బయటకు చెప్పకుండా దాగుడుమూతలు ఆడుతున్నారు.ఇప్పుడు ఆ ఆటకు ముగింపు పలుకుతూ భార్యాభర్తలుగా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఫిబ్రవరి 26న విరోష్ (విజయ్- రష్మిక) పెళ్లి జరగనుంది. ఇప్పటికే ప్రీవెడ్డింగ్ సెలబ్రేషన్స్ మొదలయ్యాయి. తాజాగా జరిగిన సంగీత్ వేడుకలో విజయ్ తల్లి మాధవి.. వారసత్వంగా వస్తున్న బంగారు గాజులను రష్మికకు బహుకరించి తన ప్రేమను చాటుకున్నట్లుృ తెలుస్తోంది. మరి విరోష్ లవ్ స్టోరీ ఎప్పుడు? ఎలా? మొదలైందో ఓసారి చూసేద్దాం..2018లోనే పెళ్లిగీత గోవిందం.. 2018లో వచ్చిన ఈ సినిమాలో తొలిసారి విజయ్- రష్మిక జంటగా నటించారు. ఆన్ స్క్రీన్లో పెళ్లి కూడా చేసుకున్నారు. ఇలా పెళ్లి సీన్లో నటించడం రష్మికకు మూడోసారి కానీ విజయ్కు మాత్రం అదే తొలిసారి కావడం విశేషం! ఈ చిత్రంతోనే వీరి మధ్య పరిచయం మొదలైంది. డియర్ కామ్రేడ్ మూవీతో స్నేహం కాస్త ప్రేమగా మారింది. అందుకే ఈ మూవీ తమకెంతో స్పెషల్ అంటుంటారు. కానీ ప్రేమలో ఉన్నామని మాత్రం నేరుగా ఎన్నడూ చెప్పలేదు. అందరి ముందు..కలిసి విహారయాత్రలకు వెళ్లినప్పుడు కూడా జంటగా ఫోటోలు షేర్ చేసిందీ లేదు. అయితే ఇద్దరూ కలిసే ఉన్నట్లుగా హింట్లు మాత్రం వదిలేవారు. పుష్ప సినిమా సమయంలో విజయ్ను డార్లింగ్ ఫ్రెండ్ అని అభివర్ణించింది రష్. ఇంటర్వ్యూలలో కూడా అతడు తన ఫేవరెట్ అని వెల్లడించింది. ది గర్ల్ఫ్రెండ్ ఈవెంట్లో తొలిసారి విజయ్.. అందరిముందు రష్మిక చేయిని ముద్దాడాడు. దీంతో ఆమె సిగ్గుల మొగ్గయింది.ఆ ఒక్క మాటతో..జయాపజయాల్లోనూ ఒకరికి ఒకరు తోడుగా ఉన్నారు. పలు బాక్సాఫీస్ ఫెయిల్యూర్స్ తర్వాత విజయ్.. కింగ్డమ్తో పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే చిన్నపిల్లలా సంబరపడిపోయింది నేషనల్ క్రష్. మనం హిట్ కొట్టాం అని మురిసిపోయింది. తన ప్రేమ విజయ్ దగ్గరే ఆగిపోలేదు, అతడి కుటుంబాన్ని కూడా తన కుటుంబంగా భావించింది. విజయ్ సోదరుడు ఆనంద్ దేవరకొండ సినిమా ఈవెంట్స్కు వెళ్లేందుకు ఏనాడూ నో చెప్పలేదు. అటు విజయ్ తల్లితోనూ తనకు ప్రత్యేక అనుబంధం ఉంది. ఆమె తనకు అమ్మ తర్వాత అమ్మతో సమానం అన్నప్పుడే ఆమె తెలుగింటి కోడలైపోయింది.పెళ్లి పత్రికలోనూ..విజయ్- రష్మికల ప్రేమను చూసిన అభిమానులు వీరికి విరోష్ (#Viorsh) అనే ట్యాగ్ ఇచ్చారు. అలానే పిలవడం మొదలుపెట్టారు. అభిమానులు ఇచ్చిన విరోష్ అనే పేరు ఈ లవ్బర్డ్స్కు సైతం నచ్చడంతో పెళ్లి పత్రికలోనూ అదే పేరు అచ్చువేయించారు. మరికొన్ని గంటల్లో ఒక్కటి కాబోతున్న ఈ విరోష్ జంటకు అడ్వాన్స్ కంగ్రాచ్యులేషన్స్!!చదవండి: పెళ్లి వేళ.. రష్మిక వ్యాఖ్యలు వైరల్ -
తెలుగమ్మాయికి కోలీవుడ్ నుంచి పిలుపు!
వైష్ణవి చైతన్య.. యూట్యూబ్ దగ్గర మొదలైన ఆమె జర్నీ ఇప్పుడు సినిమా వరకు చేరింది. మొదట్లో అల వైకుంఠపురములో, రంగ్దే, టక్ జగదీశ్ వంటి సినిమాల్లో చిన్న పాత్రలు చేసింది. ఆనంద్ దేవరకొండ 'బేబీ' సినిమాతో హీరోయిన్గా మారి ఫస్ట్ మూవీకే మంచి మార్కులు కొట్టేసింది. ఈ ఒక్క సినిమాతోనే విశేషమైన గుర్తింపు, ప్రేమ, అవార్డులు అందుకుంది. కోలీవుడ్ ఎంట్రీప్రస్తుతం ఎపిక్: ద సెమిస్టర్ మూవీ చేస్తోంది. ఇదిలా ఉంటే ఈ బ్యూటీ కోలీవుడ్లో ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నట్లు ఓ వార్త వైరల్గా మారింది. జీవీ ప్రకాశ్ హీరోగా విఘ్నేశ్ కార్తీక్ ఓ సినిమా ప్లాన్ చేస్తున్నట్లు ఫిల్మీదునియాలో ఓ వార్త వైరల్గా మారింది. ఇప్పటికే 'హాట్స్పాట్ టూ మచ్'తో సక్సెస్ అందుకున్న ఈ దర్శకుడు ఈసారి ఏం ప్లాన్ చేయబోతున్నాడని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సినిమాఈ క్రమంలో అతడి నెక్స్ట్ ప్రాజెక్ట్లో జీవీ ప్రకాశ్ హీరోగా, తెలుగమ్మాయి వైష్ణవి చైతన్య హీరోయిన్గా నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. నిజానికి అజిత్ హీరోగా నటించిన వాలిమై అనే తమిళ మూవీలో వైష్ణవి చైతన్య చిన్న రోల్ చేసింది. కానీ, ప్రస్తుతం జరుగుతున్న ప్రచారం నిజమైతే మాత్రం కోలీవుడ్లో కథానాయికగా ఇదే తన తొలి సినిమా కానుంది.చదవండి: పెళ్లి వేడుకలో వరుణ్- లావణ్య.. ఎక్కడంటే? -
రష్మిక పెళ్లికి పిలిచిందా? రిషభ్ శెట్టి సమాధానమిదే
హీరోయిన్ రష్మిక పెళ్లి మరికొన్ని గంటల్లో జరగనుంది. హీరో విజయ్ దేవరకొండతో ఉదయ్పుర్ వేదికగా ఏడడుగులు వేయనుంది. గతంలోనే రష్మిక.. కన్నడ హీరో రక్షిత్ శెట్టిని పెళ్లి చేసుకోవాల్సింది. నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. కానీ అనుకోని కారణాల వల్ల అది రద్దయింది. అప్పటినుంచి రక్షిత్ శెట్టి అతడి స్నేహితులకు రష్మిక అంటే ఎందుకో కోపం? తాజాగా రష్మిక పెళ్లికి పిలిచిందా అనే ప్రశ్న 'కాంతార' రిషభ్ శెట్టికి ఎదురైంది. మరి అతడేం సమాధానమిచ్చాడో తెలుసా?(ఇదీ చదవండి: విజయ్-రష్మిక పెళ్లి.. శుభాకాంక్షలు చెప్పిన ప్రధాని)కర్ణాటకకు చెందిన రష్మిక.. రిషభ్ శెట్టి దర్శకత్వం వహించిన 'కిరిక్ పార్టీ' సినిమాతోనే హీరోయిన్ అయింది. ఇందులో రక్షిత్ శెట్టి హీరో. ఈ మూవీ షూటింగ్ జరుగుతున్నప్పుడే రక్షిత్-రష్మిక ప్రేమలో పడ్డారు. ఇరు కుటుంబ పెద్దల్ని ఒప్పించి ఘనంగా నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. కానీ తర్వాత ఏమైందో ఏమో పెళ్లి రద్దయింది. అప్పటినుంచి రిషభ్ శెట్టి, రక్షిత్ శెట్టితోపాటు అతడి స్నేహితులు.. రష్మిక గురించి మాట్లాడేందుకు పెద్దగా ఇష్టపడరు. ఇప్పుడు కూడా అదే జరిగింది.మంగళవారం ఉదయం మంత్రాలయంకి వచ్చిన రిషభ్ శెట్టి.. రాఘవేంద్ర స్వామిని దర్శించుకున్నారు. ఓ కార్యక్రమంలోనూ పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతున్న టైంలోనే.. రష్మిక మిమ్మల్ని తన పెళ్లికి పిలవలేదా? అని ఓ రిపోర్టర్ అడిగాడు. ప్రశ్న మధ్యలో ఉండగానే థ్యాంక్యూ అని చెబుతూ రిషభ్ శెట్టి అక్కడనుంచి వెళ్లిపోయాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.రష్మిక పెళ్లి విషయానికొస్తే.. గీతగోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాల్లో కలిసి చేసిన విజయ్ దేవరకొండని ప్రేమించి పెళ్లి చేసుకుంటోంది. ఉదయ్పుర్ వేదికగా కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో గురువారం ఉదయం పెళ్లి చేసుకోనున్నారు. ఉదయం తెలుగు పద్ధతిలో, సాయంత్రం రష్మిక కుటుంబానికి చెందిన కొడవ సంప్రదాయ పద్ధతిలో వివాహం జరగనుంది.(ఇదీ చదవండి: రష్మికకు విజయ్ తల్లిదండ్రులు పెట్టిన కండిషన్ ఏంటి?)#RishabShetty ignored #RashmikaMandanna’s marriage invitation questionpic.twitter.com/gwUFUpj9AC— cinee worldd (@Cinee_Worldd) February 25, 2026 -
ముఖ్యమంత్రిని ఇంటర్వ్యూ చేసిన స్టార్ హీరో.. ప్రోమో రిలీజ్
సాధారణంగా సినీ తారలను, రాజకీయ నాయకులను జర్నలిస్టులు ఇంటర్వ్యూ చేస్తుంటారు. కానీ కేరళలో ఓ అరుదైన ఇంటర్వ్యూ జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ను మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఇంటర్వ్యూ చేశాడు. దీనికి సంబంధించిన 'ప్రోమో' తాజాగా విడుదలై సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ముఖ్యమంత్రి అధికారిక నివాసమైన 'క్లిఫ్ హౌజ్' ఈ ప్రత్యేక ఇంటర్వ్యూకి వేదికైంది. సాధారణంగా గంభీరంగా కనిపించే ముఖ్యమంత్రి, మోహన్ లాల్ అడిగిన ప్రశ్నలకు ఎంతో ఉత్సాహంగా సమాధానాలు ఇచ్చినట్లు ప్రోమో ద్వారా తెలుస్తోంది.ఈ ఇంటర్వ్యూలో వ్యక్తిగత జీవితం, రాజకీయ ప్రస్థానం, ప్రభుత్వ పాలన వంటి అంశాలపై ముఖ్యమంత్రి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. మోహన్ లాల్ ఒక ముఖ్యమంత్రిని ఇంటర్వ్యూ చేయడం ఇదే తొలిసారి కాదు. గతంలో ఆయన కేరళ మాజీ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీని కూడా ఇదే తరహాలో ఇంటర్వ్యూ చేసి మెప్పించారు. ఇప్పుడు పినరయి విజయన్తో ఆయన చేసిన సంభాషణపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ ఇంటర్వ్యూ జరగడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.ఇది ప్రభుత్వ పబ్లిక్ రిలేషన్స్ (పీఆర్) ప్రయత్నాల్లో భాగమేనని విపక్షాలు ఇప్పటికే ఆరోపణలు గుప్పిస్తున్నాయి. ఒక నటుడిగా కాకుండా, ఒక సామాన్య పౌరుడిగా ముఖ్యమంత్రిని కలిసినప్పుడు కలిగే అనుభూతి ప్రత్యేకం’ అని ఈ సందర్భంగా మోహన్ లాల్ అభిప్రాయపడ్డారు. The teaser for the special Mohanlal interview of Kerala CM Shri Pinarayi Vijayan.. Superstar-turned-interviewer at Cliff House—covering life, politics, governance & even CM’s love for films! 🔥Titled “കണ്ടും മിണ്ടിയും ഇരുവർ” (or “Iruvar”), full episode coming soon. Buzz is… pic.twitter.com/qgL6gBl9iB— John Brittas (@JohnBrittas) February 24, 2026 -
ఎంత సంపాదించినా ఇప్పుడే.. లేదంటే చివరకు!: తమన్నా
దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలంటోంది హీరోయిన్ తమన్నా భాటియా. చేతిలో అవకాశాలున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవడంతో పాటు వాటిని భద్రంగా కాపాడుకోవాలని చెప్తోంది. ఆ ముందుజాగ్రత్త లేకపోతే మొదటికే మోసం వస్తుందని, చివరి రోజుల్లో ఆర్థిక ఇబ్బందులు తప్పవని హెచ్చరిస్తోంది. రెండు దశాబ్దాలుగా వెండితెరపై అలరిస్తున్న ఈ బ్యూటీ ఇటీవలే ఆభరణాల బిజినెస్లో అడుగుపెట్టింది.నాన్న వల్లే..ఆర్థిక భద్రత గురించి ఆమె మాట్లాడుతూ.. చిన్న వయసులో నాన్నే నా ఆర్థిక వ్యవహారాలన్నీ చూసుకునేవాడు. ఇప్పటికీ ఈ విషయంలో ఆయన సపోర్ట్, గైడెన్స్ ఎంతగానో ఉంది. ప్రస్తుతం నేను నా పెట్టుబడి వైవిధ్యంగా ఉండేలా చూసుకుంటున్నాను. రియల్ ఎస్టేట్, జ్యువెలరీ.. ఇలా వేర్వేరు రంగాల్లో పెట్టుబడులు పెట్టాను. విభిన్న మార్గాల్లో పెట్టుబడి పెట్టాలన్న ముందుచూపుకు నాన్నే కారణం. ఆయన దగ్గరినుంచే ఈ ఆర్థిక క్రమశిక్షణ అలవడింది.సంపాదన ఉన్నప్పుడే..సినిమా ఇండస్ట్రీలో పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. ఒకానొక సమయంలో యాక్టర్స్ భారీగా సంపాదించగలరు. కానీ, దాన్ని సరైన మార్గాల్లో ఆదా చేసుకోవాలి. ఆ డబ్బును రెట్టింపు చేసుకునే ప్రయత్నాలు చేయాలి. లేదంటే మాత్రం చివరకు ఏమీ మిగలదు అని తమన్నా చెప్పుకొచ్చింది. తమన్నా ప్రధాన పాత్రలో నటించిన వివాన్: ఫోర్స్ ఆఫ్ ది ఫారెస్ట్ మూవీ మే 15న విడుదల కానుంది.చదవండి: పవన్ కల్యాణ్పై పూనమ్ సెటైర్లు -
నాని-సుజీత్ ‘బ్లడీ రోమియో’.. యుకే ఫుడ్ మాఫియా బ్యాక్డ్రాప్?
టాలీవుడ్ హీరోలు యంగ్ దర్శకులపై చర్చ వస్తే తరచూ అట్లీ, ప్రశాంత్ నీల్, నీల్సన్, కార్తీక్ సుబ్బరాజు వంటి పేర్లే వినిపిస్తుంటాయి. కానీ మన దగ్గర కూడా యూత్ను ఆకట్టుకునే స్టైలిష్ యాక్షన్ సినిమాలు తెరకెక్కించగల టాలెంట్ ఉన్న దర్శకులు ఉన్నారు.అందులో ముఖ్యంగా నిలుస్తున్న పేరు సుజీత్. ‘ఓజి’తో సుజీత్ ఒక్కసారిగా భారీ క్రేజ్ సంపాదించుకున్నారు. ఆ సినిమా చుట్టూ ఏర్పడిన అంచనాలు, టీజర్లు, పోస్టర్లు—అన్నీ కలిపి సుజీత్ను పాన్ ఇండియా రేంజ్లో చర్చకు తెచ్చాయి. ‘ఓజి’ తర్వాత ఆయన చేయబోయే ప్రాజెక్ట్పై కూడా అదే స్థాయిలో ఆసక్తి నెలకొంది.సుజీత్ తదుపరి చిత్రం నేచురల్ స్టార్ నానితో ఉండనున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం ఇండస్ట్రీలో ఇప్పటికే హాట్ టాపిక్గా మారింది. తాజాగా విడుదలైన ‘బ్లడీ రోమియో’ అనౌన్స్మెంట్ వీడియో ఈ ప్రాజెక్ట్పై మరింత స్పష్టత ఇచ్చింది. వీడియోలో కనిపించిన విజువల్స్ ఆధారంగా ఈ సినిమా యుకే ఫుడ్ మాఫియా బ్యాక్డ్రాప్లో సాగనుందని అర్థమవుతోంది. ఫుడ్ రెసిపీలు, చెఫ్ ఎలిమెంట్స్, వంటకాలకు సంబంధించిన సింబాలిజం వంటివి కథలో కీలక భాగమని సూచిస్తున్నాయి. లోగోలో కనిపించిన లండన్ బ్యాక్డ్రాప్ సినిమా సెట్టింగ్ను క్లియర్ చేసింది.ఇప్పటివరకు విభిన్న జానర్లలో తనదైన ముద్ర వేసుకున్న నాని, శ్రీకాంత్ ఓడెలతో కలిసి ఇటీవల రగ్డ్ పీరియాడిక్ టచ్ ఉన్న ‘పారడైజ్’ తరహా కథ తర్వాత సుజీత్తో పూర్తిగా స్టైలిష్ యాక్షన్ జోన్లోకి అడుగుపెడుతున్నారు. గన్స్, గర్ల్స్, స్టైలిష్ టేకింగ్, ఎలివేషన్ సీన్స్ అన్నీ కలిపి ఈ చిత్రం ఫుల్ క్లాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందనుందని టాక్. యూత్కు నచ్చేలా స్టైలిష్గా సినిమా తీయగల దర్శకుడిగా సుజీత్ ఇప్పటికే తన సామర్థ్యాన్ని నిరూపించుకున్నారు. ఇప్పుడు నాని వంటి నటుడితో కలయిక మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది.ఈ చిత్రం టాలీవుడ్కు కొత్త స్టైలిష్ యాక్షన్ ఫేజ్ను తెచ్చిపెడుతుందా? అన్నది చూడాలి. -
రాధిక శరత్కుమార్ డిఫరెంట్ రోల్ మూవీ.. ఆసక్తిగా ట్రైలర్
సీనియర్ నటి రాధిక శరత్కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న తాజా చిత్రం తాయ్ కిజవి. ఈ మూవీలో ఇంతకు ముందెన్నడు కనిపించని లుక్లో రాధికా కనిపించనుంది. ఈ సినిమాకు శివకుమార్ మురుగేశన్ దర్శకత్వం వహించారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ చిత్రాన్ని హీరో శివ కార్తికేయన్ నిర్మించారు. ఈ చిత్రంలో రాధిక శరత్కుమార్ వృద్ధురాలిగా కనిపించనున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం ఫిబ్రవరి 27న థియేటర్లలో సందడి చేయనుంది. అయితే ప్రస్తుతానికి కేవలం తమిళంలోనే రిలీజ్ కానుంది. తెలుగులోకి డబ్ చేసి రిలీజ్ చేసే విషయంపై మేకర్స్ క్లారిటీ ఇవ్వలేదు. ఈ చిత్రంలో సింగమ్ పులి, అరుళ్ దాస్, బాల శరవణన్, తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. -
8 ఏళ్ల తర్వాత తీసేశాడు.. ఈ స్టార్ హీరోని గుర్తుపట్టారా?
పాన్ ఇండియా ట్రెండ్ కలిసొచ్చిన హీరోల్లో ఇతడు ఒకడు. చేసింది రెండే సినిమాలు అయినా దేశవ్యాప్తంగా కోట్లాది మంది ఇతడికి అభిమానులయ్యారు. 2022లో చివరగా పలకరించిన ఈ హీరో.. దాదాపు నాలుగేళ్ల తర్వాత మళ్లీ ఓ మూవీతో థియేటర్లలోకి రాబోతున్నాడు. అయితే గత 8-9 ఏళ్లుగా ఒకే లుక్ మెంటైన్ చేస్తూ వచ్చిన ఇతడు.. ఎట్టకేలకు కొత్తగా కనిపించాడు. మరి ఇతడెవరో గుర్తుపట్టారా?(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 20 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)పైన కనిపిస్తున్నది 'కేజీఎఫ్' ఫేమ్ యష్. సడన్గా చూస్తే మీరు గుర్తుపట్టలేకపోవచ్చు. ఎందుకంటే 'కేజీఎఫ్' సినిమాల కోసం చాలా గడ్డం పెంచేసిన ఇతడు.. దాన్ని అలానే ఉంచేశాడు. తర్వాత 'టాక్సిక్' మూవీ చేసినప్పటికీ అందులో గడ్డం లుక్తోనే ఓ పాత్ర ఉంది. ఇది కాకుండా మరో రోల్లో క్లీన్ షేవ్తో కనిపించాడు. కొన్నిరోజుల క్రితం వచ్చిన టీజర్ చివరలో కనిపించి కనిపించకుండా లుక్ చూపించారు. దాన్ని ఏఐతో క్రియేట్ చేశారని చాలామంది కామెంట్స్ చేశారు.ఆ ట్రోల్స్పై క్లారిటీ ఇచ్చిన స్టైలిష్ట్.. యష్ క్లీన్ షేవ్ లుక్ వీడియోని తన ఇన్ స్టాలో పోస్ట్ చేశాడు. 'నమ్మకం నిజమైనది అయినప్పుడు.. పనే మాట్లాడుతుంది' అని సదరు హెయిర్ స్టైలిష్ట్ క్యాప్షన్ పెట్టాడు. అయితే ఇన్నాళ్లు గడ్డంతోనే యష్ని చూసిన ఫ్యాన్.. ఈ లుక్ చూసి గుర్తుపట్టలేకపోతున్నారు. వాళ్లకు ఈ యష్.. ఎవరో కొత్త వ్యక్తిలా కనిపిస్తుండటం విశేషం.'టాక్సిక్' విషయానికొస్తే 1970ల్లో గోవా బ్యాక్డ్రాప్లో జరిగే గ్యాంగ్స్టర్ డ్రామాగా దీన్ని తెరకెక్కించారు. మలయాళ దర్శకురాలు గీతూ మోహన్ దాస్ దీన్ని తీసింది. నయనతార, రుక్మిణి వసంత్, కియారా అడ్వాణీ, హ్యుమా ఖురేషి తదితరులు హీరోయిన్లుగా నటించారు. మార్చి 19న ఇది పాన్ ఇండియా వైడ్ థియేటర్లలోకి రానుంది. టీజర్ రిలీజ్ తర్వాత యష్ సొంత భాషలో పెద్దగా సౌండ్ లేదు. తెలుగులోనే కాస్తంత ఎక్కువ హడావుడి కనిపిస్తోంది. దానికి తోడు.. మార్చి 19నే 'ధురంధర్ 2' రిలీజ్ కానుంది. యష్ మూవీతో పోలిస్తే దీనిపైనే ఎక్కువ హైప్ ఉంది.(ఇదీ చదవండి: అన్న అని పిలవను.. రాజీవ్ కనకాల నాకు బావ!: గాయత్రి భార్గవి) View this post on Instagram A post shared by Alex Vijaykanth (@alex.vijaykanth) -
2017లో బెస్ట్ ఫ్రెండ్.. ఇప్పుడతడినే పెళ్లి చేసుకుంటున్నా
మలయాళ నటి నిలీన్ సాండ్రా గుడ్న్యూస్ చెప్పింది. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు వెల్లడించింది. దర్శకుడు శ్యామిన్ గిరీశ్తో కొత్త జీవితం ప్రారంభించబోతున్నానంది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ వీడియో షేర్ చేసింది. దేవుడు ఒక స్త్రీని ఆశీర్వదించాలనుకున్నప్పుడు తనను ప్రేమగా చూసుకునే ఓ వ్యక్తిని తన జీవితంలోకి పంపుతాడు. పెళ్లి చేసుకోబోతున్నా..అలా 2017లో నాకోసం నిన్ను పంపాడు. ప్రేమికుడిగా కాదు బెస్ట్ ఫ్రెండ్గా! ఏళ్లు గడిచిపోయాయి. ఇప్పుడదే బెస్ట్ ఫ్రెండ్తో జీవితాంతం కలిసుండాలని నిర్ణయించుకున్నాను. పెళ్లి చేసుకోబోతున్నాను. దేవుడు నాకోసం పంపిన వ్యక్తిని పెళ్లాడబోతున్నాను అని క్యాప్షన్ ఇచ్చింది. ఈ వీడియోలో నిలీన్.. శ్యామిన్తో కలిసి సరదాగా గడిపిన క్షణాలున్నాయి.ప్రియురాలి కోసం..ఒకరికోసం ఒకరు నిలబడటం, విహారయాత్రకు వెళ్లడం, కలిసి భోజనం చేసిన క్లిప్పింగ్స్ ఉన్నాయి. అలాగే శ్యామిన్.. నిలిన్కు చీర సర్దడం, కాలికి మెహందీ వేయడం, కాలికి మసాజ్ చేయడం, తనకోసం ఇల్లు తుడవడం ఇలా ఎన్నో చేశాడు. మలయాళ నటి నిలీన్ సాండ్రా.. 2018, ఆఫీసర్ ఆన్ డ్యూటీ వంటి చిత్రాల్లో నటించింది. అలా సామర్థ్య శాస్త్రం, రాక్ పేపర్ సిజర్స్ వెబ్ సిరీస్లలో కనిపించింది. View this post on Instagram A post shared by Nileen SaNdra (@nileen_sandra) చదవండి: విజయ్- రష్మిక జోడీ.. ఏజ్ గ్యాప్ ఎంతంటే? -
నటి విష్ణుప్రియ తండ్రి దారుణ హత్య
తమిళనాడులో దారుణం జరిగింది. ప్రముఖ నటి విష్ణుప్రియ తండ్రి సూర్యనారాయణ(73) హత్యకు గురయ్యారు. ఈ విషయం ఇప్పుడు కలకలం సృష్టించింది. కొందరు దుండగులు ఈ దారుణానికి పాల్పడ్డారు. అలానే మృతుడి ఒంటిపై ఉన్న బంగారు గొలుసు, ఉంగరం లాంటి విలువైన వస్తువులు తీసుకుని పరారయ్యారు.సూర్యనారాయణ.. కొడైక్కెనాల్ సమీపంలోని కురించి ఆండవర్ కోయిల్ ప్రాంతంలో నివసిస్తున్నారు. ఈయనకు అక్కడే ఓ పెద్ద బంగ్లా కూడా ఉంది. అందులో ఆరుముగం, మురళి అనే ఇద్దరు పనివాళ్లు కూడా ఉన్నారు. రెండురోజుల క్రితం విహారయాత్ర కోసం అని వచ్చిన ఐదుగురు వ్యక్తులు.. దగ్గరలో బసకు దిగారు. శనివారం రాత్రి, బంగ్లా దగ్గరకు వచ్చిన వ్యక్తులు.. పనిమనుషులని చితకబాదారు. తర్వాత సూర్యనారాయణ ముఖానికి టేప్ చుట్టి దారుణంగా హింసించారు. ఈ క్రమంలోనే ఆయన ఊపిరాడక చనిపోయారు.సూర్యనారాయణని హత్య చేసిన అనంతరం ఆయన మెడలోని బంగారు గొలుసు, ఉంగరంతో పాటు సీసీటీవీల హార్ట్ డిస్క్లు తీసుకుని పరారయ్యారు. కాగా సూర్య 'మాయావి' సినిమాలో సహాయ నటిగా చేసిన విష్ణుప్రియ కాస్త గుర్తింపు తెచ్చుకుంది. 2018లో ఈమెని ప్రేమించిన వ్యక్తి హత్యకు గురయ్యాడు. ఇప్పుడు సూర్యనారాయణ హత్యకు.. అప్పటి హత్యకు ఏమైనా సంబంధం ఉందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
‘వెడ్డింగ్ ఆఫ్ విరోష్’.. పెళ్లిపై స్పందించిన విజయ్, రష్మిక
టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ – నేషనల్ క్రష్ రష్మిక మందన్న పెళ్లి వార్తలు ప్రస్తుతం సినీ వర్గాల్లో, సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారాయి. ఈ జంట త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నట్లు సమాచారం. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఇద్దరూ తొలిసారి ఇన్స్టాగ్రామ్లో పెళ్లి విషయమై స్పందించారు. అభిమానులు వీరిని ఎంతో ఇష్టంగా “విరోష్” అని పిలుస్తున్నారు. అదే పేరును తమ వివాహ వేడుకకు ఖరారు చేస్తున్నట్లు తెలిపారు. “మేం ఏదైనా ప్లాన్ చేసుకోవాలనుకున్నా, ముందే అభిమానులు ఆ పనులు చేసి పెడుతున్నారు. ఇప్పుడు పెళ్లి విషయంలోనూ చాలా ప్రేమతో ఒక పేరు పెట్టారు. అందువల్ల మా వివాహ వేడుకకు ‘వెడ్డింగ్ ఆఫ్ విరోష్’ అని పేరు పెట్టాలని నిర్ణయించుకున్నాం. మమ్మల్ని ఇంతగా ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలు” అంటూ విజయ్, రష్మిక పేర్కొన్నారు. ఈ జంట వివాహ వేడుక అతి కొద్ది మంది సమక్షంలో రాజస్థాన్లోని ఉదయ్పుర్లో జరగనుందని సమాచారం. ఫిబ్రవరి 26న విజయ్ – రష్మిక మూడుముళ్లతో ఒక్కటవుతున్నారు. మార్చి 4వ తేదీన హైదరాబాద్లోని హోటల్ తాజ్ కృష్ణలో రాత్రి 7 గంటలకు గ్రాండ్గా రిసెప్షన్ నిర్వహించనున్నారు. దీనికి సినీ, రాజకీయ ప్రముఖులు హాజరుకానున్నారు.వీరిద్ధరూ కలిసి గీత గోవిందం, డియర్ కామ్రేడ్ చిత్రాల్లో నటించారు. అప్పటి నుంచే ఈ జంటపై రూమర్స్ వినిపించాయి. ఇప్పుడు పెళ్లి వార్తలతో ఆ రూమర్స్కు ముగింపు పలుకుతున్నారు. ప్రస్తుతం వీరిద్దరూ కలిసి ‘రణబలి’ అనే పీరియాడిక్ యాక్షన్ డ్రామాలో నటిస్తున్నారు. ఈ చిత్రం సెప్టెంబర్ 11న విడుదల కానుంది. దీనికి రాహుల్ సంకృత్యన్ దర్శకత్వం వహిస్తున్నారు. టాలీవుడ్లో అత్యంత క్రేజీ కపుల్గా పేరుగాంచిన విజయ్, రష్మిక వివాహం కోసం వీరి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. -
ట్రోల్స్ లెక్క చేయను.. నా ఇంటివరకు వస్తే మాత్రం!
దర్శకుడు రాజ్ నిడిమోరును పెళ్లి చేసుకున్నాక సమంత ముఖం వెలిగిపోతోంది. ఒకప్పుడు విచారంగా కనిపించే తన ముఖం ఇప్పుడు వెయ్యి ఓట్ల బల్బులా ప్రకాశిస్తోంది. ప్రస్తుతం సంతోషకర జీవితం గడుపుతున్న సామ్ మా ఇంటి బంగారం అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. పెళ్లి తర్వాత ఆమె నుంచి వస్తున్న మొదటి సినిమా ఇదే కావడం విశేషం! ఈ చిత్రం మే 15న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.ఏదీ నన్ను కదిలించలేదుఇదిలా ఉంటే తాజాగా తను సోషల్ మీడియాలో అభిమానులతో చిట్చాట్ చేసింది. ఫ్యాన్స్ అడిగిన పలు ప్రశ్నలకు ఓపికగా సమాధానాలిచ్చింది. సోషల్ మీడియాలో వచ్చే ప్రశంసలు, విమర్శలపై మీరు ఎలా స్పందిస్తారు? అని ఓ వ్యక్తి అడిగారు. అందుకు సమంత స్పందిస్తూ.. ప్రశంసలు నన్ను కదిలించలేవు. అలాగే విమర్శలు కూడా నన్ను ఎఫెక్ట్ చేయవు. కానీ, నెగెటివిటీని నా ఇంటివరకు తీసుకొస్తే మాత్రం మిమ్మల్ని బ్లాక్ చేస్తాను.దానర్థం అదే..అలా నా స్పేస్ను ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకుంటాను. మిమ్మల్ని బ్లాక్ చేశానంటే నేను బాధపడ్డానని కాదు. మీలాంటివారికి నాదగ్గర చోటు లేదని అర్థం అని రిప్లై ఇచ్చింది. మీలోని ఓ ఫన్నీ థింగ్ ఏంటని అడగ్గా.. కిందపడి మరీ నవ్వుతానంది. ఎక్కువ బాధ లేదా ఒత్తిడికి గురైనప్పుడు ఏం చేస్తారని అడగ్గా.. ధ్యానం చేస్తానని బదులిచ్చింది.సినిమామా ఇంటి బంగారం సినిమా విషయానికి వస్తే.. ఇందులో సమంత పెళ్లయిన అమ్మాయిగా కనిపించనుంది. అలాగే ఆపద వచ్చినప్పుడు కత్తి పట్టేందుకు కూడా వెనుకాడని శివంగిగానూ అలరించనుంది. గుల్షన్ దేవయ్య కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి నందిని రెడ్డి దర్శకత్వం వహించింది.చదవండి: ఇంకా అదే బాధలో ఉన్న కమెడియన్ ఇమ్మాన్యుయేల్ -
పిల్లలు నా మూవీ ఒక్కటి కూడా చూడలేదు: షాలిని
చిన్న వయసులోనే కెమెరా ముందు నటించడం మొదలుపెట్టింది షాలిని. బాలనటిగా 50కి పైగా సినిమాలు చేసింది. వాటిలో తెలుగు, తమిళ, మలయాళ, హిందీ చిత్రాలున్నాయి. తెలుగులో బెజవాడ బెబ్బులి, జైలు పక్షి, శారదాంబ, చిన్నారి దేవత, బ్రహ్మ పుత్రుడు, జగదేక వీరుడు అతిలోక సుందరి.. ఇలా పలు చిత్రాల్లో యాక్ట్ చేసింది.బాలనటిగా, హీరోయిన్గా..1997లో అనియతిప్రావు అనే మలయాళ చిత్రంతో హీరోయిన్గా మారింది. మలయాళంతో పాటు తమిళంలోనూ పలు చిత్రాల్లో కథానాయికగా మెప్పించింది. తమిళ స్టార్ హీరో అజిత్ను పెళ్లాడాక సినిమాలకు స్వస్తి చెప్పింది. ఇద్దరు పిల్లలు పుట్టాక వారిని చూసుకోవడంలోనే బిజీ అయిపోయింది. అయితే పిల్లలిద్దరూ ఇంతవరకు తన సినిమాలేవీ చూడలేదంటోంది షాలిని. ఒక్క సినిమా చూడలేదుతాజాగా ఓ అవార్డుల ఫంక్షన్కు హాజరైన సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నా పిల్లలు ఇంతవరకు నేను నటించిన ఒక్క సినిమా కూడా చూడలేదు. ఎప్పుడైనా చూద్దామని ప్లాన్ చేసుకుంటారు. తీరా సమయం దగ్గరపడ్డాక తర్వాత చూద్దాం అని వాయిదా వస్తుంటారు. అయితే నేను యాక్ట్ చేసిన సాంగ్స్ మాత్రం అప్పుడప్పుడు చూస్తూనే ఉంటారు. కానీ ఒక్క మూవీ కూడా పూర్తిగా చూడలేదు. ఇప్పటికైనా ఒక్క సినిమా అయినా చూడండ్రా.. అని స్టేజీపైనే పిల్లలను అభ్యర్థించింది షాలిని. View this post on Instagram A post shared by Reji babu Suresh babu (@rejibabusuresh) చదవండి: కుర్రాడైనా ఓకే అంటూ గ్రీన్ సిగ్నల్ ఇస్తున్న హీరోయిన్స్ -
డ్రాగన్ సీక్వెల్? హింట్ ఇచ్చిన డైరెక్టర్
దర్శకుడిగా, హీరోగా హిట్టయినవారిలో ప్రదీప్ రంగనాథన్ ఒకరు. కోమలి సినిమాతో డైరెక్టర్గా పరిచయమైన ఇతడు లవ్ టుడేతో డైరెక్టర్ కమ్ హీరోగా భారీ సక్సెస్ కొట్టాడు. ఆ వెంటనే డ్రాగన్ సినిమా చేశాడు. అశ్వత్ మారిముత్తు దర్శకత్వం వహించిన ఈ మూవీ కూడా బాక్సాఫీస్ వద్ద బ్లాక్బస్టర్గా నిలిచింది. దాదాపు రూ.150 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఫిబ్రవరి 21న ఈ సినిమా వచ్చి ఏడాది అవుతోంది.రెండోసారి తప్పక వస్తాంఈ సందర్భంగా అశ్వత్.. ప్రదీప్తో కలిసి దిగిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. డ్రాగన్ చిత్రానికి ఏడాది. సెల్ఫ్ మేడ్ స్టార్ ప్రదీప్తో కలిసి పని చేసిన అనుభవాన్ని మర్చిపోలేను. ఇద్దరు స్నేహితులు కలిసి పని చేస్తే ఎలా ఉంటుందో చూపించాం. మమ్మల్ని నమ్మినందుకు ఏజీఎస్ ప్రొడక్షన్ బ్యానర్కు, మా టీమ్కు కృతజ్ఞతలు. మేము సెకండ్ టైమ్ తప్పకుండా వస్తాం అని రాసుకొచ్చాడు. సినిమాదీంతో అభిమానులు డ్రాగన్ సీక్వెల్ ఉంటుందా? అని కామెంట్లు చేస్తున్నారు. మరికొందరేమో డ్రాగన్ టీమ్ కాంబినేషన్లో ఒక కొత్త చిత్రం రాబోతుందేమోనని అభిప్రాయపడుతున్నారు. డ్రాగన్ విషయానికి వస్తే.. ప్రదీప్ హీరోగా నటించిన ఈ మూవీలో అనుపమ పరమేశ్వరన్, కయాదు లోహర్ హీరోయిన్లుగా యాక్ట్ చేశారు. ఈ చిత్రం తెలుగులో రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ పేరిట విడుదలై ప్రేక్షకుల ఆదరణ సొంతం చేసుకుంది. 1 year of Dragon ! Blast working with this self made star ⭐️ @pradeeponelife . when friends come together for work the relationship is at stake ! But the same stake pushes u to deliver 🧨keep growing more PR! Thanks to @Ags_production & my team ❤️WE WILL COME BACK ‘2’nd TIME 😉 pic.twitter.com/ZpcH1j5QMT— Ashwath Marimuthu (@Dir_Ashwath) February 21, 2026 చదవండి: సెట్లో అందరూ చూస్తుండగా.. : తాప్సీ -
తలకిందులుగా వేలాడుతున్న ఈ హీరోని గుర్తుపట్టారా?
పైన ఫోటోలో తలక్రిందుగా వేలాడుతూ కనిపిస్తున్న ఆ హీరో ఎవరో గుర్తుపట్టారా? తమిళ చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి, తనదైన శైలిలో తెలుగు ప్రేక్షకులకు కూడా ఎంతో దగ్గరైన నటుడు. కేవలం నటనతోనే కాదు, క్రమశిక్షణతో కూడిన ఫిట్నెస్తో కుర్రకారుకు ఇన్పిరేషన్గా నిలుస్తుంటారు. ఆయనే మాస్ హీరో విశాల్. ఫిట్నెస్ విషయంలో ఏమాత్రం రాజీపడని ఈ హీరో, గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడ్డారు. ముఖ్యంగా డెంగ్యూ బారిన పడటం, షూటింగ్స్ ఒత్తిడి వల్ల కొన్నాళ్ల పాటు వ్యాయామానికి బ్రేక్ ఇవ్వాల్సి వచ్చింది. అయితే, ఇప్పుడు పూర్తి ఆరోగ్యంతో, రెట్టింపు ఉత్సాహంతో మళ్ళీ జిమ్లోకి అడుగుపెట్టారు.తాజాగా ఆయన తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసిన జిమ్ ఫొటోలు నెట్టింట వైరల్గా మారాయి. శరీరాన్ని దృఢంగా మార్చుకుంటూ, పాత 'పందెంకోడి' లుక్ను గుర్తుచేస్తున్నారు. ఈ మార్పు కేవలం ఆరోగ్యం కోసమే కాదు, తన తదుపరి ప్రాజెక్టుల కోసం కూడా అని తెలుస్తోంది.ప్రస్తుతం విశాల్ తన 36వ చిత్రంలో బిజీగా ఉన్నారు. సుందర్ సి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి తెలుగులో 'మొగుడు' అనే టైటిల్ను ఖరారు చేశారు. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన 'మగ మహారాజు', 'యాక్షన్' సినిమాల తరహాలోనే ఇది కూడా పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్గా ఉండబోతోంది. ఈ సినిమాలో విశాల్ సరసన మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్గా నటిస్తుండగా, యోగి బాబు కీలక పాత్ర పోషిస్తున్నారు. View this post on Instagram A post shared by Vishal (@actorvishalofficial) -
ఓటీటీలోకి ‘ఛాంపియన్’ బ్యూటీ కొత్త సినిమా
సంగీత దర్శకుడు, నటుడు జీవీ ప్రకాష్కుమార్ ఇటీవల ఒక సూపర్ హిట్ చిత్రం కోసం ఎదురుచూస్తున్నారనే చెప్పాలి. ఈయన సమీప కాలంలో కథానాయకుడిగా నటించిన బ్లాక్ మెయిల్ చిత్రం ప్రేక్షకుల మధ్య మంచి ఆదరణనే పొందింది. తాజాగా జీవీ ప్రకాష్కుమార్ కథానాయకుడుగా నటించిన చిత్రం లక్కీ. నటి అనస్వర రాజన్ నాయకిగా నటించిన ఈ చిత్రాన్ని పుష్ప కందస్వామి నిర్మించారు. ఉదయ్ మహేష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం వినోదంతోపాటు ప్రేమ, ఫ్యామిలీ సెంటిమెంట్, సమకాలీన రాజకీయ అంశాలతో రూపొందింది. తప్పిపోయిన లక్కీ అనే ఒక కుక్క పిల్ల, ఒక ఆటిజం చిన్నారి చుట్టూ తిరిగే కథాంశంగా ఈ చిత్రం రూపొందింది. తప్పిపోయిన కుక్కపిల్ల ఒక రాజకీయ నాయకుడి చేతిలో చిక్కడంతో దాన్ని హీరో ఎలా రక్షించాడు అన్నదే లక్కీ చిత్రంలోని ప్రధాన అంశం.నటి మేఘన సుమేష్, దేవదర్శిని ఇలంగో కుమరవేల్, ఉదయ్ మహేష్, సుబ్బు తదితరులు ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రంలో నటి కోవై సరళ, తంబిరామయ్య, మొట్టై రాజేంద్రన్ల వాయిస్ చోటు చేసుకుంటుంది. మంచి కుటుంబ కథాచిత్రంగా రూపొందిన లక్కీ నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకొని గత 20వ తారీఖున నేరుగా జియో హాట్ స్టార్ ఓటీటీలో ప్రేక్షకులను అలరిస్తోంది. -
ఇట్స్ సుప్రీమ్ టైమ్
ప్రభాస్ హీరోగా నటించిన ‘కల్కి 2898 ఏడీ’ చిత్రం పాన్ ఇండియా హిట్గా నిలిచిన సంగతి తెలిసిందే. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, కమల్హాసన్, దీపికా పదుకోన్, దిశా పటానీ కీలక పాత్రలు పోషించారు. వైజయంతీ మూవీస్పై సి. అశ్వినీదత్ నిర్మించిన ఈ సినిమా 2024 జూన్ 27న విడుదలై బ్లాక్బస్టర్గా నిలిచింది. ఈ మూవీకి సీక్వెల్గా ‘కల్కి 2898 ఏడీ 2’ ఉంటుందని మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే.ఈ మూవీ చిత్రీకరణను 2025లో ప్రారంభించేందుకు నాగ్ అశ్విన్ సన్నాహాలు చేశారు. అయితే ప్రీ ప్రోడక్షన్ పనులు ఆలస్యం కావడంవల్ల షూటింగ్ ఆరంభం కాలేదు. తాజాగా ‘కల్కి 2898 ఏడీ 2’ మూవీ షూటింగ్ ఆరంభం అయింది. హైదరాబాద్ సమీపంలోని శంకర్పల్లిలో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది.‘కల్కి 2898 ఏడీ’లో సుప్రీమ్ యాస్కిన్ పాత్రలో నటించిన కమల్హాసన్పై సీన్స్ తెరకెక్కిస్తున్నారట నాగ్ అశ్విన్. శంకర్పల్లిలో వేసిన ప్రత్యేకమైన సెట్లో దాదాపు నెల రోజుల పాటు రెగ్యులర్ షూటింగ్ జరగనుందని సమాచారం. ఇదిలా ఉంటే... హను రాఘవపూడి దర్శకత్వంలో ‘ఫౌజి’ మూవీ షూటింగ్లో పాల్గొంటున్న ప్రభాస్ మార్చిలో ‘కల్కి 2898 ఏడీ 2’ సెట్లోకి అడుగుపెడతారని తెలిసింది. -
అజిత్, విజయ్ మధ్య శత్రుత్వం? ఎలా ఉంటారో చెప్పిన షాలిని
కోలీవుడ్ స్టార్స్ అజిత్, విజయ్ మధ్య పోటీ సంగతేమో కానీ, వారి అభిమానుల మధ్య మాత్రం పచ్చగడ్డి వేసినా భగ్గుమంటుంది. ఎప్పుడూ మా హీరో గొప్ప, మా హీరో తోపు అని వాదులాడుకుంటూనే ఉంటారు. ఇద్దరి సినిమాలు ఒకేసారి రిలీజైతే మాత్రం బాక్సాఫీస్ వద్ద రణరంగం లాంటి పరిస్థితే కనిపిస్తుంది.షాలిని ఆసక్తికర వ్యాఖ్యలుహీరోల మధ్య కూడా ఈ శత్రుత్వం ఉందని చాలామంది భావిస్తుంటారు. అయితే అందులో ఏమాత్రం నిజం లేదంటోంది అజిత్ సతీమణి, నటి షాలిని. తాజాగా చెన్నైలో జరిగిన ఓ అవార్డుల ఫంక్షన్లో షాలిని మాట్లాడుతూ.. అజిత్, విజయ్.. ఇద్దరి మధ్య మంచి స్నేహబంధం ఉంది. ఒకరి సక్సెస్ను చూసి మరొకరు అభినందిస్తుంటారు. ఒకరిపై మరొకరికి సానుకూల అభిప్రాయం ఉంది అని పేర్కొంది. అప్పుడు కూడా వివాదంఇది విన్న అభిమానులు ఇద్దరు హీరోలు మనసున్న మనుషులే అని కామెంట్లు చేస్తున్నారు. కాగా గతేడాది అజిత్ను కేంద్రప్రభుత్వం పద్మ భూషణ్తో సత్కరించింది. అప్పుడు విజయ్ అజిత్కు కంగ్రాచ్యులేషన్స్ చెప్పలేదని వివాదం చెలరేగింది. దీంతో అతడి టీమ్ స్పందిస్తూ.. . అజిత్ సర్కు మొదటి కృతజ్ఞతలు చెప్పినవారిలో విజయ్ ఒకరు. సినిమాఇద్దరూ స్నేహపూర్వకంగా మెదులుతారు. అజిత్ సర్కు విజయ్ విషెస్ చెప్పలేదనడంలో ఎటువంటి నిజం లేదు అని వివరణ ఇచ్చింది. కాగా విజయ్ చివరగా నటించిన సినిమా జన నాయగణ్. జనవరిలో విడుదలవాల్సిన ఈ మూవీ సెన్సార్ కారణంగా ఇప్పటికీ విడుదలకు నోచుకోలేదు. అజిత్.. ప్రస్తుతం కార్ రేసింగ్ పోటీల్లో బిజీగా ఉన్నాడు.చదవండి: తిరుమల గుడిలో అలాంటి అనుభవం.. శివానీ కామెంట్స్పై వివాదం -
మీవల్లే ఈ వేదన.. కర్మ మిమ్మల్ని వదిలిపెట్టదు: మీనా
సౌత్లో స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది మీనా. రజనీకాంత్, కమల్ హాసన్, అజిత్, చిరంజీవి, వెంకటేశ్, మోహన్లాల్, మమ్ముట్టి.. ఇలా అందరు హీరోలతోనూ యాక్ట్ చేసింది. కొన్నేళ్ల క్రితం మీనా భర్త విద్యాసాగర్ అనారోగ్యంతో కన్నుమూశాడు. దీంతో ఆమె కొంతకాలంపాటు తీవ్ర దుఃఖంలో మునిగిపోయింది.రెండో పెళ్లంటూ ప్రచారంతీరని మనోవేదనతో ఆమె నరకం అనుభవిస్తుంటే సోషల్ మీడియాలో మాత్రం మీనాకు రెండో పెళ్లి అంటూ అసత్య ప్రచారం ఊపందుకుంది. దయచేసి ఇటువంటి రూమర్స్ వ్యాప్తి చేయకండి అని మీనా కోరడంతో కొంతకాలం ఆ గాసిప్స్ పత్తా లేకుండా పోయాయి. కానీ తర్వాత మళ్లీ అదే తంతు. ఏదో ఒక హీరోతో మీనాకు లింక్ పెట్టడం, త్వరలోనే రెండో పెళ్లంటూ ప్రచారానికి తెర తీయడం సర్వసాధారణమైపోయింది.ఒంటరి ఆడదాన్ని అనేకదా!ఈ వ్యవహారంపై మీనా మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. నాకు రెండో పెళ్లి అని చెత్తంతా రాస్తున్నారు. అందులో నిజం ఉంటే మీరు మాట్లాడుకోవడంలో తప్పు లేదు. కానీ మీకు మీరే ఏదో ఊహించుకుని, కల్పించుకుని రాయడం ముమ్మాటికీ తప్పే! నేనొక ఒంటరి మహిళను, అందులోనూ సెలబ్రిటీని అనే కదా మీకు నచ్చినట్లు రూమర్స్ సృష్టిస్తున్నారు. నా సహనాన్ని పరీక్షిస్తున్నారు. పైగా నాకు ఓ కూతురుంది. మంచివాటిపై ఫోకస్ చేస్తా..తను ఇవన్నీ చూస్తే ఏమనుకుంటుంది? ఇదంతా నాకెంతో అసౌకర్యంగా ఉంది, చాలా చిరాకు తెప్పిస్తోంది. దీన్ని భరించడం నావల్ల కావడం లేదు. కానీ కర్మ అనేది ఒకటుంది. అదెవర్నీ వదిలిపెట్టదు. ఈ అనవసర ప్రచారంపై స్పందించి నా సమయం, ఎనర్జీ, ఆరోగ్యాన్ని నాశనం చేసుకోదల్చుకోలేదు. నేను చాలా పాజిటివ్ వ్యక్తిని. ఎప్పుడూ సంతోషంగా, పాజిటివ్గా ఉండటానికే ప్రయత్నిస్తాను. మంచివిషయాలపైనే ఫోకస్ చేస్తాను అని మీనా చెప్పుకొచ్చింది.చదవండి: అమ్మ ఉగ్రరూపం.. గొంతు పట్టుకుని చెంప చెళ్లుమనిపించింది: ప్రియాంక -
'అర్ధరాత్రి 2 గంటలకు అతనికే కాల్ చేస్తా'.. అనుపమ షాకింగ్ ఆన్సర్
మలయాళ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ గతేడాది వరుస సినిమాలతో అలరించింది. బైసన్, పరదా, కిష్కింధపురి చిత్రాలతో అభిమానులను మెప్పించింది. అయితే ప్రస్తుతం ఓ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీలో నటిస్తోంది. దర్శకుడు ఆర్జే షాన్ కాంబినేషన్లో మరోసారి కనిపించనుంది.అయితే ఇటీవల ముంబయిలో ఓ అవార్డ్ వేడుకలో పాల్గొన్న అనుపమ అందరి దృష్టిని ఆకర్షించింది. బైసన్ కో స్టార్ ధృవ్ విక్రమ్తో కలిసి సందడి చేసింది. ఈ వేదికపై అనుపమకు హ్యాపీ బర్త్ డే అంటూ ధృవ్ విక్రమ్ విషెస్ తెలిపాడు. ఆ తర్వాత యాంకర్ అనుపమకు ఓ ప్రశ్న వేసింది. ఇండస్ట్రీలో అర్ధరాత్రి రెండు గంటలకు కాల్ చేయాలంటే ఎవరికీ చేస్తావ్ అని ప్రశ్నించింది. దీనికి అనుపమ ఆసక్తికర సమాధానమిచ్చింది. నేను ధృవ్కు కాల్ చేస్తానని నవ్వుతూ ఆన్సరిచ్చింది.ఇది చూసిన నెటిజన్స్ వీరిద్దరి మధ్య సమ్థింగ్ సమ్థింగ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ జంట డేటింగ్లో ఉన్నారంటూ మరికొందరు పోస్టులు పెడుతున్నారు. తాజాగా చెన్నైలో జరిగిన మరో అవార్డుల ఫంక్షన్లోనూ అనుమపతో ఉన్న సెల్ఫీని ధృవ్ విక్రమ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో వీరిద్దరి డేటింగ్ రూమర్స్ మరింత బలంగా వినిపిస్తున్నాయి. అయితే తమపై వస్తున్న రూమర్స్పై ఎవరూ కూడా స్పందించలేదు. Dhruv and anupama something something 🤭🫣 pic.twitter.com/vFvE5hM7qm— 𝓓𝓸𝓵𝓵𝔂 🤍 (@dollybiblio) February 18, 2026 -
ది కేరళ స్టోరీ-2 మేకర్స్కు షాక్..!
ది కేరళ స్టోరీ నిర్మాతలకు షాక్ తగిలింది. ఈ సినిమా రిలీజ్ నిలిపేయాలంటూ కేరళ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం కేంద్ర సమాచారశాఖతో పాటు సెన్సార్ బోర్డ్, నిర్మాతలకు నోటీసులు జారీ చేసింది. ఈ సినిమా ట్రైలర్ తనను ఆశ్చర్యానికి గురిచేసిందని.. కేరళ ప్రతిష్టను దెబ్బతీసేలా ఉందంటూ శ్రీదేవ్ అనే బయాలజిస్ట్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.సుదీప్తో సేన్ డైరెక్షన్లో వచ్చి ది కేరళ స్టోరీ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆదా శర్మ కీలక పాత్రలో తెరకెక్కంచిన ఈ మూవీ సూపర్ హిట్గా నిలిచింది. ఎన్ని విమర్శలొచ్చినా కలెక్షన్ల వర్షం కురిపించింది. తాజాగా ఈ మూవీకి సీక్వెల్గా ది కేరళ స్టోరీ-2 ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ చేయగా.. ముగ్గురు హిందూ అమ్మాయిల కథగా ఈ సినిమాను రూపొందించినట్లు తెలుస్తోంది.కాగా.. ఈ చిత్రం ఫిబ్రవరి 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమాకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ యూ/ఏ సర్టిఫికేట్ జారీ చేసింది. ఈ చిత్రానికి కామాఖ్య నారాయణ్ సింగ్ దర్శకత్వం వహంచారు. -
థ్రిల్లర్ సిరీస్లో సముద్రఖని.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీ ప్లాట్ఫామ్స్ వచ్చాక చిన్నాపెద్ద తేడా లేకుండా నటీనటులందరూ అందులోనూ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. తాజాగా సముద్రఖని తొలిసారి ఓ ఓటీటీ వెబ్సిరీస్లో బాగమయ్యాడు. ఆ సిరీస్ పేరు తడయం (క్లూ అని అర్థం). సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ సిరీస్ ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ జీ5లో ఫిబ్రవరి 27న ప్రసారం కానుంది.ట్రైలర్ రిలీజ్తాజాగా ట్రైలర్ వదిలారు. అందులో ఒక పాలవాడు రోజూలాగే అందరికీ పాలు పోసేందుకు బయలుదేరతాడు. అయితే ఓ ఇంటికి వచ్చాక మాత్రం ఎంత పిలిచినా ఎవరూ బయటకు రారు. దాంతో అతడే అమ్మా అని పిలుస్తూ లోపలకు వెళ్తాడు. తీరా అక్కడ రక్తపుమడుగు చూసి భయభ్రాంతులకు లోనవుతాడు. ఈ సన్నివేశంతోనే ట్రైలర్ మొదలైంది. వరుస హత్యలను చేధించేందుకు ప్రయత్నిస్తున్న ఎస్ఐ అదియమాన్గా సముద్రఖనిని చూపించారు.ఓటీటీలో తడయంఇది ఎక్కడ మొదలుపెట్టామో అక్కడే ముగించేద్దాం అని తెలుగు నటుడు నవీన్ చంద్ర వాయిస్తో డైలాగ్ వచ్చింది. మరి ఈ సిరీస్లో నవీన్ ఉన్నాడా? లేదా? అన్నది తడయం ఓటీటీలోకి వచ్చాకే తెలియనుంది. యదార్థ సంఘటనల ఆధారంగా ఈ సిరీస్ తెరకెక్కించినట్లు మేకర్స్ తెలిపారు. నవీన్ కుమార్ పలనివేల్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్కు విబిన్ భాస్కర్ సంగీతం అందించాడు.A story that unfolds frame by frame🔍Samuthirakani's 1st ever web-series #Thadayam Premieres on 27th Feb On ZEE5!@thondankani @SshivadaOffcl @cocktailcinemas @dirNavin_offl#Thadayam #ThadayamOnZEE5 #TamilZEE5Original #ZEE5Tamil #TamilZEE5 pic.twitter.com/xYfK9xg6s4— ZEE5 Tamil (@ZEE5Tamil) February 19, 2026 -
బిగ్బాస్ కంటెస్టెంట్తో పెళ్లి? క్లారిటీ ఇచ్చిన నటి
కన్నడ సీరియల్ నటి, బిగ్బాస్ ఫేమ్ నమ్రత గౌడ పెళ్లి చేసుకోబోతుందని ప్రచారం ఊపందుకుంది. బిగ్బాస్ కంటెస్టెంట్ కార్తీక్ మహేశ్తోనే ఏడడుగులు వేయనుందని గాసిప్. రియాలిటీ షో ముగిసిన తర్వాత కూడా ఇద్దరూ తరచూ జంటగా కనిపించడంతో ఇది నిజమేనేమో అని అందరూ అనుకున్నారు. కానీ, తన పెళ్లి వార్తల్లో ఏమాత్రం నిజం లేదంటోంది నమ్రత.రహస్యంగా పెళ్లి చేసుకోనుఈ మేరకు ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఓ పోస్ట్ పెట్టింది. నా రిలేషన్షిప్, పెళ్లి గురించి ఏవేవో ఊహాగానాలు వెలువడుతున్నాయి. కాబట్టి దానిపై మీ అందరికీ క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను. నేను పెళ్లి చేసుకుంటే ఆ విషయం అందరికీ చెప్తాను. దాన్ని రహస్యంగా ఉంచాల్సిన పని లేదు. నా పెళ్లి చీర కోసం ఏదో కొత్త రంగు సృష్టిస్తున్నారట. ఇది మరీ విడ్డూరంగా ఉంది. మా మధ్య ఉన్నది స్నేహమేఏదేమైనా ఇప్పట్లో నాకు పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన లేదు అని కుండబద్ధలు కొట్టింది. కాగా కన్నడ బిగ్బాస్ పదో సీజన్లో నమ్రత, కార్తీక్ పాల్గొన్నారు. వీరిద్దరి మధ్య ఉన్న చనువు చూసి ప్రేమాయణం నడుపుతున్నారని అభిమానులు ఫీలయ్యారు. అయితే తమ మధ్య ఉన్నది స్నేహమే అని ఈ జోడీ గతంలోనే క్లారిటీ ఇచ్చింది. అయినప్పటికీ ఫ్యాన్స్ మాత్రం వీరి చనువు చూస్తుంటే ఫ్రెండ్షిప్లా లేదని అభిప్రాయపడ్డారు.చదవండి: తల్లి కాళ్లు కడిగి ఆ నీళ్లు తాగే హీరో -
ఏడేళ్లకు నటి గుడ్న్యూస్.. పొట్టపై మెహందీ డిజైన్
మలయాళ నటి ప్రీత ప్రదీప్ త్వరలో తల్లి కాబోతోంది. ఇప్పుడు ఆమెకు తొమ్మిది నెలలు. మరికొద్ది రోజుల్లో పండంటి బిడ్డ ఆమె కుటుంబంలో భాగం కానుంది. ఈ క్రమంలో అందంగా ముస్తాబైన ప్రీత తన బేబీ బంప్ ఫోటోలు షేర్ చేసింది. అందులో తన పొట్టపై మెహందీ ఉంది. కమలం పువ్వుపై తల్లి బిడ్డను ఎత్తుకున్నట్లుగా డిజైన్ ఉంది. ఈ ఫోటోలు చూసిన అభిమానులు మీకంతా మంచే జరగాలని కామెంట్లు చేస్తున్నారు.నటిగాఇకపోతే ప్రీత- వివేక్ పెళ్లి 2019 ఆగస్టు 25న జరిగింది. పెళ్లయిన ఏడేళ్లకు తొలిసారి పేరెంట్స్గా ప్రమోషన్ పొందబోతున్నారు. కాగా ప్రీత ప్రదీప్.. కురుక్కు, సండే హాలీడే, ప్రేమసూత్రం, ఉయరే వంటి పలు సినిమాలు చేసింది. అలాగే బుల్లితెరపై ఓ సీరియల్లో నెగెటివ్ రోల్ పోషించింది. యాంకర్, డ్యాన్సర్గానూ తను సుపరిచితురాలే! View this post on Instagram A post shared by Preetha Pradeep (@preethspradeep) View this post on Instagram A post shared by Preetha Pradeep (@preethspradeep) -
రామ్ చరణ్ 'పెద్ది'కి భారీ డిజిటల్, ఆడియో డీల్
రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్లో వస్తున్న 'పెద్ది' సినిమా మీద అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన నాన్-థియేట్రికల్ బిజినెస్ ఇప్పటికే హాట్ టాపిక్గా మారింది. నిర్మాత సతీష్ కిలారు ఈ సినిమాను ఏప్రిల్ 30న విడుదల చేయాలని ప్రయత్నిస్తున్నారు. రామ్ చరణ్ సరసన జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ చిత్రానికి సంగీతం ఎఆర్ రెహమాన్ అందిస్తున్నారు. ఓటిటి మార్కెట్ డౌన్ కాకముందే డిజిటల్ హక్కుల డీల్ ఫినిష్ చేసుకోవడం నిర్మాతల అదృష్టమనే చెప్పాలి. ఆ రోజుల్లో దాదాపు రూ. 130 కోట్ల భారీ బడ్జెట్ పెట్టి పెద్ది(Peddi) చిత్రాన్ని కోనుగోలు చేసిందట ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్.ఆడియో హక్కులు మరో 18 కోట్ల మేరకు వచ్చాయి. శాటిలైట్ హక్కులు ఇంకా ఫైనల్ కాలేదు. కానీ మంచి మొత్తంలో వచ్చే అవకాశం ఉంది. ఈ సినిమాను నేరుగా హిందీలో కూడా విడుదల చేయనున్నారు. అందువల్ల హిందీ డబ్బింగ్ అవసరం లేదు. కానీ హిందీ శాటిలైట్ హక్కులు వేరుగా ఉంటాయి. నాన్-థియేట్రికల్ ఆదాయం మొత్తం కలిపి 150 కోట్లకు పైగా వచ్చే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న 'పెద్ది' విడుదలకు ముందే మంచి బిజినెస్ చేస్తోందనే చెప్పాలి. -
హీరోకు తల్లిగా, భార్యగా, కూతురిగా నటించిన హీరోయిన్
హీరోయిన్లు కేవలం హీరోతో జోడీ కట్టడమే కాదు కొన్నిసార్లు అదే హీరోకు తల్లిగా, కూతురిగా కూడా నటించినవాళ్లూ ఉన్నారు. అలా మలయాళ స్టార్ మమ్ముట్టికి ఓ స్టార్ హీరోయిన్ తల్లిగా, కూతురిగా, భార్యగా నటించింది. ఆమె మరెవరో కాదు, అందాల తార మీనా.స్టార్ హీరోయిన్గా13 ఏళ్ల వయసుకే హీరోయిన్గా మారింది మీనా. కథానాయికగా ఎన్నో సినిమాలు చేసింది. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో స్టార్ హీరోయిన్గా రాణించింది. ఇప్పటికీ సినిమాలు చేస్తూనే ఉంది. దాదాపు అందరు హీరోలతో జత కట్టిన మీనా మలయాళ స్టార్ మమ్ముట్టికి మాత్రం భార్యగా, కూతురిగా, తల్లిగా నటించింది.మమ్ముట్టికి జోడీగా..ఒరు కొచ్చుకథ ఆరుం పరయత కథ మూవీలో మమ్ముట్టి కూతురిగా నటించింది. 2001లో వచ్చిన రాక్షస రాజవు మూవీలో మమ్ముట్టి ప్రేయసిగా కనిపించింది. ఆ తర్వాత కరుత పక్షికల్, కద పరయుంబల్ సినిమాల్లోనూ మమ్ముట్టితో కలిసి నటించింది. 2014లో మమ్ముట్టి ద్విపాత్రాభినయం చేసిన మూవీ బాల్యకాలసఖి. ఇందులో మమ్ముట్టి తల్లిగా, భార్యగా మీనా యాక్ట్ చేసింది. చదవండి: జీవితంలో ఒక్క పుస్తకం చదవలేదు: స్టార్ హీరో


