విజయ్ సేతుపతి, సాయిపల్లవి కాంబినేషన్ ఫిక్స్ అయ్యింది. ఈ ఇద్దరూ జోడీగా నటించనున్న సినిమా ఖరారైంది. ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు మణిరత్నం తెరకెక్కించనున్నారు. సుభాస్కరన్ సమర్పణలో లైకా ప్రోడక్షన్స్, మద్రాస్ టాకీస్, ఇండియా టాకీస్ సంస్థలు నిర్మించనున్న ఈ సినిమాని శుక్రవారం అధికారికంగా ప్రకటించారు మేకర్స్. ఏఆర్ రెహమాన్ ఈ సినిమాకు సంగీతం అందించనున్నారు.
సోని మ్యూజిక్ సంస్థ ఈ మూవీ ఆడియో హక్కులను పొందింది. ఇక ఈ ఏడాదిలోనే ఈ సినిమా చిత్రీకరణను ఆరంభించి, వచ్చే ఏడాది ప్రారంభంలోనే రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని కోలీవుడ్ సమాచారం. కాగా, మణిరత్నం దర్శకత్వం వహించిన తమిళ చిత్రం ‘చెక్క చివంద వానమ్’లో (తెలుగులో ‘నవాబ్’ టైటిల్తో విడుదలైంది) విజయ్ సేతుపతి ఓ లీడ్ రోల్లో నటించిన విషయం గుర్తుండే ఉంటుంది.


