breaking news
Andhra Pradesh High Court
-
భారతి సిమెంట్స్ కేసులో కూటమి ప్రభుత్వానికి గట్టి షాకిచ్చిన హైకోర్టు
-
‘ప్రత్యామ్నాయం’ ఉంటే.. మరణశిక్ష విధించకూడదు
సాక్షి, అమరావతి: మరణ శిక్ష విధించే ముందు న్యాయస్థానాలు నేర తీవ్రతను మాత్రమేగాక, నిందితుని స్థితిగతులను సైతం పరిగణలోకి తీసుకోవాలని హైకోర్టు స్పష్టం చేసింది. నేరం జరిగిన తీరు, క్రూరత్వం, బాధితుల పరిస్థితి, అలాగే నిందితుడి వయసు, సామాజిక–ఆర్థిక నేపథ్యం, నేర చరిత్ర లేకపోవడం, మానసిక స్థితి మధ్య న్యాయస్థానాలు సమతుల్యతను పాటించాల్సి ఉంటుందని తెలిపింది. అంతేగాక నిందితుడు మారడానికి, జనజీవన స్రవంతిలో కలిసి పునరావాసం పొందడానికి ఉన్న అవకాశాలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలంది.‘క్రిమినల్ జస్టిస్ సిస్టం (నేర న్యాయ వ్యవస్థ) అనుకున్న దానికంటే ఎక్కువ శిక్షాత్మకంగా మారింది. ఇదే సమయంలో ఈ వ్యవస్థ మార్పు, పునరావాసానికి కూడా అవకాశం కల్పిస్తోంది. నేరస్థుడిని శిక్షించడం, సంస్కరించడం, జనజీవనస్రవంతిలో కలిసేలా చేయడం అనేవి భారతీయ క్రిమినల్ జస్టిస్ సిస్టం ముఖ్య లక్ష్యాలు. శిక్షించడం కంటే పునరావాసం కల్పించడానికే క్రిమినల్ జస్టిస్ సిస్టం ప్రాధాన్యతనిస్తుంది. ఈ నేపథ్యంలో నేరస్థుడిని సంస్కరించడమే దీని అంతిమ లక్ష్యం’ అని హైకోర్టు పేర్కొంది. జీవితఖైదు విధించే ప్రత్యామ్నాయం ఉన్న కేసులను సైతం అరుదైన కేసుల్లో అత్యంత అరుదైన కేసులుగా పరిగణించి ఉరిశిక్ష విధించడానికి వీల్లేదని స్పష్టం చేసింది. ప్రస్తుత భార్య, అత్తమామలను చంపినందుకు నారాపురం శ్రవణ్కుమార్, తండ్రి వరప్రసాద్లకు ఉరిశిక్ష విధిస్తూ కర్నూలు జిల్లా సెషన్స్ కోర్టు 2024లో ఇచ్చిన తీర్పును హైకోర్టు సవరించింది. ఉరిశిక్షను రద్దుచేసిన హైకోర్టు తండ్రి, కొడుకులకు జీవితఖైదు విధించింది. వీరికి ఎలాంటి క్షమాభిక్షకు ఆస్కారం లేదని స్పష్టం చేసింది. తండ్రీకొడుకులకు నేరచరిత్ర లేదని, పరివర్తన చెందేందుకు ఆస్కారం ఉందని, అంతేగాక వీరు సమాజానికి ముప్పుగా పరిణవిుస్తారనేందుకు ఆధారాలు లేనందున వారికి విధించిన మరణశిక్షణు జీవితఖైదుగా మారుస్తున్నట్లు హైకోర్టు తన తీర్పులో పేర్కొంది. శ్రవణ్కుమార్ తల్లి కృష్ణవేణిని నిర్దోషిగా ప్రకటించింది. ఆమెకు కింది కోర్టు విధించిన జీవితఖైదును రద్దుచేసింది. ఆమెను తక్షణమే విడుదల చేయాలని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ కంచిరెడ్డి సురేష్రెడ్డి, జస్టిస్ అవధానం హరిహరనాథశర్మ ధర్మాసనం ఇటీవల తీర్పు వెలువరించింది.ఇద్దరిని చంపిన తండ్రీకొడుకులు కర్నూలులోని చింతలముని నగర్కు చెందిన నారాపురం శ్రవణ్కుమార్ (26), రుక్మిణి (18)లకు 2023 మార్చి 1న పెళ్లైంది. అనంతరం శ్రవణ్కుమార్ నపుంసకుడంటూ రుక్మిణి తల్లిదండ్రులు ఆరోపించడంతో ఈ దంపతుల మధ్య విభేదాలు ఏర్పడ్డాయి. అదే సమయంలో భార్యపై అనుమానం పెంచుకున్నాడు. 2023 మార్చి 14న శ్రవణ్కుమార్ వనపర్తి వెళ్లి తన భార్య రుక్మిణి, అత్త రమాదేవి, మామ వెంకటేశ్వర్లును కర్నూలులోని తన ఇంటికి రాత్రి 11.30 గంటల సమయంలో తీసుకొచ్చాడు. తరువాత కొద్దిసేపటికే శ్రవణ్కుమార్, అతడి తండ్రి వరప్రసాద్ (62).. కత్తులతో రుక్మిణి మీద, ఆమె తల్లిదండ్రులు రమాదేవి, వెంకటేశ్వర్లుపై దాడిచేశారు. తీవ్ర గాయాలతో రుక్మిణి, రమాదేవి మృతి చెందగా.. వెంకటేశ్వర్లు తీవ్రంగా గాయపడ్డారు. దీనిపై ఐపీసీ సెక్షన్లు 302, 307తో పాటు 34 కింద కేసు నమోదు చేసిన కర్నూలు నాలుగో పట్టణ పోలీసులు 2023 మార్చి 15న నిందితులను అరెస్టు చేశారు. కర్నూలు జిల్లా సెషన్స్ కోర్టు ఈ కేసుపై విచారణ జరిపి 2024లో తీర్పు వెలువరించింది. దీన్ని అరుదైన కేసుల్లో అత్యంత అరుదైన కేసుగా పరిగణిస్తూ.. నిందితులు శ్రవణ్కుమార్, వరప్రసాద్లకు మరణశిక్ష, శ్రవణ్కుమార్ తల్లి కృష్ణవేణికి జీవితఖైదు విధిస్తూ తీర్పు చెప్పింది. ఈ మరణశిక్ష ఖరారుపై నిర్ణయం తీసుకోవాలని అభ్యర్థిస్తూ సెషన్స్ కోర్టు 2024లో హైకోర్టుకు లేఖ రాసింది. కేసు రికార్డులను హైకోర్టుకు పంపింది. దీంతో హైకోర్టు ఆ లేఖను రెఫర్డ్ ట్రయల్ (ఆర్టీ)గా పరిగణించి విచారణ చేపట్టింది. ఇదే సమయంలో శ్రవణ్కుమార్, వరప్రసాద్ తమకు విధించిన మరణశిక్షను సవాలు చేస్తూ హైకోర్టులో అప్పీల్ దాఖలు చేశారు. కృష్ణవేణి కూడా అప్పీల్ వేశారు. వీటిపై న్యాయమూర్తి జస్టిస్ కంచిరెడ్డి సురేష్రెడ్డి నేతృత్వంలోని ప్రత్యేక ధర్మాసనం విచారణ జరిపింది. వరప్రసాద్, శ్రవణ్కుమార్లకు కింది కోర్టు విధించిన మరణశిక్షను జీవితఖైదుగా సవరిస్తూ తీర్పునిచ్చింది. కృష్ణవేణిని నిర్దోషిగా ప్రకటించింది. -
ఉపాధి కల్పిస్తున్న సంస్థకే అడ్డంకులా?
‘భారతి సిమెంట్స్ కంపెనీ 2007 నుంచి సంబంధిత చట్టబద్ధ సంస్థల నుంచి అవసరమైన అన్ని అనుమతులు పొంది వ్యాపారాన్ని నిర్వహిస్తోంది. కరువు ప్రభావిత ప్రాంతంలో ఉన్న ఈ కంపెనీ నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది. పన్నుల రూపంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలకు సుమారు రూ. 7,300 కోట్లు చెల్లించింది. కంపెనీ వ్యాపార కార్యకలాపాలకు బలవంతంగా అడ్డంకులు సృష్టించడం, రాకపోకలను నిరోధించడం తప్పనిసరిగా అరికట్టాలి. భారతి సిమెంట్స్ ప్రాంగణం సమీపంలో ఎటువంటి శాంతిభద్రతల సమస్య ఏర్పడకుండా పోలీసులు చూడాలి’.– హైకోర్టుసాక్షి,అమరావతి: కాంట్రాక్ట్ ఉద్యోగుల ముసుగులో కొంతమంది అరాచక, విచ్ఛిన్నకర శక్తులను అడ్డంపెట్టుకుని స్వార్థ ప్రయోజనాలు, రాజకీయ కుతంత్రాలతో భారతి సిమెంట్స్ను దెబ్బ కొట్టాలని చూసిన చంద్రబాబు ప్రభుత్వానికి హైకోర్టు గట్టి షాక్నిచ్చింది. అధికార పార్టీ నేతలకు తొత్తులుగా మారి భారతి సిమెంట్స్ను అన్ని రకాలుగా ఇబ్బందులకు గురి చేసేందుకు అడుగడుగునా సహకరించిన పోలీసులకు సైతం హైకోర్టు తలంటింది. వైఎస్సార్ కడప జిల్లా, ఎర్రగుంట్ల, కమలాపురం మండలాల పరిధిలోని నల్లలింగాయపల్లె గ్రామంలో ఉన్న ‘భారతి సిమెంట్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్’కు తగిన రక్షణ కల్పించాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. కంపెనీ ఉద్యోగులు, ముడిసరుకుతో పాటు ఇతర సరుకులు, వాహనాల రాకపోకలకు ఎలాంటి ఆటంకం లేకుండా చూడాలని పోలీసులకు తేల్చి చెప్పింది. అంతేకాక కంపెనీ చట్టబద్ధమైన కార్యకలాపాలన్నీ సజావుగా సాగేలా చూడాలని కూడా స్పష్టం చేసింది. భారతి సిమెంట్స్ పరిశ్రమ ఆవరణ సమీపంలో ఎలాంటి శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా, తమ చట్టబద్ధమైన అధికారాలను ఉపయోగించి సాధారణ పరిస్థితులను పునరుద్ధరించాలని పోలీసులను ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కుంచం మహేశ్వరరావు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. కార్మికులు దాఖలు చేసిన ఇంప్లీడ్ పిటిషన్లో కౌంటర్ దాఖలు చేయాలని భారతి సిమెంట్స్ను ఆదేశిస్తూ విచారణను అక్టోబర్ 5కి వాయిదా వేశారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల న్యాయమైన, చట్టబద్ధమైన డిమాండ్లను పరిష్కరించడానికి పిటిషనర్ కంపెనీ సాధ్యమైనంత వరకు తన విచక్షణను ఉపయోగించవచ్చునని తెలిపారు.పోలీసుల ఉదాసీనతపై హైకోర్టులో భారతి సిమెంట్స్ పిటిషన్...వైఎస్సార్ కడప జిల్లా నల్లలింగాయపల్లె వద్ద ఉన్న తమ ప్లాŠంట్ కార్యకలాపాలతో పాటు మైనింగ్ కార్యకలాపాలను సైతం అడ్డుకుంటున్న మూకలపై ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదని, తమ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ భారతి సిమెంట్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ (బీసీసీపీఎల్) అధీకృత ప్రతినిధి, డైరెక్టర్ జి.బాలాజీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై సోమవారం జస్టిస్ మహేశ్వరరావు విచారణ జరిపి మంగళవారం తన నిర్ణయాన్ని వెలువరించారు.భారతి సిమెంట్స్ కరువు పీడిత ప్రాంతంలో ఉపాధి కల్పిస్తోంది...‘భారతి సిమెంట్స్ ప్రాథమికంగా 2007 నుండి చట్టబద్ధ, సంబంధిత అధికారుల నుండి అవసరమైన అన్ని ముందస్తు అనుమతులను పొంది తన వ్యాపారాన్ని కొనసాగిస్తోంది. ముఖ్యంగా, ఇది కరువు పీడిత ప్రాంతంలో నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలను కల్పిస్తోంది. అంతేకాదు ప్రత్యక్ష, పరోక్ష పన్నుల రూపంలో దాదాపు రూ. 7,300,00,00,000 చెల్లిస్తూ రాష్ట్ర, కేంద్ర ఖజానాలకు తోడ్పడుతోంది.’ అని న్యాయమూర్తి తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.దేశ సమగ్ర అభివృద్ధికి పారిశ్రామిక శాంతి చాలా అవసరం...‘పారిశ్రామిక శాంతి అనేది దేశ సమగ్ర అభివృద్ధికి, భారతి సిమెంట్స్కి, అలాగే దాని వాటాదారులు (శాశ్వత, తాత్కాలిక, కాంట్రాక్ట్ ఉద్యోగులు, వారి కుటుంబాలు) అందరికీ చాలా అవసరం. ఎటువంటి చట్టపరమైన కారణం లేకుండా భారతి సిమెంట్స్ వ్యాపార కార్యకలాపాలను అకస్మాత్తుగా, బలవంతంగా అడ్డుకోవడం, ఆటంకాలు సృష్టించడం సరికాదు. ఇలాంటి చర్యలను ఆదిలోనే అరికట్టాలి. ఎందుకంటే ఇది యజమాని, ఉద్యోగులు, వారి కుటుంబాలు, రాష్ట్ర ఖజానాపై వినాశకరమైన దుష్ప్రభావాలకు దారితీస్తుంది. చట్ట ప్రకారం తమ అధికార పరిధిలో శాంతి భద్రతలను కాపాడవలసిన చట్టబద్ధమైన బాధ్యత పోలీసులపై ఉంది. ఇందులో ఎలాంటి సందేహానికి ఆస్కారం లేదు.’ అని జస్టిస్ మహేశ్వరరావు తెలిపారు.అన్ని అనుమతులతో భారతి సిమెంట్స్ నడుస్తోంది...‘భారతి సిమెంట్స్ మైనింగ్ శాఖతో సహా అన్ని శాఖల ముందస్తు అనుమతులతో నడుస్తున్న కంపెనీ. ఇందులో ఎలాంటి వివాదానికి తావు లేదు. కంపెనీ రాకపోకలకు, ఉత్పత్తికి, ఇతర చట్టబద్ధమైన కార్యకలాపాలకు ఎటువంటి చట్టపరమైన ఆటంకాలు లేవనేది కూడా స్పష్టం. కాంట్రాక్ట్ ఉద్యోగులు, వారి అనుచరులు కంపెనీ కార్యకలాపాలను, వాహనాలు, ఉద్యోగులు, అధికారులు, మెటీరియల్స్ రాకపోకలను అడ్డుకోకుండా భారతీ సిమెంట్స్కు అనుకూలంగా కింది కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.’ అని ఆయన తెలిపారు.చట్టపరమైన చర్యలు తీసుకోవడం పోలీసుల ప్రాథమిక బాధ్యత...‘నేరాలను అరికట్టడం, శాంతిభద్రతల విఘాతానికి దారితీసే పరిస్థితులను అదుపు చేయడం, ప్రజల ప్రాణాలను, ఆస్తులను కాపాడటం, హింస, బెదిరింపులు, భయభ్రాంతులకు గురిచేసే చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం పోలీసుల ప్రాథమిక బాధ్యత. ప్రజా శాంతికి ప్రమాదం ఏర్పడే అవకాశం ఉన్నప్పుడు పోలీసులు అవసరమైన ముందస్తు జాగ్రత్త చర్యలు కూడా తీసుకోవచ్చు. కాబట్టి చట్టవిరుద్ధమైన పనులను నిరోధించడం, ప్రజలు, ప్రభుత్వ ఆస్తులను కాపాడటం, ప్రజలు తమ చట్టబద్ధమైన కార్యకలాపాలను ఎటువంటి ఆటంకాలు లేకుండా చేసుకునేలా చూడడమే పోలీసుల ప్రధాన విధి.’ అని తేల్చి చెప్పారు.ప్రజా సంక్షేమమే సర్వోత్కృష్ట చట్టం..‘ప్రజా సంక్షేమమే అన్నింటి కన్నా గొప్ప చట్టం. న్యాయస్థానాలు తమ న్యాయాధికారాన్ని ఉపయోగించేటప్పుడు సమాజ విస్తృత ప్రజా ప్రయోజనాలను, సంక్షేమాన్ని తప్పక పరిగణనలోకి తీసుకోవాలి. వ్యక్తిగత హక్కులు, సమాజ చట్టబద్ధ ప్రయోజనాలు రెండింటినీ కూడా కోర్టు విస్మరించరాదు. వాటి మధ్య తగిన సమతుల్యతను పాటించాలి. భారతి సిమెంట్స్ కంపెనీ స్పష్టమైన ఫిర్యాదులు చేసినప్పటికీ, శాంతిభద్రతలను అదుపులో ఉంచడానికి సంబంధిత పోలీసు అధికారులు తగిన చర్యలు తీసుకోలేదనేది ఈ కేసులోని కీలక అంశం. చట్టపరమైన సమస్యలు తలెత్తకుండా వేగంగా స్పందించాల్సిన బాధ్యత పోలీసులపై ఉంది.’ అని న్యాయమూర్తి పేర్కొన్నారు.కంపెనీకి రోజుకు రూ.4 కోట్ల నుంచి రూ.6 కోట్ల వరకు నష్టం....సీనియర్ న్యాయవాది సీవీ మోహన్రెడ్డి వాదనను క్లుప్తంగా చెప్పాలంటే, పోలీసులు, కలెక్టర్ నిర్లక్ష్యం వల్ల శాంతిభద్రతల సమస్య తలెత్తుతోందని తెలిపారు. పరిశ్రమ ఆవరణలో నివసిస్తున్న శాశ్వత ఉద్యోగులు వారి కుటుంబ సభ్యుల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయని సీనియర్ న్యాయవాది పేర్కొన్నారు. అంతేకాకుండా కంపెనీ రోజుకు రూ. 4 కోట్ల నుండి 6 కోట్ల వరకు నష్టపోతోందని, ఇది రాష్ట్ర ఖజానాకు, శాశ్వత ఉద్యోగులకు, వారి కుటుంబాలకు తీవ్ర నష్టం కలిగిస్తోందని అన్నారు.యజమానులు పోలీసు రక్షణ కోరవచ్చు.. కేరళ హైకోర్టు తీర్పు‘పారిశ్రామిక శాంతిని కాపాడేందుకు రాజ్యాంగంలోని ఆర్టికల్ 226 ప్రకారం హైకోర్టు తన అధికారాన్ని ఉపయోగించి అధికారులకు తగిన ఆదేశాలు ఇవ్వవచ్చా లేదా అనే కోణంలో కోర్టులు వెల్లడించిన చట్టపరమైన తీర్పులను పరిశీలించడం ఎంతైనా అవసరం. రాఘవన్ వర్సెస్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కేసులో కేరళ హైకోర్టు విస్తృత తీర్పునిస్తూ... యజమానులకు, కార్మికులకు నడుమ వివాదాల పరిష్కారానికి లేబర్ చట్టాలు ఉన్నప్పటికీ, శాంతిభద్రతల సమస్య తలెత్తినప్పుడు యజమానులు రాజ్యాంగంలోని అధికరణ 226 కింద హైకోర్టును ఆశ్రయించి పోలీసు రక్షణ కోరవచ్చునని తెలిపింది. సమ్మె చేస్తున్న కార్మికులు యజమానిని లేదా పనిచేయడానికి సిద్ధంగా ఉన్న కార్మికులను అడ్డుకున్నప్పుడు, పూడ్చుకోలేని నష్టం జరిగే ప్రమాదం ఉన్నప్పుడు కూడా యజమానులు హైకోర్టుకు రావొచ్చునని కేరళ హైకోర్టు చెప్పింది.’ అని జస్టిస్ మహేశ్వరరావు తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.పోలీసు రక్షణకు ఆదేశాలివ్వవచ్చు.. మద్రాసు హైకోర్టు‘అదే విధంగా, తమిళనాడు హైకోర్టు కూడా ఎస్ఎన్వై ఆటోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ వర్సెస్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కేసులో ఫ్యాక్టరీ నిర్వహణపై శాంతిభద్రతల ప్రభావం పడినప్పుడు ఆర్టికల్ 226 కింద హైకోర్టు పోలీసు రక్షణకు ఆదేశాలు జారీ చేయవచ్చని తెలిపింది. కార్మికులు శాంతియుతంగా సమ్మె చేయవచ్చని, అయితే ఫ్యాక్టరీపై, తోటి కార్మికులపై లేదా మెటీరియల్ తరలింపు విషయంలో హింసకు, బెదిరింపులకు పాల్పడటం, రాకపోకలకు ఆటంకాలు సృష్టించడం వంటివి చేయరాదని ఆ హైకోర్టు స్పష్టం చెప్పింది. పోలీసు రక్షణ అనేది కేవలం శాంతిని కాపాడటానికి, చట్టబద్ధమైన రాకపోకలకు మాత్రమేనని, వారి మధ్య ఉన్న పారిశ్రామిక వివాదాన్ని హైకోర్టు పరిష్కరించదని స్పష్టం చేసింది.’ అని న్యాయమూర్తి గుర్తు చేశారు.రాష్ట్రానికి లబ్ది చేకూర్చే పరిశ్రమను మూసివేసేలా చేయకూడదు‘ఇండియన్ సిమెంట్స్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఏపీ కేసులో శాంతిభద్రతలను కాపాడటమే పోలీసుల ప్రాథమిక విధి ఇదే హైకోర్టు స్పష్టంగా పేర్కొంది. పెద్ద సంఖ్యలో కార్మికులకు ఉపాధి కల్పిస్తూ, పన్నుల రూపంలో రాష్ట్రానికి లబ్ధి చేకూరుస్తున్న పరిశ్రమను, కార్మికుల నిరసనల కారణంగా మూసివేసేలా చేయకూడదు. కాంట్రాక్ట్ కార్మికులకు తమ ఉద్యోగానికి సంబంధించి ఏదైనా ఫిర్యాదులు లేదా డిమాండ్లు ఉంటే, వారు లేబర్ కోర్టు లేదా సంబంధిత లేబర్ అథారిటీ వద్ద తగిన పరిష్కారం కోరాలి. హింస, ఆటంకాలు, అలజడులను నిరోధించి, పరిశ్రమ తన చట్టబద్ధమైన కార్యకలాపాలను శాంతియుతంగా నిర్వహించుకునేలా చూసేందుకు పోలీసులు అవసరమైన చర్యలు తీసుకోవాలి. ఈ ఉత్తర్వును ఇదే హైకోర్టుకు చెందిన మరొక సింగిల్ జడ్జి కూడా అనుసరించారు. అందువల్ల, పారిశ్రామిక శాంతికి సంబంధించి రాజ్యాంగంలోని ఆర్టికల్ 226 కింద ఈ కోర్టుకు విస్తృత అధికారాలున్నాయి.’ అని న్యాయమూర్తి జస్టిస్ మహేశ్వరరావు తేల్చి చెప్పారు. -
న్యాయమూర్తిపై నిరాధార ఆరోపణలా..?
సాక్షి, అమరావతి: న్యాయమూర్తి జస్టిస్ నూనెపల్లి హరినాథ్పై ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్జీపీ) సింగమనేని ప్రణతి దాఖలు చేసిన అప్పీల్లో ఉపయోగించిన అభ్యంతరకర పదజాలంపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. న్యాయమూర్తిపై తీవ్ర వ్యాఖ్యలు, నిరాధార ఆరోపణలు చేస్తే సహించేది లేదని స్పష్టం చేసింది. ఆరోపణలు చేయడం మాత్రమే కాదని.. వాటిని ఆధారాలతో నిరూపించాల్సిన బాధ్యత కూడా ఉందని తేల్చి చెప్పింది. దీంతో ప్రణతి తరఫు న్యాయవాది క్షమాపణ చెప్పడంతో పాటు, ఆ వ్యాఖ్యలను అప్పీల్ నుంచి తొలగిస్తామని కోర్టుకు విన్నవించారు.కాకినాడ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో కోట్ల రూపాయల భూమిని కొట్టేసేందుకు కుట్ర పన్ని, కోర్టునే తప్పుదోవ పట్టించిన వ్యవహారంపై ఏసీబీ విచారణకు ఆదేశిస్తూ సింగిల్ జడ్జి జస్టిస్ నూనెపల్లి హరినాథ్ ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది సింగమనేని ప్రణతి అప్పీల్ దాఖలు చేశారు. ఆ అప్పీల్లో సింగిల్ జడ్జిపై అభ్యంతరకరమైన భాష ఉపయోగించారు. ప్రణతి తన అప్పీల్లో సింగిల్ జడ్జిని ఉద్దేశించి ఉపయోగించిన... ‘అక్రమం, బుర్ర ఉపయోగించకపోవడం, పక్షపాతం, అసందర్భం, అనుచితం, మందబుద్ది, దురుద్దేశాలు’ వంటి పదాలను ధర్మాసనం చదివి వినిపించింది.పరిస్థితిని అర్థం చేసుకున్న ప్రణతి తరఫు సీనియర్ న్యాయవాది బండారుపల్లి ఆదినారాయణ రావు కోర్టును క్షమాపణ కోరారు. అప్పీల్ నుంచి వాటిని తొలగిస్తామని చెప్పారు. అలా అయితే సింగిల్ జడ్జిని ఉద్దేశించి ఉపయోగించిన అభ్యంతకర పదజాలాన్ని తొలగిస్తూ అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రణతిని ఆదేశించింది. విచారణను వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ లీసా గిల్, న్యాయమూర్తి జస్టిస్ చల్లా గుణరంజన్ ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.అటు భార్య.. భర్త.. ఇటు ఏసీబీ విచారణ...కాకినాడలో జయేంద్రనగర్ నివాసితుల సంక్షేమ సంఘం ప్రజా ప్రయోజనాల నిమిత్తం కాకినాడ మునిసిపల్ కార్పొరేషన్కు కొంత భూమిని బహుమానంగా ఇచ్చింది. ఈ భూమి విషయంలో కొందరు ప్రైవేటు వ్యక్తుల హక్కులు కోరుతూ హైకోర్టుకొచ్చారు. దీనిపై స్పందించిన కాకినాడ మునిసిపల్ కార్పొరేషన్, ప్రైవేటు వ్యక్తుల హక్కులు కోరుతున్న భూమి తమదేనని, దానిని రక్షించాల్సిన బాధ్యత తమపై ఉందని హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసింది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కాకినాడ మునిసిపల్ కార్పొరేషన్ మాట మార్చింది. ఆ భూముల విషయంలో తాము జోక్యం చేసుకోబోమంటూ హైకోర్టు ముందు కౌంటర్ దాఖలు చేశారు. అలాగే జయేంద్రనగర్ నివాసితుల సంక్షేమ సంఘం న్యాయవాది కూడా ఆశ్చర్యకరంగా ఆ భూమిపై తాము జోక్యం చేసుకోమని కోర్టుకు వివరించారు. అయితే దీనిని జయేంద్రనగర్ నివాసితుల సంక్షేమ సంఘం తోసిపుచ్చింది. ఆ భూముల విషయంలో జోక్యం చేసుకోబోమంటూ కోర్టుకు చెప్పాలని తాము ఎన్నడూ తమ న్యాయవాదికి చెప్పలేదని తెలిపింది. వీటన్నింటితో పాటు ఈ కేసులో గతంలో ప్రైవేటు వ్యక్తుల తరఫున హాజరైన ప్రణతి ఇప్పుడు ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాదిగా ప్రభుత్వం తరఫున హాజరు కావడం, అలాగే ఆ ప్రైవేటు వ్యక్తుల తరఫున ప్రస్తుతం ప్రణతి భర్త రాహుల్ చౌదరి హాజరుకావడం వంటి పరిణామాల నేపథ్యంలో ఈ మొత్తం వ్యవహారంపై విచారణ జరిపిన జస్టిస్ హరినాథ్, పలు అను మానాలు వ్యక్తం చేశారు. వాస్తవాలను నిగ్గు తేల్చేందుకు ఏసీబీ విచారణకు ఆదేశిస్తూ గత నెల 28న ఉత్తర్వులిచ్చారు.ఏసీబీ విచారణపై ధర్మాసనం ముందు ప్రణతి అప్పీల్...ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ ఎస్జీపీ సింగమనేని ప్రణతి గురువారం ధర్మాసనం ముందు అప్పీల్ దాఖలు చేశారు. సింగిల్ జడ్జి తన తీర్పులో వ్యక్తం చేసిన అభిప్రాయాల వల్ల తన కెరీర్ తీవ్ర ప్రభావితమవుతుందని, అందువల్ల వాటిని తొలగిస్తూ ఆదేశాలు ఇవ్వాలని ప్రణతి తన అప్పీల్లో ధర్మాసనాన్ని అభ్యర్థించారు. ఈ అప్పీల్పై గత నెల 31న విచారణ జరిపిన సీజే ధర్మాసనం, ప్రణతిపై సింగిల్ జడ్జి వ్యక్తం చేసిన ప్రతికూల అభిప్రా యాలను, అలాగే ఆమెపై ఏసీబీ విచారణను తదుపరి విచారణ వరకు నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.ప్రణతి సింగిల్ జడ్జిపై వ్యక్తిగత ఆరోపణలు చేశారు...తాజాగా సోమవారం ప్రణతి దాఖలు చేసిన అప్పీల్ మరోసారి విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా జయేంద్రనగర్ నివాసితుల సంక్షేమ సంఘం తరఫు న్యాయవాది చల్లా వెంకట్ స్పందిస్తూ, ప్రణతి తన అప్పీల్లో సింగిల్ జడ్జిపై వ్యక్తిగత ఆరోపణలు చేశారని ధర్మా సనం దృష్టికి తీసుకొచ్చారు. ఏ ఏ పేరాల్లో వ్యక్తిగత ఆరోపణలున్నాయో చెప్పారు. దీంతో ధర్మాసనం ఆ పేరాలను పరిశీలించింది. అనంతరం వాటిని చదివి వినిపించింది. సింగిల్ జడ్జిను ఉద్దేశించి అప్పీల్లో ఉపయోగించిన పదజాలాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామంటూ ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో వాటిని అప్పీల్ నుంచి తొలగిస్తామని ప్రణతి తరఫు సీనియర్ న్యాయవాది ఆదినారాయణ రావు చెప్పడంతో, ఆ మేర అఫిడవిట్ను తమ ముందుంచాలని ధర్మాసనం ఆదేశించింది. -
ఇది రాజకీయశక్తుల కుట్ర!
సాక్షి, అమరావతి: భారతీ సిమెంట్స్ సంక్షోభం వెనుక రాజకీయ శక్తులున్నాయని ఆ కంపెనీ తరఫు సీనియర్ న్యాయవాది సీవీ మోహన్రెడ్డి హైకోర్టుకు నివేదించారు. భారతీ సిమెంట్స్ ఉత్పత్తిని ఎలాగైనా ఆపేయాలన్న ఉద్దేశంతో కొన్ని రాజకీయ శక్తులు వెనకుండి తొలగింపునకు గురైన కార్మికులను ఉసిగొల్పుతున్నాయని ఆయన వివరించారు. సిమెంట్ ఫ్యాకర్టీని నమ్ముకుని 1,300 కుటుంబాలు బతుకుతున్నాయని, ఓ 10 మంది తీరు వల్ల వారంతా కూడా రోడ్డున పడే పరిస్థితి వచ్చిందని ఆయన తెలిపారు. రాజకీయ శక్తుల కుతంత్రాలతో గత ఐదు రోజులుగా లైమ్స్టోన్ తవ్వకాలు, సిమెంట్ ఉత్పత్తి నిలిచిపోయాయన్నారు.తద్వారా కంపెనీకి రోజుకు రూ.6 కోట్ల మేర నష్టం వాటిల్లుతోందని ఆయన హైకోర్టుకు చెప్పారు. లైమ్స్టోన్ తవ్వకాల వాహనాలు ఫ్యాక్టరీలోకి వచ్చే పరిస్థితులు లేవని, లోపలికి వెళ్లే గేటు ముందు టెంట్ వేసి కొందరు ఉద్దేశపూర్వకంగా అడ్డుపడుతున్నారని తెలిపారు. పోలీసుల కళ్ల ఎదుటే అంతా జరుగుతున్నా వారే మాత్రం పట్టించుకోవడం లేదన్నారు. భారతీ సిమెంట్స్ చట్టబద్ధంగా వ్యాపారం చేస్తోందని, అన్ని అనుమతులు పొంది, అన్ని రకాలు పన్నులు చెల్లిస్తోందని ఆయన కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. చట్టబద్ధంగా నడుస్తున్న కంపెనీకి భద్రత కల్పించాల్సిన పోలీసులు రాజకీయ శక్తులకు కొమ్ముకాస్తూ చోద్యం చూస్తున్నారని మోహన్రెడ్డి వివరించారు. అందరి వాదనలు విన్న హైకోర్టు తగిన నిర్ణయం వెలువరిస్తామని స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కుంచం మహేశ్వరరావు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. పోలీసులు తమ విధి నిర్వహణలో విఫలయ్యారు..భారతి సిమెంట్ కంపెనీ వైఎస్ఆర్ కడప జిల్లా నల్లలింగాయపల్లె వద్ద ఉన్న తమ ప్లాంట్ కార్యకలాపాలతో పాటు మైనింగ్ కార్యకలాపాలను సైతం అడ్డుకుంటున్న మూకలపై ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదని, తమ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ భారతి సిమెంట్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ (బీసీసీపీఎల్) అ«దీకృత ప్రతినిధి, డైరెక్టర్ జి.బాలాజీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై సోమవారం జస్టిస్ మహేశ్వరరావు మరోసారి విచారణ జరిపారు. ఈ సందర్భంగా భారతీ సిమెంట్స్ తరఫున సీనియర్ న్యాయవాది సీవీ మోహన్రెడ్డి వాదనలు వినిపించారు.రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కుల పరిరక్షణ న్యాయస్థానాల బాధ్యతన్నారు. ఇదే సమయంలో శాంతి భద్రతల బాధ్యత పోలీసులపై ఉందని తెలిపారు. అయితే పోలీసులు తమ విధులను నిర్వర్తించడంలో దారుణంగా విఫలయ్యారని చెప్పారు. చర్యలు తీసుకోవాల్సిన కలెక్టర్ సైతం మౌనంగా ఉన్నారన్నారు. ఫ్యాక్టరీ ప్రాంగణంలో 350 కుటుంబాలు తాము నిర్మీంచిన క్వార్టర్స్లో ఉంటున్నాయన్నారు. వారందరికీ కూడా రాకపోకలకు తీవ్ర విఘాతం కలుగుతోందని చెప్పారు. ముడిసరుకు లైమ్స్టోన్ లోపలికి వెళితే, సిమెంట్ బయటకు వస్తుందని, ఇప్పుడు అలా జరగడం లేదన్నారు. ప్లాంట్ కార్యకలాపాలు సజావుగా సాగేందుకు తగిన చర్యలు తీసుకునేలా పోలీసులను ఆదేశించాలని ఆయన కోర్టును కోరారు. 10మంది ఆందోళన చేస్తున్నారు... అనంతరం పోలీసుల తరఫున ప్రభుత్వ న్యాయవాది అడుసుమిల్లి జయంతి వాదనలు వినిపిస్తూ, ఫ్యాక్టరీలోకి వాహనాలు వెళుతున్నాయన్నారు. తొలగింపుకు గురైన 10 మంది ఆందోళన చేస్తున్నారని తెలిపారు. అక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదన్నారు. అన్నీ సక్రమంగా ఉంటే మేమెందుకు కోర్టుకొస్తాం.. ఈ సమయంలో సీవీ మోహన్రెడ్డి జోక్యం చేసుకుంటూ, అన్నీ సక్రమంగా ఉంటే తామెందుకు కోర్టుకు వస్తామని ప్రశ్నించారు. సక్రమంగా ఉంటే వ్యయప్రయాసల కోర్చి ఈ వ్యాజ్యాన్ని ఎందుకు దాఖలు చేస్తామని, కోర్టును ఎందుకు ఇబ్బంది పెడుతామన్నారు. తొలగింపునకు గురైన కార్మీకుల తరఫున సీనియర్ న్యాయవాది పాపెల్లుగారి వీరారెడ్డి వాదనలు వినిపిస్తూ, ఈ వ్యాజ్యంలో తాము ప్రతివాదులుగా చేరతామని, అందుకు అనుమతించాలని కోరారు. సాధారణ ఉద్యోగికి వీరారెడ్డిని పెట్టుకునేంత స్థోమత ఉంటుందా? ఇందుకు సీవీ మోహన్రెడ్డి తీవ్ర అభ్యంతరం తెలిపారు. తాము తమ వ్యాజ్యంలో వారికి వ్యతిరేకంగా ఎలాంటి అదేశాలు కోరడం లేదన్నారు. ఓ కాంట్రాక్ట్ ఉద్యోగికి అమరావతి వరకు వచ్చి వీరారెడ్డి వంటి సీనియర్ న్యాయవాదిని పెట్టుకునే స్థోమత ఉందంటే వారి వెనుక ఎవరో ఉన్నారన్న విషయం ఇట్టే అర్థమవుతోందన్నారు. అందరి వాదనలు విన్న న్యాయమూర్తి తగిన ఉత్తర్వులు జారీ చేస్తామంటూ తీర్పును రిజర్వ్ చేశారు -
రాజ్యాంగబద్ధంగా విధులు నిర్వర్తించడం పోలీసుల బాధ్యత
సాక్షి, అమరావతి: పచ్చ ముఠాల దౌర్జన్యం.. విధి నిర్వహణలో పోలీసుల ఉదాసీనతపై భారతీ సిమెంట్స్ దాఖలు చేసిన పిటిషన్పై తాజాగా హైకోర్టు స్పందించింది. భారతీ సిమెంట్స్ మైనింగ్ కార్యకలాపాలను టీడీపీ మూకలు అడ్డుకుంటున్న నేపథ్యంలో ఈ మొత్తం వ్యవహారంపై పూర్తి వివరాలను తమ ముందుంచాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. రాజ్యాంగబద్ధంగా విధులు నిర్వర్తించాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని ఈ సందర్భంగా స్పష్టం చేస్తూ తదుపరి విచారణను హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కుంచం మహేశ్వరరావు ఉత్తర్వులు జారీ చేశారు. ప్లాంట్తో పాటు మైనింగ్ కార్యకలాపాలను సైతం అడ్డుకుంటున్న టీడీపీ మూకలపై ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదని, తమ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసేలా ఆదేశించాలని కోరుతూ భారతీ సిమెంట్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ (బీసీసీపీఎల్) అ«దీకృత ప్రతినిధి, డైరెక్టర్ జి.బాలాజీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై న్యాయస్థానం విచారణ జరిపింది. కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారు! భారతీ సిమెంట్స్ తరఫున సీనియర్ న్యాయవాది సీవీ మోహన్రెడ్డి వాదనలు వినిపించారు. క్రమశిక్షణరాహిత్యంలో భాగంగా కాంట్రాక్టర్ తొలగించిన కొంత మంది, ఇతరులతో కలిసి భారతీ సిమెంట్స్ కార్యకలాపాలను అడ్డుకుని ఉత్పత్తి నిలిపేయాలన్న కుట్రతో వ్యవహరిస్తున్నారన్నారు. ప్లాంట్లోకి వెళ్లే దారులను మూసివేసి రాకపోకలకు తీవ్ర ఆటంకాలు సృష్టిస్తున్నా పోలీసులు చోద్యం చూస్తున్నారని నివేదించారు. దీనిపై ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదన్నారు. అల్లరి మూకల దౌర్జన్యం వల్ల గని నుంచి లైమ్స్టోన్, ఫ్యాక్టరీ నుంచి సిమెంట్ రవాణా పూర్తిగా నిలిచిపోయిందన్నారు. గతంలో రోజుకు 400 ట్రక్కులు తిరుగుతుండగా, ఇప్పుడు ఒక్క ట్రక్కు కూడా తిరిగే పరిస్థితి లేదని మోహన్రెడ్డి వివరించారు. దీంతో కంపెనీకి రోజుకు సుమారు రూ.4 కోట్లకు పైగా నష్టం వాటిల్లుతోందన్నారు. అంతేకాక ప్లాంట్ కార్యకలాపాలు నిలిచిపోవడం వల్ల ప్రభుత్వ ఖజానాకు సైతం నష్టం కలుగుతోందని తెలిపారు. కొందరి రాజకీయాలతో ఉద్యోగులు రోడ్డున పడే ప్రమాదం... ఈ ఫ్యాక్టరీపై ఆధారపడి వేల మంది ఉద్యోగులు బతుకుతున్నారని, కొందరి రాజకీయాల వల్ల వారంతా రోడ్డున పడే ప్రమాదం నెలకొందని మోహన్రెడ్డి తెలిపారు. దౌర్జన్యం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత పోలీసులపై ఉందన్నారు. చట్టబద్ధంగా వ్యాపారం చేస్తూ, ఖజానాకు పన్నుల రూపంలో భారీ మొత్తాలు చెల్లిస్తున్న కంపెనీ విషయంలో పోలీసులు ఉదాసీనంగా వ్యవహరించడం దారుణమన్నారు. గతంలో ఇదే రీతిలో కొందరు ఇండియా సిమెంట్స్ కార్యకలాపాలను అడ్డుకున్నారని, దీనిపై హైకోర్టు జోక్యం చేసుకుని పోలీసులకు తగిన ఆదేశాలు ఇచ్చిందని నివేదించారు. ఈ రోజు కూడా ప్లాంట్కు వెళ్లకుండా దారిలో టెంట్ వేస్తున్నా పోలీసులు చోద్యం చూస్తున్నారని కోర్టు దృష్టికి తెచ్చారు. 10 మందిపై చర్యలు తీసుకునేలా పరిస్థితిలో కూడా పోలీసులు లేరంటే రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చునన్నారు. ప్లాంట్లో రాకపోకలకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకునేలా పోలీసులను ఆదేశించాలని కోరారు. కంపెనీపై ఆధారపడి బతుకుతున్న కారి్మకులను దృష్టిలో పెట్టుకుని తగిన ఆదేశాలు ఇవ్వాలని అభ్యర్థించారు. కాగా పోలీసుల తరఫున ప్రభుత్వ న్యాయవాది (జీపీ) అడుసుమల్లి జయంతి వాదనలు వినిపిస్తూ ఈ వ్యాజ్యం తొలిసారి విచారణకు వస్తోందని, పూర్తి వివరాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. -
బాబు సర్కార్ కుట్రలు.. పోలీసుల నిర్లక్ష్యం.. హైకోర్టుకు భారతి సిమెంట్స్
-
చంద్రబాబు ప్రభుత్వ కక్ష సాధింపుపై భారతి సిమెంట్స్ న్యాయ పోరాటం
సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలపై భారతి సిమెంట్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ (బీసీసీపీఎల్) న్యాయ పోరాటానికి దిగింది. అధికార పార్టీకి చెందిన కమలాపురం ఎమ్మెల్యే పుత్తా కృష్ణచైతన్య రెడ్డి తన అనుచరుల ద్వారా మైనింగ్ కార్యకలాపాలు అడ్డుకుంటున్నా కనీస స్థాయిలో కూడా స్పందించకుండా చోద్యం చూస్తున్న అధికారులు ముఖ్యంగా పోలీసుల ఉదాసీనతపై హైకోర్టును ఆశ్రయించింది. టీడీపీ గుండాలు గత మూడు రోజులుగా రేయింబవళ్లు తిష్టవేసి సున్నపురాయి తవ్వకాలను అడ్డుకుంటూ, తద్వారా ఉత్పత్తిని ఆపి కంపెనీని దెబ్బ తీసేందుకు చేస్తున్న ప్రయత్నాలపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. తమ సిమెంట్ ప్లాంట్ కార్యకలాపాలను మొత్తం అడ్డుకుంటున్న వారిపై ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదని, తమ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ భారతి సిమెంట్స్ అధీకృత ప్రతినిధి, డైరెక్టర్ జి.బాలాజీ ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తున్నారు ‘భారతి సిమెంట్ కంపెనీ వైఎస్ఆర్ కడప జిల్లా నల్లలింగాయపల్లె వద్ద సిమెంట్ తయారీ ఫ్యాక్టరీ, సున్నపురాయి గనిని నిర్వహిస్తోంది. కంపెనీ మ్యాన్పవర్ కాంట్రాక్టర్ అయిన ‘మెసర్స్ వైష్ణవి అసోసియేట్స్’ ద్వారా పనుల్లోకి వచ్చిన 10 మంది కాంట్రాక్ట్ కార్మికులు ఈ ఏడాది ఫిబ్రవరిలో కంపెనీ నిర్వహించిన క్రీడా పోటీలలో తీవ్ర గొడవలు సృష్టించారు. దీనిని తీవ్ర క్రమశిక్షణారాహిత్యంగా పరిగణించిన కాంట్రాక్టర్ వారిని పని నుంచి తొలగించారు. సస్పెండ్ అయిన కార్మికులు ఫ్యాక్టరీ వద్ద గొడవలు చేస్తామని బెదిరించడంతో, కంపెనీ యాజమాన్యం పోలీసుల రక్షణ కోరింది.అయినా కూడా పోలీసులు పట్టించుకోలేదు. దీంతో ఏప్రిల్ 28న భారతి సిమెంట్స్ కమలాపురం జూనియర్ సివిల్ కోర్టులో సస్పెండ్ అయిన 10 మంది కాంట్రాక్ట్ కార్మికులకు వ్యతిరేకంగా దావా వేసింది. విచారణ జరిపిన కోర్టు తాత్కాలిక ఇంజంక్షన్ ఉత్తర్వులు ఇచ్చింది. సస్పెండ్ అయిన కార్మికులు లేదా వారి అనుచరులు ఫ్యాక్టరీ కార్యకలాపాలకు, వాహనాల రాకపోకలకు ఆటంకం కలిగించకూడదని స్పష్టం చేసింది. అయినప్పటికీ, ప్రతిరోజూ 25–30 మంది వ్యక్తులు సస్పెండ్ అయిన కార్మికులతో కలిసి సిమెంట్ ప్లాంట్కు వెళ్లే ఏకైక రహదారిని ట్రాక్టర్లు, వాహనాలు అడ్డంగా పెట్టి దిగ్బంధిస్తున్నారు. దీంతో గని నుండి లైమ్స్టోన్, ఫ్యాక్టరీ నుండి సిమెంట్ రవాణా పూర్తిగా నిలిచిపోయింది.రోజుకు 400 ట్రక్కులు తిరుగుతుండగా, ఇప్పుడు ఒక్క ట్రక్కు కూడా తిరిగే పరిస్థితి లేదు. దీంతో కంపెనీకి రోజుకు సుమారు రూ.4 కోట్లకు పైగా నష్టం వాటిల్లుతోంది. భారతి సిమెంట్ తయారీ కేంద్రంలో ఉన్న ప్రస్తుత సున్నపురాయి నిల్వలు ఇకపై ఫ్యాక్టరీ కార్యకలాపాలను కొనసాగించడానికి సరిపోవు. పోలీసుల ఉదాసీతన కారణంగా ప్లాంట్ పూర్తిగా మూతపడే ప్రమాదం పొంచి ఉంది. ఇది కంపెనీకి మరింత ఆర్థిక నష్టాన్ని కలిగిస్తుండటమే కాకుండా, అక్కడ పనిచేస్తున్న వందలాది మంది ఉద్యోగులు, కార్మికుల జీవనోపాధికి తీవ్రమైన ముప్పును కలిగిస్తోంది’ అని పిటిషనర్ పేర్కొన్నారు.అధికారం ఉన్నా.. కలెక్టర్ స్పందించడం లేదు‘జిల్లాపై పూర్తి అధికార పరిధి కలిగిన ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ అయిన జిల్లా కలెక్టర్, ఇలాంటి అత్యవసర పరిస్థితుల్లో ’భారతీయ నాగరిక్ సురక్ష సంహిత’ (బీఎన్ఎస్ఎస్) లోని సెక్షన్ 163 ప్రకారం తగిన ఉత్తర్వులు జారీ చేయవచ్చు. చట్టబద్ధంగా ఉపాధి పొందుతున్న వ్యక్తులకు ఆటంకం, ఇబ్బంది కలగకుండా నిరోధించడానికి, ప్రాణాలకు, భద్రతకు ప్రమాదం కలగకుండా, ప్రజల ప్రశాంతతకు భంగం వాటిల్లకుండా, తిరుగుబాటు, గొడవలు జరగకుండా నిరోధించేందుకు నిర్దిష్ట చర్యలకు దూరంగా ఉండాలని ఆదేశించే అధికారం కూడా కలెక్టర్కు ఉంది. అయితే అధికారాన్ని ఉపయోగించాల్సిన పరిస్థితులు నెలకొని ఉన్నా కూడా కలెక్టర్ ఏ మాత్రం స్పందించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.’ అని పిటిషనర్ హైకోర్టుకు నివేదించారు.ఎస్పీ ఫిర్యాదును తీసుకోవడానికే నిరాకరించారు‘సస్పెండ్ అయిన కార్మికులు, ఇతరులు కలిసి కంపెనీ జీఎం (మైన్స్) కె.సుధాకర్, సెక్యూరిటీ ఆఫీసర్ జి. వెంకటయ్యలపై భౌతిక దాడికి పాల్పడ్డారు. అటు తరువాత కూడా భారీ మూక ప్లాంట్ వద్దకు చేరింది. ఈ పరిస్థితుల్లో భారతి సిమెంట్స్ కంపెనీ ప్రతినిధులు కమలాపురం సీఐ, కడప డీఎస్పీ, లిఖితపూర్వక ఫిర్యాదులు చేశారు. ఎస్పీ ఫిర్యాదును స్వీకరించడానికే నిరాకరించారు. దీంతో ఆయనకు ఈ మెయిల్ ద్వారా ఫిర్యాదు పంపాం. ఫిర్యాదులు చేసినప్పటికీ, పోలీసులు సదరు మూకను చెదరగొట్టడం గానీ, వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడం గానీ చేయలేదు. ఈ నేపథ్యంలో విధి పరిస్థితుల్లో హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది. అందువల్ల ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుని పోలీసులకు తగిన ఆదేశాలు ఇవ్వండి.’ అని బాలాజీ తన పిటిషన్లో అభ్యర్థించారు. హైకోర్టుకు అభ్యర్థనలు ⇒ కంపెనీ ప్రాంగణంలో చట్టవిరుద్ధంగా గుమిగూడిన వారిపై తక్షణమే చట్ట ప్రకారం చర్యలు తీసుకునేలా ఆదేశాలు జారీ చేయాలి. ⇒ ముందస్తు భద్రతను ఏర్పాటు చేసేలా కూడా తగిన ఆదేశాలు ఇవ్వాలి. ⇒ మేము ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడాన్ని చట్టవిరుద్ధంగా, రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించాలి. ⇒ కంపెనీలోకి అక్రమంగా ప్రవేశించిన వారు కలిగిస్తున్న ఆటంకాలను తొలగించి, వారిని ఆ ప్రాంగణం నుండి ఖాళీ చేయించేలా ఆదేశాలివ్వాలి. ⇒ తద్వారా సిమెంట్ ప్లాంట్లో చట్టబద్ధమైన వ్యాపారాన్ని కొనసాగించేలా, ప్లాంట్ ప్రాంగణంలో సాధారణ కార్యకలాపాలను పునరుద్ధరించేలా ఆదేశించాలి. ⇒ ఈ మొత్తం వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై చట్టప్రకారం తగిన చర్యలు తీసుకునేలా ఆదేశించాలి. -
అభ్యర్థులకు ప్రభుత్వం చేసిన హెచ్చరికలను మా ముందుంచండి
సాక్షి, అమరావతి: డీఎస్సీ 2025లో చోటు చేసుకున్న భారీ అక్రమాలు, నిబంధనల ఉల్లంఘనలపై ఎవరైనా బహిరంగంగా మాట్లాడితే వారిపై సివిల్, క్రిమినల్ చర్యలు చేపడతామంటూ ప్రభుత్వం జారీ చేసిన హెచ్చరికలను అదనపు ఆధారాలుగా తమ ముందుంచాలని హైకోర్టు మంగళవారం పిటిషనర్ అయిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డిని ఆదేశించింది. అలాగే ప్రభుత్వ చర్యల వల్ల బాధితులుగా మారిన అభ్యర్థులను ప్రతివాదులుగా చేర్చే విషయంలోనూ స్పష్టతనివ్వాలని ఆదేశించింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ లీసా గిల్, న్యాయమూర్తి జస్టిస్ మెడమల్లి బాలాజీ ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. మెగా డీఎస్సీ అక్రమాలపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ చంద్రశేఖర్రెడ్డి ఇటీవల హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై మంగళవారం సీజే ధర్మాసనం విచారణ జరిపింది.పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది సుబ్రహ్మణ్య శ్రీరాం వాదనలు వినిపించారు. మెగా డీఎస్సీ2025 నియామక ప్రక్రియ మొత్తం భారీ స్థాయి వ్యవస్థాగత కుంభకోణమని పేర్కొన్నారు. ఈ వ్యాజ్యం దాఖలు వెనుక ఎలాంటి రాజకీయ ప్రయోజనాలూ లేవని, పిటిషనర్కు ఉన్న రాజకీయ నేపథ్యాన్ని కూడా తాము ఎక్కడా దాచిపెట్టలేదని కోర్టుకు వివరించారు. ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ, బాధిత అభ్యర్థులు ఎందుకు హైకోర్టును ఆశ్రయించలేదని ప్రశ్నించింది. డీఎస్సీ అక్రమాలపై ఎవరైనా మాట్లాడితే వారిపై సివిల్, క్రిమినల్ చర్యలు చేపడతామని ప్రభుత్వం హెచ్చరించిందని, ఈ నేపథ్యంలో కోర్టుకొచ్చేందుకు అభ్యర్థులు భయపడుతున్నారని శ్రీరాం తెలిపారు. ప్రభుత్వం ఇప్పటి వరకు మెరిట్ లిస్ట్ ప్రచురించలేదని, దీంతో పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం లేకుండా పోయిందని పేర్కొన్నారు. బాధితులు ఇప్పటికే కోర్టుకొచ్చారు... ఈ సమయంలో ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్ స్పందిస్తూ, డీఎస్సీ నియామక ప్రక్రియను సవాలు చేస్తూ ఇప్పటికే 335 రిట్ పిటిషన్లు పడ్డాయని, ఇందులో 69 స్పోర్ట్స్ కోటాకు సంబంధించినవి ఉన్నాయని చెప్పారు. అభ్యర్థుల ఎంపికకు సంబంధించిన పూర్తి సమాచారం ఆన్లైన్లో అందుబాటులో ఉందన్నారు. రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తి దాఖలు చేసిన ఈ వ్యాజ్యానికి విచారణార్హత లేదని తెలిపారు. ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ, ఎవరూ కూడా రాజకీయ ప్రయోజనాల కోసం పిల్ దాఖలు చేయడానికి వీల్లేదని వ్యాఖ్యానిస్తూనే డీఎస్సీ అక్రమాలపై మాట్లాడితే సివిల్, క్రిమినల్ చర్యలు చేపడుతామన్న ప్రభుత్వ హెచ్చరికలను తమ ముందుంచాలని పిటిషనర్ను ఆదేశించింది. అదే రీతిలో బాధిత అభ్యర్థులను ఈ పిల్లో ప్రతివాదులుగా చేర్చే అంశంపైనా స్పష్టతనివ్వాలని పేర్కొంది. -
మహిళా న్యాయవాదుల సమస్యలు పరిష్కరిస్తా
సాక్షి, అమరావతి: రాష్ట్ర న్యాయవాద మండలి (బార్ కౌన్సిల్)కి కొత్తగా ఎన్నికైన సభ్యులు మంగళవారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ లీసా గిల్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు కింది కోర్టుల్లో న్యాయవాదులు, ముఖ్యంగా మహిళా న్యాయవాదులు ఎదుర్కొంటున్న సమస్యలను సీజే దృష్టికి తీసుకొచ్చారు. కింది కోర్టుల్లో మరుగుదొడ్లు, వెయిటింగ్ రూమ్లు లేక మహిళా న్యాయవాదులు, కక్షిదారులు ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. దీనిపై స్పందించిన సీజే.. ఈ విషయంలో ఇప్పటికే తగిన చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఎక్కడెక్కడ మరుగుదొడ్లు, వెయిటింగ్ రూంల అవసరం ఉందో వివరాలు తెప్పించుకునే పనిలో ఉన్నానన్నారు. న్యాయవాదులు మరణించినప్పుడు ఏర్పాటు చేసే సంస్మరణ సభలను సాయంత్రం 4.15 గంటలకు మార్చడంపై కింది కోర్టుల న్యాయవాదుల అభ్యంతరాలను బార్ కౌన్సిల్ నూతన సభ్యులు సీజే దృష్టికి తీసుకొచ్చారు. గతంలో ఉన్న విధంగా ఉదయమే సంస్మరణ సభలు ఏర్పాటు చేసుకునేందుకు అనుమతినివ్వాలని కోరారు. దీనిపై కూడా సీజే సానుకూలంగా స్పందించారు. కోర్టు పని మొదలు కావడానికి ముందే సంస్మరణ సభ ఏర్పాటు చేసుకునే అవకాశాన్ని పరిశీలించాలని బార్ కౌన్సిల్ సభ్యులకు సూచించారు. సీజేను కలిసిన వారిలో అజయ్ కుమార్ చలసాని, కలిగినీడి చిదంబరం, ఆలూరు రామిరెడ్డి, గొర్రెముచ్చు శాంత కుమార్, వట్టిజొన్నల బ్రహ్మారెడ్డి, యలమంజుల బాలాజీ, బీవీ కృష్ణారెడ్డి, ఉప్పలపాటి శ్రీనివాస రాజు, ఎస్.రాజేంద్ర ప్రసాద్, శ్రీనివాసులరెడ్డి, ఎన్వీ సుమంత్, రవి బెల్లన, బండారు వెంకట రమణ మూర్తి, గంటా రామారావు, కీర్తి రామ జోగేశ్వరరావు, కె. వెంకట్రామిరెడ్డి, మాధవి,కృష్ణమోషన్,అంకయ్య, శ్రీదేవి, మంజులత, దుర్గా నాగశ్రీ, రాగి గంగా భవాని ఉన్నారు. -
తీర్పు అభిప్రాయాల వినియోగంపై ఆంక్షలు విధించలేం
సాక్షి, అమరావతి: కాకినాడ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో కోట్ల రూపాయల భూమిని కొట్టేసేందుకు కుట్ర పన్ని, కోర్టునే తప్పుదోవ పట్టించిన వ్యవహారంపై ఏసీబీ విచారణకు ఆదేశిస్తూ తీర్పునిచ్చిన సింగిల్ జడ్జి, ఆ తీర్పులో వ్యక్తం చేసిన అభిప్రాయాలను ప్రజా బాహుళ్యంలో ఎవరూ, ఏ రకంగా వాడకుండా ఆదేశాలు ఇవ్వాలన్న ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్జీపీ) సింగమనేని ప్రణతి అభ్యర్థనను హైకోర్టు ధర్మాసనం తోసిపుచ్చింది. సింగిల్ జడ్జి తీర్పులోని అభిప్రాయాలను పలువురు పలు రకాలుగా వ్యాప్తి చేస్తున్నారని, ఇది ప్రణతి ప్రతిష్టకు విఘాతం కలిగిస్తోందన్న ఆమె తరఫు సీనియర్ న్యాయవాది బండారుపల్లి ఆదినారాయణరావు చేసిన వాదనతో ధర్మాసనం ఏకీభవించలేదు. ఆ తీర్పు కాపీ పబ్లిక్ డాక్యుమెంట్ అని, అది ఇప్పటికే ప్రజా బాహుళ్యం (పబ్లిక్ డొమైన్)లో ఉందని ధర్మాసనం గుర్తు చేసింది. అందువల్ల ఆ తీర్పును ఏ రకంగా ఉపయోగించకుండా ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని ధర్మాసనం స్పష్టం చేసింది. అయితే సింగిల్ జడ్జి తన తీర్పులో ప్రణతి విషయంలో వ్యక్తం చేసిన అభిప్రాయాల అమలును తదుపరి విచారణ వరకు మాత్రమే ధర్మాసనం నిలుపుదల చేసింది. అలాగే ప్రణతిపై ఏసీబీ విచారణను సైతం తదుపరి విచారణ వరకు నిలిపేసింది. సింగిల్ జడ్జి తీర్పుపై ప్రణతి దాఖలు చేసిన అప్పీల్లో ప్రతివాదులుగా ఉన్న జయేంద్రనగర్ నివాసితుల సంక్షేమ సంఘానికి, పిటిషనర్లు, రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఆగస్టు రెండో వారానికి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ లీసా గిల్, న్యాయమూర్తి జస్టిస్ చల్లా గుణరంజన్ ధర్మాసనం శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. -
డబ్బు కోసం పామర్రు పోలీసులు వేధిస్తున్నారు
సాక్షి ప్రతినిధి, విజయవాడ: హత్య కేసులో సాక్షినైన తనను డబ్బు కోసం పోలీసులు వేధిస్తున్నాడంటూ ఓ వ్యక్తి తీవ్ర ఆరోపణలు చేయడం పోలీసు శాఖలో కలకలం రేపింది. కృష్ణా జిల్లా పామర్రు సీఐ, ఎస్సై తనను లక్షా యాభై వేల రూపాయలు లంచం ఇవ్వాలని, లేదంటే ఒక హత్య కేసులో ఇరికిస్తామంటూ వేధిస్తున్నారని కొలుసు అయ్యప్ప శుక్రవారం మీడియా ఎదుట వాపోయాడు. కొలుసు అయ్యప్ప తన అత్తను మామ కొట్టి చంపిన కేసులో సాక్షిగా ఉన్నాడు. డబ్బు కోసం తనను సీఐ కొట్టాడని, కానిస్టేబుల్ను పలుమార్లు ఇంటికి, పనిచేసే చోటకి పంపించి వేధిస్తున్నారని తెలిపాడు. తాము తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించాలని, లేదంటే లక్షన్నర రూపాయలు ఇవ్వాల్సిందేనంటూ సీఐ, ఎస్ఐ తనను వేధిస్తున్నారని ఆరోపించాడు. ఈ విషయంపై తాను సీఐ, ఎస్ఐతో మాట్లాడిన ఆడియో రికార్డులను కృష్ణా జిల్లా ఎస్పీకి అందచేసి ఫిర్యాదు చేశానని, అయినా చర్యలు తీసుకోకపోవడంతో పోలీసుల వేధింపులపై కోర్టును ఆశ్రయించానని చెప్పాడు. పోలీసులు లంచం డిమాండ్ చేసిన ఆడియో రికార్డులను అయ్యప్ప తరపు న్యాయవాది కోర్డుకు సమర్పించాడు. శుక్రవారం హైకోర్టులో జరిగిన విచారణలో అయ్యప్ప దొంగతనం చేశాడని పోలీసులు ఆరోపించారు. అయితే మూడు నెలలు అయినా ఇప్పటివరకూ కేసు ఎందుకు నమోదు చేయలేదని పోలీసులను న్యాయమూర్తి నిలదీసినట్లు సమాచారం. -
ఆస్తిని మీ ఇష్టం వచ్చినట్లు లాక్కోడానికి వీల్లేదు
సాక్షి, అమరావతి: అమరావతి రాజధాని నిర్మాణం కోసం ఎలాంటి పరిహారం చెల్లించకుండా రైతుల భూములను చంద్రబాబు నాయుడు ప్రభుత్వం దౌర్జన్యపూరితంగా, బలవంతంగా, చట్టవిరుద్ధంగా లాక్కుంటున్న నేపథ్యంలో హైకోర్టు గురువారం కీలక ఆదేశాలు ఇచ్చింది. చట్టబద్ధమైన అధికారం లేకుండా ఏ వ్యక్తి ఆస్తిని లాక్కోడానికి వీల్లేదని ప్రభుత్వానికి హైకోర్టు స్పష్టం చేసింది. తన భూమిని సేకరించే విషయంలో ముందుకెళ్లకుండా అధికారులను నిరోధించాలంటూ చోడిశెట్టి నిర్మలత అనే రైతు దాఖలు చేసిన అప్పీల్ విచారణ సందర్భంగా ధర్మాసనం ఈ కీలక వ్యాఖ్యలు చేసింది.ఇందుకు సంబంధించి పిటిషనర్ దాఖలు చేసిన అనుబంధ పిటిషన్పై విచారణ జరిపి ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసిన వారంలోపు తగిన నిర్ణయం వెలువరించాలని సింగిల్ జడ్జిని ధర్మాసనం కోరింది. అప్పటి వరకూ ఈ భూమి విషయంలో గతంలో ఇచ్చిన ‘యథాతథస్థితి’ మధ్యంతర ఉత్తర్వులను పొడిగించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ రవినాథ్ తిల్హరీ, న్యాయమూర్తి జస్టిస్ చింతలపూడి పురుషోత్తం కుమార్ ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ దౌర్జన్యంపై హైకోర్టులో పిటిషన్...అమరావతి రాజధాని ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణం కోసం పెనుమాక రైతుల భూములను లక్ష్యంగా చేసుకున్న చంద్రబాబు ప్రభుత్వం ఎలాంటి పరిహారం చెల్లించకుండా దౌర్జన్యపూరితంగా, బలవంతంగా లాక్కుంటున్న విషయం తెలిసిందే. ఇదే రీతిలో తన భూమిని సైతం ఎలాంటి పరిహారం చెల్లించకుండా ఏకపక్షంగా స్వాధీనం చేసుకుంటుండటంతో ప్రభుత్వ చర్యలను సవాలు చేస్తూ విజయవాడకు చెందిన చోడిశెట్టి నిర్మలత హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గుంటూరు జిల్లా, తాడేపల్లి మండలం, పెనుమాక గ్రామంలోని సర్వే నెంబర్ 39–2లో ఉన్న 65 సెంట్ల భూమికి సంబంధించిన భూ సేకరణ నోటిఫికేషన్తో పాటు తదుపరి చర్యలన్నీ నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. ఈ వ్యాజ్యంపై ఇటీవల విచారణ జరిపిన సింగిల్ జడ్జి జస్టిస్ చల్లా గుణరంజన్, ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ప్రభుత్వ భూ సేకరణ ప్రక్రియలో జోక్యం చేసుకోలేమంటూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ నిర్మలత ధర్మాసనం ముందు అప్పీల్ దాఖలు చేశారు. ఈ అప్పీల్పై ఇటీవల వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ తిల్హరీ «నేతృత్వంలోని ధర్మాసనం, నిర్మలత భూమి స్వాధీనం విషయంలో యథాతథస్థితి కొనసాగించాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. తాజాగా గురువారం ఈ అప్పీల్ విచారణకు వచ్చిన సందర్భంగా ప్రభుత్వానికి కీలక నిర్దేశాలు ఇచ్చింది. ప్రభుత్వానికి ధర్మాసనం సూచనలు» ఆస్తిలో అతి చిన్న భాగాన్ని సేకరించాలన్నా కూడా, అది చట్టానికి లోబడి జరగాల్సిందే. » 2013 భూసేకరణ చట్టం కింద భూమిని సేకరించే అధికారం ప్రభుత్వానికి ఉంది. అయితే ఆ సేకరణ చట్ట నిబంధనల ప్రకారమే జరిగి తీరాలి. » భూ సేకరణలో తీసుకుంటున్న భూమి విస్తీర్ణం చాలా తక్కువే అయినప్పటికీ, ఆస్తి హక్కు అనేది ఆ భూమి విస్తీర్ణంపై ఆధారపడి ఉండదు. » విస్తృత ప్రజాప్రయోజనానికి, ఒక వ్యక్తి ప్రయోజనానికి మధ్య వైరుధ్యం ఏర్పడినప్పుడు, విస్తృత ప్రజా ప్రయోజనమే నిలబడుతుంది. » ఇతరుల దృష్టిలో ఆ ఆస్తి నష్టం ఎంత చిన్నదైనప్పటికీ, చట్ట నిబంధనల ప్రకారం ఆ ఆస్తిని మినహాయించడానికి వీల్లేదు. » ’చట్ట ప్రకారం’ అంటే కేవలం చట్టపరమైన అధికారం ఉండటం మాత్రమే కాదు. చట్టం నిర్దేశించిన విధి విధానాలను ఖచ్చితంగా అనుసరించడం కూడా. » ప్రస్తుత కేసులో చట్ట నిబంధనలు, నిర్దేశిత విధి విధానాలను పాటించలేదని బాధిత వ్యక్తుల తరఫు న్యాయవాది చేసిన వాదనను ఎలాంటి ప్రాధాన్యత, విలువ లేనిదిగా ఈ దశలో చూడలేము. » చట్ట విధి విధానాలను పాటించారా లేదా దాని ప్రభావం ఏంటన్నది బాధితులు దాఖలు చేసిన రిట్ పిటిషన్లో తేల్చాల్సిన అంశం. » ఈ నేపథ్యంలో అప్పీలుదారు ప్రయోజనాలను కాపాడటం సమంజమైన చర్య. -
సాయికృష్ణ కేసులో సంచలనం
సాక్షి, అమరావతి: ఆది నుంచీ మలుపులపై మలుపులు తిరుగుతున్న కాపు యువకుడు సాయికృష్ణ లాకప్డెత్ కేసులో ఊహించని మలుపు చోటు చేసుకుంది. తన కుమారుడు లాకప్డెత్ కేసులో సీబీఐ దర్యాప్తు కోసం తాను దాఖలు చేసిన పిటిషన్ను ఉపసంహరించుకోవడం లేదని గాదె విజయలక్ష్మి బుధవారం హైకోర్టుకు నివేదించింది. తనకు తెలియకుండా, తన సమ్మతి లేకుండా, ఎలాంటి సూచనలు తీసుకోకుండానే సీబీఐ దర్యాప్తు కోసం గతంలో ఆమె దాఖలు చేసిన అనుబంధ పిటిషన్ను ఉపసంహరించుకుంటున్నట్లు న్యాయవాది కోగంటి రిత్విక పిటిషన్ వేశారని న్యాయవాది గుడివాక వాసుదేవుడు హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. రిత్విక స్థానంలో వాదనలు వినిపించేందుకు తనను విజయలక్ష్మి నియమించుకుని, ఆ మేరకు వకాలత్ ఇచ్చారని ఆయన వివరించారు. తాను ఈ కేసులో హాజరయ్యేందుకు రిత్విక నుంచి నిరభ్యంతర పత్రం (ఎన్వోసీ) కోరినప్పటికీ, ఆమె స్పందించడం లేదని వాసుదేవుడు కోర్టుకు నివేదించారు. ఎన్వోసీతో పాటు కేసు రికార్డులను కూడా ఇవ్వలేదని చెప్పారు. అందువల్ల ఎన్వోసీ లేకుండానే వకాలత్ దాఖలు చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోర్టును అభ్యర్థించారు. ఆ మేర తాము దాఖలు చేసిన అనుబంధ పిటిషన్ను అనుమతించాలని కోరారు. దీంతో హైకోర్టు, విజయలక్ష్మి తాజాగా దాఖలు చేసిన అనుబంధ పిటిషన్ను పరిశీలించింది. ఇందులోని ఆరోపణలు చాలా తీవ్రమైనవన్న హైకోర్టు, వాటి సంగతి తేలుస్తామని స్పష్టం చేసింది. ఇదేమీ చిన్న విషయం కాదంది. రిత్విక వాదనలు విన్న అనంతరమే తగిన నిర్ణయం తీసుకుంటామని, ఆమెకు నోటీసులు ఇవ్వాలని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ రవినాథ్ తిల్హరి, జస్టిస్ చింతలపూడి పురుషోత్తం కుమార్ ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.నాకు తెలియకుండానే రిత్విక ఆ పిటిషన్ వేశారు..తన కుమారుడిని కోర్టు ముందు హాజరు పరిచేలా ఆదేశాలు జారీ చేయాలంటూ సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ తర్వాత సాయికృష్ణ లాకప్డెత్ జరిగిందన్న విషయం రూఢీ అయింది. దీంతో ఆమె తన కుమారుడి లాకప్డెత్పై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. ఇదిలా ఉండగా, సీబీఐ దర్యాప్తు కోసం తాను దాఖలు చేసిన అనుబంధ పిటిషన్ను ఉపసంహరించుకుంటానని, అందుకు అనుమతినివ్వాలని కోరుతూ ఈ నెల 14న విజయలక్ష్మి తరఫు న్యాయవాది కోగంటి రిత్విక అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో సీబీఐ దర్యాప్తు కోసం వేసిన అనుబంధ పిటిషన్తో పాటు హెబియస్ కార్పస్ పిటిషన్నూ ఉపసంహరించుంటామని పేర్కొన్నారు. దీనిని పరిశీలించిన జస్టిస్ తిల్హరీ ధర్మాసనం, ప్రధాన పిటిషన్ను ఉపసంహరించుకుంటామని ఓ చోట, అనుబంధ పిటిషన్ను ఉపసంహరించుకుంటామని మరో చోట రాశారని గుర్తు చేసింది. అసలు సీబీఐ దర్యాప్తు కోసం దాఖలు చేసిన పిటిషన్ను ఎందుకు ఉపసంహరించుకోవాలనుకుంటున్నారో వివరిస్తూ తాజాగా పిటిషన్ దాఖలు చేయాలని విజయలక్ష్మిని ఆదేశిస్తూ విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసిన విషయం తెలిసిందే.ఐదుగుర్ని అరెస్ట్ చేశాం.. ఒకరు పరారీలో ఉన్నారు..తాజాగా ఈ కేసు బుధవారం మరోసారి విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా విజయలక్ష్మి తరఫు న్యాయవాది వాసుదేవుడు స్పందిస్తూ జరిగిన విషయాన్ని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ధర్మాసనం జోక్యం చేసుకుంటూ, సాయికృష్ణ కేసు దర్యాప్తు పురోగతి ఏమిటని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్జీపీ) సింగమనేని ప్రణతిను ప్రశ్నించింది. మొత్తం ఆరుగురు నిందితుల్లో ఐదుగురిని అరెస్ట్ చేశామని, మరొకరు పరారీలో ఉన్నారని తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం, విజయలక్ష్మి అనుమతి లేకుండానే సీబీఐ దర్యాప్తు కోసం గతంలో వేసిన పిటిషన్ ఉపసంహరణకు పిటిషన్ వేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న న్యాయవాది రిత్వికకు నోటీసు ఇవ్వాలని వాసుదేవుడిని ఆదేశిస్తూ విచారణను గురువారానికి వాయిదా వేసింది.దర్యాప్తు పురోగతిని మా ముందుంచండిసాయికృష్ణ లాకప్డెత్పై నమోదు చేసిన కేసులో దర్యాప్తు పురోగతికి సంబంధించిన వివరాలను తమ ముందుంచాలని హైకోర్టు బుధవారం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఆదేశించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న కృష్ణలంక పోలీస్స్టేషన్ అప్పటి ఇన్స్పెక్టర్ నాగరాజును పోలీసు కస్టడీకి అప్పగించే విషయంలో సుప్రీంకోర్టు ఏం ఉత్తర్వులిచ్చిందో వాటిని తమ ముందుంచాలని కూడా ఆదేశించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ లీసా గిల్, న్యాయమూర్తి జస్టిస్ చల్లా గుణరంజన్ ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. సాయికృష్ణ లాకప్డెత్ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని కోరుతూ సెంటర్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ రైట్స్ అధ్యక్షుడు గోచిపాత శ్రీనివాసరావు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే. -
రూ.కోట్ల ఆస్తి కోసం హైకోర్టునే పక్కదారి పట్టించారు
సాక్షి, అమరావతి: రూ.కోట్లు విలువచేసే కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ భూమిని కొట్టేసేందుకు కుట్ర జరిగిందన్న అనుమానంతో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టులో ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్జీపీ) సింగమనేని ప్రణతి, ఆమె భర్త, న్యాయవాది మేకా రాహుల్ చౌదరి, అలాగే కాకినాడ మునిసిపల్ కార్పొరేషన్ అధికారుల పాత్రపై అనుమానాలు వ్యక్తం చేసింది. కోర్టును తప్పుదోవ పట్టించి రూ. 15 కోట్ల ప్రభుత్వ ఆస్తిని ప్రైవేటు వ్యక్తులకు అప్ప గించే ప్రయత్నం జరిగి ఉండొచ్చని ఇందుకు సంబంధించిన ఒక రివ్యూ పిటిషన్ విచారణ సందర్భంగా అభిప్రాయపడింది. దీంతో ఈ వ్యవహారానికి సంబంధించి ఈ ఏడాది జనవరి 8వ తేదీన ఇచ్చిన ఉత్తర్వులను రద్దుచేసి రివ్యూ పిటిషన్ను అనుమతించింది. ‘మోసం, కుమ్మక్కు, పరస్పర విరుద్ధ ప్రయోజనాల ఘర్షణ (కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రస్ట్) వంటి అంశాలు తీవ్రమైన ఆందోళన కలిగిస్తున్నాయి’అని ఈ కేసు విచారణ సందర్భంగా న్యాయమూర్తి జస్టిస్ నూనెపల్లి హరినాథ్ వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో ఈ మొత్తం వ్యవహారంపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) విచారణ జరపాలని ఆదేశించారు. ఐజీ స్థాయికంటే తక్కువకాని అధికారి విచారణ చేపట్టాలని నిర్దేశించారు. 12 వారాల్లో నివేదిక సమర్పించాలని ఏసీబీ డీజీని ఆదేశించారు. కోర్టును తప్పుదారి పట్టించిన తీరిది » తూర్పు గోదావరి జిల్లా, కాకినాడ అర్బన్ మండలం, రమణయ్యపేట సర్వే నెంబర్ 127/4లో తమకు చెందిన స్థలాల్లో కాకినాడ మునిసిపల్ కార్పొరేషన్ ప్రహరీ నిర్మిస్తోందని, ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కోరుతూ గోదావరిగుంటకు చెందిన గుబ్బల సత్యనారాయణమూర్తి, మరొకరు 2013లో, ఇదే అభ్యర్థనతో వాసంశెట్టి అప్పారావు మరో ముగ్గురు 2015లో హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాల్లో కాకినాడ మునిసిపల్ కార్పొరేషన్ అధికారులు 2015లో కౌంటర్లు దాఖలు చేశారు. పిటిషనర్లు ఏ స్థలాలనైతే తమ స్థలాలుగా చెబుతున్నారో వాస్తవానికి అవి ప్రజా ప్రయోజనాల నిమిత్తం విడిచిపెట్టిన స్థలాలని, వాటిని కాపాడాల్సిన బాధ్యత తమపై ఉందని కార్పొరేషన్ అధికారులు కౌంటర్లలో పేర్కొన్నారు. » ఇదిలా ఉండగా, కాకినాడ, జయేంద్ర నగర్ నివాసితుల సంక్షేమ సంఘం ఈ వ్యాజ్యాల్లో ప్రతివాదిగా చేరింది. పిటిషనర్లు తమవిగా చెబుతున్న స్థలాలు వారివి కావని, అవి ప్రజా ప్రయోజనార్థం మునిసిపల్ కార్పొరేషన్కు తమ సంఘం బహుమతిగా ఇవ్వడం జరిగిందని హైకోర్టుకు నివేదించింది. » ఈ ఏడాది జనవరిలో ఈ వ్యాజ్యాలు మరోసారి విచారణకు వచ్చాయి. పిటిషనర్లు చెబుతున్న స్థలాలు తమవేనంటూ 2015లో దాఖలు చేసిన కౌంటర్కు భిన్నంగా కాకినాడ మునిసిపల్ కార్పొరేషన్ జనవరి 6న మరో కౌంటర్ దాఖలు చేసింది. పిటిషనర్లు తమవిగా చెబుతున్న స్థలాల విషయంలో తాము జోక్యం చేసుకోబోమని కోర్టుకు చెప్పింది. అదే రీతిలో ఆ స్థలాలపై తాము ఎలాంటి హక్కు కోరడం లేదంటూ జయేంద్ర నగర్ నివాసితుల సంక్షేమ సంఘం తరఫు న్యాయవాది సైతం హైకోర్టుకు నివేదించారు. మునిసిపల్ కార్పొరేషన్ తాజా కౌంటర్ను పరిగణనలోకి తీసుకుని ఈ వ్యాజ్యాలను పరిష్కరించాలని సంఘం న్యాయవాది కోరారు. దీంతో ఇరుపక్షాల అంగీకారంతో హైకోర్టు సింగిల్ జడ్జి ఈ రెండు వ్యాజ్యాలను పరిష్కరించారు. పిటిషనర్ల స్థలాల విషయంలో జోక్యం చేసుకోవద్దని కార్పొరేషన్ అధికారులను ఆదేశిస్తూ 2026 జనవరిలో ఉత్తర్వులిచ్చారు. » ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ జయేంద్రనగర్ నివాసితుల సంక్షేమ సంఘం ధర్మాసనం ముందు అప్పీళ్లు దాఖలు చేసింది. వీటిపై విచారణ జరిపిన ధర్మాసనం, సింగిల్ జడ్జి ముందు పునఃసమీక్ష (రివ్యూ) పిటిషన్ దాఖలు చేసుకోవాలని సంఘానికి సూచించింది. దీంతో జనవరి 8న ఇచ్చిన ఉత్తర్వులను రివ్యూ చేయాలంటూ జయేంద్రనగర్ నివాసితుల సంక్షేమ సంఘం పిటిషన్ దాఖలు చేసింది. » జయేంద్రనగర్ నివాసితుల సంక్షేమ సంఘం తరఫు న్యాయవాది చల్లా వెంకట్ వాదనలు వినిపిస్తూ పిటిషనర్లు, ప్రభుత్వం, మునిసిపల్ కార్పొరేషన్ అధికారులు, తమ న్యాయవాది కుమ్మక్కై, ఆస్తిని కాజేయడానికి ప్లాన్ వేసి, కోర్టును తప్పుదోవ పట్టించారని విన్నవించారు. హైకోర్టు గమనించిన ముఖ్యాంశాలు..» ప్రణతి గతంలో పిటిషనర్ల తరఫున న్యాయవాదిగా వ్యవహరించి, ఆ తర్వాత ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాదిగా బాధ్యతలు చేపట్టారు. » ఆమె స్థానంలో ఆమె భర్త రాహుల్ చౌదరి అదే పిటిషనర్ల తరఫున వకాలత్ దాఖలు చేశారు. » 2015లో భూమి తమదేనని చెప్పిన మునిసిపల్ కార్పొరేషన్, 2026లో ఆ భూమిపై హక్కు కోరబోమని విరుద్ధ అఫిడవిట్ దాఖలు చేసింది. » హైకోర్టులో ప్రభుత్వం తరఫున మళ్లీ ప్రణతి హాజరు కావడం, కాకినాడ మునిసిపల్ కార్పొరేషన్ గతంలో దాఖలు చేసిన కౌంటర్కు భిన్నంగా.. ఇప్పుడు ప్రైవేటు వ్యక్తులకు అనుకూలంగా కౌంటర్ దాఖలు చేయడం వంటి వరుస పరిణామాలపై న్యాయమూర్తి అనుమానాలు వ్యక్తం చేశారు. » ఈ పరిణామాలు కోర్టును తప్పుదోవ పట్టించి ప్రభుత్వ ఆస్తిని కాజేయాలనే ప్రయత్నాన్ని సూచిస్తున్నాయని వ్యాఖ్యానించారు. » ఈ కేసుల్లో ఆయా పార్టీల తరఫున హాజరైన న్యాయవాదులు వ్యవహరించిన తీరు వృత్తిపరమైన తీవ్ర దుష్ప్రవర్తన, కోర్టును మోసం చేయడానికి చేసిన ప్రయత్నమన్నారు. » ప్రభుత్వం, దాని అనుబంధ సంస్థల తరఫున హాజరైన న్యాయవాదులు తమ బాధ్యతలను నిర్వర్తించడంలో దారుణంగా విఫలమయ్యారని తీవ్రంగా ఆక్షేపించారు. » రిట్ పిటిషనర్లు, ప్రతివాదులు (ప్రభుత్వం) తరఫున హాజరైన న్యాయవాదులు కోర్టును మోసం చేయడం పట్ల కోర్టు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. -
వైద్య విద్యార్థినికి హైకోర్టు అండ
సాక్షి, అమరావతి: తీవ్ర ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఎంబీబీఎస్ కోర్సు నుంచి రెండేళ్లు విరామం తీసుకుని, తిరిగి కోర్సులో మంచి మార్కులతో మొదటి సంవత్సరం ఉత్తీర్ణత సాధించినా.. రెండో సంవత్సరం పరీక్షలు రాసేందుకు డాక్టర్ ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయం అనుమతి ఇవ్వకపోవడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్న విద్యార్థిని వినీతకు హైకోర్టు అండగా నిలిచింది. ఆ విద్యార్థిని ఎంబీబీఎస్ కోర్సు పూర్తిచేసేందుకు అనుమతి ఇచ్చింది. ‘తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు వంటి అనివార్య కారణాల వల్ల విద్యార్థులు ఎంబీబీఎస్ కోర్సులో తాత్కాలిక విరామం తీసుకుంటే, ఆ విరామకాలాన్ని మొదటి సంవత్సరం పూర్తి చేయడానికి ఉద్దేశించిన నాలుగేళ్ల గరిష్ట కాలపరివిుతిలో లెక్కించకూడదు. కోర్సులో తీసుకునే తాత్కాలిక విరామం విద్యార్థి ప్రతిభకు ప్రాతిపదిక కాదు. ప్రస్తుత కేసులో ఆ విద్యార్థిని రూ.62 లక్షల ఫీజు చెల్లించి తిరిగి కోర్సులో చేరినట్లు తెలిపారు. సెప్టెంబర్ 2025లో జరిగిన పరీక్షకు హాజరై మొదటి సంవత్సరాన్ని మంచి మార్కులతో పూర్తిచేశారు. రెండో ప్రయత్నంలోనే ఉత్తీర్ణత సాధించి, ప్రస్తుతం రెండో సంవత్సరం కోర్సు పూర్తిచేసే దశలో ఉన్నారు. నిబంధనల పేరుతో ఈ దశలో ఆమెను చదువుకు దూరం చేయడమంటే, సమాజానికి ఒక వైద్యురాలిని దూరం చేయడమే. నీట్ ప్రవేశపరీక్ష కోసం ఎంతో కఠినమైన ప్రిపరేషన్ను దాటుకుని అడ్మిషన్ సాధించిన తర్వాత, సాధారణ పరిస్థితుల్లో ఏ విద్యార్థి కూడా ఎంబీబీఎస్ కోర్సు నుంచి స్వచ్ఛందంగా విరామం తీసుకోరు’ అని హైకోర్టు పేర్కొంది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ న్యాపతి విజయ్ ఇటీవల తీర్పు చెప్పారు.ఆర్థిక కారణాలతో రెండేళ్ల విరామం పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురానికి చెందిన జోసెఫ్ పాల్ కుమార్తె వినీత 2020–21 విద్యాసంవత్సరానికి రాజమహేంద్రవరం జీఎస్ఎల్ వైద్య కళాశాలలో బీ కేటగిరి కింద ఎంబీబీఎస్ ప్రవేశం పొందారు. తీవ్రమైన ఆర్థిక కారణాలతో ఆమె రెండేళ్లు విరామం తీసుకున్నారు. 2024లో రూ.62 లక్షల ఫీజు చెల్లించి తిరిగి కోర్సులో చేరారు. నిబంధనల ప్రకారం ఎంబీబీఎస్ మొదటి సంవత్సరాన్ని గరిష్టంగా నాలుగేళ్లు లేదా నాలుగు ప్రయత్నాల్లో పూర్తిచేయాలి. ఈ నాలుగేళ్ల కాల పరిమితి 2024 డిసెంబర్తో ముగిసిందంటూ ఎన్టీఆర్ వర్సిటీ అధికారులు వినీతను పరీక్షలకు అనుమతించలేదు. దీంతో వినీత తండ్రి హైకోర్టును ఆశ్రయించారు. -
డీఎస్సీ అక్రమాలపై విచారణ
సాక్షి, అమరావతి: లక్షలాది మంది టీచర్ అభ్యర్థుల భవిష్యత్ను గందరగోళంలోకి నెట్టిన మెగా డీఎస్సీ అక్రమాలపై హైకోర్టు స్పందించింది. ఈ మొత్తం వ్యవహారంపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. స్పోర్ట్స్ కోటా ముఖ్యంగా జూడో క్రీడా విభాగంలో నకిలీ క్రీడా ధృవీకరణ పత్రాలతో ప్రభుత్వ ఉద్యోగాలు, వైద్య విద్య ప్రవేశాలు పొందుతున్నారని, దీనిపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. 2025 మెగా డీఎస్సీలో నకిలీ క్రీడా ధృవీకరణ పత్రాలతో పలువురు ఉద్యోగాలు పొందారని, దీనిపై ఫిర్యాదులు చేసినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ ఏపీ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆర్.కె.పురుషోత్తం ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై సోమవారం ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ లీసా గిల్, న్యాయమూర్తి జస్టిస్ చల్లా గుణరంజన్ ధర్మాసనం విచారణ జరిపింది. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం, ఈ మొత్తం వ్యవహారంపై విచారణ జరిపిన తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. పిటిషనర్ ఇచ్చిన ఫిర్యాదులు, రిట్ పిటిషన్లో ప్రస్తావించిన అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని ఈ వ్యవహారంపై నాలుగు నెలల్లోతగిన నిర్ణయం తీసుకోవాలని ధర్మాసనం స్పష్టం చేసింది.ఫిర్యాదులు ఇచ్చినా ప్రభుత్వం పట్టించుకోలేదు...అంతకు ముందు పురుషోత్తం తరఫున సీనియర్ న్యాయవాది ఓబిరెడ్డి మనోహర్రెడ్డి వాదనలు వినిపించారు. ఏపీ జూడో అసోసియేషన్ నుంచి నకిలీ ధృవీకరణ పత్రాలు పొంది పలువురు పలు ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరారని, అలాగే 2025 డీఎస్సీలో కూడా ఉద్యోగాలు సంపాదించారన్నారు. అంతేకాక వైద్య విద్యలో కూడా ప్రవేశాలు పొందారని తెలిపారు. వీటన్నింటిపై పిటిషనర్ ఫిర్యాదులు చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. ప్రభుత్వ న్యాయవాది (హోం) అడుసుమల్లి జయంతి వాదనలు వినిపిస్తూ, ఆరోపణలకు ఆధారాలు చూపాలని పిటిషనర్ను కోరినా స్పందించలేదన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం, నకిలీ క్రీడా ధృవీకరణ పత్రాలపై పిటిషనర్ ఇచ్చిన ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకుని తగిన చర్యల నిమిత్తం విచారణ జరపాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. పోటీలు జరగకపోయినా సర్టిఫికెట్లు..ఏపీ జూడో అసోసియేషన్ నుంచి నకిలీ సర్టిఫికెట్లు పొందినవారు.. వారు సంపాదించిన ఉద్యోగాలకు సంబంధించిన వివరాలను పిటిషనర్ పిటిషన్లో వివరించారు. పోటీలు జరగకపోయినా జూడోలో పాల్గొన్నట్లు సర్టిఫికేట్లు ఇచ్చారు. అసలైన జాతీయ, రాష్ట్ర స్థాయి టోర్నమెంట్లతో సంబంధం లేని తేదీలు, వేదికల పేరుతో నకిలీ ఫారమ్–2, ఫారమ్–4 సర్టిఫికేట్లను సృష్టించారు. టోర్నమెంట్లలో పాల్గొనని, మొదటి రౌండ్లలోనే నిష్క్రమించిన అభ్యర్థులు బంగారు, వెండి, కాంస్య పతకాలు సాధించినట్లు నకిలీ రికార్డులను తయారు చేశారు. ఈ నకిలీ పత్రాల ద్వారా స్పోర్ట్స్ ప్రాధాన్యత జాబితాలో మొదటి స్థానాలు పొంది, నిజమైన క్రీడాకారుల హక్కులను కాలరాశారు.నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు.. మెడికల్ సీట్లు..విశాఖపట్నం జిల్లాలో సుమారు 20 మంది నకిలీ జూడో సర్టిఫికేట్లతో ఉద్యోగాలు పొందారు. కె.చందన అనే అభ్యర్థి ఇంటర్–డిస్ట్రిక్ట్ జూడో టోర్నమెంట్ నకిలీ సర్టిఫికేట్తో సివిల్ అసిస్టెంట్ సర్జన్గా ఎంపికైంది. ⇒ పల్లిపాటి రిత్విక్ను 2017 డిసెంబర్ లో చెన్నైలో జరిగిన సీనియర్ నేషనల్ జూడో ఛాంపియన్షిప్లో 66 కేజీల కేటగిరీలో అనర్హుడిగా ప్రకటించారు. అయినప్పటికీ, ఈ పోటీ ఆధారంగా పొందిన నకిలీ సర్టిఫికేట్తో తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ స్పోర్ట్స్ కోటా సీటు సాధించాడు. సమాచార హక్కు చట్టం కింద అడిగిన ప్రశ్నకు జూడో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా స్పందించింది. టోర్నమెంట్లలో అనర్హత పొందిన వారికి, కేవలం పాల్గొన్న వారికి ఎటువంటి మెరిట్ సర్టిఫికెట్లు జారీ చేయమని స్పష్టంగా చెప్పింది. ⇒ ఇదే రీతిలో పశుసంవర్థక శాఖలో కూడా పలువురు ఉద్యోగాలు పొందారు. టోర్నమెంట్ రికార్డులు, పతకాల ప్రదానోత్సవ వివరాలను పరిశీలించగా, పలువురు అభ్యర్థులు చూపిన సర్టిఫికేట్లు నకిలీవని రూఢీ అయింది. ఆకుమల్ల హర్షవర్ధన్ జాతీయ స్థాయి పోటీలలో ఎటువంటి స్థానమూ సాధించకపోయినా, మెరిట్ సర్టిఫికేట్తో ఉద్యోగానికి ఎంపికయ్యాడు. పి. ఇస్మాయిల్ బాషా, పల్లపు అభినయ్, అయితు అప్పలస్వామి, పి. అశ్విని తదితరులు పోటీ రికార్డుల్లో పేర్లు లేకున్నా నకిలీ స్పోర్ట్స్ ఫారమ్ల ఆధారంగా ఉద్యోగాలు సాధించారు. ఏ టోర్నమెంట్ అధికారిక రికార్డులలో లేదా ఎంట్రీ ఫారమ్లలో లేదు. అయినా సరే నకిలీ సర్టిఫికేట్ల ద్వారా జాబితాలో చేరి ఉద్యోగం సాధించారు. ఇదో పెద్ద కుంభకోణం.. దీని వెనుక కుట్రకోణం..పోటీలు జరగని తేదీలతో, ఇతర విజేతల స్థానాలను తమ స్థానాలుగా చెప్పుకుంటూ, జూనియర్ టోర్నమెంట్లను సీనియర్ టోర్నమెంట్లుగా చిత్రీకరిస్తూ సమర్పించిన దరఖాస్తులను జూడో సంఘం కార్యదర్శి పవన్ ఎలాంటి పరిశీలన చేయకుండా ఫారమ్ 2 సర్టిఫికేట్లు జారీ చేశారు. ఇది ఒక పెద్ద కుంభకోణంలో భాగం. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (శాప్) లోని అసిస్టెంట్ డైరెక్టర్, డిప్యూటీ డైరెక్టర్ స్థాయి అధికారులు, సంబంధిత సిబ్బంది ఈ నకిలీ సర్టిఫికేట్లను క్షుణ్ణంగా తనిఖీ చేయకుండా ధృవీకరించారు. సమాచార హక్కు చట్టం కింద పాత సమాచారాన్ని కోరినప్పుడు, ఈమెయిల్లు, ఇతర ఆధారాలు డిలీట్ అయ్యాయని అధికారులు చెప్పడం వెనుక కుట్ర కోణం ఉంది. ఏపీ జూడో అసోసియేషన్ ప్రతినిధులు వెంకట్ నమిశెట్టి, పవన్ సందీప్ నమిశెట్టి తదితరులు నిబంధనలకు విరుద్ధంగా నకిలీ ఫారమ్–2, ఫారమ్–4 లను జారీ చేశారు. ఈ మొత్తం వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరగాలి.’ అని పురుషోత్తం తన పిటిషన్లో పేర్కొన్నారు.డీఎస్సీలోనూ అవే నకిలీ సర్టిఫికెట్లు..మెగా డీఎస్సీ నోటిఫికేషన్ –2025 కింద దరఖాస్తు చేసుకున్న పలువురు అభ్యర్థులు జూడో అసోసియేషన్ నుంచి సంపాదించిన నకిలీ సర్టిఫికేట్లను జతపరిచారు. ఖమ్మం, విజయవాడ, గుంటూరులలో జరిగిన టోర్నమెంట్ల పేరుతో సమర్పించిన ధృవీకరణ పత్రాలు అసలు ఫలితాల జాబితాతో సరిపోలడం లేదు. జరగని పోటీలను జరిగినట్లు చూపడంతో పాటు, పోటీల్లో తాము ఫలానా స్థానం సాధించామని తప్పుడు ధృవీకరణ పత్రాలు పొందారు. ⇒ డాకోజి పాండు ఖమ్మంలో జరిగిన సీనియర్ జూడో ఛాంపియన్షిప్లో 2వ స్థానం సాధించినట్లు నకిలీ సర్టిఫికేట్, హామీ పత్రం సమర్పించగా, జూడో అసోసియేషన్ కార్యదర్శి పవన్ సందీప్ దీనికి ఫారమ్–2 మంజూరు చేశారు. ⇒ మిట్నసాల సుధారాణి 52 కేజీల సీనియర్ విభాగంలో 2వ స్థానం సాధించినట్లు తప్పుడు వివరాలతో సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వగా, 23.05.2025న పవన్ సందీప్ ఫారమ్–2 జారీ చేశారు. ⇒ దేసావత్ చంద్ర నాయక్ 66 కేజీల సీనియర్ విభాగంలో 2వ స్థానం సాధించినట్లు హామీ పత్రం ఇవ్వగా, 20.05.2025న పవన్ ఫారమ్–2 సర్టిఫికేట్ ఇచ్చారు. ⇒ రియాజుల్లా నల్బంది 73 కేజీల సీనియర్ విభాగంలో 2వ స్థానం పొందినట్లు తప్పుడు రికార్డు చూపగా, పవన్ 20.05.2025న ఫారమ్–2 జారీ చేశారు.⇒ షేక్ ఇనామ్ హుస్సేన్ 73 కేజీల సీనియర్ విభాగంలో పాల్గొన్నట్లు సర్టిఫికేట్ చూపారు. ఏ స్థానంలో అయితే తాను విజయం సాధించానని హుస్సేన్ చెప్పారో, అధికారిక రికార్డుల ప్రకారం కె.హరికృష్ణ ఆ స్థానాన్ని సాధించినట్లు తేలింది. అయినా సరే హుస్సేన్కు పవన్ ఫారమ్–2 ఇచ్చారు.⇒ అక్కల సురేఖ 63 కేజీల సీనియర్ విభాగంలో 2వ స్థానం సాధించినట్లు తప్పుడు తేదీలతో ఉన్న పత్రాలు ఇవ్వగా, పవన్ ఫారమ్–2 జారీ చేశారు.⇒ నొస్సం కరిష్మా 52 కేజీల సీనియర్ విభాగంలో 2వ స్థానం పొందినట్లు నకిలీ తేదీల సర్టిఫికేట్ సమర్పించగా, జూడో సంఘం కార్యదర్శి నుంచి ఫారమ్ 2 సంపాదించారు. ⇒ హస్వంత్ సూర్య నాయక్ 66 కేజీల సీనియర్ విభాగంలో 2వ స్థానం సాధించినట్లు తప్పుడు రికార్డులతో ఫారమ్–2 సర్టిఫికేట్ పొందారు. ఇలా పలువురు తప్పుడు ధృవీకరణ పత్రాలు తయారు చేసి వాటి ద్వారా ఉద్యోగాలు పొందారు. -
సివిల్ వివాదాలలో మీరెందుకు జోక్యం చేసుకుంటున్నారు?
సాక్షి, అమరావతి: సివిల్ కేసుల్లో పోలీసుల జోక్యంపై హైకోర్టు మండిపడింది. అసలు మీరెందుకు సివిల్ వివాదాల్లో జోక్యం చేసుకుంటున్నారని నిలదీసింది. సివిల్ వివాదాల్లో పోలీసులు జోక్యం చేసుకోకుండా తక్షణమే నిలువరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. విశాఖపట్నంలో ప్రీ లిటిగేషన్ కౌన్సెలింగ్ ఫోరం(పీఎల్సీఎఫ్) పేరుతో ఓ వ్యవస్థను ఏర్పాటు చేసి, సివిల్ వివాదాల్లో పోలీసులు జోక్యం చేసుకుంటున్న వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్, న్యాయమూర్తి జస్టిస్ చల్లా గుణరంజన్ ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. పోలీసులు వేధిస్తున్నారంటూ పిటిషన్లు ప్రీ లిటిగేషన్ కౌన్సెలింగ్ ఫోరం పేరుతో విశాఖపోలీసులు సివిల్ వివాదాల్లో జోక్యం చేసుకోవడంతోపాటు నిత్యం తమను పోలీస్స్టేషన్కు పిలిపించి వేధిస్తున్నారని సినీ నిర్మాత నట్టికుమార్ గత నెలలో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇదే అంశంపై వ్యాపారి మంచుకొండ రామకృష్ణ కూడా పిటిషన్ దాఖలు చేశారు. ఈ రెండు వ్యాజ్యాలపై న్యాయమూర్తి జస్టిస్ అవధానం హరిహరనాథశర్మ విచారణ జరిపారు. కోర్టుల్లో పెండింగ్లో ఉన్న సివిల్ వివాదాలను ప్రీ లిటిగేషన్ కౌన్సెలింగ్ ఫోరం ద్వారా పరిష్కరించుకోవాలంటూ విశాఖ పోలీసులు తమను నిత్యం వేధిస్తున్నారని వారు న్యాయమూర్తి దృష్టికి తీసుకొచ్చారు. వీరి వాదనలు విన్న న్యాయమూర్తి ప్రీ లిటిగేషన్ కౌన్సెలింగ్ ఫోరం పేరుతో విశాఖ పోలీసులు సివిల్ కేసుల్లో జోక్యం చేసుకుంటున్నట్లు నిర్ధారణకు వచ్చారు. ఫోరం పరిధి, దాని చట్టబద్ధత, అధికారాలు, పరిమితులపై సందేహం వ్యక్తం చేశారు. ఈ ఫోరం సంగతి ఏంటో తేల్చేందుకు కేసు రికార్డులు అన్నింటినీ ప్రధాన న్యాయమూర్తి ముందుంచాలని రిజిస్ట్రీని ఆదేశించారు. దీంతో రిజిస్ట్రీ కేసు రికార్డులను సీజే ముందుంచారు. వాటిని పరిశీలించిన సీజే, దీనిని రిట్ పిటిషన్గా మలచాలని ఆదేశించి గురువారం విచారణ జరిపారు. అసలు పోలీసులు ఎందుకు సివిల్ వివాదాల్లో జోక్యం చేసుకుంటున్నారని గట్టిగా ప్రశ్నించింది. ప్రభుత్వం తరఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది సింగమనేని ప్రణతి వాదనలు వినిపిస్తూ, ప్రీ లిటిగేషన్ కౌన్సెలింగ్ ఫోరం గురించి పూర్తి వివరాలను కోర్టు ముందుంచుతామని, ఇందుకు కొంత సమయం కావాలని కోరారు. ఇందుకు ధర్మాసనం అంగీకరించింది. -
హైకోర్టులో AP పోలీసులకు బిగ్ షాక్
-
లా అండ్ ఆర్డర్ చట్ట నిబంధనలకు అనుగుణంగా ఉండాలి
సాక్షి, అమరావతి: ఎన్ని సార్లు చీవాట్లు పెట్టినా.. ఎన్ని కేసుల్లో తలంటినా ఆంధ్రప్రదేశ్లో పోలీసుల తీరు మారడం లేదు. తప్పుడు కేసులు, అక్రమ అరెస్టులు షరామామూలుగా మారిపోయింది. ఏపీ పోలీసుల తీరుపై హైకోర్టు మరోసారి తీవ్రస్థాయిలో మండిపడింది. లా అండ్ ఆర్డర్ అన్నది చట్ట నిబంధనలకు అనుగుణంగానే ఉండాలి తప్ప, పోలీసులకు నచ్చినట్లు కాదని తేల్చి చెప్పింది. పోలీసులు కవులుగా మారిపోయారని, వారు తలచుకుంటే ఏదైనా సృష్టించగలరంది. ప్రభుత్వం మారిన తరువాత గతంలో నమోదైన కేసుల్లో సాక్షులు ఇచ్చిన వాంగ్మూలాలను సైతం మార్చేసి నిందితులకు క్లీన్చిట్లు ఇస్తేస్తున్నారని తెలిపింది. ఇలాంటి పరిస్థితులు ఉండటం దురదృష్టకరమని హైకోర్టు పేర్కొంది. మాజీ స్పీకర్, వైఎస్సార్సీపీ సీనియర్ నేత తమ్మినేని సీతారాం, ఆయన భార్య వాణి, కుమారుడు వెంకట శ్రీరాం చిరంజీవి నాగులపై నమోదు చేసిన ఫోర్జరీ కేసులో పోలీసుల తీరును హైకోర్టు తీవ్రంగా ఆక్షేపించింది. వివాదానికి కారణమైన రిజిస్టర్డ్ డాక్యుమెంట్ వెంకట శ్రీరాం చిరంజీవి నాగు పేరు మీద ఉంటే, అతని తండ్రి తమ్మినేని సీతారాం, తమ్మినేని వాణిని ఎందుకు నిందితులుగా చేర్చారని పోలీసులను నిలదీసింది. నాగు తమ్ముళ్లు, బావమరుదులు, ఇతర కుటుంబ సభ్యులను కూడా నిందితులుగా చేర్చి ఉండాల్సిందని వ్యంగ్యంగా వ్యాఖ్యానించింది. ఈ కేసుకు రాజకీయ రంగు పులిమారని తెలిపింది. ఈ కేసులో పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని అటు పోలీసులను, ఇటు ఫిర్యాదుదారుడిని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ యడవల్లి లక్ష్మణరావు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి అరెస్ట్ నుంచి సీతారాం, ఆయన కుటుంబ సభ్యులకు రక్షణ కల్పించేందుకు నిరాకరించారు. క్వాష్ పిటిషన్లో ఎలాంటి రక్షణ కల్పించలేమని, అరెస్ట్ భయం ఉంటే ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోవాలని స్పష్టం చేశారు. మాపై కేసు కొట్టేయండి.. అప్పటి వరకు తదుపరి చర్యలన్నీ నిలిపేయండి ఫోర్జరీ ధ్రువీకరణ పత్రాలతో ఆస్తి రిజిష్టర్ చేయించుకున్నారని ఆరోపిస్తూ కట్టా జయకిషోర్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు తమపై శ్రీకాకుళం గ్రామీణ పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ తమ్మినేని సీతారాం, ఆయన భార్య వాణి, కుమారుడు వెంకట శ్రీరాం చిరంజీవి నాగు హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో తదుపరి చర్యలన్నీ నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. ఈ వ్యాజ్యంపై మంగళవారం న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ లక్ష్మణరావు విచారణ జరిపారు. తమ్మినేని తరఫున సీనియర్ న్యాయవాది చిత్తర్వు రఘు వాదనలు వినిపించారు. రజనీ అనే మహిళ నుంచి చట్టబద్ధంగా వెంకట శ్రీరాం చిరంజీవి నాగు భూమిని కొనుగోలు చేశారన్నారు. ఒక్క సెక్షన్ మినహా మిగిలిన సెక్షన్లన్నీ ఏడేళ్ల లోపు శిక్ష పడేవేనని తెలిపారు. అందువల్ల బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 35(3) కింద నోటీసులిచ్చి వివరణ తీసుకునేలా పోలీసులను ఆదేశించాలని కోరారు. క్రిమినల్ కేసును సివిల్ కేసుగా చూపుతున్నారుపోలీసుల తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ (పీపీ) మెండ లక్ష్మీనారాయణ వాదనలు వినిపిస్తూ, నకిలీ ధ్రువీకరణ పత్రాలతో విలువైన ఆస్తిని కాజేయాలని పిటిషనర్లు కుట్ర పన్నారన్నారు. ఈ సమయంలో న్యాయమూర్తి స్పందిస్తూ, డాక్యుమెంట్ వెంకట శ్రీరాం చిరంజీవి నాగు పేరు మీద ఉంటే, సీతారాం, ఆయన భార్యను ఎందుకు నిందితులుగా చేర్చారని ప్రశ్నించారు. ఈ సందర్భంగా పోలీసులను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. స్థలం ఆక్రమణకు గురైందని తెలుసుకున్న వెంటనే పోలీసు కేసు పెట్టకుండా సివిల్ సూట్ ఎందుకు వేశారని న్యాయమూర్తి ప్రశ్నించారు. దావా దాఖలు చేసిన రెండేళ్ల తరువాత ఇప్పుడు కేసు ఎందుకు పెట్టారని కూడా ప్రశ్నించారు. ఆధారాలు చూపండిఫిర్యాదుదారు తరఫున సీనియర్ న్యాయవాది, టీడీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు పోసాని వెంకటేశ్వర్లు స్పందిస్తూ, ఫోర్జరీ డాక్యుమెంట్ల వెనుక పిటిషనర్లు ఉన్నట్లు వారి ఉద్యోగులే వాంగ్మూలాలు ఇచ్చారని చెప్పారు. పోలీసులు ఏమైనా సృష్టించగలరని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. ఆస్తి కొనుగోలుకు సంబంధించి యజమాని రజనీకి డబ్బు చెల్లించినట్లు ఆధారాలు చూపాలని పిటిషనర్లకు న్యాయమూర్తి స్పష్టం చేశారు. చెక్కు ఇచ్చారా? డబ్బు ఇచ్చారా? ఇందుకు సంబంధించిన ఆధారాలను తమ ముందుంచి, సచ్చీలతను నిరూపించుకోవాలన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి, ఈ వ్యవహారంలో కౌంటర్లు దాఖలు చేయాలని పోలీసులను, ఫిర్యాదుదారుడిని ఆదేశిస్తూ విచారణను ఈ నెల 29కి వాయిదా వేశారు. -
సాయికృష్ణ కేసులో సంచలన పరిణామం
-
ప్రకృతిని చెరబట్టొద్దు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సహజ వనరుల దోపిడీపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నీటి వనరుల పరిసరాల్లో పెద్ద ఎత్తున ఇసుక, మట్టి తవ్వకాలు చేస్తూ వాటిని తరలిస్తుండటాన్ని హైకోర్టు తప్పు పట్టింది. ‘గాలి, నీరు, అడవులు వంటివి ప్రకృతి ప్రసాదించిన వరాలు. ఇవి ఏ ఒక్క వ్యక్తికో, ప్రైవేట్ సంస్థకో సొంతం కాదు. సమాజంలోని ప్రజలందరికీ వీటిని సమానంగా పొందే హక్కు ఉంది. ఈ వనరులపై ప్రభుత్వానికి సర్వాధికారాలు ఉండవు. ప్రభుత్వం కేవలం ప్రజల తరఫున ఒక సంరక్షకుడిగా మాత్రమే వ్యవహరించాలి. ప్రజల శ్రేయస్సు కోసం ఈ వనరులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఇదే పబ్లిక్ ట్రస్ట్ సిద్ధాంతం. సహజ వనరులు జాతీయ ఆస్తులు. ప్రకృతి ప్రసాదించిన వనరులు ఏ ఒక్క తరం వాడి పారేసే వస్తువులు కావు. ఈ వనరులను భవిష్యత్తు తరాల కోసం పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది’ అని హైకోర్టు స్పష్టం చేసింది. ఎకనావిుక్ కారిడార్లో భాగంగా జాతీయ రహదారి నిర్మాణ పనుల కోసం విజయనగరం జిల్లా బొండపల్లి మండలం కొత్తపాలెం గ్రామంలో ఉన్న కన్నంనాయుడు చెరువు నుంచి ఇసుక, మట్టి తవ్వకాలకు అనుమతినిస్తూ జిల్లా కలెక్టర్ జారీ చేసిన ప్రొసీడింగ్స్ను హైకోర్టు రద్దు చేసింది. సహజ వనరుల పరిరక్షణ నిమిత్తం ఈ ఏడాది మే 8న జారీ చేసిన ప్రామాణిక నిర్వహణ విధానాన్ని (ఎస్ఓపీ) కచ్చితంగా అమలు చేసి తీరాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. సహజ వనరుల దోపిడీని అడ్డుకునేందుకు వీలుగా ప్రతి ఏడాది సమీక్ష సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశిస్తూ న్యాయమూర్తి జస్టిస్ కుంచం మహేశ్వరరావు రెండు రోజుల క్రితం తీర్పునిచ్చారు.చెరువు నుంచి ఇసుక, మట్టి తవ్వకాలకు అనుమతిపై పిటిషన్ కన్నంనాయుడు చెరువు నుంచి ఇసుక, మట్టి తవ్వకాలకు అనుమతినిస్తూ కలెక్టర్ జారీ చేసిన ప్రొసీడింగ్స్ను సవాలు చేస్తూ స్థానికులు బొడ్డు సత్యవతి, మరికొందరు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తమ గ్రామంతో పాటు పరిసర గ్రామాలకు సాగు, తాగు నీటికి కన్నంనాయుడు చెరువే ఆధారమన్నారు. ఈ వ్యాజ్యంపై న్యాయమూర్తి జస్టిస్ మహేశ్వరరావు విచారణ జరిపారు. ‘పర్యావరణ పరిరక్షణ ఆధునిక కాలంలో పుట్టుకొచ్చిన ఆలోచనేమీ కాదు. ముఖ్యంగా భారత్లో ప్రకృతిని ప్రేమించడం, పరిరక్షించడం అన్నది మన సంస్కృతి, జీవన విధానంలో ఒక భాగంగా ఉంటూ వస్తోంది.మానవాళి మనుగడకు అత్యంత కీలకమైన నీరు, ఇతర సహజ వనరులను ప్రపంచంలోని అన్ని ప్రధాన మతాలు పవిత్రమైనవిగా భావిస్తాయి. నేడు మనం మాట్లాడుకుంటున్న ‘పబ్లిక్ ట్రస్ట్ సిద్ధాంతం’ మూలాలు ఈ ఆధ్యాత్మిక బోధనల్లో స్పష్టంగా కనిపిస్తాయి. ‘జీవించే హక్కు’ అంటే కేవలం మనుషులు శ్వాస తీసుకుంటూ, భౌతికంగా బతికి ఉండటం మాత్రమే కాదు. ప్రతి మనిషీ స్వచ్ఛమైన, సురక్షితమైన, ఆరోగ్యకరమైన వాతావరణంలో గౌరవప్రదంగా జీవించడం.’ అని న్యాయమూర్తి పేర్కొన్నారు.కాంట్రాక్టర్లేమీ సేవ చేయడం లేదు ‘జాతీయ రహదారుల నిర్మాణం వేగంగా పూర్తి కావాలనే లక్ష్యం దేశ ప్రగతికి ఎంత అవసరమో.. ఆ ప్రక్రియలో చట్టపరమైన పరిధులను, క్షేత్ర స్థాయి వాస్తవాలను గౌరవించడం కూడా అంతే ముఖ్యం. జాతీయ రహదారుల అథారిటీ నుండి పనులు పొందిన కాంట్రాక్టర్లు ఈ నిర్మాణాలను ఉచితంగా, స్వచ్ఛంద సేవగా చేయడం లేదు. వారు ఈ కమర్షియల్ కాంట్రాక్ట్ ద్వారా భారీ మొత్తంలో డబ్బును, లాభాలను ఆర్జిస్తున్నారు. కాబట్టి, సాధారణ వ్యాపార నిబంధనలు, పౌర చట్టాలు వారికి కూడా పూర్తిగా వర్తిస్తాయి. రహదారుల నిర్మాణానికి అవసరమైన మట్టి, ఇసుక వంటి సహజ వనరులను సేకరించడం పూర్తిగా ఆయా కాంట్రాక్టర్ల బాధ్యత. చట్టం విధించిన కఠిన నిబంధనలను ఉల్లంఘించి అనుమతులు లేకుండా ఇష్టారాజ్యంగా తవ్వకాలు జరపడం నేరం’ అని న్యాయమూర్తి తన తీర్పులో స్పష్టం చేశారు.ముందు తరాలు కాపాడినందునే మనం జీవిస్తున్నాం ‘పర్యావరణాన్ని కాపాడటం కోసం ఈరోజు మనం తీసుకునే నిర్ణయాలు లేదా విధించే చట్టపరమైన ఆంక్షలు తక్షణమే కంటికి కనిపించే ఆర్థిక లాభాలను ఇవ్వకపోవచ్చు. కానీ, ఆ నిర్ణయాలను నిజమైన స్ఫూర్తితో అమలు చేస్తే, అది మన తర్వాత రాబోయే బిడ్డలకు మనం ఇచ్చే అత్యంత విలువైన కానుక. మన ముందు తరాలు ప్రకృతిని పూర్తిగా ధ్వంసం చేయకుండా, కొంత వరకు కాపాడగలిగారు కాబట్టే.. ఈ రోజు మనం ఈ భూమిపై శ్వాస తీసుకోగలుగుతున్నాం. ఒకవేళ వారు కేవలం తమ స్వార్థ ప్రయోజనాల కోసమే ప్రకృతిని పూర్తిగా దోచేసి ఉంటే, ఈ రోజు మనం మాట్లాడుకుంటున్న జీవించే హక్కు, దాని విస్తృత పరిధులు కేవలం కాగితాలకే పరిమితమయ్యేవి. దీంతో మన మనుగడే ప్రశ్నార్థకమయ్యేది’ అని తెలిపారు.ఆ జలాశయాలు కీర్తి కోసం కట్టినవి కావు ‘ప్రజల కోసం శతాబ్దాల క్రితం నిర్మించిన జలాశయాలు కేవలం రాజుల కీర్తి కోసం కట్టినవి కావు. రాబోయే తరాల సంక్షేమం కోసం వారు తలపెట్టిన పవిత్ర యజ్ఞాలు. ప్రకాశం జిల్లాలో కంభం చెరువు, వైఎస్సార్ కడప జిల్లాలోని పోరుమామిళ్లలో అనంతరాజ సాగర్, అనంతపురం జిల్లాలో బుక్కరాయ సముద్రం చెరువులు ఇలా నిర్మితమైనవే.పర్యావరణ పరిరక్షణ చట్టాలు ఉన్నప్పటికీ ప్రభుత్వ యంత్రాంగాల వైఫల్యం లేదా ఉదాసీనత వల్ల పర్యావరణానికి నష్టం వాటిల్లుతోంది. ఇలాంటి సందర్భాల్లో న్యాయస్థానాలు తమకు లభించిన అంతర్గత అధికారాలను ఉపయోగిస్తాయి. సంపూర్ణ న్యాయం చేయడం కోసం, ప్రజా ప్రయోజనాలను కాపాడటం కోసం ఈ కోర్టు కూడా తన అంతర్గత అధికారాలను ఉపయోగించి ఈ ఆదేశాలు ఇస్తోంది’ అని జస్టిస్ మహేశ్వరరావు తన తీర్పులో తేల్చి చెప్పారు. -
నాటకీయ పరిణామాల మధ్య పటాస్ శ్రీకాంత్ అరెస్ట్
రాప్తాడు రూరల్: అనంతపురం జిల్లాకు చెందిన సోషల్ మీడియా యాక్టివిస్ట్ కురుబ చిట్రా శ్రీకాంత్ అలియాస్ పటాస్ శ్రీకాంత్ను పోలీసులు గురువారం సాయంత్రం అరెస్టు చేశారు. అతడి ఆచూకీపై కుటుంబసభ్యుల ఆందోళన, హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలైన నేపథ్యంలో పోలీసులు తప్పని పరిస్థితుల్లో అరెస్టు చూపించారు. ఈ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. శ్రీకాంత్ను మూడురోజులుగా ప్రత్యేక పోలీసులు అదుపులో ఉంచుకుని తమకు సమాచారం కూడా ఇవ్వలేదని కుటుంబసభ్యులు ఆరోపించారు.కూటమి ప్రభుత్వాన్ని, మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజును ప్రశ్నించిన కారణంగానే తన కుమారుడిని వేధిస్తున్నారని అంతకుముందు శ్రీకాంత్ తల్లి చిట్రా రాజేశ్వరి మీడియా సమావేశంలో తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తన కుమారుడు పదిరోజులుగా ఇంటికి రాలేదని, మూడురోజులుగా పోలీసుల అదుపులో ఉన్నాడని తెలిసిందని పేర్కొన్నారు. తన కుమారుడిని వెంటనే కోర్టులో హాజరుపరచాలని, లేదంటే పోలీస్స్టేషన్ ఎదుటే ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించారు. అదే సమయంలో శ్రీకాంత్ కుటుంబసభ్యులు హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో శ్రీకాంత్ను అరెస్ట్ చేస్తున్నట్లు గురువారం సాయంత్రం పోలీసులు ప్రకటించారు. అనంతపురం రూరల్ పోలీస్స్టేషన్కు వచ్చిన తల్లి రాజేశ్వరితో సంతకాలు తీసుకున్న అనంతరం పోలీసులు శ్రీకాంత్ శింగనమల పోలీస్స్టేషన్లో ఉన్నట్లు చెప్పారు. తరువాత శ్రీకాంత్ను ఆస్పత్రి నుంచి అనంతపురం రూరల్ పోలీస్స్టేషన్కు తీసుకెళ్లిన పోలీసులు గురువారం రాత్రి 9.30 గంటల సమయంలో న్యాయాధికారి ఎదుట హాజరుపరిచారు. శ్రీకాంత్కు వైద్యపరీక్షలు నిర్వహించి నివేదిక ఇవ్వండి విచారణ సందర్భంగా పోలీసులు తనను కొట్టి హింసించారని శ్రీకాంత్ న్యాయాధికారికి చెప్పారు. దీంతో శ్రీకాంత్కు వైద్యపరీక్షలు నిర్వహించి నివేదిక సమర్పించాలని న్యాయాధికారి ఆదేశించారు. తర్వాత సొంత పూచీకత్తుపై శ్రీకాంత్ను విడుదల చేయాలని చెప్పారు. మరోవైపు.. శ్రీకాంత్పై అనంతపురం వన్టౌన్, ఇటుకలపల్లి, శింగనమల, శ్రీసత్యసాయి జిల్లా అగళి పోలీస్స్టేషన్లలో కేసులు నమోదు చేశారు. ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, అధికార పార్టీ నాయకుల ఒత్తిడితో అక్రమ కేసులు నమోదు చేయడంతోపాటు కౌన్సెలింగ్ పేరుతో తీవ్రస్థాయిలో వేధించారని కుటుంబసభ్యులు ఆరోపించారు. -
అసెంబ్లీ సెక్రటరీ జనరల్గా ప్రసన్న నియామకం చెల్లదు
సాక్షి, అమరావతి: చట్టం నిర్దేశించిన అర్హతలు లేనప్పటికీ శాసన సభ సెక్రటరీ జనరల్గా సూర్యదేవర ప్రసన్నకుమార్ను నియమించారని, ఏ అధికారంతో ఆయన పదవిలో కొనసాగుతున్నారో వివరణ కోరాలంటూ దాఖలైన కో వారెంటో పిటిషన్పై హైకోర్టు స్పందించింది. ఈ వ్యవహారంపై కౌంటర్లు దాఖలు చేయాలంటూ గవర్నర్ కార్యదర్శికి, ప్రసన్న కుమార్కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ న్యాపతి విజయ్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. అర్హతలు లేని వ్యక్తిని చంద్రబాబు ప్రభుత్వం అందలం ఎక్కించింది న్యాయవాది వై. కనక లింగేశ్వరరావు దాఖలు చేసిన ఈ కో వారెంటో పిటిషన్పై జస్టిస్ విజయ్ మంగళవారం విచారణ జరిపారు. పిటిషనర్ తరఫున న్యాయవాది బి.శశిభూషణ్రావు వాదనలు వినిపించారు. ‘నిబంధనల ప్రకారం అసెంబ్లీ సెక్రటరీ జనరల్ పదవిని లోక్సభ, రాజ్యసభ లేదా రాష్ట్రాల శాసన సభ సెక్రటేరియట్లలో పని చేస్తున్న లేదా రిటైర్ అయిన సెక్రటరీ జనరల్లతో భర్తీ చేయాలి. అందుకు విరుద్ధంగా ప్రసన్నకుమార్ను ఆంధ్రప్రదేశ్ శాసన సభకు సెక్రటరీ జనరల్గా నియమిస్తూ చంద్రబాబు ప్రభుత్వం 2024లో నోటిఫికేషన్ జారీ చేసింది. తగిన అర్హతలు లేకపోయినా ప్రసన్నకుమార్ను సెక్రటరీ జనరల్గా నియమించారు.ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హోదా కట్టబెట్టి, నెలవారీ పారితోషికం రూ.3.5 లక్షలుగా ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నోటిఫికేషన్లో ప్రసన్నకుమార్ పూర్వ అర్హతను సుప్రీంకోర్టు మాజీ రిజిస్ట్రార్ గా పేర్కొన్నారు. అయితే, సుప్రీంకోర్టు రిజిస్ట్రీ సెంట్రల్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ ఇ చ్చిన సమాచారం ప్రకారం.. ప్రసన్న కుమార్ సుప్రీంకోర్టులో ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (ఓఎస్డీ)గానే పని చేశారు. వాస్తవానికి ఆయన 1993లో న్యూఢిల్లీలోని న్యూస్ సర్వీసెస్ డివిజన్లో న్యూస్ రీడర్ కమ్ ట్రాన్స్లేటర్గా చేరి 2022న స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకున్నారు.అయినప్పటికీ, ఏపీ అసెంబ్లీ సెక్రటరీ జనరల్గా నియమించడం కోసం సుప్రీంకోర్టు మాజీ రిజిస్ట్రార్గా పేర్కొన్నారు. అర్హతలు లేని వ్యక్తిని సెక్రటరీ జనరల్గా నియమించడం చట్టాన్ని అపహాస్యం చేయడమే అవుతుంది. ఎటువంటి పబ్లిక్ నోటిఫికేషన్ ఇవ్వకుండా, అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానించకుండా, పారదర్శక ఎంపిక విధానం లేకుండా ప్రసన్న కుమార్ నియామకం జరిగింది. అందువల్ల ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోండి.’ అని శశిభూషణ్ హైకోర్టును అభ్యర్థించారు. -
పార్టీషన్ డీడ్ను ట్రిబ్యునళ్లు రద్దు చేయలేవు
సాక్షి, అమరావతి: తల్లిదండ్రులు, వృద్ధుల పోషణ, సంక్షేమ చట్టం ప్రకారం ఆస్తి పార్టీషన్ డీడ్ (విభజన పత్రం)ను రద్దు చేసే అధికారం ఆర్డీవో నేతృత్వంలోని ట్రిబ్యునల్కు గానీ, జిల్లా కలెక్టర్ నేతృత్వంలోని అప్పిలెట్ ట్రిబ్యునల్కు గానీ లేదని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు కలెక్టర్ నేతృత్వంలోని అప్పిలెట్ ట్రిబ్యునల్ ఇచ్చిన ఒక తీర్పును రద్దు చేసింది. కాగా ఈ చట్టం ప్రకారం ఆస్తి బదిలీ (ట్రాన్స్ఫర్ ఆఫ్ పాపర్టీ) విషయంలో మాత్రం ట్రిబ్యునళ్లు జోక్యం చేసుకోవచ్చునని పేర్కొంది. చట్టం ప్రకారం ట్రిబ్యునళ్లు ఆస్తి బదిలీని రద్దు చేయాలంటే తప్పనిసరిగా వర్తించాల్సిన అంశాలను కూడా హైకోర్టు వివరించింది. ‘చట్టం అమల్లోకి వచ్చిన తరువాత వృద్ధులు తమ ఆస్తిని వేరొకరికి బదిలీ చేసి ఉండాలి. అలాగే ఆస్తి తీసుకునే వ్యక్తి ఆస్తి బదిలీ పత్రంలో ఆ వృద్ధుల అవసరాలు తీరుస్తాననే నిబంధనను తప్పనిసరిగా పొందుపరిచి ఉండాలి. సదరు వృద్ధుల పట్ల తన బాధ్యతలను నిర్వర్తించడంలో ఆస్తిని తీసుకున్న వ్యక్తి విఫలమవ్వాలి’’ అని హైకోర్టు పేర్కొంది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు ఇటీవల తీర్పు వెలువరించారు.కుమారుడిపై తల్లి ఫిర్యాదుపశ్చిమ గోదావరి జిల్లా, నరసాపురానికి చెందిన రామలక్ష్మి, ఆమె కుమారుడు శ్రీరామమూర్తి 2018లో ఉమ్మడి ఆస్తులను విభజించుకుని ఎవరికి రావాల్సిన ఆస్తులను వారు తీసుకున్నారు. కొద్ది కాలం తరువాత తన కుమారుడు తనను సక్రమంగా చూడటం లేదని, అందువల్ల ఆస్తి విభజన పత్రాన్ని రద్దు చేయాలని కోరుతూ తల్లిదండ్రులు, వృద్ధుల పోషణ, సంక్షేమ చట్టం ప్రకారం రామలక్ష్మి ఆర్డీవో నేతృత్వంలోని ట్రిబ్యునల్ను ఆశ్రయించారు. విచారణ జరిపిన ఆర్డీవో ఆస్తి విభజన పత్రాన్ని రద్దు చేసేందుకు నిరాకరించారు. దీంతో కలెక్టర్ నేతృత్వంలోని అప్పిలెట్ ట్రిబ్యునల్కు రామలక్ష్మి వెళ్లారు. కలెక్టర్ విచారణ జరిపి రామలక్ష్మి కోరిన విధంగా ఆస్తి పార్టీషన్ డీడ్ను రద్దు చేస్తూ 2023లో తీర్పునిచ్చారు. దీనిని సవాలు చేస్తూ రామలక్ష్మి కుమారుడు శ్రీరామమూర్తి, ఆయన భార్య, కుమారుడు, కోడలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు కలెక్టర్ నేతృత్వంలోని అప్పిలెట్ ట్రిబ్యునల్ తీర్పును రద్దు చేశారు. -
సుప్రీం కోర్టుకు చేరిన సాయికృష్ణ కేసు
సాక్షి, అమరావతి: గాదె సాయికృష్ణ లాకప్డెత్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసు నిందితుడు, సస్పెండెడ్ సీఐ నాగరాజును కస్టడీలోకి తీసుకుని విచారించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) చేసిన ప్రయత్నాలకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఏపీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ సిట్ సుప్రీం కోర్టును ఆశ్రయించింది.సీఐ నాగరాజు కస్టడీ విచారణకు సంబంధించి హైకోర్టు విధించిన నిబంధనలపై సిట్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ముఖ్యంగా విచారణ మొత్తాన్ని ఆడియో, వీడియో రికార్డింగ్ చేయాలన్న ఆదేశంపై అభ్యంతరం తెలిపిన సిట్.. దర్యాప్తు ప్రక్రియకు ఇది ఆటంకంగా మారుతుందని పేర్కొన్నట్లు సమాచారం.హైకోర్టు ఆదేశాలపై అభ్యంతరాలేంటంటే..గాదె సాయికృష్ణ మృతి కేసులో వాస్తవాలు వెలుగులోకి తీసుకురావడానికి సీఐ నాగరాజును ప్రశ్నించాల్సిన అవసరం ఉందని సిట్ భావిస్తోంది. అయితే కస్టడీ విచారణ విషయంలో ఏపీ హైకోర్టు కొన్ని షరతులు విధించింది. దర్యాప్తు అధికారుల విచారణలో పారదర్శకత కోసం ఆడియో, వీడియో రికార్డింగ్ చేయాలని, అలాగే విచారణ సమయంలో నిబంధనలు పాటించాలని హైకోర్టు ఆదేశించింది. అంతేకాకుండా సీఐ నాగరాజును ఒక రోజు కృష్ణలంక పోలీస్ స్టేషన్లో, మిగిలిన రోజులు రాజమండ్రి జైలులోనే విచారించాలని సూచించింది.సుప్రీంకు వెళ్లిన సిట్హైకోర్టు ఆదేశాలపై సిట్ అసంతృప్తి వ్యక్తం చేసింది. కస్టడీ విచారణ సమయంలో ఇలాంటి పరిమితులు ఉంటే దర్యాప్తు ప్రభావితం అయ్యే అవకాశం ఉందని పేర్కొంటూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. విచారణకు సంబంధించిన అంశాలు, సాక్ష్యాల సేకరణ, నిందితుడిని ప్రశ్నించే విధానంపై హైకోర్టు ఆదేశాలు తమ దర్యాప్తు పరిధిని ప్రభావితం చేస్తున్నాయని సిట్ తన అభ్యర్థనలో పేర్కొన్నట్లు తెలుస్తోంది.లాకప్డెత్ కేసులో కీలక విచారణగాదె సాయికృష్ణ లాకప్డెత్ కేసు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. పోలీస్ కస్టడీ.. అనంతరం కనిపించకుండా పోవడం.. చివరకు లాకప్లో హింసించడం కారణంగానే మృతి చెందాడని.. ఆనవాలు కూడా దొరక్కుండా శవం మాయం చేశారని తేలింది. ఈ కేసులో నిజానిజాలను తేల్చేందుకు సిట్ దర్యాప్తు చేపట్టింది. సీఐ నాగరాజు పాత్రపై దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో ఆయన కస్టడీ విచారణ కీలకంగా మారింది. అయితే.. సిట్ తనను ఇరికించేందుకు కుట్ర చేస్తోందని, ఇందులో భాగంగానే కస్టడీకి కోరిందని.. విచారణ పేరిట తనను టార్చర్ చేయకుండా రక్షణ కల్పించాలని నాగరాజు న్యాయస్థానాన్ని లేఖ రాయడంతో కేసు కీలక మలుపు తిరిగినట్లైంది. -
సాయికృష్ణ కేసు దర్యాప్తుపై స్టేటస్ రిపోర్ట్ ఇవ్వండి
సాక్షి, అమరావతి: కాపు యువకుడు సాయికృష్ణ లాకప్డెత్ కేసులో దర్యాప్తు పురోగతి వివరాలతో స్టేటస్ రిపోర్ట్ను సీల్డ్ కవర్లో తమ ముందుంచాలని హైకోర్టు బుధవారం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఆదేశించింది. తదుపరి విచారణను 3 వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ లీసా గిల్, న్యాయమూర్తి జస్టిస్ చల్లా గుణరంజన్ ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని కోరుతూ సొసైటీ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ రైట్స్ సంస్థ అధ్యక్షుడు గోచిపాత శ్రీనివాసరావు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన సంగతి తెలిసిందే.సీజే ధర్మాసనం ముందు తాజాగా విచారణకు వచ్చిన ఈ వ్యాజ్యంలో పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్రెడ్డి అంతకుముందు వాదనలు వినిపించారు. ‘సాయికృష్ణ లాకప్డెత్ వ్యవహారాన్ని ప్రభుత్వం కేవలం కృష్ణలంక ఇన్స్పెక్టర్ నాగరాజు వరకే పరిమితం చేస్తోంది. లాకప్డెత్ వెనుక డీజీపీ, విజయవాడ కమిషనర్, డీసీపీ, ఏసీపీ తదితరుల పాత్ర ఉంది. సాయికృష్ణ తల్లి దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్ సందర్భంగా డీజీపీ, విజయవాడ కమిషనర్లు హైకోర్టును తప్పుదోవ పట్టించారు. సాయికృష్ణ ఎక్కడ ఉన్నారో తమకు తెలియనే తెలియదని చెప్పారు. అయితే నాగరాజును అరెస్ట్ చేసిన తరువాత దాఖలు చేసిన రిమాండ్ రిపోర్ట్లో సాయికృష్ణను టాస్క్ఫోర్స్ పోలీసులు మే 6నే అదుపులోకి తీసుకున్నారు. తద్వారా సాయికృష్ణ గురించి పూర్తి వివరాలు డీజీపీ, కమిషనర్లకు స్పష్టంగా తెలుసని అర్థమవుతోంది. దీనిపై పారదర్శక, నిష్పాక్షిక దర్యాప్తు కోరుతున్నాం. సిట్ దర్యాప్తుపై విశ్వాసం లేదు. స్వతంత్ర సంస్థ దర్యాప్తుతోనే నిజాలు నిగ్గుతేలుతాయి. ఈ దారుణంలో డీజీపీతో సహా ఉన్నతాధికారులు చట్టం నుంచి తప్పించుకోవడానికి వీల్లేదు’ అని పొన్నవోలు ధర్మాసనం ముందు తన వాదనలు వినిపించారు. కాగా, ఈ కేసులో ఐదుగురిని అరెస్ట్ చేసినట్లు, ఆరుగురిని నిందితులుగా చేర్చినట్లు సిట్ తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్ ఈ సందర్భంగా ధర్మాసనానికి తెలియజేశారు. -
SITకు హైకోర్టు చిన్న అవకాశం సీల్డ్ కవర్ లో ఆధారాలు
-
సాయికృష్ణ లాకప్డెత్ కేసుపై ఏపీ హైకోర్టులో విచారణ
విజయవాడ: సాయికృష్ణ లాకప్డెత్ కేసులో విచారణను మూడు వారాలు వాయిదా వేసింది ఏపీ హైకోర్టు. సాయికృష్ణ లాకప్డెత్ కేసును సీబీఐకి అప్పగించాలని దాఖలైన పిల్పై విచారణ చేపట్టింది హైకోర్టు, ఈ పిల్ తరఫున న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. లాకప్డెత్ కేసులో సీపీతో పాటు డీజీపీ పాత్ర ఉందని, డీజీపీ కింద స్థాయి అధికారులతో సిట్ ఏర్పాటు చేస్తే నిజాలు ఎలా బయటకు వస్తాయని తన వాదనల్లో వినిపించారు పొన్నవోలు. గత నెల 15వ తేదీన హెబియస్ కార్పస్ పిటిషన్ విచారణ సందర్భంగా పోలీసులు సాయి కృష్ణ మా దగ్గర లేడు ఆయన కోసం ప్రత్యేక టీములు పెట్టి వెతుకుతున్నామని చెప్పారని, సిట్ వేసిన రిమాండ్ రిపోర్టులు మాత్రం గత నెల ఆరో తేదీన సాయి కృష్ణ అదుపులోకి తీసుకున్నట్లు చూపించారన్నారు. పోలీసులు అబద్ధాలు చెప్పి కోర్టునే తప్పుదోవ పట్టించారని విచారణ సందర్భంగా పొన్నవోలు స్సష్టం చేశారు. అయితే సిట్కు చిన్న అవకాశం ఇద్దామన్న హైకోర్టు.. సీల్డ్ కవర్లో విచారణ నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ఈ క్రమంలో విచారణను మూడు వారాలు వాయిదా వేసింది. -
సత్యమేవ జయతే నినాదాన్ని కాపాడండి
సాక్షి, అమరావతి : దేశ జాతీయ నినాదమైన ‘సత్యమేవ జయతే’ సమగ్రతను కాపాడుతూ నిజాన్ని వెలికి తీసేందుకు కాపు యువకుడు గాదె సాయికృష్ణ లాకప్డెత్ కేసును నిష్పక్షపాతంగా, శాస్త్రీయ పద్ధతిలో విచారించాలని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులను హైకోర్టు ఆదేశించింది. సాయికృష్ణ లాకప్డెత్ కేసులో ప్రధాన నిందితుడు నాగరాజును రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో విచారించాలంటూ విజయవాడ రెండో అదనపు జ్యుడీషియల్ ఫస్ట్క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు విధించిన షరతులను హైకోర్టు పాక్షికంగా సవరించింది.సాక్ష్యాధారాల సేకరణ, సీన్ రీకన్స్ట్రక్షన్ నిమిత్తం నాగరాజును రాజమహేంద్రవరం జైలు నుంచి కృష్ణలంక పోలీస్స్టేషన్తో సహా నేర ఘటనలు జరిగిన చోట్లకు తీసుకెళ్లేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)కు హైకోర్టు అనుమతినిచ్చింది. ఈ నెల 9వ తేదీ నుంచి నాగరాజును కస్టడీలోకి తీసుకుని ఈ నెల 16 వరకు విచారించాలని సిట్ను ఆదేశించింది. రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు నుండి విజయవాడకు, తిరిగి విజయవాడ నుంచి రాజమహేంద్రవరం జైలుకు నాగరాజును తరలించే సమయంలో అతని ప్రతి కదలికను తప్పనిసరిగా వీడియో రికార్డింగ్ చేయాలని సిట్ను ఆదేశించింది. ఆ ఒరిజినల్ వీడియో రికార్డింగ్లను ఈ నెల 17న విజయవాడ మేజిస్ట్రేట్ కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది. కస్టడీ సమయంలో నమోదైన సీసీటీవీ ఫుటేజీని ఒరిజినల్ రూపంలో 17న విజయవాడ మేజిస్ట్రేట్ కోర్టుకు సమర్పించాలని రాజమహేంద్రవరం జైలు సూపరింటెండెంట్కు తేల్చి చెప్పింది. కస్టడీ కాలంలో నాగరాజు ప్రాణానికి, శారీరక భద్రతకు, వ్యక్తిగత గౌరవానికి భంగం కలగకుండా రాజ్యాంగ నిబంధనల ప్రకారం అన్ని చర్యలు తీసుకోవాలని సిట్ అధికారులకు స్పష్టం చేసింది. సీఐ కస్టడీ విషయంలో విజయవాడ మేజిస్ట్రేట్ కోర్టు విధించిన మిగతా అన్ని షరతులు యథాతథంగా కొనసాగుతాయని న్యాయమూర్తి జస్టిస్ కుంచం మహేశ్వరరావు మంగళవారం తీర్పుచెప్పారు.జైలులోనే విచారించాలన్న విజయవాడ కోర్టుసాయికృష్ణ లాకప్డెత్ కేసులో నిందితుడు నాగరాజును పోలీస్ కస్టడీకి కోరుతూ సిట్ అధికారులు దాఖలు చేసిన పిటిషన్ను విజయవాడ రెండో అదనపు జ్యుడీషియల్ ఫస్ట్క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు ఇటీవల అనుమతించింది. ఈ నెల 10 వరకు నాగరాజును పోలీసు కస్టడీకి ఇచ్చింది. రాజమహేంద్రవరం జైలులోనే నాగరాజును విచారించాలని, విచారణకు న్యాయవాదిని అనుమతించాలని సిట్ అధికారులను ఆదేశించింది. వీటితో పాటు పలు షరతులు విధించింది. పారదర్శకత, నిష్పాక్షికత, జవాబుదారీతనం నిమిత్తం మొత్తం విచారణ జైలు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలు లేదా ఇతర వీడియో రికార్డింగ్ సిస్టం ఉన్న ప్రాంతంలోనే నాగరాజును విచారించాలని సిట్కు స్పష్టం చేసింది. పోలీస్ కస్టడీ సమయంలో జైలు ప్రాంగణంలో రికార్డ్ చేసిన సీసీటీవీ ఫుటేజీని కోర్టు తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు భద్రపరచాలని, దానిని తొలగించడానికి, ఓవర్ రైట్ చేయడానికి లేదా ట్యాంపరింగ్ చేయడానికి ఎవరినీ అనుమతించకూడదని జైలు సూపరింటెండెంట్ను ఆదేశించింది. నాగరాజు భద్రతకు దర్యాప్తు ఆఫీసర్, అదనపు ఎస్పీ, సిట్ సభ్యులు, జైలు సూపరింటెండెంట్ సంయుక్తంగా, వ్యక్తిగతంగా బాధ్యత వహించాలని పేర్కొంది. ఎట్టి పరిస్థితుల్లోనూ పోలీస్ కస్టడీని 10వ తేదీ తర్వాత పొడిగించబోమని స్పష్టం చేసింది. విజయవాడ కోర్టు విధించిన ఈ షరతులను, ఆదేశాలను సిట్ తీవ్రంగా వ్యతిరేకిస్తూ గతవారం హైకోర్టులో అత్యవసరంగా పిటిషన్ దాఖలు చేసింది. నాగరాజును కృష్ణలంక పోలీస్స్టేషన్లో విచారించేందుకు అనుమతించాలని కోరింది. ఈ వ్యాజ్యంపై సోమవారం సిట్ తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ (పీపీ) మెండ లక్ష్మీనారాయణ, నాగరాజు తరఫున చల్లా అజయ్ కుమార్ వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ మహేశ్వరరావు తీర్పును రిజర్వ్ చేసి మంగళవారం నిర్ణయం వెలువరిస్తానని స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఇందుకు అనుగుణంగా ఆయన మంగళవారం తన తీర్పును వెలువరించారు.అప్పుడు ధ్వంసం చేసి.. ఇప్పుడు సీసీటీవీ కెమెరాల రక్షణ కోరతారా?‘నిందితుడు నాగరాజు విజయవాడ కృష్ణలంక మాజీ ఇన్స్పెక్టర్. అతనిపై హత్య, సాక్ష్యాల నాశనం కింద తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. సాయికృష్ణ మృతదేహం ఇంకా లభ్యం కాలేదు. అక్రమ కస్టడీలో హత్య జరిగినట్లు భావిస్తున్న కాలానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ, హార్డ్ డిస్క్ను ఉద్దేశ పూర్వకంగా మాయం చేశారన్న తీవ్రమైన ఆరోపణలు నాగరాజుపై ఉన్నాయి. ఇటువంటి తరుణంలో, కేవలం రాజమహేంద్రవరం జైలులోనే నాగరాజును విచారించాలనడం దర్యాప్తు సంస్థల చట్టబద్ధమైన అధికారాలకు అడ్డుకట్ట వేయడమే అవుతుంది.నిందితుడు ఒకప్పుడు తానే సీసీటీవీ కెమెరాలను మాయం చేశాడని ఆరోపణలు ఎదుర్కొంటూ, ఇప్పుడు తన విచారణకు అవే సీసీటీవీ కెమెరాల రక్షణ కావాలని కోరడం పరస్పర విరుద్ధంగా ఉంది. రాజ్యాంగ బద్ధమైన ఈ కోర్టు, నిందితుడి హక్కులను కాపాడటంతో పాటు దర్యాప్తు సంస్థల అధికారాలను కూడా సమతుల్యం చేయాల్సి ఉంది. అందువల్ల విజయవాడ రెండో అదనపు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు విధించిన షరతులను పాక్షికంగా సవరిస్తున్నాం’ అని జస్టిస్ మహేశ్వరరావు తన తీర్పులో పేర్కొన్నారు. -
హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా ముగ్గురు ప్రమాణం
సాక్షి, అమరావతి: రాష్ట్ర హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా గంధం సునీత, ఆలపాటి గిరిధర్, చింతలపూడి పురుషోత్తం కుమార్ సోమవారం ప్రమాణం చేశారు. హైకోర్టు మొదటి కోర్టు హాలులో జరిగిన కార్యక్రమంలో ఈ ముగ్గురితో ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ లీసా గిల్ ప్రమాణం చేయించారు. మొదట హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ పార్థసారథి ముగ్గురు అదనపు న్యాయమూర్తుల నియామకానికి సంబంధించి రాష్ట్రపతి జారీ చేసిన ఉత్తర్వులను చదివి వినిపించారు. అనంతరం వారి ప్రమాణ స్వీకారం జరిగింది. ఆ తరువాత జస్టిస్ రవినాథ్ తిల్హరీతో కలిసి పురుషోత్తం కుమార్, జస్టిస్ బట్టు దేవానంద్తో కలిసి గంధం సునీత, జస్టిస్ దొనడి రమేష్తో కలిసి ఆలపాటి గిరిధర్ కేసులను విచారించారు. హైకోర్టులో మొత్తం 37 మంది న్యాయమూర్తులకు గాను.. ప్రస్తుతం 29 మంది ఉన్నారు. ఈ ముగ్గురి నియామకంతో న్యాయమూర్తుల సంఖ్య 32కి చేరింది. ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులతోపాటు రిజిస్ట్రార్లు, అదనపు న్యాయమూర్తులుగా ప్రమాణం చేసిన వారి కుటుంబ సభ్యులతోపాటు అదనపు సొలిసిటర్ జనరల్(ఏఎస్జీ) చల్లా ధనంజయ, అడ్వొకేట్ జనరల్(ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్, అదనపు ఏజీ ఇవన సాంబశివ ప్రతాప్, పబ్లిక్ ప్రాసిక్యూటర్(పీపీ) మెండ లక్ష్మీనారాయణ, హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు వాసిరెడ్డి ప్రభునాథ్, న్యాయవాదులు పాల్గొన్నారు. అదనపు న్యాయమూర్తులుగా ప్రమాణం చేసిన ముగ్గురిని పలువురు న్యాయవాదులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. -
ఏపీ హైకోర్టుకు ప్రశ్న రావణ్.!
-
ఏపీ హైకోర్టులో రావణ్ పిటిషన్
సాక్షి,విజయవాడ: యూట్యూబర్ ప్రశ్న రావణ్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు. తనపై రాష్ట్రవ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసులన్నింటినీ ఒకే కేసుగా పరిగణించి, ఒకే చోట విచారణ జరిపేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.ఒకే అంశాన్ని లేదా ఒకే ప్రసంగాన్ని బేస్ చేసుకుని రాష్ట్రంలోని వేర్వేరు పోలీస్ స్టేషన్లలో అక్రమంగా వరుస కంప్లైంట్లు నమోదు చేస్తున్నారని ఆయన తన పిటిషన్లో పేర్కొన్నారు.ఒక కేసులో కోర్టు నుండి బెయిల్ లభించగానే, వెంటనే మరో పాత కేసు పేరుతో పోలీసులు తనను అరెస్టు చేస్తూ అక్రమ నిర్బంధానికి గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చట్టవిరుద్ధంగా జరుగుతున్న ఈ వరుస అరెస్టులను నిలువరించాలని ఆయన న్యాయస్థానాన్ని అభ్యర్థించారు.రావణ్పై ఏపీలో ఇప్పటివరకు పలు స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. ముఖ్యంగా పిఠాపురం, సర్పవరం, మచిలీపట్నం, పాయకరావుపేట, మరియు గన్నవరం పోలీస్ స్టేషన్లలో ఆయనపై కేసులు నమోదు చేశారు. -
జడ్జిగా ఆదర్శంగా ఉండాల్సిన తండ్రి 'మాకు అన్యాయం చేస్తున్నారు'..
సాక్షి, అమరావతి: తన పోషణ, చదువు తదితరాల నిమిత్తం జడ్జిగా బాధ్యతలు నిర్వహిస్తున్న తన తండ్రి నుంచి తన తల్లికి భరణం ఇప్పించాలని కోరుతూ 4వ తరగతి చదువుతున్న ఓ తొమ్మిదేళ్ల చిన్నారి న్యాయ పోరాటానికి దిగింది. తెలంగాణలోని కరీంనగర్ జిల్లా జగిత్యాలలో రెండో అదనపు జుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్గా జగిత్యాలలో పని చేస్తున్న తన తండ్రి వినీల్ కుమార్ తమకు కనీసం తాత్కాలిక భరణం కూడా ఇవ్వకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోతూ హైకోర్టును ఆశ్రయించింది. భరణం విషయంలో తన తల్లి నాగలక్ష్మి దాఖలు చేసిన పిటిషన్ను విచారించడంలో ఒంగోలు కోర్టు తీవ్ర జాప్యం చేస్తోందని శుక్రవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ‘తన అధికారిక సామర్థ్యంలోనే కాక, తన వ్యక్తిగత ప్రవర్తనలో కూడా రోల్ మోడల్గా ఉండాల్సిన తండ్రి మాకు అన్యాయం చేస్తున్నారు’’ అని ఆవేదన వ్యక్తం చేసింది. తన పెంపకం భారాన్ని నా తల్లే మోస్తోందని పేర్కొంటూ తన బాగోగుల నిమిత్తం కనీసం రూ.40 వేల తాత్కాలిక భరణం ఇప్పించేలా ఆదేశాలు జారీ చేయాలని ఆ చిన్నారి తన పిటిషన్లో హైకోర్టును అభ్యర్థించింది. లేదా నిర్దిష్ట మొత్తాన్ని కోర్టులో జమ చేసేలా కూడా ఆదేశాలు జారీ చేయాలని కోరింది. భరణం కోసం ఏడాదిన్నరగా పెండింగులో ఉన్న పిటిషన్ను రోజూ వారీ పద్దతిలో విచారణ జరిపి వీలైనంత త్వరగా పరిష్కరించేలా ఒంగోలు కోర్టును ఆదేశించాలని కోరింది. ‘‘వేగవంతమైన పరిష్కారం అనేది కేవలం న్యాయపరమైన విచక్షణ మాత్రమే కాదు. అది ఒక రాజ్యాంగపరమైన బాధ్యత. మరీ ముఖ్యంగా చిన్న వయసున్న నాలాంటి మైనర్ బాలిక సంక్షేమం ప్రమాదంలో ఉన్నప్పుడు వేగవంతమైన పరిష్కారం చాలా అవసరం.’ అని చిన్నారి తన పిటిషన్లో పేర్కొంది. ‘‘నా తల్లి తాత్కాలిక భరణం కోసం దాఖలు చేసిన అనుబంధ పిటిషన్తో పాటు రూ. 50 వేల మెయింటినెన్స్కు ప్రధాన పిటిషన్లో విచారణను ఆలస్యం చేయడానికి నా తండ్రి వరుస దరఖాస్తులు దాఖలు చేస్తున్నారు. తద్వారా ఆయన కోర్టు ప్రక్రియను దుర్వినియోగం చేస్తున్నారు’’ అని కూడా చిన్నారి పేర్కొంది. -
2 నెలల తర్వాత ఎముకలు, బూడిద ఎలా వచ్చాయి?
సాక్షి, అమరావతి: అబ్రకదబ్ర అంటూ గాల్లో వస్తువులు సృష్టించడం ఇంద్రజాల విద్య. కానీ చంద్రబాబు ప్రభుత్వం అంతకంటే నాలుగాకులు ఎక్కువే చదివింది. అబ్రకదబ్ర అంటూ ఏకంగా పోలీస్ స్టేషన్ డాబా మీదే ఎముకలు, బూడిద సృష్టించింది. సంచలనం సృష్టించిన కాపు యువకుడు గాదె సాయికృష్ణ లాకప్లో అంతమైన కేసును నీరుగార్చేందుకు సరికొత్త కట్టుకథను తెరపైకి తెచ్చింది. ఈ కేసు నుంచి పోలీసు, ప్రభుత్వ పెద్దలను తప్పించేందుకు ఏకంగా న్యాయస్థానం కళ్లుగప్పేందుకు బరితెగించింది. ఈ క్రమంలో ప్రభుత్వ పెద్దల ఆదేశాలతోనే డీజీపీ కార్యాలయంలో పక్కా స్కెచ్ సిద్ధమైపోయిందని హైకోర్టులో పోలీసులు సమర్పించిన లంచ్ మోషన్ పిటిషన్ బట్టబయలు చేస్తోంది.కృష్ణలంక పోలీస్ స్టేషన్పై తమకు కొన్ని ఎముకలు, కొంత బూడిద దొరికినట్లు హఠాత్తుగా ఓ కట్టుకథను వినిపించడం విస్మయ పరుస్తోంది. సాయికృష్ణ అదృశ్యంపై దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్ వ్యవహారంలో హైకోర్టును బురిడీ కొట్టించడం.. ఈ కేసు నుంచి టాస్క్ ఫోర్స్ అధికారులు, విజయవాడ పోలీస్ కమిషనర్తోపాటు తెరవెనుక పోలీసు, ప్రభుత్వ పెద్దల పాత్రను తప్పించడం.. కేసు సీబీఐ పరిధిలోకి వెళ్లకుండా అడ్డుకోవడమే లక్ష్యంగా పోలీసులు పన్నిన కుతంత్రం విస్తుగొలుపుతోంది. రెండు నెలల తర్వాత పోలీస్ స్టేషన్పై ఎముకలు, బూడిద! సాయికృష్ణ లాకప్లో అదృశ్యమైన దారుణాన్ని దారి మళ్లించేందుకు పోలీసులు పన్నిన సరికొత్త పన్నాగం విస్మయ పరుస్తోంది. సాయికృష్ణను పోలీసులు అక్రమంగా నిర్బంధించారని ఆయన తల్లి విజయలక్ష్మి న్యాయస్థానాన్ని నెల క్రితమే ఆశ్రయించారు. ఈ కేసు దర్యాప్తునకు నియమించిన సిట్ అధికారిక సమాచారం ప్రకారం సాయికృష్ణను మే 6న కృష్ణలంక పోలీసు స్టేషన్కు తీసుకువచ్చారు. ఆ తర్వాత నుంచి ఆయన కనిపించలేదు. అంటే ఇప్పటికి దాదాపు రెండు నెలలు అవుతోంది. రెండు నెలల తర్వాత సిట్ అధికారులు కృష్ణలంక పోలీస్స్టేషన్ డాబా మీద హఠాత్తుగా కొన్ని ఎముకలు, కొంత బూడిదను గుర్తించారట. అంతే కాకుండా అనుమానాస్పద మరకలతోపాటు ఓ లాఠీని కూడా గుర్తించారని సిట్ హైకోర్టుకు సమరి్పంచిన నివేదికలో పేర్కొంది. సాయికృష్ణను ఎక్కడికో తరలించి మరీ దహనం చేయడం ద్వారానో మరో విధంగానో లేకుండా చేశారని ఇదే సిట్ మొదట పేర్కొంది. విద్యుత్ దహన వాటికలో అనాథ మృతదేహంగా బూడిద చేశారనే బలమైన వాదనా ఉంది. సిట్ అధికారులు విద్యుత్ దహన వాటికకు వెళ్లి దర్యాప్తు చేశారు కూడా. కాగా అందుకు విరుద్ధంగా పోలీస్స్టేషన్ డాబా మీదే ఎముకలు, బూడిద దొరికాయని సిట్ చెప్పడం విడ్డూరం. హెబియస్ కార్పస్ పిటిషన్ నుంచి తప్పించుకునేందుకే.. సాయికృష్ణ ఆచూకీ కోసం ఆయన తల్లి విజయలక్ష్మి దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్ హైకోర్టులో విచారణలో ఉంది. ఈ నేపథ్యంలో హైకోర్టుకు ఏం చెప్పాలనే దానిపై పోలీసు పెద్దలు మల్లగుల్లాలు పడుతున్నారు. సాయికృష్ణను గానీ, ఆయన మృతదేహాన్ని గానీ, ఆయనకు సంబంధించిన డీఎన్ఏ అవశేషాలనుగానీ గుర్తించాల్సిన బాధ్యత పోలీసులపై ఉంది. అందుకే తాము ఏదో ఎముకలు, బూడిద కనుగొన్నాం.. దర్యాప్తు కొనసాగుతోందని హైకోర్టును తప్పుదారి పట్టించాలన్నది పోలీసుల ఎత్తుగడ అని స్పష్టంగా తెలుస్తోంది. కానీ ఆ ఎముకలు, బూడిద సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి డీఎన్ఏ నమూనాలతో కనీసం పరీక్ష కూడా చేయించలేదు. కొన్ని వాయిదాల తర్వాత డీఎన్ఏ నమూనాలు సరిపోలేదని చెప్పవచ్చులే అన్నది పోలీసుల ధీమాగా స్పష్టమవుతోంది.సిట్.. ఈ ప్రశ్నలకు బదులివ్వాలి » ఎక్కడో బయటకు తీసుకువెళ్లి దహనం చేసి ఉంటే.. అక్కడి నుంచి ఎముకలు, బూడిద తీసుకువచ్చి పోలీస్ స్టేషన్ మీద దాచారా? » ఒకవేళ పోలీస్ స్టేషన్ డాబా మీదే సాయికృష్ణ మృతదేహాన్ని దహనం చేసి ఉంటే, అప్పుడు వచ్చే మంటలు, పొగను ఆ చుట్టుపక్కల ఉన్న వందలాది నివాసాల్లో ఉన్న వారు గమనించలేదా? » అదే జరిగి ఉంటే అప్పుడు పోలీస్ స్టేషన్లో ఉన్న అధికారులు, సిబ్బంది అందరికీ ఈ విషయం తెలిసి ఉండదా? » మరి విజయవాడ కోర్టుకు సమర్పించిన సాయికృష్ణ రిమాండ్ రిపోర్టులో ఆ విషయాలను ఎందుకు వెల్లడించ లేదు? »ప్రస్తుతం హఠాత్తుగా హైకోర్టుకు ఎందుకు ఈ విషయాన్ని చెప్పినట్టు? » హైకోర్టును తప్పుదారి పట్టించేందుకు ఇది బరితెగించడం కాదా?టాస్క్ ఫోర్స్, సీపీ, డీజీపీ, పెద్దలను తప్పించడమే లక్ష్యంటీడీపీ ప్రజా ప్రతినిధి భూ, ఆర్థిక లావాదేవీల వివాదం నేపథ్యంలోనే సాయికృష్ణను అంతం చేశారన్నది బహిరంగ రహస్యం. ఈ వ్యవహారం వెనుక కేవలం సీఐ నాగరాజు పాత్రధారి మాత్రమేనని.. టాస్క్ ఫోర్స్ అధికారులు, పోలీస్ కమిషనర్ రాజశేఖర్బాబు పాత్ర ఉందన్నది నిర్వివాదాంశం. డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా, ప్రభుత్వ పెద్దలు సూత్రధారులుగా ఉన్నారని పోలీసువర్గాలే చెబుతున్నాయి. ఈ కేసును కేవలం సీఐ నాగరాజు వరకే పరిమితం చేయాలన్నది ప్రభుత్వ పెద్దల పన్నాగం. అందుకే కృష్ణలంక పోలీస్స్టేషన్ డాబా మీదే ఎముకలు, బూడిద దొరికినట్టు కట్టు కథను తెరపైకి తెచ్చారు. కాగా, సాయికృష్ణ లాకప్లోనే అదృశ్యం కావడం జాతీయ స్థాయిలో సంచలనంగా మారింది. ఈ కేసును ఏపీ పోలీసులు నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయలేరన్నది స్పష్టమవుతోంది. అందుకే ఈ కేసును సీఐబీకి అప్పగించాలని సామాజికవేత్తలు న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నారు. సీబీఐ రంగంలోకి దిగితే టాస్క్ ఫోర్స్ అధికారులు, సీపీ, డీజీపీలతోపాటు ప్రభుత్వ పెద్దల పాత్ర బట్టబయలవుతుంది. అందుకే ఈ కేసు దర్యాప్తులో ఏదో పురోగతి సాధించామని నమ్మించేందుకు.. సీబీఐ దర్యాప్తు అవసరం లేదని వాదించేందుకు వీలుగా పోలీసు పెద్దలే పోలీస్ స్టేషన్పై కొన్ని ఎముకలు, కొంత బూడిద లభించాయనే కట్టుకథను సృష్టించారన్నది స్పష్టమవుతోంది. సాయికృష్ణ లాకప్ హత్య కేసును పూర్తిగా నీరుగార్చేందుకు పోలీసు పెద్దలు ఇంతగా బరితెగిస్తుండటం సదరు శాఖలోనే తీవ్ర చర్చనీయాంశంగా మారింది. -
మీపై కేసు ఎందుకు పెట్టకూడదు?
ఆదోని: తనను రక్షించమంటూ దళితుడు పెట్టుకున్న ఫిర్యాదును తారుమారు చేసి టీడీపీ వర్గీయులను రక్షించాలనుకున్న కర్నూలు జిల్లా హొళగుంద ఎస్హెచ్ఓ, ఎస్ఐ దిలీప్కుమార్కు హైకోర్టు నోటీసులు జారీచేసింది. సదరు ఎస్ఐపై ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేయకూడదో వివరణ ఇవ్వాలని ఆయనతోపాటు ప్రతివాదులైన హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, డీజీపీ, కర్నూలు డీఐజీ, ఎస్పీ, పత్తికొండ డీఎస్పీ, కానిస్టేబుల్ అనిల్కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఇందుకు సంబంధించిన వ్యాజ్యంపై తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. పిటిషనర్ గిరిమల్ల దాఖలు చేసిన రిట్ పిటిషన్ ప్రకారం.. హొళగుంద మండలం నెరణికి గ్రామానికి చెందిన దళిత గిరిమల్ల కూలి పనులతో జీవనం సాగిస్తున్నాడు. గత మే 20న గ్రామంలోని చెరువు కట్ట వద్ద మట్టిని తవ్వుకుంటూ ట్రాక్టర్లో నింపుకుంటున్నాడు. ఈ సందర్భంలో అదే గ్రామానికి చెందిన పింజారి అల్లావలి అకారణంగా గిరిమల్లను అసభ్య పదజాలంతో కులం పేరుతో దూషిస్తూ మట్టిని ఎలా తవ్వుతావని గట్టిగా అరుస్తూ, గొడ్డలితో దాడి చేసే ప్రయత్నం చేశాడు. తల మీద తగలాల్సిన గొడ్డలికి గిరిమల్ల చెయ్యి అడ్డు పెట్టడంతో అతనికి రక్తగాయమైంది. అధికార పార్టీ వర్గీయులను ప్రశ్నించినందుకే.. గ్రామంలో సచివాలయం పక్కన అధికార పార్టీ అనుచరుడు పీర్సాబ్ నిర్మిస్తున్న ఇంటి నిర్మాణ విషయంలో గ్రామస్తులతో కలిసి గిరిమల్ల తీవ్రంగా వ్యతిరేకించాడు. న్యాయపోరాటం చేస్తూ వచ్చాడు. ఆ నిర్మాణాలను ఆపాలంటూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే అదే గ్రామానికి చెందిన పింజారి పీరుసాబ్, షరీఫ్, మాబలి, సయ్యద్ సాబ్ ప్రోద్బలంతో పింజారి అల్లావలి దాడికి పాల్పడటంతో వారందరిపై గిరిమల్ల హొళగుంద పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దళితుడినైన తనకు వారి నుంచి రక్షణ కల్పించాలని, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో విజ్ఞప్తి చేశాడు. అయితే ఎస్ఐ దిలీప్కుమార్ గిరిమల్లను బెదిరించి అనిల్ అనే కానిస్టేబుల్ చేత ఫిర్యాదును తిరగరాయించారు. ఆ ఫిర్యాదులో పింజారి పీరుసాబ్, షరీఫ్, మాబలి, సయ్యద్ సాబ్ పేర్లు లేకుండా కేవలం పింజారి అల్లావలి పేరు మాత్రమే ఉండేలా చేశారు. ఆ మేరకు ఎఫ్ఐఆర్ను నమోదు చేశారు. పైగా ఈ ఎఫ్ఐఆర్ నమోదులో తీవ్ర ఆలస్యం అయ్యింది. ఆ దీంతో న్యాయం కోసం బాధితుడు గిరిమల్ల సీనియర్ అడ్వకేట్ డాక్టర్ బి.పురుషోత్తమ రెడ్డి ద్వారా హైకోర్టును ఆశ్రయించారు. కాగా, ఫిర్యాదులో పేర్లు లేకుండా చేసుకున్న వాళ్లంతా టీడీపీ వర్గీయులు కావడంతో పెద్దల ఒత్తిడితో ఎస్ఐ ఫిర్యాదు నుంచి వారి పేర్లను తీసివేయించినట్లు ఆరోపణలు ఉన్నాయి. -
నాగరాజును విజయవాడలోనే విచారిస్తాం
సాక్షి, అమరావతి: కాపు యువకుడు గాదె సాయికృష్ణ లాకప్డెత్ వ్యవహారంలో ప్రధాన నిందితుడు నాగరాజును రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో విచారించాలని విజయవాడ రెండో అదనపు జ్యుడీషియల్ ఫస్ట్క్లాస్ మేజిస్ట్రేట్ ఇచ్చిన పోలీసు కస్టడీ ఆదేశాలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ సిట్ హైకోర్టులో అత్యవసర లంచ్మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. రాజమహేంద్రవరం జైలులో కాకుండా కృష్ణలంక పోలీస్ స్టేషన్లో నాగరాజును విచారించేందుకు అనుమతించాలని సిట్ తన పిటిషన్లో హైకోర్టును కోరింది. ఈ వ్యాజ్యంపై న్యాయమూర్తి జస్టిస్ కుంచం మహేశ్వరరావు విచారణ జరిపారు. తదుపరి విచారణను ఆదివారానికి వాయిదా వేశారు. సిట్ అత్యవసర విచారణ కోరుతున్న నేపథ్యంలో ఆదివారమైనప్పటికీ ఆ రోజున ఉదయం 10.30 గంటలకు విచారణ చేపడతామని న్యాయమూర్తి స్పష్టం చేశారు. రాజమహేంద్రవరం జైలులో విచారణకు సిట్ అభ్యంతరాలు ఇవీ.. నాగరాజును పోలీస్ కస్టడీకి కోరుతూ సిట్ అధికారులు దాఖలు చేసిన పిటిషన్ను విజయవాడ మేజిస్ట్రేట్ కోర్టు అనుమతించింది. ఈ నెల 10వ తేదీ వరకు నాగరాజును పోలీసు కస్టడీకి ఇచ్చింది. రాజమహేంద్రవరం జైలులోనే నాగరాజును విచారించాలని ఆదేశిస్తూ పలు నిబంధనలు విధించింది. అయితే ఇందుకు సంబంధించి హైకోర్టులో సిట్ తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ (పీపీ) మెండ లక్ష్మీనారాయణ వాదనలు వినిపిస్తూ, ‘నేరం మొత్తం కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిసరాల్లోనే జరిగింది. పోలీస్ కస్టడీ సమయంలో నిందితుడు నాగరాజు ఇచ్చే సమాచారం ఆధారంగా భౌతిక ఆధారాలను సేకరించడానికి లేదా క్రైమ్ సీన్ రీకన్స్ట్రక్షన్కు దర్యాప్తు అధికారి అవసరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. మొత్తం పోలీస్ కస్టడీని రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకే పరిమితం చేయడం వల్ల సరైన దర్యాప్తు జరపకుండా అడ్డుకున్నట్లవుతుంది. నేరం జరిగిన పరిధిని విడిచిపెట్టి వేరే చోట నాగరాజును విచారించడం వల్ల దర్యాప్తు అధికారికి ఎదురయ్యే ఇబ్బందులను కింది కోర్టు పరిగణనలోకి తీసుకోలేదు. దర్యాప్తులో భాగమైన అధికారులందరూ రాజమండ్రి జైలుకెళ్లడం సాధ్యం కాదు. పోలీసు అధికారి అయిన నాగరాజు నుంచి వివరాలు రాబట్టడం అంత సులభం కాదు. అందువల్ల ఇందుకు సంబంధించి కింది కోర్టు ఆదేశాలపై స్టే ఇవ్వాలి’’ అని విన్నవించారు.మరకలు ఉన్న లాఠీ.. ఎముకలు.. బూడిద, కాలిన రిస్ట్ చైన్ స్వాదీనం చేసుకున్నాం: హైకోర్టుకు సిట్ సంచలన విషయాలువిజయవాడ కోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ పిటిషన్ దాఖలు చేసిన సిట్ తన పిటిషన్లో పలు కీలక విషయాలను ప్రస్తావించింది. ‘సాయికృష్ణను అదుపులోకి తీసుకున్న తర్వాత అతన్ని మేజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టకుండా, చట్టవిరుద్ధంగా కస్టడీలో ఉంచారు. ముఖ్య సాక్షులు అతనిని పోలీస్ స్టేషన్లో గాయాలతో చూశారు. సాయికృష్ణ కస్టడీలో ఉన్న విషయాన్ని నాగరాజు ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టాడు. 01.05.2026 నుండి 01.06.2026 వరకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ని డిలీట్ చేశారు. ఎల్రక్టానిక్ ఆధారాలను ధ్వంసం చేసినట్లు ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ ప్రాథమిక నివేదిక ఇచ్చింది. అనుమానాస్పద మరకలు ఉన్న లాఠీ, ఎముకలు, కాలిపోయిన బూడిద, పాక్షికంగా కాలిన స్టీల్ రిస్ట్ చైన్, ఇతర వస్తువులను ఫోరెన్సిక్ పరీక్షల నిమిత్తం స్వాదీనం చేసుకున్నాం.. సాయికృష్ణ మృతదేహం ఇంకా లభ్యం కాలేదు. అతని మరణం, మృతదేహం మాయం చేయడం, ఆధారాల ధ్వంసం వంటి కీలక అంశాలకు సంబంధించి దర్యాప్తు జరుగుతోంది.’ అని సిట్ తన పిటిషన్లో పేర్కొంది.నాకు ప్రాణహాని ఉంది: నాగరాజుకంబాలచెరువు (రాజమహేంద్రవరం): కాపు యువకుడు సాయికృష్ణ హత్య కేసులో తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో ఉన్న ప్రధాని నిందితుడు, సస్పెండెడ్ సీఐ నాగరాజు తనకు ప్రాణహాని ఉందంటూ విజయవాడ కోర్టుకు రాసిన లేఖ సంచలనం సృష్టించింది. నాగరాజును ఎనిమిది రోజుల పాటు విచారించేందుకు సిట్కు కోర్టు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో ఆయన విజయవాడ కోర్టుకు ఈ లేఖ రాశారు.తాను నిర్దోషినని, సిట్ తనను అన్యాయంగా ఇరికించి భయభ్రాంతులకు గురిచేస్తోందని ఈ లేఖలో పేర్కొన్నారు. న్యాయవాదుల సమక్షంలోనే తనను విచారించాలని, సిట్ టార్చర్ లేకుండా చూడాలని కోరారు. నాగరాజును రాజమహేంద్రవరంలో విచారించడంసహా పోలీస్ కస్టడీకి సంబంధించి విచారణ కోర్టు ఇచ్చిన పలు ఆదేశాలను సవాల్ చేస్తూ సిట్ అత్యవసరంగా హైకోర్టును ఆశ్రయించడంతో శుక్రవారం ఆయన విచారణ ప్రక్రియ నిలిచిపోయింది. -
ఏపీ హైకోర్టుకు ముగ్గురు అదనపు జడ్జిలు
సాక్షి, అమరావతి/సాక్షి, న్యూఢిల్లీ : న్యాయాధికారుల కోటా నుంచి హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా గంధం సునీత, ఆలపాటి గిరిధర్, చింతలపూడి పురుషోత్తం కుమార్ నియమితులయ్యారు. వీరి నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుక్రవారం ఆమోద ముద్ర వేశారు. దీంతో ఈ ముగ్గురి నియామకాన్ని నోటిఫై చేస్తూ కేంద్ర న్యాయ శాఖ సంయుక్త కార్యదర్శి జగన్నాథ్ శ్రీనివాసన్ నోటిఫికేషన్ జారీ చేశారు. అదనపు న్యాయమూర్తులుగా వీరు రెండేళ్ల పాటు కొనసాగుతారు. ఆ తర్వాత శాశ్వత న్యాయమూర్తులవుతారు. ఈ ముగ్గురి చేత వచ్చే వారం ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ లీసా గిల్ ప్రమాణం చేయించనున్నారు. న్యాయమూర్తులుగా ఈ ముగ్గురి పేర్లను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని కొలీజియం గత ఏడాది అక్టోబర్లో సుప్రీంకోర్టుకు సిఫారసు చేసింది. అనంతరం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని కొలీజియం ఈ ఏడాది మే 4న సమావేశమై, వీరిని హైకోర్టు న్యాయమూర్తులుగా నియమించేందుకు సిఫారసు చేసిన విషయం తెలిసిందే. వీరిలో గంధం సునీత ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లా ప్రధాన జిల్లా జడ్జిగా ఉన్నారు. ఆలపాటి గిరిధర్ విశాఖపట్నం సేల్స్ ట్యాక్స్ అప్పిలెట్ ట్రిబ్యునల్ చైర్మన్గా కొనసాగుతున్నారు. పురుషోత్తం కుమార్ ఏపీ జ్యుడీషియల్ అకాడమీ డైరెక్టర్గా ఉన్నారు. ఇదిలా ఉండగా ఏపీ హైకోర్టుకు మంజూరైన మొత్తం న్యాయమూర్తుల సంఖ్య 37 కాగా, ఈ ముగ్గురి నియామకంతో ఆ సంఖ్య 32కు చేరింది. గంధం సునీత గంధం సునీత 1977 జూలై 14న కృష్ణా జిల్లా పెదకళ్లేపల్లి గ్రామంలో గంధం వీరయ్య, శివనాగేంద్రమ్మ దంపతులకు జన్మించారు. వీరిది వ్యవసాయ కుటుంబం. పెదకళ్లేపల్లిలోని ఎస్డీఎన్ఎస్డీఎస్ పాఠశాలలో 10వ తరగతి, మచిలీపట్నం లేడీయాంప్తిల్ కాలేజీలో ఇంటర్, విజయవాడ గాంధీ మహిళా కళాశాలలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. మాంటిస్సోరి కాలేజీలో ఎల్ఎల్బీ పూర్తి చేసి టాపర్గా బంగారు పతకం సాధించారు. 1999 జూలై 1న న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. విజయవాడలో న్యాయవాద వృత్తిని ప్రారంభించారు. 2008 నుంచి 2010 వరకు గుడివాడలో అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా పని చేశారు. 2010లో సివిల్ జడ్జిగా, 2012లో జిల్లా జడ్జిగా ఎంపికయ్యారు. అనంతరం జిల్లా జడ్జిగా పలు చోట్ల పని చేశారు. 2019–23 మధ్య హైకోర్టు రిజిస్ట్రార్గా వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. 2023 నుంచి తూర్పు గోదావరి జిల్లా ప్రధాన జిల్లా జడ్జిగా వ్యవహరిస్తున్నారు. ఆలపాటి గిరిధర్ ప్రకాశం జిల్లా కొండెపి మండలం గోగినేనివారిపాలెంలో ఆలపాటి గిరిధర్ జన్మించారు. తండ్రి బాపయ్య చౌదరి స్వాతంత్ర సమరయోధుడు, విశాంత్ర ప్రధానోపాధ్యాయుడు. గిరిధర్ ఒంగోలు ఇందిరా ప్రయదర్శిని న్యాయ కళాశాలలో లా డిగ్రీ పొందారు. 1998 ఆగస్టు 27న న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. ఒంగోలు జిల్లా కోర్టుతో పాటు అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. ఆ తర్వాత న్యాయాధికారిగా ఎంపికయ్యారు. వివిధ హోదాల్లో న్యాయాధికారిగా పనిచేశారు. విజయవాడ ఏసీబీ కోర్టు ప్రత్యేక జడ్జిగా కూడా వ్యవహరించారు. కర్నూలు, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల ప్రధాన జిల్లా జడ్జీలుగా పని చేశారు. హైకోర్టులో రిజిస్ట్రార్గా వ్యవహరించారు. ప్రస్తుతం విశాఖపట్నం ఏపీ వ్యాట్ అప్పిలెట్ ట్రిబ్యునల్ చైర్మన్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. చింతలపూడి పురుషోత్తం కుమార్ విశాఖపట్నంలో చింతలపూడి రాంబాబు, రామరత్నం దంపతులకు పురుషోత్తం కుమార్ జన్మించారు. రాంబాబు విశ్రాంత జిల్లా జడ్జి. ఈ కుటుంబంలోని వారు మూడు తరాలుగా న్యాయవాదులుగా, న్యాయమూర్తులుగా సేవలు అందిస్తున్నారు. పురుషోత్తం కుమార్ ఆంధ్ర యూనివర్సిటీలో మెరైన్ బయాలజీలో ఎమ్మెస్సీ పూర్తి చేశారు. ఉస్మానియా వర్సిటీ నుంచి లా డిగ్రీ పొందారు. 2002 నవంబర్ 22న న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. ప్రముఖ సీనియర్ న్యాయవాది ఎస్.రవి వద్ద వృత్తి మెళకువలు నేర్చుకున్నారు. హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు, రంగారెడ్డి జిల్లా కోర్టు, అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ప్రాక్టీస్ చేశారు. 2010లో జిల్లా జడ్జిగా ఎంపికయ్యారు. అనంతరం వివిధ హోదాల్లో పలు జిల్లాల్లో పనిచేశారు. హైకోర్టులో సైతం వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. రిజి్రస్టార్గా అదనపు బాధ్యతలు నిర్వర్తించారు. 2025 జనవరి నుంచి ఏపీ జ్యుడీషియల్ అకాడమీ డైరెక్టర్గా కొనసాగుతున్నారు. -
సాయికృష్ణ కేసు.. సిట్ లంచ్మోషన్ పిటిషన్కు హైకోర్టు అనుమతి
సాక్షి, విజయవాడ: గాదె సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో ఏపీ హైకోర్టులో సిట్ లంచ్ మోషన్ పిటిషన్కు హైకోర్టు అనుమతి ఇచ్చింది. సిట్ హైకోర్టును ఆశ్రయించడంతో కస్టడీ విచారణకు బ్రేక్ పడింది. సీఐ నాగరాజు కస్టడీ విచారణ షరతులపై సిట్ అభ్యంతరం వ్యక్తం చేసింది. హైకోర్టు తీర్పు తర్వాత సీఐని సిట్ కస్టడీకి తీసుకోనుంది. తదుపరి విచారణ ఎల్లుండికి హైకోర్టు వాయిదా వేసింది. నాగరాజు అరెస్టు నుంచి కస్టడీలోకి తీసుకొని విచారించడం వరకు నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో తనను సిట్ ఇరికించే ప్రయత్నం చేస్తుందని ఇప్పటికే న్యాయమూర్తికి సీఐ నాగరాజు చెప్పిన సంగతి తెలిసిందే.కాగా, సిట్ కస్టడీ వేళ.. ఈ కేసు నిందితుడు, సీఐ(సస్పెండెడ్) నాగరాజు కోర్టుకు రాసిన లేఖ బయటకు వచ్చింది. అందులో తాను నిర్దోషినని పేర్కొంటూ.. ప్రత్యేక దర్యాప్తు బృందంపై సంచలన ఆరోపణలకు దిగాడు. సాయికృష్ణ కేసులో తాను పూర్తిగా నిర్దోషినని నాగరాజు విజయవాడ కోర్టుకు రాసిన లేఖలో పేర్కొన్నాడు. అయితే.. ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) తనను ఇరికించేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించాడు. అంతేకాదు తనను బెదిరించి, భయభ్రాంతులకు గురిచేసి.. నేరం ఒప్పించాలని చూస్తోందని, అందుకే కస్టడీకి కోరిందని అంటున్నాడు.సాయికృష్ణ కేసులో తనను సిట్ కస్టడీకి ఇవ్వాల్సిన అవసరం అసలే లేదని.. కేవలం కేసులో ఇరికించేందుకే సిట్ ఈ డ్రామా ఆడుతోందని ఆరోపించాడు. ఒకవేళ.. తనను విచారించాల్సి వస్తే న్యాయవాదుల సమక్షంలోనే అది జరిగేలా చూడాలని కోర్టును కోరాడు. అదేవిధంగా, తనపై ఎలాంటి మానసిక, శారీరక ఒత్తిడి (టార్చర్) జరగకుండా కోర్టు జోక్యం చేసుకోవాలన్నాడు. -
భరణం పిటిషన్ను 6 నెలల్లో పరిష్కరించండి
సాక్షి, న్యూఢిల్లీ: నాలుగేళ్ల వయసున్న ఆటిజం బాధిత చిన్నారిని భర్త, అత్తమామల వద్ద వదిలేసి వెళ్లిన భార్య దాఖలు చేసిన భరణం పిటిషన్ను 6నెలల్లోగా పరిష్కరించాలని సుప్రీంకోర్టు విజయవాడలోని ప్రిన్సిపల్ ఫ్యామిలీ కోర్టును ఆదేశించింది. గుండు సాయికార్తీక్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఏపీ వ్యవహారంలో ఏపీ హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్పై జస్టిస్ ఎం.ఎం.సుందరేశ్, జస్టిస్ శీల్ నాగులతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. పిటిషనర్ న్యాయవాది బి.శ్రవణ్శంకర్ వాదనలు వినిపిస్తూ.. సాయికార్తీక్ భార్య నాలుగేళ్ల ఆటిస్టిక్ చిన్నారిని భర్త, అతడి తల్లిదండ్రుల వద్ద వదిలేసి వెళ్లిపోయినట్లు చెప్పారు. ఆమె కూడా భర్తతో సమానంగా చదువుకున్న ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అని, పెళ్లికి ముందు బ్యాంకులో పనిచేశారని తెలిపారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్న భర్త చేతికి వచ్చే నికర నెలవారీ ఆదాయం కేవలం రూ.48 వేలు మాత్రమేనని చెప్పారు. 2024లో భరణం కోసం పిటిషన్ వేసిన ఆమె ఇప్పటివరకు కనీసం బిడ్డ కస్టడీ కోరలేదని తెలిపారు. ఈ పిటిషనర్ వాదనలు విన్న సుప్రీంకోర్టు ధర్మాసనం స్పందిస్తూ.. ఇది కేవలం కింది కోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల వ్యవహారమేనని, ప్రస్తుత దశలో ఇందులో జోక్యం చేసుకోలేమని వ్యాఖ్యానించింది. అయితే, విజయవాడలోని ట్రయల్ కోర్టులో విచారణలో ఉన్న మెయింటెనెన్స్ పిటిషన్ను 6 నెలల వ్యవధిలో పరిష్కరించాలని ఆదేశిస్తూ విచారణను ముగించింది. అసలేం జరిగిందంటే.. ఐర్లాండ్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్న గుండు సాయికార్తీక్పై అతడి భార్య హిమబిందు విజయవాడలోని ప్రిన్సిపల్ ఫ్యామిలీ కోర్టులో భరణం కోసం పిటిషన్ వేశారు. దీనిపై విచారణ జరిపిన కింది కోర్టు.. ఆమెకు నెలకు రూ.50 వేలు మధ్యంతర భరణం చెల్లించాలని 2025 నవంబర్ 26న ఆదేశించింది. తనకున్న ఆర్థికభారాన్ని, వ్యయాలను పరిగణనలోకి తీసుకోకుండా కింది కోర్టు ఎక్కువ మొత్తాన్ని భరణంగా ఖరారు చేసిందంటూ సాయికార్తీక్ ఏపీ హైకోర్టులో రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఈ ఏడాది ఏప్రిల్ 2న ఏపీ హైకోర్టు విచారణ జరిపి కింది కోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. ప్రధాన కేసును వేగంగా పరిష్కరించాలని కింది కోర్టును ఆదేశిస్తూ రివిజన్ పిటిషన్ను కొట్టేశారు. దీంతో సాయికార్తీక్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
బెయిల్ పిటిషన్లో నేర చరిత్రను చెప్పాల్సిందే
సాక్షి, అమరావతి: బెయిల్ కోసం పిటిషన్లు దాఖలు చేసే నిందితులు తమ నేరచరిత్రను దాచిపెట్టి బెయిల్ పొందుతున్న నేపథ్యంలో దీనికి అడ్డుకట్ట వేసేందుకు రాష్ట్ర హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా తన స్టాండింగ్ ఆర్డర్స్కు కీలక సవరణ చేసింది. హైకోర్టులో దాఖలు చేసే బెయిల్ పిటిషన్లో నిందితుడు తన నేరచరిత్రను తెలియజేయడాన్ని తప్పనిసరి చేసింది. ఈ మేరకు హైకోర్టు స్టాండింగ్ ఆర్డర్స్లో కఠినమైన కొత్త నిబంధన చేర్చింది. హైకోర్టులో దాఖలు చేసే ప్రతి బెయిల్ పిటిషన్లో.. సుప్రీంకోర్టులో ఇటువంటి పిటిషన్ను ఏదైనా దాఖలు చేశారా? లేదా? అనే విషయాన్ని పిటిషనర్ తప్పనిసరిగా పేర్కొనాలి. ఒకవేళ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసి ఉంటే దాని ఫలితాన్ని కూడా బెయిల్ పిటిషన్లో తెలియజేయాలి. అంతేగాక పిటిషనర్/దరఖాస్తుదారు తనపై మరేదైనా క్రిమినల్ కేసు ఉందా? లేదా? అన్న విషయాన్ని కూడా పేర్కొనాలి. ఒకవేళ క్రిమినల్ కేసులు ఉంటే వాటి వివరాలు, ఆ కేసుల్లో కోర్టుల నిర్ణయాలను (తీర్పులను) కూడా పిటిషనర్ తన బెయిల్ పిటిషన్లో తెలియజేయాలి. ఒకవేళ ఈ సమాచారాన్ని బెయిల్ పిటిషన్లో పొందుపరచకపోతే, ఆ వివరాలను తెలుసుకున్న తరువాతే ఆ పిటిషన్ విచారణకు వస్తుంది. హైకోర్టు ఈ సవరణ ఆర్డర్ను తక్షణమే అమల్లోకి తెచ్చింది. ఈ కొత్త నిబంధనతో న్యాయపరమైన ప్రక్రియలు మరింత పారదర్శకంగా, వేగవంతంగా జరిగేందుకు ఆస్కారం ఏర్పడినట్లయింది.కుమ్మక్కు ఆటలు సాగవు ఇప్పటివరకు నిందితులు బెయిల్ పిటిషన్ దాఖలు చేసినప్పుడు అందులో కేవలం సదరు కేసుకు సంబంధించిన వివరాలను మాత్రమే పొందుపరిచేవారు. నేరచరిత్రను, సుప్రీంకోర్టులో దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ల వివరాలను ప్రస్తావించేవారు కాదు. దీంతో కోర్టుకు సదరు నిందితుడికి సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకునే అవకాశం లేకపోయేది. తద్వారా బెయిల్ మంజూరు విషయంలో సరైన నిర్ణయం తీసుకునే పరిస్థితి ఉండేది కాదు. బెయిల్ మంజూరు విషయంలో న్యాయస్థానాలు ఇటీవల కాలంలో నిందితుడి నేరచరిత్రను తప్పనిసరిగా తెలుసుకుంటున్నాయి. గతంలో ఎలాంటి కేసులు నమోదయ్యాయి.. వాటి తీవ్రత ఏమిటన్న విషయాలను పరిగణనలోకి తీసుకుంటున్నాయి. అయితే నిందితుడి నేరచరిత్ర వివరాలను పోలీసులే కోర్టు ముందుంచాల్సి వచ్చేది. కొందరు పోలీసులు నిందితులతో కుమ్మక్కై వారి నేరచరిత్రను కోర్టు ముందుంచకుండా ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టేవారు. తద్వారా నిందితులకు బెయిల్ వచ్చేందుకు పోలీసులు తమవంతు సహకారం అందించేవారు. అంతేగాక నిందితులు తమపై గతంలో నమోదైన కేసుల్లో కోర్టులు ఇచ్చి న తీర్పుల గురించి కూడా బెయిల్ పిటిషన్లో పేర్కొనేవారు కాదు. దీంతో సదరు నిందితుడి నేరస్వభావాన్ని తెలుసుకునే అవకాశం హైకోర్టుకు లేకుండాపోయేది. అంతిమంగా సులభంగా బెయిల్ మంజూరుకు ఆస్కారం ఉండేది. ఇప్పుడు హైకోర్టు తీసుకొచ్చి న కొత్త నిబంధన వల్ల ఇకపై ఈ ఆటలు సాగవు. నిందితులే స్వయంగా తమ బెయిల్ పిటిషన్లో తమ నేరచరిత్రను, గతంలో నమోదైన కేసుల వివరాలను, ఆ కేసుల్లో కోర్టులిచ్చి న తీర్పులను తప్పనిసరిగా తెలియజేయాల్సి ఉంటుంది. ఈ నిబంధన వల్ల ఇకపై తీవ్రనేరాల్లో బెయిల్ పొందడం అంత సులభం కాదని న్యాయవర్గాలు చెబుతున్నాయి. -
ఏపీ హైకోర్టులో సీఆర్డీఏ రైతు పరిరక్షణ కమిటీ సభ్యులకు ఊరట
ఏపీ హైకోర్టులో సీఆర్డీఏ రైతు పరిరక్షణ కమిటీ సభ్యులకు ఊరట దక్కింది. ఎస్సీ, ఎస్టీ కేసు నమోదైన వైఎస్సార్సీపీ నేతలను అరెస్ట్ చేయొద్దని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 8కి వాయిదా వేసింది.కాగా, వైఎస్సార్సీపీ నేతలపై కూటమి ప్రభుత్వం కక్ష చర్యలకు పాల్పడుతోంది. వైఎస్సార్సీపీ సీఆర్డీఏ రైతు పరిరక్షణ కమిటీ సభ్యులపై ఇటీవల పోలీసులు అట్రాసిటీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. సీఐ విధులకు ఆటంకం కలిగించారని తాడేపల్లి పోలీస్ స్టేషన్లో మరో కేసు నమోదైంది.అంబటి రాంబాబు, పేర్ని నాని, లేళ్ల అప్పిరెడ్డి, దేవినేని అవినాశ్తో పాటు డైమండ్ బాబు, దొంతిరెడ్డి వేమారెడ్డి, పానుగంటి చైతన్య, పెనుమాక రైతు శివారెడ్డి, నూనె ఉమామహేశ్వర్ రెడ్డి నవరత్నాల మూర్తి, తదితరులపై కేసు నమోదైంది. -
రాష్ట్రం రావణ కాష్టం కావాలా?
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పోలీసుల అడ్మినిస్ట్రేషన్ ఏ మాత్రం సక్రమంగా లేదు. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (సీఆర్పీసీ)ని ఉల్లంఘిస్తామంటే చూస్తూ ఊరుకునేది లేదు. రూల్ ఆఫ్ లా అనేది ఒకటి ఉందన్న విషయాన్ని పోలీసులు గుర్తు పెట్టుకోవాలి. ఎవరైనా సరే రాజ్యాంగం, చట్ట ప్రకారం నడుచుకోవాల్సిందే. రాష్ట్రం రావణకాష్టంగా ఉండాలని అనుకుంటున్నారా? శాంతి, సామరస్యం అవసరం లేదని భావిస్తున్నారా? పోలీసులు ఏం చేస్తున్నా అడిగే వారు లేరనుకుంటున్నారా? లేక మీరే తెలివైన వాళ్లు అనుకుంటున్నారా? కోర్టునే తప్పుదోవ పట్టిస్తారా?’ అంటూ మంగళవారం హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వంపై, ప్రత్యేకించి పోలీసు శాఖపై నిప్పులు చెరిగింది.ఒక నేత దాఖలు చేసిన పిటిషన్లో పూర్తి వివరాలను హైకోర్టు ముందుంచేందుకు సమయం తీసుకున్న పోలీసులు, దానిని అడ్డం పెట్టుకుని ఆ వెంటనే కింది కోర్టులో చార్జిషీట్ దాఖలు చేయడంపై హైకోర్టు తీవ్రంగా మండిపడింది. ‘వివరాలు సమర్పించేందుకు సమయం తీసుకుని చార్జిషీట్ ఎలా దాఖలు చేస్తారు? ఇది ముమ్మాటికీ కోర్టు ధిక్కారమే. పోలీసులు, కలెక్టర్కు గుణపాఠం నేర్పించాల్సిన అవసరం ఉంది.పోలీసులు, కలెక్టర్ను కోర్టు ముందు హాజరు కావాలని ఆదేశిస్తున్నా. వివరాల సమర్పణ కోసం పోలీసులు సమయం కోరినప్పుడు, కోర్టు సమయం ఇవ్వడం పెద్ద మనుషుల ఒప్పందం లాంటిది. పోలీసులు ఈ ఒప్పందాన్ని ఉల్లంఘించారు. అధికారులు ఇల్లు కూల్చి వేస్తున్నారంటూ కక్షిదారుడు పిటిషన్ దాఖలు చేస్తే.. వివరణ సమర్పణ కోసం గడువు తీసుకుని ఆ ఇల్లు కూల్చేసినట్లుగా ఉంది పోలీసుల తీరు’ అని హైకోర్టు మండిపడింది. ఫలితంగా ప్రత్యర్థులే లక్ష్యంగా రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతున్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి హైకోర్టులో గట్టి ఎదురు దెబ్బ తగిలింది. జీపీ ప్రభుత్వ మౌత్పీస్ కాకూడదు హోంశాఖ తరఫు ప్రభుత్వ న్యాయవాది (జీపీ) జయంతి తీరుపై కూడా హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ప్రభుత్వ న్యాయవాదికి కొన్ని ప్రమాణాలు ఉండాలని హితవు పలికారు. ప్రభుత్వ ప్రతినిధిగా (మౌత్పీస్) వ్యవహరించవద్దని స్పష్టం చేసింది. ప్రభుత్వ న్యాయవాది ఉన్నది కోర్టుకు సహకరించేందుకే తప్ప ప్రభుత్వానికి పోస్టు మ్యాన్గా ఉండేందుకు కాదని తేల్చి చెప్పింది. ప్రభుత్వ న్యాయవాది కోర్టు ఆఫీసర్ అన్న సంగతి మర్చిపోవద్దని ఘాటు వ్యాఖ్యలు చేసింది.పోలీసుల తరఫున ప్రభుత్వ న్యాయవాది అడుసుమిల్లి జయంతి స్పందిస్తూ.. కేసును విచారణకు స్వీకరించాలా? లేదా అన్నది కింది కోర్టు పరిధిలోని వ్యవహారమన్నారు. ఈ మొత్తం వ్యవహారాన్ని ట్రయల్లో తేల్చాల్సి ఉంటుందని తెలిపారు. అధికరణ 226 కింద హైకోర్టు ఈ కేసులో జోక్యం చేసుకోవడానికి వీల్లేదన్నారు. ఈ వాదనను హైకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. అధికరణ 226 కింద హైకోర్టు అధికారాలకు ఆకాశమే హద్దని స్పష్టం చేసింది. మూడేళ్లు శిక్షపడే కేసుల్లో మూడేళ్ల తర్వాత ఆ కేసును కోర్టు విచారణకు స్వీకరించడంపై చట్ట ప్రకారం నిషేధం ఉందని గుర్తు చేసింది.ఐదేళ్ల తర్వాత ప్రాసిక్యూషనా?2021 పంచాయతీ ఎన్నికల సందర్భంగా అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు, అప్పటి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్పై మంత్రి హోదాలో కొడాలి నాని పలు వ్యాఖ్యలు చేశారు. దీనిపై ఎన్నికల సంఘం సంయుక్త కార్యదర్శి గుడివాడ పోలీసులకు 2021 ఫిబ్రవరిలో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కొడాలి నానిపై కేసు నమోదు చేశారు. అప్పటి కేసుపై ఇప్పుడు ప్రాసిక్యూషన్కు అనుమతినిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. దానిని కొట్టేయాలని కోరుతూ నాని ఇటీవల హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.నాని తరఫున సీనియర్ న్యాయవాది చిత్తర్వు రఘు మంగళవారం వాదనలు వినిపించారు. 2021లో కేసు నమోదైతే ఐదేళ్ల తర్వాత ఇప్పుడు ప్రాసిక్యూషన్కు అనుమతి ఇవ్వడం కచ్చితంగా రాజకీయ కక్ష సాధింపుల్లో భాగమేనన్నారు. నానిపై నమోదైన కేసును సంబంధిత కోర్టు విచారణకు స్వీకరించే గడువు ఎప్పుడో ముగిసిందని తెలిపారు. అందువల్ల సీఆర్పీసీ ప్రకారం కొడాలి నాని ప్రాసిక్యూషన్ చెల్లదన్నారు. వివరాల సమర్పణకు మొన్న (28వ తేదీ) గడువు తీసుకున్న పోలీసులు, నిన్న (29న) చార్జిషీట్ దాఖలు చేశారని వివరించారు. దీనిపై హైకోర్టు స్పందిస్తూ.. నానిపై నమోదైన కేసులో మూడేళ్ల శిక్ష మాత్రమే పడుతుందని, ఇలాంటి పరిస్థితుల్లో మూడేళ్లు దాటిన తర్వాత ఆ కేసును కోర్టులు విచారణకు స్వీకరించలేవని స్పష్టం చేసింది.మూడేళ్ల తరువాత కేసును విచారణకు స్వీకరించడంపై క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (సీఆర్పీసీ)లో స్పష్టమైన నిషేధం ఉందని తెలిపింది. 2021లో జరిగిన ఘటనపై తాజాగా పోలీసులు చార్జిషీట్ దాఖలు చేశారని, ఆ చార్జిషీట్ను కోర్టు విచారణకు స్వీకరించడానికి వీలు ఉండదని గుర్తు చేసింది. నాని ప్రాసిక్యూషన్కు అనుమతినిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జూన్ 18న జారీ చేసిన జీవో 801, తదనుగుణంగా కృష్ణా జిల్లా కలెక్టర్ జూన్ 25న జారీ చేసిన ప్రొసీడింగ్స్కు సంబంధించిన తదుపరి చర్యలన్నింటినీ హైకోర్టు తదుపరి ఉత్తర్వులు జారీ చేసేంత వరకు నిలిపేసింది. తదుపరి విచారణను ఆగస్టు 11కు వాయిదా వేసింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. -
న్యాయమూర్తులున్నది ప్రజల హక్కుల పరిరక్షణకే
సాక్షి, అమరావతి: న్యాయమూర్తులున్నది ప్రజల హక్కుల పరిరక్షణకేనని, ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికో, ప్రభుత్వానికి సహకారం అందించడానికో కాదని హైకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందన్రావు తెలిపారు. తమకు చట్టం ఎనలేని అధికారాలను ఇచ్చింది న్యాయ పాలనను నిలబెట్టడానికి, ప్రజల హక్కులను ప్రభుత్వాలు హరించకుండా చూడటానికే అని పేర్కొన్నారు. తాను ఎల్లప్పుడూ ఇదే సూత్రంపై పని చేశానని, దీనికి ఎప్పుడూ చింతించలేదన్నారు.మన చుట్టూ ఉన్న ఆడంబరాలు లేదా మనకు లభించే గౌరవ మర్యాదలను బట్టి మన గుర్తింపు, విశ్వసనీయత ఆధారపడి ఉండవని చెప్పారు. ప్రజలు కష్టాల్లో ఉండి మన తలుపు తట్టిన ప్రతిసారీ వారికి ఏ విధంగా న్యాయం చేశామనే దానిపైనే మన అసలు గుర్తింపు ఆధారపడి ఉంటుందని చెప్పారు. న్యాయమూర్తిగా జస్టిస్ రఘునందన్రావు సోమవారం పదవీ విరమణ చేశారు. ఈ సందర్భంగా హైకోర్టు ఆయనకు ఘనంగా వీడ్కోలు పలికింది. ఈ వీడ్కోలు సమావేశంలో ఆయన మాట్లాడారు. పేదలకు సాయం చేయడానికి నాకు లభించిన గొప్ప అవకాశం‘నేను అడ్వొకేట్గా ఉన్నప్పుడు నా ప్రాక్టీస్ స్వభావం వల్ల, ఎక్కువ వనరులు ఉన్న కక్షిదారుల పక్షాన వాదించేవాడిని. వారికి కోర్టులు వారి హక్కులను కాపాడుకోవడానికి ఉన్న అనేక మార్గాలలో ఒకటి మాత్రమే. కానీ, నేను న్యాయమూర్తి అయిన తర్వాతే.. కోర్టు మాత్రమే తమ మొదటి, చివరి ఆశ్రయం అని నమ్మే సాధారణ ప్రజల కేసులను చూసే అవకాశం దక్కింది. అటువంటి నిరుపేదలకు, హక్కులు కోల్పోయిన వారికి సహాయం చేయడానికి నాకు లభించిన ఈ అవకాశాన్ని గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను. సమాజంలో వెనుకబడిన వర్గాల వారు మనుగడ కోసం ఎంతగా పోరాడుతున్నారో, వారు ఎంత బలహీనంగా ఉన్నారో నేను న్యాయమూర్తి అయిన తరువాతే గ్రహించాను.’ అని ఆయన చెప్పారు.భవిష్యత్ తరాలు గర్వపడేలా తీర్చిదిద్దాలి‘ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మౌలిక సదుపాయాల పరంగా ఎంతో పురోగతి సాధించింది. త్వరలోనే కొత్త హైకోర్టు భవనం కూడా రాబోతోంది. గత రెండేళ్లుగా హైకోర్టు వంద శాతానికి పైగా కేసుల పరిష్కార రేటును సాధించింది. అంటే కొత్తగా దాఖలైన కేసుల కంటే ఎక్కువ కేసులను పరిష్కరించాం. గత ఏడాది ప్రముఖ స్వచ్ఛంద సంస్థలు నిర్వహించిన స్వతంత్ర సర్వేలో కోర్టులు, జైళ్ల పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది. దేశంలోని 25 హైకోర్టులలో మన ఏపీ హైకోర్టు ఐదో స్థానాన్ని కైవసం చేసుకుంది. దేశంలోనే అత్యుత్తమ హైకోర్టుగా ఎదగడానికి ఇంకా శ్రమించాలి.రాబోయే తరాలు గర్వపడేలా మన న్యాయవ్యవస్థను తీర్చిదిద్దాలి. ఈ దేశ ప్రజల కోసం, చట్టాన్ని నిలబెట్టడం కోసం ఈ కోర్టు ఎల్లప్పుడూ తన బాధ్యతను నిర్వర్తిస్తుందనే నమ్మకం నాకు ఉంది.’ అని జస్టిస్ రఘునందన్రావు తెలిపారు. న్యాయమూర్తిగా ఇక్కడ కూర్చోవడానికి, తన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించడానికి తోడ్పడిన వారందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. హైదరాబాద్ నుండి విజయవాడకు మారడానికి అంగీకరించి, తన సంరక్షణ కోసం కెరీర్ను సైతం వదులుకున్న తన సతీమణి రాజిత, పిల్లలు అనన్య, ఆదిత్య అందించిన మద్దతు వల్లే ఇక్కడ ప్రశాంతంగా పని చేయగలిగానని తెలిపారు.సత్వర న్యాయం ఎంత ముఖ్యమో నిరూపించారు: సీజే జస్టిస్ లీసా గిల్జస్టిస్ రఘునందన్రావు సేవలను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజే) జస్టిస్ లీసా గిల్ కొనియాడారు. న్యాయవ్యవస్థపై ఆయన చెరగని ముద్ర వేశారని చెప్పారు. 25 వేల కేసులను పరిష్కరించి సత్వర న్యాయం ఎంత ముఖ్యమో నిరూపించారన్నారు. సాంకేతికతను, న్యాయవ్యవస్థను అనుసంధానం చేసి న్యాయాన్ని ప్రజలకు చేరువ చేశారని తెలిపారు. ఆయన శేష జీవితం ప్రశాంతంగా, ఆయురారోగ్యాలతో సాగిపోవాలని సీజే ఆకాక్షించారు. పౌర హక్కుల పరిరక్షణలో ముందున్నారుఈ కార్యక్రమంలో అదనపు సొలిసిటర్ జనరల్ (ఏఎస్జీ) చల్లా ధనంజయ, అడ్వొకేట్ జనరల్ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్, బార్ కౌన్సిల్ చైర్మన్ నల్లారి ద్వారకనాథరెడ్డి, హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు వాసిరెడ్డి ప్రభునాథ్ మాట్లాడారు. పౌరుల హక్కులను కాపాడటంలో జస్టిస్ రఘునందన్రావు ముందున్నారని తెలిపారు. జూనియర్ న్యాయవాదులను ప్రోత్సహించి వారు వృత్తి మెళకువలు నేర్చుకునేలా చేశారన్నారు. న్యాయమూర్తిగా పదవీ విరమణ చేయడం న్యాయ వ్యవస్థకు లోటన్నారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తులు జస్టిస్ మంతోజు గంగారావు, జస్టిస్ మఠం వెంకటరమణ, జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్, జస్టిస్ రఘునందన్రావు కుటుంబ సభ్యులు, రిజిస్ట్రార్లు, న్యాయవాదులు, అదనపు అడ్వొకేట్ జనరల్ ఇవన సాంబశివ ప్రతాప్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ మెండ లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.హైకోర్టు న్యాయవాదుల సంఘం ఘన సన్మానంపదవీ విరమణ చేసిన జస్టిస్ రఘునందన్రావును హైకోర్టు న్యాయవాదుల సంఘం ఘనంగా సన్మానించింది. జస్టిస్ రఘునందన్రావు, ఆయన సతీమణి రాజితకు అమ్మవారి చిత్రపటాన్ని సంఘం కార్యవర్గం బహూకరించింది. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు వాసిరెడ్డి ప్రభునాథ్, ఉపాధ్యక్షుడు పీటా రామన్, ప్రధాన కార్యదర్శి తిరుమలశెట్టి కిరణ్, కార్యవర్గ సభ్యులు, పెద్ద సంఖ్యలో న్యాయవాదులు పాల్గొన్నారు. -
హైకోర్టు తీర్పుపై ఉత్కంఠ
-
ఈ రోజు కోర్టులో జరగబోయేది ఇదే.. సాయి కృష్ణ కేసుపై కారుమూరి షాకింగ్ నిజాలు
-
ఇవాళ హైకోర్టు ముందుకు సాయికృష్ణ కేసు
-
తెర వెనుక మల్లగుల్లాలు
సాక్షి ప్రతినిధి, విజయవాడ: కాపు యువకుడు గాదె సాయికృష్ణ లాకప్డెత్ కేసులో సిట్ విచారణ తూతూ మంత్రంగా సాగుతోంది. అసలు సూత్రధారులు, పాత్రధారులను రక్షించే విధంగా దర్యాప్తు పక్కదారి పట్టిందనే ఆరోపణలు వస్తున్నాయి. మరోవైపు సాయికృష్ణ మిస్సింగ్కు సంబంధించి కీలకమైన ‘హెబియస్ కార్పస్’ పిటిషన్ సోమవారం హైకోర్టులో విచారణకు రానుంది. ఈ తరుణంలో ప్రభుత్వ పెద్దలు తెరవెనుక పొలిటికల్ డ్రామాకు తెర తీశారు. బాధిత కుటుంబ సభ్యుల ద్వారా కేసు ఉపసంహరణకు ఓ పచ్చనేత తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. హైకోర్టు సీబీఐ విచారణకు ఆదేశిస్తే ఈ కేసులో సూత్రధారులు వెలుగులోకి రావడం ఖాయమనే ఆందోళనతో తెర వెనుక కుట్రలకు పదును పెట్టారు. -
వంశపారంపర్య ఆస్తిలో రెండో భార్య సంతానానికీ సమాన హక్కు
సాక్షి, అమరావతి: తండ్రికి వంశపారంపర్యంగా సంక్రమించిన ఆస్తిలో అతడి మొదటి భార్య పిల్లలతో పాటు రెండో భార్య సంతానానికి కూడా సమాన హక్కు ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసింది. మొదటి భార్య మరణించిన తరువాత రెండో వివాహం చేసుకున్నానని, తద్వారా కుమార్తెలు జన్మించారని తండ్రే స్వయంగా చెబుతున్న నేపథ్యంలో ఆ కుమార్తెలు చట్టబద్ధ సంతానమే అవుతారని స్పష్టంచేసింది. సదరు తండ్రి వంశపారంపర్య ఆస్తికి కుమార్తెలు సైతం హక్కుదారులేనని, వారందరికీ ఆస్తిపై సమాన హక్కు ఉంటుందని హైకోర్టు తేల్చి చెప్పింది. ఇందుకు సంబంధించిన దాఖలైన రెండవ అప్పీల్ను కొట్టేసిన న్యాయమూర్తి జస్టిస్ వెణుతురుమల్లి గోపాలకృష్ణారావు ఈ మేరకు ఇటీవల తీర్పు వెలువరించారు. తండ్రి, కుమార్తెల న్యాయ పోరాటం తురంగి సోమరాజుకు కాకినాడ గ్రామీణ మండలం, గైగోలుపాడు గ్రామంలో వంశపారంపర్య ఆస్తులున్నాయి. ఈ ఆస్తుల్లో తనకూ, రెండో భార్యతో తనకు కలిగిన ఆరుగురు కుమార్తెలకు సమాన వాటా ఉందని, దీనిపై తన మొదటి భార్య కుమారుడు సత్యనారాయణ విబేధిస్తున్నాడని, ఆస్తుల పంపకాలు జరగనీయడం లేదని పేర్కొంటూ సోమరాజు ఆయన కుమార్తెలతోపాటు కాకినాడ ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో దావా వేశారు. విచారణ జరిపిన కోర్టు ఈ దావాను కొట్టేసింది. దీనిపై సోమరాజు, ఆయన కుమార్తెలు కాకినాడ అదనపు జిల్లా కోర్టులో మొదటి అప్పీల్ దాఖలు చేశారు. ఈ అప్పీల్ పెండింగ్లో ఉన్న సమయంలోనే సోమరాజు మరణించారు. అయితే దావాపై విచారణ జరిపిన కోర్టు.. సోమరాజు, ఆయన కుమారుడు సత్యనారాయణతో పాటు ఆరుగురు కుమార్తెలకు ఆ ఆస్తిలో సమాన వాటా (8 వాటాలు) ఉందంటూ తీర్పు చెప్పింది. ఈ తీర్పును సవాలు చేస్తూ సత్యనారాయణ 2012లో హైకోర్టులో రెండో అప్పీల్ దాఖలు చేశారు. తన తండ్రికి రెండో వివాహం కాలేదని, ఆయన కుమార్తెలు చెబుతున్నట్లు వారు తన తండ్రికి జన్మించలేదని సత్యనారాయణ చేసిన వాదనలను హైకోర్టు త్రోసిపుచ్చింది. తన తండ్రి తన నుంచి రూ. 80 వేలు తీసుకుని ఆస్తిపై హక్కులు వదులుకున్నారన్న వాదనలనూ హైకోర్టు పరిగణనలోకి తీసుకోలేదు. సోమరాజు మరణించినందున, ఆయన వాటాకు రెండో భార్య హక్కుదారు అవుతారని కూడా హైకోర్టు స్పష్టం చేసింది. ఇక రూ.80 వేలు తీసుకుని తండ్రి ఆస్తిపై వాటా వదులుకున్నారని సత్యనారాయణ మౌఖికంగా చెబుతున్నారే తప్ప, అందుకు ఎలాంటి ఆధారాలను చూపడం లేదన్నారు. ఒకవేళ డబ్బు తీసుకుని సోమరాజు ఆస్తిపై హక్కు వదులుకున్నది నిజమే అనుకున్నా, ఆయన తన వాటా ఆస్తిపై హక్కును వదులుకోగలరే తప్ప, కుమార్తెలకు రావాల్సిన వాటా విషయంలో కాదని న్యాయమూర్తి జస్టిస్ గోపాలకృష్ణారావు స్పష్టం చేశారు. -
మాకు బాబుపై నమ్మకం లేదు.. హైకోర్టును ఆశ్రయించిన సాయికృష్ణ తల్లి...
-
గంగమ్మ లాకప్ డెత్ కేసులో హై కోర్టు కీలక నిర్ణయం..
-
హైకోర్టుకు సాయి కృష్ణ తల్లి.. ఖాకీలపై నమ్మకం లేదు.. సీబీఐకి ఇవ్వండి!
-
విడాకులకు 6 నెలల కూలింగ్ పీరియడ్ తప్పనిసరి కాదు
సాక్షి, అమరావతి: పరస్పర అంగీకారంతో భార్య భర్తలు విడిపోవాలని నిర్ణయించుకున్నప్పుడు వారికి విడాకులు మంజూరు చేసేందుకు ఆరు నెలల పాటు వేచి ఉండటం (కూలింగ్ పీరియడ్) తప్పనిసరి కాదని హైకోర్టు తేల్చి చెప్పింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు ఇటీవల తీర్పు వెలువరించారు. ఇందుకు సంబంధించి ఒంగోలు ఫ్యామిలీ కోర్టు జారీచేసిన ఉత్తర్వులను రద్దు చేసిన హైకోర్టు.. భార్య, భర్తలు చాలా కాలం నుంచి వేర్వేరుగా ఉంటూ, తమ మధ్య ఉన్న వివాదాలన్నింటినీ పరిష్కరించుకుని పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకోవాలన్న నిర్ణయానికి వచ్చినప్పుడు విధించే కూలింగ్ పీరియడ్ వల్ల వారికి మానసిక వేదన పెరగడం తప్ప ఎలాంటి ప్రయోజనం ఉండబోదని స్పష్టంచేసింది. ఒంగోలు ఫ్యామిలీ కోర్టు జారీ చేసిన ఉత్తర్వులను సవాలుచేస్తూ భార్య, భర్తలు దాఖలు చేసిన పిటిషన్ను ఈ మేరకు అనుమతించిన హైకోర్టు వీలైనంత త్వరగా విడాకుల మంజూరు ప్రక్రియను పూర్తి చేయాలని ఫ్యామిలీ కోర్టును ఆదేశించింది. -
గంగమ్మ మృతి కేసు దర్యాప్తు ఏమైంది?
సాక్షి, అమరావతి: దళిత మహిళ మాల గంగమ్మ మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ఆమె కుమార్తె లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నమోదు చేసిన కేసులో దర్యాప్తు ఎంత వరకు వచ్చిందో చెప్పాలని హైకోర్టు బుధవారం పోలీసులను ఆదేశించింది. గంగమ్మ మృతి కేసు దర్యాప్తు పురోగతిపై స్టేటస్ రిపోర్ట్ను తమ ముందుంచాలని కూడా ఆదేశించింది. అలాగే గంగమ్మ పోస్టుమార్టం నివేదికతో సహా అన్ని రికార్డులను తమ ముందుంచాలని స్పష్టం చేసింది. అలాగే గంగమ్మ కుమార్తె లక్ష్మికి తగిన భద్రత కల్పించాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే నెలకు వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ లీసా గిల్, న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్య ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. పోస్టుమార్టం రిపోర్ట్ తారుమారు? గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలమేరకు కర్నూలు జీజీహెచ్ సూపరింటెండెంట్ సీల్డ్ కవర్లో సమర్పించిన పత్రాలను ధర్మాసనం బుధవారం పరిశీలించింది. అనంతరం గంగమ్మ పోస్టుమార్టం నివేదిక ప్రకారం ఆమె ఎలా చనిపోయారని పోలీసులను ప్రశ్నించింది. దీనికి పోలీసుల తరఫు న్యాయవాది సింగమనేని ప్రణతి స్పందిస్తూ, «కార్డియాక్ అరెస్ట్తో పాటు పలు ఇతర కారణాలతో గంగమ్మ మృతి చెందారని తెలిపారు. ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి తుది నివేదిక కోసం ఎదురుచూస్తున్నట్లు వివరించారు. పిటిషనర్ ఆగమన్రాజ్ తరఫు న్యాయవాది శివప్రసాద్రెడ్డి జోక్యం చేసుకుంటూ, గంగమ్మ కుమార్తె లక్ష్మిని కలిసేందుకు పోలీసులు ఎవరినీ అనుమతించడం లేదన్నారు. గంగమ్మ పోస్టుమార్టం రిపోర్ట్ను సైతం పోలీసులు తారుమారు చేశారని తెలిపారు.గంగమ్మ లాకప్డెత్! కర్నూలు జిల్లా బదినేహాల్కి చెందిన మాల గంగమ్మ తన కుమారుడు వీరేంద్ర అదృశ్యంపై గత ఏడాది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టు ఆదేశాల మేరకు గుంటూరు అదనపు ఎస్పీ (క్రైమ్స్) కె.సుప్రజ నేతృత్వంలో 13 మందితో సిట్ ఏర్పాటయ్యింది. వీరేంద్ర ఆచూకీ తెలుసుకునే క్రమంలో సిట్ గంగమ్మను, బేగరి దర్గప్పను కస్టడీలోకి తీసుకుంది. అయితే సిట్ టార్చర్ తట్టుకోలేక గంగమ్మ మృతి చెందిందన్న విమర్శలు గుప్పుమన్నాయి. ఆమె కుమార్తె లక్ష్మి ఫిర్యాదు మేరకు కర్నూలు వన్టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు.టార్చర్కు గురైన దర్గప్ప తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే దర్గప్ప ప్రాణాపాయ స్థితిలో ఉండటంతో గంగమ్మ లాకప్డెత్ వ్యవహారం మరుగునపడి పోయే ప్రమాదం ఉందంటూ ప్రకాశం జిల్లాకు చెందిన ఆగమన్రాజ్ అనే యువకుడు ఇటీవల హైకోర్టును ఆశ్రయించారు. దర్గప్ప చనిపోవడానికి ముందే అతని వాంగ్మూలాన్ని నమోదు చేసేలా ఆదేశాలు ఇవ్వాలంటూ పిల్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై సీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరుపుతోంది. -
దళిత మహిళ గంగమ్మ లాకప్ డెత్ కేసులో హై కోర్టు కీలక నిర్ణయం
-
గంగమ్మ లాకప్డెత్ కేసు.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు
సాక్షి, విజయవాడ: దళిత మహిళ గంగమ్మ లాకప్ డెత్పై దాఖలైన పిల్పై ఇవాళ ఏపీ హైకోర్టు విచారణ జరిపింది. దుర్గప్ప ట్రీట్మెంట్కి సంబంధించిన అన్ని రిపోర్టులను ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్.. సీల్డ్ కవర్లో హైకోర్టుకు సమర్పించారు. రిపోర్టులు మొత్తాన్ని ధర్మాసనం క్షుణ్ణంగా పరిశీలించింది. పిటిషనర్ తరపున న్యాయవాది తన వాదనలు వినిపిస్తూ.. గంగమ్మ కుమార్తె లక్ష్మిని పోలీసులు భయపెడుతున్నారన్నారు.ఆమె స్వగ్రామంలోకి ఎవరిని వెళ్లనివ్వట్లేదని.. గంగమ్మ మృతదేహానికి రీపోస్టుమార్టం నిర్వహించాలని పిటిషనర్ తరపున న్యాయవాది కోరారు. గంగమ్మ ఎలా చనిపోయిందని ప్రభుత్వం తరఫున న్యాయవాదిని ధర్మాసనం ప్రశ్నించింది. పోస్టుమార్టం రిపోర్ట్లో గంగమ్మ ఏ కారణం చేత చనిపోయిందని రాసి ఉందంటూ హైకోర్టు ప్రశ్నించింది.గంగమ్మ ఒంటిపై గాయాలు ఉన్నాయని హైకోర్టు ప్రశ్నించగా.. కార్డియాక్ అరెస్ట్తో పాటు మరికొన్ని కారణాలతో గంగమ్మ చనిపోయిందని పోస్టుమార్టం రిపోర్ట్లో పేర్కొన్నారని ప్రభుత్వం తరఫున న్యాయవాది.. కోర్టుకు తెలిపారు. గంగమ్మ కూతురు లక్ష్మికి భద్రత కల్పించాలని హైకోర్టు ఆదేశించింది. ఈ కేసులో విచారణకు సంబంధించి పూర్తి వివరాలు తమ ముందు ఉంచాలని ఆదేశించిన ధర్మాసనం.. తదుపరి విచారణ రెండు వారాలకు వాయిదా వేసింది. -
దుర్గప్ప మెడికల్ రికార్డులన్నీ మా ముందుంచండి
సాక్షి, అమరావతి : దళిత మహిళ మాల గంగమ్మ లాకప్డెత్ కేసులో హైకోర్టు మరోసారి కీలక ఆదేశాలు జారీ చేసింది. గంగమ్మతో పాటు పోలీసుల చేతిలో తీవ్రంగా గాయపడి కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న బేగరి దుర్గప్ప వాంగ్మూలాన్ని నమోదు చేయాలని గత వారం ఆదేశాలు ఇచ్చిన హైకోర్టు, తాజాగా అతని మెడికల్ రికార్డులన్నింటినీ సీల్డ్ కవర్లో తమ ముందుంచాలని కర్నూలు జీజీహెచ్ సూపరింటెండెంట్ను ఆదేశించింది. అలాగే జుడీషియల్ కస్టడీలో ఉన్న దుర్గప్ప వద్దకు వెళ్లి, అతని ప్రస్తుత ఆరోగ్య స్థితిని పరిశీలించి.. అందుకు సంబంధించిన నివేదికను సైతం తమ ముందుంచాలని సూపరింటెండెంట్ను ఆదేశించింది. అవసరమైతే అతన్ని ఆసుపత్రికి తరలించాలని కూడా చెప్పింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ లీసా గిల్, న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్య ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. కర్నూలు జిల్లా కౌతాళం మండలం బదినేహాల్ గ్రామానికి చెందిన మాల గంగమ్మ తన కుమారుడు వీరేంద్ర అదృశ్యంపై గత ఏడాది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు, వీరేంద్ర అదృశ్యంపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ ఆదేశాల మేరకు గుంటూరు అదనపు ఎస్పీ (క్రైమ్) కె.సుప్రజ నేతృత్వంలో 13 మందితో సిట్ను ఏర్పాటు చేస్తూ ఈ ఏడాది మే 8న డీజీపీ ఉత్తర్వులిచ్చారు. వీరేంద్ర ఆచూకీ తెలుసుకునే క్రమంలో సుప్రజ నేతృత్వంలోని సిట్.. మాల గంగమ్మను, బేగరి దుర్గప్పను కస్టడీలోకి తీసుకుని తీవ్రంగా హింసించారు. సిట్ టార్చర్ తట్టుకోలేక గంగమ్మ మృతి చెందారు. గంగమ్మ, దుర్గప్పలను పోలీసులు కస్టడీలోకి తీసుకుని టార్చర్ చేసిన సంగతి గ్రామస్తులందరికీ తెలుసు. టార్చర్కు గురైన దుర్గప్ప తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గంగమ్మ మృతితో భయపడిన పోలీసులు దుర్గప్పను ఆసుపత్రిలో చేర్పించారు. వాస్తవానికి గంగమ్మ లాకప్డెత్కు దుర్గప్ప ప్రత్యక్ష సాక్షి. దుర్గప్ప వాంగ్మూలం నమోదు కోసం పిటిషన్ దుర్గప్ప ప్రాణాపాయ స్థితిలో ఉండటంతో గంగమ్మ లాకప్డెత్ వ్యవహారం మరుగునపడి పోయే ప్రమాదం ఉండటంతో ప్రకాశం జిల్లాకు చెందిన ఓ యువకుడు ఇటీవల హైకోర్టును ఆశ్రయించారు. దుర్గప్ప చనిపోవడానికి ముందే అతని వాంగ్మూలాన్ని నమోదు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ కాసుకుర్తి ఆగమన్రాజ్ అనే యువకుడు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన సీజే ధర్మాసనం, దుర్గప్ప చికిత్స పొందున్న ఆసుపత్రికి వెళ్లి అతని వాంగ్మూలాన్ని నమోదు చేసి తమ ముందుంచాలని సంబంధిత మేజిస్ట్రేట్ను ఆదేశిస్తూ తదుపరి విచారణను ఈ నెల 23కు వాయిదా వేసిన విషయం తెలిసిందే. తాజాగా మంగళవారం ఈ వ్యాజ్యం మరోసారి విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా పోలీసుల తరఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్జీపీ) సింగమనేని ప్రణతి స్పందిస్తూ, ధర్మాసనం ఆదేశాల మేరకు దుర్గప్ప వాంగ్మూలాన్ని మేజిస్ట్రేట్ నమోదు చేశారన్నారు. దుర్గప్ప ప్రస్తుతం జుడీషియల్ కస్టడీలో ఉన్నారని తెలిపారు. ఆరోగ్యంగానే ఉన్నారన్నారు. దీంతో ధర్మాసనం.. మేజిస్ట్రేట్ నమోదు చేసిన దుర్గప్ప వాంగ్మూలాన్ని పరిశీలించింది.గంగమ్మ కుమార్తెకూ పోలీసుల బెదిరింపులుఈ సమయంలో పిటిషనర్ తరఫు న్యాయవాది గుండాల శివప్రసాద్రెడ్డి వాదనలు వినిపిస్తూ.. మృతురాలు గంగమ్మ కుమార్తె లక్ష్మీని పోలీసులు బెదిరించారన్నారు. ఆమె ఆచూకీ తెలియడం లేదని తెలిపారు. ఆమె తన స్వగ్రామంలో కూడా లేదని, ఫోన్ సైతం స్విచ్ఛాఫ్ వస్తోందన్నారు. ఈ వాదనను ఎస్జీపీ ప్రణతి తోసిపుచ్చారు. గంగమ్మ కుమార్తె అందుబాటులోనే ఉన్నారన్నారు. గంగమ్మ మృతికి సంబంధించిన అన్ని రికార్డులను కర్నూలు జీజీహెచ్ నుంచి స్వాధీనం చేసుకున్నామన్నారు. దుర్గప్ప మెడికల్ రికార్డుల కోసం ఆసుపత్రి వర్గాలకు దరఖాస్తు చేయాల్సి ఉందని చెప్పారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. దుర్గప్పకు సంబంధించిన అన్ని మెడికల్ రికార్డులను సీల్డ్ కవర్లో తమ ముందుంచాలని కర్నూలు జీజీహెచ్ సూపరింటెండెంట్ను ఆదేశించింది. అలాగే కర్నూలు జైలుకు వెళ్లి.. అక్కడ ఉన్న దుర్గప్పను పరిశీలించి అతని ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిపై కూడా నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. విచారణను బుధవారానికి వాయిదా వేసింది. -
చిన్నారి జ్ఞానేశ్వరి కేసు.. ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు
కాకినాడ జిల్లాలో అదృశ్యమైన చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. జ్ఞానేశ్వరి ఆచూకీ కోసం ఏం చర్యలు తీసుకున్నారో తెలియచేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. పూర్తి వివరాలతో స్టేటస్ రిపోర్ట్ తమ ముందు ఉంచాలని హైకోర్టు చెప్పింది. అదృశ్యమైన చిన్నారి ఆచూకీ తెలియజేసేందుకు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రూపొందించిన ఎస్ఓపీ విధానాన్ని అనుసరించారో లేదో కూడా తెలియచేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ కేసులో తదుపరి విచారణను హైకోర్టు వచ్చే నెలకు వాయిదా వేసింది.గంగమ్మ లాకప్ డెత్ కేసులో ఆదేశాలుకర్నూలు జిల్లా దళిత మహిళ గంగమ్మ లాకప్ డెత్ కేసులో హైకోర్టు మరోసారి కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రత్యక్ష సాక్షి దుర్గప్ప మెడికల్ రికార్డులన్నీ తమ ముందు ఉంచాలని ఆదేశించింది. స్వయంగా జైలుకు వెళ్లి దుర్గప్ప ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిపై నివేదిక ఇవ్వాలని చెప్పింది. చికిత్స అవసరమైతే అతడిని మరో ఆసుపత్రికి తరలించాలని కర్నూలు జీజీహెచ్ సూపరింటెండెంట్ కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దుర్గప్ప వాంగ్మూలాన్ని పరిశీలించిన ధర్మాసనం.. తదుపరి విచారణ రేపటికి వాయిదా వేసింది. -
దళిత మహిళ గంగమ్మ మృతిపై హైకోర్టులో విచారణ
-
కాపు యువకుని లాకప్డెత్ కేసు సీబీఐకి అప్పగించండి
సాక్షి, అమరావతి: కాపు యువకుడు గాదె సాయికృష్ణ లాకప్డెత్ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని కోరుతూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. సాయికృష్ణ లాకప్డెత్కు సంబంధించిన రికార్డులన్నింటినీ భద్రపరిచేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ సొసైటీ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ ప్రొపర్టీ అండ్ ఎని్వరాన్మెంటల్ రైట్స్ సంయుక్త కార్యదర్శి దాడిశెట్టి వీరబాబు సోమవారం ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ‘సాయికృష్ణ కేసు దర్యాప్తులో ప్రభుత్వ అధికారులు, పోలీసులు చూపుతున్న ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. ఈ కేసులో పారదర్శక, నిష్పక్షపాత, స్వతంత్ర దర్యాప్తు జరపకపోవడమన్నది రాజ్యాంగంలోని సమానత్వ హక్కు, జీవించే హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛ హక్కులను హరించడమే అవుతుంది. పోలీసుల చర్యలను ఏకపక్షం, చట్టవిరుద్ధం, రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించాలి. ఈ కేసులో ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ ప్రమేయం ఉన్న ప్రతి ఒక్కరి పాత్రపై ముఖ్యంగా అధికారులు, రాజకీయ పెద్దలు పాత్రపై పక్షపాతానికి తావు లేకుండా, స్వతంత్రంగా విచారణ జరిపేలా సీబీఐని ఆదేశించాలి. స్థానిక పోలీసులు ఈ కేసును సరిగ్గా దర్యాప్తు చేయడం లేదు. కాబట్టి నిష్పక్షపాత దర్యాప్తుతో పాటు వాస్తవాలు వెలుగులోకి రావడానికి కేసును సీబీఐకి అప్పగించడమే సరైన మార్గం.సాయికృష్ణ కేసుకు సంబంధించిన అన్ని రకాల డాక్యుమెంటరీ, ఎల్రక్టానిక్, డిజిటల్, ఫోరెన్సిక్, శాస్త్రీయ ఆధారాలను వెంటనే భద్రపరచేలా ఆదేశాలు ఇవ్వాలి. సీసీటీవీ ఫుటేజీ, జనరల్ డైరీ ఎంట్రీలు, స్టేషన్ హౌస్ రికార్డులు, కాల్ డేటా రికార్డులు, మొబైల్ ఫోన్ డేటా, లొకేషన్ డేటా, హాస్పిటల్ రికార్డులు, పోస్ట్మార్టం రికార్డులు, ఫోరెన్సిక్ సామాగ్రి, పోలీసు వాహనాల రాకపోకల రికార్డులను భద్రపరిచేలా ఆదేశాలు ఇవ్వాలి. ఈ ఘటనతో ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ సంబంధం ఉన్న ఏ పోలీస్ అధికారిని కూడా దర్యాప్తులో పాలుపంచుకోకుండా, దర్యాప్తును పర్యవేక్షించకుండా ఆదేశాలు జారీ చేయాలి. ఈ వ్యాజ్యం తేలేంత వరకు, కేసును అధికారికంగా సీబీఐకి బదిలీ చేసే ప్రక్రియ పూర్తయ్యేంత వరకు ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసులు సాక్ష్యాలను నాశనం చేయకుండా ఉండేందుకు తక్షణ రక్షణ ఆదేశాలు ఇవ్వాలి’ అని పిటిషనర్ న్యాయస్థానాన్ని కోరారు. స్వయంగా పోలీస్ అధికారులపైనే ఆరోపణలు వచ్చినప్పుడు, స్థానిక పోలీసులు జరిపే విచారణ నిష్పక్షపాతంగా జరుగుతుందనే నమ్మకం లేనప్పుడు దర్యాప్తును సీబీఐకి బదలాయించాలని కోరవచ్చునని సుప్రీంకోర్టు పలు తీర్పుల్లో చెప్పిన విషయాన్ని పిటిషనర్ పిల్లో ప్రస్తావించారు. ‘సాయికృష్ణ లాకప్డెత్కు సంబంధించి కృష్ణలంక పోలీస్ స్టేషన్లో కేవలం ఒక్క అధికారిపైనే చర్యలు చేపట్టారు. వాస్తవానికి ప్రజలు, మీడియా సమాచారం ప్రకారం ఈ ఘోరంలో పలువురు పోలీస్ సిబ్బందితో పాటు ఇతర ప్రభుత్వ ఉన్నతాధికారుల ప్రమేయం కూడా ఉందని స్పష్టమవుతోంది. స్వయంగా రాష్ట్ర పోలీస్ శాఖకు చెందిన అధికారులపైనే తీవ్రమైన ఆరోపణలు ఉన్నప్పుడు.. రాష్ట్ర పోలీసులే ఈ దర్యాప్తును కొనసాగించడం అసమంజసం’’ అని వీరబాబు తన పిటిషన్లో పేర్కొన్నారు. కొట్టి చంపేశారు... ‘సాయికృష్ణను విజయవాడ టాస్క్ఫోర్స్ పోలీసులు మే 9వ తేదీన ఓ నాన్బెయిలబుల్ వారెంట్ అమలుకు సంబంధించి మార్కాపురంలో అదుపులోకి తీసుకున్నారు. కోర్టులో ప్రవేశపెట్టకుండా అతడిని మొదట కృష్ణలంక, టాస్్కఫోర్స్ పోలీస్ స్టేషన్లలో రెండు రోజులు ఉంచారు. ఆ తర్వాత విజయవాడ బెంజ్ రోడ్లోని ఒక ప్రైవేట్ హోటల్కు తరలించి, మే 23 వరకు తీవ్రంగా హింసించారు. విజయవాడ టాస్క్ఫోర్స్ పోలీసులతో కలిపి దాదాపు 12 మంది పోలీసులు ఈ హత్య ప్రణాళికలో పాల్గొన్నారు. దీనికి సంబంధించి విశ్వసనీయ సమాచారం మాకుంది.కృష్ణలంక, టాస్్కఫోర్స్ పోలీసుల దాడి కారణంగా సాయికృష్ణ తీవ్రంగా గాయపడ్డారు. దీంతో అతడిని మొదట విజయవాడలోని ప్రజా వైద్యశాలకు తీసుకెళ్లగా, పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడ వైద్యులు చికిత్స చేయడానికి నిరాకరించారు. ఆ తర్వాత మణిపాల్ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి ఒక రోజు చికిత్స అందించారు. అయినా ఆరోగ్యం కుదుటపడకపోవడంతో మళ్లీ హోటల్ గదికే తీసుకెళ్లి, ఒక డాక్టర్తో ప్రథమ చికిత్స చేయించారు. చివరికి సాయికృష్ణ గాయాలు తట్టుకోలేక మరణించాడు. సాయికృష్ణ మరణించిన తర్వాత, కృష్ణలంక పోలీసులు శవాన్ని మాయం చేయడానికి ప్లాన్ చేశారు.ప్రజలను నమ్మించడానికి, ఆ మృతదేహాన్ని విజయవాడ బస్టాండ్లోని ప్లాట్ నంబర్ 43 వద్ద పడేశారు. అది గుర్తుతెలియని శవంగా భ్రమింపజేసి, మున్సిపల్ అధికారుల సహాయంతో తప్పుడు పంచనామా రికార్డులు సృష్టించారు. స్మశానవాటిక సిబ్బందిని లొంగతీసుకుని, మే 24న మున్సిపల్ కార్పొరేషన్ శ్మశానవాటికలో అంత్యక్రియలు పూర్తి చేసేశారు. కొడుకు జాడ కోసం తల్లి తీవ్రంగా ప్రయత్నించి, చివరికి హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు విచారణ సమయంలో పోలీసులు తాము అసలు సాయికృష్ణను అరెస్టు చేయలేదని అబద్ధం చెబుతూ, మే 29 వరకు సమయం కోరారు.కానీ ఈ లోపే, విచారణ పేరుతో పోలీసులు అతన్ని కొట్టి చంపేశారనే నిజం బయటపడింది. రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఇచ్చిన హామీల మేరకు, రాష్ట్ర ప్రభుత్వం కేసు నమోదు చేయడంతో ప్రస్తుతం సాయికృష్ణ తల్లి సంతృప్తి చెందారు. ఈ విషయాన్ని ఇకపై పెద్దది చేయవద్దని ఆమెను ప్రభుత్వ పెద్దలు బహిరంగంగా కోరుతున్నారు. అయితే, ఒక బాధ్యతగల పౌరుడిగా వాస్తవాలు వెలుగులోకి రావాలన్న ఉద్దేశంతో సాయికృష్ణ లాకప్డెత్ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని కోరుతున్నా. అందులో భాగంగానే ఈ పిల్ దాఖలు చేస్తున్నా.’ అని వీరబాబు తన పిటిషన్లో పేర్కొన్నారు. -
దళిత మహిళ లాకప్ డెత్పై ప్రత్యక్ష సాక్షి వాంగ్మూలం తీసుకోండి
సాక్షి, అమరావతి: దళిత మహిళ మాల గంగమ్మ లాకప్డెత్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ వ్యవహారానికి సంబంధించి ప్రాణా పాయ స్థితిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బేగరి దుర్గప్ప వాంగ్మూలాన్ని నమోదు చేయాలని సంబంధిత జుడీషియల్ మేజిస్ట్రేట్ను హైకోర్టు ఆదేశించింది. ఒకవేళ దుర్గప్ప ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయితే అతన్ని వెంటనే సంబంధిత మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచాలని ఆదేశించింది. నమోదు చేసిన వాంగ్మూలాన్ని ఈ నెల 23న తమ ముందుంచాలని మేజిస్ట్రేట్ను హైకోర్టు ఆదేశించింది. ఈ కేసుకు సంబంధించిన రిట్ పిటిషన్ కాపీతో పాటు ఈ ఆదేశాల కాపీని సంబంధిత మేజిస్ట్రేట్కు పంపాలని రిజిస్ట్రీని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 23కి వాయిదా వేసింది. కాసుకుర్తి ఆగమన్రాజ్ అనే యువకుడు దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్) విచారించిన ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ లీసాగిల్, న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్యలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. కొడుకు ఆచూకీ కావాలన్న తల్లి ప్రాణాలు కోల్పోయింది కర్నూలు జిల్లా, కౌతాళం మండలం, బదినేహాల్ గ్రామానికి చెందిన మాల గంగమ్మ తన కుమారుడు వీరేంద్ర అదృశ్యంపై గత ఏడాది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు, వీరేంద్ర అదృశ్యంపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ ఆదేశాల మేరకు గుంటూరు అదనపు ఎస్పీ (క్రైమ్స్) కె.సుప్రజ నేతృత్వంలో మొత్తం 13 మందితో సిట్ను ఏర్పాటు చేస్తూ ఈ ఏడాది మే 8న డీజీపీ ఉత్తర్వులిచ్చారు.వీరేంద్ర ఆచూకీ తెలుసుకునే క్రమంలో సుప్రజ నేతృత్వంలోని సిట్ మాల గంగమ్మను, బేగరి దుర్గప్పను కస్టడీలోకి తీసుకుని తీవ్రంగా హింసించారన్నది ప్రధాన విమర్శ. దీని ప్రకారం సిట్ టార్చర్ తట్టుకోలేక గంగమ్మ మృతి చెందింది. తీవ్రంగా గాయపడి ప్రాణాపాయ స్థితిలో ఉన్న దుర్గప్పను కర్నూలు ఆసుపత్రిలో పోలీసులు చేర్చారు. ఇక గంగమ్మ లాకప్డెత్ వ్యవహారం తమ మీదకు రాకుండా ఉండేందుకు పోలీసులు గంగమ్మ కుమార్తె లక్ష్మిని భయపెట్టి ఆమె చేత ఓ తప్పుడు ఫిర్యాదు చేయించారు. తన తల్లి గంగమ్మ అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందిందని, అయితే ఆమె మరణానికి కారణాలను తెలుసుకోవాలని మే 31న పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో లక్ష్మి పేర్కొన్నారు. తన తల్లి లోబీపీ, విరోచనాలతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ చనిపోయిందని ఫిర్యాదులో పేర్కొన్న లక్ష్మి, ఫిర్యాదు చివరి లైనులో మాత్రం అనారోగ్యంతో కాక మరేదైనా కారణంతో మరణించారో తెలియడం లేదని పేర్కొంది. అనారోగ్యంతో కుటుంబ సభ్యులు మరణిస్తే దానిపై సాధారణంగా ఎవరూ పోలీసులకు ఫిర్యాదు చేయరు. అయితే లక్ష్మి మాత్రం తల్లి మృతిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుతో గంగమ్మ లాకప్డెత్ వ్యవహారం మరుగున పడిపోయింది. సిట్ అధికారులందరూ హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు. అయితే విజయవాడకు చెందిన సాయికృష్ణ లాకప్డెత్ నేపథ్యంలో గంగమ్మ లాకప్డెత్ వ్యవహారం మళ్లీ తెరపైకి వచ్చింది. పిల్తో వెలుగుచూసిన పోలీసుల దాష్టీకం! ప్రాణాపాయ స్థితిలో ఉన్న దుర్గప్ప మరణిస్తే గంగమ్మ లాకప్డెత్ వ్యవహారం మరుగునపడి పోయే ప్రమాదం ఉందని భావించిన కాసుకుర్తి ఆగమన్రాజ్ అనే యువకుడు ఈ మొత్తం వ్యవహారంపై హైకోర్టును ఆశ్రయించారు. దుర్గప్ప చనిపోవడానికి ముందే అతని వాంగ్మూలాన్ని నమోదు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని పిల్ దాఖలు చేశారు. పోలీసుల టార్చర్కు గంగమ్మ మృతి చెందగా, దుర్గప్ప ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో ఉన్నారని తెలిపారు. పోలీసులు మాత్రం బైక్పై నుంచి పడిపోవడం వల్ల దుర్గప్పకు గాయాలయ్యాయని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారని వివరించారు. గంగమ్మను కస్టడీలో పోలీసులు హింసించారా లేదా అనేదానికి ఆ సమయంలో అక్కడే ఉన్న దుర్గప్ప ఏకైక కీలక సాక్షి అని, అతను కూడా చనిపోతే ఈ కేసులో కీలకమైన సాక్ష్యం లేకుండా పోతుందని వివరించారు. కాగా, దుర్గప్ప మోటారుసైకిల్ నుంచి పడటం వల్ల గాయపడ్డారని రిమాండ్ రిపోర్ట్ పేర్కొంటుంటే.. పోలీసుల తరఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది సింగమనేని ప్రణతి మాత్రం దుర్గప్ప అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారని ధర్మాసనం ముందు పేర్కొనడం గమనార్హం. -
పోలీసులే హంతకులైతే.. సీబీ‘ఐ’తోనే న్యాయం
సాక్షి, అమరావతి: కాపు యువకుడు గాదె సాయికృష్ణ లాకప్డెత్ రాష్ట్ర పోలీసుల క్రూరత్వాన్ని మరోసారి బట్టబయలు చేసింది. పౌరులను, చట్టాన్ని రక్షించాల్సిన పోలీసులే హంతకులుగా మారినప్పుడు జరిగే ఘోరానికి.. తమిళనాడులోని తూత్తుకుడి (సాతాన్కుళం), ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ (కృష్ణలంక)లలో జరిగిన రెండు భయంకరమైన లాకప్డెత్లు ప్రత్యక్ష నిదర్శనాలు. తమిళనాడులో కరోనా సమయం 2020 జూన్లో పాన్ షాపు మూసివేతకు సంబంధించిన ఒక చిన్న వ్యవహారంలో జయరాజ్–బెన్నిక్స్ అనే తండ్రి కొడుకులను దారుణంగా కొట్టి లాకప్డెత్ చేసిన 9 మంది పోలీసులకు కోర్టు ఉరిశిక్ష విధించింది. బాధిత కుటుంబానికి రూ.1.40 కోట్లు పరిహారంగా చెల్లించింది. సదరు కేసులో ఎన్ని ఒత్తిడులు ఎదురైనా అప్పట్లో జరిగిన ఆ దారుణంపై రేవతి అనే ఒక మహిళా కానిస్టేబుల్ కోర్టులో చెప్పిన సాక్ష్యం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. జయరాజ్–బెన్నిక్స్ కేసు తరహాలోనే రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సాయికృష్ణ లాకప్డెత్ ఘటనపై సీబీఐ దర్యాప్తుతోనే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని, పోలీసు దర్యాప్తుతో ఏమాత్రం న్యాయం జరగదని సర్వత్రా అభిప్రాయపడుతున్నారు. హైకోర్టుకు ఇచ్చే సమాధానంపై ఆసక్తి విజయలక్ష్మి తరఫు న్యాయవాది ఆదిత్య చౌదరి వాదనలు వినిపిస్తూ పోలీసుల చేతిలో చిత్రహింసలకు గురై సాయికృష్ణ మరణించి ఉంటాడని తల్లి ఆందోళన చెందుతోందన్నారు. ఈ నేపథ్యంలో సాయికృష్ణను తమ ముందు హాజరుపరచి తీరాల్సిందేనని కృష్ణలంక పోలీసులకు హైకోర్టు తేల్చి చెప్పింది. ఇందుకు 29వ తేదీ వరకూ గడువు పొడిగించిన హైకోర్టు, కేసు తదుపరి విచారణనూ అదే రోజుకు వాయిదా వేసింది. ఇప్పటి వరకు సాయికృష్ణ ఆచూకీ తెలియకపోవడం, అతడి శవాన్ని మాయం చేసి కాల్చి బుడిద చేశారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో పోలీసులు 29వ తేదీన హైకోర్టుకు ఏం చెబుతారు? దీనిపై ధర్మాసనం ఎలా స్పందిస్తుందన్న అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. -
అవి సర్కారు హత్యలే!
సాక్షి, అమరావతి: కాపు యువకుడు గాదే సాయికృష్ణ లాకప్లోనే ‘కనుమరుగు’...! పోలీసుల థర్డ్డిగ్రీ వేధింపులు తట్టుకోలేక దళిత యువకుడు క్రాంతి కుమార్ సెల్ఫీ వీడియో తీసుకుని మరీ ఆత్మహత్య... ! ఈ రెండూ చంద్రబాబు ప్రభుత్వం చేసిన హత్యలే!! టీడీపీ కూటమి సర్కారు అరాచక కాండే. ఆ ఇద్దరి కుటుంబ సభ్యులు నెల రోజులపాటు పోలీస్ స్టేషన్ల చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా న్యాయం కాదు కదా కనీసం ఓదార్పు దక్కకపోవడం చంద్రబాబు ప్రభుత్వం రాక్షసత్వాన్ని బట్టబయలు చేస్తోంది. లాకప్లోనే సాయికృష్ణ అదృశ్యం... క్రాంత్రి కుమార్ ఆత్మహత్య..! ఇవి రెండూ చంద్రబాబు ప్రభుత్వం చేసిన హత్యలేనని దేశవ్యాప్తంగా న్యాయ నిపుణులు తేల్చి చెబుతున్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వం దారుణ మారణకాండపై జాతీయస్థాయిలో న్యాయ, రాజ్యాంగ నిపుణులు, పౌర హక్కుల కార్యకర్తలు మండిపడుతున్నారు. న్యాయస్థానం జోక్యం... మీడియా క్రియాశీలతో చంద్రబాబు ప్రభుత్వ దారుణాలు బయటపడ్డాయని స్పష్టం చేస్తున్నారు. ఇంత బరి తెగింపా బాబూ...! దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న విజయవాడ పోలీస్ లాకప్లో మరణాలు... దారుణాలు కచ్చితంగా చంద్రబాబు ప్రభుత్వం చేసిన హత్యలే! విజయవాడ పోలీసులు ఇంతటి అమానుషానికి బరితెగించి లాకప్లలో మరణమృదంగం మోగిస్తున్నా కూటమి ప్రభుత్వం దాదాపు నెల రోజులపాటు కప్పిపుచ్చేందుకు యత్నించడం... అసలు ఏమీ జరగలేదని నిస్సిగ్గుగా బుకాయించేందుకు యత్నించడమే నివ్వెరపరుస్తోంది. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా పోలీసు లాకప్లలో మరణాలను ఇంత బరితెగించి కప్పిపుచ్చేందుకు యత్నించలేదని న్యాయ నిపుణులు మండిపడుతున్నారు. ఆ తల్లి గోడు పట్టని ప్రభుత్వం... బిడ్డల కోసం తల్లిదండ్రులు ఎంతగా తల్లడిల్లిపోతారన్నది పాషాణ చంద్రబాబు ప్రభుత్వానికి ఏమాత్రం పట్టలేదు. గాదే సాయికృష్ణను పోలీసులు మార్కాపురంలో అక్రమంగా నిర్బంధించి తీసుకువెళ్లి థర్డ్ డిగ్రీతో వేధించారు. ఆ విషయం తెలిసిన ఆయన తల్లి కృష్ణలంక పోలీస్ స్టేషన్ చుట్టూ... విజయవాడ పోలీస్ కమిషనర్ కార్యాలయం చుట్టూ తిరిగి తన బిడ్డ కోసం పరితపించారు. అయినా సరే పోలీసుల మనసు ఏమాత్రం కరగలేదు. తన బిడ్డను న్యాయస్థానంలో హాజరుపరచాలని... ప్రాణాలతో అప్పగించాలని ఆమె విజయవాడ ప్రెస్ క్లబ్లో మీడియా ద్వారా ప్రభుత్వాన్ని వేడుకుంది. ఇంతటి విస్తృత ప్రభుత్వ యంత్రాంగం ఉన్నా సరే ముఖ్యమంత్రి చంద్రబాబుగానీ, హోంమంత్రి అనిత గానీ ఏమాత్రం స్పందించలేదు. అసలు సాయికృష్ణ విషయంలో ఏం జరిగిందన్నది ముఖ్యమంత్రి చంద్రబాబు తెలుసుకునే ప్రయత్నమే చేయలేదు. చివరికి ఆమె తన కుమారుడిని అప్పగించాలని హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేయాల్సి వచ్చింది. అయినా సరే చంద్రబాబు ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగానే వ్యవహరించింది. సాయికృష్ణ సంగతి తమకు తెలియదని... అతడిని పోలీసులు అదుపులోకి తీసుకోలేదని న్యాయస్థానానికి సైతం అవాస్తవాలు చెబుతూ వచ్చింది. న్యాయస్థానం జోక్యం... తన కుమారుడు సాయికృష్ణ ఆచూకీ తెలపాలని బాధితుడు తల్లి విజయలక్ష్మి హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేయడంతో డొంక కదిలింది. సాయికృష్ణను పోలీసులే అక్రమంగా నిర్బంధించి అదృశ్యం చేశారని సాక్షి పత్రిక సహేతుక వాదనతో వెలుగులోకి తీసుకువచ్చింది. దాంతో చంద్రబాబు ప్రభుత్వానికి షాక్ తగిలింది. దీంతో హైకోర్టు ఈ కేసులో పోలీసులు, రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. అంతవరకు సాయికృష్ణ విషయమే తెలియదని బుకాయించిన చంద్రబాబు ప్రభుత్వం కొత్త ఎత్తుగడ వేసింది. కేవలం కృష్ణలంక సీఐ నాగరాజు మీద తూతూ మంత్రంగా చర్యలతో విషయాన్ని కప్పిపుచ్చాలని చూసింది. ఆయన్ను వీఆర్కు పంపించి చేతులు దులిపేసుకుంది. వైఎస్ జగన్ రాకతో... తప్పనిసరై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధిత కుటుంబానికి అండగా నిలబడ్డారు. చంద్రబాబు ప్రభుత్వం, పోలీసుల దమనకాండపై మండిపడ్డారు. సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి నివాసానికి గురువారం వెళ్లిన వైఎస్ జగన్ పరామర్శించి భరోసానిచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, హోంమంత్రి అనిత, డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా, విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు, ఇతర పోలీసు అధికారులు అంతా కలిసే ఈ దారుణానికి ఒడిగట్టారని ధ్వజమెత్తారు. బాధిత కుటుంబానికి అండగా నిలిచి న్యాయపోరాటం చేస్తామన్నారు. దాంతో చంద్రబాబు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. విధిలేని పరిస్థితుల్లో ఈ ఉదంతంపై విచారణకు ఆదేశించారు. అప్పటివరకు సాయికృష్ణ గురించే తెలియదు అని బుకాయించిన చంద్రబాబు సర్కారు... అతడిని పోలీసులే లాకప్లో అదృశ్యం చేశారని అంగీకరించక తప్పలేదు. కానీ విచారణను కేవలం సీఐ పాత్ర వరకే పరిమితం చేసి డీజీపీ, విజయవాడ సీపీలను రక్షించేందుకు ఎత్తుగడ వేశారు. దీనిపై వైఎస్సార్సీపీ మండిపడింది. మొత్తం సూత్రధారులు, పాత్రధారులకు శిక్ష పడేవరకు తమ పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేసింది. బుకాయించి.. బెదిరించి! ఇక విజయవాడకు చెందిన దళిత యువకుడు క్రాంతి కుమార్ ఉదంతంలోనూ చంద్రబాబు ప్రభుత్వం అంతే అమానవీయంగా వ్యవహరించింది. తన కుమారుడిని పోలీసులు అక్రమంగా నిర్బంధించి వేధిస్తున్నారని ఆయన తండ్రి వెంకటేశ్వరరావు రోజుల తరబడి మొత్తుకున్నారు. తన కుమారుడిని అప్పగించాలని పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగారు. కానీ అటు ప్రభుత్వంగానీ ఇటు పోలీసులుగానీ ఏమాత్రం స్పందించలేదు. అసలు క్రాంతి కుమార్ సంగతి తమకు తెలియదని ప్రభుత్వం... ఆయన తమ వద్ద లేరని పోలీసులు బుకాయించారు. ఆ తండ్రిని బెదిరించి వెనక్కి పంపేశారు. పోలీసుల వేధింపులు తట్టుకోలేక క్రాంతి కుమార్ ఆత్మహత్య చేసుకున్నా సరే ఖాకీల తీరు ఏమాత్రం మారలేదు. ఆయన తండ్రి వెంకటేశ్వరరావును బెదిరించి మౌనం వహించేలా చేశారు. గుట్టుచప్పుడు కాకుండా క్రాంతికుమార్ అంత్యక్రియలు పూర్తి చేయించారు. దమనకాండపై ఉద్యమించేందుకు ప్రజా సంఘాలు సన్నద్ధం.. దళిత యువకుడు క్రాంతి కుమార్ ఆత్మహత్య చేసుకుంటూ తీసిన సెల్ఫీ వీడియో చంద్రబాబు ప్రభుత్వ బండారాన్ని బయటపెట్టింది. పోలీసులు మూడు నెలలపాటు తనను భౌతికంగా హింసిస్తున్నారని... ఆ చిత్రహింసలు భరించలేకే ఆత్మహత్య చేసుకుంటున్నానని పేర్కొన్నాడు. సెల్ఫీ వీడియో తీస్తూనే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆ వీడియో వెలుగులోకి రావడంతో చంద్రబాబు ప్రభుత్వం సాగిస్తున్న దారుణం బహిర్గతమైంది. రాష్ట్రమే కాదు జాతీయ స్థాయిలో టీడీపీ కూటమి ప్రభుత్వ అమానుష వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.లాకప్లోనే సాయికృష్ణ అదృశ్యం.. పోలీసుల వేధింపులతో క్రాంతి కుమార్ ఆత్మహత్య.. ఇవి రెండూ చంద్రబాబు ప్రభుత్వం చేసిన హత్యలేనని న్యాయ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఈ కర్కశ కూటమి ప్రభుత్వం ఇటువంటివి ఇంకెన్ని దారుణాలు పాల్పడిందోనని సర్వత్రా చర్చ జరుగుతోంది. పోలీసుల అండతో ప్రభుత్వం సాగిస్తున్న మారణకాండకు వ్యతిరేకంగా ఉద్యమించేందుకు ప్రజా సంఘాలు సన్నద్ధమవుతున్నాయి. -
త్వరలో ‘స్థానిక’ ఎన్నికలు నిర్వహిస్తాం
సాక్షి అమరావతి: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు తాము సిద్ధంగా ఉన్నామని.. త్వరలో వాటిని నిర్వహిస్తానని రాష్ట్ర ప్రభుత్వం గురువారం హైకోర్టుకి నివేదించింది. సమగ్ర కుటుంబ సర్వే పూర్తయిందని, దానికి సంబంధించిన డేటాను ఈనెల 19 నుంచి రెండ్రోజుల పాటు గ్రామసభల ముందు ఉంచుతామని రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ ) దమ్మాలపాటి శ్రీనివాస్ తెలిపారు. ఆ తరువాత ఈనెల 24 వరకు అభ్యంతరాలు స్వీకరిస్తామన్నారు. అలాగే, స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ ఖరారు నిమిత్తం ఏర్పాటుచేసిన ఏకసభ్య కమిషన్ త్వరలో నివేదిక ఇస్తుందని ఆయన చెప్పారు. కమిషన్ నివేదిక ఆధారంగా బీసీ రిజర్వేషన్లను ఖరారుచేసి ఎన్నికలు నిర్వహిస్తామని ఆయన కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. వాదనలు విన్న న్యాయస్థానం పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను జూలై 16కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ లీసా గిల్, న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందన్రావు ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీచేసింది. ఏపీ బీసీ సంఘం పిల్ దాఖలు.. బీసీ జన గణన చేపట్టకుండా స్థానిక ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం యత్నిస్తోందని, బీసీ జనాభా లెక్కించిన తరువాతే ఎన్నికలు నిర్వహించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ ఏపీ బీసీ సంఘం అధ్యక్షుడు కేశన శంకర రావు హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. స్థానిక సంస్థల కాల పరిమితి ముగిసిన నేపథ్యంలో వెంటనే ఎన్నికలు నిర్వహించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ న్యాయవాది తాండవ యోగేష్ మరో పిల్ వేయడంతో ఈ రెండు వ్యాజ్యాలపై సీజే ధర్మాసనం గురువారం విచారణ జరిపింది. -
‘ఈ–స్టాంపు’ల కుంభకోణం దర్యాప్తు పురోగతి ఏంటి?
సాక్షి, అమరావతి: తెలుగుదేశం పార్టీ కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు, ఆయన కంపెనీ ఎస్ఆర్సీ ఇన్ఫ్రా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ వేల కోట్ల రూపాయల భారీ ‘ఈ–స్టాంప్’ కుంభకోణానికి పాల్పడిందంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)పై హైకోర్టు స్పందించింది. ఈ వ్యవహారంపై దర్యాప్తు పురోగతి పూర్తి వివరాలను (స్టేటస్ రిపోర్ట్) తమ ముందుంచాలని సీఐడీ దర్యాప్తు అధికారిని ఆదేశిస్తూ తదుపరి విచారణను వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ లీసా గిల్, న్యాయమూర్తి నైనాల జయసూర్య ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. అంతక్రితం పిటిషనర్ మాజీ ఎంపీ తలారి రంగయ్య తరఫున సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్రెడ్డి వాదనలు వినిపిస్తూ, ‘ఇది రూ.2,500 కోట్ల కుంభకోణం. ఎంతో పలుకుబడి కలిగిన ఎమ్మెల్యే సురేంద్రబాబుది ఇందులో కీలక పాత్ర. ఈ కుంభకోణంపై సీబీఐ దర్యాప్తు కోరుతూ గత ఏడాది అక్టోబర్ 7న హైకోర్టులో ఈ పిల్ దాఖలు చేశాం. ఆ మరుసటి రోజే ప్రభుత్వం కేసు దర్యాప్తును సీఐడీకి అప్పగించింది. అయితే సీఐడీ ఇప్పటి వరకు ఏం చేసిందో తెలియడం లేదు’ అని వివరించారు.ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్జీపీ) సింగమనేని ప్రణతి ఈ సందర్భంగా స్పందిస్తూ కుంభకోణంపై మూడు కేసులు నమోదయ్యాయని ధర్మాసనానికి తెలిపారు. 14వేల లావాదేవీలు జరిగాయని, మొత్తం రికార్డులను జప్తు చేశామని పేర్కొంటూ ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి నివేదిక రాగానే సంబంధిత కోర్టులో చార్జ్షీట్ దాఖలు చేస్తామని తెలిపారు. పిల్ వివరాలుఅనంతపురం జిల్లా, కళ్యాణదుర్గంలో బోయ యర్రప్ప.. ‘బాబు మీ సేవా కేంద్రం’ నిర్వహిస్తున్నారు. ఈ కేంద్రం లైసెన్స్ భార్య భార్గవి పేరు మీద ఉంది. అయితే ఇప్పటి వరకు యర్రప్ప 15,851 ఈ–స్టాంపులను తారుమారు చేశారు. టీడీపీ ఎమ్మెల్యే సురేంద్రబాబుతో కలిసి భారీ ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారు. తద్వారా ప్రభుత్వ ఖజానాకు కోట్ల రూపాయల నష్టం కలిగించారు. ఎమ్మెల్యేకు చెందిన ఎస్ఆర్సీ ఇన్ఫ్రా కంపెనీ బెంగళూరులో ఉన్నప్పటికీ, కళ్యాణదుర్గం మీ సేవా కేంద్రం నుంచి తక్కువ విలువ కలిగిన ‘ఈ–స్టాంపు’లను కొనుగోలు చేసి, వాటిని ఎక్కువ విలువ కలిగిన ఈ స్టాంపులుగా మార్చి పలు బ్యాంకుల్లో భారీ ఆర్థిక లావాదేవీలు నిర్వహించింది.ఈ భారీ కుంభకోణంపై స్టాంప్స్ ఐజీ, డీజీపీ, జిల్లా ఎస్పీకి పిటిషనర్ ఫిర్యాదు చేశారు. పిటిషనర్ ఇచ్చిన ఫిర్యాదుపై చర్యలు తీసుకోవాలని సీరియస్ ఫ్రాండ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ (ఎస్ఎఫ్ఐఓ) నుంచి డీజీపీకి లేఖ వెళ్లింది. అయినా ఎవ్వరినుంచీ స్పందనలేదు. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంపై సీబీఐ, ఈడీ, ఎస్ఎఫ్ఐఓ దర్యాప్తునకు ఆదేశించడంతో పాటు, దర్యాప్తుపై రాజకీయ ప్రభావం లేకుండా ఉండేందుకు దర్యాప్తును హైకోర్టు స్వయంగా పర్యవేక్షించాలని కోరుతూ పిటిషనర్ హైకోర్టును ఆశ్రయించారు.36 గంటలు ఎలా పని చేయిస్తున్నారు?పీజీ వైద్య విద్యార్థుల పనిగంటలపై హైకోర్టు ఆందోళనవారి ఉపశమనం కోసం ఏం చేస్తున్నారో చెప్పండిరాష్ట్ర ప్రభుత్వానికి ధర్మాసనం ఆదేశంసాక్షి, అమరావతి: ప్రభుత్వ, బోధనాసుపత్రుల్లో పీజీ వైద్య విద్యార్థుల సుదీర్ఘ పనిగంటల పట్ల హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. నిరంతరాయంగా వారి చేత 36 గంటలు ఎలా పని చేయిస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అత్యవసర పరిస్థితుల్లో వారు ఏకంగా 72 గంటలు ఏకబిగిన పనిచేస్తున్న విషయాన్ని కూడా హైకోర్టు ప్రస్తావించింది. అసాధారణ పని గంటల నుంచి పీజీ వైద్య విద్యార్థులకు ఉపశమనం కలిగించేందుకు ఏ చర్యలు తీసుకుంటున్నారో వివరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ లీసా గిల్, న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్య ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. గుంటూరుకు చెందిన ప్రముఖ వైద్యులు ఆలా వెంకటేశ్వర్లు దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) తాజా విచారణ సందర్భంగా పిటిషనర్ తరఫు న్యాయవాది ఠాకూర్ యాదవ్ వాదనలు వినిపిస్తూ, ‘నిబంధనల ప్రకారం పీజీ వైద్య విద్యార్థులు 12 గంటలకు మించి పని చేయడానికి వీల్లేదు. అత్యవసర పరిస్థితుల్లో 24 గంటలకు మించి సేవలు అందించాల్సిన అవసరం లేదు. నిబంధనలకు అనుగుణంగా పనిగంటలు అమలయ్యేలా ఆదేశాలు ఇవ్వండి’ అని విన్నవించారు. -
హైకోర్టు ఆదేశాలంటే లెక్కలేదా..?
సాక్షి,అమరావతి: అనకాపల్లి జిల్లా, నర్సీపట్నం మునిసిపాలిటీ పరిధిలోని పెద చెరువులో ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదని గతంలో తాము ఆదేశాలు జారీ చేసినా ఇప్పటికీ నిర్మాణాలు కొనసాగుతుండటంపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. తాము ఆదేశాలు జారీ చేసిన తరువాత కూడా పెద చెరువులో నిర్మాణాలకు ఎలా అనుమతులు జారీ చేస్తారని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. నిర్మాణాలు ఆపాలంటూ గతంలో తామిచ్చిన ఉత్తర్వులకు కట్టుబడి ఉండాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ ఉత్తర్వులు తదుపరి విచారణ వరకు అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది. అసలు నీటి వనరుల్లో నిర్మాణాలు చేయవచ్చా? అన్న అంశంపై ఇరుపక్షాలు వాదనలు వినిపించాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను వాయిదా వేసింది. ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ లీసా గిల్, న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్య ధర్మాసనం బుధవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు, ఆయన కుమారుడు ప్రోద్బలంతో పెద చెరువును ఆక్రమించి ‘సృష్టిక్షేత్రం’ పేరుతో చేస్తున్న నిర్మాణాలను సవాలు చేస్తూ మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర గణేష్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై ఈ ఏడాది ఏప్రిల్ 1న విచారణ జరిపిన ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం, పెద చెరువులో ఎలాంటి నిర్మాణాలు చేపట్టడానికి వీల్లేదని ఆదేశించింది. తాజాగా బుధవారం ఈ వ్యాజ్యం మరోసారి విచారణకు వచ్చింది. వాదోపవాదనలు ఇలా... పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్రెడ్డి వాదనలు వినిపిస్తూ ‘కోర్టు ఆదేశాలు ఇచ్చినా కూడా నిర్మాణ పనులు కొనసాగుతూనే ఉన్నాయి. దీనిపై తాము కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశాం. ధర్మాసనం ఆదేశాలను అధికారులు బేఖాతరు చేశారు. స్పీకర్ ఆధ్వర్యంలో విగ్రహాలు ఏర్పాటు అవుతుండటంతో అధికారులు కోర్టు ఆదేశాల కన్నా రాజకీయ నేతలకే ప్రాధాన్యతనిస్తున్నారు’అని వివరించారు.కాగా, వ్యాజ్యంలో అయ్యన్నపాత్రుడి తరఫు న్యాయవాది వీవీ సతీష్ వాదనలు వినిపిస్తూ ‘స్పీకర్ను వ్యక్తిగత హోదాలో ప్రతివాదిగా చేర్చి, ఆయనే చెరువును ఆక్రమించి నిర్మాణాలు చేస్తున్నట్లు ఆరోపణలు చేయడం సరికాదు. పిల్ దాఖలు చేసిన వ్యక్తి ప్రతిపక్ష రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తి. ఎమ్మెల్యే హోదాలో అయ్యన్నపాత్రుడు కేవలం భూమి పూజలో మాత్రమే పాల్గొన్నారు. పిల్ వెనుక రాజకీయ దురుద్దేశాలు ఉన్నాయి’ అని తెలిపారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ రాజకీయాలతో తమకు సంబంధం లేదని స్పష్టం చేసింది. -
సాయికృష్ణ కేసులో పోలీసుల తీరుపై హైకోర్టు సీరియస్
-
ఫేస్బుక్ పేజీని బ్లాక్ చేయడంపై వైఎస్సార్సీపీ న్యాయ పోరాటం
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ అధికారిక ఫేస్బుక్ పేజీని అందుబాటులో లేకుండా చేసిన చంద్రబాబు ప్రభుత్వ దుశ్చర్యపై ఆ పార్టీ న్యాయ పోరాటానికి దిగింది. వైఎస్సార్సీపీ ఫేస్బుక్ పేజీని భారతదేశంలో నిలిపివేయడానికి ఏ ప్రభుత్వ అధికారి ఉత్తర్వులిచ్చారు?, ఏ నిర్దిష్ట కంటెంట్ ఆధారంగా ఈ చర్య తీసుకున్నారు?అనే పూర్తి వివరాలను, నోటీసుల అసలు ప్రతులను వెంటనే తమకు అందజేసేలా మెటాను ఆదేశించాలని కోరుతూ వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి మంగళవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఐటీ చట్టంలోని సెక్షన్ 79(3)(బీ) కింద ఏదైనా ఖాతాదారుడి కంటెంట్ను తొలగించినప్పుడు, ప్రభుత్వ నోటీసు నకలును సదరు ఖాతాదారుడికి అందించాల్సిన బాధ్యత సంబంధిత సోషల్ మీడియా సంస్థ అయిన మెటాపై ఉందన్నారు. వైఎస్సార్సీపీ ఫేస్బుక్ పేజీని బ్లాక్ చేసే విషయంలో మెటా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిందని తెలిపారు. ఫేస్బుక్ పేజీని బ్లాక్ చేయడానికి గల కారణాలను తెలియజేయకపోవడం, అందుకు సంబంధించిన నోటీసు కాపీని ఇవ్వకపోవడం చట్టవిరుద్ధం, ఏకపక్షం, రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించాలని ఆయన హైకోర్టును అభ్యరి్థంచారు. ఈ వ్యాజ్యం తేలేంతవరకు, సదరు బ్లాకింగ్కు దారితీసిన ప్రభుత్వ నోటీసులు, కమ్యూనికేషన్ల కాపీలను తక్షణమే పిటిషనర్లకు సమర్పించేలా మెటా సంస్థను ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోర్టును కోరారు. ‘మెటా అధికార పార్టీకి సహకరిస్తోంది’ ‘శ్రేయా సింఘాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ప్రభుత్వ నోటీసులను సాకుగా చూపి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు తమ ఇష్టానుసారంగా వ్యవహరించకూడదని సుప్రీంకోర్టు చాలా స్పష్టమైన తీర్పునిచ్చింది. ఈ బ్లాకింగ్ ప్రభుత్వ ‘సహయోగ్ పోర్టల్’ ద్వారా జరిగిందని భావిస్తున్నారు. అయితే, నోటీసు ఇచ్చిన సంస్థ అసలు చట్టబద్ధంగా నోటిఫై చేయబడిన సంస్థేనా కాదా అనే వివరాలు దాచారు. ఐటీ బ్లాకింగ్ రూల్స్–2009లోని రూల్ 16 ప్రకారం కొన్ని విషయాలు రహస్యంగా ఉంచవచ్చు. కానీ అది సెక్షన్ 69ఏ కింద చేసే బ్లాకింగ్కు మాత్రమే వర్తిస్తుంది. సెక్షన్ 79(3)(బీ) కింద మెటా తీసుకునే చర్యలకు ఈ రహస్య నిబంధన వర్తించదు. తటస్థ వేదికగా ఉండాల్సిన మెటా, అధికార పక్షం చెప్పినట్లు వింటూ ప్రతిపక్ష పార్టీ గొంతు నొక్కడానికి సహకరిస్తోంది. తద్వారా అది తన తటస్థతను కోల్పోయింది’ అని వివరించారు. ఈ వ్యాజ్యంలో కేంద్ర ఎల్రక్టానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ కార్యదర్శి, కేంద్ర ఎల్రక్టానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ డిజిగ్నేటెడ్ ఆఫీసర్, మెటా ప్లాట్ఫామ్ ఇంక్, రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శిని ప్రతివాదులుగా పేర్కొన్నారు. ‘మా భావ ప్రకటన స్వేచ్ఛ హరించడమే’ ‘2026 జూన్ 9న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారిక ఫేస్బుక్ పేజీని భారతదేశంలో ఎవరికీ కనిపించకుండా మెటా సంస్థ నిలిపివేసింది. ఐటీ చట్టంలోని సెక్షన్ 79(3)(బీ) కింద భారత ప్రభుత్వం, లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీల నుంచి వచ్చిన నోటీసు ఆధారంగా ఈ పేజీని నిలిపివేసినట్టు మెటా పేర్కొంది. అయితే, ఏ అధికారి లేదా ఏ శాఖ నోటీసు ఇచ్చిందో మెటా స్పష్టం చేయలేదు. ఎటువంటి ముందస్తు నోటీసు లేదా సంజాయిషీ ఇచ్చుకునే అవకాశం ఇవ్వకుండా రాత్రికి రాత్రే ఫేస్బుక్ పేజీని బ్లాక్ చేశారు. రాజకీయ పార్టీగా ప్రజలతో, లక్షలాది మంది ఫాలోవర్లతో కమ్యూనికేట్ చేయడం మా పార్టీ ప్రాథమిక హక్కు. మా పార్టీ అధికారిక ఫేస్బుక్ పేజీని బ్లాక్ చేయడం రాజ్యాంగం మాకు ప్రసాదించిన భావప్రకటన స్వేచ్ఛను హరించడమే. ఏదైనా నిర్దిష్ట పోస్ట్, వీడియో లేదా ఇమేజ్ చట్టవిరుద్ధంగా ఉంటే దాన్ని తొలగించవచ్చు. కానీ, కేవలం ఒక అస్పష్టమైన నోటీసుతో ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీకి చెందిన మొత్తం ఫేస్బుక్ పేజీని బ్లాక్ చేయడం చట్టపరిధిని మించిన చర్య’ అని అప్పిరెడ్డి తన వ్యాజ్యంలో పేర్కొన్నారు. -
కాపు యువకుడిది లాకప్ డెత్తేనా!
సాక్షి టాస్క్ ఫోర్స్: చంద్రబాబు, చినబాబు రెడ్బుక్ అరాచక పాలనలో మరో సమాధానం లేని ప్రశ్న.. కాపు యువకుడు గాదె సాయికృష్ణ ఏమయ్యాడు? సాయికృష్ణ మిస్సింగ్ వ్యవహారం రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ పనితీరుపై, శాంతిభద్రతల పరిస్థితిపై తీవ్ర సందేహాలు లేవనెత్తుతోంది. సాయికృష్ణ బ్రతికే ఉన్నాడా? లాకప్లో చంపేశారా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. సాయికృష్ణను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని, బలవంతంగా ఎత్తుచికెళ్లారని కుటుంబ సభ్యులు చెబుతుండగా, అతని ఆచూకీ గురించి పోలీసులు స్పష్టత ఇవ్వలేకపోవడం ప్రజాస్వామ్య వ్యవస్థకు ఆందోళన కలిగిస్తోంది. ఒక తల్లి తన కుమారుడు బతికున్నాడో, లేదో తెలియక హైకోర్టును ఆశ్రయించాల్సి రావడం రాష్ట్ర పరిపాలనపై ప్రజల్లో అనుమానాలు పెంచుతోంది. ప్రజల ప్రాణాలు, స్వేచ్ఛలను కాపాడాల్సిన వ్యవస్థే ఒక వ్యక్తి ఆచూకీపై స్పష్టత ఇవ్వలేకపోతే, సాధారణ పౌరుడు తన భద్రత గురించి ఎలా నమ్మకం కలిగి ఉంటాడు? సమాధానాలు లేని ప్రశ్నలు ఈ వ్యవహారంలో హైకోర్టు స్పందించి సాయికృష్ణ ఆచూకీ కనుగొని తన ముందు హాజరుపరచాలని ఆదేశించడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఒకవేళ పోలీసులు చెప్పినట్లే సాయికృష్ణ వారి అదుపులో లేకపోతే, అతను చివరిసారిగా ఎక్కడ కనిపించాడు? అతని కదలికలపై స్పష్టమైన వివరాలు ఎందుకు లేవు? అనే ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనా అలాగే పోలీసు శాఖపైనా ఉంది. సాయికృష్ణను ఈ నెల 29వ తేదీలోపు తన ముందు ప్రవేశపెట్టి తీరాల్సిందేనంటూ హైకోర్టు ధర్మాసనం ఇచ్చిన ఆదేశాలతో ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని మసిబూసి మారేడుకాయ చేసే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. దీనిలో భాగంగానే కృష్ణలంక సీఐ నాగరాజును హడావిడిగా వీఆర్కు పంపినట్లు తెలుస్తోంది. స్వతంత్ర విచారణకు ఆదేశించాలి చంద్రబాబు ప్రభుత్వంలో పోలీసు వ్యవస్థ రాజకీయ ఒత్తిళ్ల కింద పనిచేస్తోందన్నది ఇప్పటికే పలు సందర్భాల్లో స్పష్టమైంది. ఒక వ్యక్తిని అక్రమంగా నిర్బంధించారనే అనుమానం ఉన్నప్పుడు భారత రాజ్యాంగం అత్యవసర పరిష్కారంగా ‘హెబియస్ కార్పస్ పిటిషన్’ను తన ప్రజల ముందు ఉంచింది. అలాంటి పరిస్థితి ఏర్పడటమే ప్రజాస్వామ్య వ్యవస్థకు ఒక హెచ్చరికగా చూడాలి. ఇలాంటి పిటిషన్లు ఇప్పుడు హైకోర్టులో పెరిగిపోతుండడం ఆందోళన కలిగించే విషయం. ఇక్కడ సమస్య ఒక్క సాయికృష్ణ గురించే కాదు. రాష్ట్రంలో చట్టబద్ధ పాలన ఎలా అమలవుతోంది? పోలీసుల చర్యలపై పర్యవేక్షణ ఎంత సమర్థంగా ఉంది? పౌర హక్కులకు ఎంత విలువ ఇస్తున్నారు? అనే తీవ్ర ప్రశ్నలు ముందుకు వస్తున్నాయి.ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈ సాయికృష్ణ మిస్సింగ్ వ్యవహారంపై స్వతంత్ర విచారణకు ఆదేశించి, వాస్తవాలను ప్రజల ముందు ఉంచాలి. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. పోలీసు శాఖ చట్టానికి మాత్రమే విధేయంగా ఉండాలి. కానీ ఒక వ్యక్తి ఆచూకీపై హైకోర్టు పదేపదే జోక్యం చేసుకోవాల్సి రావడం పరిపాలనా వైఫల్యంగా కనిపిస్తోంది. సాయికృష్ణ ఎక్కడ ఉన్నాడు? అతని పరిస్థితి ఏమిటి? అనే ప్రశ్నలకు త్వరితగతిన, విశ్వసనీయ సమాధానం రాకపోతే, ఈ ఘటన చంద్రబాబు ప్రభుత్వ పాలనపై మరింత తీవ్రమైన అనుమానాలను రేకెత్తిస్తుంది. సీఐ బెదిరించారంటున్న తల్లి ‘నీ కొడుకును చంపేస్తా.. చచ్చిపోయాడనుకో.. వాడిపై ఆశలు వదులుకో... వాడు ఇకపై నీవద్దకు రాడు’ అంటూ కృష్ణలంక సీఐ నాగరాజు బెదిరించాడని సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి ఆరోపిస్తున్నారు. గత మే నెల 9, 10 తేదీలలో మార్కాపురం నుండి తన కుమారుడు గాదె సాయికృష్ణను కృష్ణలంక పోలీసులు ఎవరికి చెప్పకుండా స్టేషన్కు తీసుకువచ్చారని, అప్పటి నుంచి అతని ఆచూకీ తెలియలేదని తల్లి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘బ్రతికి ఉంటే కోర్టుముందు హాజరుపరచండి.. లేదంటే మృతదేహాన్ని అప్పగించండి’ అంటూ కన్నీటి పర్యంతమవుతుండడం రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలనూ తీవ్ర ఆవేదనకు గురిచేస్తోంది.ఈ విషయమై ఆమె బెజవాడ బార్ అసోసియేషన్ మానవహక్కుల కమిటీ చైర్మన్ను సంప్రదించి, తనకు న్యాయం చేయాలని అర్థించారు. ‘మే నెలలో కృష్ణలంక పోలీసులు నా ఇంటివద్దకు వచ్చారు. సీఐ పోలీసుస్టేషన్కు రమ్మంటున్నారంటూ స్టేషన్కు తీసుకెళ్లారు. అక్కడ నా సెల్ఫోన్ను లాక్కొని, కొద్దిరోజులు వారి వద్దే ఉంచుకొన్నారు. ఫోన్ను తిరిగి ఇవ్వమని ఎన్నిసార్లు అడిగినా, రోజుల తరబడి తిప్పించుకొన్నారే తప్ప తిరిగి ఇవ్వలేదు’అంటూ ఆమె చెబుతున్న మాటలు రాష్ట్రంలో చంద్రబాబు పాలనలో పోలీసుల అరాచకాన్ని కళ్లకు కడుతోంది. తన కొడుకును చంపేసి ఉంటారని ఆమె హైకోర్టు ధర్మాసనం సాక్షిగా ఆందోళన వ్యక్తం చేయడం చర్చనీయాంశంగా మారింది. ‘నా కొడుకును చంపేశారేమోనని చివరికి ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురీకి కూడా వెళ్లి చూశా’ అన్న ఆమె ఆవేదన అందరినీ కంటతడి పెట్టిస్తోంది. సాయికృష్ణను మా ముందు హాజరుపరిచి తీరాల్సిందేకృష్ణలంక పోలీసులకు 29 వరకు గడువు పొడిగించిన హైకోర్టువిజయవాడకు చెందిన గాదె సాయికృష్ణను తమ ముందు హాజరుపరచి తీరాల్సిందేనని కృష్ణలంక పోలీసులకు హైకోర్టు తేల్చి చెప్పింది. ఇందుకు 29వ తేదీ వరకూ గడువు పొడిగించిన హైకోర్టు.. కేసు తదుపరి విచారణనూ అదే రోజుకు వాయిదా వేసింది. ఆలోపు సాయికృష్ణ ఆచూకీ లభించినా కూడా.. వెంటనే తమ ముందు హాజరు పరచాలని హైకోర్టు స్పష్టం చేసింది. కాగా, పోలీసులు చంపేసి ఉంటారన్న అనుమానాలను సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి వ్యక్తం చేశారు.సాక్షి, అమరావతి: విజయవాడకు చెందిన గాదె సాయికృష్ణను తమ ముందు హాజరుపరచి తీరాల్సిందేనని కృష్ణలంక పోలీసులకు హైకోర్టు తేల్చి చెప్పింది. ఇందుకు 29 వతేదీ వరకూ గడువు పొడిగించిన హైకోర్టు, కేసు తదుపరి విచారణనూ అదే రోజుకు వాయిదా వేసింది. ఆలోపు సాయికృష్ణ ఆచూకీ లభించినా కూడా.. వెంటనే తమ ముందు హాజరు పరచాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ రావు రఘునందన్రావు, జస్టిస్ తూటా చంద్ర ధనశేఖర్ ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. విజయవాడ కృష్ణలంకకు చెందిన సాయికృష్ణ కొంత కాలంగా మార్కాపురంలో ఉంటున్నాడు.అయితే పలు కేసులు ఉన్నాయన్న కారణంతో సాయికృష్ణను కృష్ణలంక పోలీసులు ఇటీవల మార్కాపురం నుంచి విజయవాడకు తీసుకొచ్చారని, ఆ తరువాత నుంచి ఆచూకీ తెలియడంలేదని, తన కుమారుడు అసలు బతికున్నాడో లేదో కూడా తెలియడం లేదని, అతడిని కోర్టు ముందు హాజరుపరిచేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ తల్లి విజయలక్ష్మి హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై ఇటీవల విచారణ జరిపిన ధర్మాసనం, ఈ నెల 15న సాయికృష్ణను తమ ముందు హాజరుపరచాలని పోలీసులను ఆదేశించింది.సోమవారం విచారణ సందర్భంగా పోలీసుల తరఫున ఏజీపీ కృష్ణ ప్రణీత్ వాదనలు వినిపిస్తూ, సాయికృష్ణ ఆచూకీ తెలియలేదని, అందుకే అతడిని కోర్టు ముందు హాజరుపరచలేదని తెలిపారు. అతడిని వెతికేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామన్నారు. కోర్టు ముందు హాజరుపరిచేందుకు మరింత సమయం కావాలని కోరారు. విజయలక్ష్మి తరఫు న్యాయవాది ఆదిత్య చౌదరి వాదనలు వినిపిస్తూ పోలీసుల చేతిలో చిత్రహింసలకు గురై సాయికృష్ణ మరణించి ఉంటాడని తల్లి ఆందోళన చెందుతోందన్నారు. -
సాయికృష్ణ బతికే ఉన్నాడా?.. లేదంటే చంపేశారా?
సాక్షి,విజయవాడ: నెల రోజుల క్రితం ఆచూకీ గల్లంతయిన గాదె సాయి కృష్ణ కేసుపై ఏపీ హైకోర్టులో ఈవాళ విచారణ జరిగింది. విచారణలో న్యాయస్థానం సీఐ నాగరాజుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈనెల 29లోగా బాధితుణ్ని హైకోర్టులో ప్రవేశ పెట్టాలని ఆదేశించింది. లేదంటే సీఐ నాగరాజుపై కేసు నమోదు చేస్తామని హెచ్చరికలు జారీ చేసింది.కేసు పూర్వాపరాల్ని పరిశీలిస్తే.. నెల రోజుల క్రితం ‘నీ కొడుకును చంపేస్తా.. చచ్చిపోయాడనుకో.. వాడిపై ఆశలు వదులుకో... వాడు ఇకపై నీవద్దకు రాడు’.. అంటూ విజయవాడ కృష్ణలంక సీఐ నాగరాజు బెదిరించారని మార్కాపురం జిల్లాకు చెందిన గాదె సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి విజయవాడలో మీడియా ఎదుట కన్నీటి పర్యంతరమయ్యారు. తన కుమారుడిని చంపేస్తానని చెప్పడంతో విజయవాడ ప్రభుత్వాస్పత్రి మార్చురీలో కూడా చూసి వచ్చానన్నారు. తన కొడుకు బతికి ఉంటే కోర్టులో హాజరుపరచాలని, చంపేస్తే శవాన్ని ఇవ్వాలని కోరారు.తనకు న్యాయం చేయాలని కోరుతూ ఆ సమయంలో ఆమె న్యాయవాదులతో కలిసి విజయవాడలో బెజవాడ బార్ అసోసియేషన్ (బీబీఏ) కార్యాలయం వద్ద ధర్నా చేశారు. ధర్నా సందర్భంగా విజయలక్ష్మి మాట్లాడుతూ.. విజయవాడ కృష్ణలంక పోలీసులు గతనెల (మే)9వ తేదీ రాత్రి జిల్లా కేంద్రం మార్కాపురం నుంచి గాదె సాయికృష్ణను విజయవాడ తీసుకొచ్చారని చెప్పారు. అప్పటి నుంచి అతడి సమాచారం ఏమీ తెలియడంలేదన్నారు. తరువాత సీఐ నాగరాజు తీసుకురమ్మన్నారని చెప్పి కృష్ణలంక పోలీసులు తనను మార్కాపురం నుంచి విజయవాడ తీసుకొచ్చారని తెలిపారు.తన సెల్ఫోన్ను పోలీసులు లాక్కున్నారన్నారు. ఎన్నిసార్లు పోలీసులకు వద్దకు వెళ్లి తన కుమారుడి గురించి, తన ఫోన్ గురించి అడిగినా పట్టించుకోలేదని చెప్పారు. తన కొడుకును తీసుకొచ్చి 20 రోజులు దాటిపోయిందని, ఇప్పటికీ కోర్టులో హాజరుపర్చలేదంటే అతడిని చంపేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. తన కొడుకు బతికి ఉంటే కోర్టులో హాజరుపరచాలని, చంపేస్తే శవాన్ని అయినా ఇవ్వాలని కన్నీటితో వేడుకున్నారు. ఈ నేపథ్యంలో తన కుమారుడు గురించి సమాచారం ఇవ్వాలని కోరుతూ గాదె సాయికృష్ణ తల్లి ఏపీ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్పై విచారణ చేపట్టిన న్యాయస్థానం సాయికృష్ణను కోర్టులో హాజరుపరచాలని సీఐ నాగరాజును ఆదేశించింది. -
ఏపీ హైకోర్టులో సాయికృష్ణ తల్లి.. హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు
-
పబ్లిక్ టాయిలెట్స్ నిర్మాణం ప్రభుత్వాల విధి
సాక్షి, అమరావతి: రాజ్యాంగ ఆదేశిక సూత్రాల ప్రకారం పబ్లిక్ టాయిలెట్స్ను ప్రజలకు అందుబాటులో ఉంచడం ప్రభుత్వాల విధి అని హైకోర్టు పేర్కొంది. ఈ సౌకర్యం కల్పించలేని ప్రభుత్వాలు తమను తాము సంక్షేమ ప్రభుత్వాలుగా చెప్పుకోలేవని స్పష్టంచేసింది. పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన జీవనమన్నది జీవించే హక్కులో భాగమని తేల్చి చెప్పింది. రోడ్ల పక్కన తగినన్ని పబ్లిక్ టాయిలెట్స్ నిర్మించడం వల్ల మహిళలు, ట్రాన్స్జెండర్ల వ్యక్తిగత గోప్యతకు రక్షణ కల్పించడంతో పాటు వారికి ఉండే భయాలను తొలగించినట్లవుతుందని పేర్కొంది.అయితే పబ్లిక్ టాయిలెట్స్ను ఏర్పాటు చేసి చేతులు దులుపుకుంటామంటే సరిపోదని, ఏడాది పొడవునా వాటిని సక్రమంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వాలపై ఉందని ఉద్ఘాటించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్ ఇటీవల ఒక వ్యాజ్యంలో తీర్పు వెలువరించారు.విశాఖపట్నం, పిఠాపురం కాలనీలో, మద్దిలపాలెం బస్డిపో సమీపంలో తమ ఇళ్ల ఎదురుగా ఉన్న జీవీఎంసీ స్థలంలో పబ్లిక్ టాయిలెట్స్ నిర్మిస్తున్నారని, దీనిని అడ్డుకోవాలని కోరుతూ కె.చిన్నస్వామి శెట్టి మరో ఇద్దరు దాఖలు చేసిన పిటిషన్లను న్యాయమూర్తి కొట్టివేశారు. నిర్వహణ విషయంలో అశ్రద్ధ చూపితే ఆ విషయాన్ని వెంటనే అధికారుల దృష్టికి తీసుకెళ్లవచ్చునని పిటిషనర్లకు సూచించారు. -
ఆస్తి యాజమాన్య హక్కులను గ్రామ పంచాయతీలు తేల్చలేవు
సాక్షి, అమరావతి: భవన నిర్మాణ అనుమతుల మంజూరు విషయంలో గ్రామ పంచాయతీల అధికారంపై హైకోర్టు ముఖ్యమైన తీర్పును వెలువరించింది. అనుమతుల విషయంలో గ్రామ పంచాయతీలు సివిల్ కోర్టులాగా వ్యవహరించడానికి వీల్లేదని స్పష్టం చేసింది. లీగల్ నోటీసులను సాకుగా చూపి భవన నిర్మాణ దరఖాస్తులను తిరస్కరించడం చట్టవిరుద్ధమని, ఆ అధికారం గ్రామపంచాయతీలకు లేదని తేల్చిచెప్పింది. భవన నిర్మాణ అనుమతులు మంజూరు చేసేటప్పుడు స్థానికసంస్థలు కేవలం దరఖాస్తుదారుడి ప్రాథమిక హక్కులను, ఆ ఆస్తి దరఖాస్తుదారుడి స్వాధీనంలో ఉందా? లేదా? అన్న అంశాలను మాత్రమే పరిశీలించాలంది. అంతేగానీ సివిల్ కోర్టుల్లా యాజమాన్య హక్కులను తేల్చే అధికారం వాటికి లేదని తేల్చిచెప్పింది. ఒక వ్యక్తి పంపిన లీగల్ నోటీసు ఆధారంగా ఓ భవననిర్మాణ అనుమతిని రద్దుచేస్తూ పంచాయతీ చేసిన తీర్మానాన్ని హైకోర్టు తప్పుపట్టింది. తీర్మానం ఏకపక్షంగా ఉందంటూ దాన్ని రద్దుచేసింది. పిటిషనర్ జమాల్రెడ్డి వద్ద రిజిస్టర్డ్ సేల్డీడ్, ఇంటిపన్ను చెల్లించిన రశీదులున్నాయని, ఇవి ఆయనకు ఆ ఆస్తిపై ఉన్న ప్రాథమిక హక్కును నిరూపిస్తున్నాయని తెలిపింది. పిటిషనర్ ప్రస్తుతం భవనం నిర్మిస్తున్న చోటే నివాసం ఉన్నారని గుర్తుచేసింది. పిటిషనర్ నివాసం, పన్నులు చెల్లించిన విషయంతో పంచాయతీ అధికారులు విభేదించడంలేదని, ఇది అతడి ప్రాథమిక హక్కులను రూఢీ చేస్తోందని పేర్కొంది. భవననిర్మాణం కోసం జమాల్రెడ్డి పెట్టుకున్న దరఖాస్తును ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్ట నిబంధనల ప్రకారం పునఃపరిశీలించి 15 రోజుల్లో తగిన ఉత్తర్వులు జారీచేయాలని పంచాయతీ అధికారులను హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ సత్తి సుబ్బారెడ్డి ఇటీవల కీలక తీర్పు వెలువరించారు. ‘భవన నిర్మాణానికి అనుమతిని నిరాకరించిన పంచాయతీ తీర్మానంపై పిటిషనర్కు ప్రభుత్వం వద్ద అప్పీల్ చేసుకునే ప్రత్యామ్నాయ అవకాశం ఉంది. అయితే పంచాయతీ నిర్ణయం ఏకపక్షంగా ఉన్నందున ఈ కోర్టే నేరుగా జోక్యం చేసుకుంటోంది.’ అని న్యాయమూర్తి తన తీర్పులో పేర్కొన్నారు.అనుమతి నిరాకరణపై హైకోర్టులో పిటిషన్ కర్నూలు జిల్లా సీతారామపురం గ్రామానికి చెందిన కాంటారెడ్డి జమాల్రెడ్డి 2009లో కొన్న స్థలంలో మట్టి ఇల్లు నిర్మించుకుని, పంచాయతీకి ఇంటిపన్ను చెల్లిస్తున్నారు. ఆయన మట్టి ఇంటిని కూల్చేసి భవనం నిర్మించుకోవాలనుకున్నారు. ఆ ఆస్తిపై యాజమాన్య వివాదం ఉందంటూ.. జమాల్రెడ్డికి ఆ స్థలం విక్రయించిన వ్యక్తి వారసులు పంచాయతీ కార్యదర్శికి లీగల్ నోటీసు పంపారు. ఈ లీగల్ నోటీసు ఆధారంగా గ్రామ పంచాయతీ 2025 డిసెంబర్ 24న జమాల్రెడ్డి ఇంటి నిర్మాణానికి అనుమతిని నిరాకరించింది. దీన్ని సవాలు చేస్తూ జమాల్రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యంపై విచారించిన న్యాయమూర్తి జస్టిస్ సత్తి సుబ్బారెడ్డి ఇటీవల తీర్పు వెలువరించారు. అనుమతుల వల్ల కొత్త హక్కులు రావు.. ఉన్నవి పోవు.. ‘భవననిర్మాణ అనుమతి ఇవ్వడం అనేది ఒక వ్యక్తికి కొత్తగా యాజమాన్య హక్కులను కల్పించదు. అలాగే మరొకరికున్న హక్కులను లాగేసుకోదు. ఒకవేళ ఆస్తిపై ఎవరికైనా నిజమైన అభ్యంతరాలుంటే వారు సివిల్ కోర్టును ఆశ్రయించి తేల్చుకోవాలి. అంతేతప్ప పంచాయతీలు సివిల్ కోర్టుల పరిధిని తమ చేతుల్లోకి తీసుకోకూడదు. ఈ కేసులో జమాల్రెడ్డి స్థలం యాజమాన్యపు హక్కులపై అభ్యంతరం వ్యక్తం చేసినవారు కేవలం లీగల్ నోటీసు ఇచ్చారే తప్ప, ఇప్పటివరకు సివిల్ కోర్టులో కేసు దాఖలు చేయలేదు’ అని న్యాయమూర్తి తన తీర్పులో పేర్కొన్నారు. -
మైనర్ల పాస్పోర్ట్పై ఒంటరి తల్లికి ఊరట
సాక్షి, అమరావతి: మైనర్ బిడ్డల పాస్పోర్ట్ విషయంలో ఇబ్బందులు పడుతున్న ఒంటరి తల్లులకు ఊరటనిస్తూ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. భర్త సమ్మతి లేదా సంతకం లేకుండానే మైనర్ల పాస్పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకునే పూర్తి హక్కు ఒంటరి తల్లికి ఉందని హైకోర్టు తేల్చి చెప్పింది. ఏదైనా కోర్టు నుండి లేదా సమర్థ అధికారి నుంచి ఎటువంటి నిషేధాజ్ఞలు లేని సందర్భాల్లో తండ్రి సమ్మతి లేకుండా, కేవలం తల్లి సమర్పించిన దరఖాస్తు ఆధారంగా మైనర్ బిడ్డకు పాస్పోర్ట్ జారీ చేయవచ్చా.. లేదా? అన్న ప్రశ్నకు హైకోర్టు ఈ మేరకు స్పష్టమైన సమాధానం ఇచ్చినట్లయింది. పిటిషనర్ కుమార్తె పాస్పోర్ట్ దరఖాస్తును పరిశీలించి, రెండు వారాల్లో పాస్పోర్ట్ జారీ చేయాలని ఈ వ్యాజ్యంలో విజయవాడ ప్రాంతీయ పాస్పోర్ట్ అధికారిని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ ఇటీవల తీర్పు వెలువరించారు. సదరు ఒంటరి తల్లి ఇప్పటికే దరఖాస్తుతో పాటు చట్ట నిబంధనల ప్రకారం సమర్పించాల్సిన ’అనెక్సర్–సి’, ’అనెక్సర్–డి’ పత్రాలను సమర్పించారని, విడాకుల కేసు కోర్టులో పెండింగ్లో ఉందన్న విషయాన్ని కూడా తెలియజేశారని, ఈ నేపథ్యంలో విడాకుల పత్రాల కోసం పాస్పోర్ట్ అధికారులు పట్టుబట్టడం సరికాదని స్పష్టం చేసింది. ఈ వ్యాజ్యంలో తన 4 ఏళ్ల కుమార్తెకు పాస్పోర్ట్ కోసం ఒక మహిళ గత ఏడాది ఆగస్టులో దరఖాస్తు చేసుకున్నారు. అయితే పాస్పోర్ట్ అధికారులు ఆమె భర్త సంతకం లేదా కోర్టు నుండి విడాకులు/న్యాయపరంగా విడిపోవడానికి సంబంధించిన పత్రాలను తీసుకురావాలని మౌఖికంగా ఒత్తిడి చేస్తూ పాస్పోర్ట్ జారీ ప్రక్రియను నిలిపివేశారు. దీనిని సవాలు చేస్తూ షేక్ షబానా హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. -
స్క్వేర్ ఫీటు.. ‘హై’రేటు
సాక్షి, అమరావతి: రాజధానిలో అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్(ఏజీసీ) ప్రాంతంలో ‘ఎఫ్’ బ్లాక్లో నిర్మిస్తున్న హైకోర్టు శాశ్వత భవన నిర్మాణం ఖర్చు రోజురోజుకు పెరిగిపోతోంది. ఈ క్రమంలో రూఫ్టాప్ ఎలివేషన్ కోసం ప్రీకాస్ట్ పిన్స్ నిర్మాణం, ఆ భవనం వెలుపల పార్కింగ్, సెక్యూరిటీ పెవిలియన్, అంతర్గత రోడ్డు, సబ్స్టేషన్, వాటర్ బాడీస్ వంటి పనులు చేపట్టేందుకు ప్రభుత్వం మరో రూ.547.07 కోట్లను మంజూరు చేసింది. ఈ పనులను డిజైన్, బిల్డ్ లంప్సమ్ విధానంలో టెండర్లు నిర్వహించి.. కాంట్రాక్టర్లకు అప్పగించేందుకు ఏజీఐసీఎల్(అమరావతి గ్రోత్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్)కు అనుమతిస్తూ పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు శుక్రవారం ఉత్తర్వులిచ్చారు. దాంతో హైకోర్టు శాశ్వత భవనం నిర్మాణ వ్యయం రూ.2,027.76 కోట్లకు చేరుకుంది.. చదరపు అడుగు నిర్మాణ వ్యయం రూ.9,978లకు చేరింది. హైకోర్టు శాశ్వత భవనాన్ని ఏజీసీలో ‘ఎఫ్’ బ్లాక్లో 42.36 ఎకరాల్లో బేస్మెంట్, గ్రౌండ్ ఫ్లోర్, ఏడు అంతస్తులు(బీ+జీ+7)లో 20,32,231 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తోంది. ఈ భవన నిర్మాణ డిజైన్ను పోస్టర్స్ అండ్ పార్టనర్స్ సంస్థ రూపొందించింది. రూ.924.69 కోట్ల నుంచి రూ.2,027.76 కోట్లకు..హైకోర్టు శాశ్వత భవన నిర్మాణ పనులకు రూ.752.06 కోట్ల అంచనా వ్యయంతో లంప్సమ్ విధానంలో 24 నెలల్లో పూర్తిచేసి, మరో మూడేళ్లు భవనాన్ని నిర్వహించాలన్న షరతుతో గతేడాది మార్చి 1న సీఆర్డీఏ టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ టెండర్లో 4.52 శాతం అధిక (ఎక్సెస్) ధరకు అంటే రూ.786.05 కోట్లకు కోట్ చేసిన ఎన్సీసీ లిమిటెడ్ సంస్థ చేజిక్కించుకుంది.. జీఎస్టీ, న్యాక్, సీనరేజీ వంటి పన్నుల రూపంలో రూ.138.64 కోట్లు అదనంగా ఇస్తామని టెండర్లో సీఆర్డీఏ పేర్కొంది. అంటే.. హైకోర్టు శాశ్వత భవన నిర్మాణ పనుల కాంట్రాక్టు విలువ రూ.924.69 కోట్లన్నమాట.ఇక ఈ భవనానికి హైసైడ్ ఎలక్ట్రికల్, హెచ్వీఏసీ(హీటింగ్ వెంటిలేషన్ అండ్ ఎయిర్ కండీషనింగ్), అగ్నిమాపక వ్యవస్థ, ప్లంబింగ్, ఈఎల్వీ(సీసీ టీవీ, ఫైర్ అలారమ్తో కూడిన భద్రత వ్యవస్థ) పనులు చేపట్టడానికి మరో రూ.556 కోట్లను మంజూరు చేస్తూ ఫిబ్రవరి 27న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పుడు హైకోర్టు శాశ్వత భవనం వెలుపల అభివృద్ధి పనులు చేపట్టేందుకు రూ.547.07 కోట్ల మంజూరు చేసింది. దాంతో హైకోర్టు శాశ్వత భవన నిర్మాణ వ్యయం రూ.2,027.76 కోట్లకు చేరుకుంది. సుప్రీం కోర్టుకు కొత్తగా 86,500 చదరపు మీటర్లు(9,31,078.25 చదరపు అడుగులు)లో రూ.800 కోట్ల వ్యయంతో అదనపు భవనం నిర్మిస్తున్నారు. అంటే.. సుప్రీం కోర్టు కొత్త భవనం కంటే 11,01,152.75 (రెట్టింపు) చదరపు అడుగులు ఎక్కువ నిర్మిత ప్రాంతంతో హైకోర్టు నిర్మిస్తున్నట్లు స్పష్టమవుతోంది. సుప్రీం కోర్టు దేశం మొత్తానికి ప్రాతినిధ్యం వహిస్తుంది. 28 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాల కేసులు సుప్రీం కోర్టులో విచారణకు వస్తాయి. అమరావతిలో ఇప్పటికే రూ.173 కోట్లతో హైకోర్టు తాత్కాలిక భవనాన్ని 2017–18లో ప్రభుత్వం నిర్మించింది. కొత్త భవనం పూర్తయితే తాత్కాలిక భవనం కోసం చేసిన వ్యయం రూ.173 కోట్లు వృథా అవనుంది. నిర్మాణం పూర్తయ్యే సరికి అంచనా వ్యయం ఎంతకు చేరుతుందో? రాజధానిలో వెలగపూడి వద్ద 2015లో ఆరు లక్షల చదరపు అడుగుల నిర్మిత ప్రాంతంతో తాత్కాలిక సచివాలయం నిర్మాణ పనులను చదరపు అడుగు రూ.3,350 చొప్పున రూ.201 కోట్లకు షాపూర్జీ పల్లోంజీ, ఎల్ అండ్ టీ సంస్థలకు అప్పట్లో చంద్రబాబు ప్రభుత్వం అప్పగించింది. కానీ.. వాటి నిర్మాణం పూర్తయ్యే సరికి అంచనా వ్యయం రూ.1,151 కోట్లకు చేరుకుంది. అంటే.. చదరపు అడుగుకు రూ.19,183 చొప్పున బిల్లులు చెల్లించారు. ఇప్పుడు హైకోర్టు శాశ్వత భవనం నిర్మాణం పూర్తయ్యేసరికి నిర్మాణ వ్యయంతో ఇంకెంతకు చేరుతుందో ఊహించుకోవచ్చునని ఇంజినీరింగ్ నిపుణులు చెబుతున్నారు. బెంగళూరు, హైదరాబాద్, చెన్నై వంటి మహానగరాల్లో ఫైవ్ స్టార్ సదుపాయాలతో ఇటాలియన్ మార్బుల్స్తో భవనాల నిర్మాణ వ్యయం చదరపు అడుగుకు రూ.4 వేల నుంచి 4,500కు మించదని గుర్తు చేస్తున్నారు. రాజధాని నిర్మాణం పేరుతో అధిక వడ్డీలకు జాతీయ, అంతర్జాతీయ బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి అప్పుగా తెచ్చిన నిధులతో చేపట్టిన భవనాల నిర్మాణంలో దుబారా చేస్తూ కమీషన్లు వసూలు చేసుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. -
సోషల్ మీడియా పోస్టును అల్లర్లను ప్రేరేపించే నేరంగా చిత్రీకరిస్తారా?
ఐపీసీ సెక్షన్ 153 లేదా 153ఏ కింద ఒక వ్యక్తిని దోషిగా తేల్చాలంటే.. కేవలం అతను మాట్లాడిన మాటలు లేదా పెట్టిన పోస్టులు మాత్రమే సరిపోవు. సమాజంలో హింసను ప్రేరేపించాలనే లేదా ప్రజాశాంతికి భంగం కలిగించాలనే కచ్చితమైన నేరపూరిత ఉద్దేశం ఆ వ్యక్తికి ఉందని తప్ప నిసరిగా నిరూపించాల్సి ఉంటుంది. ఆ ఉద్దేశం లేనప్పుడు ఆ సెక్షన్ కింద నేరం మోపడం సాధ్యం కాదు. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు పలు సందర్భాల్లో కూడా చెప్పింది. అలాగే ఒక వ్యక్తి ఒక నిర్దిష్ట వర్గానికి లేదా సమాజానికి వ్యతిరేకంగా ద్వేషాన్ని రేకెత్తించేలా ప్రత్యక్షంగా ఎలాంటి చర్యలకు పాల్పడనప్పుడు, కేవలం అనుమానాల ఆధారంగా ఐపీసీ సెక్షన్ 153ఏ వంటి తీవ్రమైన సెక్షన్లను వారిపై మోపడం చట్టవిరుద్ధం. – హైకోర్టుసాక్షి, అమరావతి: సోషల్ మీడియాలో ఏ పోస్టు పెట్టినా.. ఆ పోస్టు దేనికి సంబంధించిందన్న దాంతో నిమిత్తం లేకుండా దానిని అల్లర్లను ప్రేరేపించే తీవ్రమైన నేరంగా పోలీసులు చిత్రీకరించడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. ‘ఐపీసీ సెక్షన్ 153 లేదా 153ఏ కింద ఒక వ్యక్తిని దోషిగా తేల్చాలంటే, కేవలం అతను మాట్లాడిన మాటలు లేదా పెట్టిన పోస్టులు మాత్రమే సరిపోవు. సమాజంలో హింసను ప్రేరేపించాలనే లేదా ప్రజాశాంతికి భంగం కలిగించాలనే ఖచ్చితమైన నేరపూరిత ఉద్దేశం ఆ వ్యక్తికి ఉందని తప్పనిసరిగా నిరూపించాల్సి ఉంటుంది. అటువంటి ఉద్దేశం లేనప్పుడు ఆ సెక్షన్ కింద నేరం మోపడం సాధ్యం కాదు. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు పలు సందర్భాల్లో కూడా చెప్పింది. అలాగే ఒక వ్యక్తి ఒక నిర్దిష్ట వర్గానికి లేదా సమాజానికి వ్యతిరేకంగా ద్వేషాన్ని రేకెత్తించేలా ప్రత్యక్షంగా ఎలాంటి చర్యలకూ పాల్పడనప్పుడు, కేవలం అనుమానాల ఆధారంగా ఐపీసీ సెక్షన్ 153ఏ వంటి తీవ్రమైన సెక్షన్లను వారిపై మోపడం చట్టవిరుద్ధం. ఒక సమూహంలో ఉన్నంత మాత్రాన లేదా ఒక నిర్దిష్ట గ్రూపుతో సంబంధం ఉన్నంత మాత్రాన, ఆ గ్రూపు చేసే ప్రతి తప్పును వ్యక్తిగతంగా ఒకరికి ఆపాదించలేం. నేరంలో ప్రత్యక్ష భాగస్వామ్యం లేనప్పుడు, కేవలం సదరు వ్యక్తులతో పరిచయం ఉందనే నెపంతో ఎవరినీ దోషిగా నిలబెట్టలేం’, అని హైకోర్టు స్పష్టం చేసింది. ఉమ్మడి కృష్ణా జిల్లా, పెనుగంచిప్రోలు, మాగల్లు గ్రామాలకు చెందిన ఇద్దరు యువకులపై ఐపీసీ సెక్షన్ 153 కింద నమోదు చేసిన కేసును కొట్టేసింది. అయితే ఇదే కేసులో ఐపీసీ సెక్షన్ 120బీ, 505 (2), ఐటీ చట్టం సెక్షన్ 66 కింద జరిగే విచారణలో (ప్రొసీడింగ్స్) జోక్యానికి మాత్రం నిరాకరించింది. ఈ మేరకు ఇటీవల హైకోర్టు తీర్పు వెలువరించింది. -
గోప్యత హక్కు పేరుతో నేరస్తులు తప్పించుకోలేరు
సాక్షి, అమరావతి: ఫోర్జరీ ద్వారా నకిలీ ఆధార్ కార్డు సృష్టించి, ఒకరి భూమిని మరొకరికి విక్రయించిన వ్యవహారంలో వాస్తవాలను నిగ్గుతేల్చేందుకు సదరు నకిలీ ఆధార్కు సంబంధించిన బయోమెట్రిక్, ఇతర అనుమతించదగిన వివరాలను పోలీసులకు అందచేయాలని ఆధార్ అథారిటీని హైకోర్టు ఆదేశించింది. వ్యక్తిగత గోప్యత పేరుతో నేరగాళ్లు చట్టం నుండి తప్పించుకోవడానికి వీల్లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. ఆధార్ చట్టం–2016 సెక్షన్ 33(1) ప్రకారం సమాచారాన్ని బహిర్గతం చేయడంపై సంపూర్ణ నిషేధం లేదని హైకోర్టు గుర్తు చేసింది. ‘సాధారణంగా ఒకరి ఆధార్ వివరాలను మరొకరికి ఇవ్వడం వల్ల గోప్యతకు భంగం కలుగుతుంది. కానీ ఈ కేసులో ఒక ప్రత్యేకమైన పరిస్థితి ఉంది.వివాదంలో ఉన్న ‘ఆధార్ కార్డు’ స్వయంగా అప్పీలుదారు పేరుతోనే జారీ అయింది. ఎవరో ఒక అపరిచిత మూడో వ్యక్తి తన పేరుతో నకిలీ కార్డు సృష్టించి మోసానికి పాల్పడ్డారని అప్పీలుదారు వాదిస్తున్నారు. అప్పీలుదారు తన స్వంత పేరు, గుర్తింపుతో ముడిపడి ఉన్న సమాచారాన్ని మాత్రమే కోరుతున్నారు కాబట్టి.. ఇక్కడ వేరొకరి వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగే అవకాశమే లేదు.’ అని హైకోర్టు ఈ సందర్భంగా స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ లీసా గిల్, న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందన్రావు ధర్మాసనం ఇటీవల తీర్పు వెలువరించింది. నకిలీ ఆధార్ కార్డ్ సృష్టించి భూమి అమ్మేసిన ఆగంతకుడు... విశాఖపట్నం జిల్లా, పెందుర్తి మండలం, సరిపల్లి గ్రామంలోని సర్వే నంబర్ 156/1 , 157/11లో 1.99.5 ఎకరాల భూమికి ఏలప్రోలు సీతారామాంజనేయులు యజమాని. అయితే ఒక గుర్తుతెలియని వ్యక్తి సీతారామాంజనేయులు పేరుతో నకిలీ ఆధార్ కార్డును సృష్టించి, తానే సీతారామాంజనేయులనంటూ 2021లో రెండు వేర్వేరు సేల్ డీడ్ల ద్వారా ఈ భూమిని ఇతరులకు అక్రమంగా అమ్మేశాడు. పెందుర్తి పోలీస్ స్టేషన్లో ఈ మేరకు ఫిర్యాదు నమోదయ్యింది. దీనిపై విశాఖపట్నం జిల్లా కోర్టులో దావా కూడా దాఖలయ్యింది. విశాఖపట్నం జిల్లా రిజిస్ట్రార్, తనిఖీలు చేపట్టి నకిలీ సేల్ డీడ్లను రద్దు చేస్తూ 2021న ఉత్తర్వులు జారీ చేశారు.కాగా, పోలీసుల దర్యాప్తులో భాగంగా సదరు నకిలీ ఆధార్ కార్డును సృష్టించిన వ్యక్తి అసలు వివరాలు, బయోమెట్రిక్ సమాచారాన్ని సేకరించడానికి బాధితుడు సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేసుకున్నారు. అయితే, చట్టంలోని సెక్షన్ 8 (1)(జే) ప్రకారం మూడో వ్యక్తికి సంబంధించిన వ్యక్తిగత వివరాలను వెల్లడించలేమంటూ ఆధార్ యంత్రాంగం ఆ అభ్యర్థనను తిరస్కరించింది. అటు పోలీసులు కూడా ఈ వివరాలు సేకరించడంలో చొరవ చూపకపోవడంతో, బాధితుడు సీతారామాంజనేయులు 2025లో హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిని సింగిల్ జడ్జి కొట్టివేయడంతో, సీతారామాంజనేయులు ద్విసభ్య ధర్మాసనాన్ని ఆశ్రయించారు. -
కోర్టు చెబితే ఇచ్చేయాలా?
సాక్షి, అమరావతి: రేయింబవళ్లు కష్టపడి సాధించుకున్న ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలేసి పొమ్మంటే వారికి ఎలా ఉంటుంది? ఆ బాధ వర్ణనాతీతం! మళ్లీ నోటిఫికేషన్ నాటికి వయసు ఉంటుందో మీరిపోతుందో తెలియని పరిస్థితి. అలాంటిది మెగా డిఎస్సీ–2025లో కష్టపడి సాధించుకున్న ఉపాధ్యాయ ఉద్యోగాలను పలువురికి ఇచ్చేదిలేదు పొమ్మంది చంద్రబాబు ప్రభుత్వం. దాంతో అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించగా, వారికి ఉద్యోగాలు ఇవ్వాలని ఆదేశించింది. కానీ ప్రభుత్వం మాత్రం అప్పటికే నియామకాలు జరిగి పోయాయని చెప్పడంతో న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. నష్టపోయిన అభ్యర్థులకు పోస్టింగ్ ఇవ్వాల్సిందేనని మరోసారి ఆదేశించగా, సర్కారు వాటినీ పెడచెవిన పెట్టింది. దాంతో అధికారులను ఇంప్లీడ్ చేస్తూ అభ్యర్థులు కోర్టు ధిక్కరణ పిటిషన్లు వేశారు. ఇలా దాదాపు 20కి పైగా కోర్టు ధిక్కరణ కేసులు ఉన్నాయంటే చంద్రబాబు ప్రభుత్వం డీఎస్సీని ఎంత పారదర్శకంగా, ఘనంగా ఎలా చేపట్టిందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. 148 రోజుల్లో మొత్తం ప్రక్రియ ముగించామని సర్కారు పెద్దలు గొప్పలు చెబుతున్నా, తీవ్రంగా నష్టపోయిన అభ్యర్థుల గురించి మాత్రం పట్టించుకోక పోవడం పట్ల పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మెగా డీఎస్సీ విధానాలపై దాఖలైన 200కు పైగా పిటిషన్లలో పలు కోర్టు ధిక్కరణ పిటిషన్లు కూడా ఉన్నాయి. ఇప్పటికే ఎంపికప్రక్రియ పూర్తయిపోయిందని చెబుతున్న ప్రభుత్వం.. నష్టపోయిన వారికి కోర్టు ఆదేశాల మేరకు పోస్టులు ఇచ్చేందుకు అంగీకరించడం లేదు. ఆదిలోనే మెరిట్కు పాతర గత వైఎస్ జగన్ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ రద్దు చేసిన చంద్రబాబు ప్రభుత్వం 16,347 ఉపాధ్యాయ పోస్టులకు డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ పోస్టులకు 3,36,307 మంది అభ్యర్థులు 5,77,694 దరఖాస్తులు సమర్పించారు. అభ్యర్థులు వారి వారి అర్హతలను బట్టి ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్, టీజీటీ, పీజీటీ, ప్రిన్సిపల్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 2,41,387 దరఖాస్తులు ఒకటి కంటే ఎక్కువ ఉద్యోగాలు పొందే అర్హతలున్న వారివే. పరీక్షలు సైతం వేర్వేరుగా నిర్వహించారు. అర్హతలు, ప్రతిభగల అభ్యర్థులు ఎస్జీటీతో పాటు స్కూల్ అసిస్టెంట్, టీజీటీ, పీజీటీ, ప్రిన్సిపల్ పోస్టుల్లో రెండు కంటే ఎక్కువ ఉద్యోగాలు పొందే అర్హత సాధించారు. వీటిల్లో ప్రిన్సిపల్, పీజీటీ, టీజీటీ, స్కూల్ అసిస్టెంట్, ఎస్జీటీ పోస్టులు ప్రాధాన్యక్రమంలో ఉంటాయి. ఒక ఎస్జీటీ 20 ఏళ్లకు పైగా పని చేసి, అర్హత సంపాదిస్తే స్కూల్ అసిస్టెంట్ (ఎస్ఏ)గా పదోన్నతి వస్తుంది. ఇక పీజీటీ అయ్యే అవకాశమే లేదు. ఈ క్రమంలో రెండు లేదా మూడు ఉద్యోగాలకు అర్హత సాధించిన అభ్యర్థులు ఉన్నత ఉద్యోగం పొందాలనే కోరుకుంటారు. మెరిట్ ప్రకారం మూడు పోస్టులకు కాల్ లెటర్లు పంపాల్సి ఉన్నా, దరఖాస్తులో మొదటి ప్రాధాన్యంగా ఎంపిక చేసుకున్న పోస్టుకే కాల్ లెటర్లు పంపారు. దీంతో అభ్యర్థి సాధించిన పోస్టుల్లో నచ్చిన పోస్టు ఎంపిక చేసుకునే అవకాశం లేకుండా చేశారు. ఇలా దాదాపు 4 వేల మంది ఉన్నత పోస్టును పొందే అవకాశం కోల్పోయారు. దాంతో కొందరు అభ్యర్థులు తమకు జరిగిన అన్యాయంపై హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు తీర్పును అధికారులు పట్టించుకోలేదని తూర్పుగోదావరి జిల్లాకు చెందిన 11 మంది డీఎస్సీ అభ్యర్థులు వేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్ (నం.4203/2025), కుల ధ్రువీకరణ పత్రం నకిలీదని తిరస్కరించిన ఘటనలో ఏఎస్సార్ జిల్లాకు చెందిన దుర్గాప్రసాద్ హైకోర్టులో వేసిన పిటిషన్ 3470/25 వివరాలు సర్కారు తీరుపై న్యాయస్థానం ఆగ్రహండీఎస్సీలో ఉన్నత ఉద్యోగాలు సాధించినా, ఆప్షన్ ఇవ్వలేదన్న కారణంతో 54 మందిని ఎస్జీటీలుగా పరిగణించారు. వీరంతా హైకోర్టును ఆశ్రయించారు. దాంతో న్యాయస్థానం విద్యా శాఖ తీరును తప్పుబట్టింది. విద్య, వైద్యంలో మెరిట్ను కాదని, కింది వారికి అవకాశం ఇస్తే ఆ దేశం నాశనం అవుతుందని తీవ్రంగా ఆక్షేపించింది. వారు సాధించిన పోస్టులు వారికే ఇచ్చేయాలని ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. కానీ, కోర్టు ఉత్తర్వులు పట్టించుకోకుండా ప్రభుత్వం గత ఏడాది అక్టోబర్ 15 నాటికి డీఎస్సీ ఎంపిక, పోస్టింగ్స్ ఇచ్చేసి ప్రక్రియ ముగించామని తెలిపింది. దీంతో కోర్టు ఆదేశాలను పట్టించుకోలేదని అభ్యర్థులు మరోసారి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ప్రభుత్వ న్యాయవాది వారి స్థానాల్లో వేరే వారిని నియమించామని చెప్పడంతో కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తామిచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించింది. తమ మధ్యంతర ఉత్తర్వులను పట్టించుకోకుండా.. మీకు తోచిన సమాధానం చెప్పడం దుర్మార్గమైన చర్యగా అభివర్ణించింది. రెండు నెలల్లోగా వారి ఉద్యోగాలు వారికి ఇవ్వాలని జనవరిలోనే తీర్పునిచ్చింది. కానీ, ప్రభుత్వం మాత్రం హైకోర్టు తీర్పును ఇప్పటికీ పట్టించుకోలేదు. బాధితులు ఒక్కరికీ ఉద్యోగం ఇవ్వలేదు. డీఎస్సీ ప్రక్రియ ముగిసిపోయిందని, కొత్తగా ఎవరికీ ఉద్యోగాలు ఇచ్చేది లేదని అభ్యర్థులపై పాఠశాల విద్యాశాఖ బెదరింపు ధోరణి ప్రదర్శించినట్టు బాధితులు వాపోయారు.తప్పుపై తప్పులకు నిదర్శనాలెన్నెన్నో..⇒ 200 మందికి పైగా అభ్యర్థులు తమకు జరిగిన అన్యాయంపై హైకోర్టులో పిటిషన్లు వేశారు. ఆ పిటిషన్లలో మచ్చుకు కొన్ని ఇలా ఉన్నాయి.⇒ డీఎస్సీలో మెరిట్ సాధించినా పరీక్షల్లో మాస్ కాపీయింగ్కు పాల్పడ్డారని ఆరోపిస్తూ తూర్పుగోదావరి జిల్లాకు చెందిన 11 మందికి ఉద్యోగాలు ఇవ్వలేదు. కోర్టులో ఆ ఆరోపణలను ప్రభుత్వం రుజువు చేయలేక పోవడంతో వారికి పోస్టింగ్ ఇవ్వాలని న్యాయస్థానం ఆదేశించింది. ఆ తీర్పును ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో వారంతా మరోసారి కోర్టు ధిక్కరణ పిటిషన్ (నం.4203/2025) వేశారు. ఇందులో డీఎస్సీ నాటి పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయరామరాజును ప్రధాన ప్రతివాదిగా చేర్చారు.⇒ అనంతపురం జిల్లాకు చెందిన గొల్ల రెడ్డమ్మ (4261/25), బి.సరస్వతి (3585/25), వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన శ్రీకాంత్ రాయల్ (3130/ 25) స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ డైరెక్టర్ పోస్టులకు (స్పోర్ట్స్ కోటా) ఎంపికయ్యారు. అయితే వారి సర్టిఫికెట్లపై అనుమానం వ్యక్తం చేస్తూ పోస్టులు ఇచ్చేందుకు తిరస్కరించారు. దాంతో వారు కోర్టును ఆశ్రయించి తమ తప్పులేదని నిరూపించుకున్నారు.⇒ అనంతపురం జిల్లాకు చెందిన రవీంద్రకుమార్ (1350/25), చిత్తూరు జిల్లా నగరికి చెందిన ఎం.మోహన్ (1347/26) స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగం సాధించినా మెరిట్ కం రోస్టర్ సరిగా అమలు చేయకపోవడంతో అవకాశం కోల్పోయారు. తమకు అన్యాయం జరిగిందని ఆధారాలతో కోర్టును ఆశ్రయించగా, వారికి పోస్టు ఇవ్వాలని ఆదేశించింది. కానీ ప్రభుత్వం పట్టించుకోలేదు.⇒ అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన దుర్గాప్రసాద్ (3470/25) ఉపాధ్యాయ ఉద్యోగం సాధించినా, కుల ధ్రువీకరణ పత్రం నకిలీదంటూ తిరస్కరించారు. దాంతో ఆయన జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేయగా, స్థానిక తహసీల్దార్ నేతృత్వంలో అధికారుల కమిటీని వేసి దుర్గాప్రసాద్ కుల ధ్రువీకరణ సర్టిఫికెట్ సరైనదేనని నిర్ధారించారు. కానీ, అతనికి పోస్టు ఇవ్వలేదు. ఇదే కోవలో తిరుపతి జిల్లాకు చెందిన ఎ.శిరీష (3060/25) ఉద్యోగాన్ని కూడా ఎస్సీ సర్టిఫికెట్ ఫేక్ అని తిరస్కరించారు. ఆమె కూడా తన సర్టిఫికెట్ సరైనదేనని నిరూపించుకున్నారు. కానీ ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వలేదు.⇒ గుంటూరుకు చెందిన జి.రాజేశ్ దినకర్ (1335/26) ఫిజికల్ హ్యాండీక్యాప్డ్ సర్టిఫికెట్ ‘ఫేక్’ అని ఎస్ఏ పోస్టు తిరస్కరించారు. దాంతో మరోసారి గుంటూరు వైద్యుల కమిటీ ముందు హాజరై సచ్చీలతను నిరూపించుకున్నారు. సదరం సర్టిఫికెట్ సరైనదేనని ధ్రువీకరించినా పోస్టు ఇవ్వలేదు. -
ఫలించిన గిరిజన యువకుడి 13 ఏళ్ల న్యాయపోరాటం
సాక్షి, అమరావతి: పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగం కోసం ఓ గిరిజన యువకుడు చేసిన 13 ఏళ్ల న్యాయపోరాటం ఎట్టకేలకు ఫలించింది. అతడికి కానిస్టేబుల్గా ఉద్యోగం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. కేసు ఉందన్న విషయాన్ని దాచిపెట్టాడన్న కారణంతో ఆ గిరిజన యువకుడికి ఉద్యోగం ఇవ్వకపోవడాన్ని తప్పుపట్టింది. సమాజంలోని ఉన్నతవర్గాల వారు ఎన్నో క్రిమినల్ కేసులున్నా దేశంలో అత్యున్నత పదవులకు పోటీపడుతున్నప్పుడు.. ఒక పేద గిరిజన యువకుడికి చిన్న సంఘటన ఆధారంగా ఉద్యోగం నిరాకరించడం అన్యాయమని పేర్కొంది. ఇలా సమాజంలో వెనుకబడిన యువతకు అవకాశాలు నిరాకరిస్తే, వారు అసాంఘిక శక్తుల వైపు మళ్లే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. యువత చేసిన చిన్న తప్పులకు వారిని జీవితాంతం శిక్షించకూడదని, ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు సైతం చెప్పిందని గుర్తుచేసింది. వాస్తవం చెప్పకపోవడాన్ని ఆటోమేటిక్ అనర్హతగా కూడా పరిగణించరాదంది. పిటిషనరయిన గిరిజన యువకుడిపై నమోదైంది హత్య, దోపిడీ లేదా అత్యాచారం వంటి తీవ్రమైన నేరం కాదని, కేవలం గ్రామంలో జరిగిన ఒక చిన్న ఘర్షణ అని, అందులోనూ అతను 13వ నిందితుడని పేర్కొంది. ఈ కేసు మినహా అతడిపై అంతకు ముందుగానీ, తర్వాతగానీ ఎలాంటి క్రిమినల్ రికార్డు లేదని గుర్తుచేసింది. గ్రామీణ గిరిజన ప్రాంతానికి చెందిన పిటిషనర్.. ఉద్యోగం పోతుందనే అమాయకత్వపు భయంతోనే తనపై కేసు నమోదైన సమాచారాన్ని దాచిపెట్టాడే తప్ప, అందులో ఎటువంటి దురుద్దేశం లేదని పేర్కొంది. సమాచారం దాచిపెట్టిన ప్రతి సందర్భాన్ని ఘోర తప్పిదంగా భావించి ఉద్యోగాన్ని యాంత్రికంగా రద్దుచేయడం చెల్లదని సుప్రీంకోర్టు గతంలోనే స్పష్టంగా చెప్పిందని గుర్తుచేసింది. అధికారులు విచక్షణతో, కేసు తీవ్రతను బట్టి నిర్ణయం తీసుకోవాలంది. పిటిషనర్ ఎంపిక రద్దును చట్టవిరుద్ధంగా, ఏకపక్షంగా పరిగణిస్తూ.. సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు ధర్మాసనం కొట్టేసింది. అలాగే పిటిషనర్ ఎంపికను రద్దుచేస్తూ అధికారులు 2011, 2014 సంవత్సరాల్లో జారీచేసిన రెండు మెమోలను రద్దుచేసింది. తీర్పు వచ్చిన రోజు నుంచి నాలుగు వారాల్లో పిటిషనర్ను పోలీస్ కానిస్టేబుల్ (సివిల్) పోస్టులోకి నియమించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. పిటిషనర్కు వేతన సదుపాయాలు, సీనియారిటీ, ఇతర సేవా ప్రయోజనాలు కల్పించాలంది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ బట్టు దేవానంద్, జస్టిస్ సుబేందు శమంతో ధర్మాసనం ఇటీవల సంచలన తీర్పు వెలువరించింది. పెంచలయ్య నిర్దోషి అని కోర్టు చెప్పినా.. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డి పాళేనికి చెందిన గిరిజన యువకుడు దొడ్ల పెంచలయ్య 2008లో కానిస్టేబుల్ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నారు. రాతపరీక్ష, శారీరక దారుఢ్య పరీక్షల్లో విజయం సాధించి ఉద్యోగానికి తాత్కాలికంగా ఎంపికయ్యారు. గ్రామంలో రాజకీయ కారణాల వల్ల 2010లో పెంచలయ్యపై పోలీసులు కేసు నమోదు చేశారు. తరువాత పోలీసులు ఎంపికయిన అభ్యర్థుల పూర్వ చరిత్రను పరిశీలించే సమయంలో పెంచలయ్యపై కేసు గురించి తెలిసింది. దీంతో పోలీసులు పెంచలయ్య నియామకాన్ని రద్దుచేస్తూ 2011లో ఉత్తర్వులు జారీచేశారు. దీనిపై 2013లో పెంచలయ్య న్యాయపోరాటం ప్రారంభించారు. తొలుత ట్రిబ్యునల్ను ఆశ్రయించారు. అక్కడ కేసు పెండింగ్లో ఉండగానే పెంచలయ్యపై నమోదైన కేసును కింది కోర్టు కొట్టేసింది. అతడిని నిర్దోషిగా ప్రకటించింది. అయితే ట్రిబ్యునల్ మాత్రం పెంచలయ్య పిటిషన్ను కొట్టేసింది. అటు తరువాత ఈ వ్యవహారం హైకోర్టుకు చేరింది. విచారణ జరిపిన సింగిల్ జడ్జి సైతం పెంచలయ్యకు వ్యతిరేకంగా ఉత్తర్వులు జారీచేశారు. దీనిపై ఆయన ధర్మాసనం ముందు అప్పీల్ చేశారు. ఈ అప్పీల్పై జస్టిస్ దేవానంద్ నేతృత్వంలోని ధర్మాసనం ఇటీవల విచారణ జరిపి న్యాయం చేసింది. -
మీరు కొట్టకపోతే.. గాయాలు ఎలా అవుతాయి?
సాక్షి, అమరావతి: ఓ కేసులో కొడుకు నిందితుడిగా ఉంటే పోలీసులు అతని తండ్రిని స్టేషన్కు తీసుకెళ్లి హింసించి తీవ్రంగా కొట్టిన ఘటనపై హైకోర్టు స్పందించింది. ఈ మొత్తం వ్యవహారంలో కౌంటర్లు దాఖలు చేయాలని నెల్లూరు జిల్లా ఎస్పీ వేజెండ్ల అజితతో పాటు గూడూరు గ్రామీణ పోలీసులను ఆదేశించింది. ఇదే సమయంలో ఈ ఘటనపై వివరణ ఇచ్చేందుకు స్వయంగా కోర్టు ముందు హాజరైన నెల్లూరు జిల్లా ఎస్పీ, గూడూరు గ్రామీణ పోలీసులను నిలదీసింది. నిందితుడైన కొడుకును పోలీస్స్టేషన్కు తీసుకురాలేదన్న కారణంతో తండ్రిని ఎలా కొడతారని ప్రశి్నంచింది. కొట్టలేదని కోర్టు హాలులో ఉన్న పోలీసులు చెప్పగా, మీరు కొట్టకుంటే ఆయనకు తీవ్ర గాయాలు ఎలా అవుతాయని కోర్టు నిలదీసింది. ఈ మొత్తం వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను జూన్కి వాయిదా వేశారు. ఈ మేరకు న్యాయమూర్తి మెడమల్లి బాలాజీ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.హింసించి, వేధించి కొట్టారనేందుకు ఆధారాలున్నాయన్న హైకోర్టు నెల్లూరు జిల్లా మంగళపూరు గ్రామానికి చెందిన రోజూ వారీ కూలీ, దళితుడు అయిన గడుతోటి పోలయ్య కుమారుడు ఓ కేసులో నిందితుడు. అయితే గూడూరు గ్రామీణ పోలీసులు పోలయ్యను తీసుకెళ్లి హింసించి, వేధించి తీవ్రంగా కొట్టి గాయపరిచారు. దీనిపై పోలయ్య హైకోర్టును ఆశ్రయించారు. పోలీసులపై చర్యలకు ఆదేశాలు జారీ చేయడంతో పాటు తనకు నష్టపరిహారం చెల్లించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ పిటిషన్ వేశారు. దీనిపై ఇటీవల విచారణ జరిపిన హైకోర్టు, పోలీసుల దెబ్బల వల్ల పోలయ్య తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చేరారని, వైద్య నివేదికలు, ఫొటోలు ఆయనపై దాడిని దృవీకరిస్తున్నాయని స్పష్టం చేసింది.ఈ దాష్టీకంపై వివరణ ఇచ్చేందుకు ఎస్పీ అజితతో సహా, గూడూరు గ్రామీణ ఇన్స్పెక్టర్ కిషోర్ బాబు, ఎస్ఐ తిరుపతయ్య, కానిస్టేబుళ్లు దాస్, చిన్నాల వ్యక్తిగత హాజరుకు ఆదేశాలిచి్చంది. కోర్టు ఆదేశాల మేరకు వీరు వ్యక్తిగతంగా గురువారం కోర్టు ముందు హాజరయ్యారు.పిటిషనర్ తరఫు న్యాయవాది వీ.సురేంద్రరెడ్డి వాదనలు వినిపిస్తూ ఈ వ్యవహారంపై ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేయాలని ఎస్పీని హైకోర్టు ఆదేశించినా ఇప్పటి వరకూ ఎలాంటి కేసు నమోదు చేయలేదన్నారు. -
కొడుకు నిందితుడైతే..తండ్రిని హింసిస్తారా?
సాక్షి, అమరావతి : ఓ కేసులో కొడుకు నిందితుడిగా ఉంటే అతని తండ్రిని తీసుకెళ్లి పోలీసులు విచక్షణారహితంగా కొట్టిన ఘటనను హైకోర్టు తీవ్రంగా పరిగణించింది. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా చెన్నూరు మండలం మంగళపూరు గ్రామానికి చెందిన రోజూవారి కూలీ గడుతోటి పోలయ్య కొడుకు ఓ కేసులో నిందితుడిగా ఉన్నాడు. అయితే అతను అందుబాటులో లేకపోవడంతో పోలీసులు గత నెల 18న పోలయ్యను స్టేషన్కు తీసుకెళ్లారు. అక్కడ హింసించి, తీవ్రంగా కొట్టి గాయపరిచారు. దీంతో పోలీసుల తీరును నిరసిస్తూ పోలయ్య హైకోర్టును ఆశ్రయించారు.పోలీసులు తన హక్కులను హరించారని, బాధ్యులైన వారిపై చర్యలకు ఆదేశించడంతో పాటు తనకు నష్టపరిహారం చెల్లించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై జస్టిస్ లక్ష్మణరావు విచారణ జరిపారు. పోలయ్య తరఫున న్యాయవాది వి.సురేంద్రరెడ్డి వాదనలు వినిపించారు. పోలీసుల దాడి వల్ల పోలయ్యకు అయిన గాయాల తాలుకా వైద్య రికార్డులను, ఘటనపై స్థానిక పత్రికల్లో వచి్చన కథనాలను కూడా కోర్టు ముందుంచారు. అలాగే వాస్తవాలను నిగ్గు తేల్చేందుకు ఈ ఏడాది ఏప్రిల్ 18న సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు గూడూరు రూరల్ పోలీస్ స్టేషన్లో సీసీటీవీ ఫుటేజీని భద్రపరచేలా ఆదేశాలు జారీ చేయాలని ఆయన కోర్టుకు విన్నవించారు. పక్కా ఆధారాలు ఉన్నాయి.. పిటిషనర్ పోలయ్యను హింసించారనేందుకు ప్రాథమిక ఆధారాలున్నాయని పోలీసుల దెబ్బల వల్ల తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చేరారని, ఇందుకు సంబంధించిన వైద్య నివేదికలు, ఫొటోలు ఆయనపై జరిగిన దాడిని ధ్రువీకరిస్తున్నాయని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ దాషీ్టకానికి పాల్పడి, పిటిషనర్ మానవ హక్కులను హరించినందుకు నెల్లూరు జిల్లా ఎస్పీ సహా, గూడూరు గ్రామీణ ఇన్స్పెక్టర్ కిషోర్ బాబు, ఎస్ఐ తిరుపతయ్య, కానిస్టేబుళ్లు దాస్, చిన్నా ఈ నెల 14న స్వయంగా తమ ముందు హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. అవసరమైతే బాధ్యులైన పోలీసులపై ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేయాలని జిల్లా ఎస్పీని ఆదేశిస్తూ న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ యడవల్లి లక్ష్మణరావు ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు.పోలీసులకు చెంపపెట్టు లాంటిదిఅధికార పార్టీ నేతల అడుగులకు మడుగులొత్తే పోలీసులకు హైకోర్టు ఆదేశాలు చెంపపెట్టు. దళితులను, రైతులను అమానుషంగా స్టేషన్లో చిత్రహింసలకు గురిచేసే పోలీసులను న్యాయస్థానం మెట్లెక్కించే వరకు న్యాయపోరాటం చేస్తాం. జిల్లా ఎస్పీ అజిత వేజెండ్ల ఉదాసీనంగా ఉంటే వారు కూడా న్యాయస్థానం ముందు నిలబడాల్సి వస్తుంది. వైఎస్సార్సీపీ కార్యకర్తలపై ఎన్ని అక్రమ కేసులు పెట్టినా భయపడం. ప్రతి ఒక్కరిపై ప్రైవేట్ కేసులు వేసి న్యాయస్థానంలో నిలబెడతాం. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక పచ్చచొక్కాలు తొడిగిన పోలీసులపై క్రిమినల్ చర్యలు తప్పవు. – కాకాణి గోవర్ధన్రెడ్డి, మాజీమంత్రి -
పోలీసుల అరాచకాలకు ఆ హోటల్ అడ్డా!
సాక్షి, అమరావతి: విజయవాడ పటమట పోలీసులు.. పోలీస్స్టేషన్ సమీపంలోని ప్రైవేట్ హోటల్ ‘కార్తికేయ ప్రైడ్’ను అడ్డాగా చేసుకుని దందాలు చేస్తున్నారని, దీనిపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలంటూ 70 ఏళ్ల వృద్ధుడు దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)పై హైకోర్టు స్పందించింది. అనధికారికంగా హోటల్ను పోలీస్ స్టేషన్గా ఉపయోగిస్తూ వ్యక్తులను ఆ హోటల్కి తీసుకెళ్లి నిర్బంధించడం, కొట్టడం, బెదిరించి ఖాళీ స్టాంప్ పేపర్లపై సంతకాలు తీసుకోవడం.. సివిల్, ఆస్తి వివాదాల బలవంతపు రాజీలు చేస్తుండటం, చట్ట విరుద్ధంగా కాల్ డీటెయిల్ రికార్డులు సేకరించడం.. అనుమతి లేకుండా డిజిటల్ సర్వైలెన్స్ చేస్తుండటం వంటి పిటిషన్లోని ఆరోపణలు తీవ్రమైనవని హైకోర్టు స్పష్టం చేసింది. వాస్తవాలను నిగ్గు తేల్చేందుకు పోలీస్స్టేషన్, ఆ హోటల్ సీసీటీవీ ఫుటేజీల మొత్తాన్ని భద్రపరచాలని పటమట పోలీసులను ఆదేశించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ లీసా గిల్, న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్య ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. సీనియర్ అధికారుల ప్రమేయం పల్నాడు జిల్లా, అందుకూరు గ్రామానికి చెందిన కర్నాటి వీరభద్రరావు హైకోర్టులో ఈ పిల్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై శుక్రవారం సీజే జస్టిస్ లీసా గిల్ ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్ తరఫు న్యాయవాది పొన్నేకంటి మల్లికార్జునరావు వాదనలు వినిపిస్తూ కార్తికేయ ప్రైడ్ హోటల్లో పోలీసుల సెటిల్మెంట్లన్నీ కూడా విజయవాడ అదనపు డిప్యూటీ కమిషనర్ ఎన్బీఎం మురళీకృష్ణ, పటమట సీఐ పవన్ల ఆధ్వర్యంలో జరుగుతున్నాయని తెలిపారు. పిటిషనర్ వీరభద్రరావును సైతం పోలీసులు ఇదే రీతిలో కార్తికేయ ప్రైడ్ హోటల్లో నిర్బంధించి, కొట్టి, తెల్ల కాగితాలపై సంతకాలు తీసుకున్నారని తెలిపారు.వాస్తవాలు తెలియాలంటే పటమట పోలీస్స్టేషన్తో పాటు హోటల్ సీసీటీవీ ఫుటేజీని భద్రపరిచేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. పోలీసుల తరఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్జీపీ) తిరుమాను విష్ణుతేజ వాదనలు వినిపిస్తూ, ఈ పిల్కు విచారణార్హత లేదన్నారు. ఇవే అభ్యర్థనలతో పిటిషనర్ ఇప్పటికే ఓ పిటిషన్ దాఖలు చేశారని తెలిపారు.పటమట పోలీసులపై చర్యలు తీసుకోవాలని పిటిషనర్ పోలీసు ఉన్నతాధికారులకు వినతి పత్రాలు ఇచ్చారని, వాటిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. పిటిషనర్ ఆరోపణలపై పూర్తి వివరాలు తెప్పించుకుని కోర్టు ముందుంచుతామని తెలిపారు. ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ, పిటిషనర్ మేజి్రస్టేట్ ముందు కూడా ఇవే విషయాలను చెప్పారని గుర్తు చేస్తూ.. వాస్తవాలను నిగ్గుదేల్చాల్సిన అవసరం ఉందని స్పష్టంచేసింది. -
జగన్ విజన్ పర్ఫెక్ట్.. బాబుకు హైకోర్టు షాక్..
-
వెంకటరామిరెడ్డిని ఎందుకు డిస్మిస్ చేశారు?
సాక్షి, అమరావతి: తనను సర్వీసు నుంచి డిస్మిస్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గత నెల 20న జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ ఏపీ సెక్రటేరియట్ ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షుడు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అసిస్టెంట్ సెక్రటరీ కాకర్ల వెంకటరామిరెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు స్పందించింది. వెంకటరామిరెడ్డి డిస్మిస్ వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, వైఎస్సార్ కడప జిల్లా కలెక్టర్ కమ్ విచారణాధికారికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను జూన్కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ దొనడి రమేష్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. డిస్మిస్ ఉత్తర్వుల రద్దుకు పిటిషన్... తనను డిస్మిస్ చేస్తూ జారీ చేసిన ఉత్తర్వులు రద్దు చేయడంతో పాటు తక్షణం వాటి అమలును నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతూ వెంకటరామిరెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై గురువారం హైకోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా వెంకట రామిరెడ్డి తరఫున న్యాయవాది వేలూరు మహేశ్వరరెడ్డి వాదనలు వినిపిస్తూ.. ‘సర్వీసు నిబంధనలను ఉల్లంఘించి అప్పటి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరించారన్న ఆరోపణలతో వెంకటరామిరెడ్డిని ప్రస్తుత ప్రభుత్వం సర్వీసు నుంచి డిస్మిస్ చేసింది.పత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా పిటిషనర్పై అభియోగాలు మోపారు. పిటిషనర్ ఓ రాజకీయ పార్టీకి అనుకూలంగా ప్రచారం చేశారనేందుకు ఎలాంటి ఆధారాలు లేవు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారంటూ నమోదైన నాలుగు కేసులను కూడా తన డిస్మిస్ ఉత్తర్వులకు కారణంగా ప్రభుత్వం చూపింది. ఆ ఆరోపణలన్నింటిపై పిటిషనర్ ఇచ్చిన వివరణలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోలేదు. విచారణాధికారి నిబంధనలు నిర్దేశించిన మేర విచారణ జరపలేదు. అభియోగాలను నిరూపించేందుకు సాక్షులను సైతం విచారించలేదు. ఆధారాలు లేకుండా విచారణాధికారి సమర్పించిన నివేదిక ఆధారంగా, కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ప్రభుత్వం పిటిషనర్ను సర్వీసు నుంచి డిస్మిస్ చేసింది’’ అని వివరించారు. -
ఇంగ్లిష్ పరిజ్ఞానం తప్పనిసరి
సాక్షి, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంలో బోధనపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పిల్లలకు ఇంగ్లిష్ పరిజ్ఞానం తప్పనిసరి అని, లేకపోతే పిల్లలు ఆయా రంగాల్లో రాణించే అవకాశాలు తక్కువగా ఉంటాయని తెలిపింది. ఇంగ్లిష్ అనేది అందరినీ ఏకం చేసే ఒక అంశమని కోర్టు అభిప్రాయపడింది. పిల్లలకు తెలుగుతో పాటు ఇంగ్లిష్ మీడియంలో కూడా చదువుకునే అవకాశం కల్పించడం ద్వారా వారు ఇతర రంగాలలోకి విస్తరించడానికి మెరుగైన అవకాశాలు లభిస్తాయని చెప్పింది. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంలో బోధన ద్వారా పిల్లలను ప్రధాన స్రవంతిలోకి తీసుకురావడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, అది మంచి పరిణామమేనంది. ప్రస్తుత కాలంలో ఇంగ్లిష్ పరిజ్ఞానం లేకుంటే విద్యార్థులకు తగిన అవకాశాలు దొరక్క పోవచ్చని తెలిపింది. ఇది ఎవరూ కాదనలేని వాస్తవమని స్పష్టం చేసింది. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో బోధన భాషగా ఇంగ్లిష్ ఉంటుందంటూ గత నెల 16న విద్యా శాఖ ప్రొసీడింగ్స్ జారీ చేసింది. దీనిని సవాలు చేస్తూ ప్రొఫెసర్ గుంటుపల్లి శ్రీనివాస్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై బుధవారం ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ లీసా గిల్, న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్య ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్ తరఫు న్యాయవాది గడిపూడి వెంకటేశ్వర్లు వాదనలు వినిపిస్తూ, ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ను బోధన భాషగా చేస్తూ గత ప్రభుత్వం తీసుకొచ్చిన విధానాన్ని ఇదే హైకోర్టు కొట్టేసిందన్నారు. అయినప్పటికీ ఈ ప్రభుత్వం కూడా ఇంగ్లిష్ను బోధనా భాషగా చేస్తూ గత నెల 16న ప్రొసీడింగ్స్ జారీ చేసిందని వివరించారు.పొరపాటు జరిగింది.. సవరించాంవిద్యాశాఖ తరఫున ప్రభుత్వ న్యాయవాది (జీపీ) గుర్రం రామచంద్రరావు వాదనలు వినిపిస్తూ.. బోధన భాషగా ఇంగ్లిష్ను పొరపాటున పేర్కొన్నామని, అందువల్ల ఆ ప్రొసీడింగ్స్ను సవరించామని కోర్టుకు నివేదించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ద్విభాషా విధానం (తెలుగు, ఇంగ్లిష్) అమల్లో ఉంటుందని తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం ఇక ఈ వ్యాజ్యం నిరర్థకమని, ఇందులో విచారించేందుకు ఏమీ లేదని స్పష్టం చేసింది. -
యువ లాయర్పై హైకోర్టు జడ్జి ఆగ్రహం.. వీడియో వైరల్
ఇటీవల ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఓ యువ న్యాయవాదిపై జడ్జి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఘటన సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఏపీ హైకోర్టు న్యాయమూర్తి తర్లాడ రాజశేఖర్రావు.. ఓ యువ న్యాయవాది చేసిన చిన్నపాటి తప్పిదం కారణంగా పోలీసు కస్టడీకి పంపాలంటూ ఆదేశించిన ఘటనపై బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (BCI) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.ఈ విషయంపై తక్షణమే జోక్యం చేసుకోవాలని కోరుతూ బీసీఐ.. భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) సూర్యకాంత్కు లేఖ రాసినట్లు బార్ అండ్ బెంచ్ పేర్కొంది. ఆ యువ న్యాయవాది చేతులు జోడించి సారీ.. క్షమించాలంటూ వేడుకుంటుండగా.. న్యాయమూర్తి ఆగ్రహంతో పోలీసులను చర్య తీసుకోవాలని ఆదేశిస్తున్న వీడియో వైరల్ అవుతోంది.. ఆ కస్టడీ ఉత్తర్వు అమలులోకి రాకముందే బార్ అసోసియేషన్ జోక్యంతో దానిని ఉపసంహరించుకున్నారు.Bar Council of India writes to CJI against over Andhra Pradesh High Court judge who sent lawyer to police custody pic.twitter.com/OVS9uPhVuU— Bar and Bench (@barandbench) May 6, 2026ఇది యువ న్యాయవాదులపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపే అవకాశం ఉందని బీసీఐ ఛైర్మన్ మనన్ కుమార్ మిశ్రా అన్నారు. చివరికి బార్ అసోసియేషన్ జోక్యంతో వివాదం సద్దుమణిగింది.What on earth is this?!! Is there something we are missing, that this lawyer could actually be arrested?? The Bar is due a fuller report. To start with. https://t.co/GU7N5Xur0t— Karuna Nundy (@karunanundy) May 6, 2026 -
హైకోర్టుకు మరో ముగ్గురు న్యాయమూర్తులు!
సాక్షి, అమరావతి, సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులుగా మరో ముగ్గురు పేర్లను సుప్రీం కోర్టు కొలీజియం తాజాగా సిఫారసు చేసింది. న్యాయాధికారుల కోటా నుంచి హైకోర్టు న్యాయమూర్తులుగా గంధం సునీత, ఆలపాటి గిరిధర్, చింతలపూడి పురుషోత్తం కుమార్ రానున్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలో సోమవారం సమావేశమైన కొలీజియం ఈమేరకు తీర్మానం చేసింది. ఈ ముగ్గురి పేర్లను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని కొలీజియం గతేడాది అక్టోబర్లో సుప్రీంకోర్టుకు సిఫారసు చేసింది.తాజాగా సుప్రీంకోర్టు కొలీజియం సమావేశమై వీరిని హైకోర్టు న్యాయమూర్తులుగా నియమించేందుకు సిఫారసు చేసింది. గంధం సునీత ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లా ప్రధాన జిల్లా జడ్జిగా ఉన్నారు. ఆలపాటి గిరిధర్ విశాఖపట్నం సేల్స్ ట్యాక్స్ అప్పిలేట్ ట్రిబ్యునల్ చైర్మన్గా కొనసాగుతున్నారు. పురుషోత్తంకుమార్ ఏపీ జుడీషియల్ అకాడమీ డైరెక్టర్గా ఉన్నారు. సుప్రీంకోర్టు సిఫారసులకు కేంద్రం ఆమోదం తెలిపిన తరువాత సంబంధిత ఫైలు ప్రధాని కార్యాలయం ద్వారా రాష్ట్రపతికి చేరుతుంది. రాష్ట్రపతి ఆమోద ముద్ర అనంతరం వారి నియామకాన్ని నోటిఫై చేస్తూ కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేస్తుంది.గంధం సునీత...గంధం సునీత 1977 జూలై 14న కృష్ణా జిల్లా పెదకళ్లేపల్లిలో గంధం వీరయ్య, శివనాగేంద్రమ్మ దంపతులకు వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. స్థానిక ఎస్డీఎన్ఎస్డీఎస్ పాఠశాలలో 10వ తరగతి, మచిలీపట్నం లేడీయాంప్తిల్ కాలేజీలో ఇంటర్, విజయవాడ గాంధీ మహిళా కళాశాలలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. మాంటిస్సోరి కాలేజీలో ఎల్ఎల్బీ చేసి టాపర్గా బంగారు పతకం సాధించారు. 1999 జూలై 1న న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. విజయవాడలో న్యాయవాద వృత్తిని ప్రారంభించారు. 2008 నుంచి 2010 వరకు గుడివాడలో అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా పని చేశారు. 2010లో సివిల్ జడ్జిగా, 2012లో జిల్లా జడ్జిగా ఎంపికయ్యారు. అనంతరం జిల్లా జడ్జిగా పలు చోట్ల పని చేశారు. 2019–23 వరకు హైకోర్టు రిజిస్ట్రార్గా వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. 2023 నుంచి తూర్పు గోదావరి జిల్లా ప్రధాన జిల్లా జడ్జిగా ఉన్నారు.ఆలపాటి గిరిధర్...ప్రకాశం జిల్లా కొండేపి మండలం గోగినేనివారిపాలెంలో జన్మించారు. తండ్రి బాపయ్య చౌదరి స్వాతంత్ర సమరయోధుడు, విశాంత్ర ప్రధానోపాధ్యాయుడు. ఒంగోలు ఇందిరా ప్రియదర్శిని న్యాయ కళాశాలలో లా డిగ్రీ పొందారు. 1998 ఆగస్టు 27న న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. గిరిధర్ ఒంగోలు జిల్లా కోర్టుతో పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. తరువాత న్యాయాధికారిగా ఎంపికయ్యారు. వివిధ హోదాల్లో న్యాయాధికారిగా పనిచేశారు. విజయవాడ ఏసీబీ కోర్టు ప్రత్యేక జడ్జిగా వ్యవహరించారు. కర్నూలు, విజయనగరం, విశాఖపట్నంలో ప్రధాన జిల్లా జడ్జిగా పని చేశారు. హైకోర్టులో రిజిస్ట్రార్గా వ్యవహరించారు. ప్రస్తుతం విశాఖపట్నం ఏపీ వ్యాట్ అప్పిలెట్ ట్రిబ్యునల్ చైర్మన్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.చింతలపూడి పురుషోత్తం కుమార్విశాఖపట్నంలో చింతలపూడి రాంబాబు, రామరత్నం దంపతులకు జన్మించారు. రాంబాబు విశ్రాంత జిల్లా జడ్జి కాగా ఆ కుటుంబంలో మూడు తరాలుగా న్యాయవాదులుగా, న్యాయమూర్తులుగా సేవలు అందిస్తున్నారు. పురుషోత్తం కుమార్ ఆంధ్ర వర్సిటీలో మెరైన్ బయాలజీలో ఎమ్మెస్సీ పూర్తి చేశారు. ఉస్మానియా నుంచి లా డిగ్రీ పొందారు. 2002 నవంబర్ 22న న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. ప్రముఖ సీనియర్ న్యాయవాది ఎస్.రవి వద్ద వృత్తి మెళకువలు నేర్చుకున్నారు. హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు, రంగారెడ్డి జిల్లా కోర్టు, అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ప్రాక్టీస్ చేశారు. 2010లో జిల్లా జడ్జిగా ఎంపికయ్యారు. అటు తరువాత వివిధ హోదాల్లో పలు జిల్లాల్లో పనిచేశారు. హైకోర్టులో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. రిజిస్ట్రార్గా అదనపు బాధ్యతలు నిర్వర్తించారు. 2025 జనవరి నుంచి ఏపీ జుడీషియల్ అకాడమీ డైరెక్టర్గా కొనసాగుతున్నారు. -
ఆకివీడు రామాలయ అనుమతులపై పిటిషన్
సాక్షి, అమరావతి: పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు మండలం పెదపేటలో రామాలయ నిర్మాణానికి అధికారులు అనుమతులు మంజూరు చేయడాన్ని సవాలు చేస్తూ స్థానికులు వంగా జ్యోత్స్న, మరో ఇద్దరు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రభుత్వ భూమిలో మతపరమైన నిర్మాణాలు చేపట్టడానికి వీల్లేదని సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పునిచ్చిందని, అయినా అధికారులు రామాలయ నిర్మాణానికి అనుమతులు ఇచ్చారని వివరించారు.ఈ వ్యాజ్యం గురించి పిటిషనర్ల తరఫు న్యాయవాది జడా శ్రవణ్ కుమార్ సోమవారం ఉదయం న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్ ముందు ప్రస్తావించారు. లంచ్మోషన్ రూపంలో అత్యవసరంగా విచారణ జరపాలని కోరారు. స్పందించిన న్యాయమూర్తి మంగళవారం విచారణ జరుపుతామని స్పష్టం చేశారు. -
పూడి శ్రీహరికి హైకోర్టులో ఊరట
సాక్షి,అమరావతి: వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, గుంటూరు కోర్టులలో ఊరట లభించింది. సోషల్ మీడియా పోస్టుల కేసులో అరెస్టు చేయొద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 41ఏ నోటీసులు ఇచ్చి విచారణకు పిలవాలని సూచించింది. నల్లపాడు పోలీసులు నమోదు చేసిన కేసు విచారణలో హైకోర్టు తాజా ఆదేశాలిచ్చింది. గుంటూరు కోర్టులోనూ పూడి శ్రీహరికి ఊరట దక్కింది. కొత్తపేట పీఎస్లో నమోదైన కేసులో పూడి శ్రీహరికి బెయిల్ ఇచ్చింది. నోటీసులు ఇచ్చి విచారించాలని స్పష్టం చేసింది. తనపై గుంటూరు జిల్లా నల్లపాడు, కొత్తపేట పోలీస్ స్టేషన్లలో నమోదు చేసిన కేసులను కొట్టేయాలని కోరుతూ శ్రీహరి హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యాలు తేలేందత వరకు ఆ కేసుల్లో తదుపరి చర్యలన్నీ నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతూ ఆయన గురువారం పిటిషన్లు దాఖలు చేశారు. ఒకే అంశానికి సంబంధించి బహుళ ఎఫ్ఐఆర్లు నమోదు చేయడానికి వీల్లేదని తెలిసినా పోలీసులు కావాలనే కేసులు పెట్టారు. ఎవరో సోషల్ మీడియాలో పోస్టులు పెడితే అందుకు నన్ను బాధ్యుడిని చేయడం తగదు’అని శ్రీహరి తన వ్యాజ్యాల్లో పేర్కొన్నారు.పూడి శ్రీహరి పిటిషన్లపై విచారణ చేపట్టిన హైకోర్టు, గుంటూరు కోర్టులు తీర్పును వెలువరించాయి. నమోదైన కేసుల్లో పూడి శ్రీహరిని అరెస్ట్ చేయొద్దని 41ఏ నోటీసులు ఇచ్చి విచారణకు పిలవాలని ఆదేశించాయి. -
హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్ ప్రమాణం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తి(సీజే)గా జస్టిస్ లీసా గిల్ శనివారం ప్రమాణస్వీకారం చేశారు. జస్టిస్ లీసా గిల్ చేత గవర్నర్ జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్ ప్రమాణం చేయించారు. విజయవాడలోని లోక్ భవన్లో జరిగిన ఈ కార్యక్రమానికి పలువురు న్యాయమూర్తులు, మంత్రులు, ప్రజాప్రతినిధులతోపాటు జస్టిస్ లీసా గిల్ కుటుంబ సభ్యులు, పంజాబ్–హరియాణ హైకోర్టుకు చెందిన న్యాయమూర్తులు, విశ్రాంత న్యాయమూర్తులు సీనియర్ న్యాయవాదులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.ప్రమాణస్వీకార కార్యక్రమం ప్రారంభంలో జస్టిస్ లీసా గిల్ నియామకానికి సంబంధించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ పార్థసారథి చదివి వినిపించారు. ప్రమాణస్వీకారం అనంతరం జస్టిస్ లీసా గిల్కు గవర్నర్ అబ్దుల్ నజీర్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్ పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అడ్వొకేట్ జనరల్ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్, అదనపు ఏజీ ఇవన సాంబశివ ప్రతాప్, రాష్ట్ర పబ్లిక్ ప్రాసిక్యూటర్ (పీపీ) మెండ లక్ష్మీనారాయణ, ఏపీ బార్ కౌన్సిల్ చైర్మన్ నల్లారి ద్వారకానాథరెడ్డి, అదనపు సొలిసిటర్ జనరల్ చల్లా ధనంజయ, హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు వాసిరెడ్డి ప్రభునాథ్, పలువురు న్యాయవాదులు, హైకోర్టు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం గవర్నర్ ఏర్పాటు చేసిన విందులో పాల్గొన్నారు.త్వరలోనే పదోన్నతిపై సుప్రీంకోర్టుకి...ఏపీ హైకోర్టు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్ రికార్డు సృష్టించారు. ఆమె ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు 5వ ప్రధాన న్యాయమూర్తి. పంజాబ్–హరియాణ కోటాలో జస్టిస్ లీసా గిల్ రానున్న మూడు, నాలుగు నెలల్లో పదోన్నతిపై సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యే అవకాశం ఉంది. సోమవారం నుంచి ఆమె న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్యతో కలిసి కేసులను విచారిస్తారు -
మీకు సిగ్గనిపించడం లేదా? పోలీసులకు హైకోర్టు చీవాట్లు
-
భర్త బాగోగులు చూడటంలో భార్యను మించినవారుండరు..
సాక్షి, అమరావతి: కోమాలో ఉన్న భర్తను బతికించుకునేందుకు ఓ భార్య చేసిన న్యాయ పోరాటం ఫలించింది. భర్త చికిత్స కోసం ఆయన ఖాతాలో ఉన్న డబ్బు విత్డ్రా చేసేందుకు ఆమెకు హైకోర్టు వెసులుబాటు కల్పించింది. ‘భర్త కోమాలో ఉన్నప్పుడు, ఆయన సంక్షేమాన్ని చూసుకోవడానికి భార్య కంటే మెరుగైన వ్యక్తి మరొకరు ఉండరు. మన పురాణాలు సైతం భార్యను భర్తలో సగంగా భావించి, భార్యను అర్ధాంగిని చేశాయి’ అని ఈ సందర్భంగా హైకోర్టు స్పష్టం చేసింది. వైఎస్సార్ కడప జిల్లా మైదుకూరుకు చెందిన సింగవరం నాగమ్మ భర్త సింగవరం సుభాన్ సింగ్ అనారోగ్యం కారణంగా కోమాలోకి వెళ్లారు. వైద్య ఖర్చుల కోసం ఆయన ఖాతా నుంచి రూ.14.38 లక్షలు విత్డ్రా చేసేందుకు అనుమతినివ్వాలని యాక్సిస్ బ్యాంక్ను నాగమ్మ అభ్యర్థించారు. అయితే దీనికి బ్యాంక్ తిరస్కరించింది. విధి లేని పరిస్థితుల్లో ఆమె హైకోర్టును ఆశ్రయించారు. భర్త చికిత్స నిమిత్తం తమ వద్ద డబ్బు లేదని, ఖాతాలో ఉన్న రూ.14 లక్షలే తమకు దిక్కని ఆమె హైకోర్టుకు నివేదించారు. ఈ వ్యాజ్యంపై జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు విచారణ జరిపారు. సంరక్షకుల నియామకం విషయంలో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడానికి వీల్లేదని, దీనిపై సివిల్ కోర్టును ఆశ్రయించడమే మార్గమని ప్రభుత్వ న్యాయవాది చేసిన వాదనను న్యాయమూర్తి తోసిపుచ్చారు. కోమాలో ఉన్న వ్యక్తుల సంరక్షణ విషయంలో నిర్దిష్టమైన నిబంధనలు లేనందున ఈ కేసులో హైకోర్టుకున్న అసాధారణ న్యాయపరిధిని ఉపయోగిస్తున్నామన్నారు. సుభాన్ సింగ్ బ్యాంకు ఖాతా నిర్వహణకు నాగమ్మను సంరక్షకురాలిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. బ్యాంకు ఖాతా నుంచి నగదు విత్డ్రా చేసుకునేందుకు నాగమ్మకు అనుమతినివ్వాలని యాక్సిస్ బ్యాంక్ని ఆదేశించారు. ఖాతా నిర్వహణ వివరాలను ప్రతీ మూడు నెలలకొకసారి హైకోర్టు రిజిస్ట్రార్ కు పంపాలని నాగమ్మను ఆదేశించారు. -
మైనర్ బాలిక అత్యాచారం కేసు.. పోలీసులపై ఏపీ హైకోర్టు ఆగ్రహం
సాక్షి, పశ్చిమగోదావరి: భీమవరానికి చెందిన మైనర్ బాలికపై జరిగిన అత్యాచారం కేసులో తెలుగుదేశం పార్టీ నేతను కాపాడేందుకు పోలీసులు బరితెగించడంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘మీకు సిగ్గు అనిపించట్లేదా? బాలిక ఫిర్యాదు వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయని మీరు ఎలా చెబుతారు? దేవుడు మీకు దివ్యదృష్టి ఏమైనా ఇచ్చారా? ఫిర్యాదారుడు స్పష్టమైన ఆరోపణలు చేసినప్పుడు ఆ అంశంపై దృష్టి పెట్టి దర్యాప్తు కొనసాగించాలి. బాధితురాలు తనపై అఘాయిత్యం జరిగిందన్న దానికి సంబంధించి 164 స్టేట్మెంట్ వాంగ్మూలాలు ఇతర ఆధారాలు ఉన్నాయని చెబితే దాని వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయని మీరు ఎలా చెబుతారు? బాధితురాలకు అండగా ఉండాల్సింది పోయి కేసు ఉపసంహరించుకోమని బెదిరిస్తారా? రాజకీయ ఒత్తిళ్లు తట్టుకోలేకుంటే ఉద్యోగాలు మానేసి వెళ్లిపోండి. మీరు దర్యాప్తు సక్రమంగా నిష్పక్షపాతంగా నిర్వహించట్లేదు కాబట్టే న్యాయం కోసం బాధితురాలు కోర్టుకు రావాల్సి వచ్చింది. మీ బాధ్యత మీకు కొంతైనా తెలియాలంటే ఒకసారి బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు చదవండి’ అంటూ హైకోర్టు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో భీమవరం డీఎస్పీ రఘువీర్ విష్ణు వివరణ సంతృప్తిగా లేదని హైకోర్టు పేర్కొంది. ఈ కేసుకు సంబంధించి అన్ని రికార్డులతో పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీ స్వయంగా తమ ముందు హాజరుకావాలని హైకోర్టు ఆదేశించింది. కేసు తదుపరి విచారణ మే ఒకటో తేదీకి వాయిదా వేస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకుంది. -
ఏపీ తొలి మహిళా సీజేకు వైఎస్ జగన్ శుభాకాంక్షలు
-
ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న ఐఏఎస్లు..: హైకోర్టు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఐఏఎస్ అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం కనీస స్థాయిలో స్పందించడం లేదని హైకోర్టు మండిపడింది. ఐఏఎస్ అధికారులు వేధిస్తున్నా, ఖజానాకు నష్టం చేకూరుస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆక్షేపించింది. ఐఏఎస్ అధికారులకు చట్టం అన్నా, కోర్టు ఆదేశాలన్నా కనీస స్థాయిలో కూడా గౌరవం లేదంది. రాష్ట్ర విభజన తరువాత ప్రభుత్వ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, కుటుంబాలు ఓ చోట, వీరు మరో చోట జీవితాన్ని వెళ్లదీస్తున్నారని తెలిపింది. అయితే ఐఏఎస్ అధికారులు మాత్రం శుక్ర, శనివారాల్లో విమానాల్లో హైదరాబాద్కు వెళ్లిపోతున్నారని వ్యాఖ్యానించింది. ఆయా అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం ఎలా పనిచేస్తుందో కోర్టు చూస్తూనే ఉందని వ్యాఖ్యానించింది. చీఫ్ కమిషనర్ ఆఫ్ స్టేట్ ట్యాక్సెస్ (సీసీఎస్టీ) బాబు అహ్మద్ తమను అనేక రకాలుగా వేధిస్తున్నారని, పదోన్నతులు ఇవ్వడం లేదని ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి ఎం.రమేష్ కుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ గురువారం మరోసారి విచారణ జరిపారు. ‘ఇలాంటి అధికారుల విషయంలో మెతక, ఉదాసీన వైఖరిని అవలంభించలేం. బాబు అహ్మద్ ప్రజలకు ఉచిత సేవ చేయడం లేదు. ఆయన ప్రతీ నెలా 1వ తేదీన ఠంచనుగా జీతం తీసుకుంటున్నారు. మాకే అధికారం ఉంటే తక్షణమే ఆయనను సస్పెండ్ చేసేవాళ్లం. అహ్మద్పై వస్తున్న ఆరోపణలపై విచారణ జరిపి, ఆధారాలుంటే ఆయనను సర్వీసు నుంచి తొలగించాలని కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేస్తాం’ అని న్యాయమూర్తి ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఈ మొత్తం వ్యవహారంపై స్పందించాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను శుక్రవారానికి వాయిదా వేశారు. పదోన్నతుల ఫైళ్లను తొక్కిపెట్టడం ఉద్యోగులను వేధించడం కాదా? తొలుత విచారణ పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది కేఎస్ మూర్తి వాదనలు వినిపిస్తూ బాబు అహ్మద్పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వినతి పత్రాలు సమర్పించినా ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. అహ్మద్ తరఫు న్యాయవాది వీవీ సతీష్ వాదనలు వినిపిస్తూ పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేస్తామన్నారు. పదోన్నతుల విషయంలో ప్యానల్ ఇయర్ ముగియడంతో తిరిగి డిపార్ట్మెంటల్ ప్రమోషన్ కమిటీ (డీపీసీ) నిర్వహిస్తామని చెప్పారు. దీనిపై న్యాయమూర్తి తీవ్రంగా స్పందించారు. ఎప్పుడో డీపీసీ పూర్తయితే ప్యానల్ ఇయర్ ముగిసేంత వరకు ఎందుకు పదోన్నతులు ఇవ్వలేదని ప్రశ్నించారు. ఇందుకుగాను అహ్మద్పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్)నిసూటిగా ప్రశ్నించారు. పదోన్నతులకు సంబంధించిన ఫైళ్లను ఐఏఎస్ అధికారులు తొక్కిపెట్టడం ఉద్యోగులను వేధించడం కాదా? అని ప్రశ్నించారు. ఈ వ్యవహారంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కోర్టుకు పిలిపిస్తేనే అన్నీ సర్దుకుంటాయన్నారు. గతంలో ఓ కోర్టు ధిక్కార కేసులో హైకోర్టు ధర్మాసనం ఇదే అహ్మద్ను భవిష్యత్తులో జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చరించిందని గుర్తు చేశారు. పదోన్నతుల విషయంలో గత డిసెంబర్లో ఈ కోర్టు ఆదేశాలిస్తే ఇప్పటి వరకు వాటిని పట్టించుకోలేదని పేర్కొన్నారు. -
పెద్దసంఖ్యలో జిల్లా జడ్జిల బదిలీ
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో జిల్లా జడ్జీలు బదిలీ అయ్యారు. ఇటీవల సివిల్ జడ్జిలు (సీనియర్ డివిజన్) నుంచి అదనపు జిల్లా జడ్జిలుగా పదోన్నతులు పొందిన వారితో సహా మొత్తం 72 మందికి స్థానచలనం కల్పిస్తూ హైకోర్టు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. మూడేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న నేపథ్యంలో పలువురు జిల్లా జడ్జిలు బదిలీ అయ్యారు. వీరందరికీ హైకోర్టు కొత్త పోస్టింగ్లు ఇచ్చింది. మే 7వ తేదీ లోపు కొత్త బాధ్యతలు చేపట్టాలని ఆదేశించింది. రిలీవ్ అయ్యే లోపు ఇప్పటికే రిజర్వ్ చేసుకున్న తీర్పులను వెలువరించాలని కూడా స్పష్టం చేసింది. విజయవాడ రెండో అదనపు జిల్లా, సెషన్స్ జడ్జిగా ఉన్న ఎ.సత్యానంద్ ప్రకాశం ప్రిన్సిపల్ జిల్లా, సెషన్స్ జడ్జిగా నియమితులయ్యారు. అత్యంత కీలకమైన విజయవాడ ఏసీబీ కోర్టు ప్రత్యేక జడ్జిగా ఎల్.తేజోవతి నియమితులయ్యారు. ప్రస్తుతం ఆమె నెల్లూరు మూడో అదనపు జిల్లా, సెషన్స్ జడ్జిగా ఉన్నారు. విజయవాడ ఏసీబీ కోర్టు ప్రత్యేక జడ్జిగా ఉన్న పి.భాస్కరరావు తూర్పు గోదావరి జిల్లా, పిఠాపురం 12వ అదనపు జిల్లా, సెషన్స్ జడ్జిగా బదిలీ అయ్యారు. రాష్ట్ర వక్ఫ్బోర్డ్ ట్రిబ్యునల్ చైర్మన్గా టి.రామచంద్రుడు నియమితులయ్యారు. గుంటూరు అదనపు జిల్లా సెషన్స్ జడ్జిగా ఉన్న జి.చక్రపాణి విశాఖపట్నం సీబీఐ కోర్టు ప్రిన్సిపల్ స్పెషల్ జడ్జిగా నియమితులయ్యారు. నెల్లూరు మొదటి అదనపు జిల్లా, సెషన్స్ జడ్జిగా ఉన్న జి.గీత, నెల్లూరు ఏసీబీ కోర్టు ప్రత్యేక జడ్జిగా బదిలీ అయ్యారు. విజయవాడ కో–ఆపరేటివ్ ట్రిబ్యునల్ చైర్మన్గా కె.రాధారత్నం నియమితులయ్యారు. -
జస్టిస్ లీసా గిల్కు వైఎస్ జగన్ శుభాకాంక్షలు
తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్ లీసా గిల్కు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. లీసా గిల్ హైకోర్టుకు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా నియామకం అవ్వడం ఏపీ న్యాయవ్యవస్థకు గర్వకారణం. జస్టిస్ లీసా గిల్ తన పదవీకాలం విజయవంతంగా కొనసాగించాలని కోరుకుంటున్నానని వైఎస్ జగన్ పేర్కొన్నారు.ఇదీ జస్టిస్ లీసా గిల్ నేపథ్యం 1966 నవంబర్ 15న జన్మించారు. చండీగఢ్లోని సెక్టార్ 9లో ఉన్న కార్మెల్ కాన్వెంట్ స్కూల్లో పాఠశాల విద్య పూర్తి చేశారు. హ్యుమానిటీస్ విభాగంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. పంజాబ్ యూనివర్సిటీ నుంచి బీఏ, ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం పూర్తి చేశారు. 1990లో న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. పంజాబ్, హర్యానా హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. క్రిమినల్, సివిల్, సర్వీస్, రెవెన్యూ, రాజ్యాంగ పరమైన అనేక రకాల కేసులను ఆమె వాదించారు. చండీగఢ్ కేంద్ర పాలిత ప్రాంతంతో పాటు పలు బోర్డులు, కార్పొరేషన్లకు ప్రాతినిధ్యం వహించారు. 2014 మార్చి 31న పంజాబ్, హర్యానా హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. -
ఐఏఎస్ అహ్మద్ బాబుపై ఏపీ హైకోర్టు ఆగ్రహం
సాక్షి,అమరావతి: ఐఏఎస్ అహ్మద్ బాబుపై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉద్యోగులకు పదోన్నతులు ఇవ్వకపోవడంపై సీరియస్ అయ్యింది. ఉద్యోగుల జీవితాలతో ఎలా ఆడుకుంటారని మండిపడింది. ప్రభుత్వం, సీఎస్ ఏం చేస్తున్నారని ప్రశ్నించింది. పన్ను వసూళ్లలోనూ అహ్మద్ బాబుపై ఆరోపణలున్నాయి. మాకు అధికారం ఉంటే వెంటనే సస్పెండ్ చేసే వాళ్లం’ అని వ్యాఖ్యానించింది, -
హైకోర్టు సీజేగా జస్టిస్ లీసా గిల్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్ నియమితులయ్యారు. ఈ మేరకు భారత రాష్ట్రపతి ముర్ము ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో జస్టిస్ గిల్ నియామకాన్ని నోటిఫై చేస్తూ కేంద్ర న్యాయ శాఖ సంయుక్త కార్యదర్శి జగన్నాథ్ శ్రీనివాసన్ బుధవారం నోటిఫికేషన్ ఇచ్చారు. ఈ నెల 25 నుంచి ఆమె నియామకం అమల్లోకి వస్తుందని ఆ నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఈ నియామకంతో ఏపీ హైకోర్టు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్ చరిత్ర సృష్టించారు. ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ఈ నెల 24న పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో జస్టిస్ లీసా గిల్ సీజేగా నియమితులయ్యారు. జస్టిస్ గిల్ ప్రస్తుతం హైకోర్టులో నెంబర్ 2గా కొనసాగుతున్నారు. పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ గిల్.. గత నెల 6న ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ప్రస్తుత సీజే జస్టిస్ ఠాకూర్ పదవీ విరమణ అనంతరం జస్టిస్ గిల్ను సీజేగా ప్రతిపాదిస్తూ సుప్రీంకోర్టు కొలీజియం గతంలోనే సిఫారసు చేసిన విషయం తెలిసిందే. ఈ నెల 25న సీజేగా ఆమెతో గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రమాణం చేయిస్తారు.ఇదీ జస్టిస్ లీసా గిల్ నేపథ్యం 1966 నవంబర్ 15న జన్మించారు. చండీగఢ్లోని సెక్టార్ 9లో ఉన్న కార్మెల్ కాన్వెంట్ స్కూల్లో పాఠశాల విద్య పూర్తి చేశారు. హ్యుమానిటీస్ విభాగంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. పంజాబ్ యూనివర్సిటీ నుంచి బీఏ, ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం పూర్తి చేశారు. 1990లో న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. పంజాబ్, హర్యానా హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. క్రిమినల్, సివిల్, సర్వీస్, రెవెన్యూ, రాజ్యాంగ పరమైన అనేక రకాల కేసులను ఆమె వాదించారు. చండీగఢ్ కేంద్ర పాలిత ప్రాంతంతో పాటు పలు బోర్డులు, కార్పొరేషన్లకు ప్రాతినిధ్యం వహించారు. 2014 మార్చి 31న పంజాబ్, హర్యానా హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. -
శ్రీహరి, గిరీష్ అరెస్ట్కు పోలీసుల యత్నాలు
సాక్షి, అమరావతి: సోషల్ మీడియా పోస్టుల వ్యవహారంలో వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి (మీడియా) పూడి శ్రీహరి, సోషల్ మీడియా యాక్టివిస్ట్ గిరీష్కుమార్రెడ్డి రిమాండ్ను తిరస్కరిస్తూ కుప్పం కోర్టు ఇచ్చిన ఆదేశాల అమలును హైకోర్టు నిలిపివేసిన తరువాత కూడా వారి అరెస్ట్కు పోలీసులు ప్రయత్నాలు చేశారని సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్రెడ్డి బుధవారం హైకోర్టుకు నివేదించారు. అలా అయితే ఆ వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ యడవల్లి లక్ష్మణరావు ఆదేశించారు. దీనిపై ఈ నెల 29వ తేదీన పూర్తి స్థాయిలో వాదనలు వింటానని తెలిపారు. అప్పటి వరకైనా కఠిన చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని సుధాకర్రెడ్డి అభ్యర్థించారు. దీనికి న్యాయమూర్తి స్పందిస్తూ, ‘కుప్పం కోర్టు ఆదేశాల అమలును మాత్రమే నిలుపుదల చేశాం తప్ప, వాటిని రద్దు చేయలేదు. అందువల్ల శ్రీహరి, గిరీష్ లను అరెస్ట్ చేస్తారన్న ఆందోళన అవసరం లేదు’ అని పునరుద్ఘాటించారు. ఈ నేపథ్యంలో శ్రీహరి, గిరీష్ విషయంలో తొందరపాటు చర్యలు తీసుకోవద్దని పోలీసులను ప్రత్యేకంగా ఆదేశించాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. కుప్పం కోర్టు ఉత్తర్వులను సవా లు చేస్తూ పోలీసులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై గత వారం విచారణ జరిపిన జస్టిస్ లక్ష్మణరావు కుప్పం కోర్టు రిమాండ్ తిరస్కరణ ఉత్తర్వుల అమలును నిలిపేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాలు బుధవారం మరోసారి విచారణకు వచ్చాయి. -
సజ్జల భార్గవ్రెడ్డిపై ఎల్ఓసీ రద్దు చేయండి
సాక్షి, అమరావతి: సోషల్ మీడియా పోస్టుల వ్యవహారంలో వైఎస్సార్సీపీ సోషల్ మీడియా పూర్వ ఇన్చార్జి సజ్జల భార్గవ్రెడ్డిపై జారీ చేసిన లుక్ ఔట్ సర్క్యులర్ (ఎల్ఓసీ)ను రద్దు చేయాలని హైకోర్టు శుక్రవారం ఇమ్మిగ్రేషన్ అధికారులను ఆదేశించింది. అన్నమయ్య జిల్లా ఎస్పీ నుంచి సమాచారం అందిన వెంటనే ఎల్ఓసీ రద్దు చేయాలని స్పష్టం చేసింది. విదేశాలకు ప్రయాణించే హక్కు భారత రాజ్యాంగంలోని అధికరణ 21 కింద జీవించే, వ్యక్తిగత స్వేచ్ఛ హక్కులో అంతర్భాగమని స్పష్టం చేసింది. సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న, అనిశ్చితంగా ఉన్న కేసుల దర్యాప్తు పేరుతో భార్గవ్రెడ్డి హక్కులను హరించడం సమంజసం కాదని స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ శుక్రవారం తీర్పు వెలువరించారు. సీఐడీ అదనపు డీజీ, పలు జిల్లాల ఎస్పీల ప్రోద్బలంతో ఇమ్మిగ్రేషన్ అధికారులు జారీ చేసిన ఎల్ఓసీని చట్ట విరుద్ధంగా ప్రకటించి రద్దు చేయాలని కోరుతూ భార్గవ్రెడ్డి గత నెలలో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్పై ఇరువర్గాల వాదనల అనంతరం న్యాయమూర్తి తీర్పుఇచ్చారు. దర్యాప్తు నుంచి తప్పించుకోవడానికి భార్గవ్రెడ్డి ప్రయత్నించలేదు ‘సంబంధిత స్టేషన్ హౌస్ ఆఫీసర్ సెక్షన్ 35(3) నోటీసులిచ్చి, చట్ట ప్రకారం నడుచుకోవాలని 2025 మే 7న హైకోర్టు పోలీసులను ఆదేశించింది. అయితే పోలీసులు ఈ రోజు వరకు భార్గవ్రెడ్డికి నోటీసులు ఇవ్వలేదు. రికార్డులో ఉన్న సమాచారాన్ని పరిశీలిస్తే పిటిషనర్ భార్గవ్రెడ్డి దర్యాప్తు నుంచి తప్పించుకోవడానికి గానీ, కోర్టు పరిధి నుండి పారిపోవడానికి ప్రయత్నం చేసినట్లు కనిపించడం లేదు. అందువల్ల, భార్గవ్రెడ్డి చట్టపరమైన ప్రక్రియల్లో పాల్గొనలేదని, దర్యాప్తునకు సహకరించడం లేదని పోలీసులు వాదించడం సమంజసం కాదు. గతంలో కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు భార్గవ్రెడ్డికి సెక్షన్ 35 (3) కింద నోటీసులు అందచేయాలి. దర్యాప్తునకు సహకరిస్తానని, ఎప్పుడు పిలిస్తే అప్పుడు దర్యాప్తు అధికారి ముందు హాజరవుతానని పేర్కొంటూ భార్గవ్రెడ్డి డీజీపీ, అన్నమయ్య జిల్లా ఎస్పీ ముందు అఫిడవిట్లు దాఖలు చేయాలి. అనంతరం భార్గవ్రెడ్డిపై జారీ చేసిన ఎల్ఓసీ ఉపసంహరణకు జిల్లా ఎస్పీ చర్యలు తీసుకోవాలి.’ అని హైకోర్టు ఆదేశించింది. ఇతరుల ప్రతిష్టను, గౌరవాన్ని దెబ్బతీసే హక్కు ఎవరికీ లేదుభారత రాజ్యాంగంలోని అధికరణ 19(1) కింద ఉన్న భావవ్యక్తీకరణ స్వేచ్ఛ సంపూర్ణమైనది కాదు. ఇది కొన్ని పరిమితులకు లోబడి ఉంటుంది. గౌరవం, నైతికత, పరువు నష్టం, నేర ప్రేరేపణ వంటి అంశాల ఆధారంగా పరిమితులు ఉంటాయి. సోషల్ మీడియాలో తప్పుడు, అసభ్య కంటెంట్ వ్యక్తులకు, సమాజానికి తీవ్ర నష్టం కలిగిస్తుంది. ఈ విధమైన కంటెంట్ ప్రముఖులు, రాజకీయ నాయకులు, వారి కుటుంబ సభ్యులు లేదా సాధారణ పౌరులను లక్ష్యంగా చేసుకున్నప్పుడు, అది వారి ప్రతిష్టను దెబ్బతీస్తుంది, గోప్యతకు భంగం కలిగిస్తుంది. భావోద్వేగ పరమైన బాధను కలిగిస్తుంది. ఇతరుల ప్రతిష్టను, గౌరవాన్ని దెబ్బతీసే హక్కు ఎవరికీ లేదు. ఎవరైనా వ్యక్తి ఏ విషయంపైనైనా, ప్రభుత్వ విధానాలపైనైనా తన అభిప్రాయాన్ని, అసమ్మతిని వ్యక్తం చేయవచ్చు. అయితే, ఆ అభిప్రాయం మర్యాదపూర్వకంగా వ్యక్తం చేయాలి. దర్యాప్తు సంస్థలు చట్టపరమైన విధి విధానాలను కచ్చితంగా అనుసరిస్తూ, సమగ్రంగా, వేగంగా దర్యాప్తు జరపాలి. సేకరించిన సాక్ష్యాల ఆధారంగా నేరస్థులపై అభియోగాలు నమోదు చేసి చట్టం నిర్దేశించిన గడువులోపు చార్జ్షీట్ దాఖలు చేసి వారిని కోర్టు ముందు హాజరుపరచాలి. సోషల్ మీడియాలో తప్పుడు, అసభ్య పోస్టులు పెట్టే వారు ఎవరైనా సరే లేదా ఎంత ఉన్నత స్థానంలో ఉన్నా సరే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. చట్టం అందరికంటే గొప్పది.. చట్టం నుంచి ఎవరూ తప్పించుకోలేరన్న స్పష్టమైన సందేశాన్ని పంపాలి. – సోషల్ మీడియాలో పోస్ట్లపై హైకోర్టు -
అరెస్ట్ చేయమనండి.. చూస్తాం
సాక్షి, అమరావతి: సోషల్ మీడియా పోస్టుల వ్యవహారంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి (మీడియా) పూడి శ్రీహరి, సోషల్ మీడియా యాక్టివిస్ట్ గిరీష్ కుమార్రెడ్డికి రిమాండ్ విధించేందుకు నిరాకరిస్తూ కుప్పం కోర్టు జారీ చేసిన ఉత్తర్వుల అమలును హైకోర్టు నిలిపేసింది. ప్రతివాదులుగా ఉన్న శ్రీహరి, గిరీష్ కుమార్రెడ్డిలకు నోటీసులు జారీ చేసింది. రిమాండ్ తిరస్కరణ ఆదేశాల అమలును మాత్రమే నిలిపివేశామని, రద్దు చేయలేదని పేర్కొన్న హైకోర్టు ఈ నేపథ్యంలో నిందితులను పోలీసులు అరెస్ట్ చేయలేరని వివరించింది. ‘అయినా కూడా పోలీసులు అరెస్ట్ చేస్తే, అరెస్ట్ చేయమనండి.. మేమూ చూస్తాం..’ అంటూ ఘాటుగా వ్యాఖ్యానించింది. తదుపరి విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ యడవల్లి లక్ష్మణరావు శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. పోలీసుల లంచ్మోషన్ పిటిషన్ కుప్పం కోర్టు గురువారం జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ పోలీసులు హైకోర్టులో అత్యవసర లంచ్మోషన్ పిటిషన్లు దాఖలు చేశారు. శ్రీహరిని రిమాండ్కు పంపేలా ఆదేశాలు ఇవ్వాలని పోలీసుల తరఫున అడ్వకేట్ జనరల్ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు. వాదనలు విన్న న్యాయమూర్తి కుప్పం కోర్టు ఉత్తర్వుల అమలును నిలిపివేస్తూ, ప్రతివాదులు శ్రీహరి, గిరీష్ కుమార్రెడ్డిలకు నోటీసులు జారీ చేశారు. ఇంతలో ఈ విషయం తెలుసుకున్న శ్రీహరి తరఫున సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్రెడ్డి కోర్టులోకి వచ్చారు. కుప్పం కోర్టు ఉత్తర్వుల అమలును నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడంపై ఆయన అభ్యంతరం తెలిపారు. తమ వాదన వినకుండా ఎక్స్ పార్టీ ఆదేశాలు ఇవ్వడం సరికాదన్నారు. ఈ సమయంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ (పీపీ) మెండ లక్ష్మీనారాయణ, సుధాకర్రెడ్డి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. కుప్పం కోర్టు ఇచ్చిన రిమాండ్ తిరస్కరణ ఉత్తర్వుల వల్ల శ్రీహరి, గిరీష్ లను పోలీసులు తిరిగి అరెస్ట్ చేసే అవకాశం ఉందని పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. తమ ఆందోళనలో న్యాయం ఉందని ఆయన కోర్టుకు నివేదించారు. ఈ సమయంలో న్యాయమూర్తి స్పందిస్తూ, తాము రిమాండ్ తిరస్కరణ ఉత్తర్వులను రద్దు చేయలేదని స్పష్టం చేశారు. ఒకవేళ రద్దు చేసి ఉంటే, అప్పుడు శ్రీహరి, గిరీష్ ల అరెస్ట్కు ఆస్కారం ఉండేదన్నారు. అయినా కూడా పోలీసులు అరెస్ట్ చేస్తే, అరెస్ట్ చేయమనండి.. మేమూ చూస్తాం.. అంటూ న్యాయమూర్తి ఘాటుగా వ్యాఖ్యానించారు. పోలీసులు చట్టం విధి విధానాలను పాటించడం లేదు: హైకోర్టువ్యక్తులను అదుపులోకి తీసుకునే సమయంలో పోలీసులు చట్టం నిర్దేశించిన విధి విధానాలను పాటించడం లేదని, ఇందుకు ప్రాథమిక ఆధారాలున్నాయని హైకోర్టు పేర్కొంది. చట్ట నిబంధనలను పాటించకుండా వ్యక్తుల స్వేచ్ఛను హరించడానికి వీల్లేదంది. శ్రీహరి అక్రమ అరెస్ట్ విషయంపై దాఖలైన పిటిషన్పై న్యాయమూర్తులు జస్టిస్ రవినాథ్ తిల్హరి, జస్టిస్ మెడమల్లి బాలాజీ ధర్మాసనం శుక్రవారం ఈ కీలక వ్యాఖ్యలు చేసింది. శ్రీహరి అరెస్ట్ విషయంలో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించింది. ఆ కౌంటర్కు పేరాల వారీగా సమాధానం ఇవ్వాలని పిటిషనర్కు సూచించింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. పోలీసులమంటూ సివిల్ దుస్తుల్లో వచ్చిన కొందరు వ్యక్తులు శ్రీహరిని బలవంతంగా తమ వెంట తీసుకెళ్లారని, ఆయన్ను కోర్టు ముందు హాజరుపరిచేలా ఆదేశాలు ఇవ్వాలంటూ డ్రైవర్ పోతల సింహాచలం నాయుడు హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై గురువారం విచారణ జరిపిన జస్టిస్ తిల్హరీ ధర్మాసనం పూర్తి వివరాలను తమ ముందుంచాలని పోలీసులను ఆదేశించిన విషయం తెలిసిందే. శుక్రవారం ఈ వ్యాజ్యం మరోసారి విచారణకు రాగా, పిటిషనర్ తరఫు న్యాయవాది సానేపల్లి రామలక్ష్మణ్రెడ్డి వాదనలు వినిపిస్తూ శ్రీహరి అరెస్ట్ చట్ట విరుద్ధమన్నారు. ‘‘చట్టవిరుద్ధంగా వ్యక్తులను అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు, ఆ అక్రమ నిర్భంధంపై హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేయగానే విడుదల చేస్తున్నారు. అదుపులోకి తీసుకున్న వ్యక్తిని విడుదల చేశాం కాబట్టి, హెబియస్ కార్పస్ పిటిషన్ నిరర్థకమైందంటూ చెబుతున్నారు’’ అని హైకోర్టు ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. -
రెడ్ బుక్ అరాచకం
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వ రెడ్బుక్ అరాచకం వెర్రితలలు వేస్తోంది. రాజ్యాంగ హక్కుల హననం యథేచ్ఛగా కొనసాగుతోంది. ఏకంగా సుప్రీంకోర్టు తీర్పు, మార్గదర్శకాలనే కాలరాస్తూ కూటమి ప్రభుత్వం అక్రమ కేసులతో విరుచుకుపడుతోంది. ఈ 20 నెలల్లో ఇప్పటికే 270కుపైగా సోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమ కేసుల్లో దాదాపు 100మందిని అక్రమంగా అరెస్టులకు తెగబడింది. ఆ క్రమంలోనే ఈసారి వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి(మీడియా) పూడి శ్రీహరిని పోలీసులు లక్ష్యంగా చేసుకున్నారు. చిత్తూరుజిల్లా కుప్పం పోలీసులు మఫ్టీలో వచ్చి గుంటూరు జిల్లా తాడేపల్లిలో బుధవారం ఉదయాన్నే శ్రీహరిని అపహరించుకుపోయారు. తక్షణం స్పందించిన వైఎస్సార్సీపీ న్యాయపోరాటానికి ఉపక్రమించి పోలీసుల కుట్రకు సమర్థంగా అడ్డుకట్ట వేసింది. అయినా సరే పోలీసులు శ్రీహరిని బుధవారం అర్ధరాత్రి దాటినా న్యాయమూర్తి ఎదుట హాజరుపరచకుండా అక్రమంగా నిర్బంధించి వేధిస్తుండటం చంద్రబాబు ప్రభుత్వ మార్కు బరితెగింపునకు నిదర్శనంగా నిలుస్తోంది. సీఎంవో, డీజీపీ కార్యాలయం కనుసన్నల్లోనే... ముఖ్యమంత్రి కార్యాలయం, డీజీపీ కార్యాలయం స్థాయిలోనే పక్కాగా పన్నాగం పన్నారు. అందులో భాగంగానే ఓ సోషల్ మీడియా పోస్టుపై కుప్పం టీడీపీ నేత వినోద్ కుమార్ మూర్తితో ఫిర్యాదు ఇప్పించారు. ఆ వెంటనే అనంతపురం జిల్లా రాప్తాడులోని సోషల్ మీడియా కార్యకర్త గిరీష్ కుమార్ రెడ్డిని మంగళవారం అక్రమంగా అరెస్టు చేశారు. ఆ వెంటనే వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి( మీడియా) పూడి శ్రీహరిని పోలీసులు లక్ష్యంగా చేసుకున్నారు. అందుకోసం కుప్పం పోలీసులు మఫ్టీలో మంగళవారం రాత్రే తాడేపల్లి చేరుకున్నారు. శ్రీహరి నివాసం వద్ద రెక్కీ నిర్వహించారు. బుధవారం ఉదయం 8గంటల ప్రాంతంలో శ్రీహరిని అక్రమంగా అదుపులోకి తీసుకున్నారు. మఫ్టీలో ఉన్నవారు పోలీసులో.. ఎవరైనా అసాంఘిక శక్తులో కూడా అంతుబట్ట లేదు. ‘అసలు ఏ కేసులో అదుపులోకి తీసుకుంటున్నారు... సోషల్ మీడియా పోస్టుతో నాకేం సంబంధం... నా సోషల్ మీడియా ఖాతా నుంచి ఎటువంటి పోస్టు పెట్ట లేదు కదా.. అసలు బీఎన్ఎస్ 35(3) కింద నోటీసులు ఇవ్వాలి కదా’అని శ్రీహరి పోలీసులను అడిగినా సరే పోలీసులు బలవంతంగా వారి వాహనంలోకి ఎక్కించి తీసుకుపోయారు. ఆయన ఫోన్, ల్యాప్టాప్ను స్వాదీనం చేసుకున్నారు. శ్రీహరిని అక్రమంగా నిర్బంధించి తరలిస్తున్న పోలీసు వాహనాన్ని ఆయన వ్యక్తిగత సహాయకుడు సింహాచలం నాయుడు కొద్ది దూరం అనుసరించారు. కానీ పోలీసులు ఆయన్ని బలవంతంగా వెనక్కి పంపించి వేశారు. అనంతరం మరో బృందం పోలీసులు శ్రీహరి నివాసంలో దాదాపు 3గంటల పాటు సోదాలు చేసింది. ఆయన నివాసంలో పలు రికార్డులు, ఇతర వస్తువులను స్వా«దీనం చేసుకున్నారు. బెడిసికొట్టిన కుట్ర... గిరీశ్కు బెయిల్ మంజూరు సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధంగా పోలీసులు తెగబడ్డ అక్రమ అరెస్టును న్యాయస్థానం తిరస్కరించింది. ఈ కేసులో పోలీసులు అరెస్టు చేసిన గిరీశ్ కుమార్ రెడ్డిని పోలీసులు బుధవారం సాయంత్రం కుప్పం న్యాయస్థానంలో హాజరుపరిచారు. ఆయనకు రిమాండ్ విధించాలని పోలీసుల తరపు న్యాయవాదులు కోరారు. కాగా సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా పోలీసులు అక్రమ అరెస్టు చేశారని నిందితుల తరపున సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి న్యాయస్థానానికి నివేదించారు. బీఎన్ఎస్ 111 సెక్షన్ కింద కేసు నమోదు చేయడం అక్రమమని వాదనలు వినిపించారు. సోషల్ మీడియా పోస్టులపై నోటీసులు ఇవ్వకుండా అరెస్టు చేయడాన్ని న్యాయస్థానం తప్పుబట్టింది. గిరీశ్కు వ్యక్తిగత పూచీకత్తు మీద బెయిల్ మంజూరు చేసింది. సోషల్ మీడియా పోస్టులపై బీఎన్ఎస్ 111 సెక్షన్ కింద కేసు నమోదు చేయడం ఏమిటని న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. వ్యవస్థీకృత నేరాలకు సంబంధించిన కేసుల్లో నమోదు చేయాల్సిన బీఎన్ఎస్ 111 సెక్షన్ సోషల్ మీడియా కేసులకు వర్తించదని తేల్చి చెప్పింది. ఈ కేసులో ఏ1 గా పేర్కొన్న గిరీశ్ కుమార్ రెడ్డికి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేయడంతో పోలీసుల కుట్ర బెడిసికొట్టింది. శ్రీహరిని న్యాయమూర్తి ఎదుట హాజరుపరిస్తే బెయిల్ మంజూరు అవుతుందని పోలీసులకు స్పష్టమైంది. అందుకే కుప్పం పోలీస్ స్టేషన్లోనే విచారణ పేరుతో కొత్త డ్రామాకు తెరతీశారు. సాయంత్రం 6గంటలకు పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చిన శ్రీహరిని అర్ధరాత్రి వరకు న్యాయమూర్తి ఎదుట హాజరుపరచలేదు. శ్రీహరితో మాట్లాడేందుకు ఆయన తరపు న్యాయవాదులను కూడా పోలీసులు అనుమతించలేదు.హెబియస్ కార్పస్ పిటిషన్తో... కిడ్నాప్ పన్నాగానికి తెర...శ్రీహరి అరెస్టుతో అప్రమత్తమైన వైఎస్సార్సీపీ న్యాయ విభాగం వెంటనే హైకోర్టును ఆశ్రయించింది. శ్రీహరి ఆచూకీ తెలియజేయాలని పోలీసులను ఆదేశించాలని కోరుతూ బుధవారం హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ కేసును గురువారం విచారిస్తామని హైకోర్టు తెలిపింది. దాంతో పోలీసులు విధి లేని పరిస్థితుల్లో పూడి శ్రీహరిని సాయంత్రం 6 గంటలకు కుప్పం పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ కేసులో గిరీశ్ కుమార్ రెడ్డిని అరెస్టు చేసినట్టు ప్రకటించి కుప్పం న్యాయస్థానంలో హాజరుపరిచారు. ఎఫ్ఐఆర్ నమోదులోనూ పోలీసులు సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా వ్యవహరించారు. సోషల్ మీడియా పోస్టులపై బీఎన్ఎస్ 111 కింద కేసులు నమోదు చేయవద్దని హైకోర్టు, సుప్రీంకోర్టు ఇప్పటికే పలు సార్లు స్పష్టం చేశాయి. వ్యవస్థీకృత నేరాల కేసుల్లో నమోదు చేయాల్సిన బీఎన్ఎస్ 111 సెక్షన్ను సోషల్ మీడియా పోస్టులకు వర్తింపజేయడం చెల్లదని తేల్చి చెప్పాయి. అయినా సరే కుప్పం పోలీసులు బీఎన్ఎస్ 111 తోపాటు 196(1)ఎ, 352(2), 336(1), 340(2), 61(2) సెక్షన్లు, ఐటీ చట్టం 67 కింద కేసు నమోదు చేయడం విస్మయపరుస్తోంది. ఈ కేసులో గిరీశ్ కుమార్ రెడ్డిని ఏ1గా, పూడి శ్రీహరిని ఏ2గా పేర్కొన్నారు. -
టీడీఆర్ బాండ్లే తీసుకోవాలని బలవంతం చేయొద్దు
సాక్షి, అమరావతి: భూ సేకరణ చట్టం కింద భూమి తీసుకున్నప్పుడు చట్ట ప్రకారం చెల్లించాల్సిన పరిహారాన్ని ఇవ్వకుండా టీడీఆర్ బాండ్లు తీసుకోవాలని బలవంతం చేయడానికి వీల్లేదని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు తేల్చి చెప్పింది. టీడీఆర్ బాండ్లు తీసుకోవడానికి భూ యజమానులు నిరాకరిస్తే చట్టం నిర్దేశించిన మేరకు పరిహారం చెల్లించడం తప్ప మరో మార్గం లేదని స్పష్టం చేసింది. పరిహారానికి బదులు టీడీఆర్ బాండ్లు తీసుకోవడం తప్పనిసరి కాదంది. టీడీఆర్ బాండ్లు తీసుకోవడమన్నది కేవలం ఐచ్ఛికం మాత్రమేనని పేర్కొంది. తీసుకున్న భూమికి చట్ట ప్రకారం పరిహారం చెల్లించకుండా టీడీఆర్ బాండ్లు తీసుకోవాలని భూ యజమానులను ఒంగోలు మున్సిపల్ అధికారులు బలవంతం చేయడాన్ని తప్పుపట్టింది. బాండ్లు తీసుకునేందుకు భూ యజమానులు నిరాకరించారని గుర్తు చేసింది. ఈ నేపథ్యంలో వారికి చట్ట ప్రకారం పరిహారం చెల్లించాలని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్ ఇటీవల తీర్పు వెలువరించారు.బెదిరింపులకు దిగటంతో హైకోర్టును ఆశ్రయించిన బాధితులుఒంగోలు మున్సిపల్ అధికారులు జేఎంబీ చర్చి సెంటర్ నుంచి ఓల్డ్ మార్కెట్ వరకు రోడ్డు విస్తరణ చేపట్టాలని నిర్ణయించారు. ఇందుకోసం కొన్ని ఆస్తులను సేకరించాలని నిర్ణయించారు. అందులో భాగంగా పలువురికి నోటీసులు జారీ చేశారు. టీడీఆర్ బాండ్లు లేదా పరిహారానికి ఆమోదం తెలిపాలని సదరు భూ యజమానులను కోరారు. అయితే, భూ యజమానులు టీడీఆర్ బాండ్లు తీసుకునేందుకు నిరాకరించారు. తమకు చట్ట ప్రకారం పరిహారం చెల్లించాలని కోరారు. దీంతో ఒంగోలు పురపాలక శాఖ అధికారులు టీడీఆర్ బాండ్లు తీసుకోవాల్సిందేనని, లేనిపక్షంలో ఇల్లు కూల్చేస్తామంటూ మౌఖికంగా బెదిరింపులకు దిగారు. దీంతో భూ యజమానులు హైకోర్టును ఆశ్రయించారు. టీడీఆర్ బాండ్లు కాకుండా తమకు చట్ట ప్రకారం పరిహారం చెల్లించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై ఇటీవల న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్ విచారణ జరిపారు. పిటిషనర్ల తరఫు న్యాయవాది షేక్ ఆసిఫ్ వాదనలు వినిపిస్తూ.. టీడీఆర్ బాండ్లు తీసుకోవాల్సిందేనని పిటిషనర్లను అధికారులు బలవంతం చేస్తున్నారని తెలిపారు. చట్ట ప్రకారం పరిహారం చెల్లించకుండా ఎగవేసేందుకే అధికారులు టీడీఆర్ బాండ్లను తీసుకోవాలని ఒత్తిడి చేస్తున్నారని వివరించారు.బలవంతంగా రుద్దడానికి వీల్లేదువాదనలు విన్న న్యాయమూర్తి అధికారుల తీరును తప్పుపట్టారు. బాధితులపై టీడీఆర్ బాండ్లను బలవంతంగా రుద్దడానికి వీల్లేదని స్పష్టం చేశారు. బాధితులైన భూ యజమానులు టీడీఆర్ బాండ్లను తిరస్కరిస్తే 2013 భూ సేకరణ చట్టం కింద పరిహారం చెల్లించడం మినహా ప్రభుత్వానికి మరో ప్రత్యామ్నాయం లేదని తేల్చి చెప్పారు. పిటిషనర్కు 2013 చట్ట ప్రకారం మార్కెట్ ధరను ఖరారు చేసి అందుకు అనుగుణంగా పరిహారాన్ని చెల్లించాలని ఒంగోలు మున్సిపల్ అధికారులను ఆదేశించారు. -
కోర్టుకు ఇచ్చిన హామీ ఉల్లంఘన శిక్షార్హమే..!
సాక్షి, అమరావతి: కోర్టుకిచ్చిన హామీ ఉల్లంఘన ఎంతమాత్రం క్షమార్హం కాదని హైకోర్టు స్పష్టం చేసింది. ఇలాంటి ఉల్లంఘనకు పాల్పడిన ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగికి నెల రోజుల సాధారణ జైలు శిక్ష, రూ.2వేల జరిమానా విధించింది. దీంతోపాటు రూ.10వేలు ఖర్చులు విధించింది. ఈ మొత్తాన్ని ఏపీ హైకోర్టు న్యాయసేవల కమిటీకి జమ చేయాలని ఆదేశించింది. న్యాయమూర్తులు జస్టిస్ రవినాథ్ తిల్హరీ, జస్టిస్ కుంచం మహేశ్వరరావు ధర్మాసనం ఈ మేరకు ఇటీవల తీర్పు వెలువరించింది. వివరాల్లోకి వెళితే ఆస్తి వివాదానికి సంబంధించి సాఫ్ట్వేర్ ఉద్యోగి నగతం ముకుందరెడ్డి, మరికొందరిపై నగతం సునీత, మరో ముగ్గురు 2009లో తిరుపతి ఐదో అదనపు జిల్లా కోర్టులో దావా వేశారు.విచారణ జరిపిన తిరుపతి కోర్టు, ఆస్తిలో 1/4 వాటా సునీత తదితరులకు చెందుతుందని 2017లో డిక్రీ జారీ చేసింది. దీనిని సవాలు చేస్తూ ముకుందరెడ్డి తదితరులు హైకోర్టులో అప్పీల్ చేయడంతో తీర్పు అమలు ఆగిపోయింది. కాగా తిరుపతి కోర్టులో తాము దాఖలు చేసిన తమ ఆస్తి ఒరిజినల్ డాక్యుమెంట్లను వెనక్కి ఇచ్చేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ ముకుందరెడ్డి హైకోర్టులో అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. ఈ డాక్యుమెంట్లను బ్యాంకు తాకట్టు పెట్టడం గానీ, ఆస్తిపై మూడో పక్షానికి హక్కులు సృష్టించడం గానీ చేయబోమని హైకోర్టుకు హామీ ఇచ్చారు.దీంతో ఈ మేరకు 2021లో హైకోర్టు సానుకూల ఆదేశాలు ఇచ్చింది. అయితే ముకుందరెడ్డి కోర్టు నుంచి తీసుకున్న ఆస్తి ఒరిజినల్ డాక్యుమెంట్లను తాకట్టు పెట్టారని, ఆ ఆస్తిని థర్డ్ పార్టీకి విక్రయించి రిజిస్ట్రేషన్ చేశారని, ఇది కోర్టు ఆదేశాలను ఉల్లంఘించడమేంటూ సునీత మరికొందరు 2025లో కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ తిల్హరీ ధర్మాసనం ఇటీవల తుది విచారణ జరిపింది. ముకుందరెడ్డి ఉద్దేశపూర్వకంగా తమ ఆదేశాలను ఉల్లంఘించారని, ఇది కోర్టు ధిక్కారమేనని తేల్చింది. -
పిల్ పెండింగ్లో ఉండగానే బాబు కేసును మూసేసిన ఏసీబీ కోర్టు
సాక్షి, అమరావతి: చంద్రబాబు కుంభకోణాలపై సీబీఐ దర్యాప్తు కోరుతూ స్వర్ణాంధ్ర పత్రిక ఎడిటర్ కొట్టి బాలగంగాధర తిలక్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) హైకోర్టులో పెండింగ్లో ఉండగానే, ఏసీబీ కోర్టు తొందరపాటు నిర్ణయం తీసుకుందని న్యాయవాది శెట్టిపల్లి దుష్యంత్రెడ్డి హైకోర్టుకు నివేదించారు. పిల్ పెండింగ్లో ఉన్న విషయాన్ని పట్టించుకోకుండా చంద్రబాబుపై గత ప్రభుత్వ హయాంలో సీఐడీ నమోదు చేసిన మద్యం కుంభకోణం కేసును ఏసీబీ కోర్టు మూసివేసిందని ఆయన వివరించారు. పైపెచ్చు ఈ కేసు డాక్యుమెంట్లను కోరితే అందుకుసైతం ‘థర్డ్ పార్టీ పేరుతో’ ఏసీబీ కోర్టు తిరస్కరించిందన్నారు. ఇదే తరహా వ్యాజ్యాలు ఇప్పటికే ఇదే హైకోర్టులో పెండింగ్లో ఉన్నాయని ఆయన న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. సీఐడీ తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపిస్తూ, అసలు ఈ వ్యాజ్యానికి విచారణార్హతే లేదన్నారు. పిటిషనర్ తిలక్కు చంద్రబాబుపై నమోదైన కేసులతో సంబంధం లేదన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు ఇదే తరహా అంశాలపై ఇప్పటికే దాఖలైన వ్యాజ్యాలతో ఈ వ్యాజ్యాన్ని జత చేయాలని, అన్నింటినీ కలిపి విచారిస్తామని స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఈ నెల 17కు వాయిదా వేస్తూ న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా, కొల్లు రవీంద్ర ఎక్సైజ్ మంత్రిగా ఉన్న 2014–2019 మధ్య కాలంలో మద్యం విధానానికి సంబంధించి తీసుకున్న నిర్ణయాల వల్ల ప్రభుత్వ ఖజానాకు వాటిల్లిన నష్టంపై 2023లో సీఐడీ నమోదు చేసిన కేసులో తాను కోరిన డాక్యుమెంట్లను ఇచ్చేందుకు విజయవాడ ఏసీబీ కోర్టు తిరస్కరించడాన్ని ప్రశి్నస్తూ తిలక్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఫైనల్ రిపోర్ట్, సీఆర్పీసీ 161 స్టేట్మెంట్లు, క్లోజర్ రిపోర్ట్ సరి్టఫైడ్ కాపీలను తనకు ఇచ్చేలా ఏసీబీ కోర్టును ఆదేశించాలని హైకోర్టును ఆయన అభ్యర్థించారు. -
చంద్రబాబు మద్యం కుంభకోణం కేసు డాక్యుమెంట్లు ఇప్పించండి
సాక్షి, అమరావతి: చంద్రబాబు ముఖ్యమంత్రిగా, కొల్లు రవీంద్ర ఎక్సైజ్ మంత్రిగా ఉన్న 2014–2019 మధ్య కాలంలో మద్యం విధానంపై తీసుకున్న నిర్ణయాల వల్ల ప్రభుత్వ ఖజానాకు వాటిల్లిన వేల కోట్ల రూపాయల భారీ నష్టంపై 2023లో సీఐడీ నమోదు చేసిన కేసులో తాను కోరిన డాక్యుమెంట్లను ఇచ్చేందుకు విజయవాడ ఏసీబీ కోర్టు తిరస్కరించడాన్ని ప్రశ్నిస్తూ స్వర్ణాంధ్ర పత్రిక ఎడిటర్ కొట్టి బాలగంగాధర తిలక్ హైకోర్టును ఆశ్రయించారు. తనను థర్డ్ పార్టీగా పేర్కొంటూ తాను కోరిన సర్టిఫైడ్ కాపీలు ఇచ్చేందుకు ఏసీబీ కోర్టు నిరాకరించిందని తాజా పిటిషన్లో పేర్కొన్నారు. మద్యం పాలసీ కుంభకోణానికి సంబంధించిన ఫైనల్ రిపోర్ట్, సీఆర్పీసీ 161 స్టేట్మెంట్లు, క్లోజర్ రిపోర్ట్ తాలూకు సర్టిఫైడ్ కాపీలను తనకు ఇచ్చేలా ఏసీబీ కోర్టును ఆదేశించాలని కోరారు. పిటిషన్లో ముఖ్యాంశాలు.. చంద్రబాబు, కొల్లు రవీంద్ర తదితరులు వారికి అనుకూలమైన కొన్ని డిస్టిలరీలకు, అధికారంలో ఉన్న వ్యక్తులకు అనుచిత లబ్ధి చేకూర్చేలా మద్యం విధానాన్ని రూపొందించారు. దీనివల్ల ప్రభుత్వ ఖజానాకు భారీ నష్టం వాటిల్లడమే కాకుండా, మద్యం నాణ్యత కూడా క్షీణించింది. ఈ కేసులో నిందితులుగా ఉన్నవారిలో కొంతమంది ప్రజా సేవకులు (పబ్లిక్ సర్వెంట్లు) ఉన్నారు. వీరిపై అవినీతి నిరోధక చట్టం కింద నిర్దిష్టమైన అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఒక ప్రభుత్వ ఉద్యోగి అవినీతి అనేది కేవలం వ్యక్తిగతమైనది కాదు.. అది మొత్తం రాష్ట్రానికి, సమాజానికి వ్యతిరేకంగా జరిగే నేరమని సుప్రీంకోర్టు పలు సందర్భాల్లో స్పష్టం చేసింది. కాబట్టి, చంద్రబాబు, కొల్లు రవీంద్రలపై గతంలో నమోదు చేసిన కేసును మూసివేస్తూ సీఐడీ దాఖలు చేసిన క్లోజర్ రిపోర్ట్ను ప్రశ్నించే హక్కు రాష్ట్రంలోని ప్రతి వ్యక్తికీ ఉంటుంది. ఆ ప్రకారమే, నాకు కూడా ఈ కేసును ప్రశ్నించే చట్టపరమైన హక్కు ఉంది. చంద్రబాబు హయాంలో జరిగిన మద్యం కుంభకోణం కేసు దర్యాప్తును సీబీఐకి బదలాయించాలని కోరుతూ నేను హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశాను. దర్యాప్తు పారదర్శకంగా, నిష్పక్షపాతంగా జరగాలని, ప్రజలకు న్యాయవ్యవస్థపై నమ్మకం సన్నగిల్లకూడదన్న ఉద్దేశంతోనే నేను ఆ పిల్ దాఖలు చేశా. ఈ పిల్ పెండింగ్లో ఉండగానే, మద్యం కుంభకోణం కేసును ఏసీబీ కోర్టు మూసివేసింది. హైకోర్టులో నేను దాఖలు చేసిన పిల్లో తదుపరి విచారణ నిమిత్తం మద్యం కుంభకోణానికి సంబంధించిన ఫైనల్ రిపోర్ట్, సీఆర్పీసీ 161 స్టేట్మెంట్లు, క్లోజర్ రిపోర్ట్లు చాలా అవసరం. పిల్ దాఖలు చేసింది నేనే కాబట్టి ఈ డాక్యుమెంట్లు ఇవ్వాలని ఏసీబీ కోర్టును కోరాను. అయితే ఏసీబీ కోర్టు దీనికి నిరాకరించింది. -
‘లులు’కు భూ కేటాయింపు.. వెనక్కి తగ్గిన బాబు సర్కార్
సాక్షి, విజయవాడ: విజయవాడలో లూలు మాల్కు భూముల కేటాయింపుపై చంద్రబాబు ప్రభుత్వం వెనక్కి తగ్గింది. విజయవాడలో లూలు మాల్కు భూమి కేటాయింపు సవాలు చేస్తూ దాఖలైన పిల్పై ఏపీ హైకోర్టు ఇవాళ విచారణ జరిపింది. లులు మాల్కు కేటాయించిన భూమిని రద్దు చేసుకుంటున్నామని కోర్టుకు ప్రభుత్వం తెలిపింది. త్వరలోనే రద్దుకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేస్తామని కోర్టుకు ప్రభుత్వం తెలిపింది.కాగా, విజయవాడ నడిబొడ్డున పాత బస్టాండుగా వ్యవహరించే గవర్నర్పేట డిపోకు చెందిన 4.15 ఎకరాల భూమిని చంద్రబాబు సర్కారు లులు చేతిలో పెట్టడానికి చంద్రబాబు ప్రభుత్వం ప్రయత్నించింది. ఈ భూమి విలువ బహిరంగ మార్కెట్లో రూ.600 కోట్లపైనే ఉంటుంది. జీ+3 విధానంలో లులు ఇక్కడ షాపింగ్ మాల్ ఏర్పాటు చేసుకునేందుకు 99 ఏళ్లు లీజుపై ఈ భూమిని రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది.అయితే, లులుకి భూములు కట్టబెట్టడంపై ఆర్టీసి ఉద్యోగ సంఘాలు, ప్రజా సంఘాలు మండిపడ్డాయి. పోరాటానికి ప్రభుత్వం దిగొచ్చింది. గతంలో లులు అద్బుతం అంటూ చంద్రబాబు పొగడ్తలు గుప్పించారు. హైకోర్టులో నేడు లులు మాల్కి కేటాయించిన భూమిని రద్దు చేసుకుంటున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. -
రాజ్ కేసిరెడ్డికి బెయిల్ మంజూరు
సాక్షి, అమరావతి: ఏపీ మద్యం అక్రమ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. మద్యం అక్రమ కేసులో రాజ్కేసిరెడ్డితో పాటుగా రోనక్ కుమార్కు ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. షరతులతో కూడిన బెయిల్ను హైకోర్టు ఇచ్చింది. -
తక్కువ వేతనంతో తాత్కాలిక ఉద్యోగం.. 'శ్రమ దోపిడీ'నే..
-
సంప్రదాయాలు పాటిస్తేనే అర్చకత్వం
సాక్షి, అమరావతి: అర్చకులు దేవస్థానాల ప్రధాన గర్భాలయంలోకి ప్రవేశించే విషయంలో హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. దేవదాయ శాఖ పరిధిలోని దేవాలయాల్లో పనిచేసే ఏ అర్చకుడైనా విదేశీయానం చేసి వస్తే, అతన్ని ప్రధాన ఆలయ గర్భాలయంలో అర్చకత్వం (పూజా కార్యక్రమాలు) నిర్వహించడానికి అనుమతించరాదంటూ 2010లో జారీ చేసిన సర్క్యులర్ను, అలాగే 2024లో శృంగేరి శారదాపీఠం జగద్గురువులు శ్రీశ్రీశ్రీ మహాతీర్థ భారతీ స్వామి జారీ చేసిన ప్రామాణికతను అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. సంప్రదాయాలకు విరుద్ధంగా జుట్టు కత్తిరించుకున్న వారు గర్భాలయంలోకి ప్రవేశించరాదని స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. విజయవాడ శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో పలువురు ప్రదాన అర్చకులు విదేశీయానం చేసి వచ్చారని, అయినా కూడా వారిని ప్రధాన గర్భాలయంలో అర్చకత్వం నిర్వహణకు దేవదాయ శాఖ అధికారులు అనుమతిస్తున్నారని పేర్కొంటూ ఆ దేవస్థానంలో శ్రీచక్ర నవావరణ అర్చన పారాయణదారుగా పనిచేస్తున్న డిఎస్ఎస్ఎస్ సుబ్రహ్మణ్యం సోమయాజీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.పిటిషనర్ తరఫు న్యాయవాది కేఆర్ శ్రీనివాస్ వాదనలు వినిపిస్తూ, అర్చకత్వం విషయంలో ప్రస్తుత దేవదాయ శాఖ నిబంధనలు, ఏపీ ధార్మిక పరిషత్తు జారీ చేసిన సర్క్యులర్, అలాగే 2024 డిసెంబర్ 12న శ్రీ శారదాపీఠం జగద్గురువులు శ్రీశ్రీశ్రీ మహాతీర్థ భారతీ స్వామి జారీ చేసిన ప్రామాణిక మార్గదర్శకాలను తూచా తప్పకుండా అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. -
తక్కువ వేతనంతో తాత్కాలిక ఉద్యోగం.. ‘శ్రమ దోపిడీ’నే..
సాక్షి, అమరావతి: శాశ్వత ప్రాతిపదికన ఖాళీలను భర్తీ చేయకుండా దశాబ్దాల తరబడి తక్కువ వేతనంతో ఉద్యోగుల సేవలను వాడుకోవడం ‘శ్రమ దోపిడీ’ అవుతుందని హైకోర్టు స్పష్టం చేసింది. అవసరమైన, నిరంతరాయమైన పనుల కోసం ‘తాత్కాలికం’ పేరుతో ఉద్యోగులను నిరవధికంగా వాడుకోవడం రాజ్యాంగ విరుద్ధమని తేల్చి చెప్పింది. ప్రభుత్వం ఎప్పుడూ ఆదర్శ యజమానిగా ఉండాలే తప్ప, పౌరులను శ్రమ దోపిడీ చేసేలా వ్యవహరించడానికి వీల్లేదని పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం వివిధ శాఖల్లో ఉన్న ఖాళీలను శాశ్వత ప్రాతిపదికన, సరైన ఎంపిక విధానం ద్వారా భర్తీ చేయకుండా, విద్యావంతులను, అన్నీ అర్హతలున్న వారిని ఔట్సోర్సింగ్ లేదా కాంట్రాక్ట్ ప్రాతిపదికన తక్కువ వేతనాలకు నియమించుకుంటోందని హైకోర్టు ఆక్షేపించింది. ఇలా ఔట్సోర్స్, కాంట్రాక్ట్ ప్రాతిపదికన నియమించుకున్న ఉద్యోగులను దశాబ్దాల పాటు ఉపయోగించుకుంటోందని తెలిపింది. ఇలా దశాబ్దాలుగా పనిచేస్తూ వస్తున్న ఉద్యోగులు తమ సర్వీసులను క్రమబద్ధీకరించాలని కోరితే, మీ నియామకాలు సక్రమంగా జరగలేదనో, మంజూరైన పోస్టులకు అనుగుణంగా నియామకాలు జరగలేదనో ప్రభుత్వం చెప్పడం పరిపాటిగా మారిందని హైకోర్టు పేర్కొంది. దశాబ్దాల తరబడి వారి నుంచి సేవలు పొందిన తరువాత ప్రభుత్వం సాంకేతిక కారణాలను సాకుగా చూపి వారి హక్కులను నిరాకరించడానికి వీల్లేదంది. ఈ మేరకు ఇటీవల న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్, జస్టిస్ సుబేందు శమంతో కూడిన ధర్మాసనం తీర్పునిచ్చింది. పిటిషనర్ల సర్వీసును రెండు నెలల్లో క్రమబద్ధీకరించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. సర్వీసుల క్రమబద్ధీకరించాలకు పిటిషన్లు...విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్లో టైపిస్టులు, ట్రేసర్లు, వర్క్ ఇన్స్పెక్టర్లు, ఆఫీస్ సబార్డినేట్లు, వాచ్మెన్లు, గార్డెనర్, ఎలక్ట్రీషియన్, డ్రైవర్లుగా దశాబ్దాలుగా పనిచేస్తున్న తమను రెగ్యులరైజ్ చేసేలా ఆదేశాలు ఇవ్వాలంటూ కె.శ్రీనివాస్ మరో 36 మంది 2018లో ఏపీ పరిపాలనా ట్రిబ్యునల్ (ఏపీఏటీ)ను ఆశ్రయించారు. అలాగే తమ సర్వీసులను కూడా క్రమబద్దీకరించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ తెలుగు గంగ ప్రాజెక్టులో పనిచేస్తున్న కె.నారాయణరెడ్డి, టీఎస్.ఖాజామైనుద్దీన్ కూడా ఏపీఏటీలో పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై విచారణ జరిపిన ట్రిబ్యునల్, సర్వీసుల క్రమబద్ధీకరణకు పిటిషనర్లు అర్హులు కారంటూ 2018లో వారి పిటిషన్లు కొట్టేసింది. ట్రిబ్యునల్ తీర్పును సవాలు చేస్తూ వీరంతా 2018లో హైకోర్టులో వేర్వేరుగా మూడు పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై ధర్మాసనం తుది విచారణ జరిపి తీర్పునిచ్చింది. పిటిషనర్లు 1987, 1989లో నామినల్ మస్టర్ రోల్ (ఎన్ఎంఆర్) పద్ధతిన విధుల్లో చేరారు. 1993 నాటికి ఐదేళ్ల సర్వీసు పూర్తి చేయలేదనే ఒకే ఒక్క కారణంతో వారి ఉద్యోగాలను క్రమబద్ధీకరించలేదు. -
సెలవులకు ముందు అరెస్ట్ పరిపాటిగా మారింది
సాక్షి, అమరావతి/టాస్క్ ఫోర్స్: తిరుపతిలో కలకలం రేపిన వైఎస్సార్సీపీ నేత తంబిరెడ్డి అక్రమ అరెస్టు విషయంలో పోలీసుల తీరుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నిర్బంధం జరిగిన వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వకపోవడాన్ని తప్పుపట్టింది. సోషల్ మీడియా యాక్టివిస్టులను సెలవులకు ముందు అరెస్ట్ చేయడం పోలీసులకు పరిపాటిగా మారిందని వ్యాఖ్యానిస్తూ, ఈ విధానాన్ని ‘‘హైడ్ అండ్ సీక్’’ ఆటతో పోలి్చంది. ఇది ఒక్క కేసుకు పరిమితం కాకుండా అనేక కేసుల్లో జరుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. అరెస్టు తేదీని దాచిపెట్టి నిన్ననే అరెస్టు చేశాం.. అంటారా? అంటూ తంబిరెడ్డి అరెస్ట్ విషయంలో ప్రశి్నంచింది. ఇది వ్యక్తిగత హక్కులను దెబ్బతీస్తుందని పేర్కొంది. పోలీసులు ఇలాగే చేస్తుంటే ఇల్లీగల్ కేసు పెట్టాల్సి వస్తుందని హెచ్చరించింది. అక్రమ నిర్బంధంపై హెబియస్ కార్పస్ వేసినప్పుడు మాత్రమే.. కేసులు పెట్టి అరెస్ట్లు చూపిస్తున్నారని తెలిపింది. గత 35 సంవత్సరాలుగా ఇలాంటివి చూస్తూనే ఉన్నామని పేర్కొంది. సోషల్ మీడియా యాక్టివిస్టుల అరెస్టుల విషయంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాల్సిందేనని పోలీసులను ఆదేశించింది. రెండేళ్ల క్రితం కేసుకు సంబంధించి ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నిర్వాహకుడు, 60 ఏళ్ళ వృద్ధుడు తంబి రెడ్డి నిర్బంధంపై దాఖలైన పిటిషన్ను విచారించిన జస్టిస్ కంచిరెడ్డి సురేష్ రెడ్డి , జస్టిస్ హరిహరనాథ శర్మ ధర్మాసనం.. ఆయన అరెస్ట్పై పూర్తి వివరాలను తమ ముందు ఉంచాలని పోలీసులను ఆదేశించింది. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. తంబిరెడ్డి విడుదల.. పోలీసులకే మంచిది ‘తంబిరెడ్డిని విడుదల చేయాలని లిఖితపూర్వక ఆదేశాలు ఇవ్వడం లేదు. మౌఖికంగా ఈ విషయాన్ని చెబుతున్నాం. తంబిరెడ్డిని విడుదల చేయడం పోలీసులకే మంచిది. ఏం జరిగిందన్న దానిపై చాలా స్పష్టత ఉంది. ఇలాంటి విషయాల్లో మొండిగా వెళితే ఇబ్బంది పడేది పోలీసులే. పిటిషనర్ వాదనలు తన తండ్రి తంబిరెడ్డిని గత నెల 31న గుర్తు తెలియని వ్యక్తులు కారులో బలవంతంగా తీసుకెళ్లారని , ఇప్పటి వరకు ఆయన జాడ తెలియలేదని, ఆయనను కోర్టు ముందు హాజరుపరిచేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ నితిన్ రెడ్డి హైకోర్టులో అత్యవసర హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషనర్ తరఫు న్యాయవాది వెంకటేష్ ధర్మాసనం ముందు వాదనలు వినిపిస్తూ, ‘పోలీసులు తంబిరెడ్డి ని అక్రమంగా నిర్బంధించారు. దీనిపై తాము తిరుపతి పోలీసులకు ఫిర్యాదు చేస్తే వారు అదృశ్యం కేసు నమోదు చేశారు. హైకోర్టులో తాము ఈ పిటిషన్ దాఖలు చేసిన తరువాత గుంటూరు అరండల్ పేట పోలీసులు ఫోన్ చేసి తంబి రెడ్డిని సోషల్ మీడియాలో పోస్టులపై అరెస్ట్ చేశామని పిటిషనర్ నితిన్ రెడ్డికి చెప్పారు. సోషల్ మీడియా కేసుల్లో 7 సంవత్సరాల కన్నా తక్కువ శిక్షే ఉన్నప్పటికీ, పోలీసులు దారుణంగా వ్యవహరిస్తున్నారు’ అని వివరించారు. వివరాలను తెలపడానికి సమయం ఇవ్వాలని పోలీసుల తరఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది టి.విష్ణుతేజ చేసిన విజ్ఞప్తి మేరకు విచారణ సోమవారానికి వాయిదా పడింది. హైకోర్టు ఆదేశించినా మారని పోలీసుల తీరు తంబిరెడ్డి అరెస్టును హైకోర్టు తీవ్రంగా తప్పుపట్టి, విడుదల చేయాలని చెప్పినా.. గుంటూరు పోలీసుల తీరు మారలేదు. గురువారం రాత్రి గుంటూరు జిల్లా జడ్జి ముందు ఆయనను హాజరుపరిచారు. అయితే న్యాయమూర్తి కేసు వివరాలను పరిశీలించి, రిమాండ్ను తిరస్కరించారు. హైకోర్టు ఆదేశాలను సైతం పట్టించుకోకుండా తన వద్దకు నిందితుడిని తీసుకురావడం పట్ల సదరు న్యాయమూర్తి పోలీసులను మందలించినట్టు సమాచారం. -
హిందూమహిళ వారసత్వ ఆస్తిపై భర్తకు హక్కు ఉండదు
సాక్షి, అమరావతి: హిందూమహిళకు తల్లిదండ్రుల నుంచి సంక్రమించిన ఆస్తిపై ఆమె భర్తకు ఎలాంటి హక్కు ఉండదని హైకోర్టు స్పష్టం చేసింది. ఆ మహిళ సంతానం లేకుండా చనిపోతే ఆ ఆస్తి తిరిగి ఆమె తండ్రి వారసులకే చెందుతుందని చెప్పింది. తన సోదరి శ్రీవిరిత మరణం నేపథ్యంలో ఆమెకు వారసత్వంగా తమ నాయనమ్మ నుంచి సంక్రమించిన భూమి తాలూకు రెవెన్యూ రికార్డుల్లో తన పేరును నమోదు చేయాలని కోరుతూ దేవిక మానస దాఖలు చేసిన అప్పీల్ను అనుమతిస్తూ రెవెన్యూ డివిజినల్ ఆఫీసర్ (ఆర్డీవో) జారీచేసిన ఉత్తర్వులను హైకోర్టు సమరి్థంచింది. ఆర్డీవో ఉత్తర్వులను రద్దుచేస్తూ జాయింట్ కలెక్టర్ జారీచేసిన ఉత్తర్వులను తప్పుబట్టింది. జాయింట్ కలెక్టర్ ఉత్తర్వులను రద్దుచేసింది. రికార్డుల్లో దేవిక మానస పేరు చేర్చాలని అధికారులను ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ తర్లాడ రాజశేఖరరావు ఇటీవల తీర్పు చెప్పారు. మనుమరాళ్లకు ఆస్తి ఇచ్చిన నాయనమ్మ అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండలం పెంటకోట గ్రామానికి చెందిన చిక్కాల వెంకాయమ్మ తన మనుమరాలు (కుమారుడు దత్తాత్రేయ కుమార్తె) శ్రీవిరితకు 1.50 ఎకరాల భూమిని 2002లో గిఫ్ట్డీడ్ కింద ఇచ్చారు. దీంతో రెవెన్యూ అధికారులు రికార్డుల్లో శ్రీవిరిత పేరు మీద మార్పులు చేశారు. 2005లో శ్రీవిరిత మరణించడంతో ఆ గిఫ్ట్డీడ్ను వెంకాయమ్మ 2007లో రద్దుచేశారు. ఆ భూమిని 2011లో మరో మనుమరాలు దేవిక మానసకు గిఫ్ట్డీడ్ ద్వారా ఇచ్చిన వెంకాయమ్మ 2012లో కన్నుమూశారు. అనంతరం ఆ 1.50 ఎకరాల భూమికి సంబంధించిన రెవెన్యూ రికార్డుల్లో తనపేరు చేర్చాలని దేవిక మానస తహసీల్దార్ను కోరారు. దీనికి శ్రీవిరిత భర్త బదిరెడ్డి నాగవీరవెంకట శ్రీరామదొర అభ్యంతరం తెలిపారు.ఆ భూమి తన భార్యదని, దానిపై తనకే హక్కులున్నాయని పేర్కొన్నారు. దీంతో తహసీల్దార్ ఆయనకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నారు. దీన్ని సవాలు చేస్తూ దేవిక మానస రెవెన్యూ డివిజినల్ ఆఫీసర్ (ఆర్డీవో)ను ఆశ్రయించారు. విచారణ జరిపిన ఆర్డీవో.. తహసీల్దార్ ఉత్తర్వులను తప్పుబట్టి, రెవెన్యూ రికార్డుల్లో మార్పులు చేయాలని 2017లో ఆదేశించారు. దీనిపై శ్రీరామదొర జాయింట్ కలెక్టర్ (జేసీ) ముందు రివిజన్ దాఖలు చేశారు. విచారణ జరిపిన జేసీ 2017లో ఆర్డీవో జారీచేసిన ఉత్తర్వులను తప్పుబట్టారు. ఒకసారి గిఫ్ట్డీడ్ ఇచ్చిన తరువాత దాన్ని రద్దుచేయడానికి వీల్లేదని, సివిల్ కోర్టు ద్వారా మాత్రమే ఆ డీడ్ను రద్దుచేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. -
నెల రోజుల్లో దర్యాప్తు పూర్తిచేసి నివేదిక ఇవ్వండి
సాక్షి, అమరావతి: గ్రూప్–1 ప్రధాన పరీక్ష పత్రాల మూల్యాంకనంలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై దర్యాప్తు చేసి నివేదిక సమరి్పంచేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందానికి (సిట్) హైకోర్టు నెల రోజుల గడువునిచి్చంది. నివేదికను సీల్డ్ కవర్లో ఉంచి తమ ముందుంచాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఏప్రిల్ 30కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ బట్టు దేవానంద్, జస్టిస్ హరిహరనాథ శర్మ ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ వ్యవహారంపై సిట్ ఏర్పాటుతోపాటు 2018 గ్రూప్–1లో ఉత్తీర్ణత సాధించిన అధికారులను నాన్ ఫోకల్ పోస్టులకు బదిలీ చేయాలని కూడా హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించిన సంగతి తెలిసిందే. ‘నాన్ ఫోకల్’ అమలు తీరుపై అసహనం కాగా, 2018 గ్రూప్–1లో ఉద్యోగం సాధించి డీఎస్పీలు, ఆర్డీవోలు తదితర హోదాల్లో కొనసాగుతున్న వారిని నాన్ ఫోకల్ పోస్టులకు బదిలీ చేయాలన్న తమ ఆదేశాల అమలు తీరుపై ధర్మాసనం తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేసింది. కొందరు డీఎస్పీలకు సీఐడీలో పోస్టింగులు ఇచ్చారని, వారే ఇకపై ఈ కేసులో కీలక డాక్యుమెంట్లను తీసుకెళుతుంటారంది. ఎవరిపై ఆరోపణలు ఉన్నాయో వారినే సీఐడీలోకి తీసుకోవడం ఏంటో అర్థం కావడం లేదని ఆక్షేపించింది. చేతకాకపోతే చెప్పండి: సిట్పై అసంతృప్తి కాగా సిట్ పంపిన జవాబు పత్రాలన్నింటిని పరిశీలించడం తమకు సాధ్యం కాదని తెలిపిన హైదరాబాద్ ఫోరెన్సిక్ ల్యాబ్, 167 పత్రాలు మాత్రమే ఉంచుకుని మిగతావి తిరిగి పంపిందని అంతకుముందు సిట్ తరఫు న్యాయవాది పాణిని సోమయాజీ పేర్కొనడంపై ధర్మాసనం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. తమ ఆదేశాలను సిట్ అమలు చేయాలని లేదా సాధ్యం కాదని చెబితే, తాము ప్రత్యామ్నాయంగా మరో దర్యాప్తు సంస్థకు ఈ బాధ్యతలను అప్పజెబుతామని స్పష్టం చేసింది. అనంతరం సిట్ అధిపతితో మాట్లాడిన సోమయాజీ, దర్యాప్తును తామే కొనసాగిస్తామని ఆయన తెలిపినట్లు ధర్మాసనానికి నివేదించారు. -
సమాచారాన్ని సరిపోల్చుకోకుండా నివేదికలు వద్దు
సాక్షి, అమరావతి: న్యాయాధికారుల పనితీరు, సమర్థత, నిజాయితీ తదితరాల మదింపునకు సంబంధించిన వార్షిక రహస్య నివేదికల (ఏసీఆర్) తయారీ విషయంలో మరింత జాగరూకతతో వ్యవహరించాలని రిజిస్ట్రీని హైకోర్టు ఆదేశించింది. న్యాయాధికారులపై ఏసీఆర్ల రూపకల్పన విషయంలో కేవలం జిల్లా ప్రధాన జడ్జిలు ఇచ్చే సమాచారానికి మాత్రమే పరిమితం కాకుండా ఇతర మార్గాల్లో కూడా సమాచారాన్ని తెప్పించుకుని, రెండింటినీ సరిచూసుకోవాలని రిజిస్ట్రీకి స్పష్టం చేసింది. ఏసీఆర్లో ప్రతికూల అభిప్రాయాల నమోదు సందర్భంలో అత్యంత జాగరూకత అవసరమని, ఈ నమోదు ఏకపక్షంగా ఉండకూడదని ఉద్ఘాటించింది. ‘పలు కారణాల వల్ల అసంతృప్తితో ఉన్న ఉద్యోగులు, సహచరులు, కక్షిదారులు న్యాయాధికారుల నిజాయితీపై ఆరోపణలు చేస్తుంటారు. కొన్ని సందర్భాల్లో నచ్చని తీర్పునిచ్చారన్న కారణంతో న్యాయవాదులు, కక్షిదారులు నిజాయితీపరులైన న్యాయాధికారులను లక్ష్యంగా చేసుకుని తప్పుడు ఆరోపణలు చేసే అవకాశం కూడా ఉంటుంది. అలాంటి ఫిర్యాదులపై విచారణ విషయంతో పాటు నిజాయితీపరులైన న్యాయాధికారులను రక్షించే విషయంలో హైకోర్టు న్యాయమూర్తులు సమతుల్యత పాటిస్తున్నారు’ అని హైకోర్టు ఈ సందర్భంగా పేర్కొంది. అయితే తనకు సంబంధించిన వార్షిక రహస్య నివేదికలో పేర్కొన్న ప్రతికూల అభిప్రాయాలను తొలగించాలన్న తన వినతిని తిరస్కరిస్తూ హైకోర్టు రిజిస్ట్రార్ (విజిలెన్స్) 2013లో జారీ చేసిన ప్రొసీడింగ్స్ను సవాలు చేస్తూ విజయబాబు అనే న్యాయాధికారి దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టేసింది. విజయబాబు నిజాయితీ సందేహాస్పదమా? కాదా? అన్న విషయంపై న్యాయమూర్తులతో కూడిన రివ్యూ కమిటీ తీసుకున్న నిర్ణయానికి విరుద్ధంగా తాము తమ నిర్ణయాన్ని చెప్పలేమంది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ రఘునందన్రావు, జస్టిస్ తూటా చంద్ర ధనశేఖర్ ధర్మాసనం ఇటీవల తీర్పు వెలువరించింది. న్యాయాధికారి వ్యాజ్యం వివరాలు.. జూనియర్ సివిల్ జడ్జిగా ఎన్.విజయబాబు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్తో పాటు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్లో కూడా పలు చోట్ల పనిచేశారు. ఆయనకు సంబంధించిన 2009 వార్షిక నివేదికలో ప్రతికూల అభిప్రాయాలను పొందుపరిచారు. అయితే ఏ ప్రాతిపదికన తన ఏసీఆర్లో ప్రతికూల అభిప్రాయాలు పొందుపరిచారో చెప్పాలని హైకోర్టు రిజిస్ట్రార్ (విజిలెన్స్)కు వినతి పత్రం ఇచ్చారు. దీంతో రిజి్రస్టార్ ఏసీఆర్ తయారీ విషయంలో హైకోర్టు న్యాయమూర్తుల కమిటీ ముందుంచిన ఆధారాలను విజయబాబుకు అందచేశారు. నల్గొండ జిల్లాలో పనిచేసే సమయంలో అప్పటి జిల్లా జడ్జి ఇచ్చిన నివేదికతో పాటు అప్పటికి పెండింగ్లో ఉన్న రెండు శాఖాపరమైన విచారణలను ఆధారంగా చేసుకుని ఏసీఆర్లో ప్రతికూల అభిప్రాయాలను వ్యక్తం చేసినట్లు విజయబాబు గుర్తించారు. అటు తరువాత విజయబాబుపై ఉన్న ఆ రెండు శాఖాపరమైన విచారణలను హైకోర్టు 2012లో రద్దు చేసింది. ఈ నేపథ్యంలో విజయబాబు 2009 ఏసీఆర్లో పొందుపరిచిన ప్రతికూల అభిప్రాయాలను పునః సమీక్షించాలని కోరారు. ఈ అభ్యర్థనను రిజిస్ట్రార్ (విజిలెన్స్) 2013లో తిరస్కరించారు. దీంతో ఆయన అదే సంవత్సరం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విజయబాబు తరఫున న్యాయవాది వీఆర్ రెడ్డి కొవ్వూరి వాదనలు వినిపిస్తూ, విజయబాబుపై ఉన్న విచారణలను హైకోర్టు రద్దు చేసిన విషయాన్ని ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. -
భర్తతో ఉంటే అది అక్రమ నిర్బంధం కాదు
సాక్షి, అమరావతి: మేజర్ అయిన యువతి తన ఇష్టపూర్వకంగా ప్రేమ వివాహం చేసుకుని భర్తతో ఉండాలని నిర్ణయించుకున్నప్పుడు, అది అక్రమ నిర్బంధం కిందకు రాదని హైకోర్టు స్పష్టం చేసింది. అందువల్ల ఇలాంటి వ్యవహారాల్లో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేయడానికి వీల్లేదంది. బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్న తమ కుమార్తెను రోజూ వారి కూలీ అయిన ఆనందబాబు అనే వ్యక్తి అక్రమంగా నిర్బంధించారంటూ ఆమె తల్లిదండ్రులు దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్ రాయ్, జస్టిస్ గేదెల తుహిన్ కుమార్ ధర్మాసనం ఇటీవల తీర్పు వెలువరించింది. ఈ వ్యాజ్యంలో హైకోర్టు ఆదేశాల మేరకు పోలీసులు యువతిని ధర్మాసనం ముందు హాజరుపరిచారు. న్యాయమూర్తులు ఆమెతో మాట్లాడారు. ఆనందబాబును ప్రేమించానని, ఇద్దరం ఇష్టపూర్వకంగా పెళ్లి చేసుకున్నామని ఆమె వివరించారు. తనను ఆనందబాబు నిర్బంధించలేదని తెలిపారు.ఎవరితో కలిసి ఉండాలనుకుంటున్నావని ధర్మాసనం ప్రశ్నించగా తల్లిదండ్రులతో వెళ్లేందుకు ఆమె నిరాకరించారు. అయితే తమ కుమార్తెతో వ్యక్తిగతంగా మాట్లాడే అవకాశం ఇవ్వాలని పిటిషనర్లయిన ఆమె తల్లిదండ్రులు కోరగా ధర్మాసనం అందుకు అనుమతినిచ్చింది. అర్థగంట పాటు కోర్టుహాలు బయట కుమార్తెతో ఆమె తల్లిదండ్రులు మాట్లాడారు. అనంతరం కూడా ఆమె తాను ఆనందబాబుతోనే కలిసి ఉంటానని కోర్టుకు నివేదించారు. దీంతో ధర్మాసనం తల్లిదండ్రుల పిటిషన్కు విచారణార్హత లేదని కొట్టేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. -
మతం మారితే ఎస్సీ హోదా కోల్పోయినట్లే!
సాక్షి, న్యూఢిల్లీ: హిందూ, బౌద్ధం, సిక్కు మతాలు మినహా ఇతర మతాల్లోకి మారిన వ్యక్తులు తమ షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ) హోదాను తక్షణమే కోల్పోతారని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. క్రైస్తవ మతాన్ని స్వీకరించి, ఆచరిస్తున్న వ్యక్తులు దళిత హోదాను క్లెయిమ్ చేయలేరని, అలాగే తమకు రక్షణ కల్పించాలంటూ ‘ఎస్సీ, ఎస్టీ ఆకృత్యాల నిరోధక చట్టాన్ని’ (అట్రాసిటీ చట్టం) ఏమాత్రం ఆశ్రయించలేరని తేల్చిచెప్పింది. ఏపీలోని పిట్టలవానిపాలెం గ్రామంలో హిందూ మతం నుంచి క్రైస్తవంలోకి మారి పాస్టర్గా కొనసాగుతున్న చింతాడ ఆనంద్ అనే వ్యక్తి తనపై దాడి జరిగిందని ఆరోపిస్తూ పలువురిపై పెట్టిన అట్రాసిటీ కేసును కొట్టేస్తూ ఏపీ హైకోర్టు గతేడాది ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు తాజాగా సమర్థించింది. ఏపీ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ చింతాడ ఆనంద్ దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ ఎన్.వి. అంజారియాలతో కూడిన సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. కేవలం ఎస్సీ కుల ధ్రువీకరణ పత్రాన్ని అధికారులు రద్దు చేయనంత మాత్రాన.. మతం మారిన వాస్తవాన్ని విస్మరించలేమని, అతనికి ఎస్సీ, ఎస్టీ చట్టం కింద రక్షణ పొందే అర్హత రాదని తేల్చిచెప్పింది. 1950 నాటి రాజ్యాంగ (షెడ్యూల్డ్ కులాలు) ఉత్తర్వులను ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ఉదహరించింది. ‘ఈ కేసులో పిటిషనర్ తిరిగి తన మాతృ మతంలోకి (హిందూ) మారినట్లు గానీ, మాదిగ సామాజికవర్గం అతన్ని తిరిగి తమలోకి చేర్చుకున్నట్లు గానీ ఎటువంటి ఆధారాలు లేవు. పైగా అతను దశాబ్దానికిపైగా క్రైస్తవాన్ని ఆచరిస్తున్నాడు. పాస్టర్గా సేవలందిస్తూ గ్రామాల్లో ప్రతి ఆదివారం ప్రార్థనలు నిర్వహిస్తున్నాడు. దాడి జరిగినట్లు చెబుతున్న రోజున కూడా అతను ఇంట్లో ప్రార్థనలు నిర్వహించాడు. ఈ వాస్తవాలన్నీ ఘటన జరిగిన నాటికి అతను క్రైస్తవుడేనని నిస్సందేహంగా నిరూపిస్తున్నాయి’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. -
సుప్రీం కోర్టు సంచలన తీర్పు
ఢిల్లీ: మత మార్పిడిలపై సుప్రీం కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. మతం మారిన వ్యక్తి ఎస్సీ హక్కులు కోల్పోతాడని వ్యాఖ్యానించింది. ఈ మేరకు ఓ కేసులో ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్ధించింది.హిందూ, బౌద్ధ, సిక్కు మతాలు కాకుండా ఇతర మతంలోకి మారితే ఎస్సీ హోదా రద్దు అవుతుందని దేశ అత్యున్నత న్యాయస్థానం ద్విసభ్య ధర్మాసనం వ్యాఖ్యానించింది. మతం మార్చుకున్న వెంటనే ఎస్సీ హోదా రద్దు అవుతుందని స్పష్టం చేసింది. -
ఐదేళ్లకుపైగా పెండింగ్లో ఉన్న కేసులను పరిష్కరించాలి
శృంగవరపుకోట: కోర్టుల్లో ఐదేళ్లకుపైబడి పెండింగ్లో ఉన్న కేసులను సత్వరమే పరిష్కరించాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను దృష్టిలో ఉంచుకుని న్యాయమూర్తులు పని చేయాలని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్రాయ్, జస్టిస్ తర్లాడ రాజశేఖరరావు చెప్పారు. విజయనగరం జిల్లా ఎస్.కోటలో రూ.8.5 కోట్లతో నిరి్మంచనున్న సింగిల్ కోర్టు కాంప్లెక్స్ భవన శంకుస్థాపన కార్యక్రమంలో న్యాయమూర్తులు పాల్గొన్నారు. ముందుగా భవన నిర్మాణ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఎస్.కోట బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గోగాడ సూరిదేముడు నేతృత్వంలో నిర్వహించిన కార్యక్రమంలో న్యాయమూర్తి జస్టిస్ మానవేంద్రనాథ్రాయ్ మాట్లాడుతూ ఎస్.కోటలో కోర్టు భవనానికి శంకుస్థాపన చేయడం సంతోషంగా ఉందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కోర్టు భవనాలన్నీ ఒకేలా ఉండేలా డిజైన్ చేశారని, మరో పాతికేళ్ల తర్వాత అవసరాలకు తగ్గట్టుగా కోర్టు భవనాల నిర్మాణం చేస్తున్నట్టు చెప్పారు. కోర్టు బెంచ్–బార్ సమన్వయంతో కలిసి పనిచేస్తేనే నాణ్యమైన మంచి తీర్పులు వస్తాయన్నారు. కొన్ని సివిల్ తగాదాలు 40 ఏళ్లుగా పెండింగ్లో ఉన్నట్టు గమనించామని, జ్యుడీషియల్ వ్యవస్థపై కోర్టులకు వెళ్తే తరాలు మారినా న్యాయం జరగదని, ఫలితం రాదన్న అపవాదు ఉందని, దాన్ని దూరం చేసేందుకు ప్రతి ఒక్కరూ పని చేయాలని సూచించారు. మెగా లోక్ అదాలత్లో తొలి విడతలో 3 లక్షలు, రెండవ విడతలో 3 లక్షలకుపైగా కేసులు పరిష్కారమయ్యాయని, ఈ విషయంలో గుంటూరు జిల్లా మొదటి స్థానంలో నిలిచిందని చెప్పారు. న్యాయమూర్తి జస్టిస్ మానవేంద్రనాథ్రాయ్ కృషితో నిధులు రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి, జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జి జస్టిస్ టి.రాజశేఖరరావు మాట్లాడుతూ కేసుల జడ్జిమెంట్ సరిగా లేకుంటే మళ్లీ కేసులు పడే ఆస్కారం ఉందని పేర్కొన్నారు. ఎస్.కోట కోర్టు భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయించిన న్యాయమూర్తి జస్టిస్ మానవేంద్రనాథ్రాయ్ క్రెడిట్ని తన ఖాతాలో వేశారని పేర్కొన్నారు. తనకు జస్టిస్ మానవేంద్రనాథ్రాయ్ మంచి స్నేహితుడు, మార్గదర్శకులు అని చెప్పారు. జిల్లా న్యాయమూర్తి బి.బబిత, గుంటూరు జిల్లా న్యాయమూర్తి సాయికళ్యాణ్ చక్రవర్తి, కలెక్టర్ రాంసుందర్రెడ్డి, విజయనగరం ఎస్పీ ఎ.ఆర్.దామోదర్, పార్వతీపురం మన్యం జిల్లాల ఎస్పీ మాధవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
తీరు మారుస్తూ.. సుప్రీం ‘తీర్పు’!
సాక్షి, అమరావతి: న్యాయాన్ని అందించడంలో జాప్యం జరిగితే.. అది న్యాయాన్ని తిరస్కరించడమే..!న్యాయం చేయడమే కాదు.. చేసినట్లు కూడా కనిపించాలి..!ఇవి న్యాయ వ్యవస్థలో రూఢీ అయిన సూత్రాలు. అయితే కక్షిదారులకు న్యాయం అందించే విషయంలో దేశంలోని హైకోర్టుల్లో పరిస్థితులు భిన్నంగా ఉండటంపై స్వయంగా సుప్రీంకోర్టు రంగంలోకి దిగింది. హైకోర్టుల్లో వాదనలు విని తీర్పును రిజర్వ్ చేసిన నాటి నుంచి తీర్పు వెలువరించేంత వరకు జరుగుతున్న అసాధారణ జాప్యాన్ని నివారించేందుకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా తీర్పులను వెలువరించేందుకు నిర్దిష్ట గడువు నిర్దేశిస్తూ ఇటీవల కీలక ఆదేశాలు ఇచ్చిన సుప్రీంకోర్టు తాజాగా దేశంలోని అన్ని హైకోర్టులకు అత్యంత కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇకపై ఏదైనా కేసులో వాదనలు విన్న తరువాత ఆ కేసులో తీర్పును ఎప్పుడు రిజర్వ్ చేశారు..? ఆ తరువాత తీర్పును ఎప్పుడు వెలువరించారు..? ఆ తీర్పు కాపీని ఎప్పుడు వెబ్సైట్లో అప్లోడ్ చేశారు..? అనే వివరాలను తేదీలతో సహా తీర్పు కాపీపై స్పష్టంగా ముద్రించాలని అన్ని హైకోర్టులను సుప్రీంకోర్టు ఆదేశించింది. తద్వారా ఆ కేసులో ఎప్పుడు ఏం జరిగిందని అందరూ తెలుసుకునే అవకాశం ఉంటుంది. అలాగే తీర్పులు వెలువరించే విషయంలో వేగం కూడా పెరగనుంది.విప్లవాత్మక సంస్కరణ అంటున్న న్యాయ నిపుణులు..సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ కీలక ఆదేశాలను న్యాయవ్యవస్థలో విప్లవాత్మక సంస్కరణగా న్యాయ నిపుణులు అభివర్ణిస్తున్నారు. దీనివల్ల న్యాయవ్యవస్థలో పారదర్శకత, తీర్పులు ఇచ్చే విషయంలో జవాబుదారీతనం పెరుగుతుందని పేర్కొంటున్నారు. సుప్రీంకోర్టు తాజా ఆదేశాల నేపథ్యంలో ఇకపై సుదీర్ఘ కాలం పాటు తీర్పు వెలువరించకుండా ఉండేందుకు అవకాశం ఉండదు. ఒకవేళ అలా సుదీర్ఘ కాలం పాటు తీర్పు వెలువరించకుంటే.. చివరకు తీర్పు వెలువరించిన సమయంలో ఆ వివరాలను అందులో ప్రస్తావించాల్సి ఉంటుంది. దీంతో జాప్యంపై ఎవరో ఒకరు ప్రశ్నించే అవకాశం ఉంటుంది. వాస్తవానికి తీర్పు వెలువరించే విషయంలో న్యాయమూర్తులకు చట్టపరంగా నిర్దిష్ట గడువంటూ ఏదీ లేదు. అయితే తీర్పు రిజర్వ్ చేసిన తర్వాత ఆరు నెలల్లోపు తీర్పు వెలువడటం ఓ సంప్రదాయంగా వస్తోంది. వాస్తవానికి 2001లో అనిల్రాయ్ కేసులో సుప్రీంకోర్టు చాలా స్పష్టమైన తీర్పునిచ్చింది. తీర్పు రిజర్వ్ చేసిన తేదీ నుంచి మూడు నెలల్లో తీర్పు వెలువరించాలని ఆ తీర్పులో సుప్రీంకోర్టు అన్నీ హైకోర్టులను ఆదేశించింది.ఇప్పటికే గడువు నిర్దేశించిన సుప్రీంకోర్టు...అలాగే కొన్ని హైకోర్టుల్లో తీర్పులు వెలువరించిన తరువాత అవి అందుబాటులోకి రావడంలో అసాధారణ జాప్యం జరుగుతోంది. కొన్నిసార్లు తీర్పు కాపీలు బయటకు వచ్చేందుకు నెలల సమయం కూడా పడుతోంది. దీంతో కక్షిదారులు తీవ్రంగా నష్టపోతున్నారు. తీర్పు కాపీ అందుబాటులోకి రాకపోవడంతో సానుకూల ఉత్తర్వులు పొందినప్పటికీ ప్రయోజనం ఉండటం లేదు. ఈ నేపథ్యంలో తీర్పులు వెలువరించే విషయంలో నిర్దిష్ట గడువు నిర్దేశిస్తూ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ కరోల్ నేతృత్వంలోని ధర్మాసనం ఇటీవల ఓ తీర్పునిచ్చింది.ఏదైనా కేసులో తీర్పు రిజర్వ్ చేసిన తరువాత 3 నెలల్లోపు తీర్పు వెలువరించకుంటే ఈ విషయాన్ని సంబంధిత హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్.. ప్రధాన న్యాయమూర్తి (సీజే) దృష్టికి తేవాలని ఆదేశించింది. అనంతరం సీజే.. ఆ విషయాన్ని సదరు న్యాయమూర్తి, ధర్మాసనం దృష్టికి తెచ్చి రెండు వారాల్లో తీర్పునివ్వాల్సిందిగా కోరాలని సూచించింది. ఆ రెండు వారాల్లో కూడా తీర్పు వెలువరించకుంటే, ప్రధాన న్యాయమూర్తి ఆ కేసును మరో న్యాయమూర్తికి, ధర్మాసనానికి నివేదించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. గడువు లోపు తీర్పు వెలువరించకుంటే సంబంధిత హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఏం చేయాలి, కక్షిదారులు ఏం చేయాలన్న దానిని ధర్మాసనం తన తీర్పులో స్పష్టంగా పేర్కొంది.సుప్రీం.. తీవ్ర విస్మయం తమకు కింది కోర్టు విధించిన శిక్షను సవాలు చేస్తూ దాఖలు చేసిన అప్పీళ్లపై తీర్పును రిజర్వ్ చేసిన జార్ఖండ్ హైకోర్టు రెండు మూడేళ్లుగా తీర్పు వెలువరించలేదంటూ కొందరు ఖైదీలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, న్యాయమూర్తి జస్టిస్ జోయ్మాల్య బాగ్చీ ధర్మాసనం విచారణ జరిపింది. తీర్పు రిజర్వు చేసి రెండేళ్లయినా కూడా తీర్పు వెలువరించకపోవడంపై ధర్మాసనం తీవ్ర విస్మయాన్ని వ్యక్తం చేస్తూ దేశంలోని అన్ని హైకోర్టుల నుంచి నివేదికలు కోరింది. తీర్పులు వెలువరించడంలో జాప్యం చేయడం కక్షిదారుల హక్కులను హరించడమేనని అభిప్రాయపడ్డ ధర్మాసనం.. హైకోర్టులకు తగిన దిశా నిర్దేశం చేయాలని నిర్ణయించింది. తమ ముందున్న కేసుల్లో తీర్పులు వెలువరించేందుకు ఎంత కాలం పడుతుందో ప్రజలందరికీ తెలియచేసేందుకు వీలుగా ఆ వివరాలను తీర్పు కాపీలో స్పష్టంగా పేర్కొనాలని అన్ని హైకోర్టులను ఆదేశించింది. న్యాయవ్యవస్థలో పారదర్శకత, సంస్కరణలు కేవలం కాగితాలకే మాత్రమే పరిమితం కాకూడదని, ప్రజలు న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉంచేలా ఆ సంస్కరణలు ఉండాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.సుప్రీం ఆదేశాల అమలుకు రాష్ట్ర హైకోర్టు శ్రీకారం..సుప్రీంకోర్టు ఆదేశాల అమలుకు ఏపీ హైకోర్టు చర్యలు చేపట్టింది. ప్రతి తీర్పు సర్టిఫైడ్ కాపీతో పాటు అప్లోడ్ చేసిన కాపీలోనూ తీర్పును ఎప్పుడు రిజర్వ్ చేశారు.. ఎప్పుడు తీర్పు వెలువరించారు.. ఎప్పుడు ఆ తీర్పును అప్లోడ్ చేశారు.. లాంటి వివరాలను తీర్పు మొదటి పేజీలో స్పష్టంగా పేర్కొనాలని హైకోర్టు రిజిస్ట్రీ ఆదేశించింది. అందుకు అనుగుణంగా న్యాయమూర్తుల కోర్టు మాస్టర్లు, పర్సనల్ సెక్రటరీలు చర్యలు చేపట్టారు. దీంతో తీర్పులు సకాలంలో అప్లోడ్ అవుతూ కక్షిదారులకు అందుబాటులోకి వస్తున్నాయి.ఆ వివరాలన్నీ ప్రజలకు తెలియాల్సిన అవసరముంది..‘ఏ న్యాయమూర్తి ఎప్పుడు తీర్పు రిజర్వ్ చేశారు? ఎంత కాలం తర్వాత తీర్పు ఇచ్చారు? ఆ తీర్పు కక్షిదారులకు ఎప్పుడు అందుబాటులోకి వచ్చింది? తీర్పులను వెబ్సైట్లలో అప్లోడ్ చేయడానికి హైకోర్టులు ఎంత సమయం తీసుకుంటున్నాయి? లాంటి వివరాలన్నీ ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది’ అని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ స్పష్టంగా పేర్కొన్నారు. తీర్పుల రిజర్వ్, తీర్పు వెలువడిన తేదీలను మాత్రమే చూపే ఒక ప్రత్యేక డాష్బోర్డ్ హైకోర్టు వెబ్సైట్లలో ఉండాలని జస్టిస్ బాగ్చీ అభిప్రాయపడ్డారు.ఏడాదికి కూడా వెలువడని తీర్పులుఅయితే ఈ ఆదేశాలు పలు హైకోర్టుల్లో అమలు కావడం లేదు. వాదనలు విని తీర్పు రిజర్వ్ చేసిన తరువాత ఏడాదికి కూడా తీర్పులు వెలువరించని పలు ఉదంతాలు ఇటీవల సుప్రీంకోర్టు దృష్టికి వచ్చాయి. కొన్ని హైకోర్టులు తీర్పు రిజర్వ్ చేసిన రెండేళ్లకు కూడా తీర్పులు వెలువరించకపోవడంపై తీవ్ర విస్మయం వ్యక్తం చేసింది. దీనిపై ఇటీవల దేశవ్యాప్తంగా పెద్ద చర్చ కూడా జరిగింది. తీర్పులు వెలువరించడంలో అసాధారణ జాప్యం చేసినందుకు కొందరు న్యాయమూర్తులను సైతం సుప్రీంకోర్టు బదిలీ చేసింది. దక్షిణాదిలోని ఓ హైకోర్టులో న్యాయమూర్తి ఒకరు దాదాపు 700 కేసుల్లో ఏడాదికి కూడా తీర్పులు వెలువరించని కారణంతో సుప్రీంకోర్టు ఆయన్ను బదిలీ చేసింది. సకాలంలో తీర్పులు వెలువరించాలన్న విషయంలో సుప్రీంకోర్టు వైఖరి చాలా స్పష్టంగా ఉంది. -
అంతర్జాతీయ మార్కెట్లో.. ఎల్పీజీని అమ్మడానికి వీల్లేదు
సాక్షి, అమరావతి: పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా దేశవ్యాప్తంగా వంట గ్యాస్ కొరత ఏర్పడిన నేపథ్యంలో హైకోర్టు కీలక ఆదేశాలు జారీచేసింది. చమురు శుద్ధి సంస్థలు ఎల్పీజీని అంతర్జాతీయ మార్కెట్లో విక్రయించడానికి వీల్లేదని తేల్చిచెప్పింది. ఈ మేరకు కాని్ఫడెన్స్ పెట్రోలియం ఇండియా లిమిటెడ్కు ఆదేశాలు జారీచేసింది. దేశంలో ఎల్పీజీ కొరత ఉన్న సమయంలో చమురు శుద్ధి సంస్థలు అంతర్జాతీయ మార్కెట్లో విక్రయిస్తే సామాన్య ప్రజలకు తీరని నష్టంతో పాటు కష్టాలను కలిగిస్తుందని కోర్టు స్పష్టంచేసింది. వినియోగదారులకు వంట గ్యాస్ సరఫరా చేసేందుకు వీలుగా గ్యాస్ను పంపిణీదారులకు మాత్రమే సరఫరా చేయాలని ఆదేశించింది. దేశంలోని చమురు శుద్ధి కర్మాగారాలు ప్రొపేన్, బ్యూటేన్ నిల్వలను గరిష్టంగా ఎల్పీజీ ఉత్పత్తి కోసం ఉపయోగించడంతో పాటు ఉత్పత్తి చేసిన ఎల్పీజీని ప్రభుత్వ రంగ సంస్థలైన ఐఓసీఎల్, హెచ్పీసీఎల్, బీపీసీఎల్లకు అందుబాటులో ఉంచి, దానిని కేవలం దేశీయ వినియోగదారులకు మాత్రమే సరఫరా చేయాలంటూ ఈనెల 5న జారీచేసిన స్వీయ ఉత్తర్వులు పక్కాగా అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ వ్యవహారంలో కౌంటర్లు దాఖలు చేయాలని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ, కాన్ఫిడెన్స్ పెట్రోలియం ఇండియా లిమిటెడ్లను ఆదేశించింది. ఇందులో భాగంగా వారికి నోటీసులు జారీచేసింది. తదుపరి విచారణను ఏప్రిల్ 2కు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ ఇటీవల మధ్యంతర ఉత్తర్వులు జారీచేశారు. కొరత వేళ అంతర్జాతీయ మార్కెట్లో భారీ ధరకు విక్రయం.. యుద్ధం వేళ దేశవ్యాప్తంగా వంట గ్యాస్కు తీవ్ర కొరత ఏర్పడిందని, అయితే కాన్ఫిడెన్స్ పెట్రోలియం ఇండియా లిమిటెడ్ ఈ పరిస్థితి ద్వారా వ్యక్తిగత లబ్ధిపొందేందుకు గ్యాస్ను భారీ ధరకు అంతర్జాతీయ మార్కెట్లో విక్రయిస్తోందని, దీనిని అడ్డుకునేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ విజయవాడలోని మేధా హిమజ శ్రీ ఎంటర్ప్రైజెస్ యజమాని నల్లమోతు దుర్జయ్, నిహాన్‡్ష గ్యాస్ ఏజెన్సీ యజమాని పారా శ్రీలక్ష్మి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై జస్టిస్ దేవానంద్ విచారణ జరిపారు.కేంద్రం ఉత్తర్వులను పట్టించుకోవడంలేదు.. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది ఓబిరెడ్డి మనోహర్రెడ్డి వాదనలు వినిపించారు. పిటిషనర్లు కాన్ఫిడెన్స్ పెట్రోలియం ఇండియా లిమిటెడ్ నుంచి గ్యాస్ కొనుగోలు చేసి దానిని వినియోగదారులకు సరఫరా చేస్తుంటారని తెలిపారు. అయితే, పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఎల్పీజీ సరఫరాలో కొరత ఏర్పడిందన్నారు. యుద్ధంవల్ల అంతర్జాతీయ, దేశీయ మార్కెట్లలో ఎల్పీజీ డిమాండ్కు, సరఫరాకు మధ్య భారీ వ్యత్యాసం ఉందన్నారు. దేశంలోని చమురు శుద్ధి కర్మాగారాలు ప్రొపేన్, బ్యూటేన్ నిల్వలను గరిష్టంగా ఎల్పీజీ ఉత్పత్తి కోసం ఉపయోగించడంతో పాటు ఉత్పత్తి చేసిన ఎల్పీజీని ప్రభుత్వ రంగ సంస్థలైన ఐఓసీఎల్, హెచ్పీసీఎల్, బీపీసీఎల్లకు అందుబాటులో ఉంచి, దానిని కేవలం దేశీయ వినియోగదారులకు మాత్రమే సరఫరా చేయాలంటూ కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ ఈనెల 5న ఉత్తర్వులు జారీచేసిందని ఆయన న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. గ్యాస్ కొరత ఉన్నప్పటికీ, కాన్ఫిడెన్స్ పెట్రోలియం ఇండియా లిమిటెడ్ మాత్రం గ్యాస్ను అంతర్జాతీయ మార్కెట్లో అధిక ధరలకు విక్రయిస్తోందని వివరించారు. కేంద్ర ప్రభుత్వం ఆదేశాలను ఏ మాత్రం పట్టించుకోవడంలేదని కోర్టుకు నివేదించారు. -
ఆదేశాలిచ్చి నెలైనా నివేదిక సమర్పించరా?
సాక్షి, అమరావతి: గ్రూప్–1 ప్రధాన పరీక్ష పత్రాల మూల్యాంకనంలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై దర్యాప్తు చేసి నివేదిక సమర్పించేందుకు 6 నెలల సమయం పడుతుందన్న సిట్పై హైకోర్టు తీవ్రస్థాయిలో మండిపడింది. దర్యాప్తు ఏ అంశాలపై చేయాలన్న దానిపై ఇప్పటికే తాము తమ ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొన్నామని, ఆ ఉత్తర్వులను సక్రమంగా అర్థం చేసుకోకుండా దర్యాప్తు నివేదిక సమర్పించేందుకు ఆరు నెలల సమయం కోరడమేమిటంటూ సిట్కు నేతృత్వం వహిస్తున్న సీఐడీ అదనపు డీజీ రవిశంకర్ అయ్యన్నార్ను నిలదీసింది. సిట్ ఏర్పాటుతో పాటు దర్యాప్తునకు తాము ఆదేశాలు జారీ చేసి నెలరోజులు పూర్తయిందని గుర్తు చేసింది. అయినా కూడా ఇప్పటికీ దర్యాప్తు విషయంలో ఏమీ చేయలేదని అసహనం వ్యక్తం చేసింది. తమ ఆదేశాలను అమలు చేయకుండా ఏవేవో చెబుతున్నారంది. ఫోరెన్సిక్ ల్యాబ్కు 300 మంది అభ్యర్థుల జవాబు పత్రాలను పంపితే సరిపోతుందని పేర్కొంది. అయితే సిట్ మాత్రం లక్షన్నర డాక్యుమెంట్లను జిరాక్స్ తీస్తున్నట్లు చెబుతోందని, ఇన్ని డాక్యుమెంట్లు ఎందుకు అవసరమో తమకు అర్థం కావడం లేదంది.దర్యాప్తు విషయంలో తమ ఆదేశాల మేరకు ఇప్పటి వరకు ఏం చర్యలు తీసుకున్నారో తెలియచేయాలని సిట్ను ఆదేశించింది. అలాగే దర్యాప్తు పూర్తి చేసి నివేదిక ఇచ్చేందుకు ఎంత కాలం పడుతుంది.. అందుకు గల కారణాలు ఏమిటో కూడా చెప్పాలని ఆదేశించింది. ఈ వివరాలతో ఓ అఫిడవిట్ను తమ ముందుంచాలంది. అలాగే 1998 గ్రూప్ 1 పరీక్షలో ఉత్తీర్ణులైన వారిని నాన్ ఫోకల్ పోస్టులకు బదిలీ చేయాలన్న ఆదేశాలను ప్రభుత్వం పూర్తిస్థాయిలో అమలు చేయలేదని తేల్చి చెప్పింది. నాన్ ఫోకల్ పోస్టులకు బదిలీ చేయకుండా వారిని ఊరికే కూర్చోబెట్టి ప్రజాధనాన్ని జీతభత్యాలుగా చెల్లిస్తున్నారని ఆక్షేపించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీని కోర్టుకు పిలిపిస్తే తప్ప తమ ఆదేశాలు పూర్తిస్థాయిలో అమలయ్యే పరిస్థితి కనిపించడం లేదంది. తదుపరి విచారణను ఈ నెల 30కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ బట్టు దేవానంద్, జస్టిస్ అవధానం హరిహరనాథ శర్మ ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.కోర్టు ముందు హాజరైన రవిశంకర్ అయ్యన్నార్...ఈ సందర్భంగా సిట్ తరఫు న్యాయవాది పాణిని సోమయాజీ స్పందిస్తూ, దర్యాప్తు నివేదిక సమరి్పంచేందుకు గడువు కావాలని కోరారు. ఎందుకు గడువు కావాలన్న దానిపై సోమయాజీ స్పష్టతనివ్వకపోవడంతో సిట్కు నేతృత్వం వహిస్తున్న రవిశంకర్ అయ్యన్నార్ను ఆన్లైన్లో హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. దీంతో రవిశంకర్ అయ్యన్నార్ ధర్మాసనం ముందు ఆన్లైన్లో హాజరయ్యారు. దర్యాప్తు నివేదిక సమర్పణకు ఆరు నెలల సమయం కావాలని కోరారు. డిజిటల్ మూల్యాంకనం విధానంలో ఉన్న సమాధాన పత్రాలను భౌతిక రూపంలోకి తీసుకొచి్చ, వాటిని జిరాక్స్ తీసి ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపాల్సి ఉందన్నారు. దాదాపు లక్షన్నర డాక్యుమెంట్లను జిరాక్స్ తీస్తున్నామని తెలిపారు. వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపిన తరువాత అక్కడి నిపుణులు ప్రతీ పేజీని క్షుణ్ణంగా పరిశీలించి ఆ తరువాతనే నివేదిక ఇస్తారని, దాని ఆధారంగా తాము నివేదికను సిద్ధం చేస్తామని చెప్పారు. ఈ ప్రక్రియ మొత్తం పూర్తి కావడానికి కొన్ని నెలల సమయం పడుతుందని ఫోరెన్సిక్ ల్యాబ్ అధికారులు చెప్పారని వివరించారు. దీనిపై ధర్మాసనం తీవ్ర అసహనం, అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఎందుకు అంత సమయం కావాలో కారణాలను వివరిస్తూ అఫిడవిట్ దాఖలు చేయాలని ఆయన్ను ధర్మాసనం ఆదేశించింది. -
ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ లిసా గిల్ ప్రమాణ స్వీకారం
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు: హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్ ప్రమాణ స్వీకారం చేశారు. శుక్రవారం ఏపీ హైకోర్టు ప్రాంగణంలో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. జస్టిస్ లీసా గిల్ చేత హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఆయన సమక్షంలో నూతన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్ బాధ్యతలు స్వీకరించారు.ఈ ప్రమాణ స్వీకార మహోత్సవానికి హైకోర్టు న్యాయమూర్తులు, బార్ కౌన్సిల్ సభ్యులు, న్యాయవాదులు, హైకోర్టు సిబ్బంది హాజరయ్యారు. నూతన న్యాయమూర్తి బాధ్యతలు చేపట్టడం పట్ల హైకోర్టు వర్గాలు, న్యాయవాదులు, సిబ్బంది జస్టిస్ లీసా గిల్కు శుభాకాంక్షలు తెలిపారు. కొత్త బాధ్యతల్లో ఆమె విజయవంతం కావాలని ఆకాంక్షించారు. సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు ఏపీ హైకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్ను సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. ప్రస్తుత సీజే జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ త్వరలోనే రిటైర్ అవ్వనున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి రిటైర్ అవ్వడానికి రెండు నెలల ముందే తదుపరి సీజేను ఖరారు చేయాలని కొలీజియం నిర్ణయించింది. జస్టిస్ లీసా గిల్ 2014 నుంచి చండీగఢ్ హైకోర్టులో న్యాయమూర్తిగా పనిచేశారు. -
IPS సునీల్ నాయక్ ను అరెస్ట్ చేయొద్దు
-
మచిలీపట్నం పోలీసులకు ఎదురుదెబ్బ
సాక్షి, విజయవాడ: మచిలీపట్నం పోలీసులకు ఏపీ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఇదే సమయంలో మాజీ మంత్రి పేర్ని నాని సతీమణి జయసుధకు ఏపీ హైకోర్టులో ఉపశమనం దక్కింది. కోర్టు షరతులను జయసుధ ఉల్లంఘించలేదని పోలీసులకు హైకోర్టు గుర్తు చేస్తూ ఆగ్రహం వ్యక్తం చేసింది.అయితే, మాజీ మంత్రి పేర్ని నాని సతీమణి జయసుధ బెయిల్ రద్దు చేయాలని మచిలీపట్నం పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా కోర్టు షరతులు ఉల్లంఘించారంటూ పోలీసులు పిటిషన్లో పేర్కొన్నారు. అనంతరం, ఏపీ కోర్టు.. పోలీసుల పిటిషన్ను తోసిపుచ్చింది. కోర్టు షరతులను జయసుధ ఉల్లంఘించలేదని గుర్తు చేసింది. ఈ క్రమంలో జయసుధ ముందస్తు బెయిల్ను రద్దు చేసేందుకు హైకోర్టు అంగీకరించలేదు. అయితే, రేషన్ బియ్యం అక్రమ కేసులో జయసుధకు ఇప్పటికే మచిలీపట్నం కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. -
‘ఇన్నర్’ను సీఐడీ నుంచి సీబీఐకి బదలాయించాలి
సాక్షి, అమరావతి: ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు , మంత్రులు లోకేశ్, పొంగూరు నారాయణ తదితరులు నిందితులుగా ఉన్న ఇన్నర్ రింగ్ రోడ్డు (ఐఆర్ఆర్) కుంభకోణం కేసును సీఐడీ నుంచి సీబీఐకి బదలాయించాలని సోమవారం హైకోర్టుకు న్యాయవాది జడా శ్రవణ్ కుమార్ విన్నవించారు. కేసులో అప్పుడు నిందితునిగా ఉన్న చంద్రబాబు ఇప్పుడు ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారని, ఈ నేపథ్యంలో సీఐడీ అధికారులు ముఖ్యమంత్రికి కొమ్ముకాస్తున్నారని ఆయన పేర్కొన్నారు. కేసు మూసివేతకు ఏకంగా ఏసీబీ కోర్టులో రెఫర్డ్ చార్జిïÙట్ దాఖలు చేసిందన్నారు. అయితే ఈ వ్యాజ్యం విచారణార్హతపై సీఐడీ తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ అభ్యంతరం వ్యక్తంచేసిన నేపథ్యంలో ఈ అంశంపై తదుపరి వాదనలు వింటామని హైకోర్టు పేర్కొంది. ఈ మేరకు తదుపరి విచారణను న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప ఈ నెల 16వ తేదీకి వాయిదా వేశారు. అంతకు ముందు ఆళ్ల రామకృష్ణారెడ్డి తరఫు న్యాయవాది శ్రవణ్ కుమార్ హైకోర్టులో చేసిన వాదనల్లో ముఖ్యాంశాలు.. n 2014–19 మధ్య చంద్రబాబు ముఖ్యమంత్రిగా, లోకేశ్, నారాయణ మంత్రులుగా ఉన్న సమయంలో ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్, మాస్టర్ ప్లాన్లో అక్రమాలు జరిగాయి. n దీనిపై సీఐడీ కేసు నమోదు చేసి పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసింది. ఐదు వేల పేజీలకు పైగా ఆధారాలను సేకరించింది. ఆ మేరకు ఏసీబీ కోర్టులో చార్జిïÙట్ కూడా దాఖలు చేసింది. n సాంకేతిక కారణాలతో ఈ చార్జిïÙట్ను కోర్టు వెనక్కి ఇచి్చంది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం మారడంతో సీఐడీ గతానికి భిన్నంగా వ్యవహరించడం మొదలుపెట్టింది. n సీఐడీ అదనపు డీజీ ముఖ్యమంత్రి కింద పనిచేస్తారు. n సీఐడీ అధికారుల పదోన్నతులు, బదిలీలు అన్నీ కూడా ముఖ్యమంత్రి పర్యవేక్షణలోనే సాగుతాయి. n అందువల్ల ఇన్నర్ రింగ్ రోడ్డు కుంభకోణం కేసును సీబీఐకి బదలాయించాల్సిన అవసరం ఉంది. ఎంపీ, ఎమ్మెల్యేల ప్రత్యేక కోర్టుకు బదిలీ చేయాలి కాగా, ఇన్నర్ రింగ్ రోడ్డు కుంభకోణం కేసును విజయవాడ ఏసీబీ కోర్టు నుంచి ఎంపీ, ఎమ్మెల్యేల ప్రత్యేక కోర్టుకు బదిలీ చేయాలని కోరుతూ ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యంలో కూడా హైకోర్టు తదుపరి విచారణను ఈ నెల 16కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. -
హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్ నియమితులయ్యారు. ఆమె ప్రమాణ స్వీకారంతో హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 34కి చేరుతుంది. జస్టిస్ లీసా గిల్ ప్రస్తుతం పంజాబ్, హర్యానా హైకోర్టులో మూడో స్థానంలో కొనసాగుతున్నారు. ఆమెను ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా నియమించాలన్న సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుక్రవారం ఆమోద ముద్ర వేశారు. దీంతో జస్టిస్ లీసా నియామకాన్ని నోటిఫై చేస్తూ కేంద్ర న్యాయశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆమె వచ్చే వారం న్యాయమూర్తిగా ప్రమాణం చేసే అవకాశం ఉంది. జస్టిస్ లీసా గిల్ను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా నియమిస్తూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని కొలీజియం ఇటీవల నిర్ణయం తీసుకుంది. మొదట జస్టిస్ లీసా గిల్ను న్యాయమూర్తిగా ఏపీ హైకోర్టుకు బదిలీ చేసి, ఆ తరువాత హైకోర్టు ప్రస్తుత సీజే జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ పదవీ విరమణ చేసిన వెంటనే ఆమెను ప్రధాన న్యాయమూర్తిగా నియమించాలని కూడా సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసిన విషయం తెలిసిందే. జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ఈ ఏప్రిల్ 24న పదవీ విరమణ చేయనున్నారు.అపార అనుభవంజస్టిస్ లీసా గిల్ 1966 నవంబర్ 15న జన్మించారు. పంజాబ్ యూనివర్సిటీ నుంచి బీఏ, ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం పూర్తి చేశారు. 1990లో న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. పంజాబ్, హర్యానా హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. క్రిమినల్, సివిల్, సర్వీస్, రెవెన్యూ, రాజ్యాంగపరమైన అనేక రకాల కేసులను ఆమె వాదించారు. చండీగఢ్ కేంద్రపాలిత ప్రాంతంతో పాటు పలు బోర్డులు, కార్పొరేషన్ల తరఫున వాదించారు. 2014 మార్చి 31న పంజాబ్, హర్యానా హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. తొలుత న్యాయమూర్తిగా ఎందుకంటే..?ఒక హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా నియమించాలని నిర్ణయించిన న్యాయమూర్తిని సదరు హైకోర్టులో సీజే పోస్టు ఖాళీ అవడానికి కనీసం రెండు నెలల ముందే న్యాయమూర్తిగా బదిలీ చేయాలని సుప్రీం కోర్టు కొత్త విధాన నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే జస్టిస్ లీసా గిల్ను ఏపీ హైకోర్టుకు బదిలీ చేసింది. జస్టిస్ లీసా గిల్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైతే ఆమె ఆం«ధ్రప్రదేశ్ హైకోర్టు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తి అవుతారు. కాగా, 2028లో పదవీ విరమణ చేసే జస్టిస్ లీసా వచ్చే ఏడాది చివరి కల్లా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యే అవకాశం ఉంది. -
‘స్కిల్’ కేసు క్లోజర్ కాపీ ఇప్పించండి
సాక్షి, అమరావతి: స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణానికి సంబంధించి సీఎం చంద్రబాబుపై గతంలో నమోదు చేసిన కేసును మూసివేసే నిమిత్తం సీఐడీ దాఖలు చేసిన క్లోజర్ రిపోర్ట్ను సవాల్ చేస్తూ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అప్పటి చైర్మన్ అజయ్రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో తాను ఫిర్యాదుదారు అయితే సీఐడీ తనకు నోటీసు ఇవ్వకుండా క్లోజర్ రిపోర్ట్ దాఖలు చేసిందని, ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. తనను థర్డ్పార్టీగా పేర్కొంటూ నోటీసు ఇవ్వాల్సిన అవసరం లేదన్న ఏసీబీ కోర్టు ఉత్తర్వులను రద్దు చేయాలని హైకోర్టును కోరారు. ఈ వ్యాజ్యంపై న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప గురువారం విచారణ జరిపారు. అజయ్రెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది పాపెల్లుగారి వీరారెడ్డి వాదనలు వినిపిస్తూ.. ఈ కేసులో అజయ్రెడ్డి ఫిర్యాదుదారు అని తెలిపారు. సీఐడీ అధికారులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో ఫిర్యాదుదారు కాలమ్లో అజయ్రెడ్డి పేరే ఉందన్నారు. స్కిల్ కేసులో నిందితునిగా ఉన్న చంద్రబాబు హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో దాఖలు చేసిన పలు వ్యాజ్యాల్లోనూ అజయ్రెడ్డిని డీఫ్యాక్టో ఫిర్యాదుదారుగా పేర్కొంటూ ప్రతివాదుల జాబితాలో కూడా చేర్చారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. సీఐడీ దాఖలు చేసిన క్లోజర్ రిపోర్ట్పై తనకు ముందస్తు నోటీసు ఇవ్వాలని, ఆ రిపోర్ట్ను వ్యతిరేకించే అవకాశం కల్పించాలని కోరుతూ ఏసీబీ కోర్టులో అజయ్రెడ్డి ఓ పిటిషన్ దాఖలు చేశారని వివరించారు. అయితే అజయ్రెడ్డికి ఈ కేసుతో సంబంధం లేదంటూ, ఈ కేసులో అతన్ని థర్డ్ పార్టీగా పరిగణిస్తూ ఆ పిటిషన్ను ఏసీబీ కోర్టు కొట్టేసిందన్నారు. కేసును పూర్తిగా మూసివేస్తూ కోర్టు తుది నిర్ణయం తీసుకునేలోపు, సీఐడీ దాఖలు చేసిన క్లోజర్ రిపోర్ట్ను వ్యతిరేకిస్తూ ‘ప్రొటెస్ట్ పిటిషన్’ దాఖలు చేసే అవకాశం పిటిషనర్కు ఇవ్వాలని కోరారు. సీఐడీ సిట్ తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులు ముకుల్ రోహత్గీ, మాధవ్ ఖురానా స్పందిస్తూ.. అసలు ఈ వ్యాజ్యానికి విచారణార్హత లేదన్నారు. స్కిల్ కేసులో అజయ్రెడ్డి పిటిషనరే కాదన్నారు. ఈ దశలో ప్రతివాదులకు నోటీసులు జారీ చేయాల్సిన అవసరం కూడా లేదన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి తదుపరి విచారణను ఈ నెల 12కి వాయిదా వేశారు. ఐఆర్ఆర్ కేసును ‘ప్రత్యేక’ కోర్టుకు బదిలీ చేయండిహైకోర్టును ఆశ్రయించిన మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్రాథమిక చార్జిషీట్, క్లోజర్ రిపోర్ట్ కాపీలు ఇప్పించాలంటూ మరో పిటిషన్సాక్షి, అమరావతి: అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు (ఐఆర్ఆర్) అలైన్మెంట్, మాస్టర్ ప్లాన్ అక్రమాలకు సంబంధించి తానిచి్చన ఫిర్యాదు మేరకు సీఐడీ నమోదు చేసిన కేసును విజయవాడ ఏసీబీ కోర్టు నుంచి ఎంపీ, ఎమ్మెల్యేల ప్రత్యేక కోర్టుకు బదిలీ చేయాలని కోరుతూ మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి గురువారం హైకోర్టును ఆశ్రయించారు. ఈ కుంభకోణం కేసులో సీఐడీ 2024లోనే చార్జిషీట్ దాఖలు చేసిందని, ఈ కేసును ఎంపీ, ఎమ్మెల్యేల ప్రత్యేక కోర్టుకు బదిలీ చేయకుండా సాధారణ ఏసీబీ కోర్టులో విచారించడం చట్టవిరుద్ధమని తన పిటిషన్లో పేర్కొన్నారు. ఇన్నర్ రింగ్ రోడ్డు కుంభకోణం కేసులో ప్రస్తుత ముఖ్యమంత్రి, ఓ మంత్రి, మాజీ ఎమ్మెల్యేలు నిందితులుగా ఉన్నారని తెలిపారు. నిందితుల హోదాను బట్టి కేసు విచారణ కేవలం ప్రత్యేక కోర్టులోనే జరగాల్సి ఉంటుందన్నారు. అయితే, ప్రస్తుతం ఈ కేసును విజయవాడ ఏసీబీ కోర్టు విచారిస్తోందని తెలిపారు. తదుపరి చర్యలన్నీ నిలిపేయండి అశి్వనికుమార్ ఉపాధ్యాయ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు ఇచి్చన చరిత్రాత్మక తీర్పు ప్రకారం ప్రస్తుత, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలపై ఉన్న క్రిమినల్ కేసులను విచారించేందుకు ప్రతి రాష్ట్రంలో ప్రత్యేక కోర్టులున్నాయన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2018లో విజయవాడలో ఎంపీ, ఎమ్మెల్యేల కేసుల విచారణ కోసం ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేసిందన్నారు. నిందితుల హోదాను బట్టి కేసు విచారణ కేవలం ఈ ప్రత్యేక కోర్టులోనే జరగాలని, సాధారణ ఏసీబీ కోర్టులో కాదని పిటిషన్లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఇన్నర్ రింగ్ రోడ్డు కుంభకోణానికి సంబంధించిన కేసుపై ఏసీబీ స్పెషల్ కోర్టులో జరుగుతున్న విచారణలో తదుపరి చర్యలన్నింటినీ నిలిపేస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని ఆయన కోర్టును కోరారు. ‘క్లోజర్’ కాపీలు ఇప్పించండి ఇన్నర్ రింగ్ రోడ్డు (ఐఆర్ఆర్) కుంభకోణం కేసులో 2024లో దాఖలు చేసిన ప్రాథమిక చార్జిషీట్, తాజాగా దాఖలు చేసిన క్లోజర్ రిపోర్ట్ కాపీలను తనకు అందచేసేలా సీఐడీని ఆదేశించాలని కోరుతూ మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి గురువారం హైకోర్టులో మరో పిటిషన్ దాఖలు చేశారు. ప్రస్తుత సీఎం చంద్రబాబు 2014–19 మధ్య కాలంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన ఇన్నర్ రింగ్ రోడ్డు భూ కుంభకోణంపై 2022లో తాను సీఐడీకి ఫిర్యాదు చేశానని రామకృష్ణారెడ్డి తెలిపారు. దర్యాప్తు జరిపిన సీఐడీ కుంభకోణానికి సంబంధించిన అన్ని ఆధారాలను సేకరించిందని తెలిపారు. 2024లో చార్జిషీట్ కూడా దాఖలు చేయగా.. కోర్టు దానిని సాంకేతిక కారణాలతో వెనక్కి పంపిందన్నారు. ప్రభుత్వం మారడంతో ఐఆర్ఆర్ కుంభకోణం కేసును మూసివేసేందుకు సీఐడీ సిద్ధమై విజయవాడ ఏసీబీ కోర్టులో క్లోజర్ రిపోర్ట్ దాఖలు చేసిందని చెప్పారు. ఈ నేపథ్యంలో గత నెల 18న సీఐడీ అధికారులు తనకు ఓ నోటీసు పంపి కేసును మూసివేస్తున్నట్లు తెలిపారన్నారు. 2024 నాటి తొలి చార్జిషీట్ కాపీని గానీ, ఇప్పుడు దాఖలు చేసిన క్లోజర్ రిపోర్ట్ కాపీని కానీ తనకు అందించడం లేదని వివరించారు. దీంతో సీఐడీ దాఖలు చేసిన క్లోజర్ రిపోర్ట్ను వ్యతిరేకిస్తూ కోర్టులో ‘ప్రొటెస్ట్ పిటిషన్’ దాఖలు చేయడం సాధ్యం కావడం లేదన్నారు. చార్జిషీట్ను, క్లోజర్ రిపోర్ట్ను ఫిర్యాదుదారునికి అందించడం దర్యాప్తు అధికారి బాధ్యత అని పిటిషన్లో పేర్కొన్నారు. -
సాక్షి కథనం సభా హక్కుల ఉల్లంఘన కిందకు రాదు
సాక్షి, అమరావతి: ఎమ్మెల్యేలకు శిక్షణ తరగతుల పేరుతో కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృథా చేయడంపై ‘సాక్షి’ ప్రచురించిన వార్తాకథనం సభాహక్కుల ఉల్లంఘన కిందకు రాదని సీనియర్ న్యాయవాది సుబ్రహ్మణ్య శ్రీరాం గురువారం హైకోర్టుకు నివేదించారు. సభ లోపల జరిగిన వ్యవహారాలపై రాసిన కథనాలకే సభాహక్కుల ఉల్లంఘన వర్తిస్తుందని చెప్పారు. సభ వ్యవహారాలతో సంబంధంలేని అంశాలపై వార్తా కథనం ప్రచురించడం తప్పు కాదన్నారు. సాక్షి కథనం సభా హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందనేందుకు ఎలాంటి ప్రాథమిక ఆధారాలు లేవని చెప్పారు. ప్రాథమిక ఆధారాలు లేకుండానే సభా హక్కుల ఉల్లంఘనపై ముందే ఓ నిర్ణయానికి వచ్చి, అందుకనుగుణంగా శాసనసభ సెక్రటరీ జనరల్ నోటీసులు జారీ చేయడం చట్ట విరుద్ధమని తెలిపారు. ఆ కథనం కేవలం పరిపాలనపరమైన అంశానికి సంబంధించింది మాత్రమేనన్నారు. అసలు ఆ కథనం సభా హక్కుల పరిధిలోకి వస్తుందా.. రాదా.. అన్న విషయాన్ని ముందు తేల్చాల్సిన అవసరం ఉందని చెప్పారు. వాస్తవానికి ఏది సభాహక్కుల పరిధిలోకి వస్తుంది, ఏది రాదు అన్న విషయంపై ఎక్కడా నిర్దిష్టమైన నిర్వచనం లేదని తెలిపారు. తమ కథనం సభాహక్కుల పరిధిలోకి వస్తుందా.. రాదా.. అన్నదానిపై ఓ వైపు న్యాయస్థానం విచారణ జరుపుతుండగానే, ప్రచురించిన వార్తా కథనానికి సంబంధించిన ఆధారాలతో తమ ముందు హాజరుకావాలంటూ అసెంబ్లీ సెక్రటరీ జనరల్ తాజాగా మరో నోటీసు ఇచ్చారని చెప్పారు. ఆ నోటీసుకు తాము సమాధానం కూడా ఇచ్చామని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ఈ వ్యవహారంలో ముందుకెళ్లకుండా ప్రివిలేజ్ కమిటీని, అసెంబ్లీ సెక్రటరీ జనరల్ను నియంత్రిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. ఈ సమయంలో అసెంబ్లీ సెక్రటరీ జనరల్ తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్ స్పందిస్తూ.. ఎలాంటి రాతపూర్వక ఉత్తర్వులు అవసరం లేదని, తదుపరి విచారణ వరకు ఎలాంటి నోటీసులు ఇవ్వబోమని చెప్పారు. ఏజీ చెప్పిన ఈ వివరాలను నమోదు చేసిన హైకోర్టు తదుపరి విచారణను ఈ నెల 19కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందన్రావు ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. సభా హక్కుల కమిటీకి నివేదించిన స్పీకర్ సాక్షి కథనం సభా హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని, దాన్ని తాను సభలో ప్రస్తావించేందుకు అనుమతించాలని కోరుతూ టీడీపీ ఎమ్మెల్యే జయసూర్య గత ఏడాది ఫిబ్రవరి 25న అసెంబ్లీ స్పీకర్ను కోరుతూ నోటీసు ఇచ్చారు. దీంతో స్పీకర్ ఈ వ్యవహారాన్ని సభాహక్కుల కమిటీకి నివేదించారు. ఈ కమిటీ ఆదేశాల మేరకు అసెంబ్లీ సెక్రటరీ జనరల్ ‘సాక్షి’కి షోకాజ్ నోటీసులు ఇచ్చారు. ఎమ్మెల్యే నోటీసుతోపాటు సెక్రటరీ జనరల్ ఇచ్చిన షోకాజ్ నోటీసును సవాలు చేస్తూ సాక్షి ఎడిటర్ ధనంజయరెడ్డి, చీఫ్ రిపోర్టర్ ఫణికుమార్ గత ఏడాది జూన్లో హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై విచారణ జరిపిన సింగిల్ జడ్జి.. ఇచ్చింది షోకాజ్ నోటీసు మాత్రమేనని, దీని తరువాత చాలా ప్రక్రియ ఉన్న నేపథ్యంలో ఈ వ్యాజ్యాలు అపరిపక్వమైనవంటూ వాటిని కొట్టేశారు. ధర్మాసనం ముందు అప్పీళ్లు ఈ తీర్పును సవాలు చేస్తూ ధనంజయరెడ్డి, ఫణికుమార్ వేర్వేరుగా ధర్మాసనం ముందు అప్పీళ్లు దాఖలు చేశారు. ఈ అప్పీళ్లపై గురువారం సీజే ధర్మాసనం మరోసారి విచారణ జరిపింది. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది శ్రీరాం, వేలూరు మహేశ్వర్రెడ్డి, అనూప్ కౌషిక్ వాదనలు వినిపించారు. శాసనసభ కార్యకలాపాల్లో జోక్యం చేసుకున్నప్పుడు, వాటిని అడ్డుకున్నప్పుడే సభాహక్కుల ఉల్లంఘన అవుతుందని శ్రీరాం వివరించారు. సాక్షి కథనం ఎక్కడా సభ కార్యకలాపాల్లో జోక్యం చేసుకోవడం లేదన్నారు. శిక్షణ తరగతులు నిర్వహించకపోవడం వల్ల ప్రజాధనం వృథా అయిందన్న విషయాన్ని మాత్రమే ఎత్తి చూపిందని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన సుప్రీంకోర్టు వెలువరించిన పలు తీర్పులను ఉదహరించారు. రూ.కోట్ల ప్రజాధనం వృథాపై సాక్షి కథనం ఎమ్మెల్యేలకు శిక్షణ తరగతుల నిర్వహణ విషయంలో సరైన ప్రణాళిక, అవగాహన లేకపోవడంతో కోట్ల రూపాయల మేర ప్రజాధనం వృథా అయింది. ఎమ్మెల్యేలకు రెండు రోజులు శిక్షణ తరగతులు నిర్వహించాలని శాసనసభ వర్గాలు గత ఏడాది ఫిబ్రవరిలో నిర్ణయించాయి. ఎమ్మెల్యేలకు, అతిథులకు హోటళ్లు, భోజనాలు, బహుమతులు తదితరాల కోసం భారీగా ఖర్చు చేశారు. అయితే లోక్సభ స్పీకర్ ఈ కార్యక్రమానికి రాకపోవడంతో ఆ ఖర్చంతా వృథా అయింది. దీనిపై సాక్షి గత ఏడాది ఫిబ్రవరి 22న ‘కోట్లు ఖర్చు.. శిక్షణ తుస్సు’ శీర్షికన వార్తా కథనం ప్రచురించింది. ఈ వార్తా కథనంతో కంగుతిన్న అధికార పార్టీ నేతలు సాక్షిపై కక్షసాధింపు చర్యలు చేపట్టారు. -
ఆ ప్రజాప్రయోజన ప్రాజెక్టు ఆగిపోకూడదు
సాక్షి, అమరావతి: బెంగళూరు–మైదుకూరు–అమరావతి గ్రీన్ఫీల్డ్ హైవే భూ సేకరణకు జాతీయ రహదారుల చట్టం కింద వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో 2022–23లో జారీ అయిన నోటిఫికేషన్లను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. 124 కిలోమీటర్లు, 12 మండలాలు, 49 గ్రామాలకు సంబంధించిన పెద్ద ప్రజా ప్రయోజన ప్రాజెక్ట్ అని, కొద్దిమంది అభ్యంతరాలతో మొత్తం ప్రాజెక్ట్ ఆగిపోకూడదని న్యాయమూర్తి జస్టిస్ కొనకంటి శ్రీనివాసరెడ్డి ఇటీవల తీర్పు వెలువరించారు.అంతా సక్రమమే: హైకోర్టుబెంగళూరు–మైదుకూరు–అమరావతి గ్రీన్ ఫీల్డ్ కారిడార్ నిర్మాణం కోసం వైఎస్సార్ కడప జిల్లాలో భూములను సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. జాతీయ రహదారుల చట్టం కింద 2022–23లో భూ సేకరణ నోటిఫికేషన్లు జారీ చేసింది. తరువాత గెజిట్ నోటిఫికేషన్లు కూడా జారీ అయ్యాయి. వీటిని సవాలు చేస్తూ పలువురు భూ యజమానులు హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది ఓబిరెడ్డి మనోహర్రెడ్డి వాదనలు వినిపించారు. నోటిఫికేషన్లపై పిటిషనర్ల అభ్యంతరాలను హైకోర్టు తిరస్కరించిన తీరిది.. » జాతీయ రహదారుల చట్టం కింద భూములు సేకరిస్తుంటే, భూ సేకరణ నోటిఫికేషన్లో ఆ భూముల వివరాలను సంక్షిప్తంగా పేర్కొంటే సరిపోతుంది. » భూముల యజమానుల పేర్లను భూ సేకరణ నోటిఫికేషన్లో పేర్కొనాల్సిన అవసరం లేదు. » జాతీయ రహదారుల చట్టంలోని సెక్షన్ 3ఏ (1) ప్రకారం భూ సేకరణ నోటిఫికేషన్ను ఏవైనా రెండు స్థానిక పత్రికల్లో ప్రచురిస్తే సరిపోతుంది. ఆ పత్రికల సర్క్యులేషన్ ఎంత అన్నది అవసరం లేదు. » సాంకేతిక నిపుణుల ద్వారా రూపొందించిన జాతీయ ప్రాజెక్టుల విషయంలో న్యాయ సమీక్షా పరిధి చాలా పరిమితంగా ఉంటుంది. » పెద్ద ప్రాజెక్టులకు భూములిచ్చేందుకు మెజారిటీ యజమానులు అంగీకరించినప్పుడు, కొద్ది మంది అభ్యంతరాల ఆధారంగా ఆ ప్రాజెక్టును నిలిపివేయడం సాధ్యం కాదు. » పైగా చట్ట ప్రకారం పిటిషనర్లు 21 రోజుల్లో అభ్యంతరాలు తెలపాల్సి ఉండగా, ఆ గడువులో అభ్యంతరాలు చెప్పలేదు. » డబుల్ ట్రంపెట్ ఇంటర్చేంజ్ మధ్యలో ఉన్న భూములు కూడా హైవేలో భాగమే. » సేకరించిన భూములను వాణిజ్య కార్యకలాపాల కోసం వాడతారనే అనుమానం ఆధారరహితం. -
AP హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్
-
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్
సాక్షి, అమరావతి/సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే)గా జస్టిస్ లీసా గిల్ రానున్నారు. పంజాబ్, హరియాణ హైకోర్టులో మూడోస్థానంలో కొనసాగుతున్న ఆమెను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సీజేగా సిఫారసు చేస్తూ భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. మొదట జస్టిస్ లీసా గిల్ను న్యాయమూర్తిగా ఏపీ హైకోర్టుకు బదిలీ చేస్తున్నారు. హైకోర్టు సీజే జస్టిస్ ధీరజ్సింగ్ ఠాకూర్ ఏప్రిల్ 24 పదవీ విరమణ చేయనున్నారు. ఆయన పదవీ విరమణ చేసిన వెంటనే జస్టిస్ లీసా గిల్ ప్రధాన న్యాయమూర్తిగా నియమితులవుతారు. ఆమె ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తి అవుతారు. సీజే జస్టిస్ ధీరజ్సింగ్ ఠాకూర్ పదోన్నతిపై సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశం ఉందని కూడా న్యాయవర్గాల్లో చర్చ జరుగుతోంది. ఒకవేళ ఆయన సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా వెళితే ఆ వెంటనే జస్టిస్ లీసా గిల్ హైకోర్టు సీజేగా నియమితులవుతారు. 2028లో జస్టిస్ లీసా గిల్ పదవీ విరమణ.. ఆలోపు సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశం జస్టిస్ లీసా గిల్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా 2028 నవంబర్లో పదవీ విరమణ చేస్తారు. ఆ లోపు పంజాబ్, హరియాణ రాష్ట్ర కోటాలో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యే అవకాశం కూడా ఉంది. ప్రస్తుతం సుప్రీంకోర్టులో పంజాబ్, హరియాణ నుంచి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్తో సహా మొత్తం ముగ్గురు న్యాయమూర్తులున్నారు. వీరిలో జస్టిస్ సూర్యకాంత్ 2027లో, జస్టిస్ రాజేష్ బిందాల్ ఈ ఏడాది ఏప్రిల్లో, జస్టిస్ అగస్టీన్ జార్జ్ మసీహ్ 2028 మార్చిలో పదవీ విరమణ చేస్తారు. ఈ నేపథ్యంలో జస్టిస్ లీసా గిల్ హైకోర్టు సీజేగా పదవీ విరమణకు ముందే సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా వెళ్లే అవకాశం ఉంది. కొత్త విధాన నిర్ణయం తీసుకున్న కొలీజియం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, న్యాయమూర్తులు జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఎం.ఎం.సుందరేష్ లతో కూడిన కొలీజియం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల నియామకం విషయంలో కొత్త విధాననిర్ణయం తీసుకుంది. న్యాయపాలన సామర్థ్యాన్ని, నాణ్యతను బలోపేతం చేయడానికి కొత్త విధానాన్ని అనుసరించాలని నిర్ణయించినట్లు కొలీజియం తెలిపింది. ఒక హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా నియమించాలని నిర్ణయించిన న్యాయమూర్తిని సదరు హైకోర్టులో ఆ ఖాళీ ఏర్పడటానికి కనీసం రెండునెలల ముందే న్యాయమూర్తిగా బదిలీ చేయాలని నిర్ణయించినట్లు తెలిపింది. దీనివల్ల సదరు న్యాయమూర్తికి ఆ హైకోర్టు వ్యవహారాలపై పూర్తి అవగాహన పెంచుకోవడానికి ఆస్కారం ఉంటుందని, అక్కడ ప్రధాన న్యాయమూర్తి పోస్టు ఖాళీ అయిన వెంటనే సీజేగా బాధ్యతలు స్వీకరించడానికి వీలుంటుందని కొలీజియం పేర్కొంది. గతంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవీ విరమణ చేయగానే, అదే హైకోర్టులో రెండోస్థానంలో ఉన్న న్యాయమూర్తిని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా నియమించేవారు. కొద్దినెలల తరువాత వేరే హైకోర్టు నుంచి పూర్తిస్థాయి ప్రధాన న్యాయమూర్తిని నియమించేవారు. చాలా సందర్భాల్లో హైకోర్టులో రెండోస్థానంలో ఉన్న న్యాయమూర్తిని మాతృ హైకోర్టు కోటా నుంచి వేరే హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతిపై నియమిస్తుండేవారు. ఆ న్యాయమూర్తి తాత్కాలిక సీజేగా కొంత అనుభవం గడిస్తారన్న ఉద్దేశంతో గతంలో సుప్రీంకోర్టు కొలీజియం ఆ నిర్ణయం తీసుకుంది. తాత్కాలిక సీజే అదే హోదాలో పదవీ విరమణ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు సీజే నియామకం విషయంలో సుప్రీంకోర్టు కొత్త విధాన నిర్ణయం తీసుకుంది. జస్టిస్ లీసా గిల్ నేపథ్యం.. 1966 నవంబర్ 15న జన్మించిన ఆమె చండీగఢ్లోని సెక్టార్ 9లో ఉన్న కార్మెల్ కాన్వెంట్ స్కూల్లో పాఠశాల విద్య పూర్తిచేశారు. హ్యుమానిటీస్ విభాగంలో గ్రాడ్యుయేషన్ చేశారు. పంజాబ్ యూనివర్సిటీ నుంచి బీఏ, ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం పూర్తిచేశారు. 1990లో న్యాయవాదిగా ఎన్రోల్ అయిన ఆమె పంజాబ్, హరియాణ హైకోర్టులో ప్రాక్టీస్ చేశారు. క్రిమినల్, సివిల్, సర్వీస్, రెవెన్యూ, రాజ్యాంగపరమైన అనేక రకాల కేసులను ఆమె వాదించారు. చండీగఢ్ కేంద్రపాలిత ప్రాంతంతోపాటు పలు బోర్డులు, కార్పొరేషన్లకు ప్రాతినిధ్యం వహించారు. 2014 మార్చి 31న పంజాబ్, హరియాణ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ప్రస్తుతం ఆ హైకోర్టులో మూడో స్థానంలో కొనసాగుతున్నారు. -
ఉద్యోగులపై క్రమశిక్షణ కేసుల పరిష్కారంలో ఇంత జాప్యమా?
సాక్షి, అమరావతి: ప్రభుత్వ ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యల కేసుల విచారణ ప్రక్రియలో జరుగుతున్న అసాధారణ జాప్యంపై హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. మూడు నుంచి ఆరు నెలల్లో ఈ కేసులు పరిష్కారం కావాలన్న ప్రభుత్వ నిబంధనలు అమలు కావడం లేదని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఈ కేసులను ఒక కొలిక్కి తెచ్చేందుకు అసాధారణ నిర్ణయం తీసుకుంది. వివిధ శాఖల్లో పెండింగ్లో ఉన్న 5,424 కేసులు పరిష్కారం అయ్యే వరకు ఈ వ్యవహారాన్ని నిరంతరం (కంటిన్యూస్ మాండమస్) పర్యవేక్షించాలని నిర్ణయించింది. 2025 డిసెంబర్ 15వ తేదీ నాటికి పెండింగ్లో ఉన్న 5,424 క్రమశిక్షణ చర్యల కేసులను మూడు నుంచి ఆరు నెలల వ్యవధిలో పరిష్కరించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. 6 నెలల్లో కేసులు పరిష్కారం కావాలని ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం, ఆ గడువులోపు విచారణను ముగించకుంటే ఏం చేయాలన్న దానిపై స్పష్టతనివ్వకపోవడం వల్ల ఎలాంటి ప్రత్యామ్నాయం లేకుండా పోయిందని కోర్టు వ్యాఖ్యానించింది. ఇకపై నాలుగు నెలలకొకసారి ఈ కేసుల పురోగతిని తమకు తెలియచేస్తూ అఫిడవిట్లు దాఖలు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ న్యాపతి విజయ్ ఇటీవల తీర్పు వెలువరించారు. తనపై రెండు అభియోగాలతో చేపట్టిన క్రమశిక్షణ చర్యల ప్రొసీడింగ్స్ను వీలైనంత త్వరగా ముగించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ ఈఎస్ఐ ఆసుపత్రిలో స్పెషల్ గ్రేడ్ సివిల్ సర్జన్గా పనిచేస్తున్న జి.రవికుమార్ దాఖలు చేసిన పిటిషన్ను విచారించిన హైకోర్టు ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది. 5,424 క్రమశిక్షణ చర్యల కేసులుక్రమశిక్షణ చర్యల కేసుల్లో విచారణను ఎందుకు సకాలంలో ముగించడం లేదో చెప్పాలని ఈ వ్యాజ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్)ని న్యాయమూర్తి ఆదేశించారు. కొత్త నియామకాలు, బదిలీలు, పదవీ విరమణలు, డేటా లభ్యత లోపం, ఫైళ్లు వివిధ కార్యాలయాల్లో ఉండడం, పదోన్నతుల వల్ల అధికార మార్పులు వంటి కారణాలతో క్రమశిక్షణ చర్యల కేసుల విచారణలో జాప్యం జరుగుతోందని ప్రధాన కార్యదర్శి రాతపూర్వకంగా హైకోర్టుకు నివేదించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. 2025 డిసెంబర్ 15వ తేదీ నాటికి మొత్తం 5,75,613 మంది ఉద్యోగులు ఉంటే, 5,70,713 మంది ఉద్యోగుల వివరాలు మ్యాప్ అయ్యాయి. 5,424 క్రమశిక్షణ చర్యల కేసులు పలువురు ఉద్యోగులపై పెండింగ్లో ఉన్నాయి. అత్యధికంగా హోంశాఖలో 1,558, రెవెన్యూ శాఖలో 854, రవాణా, రోడ్లు భవనాల శాఖలో 384, పురపాలక శాఖలో 366 కేసులు పెండింగ్లో ఉన్నాయి. జీవించే హక్కును హరించడమే: హైకోర్టు కీలక వ్యాఖ్యలు» ఈ కేసుల విచారణలో జాప్యం రాజ్యాంగం ప్రసాదించిన గౌరవంగా జీవించే హక్కును హరిస్తోంది. » క్రమశిక్షణ చర్యల కేసులు ఓ కొలిక్కి రాకుండా ఏళ్ల తరబడి పేరుకుపోతుండటంతో న్యాయస్థానాల్లో పెద్ద సంఖ్యలో కేసులు దాఖలవుతున్నాయి. » ఇవి న్యాయవ్యవస్థపై మోయలేని భారాన్నిమోపడమే కాకుండా, ఉద్యోగులూ మానసిక వేదనకు గురవుతున్నారు. » ఉద్యోగి పదవీ విరమణ ప్రయోజనాలు చాలా సందర్భాల్లో అతనిపై పెండింగ్లో ఉన్న క్రమశిక్షణ చర్యల కేసుతో ముడిపడి ఉంటాయి. » చార్జ్ మెమోలతో సంబంధం లేకుండా పదోన్నతులు కల్పిం చాలని, సీనియారిటీ పునరుద్ధరించాలని, జాప్యం ఉన్నందున క్రమశిక్షణ చర్యలను కొట్టేయాలని, పదవీ విరమణ ప్రయోజనాలు ఇప్పించాలని, అలాగే కోర్టు ధిక్కార చర్యలు చేపట్టాలని.. ఇలా పలు అంశాలపై పెద్ద సంఖ్యలో పిటిషన్లు దాఖలవుతున్నాయి. » క్రమశిక్షణ చర్యల కేసుల్లో విచారణను త్వరగా ముగించడమన్నది కేవలం ఆ ఉద్యోగి హక్కు మాత్రమే కాదు. సంబంధిత శాఖకు సైతం ఆ హక్కు ఉంది. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా తప్పు చేసిన ఉద్యోగులను శిక్షించి, నిజాయితీపరులైన అధికారులను ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. -
పవన్ కళ్యాణ్ కళ్లు మూసుకుపోయాయ..? హై కోర్టు అడ్వకేట్ సావిత్రి స్ట్రాంగ్ రియాక్షన్
-
జైల్లో ఉంచితే దారికొస్తారా? ఏపీ సీఎస్ పై హైకోర్టు ఫైర్
-
కోర్టులను మూసేయండి
సాక్షి, అమరావతి : ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) విజయానంద్పై హైకోర్టు నిప్పులు చెరిగింది. కోర్టు ఆదేశాలను అమలు చేసే ఉద్దేశం లేకపోతే కోర్టులను మూసి వేయడం మంచిదని ఘాటుగా వ్యాఖ్యానించింది. ప్రజలకు, కక్షిదారులకు న్యాయం చేయలేకపోతే ఇక న్యాయస్థానాలు ఎందుకని ప్రశ్నించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శే కోర్టు ఆదేశాలను అమలు చేయకుంటే అతని కింద పని చేసే ప్రభుత్వ ఉద్యోగులందరికీ కోర్టు ఆదేశాలంటే ఏం గౌరవం ఉంటుందని నిలదీసింది. కోర్టు ఆదేశాలను అమలు చేయకపోవడం ద్వారా మిగిలిన అధికారులకు ఏం సందేశం ఇస్తున్నారని ఆయన్ను ప్రశ్నించింది. ప్రజలకు న్యాయం చేయడానికి, న్యాయ వ్యవస్థ ప్రతిష్టను కాపాడటానికే తాము ఇక్కడ ఉన్నామని, ఈ విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. ప్రభుత్వాధికారుల తీరు వల్ల న్యాయ వ్యవస్థపై ప్రజలు నమ్మకం కోల్పోయే పరిస్థితి దాపురించిందని ఘాటుగా వ్యాఖ్యానించింది. త్వరలో పదవీ విరమణ చేయనున్న విజయానంద్ను నాలుగు రోజుల పాటు జైల్లో ఉంచితే అధికారులందరూ దార్లోకి వస్తారంది. కోర్టు ఆదేశాలను అమలు చేయవద్దని సలహా ఇస్తే ఎంత మాత్రం సహించేది లేదని స్పష్టం చేసింది. గ్రూప్–1 ప్రధాన పరీక్షలో ఉత్తీర్ణులై ప్రస్తుతం వివిధ పోస్టుల్లో కొనసాగుతున్న అధికారులను నాన్ ఫోకల్ (ప్రాధాన్యత లేని) పోస్టులకు బదిలీ చేయాలన్న తమ ఆదేశాలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉద్దేశ పూర్వకంగానే అమలు చేయలేదని హైకోర్టు ఆక్షేపించింది. నాన్ ఫోకల్ పోస్టులకు బదిలీ చేయాలంటూ ఆదేశం.. గ్రూప్–1 ప్రధాన పరీక్ష జవాబు పత్రాల మూల్యాంకనంలో అక్రమాలు జరిగాయంటూ దాఖలైన పలు వ్యాజ్యాలపై విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్ దేవానంద్ నేతృత్వంలోని హైకోర్టు ధర్మాసనం ఈ నెల 11న ప్రభుత్వానికి పలు ఆదేశాలు జారీ చేసింది. గ్రూప్–1లో ఇప్పటికే ఎంపికై ప్రస్తుతం పలు చోట్ల ఉద్యోగాలు చేస్తున్న అధికారులను తక్షణమే నాన్ ఫోకల్ (ప్రాధాన్యత లేని) పోస్టులకు బదిలీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.ఓ వారంలో ఆ అధికారుల బదిలీలకు సంబంధించిన వివరాలతో ఓ నివేదికను రిజి్రస్టార్ జ్యుడీషియల్కు అందచేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ను ఆదేశించింది. ఈ వ్యవహారంపై మంగళవారం విచారణ జరిపిన ధర్మాసనం.. తమ ఆదేశాల మేరకు ఆ అధికారులను నాన్ ఫోకల్ పోస్టులకు బదిలీ చేయకపోవడంతో విజయానంద్ వ్యక్తిగత హాజరుకు ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే. ఏఐని అడిగితే ఏంటో తెలిసేదిగా.. ఈ వ్యాజ్యాలపై న్యాయమూర్తులు జస్టిస్ బట్టు దేవానంద్, జస్టిస్ అవధానం హరిహరనాథ శర్మ ధర్మాసనం బుధవారం మరోసారి విచారణ జరిపింది. ఈ సందర్భంగా తమ ఆదేశాలను ఎందుకు అమలు చేయలేదని, తమ ముందు వ్యక్తిగతంగా హాజరైన సీఎస్ విజయానంద్ను ప్రశ్నించింది. తక్షణమే బదిలీ చేయాలని తాము ఈ నెల 11న ఆదేశాలిస్తే, ఇప్పటి వరకు వాటిని అమలు చేయలేదని, దీని బట్టి ‘తక్షణమే’ అన్న పదానికి సీఎస్కు అర్థం తెలిసినట్లు లేదని పేర్కొంది. తమ ఆదేశాలను అమలు చేసి తీరాల్సిందేనని, లేని పక్షంలో తాము తీసుకునే కోర్టు ధిక్కార చర్యలకు సిద్ధంగా ఉండాలని విజయానంద్కు తేల్చి చెప్పింది. ఈ సమయంలో అడ్వొకేట్ జనరల్ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్ జోక్యం చేసుకుంటుండగా, సీఎస్ స్వయంగా తమ ముందు ఉన్నారని, ఆయన్నే అడిగి వివరాలు తెలుసుకుంటామని, ఈ దశలో మీ జోక్యం అవసరం లేదని ఏజీకి తేల్చి చెప్పింది. సర్వీసు నిబంధనల్లో ఫోకల్, నాన్ ఫోకల్ పోస్టుల నిర్వచనం లేదని ఏజీ చెప్పగా.. 1966లోనే ప్రభుత్వ కార్యనిర్వాహక ఉత్తర్వులు జారీ చేసిందని ధర్మాసనం గుర్తు చేసింది. ఈ ఉత్తర్వుల ఆధారంగానే ఫోకల్, నాన్ ఫోకల్ పోస్టులకు బదిలీలు జరుగుతూ వస్తున్నాయని తెలిపింది. ఫోకల్, నాన్ ఫోకల్ పోస్టులకు అర్థం తెలియకుంటే, నిఘంటువును చూసినా, ఏఐని అడిగినా తెలుస్తుందని పేర్కొంది. ఫోకల్, నాన్ ఫోకల్ పోస్టుల గురించి అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్కు కూడా తెలుసని, కానీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాత్రం తెలియదని చెబుతున్నారంది. గ్రూప్–1 ప్రధాన పరీక్షలో ఉత్తీర్ణులై వివిధ పోస్టుల్లో కొనసాగుతున్న అధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కుమ్మక్కయ్యారని, అందుకే వారిని నాన్ ఫోకల్ పోస్టులకు బదిలీ చేయాలన్న తమ ఆదేశాలను కావాలనే అమలు చేయడం లేదని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. అధికారులను సమర్థించొద్దు 1966 నాటి ఉత్తర్వుల గురించి తమ అధికారులకు తెలిసి ఉండకపోవచ్చునని ఏజీ చెప్పగా, కోర్టు ఆదేశాలను అమలు చేయని ఓ అధికారిని సమర్థించేందుకు ఎందుకింత తాపత్రయ పడుతున్నారని ఏజీని ప్రశి్నంచింది. తమ ఆదేశాలను అమలు చేసి, ఆ వివరాలను తమ ముందుంచాలని సీఎస్ను ఆదేశిస్తూ తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది. ఈ సమయంలో ఏజీ స్పందిస్తూ, వ్యక్తిగత హాజరు నుంచి సీఎస్కు మినహాయింపు కావాలని కోరారు. తమ ఆదేశాలను అమలు చేస్తే వ్యక్తిగతంగా హాజరు కావాల్సిన అవసరం లేదని, అమలు చేయకుంటే మాత్రం హాజరు కావాల్సిందేనని ధర్మాసనం స్పష్టం చేసింది. -
కోర్టు ముందు అసత్యాలు ఉంచడం సరికాదు
సాక్షి, అమరావతి: సర్వశిక్షాభియాన్ పీడీ శ్రీనివాసరావుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ముందు అసత్యాలు ఉంచడం సరికాదని ఆక్షేపించింది. క్రిమినల్ చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఘాటుగా వ్యాఖ్యానించింది. కస్తూరిభా గాంధీ బాలికా విద్యాలయాల్లో (కేజీబీవీ) బోధనా సిబ్బందిని శాశ్వత ప్రాతిపదికన నియమించే వ్యవహారంపై హైకోర్టులో వాదనలు ముగిశాయి. వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ బట్టు దేవానంద్, జస్టిస్ అవధానం హరిహరనాథ శర్మ ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. కేజీబీవీల్లో పార్ట్టైం పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్లు (పీజీటీ)గా పనిచేస్తున్న తమను అర్థాంతరంగా తొలగించడాన్ని సవాలు చేస్తూ పలువురు పీజీటీలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణ జరిపిన సింగిల్జడ్జి అధికారుల తీరును తప్పుపట్టారు. వారి సేవలను కొనసాగించాలని ఆదేశించారు. ఈ తీర్పును సవాలు చేస్తూ అధికారులు ధర్మాసనం ముందు ఈ ఏడాది జనవరిలో అప్పీల్ దాఖలు చేశారు. ఈ అప్పీల్పై జస్టిస్ బట్టు దేవానంద్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరుపుతూ వస్తోంది. సింగిల్ జడ్జి తీర్పును అమలు చేస్తామంటూ కోర్టుకిచి్చన హామీని ఉల్లంఘించినందుకు సర్వశిక్షాభియాన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ (పీడీ) శ్రీనివాసరావుపై సుమోటోగా కోర్టు ధిక్కార చర్యలు చేపట్టింది. తాజాగా ధర్మాసనం ఈ సుమోటో కోర్టు ధిక్కార వ్యాజ్యంతో పాటు సింగిల్ జడ్జి తీర్పుపై అధికారులు దాఖలు చేసిన అప్పీళ్లపై కూడా విచారణ జరిపింది. శ్రీనివాసరావు ఈ విచారణకు సైతం వ్యక్తిగతంగా హాజరయ్యారు. కోర్టు ఆదేశాలను గౌరవించి అమలు చేయండి చాలు... ఈ సందర్భంగా ఆయన దాఖలు చేసిన అఫిడవిట్లో పేర్కొన్న అంశాలపై ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. కోర్టుకు అసత్యాలు చెప్పొద్దని తేల్చి చెప్పింది. క్రిమినల్ కోర్టు ధిక్కార చర్యలూ ఎదుర్కోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ కేసులో మీ చర్యలను డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ (డీవోపీటీ)కి నివేదించాల్సి ఉంటుందని హెచ్చరించింది. అయితే 12 ఏళ్ల సుదీర్ఘ సర్వీసు ఉన్న నేపథ్యంలో ఆ పని చేయడం లేదని స్పష్టం చేసింది. కోర్టు ముందు ఎందుకు అసత్యాలు చెప్పాల్సి వ చ్చిందని ధర్మాసనం ప్రశ్నించగా, కోర్టు అంటే భయమని శ్రీనివాసరావు చెప్పారు. కోర్టు అంటే భయమంటూ మళ్లీ అబద్ధం చెబుతున్నారని ధర్మాసనం నవ్వుతూ వ్యాఖ్యానించింది. మరోసారి ఇలాంటి వాటిని పునరావృత్తం చేయవద్దని స్పష్టం చేసింది. పూర్తి వాస్తవాలతో మరో అఫిడవిట్ దాఖలు చేయాలని ఆయన్ను ఆదేశించింది. తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. -
తన వారి లబ్ధి కోసమే బాబు ఐఆర్ఆర్ ప్లాన్ మర్చారు: ఆర్కే
సాక్షి, విజయవాడ: అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ కుంభకోణం కేసులో సీఎం చంద్రబాబు ముందస్తు బెయిల్ రద్దు చేయాలని మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై ఏపీ హైకోర్టు విచారణ జరిపిది. చంద్రబాబు ముందస్తు బెయిల్ రద్దు చేయాలని ఆళ్ల రామకృష్ణారెడ్డి పిటిషన్కు విచారణార్హత లేదని ప్రభుత్వం తన వాదనలు వినిపించింది.ఈ కేసు సంబంధించి ముందస్తు బెయిల్ ఇవ్వద్దని 542 పేజీలతో సీఐడీ కౌంటర్ వేసినట్టు కోర్టుకు న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ తెలిపారు. అదే సమయంలో కొన్ని ఆధారాలు కూడా కోర్టుకు సమర్పించినట్టు కోర్టుకు చెప్పారు. కేసు క్లోజ్ చేయకుండా ప్రొటెస్ట్ పిటిషన్ దాఖలు చేశామని ఈ నెల 27న ఏసీబీ కోర్టులో విచారణకు వస్తుందని శ్రవణ్కుమార్ కోర్టుకు తెలిపారు. వివరాలు సమర్పించాలన్న హైకోర్టు.. మార్చి 10కి వాయిదా వేసింది.మీడియాతో ఆళ్ల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. చంద్రబాబు గతంలో సీఎం గా ఉన్న సమయంలో ఐఆర్ఆర్ ప్లాన్ తన వారికి లబ్ధి పొందేందుకు మార్పులు చేశారని.. తాను ఈ అంశంపై సాక్ష్యాలతో సీఐడీకి ఫిర్యాదు చేశానని తెలిపారు. ‘‘నా సాక్ష్యాలను పరిశీలించి ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఛార్జ్షీట్ వేశారు. చంద్రబాబుతో పాటు మంత్రి నారాయణ, లింగమనేని రమేష్, లోకేష్, అంజనీ కుమార్పై కేసు నమోదైంది. వీళ్ళందరూ ఐఆర్ఆర్ను తమకు లబ్ధి కోసం అనేక మార్పులు ఐఆర్ఆర్లో అక్రమాలు చేశారు...అక్రమ మార్గంలో డబ్బు పొందేందుకు ఐఆర్ఆర్ను వాడుకున్నారు. 2014 ముందు లింగమనేని రమేష్ 500 ఎకరాలు పొలం ఐఆర్ఆర్ మార్గంలో కొన్నారు. చంద్రబాబు 2014లో సీఎం అయ్యాక హెరిటేజ్ సంస్థకు ఎకరం 7 లేదా 8 లక్షలకు మాత్రమే లింగమనేని అమ్మారు. ఐఆర్ఆర్ ద్వారా లాభం పొందిన కారణంగా హెరిటేజ్కు ఎకరం 4 కోట్లు ఉంటే 8 లక్షలకు అమ్మారు. నారా లోకేష్ కూడా ఈ కేసులో ముద్దాయిగా ఉన్నారు. చంద్రబాబు అప్పట్లో ఈ కేసులో ముందస్తు బెయిల్ పొందారు. ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ ద్వారా రూ. 2500 కోట్లు లబ్ధి పొందారు..కానీ అప్పుడు 542 పేజీలతో బెయిల్ ఇవ్వొద్దని కోర్టులో కౌంటర్ వేసిన సీఐడీ ఇప్పుడు కేసు లేదని ఏసీబీ కోర్టును ఆశ్రయించటం దారుణం. చంద్రబాబు హోం మంత్రిగా అనితకు ఇచ్చిన లా అండ్ ఆర్డర్ మాత్రం చంద్రబాబు తన వద్దే ఉంచుకున్నారు. ఐపీఎస్ అధికారులపై ఒత్తిడి తెచ్చి చంద్రబాబు తన కేసు క్లోజ్ చేయించుకుంటున్నాడు. చంద్రబాబు ఐఆర్ఆర్ కేసులో తొలి ముద్దాయి, లోకేష్ 14వ ముద్దాయి. ఐఆర్ఆర్ కేసులో చంద్రబాబు ముద్దాయిగా తేలడం ఖాయం’’ అని ఆళ్ల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. -
ప్రభుత్వంలో ఎక్కడో ఏదో తేడా ఉంది
సాక్షి, అమరావతి: ఉన్నత విద్యాశాఖ పరిధిలోని విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తూ యూజీసీ స్కేల్ పొందుతున్న బోధనా సిబ్బంది పదవీ విరమణ వయసును 62 నుంచి 65కి పెంచిన రాష్ట్ర ప్రభుత్వం, వ్యవసాయ శాఖ పరిధిలోని విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న బోధనా సిబ్బంది పదవీ విరమణ వయసు 65కి పెంచకపోవడం రాజ్యాంగ విరుద్ధమని హైకోర్టు తేల్చి చెప్పింది. ప్రభుత్వ చర్యలు వివక్షాపూరితమని స్పష్టం చేసింది. ప్రభుత్వంలో ఎక్కడో ఏదో తేడా ఉందని ఈ సందర్భంగా వ్యాఖ్యానించిన హైకోర్టు, ముఖ్యమంత్రి కార్యాలయంలో (సీఎంఓ) కూర్చొని ఒకరిద్దరు అధికారులే అన్నీ నిర్ణయాలు తీసేసుకుంటున్నారని సూచించింది. మనది ప్రజాస్వామ్య దేశమే తప్ప, నియంతృత్వ దేశం కాదని, ఈ విషయాన్ని అధికారులందరూ గుర్తు పెట్టుకోవాలని స్పష్టం చేసింది. ఎలా పడితే అలా, ఏది పడితే అది చేయడానికి వీల్లేదంది. ఈ అంశంపై దాఖలైన అప్పీళ్లపై న్యాయమూర్తులు జస్టిస్ బట్టు దేవానంద్, జస్టిస్ సుబేంధు శమం ధర్మాసనం సోమవారం కీలక మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. బోధనా సిబ్బంది కొనసాగింపునకు ఆదేశాలు.. వ్యవసాయ శాఖ పరిధిలోని ఉద్యానవన, వ్యవసాయ, పశుసంవర్ధక, మత్స్య విశ్వవిద్యాలయాల్లో యూజీసీ స్కేల్ పొందుతున్న బోధనా సిబ్బందిని తదుపరి ఉత్తర్వులిచ్చేంత వరకు కొనసాగించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు తాజాగా ఆదేశించింది. పదవీ విరమణ వయసును 65కి పెంచాలంటూ ఈ నాలుగు విశ్వవిద్యాలయాలు చేసిన ప్రతిపాదనలను వ్యవసాయ శాఖ ఎక్స్ అఫీషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బుడిత రాజశేఖర్ ఏకపక్షంగా తిరస్కరించడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. ఈ మేరకు రాజశేఖర్ ఇచి్చన లేఖ అమలును నిలిపేసింది. వ్యవసాయ శాఖ పరిధిలోని విశ్వవిద్యాలయాల్లో ఇప్పటికే పలువురు పదవీ విరమణ చేశారని, అయితే ప్రభుత్వం ఆ ఖాళీలను భర్తీ చేసేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆక్షేపించింది. ఇలా అయితే విద్యార్థులకు నాణ్యమైన విద్య ఎలా అందుతుందని ప్రశి్నంచింది. పదవీ విరమణ వయసు పెంపుపై కౌంటర్ దాఖలుకు ప్రభుత్వానికి మూడు వారాల గడువునిచ్చింది. కాగా ఈ అంశంపై ధర్మాసనం ఆదేశాల మేరకు బుడిద రాజశేఖర్ కోర్టు ముందు స్వయంగా హాజరయ్యారు. -
భర్త అసౌకర్యం కంటే భార్య సౌకర్యానికే ప్రాధాన్యత
సాక్షి, అమరావతి: వైవాహిక వివాదాల కేసుల్లో భర్తకు కలిగే అసౌకర్యం కంటే భార్య సౌకర్యానికే ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసింది. విడాకుల నిమిత్తం భర్త పిటిషన్ దాఖలు చేసిన ప్రదేశానికి వెళ్లడానికి భార్యకు తగినంత ఆర్థిక స్తోమత లేనప్పుడు, ఆ పిటిషన్ను తనకు సౌకర్యంగా ఉండే చోటుకు బదిలీ చేయాలని కోరుతూ ఆమె దాఖలు చేసిన బదిలీ పిటిషన్ను అనుమతించవచ్చని హైకోర్టు తెలిపింది. వైవాహిక వివాదాల కేసుల్లో బదిలీ పిటిషన్లను పరిశీలించేటప్పుడు కోర్టులు ఇరుపక్షాల సామాజిక, ఆర్థిక స్థితిగతులను, వారి జీవన ప్రమాణాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొంది.రెండు వేర్వేరు విడాకుల కేసుల్లో ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ వేణుతురుమల్లి గోపాలకృష్ణారావు ఇటీవల ఆదేశాలు ఇచ్చారు. తన భర్త మోహన మురళీ దాఖలు చేసిన విడాకుల పిటిషన్ను రేపల్లె నుంచి ఒంగోలుకు బదిలీ చేయాలని కోరుతూ భార్య రాజేశ్వరి దాఖలు చేసిన పిటిషన్ను, అలాగే తన భర్త పవన్ దాఖలు చేసిన విడాకుల పిటిషన్ను తిరుపతి నుంచి ఆదోనికి బదిలీ చేయాలని ఐశ్వర్య అనే మరో మహిళ దాఖలు చేసిన పిటిషన్ను న్యాయమూర్తి అనుమతించారు. కాగా, విడాకుల కోసం పిటిషన్లు దాఖలు చేసిన భర్తలను తప్పనిసరిగా కోర్టు ముందు వ్యక్తిగతంగా హాజరు కావాల్సిందేనంటూ ఒత్తిడి చేయవద్దని న్యాయమూర్తి సూచించారు. భర్తల తరఫున న్యాయవాదులు హాజరవుతున్నంత కాలం వారి వ్యక్తిగత హాజరు అవసరం లేదని పేర్కొన్నారు. అయితే క్రాస్ ఎగ్జామినేషన్ లేదా ఇతర ప్రత్యేక పరిస్థితుల్లో వ్యక్తిగత హాజరుకు ఆదేశాలు ఇవ్వవచ్చని స్పష్టం చేశారు. -
పాఠశాలల ఆవరణల్లో వాణిజ్య సముదాయాలా..?
సాక్షి, అమరావతి: జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల ఆవరణల్లో వాణిజ్య సముదాయాల నిర్మాణాలను నిలిపివేస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. చిత్తూరు జిల్లా, బైరెడ్డిపల్లి పాఠశాల వద్ద రూ.50 లక్షలతో, వి.కోట పాఠశాల వద్ద రూ.25 లక్షల అంచనా వ్యయంతో వాణిజ్య సముదాయాలను నిర్మించాలని అధికారులు నిర్ణయించారని, ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని కోరుతూ విశ్రాంత ఉపాధ్యాయుడు నారాయణరెడ్డి సోమచంద్రరెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై న్యాయమూర్తి జస్టిస్ న్యాపతి విజయ్ శుక్రవారం విచారణ జరిపారు. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది కేజీ కృష్ణమూర్తి వాదనలు వినిపిస్తూ ఈ నిర్మాణాల వల్ల విద్యార్థుల చదువుపై ప్రతికూల ప్రభావం పడుతుందని వివరించారు. వాదనలు విన్న న్యాయమూర్తి నిర్మాణాలను చేపట్టవద్దని ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చారు. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు. తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేశారు. -
ఆ అధికారం పోలీసులకు లేదు
సాక్షి, అమరావతి: రాజకీయ పార్టీలు నిర్వహించే బహిరంగ సభలకు అనుమతిని నిరాకరించే అధికారం పోలీసులకు లేదని హైకోర్టు చెప్పింది. ఆ సభలను నియంత్రించే అధికారం మాత్రమే పోలీసులకు ఉందని స్పష్టం చేసింది. భారత యువజన చైతన్య పార్టీ (బీవైసీపీ) ఈ నెల 22న బీసీ సింహ గర్జన పేరుతో నిర్వహించతలపెట్టిన బహిరంగ సభకు పోలీసులు అనుమతి నిరాకరించడాన్ని తప్పుపట్టింది. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలను, సీబీఎస్ఈ పరీక్షలను సాకుగా చూపుతూ అనుమతి నిరాకరించడాన్ని ప్రశ్నింశ్నించింది. సభ నిర్వహించేది ఆదివారమని, ఆ రోజున అసెంబ్లీ సమావేశాలు గానీ, సీబీఎస్ఈ పరీక్షలు గానీ లేవని గుర్తు చేసింది. బహిరంగ సభకు అనుమతి విషయంలో గురువారం ఇరుపక్షాలు వాదనలు విన్న న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ యడవల్లి లక్ష్మణరావు ఈ అంశంపై తగిన ఉత్తర్వులు జారీ చేస్తామని తెలిపారు. పిటిషన్ దాఖలు చేసిన బీవైసీపీ పార్టీ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ తరఫున సీనియర్ న్యాయవాది వై.వి.రవిప్రసాద్ వాదనలు వినిపిస్తూ పోలీసులు అధికార పార్టీ నిర్వహించే సభల విషయంలో ఓ రకంగా, మిగిలిన పార్టీల విషయంలో మరోరకంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. రామచంద్ర యాదవ్పై పలు కేసులున్నాయని ప్రభుత్వ సహాయ న్యాయవాది అజయ్ పేర్కొనగా, ఆ కేసుల వివరాలను పరిశీలించిన న్యాయమూర్తి అవన్నీ వేర్వేరు అంశాలకు సంబంధించినవని, సభ అనుమతి షరతులను ఉల్లంఘించిన కారణంగా నమోదు చేసిన కేసులు కావని వ్యాఖ్యానించారు. -
ఉద్యోగ విరమణ వయసుపై వివక్ష ఎందుకు?
సాక్షి, అమరావతి: వ్యవసాయశాఖ పరిధిలోని డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన వర్సిటీ, శ్రీవేంకటేశ్వర వెటర్నరీ, ఏపీ ఫిషరీస్, ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ వర్సిటీల్లో పనిచేస్తూ యూజీసీ వేతనాలు పొందుతున్న ప్రొఫెసర్ల పదవీ విరమణ వయసు పెంపు విషయంలో ప్రభుత్వ వివక్షను హైకోర్టు ప్రశ్నించింది. ఉన్నత విద్యాశాఖ పరిధిలోని విశ్వవిద్యాలయాల్లో ప్రొఫెసర్ల పదవీ విరమణ వయసును 62 నుంచి 65 సంవత్సరాలకు పెంచిన రాష్ట్ర ప్రభుత్వం.. ఈ వర్సిటీల్లో ప్రొఫెసర్ల పదవీ విరమణ వయసును మాత్రం పెంచకపోవడాన్ని తీవ్రంగా ఆక్షేపించింది. ఎందుకు ఇలా వివక్ష చూపుతున్నారని ప్రశ్నించింది. ఉన్నత విద్యాశాఖ పరిధిలోని వర్సిటీల ప్రొఫెసర్లకు ఓ న్యాయం, మిగిలిన వర్సిటీల ప్రొఫెసర్లకు ఓ న్యాయమా? అంటూ నిలదీసింది. ఐఏఎస్ అధికారులకు పదవీ విరమణ చేసిన తరువాత కూడా పొడిగింపులు ఇస్తున్న ప్రభుత్వం.. అన్ని అర్హతలు ఉండి, యూజీసీ స్కేల్ తీసుకున్న ప్రొఫెసర్లకు మాత్రం పదవీ విరమణ వయసును ఎందుకు పెంచదని గట్టిగా ప్రశ్నించింది. పదవీ విరమణ వయస్సు పెంచాలని ఉద్యాన తదితర వర్సిటీలు సిఫార్సు చేస్తే, అలాంటి సిఫార్సులు ఏవీ రాలేదని ప్రభుత్వం చెప్పడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. అలాగే ఆర్థికశాఖ సైతం పదవీ విరమణ వయసు పెంపునకు అంగీకరించడం లేదని చెప్పడాన్ని కూడా ఆక్షేపించింది. కోర్టుకు తప్పుడు సమాచారం ఇవ్వొద్దంది. పదవీ విరమణ వయసు పెంపు విషయంలో వర్సిటీల సిఫార్సులను ఎందుకు తిరస్కరించారో, దీనివెనుక ఉన్న హేతుబద్ధత ఏమిటో స్వయంగా తమముందు హాజరై చెప్పాలని వ్యవసాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బుడితి రాజశేఖర్ను ఆదేశించింది. విచారణను ఈ నెల 23కి వాయిదా వేస్తూ.. న్యాయమూర్తులు జస్టిస్ బట్టు దేవానంద్, జస్టిస్ మండవ కిరణ్మయి ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీచేసింది.సింగిల్ జడ్జి తీర్పుపై అప్పీళ్లు..ఉన్నత విద్యాశాఖ నియంత్రణలోని వర్సిటీల్లో బోధన సిబ్బంది పదవీ విరమణ వయసును పెంచిన ప్రభుత్వం వ్యవసాయశాఖ పరిధిలోని వర్సిటీల్లో పనిచేస్తున్న తమ పదవీ విరమణ వయసు పెంచలేదని డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన, శ్రీవేంకటేశ్వర వెటర్నరీ, ఏపీ ఫిషరీస్, ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ వర్సిటీల్లో పనిచేస్తున్న పలువురు ప్రొఫెసర్లు, డీన్లు, శాఖాధిపతులు హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. విచారణ జరిపిన సింగిల్ జడ్జి ఆ పిటిషన్లను కొట్టేశారు. పదవీ విరమణ వయసు పెంపు విధానపరమైన నిర్ణయమని పేర్కొన్నారు. వ్యవసాయ శాఖ నియంత్రణలో పనిచేస్తున్న వర్సిటీల బోధన సిబ్బంది పదవీ విరమణ వయసు పెంపు విషయంలో నాలుగునెలల్లో నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు. తమ పిటిషన్లను కొట్టేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ పిటిషనర్లు ధర్మాసనం ముందు అప్పీళ్లు దాఖలు చేశారు. వీటిపై విచారణ జరుపుతున్న ధర్మాసనం తాజాగా సోమవారం మరోసారి విచారించింది. -
మూల్యాంకనంలో అక్రమాలపై సిట్ ఏర్పాటు చేయండి
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) గ్రూప్–1 ప్రధాన పరీక్ష జవాబు పత్రాల మూల్యాంకనం కేసులో హైకోర్టు బుధవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. మూల్యాంకనంలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో వాస్తవాలను నిగ్గు తేల్చేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. లేనిపక్షంలో ప్రస్తుతం ఉన్న సిట్ను పునర్వ్యవస్థీకరించాలని ఆదేశించింది. ఈ సిట్కు అదనపు డీజీ స్థాయికి తక్కువ కాని అధికారి నేతృత్వం వహించాల్సి ఉంటుందని తెలిపింది. ఈ సిట్లో ఎవరెవరు ఉంటారన్న వివరాలను మూడు రోజుల్లో హైకోర్టు రిజిస్ట్రార్ కు అందచేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఎంపికైన అభ్యర్థుల జవాబు పత్రాలు భద్రంగా ఉన్నాయా లేదా, వాటిని ఎవరైనా ట్యాంపరింగ్ చేశారా అనే విషయాలను క్షుణ్ణంగా పరిశీలించాలని సిట్ను ఆదేశించింది. అసలు ఓఎంఆర్ షీట్లు, విజయవాడలో ఫిజికల్ వాల్యుయేషన్ సమయంలో ఉపయోగించిన ఓఎంఆర్ షీట్లు, సమాధాన పత్రాలపై ఉన్న బార్ కోడ్లు, వాటినుంచి సేకరించిన వివరాలన్నీ ఒకేలా ఉన్నాయో లేదో సరిపోల్చాలని కూడా స్పష్టం చేసింది. ఎంపికైన అభ్యర్థుల సమాధాన పత్రాలను ఏవిధంగా తనిఖీ చేస్తారో, అదే రీతిలో ఎంపిక కాని అభ్యర్థుల సమాధాన పత్రాలను కూడా పరిశీలించాలని ఆదేశించింది. అలాగే మెరిట్ లిస్ట్లో చివరిగా ఎంపికైన అభ్యర్థి కంటే కింద ఉన్న 100 మంది అభ్యర్థుల జవాబు పత్రాలను కూడా పరిశీలించాలని సిట్ను హైకోర్టు ఆదేశించింది. పైన పేర్కొన్న నిర్దిష్ట అంశాలపైనే కాకుండా (బార్ కోడ్లు, ఓఎంఆర్ షీటు వంటివి), దర్యాప్తు సంస్థ ఇతర శాస్త్రీయ మార్గాల ద్వారా కూడా అక్రమాలను వెలికితీయవచ్చని కోర్టు స్పష్టం చేసింది. దర్యాప్తులో ఎలాంటి స్థానిక ప్రభావం లేకుండా ఉండటానికి, రాష్ట్రం వెలుపల ఉన్న ఏదైనా సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ నిపుణుల సహాయం తీసుకోవాలని కోర్టు ఆదేశించింది. ఇప్పటికే ఎంపికై ఉద్యోగాలు చేస్తున్న వారు తమ అధికార బలంతో విచారణను ప్రభావితం చేసే అవకాశం ఉందని ఎంపిక కాని అభ్యర్థులు అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో తక్షణమే వారందరినీ తదుపరి ఉత్తర్వులు జారీ చేసేంత వరకు నాన్–ఫోకల్ (ప్రాధాన్యత లేని) పోస్టులకు బదిలీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఓ వారంలో ఆ అధికారుల బదిలీలకు సంబంధించిన వివరాలతో ఓ నివేదికను రిజి్రస్టార్ జ్యుడీషియల్కు అందచేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. ఎంపిక కాని అభ్యర్థుల జవాబు పత్రాలను కూడా ఎంపికైన అభ్యర్థుల మాదిరిగానే విచారించాలని సిట్కు తేల్చి చెప్పింది. మార్చి 16 లోపు నివేదిక సమర్పించాలని సిట్ను ఆదేశించింది. అన్ని అప్పీళ్లపై మార్చి 16న తిరిగి విచారణ జరుపుతామంది. ఈ ఆదేశాల కాపీని ప్రత్యేక మెసెంజర్ ద్వారా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి అందచేయాలని రిజిస్ట్రీని ఆదేశించింది. ఈ వ్యాజ్యంలో సిట్ను ప్రతివాదిగా చేర్చాలని రిజిస్ట్రీకి స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ బట్టు దేవానంద్, జస్టిస్ అవధానం హరిహరనాథశర్మ ధర్మాసనం బుధవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. సింగిల్ జడ్జి తీర్పుపై అప్పీళ్ల నేపథ్యంలో గ్రూప్–1 ప్రధాన పరీక్ష జవాబు పత్రాల మూల్యాంకనంలో అక్రమాలు జరిగాయంటూ హైకోర్టులో పలు వ్యాజ్యాలు దాఖలయ్యాయి. ఈ వ్యాజ్యాలపై విచారణ జరిపిన సింగిల్ జడ్జి గ్రూప్–1 మెయిన్స్ పరీక్ష మొత్తాన్ని రద్దు చేశారు. అలాగే గ్రూప్–1 మెయిన్స్లో అర్హత సాధించిన వారి జాబితాను కూడా రద్దు చేశారు. తిరిగి గ్రూప్–1 మెయిన్స్ పరీక్ష నిర్వహించాలని, మొత్తం ప్రక్రియను 6 నెలల్లో పూర్తి చేయాలని ఏపీపీఎస్సీ అధికారులను ఆదేశించారు. ఈ తీర్పును సవాల్ చేస్తూ ఏపీపీఎస్సీ హైకోర్టు ధర్మాసనం ముందు అప్పీల్ దాఖలు చేసింది. మరోవైపు ఉద్యోగాలు పొంది ప్రస్తుతం వివిధ హోదాల్లో కొనసాగుతున్న వారు కూడా అప్పీళ్లు దాఖలు చేశారు. అలాగే వీరు పలు అభ్యర్థనలతో అనుబంధ పిటిషన్లు సైతం దాఖలు చేశారు. కాలేజీ ఎడ్యుకేషన్ కమిషనర్ను ప్రతివాదిగా చేయాలని, గ్రూప్–1 మూల్యాంకనంలో జరిగిన అక్రమాల మీద నమోదైన క్రిమినల్ కేసులో సిట్ దర్యాప్తు అధికారి ఫోరెన్సిక్ ఎగ్జామినేషన్ రిపోర్టును కోర్టు ముందు ఉంచేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ అనుబంధ పిటిషన్లు దాఖలు చేశారు. కోర్టు నియమించిన కమిటీ పరిశీలించిన ఆన్సర్ షీట్స్, కంట్రోల్ బండిల్స్ ఫోరెన్సిక్ ఎగ్జామినేషన్కి ఇవ్వాలన్న అభ్యర్థనలతో మరికొన్ని అనుబంధ పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై గతంలో వాదనలు విని తీర్పు రిజర్వ్ చేసిన న్యాయమూర్తి జస్టిస్ దేవానంద్ నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం తన నిర్ణయాన్ని వెలువరించింది. -
హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా బాలాజీ మెడమల్లి
సాక్షి, అమరావతి: హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా బాలాజీ మెడమల్లి నియమితులయ్యారు. ఈ నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదముద్ర వేశారు. దీంతో అదనపు న్యాయమూర్తిగా బాలాజీ నియామకాన్ని నోటిఫై చేస్తూ కేంద్ర న్యాయశాఖ సంయుక్త కార్యదర్శి జగన్నాథ్ శ్రీనివాసన్ మంగళవారం నోటిఫికేషన్ జారీ చేశారు. అదనపు న్యాయమూర్తిగా బాలాజీ రెండు మూడు రోజుల్లో ప్రమాణం చేసే అవకాశం ఉంది. హైకోర్టు న్యాయమూర్తి పోస్టుకు బాలాజీ పేరును సిఫారసు చేస్తూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం గత నెలలో తీర్మానం చేసిన విషయం తెలిసిందే. ఈ తీర్మానం కేంద్ర న్యాయశాఖ, ప్రధాన మంత్రి కార్యాలయం ద్వారా రాష్ట్రపతికి చేరింది. దీంతో బాలాజీ నియామకానికి రాష్ట్రపతి తాజాగా ఆమోద ముద్ర వేశారు. ఈ నియామకంతో హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 33కి చేరింది. ప్రస్తుతం హైకోర్టులో 32 మంది న్యాయమూర్తులుండగా, ఇందులో ఆరుగురు అదనపు న్యాయమూర్తులున్నారు. ఇదీ నేపథ్యం... బాలాజీ మెడమల్లి వైఎస్సార్ కడప జిల్లా, శేషన్నగారిపల్లికి చెందిన వ్యక్తి. లక్ష్మీనరసమ్మ, సుబ్బయ్యనాయుడు దంపతులకు 1972 మే 29న జన్మింంచారు. వీరిది వ్యవసాయ కుటుంబం. కుటుంబంలో బాలాజీనే మొదటితరం న్యాయవాది. రాజంపేటలో ప్రాథమిక విద్యను, తిరుపతి శ్రీవెంకటేశ్వర ఆర్ట్స్ కాలేజీలో డిగ్రీ పూర్తి చేశారు. హైదరాబాద్ పడాల రామిరెడ్డి లా కాలేజీలో న్యాయ విద్యను అభ్యసించారు. 1998లో హైకోర్టు న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. న్యాయవాది గూడపాటి వెంకటేశ్వరరావు వద్ద వృత్తి జీవితాన్ని ఆరంభించారు. గతంలో ఆయన ప్రభుత్వ సహాయ న్యాయవాదిగా వ్యవహరించారు. 2018–19 మధ్య కాలంలో విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కౌన్సిల్గా ఉన్నారు. పలు సంస్థలకు, బ్యాంకులకు స్టాండింగ్ కౌన్సిల్గా వ్యవహరిస్తున్నారు. బాలాజీకి భార్య కళ్యాణి, కుమారుడు సుచంద్రహాస్, కుమార్తె లక్ష్మీశ్వేత ఉన్నారు. -
DSCలో అక్రమ నియామకాలు.. ఏపీ హైకోర్టు ఆగ్రహం
సాక్షి,విజయవాడ: డీఎస్సీలో అక్రమ నియామకాలపై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. షెడ్యూల్డ్ ఏరియాలోని గిరిజనుల చేత పూరించవలసిన 3వేల అధ్యాపక పోస్టులను జనరల్లో పూరించడంపై సీరియస్ అయ్యింది.గిరిజన యువతీ యువకులకు అన్యాయం చేయడమే రాష్ట్రప్రభుత్వ ఉద్దేశమా అని హైకోర్టు ప్రశ్నించింది. అధికారులు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు. గిరిజన నిరుద్యోగులకు చెందాల్సిన పోస్టులను ఏ అధికారంతో డీఎస్పీలో కలిపారంటూ నిలదీసింది.ప్రభుత్వాలు చేస్తున్న తప్పుల వల్ల ప్రజలు ప్రజాస్వామ్యంపై నమ్మకం కోల్పోతున్నారు. గిరిజన ప్రాంతాల్లో ఎన్ని ఖాళీలున్నాయి. ఎంతమంది అభ్యర్థుల చేత ఖాళీలు పూరించబడ్డాయి. ఇంకా ఎన్నిపోస్టులు పూరించాలో ప్రమాణపత్రం దాఖలు చేయాలని.. ట్రైబల్ వెల్ఫేర్ కమిషనర్ను హైకోర్టు ఆదేశించింది.రాష్ట్ర ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్ల గిరిజన నిరుద్యోగులు తమ హక్కులు కోల్పోతున్నారన్న న్యాయస్థానం.. తదుపరి విచారణ రెండు వారాలకు వాయిదా వేసింది. -
ఒకే ఘటనపై ఎన్ని కేసులు పెడతారు
సాక్షి, అమరావతి: తిరుమల శ్రీవారి లడ్డూ తయారీలో వినియోగించిన నెయ్యిలో జంతు కొవ్వులు లేవని సీబీఐ–సిట్ చార్జిషిట్ దాఖలు చేసినా.. అధికార పార్టీ తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టే క్రమంలో చేసిన వ్యాఖ్యలకు గాను తనపై రాష్ట్రవ్యాప్తంగా వేర్వేరు పోలీస్ స్టేషన్లలో నమోదైన 33 కేసులను కొట్టేయాలని కోరుతూ మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత అంబటి రాంబాబు సోమవారం అత్యవసరంగా హైకోర్టును ఆశ్రయించారు. లంచ్ మోషన్ రూపంలో దాఖలు చేసిన ఈ వ్యాజ్యాలపై న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప విచారణ జరిపారు.ఒకే అంశంపై ఎన్ని ఎఫ్ఐఆర్లు దాఖలు చేస్తారని న్యాయమూర్తి ప్రశి్నంచారు. మొదటి ఫిర్యాదును ప్రధాన కేసుగా తీసుకుని మిగిలిన అన్ని ఫిర్యాదులను సీఆర్పీసీ సెక్షన్ 162 కింద వాంగ్మూలాలుగా ఎందుకు పరిగణించకూడదన్నారు. దీనిపై పోలీసులకు తగిన సూచనలు చేస్తామని పబ్లిక్ ప్రాసిక్యూటర్ మెండ లక్ష్మీనారాయణ తెలిపారు. ఈ విషయంపై తదుపరి విచారణ నాటికి స్పష్టత తీసుకోవాలని పీపీకి న్యాయమూర్తి స్పష్టం చేశారు. అంబటిపై రాష్ట్రవ్యాప్తంగా నమోదైన 33 కేసుల్లో చట్ట ప్రకారం నడుచుకోవాలని పోలీసులను న్యాయమూర్తి ఆదేశించారు.బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 35(3) కింద నోటీసులు జారీ చేసి ఆయన వివరణ తీసుకోవాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను మార్చి 2కి వాయిదా వేశారు. అంబటి తరఫున సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్రెడ్డి వాదనలు వినిపించారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా నమోదైన 35 కేసులు ఒకే అంశానికి సంబంధించినవని, దీనిపై బహుళ ఎఫ్ఐఆర్లు నమోదు చేయడానికి వీల్లేదని తెలిసినా పోలీసులు కేసులు నమోదు చేస్తూనే ఉన్నారని కోర్టుకు తెలిపారు. చట్ట ప్రకారం నడుచుకోండి గత ఏడాది జూన్లో వెన్నుపోటు దినం పేరుతో బైక్ ర్యాలీ నిర్వహించినందుకు అంబటి రాంబాబుపై నమోదైన కేసుల్లో బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 35(3) ప్రకారం నడుచుకోవాలని గుంటూరు, పట్టాభిపురం పోలీసులను హైకోర్టు ఆదేశించింది. ఆయనకు నోటీసులిచ్చి వివరణ తీసుకోవాలంది. అంబటిపై నమోదైన కేసులు ఏడేళ్ల కన్నా తక్కువ శిక్ష పడేవేనని, ఫిర్యాదుదారులకు నోటీసులివ్వాలని స్పష్టం చేసింది. తదుపరి విచారణను మార్చి 16కి వాయిదా వేస్తూ న్యాయమూర్తి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. -
ఏపీ హైకోర్టులో మాజీ మంత్రి అంబటి రాంబాబుకు ఊరట
సాక్షి,విజయవాడ: ఏపీ హైకోర్టులో మాజీ మంత్రి అంబటి రాంబాబుకు ఊరట లభించింది. పట్టాభిపురం, నగరం పాలెం పోలీసులు నమోదు చేసిన కేసులను క్వాష్ చేయాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అంబటి దాఖలు పిటిషన్పై విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా 35 (3) BNSS ప్రొసీజర్ ఫాలో కావాలని ఏపీ హైకోర్టు పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. -
ఆక్రమణదారులు పరిహారానికి అనర్హులు
సాక్షి, అమరావతి: చట్టబద్ధ యాజమాన్య పత్రాలు లేకుండా ప్రభుత్వ భూమిలో ఎన్ని దశాబ్దాలు ఉన్నా.. వారు ఆక్రమణదారులుగానే పరిగణించబడతారని హైకోర్టు స్పష్టం చేసింది. దీర్ఘకాలిక నివాసం ఆధారంగా భూ యజమాని హోదా రాదని తేల్చి చెప్పింది. ఆక్రమణదారులు 2013 భూసేకరణ చట్టం కింద ‘భూ యజమానులు‘ నిర్వచన పరిధిలోకి రారని, పరిహారానికి అర్హులు కాలేరని కుండబద్దలు కొట్టింది. భూమిపై లేదా ఆస్తిపై చెల్లుబాటయ్యే యాజమాన్య హక్కులు కలిగి ఉన్న వారు మాత్రమే 2013 భూ సేకరణ చట్టం కింద పరిహారానికి అర్హులని వివరించింది.పిటిషనర్లు కోరినట్టు భూసేకరణ చట్టం కింద పరిహారం చెల్లించాల్సిన అవసరం లేదని తెలిపింది. ఇప్పటికే ప్రభుత్వం వారికి ప్రత్యామ్నాయ గృహ వసతి కల్పించిన విషయాన్ని కోర్టు గుర్తు చేసింది. రైల్వే ఓవర్ బ్రిడ్జి కోసం తమ అధీనంలో ఉన్న భూములు తీసుకున్నందున తమకు పరిహారం చెల్లించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ పలువురు దాఖలు చేసిన పిటిషన్లను తోసిపుచ్చింది. అలాగే అధికారులపై వారు దాఖలు చేసిన కోర్టు ధిక్కార పిటిషన్లనూ కొట్టేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ నూనెపల్లి హరినాథ్ ఇటీవల తీర్పు వెలువరించారు.పూర్వీకుల కాలం నుంచి ఆ భూముల్లోనే ఉంటున్నాంతాము ఉంటున్న భూమిని ప్రభుత్వం రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం కోసం తీసుకుంటున్నందున తమకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లించాలని కోరుతూ విజయవాడలోని గుణదల ప్రాంతానికి చెందిన పలువురు 2020,21,22 సంవత్సరాల్లో రిట్ పిటిషన్లు దాఖలు చేశారు. ఈ భూమిలో తాము తమ పూర్వీకుల కాలం నుంచి నివసిస్తున్నామని పేర్కొన్నారు. క్రమం తప్పకుండా ఆస్తి పన్ను చెల్లిస్తున్నామని, విద్యుత్, మునిసిపల్ నీటి కనెక్షన్లు కూడా ఉన్నాయని వివరించారు. తాము భూమిలేని పేదలమని, అక్కడే షాపులు నడుపుకుంటూ జీవిస్తున్నామని, తమకు న్యాయం చేయాలని కోరారు.అయితే పిటిషనర్లు ఆక్రమించిన భూమి ప్రభుత్వ కాలువ, శ్మశాన వాటిక భూమిగా రికార్డుల్లో ఉందని అధికారులు హైకోర్టుకు నివేదించారు. పిటిషనర్ల వద్ద ఎటువంటి యాజమాన్య పత్రాలు లేవని, కేవలం పన్నులు కట్టినంత మాత్రాన యాజమాన్య హక్కులు రావని వివరించారు. అయినప్పటికీ, పిటిషనర్లతో పాటు ఇతర బాధితులకు మానవతా దృక్పథంతో ప్రత్యామ్నాయంగా 114 ఇళ్లు కేటాయించామని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు పిటిషనర్ల వాదనలను తోసిపుచ్చింది. వీరు 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం పొందలేరని స్పష్టంచేసింది.


