Andhra Pradesh High Court
-
సమాచారాన్ని సరిపోల్చుకోకుండా నివేదికలు వద్దు
సాక్షి, అమరావతి: న్యాయాధికారుల పనితీరు, సమర్థత, నిజాయితీ తదితరాల మదింపునకు సంబంధించిన వార్షిక రహస్య నివేదికల (ఏసీఆర్) తయారీ విషయంలో మరింత జాగరూకతతో వ్యవహరించాలని రిజిస్ట్రీని హైకోర్టు ఆదేశించింది. న్యాయాధికారులపై ఏసీఆర్ల రూపకల్పన విషయంలో కేవలం జిల్లా ప్రధాన జడ్జిలు ఇచ్చే సమాచారానికి మాత్రమే పరిమితం కాకుండా ఇతర మార్గాల్లో కూడా సమాచారాన్ని తెప్పించుకుని, రెండింటినీ సరిచూసుకోవాలని రిజిస్ట్రీకి స్పష్టం చేసింది. ఏసీఆర్లో ప్రతికూల అభిప్రాయాల నమోదు సందర్భంలో అత్యంత జాగరూకత అవసరమని, ఈ నమోదు ఏకపక్షంగా ఉండకూడదని ఉద్ఘాటించింది. ‘పలు కారణాల వల్ల అసంతృప్తితో ఉన్న ఉద్యోగులు, సహచరులు, కక్షిదారులు న్యాయాధికారుల నిజాయితీపై ఆరోపణలు చేస్తుంటారు. కొన్ని సందర్భాల్లో నచ్చని తీర్పునిచ్చారన్న కారణంతో న్యాయవాదులు, కక్షిదారులు నిజాయితీపరులైన న్యాయాధికారులను లక్ష్యంగా చేసుకుని తప్పుడు ఆరోపణలు చేసే అవకాశం కూడా ఉంటుంది. అలాంటి ఫిర్యాదులపై విచారణ విషయంతో పాటు నిజాయితీపరులైన న్యాయాధికారులను రక్షించే విషయంలో హైకోర్టు న్యాయమూర్తులు సమతుల్యత పాటిస్తున్నారు’ అని హైకోర్టు ఈ సందర్భంగా పేర్కొంది. అయితే తనకు సంబంధించిన వార్షిక రహస్య నివేదికలో పేర్కొన్న ప్రతికూల అభిప్రాయాలను తొలగించాలన్న తన వినతిని తిరస్కరిస్తూ హైకోర్టు రిజిస్ట్రార్ (విజిలెన్స్) 2013లో జారీ చేసిన ప్రొసీడింగ్స్ను సవాలు చేస్తూ విజయబాబు అనే న్యాయాధికారి దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టేసింది. విజయబాబు నిజాయితీ సందేహాస్పదమా? కాదా? అన్న విషయంపై న్యాయమూర్తులతో కూడిన రివ్యూ కమిటీ తీసుకున్న నిర్ణయానికి విరుద్ధంగా తాము తమ నిర్ణయాన్ని చెప్పలేమంది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ రఘునందన్రావు, జస్టిస్ తూటా చంద్ర ధనశేఖర్ ధర్మాసనం ఇటీవల తీర్పు వెలువరించింది. న్యాయాధికారి వ్యాజ్యం వివరాలు.. జూనియర్ సివిల్ జడ్జిగా ఎన్.విజయబాబు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్తో పాటు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్లో కూడా పలు చోట్ల పనిచేశారు. ఆయనకు సంబంధించిన 2009 వార్షిక నివేదికలో ప్రతికూల అభిప్రాయాలను పొందుపరిచారు. అయితే ఏ ప్రాతిపదికన తన ఏసీఆర్లో ప్రతికూల అభిప్రాయాలు పొందుపరిచారో చెప్పాలని హైకోర్టు రిజిస్ట్రార్ (విజిలెన్స్)కు వినతి పత్రం ఇచ్చారు. దీంతో రిజి్రస్టార్ ఏసీఆర్ తయారీ విషయంలో హైకోర్టు న్యాయమూర్తుల కమిటీ ముందుంచిన ఆధారాలను విజయబాబుకు అందచేశారు. నల్గొండ జిల్లాలో పనిచేసే సమయంలో అప్పటి జిల్లా జడ్జి ఇచ్చిన నివేదికతో పాటు అప్పటికి పెండింగ్లో ఉన్న రెండు శాఖాపరమైన విచారణలను ఆధారంగా చేసుకుని ఏసీఆర్లో ప్రతికూల అభిప్రాయాలను వ్యక్తం చేసినట్లు విజయబాబు గుర్తించారు. అటు తరువాత విజయబాబుపై ఉన్న ఆ రెండు శాఖాపరమైన విచారణలను హైకోర్టు 2012లో రద్దు చేసింది. ఈ నేపథ్యంలో విజయబాబు 2009 ఏసీఆర్లో పొందుపరిచిన ప్రతికూల అభిప్రాయాలను పునః సమీక్షించాలని కోరారు. ఈ అభ్యర్థనను రిజిస్ట్రార్ (విజిలెన్స్) 2013లో తిరస్కరించారు. దీంతో ఆయన అదే సంవత్సరం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విజయబాబు తరఫున న్యాయవాది వీఆర్ రెడ్డి కొవ్వూరి వాదనలు వినిపిస్తూ, విజయబాబుపై ఉన్న విచారణలను హైకోర్టు రద్దు చేసిన విషయాన్ని ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. -
భర్తతో ఉంటే అది అక్రమ నిర్బంధం కాదు
సాక్షి, అమరావతి: మేజర్ అయిన యువతి తన ఇష్టపూర్వకంగా ప్రేమ వివాహం చేసుకుని భర్తతో ఉండాలని నిర్ణయించుకున్నప్పుడు, అది అక్రమ నిర్బంధం కిందకు రాదని హైకోర్టు స్పష్టం చేసింది. అందువల్ల ఇలాంటి వ్యవహారాల్లో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేయడానికి వీల్లేదంది. బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్న తమ కుమార్తెను రోజూ వారి కూలీ అయిన ఆనందబాబు అనే వ్యక్తి అక్రమంగా నిర్బంధించారంటూ ఆమె తల్లిదండ్రులు దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్ రాయ్, జస్టిస్ గేదెల తుహిన్ కుమార్ ధర్మాసనం ఇటీవల తీర్పు వెలువరించింది. ఈ వ్యాజ్యంలో హైకోర్టు ఆదేశాల మేరకు పోలీసులు యువతిని ధర్మాసనం ముందు హాజరుపరిచారు. న్యాయమూర్తులు ఆమెతో మాట్లాడారు. ఆనందబాబును ప్రేమించానని, ఇద్దరం ఇష్టపూర్వకంగా పెళ్లి చేసుకున్నామని ఆమె వివరించారు. తనను ఆనందబాబు నిర్బంధించలేదని తెలిపారు.ఎవరితో కలిసి ఉండాలనుకుంటున్నావని ధర్మాసనం ప్రశ్నించగా తల్లిదండ్రులతో వెళ్లేందుకు ఆమె నిరాకరించారు. అయితే తమ కుమార్తెతో వ్యక్తిగతంగా మాట్లాడే అవకాశం ఇవ్వాలని పిటిషనర్లయిన ఆమె తల్లిదండ్రులు కోరగా ధర్మాసనం అందుకు అనుమతినిచ్చింది. అర్థగంట పాటు కోర్టుహాలు బయట కుమార్తెతో ఆమె తల్లిదండ్రులు మాట్లాడారు. అనంతరం కూడా ఆమె తాను ఆనందబాబుతోనే కలిసి ఉంటానని కోర్టుకు నివేదించారు. దీంతో ధర్మాసనం తల్లిదండ్రుల పిటిషన్కు విచారణార్హత లేదని కొట్టేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. -
మతం మారితే ఎస్సీ హోదా కోల్పోయినట్లే!
సాక్షి, న్యూఢిల్లీ: హిందూ, బౌద్ధం, సిక్కు మతాలు మినహా ఇతర మతాల్లోకి మారిన వ్యక్తులు తమ షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ) హోదాను తక్షణమే కోల్పోతారని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. క్రైస్తవ మతాన్ని స్వీకరించి, ఆచరిస్తున్న వ్యక్తులు దళిత హోదాను క్లెయిమ్ చేయలేరని, అలాగే తమకు రక్షణ కల్పించాలంటూ ‘ఎస్సీ, ఎస్టీ ఆకృత్యాల నిరోధక చట్టాన్ని’ (అట్రాసిటీ చట్టం) ఏమాత్రం ఆశ్రయించలేరని తేల్చిచెప్పింది. ఏపీలోని పిట్టలవానిపాలెం గ్రామంలో హిందూ మతం నుంచి క్రైస్తవంలోకి మారి పాస్టర్గా కొనసాగుతున్న చింతాడ ఆనంద్ అనే వ్యక్తి తనపై దాడి జరిగిందని ఆరోపిస్తూ పలువురిపై పెట్టిన అట్రాసిటీ కేసును కొట్టేస్తూ ఏపీ హైకోర్టు గతేడాది ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు తాజాగా సమర్థించింది. ఏపీ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ చింతాడ ఆనంద్ దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ ఎన్.వి. అంజారియాలతో కూడిన సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. కేవలం ఎస్సీ కుల ధ్రువీకరణ పత్రాన్ని అధికారులు రద్దు చేయనంత మాత్రాన.. మతం మారిన వాస్తవాన్ని విస్మరించలేమని, అతనికి ఎస్సీ, ఎస్టీ చట్టం కింద రక్షణ పొందే అర్హత రాదని తేల్చిచెప్పింది. 1950 నాటి రాజ్యాంగ (షెడ్యూల్డ్ కులాలు) ఉత్తర్వులను ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ఉదహరించింది. ‘ఈ కేసులో పిటిషనర్ తిరిగి తన మాతృ మతంలోకి (హిందూ) మారినట్లు గానీ, మాదిగ సామాజికవర్గం అతన్ని తిరిగి తమలోకి చేర్చుకున్నట్లు గానీ ఎటువంటి ఆధారాలు లేవు. పైగా అతను దశాబ్దానికిపైగా క్రైస్తవాన్ని ఆచరిస్తున్నాడు. పాస్టర్గా సేవలందిస్తూ గ్రామాల్లో ప్రతి ఆదివారం ప్రార్థనలు నిర్వహిస్తున్నాడు. దాడి జరిగినట్లు చెబుతున్న రోజున కూడా అతను ఇంట్లో ప్రార్థనలు నిర్వహించాడు. ఈ వాస్తవాలన్నీ ఘటన జరిగిన నాటికి అతను క్రైస్తవుడేనని నిస్సందేహంగా నిరూపిస్తున్నాయి’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. -
సుప్రీం కోర్టు సంచలన తీర్పు
ఢిల్లీ: మత మార్పిడిలపై సుప్రీం కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. మతం మారిన వ్యక్తి ఎస్సీ హక్కులు కోల్పోతాడని వ్యాఖ్యానించింది. ఈ మేరకు ఓ కేసులో ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్ధించింది.హిందూ, బౌద్ధ, సిక్కు మతాలు కాకుండా ఇతర మతంలోకి మారితే ఎస్సీ హోదా రద్దు అవుతుందని దేశ అత్యున్నత న్యాయస్థానం ద్విసభ్య ధర్మాసనం వ్యాఖ్యానించింది. మతం మార్చుకున్న వెంటనే ఎస్సీ హోదా రద్దు అవుతుందని స్పష్టం చేసింది. -
ఐదేళ్లకుపైగా పెండింగ్లో ఉన్న కేసులను పరిష్కరించాలి
శృంగవరపుకోట: కోర్టుల్లో ఐదేళ్లకుపైబడి పెండింగ్లో ఉన్న కేసులను సత్వరమే పరిష్కరించాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను దృష్టిలో ఉంచుకుని న్యాయమూర్తులు పని చేయాలని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్రాయ్, జస్టిస్ తర్లాడ రాజశేఖరరావు చెప్పారు. విజయనగరం జిల్లా ఎస్.కోటలో రూ.8.5 కోట్లతో నిరి్మంచనున్న సింగిల్ కోర్టు కాంప్లెక్స్ భవన శంకుస్థాపన కార్యక్రమంలో న్యాయమూర్తులు పాల్గొన్నారు. ముందుగా భవన నిర్మాణ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఎస్.కోట బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గోగాడ సూరిదేముడు నేతృత్వంలో నిర్వహించిన కార్యక్రమంలో న్యాయమూర్తి జస్టిస్ మానవేంద్రనాథ్రాయ్ మాట్లాడుతూ ఎస్.కోటలో కోర్టు భవనానికి శంకుస్థాపన చేయడం సంతోషంగా ఉందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కోర్టు భవనాలన్నీ ఒకేలా ఉండేలా డిజైన్ చేశారని, మరో పాతికేళ్ల తర్వాత అవసరాలకు తగ్గట్టుగా కోర్టు భవనాల నిర్మాణం చేస్తున్నట్టు చెప్పారు. కోర్టు బెంచ్–బార్ సమన్వయంతో కలిసి పనిచేస్తేనే నాణ్యమైన మంచి తీర్పులు వస్తాయన్నారు. కొన్ని సివిల్ తగాదాలు 40 ఏళ్లుగా పెండింగ్లో ఉన్నట్టు గమనించామని, జ్యుడీషియల్ వ్యవస్థపై కోర్టులకు వెళ్తే తరాలు మారినా న్యాయం జరగదని, ఫలితం రాదన్న అపవాదు ఉందని, దాన్ని దూరం చేసేందుకు ప్రతి ఒక్కరూ పని చేయాలని సూచించారు. మెగా లోక్ అదాలత్లో తొలి విడతలో 3 లక్షలు, రెండవ విడతలో 3 లక్షలకుపైగా కేసులు పరిష్కారమయ్యాయని, ఈ విషయంలో గుంటూరు జిల్లా మొదటి స్థానంలో నిలిచిందని చెప్పారు. న్యాయమూర్తి జస్టిస్ మానవేంద్రనాథ్రాయ్ కృషితో నిధులు రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి, జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జి జస్టిస్ టి.రాజశేఖరరావు మాట్లాడుతూ కేసుల జడ్జిమెంట్ సరిగా లేకుంటే మళ్లీ కేసులు పడే ఆస్కారం ఉందని పేర్కొన్నారు. ఎస్.కోట కోర్టు భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయించిన న్యాయమూర్తి జస్టిస్ మానవేంద్రనాథ్రాయ్ క్రెడిట్ని తన ఖాతాలో వేశారని పేర్కొన్నారు. తనకు జస్టిస్ మానవేంద్రనాథ్రాయ్ మంచి స్నేహితుడు, మార్గదర్శకులు అని చెప్పారు. జిల్లా న్యాయమూర్తి బి.బబిత, గుంటూరు జిల్లా న్యాయమూర్తి సాయికళ్యాణ్ చక్రవర్తి, కలెక్టర్ రాంసుందర్రెడ్డి, విజయనగరం ఎస్పీ ఎ.ఆర్.దామోదర్, పార్వతీపురం మన్యం జిల్లాల ఎస్పీ మాధవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
తీరు మారుస్తూ.. సుప్రీం ‘తీర్పు’!
సాక్షి, అమరావతి: న్యాయాన్ని అందించడంలో జాప్యం జరిగితే.. అది న్యాయాన్ని తిరస్కరించడమే..!న్యాయం చేయడమే కాదు.. చేసినట్లు కూడా కనిపించాలి..!ఇవి న్యాయ వ్యవస్థలో రూఢీ అయిన సూత్రాలు. అయితే కక్షిదారులకు న్యాయం అందించే విషయంలో దేశంలోని హైకోర్టుల్లో పరిస్థితులు భిన్నంగా ఉండటంపై స్వయంగా సుప్రీంకోర్టు రంగంలోకి దిగింది. హైకోర్టుల్లో వాదనలు విని తీర్పును రిజర్వ్ చేసిన నాటి నుంచి తీర్పు వెలువరించేంత వరకు జరుగుతున్న అసాధారణ జాప్యాన్ని నివారించేందుకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా తీర్పులను వెలువరించేందుకు నిర్దిష్ట గడువు నిర్దేశిస్తూ ఇటీవల కీలక ఆదేశాలు ఇచ్చిన సుప్రీంకోర్టు తాజాగా దేశంలోని అన్ని హైకోర్టులకు అత్యంత కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇకపై ఏదైనా కేసులో వాదనలు విన్న తరువాత ఆ కేసులో తీర్పును ఎప్పుడు రిజర్వ్ చేశారు..? ఆ తరువాత తీర్పును ఎప్పుడు వెలువరించారు..? ఆ తీర్పు కాపీని ఎప్పుడు వెబ్సైట్లో అప్లోడ్ చేశారు..? అనే వివరాలను తేదీలతో సహా తీర్పు కాపీపై స్పష్టంగా ముద్రించాలని అన్ని హైకోర్టులను సుప్రీంకోర్టు ఆదేశించింది. తద్వారా ఆ కేసులో ఎప్పుడు ఏం జరిగిందని అందరూ తెలుసుకునే అవకాశం ఉంటుంది. అలాగే తీర్పులు వెలువరించే విషయంలో వేగం కూడా పెరగనుంది.విప్లవాత్మక సంస్కరణ అంటున్న న్యాయ నిపుణులు..సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ కీలక ఆదేశాలను న్యాయవ్యవస్థలో విప్లవాత్మక సంస్కరణగా న్యాయ నిపుణులు అభివర్ణిస్తున్నారు. దీనివల్ల న్యాయవ్యవస్థలో పారదర్శకత, తీర్పులు ఇచ్చే విషయంలో జవాబుదారీతనం పెరుగుతుందని పేర్కొంటున్నారు. సుప్రీంకోర్టు తాజా ఆదేశాల నేపథ్యంలో ఇకపై సుదీర్ఘ కాలం పాటు తీర్పు వెలువరించకుండా ఉండేందుకు అవకాశం ఉండదు. ఒకవేళ అలా సుదీర్ఘ కాలం పాటు తీర్పు వెలువరించకుంటే.. చివరకు తీర్పు వెలువరించిన సమయంలో ఆ వివరాలను అందులో ప్రస్తావించాల్సి ఉంటుంది. దీంతో జాప్యంపై ఎవరో ఒకరు ప్రశ్నించే అవకాశం ఉంటుంది. వాస్తవానికి తీర్పు వెలువరించే విషయంలో న్యాయమూర్తులకు చట్టపరంగా నిర్దిష్ట గడువంటూ ఏదీ లేదు. అయితే తీర్పు రిజర్వ్ చేసిన తర్వాత ఆరు నెలల్లోపు తీర్పు వెలువడటం ఓ సంప్రదాయంగా వస్తోంది. వాస్తవానికి 2001లో అనిల్రాయ్ కేసులో సుప్రీంకోర్టు చాలా స్పష్టమైన తీర్పునిచ్చింది. తీర్పు రిజర్వ్ చేసిన తేదీ నుంచి మూడు నెలల్లో తీర్పు వెలువరించాలని ఆ తీర్పులో సుప్రీంకోర్టు అన్నీ హైకోర్టులను ఆదేశించింది.ఇప్పటికే గడువు నిర్దేశించిన సుప్రీంకోర్టు...అలాగే కొన్ని హైకోర్టుల్లో తీర్పులు వెలువరించిన తరువాత అవి అందుబాటులోకి రావడంలో అసాధారణ జాప్యం జరుగుతోంది. కొన్నిసార్లు తీర్పు కాపీలు బయటకు వచ్చేందుకు నెలల సమయం కూడా పడుతోంది. దీంతో కక్షిదారులు తీవ్రంగా నష్టపోతున్నారు. తీర్పు కాపీ అందుబాటులోకి రాకపోవడంతో సానుకూల ఉత్తర్వులు పొందినప్పటికీ ప్రయోజనం ఉండటం లేదు. ఈ నేపథ్యంలో తీర్పులు వెలువరించే విషయంలో నిర్దిష్ట గడువు నిర్దేశిస్తూ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ కరోల్ నేతృత్వంలోని ధర్మాసనం ఇటీవల ఓ తీర్పునిచ్చింది.ఏదైనా కేసులో తీర్పు రిజర్వ్ చేసిన తరువాత 3 నెలల్లోపు తీర్పు వెలువరించకుంటే ఈ విషయాన్ని సంబంధిత హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్.. ప్రధాన న్యాయమూర్తి (సీజే) దృష్టికి తేవాలని ఆదేశించింది. అనంతరం సీజే.. ఆ విషయాన్ని సదరు న్యాయమూర్తి, ధర్మాసనం దృష్టికి తెచ్చి రెండు వారాల్లో తీర్పునివ్వాల్సిందిగా కోరాలని సూచించింది. ఆ రెండు వారాల్లో కూడా తీర్పు వెలువరించకుంటే, ప్రధాన న్యాయమూర్తి ఆ కేసును మరో న్యాయమూర్తికి, ధర్మాసనానికి నివేదించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. గడువు లోపు తీర్పు వెలువరించకుంటే సంబంధిత హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఏం చేయాలి, కక్షిదారులు ఏం చేయాలన్న దానిని ధర్మాసనం తన తీర్పులో స్పష్టంగా పేర్కొంది.సుప్రీం.. తీవ్ర విస్మయం తమకు కింది కోర్టు విధించిన శిక్షను సవాలు చేస్తూ దాఖలు చేసిన అప్పీళ్లపై తీర్పును రిజర్వ్ చేసిన జార్ఖండ్ హైకోర్టు రెండు మూడేళ్లుగా తీర్పు వెలువరించలేదంటూ కొందరు ఖైదీలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, న్యాయమూర్తి జస్టిస్ జోయ్మాల్య బాగ్చీ ధర్మాసనం విచారణ జరిపింది. తీర్పు రిజర్వు చేసి రెండేళ్లయినా కూడా తీర్పు వెలువరించకపోవడంపై ధర్మాసనం తీవ్ర విస్మయాన్ని వ్యక్తం చేస్తూ దేశంలోని అన్ని హైకోర్టుల నుంచి నివేదికలు కోరింది. తీర్పులు వెలువరించడంలో జాప్యం చేయడం కక్షిదారుల హక్కులను హరించడమేనని అభిప్రాయపడ్డ ధర్మాసనం.. హైకోర్టులకు తగిన దిశా నిర్దేశం చేయాలని నిర్ణయించింది. తమ ముందున్న కేసుల్లో తీర్పులు వెలువరించేందుకు ఎంత కాలం పడుతుందో ప్రజలందరికీ తెలియచేసేందుకు వీలుగా ఆ వివరాలను తీర్పు కాపీలో స్పష్టంగా పేర్కొనాలని అన్ని హైకోర్టులను ఆదేశించింది. న్యాయవ్యవస్థలో పారదర్శకత, సంస్కరణలు కేవలం కాగితాలకే మాత్రమే పరిమితం కాకూడదని, ప్రజలు న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉంచేలా ఆ సంస్కరణలు ఉండాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.సుప్రీం ఆదేశాల అమలుకు రాష్ట్ర హైకోర్టు శ్రీకారం..సుప్రీంకోర్టు ఆదేశాల అమలుకు ఏపీ హైకోర్టు చర్యలు చేపట్టింది. ప్రతి తీర్పు సర్టిఫైడ్ కాపీతో పాటు అప్లోడ్ చేసిన కాపీలోనూ తీర్పును ఎప్పుడు రిజర్వ్ చేశారు.. ఎప్పుడు తీర్పు వెలువరించారు.. ఎప్పుడు ఆ తీర్పును అప్లోడ్ చేశారు.. లాంటి వివరాలను తీర్పు మొదటి పేజీలో స్పష్టంగా పేర్కొనాలని హైకోర్టు రిజిస్ట్రీ ఆదేశించింది. అందుకు అనుగుణంగా న్యాయమూర్తుల కోర్టు మాస్టర్లు, పర్సనల్ సెక్రటరీలు చర్యలు చేపట్టారు. దీంతో తీర్పులు సకాలంలో అప్లోడ్ అవుతూ కక్షిదారులకు అందుబాటులోకి వస్తున్నాయి.ఆ వివరాలన్నీ ప్రజలకు తెలియాల్సిన అవసరముంది..‘ఏ న్యాయమూర్తి ఎప్పుడు తీర్పు రిజర్వ్ చేశారు? ఎంత కాలం తర్వాత తీర్పు ఇచ్చారు? ఆ తీర్పు కక్షిదారులకు ఎప్పుడు అందుబాటులోకి వచ్చింది? తీర్పులను వెబ్సైట్లలో అప్లోడ్ చేయడానికి హైకోర్టులు ఎంత సమయం తీసుకుంటున్నాయి? లాంటి వివరాలన్నీ ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది’ అని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ స్పష్టంగా పేర్కొన్నారు. తీర్పుల రిజర్వ్, తీర్పు వెలువడిన తేదీలను మాత్రమే చూపే ఒక ప్రత్యేక డాష్బోర్డ్ హైకోర్టు వెబ్సైట్లలో ఉండాలని జస్టిస్ బాగ్చీ అభిప్రాయపడ్డారు.ఏడాదికి కూడా వెలువడని తీర్పులుఅయితే ఈ ఆదేశాలు పలు హైకోర్టుల్లో అమలు కావడం లేదు. వాదనలు విని తీర్పు రిజర్వ్ చేసిన తరువాత ఏడాదికి కూడా తీర్పులు వెలువరించని పలు ఉదంతాలు ఇటీవల సుప్రీంకోర్టు దృష్టికి వచ్చాయి. కొన్ని హైకోర్టులు తీర్పు రిజర్వ్ చేసిన రెండేళ్లకు కూడా తీర్పులు వెలువరించకపోవడంపై తీవ్ర విస్మయం వ్యక్తం చేసింది. దీనిపై ఇటీవల దేశవ్యాప్తంగా పెద్ద చర్చ కూడా జరిగింది. తీర్పులు వెలువరించడంలో అసాధారణ జాప్యం చేసినందుకు కొందరు న్యాయమూర్తులను సైతం సుప్రీంకోర్టు బదిలీ చేసింది. దక్షిణాదిలోని ఓ హైకోర్టులో న్యాయమూర్తి ఒకరు దాదాపు 700 కేసుల్లో ఏడాదికి కూడా తీర్పులు వెలువరించని కారణంతో సుప్రీంకోర్టు ఆయన్ను బదిలీ చేసింది. సకాలంలో తీర్పులు వెలువరించాలన్న విషయంలో సుప్రీంకోర్టు వైఖరి చాలా స్పష్టంగా ఉంది. -
అంతర్జాతీయ మార్కెట్లో.. ఎల్పీజీని అమ్మడానికి వీల్లేదు
సాక్షి, అమరావతి: పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా దేశవ్యాప్తంగా వంట గ్యాస్ కొరత ఏర్పడిన నేపథ్యంలో హైకోర్టు కీలక ఆదేశాలు జారీచేసింది. చమురు శుద్ధి సంస్థలు ఎల్పీజీని అంతర్జాతీయ మార్కెట్లో విక్రయించడానికి వీల్లేదని తేల్చిచెప్పింది. ఈ మేరకు కాని్ఫడెన్స్ పెట్రోలియం ఇండియా లిమిటెడ్కు ఆదేశాలు జారీచేసింది. దేశంలో ఎల్పీజీ కొరత ఉన్న సమయంలో చమురు శుద్ధి సంస్థలు అంతర్జాతీయ మార్కెట్లో విక్రయిస్తే సామాన్య ప్రజలకు తీరని నష్టంతో పాటు కష్టాలను కలిగిస్తుందని కోర్టు స్పష్టంచేసింది. వినియోగదారులకు వంట గ్యాస్ సరఫరా చేసేందుకు వీలుగా గ్యాస్ను పంపిణీదారులకు మాత్రమే సరఫరా చేయాలని ఆదేశించింది. దేశంలోని చమురు శుద్ధి కర్మాగారాలు ప్రొపేన్, బ్యూటేన్ నిల్వలను గరిష్టంగా ఎల్పీజీ ఉత్పత్తి కోసం ఉపయోగించడంతో పాటు ఉత్పత్తి చేసిన ఎల్పీజీని ప్రభుత్వ రంగ సంస్థలైన ఐఓసీఎల్, హెచ్పీసీఎల్, బీపీసీఎల్లకు అందుబాటులో ఉంచి, దానిని కేవలం దేశీయ వినియోగదారులకు మాత్రమే సరఫరా చేయాలంటూ ఈనెల 5న జారీచేసిన స్వీయ ఉత్తర్వులు పక్కాగా అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ వ్యవహారంలో కౌంటర్లు దాఖలు చేయాలని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ, కాన్ఫిడెన్స్ పెట్రోలియం ఇండియా లిమిటెడ్లను ఆదేశించింది. ఇందులో భాగంగా వారికి నోటీసులు జారీచేసింది. తదుపరి విచారణను ఏప్రిల్ 2కు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ ఇటీవల మధ్యంతర ఉత్తర్వులు జారీచేశారు. కొరత వేళ అంతర్జాతీయ మార్కెట్లో భారీ ధరకు విక్రయం.. యుద్ధం వేళ దేశవ్యాప్తంగా వంట గ్యాస్కు తీవ్ర కొరత ఏర్పడిందని, అయితే కాన్ఫిడెన్స్ పెట్రోలియం ఇండియా లిమిటెడ్ ఈ పరిస్థితి ద్వారా వ్యక్తిగత లబ్ధిపొందేందుకు గ్యాస్ను భారీ ధరకు అంతర్జాతీయ మార్కెట్లో విక్రయిస్తోందని, దీనిని అడ్డుకునేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ విజయవాడలోని మేధా హిమజ శ్రీ ఎంటర్ప్రైజెస్ యజమాని నల్లమోతు దుర్జయ్, నిహాన్‡్ష గ్యాస్ ఏజెన్సీ యజమాని పారా శ్రీలక్ష్మి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై జస్టిస్ దేవానంద్ విచారణ జరిపారు.కేంద్రం ఉత్తర్వులను పట్టించుకోవడంలేదు.. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది ఓబిరెడ్డి మనోహర్రెడ్డి వాదనలు వినిపించారు. పిటిషనర్లు కాన్ఫిడెన్స్ పెట్రోలియం ఇండియా లిమిటెడ్ నుంచి గ్యాస్ కొనుగోలు చేసి దానిని వినియోగదారులకు సరఫరా చేస్తుంటారని తెలిపారు. అయితే, పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఎల్పీజీ సరఫరాలో కొరత ఏర్పడిందన్నారు. యుద్ధంవల్ల అంతర్జాతీయ, దేశీయ మార్కెట్లలో ఎల్పీజీ డిమాండ్కు, సరఫరాకు మధ్య భారీ వ్యత్యాసం ఉందన్నారు. దేశంలోని చమురు శుద్ధి కర్మాగారాలు ప్రొపేన్, బ్యూటేన్ నిల్వలను గరిష్టంగా ఎల్పీజీ ఉత్పత్తి కోసం ఉపయోగించడంతో పాటు ఉత్పత్తి చేసిన ఎల్పీజీని ప్రభుత్వ రంగ సంస్థలైన ఐఓసీఎల్, హెచ్పీసీఎల్, బీపీసీఎల్లకు అందుబాటులో ఉంచి, దానిని కేవలం దేశీయ వినియోగదారులకు మాత్రమే సరఫరా చేయాలంటూ కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ ఈనెల 5న ఉత్తర్వులు జారీచేసిందని ఆయన న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. గ్యాస్ కొరత ఉన్నప్పటికీ, కాన్ఫిడెన్స్ పెట్రోలియం ఇండియా లిమిటెడ్ మాత్రం గ్యాస్ను అంతర్జాతీయ మార్కెట్లో అధిక ధరలకు విక్రయిస్తోందని వివరించారు. కేంద్ర ప్రభుత్వం ఆదేశాలను ఏ మాత్రం పట్టించుకోవడంలేదని కోర్టుకు నివేదించారు. -
ఆదేశాలిచ్చి నెలైనా నివేదిక సమర్పించరా?
సాక్షి, అమరావతి: గ్రూప్–1 ప్రధాన పరీక్ష పత్రాల మూల్యాంకనంలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై దర్యాప్తు చేసి నివేదిక సమర్పించేందుకు 6 నెలల సమయం పడుతుందన్న సిట్పై హైకోర్టు తీవ్రస్థాయిలో మండిపడింది. దర్యాప్తు ఏ అంశాలపై చేయాలన్న దానిపై ఇప్పటికే తాము తమ ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొన్నామని, ఆ ఉత్తర్వులను సక్రమంగా అర్థం చేసుకోకుండా దర్యాప్తు నివేదిక సమర్పించేందుకు ఆరు నెలల సమయం కోరడమేమిటంటూ సిట్కు నేతృత్వం వహిస్తున్న సీఐడీ అదనపు డీజీ రవిశంకర్ అయ్యన్నార్ను నిలదీసింది. సిట్ ఏర్పాటుతో పాటు దర్యాప్తునకు తాము ఆదేశాలు జారీ చేసి నెలరోజులు పూర్తయిందని గుర్తు చేసింది. అయినా కూడా ఇప్పటికీ దర్యాప్తు విషయంలో ఏమీ చేయలేదని అసహనం వ్యక్తం చేసింది. తమ ఆదేశాలను అమలు చేయకుండా ఏవేవో చెబుతున్నారంది. ఫోరెన్సిక్ ల్యాబ్కు 300 మంది అభ్యర్థుల జవాబు పత్రాలను పంపితే సరిపోతుందని పేర్కొంది. అయితే సిట్ మాత్రం లక్షన్నర డాక్యుమెంట్లను జిరాక్స్ తీస్తున్నట్లు చెబుతోందని, ఇన్ని డాక్యుమెంట్లు ఎందుకు అవసరమో తమకు అర్థం కావడం లేదంది.దర్యాప్తు విషయంలో తమ ఆదేశాల మేరకు ఇప్పటి వరకు ఏం చర్యలు తీసుకున్నారో తెలియచేయాలని సిట్ను ఆదేశించింది. అలాగే దర్యాప్తు పూర్తి చేసి నివేదిక ఇచ్చేందుకు ఎంత కాలం పడుతుంది.. అందుకు గల కారణాలు ఏమిటో కూడా చెప్పాలని ఆదేశించింది. ఈ వివరాలతో ఓ అఫిడవిట్ను తమ ముందుంచాలంది. అలాగే 1998 గ్రూప్ 1 పరీక్షలో ఉత్తీర్ణులైన వారిని నాన్ ఫోకల్ పోస్టులకు బదిలీ చేయాలన్న ఆదేశాలను ప్రభుత్వం పూర్తిస్థాయిలో అమలు చేయలేదని తేల్చి చెప్పింది. నాన్ ఫోకల్ పోస్టులకు బదిలీ చేయకుండా వారిని ఊరికే కూర్చోబెట్టి ప్రజాధనాన్ని జీతభత్యాలుగా చెల్లిస్తున్నారని ఆక్షేపించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీని కోర్టుకు పిలిపిస్తే తప్ప తమ ఆదేశాలు పూర్తిస్థాయిలో అమలయ్యే పరిస్థితి కనిపించడం లేదంది. తదుపరి విచారణను ఈ నెల 30కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ బట్టు దేవానంద్, జస్టిస్ అవధానం హరిహరనాథ శర్మ ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.కోర్టు ముందు హాజరైన రవిశంకర్ అయ్యన్నార్...ఈ సందర్భంగా సిట్ తరఫు న్యాయవాది పాణిని సోమయాజీ స్పందిస్తూ, దర్యాప్తు నివేదిక సమరి్పంచేందుకు గడువు కావాలని కోరారు. ఎందుకు గడువు కావాలన్న దానిపై సోమయాజీ స్పష్టతనివ్వకపోవడంతో సిట్కు నేతృత్వం వహిస్తున్న రవిశంకర్ అయ్యన్నార్ను ఆన్లైన్లో హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. దీంతో రవిశంకర్ అయ్యన్నార్ ధర్మాసనం ముందు ఆన్లైన్లో హాజరయ్యారు. దర్యాప్తు నివేదిక సమర్పణకు ఆరు నెలల సమయం కావాలని కోరారు. డిజిటల్ మూల్యాంకనం విధానంలో ఉన్న సమాధాన పత్రాలను భౌతిక రూపంలోకి తీసుకొచి్చ, వాటిని జిరాక్స్ తీసి ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపాల్సి ఉందన్నారు. దాదాపు లక్షన్నర డాక్యుమెంట్లను జిరాక్స్ తీస్తున్నామని తెలిపారు. వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపిన తరువాత అక్కడి నిపుణులు ప్రతీ పేజీని క్షుణ్ణంగా పరిశీలించి ఆ తరువాతనే నివేదిక ఇస్తారని, దాని ఆధారంగా తాము నివేదికను సిద్ధం చేస్తామని చెప్పారు. ఈ ప్రక్రియ మొత్తం పూర్తి కావడానికి కొన్ని నెలల సమయం పడుతుందని ఫోరెన్సిక్ ల్యాబ్ అధికారులు చెప్పారని వివరించారు. దీనిపై ధర్మాసనం తీవ్ర అసహనం, అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఎందుకు అంత సమయం కావాలో కారణాలను వివరిస్తూ అఫిడవిట్ దాఖలు చేయాలని ఆయన్ను ధర్మాసనం ఆదేశించింది. -
ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ లిసా గిల్ ప్రమాణ స్వీకారం
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు: హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్ ప్రమాణ స్వీకారం చేశారు. శుక్రవారం ఏపీ హైకోర్టు ప్రాంగణంలో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. జస్టిస్ లీసా గిల్ చేత హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఆయన సమక్షంలో నూతన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్ బాధ్యతలు స్వీకరించారు.ఈ ప్రమాణ స్వీకార మహోత్సవానికి హైకోర్టు న్యాయమూర్తులు, బార్ కౌన్సిల్ సభ్యులు, న్యాయవాదులు, హైకోర్టు సిబ్బంది హాజరయ్యారు. నూతన న్యాయమూర్తి బాధ్యతలు చేపట్టడం పట్ల హైకోర్టు వర్గాలు, న్యాయవాదులు, సిబ్బంది జస్టిస్ లీసా గిల్కు శుభాకాంక్షలు తెలిపారు. కొత్త బాధ్యతల్లో ఆమె విజయవంతం కావాలని ఆకాంక్షించారు. సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు ఏపీ హైకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్ను సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. ప్రస్తుత సీజే జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ త్వరలోనే రిటైర్ అవ్వనున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి రిటైర్ అవ్వడానికి రెండు నెలల ముందే తదుపరి సీజేను ఖరారు చేయాలని కొలీజియం నిర్ణయించింది. జస్టిస్ లీసా గిల్ 2014 నుంచి చండీగఢ్ హైకోర్టులో న్యాయమూర్తిగా పనిచేశారు. -
IPS సునీల్ నాయక్ ను అరెస్ట్ చేయొద్దు
-
మచిలీపట్నం పోలీసులకు ఎదురుదెబ్బ
సాక్షి, విజయవాడ: మచిలీపట్నం పోలీసులకు ఏపీ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఇదే సమయంలో మాజీ మంత్రి పేర్ని నాని సతీమణి జయసుధకు ఏపీ హైకోర్టులో ఉపశమనం దక్కింది. కోర్టు షరతులను జయసుధ ఉల్లంఘించలేదని పోలీసులకు హైకోర్టు గుర్తు చేస్తూ ఆగ్రహం వ్యక్తం చేసింది.అయితే, మాజీ మంత్రి పేర్ని నాని సతీమణి జయసుధ బెయిల్ రద్దు చేయాలని మచిలీపట్నం పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా కోర్టు షరతులు ఉల్లంఘించారంటూ పోలీసులు పిటిషన్లో పేర్కొన్నారు. అనంతరం, ఏపీ కోర్టు.. పోలీసుల పిటిషన్ను తోసిపుచ్చింది. కోర్టు షరతులను జయసుధ ఉల్లంఘించలేదని గుర్తు చేసింది. ఈ క్రమంలో జయసుధ ముందస్తు బెయిల్ను రద్దు చేసేందుకు హైకోర్టు అంగీకరించలేదు. అయితే, రేషన్ బియ్యం అక్రమ కేసులో జయసుధకు ఇప్పటికే మచిలీపట్నం కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. -
‘ఇన్నర్’ను సీఐడీ నుంచి సీబీఐకి బదలాయించాలి
సాక్షి, అమరావతి: ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు , మంత్రులు లోకేశ్, పొంగూరు నారాయణ తదితరులు నిందితులుగా ఉన్న ఇన్నర్ రింగ్ రోడ్డు (ఐఆర్ఆర్) కుంభకోణం కేసును సీఐడీ నుంచి సీబీఐకి బదలాయించాలని సోమవారం హైకోర్టుకు న్యాయవాది జడా శ్రవణ్ కుమార్ విన్నవించారు. కేసులో అప్పుడు నిందితునిగా ఉన్న చంద్రబాబు ఇప్పుడు ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారని, ఈ నేపథ్యంలో సీఐడీ అధికారులు ముఖ్యమంత్రికి కొమ్ముకాస్తున్నారని ఆయన పేర్కొన్నారు. కేసు మూసివేతకు ఏకంగా ఏసీబీ కోర్టులో రెఫర్డ్ చార్జిïÙట్ దాఖలు చేసిందన్నారు. అయితే ఈ వ్యాజ్యం విచారణార్హతపై సీఐడీ తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ అభ్యంతరం వ్యక్తంచేసిన నేపథ్యంలో ఈ అంశంపై తదుపరి వాదనలు వింటామని హైకోర్టు పేర్కొంది. ఈ మేరకు తదుపరి విచారణను న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప ఈ నెల 16వ తేదీకి వాయిదా వేశారు. అంతకు ముందు ఆళ్ల రామకృష్ణారెడ్డి తరఫు న్యాయవాది శ్రవణ్ కుమార్ హైకోర్టులో చేసిన వాదనల్లో ముఖ్యాంశాలు.. n 2014–19 మధ్య చంద్రబాబు ముఖ్యమంత్రిగా, లోకేశ్, నారాయణ మంత్రులుగా ఉన్న సమయంలో ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్, మాస్టర్ ప్లాన్లో అక్రమాలు జరిగాయి. n దీనిపై సీఐడీ కేసు నమోదు చేసి పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసింది. ఐదు వేల పేజీలకు పైగా ఆధారాలను సేకరించింది. ఆ మేరకు ఏసీబీ కోర్టులో చార్జిïÙట్ కూడా దాఖలు చేసింది. n సాంకేతిక కారణాలతో ఈ చార్జిïÙట్ను కోర్టు వెనక్కి ఇచి్చంది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం మారడంతో సీఐడీ గతానికి భిన్నంగా వ్యవహరించడం మొదలుపెట్టింది. n సీఐడీ అదనపు డీజీ ముఖ్యమంత్రి కింద పనిచేస్తారు. n సీఐడీ అధికారుల పదోన్నతులు, బదిలీలు అన్నీ కూడా ముఖ్యమంత్రి పర్యవేక్షణలోనే సాగుతాయి. n అందువల్ల ఇన్నర్ రింగ్ రోడ్డు కుంభకోణం కేసును సీబీఐకి బదలాయించాల్సిన అవసరం ఉంది. ఎంపీ, ఎమ్మెల్యేల ప్రత్యేక కోర్టుకు బదిలీ చేయాలి కాగా, ఇన్నర్ రింగ్ రోడ్డు కుంభకోణం కేసును విజయవాడ ఏసీబీ కోర్టు నుంచి ఎంపీ, ఎమ్మెల్యేల ప్రత్యేక కోర్టుకు బదిలీ చేయాలని కోరుతూ ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యంలో కూడా హైకోర్టు తదుపరి విచారణను ఈ నెల 16కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. -
హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్ నియమితులయ్యారు. ఆమె ప్రమాణ స్వీకారంతో హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 34కి చేరుతుంది. జస్టిస్ లీసా గిల్ ప్రస్తుతం పంజాబ్, హర్యానా హైకోర్టులో మూడో స్థానంలో కొనసాగుతున్నారు. ఆమెను ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా నియమించాలన్న సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుక్రవారం ఆమోద ముద్ర వేశారు. దీంతో జస్టిస్ లీసా నియామకాన్ని నోటిఫై చేస్తూ కేంద్ర న్యాయశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆమె వచ్చే వారం న్యాయమూర్తిగా ప్రమాణం చేసే అవకాశం ఉంది. జస్టిస్ లీసా గిల్ను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా నియమిస్తూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని కొలీజియం ఇటీవల నిర్ణయం తీసుకుంది. మొదట జస్టిస్ లీసా గిల్ను న్యాయమూర్తిగా ఏపీ హైకోర్టుకు బదిలీ చేసి, ఆ తరువాత హైకోర్టు ప్రస్తుత సీజే జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ పదవీ విరమణ చేసిన వెంటనే ఆమెను ప్రధాన న్యాయమూర్తిగా నియమించాలని కూడా సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసిన విషయం తెలిసిందే. జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ఈ ఏప్రిల్ 24న పదవీ విరమణ చేయనున్నారు.అపార అనుభవంజస్టిస్ లీసా గిల్ 1966 నవంబర్ 15న జన్మించారు. పంజాబ్ యూనివర్సిటీ నుంచి బీఏ, ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం పూర్తి చేశారు. 1990లో న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. పంజాబ్, హర్యానా హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. క్రిమినల్, సివిల్, సర్వీస్, రెవెన్యూ, రాజ్యాంగపరమైన అనేక రకాల కేసులను ఆమె వాదించారు. చండీగఢ్ కేంద్రపాలిత ప్రాంతంతో పాటు పలు బోర్డులు, కార్పొరేషన్ల తరఫున వాదించారు. 2014 మార్చి 31న పంజాబ్, హర్యానా హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. తొలుత న్యాయమూర్తిగా ఎందుకంటే..?ఒక హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా నియమించాలని నిర్ణయించిన న్యాయమూర్తిని సదరు హైకోర్టులో సీజే పోస్టు ఖాళీ అవడానికి కనీసం రెండు నెలల ముందే న్యాయమూర్తిగా బదిలీ చేయాలని సుప్రీం కోర్టు కొత్త విధాన నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే జస్టిస్ లీసా గిల్ను ఏపీ హైకోర్టుకు బదిలీ చేసింది. జస్టిస్ లీసా గిల్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైతే ఆమె ఆం«ధ్రప్రదేశ్ హైకోర్టు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తి అవుతారు. కాగా, 2028లో పదవీ విరమణ చేసే జస్టిస్ లీసా వచ్చే ఏడాది చివరి కల్లా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యే అవకాశం ఉంది. -
‘స్కిల్’ కేసు క్లోజర్ కాపీ ఇప్పించండి
సాక్షి, అమరావతి: స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణానికి సంబంధించి సీఎం చంద్రబాబుపై గతంలో నమోదు చేసిన కేసును మూసివేసే నిమిత్తం సీఐడీ దాఖలు చేసిన క్లోజర్ రిపోర్ట్ను సవాల్ చేస్తూ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అప్పటి చైర్మన్ అజయ్రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో తాను ఫిర్యాదుదారు అయితే సీఐడీ తనకు నోటీసు ఇవ్వకుండా క్లోజర్ రిపోర్ట్ దాఖలు చేసిందని, ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. తనను థర్డ్పార్టీగా పేర్కొంటూ నోటీసు ఇవ్వాల్సిన అవసరం లేదన్న ఏసీబీ కోర్టు ఉత్తర్వులను రద్దు చేయాలని హైకోర్టును కోరారు. ఈ వ్యాజ్యంపై న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప గురువారం విచారణ జరిపారు. అజయ్రెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది పాపెల్లుగారి వీరారెడ్డి వాదనలు వినిపిస్తూ.. ఈ కేసులో అజయ్రెడ్డి ఫిర్యాదుదారు అని తెలిపారు. సీఐడీ అధికారులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో ఫిర్యాదుదారు కాలమ్లో అజయ్రెడ్డి పేరే ఉందన్నారు. స్కిల్ కేసులో నిందితునిగా ఉన్న చంద్రబాబు హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో దాఖలు చేసిన పలు వ్యాజ్యాల్లోనూ అజయ్రెడ్డిని డీఫ్యాక్టో ఫిర్యాదుదారుగా పేర్కొంటూ ప్రతివాదుల జాబితాలో కూడా చేర్చారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. సీఐడీ దాఖలు చేసిన క్లోజర్ రిపోర్ట్పై తనకు ముందస్తు నోటీసు ఇవ్వాలని, ఆ రిపోర్ట్ను వ్యతిరేకించే అవకాశం కల్పించాలని కోరుతూ ఏసీబీ కోర్టులో అజయ్రెడ్డి ఓ పిటిషన్ దాఖలు చేశారని వివరించారు. అయితే అజయ్రెడ్డికి ఈ కేసుతో సంబంధం లేదంటూ, ఈ కేసులో అతన్ని థర్డ్ పార్టీగా పరిగణిస్తూ ఆ పిటిషన్ను ఏసీబీ కోర్టు కొట్టేసిందన్నారు. కేసును పూర్తిగా మూసివేస్తూ కోర్టు తుది నిర్ణయం తీసుకునేలోపు, సీఐడీ దాఖలు చేసిన క్లోజర్ రిపోర్ట్ను వ్యతిరేకిస్తూ ‘ప్రొటెస్ట్ పిటిషన్’ దాఖలు చేసే అవకాశం పిటిషనర్కు ఇవ్వాలని కోరారు. సీఐడీ సిట్ తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులు ముకుల్ రోహత్గీ, మాధవ్ ఖురానా స్పందిస్తూ.. అసలు ఈ వ్యాజ్యానికి విచారణార్హత లేదన్నారు. స్కిల్ కేసులో అజయ్రెడ్డి పిటిషనరే కాదన్నారు. ఈ దశలో ప్రతివాదులకు నోటీసులు జారీ చేయాల్సిన అవసరం కూడా లేదన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి తదుపరి విచారణను ఈ నెల 12కి వాయిదా వేశారు. ఐఆర్ఆర్ కేసును ‘ప్రత్యేక’ కోర్టుకు బదిలీ చేయండిహైకోర్టును ఆశ్రయించిన మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్రాథమిక చార్జిషీట్, క్లోజర్ రిపోర్ట్ కాపీలు ఇప్పించాలంటూ మరో పిటిషన్సాక్షి, అమరావతి: అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు (ఐఆర్ఆర్) అలైన్మెంట్, మాస్టర్ ప్లాన్ అక్రమాలకు సంబంధించి తానిచి్చన ఫిర్యాదు మేరకు సీఐడీ నమోదు చేసిన కేసును విజయవాడ ఏసీబీ కోర్టు నుంచి ఎంపీ, ఎమ్మెల్యేల ప్రత్యేక కోర్టుకు బదిలీ చేయాలని కోరుతూ మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి గురువారం హైకోర్టును ఆశ్రయించారు. ఈ కుంభకోణం కేసులో సీఐడీ 2024లోనే చార్జిషీట్ దాఖలు చేసిందని, ఈ కేసును ఎంపీ, ఎమ్మెల్యేల ప్రత్యేక కోర్టుకు బదిలీ చేయకుండా సాధారణ ఏసీబీ కోర్టులో విచారించడం చట్టవిరుద్ధమని తన పిటిషన్లో పేర్కొన్నారు. ఇన్నర్ రింగ్ రోడ్డు కుంభకోణం కేసులో ప్రస్తుత ముఖ్యమంత్రి, ఓ మంత్రి, మాజీ ఎమ్మెల్యేలు నిందితులుగా ఉన్నారని తెలిపారు. నిందితుల హోదాను బట్టి కేసు విచారణ కేవలం ప్రత్యేక కోర్టులోనే జరగాల్సి ఉంటుందన్నారు. అయితే, ప్రస్తుతం ఈ కేసును విజయవాడ ఏసీబీ కోర్టు విచారిస్తోందని తెలిపారు. తదుపరి చర్యలన్నీ నిలిపేయండి అశి్వనికుమార్ ఉపాధ్యాయ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు ఇచి్చన చరిత్రాత్మక తీర్పు ప్రకారం ప్రస్తుత, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలపై ఉన్న క్రిమినల్ కేసులను విచారించేందుకు ప్రతి రాష్ట్రంలో ప్రత్యేక కోర్టులున్నాయన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2018లో విజయవాడలో ఎంపీ, ఎమ్మెల్యేల కేసుల విచారణ కోసం ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేసిందన్నారు. నిందితుల హోదాను బట్టి కేసు విచారణ కేవలం ఈ ప్రత్యేక కోర్టులోనే జరగాలని, సాధారణ ఏసీబీ కోర్టులో కాదని పిటిషన్లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఇన్నర్ రింగ్ రోడ్డు కుంభకోణానికి సంబంధించిన కేసుపై ఏసీబీ స్పెషల్ కోర్టులో జరుగుతున్న విచారణలో తదుపరి చర్యలన్నింటినీ నిలిపేస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని ఆయన కోర్టును కోరారు. ‘క్లోజర్’ కాపీలు ఇప్పించండి ఇన్నర్ రింగ్ రోడ్డు (ఐఆర్ఆర్) కుంభకోణం కేసులో 2024లో దాఖలు చేసిన ప్రాథమిక చార్జిషీట్, తాజాగా దాఖలు చేసిన క్లోజర్ రిపోర్ట్ కాపీలను తనకు అందచేసేలా సీఐడీని ఆదేశించాలని కోరుతూ మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి గురువారం హైకోర్టులో మరో పిటిషన్ దాఖలు చేశారు. ప్రస్తుత సీఎం చంద్రబాబు 2014–19 మధ్య కాలంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన ఇన్నర్ రింగ్ రోడ్డు భూ కుంభకోణంపై 2022లో తాను సీఐడీకి ఫిర్యాదు చేశానని రామకృష్ణారెడ్డి తెలిపారు. దర్యాప్తు జరిపిన సీఐడీ కుంభకోణానికి సంబంధించిన అన్ని ఆధారాలను సేకరించిందని తెలిపారు. 2024లో చార్జిషీట్ కూడా దాఖలు చేయగా.. కోర్టు దానిని సాంకేతిక కారణాలతో వెనక్కి పంపిందన్నారు. ప్రభుత్వం మారడంతో ఐఆర్ఆర్ కుంభకోణం కేసును మూసివేసేందుకు సీఐడీ సిద్ధమై విజయవాడ ఏసీబీ కోర్టులో క్లోజర్ రిపోర్ట్ దాఖలు చేసిందని చెప్పారు. ఈ నేపథ్యంలో గత నెల 18న సీఐడీ అధికారులు తనకు ఓ నోటీసు పంపి కేసును మూసివేస్తున్నట్లు తెలిపారన్నారు. 2024 నాటి తొలి చార్జిషీట్ కాపీని గానీ, ఇప్పుడు దాఖలు చేసిన క్లోజర్ రిపోర్ట్ కాపీని కానీ తనకు అందించడం లేదని వివరించారు. దీంతో సీఐడీ దాఖలు చేసిన క్లోజర్ రిపోర్ట్ను వ్యతిరేకిస్తూ కోర్టులో ‘ప్రొటెస్ట్ పిటిషన్’ దాఖలు చేయడం సాధ్యం కావడం లేదన్నారు. చార్జిషీట్ను, క్లోజర్ రిపోర్ట్ను ఫిర్యాదుదారునికి అందించడం దర్యాప్తు అధికారి బాధ్యత అని పిటిషన్లో పేర్కొన్నారు. -
సాక్షి కథనం సభా హక్కుల ఉల్లంఘన కిందకు రాదు
సాక్షి, అమరావతి: ఎమ్మెల్యేలకు శిక్షణ తరగతుల పేరుతో కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృథా చేయడంపై ‘సాక్షి’ ప్రచురించిన వార్తాకథనం సభాహక్కుల ఉల్లంఘన కిందకు రాదని సీనియర్ న్యాయవాది సుబ్రహ్మణ్య శ్రీరాం గురువారం హైకోర్టుకు నివేదించారు. సభ లోపల జరిగిన వ్యవహారాలపై రాసిన కథనాలకే సభాహక్కుల ఉల్లంఘన వర్తిస్తుందని చెప్పారు. సభ వ్యవహారాలతో సంబంధంలేని అంశాలపై వార్తా కథనం ప్రచురించడం తప్పు కాదన్నారు. సాక్షి కథనం సభా హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందనేందుకు ఎలాంటి ప్రాథమిక ఆధారాలు లేవని చెప్పారు. ప్రాథమిక ఆధారాలు లేకుండానే సభా హక్కుల ఉల్లంఘనపై ముందే ఓ నిర్ణయానికి వచ్చి, అందుకనుగుణంగా శాసనసభ సెక్రటరీ జనరల్ నోటీసులు జారీ చేయడం చట్ట విరుద్ధమని తెలిపారు. ఆ కథనం కేవలం పరిపాలనపరమైన అంశానికి సంబంధించింది మాత్రమేనన్నారు. అసలు ఆ కథనం సభా హక్కుల పరిధిలోకి వస్తుందా.. రాదా.. అన్న విషయాన్ని ముందు తేల్చాల్సిన అవసరం ఉందని చెప్పారు. వాస్తవానికి ఏది సభాహక్కుల పరిధిలోకి వస్తుంది, ఏది రాదు అన్న విషయంపై ఎక్కడా నిర్దిష్టమైన నిర్వచనం లేదని తెలిపారు. తమ కథనం సభాహక్కుల పరిధిలోకి వస్తుందా.. రాదా.. అన్నదానిపై ఓ వైపు న్యాయస్థానం విచారణ జరుపుతుండగానే, ప్రచురించిన వార్తా కథనానికి సంబంధించిన ఆధారాలతో తమ ముందు హాజరుకావాలంటూ అసెంబ్లీ సెక్రటరీ జనరల్ తాజాగా మరో నోటీసు ఇచ్చారని చెప్పారు. ఆ నోటీసుకు తాము సమాధానం కూడా ఇచ్చామని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ఈ వ్యవహారంలో ముందుకెళ్లకుండా ప్రివిలేజ్ కమిటీని, అసెంబ్లీ సెక్రటరీ జనరల్ను నియంత్రిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. ఈ సమయంలో అసెంబ్లీ సెక్రటరీ జనరల్ తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్ స్పందిస్తూ.. ఎలాంటి రాతపూర్వక ఉత్తర్వులు అవసరం లేదని, తదుపరి విచారణ వరకు ఎలాంటి నోటీసులు ఇవ్వబోమని చెప్పారు. ఏజీ చెప్పిన ఈ వివరాలను నమోదు చేసిన హైకోర్టు తదుపరి విచారణను ఈ నెల 19కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందన్రావు ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. సభా హక్కుల కమిటీకి నివేదించిన స్పీకర్ సాక్షి కథనం సభా హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని, దాన్ని తాను సభలో ప్రస్తావించేందుకు అనుమతించాలని కోరుతూ టీడీపీ ఎమ్మెల్యే జయసూర్య గత ఏడాది ఫిబ్రవరి 25న అసెంబ్లీ స్పీకర్ను కోరుతూ నోటీసు ఇచ్చారు. దీంతో స్పీకర్ ఈ వ్యవహారాన్ని సభాహక్కుల కమిటీకి నివేదించారు. ఈ కమిటీ ఆదేశాల మేరకు అసెంబ్లీ సెక్రటరీ జనరల్ ‘సాక్షి’కి షోకాజ్ నోటీసులు ఇచ్చారు. ఎమ్మెల్యే నోటీసుతోపాటు సెక్రటరీ జనరల్ ఇచ్చిన షోకాజ్ నోటీసును సవాలు చేస్తూ సాక్షి ఎడిటర్ ధనంజయరెడ్డి, చీఫ్ రిపోర్టర్ ఫణికుమార్ గత ఏడాది జూన్లో హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై విచారణ జరిపిన సింగిల్ జడ్జి.. ఇచ్చింది షోకాజ్ నోటీసు మాత్రమేనని, దీని తరువాత చాలా ప్రక్రియ ఉన్న నేపథ్యంలో ఈ వ్యాజ్యాలు అపరిపక్వమైనవంటూ వాటిని కొట్టేశారు. ధర్మాసనం ముందు అప్పీళ్లు ఈ తీర్పును సవాలు చేస్తూ ధనంజయరెడ్డి, ఫణికుమార్ వేర్వేరుగా ధర్మాసనం ముందు అప్పీళ్లు దాఖలు చేశారు. ఈ అప్పీళ్లపై గురువారం సీజే ధర్మాసనం మరోసారి విచారణ జరిపింది. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది శ్రీరాం, వేలూరు మహేశ్వర్రెడ్డి, అనూప్ కౌషిక్ వాదనలు వినిపించారు. శాసనసభ కార్యకలాపాల్లో జోక్యం చేసుకున్నప్పుడు, వాటిని అడ్డుకున్నప్పుడే సభాహక్కుల ఉల్లంఘన అవుతుందని శ్రీరాం వివరించారు. సాక్షి కథనం ఎక్కడా సభ కార్యకలాపాల్లో జోక్యం చేసుకోవడం లేదన్నారు. శిక్షణ తరగతులు నిర్వహించకపోవడం వల్ల ప్రజాధనం వృథా అయిందన్న విషయాన్ని మాత్రమే ఎత్తి చూపిందని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన సుప్రీంకోర్టు వెలువరించిన పలు తీర్పులను ఉదహరించారు. రూ.కోట్ల ప్రజాధనం వృథాపై సాక్షి కథనం ఎమ్మెల్యేలకు శిక్షణ తరగతుల నిర్వహణ విషయంలో సరైన ప్రణాళిక, అవగాహన లేకపోవడంతో కోట్ల రూపాయల మేర ప్రజాధనం వృథా అయింది. ఎమ్మెల్యేలకు రెండు రోజులు శిక్షణ తరగతులు నిర్వహించాలని శాసనసభ వర్గాలు గత ఏడాది ఫిబ్రవరిలో నిర్ణయించాయి. ఎమ్మెల్యేలకు, అతిథులకు హోటళ్లు, భోజనాలు, బహుమతులు తదితరాల కోసం భారీగా ఖర్చు చేశారు. అయితే లోక్సభ స్పీకర్ ఈ కార్యక్రమానికి రాకపోవడంతో ఆ ఖర్చంతా వృథా అయింది. దీనిపై సాక్షి గత ఏడాది ఫిబ్రవరి 22న ‘కోట్లు ఖర్చు.. శిక్షణ తుస్సు’ శీర్షికన వార్తా కథనం ప్రచురించింది. ఈ వార్తా కథనంతో కంగుతిన్న అధికార పార్టీ నేతలు సాక్షిపై కక్షసాధింపు చర్యలు చేపట్టారు. -
ఆ ప్రజాప్రయోజన ప్రాజెక్టు ఆగిపోకూడదు
సాక్షి, అమరావతి: బెంగళూరు–మైదుకూరు–అమరావతి గ్రీన్ఫీల్డ్ హైవే భూ సేకరణకు జాతీయ రహదారుల చట్టం కింద వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో 2022–23లో జారీ అయిన నోటిఫికేషన్లను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. 124 కిలోమీటర్లు, 12 మండలాలు, 49 గ్రామాలకు సంబంధించిన పెద్ద ప్రజా ప్రయోజన ప్రాజెక్ట్ అని, కొద్దిమంది అభ్యంతరాలతో మొత్తం ప్రాజెక్ట్ ఆగిపోకూడదని న్యాయమూర్తి జస్టిస్ కొనకంటి శ్రీనివాసరెడ్డి ఇటీవల తీర్పు వెలువరించారు.అంతా సక్రమమే: హైకోర్టుబెంగళూరు–మైదుకూరు–అమరావతి గ్రీన్ ఫీల్డ్ కారిడార్ నిర్మాణం కోసం వైఎస్సార్ కడప జిల్లాలో భూములను సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. జాతీయ రహదారుల చట్టం కింద 2022–23లో భూ సేకరణ నోటిఫికేషన్లు జారీ చేసింది. తరువాత గెజిట్ నోటిఫికేషన్లు కూడా జారీ అయ్యాయి. వీటిని సవాలు చేస్తూ పలువురు భూ యజమానులు హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది ఓబిరెడ్డి మనోహర్రెడ్డి వాదనలు వినిపించారు. నోటిఫికేషన్లపై పిటిషనర్ల అభ్యంతరాలను హైకోర్టు తిరస్కరించిన తీరిది.. » జాతీయ రహదారుల చట్టం కింద భూములు సేకరిస్తుంటే, భూ సేకరణ నోటిఫికేషన్లో ఆ భూముల వివరాలను సంక్షిప్తంగా పేర్కొంటే సరిపోతుంది. » భూముల యజమానుల పేర్లను భూ సేకరణ నోటిఫికేషన్లో పేర్కొనాల్సిన అవసరం లేదు. » జాతీయ రహదారుల చట్టంలోని సెక్షన్ 3ఏ (1) ప్రకారం భూ సేకరణ నోటిఫికేషన్ను ఏవైనా రెండు స్థానిక పత్రికల్లో ప్రచురిస్తే సరిపోతుంది. ఆ పత్రికల సర్క్యులేషన్ ఎంత అన్నది అవసరం లేదు. » సాంకేతిక నిపుణుల ద్వారా రూపొందించిన జాతీయ ప్రాజెక్టుల విషయంలో న్యాయ సమీక్షా పరిధి చాలా పరిమితంగా ఉంటుంది. » పెద్ద ప్రాజెక్టులకు భూములిచ్చేందుకు మెజారిటీ యజమానులు అంగీకరించినప్పుడు, కొద్ది మంది అభ్యంతరాల ఆధారంగా ఆ ప్రాజెక్టును నిలిపివేయడం సాధ్యం కాదు. » పైగా చట్ట ప్రకారం పిటిషనర్లు 21 రోజుల్లో అభ్యంతరాలు తెలపాల్సి ఉండగా, ఆ గడువులో అభ్యంతరాలు చెప్పలేదు. » డబుల్ ట్రంపెట్ ఇంటర్చేంజ్ మధ్యలో ఉన్న భూములు కూడా హైవేలో భాగమే. » సేకరించిన భూములను వాణిజ్య కార్యకలాపాల కోసం వాడతారనే అనుమానం ఆధారరహితం. -
AP హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్
-
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్
సాక్షి, అమరావతి/సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే)గా జస్టిస్ లీసా గిల్ రానున్నారు. పంజాబ్, హరియాణ హైకోర్టులో మూడోస్థానంలో కొనసాగుతున్న ఆమెను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సీజేగా సిఫారసు చేస్తూ భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. మొదట జస్టిస్ లీసా గిల్ను న్యాయమూర్తిగా ఏపీ హైకోర్టుకు బదిలీ చేస్తున్నారు. హైకోర్టు సీజే జస్టిస్ ధీరజ్సింగ్ ఠాకూర్ ఏప్రిల్ 24 పదవీ విరమణ చేయనున్నారు. ఆయన పదవీ విరమణ చేసిన వెంటనే జస్టిస్ లీసా గిల్ ప్రధాన న్యాయమూర్తిగా నియమితులవుతారు. ఆమె ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తి అవుతారు. సీజే జస్టిస్ ధీరజ్సింగ్ ఠాకూర్ పదోన్నతిపై సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశం ఉందని కూడా న్యాయవర్గాల్లో చర్చ జరుగుతోంది. ఒకవేళ ఆయన సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా వెళితే ఆ వెంటనే జస్టిస్ లీసా గిల్ హైకోర్టు సీజేగా నియమితులవుతారు. 2028లో జస్టిస్ లీసా గిల్ పదవీ విరమణ.. ఆలోపు సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశం జస్టిస్ లీసా గిల్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా 2028 నవంబర్లో పదవీ విరమణ చేస్తారు. ఆ లోపు పంజాబ్, హరియాణ రాష్ట్ర కోటాలో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యే అవకాశం కూడా ఉంది. ప్రస్తుతం సుప్రీంకోర్టులో పంజాబ్, హరియాణ నుంచి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్తో సహా మొత్తం ముగ్గురు న్యాయమూర్తులున్నారు. వీరిలో జస్టిస్ సూర్యకాంత్ 2027లో, జస్టిస్ రాజేష్ బిందాల్ ఈ ఏడాది ఏప్రిల్లో, జస్టిస్ అగస్టీన్ జార్జ్ మసీహ్ 2028 మార్చిలో పదవీ విరమణ చేస్తారు. ఈ నేపథ్యంలో జస్టిస్ లీసా గిల్ హైకోర్టు సీజేగా పదవీ విరమణకు ముందే సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా వెళ్లే అవకాశం ఉంది. కొత్త విధాన నిర్ణయం తీసుకున్న కొలీజియం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, న్యాయమూర్తులు జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఎం.ఎం.సుందరేష్ లతో కూడిన కొలీజియం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల నియామకం విషయంలో కొత్త విధాననిర్ణయం తీసుకుంది. న్యాయపాలన సామర్థ్యాన్ని, నాణ్యతను బలోపేతం చేయడానికి కొత్త విధానాన్ని అనుసరించాలని నిర్ణయించినట్లు కొలీజియం తెలిపింది. ఒక హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా నియమించాలని నిర్ణయించిన న్యాయమూర్తిని సదరు హైకోర్టులో ఆ ఖాళీ ఏర్పడటానికి కనీసం రెండునెలల ముందే న్యాయమూర్తిగా బదిలీ చేయాలని నిర్ణయించినట్లు తెలిపింది. దీనివల్ల సదరు న్యాయమూర్తికి ఆ హైకోర్టు వ్యవహారాలపై పూర్తి అవగాహన పెంచుకోవడానికి ఆస్కారం ఉంటుందని, అక్కడ ప్రధాన న్యాయమూర్తి పోస్టు ఖాళీ అయిన వెంటనే సీజేగా బాధ్యతలు స్వీకరించడానికి వీలుంటుందని కొలీజియం పేర్కొంది. గతంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవీ విరమణ చేయగానే, అదే హైకోర్టులో రెండోస్థానంలో ఉన్న న్యాయమూర్తిని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా నియమించేవారు. కొద్దినెలల తరువాత వేరే హైకోర్టు నుంచి పూర్తిస్థాయి ప్రధాన న్యాయమూర్తిని నియమించేవారు. చాలా సందర్భాల్లో హైకోర్టులో రెండోస్థానంలో ఉన్న న్యాయమూర్తిని మాతృ హైకోర్టు కోటా నుంచి వేరే హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతిపై నియమిస్తుండేవారు. ఆ న్యాయమూర్తి తాత్కాలిక సీజేగా కొంత అనుభవం గడిస్తారన్న ఉద్దేశంతో గతంలో సుప్రీంకోర్టు కొలీజియం ఆ నిర్ణయం తీసుకుంది. తాత్కాలిక సీజే అదే హోదాలో పదవీ విరమణ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు సీజే నియామకం విషయంలో సుప్రీంకోర్టు కొత్త విధాన నిర్ణయం తీసుకుంది. జస్టిస్ లీసా గిల్ నేపథ్యం.. 1966 నవంబర్ 15న జన్మించిన ఆమె చండీగఢ్లోని సెక్టార్ 9లో ఉన్న కార్మెల్ కాన్వెంట్ స్కూల్లో పాఠశాల విద్య పూర్తిచేశారు. హ్యుమానిటీస్ విభాగంలో గ్రాడ్యుయేషన్ చేశారు. పంజాబ్ యూనివర్సిటీ నుంచి బీఏ, ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం పూర్తిచేశారు. 1990లో న్యాయవాదిగా ఎన్రోల్ అయిన ఆమె పంజాబ్, హరియాణ హైకోర్టులో ప్రాక్టీస్ చేశారు. క్రిమినల్, సివిల్, సర్వీస్, రెవెన్యూ, రాజ్యాంగపరమైన అనేక రకాల కేసులను ఆమె వాదించారు. చండీగఢ్ కేంద్రపాలిత ప్రాంతంతోపాటు పలు బోర్డులు, కార్పొరేషన్లకు ప్రాతినిధ్యం వహించారు. 2014 మార్చి 31న పంజాబ్, హరియాణ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ప్రస్తుతం ఆ హైకోర్టులో మూడో స్థానంలో కొనసాగుతున్నారు. -
ఉద్యోగులపై క్రమశిక్షణ కేసుల పరిష్కారంలో ఇంత జాప్యమా?
సాక్షి, అమరావతి: ప్రభుత్వ ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యల కేసుల విచారణ ప్రక్రియలో జరుగుతున్న అసాధారణ జాప్యంపై హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. మూడు నుంచి ఆరు నెలల్లో ఈ కేసులు పరిష్కారం కావాలన్న ప్రభుత్వ నిబంధనలు అమలు కావడం లేదని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఈ కేసులను ఒక కొలిక్కి తెచ్చేందుకు అసాధారణ నిర్ణయం తీసుకుంది. వివిధ శాఖల్లో పెండింగ్లో ఉన్న 5,424 కేసులు పరిష్కారం అయ్యే వరకు ఈ వ్యవహారాన్ని నిరంతరం (కంటిన్యూస్ మాండమస్) పర్యవేక్షించాలని నిర్ణయించింది. 2025 డిసెంబర్ 15వ తేదీ నాటికి పెండింగ్లో ఉన్న 5,424 క్రమశిక్షణ చర్యల కేసులను మూడు నుంచి ఆరు నెలల వ్యవధిలో పరిష్కరించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. 6 నెలల్లో కేసులు పరిష్కారం కావాలని ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం, ఆ గడువులోపు విచారణను ముగించకుంటే ఏం చేయాలన్న దానిపై స్పష్టతనివ్వకపోవడం వల్ల ఎలాంటి ప్రత్యామ్నాయం లేకుండా పోయిందని కోర్టు వ్యాఖ్యానించింది. ఇకపై నాలుగు నెలలకొకసారి ఈ కేసుల పురోగతిని తమకు తెలియచేస్తూ అఫిడవిట్లు దాఖలు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ న్యాపతి విజయ్ ఇటీవల తీర్పు వెలువరించారు. తనపై రెండు అభియోగాలతో చేపట్టిన క్రమశిక్షణ చర్యల ప్రొసీడింగ్స్ను వీలైనంత త్వరగా ముగించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ ఈఎస్ఐ ఆసుపత్రిలో స్పెషల్ గ్రేడ్ సివిల్ సర్జన్గా పనిచేస్తున్న జి.రవికుమార్ దాఖలు చేసిన పిటిషన్ను విచారించిన హైకోర్టు ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది. 5,424 క్రమశిక్షణ చర్యల కేసులుక్రమశిక్షణ చర్యల కేసుల్లో విచారణను ఎందుకు సకాలంలో ముగించడం లేదో చెప్పాలని ఈ వ్యాజ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్)ని న్యాయమూర్తి ఆదేశించారు. కొత్త నియామకాలు, బదిలీలు, పదవీ విరమణలు, డేటా లభ్యత లోపం, ఫైళ్లు వివిధ కార్యాలయాల్లో ఉండడం, పదోన్నతుల వల్ల అధికార మార్పులు వంటి కారణాలతో క్రమశిక్షణ చర్యల కేసుల విచారణలో జాప్యం జరుగుతోందని ప్రధాన కార్యదర్శి రాతపూర్వకంగా హైకోర్టుకు నివేదించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. 2025 డిసెంబర్ 15వ తేదీ నాటికి మొత్తం 5,75,613 మంది ఉద్యోగులు ఉంటే, 5,70,713 మంది ఉద్యోగుల వివరాలు మ్యాప్ అయ్యాయి. 5,424 క్రమశిక్షణ చర్యల కేసులు పలువురు ఉద్యోగులపై పెండింగ్లో ఉన్నాయి. అత్యధికంగా హోంశాఖలో 1,558, రెవెన్యూ శాఖలో 854, రవాణా, రోడ్లు భవనాల శాఖలో 384, పురపాలక శాఖలో 366 కేసులు పెండింగ్లో ఉన్నాయి. జీవించే హక్కును హరించడమే: హైకోర్టు కీలక వ్యాఖ్యలు» ఈ కేసుల విచారణలో జాప్యం రాజ్యాంగం ప్రసాదించిన గౌరవంగా జీవించే హక్కును హరిస్తోంది. » క్రమశిక్షణ చర్యల కేసులు ఓ కొలిక్కి రాకుండా ఏళ్ల తరబడి పేరుకుపోతుండటంతో న్యాయస్థానాల్లో పెద్ద సంఖ్యలో కేసులు దాఖలవుతున్నాయి. » ఇవి న్యాయవ్యవస్థపై మోయలేని భారాన్నిమోపడమే కాకుండా, ఉద్యోగులూ మానసిక వేదనకు గురవుతున్నారు. » ఉద్యోగి పదవీ విరమణ ప్రయోజనాలు చాలా సందర్భాల్లో అతనిపై పెండింగ్లో ఉన్న క్రమశిక్షణ చర్యల కేసుతో ముడిపడి ఉంటాయి. » చార్జ్ మెమోలతో సంబంధం లేకుండా పదోన్నతులు కల్పిం చాలని, సీనియారిటీ పునరుద్ధరించాలని, జాప్యం ఉన్నందున క్రమశిక్షణ చర్యలను కొట్టేయాలని, పదవీ విరమణ ప్రయోజనాలు ఇప్పించాలని, అలాగే కోర్టు ధిక్కార చర్యలు చేపట్టాలని.. ఇలా పలు అంశాలపై పెద్ద సంఖ్యలో పిటిషన్లు దాఖలవుతున్నాయి. » క్రమశిక్షణ చర్యల కేసుల్లో విచారణను త్వరగా ముగించడమన్నది కేవలం ఆ ఉద్యోగి హక్కు మాత్రమే కాదు. సంబంధిత శాఖకు సైతం ఆ హక్కు ఉంది. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా తప్పు చేసిన ఉద్యోగులను శిక్షించి, నిజాయితీపరులైన అధికారులను ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. -
పవన్ కళ్యాణ్ కళ్లు మూసుకుపోయాయ..? హై కోర్టు అడ్వకేట్ సావిత్రి స్ట్రాంగ్ రియాక్షన్
-
జైల్లో ఉంచితే దారికొస్తారా? ఏపీ సీఎస్ పై హైకోర్టు ఫైర్
-
కోర్టులను మూసేయండి
సాక్షి, అమరావతి : ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) విజయానంద్పై హైకోర్టు నిప్పులు చెరిగింది. కోర్టు ఆదేశాలను అమలు చేసే ఉద్దేశం లేకపోతే కోర్టులను మూసి వేయడం మంచిదని ఘాటుగా వ్యాఖ్యానించింది. ప్రజలకు, కక్షిదారులకు న్యాయం చేయలేకపోతే ఇక న్యాయస్థానాలు ఎందుకని ప్రశ్నించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శే కోర్టు ఆదేశాలను అమలు చేయకుంటే అతని కింద పని చేసే ప్రభుత్వ ఉద్యోగులందరికీ కోర్టు ఆదేశాలంటే ఏం గౌరవం ఉంటుందని నిలదీసింది. కోర్టు ఆదేశాలను అమలు చేయకపోవడం ద్వారా మిగిలిన అధికారులకు ఏం సందేశం ఇస్తున్నారని ఆయన్ను ప్రశ్నించింది. ప్రజలకు న్యాయం చేయడానికి, న్యాయ వ్యవస్థ ప్రతిష్టను కాపాడటానికే తాము ఇక్కడ ఉన్నామని, ఈ విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. ప్రభుత్వాధికారుల తీరు వల్ల న్యాయ వ్యవస్థపై ప్రజలు నమ్మకం కోల్పోయే పరిస్థితి దాపురించిందని ఘాటుగా వ్యాఖ్యానించింది. త్వరలో పదవీ విరమణ చేయనున్న విజయానంద్ను నాలుగు రోజుల పాటు జైల్లో ఉంచితే అధికారులందరూ దార్లోకి వస్తారంది. కోర్టు ఆదేశాలను అమలు చేయవద్దని సలహా ఇస్తే ఎంత మాత్రం సహించేది లేదని స్పష్టం చేసింది. గ్రూప్–1 ప్రధాన పరీక్షలో ఉత్తీర్ణులై ప్రస్తుతం వివిధ పోస్టుల్లో కొనసాగుతున్న అధికారులను నాన్ ఫోకల్ (ప్రాధాన్యత లేని) పోస్టులకు బదిలీ చేయాలన్న తమ ఆదేశాలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉద్దేశ పూర్వకంగానే అమలు చేయలేదని హైకోర్టు ఆక్షేపించింది. నాన్ ఫోకల్ పోస్టులకు బదిలీ చేయాలంటూ ఆదేశం.. గ్రూప్–1 ప్రధాన పరీక్ష జవాబు పత్రాల మూల్యాంకనంలో అక్రమాలు జరిగాయంటూ దాఖలైన పలు వ్యాజ్యాలపై విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్ దేవానంద్ నేతృత్వంలోని హైకోర్టు ధర్మాసనం ఈ నెల 11న ప్రభుత్వానికి పలు ఆదేశాలు జారీ చేసింది. గ్రూప్–1లో ఇప్పటికే ఎంపికై ప్రస్తుతం పలు చోట్ల ఉద్యోగాలు చేస్తున్న అధికారులను తక్షణమే నాన్ ఫోకల్ (ప్రాధాన్యత లేని) పోస్టులకు బదిలీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.ఓ వారంలో ఆ అధికారుల బదిలీలకు సంబంధించిన వివరాలతో ఓ నివేదికను రిజి్రస్టార్ జ్యుడీషియల్కు అందచేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ను ఆదేశించింది. ఈ వ్యవహారంపై మంగళవారం విచారణ జరిపిన ధర్మాసనం.. తమ ఆదేశాల మేరకు ఆ అధికారులను నాన్ ఫోకల్ పోస్టులకు బదిలీ చేయకపోవడంతో విజయానంద్ వ్యక్తిగత హాజరుకు ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే. ఏఐని అడిగితే ఏంటో తెలిసేదిగా.. ఈ వ్యాజ్యాలపై న్యాయమూర్తులు జస్టిస్ బట్టు దేవానంద్, జస్టిస్ అవధానం హరిహరనాథ శర్మ ధర్మాసనం బుధవారం మరోసారి విచారణ జరిపింది. ఈ సందర్భంగా తమ ఆదేశాలను ఎందుకు అమలు చేయలేదని, తమ ముందు వ్యక్తిగతంగా హాజరైన సీఎస్ విజయానంద్ను ప్రశ్నించింది. తక్షణమే బదిలీ చేయాలని తాము ఈ నెల 11న ఆదేశాలిస్తే, ఇప్పటి వరకు వాటిని అమలు చేయలేదని, దీని బట్టి ‘తక్షణమే’ అన్న పదానికి సీఎస్కు అర్థం తెలిసినట్లు లేదని పేర్కొంది. తమ ఆదేశాలను అమలు చేసి తీరాల్సిందేనని, లేని పక్షంలో తాము తీసుకునే కోర్టు ధిక్కార చర్యలకు సిద్ధంగా ఉండాలని విజయానంద్కు తేల్చి చెప్పింది. ఈ సమయంలో అడ్వొకేట్ జనరల్ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్ జోక్యం చేసుకుంటుండగా, సీఎస్ స్వయంగా తమ ముందు ఉన్నారని, ఆయన్నే అడిగి వివరాలు తెలుసుకుంటామని, ఈ దశలో మీ జోక్యం అవసరం లేదని ఏజీకి తేల్చి చెప్పింది. సర్వీసు నిబంధనల్లో ఫోకల్, నాన్ ఫోకల్ పోస్టుల నిర్వచనం లేదని ఏజీ చెప్పగా.. 1966లోనే ప్రభుత్వ కార్యనిర్వాహక ఉత్తర్వులు జారీ చేసిందని ధర్మాసనం గుర్తు చేసింది. ఈ ఉత్తర్వుల ఆధారంగానే ఫోకల్, నాన్ ఫోకల్ పోస్టులకు బదిలీలు జరుగుతూ వస్తున్నాయని తెలిపింది. ఫోకల్, నాన్ ఫోకల్ పోస్టులకు అర్థం తెలియకుంటే, నిఘంటువును చూసినా, ఏఐని అడిగినా తెలుస్తుందని పేర్కొంది. ఫోకల్, నాన్ ఫోకల్ పోస్టుల గురించి అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్కు కూడా తెలుసని, కానీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాత్రం తెలియదని చెబుతున్నారంది. గ్రూప్–1 ప్రధాన పరీక్షలో ఉత్తీర్ణులై వివిధ పోస్టుల్లో కొనసాగుతున్న అధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కుమ్మక్కయ్యారని, అందుకే వారిని నాన్ ఫోకల్ పోస్టులకు బదిలీ చేయాలన్న తమ ఆదేశాలను కావాలనే అమలు చేయడం లేదని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. అధికారులను సమర్థించొద్దు 1966 నాటి ఉత్తర్వుల గురించి తమ అధికారులకు తెలిసి ఉండకపోవచ్చునని ఏజీ చెప్పగా, కోర్టు ఆదేశాలను అమలు చేయని ఓ అధికారిని సమర్థించేందుకు ఎందుకింత తాపత్రయ పడుతున్నారని ఏజీని ప్రశి్నంచింది. తమ ఆదేశాలను అమలు చేసి, ఆ వివరాలను తమ ముందుంచాలని సీఎస్ను ఆదేశిస్తూ తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది. ఈ సమయంలో ఏజీ స్పందిస్తూ, వ్యక్తిగత హాజరు నుంచి సీఎస్కు మినహాయింపు కావాలని కోరారు. తమ ఆదేశాలను అమలు చేస్తే వ్యక్తిగతంగా హాజరు కావాల్సిన అవసరం లేదని, అమలు చేయకుంటే మాత్రం హాజరు కావాల్సిందేనని ధర్మాసనం స్పష్టం చేసింది. -
కోర్టు ముందు అసత్యాలు ఉంచడం సరికాదు
సాక్షి, అమరావతి: సర్వశిక్షాభియాన్ పీడీ శ్రీనివాసరావుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ముందు అసత్యాలు ఉంచడం సరికాదని ఆక్షేపించింది. క్రిమినల్ చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఘాటుగా వ్యాఖ్యానించింది. కస్తూరిభా గాంధీ బాలికా విద్యాలయాల్లో (కేజీబీవీ) బోధనా సిబ్బందిని శాశ్వత ప్రాతిపదికన నియమించే వ్యవహారంపై హైకోర్టులో వాదనలు ముగిశాయి. వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ బట్టు దేవానంద్, జస్టిస్ అవధానం హరిహరనాథ శర్మ ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. కేజీబీవీల్లో పార్ట్టైం పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్లు (పీజీటీ)గా పనిచేస్తున్న తమను అర్థాంతరంగా తొలగించడాన్ని సవాలు చేస్తూ పలువురు పీజీటీలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణ జరిపిన సింగిల్జడ్జి అధికారుల తీరును తప్పుపట్టారు. వారి సేవలను కొనసాగించాలని ఆదేశించారు. ఈ తీర్పును సవాలు చేస్తూ అధికారులు ధర్మాసనం ముందు ఈ ఏడాది జనవరిలో అప్పీల్ దాఖలు చేశారు. ఈ అప్పీల్పై జస్టిస్ బట్టు దేవానంద్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరుపుతూ వస్తోంది. సింగిల్ జడ్జి తీర్పును అమలు చేస్తామంటూ కోర్టుకిచి్చన హామీని ఉల్లంఘించినందుకు సర్వశిక్షాభియాన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ (పీడీ) శ్రీనివాసరావుపై సుమోటోగా కోర్టు ధిక్కార చర్యలు చేపట్టింది. తాజాగా ధర్మాసనం ఈ సుమోటో కోర్టు ధిక్కార వ్యాజ్యంతో పాటు సింగిల్ జడ్జి తీర్పుపై అధికారులు దాఖలు చేసిన అప్పీళ్లపై కూడా విచారణ జరిపింది. శ్రీనివాసరావు ఈ విచారణకు సైతం వ్యక్తిగతంగా హాజరయ్యారు. కోర్టు ఆదేశాలను గౌరవించి అమలు చేయండి చాలు... ఈ సందర్భంగా ఆయన దాఖలు చేసిన అఫిడవిట్లో పేర్కొన్న అంశాలపై ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. కోర్టుకు అసత్యాలు చెప్పొద్దని తేల్చి చెప్పింది. క్రిమినల్ కోర్టు ధిక్కార చర్యలూ ఎదుర్కోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ కేసులో మీ చర్యలను డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ (డీవోపీటీ)కి నివేదించాల్సి ఉంటుందని హెచ్చరించింది. అయితే 12 ఏళ్ల సుదీర్ఘ సర్వీసు ఉన్న నేపథ్యంలో ఆ పని చేయడం లేదని స్పష్టం చేసింది. కోర్టు ముందు ఎందుకు అసత్యాలు చెప్పాల్సి వ చ్చిందని ధర్మాసనం ప్రశ్నించగా, కోర్టు అంటే భయమని శ్రీనివాసరావు చెప్పారు. కోర్టు అంటే భయమంటూ మళ్లీ అబద్ధం చెబుతున్నారని ధర్మాసనం నవ్వుతూ వ్యాఖ్యానించింది. మరోసారి ఇలాంటి వాటిని పునరావృత్తం చేయవద్దని స్పష్టం చేసింది. పూర్తి వాస్తవాలతో మరో అఫిడవిట్ దాఖలు చేయాలని ఆయన్ను ఆదేశించింది. తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. -
తన వారి లబ్ధి కోసమే బాబు ఐఆర్ఆర్ ప్లాన్ మర్చారు: ఆర్కే
సాక్షి, విజయవాడ: అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ కుంభకోణం కేసులో సీఎం చంద్రబాబు ముందస్తు బెయిల్ రద్దు చేయాలని మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై ఏపీ హైకోర్టు విచారణ జరిపిది. చంద్రబాబు ముందస్తు బెయిల్ రద్దు చేయాలని ఆళ్ల రామకృష్ణారెడ్డి పిటిషన్కు విచారణార్హత లేదని ప్రభుత్వం తన వాదనలు వినిపించింది.ఈ కేసు సంబంధించి ముందస్తు బెయిల్ ఇవ్వద్దని 542 పేజీలతో సీఐడీ కౌంటర్ వేసినట్టు కోర్టుకు న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ తెలిపారు. అదే సమయంలో కొన్ని ఆధారాలు కూడా కోర్టుకు సమర్పించినట్టు కోర్టుకు చెప్పారు. కేసు క్లోజ్ చేయకుండా ప్రొటెస్ట్ పిటిషన్ దాఖలు చేశామని ఈ నెల 27న ఏసీబీ కోర్టులో విచారణకు వస్తుందని శ్రవణ్కుమార్ కోర్టుకు తెలిపారు. వివరాలు సమర్పించాలన్న హైకోర్టు.. మార్చి 10కి వాయిదా వేసింది.మీడియాతో ఆళ్ల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. చంద్రబాబు గతంలో సీఎం గా ఉన్న సమయంలో ఐఆర్ఆర్ ప్లాన్ తన వారికి లబ్ధి పొందేందుకు మార్పులు చేశారని.. తాను ఈ అంశంపై సాక్ష్యాలతో సీఐడీకి ఫిర్యాదు చేశానని తెలిపారు. ‘‘నా సాక్ష్యాలను పరిశీలించి ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఛార్జ్షీట్ వేశారు. చంద్రబాబుతో పాటు మంత్రి నారాయణ, లింగమనేని రమేష్, లోకేష్, అంజనీ కుమార్పై కేసు నమోదైంది. వీళ్ళందరూ ఐఆర్ఆర్ను తమకు లబ్ధి కోసం అనేక మార్పులు ఐఆర్ఆర్లో అక్రమాలు చేశారు...అక్రమ మార్గంలో డబ్బు పొందేందుకు ఐఆర్ఆర్ను వాడుకున్నారు. 2014 ముందు లింగమనేని రమేష్ 500 ఎకరాలు పొలం ఐఆర్ఆర్ మార్గంలో కొన్నారు. చంద్రబాబు 2014లో సీఎం అయ్యాక హెరిటేజ్ సంస్థకు ఎకరం 7 లేదా 8 లక్షలకు మాత్రమే లింగమనేని అమ్మారు. ఐఆర్ఆర్ ద్వారా లాభం పొందిన కారణంగా హెరిటేజ్కు ఎకరం 4 కోట్లు ఉంటే 8 లక్షలకు అమ్మారు. నారా లోకేష్ కూడా ఈ కేసులో ముద్దాయిగా ఉన్నారు. చంద్రబాబు అప్పట్లో ఈ కేసులో ముందస్తు బెయిల్ పొందారు. ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ ద్వారా రూ. 2500 కోట్లు లబ్ధి పొందారు..కానీ అప్పుడు 542 పేజీలతో బెయిల్ ఇవ్వొద్దని కోర్టులో కౌంటర్ వేసిన సీఐడీ ఇప్పుడు కేసు లేదని ఏసీబీ కోర్టును ఆశ్రయించటం దారుణం. చంద్రబాబు హోం మంత్రిగా అనితకు ఇచ్చిన లా అండ్ ఆర్డర్ మాత్రం చంద్రబాబు తన వద్దే ఉంచుకున్నారు. ఐపీఎస్ అధికారులపై ఒత్తిడి తెచ్చి చంద్రబాబు తన కేసు క్లోజ్ చేయించుకుంటున్నాడు. చంద్రబాబు ఐఆర్ఆర్ కేసులో తొలి ముద్దాయి, లోకేష్ 14వ ముద్దాయి. ఐఆర్ఆర్ కేసులో చంద్రబాబు ముద్దాయిగా తేలడం ఖాయం’’ అని ఆళ్ల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. -
ప్రభుత్వంలో ఎక్కడో ఏదో తేడా ఉంది
సాక్షి, అమరావతి: ఉన్నత విద్యాశాఖ పరిధిలోని విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తూ యూజీసీ స్కేల్ పొందుతున్న బోధనా సిబ్బంది పదవీ విరమణ వయసును 62 నుంచి 65కి పెంచిన రాష్ట్ర ప్రభుత్వం, వ్యవసాయ శాఖ పరిధిలోని విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న బోధనా సిబ్బంది పదవీ విరమణ వయసు 65కి పెంచకపోవడం రాజ్యాంగ విరుద్ధమని హైకోర్టు తేల్చి చెప్పింది. ప్రభుత్వ చర్యలు వివక్షాపూరితమని స్పష్టం చేసింది. ప్రభుత్వంలో ఎక్కడో ఏదో తేడా ఉందని ఈ సందర్భంగా వ్యాఖ్యానించిన హైకోర్టు, ముఖ్యమంత్రి కార్యాలయంలో (సీఎంఓ) కూర్చొని ఒకరిద్దరు అధికారులే అన్నీ నిర్ణయాలు తీసేసుకుంటున్నారని సూచించింది. మనది ప్రజాస్వామ్య దేశమే తప్ప, నియంతృత్వ దేశం కాదని, ఈ విషయాన్ని అధికారులందరూ గుర్తు పెట్టుకోవాలని స్పష్టం చేసింది. ఎలా పడితే అలా, ఏది పడితే అది చేయడానికి వీల్లేదంది. ఈ అంశంపై దాఖలైన అప్పీళ్లపై న్యాయమూర్తులు జస్టిస్ బట్టు దేవానంద్, జస్టిస్ సుబేంధు శమం ధర్మాసనం సోమవారం కీలక మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. బోధనా సిబ్బంది కొనసాగింపునకు ఆదేశాలు.. వ్యవసాయ శాఖ పరిధిలోని ఉద్యానవన, వ్యవసాయ, పశుసంవర్ధక, మత్స్య విశ్వవిద్యాలయాల్లో యూజీసీ స్కేల్ పొందుతున్న బోధనా సిబ్బందిని తదుపరి ఉత్తర్వులిచ్చేంత వరకు కొనసాగించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు తాజాగా ఆదేశించింది. పదవీ విరమణ వయసును 65కి పెంచాలంటూ ఈ నాలుగు విశ్వవిద్యాలయాలు చేసిన ప్రతిపాదనలను వ్యవసాయ శాఖ ఎక్స్ అఫీషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బుడిత రాజశేఖర్ ఏకపక్షంగా తిరస్కరించడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. ఈ మేరకు రాజశేఖర్ ఇచి్చన లేఖ అమలును నిలిపేసింది. వ్యవసాయ శాఖ పరిధిలోని విశ్వవిద్యాలయాల్లో ఇప్పటికే పలువురు పదవీ విరమణ చేశారని, అయితే ప్రభుత్వం ఆ ఖాళీలను భర్తీ చేసేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆక్షేపించింది. ఇలా అయితే విద్యార్థులకు నాణ్యమైన విద్య ఎలా అందుతుందని ప్రశి్నంచింది. పదవీ విరమణ వయసు పెంపుపై కౌంటర్ దాఖలుకు ప్రభుత్వానికి మూడు వారాల గడువునిచ్చింది. కాగా ఈ అంశంపై ధర్మాసనం ఆదేశాల మేరకు బుడిద రాజశేఖర్ కోర్టు ముందు స్వయంగా హాజరయ్యారు. -
భర్త అసౌకర్యం కంటే భార్య సౌకర్యానికే ప్రాధాన్యత
సాక్షి, అమరావతి: వైవాహిక వివాదాల కేసుల్లో భర్తకు కలిగే అసౌకర్యం కంటే భార్య సౌకర్యానికే ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసింది. విడాకుల నిమిత్తం భర్త పిటిషన్ దాఖలు చేసిన ప్రదేశానికి వెళ్లడానికి భార్యకు తగినంత ఆర్థిక స్తోమత లేనప్పుడు, ఆ పిటిషన్ను తనకు సౌకర్యంగా ఉండే చోటుకు బదిలీ చేయాలని కోరుతూ ఆమె దాఖలు చేసిన బదిలీ పిటిషన్ను అనుమతించవచ్చని హైకోర్టు తెలిపింది. వైవాహిక వివాదాల కేసుల్లో బదిలీ పిటిషన్లను పరిశీలించేటప్పుడు కోర్టులు ఇరుపక్షాల సామాజిక, ఆర్థిక స్థితిగతులను, వారి జీవన ప్రమాణాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొంది.రెండు వేర్వేరు విడాకుల కేసుల్లో ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ వేణుతురుమల్లి గోపాలకృష్ణారావు ఇటీవల ఆదేశాలు ఇచ్చారు. తన భర్త మోహన మురళీ దాఖలు చేసిన విడాకుల పిటిషన్ను రేపల్లె నుంచి ఒంగోలుకు బదిలీ చేయాలని కోరుతూ భార్య రాజేశ్వరి దాఖలు చేసిన పిటిషన్ను, అలాగే తన భర్త పవన్ దాఖలు చేసిన విడాకుల పిటిషన్ను తిరుపతి నుంచి ఆదోనికి బదిలీ చేయాలని ఐశ్వర్య అనే మరో మహిళ దాఖలు చేసిన పిటిషన్ను న్యాయమూర్తి అనుమతించారు. కాగా, విడాకుల కోసం పిటిషన్లు దాఖలు చేసిన భర్తలను తప్పనిసరిగా కోర్టు ముందు వ్యక్తిగతంగా హాజరు కావాల్సిందేనంటూ ఒత్తిడి చేయవద్దని న్యాయమూర్తి సూచించారు. భర్తల తరఫున న్యాయవాదులు హాజరవుతున్నంత కాలం వారి వ్యక్తిగత హాజరు అవసరం లేదని పేర్కొన్నారు. అయితే క్రాస్ ఎగ్జామినేషన్ లేదా ఇతర ప్రత్యేక పరిస్థితుల్లో వ్యక్తిగత హాజరుకు ఆదేశాలు ఇవ్వవచ్చని స్పష్టం చేశారు. -
పాఠశాలల ఆవరణల్లో వాణిజ్య సముదాయాలా..?
సాక్షి, అమరావతి: జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల ఆవరణల్లో వాణిజ్య సముదాయాల నిర్మాణాలను నిలిపివేస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. చిత్తూరు జిల్లా, బైరెడ్డిపల్లి పాఠశాల వద్ద రూ.50 లక్షలతో, వి.కోట పాఠశాల వద్ద రూ.25 లక్షల అంచనా వ్యయంతో వాణిజ్య సముదాయాలను నిర్మించాలని అధికారులు నిర్ణయించారని, ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని కోరుతూ విశ్రాంత ఉపాధ్యాయుడు నారాయణరెడ్డి సోమచంద్రరెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై న్యాయమూర్తి జస్టిస్ న్యాపతి విజయ్ శుక్రవారం విచారణ జరిపారు. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది కేజీ కృష్ణమూర్తి వాదనలు వినిపిస్తూ ఈ నిర్మాణాల వల్ల విద్యార్థుల చదువుపై ప్రతికూల ప్రభావం పడుతుందని వివరించారు. వాదనలు విన్న న్యాయమూర్తి నిర్మాణాలను చేపట్టవద్దని ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చారు. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు. తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేశారు. -
ఆ అధికారం పోలీసులకు లేదు
సాక్షి, అమరావతి: రాజకీయ పార్టీలు నిర్వహించే బహిరంగ సభలకు అనుమతిని నిరాకరించే అధికారం పోలీసులకు లేదని హైకోర్టు చెప్పింది. ఆ సభలను నియంత్రించే అధికారం మాత్రమే పోలీసులకు ఉందని స్పష్టం చేసింది. భారత యువజన చైతన్య పార్టీ (బీవైసీపీ) ఈ నెల 22న బీసీ సింహ గర్జన పేరుతో నిర్వహించతలపెట్టిన బహిరంగ సభకు పోలీసులు అనుమతి నిరాకరించడాన్ని తప్పుపట్టింది. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలను, సీబీఎస్ఈ పరీక్షలను సాకుగా చూపుతూ అనుమతి నిరాకరించడాన్ని ప్రశ్నింశ్నించింది. సభ నిర్వహించేది ఆదివారమని, ఆ రోజున అసెంబ్లీ సమావేశాలు గానీ, సీబీఎస్ఈ పరీక్షలు గానీ లేవని గుర్తు చేసింది. బహిరంగ సభకు అనుమతి విషయంలో గురువారం ఇరుపక్షాలు వాదనలు విన్న న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ యడవల్లి లక్ష్మణరావు ఈ అంశంపై తగిన ఉత్తర్వులు జారీ చేస్తామని తెలిపారు. పిటిషన్ దాఖలు చేసిన బీవైసీపీ పార్టీ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ తరఫున సీనియర్ న్యాయవాది వై.వి.రవిప్రసాద్ వాదనలు వినిపిస్తూ పోలీసులు అధికార పార్టీ నిర్వహించే సభల విషయంలో ఓ రకంగా, మిగిలిన పార్టీల విషయంలో మరోరకంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. రామచంద్ర యాదవ్పై పలు కేసులున్నాయని ప్రభుత్వ సహాయ న్యాయవాది అజయ్ పేర్కొనగా, ఆ కేసుల వివరాలను పరిశీలించిన న్యాయమూర్తి అవన్నీ వేర్వేరు అంశాలకు సంబంధించినవని, సభ అనుమతి షరతులను ఉల్లంఘించిన కారణంగా నమోదు చేసిన కేసులు కావని వ్యాఖ్యానించారు. -
ఉద్యోగ విరమణ వయసుపై వివక్ష ఎందుకు?
సాక్షి, అమరావతి: వ్యవసాయశాఖ పరిధిలోని డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన వర్సిటీ, శ్రీవేంకటేశ్వర వెటర్నరీ, ఏపీ ఫిషరీస్, ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ వర్సిటీల్లో పనిచేస్తూ యూజీసీ వేతనాలు పొందుతున్న ప్రొఫెసర్ల పదవీ విరమణ వయసు పెంపు విషయంలో ప్రభుత్వ వివక్షను హైకోర్టు ప్రశ్నించింది. ఉన్నత విద్యాశాఖ పరిధిలోని విశ్వవిద్యాలయాల్లో ప్రొఫెసర్ల పదవీ విరమణ వయసును 62 నుంచి 65 సంవత్సరాలకు పెంచిన రాష్ట్ర ప్రభుత్వం.. ఈ వర్సిటీల్లో ప్రొఫెసర్ల పదవీ విరమణ వయసును మాత్రం పెంచకపోవడాన్ని తీవ్రంగా ఆక్షేపించింది. ఎందుకు ఇలా వివక్ష చూపుతున్నారని ప్రశ్నించింది. ఉన్నత విద్యాశాఖ పరిధిలోని వర్సిటీల ప్రొఫెసర్లకు ఓ న్యాయం, మిగిలిన వర్సిటీల ప్రొఫెసర్లకు ఓ న్యాయమా? అంటూ నిలదీసింది. ఐఏఎస్ అధికారులకు పదవీ విరమణ చేసిన తరువాత కూడా పొడిగింపులు ఇస్తున్న ప్రభుత్వం.. అన్ని అర్హతలు ఉండి, యూజీసీ స్కేల్ తీసుకున్న ప్రొఫెసర్లకు మాత్రం పదవీ విరమణ వయసును ఎందుకు పెంచదని గట్టిగా ప్రశ్నించింది. పదవీ విరమణ వయస్సు పెంచాలని ఉద్యాన తదితర వర్సిటీలు సిఫార్సు చేస్తే, అలాంటి సిఫార్సులు ఏవీ రాలేదని ప్రభుత్వం చెప్పడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. అలాగే ఆర్థికశాఖ సైతం పదవీ విరమణ వయసు పెంపునకు అంగీకరించడం లేదని చెప్పడాన్ని కూడా ఆక్షేపించింది. కోర్టుకు తప్పుడు సమాచారం ఇవ్వొద్దంది. పదవీ విరమణ వయసు పెంపు విషయంలో వర్సిటీల సిఫార్సులను ఎందుకు తిరస్కరించారో, దీనివెనుక ఉన్న హేతుబద్ధత ఏమిటో స్వయంగా తమముందు హాజరై చెప్పాలని వ్యవసాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బుడితి రాజశేఖర్ను ఆదేశించింది. విచారణను ఈ నెల 23కి వాయిదా వేస్తూ.. న్యాయమూర్తులు జస్టిస్ బట్టు దేవానంద్, జస్టిస్ మండవ కిరణ్మయి ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీచేసింది.సింగిల్ జడ్జి తీర్పుపై అప్పీళ్లు..ఉన్నత విద్యాశాఖ నియంత్రణలోని వర్సిటీల్లో బోధన సిబ్బంది పదవీ విరమణ వయసును పెంచిన ప్రభుత్వం వ్యవసాయశాఖ పరిధిలోని వర్సిటీల్లో పనిచేస్తున్న తమ పదవీ విరమణ వయసు పెంచలేదని డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన, శ్రీవేంకటేశ్వర వెటర్నరీ, ఏపీ ఫిషరీస్, ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ వర్సిటీల్లో పనిచేస్తున్న పలువురు ప్రొఫెసర్లు, డీన్లు, శాఖాధిపతులు హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. విచారణ జరిపిన సింగిల్ జడ్జి ఆ పిటిషన్లను కొట్టేశారు. పదవీ విరమణ వయసు పెంపు విధానపరమైన నిర్ణయమని పేర్కొన్నారు. వ్యవసాయ శాఖ నియంత్రణలో పనిచేస్తున్న వర్సిటీల బోధన సిబ్బంది పదవీ విరమణ వయసు పెంపు విషయంలో నాలుగునెలల్లో నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు. తమ పిటిషన్లను కొట్టేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ పిటిషనర్లు ధర్మాసనం ముందు అప్పీళ్లు దాఖలు చేశారు. వీటిపై విచారణ జరుపుతున్న ధర్మాసనం తాజాగా సోమవారం మరోసారి విచారించింది. -
మూల్యాంకనంలో అక్రమాలపై సిట్ ఏర్పాటు చేయండి
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) గ్రూప్–1 ప్రధాన పరీక్ష జవాబు పత్రాల మూల్యాంకనం కేసులో హైకోర్టు బుధవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. మూల్యాంకనంలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో వాస్తవాలను నిగ్గు తేల్చేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. లేనిపక్షంలో ప్రస్తుతం ఉన్న సిట్ను పునర్వ్యవస్థీకరించాలని ఆదేశించింది. ఈ సిట్కు అదనపు డీజీ స్థాయికి తక్కువ కాని అధికారి నేతృత్వం వహించాల్సి ఉంటుందని తెలిపింది. ఈ సిట్లో ఎవరెవరు ఉంటారన్న వివరాలను మూడు రోజుల్లో హైకోర్టు రిజిస్ట్రార్ కు అందచేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఎంపికైన అభ్యర్థుల జవాబు పత్రాలు భద్రంగా ఉన్నాయా లేదా, వాటిని ఎవరైనా ట్యాంపరింగ్ చేశారా అనే విషయాలను క్షుణ్ణంగా పరిశీలించాలని సిట్ను ఆదేశించింది. అసలు ఓఎంఆర్ షీట్లు, విజయవాడలో ఫిజికల్ వాల్యుయేషన్ సమయంలో ఉపయోగించిన ఓఎంఆర్ షీట్లు, సమాధాన పత్రాలపై ఉన్న బార్ కోడ్లు, వాటినుంచి సేకరించిన వివరాలన్నీ ఒకేలా ఉన్నాయో లేదో సరిపోల్చాలని కూడా స్పష్టం చేసింది. ఎంపికైన అభ్యర్థుల సమాధాన పత్రాలను ఏవిధంగా తనిఖీ చేస్తారో, అదే రీతిలో ఎంపిక కాని అభ్యర్థుల సమాధాన పత్రాలను కూడా పరిశీలించాలని ఆదేశించింది. అలాగే మెరిట్ లిస్ట్లో చివరిగా ఎంపికైన అభ్యర్థి కంటే కింద ఉన్న 100 మంది అభ్యర్థుల జవాబు పత్రాలను కూడా పరిశీలించాలని సిట్ను హైకోర్టు ఆదేశించింది. పైన పేర్కొన్న నిర్దిష్ట అంశాలపైనే కాకుండా (బార్ కోడ్లు, ఓఎంఆర్ షీటు వంటివి), దర్యాప్తు సంస్థ ఇతర శాస్త్రీయ మార్గాల ద్వారా కూడా అక్రమాలను వెలికితీయవచ్చని కోర్టు స్పష్టం చేసింది. దర్యాప్తులో ఎలాంటి స్థానిక ప్రభావం లేకుండా ఉండటానికి, రాష్ట్రం వెలుపల ఉన్న ఏదైనా సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ నిపుణుల సహాయం తీసుకోవాలని కోర్టు ఆదేశించింది. ఇప్పటికే ఎంపికై ఉద్యోగాలు చేస్తున్న వారు తమ అధికార బలంతో విచారణను ప్రభావితం చేసే అవకాశం ఉందని ఎంపిక కాని అభ్యర్థులు అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో తక్షణమే వారందరినీ తదుపరి ఉత్తర్వులు జారీ చేసేంత వరకు నాన్–ఫోకల్ (ప్రాధాన్యత లేని) పోస్టులకు బదిలీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఓ వారంలో ఆ అధికారుల బదిలీలకు సంబంధించిన వివరాలతో ఓ నివేదికను రిజి్రస్టార్ జ్యుడీషియల్కు అందచేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. ఎంపిక కాని అభ్యర్థుల జవాబు పత్రాలను కూడా ఎంపికైన అభ్యర్థుల మాదిరిగానే విచారించాలని సిట్కు తేల్చి చెప్పింది. మార్చి 16 లోపు నివేదిక సమర్పించాలని సిట్ను ఆదేశించింది. అన్ని అప్పీళ్లపై మార్చి 16న తిరిగి విచారణ జరుపుతామంది. ఈ ఆదేశాల కాపీని ప్రత్యేక మెసెంజర్ ద్వారా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి అందచేయాలని రిజిస్ట్రీని ఆదేశించింది. ఈ వ్యాజ్యంలో సిట్ను ప్రతివాదిగా చేర్చాలని రిజిస్ట్రీకి స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ బట్టు దేవానంద్, జస్టిస్ అవధానం హరిహరనాథశర్మ ధర్మాసనం బుధవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. సింగిల్ జడ్జి తీర్పుపై అప్పీళ్ల నేపథ్యంలో గ్రూప్–1 ప్రధాన పరీక్ష జవాబు పత్రాల మూల్యాంకనంలో అక్రమాలు జరిగాయంటూ హైకోర్టులో పలు వ్యాజ్యాలు దాఖలయ్యాయి. ఈ వ్యాజ్యాలపై విచారణ జరిపిన సింగిల్ జడ్జి గ్రూప్–1 మెయిన్స్ పరీక్ష మొత్తాన్ని రద్దు చేశారు. అలాగే గ్రూప్–1 మెయిన్స్లో అర్హత సాధించిన వారి జాబితాను కూడా రద్దు చేశారు. తిరిగి గ్రూప్–1 మెయిన్స్ పరీక్ష నిర్వహించాలని, మొత్తం ప్రక్రియను 6 నెలల్లో పూర్తి చేయాలని ఏపీపీఎస్సీ అధికారులను ఆదేశించారు. ఈ తీర్పును సవాల్ చేస్తూ ఏపీపీఎస్సీ హైకోర్టు ధర్మాసనం ముందు అప్పీల్ దాఖలు చేసింది. మరోవైపు ఉద్యోగాలు పొంది ప్రస్తుతం వివిధ హోదాల్లో కొనసాగుతున్న వారు కూడా అప్పీళ్లు దాఖలు చేశారు. అలాగే వీరు పలు అభ్యర్థనలతో అనుబంధ పిటిషన్లు సైతం దాఖలు చేశారు. కాలేజీ ఎడ్యుకేషన్ కమిషనర్ను ప్రతివాదిగా చేయాలని, గ్రూప్–1 మూల్యాంకనంలో జరిగిన అక్రమాల మీద నమోదైన క్రిమినల్ కేసులో సిట్ దర్యాప్తు అధికారి ఫోరెన్సిక్ ఎగ్జామినేషన్ రిపోర్టును కోర్టు ముందు ఉంచేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ అనుబంధ పిటిషన్లు దాఖలు చేశారు. కోర్టు నియమించిన కమిటీ పరిశీలించిన ఆన్సర్ షీట్స్, కంట్రోల్ బండిల్స్ ఫోరెన్సిక్ ఎగ్జామినేషన్కి ఇవ్వాలన్న అభ్యర్థనలతో మరికొన్ని అనుబంధ పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై గతంలో వాదనలు విని తీర్పు రిజర్వ్ చేసిన న్యాయమూర్తి జస్టిస్ దేవానంద్ నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం తన నిర్ణయాన్ని వెలువరించింది. -
హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా బాలాజీ మెడమల్లి
సాక్షి, అమరావతి: హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా బాలాజీ మెడమల్లి నియమితులయ్యారు. ఈ నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదముద్ర వేశారు. దీంతో అదనపు న్యాయమూర్తిగా బాలాజీ నియామకాన్ని నోటిఫై చేస్తూ కేంద్ర న్యాయశాఖ సంయుక్త కార్యదర్శి జగన్నాథ్ శ్రీనివాసన్ మంగళవారం నోటిఫికేషన్ జారీ చేశారు. అదనపు న్యాయమూర్తిగా బాలాజీ రెండు మూడు రోజుల్లో ప్రమాణం చేసే అవకాశం ఉంది. హైకోర్టు న్యాయమూర్తి పోస్టుకు బాలాజీ పేరును సిఫారసు చేస్తూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం గత నెలలో తీర్మానం చేసిన విషయం తెలిసిందే. ఈ తీర్మానం కేంద్ర న్యాయశాఖ, ప్రధాన మంత్రి కార్యాలయం ద్వారా రాష్ట్రపతికి చేరింది. దీంతో బాలాజీ నియామకానికి రాష్ట్రపతి తాజాగా ఆమోద ముద్ర వేశారు. ఈ నియామకంతో హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 33కి చేరింది. ప్రస్తుతం హైకోర్టులో 32 మంది న్యాయమూర్తులుండగా, ఇందులో ఆరుగురు అదనపు న్యాయమూర్తులున్నారు. ఇదీ నేపథ్యం... బాలాజీ మెడమల్లి వైఎస్సార్ కడప జిల్లా, శేషన్నగారిపల్లికి చెందిన వ్యక్తి. లక్ష్మీనరసమ్మ, సుబ్బయ్యనాయుడు దంపతులకు 1972 మే 29న జన్మింంచారు. వీరిది వ్యవసాయ కుటుంబం. కుటుంబంలో బాలాజీనే మొదటితరం న్యాయవాది. రాజంపేటలో ప్రాథమిక విద్యను, తిరుపతి శ్రీవెంకటేశ్వర ఆర్ట్స్ కాలేజీలో డిగ్రీ పూర్తి చేశారు. హైదరాబాద్ పడాల రామిరెడ్డి లా కాలేజీలో న్యాయ విద్యను అభ్యసించారు. 1998లో హైకోర్టు న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. న్యాయవాది గూడపాటి వెంకటేశ్వరరావు వద్ద వృత్తి జీవితాన్ని ఆరంభించారు. గతంలో ఆయన ప్రభుత్వ సహాయ న్యాయవాదిగా వ్యవహరించారు. 2018–19 మధ్య కాలంలో విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కౌన్సిల్గా ఉన్నారు. పలు సంస్థలకు, బ్యాంకులకు స్టాండింగ్ కౌన్సిల్గా వ్యవహరిస్తున్నారు. బాలాజీకి భార్య కళ్యాణి, కుమారుడు సుచంద్రహాస్, కుమార్తె లక్ష్మీశ్వేత ఉన్నారు. -
DSCలో అక్రమ నియామకాలు.. ఏపీ హైకోర్టు ఆగ్రహం
సాక్షి,విజయవాడ: డీఎస్సీలో అక్రమ నియామకాలపై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. షెడ్యూల్డ్ ఏరియాలోని గిరిజనుల చేత పూరించవలసిన 3వేల అధ్యాపక పోస్టులను జనరల్లో పూరించడంపై సీరియస్ అయ్యింది.గిరిజన యువతీ యువకులకు అన్యాయం చేయడమే రాష్ట్రప్రభుత్వ ఉద్దేశమా అని హైకోర్టు ప్రశ్నించింది. అధికారులు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు. గిరిజన నిరుద్యోగులకు చెందాల్సిన పోస్టులను ఏ అధికారంతో డీఎస్పీలో కలిపారంటూ నిలదీసింది.ప్రభుత్వాలు చేస్తున్న తప్పుల వల్ల ప్రజలు ప్రజాస్వామ్యంపై నమ్మకం కోల్పోతున్నారు. గిరిజన ప్రాంతాల్లో ఎన్ని ఖాళీలున్నాయి. ఎంతమంది అభ్యర్థుల చేత ఖాళీలు పూరించబడ్డాయి. ఇంకా ఎన్నిపోస్టులు పూరించాలో ప్రమాణపత్రం దాఖలు చేయాలని.. ట్రైబల్ వెల్ఫేర్ కమిషనర్ను హైకోర్టు ఆదేశించింది.రాష్ట్ర ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్ల గిరిజన నిరుద్యోగులు తమ హక్కులు కోల్పోతున్నారన్న న్యాయస్థానం.. తదుపరి విచారణ రెండు వారాలకు వాయిదా వేసింది. -
ఒకే ఘటనపై ఎన్ని కేసులు పెడతారు
సాక్షి, అమరావతి: తిరుమల శ్రీవారి లడ్డూ తయారీలో వినియోగించిన నెయ్యిలో జంతు కొవ్వులు లేవని సీబీఐ–సిట్ చార్జిషిట్ దాఖలు చేసినా.. అధికార పార్టీ తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టే క్రమంలో చేసిన వ్యాఖ్యలకు గాను తనపై రాష్ట్రవ్యాప్తంగా వేర్వేరు పోలీస్ స్టేషన్లలో నమోదైన 33 కేసులను కొట్టేయాలని కోరుతూ మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత అంబటి రాంబాబు సోమవారం అత్యవసరంగా హైకోర్టును ఆశ్రయించారు. లంచ్ మోషన్ రూపంలో దాఖలు చేసిన ఈ వ్యాజ్యాలపై న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప విచారణ జరిపారు.ఒకే అంశంపై ఎన్ని ఎఫ్ఐఆర్లు దాఖలు చేస్తారని న్యాయమూర్తి ప్రశి్నంచారు. మొదటి ఫిర్యాదును ప్రధాన కేసుగా తీసుకుని మిగిలిన అన్ని ఫిర్యాదులను సీఆర్పీసీ సెక్షన్ 162 కింద వాంగ్మూలాలుగా ఎందుకు పరిగణించకూడదన్నారు. దీనిపై పోలీసులకు తగిన సూచనలు చేస్తామని పబ్లిక్ ప్రాసిక్యూటర్ మెండ లక్ష్మీనారాయణ తెలిపారు. ఈ విషయంపై తదుపరి విచారణ నాటికి స్పష్టత తీసుకోవాలని పీపీకి న్యాయమూర్తి స్పష్టం చేశారు. అంబటిపై రాష్ట్రవ్యాప్తంగా నమోదైన 33 కేసుల్లో చట్ట ప్రకారం నడుచుకోవాలని పోలీసులను న్యాయమూర్తి ఆదేశించారు.బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 35(3) కింద నోటీసులు జారీ చేసి ఆయన వివరణ తీసుకోవాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను మార్చి 2కి వాయిదా వేశారు. అంబటి తరఫున సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్రెడ్డి వాదనలు వినిపించారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా నమోదైన 35 కేసులు ఒకే అంశానికి సంబంధించినవని, దీనిపై బహుళ ఎఫ్ఐఆర్లు నమోదు చేయడానికి వీల్లేదని తెలిసినా పోలీసులు కేసులు నమోదు చేస్తూనే ఉన్నారని కోర్టుకు తెలిపారు. చట్ట ప్రకారం నడుచుకోండి గత ఏడాది జూన్లో వెన్నుపోటు దినం పేరుతో బైక్ ర్యాలీ నిర్వహించినందుకు అంబటి రాంబాబుపై నమోదైన కేసుల్లో బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 35(3) ప్రకారం నడుచుకోవాలని గుంటూరు, పట్టాభిపురం పోలీసులను హైకోర్టు ఆదేశించింది. ఆయనకు నోటీసులిచ్చి వివరణ తీసుకోవాలంది. అంబటిపై నమోదైన కేసులు ఏడేళ్ల కన్నా తక్కువ శిక్ష పడేవేనని, ఫిర్యాదుదారులకు నోటీసులివ్వాలని స్పష్టం చేసింది. తదుపరి విచారణను మార్చి 16కి వాయిదా వేస్తూ న్యాయమూర్తి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. -
ఏపీ హైకోర్టులో మాజీ మంత్రి అంబటి రాంబాబుకు ఊరట
సాక్షి,విజయవాడ: ఏపీ హైకోర్టులో మాజీ మంత్రి అంబటి రాంబాబుకు ఊరట లభించింది. పట్టాభిపురం, నగరం పాలెం పోలీసులు నమోదు చేసిన కేసులను క్వాష్ చేయాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అంబటి దాఖలు పిటిషన్పై విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా 35 (3) BNSS ప్రొసీజర్ ఫాలో కావాలని ఏపీ హైకోర్టు పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. -
ఆక్రమణదారులు పరిహారానికి అనర్హులు
సాక్షి, అమరావతి: చట్టబద్ధ యాజమాన్య పత్రాలు లేకుండా ప్రభుత్వ భూమిలో ఎన్ని దశాబ్దాలు ఉన్నా.. వారు ఆక్రమణదారులుగానే పరిగణించబడతారని హైకోర్టు స్పష్టం చేసింది. దీర్ఘకాలిక నివాసం ఆధారంగా భూ యజమాని హోదా రాదని తేల్చి చెప్పింది. ఆక్రమణదారులు 2013 భూసేకరణ చట్టం కింద ‘భూ యజమానులు‘ నిర్వచన పరిధిలోకి రారని, పరిహారానికి అర్హులు కాలేరని కుండబద్దలు కొట్టింది. భూమిపై లేదా ఆస్తిపై చెల్లుబాటయ్యే యాజమాన్య హక్కులు కలిగి ఉన్న వారు మాత్రమే 2013 భూ సేకరణ చట్టం కింద పరిహారానికి అర్హులని వివరించింది.పిటిషనర్లు కోరినట్టు భూసేకరణ చట్టం కింద పరిహారం చెల్లించాల్సిన అవసరం లేదని తెలిపింది. ఇప్పటికే ప్రభుత్వం వారికి ప్రత్యామ్నాయ గృహ వసతి కల్పించిన విషయాన్ని కోర్టు గుర్తు చేసింది. రైల్వే ఓవర్ బ్రిడ్జి కోసం తమ అధీనంలో ఉన్న భూములు తీసుకున్నందున తమకు పరిహారం చెల్లించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ పలువురు దాఖలు చేసిన పిటిషన్లను తోసిపుచ్చింది. అలాగే అధికారులపై వారు దాఖలు చేసిన కోర్టు ధిక్కార పిటిషన్లనూ కొట్టేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ నూనెపల్లి హరినాథ్ ఇటీవల తీర్పు వెలువరించారు.పూర్వీకుల కాలం నుంచి ఆ భూముల్లోనే ఉంటున్నాంతాము ఉంటున్న భూమిని ప్రభుత్వం రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం కోసం తీసుకుంటున్నందున తమకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లించాలని కోరుతూ విజయవాడలోని గుణదల ప్రాంతానికి చెందిన పలువురు 2020,21,22 సంవత్సరాల్లో రిట్ పిటిషన్లు దాఖలు చేశారు. ఈ భూమిలో తాము తమ పూర్వీకుల కాలం నుంచి నివసిస్తున్నామని పేర్కొన్నారు. క్రమం తప్పకుండా ఆస్తి పన్ను చెల్లిస్తున్నామని, విద్యుత్, మునిసిపల్ నీటి కనెక్షన్లు కూడా ఉన్నాయని వివరించారు. తాము భూమిలేని పేదలమని, అక్కడే షాపులు నడుపుకుంటూ జీవిస్తున్నామని, తమకు న్యాయం చేయాలని కోరారు.అయితే పిటిషనర్లు ఆక్రమించిన భూమి ప్రభుత్వ కాలువ, శ్మశాన వాటిక భూమిగా రికార్డుల్లో ఉందని అధికారులు హైకోర్టుకు నివేదించారు. పిటిషనర్ల వద్ద ఎటువంటి యాజమాన్య పత్రాలు లేవని, కేవలం పన్నులు కట్టినంత మాత్రాన యాజమాన్య హక్కులు రావని వివరించారు. అయినప్పటికీ, పిటిషనర్లతో పాటు ఇతర బాధితులకు మానవతా దృక్పథంతో ప్రత్యామ్నాయంగా 114 ఇళ్లు కేటాయించామని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు పిటిషనర్ల వాదనలను తోసిపుచ్చింది. వీరు 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం పొందలేరని స్పష్టంచేసింది. -
జోగి రమేశ్కు హైకోర్టులో ఊరట
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేశ్కు హైకోర్టులో ఊరట లభించింది. ఆయనపై నమోదు చేసిన కేసుల్లో కఠిన చర్యలేవీతీసుకోవద్దని ఎన్టీఆర్ జిల్లా, ఇబ్రహీంపట్నం పోలీసులతోపాటు, తిరుపతి జిల్లా, తిరుపతి గ్రామీణ పోలీసులను హైకోర్టు ఆదేశించింది. ఫిర్యాదుదారుకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 27కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. తిరుమల లడ్డూ నెయ్యి కల్తీపై అధికార టీడీపీ కూటమి నేతలు చేస్తున్న తప్పుడు ప్రచారంపై జోగి రమేశ్ చేసిన వ్యాఖ్యల గురించి న్యాయమూర్తి తన ఉత్తర్వుల్లో ప్రస్తావించారు. జోగి వ్యాఖ్యలు రాజ్యాంగంలోని ఆరి్టకల్ 19(1)(ఏ) ప్రకారం ‘వాక్ స్వాతంత్య్రం, భావ వ్యక్తీకరణ’ పరిధిలోకి వస్తాయని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. అంతేకాక ఆయనపై ఆరోపించిన నేరాలు ఏడేళ్ల కంటే తక్కువ జైలు శిక్ష పడేవేనని తెలిపారు. అందువల్ల ప్రస్తుత దశలో జోగి రమేశ్ను కస్టడీలోకి తీసుకుని విచారించాల్సిన తక్షణ అవసరం ఏదీ లేదని ఆమె ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. -
ఏపీ హైకోర్టులో అంబటి రాంబాబు క్వాష్ పిటిషన్లు
ఏపీ విజయవాడ: ఏపీ హైకోర్టులో మాజీ మంత్రి అంబటి రాంబాబు క్వాష్ పిటిషన్లు దాఖలు చేశారు. పట్టాభిపురం, నగరం పాలెం, మంగళగిరి, నల్లపాడు పోలీస్ స్టేషన్లలో తనపై అక్రమంగా కేసులు నమోదు చేశారని వాటిని క్వాష్ (కొట్టివేయాలని) చేయాలని కోరారు. ఇప్పటికే నల్లపాడు పీఎస్ కేసు క్వాష్ ఈ నెల 11కి వాయిదా పడింది. మంగళగిరిలో నమోదైన కేసులో 35 (3) BNSS ప్రొసీజర్ ఫాలో అవ్వాలని మంగళగిరి పోలీసులకు ఇవాళ ఏపీ హైకోర్టు ఆదేశాలు ఆదేశాలు జారీ చేసింది. అంబటిపై పిటి వారెంట్ కోసం మంగళగిరి కోర్టులో మంగళగిరి పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. మరో ఐదు కేసుల్లో క్వాష్ పిటిషన్లు వచ్చే సోమవారం విచారణకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. -
అంబటి రాంబాబు క్వాష్ పిటిషన్పై ఏపీ హైకోర్టులో విచారణ
సాక్షి,విజయవాడ: వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు క్వాష్ పిటిషన్పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. అంబటి రాంబాబుపై కేసును క్వాష్ చేయాలని రిమాండ్ చట్ట విరుద్ధమని అంబటి న్యాయవాది కోర్టులో వాదించారు.పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. తదిపరి విచారణ ఈనెల 11కు వాయిదా వేసింది. అంబటి రాంబాబు అరెస్టుఅంతకుముందు అంబటి రాంబాబును పోలీసులు గుంటూరులోని తన నివాసం వద్ద అరెస్టు చేశారు. గత శనివారం రాత్రి గం. 10.30 ప్రాంతంలో అంబటి రాంబాబును అరెస్ట్ చేశారు. ఆయనను నల్లపాడు పీఎస్కు తరలించారు. అంబటి రాంబాబు కేసును సమోటోగా తీసుకొని బీఎన్ఎస్ 126(2),132, 196(1), 352, 351(2),292 రెడ్విత్ 3(5),-BNS సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. హైకోర్టులోఅంబటి సతీమణి హౌస్ మోషన్ పిటిషన్ అరెస్టుపై అంబటి సతీమణి విజయలక్ష్మి హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. తనతోపాటు 60 మందిని పోలీసులు అక్రమంగా నిర్భందించారని ఆమె అందులో పేర్కొన్నారు. తనకు రక్షణ కల్పించడంలో పోలీసులు విఫలమయ్యారని, శాంతి భద్రతల సమస్య ఉందని పిటిషన్లో వివరించారు. తనకు 24 గంటలు భద్రత కల్పించాలని, అందుకు అనుగుణంగా తక్షణమే చర్యలు తీసుకోవాలని విజయలక్ష్మి కోరిన విషయం తెలిసిందే. -
బిగ్ షాక్.. బాబు సర్కార్ కు హైకోర్టు నోటీసులు..
-
ఏపీ పోలీసులపై హైకోర్టు సీరియస్
-
నిందితులను రోడ్లపై ఎలా పెరేడ్ చేయిస్తారు?
సాక్షి, అమరావతి: పోలీసులు సామాన్య ప్రజలతో అమానవీయంగా వ్యవహరిస్తున్నారని హైకోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది. చట్ట నిబంధనలను పాటించాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని తేల్చి చెప్పింది. చట్టానికి లోబడే పోలీసులు శాంతి భద్రతలను కాపాడాల్సి ఉంటుందని చెప్పింది. వివిధ కేసుల్లో అరెస్టు చేసిన నిందితులను రోడ్లపై పెరేడ్ చేయిస్తూ.. ప్రింట్, ఎల్రక్టానిక్ మీడియా ముందు ఎందుకు ప్రవేశపెడుతున్నారని పోలీసులను నిలదీసింది. నేరం నిరూపణ అయ్యేంత వరకు నిందితులు నిరపరాధులేనని స్పష్టం చేసింది. నిందితులను పెరేడ్ చేయిస్తున్న వ్యవహారంలో రాష్ట్ర‡ ప్రభుత్వానికి, డీజీపీ, గుంటూరు, కృష్ణా, తూర్పు గోదావరి జిల్లాల ఎస్పీలకు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని వీరిని ఆదేశించింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ చల్లా గుణరంజన్ ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.వివిధ కేసుల్లో అరెస్టు చేసిన నిందితులను రోడ్లపై పెరేడ్ చేయిస్తూ, ప్రింట్, ఎల్రక్టానిక్ మీడియా ముందు ప్రవేశపెట్టడాన్ని రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించాలని కోరుతూ సొసైటీ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ ప్రాపర్టీ అండ్ ఎన్విరాన్మెంటల్ రైట్స్ కృష్ణా జిల్లా అధ్యక్షుడు పరసా సురేష్ కుమార్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)పై సీజే ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది.పోలీసులే న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తున్నారు పిటిషనర్ తరఫు న్యాయవాది జడా శ్రవణ్ కుమార్ వాదనలు వినిపిస్తూ, నిందితులను రోడ్లపై పెరేడ్ చేయించడం ఇటీవలి కాలంలో పెరిగిపోయిందని, ఇలా పెరేడ్ చేయించి మీడియా ముందు ప్రవేశపెట్టడం సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పులకు విరుద్దమని తెలిపారు. ఇలా చేయడం ఓ రకంగా నేరం చేశారని తీర్పునిచ్చేయడమేనన్నారు. వాస్తవానికి నేరం చేశారా లేదా అన్నది తేల్చాల్సింది న్యాయవ్యవస్థ మాత్రమేనని, అయితే రాష్ట్రంలో పోలీసులే న్యాయ నిర్ణేతల్లా వ్యవహరిస్తున్నారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.నేరారోపణ ఉన్న ప్రతి వ్యక్తీ దోషి కాదని, అలాంటప్పుడు వారిని రోడ్లపై పెరేడ్ చేయించడం వారి హక్కులను హరించడమే అవుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ.. ఉత్తర భారతదేశంలో ఓ ద్విచక్ర వాహనదారుడిని పోలీసులు దూషిస్తూ కొడుతున్నారని, ఇందుకు సంబంధించిన ఓ వీడియో క్లిప్పింగ్ తమకు వచి్చందని తెలిపింది. సామాన్య ప్రజల పట్ల పోలీసులు అమానవీయంగా వ్యవహరిస్తున్నారంది. పోలీసుల తరఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్జీపీ) సింగమనేని ప్రణతి వాదనలు వినిపిస్తూ.. ఓ కేసులో నిందితుడిని తీసుకెళ్లే వాహనం మరమ్మతులకు గురి కావడంతో పోలీసులు అతన్ని నడిపించుకు తీసుకెళ్లారని, దీన్ని ఫోటోలు తీసి ప్రచారం చేశారని వివరించారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. ప్రభుత్వానికి నోటీసులు జారీ చేస్తూ కౌంటర్ల దాఖలుకు ఆదేశాలిచ్చింది. -
ప్రజా సేవకులమని మర్చిపోయి.. పాలకుల్లా వ్యవహరిస్తున్నారు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రభుత్వ అధికారుల తీరుపై హైకోర్టు నిప్పులు చెరిగింది. అధికారులు ప్రజా సేవకులన్న విషయాన్ని మర్చిపోయి, వారే పాలకులన్నట్లు వ్యవహరిస్తున్నారని ఘాటుగా వ్యాఖ్యానించింది. అధికారులందరూ ఒక కుటుంబంగానే ఉంటారని, కానీ ప్రజలను ఎల్లవేళలా ఓ ప్రతిపక్షంలా చూస్తుంటారని తెలిపింది. కోర్టులు ఏం చేస్తాయిలే అనుకునే అధికారులను ఎవ్వరూ కాపాడలేరని స్పష్టం చేసింది. ప్రతి ఒక్కరూ కోర్టు ఆదేశాలను అమలుచేసి తీరాల్సిందేనని తేల్చి చెప్పింది. కోర్టులో మా ఆదేశాలను అమలుచేస్తామని చెప్పి, ఆఫీసులకు వెళ్లిన తరువాత మూలన పడేస్తే మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించింది. సింగిల్జడ్జి ఆదేశాల అమలుకు తీసుకున్న చర్యలను అఫిడవిట్ రూపంలో తమ ముందుంచాలని సర్వశిక్ష అభియాన్ ప్రాజెక్టర్ డైరెక్టర్ బి.శ్రీనివాసరావును న్యాయమూర్తులు జస్టిస్ బట్టు దేవానంద్, జస్టిస్ అవధానం హరిహరనాథ శర్మ ధర్మాసనం బుధవారం ఆదేశించింది. ప్రజాధనంతో పథకాలు తెస్తూ ప్రచారం కోసం వాడుకుంటున్నారు సర్వశిక్ష అభియాన్ పథకం అమలుపై కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన మెమోను పరిశీలించిన ధర్మాసనం.. కేంద్ర ప్రభుత్వ తీరును కూడా తప్పుపట్టింది. పథకాలను ప్రచారం కోసమే వాడుకుంటున్నారు తప్ప, అమలు బాధ్యతను తీసుకోవడంలేదని వ్యాఖ్యానించింది. దీనివల్ల పథకం ఉద్దేశం నెరవేరడంలేదని తెలిపింది. ప్రభుత్వాలు బాధ్యతల నుంచి తప్పుకున్నా న్యాయస్థానాలు మాత్రం బాధ్యత నుంచి తప్పుకోవని హైకోర్టు స్పష్టం చేసింది. పథకం అమలుపై పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. ఈ వ్యవహారంలో పూర్తిస్థాయి ఆదేశాలు ఇస్తామని స్పష్టం చేసింది.నోటీసులిచ్చి చేతులు దులిపేసుకుంటారా? తమను అర్ధంతరంగా తొలగించడాన్ని సవాలు చేస్తూ కేజీబీవీ పార్ట్టైం పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్లు (పీజీటీ) దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన సింగిల్ జడ్జి.. వారి సేవలను కొనసాగించాలని ఆదేశించారు. ఈ తీర్పుపై అధికారులు దాఖలు చేసిన అప్పీల్పైన, సింగిల్ జడ్జి తీర్పును అమలు చేస్తామంటూ కోర్టుకిచ్చిన హామీని ఉల్లంఘించినందుకు సర్వశిక్ష అభియాన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీనివాసరావుపై తమ ఆదేశాల మేరకు నమోదైన సుమోటో కోర్టు ధిక్కార వ్యాజ్యం పైనా జస్టిస్ బట్టు దేవానంద్ ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది. ధర్మాసనం ఆదేశాల మేరకు కోర్టుకు హాజరైన శ్రీనివాసరావును సింగిల్ జడ్జి ఆదేశాలను ఎందుకు అమలు చేయలేదని ధర్మాసనం ప్రశ్నించగా.. కింది స్థాయి అధికారుల తీరు వల్ల తన ఆదేశాలు అమలు కాలేదని, ఆ అధికారులకు నోటీసులు ఇచ్చానని ఆయన చెప్పగా, నోటీసులిచ్చి చేతులు దులిపేసుకున్నారా అంటూ నిలదీసింది. మరో ప్రశ్నకు శ్రీనివాసరావు సూటిగా సమాధానం చెప్పకపోవడంతో.. ‘ఇది మీ అధికారుల రివ్యూ మీటింగ్ కాదు. మీకు తోచింది చెప్పడానికి. కోర్టు అన్న విషయం గుర్తు పెట్టుకోండి’ అని ధర్మాసనం మండిపడింది. అడ్వొకేట్ జనరల్ (ఏజీ) తరఫున హాజరైన ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్జీపీ) విష్ణుతేజ అధికారుల చర్యలను సమర్థించబోగా.. ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. సుమోటో కేసులో కోర్టు సహాయకారిగా వ్యవహరించాల్సిన అడ్వొకేట్ జనరల్ (ఏజీ) సైతం అధికారులను సమర్థించేలా వాదించకూడదని స్పష్టం చేసింది. ఏజీ ఓ ప్రాసిక్యూటర్గా వ్యవహరించాలంది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. -
‘గీతం’ యూనివర్సిటీ భూముల వ్యవహారం.. ఏపీ హైకోర్టులో విచారణ
సాక్షి,విజయవాడ: ఏ హక్కుతో వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను గీతం యూనివర్సిటీకి కట్టబెడతారంటూ రాష్ట్ర ప్రభుత్వంతో పాటు గీతం యూనివర్సిటీ తరఫు న్యాయవాదులపై ఏపీ హైకోర్టు ప్రశ్నల వర్షం కురిపించింది.బాలకృష్ణ చిన్నల్లుడు, మంత్రి నారా లోకేష్ తోడల్లుడు, గీతం యూనివర్సిటీ అధినేత, విశాఖ ఎంపీ శ్రీభరత్కు వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను కట్టబెట్టేందుకు కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు విస్తుగొలుపుతున్నాయి.ఈ నేపథ్యంలో, ఏపీ ప్రభుత్వం ప్రభుత్వ భూములను గీతం యూనివర్సిటీకి కట్టబెట్టే ప్రయత్నాలపై విశాఖకు చెందిన న్యాయవాది గ్రేస్ ఏపీ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (PIL) దాఖలు చేశారు.మంగళవారం ఈ పిల్పై ఏపీ హైకోర్టు విచారణ చేపట్టింది. విచారణలో, రాజకీయ ప్రయోజనాల కోసం ప్రభుత్వ భూములను ఇష్టానుసారంగా ప్రైవేట్ సంస్థలకు కట్టబెట్టడం చట్టవ్యతిరేకమని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. ఇరు పక్షాల వాదనలు విన్న అనంతరం కోర్టు విచారణను వాయిదా వేసింది. -
జోగి రమేష్ ఇంటిపై దాడి.. హైకోర్టు కీలక ఆదేశం
సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నాయకులు జోగి రమేష్ ఇంటిపై టీడీపీ గూండాల దాడి నేపథ్యంలో ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. జోగి రమేష్ ఇంటికి భద్రత కల్పించాలని హైకోర్టు ఆదేశించింది. జోగి రమేష్ ఇంటి వద్ద ఎలాంటి దాడులు జరిగినా పోలీసులలే బాధ్యత అని తెలిపింది.కాగా, తమకు భద్రత కల్పించాలని జోగి రమేష్ కుమారుడు.. ఏపీలో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆయన పిటిషన్పై విచారణ చేపట్టిన ధర్మాసనం.. జోగి రమేష్ ఇంటి వద్ద భద్రత కల్పించాలని పోలీసులను ఆదేశించింది. అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. ఒకవేళ దాడులు జరిగితే పోలీసులదే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించింది. జోగి రమేష్ ఇంటిపై దాడి ఘటనలో ఇబ్రహీంపట్నం పోలీసుల హై డ్రామాకు తెరలేపారు. దాడికి పాల్పడిన వారిపై డమ్మీ కేసులు నమోదు చేసి 11 మందిని అరెస్ట్ చేశారు. అనంతరం, వెంటనే స్టేషన్ బెయిల్ ఇచ్చి వారిని ఇబ్రహీంపట్నం పోలీసులు వదిలేశారు. 11 మంది టీడీపీ నాయకులు, కార్యకర్తలను విడుదల చేశారు. టీడీపీ నేతలు ఫతావుల్లా, మాధవ్, ఆశ సహా పలువురిని అరెస్ట్ చేసి వదిలిపెట్టారు. వీరంతా విజయవాడ నుండి దాడికి వెళ్లిన టీడీపీ నేతలు కావడం గమనార్హం. -
చంద్రబాబుకు బిగ్ షాక్.. ఏపీ హైకోర్టులో జోగి రమేష్ కొడుకు పిటిషన్
-
అంబటి ఇంటికి భద్రత.. హైకోర్టు కీలక ఆదేశాలు
-
హైకోర్టులో ఏపీ ప్రభుత్వానికి షాక్
సాక్షి, అమరావతి: ఏపీ హైకోర్టులో చంద్రబాబు సర్కార్కు షాక్ తగిలింది. వైఎస్సార్సీపీ నేత, కాపు నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై దాడి కేసులో హైకోర్టు సీరియస్ అయ్యింది. శాంతిభద్రతలు అదుపులోకి వచ్చేంతవరకూ అంబటి ఫ్యామిలీకి 24 గంటల భద్రత ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. అంబటి రాంబాబు సతీమణి విజయలక్ష్మి నిన్న (శనివారం) హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.తనతోపాటు 60 మందిని పోలీసులు అక్రమంగా నిర్బంధించారని ఆమె అందులో పేర్కొన్నారు. తనకు రక్షణ కల్పించడంలో పోలీసులు విఫలమయ్యారని, శాంతిభద్రతల సమస్య ఉందని పిటిషన్లో వివరించారు. తనకు 24 గంటలు భద్రత కల్పించాలని, అందుకు అనుగుణంగా తక్షణమే చర్యలు తీసుకోవాలని విజయలక్ష్మి కోరారు. ఇవాళ (ఫిబ్రవరి 1, ఆదివారం) హౌస్ మోషన్ పిటిషన్పై విచారణ చేపట్టిన హైకోర్టు.. అంబటి కుటుంబానికి భద్రత కల్పించాలని ఆదేశాలు జారీ చేసింది.కాగా, టీడీపీ గూండాలు బహిరంగంగా ఆయుధాలు చేతబట్టి అంబటి రాంబాబుపై శనివారం హత్యాయత్నం చేయడం కలకలం రేపింది. కర్రలు, రాడ్లు, కోడిగుడ్లతో దాడి చేస్తూ అంబటి ఇంటి వద్ద టీడీపీ రౌడీలు రెచ్చిపోయారు. కార్యాలయంలోనూ విధ్వంసం సృష్టించారు. ఫర్నీచర్ ధ్వంసం చేశారు. తుదకు పెట్రోల్ పోసి నిప్పంటించారు. తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి కుట్ర బెడిసి కొట్టడంతో దాన్నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఏకంగా రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్య సృష్టించేందుకు పాలకులు బరి తెగించారు.ఈ క్రమంలో వందలాది మంది పోలీసుల సమక్షంలోనే మాజీ మంత్రి ఇంటిపై దాడికి దిగినా వారు చోద్యం చూస్తూ మిన్నకుండి పోవడం విస్తుగొలుపుతోంది. వందల మంది రౌడీలు ఒకేసారి అంబటి రాంబాబు ఇంటిపైకి దాడి చేసి విధ్వంసం సృష్టించారు. ఆయనపైనా దాడి చేశారు. సాయంత్రం 5 గంటల నుంచి అర్ధరాత్రి దాటినా విధ్వంసం కొనసాగుతూనే ఉంది. ఒక పథకం ప్రకారం అంబటి రాంబాబును భౌతికంగా నిర్మూలించాలన్న తెలుగుదేశం పార్టీ కుట్రలో భాగంగా గూండాలను పంపించి ఆయనపై ఉదయం నుంచి దాడి చేయడానికి టీడీపీ ప్రయత్నాలు చేసింది. -
రేషన్ డీలర్ల ఎంపిక ఆపండి
సాక్షి, అమరావతి: రేషన్ దుకాణాల డీలర్ల ఎంపిక విషయంలో హైకోర్టు ధర్మాసనం కీలక తీర్పునిచి్చంది. డీలర్ల ఎంపిక నిమిత్తం నిర్వహిస్తున్న ఇంటర్వ్యూకు రాత పరీక్షతో సమానంగా 50 మార్కులను నిర్ణయించడాన్ని తప్పుపట్టింది. కొత్త మార్గదర్శకాలు జారీ చేసేంత వరకు డీలర్ల ఎంపికను ఖరారు చేయవద్దంటూ గతంలోనే ఆదేశాలిచ్చినా ప్రభుత్వం అమలు చేయకపోవడాన్ని తీవ్రంగా ఆక్షేపించింది. ఇంటర్వ్యూలో 50 మార్కులను నిర్ధేశిస్తూ 2011లో జారీ చేసిన జీవో–4ను హైకోర్టు కొట్టేసినప్పటికీ ప్రభుత్వం 50 మార్కులతోనే ఎంపిక ప్రక్రియను కొనసాగించడాన్ని తీవ్రంగా తప్పుపట్టింది. ఇది కోర్టు ఆదేశాలను ధిక్కరించడమే అవుతుందని స్పష్టం చేసింది. కోర్టు ఆదేశాలకు విరుద్ధంగా జరిగిన డీలర్ల ఎంపిక ప్రక్రియ మొత్తం చట్టరీత్యా చెల్లదని తేల్చిచెప్పింది. హైకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా మార్కులను నిర్ణయించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రస్తుత కేసులో పిటిషన్ను కొట్టేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును రద్దు చేస్తున్నట్టు ధర్మాసనం తెలిపింది. హైకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా కొత్తగా ఎంపిక ప్రక్రియను ప్రారంభించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ చీమలపాటి రవితో కూడిన ధర్మాసనం శుక్రవారం కీలక తీర్పునిచి్చంది. 50 శాతం మార్కులపై పిటిషన్ విజయనగరం జిల్లా సాలూరులోని షాపు నంబర్–15కు రేషన్ డీలర్ నియామకం కోసం 2012 ఫిబ్రవరి 9న పార్వతీపురం ఆర్డీవో నోటిఫికేషన్ జారీ చేశారు. 50 మార్కుల రాత పరీక్ష, 50 మార్కుల ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక జరుగుతుందని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. కోట నాగమణి అనే మహిళ 2012 ఫిబ్రవరి 26న జరిగిన రాతపరీక్షకు హాజరై 50కి 50 మార్కులు సాధించారు. అయితే.. ఇంటర్వ్యూలో అర్హత సాధించలేదు. దీంతో నాగమణి రేషన్ డీలర్ ఎంపిక ప్రక్రియలో భాగంగా ఇంటర్వ్యూకు 50 మార్కులను నిర్ధేశిస్తూ 2011లో ప్రభుత్వం జారీ చేసిన జీవో 4ను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన సింగిల్ జడ్జి ఈ పిటిషన్ను కొట్టేశారు. దీనిని సవాల్ చేస్తూ నాగమణి ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ముందు అప్పీల్ దాఖలు చేశారు. దీనిని విచారించిన ధర్మాసనం తీర్పునిస్తూ.. సాధారణ పరిస్థితుల్లో అయితే పిటిషనర్ నాగమణి ఓసారి అవకాశం తీసుకున్న తర్వాత ఎంపిక ప్రక్రియను సవాల్ చేయలేరంది. అయితే, ఇంటర్వ్యూకు 50 మార్కుల విషయంలో కొత్త మార్గదర్శకాలు జారీ చేయాలని గతంలోనే హైకోర్టు ఆదేశించినా.. జీవో–4ను కొట్టేసినా అధికారులు డీలర్ల ఎంపిక ప్రక్రియ విషయంలో ముందుకెళ్లారని ఆక్షేపించింది. ఇది కోర్టు ఆదేశాలను ధిక్కరించడమే అవుతుందని తెలిపింది. కోర్టు ఆదేశాలకు విరుద్ధంగా జరిగిన ఈ మొత్తం ఎంపిక ప్రక్రియ చట్టరీత్యా చెల్లదని తేల్చి చెప్పింది. కాబట్టి నాగమణి పిటిషన్ను కొట్టేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును రద్దు చేస్తున్నట్టు తెలిపింది. కొత్తగా ఎంపిక ప్రక్రియ ప్రారంభించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. -
ఎన్ని కేసులు పెట్టినా భయపడం
గాందీనగర్ (విజయవాడ సెంట్రల్) : ఎన్ని అక్రమ కేసులు పెట్టినా ధైర్యంగా ఎదుర్కొంటామని వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి స్పష్టం చేశారు. చంద్రబాబు సంతృప్తి పొందే వరకు ఎన్ని కేసులైనా పెట్టుకోవచ్చన్నారు. ఇంకా గట్టిగా తయారవుతామని, బెదిరే ప్రసక్తే లేదన్నారు. అన్యాయంగా ఇరికించిన మద్యం అక్రమ కేసులో గురువారం ఆయనకు హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో జైలు నుంచి విడుదలయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. 2014–19 మధ్య 72 కేసులు ‘నేను చంద్రబాబు సొంత ఊరి నుంచి రాజకీయాల్లో ఎదిగాను. నా ఎదుగుదల తట్టుకోలేక ఆయన నన్ను జైళ్లకు పంపుతూ ఉంటారు. 2014లో నేను చంద్రబాబు సొంత ఊరి నుంచి ఎమ్మెల్యేగా గెలిచా. తను ముఖ్యమంత్రి అయ్యారు. అంతే నన్ను టార్గెట్ చేశారు. 2014–19 మధ్య నాపై 72 కేసులు పెట్టారు. మా చిత్తూరు జిల్లాలోని డిస్ట్రిక్ట్ జైలు మొదలు అన్ని సబ్ జైళ్లలో నెలలపాటు పెట్టించాడు. పక్కనే ఉన్న నెల్లూరు సెంట్రల్ జైలు, కడప సెంట్రల్ జైల్లో కూడా పెట్టించారు. అంతటితో వదిలారా అంటే అదీ లేదు. ఒక ఎమ్మెల్యే అని కూడా చూడకుండా అదే జైళ్లలో నన్ను కొట్టించారు. చిత్తూరు పోలీస్ ట్రైనింగ్ కాలేజీ నుంచి రాత్రి ఎనిమిది గంటలకు నా కళ్లకు గంతలు కట్టి నన్ను పోలీసు బస్సులో కింద కూర్చోబెట్టి చాలా అవమానకరంగా తమిళనాడులోని తిరువళ్లూరు వరకు తీసుకెళ్లారు.అక్కడ బాగా కొట్టారు. అక్కడి నుంచి మరుసటి రోజు ఉదయానికి నన్ను నెల్లూరు జిల్లా సమీపంలోని సత్యవేడు పోలీసు స్టేషన్కు తీసుకొచ్చారు. ఆ రోజు నేను సత్యవేడు పోలీసు స్టేషన్లో ఆమరణ నిరాహార దీక్షకు కూర్చుంటే అదే రోజు సాయంత్రం నన్ను కోర్టుకు తీసుకెళుతున్నామని చెప్పి పోలీసు జీపులో ఎక్కించుకుని కేవీబీ పురం మండలంలోని ఒక మారుమూల పల్లె దగ్గర వదిలేసి వెళ్లిపోయారు. ఎందుకంటే ఆ పరిస్థితుల్లో నన్ను కోర్టు ముందు హాజరు పరిస్తే పోలీసులు కొట్టిన దెబ్బలు చూపిస్తానని కోర్టుకు తీసుకెళ్లకుండా మధ్యలో వదిలేసి వెళ్లిపోయారు. ఇప్పుడు చంద్రబాబు మళ్లీ సీఎం అయ్యారు. కేసులు, అరెస్ట్లు ప్రారంభించారు. ఈ సారి ఏకంగా 8నెలలు అంటే 230 రోజుల పాటు జైల్లో పెట్టారు. ఇక మా అమ్మ, నా భార్యపై కూడా కేసులు పెట్టండి 2024 ఎన్నికల్లో నా కొడుకు మోహిత్రెడ్డిని సొంత ఊరి నుంచి జగనన్న ఎమ్మెల్యేగా నిలబెట్టారు. అంతే.. నా కొడుకుపై 10 కేసులు పెట్టి వేధిస్తున్నారు. మా నాయకుడు జగనన్న నా రెండో కొడుకు హర్షిత్రెడ్డిని విద్యార్థి నాయకుడిని చేశారు. అంతే.. ఇప్పుడు వాడిపైనా కూడా కేసులు పెట్టారు. చంద్రబాబు పుట్టిన ఊరిలో మేం పుట్టడం మా తప్పు ఎలా అవుతుంది? మా నాన్న ఎలాగూ లేరు. ఇంక మా ఇంట్లో మిగిలింది మా అమ్మ, నా భార్య. వాళ్లపైన కూడా కేసులు పెట్టేస్తే సకుటుంబంగా చంద్రబాబు బాధితులమవుతాం.నేను 1988 నుంచి మా నాయకుడు జగనన్న కుటుంబంలోని వైఎస్ రాజారెడ్డి, వైఎస్ రాజశేఖరరెడ్డి, వైఎస్ జగన్మోహన్రెడ్డి.. ఇలా ఒకే కుటుంబంలోని మూడు తరాల నాయకుల వద్ద ప్రియ శిష్యుడిగా కొనసాగాను. ఒక సైనికుడిగా ఉన్నా. వాళ్లు నాకు నేరి్పంది, నేను నేర్చుకొన్నది, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎవరెన్ని ఇబ్బందులు పెట్టినా మొండిగా నిలబడి ఎదుర్కోవడమే. ఎన్ని కేసులు పెట్టినా, అసత్యపు ప్రచారాలతో ఎంత అవమానించినా, ఎంత మంది ఒక్కటై దాడులు చేసినా తట్టుకుని నిలబడే స్థైర్యాన్ని మా లీడర్ జగనన్నను దగ్గరగా చూసి నేర్చుకున్నా.చంద్రబాబూ.. మీరు ఇష్టం వచ్చినన్ని కేసులు పెట్టుకోండి. మీరు కోరుకున్నన్ని రోజులు జైల్లో పెట్టుకోండి. ఎదుర్కొంటాం. ఇంకా గట్టిగా తయారవుతాం. భయపడేది లేదు. మా జగనన్న వల్లే మాకు ఇంత ధైర్యం’ అని చెవిరెడ్డి స్పష్టం చేశారు. పార్టీ నాయకులకు, ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గం, చంద్రగిరి నియోజకవర్గ నేతలు, ప్రజలకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు.భారీగా తరలివచ్చిన అభిమానులు చెవిరెడ్డి భాస్కరరెడ్డికి బైయిల్ మంజూరు చేయడంతో వైఎస్సార్సీపీ నేతలు, అభిమానులు భారీగా జైలు వద్దకు చేరుకున్నారు. ధర్మం గెలిచిందంటూ çప్లకార్డులు ప్రదర్శించారు. చెవిరెడ్డి బయటకు రాగానే ఆలింగనం చేసుకున్నారు. మాజీ మంత్రులు జోగి రమే‹Ù, వెలంపల్లి శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, విద్యార్థి సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ.రవిచంద్ర జైలు వద్ద చెవిరెడ్డిని కలుసుకున్నారు. అన్యాయంగా ఇరికించిన మద్యం అక్రమ కేసులో.. చెవిరెడ్డికి బెయిల్ ⇒ శ్రీధర్రెడ్డి, వెంకటేష్ నాయుడికి కూడా హైకోర్టు బెయిల్ మంజూరు⇒ సాక్ష్యాలను తారుమారు చేస్తారన్న ఆరోపణలకు ఆధారాల్లేవు ⇒ వీరి పాత్రపై దర్యాప్తు దాదాపుగా పూర్తి⇒ ట్రయల్కు ముందు సుదీర్ఘ కాలం జైల్లో ఉంచడానికి వీల్లేదు ⇒ అలా ఉంచడం రాజ్యాంగ విరుద్ధం.. వ్యక్తిగత స్వేచ్ఛను హరించడమే ⇒ ఇదే కేసులో కొందరు సహ నిందితులు ఇప్పటికే బెయిల్ పొందారు ⇒ అందువల్ల ఈ ముగ్గురి బెయిల్ విషయంలో వివక్ష చూపలేం ⇒ ఈ కేసులో పలు అంశాలను ట్రయల్లో తేల్చాలి.. ఈ సమీప కాలంలో ట్రయల్ పూర్తయ్యే పరిస్థితి లేదు ⇒ అందువల్ల ఈ ముగ్గురికీ బెయిల్ మంజూరు చేస్తున్నామని స్పషీ్టకరణసాక్షి, అమరావతి: అన్యాయంగా ఇరికించిన మద్యం అక్రమ కేసులో నిందితులుగా ఉన్న మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి, వ్యాపారవేత్తలు సజ్జల శ్రీధర్రెడ్డి, చెరుకూరి వెంకటేష్ నాయుడుకి హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. సాక్ష్యాలను తారుమారు చేస్తారన్న ఆరోపణలకు ఆధారాల్లేనందున ట్రయల్కు ముందు సుదీర్ఘ కాలం వీరిని జైల్లో ఉంచడానికి వీల్లేదని స్పష్టం చేసింది. ఇదే కేసులో కొందరు సహ నిందితులు ఇప్పటికే బెయిల్ పొందినందున ఈ ముగ్గురి విషయంలో వివక్ష చూపలేమంటూ బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో సజ్జల శ్రీధర్రెడ్డి 6వ నిందితునిగా, చెరుకూరు వెంకటేష్ నాయుడు 34వ నిందితునిగా, చెవిరెడ్డి భాస్కర్రెడ్డి 38వ నిందితునిగా ఉన్నారు. శ్రీధర్రెడ్డి గత ఏడాది ఏప్రిల్ నుంచి, వెంకటేష్ నాయుడు, చెవిరెడ్డి భాస్కర్రెడ్డి గత జూన్ నుంచి జైల్లో ఉన్నారు. వీరి బెయిల్ పిటిషన్లను విజయవాడ ఏసీబీ కోర్టు పలుమార్లు కొట్టేయడంతో వీరు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు.వీరి బెయిల్ పిటిషన్లపై విచారణ జరిపి తీర్పు రిజర్వ్ చేసిన న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి గురువారం తీర్పు వెలువరించారు. ‘బెయిల్ మంజూరు చేయడానికి నిర్దిష్ట ఫార్ములా అంటూ ఏదీ ఉండదు. ఒక్కో కేసును బట్టి, అందులోని వాస్తవాల ఆధారంగా బెయిల్పై నిర్ణయం తీసుకుంటాం. ఆర్థిక నేరాల్లో బెయిల్ మంజూరు చేసేటప్పుడు నిందితులపై ఉన్న నేరారోపణలు, వారికి వ్యతిరేకంగా ఉన్న సాక్ష్యాలు, నిందితుడి పాత్ర, శిక్ష తీవ్రత, సాక్ష్యాలను తారుమారు చేస్తారా.. ట్రయల్కు అందుబాటులో ఉంటారా.. అన్న విషయాలను న్యాయస్థానం పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది’ అని ఆమె తన తీర్పులో పేర్కొన్నారు. ఈ ముగ్గురికి బెయిల్ మంజూరు చేయడానికి గల కారణాలను ఆమె తన తీర్పులో సవివరంగా పేర్కొన్నారు.చెవిరెడ్డికి వ్యతిరేకంగా ఆధారాలేవీ?38వ నిందితునిగా ఉన్న చెవిరెడ్డి భాస్కర్రెడ్డిపై ఇదే కేసులో నిందితునిగా ఉన్న వ్యక్తి ఇచ్చిన వాంగ్మూలం ఆర్థిక లావాదేవీలకు సంబంధించి నమోదైంది. సహ నిందితుడు ఇచ్చిన వాంగ్మూలాన్ని ఈ దశలో పరిగణనలోకి తీసుకోలేం. ఇతర బలమైన ఆధారాలు లేకుండా కేవలం సహ నిందితుడు ఇచ్చిన వాంగ్మూలాన్ని ఆధారంగా చేసుకుని బెయిల్ ఇవ్వొద్దనడంపై నిర్ణయం తీసుకోలేం. ఆ సహ నిందితుడు ఇచ్చిన వాంగ్మూలం వాస్తవికతను ట్రయల్లో తేల్చాల్సి ఉంటుంది. ఈ కేసులో చెవిరెడ్డి భాస్కర్రెడ్డి పాత్రపై దర్యాప్తు దాదాపుగా పూర్తయింది. అవసరమైన అన్ని డాక్యుమెంట్లను దర్యాప్తు సంస్థ సేకరించింది.తీవ్ర ఆర్థిక నేరమని ఆరోపణలు చేస్తున్న దర్యాప్తు సంస్థ.. చెవిరెడ్డి భాస్కర్రెడ్డికి బెయిల్ ఇస్తే, సాక్ష్యాలను తారుమారు చేస్తారని, సాక్షులను ప్రభావితం చేస్తారని నిరూపించేందుకు ఎలాంటి ఆధారాలను చూపలేదు. ఇదే కేసులో ఇదే తరహా ఆరోపణలు ఎదుర్కొంటున్న కొందరు సహ నిందితులు బెయిల్ పొందారు. అందువల్ల ఇక్కడ సమానత్వ సూత్రాన్ని అనుసరించాల్సి ఉంటుంది. నిందితుల పట్ల వివక్ష చూపడానికి వీల్లేదు. ఇదే సమయంలో చెవిరెడ్డి భాస్కర్రెడ్డి వయస్సు, ఆరోగ్య పరిస్థితిని కూడా ఈ కోర్టు పరిగణలోకి తీసుకుంది. ఈ కేసులో చెవిరెడ్డి పాత్ర పరిమితమైనదని, మిగిలిన వారితో పోలిస్తే తక్కువ తీవ్రత ఉంది. దర్యాప్తు ఓ దశకు చేరుకున్నందున అతన్ని ఇంకా జైల్లో ఉంచాల్సిన అవసరం లేదు.శ్రీధర్రెడ్డి పాత్ర కీలకమని నిరూపించలేదు6వ నిందితునిగా ఉన్న సజ్జల శ్రీధర్రెడ్డి గత ఏడాది మే 24 నుంచి జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. ఇప్పటికే 7 నెలలు గడిచిపోయాయి. దర్యాప్తు సంస్థ ఇప్పటికే ప్రాథమిక చార్జిషీట్ దాఖలు చేసింది. డిజిటల్ ఉపకరణాల ఫోరెన్సిక్ పరిశీలన, డాక్యుమెంటరీ ఆధారాల సేకరణ, శ్రీధర్రెడ్డి పాత్రపై దర్యాప్తు దాదాపుగా పూర్తయ్యాయి. దర్యాప్తు సంస్థ సేకరించిన ఆధారాలు ఎంత వరకు నిజం.. అవి కోర్టు ముందు నిలబడతాయా లేదా అన్న విషయాలను లోతుగా పరిశీలించేందుకు ఇది సరైన సమయం కాదు. కేసులో నిందితుడి ప్రమేయం ఎంత వరకు ఉందన్నదే కోర్టుకు ప్రాథమికంగా కావాల్సింది. ఎఫ్ఐఆర్, ప్రాథమిక ఆధారాలు శ్రీధర్రెడ్డి పాత్రపై అనుమానాలు కలిగిస్తున్నా, అతని పాత్ర అత్యంత కీలకమైనదని నిరూపించే బలమైన, తిరుగులేని ఆధారాలేవీ కనిపించడం లేదు.విచారణ పూర్తి కాక ముందే ఓ వ్యక్తిని సుదీర్ఘ కాలం పాటు జైల్లో ఉంచడం అతని వ్యక్తిగత స్వేచ్ఛను హరించడమే అవుతుంది. నేర తీవ్రతను, నిందితుని వ్యక్తిగత స్వేచ్ఛను సమతుల్యం చేయాల్సిన బాధ్యత ఈ కోర్టుపై ఉంది. కస్టడీలో ఉంచి విచారించాల్సిన అవసరం లేనప్పుడు నిందితుడ్ని జైల్లో ఉంచాల్సిన అవసరం ఎంత మాత్రం లేదు. బెయిల్పై శ్రీధర్రెడ్డి బయటకు వస్తే సాక్ష్యాలను తారుమారు చేస్తారని దర్యాప్తు సంస్థ ఆందోళన వ్యక్తం చేస్తోంది. అయితే ఈ ఆందోళనకు ఎలాంటి ఆధారాలను మాత్రం చూపలేదు. నిందితుడు చట్టం నుంచి పారిపోయే అవకాశం లేనప్పుడు, దర్యాప్తు దాదాపుగా పూర్తయిన సందర్భాల్లో బెయిల్ ఇవ్వడమే సముచితం. సాక్షుల వాంగ్మూలాలతో ఎన్నాళ్లు జైల్లో ఉంచుతారు? 34వ నిందితునిగా ఉన్న వెంకటేష్ నాయుడు గత ఏడాది జూన్ 18 నుంచి జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. ఇతనికి సంబంధించిన దర్యాప్తు ఇప్పటికే పూర్తయింది. దర్యాప్తు సంస్థ చార్జిషీట్ కూడా దాఖలు చేసింది. 414 మంది సాక్షులను దర్యాప్తు సంస్థ విచారించింది. ఈ కేసులో ఉన్న ఆధారాలు, నిందితుల సంఖ్య, ప్రస్తుత కేసు దశలను పరిగణనలోకి తీసుకుంటే, సమీప కాలంలో ట్రయల్ పూర్తయ్యే అవకాశం లేదు. రికార్డుల్లో ఉన్న ఆధారాలను చూస్తే, అతడికి ఆపాదించిన పాత్ర కేవలం అనుమానాల ఆధారంగా మాత్రమే ఉంది. దర్యాప్తు సంస్థ వెంకటేష్ నాయుడి నుంచి ప్రత్యక్షంగా ఎలాంటి నగదు స్వాధీనం చేసుకోలేదు. కుట్ర వ్యవహారాన్ని పర్యవేక్షించారనేందుకు ఎలాంటి ప్రాథమిక ఆధారాలు లేవు. ఇవన్నీ కూడా ట్రయల్లో తేల్చాల్సిన అంశాలు. ఇద్దరు సాక్షులు ఇచ్చిన వాంగ్మూలాల ఆధారంగానే వెంకటేష్ నాయుడిపై కేసు నమోదు చేశారుఆ సాక్ష్యాల వాస్తవికత ఎంత అన్న విషయం ట్రయల్లోనే తెలుస్తుంది. వాటిని ఈ దశలో పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఈ కేసులో ఇదే తరహా ఆరోపణలు ఎదుర్కొన్న సహ నిందితులు బెయిల్ పొందారు. ట్రయల్ పూర్తి కాక ముందే నిందితుడిని ఎక్కువ కాలం జైల్లో ఉంచడం శిక్ష విధించడం కిందకే వస్తుంది. ఇది రాజ్యాంగ విరుద్ధం. అరెస్టయిన తర్వాత దర్యాప్తులో జోక్యం చేసుకున్నట్లు, సాక్షులను బెదిరించినట్లు, సాక్ష్యాలను తారుమారు చేసినట్లు అతనిపై ఎలాంటి ఆరోపణలు లేవు. దర్యాప్తు సంస్థ వ్యక్తం చేస్తున్న భయాందోళనలను కఠిన షరతుల ద్వారా తొలగిస్తాం. సమీప కాలంలో ట్రయల్ పూర్తయ్యే పరిస్థితి లేకపోవడాన్ని పరిగణనలోకి తీసుకుంటూ ఇతనికి బెయిల్ మంజూరు చేస్తున్నాం’ అని న్యాయమూర్తి తన తీర్పులో పేర్కొన్నారు.లక్ష రూపాయల చొప్పున రెండు పూచీకత్తులు సమర్పించాలని ఈ ముగ్గురిని హైకోర్టు ఆదేశించింది. పాస్పోర్టులను కోర్టుకు అప్పగించాలని, కోర్టు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లకూడదని, దర్యాప్తునకు సహకరించాలని స్పష్టం చేసింది. తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు ప్రతి శనివారం ఉదయం 10 నుంచి సాయంత్రం 5 లోపు దర్యాప్తు అధికారి ముందు హాజరు కావాలంది. కాగా, ఈ కేసులో మొదటి నిందితునిగా ఉన్న కేసిరెడ్డి రాజశేఖర్రెడ్డికి హైకోర్టు బెయిల్ నిరాకరించింది. ఆయన దాఖలు చేసిన పిటిషన్ను కొట్టేసింది. 7వ నిందితునిగా ఉన్న ముప్పిడి అవినాష్రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ను సైతం కొట్టేసింది. -
హైకోర్టు ఇమ్మంది.. ప్రభుత్వం పొమ్మంటోంది!
సాక్షి, అమరావతి: డీఎస్సీ–2025లో మెరిట్ అభ్యర్థులకు జరిగిన అన్యాయాన్ని హైకోర్టు సీరియస్గా తీసుకుంది. ప్రతిభావంతులకు అన్యాయం జరిగితే సహించబోమని ఇటీవల హెచ్చరించడంతోపాటు, వారికి రెండు నెలల్లోగా అర్హత సాధించిన పోస్టుల్లో ఉన్నతమైన పోస్టు ఇవ్వాల్సిందేనని ఆదేశించింది. ఇందుకు చంద్రబాబు సర్కారు ససేమిరా అంటోంది. ఇప్పటికే నియామకాలు పూర్తి చేశామని, ఇవ్వడం కుదరదని చెప్పింది. పైపెచ్చు హైకోర్టు తీర్పుపై అప్పీల్కు విద్యా శాఖ సిద్ధమవుతోంది. చేసిన తప్పుల నుంచి తప్పించుకునేందుకు ప్రభుత్వం పాట్లు పడుతోందేగానీ, హైకోర్టు ఆదేశాల ప్రకారం మెరిట్ అభ్యర్థులకు న్యాయం చేసేందుకు మాత్రం అంగీకరించడం లేదు. డీఎస్సీ–2025 అభ్యర్థుల జీవితాలతో ఆది నుంచి ఆడుకున్న ప్రభుత్వం.. గతంలో ఎన్నడూ లేని విధంగా దరఖాస్తు సమయంలోనే తొలి ప్రాధాన్య పోస్టు ఏదో అభ్యర్థులను ఎంచుకోమంది. అభ్యర్థులు తొలి ప్రాధాన్యంగా ఏ పోస్టు ఎంచుకుంటే అదే పోస్టు వస్తుందని ప్రకటించింది. ఈ విధానం గతంలో ఎప్పుడూ లేదు. కౌన్సెలింగ్ సమయంలో మాత్రమే పోస్టుల ప్రాధాన్యం అడిగేవారు. దాని ద్వారా అభ్యర్థులు తాము మెరిట్ సాధించిన వాటిలో ఉన్నత పోస్టును పొందే అవకాశం ఉండేది. ఈసారి దరఖాస్తు సమయంలోనే అడగడంతో వందలాది అభ్యర్థులు ఉన్నత పోస్టులను కోల్పోయారు. డీఎస్సీ –2025 ఫలితాలు ప్రకటించాక దాదాపు 2 వేల మంది అభ్యర్థులు ఎస్జీటీ తొలి ప్రాధాన్యంగా ఎంపిక చేసుకున్నా స్కూల్ అసిస్టెంట్, పోస్టు గ్రాడ్యుయేట్ పోస్టులు కూడా సాధించారు. అయితే వారికి తొలి ప్రాధాన్యమైన ఎస్జీటీ పోస్టు మాత్రమే ప్రభుత్వం ఇచ్చింది. అంతకంటే మంచి పోస్టులైన స్కూల్ అసిస్టెంట్, పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్ పోస్టులకు అర్హత సాధించినప్పటికీ, ప్రభుత్వం వారికి ఆ పోస్టులు ఇవ్వలేదు. దీంతో 54 మంది అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు.తాము ఎంతో కష్టపడి సాధించుకున్న ఉన్నతమైన పోస్టును కోల్పోతున్నామని, గతంలో కౌన్సెలింగ్ దశలో అభ్యర్థులకే పోస్టు ప్రాధాన్యం ఎంచుకునే వెసులుబాటు ఉండేదని, తమకు న్యాయం చేయాలని హైకోర్టును కోరారు. దీంతో ఉన్నత ఉద్యోగం అభ్యర్థి హక్కుగా హైకోర్టు పేర్కొంది. ఒకటి కంటే ఎక్కువ ఉద్యోగాలు పొందిన వారికి ప్రాధాన్యత ఎంపిక విధానంలో కాకుండా ఉన్నత అర్హత గల ఉద్యోగం ఇవ్వాలని ఆదేశించింది. హైకోర్టు తీర్పు బేఖాతర్ హైకోర్టు తీర్పును ప్రభుత్వం పట్టించుకోకుండా ఆగస్టు 11న ఫలితాలను, 21న మెరిట్ లిస్టును ప్రకటించడంతోపాటు ఈ తీర్పుపై డివిజన్ బెంచ్కు అప్పీల్ చేసింది. అక్కడా ప్రభుత్వానికి చుక్కెదురైంది. అయినప్పటికీ ప్రభుత్వం హడావుడిగా గతేడాది సెపె్టంబర్లో పోస్టింగులు సైతం పూర్తి చేసింది. దీనిపై హైకోర్టు సెపె్టంబర్ 12న మధ్యంతర ఉత్తర్వులు ఇస్తూ మెరిట్ విద్యార్థులకు పోస్టులు ఇవ్వాల్సిందేనని మరోసారి ఆదేశించింది. కానీ దీన్ని కూడా ప్రభుత్వం లెక్కలోకి తీసుకోకుండా సెపె్టంబర్ 15న సెలక్షన్ లిస్టును విడుదల చేసి, ప్రభుత్వం మళ్లీ హైకోర్టులో పిటిషన్ వేసింది. హైకోర్టు బెంచ్ ప్రభుత్వ పిటిషన్ను కొట్టివేసి, మెరిట్కే ప్రాధాన్యమివ్వాలని ఆదేశించింది. డిసెంబర్ 29న తుది తీర్పునిస్తూ మెరిట్కే ప్రాధాన్యమివ్వాలని ఆదేశించింది. ఇప్పటికే పోస్టింగ్స్ పూర్తయ్యాయని ప్రభుత్వ న్యాయవాది చెప్పడంతో హైకోర్టు మండిపడింది. న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులను పట్టించుకోకుండా ఎలా పోస్టులు ఇస్తారని ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో కోర్టును ఆశ్రయించిన 54 మంది మెరిట్ అభ్యర్థులతోపాటు ఆర్థి కారణలతో హైకోర్టుకు వెళ్లలేని వారికీ న్యాయం దొరుకుతుందని అంతా భావించారు. కానీ ఇప్పటికీ ప్రభుత్వం హైకోర్టు తీర్పును పాటించకుండా మరోసారి అప్పీల్కు వెళ్లే యోచన చేస్తుండడం గమనార్హం. న్యాయస్థానాన్ని సైతం లెక్క చేయని ప్రభుత్వ తీరుపై అభ్యర్థులు, యువజన సంఘాలు మండిపడుతున్నాయి. -
జైలు నుంచి చెవిరెడ్డి భాస్కర్రెడ్డి విడుదల
సాక్షి,విజయవాడ: అక్రమ మద్యం కేసులో అరెస్టై 226 రోజుల పాటు జైల్లో ఉన్న వైఎస్సార్సీపీ సీనియర్ నేత, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి విజయవాడ సబ్ జైలు నుంచి విడుదలయ్యారు. చెవిరెడ్డికి పార్టీ నేతలు ఆయనకు పూలమాలలు వేసి, పుష్పగుచ్చాలు అందించి ఘనంగా ఆహ్వానించారు.జైలు విడుదల అనంతరం, చెవిరెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘చంద్రబాబు ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా నాకు జైలు జీవితం తప్పదు. గతంలో చంద్రబాబు నాపై 72 కేసులు పెట్టారు. చంద్రగిరి నుంచి ఎదిగాను కాబట్టే చంద్రబాబు వేధిస్తున్నారు. గతంలో నన్ను చాలా అవమానకరంగా అరెస్టు చేశారు. కళ్లకు గంతలు కొట్టి నన్ను పోలీసులతో కొట్టించారు. చంద్రబాబు ఇప్పుడు నన్ను ఎనిమిది నెలల పాటు జైల్లో పెట్టారు. చంద్రబాబు పుట్టిన గ్రామంలో నేను పుట్టడం నా తప్పా.చంద్రబాబు సొంత ఊరి నుంచి నా కొడుకు ఎమ్మెల్యేగా పోటీ చేశారు. నా కుమారులపై కేసులు పెట్టారు. మా కుటుంబ సభ్యులంతా చంద్రబాబు బాధితులే. ఫైరవీలతో కాదు.. పోరాటాలతో రాజకీయాల్లోకి వచ్చా.1988 నుంచి నేను రాజకీయాల్లో ఉన్నా. చంద్రబాబు ఎన్నికేసులు పెట్టిన బయపడను. కష్టం వచ్చినప్పుడు ధైర్యంగా ఎదుర్కోవడం వైఎస్సార్ నుంచి నేర్చుకున్నా. నన్ను ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎదుర్కొంటా. నేను భయపడను. అన్నింటికి కాలమే సమాధానం చెబుతోంది’ అని వ్యాఖ్యానించారు. మద్యం కేసులో గతేడాది జూన్ 17న చెవిరెడ్డిని సిట్ అరెస్ట్ చేసింది. అక్రమ కేసులు నమోదు చేయడంతో 226 జైల్లో ఉన్నారు. ఈ క్రమంలో ఇవాళ ఏపీ హైకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సిట్ అభియోగాలుడిస్టిలరీలు, మద్యం సరఫరా కంపెనీల నుంచి కొల్లగొట్టిన సొత్తులో కొంత మొత్తాన్ని ప్రధాన నిందితుడిగా ఉన్న రాజ్ కేసిరెడ్డి నుంచి చెవిరెడ్డి భాస్కర్రెడ్డి అందుకున్నారని.. ఆ సొమ్మును గత అసెంబ్లీ ఎన్నికల టైంలో వైఎస్సార్సీపీ అభ్యర్థులకు చేరవేసినట్లు చంద్రబాబు ప్రభుత్వం వేసిన సిట్ తన అభియోగాల్లో పేర్కొంది. ఈ వ్యవహారంలో కర్త, కర్మ, క్రియగా చెవిరెడ్డి భాస్కరరెడ్డి వ్యవహరించారంటూ అభియోగం నమోదు చేసింది. ఈ కేసులో ఆయన్ని ఏ-38గా, భాస్కరరెడ్డి తనయుడు మోహిత్రెడ్డిని ఏ-39 నిందితులుగా పేర్కొనడం గమనార్హం. -
చెవిరెడ్డి భాస్కర్రెడ్డికి బెయిల్ మంజూరు
సాక్షి, విజయవాడ: వైఎస్సార్సీపీ నేత, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఊరట లభించింది. అక్రమ మద్యం కేసులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు గురువారం చెవిరెడ్డికి బెయిల్ మంజూరు చేసింది. భాస్కర్రెడ్డితో పాటు సజ్జల శ్రీధర్రెడ్డి, వెంకటేష్ నాయుడులకు సైతం బెయిల్ ఇచ్చింది.వేల కోట్ల రూపాయల మద్యం కుంభకోణం జరిగిందని.. ఇందులో చెవిరెడ్డి భాస్కర్రెడ్డి పాత్ర కూడా ఉందంటూ జూన్17వ తేదీన సిట్ బెంగుళూరులో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే అలాంటి కుంభకోణానికే ఆస్కారమే లేదని.. ఇదంతా కూటమి ప్రభుత్వ కుట్రేనని వైఎస్సార్సీపీ మొదటి నుంచి చెబుతూ వస్తోంది. ఈ క్రమంలో అనారోగ్యంతో భాధపడుతున్నప్పటికీ కూడా చెవిరెడ్డి సుబ్బారెడ్డిని ఇబ్బంది పెట్టింది కూటమి ప్రభుత్వం. చివరకు 226 రోజుల తర్వాత ఆయనకు బెయిల్ ద్వారా ఉపశమనం లభించింది. సిట్ అభియోగాలుడిస్టిలరీలు, మద్యం సరఫరా కంపెనీల నుంచి కొల్లగొట్టిన సొత్తులో కొంత మొత్తాన్ని ప్రధాన నిందితుడిగా ఉన్న రాజ్ కేసిరెడ్డి నుంచి చెవిరెడ్డి భాస్కర్రెడ్డి అందుకున్నారని.. ఆ సొమ్మును గత అసెంబ్లీ ఎన్నికల టైంలో వైఎస్సార్సీపీ అభ్యర్థులకు చేరవేసినట్లు చంద్రబాబు ప్రభుత్వం వేసిన సిట్ తన అభియోగాల్లో పేర్కొంది. ఈ వ్యవహారంలో కర్త, కర్మ, క్రియగా చెవిరెడ్డి భాస్కరరెడ్డి వ్యవహరించారంటూ అభియోగం నమోదు చేసింది. ఈ కేసులో ఆయన్ని ఏ-38గా, భాస్కరరెడ్డి తనయుడు మోహిత్రెడ్డిని ఏ-39 నిందితులుగా పేర్కొనడం గమనార్హం. -
న్యాయాధికారులూ.. ఏఐతో జాగ్రత్త
సాక్షి, అమరావతి: కృత్రిమ మేధస్సు (ఏఐ) అనేది కేవలం సమాచారాన్ని సమకూర్చుకోవడానికి ఉపయోగపడే సాధనం మాత్రమేనని, అది మానవ మేధస్సుకు లేదా సాక్ష్యాలను విశ్లేషించే సామర్థ్యానికి ప్రత్యామ్నాయం కానే కాదని హైకోర్టు స్పష్టం చేసింది. కృత్రిమ మేధస్సు కంటే న్యాయమూర్తి తన మానవ మేధస్సుకే అధిక ప్రాధాన్యమివ్వాలని పేర్కొంది. ఓ సివిల్ వివాదంలో అడ్వొకేట్ కమిషనర్ ఇచ్చిన నివేదికతో విభేదిస్తూ.. ఆ నివేదికను రద్దు చేయాలని గుమ్మడి ఉషారాణి, మరొకరు విజయవాడ కోర్టులో అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని కొట్టేస్తూ విజయవాడ కోర్టు న్యాయాధికారి గత ఏడాది ఆగస్టు 19న ఉత్తర్వులిచ్చారు. అడ్వొకేట్ కమిషనర్ నివేదిక కేవలం సాక్ష్యం మాత్రమేనని, దానిపై అభ్యంతరం ఉంటే ట్రయల్ సందర్భంగా క్రాస్ ఎగ్జామినేషన్లో తేల్చుకోవాలని ఆ న్యాయాధికారి తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆ న్యాయాధికారి తన ఉత్తర్వుల్లో నాలుగు తీర్పులను ఉదహరించారు. ఆ ఉత్తర్వులను సవాల్ చేస్తూ గుమ్మడి ఉషారాణి, మరొకరు హైకోర్టులో సివిల్ రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై న్యాయమూర్తి జస్టిస్ రవినాథ్ తిల్హరి విచారణ జరిపారు. ముఖ్యంగా కింది కోర్టులు తమ తీర్పుల విషయంలో ఏఐ సాధనాలను ఉపయోగించే సందర్భాల్లో అత్యంత అప్రమత్తంగా, జాగ్రత్తగా వ్యవహరించాలని హైకోర్టు న్యాయమూర్తి చెప్పారు. ఏఐ ఇచ్చే సమాచారాన్ని యథాతథంగా తీసుకోకుండా న్యాయాధికారులు తమ విచక్షణను, న్యాయపరమైన ఆలోచనను ఉపయోగించి నిర్ణయాలు తీసుకోవాలని స్పష్టం చేశారు. తీర్పులు లేదా ఉత్తర్వులు ఎప్పుడూ చట్టపరమైన సూత్రాల ఆధారంగా ఉండాలే తప్ప, ఏఐ ఇచ్చిన సమాచారం ఆధారంగా ఉండకూడదని తేలి్చచెప్పారు. న్యాయ పరిశోధన కోసం ఏఐను ఉపయోగించే వారు, అది అందించే సమాచారాన్ని, తీర్పులను అత్యంత జాగ్రత్తగా, కఠినంగా పరిశీలించాలని సూచించారు. ‘ఏఐ సాధనాలు పైకి నమ్మకంగా, ప్రభావవంతంగా కనిపించే సమాధానాలు ఇవ్వగలిగినా అవి వాస్తవంగా, చట్టపరంగా తప్పయ్యే ప్రమాదం ఉంది. కొన్ని సందర్భాల్లో ఏఐ అసలు ఉనికిలో లేని తీర్పులను సృష్టించడంతోపాటు సమస్యకు సంబంధం లేని తీర్పులను తప్పుగా అన్వయించవచ్చు. ఇది అత్యంత ఆందోళనకరమైన విషయం. కృత్రిమ మేధస్సు వల్ల గోప్యతకు భంగం కలగడంతో పాటు న్యాయవ్యవస్థపై ప్రజలకున్న నమ్మకం, విశ్వాసం దెబ్బతింటుంది’ అని న్యాయమూర్తి పేర్కొన్నారు.అందుకే.. ఆ ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేం ‘ప్రస్తుత కేసులో కింది కోర్టు న్యాయాధికారి తన ఉత్తర్వుల్లో ఏఐ సాధనాన్ని ఉపయోగించి ప్రస్తావించిన తీర్పులు అసలు ఉనికిలోనే లేవు. కానీ.. ఆ న్యాయాధికారి ఆ కేసుకు చట్టబద్ధమైన న్యాయసూత్రాన్ని మాత్రం సక్రమంగానే అన్వయించారు. సీపీసీ ప్రకారం అడ్వొకేట్ కమిషనర్ నివేదిక కేవలం ఒక సాక్ష్యం మాత్రమేనని, దానిపై అభ్యంతరాలుంటే ట్రయల్ సమయంలో క్రాస్ ఎగ్జామినేషన్ ద్వారా తేల్చుకోవచ్చని ఆ న్యాయాధికారి తన ఉత్తర్వుల్లో చెప్పారు. ఈ నేపథ్యంలో కమిషనర్ నివేదికను కొట్టివేయాల్సిన అవసరం లేదని కూడా ఆ న్యాయాధికారి చెప్పారు. ఇదే చట్టబద్ధమైన న్యాయసూత్రం. దీనిని ఆ న్యాయాధికారి ఈ కేసుకు సరైన రీతిలో అన్వయింప చేశారు. ప్రస్తుత కేసులో కింది కోర్టు ఉత్తర్వుల్లో చట్టపరమైన లోపం గానీ, న్యాయపరిధి ఉల్లంఘన గానీ లేనే లేదు. అందువల్ల ఆ ఉత్తర్వుల్లో మేం ఏ రకంగానూ జోక్యం చేసుకోలేం’ అని తేల్చి చెప్పారు. ఉషారాణి, మరొకరు దాఖలు చేసిన సివిల్ రివిజన్ పిటిషన్ (సీఆర్పీ)ను కొట్టేస్తున్నట్టు న్యాయమూర్తి జస్టిస్ రవినాథ్ తిల్హరీ ఇటీవల తీర్పు వెలువరించారు. -
‘కారుణ్య’ అభ్యర్థనను ఏకపక్షంగా తిరస్కరించరాదు
సాక్షి, అమరావతి: కారుణ్య నియామకం అనేది హక్కు కానప్పటికీ, దరఖాస్తుదారుడి అభ్యర్థనను ఏకపక్షంగా తిరస్కరించడానికి వీల్లేదని, న్యాయబద్ధంగా పరిశీలించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. కారుణ్య నియామకంపై అధికారులు నిర్ణయాన్ని తీసుకునేటప్పుడు యాంత్రికంగా కాకుండా, ఆ కుటుంబం ఎదుర్కొంటున్న వాస్తవ ఆర్థిక ఇబ్బందులను పరిగణనలోకి తీసుకోవాలని తేల్చి చెప్పింది. దరఖాస్తు చేయడంలో జాప్యం ఉందన్న కారణంతో కారుణ్య నియామకాన్ని తిరస్కరించడానికి వీల్లేదంది. ఐదేళ్ల జాప్యం అన్నది అసాధారణ జాప్యం కానే కాదంది. తనకు, తన తండ్రికి రైల్వే శాఖలో కారుణ్య నియామకానికి సంబంధించిన నిబంధనల గురించి తెలియదని పిటిషనర్ చెప్పిన దాంతో హైకోర్టు ఏకీభవించింది. కారుణ్య నియామకం కోసం పిటిషనర్ నారాయణమ్మ పెట్టుకున్న దరఖాస్తును మూడు నెలల్లో పరిగణనలోకి తీసుకోవాలని రైల్వే అధికారులను ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్ రాయ్, జస్టిస్ గేదెల తుహిన్ కుమార్ ధర్మాసనం ఇటీవల తీర్పు వెలువరించింది. అసలు కేసు ఏంటంటే..! విజయనగరం జిల్లా, కొత్తవలస గ్రామానికి చెందిన బి.రాములు రైల్వేశాఖలో గ్యాంగ్మెన్గా పనిచేసేవారు. ఆయనకు భార్య, ముగ్గురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. అనారోగ్యంతో గ్యాంగ్మెన్గా ఉద్యోగం చేసే పరిస్థితిలో లేకపోవడంతో 1999లో రాములుకు రైల్వే అధికారులు ప్రత్యామ్నాయ ఉద్యోగాన్ని (డీ కేటగిరైజేషన్) ఇవ్వదలిచారు. అయితే రాములు 2000లో స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేశారు. రూ.1895లను పెన్షన్గా, రూ.1.50 లక్షలను పీఎఫ్, గ్రాట్యుటీ కింద రైల్వే అధికారులు చెల్లించారు. ఇదిలా ఉండగా 2006లో రాములు కుమార్తె నారాయణమ్మ కారుణ్య నియామకానికి దరఖాస్తు చేసుకున్నారు. రాములు కుటుంబ ఆరి్థక ఇబ్బందులను గుర్తించిన డివిజినల్ రైల్వే అధికారులు కారుణ్య నియామకం కోసం నారాయణమ్మ దరఖాస్తును ఉన్నతాధికారులకు సిఫారసు చేయగా, వారు దానిని తిరస్కరించారు. నిబంధనల ప్రకారం ఐదేళ్ల లోపు దరఖాస్తు చేయలేదంటూ నారాయణమ్మ దరఖాస్తును వారు తోసిపుచ్చారు. దీనిపై ఆమె కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్ (క్యాట్)ను ఆశ్రయించారు. క్యాట్ ఆమె పిటిషన్ను తోసిపుచ్చింది. దీంతో హైకోర్టులో ఆమె పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై ఇటీవల విచారణ జరిపిన జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్ ధర్మాసనం అధికారులు నారాయణమ్మ దరఖాస్తును ఏకపక్షంగా తిరస్కరించడాన్ని తప్పుబట్టింది. ఉద్యోగి మరణం.. ఆ కుటుంబానికి ఆర్థిక మరణం కాకూడదని వ్యాఖ్యానించింది. క్యాట్ తీర్పును రద్దు చేసింది. నారాయణమ్మ దరఖాస్తును మూడు నెలల్లో పరిగణనలోకి తీసుకోవాలని రైల్వే అధికారులను ధర్మాసనం ఆదేశించింది. -
జడ్జి అనుమతి లేకుండా కోర్టులోకొచ్చి ఎలా అరెస్ట్ చేస్తారు?
సాక్షి, అమరావతి: ఒక కేసులో లొంగిపోవడానికి వచ్చిన నిందితుడిని జడ్జి అనుమతి లేకుండానే కోర్టు హాల్లోకి చొరబడి ఎలా అరెస్టు చేస్తారని హైకోర్టు పోలీసు అధికారులను ప్రశ్నించింది. ఈ వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని డీజీపీ, కర్నూలు రేంజ్ డీఐజీ, డీఎస్పీ తదితరులను ఆదేశించింది. చిప్పగిరి ఎస్ఐ సతీష్కుమార్, పత్తికొండ ఎస్ఐ ఆర్.విజయ్కుమార్ నాయక్, చిప్పగిరి కానిస్టేబుళ్లు షబ్బీర్, రామోజీలకు వ్యక్తిగత నోటీసులు జారీచేసింది. విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ యడవల్లి లక్ష్మణరావు మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. లొంగిపోవడానికి వచ్చిన నిందితుడిని జడ్జి అనుమతి లేకుండానే కోర్టు హాల్లోకి చొరబడి మరీ బలవంతంగా అరెస్ట్ చేయడమే కాకుండా అడ్డుకునేందుకు ప్రయత్నించిన న్యాయవాదులను తోసేసి వెళ్లిపోయిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కర్నూలు జిల్లా పత్తికొండ న్యాయవాదుల సంఘం ప్రధాన కార్యదర్శి జి.భాస్కర్ దాఖలు చేసిన పిటిషన్పై మంగళవారం జస్టిస్ లక్ష్మణరావు విచారణ జరిపారు. పోలీసుల దౌర్జన్యంపై వీడియో ఆధారాలున్నాయి పిటిషనర్ తరఫున న్యాయవాది కె.వి.రఘువీర్ వాదనలు వినిపించారు. ‘చిప్పగిరి మండలం డేగులపాడుకి చెందిన శివయ్య గంజాయి సాగుచేస్తుండటంతో అతడిపై చిప్పగిరి పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. దీంతో అతడు లొంగిపోయేందుకు గతనెల 24న పత్తికొండ కోర్టుకు వచ్చారు. తన న్యాయవాది ద్వారా సరెండర్ పిటిషన్ దాఖలు చేయించారు. ఈ పిటిషన్పై జడ్జి నిర్ణయం కోసం శివయ్య కోర్టులో వేచిచూస్తుండగా పోలీసులు మఫ్టీలో కోర్టు హాల్లోకి దూసుకొచ్చి బలవంతంగా శివయ్యను లాక్కెళ్లి అరెస్ట్ చేశారు. దీన్ని అడ్డుకోబోయిన న్యాయవాదులను సైతం తోసేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా సర్క్యులేట్ అయింది. కోర్టు హాల్లోకి ప్రవేశించేందుకు ఆ కోర్టు న్యాయాధికారి అనుమతి తీసుకోలేదు. దౌర్జన్యపూరితంగా వ్యవహరించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని పత్తికొండ న్యాయవాదుల సంఘం సమర్పించిన వినతిపై పోలీసులు ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు’ అని రఘువీర్ నివేదించారు. పోలీసులు ఏమైనా చేస్తారు ఈ సమయంలో న్యాయమూర్తి స్పందిస్తూ.. పోలీసులు ఇదేరీతిలో హైకోర్టులోకి వచ్చి నిందితులను అరెస్ట్ చేయగలరా? రిజిస్ట్రీ అనుమతి తీసుకోకుండా అరెస్ట్ చేస్తారా? మరి కింది కోర్టులో కూడా జడ్జి అనుమతి లేకుండా నేరుగా కోర్టు హాల్లోకి వచ్చి మరీ ఎలా అరెస్ట్ చేస్తారు?.. అని ప్రశ్నించారు. బాధ్యులైన పోలీసులపై ఏం చర్యలు తీసుకున్నారు? వారిని బదిలీ చేశారా లేదా? అని అడిగారు. ఇలాంటివాటిని అనుమతిస్తే పోలీసులు ఏమైనా చేస్తారు.. అని ఘాటుగా వ్యాఖ్యానించారు. పోలీసుల తరఫున ప్రభుత్వ సహాయ న్యాయవాది (ఏజీపీ) స్పందిస్తూ.. ఆ పోలీసులకు చార్్జమెమోలు ఇచ్చినట్లు చెప్పారు. ఈ ఘటనపై సంబంధిత కోర్టు మేజిస్ట్రేట్ జిల్లా ఎస్పీకి రాసిన లేఖ ఆధారంగా బాధ్యులైన పోలీసులపై క్రమశిక్షణ చర్యలు చేపట్టామని తెలిపారు.బాధ్యులైన పోలీసులను సస్పెండ్ చేశారా? లేదా? అని ప్రశ్నించిన న్యాయమూర్తి.. సస్పెండ్ చేసి ఉండరులే అంటూ నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. కోర్టు హాల్లోకి చొరబడి మరీ అరెస్ట్ చేసిన పోలీసులకు వ్యక్తిగత నోటీసులు జారీచేశారు. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని పోలీసు ఉన్నతాధికారులను ఆదేశిస్తూ విచారణను వాయిదా వేశారు. -
ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం
సాక్షి,విజయవాడ: మరోసారి రాష్ట్ర పోలీసుల వ్యవహారశైలిపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పత్తికొండ న్యాయవాదుల సంఘం దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపింది. కోర్టు గౌరవాన్ని కించపరిచే విధంగా పోలీసులు ప్రవర్తించారని మండిపడింది. విచారణ సందర్భంగా.. పోలీసులపై ప్రశ్నల వర్షం కురిపించింది. ‘జడ్జి అనుమతి లేకుండా కోర్టు హాల్లోకి ప్రవేశించి అరెస్టులు ఎలా చేస్తారు? అని ప్రశ్నించింది. ‘ఇలాంటి వాటిని అనుమతిస్తే పోలీసులు ఏమైనా చేస్తారు. హైకోర్టులో కూడా ఇలాగే అరెస్టులు చేస్తారా?’ కోర్టు గౌరవాన్ని దెబ్బతీసే విధంగా పోలీసులు తీరు సరైంది కాదని వ్యాఖ్యానించింది.దౌర్జన్యం చేసిన పోలీసులకు వ్యక్తిగతంగా నోటీసులు జారీ చేయాలని హైకోర్టు ఆదేశించింది. బాధ్యులైన అధికారులపై ఇప్పటివరకు ఏం చర్యలు తీసుకున్నారో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించింది. కోర్టు ఆదేశాలను తేలికగా తీసుకోవద్దని, న్యాయస్థానం గౌరవాన్ని కాపాడే బాధ్యత అందరికీ ఉందని హైకోర్టు స్పష్టం చేసింది.పత్తికొండ న్యాయవాదుల సంఘం తరఫున దాఖలైన పిటిషన్లో, కోర్టు హాల్లోకి పోలీసులు అనుమతి లేకుండా ప్రవేశించి అరెస్టులు చేయడం చట్ట విరుద్ధమని పేర్కొన్నారు. ఈ పిటిషన్పై స్పందించిన హైకోర్టు, పోలీసుల వ్యవహారంపై కఠినంగా స్పందించింది. -
మాంసం, చేపల దుకాణాలకూ ఈ–వేలమేనా!?
సాక్షి, అమరావతి : ఏసీ రూముల్లో కూర్చొని నిర్ణయాలు తీసుకుంటున్న అధికారులు క్షేత్ర స్థాయిలో వాస్తవ పరిస్థితులను ఏ మాత్రం పరిగణనలోకి తీసుకోవడంలేదని హైకోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది. మాంసం, చేపల దుకాణాల కేటాయింపునకు సైతం ‘ఈ–వేలం’ నిర్వహించడాన్ని హైకోర్టు ఆక్షేపించింది. కంప్యూటర్పై కనీస పరిజ్ఞానం కూడా లేని చిన్న వ్యాపారులకు షాపులు కేటాయించే విషయంలో సాంప్రదాయ బహిరంగ వేలం కాకుండా ఈ–వేలం నోటిఫికేషన్ జారీ చేయడాన్ని తప్పుబట్టింది. ఇందులో పాల్గొనాలంటే పలు డాక్యుమెంట్లను అప్లోడ్ చేయాల్సి ఉంటుందని, ఆ డాక్యుమెంట్లు ఏవనే విషయంపై కూడా ఆ చిరు వ్యాపారులకు అవగాహన ఉండదని, వారిలో చాలా మంది పెద్దగా చదువుకుని ఉండరని తెలిపింది. క్షేత్ర స్థాయి ఇబ్బందులను పరిగణనలోకి తీసుకోకుండా, అధికారులు ఏసీ రూముల్లో కూర్చొని ఎలా పడితే అలా నిర్ణయాలు తీసుకుంటున్నారని వ్యాఖ్యానించింది. పైపెచ్చు ఈ–వేలం టెండర్ నోటిఫికేషన్ను ఇంగ్లిష్ లో ప్రచురించడాన్ని కూడా హైకోర్టు తప్పుబట్టింది. తెలుగు పత్రికలో తెలుగు భాషలో నోటిఫికేషన్ను ఇవ్వాలని నిబంధనలు చెబుతుంటే, తెలుగు పత్రికలో ఇంగ్లిష్ లో నోటిఫికేషన్ ఇవ్వడంపై విస్మయం వ్యక్తం చేసింది. ఏం ప్రయోజనాలు ఆశించి ఇలా చేస్తున్నారని విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులను నిలదీసింది. విజయవాడ మహంతి మార్కెట్లో షాపుల కేటాయింపు నిమిత్తం ఈనెల 6న విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ జారీ చేసిన ఈ–వేలం నోటిఫికేషన్ను తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు నిలిపేస్తున్నట్లు హైకోర్టు స్పష్టం చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని కార్పొరేషన్ను ఆదేశించింది. తదుపరి విచారణను మార్చి 3కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్ శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ఈ–వేలంపై పిటిషన్మహంతి మార్కెట్లో మాంసం, చేపల దుకాణాల కేటాయింపు కోసం ఈ–వేలానికి ఈ నెల 6న విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు జారీ చేసిన నోటిఫికేషన్ను సవాలు చేస్తూ అదే మార్కెట్లో చేపల వ్యాపారం చేస్తున్న హరి మాణిక్యం శంకరరావు హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్ శుక్రవారం విచారణ జరిపారు.పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ, ఈ–వేలం నోటిఫికేషన్ గురించి అధికారులు ఎలాంటి నోటీసు ఇవ్వకుండా, తెలుగు పత్రికలో ఇంగ్లిష్లో నోటిఫికేషన్ ఇచ్చారన్నారు. పిటిషనర్తో సహా ఇతర వ్యాపారుల్లో చాలా మంది నిరక్ష్యరాస్యులు, కంప్యూటర్ పరిజ్ఞానం లేనివారున్నారని.. దీంతో నోటిఫికేషన్కు స్పందించలేకపోయారన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి ప్రభుత్వ నిర్ణయాలు ప్రజలకు సౌకర్యవంతంగా ఉండాలే తప్ప, క్లిష్టతరంగా ఉండకూడదని అభిప్రాయపడ్డారు. -
తండ్రి కులమే పిల్లలకు వర్తిస్తుంది
సాక్షి, అమరావతి: ఒక వ్యక్తి కులంతో అధికారులు విభేదిస్తున్నప్పుడు, అతడు ఫలానా కులానికి చెందిన వ్యక్తి కాదని నిరూపించాల్సిన బాధ్యత కూడా ఆ అధికారులదేనని హైకోర్టు స్పష్టం చేసింది. ఆ వ్యక్తి తన కులాన్ని రుజువు చేసే డాక్యుమెంట్లు సమర్పించలేదన్న కారణంతో అతడు ఫలానా కులానికి చెందినవాడుకాదని చెప్పలేరని పేర్కొంది. తండ్రిది ఏ కులమైతే పిల్లలకు అదే కులం వర్తిస్తుందని, ఈ విషయాన్ని సుప్రీంకోర్టు, హైకోర్టులు గతంలోనే స్పష్టంగా చెప్పాయని గుర్తుచేసింది. పిటిషనర్ అట్లపాకాల రామకృష్ణ తండ్రి, నాయనమ్మ కొండకాపు కులానికి చెందిన వారనేందుకు ఆధారాలున్నా.. భూ రికార్డులను మాత్రమే ఆధారంగా చేసుకుంటూ రామకృష్ణ కొండకాపు కులానికి చెందినవ్యక్తి కాదంటూ అధికారులు ఉత్తర్వులు ఇవ్వడాన్ని తప్పుపట్టింది. రామకృష్ణ కొండకాపు (ఎస్టీ) కులస్తుడు కాదు, కాపు అంటూ సాంఘిక సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి, జిల్లాస్థాయి పరిశీలన అధికారి హోదాలో తూర్పు గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ జారీచేసిన ఉత్తర్వులను రద్దుచేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కొనకంటి శ్రీనివాసరెడ్డి ఇటీవల తీర్పు చెప్పారు. ఏకపక్షంగా కులధ్రువీకరణ రద్దుపై పిటిషన్ కొండకాపు (ఎస్టీ) కులానికి చెందిన అట్లపాకాల రామకృష్ణ పూర్వీకులు తూర్పు గోదావరి ఏజెన్సీ ప్రాంతంలో నివశించారు. వారు ఎస్టీగానే చెలామణి అయ్యారు. రామకృష్ణ విద్యాభ్యాసం మొత్తం ఎస్టీగానే సాగింది. రామకృష్ణ బీఎస్సీ అగ్రికల్చర్ కోర్సు చదువుతున్న సమయంలో అధికారులు అతడి కులధ్రువీకరణపై విచారణ జరిపారు. అతడు ఇచి్చన డాక్యుమెంట్లను కాకుండా 1938 సంవత్సరానికి చెందిన భూ రికార్డులను ఆధారంగా చేసుకుని రామకృష్ణ కొండకాపు కులస్తుడు కాదంటూ ఆచార్య నాగార్జున యూనివర్సిటీకి తెలిపారు.తరువాత రామకృష్ణకు నోటీసు కూడా ఇవ్వకుండానే అతడి ఎస్టీ కులధ్రువీకరణ పత్రాన్ని 2005లో కలెక్టర్ రద్దుచేశారు. దీనిపై రామకృష్ణ అప్పీలు చేయగా.. కలెక్టర్ ఉత్తర్వులను సమర్థిస్తూ సాంఘిక సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి 2009లో ఉత్తర్వులిచ్చారు. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ రామకృష్ణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై న్యాయమూర్తి జస్టిస్ శ్రీనివాసరెడ్డి తుది విచారణ జరిపారు.ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి.. పిటిషనర్ తండ్రి, నాయనమ్మ కొండకాపులంటూ 1966లోనే అధికారులు రెవెన్యూ రికార్డుల్లో పొందుపరిచారని తెలిపారు. గిరిజన సంక్షేమ డిప్యూటీ కలెక్టర్ 2004లో జారీచేసిన ఉత్తర్వుల్లో కూడా రామకృష్ణ తండ్రి, నాయనమ్మలను గిరిజనులుగా పేర్కొన్నారని చెప్పారు. ఈ ఆధారాలన్నీ చూపినా అధికారులు పట్టించుకోకుండా, కేవలం 1938 నాటి రెవెన్యూ రికార్డును ఆధారంగా తీసుకోవడాన్ని తప్పుబట్టారు. రామకృష్ణ కులధ్రువీకరణ పత్రాన్ని రద్దుచేస్తూ జాయింట్ కలెక్టర్, సాంఘిక సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి జారీచేసిన ఉత్తర్వులను రద్దుచేశారు. -
కోర్టు హాల్లో పోలీసుల దౌర్జన్యంపై ‘న్యాయ’ పోరాటం!
సాక్షి, అమరావతి: రెడ్బుక్ రాజ్యాంగంతో చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తున్న పోలీసులపై న్యాయవాదులు న్యాయ పోరాటానికి దిగారు. ఇటీవల ఓ కేసులో లొంగిపోవడానికి వచ్చిన నిందితుడిని జడ్జి అనుమతి లేకుండానే కోర్టు హాల్లోకి చొరబడి పోలీసులు అరెస్టు చేయడం.. అడ్డుకునేందుకు యత్నించిన న్యాయవాదులపై పోలీసులు దౌర్జన్యానికి దిగటాన్ని నిరసిస్తూ హైకోర్టును ఆశ్రయించారు. సరెండర్ పిటిషన్ దాఖలు చేసి కోర్టు నిర్ణయం కోసం ఎదురు చూస్తున్న నిందితుడిని పోలీసులు బలవంతంగా ఈడ్చుకెళ్లడంపై చర్యలు తీసుకునేలా ఆదేశించాలని అభ్యర్థిస్తూ కర్నూలు జిల్లా పత్తికొండ న్యాయవాదుల సంఘం హైకోర్టులో బుధవారం పిటిషన్ దాఖలు చేసింది. చిప్పగిరి పోలీస్స్టేషన్ ఎస్ఐ సతీష్ కుమార్, కానిస్టేబుళ్లు షబ్బీర్, రామోజీ, పత్తికొండ ఎస్ఐ ఆర్.విజయ్కుమార్ నాయక్పై డీజీపీకి ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదని పత్తికొండ న్యాయవాదుల సంఘం ప్రధాన కార్యదర్శి జి.భాస్కర్ తన పిటిషన్లో హైకోర్టుకు నివేదించారు.జడ్జి అనుమతి లేకుండా కోర్టు హాలులోకి చొరబడి నిందితుడిని అరెస్ట్ చేసిన ఘటనపై జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజి్రస్టేట్ లేదా జిల్లా జడ్జి సూచించిన అధికారి లేదా ఏదైనా స్వతంత్ర సంస్థతో విచారణకు ఆదేశించాలని కోరారు. పోలీసుల దౌర్జన్యంపై వీడియోలు రాష్ట్రవ్యాప్తంగా వైరల్ అయ్యాయని పిటిషన్లో నివేదించారు. బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన పోలీసులు దూకుడుగా వ్యవహరించారన్నారు. మేజి్రస్టేట్కు ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. అందువల్ల ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని హైకోర్టుకు విన్నవించారు. కోర్టు హాల్లోకి దూసుకెళ్లిన పోలీసులు.. చిప్పగిరి మండలం డేగులపాడుకి చెందిన శివయ్య గంజాయి సాగు చేస్తున్నట్లు పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. దీంతో లొంగిపోయేందుకు గత నెల 24న పత్తికొండ కోర్టుకు వచ్చిన నిందితుడు తన న్యాయవాది ద్వారా సరెండర్ పిటిషన్ దాఖలు చేశాడు. దీనిపై న్యాయాధికారి నిర్ణయం కోసం శివయ్య కోర్టులో నిరీక్షిస్తుండగా పోలీసులు మఫ్టీలో కోర్టు హాల్లోకి చొరబడి శివయ్యను లాక్కెళ్లి అరెస్ట్ చేశారు. దీన్ని అడ్డుకోబోయిన న్యాయవాదులను తోసివేశారు. కోర్టు హాలులోకి ప్రవేశించేందుకు సంబంధిత న్యాయాధికారి అనుమతి తీసుకోకపోవడం, పోలీసుల దౌర్జన్యంపై పత్తికొండ కోర్టు న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. బాధ్యులైన పోలీసులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ డీజీపీ, డీఐజీలకు ఈ నెల 5న పత్తికొండ న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు ఫిర్యాదు చేశారు. -
ఎన్జీటీ ఉత్తర్వులపై హైకోర్టుకు రావొచ్చు
సాక్షి, అమరావతి: జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) జారీ చేసే ఉత్తర్వులను సవాలు చేస్తూ అధికరణ 226 కింద తమ ముందు దాఖలు చేసే వ్యాజ్యాలకు విచారణార్హత ఉందని హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. ఎన్జీటీ చట్టం సెక్షన్ 22 కింద ఉన్న ప్రత్యామ్నాయం ప్రకారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని, అయితే ఈ సెక్షన్ కింద హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడంపై ఎలాంటి నిషేధం లేదని తేల్చి చెప్పింది. సెక్షన్ 22 కింద ఉన్న ప్రత్యామ్నాయం హైకోర్టు తన న్యాయ పరిధి ఉపయోగించకుండా అడ్డుకోలేదంది.చట్ట నిబంధనలకు విరుద్ధంగా, ఎలాంటి పర్యావరణ అనుమతులు (ఈసీ) లేకుండా జరిపే మైనింగ్ కార్యకలాపాల వల్ల ప్రభావితమయ్యే ఏ వ్యక్తి అయినా ఎన్జీటీ చట్టంలోని సెక్షన్ 16లో పేర్కొన్న ‘బాధిత వ్యక్తి’ నిర్వచన పరిధిలోకి వస్తారని తెలిపింది. ఎలాంటి కాలుష్యానికి తావు లేకుండా గాలి, నీరు పొందడమన్నది పౌరులకు రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కని హైకోర్టు పేర్కొంది. ఈ హక్కుకు భంగం కలిగితే ఏ వ్యక్తి అయినా అందుకు సంబంధించిన చర్యలను సవాలు చేయవచ్చునని పేర్కొంది.ముఖ్యంగా పర్యావరణ అంశాల్లో సంబంధిత గ్రామానికి చెందిన వ్యక్తి ఎవరైనా కూడా ఎన్జీటీ ముందు అప్పీల్ దాఖలు చేయవచ్చునని తేల్చి చెప్పింది. పొట్టిశ్రీరాములు జిల్లా మోమిడి గ్రామంలో సిలికా మైనింగ్ విషయంలో శ్రీకుమారస్వామి మైనింగ్ సంస్థకు పర్యావరణ అనుమతులు మంజూరు చేసే విషయంలో సుప్రీంకోర్టు తాజా తీర్పును, చట్ట నిబంధనలను పరిగణనలోకి తీసుకుని, వాటికి అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను హైకోర్టు ఆదేశించింది.పర్యావరణ అనుమతులను తాత్కాలికంగా నిలిపేస్తూ ఎన్జీటీ ఇచ్చిన ఉత్తర్వుల్లో జోక్యానికి నిరాకరించింది. ఎన్జీటీ ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ శ్రీకుమారిస్వామి మైనింగ్ సంస్థ దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ రవినాథ్ తిల్హరీ, జస్టిస్ కుంచెం మహేశ్వరరావు ధర్మాసనం ఇటీవల కీలక తీర్పు వెలువరించింది. -
చంద్రబాబుపై కేసులు ఎందుకు కొట్టేశారు? హైకోర్టు ఆగ్రహం
-
చంద్రబాబు కేసుల వ్యవహారం.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు
సాక్షి, విజయవాడ: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన మీద ఉన్న కేసులను కొట్టేయించుకుంటన్న సంగతి తెలిసిందే. అయితే ఈ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేసులు ఎందుకు మూసేస్తున్నారో తెలియజేయాలంటూ ఏపీ హైకోర్టు మంగళవారం ప్రభుత్వ యంత్రాంగాన్ని ఆదేశించింది. ఫైబర్నెట్ కుంభకోణంతో పాటు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులను న్యాయస్థానాలు కొట్టేసిన సంగతి తెలిసిందే. దర్యాప్తు సంస్థ సిఫారసు మేరకు కోర్టులు ఈ నిర్ణయాలు తీసుకున్నాయి. అయితే కేసుల కొట్టివేత సమయంలో అభ్యంతరాలను న్యాయస్థానాలు సరిగా పరిగణనలోకి తీసుకోలేదంటూ ఏపీ హైకోర్టులో పిటిషన్లు దాఖలు అయ్యాయి. వీటిని విచారణకు స్వీకరించిన ఉన్నత న్యాయస్థానం.. కేసులు ఎందుకు మూసివేసారో, ఏ ఆధారాలపై ఉపసంహరణకు వెళ్లారో స్పష్టమైన వివరణ ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ కేసు తదుపరి విచారణ ఫిబ్రవరి 3వ తేదీన జరగనుంది. ఏపీలో చంద్రబాబు అధికార దుర్వినియోగం పరాకాష్టకు చేరిందని.. ఈ క్రమంలోనే తనపై దాఖలైన కేసులను కొట్టేయించుకుంటున్నారని ఇటు వైఎస్సార్సీపీ తీవ్ర విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. -
జెడ్పీటీసీలకు గౌరవ వేతనాలు ఎప్పటిలోగా చెల్లిస్తారు?
సాక్షి, అమరావతి: వైఎస్సార్ కడప జిల్లాలోని జెడ్పీటీసీ సభ్యులకు గౌరవ వేతనం, రవాణా భత్యం, కరువు భత్యం వంటి బకాయిలను ఎప్పటిలోగా చెల్లిస్తారో స్పష్టంగా చెప్పాలని జెడ్పీ సీఈవోను హైకోర్టు నిలదీసింది. ఒక్కో సభ్యునికి రూ.2.10 లక్షల చొప్పున బకాయిలు చెల్లించాల్సి ఉందని, వీటిని చెల్లించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ కడప జెడ్పీటీసీ సభ్యులు ముత్యాల చెన్నయ్య, మరో 26 మంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై న్యాయమూర్తి జస్టిస్ సత్తి సుబ్బారెడ్డి సోమవారం మరోసారి విచారణ జరిపారు.ఈ నేపథ్యంలో జెడ్పీ సీఈవో ఓ మెమోను కోర్టు ముందుంచారు. ఆ వివరాలను పరిశీలించిన న్యాయమూర్తి జెడ్పీటీసీ సభ్యులకు గౌరవ వేతనం చెల్లింపు విషయంలో పూర్తి వివరాలను తమ ముందుంచాలని సీఈవోను ఆదేశిస్తూ విచారణను వచ్చే వారానికి వాయిదా వేశారు. అంతకుముందు పిటిషనర్ తరఫు న్యాయవాది జడా శ్రవణ్కుమార్ వాదనలు వినిపిస్తూ.. ఎమ్మెల్యేలు, మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులకు సకాలంలో వేతనాలు అందుతున్నాయన్నారు. కానీ పిటిషనర్లకు మాత్రం గౌరవ వేతనం, ఇతర భత్యాలను చెల్లించడం లేదని, ఈ విషయంలో నిర్ధిష్ట గడువు విధించాలని కోర్టును అభ్యర్థించారు. -
బాబుకు బిగ్ షాక్ హైకోర్టుకు స్కిల్ స్కామ్ కేస్?
-
జంతు హింస, జూద నిరోధక చట్టాలను కఠినంగా అమలు చేయండి
సాక్షి, అమరావతి: సంక్రాంతి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ముఖ్యంగా తూర్పు, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో విస్తృతంగా కోడి పందేలు నిర్వహిస్తున్న నేపథ్యంలో జంతుహింస నిరోధక చట్టం–1960, ఏపీ జూద నిరోధక చట్టం–1974ను కఠినంగా అమలు చేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీసు కమిషనర్లు, ఎస్పీలను హైకోర్టు ఆదేశించింది. ఎక్కడైనా ఉల్లంఘనలు జరిగితే వ్యక్తిగతంగా బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించింది. చట్టాల అమలులో విఫలమైతే తహసీల్దార్లు, పోలీసు అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవచ్చని స్పష్టం చేసింది.ఆయా జిల్లాల్లోని మండలాల్లో సంయుక్త తనిఖీ బృందాలను ఏర్పాటు చేయాలని కలెక్టర్లను ఆదేశించింది. కోడి పందేల పేరుతో బెట్టింగ్, ఇతర చట్ట విరుద్ధ కార్యకలాపాలు నిర్వహిస్తూ యువతను వాటిలోకి లాగుతున్నారని, దీంతో వారు ఆస్తులు కోల్పోయే పరిస్థితి వస్తోందంటూ హైకోర్టులో పలువురు పిటిషన్లు దాఖలు చేశారు. పందేలను ఆపేలా చర్యలు తీసుకోవాలని వినతిపత్రాలు ఇచ్చినా పోలీసులు పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. గతంలోనూ హైకోర్టు పలు ఆదేశాలు జారీ చేసినా అధికారులు పూర్తిస్థాయిలో అమలు చేయలేదని తెలిపారు. ఈ వ్యాజ్యాలపై న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప విచారణ జరిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి... జంతు హింస నిరోధక చట్టం, ఏపీ జూద నిరోధక చట్టాలను కఠినంగా అమలు చేయాలని ఆదేశిస్తూ తీర్పు చెప్పారు.తహసీల్దార్, ఎస్ఐలతో తనిఖీ బృందాలుసంయుక్త తనిఖీ బృందాల్లో తహసీల్దార్, ఎస్ఐ ర్యాంకుకు తగ్గని పోలీసు అధికారి, భారత జంతు సంక్షేమ బోర్డు ప్రతినిధి లేదా జంతు సంరక్షణకు పనిచేసే స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి సభ్యులుగా ఉండాలని కలెక్టర్లను హైకోర్టు ఆదేశించింది. వీరు తనిఖీలకు వెళ్లే సమయంలో ఇద్దరు పోలీసులు, ఒక ఫోటోగ్రాఫర్ సహాయకులుగా ఉండాలని పేర్కొంది. ‘‘కోడి పందేలు ఎక్కడ నిర్వహిస్తున్నారు? బరులను ఎక్కడెక్కడ ఏర్పాటు చేశారు? తదితర వివరాలను తెలుసుకునేందుకు తనిఖీ బృందాలు మండలాల పరిధిలోని గ్రామాలను సందర్శించేందుకు జిల్లా అధికార యంత్రాంగం అవసరమైన ఏర్పాట్లు చేయాలి.కోడి పందేలకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం అందితే కలెక్టర్లు, పోలీసు కమిషనర్లు, ఎస్పీలు తక్షణమే చర్యలు చేపట్టాలి. అవసరమైతే 144 సెక్షన్ కింద ఉన్న అధికారాలను సైతం ఉపయోగించుకోవచ్చు. కోడి పందేల్లో ఉపయోగించిన, ఉపయోగించ తలపెట్టిన ఉపకరణాలు, పందేల సందర్భంగా వసూలు చేసిన డబ్బును జప్తు చేయవచ్చు’’ అని డాక్టర్ జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప తీర్పునిచ్చారు. పోలీసుల తరఫున ప్రభుత్వ న్యాయవాది (హోం) అడుసుమిల్లి జయంతి వాదనలు వినిపిస్తూ చట్ట విరుద్ధ కార్యకలాపాల్లో పాల్గొనకుండా పోలీసులు ప్రజలను చైతన్యపరుస్తున్నారని తెలిపారు. -
YSRCP ఆఫీసుకు నోటీసులు.. మున్సిపల్ కమీషనర్ పై హైకోర్టు ఆగ్రహం
-
కోర్టు ఆదేశాలంటే నవ్వులాటగా ఉందా..?
సాక్షి, అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్సార్సీపీ) మచిలీపట్నం టౌన్, ఈడేపల్లిలో నిబంధనలకు అనుగుణంగా నిరి్మంచిన పార్టీ కార్యాలయ భవనం విషయంలో మునిసిపల్ కమిషనర్ వ్యవహరిస్తున్న తీరుపై హైకోర్టు గురువారం తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. వైఎస్సార్సీపీ పార్టీ కార్యాలయ భవన నిర్మాణంలో లోపాలు ఉన్నాయంటూ ఇప్పటికే పలు నోటీసులు జారీ చేసిన మచిలీపట్నం మునిసిపల్ కమిషనర్, కోర్టు ఆదేశాలకు విరుద్ధంగా మళ్లీ పదే పదే నోటీసులు జారీ చేయడంపై మండిపడింది.‘ఇంపాక్ట్ ఫీజు వసూలు చేసి ఆక్యుపెన్సీ సర్టీఫికెట్ (ఓసీ) జారీ చేయాలన్న మా ఆదేశాలకు విరుద్ధంగా, అలాగే సీజే నేతృత్వంలోని ధర్మాసనం ఇచ్చిన ఆదేశాలకు విరుద్ధంగా మళ్లీ ఎలా నోటీసులు ఇస్తారు? మచిలీపట్నం మునిసిపల్ కమిషనర్ చర్యలు కోర్టు ధిక్కారం కిందకు వస్తాయి. సుమోటోగా కోర్టు ధిక్కార చర్యలు చేపడుతాం. మా ఆదేశాల మేరకు ఎందుకు ఆక్యుపెన్సీ సర్టీఫికెట్ ఇవ్వలేదో, ఎందుకు పదే పదే నోటీసులు ఇస్తున్నారో కమిషనర్ వివరణ ఇవ్వాలి. దీనిపై అఫిడవిట్ దాఖలు చేయాలి. కోర్టు ఆదేశాలను ఎందుకు ఉల్లంఘించారో స్పష్టంగా చెప్పాలి. కోర్టు ఆదేశాలంటే నవ్వులాట అనుకుంటున్నారా? కోర్టు పవర్ ఏంటో రాష్ట్రంలోని అధికారులందరికీ చూపిస్తాం. చట్టం కంటే ఎక్కువని అధికారులు భావిస్తున్నారు. ఇలాంటి వారిని ఎక్కడ నిలబెట్టాలో తమకు బాగా తెలుసు. ఒక అధికారిని కటకటాల వెనక్కి పంపితే అధికారులందరూ దార్లోకి వస్తారు’’ అని హెచ్చరించింది. వాదనల సమయంలో కమిషనర్ తరఫు న్యాయవాది ఆయన చర్యలను సమర్థిస్తుండగా న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ ‘కోర్టు ఆదేశాలను అమలు చేయలేదంటే కమిషనర్కు ఇంగ్లీష్ రాదని అనుకోవాలా? లేక అర్ధం కాలేదని అనుకోవాలా?’ అంటూ మండిపడ్డారు. తానిచ్చిన ఉత్తర్వులతో పాటు సీజే ధర్మాసనం ఇచ్చిన ఆదేశాలు కూడా చాలా స్పష్టంగా ఉన్నాయని న్యాయమూర్తి గుర్తు చేశారు. కమిషనర్ జారీ చేసిన నోటీసులను రద్దు చేస్తూ తదుపరి విచారణను ఫిబ్రవరి 9కి వాయిదా వేశారు. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ నూనెపల్లి హరినాథ్ ఉత్తర్వులు జారీ చేశారు.ఆక్యుపెన్సీ సర్టీఫికెట్ ఇవ్వాలని కోర్టు ఆదేశిస్తే,. ఇవ్వడం సాధ్యం కాదన్నారు..తమ పార్టీ కార్యాలయ భవనానికి ఆక్యుపెన్సీ సర్టీఫికేట్ ఇవ్వాలన్న సింగిల్ జడ్జి ఆదేశాలకు, అలాగే తాము సమర్పించిన డాక్యుమెంట్ల ఆధారంగా అక్యుపెన్సీ సర్టిఫికెట్ జారీపై నిర్ణయం తీసుకోవాలన్న సీజే ధర్మాసనం ఉత్తర్వులకు విరుద్ధంగా మచిలీçపట్నం మునిసిపల్ కమిషనర్ తిరిగి తమకు నోటీసులు జారీ చేశారంటూ వైఎస్సార్సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు పేర్ని నాని హైకోర్టులో ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ జారీ చేయడానికి నిరాకరిస్తూ జారీ చేసిన ఎండార్స్మెంట్ను కూడా ఆయన సవాలు చేశారు. నాని తరఫున న్యాయవాది యర్రంరెడ్డి నాగిరెడ్డి వాదనలు వినిపిస్తూ పార్టీ కార్యాలయ భవన నిర్మాణంపై అధికారులు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. ఇప్పటికే పలుమార్లు వివరణలు ఇచ్చినా కూడా పట్టించుకోకుండా పదే పదే నోటీసులు ఇస్తున్నారన్నారు. భవన నిర్మాణం రెండేళ్ల క్రితమే పూర్తయినప్పటికీ, నిర్మాణ పనులను ఆపాలంటూ నోటీసు ఇచ్చారని తెలిపారు. -
జస్టిస్ ఎన్వీ రమణ వల్లే హైకోర్టు న్యాయమూర్తి అయ్యాను
సాక్షి, అమరావతి: హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ తల్లాప్రగడ మల్లికార్జునరావుకు హైకోర్టు ఘనంగా వీడ్కోలు పలికింది. జస్టిస్ మల్లికార్జునరావు ఈ నెల 18న పదవీ విరమణ చేయనున్నారు. ఈ నెల 9 నుంచి హైకోర్టుకు సంక్రాంతి సెలవులు కావడం, 18వ తేదీ ఆదివారం కావడంతో హైకోర్టు ఆయనకు గురువారమే వీడ్కోలు కార్యక్రమం ఏర్పాటు చేసింది. ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమానికి న్యాయమూర్తులందరూ హాజరయ్యారు. ఈ సందర్భంగా జస్టిస్ మల్లికార్జునరావు మాట్లాడుతూ, ‘జిల్లా జడ్జిగానే పదవీ విరమణ చేస్తానని నేను భావించా.అయితే అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ వల్ల పరిస్థితులు మారాయి. నేను కూడా హైకోర్టు న్యాయమూర్తిని అయ్యాను’అని తెలిపారు. అంతకుముందు సీజే జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ మాట్లాడుతూ జస్టిస్ మల్లికార్జునరావు న్యాయాధికారిగా, న్యాయమూర్తిగా న్యాయవ్యవస్థకు ఎనలేని సేవలు అందించారన్నారు. అదనపు సొలిసిటర్ జనరల్ (ఏఎస్జీ) చల్లా ధనంజయ, అడ్వొకేట్ జనరల్ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్, హైకోర్టు న్యాయవాదుల సంఘం ఇన్చార్జ్ అధ్యక్షుడు కేవీ రఘువీర్లు జస్టిస్ మల్లికార్జునరావు సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో జస్టిస్ మల్లికార్జునరావు కుటుంబ సభ్యులు, అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) ఇవన సాంబశివ ప్రతాప్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ (పీపీ) మెండ లక్ష్మీనారాయణ, డిప్యూటీ సొలిసిటర్ జనరల్ (డీఎస్జీ) పసల పొన్నారావు, హైకోర్టు న్యాయవాదులు, రిజి్రస్టార్లు, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు. హైకోర్టు న్యాయవాదుల సంఘం ఘన సన్మానం అనంతరం జరిగిన కార్యక్రమంలో హైకోర్టు న్యాయవాదుల సంఘం జస్టిస్ మల్లికార్జునరావు దంపతులను ఘనంగా సన్మానించింది. ఈ కార్యక్రమంలో సంఘం ప్రధాన కార్యదర్శి చేజర్ల సుబోధ్, ఇతర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, ఆస్పత్రుల ప్రైవేటీకరణను రద్దు చేయండి
సాక్షి, అమరావతి: ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, ఆస్పత్రులను ప్రైవేటీకరించాలన్న చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయాన్ని అడ్డుకోవాలంటూ హైకోర్టులో వైఎస్సార్సీపీ ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసింది. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజల నుంచి ఇప్పటికే కోటికి పైగా సంతకాలు సేకరించగా... ఇప్పుడు న్యాయ పోరాటం ప్రారంభించింది. ఈ మేరకు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, ఆస్పత్రుల విషయంలో చంద్రబాబు సర్కారు తీరును సవాల్ చేస్తూ వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి తరఫున ఆయన న్యాయవాది మారక్కగారి బాలకృష్ణ హైకోర్టులో పిల్ వేశారు. ప్రభుత్వ విధానాన్ని రద్దు చేయాలని కోరారు. కాగా, ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, ఆస్పత్రుల ప్రైవేటీకరణ చట్ట విరుద్ధమని అప్పిరెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వమే నిరి్మంచి, నిర్వహించేలా ఆదేశాలు జారీ చేయాలని అభ్యర్థించారు. ప్రైవేటీకరణకు జారీ చేసిన ఉత్తర్వులు, టెండర్ నోటిఫికేషన్ను సైతం సవాల్ చేశారు. దాదాపు 2,300 పేజీలతో ఆయన పిల్ వేయడం విశేషం. కాగా, వైఎస్సార్సీపీ దాఖలు చేసిన వ్యాజ్యంపై బుధవారం స్పందించిన హైకోర్టు... పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, వైద్య, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి, రాష్ట్ర వైద్య సేవల మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (ఏపీఎంఎస్ఐడీసీ) ఎండీ, రాష్ట్ర వైద్య విద్య పరిశోధన కార్పొరేషన్ (ఏపీఎంఈఆర్సీ) ఎండీలకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఆరు వారాలకు వాయిదా వేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ చల్లా గుణరంజన్ల ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులిచ్చింది. ప్రభుత్వ విధానాన్ని నిర్దిష్టంగా సవాల్ చేశాం వైఎస్సార్సీపీ తరఫున సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్రెడ్డి వాదనలు వినిపిస్తూ... కోటిమంది గొంతుకగా తాము పిల్ వేశామని, ప్రైవేటీకరణ విషయంలో ప్రభుత్వ విధానాన్ని సవాల్ చేశామని చెప్పారు. ప్రైవేటీకరణపై ఇప్పటికే ఒక వ్యాజ్యం దాఖలైందని గుర్తు చేసిన ధర్మాసనం... అందులో వాదనలు వినిపించేందుకు అనుమతిస్తామని పేర్కొంది. అయితే, అందులోని అంశాలకు, ప్రస్తుత వ్యాజ్యంలో తాము లేవనెత్తినవాటికి చాలా తేడా ఉందని పొన్నవోలు బదులిచ్చారు. ప్రభుత్వ విధానాన్ని నిర్దిష్టంగా సవాల్ చేశామని, ప్రైవేటీకరణ కారణంగా వైద్య ఖర్చులను భరించడంలో ప్రజల శక్తి, ప్రభుత్వంపై పెట్టుకున్న చట్టబద్ధమైన నమ్మకం వంటి అనేక విషయాలను లేవనెత్తామని చెప్పారు.ప్రభుత్వం జాప్యం చేస్తుంది.. పొన్నవోలు వాదనలపై ధర్మాసనం జోక్యం చేసుకుంటూ, ఒకే అంశంపై ఇలా పిటిషన్లు వేస్తూ ఉంటే, ఎప్పటికీ తేలవని వ్యాఖ్యానించింది. ఈ పిల్ను అడ్డంపెట్టుకుని ప్రభుత్వం కౌంటర్ దాఖలుకు మరింత సమయం కోరుతుందని, దీంతో విచారణలో జాప్యం జరుగుతుందని పేర్కొంది. సుధాకర్రెడ్డి స్పందిస్తూ... తమ పిల్ను ఇప్పటికే దాఖలైన వ్యాజ్యంతో జత చేసినా అభ్యంతరం లేదన్నారు. దీంతో ధర్మాసనం వైఎస్సార్సీపీ వ్యాజ్యాన్ని ప్రైవేటీకరణపై గతంలో దాఖలైన వ్యాజ్యంతో జత చేసింది.చంద్రబాబు ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రైవేటీకరణతో.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచితంగా అందాల్సిన వైద్య సేవలు ఖరీదైనవిగా మారిపోతాయి. వైద్య కళాశాలల్లో రూ.వేలల్లో ఉన్న ఫీజులు రూ.లక్షల్లోకి వెళ్లిపోతాయి. ప్రైవేటీకరణతో అంతిమంగా పేద ప్రజలు తీవ్రంగా నష్టపోతారు. – పొన్నవోలు సుధాకర్రెడ్డి -
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా హైకోర్టులో YSRCP పిల్
-
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై వైఎస్సార్సీపీ పిల్
సాక్షి, అమరావతి: మెడికల్ కళాశాలలు ప్రైవేటీకరణ చేయొద్దంటూ ఏపీ హైకోర్టులో వైఎస్సార్సీపీ పిల్ వేసింది. పిల్ను విచారణకు స్వీకరించిన హైకోర్టు.. గతంలో దాఖలైన పిటిషన్లను కలిపి విచారిస్తామని పేర్కొంది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణ ఆరు వారాలకు వాయిదా వేసింది.పిల్లో కీలక అంశాలు..ఏపీలో ఉన్న 17 మెడికల్ కళాశాలలు ప్రభుత్వ ఆధ్వర్యంలో నడవాలని.. ప్రైవేట్ వ్యక్తుల జోక్యం ఉండకూడదని పిల్లో వైఎస్సార్సీపీ పేర్కొంది. ‘‘ప్రజలకు ప్రభుత్వం ఉచితంగా మెరుగైన వైద్యం అందించటానికి వీటి ఏర్పాటు జరిగింది. మెడికల్ కాలేజీల నిర్వహణ బడ్జెట్ ప్రభుత్వానికి భారం లేకుండా అప్పటి ప్రభుత్వం విధానాలను రూపొందించింది. మెడికల్ కళాశాలల్లో కొన్ని సీట్లను మాత్రమే డొనేషన్కి కేటాయించి ఆ డబ్బును ఆసుపత్రులకు వాడే విధంగా మార్గదర్శకాలు అప్పటి ప్రభుత్వం రూపొందించింది’’ అని కోర్టుకు వైఎస్సార్సీపీ తెలిపింది.అనుబంధ పిటిషన్ దాఖలు..టెండర్లు ప్రక్రియ నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని అనుబంధ పిటిషన్ను కూడా వైఎస్సార్సీపీ దాఖలు చేసింది. పీపీపీ వల్ల వైద్య విద్య దూరం అవటమే కాకుండా విద్యా, వైద్యం పేద ప్రజలకు దక్కకుండా కొనుక్కునే పరిస్థితి వస్తుందని పిల్లో వైఎస్సార్సీపీ పేర్కొంది. ఆర్థికంగా భారం అవుతుందని ప్రభుత్వం చెబుతోంది వాస్తవం కాదన్న వైఎస్సార్సీపీ.. ప్రజా ప్రభిప్రాయం కోసం కోటి సంతకాలు కూడా తెలియజేస్తునట్టు కోర్టుకు తెలిపింది. ప్రతివాదులుగా రాష్ట్ర ప్రభుత్వం, ఏపీఎంఎస్ఐడీసీ, ఏపీ మెడికల్ ఎడ్యుకేషన్, నేషనల్ మెడికల్ కౌన్సిల్ను వైఎస్సార్సీపీ చేర్చింది. -
భక్తులను అమానవీయ రీతిలో తనిఖీలు చేయడం ఆపాల్సిందే
సాక్షి, అమరావతి: శ్రీవారి పరకామణిలో చేపట్టే సంస్కరణలపై టీటీడీ సమర్పించిన ప్లాన్–ఏపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. గత ఉత్తర్వుల్లో తాము పలు అంశాల్లో సంస్కరణలు అవసరమని చెబుతూ సలహాలు, సూచనలు కోరితే.. టీటీడీ మాత్రం ఎలాంటి సలహాలను తెలియజేయలేదని హైకోర్టు ఆక్షేపించింది. తాము లేవనెత్తిన ఏ అంశానికీ సమాధానం ఇవ్వలేదని తప్పు పట్టింది. శ్రీవారి పరకామణిలో కానుకల లెక్కింపును సేవగా భావించి వచ్చే భక్తులను అమానవీయ రీతిలో తనిఖీలు చేయడంపై హైకోర్టు మరోసారి అభ్యంతరం తెలిపింది.తనిఖీలపై భక్తిరీత్యా భక్తులు అభ్యంతరం చెప్పకపోవచ్చని, కానీ.. ఇది రాజ్యాంగం కల్పించిన ‘గౌరవంగా, హుందాగా జీవించే హక్కు’ను కాలరాయడమేనని స్పష్టం చేసింది. ఈ హక్కును ఎవరూ కాలరాయలేరని తేల్చి చెప్పింది. ఒకవేళ తనిఖీల్ని ఆపకుంటే.. పరకామణిలో భక్తుల చేత కానుకల లెక్కింపును ఆపేస్తూ ఉత్తర్వులిస్తామని స్పష్టం చేసింది.కానుకలు లెక్కించే చోట టేబుళ్లు ఏర్పాటు చేయాలన్న ఆదేశాలపైనా టీటీడీ తన నివేదికలో ఎలాంటి స్పష్టత ఇవ్వలేదంది. అందువల్ల భక్తులను అమానవీయ రీతిలో తనిఖీ చేయడం, లెక్కింపు కోసం టేబుళ్ల ఏర్పాటుపై స్పష్టత తీసుకుని పూర్తి వివరాలను తమ ముందుంచాలని టీటీడీ న్యాయవాదిని ఆదేశించింది. తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆ అధికారులపై క్రమశిక్షణ చర్యలు అవసరం పరకామణిలో రూ.72 వేల విలువైన 900 డాలర్ల చోరీ నేపథ్యంలో హైకోర్టు ఇటీవల పలు సంస్కరణలను ప్రతిపాదించింది. ఈ దిశగా తీసుకోవాల్సిన చర్యలపై టీటీడీకి ఆదేశాలిచ్చింది. పరకామణిలో తక్షణ సంస్కరణల నిమిత్తం ప్లాన్–ఏ సమర్పించాలని టీటీడీని ఆదేశించిన విషయం తెలిసిందే. తాజాగా మంగళవారం ఈ వ్యవహారంపై జస్టిస్ రామకృష్ణ ప్రసాద్ మరోసారి విచారణ జరిపారు.టీటీడీ సమరి్పంచిన ప్లాన్–ఏను పరిశీలించానని, గత విచారణ సమయంలో తాను లేవనెత్తిన అంశాలు, ఆదేశాల గురించి అందులో ఎలాంటి ప్రస్తావన లేదన్నారు. ఇది తమను అసంతృప్తికి గురి చేసిందన్నారు. పరకామణిలో చోరీ కేసును నీరుగార్చేందుకు ప్రయత్నించిన అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. నిందితుడు రవికుమార్తో కొందరు పోలీసులు కుమ్మక్కైనట్టు సీఐడీ నివేదికను పరిశీలిస్తే తెలిసిందన్నారు. చోరీ కేసు లోక్ అదాలత్లో రాజీ చేసుకున్న వ్యవహారంపై తప్ప మిగిలిన అన్ని అంశాల్లో దర్యాప్తు కొనసాగించుకోవచ్చని, చట్ట ప్రకారం ముందుకెళ్లొచ్చని సీఐడీ, ఏసీబీ అదనపు డీజీలకు న్యాయమూర్తి స్పష్టం చేశారు. -
టీటీడీ నివేదికపై హైకోర్టు సీరియస్
-
టీటీడీ పరకామణి చోరీ కేసుపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు
సాక్షి,విజయవాడ: పరకామణి చోరీ కేసులో టీటీడీ నివేదికపై ఏపీ హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రత్యామ్నాయ విధానాలను సరిగా పేర్కొనలేదని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. భక్తుల కానుకలు పక్కదారి పట్టడాన్ని సహించలేమని హైకోర్టు స్పష్టం చేసింది. భక్తుల మనోభావాలను కాపాడాల్సిన బాధ్యత ఉందని హైకోర్టు పేర్కొంది. సలహాలు, సూచనలు తెలపకుండా ఆదేశాలు ఎలా ఇస్తామని ప్రశ్నించింది. తదుపరి విచారణను ఎల్లుండికి వాయిదా వేసింది. -
నారా లోకేశ్ శాఖపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు
సాక్షి, అమరావతి: నారా లోకేశ్ మంత్రిగా వ్యవహరిస్తున్న విద్యాశాఖపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. పవర్ఫుల్ వ్యక్తి కింద పనిచేస్తున్నందున తమను ఏమీ చేయలేరన్న భావన విద్యాశాఖ అధికారుల్లో కనపడుతోందని వ్యాఖ్యానించింది. ఈ ప్రభుత్వంలో విద్యాశాఖ అధికారులు తమను తాము చాలా గొప్ప వారిగా, కోర్టుకన్నా శక్తివంతులుగా భావిస్తున్నారని మండిపడింది.కోర్టులన్నా, కోర్టు ఆదేశాలన్నా వారికి ఏ మాత్రం లెక్క లేకుండా పోయిందని తెలిపింది. పైగా న్యాయస్థానాలతో ఘర్షణ పెట్టుకోవాలని భావిస్తున్నారని పేర్కొంది. ఇందుకు ప్రత్యేక కారణాలున్నాయంది. ఇలాంటి అధికారులను ఎలా డీల్ చేయాలో తమకు బాగా తెలుసునంది. కేజీబీవీల్లో పీజీటీల బదిలీలకు సంబంధించి అప్పీల్పై జరుగుతున్న విచారణ సందర్భంగా హైకోర్టు... విద్యాశాఖలో ఏదీ కూడా సక్రమంగా జరగడం లేదంటూ ఘాటుగా వ్యాఖ్యానించింది. సర్వశిక్షాభియాన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ వ్యక్తిగత హాజరుకు ఆదేశం కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో (కేజీబీవీ) పార్ట్టైం పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్లు (పీజీటీ)గా పనిచేస్తున్న వారిని ఒప్పందం ప్రకారం యథాతథంగా కొనసాగించాలంటూ సింగిల్ జడ్జి ఇచి్చన ఉత్తర్వులను, అలాగే సింగిల్ జడ్జి ఇచి్చన ఉత్తర్వులను అమలు చేస్తామంటూ ఇచ్చిన హామీని ఉల్లంఘించినందుకు సర్వశిక్షాభియాన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ (పీడీ) బి.శ్రీనివాస్రావుపై హైకోర్టు సుమోటోగా కోర్టు ధిక్కార చర్యలు చేపట్టింది. ఆయనకు కోర్టు ధిక్కారం కింద నోటీసులు జారీ చేయాలని రిజిస్ట్రీని ఆదేశించింది. అలాగే వ్యక్తిగతంగా తమ ముందు హాజరు కావాలని శ్రీనివాస్రావును ఆదేశిస్తూ ఆయనకు నోటీసు ఇచి్చంది. తదుపరి విచారణను ఫిబ్రవరి 4కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ బట్టు దేవానంద్, జస్టిస్ అవధానం హరిహరనాథ శర్మ ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.కేసు వివరాలు ఇవీ..⇒ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో (కేజీబీవీ) పార్ట్టైం పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్లు (పీజీటీ)గా పనిచేస్తున్న తమను అర్ధంతరంగా తొలగించడాన్ని సవాలు చేస్తూ పలువురు పీజీటీలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ⇒ ఈ తీర్పును సవాలు చేస్తూ అధికారులు ధర్మాసనం ముందు గత ఏడాది జనవరిలో అప్పీల్ దాఖలు చేశారు.⇒ ఈ సందర్భంలో కోర్టు ఆదేశాలను, కోర్టుకిచ్చిన హామీని ఉల్లంఘించిన అధికారి ఎవరని ధర్మాసనం ప్రశ్నించింది.⇒ సర్వశిక్షాభియాన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ బి.శ్రీనివాస్రావు అని ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. దీంతో ధర్మాసనం ఆయనపై సుమోటోగా కోర్టు ధిక్కార చర్యలు చేపట్టింది.⇒ ఈ అప్పీల్పై ఇప్పటికే పలుమార్లు విచారణ జరిపిన జస్టిస్ బట్టు దేవానంద్ నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం మరోసారి విచారణ జరిపింది.⇒ విచారణ జరిపిన సింగిల్ జడ్జి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు వారి సేవలను కొనసాగించాలని ఆదేశించారు. ⇒ పీజీటీల తరఫు న్యాయవాది జైభీమ్ రావు వాదనలు వినిపిస్తూ “ఒప్పందం ప్రకారం రిట్ పిటిషనర్లు ఎక్కడ పనిచేస్తున్నారో వారిని అక్కడే కొనసాగిస్తూ, వారికి ఆ మేర వేతనాలు చెల్లించాలని సింగిల్ జడ్జి ఆదేశాలు ఇచ్చారు. అయితే సర్వశిక్షాభియాన్ అధికారులు మాత్రం పిటిషనర్లను వేరే ప్రాంతానికి బదిలీ చేయడంతో పాటు నెలవారీ ఇచ్చే వేతనాన్ని పని గంటల ఆధారంగా చెల్లించేలా మార్పులు చేశారు. అంతేకాక సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను యథాతథంగా అమలు చేస్తామంటూ ఈ కోర్టుకు ఇచ్చిన హామీని సైతం అధికారులు ఉల్లంఘించారు’ అని ధర్మాసనానికి విన్నవించారు. -
ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో అన్నమయ్య జిల్లా కేంద్రంపై పిల్
సాక్షి, అన్నమయ్య: అన్నమయ్య జిల్లా పరిపాలన కేంద్రాన్ని రాయచోటి నుండి మదనపల్లికి మార్చిన ప్రభుత్వ నిర్ణయంపై హైకోర్టులో పబ్లిక్ ఇంటరెస్ట్ లిటిగేషన్ (పిల్) దాఖలైంది. జిల్లా కేంద్రం రాయచోటుగానే కొనసాగించాలని పిటిషనర్ విజ్ఞప్తి చేశారు. ప్రాథమిక నోటిఫికేషన్ ఇవ్వకుండా కేంద్రాన్ని మార్చడం చట్ట విరుద్ధమని పిల్లో పేర్కొన్నారు. ప్రజల అభ్యంతరాలు, సూచనలను స్వీకరించిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలని పిటిషనర్ వాదించారు. జిల్లా కేంద్ర మార్పుకు సంబంధించిన జీవో, గెజిట్ నోటిఫికేషన్లను నిలిపివేస్తూ స్టే ఇవ్వాలని హైకోర్టును కోరారు. కార్యాలయాలు, రికార్డులను మదనపల్లికి మార్చకుండా తక్షణ ఉత్తర్వులు ఇవ్వాలని పిల్లో అభ్యర్థించారు.ప్రతివాదులుగా రెవెన్యూ సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శులు భూ పరిపాలన ప్రధాన కమిషనర్, అన్నమయ్య జిల్లా కలెక్టర్ను చేర్చిన పిటిషనర్. చట్ట నిబంధనల ప్రకారం ముందుగా ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసి ప్రజల అభిప్రాయాలను స్వీకరించాలి. ఆ తర్వాతే తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందనే విషయాన్ని పిటిషనర్ హైకోర్టు దృష్టికి తెచ్చారు. ఈ పిల్పై హైకోర్టు విచారణ చేపట్టనుంది. -
నూజివీడు పేకాట క్లబ్ వ్యవహారంలో కీలక పరిణామం
సాక్షి, అమరావతి: నూజివీడు పేకాట క్లబ్ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. మ్యాంగో బే క్లబ్ నిర్వాహకులకు ఏపీ హైకోర్టు షాకిచ్చింది. క్లబ్లో గేమింగ్స్కు సంబంధించి ఆంక్షలతో ఉత్తర్వులు జారీ చేసింది. వాటిని పాటించకుంటే చర్యలు తీసుకోవాలని అటు పోలీసులకు స్పష్టం చేసింది. డిసెంబర్ 22వ తేదీన మ్యాంగో బే క్లబ్పై పోలీసులు రైడ్స్ నిర్వహించి.. పేకాట ఆడుతున్న 285 మందిని పట్టుకున్నారు. మొత్తం రూ.34 లక్షల నగదుతో పాటు 128 కార్లు, 40 టూ వీలర్స్ కూడా సీజ్ చేశారు. ఈ కేసులో నాలుగురోజుల కిందట ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. 13 కార్డ్స్ పేకాట లేదంటే డబ్బులు పందేలకు ఏ ఆట ఆడవద్దని.. అలా ఆడే వారిపై చర్యలు తీసుకోవచ్చని పోలీసులకి హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో.. హైకోర్టు ఉత్తర్వులపైన మ్యాంగో బే కల్చరల్ అండ్ రీక్రియేషన్ సొసైటీ నడపబడుతోందని గమనిక బోర్డు ఏర్పాటు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. -
సంరక్షణ లేని ‘సంక్షేమం’!
నరదృష్టికి నాపరాళ్లయినా పగులుతాయంటారు. ఆంధ్రప్రదేశ్లో ఏణ్ణర్ధం నుంచి ప్రజల్ని పాలించటం కాదు... వారిని బాధించటమే పనిగా పెట్టుకున్న కూటమి సర్కారువారి వక్రదృష్టి సంక్షేమ హాస్టళ్లు, గురుకుల విద్యాలయాలపై కూడా పడింది. అందుకే 3,878 ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లు, గురుకుల విద్యాలయాల్లో చదువుకుంటున్న దాదాపు ఆరున్నర లక్షలమంది విద్యార్థులు అవస్థల పాలవుతున్నారు. వెన్నుపోటుతో అధికారానికి ఎగ బాకినా, కూటమి పేరుతో అందలం ఎక్కినా చంద్రబాబుకు సంక్షేమం పేరు వింటే తేళ్లూ జెర్రులూ పాకినంత పనవుతుంది. అందుకే ఆయన ఏలుబడిలో అరకొర వసతులు, అర్ధాకలి బతుకులతోనే పిల్లల చదువులు తెల్లారుతున్నాయి. ఈసారి కూడా మినహాయింపు లేదు.సంక్షేమ, ఆశ్రమ పాఠశాలల వసతి గృహాల్లో ఇటీవలి కాలంలో 45 మంది పిల్లలు చనిపోయిన విషయమై దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై విచారణ జరిపిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేయటంతోపాటు ఈ విషయంలో సమగ్ర నివేదిక అందజేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. నిజానికి ఇలాంటి ఆదేశాలివ్వటం ఇది మొదటిసారేమీ కాదు. నిరుడు జూలైలో హాస్టళ్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను విచారించిన సందర్భంలో సైతం మౌలిక సదుపాయాల సమస్యను అధిగమించేందుకు మీ దగ్గరున్న ప్రణాళికేమిటో చెప్పాలంటూ ఇచ్చిన ఆదేశా లకు ఇంకా అతీగతీ లేదు. హాస్టళ్లలో ఉంటున్న పిల్లలు శతాబ్దాలుగా విద్యాగంధానికి నోచుకోని బడుగు, బలహీనవర్గాలకు చెందినవారు. ఊరికి మాత్రమే కాదు, విద్యకు కూడా వెలిగా బతుకులు వెళ్లదీసిన ఆ వర్గాలవారికి ప్రామాణిక విద్యనందించటంతోపాటు మెరుగైన ఆహారం, ఇతర సదుపాయాలు కల్పించటం ప్రభుత్వాల బాధ్యత కావాలి. పిల్లల మరణానికి దారితీస్తున్న అనారోగ్య సమస్యలు మరీ పెద్దవేమీ కాదు. జ్వరం, కడుపు నొప్పి, వివిధ సాంక్రమిక వ్యాధులు. చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే, పౌష్టికాహారం అందించ గలిగితే, నిర్ణీత వ్యవధిలో వైద్య శిబిరాలు నిర్వహిస్తుంటే... ఈ వ్యాధులు దరిచేరే అవకాశం ఉండదు. ఆ మాత్రం చేయటం కూడా చేతగాని ప్రభుత్వం రేపటి పౌరుల ఉసురు తీస్తోంది. ఈ మరణాలపై హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసిన రోజే అన్నమయ్య జిల్లా రాయవరం ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో 34 మంది పిల్లలు మధ్యాహ్న భోజనం తిని తీవ్ర అస్వస్థతకు లోనవటం బాబు నిర్వాకానికి అద్దం పడుతోంది. వెలుగూ వికాసమూ లేక చీకట్లో మగ్గిన తమ మాదిరిగా పిల్లలుండొద్దని, వారు మెరుగైన జీవితం గడపాలన్న ఆరాటంతో తల్లిదండ్రులు తమ కంటిపాపలను దూరమైనా పంపుతున్నారు. అలాంటివారిని ఎంత సున్నితంగా చూసుకోవాలో, ఎంత సురక్షితమైన సదుపాయాలు కల్పించాలో తెలియని చర్మం మందం సర్కారిది. వైఎస్సార్ కాంగ్రెస్ పాలనలో మెరుగైన విద్యతోపాటు బడుల్లో, హాస్టళ్లలో ఆర్వో ప్లాంట్లు నెల కొల్పారు. రుచికరమైన అల్పాహారం, భోజనం అందించారు. పరిశుభ్రమైన మరుగు దొడ్లు, స్నానపు గదులు నిర్మించారు. జిల్లాల్లో కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు ప్రతి 15 రోజులకూ హాస్టళ్లు సందర్శించి రాత్రి బస చేయాలన్న నియమం పెట్టారు. అందుకే సమస్యలున్నా వెంటనే పరిష్కారమయ్యేవి. ఇప్పుడు అధికారుల సందర్శన మాట అటుంచి, అడిగే దిక్కూ మొక్కూ లేక హాస్టళ్లు బావురుమంటున్నాయి.ఉడికీ ఉడకని అన్నం, నీళ్ల పప్పు, నాణ్యత లేని కూరగాయలతో వంట చేస్తుండటంవల్ల పిల్లల ఆరోగ్యం నాశనమై వారు అస్వస్థులవుతున్నారని ఆర్నెల్ల క్రితమే ‘సాక్షి’ కథనాలు వెల్లడించాయి. చాలామంది వార్డెన్లు సరుకులు అప్పు తెస్తున్నారని, సరైన స్నానపుగదులు, మరుగుదొడ్లు లేక విద్యార్థినులు సైతం ఇక్కట్లు ఎదుర్కొంటున్నారని ఆ కథనాలు తెలిపాయి. ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్ వంటి విద్యార్థి సంఘాలు ఉద్యమాలు చేశాయి. కానీ మారిందేమీ లేదు. మళ్లీ హైకోర్టు అక్షింతలు తప్పలేదు. మరణించిన విద్యార్థుల కుటుంబాలకు పరిహారం ఇవ్వాలన్న ఇంగితం కూడా కరవైంది. కార్పొరేట్లకూ, కాంట్రాక్టర్లకూ దోచిపెట్టే విధానాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్వస్తి పలకాలి. హాస్టళ్లను సకల సదుపాయాలతో తీర్చిదిద్దాలి. లేనట్టయితే ప్రజలే ప్రభుత్వానికి బుద్ధి చెబుతారు. -
ఏపీ హైకోర్టులో వల్లభనేని వంశీకి ఊరట
సాక్షి,విజయవాడ: మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ఏపీ హైకోర్టులో ఊరట దక్కింది. వంశీని అరెస్ట్ చేయొద్దని పోలీసులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. విజయవాడ మాచవరం పోలీస్ స్టేషన్లో వల్లభనేని వంశీపై హత్యాయత్నం కేసు నమోదైంది.ఈ కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని హైకోర్టులో వంశీ పిటిషన్ దాఖలు చేశారు. విచారణ చేపట్టిన కోర్టు అరెస్టు చేయొద్దని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణ వచ్చే వారానికి వాయిదా వేసింది. -
పిల్లలకు తాగునీరు ఎప్పుడిస్తారు?
సంక్షేమ హాస్టళ్లలో చదువుకుంటున్న పిల్లలకు ఎప్పటిలోగా తాగు నీరు అందిస్తారో కూడా స్పష్టంగా చెప్పలేరా? హాస్టళ్లకు ఎన్ని ఆర్వో ప్లాంట్లు అవసరం? దానికి సంబంధించిన లోపాలను ఎలా అధిగమిస్తారనే వివరాలను ప్రభుత్వం సమర్పించడం లేదు. హాస్టళ్ల పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయంటూ ప్రభుత్వం చేసిన ప్రకటన కూడా చాలా సాధారణంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ హైకోర్టు వ్యాఖ్యలు సాక్షి, అమరావతి: సంక్షేమ హాస్టళ్లలో చదువుకుంటున్న పిల్లలకు తాగునీరు ఎప్పటిలోగా అందిస్తారో కూడా స్పష్టంగా చెప్పలేరా? అంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. సుమారు 453 హాస్టళ్లలో ఆర్వో ప్లాంట్లు లేవన్న విషయాన్ని ప్రభుత్వం ఖండించడం లేదని ప్రస్తావించింది. హాస్టళ్లకు ఎన్ని ఆర్వో ప్లాంట్లు అవసరం? అందుకు సంబంధించిన లోపాలను ఎలా అధిగమిస్తారు? అనే వివరాలను ప్రభుత్వం సమర్పించడం లేదని ఆక్షేపించింది. హాస్టళ్ల పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయంటూ ప్రభుత్వం చేసిన ప్రకటన చాలా సాధారణంగా ఉందని ధర్మాసనం తప్పుబట్టింది.రాష్ట్రవ్యాప్తంగా 3 వేలకు పైగా హాస్టళ్లు ఉన్నందున ప్రతి చోటా తాము స్వయంగా పరిశీలించడం సాధ్యం కాదని, అందువల్ల, తాలూకా/ జిల్లా/ రాష్ట్ర స్థాయిల్లో మౌలిక సదుపాయాలను క్రమం తప్పకుండా పరిశీలించే వ్యవస్థను ఏర్పాటు చేయడం అవసరమని తేల్చి చెప్పింది. రాష్ట్రంలోని అన్ని హాస్టళ్లలో తాగునీరు, మరుగుదొడ్లు లాంటి మౌలిక సదుపాయాల కల్పనకు నిర్దిష్ట కాల పరిమితితో సమగ్ర ప్రణాళికను తమ ముందుంచాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ చీమలపాటి రవి ధర్మాసనం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. స్నానపు గదులు, మరుగుదొడ్లకు తలుపులే లేవు పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం హాస్టల్లో 86 మంది విద్యార్థులు కామెర్లకు గురికావడం, విద్యార్థి మరణించడం, 150 మంది విద్యార్థులు ఇతర సమస్యలతో ఆసుపత్రుల్లో చేరిన ఘటనపై సీజే ధర్మాసనం విజయనగరం జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శిని విచారణకు ఆదేశించింది. ధర్మాసనం ఆదేశాల మేరకు న్యాయసేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి ఆ హాస్టల్ను తనిఖీ చేసి నివేదికను హైకోర్టుకు సమరి్పంచారు. బావి నుంచి నేరుగా ట్యాంక్లోకి పంపిన నీటినే విద్యార్థులు తాగుతున్నారని తన నివేదికలో పేర్కొన్నారు.611 మంది విద్యార్థులు ఉంటే కేవలం 58 మరుగుదొడ్లు మాత్రమే ఉన్నాయని, ఇందులో 40 దొడ్లను వ్యాధి ప్రబలిన తరువాతే నిరి్మంచారని కార్యదర్శి హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. 11 మరుగుదొడ్లకు, 2 సాన్నపు గదులకు అసలు తలుపులే లేవని నివేదించారు. ఈ నివేదికపై రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్జీపీ) సింగమనేని ప్రణతి స్పందిస్తూ ఆ హాస్టల్లో ఆర్వో ప్లాంట్ను ఏర్పాటు చేసి తాగునీటిని అందిస్తున్నామన్నారు. మరుగుదొడ్ల నిర్మాణాన్ని స్వచ్ఛాంధ్రప్రదేశ్ కార్పొరేషన్ చేపడుతోందన్నారు. ప్రణతి నివేదించిన వివరాలపై ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. గత ప్రభుత్వం ఇచ్చిన జీవో అమలు ఎక్కడ? రాష్ట్రంలోని సంక్షేమ హాస్టళ్లలో కనీస మౌలిక సదుపాయాల కల్పనను రాష్ట్ర ప్రభుత్వం కేవలం మాటలకు, కాగితాలకే పరిమితం చేయడంపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆయా జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, ఇతర అధికారులు ప్రతి 15 రోజులకు ఒకసారి సంక్షేమ హాస్టళ్లను సందర్శించి రాత్రి అక్కడ బస చేయాలంటూ వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇచ్చిన జీవో 46 అమలు కాకపోవడంపై విస్మయం వ్యక్తం చేస్తూ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. గత ప్రభుత్వం ఇచ్చిన ఈ ఉత్తర్వులు హాస్టళ్ల పనితీరును మెరుగుపరిచేందుకు, విద్య నాణ్యతను పెంపొందించటానికి ఉద్దేశించినవని గుర్తు చేసింది.హాస్టళ్లలో పిల్లలకు శుభ్రమైన తాగునీరు ఎప్పటిలోపు అందిస్తారో కూడా ఈ ప్రభుత్వం స్పష్టంగా చెప్పడం లేదని ఆక్షేపించింది. 320 కొత్త ఆర్వో వాటర్ ప్లాంట్లు మంజూరయ్యాయని ప్రభుత్వం చెబుతున్నా, వాస్తవానికి అవి ప్రస్తుతం ఉన్న హాస్టళ్ల సంఖ్యకు ఏమాత్రం సరిపోవని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో గత ప్రభుత్వం జారీ చేసిన జీవో 46 ప్రకారం ప్రతి 15 రోజులకొకసారి పరిస్థితిని పర్యవేక్షించే యంత్రాంగాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. ఈమేరకు హాస్టళ్లలో మౌలిక సదుపాయాల కల్పన నిమిత్తం ఓ కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశించింది.కమిటీ పర్యవేక్షణ, నియంత్రణ బాధ్యత మొత్తం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిదేనని తేల్చి చెప్పింది. సంక్షేమ శాఖల అధికారులకు ఈ కమిటీలో స్థానం కల్పించాలని సూచించింది. నెలకు ఒకసారి ఈ కమిటీ సమావేశమై హాస్టళ్లలో మౌలిక సదుపాయాల కల్పనను పర్యవేక్షించాలని పేర్కొంది. జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ మార్గదర్శకాల ప్రకారం హాస్టళ్లలో మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. హాస్టళ్లలో ప్రస్తుతం, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించింది. మౌలిక సదుపాయాల కల్పనకు పిల్ సంక్షేమ హాస్టళ్లలో కనీస మౌలిక సదుపాయాలు కల్పించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ కాకినాడ జిల్లాకు చెందిన కీతినీడి అఖిల్ శ్రీగురు తేజ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై ఇప్పటికే పలుమార్లు విచారణ జరిపిన సీజే ధర్మాసనం ఇటీవల మరోసారి విచారణ జరిపింది.2025లో హైకోర్టు అడిగినా సీఎస్ ఇంతవరకూ నివేదిక ఇవ్వలేదు హాస్టళ్లలో విద్యార్థులు ఎదుర్కొంటున్న ఆహారం, వ్రస్తాలు, ఆశ్రయం ఇతర మౌలిక సదుపాయాల సమస్యలను అధిగమించేందుకు సమగ్ర ప్రణాళిక రూపొందించాలని 2025 జూలైలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించినా ఇంతవరకు తమకు సమరి్పంచలేదని ధర్మాసనం తెలిపింది. హాస్టళ్ల ప్రిన్సిపాళ్లు, వార్డెన్లు్ల క్షేత్రస్థాయి సమస్యలను ఉన్నతాధికారులకు నివేదించకపోవడం, ఆ సమస్యలను ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడం జరుగుతోందని ధర్మాసనం పేర్కొంది. నెలకొకసారి తనిఖీలు జరుగుతున్నాయని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, సమస్యను అధిగమించేందుకు పరిష్కార చర్యలు చేపట్టకుంటే ఎన్ని తనిఖీలు చేసినా ప్రయోజనం ఉండదని స్పష్టం చేసింది. -
బాబు కేస్తుల వివరాలన్నీ ఇవ్వండి
-
ప్రభుత్వం దారుణంగా విఫలం
సంక్షేమ హాస్టళ్లలో 45 మంది పిల్లలు చనిపోవడం చిన్న విషయమేమీ కాదు. వసతి గృహాల్లో ఉంటున్న విద్యార్థుల సంరక్షణ ప్రభుత్వ ప్రాథమిక బాధ్యత. జ్వరం, కడుపు నొప్పి, కంటి, బ్లడ్ ఇన్ఫెక్షన్ తదితర కారణాలతో పిల్లలు మృతి చెందారని చెబుతున్నారంటే... ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవడంలో, తగిన వైద్య సాయం అందించడంలో ప్రభుత్వం దారుణంగా విఫలమైనట్లే!– రాష్ట్ర హైకోర్టు వ్యాఖ్యలు సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని గిరిజన సంక్షేమ, ఆశ్రమ పాఠశాలల వసతి గృహాల్లో ఉంటున్న విద్యార్థినీ విద్యార్థుల వరుస మరణాలపై హైకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. పిల్లల సంరక్షణ బాధ్యత ప్రభుత్వానిదే అని తేల్చిచెప్పింది. విద్యార్థులు జ్వరం, కడుపు నొప్పి, కంటి, బ్లడ్ ఇన్ఫెక్షన్ తదితర కారణాలతో చనిపోవడం అంటే ముందుజాగ్రత్త చర్యలు, తగిన వైద్యం అందించడంలో దారుణంగా విఫలమైనట్లేనని ఆక్షేపించింది. సంక్షేమ హాస్టళ్లలో మరణించిన విద్యార్థుల కుటుంబాలకు పరిహారం అందజేసే విషయంలో నిర్దిష్ట విధానం ఉందా...? అని ప్రశ్నించింది. ఉంటే దానిని తమ ముందు ఉంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. హాస్టళ్లలో నెలలో ఎన్నిసార్లు వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలన్న దానిపై కార్యాచరణ రూపొందించాలని, ఇప్పటివరకు సంభవించిన మరణాలపై పూర్తి వివరాలను సమర్పించాలని సూచించింది. విద్యార్థులు ఏఏ కారణాలతో చనిపోయారో చెబుతూ, అందుకు సంబంధించిన నివేదికలను సమర్పించాలని స్పష్టం చేసింది. మరణించిన వారి కుటుంబాలకు ఇప్పటివరకు ఏమైనా పరిహారం చెల్లించి ఉంటే ఆ వివరాలను కూడా అందించాలంది. తదుపరి విచారణను జనవరి 21కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ చల్లా గుణరంజన్ల ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇదే అంశంపై ఇప్పటికే దాఖలైన ఓ పిల్లో కూడా ఈ వివరాలు అన్నింటినీ పొందుపరచాలని ప్రభుత్వానికి నిర్దేశించింది. కారణాలు తెలుసుకుంటాం రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్జీపీ) సింగమనేని ప్రణతి వాదనలు వినిపిస్తూ, 45 మంది విద్యార్థులు చనిపోయారని పిటిషనర్ చెబుతున్నారని... అందుకు కారణాలు ఏమిటి? హాస్టళ్లలోని పరిస్థితుల నేపథ్యమా? లేక ఇతర అంశాలు ఉన్నాయా? అన్న విషయాలను నిర్ధారించుకోవాల్సి ఉందని చెప్పారు. పిల్లలు మరణించినప్పుడు అందుకుగల కారణాలపై నివేదికలు ఉంటాయని, వాటిని కూడా కోర్టు ముందు ఉంచుతామని తెలిపారు. ప్రతి 15 రోజులకు హాస్టళ్లకు వెళ్లి విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షించాలని గ్రామాల్లోని ఏఎన్ఎంలకు ఆదేశాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఇరుపక్షాల వాదనల అనంతరం పూర్తి వివరాలను కోర్టు ముందు ఉంచేందుకు వీలుగా ధర్మాసనం విచారణను 21కి వాయిదా వేసింది. ఇటీవల హాస్టళ్లలో మరణాలు పెరిగాయి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని సంక్షేమ హాస్టళ్లలో పిల్లల బాగోగులు చూసేందుకు హెల్త్ వలంటీర్లను నియమించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ ఉత్తరాంధ్ర కమిటీ ఆఫ్ గిరిజన సంక్షేమ సంఘం ప్రతినిధి పలక రంజిత్కుమార్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. దీనిపై సీజే ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ... సంక్షేమ హాస్టళ్లలో మృతి చెందిన పిల్లల కుటుంబాలకు రూ.20 లక్షల చొప్పున పరిహారం ఇచ్చేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. ఇటీవల హాస్టళ్లలో మరణాలు పెరిగాయన్నారు. హెల్త్ వలంటీర్లను నియమించేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. -
బాబు కేసుల వివరాలన్నీ ఇవ్వండి
సాక్షి, అమరావతి: నారా చంద్రబాబునాయుడు, పొంగూరు నారాయణ, కొల్లు రవీంద్ర తదితరులు ముఖ్యమంత్రిగా, మంత్రులుగా ఉన్న 2014–19 మధ్య కాలంలో జరిగిన ఏపీ ఫైబర్నెట్, మద్యం విధానం, ఉచిత ఇసుక కుంభకోణాలపై సీఐడీ నమోదుచేసిన కేసుల్లో అన్ని డాక్యుమెంట్లను తనకిచ్చేలా విజయవాడ ఏసీబీ కోర్టును ఆదేశించాలని కోరుతూ ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు సువర్ణరాజు దాఖలు చేసిన క్రిమినల్ రివిజన్ పిటిషన్లపై హైకోర్టు స్పందించింది. సువర్ణరాజు దాఖలు చేసిన మూడు రివిజన్ పిటిషన్లను హైకోర్టు విచారణకు స్వీకరించింది. పూర్తి వివరాలను తమ ముందుంచాలని సీఐడీని ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ యడవల్లి లక్ష్మణరావు బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. రాష్ట్ర ప్రభుత్వం–నిందితుల మధ్య అపవిత్ర బంధంఏపీ ఫైబర్నెట్, మద్యం విధానం, ఉచిత ఇసుక కుంభకోణాలపై సీఐడీ పెట్టిన కేసుల్లో అన్ని డాక్యుమెంట్లను తనకిచ్చేందుకు ఏసీబీ కోర్టు నిరాకరిస్తూ ఈనెల 5న జారీచేసిన ఉత్తర్వులను రద్దుచేసి, అన్ని డాక్యుమెంట్లను తనకిచ్చేలా ఆదేశాలు జారీచేయాలని కోరుతూ సువర్ణరాజు హైకోర్టులో ఇటీవల క్రిమినల్ రివిజన్ పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాలపై జస్టిస్ లక్ష్మణరావు బుధవారం విచారణ జరిపారు. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్రెడ్డి వాదనలు వినిపించారు. ఈ కేసుల్లో రాష్ట్ర ప్రభుత్వం, నిందితుల మధ్య అపవిత్ర బంధం కొనసాగుతోందన్నారు. ప్రస్తుత ప్రభుత్వ పెద్దలపై గతంలో నమోదైన క్రిమినల్ కేసులను అన్యాయంగా, దారుణంగా మూసేస్తున్నారని.. ఇప్పటికే ఇలా ఐదారు కేసులను మూసివేశారని ఆయన వివరించారు. అలా మూసేసిన కేసుల తాలూకు కాపీలను కూడా బయటకు రానివ్వడంలేదన్నారు. ప్రస్తుత ప్రభుత్వ పెద్దలు నిందితులుగా ఉన్న కేసులకు తాలూకు డాక్యుమెంట్లను కోరినా కూడా ఏసీబీ కోర్టు ఇవ్వడంలేదని తెలిపారు. వాటిని తమకు ఇచ్చేందుకు ఏసీబీ కోర్టు నిరాకరించిందన్నారు. థర్డ్ పార్టీగా అన్ని డాక్యుమెంట్లు పొందే హక్కు పిటిషనర్కు ఉందన్నారు. వాస్తవానికి ఆ డాక్యుమెంట్లన్నీ కూడా పబ్లిక్ డాక్యుమెంట్లేనని తెలిపారు. న్యాయం కోసమే పోరాటం చేస్తున్నాంసీఐడీ తరఫున అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ పాణిని సోమయాజీ జోక్యం చేసుకుంటూ.. థర్డ్ పార్టీకి కేసు డాక్యుమెంట్లు ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. థర్డ్పార్టీ అయినా డాక్యుమెంట్లు పొందవచ్చని సుప్రీంకోర్టు పలు తీర్పుల్లో స్పష్టంగా చెప్పిందని పొన్నవోలు సుధాకర్రెడ్డి తెలిపారు. ఆ కాపీలను ఏ ప్రయోజనం కోసం కోరుతున్నారని న్యాయమూర్తి ప్రశి్నంచారు. కేసుల మూసివేతపై హైకోర్టులో రివిజన్ పిటిషన్లు దాఖలు చేసేందుకు కోరుతున్నామని సుధాకర్రెడ్డి బదులిచ్చారు. కేసుల మూసివేతపై థర్డ్ పార్టీనే పిటిషన్లు దాఖలు చేయాల్సిన అవసరంలేదని, హైకోర్టు సైతం సుమోటోగా స్పందించవచ్చని ఆయన చెప్పారు. న్యాయం కోసమే తాము పోరాటం చేస్తున్నామన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి ఈ మూడు క్రిమినల్ రివిజన్ పిటిషన్లను విచారణకు స్వీకరిస్తున్నట్లు తెలిపారు. పూర్తి వివరాలను తమ ముందుంచాలని సీఐడీని ఆదేశిస్తూ విచారణను వచ్చే వారానికి వాయిదా వేశారు. -
ఏపీ హైకోర్టు సిబ్బందిని చావగొట్టిన సీఐకి బాబు సర్కార్ పోస్టింగ్
సాక్షి, విజయవాడ: హైకోర్టు చెప్పినా లెక్క చెయ్యని చంద్రబాబు ప్రభుత్వం.. హైకోర్టు సిబ్బందిని చావగొట్టిన సీఐకి పోస్టింగ్ ఇచ్చింది. మార్టూరు సీఐగా యార్లగడ్డ శ్రీనివాసరావుకు పోస్టింగ్ ఇచ్చింది. టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుని సీఐ యార్లగడ్డ శ్రీనివాసరావు మర్యాదపూర్వకంగా కలిశారు.గతంలో మంగళగిరి రూరల్ సీఐగా పనిచేసిన యార్లగడ్డ శ్రీనివాసరావు.. హైకోర్టు డ్రైవర్పై దాడి చేశాడు. అదే కేసులో గతంలో సీఐని ప్రభుత్వం వీఆర్కు పంపింది. సీఐపై హైకోర్టు తీవ్ర స్థాయిలో మండిపడింది. హైకోర్టు ఆదేశంతో సీఐపై కేసు నమోదైంది. అదే సీఐకి చంద్రబాబు ప్రభుత్వం సైలెంట్గా మళ్లీ పోస్టింగ్ ఇచ్చింది. సీఐకి పోస్టింగ్ ఇవ్వడంపై పోలీసు, హైకోర్టు వర్గాల్లో తీవ్ర చర్చ నడుస్తోంది. -
న్యాయానికి గంతలు కట్టొచ్చేమో.. న్యాయమూర్తులకు కాదు
సాక్షి, అమరావతి: నివాస భవన నిర్మాణానికి అనుమతులు తీసుకుని.. తరువాత వాణిజ్య సముదాయాన్ని నిర్మిస్తున్నా, అది నివాస భవనమేనంటూ కోర్టును తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించిన పురపాలక కమిషనర్పై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన కేసు ఇది. న్యాయానికి గంతలు కట్టొచ్చేమో గానీ, న్యాయమూర్తులకు కాదని హైకోర్టు తేల్చి చెప్పింది. కోర్టును తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించినందుకు గాను పశి్చమ గోదావరి జిల్లా, భీమవరం అప్పటి మునిసిపల్ కమిషనర్కు రూ.2.50 లక్షలను ఖర్చుల కింద విధించింది. ఈ ఖర్చులను సొంత జేబు నుంచి చెల్లించాలని ఆదేశించింది. అంతేకాక నివాస భవనం కోసం అనుమతి తీసుకుని వాణిజ్య భవనం నిర్మించిన ఆ భవన యజమానులు– మణి మంజరి, నరసింహారావుకి సైతం రూ.2.50 లక్షలు ఖర్చులు విధించింది. సింగిల్ జడ్జి విధించిన రూ.50 వేల ఖర్చులను ఈ మేరకు భారీగా పెంచింది. ఈ మొత్తాన్ని రెండు వారాల్లో హైకోర్టు రిజిస్ట్రార్ (జుడీషియల్) వద్ద జమ చేయాలని ఆదేశించింది. అనంతరం ఈ మొత్తాన్ని రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ద్వారా మూగ, అంధుల సంక్షేమం కోసం వినియోగించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ చల్లా గుణరంజన్ ధర్మాసనం ఇటీవల ఒక అప్పీల్పై తీర్పును వెలువరించింది. కాగా, వాణిజ్య భవనం నిర్మించిన ప్రాంతం ఇప్పటికే వాణిజ్య ప్రాంతంగా అధికారికంగా మారడం, తమ భవనానికి యజమానులు వాణిజ్య అనుమతులు పొందడం వంటి కారణాల నేపథ్యంలో భవన అనుమతులను రద్దు చేయడం సాధ్యం కాదని ధర్మాసనం తేల్చిచెప్పింది. -
పరకామణిలో సంస్కరణలు తప్పనిసరి
సాక్షి, అమరావతి: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి పరకామణి వ్యవస్థలో సమూల సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందని హైకోర్టు స్పష్టంచేసింది. హుండీల్లో భక్తులు సమర్పించే కానుకల లెక్కింపు, రవాణా, సీలింగ్, డీ–సీలింగ్, ఖాతాల నిర్వహణ వంటి అంశాల్లో ఇప్పటికీ అనుసరిస్తున్న పాత విధానాల్లో మానవ జోక్యాన్ని తగ్గిస్తూ, కృత్రిమ మేథస్సు (ఏఐ), ఆధునిక యంత్రాలు, డిజిటలైజేషన్ వంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాల్సిన అవసరం ఉందని టీటీడీకి తేల్చిచెప్పింది. హుండీల్లో కేవలం డబ్బు మాత్రమే కాకుండా ఎన్నో వస్తువులు భక్తులు సమర్పిస్తారని కోర్టు గుర్తుచేసింది. ఇవన్నీ వర్గీకరించడంలో నేటి ఆధునిక యంత్రాలు, ఏఐ సాంకేతికత సమర్థవంతంగా పనిచేస్తాయని తెలిపింది. తక్షణ, శాశ్వత ప్రణాళికలను రూపొందించి వాటిని తమ ముందుంచాలని టీటీడీని ఆదేశించింది. తదుపరి విచారణను ఈనెల 26కి వాయిదా వేసింది.సీఐడీ, ఏసీబీ దర్యాప్తునకు ఆదేశం..శ్రీవారి పరకామణి చోరీ కేసును లోక్ అదాలత్లో రాజీచేసుకోవడంపై సీఐడీ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ తిరుపతికి చెందిన పాత్రికేయుడు ఎం.శ్రీనివాసులు హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన న్యాయస్థానం ఈ వ్యవహారంపై సీఐడీ దర్యాప్తునకు ఆదేశించింది. అలాగే, నిందితుడు రవికుమార్ ఆస్తులపై దర్యాప్తు జరపాలని ఏసీబీని ఆదేశించింది. ఆ కానుకలు.. భక్తుల మనోభావాలకు ప్రతీకలు..శ్రీవారికి భక్తులు హుండీలో సమర్పించిన ప్రతి కానుక భక్తుల విశ్వాసానికి ప్రతీకగా భావించాల్సి ఉంటుందని హైకోర్టు స్పష్టంచేసింది. అందుకే వాటి భద్రత, పారదర్శక లెక్కింపునకు అత్యంత ప్రాముఖ్యతను ఇస్తున్నామని పేర్కొంది. హుండీ నిర్వహణ, కానుకల లెక్కింపులో పారదర్శకత లేకపోతే భక్తుల మనోభావాలు దెబ్బతింటాయని టీటీడీకి తేల్చిచెప్పింది. భక్తుల మనోభావాలను పరిరక్షించాల్సిన బాధ్యత టీటీడీదేనని స్పష్టంచేసింది. ఇక పరకామణి వ్యవస్థలో తక్షణ సంస్కరణల కోసం ప్లాన్–ఏ ను రెండు వారాల్లో, శాశ్వత ఆధునీకరణ కోసం ప్లాన్–బీని ఎనిమిది వారాల్లో సమర్పించాలని టీటీడీ బోర్డును హైకోర్టు ఆదేశించింది. ప్లాన్–ఏ అమలుకు అవసరమైన నిపుణుల కమిటీలను ఏర్పాటుచేయాలని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాంకేతిక పరిజ్ఞానం కలిగిన భక్తుల సేవలను వినియోగించుకోవచ్చని సూచించింది. అలాగే, పరకామణిలో చోరీచేస్తూ దొరికిన ఓ ప్రైవేటు మఠం ఉద్యోగి సీవీ రవికుమార్, ఆయన కుటుంబ సభ్యులు జరిపిన ఆస్తుల బదలాయింపు వివరాలను సీల్డ్ కవర్లో ఒక వారంలో తమ ముందుంచాలని ఏసీబీ డైరెక్టర్ జనరల్ను హైకోర్టు ఆదేశించింది. -
టీటీడీ పరకామణి చోరీ కేసుపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు
సాక్షి, విజయవాడ: టీటీడీ పరకామణి చోరీ కేసుపై ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తిరుమలలో ఏం జరిగినా భక్తుల మనోభావాలు దెబ్బతింటాయని.. ఏ ఘటన జరిగినా టీటీడీ బోర్డుదే బాధ్యత అంటూ హైకోర్టు తేల్చి చెప్పింది. కానుకల లెక్కింపులో పారదర్శకత ఉండాలన్న ధర్మాసనం.. టెక్నాలజీని వినియోగించుకోవాలని హైకోర్టు సూచించింది.టీటీడీ పరకామణి చోరీ కేసు పిటిషన్పై హైకోర్టు ఇవాళ(డిసెంబర్ 19, శుక్రవారం) విచారణ చేపట్టింది. పరకామణి లెక్కింపు వ్యవహారంలో గత విచారణలో సలహాలు ఇవ్వమన్న దానిపై ఏమైనా సలహాలు ఇస్తారా అంటూ టీటీడీ స్టాండింగ్ కౌన్సిల్ను న్యాయస్థానం ప్రశ్నించింది. కానుకల లెక్కింపు,పర్యవేక్షణ, రికార్డుల సేకరణ కోసం AI టెక్నాలజీ, కంప్యూటర్స్ వినియోగించాలని పేర్కొంది. చివరి పైసా వరకు లెక్క సరిగ్గా ఉండాలని.. చోరీలు, మోసాలు జరగకుండా చూడాలని హైకోర్టు చెప్పింది.టీటీడీ బోర్డ్ వెంటనే వీటిపై చర్యలు చేపట్టాలని.. ఒక ముసాయిదా రూపొందించాలని పేర్కొంది. రెండు వారాల్లోగా దీనిపై నివేదిక సమర్పించాలని ఆదేశించింది. టీటీడీ బోర్డు 8 వారాల్లోగా ప్లాన్ B పై నివేదిక సమర్పించాలని ఆదేశించిన హైకోర్టు.. తదుపరి విచారణ వచ్చే శుక్రవారానికి వాయిదా వేసింది. -
హైకోర్టు షాక్.. చంద్రబాబు చేసిన పనికి నోరెళ్లబెట్టింది
-
జగన్ విజన్కే బాబు సర్కార్ జై..!
సాక్షి, అమరావతి: వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (హెచ్ఆర్సీ), లోకాయుక్తను కర్నూలులో ఏర్పాటు చేయడంపై నానా యాగీ చేసి హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేయించిన టీడీపీ.. ఇప్పుడు జగన్ విజన్కే జై కొట్టింది. హెచ్ఆర్సీ, లోకాయుక్తలను విజయవాడకు తరలించాలని సూత్రప్రాయంగా నిర్ణయించామని గతంలో హైకోర్టుకు నివేదించిన చంద్రబాబు ప్రభుత్వం వాటిని కర్నూలులోనే కొనసాగిస్తామని తాజాగా హైకోర్టుకు వివరించింది. దీనిని పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు.. ప్రభుత్వ విధాన నిర్ణయంలో తామెలా జోక్యం చేసుకోగలమని పిటిషనర్ను ప్రశ్నించింది. ఈ వ్యవహారంలో 2021లో ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్ రికార్డుల్లో లేకపోవడంతో హైకోర్టు తదుపరి విచారణను వచ్చే నెలకు వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ చల్లా గుణరంజన్ ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. లోకాయుక్త, హెచ్ఆర్సీ కార్యాలయాలను కర్నూలులో ఏర్పాటు చేయాలన్న గత ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ తెలుగుదేశం పార్టీ నాయకులు డాక్టర్ మద్దిపాటి శైలజ 2021లో హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. ఈ వ్యాజ్యం గతంలో విచారణకు వచ్చిన సందర్భంలో లోకాయుక్త, హెచ్ఆర్సీలను కర్నూలు నుంచి విజయవాడకు తరలించాలని సూత్రప్రాయంగా నిర్ణయించామని చంద్రబాబు ప్రభుత్వం పేర్కొంది. తాజాగా ఈ వ్యాజ్యంపై బుధవారం సీజే నేతృత్వంలోని ధర్మాసనం మరోసారి విచారణ జరిపింది. ఈ సందర్భంగా ప్రభుత్వం తరఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్జీపీ) సింగమనేని ప్రణతి వాదనలు వినిపిస్తూ లోకాయుక్త, హెచ్ఆర్సీ కార్యాలయాలను కర్నూలులోనే కొనసాగిస్తామని చెప్పారు. -
99 పైసలకే 27.10 ఎకరాలా..? రహేజా కార్ప్కు భూకేటాయింపులపై హైకోర్టు విస్మయం
సాక్షి, అమరావతి: పలు ప్రైవేటు కంపెనీలకు నామమాత్రపు ధరలకే భూములు కట్టబెడుతూ వస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, ఇప్పుడు ఏకంగా ఓ రియల్ ఎస్టేట్ సంస్థ– రహేజా కార్ప్ రియల్ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్కు కూడా కేవలం 99 పైసలకే 27.10 ఎకరాలు కట్టబెట్టడంపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది.ఇంత తక్కువ ధరకు రియల్ ఎస్టేట్ కంపెనీకి అంత భూమి ఎలా కేటాయిస్తారని ప్రశ్నించింది. ఇతర కంపెనీల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ ఇచ్చారా? అని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. ఒక వేళ దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ ఇచ్చి ఉంటే మరిన్ని కంపెనీలు కూడా ముందుకు వచ్చి ఉండేవని తెలిపింది.అలా ఎన్ని కంపెనీలు ముందుకు వచ్చాయని ప్రశ్నించింది. అందరికీ అవకాశం ఇవ్వకుండా ఒకే కంపెనీకే భూములు కట్టబెట్టడం ఏమిటని ప్రశ్నించింది. ఈ మొత్తం వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.రహేజాకు భూ కేటాయింపు విషయంలో అనుసరించిన విధానాన్ని కూడా తమ ముందుంచాలని ఆదేశించింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ చల్లా గుణరంజన్ ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.ఎదురు రూ.91.2 కోట్లు చెల్లిస్తోంది: పొన్నవోలువిశాఖపట్నం, మధురవాడ, ఐటీ హిల్లో కేవలం 99 పైసలకే 27.10 ఎకరాల భూమిని రహేజాకు కేటాయించడాన్ని సవాలు చేస్తూ సొసైటీ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ రైట్స్ సంస్థ అధ్యక్షుడు, మానవ హక్కుల కమిషన్ పూర్వ సభ్యుడు డాక్టర్ గోచిపాత శ్రీనివాసరావు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్రెడ్డి వాదనలు వినిపించారు. వాదనల్లో ముఖ్యాంశాలు..– పొన్నవోలు వాదనల సమయంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్ స్పందిస్తూ, కంపెనీలకు భూ కేటాయింపులపై ఇప్పటికే ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలై ఉన్నాయని, ప్రస్తుత వ్యాజ్యంలో కూడా పిటిషనర్ భూ కేటాయింపులను, కేటాయింపుల విధానాన్ని సవాలు చేశారని వివరించారు. – అలా అయితే ఆ వ్యాజ్యాలతో కలిపి ఈ వ్యాజ్యాన్ని కూడా వింటామని ధర్మాసనం స్పష్టం చేసింది. – ఈ సమయంలో పొన్నవోలు జోక్యం చేసుకుంటూ, ఇది రియల్ ఎస్టేట్ కంపెనీకి భూములు కేటాయించిన వ్యవహారమని తెలిపారు. గతంలో దాఖలు చేసిన వ్యాజ్యాలు పలు ఐటీ కంపెనీలకు భూ కేటాయింపులపై దాఖలైనవని వివరించారు. దీంతో ధర్మాసనం విచారణను కొనసాగించింది– రహేజా రియల్టీ సంస్థ కాదని ఏజీ చెబుతుండగా, పొన్నవోలు అడ్డుతగులుతూ అది రియల్ ఎస్టేట్ కంపెనీనేనని, కావాలంటే జీవో 204ను చూడాలని, అందులో రియల్ ఎస్టేట్ కంపెనీ అని స్పష్టంగా ఉందని చెప్పారు. – ప్రభుత్వం భూ కేటాయింపులతో సరిపెట్టలేదని, ప్రోత్సాహకాలుగా సదరు రియల్ ఎస్టేట్ కంపెనీకి ఎదురు రూ.91.2 కోట్లు చెల్లిస్తోందని వివరించారు. ఈ మొత్తాన్ని ఏ క్షణమైనా విడుదల చేసే అవకాశం ఉందని, అందువల్ల తగిన మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. – పొన్నవోలు లేవనెత్తిన పాయింట్ సరైనదేనని, అయితే ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసిన తరువాత అన్ని విషయాలను పరిశీలిస్తామని పొన్నవోలుకు ధర్మాసనం స్పష్టం చేసింది. -
మద్యం అక్రమ కేసులో బెయిల్ పిటిషన్లపై విచారణ వాయిదా
సాక్షి, న్యూఢిల్లీ: మద్యం అక్రమ కేసులో బెయిల్కు సంబంధించి హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై మాజీ ఐఏఎస్ కె.ధనంజయ రెడ్డి, పెల్లకూరు కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప దాఖలు చేసిన పిటిషన్లపై తదుపరి విచారణను సుప్రీంకోర్టు జనవరి 21వ తేదీకి వాయిదా వేసింది. ఈ పిటిషన్లు సోమవారం ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్మాల్య బాగ్చీ, జస్టిస్ విపుల్ ఎం. పంచోలిలతో కూడిన ధర్మాసనం ముందుకు వచ్చినప్పుడు... పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాదులు సి. ఆర్యమ సుందరం, నిరంజన్ రెడ్డి, సిద్ధార్థ దవేలు వాదనలు వినిపిస్తూ, కౌంటర్ అఫిడవిట్లకు సంబంధించి శనివారం రెండు రిజాయిండర్లు దాఖలు చేశామని, మరొకటి సోమవారం దాఖలు చేస్తున్నామని వివరించారు. ఇరుపక్షాల కౌంటర్లు, రిజాయిండర్లు, వాదనలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం కేసు తదుపరి విచారణను జనవరి 21కి వాయిదా వేసింది.కాగా ఈ కేసులో ట్రయల్ కోర్టు తదుపరి చర్యలకు తమ మధ్యంతర ఉత్తర్వులు అడ్డంకి కాదని అత్యున్నత న్యాయస్థానం ఈ సందర్భంగా స్పష్టం చేసింది. నేపథ్యం ఇదీ... తప్పుల తడక చార్జ్షిట్ నేపథ్యంలో ముగ్గురు నిందితులకు గతంలో ట్రయల్ కోర్టు ‘డిఫాల్ట్ బెయిల్’ మంజూరు చేసింది. అయితే, దాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ను విచారించిన ఏపీ హైకోర్టు వారి డిఫాల్ట్ బెయిల్ను రద్దు చేసింది. నవంబర్ 26లోగా ట్రయల్ కోర్టులో లొంగిపోవాలని, రెగ్యులర్ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవాలని ఆదేశించింది. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ వీరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పిటిషనర్లకు అనుకూలంగా నవంబర్ 26న సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. -
కాకాణి రిట్ పిటిషన్పై స్పందించిన హైకోర్టు
సాక్షి, నెల్లూరు జిల్లా: వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్న్రెడ్డి రిట్ పిటిషన్పై హైకోర్టు స్పందించింది. తనపై నమోదైన 9 అక్రమ కేసుల్లో సీబీఐ విచారణను కాకాణి కోరారు. రిట్ పిటిషన్పై కౌంటర్ దాఖలు చేయాలని.. ఏపీ ప్రభుత్వం, సీబిఐ, సిఐడీతో పాటు ప్రతివాదులను హైకోర్టు ధర్మాసనం అదేశించింది. గతంలో తనపై నమోదైన కేసులపై సీబీఐ విచారణ జరపాలని సీఎం చంద్రబాబుకు మెయిల్ చేశారు. సీఎం స్పందించకపోవడంతో కాకాణి.. హైకోర్టులో రిట్ పిటిషన్ వేశారు.కాగా, చంద్రబాబు సర్కార్ వైఫల్యాలను, అవినీతి, అక్రమాలను ఎప్పటికప్పుడు నిలదీస్తుండటంతో కాకాణిపై చంద్రబాబు సర్కార్ కక్ష సాధింపు చర్యలకు దిగిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది మే నెలలో కాకాణి గోవర్ధన్రెడ్డిని నెల్లూరు పోలీసులు కక్షపూరితంగా అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. 85 రోజులు జైల్లో ఉన్న ఆయన కాకాణి గోవర్దన్రెడ్డి.. బెయిల్ రావడంతో బయటకువచ్చారు. అక్రమ కేసులు బనాయించడంతో.. కూటమి ప్రభుత్వంపై ఆయన న్యాయ పోరాటం చేస్తున్నారు. -
టీడీపీ ఎమ్మెల్యేకు హైకోర్టు నోటీసులు.. 100 స్టాంపును 1,00,000 స్టాంపుగా మార్చి..
-
టీడీపీ ఎమ్మెల్యే సురేంద్రబాబుకు హైకోర్టు నోటీసులు
సాక్షి, అనంతపురం: కళ్యాణదుర్గం టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబుకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఇటీవల కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఈ-స్టాంపుల కుంభకోణం బయటపడింది. నకిలీ స్టాంపులు బ్యాంకులకు సమర్పించి వందల కోట్ల రూపాయల రుణాలను అక్రమంగా తీసుకున్న టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబుకు చెందిన ఎస్ఆర్ కన్ స్ట్రక్షన్ సంస్థ. సురేంద్ర బాబు సహా 12 మందికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఫిబ్రవరి 18వ తేదీ లోపు వివరణ ఇవ్వాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది.కళ్యాణదుర్గం కేంద్రంగా సాగిన ఈ బాగోతం.. రాష్ట్రాన్ని కుదిపేసిన సంగతి తెలిసిందే. ఎస్ఆర్ కన్స్ట్రక్షన్ కంపెనీ రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటకలో కూడా కాంట్రాక్టు పనులు నిర్వహిస్తోంది. ఈ కంపెనీ ఈ ఏడాది బ్యాంకుల నుంచి రూ.900 కోట్ల మేర రుణం తీసుకుంది.ఆస్తులు తనఖా పెట్టి ఆ గ్యారెంటీతో రుణాలు తీసుకోవాలి. దీనికోసం ముందుగా స్టాంప్ డ్యూటీ చెల్లించి తనఖా వివరాలు పొందుపరిచి ఈ స్టాంప్ పొందాలి. బ్యాంకు రుణంలో 0.5 శాతం స్టాంప్ డ్యూటీ కింద అంటే రూ.900 కోట్ల రుణానికి రూ.4.5 కోట్లు ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉండగా, ఎస్ఆర్సీ మాత్రం నాలుగు డాక్యుమెంట్ల ద్వారా కేవలం రూ.1,51,700 చెల్లించింది. అంటే రూ.4,48,48,300 మేర స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖకు చెల్లించకపోవడం గమనార్హం. -
ఏళ్ల తరబడి ఒకేచోట పనిచేయడం సరికాదు
సాక్షి, అమరావతి: జీవిత భాగస్వామి పనిచేస్తున్న చోటే పోస్టింగ్ తీసుకుంటున్న కొందరు ప్రభుత్వ ఉద్యోగులు జీవితాంతం ఒక్క చోటే విధులు నిర్వర్తిస్తుండటంపై హైకోర్టు ధర్మాసనం విస్మయం వ్యక్తం చేసింది. అలాగే ఉద్యోగ సంఘాల నాయకులు కూడా ఆయా సంఘాల్లో తమ తమ హోదాలను సాకుగా చూపుతూ ఏళ్ల తరబడి ఒకే చోట పనిచేస్తున్నారని, ఇది ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేసింది. ఇలా కొందరు ఉద్యోగులు ఒకే చోట ఏళ్ల తరబడి పనిచేస్తూ ఆ స్థానాలకు రావాలనుకుంటున్న ఇతర ఉద్యోగులకు అడ్డంపడి పోతున్నారని తెలిపింది. ఈ వ్యవహారంపై లోతుగా విచారణ జరుపుతామని తేల్చి చెప్పింది. ఈ రెండు కేటగిరిలకు మినహాయింపుల వెనుక ఉన్న హేతుబద్ధత ఏమిటని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఇందుకు సంబంధించి నిబంధనలు, మార్గదర్శకాల వివరాలు తెలియచేయాలని శుక్రవారం ప్రభుత్వాన్ని ఆదేశించిన న్యాయమూర్తులు జస్టిస్ బట్టు దేవానంద్, జస్టిస్ అవధానం హరిహరనాథ శర్మ ధర్మాసనం.. తదుపరి విచారణను జనవరి మొదటి వారానికి వాయిదా వేసింది. హైకోర్టుకు చేరిన ఇద్దరు అధికారుల మధ్య వివాదం...విజయనగరం జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్ (జెడ్ఎస్డబ్యూఓ)గా పనిచేస్తున్న మజ్జి కృష్ణారావును తూర్పు గోదావరి జిల్లా, కాకినాడకు బదిలీ చేశారు. కృష్ణారావు స్థానంలో కేవీఎస్ ప్రసాదరావును విజయనగరం జెడ్ఎస్డబ్యూఓగా నియమించారు. కృష్ణారావు కాకినాడలో బాధ్యతలు చేపట్టకుండా విజయనగరంలోనే ఉండటంతో వివాదం మొదలైంది. పైగా ఈ బదిలీపై హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన సింగిల్ జడ్జి... పిటిషనర్ కృష్ణారావును విజయనగరంలో కొనసాగించే విషయంలో హోంశాఖ ముఖ్య కార్యదర్శి జారీ చేసిన సంబంధిత ప్రొసీడింగ్స్ అమలుకు చర్యలు తీసుకోవాలని సైనిక్ వెల్ఫేర్ డైరెక్టర్ను ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ ప్రసాదరావు ధర్మాసనం ముందు అప్పీల్ దాఖలు చేశారు. -
అవి ఏమైనా.. అడ్డా కూలీ కేంద్రాలా?
-
హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్గా జస్టిస్ రవినాథ్ తిల్హరీ
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్గా సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ రవినాథ్ తిల్హరీ నామినేట్ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ జారీ చేసింది. హైకోర్టులో సీనియారిటీలో 3వ స్థానంలో ఉన్న న్యాయమూర్తి హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్గా వ్యవహరించడం సంప్రదాయంగా వస్తోంది.లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్ పోస్టుకు జస్టిస్ తిల్హరీని ప్రధాన న్యాయమూర్తి, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ప్యాట్రన్ ఇన్ చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ నామినేట్ చేశారు. ఇప్పటి వరకు ఆ స్థానంలో జస్టిస్ రావు రఘునందన్రావు ఉన్నారు. -
రాష్ట్రంలో నిరుద్యోగుల పరిస్థితేంటి?
సాక్షి, అమరావతి: బోధనా సిబ్బంది పోస్టులను శాశ్వత ప్రాతిపదికన భర్తీ చేయకుండా ఎప్పటికప్పుడు కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్, తాత్కాలిక పద్దతుల్లో భర్తీ చేస్తుంటే రాష్ట్రంలో నిరుద్యోగుల పరిస్థితి ఏమిటని హైకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. తాత్కాలిక పోస్టులతో యువతను దోచుకుంటున్నారని ఘాటుగా వ్యాఖ్యానించింది. అసంబద్ధ నిర్ణయాలతో విద్యా సంస్థలను అడ్డా కూలీల కేంద్రాలుగా మార్చేస్తున్నారంటూ మండిపడింది. నాణ్యమైన విద్యను పొందడం విద్యార్థుల హక్కు అని తేల్చి చెప్పింది. విధాన నిర్ణయం పేరు చెప్పి ఆ హక్కులను కాలరాయలేరని ఈ సందర్భంగా స్పష్టం చేసింది. రాష్ట్రంలో విద్యా వ్యవస్థను ముఖ్యంగా విశ్వవిద్యాలయాలను నాశనం చేస్తుంటే మౌనంగా ఉండలేమని హైకోర్టు స్పష్టం చేసింది. పోస్టుల భర్తీ ప్రభుత్వ విధాన నిర్ణయమని, అందులో కోర్టు జోక్యం తగదని ఈ సందర్భంగా యూనివర్సిటీ తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్ చేసిన వాదనలతో ధర్మాసనం ఏకీభవించలేదు. తాత్కాలిక ప్రాతిపదికన భర్తీ చేసే నిమిత్తం.. లేని పోస్టులను ఎలా సృష్టిస్తారని ఈ సందర్భంగా హైకోర్టు ప్రశ్నించింది. పోస్టే లేకుంటే దానిని తాత్కాలికంగా భర్తీ చేయడమన్న ప్రశ్నే ఉత్పన్నం కాదంది. శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయం (ఎస్వీయూ)లోని పలు విభాగాల్లో 2025–26 విద్యా సంవత్సరానికి తాత్కాలిక ప్రాతిపదికన అకడమిక్ కన్సల్టెంట్ల నియామకం కోసం యూనివర్సిటీ రిజి్రస్టార్ అక్టోబర్ 31న జారీ చేసిన నోటిఫికేషన్ అమలును ఈ సందర్భంగా నిలిపివేసింది. దీనికి అనుమతినిస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులపై స్టే విధించింది. ఈ వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం, ఎస్వీయూ రిజిస్ట్రార్లను హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ బట్టు దేవానంద్, జస్టిస్ అవధానం హరిహరనాథ శర్మ ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. అప్పీల్ నేపథ్యం ఇదీ.. ⇒ ఎస్వీయూ అక్టోబర్ 31 నోటిఫికేషన్ రాజ్యాంగబద్ధతను సవాలు చేస్తూ డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్లో అకడమిక్ కన్సల్టెంట్లుగా పనిచేస్తున్న డాక్టర్ కె.కిషోర్ కుమార్రెడ్డి, డాక్టర్ ఎస్.శివశంకర్, మరో ప్రైవేటు ఉద్యోగి రెడ్డివారి అర్జున్రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ⇒ ఈ పిటిషన్పై జోక్యానికి గత నెల 26న సింగిల్ జడ్జి బెంచ్ నిరాకరించింది. ⇒ దీనిపై హైకోర్టు ధర్మాసనం వద్ద అప్పీల్ దాఖలైంది ⇒ అప్పీల్దారుల తరఫు న్యాయవాది మునకల వెంకటరమణ వాదనలు వినిపిస్తూ.. అన్నీ అర్హతలున్నా ప్రస్తుత నియామకాలకు సంబంధించి పిటిషనర్లను అసలు పరిగణనలోకే తీసుకోవడం లేదని ధర్మాసనానికి విన్నవించారు. -
రోడ్డుపైనే అంతిమ సంస్కారమా!
సాక్షి, అమరావతి: ఓ వ్యక్తి అంతిమ సంస్కారాలను రోడ్డుపైనే నిర్వహించడంపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. శ్మశాన వాటికల్లో అంతిమ సంస్కారాలు నిర్వహించలేని దుస్థితిలో ఉన్నామా? అని ఆవేదన వ్యక్తం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న శ్మశాన వాటికల్లో కనీస సదుపాయాలను కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని స్పష్టం చేసింది. శ్మశానాల నిర్వహణకు నిధులు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అసక్తి చూపడం లేదని ప్రశ్నించింది. శ్మశానాల ఏర్పాటు, నిర్వహణ కోసం జీవోలు ఇచ్చినప్పటికీ అవేవీ అమలు కావడం లేదంది. ఆ జీవోలు కేవలం కాగితాలకే పరిమిత మయ్యాయని తెలిపింది. రాష్ట్రంలో రాబోయే రెండు దశాబ్దాలకు అనుగుణంగా శ్మశాన వాటికల ఏర్పాటుకు కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రస్తుతం ఉన్న శ్మశానాల నిర్వహణకు ఓ యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని కూడా ఆదేశించింది. శ్మశాన వాటికల్లో కనీస మౌలిక వసతుల కల్పనకు అవసరమైన నిధులను సైతం విడుదల చేయాలని స్పష్టం చేసింది. ఈ ఆదేశాలను అమలు చేసి దానిపై రెండు నెలల్లో నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. తదుపరి విచారణను వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ చల్లా గుణరంజన్ ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని అన్ని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, పంచాయతీల్లోని శ్మశాన వాటికల్లో కనీస సదుపాయాలు లేకపోయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ విజయవాడకు చెందిన పి.ప్రమోద్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన సీజే ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. పిటిషనర్ తరఫు న్యాయవాది గడిపూడి వెంకటేశ్వర్లు, పురపాలక శాఖ తరఫున ప్రభుత్వ న్యాయవాది అంబటి శ్రీకాంత్రెడ్డి వాదనలు వినిపించారు. -
సహచర అధికారిపైనే దౌర్జన్యమా?
సాక్షి, అమరావతి: సహచర ప్రభుత్వాధికారిపట్ల మరో అధికారి దురుసుగా, దౌర్జన్యంగా వ్యవహరించడాన్ని హైకోర్టు తీవ్రంగా ఆక్షేపించింది. తామిచ్చిన ఆదేశాలకు విరుద్ధంగా మజ్జి కృష్ణారావు జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్ (జెడ్ఎస్డబ్ల్యూఓ)గా బాధ్యతలు చేపట్టేందుకు ప్రయత్నించడమే కాక, ఆ స్థానంలో ఉన్న మరో అధికారి కేవీఎస్ ప్రసాదరావుపట్ల దౌర్జన్యపూరితంగా వ్యవహరించడంపై మండిపడింది. ఇలాంటి వాటిని ఎట్టి పరిస్థితుల్లో అనుమతించబోమని తేల్చిచెప్పింది.ఈ చర్యలు ఏపీ స్టేట్ అండ్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్కు విరుద్ధమని స్పష్టంచేసింది. ఈ 21వ శతాబ్దంలో, ప్రజాస్వామ్య పాలన వ్యవస్థలో అధికారుల దౌర్జన్యపూరిత, అరాచక ప్రవర్తనను సహించేదేలేదని తేల్చిచెప్పింది. ఈ మొత్తం వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని, దీనిపై పూర్తిస్థాయిలో విచారణ జరుపుతామని వెల్లడించింది. ఈ వ్యాజ్యంలో విజయనగరం జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, వన్టౌన్ పోలీస్స్టేషన్ ఇన్స్పెక్టర్ను సుమోటో ప్రతివాదులుగా చేర్చింది. తదుపరి ఉత్తర్వులు జారీచేసే వరకు జెడ్ఎస్డబ్ల్యూఓగా కేవీఎస్ ప్రసాదరావు కొనసాగేలా చూడాలని హోంశాఖ ముఖ్య కార్యదర్శి, సైనిక్ వెల్ఫేర్ డైరెక్టర్లను హైకోర్టు ఆదేశించింది. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించిన ఒరిజినల్ రికార్డులను తమ ముందుంచాలని సైనిక్ వెల్ఫేర్ డైరెక్టర్ను ఆదేశించింది. అలాగే, ఈ వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వంతో పాటు ఆరోపణలు ఎదుర్కొంటున్న మజ్జి శ్రీనివాసరావును ఆదేశించింది. తదుపరి విచారణను డిసెంబరు 2కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ బట్టు దేవానంద్, జస్టిస్ అవధానం హరిహరనాథ శర్మ ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. చట్టం దృష్టిలో విజయనగరం జెడ్ఎస్డబ్ల్యూఓగా ప్రసాదరావే కొనసాగుతున్నారని ధర్మాసనం తన ఉత్తర్వుల్లో స్పష్టంచేసింది.అక్కడ సైనిక వెల్ఫేర్ ఆఫీసర్గా నేనే ఉంటా..విజయనగరం జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్గా పనిచేస్తున్న మజ్జి కృష్ణారావును తూర్పుగోదావరి జిల్లా, కాకినాడకు బదిలీ చేశారు. ఆయన స్థానంలో కేవీఎస్ ప్రసాదరావును నియమించారు. అయితే, కృష్ణారావు కాకినాడలో రిపోర్ట్ చేయలేదు. జిల్లా సైనిక్ వెల్ఫేర్ అధికారిగా బాధ్యతలు కూడా చేపట్టలేదు. ఈ వ్యవహారంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ జోక్యం చేసుకున్నారు. దీంతో.. కృష్ణారావును విజయనగరంలోనే కొనసాగించాలంటూ హోంశాఖ ముఖ్య కార్యదర్శి ప్రొసీడింగ్స్ ఇచ్చారు. ఈ ప్రొసీడింగ్స్ను సైనిక్ వెల్ఫేర్ డైరెక్టర్ అమలుచేయడం లేదంటూ మజ్జి కృష్ణారావు హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన హైకోర్టు సింగిల్ జడ్జి.. హోంశాఖ ముఖ్య కార్యదర్శి జారీచేసిన ప్రొసీడింగ్స్ అమలుకు చర్యలు తీసుకోవాలని సైనిక్ వెల్ఫేర్ డైరెక్టర్ను ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీచేశారు.20 మందితో ప్రసాదరావును బయటకు తోసేసిన కృష్ణారావు..ఈ ఉత్తర్వులను సవాలుచేస్తూ విజయనగరం జెడ్ఎస్డబ్ల్యూఓగా నియమితులైన కేవీఎస్ ప్రసాదరావు ఈనెల 26న ధర్మాసనం ముందు అత్యవసరంగా అప్పీల్ దాఖలుచేశారు. కృష్ణారావు తనను ప్రతివాదిగా చేర్చకుండానే పిటిషన్ దాఖలుచేసి, తనకు తెలియకుండానే తనకు వ్యతిరేకంగా ఉత్తర్వులు పొందారని ప్రసాదరావు ధర్మాసనానికి నివేదించారు. ఈ అప్పీల్పై ఈనెల 27న విచారణ జరిపిన జస్టిస్ బట్టు దేవానంద్ నేతృత్వంలోని ధర్మాసనం, ఈ మొత్తం వ్యవహారంలో యథాతథస్థితి కొనసాగించాలంటూ ప్రభుత్వ న్యాయవాది, ప్రసాదరావు, కృష్ణారావు తరఫు న్యాయవాదుల సమక్షంలో ఉత్తర్వులు జారీచేసింది. ఇదే సమయంలో కృష్ణారావు దౌర్జన్యపూరితంగా 20 మందితో కలిసి ప్రసాదరావు ఛాంబర్కు వెళ్లి అతన్ని సీటు నుంచి లేపి బలవంతంగా బయటకు తోసేసిన విషయం కూడా ధర్మాసనం దృష్టికి వచ్చింది. ఈ ఘటనపై ప్రసాదరావు పోలీసులకు సైతం ఫిర్యాదు చేసినట్లు అతని తరఫు న్యాయవాది వివరించారు.కృష్ణారావు చర్యలు నిబంధనలకు విరుద్ధం..ప్రసాదరావు అప్పీల్పై ధర్మాసనం శుక్రవారం మరోసారి విచారణ జరిపింది. విజయనగరం జెడ్ఎస్డబ్ల్యూఓగా కృష్ణారావు 27వ తేదీ మధ్యాహ్నమే బాధ్యతలు స్వీకరించారని ప్రభుత్వ న్యాయవాది ఈ సందర్భంగా ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. డైరెక్టర్ సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్ ఇచ్చిన ప్రొసీడింగ్స్ మేర జెడ్ఎస్డబ్ల్యూఓగా బాధ్యతలు తీసుకున్నారని కృష్ణారావు తరఫు న్యాయవాది వివరించారు. ఆ ప్రొసీడింగ్స్ను ఇప్పటివరకు తనకు అందచేయలేదని, అందువల్ల తనను విజయనగరం జెడ్ఎస్డబ్ల్యూఓగా రిలీవ్ చేయడమన్న ప్రశ్నే తలెత్తదని ప్రసాదరావు న్యాయవాది జయంతి ఎస్సీ. శేఖర్ వివరించారు. నిబంధనల ప్రకారం ఎవరైనా అధి కారి ఓ స్థానం నుంచి మరో స్థానానికి బదిలీ అయినప్పుడు అతన్ని రిలీవ్ చేస్తూ ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉంటుందని.. అయితే ప్రస్తుత కేసులో అలాంటి విధానాన్ని అనుసరించలేదని ప్రభుత్వ న్యాయవాది అంగీకరించారు.స్టేట్ అండ్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ ప్రకారం కృషా్ణరావు నడుచుకోలేదని వివరించారు. దీంతో.. కృష్ణారావు తీరును ధర్మాసనం తీవ్రంగా పరిగణించి ఈ మొత్తం వ్యవహారంపై లోతుగా విచారణ జరపాలని నిర్ణయించింది. -
వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్కు ముందస్తు బెయిల్ ఇవ్వద్దు
సాక్షి, అమరావతి: మద్యం అక్రమ కేసులో అప్రూవర్లుగా మారుతామని, అందువల్ల తమకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ప్రధాన నిందితులైన అప్పటి ఏపీ బేవరేజస్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎండీ దొంతిరెడ్డి వాసుదేవరెడ్డి, ఎక్సైజ్ శాఖ స్పెషలాఫీసర్ దొడ్డా వెంకట సత్యప్రసాద్ దాఖలు చేసిన వ్యాజ్యాలను వ్యతిరేకిస్తూ మరో నిందితుడు చెవిరెడ్డి భాస్కర్రెడ్డి హైకోర్టులో అనుబంధ పిటిషన్లు దాఖలు చేశారు. ముందస్తు బెయిల్ కోసం వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్ దాఖలు చేసిన పిటిషన్లలో తనను ప్రతివాదిగా చేర్చుకుని తన వాదనలు కూడా వినాలని హైకోర్టును కోరారు. వీరివురి ముందస్తు బెయిల్ పిటిషన్లు ఈ నెల 28వ తేదీన (శుక్రవారం) హైకోర్టులో విచారణకు రానున్న నేపథ్యంలో చెవిరెడ్డి తాజా పిటిషన్లు దాఖలు చేశారు. వీటిలోని ముఖ్యాంశాలు ఇవీ.. బెయిల్తో సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ‘మద్యం అక్రమ కేసులో 2, 3 నిందితులుగా ఉన్న వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్ అప్రూవర్లుగా మారి ముందస్తు బెయిల్ పొందితే సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉంది. సాక్షులను బెదిరించే అవకాశం ఉంది. వారికి ముందస్తు బెయిలిస్తే అది కేసుతో పాటు ట్రయల్పై, సహనిందితులపై తీవ్ర ప్రభావం చూపుతుంది. వీరిద్దరూ ఇచి్చన వాంగ్మూలాలు నమ్మదగినవి కావు. అందువల్ల వాటిని పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈ కేసులో ట్రయల్ మొత్తం పూర్తయ్యేంత వరకు వారిద్దరినీ కస్టడీలోకి తీసుకోవాలి. వారికి ముందస్తు బెయిల్ నిష్పాక్షిక దర్యాప్తు సూత్రాలకు విరుద్ధం. దర్యాప్తులో భాగంగా ఇప్పటివరకు 150 మంది సాక్షులను విచారించారు. 50 మందిని ఈ కేసులో చట్ట విరుద్ధంగా నిందితులుగా చేర్చారు.తప్పు చేయకపోయినా కొందరు నిందితులు ఇప్పటికీ జైల్లోనే మగ్గుతున్నారు. ఎఫ్ఐఆర్ ప్రకారం ఈ కేసులో పబ్లిక్ సర్వెంట్లుగా వీరిద్దరి పాత్ర కీలకం. అయితే ఇప్పటికీ వారిని అరెస్ట్ చేయలేదు. వారిపై ఎలాంటి శాఖాపరమైన చర్యలు తీసుకోలేదు. దర్యాప్తు సంస్థ రాజ్యాంగంలోని అధికరణ 14, 20, 21 నిర్దేశించిన నిష్పాక్షిక దర్యాప్తు సూత్రాలను ఉల్లంఘించినట్లు దీని ప్రకారం అర్థం అవుతోంది.ఈ అక్రమ కేసులో కొందరిపై రాజకీయ కక్ష సాధింపు3లకు వీరిరువురి వాంగ్మూలాలను వినియోగించుకోవాలని బాబు సర్కార్ కనుసన్నల్లోని దర్యాప్తు సంస్థ కుట్ర పన్నుతోంది. ప్రధాన నిందితులుగా ఉన్న వారిని రక్షిస్తోంది. న్యాయపరమైన పర్యవసానాల నుంచి కాపాడుతోంది. ఇదే విషయంలో వీరు దాఖలు చేసిన పిటిషన్లను ఏసీబీ కోర్టు తిరస్కరించింది. దీంతో వారిద్దరూ ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు’ అని భాస్కర్రెడ్డి ఆపిటిషన్లలో వివరించారు. -
ప్రొవిజినల్ అసైన్మెంట్పైనా పూర్తి హక్కులు
సాక్షి, అమరావతి: ఎక్స్ సర్విస్మెన్ కోటా కింద సైనికోద్యోగులకు ప్రొవిజినల్ (తాత్కాలికం) అసైన్మెంట్ ద్వారా కేటాయించిన భూమిపై వారికి సర్వ హక్కులు ఉంటాయని హైకోర్టు తేల్చి చెప్పింది. ప్రొవిజినల్ అసైన్మెంట్ కింద పొందిన భూమిని సాగు చేస్తుంటే డీఫాం పట్టా జారీ అన్నది కేవలం లాంఛనం మాత్రమేనని స్పష్టం చేసింది. డీఫాం పట్టా ఆలస్యంగా జారీ అయిందన్న కారణంతో ఎక్స్ సర్విస్మెన్ కోటా కింద సైనికోద్యోగులకు దక్కాల్సిన ప్రయోజనాలను దక్కకుండా చేయలేరని పేర్కొంది. గత 40 ఏళ్లుగా అప్పిలెట్ తనకు కేటాయించిన భూమిని సాగు చేసుకుంటున్న నేపథ్యంలో, ఆ భూమిని అమ్ముకునేందుకు అతనికి హక్కులు ఉన్నాయని తెలిపింది.అలాగే ఇసుక దిబ్బల పోరంబోకు భూమిని అసైన్మెంట్ కింద ఇవ్వడానికి వీల్లేదన్న ప్రభుత్వ వాదనను సైతం హైకోర్టు తోసిపుచ్చింది. ఇదే సర్వే నంబర్లోని ఇసుక దిబ్బల పోరంబోకు భూమిని ప్రభుత్వం ఇతరులకు సైతం అసైన్మెంట్ కింద ఇచ్చిందని, వారు ఆ భూమిని వీఎంఆర్డీఏకి అప్పగించి, అందుకు ప్రతిగా ప్లాట్లు పొందారని హైకోర్టు గుర్తు చేసింది. అలాంటప్పుడు అప్పిలేట్కి కేటాయించిన ఇసుక దిబ్బ భూమిపై ప్రభుత్వం ఎందుకు అభ్యంతరం చెబుతుందో అర్థం కావడం లేదని పేర్కొంది.ఎక్స్ సర్విస్మెన్ కోటా కింద అసైన్మెంట్ భూమి పొందేందుకు జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్లు, సర్విసులో ఉన్న సైనికోద్యోగులు కూడా అర్హులేనని తేల్చి చెప్పింది. ప్రస్తుత కేసులో మాజీ సైనికోద్యోగి అప్పారావు భూమిని నిషేధిత భూముల జాబితా నుంచి తొలగించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆరు వారాల్లో నిరభ్యంతర పత్రం (ఎన్వోసీ) జారీ చేయాలని స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ రావు రఘునందన్రావు, జస్టిస్ బొప్పన వరాహ లక్ష్మీనరసింహ చక్రవర్తి ధర్మాసనం ఇటీవల తీర్పు వెలువరించింది.కలెక్టర్ ఉత్తర్వులపై హైకోర్టులో పిటిషన్ విశాఖపట్నానికి చెందిన వీసీ అప్పారావు నౌకాదళంలో పనిచేసి 1989లో పదవీ విరమణ చేశారు. సర్వీసులో ఉండగానే ఆయనకు ఎక్స్ సర్విస్మెన్ కోటా కింద ప్రభుత్వం 1978లో భీమునిపట్నం మండలం కొత్తవలస గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 75–2లో 5.10 ఎకరాల భూమిని అసైన్మెంట్ కింద ఇచ్చింది. అప్పటి నుంచి ఆయన ఈ భూమిని సాగు చేసుకుంటున్నారు. కొంతకాలం తర్వాత ప్రభుత్వం ఈ భూమిని నిషేధిత భూముల జాబితాలో చేర్చింది. ఈ భూమిని నిషేధిత జాబితా నుంచి తొలగించాలని కలెక్టర్ను కోరగా తిరస్కరించారు. దీంతో అప్పారావు హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యంపై హైకోర్టు సింగిల్ జడ్జి విచారణ జరిపారు. కలెక్టర్ అభ్యంతరాలపై వివరణ ఇస్తూ తిరిగి ఆయనకు వినతిపత్రం ఇవ్వాలని అప్పారావును ఆదేశించారు.ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ అప్పారావు ధర్మాసనం ముందు అప్పీల్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ రఘునందన్రావు ధర్మాసనం విచారణ జరిపింది. అప్పారావు తరఫు న్యాయవాది జీఎల్ నరసింహారెడ్డి వాదనలు వినిపించారు. సర్విసులో ఉండగా ఇచ్చిన అసైన్మెంట్ను ఎక్స్ సర్వీస్మెన్కు ఇచ్చినట్లుగానే భావించాల్సి ఉంటుందని, దానిని 10 ఏళ్ల తర్వాత అమ్ముకునేందుకు హక్కు ఉంటుందని వివరించారు. కలెక్టర్ ఏకపక్షంగా అప్పారావు భూమిని నిషేధిత భూముల జాబితాలో చేర్చారని, ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని కోరారు. వాదనలు విన్న ధర్మాసనం, అప్పారావు భూములను నిషేధిత భూముల జాబితా నుంచి తొలగించాలని కలెక్టర్ను ఆదేశిస్తూ తీర్పునిచ్చింది. -
హామీలిచ్చి నెరవేర్చబోమంటే కుదరదు..
సాక్షి, అమరావతి: హామీలిచ్చి నెరవేర్చబోమంటే కుదరదని, ఇచ్చిన హామీలను నెరవేర్చడం ప్రభుత్వ బాధ్యత అని తెలుగు గంగ భూ నిర్వాసితుల వ్యాజ్యంలో న్యాయమూర్తులు జస్టిస్ బట్టు దేవానంద్, జస్టిస్ అవధానం హరిహరనాథ శర్మలతో కూడిన హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది. హామీలను నెరవేర్చడానికి ఒక విధానాన్ని రూపొందించినప్పుడు దానికి అనుగుణంగా నిర్దిష్ట కాల వ్యవధిలోపే ఆ హామీలను నెరవేర్చి తీరాలని పేర్కొంది. సాంకేతిక అంశాలతోసహా అర్థం లేని కారణాలను సాకుగా చూపడం సరికాదని చెప్పింది. మనదేశంలో ప్రజలకు భూమితో వీడదీయలేని సంబంధం ఉంటుందని, భూమిని మనం అమ్మలా ప్రేమించడమే దీనికి కారణమని తెలిపింది.భూమి తీసుకున్నప్పుడు పునరావాసం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుందని, లేదంటే ప్రభుత్వంపై ప్రజలు విశ్వాసం కోల్పోతారని పేర్కొంది. అంతిమంగా ఇది సమాజంలో అశాంతికి దారి తీస్తుందని హెచ్చరించింది. ఈ వ్యాజ్యం విషయంలో నిర్వాసితులకు ఉద్యోగాలివ్వాలన్న సింగిల్ జడ్జి ఉత్తర్వుల్లో జోక్యానికి నిరాకరించింది. ప్రభుత్వ అప్పీల్ను కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది. తెలుగు గంగ ప్రాజెక్టు కోసం 40 ఏళ్ల క్రితం భూములు కోల్పోయిన భూ నిర్వాసిత కుటుంబాలకు ఈ తీర్పు పెద్ద ఊరటనిచ్చింది. కేసు నేపథ్యం ఇదీ... తెలుగు గంగ ప్రాజెక్టు కోసం 1984 నుంచి చేస్తున్న భూ సేకరణలో భాగంగా అధికారులు కడప జిల్లాలో పెద్ద మొత్తంలో భూములు సేకరించారు. భూ నిర్వాసితులు, వారి కుటుంబ సభ్యులు, వారిపై ఆధారపడి జీవిస్తున్న వారికి పునరావాసం కలి్పంచే నిమిత్తం ప్రభుత్వం 1986లో జీవో నెంబర్ 98ని జారీ చేసింది. పునరావాసం నిమిత్తం అర్హులైన వారు ఏడాదిలోపు కలెక్టర్కు దరఖాస్తు చేసుకోవాలంటూ ఆ జీవోలో పేర్కొన్నారు. అటు తరువాత 1987లో ప్రభుత్వం ఈ షరతును తొలగించింది. భారీ, మధ్య తరహా సాగునీరు, విద్యుత్ ప్రాజెక్టుల్లో జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్లకు సమానమైన పోస్టుల్లో 50 శాతం పోస్టులను భూ నిర్వాసితులు, వారి కుటుంబ సభ్యులు, వారిపై ఆధారపడ్డ వారితో భర్తీ చేస్తామని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.దీంతో అర్హతలు ఉన్న పలువురు ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే హామీ ఇచ్చిన మేర ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వకపోవడంతో కొందరు ఏపీ పరిపాలనా ట్రిబ్యునల్ను ఆశ్రయించారు. విచారణ జరిపిన ట్రిబ్యునల్ వారికి ఉద్యోగాలు ఇవ్వాలని ఆదేశించింది. దీంతో ప్రభుత్వం వారికి ఉద్యోగాలిచ్చింది. ఇదే రీతిలో అర్హులైన మరికొందరు హైకోర్టును ఆశ్రయించారు. దశాబ్దాల క్రితం తమ భూములు తీసుకున్న ప్రభుత్వం ఇప్పటి వరకు ఉద్యోగాలు ఇవ్వలేదని, అర్హులైన తమకు కూడా ఉద్యోగాలు ఇచ్చేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ కడప జిల్లాకు చెందిన రాజోల జగన్నాధరెడ్డి, మరో 46 మంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన సింగిల్ జడ్జి పిటిషనర్లకు ఉద్యోగాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు. ఈ ఆదేశాలను సవాలు చేస్తూ ప్రభుత్వం డివిజన్ బెంచ్ని ఆశ్రయించింది. విచారణ జరిపిన డివిజన్ బెంచ్ ప్రభుత్వ అప్పీల్ను కొట్టేసింది. -
తెలుగు గంగ ప్రాజెక్ట్.. ఏపీ హైకోర్టు సంచలన తీర్పు
సాక్షి, విజయవాడ: తెలుగు గంగ ప్రాజెక్ట్ నిర్వాసితుల ఉద్యోగ కల్పనపై ఏపీ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. తెలుగు గంగ ప్రాజెక్టు కోసం 40 ఏళ్ల క్రితం ప్రభుత్వం భూములు తీసుకుంది. నిర్వాసితులకు ఉద్యోగాలు ఇస్తామన్న ప్రభుత్వం.. ఇవ్వకపోవడంతో నిర్వాసితులు కోర్టును ఆశ్రయించారు.నిర్వాసితులకు ఉద్యోగాలు ఇవ్వాలని హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పు చెప్పింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ప్రభుత్వం డివిజన్ బెంచ్కి వెళ్లింది. సింగిల్ బెంచ్ ఉత్తర్వులపై ప్రభుత్వ అప్పీల్ను హైకోర్టు కొట్టివేసింది.ప్రభుత్వం హామీలిచ్చి నెరవేర్చబొమంటే కుదరదు అంటూ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘ఇచ్చిన హామీలను నెరవేర్చడం ప్రభుత్వ బాధ్యత. ఇచ్చిన హామీలను నిర్దిష్ట కాల వ్యవధిలోపే నెరవేర్చాలి. ప్రభుత్వం సాంకేతిక, అర్థంలేని కారణాలు సాకుగా చెప్పటానికి వీల్లేదు. నిర్వాసితుల కోసం తెచ్చిన పథకాన్ని అమలు చేయాల్సిందే. నిజమైన స్ఫూర్తితో అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపైన ఉంది..భూమి తీసుకున్నప్పుడు పునరావాసం కల్పించాల్సిందే. లేకపోతే ప్రభుత్వంపై ప్రజలు నమ్మకం కోల్పోతారు. తెలుగు గంగ భూనిర్వాసితులకు ఉద్యోగాలు ఇవ్వాలన్న ఉత్తర్వులు సబబే. సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వుల్లో మేము జోక్యం చేసుకోం’’ అంటూ ధర్మాసనం తేల్చి చెప్పింది. -
హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు.. నిబంధనల పేరుతో ప్రభుత్వ డాక్టర్ల కాలయాపన
సాక్షి, అమరావతి: ప్రభుత్వ డాక్టర్లు నిబంధనల పేరుతో కాలయాపన చేస్తున్నారని హైకోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది. పబ్లిక్ సర్వెంట్లుగా నిర్వర్తించాల్సిన విధులను సక్రమంగా నిర్వర్తించడం లేదని పేర్కొంది. వివరాల్లోకి వెళితే రాయపూడి గ్రామానికి చెందిన 90 ఏళ్ల శేషగిరమ్మకు చెందిన భూమిని సీఆర్డీఏ భూసేకరణలో తీసుకోగా.. ఆమెకు, మానసిక వైకల్యంతో బాధపడుతున్న మనుమరాలు శ్యామలకు జీవనోపాధి లేకుండా పోయింది. దీంతో ఇద్దరూ కారుణ్య మరణం కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. దీనిని విచారించిన న్యాయమూర్తి జస్టిస్ రామకృష్ణ ప్రసాద్ ప్రభుత్వ పథకం కింద ఆర్థిక సాయం అందించేందుకు శ్యామలకు ఎంత మేర మానసిక వైకల్యం ఉందో తేల్చాలని గతంలో వైద్యశాఖను ఆదేశించారు. శుక్రవారం విచారణలో శ్యామలకు 95 శాతం మానసిక వైకల్యం ఉందని సంబంధిత అధికారి నివేదించారు. అయితే, శారీరక వైకల్యం పరిస్థితి పరీక్షించలేదని చెప్పడంతో న్యాయమూర్తి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. శ్యామల ఇంటికి నిపుణులను పంపి పూర్తి పరీక్షలు చేయాలని వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టర్ను ఆదేశించారు.తదుపరి విచారణను డిసెంబర్ 1కి వాయిదా వేశారు. కాగా, ఈ వ్యాజ్యంలో సీఆర్డీఏ తరఫు న్యాయవాది సింగమనేని ప్రణతి స్పందిస్తూ.. శేషగిరమ్మ, శ్యామల ప్రస్తుతం ఉంటున్న ఇల్లు, అక్కడి నిర్మాణాల విలువను అధికారులు రూ.6 లక్షలుగా అంచనా వేశారని, ఈ మొత్తానికి మరో రూ.6 లక్షలు కలిపి మొత్తం రూ.12 లక్షలు వారికి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. వారిద్దరిని అక్కడి నుంచి మరోచోటుకు తరలించిన పక్షంలో వారికి అక్కడ 5 సెంట్ల భూమిని కూడా ఇవ్వాలని కూడా నిర్ణయించామన్నారు. ఈ వ్యాజ్యంలో న్యాయమూర్తి గతంలో స్వయంగా తన కారు డ్రైవర్ను ఇచ్చి అడ్వకేట్ కమిషనర్ను బాధితుల ఇంటికి పంపి వారి వివరాలు తెలుసుకున్న సంగతి తెలిసిందే. -
చంద్రబాబు సర్కార్ కి హైకోర్టు చివాట్లు
-
మరోసారి ఏపీ ప్రభుత్వంపై హైకోర్టు అసహనం..
-
దేవ్జీ, రాజారెడ్డి.. పోలీసుల అక్రమంగా నిర్భంధం?
సాక్షి, అమరావతి: మావోయిస్టు పార్టీ అగ్రనేతలు తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ, మల్లా రాజిరెడ్డిలను పోలీసులు అక్రమంగా నిర్బంధించారని, వారిని కోర్టుముందు హాజరుపరిచేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ దేవ్జీ సోదరుడు తిప్పిరి గంగాధర్, రాజిరెడ్డి కుమార్తె స్నేహలత హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై న్యాయమూర్తులు జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్రాయ్, జస్టిస్ తుహిన్కుమార్ గేదెల ధర్మాసనం గురువారం విచారణ జరిపింది.పిటిషనర్ల న్యాయవాది యు.జైభీమారావు వాదనలు వినిపిస్తూ.. ఈ నెల 18న పోలీసులు, మావోయిస్టులకు మధ్య కాల్పులు జరిగాయని చెప్పారు. ఈ సందర్భంగా పలువురు మృతి చెందారన్నారు. ఇదే సమయంలో దేవ్జీ, మల్లా రాజిరెడ్డిలను పోలీసులు నిర్బంధించారని చెప్పారు. వారిని కోర్టుముందు ప్రవేశపెట్టేలా ఆదేశాలివ్వాలని కోరారు. ఈ సమయంలో ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్జీపీ) తిరుమణి విష్ణుతేజ వాదనలు వినిపిస్తూ.. దేవ్జీ, రాజారెడ్డి పోలీసుల అదుపులో లేరని చెప్పారు. అరెస్ట్ చేసిన 50 మంది మావోయిస్టులను పోలీసులు మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారని నివేదించారు. దేవ్జీ, రాజారెడ్డిలను అక్రమంగా నిర్బంధించారన్న వాదనలో వాస్తవం లేదన్నారు. పోలీసుల అదుపులో ఉన్నారనేందుకు ఆధారాలేమున్నాయి? ఈ సమయంలో ధర్మాసనం జోక్యం చేసుకుంటూ.. దేవ్జీ, రాజారెడ్డి పోలీసుల అక్రమ నిర్బంధంలో ఉన్నారనేందుకు ఆధారాలు ఏమైనా ఉన్నాయా? అని ప్రశ్నించింది. ఏ ఆధారాలతో వారు పోలీసుల అదుపులో ఉన్నారని చెబుతున్నారని ప్రశ్నించింది. ఇలాంటి వ్యవహారాల్లో న్యాయస్థానం జోక్యం చేసుకోవాలంటే.. అక్రమ నిర్బంధంపై ప్రాథమిక ఆధారాలుండాలని స్పష్టం చేసింది. ప్రాథమిక ఆధారాలు లేనప్పుడు తాము చేయగలిగిందీ ఏమీ లేదని పేర్కొంది. పిటిషనర్ల న్యాయవాది జైభీమారావు స్పందిస్తూ.. దేవ్జీ, రాజారెడ్డిల సెక్యూరిటీ గార్డులను పోలీసులు అరెస్ట్ చేశారని తెలిపారు. ఎన్కౌంటర్ తరువాత పోలీసులు మీడియాతో మాట్లాడుతూ 9 మంది కీలకనేతలు తమ ఆ«దీనంలో ఉన్నట్లు చెప్పారని, ఆ వీడియోను కోర్టు ముందుంచుతామని చెప్పారు. దీంతో ధర్మాసనం.. దేవ్జీ, రాజారెడ్డి పోలీసుల అదుపులో ఉన్నారనేందుకు ఆధారాలను తమ ముందుంచాలని పిటిషనర్ల న్యాయవాదికి స్పష్టం చేసింది. తదుపరి విచారణను శుక్రవారానికి (నేటికి) వాయిదా వేసింది. -
నిర్ధారణ కాకుండానే నోటీసులా?
సాక్షి, అమరావతి: సభా హక్కుల ఉల్లంఘన పేరుతో ‘సాక్షి’పై కక్షసాధింపులకు పాల్పడుతున్న అసెంబ్లీ వర్గాలకు హైకోర్టు మరోసారి గట్టి షాక్నిచ్చింది. ఎమ్మెల్యేలకు శిక్షణ తరగతుల పేరుతో రూ.కోట్ల ప్రజాధనాన్ని వృథా చేయడంపై కథనాన్ని ప్రచురించినందుకు ‘సాక్షి’ని లక్ష్యంగా చేసుకోవడంపై కళ్లెం వేసింది. కథనం తాలూకు ఆధారాలతో ఈ నెల 21న సభా హక్కుల కమిటీ ఎదుట హాజరై సాక్ష్యం చెప్పాలంటూ ‘సాక్షి’ ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డికి అసెంబ్లీ సెక్రటరీ జనరల్ ఈ నెల 11న జారీ చేసిన లేఖ విషయంలో హైకోర్టు జోక్యం చేసుకుంది. సభా హక్కుల కమిటీ ముందు ధనంజయరెడ్డి, ఫణికుమార్ వ్యక్తిగత హాజరును వాయిదా వేసింది. అదనపు వివరాలను కమిటీ ముందు ఉంచేందుకు వారిద్దరికీ వెసులుబాటు ఇచ్చింంది. అసలు ‘సాక్షి’ కథనం సభా హక్కుల ఉల్లంఘన పరిధిలోకి వస్తుందో రాదో తేల్చకుండా షోకాజ్ నోటీసులు ఎలా ఇస్తారని అసెంబ్లీ సెక్రటరీ జనరల్, సభా హక్కుల కమిటీని ప్రశ్నించింది. అన్ని అంశాలపై లోతైన విచారణ జరుపుతామని పేర్కొంది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందన్రావు ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. రూ.కోట్ల ప్రజాధనం వృథాపై ‘సాక్షి’ కథనంఎమ్మెల్యేలకు శిక్షణ తరగతుల నిర్వహణలో సరైన ప్రణాళిక, అవగాహన లేకపోవడంతో రూ.కోట్ల ప్రజాధనం వృథా అయింది. రెండు రోజుల పాటు శిక్షణ తరగతులు నిర్వహించేలా శాసనసభ వర్గాలు ఈ ఏడాది ఫిబ్రవరిలో నిర్ణయించాయి. ఎమ్మెల్యేలు, అతిథులకు హోటళ్లు, భోజనాలు, బహుమతులు తదితరాల కోసం భారీగా ఖర్చు చేశారు. కానీ, లోక్సభ స్పీకర్ ఈ కార్యక్రమానికి రాలేదు. దీంతో ఖర్చంతా వృథా అయింది. ఆ విషయాన్నే చెబుతూ ‘కోట్లు ఖర్చు... శిక్షణ తుస్సు’ శీర్షికన ఫిబ్రవరి 22న ‘సాక్షి’ కథనం ప్రచురించింది. దీంతో కంగుతిన్న అధికార పార్టీ నేతలు కక్షసాధింపు చర్యలు చేపట్టారు. సభా హక్కుల కమిటీకి నివేదించిన స్పీకర్ ‘సాక్షి’ కథనం సభా హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని, దానిని తాను సభలో ప్రస్తావించేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ టీడీపీ ఎమ్మెల్యే జయసూర్య ఫిబ్రవరి 25న అసెంబ్లీ స్పీకర్కు నోటీసు ఇచ్చారు. స్పీకర్ ఈ వ్యవహారాన్ని సభా హక్కుల కమిటీకి నివేదించారు. ఆ కమిటీ ఆదేశాల మేరకు అసెంబ్లీ సెక్రటరీ జనరల్ ‘సాక్షి’కి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఎమ్మెల్యే ఇచ్చిన నోటీసుతో పాటు సెక్రటరీ జనరల్ ఇచ్చిన షోకాజ్ నోటీసును సవాలు చేస్తూ ఎడిటర్ ధనంజయరెడ్డి, ఫణికుమార్ జూన్లో హైకోర్టులో పిటిషన్లు వేశారు. ఈ వ్యాజ్యాలపై ఇటీవల న్యాయమూర్తి జస్టిస్ రామకృష్ణప్రసాద్ విచారణ జరిపారు. ఇచ్చింది షోకాజ్ నోటీసు మాత్రమేనని, ఆ తర్వాత చాలా ప్రక్రియ ఉన్న నేపథ్యంలో ఈ వ్యాజ్యాలు అపరిపక్వమైనవి అంటూ వాటిని కొట్టివేస్తూ ఈ నెల 4న తీర్పునిచ్చారు. ఈ తీర్పును సవాలు చేస్తూ ధనంజయరెడ్డి, ఫణికుమార్ ధర్మాసనం ముందు అప్పీళ్లు దాఖలు చేశారు.ప్రజాధనం వృథా అనే చెప్పాం.. సభా కార్యకలాపాల్లో జోక్యం చేసుకోలేదు వారి అప్పీళ్లపై గురువారం సీజే ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది ఓబిరెడ్డి మనోహర్రెడ్డి, వేలూరు మహేశ్వర్రెడ్డి, అనూప్ కౌషిక్ వాదనలు వినిపించారు. ‘‘అసలు సాక్షి కథనం సభా హక్కుల పరిధిలోకి రాదు. అది కేవలం పరిపాలనాపరమైన అంశానికి సంబంధించినది. ఆ కథనం సభ్యుల హక్కులకు భంగం కలిగించడం లేదు. కాబట్టి సభా హక్కుల పరిధిలోకి వస్తుందా? రాదా? అన్న విషయం తేల్చాల్సిన అవసరం ఉంది. వాస్తవానికి ఏది సభా హక్కుల పరిధిలోకి వస్తుంది? ఏది రాదు..? అన్న విషయమై ఎక్కడా నిర్దిష్టమైన నిర్వచనం లేదు’’ అని మనోహర్రెడ్డి తెలిపారు. ‘సాక్షి’ కథనాన్ని చదివి వినిపించారు. ‘‘అసెంబ్లీ కార్యకలాపాల్లో జోక్యం చేసుకున్నప్పుడు, వాటిని అడ్డుకున్నప్పుడే సభా హక్కుల ఉల్లంఘన తెరపైకి వస్తుంది. సాక్షి కథనం ఎక్కడా సభా కార్యకలాపాల్లో జోక్యం చేసుకోవడం లేదు. శిక్షణ తరగతులు నిర్వహించకపోవడంతో ప్రజాధనం వృథా అయిందన్న విషయాన్ని మాత్రమే ఎత్తిచూపింది. సాక్షికి షోకాజ్ నోటీసిచ్చే అధికార పరిధి సభా హక్కుల కమిటీకి లేదు’’ అని వివరించారు. షోకాజ్ నోటీసుకు వివరణ కూడా ఇచ్చినా, దానిని సభా హక్కుల కమిటీ పరిగణనలోకి తీసుకోలేదన్నారు. అంతేకాక తాము ప్రచురించిన కథనానికి తగిన ఆధారాలతో స్వయంగా ఈ నెల 21న హాజరై సాక్ష్యం ఇవ్వాలంటూ కమిటీ తరఫున అసెంబ్లీ జనరల్ సెక్రటరీ లేఖ పంపారని పేర్కొన్నారు.కమిటీ ఎదుట హాజరైతే దోషులుగా తేల్చేస్తారుఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ, ‘‘సభా హక్కుల కమిటీ ఇచ్చిన నోటీసులకు స్పందించండి. కమిటీ ముందు హాజరుకండి. మీరు చెప్పాల్సింది చెప్పండి. మీకు వ్యతిరేకంగా కమిటీ ఉత్తర్వులిస్తే మా వద్దకు రండి. అప్పుడు తప్పకుండా మేం స్టే ఇస్తాం’’ అని ప్రతిపాదించింది. దీనిపై మనోహర్రెడ్డి స్పందిస్తూ, వార్తా కథనం సభా హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందా? రాదా? అన్నది తేలకుండా పిటిషనర్లు కమిటీ ఎదుట హాజరు కావడంలో అర్థం లేదని.. ఒకవేళ వారు హాజరైతే వెంటనే విచారణ మొదలుపెట్టి దోషులుగా తేలుస్తారని తెలిపారు.సభా హక్కుల ఉల్లంఘనఅని దేని ఆధారంగా నిర్ధారణకు వచ్చారుప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్, అసెంబ్లీ సెక్రటరీ జనరల్, సభా హక్కుల కమిటీ తరఫున గింజుపల్లి సుబ్బారావు వాదనలు వినిపిస్తూ.. సహజ న్యాయ సూత్రాల్లో భాగంగా పిటిషనర్లకు నోటీసులు ఇచ్చామన్నారు. ధర్మాసనం స్పందిస్తూ, సాక్షి కథనం సభా హక్కుల ఉల్లంఘన అని దేని ఆధారంగా నిర్ధారణకు వచ్చారంటూ వరుసగా ప్రశ్నలు సంధించింది. దమ్మాలపాటి స్పందిస్తూ సభా హక్కుల ఉల్లంఘన విషయంలో సభా హక్కుల కమిటీ తన నివేదికను సభకు ఇస్తుందని, ఈ నివేదిక తుది నిర్ణయం కాదన్నారు. పిటిషనర్లు తప్పు చేశారా లేదా అన్నది సభే నిర్ణయిస్తుందన్నారు. నోటీసులకు స్పందించి అదనపు వివరాలు ఇవ్వొచ్చని, సాక్ష్యం ఇవ్వాలన్న బలవంతం కానీ, నిబంధన కానీ ఏమీ లేదన్నారు.ఉల్లంఘన తేల్చకుండా పిటిషనర్లను విచారించడం సరికాదుఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం, సాక్షి కథనం సభా హక్కుల ఉల్లంఘన పరిధిలోకి వస్తుందో రాదో తేల్చకుండా పిటిషనర్లను విచారించడం సరికాదని ప్రాథమికంగా అభిప్రాయపడింది. పిటిషనర్ల వివరణను కమిటీ పరిగణనలోకి తీసుకోలేదని వారి తరఫు సీనియర్ న్యాయవాది చెబుతున్నందున సభా హక్కుల కమిటీ ఎదుట పిటిషనర్ల వ్యక్తిగత హాజరును వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. కమిటీకి అదనపు వివరాలు ఉంటే వాటిని సమర్పించవచ్చునని పిటిషనర్లకు సూచించింది. -
అంబేద్కర్ స్మృతివనం పట్ల నిర్లక్ష్యం బాబుపై హైకోర్టు ఆగ్రహం
-
ఆ సెక్షన్లు చెల్లవన్న హైకోర్టు
విజయవాడ: కృష్ణ జిల్లా పోలీసులకు హైకోర్టు షాకిచ్చింది. మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్పై పెట్టిన కేసులో పోలీసులకు చుక్కెదురైంది. వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా కైలే అనిల్పై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసులపై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది. విచారణ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ తరుఫు మనోహర్ రెడ్డి తన వాదనలు వినిపించారు. మాజీ ఎమ్మెల్యే కైలేపై పోలీసులు తప్పుడు కేసులు నమోదు చేశారంటూ ఆరోపించారు.అనంతరం కైలే అనిల్పై నమోదైన సెక్షన్లను హైకోర్టు పరిశీలించింది. పోలీసులు నమోదు చేసిన సెక్షన్ల చెల్లవని స్పష్టం చేసింది. మనోహర్ రెడ్డి వాదనతో ఏకీభవించిన హైకోర్టు..2 వారాల్లోగా అఫిడవిట్ దాఖలు చెయ్యాలని పోలీసులుకి ఆదేశాలు జారీ చేసింది. -
చంద్రబాబు ప్రభుత్వానికి ఏపీ హైకోర్టు షాక్!
సాక్షి,అమరావతి: నకిలీ మద్యం కేసును సీబీఐతో విచారణ జరిపించాలని కోరుతూ మాజీ మంత్రి జోగి రమేష్ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై ఇవాళ విచారణ చేపట్టిన హైకోర్టు, ఈ నెల 26లోపు కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వం, హోంశాఖ, డీజీపీకి ఆదేశాలు జారీ చేసింది.విచారణ సందర్భంగా జోగి రమేష్ తరఫున మాజీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్రెడ్డి వాదనలు వినిపించారు. నకిలీ మద్యం కేసులో సిట్ విచారణ రాష్ట్ర ప్రభుత్వ కనుసన్నల్లో దారి తప్పుతోందని ఆయన ఆరోపించారు. సీబీఐ విచారణ కోరుతూ పిటిషన్ వేసిన వ్యక్తినే నిందితుడిగా అక్రమంగా అరెస్ట్ చేశారని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు..‘సిట్ విచారణ ఎలా జరుగుతోంది? సీబీఐకి కేసు అప్పగించాలా?’ అనే అంశాలపై కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ పరిణామాలతో చంద్రబాబు ప్రభుత్వం ఇరకాటంలో పడినట్లైంది. -
ఖచ్చితంగా కక్ష సాధింపే! జడ్జి ఎదుట భాస్కర్ రెడ్డి కన్నీరు
-
NRI భాస్కర్ రెడ్డిని బూతులు తిడుతూ.. సర్కార్ శాడిజంపై హైకోర్టు సీరియస్..
-
హైకోర్టు కారుణ్యం
సాక్షి, అమరావతి: రాజధాని భూసేకరణ బాధితుల గోడును క్షేత్రస్థాయిలో పరిశీలించి మానవీయ దృష్టితో చర్యలు చేపట్టేందుకు హైకోర్టు శ్రీకారం చుట్టిన ఘటన ఇది. వివరాల్లోకి వెళితే గుంటూరు జిల్లా, తుళ్లూరు మండలం, రాయపూడికి చెందిన నెల్లూరు శేషగిరమ్మకు చెందిన ఐదు సెంట్ల భూమిని సీఆర్డీఏ అధికారులు తీసుకున్నారు. దీంతో శేషగిరమ్మ, అనారోగ్యంతో ఉన్న 70 ఏళ్ల ఆమె కూతురు వెంకాయమ్మ, మతిస్థిమితం లేని మనుమరాలు శ్యామల పరిస్థితి దుర్భరంగా మారింది. ఈ క్రమంలో శేషగిరమ్మ కుమార్తె వెంకాయమ్మ మరణించింది. తమ నుంచి తీసుకున్న 5 సెంట్ల భూమిని తమకు ఇవ్వాలని శేషగిరమ్మ సీఆర్డీఏ అధికారులను కోరినా వారు పట్టించుకోలేదు. దీంతో శేషగిరమ్మ, ఆమె మనుమరాలు విధి లేని పరిస్థితుల్లో హైకోర్టును ఆశ్రయించారు. తమ బాగోగులను చూసుకునేందుకు ఓ కేర్టేకర్ను నియమించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని, లేని పక్షంలో తమకు కారుణ్య మరణం ప్రసాదించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ విచారణ జరుపుతున్న న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణప్రసాద్ 90 ఏళ్ల ఆ వృద్ధురాలి సమస్యను మానవీయ కోణంలో పరిష్కరించడానికి చర్యలు తీసుకున్నారు. శేషగిరమ్మ, ఆమె మనుమరాలి బాగోగులే తమకు ప్రధానమని చెప్పిన న్యాయమూర్తి కేవలం మాటలకే పరిమితం కాలేదు. ఆ అవ్వ, మనుమరాలి సంరక్షణ కోసం తగిన చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వం చెప్పినప్పటికీ, అసలు క్షేత్రస్థాయిలో వారి పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవాలని నిర్ణయించారు. అందులో భాగంగా న్యాయమూర్తి శుక్రవారం తన సొంత కారులో డ్రైవర్నిచ్చి రూపేష్ అనే న్యాయవాదిని ఆ వృద్ధురాలు, ఆమె మనుమరాలు ఉంటున్న రాయపూడి గ్రామానికి పంపారు. వారి పరిస్థితిని పూర్తిగా తెలుసుకుని నివేదిక ఇవ్వాలని ఆ న్యాయవాదిని ఆదేశించారు. వారి పునరావాసం, బాగోగుల కోసం ఏం చర్యలు తీసుకుంటున్నారో పూర్తి వివరాలను తమ ముందుంచాలని ప్రభుత్వాన్ని, సీఆర్డీఏను ఆదేశించారు. చర్యలు సైతం సంతృప్తికరంగా ఉండాల్సిందేనని తేల్చిచెప్పారు. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేశారు. -
మా ప్రమేయం లేకుండా వాంగ్మూలాలా!
సాక్షి, అమరావతి: గత ప్రభుత్వ హయాంలో మద్యం విధానంపై అక్రమ కేసులో ఇన్నాళ్లూ భేతాళ విక్రమార్క కథలు చూశాం! సాక్షుల వాంగ్మూలం పేరుతో సిట్ ద్వారా టీడీపీ పెద్దలు ఆడిస్తున్న నాటకాలు తాజాగా బట్టబయలయ్యాయి! హైకోర్టులో వేసిన పిటిషన్తో ఈ విషయం మరోసారి తేలిపోయింది. తాము చెప్పని విషయాలతో సీఆర్పీసీ సెక్షన్ 161 కింద విచారణ సంస్థ తయారు చేసిన వాంగ్మూలాలను దర్యాప్తు రికార్డు నుంచి తొలగించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ ఈ కేసులో సాక్షులు పెనకా శరత్ చంద్రారెడ్డి, ఆయన సోదరుడు పెనకా రోహిత్రెడ్డి తాజాగా హైకోర్టును ఆశ్రయించడం కీలకంగా మారింది. తాము చెప్పిన వాస్తవాలను నమోదు చేయకపోవడాన్ని చట్ట విరుద్ధంగా, రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించాలని అభ్యర్థిస్తూ హైకోర్టులో వారిద్దరూ వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. సీఆర్పీసీ సెక్షన్ 161 కింద తాము ఏ వాంగ్మూలాలైతే ఇచ్చామని సీఐడీ చెబుతోందో... వాటిని తాము స్వచ్ఛందంగా ఇవ్వనేలేదని వారు తమ పిటిషన్లో స్పష్టం చేశారు. దర్యాప్తు అధికారి సాక్షుల వాంగ్మూలాలను వారు చెప్పిన విషయాలను చెప్పినట్లుగా నమోదు చేయాల్సి ఉంటుందని.. అలాగే వాంగ్మూలం ఇచ్చే ప్రక్రియను ఆడియో, వీడియోగ్రఫీ చేయాల్సి ఉన్నా, అలాంటిదేమీ చేయలేదని తమ పిటిషన్లో కోర్టుకు నివేదించారు. నిష్పాక్షిక దర్యాప్తు అన్నది రాజ్యాంగంలోని అధికరణ 21లో భాగమన్నారు. దర్యాప్తు ప్రక్రియ దుర్వినియోగం అవుతున్నప్పుడు, దర్యాప్తు నిష్పాక్షికతను పరిరక్షించేందుకు కోర్టు తనకు స్వతఃసిద్ధ అధికారాలను ఉపయోగించవచ్చునని నివేదించారు. మేం చెప్పింది వేరు.. వాంగ్మూలాల్లో ఉన్నది వేరు...మద్యం విధానంపై అక్రమ కేసులో సిట్ అధికారులు గత నెల 13న హైదరాబాద్ వచ్చి సీఆర్పీసీ సెక్షన్ 161 కింద తమ వాంగ్మూలాలను నమోదు చేశారని పిటిషన్లో తెలిపారు. ల్యాప్టాప్లో తమ వాంగ్మూలాలను నమోదు చేసిన అధికారులు ఈ ప్రక్రియను ఆడియో, వీడియోగ్రఫీ చేయలేదని పేర్కొన్నారు. దర్యాప్తునకు సహకరిస్తామని, తెలిసిన విషయాలన్నీ చెబుతామని ఆ అధికారులకు చెప్పామన్నారు. ఆ తరువాత తమకు తెలిసిన విషయాలు వారికి చెప్పామన్నారు. రెండు గంటల పాటు వాంగ్మూలాలను నమోదు చేసిన అధికారులు, వాటిని ఓసారి చదువుకోవాలని ల్యాప్టాప్ తమకు ఇచ్చారని, అందులో ఉన్న వివరాలన్నీ సరైనవేన్నారు. ఇదిలా ఉంటే, గత నెల 16న సోషల్ మీడియాలో తాము ఇచ్చిన వాంగ్మూలాలు అంటూ ఓ రిపోర్ట్ విస్తృతంగా సర్కూలేట్ అయిందని తెలిపారు. ఆ తరువాత సిట్ అధికారులు నమోదు చేసిన వాంగ్మూలం కాపీని తీసుకుని పరిశీలించామని, విçస్మయకరంగా తాము చెప్పిన దానికి భిన్నమైన విషయాలో ఆ వాంగ్మూలాల్లో ఉన్నాయని శరత్ చంద్రారెడ్డి, రోహిత్రెడ్డి తమ పిటిషన్లో వెల్లడించారు. ఇవి తాము స్వచ్ఛందంగా ఇచ్చిన వాంగ్మూలాలు కానే కావని స్పష్టం చేశారు. విచారణ అర్హత ఉంది.. సుప్రీం తీర్పులున్నాయి.. శరత్ చంద్రారెడ్డి, రోహిత్ దాఖలు చేసిన వ్యాజ్యాలపై న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప గురువారం విచారణ జరిపారు. వ్యాజ్యం విచారణకు రాగానే పిటిషనర్ల తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది మయాంక్ జైన్ ఈ కేసు గురించి వివరిస్తుండగా.. సీఐడీ, సిట్ తరఫున సీనియర్ న్యాయవాదులు సిద్దార్థ లూథ్రా, పోసాని వెంకటేశ్వర్లు జోక్యం చేసుకుంటూ పూర్తి వివరాలను సమర్పించేందుకు విచారణను వాయిదా వేయాలని కోరారు. ఈ వ్యాజ్యానికి విచారణార్హతే లేదని, దీనిపైనే మొదట వాదనలు వినిపిస్తామన్నారు. దీనిపై మయాంక్ జైన్ ప్రతిస్పందిస్తూ.. విచారణ అర్హత ఉందని, దీనికి సంబంధించి సుప్రీం కోర్టు తీర్పులు కూడా ఉన్నాయని నివేదించారు. ఇరుపక్షాల వాదనలను విన్న అనంతరం తదుపరి విచారణను న్యాయమూర్తి ఈ నెల 27కి వాయిదా వేశారు. పూర్తి వివరాలను తమ ముందుంచాలని సీఐడీ, సిట్ని ఆదేశించారు. నచ్చినట్లుగా నివేదికలు సిద్ధం చేసుకుంటూ మద్యం విధానంపై అక్రమ కేసులో సాక్షులుగా మారాలని దర్యాప్తు సంస్థ ‘సిట్’ ద్వారా తీవ్ర ఒత్తిళ్లు తెస్తూ.. అందుకు ఒప్పుకోకపోతే వారి కుటుంబ సభ్యులనూ టీడీపీ పెద్దలు వేధించారు. సిట్ ద్వారా ఓ కట్టుకథ అల్లేసి.. సోదాల పేరుతో ఏమార్చే కుట్రలకు దిగారు. వాస్తవాలు, ఆధారాలతో నిమిత్తం లేకుండా.. కోర్టులపై గౌరవం లేకుండా లెక్కలేనితనంతో వ్యవహరించారు. కేసు విచారణ పేరుతో తమకు నచ్చినట్లుగా నివేదికలు సిద్ధం చేసుకుంటూ టీడీపీ పెద్దల కుట్రలకు తలొగ్గారు! అసలు తాను చెప్పని అంశాలను వాంగ్మూలం పేరుతో రిమాండ్ రిపోర్టులో పొందుపరిచారంటూ ఈ అక్రమ కేసులో నిందితుడిగా ఉన్న రాజ్ కేసిరెడ్డి గతంలోనే న్యాయస్థానానికే మొరపెట్టుకోగా.. ప్రపంచంలో ఏ దర్యాప్తు సంస్థ కూడా ఇలా వ్యవహరించిన దాఖలాలు లేవని న్యాయ నిపుణులు వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో సిట్ ఏర్పాటైన నాటి నుంచి టీడీపీ పెద్దల కనుసన్నల్లో పచ్చ కుట్రలు, కట్టు కథలు ఎలా అల్లారో ఒకసారి పరిశీలిద్దాం..దర్యాప్తు పేరిట వేధింపులు, బెదిరింపులువాసుదేవరెడ్డి, సత్యప్రసాద్, అనూషలపై ఒత్తిడిమద్యం విధానంపై అక్రమ కేసు దర్యాప్తులో బెవరేజస్ కార్పొరేషన్ పూర్వ ఎండీ వాసుదేవరెడ్డి, పూర్వ ఉద్యోగి సత్య ప్రసాద్లను బెదిరించి నమోదు చేసిన అబద్ధపు వాంగ్మూలాలనే సిట్ ఆధారంగా చేసుకుంది. అబద్ధపు వాంగ్మూలం నమోదుకు నిరాకరిస్తూ, సిట్ బెదిరింపులకు వ్యతిరేకంగా వాసుదేవరెడ్డి మూడుసార్లు హైకోర్టును ఆశ్రయించారు. అయినా సరే ప్రభుత్వం ఆయన్ను వెంటాడి వేధించింది. డిప్యుటేషన్ ముగిసినా కేంద్ర సర్వీసులకు వెళ్లనివ్వకుండా, రిలీవ్ చేయకుండా అడ్డుకుంది. మూడు రోజులపాటు గుర్తు తెలియని ప్రదేశంలో నిర్బంధించి వేధించింది. ఆయన కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురి చేసింది. చివరికి సిట్ చెప్పినట్టుగా ఆయన అబద్ధపు వాంగ్మూలం ఇవ్వడంతో ఆ వెంటనే రిలీవ్ చేసి కేంద్ర సర్వీసులకు వెళ్లేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. అదే రీతిలో బెవరేజస్ కార్పొరేషన్ పూర్వ ఉద్యోగులు సత్య ప్రసాద్, అనూషలను వేధించి అబద్ధపు వాంగ్మూలాలు నమోదు చేయించింది. సత్యప్రసాద్ ఎన్నో ఏళ్లుగా మానసిక అనారోగ్య సమస్యతో బాధపడుతున్నట్టు తాజాగా వైద్య నివేదికలు వెలుగులోకి వచ్చాయి. అటువంటి వ్యక్తితో ఇప్పించిన వాంగ్మూలం ఆధారంగా సిట్ అక్రమ కేసును దర్యాప్తు చేస్తుండటం విస్మయపరుస్తోంది. రాజ్ కేసిరెడ్డిని ఎంపిక చేసుకోవడంలోనే కుతంత్రం..!అసలు ఈ కుట్ర కేసుకు కేంద్ర బిందువుగా రాజ్ కేసిరెడ్డిని ఎంపిక చేసుకోవడంలోనే చంద్రబాబు ప్రభుత్వ కుతంత్రం దాగుంది. అసలు విషయం ఏమిటంటే.. రాజ్ కేసిరెడ్డి టీడీపీ విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) వ్యాపార భాగస్వామి కావడం గమనార్హం. తెలంగాణ సీఎం రేవంత్రెడ్డికి ఆయన సన్నిహితుడు కూడా. వైఎస్సార్సీపీ అధికారంలో ఉండగానే.. అంటే 2021లోనే రాజ్ కేసిరెడ్డి.. కేశినేని చిన్ని భాగస్వామిగా వ్యాపారాలు నిర్వహించారు. రాజ్ కేసిరెడ్డికి చెందిన ‘డే ఇన్ఫ్రాకాన్ ఎల్ఎల్పీ’లో కేశినేని చిన్ని దంపతులు వాటాదారులుగా ఉన్నారు. అక్రమంగా నిధులు తరలించారని సిట్ అధికారులు చెబుతున్న ఇషన్వీ ఇన్ఫ్రా ప్రాజెక్టŠస్ ప్రైవేట్ లిమిటెడ్, ప్రైడే ఇన్ఫ్రా ఎల్ఎల్పీ హైదరాబాద్లోని ఒకే చిరునామాతో (జూబ్లీ హిల్స్, సర్వే నంబర్ 403, ప్లాట్ నంబర్ 9)తో రిజిస్టర్ అయ్యాయి. అంతే కాదు ఆ రెండు కంపెనీలు ఒకే మెయిల్ ఐడీ (accounts@wshanviinfraprojects. com)నే ఉపయోగిస్తుండటం గమనార్హం. కేశినేని చిన్ని ఏకంగా 12 రియల్ ఎస్టేట్, విదేశీ కంపెనీల ద్వారా భారీగా నల్లధనాన్ని అమెరికా, దుబాయ్లకు తరలించి భారీ పెట్టుబడులు పెట్టారు. రాజ్ కేసిరెడ్డి వ్యాపార భాగస్వామి అయిన కేశినేని చిన్ని మంత్రి నారా లోకేశ్కు అత్యంత సన్నిహితుడే కాదు బినామీ కూడా అన్నది బహిరంగ రహస్యమే! అందుకే పట్టుబట్టి మరీ ఆయనకు విజయవాడ ఎంపీ టికెట్ ఇప్పించారు. కేశినేని చిన్ని బినామీ కంపెనీ ఉర్సా ఐటీ సొల్యూషన్స్కు విశాఖలో అత్యంత విలువైన 60 ఎకరాలను కారుచౌకగా కట్టబెట్టే కుట్రలకు తెర తీయడం తెలిసిందే. మరి రాజ్ కేసిరెడ్డి వ్యాపార భాగస్వామి అయిన ఎంపీ కేశినేని చిన్నిపై సిట్ ఎందుకు కేసు నమోదు చేయడం లేదన్నది కీలకం. దీంతో ఇదంతా చంద్రబాబు రెడ్బుక్ కుతంత్రమేనన్నది తేటతెల్లమవుతోంది. డిస్టిలరీల ప్రతినిధులకు వేధింపులు..అబద్ధపు వాంగ్మూలాలు ఇవ్వాలని టీడీపీ పెద్దలు డిస్టిలరీల ప్రతినిధులను వేధించారు. వృద్ధులని కూడా చూడకుండా విచారణ పేరుతో హైదరాబాద్ నుంచి విజయవాడ తీసుకువచ్చి వేధించడంతో వారు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దాంతో వారిని హైదరాబాద్లోని వారి నివాసంలోనే విచారించాలని న్యాయస్థానం ఆదేశించింది. ఈ కేసుతో ఏమాత్రం సంబంధం లేని రాజ్ కేసిరెడ్డి తండ్రిని బలవంతంగా తీసుకువచ్చి విచారణ పేరుతో వేధించారు. మరో నిందితుడి తండ్రి, రిటైర్డ్ కానిస్టేబుల్ను అక్రమంగా నిర్బంధించి మరీ వేధించడంతో ఆ కుటుంబం హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది. రూ.11 కోట్ల జప్తు డ్రామారాజ్ కేసిరెడ్డి కుటుంబానికి చెందిన ఇంజినీరింగ్ కాలేజీలో రూ.11 కోట్లు స్వా«దీనం చేసుకున్నామని సిట్ మరో కట్టుకథ అల్లింది. అయితే ఆ నగదు తనది కాదని ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో సిట్ కుట్రకథ అడ్డం తిరిగింది. ఆ నోట్ల కట్టలపై ఉన్న బ్యాచ్ నంబర్ల ఆధారంగా ఎప్పుడు? ఏ బ్యాంకుల నుంచి విత్డ్రా చేశారు? ఆర్బీఐ ద్వారా దీనిపై విచారించాలని ఆయన న్యాయస్థానాన్ని కోరడంతో సిట్ తోకముడిచింది. వెంకటేష్ నాయుడుకు ప్రలోభాలుఅబద్ధపు వాంగ్మూలం ఇస్తే నామినేటెడ్ పదవి ఇవ్వడంతోపాటు రూ.2 కోట్లు ఇస్తామని టీడీపీ పెద్దలు రియల్టర్ వెంకటేశ్ నాయుడు దంపతులను ప్రలోభ పెట్టారు. అందుకు వారు తిరస్కరించడంతోనే వెంకటేశ్నాయుడును అరెస్టు చేశారు. ఆయన నోట్ల కట్టలను లెక్కిస్తున్నట్లుగా ఓ వీడియోను సెల్ఫోన్ నుంచి రిట్రీవ్ చేశామంటూ ఎల్లో మీడియా ద్వారా ప్రచారంలోకి తెచ్చింది. ఎన్నికల ఖర్చు కోసం ఆ డబ్బు వినియోగించారని దుష్ప్రచారానికి తెర తీశారు. వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి వద్ద గతంలో గన్మెన్గా పని చేసిన గిరి, మదన్రెడ్డిలను అక్రమంగా నిర్బంధించి అబద్ధపు వాంగ్మూలం కోసం తీవ్రస్థాయిలో వేధించారు. బెంబేలెత్తిన గిరి.. సిట్ అధికారులు చెప్పినట్టు అబద్ధపు వాంగ్మూలం ఇచ్చారు. ఆ వెంటనే ఆయనకు ప్రమోషన్ కల్పించి మరీ జీతం పెంచారు. అందుకు సమ్మతించని మదన్రెడ్డిపై సిట్ అధికారులు థర్డ్ డిగ్రీ ప్రయోగించడంతో ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. మిథున్రెడ్డిపై నిరాధార అభియోగాలు..మద్యం విధానంతో ఏమాత్రం సంబంధం లేని వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్రెడ్డిని అక్రమంగా అరెస్టు చేసి ప్రజలను తప్పుదారి పట్టించేందుకు టీడీపీ పెద్దలు యత్నించారు. గత ప్రభుత్వంలో మిథున్రెడ్డి ఎంపీగా మాత్రమే ఉండగా.. ఆయన తండ్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కనీసం ఆ శాఖ మంత్రిగా కూడా లేకపోవడం గమనార్హం. ఎంపీ మిథున్రెడ్డిపై నమోదు చేసిన అభియోగాలు అవాస్తవమని స్పష్టమైంది. ఆయన కంపెనీలోకి అక్రమంగా నిధులు వచ్చాయన్న సిట్ అభియోగాలు న్యాయస్థానంలో తేలిపోయాయి. మిథున్రెడ్డి తమ బ్యాంకు స్టేట్మెంట్లు, ఇతర ఆధారాలు న్యాయస్థానానికి సమర్పించారు. ఆయనపై నమోదు చేసిన అభియోగాల్లో సిట్ కనీస ఆధారాలు కూడా చూపలేకపోయిందని, ఒక్క దానికీ ఆధారం లేదని న్యాయస్థానం స్పష్టం చేసింది. దీంతో మిథున్రెడ్డికి బెయిల్ మంజూరు చేసింది. తప్పుల తడకగా చార్జ్షీట్లు న్యాయస్థానం సాక్షిగా సిట్ అక్రమ అరెస్టుల కుట్రలు బెడిసికొట్టాయి. సిట్ దాఖలు చేసిన మొదటి చార్జ్షీట్, అనుబంధ చార్జ్షీట్లను పరిశీలించిన న్యాయస్థానమే వాటి చట్టబద్ధతను ప్రశ్నించడం ప్రాధాన్యం సంతరించుకుంది. న్యాయస్థానం వ్యక్తం చేసిన 21 అభ్యంతరాలపై సిట్ కనీసం సమాధానం చెప్పలేకపోయింది. దాంతో ఈ కేసులో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయ్రెడ్డి, ఓఎస్డీ కృష్ణమోహన్రెడ్డి, వికాట్ కంపెనీ డైరెక్టర్ బాలాజీ గోవిందప్పలకు న్యాయస్థానం డిఫాల్ట్ బెయిల్ మంజూరు చేసింది. కుట్రలు బెడిసికొట్టిన ప్రతిసారి సోదాలతో హడావుడి భేతాళ కుట్రలు బెడిసికొట్టిన ప్రతిసారి సోదాల పేరుతో హడావుడి చేస్తూ ఏదో ఒక పేరును తెరపైకి తెచ్చి సిట్ ఏమారుస్తోంది. తనిఖీల పేరుతో తప్పుడు సాక్ష్యాలు సృష్టించేందుకు యత్నిస్తోంది. టీడీపీ పెద్దల కనుసన్నల్లో ఓ డాక్యుమెంట్ను వదలడం.. అందుకు ఎల్లో మీడియా తాన తందానా అంటూ బ్రేకింగ్ న్యూస్గా ప్రచారం చేస్తోంది. అక్రమ కేసును నిజమని భ్రమింప చేసే ఎత్తుగడలకు తెర తీస్తోంది. ఆంధ్రప్రదేశ్ వ్యవహారాలతో ఏమాత్రం సంబంధం లేని వైఎస్ అనిల్రెడ్డి కార్యాలయాల్లో సోదాల పేరుతో ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు సిట్ యత్నించింది. ఇక ఆయన కంపెనీల్లో మాజీ సీఎం వైఎస్ జగన్ సతీమణి భారతి డైరెక్టర్గా వ్యవహరించారని ఎల్లో మీడియా దు్రష్పచారం చేసింది. వాస్తవానికి వైఎస్ అనిల్రెడ్డి మాతృమూర్తి వైఎస్ భారతి ఆ కంపెనీల్లో గతంలో డైరెక్టర్గా వ్యవహరించారు. హైదరాబాద్కు చెందిన న్యాయవాది, వ్యాపారి నర్రెడ్డి సునీల్ రెడ్డి నివాసాల్లోనూ తనిఖీల పేరిట సిట్ రాద్ధాంతం చేసింది. ఆ సమయంలో ఓ ప్రైవేటు వాహనంలో కొన్ని సందేహాస్పద పత్రాలను ఆయన నివాసంలో చేరవేసేందుకు సిట్ యత్నించడం గమనార్హం. ఆ వాహనంలో ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్థన్ కార్యాలయంలో పని చేసే ఉద్యోగి ఉండటంతో అసలు కుట్ర బట్టబయలైంది. రిమాండ్ రిపోర్టుపై సంతకం చేయని రాజ్ కేసిరెడ్డి లేని కుంభకోణం ఉన్నట్టుగా భ్రమింపజేసేందుకు సిట్ అక్రమ అరెస్టులకు తెగబడింది. అప్రూవర్గా మారి తాము చెప్పినట్టు వాంగ్మూలం ఇవ్వాలని టీడీపీ పెద్దలు రాజ్ కేసిరెడ్డిని వేధించారు. అందుకు ఆయన తిరస్కరించడంతోనే అరెస్టు చేశారు. అసలు రాజ్ కేసిరెడ్డి చెప్పని విషయాలు చెప్పినట్టుగా సిట్ అధికారులే అబద్ధపు వాంగ్మూలం నమోదు చేయడం ఈ కుట్రకు పరాకాష్ట. ఆ వాంగ్మూల పత్రంపై సంతకం చేసేందుకు రాజ్ కసిరెడ్డి నిరాకరించారని సిట్ స్వయంగా తన నివేదికలో పేర్కొనడం గమనార్హం. దీంతో అసలు బండారం బయటపడింది. అక్రమ కేసులో చంద్రబాబు ప్రభుత్వం ఎంతగా బరితెగిస్తోందన్నది ఆ నివేదికే బట్టబయలు చేసింది. -
బాబుకు బిగ్ షాక్..! వణుకుతున్న టీడీపీ పెద్ద తలకాయలు
-
నకిలీ మద్యం కేసు.. హోంశాఖకు కొత్త టెన్షన్!
సాక్షి, విజయవాడ: కూటమి ప్రభుత్వంలో నకిలీ మద్యం కేసు విషయమై హోంశాఖకు టెన్షన్ పట్టుకుంది. ఈ కేసును సీబీఐకి ఇవ్వాలంటూ హైకోర్టులో మాజీ మంత్రి జోగి రమేష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో కౌంటర్ దాఖలు చేయాలని సీఎస్, హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీకి హైకోర్టు నోటీసులు జారీ చేసింది.నకిలీ మద్యం కేసు చంద్రబాబు ప్రభుత్వం వేసిన సిట్ నుంచి సీబీఐకి వెళ్తే.. టీడీపీ నాయకుల పేర్లు బయటకి వస్తాయని పచ్చ పార్టీ పెద్దలు తీవ్ర ఆలోచనలో పడినట్టు సమాచారం. మరోవైపు.. కౌంటర్ దాఖలు చేస్తే సీబీఐ విచారణ ఎందుకు వద్దు అంటున్నారు అనేది హైకోర్టుకు చెప్పాల్సి ఉంటుంది. అయితే, నకిలీ మద్యం కేసు వెలుగులోకి వచ్చిన నాటి నుంచి సీబీఐ విచారణకి ఇవ్వడానికి చంద్రబాబు ప్రభుత్వం వెనుకడుగు వేస్తున్న విషయం తెలిసిందే.దీనికి ముందు జోగి రమేష్ తరఫున సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్రెడ్డి వాదనలు వినిపించారు. కేసును రాజకీయ కక్ష సాధింపులు, రాజకీయ కోణంలోనే దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు. ‘‘నకిలీ మద్యం కేసులో ప్రభుత్వ దర్యాప్తు నిష్పాక్షికంగా జరగడం లేదు. అందుకే సీబీఐకి ఇవ్వాలని కోరుతున్నాం. మొదటి నిందితుడిగా ఉన్న అద్దేపల్లి జనార్దనరావు అరెస్ట్ కాకముందు ఎన్నడూ జోగి రమేష్ గురించి మాట్లాడలేదు. పోలీస్ కస్టడీలోకి వెళ్లాక... నకిలీ మద్యం మొత్తానికి జోగి ప్రధాన సూత్రధారి అని చెబుతున్నట్లు ఓ వీడియోను రికార్డ్ చేసి విడుదల చేశారు. ఇది బలవంతంగా తీసినట్లు కనిపిస్తోంది. దీనివెనుక జోగి రమేష్ను ఇరికించే పెద్ద కుట్ర ఉంది. జనార్దనరావు వాంగ్మూలాన్ని ఆధారంగా చేసుకుని ఈ వ్యాజ్యం దాఖలు చేసిన తరువాత పిటిషనర్ను పోలీసులు అరెస్ట్ చేశారు’’ అని పేర్కొన్నారు.మొత్తం వ్యవహారంలో స్థానిక పోలీసులు, సిట్ అధికారులు పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని అన్నారు. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్ స్పందిస్తూ పిటిషనర్ ఇప్పటికే అరెస్టయ్యారని, ఈ వ్యాజ్యానికి విచారణార్హత లేదని తెలిపారు. నిందితుడికి దర్యాప్తు సంస్థను ఎంచుకునే అవకాశం లేదని, ఇదే విషయాన్ని న్యాయస్థానాలు స్పష్టంగా చెప్పాయన్నారు.దర్యాప్తు పక్షపాతంతో ఉంటే సీబీఐ విచారణ కోరవచ్చు ఏజీ వాదనను పొన్నవోలు తోసిపుచ్చారు. ఏకపక్షంగా, పక్షపాతంతో, విశ్వసనీయత లేకుండా కేసును దర్యాప్తు చేస్తుంటే నిందితుడు సీబీఐకి అప్పగించాలని హైకోర్టు లేదా సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేయొచ్చని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పిందని తెలిపారు. నిష్పాక్షిక దర్యాప్తు పౌరుడి ప్రాథమిక హక్కు అని, దీనికి భంగం కలుగుతుంటే తప్పనిసరిగా సీబీఐకి ఇవ్వాలని కోరవచ్చన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి... ప్రభుత్వానికి నోటీసులు జారీ చేశారు. -
బాబుకు హైకోర్టు బిగ్ షాక్.. జోగి రమేష్ దెబ్బ అదుర్స్..!
-
చంద్రబాబుకి బిగ్ షాక్.. ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు
-
నకిలీ మద్యం కేసు దర్యాప్తు... ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు
సాక్షి, అమరావతి: నకిలీ మద్యం కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని కోరుతూ మాజీ మంత్రి జోగి రమేష్ దాఖలు చేసిన పిటిషన్పై రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోం శాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీకి నోటీసులిస్తూ... న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. జోగి అరెస్ట్ తర్వాత జరిగిన పరిణామాలతో అదనపు అఫిడవిట్ దాఖలు చేసేందుకు వెసులుబాటునిస్తూ విచారణను ఈ నెల 12కు వాయిదా వేశారు. దీనికిముందు జోగి రమేష్ తరఫున సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్రెడ్డి వాదనలు వినిపించారు. కేసును రాజకీయ కక్ష సాధింపులు, రాజకీయ కోణంలోనే దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు. ‘‘నకిలీ మద్యం కేసులో ప్రభుత్వ దర్యాప్తు నిష్పాక్షికంగా జరగడం లేదు. అందుకే సీబీఐకి ఇవ్వాలని కోరుతున్నాం. మొదటి నిందితుడిగా ఉన్న అద్దేపల్లి జనార్దనరావు అరెస్ట్ కాకముందు ఎన్నడూ జోగి రమేష్ గురించి మాట్లాడలేదు. పోలీస్ కస్టడీలోకి వెళ్లాక... నకిలీ మద్యం మొత్తానికి జోగి ప్రధాన సూత్రధారి అని చెబుతున్నట్లు ఓ వీడియోను రికార్డ్ చేసి విడుదల చేశారు. ఇది బలవంతంగా తీసినట్లు కనిపిస్తోంది. దీనివెనుక జోగి రమేష్ను ఇరికించే పెద్ద కుట్ర ఉంది. జనార్దనరావు వాంగ్మూలాన్ని ఆధారంగా చేసుకుని ఈ వ్యాజ్యం దాఖలు చేసిన తరువాత పిటిషనర్ను పోలీసులు అరెస్ట్ చేశారు’’ అని పేర్కొన్నారు. మొత్తం వ్యవహారంలో స్థానిక పోలీసులు, సిట్ అధికారులు పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని అన్నారు. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్ స్పందిస్తూ పిటిషనర్ ఇప్పటికే అరెస్టయ్యారని, , ఈ వ్యాజ్యానికి విచారణార్హత లేదని తెలిపారు. నిందితుడికి దర్యాప్తు సంస్థను ఎంచుకునే అవకాశం లేదని, ఇదే విషయాన్ని న్యాయస్థానాలు స్పష్టంగా చెప్పాయన్నారు.దర్యాప్తు పక్షపాతంతో ఉంటే సీబీఐ విచారణ కోరవచ్చు ఏజీ వాదనను పొన్నవోలు తోసిపుచ్చారు. ఏకపక్షంగా, పక్షపాతంతో, విశ్వసనీయత లేకుండా కేసును దర్యాప్తు చేస్తుంటే నిందితుడు సీబీఐకి అప్పగించాలని హైకోర్టు లేదా సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేయొచ్చని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పిందని తెలిపారు. నిష్పాక్షిక దర్యాప్తు పౌరుడి ప్రాథమిక హక్కు అని, దీనికి భంగం కలుగుతుంటే తప్పనిసరిగా సీబీఐకి ఇవ్వాలని కోరవచ్చన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి... ప్రభుత్వానికి నోటీసులు జారీ చేశారు. -
పోలీసు అధికారులకు ప్రభుత్వం జీతభత్యాలు ఇవ్వడం లేదు
సాక్షి, అమరావతి: రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగంగా రాష్ట్రంలో పలువురు పోలీసు అధికారులను వేకెన్సీ రిజర్వ్ (వీఆర్)లో ఉంచి ఎలాంటి జీతాలు చెల్లించకపోవడాన్ని ప్రశ్నిస్తూ తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. దీనిపై బుధవారం ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ చల్లా గుణరంజన్ల ధర్మాసనం విచారణ జరిపింది. గురుమూర్తి తరఫు న్యాయవాది వి.మహేశ్వరరెడ్డి వాదనలు వినిపిస్తూ... ‘‘విధి నిర్వహణలో నిక్కచి్చగా వ్యవహరిస్తారనే పేరున్న పోలీసు అధికారులను చాలాకాలంగా ప్రభుత్వం వీఆర్లో ఉంచింది. ప్రభుత్వం సహేతుక కారణాలు లేకుండానే ఇలా చేసింది. ఇది చట్ట విరుద్ధం. 199 మంది అధికారులకు జీతభత్యాలు అందడం లేదు. వారి కుటుంబాలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నాయి. పోలీసు సంస్కరణల విషయమై ప్రకాశ్సింగ్ కేసులో సుప్రీంకోర్టు చాలా స్పష్టమైన ఆదేశాలు, మార్గదర్శకాలు జారీ చేసింది. వాటిని ప్రతి రాష్ట్రం పాటించాల్సి ఉంది’’ అని తెలిపారు. ధర్మాసనం స్పందిస్తూ, ప్రకాశ్సింగ్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం లేదంటే ఈ విషయాన్ని సుప్రీంకోర్టు దృష్టికే తీసుకెళ్లాలని పిటిషనర్కు స్పష్టం చేసింది. జీతాలు అందక ఇబ్బందులు పడుతుంటే సంబంధిత పోలీసు అధికారులే కోర్టుకు వస్తారని, వారి తరఫున వ్యాజ్యాన్ని దాఖలు చేయాల్సిన అవసరం లేదని అభిప్రాయపడింది. ఈ మొత్తం వ్యవహారంపై సుప్రీంకోర్టును ఆశ్రయించడమే మేలని పిటిషనర్కు సూచించింది. -
చట్టం దృష్టిలో అందరూ ఒక్కటే! సర్కార్ కు హైకోర్టు చెంపపెట్టు
-
సభాహక్కుల పేరుతో ఎలాపడితే అలా చేయడానికి వీల్లేదు
సాక్షి, అమరావతి: శాసనసభ హక్కులు రాజ్యాంగంలో నిర్దేశించిన సూత్రాలకు లోబడే ఉంటాయని హైకోర్టు స్పష్టం చేసింది. సామాన్యులకు ఏ చట్టాలైతే వర్తిస్తాయో, అవే చట్టాలకు అనుగుణంగా సభా హక్కుల ఉల్లంఘన తీర్మానాలు, సభ నిర్ణయాలు కూడా ఉంటాయని తేల్చిచెప్పింది. సభా హక్కుల పేరుతో ఎలాపడితే అలా వ్యవహరించడానికి వీల్లేదని పేర్కొంది. పార్లమెంట్ లేదా శాసనసభలు, వాటికి సంబంధించిన కమిటీలు కూడా సాధారణ చట్టాలకు లోబడే ఉంటాయంది. అవేమీ చట్టాలకు అతీతం కాదని స్పష్టం చేసింది. చట్టం చేసేవారు కూడా అదే చట్టానికి లోబడి ఉండాలని, అంతే తప్ప ప్రజల కోసం రూపొందించే చట్టాల అమలు నుంచి వారు మినహాయింపు పొందలేరని తెలిపింది.‘‘ఎంతటి భారీ మెజార్టీ ఉన్నప్పటికీ ప్రతి శాసనసభకు చట్టాలు సమానంగా వర్తిస్తాయి. కాబట్టి సభా హక్కుల తీర్మానంపై తీసుకునే తుది నిర్ణయం న్యాయ సమీక్షకు లోబడే ఉంటుంది. కోర్టు న్యాయ సమీక్ష చేసే సమయంలో సభా హక్కుల ఉల్లంఘన జరిగిందని నిరూపించాల్సిన బాధ్యత హక్కులకు భంగం కలిగిందన్న సభ, వ్యక్తిదే. ఈ విషయాన్ని సీతాసోరెన్ కేసులో సుప్రీం కోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. శాసనసభ, సభా హక్కుల కమిటీ రాజ్యాంగ సూత్రాలను, చట్టపరమైన పరిమితులను గుర్తెరిగి సరైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని కూడా సుప్రీంకోర్టు ఆశాభావం వ్యక్తం చేసింది’’ అని పేర్కొంది.సభా హక్కుల కమిటీ ఇచ్చిన షోకాజ్ నోటీసులను సవాల్ చేస్తూ సాక్షి ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డి, చీఫ్ రిపోర్టర్ బి.ఫణికుమార్ వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. ఇచ్చింది కేవలం షోకాజ్ నోటీసు మాత్రమేనని, అనంతరం చాలా దశలు ఉంటాయని, అందువల్ల ఈ వ్యాజ్యాలు అపరిపక్వమైనవి వ్యాఖ్యానించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్ మంగళవారం తీర్పు వెలువరించారు. ‘సాక్షి’పై కక్షసాధింపు చర్యలు... షోకాజ్ నోటీసు జారీ ఎమ్మెల్యేలకు రెండు రోజుల పాటు శిక్షణ తరగతులు నిర్వహించాలని శాసనసభ వర్గాలు ఈ ఏడాది ఫిబ్రవరిలో నిర్ణయించాయి. ఎమ్మెల్యేలు, అతిథులకు హోటళ్లు, భోజనాలు, బహుమతులు తదితరాల కోసం భారీగా ఖర్చు చేశారు. అయితే, లోక్సభ స్పీకర్ ఈ కార్యక్రమానికి హాజరు కాకపోవడంతో ఆ ఖర్చంతా వృథా అయింది. దీనిపై ‘సాక్షి’ ఫిబ్రవరి 22న ‘రూ.కోట్లు ఖర్చు... శిక్షణ తుస్సు’ శీర్షికన కథనం ప్రచురించింది. కంగుతిన్న అధికార పార్టీ నేతలు ‘సాక్షి’పై కక్షసాధింపు చర్యలు చేపట్టారు. పత్రిక కథనం సభాహక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని, దానిని తాను సభలో ప్రస్తావించేందుకు అనుమతించాలని టీడీపీ ఎమ్మెల్యే జయసూర్య ఫిబ్రవరి 25న అసెంబ్లీ స్పీకర్ను కోరుతూ నోటీసు ఇచ్చారు. స్పీకర్ ఈ వ్యవహారాన్ని సభా హక్కుల కమిటీకి నివేదించారు. దాని ఆదేశాల మేరకు ‘సాక్షి’కి అసెంబ్లీ సెక్రటరీ జనరల్ షోకాజ్ నోటీసులు జారీచేశారు. పాలనాపరమైన అంశాలపైనే కథనం ఎమ్మెల్యే ఇచ్చిన నోటీసుతో పాటు, సెక్రటరీ జనరల్ ఇచ్చిన షోకాజ్ నోటీసును సవాల్ చేస్తూ ‘సాక్షి’ ఎడిటర్ ధనంజయరెడ్డి, చీఫ్ రిపోర్టర్ ఫణికుమార్ జూన్లో హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై జస్టిస్ రామకృష్ణ ప్రసాద్ విచారణ జరిపారు. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది సుబ్రహ్మణ్య శ్రీరామ్, వి.మహేశ్వర్రెడ్డి, అనూప్ కౌషిక్ వాదిస్తూ... సభలో జరిగిన విషయాలపై ‘సాక్షి’ కథనం రాయలేదని, పాలనాపరమైన అంశంపైనే ప్రచురించిందని, దాని కారణంగా ఎవరి హక్కులకూ భంగం వాటిల్లలేదని, ఆ కథనం సభా హక్కుల ఉల్లంఘన కిందకు రాదని వివరించారు.శాసన వ్యవహారాల శాఖ ముఖ్య కార్యదర్శి తరఫున ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు. పిటిషనర్లకు ఇచ్చింది కేవలం షోకాజ్ నోటీసు మాత్రమేనన్నారు. వారి వివరణ తీసుకున్న తరువాత పలు దశలు ఉంటాయని, వివరణతో సభా హక్కుల కమిటీ సంతృప్తి చెందితే తదుపరి చర్యల ఉపసంహరణకు సిఫారసు చేయవచ్చన్నారు. ‘సాక్షి’ కథనం «ధిక్కారం కిందకే వస్తుందని కమిటీ భావించినా అంతిమంగా నిర్ణయం శాసన సభనే తీసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. షోకాజ్ నోటీసుల దశలో కోర్టుల జోక్యం తగదని, ఈ వ్యాజ్యాలను తోసిపుచ్చాలని కోరారు. పౌరులను కాపాడే రక్షణ కవచమే రాజ్యాంగం ‘‘పౌరుల హక్కులను ప్రభావితం చేసేలా రాజ్యాంగ వ్యవస్థలు ఏకపక్ష, అన్యాయ నిర్ణయాలు తీసుకుంటే, వాటి నుంచి కాపాడే రక్షణ కవచమే రాజ్యాంగం. అధికరణ 194 కింద... రాష్ట్ర అసెంబ్లీలు తీసుకునే నిర్ణయాలు పౌరుల హక్కులను ప్రభావితం చేస్తుంటే, అవి కచ్చితంగా న్యాయ సమీక్షకు లోబడి ఉంటాయి. సభా హక్కుల ఉల్లంఘనకు సంబంధించి జారీచేసే షోకాజ్ నోటీసులు పలు దశల్లో చట్టపరమైన పరిశీలనకు లోబడి ఉంటాయి.సభా హక్కుల కమిటీ మొదట పిటిషనర్ల వివరణను పరిగణనలోకి తీసుకుని, తదుపరి చర్యలను ఉపసంహరించాలని శాసనసభకు సిఫారసు చేయవచ్చు. అలాకాకుండా పిటిషనర్ల వంటి పౌరులకు వ్యతిరేకంగా కమిటీ సిఫారసు చేసినప్పటికీ, శాసనసభ పిటిషనర్లు సమర్పించిన వివరణను, ఆధారాలను పరిగణనలోకి తీసుకుని స్వతంత్రంగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది’’ అని హైకోర్టు వ్యాఖ్యానించింది. -
ఆర్థిక పరిస్థితి బాగోలేదని రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఆపలేరు
టెర్మినల్ బెనిఫిట్స్ కోసం పిటిషన్లు దాఖలు చేసిన వారు 70, 80, 90 ఏళ్ల సీనియర్ సిటిజన్లు. ఈ వయస్సులో అనేక ఆరోగ్య సమస్యలతో పాటు ఇతర సమస్యలు ఎదుర్కొంటుంటారు. వీరి నుంచి జీవితాంతం సేవలు తీసుకున్నారు. పదవీ విరమణ తర్వాత 16 ఏళ్లకు కూడా వారికి పదవీ విరమణ ప్రయోజనాలను ఇవ్వకపోవడం అమానవీయం. రాజ్యాంగ విరుద్ధం. – ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సాక్షి, అమరావతి: పదవీ విరమణ అనంతరం ఉద్యోగులకు ఇవ్వాల్సిన ఉద్యోగాంతర ప్రయోజనాలైన (టెర్మినల్ బెనిఫిట్స్) గ్రాట్యుటీ, లీవ్ ఎన్క్యాష్ మెంట్ తదితరాలను చెల్లించడంలో ప్రభుత్వం, దాని పర్యవేక్షణలోని సంస్థలు చేస్తున్న అసాధారణ జాప్యంపై హైకోర్టు తీవ్రంగా స్పందించింది. ఏళ్ల తరబడి సేవలు చేయించుకుని వారికి టెర్మినల్ బెనిఫిట్స్ను చెల్లించకపోవడం చట్ట విరుద్ధమే కాక రాజ్యాంగ విరుద్ధమని తేల్చి చెప్పింది.టెర్మినల్ బెనిఫిట్స్ ప్రభుత్వాల దాతృత్వం కాదని, అవి ఉద్యోగుల హక్కు అని స్పష్టం చేసింది. ఆర్థిక పరిస్థితి బాగోలేదన్న సాకుతో ఉద్యోగులకు రాజ్యాంగం కలి్పస్తున్న సామాజిక భద్రత హక్కును ప్రభుత్వం, దాని సంస్థలు కాలరాయలేవని పేర్కొంది. పదవీ విరమణ చేసిన 16 ఏళ్లకు కూడా ఉద్యోగులకు టెర్మినల్ బెనిఫిట్స్ చెల్లించకపోవడంపై విస్మయం వ్యక్తం చేసింది. ఆ ఉద్యోగులు వడ్డీతో సహా బకాయిలను పొందేందుకు అర్హులని హైకోర్టు తేల్చి చెప్పింది.నాటి నుంచి టెర్మినల్ బెనిఫిట్స్ పొందని పిటిషనర్లు..చిట్టిబోయిన భారతరావు, పి. చంద్రమౌళీశ్వరరావు, బండ శివరామకృష్ణ ప్రసాద్, ఏ.సాయిబాబు పెయిడ్ సెక్రటరీలుగా కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ)లో పనిచేశారు. తరువాత వారి పోస్టులు డీ–కేడరైజ్డ్ చేసి సెక్రటరీలుగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలలోకి (పీఏసీఎస్) బదిలీ చేశారు. నాబార్డ్ మార్గదర్శకాల ప్రకారం వారిని 2009 మార్చి 2న తిరిగి పెయిడ్ సెక్రటరీలుగా డీసీసీబీలోకి తీసుకున్నారు. అప్పటి నుంచి పదవీ విరమణ వరకు వారు ఎలాంటి మచ్చ లేకుండా పని చేశారు.రిటైర్ అయినప్పటికీ, వారికి గ్రాట్యుటీ, లీవ్ ఎన్క్యాష్మెంట్ వంటి టెర్మినల్ బెనిఫిట్స్ను చెల్లించలేదు. వీటి కోసం ప్రభుత్వం, డీసీసీబీలతో పోరాడి అలసిపోయిన ఆ వృద్ధులు 2016లో హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యాలపై డీసీసీబీ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ, పిటిషనర్లు కొంత కాలం పీఏసీఎస్లలో పనిచేసినందున, అవి వారి వాటా బెనిఫిట్స్ను చెల్లించాలని, ఆ మొత్తం రాగానే దానితో కలిపి టెర్మినల్ బెనిఫిట్స్ ఇస్తామన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ కుంచెం మహేశ్వరరావు ఇటీవల కీలక తీర్పు వెలువరించారు.16 ఏళ్ల తరువాత కూడా ప్రయోజనాలు చెల్లించరా...? ‘రిటైర్ అయిన 16 ఏళ్లకు కూడా వారికి ఇవ్వాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకపోవడం అమానవీయం. రాజ్యాంగ విరుద్ధం. ప్రభుత్వం, డీసీసీబీ, పీఏసీఎస్లు పిటిషనర్ల నుంచి వారి జీవిత కాల సేవలు పొందాయి. ఎలాంటి న్యాయపరమైన అడ్డంకులు లేకపోయినా బెనిఫిట్స్ను చెల్లించలేదు. అది పిటిషనర్ల చట్టబద్ధమైన, రాజ్యాంగ హక్కులను హరించినట్లే. గ్రాట్యుటీ చెల్లింపు చట్టం సెక్షన్ 7 ప్రకారం ఉద్యోగి పదవీ విరమణ చేసి దరఖాస్తు చేసుకున్న నాటి నుంచి 30 రోజుల్లోపు చెల్లించాలి. లేదంటే ఆ రోజు నుంచి వడ్డీ కూడా చెల్లించాలి. దీని ప్రకారం ఈ కేసులో పిటిషనర్లు చట్ట ప్రకారం వడ్డీ పొందేందుకు అర్హులు.ఇది యజమాని విచక్షణపై ఆధారపడి ఉండదు. గ్రాట్యుటీ, లీవ్ ఎన్క్యాష్ మెంట్, ఇతర ప్రయోజనాలను పిటిషనర్లు లేదా వారి కుటుంబ సభ్యులకు 10 శాతం వార్షిక వడ్డీతో చెల్లించాలి. ఫ్యామిలీ మెంబర్ సరి్టఫికెట్లు పరిశీలించి, ఆ తరువాత 8 వారాల్లో చెల్లించాలి. కోర్టు ఖర్చుల కింద పిటిషనర్లు ఒక్కొక్కరికి రూ.10 వేలు ప్రభుత్వం, డీసీసీబీ, పీఏసీఎస్ చెల్లించాలి. టెర్మినల్ బెనిఫిట్స్లో పీఏసీఎస్ నుంచి రావాల్సిన వాటాను వసూలు చేసుకునే హక్కు డీసీసీబీకి ఉంది. పీఏసీఎస్ వాటా చెల్లించలేదు కాబట్టి పిటిషనర్లకు టెర్మినల్ బెనిఫిట్స్ చెల్లించలేకపోయామన్న డీసీసీబీ వాదన చట్టబద్ధం కాదు’ అని జస్టిస్ మహేశ్వరరావు తన తీర్పులో పేర్కొన్నారు. -
ప్రభుత్వ ధనం.. ప్రైవేటు లాభం!
సాక్షి, అమరావతి: ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణ వల్ల ప్రజలు కార్పొరేట్ ఆస్పత్రుల్లో చెల్లించినట్లు భారీ ఫీజులు చెల్లించాల్సి ఉంటుందని, ఇలాంటి కేసుల్లో ప్రజా ప్రయోజనాలనే కోర్టులు పరమావధిగా పరిగణించాలని సీనియర్ న్యాయవాది సుబ్రహ్మణ్య శ్రీరామ్ బుధవారం హైకోర్టును అభ్యర్థించారు. రాష్ట్రంలో 10 వైద్య కళాశాలలను పబ్లిక్, ప్రైవేట్ పార్ట్నర్షిప్ (పీపీపీ) విధానంలో అభివృద్ధి చేసేందుకు అనుమతినిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 590ని రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించాలని కోరుతూ గుంటూరు జిల్లా, తాడేపల్లికి చెందిన సామాజిక కార్యకర్త డాక్టర్ కుర్రా వసుంధర హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ చల్లా గుణరంజన్ ధర్మాసనం ముందు తాజాగా ఈ పిల్ విచారణకు వచ్చింది. పిటిషనర్ తరఫున శ్రీరామ్ తన వాదనలను వినిపిస్తూ ప్రభుత్వ వైద్య కళాశాలలను లీజుకివ్వడం వల్ల ప్రైవేటు వ్యక్తులు రూ. కోట్లు ఆర్జిస్తారన్నారు. కాలేజీలను కేంద్రం, నాబార్డ్ ఇచ్చే నిధులతోనే నిర్మిస్తారని తెలిపారు. లబ్ధి మాత్రం ప్రైవేటు వ్యక్తులే పొందుతారన్నారు. ప్రభుత్వ వైద్య సేవలకు పేదలు దూరమవుతారని పేర్కొన్నారు. దీనిపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేసేందుకు సమయం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది సింగమనేని ప్రణతి ధర్మాసనాన్ని కోరారు. ఇందుకు కోర్టు అంగీకరిస్తూ తదుపరి విచారణను నవంబర్ 19కి వాయిదా వేసింది. -
ట్రాన్స్జెండర్లకు రిజర్వేషన్లపై సానుకూల నిర్ణయం తీసుకోండి
సాక్షి, అమరావతి: ప్రభుత్వ ఉద్యోగాల్లో ట్రాన్స్జెండర్లకు రిజర్వేషన్లు కల్పించే విషయంలో సానుకూల నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు స్పష్టం చేసింది. కర్ణాటక రాష్ట్రం ట్రాన్స్జెండర్లకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 1 శాతం రిజర్వేషన్ కల్పిస్తున్న నేపథ్యంలో మన రాష్ట్రంలో కూడా ప్రభుత్వం అలాంటి నిర్ణయమే తీసుకుంటుందని ఆశిస్తున్నామని తెలిపింది. కర్ణాటక విధానాన్ని అధ్యయనం చేసి, రిజర్వేషన్ కల్పనపై పూర్తి వివరాలను తమ ముందుంచాలని చెప్పింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ బట్టు దేవానంద్, జస్టిస్ అవధానం హరిహరనాథశర్మ ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. ట్రాన్స్జెండర్ న్యాయపోరాటం 2018 నవంబర్లో జారీచేసిన ఎస్ఐ పోస్టుల భర్తీ నోటిఫికేషన్లో ట్రాన్స్జెండర్లకు రిజర్వేషన్ కల్పించకపోవడాన్ని సవాలు చేస్తూ ట్రాన్స్జెండర్ గంగాభవాని 2019లో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దరఖాస్తులో స్త్రీ, పురుష ఐచ్చికాలు మాత్రమే ఉండటంతో తాను స్త్రీగా ఐచ్చికం ఇచ్చినట్లు తెలిపారు. రాతపరీక్షలో 35 శాతం మార్కులు సాధించినా తదుపరి ప్రక్రియకు తనను అనర్హురాలిగా ప్రకటించారని తెలిపారు. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన సింగిల్ జడ్జి ఆ పిటిషన్ను కొట్టేశారు. దీనిపై గంగాభవాని 2022లో ధర్మాసనం ముందు అప్పీల్ దాఖలు చేశారు. ఈ అప్పీల్పై గత ఏడాది విచారణ జరిపిన ధర్మాసనం గంగాభవానీకి ఉద్యోగం కల్పించే విషయంలో నిర్ణయం తీసుకోవాలని హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ని ఆదేశించింది.తాజాగా ఈ అప్పీల్పై జస్టిస్ దేవానంద్ ధర్మాసనం మరోసారి విచారణ జరిపింది. హోంశాఖ ముఖ్య కార్యదర్శి తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) ఇవన సాంబశివప్రతాప్ వాదనలు వినిపిస్తూ.. కోర్టు ఆదేశాల మేరకు పిటిషనర్ ఇచ్చిన వినతిపత్రాన్ని డీజీపీ తిరస్కరించారని చెప్పారు. కోర్టు ఆదేశాల మేరకు పోలీసు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్లలో రిజర్వేషన్లు అమలు సాధ్యం కాదని తెలిపారు. ఇప్పటికే వందశాతం రిజర్వేషన్ల కోటా పూర్తయిందని చెప్పారు. ట్రాన్సజెండర్ల విషయంలో ప్రభుత్వం 2017లో ఓ విధానం తీసుకొచి్చందని, అయితే రిజర్వేషన్లను మాత్రం ఇప్పటివరకు అమలు చేయలేదని తెలిపారు. ధర్మాసనం స్పందిస్తూ.. రిజర్వేషన్లు లేకుండా పాలసీలు రూపొందిస్తే ప్రయోజనం ఏముంటుందని ప్రశ్నించింది.పిటిషనర్ న్యాయవాది సాల్మన్రాజు వాదనలు వినిపిస్తూ.. నోటిఫికేషన్లో ట్రాన్స్జెండర్ ఆప్షన్ లేకపోవడంతో ఫీమేల్ ఆప్షన్ ఎంచుకున్నారని తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు స్పెషల్ రిజర్వేషన్ అమలు చేసేలా ఆదేశాలివ్వాలని కోరారు. కర్ణాటక రాష్ట్రం ఆ రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వ ఉద్యోగాల్లో ట్రాన్స్జెండర్లకు 1 శాతం రిజర్వేషన్లు కల్పించినట్లు చెప్పారు. ధర్మాసనం స్పందిస్తూ.. ఆ రాష్ట్రం రిజర్వేషన్ అమలు చేస్తున్నప్పుడు మన రాష్ట్రంలో ఎందుకు అమలు చేయడంలేదని ప్రశ్నించింది. ఏఏజీ సాంబశివప్రతాప్ స్పందిస్తూ.. దీనిమీద అధ్యయనం చేసి నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. ట్రాన్స్జెండర్లకు ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ కల్పించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా నిర్ణయం తీసుకుంటుందని ఆశిస్తున్నట్లు పేర్కొంది. -
హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ మానవేంద్రనాథ్రాయ్ ప్రమాణం
సాక్షి, అమరావతి: రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్రాయ్ ప్రమాణం చేశారు. కోర్టు మొదటి హాలులో జరిగిన కార్యక్రమంలో జస్టిస్ రాయ్తో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్సింగ్ ఠాకూర్ ప్రమాణం చేయించారు. అంతకుముందు హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ పార్థసారథి జస్టిస్ రాయ్ బదిలీకి సంబంధించి రాష్ట్రపతి ముర్ము జారీ చేసిన ఉత్తర్వులను చదివి వినిపించారు. కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు, జస్టిస్ రాయ్ కుటుంబ సభ్యులు, అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్, అదనపు ఏజీ ఇవన సాంబశివప్రతాప్.. రాష్ట్ర బార్ కౌన్సిల్æ చైర్మన్ ఎన్.ద్వారకనాథరెడ్డి, అదనపు సొలిసిటర్ జనరల్ చల్లా ధనుంజయ, డిప్యూటీ సొలిసిటర్ జనరల్ పసల పొన్నారావు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ మెండ లక్ష్మీనారాయణ, హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు కలిగినీడి చిదంబరం పాల్గొన్నారు. ప్రమాణం అనంతరం జస్టిస్ రాయ్ మరో న్యాయమూర్తి జస్టిస్ తుహిన్ కుమార్తో కలిసి ధర్మాసనంలో కేసులను విచారించారు. కాగా.. కలకత్తా హైకోర్టు నుంచి ఏపీ హైకోర్టుకు బదిలీ అయిన న్యాయమూర్తి జస్టిస్ సుభేందు సమంత ఈ నెల 29న ప్రమాణం చేయనున్నారు. -
చనిపోయేందుకు అనుమతి ఇవ్వండి.. కోర్టుకు అమరావతి బాధితులు
-
పరకామణి కేసు రాజీ చేసుకోదగ్గదే..
సాక్షి, అమరావతి: టీటీడీ పరకామణిలో జరిగిన రూ.72 వేల విలువైన 900 డాలర్ల చోరీ వ్యవహారంపై నమోదైన కేసు చట్ట ప్రకారం రాజీ చేసుకోదగ్గ కేసు కాబట్టే నిబంధనలకు అనుగుణంగా లోక్ అదాలత్లో రాజీ అయిందని అప్పటి పరకామణి అసిస్టెంట్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ అధికారి (ఏవీఎస్ఓ) వై. సతీష్కుమార్ హైకోర్టుకు నివేదించారు. రాజీ వెనుక ఎలాంటి దురుద్దేశాలు లేవన్నారు. దొంగతనం కేసులో తానే ఫిర్యాదుదారుడిని కాబట్టే నిబంధనల ప్రకారం రాజీ జరిగిందన్నారు. సీఆర్పీసీ, ఐపీసీలో రాజీపై ఎలాంటి నిషేధంలేదని ఆయన వివరించారు. రాజీ అన్నది అసాధారణ విషయం ఏమీకాదని తెలిపారు.రాజీ విషయంలో పిటిషనర్ చేసిన ఆరోపణలన్నీ కూడా ఊహాజనితమైనవేనన్నారు. రవికుమార్ అనే ఉద్యోగి దొంగతనం చేస్తుండగా రెడ్హ్యాండెడ్గా పట్టుకుని తానే ఫిర్యాదు చేశానని సతీష్కుమార్ తెలిపారు. రూ.72వేల విలువ చేసే డాలర్లు దొంగతనం జరిగితే దీనివెనుక భారీ కుట్ర ఉందన్న పిటిషనర్ ఆరోపణ అర్ధంలేనిదన్నారు. టీటీడీ నిబంధనల ప్రకారం ఫిర్యాదు చేయడానికి, రాజీ చేసుకోవడానికి శాఖాధిపతులకు అధికారం ఉందని తెలిపారు. ఇందుకు టీటీడీ పాలక మండలి అనుమతి అవసరంలేదని తెలిపారు.టీటీడీ చట్టం రాష్ట్రం చేసిన చట్టమని.. సీఆర్పీసీ, ఐపీసీలు కేంద్ర చట్టాలని.. ఈ కేంద్ర చట్టాలే రాజీకి ఆస్కారం కల్పిస్తున్నప్పుడు దానిని తప్పుపట్టాలి్సన పనేలేదన్నారు. రాజీ అన్నది చట్ట విరుద్ధమైన చర్య కాదన్నారు. ఊహాజనిత, నిరాధార ఆరోపణలతో దాఖలు చేసిన పిటిషన్ను కొట్టేయాలని సతీష్కుమార్ హైకోర్టును కోరారు. ఈ మేరకు ఆయన హైకోర్టులో కౌంటర్ దాఖలు చేశారు. పరకామణిలో చోరి వ్యవహారంపై సీఐడీ విచారణకు ఆదేశించాలని కోరుతూ శ్రీనివాసులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన హైకోర్టు, కౌంటర్లు దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశించింది. ఈ ఆదేశాల మేరకు అప్పటి ఏవీఎస్ఓ సతీష్కుమార్ కౌంటర్ దాఖలు చేశారు.మా వాదనలు కూడా వినండి..ఈ వ్యాజ్యంలో తమను ప్రతివాదిగా చేర్చుకుని, తమ వాదనలు కూడా వినాలంటూ ఏపీ సాధు పరిషత్ అధ్యక్షుడు స్వామి శ్రీనివాసానంద సరస్వతి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. -
‘కూటమి ప్రభుత్వం భూమిని లాగేసుకుంది.. కారుణ్య మరణానికి అనుమతించండి’
తాడికొండ: గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం రాయపూడి గ్రామానికి చెందిన 90 ఏళ్ల వృద్ధురాలు నెల్లూరి శేషగిరమ్మ, ఆమె కుమార్తె చెరుకూరి వెంకాయమ్మ, మానసిక వైకల్యం గల మనవరాలు చెరుకూరి శ్యామల కారుణ్య మరణానికి అనుమతించాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. తమ జీవితానికి చివరి ఆసరాగా ఉన్న 5 సెంట్ల భూమిని కూటమి ప్రభుత్వం లాక్కుందని.. తాము ఎన్ని ఫిర్యాదులు, వినతులు ఇచ్చినా పట్టించుకోలేదని హైకోర్టుకు సమర్పించిన రిట్ పిటిషన్లో పేర్కొన్నారు. అమరావతి ల్యాండ్ పూలింగ్ స్కీమ్ కింద ఆ కుటుంబానికి ఏకైక ఆధారంగా ఉన్న 5 సెంట్ల భూమిని కూటమి ప్రభుత్వం తీసుకుంది. తమ ఏకైక ఆధారాన్ని లాగేసుకోవడం వల్ల తమ జీవనాధారం పోయిందని ఆ పిటిషన్లో పేర్కొన్నారు. ఏపీ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ తమ ఫిర్యాదులు, వినతులు పట్టించుకోవడం లేదని.. తద్వారా రాజ్యాంగంలోని మౌలిక హక్కులు ముఖ్యంగా జీవన హక్కు (ఆర్టికల్ 21), సమానత్వ హక్కు (ఆరి్టకల్ 14), ఆస్తి హక్కు (ఆర్టికల్ 300ఏ) ఉల్లంఘించబడిందని వాపోయారు. తమ దుస్థితి దృష్ట్యా పిటిషనర్లు ముగ్గురూ హైకోర్టును రెండు ప్రధాన అంశాలపై వేడుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళా, శిశు సంక్షేమ శాఖ ద్వారా ఒక కేర్ టేకర్ను నియమించి తమ ఆహారం, వైద్యచికిత్స, విద్యుత్ బిల్లులు, జీవనాధార ఖర్చులు భరించాలని అభ్యర్థించారు. ప్రభుత్వం ఈ సహాయం అందించలేని స్థితిలో ఉంటే.. కారుణ్య మరణానికి తమకు న్యాయపరమైన అనుమతి ఇవ్వాలని కోరారు. ‘మానవ గౌరవం లేకుండా జీవించడం కన్నా.. గౌరవంగా మరణించడం మేలు. మమ్మల్ని ఈ స్థితికి ప్రభుత్వం నెట్టేసింది’ అని వృద్ధురాలు శేషగిరమ్మ ఆ పిటిషన్లో పేర్కొన్నారు. ఈ కేసు అమరావతి ల్యాండ్ పూలింగ్ స్కీమ్లోని మానవ హక్కుల ఉల్లంఘణ కోణాన్ని బయటపెడుతోంది. వికాసం పేరుతో పేదలు, వృద్ధులు, దివ్యాంగులు తమ భూములు, గౌరవం, జీవన హక్కులు కోల్పోతున్న వైనాన్ని పిటిషన్ చాటి చెబుతోంది. -
ఏపీ హైకోర్టుకు ఇద్దరు న్యాయమూర్తులు నియామకం
సాక్షి, విజయవాడ: ఏపీ హైకోర్టుకు ఇద్దరు న్యాయమూర్తులు నియమితులయ్యారు. హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్, జస్టిస్ సుబేందు సమంత నియామకం జరిగింది. జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్.. గుజరాత్ హైకోర్టు నుంచి బదిలీపై రాగా, జస్టిస్ సుబేందు సమంత.. కోల్కతా హైకోర్టు నుంచి బదిలీపై వచ్చారు. -
‘చీమకుర్తి’ ప్రభుత్వ భూముల్లో గ్రానైట్ అక్రమ తవ్వకాలు
చీమకుర్తి: ప్రకాశం జిల్లా చీమకుర్తి రెవెన్యూ పరిధిలోని ప్రభుత్వ భూముల్లో గ్రానైట్ అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయని హైకోర్టులో రిట్పిటిషన్ దాఖలైంది. అద్దంకికి చెందిన పులిపాటి హేబేలు ఈ నెల 17న న్యాయవాది జడ శ్రావణ్కుమార్ ద్వారా ఈ పిటిషన్ దాఖలు చేశారు. సర్వే నంబర్లు 958 నుంచి 1058 వరకు ఉన్న 258.67 ఎకరాల ప్రభుత్వ భూముల్లో అక్రమ మైనింగ్ జరుగుతున్నట్లు పిటిషన్లో తెలిపారు. మణికంఠ గ్రానైట్స్, కృష్ణసాయి గ్రానైట్స్, వాసవీ గ్రానైట్స్ యజమానులు అక్రమంగా అనుమతులు తెచ్చుకుని తవ్వకాలు సాగిస్తున్నారని పేర్కొన్నారు. వీరితోపాటు హంస, జయ మినరల్స్, ఎన్.వి.ఎక్స్పోర్ట్స్ తదితర క్వారీల యజమానులు ఆర్.ఎల్.పురం, బూదవాడ గ్రామ రెవెన్యూ పరిధిలో మరో 150 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూముల్లో అక్రమ తవ్వకాలు జరుపుతున్నారని ఆరోపించారు. అధికారుల్ని ప్రలోభపెట్టి పేదలకు డి–పట్టాగా ఇచి్చన భూముల్ని ఆ«దీనంలోకి తీసుకుని ఈ అక్రమ తవ్వకాలు సాగిస్తున్నారని పిటిషన్లో పేర్కొన్నారు. -
ఏపీ పోలీసుల తీరుపై హైకోర్టు నిప్పులు
-
13 ఏళ్లయినా మహిళ ఆచూకీ తెలుసుకోలేకపోయారా?
సాక్షి, అమరావతి: ఓ వివాహిత 13 ఏళ్ల క్రితం అదృశ్యమైతే ఆమె ఆచూకీని పోలీసులు ఇప్పటికీ తెలుసుకోలేకపోయారా.. అని హైకోర్టు విస్మయం వ్యక్తంచేసింది. తమ కుమార్తె బతికుందో.. లేదో.. కూడా తెలియకుంటే ఆ తల్లిదండ్రుల వేదన ఎలా ఉంటుందో మీకు తెలుసా? అంటూ పోలీసులను ప్రశ్నించింది. తల్లిదండ్రుల వేదనను మనందరం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొంది. తన కుమార్తె అదృశ్యం విషయంలో కొందరిపై అనుమానం వ్యక్తం చేస్తూ తండ్రి ఫిర్యాదు చేస్తే, వారిని సకాలంలో విచారించకపోవడంపై హైకోర్టు మండిపడింది. దర్యాప్తు ఎలా చేయాలో, ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో కూడా తెలియదా? అంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. వ్యక్తుల అదృశ్యం కేసుల్లో ప్రతి నిమిషమూ కీలకమని స్పష్టంచేసింది. ఘటన జరిగిన మొదట్లోనే ఫిర్యాదు చేస్తే తీరిగ్గా ఆ తర్వాత ఎప్పుడో అనుమానితులను విచారిస్తే ప్రయోజనం ఏముంటుందని పోలీసులను ప్రశ్నించింది. దర్యాప్తు సాగిన తీరు విషయంలో తామెంత మాత్రం సంతృప్తికరంగా లేమంది. తాజాగా పురోగతికి సంబంధించిన వివరాలతో స్థాయీ నివేదికను తమ ముందుంచాలని పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ, కొవ్వూరు డీఎస్పీ, తాడేపల్లిగూడెం ఎస్హెచ్వోలను ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.దర్యాప్తు పక్కన పడేసిన పోలీసులు..పశ్చిమ గోదారి జిల్లా జీలుగుమిల్లి మండలం కామయ్యపాలెం గ్రామానికి చెందిన బండారు ప్రకాశరావు తన కుమార్తె మంగాదేవిని దండగర్ర గ్రామానికి చెందిన మోహన బ్రహ్మాజీ అనే వ్యక్తికిచ్చి వివాహం చేశారు. 2012 అక్టోబర్ 18న ప్రకాశరావుకు ఆయన అల్లుడు బ్రహ్మాజీ ఫోన్ చేసి మంగాదేవి కనిపించడం లేదని చెప్పారు. ప్రకాశరావు అదే రోజున తాడేపల్లిగూడెం పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. దర్యాప్తును మాత్రం పక్కన పడేశారు. దీంతో ప్రకాశరావు 2017లో హైకోర్టును ఆశ్రయించారు. అప్పటి నుంచి హైకోర్టు ఈ వ్యాజ్యంపై పలుమార్లు విచారణ జరిపింది. తాజాగా శుక్రవారం ఈ వ్యాజ్యం న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ ముందు విచారణకు వచ్చింది. జిల్లా ఎస్పీ తదితరులు కోర్టు ముందు హాజరయ్యారు. ఈ కేసులో పోలీసులు సాగించిన దర్యాప్తు తీరుపై న్యాయమూర్తి అసహనం వ్యక్తంచేశారు. అనుమానితుల్లో ఉన్న అదృశ్యమైన మహిళ భర్తను ఫిర్యాదు ఇచ్చిన ఐదేళ్ల తర్వాత విచారించడంపై అసంతృప్తి వ్యక్తంచేశారు. రైల్వేస్టేషన్లలో, మీ–సేవా కేంద్రాల్లో వెతికామంటూ రంగురంగుల ఫొటోలు వేస్తే ఏం ప్రయోజనం ఉంటుందని ప్రశ్నించారు. దర్యాప్తు సక్రమంగా సాగినప్పుడు ఫలితం ఉంటుందని తెలిపారు. ఈ కేసులో తాజా పురోగతితో స్థాయీ నివేదికను తమ ముందుంచాలని పోలీసులను ఆదేశిస్తూ విచారణను నాలుగు వారాలకు వాయిదా వేశారు. -
ఏళ్ల తరబడి కౌంటర్ దాఖలు చేయరా?
సాక్షి, అమరావతి: సివిల్ వివాదాల్లో జోక్యం చేసుకుంటున్నారంటూ 2017లో పిటిషన్ దాఖలైతే.. ఏళ్లు తరబడిగా పోలీసులు కౌంటర్ దాఖలు చేయకపోవడంపై హైకోర్టు తీవ్ర విస్మయం వ్యక్తం చేసింది. ఏమిటీ నిర్లక్ష్యమంటూ మండిపడింది. కోర్టులన్నా, కోర్టు ఆదేశాలన్నా పోలీసులు తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. అసలు మీ గురించి మీరేమనుకుంటున్నారంటూ పోలీసులను నిలదీసింది. తీరిగ్గా మీకు కావాల్సినప్పుడు కౌంటర్ దాఖలు చేస్తామంటే చూస్తూ ఊరుకోమంటారా? అని నిలదీసింది. ఇలాగే వదిలిస్తే.. పదేళ్ల తరువాత కూడా కౌంటర్ దాఖలు చేసినా ఏమీ కాదనే ధోరణితో అధికారులు ఉంటారని, దీనివల్ల కోర్టులపై ప్రజలకు నమ్మకంపోతుందని వ్యాఖ్యానించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ అలాంటి పరిస్థితిని రానివ్వబోమని స్పష్టం చేసింది. ఎనిమిదేళ్లుగా కౌంటర్ దాఖలు చేయకుండా చోద్యం చూసిన పోలీసులు ఇప్పుడు అందుకు అనుమతి కోరడాన్ని తప్పుబట్టింది. ఈ అసాధారణ జాప్యానికి రూ.10 వేలు ఖర్చుల కింద చెల్లించాలని, అప్పుడు మాత్రమే కౌంటర్ దాఖలుకు అనుమతినిస్తామని అనంతపురం జిల్లా ధర్మవరం వన్టౌన్ ఇన్స్పెక్టర్ పి.నాగేంద్ర ప్రసాద్కు స్పష్టం చేసింది. ఈ మొత్తాన్ని హైకోర్టు న్యాయవాదుల క్లర్కుల సంఘానికి చెల్లించాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను ఈ నెల 24కి వాయిదా వేసింది. కోర్టుకు సరైన వివరాలు వెల్లడించనందుకు సుమోటోగా చేపట్టిన కోర్టు ధిక్కార వ్యాజ్యంలో నాగేంద్ర ప్రసాద్కు నోటీసులు జారీ చేస్తూ దీనిపై విచారణను కూడా అదే రోజుకు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. సుమోటోగా కోర్టు ధిక్కార చర్యలు... కొందరు వ్యక్తులతో తమకున్న సివిల్ వివాదాలపై పోలీసులు జోక్యం చేసుకోవడంపై అనంతపురం జిల్లా ధర్మవరం వాసి ఏ.రాజశేఖర్ 2017లో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను హైకోర్టు ఆదేశించినా ఇప్పటివరకు దాఖలు చేయలేదు. గత వారం ఈ వ్యాజ్యం విచారణకు వచ్చిన సమయంలో ధర్మవరం వన్టౌన్ ఇన్స్పెక్టర్ నాగేంద్ర ప్రసాద్ స్వయంగా కోర్టు ముందు హాజరయ్యారు. లక్ష్మీదేవమ్మ అనే మహిళ ఫిర్యాదు మేరకు పిటిషనర్ రాజశేఖర్పై కేసు నమోదు చేశామని 2017లో పేర్కొన్న పోలీసులు ఇటీవల అందుకు విరుద్ధంగా చెప్పారు. అసలు ఎవరి నుంచి ఎలాంటి ఫిర్యాదు అందలేదని చెప్పడంపై న్యాయమూర్తి జస్టిస్ దేవానంద్ తీవ్రంగా స్పందించారు. ఇలా పరస్పర విరుద్ధ వివరాలను కోర్టు ముందుంచినందుకు నాగేంద్ర ప్రసాద్పై న్యాయమూర్తి సుమోటోగా కోర్టు ధిక్కార చర్యలు చేపట్టారు. పోలీసులకు స్పష్టమైన సందేశం ఇవ్వదలిచాంతాజాగా ఈ పిటిషన్లపై విచారణ సందర్భంగా పోలీసుల తీరుపై న్యాయమూర్తి మండిపడ్డారు. ఈ కేసులో పోలీసుల నిర్లక్ష్యం ప్రతి దశలోనూ కనిపిస్తోందన్నారు. ఇటీవల కాలంలో కోర్టుల పట్ల పోలీసులు అత్యంత నిర్లక్ష్యపూరితంగా వ్యవహరిస్తున్నారని ఘాటుగా వ్యాఖ్యానించారు. అందువల్లే పోలీసుల విషయంలో తాము కఠినంగా వ్యవహరిస్తున్నామని, తద్వారా వారికి స్పష్టమైన సందేశం పంపదలిచామన్నారు. కోర్టు ఒకసారి నోటీసులు జారీ చేసిన తరువాత పోలీసులు కౌంటర్ దాఖలు చేసి తీరాల్సిందేనని, ఇందులో ఎలాంటి మినహాయింపు లేదని స్పష్టం చేశారు. రిట్ రూల్స్ ప్రకారం 180 రోజుల్లో కౌంటర్ దాఖలు చేయాలన్నారు. -
కదల్లేని విధంగా కొడతారా?
ఇటీవల మంగళగిరి సీఐ.. హైకోర్టు డ్రైవర్ను కొట్టారు. దీనిపై డ్రైవర్ ఫిర్యాదు చేసినా కూడా కేసు నమోదు చేయలేదు. మేం జోక్యం చేసుకుని ఎస్పీని పిలిస్తే అప్పుడు మాత్రమే ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అయితే కొట్టిన సీఐని నిందితుడిగా చేర్చలేదు. మా జోక్యం తర్వాతే సీఐని నిందితుడిగా చేర్చారు. ఫిర్యాదుదారుడిని నిబంధనల ప్రకారం వైద్య పరీక్షలకు కూడా పంపలేదు. ఆ తర్వాత దర్యాప్తును పక్కన పడేశారు. డీజీపీని పిలిపిస్తే, ఆ తర్వాత సీఐని వీఆర్కు పంపారు. పోలీసులు వ్యవహరించాల్సిన తీరు ఇదేనా? – పోలీసులపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పోలీసుల తీరుపై హైకోర్టు తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగింది. చట్టాన్ని పరిరక్షించాల్సిన పోలీసులు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటామంటే కుదరదని హెచ్చరించింది. పౌరులను పోలీసుస్టేషన్కు పిలిపించడం.. అక్రమంగా నిర్బంధించడం.. చితకబాదడం పరిపాటిగా మారిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రస్తుత కేసులో పోలీసులు పిటిషనర్ను కొడితే ఎనిమిదేళ్లుగా ఇప్పటికీ ఆయన కదల్లేని పరిస్థితుల్లో ఉన్నారని, ఇది దారుణమని హైకోర్టు మండిపడింది. అసలు నిర్బంధించడం... కొట్టడం.. ఏమిటంటూ నిలదీసింది. పిటిషనర్ను కోర్టుకు పిలిపించి స్వయంగా వాస్తవాలు తెలుసుకోవాలని భావించినా ఆయన నడవలేని పరిస్థితిలో ఉన్నందున ఆ దిశగా ఆదేశాలు ఇవ్వలేకపోతున్నామని పేర్కొంది. నిర్బంధించి ఇలా కొట్టడం పౌరులకు రాజ్యాంగం కల్పించిన హక్కులను హరించడమేనని, పిటిషనర్ చేసింది ఎలాంటి నేరమైనా ఎనిమిదేళ్లుగా కదల్లేని విధంగా కొడతారా? చట్టాన్ని అనుసరించరా? అంటూ పోలీసుల తీరుపై కన్నెర్ర చేసింది. తనను చిత్రహింసలకు గురి చేశారంటూ పిటిషనర్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కర్నూలు సీసీఎస్ పోలీసులపై నమోదు చేసిన కేసును తప్పుడు కేసు అంటూ మూసివేయడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. కేసును మూసివేయాలంటూ సంబంధిత కోర్టులో తుది నివేదిక దాఖలు చేయకపోవడాన్ని ఆక్షేపించింది. కోర్టు అనుమతి లేకుండా కేసును ఎలా మూసివేస్తారని నిలదీసింది. కేసును మూసివేసిన సంగతి కనీసం ఫిర్యాదుదారుడైన పిటిషనర్కు కూడా చెప్పకపోవడం ఏమిటంటూ మండిపడింది. ఇలా చేయడం ద్వారా పిటిషనర్ హక్కులను హరించారంటూ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కేసును మూసివేస్తున్నట్లు చట్ట ప్రకారం కోర్టు ముందు తుది నివేదిక దాఖలు చేసి ఉంటే ఫిర్యాదుదారుడికి నోటీసు అందేనని, తద్వారా కేసు మూసివేతపై నిరసన పిటిషన్ దాఖలు చేసుకునేందుకు అవకాశం ఉండేదని పేర్కొంది. ఫిర్యాదుదారుడికి పోలీసులు అలాంటి అవకాశం లేకుండా చేశారని, ఇది రాజ్యాంగ ఉల్లంఘనే అవుతుందంది. పోలీసుల తీరు ఆమోదయోగ్యం కాదని, ఇటీవల కాలంలో చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం వారికి అలవాటుగా మారిపోయిందని వ్యాఖ్యానించింది. ‘‘ఇటీవల మంగళగిరి సీఐ హైకోర్టు డ్రైవర్ను కొట్టారు. దీనిపై డ్రైవర్ ఫిర్యాదు చేసినా కూడా కేసు నమోదు చేయలేదు. మేం జోక్యం చేసుకుని ఎస్పీని పిలిస్తే అప్పుడు మాత్రమే ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అయితే కొట్టిన సీఐని నిందితుడిగా చేర్చలేదు. మా జోక్యం తరువాతే కొట్టిన సీఐని నిందితుడిగా చేర్చారు. ఫిర్యాదుదారుడిని నిబంధనల ప్రకారం వైద్య పరీక్షలకు కూడా పంపలేదు. ఆ తరువాత దర్యాప్తును పక్కన పడేశారు. డీజీపీని పిలిపిస్తే.. ఆ తరువాత సదరు సీఐని వీఆర్కు పంపారు. పోలీసులు వ్యవహరించాల్సిన తీరు ఇదేనా?’’ అంటూ హైకోర్టు నిలదీసింది.కేసు మూసివేత విషయంలో కోర్టులో దాఖలు చేసిన తుది నివేదికను పిటిషనర్కివ్వాలని పోలీసులను ఆదేశించింది. ఎనిమిదేళ్లుగా కేసును కోల్డ్ స్టోరేజ్లో పెట్టారని, తదుపరి విచారణలో ఈ వ్యవహారానికి ముగింపు పలుకుతామంది. అసాధారణ జాప్యాన్ని తాము విస్మరించలేమని పేర్కొంటూ తదుపరి విచారణను ఈ నెల 24కి వాయిదా వేసింది. కోర్టు ఆదేశాల మేరకు కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్, సీసీఎస్ ఇన్స్పెక్టర్ పి.రామకృష్ణ స్వయంగా కోర్టుకు హాజరు కాగా తదుపరి విచారణకు మాత్రం వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపునిచ్చింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.తప్పుడు కేసుగా మూసివేసిన పోలీసులుకర్నూలు సెంట్రల్ క్రైం స్టేషన్ (సీసీఎస్) ఎస్హెచ్వో తనను అక్రమంగా నిర్బంధించి, అకారణంగా కస్టడీలో వేధిస్తున్నారని, దీనిపై ఫిర్యాదు చేసినా పోలీసులు ఎలాంటి కేసు నమోదు చేయడం లేదంటూ కర్నూలు జిల్లా చిప్పగిరికి చెందిన గొల్లా జయపాల్ యాదవ్ 2016లో హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై న్యాయమూర్తి జస్టిస్ దేవానంద్ ఇటీవల తుది విచారణ చేపట్టారు. పిటిషనర్ ఫిర్యాదు ఆధారంగా సీసీఎస్ పోలీసులపై నమోదు చేసిన కేసు రికార్డులన్నింటినీ పరిశీలించారు. కర్నూలు టూ టౌన్ ఎస్ఐ ఇచ్చిన నివేదికను ఆమోదిస్తూ డీఎస్పీ 2018లో ప్రొసీడింగ్స్ ఇచ్చిన విషయాన్ని న్యాయమూర్తి గుర్తించారు. దేని ఆధారంగా ఆ ఫిర్యాదును తప్పుడు ఫిర్యాదుగా తేల్చారో అందుకు ఆధారాలేవీ రికార్డుల్లో లేని విషయాన్ని న్యాయమూర్తి గమనించారు. తప్పుడు ఫిర్యాదు అన్న విషయాన్ని సంబంధిత మేజి్రస్టేట్కు తెలియ చేశారా? లేదా? అనే విషయం రికార్డుల్లో స్పష్టంగా లేదు. ఇప్పటికీ నడవలేకపోతున్నారుపిటిషనర్ జయపాల్ యాదవ్ తరఫున సీనియర్ న్యాయవాది వి.రఘునాథ్ వాదనలు వినిపించారు. పోలీసులు పిటిషనర్ను తీవ్రంగా కొట్టారని, దీంతో అప్పటి నుంచి కదల్లేని పరిస్థితుల్లో ఉన్నారని ఆయన కోర్టు దృష్టికి తెచ్చారు. అందుకు సంబంధించిన ఫోటోలను కోర్టుకు సమర్పించారు. వీటిని పరిశీలించిన న్యాయమూర్తి జస్టిస్ దేవానంద్ పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ వ్యక్తిని ఇలా కూడా కొడతారా? అంటూ విస్మయం వ్యక్తం చేశారు. గత విచారణ సమయంలో కోర్టు తీవ్రంగా స్పందించిన తరువాతే పోలీసులు సంబంధిత కోర్టులో తుది నివేదిక దాఖలు చేశారని రఘునాథ్ నివేదించారు. ఈ సమయంలో పోలీసుల తరఫున ప్రభుత్వ న్యాయవాది అడుసుమల్లి జయంతి స్పందిస్తూ తుది నివేదికకు సంబంధించి పిటిషనర్కు నోటీసు ఇచ్చామని తెలిపారు. దీనిపై న్యాయమూర్తి స్పందిస్తూ నోటీసు ఒక్కటే ఇస్తే ప్రయోజనం ఏముంటుందని ప్రశ్నించారు. కోర్టులో దాఖలు చేసిన తుది నివేదిక కాపీని కూడా పిటిషనర్కు ఇవ్వాలని, అప్పుడు దానిపై తగిన విధంగా స్పందించేందుకు అతడికి అవకాశం ఉంటుందని పేర్కొంటూ విచారణను ఈ నెల 24కి వాయిదా వేశారు. -
టీటీడీ అధికారులపై హైకోర్టు అసహనం!
సాక్షి, విజయవాడ: తిరుమల పరకామణి చోరీ కేసుపై ఏపీ హైకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. సీజ్ చేసిన ఫైళ్లు, ప్రాథమిక దర్యాప్తు నివేదికను ఉన్నత న్యాయస్థానానికి సీఐడీ సమర్పించింది. ఈ ఘటనపై కౌంటర్ దాఖలు చేయకపోవడంపై టీటీడీ ఈవోపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నెల 27న ఈవో న్యాయస్థానం ముందు హాజరు కావాలని ఆదేశించింది. -
రూ.360 కోట్ల భూమిని రూ.45 కోట్లకే ఎలా ఇస్తారు?
సాక్షి, అమరావతి: విశాఖపట్నం, మధురవాడలోని అత్యంత విలువైన 30 ఎకరాల ప్రభుత్వ భూమిని చట్ట విరుద్ధంగా నామమాత్రపు ధరకే రియల్ ఎస్టేట్ కంపెనీ సత్వా గ్రూపునకు కేటాయించడాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. మార్కెట్లో ఎకరా రూ.12 కోట్లు ఉన్న భూమి కేవలం రూ.1.5 కోట్లకే కేటాయించారని, వీటిని రద్దు చేయాలని కోరుతూ జీవీఎంసీ కౌన్సిలర్ మేడపాటి వెంకటరెడ్డి ఈ పిల్ను దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై బుధవారం హైకోర్టు విచారణ జరిపింది. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్రెడ్డి వాదనలు వినిపిస్తూ.. సత్వా గ్రూపునకు రూ.360 కోట్ల విలువైన భూమిని రూ.45 కోట్లకే ఆ కంపెనీకి ఇచ్చేశారని తెలిపారు. ఆ భూమిలో రియల్ కంపెనీ ఆఫీసు కార్యాలయాలను నిర్మించి లీజుకిచ్చి సొమ్ము చేసుకుంటుందని పొన్నవోలు చెప్పారు. అనంతరం భూ కేటాయింపుల విధానాన్నే సవాలు చేస్తామని, అందుకు అనుగుణంగా ఈ వ్యాజ్యంలో సవరణలకు అనుమతివ్వాలని ధర్మాసనాన్ని కోరారు. ఇందుకు ధర్మాసనం అంగీకరిస్తూ తదుపరి విచారణను వాయిదా వేసింది. -
ఏపీ మద్యం కేసు.. సుప్రీం కోర్టు సంచలన తీర్పు
సాక్షి, ఢిల్లీ: మద్యం కుంభకోణం కేసులో చెవిరెడ్డి భాస్కర్రెడ్డి పిటిషన్ విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. హైకోర్టులో బెయిల్ రద్దు పిటిషన్లు తేలేవరకు.. ఏసీబీ కోర్టు బెయిల్ పిటిషన్లు విచారించవద్దన్న ఏపీ హైకోర్టు తీర్పుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. బెయిల్ రద్దు, బెయిల్ పిటిషన్లను మెరిట్ ఆధారంగానే నిర్ణయించాలని స్పష్టం చేస్తూ.. ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టేస్తూ సర్వోన్నత న్యాయస్థానం సంచలన తీర్పు వెల్లడించింది. అక్రమ మద్యం కేసులోచెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. తీర్పు సందర్భంగా.. ‘‘ఈ కేసుల్లో వ్యక్తిగత స్వేచ్ఛ ఇమిడి ఉంది. బెయిల్ కేసులకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలి. ఎదురు చూడాలనే ఆదేశం ఏమాత్రం సరికాదు. ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 21ని ఉల్లంఘించడమే. బెయిల్ రద్దు పిటిషన్లు గానీ, బెయిల్ పిటిషన్లు గానీ మెరిట్ ఆధారంగానే నిర్ణయించాలి’’ జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ కె.వి విశ్వనాథన్లతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. మద్యం కుంభకోణం కేసులో మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నేత చెవిరెడ్డి భాస్కర్రెడ్డి ఏ-38 నిందితుడిగా ఉన్నారు. తుడా (Tirupati Urban Development Authority) అధికార వాహనాలను ఉపయోగించి అక్రమ మద్యం డబ్బును తరలించారని, 2024 ఎన్నికల నిధుల కోసం అక్రమంగా ఆ డబ్బును వాడినట్లు సిట్ ఆరోపిస్తోంది. ఈ క్రమంలో.. ఈ ఏడాది జూన్ 18న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసింది. అప్పటి నుంచి ఆయన విజయవాడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. తానే తప్పూ చేయలేదని.. దేవుడు అంతా చూస్తున్నాడని.. తప్పు చేసిన వారికి శిక్ష తప్పదని పలుమార్లు ఆయన జైలు, కోర్టు బయట ఆవేదన వ్యక్తం చేయడం చూసిందే. మరోవైపు.. బెయిల్ కోసం ఆయన చేస్తున్న ప్రయత్నాలు ఇప్పటిదాకా ఫలించ లేదు. తాజాగా సుప్రీం కోర్టు జోక్యం నేపథ్యంలో ఆయనకు ఉపశమనం దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదీ చదవండి: లిక్కర్ కేసులో మోహిత్రెడ్డికి బిగ్ రిలీఫ్ -
బాబు, పోలీసులపై కోర్టు సీరియస్
-
ఏపీ హైకోర్టుకు ముగ్గురు నూతన న్యాయమూర్తులు
సాక్షి, న్యూఢిల్లీ, అమరావతి: ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు ముగ్గురు నూతన న్యాయమూర్తులు బదిలీపై రానున్నారు. వేర్వేరు హైకోర్టుల్లో పనిచేస్తున్న ఈ ముగ్గురు న్యాయమూర్తులను ఏపీ హైకోర్టుకు బదిలీ చేయాలన్న సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ఈ మేరకు కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ మంగళవారం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. గుజరాత్ హైకోర్టు నుంచి న్యాయమూర్తి జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్ రాయ్, అలహాబాద్ హైకోర్టు నుంచి న్యాయమూర్తి జస్టిస్ దొనడి రమేష్, కలకత్తా హైకోర్టు నుంచి న్యాయమూర్తి జస్టిస్ సుబేందు సమంత ఉన్నారు. వీరిలో జస్టిస్ రాయ్ నెంబర్ 2, జస్టిస్ రమేష్ నెంబర్ 6, జస్టిస్ సుబేందు 18వ స్థానంలో ఉంటారు. ఈ ముగ్గురూ తక్షణమే ఏపీ హైకోర్టులో బాధ్యతలు స్వీకరించాలని ఉత్తర్వుల్లో ఆదేశించారు. దీంతో ఏపీ హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 33కి చేరింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి చెందిన జస్టిస్ రాయ్, జస్టిస్ రమేష్ 2023లో బదిలీ అయ్యారు. అప్పటి నుంచి వీరు గుజరాత్, అలహాబాద్ హైకోర్టుల్లో విధులు నిర్వర్తిస్తున్నారు. అలాగే, జస్టిస్ సుబేందు సమంత ప్రస్తుతం కలకత్తా హైకోర్టు న్యాయమూర్తిగా పని చేస్తున్నారు. ఈ ముగ్గురిని ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి బదిలీ చేస్తూ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ నేతృత్వంలోని కొలీజియం ఆగస్టు 25న కేంద్రానికి సిఫారసు చేస్తూ తీర్మానం చేసిన విషయం తెలిసిందే.హైకోర్టుకి ముగ్గురు న్యాయాధికారులు..ఇదిలా ఉండగా.. న్యాయాధికారుల కోటా నుంచి ముగ్గురు న్యాయాధికారులు హైకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతి పొందనున్నారు. ప్రస్తుతం రాజమహేంద్రవరం జిల్లా ప్రధాన జడ్జిగా ఉన్న గంధం సునీత, విశాఖపట్నం సేల్స్ ట్యాక్స్ అప్పీలేట్ ట్రిబ్యునల్ చైర్మన్ ఆలపాటి గిరిధర్, రాష్ట్ర జుడీషియల్ అకాడమీ డైరెక్టర్ చింతలపూడి పురుషోత్తం హైకోర్టు న్యాయమూర్తులు కానున్నారు. వీరి పేర్లను హైకోర్టు కొలీజియం ఇటీవల సిఫారసు చేసింది. కేంద్ర హోమ్ శాఖ నుంచి ఇంటెలిజెన్స్ నివేదిక వెళ్లగానే సుప్రీంకోర్టు కొలీజియం వీరి నియామకంపై నిర్ణయం తీసుకుంటుంది.న్యాయమూర్తి జస్టిస్ మానవేంద్రనాథ్ ప్రస్థానం ఇదీ..విజయనగరం జిల్లా, పార్వతీపురానికి చెందిన జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్ 1964 మే 21న విశాఖపట్నంలో వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. తల్లి విజయలక్ష్మి, తండ్రి నరహరిరావు. ప్రాథమిక విద్యను పార్వతీపురంలోని ఆర్.సి.ఎం. పాఠశాలలో, ఉన్నత విద్యను విశాఖపట్నంలోని సెయింట్ అలోసియస్ ఉన్నత పాఠశాలలో అభ్యసించారు. విశాఖపట్నంలోని ఎం.వి.పి. లా కాలేజీలో న్యాయ విద్యను పూర్తి చేశారు. 1988 జూలైలో ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్లో న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. 1988 నుంచి 2002 వరకు 14 ఏళ్ల పాటు పార్వతీపురం, విజయనగరంలో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్ వారి కుటుంబంలో మూడో తరం న్యాయవాది. ఆయన తాత చీకటి పరశురాం నాయుడు ప్రసిద్ధ న్యాయవాది, రాజనీతిజు్ఞడు. 2002లో జిల్లా, సెషన్స్ జడ్జిగా ఎంపికైన జస్టిస్ రాయ్ అవిభాజ్య ఆంధ్రప్రదేశ్లో పలు చోట్ల విధులు నిర్వర్తించారు. అలాగే ఉమ్మడి రాష్ట్ర హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్గా 2015 జూలై 3 నుంచి 2018 డిసెంబర్ 31 వరకు సేవలందించారు. 2019 జనవరి 1న అమరావతిలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏర్పాటయిన తరువాత తొలి రిజిస్ట్రార్ జనరల్గా పనిచేశారు. 2019 జూన్ 20న ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2023లో గుజరాత్ హైకోర్టుకు బదిలీపై వెళ్లారు.న్యాయమూర్తి జస్టిస్ దొనడి రమేష్ ప్రస్థానం ఇదీ..చిత్తూరు జిల్లా, మదనపల్లె సమీపంలోని కమ్మపల్లికి చెందిన జస్టిస్ దొనడి రమేష్ 1965 జూన్ 27న జన్మించారు. ఆయన తల్లి అన్నపూర్ణమ్మ. తండ్రి డి.వి.నారాయణ నాయుడు. ఈయన పంచాయతీ రాజ్ శాఖలో ఇంజినీర్గా పదవీ విరమణ చేశారు. జస్టిస్ రమేష్ తిరుపతిలోనిశ్రీ వెంకటేశ్వర ఆర్ట్స్ కళాశాలలో డిగ్రీ పూర్తి చేశారు. అనంతరం 1987–90 కాలంలో వి.ఆర్. లా కాలేజీ నుంచి న్యాయశాస్త్రంలో డిగ్రీ పొందారు. 1990లో ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్లో న్యాయవాదిగా నమోదు అయ్యారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, హైదరాబాద్లో న్యాయవాద వృత్తిని ఆరంభించారు. విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ పి.ఎస్. నారాయణ వద్ద వృత్తిలో మెళకువలు నేర్చుకున్నారు. 2000 డిసెంబర్ నుంచి 2004 వరకు ప్రభుత్వ న్యాయవాదిగా వ్యవహరించారు. 2007లో ఆంధ్రప్రదేశ్ సర్వ శిక్ష అభియాన్కు న్యాయవాదిగా ఉన్నారు. 2014లో ప్రత్యేక ప్రభుత్వ పక్ష న్యాయవాదిగా నియమితులై 2019 మే వరకు కొనసాగారు. 2020 జనవరి 13న హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. అనంతరం 2023 జూలై 24న అలహాబాద్ హైకోర్టుకు బదిలీ అయ్యారు.న్యాయమూర్తి జస్టిస్ సుబేందు సమంత ప్రస్థానం ఇదీ.. పశ్చిమ బెంగాల్కు చెందిన జస్టిస్ సుబేందు సమంత 1971 నవంబర్ 25న జన్మించారు. హమిల్టోన్లో పాఠశాల విద్య, తమ్లుక్లో హైసూ్కల్ విద్య పూర్తి చేశారు. కలకత్తా విశ్వవిద్యాలయం హజ్రా క్యాంపస్లో లా డిగ్రీ పొందారు. తమ్లుక్ జిల్లా కోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. అనంతరం అదనపు జిల్లా, సెషన్స్ జడ్జిగా ఎంపికయ్యారు. కలకత్తాలోని సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయాధికారిగానూ వ్యవహరించారు. అండమాన్ నికోబార్లో జిల్లా సెషన్స్ జడ్జిగా పనిచేసిన జస్టిస్ సుబేందు.. కలకత్తా సిటీ సెషన్స్ కోర్టు చీఫ్ జడ్జిగానూ వ్యవహరించారు. 2022 మే 18న కలకత్తా హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా, 2025 ఏప్రిల్ 28న శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. -
డీజీపీ నిద్రపోతున్నారా.. పోలీసు శాఖను మూసేయాలి!
సాక్షి, అమరావతి: కేసుల దర్యాప్తు, హైకోర్టులఉతర్వుల అమలు విషయంలో పోలీసుల పనితీరుపై తరచూ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్న హైకోర్టు, ‘డీజీపీ నిద్రపోతున్నారా?’ అంటూ మరో సారి ఘాటుగా వ్యాఖ్యానించింది. ఒక కేసుకు సంబంధించి రికార్డులన్నింటినీ తక్షణమే సీజ్ చేయాలన్న తమ ఆదేశాలను సీఐడీ అమలు చేయకపోవడంపై హైకోర్టు నిప్పులు చెరిగింది. రికార్డులను సీజ్ చేయాలని తాము గత నెల 19న ఆదేశాలు ఇస్తే, ఇప్పటి వరకు వాటిని అమలు చేయకపోవడంపై మండిపడింది. రికార్డులను సీజ్ చేయాలని తాము సీఐడీ ఐజీని ఆదేశించామని, అయితే సీఐడీ ఐజీ పోస్టులేదంటూ ఈ నెల 6న అనుబంధ పిటిషన్ దాఖలు చేయడమేమిటని ఆక్షేపించింది.సెప్టెంబర్ 19న ఆదేశాలిస్తే, అక్టోబర్ 6వ వరకు ఏం చేస్తున్నారని ప్రశ్నించింది. డీజీపీ నిద్రపోతున్నారా? అంటూ మండిపడింది. తమ ఆదేశాలను అమలు చేయాలన్న చిత్తశుద్ధి ఉండి ఉంటే ఐజీ లేకున్నా, మరో అధికారి చేత తమ ఆదేశాలను అమలు చేసి ఉండేవారని పేర్కొంది. గతంలో ఓ కేసులో ఇదే కోర్టు సీఐడీ ఐజీకి ఆదేశాలు ఇచ్చిందని, ఆ ఆదేశాలు అమలయ్యాయని గుర్తు చేసింది. అప్పుడు ఉన్న ఐజీ పోస్టు ఇప్పుడు ఎందుకు లేకుండా పోతుందని ప్రశ్నించింది. కోర్టు ఆదేశాల అమలు చేయనప్పుడు పోలీసు శాఖను మూసివేయాలని ప్రభుత్వాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించింది. కోర్టు ఆదేశాలను అమలు విషయంలో పోలీసులు వారి బాధ్యతను పూర్తిగా విస్మరించారని అభిప్రాయపడింది. కోర్టు ఆదేశాల అమల్లో జాప్యం చేయడం ద్వారా ఉద్దేశపూర్వకంగా నిందితులకు సహకరించినట్లు ఉందని తెలిపింది. తమ ఆదేశాలను అమలు చేయకపోవడం వల్ల నిందితులు ఇప్పటికే రికార్డులను తారుమారు చేసే ఉంటారని వ్యాఖ్యానించింది.అయినా కూడా మీరు (పోలీసులు) చోద్యం చూస్తూనే ఉంటారంది. ఈ కేసులో పోలీసుల నిర్లక్ష్యం చాలా విషయాలను చెబుతోందని ఘాటుగా వ్యాఖ్యానించింది. పోలీసు శాఖ మొత్తం నిస్సారంగా, నిరుపయోగంగా మారిపోయిందని తెలిపింది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి పరకామణి నుంచి రూ. 72,000 విలువైన 900 అమెరికన్ డాలర్లను దొంగిలించిన ఘటనకు సంబంధించి తిరుమల వన్టౌన్ పోలీసులు నమోదు చేసిన కేసులో తాము కేవలం రికార్డుల సీజ్కు మాత్రమే ఆదేశాలిచ్చామని, దర్యాప్తునకు ఇవ్వలేదని గుర్తు చేసింది. అలాంటప్పుడు రికార్డులను సీజ్ చేయాలన్న ఆదేశాలను సీఐడీలో ఏ అధికారి అయినా అమలు చేసి ఉండొచ్చునంది. ఈ నిర్లక్ష్యానికి డీజీపీనే నిందించాల్సి ఉంటుందని తెలిపింది.ఈ మొత్తం వ్యవహారంలో తాము పోలీసుల తీరుపై చాలా అసంతృప్తిగా ఉన్నామంది. గతంలో తాము ఆదేశించిన విధంగా రికార్డులను సీజ్ చేయాలని, అలాగే ఈ విషయంలో టీటీడీ బోర్డు తీర్మానాలకు సంబంధించిన రికార్డులను కూడా జప్తు చేయాలని సీఐడీ డీజీ రవిశంకర్ అయ్యన్నార్ని ఆదేశించింది. వీటన్నిటినీ సీల్డ్ కవర్లో ఉంచి హైకోర్టు రిజి్రస్టార్ (జ్యుడిషియల్) ద్వారా తమ ముందు ఉంచాలని డీజీని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 17కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. -
ఏపీ పోలీసులపై మరోసారి హైకోర్టు సీరియస్
సాక్షి,విజయవాడ: పోలీసులపై ఏపీ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పరకామణిలో చోరీ కేసుకు సంబంధించి రికార్డులు సీజ్ చేయాలని ఇచ్చిన ఆదేశాలను సీఐడీ అమలు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా పోలీసులపై హైకోర్టు ఘాటైన వ్యాఖ్యలు చేసింది. పోలీసు శాఖను మూసేయాలి. డీజీపీ నిద్రపోతున్నారా?. కోర్టు ఆదేశాన్ని అమలు చేయడం తెలీదా అంటూ ధ్వజమెత్తింది. పరకామణి వ్యవహారంలో నిందితులకు సహకరిస్తున్నారని మండిపడింది.ఇప్పటికే నిందితులు సాక్షాలను తారుమారు చేసే ఉంటారు. అయినా మీరు చోద్యం చేస్తున్నారంటూ హైకోర్టు విమర్శలు గుప్పించింది. ఈ కేసులో మీ నిర్లక్ష్యం చాలా విషయాలు చెబుతోంది. మీకు నిజాయితీ ఉండి ఉంటే వెంటనే కోర్టుకు వచ్చేవాళ్లు.సీఐడీలో ఐజీ ర్యాంకు అధికారి లేకుంటే.. మరో అధికారితో పనిచేయించుకోవచ్చుగా? మేము కేవలం రికార్డులను సీజ్ మాత్రమే కదా ఆదేశించింది. ఆ ఆదేశాలను అమలు చేసే వారెవరు సీఐడీలో లేరా?.ఈ నిర్లక్ష్యానికి డీజీపీనే మేం నిందించాలి. పోలీసుల తీరుపై అసంతృప్తిగా ఉన్నామంటూ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. -
సీఐ తీరుపై హైకోర్టు సీరియస్
-
జగన్ దెబ్బకు టీడీపీ మైండ్ బ్లాక్
‘‘ఆధునిక దేవాలయాలను అమ్మేస్తున్నారు..’’ ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేట్ సంస్థలకు అప్పగించాలన్న కూటమి సర్కారు నిర్ణయంపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వ్యాఖ్య. ‘‘వైద్య కళాశాలలను పీపీపీ పద్ధతిలో నిర్మిస్తే తప్పేంటి? నిధుల కొరత ఉండవచ్చు.. వనరుల లేమితో కోర్టు భవన నిర్మాణాలే ఆగిపోయాయి’’ - ఏపీ హైకోర్టు వ్యక్తం చేసిన అభిప్రాయం. తెలుగుదేశం మీడియా ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు సహజంగానే హైకోర్టు వ్యాఖ్యలను పతాక శీర్షికలుగా చేశాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ నర్సీపట్నం వద్ద ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాలను సందర్శించడానికి వెళుతున్న రోజే ఎల్లో మీడియాలో ఈ కథనం వచ్చింది. జగన్ పర్యటనకు వచ్చిన స్పందన చూసిన తర్వాత జనాభిప్రాయం ఎలా ఉందో తెలుసుకోవడం కష్టం కాదు. ఆంక్షలతో అడ్డుకోవడానికి ఎన్ని కుయుక్తులు పన్ననా, జనం మాత్రం తరలి సంద్రంలా తరలి వచ్చారు. వర్షం జోరున కురుస్తున్నా ప్రజలు జగన్తో సమస్యలు విన్నవించడానికి తండోపతండాలుగా వచ్చారు. అరవై కిలో మీటర్ల దూరం ప్రయాణించడానికి ఆరు గంటలు పట్టిందంటేనే జన ప్రభంజనం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ జనాన్ని చూసి కూటమి పార్టీల నేతలకు మతిపోయి ఉండాలి. ప్రజలు ప్రైవేటీకరణపై ఎంత ఆగ్రహంగా ఉన్నారో అర్థమై ఉండాలి. కొద్దిరోజుల క్రితం శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఒక సమావేశంలో మాట్లాడుతూ అసలు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఎక్కడ? అని ప్రశ్నించారు. దీనికి సంబంధించిన జీవో ఎక్కడ అని అడిగారు. తన ప్రాంతంలో మెడికల్ కాలేజీ భవనాల నిర్మాణం జరుగుతున్నట్లు తెలిసి కూడా అయ్యన్న ఆ వ్యాఖ్య చేయడాన్ని వైసీపీ సవాల్ గా తీసుకుంది. జగన్ గతంలో చెప్పిన విధంగా తన హయాంలో చేపట్టిన మెడికల్ కాలేజీల సందర్శనకు ఇది ఒక అవకాశంగా మారింది. తదుపరి ఆయన నర్సీపట్నం టూర్ పెట్టుకున్నారు. ఆ సందర్భంగానే జగన్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి రాష్ట్రానికి 17 వైద్య కళాశాలలు ఎలా తీసుకొచ్చింది వివరించారు. భవన నిర్మాణాలకు తీసుకున్న చర్యలతోపాటు జారీ చేసిన జీవోలను కూడా చూపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైద్య కళాశాలలను టీడీనే తెచ్చిందని అనంతపురంలో ప్రకటించి భంగపడితే జీవోలు ఎక్కడని అడిగి స్పీకర్ అయ్యన్నపాత్రుడు అభాసుపాలయ్యారని జనమిప్పుడు వ్యాఖ్యానిస్తున్నారు. గౌరవ న్యాయస్థానం ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పీపీపీ పద్దతిలో నడిపే ప్రతిపాదనపై అభిప్రాయం వ్యక్తం చేయడాన్ని మనం తప్పు పట్టనక్కర్లేదు. అయితే ఆ మీడియాలోనే ఆ రోజు వచ్చిన వార్తలే న్యాయమూర్తుల సందేహాన్ని తీర్చే విధంగా ఉన్నాయన్న విశ్లేషణలు వచ్చాయి. అమరావతిలో రూ.212 కోట్లతో రాజ్ భవన్ నిర్మాణం చేపట్టాలని రాజధాని అభివృద్ది సంస్థ (సీఆర్డీయే) సమావేశంలో నిర్ణయించారన్నది ఆ వార్త సారాంశం. మూడు నెలల్లో రాజధానికి ఒక రూపు తీసుకు రావాలని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ సమావేశంలో చెప్పినట్లు కూడా రాశారు. అమరావతిలో రూ.104 కోట్లతో క్వాంటమ్ హబ్ భవనం నిర్మాణానికి సీఆర్డీయే నిర్ణయం అన్నది ఎల్లో మీడియా ఇచ్చిన ఇంకో వార్త. ప్రధాన రోడ్లకు రూ.వెయ్యి కోట్లు వ్యయం చేయడానికి ప్రభుత్వం పాలన అనుమతులు ఇచ్చింది.గోదావరి- బనకచర్ల స్కీమును రూ.81 వేల కోట్లతో చేపట్టే విషయంలో ముందుకే వెళ్లాలని, డీపీఆర్లు సిద్దం చేయడానికి ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చినట్లు మరో కథనం. ఇంతకన్నా ఆసక్తికరమైన విశేషం ఏమిటంటే ప్రభుత్వం రూ.257 కోట్లు వ్యయం చేసి జీ+ 7 అంతస్తుల సీఆర్డీయే కార్యాలయ భవన నిర్మాణాన్ని పూర్తి చేసింది. వేల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చి భవనాలు, ఇతర నిర్మాణాలు చేపడుతున్న కూటమి సర్కార్ పేదలకు ఉపయోగపడే ప్రభుత్వ వైద్య కళాశాలల నిర్మాణం విషయానికి వచ్చేసరికి డబ్బులు లేకుండా పోయాయా? అన్న సాధారణ పౌరుల ప్రశ్నలకు జవాబు దొరకడం లేదు. గౌరవ న్యాయస్థానం కోర్టుల నిర్మాణం కూడా ఆగిపోయిన విషయాన్ని ప్రస్తావించారు. అంటే కోర్టుల కన్నా కూడా రాజధానిలో తాము అనుకున్న విలాసవంత భవనాలే ముఖ్యమని ప్రభుత్వ అధినేతలు భావిస్తున్నారని అనుకోవాల్సి వస్తుంది కదా! ఈ తరహా వ్యాఖ్య కోర్టు జగన్ ప్రభుత్వ టైమ్లో చేసి ఉంటే ప్రభుత్వం దివాళా తీసిందని, కోర్టుల భవనాలను కూడా నిర్మించ లేకపోతోందని ఎల్లో మీడియా పెద్ద ఎత్తున ప్రచారం చేసేది. కాని ఇప్పుడు మాత్రం కోర్టు భవనాలకే డబ్బు లేనప్పుడు మెడికల్ కాలేజీలను ప్రభుత్వం ఎలా కట్టగలుగుతుందని ప్రశ్నిస్తున్నట్లుగా ఉంది. అందుకే పీపీపీ మోడల్లో ప్రైవేటు వారికి అప్పగిస్తున్నట్లు జనాన్ని మభ్య పెట్టాలని యత్నిస్తోంది. మెడికల్ కాలేజీల నిర్మాణానికి రూ.ఐదు వేల కోట్ల వనరులు లేకపోతే రాజధాని నిర్మాణానికి లక్ష కోట్లు ఎక్కడ నుంచి వస్తున్నాయి? వైఎస్ జగన్ తీసుకువచ్చిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలలో అన్ని సీట్లు మెరిట్ బేసిస్ మీదే కేటాయించాలని, సెల్ఫ్ ఫైనాన్స్ స్కీమ్ కింద ఎన్నారైలకు ఇవ్వడానికి వీల్లేదని చంద్రబాబు, లోకేశ్లు ఎన్నికలకు ముందు చెప్పారు. కానీ ఇప్పుడు మాత్రం ఒక్కో సీటును ఏకంగా రూ.57 లక్షలకు అమ్ముకోవడానికి అవకాశం ఇస్తున్నారు. ప్రభుత్వ విధాన నిర్ణయాలలో జోక్యం చేసుకోవచ్చా అన్న సంశయం కోర్టుకు ఉండవచ్చు. ఇది కేవలం విధానానికి సంబంధించిందే కాదు. వందల కోట్ల విలువైన భూములను ప్రైవేటు సంస్థలకు కట్టబెడుతున్నారు. ఇప్పటికే నిర్మించిన భవనాలను అప్పగించేస్తారు. ఎకరా వంద రూపాయల లీజుకే ఇచ్చేయబోతున్నారు. ఈ కాలేజీలకు అనుబంధంగా ఏర్పాటయ్యే వైద్యశాలల్లో కూడా అన్ని సేవలు పేదలకు ఉచితంగా లభించే అవకాశం తక్కువే. ఒకవేళ ఇచ్చినా, వాటికి రాష్ట్ర ప్రభుత్వమే చెల్లింపులు చేస్తుంది. ఇలా రకరకాల అంశాలు ఇందులో ఇమిడి ఉన్నాయి. వీటన్నిటి మీద కోర్టులో వాద, ప్రతివాదాలు జరుగుతాయో లేదో తెలియదు. కోర్టు వారు ఎలాంటి తీర్పు ఇచ్చినా, రాజకీయ పార్టీలు తమ విధానం ప్రకారం ఇలాంటి అంశాలపై నిర్ణయాలు తీసుకుంటాయి. అయితే ఈ టెండర్లు ఖరారు కాకుండా స్టే ఇవ్వలేమని కోర్టు పేర్కొనడం గమనించదగ్గ విశేషమే. మెడికల్ కాలేజీలను ఈ ప్రభుత్వం పీపీపీ విధానం కింద ప్రైవేటు సంస్థలకు అప్పగించినా, తాము అధికారంలోకి వచ్చాక తిరిగి స్వాధీనం చేసుకుంటామని జగన్ ఇప్పటికే ప్రకటించారు. ఈ లోగా ప్రైవేటికరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల ఉద్యమాన్ని వైసీపీ ఆరంభించింది. ఈ రకంగా ప్రజల మనోగతాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకురావడంలొ వైసీపీతో సహా వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు తగు పాత్ర పోషిస్తాయి. అందువల్ల కోర్టు ప్రభుత్వ చర్యలకు ఆమోదం తెలిపినా, తెలపకపోయినా, దానితో నిమిత్తం లేకుండా వైఎస్సార్ కాంగ్రెస్ తమ విధానం ప్రకారం ప్రజల అభిప్రాయాన్ని కూడగట్టుకోవడానికి ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్పాలి. జగన్ వ్యాఖ్యానించినట్లు ఆధునిక దేవాలయాల వంటి ప్రభుత్వ మెడికల్ కాలేజీలు అమ్మడం న్యాయం కాదని ప్రజలు భావిస్తున్నారు . జగన్ టూర్ కు జనం రాకుండా చూడడంలో పోలీసులు విఫలమయ్యారని, మంత్రులు సరిగా స్పందించ లేకపోతున్నారని.. చంద్రబాబు అభిప్రాయపడ్డారని వార్తలు వచ్చాయి. దానిని బట్టే జగన్ టూర్ సక్సెస్ అయిందని చంద్రబాబుతో సహా కూటమి నేతలంతా పరోక్షంగా ఒప్పుకుంటున్నట్లే!. కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
మచిలీపట్నం పోలీసులకు బిగ్ షాక్.. మేకల సుబ్బన్నకు బెయిల్
-
హైకోర్టు ఉత్తర్వులకన్నా.. ఎమ్మెల్యే ఆదేశాలే మిన్న!
సాక్షి, అమరావతి: హైకోర్టు ఆగ్రహం, ఆదేశాలను పట్టించుకోకుండా పోలీసులు గ్రామస్థాయి మొదలుకుని రాష్ట్ర స్థాయి వరకు అధికార పార్టీ నాయకుల ఆదేశాల మేరకే నడుచుకుంటున్నారన్న విషయం పలు దఫాలు స్పష్టమవుతూనే ఉంది. ప్రకాశం జిల్లాలో పేరుగాంచిన శ్రీసిద్ధి భైరవేశ్వరస్వామి ఆలయం ఇందుకు తాజా ఉదాహరణ. గత మూడు దశాబ్దాలుగా ఆలయాన్ని ఎంతో అభివృద్ధి చేసిన కమిటీ పగ్గాలను కూటమి నేతలు బలవంతంగా లాక్కున్నారు. గుడి తాళాలు, హుండీలు పగలగొట్టారు.ఈ ఘటనపై వాస్తవ కమిటీ ప్రెసిడెంట్ శ్రీరంగారెడ్డి ఈ ఏడాది జూన్ 19న ఫిర్యాదు చేసినా పోలీసులు కేసు నమోదు చేయలేదు. పైపెచ్చు ఫిర్యాదును ఉపసంహరించుకోవాలంటూ శ్రీరంగారెడ్డినే వేధించడం మొదలుపెట్టారు. దీంతో ఈ మొత్తం వ్యవహారంపై శ్రీరంగారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. దీనిని విచారించిన హైకోర్టు చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని రాచర్ల పోలీసులను ఆదేశించింది. అయినా రాచర్ల పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. హైకోర్టు ఆదేశాల కన్నా అధికార పార్టీ ఎమ్మెల్యే మాటకే పోలీసులు విలువిస్తున్నారు. కోర్టు ధిక్కార పిటిషన్ల దాఖలు వరకూ పరిస్థితి.. దేవస్థానం వ్యవహారాల్లో జోక్యం వద్దని హైకోర్టు ఆదేశించినా వాటిని అమలు చేయకపోవడంతో, శ్రీరంగారెడ్డి రాచర్ల ఏఎస్ఐ వై. ఆదిశేషయ్యపై కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఏఎస్ఐకు నోటీసులు జారీ అయ్యాయి. అలాగే, ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేయాలని ఇచ్చిన హైకోర్టు ఆదేశాలను అమలు చేయలేదన్న కారణంగా, ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్రాజు, డీఎస్పీ డాక్టర్ యు. నాగరాజు, రాచర్ల ఎస్హెచ్వో పి. కోటేశ్వరరావులపై మరో ధిక్కార పిటిషన్ కూడా ఆయన దాఖలు చేశారు. ఈ రెండు పిటిషన్లపై హైకోర్టు వచ్చే వారం విచారణ చేపట్టే వీలుంది. మరో కుట్రకు శ్రీకారం కోర్టు ధిక్కరణ పిటిషన్లు విచారణకు వస్తున్న తరుణంలోనే శ్రీరంగారెడ్డి, ఆయన సోదరుడు నెమిలిరెడ్డిని లక్ష్యంగా చేసుకుంటూ రాచర్ల పోలీసులు తాజాగా కేసు నమోదు చేయడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. దేవస్థానానికి సంబంధించిన ఆభరణాలను తీసుకున్నారన్నది ఈ కేసు సారాంశం. -
మరోసారి ఎస్సీలే లక్ష్యంగా బాబు కుతంత్రం
సాక్షి, అమరావతి: ఎస్సీగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా..? అంటూ గతంలో ఎస్సీలను ఘోరంగా అవమానించిన సీఎం చంద్రబాబు ఇప్పుడు మరోసారి ఎస్సీలను లక్ష్యంగా చేసుకున్నారు. మద్యం కేసులో నిందితులకు విజయవాడ ఏసీబీ ప్రత్యేక కోర్టు న్యాయాధికారి భాస్కరరావు ఇటీవల వరుసగా బెయిళ్లు మంజూరు చేస్తూ వస్తుండటంతో చంద్రబాబు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎస్సీ అయిన ఆయన్ను లక్ష్యంగా చేసుకుని న్యాయ చరిత్రలో ఎన్నడూ, ఎవ్వరూ చేయని విధంగా తన ఆస్థాన న్యాయవాది సిద్దార్థ లూథ్రా చేత హైకోర్టులో అనుచిత వ్యాఖ్యలు చేయించారు. భాస్కరరావు నిబంధనల మేరకు తన విచక్షణాధికారాన్ని ఉపయోగించి వైఎస్సార్సీపీ నేతలకు బెయిల్ మంజూరు చేస్తుండటాన్ని సహించలేని చంద్రబాబు.. ఆ న్యాయాధికారిపై తన అసహనాన్ని, ఆక్రోశాన్ని లూథ్రా ద్వారా వెళ్లగక్కించారు. వైఎస్సార్సీపీ ఎంపీ పీవీ మిధున్రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్పై గురువారం హైకోర్టు విచారణ జరుపుతున్న సమయంలో లూథ్రా సంచలన వ్యాఖ్యలు చేశారు. భాస్కరరావును ఏసీబీ కోర్టు నుంచి బదిలీ చేయించాలని తాను ప్రభుత్వానికి సిఫారసు చేసినట్లు లూథ్రా బహిరంగంగానే తెలిపారు. భాస్కరరావు తాము చేస్తున్న ప్రతీ వాదనను తోసిపుచ్చుతున్నారని, తమ వాదనలను ఏ మాత్రం పరిగణనలోకి తీసుకోకుండా వైఎస్సార్సీపీ నేతలకు బెయిల్ మంజూరు చేసేస్తున్నారని లూథ్రా కోర్టుకు నివేదించారు. ఇటీవల మిధున్రెడ్డికి బెయిల్ మంజూరు సందర్భంగా తాము చేసిన ఏ వాదనను కూడా ఆయన పట్టించుకోకుండా తీర్పు ఇచ్చారని తెలిపారు. సీఆర్పీసీ సెక్షన్ 161 కింద, సెక్షన్ 164 కింద సాక్షులు ఇచ్చిన సాక్ష్యాలను సైతం ఆయన పరిగణనలోకి తీసుకోలేదన్నారు. అంతేకాక గూగుల్ టేకౌట్ను కూడా పట్టించుకోలేదన్నారు. ఎన్ని ఆధారాలు సమర్పించినా వాటిని ఆరోపణలనే పేర్కొంటూ ఆధారాల్లేవని చెబుతున్నారని తెలిపారు. మిధున్రెడ్డి ఏ నేరం చేయలేదంటూ క్లీన్ చీట్ ఇచ్చేశారన్నారు. బెయిలు మంజూరు సమయంలో భాస్కరరావు ఏ ఒక్క నిబంధనను కూడా పాటించలేదని తెలిపారు. మిధున్రెడ్డికి బెయిల్ తీర్పును కొట్టేయాలని పిటిషన్మద్యం కేసులో మిధున్రెడ్డికి బెయిల్ మంజూరు చేస్తూ ఏసీబీ కోర్టు ఇచ్చిన తీర్పును కొట్టేయాలని కోరుతూ సీఐడీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఏసీబీ కోర్టు ఇచ్చిన తీర్పులోని పలు అంశాలపై అభ్యంతరాలు లేవనెత్తింది. ఆ తీర్పులోని అంశాలపై స్టే ఇవ్వాలని కోరుతూ అనుబంధ పిటిషన్ దాఖలు చేసింది. ఈ వాజ్యంపై న్యాయమూర్తి జస్టిస్ జ్యోతిర్మయి ప్రతాప గురువారం విచారణ జరిపారు. ఈ సందర్భంగా మిధున్రెడ్డికి బెయిల్ ఇస్తూ ఇచ్చిన తీర్పులోని పలు అంశాలను స్టే చేయాలని, లేని పక్షంలో మిగిలిన నిందితులు ఆ అంశాలను ఆధారంగా చేసుకుని బెయిల్ పొందే అవకాశం ఉందని సిట్ తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్దార్థ లూథ్రా వాదించారు. దర్యాప్తు మొత్తం ప్రభావితం అయ్యేలా మిధున్రెడ్డికి ఏసీబీ కోర్టు న్యాయాధికారి బెయిల్ ఇచ్చారని తెలిపారు. దీని వల్ల మొత్తం దర్యాప్తే నిర్వీర్యమై పోతుందన్నారు. మిధున్రెడ్డికి బెయిల్ మంజూరు చేసే సమయంలో అతని పాస్పోర్ట్ను స్వాధీనం చేయాలని ఏసీబీ కోర్టు ఆదేశించిందని లూథ్రా తెలిపారు. ఇదిలా ఉండగానే న్యూయార్క్లోని యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ సమావేశాలకు వెళ్లేందుకు వీలుగా పార్లమెంటరీ కార్యదర్శి నుంచి సెప్టెంబర్ 26న మిధున్రెడ్డికి మెయిల్ వచ్చిందన్నారు. అప్పుడు మిధున్రెడ్డి జైల్లో ఉన్నారని తెలిపారు. ఈ సమావేశాల్లో పాల్గొనే నిమిత్తం న్యూయార్క్ వెళ్లేందుకు వీలుగా మిధున్రెడ్డికి ఏసీబీ కోర్టు పాస్పోర్టును వెనక్కి ఇచ్చేసిందన్నారు. ఈ సందర్భంగా ఎలాంటి షరతులు విధించలేదన్నారు. ఈ సందర్భంగా సిట్ తరఫున లూథ్రా ఏసీబీ కోర్టు న్యాయాధికారిపై పలు ఆరోపణలు చేశారు. ఏకపక్షంగా స్టే ఇవ్వలేంమిధున్రెడ్డికి బెయిలిస్తూ ఇచ్చిన తీర్పులోని అంశాలపై స్టే విధించేందుకు హైకోర్టు నిరాకరించింది. మిధున్రెడ్డి వాదనలు వినకుండా ఏకపక్షంగా ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేమని హైకోర్టు తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో సోమవారం చెవిరెడ్డి భాస్కర్రెడ్డి, వెంకటేష్ నాయుడు, సజ్జల శ్రీధర్రెడ్డి తదితరుల బెయిల్ పిటిషన్లపై విచారణ ఉందని, మిధున్రెడ్డికి ఇచ్చిన తీర్పులోని అంశాలను స్టే చేయాలంటూ తాము దాఖలు చేసిన అనుబంధ పిటిషన్ను తేల్చేంత వరకు తన ముందున్న వ్యాజ్యాలపై విచారణ జరపకుండా ఏసీబీ కోర్టును నియంత్రించాలని లూథ్రా హైకోర్టును కోరారు. ఇందుకు అంగీకరించిన హైకోర్టు.. సీఐడీ దాఖలు చేసిన అనుబంధ పిటిషన్పై తాము నిర్ణయం వెలువరించేంత వరకు చెవిరెడ్డి భాస్కర్రెడ్డి తదితరుల పిటిషన్లపై విచారణ జరపొద్దని ఏసీబీ కోర్టును ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 15వ తేదీకి వాయిదా వేసింది. కాగా, సిట్ తరఫున ఇంకా హైకోర్టు సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ (పీపీ) మెండ లక్ష్మీనారాయణ వాదనలు వినిపించారు.వ్యక్తిగత పర్యటన కాదు.. అది ప్రతిష్టాత్మక సమావేశం ఈ సమయంలో మిథున్ రెడ్డి తరఫు న్యాయవాది తప్పెట నాగార్జునరెడ్డి స్పందిస్తూ, అనుబంధ పిటిషన్కు సంబంధించిన కాపీలను సిట్ తరఫు న్యాయవాదులు ఇప్పుడే తమకు అందచేశారన్నారు. వాటన్నింటినీ పరిశీలించి తగిన విధంగా స్పందించేందుకు సమయం ఇవ్వాలని కోరారు. మి«థున్రెడ్డి పాల్గొనే సమావేశం చాలా ప్రతిష్టాత్మకమైనదని చెప్పారు. ఈ సమావేశానికి వెళుతున్న అతి తక్కువ మందిలో మిథున్ రెడ్డి ఒకరని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. పార్లమెంట్ కార్యదర్శి నుంచి మెయిల్ వచ్చాక పాస్పోర్ట్ను వెనక్కి ఇవ్వాలని కోరుతూ ఏసీబీ కోర్టులో పిటిషన్ వేశామన్నారు. సమావేశంలో పాల్గొనే హక్కు ఎంపీగా మిథున్రెడ్డికి ఉందని, దానిని పరిగణనలోకి తీసుకునే ఏసీబీ కోర్టు పాస్పోర్ట్ను వెనక్కి ఇచ్చిందన్నారు. మిథున్ దేశం తరఫున ఆ సమావేశానికి వెళుతున్నారే తప్ప అది వ్యక్తిగత పర్యటన కాదన్నారు. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకునే కోర్టు బెయిల్ మంజూరు చేసిందన్నారు. బెయిల్ మంజూరు చేసిన న్యాయాధికారికి ఉద్దేశాలు ఆపాదించడం సరికాదన్నారు. ఎంపీ తన వ్యక్తిగత పనుల నిమిత్తం విదేశాలకు వెళ్లడం లేదని, అధికారిక కార్యక్రమంలో భాగంగానే వెళ్తున్నారని.. ఈ ప్రోగ్రాం మొత్తాన్ని పీఎంవో పర్యవేక్షణ చేస్తుందని తెలిపారు. చెవిరెడ్డి తదితరుల బెయిల్ పిటిషన్లపై ఏసీబీ కోర్టు సోమవారం విచారణ జరుపుతుంది కాబట్టి, మిధున్రెడ్డి బెయిల్ పిటిషన్లోని అంశాలపై స్టే ఇవ్వాలని ఎలా కోరతారని ఆయన ప్రశ్నించారు. స్టే కావాలనుకుంటే అందుకు ప్రత్యేకంగా పిటిషన్ దాఖలు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. లూథ్రా సిఫారసు చేస్తే సరిపోతుందా?ఏసీబీ కోర్టు జడ్జి భాస్కరరావును అక్కడి నుంచి బదిలీ చేయించాలని తాను ప్రభుత్వానికి సిఫారసు చేసినట్లు లూథ్రా చెప్పిన నేపథ్యంలో ఓ న్యాయాధికారి బదిలీ అంత సులభమా అని సందేహం కలుగుతోంది. ప్రభుత్వం అనుకున్నంతనే న్యాయాధికారి బదిలీ జరిగిపోదు. న్యాయవాదులు ప్రభుత్వ పరిధిలో హైకోర్టు నియంత్రణలో పని చేస్తుంటారు. వారిని బదిలీ చేసే అధికారం హైకోర్టుకే ఉంటుంది. ప్రభుత్వానికి కేవలం న్యాయాధికారుల బదిలీని నోటిఫై చేసే అధికారం మాత్రమే ఉంటుంది. న్యాయాధికారుల బదిలీల విషయంలో హైకోర్టుదే తుది నిర్ణయం. న్యాయాధికారుల బదిలీల విషయంలో పరిపాలన హెడ్గా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి తన సహచర సీనియర్ న్యాయమూర్తులతో ఓ కమిటీని ఏర్పాటు చేసి ఉంటారు. ఆ కమిటీనే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. లూథ్రా సిఫారసు చేశారనో, ప్రభుత్వం అడిగిందనో బదిలీ చేయడం ఉండదు. అందునా సీఐడీకి నచ్చని విధంగా న్యాయాధికారి వ్యవహరిస్తున్నారనే కారణంతో బదిలీ చేయడం అన్నది జరిగే పని కాదు. -
డీఎస్సీ టీచర్లకు ‘వెబ్ ఆప్షన్స్’ ప్రారంభం
సాక్షి, అమరావతి: డీఎస్సీ–2025 ద్వారా ఎంపికైన అభ్యర్థులు జిల్లాల్లో పాఠశాలలు ఎంపిక చేసుకునేందుకు బుధవారం వెబ్ ఆప్షన్ ప్రక్రియ ప్రారంభమైంది. ప్రస్తుతం వీరికి జరుగుతున్న శిక్షణ కేంద్రాల్లోనే విద్యాశాఖాధికారులు ఇందుకు ఏర్పాట్లుచేశారు. ఈనెల 10 వరకు ఇది జరుగుతుంది. ఈ సందర్భంగా రాష్ట్రంలోని 13 ఉమ్మడి జిల్లాల్లో ఖాళీల వివరాలను ప్రకటించారు. కానీ, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న 3, 4 కేటగిరీ పాఠశాలలకు సంబంధించిన ఖాళీలను మాత్రమే చూపినట్లు తెలిసింది. ఉపాధ్యాయుల్లేని ప్రాంతాలు, సింగిల్ టీచర్ పాఠశాలలు, విద్యార్థుల సంఖ్య తగ్గుతున్న స్కూళ్లను కొత్త టీచర్లకు కేటాయిస్తున్నట్లు సమాచారం. అలాగే, జూన్లో జరిగిన ఉపాధ్యాయ బదిలీల్లో రిలీవర్ లేక అదే స్కూళ్లలో ఉండిపోయిన వారి స్థానాలను ఇక్కడ చూపడంలేదన్న ఆరోపణలూ వినిపిస్తున్నాయి. హైకోర్టు తీర్పునకు భిన్నంగా పోస్టుల భర్తీ.. ఇక డీఎస్సీ నిర్వహణ లోపభూయిష్టంగా ఉందని, మెరిట్ లిస్టు ఇవ్వకుండానే నేరుగా అభ్యర్థులను ఎంపిక చేశారని కొందరు.. రిజర్వేషన్ ప్రక్రియ సక్రమంగా చేపట్టలేదని మరికొందరు, స్పోర్ట్స్ కోటా ఎంపికలోనూ అవకతవకలు జరిగాయని ఇంకొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. అలాగే.. రెండు, మూడు పోస్టులు పొందిన వారికి తక్కువ కేటగిరీ పోస్టులు ఇవ్వడంపైనా హైకోర్టుకు ఫిర్యాదు చేశారు. దీనిపై రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం కీలకమైన తీర్పును వెలవరించింది. ఉన్నతమైన పోస్టు పొందడం అభ్యర్థి హక్కు అని, వారికి ఆయా పోస్టులు ఇవ్వాలని తేల్చిచెప్పింది. ఫిర్యాదులకు సంబంధించిన పోస్టులను మినహాయించాలని కోర్టు తీర్పునిచ్చినట్లు అభ్యర్థులు చెబుతున్నారు. అయితే, అందిన ఫిర్యాదులను గ్రీవెన్స్ ద్వారా పరిష్కరించేందుకు విద్యాశాఖ చర్యలు చేపట్టింది. ఇందుకోసం జిల్లా, జోనల్, రాష్ట్రస్థాయిలో 60 రోజుల్లో పరిష్కరిస్తామని ప్రకటించింది. కానీ, ఈ సమస్యలు పరిష్కరించకుండానే మొత్తం అన్ని పోస్టులను భర్తీచేసేందుకు ఏర్పాట్లుచేసింది. మొత్తం 15,941 పోస్టులను నింపి ఈ నెల 13 నాటికి కొత్త టీచర్లు స్కూళ్లలో చేరాలని ఆదేశించిడం గమనార్హం. మాన్యువల్ కౌన్సెలింగ్ నిర్వహించాలి.. ఇదిలా ఉంటే.. కొత్త ఉపాధ్యాయులకు ఆన్లైన్ విధానంపై పూర్తి అవగాహన ఉండదని, వారికి మాన్యువల్ కౌన్సెలింగ్ నిర్వహించాలని ఏపీటీఎఫ్ అమరావతి రాష్ట్ర అధ్యక్షుడు సీవీ ప్రసాద్ విద్యాశాఖను డిమాండ్ చేశారు. బదిలీల్లో ఎస్జీటీలకు అనుసరించిన విధానాన్నే వీరికి కూడా అమలుచేయాలన్నారు. అలాగే, బదిలీ అయ్యి రిలీవ్ కాని ఉపాధ్యాయుల సమస్య పరిష్కరించేలా ఖాళీలు చూపించాలని విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం ఎంప్లాయీస్ అసోసియేషన్ కూడా మాన్యువల్ కౌన్సెలింగ్ నిర్వహించాలని విజ్ఞప్తి చేసింది. ఒక్క కర్నూలు జిల్లాలో ఒక్కో అభ్యర్థి 1,650 ఆప్షన్స్ ఇవ్వాల్సి ఉంటుందని, దీనివల్ల అభ్యర్థులు ఇబ్బందులు ఎదుర్కొంటారని పేర్కొంది.


