రూ.360 కోట్ల భూమిని రూ.45 కోట్లకే ఎలా ఇస్తారు? | 30 acres of government land illegally sold to a real estate company at a nominal price | Sakshi
Sakshi News home page

రూ.360 కోట్ల భూమిని రూ.45 కోట్లకే ఎలా ఇస్తారు?

Oct 16 2025 5:21 AM | Updated on Oct 16 2025 5:21 AM

30 acres of government land illegally sold to a real estate company at a nominal price

రియల్‌ కంపెనీకి నామమాత్రపు ధరకు ఇవ్వడం చట్టవిరుద్ధం

సత్వా గ్రూపునకు భూ కేటాయింపులను రద్దు చేయండి

హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం

సాక్షి, అమరావతి: విశాఖపట్నం, మధురవాడలోని అత్యంత విలువైన 30 ఎకరాల ప్రభుత్వ భూమిని చట్ట విరుద్ధంగా నామమాత్రపు ధరకే రియల్‌ ఎస్టేట్‌ కంపెనీ సత్వా గ్రూపునకు కేటా­యించడాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్‌) దాఖలైంది. మార్కెట్‌లో ఎకరా రూ.12  కోట్లు ఉన్న భూమి కేవలం రూ.1.5 కోట్లకే కేటాయించారని, వీటిని రద్దు చేయాలని కోరుతూ జీవీఎంసీ కౌన్సిలర్‌ మేడపాటి వెంకటరెడ్డి ఈ పిల్‌ను దాఖలు చేశారు. 

ఈ వ్యాజ్యంపై బుధవారం హైకోర్టు విచారణ జరిపింది.  పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. సత్వా గ్రూపునకు రూ.360 కోట్ల విలువైన భూమిని రూ.45 కోట్లకే ఆ కంపెనీకి ఇచ్చేశారని తెలిపారు. ఆ భూమిలో రియల్‌ కంపెనీ ఆఫీసు కార్యాలయాలను నిర్మించి లీజుకిచ్చి సొమ్ము చేసుకుంటుందని పొన్నవోలు చెప్పారు. 

అనంత­రం  భూ కేటాయింపుల విధానాన్నే సవాలు చేస్తామని, అందుకు అనుగుణంగా ఈ వ్యాజ్యంలో సవరణలకు అనుమతివ్వాలని ధర్మాసనాన్ని కో­రా­రు. ఇందుకు ధర్మాసనం అంగీకరిస్తూ తదుపరి విచారణను వాయిదా వేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement