తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని తాడేపల్లిలోని ఆయన నివాసంలో తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కలిశారు. తన కుమారుడి వివాహ ఆహ్వాన పత్రికను ఇవ్వడానికి భట్టి విక్రమార్క ఈరోజు(మంగళవారం, మార్చి 3వ తేదీ) వైఎస్ జగన్ నివాసానికి వెళ్లారు.

దీనిలో భాగంగా తన కుటుంబ సన్నిహితుడు విక్రమార్కకు వైఎస్ జగన్ సాదర స్వాగతం పలికారు.అనంతరం తన కుమారుడి వివాహానికి సంబంధించి విషయాన్ని వైఎస్ జగన్కు తెలియజేశారు. ఈ మేరకు వివాహ ఆహ్వాన పత్రికను వైఎస్ జగన్కు అందించారు భట్టి విక్రమార్క.



