నిందితులను రోడ్లపై ఎలా పెరేడ్‌ చేయిస్తారు? | High Court orders state government and DGP | Sakshi
Sakshi News home page

నిందితులను రోడ్లపై ఎలా పెరేడ్‌ చేయిస్తారు?

Feb 5 2026 6:00 AM | Updated on Feb 5 2026 6:00 AM

High Court orders state government and DGP

నేర నిరూపణ అయ్యే వరకు నిందితులు నిరపరాధులే 

సామాన్యుల పట్ల పోలీసులు అమానవీయంగా వ్యవహరిస్తున్నారు  

నిందితుల పెరేడింగ్‌పై కౌంటర్లు వేయండి 

రాష్ట్ర ప్రభుత్వానికి, డీజీపీకి హైకోర్టు ఆదేశం 

సాక్షి, అమరావతి: పోలీసులు సామాన్య ప్రజలతో అమానవీయంగా వ్యవహరిస్తున్నారని హైకోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది. చట్ట నిబంధనలను పాటించాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని తేల్చి చెప్పింది. చట్టానికి లోబడే పోలీసులు శాంతి భద్రతలను కాపాడాల్సి ఉంటుందని చెప్పింది. వివిధ కేసుల్లో అరెస్టు చేసిన నిందితులను రోడ్లపై పెరేడ్‌ చేయిస్తూ.. ప్రింట్, ఎల్రక్టానిక్‌ మీడియా ముందు ఎందుకు ప్రవేశపెడుతున్నారని పోలీసులను నిలదీసింది. నేరం నిరూపణ అయ్యేంత వరకు నిందితులు నిరపరాధులేనని స్పష్టం చేసింది. 

నిందితులను పెరేడ్‌ చేయిస్తున్న వ్యవహారంలో రాష్ట్ర‡ ప్రభుత్వానికి, డీజీపీ, గుంటూరు, కృష్ణా, తూర్పు గోదావరి జిల్లాల ఎస్‌పీలకు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్‌లు దాఖలు చేయాలని వీరిని ఆదేశించింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ ధీరజ్‌ సింగ్‌ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్‌ చల్లా గుణరంజన్‌ ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.

వివిధ కేసుల్లో అరెస్టు చేసిన నిందితులను రోడ్లపై పెరేడ్‌ చేయిస్తూ, ప్రింట్, ఎల్రక్టానిక్‌ మీడియా ముందు ప్రవేశపెట్టడాన్ని రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించాలని కోరుతూ సొసైటీ ఫర్‌ ప్రొటెక్షన్‌ ఆఫ్‌ సివిల్‌ ప్రాపర్టీ అండ్‌ ఎని్వరాన్‌మెంటల్‌ రైట్స్‌ కృష్ణా జిల్లా అధ్యక్షుడు పరసా సురేష్‌ కుమార్‌ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్‌)పై సీజే ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement