జెడ్పీటీసీలకు గౌరవ వేతనాలు ఎప్పటిలోగా చెల్లిస్తారు? | Andhra Pradesh High Court questioned the Kadapa ZP CEO | Sakshi
Sakshi News home page

జెడ్పీటీసీలకు గౌరవ వేతనాలు ఎప్పటిలోగా చెల్లిస్తారు?

Jan 20 2026 4:12 AM | Updated on Jan 20 2026 4:12 AM

Andhra Pradesh High Court questioned the Kadapa ZP CEO

కడప జెడ్పీ సీఈవోను నిలదీసిన హైకోర్టు 

సాక్షి, అమరావతి:  వైఎస్సార్‌ కడప జిల్లాలోని జెడ్పీటీసీ సభ్యులకు గౌరవ వేతనం, రవాణా భత్యం, కరువు భత్యం వంటి బకాయిలను ఎప్పటిలోగా చెల్లిస్తారో స్పష్టంగా చెప్పాలని జెడ్పీ సీఈవోను హైకోర్టు నిలదీసింది. ఒక్కో సభ్యునికి రూ.2.10 లక్షల చొప్పున బకాయిలు చెల్లించాల్సి ఉందని, వీటిని చెల్లించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ కడప జెడ్పీటీసీ సభ్యులు ముత్యాల చెన్న­య్య, మరో 26 మంది హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై న్యాయమూర్తి జస్టిస్‌ సత్తి సుబ్బారెడ్డి సోమవారం మరోసారి విచారణ జరిపారు.

ఈ నేపథ్యంలో జెడ్పీ సీఈవో ఓ మెమోను కోర్టు ముందుంచారు. ఆ వివరాలను పరిశీలించిన న్యాయమూర్తి జెడ్పీటీసీ సభ్యులకు గౌరవ వేతనం చెల్లింపు విషయంలో పూర్తి వివరాలను తమ ముందుంచాలని సీఈవోను ఆదేశిస్తూ విచారణను వచ్చే వారానికి వాయిదా వేశారు. అంతకుముందు పిటిషనర్‌ తరఫు న్యాయవాది జడా శ్రవణ్‌కుమార్‌ వాదనలు వినిపిస్తూ.. ఎమ్మెల్యేలు, మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులకు సకాలంలో వేతనాలు అందుతున్నాయన్నారు. కానీ పిటిషనర్లకు మా­త్ర­ం గౌరవ వేతనం, ఇతర భత్యా­లను చెల్లించ­డం లేదని, ఈ విషయంలో నిర్ధిష్ట గడువు విధించాలని కోర్టును అభ్యర్థించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement