జగన్‌ విజన్‌కే బాబు సర్కార్‌ జై..! | HRC and Lokayukta are located in Kurnool | Sakshi
Sakshi News home page

జగన్‌ విజన్‌కే బాబు సర్కార్‌ జై..!

Dec 18 2025 4:33 AM | Updated on Dec 18 2025 4:33 AM

HRC and Lokayukta are located in Kurnool

కర్నూలులోనే హెచ్‌ఆర్‌సీ,లోకాయుక్త

హైకోర్టుకు తెలిపిన రాష్ట్ర ప్రభుత్వం

విజయవాడకు తరలిస్తామన్నగత వైఖరి నుంచి యూటర్న్‌

జగన్‌ ప్రభుత్వ నిర్ణయంపై గతంలో నానా యాగీ 

సాక్షి, అమరావతి: వైఎస్‌ జగన్‌ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ (హెచ్‌ఆర్‌సీ), లోకాయుక్తను కర్నూలులో ఏ­ర్పాటు చేయడంపై నానా యాగీ చేసి హైకోర్టులో పి­టిషన్‌లు దాఖలు చేయించిన టీడీపీ.. ఇప్పుడు జగన్‌ విజన్‌కే జై కొట్టింది. హెచ్‌ఆర్‌సీ, లోకాయుక్తలను విజయవాడకు తరలించాలని సూత్రప్రాయంగా నిర్ణయించామని గతంలో హైకోర్టుకు నివేదించిన చంద్రబాబు ప్రభుత్వం వాటిని కర్నూలులోనే కొనసాగిస్తామని తాజాగా హైకోర్టుకు వివరించింది. దీనిని పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు.. ప్రభుత్వ విధా­న నిర్ణయంలో తామెలా జోక్యం చేసుకోగలమని పిటిషనర్‌ను ప్రశ్నించింది. 

ఈ వ్యవహారంలో 2021­లో ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్‌ రికార్డుల్లో లేకపోవడంతో హైకోర్టు తదుపరి విచారణను వచ్చే నెలకు వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ ధీరజ్‌ సింగ్‌ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్‌ చల్లా గుణరంజన్‌ ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. లోకాయుక్త, హెచ్‌ఆర్‌సీ కార్యాల­యాలను కర్నూలులో ఏర్పాటు చేయాలన్న గత ప్రభుత్వ నిర్ణయా­న్ని సవాలు చేస్తూ తెలుగుదేశం పార్టీ నాయకులు డాక్టర్‌ మద్దిపాటి శైలజ 2021లో హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్‌) దాఖలు చేశారు. 

ఈ వ్యాజ్యం గతంలో విచారణకు వచ్చిన సందర్భంలో లోకాయుక్త, హెచ్‌ఆర్‌సీలను కర్నూలు నుంచి విజయవాడకు తరలించాలని సూ­త్రప్రా­­ంగా నిర్ణయించామని చంద్రబాబు ప్రభు­త్వం పేర్కొంది. తాజాగా ఈ వ్యాజ్యంపై బుధ­వా­రం సీజే నేతృత్వంలోని ధర్మాసనం మరోసారి విచారణ జరిపింది. ఈ సందర్భంగా ప్రభుత్వం తర­ఫు­న ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) సింగమనేని ప్రణ­తి వాదనలు వినిపిస్తూ లోకా­యు­క్త, హెచ్‌ఆర్‌సీ కా­ర్యా­లయాలను కర్నూలులోనే కొనసాగిస్తామని చెప్పా­రు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement