breaking news
Vikarabad
-
లేబర్ కోడ్లను రద్దు చేయాలి
అనంతగిరి: పెట్టుబడుదారుల ప్రయోజనాల కోసం కార్మిక వర్గాన్ని బలిచ్చే నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని పలువురు కార్మిక సంఘాల ముఖ్య నాయకులు, డిమాండ్ చేశారు. బుధవారం కార్మిక, రైతు, ప్రజ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశవ్యాప్త సమ్మెలో భాగంగా వికారాబాద్ జిల్లా కేంద్రంలో ఎమ్మార్పీ చౌరస్తా నుంచి ఆర్డిఓ కార్యాలయం వరకు భారీ ర్యాలీ ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డిఓ కార్యాలయం ఎదుట సమావేశం ఏర్పాటు చేసి పలువురు నాయకులు మాట్లాడుతూ 12గంటల పని విధానాన్ని రద్దు చేసి 8గంటలు అమలు చెయ్యాలని డిమాండ్ చేశారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను ప్రతిఘటించాలన్నారు. కార్మిక వర్గం సమరశీల పోరాటాల ద్వారా సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దు చేసి వాటి స్థానంలో నాలుగు లేబర్ కోడ్లను తీసుకువచ్చి పారిశ్రామిక సంబంధాల కోడ్, ట్రేడ్ యూనియన్లో ఉద్యోగుల కార్మిక సంఘటిత శక్తిని బలహీన పరుస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. లేబర్ కోడ్ల ప్రకారం యాజమాన్యాలు సర్వీస్ కండిషన్లు మార్చాలనుకుంటే ముందస్తు నోటీస్ ద్వారా తెలియజేయవలసిన అవసరం ఉండదని, పారిశ్రామిక సంబంధాల కోడ్ అమలయితే 300 మంది లోపు కార్మికులను ప్రభుత్వ అనుమతి లేకుండా యథేచ్ఛగా కార్మికుల్ని తొలగించుకోవచ్చనే నిబంధనలు తీసుకొచ్చారన్నారు. సామాజిక భద్రత కోడ్ అమలు వల్ల ఉద్యోగులు పొందే ఈపీఎఫ్ కాంట్రిబ్యూషన్ 12 నుంచి 10 శాతం తగ్గిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు మైపాల్, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ వెంకట్ రాములు, బీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు బి.కృష్ణయ్య, ఐఎఫ్టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు వై గీత, జిల్లా ఉపాధ్యక్షుడు గోపాల్ రెడ్డి, టీఎస్టీఎఫ్ టీచర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు వెంకటరత్నం, కేవీపీఎస్ జిల్లా అధ్యక్షుడు నవీన్ కుమార్, మహిళా సంఘం జిల్లా కార్యదర్శి అనసూయ, రైతు సంఘం జిల్లా కార్యదర్శి సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు. లేబర్ కోడ్ రద్దు కోసం నిరసన కొడంగల్ రూరల్: కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నాలు గు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని, 29కార్మిక చట్టాలను పునరుద్దరించాలని సీఐటీయూ రాష్ట్ర నాయకులు అరుణ జ్యోతి, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు బుస్స చంద్రయ్య డిమాండ్ చేశారు. బుధవారం పట్టణంలో సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మిక సంఘాల నాయకులతో భారీ ర్యాలీ నిర్వహించారు. అంబేడ్కర్ చౌరస్తాలో నిరసనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. భారత రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కుల రక్షణకు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె నిర్వహించినట్లు వారు తెలిపారు. కనీసవేతనం రూ. 26వేలు అందించాలని, కార్మిక వర్గానికి ప్రయోజనాలు చేకూరేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. వెంకటయ్య, పకిరప్ప, చంద్రకళ, కుర్మాని సాయిలు, డప్పు రాములు, రాములు, మంజుల పాల్గొన్నారు. కార్మిక సంఘాల డిమాండ్ భారీ ర్యాలీలు, నిరసనలు -
నాటిన ప్రతి మొక్కా బతకాలి
● వన మహోత్సవాన్ని పకడ్బందీగాఅమలు చేయాలి ● అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు ● కలెక్టర్ ప్రతీక్జైన్ నవాబుపేట: వన మహోత్సవంలో భాగంగా జిల్లా లో నాటిన ప్రతి మొక్కా బతకాలని కలెక్టర్ ప్రతీక్జైన్ అన్నారు. బుధవారం మండలంలోని చించల్ పేటలో మొక్కలు నాటారు. అక్నాపూర్, అత్తాపూర్ గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను ఎమ్మెల్యే కాలె యాదయ్యతో కలిసి పరిశీలించారు. కలెక్టర్కు స్వాగతం పలికేందుకు విద్యార్థులను లైన్లో నిలబెట్టటాన్ని గమనించిన ఆయన హెచ్ఎం పాండు, ఎంఈఓ అబ్దుల్ రెహమాన్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఉన్నత పాఠశాలను సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు. సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వన మహోత్సవాన్ని విజయవంతం చేయాలన్నారు. ప్రతిఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇస్తాయని తెలిపారు. మొదటి విడతలో ఇళ్లు మంజూరైన వారు పనులు ప్రారంభించి సకాలంలో పూర్తి చేసుకోవాలన్నారు. జిల్లాలో 9వేల ఇళ్లు గ్రౌండింగ్లో ఉన్నాయని పేర్కొన్నారు. వర్షాల కారణంగా ఇళ్ల నిర్మాణ పనుల్లో కొంత ఆలస్యం అవుతున్నట్లు చెప్పారు. ఇటీవల నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో జిల్లా వ్యాప్తంగా 10వేల దరఖాస్తులు వచ్చాయని, ప్రతి వారం 500 అర్జీలను పరిష్కరిస్తున్నట్లు చెప్పారు. భూ సమస్యలు ఉన్న వారు తహసీల్దార్కు దరఖాస్తు చేసుకోవాలన్నారు. పాఠశాలల్లో చేసిన అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లులు మంజూరు కావడం లేదని, దీంతో పనులు ఆగిపోయాయని ఎమ్మెల్యే యాదయ్య కలెక్టర్ దృష్టికి తెచ్చారు. స్పందించిన ఆయన త్వరలో బిల్లులు చెల్లిస్తామని తెలిపారు. బడి బయట పిల్లలు ఉండరాదన్నారు. అత్తాపూర్లో ప్రాథమిక పాఠశాల మూతపడిన విషయం తెలుసుకున్న కలెక్టర్ ఎందుకు పిల్లలను పాఠశాలకు పంపడం లేదని గ్రామస్తులను అడిగారు. పిల్లలు ప్రైవేటు స్కూళ్లకు వెళ్తున్నారని చెప్పడంతో పాఠశాల భవనాన్ని గ్రంథాలయానికి వాడుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ గీతాసింగ్ నాయక్, పీఏసీఎస్ చైర్మన్ రాంరెడ్డి, మండల ప్రత్యేకాధికారి మోహన్రెడ్డి, తహసీల్దార్ బుచ్చయ్య, ఎంపీడీఓ అనురాధ, మండల నాయకులు నాగిరెడ్డి, ప్రభాకర్, రవీందర్రెడ్డి, ఎక్బాల్, అనంతరామ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈవీఎం గోదాం పరిశీలన అనంతగిరి: వికారాబాద్ పట్టణంలోని ఈవీఎం గోదాంను కలెక్టర్ ప్రతీక్ జైన్ బుధవారం సందర్శించారు. సాధారణ పరిశీలన ప్రక్రియలో భాగంగా క్షేత్రస్థాయి సందర్శన జరిపారు. ఈ సందర్భంగా బ్యాలెట్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్లు, వీవీ ప్యాట్లు, ఇతర ఎన్నికల సామగ్రిని భద్రపరిచిన తీరును పరిశీలించారు. ఆయన వెంట అదనపు కలెక్టర్ లింగ్యానాయక్, తహసీల్దార్ లక్ష్మీనారాయణ, ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు నేమత్ హలి, సంబంధిత అధికారులు ఉన్నారు. వసతులు కల్పించండి జిల్లాలోని ప్రభుత్వ కళాశాలలో విద్యార్థులకు తాగునీరు, మరుగుదొడ్లు, లైట్లు, ఫ్యాన్లు వంటి సదుపాయాలు కల్పించాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులకు సూచించారు. బుధవారం కలెక్టరేట్ నుంచి ఎంపీడీఓలు, కళాశాలల ప్రిన్సిపాళ్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కళాశాలల్లో మరమ్మతులపై దృష్టి సారించాలన్నారు. మౌలిక వసతులు, మరమ్మతులకు ప్రతిపాదనలు పంపితే నిధులు మంజూరు చేస్తామని తెలిపారు. సమావేశంలో అసిస్టెంట్ కలెక్టర్ హర్ష చౌదరి, డీఐఓ శంకర్ నాయక్ తదితరలు పాల్గొన్నారు. 09 వీకేబీ 101: -
మంత్రి కొండా సురేఖను కలిసిన నాయకులు
కొడంగల్ రూరల్: రాష్ట్ర ప్రజల సుభిక్షంగా ఉండాలని ఈ నెల 14 నుంచి 16వ తేదీ వరకు చండీ, కుబేర, పాశుపత యాగాలు నిర్వహించనున్నట్లు డీడీఎన్ఎస్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, దౌల్తాబాద్ వాసుదేవశర్మ తెలిపారు. బుధవారం దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖను హైదరాబాద్లో కలిసి యాగాలకు రావాలని కోరారు. ఇందుకు మంత్రి సానుకూలంగా స్పందించారని సంఘం నాయకులు తెలిపారు. అలాగే పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ ఆర్.గురునాథ్రెడ్డిని కలిసి ఆహ్వానించారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర గౌరవ సలహాదారు జీ లక్ష్మీనరసయ్య శర్మ, జిల్లా అధ్యక్షుడు లోకూర్తి జయతీర్థాచారి, జ్యోషి కిట్టు స్వామి, దత్తాత్రేయరావు తదితరులు పాల్గొన్నారు. రేపు కొబ్బరి కాయల విక్రయానికి వేలం మోమిన్పేట: మండలంలోని ఏన్కతల గ్రామంలో వెలసిన శనైశ్చరస్వామి ఆలయం వద్ద ఏడాది పాటు కొబ్బరి కాయలు విక్రయించడానికి ఈ నెల 11న వేలం నిర్వహించనున్నట్లు ఆలయ ఈఓ నరేందర్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. వేలం పాటలో పాల్గొనే వారు రూ.10 వేలు డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. ఉదయం 10గంటలకు ఆలయం ప్రాంగణంలో వేలం నిర్వహిస్తామని ఆసక్తి గల వారు సకాలంలో హాజరుకావాలని ఆయన కోరారు. గురుకుల కళాశాల నుంచి విద్యార్థి అదృశ్యం కుల్కచర్ల పీఎస్లో ఫిర్యాదు కుల్కచర్ల: గిరిజన గు రుకులకళాశాలనుంచి విద్యార్థి అదృశ్యమైన ఘటన కుల్కచర్ల మండల పరిధిలో చోటు చేసుకుంది. పోలీసు లు, అధ్యాపక సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం.. బండవెల్కిచర్ల గిరిజన గురుకుల పాఠశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం (ఎంపీసీ) చదువుతున్న సందీప్(16) మంగళవారం ఉదయం 7:35 నిమిషాలకు పాఠశాల ప్రహరీ దూకి పారిపోయాడు. అటెండెన్స్ సమయంలో విద్యార్థి గైర్హాజరును గమనించిన సిబ్బంది హాస్టల్లో వెతికారు. మధ్యాహ్నం వరకూ ఆచూకీ తెలియకపోవడంతో సీసీ కెమెరాలను పరిశీలించారు. ఉదయం 7:35 నిమిషాలకు మరుగుదొడ్ల వద్ద ఉన్న ప్రహరీ వైపు వెళ్లినట్లు సీసీ కెమెరాలో రికార్డయింది. కాలేజీ ప్రిన్సిపల్ మధూసూదన్, పాఠశాల ప్రిన్సిపల్ లక్ష్మీకాంతరెడ్డి ఈ విషయాన్ని విద్యార్థుల తల్లిదండ్రులు, పోలీసులకు సమాచారం అందించారు. సందీప్ స్వగ్రామమైన మహబూబ్నగర్ జిల్లా గండీడ్ మండలం రుసుంపల్లితో పాటు బంధువుల వద్ద వెతికినా ఫలితం లేకపోవడంతో బుధవారం ఉదయం కాలేజీ ప్రిన్సిపల్ కుల్కచర్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
సాగు.. సాగదే!
ఎనిమిది మండలాల్లో వర్షాభావం.. ● మోమిన్పేట్, వికారాబాద్, మర్పల్లి, బంట్వారం, నవాబుపేట్, కులకచర్ల, తాండూరు, బషీరాబద్ మండలాల్లో 30 మి.మీ.ల నుంచి 45 మి.మీ.ల లోటు వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ ధ్రువీకరించింది. ● నైరుతి రుతు పవనాలు కారణంగా గత నెల జూన్ 10, 12, 13, 30వ తేదీల్లో వర్షాలు కురిశాయి. ● దీంతో నెల రోజుల్లో 72 మి.మీ.ల వర్షపాతం నమోదైంది. ● జూలై 1నుంచి 3వ తేదీ వరకు కురిసిన వర్షాలతో 40 మి.మీ.ల వర్షపాతం నమోదైంది. ● వ్యవసాయ అధికారులు లెక్కల ప్రకారం ఇది సాధారణం కన్నా తక్కువే. ● మరో వారం రోజులు వర్షాభావ పరిస్థితులు సంభవిస్తే రైతులు పొలాల్లో వేసుకొన్న పంటలు పూర్తిగా ఎండిపోతాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.తాండూరు: కర్షకులకు ఖరీఫ్ కష్టాలు మొదలయ్యాయి. పంటల సాగుకు అవసరమైన ఎరువులు, విత్తనాల కొతర ఒక వైపు.. సరైన వర్షాలు కురవకపోవడం మరోవైపు రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. మే నెలలో దండిచికొట్టిన వానలు జూన్, జూలైలో ముఖం చాటేశాయి. తేలికపాటి వర్షాలకు కొంతమంది రైతులు ఆరుతడి పంటలు సాగు చేశారు. వీటికి అడపాదడపా వానలు కురుస్తున్నా సీజన్ ప్రారంభమైన రోజు నుంచి ఇప్పటి వరకు ఒక్క భారీ వర్షం కురవలేదు. ● జిల్లాలోని 20 మండలాల్లో 5.63 లక్షల ఎకరాల్లో ఈసారి పంటలు సాగయ్యే అవకాశం ఉంది. ● ఇప్పటికే సగం మంది పత్తి, కంది, మొక్కజొన్న వరి సాగు చేశారు. మిగిలిన వారు వర్షాల కోసం ఎదురు చూస్తున్నారు. ● ప్రస్తుత సీజన్లో 2.58 లక్షల ఎకరాల్లో పత్తి, 1.14 లక్షల ఎకరాల్లో కంది వేశారు. ● జిల్లా వ్యాప్తంగా ఈరోజు వరకు 146.4 మిల్లీలీటర్ల వర్షపాతానికి గాను 134.2 మిల్లీమీటర్లు నమోదైంది. ● తేలికపాటి భూముల్లో 50 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైతే విత్తనాలు వేసుకునే అవకాశం ఉంది. ● నల్లరేగడి నేలల్లో 75 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైన తర్వాతే విత్తుకోవాలి. ● పెసర, మినుము తదితర స్వల్పకాలిక పంటలు 70శాతానికి పైగా సాగయ్యాయని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. దోబూచులాడుతున్న వరుణుడు ఇప్పటి వరకు కురవని భారీ వర్షం వర్షాలు లేక ఖరీఫ్ సాగుపై తీవ్ర ప్రభావం జిల్లాలో5.63 లక్షల ఎకరాలలో పంటల సాగుకు అంచనా ఈ సీజన్లో జిల్లాలో 134.2ఎంఎంల సగటు వర్షపాతం నమోదు -
జుంటివాగు పరిశీలన
బషీరాబాద్: మండలంలోని జుంటివాగును బుధవారం ఇరిగేషన్ డీఈ కృష్ణయ్య, యాలాల తహసీల్దార్ వెంకటస్వామి ఆధ్వర్యంలో రెండు శాఖల అధికారులు పరిశీలించారు. ఈ నెల 8న కబ్జా చెరలో జుంటివాగు అనే శీర్షికన సాక్షి దినపత్రికలో ప్రచురితమైన కథనానికి కలెక్టర్ స్పందించారు. ఆయన ఆదేశాలతో అధికారుల బృందం జుంటివాగును పరిశీలించింది. వాగు పొడవున 200 మీటర్ల మేర 5 మీటర్ల లోపలికి కబ్జా చేసినట్లు గుర్తించారు. పక్కనే ఉన్న పొలం యజమాని సంతోష్ కుమార్, వీణ దంపతులు చెక్డ్యామ్కు వింగ్ వాల్ కింద తాండూరు మండలం మాచనూరు రెవెన్యూ పరిధిలోకి వచ్చే సర్వే నంబర్ 39జీ 2లో 20 గుంటల ప్రభుత్వ భూమిని ఆక్రమించారని తెలిపారు. ఆ స్థలంలో ఇంటి నిర్మాణం చేపట్టినట్ల అధికారుల బృందం గుర్తించింది. అక్రమ నిర్మాణాన్ని కూల్చి వేసి స్థలాన్ని ప్రభుత్వ స్వాధీనం చేయాలని, లేకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇదిలా ఉండగా ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్యంతోనే వాగు రోజు రోజుకూ కబ్జాలకు గురై కుచించుక పోయిందని పలువురు రైతులు ఆరోపించారు. కార్యక్రమంలో ఇరిగేషన్ ఏఈ భానుప్రకాశ్ రెడ్డి, వర్క్ ఇన్స్పెక్టర్ శ్రవణ్, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
ఆ చట్టాలను రద్దు చేయాల్సిందే
● కనీస వేతన సవరణ చట్టాన్ని అమలు చేయాలి ● దేశ వ్యాప్త సమ్మెలో పాల్గొన్న కార్మికులు తాండూరు టౌన్: కేంద్ర ప్రభుత్వం కార్మికుల పట్ల అవలంబిస్తున్న తీరుకు నిరసనగా పలు కార్మిక సంఘాలు బుధవారం పట్టణంలో సమ్మె నిర్వహించారు. ఏఐటీయూసీ, సీఐటీయూ ఆధ్వర్యంలో వేర్వేరుగా మున్సిపల్ కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, పంచాయతీ కార్మికులు, మున్సిపల్ కార్మికులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం కార్మికులకు వ్యతిరేకంగా తెచ్చిన నాలుగు లేబర్ కోడ్లను, 29 కార్మిక చట్టాలను వెంటనే రద్దు చేయాలన్నారు. వీటి వల్ల కార్మికుల హక్కులకు భంగం వాటిల్లే ప్రమాదం ఉందన్నారు. దీనివల్ల 12గంటల పాటు విధులు నిర్వర్తించాల్సి వస్తుందన్నారు. సామాజిక భద్రతా పథకాలను తగ్గిస్తూ, ఏకంగా కార్మిక సంఘాలను రద్దు చేయాలనే యోచనలో కేంద్రం ఉందని ఆరోపించారు. కార్మికులకు కనీస వేతనం కింద రూ.26 వేలు చెల్లించడంతో పాటు, ఈఎస్ఐ ఆసుపత్రి ఏర్పాటు, పీఎఫ్, బీమా సౌకర్యాలను కల్పించాలన్నారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షురాలు విజయలక్ష్మి పండిట్, కార్యదర్శి రవీందర్, నాయకులు గోపాల్, మునీర్, దస్తప్ప, మీనాజుద్దీన్, దేవి, అబ్దుల్లా, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు కె.శ్రీనివాస్, మల్క య్య, కృష్ణ, బాలమణి, బేబి, భారతి, మల్లమ్మ, సుమలత, శాంత, అరుణ, శ్రీనివాస్, చందు తదితరులు పాల్గొన్నారు. -
పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి
కొడంగల్: మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని సీ్త్రనిధి జిల్లా మేనేజర్ లక్ష్మీనారాయణ, ఆర్గనైజర్ రాజేశ్వరీ అన్నారు. ఇందిరా మహిళా శక్తి విజయోత్సవ సంబరాల్లో భాగంగా బుధవారం పట్ణణంలో వెటర్నరీ సమావేశ మందిరంలో మెప్మా ఆధ్వర్యంలో మహిళా సంఘాల సభ్యులతో సమావేశం నిర్వహించారు. సంఘాల్లో లేని మహిళలను గుర్తించి వారిని కొత్త సంఘాల్లో చేర్పించాలన్నారు. ఆగిపోయిన సంఘాలను గుర్తించి వాటిని పునరుద్ధరించాలన్నారు. మహిళా వృద్ధాప్య సంఘాలను, కిషోర బాలికలసంఘాలను ఏర్పాటు చేయాలన్నారు. అన్ని సంఘాలకు బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించడం వల్ల వారు ఆర్థికాభివృద్ధి సాధంచే అవకాశం ఉంటుందన్నారు. జీవిత బీమా, ప్రమాద బీమా తదితర అంశాలపై అవగాహన కల్పించాలన్నారు. మహిళా క్యాంటిన్ ఏర్పాటుకు కృషి చేయాలన్నారు. మహిళలు పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలన్నారు. ప్రభుత్వం కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేసే దిశగా ప్రణాళికలు సిద్ధం చేసిందన్నారు. మున్సిపల్ పరిధిలో ఉన్న అన్ని గ్రామాల్లో మహిళలను స్వయం సహాయక సంఘాల్లో భాగస్వాములను చేయాలన్నారు. సమావేశంలో కొడంగల్ మున్సిపల్ మెప్మా సిబ్బంది, మహిళా సంఘాల సిబ్బంది పాల్గొన్నారు. మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకోవాలి పూడూరు: మహిళా సమాఖ్య సంఘాల ద్వారా రుణాలు తీసుకుని ఆర్థికంగా ఎదగాలని జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్ మేనేజర్ నర్సింలు అన్నారు. బుధవారం ఇందిరా మహిళా శక్తి సంబురాల్లో భాగంగా మండలంలోని మేడిపల్లికలాన్, పరిగి మండలం రూఫ్ఖాన్పేట్లో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం మహిళలకు అందిస్తున్న పథకాలపై కళాజాత బృందంతో అవగాహన కల్పించారు. అనంతరం ప్రాజె క్టు మేనేజర్ మాట్లాడుతూ.. మహిళలు సంఘటితంగా ఉండి ప్రభుత్వం అందిస్తున్న రుణాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. పెట్రోల్ బంక్ లు, ప్రై వేటు బస్సుల కొనుగోలు, క్యాంటిన్ల వంటివి ఏర్పా టు చేసుకొని ఆర్థిక ప్రగతి సాధించాలని సూచించారు. కార్యక్రమంలో ఏపీఎంలు బందయ్య, శ్రీనివాస్రెడ్డి, సీసీలు శేఖర్రెడ్డి పాల్గొన్నారు. సీ్త్రనిధి జిల్లా మేనేజర్ లక్ష్మీనారాయణ -
ఓటరు జాబితాలో తప్పులుండొద్దు
● అదనపు కలెక్టర్ సుధీర్ ● బూత్ లెవెల్ ఆఫీసర్లకు శిక్షణ అనంతగిరి: బూత్ లెవెల్ అధికారులు ప్రతి ఇంటినీ సందర్శించి ఓటర్ల వివరాలను పరిశీలించాలని, మార్పులు చేర్పులపై తగు జాగ్రత్తలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ సుధీర్ సూచించారు. బుధవారం వికారాబాద్ మండలంలోని బీఎల్ఓలకు మున్సిపల్ కార్యాలయంలో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఫారం 6, 7, 8 నిర్వహణ పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు నమోదు చేసుకోవాలని తెలిపారు. ఓటరు జాబితాలో అవసరమైన చోట పాత ఫొటోలను తొలగించి, నూతన ఫొటోలను అప్లోడ్ చేయాలన్నారు. పేర్లలో తప్పులను సవరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఫారం 6 ద్వారా కొత్త ఓటర్లు నమోదు చేయాలని, కుటుంబ సభ్యులంతా ఒకే పోలింగ్ కేంద్రంలో ఓటు వేసేలా చూడాలన్నారు. మరణించిన వారి పేర్లను తొలగించాలని ఆదేశించారు. కార్యక్రమంలో తహసీల్దార్ లక్ష్మీనారాయణ, జిల్లా మాస్టర్ ట్రైనర్, అసెంబ్లీ లెవెల్ మాస్టర్ ట్రైనర్, బూత్ లెవెల్ అధికారులు పాల్గొన్నారు. ఆధార్ నంబరు అనుసంధానం చేయాలి పరిగి: ఓటరు కార్డుకు ఆధార్ నంబరు అనుసంధానం చేయాలని వికారాబాద్ ఆర్డీఓ వాసుచంద్ర సూచించారు. బుధవారం పరిగి పట్టణంలో బీఎల్ఓలకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకునేలా బీఎల్ఓలు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో ఏఎల్ఎంటీ శ్రీనివాస్, అధికారులు పాల్గొన్నారు. -
తెలంగాణకే ఆదర్శం ఎన్కేపల్లి
బొంరాస్పేట: ఎన్కేపల్లి యావత్ తెలంగాణకే ఆదర్శంగా నిలుస్తోందని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ శేరి రాజేశ్రెడ్డి పేర్కొన్నారు. మండల పరిధిలోని ఎన్కేపల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో బుధవారం పాఠశాల విద్యాప్రగతి పట్ల విద్యార్థులు, తల్లిదండ్రులకు ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు. శ్రీబలభీమ న్యూస్ ఛానెల్, మాస్ స్వచ్ఛంద సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పలువురు ముఖ్య అతిథులు, మాట్లాడారు. డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ రవీంద్రయాదవ్, సీఐ శ్రీధర్రెడ్డి, వెంకట్రాములుగౌడ్, నర్సింలుగౌడ్, టీవీవీ రాష్ట్ర కార్యదర్శి రవీందర్గౌడ్ మాట్లాడారు. గ్రామం నుంచి ప్రైవేట్ బడులకు వెళ్లేవారు ఇక్కడ చేరడం, గురుకులాలకు ఎక్కువ మొత్తంలో ప్రవేశాలు సాధించడం, మహిళా సంఘాల చొరవ, ప్రభుత్వ బడులను కాపాడుకొంటూ విద్యాప్రగతి సాధించడంలో మండలంలోనే ప్రథమ స్థాయిలో నిలిచిందని వారు ప్రశంసించారు. విద్యార్థులకు కుటుంబ సభ్యులు సైతం జ్ఞానం అందివ్వాలని, విద్యా పర్యవేక్షణ చేయాలని ప్రధాన వక్త భాస్కరయోగి పేర్కొన్నారు. పలకల పంపిణీ పాఠశాలలోని నూతన 120మంది విద్యార్థులకు దాతల సహకారంతో ఉచితంగా పలకలు, ఐడీ కార్డులు, టై, బెల్టు, బూట్లు, బ్యాగులు, పాఠశాలకు సీసీకెమెరాలు, ఫరేడ్ డ్రమ్స్ అందజేశారు. మొక్కలు నాటిన అధికారులు కొడంగల్ ఫారెస్టు రేంజ్ అధికారి సవిత పాఠశాల ఆవరణలో మొక్కలు నాటి వనమహోత్సవం నిర్వహించారు. అడవులను కాపాడాలని గ్రామస్తులకు సూచించారు. అనంతరం మహిళా సంఘాల ప్రతినిధులకు, తల్లిదండ్రులకు జ్ఞాపికలు అందజేశారు. పూర్వ ఉపాధ్యాయులు రహీం, అలీమ్, హెచ్ఎం జ్యోతిపరమేశ్వరి దంపతులకు సన్మానించారు. ఈ కార్యక్రమాల్లో టీవీవీ జిల్లా కార్యదర్శి రవీందర్గౌడ్, ఎంఈఓలు హరిలాల్, రాంరెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు నర్సింలుగౌడ్, పీఏసీఎస్ చైర్మన్ జయకృష్ణ, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వెంకట్రాములుగౌడ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ మల్లేశం, తదితరులు పాల్గొన్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ శేరి రాజేశ్రెడ్డి -
ఎంపీ సేవలు అభినందనీయం
కుల్కచర్ల: గ్రామీణ ప్రాంత పాఠశాలలను పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రత్యేకమైన వాహనాన్ని ఏర్పాటుచేసి శుభ్రం చేయిస్తున్న చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి సేవలు అభినందనీయమని వైజీఆర్ స్వచ్ఛంద సంస్థ మండల కో ఆర్డినేటర్ రాంచంద్రయ్య పేర్కొన్నారు. బుధవారం కుల్కచర్ల మండలం ఘణపూర్ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో స్వచ్ఛత కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రతీరోజు పార్లమెంటరీ నియోజకవర్గంలోని 36 పాఠశాలలను శుభ్రం చేయనున్నట్లు చెప్పారు. విద్యార్థుల సౌకర్యార్థం పరిసరాలను శుభ్రంగా ఉంచేందుకు ఏర్పాటుచేసిన వాహనం ద్వారా స్వచ్ఛత కార్యక్రమాలు చేపడుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
కాసుల కోసం కవలల విచ్ఛిన్నం!
ఆరు నెలల గర్భిణికి అబార్షన్ ● మగ కవలలను పొట్టన పెట్టుకున్న వైనం ● ప్రైవేటు ఆస్పత్రి ఎదుట బాధితుల ఆందోళన ● తమకు తెలియకుండా గర్భస్రావం ఎలా చేశారని వైద్యుల నిలదీత ● పరిగి పీఎస్లో ఫిర్యాదు పరిగి: కాసులకు కక్కుర్తి పడి ఓ ప్రైవేటు ఆస్పత్రి నిర్వాహకులు ఆరు నెలల గర్భిణికి అబార్షన్ చేశారు. తమ అనుమతి లేకుండా గర్భస్రావం ఎలా చేస్తా రని సంబంధిత కుటుంబ సభ్యులు హాస్పిటల్ ఎదుట బుధవారం ఆందోళనకు దిగారు. ఈ ఘట న పరిగి మండలంలో చోటుచేసుకుంది. బాధితుల వివరాల ప్రకారం.. కళ్లాపూర్ తండాకు చెందిన హన్మంత్ నాయక్(24)కు గతేడాది చౌడాపూర్ మండలం, కొత్తపల్లి తండాకు చెందిన నందినితో వివాహం జరిగింది.నెల రోజుల క్రితం విద్యుత్షాక్కు గురైన హన్మంత్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈనెల 5న మృతి చెందాడు. అప్పటికే నందిని ఆరు నెలల గర్భిణి. హన్మంత్ అంత్యక్రియలు నిర్వహించిన మరుసటి రోజున ఇరు కుటుంబాలకు చెందిన వారు కూర్చుని మాట్లాడుకున్నారు. హన్మంతు ఇంటికి ఒక్కడే కొడుకు కావడంతో అతనికి వారసత్వం ఉండాలని, ఎలాంటి దుశ్చర్యలకు పాల్పడకూడదని నందినికి సూచించారు. ప్రసవం తర్వాత తమ ఆస్తులను పిల్లల పేరున చేయడంతో పాటు ఆతర్వాత నందిని ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ఆమెకు న్యాయం జరిగేలా చూస్తామని అత్తింటి వారు హామీ ఇచ్చారు. ఇదిలా ఉండగా గత సోమవారం నందిని అత్తవారి ఇంటి నుంచి పుట్టింటికి వెళ్లింది. ఆతర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ బుధవారం పరిగిలోని విజేత ఆస్పత్రిలో ఆమెకు అబార్షన్ చేయించారు. ఈ విషయం తెలుసుకున్న హన్మంతు తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఆస్పత్రికి చేరుకుని గర్భం నుంచి వెలికి తీసిన ఇద్దరు మృత మగ కవలలను చూసి గుండెలు బాదుకున్నారు. తమ అనుమతి లేకుండా అబార్షన్ ఎలా చేస్తారని వైద్యులను నిలదీశారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ఆందోళనకారులను, ఆస్పత్రి సిబ్బందిని స్టేషన్కు తరలించారు. హన్మంతు తల్లి మణెమ్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. విజేత ఆస్పత్రిలో గతంలోనూ ఈ తరహా ఘటనలు జరిగాయి. ఇక్కడ అబార్షన్లతో పాటు ప్రసవాల కోసం వచ్చిన వారికి సిజేరియన్లు చేయడం నిత్యకృత్యమని పలువురు ఆరోపించారు. ఈ విషయమై పూర్తి స్థాయి విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై ఆస్పత్రి నిర్వాహకులను వివరణ కోరే ప్రయత్నం చేయగా.. సమాధానం చెప్పకుండా ఎవరికి వారు తప్పించుకునే ప్రయత్నం చేశారు. -
ఎరువులు అందుబాటులో ఉంచండి
● జిల్లా వ్యవసాయాధికారి మోహన్రెడ్డి ● ఫెర్టిలైజర్ దుకాణాల్లో తనిఖీలు దుద్యాల్: మండలంలో సాగుకు సరిపడా ఎరువులు అందుబాటులో ఉంచాలని జిల్లా వ్యవసాయాధికారి మోహన్రెడ్డి ఫెర్టిలైజర్ దుకాణ యజమానులకు సూచించారు. బుధవారం దుద్యాల్, పోలేపల్లి గ్రామాల్లోని ఫెర్టిలైజర్ దుకాణాల్లో తనిఖీలు నిర్వహించారు. హకీంపేట్ రైతు వేదికలో కొనసాగుతున్న ఫార్మర్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భూమి ఉన్న ప్రతి రైతూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్నారు. పంటల సాగుపై సందేహాలు ఉంటే ఏఈవోను సంప్రదించాలని అన్నారు. రసాయన ఎరువులు, క్రిమి సంహారక మందులు ఎక్కువగా వాడరాదని సూచించారు. మోతాదుకు మించి వాడితే పంట ఎదుగుదల, దిగుబడిపై ప్రభావం చూపుతుందన్నారు. ప్రస్తుత సీజన్కు సరిపడా ఎరువులు అందుబాటులో ఉంచాలని ఫెర్టిలైజర్ దుకాణ యజమానులకు సూచించారు. ఆయన వెంట మండల వ్యవసాయ అధికారి నాగరాజు, ఏఈవో భావన ఉన్నారు. -
పరిహారం ఇప్పించండి సారూ
తాండూరు రూరల్: జాతీయ రహదారి నిర్మాణంతో రోడ్డుకు ఇరువైపులా ఇళ్లు కోల్పోతున్నామని, బాధితులకు ప్రభుత్వం పరిహారం అందజేయాలని గ్రామస్తులు కోరారు. బుధవారం తాండూరు మండలం కోటబాసుపల్లి గ్రామస్తులు సబ్కలెక్టర్ కార్యాలయంలో సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ..తాండూరు–చించోళి ప్రధాన రోడ్డు మార్గంలో ఎన్హెచ్ 167 జాతీయ రహదారిని నిర్మిస్తున్నారన్నారు. ఈ నిర్మాణంలో కోటబాసుపల్లి గ్రామంలో రోడ్డుకు ఇరువైపులా ఉన్న 27ఇళ్లు కొన్ని పూర్తిగా, మరికొన్ని పాక్షికంగా దెబ్బతింటున్నాయని పేర్కొన్నారు. రోడ్డువెడల్పులో ఇళ్లుపోతే ఎక్కడ నివసించాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం పరిహారం ఇస్తే మరోచోట ఇళ్లు నిర్మించుకుంటామన్నారు. కావున ప్రభుత్వం పరిహారం ఇచ్చిన తర్వాతే పనులు ప్రారంభించాలని సబ్ కలెక్టర్ను వారు కోరారు. ఈ విషయంలో కలెక్టర్తో మాట్లాడి సమస్య పరిష్కరించే విధంగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. వినతిపత్రం సమర్పించిన వారిలో మాజీ వైస్ ఎంపీపీ మొగులప్ప, మాజీ సర్పంచు కుర్వ నాగార్జున, గ్రామస్తులు రఘునాథ్రెడ్డి, ప్రవీణ్ పాల్గొన్నారు. సబ్కలెక్టర్ను కోరిన కోటబాసుపల్లి గ్రామస్తులు జాతీయ రహదారి నిర్మాణంతో ఇళ్లు కోల్పోతున్నామని ఆవేదన -
విచ్చలవిడిగా గడ్డిమందు!
దుద్యాల్: ప్రభుత్వం నిషేధించిన కలుపు నివారణ మందులను తెలిసీతెలియక కొంతమంది రైతులు విచ్చలవిడిగా వాడుతున్నారు. గుట్టు చప్పుడు కాకుండా కర్ణాటక నుంచి వీటిని దిగుమతి చేసుకుంటున్నారు. స్థానికంగా సైతం విక్రయిస్తుండటంతో పత్తి, మొక్కజొన్న, వరి, కంది తదితర పంటలు సాగు చేసిన రైతులు గడ్డిని నియంత్రించేందుకు విరివిగా నిషేధిత మందును వినియోగిస్తున్నారు. వికారాబాద్, నారాయణపేట జిల్లాలకు కర్ణాటక రాష్ట్రం సరిహద్దుగా ఉండటంతో అలవోకగా తెచ్చుకుంటున్నారు. మన జిల్లాలోని కొడంగల్, దౌల్తాబాద్, బొంరాస్పేట, దుద్యాల్, యాలాల, బషీరాబాద్, తాండూరుతోపాటు నారాయణపేట జిల్లాలోని కోస్గి, మద్దూర్, గుండుమాల్, కొత్తపల్లి, దామరగిద్ద, ఉట్కూర్, నారాయణపేట తదితర మండలాలు కర్ణాటకతో సరిహద్దును కలిగి ఉన్నాయి. గరిష్టంగా 40 కిలోమీటర్లలోపు దూరం ఉండటంతో ఇలా వెళ్లి అలా తెచ్చేస్తున్నారు. కొంతమంది దళారులు వీటిని రైతులకు తీసుకువచ్చి ఇస్తున్నారు. స్ప్రే చేసిన కొద్ది గంటల్లోనే గడ్డి పూర్తిగా మాడిపోతుండటంతో రైతులు వీటిని ఎక్కువగా వాడుతున్నారు. గడ్డి మందుతో దుష్ఫలితాలు ● గడ్డి మందును పంటల్లో పిచికారీ చేయడం ద్వారా భూమి సహజత్వాన్ని కోల్పోతుంది. ● నేలలు నిస్సారవంతంగా మారి పంటలు ఎదగవు, దిగుబడులు పూర్తిగా పడిపోతాయి. ● మందు స్ప్రే చేసిన గడ్డిని మేస్తే పశువులు, గొర్రెలు, మేకలు చనిపోయే ప్రమాదం ఉంది. ● గడ్డిమందు పిచికారీ చేసే రైతులు శ్వాసకోస వ్యాధులతో పాటు అనారోగ్యం బారిన పడే అవకాశాలు ఎక్కువ. జిల్లాలో జోరుగా నిషేధిత కలుపు మందుల వినియోగం కర్ణాటక నుంచి దిగుమతి చేసుకుంటున్న వైనం దీర్ఘకాలిక దుష్ప్రభావాలు తప్పవంటున్న పర్యావరణవేత్తలు -
మహేందర్రెడ్డి మరణం తీరని లోటు
ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి బంట్వారం: బీజేపీ సీనియర్ నాయకుడు పట్లోల్ల మహేందర్రెడ్డి అకాల మరణం పార్టీకి తీరని లోటని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి అన్నారు. కోట్పల్లి మండలం బార్వాద్కు చెందిన మహేందర్రెడ్డి గత నెల 28న విద్యుత్ షాక్తో మృతి చెందిన విషయం తెలిసిందే. బుధవారం గ్రామంలో నిర్వహించిన సంస్మరణ సభకు ఎంపీ హాజరై సంతాపం తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ రాజశేఖర్రెడ్డి, పార్టీ నాయకులు మాధవరెడ్డి, వడ్ల నందు, శివరాజ్, నరేందర్రెడ్డి, శివకుమార్, పీఏసీఎస్ చైర్మన్ రాంచంద్రారెడ్డి, బార్వాద్ మాజీ సర్పంచ్ వెంకటేష్ యాదవ్, అడ్వకేట్ ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. బాలల హక్కులను కాపాడుదాం అనంతగిరి: బాలల హక్కులను కాపాడటం మన బాధ్యత అని కలెక్టర్ ప్రతీక్జైన్ అన్నారు. బుధవారం కలెక్టరేట్ నుంచి అన్ని మండలాల ఎంపీడీఓలు, తహసీల్దార్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ భవనాల నిర్మాణానికి సరిపడా భూములను గుర్తించాలన్నారు. ప్రతి బుధ, శుక్రవారాలు ఆయా మండలాల ప్రత్యేక అధికారులు పాఠశాలలను సందర్శించాలని ఆదేశించారు. విద్యార్థులతో కలిసి భోజనం చేయాలన్నారు. చెంచు కుటుంబాలను గురించి వారికి ఇంటి స్థలం 80 చదరపు గజాలు కేటాయించాలని ఆదేశించారు. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలను చర్యలు తీసుకోవాలన్నారు. పిల్లలను పనుల్లో పెట్టుకోవడం నేరమన్నారు. కార్యక్రమంలో కార్మిక శాఖ అసిస్టెంట్ లేబర్ కమిషనర్ యాదయ్య, అదనపు కలెక్టర్లు లింగ్యానాయక్, సుధీర్, అసిస్టెంట్ కలెక్టర్ హర్ష చౌదరి, డీబ్ల్యూఓ కృష్ణవేణి, డీఈఓ రేణుకాదేవి, డీపీఓ జయసుధ, డీసీపీఓ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. నిద్రలోనే మృత్యు ఒడికి మొయినాబాద్: తలనొప్పిగా ఉందని టాబ్లెట్ వేసుకుని, కుర్చీలో కునుకు తీసిన ఓ వ్యక్తి నిద్రలోనే మరణించాడు. ఈ సంఘటన మొయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గండిపేట మండలం వట్టినాగులపల్లికి చెందిన గోలియా శ్యామ్ సుందర్సింగ్(55) నాగిరెడ్డిగూడ రెవెన్యూలోని సుజాత స్కూల్లో వాచ్మన్గా పనిచేస్తున్నాడు. బుధవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో తలనొప్పిగా ఉందని టాబ్లెట్ వేసుకుని కుర్చీలో నిద్రపోయాడు. కొంత సేపటి తర్వాత తోటి ఉద్యోగులు నిద్రలేపే ప్రయత్నం చేయగా లేవలేదు. వెంటనే భాస్కర ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. బసిరెడ్డిపల్లి వాసికి డాక్టరేట్ పట్టా పరిగి: మండలంలోని బసిరెడ్డిపల్లికి చెందిన రామచంద్రయ్య యాదవ్ డాక్టరేట్ పట్టా పొందారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో స్టాక్మార్కెట్ ప్రవర్తన, భారత దేశ వృద్ధి అనే అంశంపై పరిశోధనలు చేశారు. ప్రొఫెసర్ నకులరెడ్డి పర్యవేక్షణలో పరిశోధన సాగించారు. స్టాక్ మార్కెట్ మార్గదర్శకాలు, ఆర్థిక వృద్ధిపై నివేదికను అందజేశారు. పరిశోధనలు పూర్తి కావడంతో బుధవారం డాక్టరేట్ పట్టా పొందారు. కేసులు నమోదు చేయాలి అనంతగిరి: సర్పన్ పల్లి ప్రాజెక్ట్లో రిసార్ట్ నిర్వాహకుల నిర్లక్ష్యంతో ఇద్దరు మహిళా పర్యాటకులు మృతి చెందిన ఘటనపై నిర్వాహకులపై కేసులు నమోదు చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి విజయలక్ష్మి పండిట్, సీపీఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ రాష్ట్ర నాయకురాలు వై గీత కోరారు. బుధవారం సర్పన్పల్లి ప్రాజెక్టు పరిసరాలను సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్న రిసార్ట్లపై ప్రభుత్వ అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. రిసార్ట్ క్లోజ్డ్ అని బోర్డు పెట్టినప్పటికీ, ఎవరు మూసివేశారన్న విషయమై స్పష్టత లేదన్నారు. అనంతగిరి చుట్టూ అనుమతి లేకుండా కొనసాగుతున్న రిసార్ట్లను వెంటనే సీజ్ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఇందురుపాటి గోపాల్ రెడ్డి, బి. మల్లేష్, మాదారం వెంకటేష్, పీర్ మహమ్మద్, మునీర్ తదితరులు పాల్గొన్నారు. -
చైన్ స్నాచర్ల అరెస్ట్, రిమాండ్
నవాబుపేట: ఇద్దరు చైన్ స్నాచింగ్ దొంగలను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించిన సంఘటన బుధవారం నవాబుపేటలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..మండల పరిధిలోని ఎత్రాజ్ పల్లి గ్రామానికి చెందిన మీనపల్లి సత్యమ్మ వారం క్రితం పొలం నుంచి మధ్యాహ్న సమయంలో ఇంటికి వస్తుంది. అదే సమయంలో రాజస్థాన్కు చెందిన సేవారాం, దీపారాంలు లూనాపై ఆమె దగ్గరికి వచ్చి ఈ రోడ్డుఎక్కడికి పోతుందని మాటలు కలిపి మెడలోని (40 గుండ్లు గల) బంగారాన్ని అపహరించారు. ఈ విషయాన్ని బాధితురాలు కుటుంబ సభ్యులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను గుర్తించారు. వారు సదశివాపేట వద్ద ఉన్నారనే పక్కా సమాచారంతో అక్కడికి వెళ్లి అదుపులోకి తీసుకొని విచారణ చేశారు. తామే బంగారు గొలుసును అపహరించినట్లు వారు ఒప్పుకున్నారు. దీంతో వారిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు సీఐ వెంకట్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ అరుణ్ కుమార్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
వీఆర్ఏ వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలి
అనంతగిరి: జీవో నెంబర్ 81, 85 ప్రకారం వీఆర్ఏ వారసులకు వెంటనే ఉద్యోగాలు ఇవ్వాలని జేఏసీ జిల్లా అధ్యక్షుడు పూజారి శ్రీకాంత్ తెలిపారు. బుధవారం వీఆర్ఏ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ వంగూరి రాములు పిలుపుమేరకు వికారాబాద్ జిల్లా కేంద్రంలో వారు ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపి, కలెక్టర్ ప్రతిక్ జైన్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2020, సెప్టెంబర్ 9న గత ప్రభుత్వం అసెంబ్లీలో వీఆర్ఏలకు పే స్కేల్, వారసులకు ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించిందన్నారు. వివిధ శాఖల్లో 16,758 మందిని ఆయా శాఖల్లో సర్దుబాటు చేయగా, మిగిలిన 3,797 మంది వీఆర్ఏ వారసులకు ఉద్యోగ ఉత్తర్వులు ఇవ్వకుండా రెండు సంవత్సరాలుగా కాలయాపన చేస్తుందని మండిపడ్డారు. వీఆర్ఏ వారసులకు ఉద్యోగ ఉత్తర్వులు ఇవ్వకున్నా నేటికి మండల రెవెన్యూ శాఖలో విధులు నిర్వహిస్తున్నారని, కుటుంబ పోషణ భారంగా మారిందని ఆవేదన వ్యక్తంచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా చేపట్టే గ్రామ పరిపాలన అధికారి నియామకాల్లో వారసులకు ఉద్యోగ ఉత్తర్వులు ఇచ్చి వీఆర్ఏల కుటుంబాలను ఆదుకోవాలని కోరారు. ఈ నిరసన కార్యక్రమానికి ప్రజా సంఘాలు మద్దతుగా నిలిచాయి. ఈ కార్యక్రమంలో వీఆర్ఏ జేఏసీ ధారూరు మండల అధ్యక్షుడు సంగమేష్, మర్పల్లి అధ్యక్షుడు సంగమేశ్వర్, వికారాబాద్ మండల అధ్యక్షుడు బండకింది శ్రీనివాస్, యాలాల మండల అధ్యక్షుడు నర్సింహులు, పెద్దేముల్ మండల అధ్యక్షుడు జనార్దన్ తదితరులు పాల్గొన్నారు. జేఏసీ జిల్లా అధ్యక్షుడు శ్రీకాంత్ జిల్లా కలెక్టర్కు వినతి -
జూనియర్ కళాశాల ఏర్పాటుకు ఎల్హెచ్పీఎస్ కృషి
జిల్లా అధ్యక్షుడు సూర్యానాయక్ బొంరాస్పేట: మండలంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటుకు ఎల్హెచ్పీఎస్ కృషి చేసిందని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు సూర్యానాయక్ పేర్కొన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని జూనియర్ కళాశాలలో విద్యార్థులతో సమావేశమై మాట్లాడారు. భారత్ ముక్తి మోర్చా, ఎల్హెచ్పీఎస్ తరఫున పోరాడామన్నారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించడంలో సంఘం ముందుంటుందన్నారు. పీఆర్టీయూ సభ్యత్వ కార్డుల పంపిణీ యాలాల: ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి పీఆర్టీయూ ముందుంటుందని సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు వెంకట్రాంరెడ్డి అన్నారు. మంగళవారం ఆయన , మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కృష్ణారెడ్డి, రాములుతో కలిసి 2025–26గాను సభ్యత్వ కార్డులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు శ్రీధర్రెడ్డి, వెంకట్రెడ్డి, మహేశ్కుమార్, మొగులయ్య, కార్యదర్శి ప్రభాకర్రెడ్డి తదితరులు ఉన్నారు. నష్టపోయా న్యాయం చేయండి దోమ: నకిలీ విత్తనాలతో నష్టపోయిన తనకు న్యాయం చేయాలని దొంగఎన్కేపల్లికి చెందిన రైతు పోట్టిగారి సాయిరెడ్డి కోరారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. 2024 డిసెంబర్ 06న పరిగి పట్టణంలోని శ్రీమహేశ్వరీ ఫెర్టిలైజర్ దుకాణంలో రూ.1,300 వెచ్చించి హైబ్రిడ్ వరి విత్తనాలు (25 కేజీల బస్తా) తీసుకెళ్లి పొలంలో నాటేశామన్నారు. ఎకరాకు 30 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని యజమాని చెప్పినప్పటికీ కేవలం ఎనిమిది క్వింటాళ్లు మాత్రమే వచ్చిందని బాధితుడు ఆవేదన వ్యక్తంచేశారు. దీంతో తీవ్రంగా నష్టపోయానని తెలిపారు. ఈ విషయమై పరిగి ఏడీఏకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. ఉన్నతాధికారులు స్పందించి, తనకు న్యాయం చేయాలని కోరారు. పోతులవాగు కబ్జాను అడ్డుకోండి ధారూరు: మండల పరిధిలోని అల్లాపూర్ గ్రామ సమీపంలోని పోతులవాగును కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని పెద్దేముల్ మండలం మారేపల్లి రైతులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం ధారూరు తహసీల్దార్, ఇరిగేషన్ డీఈ రవికుమార్, కోట్పల్లి ప్రాజెక్టు కుడి కాల్వ ఏఈ మాధురీలతకు మొరపెట్టుకున్నారు. ఈ విషయమై ఇరిగేషన్ అధికారులకు విన్నవించగా పోలీసులకు ఫిర్యాదు చేసి, చేతులు దులుపుకొన్నారని తెలిపారు. వాగు కాల్వకు గ్రానైట్తో సోలింగ్ చేసి, కాల్వను చిన్నదిగా చేశారని, దీంతో కింది భాగంలోని తమ పొలాలు నీట మునిగే ప్రమా దం ఉందని ఆవేదన వ్యక్తంచేశారు. కాల్వకు రాళ్లు పేర్చడం ద్వారా పశువులు వెళ్లకుండా చేసి, మూగజీవాల దాహార్తి తీర్చుకునే అవకా శం లేకుండా చేశారని మండిపడ్డారు. వాగును కబ్జా చేసిన వారిపై వాల్టా చట్టం కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ప్లాట్ కబ్జా చేసిన వారిపై ఫిర్యాదు బంజారాహిల్స్: బోగస్ డాక్యుమెంట్లతో తన ప్లాట్ను కబ్జా చేసి, అక్రమ నిర్మాణాలు చేపట్టడానికి యత్నిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని బాధితుడు చాడ రమేష్చందర్రెడ్డి మంగళవారం ప్రజాభవన్లో నిర్వహించిన ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. బాలాపూర్ మండలం అల్మాస్గూడ వినాయకహిల్స్ సర్వేనంబర్ 94 నుంచి 97తో పాటు 103లో తనకు 300 గజాల ప్లాట్ ఉందని, ఈ ప్లాట్ను ఇద్దరు వ్యక్తులు ఫేక్ డాక్యుమెంట్లతో కబ్జా చేశారని ఆరోపించారు. ఈ విషయంపై పూర్తి ఆధారాలతో తాను మీర్పేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశానని తెలిపారు.సంబంధిత ఎస్ఐ కబ్జాదారులపై చర్యలు తీసుకోకపోగా, సివిల్ తగాదా అంటూ కేసును మూసివేశారని ఆరోపించారు. -
నిబంధనలు పాటించని క్లినిక్ల సీజ్
షాబాద్: వచ్చిరాని వైద్యం చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఆర్ఎంపీపై కఠిన చర్యలు తప్పవని డిప్యూటీ డీఎంహెచ్ఓ నాగేంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం మండల కేంద్రంలో నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న క్లినిక్లను సీజ్ చేశారు. అర్హత లేకున్న నిర్వహిస్తున్న ఆర్ఎంపీలపై చర్యలు తప్పవని మండిపడ్డారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. షాబాద్లో నిర్వహిస్తున్న క్లినిక్లపై తమకు ఫిర్యాదులు వచ్చాయన్నారు. వాటిని తనిఖీ చేసేందుకు వెళ్లగా, అప్పటికే వారు మూసివేసి వెళ్లడంతో ఉన్నతాధికారుల ఆదేశానుసారం క్లినిక్లను సీజ్ చేశామన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా క్లినిక్లు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆయన వెంట వైద్య సిబ్బంది ఉన్నారు. కఠిన చర్యలు తప్పవు డిప్యూటీ డీఎంహెచ్ఓ నాగేంద్రబాబు -
అవగాహన కల్పించండి
బంట్వారం: వయోజనులంతా ఓటు హక్కు నమోదు చేసుకునేలా అవగాహన కల్పించాలని అదనపు కలెక్టర్ సుధీర్ సూచించారు. మంగళవారం కోట్పల్లి మండలం రాంపూర్ జెడ్పీహెచ్ఎస్లో బీఎల్ఓలకు, సూపర్వైజర్లకు శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్షేత్ర స్థాయిలో ప్రతీ ఇంటిని సందర్శించి ఓటర్ల వివరాలను పరిశీలించాలన్నారు. మార్పులు, చేర్పులపై జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఓటరు జాబితాలో పాత ఫొటోలు తొలగించి కొత్త ఫోటోలు అప్లోడ్ చేయాలన్నారు. పేరులో తప్పులుంటే సవరించాలన్నారు. కుటుంబ సభ్యులంతా ఒకే పోలింగ్ కేంద్రంలో ఓటు నమోదు అయ్యేలా చూడాలన్నారు. మరణించిన వారి పేర్లను నిబంధనల ప్రకారం ఫారం–7 ద్వారా తొలగించాలన్నారు. మరణ ధ్రువీకరణ పత్రం తప్పనిసరిగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీఓ డానియల్, ఎంఈఓ చంద్రప్ప, అసెంబ్లీ లెవల్ మాస్టర్ ట్రైనర్స్, బూత్ లెవల్ అధికారులు పాల్గొన్నారు. అదనపు కలెక్టర్ సుధీర్ -
ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు కల్పించండి
ఆమనగల్లు: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని పీడీఎస్యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంతోష్ డిమాండ్ చేశారు. ఆమనగల్లు పట్టణంలోని ఎంఆర్సీ కార్యాలయంలో మంగళవారం ఎంఈఓ పాండుకు పీడీఎస్యూ నాయకులు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా సంతోష్ మాట్లాడుతూ.. ప్రభుత్వం పాఠశాలల్లో వసతులు కల్పించడంలో నిర్లక్ష్యం వహిస్తుందని ఆరోపించారు. సర్కారు బడులను బలోపేతం చేయకుండా విచ్చలవిడిగా ప్రైవేట్ పాఠశాలలకు అనుమతులు ఇస్తున్నారని విమర్శించారు. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు అనిల్, సాయి, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.పీడీఎస్యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంతోష్ -
స్వయం ఉపాధితో నిలదొక్కుకోవాలి
బొంరాస్పేట: స్వయం సహాయక సంఘాల్లోని సభ్యులు స్వయం ఉపాధితో ఆర్థికంగా నిలదొక్కుకోవాలని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ శేరి రాజేశ్రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం మండల కేంద్రంలో సెర్ప్ ఆదేశాలతో మండల మహిళా సమాఖ్య ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం మహిళా సంఘాలకు అందిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని అభివృద్ధి సాధించాలన్నారు. ఈ సందర్భంగా మహిళల ఆర్థిక, సామాజిక అభివృద్ధికి చేస్తున్న కార్యక్రమాలను చర్చించారు. బ్యాంకు రుణాలు, శ్రీనిధి, సీఐఎఫ్, చిరు వ్యాపారాలు, పాఠశాలల ఏకరూప దుస్తులు కుట్టడం, కొత్త స్వయం సహాయక సంఘాల ఏర్పాటు అంశాలపై చర్చించారు. నూతనంగా కిశోర, వృద్ధుల సంఘాలు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఏపీఎం సాయన్న, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకట్రాములుగౌడ్, నర్సింలుగౌడ్, రాంచంద్రారెడ్డి, మహిళా సమాఖ్య అధ్యక్షురాలు కవిత, కార్యదర్శి సునిత, సీసీ రాంచంద్రయ్య, గ్రామ సంఘాల అధ్యక్ష, కార్యదర్శి, కోశాధికారులు పాల్గొన్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ శేరి రాజేశ్రెడ్డి -
మాడ్గులలో ఆపరేషన్ ముస్కాన్
మాడ్గుల: బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించి బందీలుగా ఉన్న చిన్నారుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు మాడ్గుల మండలంలో సీఐ వేణుగోపాల్రావు ఆధ్వర్యంలో ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమాన్ని చేపట్టారు. మంగళవారం మండలంలో బాల కార్మికుల స్థావరాలుగా నిలిచే పరిశ్రమలు, వ్యాపార సముదాయాలు, గోదాములు, హోటళ్లు, మెకానిక్ షాపులు, ఇటుక బట్టీలు తదితర ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు. నల్లచెరువు శివారులో ఉన్న పౌల్ట్రీ ఫారంలో పని చేస్తున్న ఇద్దరు బాలికలను గుర్తించారు. యాజమాన్యంపై విచారణ జరుగుతున్నట్లు సీఐ తెలిపారు. ఖాళీ జాగా కనిపిస్తే కబ్జా! తాండూరు: మున్సిపల్ పరిధిలోని ప్రభుత్వ స్థలాలు కనిపిస్తే అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడంతో దర్జాగా కబ్జాలకు పాల్పడుతున్నారు. తాజాగా గతంలో సామూహిక మరుగుదొడ్ల కొనసాగిన స్థలాన్ని కబ్జా చేశారు. మున్సిపల్ పరిధిలోని 34వ వార్డులో మూడు దశాబ్దాల క్రితం సామూహిక మరుగుదొడ్లు నిర్మించారు. ప్రస్తుతం ప్రతీ ఇంటిలో వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకోవడంతో నాలుగేళ్ల క్రితం మున్సిపల్ కౌన్సిల్లో ఆమోదించి మరుగుదొడ్లను తొలగించారు. దీంతో ఆ స్థలంలో మూడేళ్ల క్రితం అంగన్వాడీ భవనం నిర్మించారు. చుట్టూ ప్రహరీ నిర్మించకపోవడంతో మిగిలిన స్థలాన్ని ఆక్రమించి దుకాణాన్ని నిర్మించారు. స్థలం కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. బంగారు గొలుసు చోరీ ఇబ్రహీంపట్నం: మహిళ మెడలోని గొలుసును లాక్కొని పరారైన సంఘటన ఇబ్రహీంపట్నం పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. కప్పపహాడ్ గ్రామానికి చెందిన బూడిద పద్మమ్మ ఆరుబయట నిలబడి ఇంట్లోకి వెళుతుండగా గుర్తు తెలియని వ్యక్తి ఆమె మెడలోని 4 తులాల గొలుసును లాక్కొని పరారయ్యాడు. -
విద్యాభివృద్ధిలో త ల్లిదండ్రులు కీలకం
జిల్లా విద్యాశాఖాధికారి రేణుకాదేవి తాండూరు రూరల్: విద్యార్థుల విద్యాభివృద్ధికి ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రులు సైతం బాధ్యత తీసుకోవాలని జిల్లా విద్యాశాఖాధికారి రేణుకాదేవి అన్నారు. మంగళవారం మండల పరిధిలోని గౌతపూర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల్లో హెచ్ఎం లీలావతి అధ్యక్షతన తల్లిదండ్రుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హారైన డీఈఓ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాల్లో నాణ్యమై న విద్యను అందిస్తున్నామన్నారు. విద్యార్థుల కు ఉచితంగా పాఠ్య, నోట్ పుస్తకాలు, యూనిఫాం, మధ్యాహ్న భోజనం అందుబాటులో ఉన్నాయన్నారు. ప్రతీ విద్యార్థిపై ఉపాధ్యా యులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏంఈఓ వెంకటయ్య, గ్రామస్తులు నాగప్ప, రాజప్పగౌడ్, పురుషోత్తంరెడ్డి, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. క్షయపై ఆందోళన అనవసరం ప్రోగ్రాం జిల్లా అధికారి రవీందర్యాదవ్ తాండూరు రూరల్: క్షయ వ్యాధిపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని టీబీ ప్రోగ్రాం జిల్లా అధికారి డాక్టర్ రవీందర్ యాదవ్ అన్నారు. మంగళవారం జినుగుర్తి గ్రామంలో టీబీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రవీందర్ యాదవ్ మాట్లాడుతూ.. టీబీ వ్యాధి సోకిన వారు ఆరు నెలలు క్రమం తప్పకుండా మందులు వాడితే నివారించవచ్చన్నారు. ఈ వ్యాధిపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు విస్తృతంగా ప్రచారం చేస్తున్నామన్నారు. వర్షాకాలం నేపథ్యంలో అంటువ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించా రు. కార్యక్రమంలో జినుగుర్తి పీహెచ్సీ డాక్టర్ రశీద్, ఏఎన్ఎంలు కరుణశీల, నర్మద, సుశీల, ఆశవర్కర్లు లలిత, రాములమ్మ పాల్గొన్నారు. దివ్యాంగులకు రూ.6 వేల పెన్షన్ ఇవ్వాలి వీహెచ్పీఎస్ జిల్లా అధ్యక్షుడు శ్యాంప్రసాద్ అనంతగిరి: ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం ప్రభుత్వం దివ్యాంగులకు రూ.6వేల పెన్షన్ ఇవ్వాలని వీహెచ్పీఎస్ జిల్లా అధ్యక్షుడు శ్యాంప్రసాద్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన కలెక్టర్ ప్రతీక్జైన్కు వినతిపత్రం అందజేశారు. వంద శాతం సబ్సిడీతో రుణాలు అందజేసి జీవనోపాధి కల్పించాలన్నారు. ప్రతీ దివ్యాంగుడికి రూ.50లక్షల ఆరోగ్య భద్రత కల్పించాలని కోరారు. ఫ్యూచర్సిటీతో మహర్దశ యాచారం: ఫ్యూచర్సిటీతో యాచారానికి మహర్దశ పట్టనుందని, కాంగ్రెస్ సర్కార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న విశ్వనగరం వై పే ప్రపంచ చూపు ఉందని ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి పేర్కొన్నారు. మండల పరిధిలోని కొత్తపల్లి, తక్కళ్లపల్లి, నస్దిక్సింగారం, అయ్యవారిగూడెం, యాచారం గ్రామాల్లో మంగళవారం ఆయన రూ. 2.5 కోట్ల నిధులతో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కేసీఆర్ సర్కార్ ఫార్మాసిటీ నిర్మించి ఈ ప్రాంతాన్ని సర్వనాశనం చేయాలని చూస్తే, సీఎం రేవంత్రెడ్డి ఆధ్వర్యంలో ఫ్యూచర్సిటీ నిర్మించి ప్రపంచ స్థాయి గుర్తింపు పొందేలా కృషి చేస్తున్నారని అన్నారు. అర్హులైన రైతులందరికీ రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని, రాజీపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం వ్యవసాయ మార్కె ట్ కమిటీ చైర్మన్ గురునాథ్రెడ్డి, పార్టీ సీనియర్ నేతలు ఈసీ శేఖర్గౌడ్, బిలకంటి చంద్రశేఖర్రెడ్డి, మండల అధ్యక్షుడు మస్కు నర్సింహ, యాచారం మాజీ ఎంపీపీ వెంకటేశ్వర్లు, మాజీ వైస్ ఎంపీపీలు రాంరెడ్డి, శ్రీనువాస్రెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
వైఎస్సార్ అడుగుజాడల్లో కాంగ్రెస్ పాలన
బంట్వారం: దివంగత సీఎం మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఉమ్మడి రాష్ట్రానికి అందించిన సేవలు మరువలేనివని శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ అన్నారు. మంగళవారం వైఎస్సార్ జయంతి సందర్భంగా ఆయన బంట్వారం మండల పరిషత్ కార్యాలయంలో రాజశేఖరరెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం స్పీకర్ మాట్లాడుతూ.. వైఎస్సార్ ఆశయ సాధనకు కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తోందన్నారు. రాజీవ్ ఆరోగ్య శ్రీ, 108 లాంటి ఎన్నో గొప్ప పథకాలు వైఎస్సార్ ప్రవేశపెట్టినవేనని గుర్తు చేశారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం వైఎస్సార్ అడుగుజాడల్లో పాలన కొనసాగిస్తోందన్నారు. అనంతరం ఆయన ప్రజలతో మాట్లాడి సమస్యలు తెలుసుకుని పరిష్కారం కోసం అధికారులకు సూచ నలు ఇచ్చారు. అర్హులందరికి ప్రభుత్వ పథకాలు అందిస్తామన్నారు. వన మహోత్సవంలో భాగంగా మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో మొక్క నాటి నీరు పోశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు వెంకటేశం, ఏఎంసీ చైర్మన్ మహేందర్రెడ్డి, ఎంపీడీఓ రాములు, తహసీల్దార్ విజయ్కుమార్, అధికారులు పాల్గొన్నారు. హామీల అమలుకే ‘ప్రజల వద్దకు స్పీకర్’ మర్పల్లి: ప్రజలకు ఇచ్చిన హామీల అమలు చేసేందుకు వారంలో రెండు రోజులు ప్రజల వద్దకు స్పీకర్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని శాసన సభాపతి గడ్డం ప్రసాద్కుమార్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ రాజ్ మల్లయ్య అధ్యతన ప్రజల వద్దకు స్పీకర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా స్పీకర్ ప్రజల నుంచి వినతులు స్వీకరించి సంబంధిత అధికారులకు సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఇందిరమ్మ ఇళ్లపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చాయి. మర్పల్లి జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ డిప్యూటేషన్పై వెళ్లడంతో అధ్వానంగా మారిందని ఫిర్యాదు చేశారు. ఇళ్ల స్థలాలు లేని పేదలకు గత ప్రభుత్వం నిర్మించిన 120 ఇళ్లను అర్హులకు అందజేస్తామన్నారు. గ్రామాల్లో విద్యుత్, తాగునీటి తదితర సమస్యలను పరిష్కరించాలన్నారు. అనంతరం స్పీకర్ ప్రసాద్కుమార్ మాట్లాడుతూ.. గత ప్రభుత్వం రూ.8లక్షల కోట్ల అప్పులు చేసిందని.. రాష్ట్రాదాయంలో సగం డబ్బు వారు చేసిన అప్పలకు కిస్తీలు చెల్లించాల్సి వస్తోందన్నారు. ప్రజా సంక్షేమ పథకాల అమలుకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చిత్త శుద్ధితో పని చేస్తున్నారన్నారు. అనంతరం ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ అందజేశారు. శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ మొక్కలు నాటి సంరక్షించాలి పర్యావరణ పరిరక్షణకు ప్రతీ ఒక్కరు మొక్కలు నాటాలని స్పీకర్ ప్రసాద్కుమార్ సూచించారు. తల్లిదండ్రులు, పిల్లల పేరున మొక్కలు నాటి సంరక్షించాలన్నారు. అనంతరం మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి మొక్క నాటారు. అనంతరం స్త్రీ శక్తి భవనంలో ఏర్పాటు చేసిన మహిళ సంఘాల సభ్యుల సమావేశంలో మాట్లాడుతూ.. రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పనిచేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ మహేందర్ రెడ్డి, వైస్ చైర్మన్ మల్లేశ్ యాదవ్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సురేశ్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు జగదీశ్వర్, డీసీసీ ఉపాధ్యక్షుడు రవీదర్, నాయకులు కృష్ణారెడ్డి, రాములు యాదవ్, రామేశ్వర్, దివాకర్, ప్రభాకర్, ఖలీమొద్ధీన్, శంకరయ్యగౌడ్, మండల ప్రత్యేకాధికారి కృష్ణమోహన్, తహసీల్దార్ పురుషోత్తం, ఏఓ శ్రీకాంత్, వెటర్నరీ డాక్టర్ నరేంద్రనాథ్ రెడ్డి, ఏపీఓ అంజిరెడ్డి, ఏపీఎం మధూకర్, ఐసీడీఎస్ సూపర్వైజర్ రిజ్వాన తదితరులు పాల్గొన్నారు. -
హత్య కేసులో నిందితుడికి జీవితఖైదు
ధారూరు: అదనపు కట్నం కోసం వేధించి హత్య చేసిన కేసులో నిందితునికి జీవితఖైదు, రూ.7వేల జరిమాన విధిస్తూ మంగళవారం వికారాబాద్ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ సెషన్స్జడ్జి డాక్టర్ ఎస్. శ్రీనివాస్రెడ్డి తీర్పు ఇచ్చారు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను జిల్లా ఎస్పీ నారాయణరెడ్డి విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ధారూరు మండలం అవుసుపల్లి గ్రామానికి చెందిన పిచ్చకుంట్ల నాగమణి చెల్లెలు కవితకు అదే గ్రామానికి చెందిన పిచ్చకుంట్ల చంద్రయ్యతో 2008లో వివాహమైంది. వివాహ సమయంలో తల్లిదండ్రులు నగదు రూ. లక్ష, 3 తులాల బంగారం, ఇతర వస్తువులు వరకట్నంగా ఇచ్చారు. పెళ్లైన కొద్ది రోజులకు భర్త చంద్రయ్య తాగుడుకు బానిసై కవితను మానసికంగా, శారీరకంగా వేదించేవాడు. అదనంగా రూ.50వేలు తీసుకరావాలని భార్యపై వత్తిడి తెచ్చాడు. 2012, మార్చి 3న ఓ కంపెనీలో కూలీ పని ముగించుకుని ఇంటికి వచ్చింది. తల్లిదండ్రుల నుంచి అదనపు కట్నం ఎందుకు తీసుకరాలేదని కవితను బూతులు తిడుతూ కర్రతో చితకబాదాడు. ఆమె నిత్యం పడుతున్న బాధలు భరించలేక అతని ముందే కిరోసిన్ పోసుకుని నిప్పంటించుని బయటకు పరుగుతీసింది. పక్క ఇంట్లో ఉన్న అంజిలమ్మ, లక్ష్మయ్యలు మంటలను ఆర్పెసీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కవిత మృతి చెందింది. ఈ సంఘటనపై ధారూరు పోలీసులకు ఫిర్యాదు చేయగా నిందితునిపై 498(ఎ), 302 ఐపీసీ సెక్షన్ల ప్రకారం కేసు నమోదైంది. అప్పటి డీఎస్పీ చౌడేశ్వరీ, ఎస్ఐ రమేశ్ కేసు దర్యాప్తు చేసి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. వాదోపవాదాలు విన్న జడ్జి మంగళవారం తీర్పు వెలువరించారు. జరిమాన రూ.7వేలు చెల్లించని పక్షంలో అదనంగా మరో 6 నెలల జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని తీర్పులో పేర్కొన్నారు. ఈ కేసులో నిందితునికి శిక్షపడేలా చేసిన పోలీసు అధికారులను ఎస్పీ అభినందించారు. రూ.7 వేల జరిమానా తీర్పు వివరాలు వెల్లడించిన ఎస్పీ నారాయణరెడ్డి -
ఆర్టీసీ బస్సునుంచి దింపివేత.. అంబులెన్స్ వచ్చేలోపు మృత్యువాత
కేశంపేట: చికిత్స కోసం ఆస్పత్రికి వెళ్తున్న వృద్ధురాలితో పాటు ఆమె కుటుంబ సభ్యులను ఆర్టీసీ సిబ్బంది బస్సులో నుంచి దింపేశారు. ఆతర్వాత కొద్ది నిమిషాలకే బాధితురాలు మృతిచెందింది. ఈ ఘటన మంగళవారం రంగారెడ్డి జిల్లా కొత్తూరులో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. కేశంపేటకు చెందిన నారని అనసూయమ్మ (64)కు ఇద్దరు కుమారులు, ఇద్దరు కూతుళ్లు సంతానం. భర్త రాములు మూడేళ్ల క్రితం, పెద్ద కూతురు ఎనిమిదేళ్ల క్రితం మృతిచెందారు. ప్రస్తుతం అనసూయమ్మ కేశంపేటలోనే కుమారుడి వద్ద ఉంటోంది. ఇటీవల ఆరోగ్యం బాగో లేకపోవడంతో హైదరాబాద్లోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స చేయించారు. పదిహేను రోజులుగా దగ్గు, దమ్ము అధికం కావడంతో మూడుసార్లు ఆస్పత్రికి తీసుకెళ్లారు. మరోసారి హైదరాబాద్ వెళ్లేందుకు అనసూయను తీసుకుని ఆమె కొడుకు, కోడలు మంగళవారం కేశంపేటలో ఆర్టీసీ బస్సు ఎక్కారు. బస్సు కొత్తూర్ వద్దకు రాగానే అనసూయనకు దమ్ము ఎక్కువైందని కుటుంబ సభ్యులు తెలిపారు. ఇది గమనించిన ఆర్టీసీ సిబ్బంది ముగ్గురినీ కిందకు దింపేశారు. బాధితులు 108 అంబులెన్స్కు సమాచారం ఇవ్వగా అంబులెన్స్ వచ్చే సరికే అనసూయ మృతిచెందారు. -
రోహింగ్యాలపై చర్యలు తీసుకోవాలని వినతి
బడంగ్పేట్: బాలాపూర్ మండలంలో అక్రమంగా నివసిస్తున్న రోహింగ్యాలపై చర్యలు తీసుకోవాలని మంగళవారం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్కి బీజేపీ మహేశ్వరం నియోజకవర్గం ఇన్చార్జి అందెల శ్రీరాములు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా అందెల మాట్లాడుతూ.. బాలాపూర్లో అక్రమంగా నివాసం ఉంటున్న రోహింగ్యాలు ఏళ్ల తరబడి తిష్టవేశారని అన్నారు. తనపై రెక్కీ సైతం నిర్వహించారని తెలిపారు. సానుకూలంగా స్పందించిన మంత్రి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చించి వీలైనంత త్వరగా చర్యలు తీసుకునేలా ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో పార్టీ మహేశ్వరం అసెంబ్లీ కన్వీనర్ దేవేందర్రెడ్డి, లక్ష్మణ్, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. -
ప్రమాదంలో ప్రజారోగ్యం
దుద్యాల్: మండలంలోని పలు పారిశుద్ధ్యం అధ్వానంగా మారింది. అసలే వర్షాకాలం.. అడపాదడపా కురుస్తున్న వానలతో గుంతల్లో నీరు నిలుస్తోంది. రోడ్లపై పారుతున్న మురుగుతో జనం అవస్థలు పడుతున్నారు. వీధుల్లో పరిశుభ్రత కరువైంది. దోమలు వ్యాప్తి చెంది జనానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. పంచాయతీ బోర్లు, కుళాయిల వద్ద మురుగు నీటి నిల్వతో తాగునీరు కలుషితమవుతోంది. పరిస్థితి ఇలాగే ఉంటే వ్యాధులు విజృంభించే ప్రమాదం ఉందని ప్రజలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి, గ్రామాల్లో అవగాహన కల్పించాలని కోరుతున్నారు. స్థానిక ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు నిత్యం పలు వార్డుల్లో పర్యటించేలా చర్యలు తీసుకోవాలని పేర్కొంటున్నారు. మండలంలోని దుద్యాల, హస్నాబాద్, కుదురుమల్ల, హకీంపేట, లగచర్ల, చిలుముల మైల్వార్, గౌరారం, ఈర్లపల్లి, పోలేపల్లి వంటి పెద్ద గ్రామాల్లో విషజ్వరాలు సోకకుండా పారిశుద్ధ్యం మెరుగుపర్చాలని కోరుతున్నారు. లేదంటే డెంగీ, డయేరియా వ్యాప్తిచెందే ప్రమాదం ఉందని చెబుతున్నారు. వీధుల్లో పారుతున్న మురుగు కలుషితమవుతున్న తాగునీరు పట్టించుకోని అధికారులు -
లారీ బైక్ ఢీ.. వ్యక్తి మృతి
అనంతగిరి: వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని ఎన్నెపల్లి సమీపంలో లారీ బైక్ను ఢీకొట్టిన ఘటనలో బైకిస్టు మృతి చెందిన సంఘటన మంగళవారం వికారాబాద్ పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..మున్సిపల్ పరిధిలోని మద్గుల్ చిట్టంపల్లికి చెందిన వై. యాదయ్య(29) వికారాబాద్ పట్టణంలోని మొబైల్ షాపు నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. సోమవారం రాత్రి దుకాణం మూసివేసి తన ద్విచక్ర వాహనంపై ఇంటికి బయలుదేరాడు. 10. 30గంటల ప్రాంతంలో ఎన్నెపల్లి చౌరస్తా దాటాక ఓ లారీ డ్రైవర్ రివర్స్ తీస్తున్న క్రమంలో వెనుకల గమనించకుండా అటుగా వస్తున్న యాదయ్య బైక్ను ఢీకొట్టాడు. ఈ ఘటనలో యాదయ్యకు తీవ్రగాయాలవ్వడంతో ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స అనంతరం మెరుగైన చికిత్సకోసం హైదరాబాద్ తరలిస్తుండగా తెల్లవారు జామున మృతి చెందాడు. మృతుని అన్న నర్సింలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నట్లు సీఐ భీంకుమార్ తెలిపారు. -
ఆకలి కేకలపై విచారణ
బషీరాబాద్: ప్రభుత్వ బడుల్లో మధ్యాహ్న భోజనం ఆపితే ఏజెన్సీలను రద్దు చేస్తామని బషీరాబాద్ ఎంఈఓ రాములు హెచ్చరించారు. ‘ఆకలి కేకలుశ్రీ శీర్షికతో సోమవారం సాక్షిలో ప్రచురితమైన కథనానికి డీఈఓ రేణుకాదేవి స్పందించారు. మైల్వార్ ప్రాథమిక పాఠశాలలో పిల్లల పస్తులపై విచారణ జరిపి, మధ్యాహ్న భోజనం ప్రారంభించాలని ఎంఈఓ రాములును ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం పాఠశాలకు వెళ్లిన ఎంఈఓ ప్రధానోపాధ్యాయుడు వెంకటప్ప, ఏజెన్సీ నిర్వాహకులు భువనేశ్వరి, ప్రమీల, సంగీత తదితరులతో సమావేశమయ్యారు. నాలుగు నెలలుగా బిల్లులు రాకపోవడంతోనే వంట బంద్ చేయాల్సి వచ్చిందని నిర్వాహకులు తెలిపారు. ఈ విషయమై వివరణ తీసుకోవడంతో పాటు మళ్లీ ఎప్పుడూ ఇలాంటి పొరపాటు జరగకుండా చూసుకుంటామని ఏజెన్సీ వారు రాసి ఇచ్చారని స్పష్టంచేశారు. మంగళవారం మధ్యాహ్నం 150 మంది పిల్లలకు భోజనం పెట్టించారు. మధ్యాహ్న భోజనం పునరుద్ధరణ -
ఏజెంట్లను ఏర్పాటు చేసుకోవాలి
‘స్థానిక’ ఎన్నికలకు.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక తొలిసారి చేపట్టనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు కార్యాచరణ సిద్ధమవుతోంది.8లోu9లోuకొడంగల్ రూరల్: అన్ని రాజకీయ పార్టీల నాయకులు తమ పరిధిలో బూత్ లెవల్ ఏజెంట్లను ఏర్పాటు చేసుకోవాలని అదనపు కలెక్టర్ లింగ్యానాయక్ సూచించారు. మంగళవారం ఆయన పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయంలో అన్ని పార్టీల అధ్యక్ష్య, కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ లింగ్యానాయక్ మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అన్ని పారీల్ట నాయకులు తమ పరిధిలో ప్రతీ అంశంపై సందేహాలను నివృత్తి చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ విజయకుమార్, ఎలక్షన్ డీటీ అనిత, ఆయా పార్టీల నాయకులు కృష్ణ, మాజీ సర్పంచ్ రమేశ్బాబు, ఇందనూర్ బషీర్, ఎస్బి.గుల్షన్, తలారి శేఖర్, ఎంపీటీసీ మాజీ సభ్యుడు శంకర్నాయక్ తదితరులు పాల్గొన్నారు. మౌలిక వసతులు కల్పించాలి అనంతగిరి: ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని మౌలిక వసతులు కల్పించాలని జిల్లా ఎస్సీ, ఎస్టీ, బీసీ జేఏసీ ముఖ్య నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం వారు అదనపు కలెక్టర్ లింగ్యానాయక్కు వినతిపత్రం అందజేశారు. ప్రతీ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థికి ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలన్నారు. చాలా రూట్లలో బస్సులు లేక విద్యార్థులు చదువులకు దూరమవుతున్నారన్నారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి ప్రత్యేక చొరవ తీసుకుని తగిన చర్యలు చేపట్టాలని కోరారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో రవీందర్, నర్సింలు, శేఖర్, సత్యం, రాజు, రమేశ్, నవీన్ రాథోడ్ తదితరులు ఉన్నారు. అదనపు కలెక్టర్ లింగ్యానాయక్ మధ్యాహ్న భోజనం తనిఖీ బొంరాస్పేట: మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను మంగళవారం అదనపు కలెక్టర్ లింగ్యానాయక్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును పరిశీలించారు. మెనూ ప్రకారం వంటలు చేయాలన్నారు. వర్షాకాలంలో ఎదురయ్యే కలుషిత ఆహార సమస్యలు తలెత్తకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. విద్యార్థుల సంఖ్య, మధ్యాహ్న భోజనం చేసే విద్యార్థుల సంఖ్య వివరాలు తెలుసుకున్నారు. అంతకు ముందు మండల కేంద్రంలో నిర్వహించిన బీఎల్ఓలకు నిర్వహించిన అవగాహన సమావేశాన్ని పరిశీలించారు. ఎన్నికల నిర్వహణలో పాటించాల్సిన బీఎల్ఓ విధులను వివరించారు. -
ఎన్నికల నిర్వహణపై అవగాహన పెంచుకోవాలి
కుల్కచర్ల: ఎన్నికల నిర్వహణపై సిబ్బంది పూర్తిస్థాయిలో అవగాహన పెంపొందించుకోవాలని ఆర్డీఓ వాసుచంద్ర అన్నారు. మంగళవారం చౌడాపూర్ మండల కేంద్రంలో ఎన్నికల నిర్వహణపై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామాల్లో నిర్వహించే ఎన్నికలపై అధికారులు, బూత్లెవల్ అధికారులు అన్ని విషయాలపై అవగాహన పెంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ వాహిదాఖాతుం, ఇన్చార్జి ఎంపీఓ రాజిరెడ్డి, పంచాయతీ కార్యదర్శులు, అంగన్వాడీ సిబ్బంది, జీపీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఆర్డీఓ వాసుచంద్ర -
సభ్యులకు రూ.10 లక్షల ప్రమాద బీమా
తాండూరు రూరల్: గ్రామాల్లో మహిళ సంఘాలను బలోపేతం చేయాలని అదనపు డీఆర్డీఏ నర్సింలు అన్నారు. మంగళవారం తాండూరు ఎంపీడీఓ కార్యాలయంలో మహిళ సంఘాల సభ్యులతో మహిళా శక్తి సంబురాలు నిర్వహించారు. ఈ సందర్భంగా నర్సింలు మాట్లాడుతూ.. సంఘంలో లేని మహిళలను నూతన సంఘంలో చేర్పించి అవగాహన కల్పించాలన్నారు. సంఘం సభ్యులకు రూ.10 లక్షల ప్రమాద బీమా సౌకర్యం ఉందని వివరించాలన్నారు. మహిళలకు వడ్డిలేని రుణాలు, పెట్రోల్బంక్ల ఏర్పాటు, సోలార్ విద్యుత్ ప్లాంట్, స్కూల్ యూనిఫాంలపై సమావేశంలో చర్చించారు. ఈ కార్యక్రమంలో సెర్ప్ ప్రోగ్రాం మేనేజర్ భీమయ్య, ఏపీఏం ఆనంద్, మండల మహిళా సమాఖ్య అధ్యక్షురాలు భాగ్యలక్ష్మి, కార్యదర్శి భానుప్రియ, కోశాధికారి నాగమణి, సీసీలు, వీఓఏలు, ఆయా గ్రామాల మహిళా సంఘం సభ్యులు పాల్గొన్నారు. ఆర్థికంగా ఎదగాలి దోమ: మహిళా సంఘాల సభ్యులు ఆర్థికంగా ఎదగాలని జిల్లా ప్రాజెక్ట్ అధికారి(డీపీఎం) నర్సింలు, కమలాకర్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని రైతు వేదికల ఇందిరా క్రాంతి మహిళా శక్తి సంబురాలు నిర్వహించారు. ఈ సదర్భంగా మహిళా సంఘాల సభ్యులకు, వీఓఏలకు, సీసీలకు మహిళల ఆర్థిక, సామాజిక అభివృద్ధికి దోహదపడే అంశాలను ఎంపీడీఓ గ్యామతో కలిసి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నూతన సంఘాలను ఏర్పాటుకు వీఓఏలు, సీసీలు చర్యలు తీసుకోవాలన్నారు. 15–18 సంవత్సరాల వయస్సు ఉన్న మహిళలను కిషోర బాలికల సంఘాలుగా, 60 సంవత్సరాలు దాటిన వృద్ధులను దివ్యాంగుల సంఘాలుగా బలోపేతం చేయాలన్నారు. ప్రతీ సంఘానికి లోన్లు ఇప్పించి రెగ్యులర్గా కట్టించేలా శ్రద్ద తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సీసీలు నారాయణ, జంగయ్య, నర్సింలు, లక్ష్మారెడ్డి, శ్రీశైలం, అనసూయ, సుజ్ఞాని, అంజమ్మ, అకౌంటెంట్ మంజుల పాల్గొన్నారు. అడిషనల్ డీఆర్డీఏ నర్సింలు -
‘ఆరోగ్య మహిళ’ను వినియోగించుకోవాలి
అనంతగిరి: ఆరోగ్య మహిళ కార్యక్రమాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా వైద్యాధికారిణి డాక్టర్ లలితాదేవి అన్నారు. మంగళవారం ఆమె రామయ్యగూడ, సిద్దులూర్ పీహెచ్సీని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రతీ మంగళవారం నిర్వహించే ఆరోగ్య మహిళ కార్యక్రమాన్ని, ఆస్పత్రి పరిసరాలను పరిశీలించారు. ఆస్పత్రికి వచ్చే రోగుల సంఖ్య, అందించే సేవలపై ఆరా తీశారు. అనంతరం డీఎంహెచ్ఓ మాట్లాడుతూ.. మహిళల ఆరోగ్య పరిరక్షణ కోసం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో వ్యాధి నిర్ధారణ పరీక్షలు, క్యాన్సర్ స్క్రీనింగ్, పోషకాహార లోప సమస్యలు, జననేంద్రియాలకు సంబంధించి సమస్యలు, కుంటుంబ నియంత్రణ, లైంగిక వ్యాధుల నిర్వహణ వంటి సమస్యలకు పరిష్కారం చూపేలా స్క్రీనింగ్ నిర్వహించాలన్నారు. సాధారణ వ్యాధితో ఆస్పత్రికి వచ్చే రోగులకు నాణ్యమైన సేవలు అందించడంతో పాటు అవరసరమైన రోగ నిర్ధారణ పరీక్షలు, పీహెచ్సీలో లేదా టీహబ్లో చేయించాలన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ఫార్మసీ స్టోర్లలో మందులను ఒక క్రమ పద్ధతిలో ఉంచుకోవాలన్నారు. విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లా వైద్యాధికారిణి డాక్టర్ లలితాదేవి సీజనల్ వ్యాధులపై అప్రమత్తత అవసరం బంట్వారం: సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని డీఎంహెచ్ఓ లలితాదేవి అన్నారు. మంగళవారం ఆమె కోట్పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వారానికోసారి నిర్వహించే ఆరోగ్య మహిళా కార్యక్రమంపై ఆమె డాక్టర్ మేఘనను అడిగి తెలుసుకున్నారు. 15 సంవత్సరాల నుంచి 50 ఏళ్ల లోపు మహిళలకు సంబంధించి తప్పనిసరిగా అవసరమైన వైద్య పరీక్షలు చేయాలన్నారు. వీరిలో లోపాలను గుర్తించి మెరుగైన వైద్యం అందించాలన్నారు. అనంతరం రికార్డులను పరిశీలించారు. ఆస్పత్రిలో ఏమైనా సమస్యలు ఉన్నాయా అంటూ ఆరా తీశారు. విధుల్లో నిర్లక్ష్యం వహించకూడదని సిబ్బందికి సూచించారు. తప్పనిసరిగా సమయపాలన పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ మేఘన, సీహెచ్ఓ ఖయూం వైద్య సిబ్బంది పాల్గొన్నారు. -
తారు.. బేజారు
యాచారం: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫ్యూచర్సిటీ నిర్మాణంతో యాచారం, కందుకూరు మండలాలు ఎంతో అభివృద్ధి చెందుతాయని భావించిన స్థానికులకు నిరాశ తప్పడం లేదు. రహదారులు నిర్మించక పోవడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో ఫార్మాసిటీకి భూసేకరణలో భాగంగా యాచారం–కందుకూర్ మండలాల మధ్యలో ఉన్న చిన్న రోడ్డును విస్తరించాలని సంకల్పించారు. ఈ రహదారిని వంద అడుగులకు విస్తరిస్తే ఫార్మాసిటీకి మార్గం సులువుతుందని అభిప్రాయం. అప్పట్లో 25 కిలోమీటర్ల రోడ్డుకు రూ.వంద కోట్లకు పైగా నిధులను టీజీఐఐసీ నుంచి మంజూరు చేశారు. కందుకూరు నుంచి మీరాఖాన్పేట గ్రామం సరిహద్దు వరకు రోడ్డు విస్తరణ అయింది. కానీ మండల పరిధిలోని నస్దిక్సింగారం, నందివనపర్తి, మొగుళ్లవంపు నుంచి యాచారానికి రహదారి పనులు ముందుకు కదలడం లేదు. దుమ్ము, ధూళితో నరకం మీరాఖాన్పేట గ్రామం సరిహద్దు నుంచి నస్దిక్సింగారం వరకు వంద అడుగుల రోడ్డు విస్తరణ కోసం గత నాలుగేళ్ల కింద పనులు ప్రారంభించారు. రోడ్డు వెడల్పు పనుల్లో భాగంగా ఇరువైపులా ఉన్న చెట్లను తొలగించి, రోడ్డుపై మట్టి పోశారు. కానీ పనుల్లో కదలిక లోపించింది. యాచారం–కందుకూర్ మండలాల సరిహద్దు కలిపే ఈ రోడ్డుపై నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తాయి. ఫ్యూచర్సిటీ నిర్మాణం, భూసేకరణ ప్రక్రియలో భాగంగా తరచూ రెవెన్యూ, టీజీఐఐసీ, పోలీస్ ఉన్నతాధికారులు ఈ రోడ్డు నుంచే నక్కర్తమేడిపల్లి, తాడిపర్తి, కుర్మిద్ద, నానక్నగర్ గ్రామాల్లో పర్యటిస్తారు. రోడ్డుపై పోసిన మట్టి ఎండలకు దుమ్ము లేస్తుంది. బైక్లపై వెళ్లే ప్రయాణికులకు కళ్లు, నోట్లోకి పోయి శ్వాసకోశ వ్యాధులకు గురవుతున్నారు. కొన్నిసార్లు ప్రమాదాలు సైతం సంభవిస్తున్నాయి. రోడ్డు విస్తరణలో అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. కందుకూరు మండలంలో చకచక రహదారి పనులు జరిగితే ఇక్కడ మాత్రం నత్తతో పోటీ పడుతున్నాయని స్థానికులు వాపోతున్నారు. మరోవైపు రోడ్డు విస్తరణలో భూములు కోల్పోయిన రైతులకు పరిహారం విషయంలో పెంచాలని కోరుతున్నారు. ఐదేళ్లయినా గ్రహణంవీడని ఫార్మాసిటీ రోడ్డు కందుకూరులో కళకళ యాచారంలో వెలవెల అవస్థలు పడుతున్న వాహనదారులు -
బుధవారం శ్రీ 9 శ్రీ జూలై శ్రీ 2025
8లోuవికారాబాద్: వారం రోజులుగా ఊరిస్తున్న మేఘాలు చిరు జల్లులకే పరిమితమవుతున్నాయి. మొదట్లో అడపాదడపా కురిసిన వర్షాలకు రైతులు విత్తనాలు వేసుకున్నారు. ఆ వెనువెంటనే వరుణుడు మొహం చాటేడయంతో ఆందోళన చెందుతున్నారు. సీజన్ ఆరంభంలోనే విత్తనాలు, ఎరువులు కొనుగోళ్లు చేసి ఇళ్లకు తెచ్చుకున్నారు. పూర్తి స్థాయిలో విత్తనాలు వేసేందుకు సరిపడా వర్షాల కురవడం లేదు. 60 మిల్లీ మీటర్ల వర్షపాతం కోసం రెండు నుంచి మూడు పెద్ద వర్షాలు కురిస్తేనే పూర్తి స్థాయిలో విత్తనాలు వేసుకునే అవకాశం ఉంటుందని వ్యవసాయాధికారులు పేర్కొంటున్నారు. జిల్లా వ్యాప్తంగా 5.61 లక్షల ఎకరాల్లో సాగు చేపట్టనున్నట్లు వ్యవసాయ శాఖ అంచనా వేస్తోంది. సాధారణ వర్షపాతంతో విత్తనాలు వేసేందుకు సరిపోవడం లేదని పూర్తి స్థాయిలో కురిసిన తర్వాతే విత్తుకుంటే మేలని అధికారులు సూచిస్తున్నారు. పెసర, మినుము, జొన్న వద్దు ముందుస్తుగా వర్షాలు కురిస్తే రోహిణి లేదంటే మృగశిర కార్తెలో విత్తనాలు విత్తుకుంటారు. ఈ ఏడాది మే 24న రోహిణి కార్తె ప్రారంభమైంది. జిల్లా వ్యాస్తంగా 5.61 లక్షల ఎకరాలు సాగవనుండగా ఇప్పటి వరకు 3.11లక్షల ఎకరాల్లో మాత్రమే విత్తనాలు వేశారు. ఈ సీజన్లో ప్రస్తుతం 60 శాతం విత్తనాలు వేయగా 40 శాతం రైతుల ఇళ్లలోనే మగ్గుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో పెసర, మినుము, జొన్న విత్తనాలు వేయకపోవడమే మేలని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు. కొన్ని చోట్ల మొలకలు రాకపోగా అక్కడక్కడా విత్తనాలు మొలకెత్తాయి. మరికొన్ని చోట్ల కలుపుతీతకు సిద్ధంగా ఉన్నాయి. మెజార్టీ రైతులు మొలకలు వస్తాయా రావా? అని ఆందోళన చెందుతున్నారు. న్యూస్రీల్వానాకాలం సీజన్ ప్రారంభమై నెల రోజులు దాటినా చినుకు జాడ లేదు. ముందస్తు వర్షాలు రైతును మురిపించినా ఆతర్వాత ఆకాశం వైపు చూడాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇప్పటి వరకు ఒక్క పెద్ద వాన కూడా కురువక సాగు ముందుకు కదలడం లేదు. సాగుకు సరిపడా కురవని వర్షాలు 40 శాతం విత్తనాలు ఇళ్లకే పరిమితం ప్రారంభం కాని వరినాట్లు ఆందోళనలో రైతులు వరి సాగుకు ఆందోళన గతేడాది వర్షాకాలంలో 1.30 లక్షల ఎకరాల్లో వరి సాగు చేపట్టగా.. ఈ సీజన్లో ఇప్పటి వరకు 8వేల ఎకరాల్లో నారుపోసుకున్నారు. వర్షాల జాడ లేక చెరువుల్లోకి నీరు రాలేదు. దీంతో రైతులు వరి నారుకు పోయాలా.. వద్దా అనేది తేల్చుకోలేకపోతున్నారు. బోరుబావులు ఉన్న వారు మాత్రం వరి నారు పోసుకున్నారు. వరి సాగుకు ఆందోళన గతేడాది వర్షాకాలంలో 1.30 లక్షల ఎకరాల్లో వరి సాగు చేపట్టగా.. ఈ సీజన్లో ఇప్పటి వరకు 8వేల ఎకరాల్లో నారుపోసుకున్నారు. వర్షాల జాడ లేక చెరువుల్లోకి నీరు రాలేదు. దీంతో రైతులు వరి నారుకు పోయాలా.. వద్దా అనేది తేల్చుకోలేకపోతున్నారు. బోరుబావులు ఉన్న రైతులు మాత్రం వరి నారు పోసుకున్నారు. పత్తి సాగుకే మొగ్గు జిల్లాలో 16 రకాల పంటలు సాగు చేస్తుండగా ఇందులో సింహభాగం పత్తి, కంది, మొక్కజొన్న, వరి పైర్లు వేస్తున్నారు. గతేడాది పత్తి క్వింటాల్కు రూ.8 వేలకు పైగా ధర రావడంతో రైతులు పత్తిసాగుకు మొగ్గు చూపుతున్నారు. పత్తి సాధారణ సాగు విస్తీర్ణం 2.5 లక్షల ఎకరాలు కాగా ఇప్పటికి 1,98,926 ఎకరాల్లో సాగు చేశారు. 80,428 ఎకరాల్లో కంది సాగు చేశారు. మొక్కజొన్న సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గింది. గతంలో 30–60 వేల ఎకరాల్లో సాగు చేసే మొక్కజొన్న ఇప్పటి వరకు 14,755 ఎకరాలకు మాత్రమే పరిమితమైంది. కోతుల బెడద ఎక్కువైన నేపథ్యంలో కూరగాయలు, వేరుశనగ సాగు విస్తీర్ణం మరింత తగ్గే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. నెలాఖరు వరకు ఓకే ఈ నెలాఖరు వరకు అన్ని రకాల విత్తనాలు విత్తుకోవచ్చు. ఎక్కువ శాతం పత్తి, కంది సాగుకు మొగ్గు చూపుతున్నారు. రైతులకు ఎరువులు, విత్తనాల సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకున్నాం. లోటు వర్షపాతం కారణంగా విత్తనాలు విత్తుకోవడం పూర్తవలేదు. – మోహన్రెడ్డి, జిల్లా వ్యవసాయాధికారి -
నేడు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె
తాండూరు టౌన్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక కార్యకలాపాలను నిరసిస్తూ దేశ వ్యాప్తంగా బుధవారం సార్వత్రిక సమ్మె చేయనున్నట్లు సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు కె శ్రీనివాస్, ఏఐటీయూసీ మున్సిపల్ వర్కర్స్ ప్రెసిడెంట్ నర్సిములు తెలిపారు. ఈ మేరకు మంగళవారం మున్సిపల్ కమిషనర్ విక్రమ్సింహా రెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం నాలుగు కార్మిక వ్యతిరేక చట్టాలను తెచ్చి ఇబ్బంది పెడుతుందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త జీఓలు తెచ్చి కార్మికులతో వెట్టిచాకిరీ చేయిస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 8 గంటల పనిదినాన్ని సవరిస్తూ, 10 గంటలకు పెంచుతూ జీఓ జారీ చేయడాన్ని కార్మిక లోకం తీవ్రంగా వ్యతిరేకిస్తోందన్నారు. కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి మల్కయ్య, రాములు, నరేశ్, ప్రకాశ్, అశోక్, రమేశ్ తదితరులు కమిషనర్కు వినతి పత్రం ఇచ్చిన వారిలో ఉన్నారు. పిలుపునిచ్చిన సీఐటీయూ, ఏఐటీయూసీ మున్సిపల్ కమిషనర్కు సమ్మె నోటీస్ అందజేత -
ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలి
తాండూరు రూరల్: పాఠశాలకు ఉపాధ్యాయలు సమయపాలన పాటించాలని పెద్దేముల్ ఏంఈఓ నర్సింగ్రావు అన్నారు. సోమవారం మండల పరిధిలోని బండపల్లి ప్రాథమిక పాఠశాలను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఏంఈఓ మాట్లాడుతూ.. విద్యార్థులకు అందజేసిన పాఠ్య, నోట్ పుస్తకాలు, యూనిఫాంలకు సంబంధించి ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు. అదేవిధంగా ప్రతి విద్యార్థిపై శ్రద్ధ పెట్టాలన్నారు. వర్షాకాలం సందర్భంగా మధ్యాహ్న భోజనంలో నాణ్యత పాటించాలన్నారు. ఉపాధ్యాయులు సమయపాలన పాటించకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. సందడిగా పీర్ల ఊరేగింపు దుద్యాల్: మండల పరిధిలోని కుదురుమల్లలో మొహర్రం ఊరేగింపును సోమవారం ఘనంగా నిర్వహించారు. చావిడిలో ఏర్పాటు చేసిన పీర్లను 10వ రోజు గ్రామంలో ఊరేగింపు చేపట్టారు. దీంతో గ్రామస్తులు ఊదు, బెల్లం చదివింపులు చేస్తూ మొక్కులు చెల్లించుకున్నారు. మహిళలు, యువకులు, గ్రామస్తులు ఆటపాటలతో సందడి చేశారు. మొహర్రం ఉత్సాహం బొంరాస్పేట: మండల పరిధిలోని పలు గ్రా మాల్లో సోమవారం మొహర్రం సందడి నెలకొంది. వడిచర్ల, నాగిరెడ్డిపల్లి, రేగడిమైలారం గ్రామాల్లో పీర్లను ఊరేగించి సాయంత్రం నిమజ్జనం చేశారు. చిన్నాపెద్ద ఆడిపాడారు. పరిగి తహసీల్దార్పై చర్యలకు డిమాండ్ అనంతగిరి: అక్రమాలకు పాల్పడిన పరిగి తహసీల్దార్ ఆనంద్రావుపై వెంటనే చర్యలు తీసుకోవాలని పలువురు ప్రజాసంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం వికారాబాద్లోని ఎన్టీఆర్ చౌరస్తాలో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వ భూములను అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసి అవినీతికి పాల్పడిన తహసీల్దార్పై చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం ఎందుకు తాత్సారం చేస్తోందని ప్రశ్నించారు. విచారణ పేరుతో కాలాయాపన చేయడం తగదన్నారు. ఇప్పటికై నా సంబంధిత అధికారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు బుగ్గప్ప, వెంకటయ్య, శ్రీనివాస్, చంద్రయ్య, శ్రీనివాస్నాయక్, మల్కయ్య తదితరులు పాల్గొన్నారు. నాణ్యమైన భోజనం అందించాలి మర్పల్లి: ప్రభుత్వ వసతి గృహంలో ఉండి చదువుకునే పేద విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని మర్పల్లి ఎంపీడీఓ రాజ్ మల్లయ్య సూచించారు. సోమవారం మండల పరిధిలోని పట్లూర్ ఎస్సీ బాలుర వసతి గృహాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎంతమంది విద్యార్థులు ఉన్నారని వార్డెన్ తుల్జారామ్ను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం 30 మంది విద్యార్థులు ఉన్నారని బదులిచ్చారు. అనంతరం వసతి గృహంలో ఉన్న రికార్డులను పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడి ఏవైన సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకు రావాలని సూచించారు. -
సర్కార్ బడుల బలోపేతానికి కృషి
పూడూరు: ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రతీ ఒక్కరు కృషి చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ రాజశేఖర్రెడ్డి అన్నారు. సోమవారం మండల పరిధిలోని కంకల్ ప్రభుత్వ పాఠశాలకు జిల్లా అధికార ప్రతినిధి కొండాల రవీందర్ రూ.30 వేలు వెచ్చించి సీసీ కెమెరాలను అందజేశారు. ఈ మేరకు జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్రెడ్డి సీసీ కెమెరాలను ప్రారంభించి మాట్లాడారు. ఉన్న ఊరుకు, చదువుకున్న పాఠశాలకు సేవ చేయడం అభినందనీయమన్నారు. అనంతరం ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఈశ్వరప్ప 200 రకాల పుస్తకాలను లైబ్రరీకి అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రాజు, జిల్లా కౌన్సిల్ సభ్యుడు శ్రీశైలం, జిల్లా కార్యవర్గ సభ్యుడు వెంకటయ్య, మండల ప్రధాన కార్యదర్శి కృష్ణాచారి, నాయకులు మాణిక్యం, రవి, నర్సింలు, నవీన్, వెంకటేశ్ పాల్గొన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్రెడ్డి -
మట్టి గణపతినే పూజిద్దాం
జిల్లా బీసీ సంక్షేమాధికారి ఉపేందర్ అనంతగిరి: కుమ్మరి కుల వృత్తుల వారిని ప్రోత్సహించడానికి, పర్యావరణాన్ని పరిక్షించడానికి ప్లాస్టర్ ఆఫ్ పారిస్ నిర్మూలనకు మట్టి గణపతులనే పూజించాలని జిల్లా బీసీ సంక్షేమాధికారి ఉపేందర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. మట్టి గణపతి ప్రతిమలు కావాల్సిన వారు దిగువ తెలిపిన వారిని సంప్రదించాలని ఆయన కోరారు. కొడంగల్–అంజిలయ్య (93916 45200) తాండూర్–శ్రీశైలం (96405 18846), పరిగి–శంకర్ (96760 38986) వికారాబాద్–అంజిలయ్య (99664 66982)లో సంప్రదించాలన్నారు. పోతులవాగు కబ్జాదారులపై ఫిర్యాదు ధారూరు: మండల పరిధిలోని అల్లాపూర్ సమీపంలోని పోతులవాగును కబ్జా చేసిన వ్యక్తులపై ఇరిగేషన్ ఏఈ నీరజ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కొన్నది కొంతే.. కొల్లగొట్టింది ఎంతో అనే శీర్షికన సోమవారం సాక్షిలో ప్రచురితమైన వార్తకు ఇరిగేషన్ అధికారులు స్పందించారు. వికారాబాద్ ఇరిగేషన్ డీఈ రవికుమార్తో కలిసి కబ్జాదారులైన జయలింగారెడ్డి, రసూల్ఖాన్లపై తగిన చర్య తీసుకోవాలని ఆమె ఎస్ఐ అనితను కోరింది. పోతులవాగును కబ్జాచేసి మట్టి పోసి రాళ్లతో గోడ నిర్మించి ఆక్రమించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. విచారణ జరిపి వాస్తవం మేరకు కేసు నమోదు చేస్తామని ఎస్ఐ తెలిపారు. కాగా పోతులవాగును అరకిలోమీటర్ మేరకు కబ్జా చేసి తమ పొలంలోకి కలుపుకొన్నారని రైతులు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. కలెక్టర్ ఆదేశం మేరకు నీటిపారుదలశాఖ అధికారులు పోతులవాగును, కోట్పల్లి ప్రాజెక్టు కుడి కాలువ రోడ్డును దున్నేసి కబ్జా చేసింది వాస్తమనని వారి పరిశీలనలో తేల్చారు. ప్రాథమిక విచారణ మేరకు ఇద్దరు వ్యక్తులు వాగును, కాల్వ రోడ్డును ఆక్రమించినట్లు గుర్తించారు. -
కబ్జాచెరలో జుంటివాగు
బషీరాబాద్: మండలంలోని కాశీంపూర్ శివారులో జుంటివాగు కబ్జాకు గురవుతోందని పలువురు రైతులు ఆరోపించారు. ఈ విషయాన్ని పలుమార్లు రెవెన్యూ, ఇరిగేషన్ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదని తెలిపారు. స్థానికుల వివరాల ప్రకారం.. పదేళ్ల క్రితం నగరానికి చెందిన ఓ కుటుంబం వాగు అంచున 17.13 ఎకరాల వ్యసాయ భూమి కొనుగోలు చేసింది. కొద్ది రోజులుగా వీరు సదరు భూమిని అభివృద్ధి చేస్తున్నారు. ఈ క్రమంలో తమ పొలానికి ఆనుకొని ఉన్న 200 మీటర్ల పొడవునా మట్టిపోశారు. ఈ ప్రాంతం బషీరాబాద్, యాలాల, తాండూరు మూడు మండలాలు కలిసే శివారులో ఉండటంతో అధికారులెవరూ పట్టించుకోవడం లేదు. చెక్డ్యాంకు పక్కనే బఫర్ జోన్ కిందకు వచ్చే పొలంలో గదుల నిర్మాణం చేపట్టారు. ఇందుకోసం తాండూరు మండలం గోనూరు కాగ్నా నది నుంచి అనుమతులు లేకుండా రాత్రి వేళ ఇసుక రవాణా చేస్తున్నారు. ఈ విషయమై భూ యజమానిని అడగగా తాము పదేళ్ల క్రితం పట్టా భూములను కొనుగోలు చేశామని, ఇందులో కొంత భూమి వాగులో కలిసిందని, దీన్ని సాగులోకి తెచ్చుకునేందుకు చదును చేస్తున్నామని తెలిపారు. ఈ విషయాన్ని కొంతమంది ఉద్దేశపూర్వకంగా రాద్దాంతం చేస్తున్నారని ఆరోపించారు. ● పట్టించుకోని రెవెన్యూ, ఇరిగేషన్ శాఖలు ●● ఆందోళనలో పరిసర ప్రాంత రైతులు కఠిన చర్యలు తీసుకుంటాం జుంటివాగు శిఖం భూమి కబ్జా చేసినట్లు కొంతమంది రైతులు మా దృష్టికి తెచ్చారు. ఈ భూముల వివరాలు రెవెన్యూ శాఖ వద్ద ఉన్నాయి. వాగు రికార్డులు పరిశీలించి కబ్జా చేసినట్లు తేలితే కఠిన చర్యలు తీసుకుంటాం. ప్రస్తుతం నేను సెలవులో ఉన్నా.. రెండు రోజుల్లో చెక్డ్యాం, వాగు భూమిని సర్వే చేస్తాం. – కృష్ణయ్య, డీఈ, తాండూరు -
తప్పుల్లేకుండా ఓటరు జాబితా
యాలాల: ఓటరు జాబితాలో తప్పులు లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని తాండూరు సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో బూత్ లెవెల్ అధికారుల శిక్షణ కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ప్రతి గ్రామ ఓటరు జాబితాలో ఎలాంటి తప్పులకు అవకాశం లేకుండా చూడాలన్నారు. ఇందుకుగాను ఏదైనా సలహాలు, సూచనలు అవసరమైతే వెంటనే మండల స్థాయి అధికారులను సంప్రదించాలన్నారు. ఆయన వెంట తహసీల్దార్ వెంకటస్వామి, డీటీ కిరణ్కుమార్, ఆర్ఐలు వేణు, శివచరణ్, జూనియర్ అసిస్టెంట్ విజయ్కుమార్ తదితరులు ఉన్నారు.తాండూరు సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ -
పుస్తక విజ్ఞానం.. మరింత విస్తృతం
బొంరాస్పేట: ‘పుస్తకం హస్త భూషణం’ అన్నారు విద్యావంతులైన పెద్దలు. ప్రచార, ప్రసార మాధ్య మాలు లేని కాలంలో పరిజ్ఞానాన్ని పంచిన పుస్తక ప్రపంచం మరుగున పడబోతోంది. దాన్ని దృష్టిలో ఉంచుకొని జిల్లా గ్రంథాలయ సంస్థ తిరిగి లైబ్రరీలను బలోపేతం చేయడం, పునఃప్రారంభించడం, ప్రజాపఠనాలయాలను ఏర్పాటు చేయడం వంటి కార్యక్రమాలను చేపట్టబోతోంది. జిల్లా వ్యాప్తంగా త్వరలో పుస్తక విజ్ఞానాన్ని విస్తృతం చేయబోతోంది. గ్రామీణ గ్రంథాలయాలివే.. జిల్లా వ్యాప్తంగా పుట్టపహాడ్, మరికల్, నవాబుపేటలో గ్రామీణ గ్రంథాలయాలు ఉన్నాయి. వీటి నిర్వహణ సంపూర్ణంగా జరగడానికి కృషిచేపట్టనున్నారు. పౌర పఠన మందిరాల నిర్వహణకు ప్రతినెలా దిన పత్రికలకు వెయ్యిరూపాయలు, నిర్వాహకుడికి గౌరవవేతనంగా వెయ్యి రూపాయ లు పంచాయతీల ద్వారా అందజేస్తున్నారు. మంజూరుకు సిద్ధంగా మండల పరిధిలోని రేగడిమైలారం, కొడంగల్ మండలం రుద్రారంలో విద్యావంతులు ఎక్కువ ఉన్న గ్రామాల్లో త్వరలో పబ్లిక్ రీడింగ్ రూమ్స్ ప్రారంభించేందుకు సన్నాహకాలు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా గ్రంథాలయ నిర్వాహకులు 37 పోస్టులకుగానూ 10మంది రెగ్యులర్ ఉద్యోగులున్నారు. నిర్వహణలోని ప్రజా పఠనాలయాలు దాదాపూర్, పీరంపల్లి, బార్వాడ్, కరన్కోట్, నవల్గా, నారాయణ్పూర్ గ్రామాల్లోని ప్రజా పఠనాలయాలు నిర్వహణలో ఉన్నాయి. జిల్లావ్యాప్తంగా ఉన్న లైబ్రరీలను జిల్లా చైర్మన్ శేరి రాజేశ్రెడ్డి, కార్యదర్శి సురేశ్బాబు పర్యవేక్షిస్తున్నారు. మిగిలిన వాటిని పునఃప్రారంభించేందుకు కృషిచేస్తున్నామని చెబుతున్నారు. నవంబరు 14 నుంచి 20వరకు ఏటా జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. వికారాబాద్ జిల్లా కేంద్రంలోని గ్రంథాలయానికి సాధారణంగా రోజువారీగా 250 మంది పాఠకులు వస్తున్నారు. పరిగిలో 70మంది, తాండూరులో 100, కొడంగల్ 40మంది చొప్పున జిల్లా వ్యాప్తంగా నిత్యం పెద్ద సంఖ్యలో పాఠకులు గ్రంథాలయాలను వినియోగించుకుంటున్నారు. లైబ్రరీల వివరాలు త్వరలో మరిన్ని పబ్లిక్ రీడింగ్ రూమ్స్ గ్రంథాలయాల పునఃప్రారంభానికి కసరత్తు మరో వారంలో ప్రారంభిస్తాం జిల్లా అక్షరాస్యులకు పఠనాసక్తిని పెంచాలని ప్రత్యేక కృషి చేస్తున్నాం. బసవాపూర్, రుద్రారం, రేగడిమైలారం, చౌడాపూర్, ముజాహిద్పూర్కు త్వరలోనే పబ్లిక్ రీడింగ్ రూమ్స్ మంజూరు కానున్నాయి. జీపీల పర్యవేక్షణలో కొనసాగే వీటి నిర్వహణకు రూ.2 వేలు ఖర్చు చేస్తారు. స్వయం సహాయక సంఘాల స్వచ్ఛందంగా ఆసక్తి చూపితే రూ.5 వేల వరకు అందించే అవకాశం ఉంది. – శేరి రాజేశ్రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్, వికారాబాద్ -
కరెంటు సమస్య తీర్చండి
ధారూరు: పొలాల్లో వేసిన ట్రాన్స్ఫార్మర్లు తరుచూ కాలిపోవడం, కొత్తగా అమర్చిన మోటార్లు నడవకపోవడంపై ధారూరు రైతులు సోమవారం శాసనసభ స్పీకర్ను కలిసి ఫిర్యాదు చేశారు. పదేపదే చెబుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని, ట్రాన్స్ఫార్మర్ల కెపాసిటీ పెంచి, కొత్త లైన్ వేయించాలని అభ్యర్థించారు. ఒకే లైన్లో 25 కేవీల రెండు మినీ ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేశారు. లోడ్ అధికం కావడంతో ఇవి తరచూ పాడవుతున్నాయని తెలిపారు. ఫలితంగా పంటలకు సాగునీరు సక్రమంగా అందడం లేదని చెప్పారు. రెండు మినీ ట్రాన్స్ఫార్మర్ల స్థానంలో 63 కేవీల ఒకే ట్రాన్స్ఫార్మర్ అమర్చాలని స్పీకర్కు విన్నవించారు. ప్రస్తుతం వరి సాగుకు నారు పోశామని, కరెంట్ మోటార్లు సరిగా నడవక నష్టపోవాల్సి వస్తోందని తెలిపారు. దీనిపై స్పందించిన స్పీకర్ ట్రాన్స్కో ఎస్ఈకి ఫోన్ చేసి సమస్యను పరిష్కరించాలని సూచించారు. ఎక్కువ కెపాసిటీ కలిగిన కొత్త ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. స్పీకర్ ప్రసాద్కుమార్ను కలిసిన రైతులు -
అధ్వాన రోడ్డు.. అవస్థలు చూడు
తాండూరు రూరల్: గ్రామీణ రోడ్లు అధ్వానంగా మారాయి. చిన్నపాటి వర్షానికి రహదారులన్నీ గుంతలమయమయ్యాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక రాత్రిపూట గోతులు కనిపించకపోవడంతో ప్రమాదాలు సైతం చోటు చేసుకుంటున్నాయి. రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసినా అధికారులు మాత్రం పనులు ప్రారంభించడం లేదని తాండూరు మండలవాసులు ఆరోపిస్తున్నారు. కనీసం గుంతలను సైతం పూడ్చాలని ఆయా గ్రామస్తులు కోరుతున్నారు. పెద్ద గుంతలతో ఇబ్బంది మండలంలోని సంగెంకలాన్ గ్రామం తాండూరు పట్టణానికి 18 కిలో మీటర్లు దూరంలో ఉంది. తెలంగాణ–కర్ణాటక సరిహద్దులో ఉంటుంది. ప్రధానంగా గ్రామస్తులు వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నారు. సంగెంకలాన్ నుంచి మల్కాపూర్ మీదుగా ప్రధానరోడ్డు తాండూరు–చించోళి మార్గం ద్వారా నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు. మల్కాపూర్ గేటు నుంచి సంగెంకలాన్ గ్రామానికి 5 కిలో మీటర్ల దూరం ఉంది. ప్రస్తుతం ఆ రహదారి పూర్తి గా ధ్వంసమైంది. పెద్ద పెద్ద గుంతలు ఏర్పడి వాహనాల రాకపోకలకు తీవ్ర ఆటంకం కలిగిస్తోంది. చిన్నపాటి వర్షానికే బురదమయంగా మారుతోంది. దీంతో ద్విచక్ర వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. వినతిపత్రం అందజేత సంగెంకలాన్కు వెంటనే రోడ్డు పనులు ప్రారంభించాలని ఆ గ్రామానికి చెందిన బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు కాళ్ల సంజీవ్రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం ఆర్అండ్బీ కార్యాలయంలో ఏఈ శ్రవణ్కు వినతిపత్రం అందజేశారు. గుంతలమయమైన రోడ్డుతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. అధికారులు స్పందించి రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని కోరారు. నిధులున్నా ప్రారంభం కాని పనులు ఇబ్బందులు పడుతున్న సంగెంకలాన్ గ్రామస్తులు త్వరగా పూర్తి చేయాలని బీజేపీ నేతల వినతి త్వరలో పనులు ప్రారంభం మల్కాపూర్ నుంచి సంగెంకలాన్ గ్రామానికి బీటీ రోడ్డు రెన్యూవల్కు ప్రభుత్వం రూ.1.72 కోట్ల నిధులు మంజూరు చేసింది. టెండర్ ప్రక్రియ కూడా పూర్తయింది. ఎస్ఎస్ఆర్ కంపెనీ కాంట్రాక్టర్ పనులు దక్కించుకున్నారు. కాంట్రాక్టర్ను పిలిచి మాట్లాడాను. వారం రోజుల్లో రోడ్డు పనులు ప్రారంభిస్తారు. – శ్రవణ్, ఏఈ, ఆర్అండ్బీ శాఖ, తాండూరు -
పని గంటలు తగ్గించాలి
అనంతగిరి: రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీఓ నంబర్ 282ను వెంటనే వెనక్కి తీసుకోవాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం ఎన్టీఆర్ చౌరస్తాలో సీఐటీయూ ఽఆధ్వర్యంలో జీవో కాపీలను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఓ వైపు కార్మిక సంఘాలు జూలై 9న సార్వత్రిక సమ్మెకు సిద్ధమైతే రేవంత్రెడ్డి సర్కార్ జీవోలు తీసుకురావడం ఎంతవరకు సమంజసమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బీజేపీ అడుగుజాడల్లో నడుస్తుందా అని మండిపడ్డారు. ఓవైపు పని గంటలు తగ్గించాలని ఉద్యమిస్తుంటే పనిగంటలు పెంచడం సరైంది కాదన్నారు. కేంద్రం కార్మిక వ్యతిరేక చట్టాలను వెంటనే రద్దు చేయాలన్నారు. పాశమైలారంలో జరిగిన దుర్ఘటన విషయంలో ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అందలేదన్నారు. కార్యక్రమంలో ఆశవర్కర్ల యూనియన్ నాయకులు మంగమ్మ, ఉమాదేవి, చంద్రకళ, మాణెమ్మ, సుజాత, బుచ్చిరెడ్డి, మల్లేశం, వెంకటయ్య, పద్మమ్మ, అరుణ పాల్గొన్నారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి రామకృష్ణ -
ఫిర్యాదు చేసేందుకు వచ్చిన వ్యక్తి మృతి
దౌల్తాబాద్: పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు వచ్చిన వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన సోమవారం మండల కేంద్రంలో చోటు చేసుకుంది. ఎస్ఐ రవిగౌడ్ తెలిపిన ప్రకారం.. మండల పరిధిలోని తిమ్మాయిపల్లికి చెందిన నర్సప్ప(48), భార్య లక్ష్మిపై గ్రామానికి చెందిన వైరివర్గం దాడి చేసింది. ఈ మేరకు దంపతులిద్దరూ ఘటన పై ఫిర్యాదు చేసేందుకు ఠాణాకు చేరుకున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసి బయట కూర్చున్నారు. ఛాతిలో నొప్పి వస్తోందని పడుకున్నాడు. భార్య ఎంత పిలిచినా స్పందన లేకపోవడంతో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. విషయం తెలసుకున్న పోలీసులు మృతదేహాన్ని కొడంగల్ ఆస్పత్రికి తరలించారు. ఇరువర్గాలను పిలిచి మాట్లాడుదామనే లోపు ఈ ఘటన చోటు చేసుకుందని.. కేసు దర్యాప్తు చేపట్టామని పోలీసులు తెలిపారు. -
ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలి
అనంతగిరి: పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షకార్యదర్శులు రాజు, అక్బర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం వికారాబాద్ పట్టణంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రైవేట్ విద్యా సంస్థల యాజమాన్యాలు విద్యార్థులను ఇబ్బంది పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 18 నెలలుగా ప్రభుత్వం పట్టించుకోకుండా వ్యవహరించడం తగదన్నారు. అక్రమ అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరన్నారు. కాంగ్రెస్ పాలనలో విద్యావ్యవస్థ గాడి తప్పుతోందన్నారు. ప్రభుత్వం వెంటనే విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలన్నారు. లేదంటే రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. అనంతరం పోలీసులు నాయకులను అరెస్టు చేసి ఠాణాకు తరలించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ ఉపాధ్యక్షుడు తేజ, జిల్లా నాయకులు పవన్, అభిషేక్, సిద్ధార్థ, కార్తీక్, బద్రీనాథ్, ఫైజల్, చరణ్ తదితరులు పాల్గొన్నారు.ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు రాజు -
చండీయాగాన్ని జయప్రదం చేయండి
పరిగి: రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి నగరంలోని తుల్జాభావన్ ధర్మశాలలో నిర్వహించనున్న పంచకుండాత్మక చండీయాగం, కుబేరపాశుపత యాగాలను జయప్రదం చేయాలని దూపదీప నైవేద్య అర్చక సంఘం జిల్లా అధ్యక్షుడు లోకూర్తి జయతీర్థచారి కోరారు. సోమవారం పట్టణ కేంద్రంలోని శ్రీ లక్ష్మీవేంకటేశ్వరస్వామి ఆలయ ఆవరణలో జిల్లా డీడీఎన్ఎస్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈనెల 14, 15, 16 తేదీల్లో డీడీఎన్ఎస్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వాసుదేవశర్మ ఆధ్వర్యంలో చండీయాగం నిర్వహించనున్నట్టు తెలిపారు. అర్చకులు నియమ నిబంధనలు పాటిస్తూ దేవాలయాల్లో దూప దీప నైవేద్యాలను సమర్పిస్తూ ప్రజలకు తీర్థప్రసాదాలను అందించాలని సూచించారు. కార్యక్రమంలో సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు కల్యాణ్రావు, కార్యదర్శి శ్రీకాంత్, ఉపాధ్యక్షుడు జగదీశ్వర్, సభ్యులు శివానందం, అఖిలేష్, నటరాజేశ్వర్, సత్యనారాయణరావు తదితరులు పాల్గొన్నారు. డీడీఎన్ఎస్ జిల్లా అధ్యక్షుడు జయతీర్థ చారి -
ఎనికేపల్లిలో ఉద్రిక్తత
● గోశాల పనులకు ఎమ్మెల్యే కాలె యాదయ్య భూమిపూజ ● పరిహారం తేల్చకుండా ఎలా చేస్తారని చుట్టుముట్టిన రైతులు ● పనులు చేపట్టేందుకు వెళ్లిన జేసీబీని అడ్డుకున్న వైనం ● లాఠీలకు పనిచెప్పిన పోలీసులు.. ఇద్దరికి స్వల్ప గాయాలు మొయినాబాద్: గోశాలకు కేటాయించిన ఎనికేపల్లి భూముల వద్ద సోమవారం ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఉదయం 7.30 గంటలకు చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, ఆర్డీఓ చంద్రకళ, తహసీల్దార్ గౌతమ్కుమార్ భారీ పోలీసు బందోబస్తు మధ్య అక్కడికి చేరుకున్నారు. గోశాల ఏర్పాటుకోసం భూమి పూజ చేశారు. అంతలోనే రైతులు అక్కడికి చేరుకుని ఎమ్మెల్యేను చుట్టుముట్టారు. పరిహారం విషయం తేల్చకుండా పనులు ఎలా మొదలు పెడతారని నిలదీశారు. పరిస్థితి చేజారి పోతుందని గమనించిన పోలీసులు వలయంగా ఏర్పడి ఎమ్మెల్యేను కారులో ఎక్కించి అక్కడి నుంచి పంపించారు. తప్పుదోవ పట్టించారు అధికారులు, పోలీసులు తమను తప్పుదోవ పట్టించారని రైతులు ఆరోపించారు. ఉదయం 8.30 గంటలకు ఎమ్మెల్యే వచ్చి తమతో మాట్లాడతారని అధికారులు సమాచారం ఇచ్చారని, కానీ 7.30 గంటలకే వచ్చి భూమి పూజ చేశారన్నారు. గ్రామం నుంచి భూముల వద్దకు వెళ్తున్న తమను పోలీసులు అడ్డుకున్నారని.. ఎమ్మెల్యే భూమి పూజ పూర్తయిన తరువాత పంపారన్నారు. లాఠీ ఝలిపించిన పోలీసులు ఎమ్మెల్యే యాదయ్య వెళ్లిపోయిన తరువాత రైతులు అక్కడే బైఠాయించి ఆందోళన చేశారు. ఎమ్మెల్యేకు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ క్రమంలో భూములను చదును చేసేందుకు జేసీబీ అక్కడికి రాగా రైతులంతా అడ్డుకున్నారు. దీంతో పోలీసులు లాఠీలు ఝులిపించారు. లాఠీ దెబ్బలకు ఓ మహిళ చెయ్యికి గాయాలుకాగా, మరొకరికి వీపులో వాతలు వచ్చాయి. రైతులు రాత్రి వరకు అక్కడే బైఠాయించారు. ఖాళీ భూములు ఇవ్వాలిప్రభుత్వం ఏర్పాటు చేసే గోశాలకు ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూములను ఇవ్వాలని మాజీ ఎమ్మెల్యే కేఎస్రత్నం అన్నారు. ఆందోళన చేస్తున్న రైతుల వద్దకు వెళ్లి మద్దతు తెలిపారు. మండలంలోని ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూములు చాలా ఉన్నాయని, రైతులు సాగుచేసుకొనే భూములను తీసుకోవడం సరికాదన్నారు. చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి, సీఎం రేవంత్రెడ్డిని ఈ నెల 13న కలసి మాట్లాడటానికి సమయం తీసుకున్నారని.. అప్పటి వరకు ఎలాంటి పనులు చేపట్టొద్దని తహసీల్దార్ గౌతమ్కుమార్కు సూచించారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కంజర్ల ప్రకాష్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు సన్వెల్లి ప్రభాకర్రెడ్డి, సీనియర్ నాయకులు భీమేందర్రెడ్డి, వెంకటేశ్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
రుణ ప్రణాళిక ఖరారు
● ఏటా పరిమితి పెంపు ● లక్ష్యం చేరుకోవడంలో విఫలం ● గతేడాది 60 శాతానికే పరిమితం ● తప్పని పరిస్థితుల్లో ప్రైవేట్ ఫైనాన్స్లను ఆశ్రయిస్తున్న రైతులు ● ఈ ఏడాది రుణ లక్ష్యంరూ. 8,525 కోట్లు వికారాబాద్: ఎట్టకేటకు బ్యాంకర్లు రెండు రోజుల క్రితం రుణ ప్రణాళిక విడుదల చేశారు. 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వ్యవసాయ పంట రుణాలు, దీర్ఘకాలిక రుణాలు, పరిశ్రమలు, మహిళా స్వయం సహాయక సంఘాలు తదితర రంగాలకు ఆయా రంగాల ప్రాధాన్యత మేరకు ఈ ఆర్థిక సంవత్సరంలో ఎంత రుణం ఇవ్వాలనే ప్రణాళికను కలెక్టర్కు నివేదించారు. గతేడాది పెట్టుకున్న లక్ష్యాలతో పాటు అందులో ఏయే రంగంలో ఎంతెంత రుణం ఇచ్చారనే విషయాలపై చర్చించారు. గత లక్ష్యాలను చేరుకోవటంలో విఫలమైన బ్యాంకర్లు మళ్లీ అంతకు మించి లక్ష్యాలను సిద్ధం చేశారు. గతేడాదికి సంబంధించి 60 శాతం లక్ష్యాన్ని మ్రాతమే చేరుకున్నారు. లక్ష్యం చేరుకోవడంలో నిర్లక్ష్యం గృహ, వాహన, వ్యక్తిగత రుణాలను లక్ష్యానికి మించి అందజేస్తున్న బ్యాంకర్లు పంట రుణాల విష యంలో మాత్రం విఫలమవుతున్నారు. జిల్లాలో 3.12 లక్షల మంది రైతులుండగా వీరిలో 1,86,107 మందికి ఆయా బ్యాంకుల్లో ఖాతాలున్నాయి. గతే డాది ఈ ఖాతాదారులకు రూ.3,547 కోట్లు వ్యవ సాయ రుణాలు ఇవ్వాలని లక్ష్యం పెట్టుకున్నారు. వానాకాలం, యాసంగి సీజన్లు కలుపుకొని రూ.2,014 కోట్లు అనగా 60 శాతంలోపే రుణాలిచ్చారు. దీర్ఘ కాలిక రుణాల్లో మరింత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. 2025–26గాను రూ.8,525 కోట్ల లక్ష్యం వ్యవసాయ, అనుంబధ రంగాలు, ఇతర రంగాల ను కలుపుకొని 2025–26 ఆర్థిక సంవత్సరానికి 2,69,593 మంది ఖాతాదారులకు రూ.8,525 కో ట్లు రుణాలివ్వాలని బ్యాంకర్లు లక్ష్యం పెట్టుకున్నా రు. పంటరుణాలు రూ.2582 కోట్లు, వ్యవసాయ, అనుంబంధ రుణాలు (వానాకాలం, యాసంగి) రూ.3,547 కోట్లు , సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల ఔత్సాహికులకు రూ.608 కోట్లు, ఇతర ప్రాధాన్యతా రంగాలకు రూ.1,190 కోట్లు, అప్రధాన్యతా రంగాలకు చెందిన రూ.1,092 కోట్ల రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. -
ఫిర్యాదులను పరిష్కరించాలి
● కలెక్టర్ ప్రతీక్జైన్అనంతగిరి: ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ ప్రతీక్జైన్ అన్నారు. సో మవారం వికారాబాద్లోని కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆయ న ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. అనంతరం కలెక్టర్ ప్రతీక్జైన్ మాట్లాడుతూ.. ప్రజావాణి కార్యక్రమానికి 105 ఫిర్యాదులు అందాయని.. వాటిని పెండింగ్లో ఉంచకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు లింగ్యానాయక్, సుధీర్, ఆర్డీఓ వాసుచంద్ర, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
విద్యార్థుల ఆకలి కేకలు!
● మైల్వార్ ప్రాథమిక పాఠశాలలో అందని మధ్యాహ్న భోజనం ● ప్రభుత్వం నుంచి బిల్లులు రాలేదని నిర్వాహకుల నిరసన ● పస్తులతో అవస్థలు పడిన 150 మంది చిన్నారులు బషీరాబాద్: మధ్యాహ్న భోజనం పెట్టకపోవడంతో విద్యార్థులు ఆకలితో అలమటించారు. మండల పరిధిలోని మైల్వార్లో సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. స్థానిక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 1నుంచి 5 తరగతుల వరకు 150 మంది బాలబాలికలు చదువుకుంటున్నారు. ఏజెన్సీ నిర్వాహకులు భువనేశ్వరీ, ప్రమీళ, సంగీత వీరికి నిత్యం మిడ్ డేమీల్స్ వండిపెట్టేవారు. బిల్లులు రావడం లేదని వంట చేయలేదు. సోమవారం మధ్యా హ్నం లంచ్ బెల్ కొట్టగానే విద్యార్థులు రోజూ మాదిరిగానే ప్లేట్లు పట్టుకుని బయటకు వచ్చారు. ఈ సమయంలో.. ‘బిల్లులు రావడం లేదని ఏజెన్సీ వాళ్లు వంట చేయలేదు. మీరంతా ఇళ్లకు వెళ్లి తిని రావాలి’ అని ఉపాధ్యాయులు చెప్పారు. అప్పటికే ఆకలితో అలమటిస్తున్న చిన్నారులు ఇళ్లకు పరుగులు తీశారు. కొంతమంది భోజనం చేసి రాగా, ఇళ్లకు తాళాలు వేసి పొలం పనులకు వెళ్లిన వారి పిల్లలు కడుపు మంటతోనే తిరిగొచ్చారు. సాయంత్రం వరకూ ఆకలితోనే అలమటించారు. ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకుని ఉపాధ్యాయులను నిలదీశారు. వంట వండటం లేదని ముందే చెబితే తాము టిఫిన్లు కట్టి పంపించే వాళ్లమని హెచ్ఎం వెంకటప్పపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఈ విషయాన్ని తాను ఎంఈఓకు చెప్పగా ఏజెన్సీ వాళ్లకు నచ్చజెప్పాలని సూచించారని, నిర్వాహకులు మాత్రం వినలేదని తెలిపారు. -
ఫార్మా రైతులకు ప్లాట్లు
కందుకూరు: వంద శాతం హక్కులతో పారదర్శకంగా ప్రభుత్వం ఫార్మా రైతులకు ప్లాట్లను అందజేస్తోందని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు. మండలంలోని మీర్ఖాన్పేట రెవెన్యూ లో టీజీఐఐసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన లేఅవు ట్లో సోమవారం కందుకూరు, యాచారం మండలాల భూ నిర్వాసితులకు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డితో కలిసి లాటరీ ద్వారా ప్లాట్లను కేటాయించారు. మొదటి రోజు 60 గజాల లబ్ధిదారులు 670 మందికి ప్లాట్లు కేటాయించారు. ఈ సందర్భంగా కలెక్టర్ నారాయణరెడ్డి మాట్లాడుతూ.. ఇక్కడ ఏర్పాటు చేసిన లేఅవుట్లో ప్రభుత్వమే అన్ని సదుపాయాలతో అభివృద్ధి చేస్తుందన్నారు. ఎలాంటి ఖర్చు లేకుండా లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్ చేయించి ఇస్తున్నామన్నారు. రైతులతో మాట్లాడిన ఎమ్మెల్యే సబితారెడ్డి లాటరీ ప్రారంభానికి కంటే ముందే స్థానిక ఎమ్మె ల్యే సబితారెడ్డి లబ్ధిదారులతో నేరుగా మాట్లాడారు. తొందరపడి ఎవరూ ప్లాట్లు విక్రయించొద్దని, భవిష్యత్లో మంచి లాభం వస్తుందని సూచించారు. అంతకుముందు అక్కడ జరుగుతున్న ప్లాట్ల కేటాయింపు, రిజిస్ట్రేషన్ ప్రక్రియను గురించి ఆమె అధికారులను అడిగి తెలుసుకున్నారు. అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది గత ప్రభుత్వం ఫార్మాసిటీ ఏర్పాటుకు సంకల్పించిందని, దీంతో ఈ ప్రాంతం నాశనమయ్యేదని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అన్నా రు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే సీఎం రేవంత్రెడ్డి ఈ ప్రాంతం అభివృద్ధికి కట్టుబడి ఉండేలా ఫ్యూచర్సిటీని ప్రకటించారన్నారు. రైతుల భూముల విలువలు మరింత పెరుగుతాయని, భవిష్యత్లో గజం ధర రూ.లక్ష పలుకుతుందన్నారు. పర్యవేక్షించిన అధికారులు మొదటి రోజు కుర్మిద్ద, మేడిపల్లి, మీర్ఖాన్పేట, ముచ్చర్ల, నానక్నగర్, పంజగూడ, తాటిపర్తి రెవెన్యూ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు 60 గజాల చొప్పున ప్లాట్లను లాటరీ ద్వారా కేటాయించారు. కలెక్టర్ నారాయణరెడ్డితో పాటు ఎఫ్సీఏడీఏ కమిషనర్ శశాంక, జెడ్పీ సీఈఓ కృష్ణారెడ్డి, ఆర్డీఓలు తదితరులు లాటరీ ప్రక్రియను పర్యవేక్షించారు. లాటరీ ద్వారా కేటాయింపు షురూ మొదటి రోజు 60 గజాల లబ్ధిదారులకు.. ప్రక్రియను ప్రారంభించిన రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి -
డీహెచ్కు సెలవు!
● త్వరలో ప్రభుత్వ ఉత్తర్వులు? ● తాండూరు నర్సింగ్ కళాశాల భవనంలో కొడంగల్ మెడికల్ కాలేజీ ● ఇప్పటికే వర్చువల్గా పరిశీలించిన కేంద్ర బృందం తాండూరు: తాండూరులోని జిల్లా ప్రభుత్వాస్పత్రి ఇక జనరల్ ఆస్పత్రిగా మారనుంది. ఇందుకు అధికార యంత్రాంగం శరవేగంగా ఏర్పాట్లు చేస్తోంది. నేడో.. రేపో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు వైద్యాధికారులు సైతం ధ్రువీకరిస్తున్నారు. 23 ఏళ్లుగా తెలంగాణ వైద్య విధాన పరిషత్(టీవీవీపీ) ఆధీనంలో ఉమ్మడి జిల్లాలో సేవలందించిన ఈ ఆస్పత్రి డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యూకేషన్(డీఎంఏ) ఆధీనంలోకి వెళ్లనుంది. వీవీపీ వైద్యులు, సిబ్బంది రానున్న రోజుల్లో ఇతర ఆస్పత్రులకు వెళ్లే అవకాశాలున్నాయి. జనరల్ ఆసుపత్రిగా మారితే వైద్య సేవలు సక్రమంగా అందుతాయా లేదా అనేది ప్రస్తుతం చర్చనీయాంశమైంది. 200 పడకలకు అప్గ్రేడ్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఆర్థికంగా వెనుకబడిన ప్రాంతంగా గుర్తించిన తాండూరులో ఉమ్మడి జిల్లా ప్రభుత్వాస్పత్రి ఏర్పాటుకు అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న పట్నం మహేందర్రెడ్డి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచారు. ఈ క్రమంలో 2002 ఆగస్టు 1న తాండూరులో జిల్లా ప్రభుత్వాస్పత్రి ప్రారంభించారు. వంద పడకలతో ప్రారంభించి రోగుల సంఖ్య పెరగడంతో 200 పడకలకు అప్గ్రేడ్ చేశారు. ఇక్కడ ప్రతీ రోజు 800 వరకు ఓపీతో పాటు 180 మంది వరకు ఇన్పేషెంట్లకు వైద్య సేవలు అందుతున్నాయి. బోర్డులు మార్చి అనుమతులు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తోన్న కొడంగల్ నియోజకవర్గంలో మెడికల్ కళాశాల ఏర్పాటుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. కొడంగల్ పట్టణ శివారులో కాలేజీ భవన నిర్మాణ పను లు కొనసాగుతున్నాయి. కళాశాల ఏర్పాటుకు 250 పడకల ప్రభుత్వ ఆస్పత్రి తప్పనిసరి. కానీ కొడంగల్లో పీహెచ్సీ మాత్రమే ఉండడంతో అనుమతులు సాధ్యపడలేదు. దీంతో తాండూరు జిల్లా ఆస్పత్రి బోర్డు తొలగించి కొడంగల్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిగా బోర్డులు ఏర్పాటు చేశారు. విషయం తెలుసుకున్న ప్రతిపక్షాలు బోర్డులు తొలగించి నిరసన వ్యక్తం చేశాయి. చురుగ్గా భవన నిర్మాణ పనులు తాండూరు శివారులో నర్సింగ్ కళాశాల భవనంలోనే కొడంగల్ మెడికల్ కళాశాల ఏర్పాటు చేసి కొన్నాళ్ల పాటు కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణ యం తీసుకుంది. ఇక్కడ ఏర్పాటు చేస్తే జిల్లా ఆస్పత్రితో పాటు, ఎంసీహెచ్ ఆస్పత్రుల్లో 350 పడకలు అందుబాటులో ఉంటాయి. దీంతో కేంద్ర ప్రభు త్వం నుంచి సులువుగా మెడికల్ కళాశాల అనుమతులు తీసుకురావొచ్చనే యోచనతో భవన నిర్మాణ పనులు చేపట్టారు. నాలుగు రోజుల క్రితమే కేంద్ర బృందం మెడికల్ కళాశాలతో పాటు ప్రభుత్వ ఆస్పత్రులను వర్చువల్గా పరిశీలించింది. టీవీవీపీ ఉద్యోగుల్లో ఆందోళన ఇక్కడ విధులు నిర్వహిస్తున్న వైద్యులు, సిబ్బంది ఆందోళనకు గురవుతున్నారు. గతంలో ఇతర జిల్లాల్లో మెడికల్ కళాశాల ఏర్పాటు సమయంలో టీవీవీపీ ఆధీనంలో పని చేసిన వారిని ఇతర ప్రాంతాలకు బదిలీ చేశారు. దీంతో ఇక్కడ సైతం బదిలీలు తప్పవనే ఆందోళనలో ఉద్యోగులున్నారు. ఇక్కడి ఉద్యోగులను డీఎంఏ పరిధిలోకి విలీనం చేసి వైద్య సేవలను పొందాలనే డిమాండ్ సైతం పెరుగుతోంది. లేదా జిల్లా ప్రభుత్వ, జనరల్ ఆసుపత్రిలో నియమించే ఉద్యోగులను ఒకే గొడు గు కిందకు తీసుకురావాలని వైద్యులు, సిబ్బంది కోరుతున్నారు. తాండూరు జిల్లా ఆస్పత్రిని జనరల్ ఆస్పత్రిగా మార్చేందుకు సన్నాహాలుఅదనపు వైద్య సేవలు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి, ఎంసీహెచ్లు డీఎంఏలోకి మారనున్నాయి. మరో వారం రోజుల్లో ఉత్తర్వులు వచ్చే అవకాశం ఉంది. జనరల్ ఆస్పత్రిగా అప్గ్రేడ్ అయితే అదనపు వైద్య సేవలు అందుతాయి. రెండు ఆస్పత్రుల్లో 200 మంది వైద్యుల సేవలు అవసరం ఉంటుంది. – డాక్టర్ ఆనంద్, డీసీహెచ్ఎస్, వికారాబాద్ -
మంత్రికి శుభాకాంక్షలు
పరిగి: రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణలో ఇటీవల కార్మిక, ఉపాధి, శిక్షణ, కర్మగారములు, గనుల శాఖ మంత్రిగా పదవీబాధ్యతలు స్వీకరించిన గడ్డం వివేక్ను పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి సన్మానించారు. సోమవారం సచివాలయంలోని మంత్రి చాంబర్లో పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. నేడు స్పీకర్ పర్యటన మర్పల్లి: శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ మంగళవారం మర్పల్లికి విచ్చేయనున్నట్లు కాంగ్రెస్ మండల అధ్యక్షుడు తుమ్మల సురేశ్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు మండల పరిషత్ కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉంటారని చెప్పారు. రేపు జాబ్ మేళా అనంతగిరి: టీంలీస్ సర్వీసెస్ లిమిటెడ్ (డి–మార్ట్ కోసం)లో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా ఉపాధి అధికారి సుభాన్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి ఉన్నవారు బుధవారం ఉదయం 10.30గంటలకు వికారాబాద్లోని ఐటీఐ కళాశాల ఆవరణలో నిర్వహించనున్న జాబ్మేళాకు హాజరవ్వాలన్నారు. వివరాలకు 96760 47444 నంబర్లో సంప్రదించాలన్నారు. హౌసింగ్ డీఈఈ బదిలీ తాండూరు రూరల్: తాండూరు డివిజన్ హౌసింగ్ డీఈఈ ఖలీమొద్దీన్ను కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కు బదిలీ చేస్తూ సోమ వారం హౌసింగ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. తొమ్మిది నెలల క్రితం తాండూరుకు వచ్చిన ఆయన నియోజకవర్గంలోని పెద్దేముల్, తాండూరు, యాలాల, బషీరాబాద్ మండల పరిధిలోని గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల పురోగతిలో తనదైన ముద్రవేశారు. ఆయన సేవలపై కలెక్టర్ ప్రతీక్జైన్, ఎమ్మెల్యే మనోహర్రెడ్డి సంతృప్తి వ్యక్తం చేశారు. ఖలీమొద్దీన్ స్థానంలో కొడంగల్ డీఈ ఎం.చందర్కు ఇన్చార్జి బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పరిగి తహసీల్దార్గా వెంకటేశ్వరి పరిగి: పరిగి తహసీల్దార్గా వెంకటేశ్వరిని నియమిస్తూ సోమవారం రెవెన్యూ శాఖ నుంచి ఉత్తర్వులు జారీ చేశారు. ఇక్కడ విధులు నిర్వహిస్తున్న ఆనంద్రావు అక్రమంగా భూ రిజిస్ట్రేషన్ చేశారని ప్రజా సంఘాల నాయకులు నిరసనలు తెలపడంతో ఉన్నతాధికారు లు ఆయన్ను ఆర్డీఓ కార్యాలయానికి బదిలీ చేశారు. కలెక్టరేట్ కార్యాలయం డి–సెక్షన్ సూపరింటెండెంట్గా విధులు నిర్వహిస్తున్న వెంకటేశ్వరిని పరిగి తహసీల్దార్గా బదిలీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. 13న కేఏఎన్పీఎస్ రాష్ట్ర మహాసభలు జిల్లా కన్వీనర్ వెంకటయ్య తాండూరు టౌన్: మహబూబ్నగర్లో ఈ నెల 13వ తేదీన నిర్వహించనున్న కుల అసమానతల నిర్మూలన పోరాట సమితి రెండవ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని జిల్లా కన్వీనర్ వెంకటయ్య పిలుపు నిచ్చారు. ఈ మేరకు సోమవారం తాండూరులో మహాసభల పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వెంకటయ్య మాట్లాడుతూ.. ‘వైరుధ్యాల జీవనం, నయా ఉదారవాద భారత దేశంలో ప్రజలస్వామ్యం, అభివృద్ధి, సామాజిక న్యాయం’అనే అంశంపై రిటైర్డ్ ప్రొఫెసర్ కె.శ్రీనివాసులు ప్రసంగిస్తారన్నారు. సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక అసమానతలను రూపుమాపేందుకు కేఏఎన్పీఎస్ పోరాడుతుందన్నారు. వర్గీకరణలో ఎస్సీ ఉపకులాల వైపు నిలబడడంతో పాటు, రాజ్యాంగ విరుద్ధ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను రద్దు చేయాలని డిమాండ్ చేశామన్నారు. ఈ పోరాటానికి మద్ధతు ఇస్తూ ఐక్యతను చాటేందుకు మహాసభలకు ప్రతీ ఒక్కరు తప్పకుండా హాజరు కావాలని కోరారు. సమితి జిల్లా కో కన్వీనర్ కిష్టప్ప, రాష్ట్ర కమిటీ సభ్యులు టి.నరేశ్, ఎం.వెంకటయ్య, ఎం.శ్రీను పోస్టర్ ఆవిష్కరణలో పాల్గొన్నారు. -
ప్రజారోగ్యంౖపై దృష్టి పెట్టాలి
● సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి ● డీఎంహెచ్ఓ లలితాదేవి ● పలు ఆస్పత్రుల సందర్శన కొడంగల్: ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతామని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ లలితాదేవి అన్నారు. శుక్రవారం మండలంలోని అంగడిరాయిచూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగాసందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నందున సీజన్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని అప్రమత్తంగా ఉండాలని సిబ్బందికి సూచించారు. రోగులకు అందుబాటులో ఉంటూ సత్వర సేవలు అందించాలని ఆదేశించారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ రవీంద్రయాదవ్, డాక్టర్ ప్రవీణ్కుమార్, డాక్టర్ ఫాతిమా, మహేష్ తదితరులు పాల్గొన్నారు. అప్రమత్తంగా ఉండాలి దౌల్తాబాద్: ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అఽధికారి లలితాదేవి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని పీహెచ్సీని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రతి పాఠశాలను సందర్శించి విద్యార్థులకు వైద్య పరీక్షలు చేయాలని సూచించారు. విధుల్లో నిర్లక్ష్యంగా ఉండరాదన్నారు. నెలలు నిండిన గర్భిణులను ముందస్తుగా ఆస్పత్రిలో చేర్పించాలని సూచించారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్ఓ రవీందర్యాదవ్, వైద్యాధికారి ప్రవీణ్కుమార్, పీహెచ్సీ వైద్యాధికారిణి అమూల్య ఉన్నారు. రోగులకు ఇబ్బంది కలగొద్దు దుద్యాల్: ఆస్పత్రికి వచ్చే రోగులకు ఇబ్బంది కలగకుండా చూడాలని డీఎంహెచ్ఓ లలితాదేవి సూచించారు. శుక్రవారం మండలంలోని హకీంపే ట్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులు, స్టాక్ వివరాలుపరిశీలించారు. మెరుగైన వైద్యం మన బాధ్యత బొంరాస్పేట: రోగులకు సకాలంలో మెరుగైన వైద్యం అందించడం మన బాధ్యత అని డీఎంహెచ్ఓ లలితాదేవి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని పీహెచ్సీని ఆమె సందర్శించారు. వసతులపై ఆరా తీశారు. రోగులకు అందుతున్న సేవలను పరిశీలించారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్ఓ రవీంద్రయాదవ్, మండల వైద్యాధికారి హేమంత్, ఏఎన్ఎంలు పాల్గొన్నారు. -
ఆరోగ్యంపై జాగ్రత్త వహించాలి
మున్సిపల్ కమిషనర్ విక్రమ్సింహారెడ్డి తాండూరు టౌన్: మున్సిపల్ కార్మికులు ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలని కమిషనర్ విక్రమ్సింహారెడ్డి సూచించారు. శుక్రవారం మున్సిపల్ కార్యాలయంలో కార్మికులు, సిబ్బందికి వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పారిశుద్ధ్య కార్మికులు నిత్యం చెత్త సేకరణ, తరలింపు తదితర పనుల వల్ల అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉందన్నారు. తరచూ జ్వరం, దగ్గు, జలుబు వంటి వ్యాధుల బారిన పడుతుంటారని తెలిపారు. కార్మికులు ఎలాంటి అనారోగ్యం పాలైనా వెంటనే వైద్యులను సంప్రదించాలన్నారు. 100 రోజుల ప్రణాళికలో భాగంగా సిబ్బందితో పాటు, కార్మికులకు వైద్య శిబిరం ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో ఇన్చార్జ్ శానిటరీ ఇన్స్పెక్టర్ ఉమేష్ కుమార్, మెప్మా టీఎంసీ రాజేందర్, జవాన్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. విరబూసిన బ్రహ్మ కమలాలు తాండూరు టౌన్: పట్టణంలోని ఓ వ్యాపారి ఇంట్లో బ్రహ్మ కమలాలు విరబూసాయి. ఏడాదికి ఒక్కసారి పూలు పూసే ఆ చెట్టుకు శుక్రవారం ఏకంగా ఏడు కమలాలు పూశాయి. పట్టణంలోని వాల్మీకి నగర్కు చెందిన వ్యాపారి పునీత్ కుమార్ ఇంట్లో ఈ అరుదైన విషయం చోటు చేసుకుంది. దీంతో కుటుంబ సభ్యులు చెట్టు వద్ద పూజలు చేశారు. ఒకేసారి ఏడు పుష్పాలు పూయడం అదృష్టంగా భావిస్తున్నామని వారు తెలిపారు. నేడు బీఎల్ఓలకు శిక్షణ ధారూరు: మండలంలోని బూత్ లెవల్ ఆఫీసర్లకు శనివారం ఒక్క రోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు డిప్యూటీ తహసీల్దార్ విజయేందర్ తెలిపారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాస్టర్స్ ట్రైన ర్స్ బీఎల్ఓలకు శిక్షణ ఇస్తారని ఆయన పేర్కొన్నారు. అదనపు కలెక్టర్ సుధీర్ హాజరుకానున్నట్లు తెలిపారు. ఈ శిక్షణ కార్యక్రమానికి మండలంలోని బీఎల్ఓలు సకాలంలో హాజరు కావాలనీ ఆయన సూచించారు. జాతీయ రక్షణ నిధికి రూ.3లక్షల విరాళం తాండూరు/యాలాల: జాతీయ రక్షణ నిధికి ఆర్బీఓఎల్ తరఫున రూ.3 లక్షల విరాళం అందజేసినట్లు కంపెనీ సీఈఓ శ్రీనివాస్రెడ్డి శుక్రవారం తెలిపారు. ఇటీవల జరిగిన ఉగ్రదాడి ఘటన తరువాత కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాల విజ్ఞప్తి మేరకు రక్షణ శాఖకు తమ కంపెనీ తరఫున ఆర్థిక సాయం అందించినట్లు పేర్కొన్నారు. ఇక నుంచి ప్రతినెలా జాతీయ రక్షణ నిధికి తమ వంతు సాయం అందజేస్తామని ఆయన తెలిపారు. విద్యతోనే ఉజ్వల భవిష్యత్ బొంరాస్పేట: చదువుకుంటే మంచి భవిష్యత్ ఉంటుందని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్రెడ్డి అన్నారు. బొంరాస్పేటలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. శుక్రవారం కళాశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం విద్యాభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతోందని తెలిపారు. ఇందులో భాగంగానే ఇక్కడ జూనియర్ కళాశాల ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నా రు. అధ్యాపకులు చెప్పే పాఠాలను శ్రద్ధగా విని ఉన్నత స్థానానికి చేరుకోవాలని విద్యార్థులకు సూచించారు. కార్యక్రమంలో ఇంటర్ విద్య నోడల్ ఆఫీసర్ శంకర్నాయక్, ప్రిన్సి పాల్ విజయ్కుమార్, ఎంఈఓ హరిలాల్, నాయ కులు నర్సింలుగౌడ్, రాంచంద్రారెడ్డి, అధ్యాపకులు దినేశ్, సురేశ్, శేఖర్గౌడ్ పాల్గొన్నారు. -
మత్తుకు బానిసలు కావొద్దు
కొడంగల్: తెలంగాణను గంజాయి రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పని చేస్తున్నట్లు డీజీపీ జితేందర్ తెలిపారు. శుక్రవారం కొడంగల్లో సీఐ కార్యాలయానికి, కొడంగల్, దుద్యాల్, బొంరాస్పేట పోలీస్ స్టేషన్ల నూతన భవనాల నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువత మత్తుకు బానిసలై జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు. డ్రగ్స్, గంజాయి, గంజాయి చాక్లెట్లు విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మాదక ద్రవ్యాల నివారణకు పకడ్బందీ చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. ఇతర రాష్ట్రాల నుంచి మత్తు పదార్థాలు తెస్తున్న వారిపై నిఘా పెట్టినట్లు పేర్కొన్నారు. వ్యసనాలకు గురికావడం వల్ల కుటుంబాలు చెల్లాచెదురవుతాయని అన్నారు. మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే నష్టాలను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలన్నారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై క్రిమినల్ కేసులు పెట్టి జైలుకు పంపుతామని హెచ్చరించారు. బొంరాస్పేటలో పోలీస్స్టేషన్ నూతన భవన నిర్మాణానికి రూ.2.96 కోట్లు, దుద్యాల్ పోలీస్స్టేషన్కు రూ.3 కోట్లు, కొడంగల్ సీఐ కార్యాలయానికి రూ.85 లక్షలు,కొడంగల్ పోలీస్ స్టేషన్కు రూ.2.96 కోట్లు కేటాయించారు. అధునాతన సౌకర్యాలతో భవనాలు నిర్మిస్తామని డీజీపీ తెలిపారు. భవనాలను త్వరగా నిర్మించి అందుబాటులోకి తెస్తామన్నారు. ఈ సందర్భంగా పోలీసులు డీజీపీకి గౌరవ వందనం సమర్పించారు. కార్యక్రమంలో పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గురునాథ్రెడ్డి, కలెక్టర్ ప్రతీక్ జైన్, డీఐజీ తాీప్సీర్ ఎగ్బాల్, ఎస్పీ నారాయణరెడ్డి, హౌసింగ్ ఐజీ రమేష్, తాండూరు సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్, అసిస్టెంట్ ట్రైనీ కలెక్టర్ హర్ష చౌదరి, కడా ప్రత్యేకాధికారి వెంకట్రెడ్డి, పరిగి డీఎస్పీ శ్రీనివాస్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ తిరుపతిరెడ్డి, మాజీ ఎంపీపీ ముద్దప్ప దేశ్ముఖ్, ఏఎంసీ చైర్మన్ అంబయ్య గౌడ్, పీఏసీఎస్ చైర్మన్ శివకుమార్ గుప్తా, తహసీల్దార్ విజయ్కుమార్, పీసీసీ సభ్యుడు మహ్మద్ యూసూఫ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నందారం ప్రశాంత్, సీఐ శ్రీధర్రెడ్డి, ఎస్ఐలు తదితరులు పాల్గొన్నారు. గంజాయి రహిత రాష్ట్రమే లక్ష్యం డీజీపీ జితేందర్ -
బాధితులకు న్యాయం చేస్తాం
కొడంగల్: పట్టణంలోని పద్మావతీ సమేత శ్రీ మహాలక్ష్మీ వేంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధిలో భాగంగా ఇండ్లు, స్థలాలు కోల్పోయే వారికి న్యా యం చేస్తామని కలెక్టర్ ప్రతీక్ జైన్ హామీ ఇచ్చారు. శుక్రవారం ఆయన పట్టణంలోని జాతర స్థలాన్ని సందర్శించారు. ఇండ్లు కోల్పోతున్న వారి కోసం జాతర స్థలంలో వెంచర్ చేస్తున్నారు. ఆ వెంచర్లో అన్ని సౌకర్యాలతో కూడిన ఇంటి స్థలాలను కేటాయిస్తామని కలెక్టర్ తెలిపారు. విశాలమైన రోడ్లు ఉండేలా చూడాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో తాండూరు సబ్కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్, అసిస్టెంట్ ట్రైనీ కలెక్టర్ హర్ష చౌదరి, కడా ప్రత్యేకాధికారి వెంకట్రెడ్డి, తహసీల్దార్ విజయ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. పనుల్లో నాణ్యత పాటించాలి పరిగి: అభివృద్ధి పనుల్లో నాణ్యత పాటించడం తోపాటు సకాలంలో పూర్తి చేయాలని కలెక్టర్ ప్రతీక్జైన్ సూచించారు. శుక్రవారం పరిగి పట్టణంలో పర్యటించారు. తహసీల్దార్ కార్యాలయ నూతన భవన నిర్మాణ పనులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. భవన నిర్మాణంలో ఎలాంటి లోపాలు లేకుండా చూడాలన్నారు. పనుల వేగంపెంచి సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో తహసీల్దార్ ఆనంద్రావు తదితరులు పాల్గొన్నారు. ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించండి అనంతగిరి: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించాలని కలెక్టర్ ప్రతీక్జైన్ లబ్ధిదారులకు సూచించారు. శుక్రవారం వికారాబాద్ మున్సి పల్ పరిధిలోని 8వ వార్డులో ఇందిరమ్మ, బుడగ జంగం కాలనీలో ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ నిబంధనల ప్రకారమే ఇంటి నిర్మాణం చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ సుధీర్, ట్రైనీ కలెక్టర్ హర్ష్ చౌదరి, మున్సిపల్ కమిషనర్ జాకీర్ అహ్మద్ పాల్గొన్నారు. కలెక్టర్ ప్రతీక్జైన్ -
ఓటరు జాబితా పక్కాగా ఉండాలి
కొడంగల్: బూత్ లెవల్ అధికారులు ప్రతి ఇంటినీ సందర్శించి ఓటర్ల వివరాలను పరిశీలించాలని అదనపు కలెక్టర్ లింగ్యానాయక్ సూచించారు. గురువారం పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల పాఠశాలలో నిర్వహించిన జాతీయ శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఓటరు జాబితాలో మార్పులు చేర్పులపై జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు బీఎల్ఓలకు, సూపర్ వైజర్లకు ఒక్కరోజు శిక్షణ, అవగాహన తరగతులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఫారం 6, 7, 8 నిర్వహణ పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆదేశించారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు నమోదు చేసుకునేలా అవగాహన కల్పించాలన్నారు. ఓటరు జాబితాలో అవసరమైతే పాత ఫొటోలను తొలగించి కొత్త ఫొటోలను అప్లోడ్ చేయాలన్నారు. పేర్లలో తప్పులు ఉంటే సవరించాలని సూచించారు. ఫారం 6 ద్వారా కొత్త ఓటర్లను నమోదు చేయాలని తెలిపారు. కుటుంబ సభ్యులందరూ ఒకే పోలింగ్ కేంద్రంలో ఓటు వేసేలా చూడాలని ఆదేశించారు. మరణించిన వారి పేర్లను జాబితా నుంచి తొలగించాలన్నారు. పేరు మార్పుల కోసం ఫారం 8 వినియోగించాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ విజయ్కుమార్, ఎంఈఓ రాంరెడ్డి, మాస్టర్ ట్రైనర్లు, బీఎల్ఓలు తదితరులు పాల్గొన్నారు. బీఎల్ఓలు ప్రతి ఇంటికి వెళ్లి వివరాలు సేకరించాలి అదనపు కలెక్టర్ లింగ్యానాయక్ -
బాలికలను వేధిస్తే జైలుకే
● తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి ● చట్టాలపై విద్యార్థులకు అవగాహన తాండూరు రూరల్: పాఠశాలలు, కళాశాలల వద్ద బాలికలను వేధిస్తే జైలుకు పంపిస్తామని తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి హెచ్చరించారు. మండల పరిధిలోని జినుగుర్తి గేటు వద్ద ఉన్న మోడల్ స్కూల్ విద్యార్థులకు చట్టాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు బాల్యం నుంచే చట్టాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. కష్టపడి చదివి, ఉన్నత శిఖరాలను చేరుకోవాలని సూచించారు. బాలికలను వేధిస్తే పోక్సో చట్టం కింద జైలుకు పంపిస్తామన్నారు. మాదకద్రవ్యాలకు బానిసలు కావొద్దని విద్యార్థులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రూరల్ సీఐ నగేష్, ఎస్ఐ విఠల్రెడ్డి, ప్రిన్సిపల్ శ్రీదేవి, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు. గుండెపోటుతో ఏఎంసీ డైరెక్టర్ మృతి తాండూరు రూరల్: గుండెపోటుతో మండలంలోని అంతారం అనుబంధ గ్రామం దస్తగిరిపేట్కు చెందిన తాండూరు మార్కెట్ కమిటీ డైరెక్టర్ భగవాన్ కరీం(60) మృతి చెందారు. ఈ సంఘటన గురువారం కర్ణాటక రాష్ట్రం గుల్బర్గా జిల్లాలో చోటు చేసుకుంది. మృతుడి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. భగవాన్ కరీం తన సోదరి అంత్యక్రియల కోసం కర్ణాటకకు వెళ్లారు. అక్కడే ఒక్కసారిగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే అతన్ని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అప్పటికే గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతదేహాన్ని స్వగ్రామం దస్తగిరిపేట్కు తరలించారు. ఎమ్మెల్యే మనోహర్రెడ్డి, మార్కెట్ చైర్మన్ బాల్రెడ్డితో పాటు డైరెక్టర్లు బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. బైండోవర్లో ఉన్న వ్యక్తికి రిమాండ్ పరిగి: మండల పరిధిలోని సాలిప్పలబాటతండాకు చెందిన డెగావత్ నీల్యనాయక్ గత 6 నెలల క్రితం సారా తయారీ చేస్తుండగా ఆబ్కా రీ పోలీసులు పట్టుకున్నారు. ఆయన్ని పరిగి తహసీల్దార్ ఎదుట బైండోవర్ చేసి మళ్లీ సారా తయారు చేయరాదని హెచ్చరించారు. అయి నా అతనిలో మార్పు రాకుండా నిత్యం అదే పనిగా సారా తయారీ చేస్తున్నాడు. దీంతో గురువారం తహసీల్దార్ ఆనంద్రావు బైండోవర్ను ఉల్లంఘించినందుకు రిమాండ్కు తరలించామని పోలీసులు తెలిపారు. బైండోవర్లో ఉన్న వ్యక్తులు నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా హెచ్చరించారు. పన్నులు సకాలంలో చెల్లించాలి కుల్కచర్ల: ట్యాక్స్ ప్లేట్ గల వాహనదారులు తమ వాహనాల పన్నులను తప్పనిసరిగా సకాలంలో చెల్లించాలని పరిగి ఆర్టీఓ వీరేంద్రనాయక్ సూచించారు. గురువారం మండల కేంద్రంలో వాహనాల తనిఖీ నిర్వహించారు. ఇందులో ఐదు వాహనాలను సీజ్ చేశారు. వాటిపై రూ.లక్ష 10వేల ట్యాక్స్ ఉందని తెలిపారు. అనంతరం వాహనాలను కుల్కచర్ల పోలీస్స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా వీరేంద్రనాయక్ మాట్లాడుతూ.. వాహనదారులు తప్పనిసరిగా తమ వాహనదారులకు ఉన్న ట్యాక్స్ను చెల్లించాలని, నిబంధనలను అనుసరించి నడపాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో స్థానిక పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం స్వాధీనం కాచిగూడ: గుర్తుతెలియని వ్యక్తి మృత దేహం లభ్యమైన సంఘటన కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్ఐ నరేష్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కాచిగూడ, కృష్ణానగర్ నాలాలో గుర్తుతెలియని వ్యక్తి (45) మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కల సాకారం
బొంరాస్పేట: మండల వ్యవస్థ ప్రారంభమైన నాటి నుంచి బొంరాస్పేటవాసులు కలలుగంటున్న జూనియర్ కళాశాల ఏర్పాటు సీఎం రేవంత్రెడ్డి చొరవతో సాకారమైంది. ఇప్పటివరకు మండలంలోని విద్యార్థులు ఇంటర్ విద్యకు పొరుగు పట్టణాలకు పరుగులు తీశారు. చుట్టుపక్కల ఉన్న కొడంగల్, తాండూరు, పరిగి, వికారాబాద్ పట్టణాలకు ఇంటర్మీడియెట్ కోసం వెళ్లక తప్పలేదు. కానీ ఈ ఏడాది మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హెచ్ఈసీ, ఎంఎల్టీ (మెడికల్ ల్యాబరేటరీ టెక్నీషియన్), ఎంపీహెచ్డబ్ల్యూ (మల్టీ పర్పస్ హెల్త్ వర్కర్స్) గ్రూపులను అందుబాటులోకి తెచ్చారు. తెలుగు, ఆంగ్లం మాధ్యమాల్లో బోధనకు శ్రీకారం చుట్టారు. దీంతో విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వసతుల కల్పన మండల కేంద్రం శివారులో తుంకిమెట్ల బ్రిడ్జి వద్ద ప్రస్తుతం జెడ్పీహెచ్ఎస్ ఆవరణలోని అదనపు తరగతి గదుల్లో జూనియర్ కళాశాల కొనసాగుతోంది. జెడ్పీహెచ్ఎస్ అదనపు గదుల సముదాయంలో జీయూపీఎస్ అదనపు గదుల భవనంలో ఇంటర్ విద్యార్థులకు బోధన జరుగుతోంది. భవిష్యత్తులో నూతన భవన నిర్మాణానికి ప్రభ్తుత్వం చర్యలు తీసుకోవాలని విద్యార్థులు, అధ్యాపకులు కోరుతున్నారు. సిద్ధంగా అధ్యాపక బృందం కళాశాల అధ్యాపకులుగా ఆంగ్లం, కామర్స్ రెగ్యులర్ లెక్చర్లున్నారు. కెమెస్ట్రీ, బాటనీ, ఫిజిక్స్, జువాలజీ, మ్యాథ్స్, సివిక్స్, ఎకనామిక్స్, హిందీ సబ్జెక్టులకు అతిథి అధ్యాపకులున్నారు. గతేడాది ప్రారంభమైన ఈ జూనియర్ కళాశాల విద్యార్థుల సంఖ్య అంతగా లేకపోవడంతో నిరుడు పరిగిలోనే నిర్వహించారు. ప్రస్తుతం ఇంటర్మీడియట్ ద్వితీయ, ప్రథమ సంవత్సరాల విద్యార్థులతో కళాశాల నిర్వహణ జరుగుతోంది. జూనియర్ కళాశాల ప్రవేశాల గడువు ఈనెల చివరి వరకు ఉంటుందని ఇంటర్ బోర్డు ఆదేశాలున్నాయి. ఇప్పటివరకు ఈ విద్యాసంవత్సరంలో 123 మంది విద్యార్థులున్నారు. మండల కేంద్రంలో జూనియర్ కళాశాల నిర్వహణ ఏళ్ల నిరీక్షణకు తెరదించిన ప్రభుత్వం హర్షం వ్యక్తం చేస్తున్న విద్యార్థులు, తల్లిదండ్రులు జూనియర్ కళాశాల వివరాలు గ్రూపు ఫస్టియర్ సెకండియర్ ఎంపీసీ 13 0 బైపీసీ 40 3 సీఈసీ 19 1 హెచ్ఈసీ 4 4 ఎంఎల్టీ 15 లేదు ఎంపీహెచ్డబ్ల్యూ 24 లేదు మొత్తం విద్యార్థుల సంఖ్య 123 -
ప్రత్యేక బస్సు ప్యాకేజీ
తాండూరు టౌన్: రానున్న గురుపౌర్ణమిని పురస్కరించుకుని గానుగాపూర్లోని దత్తాత్రేయ స్వామి దర్శనార్ధం వెళ్లనున్న భక్తుల కోసం తాండూరు ఆర్టీసీ డిపో ఆధ్వర్యంలో ప్రత్యేక బస్సు ప్యాకేజీని తీసుకొచ్చినట్లు డిపో మేనేజర్ సురేష్ కుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 9వ తేదీ సాయంత్రం 5గంటలకు తాండూరు బస్టాండ్ నుంచి బయలుదేరనున్న బస్సు కల్బుర్గిలోని శరణు బసవేశ్వర టెంపుల్ దర్శనానంతరం గానుగాపూర్కు చేరుకుంటుందన్నారు. 10వ తేదీన దత్తాత్రేయ స్వామి దర్శనానంతరం బయలుదేరి అదే రోజు సాయంత్రం 5గంటలకు తాండూరుకు చేరుకోనున్నట్లు తెలిపారు. స్పెషల్ ఎక్స్ప్రెస్ బస్సులో ప్రయాణించే ఒక్కో ప్రయాణికుని వద్ద రూ.700 చొప్పున చార్జీలు వసూలు చేయనున్నట్లు చెప్పారు. ప్రయాణికులు ముందస్తుగా తమ సీట్లను బస్ స్టేషన్కు వచ్చి బుక్ చేసుకోవచ్చన్నారు. ఇతర వివరాలకు సెల్ నంబర్ల 9959226251, 9441717503, 830934 8157లో సంప్రదించాలన్నారు. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. నేడు పీఎస్ భవనాలకు భూమిపూజ కొడంగల్: నియోజకవర్గంలోని పలు మండల కేంద్రాల్లో శుక్రవారం పోలీస్ స్టేషన్ల నూతన భవన నిర్మాణాలకు భూమిపూజ చేయనున్నారు. కొడంగల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంతో పాటు కొడంగల్, దుద్యాల్, బొంరాస్పేట మండల కేంద్రాల్లో నూతన భవనాల నిర్మాణ పనులను ప్రారంభించనున్నట్లు సీఐ శ్రీధర్రెడ్డి, ఎస్ఐ సత్యనారాయణ తెలిపారు. కొడంగల్లోని పాత పోలీస్స్టేషన్ స్థలంలో కొత్తగా నిర్మాణాలు చేపట్టనున్నారు. గురువా రం మార్కింగ్ వేయించారు. భూమిపూజ కార్యక్రమానికి రాష్ట్ర పోలీస్ ఉన్నతాధికారులతో పాటు పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గురునాథ్రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ తిరుపతిరెడ్డి, జిల్లా అధికారులు హాజరవుతారని తెలిపారు. సర్కారు వారి చేతి సంచులు! బొంరాస్పేట: రేషన్ కార్డుదారులకు ప్రభు త్వం త్వరలో చేతి బస్తాలు (క్యారీ బ్యాగులు) అందించనుంది. పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో ప్రతీ కార్డుదారునికి ఒక్కో బ్యాగు చొప్పున ఇస్తారు. ఆరు గ్యారంటీల లోగో, దివంగత ప్రధాని ఇందిరాగాంధీ, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, మంత్రుల ఫొటోలతో ఉన్న ఈ హ్యాండ్ బ్యాగులు ఇప్పటికే స్టాక్ పాయింట్లకు చేరాయి. వారం రోజుల్లో వీటిని రేషన్ దుకాణాలకు పంపిస్తారు. -
అరకొర సరఫరా
కొడంగల్: మున్సిపల్ పరిధిలో 16వేలకు పైగా జనాభా ఉంది. పట్టణ శివారులోని సిద్దనొంపు వద్ద గల మిషన్ భగీరథ వాటర్ ట్రిట్మెంట్ ప్లాంట్ నుంచి నీటి సరఫరా జరుగుతోంది. సీఎం నియోజకవర్గం కావడంతో అధికారులు నీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నా అక్కడక్కడ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మిషన్ భగీరథ పథకం నిబంధనల ప్రకారం నీటి సరఫరా జరగడం లేదనే అపవాదు ఉంది. మంచినీటి సరఫరా అరకొరగానే సరఫరా అవుతోందనే విమర్శలు వస్తున్నాయి. పాత కొడంగల్లో కొన్ని రోజులుగా నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతోందని గ్రామస్తులు తెలిపారు. కొడంగల్తో పాటు విలీన గ్రామాల్లో అవసరం మేరకు నీటి సరఫరా కావడం లేదని తెలుస్తోంది. గతంలో కూళాయిల ద్వారా రెండు గంటల పాటు నీటి సరఫరా జరిగేది. ప్రస్తుతం గంటకు కుదించినట్లు స్థానికులు తెలిపారు. -
సర్వం లీకేజీలమయం
తాండూరు: మున్సిపల్ పరిధిలో తాగునీటి సరఫరాలో నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. పట్టణ పరిధిలో 36 వార్డుల్లో 14,706 గృహాలు, 85వేల జనాభా ఉంది. వీరికి రోజుకు 12 ఎంఎల్డీ నీరు అవసరం కాగా 9 ఎంఎల్డీల నీటి మాత్రమే సరఫరా చేస్తున్నారు. మున్సిపల్ ప్రజల తాగునీటి అవసరాలను మిషన్ భగీరథ, కృష్ణా జలాలు, కాగ్నానది వద్ద గల రెండు పంప్హౌస్ తీరుస్తున్నాయి. పట్టణ పరిధిలో 14,706 ఇళ్లు ఉండగా 7,158 ఇళ్లకు మాత్రమే తాగునీటిని సరఫరా చేస్తున్నారు. మరో రెండు వేల ఇళ్లకు నల్లా కనెక్షన్లు ఇచ్చినా ఇప్పటి వరకు సరఫరా చేయడం లేదు. 10 వాటర్ ట్యాంక్ల ద్వారా నీటి సరఫరా జరుగుతోంది. ఆరేళ్ల క్రితం తాండూరు మున్సిపాలిటీలో ఎన్టీఆర్ కాలనీ, రాజీవ్ కాలనీ, రసూల్పూర, కోకట్ రోడ్డు, గౌతాపూర్ శివారు ప్రాంతాలు కలిశాయి. ఇప్పటి వరకు ఆయా ప్రాంతాల్లో తాగునీటి సరఫరాకు చర్యలు తీసుకుంది లేదు. వాటర్ ట్యాంక్ నిర్మించి ఏళ్లు గడుస్తున్నా ఇళ్లకు పైప్లైన్ వేసి ట్యాప్లు బిగించలేదు. దీంతో ట్యాంక్ అలంకార ప్రాయంగా దర్శనమిస్తోంది. 325 వరకు బోరు మోటార్లు, పంపులు ఉన్నా సగానికి పైగా కబ్జా చేసి వాడుకుంటున్నారు. 122 చేతిపంపులు ఉండగా కొన్ని మరమ్మతులకు నోచుకోవడం లేదు. పట్టణ ప్రజల దాహార్తి తీరుస్తున్న కాగ్నా నదిలోని పంప్హౌస్లు పాడయ్యే స్థితికి చేరాయి. పాత తాండూరులోని పంప్ హౌస్ పైప్లైన్కు లీకేజీలు ఏర్పడి నీరు కలుషితమవుతోంది. ఆ నీటిని తాగి ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో తాగునీరు వృథాగా పోతోంది. -
జలం.. కలుషితం
తాగునీటి అవసరాల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏటా కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నా ప్రజల దాహం మాత్రం తీరడం లేదు. మిషన్ భగీరథ, వాటర్ ట్యాంకులు, బోరు బావులు, నల్లా కనెక్షన్లు ఎన్ని ఉన్నా నిత్యం తాగునీటి కోసం ఎదురుచూపులు తప్పడం లేదు. మున్సిపాలిటీల్లో తాగునీటి సమస్యలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనాలు. ● గాడిన పడని తాగునీటి సరఫరా ● వర్షాలు పడుతున్నామెరుగుపడని పరిస్థితి ● ప్రజల దాహం తీర్చని ‘భగీరథ’ ● ప్రైవేటులో కొనుగోలు చేస్తున్న జనం ● పట్టించుకోని అధికార యంత్రాంగం వికారాబాద్: మున్సిపల్ పరిధిలో రోజు తప్పించి రోజు తాగునీరు సరఫరా అవుతోంది. లీకేజీల కారణంగా తాగునీరు కలుషితం అవుతుండటంతో 90శాతం ప్రజలు ఆ నీళ్లు తాగడంలేదు. దాదాపు 90శాతం అవసరాలకు మిషన్ భగీరథ పథకంతీరుస్తోంది. మిగతా లోటును బోరు బావులు, హ్యాండ్ పంపుల ద్వారా పూడుస్తున్నారు. పలుచోట్ల తరచూ పైప్లైన్లు లీకేజీలు అవుతున్నాయి. ఆయా ప్రాంతాల ప్రజలు అధికారుల దృష్టికి తెచ్చినా తక్షణం స్పందించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. మిషన్ భగీరథ పథకం పైప్లైన్కు అమర్చిన ట్యాప్లు, మీటర్లను చాలా వరకు ప్రజలు తొలగించారు. దీంతో తాగునీరు వృథాగా పోతోంది. అంతేకాకుండా నల్లాల వద్ద నిలిచి నీటి సరఫరా ఆగిపోయిన తర్వా త పైపుల్లోకి చేరి కలుషితమవుతున్నాయి. మరుసటి రోజు వండ్రు నీరు వస్తోంది. దీంతో ఆ నీటిని ప్రజలు తాగడం లేదు. చాలా మంది బుబుల్స్ కొనుగోలు చేసి దాహం తీర్చుకుంటున్నారు. 10,600 నల్లా కనెక్షన్లు వికారాబాద్ మున్సిపల్ పరిధిలో మొత్తం 16,000 ఆవాసాలు ఉండగా 70 వేల జనాభా నివసిస్తున్నారు. వీరికి మిషన్ భగీరథ నామ్స్ ప్రకారం రోజుకు ఒకరికి 100 లీటర్ల చొప్పున సరఫరా చేయాల్సి ఉంది. ఈ లెక్కన మున్సిపాలిటీకి రోజుకు 7 ఎంఎల్డీ (మిలియల్ లీటర్ ఫర్డే) నీళ్లు అవసరం. ప్రస్తుతం రోజు తప్పించి రోజు సరఫరా చేస్తున్నారు. మిషన్ భగీరథ పథకం కింద 14 ఎంఎల్డీ వాటర్ సరఫరా చేయాల్సి ఉండగా ప్రస్తుతం 10.4 ఎంఎల్డీ సరఫరా చేస్తున్నారు. మున్సిపల్ పరిధిలో 198 బోరు బావులు, 56 చేతిపంపులు ఉన్నాయి. నల్లాలు లేని చోట వాటిని వినియోగిస్తున్నారు. వర్షాకాలం ప్రారంభమైనా భూగర్భ జలాలు పెరగలేదు. ఇది ప్రజల తాగునీటి అవసరాలపై ప్రభావం చూపుతోంది. పైప్లైన్ లీకేజీలతో సతమతంవికారాబాద్ మున్సిపల్ జనాభా 70 వేలు మొత్తం నివాసాలు 16వేలు నల్లా కనెక్షన్లు 10,600 రోజుకు అవసరమైన తాగునీరు 14 ఎంఎల్డీ సరఫరా అవుతున్నది 10.4 ఎంఎల్డీ -
● తాగునీటికి తంటాలు
పరిగి: మున్సిపల్ పరిధిలోని పలు కాలనీల ప్రజలు తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రజలకు సరిపడా సరఫరా కాకపోవడంతో అవస్థలు తప్పడం లేదు. మున్సిపల్ పరిధిలో 30వేలకు పైగా జనాభా ఉంది. వీరికి రోజుకు 4.5 ఎంఎల్టీ నీరు అవసరం. కానీ 3.5ఎంఎల్టీ నీటిని మాత్రమే సరఫరా చేస్తున్నారు. 15 ట్యాంకులు, 76 బోరు మోటార్లు అందుబాటులో ఉన్నాయి. 42 కిలోమీటర్ల పైప్లైన్ ఉంది. ఏడు నెలల క్రితం కేంద్ర ప్రభుత్వం అమృత్ 2.0 కింది పరిగి మున్సిపాలిటీకి రూ.15 కోట్లు మంజూరు చేసింది. ఈ నిధులతో నాలుగు ట్యాంకులు, 10 కిలో మీటర్ల మేర పైన్లైన్ వేయాల్సి ఉండగా.. పనుల్లో ఎలాంటి ప్రగతి కనిపించడం లేదు. -
చురుగ్గా బ్రిడ్జి నిర్మాణ పనులు
తాండూరు: పట్టణ పరిధిలోని తాండూరు – కొడంగల్ మార్గంలో చిలుక వాగుపై బ్రిడ్జి నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. చిలువ వాగు ప్రక్షాళణకు రాష్ట్ర ప్రభుత్వం ఐదు నెలల క్రితం దాదాపు రూ.16 కోట్లు మంజూరు చేసింది. ఇందులో భాగంగా శిథిలావస్థకు చేరిన బ్రిడ్జి పునర్మిర్మాణ పనులు చేపట్టారు. వర్షాలు పడేలోపు పనులు పూర్తి చేయాలని ఎమ్మెల్యే బుయ్యని మనోహర్రెడ్డి ఆదేశించడంతో పనులు వేగం పుంజుకున్నాయి. ప్రస్తుతం బ్రిడ్జి పనులు 70శాతం మేర పూర్తయ్యాయి. ఈ వంతెన అందుబాటులోకి వస్తే మార్కెండేయ కాలనీ, టీచర్స్ కాలనీ, ఆదర్శనగర్, తులసీ నగర్, సాయిపూర్ కాలనీకు మేలు చేకూరుతుంది. అంతేకాకుండా వాహనాల రాకపోకలకు సులభతరం అవుతుంది. మరో వారం రోజుల వ్యవధిలో బ్రిడ్జి పైనుంచి రాకపోకలు సాగించేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. పూర్తిస్థాయి వర్షాలు పడకముందే బ్రిడ్జి నిర్మాణం పూర్తి కానుండటంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
సర్ధార్నగర్ను సందర్శించిన తమిళనాడు బృందం
షాబాద్: మండలంలోని సర్ధార్నగర్ గ్రామాన్ని తమిళనాడు బృందం గురువారం సందర్శించింది. గ్రామ పరిపాలన, పౌరసేవలు, వివిధ పథకాల అమలు బాగుందని కితాబిచ్చింది. ఎంసీఆర్హెచ్ఆర్డీ ద్వారా సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్శిక్షణ బృందం అనిల్కుమార్, వెంకటరమణ తమిళనాడు సర్పంచులు, బ్లాక్ అధ్యక్షులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, అధికారుల బృందంతో కలిసి గ్రామంలో సౌకర్యాలు, వనరులు, అభివృద్ధిని పరిశీలించారు. అనంతరం పంచాయతీ ఆవరణలో మొక్కలు నాటారు. పంచాయతీ భవనం, గ్రంథాలయం, క్రీడా ప్రాంగణం, సెగ్రిగేషన్ షెడ్, పల్లె ప్రకృతి వనాలను సందర్శించారు. -
అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయం
అనంతగిరి: సీఎం రేవంత్రెడ్డి అభివృద్ధి.. సంక్షేమాన్ని సమాంతరంగా తీసుకెళ్తున్నారని స్పీకర్ ప్రసాద్కుమార్ అన్నారు. గురువారం వికారాబాద్లోని ఆయన నివాసంలో పరిగి, తాండూరు ఎమ్మెల్యేలు రామ్మోహన్రెడ్డి, మనోహర్రెడ్డితో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శుక్రవారం హైదరాబాద్లో జరగనున్న ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమావేశానికి జిల్లా నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు స్వచ్ఛందంగా తరలిరావాలని పిలుపునిచ్చారు. గత ప్రభుత్వ పెద్దలు రాష్ట్రాన్ని దివాళా తీయించారని ఆరోపించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేకున్నా సీఎం రేవంత్రెడ్డి సమర్థవంతంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని తెలిపారు. అనంతరం చేవెళ్ల పార్లమెంట్ ఇన్చార్జ్, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ మాట్లాడారు. పార్టీ కార్యక్రమాలపై ఖర్గే దిశానిర్దేశం చేయనున్నట్లు తెలిపారు. ఆ తర్వాత పార్టీ జిల్లా అధ్యక్షుడు రామ్మోహన్రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. తాండూరు ఎమ్మెల్యే మనోహర్రెడ్డి మాట్లాడుతూ.. ఖర్గే సమావేశం చరిత్రలో నిలిచిపోనుందన్నారు. సమావేశంలో పీసీసీ ప్రధాన కార్యదర్శి సుబ్బారావు, డీసీసీబీ డైరక్టర్ కిషన్నాయక్, పార్టీ పట్టణ అధ్యక్షుడు సుధాకర్రెడ్డి, మండల అధ్యక్షుడు రాజశేఖర్రెడ్డి, ఆర్టీఏ సభ్యుడు ఎర్రవల్లి జాఫర్, మున్సిపల్ మాజీ చైర్మన్ సత్యనారాయణ, మాజీ వైస్చైర్మన్ రమేష్కుమార్, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు మైపాల్రెడ్డి, బ్లాక్ అధ్యక్షులు అనంత్రెడ్డి, కృష్ణారెడ్డి, మాజీ ఎంపీపీ నర్సింలు, రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు రత్నారెడ్డి, సీనియర్ నాయకులు నరోత్తంరెడ్డి, రాంచంద్రారెడ్డి, వాహిద్మియా, లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు. పాలన నచ్చే పార్టీలోకి చేరికలు మోమిన్పేట: కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజాపాలన నచ్చే పలువురు పార్టీలో చేరుతున్నట్లు స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ తెలిపారు. గురువారం వికారాబాద్లో బీఆర్ఎస్కు చెందిన పలువురు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలకు కట్టుబడి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని తెలిపారు. రైతు రుణమాఫీ, రైతు భరోసా, సన్న రకం వడ్లకు బోనస్, కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం సేకరించినట్లు పేర్కొన్నారు. అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నట్లు వివరించారు. కొత్త రేషన్ కార్డుల పంపిణీ, యువ వికాసం తదితర పథకాలను ప్రవేశ పెట్టిందన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ.500కే వంట గ్యాస్ సిలిండర్ అందిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో పార్టీ మండల నాయకులు సుభాష్గౌడ్, ఎరాజ్ తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల హామీలు అమలు చేస్తున్నాం ఖర్గే సమావేశాన్ని విజయవంతం చేద్దాం స్పీకర్ ప్రసాద్కుమార్ -
గాడితప్పిన పల్లెపాలన
షాబాద్: ప్రత్యేకాధికారుల పాలనలో గ్రామాలు అస్తవ్యస్తంగా మారాయి. పంచాయతీల్లో డబ్బులు లేక, ప్రభుత్వం నుంచి నిధులు ఇవ్వకపోవడంతో అభివృద్ధి కుంటు పడుతుంది. గతేడాది జనవరి 31తో గ్రామాల్లో సర్పంచ్ల పదవీకాలం ముగిసింది. అప్పటి నుంచి జిల్లా వ్యాప్తంగా ఆయా గ్రామాలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకాధికారులను నియమించింది. గ్రామ పంచాయతీల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు లేకపోవడంతో వీధి దీపాలు, బోర్ల మరమ్మతులు, పంచాయతీ ట్రాక్టర్లకు డీజిల్ కొనేందుకు ఇబ్బందులు పడుతున్నారు. ఉద్యోగులకు సైతం జీతాలు చెల్లించలేని స్థితిలో పంచాయతీలున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామాల్లో ప్రజాప్రతినిధులు లేకపోవడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రావాల్సిన నిధులు నిలిచిపోయాయి. ప్రత్యేకాధికారుల పర్యవేక్షణ పూర్తిగా కొరవడి పంచాయతీ కార్యదర్శులపై పనిభారం పెరిగింది. పల్లెల్లో పారిశుద్ధ్యం పడకేయడంతో పాటు సరైన నిర్వహణ లేక పల్లెప్రకృతి వనాలు, వైకుంఠధామాల పరిస్థితి అధ్వానంగా మారింది. పంచాయతీ కార్యదర్శులపై పనిభారం జిల్లా వ్యాప్తంగా చేవెళ్ల, ఇబ్రహీంపట్నం, షాద్నగర్, కల్వకుర్తి, మహేశ్వరం, రాజేంద్రనగర్ నియోజకవర్గాల పరిధిలోని 21 మండలాల్లో మొత్తం 526 గ్రామ పంచాయతీలున్నాయి. 16 నెలల క్రితం గ్రామాల్లో సర్పంచ్ల పదవీకాలం ముగిసింది. ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించకుండా ప్రత్యేకాధికారుల పాలన కొనసాగిస్తున్నది. దీంతో గ్రామాల్లో ప్రత్యేకాధికారుల పర్యవేక్షణ అంతంతా మాత్రంగానే ఉండడంతో పంచాయతీ కార్యదర్శులపై పనిభారం పెరిగింది. వనమహోత్సవం, ఉపాధిహామీ, పల్లెప్రగతి, ఇంటి పన్నుల వసూలు, పారిశుద్ధ్యం తదితర పనులతో పంచాయతీ కార్యదర్శులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. గ్రామ పంచాయతీల్లో నిధులు లేకపోవడంతో చెత్త సేకరణ ట్రాక్టర్ల నిర్వహణ భారంగా మారింది. పంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం, స్టేట్ ఫైనాన్స్ నిధులు రాకపోవడంతో పెద్ద సమస్యగా మారింది. ఒక్కో గ్రామ పంచాయతీలో వివిధ పనులు చేపట్టడానికి రూ.50వేల నుంచి రూ.లక్ష వరకు అప్పులు చేసి ఇబ్బందులు పడుతున్నామని కార్యదర్శులు వాపోతున్నారు. వర్షాకాలం ప్రారంభంలోనే గ్రామాల్లో పల్లెప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమం ద్వారా పారిశుద్ధ్య పనులు చేపట్టేవారు. శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ కార్యక్రమం ద్వారా ప్రజలకు సీజనల్ వ్యాధుల పట్ల అవగాహన కల్పించేవారు. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా భిన్నంగా మారింది. ప్రస్తుతం వర్షాకాలం ప్రారంభం కావడంతో పల్లెల్లో పడకేసిన పారిశుద్ధ్యంతో వ్యాధుల ముప్పు పొంచి ఉందని ప్రజలు వాపోతున్నారు. జిల్లాలో నిధులు లేక అభివృద్ధికి నోచుకోని గ్రామాలు ప్రత్యేకాధికారుల పర్యవేక్షణ కరువు పనిభారంతో ఇబ్బందులు పడుతున్న పంచాయతీ కార్యదర్శులు పల్లె ప్రకృతివనాల పరిస్థితి అధ్వానం పారిశుద్ధ్య నిర్వహణ గ్రామాల్లో పారిశుద్ధ్యం లోపించకుండా ఉండేలా పంచాయతీ కార్యదర్శులతో ప్రతీవారం సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నాం. వర్షాకాలంలో వచ్చే సీజన్ వ్యాధులపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించాం. పెండింగ్ బిల్లులు ఉన్నప్పటికీ పారిశుద్ధ్య నిర్వహణలో జాప్యం లేకుండా చూస్తున్నాం. – అపర్ణ, ఎంపీడీఓ, షాబాద్ -
పీహెచ్సీకి ఒక్కరే డాక్టర్
మోమిన్పేట: వైద్యుల కొరతతో మోమిన్పేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. కేంద్రంలో ముగ్గురు డాక్టరు ఉండాల్సి ఉండగా.. కేవలం ఒక్కరు మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. రోజుకు 100కు పైగానే బయటి రోగులు వస్తుంటారు. మోమిన్పేట, మర్పల్లి, కోటపల్లి మండలాలకు చెందిన గ్రామాల ప్రజలు అత్యవసరమై ఈ పీహెచ్సీనే సంప్రదిస్తారు. అలాంటి ఆస్పత్రిలో కేవలం ఒక్క డాక్టరు మాత్రమే విధులు నిర్వహిస్తే ఎలా అని మండలప్రజలు ప్రశ్నిస్తున్నారు. గతంలో ప్రభుత్వం ముగ్గురు వైద్యులను నియమించింది. కానీ ఉన్నతాధికారులు డిప్యూటేషన్ పేరుతో ఇతర వైద్యశాలలకు పంపించారు. డిప్యూటేషన్లను రద్దు చేయడంతో ఇద్దరు డాక్టర్లు సుజల, రషీద్ విధులు నిర్వహిస్తూ వచ్చారు. ఆ తర్వాత డా.బుచ్చిబాబును నియమించారు. కొన్ని రోజులకు డిప్యూటేషన్పై బుచ్చిబాబు, రషీద్లను పంపించారు. దీంతో కథ మొదటికి వచ్చింది. ఇద్దరిని పంపారు సుజల మాత్రమే డాక్టరుగా విధులు నిర్వహిస్తున్నారు. రోగులకు కొన్ని నెలలు సవ్యంగానే వైద్యం అందింది. కానీ ఉన్నతాధికారులు తాత్కాలిక డిప్యూటేషన్ అంటూ డాక్టరు రషీద్ను జీనుగుర్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి, బుచ్చిబాబును డీఎంహెచ్ఓ కార్యాలయానికి పంపారు. ఒక నెల అని చెప్పి అక్కడే విధులు నిర్వహించాలని పేర్కొన్నట్లు తెలిసింది. ఆస్పత్రిలో ఒక్కరే విధులు నిర్వహించడంతో రోగులకు సరైన వైద్యం సకాలంలో అందడం లేదంటున్నారు. పేదలకు నాణ్యమైన వైద్యం అందాలంటే వెంటనే డిప్యూటేషన్పై వెళ్లిన డాక్టర్లను తిరిగి రప్పించాలని, అందుకు ప్రజప్రతినిధులు చొరవ తీసుకొవాలని మండల ప్రజలు కొరుతున్నారు. పేదలకు సకాలంలో అందని వైద్యం పట్టించుకోని అధికారులు -
తప్పుల్లేకుండా ఓటరు నమోదు
ఆర్డీఓ వాసుచంద్ర దోమ: ఓటరు నమోదు, జాబితా తయారీలో బీఎల్వోలు బాధ్యతయుతంగా వ్యహరించి తప్పులు లేకుండా చేపట్టాలని ఆర్డీఓ వాసుచంద్ర సూచించారు. గురువారం మండల కేంద్రంలోని తహసీల్దార్ గోవిందమ్మ బీఎల్వోలకు నిర్వహించిన ఓటరు నమోదు శిక్షణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై పలు సూచనలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం 2025లో భాగంగా కొత్త ఓటర్ల నమోదు, ముసాయిదా ఓటర్ల జాబితాపై అభ్యంతరాలు, ఇతర మార్పులు, చేర్పుల ప్రక్రియను కొనసాగిస్తుందని చెప్పారు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి 18 ఏళ్లు నిండిన వారందరికీ ఓటు హక్కును కల్పించేందుకు బీఎల్వోలు చర్యలు తీసుకోవాలని సూచించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పోటీ చేసే అభ్యర్థులు, ఓటు వేయాలనుకునే వారికి కొత్త ఓటర్లను నమోదు చేయించేలా శ్రద్ధ తీసుకోవాలన్నారు. దరఖాస్తుల ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని, నూతన ఓటర్లు నమోదు చేసుకునేందుకు చొరవ తీసుకోవాలన్నారు. ప్రతి గ్రామంలో డెత్ ఓటర్లను తొలగించి, తప్పులు లేకుండా జాబితాను తయారు చేయాలన్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలుంటాయని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏఎల్ఎంటీ శ్రీనివాస్, రాజేశ్ రాథోడ్, ఎలెక్షన్ డీటీ అనిల్, డిప్యూటీ తహసీల్దార్ నర్సింహులు, ఆర్ఐలు సుదర్శన్, రాంచందర్రావు, సీనియర్ అసిస్టెంట్ పర్వేజ్, జూనియర్ అసిస్టెంట్లు యాదయ్య, శ్రీనివాస్, రెవెన్యూ సిబ్బంది, బీఎల్వోలు, పాల్గొన్నారు. -
దళితులపై దాడులను ఆపాలి
వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి వెంకట్ రాములు అనంతగిరి: జిల్లాలో దళితులపై జరుగుతన్న దాడులను ఆపాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి వెంకట్ రాములు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం వికారాబాద్లోని సీఐటీయూ కార్యాలయంలో కేవీపీఎస్, వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘం, సీఐటీయూ, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం దళితులపై జరుగుతున్న దాడులపై ప్రత్యేక విచారణ చేపట్టి మరోసా ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. దాడులకు కారణమైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. దళితుల హక్కులను కాపాడానికి ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో నాయకులు వెంకటయ్య, మైపాల్, శ్రీనివాస్, చంద్రయ్య, నవీన్కుమార్, సతీష్ తదితరులు పాల్గొన్నారు. -
విద్యుత్ షాక్తో వ్యక్తి మృతి
తాండూరు రూరల్: ట్రాన్స్ఫార్మర్ వద్ద విద్యుత్ షాక్కు గురై ఓ వ్యక్తి మృతిచెందాడు. తాండూరు మండలం ఎల్మకన్నెలో గురువారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. బాధిత కుటుంబ సభ్యులు, స్థానికుల కథనం ప్రకారం.. ఎల్మకన్నె గ్రామానికి చెందిన సయ్యద్ ముజాయిద్(40) తన ఎకరా పొలంలో వ్యవసాయంతో పాటు చిన్నచిన్న కరెంట్ పనులు చేస్తూ జీవనం సాగించేవాడు. మహబూబ్నగర్ జిల్లా గండీడ్ మండలానికి చెందిన గోపాల్ రాథోడ్కు ఎల్మకన్నె శివారులో ఓ ఫాంహౌస్ ఉంది. ఇందులో మామిడితోట సాగు చేస్తున్నాడు. బుధవారం రాత్రి ఫాంహౌస్కు కరెంట్ సరఫరా నిలిచిపోయింది. ఈ విషయం తెలుసుకున్న యజమాని గురువారం ఉదయం ముజాయిద్ను తీసుకురావాలని తన వద్ద పని చేసే నర్సింలును పంపించాడు. ట్రాన్స్ఫార్మర్ ఆఫ్ చేసి, ఫ్యూజ్ వైర్ వేసిన అనంతరం ముజాయిద్ కిందకు దిగాడు. ఈక్రమంలో అతని చెప్పు ట్రాన్స్ఫార్మర్ కిందిభాగంలో ఎర్తింగ్ పట్టీ కింద ఇరుక్కుపోయింది. విద్యుత్ సరఫరా పునరుద్ధరించిన అనంతరం ముజాయిద్ ఓ కట్టె సాయంతో తన చెప్పును తీసుకునే ప్రయత్నం చేస్తుండగా.. 11కేవీ జంపర్ తగిలి ఒక్కసారిగా కిందపడిపోయాడు. అపస్మారక స్థితికి చేరుకున్న అతన్ని పట్టణంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా, పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. మృతదేహంతో బైఠాయింపు.. ఫాంహౌస్ యజమాని నిర్లక్ష్యం కారణంగానే ముజాయిద్ చనిపోయాడని ఆరోపిస్తూ అతని బంధువులు, గ్రామస్తులు మృతదేహంతో ఆందోళన చేపట్టారు. సుమారు 5గంటల పాటు ఫాంహౌస్లో నిరసన తెలిపారు. మృతునికి భార్య ఫర్వీన్ బేగం, కుమారులు ముస్తాఫా, సమీర్, కుతూరు సిమ్లా ఉన్నారు. ఫర్వీన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ విఠల్రెడ్డి తెలిపారు. యజమాని నిర్లక్ష్యం.. కళ్లమందే కరెంట్షాక్కు గురై కింద పడిపోయిన ముజాయిద్ను ఆస్పత్రికి తరలించడంలో ఫాంహౌస్ యజమాని నిర్లక్ష్యంగా వ్యవహరించాడని బాధితులు, స్థానికులు ఆరోపించారు. అక్కడే ఉన్న అతని కారులో ఆస్పత్రికి తీసుకెళ్తే బతికేవాడని మండిపడ్డారు. అలా కాకుండా గ్రామంలోకి వెళ్లి ఆటో తీసుకువచ్చి, ఆస్పత్రికి వెళ్లేసరికి చాలా ఆలస్యమైందని బాధితులు వాపోయారు. ట్రాన్స్ఫార్మర్ కింద ఇరుక్కుపోయిన చెప్పును తీస్తుండగా ప్రమాదం తాండూరు మండలం ఎల్మకన్నెలో ఘటన మృతదేహంతో బాధితుల ఆందోళన -
ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు ప్రోత్సాహం
అనంతగిరి: చిన్నస్థాయి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపనకు ప్రభుత్వ ప్రోత్సాహం ఉంటుందని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ ఆఫీసర్ నవీన్ కుమార్ బసురి తెలిపారు. వికారాబాద్ కలెక్టరేట్లోని పరిశ్రమల శాఖ కార్యాలయంలో మంగళవారం జనరల్ మేనేజర్ మహేశ్వర్ అధ్యక్షతన ప్రధాన మంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్పై వ్యవసాయ, హార్టికల్చర్, మత్స్య, పశుసంవర్ధక తదితర శాఖల అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ పథకంపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్, రైతుల ఆదాయ వృద్ధి, ఉపాధి అవకాశాల పెంపు, వ్యవసాయ ఉత్పత్తులకు విలువ వృద్ధి తదితర అంశాలపై ప్రభుత్వం యోచిస్తోందన్నారు. ఈ పథకం ద్వారా ఆర్థిక సహాయం, సాంకేతిక మద్దతు, బ్రాండింగ్, ప్యాకేజింగ్, లేబులింగ్, మార్కెటింగ్ లింకేజెస్, రుణ సదుపాయం కల్పించడం జరుగుతుందన్నారు. పథకంలో భాగంగా వ్యక్తిగత యూనిట్లకు 35శాతం రాయితీ, గరిష్టంగా 10 లక్షల వరకు సబ్సిడీ ఇవ్వడం జరుగుతుందని పేర్కొన్నారు. సమూహ ప్రాజెక్టులకు (ఎఫ్సీఓలు, స్వయం సహాయక సంఘాలు, ప్రొడ్యూసర్ గ్రూపులకు) గరిష్టంగా రూ.3 కోట్ల వరకు రాయితీ పొందవచ్చని వివరించారు. వ్యవసాయ, హార్టికల్చర్, పశుసంవర్ధక, మత్స్య ఉత్పత్తుల ప్రాసెసింగ్, విలువవృద్ధి, బ్రాండింగ్, మార్కెటింగ్, రుణ మద్దతు తదితర అంశాల్లో ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకారం అందిస్తుందని తెలిపారు. సంబంధిత శాఖల అధికారులు ఈ పథకం గురించి విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు. మరిన్ని వివరాలకు జిల్లా పరిశ్రమల కేంద్రం సెల్ నంబర్ 8121009155లో సంప్రదించాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో వ్యవసాయ, పట్టు పరిశ్రమ, పశుసంవర్ధక, మత్స్య శాఖ అధికారులు పాల్గొన్నారు. తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ ఆఫీసర్ నవీన్కుమార్ బసురి పలు శాఖల అధికారులతో సమావేశం -
ఉల్లి రైతుకు సబ్సిడీ
బంట్వారం: వానాకాలంలో ఉల్లి పంట సాగు చేసే రైతులకు ఉద్యాన శాఖ తరఫున ఎంఐడీహెచ్ వారు ఎకరాకు రూ.8 వేల చొప్పున సబ్సిడీ అందజేస్తారని కోట్పల్లి వ్యవసాయ విస్తరణ అధికారి సందీప్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉల్లి పంట వేసిన రైతులు స్థానిక ఏఈఓల దగ్గర పంట వివరాలను నమోదు చేసుకోవాలన్నారు. ఐదు ఎకరాల వరకు సబ్సిడీ వర్తిస్తుందన్నారు. ఇందుకు సంబంధించి పట్టా పాసు పుస్తకం, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ పత్రాలతో పాటు ఉల్లి విత్తనాలు కొనుగోలు చేసిన రసీదు, రెండు పాస్పోర్టు సైజు ఫొటోలను ఏఈఓలకు అందజేయాలన్నారు. వానాకాలంలో ఉల్లి సాగు చేసే రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. కంది విత్తనాల పంపిణీ కొడంగల్: మండలంలోని అంగడి రాయిచూర్ గ్రామంలో 150 మంది రైతులకు బుధవారం ఉచితంగా కంది విత్తనాలు పంపిణీ చేశారు. అధిక దిగుబడినిచ్చే మేలు రకం కంది విత్తనాలను అందజేశారు. ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం కృషి చేస్తోందని కాంగ్రెస్ నాయకుడు గోడల రాంరెడ్డి అన్నారు. రైతులను ఆర్థికంగా ఆదుకోడానికి కాంగ్రెస్ ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని అన్నారు. కార్యక్రమంలో ఏఈఓ పావని తదితరులు పాల్గొన్నారు. ప్రజారోగ్యమే ప్రభుత్వ లక్ష్యం ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి పరిగి: ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందేలా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఎమ్మెల్యే టి.రామ్మోహన్రెడ్డి సూచించారు. జిల్లా వైద్యాధికారిగా డాక్టర్ లలిత బాధ్యతలు స్వీకరించిన అనంతరం బుధవారం ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు వైద్య సిబ్బంది అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. వర్షాలు పడుతున్నందున ప్రజలు సీజనల్ వ్యాధుల బారిన పడే అవకాశం ఉందని ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. వైద్యులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనంతరం డీఎంహెచ్ఓ మాట్లాడుతూ.. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు తాము ముందుంటామని పేర్కొన్నారు. ఎమ్మెల్యే బీఎంఆర్ను కలిసిన లలితాదేవి తాండూరు: తాండూరు ఎమ్మెల్యే మనోహర్రెడ్డిని జిల్లా వైద్యాధికారి లలితాదేవి బుధ వారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మెల్యే ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. సీజనల్ వ్యాధులు ప్రబల కుండా చూడాలని, ప్రజలకు సకాలంలో వైద్య సేవలు అందేలా చొరవ చూపాలని ఎమ్మెల్యే సూచించారు. అధిక ఫీజులను నియంత్రించాలి ఏబీవీపీ నాయకుల డిమాండ్ తాండూరు టౌన్: అధిక ఫీజు వసూళ్లకు పాల్పడుతున్న ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలంటూ ఏబీవీపీ నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం ఈ మేరకు మండల విద్యాధికారి వెంకటయ్య గౌడ్ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కార్పొరేట్ పాఠశాలలను తలదన్నే విధంగా తాండూరు పట్టణంలోని కొన్ని ప్రైవేటు స్కూళ్లు అధిక ఫీజు వసూళ్లకు పాల్పడుతున్నాయని ఆరోపించారు. పుస్తకాలు, నోట్ బుక్స్ వారి వద్దే కొనుగోలు చేయాలని షరతు విధిస్తున్నారని పేర్కొన్నారు. దీంతో సామాన్య ప్రజలు దిక్కుతోచని స్థితిలో ఉన్నారన్నారు. నిబంధనలు పాటించని స్కూళ్లపై చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఏబీవీపీ పట్టణ అధ్యక్షుడు నర్సింలు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అజయ్, నాయకులు నవీన్, శ్రీకాంత్, రఘు తదితరులు పాల్గొన్నారు. -
బాధ్యతగా విధులు నిర్వహించాలి
కొడంగల్: త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి ఉద్యోగి బాధ్యతగా విధులు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం మాస్టర్ ట్రైనర్స్ సూచించారు. బుధవారం కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన ఏఈఆర్ఓలు, ఏఎల్ఎంటీ, బీఎల్ఓలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు పలు సలహాలు సూచనలు ఇచ్చారు. ఎన్నికల ప్రధాన అధికారి ప్రతి రోజూ పర్యవేక్షణ ఉంటుందన్నారు. పాదర్శకంగా జవాబుదారీగా ఉండాలన్నారు. ఎన్నికల సిబ్బందికి నేటి నుంచి శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు తహసీల్దార్ విజయ్కుమార్ తెలిపారు. కొడంగల్ మండల సిబ్బందికి స్థానిక జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో ఉదయం 9నుంచి సాయంత్రం 5గంటల వరకు శిక్షణ ఉంటుందన్నారు. బొంరాస్పేట, దుద్యాల్ మండలాల సిబ్బందికి ఈ నెల 8న బొంరాస్పేట తహసీల్దార్ కార్యాలయంలో, దౌల్తాబాద్ మండల సిబ్బందికి 10వ తేదీ దౌల్తాబాద్ తహసీల్దార్ కార్యాలయంలో ఉదయం 9నుంచి సాయంత్రం 5గంటల వరకు శిక్షణ తరగతులు నిర్వహిస్తారు. వీరికి అసెంబ్లీ లెవల్ మాస్టర్ ట్రైనర్స్ రవికుమార్, అబ్దుల్ హాఖ్, క్రాంతి, సాయిలు, భీమయ్య, బుడ్డయ్య శిక్షణ ఇస్తారు. వీడియో కాన్ఫరెన్సలో మాస్టర్ ట్రైనర్స్ నేటి నుంచి శిక్షణ తరగతులు -
పోరాటాలతోనే లంబాడాలకు న్యాయం
పరిగి: హక్కుల సాధన కోసం ఎల్హెచ్పీఎస్ పో రాటం చేయడం ద్వారానే లంబాడాలకు న్యా యం జరిగిందని ఆ సంఘం రాష్ట్ర కార్యదర్శి గో వింద్నాయక్ తెలిపారు. బుధవారం పరిగి పట్టణంలో ఎల్హెచ్పీఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లంబాడా హక్కుల పోరాట సమితి కృషితోనే తండాలు గ్రామ పంచాయతీలుగా మారాయన్నారు. మా తండాల్లో.. మా రాజ్యం కావాలని వీరన్న నాయకత్వంలో ఎల్హెచ్పీఎస్ ఆవిర్భావం జరిగిందన్నారు. 10శాతం రిజర్వేషన్లు కూడా సాధించుకున్నామని పేర్కొన్నారు. లంబాడాలకు ఎక్కడ అన్యాయం జరిగినా అక్కడికి వెళ్లి వారికి అండగా నిలిచామని చెప్పారు. లంబాడీలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చని హామీలను అమలు చేయాలని కోరారు. కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు సూర్య నాయక్, కార్యదర్శి రవీందర్, నాయకులు బాలకృష్ణ, శ్రీనివాస్, సత్తయ్య పాల్గొన్నారు. ఎల్హెచ్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి గోవింద్నాయక్ -
వన మహోత్సవాన్ని సక్సెస్ చేద్దాం
తాండూరు రూరల్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వన మహోత్సవ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని డీఆర్డీఏ శ్రీనివాస్ ఆదేశించారు. బుధవారం ఎంపీడీఓ కార్యాలయ సమావేశ మందిరంలో పెద్దేముల్, తాండూరు, యాలాల, బషీరాబాద్ మండలాలకు చెందిన ఉపాధి హామీ పథకం అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భావితరాల శ్రేయస్సు కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలన్నారు. విరివిగా మొక్కలు నాటి వనమహోత్సవాన్ని విజయవంతం చేయాలన్నారు. తాండూరు పరిసరాల్లో సిమెంట్ పరిశ్రమలు, నాపరాతి గనులు, పాలి షింగ్ యూనిట్లు ఎక్కువగా ఉండటంతో కాలు ష్యం వెదజల్లుతోందని, ఈ సమస్యకు చెక్ పెట్టాలంటే మొక్కల పెంపకమే మార్గమన్నారు. ఆయా మండలాలను కేటాయించిన మొక్కల లక్ష్యాలను పూర్తి చేయాలని సూచించారు. పెండింగ్లో ఉన్న ఉపాధి పనులను వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఏపీడీ సరళ, ఎంపీడీఓ విశ్వప్రసాద్, ఏపీవోలు నరోత్తంరెడ్డి, నర్సింలు, జనార్దన్, శారద, ఈసీలు మధుసూదన్రెడ్డి, కృష్ణ, శ్రవణ్, నర్సిరెడ్డి ఉన్నారు. డీఆర్డీఏ శ్రీనివాస్ -
నడక.. నరకం
ఒక ప్రాంతం అభివృద్ధి చెందాలంటే రోడ్లే ముఖ్యం. రోడ్లు ఉంటే రవాణా వ్యవస్థ మెరుగుపడుతుంది.. తద్వారా రాకపోకలు పెరిగి ప్రజలు వ్యాపార పరంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు.. అయితే ఏళ్ల క్రితం మున్సిపాలిటీల్లో విలీనమైన గ్రామాలు, కొత్తగా వెలసిన కాలనీలకు రోడ్లు లేక అభివృద్ధికి నోచుకోవడం లేదు. వీధి దీపాలు లేక అంధకారంలో ఉంటున్నాయి. మున్సిపాలిటీల్లో అంతర్గత రహదారులు, విద్యుత్ సమస్యలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనాలు అధ్వానంగా అంతర్గత రోడ్లు ● చిన్నపాటి వర్షానికే బురదమయం ● మట్టి పోసి మమ అనిపిస్తున్న అధికారులు ● విద్యుత్ కోతలతో అవస్థలు ● వర్షం పడితే గంటల తరబడి బంద్ ● ఇబ్బందుల్లో ప్రజలు వికారాబాద్: మున్సిపాలిటీల్లో అంతర్గత రోడ్లు అభివృద్ధికి నోచుకోక అధ్వానంగా తయారయ్యాయి. జిల్లాలో నాలుగు మున్సిపాలిటీలు ఉండగా అన్నింటిలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. గతంలో వేసిన లేఅవుట్లు, వెంచర్లలో కూడా రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేయలేదు. రోడ్లపై మట్టిపోసి మమ అనిపించారు. అధికారులు సైతం మామూళ్లకు అలవాటు పడి కనీస సౌకర్యాలు ఉన్నాయా..? లేదా..? అని కూడా చూడటం లేదు. మెజార్టీ కాలనీల్లో మట్టి రోడ్లే దర్శనమిస్తున్నాయి. కాస్త వర్షం కురిసినా దారులు పూర్తిగా చిత్తడిగా మారుతున్నాయి. కొన్ని కాలనీల్లోకి ద్విచక్ర వాహనాలు కూడా వెల్లలేని పరిస్థితి ఉంది. నడుచుకుంటూ వెళ్లాలన్నా భయం వేస్తోందని పలువురు పేర్కొన్నారు. జిల్లా కేంద్రం వికారాబాద్లో 80వేల జనాభా ఉండగా ఆయా గ్రామాల నుంచి రోజూ 20వేల నుంచి 30వేల మంది ఇక్కడికి వచ్చి వెళ్తుంటారు. ప్రస్తుతం వికారాబాద్ మున్సిపల్ పరిధిలో 35 కిలోమీటర్ల పొడవున సీసీ రోడ్లు ఉండగా మరో 60 కిలోమీటర్లకు పైగా సీసీ అవసరం ఉంది. కరెంటు కోతలతో సతమతం రోజురోజుకూ కరెంటు కోతలు తీవ్ర రూపం దాల్చుతున్నాయి. ఆరు నెలలుగా ఈ సమస్య మరింత పెరిగింది. విద్యుత్ వ్యవస్థలో ఉన్న చిన్నచిన్న సమస్యల కారణంగా కోతలు విధించాల్సి వస్తోంది. వర్షం పడినంతసేపు కరెంటు కట్ చేస్తున్నారు. రాత్రి సమయంలో కోతల కారణంగా ప్రజలు నిద్రపోవడానికి ఇబ్బంది పడాల్సి వస్తోంది. కాలం చెల్లిన ఐరన్ స్తంభాలు ప్రమాదకరంగా మారాయి. పలు చోట్ల విద్యుత్ తీగలు చెట్లకు తాకుతుండటం, గాలి తీవ్రతకు తీగలు తెగి పడటం లాంటివి చోటు చేసుకుంటున్నాయి. కలెక్టరేట్కు వెళ్లే దారి వీధి దీపాలు లేవు. దీంతో అంధకారం నెలకొంది. -
దెబ్బతిన్న రోడ్లు.. జనం పాట్లు
తాండూరు: మున్సిపల్ పరిధిలోని అంతర్గత రోడ్లు దారుణంగా తయారయ్యాయి. ఆరేళ్ల క్రితం పలు గ్రామాలను తాండూరు మున్సిపాలిటీలో విలీనం చేశారు. నాటి నుంచి ఇప్పటి వరకు రోడ్ల అభివృద్ధికి నిధులు మంజూరు కాలేదు. ఏడేళ్ల క్రితం రూ.33 కోట్లతో పలు రోడ్లను అభివృద్ధి చేశారు. ప్రస్తుతం అవన్నీ పూర్తిగా పాడయ్యాయి. మున్సిపల్ పరిధిలో 36 వార్డులు ఉండగా 6, 7 వార్డుల్లో మినహా మిగతా వాటిలో పెద్దగా అభివృద్ధి పనులు జరగలేదు. రోడ్లు, మురుగు కాల్వలు, విద్యుత్ దీపాలు, తాగునీటి సరఫరాలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రతి నెలా ఆస్తి పన్ను వసూలు చేసే మున్సిపల్ అధికారులు మౌలిక వసతులు కల్పించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఆర్ కాలనీ, రాజీవ్ గృహకల్ప, ఇందిరమ్మ కాలనీలతోపాటు పట్టణ శివారు ప్రాంతాలన్నీ సమస్యలతో కొటుమిట్టాడుతున్నాయి. పలు శివాజీ చౌక్ నుంచి సెయింట్ మార్క్స్ స్కూల్ వరకు వీధి దీపాలు వెలగటం లేదు. -
గురువారం శ్రీ 3 శ్రీ జూలై శ్రీ 2025
● రహ‘దారి’ కష్టాలు8లోuకొడంగల్: కొడంగల్ మున్సిపల్ పరిధిలో అంతర్గత రోడ్లు అధ్వానంగా మారాయి. కొండారెడ్డిపల్లి, గుండ్లకుంట, పాత కొడంగల్, పాత కొడంగల్ తండా, బూల్కాపూర్, ఐనన్పల్లి గ్రామాల్లో రోడ్లు గుంతలమయంగా మారాయి. మున్సిపాలిటీలో విలీనమైన నాటి నుంచి పూర్తి స్థాయిలో రోడ్ల పనులు చేపట్టలేదనే విమర్శలు ఉన్నాయి. ఐనన్పల్లి, బూల్కాపూర్, కొండారెడ్డిపల్లి గ్రామాలకు రోడ్డు వేయాల్సి ఉంది. ప్రస్తుతం మట్టి రోడ్లే ఉన్నాయి. పాత కొడంగల్ వెళ్ల్లాంటే చెరువు కట్టపై ప్రయాణం చేయాల్సి ఉంటుంది. రేవంత్రెడ్డి సీఎం అయిన తర్వాత కొత్తగా రోడ్లు వేయడానికి నిధులు మంజూరు చేశారు. ఆయా గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాల్సి ఉంది. బూల్కాపూర్, ఐనన్పల్లి గ్రామాల్లో సుమారు రెండు వేలకు పైగా జనాభా ఉంది. 1,200మందికి పైగా ఓటర్లు ఉన్నారు. ఈ రెండు గ్రామాలకు వెళ్లాలంటే మట్టి రోడ్లే దిక్కు. ఈ మార్గంలో రాకపోకలు సాగించడానికి గ్రామస్తులు ఇబ్బంది పడుతున్నారు. వర్షాకాలంలో పరిస్థితి మరీ దారుణంగా ఉంటుంది. ఐనన్పల్లి గ్రామంలో మురుగు కాల్వలు నిర్మించాల్సి ఉంది.న్యూస్రీల్ -
అధ్యక్ష పదవికి పోటాపోటీ
బషీరాబాద్: కాంగ్రెస్ పార్టీ బషీరాబాద్ మండల అధ్యక్ష పదవికి నేతల మధ్య తీవ్ర పోటీ ఉంది. మండల కేంద్రం నుంచి తొమ్మిది మంది పాత నేతలు, కొత్తగా వచ్చిన మరో వ్యక్తి దరఖాస్తు చేసుకున్నారు. ప్రస్తుత మండల అధ్యక్షుడు కలాల్ నర్సింలు, సీనియర్ నాయకులు రామునాయక్, వడ్డే ఉల్గప్ప, శంకర్నాయక్, రాజవర్ధన్రెడ్డి, మాణిక్రావు, నరేష్ చౌహన్, సిద్ధార్థ్, వాల్మికి నరేష్, కంసాన్పల్లి వెంకట్రెడ్డి రేసులో ఉన్నారు. రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పదవీ కోసం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు వెంకటేష్ మహరాజ్ దరఖాస్తు చేశారు. వీరితో పాటు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సెల్ వంటి అనుబంధ సంఘాల మండల అధ్యక్ష పదవుల కోసం మరో 30 మంది వరకు దరఖాస్తు చేసుకున్నట్లు తెలిసింది. అయితే 2017 కంటే ముందు నుంచి పార్టీలో ఉన్న వారికే అధ్యక్ష పదవి వచ్చే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా యువతకే అవకాశం ఇవ్వాలని యువజన కాంగ్రెస్ నాయకుడు మాణిక్రావు డిమాండ్ చేస్తున్నారు. తాను కూడా పదవి ఆశిస్తున్నట్లు తెలిపారు. ఫైనాన్స్ కమిషన్ సభ్యుడు రమేష్ మహరాజ్ సూచన మేరకు ఎంపిక చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. బరిలో పది మంది ఆశావహులు ఎమ్మెల్యేను ప్రసన్నం చేసుకునే పనిలో నేతలు -
భారతి సిమెంట్కు తిరుగు లేదు
అనంతగిరి: సిమెంట్ వ్యాపారంలో తిరుగులేని సంస్థగా ఎదుగుతున్న భారతి సిమెంట్ అల్ట్రాఫాస్ట్ పేరుతో ఫాస్ట్ సెట్టింగ్ సిమెంట్ 5స్టార్ గ్రేడ్ను తెలంగాణలో ప్రవేశపెట్టిందని, సంస్థ టెక్నికల్ ఇంజనీర్ సామ్రాట్ తెలిపారు. ఈ మేరకు బుధవారం వికారాబాద్లోని ఓంసాయి ట్రేడర్స్ డీలర్ షాప్లో తాపీ మేసీ్త్రల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మార్కెట్లో లభించే ఇతర సిమెంట్లతో పోలిస్తే భారతి అల్ట్రాఫాస్ట్తో నిర్మాణ ప్రక్రియ వేగంగా పూర్తవుతుందన్నారు. స్లాబులు, పిల్లర్లు, బ్రిడ్జిలు, రహదారుల నిర్మాణానికి ఈ సిమెంట్ సరైన ఎంపిక అని తెలిపారు. అల్ట్రాఫాస్ట్ వినియోగదారులకు ఉచిత సాంకేతిక సాయం అందజేస్తామని, స్లాబ్, కాంక్రీట్ వేసే సమయంలో నిపుణులైన భారతి సిమెంట్ ఇంజనీర్లు సైట్ వద్దకు వచ్చి సహాయపడుతారని స్పష్టంచేశారు. మార్కెట్లో దొరికే ఇతర సిమెంట్లతో పోలిస్తే భారతి అల్ట్రాఫాస్ట్ ధర బ్యాగుకు 20 రూపాయలు అధికంగా ఉంటుందన్నారు. అనంతరం 60 మంది తాపీ మేసీ్త్రలకు రూ.లక్ష చొప్పున ప్రమాద బీమా బాండ్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ మేనేజర్ వీరాంజనేయరెడ్డి, డీలర్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. సంస్థ టెక్నికల్ ఇంజనీర్ సామ్రాట్ తాపీ మేసీ్త్రలకు ప్రమాద బీమా బాండ్ల అందజేత -
బడుల్లో గ్రంథాలయాలు
దౌల్తాబాద్: విద్యార్థుల్లో పఠనాసక్తి పెంచడానికి విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వం వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కోసం గ్రంథాలయంలో పుస్తకాలను అందుబాటులోకి తీసుకువచ్చింది. మండలంలోని 33 గ్రామ పంచాయతీల్లో 41 పాఠశాలలున్నాయి. ఇందులో నుంచి 12 ప్రాథమిక, 4 ప్రాథమికోన్నత పాఠశాలలకు ఎంపిక చేశారు. వాటికి ప్రభుత్వం గ్రంథాలయ పుస్తకాలను అందజేసింది. రెండు భాషల్లో.. నేషనల్ బుక్స్ ట్రస్ట్, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజి ఆధ్వర్యంలో గ్రంథాలయ పుస్తకాలను రూపొందించారు. నీతి కథలతో విద్యార్థుల్లో మేథా సంపత్తి పెంపొందించేలా పుస్తకాలను తీర్చిదిద్దారు. తెలుగు, ఆంగ్ల భాషల్లో అందమైన బొమ్మతలతో పిల్లలను ఆకట్టుకునేలా పాఠ్యాంశాలు ఉన్నాయి. అభ్యసన సామర్థ్యాలతో పాటు విద్యా ప్రగతికి దోహదం చేసేలా ఉన్నాయి. చదువు విలువ తెలిసేలా అందులో పాఠ్యాంశాలను పొందుపర్చారు. ఒక్కో పాఠశాలకు 117 రకాల పుస్తకాలు సమకూర్చుతున్నారు. పాఠశాలల్లో ప్రత్యేక గదిని కేటాయించి గ్రంథాలయంగా మార్చి విద్యార్థులు నిత్యం పుస్తకాలు చదివేలా ఒక పీరియడ్ను సైతం విద్యాశాఖ అధికారులు నిర్ణయించారు. విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాల పెంపే లక్ష్యం ఒక్కో పాఠశాలకు 117 పుస్తకాలు రోజూ చదివించాలి విద్యార్థులతో గ్రంథాలయ పుస్తకాలను ప్రతి రోజు చదివించాలి. అర్థం కాని విషయాలను ఉపాధ్యాయులు చిన్నారులకు వివరించాలి. విద్యా సంవత్సరం ముగిసే వరకు పుస్తకాలను భద్రంగా ఉంచాలి. ఆకట్టుకున్న పుస్తకాలపై విద్యార్థులు దృష్టి సారించేలా చూడాలి. – వెంకట్స్వామి, ఎంఈఓ, దౌల్తాబాద్ -
అక్రమార్కులపై చర్యలు తీసుకోండి
బషీరాబాద్: మండలంలోని ఎక్మాయి గ్రామంలో ఇందరిమ్మ ఇళ్ల కేటాయింపుల్లో అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు కె.శ్రీనివాస్ డిమాండ్ చేశారు. బుధవారం బషీరాబాద్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట గ్రామస్తులతో కలిసి సీపీఎం పార్టీ నాయకులు ధర్నాకు దిగారు. గ్రామంలోని అధికార పార్టీకి చెందిన నలుగురు నాయకులు డబ్బులు తీసుకొని ఇళ్లు కేటాయించారని ఆరోపించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఎక్మాయిలో ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో 70 శాతం అనర్హులకు ఇళ్లు కేటాయించారన్నారు. ముఖ్యంగా ఎస్సీ, బీసీ, మైనార్టీ, పేదలకు ఇళ్లు ఇవ్వకుండా ఉన్నత వర్గాలకు చెందిన వారికి, కాంగ్రెస్ నాయకుల కుటుంబ సభ్యులకు ఇచ్చారని మండిపడ్డారు. లబ్ధిదారుల దగ్గర డబ్బులు వసూలు చేసిన నాయకులపై ఎమ్మెల్యే మనోహర్రెడ్డి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. లేకుంటే ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని బాధితులతో ముట్టడిస్తామని హెచ్చరించారు. ఆందోళనలో ఇళ్ల అక్రమాలపై సాక్షి దినపత్రికలో జూన్ 27న ప్రచురితమైన ‘ఇందిరమ్మ’లో ఇంటి దొంగలు కథనం క్లిప్పింగ్ను ప్రదర్శించారు. అనంతరం తహసీల్దార్ షాహేదబేగంకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు సురేష్, సీపీఎం మండల నాయకులు సురేష్, వెంకటేశ్, గ్రామస్తులు గజలప్ప, శ్యామప్ప, అమృతమ్మ, లక్ష్మి, మంజుల, రేణుక, జె.లక్ష్మి, నర్సిములు, హన్మంతు తదితరులు పాల్గొన్నారు. సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు శ్రీనివాస్ -
పుస్తకాల దందాను సహించేది లేదు
తాండూరు టౌన్: ప్రైవేటు స్కూళ్లలో పాఠ్య పుస్తకాల దందాను సహించేది లేదని ఎంఈఓ వెంకటయ్యగౌడ్ హెచ్చరించారు. పట్టణంలోని ఓ కార్పొరేట్ పాఠశాలలో పుస్తకాలు, నోటుబుక్కులతో పాటు స్టేషనరీ సామగ్రిని అధిక ధరలకు విక్రయిస్తున్నారని ఫిర్యాదు అందుకున్న ఆయన బుధవారం తనిఖీలు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా నిల్వ చేసిన పుస్తకాల గదిని సీజ్ చేశారు. ప్రైవేటు స్కూళ్ల దోపిడీని అరికట్టాలని బీసీ జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. విద్యుదాఘాతంతో గేదె మృతి బొంరాస్పేట: మండల పరిధిలోని ఎన్కేపల్లిలో బుధవారం విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ వద్ద షాక్కు గురై పాడి గేదె మృతి చెందింది. గ్రామానికి చెందిన గొల్ల మల్లప్పకు చెందిన గేదె గడ్డి మేత మేస్తూ పొలంలో ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్కు తగిలి మృత్యువాత పడింది. రూ.1.50 లక్షలు నష్టపోయానని బాధితుడు వాపోయాడు. స్కూల్ పిల్లలకు తప్పిన ముప్పు మొయినాబాద్: డ్రైవర్ నిర్లక్ష్యంతో స్కూల్ బస్సు పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ సంఘటన నాగిరెడ్డిగూడలో బుధవారం ఉదయం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మొయినాబాద్లోని ఓ కార్పొరేట్ స్కూల్ బస్సు బాకారం నుంచి పిల్లలను ఎక్కించుకుని నాగిరెడ్డిగూడ వెళ్తుండగా గ్రామ సమీపంలో రోడ్డు కిందికి దూసుకెళ్లింది. ఒకవైపు చక్రాలు పంటపొలంలోకి దూసుకెళ్లడంతో బస్సు ఆగిపోయింది. ఈ సమయంలో బస్సులో సుమారు 15 మంది విద్యార్థులు ఉన్నారు. ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో ప్రమాదం తప్పింది. డ్రైవర్ నిర్లక్ష్యంగా బస్సు నడపడంతోనే రోడ్డు కిందికి దూసుకెళ్లినట్లు ప్రత్యక్ష సాక్షులు మండిపడ్డారు. ఈ ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. స్కూల్ బస్సులు వరుస ప్రమాదాల బారిన పడుతున్న నేపథ్యంలో వీటి ఫిట్నెస్పై తల్లిదండ్రులు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నారు. కాడెద్దుల అపహరణ నందిగామ: రోజంతా అరక కొట్టి రాత్రివేళ చెట్టుకింద కట్టేసిన కాడెద్దులు అపహరణకు గురైన సంఘటన నందిగామలో చోటు చేసుకుంది. ఎస్హెచ్ఓ ప్రసాద్ కథనం ప్రకారం.. స్థానికంగా ఉండే శివగళ్ల జంగయ్యకు గ్రామ శివారులోని జాతీయ రహదారి పక్కన వ్యవసాయ భూమి ఉంది. సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు పొలంలో తన ఎద్దులతో అరక తోలాడు. రాత్రి ఎప్పటిలాగే పొలం వద్ద ఓ చెట్టుకు ఎద్దులను కట్టేసి ఇంటికి వెళ్లిపోయాడు. మంగళవారం ఉదయం వచ్చి చూసే సరికి అవి కనపడలేదు. దీంతో తెలిసిన వారి వద్ద, పరిసర గ్రామాలలో ఎంత వెతికినా జాడ కనపడలేదు. దీంతో పోలీస్ స్టేషన్ను ఆశ్రయించి ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ ప్రసాద్ తెలిపారు. ఎద్దుల విలువ సుమారు రూ.లక్ష యాభై వేలు ఉంటుందని వాపోయాడు. -
తెల్లచందనం స్మగ్లర్ల అరెస్ట్
చేవెళ్ల: పుష్ప సినిమా తరహాలో.. అక్రమంగా తరలిస్తున్న టన్ను (1,000 కిలోల) తెల్లచందనాన్ని పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటనలో ఐదుగురిపై కేసు నమోదైంది. ఇందుకు సంబంధించిన వివరాలను బుధవారం చేవెళ్ల ఏసీపీ బి.కిషన్ వెల్లడించారు. మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులకు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు చేవెళ్ల పోలీసులతో కలిసి మంగళవారం మండలంలోని బస్తేపూర్ వద్ద వాహనాల తనిఖీ నిర్వహించారు. ఎంహెచ్ 25 ఏజే 3689 నంబరు కలిగిన డీసీఎం వ్యాన్ను తనిఖీ చేశారు. వ్యాన్ బాడీ మొత్తం ఖాళీగా ఉండగా.. డ్రైవర్తో పాటు అందులో ఉన్న మరో ఇద్దరు వ్యక్తులను ఎక్కడి నుంచి వస్తున్నారని ప్రశ్నించారు. పొంతన లేని సమాధానాలు చెప్పడంతో అనుమానం వచ్చిన పోలీసులు డ్రైవర్ వెనక భాగంలో ప్రత్యేకంగా ఓ చిన్నపాటి అరను తయారు చేయించినట్లు గమనించారు. దీన్ని తెరిపించి చూడగా ప్లాస్టిక్ బ్యాగులలో చిన్నచిన్న ముక్కలుగా ఉన్న తెల్లచందనం(శ్రీగంధం) చెక్కలను గుర్తించారు. ఫారెస్ట్ అధికారులను పిలిపించి నిర్ధారించుకున్న అనంతరం ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వెయ్యి కిలోల బరువున్న గంధం చెక్కల విలువ రూ.35 లక్షలు ఉంటుందని ఏసీపీ తెలిపారు. మహారాష్ట్రలోని సంగ్లీ జిల్లా జాత్ తహసీల్ ఉంట్వాడీ గ్రామం నుంచి చేవెళ్ల నియోజకవర్గంలోని షాబాద్ మండలం నాగరగూడలోని ఆంధ్ర పర్ఫ్యూమ్ ఫ్యాక్టరీకి వీటిని తరలిస్తున్నారు. పట్టుబడిన ముగ్గురిలో తెల్లచందనం సాగు చేస్తున్న మహారాష్ట్రకు చెందిన విజయ్ హన్మంత్ మానే, డీసీఎం డ్రైవర్ అబ్దుల్ అజీజ్, ఫ్యాక్టరీ సూపర్వైజర్ సోహెబ్ ఉన్నారు. అనుమతులు లేకుండా తెల్లచందనం కొనుగోలు చేసి, తీసుకువస్తున్న ఫ్యాక్టరీ యజమాని అబ్దుల్లా కున్హి, కంపెనీ మేనేజర్ సాదిక్పై కూడా కేసు నమోదు చేశారు. ప్రస్తుతం వీరు పరారీలో ఉన్నారు. సదరు ఐదుగురు వ్యక్తులపై అటవీ చట్టం కింద కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. పట్టుబడిన ముగ్గురు గతంలో ఒకే పర్ఫ్యూమ్ కంపెనీలో పనిచేశారని పోలీసులు వెల్లడించారు. డీసీఎంతో పాటు నాలుగు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. సమావేశంలో చేవెళ్ల సీఐ భూపాల్శ్రీధర్, మాదాపూర్ ఎస్ఓటీ సీఐ సంజయ్కుమార్, ఫారెస్ట్ అధికారి రవికుమార్, ఎస్ఐలు వనం శిరీష, ఎస్ఓటీ ఎస్ఐలు సతీష్, బారాజ్, సిబ్బంది పాల్గొన్నారు. అక్రమంగా తరలిస్తున్న వెయ్యి కిలోల శ్రీగంధం చెక్కలు స్వాధీనం ఐదుగురిపై కేసు నమోదు, పరారీలో ఇద్దరు పట్టుబడిన సరుకు విలువ రూ.35 లక్షలు -
నగదు రహిత ఆరోగ్య కార్డులివ్వాలి
ధారూరు: నగదు రహిత ఆరోగ్య కార్డులను ఉపాధ్యాయ, ఉద్యోగులకు ఇవ్వాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం(తపస్) జిల్లా అధ్యక్షుడు కె.అంజిరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం మండల పరిధిలోని పలు పాఠశాలలను ఆయన సంఘం నాయకులతో కలిసి సందర్శించారు. ఉపాధ్యాయుల సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉద్యోగ, ఉపాధ్యాయులకు పెండింగ్లో పీఆర్సీ, డీఏను వర్తింప జేయాలని కోరారు. సంఘంలో పెద్ద ఎత్తున సభ్యత్వాలు తీసుకున్నారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కమాల్రెడ్డి, మండల శాఖ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎల్.రాజు, బాల్రాజ్లు, కోశాధికారి విజయ్, జిల్లా బాధ్యులు రాజ్కుమార్, సంతోష్, సభ్యులు సుధాకర్రెడ్డి, అంజిరెడ్డి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. తపస్ జిల్లా అధ్యక్షుడు అంజిరెడ్డి -
హనుమాన్ విగ్రహ ధ్వంసం
అనంతగిరి: హనుమాన్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిని కఠినంగా శిక్షించాలని హిందూ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. వికారాబాద్లోని సుభాష్నగర్ ఐటీఐ శిక్షణ కేంద్రంలో ఉన్న హనుమాన్ దేవాలయంలో మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత గుర్తుతెలియని దుండగులు స్వామివారి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. బుధవారం ఉదయాన్నే ఈ విషయం తెలుసుకున్న స్థానికులు, హిందూ సంఘాల నాయకులు ఆలయం వద్దకు చేరుకుని విగ్రహాన్ని పరిశీలించి, పోలీసులకు సమాచారం ఇచ్చారు. అనంతరం పట్టణంలోని ప్రధాన రోడ్డుపై నిరసన వ్యక్తంచేశారు. సీసీ కెమెరాలను పరిశీలించి, దుండగులను పట్టుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో వీహెచ్పీ జిల్లా కార్యదర్శి ప్రశాంత్ కుమార్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ చిగుల్లపల్లి రమేష్కుమార్, బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు సదానందరెడ్డి, పట్టణ అధ్యక్షురాలు యాస్కి శిరీష, మాజీ కౌన్సిలర్లు లక్ష్మణ్, శ్రీదేవి, పోకల సతీష్, బీజేవైఎం రాష్ట్ర నాయకులు చరణ్రెడ్డి, శ్రీకాంత్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వికారాబాద్లో హిందూ సంఘాల ఆందోళన దుండగులను పట్టుకోవాలని బీజేపీ నేతల డిమాండ్ -
ఫార్మర్ రిజిస్ట్రీ అంతంతే!
వ్యవసాయ రంగాన్ని డిజిటలైజేషన్ చేయాలన్న సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఫార్మర్ రిజిస్ట్రీ ప్రక్రియ మందకొడిగా సాగుతోంది. ఓ పక్క సర్వర్ మొరాయింపు, ఇంకోపక్క వ్యవసాయ పనుల్లో రైతుల నిమగ్నం, మరోవైపు అవగాహన లేమి.. వెరసి పంటల ఆన్లైన్ నమోదుకు అడ్డంకిగా మారాయి. కొడంగల్ రూరల్: గ్రామాల్లో ఫార్మర్ రిజిస్ట్రీ నామమాత్రంగానే కొనసాగుతోంది. వ్యవసాయ పనుల్లో బిజీగా ఉండడంతో నమోదు చేసుకోవడానికి రైతులు ఆసక్తి చూపడం లేదు. దీంతో ఫార్మర్ రిజిస్ట్రీ ఉద్దేశం నీరుగారుతోంది. వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో రైతువేదిక, గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో రైతులకు అందుబాటులో ఉంటూ ఫార్మర్ రిజిస్ట్రీ కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. మండలంలో 17,449 మంది కర్షకులు ఉండగా కేవలం 5,825 మంది మాత్రమే(33శాతం) రిజిస్ట్రీ చేసుకున్నారని అధికారులు చెబుతున్నారు. మే 5 నుంచే ప్రారంభం వ్యవసాయరంగంలో రైతుల వివరాలను డిజిటల్ రూపంలో నమోదు చేయడానికి, వారి భూమి యాజమాన్యం, పథకాల లభ్యత అనుసంధానం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఫార్మర్ రిజిస్ట్రీ కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో నమోదు చేసుకున్న రైతులకు ఆధార్కార్డు మాదిరి 11 అంకెలతో కూడిన ఐడీని అందిస్తారు. ఈ ప్రక్రియను మే నెల 5వ తేదీ నుంచి వ్యవసాయ అధికారులు ప్రారంభించారు. అప్పటి నుంచి రైతులు ధాన్యం అమ్మకాలు, కొనుగోలు కేంద్రాలకు వెళ్లడం వంటి పనులు మాత్రమే ఉండడంతో చక చకా ఫార్మర్ రిజిస్ట్రీ చేసుకున్నారు. అనంతర పరిణామాలలో వ్యవసాయ పనులు ప్రారంభం కావడంతో రైతులు రిజిస్ట్రీ ప్రక్రియకు ఆసక్తి చూపడం లేదు. పథకాలకు ఐడీ కచ్చితం ఫార్మర్ రిజిస్ట్రీలో రైతులకు అందించే ఐడీ కీలకంగా మారనుందని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. ఈ ఐడీతోనే రానున్న రోజుల్లో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన రైతుల పథకాలు దక్కనున్నాయని అవగాహన కల్పిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో చేపట్టనున్న పంటల నమోదు కార్యక్రమంలో ఈ ఐడీని ఉపయోగించనున్నారు. క్షేత్రస్థాయిలో వ్యవసాయాధికారులు గ్రామాల్లోని రైతు వేదికలు, గ్రామపంచాయతీ కార్యాలయాలలో ఫార్మర్ రిజిస్ట్రీపై అవగాహన కల్పిస్తున్నట్లు చెబుతున్నారు. భూమి ఉన్న ప్రతిరైతు తప్పనిసరిగా ఈ ప్రత్యేక రైతు విశిష్ట గుర్తింపు సంఖ్యను పొందాలని సూచిస్తున్నారు. రైతులు తమ పట్టాదారు పాస్బుక్, ఆధార్కార్డు జిరాక్స్లను మొబైల్ నంబర్ను వ్యవసాయ విస్తరణ అధికారులకు అందించాలని పేర్కొంటున్నారు. ఫార్మర్ రిజిస్ట్రీ ఐడీతో ముఖ్యంగా పీఎం కిసాన్ నిధి, ఫసల్ బీమా యోజన, రాష్ట్రీయ కిసాన్ వికాస్ యోజన వంటి పథకాల అమలులో ఐడీ తప్పనిసరిగా అవసరమవుతుందని నొక్కి చెబుతున్నారు. రైతులు తప్పనిసరిగా ఫార్మర్ రిజిస్ట్రీ చేయించుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. సాంకేతిక సమస్యలతో ఇబ్బంది దోమ: మండలంలో 28 శాతమే ఫార్మర్ రిజిస్ట్రీ నమోదు పూర్తయిందని అధికారులు పేర్కొంటున్నారు. మొత్తం 36 గ్రామ పంచాయతీలలో 16,606 మంది రైతులకు ఉండగా, ఐదు వ్యవసాయ క్లస్టర్లు ఉన్నాయి. క్లస్టర్కు ఓ వ్యవసాయ విస్తరణ అధికారి విధులు నిర్వహించగా, ఆయా గ్రామాలకు వెళ్లి ఫార్మర్ రిజిస్ట్రీ ప్రక్రియను కొనసాగిస్తున్నారు. చాలా చోట్ల సర్వర్లు మొరాయిస్తున్నాయని అధికారులు, రైతులు వాపోతున్నారు. రైతు భరోసా, పంటల నమోదు, విత్తనాలు, ఎరువుల సరఫరా తదితర విషయాల్లో వ్యవసాయ విస్తరణ అధికారులు ఇప్పటికే బీజీ ఉండగా, కేంద్ర ప్రభుత్వం అదనంగా మరో ఫార్మర్ రిజిస్ట్రీని తీసుకురావడంతో ఏఈఓలు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. దీనికి తోడు సాంకేతిక సమస్యలతో ఇబ్బందులు అధికమవుతున్నాయి. వ్యవసాయ పనుల్లో రైతులు బిజీ నమోదు ప్రక్రియకు ముందుకు రాని కర్షకులు తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని అధికారుల సూచన -
కార్మిక వ్యతిరేక విధానాలపై పోరు
హయత్నగర్: కేంద్ర ప్రభుత్వ కర్షక, కార్మిక వ్యతిరేక విధానాలపై ఉద్యమించాలని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఆందోజు రవీంద్రాచారి, కౌన్సిల్ సభ్యుడు ముత్యాల యాదిరెడ్డి డిమాండ్ చేశారు. కేంద్రంలో బీజేపీ సర్కారు తీరుకు నిరసనగా ఈ నెల 9న తలపెట్టనున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కోరారు. ఈ మేరకు అబ్దుల్లాపూర్మెట్ మండల ఏఐటీయూసీ ఆధ్వర్యంలో బుధవారం కుంట్లూరులోని రావినారాయణరెడ్డి కాలనీలో వాల్ పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్, ఫిక్స్డ్ టర్మ్, అప్రెంటీస్, థర్డ్ పార్టీ ట్రైనీలుగా పని చేస్తున్న కార్మికులను పర్మినెంట్ చేయాలని, కనీస వేతనం రూ.26వేలు ఇవ్వాలని, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. అలాగే ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యం కల్పించాలన్నారు. ఉపాధి హామీ పథకాన్ని పట్టణాలకు విస్తరించాలని, వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు ధర ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ మండల అధ్యక్షుడు హరిసింగ్నాయక్, నాయకులు లక్ష్మణ్, నర్సింహ, ప్రసాద్, నవనీత తదితరులు పాల్గొన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యవర్గసభ్యుడు రవీంద్రాచారి -
కారడవిలో ఉరేసుకున్న వ్యక్తి
ఆర్థిక ఇబ్బందులే కారణమని కుటుంబీకుల ఫిర్యాదు అనంతగిరి: వికారాబాద్కు సమీపంలోని అనంతగిరిగుట్ట అటవీ ప్రాంతంలో ఓ వ్యక్తి చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన బుధవారం స్థానికంగా కలకలం రేపింది. సీఐ భీంకుమార్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. వనపర్తి జిల్లా గోపాల్పేట మండలం ఏదుట్ల గ్రామానికి చెందిన సంగనమోని నరసింహ పెద్ద కుమారుడైన రమేశ్(27) ప్రైవేట్ జాబ్ చేసుకుంటూ హైదరాబాద్లో నివాసం ఉంటున్నారు. కాగా గత నెల 29న రాత్రి పని నిమిత్తం ఇంటి నుంచి బయటికి వెళ్లిన రమేశ్ ఎంతసేపటికి తిరిగి రాకపోవడంతో సాధ్యమైన ప్రాంతాల్లో వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో మంగళవారం గుడిమల్కాపూర్ పీఎస్లో ఫిర్యాదు ఇవ్వగా మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రమేశ్ ఫోన్ లొకేషన్ అనంతగిరిగుట్ట ప్రాంతంలో చూపించింది. దీంతో తెల్లవారుజామునుంచి వెతుకుతుండగా అతని స్కూటీ వ్యూ పాయింట్ దగ్గర పార్క్ చేసి ఉండటంతో పరిసరాల్లో వెతికారు. ఈ క్రమంలో ఓ చెట్టుకు ఉరేసుకున్న ఆయన మృతదేహం లభ్యమయింది. ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్నాడని మృతుడి తండ్రి ఫిర్యాదు చేశారు. మృతుడికి భార్య, ఓ పాప ఉంది. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు. పెద్దచెరువులో మట్టి తవ్వకాలు! మీర్పేట: పెద్దచెరువు (ఐల్యాండ్)లో నిబంధనలకు విరుద్ధంగా బుధవారం ఉదయం మట్టి తవ్వకాలు చేపట్టారు. ఈ విషయమై కార్పొరేషన్ అధికారులను వివరణ కోరగా.. మాకేం సంబంధం లేదని తెలిపారు. ఇదిలా ఉండగా హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో చెరువు కట్టపై మొక్కలు నాటేందుకు.. కొద్దిగా మట్టి తీసుకెళ్తున్నామని అక్కడే ఉన్న కాంట్రాక్టర్ తెలిపారు. వాస్తవానికి బయటనుంచి మట్టి తీసుకురావాల్సి ఉన్నా.. చెరువు స్థలంలో తవ్వకాలు చేపట్టడంపై స్థానికులు మండిపడుతున్నారు. ఇలా తవ్విన గుంతల్లో నీళ్లు నిలిచి ప్రమాదాలకు కారణమవుతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. చెరువు స్థలం చుట్టూ ఉన్న ఫెన్సింగ్ను ధ్వంసం చేసి జేసీబీ, ట్రాక్టర్లతో లోనికి వెళ్లారని ఆరోపించారు. -
తాతను చూసేందుకు వచ్చి..
బషీరాబాద్: తాతను చూసేందుకు నగరం నుంచి వచ్చిన యువకుడు రోడ్డు ప్రమాదంలో మృత్యువాతపడ్డాడు. ఈ ఘటన బషీరాబాద్ పోలీస్స్టేషన్ పరిధి ఇందర్చెడ్ సమీపంలో చోటు చేసుకుంది. ఎస్ఐ శంకర్, మృతుడి బంధువులు తెలిపిన ప్రకారం.. మూడు రోజుల క్రితం మండల కేంద్రంలోని జయంతి కాలనీలో నివాసం ఉండే సంకుల బోనప్పను చూసేందుకు తన మనవడు బైలుపాటి రాము(25) హైదరాబాద్ నుంచి వచ్చాడు.మంగళవారం చేపలు తీసుకువచ్చేందుకు తాతామనుమడు కలిసి బైక్పై ఇందర్చెడ్ సమీపంలోని చెరువుకు వెళ్లారు. చేపలు విక్రయించే వారు లేక వెనుదిరిగారు. ఈ క్రమంలో ఇందర్చెడ్– బషీరాబాద్ మార్గంలో మూలమలుపు వద్ద బైక్ అదుపుతప్పి రోడ్డు పక్కన పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో రాము తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. బోనప్ప గాయాలతో పడి ఉండడంతో గమనించిన వాహనదారులు వారి కుటుంబీకులకు సమాచారం ఇచ్చారు. వెంటనే వారు అక్కడకు చేరుకుని తాండూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలంలో వివరాలు సేకరించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తాండూరు జిల్లా ఆస్పత్రికి తరలించారు. కాగా తల్లిదండ్రులు లేని మృతుడికి భార్య మంగమ్మ గర్భిణి, మూడేళ్ల కూతురు ఉంది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఆలయ అభివృద్ధికి కృషి
తాండూరు రూరల్: మండలంలోని కొత్లాపూర్లో వెలసిన రేణుక ఎల్లమ్మ ఆలయ అభివృద్ధికి దేవాదాయ శాఖ నుంచి రూ.కోటి మంజూరయ్యేలా కృషి చేస్తానని ఎమ్మెల్యే మనోహర్రెడ్డి తెలిపారు. మూడు రోజులుగా ఆలయంలో కొనసాగుతున్న మృత్యుంజయ హోమం మంగళవారంతో ముగిసింది. కర్ణాటక మాజీ మంత్రి అరవింద్ లింబావళితో కలిసి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఈ ఆలయం ఎంతో పురాతనమైనదని పేర్కొన్నారు. సీఎం రేవంత్రెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖతో మాట్లాడి నిధులు మంజూరయ్యేలా చూస్తానని తెలిపారు. త్వరలో కల్యాణ మండపం, స్నానపు గదులు, మరుగుదొడ్ల నిర్మాణ పనులు ప్రారంభిస్తామని చెప్పారు. నెలరోజుల పాటు జరిగే జాతరకు తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి వేల సంఖ్యలో భక్తులు వస్తారని వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ నవీన్రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ బాల్రెడ్డి, డీసీసీబీ వైస్ చైర్మన్ రవిగౌడ్, నాయకులు సాయిలు, గోపాల్, రాందాస్, పండరి, రాంచెంద్రారెడ్డి, వడ్డె శ్రీను, ప్రదీప్రెడ్డి, వెంకట్రెడ్డి, డైరక్టర్లు రాజు, లాల్యనాయక్, లాలయ్యగౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే మనోహర్రెడ్డి ముగిసిన మృత్యుంజయ హోమం -
పొరపాట్లను సరిచేశాం
మండలంలో ఉన్న జాబ్కార్డుల్లో తప్పులు లేకుండా, కార్డుదారుల్లో నమోదైన పొరపాట్లను, అర్హులను ఎంపిక చేసేందుకు అన్ని సవరించాం. అర్హులైన వారిని గుర్తించేలా కొన్ని జాబ్ కార్డులను తీసివేశాం. దీంతో లబ్ధిదారుల ఎంపిక సులువుగా ఉంటుంది. – ఇలియాస్, ఎన్ఆర్ఈజీఎస్ ఏపీఓ, బొంరాస్పేట మంచి పథకం భూమిలేని వ్యవసాయ కార్మిక కుటుంబాలకు, ఉపాధి హామీ కూలీ కుటుంబాలకు, అడ్డా కూలి కుటుంబాలకు ఈ పథకం ఆర్థిక భద్రత కల్పించనుంది. ఏడాదికి రూ.12 వేల చొప్పున ఖరీఫ్, రబీ సీజన్లలో అందించనున్నారు. ప్రస్తు త సీజన్లో జిల్లాలో 1.5లక్షల మంది ఉపాధి ప నులు చేయగా అందులో సుమారు 8వేల మంది అర్హులు లబ్ధి పొందే అవకాశం ఉంది. ఇదివరకు భూమి ఉన్న వారికే రైతుబంధు, భీమా ఉండేది. ప్రస్తుతం భూమిలేని వారికి ఇది మంచి పథకం. – జి.నర్సింలుగౌడ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు, బొంరాస్పేట -
ఆర్టీసీని రక్షించుకుంటాం
హయత్నగర్: ఆర్టీసీని రక్షించుకుంటామని, సంస్థను లాభాల్లోకి తీసుకొస్తున్నామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. అబ్దుల్లాపూర్మెట్టు మండలంలోని మునుగనూరులో మంగళవారం ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల కమ్యూనిటీ హాలు నిర్మాణానికి స్థానిక ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పేదవాడికి రవాణా సౌక ర్యం కల్పించేది ఆర్టీసీ బస్సు మాత్రమేనని అలాంటి బస్సులను నడిపి సేవలు అందిస్తున్న కార్మికులను గుండెల్లో పెట్టుకుంటామని పేర్కొన్నారు. గత ప్రభుత్వం ఆర్టీసీని నిర్వీర్యం చేయాలని చూ సిందని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త బస్సులు కొంటున్నామని, పీఆర్సీ ఇచ్చామని, కారుణ్య నియమకాలు చేపట్టామని, కొత్తగా ఉద్యోగాలు కల్పిస్తున్నామని వివరించారు. కార్మికుల సంక్షేమం, సంస్థ పరిరక్షణ, ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో ఆర్టీసీ పురోగమిస్తోందని అన్నారు. ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రానికి రూ.7 లక్షల కోట్ల అప్పును మిగిల్చిన గత ప్రభుత్వం ఆర్టీసీని దివాలా తీయించిందని విమర్శించారు. కార్మికుల సమస్యలపై సానుకూలంగా స్పందించి వారికి అండగా ఉంటామన్నారు. రాష్ట్ర రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్రెడ్డి రాంరెడ్డి మాట్లాడుతూ.. గతంలో ఇచ్చిన హామీ మేరకు విశ్రాంత కార్మికుల భవన నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ ముద్దగోని లక్ష్మీప్రసన్న, ఆర్డీఓ అనంతరెడ్డి, తహసీల్దార్ సుదర్శన్రెడ్డి, విశ్రాంత కార్మిక సంఘం అధ్యక్షుడు రాజయ్య తదితరులు పాల్గొన్నారు. కార్మికులను గుండెల్లో పెట్టుకుంటాం మంత్రి పొన్నం ప్రభాకర్ -
పాల ఉత్పత్తిదారుల సంఘం చైర్మన్గా నరేశ్
దోమ: పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం చైర్మన్గా దోమ గ్రామానికి చెందిన కావలి నరేశ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గత నెల 29న మండల కేంద్రంలోని పాలఉత్పత్తిదారుల కేంద్రంలో రెండు డైరెక్టర్ స్థానాలకు అధికారులు ఎన్నికలు నిర్వహించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు చెందిన నలుగురు అభ్యర్థులు పోటీలో నిలిచారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన బొంపల్లి తండాకు చెందిన బుగ్యానాయక్, దోమకు చెందిన జాకరం నారాయణ విజయం సాధించారు. దీంతో మొత్తం 10 డైరెక్టర్ స్థానాలకు గాను కాంగ్రెస్ ఏడింటిని కై వసం చేసుకుంది. దీంతో కావలి నరేశ్ను చైర్మన్గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నరేశ్ను డైరెక్టర్లు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో పీఏసీఎస్ డైరెక్టర్ జాకటి వెంకటయ్య, డైరెక్టర్లు మల్లేశ్, సత్తమ్మ, లలిత, చందర్, నాయకులు మాలి శివకుమార్రెడ్డి మల్లేశ్, జావీద్, యాదయ్య, బాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
నత్తనడకన ‘వనమహోత్సవం’
వికారాబాద్: జిల్లాలో వనమహోత్సవం కార్యక్రమం నత్తను తలపిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. అయితే అధికారుల అలసత్వం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. కొన్ని శాఖలు 20 శాతం మేర మొక్కలు నాటగా సగం శాఖలు పనులే ప్రారంభించలేదు. రెండు నెలల క్రితమే జిల్లా అధికారులు ఆయా శాఖలకు మొక్కల లక్ష్యాలను నిర్దేశించారు. ఈ ఏడాది 40.48 లక్షల మొక్కలు నాటాలని నిర్ణయించారు. ఇందుకోసం ఏర్పాట్లు పూర్తి చేశారు. సీజన్ ప్రారంభ సమయంలో వర్షాలు కురవక పోవడంతో మొక్కలు నాటే కార్యక్రమం ముందుకు సాగలేదు. ప్రస్తుతం వానలు పడుతున్నా అధికారుల్లో చలనం లేదు. వనమహోత్సవంలో ప్రాధాన్యతను బట్టి 19 శాఖలను భాగస్వాములను చేశారు. అటవీ, గ్రామీణాభివృద్ధి శాఖల పర్యవేక్షణలో ఈ కార్యక్రమం సాగనుంది. అధికారుల అలసత్వం మొక్కలు నాటి సంరక్షించడం ద్వారా పచ్చదనాన్ని అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావించింది. ఇందులో భాగంగా వనమహోత్సవ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఏటా లక్షలాది మొక్కలు నాటి సంరక్షిస్తున్నారు. ఇందుకోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నారు. ఈ ఏడాది జిల్లా వ్యాప్తంగా 40,48,500 మొక్కలు నాటాలని లక్ష్యం పెట్టుకున్నారు. గతేడాది నాటిన మొక్కల్లో 80శాతం బతికాయని అధికారులు చెబుతున్నా వాస్తవానికి 50 నుంచి 60 శాతం మాత్రమే పెరిగినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది ఇప్పటి వరకు 8లక్షల లోపు మాత్రమే మొక్కలు నాటారు. పశు సంవర్ధక శాఖ, మైనింగ్, సివిల్ సప్లయ్, పోలీసు, ఆర్అండ్బీ, డీడబ్ల్యూఓ, పరిగి, కొడంగల్ మున్సిపాలిటీలు కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. 581 నర్సరీల్లో పెంపకం జిల్లా వ్యాప్తంగా అటవీ, గ్రామీణాభివృద్ధి శాఖల ఆధ్వర్యంలో 581 నర్సరీల్లో 38,30000 మొక్కలను పెంచుతున్నారు. ఈ సారి టేకు మొక్కల పెంపకానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. గ్రామీణాభివృద్ధి శాఖ, గ్రామ పంచాయతీలకు అత్యధిక లక్ష్యాలను కేటాయించారు. వానాకాలం ప్రారంభమై నెలన్నర దాటినా నాటింది 20 శాతంలోపే.. ఈ ఏడాది లక్ష్యం 40,48,500 మొక్కలు 19 ప్రభుత్వ శాఖలకు బాధ్యతలు పనులు ప్రారంభించని సగం శాఖలు శాఖల వారీగా కేటాయించిన లక్ష్యం శాఖ మొక్కలు అటవీ 5లక్షలు విద్య 11వేలు ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ 9,43,500 ఉద్యానవన 2లక్షలు వ్యవసాయ 5లక్షలు తాండూరు మున్సిపాలిటీ 70వేలు వికారాబాద్ మున్సిపాలిటీ 80వేలు కొడంగల్ మున్సిపాలిటీ 35వేలు పరిగి మున్సిపాలిటీ 30వేలు మరి కొన్ని శాఖలకు లక్ష్యాన్ని నిర్ద్ధేశించారు -
చేతి వృత్తిని వ్యాపారం చేస్తే ఊరుకోం
అనంతగిరి: కార్పొరేట్ సెలూన్లకు తావివ్వకుండా ప్రభుత్వ పెద్దలు, అధికారులు చొరవ తీసుకొని నాయీ బ్రాహ్మణులు సంక్షేమానికి కృషి చేయాలని ఆ విభాగం నేతలు, విశ్రాంత ప్రొఫెసర్ ఎం.భాగయ్య కోరారు. మంగళవారం వికారాబాద్ కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్ను కలిసి ఈ మేరకు విన్నవించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. నిజాం కాలంలో 12 కులాలకు ఇనామ్ భూములు ఇవ్వడం జరిగిందని, ఈ కులాల వారు వృత్తి ధర్మాన్ని నెరవేర్చే సేవకులని గుర్తు చేశారు. ముఖ్యంగా నాయీ బ్రాహ్మణులకు 5 వృత్తి ధర్మాలు ఉన్నాయని, అందులో ఒకటి క్షౌ రము, మంగళ వాయిద్యం, వైద్యము, మంత్రసాని, (కాగడా) దివిటీ. ఉదయం లేచిన కాడి నుంచి అన్ని ముఖ్య దేవాలయాల్లో మేలుకొలుపు నుంచి దివిటీ పట్టే వరకు నాయీ బ్రాహ్మణుల వృత్తి అని పేర్కొన్నారు. 1982లోనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా ఫెడరేషన్లుగా సాధించుకోవడంతో పాటు కులవృత్తికి సంబంధించిన సామగ్రిని కూడా పొందడం జరిగిందన్నారు. ఇతర మతాలకు చెందిన కొందరు వచ్చి సెలూన్లు పెట్టుకొని నాయీ బ్రాహ్మణుల వృత్తి దోచేద్దామని ప్రయత్నిస్తే చూస్తూ ఊరుకోవడానికి సిద్ధంగా లేమన్నారు. న్యాయం కోసం హై కోర్టును ఆశ్రయిస్తామన్నారు. కార్యక్రమంలో విశ్రాంత ఉద్యోగి సీపీ రెడ్డి, సంఘం సభ్యులు శేఖర్, రఘుపతి, రమేష్, భగవాన్, నాగరాజు, నరేష్, సంతోష్, రాజు, నర్సింలు, ఎం.నరేష్, వెంకట్ తదితరులు పాల్గొన్నారు. అన్య మతస్తులు కార్పొరేట్ సెలూన్లు పెట్టడానికి వీల్లేదు నాయీ బ్రాహ్మణుల సంక్షేమ విభాగం నేతలు, విశ్రాంత ప్రొఫెసర్ బాగయ్య అదనపు కలెక్టర్కు వినతిపత్రం అందజేత -
ఆదర్శనీయుడు వనజీవి రామయ్య
తాండూరు టౌన్: పర్యావరణ పరిరక్షకుడు వనజీవి రామయ్య అందరికీ ఆదర్శనీయుడని మున్సిపల్ మాజీ చైర్పర్సన్ కొట్రిక విజయలక్ష్మి అన్నారు. మంగళవారం రామయ్య జయంతిని పురస్కరించుకుని కోకట్ టీజీ సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఒక్క మొక్క నాటడంతో ప్రారంభించిన వనజీవి రామయ్య తన జీవిత కాలంలో సుమారు 3కోట్ల వరకు మొక్కలు నాటారన్నారు. పర్యావరణ పరిరక్షణకు ఆయన చేసిన కృషిని మెచ్చిన ప్రభుత్వాలు అనేక అవార్డులతో సత్కరించాయన్నారు. వృక్ష సంపద పెరిగితే వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని, తద్వారా పంటలు పండటం, పర్యావరణం కలుషిత రహితంగా మారుతుందన్నారు. అందరికీ ఆదర్శంగా నిలుస్తూ వయసు పైబడినా మొక్కలు నాటే ప్రక్రియను మాత్రం ఆయన వదిలిపెట్టలేదన్నారు. కావున అందరూ ఆయనను ఆదర్శంగా తీసుకుని విస్తారంగా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో తాండూరు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీదేవి, ప్రిన్సిపాల్ సరస్వతి, సామాజిక కార్యకర్త వెంకట్, గాజుల బస్వరాజ్ తదితరులు పాల్గొన్నారు. ఘనంగా జయంతి వేడుకలు -
బడి వద్దకే బియ్యం
బొంరాస్పేట: ప్రభుత్వం సర్కారు బడులకు ప్రతీ నెల అందించే మధ్యాహ్న భోజన పథకం సన్న బియ్యం ఈ నెల నుంచి నేరుగా పాఠశాలలకే చేరనున్నాయి. రెండేళ్లుగా మండల కేంద్రం నుంచి లేదా మార్గమధ్యలో నుంచి సొంత ఖర్చులు భరించాల్సిన బాధలు తొలిగాయని బొంరాస్పేట, దుద్యాల ఎంఈఓలు, హెచ్ఎంలు, ఉపాధ్యాయలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలో పాఠశాలలకు రోడ్డు సౌకర్యం లేదని, వర్షాల వల్ల ఇబ్బంది పడుతున్నామని కుంటిసాకులు చెబుతూ బియ్యం సరఫరా కాంట్రాక్టరు రవాణా డబ్బులు జేబులో వేసుకున్నారనే ఆరోపణలు వచ్చాయి. మండల కేంద్రంలో డంప్ చేస్తుండడంతో అవి సకాలంలో పాఠశాలలకు అందక ముక్కిపోయి, పురుగులు పడి పాడైన సంఘటనలు చోటుచేసుకున్నాయి. మండల కేంద్రం మార్గమధ్య నుంచి హెచ్ఎంలు ప్రైవేట్ వాహనాల్లో తమ పాఠశాలలకు మధ్యాహ్న భోజనం బియ్యం తెప్పించుకున్నారు. ఇటీవల ఉన్నతాధికారులు తనిఖీలు చేపట్టిన సమయంలో పౌరసరఫరాల శాఖ అధికారులు స్పందించి సన్నబియ్యం రవాణా ఇబ్బందలు తొలగిస్తామని చెప్పారు. సర్కార్ బడులకు ప్రతీనెల అందించే హమాలీ పేరుతో సీఆర్పీల నుంచి అక్రమ వసూళ్లు ఉండరాదని హెచ్చరించారు. ఈ నెల నుంచి స్టాక్ పాయింట్ నుంచి నేరుగా పాఠశాలలకు చేరవేత రెండేళ్లుగా సొంత ఖర్చులు భరించిన హెచ్ఎంలు వెతలు తీరాయని హర్షం ఉమ్మడి మండలంలో సన్న బియ్యం సరఫరా వివరాలు పాఠశాలలు 77 విద్యార్థుల సంఖ్య 2,800 ప్రతీ నెల సరఫరా చేసే బియ్యం 76.50 క్వింటాళ్లు 1–5 తరగతుల విద్యార్థులకు 100 గ్రాములు 6–9 తరగతుల విద్యార్థులకు 150 గ్రాములు -
రెండు ఆలయాల్లో చోరీ
ఇబ్రహీంపట్నం: డివిజన్ పరిధిలోని ఓ గ్రామంలో రెండు ఆలయాల్లో విగ్రహాలు చోరీకి గురయ్యాయి. ఈ ఘటన ఇబ్రహీంపట్నం ఠాణా పరిధిలోని పోల్కంపల్లిలో మంగళవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన ప్రకారంగ్రామంలోని రామాలయంలో సీతారామలక్ష్మణ స్వాముల వారి పంచలోహ విగ్రహాలు, గంగాదేవి ఆలయంలో పెద్ద మ్మ తల్లి, గంగాదేవి విగ్రహాలను గుర్తు తెలియని దుండగులు ఎత్తుకెళ్లారు. రామాలయంలోని సీసీ టీవీ పుటేజీలను పరిశిలీంచగా ఓ దొంగ విగ్రహాన్ని సంచిలో పెట్టుకుని వెళ్తున్నట్లు గుర్తించారు. అనుమానితులు పోలీసుల అదపులో ఉన్నట్లు సమాచారం.పంచలోహ విగ్రహాలను ఎత్తుకెళ్లిన దుండగులు -
అంగన్వాడీ టీచర్పై విచారణ
దోమ: కోడిగుడ్ల పంపిణీ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అంగన్వాడీ టీచర్పై సీడీపీఓ మెహర్ఉన్నీసా బేగం విచారణ చేపట్టారు. వివరాలిలా ఉన్నాయి. మండల పరిధిలోని బట్ల చందారం గ్రామంలో కావలి మంగమ్మ(గర్భిణీ)కి అంగన్వాడీ టీచర్ ఆనంద గుడ్లు ఇవ్వాల్సి ఉంది. అయితే ఆమె పేరు నమోదు కాకపోవడంతో హైదరాబాద్ నగరంలో ఉంటూ మే 20న వచ్చి కేంద్రంలో రిజిస్టర్ చేసుకుంది. ఈ క్రమంలో జూన్ 20న అంగన్వాడీ కేంద్రానికి గుడ్లకు రాగా.. టీచర్తో మంగమ్మ భర్త సురేశ్ ఫోన్లో చిన్నపాటి వాగ్వాదానికి దిగాడు. ఇద్దరి మధ్య మాటమాట పెరగడంతో టీచర్ ఆనంద, ఆమె భర్త వీరప్పతో కలిసి సురేశ్ ఇంటికి వెళ్లి దాడి చేశారు. ఈ మేరకు ఇరువురు పోలీసులకు ఫిర్యాదు చేసుకోగా, గత నెల 21న ఆనంద, వీరప్పలపై కేసు నమోదు చేశారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన అంగన్వాడీ టీచర్పై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ సీడీపీఓ, డీడబ్ల్యూఓకు ఫిర్యాదులు సైతం చేశారు. ఈ మేరకు మంగళవారం సీడీపీఓ గ్రామానికి వచ్చి గ్రామ మాజీ సర్పంచ్తో పాటు గ్రామస్తులతో కలిసి విచారణ చేపట్టారు. -
విద్యతోనే అంతరాలు లేని సమాజం
మంచాల: విద్య సమాజాభివృద్ధికి తోడ్పాటునిచ్చేలా ఉండాలని మాజీ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సింహారెడ్డి అన్నారు. మంగళవారం ఆయన మండల పరిధిలోని ఆరుట్లలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ను సందర్శించారు. అక్కడ కొనసాగుతున్న పనులు, బోధన తీరు, ఉపాధ్యాయుల కృషిని తెలంగాణ పౌర స్పందన వేదిక ఆధ్వర్యంలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోనే మొట్ట మొదటిసారిగా తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఆరుట్లలో ఏర్పాటు చేయడం శుభ పరిణామమన్నారు. ప్రజల మధ్య అంతరాలు తొలగాలంటే విద్యతోనే సాధ్యమన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ పౌర స్పందన వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాధేశ్యాం, ఉపాధ్యక్షురాలు మంగ, సభ్యులు నాగమణి, ధనమూర్తి, జగన్నాథ్ ఆరుట్ల ప్రధానోపాధ్యాయుడు గిరిధర్ గౌడ్, సుప్రియ, మోహన్ గౌడ్, పేరెంట్స్ కమిటీ సభ్యులు భాస్కర్, రాజు, ఎం.డీ.జానీ పాష, జంగయ్య, జంగయ్య, మల్లేశ్, పార్వతి, జ్యోతి, ఉపాధ్యాయులు పాపిరెడ్డి, కిషన్ చౌహాన్, శ్రీకాంత్, జహీర్ పాల్గొన్నారు.మాజీ ఎమ్మెల్సీ నర్సింహారెడ్డి -
ప్రజలకు ఇబ్బంది లేకుండా పంపిణీ
కుల్కచర్ల: ప్రజలకు ఇబ్బంది లేకుండా రేషన్ సరుకుల పంపిణీ సమయాన్ని పెంచడం జరుగుతుందని డీసీసీ ఉపాధ్యక్షుడు భీంరెడ్డి, కుల్కచర్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆంజనేయులు, పీఏసీఎస్ చైర్మన్ కనకం మొగులయ్య అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో రేషన్ బియ్యం పంపిణీ కేంద్రాన్ని పరిశీలించి మాట్లాడారు. రేషన్బియ్యం ప్రతీ ఒక్క లబ్ధిదారుడికి మూడు నెలల బియ్యం చేరాలనే సంకల్పంతో జూలై 29 వరకు రేషన్ బియ్యం తీసుకునేందుకు అవకాశం ఇచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ మాజీ సభ్యుడు ఆనందం, మాజీ ఎంపీపీ అంజిలయ్య, పార్టీ మండల ప్రధాన కార్యదర్శి గోపాల్ నాయక్, రజక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేష్, నాయకులు రాంచంద్రయ్య, వెంకటేశ్, ఎల్లయ్య, భాను తదితరులు పాల్గొన్నారు. -
ధ్రువపత్రాల పరిశీలనకు 183 మంది విద్యార్థులు
అనంతగిరి: వికారాబాద్ సమీపంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో మంగళవారం కళాశాల ప్రవేశాల కోసం స్లాట్ బుక్ చేసుకున్న అభ్యర్థుల ధ్రువపత్రాలను పరిశీలించామని కళాశాల ప్రిన్సిపాల్ రవీందర్ తెలిపారు. మొదటి రోజు 194 మంది విద్యార్థులు స్లాట్ బుక్ చేసుకోగా 183 మంది హాజరయ్యారని చెప్పారు. ఈ కార్యక్రమంలో కశాశాల సిబ్బంది నారాయణ, రామలక్ష్మి, సుదీంద్రకుమార్, కిరణ్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. హత్య కేసులో ఏడుగురు నిందితులకు రిమాండ్ దౌల్తాబాద్: భూతగాదాల్లో పాత కక్షలను మనసులో పెట్టుకుని వ్యక్తిని హత్య చేసిన సంఘటనలో పోలీసులు మంగళవారం ఏడుగురు నిందితులను రిమాండ్కు తరలించారు. జూన్ 30న పొలం బాట విషయంలో బండివాడకు చెందిన వెంకట్ నాయక్, హన్మానాయక్ తండాకు చెందిన జైపాల్ నాయక్, రాములు నాయక్, మాన్యానాయక్, విజయ్ నాయక్, వెంకట్ నాయక్, రవి నాయక్, అమ్రీబాయిల మధ్య గొడవ తలెత్తింది. ఈ ఘటనలో ఇరువర్గాల వారు పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. వెంకట్నాయక్ అదేరోజు రాత్రి తనబైక్పై ఇంటికి వెళ్తుండగా హన్మానాయక్ తండావాసులు దాడి చేశారు. తలకు బలమైన గాయాలవడంతో మృత్యువాతపడ్డాడు. కేసు విచారణ చేపట్టిన పోలీసులు మంగళవారం నిందితులను అరెస్టు చేసి కొడంగల్లో కోర్టులో హాజరు పరిచి రిమాండ్కు తరలించినట్లు సీఐ శ్రీధర్రెడ్డి, ఎస్ఐ రవిగౌడ్ తెలిపారు. అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి దౌల్తాబాద్: నిద్రకు ఉపక్రమించిన ఓ వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందాడు. ఈ ఘటన మండల పరిధిలోనలి గోకఫసల్వాద్లో మంగళవారం వెలుగులోకి వచ్చింది. వివరాలు.. గ్రామానికి చెందిన దామోదర్రెడ్డి(43), మాజీ కోఆప్షన్ సభ్యుడు జాకీర్అలీ కలిసిమెలిసి ఉండేవారు. దామోదర్రెడ్డి అప్పుడప్పుడు జాకీర్ ఇంట్లోనే నిద్రించేవాడు. ఈ క్రమంలో సోమవారం రాత్రి ఇద్దరు జాకీర్అలీ ఇంట్లోనే భోజనం చేసి జాకీర్ అలీ పైన గదిలో పడుకోవడానికి వెళ్లగా దామోదర్రెడ్డి కింద గదిలో నిద్రించడానికి వెళ్లాడు. మంగళవారం ఉదయం జాకీర్అలీ లేచి చూసేవరకు విగతజీవిగా పడి ఉన్నాడు. వెంటనే జాకీర్అలీ కుటుంబసభ్యులకు తెలిపాడు. వారు వచ్చి చూసి మృతిచెందినట్లు గుర్తించారు. ఈ విషయమై మృతుడి భార్య ప్రభావతమ్మ తన భర్త మృతిపై అనుమానం ఉందని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎస్ఐ రవిగౌడ్ ఘటనా స్థలిని పరిశీలించి వివరాలు సేకరించారు. కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు. రాష్ట్ర స్థాయి ఫుట్బాల్ టోర్నీ విజేతగా రంగారెడ్డి జిల్లా ట్రోఫీ అందజేసిన సీపీ సాయి చైతన్య నిజామాబాద్ నాగారం: నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని రాజారాం స్టేడియంలో నాలుగు రోజులుగా సాగిన రాష్ట్రస్థాయి ఫుట్బాల్ టోర్నమెంట్ పోటీలు మంగళవారంతో ముగిసాయి. పోటీ ల్లో విజేతగా రంగారెడ్డి జిల్లా జట్టు నిలువగా, రన్నర్గా నిజామాబాద్ జట్టు నిలిచింది. ముగింపు కార్యక్రమానికి సీపీ సాయిచైతన్య ముఖ్య అతిథిగా హాజరై, విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. -
దుండగులను అరెస్ట్ చేయాలి
పరిగి: పుట్టపహాడ్లో అంబేడ్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ అన్నారు. మంగళవారం పట్టణ కేంద్రంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ.. అంబేడ్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన నిందితులను అరెస్ట్ చేయడంలో పోలీసులు విఫలమయ్యారన్నారు. దుండగులను పట్టుకోవడంలో పోలీసులు నిర్లక్ష్యం వ్యహరిస్తున్నారన్నారు. విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిని అరెస్ట్ చేయకపోతే ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఎస్పీ కార్యాలయాన్ని ముట్టడి చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు గోవింద్నాయక్, వెంకట్, సత్తయ్య పాల్గొన్నారు. లేదంటే ఎస్పీ కార్యాలయాన్ని ముట్టడిస్తాం తెలంగాణ ఉద్యమకారుల ఐక్య వేదిక జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ -
ఖర్చుకు వెనుకాడొద్దు
● నిధులు మంజూరు బాధ్యత నాది ● కలెక్టర్ నారాయణరెడ్డి ● వనస్థలిపురం ఏరియా ఆస్పత్రిలోఆకస్మిక తనిఖీ ● సమస్యలు వివరించిన మహేశ్వరం మెడికల్ కాలేజీ అనుబంధ ఆస్పత్రి వైద్య సిబ్బంది సాక్షి, రంగారెడ్డిజిల్లా: ‘కోవిడ్ సమయంలో ఆస్పత్రి భవనంపై ఏర్పాటు చేసిన తాత్కాలిక షెడ్డు పైకప్పు లీకేజీ అవుతోంది. సిటీ స్కాన్ మంజూరైనప్పటికీ.. స్థలాభావ సమస్యతో ఇప్పటికీ ఏర్పాటు చేయలేదు. టెక్నీషియన్లు అందుబాటులో లేరు. రక్తనిధి కేంద్రం లేకపోవడంతో రక్తస్త్రావంతో బాధపడుతున్న రోగులకు సత్వర సేవలు అందించలేకపోతున్నాం. వైద్యుల నిష్పత్తి మేరకు గదులు లేకపోవడంతో ఔట్ పేషంట్ విభాగానికి వచ్చే రోగులకు సేవలు అందించలేని పరిస్థితి తలెత్తుతోంది’అంటూ మహేశ్వరం మెడికల్ కాలేజీ అనుబంధ ఆస్పత్రి (వనస్థలిపురం ఏరియా ఆస్పత్రి) వైద్య సిబ్బంది కలెక్టర్ నారాయణరెడ్డి ముందు తమ సమస్యలను ఏకరువు పెట్టారు. వైద్యులు, సిబ్బంది చెప్పిన అంశాలను కలెక్టర్ సావధానంగా ఆలకించారు. ‘ఆస్పత్రిలో మౌలిక సదుపాయాల కల్పనకు నిధులు కేటాయించే బాధ్యత నాదీ.. అయితే ఆస్పత్రికి ఆపదలో వచ్చిన నిరుపేద రోగులకు సత్వర, మెరుగైన వైద్యసేవలు అందేలా చూడాల్సిన బాధ్యత మీదే’అని కలెక్టర్ స్పష్టం చేశారు. ఆకస్మిక తనిఖీ.. వైద్యసేవలపై ఆరా మంగళవారం వనస్థలిపురం ప్రభుత్వ ఆస్పత్రిని కలెక్టర్ నారాయణరెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఔట్, ఇన్ పేషంట్ విభాగాలు సహా ఆపరేషన్ థియేటర్, ఫార్మసీ విభాగాలను పరిశీలించారు. రోగులకు అందిస్తున్న వైద్యసేవలపై ఆరా తీశారు. వైద్య పరీక్షలు చేస్తున్నారా? మందులు ఇస్తున్నారా? అంటూ రోగులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వైద్యులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్య సిబ్బంది రోగుల సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఆస్పత్రి పడకల సామర్థ్యాన్ని 100 నుంచి 200 పెంచారు కానీ..అనువైన స్థలం లేక అదనపు పడకలను ఏర్పాటు చేయలేకపోతున్నట్లు స్పష్టం చేయగా, ఆస్పత్రి భవనం పై అంతస్తులో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన షెడ్డుకు తక్షణమే రిపేర్లు చేసి, రోగులకు అందుబాటులోకి తీసుకురావాలని కలెక్టర్ సూచించారు. ఇందుకు ఎంత ఖర్చైనా వెనుకాడొద్దన్నారు. వెంటనే పనులు ప్రారంభించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సీటీస్కాన్ పెట్టండి.. టెక్నీషియన్లను తీసుకోండి మెడికల్ కాలేజీ నిబంధనల ప్రకారం ఆస్పత్రిలో సీటీస్కాన్ ఏర్పాటు చేయాల్సి ఉందని, 2024లోనే సీటీస్కాన్ మంజూరైందని, ఆస్పత్రిలో అనువైన స్థలం లేక ఏర్పాటు చేయలేకపోయినట్లు అధికారులు కలెక్టర్కు వివరించారు. ఆస్పత్రి ఆవరణలోని ఈహెచ్ఎస్, జేహెచ్ఎస్ డిస్పెన్సరీలను పక్కనే ఉన్న వార్డు ఆఫీసుకు తరలించి, ఆ ఖాళీ ప్రదేశంలో సీటీస్కాన్ ఏర్పాటు చేయించాలని అధికారులకు సూచించారు. రక్తనిధి కేంద్రం ఏర్పాటు సహా అవసరమైన టెక్నీషియన్లను ఔట్సోర్సింగ్ ప్రతిపాదికను నియమించుకోవాలని ఆదేశించారు. రోగులకు సేవలు అందించే విషయంలో రాజీపడొద్దన్నారు. ఆస్పత్రిలో పారిశుద్ధ్యలోపం, తాగునీటి కొరత లేకుండా చూసుకోవాలన్నారు. కలెక్టర్ వెంట ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నాగేందర్, అదనపు డీఎండీ డాక్టర్ వాణి, ప్రిన్సిపాల్ డాక్టర్ త్రివేణి, వైస్ ప్రిన్సిపాల్ తఖీయుద్దీన్, ఆర్ఎంఓలు జయమాల, రాజ్కుమార్, వైద్య మౌలిక సదుపాయాల సంస్థ చీఫ్ ఇంజనీర్ దేవేందర్, ఈఈ అజీజ్, ఇబ్రహీంపట్నం ఆర్డీఓ అనంతరెడ్డి, ఎల్బీనగర్ డిప్యూటీ కమిషనర్ యాదయ్య తదితరులు ఉన్నారు. -
పారదర్శకంగా పదవుల పంపిణీ
● నామినేటెడ్, పార్టీ పదవుల్లో సీనియర్లకు ప్రాధాన్యం ● డీసీసీ అధ్యక్షుడు రామ్మోహన్రెడ్డి ● అర్హులకు పథకాలు అందేలా చూస్తాం ● ఎమ్మెల్యే మనోహర్రెడ్డి బషీరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికలలోపు పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేస్తామని డీసీసీ అధ్యక్షుడు, పరిగి ఎమ్మెల్యే టి.రామ్మోహన్రెడ్డి అన్నారు. ఇందులో భాగంగా గ్రామ, మండల, డివిజన్ కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. సోమవారం బషీరాబాద్లో పార్టీ ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. రాష్ట్ర పరిశీలకులు వినోద్రెడ్డి, నరేందర్, తాండూరు ఎమ్మెల్యే మనోహర్రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ.. పదవులు ఆశించే నాయకులు వివరాలు ఇవ్వాలని సూచించారు. జిల్లాకు రెండు రాష్ట్రస్థాయి డైరెక్టర్ పదువులతో పాటు గ్రామ, మండల, డివిజన్ కమిటీలు ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజలకు వివరించాలని సూచించారు. అన్యాయం జరగనివ్వం: మనోహర్రెడ్డి పార్టీలో చాలా కాలంగా పనిచేస్తున్న సీనియర్ నాయకులకు పదవుల పంపిణీలో అన్యాయం జరగనివ్వమని తాండూరు ఎమ్మెల్యే మనోహర్రెడ్డి భరోసా ఇచ్చారు. 2017 కంటే ముందు నుంచి ఉన్నవారికి ముఖ్యమైన పదవుల్లో ప్రాధాన్యత ఇస్తామన్నారు. ఎక్మాయిపల్లిలో ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో జరిగిన అక్రమాలపై విచారణ జరిపామని త్వరలో చర్యలు ఉంటాయని తెలిపారు. కొత్త వారిదే పెత్తనం: రమేష్ మహరాజ్ అసెంబ్లీ ఎన్నికల ముందు బీఆర్ఎస్ నుంచిపార్టీలో చేరిన నాయకులు పెత్తనం చెలాయిస్తున్నా రని రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ సభ్యుడు రమేష్ మహ రాజ్ ఆరోపించారు.తాను నాలుగేళ్లుగా పార్టీలో పనిచేస్తున్నానని, మీరంతా రెండేళ్ల కిందట వచ్చారంటూ ఎమ్మెల్యేను ఉద్దేశించి అనడంతో సమావేశంలో గందరగోళం ఏర్పడింది. ఇందిరమ్మ కమిటీల్లోనూ సీనియర్లకు చోటు ఇవ్వలేదన్నారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు కలాల్ నర్సింలు, మార్కె ట్ కమిటీ చైర్మన్ మాధవరెడ్డి, సొసైటీ చైర్మన్ వెంకట్రామ్రెడ్డి, వైస్ చైర్మన్ అజయ్ప్రసాద్, సీనియర్ నాయకులు వెంకటేశ్ మహరాజ్, శంకరప్ప, రామ్ నాయక్, శంకర్రెడ్డి, శ్రీనివాస్రెడ్డి, సుధాకర్రెడ్డి, శ్రావణ్కుమార్, శాంతిభాయి, తలారి సురేష్, అనిల్ కుమార్, సతీష్, మాణిక్రావు పాల్గొన్నారు. పాతవారికే పదవులుతాండూరు రూరల్: 2017 కంటే ముందు నుంచి పార్టీలో ఉన్న నేతలకే పదవులు ఇస్తామని ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి అన్నారు. సోమవారం పట్టణ శివారులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మండల కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీ కోసం పని చేసిన వారికి గుర్తింపు ఉంటుందన్నారు. ఎమ్మెల్యే మనోహర్రెడ్డి సహకారంతో తాండూరు అన్నీవిధాలా అభివృద్ధి చెందుతుందన్నారు. కార్యక్రమంలో పీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధారాసింగ్, మార్కెట్ కమిటీ చైర్మన్ బాల్రెడ్డి, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఉత్తమ్చందులు పాల్గొన్నారు. -
చినుకు పడితే చిత్తడే
కొడంగల్: కొడంగల్ మున్సిపల్ పరిధిలోని పలు గ్రామాల్లో చినుకు పడితే చిత్తడిగా మారుతోంది. మున్సిపల్లో విలీనమైన గ్రామాల్లో సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. కొడంగల్ మేజర్ గ్రామ పంచాయతీకి 2018లో మున్సిపల్ హోదా లభించింది. అప్పట్లో కొండారెడ్డిపల్లి, గుండ్లకుంట, పాత కొడంగల్, పాత కొడంగల్ తండా, బూల్కాపూర్, ఐనన్పల్లి గ్రామాలను మున్సిపాలిటీలో విలీనం చేశారు. ఈ గ్రామాల్లో మౌలిక సదుపాయాలను కల్పించాల్సిన బాధ్యతను ప్రభుత్వం విస్మరించిందని ఆయా గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. బూల్కాపూర్లో మైసమ్మ దేవాలయానికి వెళ్లే దారిలో మురుగు నీరు రోడ్డుపై నిలుస్తోంది. దీంతో గ్రామస్తుల రాకపోకలకు ఇబ్బందిగా మారింది. ఈ గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో మురుగు నీరు రోడ్లపైకి వస్తోంది. బూల్కాపూర్లో మురుగు కాల్వలు లేవు. వ్యక్తిగత మరుగుదొడ్లు లేవు. గ్రామానికి వెళ్లే దారిలో రోడ్డుకు ఇరువైపులా గ్రామస్తులు బహిర్భుమికి వెళ్తున్నారు. గ్రామంలోకి వెళ్లాలంటేనే ఇబ్బందిగా ఉంది. వర్షాకాలంలో గ్రామంలో రాకపోకలకు ఇబ్బందిగా ఉంది. -
ప్రతీ కార్యకర్తకు న్యాయం చేస్తాం
యాలాల: కష్టకాలంలో కాంగ్రెస్కు అండగా నిలిచిన ప్రతీ కార్యకర్తకు, నాయకులకు తగిన పదవి ఇచ్చి న్యాయం చేస్తామని డీసీసీ అధ్యక్షుడు, పరిగి ఎమ్మె ల్యే రామ్మోహన్రెడ్డి అన్నారు. సోమవారం ఆయన మండల కేంద్రంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో పీసీసీ ఉపాధ్యక్షుడు వినోద్రెడ్డి, ఫైనాన్స్ కమిషన్ సభ్యుడు రమేశ్మహరాజ్, అధికార ప్రతినిధి నరేందర్తో కలిసి పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ.. పార్టీ పటిష్టతకు పాత, కొత్త తేడా లేకుండా పనిచేయాలని సూచించారు. స్థానిక ఎన్నికల్లో కార్యకర్తలు సూచించిన వారికే ఎంపీటీసీ, సర్పంచ్ టిక్కెట్లు ఇస్తామన్నారు. ఈ విషయాన్ని క్షేత్రస్థాయిలో ప్రజలకు వివరించే బాధ్యత పార్టీ కార్యకర్తలపై ఉందన్నారు. స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించుకోవాలని సూచించారు. అనంతరం పార్టీ కమిటీల్లో భాగంగా పదవులను ఆశిస్తున్న వారి నుంచి దరఖాస్తులను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ సురేందర్రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు నర్సిరెడ్డి, మాజీ అధ్యక్షుడు భీమప్ప, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు వీరేశం, మాజీ సర్పంచ్లు శ్రీనివాస్, మధుసూదనరెడ్డి, బస్వరాజ్, భీమప్ప, ఏఎంసీ డైరెక్టర్లు నర్సింలుగౌడ్, రాజు, మొగులయ్య, శ్రీనివాస్, నాయకులు చంద్రశేఖర్గౌడ్, అమృతప్ప, సత్యనారాయణరెడ్డి, రవినాయక్ తదితరులు ఉన్నారు. డీసీసీ అధ్యక్షుడు, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి -
ఆటో నుంచి కిందపడి వ్యక్తి మృతి
కొడంగల్ రూరల్: ఆటో నుంచి కిందపడిన ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని చిట్లపల్లి టోల్ప్లాజా దగ్గర చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని రుద్రారం గ్రామానికి చెందిన మహ్మద్అలీ(65) తన కుటుంబంతో కలిసి హైదరాబాద్లో స్థిరపడ్డారు. సోమవారం మొహరం(పీర్ల పండగ)సంతాప దినాలను పురస్కరించుకొని స్వగ్రామానికి బయలుదేరారు. నగరం నుంచి కొడంగల్ చేరాక, ఇక్కడి నుంచి రుద్రారానికి ఆటోలో వెళ్లారు. మార్గమధ్యలో చిట్లపల్లి టోల్ ప్లాజా సమీపంలో స్పీడ్ బ్రేకర్ దాటుతున్న క్రమంలో అకస్మాత్తుగా మహ్మద్అలీ ఆటోలో నుంచి జారి కింద పడ్డారు. దీంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆయన్ని చికిత్స నిమిత్తం కొడంగల్ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుడి కుమారుడు యూసుఫ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సత్యనారాయణ తెలిపారు. మట్టి దందా నిలిపివేత దోమ: మల్లేపల్లితండా, దాదాపూర్ గ్రామాల సమీపంలో కొన్ని రోజులుగా కొందరు అక్రమార్కులు యథేచ్చగా కొనసాగుతున్న మట్టి దందాను రెవెన్యూ అధికారులు నిలిపివేశారు. శనివారం శ్రీసాక్షిశ్రీదినపత్రికలో శ్రీతోడేస్తున్నారుశ్రీఅనే కథనం ప్రచురితమైంది. ఇందుకు స్పందించిన రెవన్యూ అధికారులు సోమవారం ఘటనా స్థలికి చేరుకుని తవ్వకాలను నిలిపివేసే చర్యలు చేపట్టారు. వాహనాలను వదిలేసి, ఎలాంటి ఫెనాల్టీలు విధించనట్లు సమాచారం. అక్రమార్కులపై తహసీల్దార్ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. పాఠశాల సమయానికి బస్సులు నడిపించాలి కొడంగల్ రూరల్: పాఠశాలల సమయానికి బస్సులను నడిపించాలని ఎంఈఓ రాంరెడ్డి అన్నారు. సోమవారం విలేకరులతో మాట్లాడుతూ.. తాండూరు ఆర్టీసీ డిపో అధికారులకు బస్సులను పాఠశాలల సమయానికి నడిపించాలని కోరినట్లు ఆయన తెలిపారు. ప్రతిరోజు ఉదయం 8.45గంటలకు కొడంగల్కు బస్సులు చేరేటట్లు చర్యలు తీసుకోవాలని, కొడంగల్ నుంచి సాయంత్రం 4.40గంటలకు తిరుగు ప్రయాణం అయ్యేటట్లు చర్యలు తీసుకోవాలని కోరినట్లు కోరారు. -
హకీంపేట్లో ఇంటర్ కళాశాల ప్రారంభోత్సవం
దుద్యాల్: మండల పరిధిలోని హకీంపేటలో ఇంటర్ కళాశాలను మంజూరు చేయడం వికారాబాద్, నారాయణపేట జిల్లా విద్యార్థులకు ఉపయోగకరంగా ఉంటుందని జిల్లా ఇంటర్మీడియెట్ విద్యాధికారి శంకర్నాయక్ సూచించారు. సోమవారం ఆయన మండల పరిధిలోని హకీంపేట్లో నూతనంగా మంజూరైన ఇంటర్ కళాశాలను ప్రిన్సిపాల్ నర్సింహారెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో శంకర్నాయక్ మాట్లాడుతూ.. రానున్న రోజుల్లో హకీంపేట అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతున్నారు. అనంతరం విద్యార్థులకు పుస్తకాలు అందించారు. ప్రిన్సిపాల్ నర్సింహారెడ్డి మాట్లాడుతూ.. ఇప్పటికే 80 మంది విద్యార్థులు కళాశాలలో అడ్మిషన్లు తీసుకున్నారని చెప్పారు. దౌల్తాబాద్, బొంరాస్పేట్ కళాశాల్లో అడ్మిషన్లు లేక రెండేళ్లుగా కళాశాలలు ప్రారంభానికి నోచుకోలేదన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు సంజీవరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, నరేందర్ రెడ్డి, యుగంధర్ రెడ్డి, గోశాల యజమాని కృష్ణ స్వామి, కళాశాల సిబ్బంది, విద్యార్థులు, గ్రామస్తులు ఆంజనేయులు యాదవ్, శ్రీనివాస్, దాసు, యాదయ్య, మహేశ్, గోవర్ధన్, రఘు తదితరులు పాల్గొన్నారు. -
దాడి చేసిన వారిని అరెస్టు చేయాలి
యాలాల: మండల పరిధిలోని హాజీపూర్ గ్రామానికి చెందిన దళిత కౌలు రైతుపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకట్రాములు డిమాండ్ చేశారు. సోమవారం హాజీపూర్ గ్రామానికి కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి మల్కయ్యతో కలిసి బాధిత రైతును పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గోరేపల్లికి చెందిన కోటం శ్రీనివాస్కు చెందిన పొలాన్ని ఏడేళ్లుగా రవి కౌలుకు తీసుకొని సాగు చేసుకుంటున్నాడన్నారు. గత నెల 17న పొలంలో విత్తనాలు వేస్తుండగా అదే గ్రామానికి చెందిన కోటం విష్ణు, పకీరప్పలు మరో 18 మందితో కలిసి రవిపై దాడి చేసి హత్యాయత్నానికి యత్నించారని వివరించారు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసిన నిందితులను అరెస్టు చేయలేదన్నారు. దళిత రైతుపై దాడికి పాల్పడిన నిందితులను వెంటనే అరెస్టు చేయాలని.. లేనిపక్షంలో జిల్లా వ్యాప్తంగా నిరసన, ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి మహిపాల్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు బుగ్గప్ప, గ్రామస్తులు పాష, మహిపాల్ తదితరులు ఉన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకట్రాములు -
18 లీటర్ల సారా పట్టివేత
ఆమనగల్లు: పోలీసులు నిర్వహించిన వాహనాల తనిఖీల్లో 18 లీటర్ల నాటుసార సీజ్ చేసి ఒకరిని అరెస్ట్ చేశారు. ఈ ఘటన సోమవారం చోటు చేసుకుంది. ఆమనగల్లు ఎక్సైజ్ సీఐ బద్యానాద్ చౌహాన్ తెలిపిన ప్రకారం.. వెల్దండ మండలం పోచమ్మగడ్డ తండా నుంచి మాడ్గుల మండలం కలకొండ గ్రామానికి నాటుసారా తరలిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం అందింది. ఈ మేరకు సీఐ బద్యానాద్ చౌహాన్ ఆధ్వర్యంలో ఎక్సైజ్ సిబ్బంది వాహనాల తనిఖీ చేపట్టారు. పోచమ్మగడ్డ తండా నుంచి కలకొండకు ప్రయాణిస్తున్న ఆటోను తనిఖీ చేయగా అందులో తొమ్మిది ప్లాస్టిక్ బాటిల్స్లో 18 లీటర్ల సారా పట్టుబడింది. సారా, ఆటోను సీజ్ చేసి సారా తరలిస్తున్న పాండును అరెస్టు చేశారు. ఈ తనిఖీలో ఎక్సైజ్ ఎస్ఐ అరుణ్కుమార్, సిబ్బంది శంకర్, దశరథ్, శ్రీను, బాబు, ఆమని, శ్రీజ పాల్గొన్నారు. -
భూ తగాదాలతో వ్యక్తి హత్య
● రాడ్డుతో తలపై మోది దారుణం ● మరొకరికి తీవ్ర గాయాలు దౌల్తాబాద్: భూతగాదాలతో వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. మరొక వ్యక్తికి తీవ్ర గాయాలయ్యా యి. ఈ సంఘటన దౌల్తాబాద్ మండలం బండివా డ తండా శివారులో సోమవారం చోటుచేసుకుంది. ప్రత్యక్ష సాక్షులుస్థానికుల కథనం ప్రకారం.. బండివాడ తండా,హన్మ్యానాయక్ తండాలు పక్కనే పక్క నే ఉంటాయి. ఈ రెండు తండాల్లోని బాబునాయక్, విజయ్నాయక్కు కొన్నేళ్లుగా భూతగాదాలు ఉన్నా యి. ఇరువర్గాల మధ్య ఆదివారం మధ్యా హ్నం గొడవ జరిగింది. విజయ్నాయక్ వర్గం బాబునాయక్ వర్గంపై దాడి చేయడంతో ఐదుమందికి గాయాలయ్యాయి. దీంతో క్షత పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రాత్రి బాబునాయక్, అతని తమ్ముడు వెంకట్నాయక్ మరో వ్యక్తి శ్రీరాంలు బైక్పై ఇంటికి వెళ్తున్న క్రమంలో విజయ్ వర్గం కాపుకాచి రాడ్డుతో దాడి చేసింది. గాయాలతో బాబునాయక్ తప్పించుకున్నారు. వెంకట్నాయక్(38)పై తలపై రాడ్డుతో దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు. అపస్మారక స్థితిలో ఉన్న ఆయన్ను చుట్టుపక్కల వారు కొడంగల్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. దీంతో తండాలో పోలీ సు పికెట్ ఏర్పాటు చేశారు. మృతుడికి ఒక కుమారుడు. ముగ్గురు కూతుర్లు ఉన్నారు. సంఘటన స్థలాన్ని సీఐ శ్రీధరెడ్డి, ఎస్ఐ రవిగౌడ్ పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
ఉపాధ్యాయ వృత్తి పవిత్రమైనది
తాండూరు రూరల్: ఉపాధ్యాయ వృత్తి పవిత్రమైనదని డీసీసీబీ వైస్ చైర్మన్ సంగెం రవిగౌడ్ అన్నారు. సోమవారం పీఆర్టీయూ ఆధ్వర్యంలో మండల పరిధిలోని జినుగుర్తి జెడ్పీహెచ్ఎస్ జీహెచ్ఎం మృత్యుంజయస్వామి పదవీవిరమణ కార్యక్రమాన్ని ఆర్యవైశ్య ఓపెన్ ఆడిటోరియంలో నిర్వహించారు. ఈ సందర్భంగా రవిగౌడ్ మాట్లాడుతూ.. విద్యార్థులను భావిభారత పౌరులుగా తీర్చిదిద్దేశక్తి ఉపాధ్యాయుడికే ఉంటుందన్నారు. బడి లేని ఊరు ఉంటుందేమోకాని ఉపాధ్యాయుడు లేని ఊరు ఉండదన్నారు. 38 ఏళ్లుగా ఉపాధ్యాయ వృత్తికే వన్నెతెచ్చిన గొప్ప వ్యక్తి మృత్యుంజయస్వామి అని కొనియాడారు. ఈ సందర్భంగా ఆయన్ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పీఆర్టీయూ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు చంద్రశేఖర్, అమర్నాథ్, గౌరవ అధ్యక్షుడు వెంకట్రాంరెడ్డి, ఏంఈఓ వెంకటయ్య, తాండూరు మండల అధ్యక్ష, కార్యదర్శులు వినోద్కుమార్, పురుషోత్తంరెడ్డి, నాయకులు జైపాల్రెడ్డి, నాగప్ప, కిష్టప్ప, అంబమ్మ, రాంనర్సింహారెడ్డి, ప్రభు, బాల్రాజ్, రాజేశ్వర్, శ్రీధర్, సతీశ్ తదితరులు ఉన్నారు. డీసీసీబీ వైస్ చైర్మన్ సంగెం రవిగౌడ్ ఘనంగా మృత్యుంజయస్వామి పదవీవిరమణ కార్యక్రమం -
విదేశీ వస్తువులను బహిష్కరించాలి
పరిగి/కుల్కచర్ల: విదేశీ వస్తువులను బహిష్కరించాలని స్వదేశీ జాగరన్ మంచ్ రాష్ట్ర నాయకుడు, ప్రముఖ వక్త బెంగాల్ ఈశ్వర్ అన్నారు. సోమవారం పట్టణ కేంద్రంలో స్వదేశీ జాగరన్ మంచ్ ఆధ్వర్యంలో శ్రీసాయి ఒకేషనల్ కళాశాలలో స్వదేశీ వస్తువుల ఆవశ్యకతపై అవగాహన కల్పించారు. నేడు దేశంలో స్వదేశీ అనేది ఒక ఉద్యమంలా సాగాలని సూచించారు. విదేశీ వ్యాపార సంస్థలైన అమెజాన్, ఫ్లిప్కార్ట్ తదితర వాటిలో వస్తువులు కొనుగోలు చేయొద్దని సూచించారు. ఈ కామర్స్ వల్ల దేశంలోని 3 లక్షలకు పైగా చిన్న చిన్న దుకాణాదారులు రోడ్డున పడ్డారన్నారు. మన సాంస్కృతిక సంప్రదాయాలను మనమే కాపాడుకోవాలని చెప్పారు. కార్యక్రమంలో విభాగ్ కన్వీనర్ ప్రభాకర్రెడ్డి, కళాశాల డైరెక్టర్ రాముయాదవ్, ప్రిన్సిపాల్ శ్రీశైలం, హరిక్రిష్ణ తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు కుల్కచర్ల మండల కేంద్రంలోని కృష్ణవేణి పాఠశాలలో స్వదేశీ జాగరణ మంచ్ కార్యక్రమాన్ని నిర్వహించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. -
శాంతి భద్రతల పరిరక్షణే ధ్యేయం
తాండూరు టౌన్: శాంతి భద్రతల పరిరక్షణే తమ ధ్యేయమని తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి అన్నారు. సోమవారం పట్టణంలో ర్యాడిప్ యాక్షన్ ఫోర్స్ టీం కవాతు నిర్వహించింది. పట్టణంలోని ఆలయాలు, మజీదులు, పురవీధుల మీదుగా కవాతు కొనసాగింది. డీఎస్పీ వెంట సీఐ సంతోశ్కుమార్ తదితరులున్నారు. ఎస్ఐ మహిపాల్ రెడ్డి సేవలు అభినందనీయం తాండూరు పట్టణ ఎస్ఐ మహిపాల్ రెడ్డి సేవలు అభినందనీయమని తాండూరు డీఎస్పీ బాలకృష్ణా రెడ్డి అన్నారు. పట్టణ ఎస్సైగా విధులు నిర్వర్తించి సోమవారం పదవీ విరమణ పొందిన మహిపాల్ రెడ్డిని డీఎస్పీ తన కార్యాలయంలో సన్మానించారు. 1984లో కానిస్టేబుల్గా విధుల్లో చేరిన మహిపాల్ రెడ్డి ఏఎస్ఐగా, ఎస్ఐగా పదోన్నతి సాధించారు. జిల్లాలోని బషీరాబాద్, బంట్వారం, తాండూరు పట్టణంతో పాటు సంగారెడ్డి జిల్లాలోనూ ఆయన ఎస్ఐగా విధులు నిర్వర్తించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ.. కానిస్టేబుల్గా ఉద్యోగాన్ని సాధించి, ఎస్ఐగా రిటైర్డ్ అయిన మహిపాల్ రెడ్డి విధుల పట్ల అంకితభావంతో ఉండేవారన్నారు. పోలీసు శాఖలో సుదీర్ఘంగా ప్రజలకు అందించిన సేవలను కొనియాడారు. ఏ ఉద్యోగికై నా పదవీ విరమణ తప్పదన్నారు. అనంతరం మహిపాల్రెడ్డి మాట్లాడుతూ 41 ఏళ్ల పాటు పోలీసు శాఖలో ఉంటూ ప్రజలకు విధుల పరంగా సహాయ సహకారాలు అందించానన్నారు. తన ఉద్యోగ కాలంలో సహకరించిన ఉన్నతాధికారులకు, ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ సీఐ సంతోశ్ కుమార్, ఎస్ఐ సాజిద్ తదితరులు ఉన్నారు. తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి -
మెడికల్ కౌన్సిల్ దాడులు
● అనుమతులు లేని ఆస్పత్రులపై కొరడా ● తనిఖీల్లో పట్టుబడ్డ నకిలీ వైద్యులు సాక్షి, సిటీబ్యూరో: ప్రభుత్వ విభాగాల నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోలేదు. విద్యార్హతలు అసలే లేవు. అయినా వైద్యులుగా చలామణి అవుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న కాంపౌండర్లపై తెలంగాణ మెడికల్ కౌన్సిల్ సభ్యులు కొరడా ఝులిపించారు. సోమవారం షాబాద్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన వైద్యుల బృందం ఏడు క్లినిక్లపై కేసులు నమోదు చేసింది. ఓం సాయి ఫస్ట్ ఎయిడ్ సెంటర్, శ్రావణ్ ఫస్ట్ఎయిడ్ ఎంటర్, మధు శ్రీ క్లినిక్, ముస్తాఫా క్లినిక్, మాస్టర్ క్లినిక్, శ్రీ సాయితిని, జంజం క్లినిక్లకు అనుమతులు లేవని గుర్తించింది. తెలంగాణ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ డా.మహేశ్కుమార్, ఉపాధ్యక్షు డు శ్రీనివాస్ మీడియాకు వివరాలు వెల్లడించారు. జంజం క్లినిక్లో వందల సంఖ్యలో డైకోఫెన్స్ సోడి యం ఇంజక్షన్లు, కాల్షియం గ్లూకోనేట్ ఇంజక్షన్లు, స్టెరాయిడ్స్, యాంటీబయాటిక్ ఇంజక్షన్లు గుర్తించినట్టు తెలిపారు. కనీస అర్హత లేకుండా అల్లోపతి దవాఖానా నిర్వహిస్తున్నారని అన్నారు. రోగంతో సంబంధం లేకుండా యాంటీబయాటిక్స్, స్టెరాయిడ్స్, మాత్రలను అధిక మోతాదులో ఇస్తున్నారని పేర్కొన్నారు. చట్ట ప్రకారం ఎంబీబీఎస్ వైద్యులు మాత్రమే మెడికల్ కౌన్సిల్లో రిజిస్టర్ చేయించుకుని ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుందన్నారు. అర్హత లేని వ్యక్తులు వైద్యం చేసినట్లైతే ఎన్ఎంసీ చట్టం 34, 35 ప్రకారం కేసులు నమోదు చేయడంతో పాటు రూ.5 లక్షల జరిమానా, ఏడాది జైలు శిక్షణ విధిస్తామని వెల్లడించారు. మెడికల్ స్టోర్స్లో క్వాలిఫైడ్ వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండా, ఫార్మసిస్ట్లు లేకుండా యాంటిబయాటిక్స్, స్టేరాయిడ్, ఇతర షెడ్యూల్ డ్రగ్స్ విక్రయిస్తునట్టు గుర్తించామని తెలిపారు. -
బాధ్యతగా పనిచేస్తే గుర్తింపు
● కలెక్టర్ ప్రతీక్ జైన్ ● ఉద్యోగ విరమణ పొందిన డీఎంహెచ్ఓ, కుల్కచర్ల తహసీల్దార్ ● ఘనంగా వీడ్కోలు అనంతగిరి: నిజాయితీగా ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తిస్తే జీవితంలో ఎంతో సంతోషాన్ని కలిగిస్తుందని కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. సోమవారం ఉద్యోగ విరమణ పొందుతున్న డీఎంహెచ్ఓ వెంకటరవణ, కుల్కచర్ల తహసీల్దార్ మురళీధర్ను కలెక్టరేట్లో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. బాధ్యతగా పనిచేస్తే మంచి గుర్తింపు వస్తుందన్నారు. ప్రజలకు సేవ చేసే భాగ్యం అందరికీ రాదన్నారు. అనంతరం వెంకటరవణ సేవలను కొనియాడారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు లింగ్యానాయక్, సుధీర్, అసిస్టెంట్ కలెక్టర్ హర్ష చౌదరి, డీఆర్డీఓ శ్రీనివాస్, ఉద్యాన వన శాఖ అధికారి మహమ్మద్ సత్తార్, ఏఓ ఫరహీన్ బేగం, నెమత్ హాలీ తదితరులు పాల్గొన్నారు. బాల కార్మికులు లేని జిల్లాగా తీర్చిదిద్దాలి బాలల భవిష్యత్తుకు బంగారు బాటలు వేసే విధంగా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ సూచించారు. సోమవారం కలెక్టరేట్ నుంచి ఆపరేషన్ స్మైల్ కార్యక్రమంపై వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో అక్రమ రవాణాకు గురవుతున్న, తప్పిపోయిన పిల్లలను గుర్తించాలని ఆదేశించారు. బాల కార్మికుల వ్యవస్థ నిర్మూలనకు కృషి చేయాలన్నారు. తప్పిపోయిన పిల్లలను గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించాలన్నారు. మతిస్థిమితం లేని వారిని వారిని పునరావాస కేంద్రాలకు తరలించి వైద్య సేవలు అందించాలని తెలిపారు. పిల్లలను పనుల్లో పెట్టుకోవడం చట్ట రీత్యా నేరమన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ ఎం.సుధీర్, అసిస్టెంట్ ట్రైనీ కలెక్టర్ హర్ష చౌదరి, డీడబ్ల్యూఓ కృష్ణవేణి, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ వెంకటేశం, కార్మిక శాఖ అసిస్టెంట్ కమిషనర్ వాల్యా నాయక్, అడిషనల్ ఎస్పీ (డీటీసీ) మురళీధర్, డీసీపీఓ శ్రీకాంత్ పాల్గొన్నారు. సత్వరం పరిష్కరించాలి ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలు ఇచ్చిన అర్జీలను సత్వరం పరిష్కరించాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ నిర్వహించిన ప్రజావాణికి 185 దరఖాస్తులు వచ్చాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజా ఫిర్యాదులను పెండింగ్ ఉంచరాదని సూచించారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు లింగ్యానాయక్, సుధీర్, ఆర్డీఓ వాసుచంద్ర తదితరులు పాల్గొన్నారు. -
చికిత్స పొందుతున్న మహిళ మృతి
దుద్యాల్: తమ కూతురుతో కలిసి స్కూటీపై వెళ్తున్న దంపతులను లారీ ఢీకొట్టిన ఘటనలో మరొకరు మృతి చెందారు. వివరాలు.. ఈ నెల 25న కోస్గికి చెందిన వెంకటేశ్, అనిత దంపతులు తమ మూడేళ్ల కూతురు అక్షితతో కలిసి కొడంగల్ వెళ్తుండగా.. దుద్యాల్ గేట్ వద్ద ఓ లారీ అదుపుతప్పి వీరి స్కూటీని ఢీకొట్టింది. దీంతో చిన్నారి అక్కడికక్కడే మృతి చెందగా దంపతులను నగరంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న అనిత పరిస్థితి విషమించి సోమవారం మృతిచెందింది. వెంకటేశ్ పరిస్థితి కూడా విషమంగానే ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు. మంగళవారం కోస్గిలో అనిత అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు సమాచారం. కాగా ప్రమాదానికి కారణమైన లారీని పోలీసులు సోమవారం కొడంగల్ ఠాణాకు తరలించారు. -
అంతా ఆన్లైన్!
నేటి నుంచివికారాబాద్: జిల్లా వ్యాప్తంగా మంగళవారం నుంచి ఆన్లైన్ అటెండెన్స్ సిస్టం అమలు చేయనున్నారు. ప్రభుత్వ యంత్రాంగం విధులకు హాజరుకావటంలో పారదర్శకతకు ఈ విధానం అమలు చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవ చూపుతుండగా అమలుకు అధికారులు కసరత్తు ప్రారంభించారు. ముందుగా జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని అన్ని శాఖల హెచ్ఓడీ కార్యాలయాల నుంచే ఈ విధానం మొదలు పెట్టనున్నారు. కలెక్టరేట్లో ఆన్లైన్ హాజరు విధానం అమలు కానుంది. అనంతరం ఆరోగ్య, విద్యాశాఖల్లో సైతం ఏర్పాటుకు నిర్ణయించారు. హెల్త్ డిపార్ట్మెంట్లో జిల్లాలో 24 పీహెచ్సీలు ఉండగా రామయ్యగూడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. విద్యాశాఖ పరిధిలో 1,063 పాఠశాలలు ఉండగా ముందుగా వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని ఎన్నెపల్లి పాఠశాలను పైలెట్ ప్రాజెక్టుగా తీసుకున్నారు. వారం రోజుల్లో ఎంప్లాయి ఐడీలతో పాటు వారి ఆధార్ నంబర్లు సేకరించారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖల్లో మొత్తం 6,500 మంది ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. పర్యవేక్షణ ఉంటేనే ఫలితం గత కలెక్టర్ నారాయణరెడ్డి హయాంలో జిల్లాలో మొదటిసారి జీఓ అటెండెన్స్ పేరుతో ఆన్లైన్ హాజరు విధానం అమలు చేశారు. ఆయన బదిలీపై వెళ్లిపోయాక బయోమెట్రిక్, ఆన్లైన్ అటెండెన్స్ విధానానికి స్వస్తి పలికారు. విధి నిర్వహణ, రోజువారీ హాజరులో పారదర్శకత కొరవడిన విషయం గమనించిన ప్రస్తుత కలెక్టర్ ప్రతీక్జైన్ తిరిగి ఆన్లైన్ విధానం అమలు చేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం మొబైల్ యాప్ ద్వారా ఈ ఆన్లైన్ హాజరు విధానం అమలు చేయనున్నారు. అయితే గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని నెల వారీ పర్యవేక్షణ ఉంటేనే సక్సెస్ అవుతుందని అంచనా వేశారు. గతంలో ఎన్ని రోజులు విధులకు హాజరయ్యారు...? ఎన్ని రోజులు ఆలస్యంగా వచ్చారు...? వారిని గుర్తించి.. శాఖాపరమైన చర్యలు తీసుకోలేదు. దీంతో ఆన్లైన్ హాజరును ఉద్యోగులు లైట్ తీసుకున్నారు. మూణ్నాళ్ల ముచ్చటగా యంత్రాంగంలో ఎక్కువ మంది ఉద్యోగులతో నడిచే వైద్య, విద్యా శాఖల్లో ఐదారు ఏళ్ల క్రితమే బయోమెట్రిక్ విధానం అమలు చేశారు. రోజువారీ హాజరు పర్యవేక్షణ కోసం ప్రభుత్వం పాఠశాలల్లో మార్పును ఆశించి ప్రవేశపెట్టిన బయోమెట్రిక్ విధానం మూణ్నాళ్ల ముచ్చటగా మారింది. ఇప్పటికే కళాశాలలు, గురుకుల పాఠశాలలు తదితర సంస్థలోల బయోమెట్రిక్ విధానం అమలు చేస్తున్నారు. సర్కారు 2018లో ఆస్పత్రులతో పాటు ప్రభుత్వ పాఠశాలల్లో మిషన్లు ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో పైలెట్ ప్రాజెక్టు కింద ముందుగా 10 జిల్లాలను తీసుకోగా అందులో వికారాబాద్ జిల్లా కూడా ఉంది. ప్రయోగాత్మక కార్యక్రమం విజయవంతం కావటంతో ఆరు నెలల తరువాత ఇదే విధానం రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేశారు. ఆ సమయంలో ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు మెరుగు పడిందని అధికారులు పేర్కొన్నారు. అయితే కొద్ది రోజులకే చిన్న చిన్న సాకుగా చూపి బయోమెట్రిక్ మిషన్లు మూలన పడేశారు.బయోమెట్రిక్తో అధికారుల హాజరు నమోదు పారదర్శకత కోసం ప్రత్యేక కార్యాచరణ ముందుగా కలెక్టరేట్లో అమలు వైద్య, విద్యా శాఖల్లోనూ పైలెట్ ప్రాజెక్టు ఎంపిక -
3న సర్టిఫికెట్ల పరిశీలన
అనంతగిరి: జిల్లాలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న 12 పోస్టుల భర్తీలో భాగంగా ఈ నెల 3వ తేదీ సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుందని డీఈఓ రేణుకాదేవి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2022 – 23లో స్పెషల్ ఆఫీసర్, పీజీసీఆర్టీ, పీఈటీ పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన పరీక్షలో మెరిట్ లిస్టులోని అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుందని తెలిపారు. అభ్యర్థులు ఉదయం 11గంటలకు సంబంధిత ఒరిజినల్స్, రెండు సెట్ల జిరాక్స్ కాపీలు, రెండు పాస్పోర్టు సైజ్ ఫొటోలతో హాజరుకావాలని తెలిపారు. తహసీల్దార్పై చర్యలు తీసుకోవాలి దోమ: ప్రభుత్వ భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసిన పరిగి తహసీల్దార్ను వెంటనే సస్పెండ్ చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం నేతలు డిమాండ్ చేశారు. సోమవారం దోమ మండల కేంద్రంలోని అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పరిగి మండలం రంగంపల్లి సర్వే నంబర్ 146లో మొత్తం 4.17 గుంటల భూమి ఉందని, అందులోని ఎకరం భూమిని గత నెల 9న ఇతరుల పేరిట అక్రమ రిజిస్ట్రేషన్ చేశారని ఆరోపించారు. ఇదే గ్రామంలోని సర్వే నంబర్ 256లో 20.23 గుంటల భూమి ఆక్రమించేందుకు కొందరు రియల్టర్లు ప్రయత్నిస్తూన్నా తహసీల్దార్ పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఆయనపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో సంఘం నేతలు సత్తయ్య, చెన్నారెడ్డి, వెంకటేశ్, రాములు, ఆనంద్, రాజు పాల్గొన్నారు. హామీలు అమలు చేయాలి మొయినాబాద్: ఎన్నికలకు ముందు ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని తెలంగాణ ఉద్యమనేత దేశమొళ్ల ఆంజనేయులు డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమకారుల సమితి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సోమవారం మున్సిపల్ కేంద్రంలో ఉద్యమకారులు రిలే నిరహారదీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమకారులను అన్ని విధాలా ఆదుకుంటామని ఎన్నికల ముందు చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మర్చిపోయిందని విమర్శించారు. ఉద్యమకారులను మరవద్దనే విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి తెలియజేస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఉద్యమకారుల సంఘం మండల అధ్యక్షుడు మహిపాల్, నాయకులు కుమ్మరి రమేష్, భిక్షపతి, మధు, అవినాష్, ముకుందరెడ్డి, బన్సీలాల్, రత్నం, కేబుల్ రాజు తదితరులు పాల్గొన్నారు. మరకత శివాలయం సందర్శన శంకర్పల్లి: మండల పరిధిలోని చెందిప్పలో వెలసిన శ్రీ బ్రహ్మాసూత్ర మరకత శివాలయా న్ని సోమవారం సినీ నటుడు బాలాజీ దర్శించుకున్నారు. స్వామి వారికి అభిషేకం, ప్రత్యేక పూజలు చేశారు. మరకత శివాలయం ఎంతో అద్భుతంగా ఉందని, సమయం దొరికినప్పుడల్లా ఇక్కడికి వచ్చేందుకు ప్రయత్నిస్తుంటానని తెలిపారు. -
‘చెత్త’మున్సిపాలిటీలు
వికారాబాద్: వికారాబాద్ మున్సిపాలిటీలో పారిశుద్ధ్య మెరుగుకు ఏటా లక్షలాది రూపాయలు ఖర్చు చేస్తున్నామని పాలకులు, అధికారులు చెబుతున్నా కాలనీలు మాత్రం కంపు వీడటం లేదు. రోజూ ఏదో ఒక కాలనీలో మురుగు సమస్య దర్శనమిస్తోంది. చిన్నపాటి వర్షం పడితే చాలు పరిస్థితి మరీ దారుణంగా ఉంటుంది. రోడ్లు, వీధులు మురుగు నీటితో నిండిపోతాయి. ప్రజలు నడిచే పరిస్థితి కూడా ఉండదు. వికారాబాద్ నడిబొడ్డున బాబు జగ్జీవన్రామ్ చౌరస్తాలో డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేదు. అవసరాల మేర మురుగు కాలువలు లేవు. వికారాబాద్ పట్టణ జనాభా దాదాపు 80 వేల వరకు ఉంటుంది. జిల్లా కేంద్రం కావడంతో ఆయా ప్రాంతాల నుంచి వివిధ అవసరాల నిమిత్తం రోజూ 20వేల నుంచి 30వేల మంది ఇక్కడికి వస్తుంటారు. మున్సిపల్ పరిధిలో పది చోట్ల మాత్రమే పబ్లిక్ టాయిలెట్లు ఉ న్నాయి. ప్రస్తుత అవసరాలకు ఇవి సరిపోవ డం లేదు. మరో పదిచోట్ల టాయిలెట్లు నిర్మించాల్సి ఉంది. మున్సిపల్ పరిధిలో 33.50 కిలోమీటర్ల మేర సీసీ డ్రైనేజీ, 3.38 కిలోమీటర్ల రాతి డ్రైనేజీ, మరో ఐదు కిలోమీటర్ల కచ్చా డ్రైనేజీ ఉంది. మరో 40 కిలోమీటర్ల సాధారణ డ్రైనేజీ, 60 కిలోమీటర్ల అండర్ గ్రౌండ్ డ్రైనేజీ అవసరమని అధికారులు అంచనా వేశారు. పట్టణ అవసరాల మేరకు డ్రైజేజీ వ్యవస్థను ఏర్పాటు చేయడంతోపాటు, పారిశుద్ధ్య మెరుగుకు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.పరిగి పట్టణంలోని 5వ వార్డులో ఇళ్ల మధ్య నిలిచిన మురుగు ప్రతిపాదనల్లోనే అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు జిల్లా కేంద్రంలో పరిస్థితిమరీ అధ్వానం పట్టించుకోని అధికారులు ఇబ్బందుల్లో ప్రజలు డ్రైనేజీ వ్యవస్థ లేక పాట్లుపరిగి: పరిగి మున్సిపాలిటీలో పారిశుద్ధ్యం పడకేసింది. ఎక్కడ చూసినా చెత్తాచెదారం కనిపిస్తోంది. కొన్ని కాలనీలకే చెత్త సేకరణ వాహనాలు వస్తుండటంతో మిగిలిన కాలనీల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. విధిలేక ప్రజలు వీధుల్లో, ఖాళీ ప్రదేశాల్లో చెత్త వేస్తున్నారు. పట్టణంలోని 5వ వార్డు, విద్యానగర్ కాలనీ, వెంకటేశ్వర కాలనీ, టీచర్స్కాలనీ, ఇంద్రనగర్ తదితర ప్రాంతాల్లో డ్రైనేజీ వ్యవస్థ లేదు. దీంతో మురుగు రోడ్లపై ప్రవహిస్తోంది. ఈ నీటిని ఖాళీ ప్లాట్లలోకి మళ్లించారు. దీంతో ఈగలు, దోమలు వృద్ధి చెంది ప్రజ లు రోగాల బారిన పడుతున్నారు. మున్సిపల్ పరిధిలోని పలు కాలనీల నుంచి 19 వాహనాలతో రోజుకు 8 టన్నుల చెత్తను సేకరిస్తున్నారు. 78 మంది పారిశుద్ధ్య కార్మికులు ఉన్నా చెత్త సేకరణ సరిగ్గా లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. మున్సిపాలిటీల్లో పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా మారింది. కాలనీల్లో చెత్తాచెదారం పేరుకుపోయి కంపుకొడుతున్నాయి. కాలువల్లో వ్యర్థాలు చేరి మురుగు ముందుకు కదలడం లేదు. ప్రస్తుతం వర్షాలు పడుతుండటంతో చెత్త కుళ్లి ఈగలు, దోమలు వృద్ధి చెందుతున్నాయి. ప్రజలు సీజనల్ వ్యాధుల బారిన పడుతున్నారు. జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో పారిశుద్ధ్య నిర్వహణ తీరుపై ‘సాక్షి’ ప్రత్యేక కథనాలు -
అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు
డీసీసీ ప్రధానకార్యదర్శి హన్మంత్ ముదిరాజ్ పరిగి: డబుల్ బెడ్రూం ఇళ్లు ఇస్తామంటూ గత ప్రభుత్వం పేదలను మోసం చేసిందని.. కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇస్తుందని డీసీసీ ప్రధాన కార్యదర్శి హన్మంత్ ముదిరాజ్ అన్నారు. సోమవారం మండల పరిధిలోని నస్కల్లో లబ్ధిదారులకు మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్స్ అందజేసి ఇంటి నిర్మాణ పూజలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు కృష్ణ, అశోక్, శ్రీనివాస్, చంద్రయ్య, నరేశ్, అశోక్, చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు. సమ్మెలో పాల్గొంటాం అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ అనంతగిరి: ఈ నెల 9న నిర్వహించనున్న దేశవ్యాప్త సమ్మెను విజయవంతం సీఐటీయూ జిల్లా కార్యదర్శి రామకృష్ణ అన్నారు. ఈ సమ్మెలో తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ పాల్గొంటుందని తెలుపుతూ వికారాబాద్ సీడీపీఓ వెంకటలక్ష్మికి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్ నాయకులు వనజ, అరుణ, పుష్ప, ఆండాలు, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. కొనసాగుతున్న ఫార్మర్ రిజిస్ట్రీ తాండూరు రూరల్: ప్రతి రైతుకు ఆధార్ తరహాలో ఫార్మర్ రిజిస్ట్రీ గుర్తింపు నంబర్ ఉండాలని వ్యవసాయశాఖ తాండూరు డివిజన్ ఏడీఏ రుద్రమూర్తి అన్నారు. సోమవారం మండలంలోని వ్యవసాయశాఖ కార్యాలయంలో ఫార్మర్ రిజిస్ట్రీ కార్యక్రమాన్ని ఏఓ కొమరయ్యతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఏడీఏ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ పథకాలు వర్తించాలంటే ఫార్మర్ రిజిస్ట్రీ తప్పనిసరిగా చేసుకోవాలని సూచించారు. పట్టాదారు పాసు పుస్తకం, ఆధార్కార్డు, ఫోన్ నంబర్ తీసుకొని సంబంధిత ఏఈవోల వద్ద నమోదు చేయించుకోవాలన్నారు. రైతుల వివరాలను ఒకే చోట డిజిటల్గా భద్రపరిచి, పథకాల అమలును మరింత సమర్థవంతంగా నిర్వహించాలనే ఉద్దేశంతో ఫార్మర్ రిజిస్ట్రీ చేపట్టారని తెలిపారు. కార్యక్రమంలో అధికారులు, రైతులు పాల్గొన్నారు. -
భూ తగాదాల్లో జోక్యం వద్దు
● నేరాల అదుపులో సీసీ కెమెరాలదే కీలక పాత్ర ● నవాబుపేట పోలీసుల పనితీరు భేష్ ● ఎస్పీ నారాయణరెడ్డి నవాబుపేట: నేరాలను అదుపు చేయడంలో సీసీ కెమెరాలు కీలకంగా పనిచేస్తాయని ఎస్పీ నారాయణరెడ్డి అన్నారు. సోమవారం నవాబుపేట పోలీస్ స్టేషన్ ఆయన సందర్శించారు. స్టేషన్ పరిసరాలు, రికార్డులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సీసీ కెమెరాలు ప్రాధాన్యతపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఇళ్ల ముందు, షాపుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునేలా చొరవ తీసుకోవాలని సూచించారు. చాలామంది నేరస్తులను సీసీ కెమెరాల ద్వారానే గుర్తిస్తున్నట్లు తెలిపారు. రోడ్ల పరిస్థితి బాగులేకపోవడం వల్లే ప్రమాదాలు జరుగుతున్నట్లు గుర్తించామని పేర్కొన్నారు. ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించి నివారణకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. భూ తగాదాల్లో పోలీసులు జోక్యం చేసుకోరాదని, రెవెన్యూ శాఖ సూచనల మేరకు ముందుకు వెళ్లాలన్నారు. 80 శాతం దొంగతనాలు, దోపిడీలు, ట్రాన్స్ ఫార్మర్ల చోరీలు పాత నేరస్తుల పనేనని పేర్కొన్నారు. వారిపై నిఘా ఉంచామన్నారు. గ్రామాల్లో కొత్త వ్యక్తులు సంచరిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. రేషన్ బియ్యం అక్రమ రవాణా, నకిలీ విత్తనాలు, ఎరువులు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నవాబుపే ట పోలీసుల పనితీరు బాగుందని, ఇంకా మెరుగ్గా పని చేయాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ శ్రీనివాస్రెడ్డి, సీఐ వెంకటేష్, ఎస్ఐ అరుణ్ కుమార్, సిబ్బంది పాల్గొన్నారు. -
చెత్త సేకరణలో నిర్లక్ష్యం
తాండూరు: తాండూరు మున్సిపల్ పరిధిలో చెత్తసేకరణ అధ్వానంగా మారింది. మున్సిపల్ పాలకవర్గం గడువు ముగియడం.. ప్రత్యేక అధికారుల పాలనలో పారిశుద్ధ్యంపై పెద్దగా శ్రద్ధ చూపడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. పట్టణంలో ఎక్కడ పడితే అక్కడ చెత్త పెరుకుపోయి డంపింగ్ యార్డులను తలపిస్తోంది. చెత్త సేకరణ వాహనాలు సరిగ్గా రావడం లేదని స్థానికులు తెలిపారు. పట్టణ పరిధిలో మురుగు కాల్వలు సరిగ్గా లేకపోవడంతో వ్యర్థ జలాలు ఎక్కడికక్కడ నిలిచి దుర్గంధం వెదజల్లుతున్నాయి. దీంతో దోమలు, ఈగలు వృద్ధి చెంది ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. ప్రధాన రహదారిలో మురుగు కాల్వలు సరిగ్గా లేక మురుగు నీరు రోడ్డుపై నిలుస్తోంది. మున్సిపల్ పరిధిలో 36 వార్డులు 85 వేల జనాభా ఉంది. రోజూ ఇతర ప్రాంతాల నుంచి మరో 30 వేల మంది పట్టణానికి వచ్చి వెళ్తుంటారు. మూత్రశాలలు లేకపోవడంతో ప్రజలు ఖాళీ ప్రదేశాల్లో కానిచ్చేస్తున్నారు. అధికారులు స్పందించి తాండూరు మున్సిపాలిటీలో పారిశుద్ధ్య మెరుగుకు చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. -
టాటా
సోమవారం శ్రీ 30 శ్రీ జూన్ శ్రీ 2025టీబీకి 8లోuకొడంగల్ రూరల్: క్షయ కట్టడికి జిల్లా అధికారులు చేపడుతున్న చర్యలు సత్ఫలితాలిస్తున్నాయి. వైద్య సిబ్బంది ఎప్పటికప్పుడు బాధితులను గుర్తిస్తూ మందులు పంపిణీ చేస్తూ టీబీ నివారణకు కృషిచేస్తున్నారు. మరోవైపు క్షేత్రస్థాయిలో వ్యాధిని గుర్తిస్తూ చికిత్స విధానాలపై అవగాహన కల్పిస్తూ కొత్త కేసులు నమోదు కాకుండా చర్యలు తీసుకుంటున్నారు. టీబీ సోకినవారు ఆందోళన చెందకుండా ఆరు నెలల పాటు క్రమం తప్పకుండా మందులు వాడాలని.. ఇతరులకు వ్యాధి సోకకుండా జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. సరైన సమయంలో చికిత్స అవసరం క్షయ నివారణకు వైద్యుల సూచనలు పాటిస్తూ సరైన చికిత్స తీసుకోవాలి. ఇది మనిషిని బలహీన పరుస్తుందని.. ఇది అంటు వ్యాధి అయినందున జాగ్రత్తలు పాటించాలి. క్రమం తప్పకుండా మందులు తీసుకుంటే వ్యాధిని కట్టడి చేయొచ్చని సూచిస్తున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆశ కార్యకర్తలు, ఏఎన్ఎంలు వ్యాధిగ్రస్తులకు ఎప్పటికప్పుడు మందులు ఇస్తూ నివారణ చర్యలు తీసుకుంటున్నారు. నిబంధనలు తప్పనిసరి ప్రైవేటు ఆస్పత్రుల్లో క్షయ బాధితులను గుర్తిస్తే వారి వివరాలను జిల్లా క్షయ నియంత్రణ శాఖకు సమాచారం ఇవ్వాలి. బాధితుడికి ఆరు నెలలపాటు చికిత్స అందించాలి. బాధిత కుటుంబసభ్యులు, ప్రైవేటు ఆస్పత్రుల సిబ్బంది, వ్యాధి సోకిన వ్యక్తులు ప్రతీ ఒక్కరి సమష్టి కృషితోనే వ్యాధి నివారణ సాధ్యమవుతుంది. వ్యాధి గుర్తింపు రెండు వారాలకు మించి ఎడతెరిపి లేకుండా దగ్గు, సాయంత్రం జ్వరం, ఆకలి మందగించడం, బరువు తగ్గడం, చాతిలో నొప్పి తదితర లక్షణాలుంటే వెంటనే సమీపంలోని ఆరోగ్య కేంద్రాలకు వెళ్లాలి. ఉచితంగా తెమడ పరీక్షలు చేసి వ్యాధిని గుర్తిస్తారు. ఈ వ్యాధి ఊపిరితిత్తులపై ఎక్కువగా ప్రభావం చూపుతుంది. పొగ తాగేవారు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. శిబిరాలను వినియోగించుకోవాలి వైద్య శిబిరాల్లో డయాబెటిస్, డయాలసిస్, 60 ఏళ్ల పైబడిన వృద్ధులు, బీపీ, షుగర్, పాత టీబీ వ్యాధిగ్రస్తులు, ప్రస్తుతం లక్షణాలు కనిపించే వ్యక్తులు, హెచ్ఐవీ తదితర వ్యాధులకు పరీక్షలు నిర్వహిస్తూ ఉచితంగా మందులను అందిస్తున్నారు. జిల్లాలోని మర్పల్లి, వికారాబాద్, పరిగి, కొడంగల్, తాండూరు ఆస్పత్రుల పరిధిలోని సబ్ సెంటర్లలోని గ్రామాల్లో సోమ, మంగళ, బుధ, శుక్రవారం వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నారు. అవగాహనతో వ్యాధి దూరం న్యూస్రీల్ క్షయ కట్టడికి టీబీ ముక్త్ భారత్ అభియాన్ శిబిరాలు కొత్త కేసులు నమోదు కాకుండా చర్యలు వ్యాధి నివారణపై బాధితులకు సూచనలు సమష్టి కృషితో నివారణ వ్యాధిగ్రస్తులు క్రమం తప్పకుండా మందులు వాడాలి. ప్రైవేటు ఆస్పత్రుల వైద్యులు టీబీకి సంబంధించి ఏ ఒక్క లక్షణం కనిపించినా వ్యాధిగ్రస్తులను ప్రభుత్వ ఆస్పత్రులకు పంపించాలి. ప్రైవేటు ఆస్పత్రుల, ప్రభుత్వ ఆస్పత్రుల వైద్యులు, వ్యాధిగ్రస్తులు, వ్యాధిగ్రస్తుల కుటుంబసభ్యులు సమష్టిగా, బాధ్యతగా వ్యవహరిస్తూ టీబీ నియంత్రణకు కృషిచేయాలి. వ్యాధి నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. – డాక్టర్ రవీంద్రయాదవ్, జిల్లా క్షయ నియంత్రణ అధికారి -
సాగుకు సాయం.. రైతు మురిపెం
దౌల్తాబాద్: వానాకాలం పంట సాగు సమయంలో ఎకరాకు రూ.6 వేల చొప్పున పెట్టుబడి సాయం అందడంతో రైతుల్లో ఆనందం వ్యక్తమవుతుంది. ఈ సీజన్కు అమలు చేస్తున్న రైతు భరోసా పథకంతో పంటల సాగుకు ధీమా లభించింది. యాసంగి సాగులో ఈ పథకానికి పరిమితి విధించగా ఈ సారి ఎత్తివేసింది. వానాకాలం పెట్టుబడి సాయంగా రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా నిధులు తొమ్మిది రోజుల్లో జమ చేసింది. తొలిరోజు ఎకరా నుంచి మొదలు ఇప్పటివరకు పూర్తి స్థాయిలో ఖాతాల్లో నిధులు జమ అయ్యాయి. దుక్కులు సిద్ధం చేసుకుని ఎరువులు విత్తనాలు కొనేందుకు ఎదురుచూస్తున్న సమయంలో సకాలంలో రైతు భరోసా నిధులు విడుదల కావడంతో అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వానాకాలం సాగుకు సన్నద్ధమవుతున్న సమయంలో సాయం డబ్బులు జమ కావడంతో రైతులకు ప్రయోజనం చేకూరింది. సాగు ప్రారంభంలోనే... వానాకాలం సాగు పనులు ఇప్పుడిప్పుడే జోరందుకున్నాయి. చాలా చోట్ల పత్తి విత్తనాలు విత్తగా కొన్ని చోట్ల కలుపులు తీస్తున్నారు. ఇప్పటివరకు సరైన వర్షాలు లేకపోవడంతో వరి సాగు పనులు ఆలస్యమవుతున్నాయి. సాగు ప్రారంభంలోనే ఎదురు చూడకుండానే పెట్టుబడికి సాయం నిధులు అందడంతో రైతుల్లో ఆనందం వ్యక్తమవుతుంది. కొడంగల్ డివిజన్ పరిధిలో ఇప్పటివరకు 56,459 మంది రైతులకుగాను రూ.70.59 కోట్ల నిధులు జమ అయ్యాయని అధికారులు తెలిపారు.భరోసా నిధులతో వ్యవసాయ పనులకు ఊతం -
తెలంగాణ సాహిత్యాన్ని కాపాడుకోవాలి
చేవెళ్ల: మన కవుల సాహిత్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని అనంత సాహిత్యం–సాంస్కృతిక వేదిక వ్యవస్థాపకుడు దోరవేటి చెన్నయ్య, అధ్యక్షుడు తూర్పు మల్లారెడ్డి సూచించారు. ఆదివారం మండల కేంద్రంలోని వివేకానంద కళాశాలలో అనంత సాహిత్యం–సాంస్కృతిక వేదిక ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తెలంగాణ మహాకవుల జయంతిని ఘనంగా నిర్వహించుకుని, భావితరాలకు అందించాలన్నారు. అనంతరం సంస్థ నూతన కమిటీని ఎన్నుకున్నారు. వారు ఈ సంవత్సరం నిర్వహించే కార్యక్రమాల క్యాలెండర్ను రూపొందించుకున్నట్లు తెలిపారు. జూలై 27న వికారాబాద్లో దాశరథి, సి.నారాయణరెడ్డిల జయంతి, చేవెళ్లలో కాళోజీ జయంతి నిర్వహించనున్నట్లు చెప్పారు. ఆయా శాఖల వారీగా ఉగాది కవి సమ్మేళనాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. చేవెళ్ల ప్రాంతం నుంచి అనంత ప్రతినిధులుగా ఘనపురం పరమేశ్వర్, పాపిరెడ్డిలను ఎన్నుకున్నట్లు వివరించారు. కార్యక్రమంలో ప్రముఖ కవి కడియాల మధుసూదన్, అనంత సాహిత్యం–సాంస్కృతిక వేదిక ప్రధాన కార్యదర్శి కమలేశ్, కార్యదర్శి శ్రీనివాస్, హనుమంత్, సభ్యులు ఆశీర్వాదం, నర్సయ్య, ప్రసాద్, శ్రీనయ్య తదితరులు పాల్గొన్నారు.అనంత సాహిత్యం–సాంస్కృతిక వేదిక సభ్యులు -
శిథిలావస్థకు చెరువు తూము
దుద్యాల్: మండలంలోని ఆలేడ్ గ్రామంలో ఉన్న తూము లీకేజీ కావడంతో చెరువులో ఉన్న నీరు వృథాగా పోతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతేడాది పూర్తిస్థాయి నీటి మట్టం నిండుకుంది. చెరువు తూము లీకేజీ కావడంతో నీరు వృథాగా పోయిందని రైతులు వాపోతున్నారు. తూము నుంచి నీరు బయటకు పోకుండా ఉపయోగించే ఇనుప రాడ్డు పూర్తిగా లోపలికి పడిపోయిందని అన్నదాతలు పేర్కొంటున్నారు. చెరువు తూము లీకేజీ అవుతున్నా ఇప్పటివరకు ఏ అధికారి కూడా పరిశీలించిన దాఖలాలు లేవు. ఇప్పటికై న సంబంధిత అధికారులు స్పందించి తూముకు మరమ్మతులు చేయాలని వ్యవసాయదారులు కోరుతున్నారు. యువత వ్యసనాల బారిన పడొద్దు గ్రీన్ ఫార్మాసిటీ సీఐ లిక్కి కృష్ణంరాజు యాచారం: యువత చెడు అలవాట్లకు గురై జీవితాలను నాశనం చేసుకోవద్దని హైదరాబాద్ గ్రీన్ ఫార్మాసిటీ సీఐ లిక్కి కృష్ణంరాజు సూచించారు. పీఎస్ పరిధిలోని కుర్మిద్ద గ్రామంలో ఆదివారం సాయంత్రం గంజాయి, డ్రగ్స్ నియంత్రణ, రోడ్డు నిబంధనలు, ఘర్షణల వల్ల జీవితాల నాశనం తదితర అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశ భవిష్యత్తు యువతనేనని, అలాంటి వారు వ్యసనాలకు గురై జీవితాలను నాశనం చేసుకోవద్దన్నారు. గొప్ప లక్ష్యంతో యువత ఆసక్తి కలిగిన రంగాల్లో రాణించాలని సూచించారు. వాహనదారులు రోడ్డు నిబంధనలు పాటించాలని, లేని పక్షంలో కేసులు నమోదుతో పాటు జరిమానాలు విధిస్తామన్నారు. గ్రామాల్లో కొత్త వ్యక్తులు సంచరిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని, బంధువుల ఇళ్లకు, శుభకార్యాలకు వెళ్లేటప్పుడు విలువైన వస్తువులు, బంగారు నగలను ఇంట్లో ఉంచి వెళ్లరాదని సూచించారు. సమావేశంలో రాచకొండ సీఐ జోసఫ్, ఎస్ఐ తేజంరెడ్డి పాల్గొన్నారు. అర్ధరాత్రి విహరిస్తే కఠిన చర్యలు మీర్పేట సీఐ నాగరాజు మీర్పేట: వేడుకలు, ఇతర కారణాలతో అనవసరంగా అర్ధరాత్రి రోడ్లపైకి వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మీర్పేట పోలీస్స్టేషన్ ఇన్స్పెక్టర్ నాగరాజు యువతను హెచ్చరించారు. శనివారం అర్ధరాత్రి తరువాత స్టేషన్ పరిధి నందనవనం, ఆర్ఎన్రెడ్డినగర్, భూపేష్గుప్తానగర్లలో పోలీసులు ఆపరేషన్ చబుత్ర చేపట్టారు. ఈ సందర్భంగా రాత్రిళ్లు రోడ్లపై తిరుగుతున్న 122 మంది యువకులను గుర్తించారు. జన్మదిన వేడుకల పేరుతో కాలనీ కూడళ్లు, ప్రధాన రహదారులపైకి రావడం, అదే విధంగా రాత్రంతా బాక్స్ టైపు క్రికెట్ ఆడుతూ ఇతరులను ఇబ్బందులకు గురి చేయవద్దని ఇన్స్పెక్టర్ సూచించారు. ఏ కారణం లేకున్నా యువత రోడ్లపై ద్విచక్ర వాహనాలను విచ్చలవిడిగా నడపడం వల్ల ప్రమాదాలు చోటు చేసుకోవడంతో పాటు గొడవలకు కారణమవుతాయని అవగాహన కల్పించారు. ఆపరేషన్ చబుత్రలో డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ గౌరునాయుడు, ఎస్ఐ రాజశేఖర్, సిబ్బంది పాల్గొన్నారు. 12న ఐటీ ఉద్యోగులకు అవగాహన రాయదుర్గం: ఐటీ ఉద్యోగుల కోసం గచ్చిబౌలిలోని శాంతిసరోవర్లో జూలై 12వ తేదీన ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. శాంతిసరోవర్ క్యాంపస్లోని ఇన్నర్స్పేస్లో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ కార్యక్రమం సాగుతుంది. ఈ సందర్భంగా ‘ఇన్నర్ ఎక్స్లెన్స్ రీట్రీట్’ పేరిట ‘ఒత్తిడి లేని జీవితాన్ని గడపడానికి మనస్సును పున:ప్రారంభించడం’పై ప్రత్యేక అవగాహనా కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. -
ఆర్టీసీ టూర్ ప్యాకేజీకి విశేష స్పందన
అనంతగిరి: ఆలయాల సందర్శనకు ఆర్టీసీ ప్రవేశపెట్టిన టూర్ ప్యాకేజీకి విశేష స్పందన లభిస్తుందని వికారాబాద్ డీఎం అరుణ అన్నారు. ఈ ప్యాకేజీలో 64 మంది ప్రయాణికులు ఈ నెల 27న ధర్మపురి ఆలయాల సందర్శనకు బయలుదేరారని చెప్పారు. వికారాబాద్, హైదరాబాద్, వేములవాడ, కొండగట్టు, ధర్మపురి ఆలయాల దర్శనానికి ప్రత్యేక ప్యాకేజీలతో రెండు బస్సులు నడిపినట్లు ఆమె తెలిపారు. అరుణాచలం, మంత్రాలయం, భద్రాచలం, పంచారామాలు వివిధ ప్రత్యేక ప్యాకేజీలతో బస్సులు నడుతున్నామని పరిసర ప్రాంత ప్రజలందతా సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. కనీసం 30–40 మంది ప్రయాణికులు ముందుకు వస్తే నేరుగా వారి కాలనీ వద్దకే బస్సు పంపుతామని చెప్పారు. వివరాలకు 99592 26252 నంబర్లో సంప్రదించాలన్నారు. రేణుక ఎల్లమ్మ ఆలయంలో మృత్యుంజయ హోమం నేడు కర్ణాటక మాజీ మంత్రి లింబావళి రాక తాండూరు రూరల్: మండల పరిధిలోని కొత్లాపూర్ శివారులోని రేణుక ఎల్లమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు కొనసాగుతున్నాయి. మూడు రోజుల పాటు ఆలయంలో ప్రత్యేక పూజలతో పాటు హోమాలు నిర్వహించనున్నారు. సోమవారం కర్ణాటక మాజీ మంత్రి అరవింద్ లింబావళి తమ ఇంటి దేవత కొత్లాపూర్ రేణుక ఎల్లమ్మ ఆలయానికి విచ్చేయనున్నారు. ఆలయానికి దోషం ఉందని చెప్పడంతో కేరళ నుంచి తొమ్మిది మంది పూజారులతో మృత్యుంజయ హోమం నిర్వహించనున్నారు. పూజా కార్యక్రమాల్లో ఆలయ చైర్మన్ నవీన్ రెడ్డి, డైరక్టర్లు రాజు, లాలయ్యగౌడ్, శాంతప్ప, లాల్య నాయక్, ఈశ్వరమ్మ, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. విద్య, ఉపాధ్యాయుల సమస్యలపై పోరాటం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి పరిగి: విద్య, ఉపాధ్యాయుల సమస్యలపై నిరంతరం పోరాడుతామని హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి అన్నారు. ఆదివారం పట్టణ కేంద్రంలోని తపస్ కార్యాలయంలో జిల్లా నాయకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ.. ప్రతీ ప్రభుత్వ పాఠశాలల్లో స్కావెంజర్లను నియమించాలని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామన్నారు. విద్యార్థులకు ఎలాంటి సమస్యలున్నా తమదృష్టికి తీసుకురావాలని కోరారు. ప్రతీ పాఠశాలలో తాగునీటి వసతి కల్పిస్తామన్నారు. ఉపాధ్యాయుల నుంచి వస్తున్న మల్టీ జోన్–2లో ఖాళీగా ఉన్న గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల ఖాళీలను భర్తీ చేసేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతామన్నారు. ఈ కార్యక్రమంలో ఏబీఆర్ఎం దక్షిణ మధ్య క్షేత్రప్రముఖ్ విష్ణువర్థన్రెడ్డి, మండల విద్యాధికారి గోపాల్, రమేశ్యాదవ్, లక్ష్మయ్య, సాయిబాబ తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయండి సీఐటీయూ జిల్లా కార్యదర్శి రామకృష్ణ పరిగి: కేంద్ర ప్రభుత్వం లేబర్ కోడ్లు రద్దు చేసేందుకు యత్నిస్తున్న ప్రయత్నాన్ని విరమించుకోవాలనే డిమాండ్తో జూలై 9వ తేదీన నిర్వహించ తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి రామకృష్ణ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆదివారం పట్టణ కేంద్రంలో సమ్మెకు సంబంధించిన కరపత్రాలను విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కార్మికులపై కక్షసాధింపులకు పాల్పడుతోందన్నారు. పదేళ్లు అధికారంలో ఉన్న బీజేపీ దేశ ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. -
ఘనంగా సత్యసాయి శత జయంతి
పరిగి: మండల పరిధిలోని రంగాపూర్ శ్రీ సత్యసాయి సేవా సమితి కేంద్రంలో ఆదివారం శత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఉదయం నామ సంకీర్తనను పుర వీధుల గుండా నిర్వహించారు. ఉత్సవాలల్లో భాగంగా టైలరింగ్ శిక్షణ పొందిన 108 మంది మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లను అందజేశారు. అనంతరం సత్యసాయి సేవా సంస్థల రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్రావు మాట్లాడుతూ.. శ్రీ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో నిత్యం ఏదో ఒక కార్యక్రమాలు నిర్వహిస్తుంటామన్నారు. ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. బాబా ఆశిస్సులతో నిత్యం ప్రజలకు సేవలను అందిస్తూ ముందుకు సాగుతున్నామన్నారు. కార్యక్రమంలో సేవా సమితి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. -
ఫుట్పాత్ల ఆక్రమణలపై
శంషాబాద్: 15 రోజుల కిందట సాతంరాయిలోని ఓ గేటెడ్ కమ్యూనిటీకి సమీపంలో రోడ్డుకు ఆనుకుని ఉన్న చిరువ్యాపారాలకు సంబంధించిన డబ్బాలు తొలగించాలని ఉన్నతస్థాయి నుంచి అందిన ఆదేశాలను అధికారులు క్షణాల్లో పూర్తి చేశారు. పక్కాగా పోలీసుల సహకారంతో జేసీబీలను ఏర్పాటు చేసి అక్కడున్న గరీబోళ్ల డబ్బాలను వెంటనే తొలగించి పెద్దసార్ల ఆదేశాలను ఆదేశాలను తూచాతప్పకుండా పూర్తి చేశారు. నాలాను ఆనుకుని ఆక్రమణలున్న కారణంగానే ఫిర్యాదులు అందగానే వాటిని తొలగించినట్లు మున్సిపల్ అధికారులు చెప్పుకొచ్చారు. మరి ఇక్కడ..? శంషాబాద్ పట్టణ ప్రధాన కేద్రంలో ప్రజలకు తీవ్ర ఇబ్బంది కరంగా మారుతున్న ఫుట్పాత్ల ఆక్రమణపై మున్సిపల్ అధికారులు ఏడేళ్లుగా ఒక్కటంటే ఒక్కసారి కూడా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. గతంలో అనేక మార్లు ఫుట్పాత్లపై ఉన్న ఆక్రమణలను తొలగించేందుకు కౌన్సిల్లో తీర్మానాలు చేసి అవి కార్చాచరణకు నోచుకున్న దాఖలు కూడా లేవు. రోడ్డులను ఆక్రమించి హోటళ్లు, వ్యాపారాలు చేసుకుంటున్నా కన్నెత్తి చూసిన పాపాన పోవడం లేదు. అద్దెకిచ్చేస్తున్నారు... ఫుట్పాత్లను ఆక్రమించి కొందరు సొంత వ్యాపారాలను విస్తరిస్తుండగా మరికొందరు తమ దుకాణాల ముందు చిరువ్యాపారులకు అద్దెకిస్తున్నారు. రోడ్డును అద్దెకిచ్చి ఏళ్లుగా లక్షల రూపాయలు సంపాదిస్తున్న తీరు కూడా ఇక్కడ షరామాములే అన్నట్లుగా మారింది. పట్టణంలోని రాళ్లగూడ రహదారిలో ఫిరంగి నాలాను ఆనుకుని పదుల సంఖ్యలో డబ్బాలను ఏర్పాటు చేసి అద్దెకిచ్చేస్తున్నారు. దీనిపై ఇంతవరకు మున్సిపాలిటీ అధికారులు చర్యలు తీసుకున్న పాపాన పోలేదు. ఫుట్పాత్ల ఆక్రమణ కారణంగా సాధారణ ప్రజలతో పాటు ప్రయాణికులు సైతం నిత్యం నరకం చూస్తున్నారు. జనాభా రద్దీలేని సాతంరాయిలో పెద్దసార్ల ఆదేశాలతో ఆగమేఘాల మీద ఆక్రమణ తొలగింపులు చేసిన అధికారులు అదే రీతిన పట్టణంలో ఉన్న ఫుట్పాత్ల ఆక్రమణపై చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. హైవే ఫుట్పాత్పై కంటైనర్ వేసి ఏర్పాటు చేసిన హోటల్ శంషాబాద్లో విచ్చలవిడిగా ఫుట్పాత్ల ఆక్రమణ కంటైనర్ల ఏర్పాటు చేసిదందా చేస్తున్నా చర్యలు శూన్యం సాతంరాయిలో యుద్ధప్రాతిపదికన డబ్బాలు తొలగించిన మున్సిపల్ అధికారులు పట్టణ ప్రధాన కేంద్రంలో పట్టించుకోని యంత్రాంగంఆక్రమణలను తొలగిస్తాం.. పట్టణంలో ఫుట్పాత్లను ఆక్రమించుకుని ఉ న్న కట్టడాలు, డబ్బాలను తప్పకుండా తొలగిస్తాం. రహదారులను ఆక్రమించి ఉంటే కఠినంగా చర్యలు తీసుకుంటాం. ఆక్రమణలు ఎవరివైనా నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటాం. – సుమన్రావు, శంషాబాద్ మున్సిపల్ కమిషనర్ -
తేలేదెప్పుడో..?
● కొలిక్కిరాని ఎనికేపల్లి భూముల వ్యవహారం ● ఎన్నిసార్లు చర్చలు జరిగినా తేలని పరిహారం ● రెండుసార్లు సర్వే చేయకుండానే వెనుదిరిగిన అధికారులు ● కొనసాగుతున్న పోలీస్ పహారా మొయినాబాద్: ఎనికేపల్లి భూముల వ్యవహారం ఎటూ తేలడంలేదు. పరిహారం విషయంలో అటు అధికారులు, ఇటు రైతులు పట్టు వీడడంలేదు. ఇప్పటికే పలు దఫాలుగా అధికారులు రైతులతో చర్చలు జరిపారు. పరిహారం విషయంలో ఎవరూ వెనక్కి తగ్గకపోవడంతో నెల రోజులుగా సమస్య పరిష్కారానికి నోచుకోవడం లేదు. రెవెన్యూ రికార్డుల్లో సర్కారు భూమి ఎనికేపల్లి సర్వేనంబర్ 180లోని 99.14 ఎకరాలు 1954 నుంచి రెవెన్యూ రికార్డుల్లో సర్కారి భూమిగానే నమోదవుతూ వస్తోంది. 1954లో ఈ భూమిని హరిజనులు సాగుచేసుకోవడానికి ఇచ్చినట్లు రెవెన్యూ రికార్డుల్లో ఉంది. కొన్నేళ్ల పాటు రైతుల పేరు కబ్జా కాలంలో వచ్చాయి తప్ప అసైనీలుగా పేర్కొనలేదు. రెవెన్యూ రికార్డుల్లో పూర్తిగా సర్కారు భూమిగా కొనసాగుతూ వచ్చింది. గ్రామానికి చెందిన సుమారు 50 మంది రైతులు డైబ్బె ఏళ్లుగా ఇక్కడ సాగుచేసుకుంటున్నారు. ఈ భూములను ప్రభుత్వం ఇటీవల గోశాల ఏర్పాటుకు కేటాయించింది. విషయం తెలిసిన గ్రామస్తులు నెల రోజుల నుంచి ఆందోళన మొదలు పెట్టారు. ఈ భూములనే నమ్ముకుని జీవిస్తున్నామని, తమకే అసైన్డ్ చేయాలని డిమాండ్ చేశారు. పలు రాజకీయ పార్టీల నేతలు సైతం భూములను పరిశీలించి రైతులకు మద్దతుగా ఉంటామని ప్రకటించారు. చర్చలు విఫలం భూములు సాగుచేసుకుంటున్న రైతులతో రెవెన్యూ అధికారులు పలుమార్లు చర్చలు జరిపారు. చేవెళ్ల ఆర్డీఓ చంద్రకళ, మొయినాబాద్ తహసీల్దార్ గౌతమ్కుమార్ పరిహారం విషయంపై వారితో చర్చించారు. ఎకరాకు వెయ్యి గజాల చొప్పున పరిహారం ఇవ్వాలని రైతులు డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎకరాకు 200 గజాల చొప్పున ఇస్తామని అధికారులు తేల్చి చెప్పారు. మూడుసార్లు జరిపిన చర్చలు విఫలం అయ్యాయి. ఎమ్మెల్యేపై భారం వేసిన రైతులు పరిహారం విషయంలో రైతులు ఎమ్మెల్యే కాలె యాదయ్యపై భారం వేశారు. పలుమార్లు ఆయనను కలిసి ప్రభుత్వంతో చర్చించి మంచి పరిహారం ఇప్పించాలని కోరారు. రైతులను తీసు కుని కలెక్టర్ నారాయణరెడ్డిని కలిసిన ఎమ్మెల్యే పరిహారం విషయంపై చర్చించారు. ఎకరాకు 800 గజాలు పరిహారంగా ఇవ్వాలని ఎమ్మెల్యే కోరగా 250 గజాలు ఇస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు. కనీసం ఎకరాాకు 400 గజాలైనా ఇవ్వాలని ఎమ్మె ల్యే కోరారు. ఈ విషయమై శనివారం రాత్రి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని కలిసి చర్చించారు. ఎకరాకు 350 గజాల స్థలం ఇచ్చేందుకు సీఎం సుముఖత వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఈ పరిహారంపై కొందరు రైతులు సంతృప్తిగానే ఉన్నట్లు సమాచారం. రెండు సార్లు సర్వే చేయకుండానే.. గోశాలకు కేటాయించిన భూములను సర్వే చేసేందుకు హెచ్ఎండీఏ అధికారులు రెండుసార్లు వచ్చారు. పరిహారం విషయం తేలకపోవడంతో సర్వే చేయకుండానే వెనుదిరిగారు. మరోవైపు ఎనికేపల్లి భూముల వద్ద పోలీస్ పహారా కొనసాగుతోంది. కొత్త వ్యక్తులు, రైతులను అటువైపు రాకుండా కాపలా కాస్తున్నారు. ఎనికేపల్లిలో గోశాలకు కేటాయించిన భూమి మా బతుకులు ఏం కావాలి తాతల కాలం నుంచి సాగుచేసుకుంటున్నాం. ప్రభుత్వం ఇప్పుడు గోశాలకు ఇస్తే మా బతుకులు ఏం కావాలి. 1954 నుంచి 1998 వరకు పహణీల్లో మా పేర్లు వచ్చాయి. తరువాత సర్కారు భూమి అని వచ్చింది. మోకిలలో ఇచ్చినట్లు ఎకరాకు 750 గజాల చొప్పున పరిహారం ఇస్తే మంచిది. – న్యాలట మహిపాల్, రైతు, ఎనికేపల్లిప్రభుత్వమే ఆదుకోవాలి సాగుచేసుకుంటున్న భూములు తీసుకుంటే మా బతుకులు ఆగమైతయి. ప్రభుత్వమే మమ్మల్ని ఆదుకోవాలి. ఎంత పరిహారం ఇస్తామన్న విషయం అధికారులు సరిగా చెప్పడంలేదు. ఎమ్మెల్యేపైనే భారం పెట్టాం. ఆయన ముఖ్యమంత్రితో మాట్లాడి పరిహారం ఇప్పిస్తామని చెప్పారు. – అనుసూయ, మహిళా రైతు, ఎనికేపల్లి -
రహదారి.. ప్రతిపాదనలతోనే సరి
వికారాబాద్: గతంలో కురిసిన వర్షాలకు పాడైన రోడ్లు చిన్నపాటి వర్షం కురిసినా చిత్తడిగా మారుతున్నాయి. ఆర్అండ్బీ, పంచాయతీరాజ్, మున్సిపల్ అనే తేడా లేకుండా రోడ్లన్నీ అధ్వానంగా మారాయి. అధికారులను ప్రశ్నిస్తే ప్రతిపాదనలు పంపామంటూ చేతులు దులుపుకొంటున్నారు తప్ప కనీస మరమ్మతులు కూడా చేపట్టడం లేదని ప్రయాణికులు వాపోతున్నారు. వర్షాలు కురిసిన ప్రతీసారి దెబ్బతిన్న రోడ్ల వివరాలు సేకరించామంటున్నారే తప్పితే ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నా పట్టించుకున్న పాపాన పోవడం లేదు. టెండర్లకే పరిమితమైన మరమ్మతులు జిల్లాలో గతేడాది కురిసిన వర్షాలకు పాడైన ఆర్అండ్బీ రోడ్లకు సంబంధించి ఆ శాఖ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపారు. అధికారుల సర్వేలో జిల్లా వ్యాప్తంగా 198 కిలోమీటర్ల మేర రోడ్లు పాడైనట్లు తేలింది. వీటిని పూర్తి స్థాయిలో పర్మినెంట్గా బాగు చేసేందుకు రూ.89 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి నివేదించారు. తాత్కాలిక మరమ్మతుల కోసం రూ.8కోట్ల నిధులు అవసరమవుతాయని ప్రతిపాదనల్లో ప్రస్తావించారు. ఇందులో ఆర్అండ్బీ శాఖ 98 కిలోమీర్ల మేర రోడ్ల మరమ్మతులకు రూ.39 కోట్లు, పంచాయతీ రాజ్ నుంచి రూ. 20 కోట్లు మంజూరయ్యాయి. అయితే ఈ రెండు శాఖల్లోనూ పాడైన రోడ్ల మరమ్మతులకు ప్రతిపాదనలు, రోడ్లు మంజూరు, టెండర్ల ప్రక్రియ దగ్గరే నిలిచిపోయింది. మెజార్టీ రోడ్లన్నీ అంతే జిల్లాలో ఒకటి రెండు రోడ్లు మినహా మెజారిటీ రోడ్లు అధ్వానంగా మారాయి. వికారాబాద్–పరిగి, వికారాబాద్–నవాబుపేట, వికారాబాద్–బుగ్గదేవాలయం వేళ్లే దారి, వికారాబాద్–తాండూరు రహదారి, కొడంగల్–తాండూరు, కొడంగల్–మహబూబ్నగర్, పరిగి–మిట్టకోడూర్, దోమ మండల పరిధిలోని దోర్నాల్పల్లి–గొడుగోనిపల్లి , ఐనాపూర్–పాలెపల్లి, గడిసింగాపూర్–మల్లెపల్లి, వికారాబాద్–సదాశివాపేట్, కోటాలగూడ–లాల్సింగ్తండా, మన్నెగూడ–మిర్జాపూర్ మీదుగా లాల్సింగ్ తండా, వికారాబాద్–దామగుండ తదితర రోడ్లన్నీ ప్రయాణానికి ఇబ్బందిగా మారాయి.పరిగి మున్సిపల్లో కొడంగల్ చౌరస్తా నుంచి వేంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లే రోడ్డు దుస్థితి అధ్వానంగా అంతర్గత రోడ్లు చిన్నపాటి వర్షానికే చిత్తడిగా మారుతున్న వైనం వాహనదారులకు నరకయాతన పట్టించుకోని ఆర్అండ్బీ, పంచాయతీ రాజ్ శాఖలు కొత్తరోడ్లు మంజూరయ్యాయంటూ దాటవేస్తున్న అధికారులు -
కొరత చూపి.. రైతులను దోచేసి
● అధిక ధరలకు ఎరువుల విక్రయాలు ●వానాకాలం సాగులో 7ఇక్కట్లు కొందుర్గు: ప్రస్తుత వానాకాలం సీజన్లో రైతులు పత్తి, మొక్కజొన్న, వరి తదితర పంటల సాగు పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఇందుకోసం ప్రస్తుతం మొదటి దఫా అధికంగా రైతులు డీఏపీ వాడుతారు. అయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం డీఏపీ బస్తా ధర రూ.1,350 ఉంటే డీలర్లు రూ.1,500 వరకు అన్నదాతలకు విక్రయిస్తున్నారు. అదే విధంగా యూరియా బస్తా ధర రూ.266 ఉండగా రూ.300 పైనే అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. షాద్నగర్ నియోజకవర్గంలోనే కొందుర్గు, జిల్లేడ్ చౌదరిగూడ మండలాల్లో అధికంగా వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగిస్తారు. ఇక్కడ పత్తి, మొక్కజొన్న పంటలను అధికంగా సాగు చేస్తారు. కానీ ప్రస్తుతం డీఏపీ, యూరియా కొరత సృష్టించడంతో తాము అధిక ధరలకు ఎరువులు కొనుగోలు చేసి నష్టపోతున్నామని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై వ్యవసాయాధికారులను వివరణ కోరగా డీఏపీ కొరత ఉన్నది వాస్తవమేనని, వాటి స్థానంలో కాంప్లెక్స్ ఎరువులు వాడా లని సూచిస్తున్నారు. కాగా కాంప్లెక్స్ ఎరువులు మొదటి దఫాలో వాడడంతో పంటలు బాగా పెరిగి చీడపీడలకు గురయ్యే ప్రమాదం ఉంటుందని వాపోతున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని రైతన్నలు కోరుతున్నారు. -
రెండేళ్లకోసారి..
కొడంగల్: పేదల తిరుపతిగా పేరుగాంచిన పట్టణంలోని మహాలక్ష్మీ సమేత వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో జులై 19వ తేదీ నుంచి పవిత్రోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ఆదివారం ఆలయ ధర్మకర్తలు భక్తులతో సమావేశం ఏర్పాటు చేశారు. పవిత్రోత్సవాల నిర్వహణపై చర్చించారు. ప్రతి ఒక్కరూ భగవంతుని కార్యక్రమంలో భాగస్వాములు కావాలని ధర్మకర్తలు కోరారు. ఆలయ పవిత్రతతో పాటు పట్టణ పురోగతి కోసం పవిత్రోత్సవాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కొడంగల్ శ్రీవారి ఆలయంలో రెండేళ్లకు ఒకసారి ఈ పవిత్రోత్సవాలు జరుగుతాయని వివరించారు. తిరుమల తిరుపతి దేవస్థానం అర్చకులతో పాటు ఆలయ అర్చకులు పాల్గొని ఉత్సవ కార్యక్రమాలను నిర్వహిస్తారని తెలిపారు. శ్రీవారి ఆలయంలో నిత్యం జరిగే కై ంకర్యాలు, ధూప దీప నివేదనలో ఏమైనా పొరపాటు జరిగితే మంత్ర లోపము, ద్రవ్యలోపము, క్రియా లోపము వలన కలుగు దోషములకు నివారణ కలుగుతుందన్నారు. లోక కల్యాణంతోపాటు విశ్వశాంతి కలుగుతుందన్నారు. జూలై 22న ఉత్సవాలు ముగుస్తాయని చెప్పారు. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. శ్రీవారి పవిత్రోత్సవాలు జూలై 19 నుంచి టీటీడీ తరహాలో నిర్వహణ పోస్టర్ ఆవిష్కరించిన ఆలయ కమిటీ సభ్యులు -
తాగునీటికి తండ్లాట!
నవాబుపేట: ప్రతి ఇంటికి తాగునీరు అందిస్తామన్న ప్రభుత్వ పెద్దల మాటలు నీటి మీది రాతలుగా మారాయి. అన్ని గ్రామాలకు మిషన్ భగీరథ నీటి సరఫరా కొనసాగుతుంటే ఆ ఊరిలో మాత్రం అలాంటి సదుపాయం లేదు. కేవలం బోరు మోటారుతో తమ అవసరాలను తీర్చుకుంటున్న పరిస్థితి. అది కూడా కాలిపోయి 15 రోజులు అవుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడని వాపోతున్నారు. ఇదీ మండల పరిధిలోని మీనపల్లికలాన్ గ్రామం ఎస్సీ కాలనీలోని దుస్థితి. మిషన్ భగీరథ పైపులైన్ లేదు కాలనీలో దాదాపు 80కిపైగా కుటుంబాలుంటాయి. కానీ ఇప్పటివరకు మిషన్ భగీరథ పైపు లైన్ వేయలేదు. ఒక్క ఇంటికి సైతంకుళాయి కనెక్షన్ బిగించిన పాపాన పోలేదు. గతంలో చేసిన పనులకుగాను కాంట్రాక్టర్కు బిల్లులు చెల్లించకపోవడంతో మధ్యలో వదిలేసినట్లు సమాచారం. దీంతో అప్పటికే ఉన్న ప్రభుత్వ బోరు మోటార్తో మాత్రమే కాలనీవాసులు తమ అవసరాలను తీర్చుకుంటూ వస్తున్నారు. గత 15 రోజులు క్రితం ఉన్న కాస్త మోటారు కాలిపోయింది. స్థానికుల ఫిర్యాదు మేరకు పంచాయతీ కార్యదర్శి వరలక్ష్మి బోరు మోటారును బాగు చేయిస్తామని తీసుకు పోయారు. కానీ ఇంతవరకు తిరిగి తీసుకు రాలేదు. దీంతో కాలనీలో నీళ్లు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలుమార్లు కార్యదర్శిని సంప్రదిస్తే బోరుమోటారు పూర్తిగా కాలిపోయిందని, కొత్తది కొనడానికి డబ్బులు లేవని చెప్పారు. ఈ సమస్యను ఉన్నతాధికారులకు చెప్పామన్నారు. డబ్బులు రాగానే నూతన బోరుమోటారు తీసుకు వస్తామని తెలిపినట్లు గ్రామస్తులు వివరించారు. సమస్యను పరిష్కరిస్తా ఈ విషయమై గ్రామ ప్రత్యేకాధికారి బుచ్చయ్య(తహసీల్దార్) వివరణ కోరగా.. గ్రామంలోని ఎస్సీ కాలనీలో తాగునీటి సమస్య ఉందని ఇటీవలే తన దృష్టికి వచ్చిందన్నారు. సోమవారం తాను స్వయంగా వెళ్లి మోటారు బిగించి తాగునీటి సమస్య పరిష్కరిస్తానని తెలిపారు. 15 రోజులుగా తీవ్ర అవస్థలు వ్యవసాయ బోర్లను ఆశ్రయించిన వైనం పట్టించుకోని అధికార యంత్రాంగం మీనపల్లికలాన్ ఎస్సీకాలనీ దుస్థితి -
రక్తదానానికి ముందుకు రావాలి
పహాడీషరీఫ్: తలసేమియా బాధితులను ఆదుకునేందుకు రక్తదానం చేసేందుకు యువత ముందుకు రావాలని సరూర్నగర్ మండల మాజీ వైస్ ఎంపీపీ ఉమర్ బామ్ అన్నారు. మజ్లిస్–ఏ–ఉలమాయే హుఫాజ్ వా దానిశ్వరనే మిల్లత్ ఆధ్వర్యంలో షాహిన్నగర్లో ఆదివారం ఉచిత రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. నెల నెల రక్తమార్పిడి అవసరమయ్యే వారికి రక్తదానం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఏటా మనదేశంలో 10–12 వేల మంది తలసేమియా పిల్లలు జన్మిస్తున్నారన్నారు. ప్రభుత్వాలు కూడా తలసేమియాను ప్రజారోగ్య సమస్యగా ప్రకటించాలన్నారు. ఎర్ర రక్తకణాలలో హీమోగ్లోబిన్ లోపం వల్ల ఒక మాదిరి నుంచి తీవ్రమైన రక్తహీనత లక్షణాలు కలిగి, రక్త సంబంధమైన అనువంశిక రుగ్మతే తలసేమియా మేజర్గా పేర్కొంటారన్నారు. దాదాపు 390 మంది దాతలు రక్తదానం చేసి తలసేమియా సికిల్ సెల్ సొసైటీకి అందజేశారు. కార్యక్రమంలో హాఫీజ్ అబ్దుల్ హాది, డాక్టర్ ముస్తఫా అలీ సుఫియానీ, సయ్యద్ యూసుఫ్ పటేల్, అబ్దుల్ రవూఫ్, ఎం.ఎ.బారీ, అలీం బేగ్ తదితరులు పాల్గొన్నారు. -
స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలి
పూడూరు: స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజార్టీ స్థానా లు గెలిచి సత్తా చాటాలని పరిగి ఎమ్మెల్యే టి.రామ్మోహన్రెడ్డి కార్యకర్తలు, నాయకులకు సూచించారు. శనివారం మండలంలోని మన్నేగూ డలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో కలసికట్టుగా పని చేసి పార్టీ నాయకులను గెలిపించుకోవాలన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికీ చేరవేసి పార్టీని బలోపేతం చేయాలన్నారు. గ్రామస్థాయి నుంచి మండలస్థాయి వరకు మెజార్టీ సీట్లు కైవసం చేసుకోవాలని సూచించారు. మండల కార్యవర్గంలో ఖాళీగా ఉన్న పదవులను వారంలోగా భర్తీ చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ సతీష్రెడ్డి, డీసీసీ ఉపాధ్యక్షుడు ఆనందం, డీసీసీ కార్యదర్శులు శ్రీనివాస్రెడ్డి, పెంటయ్య, అజీం పటేల్, శ్రీనివాస్, షకీల్ తదితరులు పాల్గొన్నారు. త్వరలో అన్ని కమిటీలు వేస్తాం కుల్కచర్ల: త్వరలో అర్హులైన వారికి పార్టీ పదవులు, నామినేటెడ్ పోస్టులు అందుతాయని, ఆ దిశగా సీఎం రేవంత్రెడ్డి కృషి చేస్తున్నారని పరిగి ఎమ్మెల్యే టీ.రామ్మోహన్రెడ్డి అన్నారు. శనివారం కుల్కచర్ల, చౌడాపూర్ మండల కేంద్రాల్లో కార్యకర్తలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. త్వరలో గ్రామ, మండల కమిటీ, జిల్లా కమిటీలను ఎన్నుకోవడం జరుగుతుందన్నారు. పార్టీకోసం కష్టపడే వారికి చోటు లభిస్తుందని తెలిపారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర పరిశీలకులు నరేందర్, వినోద్ రెడ్డి, డీసీసీ ఉపాధ్యక్షుడు భీంరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ ఆంజనేయులు, పీఏసీఎస్ చైర్మన్ మొగులయ్య, పాంబండ ఆలయ చైర్మన్ మైపాల్ రెడ్డి, బ్లాక్ బి అధ్యక్షుడు భరత్కుమార్, పార్టీ మండల మాజీ అధ్యక్షుడు వెంకటయ్య, జిల్లా కార్యదర్శి నర్సింలు యాదవ్, యువజన విభాగం మండల అధ్యక్షుడు జంగయ్య, పార్టీ మండల ప్రధాన కార్యదర్శి గోపాల్నాయక్, మాజీ ఎంపీపీ సత్యహరిశ్చంద్ర, మార్కెట్ కమిటీ చైర్మన్ అంజిలయ్య తదితరులు పాల్గొన్నారు. ● ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి -
కొడంగల్లో ఆర్పీఎఫ్ బలగాల కవాతు
కొడంగల్: పట్టణంలోని పలు కాలనీల్లో ఆర్పీఎఫ్ బలగాలు శనివారం కవాతు నిర్వహించాయి. 99 బెటాలియన్ హకీంపేటకు చెందిన ర్యాపిడ్ యాక్షన్ ఫోర్సు జవానులు కొడంగల్ పుర వీధుల గుండా తిరిగారు. సమస్యాత్మక ప్రాంతాల్లో పర్యటించడం వల్ల ప్రజల్లో భరోసా కల్పించడం కోసం కవాతు నిర్వహిస్తున్నట్లు సీఐ శ్రీధర్రెడ్డి, ఎస్ఐ సత్యనారాయణ తెలిపారు. అంబేడ్కర్ చౌరస్తా నుంచి మెయిన్ రోడ్డు మీదుగా వినాయక చౌరస్తా, సంత బజార్, బ్రాహ్మనవాడ, తెలుగుగేరి, బాలాజీనగర్ మీదుగా కవాతు సాగింది. ప్రజలతో మమేకం కండి ఎస్పీ నారాయణరెడ్డి అనంతగిరి: ప్రజలతో మమేకమై పనిచేస్తే మంచి పేరు వస్తుందని ఎస్పీ నారాయణరెడ్డి సిబ్బందికి సూచించారు. శనివారం వికారాబాద్లోని ఎస్పీ కార్యాలయంలో తాండూరు పీఎస్లో ఎస్ఐగా పనిచేసి ఉద్యోగ విమరణ పొందుతున్న మైపాల్రెడ్డికి ఘనంగా వీడ్కోలు పలికారు. ఘనంగా సన్మానించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. నాలుగు దశాబ్దాల పాటు పోలీసు ఉద్యోగం చేయడమంటే చాలా గొప్ప విషయమన్నారు. సుదీర్ఘ అనుభవం ఉన్న అధికారిగా మైపాల్రెడ్డి మంచిపేరు తెచ్చుకున్నారని కొనియాడారు. విధి నిర్వహణలో ప్రజలకు మనం చేసిన సేవలు చిరస్థాయిగా నిలిచిపోతాయన్నారు. కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ వీరేష్, జిల్లా పోలీసు ప్రెసిడెంట్ అశోక్, ఇతర అధికారులు పాల్గొన్నారు. హారికకు ప్రావీణ్య పురస్కార్ అవార్డు కొడంగల్: పట్టణంలోని నవీన ఆదర్శ పాఠశాల విద్యార్థిని హారికకు రాష్ట్ర స్థాయిలో ప్రావీణ్య పురస్కార్ అవార్డు వరించింది. జాతీయ సెమ్స్ ఒలంపియాడ్ ఆధ్వర్యంలో మార్చి నెలలో జాతీయ స్థాయిలో పోటీ పరీక్షలు నిర్వహించారు. ఈ పోటీల్లో హారిక రాష్ట్రస్థాయిలో 4వ ర్యాంకు సాధించింది. శనివారం హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం ఆడిటోరియంలో సెమ్స్ ఫౌండేషన్ డైరెక్టర్ రాంచందర్రెడ్డి, ట్రస్టు రాష్ట్ర అధ్యక్షుడు ఎస్ఎన్ రెడ్డి హారికకు అవార్డు, మెమొంటో, మెడల్ అందజేశారు. శాలువా కప్పి అభినందించారు. నవీన ఆదర్శ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నరేష్ రాజ్ను విశేష పురస్కార్ అవార్డుతో సన్మానం చేశారు. యాదవులపై దాడులను ఆపాలి బీసీ సంఘం జాతీయ కార్యదర్శి బీరయ్య యాదవ్ మోమిన్పేట: ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రంలో యాదవులపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని బీసీ సంఘం జాతీయ కార్యదర్శి బీరయ్య యాదవ్ డిమాండ్ చేశారు. శనివారం మండల కేంద్రంలోని పాత బస్టాండ్ నుంచి అంబేడ్కర్ చౌరస్తా వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యాదవులపై జరుగుతున్న దాడులను వెంటనే అరికట్టాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. కార్య క్రమంలో నాయకులు మల్లయ్య, యాదగిరి యదవ్, మానయ్య, అంజయ్య, బిచ్చయ్య, అంజి, పాపయ్య, శ్రీను పాల్గొన్నారు. -
సర్కారు బడికి రాంరాం!
ఏటా తగ్గుతున్న విద్యార్థుల నమోదువికారాబాద్: ప్రభుత్వ పాఠశాలలపై చాలామంది తల్లిదండ్రులకు నమ్మకం కుదరడం లేదు. నిష్ణాతు లైన ఉపాధ్యాయులు ఉన్నా..ఫీజుల బాధ లేకు న్నా .. ఉచితంగా పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్, మ ధ్యాహ్న భోజన సదుపాయం కల్పిస్తున్నా చాలా మంది ప్రైవేటుకే మొగ్గుచూపుతున్నారు. గడిచిన ప దేళ్ల కాలంలో విద్యా వ్యవస్థలో వేగంగా చోటు చేసుకుంటున్న మార్పులతో ప్రభుత్వ బడులకు ప్రైవేటు స్కూళ్లు సమాంతర వ్యవస్థగా తయారయ్యాయి. గ తంలో పట్టణ ప్రాంత వాసులు మాత్రమే వారి పిల్లలను ప్రైవేటు స్కూళ్లలో చేర్చేవారు. ప్రస్తుతం గ్రా మీణ ప్రాంత ప్రజలు కూడా ప్రైవేటు బాట పట్టా రు. ఇది సర్కారు బడులపై తీవ్ర ప్రభావం చూపుతోంది.గడిచిన నాలుగేళ్ల కాలంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు సంఖ్య 40శాతం మేర తగ్గినట్లు గణాంకాలు చెబుతున్నాయి.జిల్లాలో 1,0 63 ప్రభుత్వ బడులు ఉండగా84,208 మంది విద్యార్థులు ఉన్నారు.185 ప్రైవేటు పాఠశాలల్లో 45,042 మంది విద్యార్థులు చదువుకొంటున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే సర్కారు బడులకు గడ్డు కాలమే నని విద్యా వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బడికి పంపడంలోనూ వివక్ష పురుషాధిక్య సమాజంలో అనేక రూపాల్లో లింగవివక్ష అనాదిగా కొనసాగుతూ వస్తున్న విషయం తెలిసిందే.. బాల్య వివాహాలు, ఇంట్లో పనులు చేసే విషయంలో, పునర్వివాహాల్లో లింగవివక్ష కొట్టొచ్చి నట్లు కనిపించేది. గతంలో మగపిల్లలను బడులకు పంపి ఆడపిల్లలకు చదువెందుకులే అంటూ చిన్నచూపు చూసేవారు. బ్రూణహత్యల్లోనూ లింగవివక్ష కనిపించేది. తాజాగా చిన్నారులను బడులకు పంపించే విషయంలోనూ లింగవివక్ష స్పష్టంగా కనిపిస్తోంది. పట్టణాల్లో బాల బాలికలిద్దరినీ వారి ఆర్థిక స్తోమతను బట్టి ప్రైవేటు స్కూళ్లకు పంపిస్తుండగా.. గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం వివక్ష కనిపిస్తోంది. ఇంట్లో ఒక ఆడపిల్ల ఒక మగ పిల్లాడు ఉంటే వారిలో కుమారుడిని ప్రైవేటుకు కుమార్తెను ప్రభుత్వ బడికి పంపుతున్నారనే వాదన వినిపిస్తోంది. కొన్ని స్వచ్ఛంద సంస్థలు జరిపిన సర్వేల్లో కూడా ఈ విషయం స్పష్టమవుతోంది. ప్రస్తుతం జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు బడులలో నమోదవుతున్న బాలబాలికల నిష్పత్తి గమనిస్తే కూడా ఈ విషయం నిజమనే అనిపిస్తుంది. ప్రైవేటులో విద్యార్థుల సంఖ్య 24,773 ఉండగా బాలికలు 20,269 మంది ఉన్నా రు. అంటే బాలికల కంటే బాలురు సంఖ్య 4,504 మంది ఎక్కువ. అదే ప్రభుత్వ బడులలో బాలుర సంఖ్య 41,285 ఉండగా.. బాలికలు 42,923 మంది ఉన్నారు. అంటే బాలుర కంటే బాలికలు 1,638 మంది అధికంగా నమోదయ్యారు. గడిచిన నాలుగేళ్లలో ప్రభుత్వ బడులలో విద్యార్థుల నమోదు సంఖ్య ఇలా.. విద్యా సంవత్సరం చేరిన విద్యార్థులు 2022 – 23 9,085 2023 – 24 7,784 2024 – 25 7,078 2025 – 26 6,124 నమోదుపై పది ఫలితాల ప్రభావం పదో తరగతి ఫలితాలు కూడా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదుపై ప్రభావం చూపుతున్నాయి. పది ఫలితాల్లో జిల్లా ప్రతిసారీ చివరి స్థానంలో నిలుస్తోంది. దీంతో తల్లిదండ్రులు పిల్లలను సర్కారు బడిలో చేర్చేందుకు జంకుతున్నారు. ఇంత జరుగుతున్నా జిల్లా విద్యాశాఖ దిద్దుబాటు చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. పదేళ్ల క్రితం ప్రభుత్వ బడులల్లో ఒకటవ తరగతిలో 9,500 మంది విద్యార్థులు నమోదు కాగా ఈ ఏడాది 6,124 మందితో సరి పెట్టుకోవాల్సి వచ్చింది. ప్రైవేటు స్కూళ్లలో మాత్రం 2,640 మంది నుంచి 7,522 మందికి చేరడం సర్కారు బడుల పనితీరుకు అద్దం పడుతోంది. నాలుగేళ్లలో 40శాతం కిందకు.. ప్రభావం చూపుతున్న పది ఫలితాలు ప్రైవేటుకే మొగ్గు చూపుతున్న తల్లిదండ్రులుపాఠశాలల బలోపేతానికి ప్రభుత్వాలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నా ఆశించిన మేర ఫలితాలు రావడం లేదు. విద్యార్థుల సంఖ్య పెంచడమే లక్ష్యంగా ఏటా బడిబాట కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఆపరేషన్ ముస్కాన్ ద్వారా బాలకార్మికులను స్కూళ్లలో చేర్పించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇవేవీ విద్యార్థుల సంఖ్య పెంచేందుకు కలసిరావడం లేదు. ఎప్పటి లాగే ఈసారి కూడా సర్కారు బడుల్లో విద్యార్థుల సంఖ్య భారీగా తగ్గింది. పిల్లల సంఖ్య పెంచేందుకు కృషి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు అన్ని విధాలా కృషి చేస్తున్నాం. పదో తరగతి ఫలితాల్లో వెనుకబడటానికి గల కారణాలను అన్వేషిస్తున్నాం. రెండేళ్ల క్రితం 65శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత కాగా గత ఏడాది 73.97 శాతంతో కాస్త మెరుగైన ఫలితాలు సాధించాం. ఈ సారి వంద సాతం ఫలితాల కోసం కృషి చేస్తున్నాం. ప్రభుత్వ బడులపై నమ్మకం కలిగించేందుకు శక్తివంచన లేకుండా ప్రయత్నం చేస్తున్నాం. – జి.రేణుకాదేవి, డీఈఓ -
అటవీ భూమి కబ్జాకు యత్నం
● అడ్డుకున్న ఫారెస్టు అధికారులు ● పరారీలో నిందితులు ● కేసు నమోదు బషీరాబాద్: మండలంలోని మైల్వార్ రిజర్వ్డ్ ఫారెస్టులో ఆక్రమణలు ఆగడం లేదు. తాజాగా మైల్వార్ తండాకు చెందిన ఇద్దరు వ్యక్తులు మూడు రోజులుగా సర్వే నంబర్ 218లో రెండు ఎకరాల అటవీ భూమిని కబ్జా చేయడానికి ప్రయత్నించారు. సుమా రు 50 వరకు చెట్లను నరికి ట్రాక్టర్తో చదును చేశారు. విషయం తెలుసుకున్న అటవీ సెక్షన్ అధికారులు స్నేహశ్రీ, ఫీర్యానాయక్, మమత, బీట్ అధికారి మల్లప్ప అక్కడికి చేరుకున్నారు. అధికారుల రాకను గుర్తించిన కబ్జాదారులు, ట్రాక్టర్ డ్రైవర్ పరారయ్యారు. తండాకు చెందిన గోపాల్ రాథోడ్, రతన్ రాథోడ్ అటవీ భూమి కబ్జా చేసేందుకు ప్రయత్నించినట్లు అధికారులు గుర్తించారు. భూమిని చదును చేసేందుకు మైల్వా ర్కు చెందిన షఫీ ట్రాక్టర్ను వినియోగించినట్లు తేల్చారు. వాహనాన్ని సీజ్ చేయడానికి వెళితే అప్పటికే దాన్ని రహస్య ప్రాంతానికి తరలించి సదరు యజమాని పరారైనట్లు అధికారులు తెలిపారు. ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు సెక్షన్ అధికారి స్నేహశ్రీ తెలిపారు. అటవీ ప్రాంతంలో చెట్లను నరికినా, భూమిని కబ్జా చేయాలని ప్రయత్నించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. -
‘బెస్ట్ అవైలబుల్’కు విద్యార్థుల ఎంపిక
అనంతగిరి: షెడ్యూల్ కులాల, గిరిజన సంక్షేమ శా ఖ ఆధ్వర్యంలో బెస్ట్ అవైలబుల్ స్కూల్కు డ్రా పద్ధ తిన విద్యార్థులను ఎంపిక చేసినట్లు అదనపు కలెక్టర్ ఎం.సుధీర్ తెలిపారు. శనివారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఒకటి నుంచి ఐదో తరగతి విద్యార్థుల ఎంపిక కోసం డ్రా తీశారు. గిరిజన సంక్షేమ శాఖలో 3, 5, 8వ తరగతులకు 22 మందిని తల్లిదండ్రుల సమక్షంలో ఎంపిక చేయడం జరిగిందని తెలిపారు. షెడ్యూల్ కులాల విభాగంలో ఒకటవ తరగతిలో 88 ఖాళీలకు గాను 139 మంది దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. గ్రూపుల వారీగా సీట్ల కేటాయింపు జరిగిందని వివరించారు. గ్రూప్ వన్లో 6 సీట్ల గాను ఇద్దరు, గ్రూప్ 2లో 53 సీట్లకు గాను 87 మంది దరఖాస్తు చేశారని తెలిపారు. గ్రూప్ 3లో 29 సీట్లకు గాను 50 మంది దరఖాస్తు చేసుకున్నట్లు చెప్పారు. ఒకటవ తరగతిలో 88 సీట్లకు గాను 84 మంది విద్యార్థులు ఎంపిక చేయడం జరిగిందని తెలిపారు. 5వ తరగతిలో 91 సీట్లకు గాను 17 మంది విద్యార్థులు దరఖాస్తులు చేసుకోగా వారందరినీ ఎంపిక చేయడం జరిగిందన్నారు. డ్రా పద్ధతిలో ఎంపికై న విద్యార్థులకు జూలై 3న పత్రాలను అందజేయడం జరుగుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో షెడ్యూల్ కులాల సంక్షేమ శాఖ అధికారి కమలాకర్రెడ్డి, సహాయ సంక్షేమ అధికారులు శుక్రవర్ధన్ రెడ్డి, వీరానందం, సిబ్బంది, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.