breaking news
Vikarabad
-
ఆనంద రవళి దీపావళి
ధనలక్ష్మీ పూజలు, నోములు, వ్రతాలతో సందడి ● కొనుగోలు దారులతో బాణసంచా,పూజాసామగ్రి దుకాణాల కిటకిటపరిగి: దీపావళి పర్వదినానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. చీకటిని పారదోలుతూ వెలుగును తెచ్చేపండుగా, విజయానికి ప్రతీకగా జరుపుకొంటారు. చెడుపై గెలుపునకు సంకేతంగా ఇంటిల్లిపాది.. ధనలక్ష్మికి ఆహ్వానం పలుకుతూ.. కాంతులు వెలిగిస్తారు. దీపావళి అంటే దీపాల వరుస అని అర్థం. దీనిని దివాలి అనికూడా పిలుస్తారు. ఈ సందర్భంగా ప్రజలు తమ ఇళ్లు, దుకాణాల్లో దీపాలు, కొవ్వొత్తులను వెలిగించి సంపద, అదృష్టం, శ్రేయస్సుకు ప్రతీక అయిన లక్ష్మీదేవిని పూజిస్తారు. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు టపాసులు కాల్చుతూ ఆనందోత్సహాలతో కేరింతలు కొడతారు. పర్యావరణ పరిరక్షణ పండుగ వేళ, పర్యావరణ పరిరక్షణకు టపాకాయలు వాయు, ధ్వని కాలుష్యాన్ని పెంచేవిధంగా ఉన్నాయనే కోణంలో కొన్నిటిని నిషేధించారు. బాణసంచా కాల్చినప్పుడు సాధారణం కంటే కాలుష్యం కొన్ని వందల రేట్లు అధికంగా విడుదలవుతుంది. వీటిని కాల్చేవారికి కాకుండా చుట్టూ ఉన్నవారికి ప్రమాదం పొంచి ఉంది. ముఖ్యంగా చిన్నపిల్లలు. పొగ ఎక్కువ వ్యాపించి, ఊపిరితిత్తుల పనితీరుపై ప్రభావం చూపుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కొద్ది పాటి జాగ్రత్తలు పాటిస్తూ.. టపాసులను కాల్చాలని సూచిస్తున్నారు. గతంలో అత్యున్నత న్యాయస్థానం కాలుష్య నివారణకు ఆంక్షలు విధించింది. కాలుష్యం అధికంగా ఉన్న ప్రాంతాల్లో టపాసులను నిషేధించింది. సాధారణ కాలుష్యం ఉన్న ప్రాంతాల్లో ఆంక్షలు విధించింది. ప్రమాదాల నివారణకు.. టపాసులు కాల్చే ముందు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. దుస్తులపై నిప్పురవ్వలు పడితే త్వరగా ప్రభావం చూపకుండా కాటన్ దుస్తులు ధరించాలి. పిల్లలను గమనిస్తుండాలి. బాణసంచా పేల్చేటప్పుడు చెవుల్లో దూది పెట్టుకోవడం మరిచిపోవద్దు. సీమ టపాసులను కొంచెం దూరంగా ఉంచి కాల్చడం మంచిది. పిల్లల చేతికి రాకెట్, తారాజువ్వ తరహా టపాసులు ఇవ్వవద్దు. రాకెట్లాంటివి పూరిళ్లకు దూరంగా విశాలమైన ఆవరణలోనే కాల్చాలి. కాలని వాటిని నీటిలో లేదా ఇసుక బకెట్లో వేయాలి. భూచక్రాలు కాల్చేటప్పుడు పాదరక్షలు ధరించడం మంచిది. సామగ్రికి సమీపంలో కొవ్వత్తులు ఉంచరాదు. -
కానిస్టేబుల్గా కొనసాగుతూ..
కొత్తూరు: కానిస్టేబుల్గా ఉద్యోగం చేస్తూనే గ్రూప్– 2లో ఉత్తమ ర్యాంకు సాధించి, సెక్రటేరియట్లో ఏఎస్ఓగా ఉన్నతస్థితికి చేరుకుంది. పట్టణానికి చెందిన గాలిగాని యాదయ్య మూడో కూతురు ఉమ.. చిన్నప్పటి నుంచి చదువుల్లో మేటి. సర్కారు బడుల్లో విద్యనభ్యసించి గ్రూప్– 1, ఎస్ఐ, ఉద్యోగానికి పలుమార్లు పరీక్షలు రాసి కొద్దిపాటి మార్కులతో రాణించలేక పోయింది. ఆ తరువాత కానిస్టేబుల్ ఉద్యోగం సాధించింది. అయినప్పటికీ.. పట్టువదలక.. పోటీ పరీక్షలు రాసి.. గ్రూప్–2లో మెరిసింది. ప్రస్తుతం ఉమకేశంపేట పోలీస్స్టేషన్లో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తోంది. -
కడ్తాల్ తహసీల్దార్గా జయశ్రీ
కడ్తాల్: నూతన తహసీల్దార్గా జయశ్రీ ని యామకమయ్యారు. ఈ మేరకు కలెక్టరేట్ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. కడ్తాల్లో రెండేళ్లుగా పనిచేసిన షేక్ ముంతాజ్.. డీఎఓగా చేవెళ్ల ఆర్డీఓ కార్యాలయానికి బదిలీ అయ్యారు. ఆమె స్థానంలో సైదాబాద్ తహసీల్దార్గా పనిచేస్తున్న జయశ్రీ ఇక్కడికి వచ్చారు. బైక్ అదుపుతప్పి వ్యక్తి మృతి కుల్కచర్ల: ద్విచక్రవాహనం అదుపుతప్పి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన మండల పరిధిలో చోటుచేసుకుంది. ఎస్ఐ రమేష్ తెలిపిన వివరాల ప్రకారం.. దోమ మండలం మల్లెపల్లి గ్రామానికి చెందిన దొడ్ల వెంకటయ్య(42), శనివారం కుల్కచర్ల గ్రామంలో ఓ వేడుకకు హాజరై.. రాత్రి పది గంటలకు గ్రామానికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో.. అతను నడిపిస్తున్న టీవీఎస్ ఎక్సెల్.. రైతువేదిక సమీపంలో అదుపుతప్పి చెట్ల పొదల్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో అక్కడ ఉన్న రాళ్లు సదరు వ్యక్తికి బలంగా తాకి, తీవ్రంగా గాయపడ్డాడు. ఉదయం వరకు అతన్ని ఎవరూ చూడకపోవడంతో తీవ్రరక్తస్రావం జరిగి మృత్యువాత పడ్డాడు. దీనిని గమనించిన కొందరు.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలికి చేరుకున్న వారు.. కుటుంబీకులకు సమాచారం అందించారు. మృతుడి భార్య చెన్నమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. బైక్ ఢీ కొని మరొకరు.. షాద్నగర్రూరల్: ద్విచక్రవాహనం ఢీ కొట్టిన ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన పోచమ్మ దేవాలయం సమీపంలో చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. పట్టణంలోని ప్యారడైజ్ కాలనీ వాసి జెట్టిరమణయ్య(45), శనివారం రాత్రి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఈ క్రమంలో వెనుక నుంచి ఓ బైక్.. రమణయ్యను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో అతను తీవ్రంగా గాయపడి అక్కడిక్కడే మృతి చెందాడు. ప్రమాదానికి కారణమైన వాహనదారుడు పరారీలో ఉన్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది. -
పాడి రైతుల శ్రేయస్సే లక్ష్యం
కడ్తాల్: పాడి రైతుల శ్రేయస్సే విజయడెయిరీ లక్ష్యం అని పాలశీతలీకరణ కేంద్రం మెనేజర్ ప్రాణేశ్కుమార్, స్థానిక విజయ పాల ఉత్పత్తి దారుల సహకార సంఘం అధ్యక్షుడు వెంకటేశ్ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని పాల సేకరణ కేంద్రం వద్ద 120 మంది రైతులకు దీపావళి కానుకగా పాలక్యాన్లు, స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పాల ఉత్పత్తి మరింత పెరగాలని, నాణ్యమైన పాలను పోసి అధిక ధర పొందాలని సూచించారు. రైతులకు అవసరమైన సదుపాయాలను ఎప్పటికప్పుడు కల్పిస్తున్నామని పేర్కొన్నారు. అనంతరం రైతులు మాట్లాడుతూ.. సకాలంలో పాలబిల్లులు చెల్లించాలని, పశుగ్రాసం, దాణా పంపిణీ చేయాలని అధికారులను కోరారు. కార్యక్రమంలో పాల ఉత్పత్తి దారుల సహకార సంఘం డైరెక్టర్లు, రైతులు రాములు, రవీందర్రెడ్డి, వెంకట్రాములుగౌడ్, వెంకట్రెడ్డి, పాండు, మహేశ్, జంగారెడ్డి, సత్యం, రాములు, చంద్రయ్య, యా దయ్య, లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు. -
కానిస్టేబుల్ నుంచి ఎస్ఐగా..
యాచారం: ఎకై ్సజ్ శాఖలో కానిస్టేబుల్గా పనిచేస్తూ.. ప్రస్తుతం అదే శాఖలో ఎస్ఐగా ఉన్నతికి చేరుకుంది మండల పరిధి నందివనపర్తి అనుబంధ గ్రామం పిల్లిపల్లికి చెందిన అయ్యాగాని ప్రవళిక. నిరుపేద కుటుంబానికి చెందిన ఆమె.. బీపార్మసి పూర్తి చేసింది. తాజాగా వెలువడిన గ్రూపు– 2లో రాణించి, ఎస్ఐగా ఎంపిౖకైంది. గతంలో గ్రూప్– 4లో వార్డు ఆఫీసర్గా ఉద్యోగం వచ్చింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్రూప్– 1లో ఉద్యోగం సాధించడమే లక్ష్యమని పేర్కొంది. ప్రవళిక తల్లిదండ్రులు పాండు, శోభలు గ్రామంలో వ్యవసాయ పనులు చేస్తూ జీవనోపాధి పొందుతున్నారు. -
పేకాట స్థావరంపై పోలీసుల దాడి
ధారూరు: మండల పరిధి అంతారం గ్రామ సమీపంలో పేకాట స్థావరంపై ఆదివారం టాస్క్ఫోర్స్ పోలీసులు దాడిచేశారు. జూదం ఆడుతున్న 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. రూ.6,340 నగదు, పేక ముక్కలను స్వాధీనం చేసుకుని, నిందితులను ఠాణాకు తరలించారు. ఈ దాడిలో టాస్క్ఫోర్స్ సీఐ అన్వర్పాష, సిబ్బంది పాల్గొన్నారని ధారూరు ఎస్ఐ రాఘవేందర్ తెలిపారు. విద్యుత్షాక్తో యువకుడి మృతి చేవెళ్ల: వాహనంలో కొత్తిమిర లోడ్ చేసి, కవర్ కప్పుతుండగా.. పైన ఉన్న విద్యుత్ తీగలు తగిలి ఓ యువకుడు మృతి చెందాడు. ఈ సంఘటన బస్తేపూర్ గ్రామంలో చోటు చేసు కుంది. పోలీసులు తెలిపిన ప్రకారం.. వికారాబాద్ జిల్లా పులుసు మామిడి గ్రామానికి చెందిన మహమ్మద్ జహంగీర్(26), చేవెళ్లలో బోలెరో డ్రైవర్ జహంగీర్ వద్ద క్లీనర్గా పనిచేస్తున్నాడు. ఎప్పటీ లాగే శనివారం రాత్రి బస్తేపూర్లో కొత్తిమీర లోడ్ కోసం వెళ్లారు. పొలం సమీపంలోని విద్యుత్ తీగల కింద వాహనం ఆపారు. లోడ్ అనంతరం వాహనం పైకి ఎక్కి.. కవర్ కప్పుతున్న క్రమంలో పైన ఉన్న కరెంట్ తీగలు చేతికి తగిలి షాక్కు గురయ్యాడు. వెంటనే డ్రైవర్.. బాధితున్ని చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. పరిశీలించిన వైద్యులు అప్పటికే అతను మృతి చెందినట్లు తెలిపారు. మృతుడి తండ్రి యూసుప్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. పోస్టుమార్టం అనంతరం ఆదివారం మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించారు. 26న పాషనరహరి వర్ధంతి సభ ఇబ్రహీంపట్నం: ఇబ్రహీంపట్నంలో ఈ నెల 26న నిర్వహించే కామ్రెడ్స్ మహబూబ్ పాష, నరహరి వర్ధంతి సభను జయప్రదం చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్య పిలుపునిచ్చారు. సీపీఎం కమిటీ జిల్లా ముఖ్యనేతల సమావేశం ఆదివారంపట్నంలోని పాషనరహరి స్మారక కేంద్రంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. భూములను పేదలకు పంచాలని, కూలీ రేట్లు పెంచాలని, అణగారిన వర్గాల అభ్యన్నతికి, వారి హక్కుల కోసం పోరాడిన పాషనరహరిలను హతమార్చిన విషయాన్ని గుర్తు చేశారు. వారి ఆశయసాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు రాంచందర్, సామేల్, చంద్రమోహన్, జగన్, నర్సింహ్మ, బుగ్గరాములు, జంగయ్య, అంజయ్య, రుద్రకుమార్లు పాల్గొన్నారు. గ్లూకోజ్ కారణంగానే చనిపోయింది.. ఎమ్మెల్యే మల్రెడ్డికి వివరించిన మానస కుటుంబీకులు మంచాల: గ్లూకోజ్ కారణంగానే గర్భిణి మానస చనిపోయిందని మృతురాలి కుటుంబీకులు ఆరోపించారు. వైద్య చికిత్స కోసం శుక్రవారం భర్త మధుతో కలిసి మానస స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు రాగా.. ఆమెకు గ్లూకోజ్ ఎక్కిస్తున్న క్రమంలో మృత్యువాత పడిన విషయం తెలిసిందే. ఇదే విషయమై న్యాయం కోసం.. బాధిత కుటుంబం ఆదివారం నగరంలో ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డిని కలిశారు. వైద్యల నిర్లక్ష్యం కారణంగానే ఆమె చనిపోయిందని, మృతురాలికి చిన్నబాబు ఉన్నాడని వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. న్యాయం జరిగే విధంగా చూస్తానని హామీనిచ్చారు. కలెక్టర్, ఆర్డీఓతో మాట్లాడి రూ.10 లక్షలు ఆర్థిక సహాయం, ఇంటి స్థలం, ఇందిరమ్మ ఇల్లు, భర్త మధుకు అవుట్ సోర్సింగ్ ఉద్యోగం, బాలుడి చదువుకు పూర్తి సహకారం అందిస్తామని చెప్పారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు సదానందం, ప్రవీణ్, బూర కృష్ణ, విష్ణు వర్ధన్రెడ్డి, ప్రభాకర్, వెంకటేశ్ తదితరులు ఉన్నారు.ఆగిఉన్న లారీని ఢీకొన్న డీసీఎం ఒకరి మృతి, ఇద్దరికి గాయాలు అబ్దుల్లాపూర్మెట్: ఆగి ఉన్న లారీని వెనుక నుంచి డీసీఎం వాహనం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో డీసీఎంలో ప్రయాణిస్తున్న ఓ యువకుడు అక్కడికక్కడే మృతిచెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన అబ్దుల్లాపూర్మెట్ ఠాణా పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లా నాగారం మండలం పస్నూర్ గ్రామానికి చెందిన చిత్తలూరి వెంకన్న కుమారుడు చిత్తలూరి గణేశ్(23), నాలుగు నెలలుగా ఎల్బీనగర్లోని దుర్గా ఫైర్ వర్క్స్లో పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో బాణసంచా లోడ్ను శనివారం రాత్రి ఘట్కేసర్లో అన్లోడ్ చేశారు. అనంతరం మహేశ్వరం నుంచి గోదాం వద్ద ఔటర్రింగ్ రోడ్డు మీదుగా వెళ్తుండగా ఆదివారం తెల్లవారు జామున ఎగ్జిట్ నం.10 వద్ద, ఎలాంటి సిగ్నల్ లేకుండా రోడ్డుపై నిలిపి ఉన్న లారీని వీరు ప్రయాణిస్తున్న డీసీఎం డీకొట్టింది. ఈ ఘటనలో గణేశ్ తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. సందీప్, సతీష్లు గాయాపడ్డారు. మృతుడి తండ్రి వెంకన్న ఫిర్యాదు మేరకు.. దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. -
నిధులు రాక.. నిర్మాణం సాగక
● అసంపూర్తిగా గిరిజన భవనం ● పట్టించుకోని పాలకులు, అధికార యంత్రాంగం ఆమనగల్లు: గిరిజనుల కోరిక మేరకు.. సంయుక్తంగా సభలు, సమావేశాలు, పండుగలు నిర్వహించుకోవడానికి ప్రభుత్వం గిరిజన భవన నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. అందుకు కావాల్సిన నిధులు కేటాయించింది. అనంతరం నిర్మాణ పనులు చేపట్టినప్పటికీ.. అవి నిలిచిపోయాయి. 30 గుంటల భూమి గిరిజన సంఘాల విన్నపంతో 2023లో కల్వకుర్తి నాటి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ఆమనగల్లు పట్టణ సమీపంలోని కల్వకుర్తి రోడ్డులో గిరిజన భవన నిర్మాణానికి 30 గుంటల ప్రభుత్వ భూమిని కేటాయించారు. అక్కడ గిరిజనులు సేవాలాల్ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. అనంతరం రూ.2 కోట్లు మంజూరు చేయించారు. దీంతో అదే ఏడాది జూన్ 17న అప్పటి కలెక్టర్ హరీశ్తో కలిసి.. జైపాల్ యాదవ్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అయితే నిధులు కేటాయించినప్పటికీ.. టెండర్ ప్రక్రియ చేపట్టకపోవడంతో పనులు ప్రారంభం కాలేదు. 2024లో పనులు షురూ ప్రస్తుత ప్రభుత్వం 2024లో భవన నిర్మాణ పనులకు కదలిక తెచ్చింది. టెండర్ ప్రక్రియ నిర్వహించి, పనులు ప్రారంభించింది. ఇప్పటి వరకు షెడ్డు, చుట్టూ ప్రహరి పూర్తయింది. ఇంకా సగం పనులు చేపట్టాల్సి ఉంది. అయితే బిల్లులు రాలేదంటూ.. సదరు నిర్మాణదారుడు పనులు నిలిపివేసినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు రూ.1.10 కోట్లతో పనులు పూర్తయ్యాయి. -
కష్టపడ్డారు.. ఉన్నతికి చేరుకున్నారు
మహేశ్వరం/కొత్తూరు: ప్రభుత్వ వివిధ శాఖల్లో ఉద్యోగాలు చేస్తూనే.. మరింత ఉన్నత స్థితికి చేరుకోవాలని కలగన్నారు. కష్టపడ్డారు. ఫలితం దక్కించుకున్నారు. వారిలో ఒకరు జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తూ.. డీటీకి ఎంపికగా, మరో ఇద్దరు కానిస్టేబుల్గా పనిచేస్తూ.. ఏఎస్ఓగా ఒకరు, ఎస్ఐగా మరొకరు ఎంపికయ్యారు. నగరంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, తదితర అధికారుల చేతుల మీదుగా నియామక పత్రాలు అందుకొన్నారు. పేద రైతు కుటుంబంలో.. పేద రైతు కుటుంబంలో పుట్టి, ప్రభుత్వ పాఠశా లలో చదివాడు. గ్రూప్– 2లో రాష్ట్ర స్థాయిలో 171 ర్యాంకు సాధించి, డిప్యూటీ తహసీల్దార్గా ఉద్యో గం సాధించాడు గిరిజన బిడ్డ దేవేందర్. మండల పరిధి పెద్దమ్మ తండా అనుబంధ నల్లచెర్వుతండా కు చెందిన కాట్రావత్ లక్ష్మీ– రాములు నాయక్ దంపతుల కుమారుడు దేవేందర్ నాయక్ శనివారం రెవెన్యూ అధికారుల చేతుల మీదుగా నియామక పత్రం అందుకున్నాడు. వికారాబాద్ జిల్లాలో రెవె న్యూ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్గా ఎంపికయ్యాడు. ఇంతకు ముందే.. దేవేందర్ గ్రూప్– 3లో 305 మార్కులు సాధించి, రాష్ట్ర స్థాయిలో 63వ ర్యాంకు సాధించారు. గ్రూప్– 4లో 141వ ర్యాంకు సాధించి, శంషాబాద్ తహసీల్దార్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్నాడు. గ్రూప్– 1లో 433 మార్కులు సాధించినప్పటికీ.. కొద్దిపాటి తేడాతో అదృష్టం చేజారింది. అయినా నిరుత్సాహం చెందకుండా.. డీటీ కొలువు సాధించాడు. గ్రూప్–2లో మెరిసిన ఉద్యోగులు జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తూ.. డీటీకి ఎంపికై న దేవేందర్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తూ..ఏఎస్ఓగా ఉమ -
పండగ పూట.. భద్రం సుమా!
● టపాసులు కాల్చేటప్పుడుజాగ్రత్తలు తప్పనిసరి ● వ్యాధిగ్రస్తులు దూరంగాఉండడం మంచిది దుద్యాల్: దీపావళి వచ్చిందంటే చాలు ప్రతి ఇంట్లో సందడి మామూలుగా ఉండదు. చిన్నపిల్లలు ఉంటే మరీ ఎక్కువే ఉంటుంది. ఉదయం నుంచి లక్ష్మీ పూజలు చేసుకోవడం, సాయంత్రం బాణసంచా కాల్చడం సర్వసాధారణంగా జరుగుతుంటాయి. అయితే టపాసులతో పర్యావరణానికి విఘాతం కలిగే అవకాశం లేకపోలేదు. మరోవైపు బాణసంచా కాల్చేటప్పడు కచ్చితంగా జాగ్రత్తలు పాటించాలని నిపుణులు చెబుతున్నారు. కాలుష్య ప్రభావం బాణసంచా కాల్చడంతో వాటి నుంచి వెలువడే పొగ వాతావరణంలో సుమారు మూడు రోజుల వరకు ఉంటుంది. అలాంటి గాలిని పీల్చినప్పుడు శ్వాసకోస వ్యాధులు సంభవించే అవకాశాలు మెండుగా ఉన్నాయని వైద్య నిపుణులు తెలుపుతున్నారు. టపాకాయల్లో ఉండే టాక్సిక్ అనే కారకంతో పాటు రాగి, కాడ్మియం, పోటాషియం వంటి పదార్థాలు విఘాతం కలిగిస్తాయి. వీటితో ఆస్తమాతో పాటు ఇతర రుగ్మతలు వస్తాయి. టపాసులు కాల్చేటప్పుడు ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా కళ్లకు ముప్పు తప్పదని కంటి వైద్యులు హెచ్చరిస్తున్నారు. 70–80 శాతం ప్రమాదాల్లో 10–18 సంవత్సరాల వారే ఉంటున్నారు. జాగ్రత్తలు పాటించడంతో ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. ఇవి పాటించాలి ● టపాసులు కాల్చేటప్పుడే కాటన్ దుస్తులే ధరించాలి. ● చిన్న పిల్లలు పెద్దల సమక్షంలోనే కాల్చాలి. ● సగం కాల్చిన, కాలని టపాసులను నీళ్లు, ఇసుకలో వేయాలి. ● రాకెట్స్ ఇతర టపాసులను గుడిసెలు, పెట్రోల్ బంకుల వద్ద కాల్చకూడదు. ● టపాసులు కాల్చుతున్న ప్రదేశంలో నీరును అందుబాటులో ఉంచుకోవాలి. ● వాయువులు కళ్లలోకి వెళ్తే నిర్లక్ష్యం చేయకుండా తక్షణమే కంటి వైద్యులను సంప్రదించాలి. ● టపాసులు కాల్చుతున్నప్పుడు శబ్దాలకు చెవిలో దూది పెట్టుకోవడం మేలు. ● ఆస్తమా, అలర్జీలు ఉంటే మరింత జాగ్రత్తగా ఉండాలి. దురద, తుమ్ములు, ఆయాసం పెరుగుతాయి. ఇవి రాకుండా ముక్కు దగ్గర తడి వస్త్రం కట్టుకోవాలి. ● కళ్లకు అద్దాలు పెట్టుకుంటే ఎలాంటి హాని జరుగదు. శబ్దంతో ప్రమాదం టపాసులను పేల్చడం ప్రమాకరమే. మానవుడు సాధారణంగా 120 డేసిబెల్స్ వరకు శబ్దం వినవచ్చు. అంతకంటే ఎక్కువ ఉంటే చెవిలో నొప్పి ప్రారంభమై రక్తం కారుతుంది. చెవిలో దుది పెట్టుకొని బాణసంచా కాల్చాలి. నిర్లక్ష్యం వహిస్తే ప్రమాదం తప్పదు. – వందన, వైద్యురాలు, పీహెచ్సీ హకీంపేట్ -
ఘనంగా పథ సంచలన్
చేవెళ్ల: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ఆదివారం పథసంచలన్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. స్వయం సేవకులు చేవెళ్లలోని రచ్చబండ నుంచి పురవీధుల మీదుగా కేవీఆర్ గ్రౌండ్ వరకు కవాతు చేశారు. ఈ సందర్భంగా ప్రధాన వక్త డాక్టర్ అన్నదానం సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ.. హిందూ సమాజాన్ని కాపాడుకోవడం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. గ్రామగ్రామాన స్వయం సేవక్ సంఘ్ను విస్తారించాలని, దేశాభివృద్ధే లక్ష్యంగా పాటుపడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం, ఆర్ఎస్ఎస్ చేవెళ్ల సంఘ్ చాలక్ బిల్లపాటి కృష్ణారెడ్డి, మైపాల్రెడ్డి, మల్లేశ్, కె.వెంకట్రెడ్డి, సురేందర్, సాయిరాం, బీజీపీ నాయకులు ప్రభాకర్రెడ్డి, అనంత్రెడ్డి, డాక్టర్ వైభవ్రెడ్డి, వెంకట్రెడ్డి, శ్రీనివాస్, పాండురంగారెడ్డి, ప్రవీణ్ పాల్గొన్నారు. -
పండగ పూట.. పేకాట!
బషీరాబాద్: జూదానికి వ్యసనమై ఎంతో మంది జీవితాలను ఛిన్నాభిన్నం చేసుకుంటున్నారు. మూడు ముక్కలాటలో కొందరు సర్వం కోల్పోయి కుటుంబాలను వీధిన పడేస్తున్నారు. దీపావళి సందర్భంగా తాండూరు నియోజకవర్గంలో పేకాట ఆడడం ఆనవాయితీగా మారింది. జూదాన్ని అరికట్టాల్సిన పోలీసులు పేకాటరాయుళ్ల ముడుపులకు అలవాటుపడి అటువైపు కూడా కన్నెత్తి చూడడంలేదనే విమర్శలు బహిరంగా వినిపిస్తున్నాయి. వ్యాపారులు, రాజకీయ నాయకులు, ఉద్యోగులు మొదలుకొని కార్మికుల వరకు కార్డ్స్ ఆడడం అలవాటుగా మారింది. దీంతో తాండూరులో మూడు ముక్కలు.. అరవై ఆటలుగా పేకాట నడుస్తోంది. ఏళ్ల నుంచి ఆచారం జిల్లాలో తాండూరు వాణిజ్య కేంద్రంగా పేరొందింది. ఇక్కడ నాపరాతి, సుద్ద గనుల వంటి విలువైన ఖనిజ సంపద విరివిగా ఉండడంతో వ్యాపారాలు, ఉపాధి ఎక్కువ లభిస్తుంటాయి. అందుకే ఈ ప్రాంతాన్ని మినీ దుబాయ్ అని కూడా పిలుస్తుంటారు. దీపావళి సందర్భంగా వ్యాపారులు తమ షాపుల్లో లక్ష్మీ పూజతో పాటు రాత్రి తప్పనిసరిగా పేకాట ఆడటం సంవత్సరాల నుంచి ఆచారంగా కొనసాగుతూ వస్తోంది. శిబిరాల ఏర్పాటు వ్యాపారులు కొంతమంది సిండికేట్గా మారి తమ షాపులు, ఇళ్లలో ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేసుకొని పందేలు కాస్తూ పేకాట కొనసాగిస్తున్నారు. పట్టణంలోని గంజి అర్తుల్లో పూజల అనంతరం పేకాట ఆడడం నిబంధనగా పెట్టుకున్నారు. మరికొందరు ఫంక్షన్ హాళ్లలోని గదుల్లో, లాడ్జీల్లో, పట్టణ శివారు ప్రాంతల్లోని ఫామ్హౌస్ల్లో, పాలిషింగ్ యూనిట్లలో, పొలాల బావుల దగ్గర తీన్పత్తా ఆట జోరుగా సాగిస్తున్నారు. ఇవీ అసాంఘిక కార్యక్రమాలని తెలిసిన వాళ్లు కూడా ఇందులో పాల్గొనడం గమనార్హం. పండుగ 15 రోజుల్లోనే రూ.లక్షల్లో డబ్బులు చేతులు మారుతున్నాయి. ముడుపుల ఆరోపణలు ఈ వ్యవహారంలో ఎక్కువగా బడాబాబులే ఉండడంతో పోలీసులు దాడులు చేయడానికి జంకుతున్నారు. 5 ఏళ్లుగా తాండూరు పట్ణణంతో పాటు మండలాల్లోనూ ఎక్కడ పోలీసుల దాడులు చేయలేదు. పేకాటరాయుళ్లు పోలీసులకు ముడుపుల మేత వేసి దర్జాగా ఆడుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతేడాది తాండూరు పట్టణంతో పాటు నియోజకవర్గంలో ఎక్కడ కూడా దాడులు జరపవద్దని ఓ పోలీసు అధికారి వాట్సాప్ కాన్ఫరెన్స్ కాల్లో ఆదేశాలు ఇచ్చారని అప్పట్లో తీవ్ర చర్చ జరిగింది. పేకాట రాయుళ్ల నుంచి రూ.లక్షల్లో ముడుపులు ముట్టజెప్పడంతో కనీసం రాత్రివేళ పోలీసు జీపుల సైరన్ కూడా వినిపించడంలేదని విమర్శలు వస్తున్నాయి. దీపావళి పూజల్లో పేకాట ఆడుతుంటారని మా దృష్టికి వచ్చింది. బెట్టింగులు కట్టి పేకాట ఆడడం చట్ట విరుద్ధం. పట్టణంతో పాటు మండలాల్లో ఎక్కడ జూదం ఆడిన పోలీసులకు సమాచారం ఇవ్వండి. ప్రత్యేక పోలీసు బృందాలతో దాడులు నిర్వహిస్తాం. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠినంగా వ్యవహరిస్తాం. – బాలకృష్ణారెడ్డి, డీఎస్పీ, తాండూరు జూదరులుగా వ్యాపారులు, రాజకీయ నేతలు తాండూరు సెగ్మెంట్లో జోరుగా పత్తాలాట రూ.లక్షల్లో కొనసాగుతున్న వ్యవహారం పట్టించుకోని పోలీస్ యంత్రాంగం -
అభివృద్ధి వైపు అడుగులు
దుద్యాల్: రాష్ట్ర ప్రభుత్వం దుద్యాల్ మండల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించింది. అందులో భాగంగానే పశు వైద్య కళాశాలను మంజూరు చేసింది. కళాశాల భవన నిర్మాణం కోసం పశువైద్య అధికారులు రెవెన్యూ సిబ్బందితో కలిసి ఇటీవల మండల పరిధిలోని హకీంపేట్ శివారులో స్థల పరిశీలన సైతం చేశారు. పారిశ్రామికవాడ ఏర్పాటు కోసం రైతుల నుంచి సేకరించిన 1,270 ఎకరాల భూమిలో 252 సర్వే నంబర్లో 250 ఎకరాలను ఎడ్యుకేషన్ హబ్ కోసం కేటాయించారు. అందులో పశువైద్య కళాశాల ఏర్పాటుకు దాదాపు 45 ఎకరాల భూమి అవసరమని భారత పశువైద్య మండలి అధికారులు సూచించినట్లు తహసీల్దార్ కిషన్ తెలిపారు. కళాశాల ఏర్పాటుకు ప్రభుత్వం రూ.360 కోట్లను కేటాయించిందని, మొదటి విడతలో రూ.200 కోట్లను మంజూరు చేసినట్లు సమాచారం. హకీంపేట్లో 45 ఎకరాలు కేటాయింపు దుద్యాల్ మండల ఏర్పాటు తర్వాత వేగంగా అభివృద్ధి చెందుతుంది. మండల పరిధిలోని లగచర్ల, హకీంపేట్, పోలేపల్లి, రోటిబండతండా, పులిచర్లకుంట తండా గ్రామాల్లో పారిశ్రామికవాడ ఏర్పాటుకు ప్రభుత్వం దాదాపు 1,270 ఎకరాల భూమిని సేకరించింది. త్వరలోనే పనులు ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. మండల కేంద్రంలో ఽసమీకృత మండల కార్యాలయాలు, ధాన్యం నిల్వల కోసం గోదాం ఏర్పాటు, హకీంపేట్లో మండల సమీకృత విద్యాలయాలు, ఏటీసీ సెంటర్, ఇంటర్ కళాశాల వంటివి కేటాయించారు. అందుకు సంబంధించిన పనుల సైతం వేగంగా జరుగుతున్నాయి. తాజాగా పశువైద్య కళాశాలను కేటాయించడంతో మండల వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పశువైద్య కళాశాలకు స్థల పరిశీలన సందర్శించిన భారత పశువైద్య మండలి అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్న దుద్యాల్వాసులు -
దీపావళి సౌభాగ్యం నింపాలి
స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ అనంతగిరి: జిల్లాతో పాటు రాష్ట్ర ప్రజలందరికీ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. చిరు దివ్వెలతో చీకట్లను పారదోలి వెలుగులు పంచాలని కోరుకున్నారు. పేదలు, రైతుల జీవితాల్లో కొత్తకాంతులు నింపడానికి సీఎం రేవంత్రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. సుఖ సంతోషాలు, సిరి సంపదలు, సౌభాగ్యం, సమృద్ధిగా ఉండాలని పేర్కొన్నారు. అందరూ తగు జాగ్రత్తలు పాటిస్తూ కుటుంబ సభ్యులందరూ కలిసి పండగను ఆనందంగా జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. కుల్కచర్ల: గ్రూప్–2 నియామక ప్రక్రియలో భాగంగా కుల్కచర్ల మండలానికి చెందిన మురళీకృష్ణ నాయక్ కో–ఆపరేటివ్ సొసైటీ అసిస్టెంట్ రిజిస్టర్గా శనివారం రాత్రి సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా పత్రాన్ని అందుకున్నారు. ఇప్పాయిపల్లి గ్రామ పంచాయతీ అనుబంధ గ్రామం రోకటిగుట్టతండాకు చెందిన మురళీకృష్ణ గ్రూప్–2 ఫలితాల్లో సత్తా చాటి నారాయణపేట జిల్లా కోఆపరేటివ్ సొసైటీ అసిస్టెంట్ రిజిస్టర్గా నియమితులయ్యారు. కాగా మండలానికి చెందిన యువకుడు జిల్లా స్థాయి ఉద్యోగాన్ని పొందడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రెండు గంటలు నిలిచిన ప్యాసింజర్ రైలు తాండూరు టౌన్: సాంకేతిక లోపం వలన ఓ ప్యాసింజర్ రైలు తాండూరు రైల్వే స్టేషన్లో రెండు గంటల పాటు నిలిచింది. వివరాలు ఇలా ఉన్నాయి. వాడి నుంచి సికింద్రాబాద్కు వెళ్లాల్సిన వాడి ప్యాసింజర్ రైలు.. ఆదివారం సాయంత్రం 4 గంటలకు తాండూరుకు చేరుకుంది. తిరిగి వెళ్లే క్రమంలో మొరాయించింది. ఇంజన్లో సాంకేతిక లోపం ఉన్నట్లు లోకో పైలట్ గుర్తించారు. వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వగా.. మెకానిక్లు వచ్చినా ఫలితం లేకుండా పోయింది. దీంతో అక్కడికి వచ్చిన ఓ గూడ్స్ ఇంజన్ను ప్యాసింజర్ బోగీలకు అమర్చి, రైలును సికింద్రాబాద్కు తరలించారు. దీంతో రెండు గంటల పాటు ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. షాద్నగర్: దీపావళి పండుగ సందర్భంగా చాలామంది సొంతూళ్లకు పయనమయ్యారు. దీంతో హైదరాబాద్–బెంగళూరు 44వ నంబర్ జాతీయ రహదారిపై ఆదివారం ప్రయాణికుల సంఖ్య పెరిగింది. షాద్నగర్ పరిధిలోని రాయికల్ శివారులో ఉన్న జడ్చర్ల ఎక్స్ప్రెక్స్ వే టోల్ప్లాజా వాహనాలతో రద్దీగా మారింది. ఏఐసీసీ పరిశీలకుడు రాబర్ట్ బ్రూస్ తుర్కయంజాల్: పార్టీ బలోపేతమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు పనిచేయాలని ఏఐసీసీ పరిశీలకుడు, తిరునల్వేలి ఎంపీ రాబర్ట్ బ్రూస్ అన్నారు. డీసీసీ అధ్యక్షుడి ఎన్నిక నేపథ్యంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం తుర్కయంజాల్లోని ఓ హోటల్లో నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. ఆయన సమక్షంలోనే ఎమ్మెల్యే రంగారెడ్డి, ఆదిబట్ల మున్సిపల్ మాజీ చైర్మన్ నిరంజన్ రెడ్డి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కార్యక్రమంలో భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, టెస్కాబ్ వైస్ చైర్మన్, డీసీసీబీ చైర్మన్ కొత్తకుర్మ సత్తయ్య పాల్గొన్నారు. -
చికిత్స పొందుతూ గర్భిణి మృతి
మంచాల: చికిత్స పొందుతూ గర్భిణి మృతి చెందింది. ఆమె మృతికి ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని బంధువులు ఆందోళనకు దిగారు. ఈ ఘటన మంచాల మండల కేంద్రంలో చోటుచేసుకుంది. బాధితుల కథనం ప్రకారం.. మండలంలోని లింగంపల్లి గ్రామానికి చెందిన పంతంగి మానస (26) ఏడు నెలల గర్భిణి. వైద్యం కోసం భర్త మధుతో కలిసి శుక్రవారం ఉదయం మంచాల ప్రభుత్వ వైద్యశాలకు వచ్చింది. అక్కడి వైద్యురాలు పరీక్షించి బలం తక్కువగా ఉందని, గ్లూకోజ్ ఎక్కించారు. కొద్ది సేపటికే ఆమె లోబీపీతో స్పృహ తప్పిపడిపోయింది. దీంతో వెంటనే ఇబ్రహీంపట్నంలో ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు నగరంలోని కోఠి ప్రభుత్వ ఆస్పత్రికి రిఫర్ చేశారు. అక్కడి వైద్యులు పరీక్షించి ఉస్మానియా వైద్యశాలకు పంపించారు. చికిత్స పొందుతూ శనివారం ఉదయం ఆమె మృతి చెందింది. న్యాయం చేయాలంటూ.. మంచాల ప్రభుత్వ ఆస్పత్రి నిర్లక్ష్యంతో మానస మరణించిందని కుటుంబ సభ్యులు ఆరోపించారు. మృతికి కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని, తమరే న్యాయం చేయాలంటూ మంచాల– ఆరుట్ల రోడ్డుపై బైఠాయించారు. వారికి వివిధ పార్టీల నాయకులు మద్దతుగా నిలిచారు. సమాచారం అందుకున్న ఇబ్రహీంపట్నం ఏసీపీ కేపీవీ రాజు ఘటనా స్థలానికి చేరుకున్నారు. విషయాన్ని ఫోన్లో కలెక్టర్, జిల్లా వైద్యాధికారులు, స్థానిక ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. అక్కడికి వచ్చిన డిప్యూటీ డీఎంహెచ్ఓ సుధామాధవి వారి సర్ది చెప్పారు. రూ.లక్ష అందిస్తామని తెలిపారు. దీంతో వారు ఆందోళన విరమించారు. వైద్యుల నిర్లక్ష్యమే కారణమని కుటుంబ సభ్యుల ఆందోళన -
పర్యవేక్షణ లేక.. అధ్వాన స్థితి
దౌల్తాబాద్: రాష్ట్రంలో గత కొన్నేళ్లుగా ప్రభుత్వాలు నీటి సంఘాలకు ఎన్నికలు నిర్వహించడం లేదు. దీంతో చెరువులు అధ్వానంగా మారాయి. మరోవైపు మిషన్ కాకతీయ పథకంలో భాగంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం చెరువులు, కుంటలకు మరమ్మతులు చేసినా వాటిపై అజమాయిషీ లేక నీటి వనరులపై దృష్టి పెట్టేవారు కరువయ్యారు. ఒకప్పుడు చెరువుల అభివృద్ధి నిర్వహణ, ఆయకట్టు నీటి విడుదల పర్యవేక్షణ పనులను నీటి సంఘాల పాలక వర్గాలు చేపట్టేవి. పదిహేడేళ్లుగా ప్రభుత్వాలు నీటి సంఘాలకు ఎన్నికలు నిర్వహించకపోవడంతో ఈ పర్యవేక్షణ కరువైంది. దీంతో కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా పనులు చేపడుతున్నారు. కొన్ని గ్రామాల్లో పనులు చేపట్టకముందే నిధులు కాజేశారన్న ఆరోపణలు వచ్చాయి. శిథిలావస్థకు తూములు గత ప్రభుత్వాలు 100 ఎకరాల ఆయకట్టు ఉన్న ప్రధాన చెరువులకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసి సాగు నీటి సంఘాలకు ఎన్నికలు నిర్వహించేవి. ఈ ఎన్నికల్లో రైతులు నీటి సంఘం చైర్మన్తో పాటు డైరెక్టర్లను ఎన్నుకునేవారు. పాలకవర్గ సభ్యులు చెరువుల నిర్వహణతో సాగు నీటిని పంట పొలాలకు విడుదల చేసుకుని పొదుపుగా వాడుకునేలా చర్యలు తీసుకునేవారు. అంతేకాకుండా రైతులను సమన్వయం చేసుకుంటూ అభివృద్ధి పనులు సైతం చేపట్టేవారు. గత 17 ఏళ్ల నుంచి నీటి సంఘాలకు ఎన్నికలు నిర్వహించకపోవడంతో చెరువుల నిర్వహణ అధ్వానంగా మారింది. కొన్ని చెరువుల తూములు, పంట కాల్వలు, అలుగులు శిథిలావస్థకు చేరుకున్నాయి. తూములు పనిచేయక సాగు నీరురాక నిరుపయోగంగా మారాయి. చెరువులపై ఎవరి పెత్తనం లేకపోవడంతో రైతులకు సాగు నీరు అవసరమయ్యే సమయంలో ఇబ్బందులు తప్పడం లేదు. వానాకాలం సీజన్ ప్రారంభంలో చేపలు పట్టుకోవడం కోసం రాత్రికి రాత్రి చెరువుల నుంచి నీటిని అక్రమంగా ఖాళీ చేస్తున్నారు. 2008లో చివరిసారి 2006వ సంవత్సరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర వ్యాప్తంగా వంద ఎకరాల ఆయకట్టుకు పైగా ఉన్న ప్రధాన చెరువులకు రెండు సంవత్సరాల కాలానికి గాను సాగునీటి సంఘాల ఎన్నికలు నిర్వహించారు. వాటి పదవీకాలం 2008లో ముగిసింది. అప్పటి నుంచి తిరిగి ఎన్నికలు నిర్వహించిన దాఖలాలు లేవు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వమైనా నీటి సంఘాలకు ఎన్నికలు నిర్వహించి చెరువులను మరింత అభివృద్ధి చేయాలని రైతులు కోరుతున్నారు. రూపురేఖలు కోల్పోతున్న చెరువులు, కుంటలు పదిహేడేళ్లుగా నీటి సంఘాలకు ఎన్నికలు బంద్ పట్టించుకోని ప్రభుత్వాలు సంఘాలతోనే అభివృద్ధి నీటి సంఘాలకు ఎన్నికలు నిర్వహించి పాలకవర్గాలను ఎన్నుకుంటేనే చెరువులు అభివృధ్ది చెందుతాయి. గతంలో నీటి సంఘాల పాలకవర్గాలు ఉండడం వలన నీటిని పొదుపుగా వాడుకోవడమే కాకుండా వాటి పర్యవేక్షణ కూడా పకడ్బంధీగా ఉండేది. ప్రభుత్వం నీటి సంఘాల ఎన్నికలపై దృష్టి సారించాలి. – వెంకటయ్య, రైతు, దేవర్ఫసల్వాద్ -
రోడ్డు ధ్వంసంపై పరస్పర ఫిర్యాదులు
పూడూరు: మాజీ సర్పంచ్ కుటుంబంతో తమకు ప్రాణహాని ఉందంటూ బాధితులు బిక్యానాయక్, ప్రభాత్, జంగయ్య తదితరులు ఆవేదన వ్యక్తంచేశారు. ఈ మేరకు శనివారం మన్నెగూడలో విలేకరులతో మాట్లాడారు. రాకంచర్ల నుంచి పొలాలకు వెళ్లకుండా మాజీ సర్పంచ్ పెంటయ్య, అతని సోదరుడు రాజు రోడ్డుకు అడ్డంగా జేసీబీతో గుంతలు తీయించారన్నారు. ఈ మార్గం వ్యవసాయ పొలాలతో పాటు సిరిగాయిపల్లికి వెళ్తుందని తెలిపారు. రోడ్డును ధ్వంసం చేయడాన్ని ప్రశ్నించిన కారణంగా తన కొడుకుపై దాడి చేశారని రైతు జంగయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. పొలం వద్ద విచారణకు వచ్చి చన్గోముల్ ఎస్ఐ భరత్రెడ్డి ఎదుటే బూతు మాటలు తిడుతూ, దాడికి పాల్పడ్డాడని తెలిపారు. ఈ విషయమై ఎస్ఐని వివరణ కోరగా ఇరువర్గాల వారు పరస్పరం ఫిర్యాదు చేశారని, కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. -
పోలీస్ స్టిక్కర్ ఉన్న కారులో వచ్చి హల్చల్
● ల్యాంకోహిల్స్లో సెక్యూరిటీ గార్డులపై దాడి ● 15 మందిపై కేసు నమోదు ● ఐదుగురి అరెస్ట్ గచ్చిబౌలి: పోలీస్ స్టిక్కర్ ఉన్న కారులో వచ్చి సెక్యూరిటీ గార్డులపై దాడికి పాల్పడిన వారిని అరెస్ట్ చేసిన సంఘటన రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ల్యాంకోహిల్స్ బ్లాక్ 3ఎల్హెచ్లో మహరాష్ట్ర కేడర్కు చెందిన ఓ ఐపీఎస్ అధికారి తల్లి అద్దెకు ఉంటోంది. ఈ నెల 15న ఉదయం వినాయక రెడ్డి అనే వ్యక్తి ల్యాంకోహిల్స్లోని ఫ్లాట్ నెంబర్ 1703కి వెళ్లేందుకు వచ్చాడు. విజిటర్స్ లైన్లో కాకుండా రెసిడెన్సీ లైన్లో వెళ్లడంతో సెక్యూరిటీ సిబ్బంది అతడిని అడ్డుకున్నారు. పాస్ ఇవ్వడం లేదని చెప్పడంతో ఫ్లాట్ నెంబర్ 1703 నుంచి మురళి అనే వ్యక్తి కిందికి వచ్చాడు. వచ్చీరావడంతో అతను గొడవకు దిగడంతో సెక్యూరిటీగార్డు బాలకృష్ణ అతడిని తోశాడు. దీంతో మురళి సెక్యురిటీ గార్డుపై చేయడంతో అతను ప్రతిదాడి చేశాడు. అక్కడి నుంచి వెళ్లిపోయిన మురళి సాయంత్రం మరి కొందరితో కలిసి వచ్చి సెక్యూరిటీ గార్డులైన బాలకృష్ణ, చంద్లపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో దాదాపు 15 మంది పాల్గొన్నట్లు ఆరోపిస్తూ బాధితులు రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. సీసీ కెమెరా పుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించిన పోలీసులు 10 మందికి నోటీసులు ఇచ్చి పంపారు. మరో ఐదురుగురు పరారీలో ఉన్నారు. ఇది ఇలా ఉండగా దాడి చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ సెక్యూరిటీ గార్డులు శనివారం ల్యాంకోహిల్స్కు వెళ్లే దారిలో ఆందోళన చేపట్టారు. ఇప్పటికే కేసు నమోదు చేశామని, మరో ఐదుగురు పరారీలో ఉన్నారని రాయదుర్గం పోలీసులు సర్ధిచెప్పడంతో వారు ఆందోళన విరమించారు. అయితే ఆ తర్వాత కొద్ది సేపటికే పరారీలో ఉన్న ఐదుగురు వ్యక్తులు పోలీస్ స్టిక్కర్ఉన్న కారులో వచ్చి రాయదుర్గం పెట్రోల్ మొబైల్ సిబ్బంది చూస్తుండగానే సిబ్బందిపై దాడికి పాల్పడటంతో వారిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. మహరాష్ట్ర క్యాడర్కు చెందిన ఐపీఎస్ ఆఫీసర్ కేసును అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. నోటీసులతో సరిపెట్టాలని సైబరాబాద్ పోలీసు ఉన్నతాధికారులను కోరినా అందుకు నిరాకరించి రిమాండ్ చేసినట్లుగా సమాచారం. -
కేజీబీవీ విద్యార్థులకు చిత్రలేఖనం పోటీలు
ధారూరు: డ్రగ్స్, మత్తుపదార్థాలతో కలిగే అనర్థాలపై ధారూరు కేజీబీవీ విద్యార్థులకు శనివారం చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు. మహిళ, శిశుసంక్షేమ శాఖ, జిల్లా మహిళా సాధికార కేంద్రం ఆధ్వర్యంలో నషాముక్త్ భారత్ అభియాన్ 5వ వార్షికోత్సవంలో పాల్గొని సత్తాచాటిన విద్యార్థులకు బహుమతులు, సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్థిక అక్షరాస్యత నిపుణులు రాందాస్, సఖీ సెంటర్ ఇంచార్జి రేష్మా, కేజీబీవీ ప్రిన్సిపాల్ స్రవంతి తదితరులు పాల్గొన్నారు. పురుగుల బియ్యాన్ని ఎలా తింటారు? తాండూరు రూరల్: రేషన్ బియ్యం పంపిణీలో పౌరసరఫరాల శాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని గాజీపూర్ మాజీ సర్పంచు తలారి వీరప్ప ఆరోపించారు. శనివారం గ్రామంలోని రేషన్ దుకాణం వద్ద పంపిణీ చేసిన బియ్యంలో పురుగులు ఉన్నాయని, ఉల్లెడ పట్టిన బియ్యాన్ని ప్రజలు ఎలా తినాలని ప్రశ్నించారు. ప్రభుత్వం ప్రజల ఆరోగ్యంతో ఆడుకుంటోందని మండిపడ్డారు. ఇప్పటికై నా నాణ్యమైన బియ్యం సరఫరా చేయకపోతే ఆందోళన తప్పదని స్పష్టంచేశారు. కార్యక్రమంలో గ్రామస్తులు ముస్తాఫా, లాలు, అంజి, ఎల్లప్ప తదితరులు పాల్గొన్నారు. ఫుడ్ సైన్స్లో ఐశ్వర్యకు గోల్డ్ మెడల్ కొడంగల్: బీఎస్సీ ఫుడ్ సైన్స్లో ప్రతిభ కనబర్చిన పట్టణానికి చెందిన బాకారం ఐశ్వర్య శనివారం హైదరాబాద్లో గవర్నర్ చేతుల మీదుగా బంగారు పతకం అందుకున్నారు. వీరనారి చాకలి ఐలమ్మ యూనివర్శిటీ (కోటీ ఉమెన్స్ కాలేజీ)లో జరిగిన స్నాతకోత్సవంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేతుల మీదుగా గోల్డ్ మెడల్, మెరిట్ సర్టిఫికెట్ తీసుకున్నారు. నీటి సంపులో పడి బాలుడి మృతి యాలాల: పొట్టకూటి కో సం వలస వెళ్లిన కుటుంబంలో తీరని విషాదం అలుముకుంది. అనుకోకుండా జరిగిన ఘటనలో నాలుగేళ్ల బాలుడు నీటి మునిగి మృతి చెందడంతో మండలంలోని దేవనూరు గ్రామం శోకసంద్రంలో మునిగింది. గ్రామానికి చెందిన పరమేశ్వర్ భార్య ఇద్దరు కొడుకులతో కలిసి 8 నెలల క్రితం హైదరాబాద్లోని నానక్రాంగూడ ప్రాంతానికి వలస వెళ్లాడు. అక్కడ డెలవరీ బాయ్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. కాగా ఆయన రెండో కుమారుడు నిఖిల్ తేజ్(4) స్థానిక అంగన్వాడీ కేంద్రానికి వెళ్లేవాడు. శుక్రవారం సాయంత్రమైన చిన్నారి ఇంటికి రాకపోవడంతో అంగన్వాడీ కేంద్రంలో వాకబు చేశాడు. పిల్లలు అప్పుడే వెళ్లిపోయారని తెలపడంతో చుట్టుపక్కల వెతకగా, స్థానికంగా ఉన్న ఓ నీటి సంపులో విగతజీవిగా నిఖిల్ తేజ్ కనిపించాడు. దీంతో బాధితులు కన్నీరుమున్నీరయ్యారు. చిన్నారి అకాల మరణంతో స్వగ్రామమైన దేవనూరులో శోకసంద్రంలో మునిగింది. గంజాయి సాగు చేస్తున్న వ్యక్తి అరెస్టు షాద్నగర్: భూమిని కౌలు కు తీసుకొని అక్రమంగా గంజాయి మొక్కలు సాగు చేస్తున్న వ్యక్తిని శనివారం కేశంపేట పోలీసులు అరెస్టు చేశారు. సీఐ నరహ రి కథనం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూరు గోదావరికి చెందిన కొప్పర్తి శ్రీను కొంత కాలం క్రితం కేశంపేట మండలం వేములనర్వ గ్రామానికి వచ్చాడు. గ్రామానికి చెందిన ఓ రైతు వద్ద కొంత భూమిని కౌలుకు తీసుకున్నాడు. ఆ భూమిలో గుట్టుగా గంజాయి మొక్కలను సాగు చేశాడు. సమాచారం అందుకున్న ప్రత్యేక పోలీసు బృందం తనిఖీ చేసి గంజాయి మొక్కలను గుర్తించారు. ఈ మేరకు కొప్పర్తి శ్రీనును అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
విధులు ముగించుకొని వెళ్తుండగా..
కుల్కచర్ల: బతుకుదెరువు కోసం నగరానికి వెళ్లిన ఓ యువకుడు రోడ్డు ప్రమాదంలో తిరిగిరాని లోకాలకు వెళ్లాడు. స్థానికుల వివరాల ప్రకారం.. చౌడాపూర్ మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన సత్యమ్మ మల్లయ్యల కుమారుడైన శివ(21) శంషాబాద్లో ఓ ప్రైవేట్ ఫార్మసీ కంపెనీలో విధులు నిర్వహిస్తూ కుటుంబానికి ఆసరాగా నిలుస్తున్నాడు. శనివారం తెల్లవారుజామున అతడు విధులు ముగించుకొని రూమ్కి వెళుతున్నాడు. మార్గమధ్యలో శంషాబాద్లో బైక్పై యూటర్న్ చేస్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొని మృతిచెందాడు. అందరితో కలుపుగోలుగా ఉండే యువకుడు ఇలా ఆకస్మికంగా మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబంలో వెలుగులు నింపుతాడుకున్న కుమారుడు ఇలా తిరిగిరాని లోకాలకు చేరడంతో కుటుంబీకులు తీవ్ర నిర్వేదంలో మునిగిపోయారు. రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం -
ప్రయాణికుల నిలువు దోపిడీ
సాక్షి, సిటీబ్యూరో: ప్రైవేట్ వాహనాలు బీసీ బంద్ను భారీగా సొమ్ము చేసుకున్నాయి. దీపావళి వేడుకలు, వరుస సెలువుల నేపథ్యంలో వివిధ ప్రాంతాల నుంచి సొంత ఊళ్లకు బయలుదేరిన నగరవాసుల పైన దారిదోపిడీకి పాల్పడ్డాయి. సాధారణ రోజుల్లో విధించే చార్జీలపైన రెట్టింపు వసూలు చేశాయి. బంద్ సందర్భంగా సిటీబస్సులతో పాటు దూరప్రాంతాలకు వెళ్లే బస్సులు సైతం నిలిచిపోయాయి. శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎక్కడికక్కడ డిపోలకే పరిమితమయ్యాయి. మహాత్మాగాంధీ, జూబ్లీ బస్స్టేషన్ల నుంచి జిల్లాలకు రాకపోకలు సాగించే బస్సులను కూడా నిలిపివేయడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.అప్పటికే బస్స్టేషన్లకు చేరుకున్న ప్రయాణికులు ఏదో ఒకవిధంగా సొంత ఊళ్లకు వెళ్లేందుకు ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించారు. దీంతో క్యాబ్లు, టాటాఏస్లు, మ్యాక్సీక్యాబ్లు, తదితర వాహనదారులు అడ్డగోలుగా దోచుకున్నాయి. గత్యంతరం లేకపోవడంతో ఎక్కువ చార్జీలను చెల్లించి వెళ్లాల్సి వచ్చింది. బీసీ బంద్ దృష్ట్యా హైదరాబాద్ నుంచి తెలుగు రాష్ట్రాలకు రాకపోకలు సాగించే సుమారు 3500 బస్సులు స్తంభించాయి. మరోవైపు నగరంలోని 25 డిపోల్లో మరో 2850 కి పైగా సిటీ బస్సులు సైతం డిపోలకే పరిమితమయ్యాయి. వీకెండ్ కావడంతో వివిధ అవసరాల నిమిత్తం ఇంటి నుంచి బయటికి వచ్చిన జనాన్ని ఆటోవాలాలు దోచుకున్నారు.సెవెన్ సీటర్ ఆటోలు, శేర్ ఆటోల్లో సైతం రెట్టింపు చార్జీలు వసూలు చేశారు. ఇష్టారాజ్యంగా వసూళ్లు... ఓలా, ఉబెర్, ర్యాపిడీ వంటి సంస్థలతో అనుసంధానమయ్యే క్యాబ్ డ్రైవర్లు తమ వాహనాలను బంద్ దృష్ట్యా జిల్లాలకు మళ్లించారు. మరోవైపు పలు ఐటీ సంస్థలకు వాహనాలను నడిపే ట్రావెల్ ఏజెంట్లు సైతం దీపావళి రద్దీని సొమ్ము చేసుకొనేందుకు రోడ్డెక్కాయి. ఉప్పల్, ఎల్బీనగర్, జేబీఎస్, ఆరాంఘర్, బీఎన్రెడ్డినగర్, తదితర ప్రాంతాల నుంచి జిల్లాలకు రాకపోకలు సాగించాయి. ప్రయాణికుల రద్దీకనుగుణంగా వివిధ ప్రాంతాల్లో ప్రైవేట్ క్యాబ్లు బారులు తీరాయి. ఉప్పల్ రింగ్ రోడ్డు నుంచి హన్మకొండ వరకు ఆర్టీసీ లగ్జరీ బస్సుల్లో రూ.250 నుంచి రూ.300 వరకు చార్జీ ఉంటుంది. సాధారణ రోజుల్లో ఈ రూట్లో రాకపోకలు సాగించే క్యాబ్లు సైతం ఈ చార్జీలను వసూలు చేస్తాయి. కానీ బంద్ డిమాండ్ను దృష్టిలో ఉంచుకొని క్యాబ్వాలాలు రూ.500 నుంచి రూ.700 వరకు వసూలు చేయడం గమనార్హం. ఎల్బీనగర్ నుంచి విజయవాడ, ఖమ్మం, సూర్యాపేట్, నల్లగొండ, తదితర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు సైతం ఇదేవిధంగా క్యాబ్వాలాల దారిదోపిడీకి గురయ్యారు. మెట్రోలు ఫుల్... బీసీబంద్ దృష్ట్యా మెట్రో రైళ్లు కిక్కిరిశాయి. నాగోల్–రాయదుర్గం, ఎల్బీనగర్–ఎంజీబీఎస్ రూట్లలో ప్రయాణికుల రద్దీ పెరిగింది. వివిధ ప్రాంతాల నుంచి సికింద్రాబాద్, నాంపల్లి రైల్వేస్టేషన్లకు వెళ్లే ప్రయాణికులు మెట్రోలను ఆశ్రయించారు. మరోవైపు ఆటోరిక్షాలకు సైతం డిమాండ్ పెరిగింది. ఓలా, ఉబెర్, ర్యాపిడో ఆటోల్లోనూ చార్జీలు అమాంతంగా పెరిగాయి.బంద్ కారణంగా ఆసుపత్రులకు వెళ్లే వారు, అత్యవసర పనులపైన బయటకు వెళ్లిన వాళ్లు పెద్ద మొత్తంలోసమర్పించుకోవాల్సి వచ్చింది. బీసీ బంద్ను భారీగా సొమ్ము చేసుకున్న ప్రైవేట్ వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయిన ఆర్టీసీ బస్సులు దీపావళి సందర్భంగా సొంత ఊళ్లకు తరలిన జనం ఇక్కట్లు బంద్ ప్రశాంతం బీసీలకు 42 శాతం రిజర్వేషన్కు మద్దతుగా అన్ని పార్టీలు, ప్రజాసంఘాలు, బీసీ సంఘాలు నగరంలోని వివిధ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టాయి. ప్రజారవాణా స్తంభించినప్పటికీ బంద్ ప్రశాంతంగా కొనసాగింది. సీపీఎం, సీపీఐ, సీసీఐఎంఎల్ న్యూడెమోక్రసీ, తదితర వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు, తెలంగాణ జనసమితి అధ్యక్షులు కోదండరాం, తదితరులు నారాయణగూడ వైఎంసీఏ నుంచి కాచిగూడ చౌరస్తా, కోఠీ , సుల్తాన్ బజార్, రామకోఠీ, బొగ్గులకుంట మీదుగా అబిడ్స్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. అరుణోదయ సాంస్కృతి సమాఖ్య గౌరవ అధ్యక్షురాలు విమలక్క, సీపీఐ సీనియర్ నాయకులు నారాయణ, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, సీపీఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జాన్ వెస్లీ , సీపీఐఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు గోవర్ధన్, తెలంగాణ జన సమితి నాయకులు ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు, సీపీఐఎల్ ఎల్ మాస్ లైన్ హన్మేష్, గదేగోని రవి, తదితరులు పాల్గొన్నారు. -
నవజాత శిశు సంరక్షణపై
ప్రత్యేక దృష్టి పెట్టాలి తాండూరు: నవజాత శిశు సంరక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కొడంగల్ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ రాజు వైద్య సిబ్బందికి సూచించారు. తాండూరు ఎంసీహెచ్లో శుక్రవారం స్టాఫ్ నర్సులు, నర్సింగ్ విద్యార్థులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నవజాత శిశువులకు ఆరోగ్య సమస్యలు వస్తే ఒత్తిడికి లోనై హైదరాబాద్కు రెఫర్ చేయరాదన్నారు. అక్కడే వైద్యం చేయాలని సూచించారు. అత్యవసర సమయాల్లో మెడికల్ కళాశాల నుంచి సలహాలు సూచనలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో పెడియాట్రిక్ వైద్యులు డాక్టర్. మూర్తి, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ మాలతి, వైద్యులు శ్రీలత, జైపాల్రెడ్డి, స్టాఫ్ నర్సులు అనిత, సౌందర్య, రాణి, ఆసిఫా, నిర్మల సింగ్ తదితరులు పాల్గొన్నారు. -
బీరప్పగుడి స్థలాన్ని కాపాడండి
ఇబ్రహీంపట్నం రూరల్: బీరప్పగుడి స్థలాన్ని కాపాడాలని కుర్మ సంఘం ఆదిబట్ల నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం ఆలయ భూమిలో ఆ సంఘం నాయకులు గుంతలు తవ్వగా.. వాటిని పోలీసుల సహకారంతో ప్లాట్ల యజమానులు కూల్చివేశారని ఆరోపిస్తూ.. వారితో వాగ్వివాదానికి దిగారు. అనంతరం సంఘం నాయకులు మాట్లాడారు. ప్రైవేటు స్థలంపై హైడ్రాకు, పోలీసులకు ఏంపనని ప్రశ్నించారు. చెరువులు, కుంటలు, అక్రమ నిర్మాణాలను వదిలేసి, పట్టా భూమి జోలికి ఎందుకు వస్తున్నారని మండిపడ్డారు. స్టే ఉన్నప్పటికీ పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా రోడ్డుఉందని పేర్కొంటూ.. గతంలో హైడ్రా.. గుడి ప్రహరిని కుల్చీవేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సివిల్ తగాదాలో పోలీసులు జోక్యం చేసుకోవద్దని సూచించారు. అనంతరం ఠాణాకు వెళ్లి, భూమి జోలికి రావొద్దని కోరారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ శ్రీశైలం, సంఘం నాయకులు జంగయ్య, రాజు, శివకుమార్, శ్రీనివాస్, వెంకటేశ్, రవి, నర్సింహ, భాస్కర్ పాల్గొన్నారు. -
సీపీఎస్ను రద్దు చేయాలి
అనంతగిరి: ఏ భారం కాని పాత పెన్షన్ విధానాన్ని ప్రభుత్వం పునరుద్ధరించాలని తెలంగాణ రాష్ట్ర కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర నాయకుడు చంద్రకాంత్ కోరారు. శుక్రవారం జిల్లా పర్యటనలో ఉన్న ఏఐఐసీ నాయకుడు సూపర్ సింగ్ ఠాగూర్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలైన రాజస్థాన్, చత్తీస్గర్, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్లో సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తున్నారని తెలిపారు. దీంతో ఆ ప్రాంతాల ఉద్యోగుల భవితకు భద్రత చేకూరిందని పేర్కొన్నారు. రాజస్థాన్లో వెయ్యికి పైగా రిటైర్ అయిన సీపీఎస్ ఉద్యోగులు.. పాత పెన్షన్ను తీసుకుంటున్నారన్నారు. తెలంగాణలోనూ అదే విధానాన్ని అమలు చేయాలని కోరారు. కార్యక్రమంలో సీపీఎస్ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు రాఘవేందర్, జనరల్ సెక్రటరీ పాషా, రాష్ట్ర సాహిత్య కమిటీ సభ్యుడు మురహరినాథ్, మహబూబ్ నగర్ ప్రధాన కార్యదర్శి రాఘవేందర్ రెడ్డి, జిల్లా నాయకులు భాస్కర్, వెంకటయ్య పాల్గొన్నారు -
అరకొర బస్సులు.. ప్రయాణికుల పాట్లు
యాచారం: మహాలక్ష్మి పథకం పేరిట ప్రభుత్వం.. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించింది. కానీ అందుకు తగిన విధంగా సర్వీసుల సంఖ్య పెంచకపోవడంతో ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగి.. అవస్థల నడుమ ఆడబిడ్డలు ఒంటికాలిపై పయనిస్తూ.. ఇబ్బంది పడుతున్నారని పలువురు పేర్కొంటున్నారు. పురుషులదీ అదే సమస్య. యాచారం– కందుకూరు రూట్లో సరిగా బస్సులు లేక.. అరకొర బస్సు ట్రిప్పులతో ప్రజలకు ఇక్కట్లు తప్పడం లేదు. ఈ రూట్లో ఉదయం, సాయంత్రం వేళలోరెండు మండలాల పరిధి గ్రామాల నుంచి వందలాది మంది విద్యార్థులతో పాటు అనేక మంది యాచారం మండల కేంద్రం, ఇబ్రహీంపట్నం, నగరానికి రాకపోకలు సాగిస్తుంటారు. ప్రయాణికులు అధికంగా ఉన్నప్పటికీ.. సంస్థ అధికారులు సర్వీసులు, ట్రిప్పులు పెంచకపోవడంతో ప్రజలు నరక ప్రయాణం చేస్తున్నారు. ఫుట్బోర్డు ప్రయాణంతో ప్రమాదాలకు గురవుతున్నట్లు తెలుస్తోంది. ఆర్టీసీ అధికారులు స్పందించి.. ఈ మార్గంలో అదనపు బస్సులు నడిపించాలని ప్రయాణికులు కోరుతున్నారు. విధిలేక ఒంటికాలిపై ఆడబిడ్డల పయనం -
పట్టుదల ఉంటే.. విజయాలు వెంటే
షాద్నగర్రూరల్: కృషి, పట్టుదల ఉంటే విజయాలు వెన్నంటే ఉంటాయని మోటివేషనల్ స్పీకర్ డాక్టర్ రవికుమార్ అన్నారు. పట్టణ సమీపంలోని నూర్ ఇంజినీరింగ్ కళాశాలలో.. గిరిజన సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ, పీజీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ నీతాపోలె ఆధ్వర్యంలో కొనసాగుతున్న ‘స్వయం ఉపాధి నైపుణ్యాల అభివృద్ధి’ శిక్షణా కార్యక్రమంలో శుక్రవారం ఆయన మాట్లాడారు. జీవిత గమనంలో ఎదురయ్యే సవాళ్ల ఎదుర్కొన్నప్పుడే లక్ష్యాన్ని చేరుకుంటామని చెప్పారు. విద్యార్థులు చదువులో రాణిస్తూ.. వృత్తి నైపుణ్యాలపై అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. చిన్నచిన్న విషయాలకు కుంగిపోకుండా, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగినప్పుడే విజయతీరాలకు చేరుకుంటారని స్పష్టం చేశారు. లక్ష్య సాధనకు ప్రణాళికలను రూపొందించుకొని, నిరంతరం శ్రమించాలన్నారు. అనంతరం ప్రిన్సిపాల్ నీతాపోలె మాట్లాడుతూ.. అందివచ్చిన అవకాశాలను అందిపుచ్చుకోవాలని సూచించారు. ఇలాంటి శిక్షణా కార్యక్రమాలు విద్యార్థులకు ఎంతగానో దోహదపడతాయన్నారు. కళాశాల స్థాయిలోనే ఉద్యోగ అవకాశాలు, ఉపాధిని కల్పించుకునే దిశగా ప్రేరణనిస్తాయ పేర్కొన్నారు. కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.మోటివేషనల్ స్పీకర్ డాక్టర్ రవికుమార్ -
సామాజిక తెలంగాణే జాగృతి లక్ష్యం
తుక్కుగూడ: సామాజిక తెలంగాణ సాధనే జాగృతి లక్ష్యమని ఆ సంస్థ జిల్లా అధ్యక్షుడు కప్పాటి పాండురంగారెడ్డి అన్నారు. శుక్రవారం నగరంలోని జాగృతి కార్యాలయంలో నిర్వహించిన జిల్లా స్థాయి నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సంస్థ వ్యవస్థాపక అధ్యక్షురాలు కవిత ప్రజా సమస్యలను తెలుసుకోవడానికి జనయాత్ర చేపట్టనుందని తెలిపారు. యాత్ర మొదటగా ఈ నెల 25న నిజమాబాద్ నుంచి ప్రారంభమై, 33 జిల్లాలో కొనసాగుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర నాయకులు కోల శ్రీనివాస్, నరేష్, బండారి లావణ్య, ముస్తాపా, రామకోటి, రాము యాదవ్, నవీన్గౌడ్, సందిప్, సత్యానారాయణ, బాబురావు, సాల్వాచారి, బాలాజీ తదితరులు పాల్గొన్నారు. ‘జనంబాట’ను జయప్రదం చేద్దాం కందుకూరు: సామాజిక తెలంగాణే కవిత లక్ష్యమని, అందుకోసం ఈ నెల 25 నుంచి చేపట్టనున్న ‘జనంబాట’ కార్యక్రమాన్ని జయప్రదం చేద్దామని జాగృతి జిల్లా అధ్యక్షుడు పాండురంగారెడ్డి పిలుపునిచ్చారు. నగరంలోని కార్యాలయంలో సంస్థ జిల్లా యాత్ర పర్యవేక్షకుడు శ్రీనివాస్, నరేష్, అర్చన సేతుపతి సమక్షంలో నిర్వహించిన జిల్లా ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. యాత్రలో భాగంగా ఆదివాసి, గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలతో పాటు బీసీ రిజర్వేషన్ల అమలు, కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలుకై పోరాటం చేయనుందన్నారు. జాగృతి జిల్లా మహిళా అధ్యక్షురాలు లావణ్య పాల్గొన్నారు.సంస్థ జిల్లా అధ్యక్షుడు పాండురంగారెడ్డి -
యాసంగిపై ఆశలు!
రబీలో సాగు విస్తీర్ణం భారీగా పెరగనుంది. గడిచిన కాలంలో కురిసిన భారీ వర్షాలకు చెరువులు, జలాశయాలు నిండుకుండను తలపిస్తుండగా.. భూగర్భ జలాలు పెరిగాయి. ౖపైపెకి ఉబికి వస్తున్నాయి. దీంతో యాసంగి ఈ సారి ఆశాజనకంగా ఉండనుంది. తాండూరు: వానాకాలం(ఖరీఫ్)లో అతివృష్టికి పంటపొలాలు దెబ్బతిన్నాయి. చేతికందొచ్చిన పంట నేలపాలై నష్టాలను మూటగట్టుకున్న రైతన్నలు.. ఆ లోటును ప్రస్తుత యాసంగి(రబీ)లో పూడ్చుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఆశతో సాగుకు సమాయత్తం అవుతున్నారు. వ్యవసాయ శాఖ ప్రణాళికను మించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రధాన పంటగా వరి రబీ పంటల ప్రణాళికను వ్యవసాయ శాఖ అధికారులు సిద్ధం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 1.56 లక్షల ఎకరాల్లో సాగు అంచనా వేశారు. అయితే అందులో వరి 1.01 లక్షల ఎకరాలు, కూరగాయ పంటలు మరో 7,121 వేల ఎకరాల్లో ఉండనుంది. 70 శాతం ప్రధాన పంటగా వరి సాగు కానుంది. పప్పు, నూనే గింజలు శనగలు 4,216 ఎకరాలు, వేరు శనగ 15,110 ఎకరాలు, మొక్కజొన్న, జొన్న, కుసుమ తదితర పంటలను మిగిలిన ఎకరాల్లో సాగుకు సిద్ధం చేశారు. ఉద్యాన పంటలకు ఊతం ప్రస్తుత యాసంగిలో 7,121 ఎకరాల్లో కూరగాయలు సాగవనున్నట్లు వ్యవసాయ శాఖఅంచనా వేసింది. ఉల్లి, టమాటా, మిరప, బీర, బెండ, క్యాబేజీ తదితర వాటిని పండిస్తున్నారు. ఉద్యాన రైతులను ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ప్రధానంగా వరి, మొక్కజొన్న, జొన్న, చెరకు, పొద్దుతిరుగుడు, వేరుశనగ పంటలను 1.48 లక్షల ఎకరాలు, కూరగాయలు 7,121 ఎకరాల్లో సాగవనుంది. ఇతర పంటలతో కలిపి మొత్తంగా జిల్లాలో 1,56,925 ఎకరాల్లో యాసంగి సాగుకు ప్రఽణాళికను సిద్ధం చేశారు.పంటల వారీగా రబీ సాగు.. పంట ఎకరాలు వరి 1,01,397 శనగ 4,217 వేరుశనగ 15,110 జొన్న 12,745 మొక్కజొన్న 11,271 చెరకు 700 పొద్దుతిరుగుడు 2,513 కంది 1,376 ఇతర పంటలు 475 కూరగాయ పంటలు 7,121 మొత్తం 1,56,925నిండుకుండల్లా జలాశయాలు పెరిగిన భూగర్భ జలాలు సాగుకు సన్నద్ధమవుతున్న రైతన్న జిల్లాలో 1,56,925ఎకరాల్లో పంటల అంచనా ఉద్యాన పంటలు 7,121 వేలు,వరి 1.01 లక్షల ఎకరాలు -
అప్రమత్తంగా ఉండాలి
దోమ: అగ్ని ప్రమాదాలు జరిగిన సమయంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ఫైర్ ఆఫీసర్ సేవ్యనాయక్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపాల్ రూపాలక్ష్మి ఆధ్వర్యంలో విద్యార్థులకు అగ్ని ప్రమాదాలపై అవగాహన కల్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వేసవిలో ఎక్కువగా ప్రమాదాలు జరుగుతుంటాయని, అప్రమత్తంగా ఉండాలన్నారు. గ్యాస్ సిలిండర్ లీక్ అయిన సమయంలో ఇంటిలోని కిటికీలను తెరిచి ఉంచాలన్నారు. ప్రమాదం జరిగితే వెంటనే డయల్ 101, 102 నంబర్లకు కాల్ చేయాలన్నారు. కార్యక్రమంలో ఫైర్ సిబ్బంది చంద్రమోహన్, పాండురంగం, వెంకటేశం, మొగులయ్య, వెంకటయ్య, కళాశాల అధ్యాపకులు రాధ శ్రీవిద్య, రాములు, లక్ష్మణ్, మధుసూదన్, శ్రీధర్, సువర్ణ, సానియా సుల్తానా, శ్రీకాంత్, చంద్రశేఖర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
బాలిక ఆత్మహత్య
పరిగి: బాలిక ఉరివేసుకుని ఆత్మహత్య చేసు కున్న సంసంఘటన మండల పరిధి రూప్ఖాన్పేట్లో శుక్రవారం చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన వెంకటయ్య, లక్ష్మీల కూతురు గాయత్రి(17) పదో తరగతి ఫేయిల్ అయి, ఇంటి వద్ద ఉంటోంది. శుక్రవారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో.. ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. గమనించిన కుటుంబ సభ్యులు.. పరిగి ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మైనర్ మృతిపై స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఓ యువకుడి వేధింపులతోనే ఆత్మహత్యకు పాల్పడినట్లు పేర్కొంటున్నారు. ఇదే విషయమై.. ఎస్ఐ మోహన్కృష్ణను వివరణ కోరగా.. బాలిక కుటుంబీకుల నుంచి ఫిర్యాదు అందలేదని తెలిపారు. ఫిర్యాదు అనంతరం దర్యాప్తు చేపడతామని చెప్పారు. ఆటో ఢీ, ఒకరి మృతి శంకర్పల్లి: ఆటో ఢీ కొన్న ప్రమాదంలో పాద చారి మృతి చెందాడు. ఈ సంఘటన శుక్రవారం మోకిల పీఎస్ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ వీరబాబు తెలిపిన వివరాల ప్రకారం.. మిర్జాగూడకు చెందిన శంకర్ సింగ్(48) అవివాహితుడు. తల్లిదండ్రులు మరణించడంతో అన్న ఇంట్లోనే ఉంటూ జీవనం సాగిస్తున్నాడు. శుక్రవారం మధ్యాహ్నం సదరు వ్యక్తి.. మిర్జాగూడ గేట్ నుంచి హైదరాబాద్ వైపు రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఈ క్రమంలో శంకర్పల్లి నుంచి నగరం వైపు వెళ్తున్న ఆటో.. శంకర్ను బలంగా ఢీ కొట్టింది. దీంతో ఆయన తీవ్ర గాయాలతో అక్కడిక్కడే మృత్యువాత పడ్డాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి మహేశ్వరం: ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం టీఎన్జీఓ నిరంతరం పని చేస్తుందని యూనియన్ జిల్లా హడహక్ కమిటీ కన్వీనర్ ముజీబ్ హుస్సేన్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని తహసీల్దార్, ఎంపీడీఓ, ఎస్టీఓ, పంచాయతీరాజ్, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సభ్యత్వ నమోదును నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం నుంచి రావాల్సిన అలవెన్సులు, రాయితీలు ప్రతి ఉద్యోగికి అందే విధంగా చూస్తామని చెప్పారు. ఉద్యోగులపై దాడులకు పాల్పడితే సహించేది లేదని, వారికి రక్షణగా ఉంటామన్నారు. కార్యక్రమంలో యూనియన్ సీనియర్ నాయకులు శ్రీధర్రెడ్డి, అశోక్, జావీద్ తదితరులు పాల్గొన్నారు. -
ఆర్డీఓకు ఘన సన్మానం
అనంతగిరి: వికారాబాద్ ఆర్డీఓ వాసుచంద్రకు స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్గా పదోన్నతి లభించింది. ఈ సందర్భంగా ఆయనను తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేషన్ జిల్లా బృందం శుక్రవారం ఘనంగా సన్మానించింది. కార్యక్రమంలో తహసీల్దార్లు లక్ష్మీనారాయణ, మునీరుద్దీన్, విజయ్కుమార్, డీటీలు శ్రీలత, అనిత, శ్రీనివాస్గౌడ్, నవీన్, వీరేష్బాబు, ఆర్ఐలు, రెవిన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రైస్ సరఫరాను వేగవంతం చేయండి అనంతగిరి: సీఎంఆర్(కస్టమ్ మిల్డ్ రైస్) డెలివరీని వేగవంతం చేయాలని అదనపు కలెక్టర్లింగ్యా నాయక్ అన్నారు. శుక్రవారం మండల పరిధి వేంకటరమణ రైస్ మిల్లును ఆయన తనిఖీ చేశారు. రబీ 202425కు సంబంధించి రైస్ సరఫరాలో అలసత్వం చేయకుండా.. ప్రక్రియను వేగవంతం చేయాలని మిల్లు యజమానికి సూచించారు. ఆయన వెంట పౌరసరఫరాల జిల్లా అధికారి మోహన్ కృష్ణ ఉన్నారు. ‘మత్తు’ దందాను అరికట్టాలి కొడంగల్ రూరల్: నానాటికీ పెరుగుతున్న మత్తు మందు దందాను అరికట్టేందుకు ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్(డీసీఏ) శేరిలింగంపల్లి జోన్ అసిస్టెంట్ డైరెక్టర్ కె.అనిల్కుమార్, జిల్లా డ్రగ్స్ ఇన్స్పెక్టర్ ఏఎన్.క్రాంతికుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజారోగ్యంపై శ్రద్ధ చూపాలని సూచించారు. ఎక్కడైనా మత్తు మందు తయారు చేస్తున్నా, వైద్యుడి చీటి లేకుండా అబార్షన్ కిట్స్, నిద్రమాత్రలు తదితర వాటిని విక్రయిస్తున్నా, ఎవరైనా అనుమానాస్పదంగా కనిపించినా డీసీఏకు సమాచారం ఇవ్వాలని కోరారు. సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని, ఎవరూ భయపడాల్సిన అవసరం లేదన్నారు. టోల్ ఫ్రీ నంబర్ 18005996969కు సమాచారం ఇవ్వాలని పేర్కొన్నారు. నేరాలను నియంత్రించండి పహాడీషరీఫ్: పెట్రోలింగ్ ముమ్మరం చేసి, నేరాలను నియంత్రించాలని రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు.. ఇన్స్పెక్టర్ ఎస్.రాఘవేందర్ రెడ్డికి సూచించారు. శుక్రవారం ఆయన పహాడీషరీఫ్ ఠాణను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డుల పరిశీలనతో పాటు సీసీ కెమెరాల పనితీరును పర్యవేక్షించారు. కేసులు, దర్యాప్తు తదితర అంశాలపై ఆరా తీశారు. న్యాయం కోసం వచ్చే వారికి భరోసా కల్పించాలని చెప్పారు. హయత్నగర్: మానవుడు తన అవసరాలకు సహజ వనరులను విధ్వంసం చేస్తున్నాడని, ప్రకృతి సహజత్వాన్ని కాపాడి భావితరాలకు అందించే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ప్రముఖ పర్యావరణవేత్త పాలడుగు జ్ఞానేశ్వర్ అన్నారు. హయత్నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అడవులను కొల్లగొటి, సహజ నీటి వనరులను కలుషితం చేయడంతో మంచినీటిని కొనుక్కునే పరిస్థితి వచ్చిందని అన్నారు. భవిష్యత్తులో గాలిని కూడా కొనాల్సిన దుస్థితి రావచ్చన్నారు. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి వృక్ష సంబంధమైన వస్తువుల వాడకాన్ని పెంచాలని సూచించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఏర్పాటు చేసిన స్టాల్స్ ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ సురేష్బాబు, వైస్ ప్రిన్సిపాల్ శ్రీనివాస్రెడ్డి, నక్క శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
రాజీనామా.. ఆమోదం
పదవి నుంచి తప్పుకొన్న బీజేపీ జిల్లా అధ్యక్షుడువికారాబాద్: అందరూ ఊహించినట్లే బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. ఆ వెంటనే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు ఆమోదించడం చకచకా జరిగిపోయింది. దీంతో కొంత కాలంగా ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి.. జిల్లా అధ్యక్షుడి మధ్య ఉన్న వివాదం ముగిసినట్లుయ్యింది. గ్రూపు తగాదాలతో విసిగిపోయిన రాజశేఖర్రెడ్డి రాజీనామా చేయగా శుక్రవారం ఆమోదించారు. ప్రస్తుతం జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరుగుతు న్న నేపథ్యంలో కొత్త అధ్యక్షుడి నియామకం తాత్కా లికంగా వాయిదా వేసినట్టు తెలుస్తోంది.గతంలో జిల్లా అధ్యక్షుడిగా పని చేసిన పార్టీ సీనియర్ నేత కరణం ప్రహ్లాద్రావును జిల్లా కన్వీనర్గా నియమించారు. కొత్త అధ్యక్షుడు వచ్చే దాకా పార్టీ వ్యవహారాలను ఆయనే చూసుకోనున్నట్లు తెలిసింది. ఆరు నెలలకే ఊడిన పదవి గతంలో ఎప్పుడూ లేని విధంగా స్థానికేతురుడికి జిల్లా అధ్యక్ష పదవి కట్టబెట్టిన పార్టీ రాష్ట్ర నాయకత్వం ఆరు నెలలకే రాజీనామా చేయించింది. సిఫారసు చేసిన ఎంపీనే అతన్ని మార్చడంలో ప్రధాన పాత్ర వహించారు. ఇటీవల జరిగిన మీడియా సమావేశంలో జిల్లా అధ్యక్షుడు తన పదవికి రాజీనామా చేస్తారని పేర్కొనడం గమనార్హం. ఆయన అన్నట్లుగానే రాజీనామా చేశారు. రాజశేఖర్రెడ్డి జిల్లా బాధ్యతలు తీసుకున్న నాటి నుంచి ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి మధ్య సఖ్యత లేదు. మొదట్లో పార్టీ సీనియర్ నేతలు వర్సెస్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న వ్యవహారం చివరకు కొండా వర్సెస్గా మారిపోయింది. జిల్లా కమిటీ ఏర్పాటు సమయంలో రాజశేఖర్రెడ్డి ఏకపక్షంగా వ్యవహరించారని, కొంతమంది సీనియర్ కార్యకర్తలపై దురుసుగా వ్యవహరించారనే విమర్శలు వచ్చాయి. రేసులో పలువురు నేతలు.. జిల్లా అధ్యక్ష పదవిని దక్కించుకునేందుకు పలువురు నేతలు పావులు కదుపుతున్నారు. ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి సిఫారసు చేసిన వారికే అధ్యక్ష పదవి దక్కే అవకాశాలు ఉన్నాయని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. గతంలో జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన సదానంద్రెడ్డి, తాండూరుకు చెందిన పార్టీ సీనియర్ నాయకుడు రమేశ్, గత అసెంబ్లీ ఎన్నికల్లో పరిగి నుంచి పోటీ చేసిన పరమేశ్వర్రెడ్డి పదవి ఆశిస్తున్నట్టు సమాచారం. ఎంపీ అనుచరుడిగా పేరున్న పరమేశ్వర్రెడ్డికి పదవి దక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బీసీ సామాజిక వర్గానికి ఆ పదవి ఇవ్వాల్సి వస్తే రమేశ్కు ఇచ్చే అవకాశం ఉన్నట్టు సమాచారం. -
ఏసీబీకి చిక్కిన ఫారెస్ట్ అధికారులు
సీతాఫలాల తరలింపు పర్మిట్లకు లంచం డిమాండ్ పరిగి: సీతాఫలాలు తరలించే వాహనాలకు పర్మిట్లు ఇచ్చేందుకు లంచం డిమాండ్ చేసిన ఇద్దరు అటవీశాఖ అధికారులు ఏసీబీకి చిక్కారు. ఈ ఘటన పరిగిలోని ఫారెస్ట్ ఆఫీస్లో శుక్రవారం చోటుచేసుకుంది. అవినీతి నిరోధక శాఖ డీఎస్పీ ఆనంద్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. పరిగి ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని మూడు మండలాల్లో సీతాఫలాల సేకరణ టెండర్ను రూ.18 లక్షలకు ఓ కాంట్రాక్టర్ దక్కించుకున్నాడు. అడవి నుంచి సేకరించిన సీతాఫలాలను నగరానికి తరలించేందుకు అవసరమైన వాహనాల పర్మిట్ల కోసం కుల్కచర్ల, కుస్మసముద్రం సెక్షన్ ఆఫీసర్లు మొయినుద్దీన్, సాయికుమార్ను సంప్రదించగా, ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు. దీంతో చెట్ల నుంచి తెంపిన కాయలు, పండ్లను తరలించే అవకాశం లేక పాడవుతున్నాయి. దీంతో వ్యాపారికి తీవ్ర నష్టం వాటిల్లుతోంది. తన సమస్యను పరిష్కరించమని అధికారులను వేడుకోగా రూ.50 వేలు డిమాండ్ చేశారు. చివరికి రూ.40 వేలకు డీల్ కుదుర్చుకున్న కాంట్రాక్టర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. శుక్రవారం పరిగి ఆఫీసులో ఉన్న సెక్షన్ ఆఫీసర్ మొయినుద్దీన్ తన డ్రైవర్ ద్వారా డబ్బులు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. నగరంలోని ఫారెస్ట్ ట్రైనింగ్ సెంటర్లో శిక్షణకు హాజరైన సాయికుమార్ను అక్కడ అదుపులోకి తీసుకున్నట్లు ఏసీబీ డీఎస్పీ వెల్లడించారు. -
కేజీబీవీలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం
అనంతగిరి: వికారాబాద్లోని కేజీబీవీలో అసిస్టెంట్ కుక్– 2, పగలు వాచ్మెన్–1 పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఎంఈఓ బాబుసింగ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 18 నుంచి 45 సంవత్సరాలలోపు వారు అర్హులన్నారు. అర్హత కలిగిన వారు ఈ నెల 22వ తేదీ సాయంత్రం 5గంటలలోపు కేజీబీవీలో దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. స్వీపర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం దుద్యాల్: మండలంలోని చెట్టుపల్లి తండా కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో కాంట్రాక్ట్ పద్ధతిన స్వీపర్ ఉద్యోగాల కోసం దర ఖాస్తు చేసుకోవాలని మండల ప్రత్యేక అధికారి రాధిక తెలిపారు. శుక్రవారం ఆమె మాట్లాడుతూ..పాఠశాలలో రెండు పోస్టులు ఖాళీగా ఉ న్నట్లు తెలిపారు.7వ తరగతి లేదా ఆపై చదు వుకున్న వారు.. 18 నుంచి 45 ఏళ్ల వయస్సు ఉన్నవారు అర్హులను పేర్కొన్నారు. ఆసక్తి కలిగి న మండలానికి చెందిన మహిళలు ఈ నెల 22వ తేదీ లోపు పాఠశాలలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇతర వివరాలకు సెల్ నంబర్ 96668 71181లో సంప్రదించాలన్నారు. నేటి బంద్ను విజయవంతం చేయాలి అనంతగిరి: బీసీ రిజర్వేషన్ల సాధనే లక్ష్యంగా శనివారం చేపట్టనున్న రాష్ట్రవ్యాప్త బంద్ను విజయవంతం చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్ యాదగిరి యాదవ్ పిలుపునిచ్చారు. శుక్రవారం వికారాబాద్లో బీసీ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని ప్రధాన వీధుల మీదుగార్యాలీ సాగింది. అనంతరం ఆయన మాట్లాడుతూ.. బంద్కు అన్ని వర్గాలు సహకరించాలన్నారు. వర్తక, వాణిజ్య, విద్యా సంస్థలు అందరూ స్వచ్ఛందంగా పాల్గొనాలని కోరారు. రిజర్వేషన్లు సాధించే దాకా ఉద్యమం ఆగదన్నారు. అనంరతం ఆర్టీసీ బస్సులు నడపరాదని డీఎంకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సంఘం నాయకులు బుచ్చిబాబుగౌడ్, బొండాల శ్రీనివాస్, గోపాల్ తదితరులు పాల్గొన్నారు. బీసీ రిజర్వేషన్లకు కాంగ్రెస్ కట్టుబడి ఉంది ఎమ్మెల్యే బీఎంఆర్ తాండూరు: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్రెడ్డి శుక్రవారం పేర్కొన్నారు. నేడు (శనివారం) బీసీ జేఏసీ తలపెట్టిన రాష్ట్ర బంద్కు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సూచనల మేరకు తాము సంపూర్ణ మద్దతు అందిస్తామన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు బంద్లో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. సీజేఐపై దాడి చేసిన వ్యక్తిని అరెస్టు చేయాలి అనంతగిరి: సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్పై దాడి చేసిన వ్యక్తిపై వెంటనే కేసు నమోదు చేసి, అరెస్టు చేయాలని ఎమ్మెస్పీ జిల్లా అధ్యక్షుడు ఆనంద్ డిమాండ్ చేశారు. ఈమేరకు శుక్రవారం వికారాబాద్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. అనంతరం కార్యాలయ సిబ్బందికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వాదనలు వింటున్న ప్రధాన న్యాయమూర్తిపై దాడులు చేయడం సరికాదన్నారు. 42 శాతం బీసీ రిజర్వేషన్ల సాధన కోసం చేపట్టిన తెలంగాణ బంద్కు తాము సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు శ్రీనివాస్, పుష్పరాణి, సునీతరాములు, ఆనందం, రాజు, జగన్ తదితరులు పాల్గొన్నారు. -
నో సేఫ్టీ..!
రిసార్ట్స్లో పర్యాటకులకు రక్షణ కరువువికారాబాద్: జిల్లాలో అనుమతులు లేని రిసార్ట్స్ విచ్ఛలవడిగా పుట్టుకొస్తున్నాయి. వీటిలో పర్యాటకుల రక్షణకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. కాలం చెల్లిన బోట్లలో పర్యాటకులను ప్రాజెక్టుల్లోకి తీసుకెళ్లి ప్రమాదాల బారిన పడేస్తున్నారు. ఇటీవల బోట్లు తిరగడబడి పలువురు మృత్యువాత పడిన విషయం తెలిసిందే.. అయినా అధికారులు నామమాత్రపు చర్యలతో సరిపెడుతున్నారు. వికారాబాద్కు కూతవేటు దూరంలో ఉన్న సర్పన్పల్లి ప్రాజెక్టులో ఎలాంటి అనుమతులు లేకుండా ఓ ప్రైవేట్ రిసార్ట్స్ నిర్వాహకులు బోటింగ్ నిర్వహిస్తున్నారు. ఇటీవల బోటు తిరగబడి ఇద్దరు పర్యాటకులు మృతి చెందిన విషయం తెలిసిందే. గతంలో కూడా ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. సంబంధిత శాఖల అధికారులపై తీవ్ర విమర్శలు రావడంతో రిసార్ట్స్ను మూసి వేశారు. ఆ వెంటనే రెవెన్యూ, పోలీసు, ఇరిగేషన్, పంచాయతీరాజ్ శాఖలతో విచారణ కమిటీ వేశారు. కమిటీ అక్కడ పర్యటించి నివేదిక కూడా ఇచ్చింది. కానీ అందులోని అంశాలను బయటపెట్టలేదు. అనుమతులు లేకపోవటంతో పాటు రిసార్ట్స్ నిర్వాహకుల తప్పిదం వల్లే పర్యాటకుల ప్రాణాలు గాల్లో కలిసినట్టు విచారణలో తేలినట్టు తెలిసింది. కమిటీ నివేదిక సమర్పించి నెలలు కావస్తున్నా నిర్వాహకులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఓ ఘటన జరిగిన రెండు నెలల తర్వాత ఇద్దరిని రిమాండ్ చేయగా ఆ వెంటనే బెయిల్పై విడుదలయ్యారు. ఆ తర్వాత యథేచ్ఛగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. అసైన్డ్ భూమిలో, ప్రాజెక్టు బఫర్ జోన్లో, పశువుల తాగునీటి పానాదిలో నిర్మాణాలు వెలసాయి. అయినా రెవెన్యూ, పోలీసు, నీటిపారుదల, పంచాయతీ అధికారులు చూసీచూడనట్టు వ్యవహరిస్తుండటం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. వరుస ఘటనలతో బెంబేలు రిసార్ట్స్ నిర్వాహకులు సమీప ప్రాజెక్టుల్లో ఎలాంటి అనుమతులు లేకుండానే బోటింగ్ నిర్వహిస్తున్నారు. కాలం చెల్లిన పడవలు కావడంతో తరచూ ప్రమాదాలకు గురవుతున్నాయి. అందులో వెళ్లే పర్యాటకులకు సేఫ్టీ మెజర్ మెంట్స్ ఇవ్వకపోవడంతో ప్రాణాలు కోల్పోతున్నారు. వికారాబా ద్ సమీపంలోని సర్పన్పల్లి ప్రాజెక్టులో బోటింగ్ చేస్తూ ప్రమాదవశాత్తు నీటిలో పడిపోవడంతో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. మునిగిపోతున్ను మరో ఇద్దరిని స్థానికులు కాపాడారు. సర్పన్పల్లి ప్రాజెక్టులో ఇది మూడో ప్రమాదం. ఇక్కడి ఓ రిసార్ట్స్లో గతంలో అడ్వెంచర్ గేమ్స్ ఆడుతూ బావిలో మునిగి ఓ వ్యక్తి మృతి చెందాడు. గతంలో జరిగిన ఘటనకు కారణమైన ఆ రిసార్ట్స్లోనే అడ్వెంచర్ గేమ్లో భాగంగా కారు నడుపుతూ బోల్తాపడి ఓ వ్యక్తి మృతి చెందాడు. అయితే రిసార్ట్స్ల ఏర్పాటుకు 11 రకాల అనుమతులు అవసరం ఉండగా అందులో ఏ ఒక్కటి కూడా తీసుకోవడం లేదు. కోట్పల్లి ప్రాజెక్టు, సర్పన్పల్లి ప్రాజెక్టు పరిసరాలు, ఆ ప్రాజెక్టుల బఫర్ జోన్లు పూర్తిగా ఈ కార్యకలాపాల కోసం వినియోగిస్తున్నారు. చేయి తడిపితే సక్రమంజిల్లాలోని కొంత మంది అధికారులు రిసార్ట్స్ నిర్వాహకులకు అండగా నిలుస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. మామూళ్లు ఇవ్వకుంటే అక్రమం.. చేయి తడిపితే సక్రమం అనే ధోరణి అవలంబిస్తున్నారు. జిల్లా కేంద్రానికి సమీపంలోని అనంతగిరి ఫారెస్టుకు అనుకొని అక్రమంగా ఏర్పాటు చేసిన రిసార్ట్స్ విషయంలో జిల్లా అధికారులు వ్యవహరిస్తున్న తీరు పలు అనుమానాలకు తావిస్తోంది. ఎలాంటి అనుమతులు లేవని మూసి వేశారు. నెల తిరక్కుండానే మళ్లీ ఓపెన్ చేశారు. ఏడాది క్రితం కూడా ఇలాగే జరిగింది. కానీ అధికారులు పట్టించుకోలేదు. గత ప్రభుత్వ హయాంలో జిల్లాకు చెందిన ఓ ప్రజాప్రతినిధి అండదండలతో ఈ రిసార్ట్స్ ఏర్పాటు చేయగా ఇప్పుడు కూడా దాని నిర్వహణకు ఓ ప్రజాప్రతినిధి సహకరిస్తున్నాడనే విమర్శలు ఉన్నాయి. ఇందులో బోటింగ్, నైట్ క్యాపింగ్, పలు రకాల అడ్వెంచర్ గేమ్స్, గేమింగ్, హోటల్స్, రాత్రి బస చేసేందుకు గదుల ఏర్పాటు చేశారు. పేకాట, మద్యం సేవించడం వంటివి సాధరమైపోయాయి. ఒక్క రాత్రి బస చేసేందుకు అక్కడ కల్పించే సౌకర్యాలు, అడ్వెంచర్ గేమ్స్ను బట్టి ఒక్కో జంటకు రూ.3000 నుంచి రూ.20 వేల వరకు వసూలు చేస్తున్నారు. -
త్వరలో పరిగికి రైలు కూత
పరిగి:త్వరలో పరిగికి రైలు కూత వినిపించనున్నట్లు ఎమ్మెల్యే టీ రామ్మోహన్రెడ్డి అన్నారు. శుక్రవారం పట్టణంలోని తన నివాసంలో విలేకరుల సమావేశంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్రంలో వికారాబాద్ – కృష్ణ రైల్వే లైన్కు కేంద్రం ఆమోదం తెలిపిందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 50శాతం నిధులు మంజూరు చేశాయన్నారు. ప్రత్యేక రాష్ట్రంలో గత ప్రభుత్వం పరిగి, వికారాబాద్ ప్రాంతాలకు తీవ్ర అన్యాయం చేసిందన్నారు. జిల్లాకు మంజూరైన అభివృద్ధి పనులను సిద్దిపేటకు మళ్లీంచారని ఆరోపించారు. ఈ విషయాన్ని సీఎం రేవంత్రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా రైల్వే లైన్కు మళ్లీ ప్రాణం పోశారని పేర్కొన్నారు. ఈ నెల 16న జరిగిరి రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో వికారాబాద్ కృష్ణ రైల్వే లైన్ భూ సేకరణ కోసం రూ.438 కోట్లు కేటాయించాలని నిర్ణయించినట్లు తెలిపారు. త్వరలో పరిగి మీదుగా పనులు ప్రారంభం కానున్నట్లు వివరించారు. అలాగే మన్నెగూడ నుంచి బీజాపూర్ వరకు నాలుగు లేన్ల రహదారి నిర్మాణానికి డీపీఆర్ సిద్ధమైందన్నారు. ఈ పనులు పూర్తయితే పరిగి నియోజకవర్గ ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇద్దరి కంటే ఎక్కువ పిల్లలు ఉన్న వారు పోటీకి అర్హులని నిర్ణయం తీసుకోవడంతో ప్రజల్లో సంతోషం నింపిందన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందాలన్నారు. కాంగ్రెస్ అంటే పేదల ప్రభుత్వమన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు అమలు చేసేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు. ఈ నెల 18న నిర్వహించే బీసీ బంద్లో ప్రతి ఒక్కరూ పాల్గొని కేంద్రంపై ఒత్తిడి తేవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పరశురాంరెడ్డి, వైస్ చైర్మన్ అయూబ్, డీసీసీ ఉపాధ్యక్షుడు లాల్కృష్ణ, ప్రధాన కార్యదర్శి హన్మంతు ముదిరాజ్, ఏబ్లాక్ అధ్యక్షుడు పార్థసారథి పంతులు, పార్టీ పట్టణ అధ్యక్షుడు ఎర్రగడ్డపల్లి కృష్ణ, నాయకులు ఆంజనేయులు, సర్వర్, శ్రీనివాస్, జగన్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. -
● అప్పాయిపల్లిలోనే భవనాలు నిర్మించాలి ● నిరసన దీక్ష చేపట్టిన గ్రామస్తులు ● మద్దతు తెలిపిన జేఏసీ నాయకులు
కళాశాలలు తరలించొద్దుకొడంగల్: కొడంగల్ మండలానికి మంజూరైన మెడికల్, వెటర్నరీ, యంగ్ ఇంటిగ్రేటెడ్ గురుకులాలను మరో మండాలనికి తరలించాలనే ఆలోచనను విరమించుకోవాలని కొడంగల్ అభివృద్ధి పరిరక్షణ ఐక్య కార్యాచరణ కమిటీ(కేడీపీ జేఏసీ) నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం మండలంలోని అప్పాయిపల్లి నుంచి మెడికల్ కళాశాల నిర్మించే స్థలం వరకు గ్రామస్తులు, విద్యార్థులు, వివిధ పార్టీల నాయకులు, విద్యావంతులు భారీ ర్యాలీ నిర్వహించారు. అక్కడే నిరసన దీక్ష చేపట్టారు. వీరికి కేడీపీ జేఏసీ నాయకులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కొడంగల్ మండలానికి మంజూరైన వాటినితరలించడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. ఎన్నో ఏళ్లుగా వెనకబడిన ఈ ప్రాంతం రేవంత్రెడ్డి ముఖ్యమంత్రి కావడంతో అభివృద్ధిలో పరుగుతు పెడుతుందని భావించామని కానీ కళాశాలలను ఇతర ప్రాంతాలకు తరలించాలనే ఆలోచన నిరాశకు గురిచేస్తోందన్నారు. అప్పాయిపల్లిలోని 19 సర్వే నంబర్ రైతుల దగ్గర నుంచి మెడికల్, వెటర్నరీ, నర్సింగ్ కళాశాలలు నిర్మిస్తామని భూమిని తీసుకొని పనులు ప్రారంభిచి, వేరే ప్రాంతానికి తరలిస్తామనడం అన్యాయమని అన్నారు. ఇంటిగ్రేటెడ్ గురుకులాలను ముందుగా నిర్ణయించిన ప్రాంతాల్లోనే నిర్మించాలని కోరారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు శ్రీనివాస్, యూ రమేష్బాబు, భీమరాజు, గంటి సురేష్, మధుయాదవ్, మాజీ సర్పంచు దత్తుసింగ్, మ్యాతరి సంగప్ప, మల్లప్ప, దొబ్బలి పకిరప్ప, గోకుల్సింగ్, గుడిసె వెంకటప్ప, దొడ్ల వెంకటయ్య, అమృతప్ప, శీనునాయక్, రాములుగౌడ్, బాల్రాజ్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
మహిళల భద్రతకు ప్రాధాన్యత
అనంతగిరి: మహిళలు, బాలికల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఎస్పీ నారాయణరెడ్డి తెలిపారు. శుక్రవారం వికారాబాద్లోని ఎస్పీ కార్యాలయం రివ్యూ మీటింగ్ నిర్వహించారు. పీఎస్ల వారీగా పెండింగ్ కేసులపై ఆరా తీశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పెండింగ్ కేసులపై ప్రత్యేక శ్రద్ధ వహించే పూర్తి చేయాలని ఆదేశించారు. కేసుల విషయంలో ఏమైనా సందేహా ఉంటే ఉన్నతాధికారు దృష్టికి తేవాలన్నారు. రోడ్డు ప్రమాదాలు, ఆత్మహత్యలకు గల కారణాలను తెలుసుకొని వాటి నివారణకు చర్యలు చేపట్టాలన్నారు. తరచూ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించాలన్నారు. నేరాల నియంత్రణలో సీసీ కెమెరాల పాత్ర ఎంతో ముఖ్యమైందన్నారు. గ్రామాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుపై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. ఇసుక, గుట్కా, పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాను అడ్డుకోవాలని ఆదేశించారు. ఇటీవల జరిగిన కేసుల్లో నిందితులకు శిక్ష పడేలా కృషి చేసిన కొడంగల్ కోర్టు ఏపీపీ అభినయి, వికారాబాద్ కోర్టు ఏపీపీ సమీనాబేగం, మహిళా పీఎస్ సీఐ సరోజ, కొడంగల్, నవాబ్పేట ఎస్హెచ్ఓలు, కోర్టు మానిటరింగ్ అధికారులకు సత్కరించి మెమొంటోలు అందజేశారు. కార్యక్రమంలో ఏఎస్పీ రాములు నాయక్, డీఎస్పీలు, సీఐలు పాల్గొన్నారు. -
కొడంగల్ బంద్ విజయవంతం
కొడంగల్: కొడంగల్ అభివృద్ధి పరిరక్షణ ఐక్య కార్యాచరణ కమిటీ (కేడీపీ జేఏసీ) ఆధ్వర్యంలో గురువారం చేపట్టిన కొడంగల్ బంద్ విజయవంతమైంది. ప్రజలు, ఉద్యోగులు, విద్యావంతులు, విద్యార్థులు, వ్యాపారులు, రాజకీయ నాయకులు స్వచ్ఛందంగా పాల్గొని సంఘీభావం తెలిపారు. కొడంగల్లో విద్యాసంస్థలను, వ్యాపార సముదాయాలను మూసి మద్దతు తెలిపారు. పట్టణంలోని వినాయక చౌరస్తా నుంచి అంబేడ్కర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. మెడికల్ కళాశాలను మండల పరిధిలోని అప్పాయిపల్లిలోనే నిర్మించాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కేడీపీ జేఏసీ నాయకులు మాట్లాడుతూ.. కొడంగల్కు మంజూరు చేసిన ప్రభుత్వ మెడికల్ కళాశాల, యంగ్ ఇండియా ఇంటిగ్రేటేడ్ గురుకులాలను లగచర్లకు తరలిస్తున్నారని ఆరోపించారు. వాటిని ముందుగా ప్రకటించినట్లు మెడికల్ కశాళాలను అప్పాయిపల్లిలో, ఇంటిగ్రేటేడ్ గురుకులాలను పాత కొడంగల్లో నిర్మించాలని ప్రభుత్వానికి విన్నవించారు. నియోజకవర్గ కేంద్రమైన కొడంగల్ అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణలో రెండు జాతీయ రహదారులు కలిసే పట్టణాలు అరుదుగా ఉన్నాయన్నారు. అందులో కొడంగల్ ఒకటన్నారు. ఈ ప్రాంతం భవిష్యత్తులో ఎంతో పురోగతి సాధించే అవకాశం ఉందన్నారు. మెడికల్ కళాశాల, గురుకులాల తరలింపుపై ఈ ప్రాంత ప్రజలు అసంతృప్తితో ఉన్నారని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కొడంగల్ ప్రజల మనోభావాలను గౌరవించాలని కోరారు. ఊరేగింపులో కేడీపీ జేఏసీ కన్వీనర్ కొట్రికె లక్ష్మీనారాయణ గుప్తా, కో కన్వీనర్లు గంటి సురేష్, ఎరన్పల్లి శ్రీనివాస్, పవన్కుమార్, నాయకులు దామోదర్రెడ్డి, మధుయాదవ్, రమేష్బాబు, చంద్రప్ప, బుస్స చంద్రయ్య, ప్రవీణ్కుమార్, రవీందర్నాయక్, నవాజ్ తదితరులు పాల్గొన్నారు. స్వచ్ఛందంగా పాల్గొన్న జనం విద్యాసంస్థలు, దుకాణాలు మూసివేత ఊరేగింపులో పాల్గొన్న కేడీపీ జేఏసీ సభ్యులు మెడికల్ కళాశాలను అప్పాయిపల్లిలోనే నిర్వహించాలని డిమాండ్ -
సీపీఆర్తో ప్రాణాలు కాపాడవచ్చు
● ప్రతిఒక్కరూ అవగాహన పెంచుకోవాలి ● కలెక్టర్ ప్రతీక్జైన్ అనంతగిరి: గుండెపోటుకు గురైన వ్యక్తికి సకాలంలో సీపీఆర్ చేయడం ద్వారా ప్రాణాలు కాపాడవచ్చని కలెక్టర్ ప్రతీక్జైన్ అన్నారు. సీపీఆర్పై ప్రతి ఒక్కరికీ అవగాహన ఉండాలని తెలిపారు. గురువారం కలెక్టరేట్లోని ఐడీఓసీ సమావేశ మందిరంలో జిల్లా వైద్య శాఖ ఆధ్వర్యంలో సీపీఆర్పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చాలా మంది గుండెపోటుతో ప్రాణాలు కోల్పోతున్నారని, సకాలంలో సీపీఆర్ చేస్తే ప్రాణాపాయ స్థితి నుంచి బయట పడతారని తెలిపారు. గుండెపోటుకు గురైన వ్యక్తికి వైద్యం అందేలోపు ఛాతీని 120 సార్లు నొక్కి, 2 శ్వాసలు ఇవ్వడం (120:2 రేషియో) ద్వారా గుండె సాధారణ స్థితికి తీసుకు రావచ్చని తెలిపారు. జిల్లాలో ఈ నెల 13 నుంచి 17వ తేదీ వరకు వారం అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అనంతరం సీపీఆర్ విధానాన్ని చేసి చూపించారు. మాస్టర్ ట్రైనర్స్ డాక్టర్ నిఖిల్, డాక్టర్ నిరోషా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. కార్యక్రమంలో ఆర్డీఓ మంగీలాల్, జిల్లా వైద్యాధికారి డాక్టర్ పవిత్ర, డిప్యూటీ డీఎంహెచ్ఓ రవీందర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
నాణ్యమైన విత్తనాలతో అధిక దిగుబడులు
నవాబుపేట: నాణ్యమైన విత్తనాలతోనే అధిక దిగుబడులు పొందవచ్చని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య తెలిపారు. మండల కేంద్రంలోని రైతు వేదికలో గురువారం జాతీయ ఆహార భద్రతా మిషన్ పథకం కింద రైతులకు ఉచితంగా శనగ, కుసుమ విత్తనాలు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రైతులు నాణ్యమైన విత్తనాలే కొనుగోలు చేయాలన్నారు. ప్రభుత్వం సబ్సిడీపై విత్తనాలు పంపిణీ చేస్తోందన్నారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయాధికారి రాజరత్నం, ఏడీఏ వెంకటేష్, పీఏసీఎస్ చైర్మన్ రామ్రెడ్డి, ఏఎంసీ చైర్మన్ గీతా సింగ్ నాయక్, డిప్యూటీ తహసీల్దార్ శ్రీలత, ఏవోలు జ్యోతి, ప్రసన్న లక్ష్మి, ఏఈఓలు, రైతులు పాల్గొన్నారు. చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య -
గడువు 2 రోజులే!
వికారాబాద్: మద్యం దుకాణాలకు టెండర్ దరఖాస్తు గడువు మరో రెండు రోజుల్లో ముగియనుంది. ఓ వైపు గడువు సమీపిస్తున్నా ఆశించిన స్థాయిలో వ్యాపారులు ముందుకు రాకపోవడంతో అబ్కారీ శాఖలో ఆందోళన మొదలైంది. 2023 – 25 సంవత్సరంలో 59 మద్యం షాపులకు నిర్వహించిన టెండర్లలో జిల్లా నుంచి 2,637 దరఖాస్తులు వచ్చాయి. ఒక్కో దరఖాస్తుకు రూ.2 లక్షల చొప్పున ప్రభుత్వానికి అప్పట్లో రూ.52.74 కోట్ల ఆదాయం సమకూరింది. ప్రస్తుతం దరఖాస్తు ఫీజు రూ.3 లక్షలకు పెంచిన నేపథ్యంలో ఆదాయం కూడా మరింత పెరుగుతుందని ఆశించింది. కానీ ఆ పరిస్థితి కనిపించడం లేదు. ఇదిలా ఉండగా కొంతమంది వ్యాపారులు సిండికేట్గా ఏర్పడి ఇతరులు దరఖాస్తు వేయకుండా చూస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. గతంలో టెండర్లు వేసిన చాలా మంది నష్టాలు చవిచూశారు. రెండేళ్ల క్రితం వ్యాపారం చేసిన వారు లాభాలు ఆర్జించడంతో 2023 ఆగస్టులో నిర్వహించిన టెండర్లలో రెగ్యులర్ వ్యాపారులే కాకుండా సాధారణ ప్రజలు, ఉద్యోగులు సైతం పోటీ పడ్డారు. టెండర్ ప్రక్రియ ప్రారంభమై 20 రోజులైనా కేవలం 452 దరఖాస్తులు మాత్రమే రావడం అబ్కారీ శాఖలో ఆందోళన నెలకొంది. డైలమాలోనే వ్యాపారులు రెండేళ్ల క్రితం బెల్టు షాపుల్లో అధికంగా అమ్మకాలను గుర్తించి ఆయా గ్రామాల్లో కొత్త దుకాణాలకు ప్రతిపాదనలు పంపారు. కానీ షాపుల సంఖ్య పెరగలేదు. అధికారులతో మద్యం వ్యాపారులు లోపాయికారి ఒప్పందం చేసుకోవడంతోనే దుకాణాల సంఖ్య పెరగలేదనే విమర్శలు వచ్చాయి. గతంలో వరుస ఎన్నికలు వస్తాయనే అంచనాలతో పలువురు టెండర్లు వేశారు. ఈ సారి స్థానిక సంస్థల ఎన్నికలు మాత్రమే ఉండటంతో ఎక్కువ మంది ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. వ్యక్తిగతంగా దరఖాస్తు వేయడం కంటే గ్రూపుగా ఏర్పడి టెండర్ వేయడానికి ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నట్లు తెలిసింది. అంతేకాకుండా కొందరు బాగా వ్యాపారం జరిగే దుకాణాలకు ఇతరులు పోటీ రాకుండా చూస్తున్నట్లు సమాచారం. 2023లో పరిగి కేంద్రంగా ఎక్కువ మంది గ్రూపు కట్టారు. ఒక్కో గ్రూపులో 100 మంది సభ్యుల నుంచి 1,000 మంది వరకు కూడా ఉండటం గమనార్హం.. టెండరు డబ్బులు పోకుండా ఉండేందుకు అప్పట్లో ఇలా చేశారనే విమర్శలు వచ్చాయి. ప్రస్తుతం కూడా ఇదే ఫార్ములా పాటిస్తున్నట్లు తెలిసింది. మద్యం దుకాణాలకు ఆసక్తి చూపని వ్యాపారులు 2023 –25 సంవత్సరానికి వచ్చిన దరఖాస్తులు 2,647 2025 –27కు గాను వచ్చింది కేవలం 452 మాత్రమే గతంతో పోలిస్తే నాలుగో వంతు కూడా రాని వైనం సిండికేట్ అయ్యారనే అనుమానాలు ఫీజు పెంచడమూ ఓ కారణమే -
రోగులకు మెరుగైన వైద్యం అందాలి
● ఎమ్మెల్యే మనోహర్రెడ్డి ● జిల్లా ఆస్పత్రిలో ఆకస్మిక తనిఖీలుతాండూరు: రోగులకు మెరుగైన వైద్యం అందించాలని ఎమ్మెల్యే మనోహర్రెడ్డి వైద్యులకు సూచించారు. గురువారం పట్టణంలోని జిల్లా ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. అత్యవసర విభాగంలో ప్రజలకు అందుతున్న సేవలపై ఆరా తీశారు. తమకు సకాలంలో వేతనాలు అందడం లేదని కాంట్రాక్ట్ పారిశుద్ధ్య కార్మికులు ఎమ్మెల్యేతో మొరపెట్టారుకున్నారు. అనంతరం డయాలసిస్ సెంటర్ను సందర్శించారు. గతంలో బెడ్ల కొరత ఉండేదని, అదనంగా ఏర్పాటు చేయడంతో సమస్య తీరిందని రోగులు తెలిపారు. ఏయే సర్జరీలు చేస్తున్నారని ఎమ్మెల్యే.. ఆస్పత్రి సూపరింటెండెంట్ వినయ్కుమార్ను ప్రశ్నించగా అన్ని రకాల సర్జరీలు చేస్తున్నట్లు వివరించారు. ప్రభుత్వం నిర్వహించే కాయకల్ప రేసులో జిల్లా ఆస్పత్రికి చోటు దక్కేలా అన్ని రకాల వసతులు కల్పించాలని సూచించారు. రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ర్యాంక్ సాధించాలన్నారు. ఆస్పత్రిలో డ్రైనేజీ వ్యవస్థను మెరుగు పరిచేందుకు నిధులు కేటాయించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ యాదగిరి, డీసీసీబీ వైస్ చైర్మన్ రవిగౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ పట్లోళ్ల బాల్రెడ్డి, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు హబీబ్లాల, వైద్యులు కేవీఎన్ మూర్తి, ఆనంద్ గోపాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
బీసీ బంద్ను జయప్రదం చేయాలి
అనంతగిరి: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్తో శనివారం తలపెట్టిన వికారాబాద్ బంద్ను విజయవంతం చేయాలని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు యాదగిరి యాదవ్ కోరారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. బంద్కు వ్యాపార సంస్థలు, విద్యా సంస్థలు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గుడిసె లక్ష్మణ్, గౌడ సంఘం రాష్ట్ర నాయకుడు శ్రీనివాస్గౌడ్, ముదిరాజ్ సంఘం జిల్లా నాయకులు బీఆర్ శేఖర్, గంగారం వెంకట్, అడ్వకేట్ లక్ష్మణ్, నాయకులు శ్రీనివాస్ ముదిరాజ్, దాసు, పాండు ముదిరాజ్, శంకర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. వీడీడీఎఫ్ మద్దతు బంద్కు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు వీడీడీఎఫ్ అధ్యక్షుడు శ్రీనివాస్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. రాజకీయ పార్టీలన్నీ చిత్తశుద్ధితో మద్దతు ఇవ్వాలని కోరారు. సంఘం జిల్లా అధ్యక్షుడు యాదగిరి -
కార్యకర్తల అభీష్టం మేరకే..
డీసీసీ అధ్యక్షుడి నియామకం ● ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికీ చేరేలా చూడాలి ● ఏఐసీసీ ఇన్చార్జ్ సూరజ్సింగ్ ఠాగూర్తాండూరు: డీసీసీ అధ్యక్షుడి నియామకం కార్యకర్తల అభీష్టం మేరకే జరుగుతుందని ఏఐసీసీ ఇన్చార్జ్ సూరజ్ సింగ్ఠాగూర్ అన్నారు. గురువారం జిల్లా అధ్యక్షుడి నియామకం కోసం యాలాల, బషీరాబాద్ మండలాల నాయకులతో పట్టణంలోని వెంకోబా గార్డెన్లో సంఘటన్ సృజన్ అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా అధ్యక్ష పదవి ఆశిస్తున్న వారి నుంచి దరఖాస్తులు స్వీకరించారు. అంతకుముందు ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రానున్న రోజుల్లో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేలా ప్రతి నాయకుడు, కార్యకర్తా పని చేయాలన్నారు. రాహుల్ గాంధీని ప్రధాన మంత్రి చేయడమే లక్ష్యంగా సాగుదామని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రతి ఇంటికీ తీసుకెళ్లాలని సూచించారు. కార్యక్రమంలో పీసీసీ ఉపాధ్యక్షుడు వేణుగౌడ్, రాష్ట్ర ఆర్థిక సంఘం సభ్యుడు రమేష్ మహరాజ్, ఆర్యవైఽశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత, డీసీసీ అధ్యక్షుడు రామ్మోహన్రెడ్డి, ఎమ్మెల్యే మనోహర్రెడ్డి, పీసీసీ ప్రధాన కార్యదర్శి థారాసింగ్, నాయకులు డాక్టర్ సంపత్కుమార్, మురళీకృష్ణగౌడ్, రవిగౌడ్ పాల్గొన్నారు. -
క్యాష్లెస్ లావాదేవీలు ఉత్తమం
డీఆర్డీఓ శ్రీనివాస్ బంట్వారం: నగదు రహిత లావాదేవీలు పారదర్శకంగా ఉంటాయని, దీనిపై మహిళా సంఘాల సభ్యులు అవగాహన పెంచుకోవాలని డీఆర్డీఓ శ్రీనివాస్ అన్నారు. గురువారం కోట్పల్లి మండలం కొత్తపల్లిలో క్యాష్లెస్ లావాదేవాలపై మహిళా సంఘాల సభ్యులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్థిక లావాదేవీలు క్యాష్లెస్ ద్వారానే చేపట్టాలన్నారు. అనంతరం కోట్పల్లిలోని పీఎంఎఫ్ఎంఈ యూనిట్ను సందర్శించారు. బార్వాద్లో ఉపాధి హామీ పనులను పరిశీలించారు. కార్యక్రమంలో అడిషనల్ డీఆర్డీఓ నర్సింలు, డీపీఎం శేఖర్, ఐకేపీ ఏపీఎం సురేష్, ఈజీఎస్ ఏపీఓ ఎలీష్ తదితరులు పాల్గొన్నారు. -
నిర్లక్ష్యాన్ని సహించేది లేదు
తాండూరు రూరల్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకాన్ని నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదని తాండూరు డివిజన్ సబ్ కలెక్టర్ ఉమాశంకర ప్రసాద్ అన్నారు. తాండూరు మండలం చెంగోల్ ఉన్నత పాఠశాలను గురువారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఓ గదిలో నిల్వ చేసిన బియ్యాన్ని పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడారు. మెనూ ప్రకారం భోజనం వడ్డించాలని సిబ్బందికి సూచించారు. ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం ప్రతీ రోజు మెనూ పాటించాలన్నారు. గురువారం మెనూలో అన్నం, ఆకుకూరలు, పప్పు ఉండాలి కదా.. అని ఉపాధ్యాయులను అడిగారు. కానీ ఇక్కడ కేవలం సాంబారుతో భోజనం ఎలా వడ్డించారని ప్రశ్నించారు. హెచ్ఎం ఎక్కడున్నారని ప్రశ్నించగా సెలవులో ఉన్నారని సిబ్బంది చెప్పారు. దీంతో శుక్రవారం పాఠశాల రికార్డులు తీసుకుని తన కార్యాలయానికి రావాలని ఆదేశించారు. అనంతరం విద్యార్థులతో కలిసి మధ్యహ్నా భోజనం చేశారు. మధ్యాహ్న భోజనం అమలులో మెనూ పాటించాలి తాండూరు సబ్ కలెక్టర్ ఉమా శంకరప్రసాద్ చెంగోల్ ఉన్నత పాఠశాలలో ఆకస్మిక తనిఖీ -
ఇసుక రీచ్ల పరిశీలన
యాలాల: మండల పరిధిలో ఇసుక రీచ్లను అధికారుల బృందం గురువారం పరిశీలించారు. జిల్లా పంచాయతీ అధికారి జయసుధ, మిషన్ భగీరథ ఈఈ రవికుమార్, తహసీల్దార్ వెంకటస్వామి, ఎంపీడీఓ పుష్పలీల, ఆర్డబ్ల్యుఎస్, ఇరిగేషన్ ఏఈలు ప్రభాకర్, భానుప్రకాశ్, రాయల్టీ ఇన్స్పెక్టర్ నిర్మల తదితరులు కాగ్నా, కాకరవేణి నది ప్రాంతాలను సందర్శించారు. కోకట్, బెన్నూరు, సంగెంకుర్దు, గోవిందరావుపేట, విశ్వనాథ్పూర్, దేవనూరు తదితర ప్రాంతాల్లో వాటిని గుర్తించారు. ప్రభుత్వ పనులతో పాటు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు అందించేందుకు గుర్తిస్తున్నట్లు అధికారుల బృందం తెలిపింది. పూర్తి నివేదికను కలెక్టర్కు అందజేయనున్నట్లు వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ యాదయ్య, ఆర్ఐలు చరణ్, వేణు, పంచాయతీ కార్యదర్శులు సుధాకర్, తారకచారి, నరహరి, జయమ్మ తదితరులు పాల్గొన్నారు. -
రేపటి బంద్కు సహకరించండి
వ్యాపారుల, ఆర్టీసీ, విద్యా సంస్థల మద్దతు కోరిన బీసీ జేఏసీ తాండూరు టౌన్: 42 శాతం రిజర్వేషన్ల సాధనలో భాగంగా బీసీ జేఏసీ ఈ నెల 18న నిర్వహించనున్న బంద్కు అందరూ సహకరించాలని కందుకూరి రాజ్కుమార్, ఈడిగ శ్రీనివాస్ గౌడ్ గురువారం పట్టణంలోని పలు విభాగాల అసోసియేషన్లను కోరారు. ఆర్టీసీ డిపో మేనేజర్, ప్రైవేట్ స్కూల్స్, కళాశాలల యాజమాన్య అసోసియేషన్, థియేటర్ల యాజమాన్యాలు, క్లాత్ అండ్ రెడిమేడ్ మర్చంట్స్, గ్రెయిన్ అండ్ సీడ్స్ మర్చంట్స్ అసోసియేషన్ తదితరులను కలిసి వినతి పత్రాలు సమర్పించి బంద్కు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీజేఎస్ నియోజకవర్గ ఇన్చార్జి సోమశేఖర్, బీసీ సంఘం నాయకులు సయ్యద్ షుకూర్, రామకృష్ణ, లక్ష్మణాచారి, శివ, పరమేశ్, విజయలక్ష్మి, నర్సమ్మ, మంజుల, వివేక్, కిరణ్, రమేశ్ తదితరులు పాల్గొన్నారు. ఎమ్మార్పీఎస్ సంపూర్ణ మద్దతు బంద్కు ఎమ్మార్పీఎస్ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు జిల్లా అధ్యక్షుడు మల్లికార్జున్ మాదిగ పేర్కొన్నారు. గురువారం ఎమ్మార్పీఎస్ నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని కోరడం సమంజసమేనన్నారు. దీనికి ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మంద కృష్ణమాదిగ మద్దతు ప్రకటించారన్నారు. బీసీల న్యాయ పోరాటంలో తమ వంతు సహకారం తప్పకుండా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పరుశురాం, స్వామిదాస్, కృష్ణ, శివాజీ, రవి, సూర్యప్రకాశ్, ఉమాశంకర్, చందు, శివ, నర్సిములు, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. అనంతగిరిలో.. అనంతగిరి: బంద్కు స్వచ్ఛందంగా కాలేజీలు, పాఠశాలలు, బస్సులు, దుకాణదారులు సహకరించాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీఆర్ కృష్ణ ముదిరాజ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తరువాత బీసీ రిజర్వేషన్లపై కోర్టు స్టే ఇవ్వడం బాధాకరమని పేర్కొన్నారు. 42 శాతం రిజర్వేషన్ల అమలు కోసం పార్లమెంట్లో బిల్లు పెట్టి 9వ షెడ్యూల్లో పెట్టి తమిళనాడు మాదిరిగా రాజ్యాంగ భద్రత కల్పించాలని కృష్ణముదిరాజ్ కోరారు. తక్షణమే బీసీలకు రాజకీయ రాజ్యాంగ రక్షణ కల్పించాలని ప్రభుత్వానికి సూచించారు. -
అభివృద్ధి పేరుతో వనరుల లూటీ
● బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రమేశ్కుమార్ ఆగ్రహం ● అంతారం శివారులో మట్టి తవ్వకాల పరిశీలన తాండూరు రూరల్: తాండూరు ప్రాంతంలో అభివృద్ధి పేరుతో సహజ వనరులను లూటీ చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రమేశ్ కుమార్ అన్నారు. అంతారం గ్రామ శివారులోని పట్టా భూముల్లో అక్రమంగా చేపట్టిన మట్టి తవ్వకాలను గురువారం ఆయన పరిశీలించారు. అక్కడే ఉన్న కాంట్రాక్టర్తో మాట్లాడి దళిత రైతులకు ప్రభుత్వం ఇచ్చిన భూముల్లో తవ్వకాలు ఎలా చేపడుతారని, ఇందుకు అనుమతులు ఉన్నాయా అని ప్రశ్నించారు. ఇంత జరుగుతున్నా మైన్స్, రెవెన్యూ శాఖల అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదని అసహనం వ్యక్తంచేశారు. కలెక్టర్ ప్రతీక్ జైన్కు ఫోన్ చేసి మాట్లాడారు. మట్టి తవ్వకాలను నిలిపివేయకుంటే బీజేపీ శ్రేణులతో కలిసి ధర్నా చేస్తామని తెలిపారు. ఆయన వెంట బీజేపీ పట్టణ అధ్యక్షుడు మల్లేశం, పెద్దేముల్ మాజీ అధ్యక్షుడు సందీప్కుమార్ తదితరులు ఉన్నారు. -
వేరుశనగ విత్తనాల డీసీఎం బోల్తా
దోమ: వేరుశనగా విత్తనాల బస్తాలు తీసుకెళ్తున్న ఓ డీసీఎం వ్యాన్ బోల్తా పడింది. ఈ ఘటన దోమ మండల పరిధిలోని మోత్కూర్ శివారులో చోటుచేసుకుంది. మండల వ్యవసాయ అధికారి ప్రభాకర్ రావు తెలిపిన వివరాల ప్రకారం.. బ్రాహ్మణపల్లి రైతు వేదికకు 18 క్వింటాళ్లు(90 బస్తాలు)సబ్సిడీ వేరుశనగ రావాల్సి ఉంది. అయితే బుధవారం మహబూబ్నగర్ బయల్దేరిన డీసీఎం దుద్యాల మండలంలో కొంత మేర ఖాళీ చేసి మిగతా లోడ్తో దాదాపూర్, కుల్కచర్ల, మోత్కూర్ మీదుగా బ్రాహ్మణపల్లి వెళ్తుండగా అదుపుతప్పి మోత్కూర్ గేట్ వద్ద బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్కు స్వల్ప గాయాలు కాగా, అందులో ఉన్న 90 బస్తాల వేరుశనగా విత్తనాలు నీటిలో పడి తడిసి ముద్దయ్యాయి. ఇది గమనించిన కొంతమంది సుమారు 20 బస్తాల వరకు ఎత్తుకెళ్లారు. కారు ఢీకొని యువకుడి మృతి అనంతగిరి: కారు, బైక్ ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ఓ యువకుడు మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. బంట్వారం మండలం మోత్కుపల్లికి చెందిన శ్రీనివాస్(26) కొంత కాలంగా వికారాబాద్ పట్టణంలోని ఓ ప్రవేట్ ఆస్పత్రిలో ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేస్తున్నాడు. కాగా అర్ధరాత్రి దాటిన తర్వాత వికారాబాద్ పట్టణంలోని ఎన్నెపల్లి సమీపంలో నివాసం ఉండే తన స్నేహితున్ని బైక్పై ఇంటి వద్ద వదిలిపెట్టాడు. అనంతరం తిరిగి వికారాబాద్కు వస్తున్న క్రమంలో మర్రి చెన్నారెడ్డి విగ్రహం వద్ద ఎదురుగా వస్తున్న కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో శ్రీనివాస్ తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుడు శ్రీనివాస్ గత 18 నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకున్న శ్రీనివాస్కు భార్య, బాబు ఉన్నారు. మృతుడి తండ్రి అనంతయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ భీంకుమార్ తెలిపారు. గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యం మీర్పేట: గుర్తు తెలియని మహిళ మృతదేహాన్ని మీర్పేట పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం. ఈ నెల 15వ తేదీన బాలాపూర్ చౌరస్తాలో పెట్రోలింగ్ సిబ్బంది గస్తీ నిర్వహిస్తుండగా రోడ్డు పక్కన ఓ మహిళ (60) స్పృహ లేకుండా పడి ఉండడాన్ని గమనించారు. దగ్గరకు వెళ్లి పరిశీలించగా అప్పటికే మృతి చెందినట్లు గుర్తించారు. మృతురాలి వివరాలు తెలియరాలేదని, స్థానికంగా భిక్షాటన చేస్తుండేదని, బంధువులు ఎవరైనా ఉంటే ఠాణాలో సంప్రదించాలని పోలీసులు తెలిపారు. నీవు లేక నేనుండలేనని.. ● నాలుగు రోజుల క్రితం భార్య మృతి ● మనస్తాపంతో భర్త ఆత్మహత్య సికింద్రాబాద్: భార్య మృతిని జీర్ణించుకోలేక ఓ వ్యక్తి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం సికింద్రాబాద్ రైల్వే పీఎస్ పరిధిలో చోటుచేసుకుంది. జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ డేవిడ్రాజు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.. సంజీవయ్యపార్కు రైల్వేస్టేషన్ సమీపంలోని అప్లైన్ వద్ద మృతదేహం ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఘటనా స్థలానికి వెళ్లిన పోలీసులు మృతుడు బేగంపేట డివిజన్ పాటిగడ్డకు చెందిన కావలి రాజేఖర్ (32) గుర్తించారు. నాలుగు రోజుల క్రితంరాజశేఖర్ భార్య మృతి చెందింది. అప్పటి నుంచి అతను మద్యం తాగుతూనే ఉన్నాడు. మద్యం మత్తులో అతను బుధవారం అర్థరాత్రి సంజీవయ్య పార్కు సమీపంలోని రైలుపట్టాలపైకి చేరుకున్నాడు. అదే సమయంలో వేగంగా వచ్చిన రైలు ఢీ కొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాంధీ మార్చురీలో రాజశేఖర్ మృతదేహానికి పోస్టుమార్టం చేయించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. -
భారతి సిమెంట్తో నిర్మాణాలు వేగవంతం
కొత్తూరు: భారతి సిమెంట్తో నిర్మాణాలు మరింత వేగవంతంగా పూర్తి చేయవచ్చని సంస్థ టెక్నికల్ అధికారి శ్రీకాంత్ అన్నారు. కొత్తూరు పట్టణంలో గురువారం తాపీ మేసీ్త్రలకు నిర్మాణ రంగం, సిమెంట్ వినియోగంపై భారతి సిమెంట్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సును నిర్వహించారు. ఇందులో భాగంగా ఆయన మాట్లాడుతూ.. భారతి సిమెంట్ ఆల్ట్రాఫాస్ట్ బ్రాండ్తో ఫాస్ట్ సెట్టింగ్ సిమెంట్ను తెలంగాణ మార్కెట్లోకి విడుదల చేసిందన్నారు. ఇతర సిమెంట్లతో పోలిస్తే భారతి ఆల్ట్రాఫాస్ట్తో నిర్మాణ ప్రక్రియ వేగంగా పూర్తవుతుందని వివరించారు. అంతేకాకుండా సిమెంట్ నాణ్యత మరింత దృఢంగా ఉంటుందని తెలిపారు. భారతి ఆల్ట్రాఫాస్ట్ సిమెంట్ సీసీ రోడ్లు, స్లాబులు, వంతెనల నిర్మాణాలకు అత్యంత అనువుగా ఉంటుందని స్పష్టంచేశారు. భారీ నిర్మాణాలు చేసే సంస్థల నిర్వాహకులకు సిమెంట్ వినియోగంలో ఉచిత సాంకేతిక సహాయం అందజేస్తామని తెలిపారు. భారతి సిమెంట్ వినియోగించే వారి కట్టడాల వద్దకే ఇంజనీర్లు వచ్చి సూచనలు ఇస్తారని పేర్కొన్నారు. ఈ సమావేశంలో టెక్నికల్ ఆఫీసర్ నితిన్, డీలర్ జయవర్ధన్రెడ్డి, తాపీ మేసీ్త్రలు తదితరులు పాల్గొన్నారు. మార్కెట్లోకి ఆల్ట్రాఫాస్ట్ సెట్టింగ్ సిమెంట్ సంస్థ టెక్నికల్ ఆఫీసర్ శ్రీకాంత్ కొత్తూరులోతాపీ మేసీ్త్రలకు అవగాహన సదస్సు -
డ్రోన్ పిచికారీతో సమయం ఆదా
షాబాద్: డ్రోన్ పిచికారీపై రైతులకు అవగాహన కల్పిస్తున్నామని అకిన్ అనలెటిక్స్ సంస్థ డైరెక్టర్, హెచ్ఆర్ సుబ్బారావు, వైస్ ప్రెసిడెంట్ అమృత్రాజ్ అన్నారు. గురువారం రేగడిదోస్వాడలో సుగు ణ మాల రైతు ఉత్పత్తిదారుల సంఘం డ్రోన్తో పు రుగు, తెగుళ్ల మందు, ఎరువుల పిచికారీ ప్రదర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. డ్రోన్ పిచికారీతో సమయం ఆదాతో పాటు ఎక్కువ విస్తీర్ణంలో పంటలు కాపాడి దిగుబడి పెరుగుతుందన్నా రు. ఎకరాకు ఐదు నుంచి ఆరు నిమిషాల్లో స్ప్రేయింగ్ పూర్తవుతుందని చెప్పారు. సేవా స్ఫూర్తి ఫౌండేషన్ ప్రాజెక్ట్ మేనేజర్ రత్నాకర్ మాట్లాడుతూ... ఈ సాంకేతిక పరిజ్ఞానంతో పురుగు మందు వ్యయం, శ్రమ, ఖర్చు, నీటి అవసరాన్ని తగ్గించవచ్చన్నారు. చీఫ్ అకడమిక్ అధికారి రాజేంద్ర ప్ర సాద్ మాట్లాడుతూ.. వ్యవసాయ రంగంలో మా ర్పులకు అనుగుణంగా రైతులు సాంకేతిక పరిజ్ఞానం పెంచుకుంటే పెట్టుబడి తగ్గి దిగుబడి పెరుగుతుందని సూచించారు. అకిన్ అనలెటిక్స్ సంస్థ డైరెక్టర్, హెచ్ఆర్ సుబ్బారావు -
ప్రమాదాలు లేకుండా పంటకు రక్షణ
● సోలార్ కంచెతో సత్ఫలితాలు ● అడవి పందులు, వన్యప్రాణులకు చెక్ ● సబ్సిడీపై అందజేయాలంటున్న రైతులు దుద్యాల్: పగలు, రాత్రి తేడా లేకుండా సేద్యం చేయడం రైతన్నకు నిత్య కృత్యం. అయినా వీరికి అడుగడుగునా కష్టాలే. విత్తనం వేసింది మొదలు పంట చేతికి వచ్చే వరకు కంటికి రెప్పలా కాపాడుకోవల్సిన పరిస్థితి. ఆదమరిస్తే తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. అందుకే కర్షకుల ఆలోచనల్లో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. పంటలను కాపాడుకోవడానికి ప్రాణహాని లేని ఆధునిక విధానాల వైపు చూస్తున్నారు. ఇందులో సోలార్ కంచె ఉత్తమమని భావిస్తున్నారు. అడవి పందులు, వన్య ప్రాణుల బెడద నుంచి పంటలను కాపాడుకునేందుకు సోలార్ సిస్టమ్ వైపు మొగ్గు చూపుతున్నారు. మండలంలో పరిస్థితి మండలంలోని కుదురుమల్ల, లగచెర్ల, హకీంపేట, పోలేపల్లి, హస్నాబాద్, చిలుముల మైల్వార్, చెట్టుపల్లితండా, హంసంపల్లి, ఈర్లపల్లి, గౌరారం తదితర గ్రామాలతో పాటు గిరిజన తండాలు, అటవీ సమీప శివారులోని భూముల్లో వేరుశనగ, మొక్కజొన్న, శనగ పంటలను విరివిగా సాగుచేస్తున్నారు. వీటిని పశుపక్ష్యాదులతో పాటు అడవి జంతువుల నుంచి రక్షించేందుకు సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేస్తున్నారు. 10ఎకరాలు రూ.15 వేల ఖర్చు పదెకరాల మేర పంటకు సోలార్ కంచెను ఏర్పాటు చేసుకోవాలంటే రూ.12 వేల నుంచి రూ.15 వేల వరకు ఖర్చవుతుందని చెబుతున్నారు. చుట్టు పక్కల రైతులు కలిసి ఏర్పాటు చేసుకుంటే ఈమొత్తం మరింత తగ్గుతుందని పేర్కొంటున్నారు. ఒకసారి ఏర్పాటు చేసుకుంటే ఏళ్ల తరబడి పనిచేస్తుందని వివరిస్తున్నారు. ప్రమాదం లేకుండా రక్షణ.. సోలార్ కంచెను వన్యప్రాణులు, పశువులు తాకినా ఎలాంటి ప్రమాదం ఉండదని అడవి జంతువులు కంచెను తాకినప్పుడు ప్రమాదం జరగకుండా షాక్ కొడుతుంది. దీంతో అవి భయపడి పరుగు పెడుతాయి. పశువులు, జంతువులకు ప్రాణహాని ఉండదు. సాధారణ షాక్ మాత్రమే కొడుతుంది. సబ్సిడీపై అందించాలి డ్రిప్ పరికరాల మాదిరిగానే సోలార్ కంచెను సైతం ప్రభుత్వం రాయితీపై అందజేస్తే బాగుంటుంది. ప్రస్తుతం పంటను పండించడం కన్నా కాపాడుకోవడమే అతిపెద్ద సమస్యగా మారింది. ప్రభుత్వం సబ్సిడీపై అందజేస్తే చాలా ఉపయోగంగా ఉంటుంది. జంతువుల బెదడ తప్పింది పొలం చుట్టూ సోలార్ కంచె ఏర్పాటు చేయడం ద్వారా పంటకు పశువులు, వన్యప్రాణుల బెదడ పూర్తిగా తప్పింది. సాధారణంగా ఇనుప కంచె ఏర్పాటు చేసుకుంటే రూ.1 లక్ష ఖర్చు అవుతుంది. సోలార్ కంచెకు రూ.10 వేల నుంచి రూ.15 వేలు సరిపోతుంది. – ఈరప్ప, రైతు, హస్నాబాద్ సోలార్ కంచె మేలు పంటలకు సోలార్ కంచె ఏర్పాటు చేయడం వల్ల తక్కువ ఖర్చుతో పంటలను రక్షించుకోవచ్చు. ఇప్పటికే చాలా మంది రైతులు దీన్ని వినియోగించి సత్ఫాలితాలు సాధిస్తున్నారు. ఈ కంచెతో ఇటు పంట రక్షణతో పాటు వన్య ప్రాణులకు ఎలాంటి హాని ఉండదు. – నాగరాజు, వ్యసాయ అధికారి, దుద్యాల్ -
ఇంకా తేలని రుణాల లెక్క!
● కొనసాగుతున్న అధికారుల విచారణ ● తాజాగా ఏపీఎం, సీసీపై సస్పెన్షన్ వేటు యాచారం: డ్వాక్రా సంఘాల నిధుల గోల్మాల్ విషయంలో అప్పటి ఐకేపీ ఏపీఎం సుదర్శన్రెడ్డి, చౌదర్పల్లి సీసీ జంగయ్యపై సస్పెన్షన్ వేటు వేస్తూ డీఆర్డీఓ శ్రీలత ఉత్తర్వులు జారీ చేశారు. చౌదర్పల్లి వీకేబీ (విలేజ్ బుక్ కీపర్) వరలక్ష్మి పర్యవేక్షణలో 25 గ్రామ స్వయం సహాయక సంఘాల్లో రూ.లక్షలాది నిధుల పక్కదారి పట్టాయంటూ రెండు నెలల క్రితం మహిళలు ఆందోళనకు దిగారు. రుణాలు తీసుకోనప్పటికీ యాచారం ఎస్బీఐ ఖాతాల్లో అప్పులను గుర్తించిన మహిళలు సాగర్రోడ్డుపై ఉన్న బ్యాంకు ఎదుట బైఠాయించి ఆందోళనకు చేపట్టారు. స్థానిక ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, కలెక్టర్ నారాయణరెడ్డి, డీఆర్డీఓ శ్రీలతకు ఫోన్లో ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన డీఆర్డీఓ ఉన్నతాధికారులు నిధుల గోల్మాల్ జరిగిందని నిర్ధారించారు. 25 స్వయం సహాయక సంఘాల్లో రూ.10 లక్షల నుంచి రూ.15లక్షల అప్పులున్నట్లు రికార్డుల్లో నమోదైంది. రికార్డుల్లో లేని రూ.3 కోట్ల రుణాలు చౌదర్పల్లిలో 40కి పైగా స్వయం సహాయం సంఘాలకు యాచారం ఎస్బీఐ నుంచి రూ.7 కోట్ల రుణాలు ఇచ్చినట్లు రికార్డులు ఉన్నాయి. నిధుల స్వాహా వెలుగులోకి రావడంతో విచారణ చేపట్టగా మొత్తం రూ.7 కోట్లకు గాను రూ.4 కోట్ల రుణాలకు సంబంధించి మాత్రమే రికార్డులున్నట్లు గుర్తించారు. రూ.3 కోట్లకు లెక్కలు లేకపోవడంతో డీఆర్డీఓ ఉన్నతాధికారులు బ్యాంకు సిబ్బంది పాత్రపై ఎస్బీఐ ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేశారు. ఉన్నతాధికారులకు కలెక్టర్ లేఖ చౌదర్పల్లి, మల్కీజ్గూడ స్వయం సహాయక సంఘాల నిధుల గోల్మాల్కు సంబంధించి అప్పటి ఎస్బీఐ మేనేజర్ ఝాన్సీరాణి పాత్రే కీలకమని, ఆమెను విధుల నుంచి తొలగించి విచారణ చేపట్టాలని.. నిధులను రికవరీ చేయాలని కలెక్టర్ నారాయణరెడ్డి ఎస్బీఐ ఉన్నతాధికారులకు లేఖ రాశారు. ఎస్బీఐ మేనేజర్ మల్కీజ్గూడ, చౌదర్పల్లి గ్రామాల్లోని వీబీకేల ద్వారా బ్యాంకు నుంచి సంఘాల్లో లేని మహిళల పేర్ల మీద రూ.లక్షలాది నిధులను బదిలీ చేశారు. తర్వాత వ్యక్తిగత అవసరాలకు వాడుకున్నట్లు అధికారులు గుర్తించారు. వారం రోజులుగా మల్కీజ్గూడ, చౌదర్పల్లి గ్రామాల్లో యాచారం ఎస్బీఐ, ఐకేపీ అధికారుల బృందం కలిసి మహిళలతో సమావేశమై విచారణ చేపడుతున్నారు. తాజాగా రెండు గ్రామాల్లో రూ.10 నుంచి రూ.20 లక్షల్లోపు రికవరీ చేసినట్లు తెలుస్తోంది. విచారణ కొనసాగుతోంది అప్పటి యాచారం ఎస్బీ ఐ మేనేజర్ సహకారంతోనే రూ.లక్షలాది నిధులు గోల్మాల్ అయ్యాయి. చౌదర్పల్లి, మల్కీజ్గూడ స్వయం సహాయక సంఘాల్లో బ్యాంకు మేనేజర్ చేతివాటం ఉంది. ఆమెను విధుల నుంచి తొలగించి నిధులు రికవరీ చేయాలని కలెక్టర్ నారాయణరెడ్డి ఎస్బీఐ ఉన్నతాధికారులకు లేఖ రాశారు. ఇంత జరుగుతున్నా పర్యవేక్షించని ఏపీఎం సుదర్శన్రెడ్డి, సీసీ జంగయ్యను సస్పెండ్ చేశాం. విచారణ కొనసాగుతోంది. – శ్రీలత, డీఆర్డీఓ -
ఇన్చార్జి ఎంపీడీఓ యాదగిరి
పౌష్టికాహారంతోనే ఆరోగ్యం మోమిన్పేట: తల్లీపిల్లల ఆరోగ్యానికి పౌష్టికాహారం అవసరమని ఇన్చార్జి ఎంపీడీఓ యాదగిరి అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని మోమిన్పేట పంచాయతీ కార్యాలయంలో పోషణ మాసోత్సవాల సంబురాల్లో భాగంగా చిన్నారులకు సామూహిక అన్నప్రాసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా యాదగిరి మాట్లాడుతూ.. తల్లీపిల్లల ఆరోగ్యానికి సహజ సిద్ధంగా లభించే వనరులపై ఆధారపడాలన్నారు. ఆకుకూరలు తప్పక తీసుకోవాలన్నారు. కూరగాయలు, పండ్లు, గ్రుడ్లు, పాలు నిత్యం స్వకరించడంతో ఆరోగ్యంగా ఉంటారని చెప్పారు. బాలామృతంతో మానసికంగా, శారీరకంగా అభివృద్ధి ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ మల్లేశం, ఐసీడీఎస్ సూపర్వైజర్ పుష్పలత, శశికళ. పంచాయతీ కార్యదర్శి స్వప్న పాల్గొన్నారు. -
రిజర్వేషన్ల సాధనకు ఐక్య ఉద్యమం
● 18న రాష్ట్ర వ్యాప్త బంద్ను విజయవంతం చేద్దాం ● తాండూరులో అఖిలపక్ష బీసీ నాయకుల భేటీతాండూరు: రిజర్వేషన్లు సాధించే వరకు బీసీ జేఏసీ ఆధ్వర్యంలో ఐక్యంగా ఉద్యమిస్తామని నాయకుడు ఈడిగి శ్రీనివాస్గౌడ్ అన్నారు. బుధవారం పట్టణంలోని ఓ కన్వెన్షన్లో బీసీ నాయకులు శ్రీనివాస్గౌడ్, రాజ్కుమార్ ఆధ్వర్యంలో అఖిలపక్ష నాయకులు, ప్రజా సంఘాలు, కులసంఘాలు, బీసీ మేధావుల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించినా హైకోర్టు స్టే విధించడంతో అన్యాయం జరిగిందన్నారు. 42 శాతం రిజర్వేషన్ల సాధనకు బీసీ కులాలంతా ఏకమై పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. రిజర్వేషన్లు అమలయ్యాకే ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. అందకు పార్టీలు, కులాలకతీతంగా ఏకమై పోరాడేందుకు ముందుకు రావడ ఆనందంగా ఉందన్నారు. రిజర్వేషన్లకు రాజ్యాంగ రక్షణ కల్పించేందుకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కేంద్రంపై ఒత్తిడి పెంచాలన్నారు. త్వరలో బీసీ జేఏసీ ఏర్పాటు చేసి కార్యచరణ రూపొందిస్తామని ప్రకటించారు. ఈ నెల 18న జరిగే రాష్ట్ర వ్యాప్త బంద్ను జయప్రదం చేయాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ మురళీకృష్ణగౌడ్, మాజీ కౌన్సిలర్ సోమశేఖర్, ప్రభాకర్గౌడ్, నాయకులు ఉత్తమ్చంద్, మల్కయ్య, శ్రీనివాస్, విజయ్కుమార్, సంతోశ్, కె.గోపాల్, రాజన్గౌడ్, రజినీకాంత్ తదితరులున్నారు. -
మట్టి తవ్వకాలు ఆపేయండి
● పురుగు మందు డబ్బాలతో దళిత రైతుల ఆందోళన ● కాంట్రాక్టర్పై పోలీసులకు ఫిర్యాదు తాండూరు రూరల్: తమ భూముల్లో చేపట్టిన మట్టి తవ్వకాలను వెంటనే నిలిపేయాలని పలువురు రైతులు డిమాండ్ చేశారు. లేదంటే పురుగు మందు తాగి ఇక్కడే చనిపోతామని హెచ్చరించారు. వివరాలు ఇలా ఉన్నాయి.. తాండూరు మండలం అంతారం గ్రామ శివారులోని అసైన్డ్ భూమి నుంచి తాండూరు– చించోళి జాతీయ రహదారి పనులకు సంబంధిత కాంట్రాక్టర్ పెద్ద ఎత్తున మట్టి తరలిస్తున్నాడు. ఈ విషయం తెలుసుకున్న గ్రామానికి చెందిన దళిత రైతులు స్వామిదాస్, బాలమ్మ, తుల్జమ్మ, బాలప్ప, మొగులప్ప, సామేల్లు తదితరులు అక్కడికి చేరుకున్నారు. వెంటనే తవ్వకాలు నిలిపివేయాలని లేదంటే పురుగుల మందు తాగి చస్తామని కాంట్రాక్టర్కు హెచ్చరించారు. అనంతరం సదరు కాంట్రాక్టర్పై పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉండగా మట్టి తవ్వకాల పంచాయితీ ఎమ్మెల్యే మనోహర్రెడ్డి వద్దకు వెళ్లినట్లు తెలిసింది. ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు ఏమీ తెలియనట్లు వ్యవహరించడం గమనార్హం. ఈ విషయమై తహసీల్దార్ తారాసింగ్ను వివరణ అడగగా.. మట్టి తవ్వకాల కోసం తామెవరికీ అనుమతులు ఇవ్వలేదని తెలిపారు. మైనింగ్ ఏడీ సత్యనారాయణకు ఫోన్ చేయగా అందుబాటులోకి రాలేదు. -
అడవి జంతువుల దాడిలో దూడ మృతి
కుల్కచర్ల: గుర్తు తెలియని అడవి జంతువు దాడిలో దూడ మృతిచెందిన ఘటన కుల్కచర్ల మండలంలో చోటుచేసుకుంది. అటవీ శాఖ సెక్షన్ ఆఫీసర్ మొయినొద్దీన్ తెలిపిన వివరాల ప్రకారం.. ముజాహిద్పూర్కు చెందిన రైతు చిలుముల బాలకృష్ణయ్య ఎప్పటిలాగే మంగళవారం రాత్రి తన పశువులను పొలం వద్ద కట్టేసి ఇంటికి వచ్చాడు. బుధవారం ఉదయాన్నే వెళ్లి చూడగా దూడ రక్తపు మడుగులో పడి ఉంది. సమీపంలోని పొలంలో అడవిజంతువుల పాద ముద్రలు కనిపించడంతో ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న వారు ట్రాప్ కెమెరా ఏర్పాటు చేశారు. పశువులను అటవీ ప్రాంతంలో ఉంచొద్దని రైతులకు సూచించారు. రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించండిబీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్యాదవ్ బంట్వారం: విద్యార్థులకు పెండింగ్ స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అత్తెల్లి లక్ష్మణ్యాదవ్ కోరారు. బుధవారం ఆయన జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమాధికారి (డీబీసీడబ్ల్యూఓ) మాధవ్రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం 2024 వరకు 50 శాతం పెండింగ్ స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేసిందని.. పూర్తిగా విడుదల చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జగన్నాథ్యాదవ్, ఏబీసీడబ్ల్యూఓ భీంరావు పాల్గొన్నారు. 75 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత కుల్కచర్ల: సివిల్ సప్లై ఎన్ఫోర్స్మెంట్ దాడిలో భారీగా రేషన్ బియ్యం పట్టుబడిన ఘటన మండల పరిధిలోని రాంరెడ్డిపల్లిలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం.. గ్రామంలోని ఓ ఇంట్లో 150 బస్తాల (75 క్వింటాళ్లు) సన్నబియ్యం నిల్వలున్నట్లు సివిల్ సప్లై అధికారులకు విశ్వసనీయ సమాచారం అందింది. ఈ మేరకు వారు దాడిచేసి 75 క్వింటాళ్ల బియ్యాన్ని సీజ్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తులో ఉంది. డీసీసీ అవకాశం కల్పించండి బంట్వారం: నాలుగు దశాబ్దాలుగా హస్తం పార్టీలో సేవలందిస్తూ వివిధ హోదాల్లో పని చేశానని, డీసీసీ అధ్యక్షుడిగా తనకు అవకాశం కల్పించాలని బ్లాక్– 2 కాంగ్రెస్ అధ్యక్షుడు ఎం.కృష్ణారెడ్డి ఏఐసీసీ అబ్జర్వర్ ఠాకూర్ను కలిసి దరఖాస్తు అందజేశారు. ‘ఫ్యూచర్’కు భూములిచ్చి సహకరించండి కందుకూరు: ఫ్యూచర్ సిటీకి భూములు ఇచ్చి సహకరించాలని ఆర్డీఓ జగదీశ్వర్రెడ్డి కోరారు. మండల పరిధిలోని తిమ్మాయిపల్లి రెవెన్యూ సర్వే నంబర్ 9లోని 400 ఎకరాల అసైన్డ్, ప్రభుత్వ భూమిని ఫ్యూచర్సిటీలో భాగంగా సేకరించడానికి బుధవారం టీజీఐఐసీ అధికారులతో కలిసి మండల పరిషత్ సమావేశ హాల్లో రైతులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎకరాకు చట్ట ప్రకారం కాకుండా అదనంగా రూ.55 లక్షల చొప్పున చెల్లిస్తామని, భూములు ఇవ్వాలని అన్నారు. దీంతో పాటు భూమిలో చెట్లు, నిర్మాణాలు, బోర్లు ఉంటే అదనంగా అందుతుందన్నారు. రైతులు మాత్రం తమకు ఎకరాకు రూ.2 కోట్ల చొప్పున ఇవ్వాలని డిమాండ్ చేశారు. విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని చెప్పి సమావేశాన్ని ముగించారు. కార్యక్రమంలో టీజీఐఐసీ జోనల్ మేనేజర్ శ్రవణ్కుమార్, నాయబ్ తహసీల్దార్ శేఖర్, ఆర్ఐ యాదగిరి తదితరులు పాల్గొన్నారు. -
అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు
తాండూరు ఎమ్మెల్యే మనోహర్రెడ్డి తాండూరు: కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తుందని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్రెడ్డి అన్నారు. బుధవారం ఆయన మున్సిపల్ పరిఽధిలోని సమద్ ఫంక్షన్ హాల్లో ఇందిరమ్మ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా 160 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల పట్టాలు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నియోజకవర్గ అభివృద్ధికి శక్తివంచన లేకుండా పనిచేస్తున్నానన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో పేదల సొంతింటి కల సాకారం చేశామన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో పేదలకు ఒక్క ఇంటిని నిర్మించి ఇవ్వలేకపోయిందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ యాదగిరి, మార్కెట్ కమిటీ చైర్మన్ పట్లోళ్ల బాల్రెడ్డి, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు హబీబ్లాల, మాజీ కౌన్సిలర్లు నర్సింహులు, ప్రభాకర్గౌడ్, ప్రవీణ్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
కలెక్టర్ ఆదేశాలతో కదలిన యంత్రాంగం
● చంద్రవంచ, చిట్టిఘనాపూర్ వాగులను పరిశీలించిన అధికారుల బృందం ● పూర్తి నివేదిక కలెక్టర్కు అందజేస్తాం: డీపీఓ జయసుధ తాండూరు రూరల్: ఇసుక అక్రమ రవాణాపై అందిన ఫిర్యాదుల మేరకు కలెక్టర్ ప్రతీక్జైన్ స్పందించారు. క్షేత్రస్థాయిలో పరిశీలించాలని డీపీఓ జయసుధను ఆదేశించారు. ఈ మేరకు బుధవారం ఆమె తహసీల్దార్ తారాసింగ్, ఎంపీడీఓ విశ్వప్రసాద్, మైన్స్ ఆర్ఐ నిర్మల, మైన్స్ జియాలజిస్ట్ రవికుమార్, ఇరిగేషన్ ఏఈ సాయిబన్నతో కలిసి మండల పరిధిలోని చంద్రవంచ, చిట్టిఘనాపూర్ గ్రామ శివారులోని వాగుల్లో ఇసుక రీచ్లను పరిశీలించారు. వాగు సమీపంలో ఉన్న రైతుల నుంచి ఇసుక అక్రమ రవాణాపై వివరాలు సేకరించారు. పూర్తి నివేదిక కలెక్టర్కు అందజేస్తామని డీపీఓ జయసుధ అన్నారు. కాగా చంద్రవంచ వాగు నుంచి ఇసుక తరలించే వీలు లేదని.. చిట్టిఘనాపూర్ వాగు నుంచి తరలించే అవకాశం ఉన్నట్లు అధికారులు గుర్తించినట్లు ప్రాథమిక సమాచారం. -
ఇందిరమ్మ ఇసుక పక్కదారి!
బషీరాబాద్: ఇందిరమ్మ లబ్ధిదారుల పేరున తీసుకెళుతున్న ఇసుకను ట్రాక్టర్ యజమానులు పక్కదారి పట్టిస్తున్నారు. గ్రామాల్లో ఇతర వ్యక్తులు, ప్రైవేటు నిర్మాణాలకు రూ.4 వేలకు ట్రిప్పు చొప్పున విక్రయిస్తూ జేబులు నింపుకొంటున్నారు. దీని పర్యవేక్షణ చేయాల్సిన ఒకరిద్దరు కింది స్థాయి సిబ్బంది అక్రమార్కులతో చేతులు కలిపారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బుధవారం మైల్వార్ గ్రామానికి చెందిన ఓ వ్యాపారి అధికార పార్టీ నాయకుడి అండతో నాలుగు ట్రాక్టర్లతో ఇసుక రవాణా చేశాడు. పట్టపగలు అనుమతులు లేకుండా ప్రైవేటు వ్యక్తులకు విక్రయించినట్లు అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. రెచ్చిపోతున్న అక్రమార్కులు మండలంలోని వాగులు, వంకల మీద పడుతున్న అక్రమార్కులు రాత్రింబవళ్లు ఇసుక తోడి రవాణా చేస్తున్నారు. గృహనిర్మాణ లబ్ధిదారుల పేరు చెప్పి యథేచ్ఛగా బయట అమ్మేస్తున్నారు. మండలంలో ఏ ప్రభుత్వ భవనాల నిర్మాణాలకై నా, ఇందిరమ్మ ఇళ్లకై నా నావంద్గీ కాగ్నానది రీచ్ నుంచి ఇసుక అనుమతులు ఇవ్వాలి. అయితే ప్రభుత్వ, ప్రైవేటు నిర్మాణాలకు ఒక్కో ట్రాక్టర్కు రూ.600 చొప్పున బ్యాంకులో డీడీ తీసి తహసీల్దార్ కార్యాలయంలో ఇస్తే అనుమతులు ఇస్తారు. ఇందిరమ్మ ఇళ్లకు మాత్రం ప్రభుత్వం నుంచి ఫ్రీగా పర్మిషన్ ఇస్తున్నారు. దీన్ని అదనుగా తీసుకుంటున్న అక్రమార్కులు వాగులు, వంకల్లో యథేచ్ఛగా ఇసుక తోడేస్తున్నారు. మైల్వార్, ఎక్మాయి, దామర్చెడ్, కొత్లాపూర్ గ్రామాలకు చెందిన ఇసుక వ్యాపారులకు ఇందిరమ్మ ఇళ్లు వరంగా మారాయి. లబ్ధిదారుల ప్రొిసీడింగ్ కాపీలను తీసుకువచ్చి అనుమతులు తీసుకుంటున్నారు. వాస్తవానికి లబ్ధిదారులకు ఎంత ఇసుక అవసరమకో హౌసింగ్ ఏఈ ద్వారా లెటర్ తీసుకుని తహసీల్దార్కు ఇవ్వాలి. ఆతర్వాతే ఇసుక పర్మిట్లు పంపిణీ చేయాలి. కానీ ఇక్కడ ఇవేవీ జరగడం లేదు. సర్కారు ఆదాయానికి గండి జేబులు నింపుకొంటున్న అక్రమార్కులు చోద్యం చూస్తున్న రెవెన్యూ, పోలీసు అధికారులు సీజ్ చేస్తాం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు ఆగిపోకూడదనే అనుమతులు ఇస్తున్నాం. పక్కదా రి పట్టించే ట్రాక్టర్లను సీజ్ చేస్తాం. ఎక్మాయి వాగులో ఇసుక రవాణాను అడ్డుకోవడానికి రెవెన్యూ సిబ్బంది వెళ్లేసరికే అక్రమార్కులు పారిపోయారు. ఇందులో సిబ్బంది ప్రమేయం ఉంటే శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం. – షాహిదాబేగం, తహసీల్దార్ -
పెండింగ్ వేతనాల కోసం పెన్డౌన్
● ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విధులు బహిష్కరించిన గెస్ట్లెక్చరర్స్ ● ఆందోళన బాటపట్టిన అతిథి అధ్యాపకులు బొంరాస్పేట: మండల కేంద్రంలో నూతనంగా ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటుతో హర్షం వ్యక్తం చేశారు. గతేడాది పరిగిలో కొనసాగిన కళాశాల ఈ ఏడాది మండల కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్ అదనపు తరగతి గదుల్లో ప్రారంభించారు. కాగా కళాశాల ప్రారంభం నాటి నుంచి తమకు వేతనాలు పెండింగ్లోనే పెట్టారని ఇక్కడ పనిచేస్తున్న అతిథి అధ్యాపకులు నాలుగు రోజులుగా ఆందోళన చేపట్టారు. ఉన్నతాధికారుల నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో బుధవారం విధులు బహిష్కరించారు. దీంతో కళాశాలకు వచ్చిన విద్యార్థులు కాలక్షేపం చేశారు. పది మంది అడ్మిషన్లు వెనక్కు.. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపాల్తోపాటు ఇద్దరు రెగ్యులర్ అధ్యాపకులు, ఎనిమిది మంది అతిథి అధ్యాపకులున్నారు. రెండు తెలుగు, సోషల్ అధ్యాపకుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇక్కడ 130 మంది విద్యార్థులు అడ్మిషన్లు తీసుకున్నారు. అధ్యాపకులు లేకపోవడంతో బోధన సాగడం లేదని పది మందికిపైగా విద్యార్థులు కళాశాలనుంచి వెళ్లిపోయారు. కాలక్షేపం చేయాల్సి వస్తోంది మా కళాశాలలో గెస్ట్ లెచ్చరర్స్ ఎక్కువగా ఉన్నారు. వారికి సమయానికి వేతనాలు రావడం లేదని బోధన చేయడం లేదు. దీంతో కాలక్షేపం చేయాల్సి వస్తోంది. – మల్లేశం, బైపీసీ విద్యార్థి బోధన చేయడం లేదు లెక్చరర్స్ వేతనాలు రాకపోవడంతో తరగతులు బహిష్కరించారు. దీంతో మాకు బోధన కరువైంది. ఇంటర్ బోర్డు అధికారులు స్పందించి తరగతులు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలి. – భూమిక, బైపీసీ విద్యార్థి -
ఆర్డీఓ వాసుచంద్రకు డిప్యూటీ కలెక్టర్గా పదోన్నతి
అనంతగిరి: వికారాబాద్ ఆర్డీఓ వాసుచంద్రకు డిప్యూటీ కలెక్టర్గా పదోన్నతి లభించింది. రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో తోటి ఉద్యోగులు అభినందనలు తెలిపారు. ధారూరు: జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడి రేసులో పీసీసీ మాజీ ప్రధాన కార్యదర్శి రఘువీరారెడ్డి పోటీ పడుతున్నారు. బుధవారం వికారాబాద్లో ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ పరిశీలకుడు సూరత్సింగ్ ఠాగూర్ను కలిసి తనకు అధ్యక్ష పదవి ఇవ్వాలని కోరారు. ఈ మేరకు దరఖాస్తు చేసుకున్నారు. కార్యక్రమంలో పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి ఉన్నారు. కొడంగల్: ప్రభుత్వ వసతి గృహాల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని రివాల్యూషనరి విద్యార్థి సంఘం (ఆర్ఎస్యూ) రాష్ట్ర అధ్యక్షుడు భీమరాజు కోరారు. బుధవారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ ప్రభుత్వ హాస్టళ్లలో మౌలిక సదుపాయాలు లేవన్నారు. మెస్ చార్జీలను పెంచాలన్నారు. విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారం ఇవ్వాలన్నారు. గురుకులాలు, కస్తూర్బాల్లో సౌకర్యాలు పెంచాలన్నారు. పాఠశాలల్లో ఉపాధ్యాయులను, గురకులాల్లో అధ్యాపకులను నియమించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. యాలాల: మండల కేంద్రంలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయంలో హెడ్ కుక్, డే వాచ్ ఉమెన్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఎంఈఓ రమేష్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. మండలానికి చెందిన మహిళా అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హులన్నారు. 18 నుంచి 45 ఏళ్ల లోపు ఉన్న వారు హెడ్ కుక్ పోస్టుకు, డే వాచ్ ఉమెన్ పోస్టుకు 10వ తరగతి పాసై ఉండాలన్నారు. అర్హత, ఆసక్తి కలిగిన వారు ఈ నెలా 27వ తేదీలోపు కేజీబీవీలో దరఖాస్తు చేసుకోవాలని ఎంఈఓ సూచించారు. పరిగి మండలంలో.. పరిగి: మండలంలోని నస్కల్ కేజీబీవీ ఉన్నత పాఠశాల, మోడల్ స్కూల్లో వాచ్మెన్, హెడ్ కుక్, అసిస్టెంట్ కుక్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు మండల విద్యాధికారి గోపాల్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 18వ తేదీలోపు మండల విద్యావనరుల కేంద్రంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. హెడ్ కుక్ పోస్టు భర్తీకి.. దౌల్తాబాద్: మండలంలోని బాలంపేట కేజీబీవీలో హెడ్కుక్ పోస్టుకు అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని ఎంఈఓ వెంకట్స్వామి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. మండలానికి చెందిన మహిళలు ఈ నెల 25వ తేదీ లోగా ఎంఈఓ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కాంట్రాక్ట్ పద్ధతిలో.. బషీరాబాద్: మండల కేంద్రంలోని కేజీబీవీలో కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తు చేసుకోవాలని ఎస్ఓ సునీత బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 18 నుంచి 45 వయసు కలిగి మండలానికి చెందిన మహిళలు అర్హులని తెలిపారు. మహిళా వాచ్మెన్ ఉద్యోగానికి కనీసం పదో తరగతి ఉత్తీర్ణత సాధించి, సెక్యూరిటీ విభాగంలో శిక్షణ పొందిన అనుభవం ఉండాలన్నారు. అలాగే స్వావేంజర్, అసిస్టెంట్ కుక్ ఉద్యోగాలకు కనీసం 7వ తరగతి ఉత్తీర్ణత సాధించిన మహిళలు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ నెల 20లోపు బషీరాబాద్లోని కేజీబీవీ పాఠశాలలో దరఖాస్తులు అందజేయాలని ఎస్ఓ సుకోరారు. -
స్థానిక ఎన్నికల్లో సత్తా చాటుతాం
● కాంగ్రెస్పై ప్రజలకు నమ్మకం పోయింది ● ఎన్నికల హామీల అమలులో ప్రభుత్వం విఫలం ● మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డిపరిగి: ఎన్నికల హామీలను అమలు చేయడంతో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి అన్నారు. దోమ మండలం గూడూర్ గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు బుధవారం మాజీ ఎమ్మెల్యే నివాసంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలకు విసుగొచ్చిందన్నారు. ఎక్కడికి వెళ్లినా కేసీఆర్ పాలను గుర్తు చేసుకుంటున్నారని తెలిపారు. ప్రభుత్వ పనితీరు నచ్చక ఎంతో మంది కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. హామీలను నెరవేర్చేంత వరకు బీఆర్ఎస్ ప్రజల పక్షాన పోరాటం చేస్తుందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస సత్తా ఎంతో చూపుతామన్నారు. ఓటమి భయంతోనే కాంగ్రెస్ ఎన్నికలను ఆలస్యం చేస్తోందని ఆరోపించారు. ఏ గ్రామానికి వెళ్లిన బీఆర్ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధే కనిపిస్తోందని అన్నారు. ప్రజలు మళ్లీ కేసీఆర్ పాలనను కోరుకుంటున్నారని తెలిపారు. ఇతర పార్టీల్లోంచి బీఆర్ఎస్లో చేరిన నాయకులకు సముచిత స్థానం కల్పిస్తామన్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ మాజీ సభ్యుడు కొప్పుల నాగిరెడ్డి, దోమ మాజీ సర్పంచ్ రాజిరెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ మల్లేశం, నాయకులు రఘుమోహన్రెడ్డి, ప్రవీణ్కుమార్రెడ్డి, రాజశేఖర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మెడికల్ కళాశాలను తరలించొద్దు
● అప్పాయిపల్లిలోనే భవనం నిర్మించాలి ● బీఆర్ఎస్ నాయకుల డిమాండ్ కొడంగల్: ప్రభుత్వ మెడికల్ కళాశాలను మండలంలోని అప్పాయిపల్లిలోనే నిర్వహించాలని, ఇక్కడే భవనాలు నిర్మించాలని బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రభుత్వాన్ని కోరారు. బుధవారం పట్టణంలో పార్టీ మండల అధ్యక్షుడు దామోదర్రెడ్డి, మాజీ ఎంపీపీలు దయాకర్రెడ్డి, మధుసూదన్రెడ్డి, మాజీ కౌన్సిలర్ మధుయాదవ్, మాజీ సర్పంచు రమేష్బాబు, కేడీపీ జేఏసీ కో కన్వీనర్ ఎరన్పల్లి శ్రీనివాస్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నియోజకవర్గానికి కొడంగల్ ముఖ చిత్రం లాంటిదని పేర్కొన్నారు. ముందుగా కొడంగల్ను అభివృద్ధి చేసి ఆదర్శంగా నిలపాలన్నారు. రేవంత్రెడ్డి ముఖ్యమంత్రి అయితే ఈ ప్రాంతం అన్ని రంగాల్లోనూ పురోగతి సాధిస్తుందని ప్రజలు నమ్మి ఓట్లు వేశారని అన్నారు. రేవంత్రెడ్డి సీఎం అయిన తర్వాత కొడంగల్కు ప్రభుత్వ మెడికల్ కళాశాలను మంజూరు చేశారని తెలిపారు. భవన నిర్మాణం కోసం అప్పాయిపల్లిలో రైతుల నుంచి 50 ఎకరాలకు పైగా భూమిని సేకరించారని పేర్కొన్నారు. పక్కనే జాతీయ రహదారి ఉందన్నారు. విద్యార్థులు, అధ్యాపకులు, రోగులు రాకపోకలు సాగించడానికి అనుకూలంగా ఉంటుందన్నారు. కొడంగల్కు మంజూరైన మెడికల్ కళాశాలను లగచర్లకు తరలిస్తున్నారని ఆరోపించారు. కేడీపీ జేఏసీ ఆధ్వర్యంలో గురువారం తలపెట్టిన కొడంగల్ బంద్కు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఉడిమేశ్వరం మధు, రుద్రారం మధుసూదన్రెడ్డి, నవాజొద్దీన్, సముద్రమ్మ తదితరులు పాల్గొన్నారు. బంద్కు సహకరించాలి: కేడీపీ జేఏసీ కొడంగల్ అభివృద్ధి పరిరక్షణ ఐక్య కార్యాచరణ కమిటీ (కేడీపీ జేఏసీ) ఆధ్వర్యంలో గురువారం తలపెట్టిన పట్టణ బంద్కు సహకరించాలని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఎంఈఓ రాంరెడ్డికి బుధవారం వినతిపత్రం సమర్పించారు. అనంతరం జిల్లా సహాయ కార్యదర్శి అనిల్ మాట్లాడుతూ.. ప్రభుత్వ మెడికల్ కళాశాల, యంగ్ ఇండియా ఇంటిగ్రేటేడ్ గురుకులాలను లగచర్లకు తరలించడాన్ని నిరసిస్తూ బంద్ పాటించనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలకు సెలవు ప్రకటించాలని కోరారు. కొడంగల్ బంద్కు అన్ని వర్గాల ప్రజలు మద్దతు ఇస్తున్నారని తెలిపారు. కుల మత వర్గ భేదం లేకుండా అందరి సహకారం ఉందన్నారు. కొడంగల్కు మంజూరు చేసిన ప్రభుత్వ మెడికల్ కళాశాలను, గురుకులాలను కొడంగల్ శివారులోనే నిర్వహించాలని, అక్కడే భవనాలు నిర్మించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ముందుగా ప్రకటించినట్లుగా మున్సిపల్ పరిధిలోని పాత కొడంగల్ గ్రామ శివారులో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాల, మండల పరిధిలోని ఎరన్పల్లి గ్రామ శివారులో మెడికల్ కళాశాలను నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో నాయకులు శ్రీనివాస్, మారుతి తదితరులు పాల్గొన్నారు. -
వేట.. తూటా !
గురువారం శ్రీ 16 శ్రీ అక్టోబర్ శ్రీ 2025వన్య ప్రాణులపై వేటగాళ్ల గురి యాలాల: మండలంలోని బాణాపూర్, అడాల్పూర్ పరిధిలోని రిజర్వ్ ఫారెస్టులో వన్య ప్రాణుల వేట సాగుతోంది. మంగళవారం బాణాపూర్ శివారులో ఓ వ్యక్తి కరెంటు షాక్తో మృతి చెందగా అతని వద్ద నాటు తుపాకీ లభించింది. దీంతో వేటగాళ్ల సంచారం మళ్లీ తెరపైకి వచ్చింది. గతంలో ఇదే ప్రాంతంలో బుల్లెట్ మ్యాగ్జిన్, తపంచా లభించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కొన్ని రోజుల పాటు స్తబ్దుగా ఉన్న ఈ వ్యవహారం తాజాగా నాటుతుపాకీ లభించడంతో ఆందోళన కలిగిస్తోంది. వన్య ప్రాణుల వేట జరుగుతుందనే దానికి బలం చేకూర్చుతోంది. వారాంతపు సెలవుల్లో.. బాణాపూర్, అడాల్పూర్ పరిధిలో భారీగా రిజర్వ్ ఫారెస్టు ఉంది. ఈ ప్రాంతంలో ఎక్కువగా దుప్పిలు, అడవి పందులు, కుందేళ్లు, నెమళ్లు, నక్కలు, అటవీ పిల్లులు(జంగ పిల్లి) ఉన్నాయి. వారాంతపు రోజులతో పాటు వరుసగా వచ్చే సెలవు రోజుల్లో వేటగాళ్లు వేటకు వస్తుంటారు. తాండూరుతో పాటు హైదరాబాద్, వికారాబాద్ లాంటి ప్రాంతాల నుంచి అపరిచిత వ్యక్తులు వస్తుంటారని స్థానికులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో స్థానికుల సాయంతో వన్య ప్రాణులను వేటాడుతున్నట్లు తెలిసింది. కొందరూ సరదా కోసం వస్తుండగా.. మరికొందరూ వన్య ప్రాణుల మాంసం విక్రయించడానికి వేట కొనసాగిస్తున్నట్లు సమాచారం. తరచూ లభిస్తున్న ఆయుధాలు 2018లో అడాల్పూర్ పరిధిలోని అటవీ ప్రాంతంలో పశువుల కాపరికి బుల్లెట్ మ్యాగ్జిన్ లభించగా, అదే ఏడాది ఉపాధి పనులు చేస్తున్న కూలీలకు తపంచా దొరకడం చర్చనీయాంశంగా మారింది. అటవీ ప్రాంతంలో వేట కోసం వచ్చిన వారు ప్రమాదవశాత్తు ఆయుధాలు పొగొట్టుకున్నట్లు తెలిసింది. తాజాగా మంగళవారం లభించిన నాటుతుపాకీతో ఈ ప్రాంతంలో విచ్చలవిడిగా వేట సాగుతుందనే ప్రచారం జరుగుతోంది. పొలాలకు కరెంటు తీగలు పంటలను రక్షించుకునేందుకు అటవీ ప్రాంతంలో పట్టా భూములతో పాటు పోడుభూములు కలిగిన రైతులు పొలాల చుట్టూ తీగను ఏర్పాటు చేసి కరెంటు సరఫరా చేస్తున్నారు. ఈ క్రమంలో అనేక సార్లు వన్యప్రాణులతో పాటు మనుషుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నారు. అటవీ ప్రాంతంలో వేటకు వెళ్లిన వ్యక్తి ప్రమాదవశాత్తు ఇటువంటి తీగకు తగిలి ప్రాణాలు కోల్పోయాడు. అటు వేటగాళ్లతో పాటు అటవీ ప్రాంతంలో బీట్లకు తిరిగే ఫారెస్టు అధికారులకు ఈ ముప్పు పొంచి ఉంది. ఈ విషయంలో అధికారులు రైతులకు అవగాహన కల్పించి తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. తాజాగా లభించిన నాటు తుపాకీ గతంలో బాణాపూర్ అటవీ ప్రాంతంలో లభించిన బుల్లెట్ మ్యాగ్జిన్, తపంచా తాజాగా ఇదే గ్రామ శివారులో మృతి చెందిన వ్యక్తి వద్ద నాటు తుపాకీ ఆందోళన రేపుతున్న ఘటనలుఅడాల్పూర్, బాణాపూర్ ఫారెస్టు ఏరియాల్లో ఏడాది కాలంగా వేట పట్ల కఠినంగా ఉంటున్నాం. ఈ విషయమై ఇటీవల బాణాపూర్లో జిల్లా అధికారితో అవగాహన కార్యక్రమం నిర్వహించాం. అయినా అన్నసాగర్ వాసి వద్ద నాటు తుపాకీ లభించింది. ఈ ఘటనపై విచారణ చేపట్టాం. యాలాల పోలీసుల సహకారంతో అనుమానితుల వద్ద ఆయుధాలు ఉంటే, వారి విషయంలో కఠినంగా వ్యవహించేలా ముందుకెళ్తాం. – రాజేందర్, ఫారెస్టు రేంజ్ ఆఫీసర్ -
ధాన్యం సేకరణకు ఏర్పాట్లు
చిరుధాన్యాలతో ఆరోగ్యం చిరుధాన్యాలతో కూడిన ఆహారం తీసుకుంటే సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుందని ఎంపీడీఓ రాములు పేర్కొన్నారు.● కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు లేకుండా చూస్తాం ● కలెక్టర్ ప్రతీక్జైన్అనంతగిరి: జిల్లాలో ధాన్యం సేకరణకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. బుధవారం నగరం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్ రావు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ధాన్యం సేకరణపై సమీక్ష నిర్వహించారు. అనంతరం కలెక్టర్ జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో 1.52 లక్షల ఎకరాల్లో వరి పంట సాగు చేశారని, 3,84,800 మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేశామన్నారు. 129 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. రవాణా పరమైన ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు చేపట్టినుట్లు వివరించారు. ధాన్యం విక్రయించిన 24 గంటల లోపే ట్యాబ్ ఎంట్రీ జరిగేలా ఏర్పాట్లు చేశామన్నారు. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను కూడా అందుబాటులో ఉంచుతామన్నారు. కేంద్రాల వద్ద రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. వీడియో కాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్, ట్రైనీ కలెక్టర్ హర్ష్ చౌదరి, డీఆర్డీఓ శ్రీనివాస్, డీఎస్ఓ సుదర్శన్, సివిల్ సప్లయ్ డీఎం మోహన్ కృష్ణ,, జిల్లా వ్యవసాయాధికారి రాజరత్నం, డీసీఓ నాగార్జున, లీగల్ మెట్రోలజీ అధికారి ప్రవీణ్ కుమార్, మార్కెటింగ్ శాఖ జిల్లా అధికారి సారంగపాణి తదితరులు పాల్గొన్నారు. ఇళ్లు కోల్పోయిన వారికి పరిహారం కొడంగల్ పట్టణంలోని శ్రీ మహాలక్ష్మి వేంకటేశ్వర స్వామి ఆలయ విస్తరణలో భాగంగా ఇండ్లు కోల్పోతున్న వారితో బుధవారం కలెక్టర్ ప్రతీక్ జైన్ సమావేశమయ్యారు. ఆలయ విస్తరణ కోసం సుమారు 8వేల గజాల భూమి సేకరించడం జరిగిందన్నారు. ఇళ్ల విలువను బట్టి నష్టపరిహారం తోపాటు ఆర్అండ్ఆర్ ప్యాకేజీ చెల్లించడం జరుగుతుందన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్, డీఆర్ఓ మంగీలాల్, కడా ప్రత్యేక అధికారి వెంకట్రెడ్డి, ఆర్అండ్బీ ఈఈ శ్రీధర్రెడ్డి, మున్సిపల్ కమిషనర్ బలరాం నాయక్, ఆలయ ఈఓ రాజేందర్ రెడ్డి, తహసీల్దార్ రాంబాబు, జీ సెక్షన్ సూపరింటెండెంట్ నఫీజ్ పాతిమా తదితరులు పాల్గొన్నారు. -
నేడు పోషణ మాసోత్సవాలు
కొడంగల్: ఐసీడీఎస్ ఆధ్వర్యంలో గురువారం ఉదయం 10 గంటల నుంచి పట్టణంలోని మురహరి పంక్షన్ హాల్లో పోషణ మాసోత్సవాలు నిర్వహించనున్నట్లు సీడీపీఓ రూప బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 16వరకు రాష్ట్రీయ పోషణ మాసం జరిగిందన్నారు. చివరి రోజు ఉత్సవాలు కొడంగల్లో నిర్వహించనున్నట్లు తెలిపారు. షాద్నగర్రూరల్: రీజినల్ రింగ్రోడ్డు (ట్రిపుల్ఆర్)ను పాత అలైన్మెంట్ ప్రకారమే నిర్మించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్య డిమాండ్ చేశారు. పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయం ఎదురుగా బుధవారం పార్టీ డివిజన్ కార్యదర్శివర్గ సభ్యుడు శ్రీనునాయక్ ఆధ్వర్యంలో ట్రిపుల్ఆర్ భూ నిర్వాసితులు రిలే దీక్షలు చేపట్టారు. దీక్షలకు మద్దతు తెలిపిన యాదయ్య మాట్లాడుతూ.. వందల ఎకరాల భూస్వాముల భూముల్లో కాకుండా పేద, చిన్న, సన్నకారు రైతుల భూములను ఆక్రమిస్తూ రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణం చేపట్టడం దారుణమని విమర్శించారు. పేద రైతుల భూములు లాక్కుంటే అడిగేవారు ఉండరనే ఆలోచనతో రేవంత్రెడ్డి సర్కార్ ట్రిపుల్ఆర్ అలైన్మెంట్ను మార్చిందని ఆరోపించారు. సీపీఎం డివిజన్ కార్యదర్శి రాజు మాట్లాడుతూ.. ప్రభుత్వ నిర్ణయంతో అనేక మంది పేద రైతులు తమ విలువైన భూములను కోల్పోతారని ఆవేదన వ్యక్తం చేశారు. వారికి అన్యాయం చేయాలని చూస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. కార్యక్రమంలో భూ నిర్వాసితులు పూజారి లక్ష్మయ్య, రమేష్, చంద్రకాంత్, నగేష్, సుదర్శన్రెడ్డి, శ్రీకాంత్, మహ్మద్బాబు, కుర్మయ్య, ఈశ్వర్, రాజు, బొజ్జనాయక్, రాజేష్, లక్ష్మణ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
పర్యాటకుల భద్రతే లక్ష్యం
అనంతగిరి: పర్యాటకుల భద్రతే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ నారాయణ రెడ్డి తెలిపారు. బుధవారం వికారాబాద్లోని ఎస్పీ కార్యాలయ ఆవరణలో జిల్లా ఫారెస్ట్ ఆఫీసర్ జ్ఞానేశ్వర్తో కలిసి ఇటీవల టూరిస్ట్ పోలీస్ అధికారులుగా శిక్షణ పొందిన వారితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు ప్రభు త్వం చర్యలు చేపట్టిందన్నారు. ఇందులో భాగంగా టూరిస్ట్ పోలీస్ వ్యవస్థను తొలిసారిగా ప్రవేశపెట్టిందన్నారు. జిల్లాకు చెందిన 10మంది పోలీసులు శిక్షణ పొందినట్లు తెలిపారు. వీరు ప్రముఖ పర్యాటక కేంద్రాలైన అనంత పద్మనాభ స్వామి దేవాలయం, అనంతగిరి అటవీ ప్రాంతం, కోట్పల్లి రిజర్వాయర్, బుగ్గ వంటి ప్రాంతాల్లో అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు. ఎస్పీ నారాయణరెడ్డి -
బషీరాబాద్ ఎస్ఐని సస్పెండ్ చేయాలి
● దాడి చేసిన వారిపై ఫిర్యాదు చేస్తే బాధితుడిపై కేసు పెడతారా? ● న్యాయం జరిగే వరకు ఆందోళన చేస్తాం ● రాష్ట్ర దివ్యాంగుల సంఘం అధ్యక్షుడు జంగయ్య బషీరాబాద్: దాడి చేసిన వ్యక్తులపై అర్ధరాత్రి 100 కాల్ చేసి ఫిర్యాదు చేస్తే బషీరాబాద్ పోలీసులు బాధితుడిపై కేసు పెట్టడం విడ్డూరంగా ఉందని దివ్యాంగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కాల జంగయ్య పేర్కొన్నారు. ఎస్ఐ నుమాన్అలీని వెంటనే విధుల్లో నుంచి సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేశారు. లేందటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడుతామని హెచ్చరించారు. మంగళవారం బాధితులైన సిహెచ్ రాజు, అర్చన దంపతులు, దివ్యాంగులతో కలిసి బషీరాబాద్ పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు. దామర్చెడ్ గ్రామంలో సెప్టెంబర్ 30 అర్ధరాత్రి బోయిని వెంకటయ్య అనే వ్యక్తి రాజు, అర్చన దంపతులను దూశిస్తూ దాడి చేశాడని, అదే రోజు రాత్రి 100కి కాల్ చేసి ఫిర్యాదు చేసినట్లు, మరునాడు మధ్యాహ్నం కూడా కేసు పెట్టే వరకు స్పందించలేదని ఆయన మండిపడ్డారు. ఈ వ్యవహారంలో దాడి చేసిన వ్యక్తితో పోలీసులు కుమ్మకై ్క బాధితులపై కేసులు పెట్టి తమ నైజాన్ని చాటుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాళ్లులేని రాజు ఎలా దాడి చేస్తాడని ప్రశ్నించారు. ఈ కేసులో సాక్షాలు తారుమారు చేసి రాజుకుటుంబంపై పోలీసులు కక్షపూరితంగా వ్యవహరించారని ఆరోపించారు. ఎస్ఐను సస్పెండ్ చేసేవరకు వదలబోమని జంగయ్య హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో దివ్యాంగుల రాష్ట్ర కార్యదర్శి నాగార్జున, జిల్లా కార్యదర్శి రాజు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీనివాస్ చారి, మండల అధ్యక్షుడు ద్యావరి నర్సిములు, నాయకులు విజయ్కుమార్, నర్సిములు, ఎమ్మార్పీఎస్ జిల్లా ఇంచార్జి కిష్ట్ర, మండల అధ్యక్షుడు కొనగేరి నర్సిములు, అంజిలప్ప, కిష్టప్ప, సాయిలు, జర్నమ్మ, రవికుమార్, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ఆరోగ్య సంరక్షణకు ప్రత్యేక చర్యలు
షాద్నగర్: చిన్నారులు, గర్భిణులు, బాలింతల ఆరోగ్య సంరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందని డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ విజయలక్ష్మి అన్నారు. పోషణ్ అభియాన్ మహోత్సవంలో భాగంగా మంగళవారం ఫరూఖ్నగర్ మండల పరిధిలోని చించోడ్ జెడ్పీహెచ్ఎస్లో ఐసీడీఎస్ సూపర్వైజర్ విజయలక్ష్మి ఆధ్వర్యంలో చిన్నారుల తల్లులకు, బాలింతలు, గర్భిణులకు పౌష్టికాహారంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ విజయలక్ష్మి మాట్లాడుతూ.. పౌష్టిక విలువలతో కూడిన ఆహారం తీసుకుంటే రోగనిరోధక శక్తి, జ్ఞాపకశక్తి పెరుగుతుందని చెప్పారు. ప్రొటీన్లు, విటమిన్లు, కార్బొహైడ్రేట్లు ఉన్న ఆహారాన్ని తీసుకోవాలన్నారు. తల్లిదండ్రులు చిన్నారుల ఆరోగ్య సంరక్షణలో నిర్లక్ష్యంగా వ్యవహించొద్దని సూచించారు. చిన్నారులకు ఏ చిన్న సమస్య వచ్చినా వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించాలని అన్నారు. ప్రతీ ఒక్కరు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలన్నారు. ఎంఈఓ మనోహర్ మాట్లాడుతూ.. విద్యార్థులు క్రమశిక్షణతో కూడిన విద్యను అభ్యను అభ్యసించి భవిష్యత్లో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని అన్నారు. ఈ సందర్భంగా చిన్నారులకు అన్న ప్రాసన, గర్భిణులకు సామూహిక సీమంతం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సవ్రంతి, హెల్త్ ఎడ్యుకేటర్ శ్రీనివాసులు, హెచ్ఎం రాంచందర్, ఎన్జీఓ సభ్యులు నవ్య, తులసి, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ విజయలక్ష్మి -
విభజన హామీలు అమలు చేయాలి
కొడంగల్: కేంద్ర ప్రభుత్వం విభజన హామీలను అమలు చేయాలని రివాల్యూషనరి విద్యార్థి సంఘం (ఆర్ఎస్యూ) జాతీయ అధ్యక్షుడు రవిశంకర్రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం కొడంగల్లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రాల విభజన సందర్భంగా అప్పటి కేంద్ర ప్రభుత్వం రెండు రాష్ట్రాలకు నిధులు, నియామకాల్లో సమాన న్యాయంతో పాటు రెండు ప్రాంతాల అభివృద్ధికి అనేక హామీలు ఇచ్చారని గుర్తు చేశారు. విభజన సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉందని, ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వం నిధులు కేటాయించడంలో జాప్యం చేస్తుందని విమర్శించారు. రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలను ఓటర్లుగానే చూస్తున్నారని విమర్శించారు. ఆర్ఎస్యూ ఆధ్వర్యంలో ఢిల్లీ వేదికగా రెండు రాష్ట్రాల విద్యార్థులతో కలిసి ఆందోళన చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు భీమరాజు, శ్రీనివాస్, మహేశ్, వెంకటేశ్, అశోక్, రాము తదితరులు పాల్గొన్నారు.ఆర్ఎస్యూ జాతీయ అధ్యక్షుడు రవిశంకర్రెడ్డి -
స్నానానికి వెళ్లి.. నీట మునిగి
బొంరాస్పేట: వివాహ వేడుకకు వచ్చిన ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు నీట మునిగి మృతిచెందాడు. ఈ ఘటన మండల పరిధిలోని బురాన్పూర్లో మంగళవారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. గత ఆదివారం గ్రామానికి చెందిన అర్షద్పాషా పెళ్లి జరిగింది. గోల్కొండలో ప్లంబింగ్ పని చేసే నాసిరొద్దీన్(41) తన భార్యాపిల్లతో కలిసి సోమవారం నిర్వహించిన వలీమా ఫంక్షన్కు వచ్చారు. మంగళవారం మధ్యాహ్నం పెళ్లి కొడుకుతో పాటు తన కుటుంబ సభ్యులతో కలిసి నాసిరొద్దీన్ గ్రామ శివారులోని పెద్ద వాగు ప్రాజెక్టులో స్నానానికి వెళ్లారు. ఈత రాకపోవడంతో నీట మునిగి చనిపోయాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ బాలవెంకటరమణ తెలిపారు. పెళ్లికి వచ్చిన వ్యక్తి మృత్యువాత -
మార్కెట్ సౌకర్యం కల్పించండి
గతంలో మేము పత్తి, మొక్కజొన్న పంటలను సాగు చేసేవాళ్లం. వరుసగా నష్టాలే రావడంతో పూలు, కూరగాయలు సాగు చేస్తున్నాం. స్థానికంగా మార్కెట్ సౌకర్యం లేకపోవడంతో సమీప పట్టణాలు, హైదరాబాద్కు తరలించి, విక్రయిస్తున్నాం. అధికారులు మార్కెట్ సౌకర్యం కల్పిస్తే మేలు జరుగుతుంది. – బంటు పార్వతమ్మ, బొంపల్లి ఎకరం భూమిలో సాగు చేశాం వాణిజ్య పంటలతో నష్టాలు రావడంతో బంతి పూలు సాగు చేశాం. ఎకరం భూమిలో పసు పు, ఎరుపు రంగు బంతి సాగు చేశాం. ఎకరానికి రూ.30 వేలు ఖర్చు వచ్చింది. పెట్టుబడి పోనూ రూ.70 వేల వరకు ఆదాయం వస్తుందని ఆశిస్తున్నాం. తోట వద్దే పూలు విక్రయిస్తున్నాం. – ఎల్.కిష్టమ్మ, మల్లేపల్లి -
కేజీబీవీలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం
బంట్వారం: కేజీబీవీలో ఉద్యోగాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఎంఈఓలు చంద్రప్ప, వెంకటేశ్వర్రావు పేర్కొన్నారు. కోట్పల్లి, బంట్వారం మండల కేంద్రాల్లోని కేజీబీవీ వసతి గృహాల్లో క్రింద తెలిపిన ఉద్యోగ నియామకాలు చేపడుతున్నట్లు వారు మంగళవారం వేర్వేరు ప్రకటనలో పేర్కొన్నారు. కోట్పల్లి కేజీబీవీలో స్వీపర్ (1), స్కావెంజర్ (1) ఉన్నాయని, బంట్వారం కేజీబీవీలో స్వీపర్ (1), స్కావెంజర్ (1) ఖాళీలు ఉన్నట్లు తెలిపారు. ఏడవ తరగతి పాసై అదే మండలానికి చెందిన మహిళలు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కనీస వయస్సు 18 నుంచి 45 ఏళ్లలోపు ఉండాలని పేర్కొన్నారు. ఆసక్తిగల అర్హులైన మహిళలు ఈ నెల 14వ తేదీ నుంచి 18 వరకు సంబంధిత ఎస్ఓలను సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగ మహిళలు సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. ఇసుక టిప్పర్ల పట్ట్టివేత కేసు నమోదు పరిగి: అక్రమంగా ఇసుక తరలిస్తున్న టిప్పర్లను స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించిన సంఘటన పరిగి పట్టణ కేంద్రంలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎ లాంటి అనుమతులు లేకుండా పట్టణ కేంద్రానికి ఫిల్టర్ ఇసుక తరలిస్తుండగా రెండు టిప్పర్లను స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. దీంతో పోలీసులు టిప్పర్లను సీజ్ చేసి కేసు నమోదు చేసినట్టు సమాచారం. ఈ ఘటనపై ఎస్ఐ మోహన క్రిష్ణను వివరణ కోరగా స్పందించలేదు. రివార్డు అందజేత దుద్యాల్: తప్పిపోయిన మహిళలను పట్టుకున్న కేసులో దుద్యాల్ పోలీస్ స్టేషన్ సిబ్బందిలో ఇద్దరికి మంగళవారం రివార్డు అందజేశారు. వివరాలు ఇలా ఉన్నాయి.. మండల పరిధిలోని పోలేపల్లి గ్రామానికి చెందిన కొత్తూర్ బాలమణి ఈ నెల 5న తప్పిపోయింది. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు రెండు రోజుల క్రితం ఆమె ఆచూకీ తెలుసుకుని వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ కేసులో చాకచక్యంగా వ్యవహరించిన కానిస్టేబుల్ అమృత, శంకర్లను ఎస్ఐ యాదగిరి అభినందించారు. అనంతరం వారికి రూ. వెయ్యి చొప్పున ప్రోత్సాహక నగదు బహుమతి అందజేశారు. పంచాయతీ ట్రాక్టర్ నుంచి బ్యాటరీ చోరీ నందిగామ: పార్క్ చేసిన చాకలిదాని గుట్టతండా గ్రామ పంచాయతీ ట్రాక్టర్ నుంచి గుర్తు తెలియని దుండగులు సోమవారం అర్ధరాత్రి బ్యాటరీ చోరీ చేశారు. కారోబార్ శ్రీనివాస్ తెలిపిన ప్రకారం.. సోమవారం గ్రామంలో పనులు చేసిన తర్వాత సాయంత్రం పంచాయతీ కార్యాలయం ఆవరణలో ట్రాక్టర్కు తాళం వేసుకుని వెళ్లారు. మంగళవారం ఉదయం ట్రాక్టర్ తీసుకెళ్లేందుకు వెళ్లగా బ్యాటరీ చోరీ విషయం గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. గతంలో ఇదే పంచాయతీలో పలుమార్లు దొంగలు పడ్డారు. ఇప్పటికై నా పోలీసులు దర్యాప్తు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
ఆలయాల అభివృద్ధికి ‘ఐక్యత’ సహకారం
ఆమనగల్లు: ఆలయాల అభివృద్ధికి ఐక్యత ఫౌండేషన్ ఆర్థిక సహకారం అందిస్తుందని ఐక్యత ఫౌండేషన్ చైర్మన్, టాస్క్ సీఈఓ సుంకిరెడ్డి రాఘవేందర్రెడ్డి అన్నారు. తలకొండపల్లి మండలం ఖానాపూర్ పరిధిలోని కర్కస్తండాలో మంగళవారం సుంకిరెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా సుంకిరెడ్డిని ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు. అనంతరం సుంకిరెడ్డి రాఘవేందర్రెడ్డి మాట్లాడుతూ.. విద్య, వైద్యం, ఉపాధి లక్ష్యాలుగా ఐక్యత ఫౌండేషన్ పనిచేస్తుందని చెప్పారు. అలాగే ఐక్యత ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆలయాల పునరుద్ధరణ, అబివృద్ధి, నూతన ఆలయాల నిర్మాణం కోసం ఆర్థికసహాకారం అందిస్తున్నామని వివరించారు. కల్వకుర్తి నియోజక వర్గంలో ఇప్పటివరకు 160 ఆలయాల అభివృద్ధికి సాయం అందించామని ఆయన గుర్తుచేశారు. కర్కస్తండాలో ముత్యాలమ్మ ఆలయ నిర్మాణానికి అవసరమైన ఆర్థికసాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ వెంకట్రాంరెడ్డి, నాయకులు శంకర్నాయక్, నర్సింహ, రవి, కరుణాకర్రెడ్డి, గోపాల్నాయక్, శ్రీను, శివాజీ, మల్లేశ్, రాజేందర్, నార్య, సంతోశ్, కృష్ణ, బాలకోటి, దేవేందర్, శంకర్, రాజు తదితరులు పాల్గొన్నారు. టాస్క్ సీఈఓ సుంకిరెడ్డి రాఘవేందర్రెడ్డి -
వేటకు వెళ్లిన వ్యక్తి మృత్యువాత
● పంటకు ఏర్పాటు చేసిన విద్యుత్ కంచెకు తగిలి దుర్మరణం ● బాణాపూర్ శివారులో ఘటన యాలాల: అటవీ ప్రాంతంలో వేటకు వెళ్లిన వ్యక్తి.. ఓ పంట పొలానికి రక్షణగా ఏర్పాటు చేసిన విద్యుత్ కంచెకు తగిలి అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ సంఘటన మంగళవారం బాణాపూర్ శివారులో వెలుగు చూసింది. ఎస్ఐ విఠల్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని అన్నసాగర్ గ్రామానికి చెందిన గురుదొట్ల శేఖర్(40) ఈనెల 9న బాణాపూర్కు చెందిన పెంట్యానాయక్తో కలిసి వేటకు వెళ్లి తిరిగిరాలేదు. ఈ విషయమై సోమవారం అతని భార్య కవిత యాలాల పోలీసులకు ఫిర్యాదు చేసింది. మంగళవారం ఉదయం బాణాపూర్ పరిధి సర్వే నంబరు 52లోని నీరటి షాకప్ప, నీరటి రాజుకు చెందిన పొలాలకు ఏర్పాటు చేసిన విద్యుత్ కంచెకు తగిలి శేఖర్ చనిపోయిట్లు గుర్తించారు. మృతదేహం వద్ద నాటు తుపాకీతో పాటు టార్చిలైట్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇదిలా ఉండగా తాను, శేఖర్ కలిసి మద్యం తాగామని, అనంతరం తాను ఇంటికి వెళ్లిపోగా, శేఖర్ ఒక్కడే వేటకు వెళ్లాడని పెంట్యానాయక్ చెబుతున్నట్లు తెలిసింది. విచారణ అనంతరం శేఖర్ మృతికి కారణమైన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ విఠల్రెడ్డి తెలిపారు. -
రేపు కొడంగల్ బంద్
కొడంగల్: కొడంగల్కు మంజూరు చేసిన ప్రభుత్వ మెడికల్ కళాశాల, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ గురుకులాలను లగచర్లకు తరలిస్తున్నారని నిరసిస్తూ గురువారం కొడంగల్ అభివృద్ధి పరిరక్షణ ఐక్య కార్యాచరణ కమిటీ బంద్కు పిలుపు నిచ్చారు. దీనికి ప్రజలు స్వచ్ఛందంగా సహకరించాలని కేడీపీ జేఏసీ కన్వీనర్ కొట్రికె లక్ష్మీనారాయణ గుప్తా, కో కన్వీనర్లు గంటి సురేశ్, ఎరన్పల్లి శ్రీనివాస్, పవన్కుమార్ తెలిపారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలను, గురుకులాలను కొడంగల్ శివారులోనే నిర్మించాలని వారు కోరారు. గోదాం నిర్మాణానికి భూమి కేటాయింపు దుద్యాల్: మండల కేంద్రంలో గోదాం ఏర్పాటుకు పదెకరాల ప్రభుత్వ భూమిని తహసీల్దార్ కిషన్ మంగళవారం కేటాయించారు. రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ రీజినల్ మేనేజర్ వేణుగోపాల్, మేనేజర్ విజయ్ కుమార్తో కలిసి కృష్ణగిరి దేవాలయ సమీపంలోని సర్వే నంబర్ 191లో పదెకరాలు గుర్తించి హద్దులు నిర్ధారించారు. అనంతరం అందుకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలను సంబంధిత అధికారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ నవీన్ కుమార్, రెవెన్యూ కార్యాలయ సిబ్బంది నర్సిములు, గిడ్డంగుల కార్పొరేషన్ కార్యాలయ సిబ్బంది మహేశ్ కుమార్, కొడంగల్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఆకారం వేణుగోపాల్, కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి మేరుగు వెంకటయ్య, పీఏసీఎస్ డైరెక్టర్ ఖలీల్ పాషా, నాయకులు శ్రీశైలం గౌడ్, ఖాజా, సత్యనారాయణ, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. పార్టీ కోసం పనిచేసే వారికి పదవులు పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి కుల్కచర్ల: పార్టీ కోసం కష్టపడి పని చేసేవారికి ఖచ్చితంగా పదవులు లభిస్తాయని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం కుల్కచర్ల మండల కేంద్రంలో డీసీసీ ఎన్నికకు ఏఐసీసీ ఇన్చార్జి సూరజ్సింగ్ ఠాగూర్ ఆధ్వర్యంలో పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పేదల పార్టీయని, పార్టీ అభ్యున్నతికి కృషిచేసేవారికే గుర్తింపు లభిస్తుందన్నారు. కల్యాణం కమనీయం వైభవంగా లక్ష్మినరసింహాస్వామి వార్షికోత్సవం పరిగి: పట్టణ కేంద్రంలోని లక్ష్మినరసింహాస్వామి వార్షికోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. రెండు రోజులుగా నిర్వహిస్తున్న ఉత్సవాలకు పలు గ్రామాల నుంచి భక్తులు అఽధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. మంగళవారం స్వామి వారి కల్యాణాన్ని వేద పండితులు కనుల పండుగగా నిర్వహించారు. అనంతరం స్వామి వారికి లక్ష్మిసమేతంగా పట్టణ కేంద్రంలోని పుర వీధుల గుండ పల్లకీ సేవా నిర్వహించారు. -
లాభాల పూబంతి
● ఉద్యాన పంటల వైపు మొగ్గు చూపుతున్న మహిళా రైతులు ● దీపావళికి పూలు కోసేందుకు ఏర్పాట్లు ● మార్కెట్ సౌకర్యం కల్పించాలని అభ్యర్థన దోమ: పూల సాగుతో పలువురు రైతులు లాభాలను ఆర్జిస్తున్నారు. బతుకమ్మ, దసరా, దీపావళి, కార్తీక పౌర్ణమి పర్వదినాలను దృష్టిలో ఉంచుకుని తోటలు సాగు చేశారు. సంప్రదాయ పంటల సాగుతో ఏటా నష్టాల పాలవుతున్న కొంతమంది దోమ మండల పరిధిలోని పలు గ్రామాల్లో పూలు, కూరగాయల సాగుకు మొగ్గు చూపుతున్నారు. కొన్నేళ్లుగా వాణిజ్య పంటలు వేసిన రైతులు వరుస ప్రకృతి వైపరిత్యాలతో తీవ్రంగా నష్టపోయారు. అతివృష్టి, అనావృష్టికి తోడు చీడపీడల బెడద ఎక్కువ కావడంతో ఇప్పుడిప్పుడే ఉద్యాన పంటలవైపు మళ్లుతున్నారు. వీరు సాగు చేసిన బంతి, చేమంతి పూలను దీపావళికి విక్రయించేందుకు సిద్ధమవుతున్నారు. ఎక్కడికక్కడే అమ్మకం మండలంలోని మల్లేపల్లి, దిర్సంపల్లి, దాదాపూర్, బొంపల్లి తదితర గ్రామాల రైతులు బంతిపూలు, కూరగాయల సాగు వైపు దృష్టి సారిస్తున్నారు. పరిగి పట్టణంతో పాటు హైదరాబాద్ నగరానికి తీసుకెళ్లి విక్రయిస్తున్నారు. ప్రభుత్వం రాయితీపై నారు సరఫరా చేయడంతో పాటు మార్కెట్ సౌకర్యం కల్పించాలని కోరుతున్నారు. దూర భారంతో ఇబ్బందులు సాగు చేసిన బంతి పూలను పరిగి, హైదరాబాద్, షాద్నగర్ తీసుకెళ్లి విక్రయిస్తున్నాం. దూర భారంతో ఇబ్బందులు పడాల్సి వస్తోంది. సీజన్లో ధర పలికినా పండుగలు ముగిసిన తర్వాత కొనుగోళ్లు ఉండవు. స్థానికంగా మార్కెట్ వసతి కల్పిస్తే ఖర్చు తగ్గుతుంది. – డి.పద్మమ్మ, మల్లేపల్లి -
మహిళా సంఘాలను బలోపేతం చేయాలి
తాండూరు రూరల్: జిల్లాలో మహిళా సంఘాలను బలోపేతం చేయాలని అడిషనల్ డీఆర్డీఓ నర్సిములు పేర్కొన్నారు. మంగళవారం తాండూరు ఎంపీడీఓ కార్యాలయంలో ఆయా మండలాల ఐకేపీ సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నర్సిములు మాట్లాడుతూ.. ఏపీఏంలు, సీసీలు గ్రామాల్లో ఎప్పటికప్పుడు మహిళా సంఘాలతో సమావేశం నిర్వహించాలన్నారు. ఆయా మండలాలకు ఇచ్చిన బ్యాంక్ లింకేజీ రుణాల టార్గెట్ను పూర్తి చేయాలని సూచించారు. సీ్త్రనిధి రుణాలకు సంబంధించి గ్రౌండింగ్ చేయాలని ఆదేశించారు. మహిళా సంఘాల్లో మొండి బకాయిలను త్వరగా కట్టించాలన్నారు. ఈ కార్యక్రమంలో డీపీఏంలు శేఖర్, నర్సిములు, మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు జానకీ, ఆయా మండలాల ఏపీఏం, సీసీలు పాల్గొన్నారు. అడిషనల్ డీఆర్డీఓ నర్సిములు -
‘ఇంటి పర్మిషన్కు డబ్బులు డిమాండ్’
దోమ: ఇంటి నిర్మాణానికి పర్మిషన్ ఇవ్వమని పంచాయతీ కార్యదర్శి వద్దకు వెళ్తే రూ.6 వేలు డిమాండ్ చేస్తున్నారని రాకొండకు చెందిన పిల్లి శ్యామలమ్మ ఆరోపించారు. ఇదే విషయాన్ని తాను కొద్ది రోజుల క్రితం ఎంపీడీఓ దృష్టికి తీసుకెళ్లి వినతిపత్రం అందజేశానని, అయినా సెక్రటరీ వ్యవహారం మారలేదని తెలిపారు. 40 గజాల స్థలంలో తాను నిర్మించుకుంటున్న ఇంటికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం రూ.2 వేలు అవుతుందని, కానీ రూ.6 వేలు అడుగుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. అధికారులు స్పందించి అనుమతి ఇప్పించాలని లేదంటే, మండల పరిషత్ కార్యాలయం ఎదుట ఆందోళన చేస్తానని హెచ్చరించారు. ఈ విషయమై ఎంపీడీఓ గ్యామాను వివరణ కోరగా, విచారణ అనంతరం చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
అంబేడ్కర్ స్ఫూర్తితో ముందుకు
అనంతగిరి: లండన్ నగరంలో బీఆర్ అంబేడ్కర్ నివసించిన గృహాన్ని మంగళవారం స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సందర్శించారు. అంబేడ్కర్ జ్ఞాపకార్థం ఆయన నివసించిన ఇంటని మ్యూజియంగా మార్చారు. అక్కడి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన ఉపయోగించిన లైబ్రరీని, పడక గదిని, ఫొటో గ్యాలరీని, వినియోగించిన వస్తువులను సందర్శించారు. విజిటర్స్ పుస్తకంలో తన అనుభవాలను రాశారు. ఈ ఇంటిని సందర్శించడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. ఆయన స్ఫూర్తితోనే ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. ఆయన వెంట శాసన పరిషత్ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్ ముదిరాజ్, లెజిస్లేటివ్ సెక్రటరీ డాక్టర్ వీ నర్సింహా చార్యులు, స్పీకర్ ఓఎస్డీ పీ వెంకటేశం, అధికారులు ఉన్నారు. -
నేవీలో మంచి అవకాశాలు
హుడాకాంప్లెక్స్: ‘డీజే షిప్పింగ్ సాగర్ మే సమ్మాన్’ కార్యక్రమంలో భాగంగా మంగళవారం సరూర్నగర్ వీఎంహోంలో స్కూల్ విద్యార్థులకు పదో తరగతి, ఇంటర్ తరువాత ఉద్యోగావకాశాలు అనే అంశంపై సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన డీజే షిప్పింగ్ నోడల్ ఆఫీసర్, ట్రైనింగ్ రెహమాన్ కళాశాల ప్రిన్సిపాల్ డా.అశుతోష్ కుమార్ ఆపండ్కర్ మాట్లాడుతూ.. పదో తరగతి, ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులకు మర్చంట్ నేవీలో అనేక ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని తెలిపారు. నేవీ రంగంలో మహిళలకు పెద్ద ఎత్తున అవకాశాలు కల్పించాలని, మహిళా సాధికారత సాధించే లక్ష్యంతో ముదుకు వెళ్తున్నామని అన్నారు. మర్చంట్ నేవీలో 10వ తరగతి తరువాత ఒక సంవత్సరం శిక్షణ ఉంటుందని, ఇంటర్ తరువాత మూడేళ్లు బీఎస్సీ డిగ్రీ చదివిన వెంటనే వంద శాతం ఉద్యోగాలు మంచి వేతనంతో దొరుకుతాయని చెప్పారు. ట్రైనింగ్ షిప్ రెహమాన్ మర్చంట్ నేవీ శిక్షణలో అనేక కోర్సులు అందిస్తోందని వివరించారు. తెలంగాణ రాష్ట్రం నుంచి మర్చంట్ నేవీలో విద్యార్థుల సంఖ్య పెరగాలని ఆకాంక్షించారు. మర్చంట్ నేవీలో ట్రైనింగ్ తీసుకుంటున్న విద్యార్థిని భీమగాని సత్య మాట్లాడుతూ.. విద్యార్థులు రొటీన్కు భిన్నంగా ఆలోచించాలని, ప్రత్యేక శిక్షణతో నేవీ రంగంలోకి అడుగు పెట్టాలని కోరారు. కార్యక్రమంలో అధ్యాపకులు మనీషా పాండే, వీఎంహోం ప్రిన్సిపాల్ పి.నర్సింహారెడ్డి, సూపరింటెండెంట్ లక్ష్మీపార్వతి, పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షుడు భీమగాని మహేశ్వర్ పాల్గొన్నారు. -
ఆర్పీఎఫ్ ఎస్ఐకి ఇండియన్ పోలీస్ మెడల్
అనంతగిరి: వికారాబాద్లోని ఆర్పీఎఫ్ సబ్ ఇన్స్పెక్టర్ జాలా సుధాకర్ ప్రతిష్టాత్మక ఇండియన్ పోలీస్ మెడల్ అందుకున్నారు. గుజరాత్లోని వలసాద్లో జరిగిన ఆర్పీఎఫ్ రైజింగ్ డే సందర్భంగా రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ చేతులమీదుగా అవార్డు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన సన్నిహితులతో పాటు జిల్లా ప్రజలు హర్షం వ్యక్తంచేస్తున్నారు. దరఖాస్తుల ఆహ్వానం అనంతగిరి: తాండూరు మార్కెట్ యార్డులో దడువాయిగా పని చేసేందుకు ఆసక్తి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలని మార్కెటింగ్ శాఖ జిల్లా అధికారి సారంగపాణి మంగళవారం ఒక ప్రకటన తెలిపారు. అర్హులైన 9 మందికి అవకాశం ఉన్నట్లు తెలిపారు. ఈ నెల 22వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. అభ్యర్థులు పదో తరగతి పూర్తి చేసి ఉండాలన్నారు. 35 సంవత్సరాల లోపు వారు మాత్రమే అర్హులని తెలిపారు. దరఖాస్తు తోపాటు విద్యార్హత, మెడికల్ ఫిట్నెస్, వయసు నిర్దారణ సర్టిఫికెట్లు జత చేయాలని సూచించారు. అభ్యర్థుల ఎంపిక కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఇతర వివరాల కోసం సెల్ నంబర్ 7330733618లో సంప్రదించాలని సూచించారు. గోవులను రక్షించుకుందాం ఇబ్రహీంపట్నం: గో సంతతిని కాపాడుకోవాలని, గోవులను రక్షించుకుంటేనే ప్రకృతి పరంగా జీవరాసులన్నింటికీ మంచి భవిష్యత్తు ఉంటుందని తెలంగాణ ప్రాంత గో సేవా ప్రముఖ్ వెంకట నివాస్జీ అన్నారు. జిల్లా స్థాయి గో విజ్ఞాన పరీక్షలను మంగళవారం ఇబ్రహీంపట్నంలోని త్రిశక్తి అలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గో సంతతి పెరిగితేనే భూసారం పెరుగుతుందని తెలిపారు. గోవుల పాల ఉత్పత్తులతోపాటు గో ఆధారిత వ్యవసాయం చేస్తే మనమంతా ఉండగలుగుతామన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పుడు 30 కోట్ల జనాభా, 80 కోట్లకు పైగా పశు సంతతి ఉండేదని చెప్పారు. ప్రస్తుతం 20 కోట్ల పశువులు మాత్రమే ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. పశుసంతతిని పెంపొందించుకునేందుకు, వాటిని రక్షించుకునేందుకు కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో విభాగ్, జిల్లా గో సేవా ప్రముఖులు వేణుగోపాల్, రచమళ్ల అబ్బయ్య, సుధాకర్రెడ్డి, బుగ్గవరపు రమేష్ పాల్గొన్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలి ఇబ్రహీంపట్నం: సీజేఐ గవాయ్పై దాడి అంటే రాజ్యాంగం, పార్లమెంట్, దేశం మొత్తంపై జరిగిన దాడిగా చూడాల్సిందేనని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. సీజేఐపై దాడిని నిరసిస్తూ కేవీపీఎస్ జిల్లా అధ్యక్షుడు సామెల్ అధ్యక్షతన మంగళవారం ఇబ్రహీంపట్నంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి సామెల్తోపాటు కార్యదర్శి ప్రకాశ్ కారత్, బీఎస్పీ నాయకుడు కొండ్రు రఘుపతి, తెలంగాణ ఉద్యమకారులు బోసుపల్లి వీరేష్కుమార్, రాములు, మారయ్య, పూసల సంఘం రాష్ట్ర నాయకుడు పురుషోత్తం, రజక సంఘం నాయకుడు ముదిగొండ అజయ్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దాడి చేసిన.. దాని వెనుకల ఉన్న నిందితులను కఠినంగా శిక్షిస్తేనే భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఉంటాయన్నారు. సమావేశంలో వెంకటేశ్, బండి సత్తయ్య, కాలె గణేశ్, కాళ్ల జంగయ్య, ఎం.రాజు, కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు. నేడు అసైన్డ్ భూములపై సమావేశం యాచారం: మండలంలోని మొండిగౌరెల్లి గ్రామానికి చెందిన సర్వే నంబర్ 19, 68, 127లోని అసైన్డ్, ప్రభుత్వ భూములపై గ్రామ రైతులతో బుధవారం సమావేశం ఉంటుందని తహసీల్దార్ అయ్యప్ప తెలిపారు. మండల తహసీల్దార్ కార్యాలయంలో మధ్యాహ్నం 3 గంటల కు జరిగే సమావేశానికి ఇబ్రహీంపట్నం ఆర్డీఓ అనంత్రెడ్డి హాజరవుతారని చెప్పారు. నోటిఫికేషన్ వేసిన 820 ఎకరాల అసైన్డ్ భూములకు సంబంధించి ఏం చేయాలనే విషయమై చర్చించడం జరుగుతుందని ఆయన వివరించారు. -
ఇక పోరాటమే!
ఏకతాటిపైకి ట్రిపుల్ఆర్ బాధిత రైతులువికారాబాద్: రీజినల్ రింగ్ రోడ్డు బాధిత రైతులు ఒక్కతాటిపైకి వచ్చారు. జాయింట్ యాక్షన్ కమిటీ గా ఏర్పాటై పోరుబాటకు సిద్ధమయ్యారు. మిగతా జిల్లాల రైతులతో జతకట్టాలని నిర్ణయించారు. ట్రిపుల్ఆర్ అలైన్మెంట్ మార్చిన నాటి నుంచే హైదరాబాద్ చుట్టూ ఉన్న జిల్లాల్లో దుమారం రేగింది.రంగారెడ్డి, వికారాబాద్, నల్లగొండ, యాదాద్రి భువనగిరి తదితర జిల్లాల్లో నెలా పదిహేను రోజులుగా ఉద్యమిస్తున్నారు. అధికారులకు వినతి పత్రా లు అందజేయడం, కలెక్టరేట్ల వద్ద నిరసనలు, రహదారుల దిగ్బంధం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తరచూ నిరసన గళం వినిపిస్తూనే ఉన్నారు. రీజినల్కు తమ పొలాలు ఇచ్చేది లేదని తేల్చి చెబుతున్నారు. తాజాగా మంగళవారం బాధిత రైతులు నవాబుపేట మండలం చించల్పేటలో సమావేశమయ్యారు. ఆయా గ్రామాల రైతులు కలిసి జేఏసీగా ఏర్పాటయ్యారు. ఉద్యమ కార్యాచరణకు సిద్ధమయ్యారు. అలాగే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో నామినేషన్ వేయాలని ఏకగ్రీవ తీర్మానం చేశారు. అలైన్మెంట్ మార్పుతోనే.. రీజినల్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్చడంతోనే సమస్య మొదలైంది. పాత అలైన్మెంట్(పడమర వైపు) ప్రకారం పొరుగు జిల్లా రంగారెడ్డి పరిధిలోని ఆలూరు – కౌకుంట్ల గ్రామాల మధ్యలోంచి తంగేడుపల్లి మీదుగా ట్రిపుల్ ఆర్ వెళ్లేలా ప్రతిపాదించారు. దీని ప్రకారం మన జిల్లా పరిధిలోని పూడూరు, నవాబుపేట మండలాలకు చెందిన ఒకటి రెండు గ్రామాల మీదుగా వెళ్లేలా డిజైన్ చేశారు. తాజా అలైన్మెంట్ వల్ల జిల్లాలోని నాలుగు మండలాలపై ప్రభావం పడింది. పూడూరు, నవాబుపేట మండలాల్లోని 20కి పైగా గ్రామాలు రీజినల్ పరిధిలోకి రాగా.. వికారాబాద్, మోమిన్పేట మండలాల్లోని ఐదారు గ్రామాల మీదుగా రోడ్డు వెళ్లేలా ప్రతిపాదనలు తయారు చేశారు. దీంతో రైతులు పోరుబాట పట్టారు. ప్రభావిత గ్రామాలు.. ఒత్తిడి పెంచేందుకు.. జిల్లాలోని ట్రిపుల్ ఆర్ బాధిత రైతులు మిగతా జిల్లాల రైతులతో కలిసి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని నిర్ణయించారు. అన్ని జిల్లాలను కలుపుకొని ఉమ్మడి జేఏసీ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్నారు. అంతేకాకుండా త్వరలో జరగనున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పోటీ చేయాలని ఏకగ్రీవ తీర్ణా నం చేశారు. నవాబుపేట మండలం చించల్పేట గ్రామానికి చెందిన బాధిత రైతు కృష్ణారెడ్డిని అభ్యర్థిగా ప్రకటించాలని ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చారు. మిగతా ప్రాంతాల రైతులతో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అయితే బీఆర్ఎస్ తరఫున గెలిచి ప్రస్తుతం అధికార పార్టీలో కొనసాగుతున్న చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య స్వగ్రామం నుంచే ఈ ఉద్యమ కార్యాచరణ ప్రారంభించడం గమనార్హం. -
పరిహారం ఇవ్వాల్సిందే
తాండూరు రూరల్: తాండూరు మండలం సంగెంకలాన్ గ్రామ సమీపంలోని చెట్టినాడ్ సిమెంట్ పరిశ్రమకు చెందిన రైల్వే ట్రాక్ వల్ల నష్టపోయిన రైతులకు వెంటనే పరిహారం చెల్లించాలని ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి డిమాండ్ చేశారు. రెండు వారాల్లో న్యాయం చేయకపోతే ఫ్యాక్టరీని మూసి వేయిస్తామని హెచ్చరించారు. మంగళవారం పార్టీ నాయకులతో కలిసి సంగెంకలాన్ గ్రామంలో పర్యటించారు. అంతకుముందు కంపెనీ ప్రతినిధులతో ఫోన్లో మాట్లాడారు. రైల్వే ట్రాక్ కోసం వాగులో 18 పిల్లర్లతో బ్రిడ్జి నిర్మించాల్సి ఉన్నా కేవలం మూడు పిల్లర్లు మాత్రమే వేశారని తెలిపారు. దీంతో వర్షాలు పడిన ప్రతీసారి పంట పొలాల్లోకి, ఎస్సీ కాలనీలోకి వరద పోటెత్తుతోందన్నారు. ఇంత జరుగుతున్నా పరిశ్రమ ప్రతినిధులు పట్టించుకోకపోవడం సరికాదన్నారు. ఫ్యాక్టరీ కారణంగా చుట్టు పక్కల గ్రామాలు నాశనం అవుతున్నాయని, ప్రజల జీవితాలతో ఆడుకోవద్దని హెచ్చరించారు. పరిహారం కోరిన రైతులను అరెస్ట్ చేయించడం ఏమిటని నిలదీశారు. వారికి అన్యాయం చేయాలని చూస్తే వదిలి పెట్టేది లేదన్నారు. ఇందుకోసంపరిశ్రమ యాజమాన్యంతో మాట్లాడతానని తెలిపారు. అనంతరం తాండూరు ఎమ్మెల్యే మనోహర్రెడ్డికి ఫోన్ చేసి మాట్లాడారు. బాధిత రైతులకు అండగా నిలుద్దామని కోరారు. అవసరమైతే ఫ్యాక్టరీ వద్ద ధర్నా చేద్దామని సూచించారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రమేశ్కుమార్, పార్టీ ఎన్నికల జిల్లా కన్వీనర్ బాలేశ్వర్ గుప్తా, ఓబీసీ జిల్లా అధ్యక్షుడు శ్రీహరి, జిల్లా కార్యవర్గ సభ్యుడు ఆంజనేయులు, జిల్లా ప్రధాన కార్యదర్శి నరేందర్రెడ్డి, నాయకులు భద్రేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. రాజశేఖర్రెడ్డిపై హాట్ కామెంట్స్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్రెడ్డిపై హాట్ కామెంట్స్ చేశారు. ఆయన రాజకీయాలకు సూట్ అయ్యే వ్యక్తి కాదని వ్యాఖ్యానించారు. ఆయన సమాజ సేవ చేస్తుంటే తానే రాజకీయాల్లోకి తీసుకొచ్చానని గుర్తుచేశారు. అందరినీ కలుపుకొని పోయే వ్యక్తియే పార్టీ అభివృద్ధికి కృషి చేస్తాడన్నారు. పార్టీలో ఎన్ని వర్గాలున్నా పార్టీ బలోపేతానికే పాటుపడాలన్నారు. త్వరలోనే ఆయన తన పదవికి రాజీనామా చేయొచ్చని తెలిపారు. సంగెంకలాన్ ఘటనలో రాజకీయ ఒత్తిళ్లు ఇటీవల సంగెంకలాన్లో ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో బీజేపీ కార్యకర్తలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి, రిమాండ్కు తరలించడం దారుణమన్నారు. కాంగ్రెస్ పార్టీ రాజకీయాలకు తలొగ్గి పోలీసులు కేసు నమోదు చేసినట్లు అర్థమవుతోందని తెలిపారు. కార్యకర్తలందరినీ తప్పకుండా బయటకు తీసుకొస్తామని వెల్లడించారు. ధైర్యంగా ఉండాలి అనంతరం కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు సంజీవ్రెడ్డి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. సంజీవ్రెడ్డిపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపారని తెలిపారు. ధైర్యంగా ఉండాలని తాను అండగా ఉంటానని కుటుంబ సభ్యులకు భరోస ఇచ్చారు. బీఎస్ఎన్ఎల్ టవర్ ప్రారంభం ధారూరు: మండలంలోని నాగారం గ్రామంలో రూ.70 లక్షలతో నిర్మించిన 4జీ బీఎస్ఎన్ఎల్ సెల్ఫోన్ టవర్ను మంగళవారం ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఎస్ఎన్ఎల్ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో దిశ కమిటీ జిల్లా సభ్యుడు వడ్ల నందు, బీజేపీ నాయకులు రాజు నాయక్, వివేకానందరెడ్డి, ఎం రమేశ్ తదితరులు పాల్గొన్నారు. సబ్సిడీ విత్తనాల పంపిణీ మండలంలోని రాంపూర్తండా, గురుదొట్ల, నాగారం గ్రామాలకు చెందిన రైతులకు ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి వందశాతం సబ్సిడీపై కుసుమ, నువ్వుల విత్తనాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నూనె గింజల సాగు లాభదాయకమన్నారు. భారతీయ నూనె గింజల సంస్థ విత్తనాలను సమకూర్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో శాస్త్రవేత్త సురేష్, ఎస్ఆర్పీ ఝాన్సీరాణి, ఫీల్డ్ అసిస్టెంట్ తేజశ్రీ, రైతులు తదితరులు పాల్గొన్నారు. -
ఇసుక అక్రమ రవాణాకు.. అడ్డుకట్ట వేయండి
అనంతగిరి: జిల్లాలో ఇసుక అక్రమ రవాణా జరగకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ సంబంధిత అధికారులకు సూచించారు. మంగళవారం కలెక్టరేట్లో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అధికారులు సమన్వయంతో పని చేసి అక్రమ రవాణాను అడ్డుకోవాలని ఆదేశించారు. విస్తృత తనిఖీలు చేపట్టాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్, జిల్లా పంచాయతీ అధి కారి జయసుధ, మైన్స్ ఏడీ సత్యనారాయణ, గ్రౌండ్ వాటర్ ఏడీ రవి, ఏఓ పర్హీన బేగం, డీ సెక్షన్ సూపరింటెండెంట్ మునీర్, ఈడీఎం మహమూద్, తహసీల్దార్లు పాల్గొన్నారు. విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ విద్యార్థుల సంక్షేమం కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ ప్రతీక్జైన్ తెలిపారు. మంగళవారం నగరం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. బెస్ట్ అవైలబుల్ పాఠశాలల్లో విద్యార్థులకు అందుతున్న వసతులపై ఆరా తీశారు. అనంతరం కలెక్టర్ అధికారులతో మాట్లాడుతూ.. జిల్లాలో విద్యా బోధన, విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు తెలిపారు. సమావేశంలో డీటీడీఓ కమలాకర్ రెడ్డి, బీసీ వెల్ఫేర్ జిల్లా అధికారి మాధవ రెడ్డి, మైనారిటీ సంక్షేమ శాఖ జిల్లా అధికారి రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు. వాల్ పోస్టర్ ఆవిష్కరణ పత్తి పంట మద్దతు ధరకు సంబంధించిన వాల్ పోస్టర్ను మంగళవారం కలెక్టర్ ప్రతీక్ జైన్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా మార్కెటింగ్ శాఖ జిల్లా అధికారి సారంగపాణి, తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యదర్శి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. పిల్లల యోగక్షేమాలపై ఆరా జిల్లాలో కరోనా సమయంలో తల్లిదండ్రలను కోల్పోయిన పిల్లల యోగ క్షేమాలపై కలెక్టర్ ఆరా తీశారు. మంగళవారం శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జూమ్ మీటింగ్ కలెక్టర్ పాల్గొని పిల్లలతో మాట్లాడారు.వారి ఆరోగ్యం, విద్య, అందిన ఆర్థిక సహాయం గురించి అడిగి తెలుసుకున్నారు. బాగా చదువుకొని ఉన్నత స్థానంలో నిలవాలని ఆకాంక్షించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ లింగ్యానాయక్, సంక్షేమ శాఖ జిల్లా అధికారి కృష్ణవేణి, బీఆర్బీ కో ఆర్డినేటర్ కాంతారావు, డీసీపీఓ శ్రీకాంత్, పీఓ ఆంజనేయులు పాల్గొన్నారు. కలెక్టర్ ప్రతీక్ జైన్ -
పార్టీ కోసం శ్రమించిన వారికే పదవులు
పరిగి: కాంగ్రెస్ పార్టీ కోసం శ్రమించిన వారికే పదవులు దక్కుతాయని ఏఐసీసీ జిల్లా ఇన్చార్జ్ సూరజ్సింగ్ ఠాగూర్ అన్నారు. మంగళవారం పట్టణ కేంద్రంలో డీసీసీ అధ్యక్షుడు, స్థానిక ఎమ్మెల్యే టీ రామ్మోహన్రెడ్డి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. డీసీసీ అధ్యక్ష పదవి ఆశిస్తున్న వారి నుంచి దరఖాస్తులు స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కార్యకర్తలు సూచించిన నాయకులకే పదవులు వరిస్తాయని తెలిపారు. పార్టీ కోసం పని చేసిన వారి జాబితా తమ వద్ద ఉందన్నారు. పార్టీని క్షేత్రస్థాయి నుంచి మరింత బలోపేతం చేసే దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని సూచించారు. పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కలిసికట్టుగా పని చేయాలన్నారు. కార్యక్రమంలో ఎస్టీ సెల్ నాయకులు బెల్లయ్య నాయక్, పీసీసీ ఉపాధ్యక్షుడు నీలిమ, వేణుగౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలి
తాండూరు: రైతులకు ఇబ్బంది లేకుండా వరి, పత్తి కొనుగోలు చేయాలని తాండూరు ఎమ్మెల్యే మనోహర్రెడ్డి కోరారు. సోమవారం వికారాబాద్లో కలెక్టర్ ప్రతీక్జైన్ను కలిసి ఈ మేరకు విన్నవించారు. అలాగే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు ఇసుక అనుమతులు జారీ చేసేలా తహసీల్దార్లను ఆదేశించాలన్నారు. అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్ రూంలు, సబ్ స్టేషన్ నిర్మాణ పనులను వేగంగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. బైపాస్ రోడ్డుకు మోక్షం తాండూరు: తాండూరు బైపాస్ రోడ్డుకు ఎట్టకేలకు మోక్షం కలిగింది. నిర్వాసితులకు నాన్ అగ్రికల్చర్ భూమి గజానికి రూ.6 వేలు, వ్యవసాయ భూమి ఎకరాకు రూ.21 లక్షలు ఇస్తా మని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఇందులో భాగంగా ప్రిన్సిపల్ సెక్రటరీ వికాస్రాజ్ రూ.25.13 కోట్లు కేటాయించారు. దీంతో బైపాస్ రోడ్డు పనులకు అడ్డంకులు తొలిగినట్లయింది. బీసీ రిజర్వేషన్ల సాధనకు కలిసి నడుద్దాం తాండూరు టౌన్: రిజర్వేషన్ల సాధనకు కలిసి నడుద్దామని బీసీ సంఘాల నాయకులు కందుకూరి రాజ్కుమార్, ఈడిగ శ్రీనివాస్ గౌడ్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. 42 శాతం రిజర్వేషన్ల కోసం ఇచ్చిన బంద్ను విజయవంతం చేయుడంలో భాగంగా ఈ నెల 15న తాండూరులో అఖిలపక్ష పార్టీలతో సన్నాహక సమావేశం నిర్వహించనున్నట్లు వారు తెలిపారు. పట్టణంలోని వినాయక కన్వెన్షన్ హాల్లో ఉదయం 10గంటలకు అఖిలపక్ష పా ర్టీల బీసీ సంఘాలు, బీసీ మేధావులు, అన్నికుల సంఘాలు,ఎస్సీ, ఎస్టీ సంఘాల నాయకు లు హాజరు కావాలని కోరారు. హైకోర్టు స్టే నేపథ్యంలో ఈ నెల 18న రాష్ట్ర వ్యాప్త బంద్కు పిలుపునిచ్చిన విషయం విధితమే. ఇట్టి బంద్ను విజయవంతం చేయాలని నాయకులు కోరారు. రైతుల సంక్షేమానికి కృషి ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి పరిగి: రైతుల సంక్షేమం కోసం సీఎం రేవంత్రెడ్డి ఎంతో కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే టీ రామ్మోహన్రెడ్డి అన్నారు. సోమవారం పట్ట ణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప రిగి, దోమ, పూడూరు మండలాలకు చెందిన రైతులకు ఉచితంగా వేరుశనగ,శనగ విత్తనాలు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అన్నదాతల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభు త్వం అనేక పథకాలు అమలు చేస్తోందన్నారు. గత ప్రభుత్వంలో రైతులను విస్మరించిందని ఆరోపించారు. కార్యక్రమంలో ఏడీఏ డీఎస్ లక్ష్మీకుమారి, మార్కెట్ కమిటీ చైర్మన్ పరశురాంరెడ్డి, వైస్ చైర్మన్ అయూబ్, ఆత్మకమిటీ చైర్మన్ శ్రీనివాస్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. షాట్పుట్లో సాయికిరణ్కు స్వర్ణం దుద్యాల్: వికాబాద్ జిల్లా దుద్యాల మండలం హస్నాబాద్ గ్రామానికి చెందిన అల్వాల్ సాయికిరణ్ జాతీయ స్థాయి క్రీడల్లో బంగారు పతకం సాధించారు. భువనేశ్వర్లో నిర్వహిస్తున్న అండర్– 20 జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్ పోటీల్లో సోమవారం ప్రథమ స్థానాన్ని దక్కించుకున్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులు పాల్గొన్న ఈపోటీల్లో తెలంగాణ తరఫున షాట్పుట్లో పాల్గొన్న సాయికిరణ్ నంబర్వన్గా నిలిచారు. నేడు సెర్ప్ అధికారుల సమావేశం తాండూరు రూరల్: తాండూరు డివిజన్కు సంబంఽధించి సెర్ప్ అధికారుల సమావేశానికి మంగళవారం డీఆర్డీఏ శ్రీనివాస్ రానున్నట్లు మండల ఐకేపీ, ఏపీఏం బాలయ్య సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఎంపీడీఓ కార్యాలయంలో ఉదయం 10:30 నిమిషాలకు మహిళా సమాఖ్యపై సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ సమావేశానికి తాండూరు, బషీరాబాద్, పెద్దేముల్, యాలాల, దౌల్తాబాద్, కొడంగల్, బొంరాస్పేట్ మండలాల ఐకేపీ ఏపీఏం, సీసీలు తదితరులు హాజరుకావాలని కోరారు. -
అప్పుల ఊబిలో జీపీలు
చెల్లించాల్సిన బిల్లులు రూ.29 కోట్లువికారాబాద్: స్థానిక సంస్థలకు ఎన్నికలు ఆలస్యం కావడంతో గ్రామ పంచాయతీలు పూర్తిగా అప్పుల ఊబిలో కూరుకుపోయాయి. పదవిలో ఉన్నప్పుడు చేసిన పనులకు బిల్లులు అందక మాజీ సర్పంచులు అవస్థలు పడుతున్నారు. రెండున్నరేళ్లుగా కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ప్రస్తుతం గ్రామాల్లో అభివృద్ధి పనులు జరగక వెలవెలబోతున్నాయి. ప్రస్తుతం జీపీల నిర్వహణ కార్యదర్శులపై పడింది. వీరు సైతం అప్పులు చేసి కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ఇటీవల స్థానిక సందడి మొదలవడంతో బిల్లులు మంజూరవుతాయని అందరూ ఆశించారు. కానీ వాయిదా పడటంతో నిరాశకు లోనయ్యారు. జిల్లాలో 594 గ్రామ పంచాయతీలు ఉండగా వీటి పరిధిలో రూ.29 కోట్ల బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. ప్రభుత్వం ఎప్పుడు విడుదల చేస్తుందా అని గత సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు ఎదురు చూస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రూ.750 కోట్ల వరకు బిల్లులు పెండింగ్లో ఉండగా రెండు నెలల క్రితం రూ.150 కోట్లు విడుదల చేసింది. అయితే జిల్లాకు చిల్లిగవ్వ కూడా రాకపోవడం నిరాశ పరిచింది. బీఆర్ఎస్ హయాం నుంచే.. గత ప్రభుత్వ హయాంలో అప్పటి సర్పంచులు సొంత డబ్బు వెచ్చింది అనేక అభివృద్ధి పనులు చేపట్టారు. కానీ బిల్లులు మంజూరు కాలేదు. అప్పట్లో ఏడాదిన్న పాటు ఎదురు చూశారు. ఆ తర్వాత వారి పదవీ కాలం ముగిసింది. మరో ఏడాదైనా బిల్లులకు మోక్షం లభించలేదు. సర్పంచుల స్థానంలో ప్రత్యేకాధికారులను నియమించినా వారు చుట్టపు చూపుగా వచ్చి వెళ్తున్నారనే విమర్శలు ఉన్నాయి. సమస్యలను పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. పారిశుద్ధ్యం, వీధి దీపాలు, తాగునీటి సరఫరా సరిగ్గా లేదని ప్రజలు పేర్కొన్నారు. మేజర్ గ్రామ పంచాయతీల్లో కనీస అవసరాల కోసం ప్రతి నెలా రూ.లక్షల్లో వెచ్చించాల్సి ఉంటుంది. చిన్న జీపీల్లో సైతం వేలకు వేలు ఖర్చు చేయాల్సి వస్తుంది. సర్పంచులు పదవిలో ఉన్న సమయంలో సొంత డబ్బు లేదా అప్పు చేసి ఖర్చు చేసేవారు. వారి పదవీ కాలం ముగిసిన నాటి నుంచి ఆ భారం పంచాయతీ కార్యదర్శులపై పడింది. మిత్తికి డబ్బు తెచ్చి సమస్యలు పరిష్కరించాల్సి వస్తోందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో పలు సార్లు కార్యదర్శులు మాకు ఈ బాధ్యతలు వద్దంటూ ఎంపీడీఓలకు పంచాయతీల తాళాలు అప్పగించగా.. వారిని సముదాయించి బాధ్యతలు అప్పగిస్తున్నారు. పన్నులు ఖర్చు చేయలేని స్థితిలో.. గతంలో పన్నుల రూపంలో వచ్చే డబ్బును పంచాయతీలు వివిధ అభివృద్ధి పనులకు ఖర్చు చేసుకునే వెసులుబాటు ఉండేది. 2018లో కొత్త చట్టం అమలులోకి వచ్చింది. వసూలు చేసిన పన్నులు ట్రెజరీలో జమ చేయాలనే నిబంధన విఽధించారు. తిరిగి ప్రభుత్వ అనుమతితో ఖర్చు చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వం ట్రెజరీ ఖాతాలను ఎక్కువ శాతం ఫ్రీజింగ్లో ఉంచుతోంది. దీంతో పంచాయతీలు ఆ డబ్బు ఖర్చు చేసుకునే వీలులేకుండా పోయింది. పాలక మండళ్లు లేకపోవడంతో కేంద్ర ప్రభుత్వం నుంచి జీపీలకు రావాల్సిన నిధులకు బ్రేక్ పడింది. దీంతో పంచాయతీల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. పెండింగ్లో స్కూల్ బిల్లులు నాలుగేళ్ల క్రితం అప్పటి ప్రభుత్వం మన ఊరు మన బడి కార్యక్రమం ప్రారంభించింది. జిల్లాలో మొత్తం 1,130 పాఠశాలలు ఉండగా 371 స్కూళ్లను ఈ పథకం కింద ఎంపిక చేశారు. వాటిలో వివిధ అభివృద్ధి పనులు చేపట్టారు. 62 పాఠశాలల్లో పనులు పూర్తి కాగా రూ.24.4 కోట్లు చెల్లించారు. మరో రూ.10.35 కోట్లు పెండింగ్లో ఉన్నాయి. ఈ పనులు సైతం అప్పట్లో సర్పంచులు, వార్డు సభ్యులు చేశారు. పనులు పూర్తయ్యి మూడేళ్లు దాటినా బిల్లులు రాలేదని వారు తెలిపారు. -
మద్యం మత్తులో డ్రైవర్ హల్చల్
రెండు బైకులు, దుకాణం, సామగ్రి ధ్వంసం తాండూరు రూరల్: మద్యం మత్తులో ఓ డ్రైవర్ ట్రాక్టర్ నడపడంతో బీభత్సం సృష్టించాడు. రెండు బైక్లు, సామగ్రి, కార్పెంటర్ షాపు షెటర్ను ధ్వంసం చేశాడు. ఈ సంఘటన మండల పరిధిలోని గౌతపూర్లో సోమవారం చోటు చేసుకుంది. కరన్కోట్ పోలీసులు, స్థానికులు తెలిపిన ప్రకారం.. మల్కాపూర్ శివారులోని నాపరాతి గనుల నుంచి డ్రైవర్ పవార్ లక్ష్మణ్ మద్యం తాగి ట్రాక్టర్లో నాపరాతి లోడ్తో తాండూరుకు వస్తున్నాడు. ఈ క్రమంలో మార్గమధ్యలో గౌతపూర్లో కొత్త అశోక్ దుకాణ సముదాయం వద్ద ఓ కార్పెంటర్ షాపులోకి దూసుకెళ్లాడు. అంతకు ముందు రెండు బైకులను ఢీకొట్టాడు. పక్కనే ఉన్న దుకాణం ముందు ఉన్న విలువైన సామగ్రిని ధ్వంసం చేశాడు. ట్రాక్టర్ ముందు టైర్ సైతం ఊడిపోయింది. వెంటనే స్థానికులు డ్రైవర్ను పట్టుకొని పోలీసులకు అప్పగించారు. మద్యం మత్తు, అతివేగం, నిర్లక్ష్యంగా వాహనం నడిపినందుకు డ్రైవర్ పవార్ లక్ష్మణ్పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
అక్రమ కట్టడాలు తొలగించండి
కొత్తూరు: పాత మున్సిపల్ కార్యాలయానికి వెళ్లే రోడ్డులో ప్రభుత్వ పాఠశాల గేటుకు ఇరువైపులా ఉన్న అక్రమ కట్టడాలను తొలగించాలని స్థానికులు సోమవారం కమిషనర్ బాలాజీకి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కార్యాలయానికి వెళ్లే రోడ్డు ఇరుకుగా ఉందన్నారు. దానికి తోడు చిరు వ్యాపారులు ఇరువైపులా కూరగాయలు విక్రయిస్తుండడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. ఇదే అదునుగా కొందరు రోడ్డుకు ఇరువైపులా డబ్బాలు, అక్ర మ కట్టడాలు నిర్మించడంతో రాకపోకలకు ఇబ్బందిగా ఉందన్నారు. మున్సిపాలిటీ అధికారులు అక్ర మంగా వెలసిన కట్టడాలను తొలగించిన తర్వాత రోడ్డు విస్తరణ చేపట్టాలని కోరారు. లేని పక్షంలో ధర్నాలు, ఆందోళనలు చేపట్టనున్నట్లు హెచ్చరించారు. కార్యక్రమంలో శ్రావణ్కుమార్, కార్తీక్రెడ్డి, కుమార్, నర్సింహ, సురేందర్, రాజు పాల్గొన్నారు. -
క్రాప్ సర్వేతో మేలు
కొత్తూరు: రైతులు సాగు చేస్తున్న పంటల వివరాలను సమగ్రంగా తెలుసుకుని వాటిని ఆన్లైన్లో నమోదు చేసే ప్రక్రియ ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి ప్రారంభమైంది. ఆ వివరాలను శాటిలైట్కు అను సంధానం చేయాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం డిజిటల్ క్రాప్ సర్వేకు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే మండలంలో సర్వే తుది అంకానికి చేరుకుంది. మండలంలో సాగుకు యోగ్యమైన భూమి 8,900 ఎకరాలు ఉండగా ఈ ఏడాది 8,800 ఎకరాల్లో రైతులు ఆయా రకాల పంటలను సాగు చేశారు. కాగా ఇప్పటికే వ్యవసాయ అధికారులు 8,200 ఎకరాల్లో సాగు చేసిన పంటల వివరాలను ఆన్లైన్లో నమోదు చేశారు. మిగిలిన 600 ఎకరాల్లో సాగు చేసిన వివరాలను త్వరలో పూర్తి చేయనున్నారు. సర్వేతో ప్రయోజనాలు ● కేంద్ర ప్రభుత్వం అమలు చేసే పలు పథకాలకు ఈ సర్వేను ప్రామాణికంగా తీసుకుని రైతులకు న్యాయం చేస్తారు. ● క్రాప్ సర్వేతో రైతులు ఎన్ని ఎకరాల్లో ఏఏ పంటలు సాగు చేశారో? అన్ని వివరాలు సమగ్రంగా అధికారుల వద్ద ఉంటాయి. ● పంట దిగుబడి సమయంలో రైతులు దళారుల చేతుల్లో మోసపోకుండా నేరుగా మార్కెట్లో తమ పంటలను విక్రయించుకునేందుకు వీలు కల్పిస్తున్నారు. ● సర్వేను ప్రామాణికంగా తీసుకుని భవిష్యత్తులో రైతులకు అవసరమైన ఎరువులు, ఇతర అవసరాలను తీర్చడానికి సర్వే అంశాలు చాలా వరకు ఉపయోగపడతాయి. ● ప్రకృతి వైపరీత్యాలు చోటు చేసుకున్నప్పడు రైతులకు త్వరగా పరిహారం అందించడంలో సర్వే వివరాలు దోహదపడతాయి. ● క్రాప్ సర్వే ఆధారంగా రైతులు నష్టపోయే పంటలను సాగు చేయకుండా చూడవచ్చు. ● అదే సమయంలో మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలను గుర్తించి వాటిని సాగు చేసే విధంగా వారిని ప్రోత్సహించవచ్చు. ● మండలంలోని క్లస్టర్ల వారీగా ఏఈవోలు తమకు కేటాయించిన గ్రామాల్లో మొబైల్ యాప్తో పంటలను సర్వే చేయాలి. అనంతరం సర్వే నంబర్ల వారీగా పంటల వివరాలను ఆన్లైన్లో నమోదు చేస్తారు. వైపరీత్యాల సమయంలో త్వరగా పరిహారం పంటలు లాభాలకు అమ్ముకునే వెసులుబాటు నమోదు చేసుకోవాలని అధికారుల సూచన నమోదు చేశాం ఈ ఏడాది సెప్టెంబర్లో ప్రారంభమైన క్రాప్ సర్వే మండలంలో దాదాపు పూర్తయింది. 8,800 ఎకరాల్లో పంటలు సాగు చేయగా ఇప్పటివరకు 8,200 ఎకరాల్లో సాగు చేసిన పంటల వివరాలను ఆన్లైన్లో నమోదు చేశాం. క్రాప్ సర్వేతో రైతులకు బహుళ ప్రయోజనాలన్నాయి. – గోపాల్నాయక్, ఏఓ, కొత్తూరు -
కళాశాలను తరలించొద్దు
కొడంగల్: ప్రభుత్వ మెడికల్ కళాశాల, ఇంటిగ్రేటెడ్ గురుకుల పాఠశాలలను కొడంగల్లోనే నిర్మించాలని సోమవారం సాయంత్రం పట్టణంలో ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం నిర్వహించారు. కొడంగల్ అభివృద్ధి పరిరక్షణ ఐక్య కార్యాచరణ కమిటీ(కేడీపీ జేఏసీ) ఆధ్వర్యంలో సంతకాలను సేకరించారు. కుల, మత వర్గ భేదం లేకుండా అందరి సహకారం కోరారు. కొడంగల్కు మంజూరు చేసిన ప్రభుత్వ మెడికల్ కళాశాలను, గురుకులాలను కొడంగల్ శివారులోనే నిర్మించాలని పట్టణ వాసులు అన్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. మున్సిపల్ పరిధిలోని పాత కొడంగల్ గ్రామ శివారులో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలకు గతంలో జిల్లా ఉన్నతాధికారులు భూమి పూజ చేశారని గుర్తు చేశారు. మండల పరిధిలోని ఎరన్పల్లి గ్రామ శివారులో మెడికల్ కళాశాల నిర్మాణానికి అక్కడి రైతుల నుంచి భూమి సేకరించారని అన్నారు. ఇంత చేసిన తర్వాత ఈ భవనాలను లగచర్లకు తరలిస్తున్నారని ప్రచారం జరగడం మంచిది కాదన్నారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తగిన నిర్ణయం తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో కేడీపీ జేఏసీ కన్వీనర్ కొట్రికె లక్ష్మీనారాయణ గుప్తా, కో కన్వీనర్లు సురేష్కుమార్, శ్రీనివాస్, శాంతకుమార్, పవన్కుమార్, వెంకటయ్య, ప్రవీణ్, రఫీక్ తదితరులు పాల్గొన్నారు. కేడీపీ జేఏసీ ఆధ్వర్యంలో ప్రజాభిప్రాయ సేకరణ -
‘పది’ విద్యార్థులపై శ్రద్ధ
● ప్రత్యేక తరగతుల నిర్వహణ ● వందశాతం ఉత్తీర్ణతే లక్ష్యం ● సందేహాలు నివృత్తి చేస్తున్న ఉపాధ్యాయులు దౌల్తాబాద్: రానున్న పదోతరగతి వార్షిక ఫలితాల్లో వందశాతం ఉత్తీర్ణత సాధించడమే లక్ష్యంగా విద్యాశాఖ అధికారులు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ మేరకు దౌల్తాబాద్ మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రత్యేక తరగతులు ప్రారంభించారు. వారం రోజుల క్రితమే జిల్లా విద్యాశాఖ అధికారులు అన్ని ప్రభుత్వ బడులకు ఉత్తర్వులు జారీ చేశారు. రోజూ గంట పాటు మండలంలో మొత్తం 8 ఉన్నత పాఠశాలులు ఉన్నాయి. ఇందులో 450 మంది విద్యార్థులు పదో తరగతి విద్యనభ్యసిస్తున్నారు. ప్రత్యేక తరగతుల తో పాటు అభ్యాస దీపికల తయారీ, తల్లిదండ్రుల తో టెలీ కాన్ఫరెన్స్, విద్యార్థుల నిరంతర పర్యవేక్షణ వంటి చర్యలు చేపట్టారు. రోజూ సాయంత్రం 4.15 గంటల నుంచి 5.15గంటల వరకు అదనంగా గంట పాటు రోజుకో సబ్జెక్టు చొప్పున ప్రత్యేక తరగతు లు నిర్వహించనున్నారు. వచ్చే జనవరి 10 నాటికి సిలబస్ పూర్తి చేయాలని నిర్ణయించారు. అదే విధంగా ప్రతి వారం ఒక్కో పాఠ్యాంశంపై పరీక్ష నిర్వహించి విద్యార్థుల ప్రతిభను అంచనా వేసి వెనుకబడిన వారిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోనున్నారు. వారానికోసారి సమీక్ష ప్రతి పాఠశాలలో వారానికి ఒకసారి ప్రత్యేక తరగతులపై సమీక్ష నిర్వహించనున్నారు. ఎంఈఓ, కాంప్లెక్స్ హెచ్ఎంలు, పాఠశాల హెచ్ఎంలు తరగతుల నిర్వహణను పరిశీలిస్తారు. విద్యార్థుల మార్కుల అభ్యసన సామర్థ్యాలు ఎలా ఉన్నాయనే అంశాలను చర్చిస్తారు. పాఠశాలకు హాజరుకాని విద్యార్థుల ఇళ్లకు వెళ్లి తల్లిదండ్రులతో మాట్లాడి హాజరయ్యే విధంగా చర్యలు తీసుకోనున్నారు. చదువుకుంటే కలిగే ప్రయోజనాలను విద్యార్థులకు వివరించి, వారిని మానసికంగా సన్నద్ధం చేస్తున్నారు. శతశాతం కోసం.. మండల వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ప్రత్యేక తరగతులు నిర్వహించాలని ఆదేశాలు వచ్చాయి. ఇప్పటికే ఆయా పాఠశాలల్లో తరగతులు నిర్వహిస్తున్నారు. ఎప్పటికప్పుడు పర్యవేక్షించి వార్షిక పరీక్షల్లో వందశాతం ఉత్తీర్ణత సాధనకు కృషి చేస్తాం. – వెంకట్స్వామి, ఎంఈఓ, దౌల్తాబాద్ -
ఇలా వచ్చి.. అలా వెళ్లిపోయి!
● డీసీసీ అభిప్రాయ సేకరణ సమావేశానికి కాలె యాదయ్య ● అబ్జర్వర్లను కలిసి వెళ్లిపోయిన వైనం చేవెళ్ల: డీసీసీ అధ్యక్ష ఎన్నికపై సోమవారం చేవెళ్లలో నిర్వహించిన అభిప్రాయ సేకరణ సమావేశానికి స్థానిక ఎమ్మెల్యే కాలె యాదయ్య ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి భీంభరత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశానికి అధిష్టానం పంపించిన పార్టీ అబ్జర్వర్లు హాజరయ్యారు. మీటింగ్ మధ్యలో అక్కడికి చేరుకున్న లోకల్ ఎమ్మెల్యే యాదయ్య వచ్చిన అతిథులకు నమస్కరించి, కరచాలనం చేసి వెళ్లిపోయారు. పార్టీ ఫిరాయింపుల కేసు నేపథ్యంలోనే ఆయన మీటింగ్లో కూర్చోలేదని అక్కడున్న నేతలు గుసగుసలాడారు. ఇదిలా ఉండగా.. తాను పార్టీ మారలేదని చెప్పుకొంటున్న ఎమ్మెల్యే కాంగ్రెస్ మీటింగ్కు ఎందుకు వచ్చారో ఆయనకే తెలియాలని భీంభరత్ వర్గం అసహనం వ్యక్తం చేయగా, తన వర్గానికి నేనున్నానని సంకేతాన్నిచ్చేందుకే యాదయ్య ఇలా వచ్చి అలా వెళ్లిపోయారని కాంగ్రెస్లో చర్చసాగింది. -
ఇసుక తరలిస్తున్న వాహనాల పట్టివేత
యాలాల: కాగ్నా నది నుంచి రాత్రివేళ ఇసుకను అక్రమంగా తరలిస్తున్న ఓ ట్రాక్టర్తో పాటు ఆటోను యాలాల పోలీసులు పట్టుకున్నారు. ఎస్ఐ విఠల్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం. మండలంలోని విశ్వనాథ్పూర్ శివారులో ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారనే సమాచారంతో ఆదివారం రాత్రి తనిఖీలు నిర్వహించారు. అదే సమయంలో నదిలో ఇసుక లోడ్తో వెళుతున్న ఓ ట్రాక్టర్ను గుర్తించి పట్టుకున్నారు. మరోవైపు కోకట్ కాగ్నా నది నుంచి ఆటోలో సిమెంటు సంచుల్లో ఇసుకను అక్రమంగా తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. కారు, ఆటో ఢీ.. భార్యాభర్తలకు గాయాలు ఆమనగల్లు: ఆటోను కారు ఢీకొట్టిన ప్రమాదంలో ఓ దంపతులు తీవ్రంగా గాయపడిన సంఘటన తలకొండపల్లి మండలం చుక్కాపూర్ గ్రామశివారులో చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన భార్యాభర్తలు అశోక్రెడ్డి, సుమతమ్మ సోమవారం సమీపంలోని తమ వ్యవసాయ పొలంలో పచ్చిగడ్డి కోసుకుని ఆటోలో గ్రామా నికి వస్తుండగా ఆమనగల్లు నుంచి వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. దీంతో ఆ టో కొద్ది దూరం వెళ్లి పల్టీ కొట్టడంతో దంపతులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదాన్ని గుర్తించిన గ్రామస్తులు వెంటనే ఇరువురిని చికిత్స నిమిత్తం 108 అంబులెన్స్లో హైదరాబాద్కు తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యా ప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. చికిత్స పొందుతూ ఆర్టీసీ డ్రైవర్ మృతి ఇబ్రహీంపట్నం రూరల్: ఆదిబట్ల మున్సిపల్ పరిధిలోని రాందాస్పల్లికి చెందిన కంతి కిషన్ (50) సోమవారం ఉదయం మృతిచెందాడు. ఇబ్రహీంపట్నం డిపోలో విధులు నిర్వర్తిస్తున్న కిషన్కు రెండు రోజుల క్రితం గుండెపోటు రావడంతో ఆస్పత్రిలో చేర్చించగా, చికిత్స పొందుతూ చనిపోయాడు. బీఆర్ఎస్ నాయకు మంచిరెడ్డి ప్రశాంత్కుమార్రెడ్డి, కొప్పు జంగయ్య తదితరులు మృతదేహం వద్ద నివాళులర్పించి, కుటుంబ సభ్యులను ఓదార్చారు. -
పర్యావరణ పరిరక్షణ సమష్టి బాధ్యత
యాచారం: పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యతని, ప్రభుత్వ ఖాళీ స్థలాల్లో విరివిగా మొక్కలు నాటాలని అడిషనల్ డీఆర్డీఓ సుభాషిణి సూచించారు. సోమవారం మండల పరిధిలోని గునుగల్, యాచారం గ్రామాల్లోని జీపీ ల్యాండ్స్, వెంచర్లలోని పది శాతం భూముల్లో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... గ్రామాల్లో ఏర్పాటయ్యే వెంచర్లలో పంచాయతీలకు రిజిస్ట్రేషన్లు చేసిన పది శాతం భూముల్లో విరివిగా మొక్క లు నాటాలని సూచించారు. గ్రామాల్లోని కాలనీలు, రోడ్ల వెంట, పార్క్ స్థలాల్లో మొక్కలు నాటా లని చెప్పారు. మొక్కలు నాటడమే కాదు.. సంరక్షణ చేయాల్సిన బాధ్యత మనదేనని అన్నారు. ఈజీఎస్ పథకం ద్వారా పండ్ల తోటల పెంపకం చేపడుతున్నామని, అర్హులైన ఆసక్తి కలిగిన రైతు లు సద్వినియోగం చేసుకోవాలని సూచించా రు. కార్యక్రమంలో ఎంపీడీఓ రాధారాణి, ఈజీఎస్ ఏ పీఓ లింగయ్య, ఈసీ శివశంకర్రెడ్డి పాల్గొన్నారు. మొక్కలను సంరక్షించాలి మంచాల: గ్రామాల్లో మొక్కల పెంపకం ప్రతిఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని జిల్లా అదనపు గ్రామీణాభివృద్ధి అధికారి సుభాషిణి అన్నారు. సోమవారం మండలంలోని ఆగాపల్లి, కాగజ్ఘట్ గ్రామాల్లో ఎన్ఆర్ ఈజీఎస్ పథకం కింద నాటిన మొక్కలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మొక్కలు నాటడమేగాకుండా వాటిని సంరక్షణ బాధ్యత కూడా తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఏపీఓ వీరాంజనేయులు, ఈసీ విమల, సిబ్బంది పాల్గొన్నారు. అడిషనల్ డీఆర్డీఓ సుభాషిణి -
నిరుపేదలకు అండగా ఉంటాం
కుల్కచర్ల: నిరుపేద ప్రజలకు అండగా ఉంటామని పరిగి నియోజకవర్గ పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు రాఘవేందర్గౌడ్ అన్నారు. మండలంలోని ఘణపూర్ గ్రామానికి చెందిన గజ్జి వెంకటయ్య ఇటీవల గుండెపోటుతో మృతిచెందారు. కాగా విషయం తెలుసుకున్న ఆయన సోమవారం స్థానిక నాయకులతో కలిసి వారి ఇంటికి వెళ్లి పరామర్శించి ధైర్యం చెప్పారు. వెంకటయ్య పిల్లలకు నాణ్యమైన విద్యను అందించేందుకు ఖర్చులు భరిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో స్థానికులు రాములు, చెన్నయ్య, బాలయ్య, మాస య్య, బాలచందర్, కేశవులు పాల్గొన్నారు. సీజేఐపై దాడికి యత్నించిన వారిని శిక్షించాలి ఎంఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఆనంద్ అనంతగిరి: సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయ్పై దాడి యత్నం చేసిన దుండగుడిని కఠినంగా శిక్షించాలని ఎంఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఆనంద్ డిమాండ్ చేశారు. ఎమ్మార్పీఎస్, ఎంఎస్ఎఫ్ ఆధ్వర్యంలో సోమవారం వికారాబాద్ కలెక్టరేట్ను ముట్టడించారు. ధర్నా చేపట్టి కలెక్టరేట్లో వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు ప్రశాంత్, మల్లికార్జున్, సుభాన్, అంజి, భరత్కుమార్, పుష్పరాణి, మంజుల, పద్మమ్మ, సునీత పాల్గొన్నారు. అయోధ్యలో ప్రదర్శనకు మన కళాకారులు బొంరాస్పేట: శ్రీరాముని జన్మస్థలం అయోధ్యలో జరిగే ‘దినోత్సవం 2025’ ఉత్సవాల సందర్భంగా తెలంగాణ రాష్ట్రం నుంచి పాల్గొనే జానపద కళాబృందంలో జిల్లా కళాకారులకు స్థానం దక్కింది. 28 రాష్ట్రాల నుంచి పాల్గొనే ఈ కళ ప్రదర్శనలకు కొడంగల్కు చెందిన ప్రకాశ్ మాస్టర్ బృందానికి అవకాశం దక్కినట్లు ఆయన తెలిపారు. ఈ నెల 17 నుంచి 19 వరకు జరిగే ఉత్సవాల్లో 15 మంది కళా బృందం సభ్యులు తెలంగాణ బోనాల ప్రదర్శన చేయనున్నట్లు చెప్పారు. కళాబృందంలో కళాకారుల సంఘం నాయకులు కృష్ణయ్య, అంజిలప్ప, రమేష్, పెంటప్ప, చిన్ని మనీషా తదితరులున్నారని మాస్టర్ ప్రకటించారు. వేటకు వెళ్లిన వ్యక్తి అదృశ్యం యాలాల: వేటకు వెళ్లిన వ్యక్తి అదృశ్యమయ్యాడు. ఈ ఘటన మండల పరిధిలోని అన్నసాగర్ గ్రామంలో సోమవారం వెలుగులోకి వచ్చింది. ఎస్ఐ విఠల్రెడ్డి తెలిపిన ప్రకారం.. గ్రామానికి చెందిన గురుదొట్ల శేఖర్ బాణాపూర్ గ్రామాని కి చెందిన సునీల్తో కలిసి ఈ నెల 9వ తేదీ రాత్రి అటవీ ప్రాంతంలో వేటకు వెళ్లారు. నాటి నుంచి శేఖర్ తిరిగి రాలేదు. ఎక్కడ వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో ఆయన భార్య కవిత సోమవారం యాలాల పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు దర్యాప్తులో ఉంది. హత్య కేసులో నిందితురాలి అరెస్టు 14 రోజుల రిమాండ్ తరలింపు కేశంపేట: భర్తను హత్య చేసిన ఘటనలో నిందితురాలైన భార్యను కేశంపేట పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. సీఐ నరహరి కథనం ప్రకారం.. మండలం కేంద్రంలోని ఎస్సీ కాలనీకి చెందిన కొప్పు కుమార్(35) రోజూ మద్యం తాగి భార్య మాధవిని వేధిస్తుండేవాడు. ఈ నెల 11న రాత్రి సైతం మద్యం తాగి ఇంటికి వచ్చి భార్యతో గొడవ పడ్డాడు. భర్తను ఎలాగైనా అంతం చేయాలని భావించిన మాధవి అర్ధరాత్రి నిద్రిస్తున్న సమయంలో అతని తల, ఛాతిపై సిమెంట్ ఇటుకతో బలంగా మోదింది. దీంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. ఆమె మృతదేహాన్ని బయటికి ఈడ్చుకుంటూ వచ్చి ఇంటి ముందు ఉన్న నీటి సంపులో పడేసినట్లు తెలిపారు. ఇంట్లో ఉన్న రక్తం మరకలను తుడిచి, పౌడర్ను చల్లి ఆధారాలు దొరకుండా చేసి పరారైనట్లు పోలీసులు చెప్పారు. ఈ ఘటనపై మృతుడి సోదరుడు జంగయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాపు చేపట్టినట్లు తెలిపారు. కేశంపేట వైఎస్ఆర్ చౌరస్తా వద్ద మాధవిని సోమవారం అదుపులోకి తీసుకొని విచారించగా.. ఆమె నేరాన్ని అంగీకరించారు. ఈ మేరకు ఆమెను కోర్టులో హాజరు పర్చారు. న్యాయమూర్తి 14రోజుల రిమాండ్ విధించినట్లు సీఐ తెలిపారు. -
బైక్ను ఢీకొట్టిన బస్సు
కొత్తూరు: ముందు వెళ్తున్న బైక్ను గుర్తు తెలియని బస్సు ఢీకొట్టడంతో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన కొత్తూరు పట్టణంలోని పెంజర్ల కూడలి జాతీయ రహదారిపై సోమవారం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. దేవరకద్ర మండలం లక్ష్మీపల్లి గ్రామానికి చెందిన నవీన్(40), మల్లేష్(45) అన్నదమ్ములు. వీరు కొన్నేళ్ల నుంచి రాజేంద్రనగర్ సమీపంలోని కాటేదన్లో ఉంటున్నారు. ఆదివారం తమ స్వగ్రామంలో ఓ శుభకార్యం ఉండడంతో ఇద్దరితో పాటు మల్లేష్ కుమారుడు లోకేష్(12) బైక్పై వెళ్లారు. తిరుగు ప్రయాణంలో ముగ్గురు బైక్పై బయలుదేరగా పట్టణంలోని పెంజర్ల కూడలి వద్దకు రాగానే వెనకాల నుంచి వచ్చిన గుర్తు తెలియని బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం 108 అంబులెన్స్లో ఉస్మానియాకు తరలించారు. ముగ్గురికి తీవ్ర గాయాలు -
బంద్ను విజయవంతం చేద్దాం
అనంతగిరి: బీసీ రిజర్వేషన్ల సాధనకు ఈ నెల 18న తలపెట్టిన బంద్ను విజయవంతం చేయాలని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు యాదగిరి యాదవ్ అన్నారు. సోమవారం వికారాబాద్ క్లబ్ ఫంక్షన్హాల్లో ఆయా పార్టీల బీసీ ముఖ్యనాయకులు, ఆయా సంఘాల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా యాదగరి యాదవ్ మాట్లాడుతూ.. బీసీలంతా సంఘటితమై ఏకతాటిపైకి రావాలన్నారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ మాజీ చైర్మన్ గుడిసె లక్ష్మణ్, విద్యా మౌలిక వసతుల కల్పన కార్పొరేషన్ మాజీ చైర్మన్ నాగేందర్గౌడ్, ముదిరాజ్ సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్, జడ్పీటీసీ మాజీ సభ్యుడు రాములు, శ్రీనివాస్గౌడ్, సత్యనారాయణగౌడ్, లక్ష్మణ్, శేఖర్, రమేశ్, అంజయ్య, సురేందర్బాబు, అశోక్, విజయ్కుమార్, ఉమాశంకర్, బన్సీలాల్ తదితరులు పాల్గొన్నారు. బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు యాదగిరి యాదవ్ -
బీసీ డిక్లరేషన్ అమలు చేయాలి
షాబాద్: అసెంబ్లీ ఎన్నికల సమయంలో కామారెడ్డి సభలో కాంగ్రెస్ అగ్రనాయకులు బీసీ డిక్లరేషన్లో ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని సీపీఐ జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో సోమవారం రెండోరోజు రిలే దీక్షలకు హాజరైన ఆయన మాట్లాడుతూ.. 40 ఏళ్లుగా బీసీలకు అన్యాయం చేస్తూ అణగదొక్కుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. జనాభాలో అధిక శాతం ఉన్న బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు న్యాయమైన వాటా అని, ఇందుకు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు తెలపాలన్నారు. 42 శాతం రిజర్వేషన్లు వచ్చే వరకు ఆందోళన కొనసాగిస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో బీసీ రిజర్వేషన్ సాధన సమితి సభ్యులు జడల రాజేందర్గౌడ్, రాపోల్ నర్సింహులు, తమ్మలి రవీందర్, మాణెయ్య, రమేష్, దర్శన్, శేఖర్, కృష్ణ, రఘువరన్, నారాయణ, దీక్షలో రాము, వెంకటేశ్గౌడ్, రాములు, మల్లయ్య, మల్లేష్ తదితరులు ఉన్నారు. -
పొరపాట్లకు ఆస్కారం ఇవ్వొద్దు
అనంతగిరి: వరి ధాన్యం సేకరణలో ఎలాంటి పొరపాట్లకు అస్కారం ఇవ్వరాదని అడిషనల్ కలెక్టర్ లింగ్యా నాయక్ ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల ఏర్పాటు.. నిర్వహణపై సంబంధిత అధికారులతో సోమవారం కలెక్టరేట్లోని తన చాంబర్లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. అవసరం మేరకు టార్పాలిన్లు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. ఐకేపీ, ప్రాథమిక వ్యవసాయ సహకార సొసైటీలు ఆధ్వర్యంలో కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. కొనుగోలకు అవసరమైన అన్ని యంత్రాలను సిద్ధం చేసుకోవాలన్నారు. జిల్లాలోని రావులపల్లి, కోత్లాపూర్ చెక్ పోస్టుల వద్ద నిరంతరం తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు. ఇతర రాష్ట్రాలకు చెందిన ధన్యాం జిల్లాలోకి ప్రవేశించకుండా చూడాలన్నారు. సమావేశంలో డీఆర్డీఓ శ్రీనివాస్, అడిషనల్ ఎస్పీ రాములు నాయక్, సివిల్ సప్లయ్ అధికారి సుదర్శన్, డీసీఓ నాగార్జున, పౌర సరఫరాల సంస్థ మేనేజర్ మోహన్కృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
కనుల పండువగా రథోత్సవం
పూడూరు: మండలంలోని పెద్ద ఉమ్మెంతాల్ గ్రామంలో కొలువుదీరిన తిరుమల నాథస్వామి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. సోమవారం తెల్లవారుజామున రథోత్సవం వైభవంగా సాగింది. అనంతరం స్వామివారికి ఏకాంతసేవ నిర్వహించారు. భజన మండలి ఆధ్వర్యంలో సంకీర్తనలు ఆలపించారు. చిన్నారుల పాటలు ఆకట్టుకున్నాయి. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ సతీష్రెడ్డి, ఆత్మకమిటీ చైర్మన్ శ్రీనివాస్రెడ్డి, డీసీసీ కార్యదర్శులు పెంటయ్య, శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సురేందర్, మాజీ సర్పంచ్ శ్రీధర్, నాయకులు రఘునాథ్రెడ్డి, గోవర్ధన్రెడ్డి, వెంకటేశ్వర్రెడ్డి, శ్రీనివాస్గుపా, సుభాష్, వెంకటేశంగుప్తా, కృష్ణ, నర్సింలు తదితరులు పాల్గొన్నారు. -
సముచిత స్థానం కల్పిస్తాం
అనంతగిరి: పార్టీ కోసం పాటుపడిన వారికి పదవుల్లో సముచిత స్థానం కల్పిస్తామని ఏఐసీసీ జిల్లా పరిశీలకుడు సూరత్సింగ్ ఠాకూర్ అన్నారు. సోమవారం వికారాబాద్ పట్టణంలోని సత్యభారతి గార్డెన్లో డీసీసీ అధ్యక్ష పదవి కోసం అభిప్రాయ సేకరణ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా సంఘటన్ సృజన్ అభియాన్ పేరిట కార్యకర్తలతో కలిసి వారి అభిప్రాయాల మేరకు డీసీసీ అధ్యక్షుల పేర్లను సేకరించి ఏఐసీసీ నాయకత్వానికి నివేదిక పంపిస్తామని తెలిపారు. అధ్యక్ష పదవికి పోటీచేసే వారు ఈ నెల 16వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. తాను ఈనెల 19వ తేదీ వరకు జిల్లాలో పర్యటిస్తానని తెలిపారు. ప్రతి మండలంలో పర్యటించి అక్కడి నాయకులు, కార్యకర్తల అభిప్రాయాలను సేకరిస్తామన్నారు. సమావేశంలో పీసీసీ పరిశీలకులు బెల్లయ్య నాయక్, నీలిమ, వేణుగౌడ్, డీసీసీ అధ్యక్షుడు రామ్మోహన్రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే మనోహర్రెడ్డి, పార్టీ పట్టణ అధ్యక్షుడు సుధాకర్రెడ్డి, రాష్ట్ర నాయకులు ధారాసింగ్, రఘువీరారెడ్డి, మాజీ చైర్మన్ సత్యనారాయణ, డీసీసీబీ డైరక్టర్ కిషన్నాయక్, సోషల్ మీడియా రాష్ట్ర కార్యదర్శి చామల రఘుపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
‘మధ్యాహ్న’ కష్టాలు
బొంరాస్పేట: మధ్యాహ్న భోజనం తయారీకి ఏజెన్సీ మహిళ నిరాకరించింది. ప్రభుత్వం ఇచ్చే డబ్బు సరిపోదంటూ విధులకు డుమ్మా కొట్టింది. దీంతో విద్యార్థులు పస్తులుండే పరిస్థితి ఏర్పడింది. ఎంఈఓ, పాఠశాల సీహెచ్ఎం దగ్గరుండి వంట తయారు చేయించి విద్యార్థుల ఆకలి తీర్చారు. ఈ ఘటన బొంరాస్పేట మండలం ఎన్కేపల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో సోమవారం చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామంలోని పాఠశాలలో 120 మంది విద్యార్థులు ఉన్నారు. వీరికి ఏజెన్సీ మహిళ చిట్టెమ్మ మధ్యాహ్న భోజనం తయారు చేసేది. సోమవారం ఎలాంటి సమాచారం ఇవ్వకుండా విధులకు డుమ్మా కొట్టింది. దీంతో స్కూల్ సిబ్బంది ఆమె ఇంటికి వెళ్లి వంట చేసేందుకు రావాలని కోరింది. కూలి గిట్టుబాటు కాదని తాను రానని చిట్టెమ్మ చెప్పింది. విషయం డీఈఓ రేణుకాదేవి దృష్టికి వెళ్లడంతో ఆమె ఎంఈఓ హరిలాల్కు ఫోన్ చేసివెంటనే సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. విద్యార్థుల మధ్యాహ్న భోజనానికి ఇబ్బంది లేకుండా చూడాలని సూచించారు. దీంతో ఎంఈఓ హరిలాల్, క్లస్టర్ హెచ్ఎం రవీందర్గౌడ్ స్కూల్ని సందర్శించారు. ఏజెన్సీ మహిళను పిలిపించాలని సిబ్బందికి సూచించారు. ఆమె రానని చెప్పడంతో హెల్పర్ బువ్వమ్మతో వంట చేయించారు. సమస్య పరిష్కారం కావడంతో పాఠశాల సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం ఎంఈఓ హరిలాల్ మాట్లాడుతూ.. ఈ నెల 19న గ్రామ కమిటీ సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. అప్పటి వరకు హెల్పర్ బువ్వమ్మతో వంట చేయిస్తామని, సమావేశంలో వంట మనిషి నియామకంపై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు. అలాగే ఉపాధ్యాయుల కొరత లేకుండా చూస్తామన్నారు. ఏజెన్సీ మహిళ స్థానంలో మరో వంట మనిషిని నియమిస్తామని పాఠశాల కమిటీ చైర్మన్ బసమ్మ, గ్రామ సంఘం ప్రతినిధులు తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది మహేశ్కుమార్, జ్యోతి పరమేశ్వరి పాల్గొన్నారు. -
తెల్లబంగారం మెరిసేనా!
● మద్దతు ధర దక్కేనా ● వారం రోజుల్లో చేతికి రానున్న పంట ● వర్షాలతో దిగుబడిపై ప్రభావం ● పెరిగిన పెట్టుబడులు దౌల్తాబాద్: మరో వారం పది రోజుల్లో పత్తి పంట చేతికి రానుంది. రెండు మూడేళ్లుగా దిగుబడి ఉన్నప్పటికీ.. సరైన మద్దతు ధర లేదు. ఈ సారి తెల్ల బంగారం బాగా పండినప్పటికీ.. అధిక వర్షాలు దిగుబడిపై ప్రభావం చూపాయి. పెట్టుబడులు పెరిగాయి. అయితే ఈ లోటు పూడ్చుకోవడానికి మద్దతు దక్కితే ఊరట లభించనుందని రైతులు పేర్కొంటున్నారు. పెరిగిన ఖర్చులు మండలంలో ఈ ఏడు 8,900 ఎకరాల్లో పత్తి సాగు అయింది. గతం కంటే పెట్టుబడులు పెరిగాయి. ఎకరాకు రూ.40 వేల పైనే ఖర్చు అయింది. అయితే నిన్నమొన్నటి వానల కారణంగా పొలాల్లో నీరు నిలిచి, మొక్కలకు తెగుళ్లు సోకాయి. వాటి నివారణకు మందులు పిచికారీ చేసేందుకు అధిక వ్యయం వెచ్చించాల్సి వచ్చిందని రైతులు తెలిపారు. దిగుబడి తగ్గిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా ఎకరాకు 10 నుంచి 12 క్వింటాళ్ల పత్తి రావాల్సి ఉండగా, ప్రస్తుతం 6 నుంచి 8 క్వింటాళ్లు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. అధిక వర్షాలతో నష్టపోయామని, ధర పెంచి ప్రభుత్వం ఆదుకోవాలని రైతన్నలు కోరుతున్నారు. అదే పదివేలు.. గడిచిన రెండేళ్లుగా పత్తి ధర నిలకడగా లేదని, క్వింటాకు రూ.10 వేలు పలికేదని రైతన్నలు తెలిపారు. ఆ తర్వాత రూ.8 వేలకు పడిపోయిందన్నారు. ధర పెరుగుతుందన్న ఆశతో చాలా మంది పత్తిని నిల్వ చేసుకుని నష్టపోయారని, ఈ సారి పెరిగిన పెట్టుబడులకు రూ. అదే పదివేలు ఉంటే తప్ప మేలు జరగదంటున్నారు. ధర పెంచితే మేలు రెండు సంవత్సరాలుగా పత్తికి మద్దతు ధర లేదు. పెట్టుబడులు మాత్రం అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఈ ఏడాది అధిక వర్షాలు దిగుబడిపై ప్రభావం చూపాయి. కనీసం ధర పెంచితే మేలు జరుగుతుంది. –నర్సింహులు, రైతు, దౌల్తాబాద్ -
ఆర్టీసీకి ఏఐ దన్ను
ప్రయాణికుల రద్దీ, డిమాండ్ మేరకు ట్రిప్పులు పెంచేందుకు ఆర్టీసీ ప్రణాళికలను రూపొందిస్తోంది. అధునాతన ఏఐ సాంకేతిక పరిజ్ఞానంతో వివిధ రూట్లలో ప్రయాణికుల సంఖ్య, రాకపోకలు, ప్రయాణ వేళలు తదితర అంశాలపై శాసీ్త్రయమైన అధ్యయనం చేసి సమగ్ర నివేదికను సిద్ధం చేసేందుకు సాంకేతిక నిపుణుల సహాయం తీసుకోనుంది. – సాక్షి, సిటీబ్యూరో మహా నగర పరిధి అనూహ్యంగా విస్తరిస్తోంది. ప్రతి ఏటా కొత్త కాలనీలు ఏర్పడుతూనే ఉన్నాయి. దీంతో ప్రయాణికులు ఏ ప్రాంతం నుంచి ఎక్కువగా బయలుదేరుతున్నారు. ఏయే ప్రాంతాల మధ్య రాకపోకలు విరివిగా కొనసాగుతున్నాయనే అంశంపై స్పష్టత ఉండడం లేదు. జీడిమెట్ల, దుండిగల్ చుట్టుపక్కల ప్రాంతాల్లో విస్తరించిన వందల కొద్దీ కాలనీల నుంచి హైటెక్ సిటీ, మాదాపూర్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, మణికొండ, నార్సింగి, తదితర ప్రాంతాలకు ప్రయాణికుల రాకపోకలు భారీగా ఉన్నాయి. ప్రైవేట్ సంస్థల్లో పని చేసే వివిధ విభాగాలకు చెందిన సిబ్బంది ఈ ప్రాంతాల నుంచి ఎక్కువగా రాకపోకలు సాగిస్తున్నారు. కానీ.. ప్రయాణికుల డిమాండ్ మేరకు బస్సులు అందుబాటులో ఉండడం లేదు. పైగా ఏ కాలనీ నుంచి, ఏయే సమయాల్లో ఎక్కువ మంది రాకపోకలు సాగిస్తున్నారనే అంశాలపై కూడా తగిన సమాచారం ఉండదు. ఈ క్రమంలో సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా రియల్ టైమ్ డిమాండ్ను కచ్చితంగా అంచనా వేసి బస్సులను ఏర్పాటు చేయాలనేది ప్రతిపాదన. ప్రతి రూటూ వాస్తవ చిత్రీకరణ.. ● ఆర్టీసీ లెక్కల ప్రకారం గ్రేటర్ పరిధిలో సుమారు 1050 రూట్లు ఉన్నాయి. గత ఐదారేళ్లుగా విస్తరించిన నగర శివార్లను పరిగణనలోకి తీసుకొంటే ఈ రూట్ల సంఖ్య 1500 దాటి ఉంటుంది. కొన్ని రూట్లలో ప్రయాణికుల డిమాండ్, రద్దీ చాలా తక్కువగా ఉంటుంది. ఉదయం, సాయంతం వేళల్లో మాత్రమే ఎక్కువ మంది ప్రయాణం చేస్తారు. మిగతా వేళల్లో పెద్దగా డిమాండ్ ఉండదు. అలాంటి రూట్లపై సరైన వివరాలు లేకుండా బస్సులను నడపడంతో నష్టం వాటిల్లుతున్నట్లు అధికారులు భావిస్తున్నారు. ఇలా ప్రయాణికుల ఆదరణ లేని మార్గాల్లో ట్రిప్పులను తగ్గించి, డిమాండ్ ఎక్కువగా ఉన్న మార్గాల్లో పెంచేందుకు ప్రతి రూట్ను సమగంగా అధ్యయనం చేసి గణాంకాలను రూపొందించనున్నారు. ఇందుకోసం ఒక ప్రైవేట్ సంస్థకు చెందిన సాంకేతిక నిపుణుల సహాయంతో డిపోల వారీగా వివిధ రూట్ల వివరాలను సేకరించనున్నారు. ● గ్రేటర్లో ప్రస్తుతం 25 డిపోల్లో ప్రస్తుతం 3,150 బస్సులు ఉన్నాయి. వీటిలో 10 శాతం బస్సులను స్పేర్లోనే ఉంచుతారు. దీంతో సుమారు 2,950 బస్సులు ప్రతిరోజు ప్రయాణికులకు రవాణా సదుపాయాన్ని అందజేస్తున్నాయి. ప్రస్తుతం రోజుకు 26 లక్షల మంది ప్రయాణిస్తున్నట్లు అంచనా. ప్రతి రోజు 31వేలకు పైగా ట్రి ప్పులు తిరుగుతున్నాయి. ప్రతి ట్రిప్పు నుంచి ఆశించిన స్థాయిలో ఆదాయం లభించడం లేదు. ఆదాయం కంటే నిర్వహణ వ్యయం ఎక్కువగా ఉంటుంది. ఈ క్రమంలో అన్ని ట్రిప్పులను క్రమబద్ధీకరించాలని భావిస్తున్నారు. ఆక్యుపెన్సీ ఉన్నా ఆదాయం అంతంతే... మహాలక్ష్మి పథకంతో మహిళా ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగింది. సుమారు 18 లక్షల మంది మహిళలు సిటీ బస్సుల్లో పయనిస్తున్నారు. వీరి చార్జీలను ప్రభుత్వమే చెల్లిస్తోంది. ప్రతిరోజు ఆర్టీసీకి నగదు రూపంలో ఆదాయం లభించేది పురుషుల నుంచే. ప్రతి రోజు 8 లక్షల మంది మగవారు ప్రయాణం చేస్తున్నారు. రోజుకు రూ.6.5 కోట్ల ఆదాయం లభిస్తే అందులో రూ.4 కోట్ల వరకు రియంబర్స్మెంట్ రూపంలో ఆర్టీసీ ఖాతాలో జమ అవుతోంది. మిగతా 2.5 కోట్లు మాత్రమే నగదు రూపంలో అందుతోంది. ఈ ఆదాయం కంటే నిర్వహణ వ్యయం, ఉద్యోగుల జీతభత్యాలు తదితర ఖర్చులే అధికంగా ఉన్నాయి. దీంతో ప్రయాణికుల సంఖ్యను పెంచుకొనేందుకు, తద్వారా అదనపు ఆదాయాన్ని సమకూర్చుకొనేందుకు కూడా ఈ సాంకేతిక పరిజ్ఞానం దోహదం చేస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఏ రూట్లో ఎంతమంది ప్రయాణికులు రద్దీ, డిమాండ్ మేరకు బస్సుల నిర్వహణ అధునాతన సాంకేతికత వినియోగం రూట్లపై శాసీ్త్రయ అధ్యయనం ప్రయాణికుల సంఖ్య పెంపునకు ప్రణాళికలు -
బైకును ఢీకొన్న జీపు..ఇద్దరికి తీవ్రగాయాలు
హస్తినాపురం: ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఇద్దరు స్నేహితులను వెనుక నుండి వేగంగా వచ్చిన జీపు ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడిన సంఘటన వనస్థలిపురం పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ రవి నాయక్ తెలిపిన వివరాల ప్రకారం రాజన్న సిరిసిల్లకు చెందిన ఫయాజ్ (21) మంగళపల్లిలోని సీవీఆర్ ఇంజనీరింగ్ కళాశాల నుండి బైకుపై అదే కళాశాలలో చదువుతున్న స్నేహితురాలు (21)తో కలిసి సాగర్ రింగ్రోడ్డు వైపు వస్తుండగా గుర్రంగూడ వద్ద యూటర్న్లో వెనుక నుంచి వేగంగా వచ్చిన థార్ కారు ఢీకొట్టింది. దీంతో ఫయాజ్ తలకు తీవ్రగాయాలు కాగా కుడి కాలు విరిగింది. వెనుక కూర్చున్న స్నేహితురాలి తలకు తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు వెంటనే 108కు ఫోన్ చేయగా క్షతగాత్రులను అంబులెన్స్లో స్థానికంగా ఉన్న ఓ ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన ఫయాజ్కు ప్రాథిమిక చికిత్స అనంతరం మలక్పేటలోని యశోదా ఆసుపత్రికి తరలించగా, అతని స్నేహితురాలిని సికింద్రాబాద్ యశోదా ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో గాయపడిన జీపు డ్రైవర్ను చికిత్స నిమిత్తం మరో ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రవినాయక్ తెలిపారు. -
హత్య పాపం వారిదే..
తండ్రి, కొడుకులను అరెస్టు చేసిన పోలీసులు షాబాద్: హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించిన కేసును షాబాద్ పోలీసులు ఛేదించారు. సొంత తండ్రి, తమ్మడే హత్య చేసినట్లు నిర్థారించారు. షాబాద్ సీఐ కాంతారెడ్డి తెలిపిన ప్రకారం.. ఈనెల 8న మండల పరిధిలోని కుర్వగూడకి చెందిన దాదే బాలకృష్ణ(45) ఇంట్లో మృతి చెందాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు చేపట్టారు. విచారణలో తండ్రి, తమ్ముడు బాలకృష్ణని చున్నీతో ఉరివేసి, చంపినట్లుగా నిర్థారించారు. ఆపై ఆత్మహత్య చేసుకున్నట్లుగా నమ్మించారు. ఆదివారం నిందితులిద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు సీఐ తెలిపారు. వృద్ధురాలి అదృశ్యం ఆమనగల్లు: మున్సిపల్ పరిధిలోని నుచ్చుగుట్ట తండాకు చెందిన నేనావత్ రమ్లి అదృశ్యమైంది. ఎస్ఐ వెంకటేశ్ తెలిపిన ప్రకారం.. తండాకు చెందిన రమ్లి కుటుంబ సభ్యులతో గొడవ కారణంగా మనస్థాపానికి గురై ఇంటినుంచి వెళ్లిపోయింది. కుటుంబ సభ్యలు సాధ్యమైన ప్రాంతాల్లో వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో ఆమె కుమారుడు భీమన్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. గ్రీన్ చానల్ ద్వారా అవయవాల రవాణా శంషాబాద్: గ్రీన్చానల్ ద్వారా శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి కిమ్స్ ఆస్పత్రికి అవయవాలను రవాణా చేశారు. ఆదివారం రాత్రి 6ఈ–216 విమానంలో విశాఖపట్నం నుంచి తీసుకొచ్చిన ఊపిరితిత్తులు రాత్రి 9 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరకున్నాయి. ఎయిర్పోర్టు నుంచి గ్రీన్చానల్ ద్వారా ప్రత్యేక అంబులెన్స్లో ట్రాఫిక్ క్లియరెన్స్ చేపట్టి 30 నిమిషాల్లోపు సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. -
హత్యాయత్నం కేసులో ముగ్గురికి రిమాండ్
మొయినాబాద్రూరల్: ఆస్తి వివాదంలో వ్యక్తిని హత్య చేసేందుకు యత్నించిన ముగ్గురు నిందితులను రిమాండ్కు తరలించామని మొయినాబాద్ సీఐ పవన్కుమార్రెడ్డి చెప్పారు. వివరాలు.. సురంగల్ పౌల్ట్రీ ఫామ్లో 250 గజాల ప్లాట్ విషయంలో తగాదా జరుగుతోంది. ఈ క్రమంలో శనివారం రామగళ్ల ప్రసాద్, రామగళ్ల నందం, సావిత్రి దంపతులు రామగళ్ల శ్యామ్పై వేట కొడవలితో దాడి చేయంతో తీవ్రంగా గాయపడ్డాడు. బాధితుడి భార్య అనిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని రాజేంద్రనగర్ న్యాయస్థానంలో ప్రవేశపెట్టగా రిమాండ్కు తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది. -
రక్తమోడుతున్న రహదారి..!
శంషాబాద్ రూరల్: రహదారి విస్తరణ పనుల్లో జాప్యం నెలకొనడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తొండుపల్లి రైల్వే వంతెన సమీపం నుంచి పాల్మాకుల వరకు మండల పరిధిలో జరుగుతున్న పనుల కారణంగా వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. పనులను ప్రారంభించి దాదాపు మూడేళ్లు గడిచినా... ఓ అడుగు ముందుకు.. రెండు అడుగులు వెనక్కు అన్నట్లుగా మారింది. ఈ రహదారిపై రాత్రి సమయంలో ప్రయాణం వాహనదారులకు నరక ప్రాయమవుతోంది. ఆరు వరుసలుగా... శంషాబాద్ మున్సిపల్ పరిధిలోని తొండుపల్లి నుంచి కొత్తూరు వరకు 12 కిలోమీటర్ల దూరం వరకు ఈ జాతీయ రహదారిని విస్తరిస్తున్నారు. ప్రస్తుతం నాలుగు వరుసలుగా ఉన్న రహదారిని ఆరు వరుసలకు విస్తరించడానికి సుమారు రూ. 540 కోట్లు కేటాయించారు. ఈ పనులను 2022 ఏప్రిల్లో కేంద్ర మంత్రి ఘడ్కరీ ప్రారంభించారు. ఆరంభంలో పనులు జోరుగా సాగినా.. మధ్యలో ఏడాది పాటు పనులు నిలిచిపోయాయి. అడపాదడపా అక్కడక్కడ పనులు చేస్తూ.. కాలం సాగదిస్తున్నారు. ప్రమాదాలతో ప్రాణాలకు ముప్పు... విస్తరణ పనులు పూర్తి కాకపోవడంతో రహదారిపై జరుగుతున్న ప్రమాదాలతో వాహనదారులు ప్రాణాలు కోల్పోతున్నారు. రెండేళ్ల కాలంలో పదుల సంఖ్యలో వాహనదారుల ప్రాణాలు గాల్లో కలిసాయి. ఇక గాయాలై ఆస్పత్రి పాలైన వాహనదారులు చాలా మంది ఉన్నారు. ● రెండు నెలల కిందట మదన్పల్లి శివారులో రహదారిపై బైక్ మీద వెళ్తున్న ఇద్దరు యువకులు రోడ్డు పక్కన నిర్మాణ సామగ్రిని ఢీకొని అక్కడిక్కడే మృతి చెందారు. ● పాల్మాకుల శివారులో బైక్పై వెళ్తున్న ఓ వ్యక్తి రహదారిపై జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. ● ఏదైనా ప్రమాదం జరిగినా.. వాహనాలు మరమ్మతులకు గురైనా రోడ్డుపై గంటల కొద్ది ట్రాఫిక్ నిలిచిపోతుంది. రాత్రి వేళల్లో జరిగే ఘటనలతో వాహనదారులు చాలా అవస్థలు పడుతున్నారు. బెంగళూరు జాతీయ రహదారి విస్తరణ పనుల్లో జాప్యం వాహనదారులకు శాపం -
పర్యావరణ రక్షణకు కృషి చేయాలి
కడ్తాల్: పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పర్యావరణ వేత్త, ప్రొఫెసర్ పురుషోత్తంరెడ్డి అన్నారు. ఆదివారం మండల పరిధిలోని అన్మాస్పల్లి సమీపంలోని ఎర్త్సెంటర్లో కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ పర్యావరణ సంస్థ ఆధ్వర్యంలో పర్యావరణ మార్పులపై అవగాహన సమావేశం నిర్వహించారు. ఐక్యరాజ్య సమితి బ్రెజిల్ దేశంలో నవంబర్ 10వ తేదీ నుంచి 21 వరకు నిర్వహించనున్న కాప్–30 కార్యక్రమానికి సమాంతరంగా కొనసాగనున్న కాన్ఫరెన్స్ ఆఫ్ పీపుల్స్ పేరుతో నిర్వహించనున్న సదస్సుకు ముందస్తుగా ఈ సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సీజీఆర్ చైర్పర్సన్ లీలాలక్ష్మారెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రొఫెసర్ పురుషోత్తంరెడ్డి మాట్లాడుతూ.. కాప్ కార్యక్రమం మొదటగా 1995 మార్చి 28 నుంచి ఏప్రిల్ 7వరకు జర్మనీలో నిర్వహించారని చెప్పారు. ప్రపంచంలో ఒక శాతం జనాభా ఉన్నవారి స్వార్థం కోసం చేస్తున్న ప్రకృతి విధ్వంసంతో 99 శాతం మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అడవులు జీవవైవిధ్యాన్ని, పర్యావరణ వ్యవస్థలను పరిరక్షించాలని, సహజ ఆవాసాలను పరిరక్షించడం, స్థిరమైన భూ వినియోగాన్ని ప్రోత్సహించడం తదితర చర్యలు చేపట్టాలని కోరారు. పర్యావరణ పరిరక్షణకు సీజీఆర్ సంస్థ నిర్విరామంగా ఐదేళ్లుగా కాప్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు నిర్వాహకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో పాలసీ నిపుణులు దొంతి నర్సింహారెడ్డి, సీజీఆర్ వ్యవస్థాపకులు లక్ష్మారెడ్డి, విశ్రాంత ఐఎఫ్ఎస్ అధికారిణి రాజేశ్వరి, పర్యావరణ శాస్త్రవేత్త డాక్టర్ సాయిభాస్కర్రెడ్డి, ఐఆర్ఎస్ అధికారి బండ్లమూడి సింగయ్య, వందేమాతరం ఫౌండేషన్ రవీందర్రావు, సీజీఆర్ ప్రతినిధులు పాల్గొన్నారు. పర్యావరణ వేత్త, ప్రొఫెసర్ పురుషోత్తంరెడ్డి -
ద్విచక్ర వాహనం చోరీ
రాజేంద్రనగర్: ఇంటి ముందు పార్కు చేసిన ద్విచక్ర వాహనాన్ని ఓ దొంగ నిమిషాల వ్యవధిలో దొంగలించి పారిపోయిన సంఘటన రాజేంద్రనగర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం... బుద్వేల్ హనుమాన్ దేవాలయం ప్రాంతంలో మసూద్ తన కుటుంబ సభ్యులతో కలిసి నివసిస్తున్నాడు. ప్రైవేటు ఉద్యోగం నిర్వహించే మసూద్ ఈ నెల 8వ తేదీన రాత్రి విధులు నిర్వహించుకొని తన ద్విచక్ర వాహనాన్ని ఇంటి ముందు పార్కు చేసి లోనికి వెళ్లాడు. లోపలికి వెళ్లిన 15 నిమిషాల అనంతరం బయటికి వచ్చి చూడగా వాహనం కనిపించలేదు. దీంతో చుట్టు పక్కల ప్రాంతాలు వెతికినా ప్రయోజనం లేకపోవడంతో రాజేంద్రనగర్ పోలీసులకు సమాచారం అందించాడు. ఓ యువకుడు ద్విచక్ర వాహనాన్ని కేవలం నిమిషాల వ్యవధిలోనే తీసుకొని ఉడాయించాడు. ఈ దొంగతనానికి సంబంధించిన పూర్తి దృశ్యాలు అక్కడే ఉన్న సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. రోడ్డు పాడు చేశారంటూ కారు డ్రైవర్పై ఫిర్యాదు మణికొండ: భారీ వర్షాలతో గుంతల మయంగా మారిన రోడ్డు పనులను ఓ వైపు చేస్తుండగానే ఓ కారు దానిపైకి వచ్చి మొత్తం పాడు చేసింది. దాంతో ఇంజనీరింగ్ అఽధికారులు కారు యజమానిపై పోలీసులకు ఫిర్యాదు చేసి కారును పోలీసులకు అప్పగించారు. మణికొండ మున్సిపాలిటీ కేంద్రంలోని పాత ఆంధ్రాబ్యాంక్ చౌరస్తా నుంచి మర్రిచెట్టు వైపు ఉన్న రోడ్డు గుంతల మయంగా మారటంతో రెండు రోజులుగా కొత్త రోడ్డు పనులను చేపడుతున్నారు. ఆ విషయం గమనించకుండా ఆదివారం ఉదయం ఓ కారు వేస్తున్న రోడ్డుపైకి వచ్చి మొత్తం పాడు చేసింది. విషయం తెలుసుకుని మణికొండ మున్సిపల్ డీఈ శివసాయి సదరు కారు యజమానిపై రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేసి కారును వారికి అప్పగించినట్టు తెలిపారు. ప్రజలందరికీ అవసరమయ్యే పనులను చేపడుతున్నపుడు వారు సహకరించాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. పది రోజుల పాటు సదరు రోడ్డును మూసి ఉంచుతున్నామని, ప్రయాణికులు ఇతర రోడ్ల ద్వారా వెళ్లాలని ఆయన కోరారు. శంషాబాద్: విమానంలో ఓ ప్రయాణికుడు అస్వస్థతకు గురికావడంతో విమానం తిరిగి వచ్చి ఆలస్యంగా బయలుదేరిన సంఘటన ఆదివారం శంషాబాద్ విమానాశ్రయంలో చోటు చేసుకుంది. శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఇండిగో విమానం 6ఈ–6223 విమానంలో 166 మంది ప్రయాణికులతో సాయంత్రం 3.55 గంటలకు బిహార్ రాజధాని పాట్నాకు టేకాఫ్ తీసుకుని బయలుదేరింది. కొద్ది నిమిషాల అనంతరం 11ఈ సీటులో కూర్చున్న ప్రయాణికుడు సంతోష్కుమార్ తీవ్ర అస్వస్థతకు గురికావడంతో పాటు వాంతులు చేసుకోవడంతో వెంటనే పైలట్ అధికారుల అనుమతితో ఎయిర్పోర్టులో 4.15 గంటలకు తిరిగి ల్యాండ్ చేశారు. అస్వస్థతకు గురైన ప్రయాణికుడికి ఆస్పత్రికి తరలించారు. తిరిగి విమానం సాయంత్రం 5.56 గంటలకు 165 మంది ప్రయాణికులతో పాట్నా బయలుదేరింది. కూతురిలా ఉన్నావంటూనే.. ● అసభ్యకరంగా ప్రవర్తించిన పై అధికారి ● పోలీసులకు ఫిర్యాదు చేసినయువతి, కేసు నమోదు బంజారాహిల్స్: కూతురిలా ఉన్నావని ప్రారంభంలో మర్యాదగా మాట్లాడి.. చనువు పెంచుకుని మెల్లమెల్లగా తన దుర్బుద్ధిని బయటపెట్టిన సీనియర్ అధికారిపై ఓ యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. వివరాల్లోకి వెళితే.. మైండ్స్పేస్లోని ఓ ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థలో హెచ్ఆర్గా పనిచేస్తున్న యువతి (26)కి తన పైఅధికారిగా పనిచేస్తున్న మృణాల్దాస్ (51)తో పరిచయం ఏర్పడింది. తరుచూ ఇద్దరూ మాట్లాడుకునేవారు. తన కుమార్తెలా ఉన్నావంటూ మృణాల్దాస్ ఆత్మీయతంగా వ్యవహరించేవాడని యువతి పేర్కొంది. జులై 5న ఆమె.. మృణాల్దాస్తో కలిసి జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్–72లో ఉన్న ది స్విఫ్ట్ ఎలిమెంట్ స్పాకు వెళ్లినట్లు తెలిపింది. పురుషులు, మహిళలకు వేర్వేరు గదులు ఉన్నాయని చెప్పడంతో తాను వెళ్లగా తనకు మసాజ్ చేస్తున్న సమయంలో నిద్రలో ఉండగా ఒక దశలో వెనుక నుంచి వేరొకరి చేతులు తగిలాయని, గమనించి చూసేసరికి మృణాల్దాస్ తన పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని గుర్తించానంది. తనపై అనుచితంగా ప్రవర్తిస్తూ అసభ్యకరంగా మాట్లాడుతుండటంతో తాను అరిచి మందలించానని తెలిపింది. ఆయన గది నుంచి వెళ్లిపోయినప్పటికీ మళ్లీ రావాలని ప్రయత్నించాడని ఆరోపించింది. ఇటీవల ఆయన లండన్కు వెళ్లడం జరిగిందని, అక్కడి నుంచి కూడా వీడియో కాల్ ద్వారా అసభ్యకరంగా ప్రవర్తించాడని ఆరోపించింది. ఈ సంఘటనను తాను పనిచేస్తున్న సాఫ్ట్వేర్ సంస్థ హెచ్ఆర్ టీమ్కు కూడా తెలియజేశానని పేర్కొంది. తన భద్రత పట్ల భయంగా ఉందని, ఆయన మళ్లీ వేధించే అవకాశం ఉందంటూ చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరింది. జూబ్లీహిల్స్ పోలీసులు మృణాల్దాస్పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఇద్దరిని బలిగొన్న ఈత సరదా
రాజేంద్రనగర్: జలపాతంలో ఈతకొట్టేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు నీట మునిగి ఇద్దరు పదో తరగతి విద్యార్థులు మృత్యువాత పడిన ఘటన రాజేంద్రనగర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సులేమాన్నగర్ ఎం.ఎం.పహాడీకి చెందిన మహ్మద్ రెహాన్ (16), సోహేల్ (15)లతో పాటు మరో నలుగురు బైక్లపై ఆదివారం మధ్యాహ్నం రాజేంద్రనగర్ గోల్డెన్ హైట్స్ ప్రాంతంలోని మొండికత్వ ప్రాంతానికి చేరుకున్నారు. జనచైతన్య వెంచర్లోని ఖాళీ స్థలంలో వాహనాలను పార్కు చేసి జలపాతం వద్దకు వెళ్లారు. ఈత కొట్టేందుకు ప్రయత్నించగా.. ప్రమాదవశాత్తు మహ్మద్ రెహాన్, సోహేల్లు నీళ్లలో మునిగిపోయారు. ఈ విషయాన్ని రాజేంద్రనగర్ పోలీసులకు తెలపడంతో అగ్నిమాపక సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. రాత్రి 8 గంటల వరకు వెతికి ఇద్దరి మృతదేహాలు నీటిలోంచి వెలికితీశారు. ఘటనా స్థలం వద్ద మృతుల కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు. -
ఆధ్యాత్మికం.. అదృష్టం
శ్రీవారి సేవలో రుద్రారం భజన మండలి ● ఏటా అఖండ హరినామ సంకీర్తనలో పాల్గొంటున్న సభ్యులు ● వృత్తి పనులు చేసుకుంటూనే సంగీతంలో ప్రావీణ్యం‘ఆధ్యాత్మిక చింతనతో ప్రశాంతంగా ఉన్నాము. వృత్తిపరమైన పనులు చేసుకుంటూనే.. టీటీడీ ఆహ్వానం మేరకు ఏటా ఏడుకొండలు సన్నిధిలో జరిగేఅఖండ హరినామ సంకీర్తనలోపాల్గొంటున్నాం. శ్రీవారి సేవలో తరిస్తున్నాము. దీనిని తమ అదృష్టంగా భావిస్తున్నాము’ అని రుద్రారం వీరాంజనేయభజన మండలి సభ్యులు అన్నారు.కొడంగల్ రూరల్: తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమలలో నిర్వహించే అఖండ హరినామ సంకీర్తనలో కొడంగల్ మండలం రుద్రారం గ్రామానికి చెందిన వీరాంజనేయ భజన మండలి సభ్యులు పాల్గొంటున్నారు. వీరు గ్రామంలోని పురాతన వీరాంజనేయ ఆలయంలో ప్రతి శనివారం, పండుగ, ప్రత్యేక రోజుల్లో భజనలు చేయడంతో పాటు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. 14 ఏళ్ల ప్రస్థానం ఆధ్యాత్మిక కార్యక్రమాల నేపథ్యంలో మహబూబ్నగర్ దేవాదాయ శాఖ కార్యాలయం సూచన మేరకు భజన మండలి సభ్యులు.. 2012లో తిరుమలలో నిర్వహించే అఖండ హరినామ సంకీర్తనలో పాల్గొనేందుకు దరఖాస్తు చేసుకున్నారు. అనంతరం టీటీడీ నుంచి ఆహ్వానం అందింది. అదే ఏడు అక్టోబర్ 10న 18మంది సభ్యులు తొలిసారి అఖండ పారాయణంలో పాల్గొన్నారు. అలా మొదలైన వీరి ప్రస్థానం 14 ఏళ్లుగా కొనసాగుతోంది. గత నెల సెప్టెంబర్ 11,12 తేదీల్లో ఉదయం 8నుంచి 10గంటలు, రాత్రి 8నుంచి 10గంటల వరకు, రెండు రోజులు 8 గంటల పాటు పారాయణంలో పాల్గొన్నారు. 2021– 22లో రవీంద్రభారతిలో ‘భక్తి భజనసంకీర్తన పరిషత్’ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి భజన పోటీల్లో 4వ స్థానం బహుమతిని భజన మండలి అందుకుంది. మండలిలో 18 మంది సభ్యులు ఉండగా.. ఇందులో 13 మంది వ్యవసాయం చేస్తూనే.. సంగీతంలో ప్రావీణ్యం పొందారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇద్దరు వైద్యులు, మరో ఇద్దరు వ్యాపారులు, ఒకరు రాజకీయ నేత ఉన్నారు. ఇటీవల శ్రీశైలంలో అఖండ శివనామ స్మరణలో సభ్యులు పాల్గొన్నారు. -
డీసీసీ పీఠం ఎవరిదో!
వికారాబాద్: జిల్లాలకు డీసీసీ అధ్యక్షులను నియమించేందుకు ఏఐసీసీ, పీసీసీ కసరత్తు చేస్తున్న నేపథ్యంలో.. అధికార పార్టీతో పాటు, ప్రతిపక్ష పార్టీల్లోనూ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఎవరనేదానిపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. మూడేళ్లకోసారి పార్టీ సంస్థాగత పటిష్టతలో భాగంగా ఏఐసీసీ నూతన కమిటీలను నియమిస్తుంది. జిల్లా ఏర్పాటు అయ్యాక తొలిసారి తాండూరు మాజీ ఎమ్మెల్యే రోహిత్రెడ్డి డీసీసీ అధ్యక్షుడిగా పనిచేశారు. అనంతరం ఆయన పార్టీ వీడటంతో.. ఆ పదవిని ప్రస్తుత డీసీసీ అధ్యక్షుడు టి.రామ్మోహన్రెడ్డిని అధిష్టానం నియమించింది. ఆ తరువాత 2022లో కొత్త కమిటీలు వేయగా.. రెండోసారి సారి కూడా టీఆర్ఆర్కే పీఠం వరించింది. రెండు పర్యాయాలు(ఆరేళ్లు)గా ఆయన బాధ్యతలు చేపడుతూ వచ్చారు. ప్రస్తుతం పదవీ కాలం ముగియటంతో.. కొత్త అధ్యక్షులను నియమించేందుకు పార్టీ కసరత్తు చేస్తోంది. 2023 ఏడాది చివరలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన సారథ్యంలోనే.. జిల్లాలో ఉన్న నాలుగింటికి నాలుగును పార్టీ హస్తగతం చేసుకుంది. ఈ నేపథ్యంలో మరోసారి ఆ పదవి ఆయనకే కట్టబెట్టే అవకాశాలు మెండుగా ఉన్నాయని పార్టీ నేతలు పేర్కొంటున్నారు. ఈ సారి వినూత్నంగా.. సాంప్రదాయాలకు భిన్నంగా ఈ సారి అధ్యక్షుల నియామకం విషయంలో అధిష్టానం కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది. ఆశావహులు ఎందరున్నా.. దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. ఒక ఫారం ఇచ్చి, అందులోనే ఆశావహుల వివరాలను నమోదు చేయిస్తోంది. వారు గతంలో పార్టీ పరంగా.. ప్రజా ప్రతినిధులుగాఏ హోదాల్లో పని చేశారు. పార్టీకి అందించిన సేవలు తదితర పూర్తి వివరాలు ఫారంలో పొందుపర్చాల్సి ఉంటుంది. ఏఐసీసీ బృందం పర్యటన కేరళకు చెందిన ఎంపీ సారథ్యంలోని ఏఐసీసీ బృందం ఈ నెల 14వ తేదీలోగా జిల్లాలో పర్యటించనుంది. ఆ బృందం సభ్యులు జిల్లా పర్యటనసందర్భంగా క్షేత్రస్థాయి కార్యకర్తలు, నేతలతో పాటు, ఎమ్మెల్యేల అభిప్రాయాలు తీసుకోనుంది. ఈ ప్రక్రియ ముగియగానే ఏఐసీసీ బృందంతో పాటు పీసీసీ చర్చించి, ఆరుగురి పేర్లను ఫైనల్ చేయనుంది. సీల్డ్ కవర్లో ఖర్గే సారథ్యంలోని పార్టీ పెద్దలకు అందజేస్తారు. పరిశీలన అనంతరం అధ్యక్షుడి ఎంపిక ఉంటుందని తెలుస్తోంది. అదీ నెలాఖరులోగా ముగియనున్నట్లు సమాచారం. సమర్థుడి కోసం అన్వేషణ డీసీసీ పీఠం దక్కించుకునేందుకు ఆశావహులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు పార్టీలో చర్చ. స్థానిక సంస్థల ఎన్నికలు మొత్తం డీసీసీ అధ్యక్షుల సారథ్యంలోనే జరుగుతాయి. మరో మూడేళ్లలో సాధారణ ఎన్నికలు రానున్నాయి. ఇవి కూడా ఇప్పుడు నియమించబోయే అధ్యక్షుడి ఆధ్వర్యంలో జరగనున్నాయి. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకుని, సమర్థవంతమైన నాయకుడికి పట్టం కట్టాలనే ఆలోచనలో పార్టీ హస్తిన పెద్దలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో జిల్లా పార్టీని నడిపించటంతో పాటు ప్రతిపక్ష పార్టీ నేతలను ఎదుర్కోగల సత్తా ఉన్న నేతకు పట్టం కట్టబెట్టే అవకాశాలు ఉన్నాయి. అధ్యక్ష పీఠంపై ఆశావహుల పోటీ సమర్థుడి వేటలో అధిష్టానం అందరి అభిప్రాయాలతో హస్తినకు జాబితా ఏఐసీసీ, పీసీసీ పరిశీలకుల పర్యవేక్షణలో స్కూట్నీ మరోసారి టీఆర్ఆర్కే పట్టం!, పరిశీలనలో మరికొన్ని పేర్లు స్థానిక ఎన్నికల నేపథ్యంలో అధికార పార్టీ కాంగ్రెస్.. సంస్థాగత నిర్మాణంపై దృష్టి సారించింది. ఎన్నికల్లో పై చేయి సాధించడమే లక్ష్యంగా కసరత్తు చేస్తోంది. ఈ మేరకు జిల్లాకు కొత్త సారథిని ఎంపిక చేసే పనిలో బిజీగా ఉంది. ఇందులో భాగంగా కేడర్ నుంచి అభిప్రాయ సేకరణ కోసం ఏఐసీసీ పరిశీలకుల బృందం పర్యటించనుంది. గతంలో డీసీసీ రేసులో ఉండి తప్పుకున్న నేతలతో పాటు మరికొన్ని కొత్త పేర్లు పీఠం రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా ప్రస్తుత డీసీసీ అధ్యక్షుడు టీఆర్ఆర్తో పాటు వికారాబాద్కు చెందిన సుధాకర్రెడ్డి, ధారూరు మండలానికి చెందిన రఘువీరారెడ్డి, తాండూరుకు చెందిన బుయ్యని శ్రీనివాస్రెడ్డి తదితరులు ఇందులో ఉన్నారు. ఒకవేళ బీసీ నేతకుఇవ్వాలనే ఆలోచనలో పార్టీ పెద్దలు ఉన్న నేపథ్యంలో.. తాండూరుకు చెందిన ఉత్తంచంద్, వికారాబాద్కు చెందిన గుడిసె లక్ష్మణ్, పరిగి వాసి హన్మంతు ముదిరాజ్, లాల్కృష్ణ ప్రసాద్లలో ఎవరికో ఒకరికి అవకాశం దక్కనుంది. సమర్థులకే అంటే.. ప్రస్తుత ఎమ్మెల్యేలు రామ్మోహన్రెడ్డి, మనోహర్రెడ్డిలలో ఒకరికి పీఠం దక్కే అవకాశం లేకపోలేదు. -
పరిగికి పవర్ సమస్య లేకుండా చేస్తా
● ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి ● 400 కేవి సబ్స్టేషన్ మంజూరుపరిగి: పరిగికి విద్యుత్ సమస్య లేకుండా చేస్తానని ఎమ్మెల్యే టి.రామ్మోహన్రెడ్డి అన్నారు. ఆదివారం పట్టణ కేంద్రంలోని ఆయన నివాసంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పరిగికి కొత్తగా 400కేవీ సబ్స్టేషన్ మంజూరు అయిందని, త్వరలో శంకుస్థాపన చేస్తానని చెప్పారు. గతంలో కాంగ్రెస్ హయాంలో 400కేవీల సబ్స్టేషన్ మంజూరు అయితే.. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఎలాంటి పనులు చేపట్టలేదని ఆరోపించారు. మళ్లీ కాంగ్రెస్ వచ్చాకే సీఎం, డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకెళ్లి, పనులను ప్రారంభించే విధంగా చర్యలు తీసుకుంటున్నానని తెలిపారు. రూ.400 కోట్లతో సబ్స్టేషన్ నిర్మాణం జరుగుతుందని, జిల్లాలోనే ఎక్కడా లేని విధంగా ఇక్కడ సబ్స్టేషన్ ఏర్పాటు అవుతుందన్నారు. పరిగిలో ఇప్పటికే 220 కేవీ సబ్స్టేషన్, విండ్పవర్, సోలార్ విద్యుత్ ఉత్పత్తి అవుతుందని చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అర్హులందరికీ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందజేస్తోందని తెలిపారు. అధికారం చేపట్టిన ఏడాదిలో నియోజకవర్గానికి 3,500 ఇళ్లను మంజూరు చేసిందని, రైతులకు రుణమాఫీ, పేదలకు సన్నబియ్యం అందిస్తోందన్నారు. నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని స్పష్టం చేశారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పరశురాంరెడ్డి, వైస్ చైర్మన్ అయూబ్, డీసీసీ ఉపాధ్యక్షుడు లాల్కృష్ణ, ప్రధాన కార్యదర్శి హన్మంతు ముదిరాజ్, పట్టణ అధ్యక్షుడు ఎర్రగడ్డపల్లి కృష్ణ పాల్గొన్నారు. -
విద్యాలయాల తరలింపు!
కొడంగల్: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నియోజకవర్గం కొడంగల్కు మంజూరు అయిన ప్రభుత్వ మెడికల్ కళాశాల, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ గురుకులాలను మరో ప్రాంతానికి తరలిస్తున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇదే విషయమై ఇటీవల ఉపాధ్యాయ సంఘాలు కడా ప్రత్యేకాధికారి వెంకట్రెడ్డికి వినతిపత్రం అందజేశాయి. శనివారం సీఎంను కలవడానికి వెళ్లిన ఉపధ్యాయులకు అపాయిట్మెంట్ దొరకలేదు. దీంతో వారు నిరాశగా వెనుదిరిగారు. కాగా.. కళాశాల, గురుకుల భవనాలు నిర్మిస్తున్న ప్రాంతాన్ని ‘సాక్షి’ ఆదివారం విజిట్ చేసింది. నిర్మాణ పనుల గురించి సిబ్బందితో మాట్లాడగా.. రెండు నెలల నుంచి పనులు నిలిపివేశారని తెలిపారు. దీంతో స్థానికులు ఆందోళనకు దిగారు. ‘కొడంగల్ అభివృద్ధి పరిరక్షణ ఐక్య కార్యాచరణ కమిటీ’ని ఏర్పాటు చేసి ఉద్యమ బాట పట్టారు.ఇంత జరుగుతున్నా.. సంబంధిత అధికారులు వాస్తవాలను దాచిపెడుతున్నారని ఆరోపిస్తున్నారు. 20 ఎకరాల్లో ఇంటిగ్రేటెడ్ పాత కొడంగల్ సమీపంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ గురుకుల భవనాలను ప్రభుత్వం మంజూరు చేసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాలన్నీ ఒకే ప్రాంగణంలో ఉండేలా చర్యలు తీసుకుంది.అందుకు 20 ఎకరాల్లో అధునాతనమైన భవనాలను నిర్మించడానికి భూమి పూజ చేసింది. ఇందుకు రూ.100 కోట్లను సైతం మంజూరు చేసింది. మెడికల్ కళాశాల మండల పరిధి అప్పాయిపల్లి(ఎరన్పల్లి) గ్రామ శివారులో మెడికల్ కళాశాల నిర్మించడానికి ప్రభుత్వం రైతుల భూమి సేకరించింది. భవన నిర్మాణాలు, మౌలిక సదుపాయాల కోసం రూ.124.50 కోట్లు మంజూరు చేసింది. నర్సింగ్ కళాశాల భవన నిర్మాణం, సౌకర్యాల కల్పనకు రూ.46 కోట్లు, ప్రభుత్వ ఫిజియోథెరపీ, పారామెడికల్ కళాశాలల నిర్మాణానికి రూ.27 కోట్లు మంజూరు చేసింది. నిర్మాణ పనులు చేపట్టడానికి ఏర్పాట్లు జరిగాయి. కానీ ప్రస్తుతం పనులు నిలిచిపోయాయి. అభివృద్ధి పనులను తరలించ వద్దు మండలానికి మంజూరు అయిన విద్యా సంస్థలను తరలించవద్దని ఐక్య కార్యాచరణ కమిటీ సభ్యులు ప్రభుత్వాన్ని కోరారు. ఆదివారం పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. మెడికల్ కళాశాల, గురుకులాలను లగచర్లకు తరలిస్తున్నారని ఆరోపించారు. అలా చేయడం వలన ఈ ప్రాంతానికి నష్టం జరుగుతుందని వాపోయారు. అనంతరం కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు. కన్వీనర్గా లక్ష్మీనారాయణ గుప్తా, కో–కన్వీనర్లుగా సురేష్ కుమార్, శ్రీనివాస్, శాంతకుమార్, గౌసన్, నవాజ్, రమేష్బాబులనునియమించారు. ఆగిన ఇంటిగ్రేటెడ్, మెడికల్ కళాశాల నిర్మాణ పనులు ఆందోళన బాటలో ఐక్య కార్యాచరణ కమిటీ కడా అధికారిని కలిసిన ఉపాధ్యాయ సంఘాలు అయోమయంలో కొడంగల్ ప్రజలు -
కుండపోత.. గుండెకోత
తాండూరు రూరల్: భారీ వర్షాల కారణంగా సోయాబీన్ సాగు చేసిన రైతులు ఆందోళనచెందుతున్నారు. పంట నష్టపోయి దిగాలుచెందుతున్నారు. తాండూరు మండలం ఐనెల్లి, కోటబాసుపల్లి, మిట్టబాసుపల్లి, జినుగుర్తి గ్రామాల్లో 600 ఎకరాల్లో సోయాబీన్ సాగు చేశారు. ఈ సాగు.. మధ్యప్రదేశ్ తరువాత తెలంగాణలోని నిజామాబాద్, కరీనంగర్, ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్, మెదక్లోవిస్తృతంగా సాగవుతోంది. మండల పరిధిఐనెల్లి గ్రామానికి చెందిన రైతు మాధవరెడ్డి తొలిసారిగా 1996లో తన సాగుభూమిలో సోయాబీన్ సాగు చేశారు. దానిని చూసినఆ గ్రామ రైతులు చాలామంది ఈ పంట సాగుకు మక్కువ చూపారు. తగ్గిన దిగుబడి సోయాబీన్ గతంలో ఎకరాకు దాదాపు 8 నుంచి 10 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చేది. ప్రస్తుతం భారీ వర్షాల కారణంగా 5 నుంచి 6 క్వింటాళ్లు మాత్రమే వస్తోందని రైతులు చెబుతున్నారు. ఇంకా 20 శాతం పొలాల్లో పంట ఉందని, వాన కారణంగా కోత యంత్రం పొలాల్లోకి వెళ్లలేని పరిస్థితి ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గింజ నల్లగా మారడంతో మార్కెట్లో సరైన మద్దతు ధర దొరకడం లేదని పేర్కొంటున్నారు. మార్కెట్లో మద్దతు ధర రూ.5,328 ఉందని, కానీ తాండూరు వ్యవసాయ మార్కె ట్లో మాత్రం ప్రస్తుతం ఽక్వింటాకు రూ.4,100లకే వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారని రైతులు తెలిపారు. ఇలా అయితే పెట్టుబడి వచ్చే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఆగస్టులో కురిసిన వర్షాలతో చాలా పంటలు దెబ్బతిన్నాయి. వాటి వివరాలను సేకరించాము. అందులో సోయాబీన్ ఉన్నట్లు గుర్తించాం. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సెప్టెంబర్లో నష్టపోయిన పంటల వివరాలను తెలుసుకుంటున్నాము. సోయాబీన్ నష్టంపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం. – కొమురయ్య, ఏడీఏ, తాండూరు డివిజన్ 12 ఎకరాల్లో సోయాబీన్ సాగు చేశాను. గతంలో ఎకరాకు 10 క్వింటాళ్ల దిగుబడి వచ్చేది. వర్షాల కారణంగా ప్రస్తుతం 6 క్వింటాళ్లు మాత్రమే వచ్చింది. గింజలు నల్లగా మారాయి. మద్దతు ధర కరువైంది. ఈ ఏడు పెట్టుబడులు కూడా వచ్చేలా లేవు. ప్రభుత్వం ఆదుకోవాలి. – మాధవరెడ్డి, రైతు, ఐనెల్లి అధిక వర్షాలతో దెబ్బతిన్న పంటలు సోయాబీన్పై అధిక ప్రభావం తగ్గిన దిగుబడి.. నల్లబడిన గింజ సన్నగిల్లిన మద్దతు ధర అతివృష్టి అనావృష్టి అంటారు. ఈ ఏడు అదే జరిగింది. కాలం కొంత ఆలస్యంగా అయినా.. బాగా అయిందని రైతన్నలు మురిసిపోయారు. ఆ మురిపెం ఎన్నోరోజులు ఉండలేదు. కుండపోత వర్షాలతో పత్తి, సోయాబీన్, వరి తదితర పంటలకు తీవ్రనష్టం కలిగించి, అన్నదాతలకుగుండెకోత మిగిల్చింది. సోయాబీన్ సాగు ఎకరాకు రూ.25 వేల పెట్టుబడి అవుతుందని రైతులు తెలిపారు. ఎకరాకు 30 కిలోల విత్తనాలు అవసరమని, వాటికి రూ.3,200 ధర ఉందని చెప్పారు. జూన్ రెండో వారంలో ప్రారంభించి, సెప్టెంబర్ నెల ఆఖరు వరకు పంట చేతికి వస్తోందని పేర్కొంటున్నారు. విత్తనాలు, కలుపు, ఎరువులు, కోత మిషన్ అన్నీ కలుపుకొని ఎకరాకు పైన పేర్కొన్న ఖర్చు అవుతుందంటున్నారు. -
ఘనంగా నృసింహుడి బ్రహ్మోత్సవాలు
పరిగి: లక్ష్మీనర్సింహ స్వామి చతుర్థ బ్రహ్మోత్సవాలు వైభవోపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా.. తొలిరోజు ఆదివారం స్వామి వారికి వేదస్వస్తి, యాగశాల ప్రవేశం, విశ్వక్సేన ఆరాధన, వాసుదేవ పుణ్యాహవాచనం, దీక్షాధారణ, రుత్విక్కరణం, మృత్సంగ్రహణ, అంకురార్పణ, అఖండ దీపారాధన, అగ్ని ప్రతిష్ట హోమం, ధ్వజారోహణం, మంత్రపుష్పం, తీర్థప్రసాద వినియోగాలను నిర్వహించారు. బ్రహ్మోత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పూజలు చేశారు. ● బీసీ సంఘం నాయకుల ఆరోపణ ● 18న తాండూరు బంద్కు పిలుపు తాండూరు టౌన్: బీసీ రిజర్వేషన్లపై ఉన్నత న్యాయస్థానం స్టే ఇవ్వడం అగ్రకులాల కుట్రలో భాగమేనని బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యుడు కందుకూరి రాజ్కుమార్ ఆరోపించారు. బహుజనులు బానిసలుగానే ఉండాలనే వారి దురహంకారాన్ని ఎండగడతామన్నారు. స్టేకు నిరనగా ఈ నెల 18న తాండూరు బంద్కు పిలుపునిచ్చామని పేర్కొన్నారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ..సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా బంద్ నిర్వహించనున్నట్లు తెలిపారు. రిజర్వేషన్లు అమలు చేసే పోరాటం ఆగదని స్పష్టం చేశారు. బంద్కు వ్యాపారులు, విద్యా సంస్థలు, పార్టీలకు అతీతంగా సహకరించాలని ఆయన కోరారు. తాండూరు టౌన్: మార్నింగ్ వాక్ ఆరోగ్యానికి మేలు చేస్తుందని మార్వాడీ యువమంచ్ జాతీయ కార్యవర్గ సభ్యుడు మన్మోహన్ సార్డా అన్నారు. ఆదివారం యువమంచ్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మంచ్ వ్యవస్థాపక అధ్యక్షుడు విజయ్ ప్రకాష్ సార్డా జెండా ఊపి వాక్థాన్ను ప్రారంభించారు. అనంతరం మన్మోహన్ మాట్లాడారు. నేటి ఉరుకుపరుగుల జీవితంలో ప్రజల ఆహారపు అలవాట్లు మారాయని, వ్యాయామానికి దూరమయ్యారని తెలిపారు. తద్వారా ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని పేర్కొన్నారు. నిత్యం గంటపాటు నడిస్తే ఆరోగ్యంగా ఉంటారని పేర్కొన్నారు. మంచ్ తాండూరు అధ్యక్షుడు అనిల్ సార్డా, కార్యదర్శి సచిన్ రాఠి, కోశాధికారి అరుణ్ సార్డా, రోహిత్ అగర్వాల్, సూర్య ప్రకాష్ సోమాని తదితరులు పాల్గొన్నారు. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ఇబ్రహీంపట్నం రూరల్: ఎల్మినేడు భూ బాధితులకు ఇచ్చిన మాట ప్రకారం ఇంటి జాగలు ఇచ్చి ఆదుకుంటానని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అన్నారు. ఆదివారం భూ బాధితులు ఎమ్మెల్యేను కలిసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇప్పటికే ముఖ్యమంత్రిని ఒప్పించి, కలెక్టర్కు ఆదేశాలు ఇప్పించామన్నారు. త్వరలో అధికారులు మరలా ఎల్మినేడుకు వస్తారన్నారు. మొదట ఎంజాయ్మెంట్ సర్వే చేపట్టి, రికార్డు ప్రకారం అర్హులైన రైతులకే ప్లాట్లు ఇప్పించేందుకు కృషి చేస్తామన్నారు. అక్రమాలు, అవినీతి జరిగితే లీగల్టీం క్షుణ్ణంగా పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటుందని వివరించారు. -
రైతులకు వరం ‘పీఎం ధన్ధాన్య’
ఇబ్రహీంపట్నం రూరల్: పీఎం ధన్ ధాన్య కృషి యోజన పథకం రైతులు ఆర్థికంగా ఎదగడానికి ఎందో దోహదపడుతుందని రంగారెడ్డి జిల్లా వ్యవసాయాధికారి ఉష తెలిపారు. ప్రధానమంత్రి ధన్–ధాన్య కృషి యోజన పథకం, పప్పు ధాన్యాల మిషన్ను ప్రధాని నరేంద్రమోదీ శనివారం వర్చువల్ ద్వారా ప్రారంభించారు. జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ భవనంలోని సమావేశ మందిరంలో ప్రారంభ కార్యక్రమాన్ని జిల్లా వ్యవసాయాధికారి, వివిధ మండలాల నుంచి దాదాపుగా 200 మంది రైతులు, కేవీకే సెంటర్, క్రిడా తరఫున శాస్త్రావేత్తలు, డివిజన్ ఏడీఏలు, మండల వ్యవసాయాధికారులు, విస్తరణ అధికారులు వీక్షించారు. ఈ సందర్భంగా ఉష మాట్లాడుతూ.. ఈ పథకం ఆరేళ్ల పాటు కొనసాగుతుందని తెలిపారు. వ్యవసాయ రంగం తక్కువ ఉత్పాదకత, తగినంత హామీ లేని నీటి పారుదల, పరిమిత రుణ లభ్యత, పంట కోత తర్వాత మౌలిక సదుపాయలు లేకపోవడం వంటి అనేక సవాళ్లను ఎదుర్కొంటోందన్నారు. వ్యవసాయ సామర్థ్యం సమృద్ధిగా ఉన్నప్పటికీ ఉత్పాదకత, ఆర్థికాభివృద్ధి పరంగా వెనుకబడిన అనేక జిల్లాల్లో ఈ సవాళ్లు స్పష్టంగా కనిపిస్తున్నాయని, ఈ అంతరాలను పరిష్కరించాల్సిన అవసరాన్ని గుర్తించి కేంద్రం 2025 బడ్జెట్లో పీఎం ధన్ధాన్య కృషి యోజన కింద 100 అకాంక్షాత్మక వ్యవసాయ జిల్లాలను అభివృద్ధి చేస్తామని ప్రకటించిందన్నారు. కార్యక్రమంలో కేవీకే శాస్త్రవేత్త విజయ్కుమార్, చిత్తాపూర్ గ్రామ రైతు అన్నపూర్ణ ప్రకృతి వ్యవసాయంలో తన అనుభాలను తోటి రైతులతో పంచుకున్నారు. -
పప్పు ధాన్యాలకు డిమాండ్
పరిగి: పప్పు ధాన్యాల సాగుతో రైతులు అధిక లాభాలు ఆర్జించవచ్చునని పరిగి ఎమ్మెల్యే టి.రామ్మోహన్రెడ్డి అన్నారు. శనివారం మండల పరిధిలోని నస్కల్ రైతు వేదికలో పప్పు ధాన్యాల్లో ఆత్మ నిర్భర్ అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దేశ ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయం కీలకమైందన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సబ్పిడీ పథకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మార్కెట్లో డిమాండ్ ఉన్న నేపథ్యంలో పప్పు ధాన్యాల సాగు చేపట్టి అధిక దిగుబడులు సాధించాలన్నారు. ప్రతీ గ్రామంలో రైతు సంఘాలను ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు. వ్యవసాయాధికారుల సూచనలు సలహాలు పాటించి సత్ఫలితాలు రాబట్టాలన్నారు. రైతు సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో ఏడీఏ డీఎస్ లక్ష్మీకుమారి, ఆత్మ కమిటీ చైర్మన్ శ్రీనివాస్రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ పరశురాంరెడ్డి, వైస్ చైర్మన్ ఆయూబ్, కాంగ్రెస్ పూడూర్ మండల అధ్యక్షుడు సురేందర్ముదిరాజ్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. హస్తం గూటికి బీఆర్ఎస్ నేతలు గండీడ్ మండల పరిధిలోని చెన్నాయపల్లి తండా అనుబంధ గ్రామం మాలగుడిసెలకు చెందిన బీఆర్ఎస్ నేతలు హస్తం గూటికి చేరుకున్నారు. శనివారం పరిగి ఎమ్మెల్యే టి.రామ్మోహన్రెడ్డి నివాసంలో ఆయనను కలసి పార్టీలో చేరారు. పెద్ద అంజిలయ్య, చిన్న అంజిలయ్య, రమేశ్, సురేశ్, కృష్ణ, వెంకటయ్య, రమేశ్, మాధురి వెంకటయ్య, మొగులయ్యతో పాటు మరో 50 మందికి ఎమ్మెల్యే కండువాలు కప్పి కాంగ్రెస్లోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పీసీసీ మెంబర్ నర్సింహారావు, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు జితేందర్రెడ్డి,ఎస్సీ, ఎస్టీ సెల్ జిల్లా కార్యదర్శి మోహన్నాయక్, వర్కింగ్ ప్రసిడెంట్ శ్రీనివాస్రెడ్డి, నేతలు, తదితరులు పాల్గొన్నారు. -
ఎందుకిలా..?
ఎవ్రీ వన్ ఈజ్ యూనిక్.. విద్యా వ్యవస్థలోపర్యవేక్షణ బాధ్యతలు నిర్వహిస్తున్న వారికి ఈ పదం తెలియని వారుండరు. విద్యార్థులు ఎవరికి వారు ప్రత్యేకమని అర్థం. ఒక్కొక్కరిలో ఒక్కోలా సామర్థ్యాలు, అభ్యసనా శైలి, ఆసక్తి, సవాళ్లుంటాయి. వ్యక్తిగత వ్యత్యాసాలను గుర్తించడమే ప్రధానం. క్రమశిక్షణ పేరిట అందరినీ ఒకేలా చూడడం కుదరదు. చాలా చోట్ల పిల్లలను చూడడంలో మాత్రం ఈ ప్రాథమిక సూత్రాన్ని విస్మరిస్తున్నారు. దీంతో తరచూ గురుకులాలు, విద్యాలయాలు, వసతి గృహాల్లో ఆత్మహత్యాయత్నాలు జరుగుతున్నాయని విశ్లేషకుల అభిప్రాయం. వికారాబాద్: వసతి గృహాలు,గురుకుల పాఠశాల ల్లో పరిస్థితులు నానాటికి తీసికట్టుగా మారుతున్నా యి.ఉన్నతాధికారులు తీసుకుంటున్న చర్యలు సత్ప లితాలు ఇవ్వడం లేదు. సంబంధిత శాఖల హెచ్ఓడీలు పర్యవేక్షణ గాలికొదిలేయడంతో వార్డెన్లు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నా యి.దీంతో బలవన్మరణానికి యత్నిస్తున్నఘటనలు పెరిగిపోయాయి. దుర్ఘటనలు జరిగిన నమయాల్లో హడావుడి చేస్తున్న అధికారులు తర్వాత పట్టించుకోవడం మానేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. కొన్ని చోట్ల సమస్యలు వేధిస్తుంటే.. మరి కొందరు విద్యార్థులు పరిస్థితులకు అలవాటు పడక, సహచ ర విద్యార్థులతో ఇమడ లేక ఆత్మహత్యలకు యత్నించడం,పారిపోవడం తదితర మార్గాలను ఎంచుకుంటున్నారు.గతంలో కొత్తగడి గురుకులలో ఓ విద్యార్థి భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు యత్నించడం..మెయినాబాద్, నవాబుపేటలోనూ ఇలాంటి ఘటనలు పునరావృతమయ్యా యి. తాజాగా పెద్దేముల్ మండలం మంబాపూర్ గురుకుల పాఠశాలో ఆరోతరగతి విద్యార్థి శనివారం భవనంపై నుంచి దూకడం చర్చనీయాంశమైంది. మండల ప్రత్యేకాధికారులుగా హెచ్ఓడీలు విద్యార్థులు ఏడాది పొడువునా సమస్యలతో సతమవుతున్నారు. ఈ విద్యా సంవత్సరం ప్రారంభం మొదలు అస్వస్థతకు గురవ్వడం, ఇబ్బందులు పడడం తరచూ వెలుగులోకి వస్తున్నాయి. ఇందుకు స్పందించిన కలెక్టర్ జిల్లా ఉన్నతాధికారులకు హాస్టళ్లు, పాఠశాలల పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు. ఆయా శాఖల హెచ్ఓడీలను మండలాల ప్రత్యేకాధికారులుగా నియమించారు. వారు వారంలో రెండు స్కూళ్లు, హాస్టళ్లను సందర్శించి పరిస్థితి పర్యవేక్షించాలని అవసరమైన చోట చక్కదిద్దాలని ఆదేశించారు. ఈ చర్యలు కొనసాగుతున్నప్పటికీ పరిస్థితులు మాత్రం మారడం లేదు. క్రమశిక్షణ పేరుతో శిక్షలు నేరం టార్గెట్ చేశారు ఓ సిమెంట్ దుకాణంలో దినసరి కూలీగా పనిచేస్తూ కూతురిని గురుకుల పాఠశాలలో చేర్పించా. ఆమె మొదటి నుంచి మెరిట్ స్టూడెంట్, 8, 9వ తరగతుల్లోనూ ఏ గ్రేడ్ వచ్చింది. తమ కూతురును చూసేందుకు వెళ్లినప్పుడు మరుగుదొడ్లు అధ్వానంగా ఉన్నాయని చూపింది. బాగు చేయించాలని ఉపాధ్యాయులను కోరాం. దీంతో వారు మా కూతురిని టార్గెట్ చేశారు. దీంతో ఆమె భవనం పైనుంచి దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. దీంతో కాలు విరిగడంతో పాటు గాయపడింది. కట్టు కట్టించి ఇంటికి పంపారు. – యాదయ్య, బాధిత విద్యార్థి తండ్రి సామాజిక తనిఖీలు అవసరం బాలల విద్యాహక్కు చట్టం ప్రకారం విద్యా విషయాల పై..విద్యార్థులపై ఒత్తిడి చేయడం.. మిగతా విద్యార్థుల ముందు చులకనగా మాట్లాడటం నేరం. పలు సందర్భాల్లో విద్యార్థులను ఒత్తిడికి గురిచే సినట్టు స్పష్టమవుతోంది. ఉపాధ్యాయులకు కౌన్సెలింగ్ ఇవ్వాలి. గురకుల ఉపాధ్యాయులకు, బోధనేతర సిబ్బందికి సైతం బాలల హక్కులు, వాటి పరి రక్షణపై, హక్కులను కాలరాస్తే పడే శిక్షలపై శిక్షణ అవసరం. బాలల రక్షణ విధానం అమలును ప్రతీ మూడు నెలలకు ఒకసారి సామాజిక తనిఖీ ద్వారా సమీక్షించాలి. జిల్లా కలెక్టర్ పర్యవేక్షణలోనూ ఓ కమిటీ వేసి సామాజిక తనిఖీ నిర్వహించాలి. – ఆర్. వెంకట్రెడ్డి, కన్వీనర్, బాలల హక్కుల పరిరక్షణ వేదిక -
వాట్సాప్ వ్యవసాయం
దుద్యాల్: రైతులకు వ్యవసాయ సమాచారం సులువుగా అందించేందుకు వ్యవసాయ శాఖ నూతనంగా వాట్సప్ చానల్ రూపొందించింది. సాగు చేసిన పంటలకు సంబంధించిన సమస్యలు పరిష్కరించేందుకు ఈ చానల్లో శాస్త్రవేత్తలు,వ్యవసాయాధికారులు సూచనలు అందిస్తున్నారు. ఈ చానల్ పంటలకు సంబంధించి కావాల్సిన సమాచారాన్ని క్షణాల్లో కర్షకులకు చేరవేస్తూ అండగా నిలుస్తోంది. ప్రభుత్వ పథకాలు, వాతావరణ సూచనలు, నాటు పద్ధతులు, ప్రభుత్వ రాయితీలు, తదితర వ్యవసాయ సమాచారాన్ని అందిస్తున్నారు. తెలుగులో సమాచారం వ్యవసాయశాఖ ప్రారంభించిన వాట్సాప్చానల్లో అధికారులు, శాస్త్రవేత్తలు, సాంకేతిక ప్రతిభావంతులను చేర్చారు. తాజాగా గ్రూప్లో రైతులను చేర్చాలని ఆదేశాలు రావడంతో ఆసక్తి ఉన్న రైతులను వ్యవసాయ విస్తరణ అధికారులు రైతుల ఫోన్ నంబర్లు నమోదు చేస్తున్నారు. స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతీ రైతు వాట్సాప్ చానల్లో చేరే అవకాశం కల్పించింది. విత్తన దశ నుంచి పంట చేతికి వచ్చే వరకు పంటల సమాచారం రైతులకు సులువుగా చేరుతోంది. తెలుగులోనూ సమాచారం అందుబాటులో ఉండడంతో రైతులు వినియోగించుకునేందుకు మొగ్గు చూపుతున్నారు. తెగుళ్లను ఫొటోలతో సాయంతో లక్షణాలు, నివారణకు పురుగు మందులు ఎలా వినియోగించాలనే సమాచారం ఇస్తున్నారు. వాట్సాప్ చానల్లో చేరాలనుకుంటే సంబంధిత ఏఈఓ, మండల వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించాలని సూచిస్తున్నారు. ఒక్క క్లిక్తో.. వ్యవసాయశాఖ రూపొందిన వాట్సాప్ చానల్ ద్వారా రైతులు ఒక క్లిక్తో నేరుగా శాస్త్రవేత్తలు, నిపుణుల సలహాలు పొందవచ్చు. పంటల రోగ నిరోధకత, ఎరువుల వినియోగం, నీటి నిర్వహణ, విత్తనాల ఎంపిక వంటి సలహాలు అరచేతిలోకి చేరుతున్నాయి. తమ సమస్యలను ఫొటో లేదా మెసేజ్ రూపంలో షేర్ చేస్తే నిపుణులు వెంటనే సమాధానం అందిస్తారు. దీంతో తక్కువ సమయంలో ఎక్కువ మంది రైతులకు ఒకే సారి సమాచారం తెలుసుకునేందుకు డిజిటల్ వ్యవసాయ విజ్ఞానం చాలా ఉపయోగకరంగా ఉందని రైతులు చెబుతున్నారు. తక్షణ పరిష్కారం రైతులకు సాంకేతిక పరిజ్ఞానం నేరుగా అందించడం వ్యవసాయ శాఖ ఉద్దేశ్యం. ఇప్పటికే రైతులు సమాచారలోపంతో సాగు చేస్తున్న పంటల్లో దిగుబడులు తగ్గి నష్టపోతున్నారు. అందరి రైతుల వద్దకు వ్యవసాయ శాస్త్రవేత్తలు వెళ్లడం కష్టం. ఈ చానల్ ద్వారా శాస్త్రవేత్తలు, నిపుణుల సలహాలు పొందవచ్చు. సమస్యలపై తక్షణ పరిష్కారం అందించడంతో ఉత్పత్తి పెరుగుతుంది. సమయం, ఖర్చు తగ్గుతుంది. రైతులు చానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలి. – రాజారత్నం, జిల్లా వ్యవసాయ అధికారి, వికారాబాద్ -
యథావిధిగా ప్రజావాణి
కలెక్టర్ ప్రతీక్జైన్ అనంతగిరి: ప్రతీ సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం యథావిధిగా కొనసాగుతుందని కలెక్టర్ ప్రతీక్జైన్ శనివారం ఓప్రకటనలో తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో రద్దు చేసినట్లు ప్రకటించామని.. ఎన్నికల స్టే రావడంతో కార్యక్రమం యధావిధిగా కొనసాగుతుందని చెప్పారు. ప్రజలు గమనించి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జుంటుపల్లి రామాలయ అభివృద్ధికి చర్యలు తాండూరు ఎమ్మెల్యే మనోహర్రెడ్డి యాలాల: మండల పరిధిలోని జుంటుపల్లి సీతారామ స్వామి ఆలయంలో ఎమ్మెల్యే మనో హర్రెడ్డి శనివారం ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం జుంటుపల్లికి చెందిన ఆశప్ప ఏర్పా టుచేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నా రు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రామాలయ అభివృద్ధికి ప్రత్యేక చర్యలను తీసుకుంటానన్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. బీసీ రిజర్వేషన్లకు కేంద్రం అడ్డంకులు సీపీఎం జిల్లా కార్యదర్శి మైపాల్ అనంతగిరి: తెలంగాణ బీసీలపై కేంద్రం కపట నాటకం తేటతెల్లమైందని సీపీఎం జిల్లా కార్య దర్శి మైపాల్ విమర్శించారు. శనివారం వికా రాబాద్లోని అమరవీరుల స్తూపం వద్ద సీపీఎం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టా రు. ఈ సందర్భంగా మైపాల్ మాట్లాడుతూ.. బీసీ రిజర్వేషన్లను గవర్నర్ ఆమోదించకుండా కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటోందని ఆరోపించారు. బీజేపీ నాయకత్వం బీసీ రిజర్వేషన్లపై కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించాలని లేదంటే బీసీ లను క్షమాపన కోరాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం న్యాయ పద్ధతిలో రిజర్వేషన్ల అమలుకు చొరవ తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు సుదర్శన్, సతీశ్, నవీన్, అక్బర్, గోపాల్, శ్రీనివాస్, మహేందర్, శంకర్నాయక్ తదితరులు పాల్గొన్నారు. డీజీపీని కలిసిన బార్ అసోసియేషన్ కమిటీ ఇబ్రహీంపట్నం: డీజీపీ శివధర్రెడ్డిని ఇబ్రహీంపట్నం బార్ అసోసియేషన్ కమిటీ సభ్యులు శనివారం మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా 12 కోర్టు భవన సముదాయాల నిర్మాణం గురించి వివరించారు. తనవంతు సహకారం అందిస్తానని శివధర్రెడ్డి తెలిపినట్లు వారు చెప్పారు. అదేవిధంగా న్యాయశాఖ కార్యదర్శి పాపిరెడ్డిని సైతం కలిసి స్థానిక సమస్యలను వివరించారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వెంకటేశ్, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్కుమార్, ఉపాధ్యక్షుడు భాస్కర్, లైబ్రరీ సెక్రటరీ పాండు పాల్గొన్నారు. మున్సిపల్ సిబ్బంది సమస్యలు పరిష్కరించాలి పహాడీషరీఫ్: రాష్ట్రంలో మున్సిపల్ కార్యాలయాల్లో పనిచేస్తున్న కారోబార్, బిల్ కలెక్టర్ల సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ రాష్ట్ర అవుట్ సోర్సింగ్ కారోబార్, బిల్ కలెక్టర్ల కమిటీ కోరింది. ఈ మేరకు కమిటీ నాయకులు రాష్ట్ర అర్బన్ ఫైనాన్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చల్లా నర్సింహా రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. 2016లో ఇచ్చిన జీవోఎంఎస్–14 ప్రకారం మున్సిపాలిటీలో కలిసిన గ్రామ పంచాయతీ సిబ్బంది సమస్యలు పరిష్కరించడం లేదన్నారు. తమకు కేటాయించిన పనులను సమర్థవంతంగా చేస్తున్నప్పటికీ, నెలకు కేవలం రూ.15,600 మాత్రమే చెల్లిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏళ్ల తరబడి పని చేస్తున్న అందరినీ రెగ్యులరైజ్ చేయాలని, కనీస వేతనం రూ.22,750 చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. -
హాస్టల్లో ఉండటం ఇష్టం లేదని..
తాండూరు రూరల్: హాస్టల్లో ఉండటం ఇష్టం లేని ఓ విద్యార్థి భవనం మొదటి అంతస్తు పైనుంచి కిందికి దూకాడు. అదృష్టవశాత్తు స్వల్ప గాయాలతో బ యటపడ్డాడు. ఈ సంఘటన పెద్దేముల్ మండలం మంబాపూర్ సమీపంలోని మహాత్మ జ్యోతి బాపూ లే గురుకుల బాలుర వసతిగృహంలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. వసతి గృహం అధికారులు, విద్యార్థి తల్లిదండ్రుల కథనం ప్రకారం.. ధారూరు మండలం కొండాపూర్కలాన్ గ్రామానికి చెందిన విరాట్ ఆరో తరగతి చదువుతున్నాడు. గతేడాది ఇక్కడే ఐదో తరగతి పూర్తి చేశాడు. తనకు హాస్టల్ లో ఉండటం ఇష్టం లేదంటూ కొద్ది రోజులుగా మారాం చేస్తున్నాడు. ఇటీవల దసరా సెలవులకు ఇంటికి వెళ్లి న విరాట్ అయిష్టంగానే హాస్ట ల్కు వచ్చాడు. తాను వెళ్లనని చెప్పినా ఈసారి ఆరో తరగతి పూర్తి చేస్తే వచ్చే ఏడాది నీకు నచ్చిన చోట చేర్పిస్తామని బుజ్జగించిన తల్లిదండ్రులు గత మంగళవారం అతన్ని హాస్టల్లో వదిలివెళ్లారు. మూడు రోజులు బాగానే ఉన్న విరాట్ శుక్రవారం సాయంత్రం హాస్టల్ భవనం మొదటి అంతస్తు పైనుంచి దూకాడు. గమనించిన సిబ్బంది వెంటనే అతన్ని తాండూరు పట్టణంలోని మాతాశిశు ఆస్పత్రికి తరలించి, చికిత్స చేయించారు. విద్యార్థి తల్లిదండ్రులకు విషయం చెప్పడంతో వారు కూడా ఆస్పత్రికి చేరుకున్నారు. హాస్టల్పై నుంచి దూకడంతో విరాట్ తలకు గాయమైంది. పెద్ద ప్రమాదమేమీ లేదని వైద్యులు చెప్పడంతో హాస్టల్ అధికారులు, తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే తనకు హాస్టల్లో ఉండటం ఇష్టం లేదని, టీసీ అడిగితే ఇవ్వకపోవడంతోనే భవనం పైనుంచి దూకానని విద్యార్థి తెలిపారు. ఈ విషయమై హాస్టల్ అధికారులు శనివారం పెద్దేముల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదైంది. -
ప్రపంచానికి ఆదర్శంగా భారత్
అనంతగిరి: ఆర్ఎస్ఎస్ పథ సంచలన్ (కవాతు) వికారాబాద్ పట్టణంలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు ఆర్ఎస్ఎస్ శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని చేపడుతున్న కార్యక్రమంలో భాగంగా భారీ కవాతు నిర్వహించారు. పట్టణంలోని కొత్తగంజ్ నుంచి ప్రారంభమై ప్రధాన వీధుల మీదుగా సాగింది. అనంతరం నిర్వహించిన సమావేశంలో ఆర్ఎస్ఎస్ ప్రాంత సద్భావన సహ ప్రముఖ్ రామకృష్ణ మాట్లాడుతూ.. ఽహిందూ ధర్మ పరిరక్షణకు ఆర్ఎస్ఎస్ పాటుపడుతుందన్నారు. ఈ దేశానికి ఘనమైన చరిత్ర ఉందన్నారు. యావత్ ప్రపంచానికే దిశానిర్దేశం చేసిన ఘనత భరత భూమికే దక్కుతుందన్నారు. హిందూ సమాజం ఐక్యతతో ముందుకు సాగాలని.. రాబోయే రోజుల్లో ప్రపంచానికే దేశం ఆదర్శంగా నిలవబోతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంఘచాలక్ సత్యనారాయణగౌడ్, సహ సంఘచాలక్ గోవర్ధన్రెడ్డి, ప్రాంత బౌద్దిక్ ప్రముఖ్ కూర జయదేవ్, సంఘ పెద్దలు, పట్టణ ప్రముఖులు, స్వయం సేవకులు తదితరులు పాల్గొన్నారు. -
బాలికలను ప్రోత్సహించడం బాధ్యత
అనంతగిరి: సమాజంలో లింగ సమానత్వం, బాలి క హక్కులను కాపాడాల్సిన బాధత్య ప్రతీ ఒక్కరిపై ఉందని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి వెంకటేశ్వర్లు అన్నారు. శనివా రం అంతర్జాతీయ బాలిక దినోత్సవం సందర్భంగా ఎంవీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సహకారంతో వికారబాద్ డైట్ కళాశాలలో అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. చదువు తో ఏదైనా సాధ్యమని.. తల్లిదండ్రులు బాలికలను సైతం బాలురతో సమానంగా అన్నిరంగాల్లో రాణించేలా ప్రోత్సహించాలన్నారు. విద్యార్థులు హక్కుల పై అవగాహన పెంచుకుని సమాజంలో సమాన త్వం సాధించేందుకు కృషి చేయాలని సూచించారు. అనంతరం జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ శాంతిలత జువైనైల్ జస్టిస్ చట్టం,బాల్యవివాహ నిషేధ చట్టం, బాలల హక్కుల పరిరక్షణ గురించి వివరించారు. బాల్యవివాహాలు, బాలల దుర్వినియోగం అరికట్ట డంలో ప్రతీ ఒక్కరు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.అనంతరం ఎంవీ ఫౌండేషన్ రాష్ట్ర సమన్వయకర్త రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. బాలబాలికలకు విద్యను అందించాల్సిన బాధ్యత సమా జం, ప్రభుత్వం మీద ఉందన్నారు.గ్రామ స్థాయిలో విద్యను ప్రోత్సహించి బాల్యవివాహాలు అరికట్టాల ని కోరారు.అనంతరం విద్యార్థులతో లింగ సమానత్వం, బాలల హక్కుల పరిరక్షణపై నిబద్ధతతో ఉండాలని ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో చైల్డ్ వెల్ఫేర్ కమిటీ జిల్లా చైర్మన్ వెంకటేశ్, చీఫ్ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ టి.వెంకటేశ్, అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ శ్రీనివాస్, ఎస్ఐ మీనాక్షి , ఫౌండేషన్ సమన్వయకర్త శ్రీనివాస్, సాధన సమితి ప్రతినిధులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. -
ఆగని మట్టి దందా!
● ఇష్టానుసారంగా తవ్వకాలు ● రాత్రి సమయంలో గుట్టలను తోడేస్తున్న అక్రమార్కులు ● పట్టించుకోని అధికారులు పరిగి: సహజ సంపద తరిగిపోతుంది. అనుమతుల్లేకుండా కొండలు, గుట్టలను అక్రమార్కులు రాత్రికి రాత్రే తవ్వేస్తున్నారు. మట్టి గుట్టలను తోడి టిప్పర్లు, ట్రాక్టర్లలో జేసీబీల సాయంతో తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. కొందరు అనుమతుల పేరిట ఇష్టానుసారంగా తరలిస్తున్నారు. మరికొందరు, అనుమతులు లేకుండానే రాత్రికి రాత్రి వాహనాల్లో నింపుకొని జోరుగా వ్యాపారం చేసుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా పోలీస్ అధికారులు, మైనింగ్ అధికారులు ఎవరు కూడా కన్నెత్తి చూసిన పాపాన పోలేదు. రోడ్లపై మట్టి నింపుకున్న వాహనాలు ఇష్టానుసారంగా తిరుగుతున్నప్పటికీ పట్టించుకోకపోవడంతో పలువురు పలు విధాలుగా విమర్శలు చేస్తున్నారు. అసైన్డ్ భూముల్లో, పట్టా భూముల రైతులకు ఎంతో కొంత ముట్టజెప్పి దర్జాగా వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. కొన్ని చోట్ల నామమాత్రంగా మైనింగ్ అధికారుల నుంచి అనుమతులు తీసుకుని వేల ట్రిప్పులు తోలుకుంటున్నారు. ఈ విషయంలో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడుతోందని పలువురు చర్చించుకుంటున్నారు. అంతేకాకా ఓవర్లోడ్తో వాహనాలు బీటీ రోడ్లపై తిరగడంతో అవి దెబ్బతింటున్నాయి. అనుమతులు గోరంత..తోడేది కొండంత.. పరిగి మండలంలోని ఆయా గ్రామాల్లో మట్టి వ్యాపారం మూడుపువ్వులు..ఆరుకాయలుగా సాగుతుంది. మైనింగ్ అధికారుల నుంచి అరకొర అనుమతులు తీసుకుని గ్రామ శివారులోని గుట్టలను యథేచ్ఛగా తవ్వుకుంటున్నారు. అనుమతుల వెనుక భారీ మట్టి మాఫీయానే కొనసాగుతుందని భావిస్తున్నారు. కొన్ని రోజులు, కొంత స్థలాన్ని తవ్వుకోవచ్చని అనుమతులు తీసుకుని ఇష్టానుసారంగా తరలిస్తున్నా పట్టించుకునే నాథుడే లేరు. ఎక్కడ ఖాళీ స్థలం కనిపిస్తే చాలు రాత్రికి రాత్రే పాగవేస్తున్నారు. రెవెన్యూ అధికారులు రాత్రి వేళల్లో మట్టి దందాపై చర్యలు తీసుకోవాలని మౌఖికంగా ఆదేశాలు ఇచ్చినా పట్టించుకోవడం లేదని విమర్శలు వస్తున్నాయి. పరిగి మండల పరిధిలోని నజీరాబాద్తండా, రంగాపూర్, జాపర్పల్లి, రూప్ఖాన్పేట్, ఇబ్రహీంపూర్, తుంకుల్గడ్డ, జాపర్పల్లి, సయ్యాద్మల్కాపూర్, ఖుదావన్పూర్, రాఘవపూర్, రాపోల్, తొండుపల్లి తదితర గ్రామాల్లోని ప్రభుత్వ భూములు, పట్టా భూముల్లో ఈ దందా జరుగుతుంది. ప్రభుత్వ ఆదాయానికి గండి మైనింగ్ శాఖ అధికారులు, పోలీస్ యంత్రాంగం కన్నెత్తి చూడటం లేదు. రాత్రి వేళల్లో పట్టణ కేంద్రంలో టిప్పర్ల సాయంతో మట్టిని తరలిస్తున్న పట్టించుకునే నాథుడే కరువయ్యారు. ఇష్టానుసారంగా మట్టిని తవ్వి రియల్ఎస్టెట్ వెంచర్లకు, ఫాంహౌస్లకు రూ.3వేల నుంచి రూ.5వేల వరకు ట్రిప్పర్ మట్టిని విక్రయిస్తూ రూ. లక్షలు గడిస్తున్నారు. ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి గండి కొడుతున్నారు. సంబంధిత అధికారుల కళ్లముందే జరుగుతున్నా ఎందుకు పట్టించుకోవడం లేదని పలువురు ప్రశ్నిస్తున్నారు. టిప్పర్లు, జేసీబీలను కొనుగోలు చేసి.. ఈ వ్యాపారాన్ని అధికార పార్టీకి చెందిన కొందరు నాయకులే నిర్వహిస్తున్నారని చెబుతున్నారు. అధికార పార్టీ నాయకుల టిప్పర్లయితే ఎవరు పట్టుకోరని ఇష్టానుసారంగా దందాను కొనసాగిస్తున్నారు. దీంతో టిప్పర్లు, జేసీబీలను కొనుగోలు చేసి వ్యాపారాన్ని యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. అధికారులు, పోలీసులు ఎవరైనా వాహనాలను ఆపితే వారిపై చివాట్లు పెట్టి ప్రజా ప్రతినిధులతో మాట్లాడించి జారుకుంటున్నారు. ప్రతిపక్ష పార్టీకి చెందిన నాయకులకు అనుమతులు ఇవ్వొద్దని, మట్టి దందా చేస్తే కేసులు నమోదు చేయాలని పోలీసులకు, రెవెన్యూ అధికారులకు అధికార పార్టీ నాయకులు హెచ్చరిస్తున్నట్లు పలువురు చర్చించుకుంటున్నారు. -
బావిలో దూకి మహిళ ఆత్మహత్య
మర్పల్లి: చేతబడి చేసిందని వేధించడంతో ఓ మహిళ బావిలో దూకి బలవన్మరణానికి పాల్పడింది. ఈ సంఘటన మర్పల్లిలో చోటుచేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మందమీది లక్ష్మి (26) వారం రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందింది. ఆమె చనిపోకముందు పక్షం రోజుల క్రితం అర్ధరాత్రి సమయంలో లక్ష్మి ఇంటి ముందు దొబ్బల నర్సమ్మ అటు ఇటు తిరుగుతూ కనిపించింది. ఇది గమనించిన లక్ష్మి భర్త నర్సింలు, కుటుంబ సభ్యులు ఇంత రాత్రి ఎందుకు వచ్చావని ప్రశ్నించారు. దీంతో ఇల్లు శుభ్రం చేసుకొనేందుకు పశువుల పేడ కోసం వచ్చినట్లు బదులిచ్చింది. అప్పటికే అస్వస్థతకు గురైన లక్ష్మి ఆరోగ్యం రోజురోజుకూ క్షీణించడంతో మృతి చెందింది. తన భార్య మృతికి నర్సమ్మే కారణమని, చేతబడి చేయడంతోనే చనిపోయిందని నర్సింలు, కుటుంబసభ్యులు ఆరోపించారు. అంతటితో ఆగకుండా ఆమెను వేధింపులకు గురిచేశారు. దీంతో మనస్తాపానికి గురైన నర్సమ్మ గ్రామంలోని చెన్నారెడ్డి వ్యవసాయ క్షేత్రంలోని బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. లక్ష్మి కుటుంబసభ్యులు వేధించడంతో నర్సమ్మ చనిపోయిందని కుటుంబ సభ్యులు కంట తడి పెట్టారు. మృతురాలి కుమారుడు దుబ్బల శ్రీకాంత్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. విషయం తెలుసుకున్న వికారాబాద్ డీఎస్పీ, మోమిన్పేట సీఐ వివరాలు ఆరా తీశారు. -
హర్యానా డీజీపీని అరెస్ట్ చేయాలి
పరిగి: హర్యానా ఐపీఎస్ అధికారి వై పూరన్కుమార్ ఆత్మహత్యకు కారణమైన ఆ రాష్ట్ర డీజీపీ శత్రుజిత్సింగ్ను వెంటనే కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ఎం వెంకటయ్య డిమాండ్ చేశారు. శనివారం పరిగి పట్టణ కేంద్రంలో దళిత ప్రజా సంఘాల నేతలతో కలిసి అంబేడ్కర్ విగ్రహం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..పలువురు సీనియర్ అధికారులు కుల వివక్ష, మానసిక వేధింపులు భరించలేక మృత్యువాత పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దళిత ఐపీఎస్ అధికారి వై.పూరన్కుమార్ కూడా వేధింపులు భరించలేకే చండీగఢ్లోని ఇంట్లో సర్వీసు రివాల్వర్తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారన్నారు. ఎనిమిది పేజీలతో కూడిన సూసైడ్ నోట్లో ఎవరెవరు వేధించారో రాశారని పేర్కొన్నారు. అందులో రిటైర్డ్ అధికారుల పేర్లు కూడా ఉన్నాయని, వారందరిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో తెలుగు రాష్ట్రాలతో పాటు హర్యానా రాష్ట్రంలో సైతం ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి వెంకటయ్య -
ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ సీజ్
యాలాల: కాగ్నా నది నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ను పోలీసులు సీజ్ చేశారు. ఎస్ఐ విఠల్రెడ్డి తెలిపిన ప్రకారం.. మండల పరిధిలోని కాగ్నా నది నుంచి ఇసుక అక్రమ రవాణాకు పాల్పడుతున్నారనే సమాచారంతో పోలీసులు రాత్రివేళ తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో కాగ్నా నదిలో ఉన్న ట్రాక్టరును పోలీసులు గుర్తించి పట్టుకున్నారు. వాహనానికి నంబరు లేకపోవడంతో పాటు డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. పట్టుబడిన ట్రాక్టరు అగ్గనూరు గ్రామానికి చెందినదిగా గుర్తించామన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
వాలీబాల్ టోర్నమెంట్ కోసం ఎంపిక
కొడంగల్ రూరల్: 69వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో వాలీబాల్ టోర్నమెంట్ కోసం ఎంపిక నిర్వహించనున్నారు. 13వ తేదీన అండర్14, 17 విభాగంలో బాలబాలికలకు జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో సెలక్షన్ నిర్వహిస్తారని జిల్లా కార్యదర్శి అనంతయ్య, జోనల్ కార్యదర్శి అజీజ్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పోటీల్లో పాల్గొనే విద్యార్థులు ఆధార్ కార్డు, ఎలిజిబిలిటీ ఫామ్, బొనఫైడ్ పత్రాలను వెంట తీసుకొనిరావాలని తెలిపారు. పూర్తి వివరాలకు 97015 86893, 89787 58124 ఫోన్ నంబర్లపై సంప్రదించాలని తెలిపారు. సీసీ కెమెరాలు తప్పనిసరి కుల్కచర్ల ఎస్ఐ రమేశ్ కుల్కచర్ల: దుకాణదారులు సీసీ కెమెరాలు తప్పక ఏర్పాటు చేసుకోవాలని కుల్కచర్ల ఎస్ఐ రమేశ్ తెలిపారు. శనివారం ఆయన మండల కేంద్రంలో సీసీ కెమెరాలు లేని దుకాణ యజమానులకు నోటీసులు ఇచ్చారు. ఈ సందర్భంగా ఎస్ఐ రమేశ్ మాట్లాడుతూ.. సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాలు తగ్గుతాయన్నారు. నేరాల కట్టడికి బీఎన్ఎస్ 144 ప్రకారం సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోని దుకాణదారులకు నోటీసులు ఇస్తున్నామని చెప్పారు. ప్రతీ ఒక్కరు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుని సహకరించాలని కోరారు. కుల్కచర్ల, చౌడాపూర్ మండలాలలోని ప్రతీ దుకాణదారుడికి నోటీసులు అందజేశారు. విద్యుదాఘాతానికి గురై ఎద్దు మృతి పూడూరు: ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై ఎద్దు మృతి చెందింది. ఈ సంఘటన మండల పరిధిలోని కెరవెళ్లి గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామస్తులు, బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం..మండల పరిధిలోని కెరవెళ్లి గ్రామానికి చెందిన బాధితరైతు ఫయాజ్కు చెందిన ఎద్దు పొలంలో మేత మేస్తూ ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్కు గురైంది. దీంతో ఎద్దు అక్కడిక్కడే మృత్యువాత పడిందని రైతు తెలిపాడు. రైతు పొలం నుంచి ఎల్టీలైన్ తీగలు వ్రేలాడుతుండడంతో ప్రమాదం చోటు చేసుకుందని తెలిపారు. ఈ విషయంలో ప్రభుత్వం తనను ఆదుకోవాలని కోరాడు. స్థల వివాదంలో దాడి మొయినాబాద్ రూరల్: స్థలం విషయంలో జరిగిన దాడిలో ఒకరు తీవ్రంగా గాయపడి, ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ సంఘటన ఠాణా పరిధిలో చోటు చేసుకుంది. సీఐ ప్రవీణ్కుమార్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. సురంగల్ గ్రామ సమీపంలోని పోల్ట్రీ ఫామ్ దగ్గర 250 గజాల ప్లాట్ ఉంది. దీనిపై రామగళ్ల ఎల్లయ్య కుమారులు నందం, శ్యామ్, శ్రీకాంత్ ముగ్గురికి సమాన హక్కు ఉంది. ఇదే విషయమై శనివారం శ్యామ్ అన్న కుమారుడు ప్రసాద్.. ప్లాట్ వద్ద గొడవకు దిగాడు. బాబాయి అయిన శ్యా మ్(35)పై కత్తితో దాడికి పాల్పడ్డాడు. విష యం బాధితుడి భార్య అనితకు తెలియడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. అనంతరం అక్కడికి చేరుకున్న వా రు.. కత్తిపోట్లతో రక్తపు మడుగులో పడున్న శ్యాంను చికిత్స నిమిత్తం ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు. బెల్టు దుకాణాలపై దాడి శంకర్పల్లి: రెండు బెల్టు దుకాణాలపై మోకిల పోలీసులు దాడులు చేశారు. ఎస్ఐ కోటేశ్వర రావు తెలిపిన వివరాల ప్రకారం.. కొండకల్ గ్రా మంలో కిరాణా దుకాణం నిర్వహిస్తున్న న ర్సింహ్మారెడ్డి.. అక్రమంగా మద్యం విక్రయిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. 23 మద్యం సీ సాలను స్వాధీనం చేసుకున్నారు. అదే విధంగా మోకిలలో రాజు దాబాలో మద్యం విక్రయిస్తున్నారన్న సమాచారంతో దాడి చేయగా.. 5 మ ద్యం బాటిళ్లు లభ్యమయ్యాయి. వీరిద్దరిపై కేసు నమోదు చేసి,దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. -
కాంగ్రెస్కు చిత్తశుద్ధి లేదు
బీజేపీ జిల్లా కార్యదర్శి జుంటుపల్లి వెంకటేశ్ తాండూరు టౌన్: 42శాతం బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని బీజేపీ జిల్లా కార్యదర్శి జుంటుపల్లి వెంకటేశ్ శనివారం ఒక ప్రకటనలో ఆరోపించారు. బీఆర్ఎస్ నాయకులు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని, బీజేపీపై బురద చల్లడం మానుకోవాలని హితవు పలికారు. కాంగ్రెస్, బీఆర్ఎస్లకు రాజ్యాంగం అంటేనే గౌరవం లేదని విమర్శించారు. రిజర్వేషన్ సాధన కోసం రాజ్యాంగంలోని ఆర్టికల్ 9 ప్రకారం తమిళనాడు ప్రభుత్వం అనుసరించిన తీరును, తెలంగాణ రాష్ట్రంలో కూడా పాటించాలని పేర్కొన్నారు. ఇప్పటికై నా ఇరు పార్టీలు బురద చల్లడం మానేయాలని సూచించారు. ఈవీఎంల గోడౌన్ పరిశీలన రాజేంద్రనగర్: రాజేంద్రనగర్లోని ఈవీఎంల గోడౌన్ను శనివారం జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) చంద్రారెడ్డి సందర్శించారు. సాధారణ పరిశీలన ప్రక్రియలో భాగంగా క్షేత్రస్థాయి సందర్శన నిర్వహించారు. ఈవీఎం గోడౌన్కు వేసిన సీళ్లను పరిశీలించి బ్యాలెట్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్లు, వీవీ ప్యాట్లు, ఇతర ఎన్నికల సామగ్రిని భద్రపరిచిన తీరును తనిఖీ చేశారు. ఈవీఎంల గోడౌన్ వద్ద పోలీసు బందోబస్తును పరిశీలించారు. రాజేంద్రనగర్ తహసీల్దార్, వేర్ హౌస్ ఇన్చార్జి రాములు, ఎన్నికల విభాగం అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
ఇసుక మాఫియా బరితెగింపు
బషీరాబాద్: ఇసుక మాఫియా రెచ్చిపోతోంది. వీరిని పెంచిపోషించారనే ఆరోపణలున్న పోలీసులపైకే ఎదురు తిరుగుతున్నారు. తాజాగా బషీరాబాద్ మండలం నంద్యానాయక్తండాలో శుక్రవారం రాత్రి ఇసుక ట్రాక్టర్ను అడ్డుకోబోయిన ఇద్దరు కానిస్టేబుళ్లపైకి వాహనం ఎక్కించేందుకు ప్రయత్నించారు. చాకచక్యంగా తప్పించుకోవడంతో పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డారు. వివరాలు ఇలా ఉన్నాయి.. ఎక్మాయి శివారులోని వాగు నుంచి జమ్లానాయక్తండాకు చెందిన చౌహాన్ బాలకృష్ణ అనే డ్రైవర్ ఇసుక లోడ్తో నంద్యానాయక్తండా వైపు వెళ్తున్నాడు. రాత్రి 11 గంటల ప్రాంతంలో పెట్రోలింగ్ చేస్తున్న కానిస్టేబుళ్లు అశోక్, రమేశ్ వాహనాన్ని ఆపమని సూచించారు. వీరు సివిల్ డ్రెస్లో ఉండటంతో డ్రైవర్ వారిపైకి ట్రాక్టర్ను తోలాడు. త్రుటిలో తప్పించుకున్న పోలీసులు వాహనాన్ని వెంబడించారు. ఇది గమనించి డ్రైవర్ నంద్యానాయక్తండాలోని ఓ ఇంటి వద్ద ట్రాక్టర్ ఆపేసి, పరారయ్యాడు. వెంటనే అక్కడికి చేరుకున్న యజమాని శ్రీను వాహనాన్ని వదిలేయాలని కోరినా వినకుండా పీఎస్కు తరలించారు. విషయం తెలుసుకున్న తాండూరు రూరల్ సీఐ నగేష్ శనివారం స్టేషన్కు చేరుకుని విచారణ జరిపారు. విధులకు ఆటంకం కలిగించడంతో పాటు పోలీసులపైకి ట్రాక్టర్ను తోలేందుకు ప్రయత్నించడాన్ని సీరియస్గా తీసుకున్నారు. ఈమేరకు ట్రాక్టర్ డ్రైవర్ బాలకృష్ణతో పాటు యజమాని చౌహాన్ శ్రీనుపై కేసు నమోదు చేసి, ట్రాక్టర్ను సీజ్ చేసినట్లు ఎస్ఐ నుమాన్అలీ తెలిపారు. పట్టుబడిన ట్రాక్టర్ ఎక్మాయి వాగు నుంచి అక్రమంగా రవాణా అడ్డుకోబోయిన పోలీసులపైకి ట్రాక్టర్ ఎక్కించే యత్నం ఛేజింగ్ చేసి పట్టుకున్న వైనం ఇరువురిపై కేసు నమోదు.. వాహనం సీజ్ -
డబ్బు కోసం వేధింపులు
మణికొండ: తాను కొనుగోలు చేసిన స్థలంలో ఇంటిని నిర్మింకుంటున్న ఓ వ్యక్తిని మాజీ కార్పొరేటర్ ఏకంగా రూ. 10 లక్షలు డిమాండ్ చేశాడు. అంత ఇచ్చుకోలేనని బతిమాలినా వినిపించుకోకుండా డబ్బులు ఇవ్వకపోతే లోపల వేసి కొడతానని బెదిరించాడు. మాజీ కార్పొరేటర్ అడిగింది ఇచ్చి సమస్య తీర్చుకోవాలని టౌన్ప్లానింగ్ అధికారి(టీపీఓ) పలు మార్లు నిర్మాణ సామగ్రిని తీసుకెళ్లి మరో వైపు వేధించాడు. వాటిని తాళలేక స్థానిక ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ను బాధితుడు అశ్రయించాడు. ఎమ్మెల్యే మాజీ డిప్యూటీ మేయర్కు సిఫారసు చేసి సమస్యను పరిష్కరించాలని సూచించారు. మాజీ డిప్యూటీ మేయర్ ఇంట్లో పంచాయతీ పెట్టి చివరకు రూ. 4 లక్షలు చెల్లించాడు. అయినా వేధింపులు ఆగక పోవటంతో బాధితుడు నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు మాజీ కార్పొరేటర్ శ్రీనాథ్రెడ్డితో పాటు అతని అనుచరుడు సందీప్రెడ్డిలను అరెస్టు చేశారు. బాధితుడు నానాజీ శనివారం మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం... ఓ కళాశాలలో లెక్చరర్గా పనిచేస్తూ హైదర్షాకోట్లో 100 గజాల పాత ఇంటిని ఇటీవల కొనుగోలు చేశానన్నారు. పాత ఇంటిని తొలగించి కొత్త ఇంటి నిర్మాణం చేపడుతుండటంతో మాజీ కార్పొరేటర్ శ్రీనాథ్రెడ్డి రూ. 10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడన్నారు. తను కొనుగోలు చేసిన స్థలంలో ఇంటి నిర్మాణం చేపడితే డబ్బు ఎందుకు ఇవ్వాలని ప్రశ్నించానన్నాడు. దాంతో మాజీ కార్పొరేటర్ టీపీఓ రాకేష్కు చెప్పి పనులను పలుమార్లు నిలుపుదల చేయటం, నిర్మాణ సామగ్రి తీసుకెళ్లి వేధించారన్నారు. ఎమ్మెల్యేకు ఫిర్యాదు తన స్థలంలో తను ఇంటి నిర్మాణం చేస్తుంటే మాజీ కార్పొరేటర్ వేధిస్తున్నాడని బాధితుడు నానాజీ ఇటీవల ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ను కలిసి ఫిర్యాదు చేశాడు. దాంతో ఎమ్మెల్యే మాజీ డిప్యూటీ మేయర్ రాజేందర్రెడ్డికి ఫోన్ చేసి అతన్ని వేధించవద్దని మాజీ కార్పొరేటర్కు చెప్పాలని సూచించాడు. అయినా మాజీ కార్పొరేటర్ పట్టు వీడకుండా టీపీఓతో కలిసి వేధించటంతో మాజీ డిప్యూటీ మేయర్ ఇంట్లో ఇటీవల సమావేశం అయి మాజీ కార్పొరేటర్కు చివరకు రూ. 3 లక్షలు నగదుగా, రూ. లక్ష ఆన్లైన్లో చెల్లించాడు. సమస్య తీరిందని అనుకున్నా తనను వదలకుండా మరో మారు డబ్బులు ఇవ్వాలని వేధించటంతో శుక్రవారం నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశానన్నాడు. ఫిర్యాదులో మాజీ కార్పొరేటర్ శ్రీనాథ్రెడ్డి, అతని అనుచరుడు సందీప్రెడ్డి, టీపీఓ రాకేష్లు వేధించినట్టు పేర్కొన్నానని బాధితుడు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు శనివారం మాజీ కార్పొరేటర్, అతని అనుచరున్ని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్టు సమాచారం. టీపీఓ పాత్రపైన విచారణ చేస్తున్నట్టు తెలిసింది. ఈ కేసు విషయమై నార్సింగి ఇన్స్పెక్టర్ హరికృష్ణారెడ్డిని వివరణ కోరేందుకు ఫోన్ చేయగా అందుబాటులోకి రాలేదు.మాజీ కార్పొరేటర్ అరెస్టు ఇంటి నిర్మాణానికి రూ. 10 లక్షలు డిమాండ్ శ్రీనాథ్రెడ్డికి టీపీఓ వత్తాసు ఎమ్మెల్యేను ఆశ్రయించిన బాధితుడు మాజీ డిప్యూటీ మేయర్ వద్ద రూ. 4 లక్షలు చెల్లింపు అయినా ఆగని వేధింపులతో పోలీసులకు బాధితుడి ఫిర్యాదు -
బ్యాడ్మింటన్లో రాష్ట్ర స్థాయికి..
● ఎస్జీఎఫ్ క్రీడల్లో సత్తాచాటిన తాండూరు విద్యార్థులు ● స్టేట్ లెవల్ పోటీలకు ఎనిమిది మంది ఎంపిక తాండూరు టౌన్: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్జీఎఫ్) జిల్లా స్థాయి షటిల్ బ్యాడ్మింటన్ పోటీల్లో తాండూరు విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. అండర్– 14, 17 విభాగాల్లో ఎనిమిది మంది బాలబాలికలు జిల్లా స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి, త్వరలో జరుగనున్న రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. శనివారం పరిగిలో నిర్వహించిన అండర్– 14 విభాగం డబుల్స్లో సాయి ప్రతీక్, అర్జున్గౌడ్ ప్రథమ స్థానం, సింగిల్స్లో సాయి ప్రతీక్ ప్రథమ స్థానం, అర్జున్ గౌడ్ ద్వితీయ స్థానంలో నిలిచారు. బాలికల అండర్– 14 విభాగం డబుల్స్లో సందర్శిని, దీక్ష ద్వితీయ స్థానం, బాలికల అండర్– 17 విభాగం డబుల్స్లో నందిని, మేరీజోన్స్ ద్వితీయ స్థానం, బాలుర విభాగంలో మణికంఠ, చరణ్ ద్వితీయ స్థానం సాధించారు. ఈ ఎనిమిది మంది వికారాబాద్ జిల్లా తరఫున రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొననున్నారు. కాగా సెయింట్ మార్క్స్ బ్యాడ్మింటన్ అకాడమీలో ప్రాక్టీస్ చేసి రాష్ట్ర స్థాయికి ఎంపికై న క్రీడాకారులను పాఠశాల ప్రిన్సిపాల్ ఆరోగ్యరెడ్డి, పీడీలు రాము, చరణ్ అభినందించారు. జిల్లా పోటీలకు 108 మంది ఎంపిక శంకర్పల్లి: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో శనివారం జోనల్ స్థాయి అండర్– 14, 17 విభాగాల్లో బాలబాలికలకు కబడ్డీ, వాలీబాల్ ఎంపికలు నిర్వహించినట్లు ఎంఈఓ అక్బర్, జోనల్ సెక్రెటరీ ప్రభాకర్ తెలిపారు. మండలం పరిధిలోని మియాఖాన్గడ్డలో నిర్వహించిన సెలెక్షన్స్లో జోన్ పరిధిలోని చేవెళ్ల, శంకర్పల్లి మండలాలకు చెందిన సుమారు 400 మంది విద్యార్థులు పాల్గొన్నారు. వీరిలో కబడ్డీ అండర్– 14 బాలబాలికల విభాగంలో 15 మంది చొప్పున 30 మందిని, అండర్– 17 విభాగంలో 15 మంది చొప్పున 30 మందిని, వాలీబాల్ అండర్– 14 బాలబాలికల విభాగంలో 12 మంది చొప్పున 24 మందిని, అండర్– 17లో 24 మందిని ఎంపిక చేశామన్నారు. వీరు ఈనెల 14న హైదరాబాద్ సరూర్నగర్లో జరిగే జిల్లా స్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు. కార్యక్రమంలో ఫిజికల్ డైరెక్టర్లు బస్వరాజ్, శంకర్, అరుంధతి, పల్లవి, నాగ సంధ్య, అనురాధ, మల్లేశ్, రవీందర్, శ్రీనివాస్, ఆనంద్, అశోక్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. ఎంపికై న విద్యార్థులతో ఎంఈఓ అక్బర్, జోనల్ సెక్రెటరీ, ఫిజికల్ డైరెక్టర్లు ఎంపికై న విద్యార్థులతో పీడీలు, తదితరులు -
తిరుపతిలో శంషాబాద్ భక్తుల ఇబ్బందులు
● ఓ కుటుంబం లగేజీ మాయం ● స్పందించిన రాజేంద్రనగర్ ఆర్డీఓ ● శంషాబాద్కు పయనమైన కుటుంబం శంషాబాద్: తిరుమలలో శంషాబాద్కు చెందిన ఓ కుటుంబం లగేజీ మాయం కావడంతో నాలుగు రోజులు అక్కడ ఇబ్బంది పడింది. చివరకు అధికారుల సహకారంతో నగరానికి బయలుదేరారు. వివరాలు.. తిరుమలలో ఐదుగురు సభ్యులుగా కుటుంబం స్వామివారి దర్శనం చేసుకుంది. ఆ తరువాత వారి లగేజీ మొత్తం దొంగలు కొట్టేశారో.. లేక పొగొట్టుకున్నారో తెలియదు కానీ అయోమయంతో కొండ కిందికి చేరుకుని రైల్వేస్టేషన్కు వచ్చారు. నాలుగురోజులుగా వారిని గమనిస్తున్న రైల్వేపోలీసులు ఏం జరిగిందని ప్రశ్నించినా సరైన సమాధానం రావడం లేదు. వృద్దురాలికి, ఆమె కుమారుడికి మాటలు రావడం లేదు. ఓ మహిళ మాట్లాడినా అర్థం కావడం లేదు. పిల్లలు ఎంత అడిగా సరిగా మాట్లాడడం లేదు. అధికారులు కాగితం పెన్ను ఇవ్వడంతో శంషాబాద్ హి హీరోహోండా షాపు, పైన లగేజీలు పోయాయని రాసింది. దీంతో మూడు రోజులుగా రైల్వేపోలీసులే వారి భోజనం సమకూరుస్తున్నారు. ఆ కుటుంబాన్ని పంపేందుకు రైల్వేపోసులు సాక్షిని సంప్రదించి శంషాబాద్ డీసీపీ, రాజేంద్రనగర్ ఆర్డీఓ వెంకట్రెడ్డితో ఫోన్లో మాట్లాడారు.. ఆర్డీఓ స్పందించి వారి రాకకోసం ఏర్పాట్లు చేయడంతో శనివారం రాత్రి హైదరాబాద్కు బయలుదేరే బస్సులో వారిని రైల్వే పోలీసులు పంపారు. -
పైన పచారీ.. లోన లిక్కర్
దుద్యాల్: కొడంగల్ నియోజకవర్గంలో బెల్టు దందా జోరుగా సాగుతోంది. మద్యం షాపుల్లో కొరత ఉన్నా.. కిరాణా దుకాణాల్లో విరివిగా లభ్యం అవుతోంది. ఇతర సామగ్రి కంటే.. లిక్కర్నే ఎక్కువగా విక్రయిస్తున్నారని, అదికూడా అధిక ధరలకు అమ్ముతూ.. మందుబాబుల జేబుకు చిల్లు పెడుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏ గ్రామంలో చూసినా 24 గంటలు మద్యం అందుబాటులో ఉంటోందని, అయినా.. ఆబ్కారీ శాఖ అధికారులు కనీస చర్యలు తీసుకోవడం లేదని ప్రాంత ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అదనంగా బాదుడు బెల్ట్ షాపుల్లో మద్యం క్వాటర్ బాటిల్పై ఎమ్మార్పీ కంటే.. అదనంగా రూ.20 తీసుకుంటున్నారు. రాత్రి సమయాల్లో, అత్యవసరంగా మద్యాన్ని కొనుగోలు చేసేవారు అడిగినంత ఇస్తున్నారు. దీంతో వీరి వ్యాపారం మూడు పువ్వులు.. ఆరు కాయలుగా సాగుతోంది. చిప్ లిక్కర్ నుంచి బ్రాండెడ్ మద్యం వరకు ప్రతి బాటిల్పై రూ. 20 నుంచి రూ. 50 వరకు వసులు చేస్తున్నారు. దుద్యాల్లో 200లకు పైగా.. నియోజకవర్గ పరిధి పల్లెల్లో బెల్ట్ షాపులు ఇష్టాను సారంగా కొనసాగుతున్నాయి. మండల కేంద్రాల్లోనూ అధికంగానే ఉన్నాయి. ఒక్క దుద్యాల్ మండలంలో సుమారు 200లకు పైగా నిబంధనలకు విరుద్ధంగా దుకాణాలు నడుస్తున్నాయి. ఇలా నిరంతరం మద్యం లభ్యం కావడంతో మందుబాబుల ఆగడాలకు అడ్డూఅదుపూ లేకుండా పోతోంది. నిత్యం మత్తులో జోగుతున్నారు. ఇది ఘర్షణలకు దారి తీస్తోంది. కొరత సృష్టిస్తూ.. బెల్టు షాపుల నిర్వాహకులు.. మద్యం వ్యాపారులతో కుమ్మక్కు అయ్యారు. వారికి కావాల్సిన సరుకు ఇస్తూ.. పల్లెలకు తరలిస్తున్నారు. అనంతరం వైన్ నిర్వాహకులు కృత్రిమ కొరత సృష్టిస్తూ మందుబాబుల జేబులు కొల్లగొడుతున్నారు. మద్యం స్టాక్ లేదని, ఫుల్ బాటిళ్లు మాత్రమే ఉన్నాయని పేర్కొంటూ.. ఆఫ్, ఫుల్లు సీసాలను అంటగడుతున్నారు. దీంతో కొద్దిగా తాగే అలవాటు ఉన్న వారు సైతం.. అధికంగా మద్యం తాగుతూ.. ఒళ్లు హూనం చేసుకొంటున్నారు.వైన్షాపుల్లో కొరత.. కిరాణా దుకాణాల్లో అడిగినంత మద్యం వ్యాపారులతో లింక్ పల్లెల్లో జోరుగా బెల్టు దందా పట్టించుకోని ఆబ్కారీ అధికారులు ఫిర్యాదు చేస్తే.. వైన్ షాపుల్లో అన్ని రకాల మద్యం అందుబాటులో ఉంది. కొనుగోలు దారులను.. వ్యాపారులు ఇబ్బందులకు గురిచేయొద్దు. వారు అడిగింది ఇచ్చేయండి. కొరత సృష్టిస్తే.. చర్యలు తప్పవు. దీనిపై ఎలాంటి ఫిర్యాదు అందినా తగిన చర్యలు తీసుకుంటాం. – వెంకటేశ్, ఎకై ్సజ్ సీఐ, కొడంగల్ -
రాకపోకల పునరుద్ధరణ
ధారూరు: మండల పరిధిలోని రుద్రారం– నాగసమందర్ గ్రామాల మధ్య కోట్పల్లి అలుగు వద్ద రాకపోకలను పునరుద్ధరించారు. కొద్ది రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలతో ప్రాజెక్టు నుంచి పారి అలుగు ఉధృతికి కల్వర్డు రోడ్డు పూర్తిగా కొట్టుకుపోయింది. రాతిగుండ్లు తేలి, పెద్దపెద్ద గుంతలు పడటంతో ఈ మార్గం మీదుగా వాహనాలు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. డిప్యూటీ ఎగ్జిక్యుటీవ్ ఇంజనీర్ శ్రావణ్కుమార్ పర్యవేక్షణలో మట్టి నింపి తాత్కాలిక మరమ్మతులు చేసిన ఆర్అండ్బీ అధికారులు శుక్రవారం నుంచి రహదారిని అందుబాటులోకి తెచ్చారు. కోట్పల్లి ప్రాజెక్టు అలుగు నీరు ప్రవహించే రోడ్డు మీదుగా వాహనాలు వెళ్లేందుకు అనువుగా మార్చారు. దీంతో ఈ రూట్లో వెళ్లే ప్రయాణికులకు అవస్థలు తప్పాయి. దూరభారం కూడా తప్పిందని పలువురు ప్రయాణికులు హర్షం వ్యక్తంచేశారు. అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. కోట్పల్లి అలుగు రోడ్డుకుతాత్కాలిక మరమ్మతు పనులు పూర్తి -
ఖాతాదారులకు జవాబుదారీగా ఉండాలి
తుక్కుగూడ: ఖాతాదారులకు జవాబుదారీగా ఉండాలని తపాలా శాఖ ఏఎస్పీ జోయల్ అన్నారు. శుక్రవారం పుర పరిధి మంఖాల్ పోస్టాఫీస్ను ఆయన తనిఖీ చేసి, మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం తపాలా కార్యాలయం ద్వారా తక్కువ ప్రీమియంతో బీమా సౌకర్యం కలిపిస్తుందని తెలిపారు. ప్రజలకు ఉపయోగపడే పథకాల గురించి విస్తృతంగా ప్రచారం చేయా లని సిబ్బందికి సూచించారు. కార్యాలయానికి వచ్చే లేఖలు, వివిధ పత్రాలను సకాలంలో ప్రజలకు చేరవేయాలని చెప్పారు. అనంతరం అంతర్జాతీయ తపాల దినోత్సవం సందర్భంగా కార్యాలయ ఆవరణలో సిబ్బందితో కలిసి మొక్కలు నాటారు. కార్యక్రమంలో శాఖ ఎస్పీఎం నవీన్కుమార్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
సీజేఐపై దాడి యత్నం అనాగరికం
అనంతగిరి: సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్.గవాయ్పై జరిగిన దాడి అనాగరికమని, దానిని తీవ్రంగా ఖండిస్తున్నామని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి, వికారాబాద్ జిల్లా ఇన్చార్జి గట్టగల్ల ప్రశాంత్ మాదిగ అన్నారు. సమితి, ఎంఎస్పీ, అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. న్యాయాన్ని కాపాడే వారిపై ఇలాంటి దాడులు జరిగితే.. ఇక సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని, దాడికి పాల్పడిన రాకేష్ కిషోర్, ఆయన వెనక ఉన్న వారిపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏంఎస్పీ జిల్లా అధ్యక్షుడు ఆనంద్, రాష్ట్ర నాయకులు మల్లికార్జున్, ప్రధాన కార్యదర్శి స్వామిదాస్, కృష్ణ, నర్సింహులు, సుభాష్ డప్పు మహేందర్, పుష్ప రాణి, సునిత తదితరులు పాల్గొన్నారు. -
కిక్కులేని లిక్కర్!
సాక్షి, రంగారెడ్డిజిల్లా: లిక్కరుకు ఆశించిన కిక్కు దక్కడం లేదు. భూముల క్రయవిక్రయాలు తగ్గిపోవడం.. చేతిలో ఆశించిన స్థాయిలో డబ్బులేక పోవడం.. ప్రభుత్వం లైసెన్స్ ఫీజును భారీగా పెంచడం.. నిర్వహణ ఖర్చులు రెట్టింపు కావడం .. వెరసి మద్యం టెండర్లపై తీవ్ర ప్రభావం చూపుతోంది. మద్యం దుకాణాలకు ప్రభుత్వం ఇటీవల టెండర్లు ఆహ్వానించిన విషయం తెలిసిందే. తెలంగాణలోనే అత్యధిక లిక్కర్ అమ్మకాలు జరిగే ఉమ్మడి జిల్లాలో ఇప్పటి వరకు ఆశించిన స్థాయిలో దరఖాస్తులు రాకపోవడం అబ్కారీ శాఖను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. టెండర్లు పిలిచాం.. దాఖలు చేయండి అంటూ మద్యం వ్యాపారులను అభ్యర్థిస్తుండడం విశేషం. అడ్డుకుంటున్న సిండికేట్లు శంషాబాద్ ఎకై ్సజ్ జిల్లా పరిధిలో 111 మద్యం దుకాణాలు ఉండగా, సరూర్నగర్ ఎకై ్సజ్ పరిధిలో 138 ఉన్నాయి. మేడ్చల్ జిల్లాలో 206, వికారాబాద్ జిల్లాలో 59 దుకాణాలున్నాయి. 2023 ఆగస్టులో జారీ చేసిన టెండర్ నోటిఫికేషన్లోని షాపుల సంఖ్యతో పోలిస్తే.. 2025 సెప్టెంబర్లో జారీ చేసిన నోటిఫికేషన్లో కొత్తగా 19 దుకాణాలు వచ్చి చేరాయి. గతంలో సరూర్నగర్ ఎకై ్సజ్ జోన్ నుంచి 10,994 దరఖాస్తులు రాగా శంషాబాద్లో ఎకై ్సజ్ జోన్ నుంచి మరో 10,611 అందాయి. దరఖాస్తుల ద్వారానే ప్రభుత్వానికి రూ.432.10 కోట్ల ఆదాయం సమకూరింది. ఈసారి మరింత ఆదాయాన్ని సమకూర్చుకోవాలని ప్రభుత్వం భావించింది. ఇప్పటి వరకు ఆశించిన స్థాయిలో దరఖాస్తులు రాలేదు. 249 షాపులకు.. సంఖ్య ఇప్పటి వరకు 700 మించలేదు. ఇదిలా ఉండగా సరూర్నగర్, శంషాబాద్, గచ్చిబౌలి, హయత్నగర్ కేంద్రంగా వెలసిన పలు షాపులను ఎలాగైనా చేజిక్కించుకోవాలని పలువురు వ్యాపారులు భావిస్తున్నారు. అంతా సిండికేట్గా ఏర్పడి.. కొత్తగా మద్యం వ్యా పారంలోకి వచ్చే వాళ్లను టెండర్లో పాల్గొనకుండా అడ్డుకుంటున్నట్లు సమాచారం. గుదిబండగా గుడ్విల్స్ గతంతో పోలిస్తే ప్రస్తుతం కొన్ని ఏరియాల్లో షాపుల సంఖ్య పెరిగింది. లైసెన్సు ఫీజును కూడా రూ.రెండు లక్షల నుంచి రూ.మూడు లక్షలకు పెంచారు. దీనికి తోడు ఎకై ్సజ్కు ప్రతి నెలా గుడ్విల్ పేరుతో భారీగా చెల్లించుకోవాల్సి వస్తోంది. ఓపెన్ టెండర్లో పాల్గొని మద్యం దుకాణాన్ని దక్కించుకున్న వ్యాపారులు ఎకై ్సజ్శాఖకు గుడ్విల్గా రూ.రెండు లక్షలు ఇచ్చుకోవాల్సి వస్తోంది. తర్వాత ఎన్ఫోర్స్మెంట్ విభాగానికి ప్రతినెలా.. స్పెషల్ టాస్క్ ఫోర్స్ (ఎస్టీఎఫ్), డీటీఎఫ్ విభాగానికి ఏడాదికి రెండు విడతల్లో రూ.25 వేల చొప్పున ముట్టజెప్పాల్సి వస్తోంది. ఇక షాపులకు మద్యం సరఫరా చేసే డిపోలకు ఒక్కో బిల్లుకు రూ.200 నుంచి రూ.300 చొప్పున ముడుపులు చెల్లించాల్సి వస్తోంది. అదనపు చెల్లింపులకు తోడు నిర్వహణ ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. వెరసి గతంలో ఒక్కో దుకాణానికి సగటున 92 దరఖాస్తులు రాగా, ప్రస్తుతం మూడు, నాలుగుకు మించడం లేదు. ఎకై ్సజ్ అధికారులు మాత్రం దీన్ని కొట్టిపారేస్తున్నారు. మరో వారం గడువుందని, ఆఖరి నిమిషంలో వచ్చే దరఖాస్తులే ఎక్కువగా ఉంటాయని చెబుతున్నారు. నూతన మద్యం పాలసీ ప్రకారం శంషాబాద్ ఎకై ్సజ్ యూనిట్లోని మూడు స్టేషన్ల పరిధిలో మొత్తం 111 మద్యం షాపులు ఉన్నాయి. వీటిలో శంషాబాద్– 40, శేరిలింపల్లి–44, చేవెళ్ల–27 చొప్పున షాపులు ఉన్నాయి. సరూర్నగర్ ఎకై ్సజ్ యూనిట్లోని ఆరు ఎకై ్సజ్ పోలీసు స్టేషన్ల పరిధిలో మొత్తం 138 షాపులు ఉన్నాయి. వీటిలో సరూర్నగర్– 32, హయాత్నగర్–28, ఇబ్రహీంపట్నం–19, మహేశ్వరం–14, ఆమనగల్లు– 17, షాద్నగర్–28 షాపులు ఉన్నాయి. దుకాణాల కేటాయింపులో రిజర్వేషన్లు అమలు చేస్తున్నారు. బీసీ గౌడ్స్కు 15 శాతం, ఎస్సీలకు పది, ఎస్టీలకు ఐదు శాతం చొప్పున కేటాయించారు. వీటికి సంబంధించిన దరఖాస్తులను బండ్లగూడ జాగీర్లోని తెలంగాణ రాష్ట్ర ఎకై ్సజ్ అకాడమీ (ఈస్ట్)లో స్వీకరిస్తున్నారు. లిక్కర్ షాపు కావాల్సిన వ్యాపారులు స్వయంగా వచ్చి వారి అప్లికేషన్లు సంబంధిత కౌంటర్లలో అందజేయాల్సి ఉంది. ఈనెల 18 దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీగా నిర్ణయించారు. ఆయా దరఖాస్తుదారుల సమక్షంలో ఈ నెల 23న లాటరీ నిర్వహించనున్నారు. టెండర్లు ఆహ్వానించిన ప్రభుత్వం ఆసక్తి చూపని వ్యాపారులు ఇప్పటివరకు వచ్చింది700లోపే దరఖాస్తులు లైసెన్స్ ఫీజు.. గుడ్విల్.. నిర్వహణ ఖర్చు ఎఫెక్ట్ గతంతో పోలిస్తే ఆశించిన స్థాయిలో రాని అప్లికేషన్లు -
మహాసభలను జయప్రదం చేయండి
మీర్పేట: సీఐటీయూ రాష్ట్ర 5వ మహాసభలను జయప్రదం చేయాలని సీఐటీయూ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షుడు దాసరి బాబు పిలుపునిచ్చారు. శుక్రవారం పురపాలిక కార్యాలయం వద్ద పారిశుద్ధ్య కార్మికులతో కలిసి వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బాబు మాట్లాడుతూ.. తుర్కయంజాల్ పట్టణంలో ఈ నెల 14,15న నిర్వహించనున్న సభలో.. కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు, ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై చర్చిస్తామని తెలిపారు. కావున కార్మికులు పెద్ద సంఖ్యలో రావాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు యాదగిరిచారి, కమలమ్మ, లలిత, బావమ్మ, బుచ్చమ్మ, స్వరూప, పున్నమ్మ, శోభ, శ్రీకాంత్, సతీష్, సత్తయ్య పాల్గొన్నారు. -
తడి పొడి చెత్త ఎక్కడ?
నందిగామ: ‘గ్రామంలో సేకరించిన తడి, పొడి చెత్తను ఎక్కెడెక్కడ నిల్వ ఉంచారు. ఎంత మేర వర్మీ కంపోస్టు తయారు చేశారు’ అని డీపీఓ సురేష్ మోహన్.. రంగాపూర్ గ్రామ కార్యదర్శి వెంకటేశ్వర్లు, ఎంపీఓ తేజ్ సింగ్లను ప్రశ్నించారు. దీనికి వారి నుంచి సరైన సమాధానం రాకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. రంగాపూర్లో కంపోస్టు యార్డును శుక్రవారం డీపీఓ తనిఖీ చేశారు. నిర్వహణ సరిగా లేకపోవడంతో సంబంధిత అధికారులైన గ్రామ కార్యదర్శి, ఎంపీఓపై మండిపడ్డారు. తడి పొడి చెత్తను వేర్వేరుగా సేకరించి, కంపోస్టు యార్డుకు తరలించాలని, పరిసరాలను పరిశుభ్రగా ఉంచాలని ఆదేశించారు. వారంలోపు పనితీరు మార్చుకోవాలని హెచ్చరించారు. ఇదిలా ఉండగా.. ఎన్నికల బిజీ కారణంగా కొంత నిర్లక్ష్యం జరిగిందని, వారం రోజుల్లో కంపోస్టు యార్డుల్లో తడి పొడి చెత్తను వేర్వేరుగా వేసి, కంపోస్టును తయారు చేస్తామని ఎంపీఓ తేజ్ సింగ్.. డీపీఓకు వివరణ ఇచ్చారు. ● వర్మీ కంపోస్టు తయారీ ఎంత? ● గ్రామ అధికారులపైడీపీఓ సురేష్ మోహన్ ప్రశ్నల వర్షం -
అక్రమ కట్టడాల కూల్చివేత
తాండూరు టౌన్: నిబంధనలకు విరుద్ధంగా ఉన్న కట్టడాలను మున్సిపల్ అధికారులు శుక్రవారం కూల్చివేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలోని మల్రెడ్డిపల్లి మార్గంలో ఎలాంటి అనుమతులు లేకుండా.. పలు మాంసం దుకాణాలు వెలిశాయి. వీటి వలన వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా ఉందని పేర్కొంటూ.. ఇటీవల పలువురు మున్సిపల్ కమిషనర్ యాదగిరికి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సంబంధిత అధికారులు.. జేసీబీ సహాయంతో ఆ షాపులను నేలమట్టం చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. కక్షపూరితంగానే దుకాణాల ఎదుట నిర్మించిన దిమ్మెలను కూల్చేశారని యజమానులు ఆరోపించారు. పట్టణంలో అనేక ప్రాంతాల్లో అక్రమ కట్టడాలు ఉన్నాయని, వాటిపై ఎందుకు చర్యలు తీసుకోవడంలేదని ప్రశ్నించారు. ఇదే విషయమై కమిషనర్ మాట్లాడుతూ.. ప్రజా రవాణాకు ఇబ్బందికరంగా ఉన్న ఎలాంటి నిర్మాణమైనా కూల్చేస్తామని స్పష్టం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణం చేపట్టరాదని సూచించారు. ఫిర్యాదుతో స్పందించిన మున్సిపల్ అధికారులు -
బానిసలుగా ఉండాల్సిందేనా?
తాండూరు టౌన్: బీసీ రిజర్వేషన్లపై హైకోర్టుస్టే విధించడంలో అగ్రవర్ణాల కుట్ర దాగి ఉందని బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యుడు కందుకూరి రాజ్కుమార్ అన్నారు. శుక్రవారం పట్టణంలోని అంబేడ్కర్ చౌక్లో బీసీ సంఘం ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అగ్రవర్ణాల చెప్పు చేతల్లో పనిచేస్తూ బహుజనులు బానిసలుగానే బతకాలా అని ప్రశ్నించారు. 42 శాతం బీసీ రిజర్వేషన్లకు అడ్డు తగిలింది అగ్రవర్ణాల వారే అన్నది ప్రజలందరికీ తెలుసన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు చోద్యం చూస్తూ కూర్చున్నాయని, నిజంగా వారికి బీసీలపై ప్రేమ ఉంటే హైకోర్టులో ఇంప్లీడ్ ఎందుకు కాలేదని దుయ్యబట్టారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నామని చెప్పుకున్న సీఎం రేవంత్రెడ్డి హైకోర్టులో పిటిషన్ వేయకుండా అడ్డుకోలేక పోవడం విడ్డూరమన్నారు. గతంలో బీఆర్ఎస్ కూడా 34 శాతం ఉన్న రిజర్వేషన్లను 23 శాతానికి తగ్గించిందన్నారు. రాజకీయ పార్టీలన్నీ బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటూ, బహుజనులకు అధికారం దక్కకుండా అడ్డుతగులుతున్నారని ఆరోపించారు. తక్షణమే ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ వేయాలని డిమాండ్ చేశారు. ఆందోళన కార్యక్రమంలో నాయకులు సయ్యద్ షుకూర్, వెంకటేష్, అనిత, మంజుల, విజయలక్ష్మి, జగదీశ్వరి, శివలీల, బస్వరాజ్, నరేందర్, కృష్ణ, పరమేష్, రాము, రమేష్, రాజు, బాబు, యాసర్, జావీద్, జుంటుపల్లి వెంకట్, శివ, అరుణ్రాజ్, సురేష్ అంజద్ తదితరులు పాల్గొన్నారు. -
గొల్లచెరువు కబ్జాలపై చర్యలేవి?
తాండూరు టౌన్: తాండూరు పట్టణ పరిధిలోని గొల్ల చెరువు(మినీ ట్యాంక్బండ్) సుందరీకరణ పనులను వెంటనే పూర్తి చేయాలని బీజేపీ పట్టణ అధ్యక్షుడు నాగారం మల్లేశం డిమాండ్ చేశారు. శుక్రవారం పార్టీ నాయకులతో కలిసి మినీ ట్యాంక్బండ్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత, ప్రస్తుత ప్రభుత్వాలు రూ.12 కోట్లతో గొల్ల చెరువును మినీ ట్యాంక్బండ్గా సుందరీకరిస్తామని చెప్పి మాట తప్పాయన్నారు. మంజూరైన నిధులు ఏమేరకు ఖర్చు చేశారో, ఇంకా ఏఏ పనులు చేయాల్సి ఉందో చెప్పాలన్నారు. చెరువు కట్ట పరిస్థితి అధ్వానంగా తయారయ్యిందని, వాకింగ్ ట్రాక్ పూర్తిగా పాడైపోయిందన్నారు. చెరువులో గుర్రపు డెక్క మొక్కలు విపరీతంగా పెరిగాయన్నారు. సుమారు 11 ఎకరాల చెరువు శిఖం ఆక్రమణలకు గురైందని ఇరిగేషన్ అధికారుల దృష్టికి తెచ్చినా కబ్జాదారులపై ఎలాంటి చర్యలు తీసుకోలేని ఆరోపించారు.వెంటనే స్పందించి చెరువు కట్ట నిర్మాణం, లైటింగ్ వ్యవస్థ, వాకింగ్ ట్రాక్ అభివృద్ధి పనులను పూర్తి చేసి, మినీ ట్యాంక్బండ్ను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు. లేకుంటే పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, నాయకులు రాజు, ప్రకాష్, దోమ కృష్ణ, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. -
పార్కు స్థలం కబ్జాపై హైడ్రా కొరడా
హయత్నగర్: పార్కు స్థలం ఆక్రమణపై హైడ్రా కొరడా ఝులిపించింది. పెద్దఅంబర్పేట్ మున్సిపల్ పరిధిలోని శ్రీ లక్ష్మి గణపతి కాలనీలోని సుమారు 700 గజాల స్థలంలో నిర్మించిన ప్రహరీని కూల్చివేసి స్థలాన్ని విడిపించారు. తట్టిఅన్నారం రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 76/ఎలో 9.24 ఎకరాల భూమిలో గతంలో లేఅవుట్ చేసి ప్లాట్లను విక్రయించారు. లేఅవుట్లో సుమారు 2,800 గజాల ఖాళీ స్థలాన్ని ప్రజా అవసరాల కోసం వదిలేశారు. ఇందులో 700 గజాల స్థలం పురాతన బావి దగ్గర ఉంది. కొంత కాలంగా ఈ స్థలంపై కన్నేసిన స్థానిక నాయకుడు సుమారు 270 గజాలు కొన్నట్లు డాక్యుమెంట్లు సృష్టించి ప్రహరీ నిర్మించాడు. స్థలం ఆక్రమణపై కాలనీవాసులు కొంత కాంగా అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. ఈ క్రమంలో గత మార్చిలో ప్రజావాణిలో హైడ్రాకు ఫిర్యాదు చేశారు. స్పందించిన అధికారులు వివరాలు సేకరించి పార్కు స్థలం కబ్జాకు గురైనట్లు గుర్తించారు. దీంతో శుక్రవారం ఉదయం జేసీబీలతో అక్కడికి చేరుకుని అక్రమంగా నిర్మించిన ప్రహరీని తొలగించారు.