వైద్య సేవలపై అవగాహన అవసరం | - | Sakshi
Sakshi News home page

వైద్య సేవలపై అవగాహన అవసరం

Dec 13 2025 10:26 AM | Updated on Dec 13 2025 10:26 AM

వైద్య సేవలపై అవగాహన అవసరం

వైద్య సేవలపై అవగాహన అవసరం

● జిల్లా వైద్యాధికారి స్వర్ణకుమారి

అనంతగిరి: ప్రభుత్వం అందిస్తున్న వైద్య సేవలపై అవగాహన పెంచుకోవాలని జిల్లా వైద్యాధికారి స్వర్ణకుమారి అన్నారు. శుక్రవారం వికారాబాద్‌ ప్రభుత్వాస్పత్రిలో జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో యూనివర్సల్‌ హెల్త్‌ కవరేజ్‌ డే సందర్భంగా ఆరోగ్య అవగాహన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వం అందిస్తున్న వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రభుత్వం మాతా, శిశు ఆరోగ్య సేవలు, వాక్సినైజేషన్‌, ఇతర ఆరోగ్య కార్యక్రమాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో చీఫ్‌ లీగల్‌ ఎయిడ్‌ డిఫెన్స్‌ కౌన్సిల్‌ వెంకటేశ్‌, డాక్టర్‌ సంగీత తదితరులు పాల్గొన్నారు.

మెరుగైన వైద్యం అందించాలి

మోమిన్‌పేట: ఆస్పత్రికి వచ్చే వారికి మెరుగైన సేవలు అందించాలని జిల్లా వైద్యాధికారి సర్ణకుమారి అన్నారు. శుక్రవారం ఆమె మండల కేంద్రంలోని ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా పలు రికార్డులను పరిశీలించారు. ప్రభుత్వాస్పత్రికి ఎక్కువగా పేదలే వస్తారని వారికి నాణ్యమైన వైద్యం అందించాలన్నారు. ఉద్యోగులు విధిగా సమయ పాలన పాటించాలని సూచించారు. ఆస్పత్రుల్లో కావాల్సిన మందులు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ఆస్పత్రి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement