పారదర్శకంగా గ్రామాభివృద్ధికి కృషి | - | Sakshi
Sakshi News home page

పారదర్శకంగా గ్రామాభివృద్ధికి కృషి

Dec 19 2025 10:13 AM | Updated on Dec 19 2025 10:13 AM

పారదర్శకంగా గ్రామాభివృద్ధికి కృషి

పారదర్శకంగా గ్రామాభివృద్ధికి కృషి

పారదర్శకంగా గ్రామాభివృద్ధికి కృషి

నవాబుపేట: సర్పంచ్‌ అంటే పదవి కాదని, ప్రజలకు సేవ చేసే మార్గమని ఎమ్మెల్యే కాలె యాదయ్య పేర్కొన్నారు. మండలంలోని వివిధ గ్రామాల్లో ఇటీవల గెలుపొందిన సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు మెంబర్లు గురువారం ఎమ్మెల్యే నివాసంలో ఆయన్ని కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారందరినీ శాలువా, పూలమాలలతో సన్మానించారు. అనంతరం మాట్లాడుతూ.. గ్రామస్తులు మీపై ఉంచిన విశ్వాసం ఎంతో గొప్పదన్నారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టి, పారదర్శకంగా గ్రామాభివృద్ధి పనులను ముందుకు తీసుకెళ్లాలన్నారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్‌ గీతాసింగ్‌ నాయక్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ రాంరెడ్డి, నాయకులు మల్లారెడ్డి, నాగిరెడ్డి, ప్రభాకర్‌, రంగారెడ్డి, ఖదీర్‌ తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యే కాలె యాదయ్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement