రూ.42 కోట్ల పత్తి కొనుగోళ్లు | - | Sakshi
Sakshi News home page

రూ.42 కోట్ల పత్తి కొనుగోళ్లు

Dec 19 2025 10:13 AM | Updated on Dec 19 2025 10:13 AM

రూ.42 కోట్ల పత్తి కొనుగోళ్లు

రూ.42 కోట్ల పత్తి కొనుగోళ్లు

రూ.42 కోట్ల పత్తి కొనుగోళ్లు మోమిన్‌పేట: స్థానికంగా ఉన్న అయ్యప్ప కాటన్‌ మిల్లులో ఈ నెల 17వ తేదీ నాటికి రూ.42 కోట్ల విలువైన పత్తిని సీసీఐ ద్వారా కొనుగోళ్లు చేశారు. 2,455 మంది రైతుల నుంచి 52,769 క్వింటాళ్ల పత్తిని కొనుగోళ్లు చేయగా రూ.42 కోట్లను సీసీఐ నుంచి చెల్లించింది. మర్పల్లి మార్కెట్‌కు ఒక శాతం ఫీజు కింద రూ.42 లక్షల ఆదాయం సమకూరే అవకాశం ఉంది. వచ్చే నెల చివరి వరకు కొనుగోళ్లు చేస్తే మంచి ఆదాయం వస్తుందని మార్కెట్‌ కార్యదర్శి వెంకటేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. మండల పరిధిలోని ఆయా గ్రామాల్లో 80 శాతం విస్తీర్ణంలో పత్తి సాగు చేశారు. అధిక వర్షాలతో పంట దిగుబడి సగానికి పడిపోయిందని రైతులు వాపోతున్నారు. సాగు నీటి కాలువ పూడికతీత యూరియా బుకింగ్‌పై అవగాహన

దుద్యాల్‌: చెరువుల కింద యాసంగి వరి సాగుకు రైతులు సన్నద్ధం అవుతున్నారు. అందులో భాగంగానే దుద్యాల్‌ గ్రామంలోని గోపన్‌ చెరువు కిందనున్న 120 ఎకరాల పొలాలకు సాగు నీరు అందించేందుకు జేసీబీతో కాలువల మరమ్మతులు గురువారం చేపట్టారు. వర్షాలు సమృద్ధిగా కురవడంతో చెరువులు, కుంటలు నిండాయి. నీరు సాఫీగా చివరి పొలం వరకు సులువుగా అందేందుకు కాలువలు పూడిక చేపట్టినట్లు కాంగ్రెస్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి మేరుగు వెంకటయ్య తెలిపారు. పనులు పూర్తవ్వగానే నీటి విడుదలకు తీర్మానం చేసి పంటలను సాగుకు ముందుకెళ్తామని పేర్కొన్నారు.

బంట్వారం: యూరియా బుకింగ్‌ యాప్‌పై గురువారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్బంగా బంట్వారం, కోట్‌పల్లి మండలాల్లోని రైతు వేదికల్లో వ్యవసాయ శాఖ అధికారులు, డీలర్లు వీసీని తిలకించారు. యూరియా బుకింగ్‌కు సంబంధించిన పలు అంశాలపై అధికారులు వీసీలో సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఓలు కరుణాకర్‌రెడ్డి, శ్రావ్య, ఏఈఓలు సందీప్‌, మశ్చేందర్‌ డీలర్లు, రైతుల తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement