ఈవీఎం గోడౌన్‌ పరిశీలన | - | Sakshi
Sakshi News home page

ఈవీఎం గోడౌన్‌ పరిశీలన

Dec 13 2025 10:26 AM | Updated on Dec 13 2025 10:26 AM

ఈవీఎం గోడౌన్‌ పరిశీలన

ఈవీఎం గోడౌన్‌ పరిశీలన

జిల్లా కేంద్రంలోని తహసీల్దార్‌ కార్యాలయ ఆవరణలో ఉన్న ఈవీఎం గోడౌన్‌ను కలెక్టర్‌ ప్రతీక్‌జైన్‌ పరిశీలించారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో గోడౌన్‌ సీల్‌ తెరిచారు. ఈవీఎంలు, బ్యాలెట్‌ యూనిట్‌, కంట్రోల్‌ యూనిట్లు, ఎన్నికల సామగ్రిని భద్రపరిచిన గదులను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం సీసీ కెమెరాల పనితీరును తనిఖీ చేశారు. ఈవీఎంల భద్రత విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సంబంధిత రిజిస్టర్లను పరిశీలించి సంతకాలు చేశారు. ఆయన వెంట అదనపు కలెక్టర్‌ లింగ్యా నాయక్‌, డీఆర్‌ఓ మంగీలాల్‌, ఆర్డీఓ వాసు చంద్ర, తహసీల్దార్‌ లక్ష్మీనారాయణ, ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు నెమత్‌ హాలీ, వివిధ రాజకీయ పార్టీల ప్రజాప్రతినిధులు, సిబ్బంది తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement