●విధుల్లో నిర్లక్ష్యం వహించొద్దు | - | Sakshi
Sakshi News home page

●విధుల్లో నిర్లక్ష్యం వహించొద్దు

Dec 17 2025 11:12 AM | Updated on Dec 17 2025 11:12 AM

●విధుల్లో నిర్లక్ష్యం వహించొద్దు

●విధుల్లో నిర్లక్ష్యం వహించొద్దు

●విధుల్లో నిర్లక్ష్యం వహించొద్దు ● ఎస్పీ స్నేహ మెహ్ర ●అప్రమత్తంగా ఉండాలి

దోమ: సమస్యాత్మక గ్రామాలపై పటిష్ట నిఘా పెట్టి ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చూడాలని ఎస్పీ స్నేహ మెహ్ర సూచించారు. మంగళవారం ఆమె దోమ ఎన్నికల నిర్వహణ తీరుపై మండల ఎన్నికల సహాయ అఽఽధికారి గ్యామాను అడిగి వివరాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులకు తగు సూచనలు ఇచ్చారు. ప్రతీ ఒక్కరు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునేలా చూడాలని చెప్పారు. విధు ల్లో ఏ మాత్రం నిర్లక్ష్యం వహించొద్దన్నారు.

మహేశ్వరం: మూడో విడత పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు ప్రతి ఒక్కరూ పోలీసు లు, అధికారులకు సహకరించాలని మహేశ్వరం డీసీపీ నారాయణరెడ్డి పేర్కొన్నారు. మండల కేంద్రంలోని పోలింగ్‌ కేంద్రాన్ని మంగళవారం ఆయ న ఏసీపీ జానకిరెడ్డి, సీఐ వెంకటేశ్వర్లతో కలిసి పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికలు అయ్యే వరకు పోలీస్‌ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని అన్నారు. అనుమతి లేని వారిని, ఓటరు కానివారిని పోలింగ్‌ బూత్‌ల్లోకి అనుమతించొద్దని సూచించారు. అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement