●విధుల్లో నిర్లక్ష్యం వహించొద్దు
దోమ: సమస్యాత్మక గ్రామాలపై పటిష్ట నిఘా పెట్టి ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చూడాలని ఎస్పీ స్నేహ మెహ్ర సూచించారు. మంగళవారం ఆమె దోమ ఎన్నికల నిర్వహణ తీరుపై మండల ఎన్నికల సహాయ అఽఽధికారి గ్యామాను అడిగి వివరాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులకు తగు సూచనలు ఇచ్చారు. ప్రతీ ఒక్కరు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునేలా చూడాలని చెప్పారు. విధు ల్లో ఏ మాత్రం నిర్లక్ష్యం వహించొద్దన్నారు.
మహేశ్వరం: మూడో విడత పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు ప్రతి ఒక్కరూ పోలీసు లు, అధికారులకు సహకరించాలని మహేశ్వరం డీసీపీ నారాయణరెడ్డి పేర్కొన్నారు. మండల కేంద్రంలోని పోలింగ్ కేంద్రాన్ని మంగళవారం ఆయ న ఏసీపీ జానకిరెడ్డి, సీఐ వెంకటేశ్వర్లతో కలిసి పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికలు అయ్యే వరకు పోలీస్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని అన్నారు. అనుమతి లేని వారిని, ఓటరు కానివారిని పోలింగ్ బూత్ల్లోకి అనుమతించొద్దని సూచించారు. అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు.


