breaking news
Gujarat
-
కోర్టు విచారణలో అర్జంట్గా బాత్రూమ్ వెళ్లాల్సి వస్తే ఎలా?
న్యాయవ్యవస్థపై కనీస గౌరవం ఉన్నవారు ఎవరైనా ఇలా చేస్తారా?.. నెట్టింట వైరల్ అవుతున్న ఓ ఘటనపై చాలామంది వ్యక్తం చేస్తున్న అభిప్రాయం ఇది. ఏకంగా టాయిలెట్ సీటుపై నుంచే వర్చువల్ కోర్టు విచారణకు హాజరు కాగా, ఆ తతంగం అంతా రికార్డు అయ్యింది కూడా. అయితే కోర్టు విచారణలో ఉన్నప్పుడు నిజంగా ఇలాంటి అవసరం పడితే ఎలా మరి?గుజరాత్ హైకోర్టు వీడియో విచారణకు ఓ వ్యక్తి టాయిలెట్ సీటుపై కూర్చొని పాల్గొన్న ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో జడ్జి నిర్జర్ దేశాయ్ ఓ చెక్బౌన్స్ కేసులో ఎఫ్ఐఆర్ రద్దు కోసం వాదనలు వింటున్నారు. జూమ్ కాల్ విచారణ(Virtual Hearings) లో టాయిలెట్ సీటు నుంచి హాజరైన వ్యక్తి ఫిర్యాదుదారుడే. కానీ జూమ్కాల్లో పేరు ‘సమద్ బ్యాటరీ’ అని ఉంది. ఆ వ్యక్తి టాయిలెట్ సీటు మీద బ్లూటూత్ హెడ్ఫోన్స్ ధరించి విచారణలో పాల్గొన్నాడు. ఓ పక్క అవతలి పార్టీ, మరోపక్క కోర్టులో లాయర్ వాదనలు వినిపిస్తున్నాడు. ఈలోపు.. ఆ వ్యక్తి ఫోన్ నేలపై ఉంచి శుభ్రం చేసుకున్నాడు కూడా. అటుపై మరో గదికి వచ్చి విచారణలో కొనసాగాడు. జూన్ 20వ తేదీ ఈ ఘటన జరిగింది. సాధారణంగా ఇలాంటి వ్యవహారాలను న్యాయమూర్తులు అస్సలు ఉపేక్షించరు. ఈ మధ్యకాలంలో ఇలాంటి ఘటనలే జరగ్గా.. కోర్టులు తీవ్రంగా పరిగణించాయి కూడా. ఈ ఏడాది మార్చిలో.. ఓ వ్యక్తి లావేటరీ నుంచి కోర్టువిచారణకు హాజరు కాగా.. ఆగ్రహించిన జడ్జి ఆ వ్యక్తికి ₹2 లక్షల జరిమానా, కోర్టు ప్రాంగణం శుభ్రం చేయాలని కమ్యూనిటీ సర్వీస్ శిక్ష విధించారు. అలాగే.. ఈ ఏడాది ఫిబ్రవరిలో బెడ్పై పడుకుని విచారణలో పాల్గొన్న వ్యక్తికి ₹25,000 జరిమానా విధించారు. 2020లో ఏకంగా ఓ అడ్వొకేట్ విచారణ టైంలో సిగరెట్ తాగుతూ న్యాయమూర్తి ఆగ్రహానికి గురయ్యారు. అయితే కోర్టులకు హాజరైనప్పడు సరైన వస్త్రధారణ మాత్రమే కాదు.. ప్రవర్తన కూడా సవ్యంగా ఉండాలి. కోర్టు హాల్లో విచారణ జరుగుతున్నప్పుడు గంభీరమైన వాతావరణం ఉంటుంది. అలాంటి సందర్భాల్లో.. న్యాయమూర్తికి అసహనం కలిగించే పనులు చేయకూడదు. ఒకవేళ.. అత్యవసరం పడితే(ఒకటికి, రెంటికి) జడ్జిలకు విజ్ఞప్తి చేస్తే కచ్చితంగా అనుమతిస్తారు. ఒకవేళ సమయం గనుక లేనట్లయితే విచారణ త్వరగతిన పూర్తి చేయాలని లాయర్లకు సూచిస్తారు. వర్చువల్ హియరింగ్స్(వీడియో కాల్స్ విచారణలో)కు ఇదే వర్తిస్తుంది. అత్యవసర పరిస్థితుల్లో.. మైక్ను మ్యూట్లో ఉంచడం, కెమెరాను ఆఫ్ చేయడం, లేదంటే తమ లాయర్ల ద్వారా జడ్జిలను రిక్వెస్ట్ చేసుకోవడం ద్వారా అవసరాలను తీర్చుకోవచ్చు. తాజా గుజరాత్ హైకోర్టు ఉదంతంలో అలాంటివేం జరగలేదని తెలుస్తోంది. అంతేకాదు.. సదరు వ్యక్తిపై క్రమశిక్షణా చర్య తీసుకోవడంగానీ, జరిమానా విధిచండంగానీ జరగలేదని సమాచారం.A video showing a man attending Gujarat High Court virtual proceedings while seated on a toilet and apparently relieving himself has gone viral on the social media. Read full story: https://t.co/FbendKMD2M #GujaratHighCourt #VirtualHearings #VideoConferencehearing… pic.twitter.com/spyxMiptiO— Bar and Bench (@barandbench) June 27, 2025 -
గుజరాత్ లోని గోల్ వాడ జగన్నాథ రథయాత్రలో అపశ్రుతి
-
రథయాత్రలో అపశృతి.. భక్తులపైకి దూసుకెళ్లిన ఏనుగులు
గాంధీనగర్: గుజరాత్లో జగన్నాథ రథయాత్ర సందర్భంగా అపశృతి చోటు చేసుకుంది. జగన్నాథ యాత్రలో పాల్గొన్న ఒక ఏనుగు ఆగ్రహంతో భక్తులపైకి దూసుకెళ్లింది. ఈ క్రమంలో భయాందోళనకు గురైన భక్తులు ఆలయం నుంచి బయటకు పరుగులు తీశారు. దీంతో, ఆలయం వద్ద తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాట కారణంగా పలువురు భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.వివరాల ప్రకారం.. ఒడిశాలోని ప్రసిద్ధ పూరీ జగన్నాథ రథయాత్ర ఈ రోజు ఘనంగా ప్రారంభమైంది. కన్నుల పండుగగా జరిగే ఈ యాత్రను చూడడానికి దేశ, విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు. ఈ రథయాత్ర సందర్భంగా పలు రాష్ట్రాల్లో కూడా జగన్నాథ ఆలయాల్లో వేడుకలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే గుజరాత్లోని గోల్వాడలో కూడా భక్తులు రథయాత్రను నిర్వహించారు. అయితే, నిర్వాహకులు యాత్రలో ప్రత్యేక ఆకర్షణకు 18 ఏనుగులను అక్కడికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా యాత్ర ప్రారంభమైన 10 నిమిషాలకు అందులో ఉన్న ఓ ఏనుగు ఉన్నట్టుండి ఒక్కసారిగా ఆగ్రహంతో జనం పైకి దూసుకెళ్లింది.Breaking!🚨Three elephants went out of control during the Jagannath Rath Yatra in Ahmedabad, GujaratHorrifying visuals. #RathaJatra2025pic.twitter.com/W2b7CwHpVw— 𝗩eena Jain (@DrJain21) June 27, 2025 ఇక, సదరు ఏనుగును చూసి పక్కనే ఉన్న ఏనుగులు సైతం ఆగ్రహానికి లోనయ్యాయి. ఒక్కసారిగా అక్కడున్న భక్తులపైకి ఏనుగులు దూసుకెళ్లాయి. దీంతో, ఏనుగులను చూసి అక్కడ ఉన్న వారు భయపడి పరుగులు తీశారు. ఏనుగులు గట్టిగా అరుస్తూ.. అటూ ఇటూ తిరగాయి. ఈ క్రమంలో రథ యాత్ర వద్ద స్వల్ప తొక్కిసలాట జరిగింది. ఆ ఏనుగులను కంట్రోల్ చేయడానికి మావటివాళ్లు కూడా ప్రయత్నించినప్పటికీ పరిస్థితి అదుపు కాలేదు. ఎట్టకేలకు పరిస్థితిని అదుపు చేసి రథ యాత్రకు సిద్ధం చేశారు. ఈ ఘటనలో మొత్తం తొమ్మిది గాయపడినట్టు తెలుస్తోంది. చికిత్స కోసం వారిని సమీపంలోని ఓ ఆసుపత్రికి తరలించారు. Ahmedabad Rath Yatra ….All people are safe … pic.twitter.com/0rw979Mfxa— €hetu $oN¥ (@chetusony) June 27, 2025🔵During the Rath Yatra in Ahmedabad, an elephant ran out of control. A mishap was narrowly avoided...Jai Jagannath Ji 🙏🙏🙏 pic.twitter.com/fr6Cyx2qSi— THE UNKNOWN MAN (@Theunk13) June 27, 2025 -
అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. మొత్తం మరణాల సంఖ్యను ప్రకటించిన ప్రభుత్వం
గాంధీనగర్: అహ్మదాబాద్లో జరిగిన ఎయిర్ ఇండియా బోయింగ్ డ్రీమ్లైనర్ ప్రమాదంలో 275 మంది ప్రాణాలు కోల్పోయారు. వారిలో 241 మంది విమానంలో ఉండగా.. 34 ఎయిరిండియా విమానం ఢీ కొట్టిన బీజే మెడికల్ కాలేజీ క్యాంపస్కు చెందిన వారు ఉన్నారని మంగళవారం (జూన్ 24న)గుజరాత్ హెల్త్ డిపార్ట్మెంట్ అధికారికంగా ప్రకటించింది.జూన్ 12న అహ్మదాబాద్ నుంచి లండన్కు వెళ్లాల్సిన విమానం అహ్మాదాబాద్లోని బీజే మెడికల్ కాలేజీ భవనాన్ని ఢీ కొట్టింది. దుర్ఘటనలో మొతత్తం మరణాల సంఖ్యను ప్రభుత్వం ధ్రువీకరించలేదు. ప్రమాదం తీవ్రతతో ఘటనా స్థలంలో భౌతికకాయాల్ని గుర్తించడం వైద్యులకు కష్టంగా మారింది.దీంతో వైద్యులు బాధిత కుటుంబ సభ్యులు ఇచ్చిన డీఎన్ఏను ఘటనా స్థలంలో లభ్యమైన మృతదేహాలతో పోల్చి చూస్తున్నారు. మృతదేహాల్ని వారిక కుటుంబ సభ్యులకు అందిస్తున్నారు. కొన్ని మృతదేహాల డీఎన్ఏ గుర్తింపు ఇంకా పురోగతిలో ఉందని ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. భారత విమానయాన చరిత్రలో అత్యంత విషాదంఅహ్మదాబాద్లో జరిగిన ఎయిరిండియా ప్రమాదం భారత విమానయాన చరిత్రలోనే అత్యంత విషాదకర ఘటనగా నిలిచింది. జూన్ 12న, లండన్కు బయలుదేరిన AI-171 బోయింగ్ 787-8 డ్రీమ్లైనర్ విమానం టేకాఫ్ అయిన కొద్ది సేపటికే సర్దార్ వల్లభభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో కుప్పకూలింది.ప్రమాదం ఎలా జరిగింది?- విమానం టేకాఫ్ అయిన 30 సెకన్లలోనే పైలట్ మేడే కాల్ ఇచ్చారు.- విమానం 625 అడుగుల ఎత్తుకు చేరుకున్న తర్వాత ఒక్కసారిగా 475 అడుగుల వేగంతో కిందకు పడిపోయింది.- విమానం మేఘాణి నగర్ ప్రాంతంలోని జనావాసాలపై కూలి, బీజే మెడికల్ కాలేజీ హాస్టల్ను ఢీకొట్టింది.- ప్రమాద సమయంలో విమానంలో 241 మంది ప్రయాణికులు ఉండగా, నేలపై ఉన్న 34 మంది కూడా ప్రాణాలు కోల్పోయారు.కారణాలు ఏమిటి?- ప్రాథమికంగా హైడ్రాలిక్ సిస్టమ్ వైఫల్యం అనుమానంగా భావిస్తున్నారు.- బోయింగ్ 787-8 మోడల్ గతంలోనూ సాంకేతిక లోపాలతో వార్తల్లో నిలిచింది- బ్లాక్ బాక్స్ను స్వాధీనం చేసుకుని విశ్లేషణ జరుపుతున్నారు.ఒకే ఒక్కడు ఎలా బతికాడు?విశ్వకుమార్ రమేష్ అనే ప్రయాణికుడు మాత్రమే ఈ ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డాడు. అతను ఎమర్జెన్సీ ఎగ్జిట్ దగ్గర 11A సీటులో కూర్చొన్నాడు. విమానం కూలిన సమయంలో అతని సీటు విరిగిపడి బయటకు పడిపోయింది. శిథిలాల మధ్య నుంచి నడుచుకుంటూ బయటకు వచ్చిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. -
గుజరాత్లో బీజేపీకి బిగ్ షాక్
న్యూఢిల్లీ/అహ్మదాబాద్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సొంత రాష్ట్రం గుజరాత్లో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) బీజేపీకి గట్టి షాక్ ఇచి్చంది. రాష్ట్రంలో రెండు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగ్గా, ఒక స్థానంలో అరవింద్ కేజ్రీవాల్ సారథ్యంలోని ఆప్ పార్టీ ఘన విజయం సాధించింది. మరో స్థానంలో అధికార బీజేపీ నెగ్గింది. లూథియానా వెస్ట్(పంజాబ్), కాళీగంజ్(పశ్చిమ బెంగాల్), కాడీ, విసావదర్(గుజరాత్), నీలంబూర్(కేరళ) శాసనసభ స్థానాలకు ఈనెల 19న ఉప ఎన్నికలు జరిగాయి. సోమవారం ఓట్ల లెక్కింపు చేపట్టారు. విసావదర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి గోపాల్ ఇటాలియా ఘన విజయం సొంతం చేసుకున్నారు. బీజేపీ అభ్యర్థి కిరీట్ పటేల్పై 17 వేలకుపైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. గోపాల్ ఇటాలియాకు 75,942 ఓట్లు రాగా, కిరీట్ పటేల్కు 58,000 ఓట్లు వచ్చాయి. గత ఎన్నికల్లో విసావదర్ నుంచి గెలుపొందిన ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే భయానీ భూపేంద్రభాయ్ తన పదవికి, పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. దీంతో ఉపఎన్నిక అనివార్యమైంది. తమ సిట్టింగ్ స్థానాన్ని ఆప్ నిలబెట్టుకుంది. కాడీ ఎస్సీ రిజర్వ్డ్ అసెంబ్లీ స్థానంలో బీజేపీ అభ్యర్థి రాజేంద్ర చావ్డా 39,000 ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఇక్కడ బీజేపీ ఎమ్మెల్యే కర్సాన్ సోలంకీ మృతిచెందడంతో ఉప ఎన్నిక జరిగింది. పంజాబ్లోని లూథియానా వెస్ట్లోనూ ఆప్ మళ్లీ గెలిచింది. ఆ పార్టీ అభ్యర్థి సంజీవ్ అరోరా కాంగ్రెస్ అభ్యర్థి భరత్ భూషణ్పై 10 వేల ఓట్ల మెజార్టీతో నెగ్గారు. బీజేపీ అభ్యర్థి జీవన్ గుప్తా మూడో స్థానంలో నిలిచారు. లూథియానా వెస్ట్లో ఆప్ ఎమ్మెల్యే గుర్ప్రీత్బస్సీ గోగీ మరణించడంతో ఉప ఎన్నిక జరిగింది. బెంగాల్లోని కాళీగంజ్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నేత అలీఫా అహ్మద్ బీజేపీ అభ్యర్థి ఆశీష్ ఘోష్పై 50,000 ఓట్ల మెజార్టీతో గెలిచారు. అలీఫా తండ్రి, తృణమూల్ ఎమ్మెల్యే నజీరుద్దీన్ అహ్మద్ మృతిచెందడంతో ఇక్కడ ఉప ఎన్నిక నిర్వహించారు. కేరళలోని నీలంబూర్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ అభ్యర్థి అర్యదన్ షౌకత్ వామపక్ష అభ్యర్థి ఎం.స్వరాజ్పై 11,000 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. నీలంబూర్ అసెంబ్లీ స్థానం కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకా గాంధీ వాద్రా ప్రాతినిధ్యం వహిస్తున్న వయనాడ్ లోక్సభ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. గుజరాత్, పంజాబ్లో మాదే విజయం: కేజ్రీవాల్ గుజరాత్, పంజాబ్ ఉప ఎన్నికల్లో తమ అభ్యర్థుల విజయం పట్ల ఆప్ ఆద్మీ పార్టీ జాతీయ కనీ్వనర్ సోమవారం హర్షం వ్యక్తంచేశారు. 2027 అసెంబ్లీ ఎన్నికలకు ఇది సెమీఫైనల్ అని, ఇందులో తామే గెలిచామని స్పష్టంచేశారు. రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్లను ఓటర్లు పూర్తిగా తిరస్కరించడం ఖాయమని అన్నారు. ఆప్ విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరని ధీమా వ్యక్తం చేశారు. -
అక్కడ బీజేపీకి ఓటమి.. ఆప్, కాంగ్రెస్, టీఎంసీ విజయం
Four States Bypoll Results Updates..👉నాలుగు రాష్ట్రాల్లో ఐదు స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. పంజాజ్లోని లూథియానా స్థానంలో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) అభ్యర్థి సంజీవ్ అరోరా విజయం సాధించారు. గుజరాత్లోని విసావదార్ అసెంబ్లీ స్థానంలో ఆప్ అభ్యర్థి గోపాల్ ఇటాలియా విజయం సాధించగా.. బీజేపీ అభ్యర్థి రెండో స్థానంలో ఉన్నారు. #WATCH | Kerala | Nilambur Assembly by-election: UDF workers celebrate outside a counting centre in Malappuram as Congress candidate Aryadan Shoukath continues his lead into the 16th round of counting.As per official EC trends, he is leading by a margin of 10,482 votes;… pic.twitter.com/87foBWs4iZ— ANI (@ANI) June 23, 2025BIG WIN FOR AAP IN GUJARATAAP @Gopal_Italia WINS from Visavadar, Gujarat !!AAP defeats BJP in Gujarat !!Congrats to everyone !!pic.twitter.com/2rKhiF0hTx— AAP Ka Mehta 🇮🇳 (@DaaruBaazMehta) June 23, 2025👉కేరళలోని నీలంబూర్లో కాంగ్రెస్ అభ్యర్థి ఆర్యధాన్ శోకత్ విజయాన్ని అందుకున్నారు. ఇక, గుజరాత్లోని కాడీ స్థానంలో బీజేపీ అభ్యర్థి రాజేంద్ర కుమార్ గెలిచారు. బెంగాల్లో తృణముల్ అభ్యర్థి అలిఫా అహ్మద్ భారీ మెజార్టీతో విజయం సాధించారు. Kadi (Gujarat) Assembly by-election | As per the latest official trends by EC, BJP's Rajendra Chavda continues his lead over Congress' Ramesh Chavda; currently leading by a margin of 34,597 votes after 15 rounds of counting. AAP's Jagdish Chavda trailing in a distant third… pic.twitter.com/cBQVBhH5Hy— ANI (@ANI) June 23, 2025 ఆప్, బీజేపీ, తృణముల్, కాంగ్రెస్ ఆధిక్యం ఇలా.. బెంగాల్లో తృణముల్ అభ్యర్థి భారీ ఆధిక్యం..Kaliganj (West Bengal) Assembly by-election | As per latest official trends by Election Commission, TMC's Alifa Ahmed continues her lead over Congress' Kabil Uddin Shaikh; currently leading by 14,462 votes in the fifth round of counting. BJP's Ashish Ghosh is trailing in the… pic.twitter.com/WxOhxqN2UN— ANI (@ANI) June 23, 2025పంజాజ్లో దూసుకెళ్తున్న ఆప్ అభ్యర్థి.Ludhiana West (Punjab) Assembly by-election | As per latest official trends by Election Commission, AAP's Sanjeev Arora continues his lead over Congress' Bharat Bhushan Ashu; currently leading by 2504 in the 5th round of counting. BJP's Jiwan Gupta trailing in third position. pic.twitter.com/nWIe91KZhO— ANI (@ANI) June 23, 2025కేరళలో కాంగ్రెస్ అభ్యర్థ ముందంజ. Nilambur (Kerala) Assembly by-election | As per official trends by Election Commission, UDF candidate - Congress' Aryadan Shoukath continues his lead over LDF candidate - CPI(M)'s M. Swaraj; currently leading by 6931 in the 11th round of counting. pic.twitter.com/oUcbPlrGA8— ANI (@ANI) June 23, 2025గుజరాత్లో పోటాపోటీ.. Visavadar (Gujarat) Assembly by-election | After initially leading, AAP's Gopal Italia now trailing behind BJP's Kirit Patel by 985 votes in the 7th round of counting, as per the latest official EC trends. Congress' Nitin Ranpariya trailing in the third position. pic.twitter.com/hZ0Q9WqigP— ANI (@ANI) June 23, 2025లీడ్లో ఆప్, కాంగ్రెస్ గుజరాత్లో రెండు స్థానాల్లో బీజేపీ ముందంజ..పంజాబ్లో ఆప్ లీడింగ్కేరళలో కాంగ్రెస్ అభ్యర్థి ముందంజబెంగాల్ తృణముల్ అభ్యర్థికి లీడ్. Kadi (Gujarat) Assembly by-election | As per latest official trends by Election Commission, BJP's Rajendra Chavda continues his lead over Congress' Ramesh Chavda; currently leading by 13,195 votes in the 7th round of counting. AAP's Jagdish Chavda trailing in the third position. pic.twitter.com/vxLel9szbp— ANI (@ANI) June 23, 2025గుజరాత్లో ఆప్ అభ్యర్థి ముందంజ..విసావదర్ స్థానంలో ఆప్ అభ్యర్థి గోపాల్ ఇటాలియాకు లీడింగ్.రెండో స్థానంలో బీజేపీ Visavadar (Gujarat) Assembly by-election | As per official trends by Election Commission, AAP's Gopal Italia leading over BJP's Kirit Patel by 391 votes in the second round of counting. Congress' Nitin Ranpariya trailing in the third position. pic.twitter.com/NH3kyEN520— ANI (@ANI) June 23, 2025 👉పంజాబ్లో ఆప్ అభ్యర్ధి లీడింగ్..Ludhiana West (Punjab) Assembly by-election | As per official trends by Election Commission, AAP's Sanjeev Arora leading over Congress' Bharat Bhushan Ashu by 1269 votes in the first round of counting. BJP's Jiwan Gupta trailing in third position. pic.twitter.com/X1j2JQCuRe— ANI (@ANI) June 23, 2025 👉కేరళలో కాంగ్రెస్ అభ్యర్థి ముందంజ..Nilambur (Kerala) Assembly by-election | As per official trends by Election Commission, UDF candidate - Congress' Aryadan Shoukath leading over LDF candidate - CPI(M)'s M. Swaraj by 419 votes in the first round of counting. pic.twitter.com/K7ro5uQ10w— ANI (@ANI) June 23, 2025👉జూన్ 19న ఎన్నికలు జరగ్గా నేడు ఫలితాలు వెలువడనున్నాయి. గుజరాత్లోని రెండు స్థానాలు విసావదర్, కాడి, పంజాబ్ (లూథియానా వెస్ట్), బెంగాల్ (కాలిగంజ్), కేరళ (నిలంబూర్) అసెంబ్లీ స్థానాల్లో ఉప ఎన్నికలు జరిగాయి.గుజరాత్లో ఇలా.. గుజరాత్లోని కాదీ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి రాజేంద్రకుమార్ దానేశ్వర్ చవడా, కాంగ్రెస్ అభ్యర్థి రమేష్భాయ్ చావడ మధ్య గట్టి పోటీ ఉండనుంది. ఇక్కడ బీజేపీ ఎమ్మెల్యే కర్సన్ సోలంకి మరణం కారణంగా ఉప ఎన్నికల జరగుతోంది. అలాగే, మరో స్థానం విసావదార్లో బీజేపీ అభ్యర్థి కిరీట్ పటేల్, ఆప్ అభ్యర్థి గోపాల్ ఇటాలియా మధ్య హోరాహోరీ ఉండే అవకాశం ఉంది.#WATCH | Gujarat: Counting of votes for Kadi Assembly by-elections begins. Postal ballots are being counted first. Voting was held on 19th June. Visuals from a counting centre in Mahesana. BJP's Rajendra Chavda, Congress' Ramesh Chavda and AAP's Jagdish Chavda are among the… pic.twitter.com/rwLXA5WJvk— ANI (@ANI) June 23, 2025 కేరళలో.. కేరళలోని నీలంబర్ సీటు కాంగ్రెస్ అభ్యర్థి విజయం.. ప్రియాంక గాంధీ వాద్రాకు ప్రతిష్టాత్మకంగా మారనుంది. ఈ స్థానం ఆమె వయనాడ్ నియోజకవర్గంలోకి వస్తుంది. జూన్ 19న జరిగిన ఉప ఎన్నికలకు ముందు ఆమె ఈ ప్రాంతంలో రోడ్షో నిర్వహించారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా ఉన్న ఓవి అన్వర్ గెలుస్తారా లేదా? అనేది తేలనుంది.VIDEO | Ludhiana West bypoll: Counting of votes to begin at 8 AM at Khalsa College; visuals of security arrangements from the counting centre.(Full video available on PTI Videos - https://t.co/n147TvrpG7) pic.twitter.com/6WJb9VmNuE— Press Trust of India (@PTI_News) June 23, 2025బెంగాల్ బైపోల్నాడియా జిల్లా పరిధిలోకి వచ్చే బెంగాల్లోని కలిగంజ్ నియోజకవర్గంలో తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే నసీరుద్దీన్ అహ్మద్ మరణం కారణంగా ఉప ఎన్నిక జరిగింది. ఆయన కుమార్తె అలీఫా అహ్మద్ అధికార పార్టీ అభ్యర్థిగా ఆ స్థానాన్ని నిలుపుకోవాలని ఆశిస్తున్నారు. బీజేపీ నుంచి ఆశిష్ ఘోష్ను నిలబెట్టగా, కాంగ్రెస్ CPI(M) మద్దతుతో కబిల్ ఉద్దీన్ షేక్ పోటీలో ఉన్నారుఉ. కలిగంజ్ ఉప ఎన్నిక ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తృణమూల్, బీజేపీ మధ్య కీలకంగా మారనుంది.పంజాబ్లో త్రిముఖ పోరు.. పంజాబ్లోని లూథియానా వెస్ట్ స్థానంలో ఆప్కు చెందిన సంజీవ్ అరోరా, బీజేపీ జీవన్ గుప్తా, కాంగ్రెస్ భరత్ భూషణ్ అషు మధ్య త్రిముఖ పోటీ జరగనుంది. శిరోమణి అకాలీదళ్ ఉప ఎన్నికకు తన అభ్యర్థిగా పరూప్కర్ సింగ్ ఘుమాన్ను నిలబెట్టింది.#WATCH | Punjab: Security has been tightened outside Ludhiana's Khalsa College for Women, the counting centre for the Ludhiana West bypoll; counting of votes will begin at 8 am.The AAP fielded Rajya Sabha MP Sanjeev Arora from the seat. The BJP fielded its leader Jiwan Gupta… pic.twitter.com/Lr9mZawi1o— ANI (@ANI) June 23, 2025 -
ఇసుకను చూసి ఉప్పందిస్తారు!
డిటెక్టివ్ ‘షెర్లాక్ హోమ్స్’ పేరు మీరు వినే ఉంటారు. బ్రిటిష్ రచయిత సర్ ఆర్థర్ కానన్ డోయల్ సృష్టించిన పాత్ర అతడు. నేర పరిశోధనలో అతడిది డేగ దృష్టి! రాలిన వెంట్రుకలు, నేలపై పడి ఉన్న సిగరెట్ పీకలు, ఆఖరికి ఆ... నుసి నుంచి కూడా అతడు నేరస్థుడి జాడల్ని, నీడల్ని కనిపెట్టగలడు. ఆ డిటెక్టివ్ హెర్లాక్ హోమ్స్ని మించిన వారే... ‘పాగీ’లు! గుజరాత్లో, మూడు ఎడారి జిల్లాల సరిహద్దుల్లో నివసిస్తుండే ఈ పాగీలు... ఇసుకలో పాదముద్రలను బట్టి చొరబాటు దారుల వివరాలను చెప్పటంలో సిద్ధహస్తులు. మొన్నటి ‘ఆపరేషన్ సిందూర్’లో కూడా పాగీలు భారత సైన్యానికి సహాయపడ్డారు.అలా చెప్పేస్తారంతే! సరిహద్దుల్లో శత్రువు కదలికల్ని పసిగట్టేందుకు భారత్ దగ్గర అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉంది. హైటెక్ గాడ్జెట్స్ ఉన్నాయి. సైనికులు నిరంతరం మూడంచెలుగా గస్తీ కాస్తుంటారు. చీమ చిటుక్కున్నా మన తుపాకులు మేల్కొనే శాటిలైట్ వ్యవస్థ ఉంది. ఇవేమీ అవసరం లేకుండానే ‘పాగీ’లు తమ సహజ పరిశీలనా శక్తితో ఎడారిలో ఇసుక ముద్రల్ని డీకోడ్ చేసి సైన్యానికి ఉప్పందించగలరు. పాగీల దగ్గర వంశపారంపర్యంగా సంక్రమిస్తూ వస్తున్న ప్రాచీన అపరాధ పరిశోధనా నైపుణ్యం తప్ప, సాంకేతిక పరిజ్ఞానం ఉండదు. అయినా, ఇసుకపై ముద్రల్ని బట్టి అటువైపు ఎవరు నడిచారు, ఎంతమంది నడిచారు అన్నది విశ్లేషించి చెప్పేయగలరు. కాలం చెల్లినట్లుగా కనిపించే ఈ పాగీలు ఒక విధంగా ఇంటెలిజెన్స్ సిబ్బందికి దీటైనవారు.పేగుల్ని లెక్కపెట్టే వేగులుఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పోల్చి చూస్తే పాగీలు ఆదిమానవుల కింద లెక్క. కానీ ఈ మానవ ‘ట్రాకింగ్ వ్యవస్థలు’ ఎడారి చొరబాట్ల వివరాల విశ్లేషణల్లో అత్యంత విశ్వసనీయమైనవి. ఉదాహరణకు : సరిహద్దును ఎవరు దాటారు అన్నదొక్కటే కాకుండా, ఎంత మంది దాటారు? వారు ఏమి మోసుకెళ్లారు? వారి లక్ష్యం ఏమిటి? అన్నవి కూడా పాగీలు అంచనా వేయగలరు. మాదకద్రవ్యాల స్మగ్లర్ల కదలికలను కనిపెట్టటం దగ్గర్నుండి, పూర్తిస్థాయి యుద్ధాల సమయంలో సైనికులకు అత్యవసర సమాచారం అందించటం వరకు ఈ సరిహద్దు సంరక్షకులు దేశం ఎప్పుడు పిలిచినా వచ్చేందుకు సిద్ధంగా ఉంటారు. 1965, 1971లో పాకిస్తా¯Œ తో జరిగిన యుద్ధాలలో భారత సైన్యం శత్రు భూభాగాలలో చొచ్చుకు వెళ్లటానికి, శత్రువుల కదలికలను గుర్తించడానికి పాగీల నుండి కీలకమైన సహాయం తీసుకుంది. తరచు యుద్ధాల గమనాన్ని నిర్ణయించటంలో కూడా పాగీల భాగస్వామ్యం ఉంటుంది. మెడలిస్టులు కూడా ఉన్నారుబనస్కాంత, కచ్, పటాన్ జిల్లాల్లో ఉండే పాగీలు ఇటీవలి భారత్–పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో సైన్యానికి మళ్లీ కీలకం అయ్యారు. పారంపర్య జ్ఞానమే తప్ప, ఎలాంటి శిక్షణా ఉండని పాగీలు సాధారణ నేత్రాలకు కనిపించని ప్రమాద సూచనలను గుర్తించటంలో అత్యద్భుతమైన ప్రావీణ్యం గలవారు. బనస్కాంత జిల్లాలోని సుయిగామ్ తాలూకా, జలోయా గ్రామానికి చెందిన రేవాజీ రాథోడ్ ఇందుకొక నిదర్శనం. 1927లో జన్మించిన ఆయన 1962 ఆగస్టు 4న పాగీగా పోలీసు దళంలో చేరారు. సుయిగామ్, వావ్, ధనేరా సరిహద్దు ప్రాంతాల వెంబడి 28 ఏళ్లపాటు, రెండు యుద్ధాల సమయంలో భారత దళాలకు భూభాగాలపై మార్గ నిర్దేశం చేశారు. ఆ నైపుణ్యాలు ఆయనకు ‘సంగ్రామ్ మెడల్’ ‘వెస్ట్రన్ స్టార్’ పురస్కారాలతో సహా కీర్తి ప్రతిష్ఠల్ని, గుర్తింపును సంపాదించి పెట్టాయి. రంగంలోకి దూకేందుకు సిద్ధంగుజరాత్ సరిహద్దులో కొన్ని చోట్ల కంచె లేకపోయినప్పటికీ ఆ ప్రాంతాలు సురక్షితంగా ఉండటానికి ఒక కారణం.. పాగీల నిరంతర నిఘా. వారు కేవలం పాదముద్రలను గుర్తించడమే కాదు, వాటిని అర్థం చేసుకుంటారు కూడా. శత్రువు ఎలాంటి బూట్లు వేసుకున్నాడు, ఏ మార్కెట్లలో ఆ బూట్లు అమ్ముడవుతాయి, అలాగే – ఎంత బరువుతో వారి నడక సాగింది, ఆ వెళ్లినవారు స్త్రీలా, పురుషులా అనేది కూడా పాగీలు కనిపెడతారు. అవసరం అయిన వెంటనే భద్రతా దళాలకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్న 5–10 మంది శిక్షణ పొందిన పాగీలు, వారికి సహాయంగా ఉండే 20 మంది యువకుల బృందం ప్రస్తుతం సైన్యానికి అందుబాటులో ఉంది. ఇరవై ఐదు మందికి ఉద్యోగాలుకొంతమంది పాగీలను అధికారికంగా సైన్యంలోకి తీసుకున్నప్పటికీ, వారి సంఖ్య తక్కువగానే ఉంది. ‘‘వారు ట్రాకర్లు మాత్రమే కాదు, అపరాధ పరిశోధకులు కూడా..’’ అని గుజరాత్ పోలీసు సరిహద్దు పరిధి ఐజీపీ చిరాగ్ కొరాడియా అంటారు. ‘‘పాదముద్రలను బట్టి వారు ఒక వ్యక్తిని గుర్తించగలరు. వారిలో ఎవరైనా బరువులు మోస్తున్నారా, వారి వద్ద జంతువులు ఉన్నాయా అని కూడా తెలుసుకోగలరు. ఇంకా అనేక ఇతర వివరాలను అందించగలరు. 2013 హోమ్ శాఖ మార్గదర్శకాలను అనుసరించి 2014లో క్లాస్ 4 పే గ్రేడ్లో 25 మంది పాగీలను శాశ్వతంగా నియమించుకున్నాం’’ అని కొరాడియా తెలిపారు. యూనిఫాం ఉండని సైనికులుపాగీలు కేవలం చారిత్రక యోధులు కారు. వారి అవసరం నేటికీ కొనసాగుతోంది. కచ్కు చెందిన 70 ఏళ్ల పాగీ తేజ్మల్జీ సోధా 2001 – 2017 మధ్య సైన్యానికి సహాయంగా పనిచేశారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణానే కాక, అనేకానేక చొరబాట్లను గుర్తించడంలో కీలకంగా వ్యవహరించారు. ‘‘వారు ఎంత దూరం వెళ్లినా, నేను కచ్చితంగా ట్రాక్ చేయగలను..’’ అని ఆయన అంటారు. పాగీలు ఇప్పుడు తమకు గుర్తింపును, తగిన పరిహారాన్ని, తర్వాతి తరానికి శాశ్వతకాల ఉద్యోగాలను కోరుకుంటున్నారు. ‘‘మేము యూనిఫాం ధరించం. అయినప్పటికీ మాతృభూమిని కాపాడతాం’’ అని అంటున్నారు. ∙సాక్షి, స్పెషల్ డెస్క్ఫీల్డ్ మార్షల్ జనరల్ శామ్ మానెక్షాపాగీలలో అత్యంత పురాతన వ్యక్తులలో దివంగత రణ్ ఛోడ్ పాగి ఒకరు. ఆయన అసలు పేరు రణ్ ఛోడ్ రబారి. తన 100వ యేట వరకు ఆయన సేవలు అందిస్తూనే ఉన్నారు. యుద్ధాల సమయంలో భారత దళాలకు సహాయంగా ఉన్నారు. జనరల్ శామ్ మా¯ð క్షా స్వయంగా రణ్ ఛోడ్ సేవల్ని గుర్తించి 1971లో రూ. 300 వ్యక్తిగత నగదు బహుమతిని కూడా అందజేశారు. రణ్ ఛోడ్ పాగి 2013లో తన 112 ఏళ్ల వయసులో మరణించిన తర్వాత బి.ఎస్.ఎఫ్. ఆయన గౌరవార్థం బనస్కాంత ఔట్పోస్టులలో ఒకదానికి ఆయన పేరు పెట్టింది. -
అవినీతి అధికారుల్ని తిరిగి విధుల్లోకి తీసుకోవడమా?: సుప్రీం కోర్టు
అవినీతి కేసులో శిక్షలు పడ్డ ప్రభుత్వాధికారుల నిర్దోషిత్వం పైకోర్టుల్లో రుజువు అయ్యేదాకా తిరిగి విధుల్లోకి తీసుకోవడం సరికాదని దేశసర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. ఇది ప్రజల నమ్మకాన్ని దెబ్బతీయడం అవుతుందన్న సుప్రీం కోర్టు.. ఇలాంటి చర్యలు నిజాయితీపరులైన అధికారులను అవమానించడమే అవుతుందంటూ తీవ్ర వ్యాఖ్యలే చేసింది.కేసు ఏంటంటే.. గుజరాత్లోని ఒక రైల్వే ఇన్స్పెక్టర్ లంచం తీసుకున్నాడన్న కేసులో ట్రయల్ కోర్టు రెండు సంవత్సరాల శిక్ష విధించింది. అయితే దీనిపై ఆయన అప్పీల్కు వెళ్లగా.. గుజరాత్ హైకోర్టు ఆ శిక్షను సస్పెండ్ చేస్తూ ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. అయితే తన శిక్షను పూర్తిగా రద్దు చేయాలని స్టే కోరుతూ సదరు ఇన్స్పెక్టర్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు.పిటిషనర్ వాదనలు.. నేను లంచం తీసుకున్నట్లు ఎక్కడా ఆధారాలు చూపించలేకపోయారు. అయినా కింది కోర్టు మా వాదనలను పట్టించుకోకుండా శిక్ష వేసింది. ఉన్నత న్యాయస్థానం నాకు ఊరట ఇచ్చినప్పటికి శిక్షను రద్దు చేయలేదు. కాబట్టి నా శిక్షపై స్టే విధించి.. నన్ను తిరిగి విధుల్లోకి తీసుకునేలా ఆదేశాలు ఇవ్వండి.సుప్రీం కోర్టు(Supreme Court) ఏం చెప్పిందంటే.. గురువారం జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ ప్రసన్న బీ వరాలేలతో కూడిన బెంచ్ ఆ రైల్వే ఇన్స్పెక్టర్ పిటిషన్పై విచారణ జరిపింది. ఈ క్రమంలో ధర్మాసనం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ‘‘ప్రజల నమ్మకమే పాలనా వ్యవస్థకు మూలాధారం. అవినీతికి లోనైన ప్రభుత్వ అధికారిని అన్ని న్యాయ ప్రక్రియలు పూర్తయ్యే వరకు ఉద్యోగంలోకి తిరిగి అనుమతించడం ఆ నమ్మకాన్నే దెబ్బతీస్తుంది. కోర్టులో దోషులుగా తేలిన అధికారులను.. తిరిగి విధుల్లోకి తీసుకోవడం వ్యవస్థ మూలాలను బలహీనపరుస్తుంది. పైగా ఇలాంటి చర్యలు.. నిజాయితీ పరులైన అధికారులను అవమానించడమే అవుతుంది అని బెంచ్ వ్యాఖ్యానించింది.ఈ క్రమంలో.. కేసీ సరీన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు తీర్పును ప్రస్తావించింది. ‘‘ఒక ప్రభుత్వ అధికారి అవినీతి కేసులో దోషిగా తేలితే.. పైకోర్టుల్లో అతను నిర్దోషిగా తేలేంతవరకు విధుల్లోకి తీసుకోకూడదు. ఒకవేళ అతని/ఆమె అప్పీల్ పెండింగ్లో ఉన్నాసరే.. ఉద్యోగంలోకి తిరిగి అనుమతించకూడదు’’ అని ఈ కేసులో తీర్పు ఇచ్చింది. -
Air India crash: అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. దెబ్బతిన్న బ్లాక్ బాక్స్
సాక్షి,ఢిల్లీ: ఎయిరిండియా బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ (Air India Boeing 787-8 Dreamliner) విమాన ప్రమాదంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. జూన్ 12న గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్లో జరిగిన ఘోర విమాన ప్రమాదానికి గల కారణాల్ని వెలికి తీసే బ్లాక్ బాక్స్ దెబ్బతిన్నట్లు తెలుస్తోంది.అయితే, అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించి దెబ్బతిన్న బ్లాక్ బాక్స్ నుంచి వివరాల్ని సేకరించేందుకు కేంద్రం అమెరికాకు తరలించినట్లు సమాచారం. తాజా బ్లాక్ బాక్స్ పరిణామంపై కేంద్రం అధికారికంగా ప్రకటన చేయాల్సి ఉంది.ఏప్రిల్ 12న అహ్మదాబాద్ నుంచి ఎయిరిండియా 787 డ్రీమ్లైనర్ విమానం 242 మందితో లండన్ బయల్దేరింది. కానీ, ఆ విమానం నేల మీద నుంచి పైకి లేచిన కొన్ని సెకన్ల వ్యవధిలోనే ఘోరమైన తప్పు ఏదో జరిగింది. విమానంలో తీవ్ర ఇబ్బంది తలెత్తింది. అందులో నుంచి ఒక మేడే కాల్ వెళ్లింది. అంతలోనే రద్దీగా ఉండే మేఘానీనగర్ బీజే మెడికల్ కాలేజీ ప్రధాన క్యాంపస్పై కప్పు మీద ఆ విమానం కూలిపోయి (air india crash video) అగ్ని గుండంలా మారింది. విమానంలోని మృత్యుంజయుడు విశ్వాస్ కుమార్ రమేష్ తప్ప మిగిలిన వారందరినీ అగ్ని దహించివేసింది. ప్రమాద సమయంలో విమానంలో ప్రయాణిస్తున్న వారితో పాటు బీజే మెడికల్ కాలేజీ క్యాంపస్లో బాధితుల్ని కలుపుకొని మొత్తం 270 మంది మరణించినట్లు తెలుస్తోంది.ప్రమాదం తీవ్రత ఎక్కువగా ఉండడంతో వైద్యులు బాధిత కుటుంబ సభ్యుల డీఎన్ఏ ఆధారంగా మృతదేహాల్ని గుర్తిస్తున్నారు. ఘటనా స్థలంలో మృతదేహాలను డీఎన్ఏతో మ్యాచ్ చేసి చూస్తున్నారు. గుజరాత్ ప్రభుత్వ వైద్యులు మృతదేహాల్ని ఎనాలసిస్ చేసి మొత్తం 208 మృతదేహాల్ని గుర్తించారు. అలా ఇప్పటి వరకు (ఏప్రిల్ 18) ఉన్న సమాచారం ప్రకారం.. 170 మృతదేహాల్ని డీఎన్ఏతో గుర్తించారు. వారిలో యూకే, ఫోర్చుగల్,కెనడాతో పాటు ప్రమాదంలో మరణించిన మరో ఆరుగురు మృత దేహాల్ని వారి కుటుంబ సభ్యులకు అందించారు. -
నాలుగు రాష్ట్రాల్లో ముగిసిన ఉప ఎన్నికల పోలింగ్.. 23న ఫలితాలు..
Four states by polls Voting Updates..ముగిసిన పోలింగ్.. 23న ఫలితాలు.పంజాబ్, పశ్చిమ బెంగాల్, గుజరాత్, కేరళ రాష్ట్రాల్లో ఐదు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికల జరుగుతున్నాయి. ఉప ఎన్నికలకు పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఉప ఎన్నికలకు ఎన్డీయే కూటమి, ఇండియా మధ్య గట్టి పోటీ నెలకొంది. ఇక, ఐదు స్థానాలకు ఓట్ల లెక్కింపు జూన్ 23న జరుగుతుంది.పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది..ఉదయం 9 గంటల వరకు పోలింగ్ శాతం ఇలా.. Polling percentage till 9 am in Assembly by-polls: Visavadar: 12.10%, Kadi: 9.05%, Nilambur: 13.15%, Ludhiana West: 8.50% and Kaliganj: 10.83%Source: Election Commission of India pic.twitter.com/NyVcI3Kai1— ANI (@ANI) June 19, 2025ఉప ఎన్నికల్లో స్థానికులు, అభ్యర్థులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. #WATCH | Kerala | LDF candidate M. Swaraj casts vote in Nilambur by-election, at polling booth no. 202 of the Government LP School in Muthiri Mankuth, NilamburSwaraj states that voting is a citizen's right and urges everyone in the constituency to exercise their franchise. pic.twitter.com/3IhGv0BsXv— ANI (@ANI) June 19, 2025 పంజాబ్..లూథియానా (పశ్చిమ)లో, సిట్టింగ్ ఆప్ ఎమ్మెల్యే గురుప్రీత్ సింగ్ గోగి మరణం కారణంగా ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ అర్బన్ సీటుపై తన పట్టును నిలుపుకోవడానికి రాజ్యసభ ఎంపీ సంజీవ్ అరోరాను పోటీకి దింపింది. కాంగ్రెస్ నుండి భరత్ భూషణ్ ఆశు, బీజేపీ నుండి జీవన్ గుప్తా, శిరోమణి అకాలీదళ్ నుండి పరూప్కర్ సింగ్ ఘుమ్మాన్ పోటీలో ఉన్నారు.#WATCH | Ludhiana, Punjab | Congress candidate Bharat Bhushan Ashu casts his vote at booth number 72-76, Malwa Sr Secondary School, in Ludhiana West assembly by-pollHe says, "I have fulfilled my constitutional duty and appeal to the voters to do the same." pic.twitter.com/WBxrRVazZ0— ANI (@ANI) June 19, 2025పశ్చిమ బెంగాల్..పశ్చిమ బెంగాల్లో టీఎంసీ ఎమ్మెల్యే నసీరుద్దీన్ అహ్మద్ మరణం తరువాత కలిగంజ్లో ఉప ఎన్నిక జరుగుతోంది. మహిళలు, మైనారిటీ ఓటర్లను ఏకీకృతం చేసే లక్ష్యంతో అధికార తృణమూల్ కాంగ్రెస్ ఆయన కుమార్తె అలీఫా అహ్మద్ను పోటీకి దింపింది. బీజేపీ నుంచి ఆశిష్ ఘోష్ పోటీలో ఉన్నారు. కాంగ్రెస్-వామపక్ష కూటమి కబిల్ ఉద్దీన్ షేక్ను బరిలోకి దింపింది.#WATCH | West Bengal | Voting is underway at polling booth 171 in Nadia for the Kaliganj by-elections.TMC's Alifa Ahmed, BJP's Ashish Ghosh, and Congress' Kabil Uddin Shaikh are the candidates from the constituency. pic.twitter.com/gxKANa55DI— ANI (@ANI) June 19, 2025గుజరాత్లో త్రిముఖ పోరు..గుజరాత్లో కడి, విసావదర్లలో ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. కడిలో బీజేపీ ఎమ్మెల్యే కర్సన్భాయ్ సోలంకి మరణంతో ఆ స్థానం ఖాళీ అయింది. బీజేపీ నుంచి రాజేంద్ర చావ్డాను, కాంగ్రెస్ రమేష్ చావ్డాను, ఆప్ జగదీష్ చావ్డాను పోటీకి దింపింది. ఇక, విశావదర్ సిట్టింగ్ ఎమ్మెల్యే భయాని భూపేంద్రభాయ్ ఆప్కు రాజీనామా చేసి బీజేపీలో చేరారు. దీంతో, అక్కడ ఉప ఎన్నిక జరుగుతోంది. ఆ స్థానంలో బీజేపీ నుంచి కిరీట్ పటేల్ను, కాంగ్రెస్ నితిన్ రాన్పారియాను, ఆప్ గోపాల్ ఇటాలియాను పోటీకి దింపింది.Polling begins for the assembly by-elections in Kerala's Nilambur, Punjab's Ludhiana West, Kaliganj in West Bengal, and Visavadar and Kadi in Gujarat.The results will be declared on 23 June. pic.twitter.com/Wp2udg68ta— ANI (@ANI) June 19, 2025కేరళ..కేరళలో నీలంబూరులో ఉప ఎన్నిక జరుగుతోంది. కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే ఆర్యదన్ మొహమ్మద్ కుమారుడు ఆర్యదన్ షౌకత్ను పోటీకి దింపగా, అధికార ఎల్డిఎఫ్ ఎం. స్వరాజ్ను తమ అభ్యర్థిగా ప్రకటించింది. #WATCH | Kerala: Voting begins at polling booth number 184, at Govt Lower Primary School, Veettikkuth, in the Nilambur assembly by-electionLDF has fielded M Swaraj, UDF has fielded Aryadan Shoukath, while BJP has fielded Adv. Mohan George as candidates pic.twitter.com/YGQJxyClKJ— ANI (@ANI) June 19, 2025 -
ఎయిరిండియా ఘటన: అయ్యో! ప్రాణాల కోసం..
దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిన ఎయిరిండియా బోయింగ్ 787–8 డ్రీమ్లైనర్ (వీటీ–ఏఎన్బీ) 171 విమాన ప్రమాదం దుర్ఘటనలో భయానక దృశ్యాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. జూన్ 12న మేఘానీ నగర్ బీజే మెడికల్ కాలేజీకి చెందిన ఐదంతస్తుల భవనాన్ని ఎయిరిండియా విమానం ఢీ కొట్టింది. ఈ ఘటన జరిగే సమయంలో విమాన ప్రమాద భయం నుంచి తప్పించుకునేందుకు మెడికల్ కాలేజీ క్యాంపస్లోని మూడో అంతస్తునుంచి విద్యార్థులు కిందకి దూకి తప్పించుకుంటున్న దృశ్యాలు ఇప్పుడు నెట్టింటకు చేరాయి. బీజే మెడికల్ కాలేజీ భవనాన్ని ఎయిరిండియా విమానం ఢీకొన్నాక వెలువడిన దిక్కులు పిక్కటిల్లే శబ్దంతో మూడో భవనంలో ఉన్న విద్యార్థులు ప్రాణ భయంతో హాస్టల్ బాల్కనీ నుంచి కిందకి దూకారు. తమ ప్రాణాల్ని రక్షించుకునే ప్రయత్నం చేశారు.మెస్లో భోజనం చేస్తుండగా ఎయిరిండియా విమానం ఢీ కొట్టడంతో.. అప్రమత్తమైన విద్యార్థులు హాస్టల్ బాల్కనీ నుంచి బెడ్ షీట్లను వేలాదీస్తూ కిందకు దూకి ప్రాణాల్ని రక్షించుకునే భయనక దృశ్యాలు ప్రమాద తీవ్రతను గుర్తు చేస్తున్నాయి. A distressing video has emerged showing medical students at BJ Medical College hostel in #Ahmedabad desperately jumping from balconies to escape following the catastrophic Air India #planecrash crash on June 12!!Although no media is highlighting this..#MedTwitter pic.twitter.com/iBAqn8xngc— Indian Doctor🇮🇳 (@Indian__doctor) June 17, 2025మాటలకందని పెనువిషాదం. భారత విమానయాన చరిత్రలోనే అత్యంత దారుణమైన ఘటన. గత గురువారం గుజరాత్లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. 230 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బందితో అహ్మదాబాద్లోని సర్దార్ వల్లబాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మధ్యాహ్నం 1.39 గంటలకు లండన్ బయల్దేరిన ఎయిరిండియా బోయింగ్ 787–8 డ్రీమ్లైనర్ ఏఐ171 విమానం టేకాఫైన 39 సెకన్లలోనే కుప్పకూలింది.కేవలం 625 అడుగుల ఎత్తుకు వెళ్లగానే విమానంలో అనూహ్య సమస్య తలెత్తింది. దాంతో అది శరవేగంగా కిందికి దూసుకొచ్చింది. చూస్తుండగానే రన్వే సమీపంలో మేఘానీనగర్లోని బీజే మెడికల్ కాలేజీ, సిటీ సివిల్ హాస్పిటల్ సముదాయంపై పడి ఒక్కసారిగా పేలిపోయింది. ఒళ్లు గగుర్పొడిచే ఈ దారుణంలో విమాన ప్రయాణికుల్లో ఒక్కరు మినహా 241 మందీ దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా ఉన్నారు.230 మంది ప్రయాణికుల్లో 169 మంది భారతీయులు కాగా 53 మంది బ్రిటన్వాసులు, ఏడుగురు పోర్చుగల్వాసులు, ఒకరు కెనడా పౌరుడు. వీరితో పాటు ఇద్దరు పైలట్లు, 10 మంది సిబ్బంది ఉన్నారు. బ్రిటన్లో స్థిరపడ్డ రమేశ్ విశ్వాస్కుమార్ బుచర్వాడ (38) అనే ప్రయాణికుడు గాయాలతో బయటపడి ఆస్పత్రిలో కోలుకుంటున్నారు. విమానం తొలుత మెడికల్ కాలేజీ క్యాంటీన్పై పడి పేలిపోయింది.ముక్కలై మంటల్లో కాలిపోతూనే పక్కనున్న బాయ్స్ హాస్టల్ భవనంపైకి దూసుకెళ్లింది. దాంతో రెండు భవనాలూ తీవ్రంగా ధ్వంసమయ్యాయి. వాటితో పాటు పరిసరాల్లోని పలు బహుళ అంతస్తుల భవనాలు కూడా మంటలంటుకుని కాలిపోయాయి. ప్రమాద సమయంలో క్యాంటీన్లో చాలామంది వైద్య విద్యార్థులు, రెసిడెంట్ డాక్టర్లు మధ్యాహ్న భోజనం చేస్తున్నారు. వారితో పాటు హాస్టల్వాసుల్లో కూడా పలువురు ప్రమాదంలో గాయపడ్డారు.వారిలో కనీసం 25 మంది మరణించినట్టు చెబుతున్నారు! ఒక వైద్యుడు, నలుగురు ఎంబీబీఎస్ విద్యార్థులు, వైద్యుని భార్య మృతిని ఆస్పత్రి వర్గాలు ధ్రువీకరించాయి. ‘‘60 మందికి పైగా వైద్యులు, వైద్య విద్యార్థులు గాయపడ్డారు. వారిలో 19 మందికి తీవ్ర గాయాలయ్యాయి’’ అని ఫెడరేషన్ ఆఫ్ ఆలిండియా మెడికల్ అసోసియేషన్ పేర్కొంది. -
విశ్వాస్ కుమార్ రమేష్ నిజంగా మృత్యుంజయుడే.. మరో వీడియోలో
గాంధీ నగర్: అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో మృత్యుంజయుడిగా నిలిచిన ఏకైక వ్యక్తి విశ్వాస్ కుమార్ రమేష్కు చెందిన మరో వీడియో వైరల్గా మారింది. తాజాగా, వెలుగులోకి వచ్చిన వీడియోలో బీజే మెడికల్ కాలేజీ క్యాంపస్ బిల్డింగ్ను ఎయిరిండియా విమానం ఢీకొట్టడంతో అగ్నికిలలు ఎగిసిపడున్నాయి. ఆ ప్రాంతాన్ని పొగ కమ్మేసింది. ఏదో అద్భుతం జరిగినట్లుగా అగ్నికోళం బద్దలైనప్పుడు మంటలు ఏ విధంగా ఎగిసిపడతాయో.. ఆ విధంగా మంటలు ఎగిసిపడుతున్నా 11ఏ సీటులో కూర్చున్న రమేష్, బీజే మెడికల్ కాలేజ్ క్యాంపస్ నుండి బయటకు వస్తూ కనిపిస్తున్న దృశ్యాల్ని మనం చూడొచ్చు. అక్కడ ఉన్న ఒక వ్యక్తి అతన్ని గమనించి, అతని చెయ్యి పట్టుకుని ప్రమాదం స్థలం నుంచి దూరంగా తీసుకెళ్లాడు.జూన్ 12న అహ్మదాబాద్లోని బీజే మెడికల్ కాలేజీ క్యాంపస్ బిల్డింగ్ను ఎయిరిండియా బోయింగ్ 787 డ్రీమ్లైనర్ ఢీకొట్టింది. ఈపెను విషాదంలో విమానంలో ప్రయాణిస్తున్న 242మందిలో మృత్యుంజయుడు ఒక్కడే సురక్షితంగా బయటపడ్డాడు.తాజా సమాచారం మేరకు ప్రమాద సమయంలో విమానంలో ప్రయాణిస్తున్న 241 మంది, మెడికల్ కాలేజీ క్యాంపస్ బాధితులతో కలుపుకొని మొత్తం 270 మంది మరణించినట్లు తెలుస్తోంది.ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండడతో మృతదేహాల్ని గుర్తు పట్టలేని విధంగా ఉన్నాయి. బాధితుల కుటుంబ సభ్యుల డీఎన్ఏల ఆధారంగా మృతదేహాల్ని గుర్తిస్తున్నారు. Unbelievable! New video of lone survivor, Viswashkumar Ramesh has emerged, showing him walking out from the crash site.He is seen wearing a white t-shirt and holding his phone in left hand.#AirIndia #AhmedabadPlaneCrash pic.twitter.com/xV83t2yjGX— Ishani K (@IshaniKrishnaa) June 16, 2025 -
లైకులు, వ్యూస్ కోసం ఇంత దిగజారాలా?
ఒకవైపు.. ఘోర ప్రమాదంలో అయినవాళ్లను కోల్పోయి పుట్టెడు దుఖంలో బాధిత కుటుంబాలు రోదిస్తున్నాయి. డీఎన్ఏ పరీక్షలు పూర్తి కాకపోవడంతో మృతదేహాల కోసం బీజే మెడికల్ కాలేజీ ఆస్పత్రి వద్ద పడిగాపులు కాస్తున్నాయి. ఈలోపు.. సోషల్ మీడియాలో లైక్స్, వ్యూస్ కోసం కొందరు దిగజారి ప్రవర్తిస్తున్నారు. మృతుల గురించి తప్పుడు సమాచారాన్ని పోస్ట్ చేస్తున్నారు. ఈ పరిణామాలపై బాధిత కుటుంబాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.కొమ్మి వ్యాస్.. తన భార్య, ముగ్గురు పిల్లలతో లండన్లో స్థిరపడేందుకు ఎయిరిండియా విమానం ఎక్కడిన డాక్టర్. అయితే అహ్మదాబాద్ ఎయిరిండియా ప్రమాదంలో ఆ కుటుంబం మొత్తం దుర్మరణం పాలైంది. ఇప్పుడు.. ఆ ఫ్యామిలీని బద్నాం చేస్తూ కొన్ని ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. విమానం ఎక్కిన తర్వాత ఫ్యామిలీ ఫొటోను వ్యాస్ తన కుటుంబానికి చెందిన వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ చేశారు. అయితే ఆ ఫొటోను ఏఐ వీడియోగా కొందరు వైరల్ చేస్తున్నారు. మరికొందరు.. ఒక అడుగు ముందుకు వేసి వ్యాస్ కూతురు మిరాయ ఫొటోను, ఓ వీడియోను తెరపైకి తీసుకొచ్చారు. ‘‘మా కుటుంబాన్ని కోల్పోయామన్న బాధలో మేముంటే.. కొందరు విలువలు మరిచి ప్రవర్తిస్తున్నారు. ఎడిట్ చేసిన వీడియోను వైరల్ చేస్తున్నారు. మా పాప మిరాయ్ ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. డీఎన్ఏ టెస్టులో ఏ మృతదేహం అనేది దృవీకరణ కాలేదు. కానీ.. ఈలోపే మిరాయ్ అంత్యక్రియలంటూ భావోద్వేగం పేరిట ఓ వీడియోను పోస్ట్ చేసి కొందరు వ్యూస్ కోసం ప్రయత్నిస్తున్నారు. ఇలాగేనా చేసేది?’’ అంటూ వ్యాస్ కుల్దీప్ భట్ ఆవేదన-అసహనం వ్యక్తం చేశారు. వ్యాస్ కుటుంబం మాత్రమే కాదు.. బాధిత కుటుంబాలు చాలా వరకు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఇలాంటి కంటెంట్ను ఖండిస్తోంది. సంబంధం లేని వీడియోలు, కంటెంట్ను తెర మీదకు తీసుకొచ్చి షేర్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘‘ప్రమాదం జరిగిన నాటి నుంచే ఇలాంటి కంటెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎక్కడెక్కడివో వీడియోలను తెచ్చి.. ఎయిరిండియా విమానంలోవి అంటూ పోస్టులు పెడుతున్నారు. మా వాళ్లకు ఏమాత్రం సంబంధం లేని పోస్టులు ఇన్స్టాగ్రామ్, ఎక్స్(ట్విటర్)లలో కనిపిస్తున్నాయి. వీటి ఆధారంగా మీడియా సంస్థలు కూడా వార్తలు ప్రచురిస్తున్నాయి. అసలేం చేస్తున్నారు?. ఇలాంటి విషాద సమయంలోనూ కనీస నైతిక విలువలు పాటించరా?’’ అని కొందరు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు విమాన ప్రమాదంపైనా జోకులు, మీమ్స్ వేస్తున్న పరిస్థితి. ఈ తరుణంలో.. ప్రభుత్వాలైన స్పందించి అలాంటి కంటెంట్ను కట్టడి చేయాలని కోరుతున్నారు మరికొందరు. -
Air India plane crash: భార్య చెప్పిందని.. ప్రమాదం నుంచి తప్పించుకున్న వైద్యుడు
న్యూఢిల్లీ: అహ్మదాబాద్ విమాన ప్రమాదం నుంచి తప్పించుకున్న గుజరాత్కు చెందిన ఒక వైద్యుడు తన భార్య, కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు చెబుతున్నాడు. ఇంటిలోనివారి మాట కాదని, ఒకవేళ అతను ఎయిర్ ఇండియా బోయింగ్ 787-8 డ్రీమ్లైనర్ విమానంలో ప్రయాణించి ఉంటే, ఇప్పుడు మన మధ్య ఉండేవాడు కాదు.ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కూలిపోయింది. ఈ ప్రమాదంలో విమానంలోని 241 మంది మృతిచెందారు. గుజరాత్కు చెందిన డాక్టర్ ఉమాంగ్ పటేల్ తన భార్య, కుమారులతో పాటు మే 24న గుజరాత్లోని మహిసాగర్కు వచ్చారు. భారతదేశంలో తన కుటుంబాన్ని ఉంచి, జూన్ 12న బ్రిటన్లోని నార్తాంప్టన్కు తిరిగి వెళ్లాలని ఆయన అనుకున్నారు. (Air India Plane Crash: నా భర్త కనిపించడం లేదు : ఫిల్మ్ మేకర్ భార్య)‘నేను జూన్ 12న ఒక్కడినే లండన్ వెళ్లవలసి ఉంది. అయితే జూన్ 9న నాకు తీవ్ర జ్వరం వచ్చింది. మరుసటి రోజు ఉదయానికి జ్వరం మరింతగా పెరిగింది. నా ఆరోగ్యంపై ఆందోళన చెందిన నా భార్య.. జూన్ 12న బుక్ చేసుకున్న విమానం టికెట్ను రద్దు చేసుకుని, ఆరోగ్యం కుదుటపడేవరకూ ఇక్కడే ఉండమని కోరింది. దీంతో నేను విమానం టిక్కెట్ రద్దు చేసుకున్నాను. తరువాత జూన్ 15కి తిరిగి టికెట్ బుక్ చేసుకున్నాను. ఇప్పుడు విమాన ప్రమాద వార్త వినగానే దిగ్భ్రాంతికి లోనయ్యాను. ఆ దేవుడే నన్ను కాపాడాడు. విమాన ప్రమాదంలో మరణించినవారికి భగవంతుడు శాంతిని ప్రసాదించాలని కోరుకుంటున్నాను’ అని డాక్టర్ ఉమాంగ్ పటేల్ అన్నారు. ఆయన గత ఐదేళ్లుగా నార్తాంప్టన్లో నివాసం ఉంటున్నారు.ఇది కూడా చదవండి: పాక్ ముస్లిం లీగ్.. జైరామ్ రమేష్ ఒక్కటే: బీజేపీ ఘాటు విమర్శ -
చలో గుజరాత్
హీరో నాగచైతన్య గుజరాత్ వెళ్లనున్నారట. నాగచైతన్య హీరోగా కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో ఓ మిస్టిక్ థ్రిల్లర్ మూవీ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో మీనాక్షీ చౌదరి హీరోయిన్. ఇటీవల హైదరాబాద్లో ఈ సినిమాకు చెందిన భారీ షెడ్యూల్ చిత్రీకరణ జరిగింది. ఓ ప్రముఖ స్టూడియోలో గుహ సెట్ వేసి, నాగచైతన్య పాల్గొనగా కీలక సన్నివేశాలను చిత్రీకరించారు.కాగా ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్ ఈ నెల చివరి వారంలో గుజరాత్లోప్రారంభం కానుందని, నాగచైతన్యతో పాటు ప్రధాన తారాగణం పాల్గొనగా మేకర్స్ కీలక సన్నివేశాల చిత్రీకరణను ప్లాన్ చేశారని సమాచారం. బాపినీడు సమర్పణలో బీవీఎస్ఎన్ ప్రసాద్, బి. సుకుమార్ నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది వేసవిలో రిలీజ్ కానుంది. -
గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ మృతదేహం గుర్తింపు
-
AI 171 plane crash : కన్నీరుమున్నీరవుతున్న వైద్యుడి వీడియో వైరల్
అహ్మదాబాద్ (గుజరాత్): సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో జరిగిన విధ్వంసకర AI 171 విమాన ప్రమాదం తర్వాత, ప్రాణాలతో బయటపడిన విద్యార్థులు, ప్రొఫెసర్లు, సిబ్బంది , కుటుంబ సభ్యులులను శుక్రవారం BJమెడికల్ కాలేజీ వైద్యుల హాస్టల్ ప్రాంగణం నుండి ఖాళీ చేయిస్తున్నారు. ఈ దృశ్యాలు ఆన్లైన్లో వైరల్గా మారాయి ఈ సందర్భంగా ముఖ్యంగా డా. అనిల్ వీడియో నెట్టింట తెగ వైరలవుతోంది. తమను ఇప్పటికిపుడు ఇళ్లు ఖాళీ చేయాల్సిందిగా మాండేటరీ ఆదేశాలిచ్చారు, రెండు మూడు రోజులు సమయం ఇవ్వండి, మానవత్వం చూపండిఅంటూ భావోద్వేగానికి గురి అవుతున్న వీడియో సంచలనంగా మారింది. మీడియాతో మాట్లాడుతూ ఈ ప్రదేశాన్ని ఖాళీ చేసేందుకు తమకు కొంత సమయం ఇవ్వాలని కోరారు. తన కుమార్తె, తన ఇంట్లో సహాయకురాలు ఈ ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్నారని, వారికి తనసాయం అవసరం అంటూ కంటతడి పెట్టారు. తన భార్య లేదని, చాలా నిస్సహాయంగా ఉన్నానంటూ భోరున విలపించారు. ఈ విషయాన్ని పై అధికారుల దృష్టికి తీసుకెళ్లాల్సిందిగా కోరుతూ కన్నీంటి పర్యంత మయ్యారు. ఇదీ చదవండి: Air India Plane Crash బోయింగ్ 787 డ్రీమ్లైనర్పై ఆరోపణలు: ఇంత విషాదం ఇపుడే! View this post on Instagram A post shared by Vinay Sharma (@vinayshaarma)> కాగా 242 మంది ప్రయాణికులతో అహ్మదాబాద్ నుండి లండన్ గాట్విక్కు వెళ్లే ఎయిర్ ఇండియా బోయింగ్ 787-8 డ్రీమ్లైనర్ సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి బయలుదేరిన కొద్దిసేపటికే మేఘనినగర్ ప్రాంతంలో బీజే మెడికల్ కాలేజీపై కూలిపోయింది. ఈ సందర్బంగా మధ్యాహ్నం లంచ్కోసం వచ్చిన విద్యార్థులు కూడా కొంతమంది మరణించిన సంగతి తెలిసిందే. -
Updates: ఎయిరిండియా కీలక నిర్ణయం
అహ్మదాబాద్ ఎయిరిండియా విమాన ప్రమాదం ఘటనకు సంబంధించిన దర్యాప్తు వేగం పెరిగింది. డీజీసీఏతో పాటు దర్యాప్తు సంస్థలు ప్రమాద స్థలికి చేరుకుని పరిశీలనలు జరుపుతున్నాయి. ఈ నేపథ్యంలో విమాన శకలాలను తొలగించకూడదని గుజరాత్ పోలీసులకు ఆదేశాలు వెళ్లాయి. దీంతో క్లీనియంగ్ ప్రక్రియకు అంతరాయం ఏర్పడింది.AI-171 విమానం నుంచి చివరి సందేశంవిమానంలో పవర్ కట్ అయిందని..కిందకి పడిపోతున్నట్టు మెసేజ్ఎయిర్ ఇండియా విమానం నుంచి ఏటీసీకి మేడే కాల్లో ఆడియోవిమానంలో పవర్ కోల్పోయామని ఏటీసీకి వెల్లడించిన కెప్టెన్ సుమిత్ సబర్వాల్ ఐదు సెకన్ల ఆడియో మేడే.. మేడే.. మేడే.. నో పవర్.. నో థ్రస్ట్.. గోయింగ్ డౌన్ అని చెప్పిన కెప్టెన్ సబర్వాల్ఏటీసీ వద్ద రికార్డయిన ఐదు సెకన్ల ఆడియోఎయిరిండియా కీలక నిర్ణయంఅహ్మాదాబాద్ విమాన ప్రమాద నేపథ్యంలో ఎయిరిండియా కీలక నిర్ణయంవిమానంలో ప్రయాణిస్తున్నన 241 మంది దుర్మరణంభవనంపై విమానం కూలి మెడికోలు, ఇతరులు మృతిమొత్తం మృతుల సంఖ్య 274ఇక నుంచి ఏఐ-171 విమాన సర్వీస్ నిలిపివేతదానికి బదులు ఎయిరిండియా- 159 విమానంఇక నుంచి లండన్కు వెళ్లనున్న ఏఐ-159 సర్వీస్ విమానం ప్రమాదంపై విచారణ జరుగుతోంది: రామ్మోహన్నాయుడుఅహ్మదాబాద్ విమాన ప్రమాదంపై పౌర విమానయాన శాఖ జరిపిన సమీక్ష వివరాలు వెల్లడించిన కేంద్ర మంత్రి రామ్మోహన్నాయుడుపైలట్ మే డే కాల్ చేశారుఎయిరిండియా విమానం టేకాఫ్ అయిన కొన్ని సెకన్లకే ప్రమాదం జరిగిందిఅహ్మదాబాద్ ఎయిర్పోర్టుకు రెండు కిలోమీటర్ల దూరంలోనే ప్రమాదం జరిగిందిరెస్క్యూ ఆపరేషన్కు గుజరాత్ ప్రభుత్వం పూర్తిగా సహకరించిందిబ్లాక్ బాక్స్ దొరికింది.. డీకోడ్ చేస్తున్నారుబ్లాక్ బాక్స్ విశ్లేషణ ద్వారా ఏం జరిగిందనేది తెలుస్తుందిహైలెవల్ కమిటీతో ప్రమాదంపై దర్యాప్తు జరుగుతోందినివేదిక వచ్చాకే బాధ్యులపై చర్యలు ఉంటాయివిమాన ప్రమాదంపై ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోంది787 సిరీస్ను తరచూ తనిఖీలు చేయాలని ఆదేశాలిచ్చాండీఎన్ఏ పరీక్షలు పూర్తైన వెంటనే మృతదేహాలను బంధువులకు అప్పగిస్తాంపౌర విమానయాన శాఖ సమీక్ష వివరాలు వెల్లడిఎయిరిండియా విమాన ప్రమాదంపై పౌరవిమానయాన శాఖ సమీక్షవివరాలు వెల్లడించిన సివిల్ ఏవియేషన్ అధికారులుAircraft Accident Investigation Bureau (AAIB) దర్యాప్తు కొనసాగుతోందని తెలిపిన అధికారులువిమానం 650 అడుగుల ఎత్తు ఎగిరాక కూలిపోయిందిపైలట్ చివరిసారిగా మే డే కాల్ అన్నారుఆ తర్వాత ఎలాంటి సిగ్నల్ అందలేదుమూడు నెలల్లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించాంరంగంలోకి ఎన్ఐఏఅహ్మదాబాద్ విమాన ప్రమాద స్థలికి జాతీయ దర్యాప్తు సంస్థకుట్ర కోణం నేపథ్యంతో విచారణ జరుపుతున్న ఎన్ఐఏక్షుణ్ణంగా పరిశీలనలు జరుపుతున్న బృందంబోయింగ్ ట్రాజెడీ పాపం ఎవరిది?తనిఖీ, నిర్వహణ లోపమే కారణమా?డీజీసీఏ హెచ్చరికలను ఎయిరిండియా పట్టించుకోలేదా? వైమానిక ఇంధనం కలుషితం అయ్యిందా? ఎందుకు గాల్లో ఎగరలేక పోయింది? టేకాఫ్ సెట్టింగుల్లో లోపం, పైలట్ తప్పిదమే కారణం?ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి అంతు చిక్కడం లేదా? దర్యాప్తులో తేలాల్సిన విషయాలెన్నోక్లిక్ చేయండి: రెండు ఇంజన్లు విఫలమవడం అత్యంత అసాధారణం! అహ్మదాబాద్ ప్రమాద ఘటన.. మరికాసేపట్లో పౌర విమానయాన శాఖ సమీక్షకీలకంగా డిజిటల్ ఆధారాలుఅహ్మదాబాద్ విమాన ప్రమాదంపై కొనసాగుతున్న దర్యాప్తుభవన శిథిలాల నుంచి ఇప్పటికే బ్లాక్ బాక్స్ స్వాధీనంబ్లాక్ బాక్స్ విశ్లేషిస్తే ప్రమాదానికి స్పష్టమైన కారణాలు తెలిసే అవకాశండిజిటల్ వీడియో రికార్డర్ను స్వాధీనం చేసుకున్న గుజరాత్ ఏటీఎస్ ఫోరెన్సిక్స్ సైన్స్ ల్యాబ్కు డీవీఆర్ను పంపిన అధికారులుబోయింగ్ ట్రాజెడీ ఫైల్స్అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై కొనసాగుతున్న దర్యాప్తుప్రాథమికంగా.. ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ కమిటీ దర్యాప్తుకేంద్రం తరఫున.. నిపుణులతో హైలెవల్ కమిటీ దర్యాప్తుడీజీసీఏ విచారణ కూడాభారత్లో బోయింగ్ విమానాల తనిఖీలుప్రత్యేక అడిటింగ్కు ఆదేశించిన కేంద్రం👉ప్రమాదంలో విమానంలో ఉన్నవాళ్లతో పాటు.. విమానం నేరుగా బీజే మెడికల్ కాలేజీ హాస్టల్ భవనంపై కూలడంతో అందులోని వాళ్లు కూడా మరణించారు. దర్యాప్తు నేపథ్యంలో మెడికల్ కాలేజీ భవనాన్ని అధికారులు ఖాళీ చేయించారు. 👉ఎయిరిండియా బోయింగ్ విమాన ప్రమాదంలో మృతుల సంఖ్య శనివారం ఉదయానికి 274కి చేరింది. 👉విమానంలో సిబ్బందితో సహా 242 మంది ఉండగా.. 241 మంది మరణించారు. విమానంలో ఒకే ఒక్క ప్రయాణికుడు ప్రాణాలతో బయటపడిన సంగతి తెలిసిందే. క్షతగాత్రుడు రమేష్ను ప్రధాని మోదీ సైతం పరామర్శించారు. 👉గురువారం మధ్యాహ్నాం ఎయిరిండియా బోయింగ్ 787 డ్రీమ్లైనర్ విమానం (AI171) అహ్మదాబాద్ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎయిర్పోర్టు నుంచి లండన్ గాట్విక్ వెళ్తుండగా.. టేకాఫ్ అయిన కొద్ది సెకన్లకే మెఘాని ప్రాంతంలో జనావాసాలపై కుప్పకూలిపోయింది. 👉మే డే కాల్ ఇచ్చిన పైలట్ ఆ వెంటనే విమానాన్ని క్రాష్ ల్యాండ్ చేశారు. ఆ ధాటికి విమానం భారీ శబ్దం చేస్తూ పేలిపోగా.. 1000 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ధాటికి ప్రయాణికులు ఖాళీ మసైపోయారు. 👉ప్రయాణికులతో పాటు జనావాసాలపై కుప్పకూలడంతో మృతుల సంఖ్య మరింత పెరిగింది👉విమాన ప్రమాదం ఎందుకు జరిగిందనేదానిపై కొనసాగుతున్న విచారణ -
ఎయిరిండియా పెను విషాదం.. డీజీసీఏ కీలక నిర్ణయం
సాక్షి,ఢిల్లీ: ఎయిరిండియా బోయింగ్ 787-8 విమాన ప్రమాదంతో భారత పౌర విమానయాన నియంత్రణ సంస్థ (డీజీసీఏ) కీలక నిర్ణయం తీసుకుంది. తక్షణమే ఎయిర్లైన్స్ డ్రీమ్లైనర్ విమానాల్లో తనిఖీలు చేపట్టాలని సూచించింది. ముఖ్యంగా బోయింగ్ విమానాల్లోని 787 విమానాల్ని పరిశీలించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. బోయింగ్ విమానాల్ని పరిశీలించిన వెంటనే నివేదిక ఇవ్వాలని స్పష్టం చేసింది. గురువారం గుజరాత్లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. 230 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బందితో అహ్మదాబాద్లోని సర్దార్ వల్లబాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మధ్యాహ్నం 1.39 గంటలకు లండన్ బయల్దేరిన ఎయిరిండియా బోయింగ్ 787–8 డ్రీమ్లైనర్ ఏఐ171 విమానం టేకాఫైన 39 సెకన్లలోనే కుప్పకూలింది. వందల మందిలో ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటన తర్వాతే డీజీసీఏ తక్షణ చర్యలకు ఉపక్రమించింది. In light of the AI-171 accident on 12.06.2025, DGCA issues directives to Air India to carry out additional maintenance actions on B787-8/9 aircraft equipped with Genx engines with immediate effect.@RamMNK @mohol_murlidhar @dgca pic.twitter.com/L8YCJ1FVVT— MoCA_GoI (@MoCA_GoI) June 13, 2025 -
ఎయిరిండియా విమాన ప్రమాదం.. సీసీ కెమెరాలో భయంకర దృశ్యాలు
సాక్షి,ఢిల్లీ: ఎయిరిండియా విమానం పెను ప్రమాదంలో మరో నలుగురు మెడికోలు మృతి చెందారు. రాకేష్,ఆర్యన్,మనవ్ జయ్ ప్రకాష్లు మరణించినట్లు అధికారులు ప్రకటించారు.దీంతో ఎయిరిండియా విమానం కూలడంతో బీజే మెడికల్ కాలేజీలో మరణాల సంఖ్య 28కి చేరింది. అయితే, ఈ ప్రమాదం జరిగే సమయంలో మెడికల్ కాలేజీ ముందున్న సీసీ కెమెరాలో భయంకరమైన దృశ్యాలు రికార్డయ్యాయి. ఆ దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. గుజరాత్లోని అహ్మదాబాద్ నుంచి లండన్కు బయల్దేరిన ఎయిరిండియా బోయింగ్ 787-8 డ్రీమ్లైనర్ విమానం గురవారం కుప్పకూలి మంటల్లో దగ్ధమైంది. ఎయిర్పోర్టు నుంచి మధ్యాహ్నం 1.38 గంటలకు టేకాఫ్ అయిన క్షణాల్లో అందరూ చూస్తుండగానే మేఘానీనగర్లో బీజే మెడికల్ కాలేజీ బిల్డింగ్పై కుప్పకూలింది. విమమానం కూలిపోవడంతో మంటలు చెలరేగాయి. దట్టంగా పొగ అలుముకుంది. ఈ దుర్ఘటనలో విమానంలో ప్రయాణిస్తున్న 242 మందిలో ఒక్కరే బ్రతికారు.బీజే మెడికల్ కాలేజీ హాస్టల్లో 24మంది మృతి చెందారు. శుక్రవారం మధ్యాహ్నం మరో నలుగురు విద్యార్ధులు మరణించారు.మరోవైపు తాజాగా ఎయిరిండియా విమానం బీజేపీ మెడికల్ కాలేజీపై కూలిన సమయంలో దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. ఆ దృశ్యాలు మెడికల్ కాలేజీ హాస్టల్ ముందు ఉన్న భవనం సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.ఆ సీసీ టీవీ ఫుటేజీల్లో విమానం కూలినప్పుడు విమాన శకలాలు చెల్లాచెదురుగా పడ్డాయి. అణు బీభత్సం ఎలా ఉంటుందో.. విమానం కూలే సమయంలో అంతే ప్రమాద స్థాయి కనిపించింది. దట్టంగా పొగ కమ్ముకుంది. స్థానికంగా పార్క్ చేసిన కార్లు ధ్వంసమయ్యాయి. ఆ ప్రాంతమంతా బీతావాహ పరిస్థితి నెలకొంది. ఇక హాస్టల్ భవనంపై విమానం కూలిపోవడంతో లోపల వైద్య విద్యార్థులు ప్రాణ భయంతో పరుగులు తీస్తున్న దృశ్యాలు కలవర పెడుతున్నాయి. ఓ విద్యార్థి విమానం బిల్డింగ్పై పడడంతో ఎగిరిపడుతున్న విమాన శకలాలు, బిల్డింగ్ శకలాల నుంచి తనని తాను రక్షించుకునేందుకు హాస్టల్లో లోపల ఉన్న టేబుల్ కింద పరిగెత్తుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. -
ఎయిరిండియా ప్రమాదం.. దొరికిన బ్లాక్ బాక్స్
న్యూఢిల్లీ: అహ్మదాబాద్(గుజరాత్) ఎయిరిండియా విమాన ప్రమాద విచారణలో పురోగతి చోటు చేసుకుంది. ఘటనా స్థలం నుంచి బ్లాక్ బాక్స్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో మరిన్ని కీలక విషయాలు వెలుగు చూసే అవకాశం ఉంది. అంతకు ముందు.. బ్లాక్బాక్స్ దొరికిందంటూ ప్రచారం జరగ్గా.. అధికారులు కొట్టిపారేసిన సంగతి తెలిసిందే.ఎయిరిండియా బోయింగ్ 787-8 విమానం కూలిన బీజే మెడికల్ కాలేజీ బిల్డింగ్పై ఆరంజె కలర్లో ఉన్న బ్లాక్ బాక్స్ లభ్యమైంది. ఏ171 బ్లాక్ బాక్స్ బీజే మెడికల్ కాలేజీ హాస్టల్ భవనంపై అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అంనతరం, బ్లాక్ బాక్స్ను విశ్లేషించే పనిలో నిమగ్నమయ్యారు. కాగా, ఈ బ్లాక్ బాక్స్లో సీవీఆర్, ఎఫ్డీఆర్ భాగాలుంటాయి. వీటిల్లో విమాన డేటా రికార్డింగ్, వేగం, ఎత్తు గురించి తెలుసుకునే అవకాశం ఉంది. సీవీఆర్లో రికార్డయిన చివరి రెండు గంటల పైలెట్, కోపైలెట్ల మధ్య సంభాషణ వినొచ్చు. గురువారం మధ్యాహ్నాం లండన్ వెళ్లాల్సిన ఎయిరిండియా విమానం టేకాఫ్ అయిన కాసేపటికే కూలి.. పేలిపోయింది. ఘటనలో విమానంలో ప్రయాణికులు, సిబ్బందితో పాటు జనావాసాలపై కూలి మరో 24 మంది మొత్తం 265 మంది మరణించారు. విమానంలోని ఒకే ఒక్క ప్రయాణికుడు ప్రాణాలతో బయటపడ్డాడు. ప్రమాదానికి కారణాలను తెలుసుకునేందుకు ఈ కేసును ప్రత్యే బృందం దర్యాప్తు జరుపుతోంది.ఇదీ చదవండి: బ్లాక్బాక్స్తో ఏం చేస్తారో తెలుసా? -
ఎలా బతికానో కూడా తెలియదు
అహ్మదాబాద్ ఎయిరిండియా విమాన ప్రమాదంలో మొత్తం 265 మందికి(ఇప్పటిదాకా అధికారిక లెక్కల ప్రకారం) మరణించారు. విమానం నుంచి ప్రాణాలతో బయటపడింది రమేష్ ఒక్కడే. ప్రస్తుతం సివిల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అతన్ని ప్రధాని మోదీ పరామర్శించి ఘటన గురించి అడిగి తెలుసుకున్నారు. మరికొన్ని జాతీయ మీడియా సంస్థలు కూడా ఆయన నుంచి వివరాలు సేకరించే ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే.. .. ‘‘నమ్మలేకపోతున్నా.. ఎలా బతికానో కూడా తెలియట్లేదు’’ అంటూ అతను చెబుతున్నాడు. విమానంలో 11ఏ సీట్లో కూర్చున్న రమేష్.. ఎమర్జెన్సీ విండో నుంచి దూకి ప్రాణాలు రక్షించుకున్నారంటూ తొలుత పోలీసులు చెప్పారు. అతని సోదరుడు ధీరేంద్ర సోమ్బాయ్ కూడా అదే స్టేట్మెంట్ ఇచ్చారు. అయితే రమేష్ మాత్రం జరిగింది అది కాదని స్పష్టత ఇచ్చారు. అంతా క్షణాల్లో జరిగిపోయిందని, తమ విమానం నేలకూలుతుందన్న విషయం తనకు అర్థమైంది. ఆ వెంటనే విమానం కిందకు వచ్చి ముక్కలై.. పేలిపోయిందని.. ప్రమాద క్షణాలను గుర్తు చేసుకున్నారు.40 ఏళ్ల బ్రిటిష్ ఇండియన్ అయిన విశ్వాష్ కుమార్ రమేష్.. ఏదో అద్భుతం జరిగినట్లే ప్రమాదం నుంచి బయటడ్డారు. ప్రమాద సమయంలో విమానం నేలను తాకి రెండు ముక్కలైంది. ఆ సమయంలో సీటు ఎగిరి కాస్త దూరం పడిపోయింది. ఈ క్రమంలోనే నాకు గాయాలయ్యాయి. ఈ ఘోర ప్రమాదంలో అసలు ఎలా బతికానో కూడా తెలియదు అని రమేష్ ప్రధాని మోదీ సహా తనను పలకరించిన వారికల్లా చెబుతున్నాడు.‘‘ప్రమాదం జరిగాక నేను బతకడం కష్టమనే అనుకున్నా. అయితే నా సీటు దగ్గర్లో విమాన ప్రధాన భాగం ఉందని కనిపించింది. అక్కడ కొంచెం సందు కనిపించింది. నా సీటు బెల్ట్ను నెమ్మదిగా తొలగించి.. పాకుంటూ బయటకు వచ్చా. నా చుట్టుపక్కల వాళ్లలో కొందరు చనిపోయి ఉన్నారు. కొందరికి ఊపిరి ఆగిపోతున్న పరిస్థితి. అది చూశాక.. ఎలా తప్పించుకోవాలో నాకు అర్థం కాలేదు. బయటకు వచ్చాక.. విమానం పేలిపోయిందని ఏదో భాషలో(గుజరాతీ) అంతా అరుస్తున్నారు. ఆ గందరగోళ వాతావరణంలోనే నడుచుకుంటూ వచ్చి ఆంబులెన్స్ ఎక్కాను’’ అని రమేష్ తెలిపారు. ప్రస్తుతం కోలుకుంటున్న రమేష్ను.. త్వరలో పోలీసులు, దర్యాప్తు కమిటీ ప్రశ్నించే అవకాశం ఉంది. -
ప్రయాణికుల పాలిట పీడకలగా డ్రీమ్ లైనర్
-
అహ్మదాబాద్లో ఘోర ప్రమాదం... మెడికల్ కాలేజీపై కుప్పకూలి పేలిపోయిన ఎయిర్ ఇండియా విమానం.. 265 మంది దుర్మరణం... మృతుల్లో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ
-
విమాన ప్రమాదంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ మృతి
-
అర నిమిషంలో కూలిపోయింది
-
దిగ్విజయాల నుంచి దిగంతాలకు
న్యూఢిల్లీ: అహ్మదాబాద్లో గురువారం జరిగిన ఘోర విమాన ప్రమాదంలో సాధారణ ప్రయాణికులతోపాటు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత విజయ్ రూపానీ సైతం ప్రాణాలు కోల్పోయిన వార్త తెలిసి గుజరాత్ ప్రజలు హుతాశులయ్యారు. పలు సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలుచేసి ప్రజారంజకంగా పాలించిన విజయ్ రూపానీ లేరన్న వార్త గుజరాత్ వాసులను కలిచివేసింది. విద్యార్థి దశ నుంచే ఆర్ఎస్ఎస్పై మక్కువ ప్రస్తుతం మయన్మార్గా పిలుచుకుంటున్న నాటి బర్మాలోని యాంగూర్ నగరంలో 1956 ఆగస్ట్ రెండో తేదీన విజయ్ కుమార్ రూపానీ జన్మించారు. నాటి బర్మాలో రాజకీయ అస్థిరత కారణంగా రూపానీ తల్లిదండ్రులు మాయబెన్, రామ్నిక్లాల్ రూపానీలు 1960లో గుజరాత్కు వలసవచ్చింది. చిన్నప్పటి నుంచే హిందూత్వంపై మక్కువతో టీనేజీలో ఉన్నప్పుడే ఆర్ఎస్ఎస్ ‘శాఖ’లో చేరారు. ఇందులోభాగంగా తొలుత ఏబీవీపీలో విద్యార్థి కార్యకర్తగా చేరారు. 1971లో జనసంఘ్లో చేరారు. భారతీయ జనతాపార్టీ ఆవిర్భావం నాటి నుంచి పార్టీకు పూర్తిగా అంకితమయ్యారు. 1976లో ఎమర్జెన్సీ కాలంలో భుజ్, భావనగర్ జైళ్లలో 11 నెలలపాటు కారాగార శిక్ష అనుభవించారు. 1978 నుంచి 1981 వరకు ఆర్ఎస్ఎస్ ప్రచారక్గానూ పనిచేశారు. 1987లో రాజ్కోట్ మున్సిపల్ కార్పొరేషన్లో కార్పోరేటర్గా గెలిచారు. 1996 నుంచి 1997 దాకా రాజ్కోట్ మేయర్గా సేవలందించారు. 1998లో బీజేపీ గుజరాత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. కేశూభాయ్పటేల్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో మేనిఫెస్టో కమిటీకి ఛైర్మన్గా ఉన్నారు. 2006లో గుజరాత్ రాష్ట్ర టూరిజం కార్పొరేషన్కు ఛైర్మన్గా సేవలందించారు. 2006 నుంచి 2012 ఏడాదిదాకా గుజరాత్ నుంచి రాజ్యసభ సభ్యునిగా కొనసాగారు. బీజేపీ గుజరాత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నాలుగు పర్యాయాలు పనిచేసిన రికార్డ్ ఈయన సొంతం. నరేంద్ర మోదీ ముఖ్యమంత్రిగా ఉన్నకాలంలో రాష్ట్ర మున్సిపల్ ఫైనాన్స్ బోర్డ్కు రూపానీ ఛైర్మన్ సేవలందించారు. 2014లో విజుభాయ్ వాలా రాజ్కోట్ పశి్చమ శాసనసభ నియోజకవర్గానికి రాజీనామాచేయడంతో అక్కడ ఉపఎన్నిక చేపట్టారు. బీజేపీ మద్దతుతో ఆనాడు రూపానీ భారీ మెజార్టీతో విజయం సాధించారు. 2014 నవంబర్లో నాటి మహిళా ముఖ్యమంత్రి ఆనందిబెన్ పటేల్ తొలిసారిగా కేబినెట్ను విస్తరించినప్పుడు మొట్టమొదటిసారిగా రూపానీని మంత్రిపదవి వరించింది. రవాణా, నీటి పారుదల, ఉపాధి కారి్మక శాఖల మంత్రిగా పనిచేశారు. 2016 ఫిబ్రవరిలో గుజరాత్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షునిగా రూపానీ ఎన్నికయ్యారు. 2021లో భారత్లో అత్యంత ప్రభావశీలురైన తొలి 100 మంది వ్యక్తుల జాబితాలో రూపానీ స్థానం సంపాదించుకున్నారు.ముఖ్యమంత్రిగా.. 2017లో గుజరాత్ శాసనసభ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. అప్పటిదాకా సీఎంగా కొనసాగిన ఆనందిబెన్ పదవి నుంచి తప్పుకున్నారు. దీంతో పార్టీకోసం దశాబ్దాలుగా అవిశ్రాంతంగా పనిచేస్తున్న రూపానీకి సీఎం పదవి కట్టబెట్టాలని పార్టీ అగ్రనాయకత్వం నిర్ణయించింది. రాజ్కోట్ వెస్ట్లో కాంగ్రెస్ నేత ఇంద్రాణిరాజ్యగురును మట్టికరిపించి ఎమ్మెల్యేగా గెలిచిన రూపానీని పార్టీ శాసనసభాపక్ష నేతగా, ముఖ్యమంత్రిగా బీజేపీ ప్రకటించింది. ప్రజల సమస్యలను వీలైనంత ఎక్కువగా పరిష్కరించేందుకు కృషిచేసి సమర్థవంతమైన సీఎంగా పేరుతెచ్చుకున్నారు.లక్కీనంబర్ 1206 నాడే...1206. ఇది తన లక్కీ నంబర్ అని విజయ్ రూపానీ బాగా నమ్ముతారు. అందుకే తొలినాళ్లలో వాడిన మోటార్సైకిళ్ల నుంచి ఆయన కార్ల దాకా అన్నింటికీ ఇదే నంబర్ ఉంటుంది. చివరికి విమాన ప్రమాదంలో రూపానీ దుర్మరణం పాలైన తేదీ కూడా 12.06 (జూన్ 12) కావడం విధి వైచిత్రేనంటూ ఆయన అభిమానులు వాపోతున్నారు. -
హృదయం ముక్కలైంది: ప్రధాని మోదీ
మాస్కో/లండన్/వాషింగ్టన్/పారిస్/బ్రస్సెల్స్: మాన ప్రమాద వార్త తెలియగానే తన హృదయం ముక్కలైందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ ఖాతాలో ఒక సంతాప పోస్ట్ పెట్టారు. ‘‘ అహ్మదాబాద్లో పెను విషాదం నన్ను ఎంతగానో కలచివేసింది. మాటలు రావడం లేదు. మాటలకందని మహా విషాదమిది. నా హృదయం ముక్కలైంది. ఈ విషాద సమయంలో నా ఆలోచనలన్నీ మృతుల కుటుంబాల గురించే. సహాయక చర్యల్లో నిగమ్నమైన కేంద్ర, రాష్ట్ర మంత్రులు, అధికారులతో నిరంతరం మాట్లాడుతున్నా’’ అని మోదీ అన్నారు. ‘‘ హృదయ విదారక దుర్ఘటన ఇది. ఇంతటి విషాద సమయంలో బాధిత కుటుంబాలకు యావత్భారతావని అండగా నిలుస్తోంది’’ అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆవేదన వ్యక్తంచేశారు. ఉపరాష్ట్రపతి ధన్ఖడ్, కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, పలు పార్టీల అధినేతలు, అగ్రనేతలు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తంచేస్తూ సంతాప సందేశాలు వెలువర్చారు.ప్రగాఢ సానుభూతి వ్యక్తంచేసిన ప్రపంచాధినేతలుఅంతులేని విషాదాన్ని మిగిల్చిన గుజరాత్ విమాన ప్రమాద ఘటనపై ప్రపంచదేశాలు నిర్వరపోయాయి. మృతుల కుటుంబాలకు సానుభూతి వ్యక్తంచేస్తూ ప్రపంచవ్యాప్తంగా సంతాపాలు వెల్లువెత్తాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్ మొదలు మలేసియా ప్రధాని అన్వర్ఇబ్రహీం దాకా పలువురు ప్రపంచ దేశాల అధినేతలు, పాలకులు తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తంచేస్తూ సంతాప సందేశాలు పంపించారు. ‘‘ ఎంతో మంది బ్రిటిష్ జాతీయులతో లండన్కు బయల్దేరిన విమానం కూలిన దుర్ఘటన దృశ్యాలు అత్యంత హృదయ విదారకంగా ఉన్నాయి. ఈ ఘటన వివరాలను ఎప్పటికప్పుడు తెల్సుకుంటున్నా. తాజా పరిస్థితిపై ఆరాతీస్తున్నా. భాదితుల కుటుంబాలకు నా ప్రగాడ సానుభూతి తెలియజేస్తున్నా’’ అని బ్రిటన్ ప్రధాన మంత్రి కెయిర్ స్మార్మర్ వ్యాఖ్యానించారు. బ్రిటన్ రాజు ఛార్లెస్, ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్, యురోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డీర్ లెయిన్ తదితరులు తమ సంతాపాన్ని ప్రకటించారు. -
మహా విషాదం.. 265 మంది దుర్మరణం
అహ్మదాబాద్: మాటలకందని పెనువిషాదం. భారత విమానయాన చరిత్రలోనే అత్యంత దారుణమైన ఘటన. గురువారం గుజరాత్లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. 230 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బందితో అహ్మదాబాద్లోని సర్దార్ వల్లబాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మధ్యాహ్నం 1.39 గంటలకు లండన్ బయల్దేరిన ఎయిరిండియా బోయింగ్ 787–8 డ్రీమ్లైనర్ ఏఐ171 విమానం టేకాఫైన 39 సెకన్లలోనే కుప్పకూలింది. కేవలం 625 అడుగుల ఎత్తుకు వెళ్లగానే విమానంలో అనూహ్య సమస్య తలెత్తింది. దాంతో అది శరవేగంగా కిందికి దూసుకొచ్చింది. చూస్తుండగానే రన్వే సమీపంలో మేఘానీనగర్లోని బీజే మెడికల్ కాలేజీ, సిటీ సివిల్ హాస్పిటల్ సముదాయంపై పడి ఒక్కసారిగా పేలిపోయింది. ఒళ్లు గగుర్పొడిచే ఈ దారుణంలో విమాన ప్రయాణికుల్లో ఒక్కరు మినహా 241 మందీ దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా ఉన్నారు. 230 మంది ప్రయాణికుల్లో 169 మంది భారతీయులు కాగా 53 మంది బ్రిటన్వాసులు, ఏడుగురు పోర్చుగల్వాసులు, ఒకరు కెనడా పౌరుడు. వీరితో పాటు ఇద్దరు పైలట్లు, 10 మంది సిబ్బంది ఉన్నారు. బ్రిటన్లో స్థిరపడ్డ రమేశ్ విశ్వాస్కుమార్ బుచర్వాడ (38) అనే ప్రయాణికుడు గాయాలతో బయటపడి ఆస్పత్రిలో కోలుకుంటున్నారు. విమానం తొలుత మెడికల్ కాలేజీ క్యాంటీన్పై పడి పేలిపోయింది. ముక్కలై మంటల్లో కాలిపోతూనే పక్కనున్న బాయ్స్ హాస్టల్ భవనంపైకి దూసుకెళ్లింది. దాంతో రెండు భవనాలూ తీవ్రంగా ధ్వంసమయ్యాయి. వాటితో పాటు పరిసరాల్లోని పలు బహుళ అంతస్తుల భవనాలు కూడా మంటలంటుకుని కాలిపోయాయి. ప్రమాద సమయంలో క్యాంటీన్లో చాలామంది వైద్య విద్యార్థులు, రెసిడెంట్ డాక్టర్లు మధ్యాహ్న భోజనం చేస్తున్నారు. వారితో పాటు హాస్టల్వాసుల్లో కూడా పలువురు ప్రమాదంలో గాయపడ్డారు. వారిలో కనీసం 25 మంది మరణించినట్టు చెబుతున్నారు! ఒక వైద్యుడు, నలుగురు ఎంబీబీఎస్ విద్యార్థులు, వైద్యుని భార్య మృతిని ఆస్పత్రి వర్గాలు ధ్రువీకరించాయి. ‘‘60 మందికి పైగా వైద్యులు, వైద్య విద్యార్థులు గాయపడ్డారు. వారిలో 19 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది’’ అని ఫెడరేషన్ ఆఫ్ ఆలిండియా మెడికల్ అసోసియేషన్ పేర్కొంది. వారందరినీ హుటాహుటిన ఆస్పత్రులకు తరలించారు. ఈ నేపథ్యంలో మృతుల సంఖ్య మరింత పెరిగేలా ఉంది. ఇద్దరు ఎంబీబీఎస్ మూడో సంవత్సరం విద్యార్థులు, ఒక వైద్యుని తాలూకు ముగ్గురు బంధువుల ఆచూకీ తెలియడం లేదని కాలేజీ డీన్ డాక్టర్ మీనాక్షీ పారిఖ్ వెల్లడించారు. విమాన శకలాలు, ధ్వంసమై కాలిపోయిన భవనాలు, కార్లు, చెట్లు తదితరాలతో ప్రమాదస్థలి భీతావహంగా మారింది. విమానాశ్రయ, అగ్నిమాపక, ఎన్డీఆర్ఎఫ్, బీఎస్ఎఫ్, సీఐఎస్ఎఫ్, సైనిక, స్థానిక సిబ్బంది హుటాహుటిన రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాద ధాటికి దాదాపుగా విమానంలోని వారంతా కాలిపోయి తీవ్రగాయాల పాలయ్యారు. వారిని బయటికి తీసి ఆ ప్రాంగణంలోనే ఉన్న సిటీ సివిల్ ఆస్పత్రికి తరలించారు. ఈ దారుణంపై భారత్తో పాటు ప్రపంచ దేశాలన్నీ దిగ్భ్రాంతికి లోనయ్యాయి. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీతో పాటు బ్రిటన్ రాజు చార్లెస్–3, ప్రధాని యిర్ స్టార్మర్, పలువురు దేశాధినేతలు, రాజకీయ తదితర రంగాల ప్రముఖులు సంతాపం వెలిబుచ్చారు. జరిగింది మాటలకందని దారుణమని మోదీ అన్నారు. శుక్రవారం ఆయన ఘటనాస్థలిని సందర్శించనున్నారు. హాస్టల్లోకి చొచ్చుకెళ్లిన విమానం పైలట్ ‘మే డే’ అలర్ట్ విమానం మధ్యాహ్నం 1.39కి టేకాఫ్ అయింది. 600 అడుగుల పై చిలుకు ఎత్తుకు వెళ్లిందో లేదో సమస్య తలెత్తింది. దాంతో మరింత పైకి వెళ్లాల్సిన విమానం కాస్తా కిందకు రాసాగింది. అప్పటికింకా కనీసం లాండింగ్ గేర్ కూడా పూర్తిస్థాయిలో మూసుకోలేదు! దాంతో తీవ్ర ప్రమాదాన్ని సూచిస్తూ పైలట్ వెంటనే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కు ‘మే డే’ కాల్ చేశారు. ‘‘ఏటీసీ తక్షణం స్పందించి తిరిగి కాల్ చేసినా అప్పటికే పరిస్థితి చేయి దాటిపోయింది. పైలట్ నుంచి ఎలాంటి స్పందనా రాలేదు’’ అని డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ఒక ప్రకటనలో పేర్కొంది. చుట్టుపక్కల వాళ్లంతా చూస్తుండగానే క్షణాల్లో ఘోరం జరిగిపోయింది. ప్రమాదం తాలూకు వీడియో ప్రపంచవ్యాప్తంగా వైరలైంది. విమానం తాలూకు జంట ఇంజన్లలో టేకాఫ్కు అవసరమైన పూర్తిస్థాయి థ్రస్ట్ లోపించడమే ప్రమాదానికి కారణమని వైమానిక నిపుణులు భావిస్తున్నారు. లేదంటే ఇంజన్లను పక్షులు ఢీకొట్టి ఉండొచ్చని కూడా చెబుతున్నారు. ప్రమాదం నేపథ్యంలో అహ్మదాబాద్ విమానాశ్రయంలో కార్యకలాపాలు సాయంత్రం దాకా నిలిచిపోయాయి. ‘‘విమానం చాలా తక్కువ ఎత్తులో ఎగురుతూ మెడికల్ కాలేజీలో డాక్టర్లు, నర్సింగ్ సిబ్బంది నివాస క్వార్టర్లపై కూలిపోయింది. వాటికి మంటలు అంటుకుని లోపలున్న చాలామంది గాయపడ్డారు’’ అని హరేశ్ షా అనే ప్రత్యక్ష సాక్షి చెప్పుకొచ్చాడు. విమాన ప్రమాదంలో కుటుంబ సభ్యుడిని కోల్పోవడంతో గుండెలవిసేలా రోదిస్తున్న మహిళలు ప్రమాద సమయంలో విమానంలో 1.25 లక్షల లీటర్ల ఇంధనం! ఎవరినీ కాపాడలేకపోయాం: అమిత్ షా ప్రమాద సమయంలో ఎయిరిండియా విమానంలో 1.25 లక్షల లీటర్ల ఇంధనం ఉన్నట్టు కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలిపారు. ‘‘అదంతా ఒక్కసారిగా అంటుకోవడంతో తీవ్రమైన మంటలు చెలరేగి భరించలేనంత వేడి పుట్టుకొచ్చింది. దాంతో ఎవరినీ కాపాడే అవకాశం లేకుండా పోయింది’’ అని చెప్పారు. డీఎన్ఏ పరీక్షల ద్వారా మృతదేహాలను గుర్తించిన అనంతరం మృతుల సంఖ్యపై అధికారిక ప్రకటన వెలువడుతుందన్నారు. ‘‘డీఎన్ఏ శాంపిళ్లను ఇప్పటికే సేకరించారు. గుజరాత్లోని ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ, నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్ వర్సిటీ డీఎన్ఏ పరీక్షలు నిర్వహిస్తాయి’’అని తెలిపారు. సెకెనుకు 4 లీటర్ల ఇంధనం విమాన ఇంధనాన్ని జెట్ ఫ్యూయల్ లేదా జెట్ ఏ1 అని పిలుస్తారు. బోయింగ్ 747 విమానం నడవాలంటే భారీగా ఇంధనం కావాలి. సెకెనుకు 4 లీటర్లు ఖర్చవుతుంది. అంటే నిమిషానికి 240 లీటర్లు, గంటకు 14,400 లీటర్లు కావాలన్నమాట. అహ్మదాబాద్ నుంచి లండన్కు సుమారు 6,859 కి.మీ. దూరానికి 9 గంటలపైనే ప్రయాణం. ఎయిరిండియా విమానంలో అంత భారీగా ఇంధనం ఉండటానికి అదే కారణం. విమానం వేగంగా, బలంగా నేలను తాకగానే అంత ఇంధనం ఒకే మండిపోయింది. దాంతో భారీగా మంటలు చెలరేగి ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదానికి కారణం తేలాల్సి ఉంది. విమానం బ్లాక్ బాక్స్ కోసం అన్వేషిస్తున్నారు. మెడికల్ కాలేజీలో హృదయ విదారక దృశ్యాలు విమాన కుప్పకూలిన బీజే మెడికల్ కాలేజీలో హృదయ విదారక దృశ్యాలు మనసులను మెలిపెడుతున్నాయి. కుప్పకూలిన హాస్టల్ భవనాలు తదితరాల కింద చాలామంది వైద్య విద్యార్థులు, ఆస్పత్రి సిబ్బంది తదితరులు చిక్కుకుని ఉంటారని ఫెడరేషన్ ఆఫ్ ఆలిండియా మెడికల్ అసోసియేషన్ (ఎఫ్ఏఐఎంఏ) తెలిపింది. వారిని వెలికితీసేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతున్నారు. ఇప్పటిదాకా 265 మృతదేహాలను సిటీ సివిల్ ఆస్పత్రికి తరలించినట్టు డీఎస్పీ కనన్ దేశాయ్ వెల్లడించారు. మృతుల సంఖ్య భారీగా పెరగవచ్చని ఎఫ్ఏఐఎంఏ జాతీయ ఉపాధ్యక్షుడు డాక్టర్ దివ్యాన్‡్ష సింగ్ అన్నారు. వెలికితీసిన మృతదేహాలన్నీ పూర్తిగా కాలిపోయి ఉన్నాయని చెప్పారు. -
ఆకాశంలో విషాదం!
గుజరాత్లోని అహమ్మదాబాద్ నుంచి 242 మంది ప్రయాణికులతో లండన్ బయల్దేరిన ఎయిరిండియా సంస్థ విమానం బోయింగ్–787–8 డ్రీమ్లైనర్ టేకాఫ్ అయిన కాసేపటికే గురువారం ప్రమాదానికి లోనై కూలిపోవటం ఎంతో విషాదకరం. మన విమానాలు ఎంతో సురక్షితమైనవనీ, ప్రమాదాలకు ఆస్కారం లేనివనీ పేరుంది. ఇప్పుడు కూలిపోయిన విమానం పదకొండేళ్లుగా వినియోగంలో ఉంది. ఈ తరహా విమానాల స్థానంలో కొత్తవి కొనుగోలు చేసే ఆలోచన కూడా ఉంది. ఇంతలోనే ఈ దురదృష్టకర సంఘటన జరిగింది. ప్రయాణికుల్లో గుజరాత్ మాజీ ముఖ్య మంత్రి విజయ్ రూపానీ సహా 169 మంది భారతీయులు కాగా, 53 మంది బ్రిటన్ పౌరులు, ఏడుగురు పోర్చుగల్ వాసులు, కెనడావాసి ఒకరు వున్నారని ఎయిరిండియా సంస్థ ప్రకటన చెబు తోంది. వీరిలో ఒక్కరు గాయాలతో బయటపడ్డారు. భవనంపై ఈ విమానం కూలడంతో అందులో కూడా మరణాలు సంభవించాయని, చాలామంది గాయపడ్డారని అంటున్నారు. వర్తమాన యుగంలో దేశాల మధ్య అనుసంధానం బాగా పెరిగింది. వ్యాపారం, వాణిజ్యం, చదువు, ఉపాధి, పర్యాటకం లాంటి ఎన్నెన్నో అవసరాల నిమిత్తం ఒకచోటనుంచి మరో చోటుకు ప్రయాణిస్తున్నవారి సంఖ్య పదేళ్ల క్రితంతో పోల్చినా ఎన్నో రెట్లు పెరిగింది. ఒకప్పుడు సంపన్న వర్గాల సొంతం అను కునే విమానయానం ఇవాళ మధ్యతరగతి పౌరులకు సైతం జీవితావసరంగా మారింది. ఎప్పటికప్పుడు అందుబాటులోకొస్తున్న సాంకేతికతలు విమానయానాన్ని సురక్షితం చేశాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా మానవ తప్పిదాలకు ఆస్కారం ఉంటుంది గనుక విమాన గమనాన్నీ, దాని తీరుతెన్నులనూ నిర్దేశించగల మెకానికల్, హైడ్రో మెకానికల్ నియంత్రిత వ్యవస్థలు ప్రవేశించాయి. ఇందువల్ల పైలెట్ ఒక కమాండ్ ఇవ్వగానే దానికి సంబంధించిన అనుబంధ మార్పులన్నీ ఒకదాని వెంబడి మరోటి వేగంగా పూర్తవుతాయి. ఈ క్రమంలో ఎక్కడ లోపం కనిపెట్టినా సెన్సర్లు గుర్తిస్తాయి. ఆ వెనకే తక్షణం సరిచే యగల వ్యవస్థలకు సంకేతాలిస్తాయి. ఏకకాలంలో అనేక పనుల్ని క్షణాల్లో చేయగలిగే ఈ వ్యవస్థల కారణంగా పైలెట్ల పని గతంతో పోలిస్తే చాలా మేరకు తగ్గిందనే చెప్పాలి. అయితే పైలెట్ సొంతంగా ఆలోచించాల్సిన అవసరం లేకపోవటం ఇందులోని బలహీ నత. ఏ వృత్తిలోనైనా అనుభవపూర్వకంగా తెలుసుకోగలిగినవెన్నో ఉంటాయి. అన్నీ యంత్రాలే చేయటం ఆ అనుభవాలకు పరిమితులు విధిస్తుంది. మరి ఇంత సాంకేతికాభివృద్ధి జరిగినా ప్రమాదం ఎలా సంభవించిందన్నదే ప్రశ్న. ఒక మాదిరి విశాలంగా, ఒకేసారి 290 మంది ప్రయాణించగల ఈ మోడల్ విమానాలను ప్రపంచవ్యాప్తంగా ఎన్నో విమానయాన సంస్థలు వినియోగిస్తున్నాయి. ఎక్కడా ఆగకుండా ఏకబిగిన వేలాది కిలోమీ టర్లు ప్రయాణించగల సామర్థ్యం దీని సొంతం. అయినా ఈ విషాదం ముంచుకొచ్చింది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే సాంకేతిక లోపం చోటుచేసుకుని ఉండొచ్చని నిపుణులు భావిస్తున్నారు. పైలెట్ నుంచి తక్షణ సాయం అవసరమని సూచించే ‘మేడే కాల్’ కూడా అందింది. ఆ మరుక్షణమే విమానం ప్రమాదంలో చిక్కుకుంది. దూరప్రయాణం కనుక ఇంధనం అధికంగా ఉంది. దాని వల్ల ప్రమాద తీవ్రత మరింత పెరిగింది. విమానాశ్రయం చుట్టుపక్కల ఆవాసాలుండటం ఒక సమస్య. అందువల్ల ఆహారం కోసం వచ్చే పక్షులు విమానాలకు ముప్పు తెస్తాయి. అయితే ఇలాంటి సందర్భాల్లో 92 శాతం వరకూ పెద్దగా ప్రమాదం ఉండకపోవచ్చంటారు. మహా అయితే అత్యవ సర ల్యాండింగ్ తప్పకపోవచ్చు. కానీ ఆ మిగిలిన 8 శాతం మేర ముప్పు పొంచివున్నట్టే లెక్క. పక్షుల గుంపు విమాన మార్గంలో అడ్డు తగలటం, దానికుండే రెండు ఇంజన్లలోనూ అవి చిక్కు కోవటం వంటి కారణాలు ప్రమాదానికి దోహదపడ్డాయా అన్నది దర్యాప్తులో తేలాల్సి ఉంది. అయితే ఈ డ్రీమ్లైనర్ రకం విమానాల్లో నిర్వహణా లోపాలున్నాయని చాన్నాళ్లుగా ఫిర్యాదు లందుతున్నాయి. వాటి పర్యవసానంగా విమానాలు కూలిపోవటం వంటివి చోటుచేసుకోలేదుగానీ అవి భారీ కుదుపులకు లోనై ప్రయాణికులు గాయపడిన ఉదంతాలున్నాయని ఏవియేషన్ సేఫ్టీ నెట్ వర్క్ (ఏఎస్ఎన్) గణాంకాలు చెబుతున్నాయి. నిరుడు జనవరిలో అలాస్కా ఎయిర్లైన్స్కు చెందిన బోయింగ్ విమానం ప్రయాణంలో ఉండగా దానికి చిల్లుపడి చొచ్చుకొచ్చిన పెనుగాలి ధాటికి ప్రయాణికులు భయభ్రాంతులకు లోనయ్యారు. అప్రమత్తమైన పైలెట్ చాకచక్యంగా కిందకు దించటంతో ముప్పు తప్పింది. విమానం ఫ్యూజలాజ్ (ప్రయాణికులు కూర్చునే బాడీ) నిర్మాణం సక్రమంగా లేదని, అందువల్ల ముప్పు ఏర్పడే అవకాశమున్నదని బోయింగ్లో పనిచేసిన ఒక ఇంజనీర్ నిరుడు వెల్లడించినప్పుడు సంస్థ కొట్టిపారేసింది. విస్తృతంగా పరీక్షలు జరిపాక వెంటనే సమస్యాత్మకం అయ్యేదేమీ లేదని ప్రకటించింది. అయితే ఈ కంపెనీ రూపొందించిన 737 రకం విమానాలు రెండు 2018, 2019 సంవత్సరాల్లో కుప్పకూలి 346 మంది మరణించారు. ఈ రెండు ఉదంతాల్లోనూ తన నేరసంబంధ బాధ్యత నుంచి తప్పించుకోవటానికి అమెరికా ప్రభుత్వంతో గత నెలలోనే ఒప్పందానికొచ్చింది. ప్రభుత్వ పర్యవేక్షణను తప్పించుకునే ప్రయత్నం చేసినందుకు భారీయెత్తున జరిమానా చెల్లించింది. విమానాల తయారీలో నాణ్యతనూ, భద్రతనూ మరింత పెంచుతామని లిఖితపూర్వక హామీ ఇచ్చింది. ఈ దురదృష్టకర ఘటనపై జరిగే దర్యాప్తులో ఉత్పాదక సంబంధ లోపాలపై కూడా దృష్టి పెట్టాల్సివుంది. ఇదే సమయంలో విమానయాన సంస్థలన్నీ భద్రతపై మరింత శ్రద్ధపెట్టి పటిష్ఠమైన చర్యలు తీసుకోవాలి. -
ఇటీవలే పెళ్లి, భర్త కోసం లండన్కు నవ వధువు.. నిమిషాల్లో గాల్లో కలిసిన ప్రాణాలు
గాంధీనగర్: అహ్మదాబాద్లో జరిగిన విమాన ప్రమాదం ప్రయాణికుల కుటుంబాల్ని తీవ్ర విషాదాన్ని నింపింది. వారిలో నవ వధువు ఖుష్బూ రాజ్పురోహిత్ ఉన్నారు. ఆమె లండన్లో ఉంటున్న తన భర్తను కలిసేందుకు ఎయిరిండియా విమానంలో బయల్దేరారు. కానీ అంతలోనే అనుకోని విషాదం.. నిమిషాల వ్యవధిలోనే తన భర్తను కలవాలన్న ఆమె కలను చిదిమేసింది. ఖుష్బూ రాజస్థాన్లోని బాలోటరా జిల్లాలోని అరాబా గ్రామ వాసి ఖుష్బూ రాజ్పురోహిత్ . ఆమెకు ఇటీవల మన్ఫూల్ సింగ్తో వివాహం జరిగింది. వివాహం తర్వాత తొలిసారి లండన్లో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న భర్తను కలిసేందుకు అహ్మదాబాద్లో కూలిన ఎయిరిండియా విమానంలో బయల్దేరారు. ఈ ప్రమాదంలో ఆమె ప్రాణాలు కోల్పోవడం కలచివేస్తోంది. విమాన ప్రమాదానికి ముందు ఎయిర్పోర్టులో ఖుష్బూ రాజ్ పురోహిత్ కుమార్తె తన తండ్రి మదన్ సింగ్తో దిగిన ఫొటోలో సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అహ్మదాబాద్ నుంచి లండన్కు బయల్దేరిన ఎయిరిండియా బోయింగ్ 787-8 డ్రిమ్లైనర్ విమానం టేకాఫ్ అయిన సెకన్ల వ్యవధిలో జనావాస్లాల్లో దూసుకెళ్లింది.ఈ ప్రమాదంలో రాజస్థాన్కు చెందిన 11 మంది ఈ విమానంలో ఉన్నారు. వారిలో ఇద్దరు యూకేలో చెఫ్గా పని చేయడానికి వెళ్తున్న పురుషులు , ఒక మార్బుల్ వ్యాపారి కుమారుడు, కుమార్తె ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.ఈ విమానంలో మొత్తం 242 మంది ప్రయాణిస్తున్నారు. ఇందులో సిబ్బంది కూడా ఉన్నారు. ప్రయాణికుల్లో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటిష్ పౌరులు, ఒక కెనడియన్ పౌరుడు, ఏడు పోర్చుగీస్ పౌరులు ఉన్నారు. మొత్తం ప్రయాణికుల్లో ఒక్కే ఒక్క ప్రయాణికుడు రమేష్ విశ్వాస్ కుమార్ మాత్రమే ప్రాణాలతో భయటపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే విమానం ఎమర్జెన్సీ గేటు నుంచి బయటకు నడుచుకుంటూ వెళ్తున్న దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. ప్రస్తుతం, రమేష్కు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. -
ఎయిరిండియా విమాన ప్రమాదంపై ప్రముఖుల తీవ్ర దిగ్భ్రాంతి
సాక్షి,ఢిల్లీ: గుజరాత్ అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు నుంచి గురువారం లండన్ బయల్దేరిన ఎయిరిండియా విమానం బోయింగ్ 787-8 డ్రీమ్లైనర్ ఘోర ప్రమాదానికి గురైంది. ఘోర విమాన ప్రమాదంలో ఎయిరిండియా విమానంలోని 242 మంది మరణించినట్లు తెలుస్తోంది. ఆ మరణాలపై కేంద్రం అధికారిక ప్రకటన ఇవ్వాల్సి ఉంది. ఈ ప్రమాదంపై జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పలువురు ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు.ప్రమాదం తనని కలిచి వేసిందన్న ప్రధాని మోదీ.. బాధిత కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.విమాన ప్రమాదంపై రాష్ట్రప్రతి ద్రౌపది ముర్ము దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటన హృదయ విదారకరమైంది.ప్రధాని మోదీ, భారత్కు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సంఘీభావం. వీలైనంత ఎక్కువ మంది ప్రాణాలతో బయటపడాలని, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నట్లు ట్వీట్ చేశారు.విమాన ప్రమాదంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విచారం వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ శ్రేణులు సహాయక చర్యల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు.ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు విచారం వ్యక్తం చేశారు. ఈ విషాద సమయంలో నా సహచరుడు ప్రధాని మోదీ, భారత ప్రజలకు అండగా నిలుస్తాం. 242 మంది పురుషులు, మహిళలు, పిల్లల ప్రాణాలను బలిగొన్న విషాదకరమైన ఎయిరిండియా ప్రమాదం గురించి తెలుసుకుని నేను బాధపడ్డాను’అని అన్నారు.ఈరోజు అహ్మదాబాద్లో జరిగిన అత్యంత విషాదకరమైన ఎయిరిండియా ప్రమాదం గురించి తెలుసుకుని షాక్ గురయ్యా. ఈ ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నా. బాధితుల కుటుంబాలకు నా సంతాపాన్ని తెలియజేస్తున్నాను. ప్రాణాలతో బయటపడిన వారి వివరాల కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నాం. ప్రమాదంలో అందరు సురక్షితంగా ఉండాలని భగవంతుణ్ని ప్రార్ధిస్తున్నాను’ అని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎక్స్ వేదికగా పోస్టు చేసింది. -
Plane Crash: విమానంలో ఉన్నవారందరూ మృతి
-
కేంద్రం హెచ్చరికను పెడ చెవిన పెట్టి.. 242 మంది మృతికి ఎయిరిండియానే కారణమా?
గాంధీ నగర్: అహ్మదాబాద్లో ఎయిరిండియా విమానం ఘోర ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీతో సహా 242 మంది ప్రయాణికులు మరణించిన జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. మరణాలపై కేంద్రం అధికారిక ప్రకటన ఇవ్వాల్సి ఉంది. అయితే ఈ విమాన ప్రమాదానికి కారణం ఎయిరిండియా?నిర్లక్ష్యమేనని తెలుస్తోంది. ఇవాళ మధ్యాహ్నం కూలిన విమానం ఇప్పటికే గతంలో పలు మార్లు మొరాయించింది. గత డిసెంబర్లో ఇదే ఫ్లైట్లో పొగలు కమ్ముకున్నాయి. గతవారం ఇదే విమానం ప్యారిస్ వెళ్తుండగా మొరాయించడంతో పైలెట్ షార్జాలో అత్యవసర ల్యాండింగ్ చేశారు. వరుస ఘటనలపై విమానయాన నియంత్రణ సంస్థ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ఎయిరిండియా విమానానికి హెచ్చరికలు జారీ చేసింది. అయినా పట్టించుకోలేదని ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి.గురువారం మధ్యాహ్నాం 1.38 నిమిషాలకు 242 మంది ప్రయాణికులు, ఇద్దరు పైలట్లు, 10 మంది సిబ్బందితో బోయింగ్ 787-7 డ్రీమ్ లైనర్ విమానం బయల్దేరింది. అయితే ఎయిర్పోర్ట్ నుంచి టేకాఫ్ అయిన కాసేపటికే.. 1.43ని. ప్రాంతంలో విమానం ప్రమాదానిక గురైంది. సుమారు 825 అడుగుల ఎత్తులో క్రాష్ ల్యాండ్ అయ్యింది. నేరుగా ఓ చెట్టును ఢీ కొట్టి జనావాసాలపై పడింది. ఆ సమయంలో భారీ పేలుడు సంభవించింది.ఎయిర్పోర్టు నుంచి టేకాఫ్ అయిన కొన్ని నిమిషాల్లోనే.. అదీ ఎయిర్పోర్ట్ పరిధిలోనే ప్రమాదానికి గురైనట్లు డీజీసీఏ ప్రకటించింది. విమానంలో ఉన్న మొత్తం 242 మంది మృతి చెందినట్లు సమాచారం. 230 మంది ప్రయాణికులు, ఇద్దరు పైలెట్లు,10 మంది విమాన సిబ్బంది మృత్యువాత పడ్డారు. వీరిలో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటన్ దేశస్థులు ఉన్నారు. ఏడుగురు పోర్చుగీస్కు చెందిన వారు ఉండగా, ఒక కెనడా దేశస్థుడు ఉన్నారు. విమానంలో 217 మంది పెద్దలు, 11 మంది చిన్నారులు,ఇద్దరు పసిపిల్లలు ఉన్నారు. -
‘విమాన ప్రమాదంలో ఎవరూ బతికే అవకాశం లేదు’: సీపీ
గాంధీ నగర్: అహ్మదాబాద్ ఎయిరిండియా ఘోర విమానం ప్రమాదంలో మరణాలపై కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. విమాన ప్రమాదంలో ఎవరూ బతికే అవకాశం లేదని అహ్మదాబాద్ సీపీ జీఎస్ మాలిక్ అసోసియేటెడ్ ప్రెస్తో మాట్లాడారు. విమానం జనావాసాల్లో కూలిపోవడంతో స్థానికులు మరణించినట్లు చెప్పారు. అయితే, ఆ మరణాలు సంఖ్య ఎంత అనేది స్పష్టత ఇవ్వలేదు. -
ఇది మాటల్లో చెప్పలేని హృదయ విదారక ఘటన: ప్రధాని మోదీ
ఢిల్లీ: అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు విమాన ప్రమాదం జరిగిన వెంటనే హోంమంత్రి అమిత్ షా మాట్లాడిన ప్రధాని మోదీ.. ఈ ఘటన తీవ్ర ఆవేదనకు గురిచేసిందన్నారు. The tragedy in Ahmedabad has stunned and saddened us. It is heartbreaking beyond words. In this sad hour, my thoughts are with everyone affected by it. Have been in touch with Ministers and authorities who are working to assist those affected.— Narendra Modi (@narendramodi) June 12, 2025ఇది మాటల్లో చెప్పలేని హృదయ విదారకర ఘటన అని మోదీ ట్వీట్ చేశారు. తాను ఎప్పటికప్పుడు పరిస్థితిన సమీక్షిస్తున్నానని,. బాధితులకు సహాయం చేస్తున్న మంత్రులు, అధికారులతో మాట్లాడుతున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దిగ్భ్రాంతివిమాన ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ విమాన ప్రమాద ఘటన తీవ్రంగా బాధించిందన్నారు. ఇది హృదయ విదారక ఘటన అని పేర్కొన్న ఆమె.. బాధితులు కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ఈ కష్ట సమయంలో వారికి దేశం అండగా నిలుస్తుందన్నారు. I am deeply distressed to learn about the tragic plane crash in Ahmedabad. It is a heart-rending disaster. My thoughts and prayers are with the affected people. The nation stands with them in this hour of indescribable grief.— President of India (@rashtrapatibhvn) June 12, 2025 కాగా, ఈ రోజు గురువారం(జూన్ 12) అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలింది. టేకాఫ్ అయిన కాసేపటికే విమానం కూలిపోయింది. ఈ ఘటనలో 100 మందిపైగా దుర్మరణం చెందినట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను స్థానిక సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. విమానంలో 242 మంది ప్రయాణికులున్నారు. ఇందులో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటన్ దేశస్థులు ఉన్నారు. ఏడుగురు పోర్చుగీస్కు చెందిన వారు ఉండగా, ఒక కెనడా దేశస్థుడు ఉన్నారు. విమానంలో 217 మంది పెద్దలు, 11 మంది చిన్నారులు, ఇద్దరు పసిపిల్లలు ఉన్నారు. విమాన ప్రమాద ఘటన తర్వాత పలు మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. :అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. 100 మందికిపైగా మృతి? -
Air India Plane Crash బోయింగ్ 787 డ్రీమ్లైనర్పై ఆరోపణలు: ఇంత విషాదం ఇపుడే!
Ahmedabad Plane Crash గుజరాత్లోని అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఎయిర్ ఇండియా బోయింగ్ 787-8 విమానం - ఫ్లైట్ AI-171 కుప్పకూలిపోయింది. గురువారం (2025 జూన్ 12వ తేదీ) లండన్లోని గాట్విక్ విమానాశ్రయానికి వెళ్తున్న ఈ విమానంలో సిబ్బందితో సహా 242 మంది ఉన్నారు. వీరిలోఇద్దరు పైలట్లు ,10 మంది క్యాబిన్ సిబ్బంది ఉన్నారు. ఈ విమానం కెప్టెన్ సుమీత్ సభర్వాల్ నేతృత్వంలో ఫస్ట్ ఆఫీసర్గా క్లైవ్ కుందర్ ఉన్నారు. ఈ దుర్ఘటపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ, సహా పలువురు నాయకులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇంధన సామర్థ్యం, అధునాతన సాంకేతికత ,సౌకర్యవంతమైన ప్రయాణీకుల అనుభవానికి ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన సుదూర విమానం బోయింగ్ 787 డ్రీమ్లైనర్తో మొట్టమొదటి ప్రాణాంతక ప్రమాదం ఇదని నిపుణులు భావిస్తున్నారు. ఎంతమంది చనిపోయారు అనేది దానిపై పూర్తి స్పష్టత లేనప్పటికీ, మరణాల సంఖ్య ఎక్కువగానే ఉండవచ్చని భావిస్తున్నారు. విమానంలో ప్రయాణిస్తున్నవారిలో 169 మంది భారతీయులు, 53 బ్రిటిష్ పౌరులు,ఒకకెనడియన్, ఏడుగురు పోర్చుగీసు వారున్నారు. వీరిలో ఎంత మంది ప్రాణాలున్నారు అనేది సందేహమే.#WATCH | Air India plane crash: "My sister was going to London. She had her flight around 1.10 pm, but the flight crashed," says Bhawna Patel as she arrived at the Civil Hospital in Ahmedabad, Gujarat pic.twitter.com/aDkixvDB9d— ANI (@ANI) June 12, 2025మేడే కాల్ విమానంనుంచి ‘ మేడే (MAYDAY) కాల్ వచ్చిందని, కానీ ఆ తర్వాత విమానం నుండి ఎటువంటి స్పందన రాలేదు" డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఒక ప్రకటనలో తెలిపింది. అటు యూకే ప్రభుత్వం కూడా స్థానిక అధికారులతో కలిసి చేస్తోంది. ఈ మేరకు ఒక ఒక ప్రకటనవిడుదల చేసింది.. కాన్సులర్ సహాయం అవసరమైన లేదా స్నేహితులు లేదా కుటుంబ సభ్యుల గురించి ఆందోళనలు ఉన్న బ్రిటిష్ జాతీయులు 020 7008 5000 కు కాల్ చేయాలని తెలిపింది.ఫ్లైట్ ట్రాకింగ్ సర్వీస్ ఫ్లైట్అవేర్ ప్రకారం, విమానం మధ్యాహ్నం 1:55 గంటలకు బయలుదేరింది - మధ్యాహ్నం 1:10 గంటలకు బయలుదేరడానికి 45 నిమిషాలు ఆలస్యంతో బయలుదేరి టేకాఫ్ అయిన కొద్ది నిమిషాలకే కూలిపోయింది. ప్రమాద స్థలం సమీపంలోని ప్రత్యక్ష సాక్షులు పెద్ద పేలుడు సంభవించి, నల్లటి పొగలు కమ్ముకున్నట్లు నివేదించారు. విమానాశ్రయానికి సమీపంలోని మేఘని నగర్ ప్రాంతం చుట్టూ చెల్లాచెదురుగా ఉన్న శిథిలాలను దృశ్యాలు చూపించాయి. స్థానిక అగ్నిమాపక విభాగాలు, అంబులెన్స్లు NDRF బృందాలు సహా అత్యవసర సేవలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి.కేంద్ర పౌర విమానయాన మంత్రి కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వెంటనే అప్రమత్తమయ్యామని త్వరితగతిన సహాయ కార్యక్రమాలు చేపట్టినట్టు వెల్లడించారు. (అమెరికాలో వాల్మార్ట్లో అమ్మానాన్నలతో : ఎన్ఆర్ఐ యువతి వీడియో వైరల్)బోయింగ్ 787 డ్రీమ్లైనర్బిజినెస్ స్టాండర్ట్ రిపోర్ట్ ప్రకారం బోయింగ్ 787 డ్రీమ్లైనర్ అత్యంత అధునాతన విమానాలలో ఒకటి కార్బన్ ఫైబర్-రీన్ఫోర్స్డ్ మిశ్రమాలతో నిర్మించబడింది. తక్కువ ఇంధనం పడుతుంది. అధిక తేమ స్థాయిలు, లార్డర్ డిమ్మబుల్ విండోస్, నిశ్శబ్ద క్యాబిన్ లాంటి ఫీచర్స్ దీని సొంతం. 2009లో ప్రవేశపెట్టబడిన 787-8 వేరియంట్, సాధారణంగా 242 మంది ప్రయాణికుల సామర్థ్యం ఉంటుంది. 13,500 కిలోమీటర్లకు పైగా ఎగురుతుంది. అయితే, ఈ విమానం సంవత్సరాలుగా నిరంతర సాంకేతిక, భద్రతా సమస్యలను ఎదుర్కొంటోంది.2013లో, లిథియం-అయాన్ బ్యాటరీ మంటలకు సంబంధించిన రెండు వేర్వేరు సంఘటనల తర్వాత డ్రీమ్లైనర్లను మొత్తం ప్రపంచవ్యాప్తంగా నిలిపిశారు. అందులో ఒకటి బోస్టన్లో జపాన్ ఎయిర్లైన్స్ 787, మరొకటి జపాన్లోని ఆల్ నిప్పాన్ ఎయిర్వేస్కు మిడ్-ఎయిర్ ఎమర్జెన్సీ. బోయింగ్ బ్యాటరీ వ్యవస్థను పునఃరూపకల్పన చేసేవరకు యుఎస్ ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA) డ్రీమ్లైనర్ కార్యకలాపాలను నిలిపివేసింది.ఇదీ చదవండి: Akhil-Zainab Reception డైమండ్ నగలతో, గార్జియస్గా అఖిల్ అర్థాంగి2024లో, కంపెనీలో ఇంజనీర్ అయిన విజిల్బ్లోయర్ సామ్ సలేహ్పూర్ డ్రీమ్లైనర్ ఫ్యూజ్లేజ్లోని నిర్మాణాత్మక సమస్యల గురించి యుఎస్ సెనేట్కు సాక్ష్యమిచ్చిన తర్వాత బోయింగ్ తిరిగి పరిశీలనలోకి వచ్చింది. నిర్మాణ వైఫల్యానికి దారితీయవచ్చని ఆయన ఆరోపించారు. FAA దర్యాప్తు ప్రారంభించింది, అది ఇంకా కొనసాగుతోంది.- మార్చి 2024లో, LATAM ఎయిర్లైన్స్ బోయింగ్ 787-9 విమానం మధ్యలో అకస్మాత్తుగా సమస్యలు రావడంతో, పడిపోవడంతో 50 మంది ప్రయాణికులు గాయపడ్డారు. కాక్పిట్లో సీటు-స్విచ్ పనిచేయకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని తరువాత గుర్తించారు. దీంతో పాటు గత కొన్నేళ్లుగా డ్రీమ్లైనర్ను నడుపుతున్న పైలట్లు ఇంజిన్ ఐసింగ్, జనరేటర్ వైఫల్యాలు , ఇంధన లీకేజీలు వంటి సమస్యల గురించి వివరించారు. అయితే ఇంత ప్రమాదం మునుపెన్నడూ జరగలేదు.ఇదే ఎయిరిండియా విమానం కేవలం ఆరు నెలల క్రితం తీవ్రమైన సాంకేతిక సమస్యలను ఎదుర్కొందని మీడియా నివేదికల ద్వారా తెలుస్తోంది. అహ్మదాబాద్-లండన్ గాట్విక్ మార్గంలో AI-171, డిసెంబర్ 2024లో ఒక పెద్ద సాంకేతిక లోపం కారణంగా నిలిపివేశారు. ఈ సమయంలో దాదాపు 300 మంది ప్రయాణికులు చిక్కుకుపోయారు. నిర్వహణ లోపాలు. విమాన భద్రతా విధానాలపై విమర్శలు వెల్లువెత్తాయి. అయినప్పటికీ విమానం తరువాత కార్యకలాపాలను తిరిగి ప్రారంభించడానికి అనుమతి లభించిందట. -
Plane Crash: ప్రమాదం దగ్గర ప్రస్తుత పరిస్థితి
-
కూలిన విమానంలో గుజరాత్ మాజీ సీఎం..!
-
కుప్పకూలిన ఎయిరిండియా విమానం.. వీడియో వైరల్
న్యూఢిల్లీ: గుజరాత్లోని అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ సమీపంలో ఎయిరిండియా (Air India) విమానం ప్రమాదానికి గురైంది. ఈ ఘోర ప్రమాదంలో వంద మందికి పైగా మృతి చెంది ఉంటారని తెలుస్తోంది. కుప్పకూలిన వెంటనే విమానం పేలిపోగా.. దట్టంగా పొగ ఆ ప్రాంతమంతా అలుముకుంది. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.గురువారం మధ్యాహ్నాం 1.38 నిమిషాలకు 242 మంది ప్రయాణికులు, ఇద్దరు పైలట్లు, 10 మంది సిబ్బందితో బోయింగ్ 787-7 డ్రీమ్ లైనర్ విమానం బయల్దేరింది. అయితే ఎయిర్పోర్ట్ నుంచి టేకాఫ్ అయిన కాసేపటికే.. 1.43ని. ప్రాంతంలో విమానం ప్రమాదానిక గురైంది. సుమారు 825 అడుగుల ఎత్తులో క్రాష్ ల్యాండ్ అయ్యింది. నేరుగా ఓ చెట్టును ఢీ కొట్టి జనావాసాలపై పడింది. ఆ సమయంలో భారీ పేలుడు సంభవించింది.ఎయిర్పోర్టు నుంచి టేకాఫ్ అయిన కొన్ని నిమిషాల్లోనే.. అదీ ఎయిర్పోర్ట్ పరిధిలోనే ప్రమాదానికి గురైనట్లు డీజీసీఏ ప్రకటించింది. ఈ ప్రమాద దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. Terrifying final moments of Air India Flight AI 171 crashing into a residential area in Ahmedabad today. Clearly catastrophic loss of lift. Details awaited. pic.twitter.com/TbgCjPLXXc— Shiv Aroor (@ShivAroor) June 12, 2025 -
Air India Plane Crash : అహ్మదాబాద్లో కూలిన ఎయిర్ ఇండియా విమానం (ఫొటోలు)
-
BIG BREAKING: గుజరాత్లో కూలిన విమానం
-
ఎయిరిండియా విమాన ప్రమాదంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ మృతి
గాంధీ నగర్: గుజరాత్ రాష్ట్రం అహ్మాబాద్ ఎయిర్పోర్ట్ సమీపంలో ఘోర విమాన ప్రమాదం సంభవించింది. అహ్మాబాద్ నుంచి లండన్ వెళుతున్న ఎయిర్ ఇండియా బోయింగ్ 787-8 డ్రీమ్లైనర్ విమానం గురువారం మధ్యాహ్నం అహ్మదాబాద్ విమానాశ్రయం సమీపంలో టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కూలిపోయింది. ఈ పెను విషాదంలో విమానంలో ఉన్న 242 మందిలో 241 మంది ప్రయాణికులు మరణించినట్లు తెలుస్తోంది. వారిలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ ఉన్నట్టు కేంద్ర మంత్రి, గుజరాత్ బీజేపీ అధ్యక్షుడు సీఆర్ పాటిల్ అధికారికంగా ప్రకటించారు. (విమాన ప్రమాదానికి ముందు మాజీ సీఎం విజయ్ రూపానీని సెల్ఫీ తీసిన తోటి ప్రయాణికురాలు)ప్రమాదంపై ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రమాద బాధితుల్లో విజయ్ రూపానీ ఉన్నారు. ‘మా నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ తన కుటుంబాన్ని కలవడానికి (లండన్) వెళ్తున్నారు. ఈ సంఘటనలో ఆయన కూడా బాధితుడే. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి. ఇది బిజెపికి పెద్ద నష్టం’అంటూ సీఆర్ పాటిల్ విచారం వ్యక్తం చేశారు. VIDEO | Ahmedabad Plane Crash: Union Minister and Gujarat BJP president, CR Patil (@CRPaatil) confirms former Gujarat CM Vijay Rupani's demise. Speaking to reporters, he says, "Our leader and former Chief Minister, Vijay Rupani, was going (to London) to meet his family. He is… pic.twitter.com/5c1VIk8KIb— Press Trust of India (@PTI_News) June 12, 2025 పలు జాతీయ మీడియా కథనాల ప్రకారం.. అహ్మదాబాద్లో కూలిన ఎయిరిండియా విమానంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ ఉన్నట్లు తేలింది. ఆ విమాన ప్రయాణికుల జాబితాలో విజయ్ రూపానీ 12వ ప్రయాణికుడు. జెడ్ క్లాస్లో రూపానీ టికెట్ బుక్ చేసుకున్నారనే ఆధారాలు వెలుగులోకి వచ్చాయి.అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి లండన్లోని గాట్విక్ విమానాశ్రయానికి మధ్యాహ్నం 1:10 గంటలకు సర్వీస్ ఉంది. ఆ విమానం టేకాఫ్ అయిన రెండు నిమిషాలకు ప్రమాదం జరిగినట్లు సమాచారం. ప్రమాదం జరిగే సమయంలో విమానంలో సిబ్బందితో సహా మొత్తం 242 మంది ఉన్నారు. విమానంలో 242 మంది: డీజీసీఏఅహ్మదాబాద్లో ప్రమాదానికి గురైన ఎయిరిండియా విమానంలో 242 మంది ఉన్నారని సివిల్ ఏవియేషన్ డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) వెల్లడించింది. వీరిలో ఇద్దరు పైలట్లు, 10 మంది క్యాబిన్ సిబ్బంది ఉన్నట్టు తెలిపింది. కెప్టెన్ సుమీత్ సభర్వాల్, ఫస్ట్ ఆఫీసర్ క్లైవ్ కుందర్ కూడా ప్రమాద సమయంలో విమానంలో ఉన్నారు.Ahmedabad Plane Crash: Video captured exact moment Air India's AI -171 passenger aircraft crashed near Meghnaninagar area earlier today.(Disclaimer: PTI can not verify the authenticity of the video)(Source: Third party) pic.twitter.com/qAK8aP6wGH— Press Trust of India (@PTI_News) June 12, 2025విమానంలో 169 మంది భారతీయులు, 53 మంత్రి బ్రిటన్, ఏడుగురు పోర్చుగీస్ జాతీయులతో పాటు ఒక కెనడా వాసి ఉన్నట్లు ఎయిరిండియా ఎక్స్ వేదికగా వెల్లడించింది.ప్రమాదానికి గురైన విమానం వైడ్బాడీ బోయింగ్ 787 డ్రీమ్ లైనర్. దీనిలో 300మంది ప్రయాణించవచ్చు. సుదూర ప్రయాణం కావడంతో విమానంలో ఇంధనం కూడా భారీగా ఉండడంతో ప్రమాదం స్థాయి తీవ్రంగా ఉన్నట్లు తెలుస్తోంది. -
అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. 265 మంది మృతి
👉అహ్మదాబాద్లో హోంమంత్రి అమిత్ షా పర్యటనవిమాన ప్రమాదంపై అమిత్ షా దిగ్భ్రాంతివిమానం పేలడంతో ప్రయాణికులు తప్పించుకునే అవకాశం రాలేదుబాధిత కుటుంబాలకు అండగా ఉంటాండీఎన్ఏ టెస్టుల తర్వాత మృతులను గుర్తిస్తాంగుజరాత్లోనే వీలైనంత త్వరగా డీఎన్ఏ టెస్టులు పూర్తి చేస్తాంకేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి సహాయక కార్యక్రమాలు చేపట్టాయి.విమాన ప్రమాదం నుంచి బయటపడ్డ ప్రయాణికుడిని కలిశానుమృతదేహాల వెలికితీత పూర్తైంది👉అహ్మదాబాద్ చేరుకున్న డీజీసీఏ దర్యాప్తు బృందంవిమాన ప్రమాదంపై దర్యాప్తు ప్రారంభించిన డీజీసీఏఏఏఐజీ డీజీ నేతృత్వంలో దర్యాప్తువిమాన ప్రమాదంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపాని మృతిఅధికారికంగా ప్రకటించిన గుజరాత్ ప్రభుత్వం2016-2021 వరకు గుజరాత్ సీఎంగా పనిచేసిన విజయ్ రూపాని👉మృతుల కుటుంబాలకు టాటా గ్రూప్ ఎక్స్గ్రేషియామృతుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున ఎక్స్గ్రేషియాక్షతగాత్రుల వైద్య పరీక్షలన్నీ భరిస్తాం: చంద్రశేఖరన్బీజే మెడికల్ కాలేజీ భవనాన్ని పునర్నిర్మిస్తాం 👉ఎయిరిండియా ప్రమాదంలో మృత్యుంజయుడుఒక ప్రయాణికుడు బతికే ఉన్నాడని ప్రకటించిన సీపీ11A సీటులో ఉన్న వ్యక్తి బతికాడంటున్న పోలీసులుఆలస్యంగా గుర్తించిన పోలీసులురమేష్ విశ్వాస్ కుమార్గా గుర్తింపు 👉ఎయిరిండియా నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమా?మెయింటెనెన్స్ లోపంతో ప్రమాదం జరిగిందనే అనుమానంవిమానానికి పలుమార్లు సాంకేతిక లోపంగత డిసెంబర్లో ఇదే విమానంలో పొగలుఏడాదిలో రెండుసార్లు సాంకేతిక సమస్యలుజూన్, డిసెంబర్లో తప్పిన ప్రమాదాలు👉విమానంలో ఉన్న 241 మంది దుర్మరణం..!229 మంది ప్రయాణికులు, ఇద్దరు పైలట్లు మృతి10 మంది విమాన సిబ్బంది మృతి👉విమాన ప్రమాదంపై విదేశాంగ శాఖ అధికారిక ప్రకటనవిమాన ప్రమాదంలో చాలా మంది చనిపోయారుమృతుల సంఖ్య ఇప్పుడే చెప్పలేం: విదేశాంగ శాఖమృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపిన విదేశాంగ శాఖ👉అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై వైఎస్ జగన్ దిగ్ర్భాంతిఎయిర్ ఇండియా AI-171 విమానం కూలిపోయిన విషయం తెలిసి నేను షాక్ అయ్యా..ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు సంతాపం తెలుపుతున్నా..మృతుల కుటుంబ సభ్యులకు ధైర్యం ప్రసాదించాలని దేవుడ్ని కోరుతున్నా..👉విమాన ప్రమాదంపై స్పందించిన భారత్లోని యూకే హైకమిషన్బాధిత కుటుంబాలకు సానుభూతి తెలిపిన యూకే హైకమిషన్స్థానిక అధికారులతో కలిసి ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాం: యూకే హైకమిషన్👉అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రికి సీఎం భూపేంద్ర పటేల్క్షతగాత్రులను పరామర్శించిన సీఎం భూపేంద్ర పటేల్బాధిత కుటుంబాలను ఆదుకుంటాంజరిగిన ఘటన దురదృష్టకరంచాలా మందికి రక్తం అవసరం.. గ్రీన్ ఛానెల్ ఏర్పాటు చేశాంరక్తదానం చేయడానికి దాతలు రావాలి: భూపేంద్ర పటేల్రక్తదాన కేంద్రాలు:1. U. N. Mehta Institute of Cardiology and Research Centre Room no 110, 1st floor, A block Contact no-9316732524 2. IHBT Department, Civil Hospital 2nd floor, 1200 bed Civil Hospital, Contact no-9428265409 3. IKDRC Blood Centre 1st floor, IKDRC Hospital, Manjushree mill road, Baliya limdi Contact no-07922687500 Ext no-4226 4. GCRI Blood Centre 1st floor, Gujarat cancer & Research institute Contact no-07922688026👉అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటనపై స్పందించిన ప్రధాని మోదీవిమాన ప్రమాదం దిగ్భ్రాంతికి గురిచేసింది.. బాధించిందిఇది మాటల్లో చెప్పలేని హృదయ విదారకర ఘటనబాధిత కుటుంబాలకు సానుభూతి వ్యక్తం చేసిన ప్రధాని👉విమాన ప్రమాదంపై తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి దిగ్భ్రాంతిబాధితులను, వారి కుటుంబాలను ఆదుకోవడానికి వీలైనంత వేగంగా చర్యలు చేపట్టాలని కేంద్రాన్ని కోరిన రేవంత్👉విమానయాన శాఖ కంట్రోల్ రూమ్ ఏర్పాటుఫోన్ నంబర్లు: 011 24610843, 9650391859ఎయిరిండియా హెల్ప్లైన్ నంబర్ 1800 5691 444👉బీజే మెడికల్ కాలేజీ హాస్టల్పై కూలిన విమానంబీజే మెడికల్ కాలేజీలోని 24 మంది వైద్య విద్యార్థులు మృతివిమానంలో ఇద్దరు పైలట్లు, 10 మంది సిబ్బంది సహా 242 మంది👉విమాన ప్రయాణికుల సమాచారం కోసం హెల్ప్లైన్ ఏర్పాటుహెల్ప్లైన్ నంబర్ 1800 5691 444ప్రమాదంపై ఎయిరిండియా ఛైర్మన్ చంద్రశేఖరన్ దిగ్భ్రాంతిమృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపిన చంద్రశేఖరన్బాధితుల కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటాం: చంద్రశేఖరన్ 👉విమానంలో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటన్ దేశస్థులువిమానంలో ఏడుగురు పోర్చుగ్రీస్ దేశస్థులు, ఒక కెనడా దేశస్థుడువిమానంలో 217 మంది పెద్దలు, 11 మంది చిన్నారులు, ఇద్దరు పసిపిల్లలుఅహ్మదాబాద్ ఆసుప్రతికి చేరిన 40 మృతదేహాలు👉విమాన ప్రమాదంపై డీజీసీఏ ప్రకటనవిమానంలో 242 మంది ప్రయాణికులుఇద్దరు పైలట్లు, 10 మంది క్యాబిన్ సిబ్బందిఏటీసీకి ఎమర్జెన్సీ కాల్ వచ్చిందిఏటీసీ నుంచి చేసిన కాల్స్కు స్పందన రాలేదుఅహ్మదాబాద్ నుంచి టేకాఫ్ అయిన వెంటనే విమానం కూలిందిఎయిర్ పోర్ట్పరిసరాల్లోనే విమాన ప్రమాదం👉కేంద్ర హోంమంత్రి అమిత్షాకు ప్రధాని మోదీ ఫోన్విమాన ప్రమాదంపై ఆరా తీసిన ప్రధానిఎప్పటి కప్పుడు పరిస్థితి తనకు తెలియజేయాలన్న మోదీ👉విమానంలో 52 మంది బ్రిటన్ దేశస్థులుసాయంత్రం 5 గంటల వరకు ఎయిర్పోర్ట్ మూసివేతవిమానం కూలిపోయే ముందు ఏటీసీకి ఎమర్జెన్సీ సమాచారం ఇచ్చిన పైలట్లుపౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడితో ఫోన్లో మాట్లాడిన ప్రధాని మోదీ👉విమాన ప్రమాదంలో 100 మందికిపైగా మృతి?కూలిన విమానంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపాని?విమానంలో ఇద్దరు పైలట్లు, 10 మంది సిబ్బందిపైలట్ సుమిత్ సబర్వాల్ ఆధ్వర్యంలో బయలేర్దిన విమానంవిమానానికి ఫస్ట్ ఆఫీసర్గా ఉన్న పైలట్ కైవ్ కుందర్న్యూఢిల్లీ: గుజరాత్ అహ్మదాబాద్లో గురువారం ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఎయిరిండియా విమానం ఎయిర్పోర్ట్ సమీపంలో జనావాసాలపై కుప్పకూలిపోయింది. ఘటనా స్థలానికి అంబులెన్స్లు, ఫైర్ ఇంజిన్లు చేరుకుంటున్నాయి. సహాయక సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. గురువారం మధ్యాహ్నాం మధ్యాహ్నం 1:39 గంటలకు బోయింగ్ 787-8 డ్రీమ్లైనర్ విమానం టేకాఫ్ అయ్యిందని.. టేకాఫ్ కాసేపటికే ప్రమాదం జరిగిందని అధికారులు చెబుతున్నారు. చెట్టును ఢీ కొట్టి జనావాసాలపై కూలిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. విమానం లండన్ వెళ్తుండగా.. అందులో 242 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ఘటనా స్థలిలో మంటలు ఎగిసిపడుతున్నాయి.Ahemdabad Plan crash around 242 passengers are traveling 💔 reason :- technical fault #Planecrash #Ahmedabad #Airindia #crash pic.twitter.com/5iUENTIPxd— Manan Trivedi (@itsurbunny7) June 12, 2025828 అడుగుల ఎత్తులో విమానం క్రాష్ అయ్యింది. విమానం కూలిన మేఘాని ప్రాంతంలో దట్టమైన పొగలు అలుముకున్నాయి. ఫైరింజన్లు మంటలు ఆర్పే ప్రయత్నాల్లో ఉన్నాయి. పలువురిని అంబులెన్సులలో ఆస్పత్రికి తరలించినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. క్షత గాత్రులను సమీప ఆసుపత్రులకు తరలిస్తున్నారు.గుజరాత్ సీఎంతో మాట్లాడిన అమిత్ షాఅహ్మదాబాద్లో ఎయిరిండియా విమాన ప్రమాదంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా వెంటనే స్పందించారు. విమాన ప్రమాదం గురించి తెలియగానే గుజరాత్ ముఖ్యమంత్రి, హోం మంత్రి, అహ్మదాబాద్ పోలీసు కమిషనర్తో ఫోన్లో మాట్లాడారు. సహాయక చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం తరపున పూర్తి సహాయం అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు.విమానంలో 242 మంది: డీజీసీఏఅహ్మదాబాద్లో ప్రమాదానికి గురైన ఎయిరిండియా విమానంలో 242 మంది ఉన్నారని సివిల్ ఏవియేషన్ డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) వెల్లడించింది. వీరిలో ఇద్దరు పైలట్లు, 10 మంది క్యాబిన్ సిబ్బంది ఉన్నట్టు తెలిపింది. కెప్టెన్ సుమీత్ సభర్వాల్, ఫస్ట్ ఆఫీసర్ క్లైవ్ కుందర్ కూడా ప్రమాద సమయంలో విమానంలో ఉన్నారు. -
టూరిస్టులకూ నో : మాంసాహారాన్ని బ్యాన్ చేసిన ఏకైక నగరం ఇదే..!
గుజరాత్లోని ‘పాలిటానా’ నగరం ప్రపంచంలో మాంసాహారం నిషేధించబడిన ఏకైక నగరంగా నిలిచింది. ఈ నగరంలో, మాంసాహార ఆహార పదార్థాల వినియోగం, అమ్మకం, కలిగి ఉండటం కూడా పూర్తిగా నిషేధం. పర్యాటకులకు కూడా మాంసాహారం తీసుకురావడానికి, తినడానికి అనుమతి లేదు. అసలేంటీ నగరం ప్రత్యేకత. ఇలాంటి నిర్ణయం ప్రభుత్వం ఎందుకు తీసుకుంది తెలుసుకుందామా..!గుజరాత్లోని భావ్నగర్ జిల్లాలో ఉంది పాలిటానా నగరం. రాజధాని నగరం అహ్మదాబాద్ సమీపంలో సౌకర్యవంతంగా ఉంది. జైనులకు ఎంతో పవ్రితమైన ప్రదేశంగా, "జైన్ టెంపుల్ టౌన్" గా పాలిటానా ప్రసిద్ది చెందిది. ఈ ప్రత్యేకతను మరింత నిలుపుకునేలా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా శాఖాహార నగరంగా ప్రకటించింది. 900 కి పైగా జైన దేవాలయాలు ఒక్కడ కొలువు దీరి ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా వేలాది పర్యాటకులు ఇక్కడికి వస్తారు. ఏడాది పొడవునా జైన భక్తులు ఇక్కడికి క్యూ కడతారు.జైనమతం బోధించే వాటిల్లో ప్రధాన సూత్రం అహింస లేదా అనువ్రతం. ఏ జీవికి హాని కలిగించకూడదని విశ్వసిస్తుంది. 2014లో, జైన సన్యాసుల అభ్యర్థనలను అనుసరించి, గుజరాత్ ప్రభుత్వం పాలిటానాను "మాంసం లేని నగరం"గా ప్రకటించింది. దీని ప్రకారం మాంసం, చేపలు ,గుడ్ల అమ్మకం మరియు వినియోగంపై పూర్తి నిషేధాన్ని విధించింది. పూర్తిగా శాఖాహార నగరంగా ప్రకటించిన పాలిటానాలో ఎటువంటి కబేళాలులేదా మాంసాహార రెస్టారెంట్లు ఉండటానికి వీల్లేదు. పర్యాటకులు నగరంలోకి మాంసాహార ఆహారాన్ని తీసుకు రావడం కూడా చట్ట రీత్యా నిషేధం. శ్వేతాంబర జైన సమాజానికి ప్రాథమిక తీర్థయాత్ర స్థలంగా, "సిద్ధక్షేత్రం" లేదా మోక్షాన్ని పొందే ప్రదేశంగా పరిగణించబడే పాలిటానాలో సుమారు 900 దేవాలయాలు ఉన్నాయి. జైన విశ్వాసాల ప్రకారం, అనేక మంది తీర్థంకరులు ఈ కొండపై మోక్షాన్ని పొందారు, దీని ఫలితంగా 2014లో జైన సన్యాసులు మతపరమైన ఉపవాసం ఆచరించారు. శత్రుంజయ దేవాలయాలు 11వ , 20వ శతాబ్దాల మధ్య నిర్మించబడిన వాటి సంక్లిష్టమైన చెక్కబడిన వాస్తుశిల్పం, అద్భుతమైన పాలరాయి పనికి ప్రసిద్ధి చెందాయి. శత్రుంజయ కొండపై ఉన్న ఈ దేవాలయాలను చేరుకోవడానికి సుమారు 3,500 మెట్లు ఎక్కాలి. ఈ ప్రదేశం జైన మతం మరియు గోహిల్ రాజ్పుత్ల వంటి ప్రాంతీయ పాలకులకు ప్రాముఖ్యతను కలిగి ఉంది. చదవండి: భారత్- భూటాన్ ఛిల్.. లాంగ్.. టూర్పాలిటానా జనాభా సుమారు 65,000, అధిక అక్షరాస్యత రేటు 85%. జనాభాలో 60% జైనులు, 35% హిందూ మరియు 5% ముస్లిం మరియు ఇతర వర్గాలు ఉన్నారు. ముఖ్యంగా, పాలిటానాలో నివసించే ముస్లింలు కూడా మాంసాహార నిషేధాన్ని పాటిస్తారు. నగర ఆర్థిక వ్యవస్థ మతపరమైన పర్యాటకంపై వృద్ధి చెందుతుంది, ఏటా లక్షలాది మంది భక్తులు మరియు పర్యాటకులను ఆకర్షిస్తుంది, ఆలయ నిర్వహణ కార్యకలాపాలు, హోటళ్ళు, ధర్మశాలల ద్వారా అనేక మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. -
ఆరావళి గ్రీన్వాల్ ప్రాజెక్టు ప్రారంభం
న్యూఢిల్లీ: ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ‘ఏక్ పేడ్ మా కే నామ్’ కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. దేశ రాజధాని ఢిల్లీలోని భగవాన్ మహావీర్ వనస్థలి పార్కులో గురువారం మొక్క నాటారు. ఢిల్లీ నుంచి గుజరాత్లోని ఆరావళి పర్వతాల వరకు 700 కిలోమీటర్ల మేర అడవుల పెంపకం కోసం ఉద్దేశించిన ‘ఆరావళి గ్రీన్వాల్ ప్రాజెక్టు’ను ప్రారంభించారు. మన భూగోళంపై ఆరావళి పర్వతాలు అత్యంత ప్రాచీనమైనవని ‘ఎక్స్’లో పోస్టు చేశారు. గుజరాత్, రాజస్తాన్, హరియాణా, ఢిల్లీలో ఈ పర్వతాలు విస్తరించి ఉన్నాయని తెలిపారు. కాలుష్యం, వాతావరణ మార్పుల వల్ల ఇక్కడ అడవులు క్రమంగా అంతరించిపోతున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. అందుకే అడవుల పునరుజ్జీవన పథకంపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టిందని వెల్లడించారు. ఈ ఉద్యమంలో ప్రజలంతా పాల్గొనాలని, విరివిగా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా యువత చొరవ తీసుకోవాలని కోరారు. ఆరావళి గ్రీన్వాల్ ప్రాజెక్టుతో పర్యావరణం మెరుగుపడుతుందని ప్రధాని మోదీ ఆశాభావం వ్యక్తంచేశారు. -
వాళ్లకు టెర్రరిజమే టూరిజం
భుజ్/వడోదర: ఆపరేషన్ సిందూర్తో భారత ఆర్మీతో పాకిస్తాన్లోని ఉగ్రవాదులు, సైన్యం, పాలకులకు బుద్ధిచెప్పిన ప్రధాని మోదీ ఇప్పుడు ఆ దేశ ప్రజలకూ హితవు పలికారు. ఉగ్రవాదం మీ ప్రభుత్వం, సైన్యానికి ఆదాయ వనరుగా మారిందని, ఇకనైనా మీరు మేల్కొనాలని పాక్ ప్రజలకు మోదీ పిలుపునిచ్చారు. ఆపరేషన్ సిందూర్ తర్వాత తొలిసారిగా సొంత రాష్ట్రం గుజరాత్లో సోమవారం పర్యటించిన ప్రధాని మోదీ దాహోద్, భుజ్, గాం«దీనగర్లలో రూ.82,950 కోట్లకుపైగా విలువైన పలు ప్రాజెక్టుల ప్రారం¿ోత్సవాలు, శంకుస్థాపనలు చేశాక భుజ్, దాహోద్లలో బహిరంగ సభల్లో ప్రస ంగించారు. పాక్ సరిహద్దులోని కఛ్ జిల్లాలోనూ మోదీ పర్యటించారు. ‘‘భారత్ పర్యాటకాన్ని ప్రోత్సహిస్తుంటే పాకిస్తాన్ ఉగ్రవాదాన్నే పర్యాటకంలా ప్రోత్సహిస్తోంది. పాక్ ఈ తరహా పంథా కేవలం వాళ్లనే కాదు యావత్ ప్రపంచానికే పెనుముప్పుగా పరిణమించింది. పాకిస్తాన్ ప్రజలకు ఒక్కటే చెబుతున్నా. మీ ప్రభుత్వం, సైన్యం ఉగ్రవాదాన్ని ఒక ఆదాయ వనరుగా మార్చుకున్నాయి. ఇకనైనా ఉగ్రవాదానికి అంతం పలికేందుకు మీరంతా ముందుకు రావాలి. సంతోషంగా, ప్రశాంత జీవనం గడపండి. కడుపారా తినండి. రోటీ కావాలో మా తూటా కావాలో మీరే నిర్ణయించుకోండి. మిమ్మల్ని ఒక్కటే అడగదల్చుకున్నా. మేం 11 ఏళ్ల క్రితం అధికారం చేపట్టినప్పుడు భారత్ 11వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉండేది. నేడు జపాన్ను దాటేసి భారత్ ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది. మరి మీరేం సాధించారు?. మీ పరిస్థితేంటి? ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న మీ ప్రభుత్వాలు, సైన్యం మీ పిల్లలకు భవిష్యత్తు లేకుండా చేస్తున్నాయి. ప్రభుత్వ ధోరణి సరైందో కాదో యువతే నిలదీయాలి. మిమ్మల్ని ఆర్మీ, పాలకులు అంధకారంలోకి నెట్టేస్తున్నారు’’అని మోదీ పాక్ ప్రజలకు హితవు పలికారు. పక్షం రోజులు వేచి చూశా ‘‘పహల్గాంలో పాశవిక ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ కఠిన చర్యల కత్తి పట్టుకుంటుందేమోనని 15 రోజులపాటు వేచి చూశా. కానీ ఉగ్రవాదమే పాకిస్తాన్కు తిండిపెడుతోందని స్పష్టమైంది. అందుకే పాక్పై దాడులకు మా బలగాలకు పూర్తి స్వేచ్ఛనిచ్చా. మే 9న భారత సరిహద్దు రాష్ట్రాలపై పాకిస్తాన్ దాడులకు తెగిస్తే అంతకు రెట్టింపు స్థాయిలో దాడి చేసి మేం పాక్ వైమానిక స్థావరాలను నేలమట్టంచేశాం’’అని మోదీ అన్నారు. తర్వాత మోదీ 1971లో పాక్ బాంబుదాడుల్లో ధ్వంసమైన ఎయిర్ఫీల్డ్ను 72 గంటల్లో పునర్నిర్మించిన మధాపార్ గ్రామంలోని 300 మంది మహిళలతో మోదీ మాట్లాడారు. వీళ్లు మోదీకి సిందూర్ మొక్కను బహూకరించారు. ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో దీనిని నాటుతానని మోదీ చెప్పారు.మూడు రోడ్షోలు తొలుత గుజరాత్ పర్యటనలో భాగంగా సోమవారం మోదీ ఏకంగా మూడు రోడ్షోల్లో పాల్గొన్నారు. ఉదయం వడోదరలో భారీ రోడ్షో చేశారు. ఆపరేషన్ సిందూర్ వివరాలను మీడియాకు వెల్లడించి దేశం దృష్టిని ఆకర్షించిన కల్నల్ సోఫియా ఖురేషి తల్లిదండ్రులు, సోదరుడు, కవల సోదరి షాయనా సున్సారా కూడా ఈ రోడ్షోలో పాల్గొనడం విశేషం. ఖురేషి స్వస్థలం వడోదరే. రోడ్ షో సందర్భంగా జనం జాతీయ జెండాలు చేతపట్టుకుని సైన్యాన్ని కీర్తిస్తూ నినాదాలు చేశారు. మోదీ కారు నుంచి బయటకొచ్చి వారికి అభివాదం చేశారు. అనంతరం భుజ్లో, అహ్మదాబాద్లో కూడా మోదీ రోడ్షోలు చేశారు. రాష్ట్రంలో మొత్తం రూ.82,950 కోట్ల ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. -
రిటైర్మెంట్ ప్రకటించిన భారత క్రికెటర్..
ఇండియా-ఎ జట్టు మాజీ కెప్టెన్, గుజరాత్ స్టార్ బ్యాటర్ ప్రియాంక్ పంచల్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అన్ని రకాల క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ విషయాన్ని సోమవారం సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. దాదాపు రెండు దశాబ్దాల పాటు కొనసాగిన తన దేశవాళీ కెరీర్కు ముగింపు పలికాడు.ఫస్ట్ క్లాస్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాలని నిర్ణయించుకున్నాను. నాకు ఈ క్షణం చాలా భాగోద్వేగంతో కూడుకున్నది. అంతే గర్వంగా కూడా ఉంది. నాకు మద్దతుగా నిలిచిన గుజరాత్ క్రికెట్ ఆసోషియేషన్కు, అభిమానులకు, సహచర ఆటగాళ్లు ధన్యవాదాలు అని తన రిటైర్మెంట్ నోట్లో పంచల్ పేర్కొన్నాడు.ప్రియాంక్కు దేశవాళీ క్రికెట్లో అద్బుతమైన రికార్డులు ఉన్నాయి. ఫస్ట్ క్లాస్ క్రికెట్, లిస్ట్-ఎ క్రికెట్లో పరుగులు వరద పారించాడు. ప్రియాంక్ తన 17 ఏళ్ల కెరీర్లో127 ఫస్ట్-క్లాస్ మ్యాచ్లు ఆడి 8856 పరుగులు చేశాడు. ఇందులో 29 సెంచరీలు, 34 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ముఖ్యంగా 2016-17 రంజీ సీజన్లో ఈ గుజరాతీ బ్యాటర్ భీబత్సం సృష్టించాడు. ఆ సీజన్లో ట్రిపుల్ సెంచరీతో చెలరేగాడు. ఓవరాల్గా ఆ ఎడిషన్లో 1310 పరుగులు చేశాడు. అదేవిధంగా97 లిస్ట్ ఏ మ్యాచుల్లో 8 సెంచరీలతో కలిపి 3,672 పరుగులు చేశాడు. 59 టీ20లు ఆడిన ప్రియాంక్ 28.71 సగటుతో 1,522 పరుగులు సాధించాడు.కాగా ప్రియాంక్ 2021లో టీమిండియాకు రిజర్వ్ ఓపెనర్గా ఎంపికయ్యాడు. కానీ భారత తరుపన అరంగేట్రం చేసే అవకాశం మాత్రం లభించలేదు. 2022 శ్రీలంక టూర్కు కూడా సెలక్ట్ అయ్యాడు. అక్కడ కూడా అతడికి డెబ్యూ చేసే ఛాన్స్ రాలేదు. -
వడోదరలో ప్రధాని మోదీ రోడ్ షో
-
పాక్కు రహస్య సమాచారాన్ని చేరవేస్తున్న వ్యక్తి అరెస్ట్
అహ్మదాబాద్: గుజరాత్లోని మిలటరీ సంస్థల కీలక సమాచారాన్ని పాకిస్తాన్ గూఢచార విభాగాలకు చేరవేస్తున్న సరిహద్దుల్లోని కచ్ జిల్లా వాసిని పోలీసులు అరెస్ట్ చేశారు. లఖ్పత్ ప్రాంతానికి చెందిన సహదేవసిన్హ్ గోహిల్(28) కాంట్రాక్టు ఆరోగ్య కార్యకర్తగా పనిచేస్తున్నాడు. 2023లో ఇతడికి అదితి భరద్వాజ్ పేరుతో పాకిస్తాన్ ఏజెంట్ వాట్సాప్ ద్వారా పరిచయమైంది. తరచూ చాటింగ్ చేస్తూ అతడిని బుట్టలో వేసుకుంది. గోహిల్ తన ఆధార్ కార్డుతో తీసుకున్న రెండు సిమ్ల ఓటీపీలను ఆమెకు పంపాడు. దీంతో, ఆమె పాకిస్తాన్ నుంచి ఆ నంబర్లతో వాట్సాప్ చాటింగ్ సాగిస్తోంది. ఆమె కోరిన విధంగా, తనుండే ప్రాంతంలోని బీఎస్ఎఫ్, నేవీల మౌలిక వసతులతోపాటు నిర్మాణంలో ఉన్న వాటికి సంబంధించిన కీలక సమాచారాన్ని, ఫొటోలను పంపాడు. బదులుగా గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఇతడికి రూ.40 వేల నగదు అందింది. విషయం పసిగట్టిన గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్(ఏటీఎస్) ఇటీవల గోహిల్ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. అదితి భరద్వాజ్ పాకిస్తాన్ గూఢచారి అనే విషయం గోహిల్కు తెలుసునని ఏటీఎస్ శనివారం వెల్లడించింది. ఇతడితోపాటు పాక్ ఏజెంట్ అదితి భరద్వాజ్పైనా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని తెలిపింది. -
గుజరాత్లో పాకిస్థాన్ గూఢచారి అరెస్ట్
కచ్: సరిహద్దు భద్రతా దళం (BSF), భారత వైమానిక దళం (IAF)కు సంబంధించిన కీలక రహస్య సమాచారాన్ని పాకిస్థాన్కు చేరవేస్తున్నాడనే ఆరోపణలపై ఓ వ్యక్తిని గుజరాత్లోని కచ్లో యాంటీ టెర్రరిజం స్క్వాడ్ అరెస్ట్ చేసింది. ఆరోగ్య కార్యకర్తగా పని చేస్తున్న సహ్దేవ్ సింగ్ గోహిల్ అనే వ్యక్తి,.. 2023 జూన్, జూలై మధ్యలో వాట్సాప్ ద్వారా అదితి భరద్వాజ్ అనే మహిళతో అతడు పరిచయం పెంచుకోగా.. ఆమె పాకిస్థాన్ ఏజెంట్ అని అతనికి ఆ తర్వాత తెలిసింది.కొత్తగా నిర్మిస్తున్న బీఎస్ఎఫ్, ఐఏఎఫ్ సైట్ల ఫోటోలు వీడియోలు ఆమె అడగటంతో వాట్సాప్ ద్వారా వాటిని పంపించాడని గుజరాత్ ఏటీఎస్ సీనియర్ అధికారి కే సిద్ధార్థ్ తెలిపారు. ఈ ఏడాది ప్రారంభంలో గోహిల్ తన ఆధార్ వివరాల ద్వారా ఒక సిమ్ కార్డును కొనుగోలు చేశాడని.. పాక్ మహిళా ఏజెంట్తో సంప్రదింపుల కోసం వాట్సాప్ను యాక్టివేట్ చేశాడు.ఆ తర్వాత పాకిస్థాన్ ఏజెంట్ ఉపయోగిస్తున్న ఆ నంబర్ నుంచి బీఎస్ఎఫ్, ఐఏఎఫ్ సదుపాయాలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు షేర్ చేశాడు. గూఢచార చర్యకు పాల్పడిన గోహిల్కు గుర్తు తెలియని వ్యక్తి రూ.40,000 చెల్లించినట్లు నిర్ధారించిట్లు ఏటీఎస్ అధికారి తెలిపారు. -
బంగ్లాదేశ్ అక్రమ వలసదారులపై ఉక్కుపాదం
-
‘ట్రైలర్ మాత్రమే చూశారు.. పాక్ తీరు మారకపోతే పూర్తి సినిమా చూపిస్తాం’
గాంధీనగర్: ఆపరేషన్ సిందూర్ (operation sindoor) ముగియలేదు. ట్రైలర్ మాత్రమే చూశారు. పాక్ తీరు మార్చుకోకపోతే సినిమా చూపిస్తాం’ అంటూ కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ (rajnath singh) హెచ్చరికలు జారీ చేశారు. శుక్రవారం గుజరాత్లోని భుజ్ ఎయిర్ బేస్లో ఆపరేషన్ సిందూర్లో పాల్గొన్న ఎయిర్ వారియర్స్తో రాజ్నాథ్ భేటీ అయ్యారు. ఆపరేషన్ సిందూర్లో పాల్గొన్న ఎయిర్ వారియర్స్పై ప్రశంసల వర్షం కురిపించారు. అనంతరం, ఆయన మీడియా మాట్లాడారు. పాకిస్తాన్పై భారత్ విజయానికి ఎయిర్బేస్ సాక్ష్యం.పహల్గాం దాడి, ఆ తర్వాత ఆపరేషన్ సిందూర్ను ప్రపంచమంతా చూసింది. పాకిస్తాన్లో ఉగ్రశిబిరాలను ధ్వంసం చేశాం. బ్రహ్మోస్ మిస్సైల్ పవరేంటో పాకిస్తాన్కు చూపించాం. బోర్డర్ దాటకుండానే పాక్ ఉగ్ర శిబిరాలను నాశనం చేశాం. పాకిస్తాన్ ముఖ్య ఉగ్ర కేంద్రాన్ని ధ్వంసం చేశాం. నయా భారత్ ఎంటో ప్రపంచానికి తెలిసింది.మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది మసూద్ అజహార్కు పాక్ రూ.14కోట్లు ఇచ్చింది. ప్రపంచానికి మన సత్తా ఏంటో కళ్లకు కట్టేలా చూపించాం. మన వాయిసేన అసమాన ప్రతిభ కనబర్చి ప్రత్యర్థులను వణికించింది. ఉగ్రవాదులకు పాకిస్తాన్ ఫండింగ్ చేస్తోంది. ఇది ఒక ట్రైలర్ మాత్రమే.. పాక్కు అసలు సినిమా ముందుంది’ అంటూ రాజ్నాథ్ సింగ్ వ్యాఖ్యానించారు. Addressing the brave Air Warriors at the Air Force Station in Bhuj (Gujarat). https://t.co/3TGhBlyxFH— Rajnath Singh (@rajnathsingh) May 16, 2025 -
సరిహద్దుల్లో కాల్పుల మోత
న్యూఢిల్లీ/జమ్మూ/శ్రీనగర్: సరిహద్దుల వెంబడి పాక్ సైన్యం కాల్పులు శనివారం వరుసగా పదహారో రోజు కూడా కొనసాగాయి. దాంతో పశ్చిమ సరిహద్దు ప్రాంతాలు దద్దరిల్లాయి. ఆపరేషన్ బున్యాన్ ఉల్ మర్సూస్ (పడగొట్టలేని దృఢమైన గోడ) పేరిట శుక్రవారం అర్ధరాత్రి నుంచి జమ్మూ కశ్మీర్ మొదలుకుని గుజరాత్ దాకా సైన్యం భారీ కాల్పులకు పాల్పడింది. సైనిక స్థావరాలతో పాటు సాధారణ జనావాసాలు, పౌర మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుంది. పంజాబ్లోని పఠాన్కోట్, జలంధర్, హోషియార్పూర్, అమృత్సర్, ఫిరోజ్పూర్, తార్న్తరన్, హరియాణాలోని సిర్సాలో కాల్పులు, పేలుళ్ల శబ్దాలు విని్పంచాయి. పాక్ కాల్పులను సైన్యం దీటుగా తిప్పికొట్టింది. మన ప్రతిదాడుల భయంతో శనివారం తెల్లవారుజాము 3.15 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల దాకా పాక్ తన గగనతలాన్ని పూర్తిగా మూసేసింది. ప్రభుత్వాధికారి సహా ఆరుగురి మృతి పాక్ కాల్పుల్లో జమ్మూలో ఆరుగురు మరణించారు. 8 మంది బీఎస్ఎఫ్ సిబ్బంది సహా 20 మంది గాయపడ్డారు. మృతుల్లో రాజౌరీ జిల్లా అభివృద్ధి విభాగం అదనపు కమిషనర్ రాజ్కుమార్ థాపా, ఓ సైనికాధికారితో పాటు రెండేళ్ల బాలిక ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. శుక్రవారం అర్ధరాత్రి దాటాక పాక్ సైన్యం సామాన్యులపై విచక్షణారహితంగా కాల్పులకు తెగబడటమే గాక డ్రోన్లు ప్రయోగించిందని పేర్కొన్నారు. జమ్మూ సహా పలు పట్టణాలు, గ్రామాల్లో శుక్రవారం నుంచి ప్రజలకు కంటిమీద కునుకు లేకుండాపోయింది. సైరన్లు నిరంతరాయంగా మోగుతుండడంతో భయాందోళనలకు గురయ్యారు. శనివారం ఉదయం 5 గంటలకు భారీగా పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. రాజ్కుమార్ థాపా అధికారిక నివాసంపై కాల్పుల్లో ఆయనతో పాటు ఇద్దరు సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. థాపా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. దాంతో స్థానికంగా విషాదం అలుముకుంది. థాపా శుక్రవారం సైతం విధుల్లో పాల్గొన్నారు. ఉప ముఖ్యమంత్రితో కలిసి జిల్లావ్యాప్తంగా పర్యటించారు. సీఎం వీడియో కాన్ఫరెన్స్కు హాజరయ్యారు. పాక్ దాడుల్లో రాజౌరీ టౌన్లో ఐషా నూర్ (2), మొహమ్మద్ షోహిబ్(35) మృతిచెందారు. పూంఛ్ జిల్లాలో రషీదా బీ(55) ప్రాణాలు కోల్పోయారు. ముగ్గురు గాయాలపాలయ్యారు. జమ్మూ జిల్లా ఆర్.ఎస్.పురా సెక్టార్లో అశోక్ కుమార్ అనే పౌరుడు విగతజీవిగా మారాడు. పూంఛ్లోని కృష్ణఘాటీ సెక్టార్లో బాంబు పేలుడులో హిమాచల్ ప్రదేశ్కు చెందిన సుబేదార్ మేజర్ పవన్ కుమార్ అమరుడయ్యాడు. జమ్మూ శివార్లలోని ఖేరీ కేరాన్ గ్రామంలో జకీర్ హుస్సేన్ (45) మరణించాడు. శ్రీనగర్లో భారీ పేలుళ్లు శ్రీనగర్ శనివారం పేలుళ్లతో దద్దరిల్లింది. ఉదయం 11.45 గంటల వేళ ఎయిర్పోర్టు సమీపంలో రెండు శక్తిమంతమైన పేలుళ్లు సంభవించినట్లు అధికారులు చెప్పారు. ముందు జాగ్రత్త చర్యగా నగరంలో విద్యుత్ సరఫరా నిలిపివేశారు. అంతకుముందు నగరంలో పలు ప్రాంతాల్లో పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. శ్రీనగర్లోని ఓల్డ్ ఎయిర్ఫీల్డ్ వైపు దూసుకొచి్చన ఓ డ్రోన్ను సైన్యం కూల్చివేసింది. సీఎం ఒమర్ సంతాపం రాజ్కుమార్ థాపా మరణం పట్ల జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా సంతాపం ప్రకటించారు. అంకితభావం కలిగిన సీనియర్ అధికారిని కోల్పోయామని ఆవేదన వ్యక్తంచేశారు. జమ్మూలో దాడులు జరిగిన ప్రాంతాల్లో ఒమర్ పర్యటించారు. జరిగిన నష్టాన్ని పరిశీలించి ప్రజలకు స్థైర్యం చెప్పే ప్రయత్నం చేశారు.హిమాచల్లో డ్రోన్, క్షిపణుల శకలాలు హిమాచల్ప్రదేశ్ రాష్ట్రం ఉనా జిల్లాలోని బెహాద్ గ్రామంలో శనివారం క్షిపణి శకలాలు లభ్యమయ్యాయి. కాంగ్రా జిల్లా నూర్పూర్లో రెండుచోట్ల డ్రోన్, మిస్సైల్ విడిభాగాలను గుర్తించారు. అవి సైన్యం కూల్చివేసిన పాక్ డ్రోన్లు, క్షిపణుల విడిభాగాలని అంచనా వేస్తున్నారు. శుక్రవారం అర్ధరాత్రి తర్వాత అక్కడ భారీగా పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. సైనిక పోస్టులు, ఉగ్ర లాంచ్ప్యాడ్లు ధ్వంసం జమ్మూ సమీపంలో పాకిస్తాన్ భూభాగంలో సైనిక పోస్టులతో ఉగ్రవాదుల లాంచ్ప్యాడ్లను భారత సైన్యం ధ్వంసం చేసింది. ‘‘భారత్పై డ్రోన్ దాడులకు ఈ లాంచ్ప్యాడ్లనే వాడారు. ఇవి పాక్లోని సియాల్కోట్ జిల్లా లూనీలో ఉన్నాయి’’ అని బీఎస్ఎఫ్ వెల్లడించింది. అంతర్జాతీయ సరిహద్దు వెంబడి పాక్ భూభాగం నుంచి జరిగిన కాల్పులకు గట్టిగా బదులిచ్చామని వెల్లడించింది. శుక్రవారం రాత్రి 9 గంటల సమయంలో బీఎస్ఎఫ్ పోస్టులే లక్ష్యంగా పాక్ సైన్యం దాడులకు దిగింది. దాంతో పాక్ రేంజర్ల క్యాంపులపై బీఎస్ఎఫ్ విరుచుకుపడింది.మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలుకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా జమ్మూ: పాకిస్తాన్ కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన సరిహద్దు ప్రాంతాల్లోని వారి కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పరిహారం అందజేస్తామని జమ్మూకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా ప్రకటించారు. బారాముల్లా, పూంఛ్, రాజౌరీ, జమ్మూ సెక్టార్లపై నాలుగు రోజుల పాటు జరిగిన కాల్పుల్లో జిల్లా అదనపు అభివృద్ధి కమిషనర్ సహా 19 మంది చనిపోయారు. ‘పాక్ వైపు నుంచి జరిగిన కాల్పుల్లో అమాయకులు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర వేదన కలిగించింది. మా ప్రజలకు కలిగిన నష్టాన్ని సాధ్యమైనంత మేర తగ్గించేందుకు అవసరమైన అన్ని చర్యలను తీసుకుంటాం. ఆప్తులను కోల్పోయిన వారి వేదనను తగ్గించలేకపోవచ్చు గానీ ఆ కుటుంబాలకు మా వంతు మద్దతుగా రూ.10 లక్షల చొప్పున అందజేస్తాం’అని సీఎం ఒమర్ పేర్కొన్నారు. -
సరిహద్దు జిల్లాల్లో 'హై అలర్ట్'
చండీగఢ్/అహ్మదాబాద్: భారత్–పాకిస్తాన్ ఉద్రిక్తతల మధ్య అంతర్జాతీయ సరిహద్దును పంచుకుంటున్న పంజాబ్, గుజరాత్ రాష్ట్రాలు హై అలర్ట్ ప్రకటించాయి. పాకిస్తాన్తో పంజాబ్ 532 కిలోమీటర్లు, రాజస్థాన్ 1,070 కిలోమీటర్లు సరిహద్దును పంచుకుంటోంది. రెండు రాష్ట్రాల్లో పోలీసుల సెలవులను రద్దు చేశారు. తదుపరి ఆదేశాలు వచ్చేవరకు పాఠశాలలను కూడా మూసివేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ప్రజలు నిత్యావసర వస్తువుల కోసం దుకాణాల ముందు క్యూ కట్టారు. పంజాబ్లోని సరిహద్దుకు సమీపంలోని అన్ని జిల్లాల్లో హై అలర్ట్ ప్రకటించారు. ఆరు సరిహద్దు జిల్లాలైన ఫిరోజ్పూర్, పఠాన్కోట్, ఫాజిల్కా, అమృత్సర్, గురుదాస్పూర్, తార్న్ తరన్ జిల్లాల్లో పాఠశాలలను మూసివేశారు. పోలీసుల సెలవులను రద్దు చేశారు. ఇక అమృత్సర్లో నిత్యావసర వస్తువుల బ్లాక్ మార్కెటింగ్ను నిరోధించడానికి జిల్లా యంత్రాంగం ఒక టాస్్కఫోర్స్ను ఏర్పాటు చేసింది. జిల్లాలో నిత్యావసర వస్తువుల కొరత లేదని, బ్లాక్ మార్కెటింగ్ను ప్రోత్సహించవద్దని, ప్రజలు అనవసరంగా అదనపు వస్తువులను కొనుగోలు చేయవద్దని అధికారులు కోరారు. మరోవైపు పప్పులు, వంటనూనె, గోధుమ పిండి, పంచదార, ఉప్పు వంటి వస్తువులను పెద్దమొత్తంలో కొనుగోలు చేసేందుకు అమృత్సర్లోని కిరాణా దుకాణాలు, డిపార్ట్మెంటల్ స్టోర్ల వద్ద ప్రజలు క్యూ కట్టారు. సరిహద్దు జిల్లాల్లో ఒకటైన గురుదాస్పూర్లో గురువారం రాత్రి 9 గంటల నుంచి తదుపరి ఆదేశాలు వచ్చే వరకు బ్లాకవుట్ విధించారు. ప్రజల భద్రత కోసం పోలీసు స్క్వాడ్లు, క్విక్ రెస్పాన్స్ బృందాలను నియమించింది. అత్యవసర సహాయం కోసం హెల్ప్లైన్లను ఏర్పాటు చేసింది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ప్రభుత్వం అన్ని బహిరంగ కార్యక్రమాలను రద్దు చేసింది. రిట్రీట్ నిలిపివేత.. ప్రజల భద్రత దృష్ట్యా పాక్ సరిహద్దుల్లో రిట్రీట్ వేడుకలను బీఎస్ఎఫ్ నిలిపివేసింది. పంజాబ్లోని పాకిస్తాన్ వెంబడి ఉన్న మూడు సరిహద్దు చెక్పోస్టుల వద్ద రిట్రీట్ వేడుకలను నిర్వహించబోమని సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) తెలిపింది. పాకిస్తాన్ వాఘాకు ఎదురుగా ఉన్న అట్టారీ (అమృత్సర్), ఫిరోజ్పూర్ జిల్లాలోని హుస్సేనీవాలా, ఫజిల్కా జిల్లాలోని సద్కీ వద్ద ఉన్న జేసీపీల వద్ద పాకిస్తాన్ రేంజర్లతో కలిసి బీఎస్ఎఫ్ దళాలు ప్రతిరోజూ సాయంత్రం రిట్రీట్ కార్యక్రమాన్ని నిర్వమిస్తాయి. తీరప్రాంతంలో కట్టుదిట్టమైన భద్రత.. ఇక గుజరాత్ తీరం వెంబడి భద్రతను కట్టుదిట్టం చేసింది. పోలీసు సిబ్బంది సెలవులను రద్దు చేసింది. తీరం వెంబడి ఉన్న రాజ్కోట్ రేంజ్లోని జామ్నగర్, మోర్బి, దేవభూమి, ద్వారకాల్లో పోలీసులు అప్రమత్తంగా ఉన్నారు. పోలీసులు తీరప్రాంత గ్రామాలు, బోట్ల్యాండింగ్ పాయింట్లను సందర్శిస్తున్నారు. అనుమానాస్పద కార్యకలాపాలు కనిపిస్తే సమాచారం ఇవ్వాలని గ్రామస్తులను పోలీసులు కోరుతున్నారు. -
అపుడు కాలుష్య కాసారం : ఇపుడు ఏడాదికి 600 టన్నుల పళ్లు
లయన్స్ ఇండస్ట్రీస్ (Reliance Industries) అనగానే ఆయిల్ నుంచి టెలికాం దాకా వివిధ రంగాల్లో అందిస్తున్న సేవలు గుర్తొస్తాయి. ముఖేష్ అంబానీ (Mukesh Ambani) సారధ్యంలోని రిలయన్స్ ప్రపంచంలోనే అత్యధికంగా మామిడిపండ్లను ఎగుమతి చేసే సంస్థల్లో ఒకటిగా ఉందని తెలుసా? అంబానీకి ఎన్ని ఎకరాల మామిడి తోట ఉంది? ఎన్ని రకాలు మామిడి పళ్లను పండిస్తారు? అసలు మ్యాంగో ఫామ్ వెనుకున్న రియల్ స్టోరీ ఏంటి? ఆ వివరాలు మీకోసం.గుజరాత్లోని జామ్నగర్లో 600 ఎకరాల మామిడి తోట (Reliance Mango Farm) రిలయన్స్ సొంతం. ఇందులో 1.5 లక్షలకు పైగా వివిధ రకాల మామిడి చెట్లున్నాయి. అల్ఫాన్సో మొదలు టామీ అట్కిన్స్ , 200లకు పైగా దేశీ, విదేశీ రకాల మామిడి చెట్లు ఫలాలనిస్తాయి. వీటిల్లో చాలా వరకు ప్రపంచంలోని అత్యుత్తమ రకాలకు చెందినవి కావడం విశేషం.ఇదీ చదవండి : ప్రిన్స్ హ్యారీతో విడాకులా? తొలిసారి మౌనం వీడిన మేఘన్అయితే రిలయన్స్ మామిడి వ్యాపారంలోకి ప్రవేశించటానికి వెనుక ఒక కథ ఉంది. మ్యాంగో ఫామ్ హౌస్ వెనకాల పెద్ద చరిత్ర ఉంది. 1997లో, జామ్నగర్లోని రిలయన్స్ శుద్ధి కర్మాగారం భారీ కాలుష్యానికి కారణమైంది. గుజరాత్ కాలుష్య నియంత్రణ బోర్డు నుండి పదేపదే నోటీసులిచ్చింది. పర్యావరణాన్ని కాపాడి, ఫ్యాక్టరీని కొనసాగించే లక్ష్యంతో, అనివార్యంగా రిలయన్స్ మామిడి తోటను పెంచేందుకు నిర్ణయం తీసుకుంది రిలయన్స్. 1998 లో ఈ కర్మాగారం చుట్టూ ఉన్న బంజరు, ఉప్పునీటి భూముల్లో మామిడి చెట్లను నాటించింది. ఇక్కడున్న అనేక ప్రతికూలతలను అధిగమించేందకు కంపెనీ కొత్త టెక్నాలజీని వినియోగించింది. డీశాలినేషన్, బిందు సేద్యం, వర్షపు నీటి సంరక్షణ, పోషక నిర్వహణ పద్దతులను పాటించారు. సముద్రపు నీటిని శుద్ధి చేసేందుకు, డీశాలినేషన్, నీటి కొరత సమస్యను ఎదుర్కోవడానికి వాటర్ హార్వెస్టింగ్ వంటి పద్దతులను ఉపయోగించారు.చదవండి: ముద్దుల మూట, మనసెలా వచ్చింది : వైద్యురాలి వీడియో వైరల్దాదాపు 7-8 సంవత్సరాల ప్రయత్నాలు ఫలించాయి. ఈ గార్డెన్ పేరే ధీరూభాయ్ అంబానీ లఖిబాగ్ అమ్రాయీ. ప్రపంచంలోనే అతిపెద్దదిగా 600 ఏకాల విస్తీర్ణంలో చుట్టూ పచ్చని చెట్లతో ఏడాది 600 టన్నుల మామిడి పళ్లను అందిస్తుందీ తోట. అందుకే ఇది ప్రపంచంలోనే అతిపెద్ద మామిడి పండ్ల ఎగుమతిదారుగా అవతరించింది. అలా కాలుష్య కాసార నుంచి పచ్చని ప్రకృతిక్షేత్రంగా ఎదిగింది. దీంతో పాటు రిలయన్స్ ప్రతి సంవత్సరం ఒక లక్ష మొక్కలను ఉచితంగా పంపిణీ చేస్తుంది. అలాగే ఆధునిక వ్యవసాయంలో శిక్షణ అందించడం ద్వారా స్థానిక రైతులకు సహాయం చేస్తుంది. ఇదీ చదవండి: మనవడితో 50 ఏళ్ల మహిళ పెళ్లి : ఫ్యామిలీని లేపేసేందుకు కుట్ర? -
జల్లెడ పడితే.. ‘చీమల దండులా’ బయటకొచ్చారు!
అహ్మదాబాద్: పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం పాకిస్తాన్ జాతీయుల వీసాల రద్దు, వారిని తిరిగి వెనక్కి పంపించే చర్యలు కొనసాగుతున్న వేళ.. అక్రమంగా భారత్ లో నివసిస్తున్న విదేశీయులు వేల సంఖ్యలో బయటపడుతున్నారు. గుజరాత్ రాష్ట్రంలో పోలీసులు నిర్వహించిన కూంబింగ్ ఆపరేషన్ లో అక్రమంగా భారత్ కు వచ్చి ఇక్కడ ఎన్నో ఏళ్ల నుంచి నివసిస్తున్న బంగ్లాదేశ్ కు చెందిన వారు వెయ్యి మందికి పైగా ఉన్నట్లు గుర్తించారు. కూంబింగ్ ఆపరేషన్ లో భాగంగా అక్రమ వలస దారుల వేరివేతకు శ్రీకారం చుడితే అహ్మదాబాద్, సూరత్ లలో కలిపి వెయ్యి మందికి పైగా అక్రమ బంగ్లా దేశీయులను గుర్తించినట్లు ఆ రాష్ట్ర హోంమంత్రి హర్ష్ సంఘ్వీ శనివారం తెలిపారు. అహ్మదాబాద్ లో నివసిస్తున్న బంగ్లాదేశీయులు 890 మంది కాగా, సూరత్ లో నివసిస్తున్న బంగ్లా జాతీయులు 134 ఉన్నట్లు గుర్తించినట్లు హోంమంత్రి తెలిపారు. ఇది గుజరాత్ రాష్ట్రంలో అతిపెద్ద పోలీస్ ఆపరేషన్ అని ఆయన పేర్కొన్నారు.స్వచ్ఛందంగా బయటకు రండి.. లేకపోతేఅక్రమ వలసదారులకు ఎవరైనా ఆశ్రయం ఇస్తే కఠినమైన చర్యలు ఉంటాయని సంఘ్వీ హెచ్చరించారు. ఎవరైనా ఇంకా ఉంటే స్వచ్ఛందంగా లొంగిపోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. లేకపోతే ఆపై తీసుకునే కఠిన చర్యలు దారుణంగా ఉంటాయన్నారు. Surat, Gujarat | The people caught last night are Bangladeshis. We will check their documents. After this, we plan to send them to Bangladesh: Surat JCP Crime Raghavendra Vats. https://t.co/jqgyPEJmzm— ANI (@ANI) April 26, 2025 Over 550 Illegal Bangladeshi immigrants detained in Gujarat operationsRead @ANI Story | https://t.co/NuuktkcjCp#IllegalImmigrant #Gujarat pic.twitter.com/6Cwc8g3Ci9— ANI Digital (@ani_digital) April 26, 2025 Massive numbers incoming - More than 1000 illegal Bangladeshis and Pakistanis detained in pre-dawn Ops by Gujarat PoliceMale - 436+88Female - 240+44Kids - 214Total - 1022 pic.twitter.com/rvAB5HdLPQ— Megh Updates 🚨™ (@MeghUpdates) April 26, 2025 -
కోడలికి రెండో పెళ్లి చేసి, కన్నీటితో సాగనంపిన ‘మామగారు’
కన్నవారిని, ఉన్న ఊరిని వదిలి, కోటి ఆశలతో అత్తింటికి చేరే కోడళ్లను కన్న కూతురిలా చూసుకునే కుటుంబాలు చాలా ఉన్నాయి. కానీ కొడుకు మరణం తరువాత కోడల్ని అక్కున చేర్చుకుని ఆదరించడమే కాకుండా, ఆమెకు మరో జీవితాన్ని ప్రసాదించిన కుటుంబాలు చాలా అరుదుగా ఉంటాయి. అలాంటి ఒక హృద్యమైన కథనం నెట్టింట వైరల్గా మారింది. అనేక ప్రశంసలు దక్కించుకుంది. గుజరాత్లోని అంబాజీ నివాసి ప్రవీణ్ సింగ్ రాణా. ముదిమి వయసులో ఆదు కుంటాడనుకున్న పెద్ద కుమారుడు సిద్ధరాజ్ సింగ్ అర్థాంతరంగా కన్నుమూశాడు. దీంతో తనతో పాటు కోడలు, నెలల వయస్సున్న చిన్న బిడ్డ అనాథలైపోయారు. కానీ ఇక్కడే ప్రవీణ్ సింగ్ తన పెద్దరికాన్ని చాటుకున్నాడు. కోడలికి తండ్రి స్థానంలో నిలబడ్డాడు. చక్కగా పెళ్లి చేసి అత్తారింటికి సాగనంపాడు. కోడలి, మనవరాల్ని కన్నీటితో సాగనంపడం విశేషంగా నిలిచింది.చదవండి: Attari Border Closure : పెళ్లి ఆగిపోయింది! కొడుకు మరణం2024లో దీపావళి పండుగ సందర్భంగా ఆకస్మిక గుండెపోటు రావడంతో కన్నుమూశాడు. ఈ సంఘటనతో సిద్ధరాజ్ భార్య కృష్ణ, చిన్నారి దీక్షితతో సహా కుటుంబం మొత్తం దిగ్భ్రాంతికి లోనైంది. ఇక జీవితాంతం భర్తలేకుండా గడపాల్సి ఉంటుందని, తండ్రి లేకుండా తన కుమార్తెను ఎలా పెంచాలంటూ కృష్ణ అంతులేని శోకంలో మునిగిపోయింది. చుట్టుపక్కల సమాజం కూడా అలానే అనుకుంది.కానీ ప్రవీణ్ మనసు వేరేలా ఆలోచించింది. తన కుమార్తెలా చూసుకున్నాడు. సమాజం అభిప్రాయాలను, భయాలను పట్టించుకోకుండా, తన కొడుకు ప్రాణ స్నేహితుడు సంజయ్తో తన కోడలి కృష్ణకు వైభవంగా పెళ్లి జరిపించాడు. కోడలితో పాటు, మనవరాలు దీక్షిత తరలి పోతోంటే, తన తల్లితో వెళ్లిపోయినప్పుడు తాత భావోద్వేగంగా కన్నీళ్లు పెట్టుకున్నాడు. దీంతో నెటిజన్లు ప్రవీణ్,కుటుంబంపై ప్రశంసలు కురిపించారు. ఇలాంటి ప్రేమ, ఆప్యాయతలు కదా నేటి సమాజానికి కావాల్సింది అంటూ వ్యాఖ్యానించారు.ఇదీ చదవండి: రూ. 40 లక్షల నుంచి 20 కోట్లకు ఒక్కసారిగా జంప్.. ఎవరీ నటుడు?కృష్ణను రెండో పెళ్లి చేసుకున్న సంజయ్ ప్రవీణ్కు ధన్యవాదాలు తెలిపారు. సిద్ధరాజ్ తన చిన్ననాటి స్నేహితుడనీ, కృష్ణను కొంతకాలంగా తనకు తెలుసునని చెప్పారు. కృష్ణ, దీక్షితను కంటికి రెప్పలా చూసుకుంటానని సిద్ధరాజ్ కుటుంబానికి సంజయ్ హామీ ఇచ్చాడు. తన స్నేహితుడి కుమార్తె , కోడలికి కొత్త జీవితాన్ని ఇవ్వాలనుకున్నాను. దీని గురించి ప్రవీణ్ సింగ్తో మాట్లాడాను. ఆయన మా పెళ్లికి అంగీకరించారు అని చెప్పుకొచ్చాడు. అటు కృష్ణ కూడా అత్త మామలకు కన్నీటితో కృతజ్ఞతలు తెలిపింది. -
రూ.1,800 కోట్ల డ్రగ్స్ పట్టివేత
అహ్మదాబాద్: గుజరాత్ తీరంలో మాదకద్రవ్యాలను అక్రమంగా తీసుకువచ్చే పాకిస్తాన్ స్మగ్లర్ల ఆటకట్టింది. గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ బృందం(ఏటీఎస్), తీర రక్షక దళం(ఐసీజీ) సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్లో రూ.1,800 కోట్ల విలువైన 300 కిలోల మెథాంఫెటమైన్ అనే సింథటిక్ డ్రగ్ పట్టుబడింది. ఈ నెల 12వ తేదీ అర్ధరాత్రి దాటాక అరేబియా సముద్రంలో ఘటన చోటుచేసుకుంది. ఫిదా అనే పేరున్న మాఫియా ముఠా చేపల పడవలో భారత జలాల్లోకి ప్రవేశించనుందంటూ ఏటీఎస్ అందించిన నిఘా సమాచారం మేరకు ఐసీజీ గస్తీని ముమ్మరం చేసింది. అంతర్జాతీయ సముద్ర జలాలకు అత్యంత సమీపంలో అర్ధరాత్రి సమయంలో ఐసీజీ గస్తీ ఓడను దూరం నుంచే గమనించిన స్మగ్లర్లు తమ బోటులో ఉన్న డ్రగ్స్ డ్రమ్ములను సముద్రంలో విసిరేశారు. వేగంగా అంతర్జాతీయ సముద్ర జలాల సరిహద్దుల వైపు వెళ్లిపోయారు. ఇదంతా వెంటవెంటనే జరిగిపోయింది. వారిని పట్టుకునేందుకు ఐసీజీ చేసిన ప్రయత్నం ఫలించలేదు. కటిక చీకటిలోనే వారు విసిరేసిన డ్రగ్ పార్శిళ్లను ఐసీజీ, ఏటీఎస్ సిబ్బంది గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నారు. అందులో ఉన్న 311 ప్యాకెట్లలో 311 కిలోల మెథాంఫెటమైన్ను పోర్బందర్ తీరానికి తరలించి, దర్యాప్తు చేపట్టామని ఐసీజీ తెలిపింది. ఈ ప్యాకెట్లను ప్లాస్టిక్ డ్రమ్ముల్లో సీల్ వేసి ఉంచారని, సముద్ర జలాల్లో వేసినా అందులోని సరుకు పాడవదని ఏటీఎస్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ సునీల్ జోషి చెప్పారు. ఈ డ్రగ్స్ గమ్యస్థానం తమిళనాడని ఆయన వివరించారు. పాక్లోని పస్ని పోర్టు నుంచి బయలుదేరిన మాఫియా సభ్యులు సముద్ర జలాల్లోనే డ్రగ్స్ను మరో బోటులోకి మార్చి, ఆపైన తమిళనాడుకు చేరవేయాల్సి ఉందని ఆయన వెల్లడించారు. ఇటీవలి కాలంలో ఇటువంటి 13 ఆపరేషన్లను విజయవంతంగా పూర్తి చేసి, అక్రమార్కుల ఆటకట్టించామని వివరించారు. కాగా, ఐస్, క్రిస్టల్ మెథ్ అని కూడా పిలిచే మెథాంఫెటమైన్ చాలా శక్తివంతమైన డ్రగ్. పొట్టలో రూ.7.85 కోట్ల కొకైన్ ముంబై: ముంబైలోని ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు ఉగాండా దేశస్తుడి పొట్టలో రూ.7.85 కోట్ల విలువుండే 785 గ్రాముల కొకైన్ను గుర్తించారు. ఈ నెల 9వ తేదీన రాత్రి ఓ విమానంలో వచ్చిన అతడిని అధికారులు అడ్డుకున్నారు. విచారణ సమయంలో అతడు ఆందోళనతో కనిపించడంతో కనిపించాడు. దీంతో, వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షలు చేయించగా పొట్టలో టాబ్లెట్లు ఉన్నట్లు తేలింది. -
భారీ అగ్ని ప్రమాదం.. బాల్కనీ నుంచి సేఫ్టీ నెట్లోకి..!
అహ్మదాబాద్: నగరంలో ఓ అపార్ట్మెంట్లో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదం స్థానికంగా పెద్ద అలజడి రేపింది. అహ్మదాబాద్లోని కోక్రా సర్రిల్లోని పరిస్కార్ 1 అప్టార్ట్మెంట్లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఆ అపార్ట్మెంట్ ఆరో అంతస్తులోని ఒక ఫ్లాట్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్రి ప్రమాదం జరిగి అది తీవ్ర రూపం దాల్చింది. మొత్తం బిల్డింగ్ అంతా దావానంలా వ్యాపించింది.అయితే దీనిపై సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది హుటాహుటీనా అక్కడకు వచ్చి మంటల్ని అదుపు చేశారు. వారు తీవ్రంగా శ్రమించిన తర్వాత ఎట్టకేలకు మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారు. వీరితో పాటు పోలీసులు అక్కడకు వచ్చి రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. మంటల్ని అదుపు చేసే క్రమంలో పలువురు బాల్కనీ నుంని కింద ఉంచిన సేప్టీ నెట్లోకి దూకేశారు. అగ్ని ప్రమాదం జరిగిన తర్వాత ఫైర్ సిబ్బంది, పోలీసులు వ్యూహాత్మకంగా వ్యవహరించడంతో ఎటువంటి ప్రాణనష్టం వాటిల్లలేదు. ప్రధానంగా అపార్ట్మెంట్ పై నుంచి మహిళలు, పిల్లలు దూకిన దృశ్యాలు వైరల్గా మారాయి.A major fire has erupted in a building in Ahmedabad’s Khokhra area. Sending strength to those affected and hoping for a timely rescue operation.#FireIncident #ViralVideo #Ahmedabad pic.twitter.com/67NkYOKhJj— Parimal Nathwani (@mpparimal) April 11, 2025 -
మనవడి కోసం ఏడుపదుల వయసులో వ్యాపారం..! తట్టుకోలేనన్ని కష్టాలు చివరికి..
జీవితంలో కష్టాలనేవి సహజం. సాధారణంగా మన కంటే వయసులో చిన్నవాళ్లు మనకళ్లముందే వెళ్లిపోతుంటే ఏ వ్యక్తులకైనా.. తట్టుకోవడం అంత ఈజీ కాదు. వాటన్నింటిని దిగమింగుకుంటూ ఏదోలా బతికినా..చివరికి విధి మరింత కఠినంగా పరీక్షలు పెట్టి.. ఉపాధి లేకుండా చేసి ఆడుకుంటే..ఆ బాధ మాములుగా ఉండదు. అదికూడా ఏడు పదుల వయసులో ఈ సమస్యలు చుట్టుముడితే పరిస్థితి మరింత ఘోరం. ఎవ్వరైనా..విలవిలలాడతారు. కానీ ఈ బామ్మ మాత్రం ఆ కష్టాలకు వెరవలేదు. పైగా మనవడికి సాయం చేసేందుకు ముందుకు వచ్చింది. అతడికి జీవనమార్గాన్ని అందించింది. ఎందరికో స్ఫూర్తిగా నిలిచింది.ఆ బామ్మే 79 ఏళ్ల ఊర్మిళ ఆషర్ అకా. అంతా ముద్దుగా ఆమెను గుజ్జు బెన్గా పిలుచుకుంటారు. పిల్లలు తమ తల్లిదండ్రులకు, తాతలకు సాయం అదించడం విని ఉంటాం. కానీ మనవడికోసం ఓ బామ్మ తన పాకకళా నైపుణ్యన్ని వెలికి తీసి..అతడి జీవనోపాధికి ఆసరాగా మారడం గురించి విన్నారా.?. అది కూడా 75 ఏళ్ల వయసులో.. అయితే ఈ బామ్మ చాలా ధీమాగా ఆ సాహసం చేసింది. రెస్ట్ తీసుకుని "కృష్ణా.. రామ.." అని జపించే వయసులో మనవడి కోసం వ్యాపారం మెదలు పెట్టింది. ఆమె కథ వింటుంటే..ఒక వ్యక్తికి వరుస కష్టాలు పలకరిస్తుంటే.. బతకగలరా..? అనే బాధ కలుగుతుంది. కానీ ఊర్మిళ వాటన్నింటిని ఒక్క చిరునవ్వుతో ఎదిరించి నిలబడింది. గుజరాత్కి చెందిన ఈ బామ్మ గుజ్జు బెన్ నా నాస్తా అనే స్నాక్ సెంటర్ని నడిపింది. దాన్ని లాభాల్లో దూసుకుపోయేలా చేసింది. ఆమె మాస్టర్ చెఫ్గా కూడా పేరు తెచ్చుకుంది. ప్రముఖ చెఫ్ రణవీర్బ్రార్ వంటి ప్రముఖుల మన్ననలకు కూడా పొందారామె. వ్యాపారం ప్రారంభించడానికి కారణం..2019లో, ఆమె ఏకైక మనవడు హర్ష్ ఒక ప్రమాదంలో కింది పెదవిని కోల్పోయాడు. ఆ తర్వాత కరోనా మహమ్మారి కారణంగా జాబ్ కోల్పోయాడు. ప్రమాదం ఇచ్చిన వికృత రూపం కారణంగా ఎవ్వరూ అతడికి ఉద్యోగం ఇచ్చేందుకు ముందుకు రాలేదు. పైగా అతడు కూడా ఆత్మనూన్యత భావంతో ఇక ఇంట్లోనే ఒంటిరిగా ఉండిపోయేవాడు. అతనిలో స్థైర్యం నింపేందుకు ఆమె వ్యాపారం చేయాలని సంకల్పించి 'గుజ్జు బెన్ నా నాస్తా' అనే గుజరాతీ స్నాక్ సెంటర్ని ప్రారంభించింది. తన మనవడితో కలిసి గుజరాతీ వంటకాలైనా.. థెప్లాస్, ధోక్లా, ఖాఖ్రా, ఫరాలి వంటి రుచులతో కస్టమర్లను మెప్పించారు. అనతి కాలంలోనే పెద్ద స్నాక్ సెంటర్గా మారింది. అంతేగాదు ఊర్మిళ ఆషర్ టెడ్ఎక్స్ స్పీకర్గా మారి తప కథని వినిపించిది. అక్కడున్న వారందర్నీ ఆమె గాథ కదిలించింది. చాలా కష్టాలు చూశారామె..మాజీ మాస్టర్ చెఫ్ అయిన ఊర్మిళ జీవితంలో వరుస విషాదాలను చవిచూసిందని ఆమె సన్నహితులు చెబుతుంటారు. రెండున్నర సంవత్సరాల కూతురుని పోగొట్టుకున్నారు. ఆ తర్వాత తన ఇద్దరు కొడుకులు ఒకరు బ్రెయిన్ ట్యూమర్తో మరొకరు గుండెజబ్బుతో చనిపోవడం. చివరికి మిగిలిన ఒక్కగానొక్క మనవడు ప్రమాదం బారినపడి వికృతరూపంతో బాధపడటం వరకు చాలా కష్టాలను అధిగమించారు. ఏడు పదుల వయసు వరకు వెన్నంటిన కష్టాలకు చలించలేదు. ఉన్న ఒక్క మనవడు ముఖంలో చిరునవ్వు తెప్పించేందుకు తాపత్రయపడింది. ఆ నేపథ్యంలోనే ఈ ఏజ్లో వ్యాపారమా..? అనే సందేహానికి తావివ్వకుండా కష్టపడింది. అనుకున్నట్లుగా ఒక ఎంటర్ప్రెన్యూర్గా మంచి సక్సెస్ని అందుకున్నారామె. త్వరలోనే ఆమె చిన్న వ్యాపారం కాస్త సొంతంగా వెబ్సైట్ని ఏర్పాటు చేసుకుని మరింత మంది కస్టమర్ల మన్నలను అందుకునేందుకు సిద్ధంగా ఉంది. ఇక ఊర్మిళ 79 ఏళ్ల వయసులో ఏప్రిల్ 07న గుండెపోటుతో చనిపోయారు. చనిపోయేంత వరకు తరుముతున్న కష్టాలని చూసి కన్నీళ్లు పెట్టకుండా పోరాడారు.. గెలిచారు. ఉక్కు సంకల్పం ఉంటే..సంపాదనకు వయసుతో సంబంధం లేదని చాటిచెప్పారు ఊర్మిళ. చిన్న చిన్న వాటికే కుంగిపోయి పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకునే యువతకు కనువిప్పు ఈ బామ్మ కథ..!.(చదవండి: ద్రౌపది తెలివిగా సృష్టించిన వంటకమే పానీపూరి.. పూర్తి కథ ఏంటంటే?) -
సొమ్మసిల్లి పడిపోయిన కాంగ్రెస్ నేత చిదంబరం
అహ్మదాబాద్: కాంగ్రెస్ సీనియర్ నేత పి. చిదంబరం అస్వస్థతకు గురయ్యారు. మంగళవారం సబర్మతి ఆశ్రమంలో జరిగిన సీడబ్ల్యూసీ సమావేశంలో ఉన్నట్లుండి ఆయన సొమ్మసిల్లి పడిపోయారు. దీంతో హుటాహుటిన ఆయన్ని ఆస్పత్రికి తరలించారు. వేడి కారణంగా డీహైడ్రేషన్తో ఆయన అస్వస్థతకు గురైనట్లు వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. #WATCH | Ahmedabad, Gujarat: Congress leader P Chidambaram fell unconscious due to heat at Sabarmati Ashram and was taken to a hospital. pic.twitter.com/CeMYLk1C25— ANI (@ANI) April 8, 2025కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి అయిన చిదంబరం 79 ఏళ్ల వయసులోనూ రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉంటున్నారు. కేంద్రంలోని బీజేపీపై అవకాశం దొరికినప్పుడల్లా విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా.. తమిళనాడు రామేశ్వరంలో పాంబన్ వంతెనను ప్రారంభించిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ చేసిన బడ్జెట్ వ్యాఖ్యలకూ ఆయన కౌంటర్ ఇచ్చారు. ‘‘ప్రధాని సహా కేంద్రమంత్రులు 2004-14తో పోలిస్తే.. 2014-24 మధ్య కాలంలో తమిళనాడుకు అధికంగా నిధులు ఇచ్చామని పదే పదే చెబుతున్నారు. రాష్ట్రానికి రైల్వే ప్రాజెక్టుల కోసం గతంలో కంటే ఏడు రెట్లు నిధులు పెంచామని ప్రధాని చెప్పారు. ఫస్టియర్ ఎకానమీ విద్యార్థిని అడగండి. ‘ఎకానమీ మ్యాట్రిక్’ ఎప్పుడూ గతేడాది కంటే ఎక్కువగానే ఉంటుందని చెబుతారు. జీడీపీ గతంలో కంటే ఇప్పుడు పెరిగింది. కేంద్ర బడ్జెట్ మొత్తం మునుపటి కంటే పెరుగుతుంది. ప్రభుత్వ మొత్తం ఖర్చూలూ అంతే. మీ వయసు కూడా గతేడాది కంటే పెరిగింది. అంకెల పరంగా ఆ సంఖ్య పెద్దగానే కనిపించి ఉండొచ్చు. కానీ, జీడీపీ పరంగా లేదా మొత్తం వ్యయ నిష్పత్తి పరంగా అది ఎక్కువగా ఉందా?’’ అని ప్రశ్నించారు. -
కూనో చీతాలకు నీరు పోశాడు.. ఉద్యోగం నుంచి సస్పెండ్!
గాంధీనగర్: ఎండా కాలంలో దాహంతో ఉన్న చీతాలకు నీరు అందించిన కారణంగా ఓ డ్రైవర్ తన ఉద్యోగాన్ని కోల్పోయాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని కూనో నేషనల్ పార్క్లో చోటుచేసుకుంది. అదేంటీ.. నీరు పోసినందుకు ఎందుకు ఉద్యోగం పోయిందనుకుంటున్నారా? అసలు ట్విస్ట్ అక్కడే ఉంది.వివరాల ప్రకారం.. కూనో పార్కులో చీతా జ్వాల దాని పిల్లలు ఇటీవల ఓ జంతువును వెంబడిస్తూ గ్రామంలోకి చొరబడ్డాయి. పొలంలోని కొందరు వాటిని చూసి ఆందోళనకు గురయ్యారు. గ్రామస్థులు చీతాలపై రాళ్ల దాడికి తెగబడ్డారు. అక్కడి నుంచి పారిపోయి ప్రాణాలతో బయటపడ్డాయి. ఈ క్రమంలో ఓ చెట్టు కింద సేద తీరుతున్న జ్వాల (చిరుత) దాని నాలుగు పిల్లలను గమనించిన అటవీ శాఖకు చెందిన ఓ డ్రైవర్.. వాటికి నీరు అందించాడు. ఓ క్యానులో నీటిని తీసుకొచ్చి.. పాత్రలో నీటిని నింపి వాటిని తాగమంటు పిలిచాడు. దాహంతో ఉన్న ఆ వన్యప్రాణులు వాటిని తాగాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.A heartwarming video from Madhya Pradesh's Kuno National Park shows a female cheetah and her four cubs being offered water by a member of the monitoring team. pic.twitter.com/SN9Q4e8vxq— NDTV (@ndtv) April 6, 2025ఈ వీడియో అటవీ శాఖ అధికారులు దృష్టికి చేరింది. ఆ డ్రైవర్పై ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అతడిని ఉద్యోగం నుంచి సస్పెండ్ చేశారు. ఈ మేరకు ఓ ప్రకటనలో..‘చీతాలకు నీరు అందించాలని గ్రామస్థులు అనుకుంటున్నారు. ఈ జీవాలు సహజంగానే ముప్పు కలిగించేవి కావని తెలుసుకుంటున్నారు. కానీ, ఈ ప్రాంతం సహజ పర్యావరణ వ్యవస్థలో భాగమని వారంతా గ్రహించారు. అందుకే, వన్యప్రాణులతో (చీతాలతో) స్నేహపూర్వకంగా ఉండాలని కోరుకుంటున్నారు. కానీ, ఇది ఏ మాత్రం పద్ధతి కాదు. ఇలాంటి చర్యలు వాటి మనుగడకే ప్రమాదం’ అంటూ వ్యాఖ్యలు చేశారు.Historic moment in Kuno National Park! ✨ Cheetah Jwala and her 4 cubs spotted thriving in the wild for the first time! A true milestone for India’s cheetah conservation efforts. Witness the legacy of speed and survival unfold in Kuno!#Cheetah #KunoCheetahSafari #FlyingCatSafari pic.twitter.com/Bs5ThPnqhI— Flying Cat Safari (@KunoSafari) February 28, 2025మరోవైపు.. ఈ వీడియోపై నెటిజన్లు స్పందిస్తూ సదరు డ్రైవర్ చేసిన పనికి అభినందనలు తెలుపుతున్నారు. ఆ వ్యక్తి చేసింది నిజంగా గొప్ప పని.. మనుషులు, వన్యప్రాణులకు మధ్య ఇలాంటి స్నేహపూర్వక బంధం ఉండాలి అంటూ కామెంట్స్ చేశారు. @KunoNationalPrk female #cheetah #Jwala along with her cubs hunted 6 goats in Umrikalan village in Agra area of Vijaypur - villagers made a video, tracking team of Kuno National Park was also on the spot.. @Ajaydubey9#cheetah #kuno #wildlifephotography #viralvideo pic.twitter.com/RgJHqJFXgS— UTTAM SINGH (@R_UTTAMSINGH) April 4, 2025 -
సిద్ధార్థ్కు కన్నీటి వీడ్కోలు.. అంత్యక్రియల్లో సానియాను ఓదార్చడం ఎవరి వల్ల కాలేదు
చంఢీగఢ్ : గుజరాత్ జామ్నగర్లో ఈ బుధవారం జాగ్వార్ జెట్లో మరణించిన భారత వాయుసేన ఫ్లైట్ లెఫ్టినెంట్ సిద్ధార్థ్ యాదవ్ అంత్యక్రియలు ముగిశాయి. హర్యానాలోని రేవారీ జిల్లాలోని ఆయన స్వగ్రామామైన భలాకీ మజ్రాలో సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి. వేలాది మంది స్థానికులు, వాయుసేన అధికారులు, ఇతర సైనికులు, పోలీసు అధికారులు, రాజకీయ నాయకులు పాల్గొని సిద్ధార్థ్ యాదవ్కు నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులు కన్నీటి వీడ్కోలు పలికారు. పది రోజుల క్రితం సిద్ధార్థ యాదవ్, సానియాల ఎంగేజ్మెంట్ అయ్యింది. నవంబర్ 2న పెళ్లి జరగాల్సి ఉంది. అంతలోనే విధి ఆడిన వింత నాటకంలో కాబోయే భార్య సానియా.. సిద్ధార్ధ్ అంత్యక్రియల్లో పాల్గొనాల్సి వచ్చింది.అంత్యక్రియలు ముగిసే సమయంలో సానియా గుండెలవిసేలా రోదించారు. ఆమెను ఓదార్చడం ఎవరి వల్ల కాలేదు.‘సిద్ధార్ధ్ ముఖాన్ని చూపించండి. ఇంకోసారి సిద్ధార్ధ్ ముఖాన్ని చూడనివ్వండి అని భౌతిక ఖాయం వద్ద గుండెలవిసేలా ఏడుస్తున్న దృశ్యాలు చూపురలను కంటతడి పెట్టిస్తున్నాయి. ‘బేబీ నన్ను తీసుకెళ్లేందుకు నువ్వు ఎందుకు రాలేదు. నువ్వు నాకు ప్రామిస్ చేశావ్ కదా అంటూ సిద్ధార్ధ్ భౌతికఖాయంతో సంభాషించడం ప్రతీ ఒక్కరినీ కలచివేస్తోంది.What a heart wrenching moment...#SiddharthYadav got engaged 10 days back, marriage was due on 2nd November...his fiance says: Baby तू आया नहीं...तूने कहा था मुझे लेने आएगा। #jaguarcrash #Rewari pic.twitter.com/c7KGJOQixr— Rahul Yadav (@Raahulrewari) April 4, 2025 అంతా బాగున్నప్పుడు కాదు.. ప్రమాదంలో అంతా బాగున్నప్పుడు కాదు, ప్రమాదపుటంచున ఉన్నప్పుడు ఎలా స్పందిస్తామన్నది మన వ్యక్తిత్వానికి కొలమానంగా నిలుస్తుంది. బుధవారం రాత్రి గుజరాత్లోని జామ్నగర్లో కూలిపోయిన భారత వైమానిక దళ జాగ్వార్ ఫైటర్ జెట్ పైలట్ సిద్ధార్థ్ యాదవ్ అలాంటి గొప్ప వ్యక్తిత్వమున్న వారి కోవకే వస్తారు. సాంకేతిక లోపాలతో విమానం కుప్పకూలనుందని అర్థమైంది. #BREAKING: Tragic news from Jamnagar, Gujarat. A Jaguar fighter jet of the Indian Air Force crashed during a routine sortie, 12 kms away from Jamnagar city. While one pilot ejected safely, a trainee pilot has been killed in the crash. The body has been found by the villagers. pic.twitter.com/yGRefVVyQR— Aditya Raj Kaul (@AdityaRajKaul) April 2, 2025 తాను మరణిస్తూ.. మరికొందరికికో పైలట్తో కలిసి సురక్షితంగా ఎజెక్టయ్యే అవకాశముంది. అయినా సిద్ధార్థ్ తన ప్రాణాల కోసం పాకులాడలేదు. ప్రజల భద్రత గురించే ఆలోచించారు. విమానం జనావాసాల్లో పడకుండా జాగ్రత్తపడ్డారు. సురక్షితంగా మైదానంలో కూలిపోయేలా చూశారు. తద్వారా ఎంతోమంది పౌరుల మరణాలను నివారించారు. ఆ క్రమంలో దురదృష్టవశాత్తూ ప్రాణాలు కోల్పోయినా తన సాటిలేని త్యాగంతో జాతి గుండెల్లో చిరంజీవిగా మిగిలిపోయారు. కో పైలట్ సురక్షితంగా ఎజెక్టయినా గాయాలపాలయ్యారు. ప్రస్తుతం ఆస్పత్రిలో కోలుకుంటున్నారు.IAF's Jaguar fighter aircraft crashes in Jamnagar, Gujarat. More details awaited.#planecrash pic.twitter.com/Xz8UAGeasc— Kedar (@Kedar_speaks88) April 2, 2025 చివరి క్షణాల్లోనూ... బయల్దేరిన కాసేపటికే విమానంలో సాంకేతిక వైఫల్యం తలెత్తింది. విమానాన్ని నియంత్రించడానికి ప్రయత్నించినా లాభం లేకపోయింది. ప్రమాదం తప్పదని స్పష్టమైంది. దాంతో పైలెట్లిద్దరూ ఎజెక్షన్ ప్రారంభించారు. అంతటి క్లిష్ట సమయంలోనూ ముందు కో పైలట్ సురక్షితంగా బయటపడేలా సిద్ధార్థ్ జాగ్రత్త తీసుకున్నారు. తర్వాత కూడా విమానాన్ని వెంటనే వదిలేయకుండా నివాస ప్రాంతాలకు దూరంగా తీసుకెళ్లారు. ఆ క్రమంలో ప్రాణాలనే పణంగా పెట్టారు. సిద్ధార్థ్ ఇటీవలే సెలవులనుంచి తిరిగి విధులకు హాజరయ్యారు. ఈ ప్రమాదం ఒక సాధారణ శిక్షణ ఫ్లైట్ సమయంలో జరిగింది.విచారంలో ఇండియన్ ఎయిర్ఫోర్స్ ఫ్లైట్ లెఫ్టినెంట్ సిద్ధార్థ్ యాదవ్ మృతిపై భారత వాయుసేన తీవ్ర విచారం వ్యక్తం చేసింది. వారి కుటుంబానికి మేం అండగా నిలుస్తాం. ఈ ప్రమాదానికి గల కారణాలను గుర్తించేందుకు విచారణ కమిటీని నియమించినట్లు తెలిపింది. హర్యానా సీఎం నాయబ్ సింగ్ సైనీ ట్వీట్ సిద్ధార్ధ్ యాదవ్ మరణంపై హర్యానా సీఎం నాయబ్ సింగ్ సైనీ విచారం వ్యక్తం చేశారు. జామ్నగర్ సమీపంలో జరిగిన విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన రేవారి జిల్లా మజ్రా (భాల్ఖీ) గ్రామానికి చెందిన పుత్రుడు, జాగ్వార్ పైలట్ సిద్ధార్థ్ యాదవ్కు నా శ్రద్ధాంజలి. ఈ త్యాగం ఎప్పటికీ మరిచిపోలేము. ఈ శోక సమయంలో ఆయన కుటుంబానికి మేమంతా అండగా నిలుస్తాం. భగవంతుడు ఆయన ఆత్మకు శాంతిని చేకూర్చాలి’అని ట్వీట్లో పేర్కొన్నారు. -
‘వస్తానని చెప్పావు కదా బేబీ’! : భోరున విలపించిన పైలట్ భార్య
జాగ్వార్ ఫైటర్ జెట్ ప్రమాదంలో మరణించిన IAF పైలట్ సిద్ధార్థ్ యాదవ్ దుర్మరణం తీవ్ర విషాదాన్ని నింపింది. క్లిష్టమైన సమయంలో అత్యంత ధైర్య సాహసాలను ప్రదర్శించి, తోటి పైలట్ను, అనేక మంది పౌరులను కాపాడిన సిద్దార్థ్ యాదవ్కు యావద్దేశం సంతాపం ప్రకటించింది. ఆయన త్యాగం, ధైర్యాన్ని గుర్తు చేసుకుంటూ అశ్రు నయనాలతో సెల్యూట్ చెబుతున్నారు. త్రివర్ణ పతాకం కప్పి, పూర్తి సైనిక గౌరవాలతో మజ్రా భల్ఖిలోని ఆయప స్వగ్రామంలో ఏప్రిల్ 4న అంత్యక్రియలు నిర్వహించారు. అంత్యక్రియల సమయంలో సిద్ధార్థకకు కాబోయే భార్య సోనియా యాదవ్ అతని శవపేటిక పక్కనే కుప్పకూలిపోయింది. పెళ్లి బారాత్లో ఆనందంగా ఊరేగి వెళ్లాల్సిన బిడ్డకు, అంతిమ వీడ్కోలు పలకాల్సి రావడం కన్నతల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగిల్చింది.ఫ్లైట్ లెఫ్టినెంట్ సిద్ధార్థ్ ఈ జెట్ ప్రమాదంలో మరణించడానికి కేవలం పది రోజుల ముందు సోనియా యాదవ్తో నిశ్చితార్థం జరిగింది. నవంబరు 2న అంగరంగవైభంగా ఈ జంటకు పెళ్లిచేసేందుకు ఇరు కుటుంబాలు ఏర్పాట్లలో మునిగి ఉండగా ఊహంచని విషాదం తీరని శోకాన్ని మిగిల్చింది. ఫైటర్జెట్ ప్రమాదంలోమరణించిన సిద్దార్థ్ పార్ధివ దేహాన్ని స్వగ్రామానికి తరలించి, గౌరవ లాంఛనాలతో అంత్య క్రియలు నిర్వహించారు. ఈ సందర్భంగా కాబోయే భార్య సోనియా సిద్దార్థ శవపేటిక పక్కనే కూలిపోయింది. ఇదీ చదవండి: మొన్ననే ఎంగేజ్మెంట్, త్వరలో పెళ్లి, అంతలోనే విషాదంభోరున విలపిస్తూ అంతులేని శోకంతో ఆమె మాట్లాడిన మాటలు అక్కుడన్న ప్రతి ఒక్కరి హృదయాలను కదిలించాయి. సిద్ధార్థ్ యాదవ్ శవపేటికను కౌగిలించుకుని ‘‘వస్తానని చెప్పావు కదా బేబీ...రానేలదు ("బేబీ తు ఆయా నహీ...తునే కహా థా మై ఆవుంగా’’) అంటూ విలపించిన తీరు అందర్నీ కలిచివేసింది. కన్నీళ్లు ఆపుకోవడం అక్కడున్న ఎవ్వరి తరమూ కాలేదు. పలువురు కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితులు , ఇతర అధికారులు సిద్ధార్థ్కు వీడ్కోలు పలికారు.Such incidents breaks down the hearts of many. My 🙏🙏🙏 to the family members of #SiddharthYadav I don't understand the story. Technical Snag, and a fighter jet and 2 pilot down. Technical efficacy of the Aero Engineers must improve. Loss can't be adjusted. pic.twitter.com/YXkdeSG5zU— Little Somesh 🇮🇳 1729 (@shankaravijayam) April 4, 2025 -
సెల్యూట్ పైలట్ సిద్ధార్థ్!
అంతా బాగున్నప్పుడు కాదు, ప్రమాదపుటంచున ఉన్నప్పుడు ఎలా స్పందిస్తామన్నది మన వ్యక్తిత్వానికి కొలమానంగా నిలుస్తుంది. బుధవారం రాత్రి గుజరాత్లోని జామ్నగర్లో కూలిపోయిన భారత వైమానిక దళ జాగ్వార్ ఫైటర్ జెట్ పైలట్ సిద్ధార్థ్ యాదవ్ అలాంటి గొప్ప వ్యక్తిత్వమున్న వారి కోవకే వస్తారు. సాంకేతిక లోపాలతో విమానం కుప్పకూలనుందని అర్థమైంది. 28 ఏళ్ల యువకుడు. తల్లిదండ్రులకు ఒక్కగానొక్క కొడుకు. పైగా 10 రోజుల కిందే నిశ్చితార్థం కూడా అయింది. కో పైలట్తో కలిసి సురక్షితంగా ఎజెక్టయ్యే అవకాశముంది. అయినా సిద్ధార్థ్ తన ప్రాణాల కోసం పాకులాడలేదు. ప్రజల భద్రత గురించే ఆలోచించారు. విమానంజనావాసాల్లో పడకుండా జాగ్రత్తపడ్డారు. సురక్షితంగా మైదానంలో కూలిపోయేలా చూశారు. తద్వారా ఎంతోమంది పౌరుల మరణాలను నివారించారు. ఆ క్రమంలో దురదృష్టవశాత్తూ ప్రాణాలు కోల్పోయినా తన సాటిలేని త్యాగంతో జాతి గుండెల్లో చిరంజీవిగా మిగిలిపోయారు. కో పైలట్ సురక్షితంగా ఎజెక్టయినా గాయాలపాలయ్యారు. ప్రస్తుతం ఆస్పత్రిలో కోలుకుంటున్నారు. చివరి క్షణాల్లోనూ... బయల్దేరిన కాసేపటికే విమానంలో సాంకేతిక వైఫల్యం తలెత్తింది. విమానాన్ని నియంత్రించడానికి ప్రయత్నించినా లాభం లేకపోయింది. ప్రమాదం తప్పదని స్పష్టమైంది. దాంతో పైలెట్లిద్దరూ ఎజెక్షన్ ప్రారంభించారు. అంతటి క్లిష్ట సమయంలోనూ ముందు కో పైలట్ సురక్షితంగా బయటపడేలా సిద్ధార్థ్ జాగ్రత్త తీసుకున్నారు. తర్వాత కూడా విమానాన్ని వెంటనే వదిలేయకుండా నివాస ప్రాంతాలకు దూరంగా తీసుకెళ్లారు. ఆ క్రమంలో ప్రాణాలనే పణంగా పెట్టారు. కుటుంబమంతా దేశ సేవలోనే.. ఫ్లైట్ లెఫ్టినెంట్ సిద్ధార్థ్ స్వస్థలం హరియాణాలోని రేవారీ. వారిది తరతరాలుగా సైనిక కుటుంబమే. ఆయన ముత్తాత బ్రిటిష్ హయాంలో బెంగాల్ ఇంజనీర్స్ విభాగంలో పనిచేశారు. తాత పారామిలటరీ దళాల్లో సేవలందించారు. తండ్రి కూడా వైమానిక దళంలో పనిచేశారు. సిద్ధార్థ్ 2016లో వైమానిక దళంలో చేరారు. రెండేళ్ల సర్వీసు తర్వాత ఫ్లైట్ లెఫ్టినెంట్గా పదోన్నతి పొందారు. మార్చి 23నే నిశ్చితార్థం జరనిగింది. నవంబర్ 2న పెళ్లి జరగాల్సి ఉంది. మార్చి 31 దాకా కుటుంబీకులతో గడిపి ఇటీవలే విధుల్లో చేరారు. ఆయన మరణవార్తతో కుటుంబం, స్నేహితులే గాక పట్టణమంతా శోకసంద్రంలో మునిగిపోయింది. విమానంలో ప్రయాణించాలని, దేశానికి సేవ చేయా లని సిద్ధార్థ్ ఎప్పుడూ కలలు కనేవాడని చెబుతూ తండ్రి సుజీత్ యాదవ్ కన్నీటిపర్యంతమయ్యారు. ‘‘సిద్ధార్థ్ తెలివైన విద్యారి్థ. తనను చూసి ఎప్పుడూ గర్వపడేవాళ్లం. ప్రజల ప్రాణాలు కాపాడుతూ తన ప్రాణాలర్పించాడు. నా కొడుకును చూసి చాలా గర్వపడుతున్నా. మాకు ఒక్కగానొక్క కొడుకు తను’’అంటూ గుండెలవిసేలా రోదించారు. సిద్ధార్థ్ పారి్థవదేహం శుక్రవారం రేవారీకి చేరింది. పూర్వీకుల గ్రామం భలాకి మజ్రాలో పూర్తి సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ద్వారకకు కాలినడకన అనంత్ అంబానీ
సాక్షి, హైదరాబాద్: దేశంలోనే అత్యంత సంపన్నుడైన రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ ద్వారకకు పాదయాత్ర చేపట్టారు. ఆధ్యాత్మిక భావాలు కలిగిన అనంత్ తన 30వ పుట్టినరోజును దేశంలోని పవిత్ర నగరాల్లో ఒకటైన ద్వారకలో జరుపుకోవాలని నిర్ణయించుకున్నారు. అక్కడికి కాలినడకన చేరుకోనున్నారు. తమ పూర్వీకుల స్వస్థలమైన గుజరాత్లోని జామ్నగర్ నుంచి ద్వారకకు 170 కి.మీ. మేర ఆయన పాదయాత్రగా వెళ్తున్నారు. మార్చి 29న అనంత్ పాదయాత్రను ప్రారంభించారు. రోజూ 20 కి.మీ. మేర 7 గంటల పాటు నడక సాగిస్తున్నారు. ఈ నెల 8వ తేదీన తన పుట్టినరోజుకు ముందు అనంత్ ద్వారకకు చేరుకుని ద్వారకాదీశుడి ఆశీస్సులు అందుకుంటారు. ఈ పాదయాత్రలో పలువురు ఆయనకు సంఘీభావంగా కొంతదూరం పాటు నడిచారు. ఈ సందర్భంగా కొంతమంది ద్వారకాదీశుడి చిత్రాలను అనంత్కు బహూకరించారు. అనంత్ పాదయాత్ర పొడవునా హనుమాన్ చాలీసా, సుందరకాండ, దేవీ స్తోత్రం పఠిస్తూనే ఉన్నారు. కుషింగ్ సిండ్రోమ్ అనే అరుదైన హార్మోన్ల రుగ్మత, స్థూలకాయం, ఉబ్బసం తదితరాలతో బాధపడుతున్నా.. 170 కి. మీ. దూరం నడుస్తుండటం విశేషంగా నిలిచింది. సనాతన భక్తుడైన అనంత్.. బద్రీనాథ్, కేదార్నాథ్, కామాఖ్య, నాథ్ద్వారా, కాళీ ఘాట్ వంటి ప్రఖ్యాత ఆధ్మాత్మిక క్షేత్రాలను తరచూ సందర్శిస్తుంటారు. గుజరాత్లోని జామ్నగర్లో వన్తారా పేరుతో సమగ్ర జంతు సంరక్షణ, పునరావాస కేంద్రాన్ని కూడా అనంత్ అంబానీ నిర్మించడం తెలిసిందే. ప్రధాని మోదీ దాన్ని ఇటీవలే ప్రారంభించారు. -
వైరల్.. మృగరాజుకి ఆకలేసి కిచెన్లో దూరింది!
గాంధీనగర్ : అడవికి రాజు అయిన సింహం జనావాసాల్లోకి వస్తే ఏమవుతుంది. అమ్మో.. ఊహించుకోవడానికే భయంగా ఉందంటారా? అలాంటిది. ఇంట్లో అందరూ గాఢనిద్రలో ఉండగా.. ఆ సింహం ఇంటి పై కప్పు నుంచి సైలెంట్గా కిచెన్లో అడుగుపెడితే . సుమారు రెండు గంటల పాటు అక్కడే తిష్ట వేస్తే.. గుజరాత్లోని అమ్రేలీ జిల్లాలో ఒక కుటుంబానికి ఓ చిరుత షాకిచ్చింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటనలో బుధవారం రాత్రి ములుభాయ్ రాంభాయ్ లఖన్నోత్రా కుటుంబం బుధవారం రాత్రి గాఢ నిద్రలో ఉన్నారు. ఆ సమయంలో ఓ సింహం వారి కిచెన్లోని గోడపై కూర్చొంది. సుమారు రెండుగంటల పాటు తిష్టేసింది.#Amreli: #Gujarat Family Finds Lion Sitting In Their Kitchen pic.twitter.com/dMkfqcILI0— Timeline. (@timelinelatest) April 4, 2025అయితే అర్ధరాత్రి తర్వాత ఇంట్లో చప్పుడు కావడంతో ములుభాయ్ కుటుంబసభ్యులు ఉలిక్కపడి లేచారు. కళ్లార్పకుండా వంటగది గోడమీద ఉన్న సింహం వారినే చూస్తుండడంతో ఒక్కసారిగా హతాశులయ్యారు. బతుకు జీవుడా అనుకుంటూ బిగ్గరగా కేకలు వేస్తూ భయటకు పరుగులు తీశారు. కేకలు విన్న ఇరుగుపొరుగు వారు ములుభాయ్ కుటుంబసభ్యులకు ఏమైందోనని వచ్చి చూడగా.. వంటగదిలో ఉన్న సింహాన్నిచూసి జడుసుకున్నారు. ఆ ఘటనకు సంబంధించిన వీడియోలో సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ప్రస్తుతం, వైరల్ అవుతున్న ఓ వీడియోలో సింహం వంటగది గోడపై కూర్చొని ఉండడాన్ని గమనించొచ్చు. చికట్లో కూడా మిరుమిట్లు గొలిపేలా కాంతిని వెదజల్లుతున్న సింహం కళ్లను గ్రామస్తులు తమ సెల్ఫోన్లలో బంధించడం మనం చూడొచ్చు. సుమారు రెండు గంటల తర్వాత గ్రామస్తుల సహాయంతో సింహాన్ని తరిమికొట్టారు. అదృష్టవశాత్తూ ఎవరికి ఎలాంటి ప్రాణాపాయం సంభవించలేదు. ఇంట్లో సింహం చొరబడిందనే సమాచారం అందుకున్న అటవీ శాఖ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆ సింహం ఎక్కడ నుంచి వచ్చిందో ఆరా తీశారు. -
Jaguar jet Incident మొన్ననే ఎంగేజ్మెంట్, త్వరలో పెళ్లి, అంతలోనే విషాదం
గుజరాత్లోని జామ్నగర్ సమీపంలో భారత వైమానిక దళానికి చెందిన జాగ్వార్ యుద్ధ విమానం కుప్పకూలిన ప్రమాదంలో 28 ఏళ్ల పైలట్ ఫ్లైట్ లెఫ్టినెంట్ సిద్ధార్థ్ యాదవ్ చనిపోయిన తీవ్ర విషాదాన్ని నింపింది. ఆయనకు కొద్దిరోజుల క్రితమే నిశ్చితార్థం జరిగింది, మరికొన్ని రోజుల్లో పెళ్లి పీటలెక్కాల్సిన తమ కుమారుడు ఇలా అర్థాంతరంగా చనిపోవడంతో పైలట్ కుటుంబంలో విషాదం నెలకొంది.జాగ్వార్ ఫైటర్ జెట్ ప్రమాదంలో సిద్ధార్థ్ యాదవ్ అపారమైన ధైర్యాన్ని ప్రదర్శించారు. తన ప్రాణాలను లెక్క చేయకుండా సిద్ధార్థ్ కో-పైలట్ ఇతరులు ప్రాణాలను కాపాడిన తీరు పలువురి చేత కంట తడిపెట్టించింది. అపారమైన ధైర్యం, త్యాగం ఎన్నటికీ మరువ లేమంటూ పలువురు ఆయనకు నివాళి అర్పించారు.గత నెలలో (మార్చి 23) సిద్ధార్థకు నిశ్చితార్థం జరిగింది. నవంబర్ 2న అతని వివాహం జరిపించేందుకు కుటుంబం సన్నద్ధమవుతుండగా, ప్రాణాలు కోల్పోవడం షాక్కు గురి చేసింది. గుజరాత్లోని సువర్ద గ్రామంలో జామ్నగర్ నుండి దాదాపు 12 కిలోమీటర్ల దూరంలో, ఎయిర్ ఫోర్స్ స్టేషన్ నుండి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ప్రమాదం చోటుచేసుకుంది. సాంకేతిక లోపం కారణంగా ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. అయితే సిద్ధార్థ్ అతి క్లిష్టమైన సమయంలో అపారమైన ధైర్యాన్ని ప్రదర్శించి, జనసాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతం నుండి జెట్ను పక్కను మళ్లించడంతో పెను ప్రమాదం తప్పింది. విమానం కూలిపోయిన తర్వాత మంటలు చెలరేగాయి. స్థానికులు సహాయక చర్యలు చేపట్టి, సంబంధిత అధికారులకు సమాచారం అందించారు. ప్రస్తుతం తీవ్రంగా గాయపడిన కో-పైలట్ మనోజ్ కుమార్ సింగ్ చికిత్స పొందుతున్నాడు. హర్యానిలోని రేవారిలోని భల్ఖి-మజ్రా గ్రామానికి సుశీల్ యాదవ, నీలం దంపతుల ఏకైక సంతానం సిద్ధార్థ్. సిద్ధార్థ్ ఫైటర్ పైలట్గా శిక్షణ పూర్తి చేసి 2016లో NDA పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన తర్వాత భారత వైమానిక దళంలో చేరారు. రెండేళ్లలోపు, అతను ఫ్లైట్ లెఫ్టినెంట్గా పదోన్నతి పొందాడు. అతని మరణ వార్త అతని కుటుంబంలోని ప్రతి ఒక్కరితోపాటు రేవారీ వాసులను కూడా తీవ్ర దుఃఖంలో ముంచెత్తింది.చదవండి: రాత్రికి రాత్రే సెన్సేషన్గా మారిపోయింది.. ఎవరీ ఐపీఎల్ గర్ల్?రిటైర్డ్ ఎయిర్ ఫోర్స్ ఉద్యోగి, ప్రస్తుతం LICలో పనిచేస్తున్న సుశీల్ యాదవ్ తన కొడుకు ధైర్యాన్ని తనకు గర్వకారణంగా అభివర్ణించారు. సిద్ధార్థ్ భౌతికకాయానికి ఆయన స్వస్థలంలో పూర్తి సైనిక గౌరవాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కాగా సిద్ధార్థ్ ముత్తాత కూడా బ్రిటిష్ కాలంలో బెంగాల్ ఇంజనీర్లలో పనిచేశారు. మరోవైపు, అతని తాత పారామిలిటరీ దళాలలో సభ్యుడు. అతని తండ్రి భారత వైమానిక దళంలో పనిచేశారు. -
గుజరాత్లో ప్రమాదం.. మంటల్లో ముక్కలైన భారత యుద్ధ విమానం
గాంధీ నగర్: గుజరాత్లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. భారత వాయుసేనకు చెందిన జాగ్వార్ యుద్ధ విమానం గుజరాత్లోని జామ్ నగర్లో కుప్పకూలింది. ప్రమాదం నుంచి ఓ పైలట్ సురక్షితంగా బయటపడగా, మరో పైలట్ మృతిచెందారు. ప్రమాదం అనంతరం యుద్ధ విమానంలో మంటలు చెలరేగాయి. ఈ మేరకు భారత వాయుసేన అధికారుల స్పందిస్తూ.. పైలట్ మృతి చెందినట్టు వెల్లడించారు. పైలట్ కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. వివరాల ప్రకారం.. జామ్నగర్లోని సువర్ద సమీపంలో బుధవారం రాత్రి ఇండియన్ ఎయిర్ ఫోర్స్కు చెందిన జాగ్వార్ యుద్ధ విమానం కుప్పకూలింది. పొలాల్లో క్రాష్ కావడంతో విమానంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో విమానం రెండు ముక్కలుగా విరిగిపోయినట్లు తెలుస్తోంది. ప్రమాదం నుంచి ఒక పైలెట్ సురక్షితంగా బయటపడగా.. మరో పైలెట్ తప్పిపోయాడు. శిక్షణలో ఉన్న విమానం కూలగానే మంటలు అంటుకున్నాయని, ప్రమాద కారణం ఇంకా తెలియరాలేదని జిల్లా ఎస్పీ ప్రేమ్సుఖ్ దేలూ తెలిపారు. గాయపడిన పైలట్ను జామ్నగర్లోని జీజీ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్టు పేర్కొన్నారు. ఇక, విమాన ప్రమాద ఘటనపై ఎయిర్ ఫోర్స్ విచారణకు ఆదేశించింది.#BREAKING: Tragic news from Jamnagar, Gujarat. A Jaguar fighter jet of the Indian Air Force crashed during a routine sortie, 12 kms away from Jamnagar city. While one pilot ejected safely, a trainee pilot has been killed in the crash. The body has been found by the villagers. pic.twitter.com/yGRefVVyQR— Aditya Raj Kaul (@AdityaRajKaul) April 2, 2025ఇదిలా ఉండగా.. మార్చి నెలలో హర్యానాలోని పంచకుల సమీపంలో జాగ్వార్ ఫైటర్ జెట్ కుప్పకూలిన విషయం తెలిసిందే. విమానంలో సాంతికేతిక సమస్య తలెత్తడంతో పైలట్ విమానాన్ని జనవాస ప్రాంతాల నుంచి దూరంగా తీసుకెళ్లడంతో పెను ప్రమాదం తప్పింది. కుప్పకూలిన విమానం అంబాలా ఎయిర్బేస్ నుంచి శిక్షణాలో భాగంగా వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటన జరిగి నెల రోజులు కూడా కాకముందే.. మరో జాగ్వార్ యుద్ధ విమానం క్రాష్ కావడం ఎయిర్ ఫోర్స్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.Tragic news tonight. Trainee IAF fighter pilot killed in Jaguar crash near Jamnagar. The other pilot managed to eject, being treated in hospital.Deepest condolences to the family of the deceased pilot. 💔 pic.twitter.com/bQy6bG1918— Shiv Aroor (@ShivAroor) April 2, 2025 An IAF Jaguar two seater aircraft airborne from Jamnagar Airfield crashed during a night mission. The pilots faced a technical malfunction and initiated ejection, avoiding harm to airfield and local population. Unfortunately, one pilot succumbed to his injuries, while the other…— Indian Air Force (@IAF_MCC) April 3, 2025 -
బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు.. 13 మంది మృతి
బనస్కాంత:గుజరాత్లోని బనస్కాంతలోని అగ్ని ప్రమాదం(fire accident) చోటుచేసుకుంది. దీసాలోని జీఐడీసీ ప్రాంతంలోని ఒక బాణసంచా కర్మాగారంలో మంగళవారం ఉదయం ఈ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 13 మంది మృతి చెందారు. బాయిలర్లో పేలుడు సంభవించడంతో మంటలు చెలరేగాయి.ఈ ప్రమాదంలో ప్రాథమికంగా ముగ్గురు మృతిచెందారని భావించారు. అయితే ఆ తరువాత మరో పది మృతదేహాలు లభించడంతో మృతుల సంఖ్య 13కి చేరింది. ఈ ప్రమాదంలో ఐదుగురు గాయపడ్డారు. బాధితులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. ఫ్యాక్టరీలోని మండే పదార్థాల కారణంగా మంటలు వేగంగా వ్యాపించాయి.అగ్నిమాపక సిబ్బంది(Fire fighters) సంఘటనా స్థలానికి చేరుకుని, మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించారు. రెస్క్యూ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. స్థానిక ఎమ్మెల్యే ప్రవీణ్ మాలి సహా సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. పేలుడు కారణంగా భవనంలోని కొంత భాగం కూలిపోయిందని ప్రవీణ్ మాలి తెలిపారు. ఈ అగ్ని ప్రమాదానికి గల కారణం ఇంకా తెలియరాలేదు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
భావ ప్రకటన స్వేచ్ఛ.. సుప్రీం కోర్టు సంచలన తీర్పు
న్యూఢిల్లీ: వాక్ స్వాతంత్ర్యం.. భావ ప్రకటన స్వేచ్ఛపై దేశ సర్వోన్నత న్యాయస్థానం(Supreme Court Of India) కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రజాస్వామ్యంలో.. అందునా ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్య వ్యవస్థలో అవి భాగమని.. ప్రాథమిక హక్కులను పరిరక్షించడం న్యాయస్థానాల విధి అని స్పష్టం చేస్తూ శుక్రవారం సంచలన తీర్పు వెల్లడించింది.రెచ్చగొట్టేలా పద్యాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేశారని కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ ప్రతాప్గర్హీపై గుజరాత్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ పిటిషన్ను విచారించిన జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ ఉజ్జల్ భుయాన్ ధర్మాసనం.. సమాజంలో భావ ప్రకటన స్వేచ్ఛ(Freedom of Expression) అంతర్భాగమని, ఆ హక్కును గౌరవించాల్సిన అవసరం కచ్చితంగా ఉందని వ్యాఖ్యానించింది. ఈ క్రమంలో గుజరాత్ పోలీసుల తీరుపై అసహనం వ్యక్తం చేస్తూ.. ఈ కేసులో ఎలాంటి నేరం లేకపోయినా అత్యుత్సాహం ప్రదర్శించారని వ్యాఖ్యానించింది. ఈ సందర్భంలోనే ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.సినిమాలు, కవిత్వం.. సాహిత్యం, వ్యంగ్యం.. మనుషుల జీవితాన్ని మరింత అర్థవంతం చేస్తాయి. ఆలోచనలు, అభిప్రాయాలను వ్యక్తీకరించే స్వేచ్ఛ లేనప్పుడు.. ఆర్టికల్ 21 ప్రకారం గౌరవప్రదమైన జీవితాన్ని గడపడం ఎలా సాధ్యమవుతుంది?. ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్య వ్యవస్థలో.. విభిన్న అభిప్రాయాలను.. ప్రతివాదనలతో ఎదుర్కోవాలే తప్ప అణచివేతతో కాదు. ఒకవేళ ఆ వ్యాఖ్యలపై ఆంక్షలు విధించాల్సివస్తే.. అవి సహేతుకంగా ఉండాలే గానీ.. ఊహాజనితంగా కాదు. ఓ వ్యక్తి అభిప్రాయాలను ఎక్కువమంది వ్యతిరేకించినా సరే.. ఆ వ్యక్తి భావ ప్రకటనా హక్కును తప్పనిసరిగా గౌరవించాల్సిందే. భావ స్వేచ్ఛ ప్రకటన, వాక్ స్వాతంత్య్రం(Freedom of Speech) అనేవి ప్రజాస్వామ్యంలో అంతర్భాగం. ప్రజల ప్రాథమిక హక్కులను కాపాడటం న్యాయస్థానాల విధి. పోలీసులు రాజ్యాంగ ఆదర్శాలకు కట్టుబడి ఉండాలి. అంతిమంగా.. ఆర్టికల్ 19(1)ను కాపాడాల్సిన బాధ్యత న్యాయమూర్తులదే’’ అని ధర్మాసనం స్పష్టం చేస్తూ.. గుజరాత్ పోలీసులు దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ను కొట్టేసింది. జరిగింది ఇదే..గుజరాత్కు చెందిన కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ ప్రతాప్గర్హి(Imran Pratapgarhi) గతేడాది డిసెంబరులో 46 సెకన్ల నిడివి ఉన్న వీడియో ఒకటి పోస్ట్ చేశారు. ఓ పెళ్లి వేడుక మధ్యలో ఆయన నడిచివస్తుండగా పూలవర్షం కురిపిస్తూ.. బ్యాక్గ్రౌండ్ ఓ పద్యం వినిపించారు. అయితే, ఆ పద్యంలో పదాలు రెచ్చగొట్టేలా ఉన్నాయని, అవి మత విశ్వాసాలు, సామరస్యాన్ని, జాతి ఐక్యతను దెబ్బతీసేలా ఉన్నాయన్న ఫిర్యాదుతో గుజరాత్ పోలీసులు కేసు నమోదు చేశారు. గుజరాత్ హైకోర్టులో ఇమ్రాన్కు ఊరట లభించలేదు. దీంతో హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ ఆయన సుప్రీంకోర్టుకు వెళ్లారు. దీనిపై విచారణ చేపట్టిన ద్విసభ్య ధర్మాసనం.. ఎఫ్ఐఆర్ను కొట్టేస్తూ కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్కు ఊరట ఇచ్చింది. -
ఐక్యతా విగ్రహ శిల్పి రామ్సుతార్కు ప్రతిష్టాత్మక అవార్డు
రాష్ట్ర ప్రభుత్వ అత్యున్నత పౌర పురస్కారం మహారాష్ట్ర భూషణ్ అవార్డుకు ప్రముఖ శిల్పి రామ్ సుతార్ను ఎంపిక చేసినట్లు ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ గురువారం శాసనసభలో ప్రకటించారు. మార్చి 12న ఆయన తన నేతృత్వంలోని కమిటీ ఏకగ్రీవంగా నిర్ణయించిందని ఫడ్నవీస్ తెలియజేశారు. ఈ అవార్డుకింద ఆయనకు రూ.25లక్షల నగదు, మెమెంటో అందజేస్తామని వెల్లడించారు. ‘ఆయనకు ఇప్పుడు వందేళ్ళు. కానీ దాన్ని లెక్కచేయకుండా ముంబైలోని ఇందు మిల్లు స్మారక ప్రాజెక్టులో అంబేద్కర్ విగ్రహం రూపకల్పనలో ఆయన నిమగ్నమై ఉన్నారు.’అని ప్రశంసించారు. పలు భారీప్రాజెక్టుల రూపశిల్పి గత నెలలో 100 ఏళ్లు నిండిన సుతార్, పద్మభూషణ్ అవార్డు గ్రహీత, ఈ ఏడాదితో వందేళ్లు పూర్తిచేసుకున్న రామ్సుతార్ ప్రపంచంలోనే ఎత్తైన విగ్రహం అయిన స్టాట్యూ ఆఫ్ యూనిటీని రూపొందించారు. సుతార్ తన కుమారుడు అనిల్తో కలిసిస్టాట్యూ ఆఫ్ యూనిటీ, అయోధ్యలో రెండు వందల యాభై ఒక్క మీటర్ల ఎత్తైన రాముడి విగ్రహం, బెంగళూరులో నూటయాభై మూడు అడుగుల ఎత్తైన శివుడి విగ్రహం, పూణేలోని మోషిలో వంద అడుగుల ఎత్తైన ఛత్రపతి శంభాజీ మహారాజ్ విగ్రహం వంటి అనేక ప్రధాన ప్రాజెక్టులకు రూపకల్పన చేశారు. తో సంబంధం కలిగి ఉన్నారు.గతేడాది మాల్వాన్లోని రాజ్కోట్ కోటలో ముప్పై ఐదు అడుగుల ఎత్తైన ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం కూలిపోయి రాష్ట్రంలో భారీ రాజకీయ దుమారం చెలరేగింది. ఆ సంఘటన జరిగిన నాలుగునెలల తరువాత ప్రభుత్వం అరవై అడుగుల కొత్త విగ్రహాన్ని నిర్మించే కాంట్రాక్టును రామ్ సుతార్ ఆర్ట్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్కు అప్పగించింది. గుజరాత్లో ప్రపంచంలోనే ఎత్తైన విగ్రహం అయిన స్టాట్యూ ఆఫ్ యూనిటీని రూపొందించారు. గత నెలలో 100 ఏళ్లు నిండిన సుతార్, మహారాష్ట్రలోని ధూలే జిల్లాకు చెందినవారు. -
సునీతా త్వరలో ఇండియాకు వస్తారు.. సమోసా పార్టీ కూడా!
భారత సంతతికి చెందిన నాసా(Nasa) వ్యోమగామి సునీతా విలియమ్స్ (Sunita Williams) తొమ్మిది నెలల తరువాత ఎట్టకేలకు సురక్షితంగా భూమి మీదకి చేరడంపై సర్వత్రా హర్షం వ్యక్తమైంది. స్పేస్ఎక్స్ డ్రాగన్ అంతరిక్ష నౌక ద్వారా ఫ్లోరిడా తీరంలో మరో వ్యోమగామి బుచ్ విల్మోర్తో కలిసి సునీతా విలియమ్స్తో కలిసి ల్యాండ్ అయ్యారు. దీనిపై ఆమె కుటుంబ సభ్యులు కూడా అమితానందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సునీతా సమీప బంధువు ఫల్గుణి పాండ్యా ఎన్డీటీవీతో మాట్లాడుతూ తన సంతోషాన్ని ప్రకటించారు అంతేకాదు ఖచ్చితమైన తేదీ తెలియదు కానీ త్వరలో భారతదేశంలో సునీతా పర్యటిస్తారనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఇండియాలోని గుజరాత్లోని ఆమె తండ్రి దీపక్ పాండ్యాకు పూర్వీకుల ఇల్లు ఉందని గుర్తు చేశారు. 286 రోజుల అంతరిక్షయానం తర్వాత నాసా వ్యోమగామి ఇంటికి తిరిగి రావడం గురించి ఆమె మాట్లాడుతూ, అంతరిక్షం నుంచి ఆమె తిరిగి వస్తుందని తెలుసు. తన మాతృదేశం, భారతీయుల ప్రేమను పొందుతుందని కూడా తనకు తెలుసన్నారు.కలిసి సెలవులకు రావాలని కూడా ప్లాన్ చేస్తున్నాం, కుటుంబ సభ్యులతో గడబబోతున్నామని చెబతూ త్వరలో ఇండియాను సందర్శిస్తామని ఫల్గుణి ధృవీకరించారు. సునీత విలియమ్స్ మళ్ళీ అంతరిక్షంలోకి వెళ్తారా లేదా అంగారకుడిపైకి అడుగుపెట్టిన తొలి వ్యక్తి అవుతారా అని అడిగినప్పుడు, అది ఆమె ఇష్టం అన్నారు. వ్యోమగామిగా తాను ఎలాంటి పరిస్థితిలో ఉన్నా, ది బెస్ట్గా పనిచేస్తుందని,"ఆమె మనందరికీ రోల్ మోడల్" ఆమె ప్రశంసించారు. సెప్టెంబర్ 19న అంతరిక్షంలో ఆమె 59వ పుట్టినరోజును జరుపుకున్నారనీ, ఈసందర్భంగా భారతీయ స్వీట్ కాజు కట్లిని పంపినట్లు కూడా ఆమె చెప్పారు. అలాగే ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరిగే మహా కుంభమేళాను అంతరిక్షంనుంచి వీక్షించినట్టు కూడా చెప్పారన్నారు.సునీతా విలియమ్స్ అంతరిక్ష కేంద్రంలో సమోసాలు తీసుకెళ్లిన తొలి వ్యోమగామి కాబట్టి, ఆమె కోసం 'సమోసా పార్టీ' ఇవ్వడానికి ఎదురు చూస్తున్నానని కూడా చమత్కరించడం విశేషం. గత ఏడాది జూన్ 5న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)కి సునీతా విలియమ్స్ , బుచ్ విల్మోర్ వెళ్లారు. రౌండ్ట్రిప్గా భావించారు. అయితే, అంతరిక్ష నౌక ప్రొపల్షన్ సమస్యలను నేపథ్యంలో అది వెనక్కి తిరిగి వచ్చేసింది. చివరకు ఇద్దరు వ్యోమగాములను NASA-SpaceX Crew-9 మిషన్ ద్వారా భూమికి చేరిన సంగతి తెలిసిందే. -
Sunita William పూర్వీకుల ఇల్లు ఇదే! వైరల్ వీడియో
నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్ (Sunita Williams) మరో వ్యోమగామి బుచ్ విల్మోర్తో (మార్చి 19 ఉదయం) అంతరిక్షం నుండి తిరిగి రావడం ప్రపంచవ్యాప్తంగా ఎంతో సంతోషాన్ని నింపింది. నిజంగా దివి నుంచి భువికి వచ్చిన దేవతలా స్పేస్ఎక్స్ క్యాప్సూల్ నుంచి బయటకు వచ్చి, చిరునవ్వులు చిందించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈనేపథ్యంలోనే ఆమె పూర్వీకులు, ఎవరు? ఏ రాష్ట్రానికి చెందినది అనే అంశాలు ఆసక్తికరంగా మారాయి. సునీతా విలియమ్స్ తండ్రి దీపక్ పాండ్యా, గుజరాత్లోని ఝులసన్ గ్రామానికి చెందినవారు. ఇక్కడే ఆమె పూర్వీకుల ఇల్లు (Ancestral Home) ఉంది. తొమ్మిది నెలల ఉత్కంఠ తరువాత ఆమె సురక్షితంగా భూమికి తిరిగి రావడంతో ఆ గ్రామంలో సంబరాలు నెలకొన్నాయి. ఆమె రాకను ప్రత్యక్షంగా చూడటానికి గ్రామం మొత్తం ఒక ఆలయం దగ్గర ఏర్పాటు చేసిన టీవీల ముందు గుమిగూడి సునీతను చూడగానే ఆనందంతో కేరింతలు కొట్టారు. దీనికి సంబంధించిన వీడియో ఇంటర్నెట్లో విశేషంగా నిలిచింది. View this post on Instagram A post shared by India Today (@indiatoday) ఇది సునీత తండ్రి దీపక్ పాండ్య పూర్వీకులకు సంబంధించిన ఇల్లుగా భావిస్తున్నారు. ఇండియా టుడే షేర్ చేసిన వీడియో ప్రకారం, సునీత పూర్వీకుల ఇల్లు ఇప్పటికీ ఉంది. అయితే, ఎత్తైన ఈ ఇంటికి చాలా కాలంగా ఇల్లు లాక్ చేయబడి ఉండటం వల్ల కొంచెం పాతబడినట్టుగా కనిపిస్తోంది. అక్కడక్కడా పగుళ్లు కూడా ఉన్నాయి. అయితే సునీతకు భారతదేశంతో ఉన్న అనుబంధానికి నిదర్శనం. 1958లో ఆమె తల్లిదండ్రులు అమెరికాకు వెళ్లడంతో ఇంటికి సరైన నిర్వహణలేకుండా ఉంది. అయినప్పటికీ ఇప్పటికీ అది దృఢంగానే కనిపిస్తోంది. మరోవైపు ప్రధానమంత్రి నరేంద్రమోదీ సునీత విలియమ్స్ను భారత్ రావాల్సిందిగా ఆహ్వానించిన నేపథ్యంలో ఆమె, సొంత గ్రామానికి వస్తారా? పూర్వీకుల ఇంటిని సందర్శిస్తారా లేదా అనేది ఆసక్తిగా మారింది.సమోసా పార్టీసునీతా విలియమ్స్ వదిన, ఫల్గుణి పాండ్యా ఈ క్షణాన్ని 'అద్భుతం'గా అభివర్ణించారు. త్వరలో ఆమె కుటుంబం త్వరలో భారతదేశాన్ని సందర్శించాలని ప్లాన్ చేస్తున్నారన్నారు. ఈ సందర్బంగా తమ పూర్వీకుల గ్రామం ఝులసన్తో బలమైన సంబంధాన్ని ఆమె గుర్తు చేశారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో సమోసా తిన్న మొదటి వ్యక్తి సునీత కాబట్టి, ఆమె సురక్షితంగా తిరిగి రావడాన్ని పండుగలా జరుపుకునేందుకు కుటుంబం సమోసా పార్టీ ఇస్తుందని కూడా ఆమె చమత్కరించారు. చదవండి: సునీతా త్వరలో ఇండియాకు వస్తారు.. సమోసా పార్టీ కూడా!తొమ్మిది నెలలు అంతరిక్షంలోనేఒక వారం రోజుల మిషన్మీద రోదసిలోకి వెళ్లిన నాసా వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ కొన్ని సాంకేతిక కారణాల వల్ల అక్కడే చిక్కుకు పోయారు. తొమ్మిది నెలల తర్వాత, వారు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) నుండి భూమికి తిరిగి వచ్చారు. అచంచలమైన ధైర్య సాహసాలు, అకుంఠిత దీక్ష, అంకితభావంతో సునీతా విలియమ్స్ ఒక రోల్మోడల్గా నిలిచారు.చదవండి: Sunita Williams Earth Return: అంతరిక్షంలో పీరియడ్స్ వస్తే? ఏలా మేనేజ్ చేస్తారు? -
చైనా వాల్ తరహాలో భారత్ వాల్.. ఎందుకంటే?
న్యూఢిల్లీ: భారతదేశం సరిహద్దు వెంబడి ఒక భారీ గోడను నిర్మించనుంది. ఈ గోడ 1,400 కిలోమీటర్ల పొడవున ఉండనుంది. ఇది గుజరాత్, రాజస్థాన్, హర్యానా, ఢిల్లీ వరకు విస్తరించి ఉంటుంది. పాకిస్తాన్(Pakistan) సరిహద్దుల్లో ఉన్న ఎడారి ప్రాంతాలను తిరిగి పచ్చగా మార్చడమే లక్ష్యంగా ఈ గోడను నిర్మించనున్నారు.ఆరావళి పర్వత శ్రేణి(Aravalli mountain range)ని పచ్చగా మార్చడం, సహజ అడవులను కాపాడటం, చెట్లు, మొక్కల పరిరక్షణ, వ్యవసాయ భూమి, నీటి వనరులను కాపాడేందుకు ఈ భారీ గోడను నిర్మించాలని భారత్ భావిస్తోంది. ఇది చైనా గ్రేట్ వాల్ మాదిరిగా ఉంటుదనే మాట వినిపిస్తోంది. గుజరాత్లోని పోర్బందర్ నుండి ఢిల్లీలోని మహాత్మా గాంధీ సమాధి రాజ్ఘాట్ వరకు 1,400 కి.మీ పొడవైన గ్రీన్ వాల్ను నిర్మించనున్నారు. ఇది మహాత్మా గాంధీ జన్మస్థలం, సమాధి స్థలాలను అనుసంధానిస్తుంది.ఇది రాజస్థాన్, హర్యానాలోని 27 జిల్లాల్లో విస్తరించి ఉన్న ఆరావళి అటవీ పునరుద్ధరణ ప్రాజెక్ట్. దీని వలన 1.15 మిలియన్ హెక్టార్లకు పైగా భూభాగంలో అడవుల పునరుద్ధరణ, చెట్లను నాటడం, వ్యవసాయ యోగ్యమైన భూమి, నీటి వనరుల పునరుద్ధరణ జరుగుతుంది. ఈ ప్రాజెక్ట్ ఆఫ్రికన్ యూనియన్కు చెందిన ‘గ్రేట్ గ్రీన్ వాల్’ ప్రాజెక్ట్ నుండి ప్రేరణ పొందింది. ఈ ప్రాజెక్టు వ్యయం దాదాపు రూ. 7,500 కోట్లు. దీనికి కేంద్రం 78 శాతం, రాష్ట్రాలు 20 శాతం, అంతర్జాతీయ సంస్థలు రెండు శాతం నిధులు సమకూర్చనున్నాయి. ఈ ప్రాజెక్టును 2027 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇది కూడా చదవండి: దర్గాలోకి బూట్లతో వచ్చిన విదేశీ విద్యార్థులపై దాడి -
దర్గాలోకి బూట్లతో వచ్చిన విదేశీ విద్యార్థులపై దాడి
వడోదర: గుజారాత్లో అమానుష ఉదంతం చోటుచేసుకుంది. వడోదర(Vadodara) జిల్లాలోని ఒక దర్గాలోకి బూట్లు ధరించి ప్రవేశించిన నలుగురు విదేశీ విద్యార్థులపై మూక దాడి జరిగింది. ఆ విద్యార్థులకు గుజరాతీ భాష అర్థం కాకపోవడంతో ఈ పరిణామం చోటుచేసుకుందని పోలీసులు మీడియాకు తెలిపారు.ఈ దాడిలో ఒక విద్యార్థి తలకు తీవ్ర గాయమైంది. ఈ కేసులో ఐదుగురిని అరెస్టు చేశామని, ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు. ఆదివారం రాత్రి వాఘోడియా పోలీస్ స్టేషన్(Police station)లో నమోదైన ఎఫ్ఐఆర్ ప్రకారం థాయిలాండ్, సూడాన్, మొజాంబిక్, బ్రిటన్కు చెందిన నలుగురు విద్యార్థులు పరుల్ విశ్వవిద్యాలయంలో చదువుతున్నారు. మార్చి 14న సాయంత్రం ఈ విద్యార్థులను దాదాపు 10 మంది వ్యక్తులు వెంబడించి దాడి చేశారు. ఆ విద్యార్థులు గుజరాతీ భాష అర్థం చేసుకోలేకపోవడంతో వారిపై దాడి చేశారని ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. వారు ఒక దర్గాకు వెళ్లగా, వారిని బూట్లు ధరించి రాకూడదని ఒక వ్యక్తి సూచించారు. ఇది వారికి అర్థం కాలేదు.దాడి సమయంలో ముగ్గురు విద్యార్థులు తప్పించుకోగలిగారని, థాయ్ విద్యార్థి సుపచ్ కంగ్వాన్రత్న (20)తలకు తీవ్ర గాయాలు అయ్యాయని ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. బాధితుడిని పరుల్ సేవాశ్రమ్ ఆసుపత్రిలోని అత్యవసర వార్డులో చేర్చినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో ఐదుగురిని అరెస్టు చేసినట్లు వాఘోడియా పోలీస్ స్టేషన్ అధికారి తెలిపారు.ఇది కూడా చదవండి: 43.5 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు.. మండిపోతున్న ఎండలు -
Vadodara: ‘తాగలేదు.. గుంతల వల్లే కారు అదుపు తప్పింది’
వడోదర: గుజరాత్లోని వడోదర(Vadodara)లో కారును వేగంగా నడిపి, ఒక మహిళ మృతికి కారణమైన రక్షిత్ రవీష్ చౌరాసియా పోలీసుల ముందు తన వాదన వినిపించాడు. ప్రమాదం జరిగిన సమయంలో తాను మద్యం మత్తులో లేనని పేర్కొన్నాడు. గురువారం రాత్రి వడోదరలో రక్షిత్ నడుపుతున్న కారు ఒక స్కూటీని ఢీకొంది. ఈ ఘటనలో ఒక మహిళ మృతిచెందగా, ఎనిమిదిమంది గాయపడ్డారు. ఈ నేపధ్యంలో పోలీసులు రక్షిత్ను అరెస్టు చేశారు.నిందితుడు రక్షిత్ శనివారం మీడియాతో మాట్లాడుతూ గురువారం రాత్రి తాను నడుపుతున్న కారు ఆ స్కూటీ కంటే ముందుగా వెళుతున్నదని, ఇంతలో తాను రైట్ సైడ్ తీసుకున్నానని తెలిపారు. అక్కడ రోడ్డుపై పెద్ద గుంత ఉన్నదని, దీంతో కారు అదుపుతప్పి, పక్కనే ఉన్న స్కూటీని ఢీకొన్నదన్నారు. ఇంతలో ఎయిర్ బ్యాగ్ తెరుచుకున్నదని, ఆ తరువాత ఏం జరిగిందో తమకు తెలియలేదన్నారు. తమ కారు ప్రమాదం జరిగిన సమయంలో50 కి.మీ. స్పీడులోనే వెళుతున్నదని, తాను మద్యం తీసుకోలేదని, హోలికా దహనం కార్యక్రమానికి వెళ్లి వస్తున్నామని రక్షిత్ తెలిపారు. #WATCH | Vadodara, Gujarat: One woman has died, and four others are injured after an overspeeding four-wheeler rammed into a two-wheeler (14/03). Accused Rakshit Ravish Chaurasia claims, " We were going ahead of the scooty, we were turning right and there was a pothole on the… pic.twitter.com/7UMundtDXH— ANI (@ANI) March 15, 2025వడోదర పోలీస్ కమిషనర్(Police Commissioner) నరసింహ మీడియాతో మాట్లాడుతూ గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మూడు వాహనాలు ధ్వంసమయ్యాయని తెలిపారు. ప్రమాదంలో ఒక మహిళ మృతి చెందగా, ఎనిమిదిమంది గాయపడ్డారన్నారు. ఘటన జరిగిన సమయంలో అక్కడున్నవారి నుంచి సమాచారం సేకర్తిస్తున్నామని, రక్షిత్ మద్యం తాగి వాహనం నడిపినట్లు కేసు నమోదయ్యిదన్నారు. అయితే రక్షిత్ ప్రమాదం జరిగిన సమయంలో మద్యం మత్తులో లేనని చెబుతున్నాడని, ఈ కేసులో నిజానిజాలు నిర్థారించాల్సి ఉందన్నారు. ఇది కూడా చదవండి: దేశ విభజనలో రైల్వే పంపకాలు.. నాడు భారత్-పాక్లకు ఏమి దక్కాయి? -
అక్కడ పది రోజులపాటు హోలీ వేడుకలు
నవసారి: దేశవ్యాప్తంగా హోలీ వేడుకలు(Holi celebrations) అంబరాన్ని అంటుతున్నాయి. చిన్నాపెద్దా అంతా ఒకరిపై మరొకరు రంగులు చల్లుకుంటూ ఆనందిస్తున్నారు. దేశంలో ఎక్కడైనా హోలీ వేడుకలు ఒకరోజు జరుగుతాయి. కానీ ఆ ప్రాంతంలో ఏకంగా 10 రోజుల పాటు హోలీ వేడుకలు కొనసాగుతాయి. గుజరాత్లోని ఆదివాసీ జనబాహుళ్యం కలిగిన డాంగ్ జిల్లాలో హోలీ ఉత్సవాలకు ఎంతో ప్రత్యేకత ఉంది.డాంగ్ జిల్లాలో జరిగే హోలీని రాజుల హోలీ(Holi of the Kings)గా చెబుతారు. డాంగ్ జిల్లాలో నేటికీ ఐదుగురు రాజవంశస్థులు ఉన్నారు. ఏడాదిలో ఒకసారి ఈ రాజులను బహిరంగంగా గౌరవపూర్వకంగా సన్మానిస్తారు. పది రోజుల పాటు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. దీనిని డాండ్ దర్బార్ మేళా అని అంటారు. ఈ ఉత్సవాల్లో ఆ రాజులను రథాలలో కూర్చోబెట్టి వేదిక దగ్గరకు తీసుకువచ్చి, ఘనంగా సన్మానిస్తారు. వీరికి ప్రభుత్వం ఫించను అందజేస్తుంది. పది రోజుల పాటు జరిగే హోలీ వేడుకల్లో ప్రతీరోజూ ఇక్కడి ఆదివాసీ మహిళలు సాయంత్రం వేళల్లో జానపద గీతాలు ఆలపిస్తారు. అలాగే పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ ప్రాంతలోని చిన్నారులు తమ మేనమామలకు హోలీ స్నానం చేయిస్తారు. చిన్నారులను స్థానికులు భక్త ప్రహాదుని రూపాలుగా భావించి పూజలు చేస్తారు.ఇది కూడా చదవండి: ‘27 ఏళ్లుగా హోలీ అన్నదేలేదు’.. ఓ పోలీసు ఆవేదన -
గుజరాతీలు జాబ్స్ ఎందుకు చేయరంటే..
వ్యాపారం, ఆర్థిక రంగాల్లో గుజరాతీల (Gujaratis) ఆధిపత్యం గురించి తెలిసిందే. అయితే వారు ఆయా రంగాల్లో అంతలా రాణించడానికి కారణాలు ఏంటి.. సంపద సృష్టిలో వారికున్న ప్రత్యేక లక్షణాలేంటి అన్న దానిపై పై స్టాకిఫీ వ్యవస్థాపకుడు అభిజిత్ చోక్సీ అద్భుతమైన విశ్లేషణ చేశారు. వారి ఆర్థిక ప్రభావాన్ని హైలైట్ చేసే గణాంకాలతో ఆయన ‘ఎక్స్’లో చేసిన పోస్ట్ వైరల్గా మారింది.దేశంలోని 191 మంది బిలియనీర్లలో 108 మంది గుజరాతీలేనని రాసుకొచ్చిన చోక్సీ సంపద సృష్టిలో వారికున్న ప్రత్యేకతలను వివరించారు. చివరికి అమెరికాలో నివసిస్తున్న గుజరాతీ.. సగటు అమెరికన్ కంటే మూడు రెట్లు ఎక్కువ సంపాదిస్తున్నాడని చోక్సీ అభిప్రాయపడ్డారు. భారతదేశ జనాభాలో కేవలం 5% మాత్రమే ఉన్నప్పటికీ, గుజరాత్ దేశ జీడీపీకి 8% పైగా, దేశ పారిశ్రామిక ఉత్పత్తిలో 18% భాగస్వామ్యం వహిస్తోంది. భారత భూభాగంలో కేవలం 6% మాత్రమే ఉన్న గుజరాత్ దేశం మొత్తం ఎగుమతుల్లో 25% వాటాను కలిగి ఉంది.గుజరాతీల సక్సెస్కు కారణాలివే..మరి గుజరాతీలు వ్యాపారంలో అంత సక్సెస్ కావడానికి కారణం ఏమిటి? చోక్సీ ప్రకారం.. ఇది తరతరాలుగా వస్తున్న జ్ఞానం, వ్యవస్థాపక మనస్తత్వం, కొత్త మార్కెట్లను స్వీకరించడానికి, ఆధిపత్యం చేయడానికి సాటిలేని సామర్థ్యం కలయిక. గుజరాతీలు వ్యాపార, ఆర్థిక వ్యవహారాలను శాసించడానికి 20 కారణాలను ఆయన వివరించారు.ఉద్యోగాల (Jobs) కంటే వ్యాపారానికి తరతరాలుగా ప్రాధాన్యత ఇవ్వడమే ఈ విజయానికి కారణమని చోక్సీ పేర్కొన్నారు. "నౌకరీ తో గరీబోన్ కా దండా చే" (ఉద్యోగాలు పేదల కోసం) అనేది గుజరాతీ కుటుంబాలలో ఒక సాధారణ నమ్మకం. వ్యాపారం అనేదేదో నేర్చుకోవాల్సిన ఒక నైపుణ్యంలాగా కాకుండా గుజరాతీ పిల్లలు.. తమ కుటుంబాల్లో డబ్బును ఎలా నిర్వహిస్తున్నారు.. డీల్స్ ఎలా చేస్తున్నారు.. నష్టాలను ఎలా అంచనా వేస్తున్నారు.. అనేది నిత్యం చూస్తూ పెరుగుతారు.రిస్క్ తీసుకోవడం అనేది మరో ముఖ్యమైన లక్షణం. వజ్రాల ట్రేడింగ్ నుంచి స్టాక్ మార్కెట్ల వరకు గుజరాతీలు అనిశ్చితిని స్వీకరించి అవకాశాలను అందిపుచ్చుకుంటారు. ఈ మనస్తత్వం ప్రారంభ ఆర్థిక విద్య ద్వారా బలపడుతుంది. చాలా మంది పిల్లలు చిన్న వయస్సు నుండే కుటుంబ వ్యాపారాలలో సహాయపడతారు. ఏ ఎంబీఏ బోధించలేని రియల్ వరల్డ్ ఆర్థిక శాస్త్రాన్ని నేర్చుకుంటారు.నెట్ వర్కింగ్, కమ్యూనిటీ సపోర్ట్ కీలకం. రుణాలు, మార్గదర్శకత్వం, మార్కెట్ విషయంలో గుజరాతీలు ఒకరికొకరు చురుకుగా సహాయపడతారు. వారి పొదుపు జీవనశైలి కూడా ఒక పాత్ర పోషిస్తుంది. లాభాలను విలాసవంతంగా ఖర్చు చేయకుండా తిరిగి పెట్టుబడి పెడతారు. ఇది దీర్ఘకాలిక సంపద సేకరణకు దారితీస్తుంది.వివిధ పరిశ్రమల్లో గుజరాతీలు ఎలా ఆధిపత్యం చెలాయిస్తున్నారో కూడా చోక్సీ తెలియజేశారు. ప్రపంచంలోని 90 శాతం వజ్రాలను సూరత్ మాత్రమే ప్రాసెస్ చేస్తోందని, బెల్జియం, ఇజ్రాయెల్ లోని పోటీదారులను గుజరాతీ పారిశ్రామికవేత్తలు ఎలా అధిగమించారో ఆయన గుర్తు చేశారు. అదేవిధంగా, భారతదేశ స్టాక్ మార్కెట్ వ్యాపారులలో 60% పైగా గుజరాతీలు లేదా మార్వాడీలు ఉన్నారు.అమెరికాలో కూడా గుజరాతీలు వ్యాపార సామ్రాజ్యాలు నిర్మించుకున్నారు. అమెరికాలోని మొత్తం హోటళ్లలో 60 శాతానికి పైగా గుజరాతీ కుటుంబాలకు చెందినవేనని, ప్రధానంగా పటేల్ సామాజిక వర్గానికి చెందినవని చోక్సీ వెల్లడించారు. 1950వ దశకంలో చిన్న చిన్న పెట్టుబడులుగా ప్రారంభమైన ఈ పరిశ్రమ మల్టీ బిలియన్ డాలర్ల పరిశ్రమగా రూపాంతరం చెందింది.108 out of 191 Indian billionaires are Gujarati.A Gujarati living in America makes three times more than an average American.Gujarat, which has 5% of India’s population, contributes over 8% to the GDP and 18% of the industrial output.Gujarat has a land area of only 6% but… pic.twitter.com/ZId5idzCNS— Abhijit Chokshi | Investors का दोस्त (@stockifi_Invest) March 8, 2025 -
నారీ శక్తికి సలాం
నవాసరీ (గుజరాత్): ఏ సమాజంలోనైనా, దేశంలోనైనా మహిళలను గౌరవించడమే ప్రగతి దిశగా తొలి అడుగని ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. మహిళల సారథ్యంలో సమాజ ప్రగతి దిశగా భారత్ కొన్నేళ్లుగా ముందుకు సాగుతోందన్నారు. ‘‘నారీ శక్తికి నా నమస్సులు. మహిళల ఆత్మగౌరవానికి, భద్రతకు, సాధికారతకు మా ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యమిస్తోంది. వారిపై నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు నూతన చట్టాల్లో మరిన్ని కఠినమైన నిబంధనలు పొందుపరిచాం. వలస పాలన నాటి కాలం చెల్లిన చట్టాల స్థానంలో తెచి్చన పూర్తి దేశీయ చట్టాల్లో అత్యాచారం వంటి దారుణ నేరాలకు మరణశిక్షకు వీలు కల్పించాం. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు తదితరాల ద్వారా మహిళలకు సత్వర న్యాయం అందిస్తున్నాం. వారిపై తీవ్ర నేరాల్లో 45 నుంచి 60 రోజుల్లోపే తీర్పులు వచ్చేలా చర్యలు చేపట్టాం. విచారణ క్రమంలో బాధిత మహిళలకు ఎలాంటి ఇబ్బందులూ ఎదురవకుండా నిబంధనలు పొందుపరిచాం’’అని వివరించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శనివారం గుజరాత్లో నవాసరీ జిల్లా వన్శ్రీ బోర్సీ గ్రామంలో ప్రత్యేక కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. అనంతరం లక్షన్నర మందికి పైగా మహిళలు హాజరైన భారీ బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగించారు. ‘‘ఆడపిల్ల ఆలస్యంగా ఇంటికొస్తే పెద్దవాళ్లు లక్ష ప్రశ్నలడుగుతారు. అదే మగపిల్లాడు ఆలస్యమైతే పట్టించుకోరు. కానీ అతన్ని కూడా కచ్చితంగా నిలదీయాలి’’అని తల్లిదండ్రులకు సూచించారు. ప్రపంచంలోకెల్లా సంపన్నుడిని నేనే తాను ప్రపంచంలోకెల్లా సంపన్నుడిని అంటూ ఈ సందర్భంగా మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘ఇది విని కొందరికి ఆశ్చర్యంతో కనుబొమ్మలు ముడిపడవచ్చు. కానీ ఇది నిజం. కాకపోతే సంపదపరంగా కాదు. కోట్లాది మంది తల్లులు, సోదరీమణులు, కూతుళ్ల ఆశీస్సులు నాకున్నాయి. ఆ రకంగా నేను అందరి కంటే సంపన్నుడిని. వారి ఆశీస్సులే నాకు అతి పెద్ద బలం, నా పెట్టుబడి. అవే నాకు తి రుగులేని రక్షణ కవచం కూడా’’అని వివరించారు. ప్రధాని సోషల్ ఖాతాల్లో... మహిళల విజయగాథలు పలు రంగాల్లో తమదైన ముద్ర వేసిన పలువురు మహిళా ప్రముఖులు శనివారం ప్రధాని మోదీ సోషల్ మీడియా హాండిళ్లను ఒక రోజు పాటు తామే నిర్వహించారు. తమ విజయగాథలను పంచుకున్నారు. కలలను నిజం చేసుకునేందుకు అమ్మాయిలు ధైర్యంగా ముందడుగు వేయాలని పిలుపునిచ్చారు. చెస్ గ్రాండ్మాస్టర్ ఆర్ వైశాలి, పారిశ్రామికవేత్తగా మారిన రైతు అనితా దేవి, అణు శాస్త్రవేత్త ఎలినా మిశ్రా, అంతరిక్ష శాస్త్రవేత్త శిల్పీ సోనీ తదితరులు వీరిలో ఉన్నారు. గ్రాండ్మాస్టర్ ప్రజ్ఞా్ఞనంద సోదరి అయిన వైశాలి ఆరేళ్ల వయసు నుంచే చెస్ ఆడుతున్నారు. రైతు ఉత్పత్తుల కంపెనీ ద్వారా తన గ్రామానికి చెందిన వందలాది మంది మహిళలకు ఉపాధి కల్పించినట్టు అనితాదేవి వివరించారు. ఇది వారికి సంపాదనతో పాటు ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం కూడా కల్పించిందన్నారు. మహిళలకు ఆర్థిక సాధికారత అవసరాన్ని ఫ్రాంటియర్ మార్కెట్స్ సీఈఓ అజితా షా వివరించారు. అనంతరం వారి విజయగాథలను ప్రస్తుతిస్తూ మోదీ పలు పోస్టులు చేశారు. వికసిత భారత్ లక్ష్యసాధనలో మహిళలదే కీలక పాత్ర అని అభిప్రాయపడ్డారు. మహిళా పోలీసుల రక్షణ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నవాసరీ సభలో ప్రధాని మోదీకి పూర్తిగా మహిళలతో కూడిన అంగరక్షక దళం భద్రత కల్పించడం విశేషం. బహిరంగ సభతో పాటు ఆయన రక్షణ బాధ్యతలను కూడా 2,500 మందికి పైగా మహిళా పోలీసు సిబ్బందే చూసుకున్నారు. వీరిలో 2,145 మంది కానిస్టేబుళ్లు, 187 మంది ఎస్సైలు, 61 మంది ఇన్స్పెక్టర్లు, 19 మంది డీఎస్పీలు, ఐదుగురు ఎస్పీలు, ఒక డీఐజీ తదితరులున్నారు. హెలిప్యాడ్ వద్ద మోదీ రాక మొదలుకుని సభనుద్దేశించి ప్రసంగం, లఖ్పతీ దీదీ లబి్ధదారులకు సన్మానం, అనంతరం ఆయన వెనుదిరిగేదాకా సర్వం వారి కనుసన్నల్లోనే సాగింది. మొత్తం ఏర్పాట్లను అదనపు డీజీపీ నిపుణా తోర్వానే పర్యవేక్షించారు. పురుష సిబ్బంది పార్కింగ్, ట్రాఫిక్ విధులకే పరిమితమయ్యారు. ఇంతటి భారీ కార్యక్రమ భద్రత ఏర్పాట్లను పూర్తిగా మహిళా పోలీసు సిబ్బందే చూసుకోవడం దేశంలో ఇదే తొలిసారి. -
మీకు మీరే ట్రోల్ చేసుకుంటున్నారు.. బాగుందయ్యా రాహుల్!
అహ్మదాబాద్: కొందరు కాంగ్రెస్ నేతలు.. బీజేపీకి బీ టీమ్గా వ్యవహరిస్తున్నారంటూ ఏఐసీసీ సీనియర్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ స్పందించింది. రాహుల్ గాంధీ వ్యాఖ్యల వల్ల ఆ పార్టీకి కలిసొచ్చే ఏమీ లేదని, వాళ్లని వారే ట్రోల్ చేసుకుంటున్నారంటూ గుజరాత్ బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాల్లా విమర్శించారు. ‘ రాహుల్ గాంధీ మిమ్మల్ని మీరే ట్రోల్ చేసుకుంటున్నారు. మీ పార్టీని కూడా బానే ట్రోల్ చేస్తున్నారు. ఆయన్ని ఆయన అద్దంలో చూసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇంతకీ వాస్తవం ఏంటంటే కాంగ్రెస్ గుజరాత్ లో గెలవలేకపోతుందనే అసహనం. కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు వివాహాల్లో గుర్రాల చేత డ్యాన్స్ చేయించే వారి మాదిరిగా ఉన్నారని, మరి కొంతమంది పోటీల్లో పరుగెత్తే పెళ్లి గుర్రాల్లా ఉన్నారని రాహుల్ అంటున్నారు. అంటే మీ పార్టీ కార్యకర్తలు జంతువులా? అని ప్రశ్నించారు షెహజాద్. కనీసం మీ పార్టీ కార్యకర్తల్ని మనుషుల మాదిరి చూడండి.. అంతే కానీ వారిని గుర్రాలతో పోలుస్తారా? అంటూ నిలదీశారు.కాగా, ఎంపీ రాహుల్ గాంధీ గుజరాత్ పర్యటనలో కాంగ్రెస్ పార్టీ నేతలతో సమావేశమయ్యారు. ఈ క్రమంలో సొంత పార్టీ నేతల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. గుజరాత్లో సగం మంది కాంగ్రెస్ నేతలు బీజేపీతో చేతులు కలిపారు. బీజేపీకి అనుకూలంగా పనిచేస్తున్నారు. బీజేపీకి బీటీమ్గా ఉన్న వారిని బయటకు పంపుతాం. బీజేపీకి అనుకూలంగా ఉన్న ఎవ్వరినీ వదిలిపెట్టేది లేదు’ అని రాహుల్ వార్నింగ్ ఇచ్చారు. -
కాంగ్రెస్ నేతలపై రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు
గాంధీనగర్: గుజరాత్లో కాంగ్రెస్ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు పార్టీ అగ్రనాయకులు రాహుల్ గాంధీ. గుజరాత్లో కొందరు కాంగ్రెస్ నేతలు బీజేపీకి బీ-టీమ్గా వ్యవహరిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ నకిలీ నేతలకు బుద్ధి చెప్పాలని ఘాటు వ్యాఖ్యలు చేశారు.లోక్సభ ప్రతిపక్ష నాయకుడు, ఎంపీ రాహుల్ గాంధీ గుజరాత్ పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నేతలతో రాహుల్ సమావేశమయ్యారు. ఈ క్రమంలో సొంత పార్టీ నేతల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. గుజరాత్లో సగం మంది కాంగ్రెస్ నేతలు బీజేపీతో చేతులు కలిపారు. బీజేపీకి అనుకూలంగా పనిచేస్తున్నారు. బీజేపీకి బీటీమ్గా ఉన్న వారిని బయటకు పంపుతాం. బీజేపీకి అనుకూలంగా ఉన్న ఎవ్వరినీ వదిలిపెట్టేది లేదు. కాంగ్రెస్ పార్టీలో నేతలకు కొదవలేదు. తెలంగాణలో కాంగ్రెస్కు 22 శాతం ఓట్లు పెరిగాయి.. అసాధ్యం అనుకున్న చోట వారు సాధించి చూపించారు.గుజరాత్లో కూడా కాంగ్రెస్కు 40 శాతం ఓటు బ్యాంక్ ఉన్నది.. కానీ అందుకు భిన్నంగా పనిచేస్తూ పార్టీ ప్రతిష్టను రోజురోజుకూ దిగజార్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదు.. అందరూ పార్టీ లైన్లో ఉండి పనిచేయాల్సింది.. గీత దాటిన వారిపై వేటు వేయడానికి ఎంతో సమయం పట్టదు.. ఇప్పుటికైనా మించిపోయిందేమీ లేదు. వైఖరి మార్చుకొని పార్టీ కోసం పనిచేయాలి. పీసీసీ నుంచి కింది స్థాయి కార్యకర్త వరకు అందరూ పనిచేయాలని పిలుపునిచ్చారు. అలాగే, గత 30 ఏళ్లుగా గుజరాత్లో కాంగ్రెస్ అధికారంలో లేదు. నేను ఇక్కడికి వచ్చిన ప్రతీసారీ 2007, 2012, 2017, 2022, 2027 అసెంబ్లీ ఎన్నికల గురించి చర్చలు జరుగుతాయి. కానీ ప్రశ్న ఎన్నికల గురించి కాదు. మన బాధ్యతలను నెరవేర్చే వరకు గుజరాత్ ప్రజలు మనల్ని ఎన్నికల్లో గెలిపించరు. ప్రజల పట్ల మనం బాధ్యతతో ఉన్న రోజున వారే మనకు అధికారం ఇస్తారు అని కీలక వ్యాఖ్యలు చేశారు. #WATCH | Ahmedabad, Gujarat: Lok Sabha LoP and Congress MP Rahul Gandhi says "...Gujarat is stuck, it is unable to see the way, Gujarat wants to move forward. I am a member of the Congress party and I am saying that the Congress party of Gujarat is unable to show it the way, and… pic.twitter.com/UYBZ5BdvfM— ANI (@ANI) March 8, 2025 -
బాలుడికి చెంపదెబ్బ.. పోలీస్ అధికారి ట్రాన్స్ఫర్, ఆగిన శాలరీ హైక్
గాంధీ నగర్ : ప్రధాని మోదీ ఇవాళ తన సొంతరాష్ట్రమైన గుజరాత్లో పర్యటించారు. అయితే, ఈ పర్యటనకు ముందు రోజు అంటే నిన్న ప్రధాని మోదీ ఖాళీ కాన్వాయ్తో రిహార్సల్స్ నిర్వహించారు అధికారులు. అంత వరకు బాగానే ఉన్నా.. కాన్వాయ్ రిహార్సల్స్ సమయంలో ఓ పోలీసు అధికారి అత్యుత్సాహం ప్రదర్శించారు. అందుకు తగిన మూల్యం చెల్లించుకున్నారు.ప్రధాని మోదీ రాక నేపథ్యంలో సెక్యూరిటీ రిత్యా ఆయా ప్రాంతాల్లో ఖాళీ కాన్వాయ్తో రిహార్సల్స్ నిర్వహిస్తుంటారు. గుజరాత్ పర్యటన వేళ గుజారత్లోని రతన్ చౌక్ వద్ద పోలీస్ ఉన్నతాధికారులు మోదీ కాన్వాయ్తో రిహారాల్స్ నిర్వహించారు. ఆ సమయంలో 17ఏళ్ల బాలుడు సైకిల్ తొక్కుకుంటూ పొరపాటున రిహార్సల్స్ జరిగే ప్రాంతం వైపు వచ్చాడు. వెంటనే రెప్పపాటులో సైకిల్ను వెనక్కి తిప్పాడు.అదే సమయంలో పక్కనే విధులు నిర్వహిస్తున్న పోలీస్ అధికారి ఎస్ బీఎస్ గాధ్వీ సదరు బాలుడిని జుట్టు పట్టుకుని లాగారు. ఆపై చెంప చెల్లు మనిపించాడు. దీంతో బాలుడు వెక్కివెక్కి ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్లి పోయాడు. అయితే, బాలుడిపై సదరు పోలీస్ అధికారి దాడి సమయంలో స్థానికంగా పలువురు వీడియోలు తీసి సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. దీంతో పోలీసు అధికారిపై విమర్శలు వెల్లువెత్తాయి. సంబంధిత వీడియోలు సైతం వైరల్గా మారాయి. వైరలైన వీడియోలపై డిప్యూటీ పోలీస్ కమిషనర్ అమిత్ వానాని స్పందించారు. గాధ్వీ తీరు క్షమించరానిది. ప్రస్తుతం,మ్రోబి జిల్లాలో పోలీస్స్టేషన్లో విధిలు నిర్వహిస్తున్న ఆయన్ను కంట్రోల్ రూంకి ట్రాన్స్ఫర్ చేసినట్లు తెలిపారు. అంతేకాదు, ఏడాదిపాటు శాలరీ ఇంక్రిమెంట్ సైతం నిలిపివేసినట్లు తెలుస్తోంది.This Gujarat Police officer brutally thrashed a harmless kid on a cycle just for coming in between the convoy of Police VVIP movement rehearsal.Look at how he makes a fist and punches the kid. NAME AND SHAME THIS COP UNITL HE IS SUSPENDED! pic.twitter.com/5a08yvdUVd— Roshan Rai (@RoshanKrRaii) March 7, 2025 -
మోదీ జంగిల్ సఫారీ (చిత్రాలు)
-
సోమనాథుని సన్నిధిలో ప్రధాని మోదీ పూజలు
గిర్ సోమనాథ్: ప్రధాని నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) తన సొంత రాష్ట్రమైన గుజరాత్లో మూడు రోజుల పాటు పర్యటిస్తున్నారు. దీనిలో భాగంగా గిర్ సోమనాథ్ జిల్లాలోని సోమనాథ్ ఆలయంలో పూజలు చేశారు. సోమనాథ్ క్షేత్రం 12 జ్యోతిర్లింగాలలో ఒకటి. అంతకుముందు ప్రధాని మోదీ జామ్నగర్ జిల్లాలోని జంతు సంరక్షణ, పునరావాస కేంద్రమైన ‘వంతారా’ను సందర్శించారు. సోమనాథ్ ఆలయాన్ని సందర్శించిన తర్వాత మోదీ సమీపంలోని జునాగఢ్ జిల్లాలోని గిర్ వన్యప్రాణుల అభయారణ్యం ప్రధాన కార్యాలయమైన సాసన్ చేరుకున్నారు.ప్రయాగ్రాజ్లో మహా కుంభమేళా(Maha Kumbh Mela) ముగిసిన తర్వాత సోమనాథుణ్ణి పూజించాలనే తన సంకల్పంలో భాగంగా ఈ సందర్శన జరిగిందని ప్రధాని మోదీ ‘ఎక్స్’ పోస్టులో పేర్కొన్నారు. ‘కోట్లాది మంది దేశప్రజల కృషితో ప్రయాగ్రాజ్లో ‘ఐక్యతా మహాకుంభ్’ విజయవంతమయ్యింది. ఒక భక్తునిగా మహా కుంభమేళా అనంతరం 12 జ్యోతిర్లింగాలలో మొదటి జ్యోతిర్లింగమైన శ్రీ సోమనాథుణ్ణి(The Jyotirlinga of Sri Somanath) పూజించాలని నా మనస్సులో నిశ్చయించుకున్నాను’ అని తెలిపారు. ‘ఈ రోజు సోమనాథుని ఆశీస్సులతో నా సంకల్పం నెరవేరింది. దేశప్రజలందరి తరపున, నేను ఐక్యతా మహా కుంభ్ విజయాన్ని సోమనాథుని పాదాలకు అంకితం చేస్తున్నాను. అలాగే దేశప్రజల ఆరోగ్యం, శ్రేయస్సు కోసం ప్రార్థిస్తున్నాను’ అని ప్రధాని మోదీ తన సందేశంలో పేర్కొన్నారు. ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం సందర్భంగా సోమవారం ససాన్లోని 'లయన్ సఫారీ'ని ప్రధానమంత్రి సందర్శించనున్నారు. అలాగే జాతీయ వన్యప్రాణి బోర్డు (ఎన్బీడబ్ల్యూఎల్) సమావేశానికి అధ్యక్షత వహిస్తారు.ఇది కూడా చదవండి: India Bhutan Train : త్వరలో భారత్-భూటాన్ రైలు.. స్టేషన్లు ఇవే.. -
గుజరాత్ చేరుకున్న ప్రధాని మోదీ.. నేడు ’వంతారా’ సందర్శన
జామ్నగర్: మూడు రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) గుజరాత్ చేరుకున్నారు. శనివారం రాత్రి జామ్నగర్ సర్క్యూట్ హౌస్లో బస చేసిన ఆయన నేడు (ఆదివారం) రిలయన్స్ ఫౌండేషన్ జంతు రక్షణ, పునరావాస కేంద్రమైన ‘వంతారా’ను సందర్శించనున్నారు. ప్రధాని తన పర్యటనలో భాగంగా గిర్ జిల్లాలోని ససన్ గిర్ జాతీయ ఉద్యానవనాన్ని సందర్శించి, జంగిల్ సఫారీ చేయనున్నారు. సోమవారం ప్రధాని మోదీ సోమనాథ్ మహాదేవ్ ఆలయంలో పూజలు నిర్వహించనున్నారు. ప్రధాని పర్యటనపై గుజరాత్ మంత్రి ములుభాయ్ బేరా మీడియాతో మాట్లాడుతూ ప్రధాని రాకకు సంబంధించి అన్ని సన్నాహాలు పూర్తి చేశామని, ఆయన జామ్నగర్, ద్వారక, గిర్ జిల్లాల్లో జరిగే వివిధ కార్యక్రమాలకు హాజరవుతారన్నారు.జంతు సంరక్షణ కేంద్రం సందర్శనఈ రోజు(ఆదివారం) సాయంత్రం ప్రధాని మోదీ జామ్నగర్(Jamnagar)లోని ‘వంతారా’ జంతు సంరక్షణ కేంద్రాన్ని సందర్శించనున్నారు. తరువాత ఆయన ససాన్ చేరుకుంటారు. అక్కడి అటవీ శాఖ కార్యాలయ అతిథి గృహం ‘సింగ్ సదన్’ను సందర్శిస్తారు. అలాగే ఈరోజు జరిగే సోమనాథ్ ట్రస్ట్ సమావేశానికి అధ్యక్షత వహిస్తారు.జంగిల్ సఫారీ..మార్చి 3న ప్రధాని గిర్ జాతీయ ఉద్యానవనంలో జంగిల్ సఫారీలో పాల్గొంటారు. అక్కడి నుండి సింగ్ సదన్కు చేరుకుని ఎన్బీడబ్ల్యు సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. ఈ సమావేశంలో వన్యప్రాణులకు సంబంధించిన జాతీయ స్థాయి అంశాలపై చర్చించనున్నారు.సోమనాథ్ ఆలయంలో పూజలు అదే రోజున ప్రధాని ససాన్లో అటవీశాఖ సిబ్బందితో సంభాషించనున్నారు. తరువాత సోమనాథ్ ఆలయంలో పూజలు నిర్వహించనున్నారు. అనంతరం సోమనాథ్ నుండి రాజ్కోట్ విమానాశ్రయానికి చేరుకుని, అక్కడి నుంచి ఢిల్లీకి బయలుదేరుతారు.ఇది కూడా చదవండి: సునీతా విలియమ్స్ రాకకు సమయం ఆసన్నం -
నేటి నుంచి ప్రధాని మోదీ గుజరాత్ పర్యటన.. షెడ్యూల్ ఇదే..
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi) ఈరోజు (శనివారం) నుంచి మూడు రోజుల పాటు గుజరాత్లో పర్యటించనున్నారు. జునాగఢ్ జిల్లాలోని ససాన్లో జరిగే జాతీయ వన్యప్రాణి బోర్డు (ఎన్బీడబ్ల్యుఎల్) సమావేశానికి ప్రధాని మోదీ అధ్యక్షత వహించనున్నారు. జామ్నగర్లోని రిలయన్స్ ఫౌండేషన్ జంతు సంరక్షణ కేంద్రంను సందర్శించనున్నారు. అలాగే సోమనాథ్ ట్రస్ట్ సమావేశంలో కూడా పాల్గొననున్నారు.ప్రధాని మోదీ తన పర్యటనలో ఆదివారం జామ్నగర్లోని వంటారా జంతు సంరక్షణ కేంద్రాన్ని సందర్శిస్తారు. అనంతరం జంగిల్ సఫారీ చేయనున్నారు. గుజరాత్ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఎపీ సింగ్ మాట్లాడుతూ మార్చి ఒకటిన సాయంత్రం ప్రధాని జామ్నగర్(Jamnagar) చేరుకుంటారని, రాత్రికి అక్కడి సర్క్యూట్ హౌస్లో బస చేస్తారని తెలిపారు. మరుసటి రోజు వంటారా జంతు సంరక్షణ కేంద్రాన్ని సందర్శిస్తారన్నారు. తరువాత జామ్నగర్ నుండి బయలుదేరి సాయంత్రం ససాన్ చేరుకుంటారు. అక్కడ ఆయన సోమనాథ్ ట్రస్ట్ సమావేశానికి అధ్యక్షత వహిస్తారు.మార్చి 3న ప్రధాని మోదీ ఆసియా సింహాలకు నిలయమైన గిర్ జాతీయ ఉద్యానవనంలో జంగిల్ సఫారీని ఎంజాయ్ చేయనున్నారు. ఈ పర్యటనలో ప్రధాని మోదీ సోమనాథ్ ఆలయంలో పూజలు చేయనున్నారు. అలాగే అటవీ ఉద్యోగులతో మోదీ సంభాషించనున్నారు. అనంతరం సోమనాథ్ నుండి రాజ్కోట్ విమానాశ్రయానికి చేరుకుని ఢిల్లీకి బయలుదేరుతారని సింగ్ తెలిపారు. ఇది కూడా చదవండి: ఢిల్లీలో ఉదయాన్నే వర్షం.. వీడని చలిగాలులు -
నోవోటెల్లో నోరూరిస్తున్న ఫుడ్ ఫెస్ట్
విభిన్న వంటకాలకు నెలవైన నగరంలో గుజరాత్ రుచులు ఆహార ప్రియుల నోరూరిస్తున్నాయి. భౌగోళిక సమ్మేళనానికి ఈ ఫెస్ట్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని చెఫ్ పూనమ్ చెబుతున్నారు. గుజరాత్ గ్రామీణ పాంతాల్లోని ప్రత్యేక వంటకాలతో పాటు, విశ్వవ్యాప్తంగా ఇష్టపడే తమ సిగ్నేచర్ డిషెస్ వండి వడ్డిస్తున్నారు. ఎయిర్పోర్టు వేదికగా నోవోటెల్లో ఏర్పాటైన ఈ ఫెస్టివల్ మార్చ్ 2 వరకూ కొనసాగనుంది. ఇందులో సూర్తి ప్యాటీలు, కుచ్చి దబేలి వంటి వెరైటీలు లైవ్ కౌంటర్లలో ఆహార ప్రియులను ఆకర్షిస్తున్నాయి. – సాక్షి సిటీ బ్యూరో నగరంలోని నోవోటెల్ ఎయిర్పోర్ట్ వేదికగా కొనసాగుతున్న గుజరాత్ కతియావాడి వంటకాలు నగరవాసుల నోరూరిస్తున్నాయి. గుజరాత్ ప్రాంతానికి చెందిన ప్రముఖ చెఫ్ పూనమ్ దేధియ ఆధ్వర్యంలో అక్కడి సంప్రదాయ వంటకాలను ఆహారప్రియులకు వడ్డిస్తున్నారు. ఈ ఫెస్ట్ నగరంలో మరో సాంస్కృతిగా సమ్మేళనంగా కనిపిస్తోంది. ‘స్వాద్ కతియావాడ్ కా’ పేరుతో ఏర్పాటైన ఈ పసందైన రుచులు బఫే నుంచి స్నాక్స్ వరకూ అక్కడి పురాతన రుచులను అందిస్తుంది. కోప్రా పాక్.. ఎండు కొబ్బరి, చక్కెర, నెయ్యి, కొత్తిమీరతో తయారు చేసే వినూత్న రుచికరమైన వెరైటీ. ఇది గుజరాతీ స్పెషల్. ఇందులో విభిన్న రకాల డ్రై ఫ్రూట్స్ వినియోగిస్తారు. 100 గ్రాములకు సుమారు 280 కిలో క్యాలరీల శక్తి వస్తుంది. క్లాసిక్ హ్యాండ్వో.. ఇది గుజరాత్కి చెందిన ప్రత్యేక స్నాక్. ఈ క్లాసిక్ హ్యాండ్వో ఫెర్మెంటెడ్ రైస్, బటర్, ప్రత్యేకంగా ఎంపిక చేసిన కూరగాయల మిశ్రమం, గుజరాత్లో మాత్రమే లభించే మసాలాలు కలిపి తయారుచేస్తారు. వంటకాల్లో వైవిధ్యంవిభిన్న కూరగాయల మిశ్రమంతో, ఘాటైన మసాలాల ఘుమఘుమలతో తక్కువ సెగపై నెమ్మదిగా వండేవంట వరదియు.. మంచి సువాసనతో కాసింత సూప్తో గుజరాతీ వెరైటీని నోటికి అందిస్తుంది. బిజోరా పికిల్.. ఈ అరుదైన వంటకం గుజరాత్లో జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ గుర్తింపు పొందిన ప్రత్యేక వంటకం. ఈ బిజోరా పికిల్ కేవలం గుజరాత్లో మాత్రమే లభిస్తుందని చెఫ్ తెలిపారు. ఇది స్థానిక సాంస్కృతిక వంటకమే కాకుండా ఎన్నో ఆరోగ్య సంరక్షణ గుణాలున్న రుచికరమైన పికిల్. లిల్వాని కచోరి.. కరకరలాడించే లడ్డూ లాంటి స్పెషల్ గుజరాతీ కచోరి ఇది. ఇందులో ప్రత్యేక రుచికరమైన పదార్థాలతో పాటు బఠానీల మిశ్రమాన్ని డీప్ ఫ్రై చేసి వడ్డిస్తారు. చదవండి: టిపినీ కాదు, చద్దన్నం : క్రేజ్ మామూలుగా లేదుగా! ఎక్కడ? -
Vantara అనంత్ అంబానీ ‘వంతారా’ అరుదైన ఘనత
రిలయన్స్ వారసుడు అనంత్ అంబానీ (Anant Ambani) మరో ఘనతను సాధించారు. రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ చిన్నకుమారుడిగా జంతుప్రేమికుడిగా అనంత్ అంబానీ అందరికీ సుపరిచితమే. జంతు రక్షణ, ప్రధానంగా ఏనుగుల సంరక్షణ కోసం వంతారా (Vantara) అనే సంస్థను స్థాపించారు. అనంత్ అంబానీ ప్రాణప్రదమైన వంతారాకు ప్రతిష్టాత్మక 'ప్రాణి మిత్ర' జాతీయ అవార్డు లభించింది.'కార్పొరేట్' విభాగంలో జంతు సంక్షేమంలో భారతదేశంలోని అత్యున్నత గౌరవం పురస్కారం 'ప్రాణి మిత్ర' ( Prani Mitra Award ) జాతీయ అవార్డు వంటారా దక్కించుకుంది. వంటారా సంస్థ అయిన రాధే కృష్ణ టెంపుల్ ఎలిఫెంట్ వెల్ఫేర్ ట్రస్ట్ (RKTEWT)కు గౌరవం దక్కింది. ఈ అవార్డును భారత ప్రభుత్వ మత్స్య, పశుసంవర్ధక మరియు పాడి పరిశ్రమ సహాయ మంత్రి గురువారం న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రదానం చేశారు. దీనికి వంతారా సీఈవో వివాన్ కరణి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన జంతు సంక్షేమం పట్ల వంతారా లోతైన నిబద్ధతను నొక్కి చెప్పారు. సంక్షేమ ప్రమాణాలను పెంచడం, భారతదేశ జీవవైవిధ్యాన్ని కాపాడటం వారి లక్ష్యమనన్నారు. "ఈ అవార్డు భారతదేశ జంతువులను రక్షించడానికి, సంరక్షించడానికి తమ జీవితాలను అంకితం చేసిన అనేక మంది వ్యక్తులకు నివాళి. వంతారాలో, జంతువులకు సేవ చేయడం అంటే కేవలం డ్యూటీ కాదు - ఇది తమ ధర్మం, సేవ, కరుణ, తమ బాధ్యతలో దృఢమైన నిబద్ధత అన్నారు. భవిష్యత్తరాలకోసం దేశ గొప్ప జీవవైవిధ్యాన్ని కాపాడటం అనే లక్ష్యంలో తాము అలుపెరగకుండా కృషి చేస్తామని పేర్కొన్నారు.చదవండి : పోలీస్ ఉద్యోగానికి రిజెక్ట్, కట్ చేస్తే ఐపీఎస్గా!కెరీర్లో పీక్లో ఉండగానే పెళ్లి, భరించలేని గృహహింస..చివరికి!ఖరీదైన కారు చెత్త కుప్పలో... అసలు సంగతి తెలిసి విస్తుపోతున్న జనంవంతారాగుజరాత్లోని జామ్నగర్లో 3వేల ఎకరాల్లో వంతారా పేరుతో కృత్రిమ అడవిని ఏర్పాటు చేశారు. వంతారాలోని ఎలిఫెంట్ కేర్ సెంటర్ ప్రపంచంలోనే అతిపెద్ద ఏనుగు ఆసుపత్రికి నిలయంగా ఉంది. 240కి పైగా ఏనుగులకు రక్షణ కల్పిస్తోంది. ఇక్కడ ఏనుగులకు ప్రపంచ స్థాయి పశువైద్య చికిత్స, కరుణా సంరక్షణ లభిస్తుంది. ఇక్కడ అల్లోపతిని ప్రత్యామ్నాయ వైద్యంతో అనుసంధానించే అధునాతన పశువైద్య సంరక్షణను అందిస్తుంది. దీర్ఘకాలిక వ్యాధుల నిర్వహణ కోసం ఆయుర్వేదం మరియు నొప్పి నివారణ కోసం అక్యుపంక్చర్ సదుపాయాలు కూడా ఉన్నాయి. దీని అత్యాధునిక వైద్య సౌకర్యాలలో ఆర్థరైటిస్ చికిత్స కోసం అధిక పీడన నీటి జెట్లతో కూడిన హైడ్రోథెరపీ చెరువు, గాయం నయం కోసం హైపర్బారిక్ ఆక్సిజన్ చాంబర్ , పెడిక్యూర్ నిపుణులతో అంకితమైన పాద సంరక్షణ సౌకర్యాలుండటం విశేషం.అలాగే వంతారా అతిపెద్ద ఏనుగు అంబులెన్స్ల సముదాయాన్ని నిర్వహిస్తోంది.హైడ్రాలిక్ లిఫ్ట్లు, రబ్బరు మ్యాట్ ఫ్లోరింగ్, వాటర్ ట్రఫ్లు, షవర్లు , కేర్టేకర్ క్యాబిన్లున్న 75 కస్టమ్-ఇంజనీరింగ్ వాహనాలున్నాయి. -
పోలీస్ ఉద్యోగానికి రిజెక్ట్, కట్ చేస్తే ఐపీఎస్గా!
‘‘సాధించినదానికి సంతృప్తిని పొంది… అదే విజయమనుకుంటే పొరపాటోయి…ఆగకోయి భారతీయుడా.. కదిలి సాగవోయి ప్రగతిదారులా’’ ఈమాటల్ని మహాకవి శ్రీశ్రీ ఏ సందర్భంలో అన్నప్పటికీ.. ఈ మాటల్నే తనకు ప్రేరణగా తీసుకున్నాడో యువకుడు. కుటుంబాన్నీ పేదరికం నుంచి బయటపడేయడమే అతని అక్ష్యం. అలాగని సాధించిన ఉద్యోగంతో తృప్తి పడలేదు. పట్వారీగా తన ప్రయాణాన్ని ప్రారంభించి, తరువాత తహసీల్దార్, అసిస్టెంట్ జైలర్, స్కూల్ లెక్చరర్గా పనిచేశాడు. ఆరేళ్లలో (2010-2016) 12 ప్రభుత్వ ఉద్యోగాలు. చివరికి ఐపీఎస్ ఆఫీసర్గా నిలిచాడు. ఎలా సాధ్యం అని ఆశ్యర్యపోతున్నారా? తన కలను సాకారం చేసుకునేందుకు ఐపీఎస్ అధికారిగా నిలిచేందుకు చేసిన కృషి ఇందుకు సమాధానం. పదండి అతని స్ఫూర్తిదాయకమైన కెరీర్ గురించి తెలుసుకుందాం. రాజస్థాన్లోని రసిసార్లో నిరుపేద కుటుంబంలో జన్మించాడు. ప్రేమ్సుఖ్ డెలు. ప్రారంభంలో ఒంటె బండి డ్రైవర్గా పనిచేశాడు. పశువుల మేతకోసి తెచ్చేవాడు. అయితే పేదరికం నుండి తన కుటుంబాన్ని పైకి తీసుకురావాలనే దృఢ సంకల్పంతో, చదువుకోవాలని నిర్ణయించాడు. ఎన్నిఇబ్బందులొచ్చినా చదువును సాగించాడు. ఆర్థిక ఇబ్బందుల భారం తన కలలకు అడ్డు రాకుండా జాగ్రత్త పడ్డాడు. అతని కుటుంబం కూడా చదువు ప్రాధాన్యతను గురించింది. ఎన్ని సవాళ్లెదురైనా, పరిమిత వనరులు ఉన్నప్పటికీ అతనిలో విశ్వాసాన్ని నింపింది. డెలు సంకల్పానికి కుటుంబ సహకారం మరింత బలాన్నిచ్చింది.గొప్ప గొప్ప బిరుదులు, హోదాలు కాదు... తనకుటుంబం ఆర్థిక కష్టాలనుంచి బైటపడి, గౌరవంగా బతకాలి ఇదే అతని పట్టుదల. ప్రేమ్ కష్టపడి చదువుతూ ఎంఏ హిస్టరీ పూర్తి చేశాడు. 2010లో తొలిసారి పట్వారీ (రెవెన్యూ ఆఫీసర్) ఉద్యోగం సంపాదించాడు. ఆ తరువాతి ఏడాదికే అసిస్టెంట్ జైలర్గా , ఆ తరువాత ఉపాధ్యాయుడిగా, అనంతరం కాలేజీలో లెక్చరర్ ఉద్యోగం సంపాదించాడు. అయితే స్వల్పమార్కులతో పోలీస్ ఉద్యోగం చేజారినా ఐపీఎస్ అవ్వాలన్న కల స్థిమితంగా నిద్రపోనీయలేదు. మరోపక్క సాధించి చాల్లే..ఉన్నదాంతో సంతోషంగా బతుకుందాం అన్నారు కుటుంబ సభ్యులు. అయినా పట్టువీడని ప్రేమ్..2015లో యూపీఎస్సీ సివిల్స్ ఎగ్జామ్ రాశాడు. యూపీఎస్సీలో (UPSC) AIR 170 ర్యాంకుతో తన కలను సాకారం చేసుకునే తొలి అడుగు వేశాడు. ప్రస్తుతం గుజరాత్లోని జామ్నగర్లో పోలీసు సూపరింటెండెంట్గా పనిచేస్తున్నారు. ఐపీఎస్ ఆఫీసర్గానూ తన ప్రత్యేకతను చాటుకుంటున్నాడు.‘ఉద్యోగం చేసుకుంటూ యూపీఎసీసీకి సిద్ధమవ్వడం అంత సులభం కాదు. అంకిత భావంతో చదివాను. కేవలం ఆరేళ్ళలో 12 ప్రభుత్వ పరీక్షలలో ఉత్తీర్ణుడయ్యాడు. అదే తనకు స్ఫూర్తినిచ్చింది। అంటాడు డైలు. ఇదీ కదా పట్టుదల అంటే.. ఇదీ కదా సక్సెస్ అంటే. అవిశ్రాంత దృఢ సంకల్పం , దృఢ నిశ్చయం ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపించాడు డైలు. తనలాంటి ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. -
పిల్లలను అమ్మే ముఠా గుట్టురట్టు.. గుజరాత్ నుంచి నగరానికి తీసుకువచ్చి..
సాక్షి,హైదరాబాద్ : రాచకొండలో అంతర్రాష్ట్ర చైల్డ్ ట్రాఫికింగ్ ముఠా గుట్టు రట్టయ్యింది. 11 మందిని రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. చైతన్యపురి పోలీసులతో మల్కాజిగిరి ఎస్ఓటీ పోలీసులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ జాయింట్ ఆపరేషన్లో అప్పుడే పుట్టిన నలుగురు పిల్లలను అమ్ముతున్న ముఠాను అదుపులోకి తీసుకున్నారు.పిల్లలు లేని తల్లిదండ్రులు ఆరాటం.. ఆ దళారులకు వ్యాపారంగా మారింది. అభం శుభం ఎరుగని చిన్నారులను.. ముక్కు పచ్చలారని పసికందుల్ని అంగట్లో సరుకులాగా అమ్ముతున్నారు. సంతానం లేని తల్లిదండ్రులు లక్షలకు లక్షలు కుమ్మరించి కొంటున్నారు. ఇందులో భాగంగా నిందితులు గుజరాత్లో పిల్లల్ని పోషించలేని తల్లిదండ్రులకు డబ్బులు ఎరవేస్తున్నారు. మెడికల్ ప్రతినిధుల ద్వారా బేరసారాలు జరిపి అప్పుడే పుట్టిన పిల్లల్ని గుజరాత్ నుంచి హైదరాబాద్కు తెస్తున్నారు. నగరంలో ఆడ శిశువును రూ.2.5 లక్షలకు, మగ శిశువును రూ 4.5లక్షలకు విక్రయిస్తున్నారు. అయితే, ఛైల్డ్ ట్రాఫికింగ్పై సమాచారం అందుకున్న హైదరాబాద్ పోలీసులు సీక్రెట్ ఆపరేషన్ నిర్వహించారు. చిన్నారులను విక్రయిస్తున్న అంతర్ రాష్ట్ర ముఠాను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు జరిపిన జాయింట్ ఆపరేషన్లో పిల్లల్ని కొనుగోలు చేసిన దంపతులని సైతం నిందితులుగా చేర్చారు. -
ఏప్రిల్లో ఏఐసీసీ భేటీ
సాక్షి, న్యూఢిల్లీ: అఖిల భారత కాంగ్రెస్ కమిటీ(ఏఐసీసీ) సమావేశాలను ఏప్రిల్ 8, 9వ తేదీల్లో గుజరాత్లోని అహ్మదాబాద్లో నిర్వహించనున్నట్లు కాంగ్రెస్ ఆదివారం ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, రాజ్యాంగానికి ఎదురవుతున్న సవాళ్లు, పార్టీ భవిష్యత్ కార్యాచరణ రూపకల్పనను ఈ సమావేశాల్లో చర్చిస్తామని తెలిపింది. కీలకమైన చర్చలకు వేదికగానే కాకుండా, సామాన్య ప్రజల సమస్యల పరిష్కారానికి, దేశం కోసం బలమైన ప్రత్యామ్నాయ దృక్పథ ఆవిష్కరణకు, పార్టీ సమష్టి సంకల్పానికి పునరుద్ఘాటనగా ఉంటాయని ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఆదివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ‘ఈ సమావేశం దేశ వ్యాప్తంగా ఉన్న ఏఐసీసీ ప్రతినిధులను ఒకచోట చేర్చి ప్రజా వ్యతిరేక విధానాల వల్ల ఎదురయ్యే సవాళ్లను, రాజ్యాంగం, దాని విలువలపై బీజేపీ చేస్తున్న నిరంతర దాడులను చర్చించి, కార్యాచరణను సిద్ధం చేస్తుంది’అని చెప్పారు. 1924 సమావేశంలో మహాత్మాగాంధీ అధ్యక్ష పదవి చేపట్టిన వందేళ్ల వార్షికోత్సవాన్ని పురష్కరించుకొని బెళగావిలో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీలో ఆమోదించిన తీర్మానాలకు కొనసాగింపుగా ఈ సమావేశాలు ఉంటాయని తెలిపారు. గాం«దీజీ, బీఆర్ అంబేడ్కర్ల వారసత్వాన్ని కొనసాగిస్తూ రాజ్యాంగాన్ని రక్షించాల్సిన అవసరాన్ని గుర్తిచేలా సంవిధాన్ బచావో రాష్ట్రీయ పాదయాత్రను చేపట్టిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ భేటీకి కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఛైర్పర్సన్ సోనియాగాం«దీతో పాటు ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, రాహుల్గాం«దీ హాజరవుతారు. -
కేరళ కల సాకారం.. కష్టానికి తోడైన అదృష్టం.. తొలిసారి రంజీ ఫైనల్లోకి ప్రవేశం
‘ధైర్యవంతులనే అదృష్టం వరిస్తుంది’ అనే నానుడి కేరళ జట్టుకు సరిగ్గా సరిపోతుంది. 68 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ... 352 మ్యాచ్ల పోరాటం అనంతరం కేరళ జట్టు తొలిసారి రంజీ ట్రోఫీలో ఫైనల్కు అర్హత సాధించింది. ఈ సీజన్లో అద్వితీయ ప్రదర్శన కనబరుస్తున్న కేరళ జట్టు... తీవ్ర ఉత్కంఠ మధ్య మాజీ చాంపియన్ గుజరాత్తో జరిగిన సెమీఫైనల్లో పైచేయి సాధించి తొలిసారి తుదిపోరుకు చేరింది. క్వార్టర్ ఫైనల్లో ఒక్క పరుగు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో జమ్మూకశ్మీర్ను వెనక్కి నెట్టిన కేరళ... ఇప్పుడు సెమీఫైనల్లో గుజరాత్పై రెండు పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో ముందంజ వేసింది. ఒక్క పరుగే కదా అని తేలికగా తీసుకుంటే ... ఎలాంటి ఫలితాలు వస్తాయో ప్రత్యర్థికి రుచి చూపింది. ఆరు దశాబ్దాల పోరాటం అనంతరం దేశవాళీ ఫస్ట్క్లాస్ క్రికెట్ టోర్నీ ఫైనల్కు చేరిన కేరళ జట్టు ప్రస్థానంపై ప్రత్యేక కథనం.. సుదీర్ఘ కాలంగా రంజీ ట్రోఫీ ఆడుతున్న కేరళ జట్టు ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఫైనల్ చేరలేకపోయింది. ముంబై, కర్ణాటక, ఢిల్లీ, తమిళనాడు, బెంగాల్ మాదిరిగా తమ జట్టులో స్టార్ ప్లేయర్లు లేకపోయినా... నిలకడ కనబరుస్తున్నప్పటికీ ఆ జట్టు తుదిపోరుకు మాత్రం అర్హత సాధించలేదు. తాజా సీజన్లో అసాధారణ పోరాటాలు, అనూహ్య ఫలితాలతో ఎట్టకేలకు కేరళ జట్టు తొలిసారి రంజీ ట్రోఫీ ఫైనల్ చేరి చరిత్ర సృష్టించింది. జమ్మూ కశ్మీర్తో హోరాహోరీగా సాగిన క్వార్టర్ ఫైనల్లో 1 పరుగు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో సెమీఫైనల్లో అడుగుపెట్టిన కేరళ జట్టు... సెమీస్లో మాజీ చాంపియన్ గుజరాత్పై 2 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో తమ చిరకాల కల నెరవేర్చుకుంది.నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన సెమీఫైనల్ చివరి రోజు కేరళ జట్టు అద్భుతమే చేసింది. చేతిలో 3 వికెట్లు ఉన్న గుజరాత్ జట్టు తుదిపోరుకు అర్హత సాధించాలంటే మరో 29 పరుగులు చేయాల్సిన దశలో తొలి ఇన్నింగ్స్ కొనసాగించగా... కేరళ జట్టు కట్టుదిట్టమైన బౌలింగ్తో ప్రత్యర్థిని కట్టిపడేసింది. అప్పటికే క్రీజులో పాతుకుపోయి మొండిగా పోరాడుతున్న గుజరాత్ బ్యాటర్లు జైమీత్ పటేల్, సిద్ధార్థ్ దేశాయ్లను కేరళ బౌలర్ ఆదిత్య వెనక్కి పంపాడు. ఇంకేముంది మరో వికెట్ తీస్తే చాలు కేరళ తొలిసారి రంజీ ట్రోఫీ ఫైనల్ చేరడం ఖాయమే అనుకుంటే... ఆఖరి వికెట్కు అర్జాన్ నాగ్వస్వల్లా, ప్రియజీత్ సింగ్ జడేజా మొండిగా పోరాడారు.పది ఓవర్లకు పైగా క్రీజులో నిలిచిన ఈ జంటను చూస్తే ఇక మ్యాచ్ కేరళ చేజారినట్లే అనుకుంటున్న తరుణంలో అర్జాన్ కొట్టిన షాట్ కేరళకు కలిసొచ్చింది. ఆదిత్య వేసిన బంతిని అర్జాన్ బలంగా బాదే ప్రయత్నం చేశాడు. బంతి షార్ట్లెగ్లో ఫీల్డింగ్ చేస్తున్న సల్మాన్ నిజార్ హెల్మెట్కు తాకి గాల్లోకి లేచి ఫస్ట్ స్లిప్లో ఉన్న కెప్టెన్ సచిన్ బేబీ చేతిలో పడింది. అంతే కేరళ జట్టు సంబరాల్లో మునిగిపోయింది. స్టార్లు లేకుండానే... స్టార్ ఆటగాడు సంజూ సామ్సన్ భారత జట్టులో ఉండగా... అనుభవజ్ఞులైన విష్ణు వినోద్, బాబా అపరాజిత్ వంటి వాళ్లు గాయాలతో జట్టుకు దూరమయ్యారు. అయినా ఈ సీజన్లో కేరళ జట్టు స్ఫూర్తివంతమైన ప్రదర్శన కనబర్చింది. ముఖ్యంగా మిడిలార్డర్లో కెప్టెన్ సచిన్ బేబీతో పాటు సీనియర్ ప్లేయర్ జలజ్ సక్సేనా... యువ ఆటగాళ్లు మొహమ్మద్ అజహరుద్దీన్, సల్మాన్ నిజార్ అసమాన పోరాటం కనబర్చారు.జమ్మూ కశ్మీర్తో క్వార్టర్స్ పోరులో మ్యాచ్ను ‘డ్రా’ చేసేందుకు సల్మాన్, అజహరుద్దీన్ కనబర్చిన తెగువను ఎంత పొగిడినా తక్కువే. 40 ఓవర్లకు పైగా జమ్మూ బౌలర్లను కాచుకున్న ఈ జంట వికెట్ ఇవ్వకుండా మ్యాచ్ను ముగించి తొలి ఇన్నింగ్స్లో దక్కిన ఒక్క పరుగు ఆధిక్యంతో సెమీఫైనల్కు చేరింది.తాజాగా గుజరాత్తో సెమీస్లోనూ తొలి ఇన్నింగ్స్లో కేరళ బ్యాటర్లు అసాధరణ ప్రదర్శన కనబర్చారు. సచిన్ బేబీ 195 బంతుల్లో 69 పరుగులు, జలజ్ సక్సేనా 83 బంతుల్లో 30 పరుగులు, అజహరుద్దీన్ 341 బంతుల్లో 177 పరుగులు, సల్మాన్ నిజార్ 202 బంతుల్లో 52 పరుగులు చేసి గుజరాత్ బౌలర్ల సహనాన్ని పరీక్షించారు. ముందు నుంచే చక్కటి గేమ్ ప్లాన్తో మైదానంలో అడుగుపెట్టిన కేరళకు చివర్లో అదృష్టం కూడా తోడవడంతో చక్కటి విజయంతో తొలిసారి రంజీ ఫైనల్లో అడుగుపెట్టింది. ఈ టోర్నీ చరిత్రలో కేరళ జట్టు ఇప్పటి వరకు అత్యుత్తమంగా 2018–19 సీజన్లో సెమీఫైనల్కు చేరింది.నిరీక్షణకు తెరదించుతూ.. తొమ్మిది దశాబ్దాల సుదీర్ఘ చరిత్ర ఉన్న రంజీ ట్రోఫీలో కేరళ జట్టు 1957లో అరంగేట్రం చేసింది. అప్పటి నుంచి ఒక్కటంటే ఒక్కసారి కూడా ఫైనల్కు అర్హత సాధించలేకపోయింది. ఫుట్బాల్కు అధిక ప్రాధాన్యత ఇచ్చే కేరళ వాసులు... క్రికెట్ను పెద్దగా పట్టించుకునేవాళ్లు కాదు. కానీ గత రెండు దశాబ్దాల్లో కేరళ క్రికెట్లో అనూహ్య మార్పు వచ్చింది. 2007 టి20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్ గెలిచిన భారత జట్టులో సభ్యుడైన శ్రీశాంత్ స్ఫూర్తితో మరెందరో ఆటగాళ్లు క్రికెట్పై మక్కువ పెంచుకున్నారు.అందుకు తగ్గట్లే గత కొన్నేళ్లుగా కేరళలో క్రీడా మౌలిక వసతులు మరింత మెరుగు పడటంతో ప్రతిభావంతులు వెలుగులోకి రావడం మొదలైంది. అయితే ఇది ఒక్క రోజులో సాధ్యమైంది కాదు. దీని వెనక ఎన్నో ఏళ్ల శ్రమ దాగి ఉంది. అందుకే శుక్రవారం సెమీస్లో కేరళ జట్టు విజయానికి చేరువవుతున్న సమయంలో ప్రసార మాధ్యమాల్లో వీక్షకుల సంఖ్య ఒక్కసారిగా లక్షల్లో పెరిగింది. ప్రతిష్టాత్మక టోర్నీలో కేరళ టీమ్ ఫైనల్కు చేరగానే సామాజిక మాధ్యమాల్లో శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. రాజకీయ, సినీ, క్రీడా రంగానికి చెందిన పలువురు ప్రముఖులు... తామే గెలిచినంతగా లీనమైపోయి జట్టును అభినందనల్లో ముంచెత్తారు. మౌలిక వసతుల్లో భేష్.. సాధారణంగా అధిక వర్షపాతం నమోదయ్యే కేరళలో ఒకప్పుడు నిరంతరం అవుట్డోర్ ప్రాక్టీస్ చేయడం కూడా కష్టతరంగా ఉండేది. అలాంటిది ఇప్పుడు ఆ రాష్ట్ర వ్యాప్తంగా 17 ఫస్ట్క్లాస్ మైదానాలు అందుబాటులోకి వచ్చాయంటే కేరళ క్రికెట్లో ఎంత పురోగతి సాధించిందో అర్థం చేసుకోవచ్చు. ఈ కృషి వల్లే కేవలం పెద్ద నగరాల నుంచే కాకుండా... ద్వితీయ శ్రేణి పట్టణాలకు చెందిన ప్రతిభావంతులైన ఆటగాళ్లు కూడా రంజీ జట్టులో చోటు దక్కించుకోగలుగుతున్నారు.‘ముంబై, కర్ణాటక, తమిళనాడు, ఢిల్లీ వంటి ఇతర జట్లతో పోల్చుకుంటే... కేరళ జట్టు ఎంపిక విభిన్నంగా ఉండేది. పరిమితమైన వనరులు మాత్రమే ఉండటంతో అందుబాటులో ఉన్నవాళ్లనే ఎంపిక చేసేవాళ్లం. ముందు ఆ పరిస్థితి మారాలనే ఉద్దేశంతో అన్ని జిల్లాల్లో అకాడమీలను స్థాపించాం. కేవలం ప్లేయర్లకే కాకుండా కోచ్లకు కూడా ప్రత్యేక శిక్షణ ఇచ్చాం. మౌలిక వసతులపై ప్రధానంగా దృష్టి పెట్టాం. ఒకప్పుడు వర్షం వస్తే ప్రాక్టీస్ ఆగిపోయేది. ఇప్పుడు ఇండోర్లోనూ నెట్స్ ఏర్పాటు చేశాం.2005లో రాష్ట్రంలో ఒక్క మైదానంలో కూడా లేదు. ఇప్పుడు మొత్తం 17 ఫస్ట్క్లాస్ గ్రౌండ్లు ఉన్నాయి. ప్రస్తుతం దేశంలో మరే రాష్ట్రంలో లేనంతమంది బీసీసీఐ లెవల్1 కోచ్లు కేరళలో ఉన్నారు’ అని బీసీసీఐ మాజీ ఉపాధ్యక్షుడు మాథ్యూ తెలిపారు.కేరళ క్రికెట్ సంఘం కృషి వల్లే స్వేచ్ఛగా ఆడగలుగుతున్నామని... సెమీఫైనల్లో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కించుకున్న అజహరుద్దీన్ వెల్లడించాడు. పరస్పర సహకారం, సమష్టితత్వంతో ముందుకు సాగడం వల్లే మెరుగైన ఫలితాలు వస్తున్నాయని అన్నాడు. ఈనెల 26 నుంచి నాగ్పూర్లో జరిగే తుది పోరులోనూ కేరళ విజయం సాధిస్తే 10 ఏళ్ల తర్వాత రంజీ ట్రోఫీ చాంపియన్గా నిలిచిన దక్షిణాది జట్టుగా నిలుస్తుంది... ఆల్ ద బెస్ట్ కేరళ..! -
ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రక్కును ఢీ కొట్టిన బస్సు.. ఏడుగురు మృతి
గాంధీ నగర్ : గుజరాత్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కచ్ జిల్లాలో జరిగిన ఘోరరోడ్డు ప్రమాదంలో ఏడుగురు ప్రయాణికులు దుర్మురణం పాలయ్యారు. శుక్రవారం కీరా ముంద్రా రహదారి మార్గంలో 40మంది ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు ట్రక్కును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏడుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మరణించారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.రోడ్డు ప్రమాదంతో అప్రమత్తమైన స్థానికులు, ఇతర వాహనదారులు క్షతగాత్రులను అత్యవసర చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. వారికి చికిత్స కొనసాగుతుండగా.. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు సహాయక చర్యల్ని ముమ్మరం చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. -
రంజీ ట్రోఫీ సెమీ ఫైనల్లో హైడ్రామా
రంజీ ట్రోఫీ 2024-25 (Ranji Trophy) సెమీ ఫైనల్లో హైడ్రామా చోటు చేసుకుంది. గుజరాత్తో (Gujarat) జరుగుతున్న తొలి సెమీస్లో కేరళ (Kerala) 2 పరుగుల స్వల్ప ఆధిక్యాన్ని సాధించి, ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకుంది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన కేరళ తొలి ఇన్నింగ్స్లో 457 పరుగులు చేయగా.. గుజరాత్ తొలి ఇన్నింగ్స్లో 455 పరుగులకు ఆలౌటైంది. రంజీ రూల్స్ ప్రకారం.. మ్యాచ్లో ఫలితం తేలని పక్షంలో తొలి ఇన్నింగ్స్లో లీడ్ సాధించిన జట్టు విజేతగా నిలుస్తుంది. గుజరాత్, కేరళ మ్యాచ్లో ఫలితం తేలడం అసాధ్యం కాబట్టి, కేరళ విజేతగా నిలిచి ఫైనల్కు చేరుకుంటుంది.Drama in the Ranji Trophy semifinals🤯pic.twitter.com/o8Bykc8Q4P— CricTracker (@Cricketracker) February 21, 2025కాగా, ఈ మ్యాచ్లో గుజరాత్.. కేరళకు గట్టి పోటీ ఇచ్చినప్పటికీ, ఆ జట్టును దురదృష్టం వెంటాడింది. కేరళపై లీడ్ సాధించేందుకు కేవలం మూడు పరుగులు అవసరమైన తరుణంలో గుజరాత్ ఆఖరి ఆటగాడు సగస్వల్లా ఔటయ్యాడు. నగస్వల్లా బౌలర్ ప్రతిభ కారణంగా ఔటై ఉంటే గుజరాత్ అంత ఫీల్ అయ్యేది కాదు. నగస్వల్లా కొట్టిన షాట్ షార్ట్ లెగ్ ఫీల్డర్ సల్మాన్ నిజర్ హెల్మెట్కు తాకి స్లిప్స్లో ఉన్న సచిన్ బేబి చేతుల్లోకి వెళ్లింది. దీంతో నగస్వల్లా పెవిలియన్ ముఖం పట్టాడు. అప్పటివరకు బాగా ఆడిన నగస్వల్లా ఔట్ కావడంతో గుజరాత్ శిబిరంలో ఒక్కసారిగా నైరాశ్యం ఆవహించింది. తాము ఫైనల్కు చేరలేమన్న విషయం తెలుసుకుని గుజరాత్ ఆటగాళ్లు కృంగిపోయారు. తృటిలో గుజరాత్కు ఫైనల్ బెర్త్ మిస్ అయ్యింది. ఈ సీజన్లో కేరళను లక్కీ జట్టుగా చెప్పాలి. క్వార్టర్ ఫైనల్లోనూ ఆ జట్టు ఇలాగే స్వల్ప ఆధిక్యంతో (ఒక్క పరుగు) సెమీస్కు చేరుకుంది. 91 ఏళ్ల రంజీ ట్రోఫీ చరిత్రలో కేరళ ఫైనల్కు చేరడం ఇదే తొలిసారి.స్కోర్ల విషయానికొస్తే.. వికెట్కీపర్ బ్యాటర్ మహ్మద్ అజహరుద్దీన్ భారీ సెంచరీతో (177 నాటౌట్) కదంతొక్కడంతో కేరళ తొలి ఇన్నింగ్స్లో 457 పరుగులు చేసింది. కేరళ ఇన్నింగ్స్లో కెప్టెన్ సచిన్ బేబి (69), సల్మాన్ నిజర్ (52) అర్ద సెంచరీలతో రాణించారు. గుజరాత్ బౌలర్లలో సగస్వల్లా 3, చింతన్ గజా 2, పి జడేజా, రవి బిష్ణోయ్, విశాల్ జేస్వాల్ తలో వికెట్ పడగొట్టారు.అనంతరం ప్రియాంక్ పంచల్ (148) సెంచరీతో అదరగొట్టడంతో గుజరాత్ తొలి ఇన్నింగ్స్లో 455 పరుగులు చేసింది. గుజరాత్ బ్యాటర్లలో ఆర్య దేశాయ్ (73), జయ్మీత్ పటేల్ (79) అర్ద సెంచరీలతో రాణించారు. కేరళ బౌలర్లలో సర్వటే, జలజ్ సక్సేనా తలో 4 వికెట్లు పడగొట్టారు. ఈ మ్యాచ్లో గుజరాత్ బ్యాటర్లు సైతం బాగానే బ్యాటింగ్ చేసినప్పటికీ.. కేరళ తొలి ఇన్నింగ్స్ స్కోర్కు రెండు పరుగుల దూరంలో నిలిచిపోయారు. చివరి రోజు లంచ్ సమయానికి కేరళ రెండో ఇన్నింగ్స్లో వికెట్ నష్టపోకుండా 26 పరుగులు చేసింది. రోహన్ కన్నుమ్మల్ (15), అక్షయ్ చంద్రన్ (9) క్రీజ్లో ఉన్నారు. -
చరిత్ర సృష్టించనున్న కేరళ.. 91 ఏళ్ల రంజీ చరిత్రలో తొలిసారి..!
కేరళ క్రికెట్ జట్టు (Kerala Cricket Team) చరిత్ర సృష్టించనుంది. 91 ఏళ్ల రంజీ ట్రోఫీ (Ranji Trophy) చరిత్రలో తొలిసారి ఫైనల్కు అర్హత సాధించనుంది. గుజరాత్తో జరుగుతున్న తొలి సెమీఫైనల్లో కేరళ 2 పరుగుల స్వల్ప ఆధిక్యం సాధించింది. తద్వారా ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకోనుంది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన కేరళ తొలి ఇన్నింగ్స్లో 457 పరుగులు చేయగా.. గుజరాత్ తొలి ఇన్నింగ్స్లో 455 పరుగులకు ఆలౌటైంది. ప్రస్తుతం ఆట చివరి రోజు కొనసాగుతుంది. కేరళ రెండో ఇన్నింగ్స్ ప్రారంభించింది. ఈ మ్యాచ్లో ఫలితం తేలడం అసాధ్యం. రంజీ రూల్స్ ప్రకారం తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించిన జట్టు విజేత నిలుస్తుంది. తద్వారా కేరళ ఫైనల్కు చేరుతుంది.దీనికి ముందు కేరళ కార్టర్ ఫైనల్లోనూ ఇలాగే స్వల్ప ఆధిక్యం సాధించి సెమీస్కు అర్హత సాధించింది. క్వార్టర్ ఫైనల్లో కేరళ.. జమ్మూ అండ్ కశ్మీర్పై ఒక్క పరుగు లీడ్ సాధించింది. ఫలితంగా సెమీస్కు అర్హత సాధించింది.1957-58 సీజన్లో తొలిసారి రంజీ బరిలోకి దిగిన కేరళ.. ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఫైనల్కు అర్హత సాధించలేదు. 2018-19 సీజన్లో సెమీస్కు చేరినా.. తుది పోరుకు అర్హత సాధించలేకపోయింది. 1957/58కి ముందు కేరళ ట్రావన్కోర్-కొచ్చిన్ టీమ్గా రంజీల్లో ఆడింది.మ్యాచ్ విషయానికొస్తే.. వికెట్కీపర్ బ్యాటర్ మహ్మద్ అజహరుద్దీన్ భారీ సెంచరీతో (177 నాటౌట్) కదంతొక్కడంతో కేరళ తొలి ఇన్నింగ్స్లో 457 పరుగులు చేసింది. కేరళ ఇన్నింగ్స్లో కెప్టెన్ సచిన్ బేబి (69), సల్మాన్ నిజర్ (52) అర్ద సెంచరీలతో రాణించారు. గుజరాత్ బౌలర్లలో సగస్వల్లా 3, చింతన్ గజా 2, పి జడేజా, రవి బిష్ణోయ్, విశాల్ జేస్వాల్ తలో వికెట్ పడగొట్టారు. అనంతరం ప్రియాంక్ పంచల్ (148) సెంచరీతో కదంతొక్కడంతో గుజరాత్ తొలి ఇన్నింగ్స్లో 455 పరుగులు చేసింది. గుజరాత్ బ్యాటర్లలో ఆర్య దేశాయ్ (73), జయ్మీత్ పటేల్ (79) అర్ద సెంచరీలతో రాణించారు. కేరళ బౌలర్లలో సర్వటే, జలజ్ సక్సేనా తలో 4 వికెట్లు పడగొట్టారు. ఈ మ్యాచ్లో గుజరాత్ బ్యాటర్లు సైతం బాగానే బ్యాటింగ్ చేసినప్పటికీ.. కేరళ తొలి ఇన్నింగ్స్ స్కోర్కు రెండు పరుగుల దూరంలో నిలిచిపోయారు. చివరి రోజు లంచ్ సమయానికి కేరళ రెండో ఇన్నింగ్స్లో వికెట్ నష్టపోకుండా 26 పరుగులు చేసింది. రోహన్ కన్నుమ్మల్ (15), అక్షయ్ చంద్రన్ (9) క్రీజ్లో ఉన్నారు.విదర్భతో జరుగుతున్న మరో సెమీఫైనల్లో ముంబై ఓటమి అంచుల్లో నిలిచింది. 406 పరుగుల లక్ష్య ఛేదనలో ముంబై 6 వికెట్లు కోల్పోయి 180 పరుగులు మాత్రమే చేసింది. ఈ మ్యాచ్లో ముంబై గెలవాలంటే మరో 226 పరుగులు సాధించాలి. స్టార్ బ్యాటర్లంతా పెవిలియన్కు చేరడంతో ఈ మ్యాచ్లో ముంబై గెలవడం అసాధ్యం. ఒకవేళ ఈ మ్యాచ్ డ్రా అయినా తొలి ఇన్నింగ్స్ లీడ్ ఆధారంగా విదర్భ ఫైనల్కు చేరుతుంది. విదర్భ తొలి ఇన్నింగ్స్లో 383 పరుగులు చేయగా.. ముంబై 270 పరుగులకే పరిమితమైంది. కాగా, గత సీజన్ ఫైనల్లో ముంబై.. విదర్భను ఓడించి ఛాంపియన్గా నిలిచింది. -
జైమీత్ పోరాటం
అహ్మదాబాద్: జైమీత్ పటేల్ (161 బంతుల్లో 74 బ్యాటింగ్; 2 ఫోర్లు), సిద్ధార్థ్ దేశాయ్ (134 బంతుల్లో 24 బ్యాటింగ్; 1 ఫోర్) మొండి పట్టుదలతో ఆడటంతో... గుజరాత్ జట్టు రంజీ ట్రోఫీ ఫైనల్కు చేరువైంది. కేరళతో జరుగుతున్న సెమీఫైనల్లో ఓవర్నైట్ స్కోరు 222/1తో గురువారం నాలుగో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన గుజరాత్ జట్టు... ఆట ముగిసే సమయానికి 154 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 429 పరుగులు చేసింది. ఫలితం తేలడం కష్టమైన ఈ మ్యాచ్లో తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించిన జట్టే ఫైనల్కు చేరుకోవడం ఖాయమైంది. అంతకుముందు కేరళ జట్టు తొలి ఇన్నింగ్స్లో 457 పరుగులు చేయగా... ప్రస్తుతం చేతిలో 3 వికెట్లు ఉన్న గుజరాత్ మరో 29 పరుగులు చేస్తే కేరళ స్కోరును దాటేస్తుంది. ప్రియాంక్ పాంచాల్ (237 బంతుల్లో 148; 18 ఫోర్లు, 1 సిక్స్) భారీ సెంచరీ ఖాతాలో వేసుకోగా... మనన్ హింగ్రాజియా (127 బంతుల్లో 33; 3 ఫోర్లు), ఉర్విల్ పటేల్ (43 బంతుల్లో 25; 3 ఫోర్లు), హేమంగ్ పటేల్ (41 బంతుల్లో 27; 2 ఫోర్లు, 1 సిక్స్) తలా కొన్ని పరుగులు చేశారు. కెప్టెన్ చింతన్ గాజా (2), విశాల్ జైస్వాల్ (14) ఎక్కువసేపు నిలవలేకపోయారు. చివర్లో సిద్ధార్థ్ దేశాయ్తో కలిసి జైమీత్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఓ పక్క పరుగులు సాధిస్తూనే... ఓవర్లు కరిగించాడు. ఈ జంట అబేధ్యమైన ఎనిమిదో వికెట్కు 220 బంతుల్లో 72 పరుగులు జోడించింది. ఓవరాల్గా గురువారం 83 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసిన గుజరాత్ జట్టు 207 పరుగులు చేసింది. కేరళ బౌలర్లలో జలజ్ సక్సేనా 4 వికెట్లు పడగొట్టాడు. స్కోరు వివరాలు కేరళ తొలి ఇన్నింగ్స్: 457; గుజరాత్ తొలి ఇన్నింగ్స్: ప్రియాంక్ (బి) జలజ్ సక్సేనా 148; ఆర్య దేశాయ్ (బి) బాసిల్ 73; మనన్ (ఎల్బీడబ్ల్యూ) (బి) జలజ్ సక్సేనా 33; ఉర్విల్ పటేల్ (స్టంప్డ్) అజహరుద్దీన్ (బి) జలజ్ సక్సేనా 25; హేమాంగ్ పటేల్ (సి) (సబ్) రోజర్ (బి) నిధీశ్ 27; జైమీత్ పటేల్ (బ్యాటింగ్) 74; చింతన్ గాజా (ఎల్బీడబ్ల్యూ) (బి) జలజ్ సక్సేనా 2; విశాల్ జైస్వాల్ (సి) బాసిల్ (బి) ఆదిత్య 14; సిద్ధార్థ్ దేశాయ్ (బ్యాటింగ్) 24; ఎక్స్ట్రాలు 9; మొత్తం (154 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి) 429. వికెట్ల పతనం: 1–131, 2–238, 3–277, 4–292, 5–320, 6–325, 7–357. బౌలింగ్: నిధీశ్ 23–4–86–1; జలజ్ సక్సేనా 61–12–137–4; బాసిల్ 22–1–59–1; ఆదిత్య సర్వతే 36–3–104–1; అక్షయ్ చంద్రన్ 11–0–31–0; ఇమ్రాన్ 1–0–3–0. -
బాపట్ల టు గుజరాత్..
సాక్షి ప్రతినిధి, బాపట్ల: బాపట్ల జిల్లాలో పేదలకు అందాల్సిన రేషన్ బియ్యం పక్కదారి పడుతోంది. కొందరు వ్యాపారులు గుజరాత్ రాష్ట్రానికి తరలించి అక్రమార్జనకు పాల్పడుతున్నారు. బాపట్ల సమీపంలోని వెదుళ్లపల్లిలో ఉన్న ఓ రైస్మిల్లు యజమాని ఈ చౌక బియ్యాన్ని సేకరించి పాలిషింగ్ చేసి తరలిస్తున్నట్లు సమాచారం. ఆయనతోపాటు బాపట్ల పట్టణం పరిధిలోని మరో రైస్మిల్లు యజమానితోపాటు ఇదే మండలం అప్పికట్ల ప్రాంతంలోని ఇంకో రైస్మిల్లుకు చెందిన బాపట్ల టీడీపీ నేత అనుచరుడు రేషన్ బియ్యాన్ని కొని పాలీíÙంగ్ చేసి రాష్ట్ర సరిహద్దులు దాటించేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా సేకరణ.. బాపట్లతో పాటు పర్చూరు, అద్దంకి, రేపల్లె, చీరాల, వేమూరు, పొన్నూరు ప్రాంతాల్లోని డీలర్ల నుంచి కిలో బియ్యాన్ని రూ.15కు ఈ ముఠా కొనుగోలు చేస్తోంది. ఇలా సేకరించిన బియ్యాన్ని వెదుళ్లపల్లితో పాటు మిగిలిన ఇద్దరు మిల్లర్లకు కిలో రూ.22 చొప్పున విక్రయిస్తున్నారు. వెదుళ్లపల్లి మిల్లు యజమాని ఒక్కరే నెలకు సుమారు 15 వేల క్వింటాళ్ల బియ్యాన్ని తన మిల్లుకు తరలించి ఎప్పటికప్పుడు పాలీషింగ్ చేసి లారీలు, ట్రక్కుల ద్వారా పొన్నూరు, గుంటూరు, మిర్యాలగూడా మీదుగా హైదరాబాద్కు, అక్కడి నుంచి గుజరాత్కు తరలిస్తున్నట్లు సమాచారం. ఇక్కడ కిలో రూ.22కు కొన్న రేషన్ బియ్యాన్ని గుజరాత్లో కిలో రూ.40కు అమ్ముతున్నట్లు సమాచారం. ఇలా ఒక్కో కిలోకు అన్ని ఖర్చులూపోను రూ.15 తక్కువ కాకుండా వస్తోంది. ఈ లెక్కన నెలనెలా రూ.కోట్లలోనే రాబడి ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, వెదుళ్లపల్లి మిల్లు యజమాని నెలకు 15 వేల క్వింటాళ్లు సేకరిస్తుండగా.. మిగిలిన రెండు మిల్లుల నుంచి మరో 10 వేల క్వింటాళ్లు అనుకున్నా మొత్తంగా జిల్లా నుంచి గుజరాత్కు సగటున 25 వేల క్వింటాళ్లు తరలిపోతున్నట్లు సమాచారం. వెదుళ్లపల్లి మిల్లుకు చెందిన వ్యాపారితోపాటు బాపట్ల, అప్పికట్ల మిల్లులకు చెందిన వ్యాపారులు జిల్లాలోని అన్ని నియోజకవర్గాలతోపాటు గుంటూరు జిల్లా పొన్నూరు, పల్నాడు జిల్లాలోని వివిధ నియోజకవర్గాల్లో రేషన్ బియ్యాన్ని సేకరించి ఎగుమతి చేస్తున్నారు.రేషన్ బియ్యం ఖరీదు ఇలా.. నిజానికి.. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే కార్డుదారులకు డీలర్లు కిలోకు రూ.8 చెల్లించి బియ్యం వ్యాపారులకు రూ.12కు ఇచ్చేవారు. అలాగే, బియ్యం అక్రమ రవాణాదారులు బియ్యం సేకరణ వ్యాపారులకు రూ.20 చెల్లించేవారు. కానీ, రేషన్ బియ్యానికి డిమాండ్ పెరగడంతో కార్డుదారులకు రూ.10 నుంచి రూ.12.. డీలర్లకు రూ.15 నుంచి రూ.17 వస్తోంది. ఇక వ్యాపారుల వద్ద నుంచి అక్రమ ఎగుమతిదారులు కిలో రూ.22 నుంచి రూ.24కు కొనుగోలు చేస్తున్నారు. కార్డుదారులను వంచిస్తున్న డీలర్లు.. మరోవైపు.. కొందరు డీలర్లు కార్డుదారులకు మొక్కుబడిగా డబ్బులు చెల్లిస్తుండగా.. మరికొందరు దౌర్జన్యంగా లాగేసుకుంటున్నారు. ఏమైనా ప్రశ్నిస్తే తెల్లకార్డు గల్లంతవుతుందని పచ్చనేతలు బెదిరిస్తున్నారు. దీంతో.. బియ్యం పోతే పోయింది కార్డు అయినా మిగులుతుందని చాలామంది పేదలు మిన్నకుండిపోతున్నారు. దీంతో మంత్రులు గొట్టిపాటి రవికుమార్, అనగాని సత్యప్రసాద్ ప్రాతినిధ్యం వహిస్తున్న అద్దంకి, రేపల్లెతోపాటు పర్చూరు, చీరాల, బాపట్ల, వేమూరు నియోజకవర్గాల్లోనూ చాలామంది డీలర్లు గోడౌన్ల నుంచే రేషన్ బియ్యాన్ని వ్యాపారులకు అప్పగించి సొమ్ము చేసుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం అస్సలు పట్టించుకోవడంలేదు. -
ప్రియాంక్ ప్రతాపం
అహ్మదాబాద్: సీనియర్ ఓపెనర్ ప్రియాంక్ పాంచాల్ (200 బంతుల్లో 117 బ్యాటింగ్; 13 ఫోర్లు, 1 సిక్స్) అజేయ శతకంతో అదరగొట్టడంతో... కేరళతో జరుగుతున్న రంజీ ట్రోఫీ సెమీఫైనల్లో మాజీ చాంపియన్ గుజరాత్ జట్టు దీటుగా బదులిస్తోంది. బ్యాటింగ్కు సహకరిస్తున్న పిచ్పై మొదట కేరళ బ్యాటర్లు భారీ స్కోరు చేయగా... ఇప్పుడు గుజరాత్ కూడా అదే బాటలో నడుస్తోంది. బుధవారం మూడో రోజు ఆట ముగిసే సమయానికి గుజరాత్ జట్టు తొలి ఇన్నింగ్స్లో 71 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 222 పరుగులు చేసింది. ప్రియాంక్ సూపర్ సెంచరీకి ఆర్య దేశాయ్ (118 బంతుల్లో 73; 11 ఫోర్లు, 1 సిక్స్) అర్ధశతకం తోడవడంతో గుజరాత్ ఇన్నింగ్స్ సజావుగా సాగింది. ఈ జంట కేరళ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొవడంతో పరుగుల రాక సులువైంది. ముఖ్యంగా ఆర్య దూకుడుగా ఆడాడు. తొలి వికెట్కు 131 పరుగులు జోడించిన అనంతరం అతడు అవుటయ్యాడు. ఆ తర్వాత మనన్ హింగ్రాజియా (108 బంతుల్లో 30 బ్యాటింగ్; 3 ఫోర్లు)తో కలిసి ప్రియాంక్ ఇన్నింగ్స్ను నడిపించాడు. ఈ క్రమంలో ప్రియాంక్ ఫస్ట్ క్లాస్ కెరీర్లో 29వ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. తాజా రంజీ సీజన్లో అతడికిది రెండో శతకం. మూడో రోజు 71 ఓవర్లు వేసిన కేరళ కేవలం ఒక్క వికెట్ మాత్రమే పడగొట్టింది. బాసిల్కు ఆ వికెట్ దక్కింది. అంతకుముందు ఓవర్నైట్ స్కోరు 418/7తో బుధవారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన కేరళ జట్టు చివరకు 187 ఓవర్లలో 457 పరుగులు చేసి ఆలౌటైంది. వికెట్ కీపర్ మొహమ్మద్ అజహరుద్దీన్ (341 బంతుల్లో 177 నాటౌట్; 20 ఫోర్లు, 1 సిక్స్) అజేయంగా నిలిచాడు. మూడో రోజు 10 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసిన కేరళ జట్టు మరో 39 పరుగులు జోడించి మిగిలిన మూడు వికెట్లు కోల్పోయింది. చివరి వరుస బ్యాటర్లు ఎక్కువసేపు నిలవలేకపోయారు. గుజరాత్ బౌలర్లలో అర్జాన్ మూడు, చింతన్ గజా రెండు వికెట్లు పడగొట్టారు. ప్రస్తుతం చేతిలో 9 వికెట్లు ఉన్న గుజరాత్ జట్టు కేరళ తొలి ఇన్నింగ్స్ స్కోరుకు ఇంకా 235 పరుగులు వెనుకబడి ఉంది. స్కోరు వివరాలు కేరళ తొలి ఇన్నింగ్స్: అక్షయ్ (రనౌట్) 30; రోహన్ (ఎల్బీడబ్ల్యూ) (బి) రవి బిష్ణోయ్ 30; వరుణ్ (సి) ఉర్విల్ (బి) ప్రియజీత్సింగ్ 10; సచిన్ బేబీ (సి) ఆర్య దేశాయ్ (బి) అర్జాన్ 69; జలజ్ సక్సేనా (బి) అర్జాన్ 30; అజహరుద్దీన్ (నాటౌట్) 177; సల్మాన్ నిజర్ (ఎల్బీడబ్ల్యూ) (బి) విశాల్ 52; ఇమ్రాన్ (సి) ఉర్విల్ (బి) అర్జాన్ 24; ఆదిత్య (బి) చింతన్ 11; నిదీశ్ (రనౌట్) 5; బాసిల్ (సి) ఆర్య (బి) చింతన్ 1; ఎక్స్ట్రాలు 18; మొత్తం (187 ఓవర్లలో ఆలౌట్) 457. వికెట్ల పతనం: 1–60, 2–63, 3–86, 4–157, 5–206, 6–355, 7–395, 8–428, 9–455, 10–457, బౌలింగ్: చింతన్ 33–9–75–2; అర్జాన్ 34–9–81–3; ప్రియజీత్ సింగ్ 21–2–58–1; జైమీత్ 13–1–46–0; రవి బిష్ణోయ్ 30–7–74–1; సిద్ధార్థ్ దేశాయ్ 33–13–49–0; విశాల్ జైస్వాల్ 22–5–57–1; ఆర్య దేశాయ్ 1–0–3–0. గుజరాత్ తొలి ఇన్నింగ్స్: ప్రియాంక్ (బ్యాటింగ్) 117; ఆర్య దేశాయ్ (బి) బాసిల్ 73; మనన్ (బ్యాటింగ్) 30; ఎక్స్ట్రాలు 2; మొత్తం: (71 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి) 222. వికెట్ల పతనం: 1–131. బౌలింగ్: నిధీశ్ 10–1–40–0; జలజ్ 25–5–71–0; బాసిల్ 15–1–40–1; ఆదిత్య 17–2–55–0; అక్షయ్ చంద్రన్ 3–0–11–0; ఇమ్రాన్ 1–0–3–0. -
Ranji Semis-1: కేరళ భారీ స్కోర్.. అజేయ సెంచరీతో మెరిసిన అజహరుద్దీన్
అహ్మదాబాద్: పసలేని గుజరాత్ బౌలింగ్పై కేరళ బ్యాటర్లు ఆధిపత్యం కనబరుస్తున్నారు. రెండో రోజు ఆటలో ఓవర్నైట్ బ్యాటర్ మొహమ్మద్ అజహరుద్దీన్ (303 బంతుల్లో 149 బ్యాటింగ్; 17 ఫోర్లు) అజేయ సెంచరీతో కదంతొక్కాడు. సల్మాన్ నిజర్ (202 బంతుల్లో 52; 4 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీతో ఆకట్టుకున్నాడు. రెండు రోజుల్లో గుజరాత్ బౌలర్లలో ఏ ఒక్కరు కూడా ప్రభావం చూపలేకపోయారు. 177 ఓవర్లు వేసిన గుజరాత్ 7 వికెట్లనే పడగొట్టింది. మంగళవారం అజహరుద్దీన్, సల్మాన్ల జోడీ క్రీజులో పాతుకుపోవడంతో రోజంతా కష్టపడిన గుజరాత్ బౌలర్లకు మూడే వికెట్లు దక్కాయి. ఓవర్నైట్ స్కోరు 206/4తో రెండో రోజు తొలి ఇన్నింగ్స్ను కొనసాగించిన కేరళ అదే స్కోరు వద్ద కెప్టెన్ సచిన్ బేబీ (69; 8 ఫోర్లు) వికెట్ను కోల్పోయింది. కీలకమైన వికెట్ను తీశామన్న ఆనందం లేకుండా సల్మాన్... ఓవర్నైట్ బ్యాటర్ అజహరుద్దీన్తో కలిసి ఇన్నింగ్స్ను నడిపించాడు. ఇద్దరు కూడా ఏమాత్రం అనవసర షాట్ల జోలికి వెళ్లకుండా నింపాదిగా పరుగులు జత చేశారు. దీంతో మొదటి సెషన్లో మరో వికెట్ పడకుండా కేరళ 293/5 స్కోరు వద్ద లంచ్ బ్రేక్కు వెళ్లింది. తర్వాత జట్టు స్కోరు 300 పరుగులు దాటింది. ఇద్దరు జిడ్డుగా ఆడటంతో గుజరాత్ బౌలర్లకు ఆలసటే తప్ప వికెట్ల ఓదార్పు దక్కనే లేదు. ఈ క్రమంలో అజహరుద్దీన్ ఫస్ట్క్లాస్ క్రికెట్లో రెండో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. డ్రింక్స్ విరామం తర్వాత సల్మాన్ అర్ధశతకం సాధించాడు. ఈ రెండో సెషన్లోనూ వీళ్లిద్దరి ఆటే కొనసాగడంతో గుజరాత్ శిబిరానికి వికెట్ సంబరమే లేకుండాపోయింది. ఎట్టకేలకు ఆఖరి సెషన్ ఊరటనిచ్చింది. ఇందులో రెండు వికెట్లు పడగొట్టగలిగింది. సల్మాన్ను విశాల్ జైస్వాల్ వికెట్ల ముందు దొరకబుచ్చుకోవడంతో ఆరో వికెట్కు 149 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. కానీ తర్వాత వచి్చన అహమ్మద్ ఇమ్రాన్ (66 బంతుల్లో 24; 3 ఫోర్లు) కూడా గుజరాత్ బౌలర్లను ఇబ్బంది పెట్టాకే నిష్క్రమించాడు. ఆదిత్య సర్వతే (10 బ్యాటింగ్; 1 ఫోర్)తో వచ్చాక అజహరుద్దీన్ జట్టు స్కోరును 400 దాటించాడు. ఆటనిలిచే సమయానికి ఇద్దరు అజేయంగా నిలిచారు. అర్జాన్కు 3 వికెట్లు దక్కాయి. స్కోరు వివరాలు కేరళ తొలి ఇన్నింగ్స్: అక్షయ్ (రనౌట్) 30; రోహన్ (ఎల్బీడబ్ల్యూ) (బి) రవి బిష్ణోయ్ 30; వరుణ్ (సి) ఉర్విల్ (బి) ప్రియజీత్సింగ్ 10; సచిన్ (సి) ఆర్య దేశాయ్ (బి) అర్జాన్ 69; జలజ్ సక్సేనా (బి) అర్జాన్ 30; అజహరుద్దీన్ (బ్యాటింగ్) 149; సల్మాన్ (ఎల్బీడబ్ల్యూ) (బి) విశాల్ 52; ఇమ్రాన్ (సి) ఉర్విల్ (బి) అర్జాన్ 24; ఆదిత్య (బ్యాటింగ్) 10; ఎక్స్ట్రాలు 14; మొత్తం (177 ఓవర్లలో 7 వికెట్లకు) 418. వికెట్ల పతనం: 1–60, 2–63, 3–86, 4–157, 5–206, 6–355, 7–395. బౌలింగ్: చింతన్ గజా 28–8–57–0, అర్జాన్ 29–8–64–3, ప్రియజీత్ సింగ్ 21–2–58–1, జైమీత్ 13–1–46–0, రవి బిష్ణోయ్ 30–7–74–1, సిద్ధార్థ్ దేశాయ్ 33–13–49–0, విశాల్ జైస్వాల్ 22–5–57–1, ఆర్య దేశాయ్ 1–0–3–0. -
కీలక ఫైళ్ల గల్లంతు.. గుజరాత్ హైకోర్టుకు తాత్కాలిక చీఫ్ జస్టిస్!
న్యూఢిల్లీ: పలు కేసులకు సంబంధించిన ఫైల్స్ గల్లంతు అయిన వ్యవహారం గుజరాత్ హైకోర్టు(Gujarat High Court)ను కుదిపేస్తోంది. మరోవైపు చీఫ్ జస్టిస్ సునీతా అగర్వాల్ను బదిలీ చేయాల్సిందేనంటూ తోటి జడ్జిలు, అడ్వొకేట్లు డిమాండ్ లేవనెత్తారు. ఈ నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. విమర్శల నేపథ్యంలో ఆమెను సెలవులపై వెళ్లగా.. జస్టిస్ అనిరుధ్ వైష్ణవ్ను తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా నియమించింది.గుజరాత్ హైకోర్టు పరిధి నుంచి పలు కేసులకు సంబంధించిన ఫైల్స్ మాయం(Files Missing) కావడంపై జడ్జి సందీప్ భట్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇది న్యాయవ్యవస్థలోని పారదర్శకతను, నమ్మకాన్ని దెబ్బ తీసే అంశమని ఆందోళన వ్యక్తం చేశారాయన. ఈ క్రమంలో న్యాయ ప్రక్రియలకు సత్వర సంస్కరణలకు అవసరమని అభిప్రాయపడ్డారు. అంతేకాదు.. ఫైళ్ల మాయంలో హైకోర్టు రిజిస్ట్రార్ ఏటీ ఉక్రాణి పాత్రపైనా ఆయన అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే.. ఇది ఊహించని పరిణామానికి దారి తీసింది.జస్టిస్ సందీప్ భట్ రోస్టర్ను మార్చేస్తూ చీఫ్ జస్టిస్ సునీతా అగర్వాల్(Chief Justice Sunitha Agarwal) ఆదేశాలు జారీ చేశారు. ఈ నిర్ణయం తీవ్ర అభ్యంతరాలకు కారణం కావడం మాత్రమే కాదు పలు అనుమానాలకూ దారి తీసింది. గుజరాత్ హైకోర్టు అడ్వొకేట్ అసోషియేషన్స్ సోమవారం అత్యవసరంగా సమావేశమై చీఫ్ జస్టిస్ నిర్ణయంపై చర్చించాయి. మరోవైపు.. హైకోర్టు జడ్జిలు, లాయర్లు జస్టిస్ సందీప్ భట్కు సంఘీభావం ప్రకటించారు. అయితే.. చీఫ్ జస్టిస్ సునీతా అగర్వాల్ ఇలా జడ్జిల విధులకు అడ్డుపడడం ఇదే తొలిసారేం కాదు. ఇంతకు ముందు.. నలుగురు జడ్జిల విషయంలోనూ ఆమె ఇలాగే ప్రవర్తించారు. అలాగే.. న్యాయవాదులతోనూ ఆమె వ్యవహరించే తీరుపైనా తీవ్ర విమర్శలు ఉన్నాయితాజాగా.. మొన్న శుక్రవారం(ఫిబ్రవరి 14)న అక్రమ కట్టడాలకు సంబంధించిన దాఖలైన పిల్పై వాదనలు జరిగాయి. చీఫ్ జస్టిస్ సునీతా అగర్వాల్ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం ఆ పిల్ను విచారించింది. ఆ టైంలో జీహెచ్సీఏఏ అధ్యక్షుడు, సీనియర్ లాయర్ బ్రిజేష్ త్రివేదికి చీఫ్ జస్టిస్కి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. తమ వాదనలు పూర్తిగా వినాలంటూ తీవ్ర స్వరంతో ఆయన చీఫ్ జస్టిస్ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అయితే ఆమె అవేం పట్టనట్లు గాల్లో చూస్తూ ఉండిపోయారు. దీంతో ఆయన మరోసారి వ్యాఖ్యలు చేయడంతో.. ఆమె మందలించారు. ఈ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశమైంది కూడా. ఈ పరిణామాలన్నింటిని దృష్ట్యా దీంతో ఆమెను మరో న్యాయస్థానానికి బదిలీ చేయాలంటూ జడ్జిలు, లాయర్లు డిమాండ్ లేవనెత్తారు. ఈ అంశంపై మంగళవారం మరోసారి జీహెచ్సీఏఏ జనరల్ బాడీ అత్యవసర సమావేశం నిర్వహించాలనుకుంది. కానీ ఈలోపు.. అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. చీఫ్ జస్టిస్ సునీతా అగర్వాల్ సెలవులపై వెళ్లగా.. ఆమె స్థానంలో జస్టిస్ బీరెన్ అనిరుధ్ వైష్ణవ్ను తాత్కాలిక చీఫ్ జస్టిస్గా నియమించింది. ఫిబ్రవరి 18వ తేదీ నుంచి మార్చి 2వ తేదీదాకా ఆయన ఆ బాధ్యతలు నిర్వర్తించనున్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 223 ప్రకారం ఈ నియామకం చేపట్టినట్లు న్యాయ విభాగం(నియామకాల) కేంద్ర సంయుక్త కార్యదర్శి జగన్నాథ్ శ్రీనివాసన్ పేరిట నోటిఫికేషన్ విడుదలైంది.ఆ పెద్దావిడ పిటిషన్తో..జయశ్రీ జోషి(71) 2020లో రాధాన్పూర్ కోర్టులో ఓ కేసు నమోదు చేసింది. అయితే అందుకు సంబంధించిన ఫైల్ కనిపించకుండా పోయిందని హైకోర్టును ఆమె ఆశ్రయించారు. ఈ పిటిషన్ జస్టిస్ సందీప్ భట్ బెంచ్ విచారణ జరిపి.. కనిపించకుండా పోయిన ఆ ఫైల్స్ ఆచూకీ కనిపెట్టాలంటూ దర్యాప్తునకు ఆదేశించింది. ఈ క్రమంలో..2024 డిసెంబర్లో ఈ పిటిషన్కు సంబంధించి సమగ్రమైన నివేదిక అందించాలని రిజిస్ట్రీని ఆదేశించింది. అప్పుడే.. సూరత్ కోర్టుకు సంబంధించిన 15 కేసుల ఫైల్స్ కనిపించకుండా పోయాయనే విషయం వెలుగు చూసింది. కొసమెరుపు ఏంటంటే.. ఆ టైంలో సంబంధిత అధికారిగా, ప్రస్తుతం ఆరోపణలు ఎదుర్కొంటున్న రిజిస్ట్రార్ ఏటీ ఉక్రాణి ఉండడం గమనార్హం. సూరత్ కోర్టులో ఆరేళ్లపాటు పని చేసి.. బదిలీ మీద కోర్టుకు వచ్చారు. ప్రస్తుతం ఫైల్స్ మాయం అయిన వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరుగుతోంది.ఎవరీ సునీతా అగర్వాల్ఉత్తర ప్రదేశ్కు చెందిన జస్టిస్ సునీతా అగర్వాల్.. గతంలో అలహాబాద్ కోర్టులో జడ్జిగా పని చేశారు. కరోనా లాక్డౌన్ సమయంలో మానవ హక్కుల గురించి చర్చ ద్వారా ఆమె వార్తల్లో ప్రముఖంగా నిలిచారు. ఆహారం పంచుతున్న కొందరిని పోలీసులు అరెస్ట్ చేయగా.. వాళ్లందరినీ విడుదల చేయాలని ఆమె ఆదేశించారు. అంతేకాదు.. యూపీలో పని చేసే చోట్ల లైంగిక వేధింపుల కట్టడికి ఏర్పాటు చేసిన కీలక కమిటీలోనూ ఆమె సభ్యురాలిగా పని చేశారు. -
చరిత్ర సృష్టించిన కేరళ క్రికెటర్
అహ్మదాబాద్ వేదికగా గుజరాత్, కేరళ జట్ల మధ్య రంజీ ట్రోఫీ తొలి సెమీఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్లో కేరళ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేస్తుంది. రెండో రోజు రెండో సెషన్ సమయానికి కేరళ 134.2 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 325 పరుగులు చేసింది. వికెట్కీపర్ మొహమ్మద్ అజహారుద్దీన్ (105 నాటౌట్), సల్మాన్ నిజర్ (40 నాటౌట్) బ్యాటింగ్ చేస్తున్నారు.కేరళ ఇన్నింగ్స్లో కెప్టెన్ సచిన్ బేబి (69) అర్ద సెంచరీతో రాణించగా.. అక్షయ్ చంద్రన్, రోహన్ కున్నుమ్మల్, జలజ్ సక్సేనా తలో 30 పరుగులు చేశారు. వరుణ్ నయనార్ 10 పరుగులకు ఔటయ్యాడు. గుజరాత్ బౌలర్లలో అర్జన్ నగస్వల్లా 2, పి జడేజా, రవి బిష్ణోయ్ తలో వికెట్ పడగొట్టారు.చరిత్ర సృష్టించిన మొహమ్మద్ అజహారుద్దీన్ఈ మ్యాచ్లో సెంచరీతో కదంతొక్కిన మొహమ్మద్ అజహారుద్దీన్ రికార్డుబుక్కుల్లోకెక్కాడు. రంజీ సెమీఫైనల్లో సెంచరీ చేసిన తొలి కేరళ ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. రంజీల్లో కేరళ గతంలో ఒకే ఒక సారి సెమీస్కు చేరుకుంది. 2018-19 సీజన్లో కేరళ ఫైనల్ ఫోర్కు అర్హత సాధించింది. అయితే ఆ సీజన్ సెమీస్లో ఏ కేరళ ఆటగాడు సెంచరీ చేయలేదు. అజహారుద్దీనే రంజీల్లో కేరళ తరఫున సెంచరీ చేసిన తొలి ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.ప్రస్తుత రంజీ సీజన్లో కేరళ అద్భుతమైన ప్రదర్శనలతో క్వార్టర్ ఫైనల్కు చేరింది. ఎలైట్ గ్రూప్-సిలో కేరళ 7 మ్యాచ్ల్లో 3 విజయాలు, 4 డ్రాలతో గ్రూప్లో రెండో స్థానంలో నిలిచింది. క్వార్టర్ ఫైనల్లో కేరళ.. జమ్మూ అండ్ కశ్మీర్పై ఒక్క పరుగు ఆధిక్యం (తొలి ఇన్నింగ్స్లో) సాధించి సెమీస్ బెర్త్ దక్కించుకుంది.మరో సెమీఫైనల్ మ్యాచ్లో విదర్భ, ముంబై జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన విదర్భ తొలి ఇన్నింగ్స్లో 383 పరుగులకు ఆలౌటైంది. ముంబై బౌలర్ శివమ్ దూబే ఐదు వికెట్లతో రాణించాడు. షమ్స్ములానీ, రాయ్స్టన్ డయాస్ తలో రెండు, శార్దూల్ ఠాకూర్ ఓ వికెట్ తీశారు.విదర్భ ఇన్నింగ్స్లో దృవ్ షోరే (74), దినిశ్ మాలేవార్ (79), యశ్ రాథోడ్ (54) అర్ద సెంచరీలతో రాణించగా.. కరుణ్ నాయర్ (45), కెప్టెన్ అక్షయ్ వాద్కర్ (34) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. అథర్వ తైడే 4, పార్థ్ రేఖడే 23, హర్ష్ దూబే 18, భూటే 11, యశ్ ఠాకూర్ 3 పరుగులు చేసి ఔట్ కాగా.. దర్శన్ నల్కండే 12 పరుగులతో అజేయంగా నిలిచాడు.అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ముంబై.. 18 పరుగుల వద్దే తొలి వికెట్ కోల్పోయింది. దర్శన్ నల్కండే బౌలింగ్లో దనిశ్ మలేవార్కు క్యాచ్ ఇచ్చి ఆయుశ్ మాత్రే (9) ఔటయ్యాడు. ప్రస్తుతం ఆకాశ్ ఆనంద్ (29), సిద్దేశ్ లాడ్ (19) క్రీజ్లో ఉన్నారు. 23 ఓవర్ల అనంతరం ముంబై తొలి ఇన్నింగ్స్ స్కోర్ 62/1గా ఉంది. విదర్భ తొలి ఇన్నింగ్స్ స్కోర్కు ముంబై ఇంకా 321 పరుగులు వెనుకపడి ఉంది. -
సెమీఫైనల్ మ్యాచ్.. లంచ్కు ముందు ఐదుగురు.. తర్వాత ఒక్కడే.. జనాలు లేక వెలవెలబోయిన నరేంద్ర మోదీ స్టేడియం
ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్ మైదానమైన నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగుతున్న సుప్రసిద్ధ దేశవాళీ టోర్నీ సెమీఫైనల్కు (కేరళ వర్సెస్ గుజరాత్) సరైన ప్రచారం లేక ప్రేక్షకులు అటువైపే కన్నెత్తి చూడలేదు. దాదాపు లక్షా 30 వేల సామర్థ్యమున్న ప్రేక్షకుల గ్యాలరీలో తొలిరోజు తొలి సెషన్లో కేవలం ఐదుగురే మ్యాచ్ను తిలకించేందుకు వచ్చారు. భోజన విరామం తర్వాత ఇందులో ఒకే ఒక్కడు మిగిలాడు. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ కావడంతో నెటిజన్స్ స్పందించారు. కొందరేమో ప్రేక్షకులను అనుమతించరేమోనని వెళ్లలేదని పేర్కొనగా, మరికొందరు అసలిక్కడ సెమీస్ జరుగుతున్న సంగతే తమకు తెలియదని పోస్ట్లు పెట్టారు. మరికొందరు క్రికెట్ ఔత్సాహికులు అనుమతిస్తున్నారనే బదులు రావడంతో రెండో రోజు నుంచి వెళ్తామని ఆసక్తి చూపారు. మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్కు దిగిన కేరళ, ఇన్నింగ్స్ను చప్పగా ప్రారంభించింది. కెప్టెన్ సచిన్ బేబీ (193 బంతుల్లో 69 బ్యాటింగ్, 8 ఫోర్లు) జిడ్డుగా బ్యాటింగ్ చేశాడు. దీంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి కేరళ జట్టు 89 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. ఓపెనర్లు అక్షయ్ చంద్రన్ (30; 5 ఫోర్లు), రోహన్ (30; 5 ఫోర్లు) మంచి ఆరంభాలు లభించినా భారీ స్కోర్లుగా మలచలేకపోయారు. వరుణ్ నాయనార్ (10) తక్కువ స్కోర్కే ఔటయ్యాడు.జలజ్ సక్సేనా (30; 4 ఫోర్లు) గుజరాత్ బౌలర్ల సహనానికి పరీక్షించాడు. ఆట ముగిసే సమయానికి సచిన్ బేబితో పాటు మొహమ్మద్ అజారుద్దీన్ (30) క్రీజ్లో ఉన్నాడు. గుజరాత్ బౌలర్లలో అర్జన్ నగస్వల్లా, పి జడేజా, రవి బిష్ణోయ్ తలో వికెట్ పడగొట్టారు. -
Ranji Trophy Semis-1: సచిన్ కెప్టెన్ ఇన్నింగ్స్
అహ్మదాబాద్: కేరళ, గుజరాత్ జట్ల మధ్య రంజీ ట్రోఫీ తొలి సెమీఫైనల్ మ్యాచ్ చప్పగా మొదలైంది. తొలిరోజు ఆటలో మొదట బ్యాటింగ్కు దిగిన కేరళ ఇన్నింగ్స్లో కెప్టెన్ సచిన్ బేబీ (193 బంతుల్లో 69 బ్యాటింగ్, 8 ఫోర్లు) జిడ్డుగా బ్యాటింగ్ చేశాడు. దీంతో సోమవారం ఆట ముగిసే సమయానికి కేరళ జట్టు 89 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. మొదట ఓపెనర్లు అక్షయ్ చంద్రన్ (30; 5 ఫోర్లు), రోహన్ (30; 5 ఫోర్లు) 20 ఓవర్ల వరకు వికెట్ పడిపోకుండా 60 పరుగులు జతచేశారు. 3 పరుగుల వ్యవధిలో వీరిద్దరూ అవుటయ్యారు. కాసేపయ్యాక వరుణ్ నాయనార్ (10) నిష్క్రమించగా... కెప్టెన్ సచిన్, జలజ్ సక్సేనా (30; 4 ఫోర్లు) గుజరాత్ బౌలర్ల సహనానికి పరీక్ష పెట్టేలా బ్యాటింగ్ చేశారు.గుజరాత్ జట్టు ఏకంగా ఏడుగురు బౌలర్లను మార్చిమార్చి ప్రయోగించినా... ప్రయోజనం లేకపోయింది. వీళ్లిద్దరు 27.5 ఓవర్ల పాటు క్రీజులో పాతుకుపోవడంతో ప్రత్యర్థి బౌలర్లు, ఫీల్డర్లు అలసిపోయారు. ఎట్టకేలకు మూడో సెషన్ మొదలయ్యాక సక్సేనాను అర్జాన్ నగ్వాస్వాలా బౌల్డ్ చేయడంతో వీరి భాగస్వామ్యానికి తెరపడింది. నాలుగో వికెట్కు ఈ జోడీ 71 పరుగులు జోడించింది. తర్వాత మొహమ్మద్ అజహరుద్దీన్ (30 బ్యాటింగ్; 3 ఫోర్లు) కూడా నాయకుడికి అండగా నిలవడంతో గుజరాత్ జట్టుకు కష్టాలు కొనసాగాయి.132 బంతుల్లో సచిన్ అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. అబేధ్యమైన ఐదో వికెట్కు అజహరుద్దీన్, సచిన్ 49 పరుగులు జతచేశారు. టెస్టులు, దేశవాళీ టోర్నీలో సెషన్కు 30 ఓవర్లు వేస్తారు. అయితే సచిన్ 25వ ఓవర్లో క్రీజులోకి వచ్చి ఓ సెషన్ ఓవర్లను మించే క్రీజులో నిలిచాడు. 193 బంతులంటే 32 ఓవర్ల పైచిలుకు బంతుల్ని అతను ఎదుర్కొన్నాడు. అర్జాన్, ప్రియజీత్, రవి బిష్ణోయ్ తలా ఒక వికెట్ తీశారు. స్కోరు వివరాలు కేరళ తొలి ఇన్నింగ్స్: అక్షయ్ (రనౌట్) 30; రోహన్ (ఎల్బీడబ్ల్యూ) (బి) రవి బిష్ణోయ్ 30; వరుణ్ (సి) ఉర్విల్ (బి) ప్రియజీత్సింగ్ 10; సచిన్ బేబీ (బ్యాటింగ్) 69; జలజ్ సక్సేనా (బి) అర్జాన్ 30; అజహరుద్దీన్ (బ్యాటింగ్) 30; ఎక్స్ట్రాలు 7; మొత్తం (89 ఓవర్లలో 4 వికెట్లకు) 206. వికెట్ల పతనం: 1–60, 2–63, 3–86, 4–157. బౌలింగ్: చింతన్ గజా 18–536–0, అర్జాన్ 16–4–39–1, ప్రియజీత్ సింగ్ 12–0–33–1, జైమీత్ 9–1–26–0, రవి బిష్ణోయ్ 15–2–33–1, సిద్ధార్థ్ దేశాయ్ 16–8–22–0, విశాల్ జైస్వాల్ 3–1–13–0. -
రెండు ఇన్నింగ్స్ల్లో విఫలమైన పుజారా.. రంజీ క్వార్టర్ ఫైనల్లో సౌరాష్ట్ర ఓటమి
రంజీ ట్రోఫీ నాలుగో క్వార్టర్ ఫైనల్లో సౌరాష్ట్రపై గుజరాత్ ఇన్నింగ్స్ 98 పరుగుల తేడాతో గెలుపొందింది. తద్వారా సెమీస్కు అర్హత సాధించింది. ఈ మ్యాచ్లో సౌరాష్ట్ర ప్లేయర్లు రెండు ఇన్నింగ్స్ల్లో దారుణంగా విఫలమయ్యారు. తొలి ఇన్నింగ్స్లో చిరాగ్ జానీ (69), రెండో ఇన్నింగ్స్లో హార్విక్ దేశాయ్ (54) మాత్రమే అర్ద సెంచరీలతో పర్వాలేదనిపించారు. ఈ మ్యాచ్లో టీమిండియా నయా వాల్ చతేశ్వర్ పుజారా రెండు ఇన్నింగ్స్ల్లో విఫలమయ్యాడు. తొలి ఇన్నింగ్స్లో 26 పరుగులు చేసిన పుజారా.. రెండో ఇన్నింగ్స్లో 2 పరుగులకే ఔటయ్యాడు.కలిసికట్టుగా రాణించిన గుజరాత్ బౌలర్లు ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌరాష్ట్ర 216 పరుగులకే ఆలౌటైంది. చింతన్ గజా 4, జయ్మీత్ పటేల్, సిద్దార్థ్ దేశాయ్ తలో 2, నగస్వల్లా, రవి బిష్ణోయ్ చెరో వికెట్ పడగొట్టారు. సౌరాష్ట్ర బ్యాటర్లలో చిరాగ్ జానీ హాఫ్ సెంచరీతో పర్వాలేదనిపించగా.. హార్విక్ దేశాయ్ (22), పుజారా, షెల్డన్ జాక్సన్ (14), వసవద (39 నాటౌట్), ధర్మేంద్ర జడేజా (22), ఉనద్కత్ (14) రెండంకెల స్కోర్లు చేశారు.జయ్మీత్, ఉర్విల్ సెంచరీలుఅనంతరం బరిలోకి దిగిన గుజరాత్ బ్యాటర్లు చెలరేగి ఆడారు. జయ్మీత్ పటేల్ (103), ఉర్విల్ పటేల్ (140) సెంచరీలతో కదంతొక్కగా.. మనన్ హింగ్రజియా (81) భారీ అర్ద సెంచరీతో రాణించాడు. వీరికి తోడు రవి బిష్ణోయ్ (45), చింతన్ గజా (39), విశాల్ జేస్వాల్ (28), ప్రియాంక్ పంచల్ (25) ఓ మోస్తరు స్కోర్లు చేయడంతో గుజరాత్ తొలి ఇన్నింగ్స్లో 511 పరుగుల భారీ స్కోర్ చేసింది. సౌరాష్ట్ర బౌలర్లలో ధర్మేంద్ర జడేజా ఐదు వికెట్లు తీయగా.. చిరాగ్ జానీ 4, జయదేశ్ ఉనద్కత్ ఓ వికెట్ పడగొట్టారు.295 పరుగులు వెనుకపడి రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన సౌరాష్ట్ర.. ఈ ఇన్నింగ్స్లో ఇంకా దారుణమైన ప్రదర్శన చేసింది. గుజరాత్ బౌలర్లు పి జడేజా (4 వికెట్లు), నగస్వల్లా (3), బిష్ణోయ్ (2), చింతన్ గజా (1) ధాటికి రెండో ఇన్నింగ్స్లో 197 పరుగులకే చాపచుట్టేసింది. ఫలితంగా గుజరాత్ ఇన్నింగ్స్ తేడాతో ఘన విజయం సాధించింది. సౌరాష్ట్ర సెకెండ్ ఇన్నింగ్స్లో హార్విక్ దేశాయ్ (54) టాప్ స్కోరర్గా నిలిచాడు. చిరాగ్ జానీ (26), షెల్డన్ జాక్సన్ (27), వసవద (11), డి జడేజా (19), ఉనద్కత్ (29) రెండంకెల స్కోర్లు చేశారు.మిగతా మూడు క్వార్టర్ ఫైనల్స్లో ముంబై, హర్యానా.. విదర్భ, తమిళనాడు.. జమ్మూ అండ్ కశ్మీర్, కేరళ జట్లు తలపడుతున్నాయి. ప్రస్తుతం నాలుగో రోజు రెండో సెషన్ ఆట కొనసాగుతుంది. ఈ మ్యాచ్ల్లో రేపు ఫలితం తేలే అవకాశం ఉంది. -
భారీ వేతనమిచ్చే ఉద్యోగాన్ని వదిలేసి.. ఐపీఎస్ అయ్యిందిలా!
అదృష్టాన్ని నమ్ముకుంటే కలలు సాకారం కావు. కృషి, పట్టుదల ఉంటేనే ఏదైనా సాధించవచ్చు. విజయం సాధించాలనే సంకల్పం ఉంటే సరిపోదు.. ఎన్ని కష్టాలైనా, నష్టాలైనా ఓపికతో కృషి చేయాలి. అలా ఆత్మవిశ్వసంతో విజయ తీరాలకు చేరుకున్న స్ఫూర్తిదాతలెందరో ఉన్నారు. అలా తన జీవితంలో ఒక బిగ్ డ్రీమ్ కోసం ఎవరూ ఊహించని విధంగా సాహసోపేతంగా ప్రతిభను చాటుకున్న ఒక ధీర గురించి తెలుసు కుందాం రండి..!ఆమె పేరే పూజా యాదవ్. హర్యానాకు చెందిన పూజా పట్టుదలగా ఎదిగి ఐపీఎస్ ఆఫీసర్ స్థాయికి ఎదిగింది. 1998లో హర్యానాలోని సోనిపట్లో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన ఆమె సోనిపట్లో పాఠశాల విద్యను పూర్తి చేసింది. బయోటెక్నాలజీలో బీటెక్, జీ, ఫుడ్ టెక్నాలజీలో ఎంటెక్ పూర్తి చేసింది. అందివచ్చిన అవకాశాలతో కెనడా, జర్మనీలో మంచి వేతనంతో ఉద్యోగాలు చేశారు. కుటుంబ పరిస్థితి గురించి ఆలోచించి ఉద్యోగం చేయాల్చి వచ్చినా, ఐపీఎస్(IPS) అవ్వాలనే ఆశయం మాత్రం నిరంతరం పూజా మదిలో మెదులుతూనే ఉంది. దీనికితోడు దేశాభివృద్ధికి తోడ్పడాలనే బలమైన కోరిక ఉంది. మొదటి నుంచీ, ఆమె తన దేశానికి సేవచేయాలని కోరిక సివిల్ సర్వీసెస్ పరీక్షకు (UPSC వైపు నడిపించింది. అంతే వన్ ఫైన్మార్నింగ్ కీలక నిర్ణయం తీసుకుంది. తక్షణమే ఉద్యోగం వదిలేసి భారత దేశానికి తిరిగి వచ్చింది. సివిల్స్ ప్రిపరేషన్ (మొదలు పెట్టింది. కానీ ఇది ఆమె అనుకున్నంత సులువుగా సాగలేదు. ఒకవైపు పూజా కుటుంబం ఆర్థిక పరిస్థితి, మరోవైపు చదువుకి అయ్యే ఖర్చులు ఇలా చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. అయితే ఐపీఎస్ కావాలనే నిర్ణయానికి కుటుంబంలో అందరూ తోడుగా నిలిచారు.ఇదీ చదవండి: నీతా అంబానీకి ముఖేష్ అంబానీ సర్ప్రైజ్ గిప్ట్రిసెప్షనిస్టుగా పనిచేస్తూనే,ఒకవైపు సిపిల్స్కు ప్రిపేర్ అవుతూనే,తన ఆర్థిక అవసరాల నిమిత్తం పిల్లలకు ట్యూషన్లు చెప్పింది. దీంతోపాటు రిసెప్షనిస్టుగా పనిచేస్తూ, పరీక్షలకు ప్రిపేర్ అయింది. తొలి ప్రయత్నం విఫలమైంది. అయినా పట్టువీడలేదు. నిరాశపడకుంగా, ఏకాగ్రతతో తపస్సులా చేసింది. చివరికి ఆమె కష్టం వృధా పోలేదు.సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన తర్వాత ఇండియన్ పోలీస్ సర్వీస్లో చేరడం ద్వారా పౌరుల జీవితాలపై ప్రభావాన్ని చూపిస్తోంది. 2018 కేడర్లో IPSగా నియమితురాలు కావడం తన జీవితంలో మర్చిపోలేని రోజని సంతోషంగా చెప్పింది పూజా. 2021లో స్నేహితుడు వికల్ప్ భరద్వాజ్ను ముస్సోరీలో లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడెమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్లో సాగిన పరిచయం పెళ్లికి దారి తీసింది. ప్రస్తుతం గుజరాత్ ట్రాఫిక్ డీసీపీగా పనిచేస్తున్నారు. వృత్తిబాధ్యలతోపాటు, పూజ యాదవ్, సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. ఆమె ఇన్స్టాగ్రామ్ పేజీలో 3.28 లక్షల మంది ఫాలోయర్స్ ఉన్నారు. ప్రజలతో కమ్యూనికేట్ అవ్వడానికి సోషల్ మీడియాను మించినది లేదు అని నమ్మేవారిలో పూజా యాదవ్ ఒకరు. చదవండి: Maha Kumbh Mela అద్భుతమైన అనుభవం: నీనా గుప్తా ప్రశంసలు -
పదో తరగతి, ఇంటర్ పరీక్షలు.. కేంద్రాల్లోకి షూస్, సాక్స్లకు నో ఎంట్రీ
గాంధీ నగర్ : త్వరలో పదో తరగతి, ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. అయితే, ఈ పరీక్షల నిర్వహణలో భాగంగా సెకండరీ, హయ్యర్ సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డ్ కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు షూస్, సాక్స్లు ధరించొద్దని ఆదేశించింది. ఈ మార్గదర్శకాలు ఎక్కడంటే?గుజరాత్లో ఫిబ్రవరి 27 నుంచి పదోతరగతి, ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ తరుణంలో విద్యార్థులకు గుజరాత్ సెకండరీ,హయ్యర్ సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డ్ పలు సూచనలు ఇచ్చింది.పరీక్షల్లో జరిగే కాపీయింగ్ను అరికట్టేందుకే గుజరాత్ ప్రభుత్వం పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు షూస్,సాక్సులు ధరించకూడదని సూచించింది. పరీక్ష ప్రారంభానికి అరగంట ముందే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలి. విద్యార్థులు మొబైల్, ఎలక్ట్రానిక్ వాచ్ లేదా ఎలాంటి గాడ్జెట్లు ధరించకూడదని ఆదేశించింది. ఇప్పటికే 2018 నుండి బీహార్ బోర్డు ఈ తరహాలో పరీక్షలు నిర్వహిస్తుంది. అయితే,ప్రతికూల వాతావరణం కారణంగా కొనసాగుతున్న ఇంటర్ రెండో సంవత్సరం పరీక్షలు, త్వరలో ప్రారంభం కానున్న పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు మినహాయింపు ఇచ్చినట్లు సమాచారం. బీహార్ బాటలో ఉత్తరప్రదేశ్ బోర్డు సైతం పరీక్షల సమయంలో కొన్ని కేంద్రాల్లో పరీక్షలు రాసే విద్యార్థులు మాత్రమే షూస్,సాక్స్లు లేకుండా రావాలని తెలిపింది. తాజాగా,గుజరాత్ సైతం పరీక్షల్లో కాపీయింగ్ను అరికట్టే దిశగా చర్యలు తీసుకుంది. కాగా,ఈ సంవత్సరం గుజరాత్లో 10వ తరగతి, ఇంటర్ రెండో సంవత్సరం పరీక్షలకు 14.30 లక్షల మంది విద్యార్థులు హాజరు కానున్నారు. -
‘అల’పెరుగని గుండెల్
పురాణాల నుంచి వర్తమానం వరకు పతిప్రాణాలు రక్షించుకోవడం కోసం మహిళలు పడిన కష్టాలు, చేసిన పోరాటం మనకు కొత్త కాదు. నూకమ్మ చేసిన పోరాటం ఆ కోవలోకే వస్తుంది. శ్రీకాకుళం జిల్లాలోని మారుమూల గ్రామానికి చెందిన నూకమ్మ భర్త, అతడి బృందం గుజరాత్లో చేపల వేటకు వెళ్లి పాకిస్తాన్ కోస్టు గార్డుల చేతికి చిక్కారు. పాకిస్తాన్ జైల్లో పద్నాలుగు నెలలు మగ్గారు. అప్పట్లో ‘ప్రజా సంకల్పయాత్ర’ చేస్తున్న వైఎస్ జగన్ మోహన్రెడ్డి దృష్టికి తమ సమస్యను తీసుకు వెళ్లారు. బాధిత కుటుంబాలకు జగన్ అండగా నిలబడ్డారు. ధైర్యం చెప్పారు. వీరి నిరంతర పోరాటం వల్ల... నాటి వైఎస్ జగన్ ప్రభుత్వం చొరవతో మత్స్యకారులు పాకిస్తాన్ జైలు నుంచి 14 నెలల తరువాత విడుదలయ్యారు. నాగచైతన్య కథానాయకుడిగా వస్తున్న ‘తండేల్’ సినిమాకు మూలం రామారావు– నూకమ్మల జీవితకథ.శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం పంచాయతీ పరిధిలోని గ్రామాలు డి.మత్స్యలేశం, కె.మత్స్యలేశం. గనగళ్ల రామారావుది కె.మత్స్యలేశం. నూకమ్మది డి.మత్స్యలేశం గ్రామం. వీరిద్దరి పరిచయం ప్రేమగా మారింది. పెద్దలు కూడా వీరి ప్రేమను ఆమోదించారు. పెళ్లి చేశారు. తమ ప్రేమకు పెద్దలు ఒప్పుకుంటారో లేదో, ఎన్ని కష్టాలు ఎదురవుతాయో! అనుకున్నారు. హమ్మయ్య... ఎలాంటి కష్టం లేకుండానే వారి పెళ్లి జరిగింది. అయితే సినిమా ట్విస్ట్లా అసలు కష్టాలు ఆ తరువాతే మొదలయ్యాయి. తన బృందంతో కలిసి చేపల వేట కోసం రామారావు గుజరాత్లోని వెరావల్కు వెళుతుండేవాడు. గుజరాత్లో వేటకెళ్లిన మత్స్యకారుల నాయకుడిని ‘తండేల్’ అని పిలుస్తారు.ఆరోజు....శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు చెందిన 22 మంది రామారావు నాయకత్వంలో మూడు బోట్లలో గుజరాత్ వెరావల్ నుంచి బయలుదేరి చేపల వేట సాగిస్తున్నారు. ఎదురుగా దట్టమైన మంచు. ఏమీ కనిపించడం లేదు. పయనిస్తున్న పడవ దిశ మారిపోయింది. దీంతో పాకిస్థాన్ప్రాదేశిక జలాల్లోకి ప్రవేశించారు. బోట్లలో వైర్లెస్ సెట్లు కూడా పనిచేయకపోవడంతో వారికి దిక్కు తోచలేదు. ఆ తరువాత పాకిస్తాన్ కోస్టు గార్డులు చేతికి చిక్కారు. వీరి ఫొటోలు తీసుకుని ఏప్రాంతానికి చెందిన వారని ఆరా తీశారు. పొరపాటున వచ్చిన మిమ్మల్ని విడిచి పెడతాం’ అని కోస్టు గార్డులు హామీ ఇవ్వడంతో ‘బతికిపోయినం దేవుడా’ అనుకున్నారు. ఊపిరి పీల్చుకున్నారు. కథ మలుపు తిరిగింది...కానీ తరువాత కథ మలుపు తిరిగింది. ‘భయపడకండి... విడిచి పెడతాం’ అన్న వాళ్లే ఆ తరువాత ‘విడిచిపెట్టేదే లేదు’ అంటూ మాట మార్చారు. ఆ మాట వారి గుండెల్లో గునపంలా దిగింది. వేలిముద్రలు తీసుకుని కరాచీ సబ్జైలులో బంధించారు. వీరందరినీ ఒకే బ్లాక్లో ఉంచారు. జైలులో వారు పడ్డ కష్టాలు అన్నీ ఇన్నీ కావు. సరైన ఆహారం అందకపోవడం, జైలు సిబ్బంది నానా రకాలుగా ఇబ్బంది పెట్టడంతో చిత్రహింసలు అనుభవించారు. ఎవరికి ఎవరూ ధైర్యం చెప్పుకునే పరిస్థితి లేదు. అందరి కళ్ల ముందు దుఃఖసముద్రం.పద్నాలుగు నెలలు... ప్రతి రోజూ నరకమే వేటకు వెళ్లిన తమ వాళ్ల ఆచూకి దొరకకపోవడంతో బాధిత కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. పాకిస్తాన్ కోస్టు గార్డులకు పట్టుబడ్డారనే వార్త తెలిసి కుప్పకూలిపోయారు. ‘ఎన్ని కష్టాలొచ్చినా సరే నా భర్తను జైలు నుంచి విడిపించుకుంటాను’ ఏడుస్తూనే దృఢంగా అన్నది నూకమ్మ. ‘నీ భర్త విజయనగరంలో ఉన్నాడనుకున్నావా? విశాఖపట్నంలో ఉన్నాడనుకున్నావా?... అక్కడెక్కడో పాకిస్తాన్ జైలులో ఉన్నాడు’ అన్నారు ఒకరు. ఆ మాటకు అర్థం... ఇక ఆశ వదులుకోవాల్సిందేనని!పాక్ జైల్లో బందీలుగా వున్న మత్స్యకారుల గురించి పాదయాత్రలో వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డికి వివరిస్తున్న నూకమ్మ తదితరులు అయితే చివరి శ్వాస వరకు అయినా పోరాడాలని నిర్ణయించుకుంది నూకమ్మ. ఆమెకు ఎర్రమ్మ భార్య శిరీష జత కలిసింది. నిండు గర్బిణీగా ఉన్న నూకమ్మ, ఎర్రయ్య సతీమణి శిరీష కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ప్రభుత్వానికి విన్నపాలు చేశారు. అప్పట్లో ‘ప్రజాసంకల్పయాత్ర’ చేస్తున్న వైఎస్ జగన్ మోహన్రెడ్డి దృష్టికి తమ సమస్యను తీసుకు వెళ్లారు. బాధిత కుటుంబాలకు జగన్ అండగా నిలబడ్డారు. ధైర్యం చెప్పారు. వీరి నిరంతర పోరాటం వల్ల, నాడు ఉన్న వైఎస్ జగన్ ప్రభుత్వం చొరవతో మత్స్యకారులు పాకిస్తాన్ జైలు నుంచి 14 నెలల తరువాత విడుదలయ్యారు. భర్తను జైలు నుంచి విడిపించటం కోసం గల్లీ నుంచి దిల్లీ వరకు నూకమ్మ చేసిన పోరాటం, గర్భిణిగా, పాపకు జన్మనిచ్చిన తల్లిగా తను ఎదుర్కొన్న కష్టాలు అన్నీ ఇన్నీ కావు. అంతులేని నిస్సహాయతలో కూడా చిన్న ఆశ మనిషిని బతికిస్తుంది. పోరాటశక్తిని ఇస్తుంది. విజయాన్ని చేతికి అందిస్తుంది. నూకమ్మ విషయంలో అదే జరిగింది.పాకిస్తాన్ నుంచి విడుదలైన తర్వాత తనను కలిసిన రామారావుకు స్వీట్ తినిపించిన నాటి సీఎం వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి అదృష్టం కాదు...అంతా ఆమె కష్టమే!పాకిస్తాన్ జైల్లో ఉన్నప్పుడు ఎప్పుడూ కుటుంబం గుర్తుకొచ్చి నాలో నేను కుమిలిపోయేవాడిని. నెల గర్భిణిగా ఉన్న నా భార్య నేను విడుదలయ్యే నాటికి మూడు నెలల పాపతో కనిపించింది. ఎన్నో నెలల పాటు నా కుటుంబానికి దూరంగా బతికాను. నా విడుదల కోసం నా భార్య చేసిన పోరాటం, పడిన కష్టాలు ఎంతోమంది ద్వారా విన్నాను. ఆమె పడిన కష్టం వల్లే విడుదలయ్యాను.– గనగళ్ల రామారావుఆందోళనలో బతికానా భర్త పాకిస్తాన్కు పట్టు పడినట్లు తెల్సుకున్నాక ఆందోళన చెందా. గుజరాత్ మరి వెళ్లనని సంక్రాంతికి వచ్చి ఇక్కడే ఉండి పోతానని అన్నారు. అంతలో పాకిస్తాన్లో చిక్కుకుపోయారు. పాకిస్తాన్ మన శత్రుదేశం కావటం వల్ల ఎంతో ఆందోళన చెందాను. అయినా ఆత్మస్థైర్యం కోల్పోకుండా పోరాటం చేశాను. ఢిల్లీ వెళ్లి కేంద్ర ప్రభుత్వ పెద్దలను, అధికారులను కలిశాను. ఆయన జైలులో ఉండగా పాప పుట్టింది. మా కథ సినిమాగా వస్తుండటం సంతోషంగా ఉంది. – నూకమ్మ– కందుల శివశంకరరావు, సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం -
గుజరాత్ అల్లర్లపై న్యాయ పోరాటం చేసిన జకియా జాఫ్రి కన్నుమూత
అహ్మదాబాద్: 2002 గుజరాత్ అల్లర్లలో ప్రాణాలు కోల్పోయిన కాంగ్రెస్ మాజీ ఎంపీ ఎహ్సాన్ జాఫ్రి భార్య జకియా జాఫ్రి(86) శనివారం చనిపోయారు. ‘అమ్మ అహ్మదాబాద్లోని ఆమె సోదరి ఇంట్లో ఉన్నారు. ఎప్పటిలాగానే శనివారం ఉదయం కూడా కుటుంబసభ్యులతో గడిపారు. అసౌకర్యం అనిపిస్తోందని చెప్పడంతో డాక్టర్ను పిలిచాం. ఆయన వచ్చే సరికే చనిపోయారు. అప్పుడు సమయం 11.30 గంటలు’అని జాఫ్రి కుమారుడు తన్వీర్ తెలిపారు. అయోధ్య నుంచి కరసేవకులతో వస్తున్న రైలుకు అహ్మదాబాద్లో దుండగులు నిప్పుపెట్టడంతో 59 మంది కరసేవకులు చనిపోవడం మరునాడే అహ్మదాబాద్లోని గుల్బర్గా సొసైటీ కాలనీపై జరిగిన దాడిలో ఎహ్సాన్ జాఫ్రి సహా 69 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ పరిణామాలు రాష్ట్రంలో తీవ్ర కలహాలకు దారి తీశాయి. ఈ ఘటనల వెనుక భారీ రాజకీయ కుట్ర దాగి ఉందంటూ అనంతరం జకియా జాఫ్రి సుప్రీంకోర్టు గడప తొక్కారు. న్యాయం పోరాటం చేపట్టి, దేశం దృష్టిని ఆకర్షించారు. అప్పటి ముఖ్యమంత్రి నరేంద్ర మోదీ తదితరులపై చార్జిషీటు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అల్లర్లను అదుపు చేసేందుకు పోలీసు బలగాలు చాలినంతగా లేరనే విషయం తెలిసి కూడా ఆయన ప్రభుత్వం సైన్యాన్ని మోహరించడంలో ఆలస్యం చేసిందని వాదించారు. ఆమె వాదనను గుజరాత్ హైకోర్టు తిరస్కరించడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆమె ఆరోపణలపై విచారణకు సుప్రీం ఆదేశాలతో 2008లో సిట్ ఏర్పాటైంది. 2012లో సిట్ నివేదిక ఇవ్వడంతో సుప్రీంకోర్టు కేసును మూసివేసింది. మోదీ, మరో 62 మందికి క్లీన్చిట్ ఇచ్చింది. దీనిని సవాల్ చేస్తూ ఆమె తిరిగి మెట్రోపాలిటన్ కోర్టుకు, తర్వాత గుజరాత్ హైకోర్టుకు వెళ్లారు. ఫలితం దక్కలేదంటూ చివరికి మళ్లీ సుప్రీంకోర్టుకు వచ్చారు. చివరికి, జకియా జాఫ్రి వాదనల్లో పస లేదంటూ సుప్రీంకోర్టు 2022లో ఆమె అర్జీని కొట్టివేసింది. జకియా జాఫ్రి మరణంపై సామాజిక కార్యకర్త తీస్తా షెతల్వాడ్ స్పందించారు. దూరదృష్టి కలిగిన మానవతావాదిగా జకియా జాఫ్రిని అభివరి్ణంచారు. -
HMPV వైరస్ కలకలం.. నాలుగేళ్ల బాలుడికి పాజిటివ్
అహ్మదాబాద్: దేశంలో చైనా వైరస్ హెచ్ఎంపీవీ కేసుల సంఖ్య క్రమంలో పెరుగుతోంది. తాజాగా గుజరాత్ నాలుగేళ్ల బాలుడు వైరస్ బారినపడ్డాడు. బాలుడికి హ్యూమన్ మెటాప్న్యూమోవైరస్ (HMPV) సోకింది. ప్రస్తుతం ఆసుపతత్రిలో బాలుడికి చికిత్స జరుగుతున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ పాజిటివ్ కేసుతో గుజరాత్ హెచ్ఎంపీ బాధితుల సంఖ్య ఎనిమిది చేరింది.వివరాల ప్రకారం.. జనవరి 28న అహ్మదాబాద్లోని గోటా ప్రాంతానికి చెందిన నాలుగేళ్ల బాలుడు జ్వరం, దగ్గుతో బాధపడ్డాడు. అనంతరం, బాలుడిని ఎస్జీవీపీ ఆసుపత్రిలో అడ్మిట్ కావడంతో వైద్య పరీక్షలు నిర్వహించారు. దీంతో ఆ బాలుడికి హెచ్ఎంపీవీ సోకిందని అదే రోజున నిర్ధారించినట్లు అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారి తెలిపారు. ఆ బాలుడు ఇటీవల విదేశాల్లో ప్రయాణించినట్లు చెప్పారు. దీంతో, సదరు బాలుడికి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం అతడి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు.ఇదిలా ఉండగా.. గుజరాత్లో ఇప్పటి వరకు ఎనిమిది హెచ్ఎంపీవీ కేసులు నమోదయ్యాయి. అహ్మదాబాద్లో ఏడు, సబర్కాంత జిల్లాలో ఒక కేసు వెలుగుచూశాయి. అహ్మదాబాద్లోని ఆసుపత్రుల్లో చేరిన ఆరుగురు రోగులను పూర్తిగా కోలుకున్న తర్వాత డిశ్చార్జ్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఇక, దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు హెచ్ఎంపీ కేసులు ఇలా ఉన్నాయి. గుజరాత్లో 8, మహారాష్ట్రలో 3, కర్ణాటక 2, తమిళనాడులో 2, అసోంలో ఒక్క కేసు నమోదైంది.అసలేంటీ హ్యూమన్ మెటాప్న్యూమోవైరస్2001లోనే హ్యూమన్ మెటానిమోవైరస్ (HMPV) డ్రాగన్ దేశం గుర్తించింది. యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) ప్రకారం ఇది రెస్పిరేటరీ సిన్సిటియల్ వైరస్ (RSV)తో పాటు న్యుమోవిరిడే కుటుంబానికి చెందినది. చిన్నపిల్లలు, వృద్ధులలో ఈ వైరస్ ప్రభావం తీవ్రంగా ఉంటుంది. బలహీనమైన రోగనిరోధక శక్తి ఉన్నవారికి, వైరస్ తీవ్రత మరింతగా ఉంటుందంటున్నారు వైద్య నిపుణులు.అనారోగ్యం తీవ్రతను బట్టి వ్యాధి తీవ్రత, వ్యవధి మారవచ్చు. సాధారణ ఈ వైరస్ పొదిగే కాలం 3 నుంచి 6 రోజులు ఉంటుంది. హెచ్ఎంపీవీ సంక్రమణ లక్షణాలు బ్రోన్కైటిస్ లేదా న్యుమోనియాకు దారితీస్తాయి. ఎగువ, దిగువ శ్వాసకోశ ఇన్ఫెక్షన్లకు కారణమయ్యే ఇతర వైరస్ల మాదిరిగానే దీని లక్షణాలు ఉంటాయి.హెచ్ఎంపీవీ లక్షణాలుఎగువ శ్వాసకోశ ఇన్ఫెక్షన్, కొన్నిసార్లు న్యుమోనియా, ఆస్తమా వంటి ఇతర శ్వాసకోశ వ్యాధులకు దారితీస్తుంది. లక్షణాలు మరింత ముదిరితే క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ (COPD)ని అధ్వాన్నంగా మారుస్తుంది. సాధారణ జలుబు మాదిరిగా లక్షణాలు కనిపిస్తాయి.దగ్గుజ్వరంజలుబు,గొంతు నొప్పిఊపిరి ఆడకపోవడంజాగ్రత్తలు ఇలా..హెచ్ఎంపీవీ వైరస్ వ్యాప్తికి నిర్దిష్ట యాంటీవైరల్ చికిత్స లేదు. వ్యాక్సిన్ కూడా ఇంతవరకూ అభివృద్ధి చేయలేదు. ఈ వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు శానిటైజేషన్, హ్యాండ్ వాష్, సామాజికి దూరం చాలా ముఖ్యం. 20 సెకన్ల పాటు సబ్బు నీటితో తరచుగా చేతులు కడుక్కోవాలి. అనారోగ్యంతో ఉన్న వ్యక్తులతో దూరాన్ని పాటించాలి. వైరస్బారిన పడిన వారు సెల్ఫ్ ఐసోలేషన్ పాటించడం ఉత్తమం. -
గుజరాత్ శకటాన్ని చూసి మురిసిపోయిన ప్రధాని మోదీ.. కారణమిదే
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో జరిగిన 76వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోదీ.. గుజరాత్ శకటాన్ని పరిశీలనగా చూసి, మురిసిపోయారు. ఆ శకటం వెళుతున్నంత సేపూ ప్రధాని దానినే చూస్తూ ఉండిపోయారు.ఈసారి గుజరాత్ శకటంలో ప్రధాని మోదీ జన్మస్థలమైన వాద్నగర్కు స్థానం కల్పించారు. ఈ శకటంలో గుజరాత్ అభివృద్ధితో పాటు అక్కడి సంస్కృతి, వారసత్వం కనిపిస్తుంది. అహ్మదాబాద్లోని సబర్మతి నదిపై నిర్మించిన అటల్ వంతెనకు గుజరాత్ శకటంలో చోటు కల్పించారు. ద్వారక నగరం భవిష్యత్తులో ఎలా అభివృద్ధి చెందబోతోందో కూడా చూపించారు. గత సంవత్సరం ఒడిశా ఉత్తమ శకట అవార్డును అందుకోగా, గుజరాత్ శకటానికి పీపుల్స్ ఛాయిస్ విభాగంలో మొదటి స్థానం లభించింది. #WATCH 76वें गणतंत्र दिवस की परेड में गुजरात की 'स्वर्णिम भारत- विरासत और विकास' की झांकी ने कर्त्तव्य पथ पर मार्च किया। (सोर्स: डीडी न्यूज) pic.twitter.com/iGVGkctJQ1— ANI_HindiNews (@AHindinews) January 26, 2025గుజరాత్ శకటంలో 12వ శతాబ్దపు ‘కీర్తి తోరణ్’కు రూపమిచ్చారు. దీనిని గుజరాత్ సాంస్కృతిక ద్వారం అని పిలుస్తారు. అలాగే సర్దార్ పటేల్ విగ్రహం ‘స్టాట్యూ ఆఫ్ యూనిటీ’ నమూనాను కూడా రూపొందించారు. శకటం వెనుక భాగంలో టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ తయారు చేసిన సీ-295 విమాననపు ప్రతిరూపాన్ని ఉంచారు.ఇది కూడా చదవండి: Republic Day 2025: మువ్వన్నెల రైల్వే స్టేషస్లు.. మురిసిపోతున్న ప్రయాణికులు -
మరో నాలుగు హెచ్ఎంపీవీ కేసులు
అహ్మదాబాద్/డిబ్రూగఢ్/పుదుచ్చేరి: దేశంలో మరో నాలుగు హ్యూమన్ మెటాన్యూమోవైరస్(హెచ్ఎంపీవీ) కేసులు బయటపడ్డాయి. గుజరాత్లో రెండు, పుదుచ్చేరి, అస్సాంలలో ఒక్కోటి చొప్పున గుర్తించారు. బాధితుల్లో ముగ్గురు చిన్నారులు కాగా ఒకరు 59 ఏళ్ల వ్యక్తి. తాజాగా నిర్ధారౖణెన కేసులతో కలిపితే గుజరాత్లో వారం వ్యవధిలో ఈ వైరస్ బారిన పడిన వారి సంఖ్య ఐదుకు చేరినట్లయింది. అహ్మదాబాద్కు చెందిన 9 నెలల మగ శిశువుకు జలుబు, దగ్గు, శ్వాస తీసుకోవడం కష్టం కావడంతో ఈ నెల 6న ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చారు. ఎలాంటి ప్రయాణ చరిత్ర లేని అతడికి హెచ్ఎంపీవీ సోకినట్లు నిర్ధారణైందని మున్సిపల్ అధికారులు తెలిపారు. అదేవిధంగా, కచ్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి అహ్మదాబాద్లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతడికి హెచ్ఎంపీవీ సోకినట్లు గుర్తించారు. ఈ బాధితుడికి కూడా ఎలాంటి ప్రయాణ చరిత్రా లేదని చెప్పారు. గుజరాత్లో ఈ నెల 6న మొదటి హెచ్ఎంపీవీ కేసు వెలుగులోకి వచ్చింది. అదేవిధంగా, అస్సాంలోని డిబ్రూగఢ్కు చెందిన 10 నెలల చిన్నారికి హెచ్ఎంపీవీ వైరస్ సోకినట్లు తేలింది. జలుబు సంబంధిత లక్షణాలతో నాలుగు రోజులుగా డిబ్రూగఢ్లోని అస్సాం మెడికల్ కాలేజీ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న చిన్నారి ఆరోగ్యం నిలకడగా ఉందని, ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు వెల్లడించారు. ఇంకా, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో కొన్ని రోజులుగా చికిత్స పొందుతున్న మూడేళ్ల చిన్నారికి హెచ్ఎంపీవీ సోకినట్లు వెల్లడైంది. ఆరోగ్యం మెరుగవడంతో ఇతడిని శనివారం డిశ్చార్జి చేశారని అధికారులు చెప్పారు. హెచ్ఎంపీవీ బాధితుల కోసం ప్రత్యేకంగా గొరిమేడులోని ప్రభుత్వ ఆస్పత్రిలో 10 పడకలతో కూడిన ప్రత్యేక ఐసీయూ విభాగాన్ని ఏర్పాటు చేశామన్నారు. -
మాయదారి గుండెపోటు : చిన్నారి ‘గుండెల్ని’ పిండేస్తున్న వీడియో
చిన్నారుల నుంచి పెద్దల దాకా గుండెపోటుతో సంభవిస్తున్న హఠాన్మరణాలు ఆందోళన రేపుతున్నాయి. ముఖ్యంగా ఇటీవలి కారణంలో చిన్నారుల గుండె సంబంధిత సమస్యలతో మరణిస్తుండటం కలచివేస్తోంది. తాజాగా మరో విషాద ఘటన చోటు చేసుకుంది. ఈసారి 8 ఏళ్ల బాలిక (School Girl) ప్రాణాలు కోల్పోవడం దిగ్భ్రాంతికి గురి చేసింది. గుజరాత్లోని అహ్మదాబాద్లోని (Ahmedabad) థల్తేజ్ ప్రాంతంలో శుక్రవారం ఈ విషాదం చోటు చేసుకుంది. ఈ దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీలో నమోదయ్యాయి.అహ్మదాబాద్లోని గార్గి రాణపరా(Gargi Ranapara) జేబార్ స్కూల్ ఫర్ చిల్డ్రన్లో గార్గి మూడో తరగతి చదువుతోంది. పాఠశాలకు వచ్చిన కొద్దిసేపటికే ఛాతీ నొప్పికి గురైంది. క్లాస్ రూమ్ వైపు నడుచుకుంటూ వెళ్తుండగా నొప్పి రావడంతో కాసేపు అక్కడే నిలబడింది. నొప్పితో బాధపడుతూనే అక్కడే ఉన్న కుర్చీలో కూర్చుంది. అంతే కొన్ని క్షణాల్లోనే కుప్పకూలిపోయింది. ఇది గమనించిన టీచర్లు ఆమెకు సపర్యలు చేశారు. బాలికను కాపాడేందుకు టీచర్లు సీపీఆర్ చేశారు. అయినా బాలికలో ఎలాంటి చలనం లేదు. వెంటనే దగ్గరలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించే సమయానికే బాలిక పరిస్థితి విషమించింది. వైద్యులు ఆమెను బతికించేందుకు తీవ్రంగా శ్రమించారు. వెంటిలేటర్పై ఉంచి చికిత్స అందించినా ఫలితం లేకపోయింది. గార్గి గుండెపోటుతో మరణించిందని వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను పాఠశాల ప్రిన్సిపల్ శర్మిష్ఠ సిన్హా వెల్లడించారు.గార్గి పాఠశాల ఆవరణలో కొంచెం అనారోగ్యంగా కనిపించిందని, కొద్దిసేపు కూర్చున్న వెంటనే కుప్పకూలిపోయిందని చెప్పారు. వెంటనే అప్రమత్తమైన టీచర్లు, విద్యార్థులు వెంటనే ఆమెకు సహాయం చేయడానికి ప్రయత్నించినా, ఆమెనుకాపాడలేకపోయామని విచారం వ్యక్తం చేశారు.మరోవైపు దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బాలిక గుండెపోటుకు గల కారణాలలపై అన్ని కోణల్లో దర్యాప్తు చేస్తున్నామని జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ నీరజ్ బడ్గుజర్ ప్రకటించారు.🚨HEART BREAKING A 8 year old girl , all of a sudden fell down and died in school. Video from Krnavati (Ahmedabad) , Gujarat.What is happening to kids and youngsters ?? Almost every week we see or hear such cases . Instead of blaming Covid vaccines , we need to get into the… pic.twitter.com/R66mcrOIK9— Amitabh Chaudhary (@MithilaWaala) January 10, 2025 > కాగా ముంబైకి చెందిన గార్గి, తన బంధువుల ఇంటిలో ఉంటూ అహ్మదాబాద్లో చదువుకుంటోంది. గతంలో పెద్దగా ఆరోగ్య సమస్యలు లేవని సమాచారం. ఇటీవల బెంగళూరులో కూడా ఇలాంటి సంఘటనే చోటు చేసుకుంది. ఎనిమిదేళ్ల బాలిక తేజస్విని పాఠశాల కారిడార్లో గుండెపోటుతో కుప్పకూలి ప్రాణాలు విడిచిన సంగతి తెలిసిందే.గుండెపోటు లక్షణాలుఛాతీ నొప్పి,ఊపిరి ఆడకపోవడంవికారం, చెమటలు పట్టడం చేతులు, వీపు లేదా దవడలో నొప్పి వంటివి సాధారణ లక్షణాలునోట్: గుండెలోని రక్త నాళాల్లో రక్త ప్రసరణకు అడ్డంకులు ఏర్పడటం, రక్తనాళాలు పూడుకుపోవడం, రక్తాన్ని గుండె సరిగా సరఫరా చేయలేకపోవడం తదితర కారణాల వల్ల గుండె పోటు వచ్చే అవకాశముందని వైద్యులు చెబుతున్నారు. అయితే, గుండె పోటు వెనుక చాలా కారణాలు ఉండొచ్చు. అందుకే ఏ చిన్న అనారోగ్యం వచ్చినా నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలి. మరీ ముఖ్యంగా జిమ్ చేస్తున్నాం కదా, ఆరోగ్యంగానే ఉన్నాం కదా అని అస్సలు అనుకోకూడదు. ఇటీవలి కేసులను దృష్టిలో ఉంచుకుని చిన్నపిల్లల్లో అయినా అనుమానిత లక్షణాలు కనిపిస్తే వైద్యులను సంప్రదించి కారణాలను రూల్ అవుట్ చేసుకోవడం చాలా అవసరం. -
గుజరాత్లో మూడు హెచ్ఎంపీవీ కేసులు
హిమ్మత్నగర్: గుజరాత్లో హెచ్ఎంపీవీ కేసు మరొకటి వెలుగులోకి వచ్చింది. రాష్ట్రంలో హెచ్ఎంపీవీ కేసుల సంఖ్య మూడుకు చేరింది. సబర్కాంత జిల్లాకు చెందిన 8 ఏళ్ల బాలుడికి హెచ్ఎంపీవీ పాజిటివ్గా నిర్థారణైందని శుక్రవారం అధికారులు తెలిపారు. ప్రాంతిజ్ తాలూకాలో కార్మికుడి కుటుంబానికి చెందిన బాలుడికి పరీక్ష చేయించారని, అతడి నుంచి మరోసారి బ్లడ్ శాంపిల్స్ సేకరించి ప్రభుత్వ ల్యాబ్కు పంపించామన్నారు. హిమ్మత్నగర్ పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో అతడు వెంటిలేటర్పై చికిత్స పొందుతున్నాడని, పరిస్థితి నిలకడగా ఉందని కలెక్టర్ రతన్కన్వర్ చెప్పారు. గుజరాత్లో మొదటి కేసు ఈ నెల 6న, రెండో కేసు రెండు రోజుల క్రితం వెలుగులోకి వచ్చాయి. -
హెలికాఫ్టర్ ప్రమాదం.. ముగ్గురు దుర్మరణం
గాంధీ నగర్ : గుజరాత్ (Gujarat)లో విషాదం చోటు చేసుకుంది. పోర్బందర్ ఎయిర్పోర్ట్ (Porbandar Airport)లో ఘోర హెలికాప్టర్ (helicopter crash porbandar) ప్రమాదం జరిగింది. కోస్ట్ గార్డ్కు చెందిన ఏఎల్హెచ్ ధృవ్ హెలికాప్టర్ టేకాఫ్ సమయంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో ఆ హెలికాప్టర్ భూమిని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, పలువురు గాయపడినట్లు సమాచారం. అయితే మరణాలకు సంబంధించి ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు.ప్రమాదం వెంటనే హెలికాప్టర్ భూమిని ఢీకొట్టిన తర్వాత మంటలు చెలరేగి, దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. ఘటనా స్థలంలో విమానాశ్రయ సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను వెంటనే సివిల్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.Helicopter of Indian Coast Guard ALH Dhruv 'crashed' in Porbandar, Gujarat during a routine training sortie.3 crew members DEAD. pic.twitter.com/vt4L025Ifl— RAMULU.B (@vedicramrekha) January 5, 2025 -
శుబ్మన్ గిల్కు షాక్.. గుజరాత్ సీఐడీ సమన్లు!?
బీజడ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కుంభకోణం కేసులో నలుగురు భారత క్రికెటర్లకు గుజరాత్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ (సీఐడీ) సమన్లు పంపింది. వారిలో టీమిండియా ప్లేయర్లు శుబ్మన్ గిల్, సాయిసుదర్శన్, మొహిత్ శర్మ, రాహుల్ తెవాటియా ఉన్నారు. వీరు నలుగురూ ఆ సంస్థలో పెట్టుబడులు పెట్టినందుకు గుజరాత్ సిఐడి సమన్లు పంపింది. త్వరలోనే విచారణకు హాజరు కావాలని అందులో పేర్కొంది.అహ్మదాబాద్ మిర్రర్ కథనం ప్రకారం.. ఆ కంపెనీలో గిల్ రూ.1.95 కోట్లు పెట్టుబడి పెట్టినట్లు తెలుస్తోంది. మిగతా ముగ్గురు గుజరాత్ టైటాన్స్ ప్లేయర్లు రూ. 10 లక్షల నుంచి కోటి మధ్య ఇన్వెస్ట్ చేసినట్లు సమాచారం. కాగా శుబ్మన్ గిల్ ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25 ముగిసిన అనంతరం గిల్ విచారణకు హాజరు కానున్నాడు. అయితే మిగితా ముగ్గురు ఆటగాళ్లు భారత్లోనే ఉండడంతో గిల్ కంటే ముందు విచారణకు హాజరు అయ్యే అవకాశముంది.ఏంటీ బీజడ్ గ్రూపు స్కామ్?గుజరాత్లోని హిమ్మత్నగర్ చెందిన భూపేంద్రసిన్హ్ జాలా.. బీజడ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, బీజడ్ ట్రేడర్స్ కంపెనీలను స్దాపించాడు. ఈ సంస్థలకు సంబంధించిన కార్యాలయాలను గుజరాత్లోని పలు జిల్లాల్లో విస్తరించాడు. ఈ కంపెనీలలో పెట్టుబడి పెడితే బ్యాంకుల కంటే మెరుగైన వడ్డీ రేటును చెల్లిస్తామని ప్రజలను నమ్మించారు.అంతేకాకుండా బహుమతులను ప్రకటించి పెట్టుబడిదారులను భారీగా ఆకర్షించారు. ఉదాహరణకు వారి కంపెనీలో రూ. 5 లక్షల పెట్టుబడి పెడితే 32 ఇంచ్ టీవీ, రూ.10 లక్షల పెట్టుబడి పెడితే గోవా ట్రిప్స్ వంటి గిప్ట్ ప్యాకేజిలను బీజడ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఆఫర్ చేసింది. దీంతో ప్రజలు భారీగా పెట్టుబడులు పెట్టారు. అయితే వారు ఇచ్చిన హామీలు అన్ని బూటకమని, మోసపోయాయని తెలుసుకున్న ప్రజలు పోలీసులను ఆశ్రయించారు. దీంతో ఫోర్జరీ కేసు నమోదు చేసిన పోలీసులు బీజడ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సీఈవో భూపేంద్రసిన్హ్ జాలాను అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఆ కేసును సిఐడీ అప్పగించారు.తొలుత భూపేంద్రసిన్హ్ రూ. 6000 కోట్ల చిట్-ఫండ్ మోసానికి పాల్పడ్డారని నివేదించిన గుజరాత్ సీఐడీ.. ఆ తర్వాత ఆ మొత్తాన్ని రూ. 450 కోట్లగా ఖారారు చేసింది. అయితే పోలీసుల విచారణలో గిల్, సాయిసుదర్శన్, మొహిత్ శర్మ, తెవాటియా సైతం పెట్టుబడులు పెట్టినట్లు తేలింది. ఈ క్రమంలోనే ఈ నలుగురుకు సిఐడి సమన్లు పంపింది. -
మోతీ షాహీ మహల్ : ఐరన్ మ్యాన్ మెమోరియల్
మోతీ షాహీ మహల్... చారిత్రక నిర్మాణం. అహ్మదాబాద్ నగరంలో షాహీభాగ్లో ఉంది. ఇప్పుడది సర్దార్ వల్లభాయ్ పటేల్ జీవితానికి దర్పణం. వల్లభాయ్ పటేల్ జీవితంలో ముఖ్యమైన ఘట్టాలను వివరించే డిజిటల్ స్టూడియో అద్భుతం. డిజిటల్ స్టూడియో జైలు గదుల రూపంలో విభజించి ఉంటుంది. గదులకు ఉన్న ఊచలను పట్టుకుంటే ఒక్కొక్క ఘట్టం ఆడియోలో వినిపిస్తుంది. జాతీయోద్యమంలో భాగంగా పటేల్ జైలు జీవితం గడిపిన సంఘటనలతో పాటు ముఖ్యమైన ఘట్టాలన్నింటినీ ఇంగ్లిష్, హిందీ, గుజరాతీ భాషల్లో వినవచ్చు. వీటన్నింటినీ లేజర్ షోలో చూడవచ్చు. ఇక మ్యూజియంలో ఒక్కో గది ఒక్కో రకమైన వస్తువులతో అలరిస్తుంది. వర్తమానం, ఆహ్వానపత్రాలను పంపించిన ట్యూబ్లాంటి వెండి పెట్టెలున్నాయి. ఐరన్ మ్యాన్ చేతుల మీదుగా శంఖుస్థాపన చేయించుకోవడానికి సిద్ధం చేసిన వెండితాపీలు లెక్కలేనన్ని ఉన్నాయి. మెమోరియల్ మ్యూజియం అంటే ఆ వ్యక్తి ఉపయోగించిన చెప్పులు, పెన్నులు, భోజనం చేసిన ప్లేట్లు, దుస్తులను మాత్రమే చూస్తుంటాం. సర్దార్ వల్లభాయ్ పటేల్ మెమోరియల్లో భారత జాతీయోద్యమం కనిపిస్తుంది. గాంధీ, నెహ్రూలతో పటేల్ కలసి ఉన్న ఫొటోలతోపాటు ఆయా సందర్భాల వివరణ కూడా ఉంటుంది. పటేల్ జీవితంలో ఉపయోగించిన వస్తువులు ఏయే సందర్భంగా ఉపయోగించారనే వివరాలు ఉండడంతో ఫ్రీడమ్ మూవ్మెంట్ క్షణక్షణమూ గుర్తుకు వస్తుంది. విశ్వకవి రవీంద్రుడు పదిహేడేళ్ల వయసులో కొంత కాలం ఈ మహల్లో బస చేశాడు.ఇదీ చదవండి: వెళ్లిపోకు నా ప్రాణమా! బోరున విలపించిన సృజన షాజహాన్ విడిది వల్లభాయ్ పటేల్ మెమోరియల్ ఉన్న భవనం మోతీ షాహీ మహల్... మొఘలుల నిర్మాణాలను తలపిస్తుంది. ఈ షాహీ మహల్ని 17వ శతాబ్దంలో షాజహాన్ కట్టించాడు. షాజహాన్ యువరాజుగా ఈ ప్రదేశానికి ప్రతినిధిగా ఉన్నప్పుడు దీనిని నిర్మించాడు, రాజ్యపర్యటనకు వచ్చినప్పుడు అతడి విడిది కూడా ఇందులోనే. ఆ తర్వాత బ్రిటిష్ ఉన్నతాధికారుల నివాసమైంది. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఈ భవనం రాష్ట్ర గవర్నర్ అధికారిక నివాసం రాజ్భవన్. గవర్నర్ నివాసానికి కొత్త భవనం కట్టిన తర్వాత 1978లో ఈ భవనాన్ని పటేల్ మొమోరియల్గా మార్చారు. నరేంద్రమోదీ గుజరాత్కి ముఖ్యమంత్రి అయిన తర్వాత 2013లో ఈ మెమోరియల్ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో డిజిటలైజ్ అయింది. మ్యూజియం అంతా తిరిగి చూసిన తర్వాత అదే ప్రాంగణంలో ఉన్న పటేల్ విగ్రహం దగ్గరకు వచ్చినప్పుడు ‘ద ఆర్కిటెక్ట్ ఆఫ్ మోడరన్ ఇండియా’ అనే ఆత్మీయ ప్రశంసను గుర్తు చేసుకుంటూ ఓ నమస్కారం పెడతాం.ఆదివారం ఆటవిడుపుమోతీ షాహీ మహల్ చుట్టూ అందమైన గార్డెన్ మొఘలుల చార్భాగ్ నమూనాలో ఉంటుంది. దట్టమైన చెట్ల మధ్య పిల్లలు ఆడుకోవడానికి ఏర్పాట్లు ఉంటాయి. రంగురంగుల వాటర్ఫౌంటెయిన్ పిల్లలను అలరిస్తుంది. అహ్మదాబాద్ వాసులకు వీకెండ్ పిక్నిక్ ప్లేస్ ఇది. దాదాపుగా నగరంలోని స్కూళ్లన్నీ విద్యార్థులను ఏటా ఈ మ్యూజియం సందర్శనకు తీసుకువస్తుంటాయి. అహ్మదాబాద్ పర్యటనలో మిస్ కాకుండా చూడాల్సిన ప్రదేశం ఇది. ఈ మెమోరియల్ భవనం లోపల మాత్రమే కాదు భవనం బయట పరిసరాలను కూడా ఆస్వాదించాలి. పచ్చటి ఉద్యానవనంలోని చెట్ల కొమ్మల మీద నెమళ్లు సేదదీరుతుంటాయి. చెట్ల మధ్య విహరిస్తూ తినుబండారాలను రుచి చూడాలంటే అనుమతించరు. చాటుగా తినే ప్రయత్నం చేసినా కోతులు ఊరుకోవు. మెరుపువేగంతో వచ్చి లాక్కెళ్తాయి. మ్యూజియం పర్యటనకు అనువైన కాలం అని ప్రత్యేకంగా అక్కరలేదు, కానీ అహ్మదాబాద్లో పర్యటించడానికి నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు అనువుగా ఉంటుంది. కాబట్టి క్రిస్మస్, సంక్రాంతి సెలవుల్లో ప్లాన్ చేసుకోవచ్చు. అహ్మదాబాద్ ఎయిర్΄ోర్ట్ నుంచి సర్దార్ వల్లభాయ్ పటేల్ మెమోరియల్కు దూరం ఐదు కిలోమీటర్లు మాత్రమే. – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
రేప్ చేసి, జననాంగంలో ఇనుప రాడ్ జొప్పించి...
వడోదర: గుజరాత్లో 11 ఏళ్ల బాలికపై ఒక 36 ఏళ్ల వలస కార్మికుడు దారుణ అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతేగాక జననాంగంలో ఇనుప కడ్డీ చొప్పించాడు! భరూచ్ జిల్లాలోని ఝగాడియా పారిశ్రామికవాడలో ఆదివారం జరిగిన ఈ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలిక పరిస్థితి విషమంగా ఉంది. ఆమె కుటుంబం జార్ఖండ్ నుంచి వలసవచ్చింది. నిందితుడు విజయ్ పాశ్వాన్ బాలిక తండ్రితోపాటు పనిచేస్తున్నాడు. సమీప గుడిసెలో ఉంటూ బాలికను కిడ్నాప్చేసి ఘోరానికి పాల్పడ్డాడని పోలీసులు చెప్పారు. పొదల్లోకి తీసుకెళ్లి రేప్చేసి పారిపోయాడు. రక్తమోడుతూ బాలిక ఏడుస్తుండటంతో తల్లి చూసి ఆస్పత్రకి తరలించింది. నిందితుడిని సోమవారం అరెస్ట్ చేశారు. పోక్సో సెక్షన్ల కింది కేసు నమోదు చేశారు. బాలికను అతను గత నెలలోనూ రేప్ చేశాడని ప్రాథమిక విచారణలో తేలింది. -
‘ఓయ్.. సుఖంగా ఉండు!’
యుక్తవయసులో మానసిక ఆరోగ్యంపై దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. క్షణాకావేశంలో తీసుకుంటున్న తీవ్ర నిర్ణయాలే అందుకు కారణం. నిన్నగాక మొన్న.. అతుల్ సుభాష్ అనే వ్యక్తి మరణ ఉదంతం ఇందుకొక ఉదాహరణగా నిలిచింది. తాజాగా.. గుజరాత్లో ఓ యువతి తన ప్రియుడిని సుఖంగా ఉండాలని కోరుకుంటూ బలవన్మరణానికి పాల్పడడం చర్చనీయాంశమైంది.27 రాధా ఠాకూర్కు గతంలోనే వివాహం, విడాకులు అయ్యాయి. ఆ తర్వాత తన సోదరితో బనస్కాంత జిల్లా పలాన్పూర్లో ఉంటూ ఓ బ్యూటీపార్లర్ నడిపిస్తోంది. ఈ క్రమంలో ఓ యువకుడితో ఆమె ప్రేమలో పడినట్లు తెలుస్తోంది. అయితే ఏం జరిగిందో తెలియదు.. సోమవారం ఉదయం కల్లా రాధ తన గదిలో విగతజీవిగా పడి ఉంది. దీంతో ఆమె సోదరి పోలీసులకు సమాచారం ఇచ్చింది. పోలీస్ ఇన్వెస్టిగేషన్లో.. రాధ ఫోన్లో కొన్ని రికార్డింగులు దొరికాయి. అందులో ఆమె ఎవరికో క్షమాపణలు చెప్పినట్లు ఉంది.‘‘ఏడు గంటలలోపు ఫొటో పంపకపోతే ఏం జరుగుతుందో చూస్తావు!’’ అంటూ ఓ ఆడియో క్లిప్ను సదరు వ్యక్తి వాట్సాప్ సందేశానికి తొలుత పంపినట్లు ఉంది. అయితే కాసేపటికే ఆమె సెల్ఫీ వీడియో చిత్రీకరించుకుంది.‘‘ ఓయ్.. నన్ను క్షమించమని రెండు చేతులు జోడించి వేడుకుంటున్నా. నిన్ను అడగకుండానే ఈ తీవ్ర నిర్ణయం తీసుకున్నా. నేను ఆత్మహత్య చేసుకున్నా అని అనుకోకు. పని, జీవితంలో విరక్తి చెంది ఈ నిర్ణయం తీసుకున్నా. నా ఈ పనితో నువ్వు బాధపడకు. పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండు. అప్పుడే నా ఆత్మ సంతోషిస్తుంది అని వీడియోలో పేర్కొందామె. మృతిరాలి సోదరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సదరు వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001మెయిల్: roshnihelp@gmail.com -
‘బంధువుల సంస్థలో ఉద్యోగం చేస్తున్నారా?’
గాంధీ నగర్ : నా మనసులో మాట చెబితే వాళ్లు ఏమనుకుంటారు? ఇంట్లో వాళ్లు, బంధువులు, స్నేహితులు ఏమనుకుంటారో? ఈ ఆలోచనల్లో కూరుకుపోయిన ఓ ఉద్యోగి తన వేదనను ఎవరికీ చెప్పలేకపోయాడు. ఆ వేదనను చెప్పుకునే ధైర్యం లేక చివరకు భయంకరమైన నిర్ణయం తీసుకున్నాడు. తన చేతి వేళ్లను తానే నరికేసుకున్నాడు. ఈ సంఘటన ఒక మనిషి ఎంత ఒత్తిడిలో ఉంటే ఎలాంటి పరిణామానికి దారితీస్తుందనేదానికి ఉదాహరణగా నిలుస్తోంది. గుజరాత్ రాష్ట్రం సూరత్లోని వరచా మినీ బజార్లో అనభ్ జెమ్స్లో మయూర్ తారాపర (32) అకౌంట్స్ డిపార్ట్మెంట్లో కంప్యూటర్ ఆపరేటర్గా విధులు నిర్వహిస్తున్నాడు. ఆ సంస్థ తన బంధువులదే. అయితే, మయూర్కి ఆ ఉద్యోగం చేయడం ఇష్టం లేదు. ఇష్టం లేదని బంధువులకు చెప్పే ధైర్యం లేదు. ఇదే విషయంపై గత కొంత కాలంగా తీవ్ర ఒత్తిడి గురయ్యేవాడు. ఈ తరుణంలో మయూర్ డిసెంబర్ 8న తన స్నేహితుడి ఇంటికి వెళుతుండగా అమ్రోలిలోని వేదాంత సర్కిల్ సమీపంలోని రింగ్రోడ్లో తల తిరిగి కిందపడిపోయాడు. దీంతో అతని స్నేహితులు ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న తారాపరా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.ముందుగా,ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మయూర్ స్టేట్మెంట్ తీసుకున్నారు. స్టేట్మెంట్లో తన స్నేహితులు ఇంటికి వెళ్లే సమయంలో వేదాంత సర్కిల్ వద్ద తన కళ్లు తిరిగాయని, 10 నిమిషాల తర్వాత స్పృహలోకి వచ్చానని, ఆ సమయంలో అతని ఎడమ చేతి నాలుగు వేళ్లు నరికివేసినట్లు తారాపరా పోలీసులకు చెప్పాడు. దీంతో, కేసును మరింత వేగవంతం చేశారు. తారామారా పోలీసులు క్రైమ్ బ్రాంచ్కి కేసును బదిలీ చేశారు. క్రైమ్ బ్రాంచ్ పోలీసులు సైతం మయూర్ చేతివేళ్లను చేతబడి కోసం అగంతకులు నరికి ఉంటారేమోనన్న కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. మయూర్ చెప్పినట్లుగా వేదాంత రింగ్ రోడ్, స్నేహితుల ఇళ్లు, మయూర్ ఇంటి నుంచి ఆఫీస్ వెళ్లే ప్రాంతాలలో సీసీ టీవీ పుటేజీలను పరిశీలించారు. ఆ ఫుటేజీల్లో మయూరే తన చేతి వేళ్లను తానే నరుకున్నట్లు పోలీసులు నిర్ధారించారు.తారామార పోలీసుల వివరాల మేరకు.. సింగన్పూర్లోని చౌరస్తా సమీపంలోని ఓ దుఖాణంలో మయూర్ ఓ పదునైన కత్తిన కొనుగోలు చేశాడు. నాలుగు రోజుల తర్వాత ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో అమ్రోలి రింగ్రోడ్డు సమీపంలో తన బైక్ను పార్క్ చేశాడు. అనంతరం, వెంట తెచ్చుకున్న పదునైన కత్తితో తన చేతి నాలుగు వేళ్లను నరుక్కున్నాడు. దారాళంగా కారుతున్న రక్తాన్ని ఆపేందుకు మోచేతి దగ్గర తాడు కట్టాడు. ఆపై కత్తి,వేళ్లను రెండు బ్యాగుల్లో వేసి దూరంగా పారేశాడు. కేసు దర్యాప్తు అధికారి మాట్లాడుతూ.. ఒక బ్యాగ్ నుండి మూడు వేళ్లు స్వాధీనం చేసుకోగా, మరొక బ్యాగ్లో కత్తిని గుర్తించామని అన్నారు. తమ విచారణలో బంధువుల సంస్థలో ఉద్యోగం చేయలేక, ఆ విషయం వాళ్ల చెప్పలేక.. చేతి వేళ్లనే మయూరే నరికేసుకున్నాడని వెల్లడించారు. చేతి వేళ్లను నరికేసుకుంటే ఉద్యోగం చేసే అవసరం ఉండదనే ఈ పనిచేసినట్లు పోలీసులు నిర్దారించారు. -
ఏపీ తీరం...1,027.58 కి.మీ.
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ తీర రేఖ పొడవు ఎన్ని కిలో మీటర్లు అని అడిగితే... 973.7 కిలో మీటర్లు అని వెంటనే చెప్పేస్తారు. కానీ.. అది గతం.. కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) తాజాగా నిర్వహించిన అధ్యయనంలో ఏపీ తీర రేఖ పొడవు 1,027.58 కిలో మీటర్లు అని తేల్చింది. గత అధ్యయనం ప్రకారం దేశ పశ్చిమ, తూర్పు తీర రేఖ పొడవు 7,516.6 కిలో మీటర్లు కాగా.. తాజాగా నిర్వహించిన అధ్యయనంలో అది 11,098.81 కిలో మీటర్లుగా తేలింది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి దేశంలో తీర ప్రాంతంపై సీడబ్ల్యూసీ విస్తృతంగా అధ్యయనం చేసి పలు కీలక విషయాలు వెల్లడించింది. 2,31,831 కిలో మీటర్ల మేర కోత » దేశంలో ఇప్పటికే 2,318,31 కిలో మీటర్ల పొడవునా తీరం కోతకు గురైందని కేంద్ర జలసంఘం తేల్చింది. మరో 1,855.02 కిలో మీటర్ల పొడవునా తీర ప్రాంతం కోతకు గురవుతోంది. పశ్చిమ బెంగాల్లోని తీర ప్రాంతం అధికంగా కోతకు గురవుతోంది. తీర ప్రాంతం ఎక్కువగా కోతకు గురవుతున్న రాష్ట్రాల్లో ఒడిశా, కేరళ, ఆంధ్రప్రదేశ్ వరుసగా రెండు, మూడు, నాలుగు స్థానాల్లో నిలిచాయి. » మన రాష్ట్రంలో ఇప్పటికే 272.34 కిలో మీటర్ల పొడవున తీర ప్రాంతం కోతకు గురైంది. మరో 434.26 కిలో మీటర్ల పొడవున తీర ప్రాంతం కోతకు గురవుతోంది. 320.98 కిలో మీటర్ల పొడవున తీర ప్రాంతం కోతకు గురికాకుండా సురక్షితంగా ఉంది. తూర్పు గోదావరి, కృష్ణా, నెల్లూరు జిల్లాల్లో తీర ప్రాంతం అధికంగా కోతకు గురైంది. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని ఉప్పాడ ప్రాంతంలో తీర రేఖ అధికంగా కోతకు గురైంది. » వాతావరణ మార్పుల వల్ల సముద్రపు నీటి మట్టం పెరగడం, అలల ఉద్ధృతి తీవ్రమవడం, తుపానులు, అధిక ఉద్ధృతితో నదులు ప్రవాహించడం వల్ల సముద్ర తీర ప్రాంతం కోతకు గురువుతోంది. సహజసిద్ధంగా ఏర్పడిన మడ అడవులను నరికివేయడం, పగడపు దిబ్బలను తవ్వేయడం, సముద్రం నాచును తొలగించడం వల్ల తీర ప్రాంతం భారీ ఎత్తున కోతకు గురికావడానికి దారితీస్తోంది. » తీర ప్రాంతం అధికంగా కోతకు గురవుతుండటం వల్ల ఉప్పు నీరు చొచ్చుకొస్తోంది. దీంతో తీర ప్రాంతం ఉప్పు నీటి కయ్యలుగా మారుతోంది. తీరం కోతకు గురవడం వల్ల ఆ ప్రాంతంలో నివసించే ప్రజల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుంది. » తీర ప్రాంతం కోతకు గురికాకుండా రక్షణ చర్యలు చేపట్టకపోతే ఉత్పాతాలు తప్పవని, మానవ మనుగడే ప్రశ్నార్థకమవుతుందని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను సీడబ్ల్యూసీ హెచ్చరించింది. సీ–వాల్(తీరానికి వెంబడి గోడ) నిర్మించడం, రాళ్లతో రివిట్మెంట్ చేయడం ఇతర రక్షణ చర్యల ద్వారా, తీర ప్రాంతం కోతకు గురికాకుండా రక్షించవచ్చని సూచించింది. ఏపీలోని ఉప్పాడ ప్రాంతంలో తక్షణమే రక్షణ చర్యలు చేపట్టాలని సీడబ్ల్యూసీ ప్రతిపాదించింది. సీడబ్ల్యూసీ అధ్యయనంలో వెల్లడైన ప్రధాన అంశాలు ఇవీ.. » దేశంలో తీర ప్రాంతం పశి్చమాన గుజరాత్లోని కచ్ ప్రాంతం నుంచి ప్రారంభమై... తూర్పున పశ్చిమ బెంగాల్లోని సుందర్ బన్స్ వద్ద ముగుస్తుంది. తీర ప్రాంతం తొమ్మిది రాష్ట్రాలు గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశి్చమ బెంగాల్లతోపాటు నాలుగు కేంద్ర పాలిత ప్రాంతాలు డయ్యూ–డామన్, లక్ష్యద్వీప్, పుదుచ్చేరి, అండమాన్ నికోబార్ దీవులలో విస్తరించింది.» 2011 జనాభా లెక్కల ప్రకారం దేశ జనాభాలో 15 శాతం తీర ప్రాంతంలో నివసిస్తున్నారు. ముంబయి, కోల్కతా, చెన్నై, విశాఖపట్నంతోపాటు 70 నగరాలు, పట్టణాలు తీర ప్రాంతంలో వెలిశాయి. » తీర రేఖ పొడవు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో గుజరాత్ ప్రథమ స్థానంలో నిలిచింది. గత అధ్యయనం ప్రకారం గుజరాత్ తీర రేఖ పొడవు 1,214.7 కిలో మీటర్లు కాగా... తాజా అధ్యయనం ప్రకారం 2,340.62 కిలో మీటర్లకు పెరిగింది. » ఇప్పటి వరకు తీర రేఖ పొడవు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో ఏపీ రెండో స్థానంలో ఉండేది. తాజా అధ్యయనం ప్రకారం తమిళనాడు రెండో స్థానంలో నిలిచింది. తమిళనాడు తీర రేఖ పొడవు 1,068.69 కిలో మీటర్లు. » ప్రస్తుతం తీర రేఖ ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో నిలిచింది. గతంలో ఆంధ్రప్రదేశ్ తీర రేఖ పొడవు 973.7 కిలో మీటర్లు. ప్రస్తుతం అది 1,027.58 కిలో మీటర్లకు పెరిగింది. » రాష్ట్రంలో తీర రేఖ పొడవు ఎక్కువగా ఉన్న జిల్లాల్లో ఉమ్మడి తూర్పు గోదావరి (189.84 కి.మీ.) మొదటి స్థానంలో నిలిచింది. రెండో స్థానంలో శ్రీకాకుళం (173.12 కి.మీ.), మూడో స్థానంలో నెల్లూరు (172.10 కి.మీ.) ఉన్నాయి. -
బ్యాంకులో డబ్బుల్ని ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తున్నారా?.. అయితే ఇది మీ కోసమే
బ్యాంకులో డబ్బుల్ని ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తున్నారా?. అయితే తస్మాత్ జాగ్రత్త. ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే మంచిది. కానీ చేసే ముందుకు ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం వల్ల లాభ నష్టాల్ని ఒక్కసారి బేరీజు వేసుకోండి. లేదంటే ఫిక్స్డ్ డిపాజిట్ ఎందుకు చేశానురా భగవంతుడా అనుకుంటూ తలలు పట్టుకోవాల్సి వస్తుంది. ఇంతకి ఏం జరిగింది.గుజరాత్లోని అహ్మదాబాద్ నగరం వస్త్రపూర్కు చెందిన జైమన్ రావల్ తనని ఆపత్కాలంలో ఆదుకుంటాయనే నమ్మకంతో యూనియన్ బ్యాంక్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు. ఫిక్స్డ్ డిపాజిట్ టెన్యూర్ పూర్తి కావడంతో తన తల్లితో పాటు బ్యాంక్కు వచ్చారు. అనంతరం, బ్యాంక్ మేనేజర్ సంప్రదించి తన ఫిక్స్డ్ డిపాజిట్ టెన్యూర్ పూర్తియ్యింది. డబ్బులు విత్ డ్రా చేసుకుంటున్నాను. సంబంధింత ప్రాసెస్ పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు.దీంతో సదరు బ్యాంక్ మేనేజర్.. కస్టమర్ బ్యాంక్ అకౌంట్ వివరాలు తీసుకుని డబ్బులు విత్ డ్రా ప్రాసెస్ ప్రారంభించారు. ఈ క్రమంలో తన ఎఫ్డీపై ట్యాక్స్ ఎక్కువ మొత్తంలో డిడక్ట్ అవ్వడాన్ని గమనించారు.ఇదే విషయాన్ని బ్యాంక్ మేనేజర్తో ప్రస్తావించారు. బ్యాంక్ మేనేజర్ నుంచి వచ్చిన సమాధానంతో కస్టమర్ జైమన్ రావెల్ సహనం కోల్పోయారు. ఎదురుగా ఉన్న బ్యాంక్ మేనేజర్ కాలర్ పట్టుకుని ప్రశ్నించారు. బ్యాంక్ మేనేజర్ సైతం కస్టమర్ చొక్కా కాలర్ పట్టుకున్నారు. అంరతరం ఇరువురి మధ్య మాట మాట పెరిగి దాడికి దారి తీసింది. ఆ వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.'Customer' turned 'Crocodile' after TDS Deduction in Bank FD. FM sud instruct Bank staffs to learn 'taekwondo' for self defense. pic.twitter.com/CEDarfxcqi— Newton Bank Kumar (@idesibanda) December 6, 2024 కుమారుడు, బ్యాంక్ మేనేజర్ల మధ్య జరుగుతున్న గొడవని ఆపేందుకు కస్టమర్ తల్లి ప్రయత్నాలు చేసింది. బ్యాంక్లో పనిచేస్తున్న ఉద్యోగి శుభమన్ను కోరింది. ఇరువురి మధ్య కోట్లాట తారాస్థాయికి చేరడంతో చేసేది లేక ఆ తల్లి తన కుమారుడిని కొట్టింది. దీంతో తల్లి కొట్టడంతో కుమారుడు వెనక్కి తగ్గడంతో గొడవ సర్ధుమణిగింది. బ్యాంక్లో జరిగిన దాడిపై సమాచారం అందుకున్న వస్త్రపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.మరోవైపు, ఫిక్స్డ్ డిపాజిట్లే కాదు, ఇతర బ్యాంక్ లావాదేవీలపై జాగ్రత్తగా ఉండాలని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. డబ్బులు సేవింగ్స్ విషయంలో లాభనష్టాల గురించి ముందే జాగ్రత్త పడాలని సూచిస్తున్నారు. బ్యాంక్లో దాచుకునే డబ్బులుపై ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. అలా ట్యాక్స్ కట్టే పని లేకుండా నిబంధనలు పాటిస్తూ డబ్బుల్ని ఆదా చేసుకోవచ్చు. అందుకే డబ్బులు దాచుకునే విషయంలో కస్టమర్లకు సరైన అవగాహన ఉండాలని సూచిస్తున్నారు. -
డబ్ల్యూపీఎల్ మినీ వేలానికి 120 మంది ప్లేయర్లు
బెంగళూరు: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) మినీ వేలంలో 120 మంది ప్లేయర్లు పాల్గొననున్నారు. ఈ నెల 15న జరగనున్న డబ్ల్యూపీఎల్ వేలంలో అందుబాటులో ఉన్న 19 స్థానాల కోసం భారత్ నుంచి 91 మంది ప్లేయర్లు, విదేశాల నుంచి 29 మంది ప్లేయర్లు బరిలో ఉన్నారు. ఇందులో అసోసియేషన్ దేశాలకు చెందిన ముగ్గురు ప్లేయర్లు ఉన్నారు. గుజరాత్ ఫ్రాంచైజీ వద్ద అత్యధికంగా రూ.4.4 కోట్లు ఉన్నాయి. గుజరాత్ నలుగురు ప్లేయర్లను ఎంపిక చేసుకోవాల్సి ఉండగా... యూపీ వారియర్స్ జట్టు ముగ్గురు ప్లేయర్లను కొనుగోలు చేసుకోనుంది. ముంబై ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీలు తలా నలుగురు ప్లేయర్లను కొనుగోలు చేయనున్నాయి. భారత ఆటగాళ్లలో ఆల్రౌండర్ స్నేహ్ రాణా రూ. 30 లక్షల కనీస ధరతో వేలానికి రానుండగా... విదేశీ ప్లేయర్లలో డాటిన్ (వెస్టిండీస్), హీథర్ నైట్ (ఇంగ్లండ్)పై అదరి దృష్టి నిలవనుంది. వీరిద్దరూ రూ. 50 లక్షల కనీస ధరతో వేలంలో పాల్గొంటున్నారు. -
సీరియల్ కిల్లర్.. ఎట్టకేలకు చిక్కాడు!
ఇదో ఇంట్రస్టింగ్ కేసు. దొంగలను పట్టుకోవడానికి హీరో దొంగగా మారి వారి ఆట కట్టించడం మనం సినిమాల్లో చూశాం. ఇదే తరహాలో సీరియల్ కిల్లర్ని పోలీసులకు పట్టించాడో ఓ వ్యక్తి. మరింత మంది ప్రాణాలు పోకుండా కాపాడాడు. తన సోదరుడి చావుకు కారణమైన దుర్మార్గుడిని చట్టం ముందు నిలబెట్టాడు. మూడేళ్లు పాటు శ్రమించి హంతకుడిని ఆధారాలతో సహా పట్టించాడు. ఆసక్తి కలిగించే ఈ కేసులో వివరాలేంటో చూద్దాం.అసలేం జరిగింది?2021 ఆగస్టులో గుజరాత్లోని అహ్మదాబాద్ సమీపంలోని కమోద్ గ్రామంలో వివేక్ గోహిల్ అనే యువకుడు బైక్ ప్రమాదంలో చనిపోయాడు. అతడు యాక్సిడెంట్లోనే చనిపోయాడని పోలీసులతో అందరూ అనుకున్నారు. కానీ అతడి సోదరుడు జిగానీ గోహిల్(24) మాత్రం నమ్మలేదు. తన సోదరుడిది ముమ్మూటికీ హత్యేనని అనుమానించాడు. అసలేం జరిగిందో తెలుసుకోవడానికి స్వయంగా రంగంలోకి దిగాడు. వివేక్పై విషప్రయోగం చేశారని అతడు తెలుసుకున్నాడు. తన సోదరుడు చనిపోవడానికి ముందు నవల్సిన్హ్ చావ్డా అనే మంత్రగాడితో టచ్లో ఉన్నట్టు గుర్తించాడు.నైట్ ట్యాక్సీ డ్రైవర్ అవతారంతన సోదరుడిని హత్య చేసిన దుండగుడిని పట్టుకునేందుకు జిగానీ గోహిల్ నైట్ షిప్ట్ ట్యాక్సీ డ్రైవర్గా మారాడు. యూట్యూర్ కూడా అయిన నవల్సిన్హ్కు కారు ఉంది. ఉదయం అతడు కారు నడిపేవాడు. రాత్రిపూట జిగానీ కారు నడుపుతూ నవల్సిన్హ్కు దగ్గరయి, అతడి విశ్వాసం సంపాందించాడు. అతడికి సంబంధించిన అన్ని విషయాలను తెలుసుకున్నాడు. అభిజీత్ సింగ్ రాజ్పుత్ అనే మరో వ్యక్తిని హత్య చేయడానికి నవల్సిన్హ్ ప్లాన్ చేశాడు. తనకు సహకరిస్తే వచ్చే డబ్బులో 25 శాతం వాటా ఇస్తానని ఆశచూపించాడు. జిగానీ ఏమాత్రం ఆలస్యం చేయకుండా పోలీసులకు సమాచారం అందించడంతో నవల్సిన్హ్ కటకటాల పాలయ్యాడు.ముగ్గురిపై విషప్రయోగంప్రత్యేక పూజలు చేసి ధనవంతుడిని చేస్తానని సనంద్ ప్రాంతానికి చెందిన అభిజీత్ సింగ్ (29)ను నవల్సిన్హ్ నమ్మించాడు. నీళ్లలో విషపదార్థం కలిపి అతడిని అంతం చేసి.. డబ్బు లాగాలని పథకం వేశాడు. జిగానీ ఇచ్చిన సమాచారంలో రంగంలోకి దిగిన సక్రెజ్ ప్రాంత పోలీసులు మమత్పురాలో నవల్సిన్హ్ను అరెస్ట్ చేశారు. 2023లోనూ ముగ్గురిని ఇలాగే అతడు చంపినట్టు పోలీసులు అనుమానిస్తునారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురిపై విషప్రయోగం చేసి చంపేసి, వారి మృతదేహాలను దుద్రేజ్ కాలువలో పడేశారు. వారు ముగ్గురూ ఆత్మహత్య చేసుకున్నారని అందరినీ నమ్మించడంతో నవల్సిన్హ్ తప్పించుకున్నాడు. ఇప్పుడు ఆధారాలతో సహా దొరికిపోవడంతో పాత కేసులను కూడా పోలీసులు తిరగదోడుతున్నారు. చదవండి: రాంగ్ కాల్ ఫలితం.. యువతి వేధింపులకు ఎస్ఐ ఆత్మహత్యనరబలి ఆరోపణలునవల్సిన్హ్ను చట్టానికి పట్టించడంలో జిగానీ పెద్ద సాహసమే చేశాడు. ట్యాక్సి డ్రైవర్గా అతడికి దగ్గరయి ఆధారాలు సంపాదించాడు. సరైన సమయంలో హంతకుడిని పోలీసులకు పట్టించాడు. నవల్సిన్హ్ కారు నుంచి పూజాసామాగ్రి, విషపదార్థంగా అనుమానిస్తున్న వైట్ పౌడర్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తాంత్రిక పూజలతో అమాయకులను నమ్మించి హత్య చేసిన అతడిపై సెక్షన్ 55, 318(1), (2) కింద కేసు నమోదు చేశారు. అయితే నరబలి ఇచ్చాడా అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గుజరాత్ నరబలి వ్యతిరేక చట్టం కింద కూడా కేసు నమోదు చేశారు. -
ఎనిమిదో తరగతి చదివినా, రూ. 70 వేలు కడితే డాక్టర్ కావొచ్చు..
దేశంలో ఎక్కువ డిమాండ్ ఉన్న కోర్సుల్లో మెడిసిన్ ఒకటి. డాక్టర్ కావాలంటే ఎంతో శ్రమించాలి. చదువు పూర్తయ్యే వరకు లక్షలు లక్షలు ఖర్చుపెట్టడమే కాకుండా.. రాత్రి పగలు శ్రమించి చదవాలి.. అయినా వైద్యులు అవుతారనే నమ్మకం లేదు. కానీ కొంతమంది కష్టపడి చదవడం మానేసి అడ్డదారిలో డబ్బులు గుమ్మరించి డాక్టర్ పట్టా పొందాలని ప్రయత్నిస్తున్నారు. కానీ ఎక్కడైనా ఎనిమిదో తరగతి చదివినా డాక్టర్ కావచ్చని తెలుసా; లేదా కేవలం రూ.70వేలు కట్టినా వైద్యవిద్యకు సంబంధించిన సర్టిఫికెట్లు పొందవచ్చని విన్నారా?వినడానికి నమ్మశక్యంగా లేని ఈ విషయాలు నిజంగా జరిగాయి. ఒకరు కాదు ఇద్దరు కాదు ఇలా తప్పుడు ధ్రువపత్రాలు సంపాదించి డాక్టర్లుగా చలామణి అవుతున్న 14 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. గుజరాత్లో ఈ ఘటన వెలుగుచూసింది. సూరత్లో 1,200 నకిలీ డిగ్రీ సర్టిఫికెట్లు కలిగి ఉన్న ముఠా గుట్టు రట్టు చేశారు. ముగ్గురు వ్యక్తులు నకిలీ ధ్రువపత్రాలతో అల్లోపతి వైద్యం చేస్తున్నారని పోలీసులకు సమాచారం వచ్చింది. దీంతో స్థానిక రెవెన్యూ అధికారులతో కలిసి సదరు క్లినిక్లపై దాడి చేశారు. వారిని ప్రశ్నించగా, బోర్డు ఆఫ్ ఎలక్ట్రో హోమియోపతిక్ మెడిసిన్ గుజరాత్ పేరిట ఉన్న ధ్రువపత్రాలను చూపించారు. దీంతో అవి నకిలీ సర్టిఫికెట్లుగా పోలీసులు తేల్చారు. అలాంటి పత్రాలను గుజరాత్ ప్రభుత్వం జారీ చేయడంలేదని పేర్కొన్నారు. అయితే ఈ ముఠా 8వ తరగతి చదివిన వారి వద్ద ఒక్కొక్కరి నుంచి 70,000 వసూలు చేస్తూ నకిలీ వైద్య ధ్రువపత్రాలను అందించినట్లు తేలింది. ఈ ముఠా నుంచి డిగ్రీలు కొనుగోలు చేసిన 14 మంది నకిలీ వైద్యులను గుజరాత్ పోలీసులు అరెస్ట్ చేశారు. నకిలీ వైద్య ధ్రువపత్రాలను అమ్ముతున్న ముఠా కీలక సభ్యుడు డాక్టర్ రమేశ్ గుజరాతీని కూడా అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుల నుంచి వందలాది దరఖాస్తులు, సర్టిఫికెట్లు, స్టాంపులుస్వాధీనం చేసుకున్నట్లు పేర్కొ న్నారు.అంతేకాకుండా అలా ఇచ్చే డిగ్రీలను ఏటా రెన్యూవల్ చేసుకోవాలి. అందుకోసం అదనంగా రూ. 5000 నుంచి రూ.15,000 వసూలు చేసేవారు. ఒకవేళ రెన్యూవల్ చేసుకోకుంటే సదరు ముఠా సభ్యులు బెదిరింపులకు దిగేవారు. ఇక సూరత్లో ఇటీవల కొందరు నకిలీ వైద్యులు భారీ స్థాయిలో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి తెరిచి అధికారులకు దొరికిపోయిన సంగతి తెలిసిందే. -
శివాలెత్తిన అక్షర్ పటేల్.. ఒకే ఓవర్లో..!
సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో టీమిండియా ఆటగాడు, గుజరాత్ ప్లేయర్ అక్షర్ పటేల్ చెలరేగిపోయాడు. కర్ణాటకతో ఇవాళ (డిసెంబర్ 5) జరిగిన మ్యాచ్లో అక్షర్ శివాలెత్తిపోయాడు. ఈ మ్యాచ్లో అక్షర్ 20 బంతులను ఎదుర్కొని 2 ఫోర్లు, అర డజన్లు సిక్సర్ల సాయంతో అజేయమైన 56 పరుగులు చేశాడు. ఇన్నింగ్స్ చివరి ఓవర్లో విద్యాధర్ అనే వ్యక్తి బౌలింగ్లో అక్షర్ పేట్రేగిపోయాడు. ఈ ఓవర్లో అతను ఏకంగా 24 పరుగులు రాబట్టాడు. ఇందులో 3 సిక్సర్లు, ఓ బౌండరీ ఉంది. అక్షర్ విజృంభించడంతో ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 251 పరుగుల భారీ స్కోర్ చేసింది. AXAR PATEL SMASHED 6,2,6,4,0,6 - 24 RUNS IN THE FINAL OVER. 🤯 pic.twitter.com/lTV3Of4CLV— Mufaddal Vohra (@mufaddal_vohra) December 5, 2024ఓపెనర్ ఆర్య దేశాయ్ 40 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 73 పరుగులు చేశాడు. మరో ఓపెనర్, ఈ సీజన్లో రెండు వేగవంతమైన సెంచరీలు చేసిన ఉర్విల్ పటేల్ 14 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 33 పరుగులు చేశాడు. అభిషేక్ దేశాయ్ 32 బంతుల్లో 47.. హేమంగ్ పటేల్ 12 బంతుల్లో 30 పరుగులు చేశారు. కర్ణాటక బౌలర్లలో కౌశిక్, భాండగే తలో రెండు వికెట్లు పడగొట్టగా.. విద్యాధర్ పాటిల్ ఓ వికెట్ దక్కించుకున్నాడు.అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన కర్ణాటక గెలుపు కోసం చివరి వరకు పోరాడింది. ఆ జట్టు 19.1 ఓవర్లలో 203 పరుగులు చేసి ఆలౌటైంది. ఫలితంగా 48 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. స్మరన్ రవిచంద్రన్ (49), మయాంక్ అగర్వాల్ (45), మనీశ్ పాండే (30), కృష్ణణ్ శ్రీజిత్ (26) కర్ణాటకను గెలిపించేందుకు విఫలయత్నం చేశారు. గుజరాత్ బౌలర్లలో రవి బిష్ణోయ్ 3 వికెట్లు పడగొట్టగా.. అక్షర్ పటేల్, నగస్వల్లా చెరో 2, చింతన్ గజా, విశాల్ జేస్వాల్, ఆర్య దేశాయ్ తలో వికెట్ దక్కించుకున్నారు. -
మరో సుడిగాలి శతకం బాదిన ఉర్విల్ పటేల్
సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో గుజరాత్ వికెట్ కీపర్ బ్యాటర్ ఉర్విల్ పటేల్ భీకర ఫామ్ కొనసాగుతుంది. ఈ టోర్నీలో ఇప్పటికే ఓ మెరుపు సెంచరీ బాదిన ఉర్విల్.. తాజాగా మరో సుడిగాలి శతకంతో విరుచుకుపడ్డాడు. ఉత్తరాఖండ్తో ఇవాళ (డిసెంబర్ 3) జరిగిన మ్యాచ్లో ఉర్విల్ 36 బంతుల్లో శతకొట్టాడు. ఈ మ్యాచ్లో మొత్తంగా 41 బంతులు ఎదుర్కొన్న ఉర్విల్.. 8 ఫోర్లు, 11 సిక్సర్ల సాయంతో అజేయమైన 115 పరుగులు చేశాడు. సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో గుజరాత్ తరఫున ఇదే అత్యధిక స్కోర్.టీ20ల్లో భారత్ తరఫున ఫాస్టెస్ట్ సెంచరీఉర్విల్ గత నెలాఖరులో త్రిపురతో జరిగిన మ్యాచ్లో కేవలం 28 బంతుల్లోనే శతక్కొట్టాడు. భారత్ తరఫున టీ20ల్లో ఇది వేగవంతమైన సెంచరీ. ఓవరాల్గా టీ20ల్లో ఇది రెండో వేగవంతమైన శతకం.టీ20ల్లో రెండో వేగవంతమైన సెంచరీని చేరుకునే క్రమంలో ఉర్విల్.. క్రిస్ గేల్, రిషబ్ పంత్ రికార్డులను బద్దలు కొట్టాడు. టీ20ల్లో గేల్ 30 బంతుల్లో శతక్కొట్టగా.. పంత్ 32 బంతుల్లో సెంచరీ బాదాడు.సాహిల్ చౌహాన్ పేరిట ఫాస్టెస్ట్ సెంచరీపొట్టి ఫార్మాట్లో ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు ఎస్టోనియా ఆటగాడు సాహిల్ చౌహాన్ పేరిట ఉంది. చౌహాన్ ఈ ఏడాదే సైప్రస్తో జరిగిన మ్యాచ్లో 27 బంతుల్లో శతక్కొట్టాడు. ఉర్విల్ ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డును కేవలం ఒక్క బంతితో మిస్ అయ్యాడు.లిస్ట్-ఏ క్రికెట్లోనూ..భారత్ తరఫున లిస్ట్-ఏ క్రికెట్లోనూ సెకెండ్ ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు ఉర్విల్ పేరిటే ఉంది. 2023 నవంబర్లో అరుణాచల్ ప్రదేశ్తో జరిగిన మ్యాచ్లో ఉర్విల్ 41 బంతుల్లోనే శతక్కొట్టాడు. లిస్ట్-ఏ క్రికెట్లో ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు టీమిండియా మాజీ ఆటగాడు యూసఫ్ పఠాన్ పేరిట ఉంది. 2010లో మహారాష్ట్రతో జరిగిన మ్యాచ్లో యూసఫ్ పఠాన్ 40 బంతుల్లో సెంచరీ బాదాడు.గుజరాత్ టైటాన్స్ వదిలేసింది..!ఉర్విల్ను 2023 ఐపీఎల్ సీజన్ వేలంలో గుజరాత్ టైటాన్స్ 20 లక్షల బేస్ ధరకు సొంతం చేసుకుంది. అయితే ఆ సీజన్లో ఉర్విల్కు ఒక్క మ్యాచ్ ఆడే అవకాశం కూడా రాలేదు. ఉర్విల్ను గుజరాత్ టైటాన్స్ 2025 మెగా వేలానికి ముందు వదిలేసింది. మెగా వేలంలో ఉర్విల్ అన్సోల్డ్గా మిగిలిపోయాడు. ఉర్విల్పై ఏ ఫ్రాంచైజీ ఆసక్తి చూపలేదు. మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన ఉత్తరాఖండ్.. సమర్థ్ (54), ఆధిత్య తారే (54) అర్ద సెంచరీలతో రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. గుజరాత్ బౌలర్లలో విశాల్ జేస్వాల్ 4 వికెట్లు పడగొట్టాడు.183 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన గుజరాత్.. ఉర్విల్ సుడిగాలి శతకంతో విరుచుకుపడటంతో కేవలం 13.1 ఓవర్లలోనే విజయతీరాలకు చేరింది. గుజరాత్ ఇన్నింగ్స్లో ఆర్య దేశాయ్ (23), అక్షర్ పటేల్ (28 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. ఈ గెలుపుతో గుజరాత్ ప్రస్తుత ఎడిషన్లో (సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో) వరుసగా ఐదో విజయాన్ని నమోదు చేసింది. -
ఒత్తిడి తట్టుకోలేక బీజేపీ మహిళా నేత ఆత్మహత్య
సూరత్ : ఒత్తిడి తట్టుకోలేక బీజేపీ మహిళా నేత ఆత్మహత్యకు పాల్పడింది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సూరత్లోని వార్డ్నెంబర్ 30లో బీజేపీ మహిళా మోర్చా విభాగానికి దీపికా పటేల్ నాయకత్వం వహిస్తున్నారు.అయితే, ఒత్తిడి తట్టుకోలేక ఆదివారం తన నివాసంలో దీపికా పటేల్ ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్యాయత్నంపై సమాచారం అందుకున్న స్థానిక కార్పొరేటర్, కుటుంబసభ్యులు బాధితురాలిని అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు దీపికా పటేల్ అప్పటికే మరణించినట్లు ధృవీకరించారు.దీపికా పటేల్ మరణంపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. స్థానిక రాజకీయాల్లో కీలక నేతగా వ్యవహరిస్తున్న దీపికా పటేలా్ బలవన్మరణం చేసుకోవడానికి కారణం ఏమై ఉంటుందని పోలీసులు ఆరా తీసుకున్నారు. కాగా, దీపికా పటేల్ భర్త వ్యవసాయం చేస్తుండగా ఆమెకు ముగ్గురు పిల్లలు.ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
టీ20ల్లో సెకెండ్ ఫాస్టెస్ట్ సెంచరీ.. గేల్, పంత్ రికార్డులు బద్దలు
టీ20ల్లో రెండో వేగవంతమైన సెంచరీ నమోదైంది. సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో గుజరాత్ ఆటగాడు ఉర్విల్ పటేల్.. 28 బంతుల్లోనే (త్రిపురతో జరిగిన మ్యాచ్లో) శతక్కొట్టాడు. పొట్టి క్రికెట్ చరిత్రలోనే ఇది సెకెండ్ ఫాస్టెస్ట్ సెంచరీ కాగా.. భారత్ తరఫున పొట్టి ఫార్మాట్లో ఇది ఫాస్టెస్ట్ సెంచరీగా రికార్డైంది.గేల్, పంత్ రికార్డులు బద్దలుటీ20ల్లో రెండో వేగవంతమైన సెంచరీని చేరుకునే క్రమంలో ఉర్విల్.. క్రిస్ గేల్, రిషబ్ పంత్ల రికార్డులను బద్దలు కొట్టాడు. టీ20ల్లో గేల్ 30 బంతుల్లో శతక్కొట్టగా.. పంత్ 32 బంతుల్లో సెంచరీ బాదాడు.సాహిల్ చౌహాన్ పేరిట ఫాస్టెస్ట్ సెంచరీపొట్టి ఫార్మాట్లో ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు ఎస్టోనియా ఆటగాడు సాహిల్ చౌహాన్ పేరిట ఉంది. చౌహాన్ ఈ ఏడాదే సైప్రస్తో జరిగిన మ్యాచ్లో 27 బంతుల్లో శతక్కొట్టాడు. ఉర్విల్ ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డును కేవలం ఒక్క బంతితో మిస్ అయ్యాడు.భారత్ తరఫున ఫాస్టెస్ట్ సెంచరీటీ20ల్లో భారత్ తరఫున ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు రిషబ్ పేరిట ఉండగా.. తాజాగా ఉర్విల్ పంత్ రికార్డును బద్దలు కొట్టాడు. త్రిపురతో జరిగిన మ్యాచ్లో 35 బంతులు ఎదుర్కొన్న ఉర్విల్ 7 ఫోర్లు, 12 సిక్సర్ల సాయంతో 113 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.లిస్ట్-ఏ క్రికెట్లోనూ ఫాస్టెస్ట్ సెంచరీభారత్ తరఫున లిస్ట్-ఏ క్రికెట్లోనూ సెకెండ్ ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు ఉర్విల్ పేరిటే ఉంది. 2023 నవంబర్లో అరుణాచల్ ప్రదేశ్తో జరిగిన మ్యాచ్లో ఉర్విల్ 41 బంతుల్లోనే శతక్కొట్టాడు. లిస్ట్-ఏ క్రికెట్లో ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు టీమిండియా మాజీ ఆటగాడు యూసఫ్ పఠాన్ పేరిట ఉంది. 2010లో మహారాష్ట్రతో జరిగిన మ్యాచ్లో యూసఫ్ పఠాన్ 40 బంతుల్లో సెంచరీ బాదాడు.మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన త్రిపుర నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. శ్రీదమ్ పాల్ (57) అర్ద సెంచరీతో రాణించాడు. గుజరాత్ బౌలర్లలో నగస్వల్లా అత్యధికంగా 3 వికెట్లు పడగొట్టాడు. 156 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందకు బరిలోకి దిగిన గుజరాత్ 10.2 ఓవర్లలోనే (2 వికెట్లు కోల్పోయి) విజయతీరాలకు చేరింది. ఉర్విల్ సునామీ శతకంతో విరుచుకుపడగా.. ఆర్య దేశాయ్ (38) మరో ఎండ్ నుంచి ఉర్విల్కు సహకరించాడు.ఎవరీ ఉర్విల్ పటేల్..?26 ఏళ్ల ఉర్విల్ బరోడాలోని మెహసానాలో జన్మించాడు. 2018లో అతను బరోడా తరఫున టీ20 అరంగేట్రం చేశాడు. అదే ఏడాది అతను లిస్ట్-ఏ క్రికెట్లోకి కూడా అడుగుపెట్టాడు. అయితే ఆతర్వాత ఉర్విల్కు ఫస్ట్ క్లాస్ అరంగేట్రం చేసేందుకు ఆరేళ్లు పట్టింది. ఉర్విల్ గతేడాదే రంజీల్లోకి అడుగుపెట్టాడు.గుజరాత్ టైటాన్స్ వదిలేసింది..!ఉర్విల్ను 2023 ఐపీఎల్ సీజన్ వేలంలో గుజరాత్ టైటాన్స్ 20 లక్షల బేస్ ధరకు సొంతం చేసుకుంది. అయితే ఆ సీజన్లో ఉర్విల్కు ఒక్క మ్యాచ్ ఆడే అవకాశం కూడా రాలేదు. ఉర్విల్ను గుజరాత్ టైటాన్స్ 2025 మెగా వేలానికి ముందు వదిలేసింది. రెండు రోజుల కిందట జరిగిన మెగా వేలంలో ఉర్విల్ అన్సోల్డ్గా మిగిలిపోయాడు. ఉర్విల్పై ఏ ఫ్రాంచైజీ ఆసక్తి చూపలేదు. తాజా ఇన్నింగ్స్ నేపథ్యంలో ఫ్రాంచైజీలు మనసు మార్చుకుంటాయేమో వేచి చూడాలి. -
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ‘రాక్షసుడు’
సాక్షి, సిటీబ్యూరో: అతడి పేరు భోలో కరమ్వీర్ జాట్ అలియాస్ రాహుల్..స్వస్థలం హర్యానాలోని రోహ్తక్లో ఉన్న మోక్రా ఖాస్...గతంలో రాజస్థాన్, హర్యానా, ఉత్తరప్రదేశ్ల్లో నేరాలు చేశాడు. ఇటీవల ‘రైల్వే’ కిల్లర్గా మారాడు. ఈ ఏడాది అక్టోబర్ 17 నుంచి ఆదివారం (ఈ నెల 24) మధ్య 35 రోజుల్లో ఎక్స్ప్రెస్ రైళ్లల్లో సంచరిస్తూ ఐదు రాష్ట్రాల్లో ఐదు మర్డర్లు చేశాడు. వీటిలో కొన్ని సొత్తు కోసమైతే..మరికొన్ని అత్యాచారం, హత్యలు. గుజరాత్లోని వల్సాద్ పోలీసులు ఈ నరహంతకుడిని సోమవారం పట్టుకున్నారు. విచారణలో ఆఖరి ఘాతుకాన్ని ఆదివారం ఉదయం సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో చేసినట్లు వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు సికింద్రాబాద్ జీఆర్పీ అధికారులకు వల్సాద్ పోలీసులు సమాచారం ఇచ్చారు. దీంతో పీటీ వారెంట్పై కరమ్వీర్ను నగరానికి తీసుకురావడానికి పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు. వల్సాద్ ఎస్పీ డాక్టర్ కరణ్రాజ్ సింగ్ వాఘేలాను మంగళవారం ‘సాక్షి’ ఫోన్ ద్వారా సంప్రదించింది. ఆయన ఈ సీరియల్ కిల్లర్ పూర్వాపరాలు వెల్లడించారు.చిన్ననాటి నుంచి చిత్రమైన ప్రవర్తన..హర్యానాలోని వ్యవసాయ కుటుంబంలో పుట్టిన రాహుల్కు ఎడమ కాలికి పోలియో సోకింది. ఫలితంగా చిన్నతనం నుంచి ఆటపాటలకు దూరంగా ఉంటూ ఒంటరిగా ఉండేవాడు. విపరీతమైన భావాలు, చిత్రమైన ప్రవర్తన కలిగి ఉండేవాడటంతో కుటుంబం దూరంగా పెట్టింది. ఐదో తరగతితో చదువుకు స్వస్తి చెప్పిన రాహుల్ లారీ క్లీనర్గా పని చేస్తూ డ్రైవింగ్ నేర్చుకున్నాడు. అయితే పోలియో కారణంగా ఇతడికి ఎవరూ డ్రైవర్గా ఉద్యోగం ఇవ్వలేదు. దీంతో హైవే దాబాలో కారి్మకుడిగా మారిన రాహుల్... అక్కడ పార్క్ చేసి ఉన్న లారీలను తస్కరించడం మొదలెట్టాడు. దీంతో పాటు లూటీలు, కిడ్నాప్లకు పాల్పడ్డాడు. ఈ ఆరోపణలపై రాజస్థాన్, హర్యానా, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ల్లో 13 కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది మే వరకు రాజస్థాన్లోని జోద్పూర్ జైల్లో గడిపిన రాహుల్ బెయిల్పై విడుదలయ్యాడు. అక్కడ నుంచి గుజరాత్లోని ఉద్వాడ పట్టణానికి చేరుకుని ఓ హోటల్లో కారి్మకుడిగా చేరాడు. కొన్ని రోజులు పని చేసి వాపి ప్రాంతానికి చేరుకుని ఫుట్పాత్స్ పైన గడిపాడు.ఆ అవకాశాన్ని దుర్వినియోగం చేసుకుని..వివిధ రైళ్లల్లో దివ్యాంగుల కోసం చివరలో ప్రత్యేక బోగీలు ఉంటాయి. వీటిలో ప్రయాణించే దివ్యాంగులను సాధారణంగా టీసీలు సైతం తనిఖీ చేయరు. పాసులు కలిగి ఉంటారనే ఉద్దేశంలోనే వదిలేస్తుంటారు. దీన్ని తనకు అనువుగా మార్చుకున్న రాహుల్ ఎక్స్ప్రెస్ రైళ్లల్లోని దివ్యాంగుల బోగీల్లో ఎక్కి దేశం మొత్తం తిరగడం ప్రారంభించాడు. ఈ ఏడాది జూన్ రెండో వారం నుంచి ఇలా దేశ సంచారం చేస్తున్న రాహుల్ అక్టోబర్ 17న తొలి హత్య చేశాడు. ఆ రోజు బెంగళూరు–మురుదేశ్వర్ రైలులో ప్రయాణిస్తుండగా బీడీ కాల్చడంపై తోటి ప్రయాణికుడు అభ్యంతరం చెప్పాడు. దీంతో విచక్షణకోల్పోయిన రాహుల్ గొంతు నులిమి చంపేశాడు. ఆపై అతడి వద్ద ఉన్న సొత్తు, సొమ్ము తీసుకుని రైలు దిగిపోయాడు. దీనిపై మంగుళూరులో ఉన్న ముల్కీ పోలీసుస్టేషన్లో కేసు నమోదైంది. వరుసపెట్టి మరో నాలుగు హత్యలు..ఆపై కతిహార్ ఎక్స్ప్రెస్లో ప్రయాణించిన రాహుల్ పశ్చిమ బెంగాల్ లోని హౌరా స్టేషన్లో మరో వృద్ధుడి గొంతు కోసి చంపి దోపిడీకి పాల్పడ్డాడు. పుణే–కన్యాకుమారి ఎక్స్ప్రెస్లో మరో మహిళపై అత్యాచారం చేసి, కత్తితో గొంతు కోసి హత్య చేశాడు. వీటిపై ఆయా ఠాణాలో కేసులు నమోదయ్యాయి. ఈ నెల 14న ఉద్వాడలో తాను పని చేసిన హోటల్కు వెళ్లి జీతం తీసుకోవాలని భావించాడు. అక్కడకు వచ్చిన రాహుల్కు స్టేషన్ ఫ్లాట్ఫామ్పై ఒంటరిగా సంచరిస్తున్న యువతి కనిపించింది. ఆమెను సమీపంలోని మామిడి తోటలోకి లాక్కెళ్లి, అత్యా చారం చేసి చంపేశాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న వల్సాద్ పోలీసులు ఘటనాస్థలిలో లభించిన బ్యాగ్ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. వివిధ రైల్వేస్టేషన్లలోని 2500 సీసీ కెమెరాల్లో ఫీడ్ను అధ్యయనం చేసి నిందితుడిని గుర్తించారు. ఉద్వాడ నుంచి రైలులో ఆంధ్రప్రదేశ్లోని మచిలీపట్నం చేరుకు న్న రాహుల్ అట్నుంచి షిర్డీ, ఆపై బాంద్రా చేరుకున్నాడు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో మహిళ హత్య..అక్కడ నుంచి సికింద్రాబాద్ వచ్చిన రాహుల్ ఆదివారం తెల్లవారుజామున రైలు దిగాడు. ఆ సమయంలో తొమ్మిదో నెంబర్ ప్లాట్ఫామ్పై మంగుళూరు స్పెషల్ ఎక్స్ప్రెస్ ఆగి ఉంది. దాని సీట్ కమ్ లగేజ్ ర్యాక్ (ఎస్ఎల్ఆర్) కోచ్లో ఓ మహిళ ఒంటరిగా ఉండటం గమనించాడు. ఆమెను గొంతునులిమి చంపేసిన రాహుల్ నగదు, సెల్ఫోన్ తస్కరించాడు. అక్కడ నుంచి రైలులోనే ఉడాయించాడు. ఈ హత్యపై సికింద్రాబాద్ జీఆర్పీ అధికారులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. వివిధ రైళ్లు మారిన రాహుల్ బాంద్రా–భుజ్ ఎక్స్ప్రెస్లో సోమవారం గుజరాత్లోని వాపి చేరుకున్నాడు. అప్పటికే ఇతడి కదలికలు సాంకేతికంగా గమనిస్తున్న వల్సాద్ పోలీసులు అక్కడ వలపన్ని పట్టుకున్నారు. అతడి నుంచి సికింద్రాబాద్లో చంపిన మహిళ నుంచి తీసుకున్న సెల్ఫోన్ స్వా«దీనం చేసుకున్నారు. ఇతడి అరెస్టుపై సికింద్రాబాద్ జీఆర్పీ పోలీసులకు సమాచారం ఇచ్చారు. -
‘సింగిల్ బల్బుకు రూ.86 లక్షల బిల్లు!’
అతనిది సింగిల్ రూమ్ షెటర్లో టైలరింగ్ షాపు. ప్యాంట్లు, చొక్కాలతో పాటు షేర్వాణీలు కుడుతుంటాడు. నెల నెలా కరెంట్ బిల్లును ఫోన్ పేలో కడుతుంటాడు. ఉన్న సింగిల్ బల్బ్కు నెలలో రోజంతా కరెంట్ వాడినా.. నెలకు రూ.2 వేలు రావడం కూడా కష్టమే. అయితే ఈ నెల బిల్లు చూడగానే.. గుండె ఆగినంత పనైందట అతనికి. ఏకంగా 86 లక్షల బిల్లు వచ్చింది.గుజరాత్ వల్సద్కు చెందిన అన్సారీ.. తన మామతో కలిసి టేలర్ షాప్ నడుపుతున్నాడు. కరెంట్ బిల్లు నెల నెల ఫోన్ పేలో కడుతుంటాడు. అయితే ఈ నెల బిల్లు చూసి అతని కళ్లు బయర్లు కమ్మాయట. ఏకంగా 86 లక్షల బిల్లు రావడంతో.. ఎలక్ట్రిసిటీ బోర్డుకు పరుగులు తీశాడు. ఆ వెంటనే డిస్కం సిబ్బంది సైతం అంతే వేగంగా అతని షాపు మీటర్ను పరిశీలించారు. అయితే..వల్సద్లో ఇతని దుకాణం ఉన్న ఏరియాకు దక్షిణ్ గుజరాత్ విజ్ కంపెనీ లిమిటెడ్ నుంచి పవర్ సప్లై జరుగుతుంది. ఈ పరిధిలో గుజరాత్ ఏడు జిల్లాల నుంచి 32 లక్షల మంది ఉన్నారు. ఇతని షాప్ మీటర్లో రెండు డిజిట్స్ పొరపాటున ఎక్కువ యాడ్ అయ్యాయట. అలా.. అతనికి అంతలా బిల్లు వచ్చిందని సిబ్బంది గుర్తించారు.వెంటనే సిబ్బంది తమ తప్పును సరిదిద్దుకుని.. రివైజ్ బిల్లును అన్సారీ చేతిలో పెట్టారు. అందులో రూ.1,540 మాత్రమే ఉంది. దీంతో హమ్మాయ్యా అనుకున్నాడా టైలర్. అయితే బిల్లు సంగతి ఏమోగానీ.. ఆ నోటా ఈ నోటా పాకి ఇప్పుడతని టైలర్ షాప్కు సెల్ఫీల కోసం జనం క్యూ కడుతున్నారట. దీంతో అన్సారీ హ్యాపీగా ఫీలవుతున్నాడు.86 લાખનું અધધ બિલ... વલસાડમાં વીજ વિભાગની બેદરકારીથી દરજીની દુકાનમાં મસમોટું લાઇટ બિલ આવ્યું#ligthbill #valsad #gujarat #viralvideo #trendingvideo pic.twitter.com/nEOdfr2g6G— Zee 24 Kalak (@Zee24Kalak) November 25, 2024 Video Credits: Zee 24 Kalakఇదీ చదవండి: గత 75 ఏళ్లుగా ఫ్రీ టిక్కెట్ సర్వీస్ అందిస్తున్న ఏకైక రైలు ఇదే..! -
అదానీ గ్రూప్ భారీ పెట్టుబడులు
పునరుత్పాదక ఇంధన వనరులపై అదానీ గ్రూప్ భారీ పెట్టుబడులు పెట్టనుంది. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో భారీ సామర్థ్యంతో సోలార్, పవన, హైబ్రిడ్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుపై వచ్చే ఐదేళ్లలో 35 బిలియన్ డాలర్లు (రూ.2.94 లక్షల కోట్లు) ఇన్వెస్ట్ చేయనున్నట్టు అదానీ గ్రీన్ ఎనర్జీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సాగర్ అదానీ ప్రకటించారు. ‘2047 నాటికి వికసిత భారత్ లక్ష్య సాధనలో యువ నాయకుల పాత్ర’ అనే అంశంపై జరిగిన సీఈవో ప్యానెల్ చర్చలో భాగంగా సాగర్ అదానీ ఈ వివరాలు వెల్లడించారు.ఇదీ చదవండి: ఒకటో తరగతి ఫీజు.. రూ.4.27 లక్షలు!గుజరాత్లోని ఖావ్డాలో 30,000 మెగావాట్ సామర్థ్యంతో పునరుత్పాదక విద్యుత్ సామర్థ్యాలను ఈ కంపెనీ ఏర్పాటు చేస్తుండడం గమనార్హం. ఇంధన స్థిరత్వం, ఇంధన పరివర్తనం విషయంలో అదిపెద్ద గ్రీన్ఫీల్డ్ పెట్టుబడుల్లో ఇది ఒకటి అవుతుందని సాగర్ అదానీ పేర్కొన్నారు. ‘‘మన దగ్గర 500 గిగావాట్ల స్థాపిత సామర్థ్యం ఉంది. తలసరి వినియోగంలో ప్రపంచవ్యాప్తంగా చూస్తే మనం మూడింత ఒక వంతు పరిమాణంలోనే ఉన్నాం. వచ్చే 7–8 ఏళ్లలో ప్రపంచ సగటు తలసరి విద్యుత్ వినియోగానికి చేరుకోవాలంటే మరో 1,000 మెగావాట్ల స్థాపిత సామర్థ్యం అవసరం. చైనా స్థాయికి చేరుకోవాలంటే మరో 1,500 మెగావాట్ల సామర్థ్యం అవసరం. అభివృద్ధి చెందిన దేశాలకు సమాన స్థాయికి చేరుకోవాలంటే మరో 2,500–3,000 మెగావాట్ల సామర్థ్యం అవసరం అవుతుంది’’అని వివరించారు. -
Gujarat: ర్యాగింగ్కు ఎంబీబీఎస్ విద్యార్థి బలి
గాంధీనగర్: విద్యాసంస్థలోని సీనియర్ల ర్యాగింగ్కు ఓ విద్యాకుసుమం నేల రాలింది. ఈ ఘటన గుజరాత్లోని ఓ మెడికల్ కళాశాలలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే అనిల్ మథానియా అనే విద్యార్థి ఈ ఏడాది ధర్పూర్ పటాన్లోని జీఎంఈఆర్ఎస్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్లో అడ్మిషన్ తీసుకున్నాడు.హాస్టల్లోని తృతీయ సంవత్సరం విద్యార్థులు అనిల్ను పరిచయం పేరిట మూడు గంటల పాటు కదలకుండా నిలబెట్టారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతసేపు నిలుచుకున్న అనిల్ అపస్మారక స్థితికి చేరుకోవడంతో తోటి విద్యార్థులు అతనిని ఆస్పత్రికి తరలించారు. బాధిత విద్యార్థి తనను సీనియర్లు మూడు గంటల పాటు నిలబెట్టారని కాలేజీ యాజమాన్యానికి తెలిపాడు. చికిత్స పొందుతూ అనిల్ మృతి చెందాడు. పోలీసులు అనిల్ మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం తరలించారు. పోస్టుమార్టం నివేదిక వచ్చాక అనిల్ మృతికి గల కారణాలు తెలుస్తాయని పోలీసులు తెలిపారు. అనిల్ బంధువు ధర్మేంద్ర మీడియాతో మాట్లాడుతూ ‘అనిల్ కుటుంబం గుజరాత్లోని సురేంద్రనగర్ జిల్లాలో ఉంటుంది. ఇది పటాన్లోని కళాశాలకు 150 కిలోమీటర్ల దూరంలో ఉంది. నిన్న మాకు కాలేజీ నుండి ఫోన్ వచ్చింది. అనిల్ అపస్మారక స్థితిలో ఉన్నాడని, అతనిని ఆస్పత్రిలో చేర్చామని తెలిపారు. తాము ఇక్కడికి చేరుకోగా, అనిల్ను మూడవ సంవత్సరం విద్యార్థులు ర్యాగింగ్ చేసారని తెలిసింది. దీనిపై వెంటనే పోలీసులు దర్యాప్తు చేసి, తమకు న్యాయం చేయాలని’ కోరారు.మెడికల్ కాలేజీ డీన్ హార్దిక్ షా మాట్లాడుతూ ‘అనిల్ అపస్మారక స్థితికి చేరుకున్నాడని గుర్తించిన వెంటనే, అతన్ని ఆస్పత్రికి తరలించాం. ఆ సమయంలో అనిల్ తనను సీనియర్లు ర్యాగింగ్ చేశారని, మూడు గంటల పాటు నిలబెట్టాడని తెలిపాడు. ఈ విషయాన్ని మేము పోలీసులు, అనిల్ కుటుంబ సభ్యులకు తెలియజేశాం. ర్యాగింగ్కు పాల్పడిన సీనియర్ విద్యార్థులపై కఠిన చర్యలు తీసుకుంటాం’ అని పేర్కొన్నారు.విద్యార్థి తండ్రి ఫిర్యాదు మేరకు ఇది ప్రమాదవశాత్తు జరిగిన మృతిగా ముందుగా కేసు నమోదు చేసినట్లు సీనియర్ పోలీసు అధికారి కెకె పాండ్యా తెలిపారు. పోస్టుమార్టం నివేదిక అందాక, దానిలోని వివరాల ఆధారంగా తదిపరి చర్యలు తీసుకుంటామన్నారు. కాలేజీలో ర్యాగింగ్పై కూడా దర్యాప్తు చేస్తున్నామన్నారు. కాగా ఉన్నత విద్యా నియంత్రణ సంస్థ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ గతంలోనే క్యాంపస్లలో ర్యాగింగ్ను నిషేధించింది. ర్యాగింగ్కు పాల్పడే వారిపై కళాశాల యాజమాన్యాలు కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది.ఇది కూడా చదవండి: స్విమ్మింగ్ పూల్లో గంతులేస్తూ.. -
గుజరాత్ తీరంలో 700 కిలోల డ్రగ్స్ స్వాధీనం
న్యూఢిల్లీ: గుజరాత్లోని పోర్బందర్ తీరంలో 700 కిలోల మాదక ద్రవ్యాలను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) అధికారులు శుక్రవారం స్వా«దీనం చేసుకున్నారు. ఈ మెథాంఫెటామైన్ డ్రగ్స్ విలువ అంతర్జాతీయ మార్కెట్లో దాదాపు రూ.3,500 కోట్లు ఉంటుందని అధికారులు చెప్పారు. అలాగే 8 మంది ఇరాన్ జాతీయులను అరెస్టు చేశారు. విదేశాల నుంచి పెద్ద ఎత్తున డ్రగ్స్ వస్తున్నట్లు నిఘా వర్గాల నుంచి సమాచారం అందడంతో ‘సాగర్ మంథన్–4’ అనే కోడ్నేమ్లో ఎన్సీబీ, భారత నావికాదళం, గుజరాత్ పోలీసు శాఖకు చెందిన యాంటీ–టెర్రరిస్టు స్క్వాడ్(ఏటీఎస్) సిబ్బంది జాయింట్ ఆపరేషన్ ప్రారంభించారు. గుజరాత్ తీరంలో భారత ప్రాదేశిక జలాల్లో ప్రవేశించిన రిజిస్టర్ కాని ఓ పడవను అడ్డుకున్నారు. అందులో తనిఖీ చేయగా 700 కిలోల డ్రగ్స్ లభించాయి. పడవలో ఉన్న 8 మంది ఇరాన్ పౌరులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద ఎలాంటి గుర్తింపు పత్రాలు లేవు. భారీ ఎత్తున డ్రగ్స్ స్వా«దీనం చేసుకున్న అధికారులను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అభినందించారు. ‘మాదక ద్రవ్యాల రహిత భారత్’ తమ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొంటూ ఎక్స్లో పోస్టు చేశారు. డ్రగ్స్ రవాణా చేసేవారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ ఏడాది ఇప్పటివరకు 3,500 కిలోల డ్రగ్స్ను అధికారులు స్వా«దీనం చేసుకున్నారు. మూడు కేసుల్లో 11 మంది ఇరాన్ పౌరులను, 14 మంది పాకిస్తాన్ పౌరులను అరెస్టు చేశారు. వారంతా ప్రస్తుతం ఇండియా జైళ్లలో ఉన్నారు. ఢిల్లీలో 80 కిలోల కొకైన్ స్వాధీనం దేశ రాజధాని ఢిల్లీలో రూ.900 కోట్ల విలువైన 80 కిలోల కొకైన్ను ఎన్సీబీ శుక్రవారం స్వా«దీనం చేసుకుంది. ఓ కొరియర్ సెంటర్లో ఆ డ్రగ్స్ లభించినట్లు అధికారులు చెప్పారు. -
PM Narendra Modi: సమాజాన్ని విభజించాలని చూస్తున్నారు
అహ్మదాబాద్: భారత సమాజాన్ని విభజించి ముక్కలుచెక్కలు చేయడానికి జాతివ్యతిరేక శక్తులు కుట్రలు పన్నుతున్నాయని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. కులగణన పేరిట దేశంలోని భిన్న కులస్తుల మధ్య విపక్షాల ‘ఇండియా’ కూటమి చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తోందని బీజేపీ విమర్శల వేళ మోదీ పరోక్షంగా ఆ అంశాన్ని ప్రస్తావించడం గమనార్హం. సోమవారం గుజరా త్లోని అహ్మదాబాద్లో శ్రీ స్వామి నారా యణ్ ఆలయం 200వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఖేడా జిల్లాలోని వడ్తాల్లో జరిగిన కార్యక్రమంలో మోదీ వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగించారు. అభివృద్ధిభారత్కు ఐక్యతే పునాది‘‘ఐక్యమత్యంతో పనిచేసే పౌరులు, దేశ సమగ్ర తతోనే భారత్ 2047 సంవత్సరంలో అభివృద్ధి చెందిన ఆధునిక భారత్గా అవతరించగలదు. దురదృష్టవశాత్తు కొందరు సమాజా న్ని కులం, మతం, ప్రాంతం,జాతి, లింగం, స్వస్థలం పేరిట విభజి స్తున్నారు. సంకుచిత మనస్తత్వంతో కొన్ని విభజన శక్తులు చేస్తున్న జాతవ్యతిరేక కుట్ర లివి. ఈ జాతివ్యతిరేక శక్తుల ఉద్దేశాలు ఎంత ప్రమాద కరమో మనం గమనించాలి. కుట్రల పర్యావసానాలను ఊహించాలి. ఈ దుష్టశక్తుల ఆటకట్టించేందుకు మనందరం ఐక్యంగా నిలబడదాం. పోరాడి వాటిని ఓడిద్దాం’’ అని అన్నారు. ఆత్మనిర్భరత మంత్రంతో ముందుకుసాగి అభివృద్ధిభారత్ను సాక్షాత్కారం చేసుకుందాం’’ అని పిలుపునిచ్చారు.ఆలయంతో ఆత్మీయ అనుబంధం‘‘నాటి దుర్భర పరిస్థితులకు ప్రజలు తమను తామే నిందించుకుంటూ కడుపేదరికంలో, బానిసత్వంలో బతు కీడుస్తున్న కాలంలో స్వామినారాయణ అవతరించారు. ఆపత్కాలంలో స్వామినారాయణ, సాధువులు భారతీయు లకు తమ కర్తవ్యబోధ చేసి ఆత్మగౌరవం గొప్పతనాన్ని తెలియజెప్పారు. దీంతో నూతన ఆధ్యాత్మిక శక్తితో ప్రజలు తమ అసలైన గుర్తింపును తెల్సుకోగలిగారు. వడ్తాల్ స్వామి నారాయణ్ ఆలయంతో నాకు దశాబ్దాల అనుబంధం ఉంది. ముఖ్యమంత్రిని అయ్యాక బంధం బలపడింది. 200 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కేంద్రప్రభుత్వం సైతం స్మారక నాణెంను ఆవిష్కరించింది’’ అని గుర్తుచేశారు. -
ఇదేం పిచ్చో.. కారును సమాధి చేశారు!
వెర్రి వెయ్యి విధాలు అంటే ఇదేనేమో. సాధారణంగా మనకు బాగా నచ్చిన వాహనాలకు మనతో పాటే ఉంచుకుంటాం, లేదంటే ఎవరికైనా పనికొస్తే ఇచ్చేస్తాం. కొత్త వెహికల్ కొన్నప్పుడు పాత వాహనం మార్పిడి చేసుకుంటాం. కానీ గుజరాత్లో ఓ వ్యాపారి మాత్రం తనకు బాగా అచ్చొచ్చిన కారును సమాధి చేసేశాడు. అదేదో అషామాషీగా చేయలేదు. ఏకంగా 4 లక్షల రూపాయలు ఖర్చు చేసి వేడుకగా ఈ తంతు జరిపాడు. శాస్త్రోక్తంగా అంత్యక్రియలు జరిపించి అందరినీ అవాక్కయ్యేలా చేశారు. తీరా చూస్తే ఈ కారు ఏ ముప్ఫైనలబై ఏళ్లనాటిదో కాదు.. జస్ట్ 12 ఏళ్లు మాత్రమే వాడారు. ఈ వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.15 అడుగుల లోతు గుంతలో..గుజరాత్కు చెందిన ఓ వ్యాపారి తనకు, తన కుటుంబానికి సంపద, పేరు తెచ్చిన లక్కీ కారును ఘనంగా సమాధి చేశారు. అమ్రేలి జిల్లా లాఠీ తాలూకా పదార్సింగ్ గ్రామం ఇందుకు వేదికైంది. గురువారం జరిగిన ఈ కార్యక్రమానికి ఆధ్యాత్మిక నాయకులు, సాధువులు సహా 1,500 మంది హాజరయ్యారు. ఫాంహౌస్లో సుమారు 15 అడుగుల లోతు గుంతలో ఉన్న వాగన్ ఆర్ కారు, సంజయ్ పొలారా, అతని కుటుంబం పూజలు చేస్తున్న వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది. అంతకుముందు, పూలు, పూలదండలతో అందంగా అలంకరించిన కారును పొలారా కుటుంబీకులు బాజా భజంత్రీలతో గ్రామంలోని తమ ఇంటి నుంచి ఊరేగింపుగా ఫాంహౌస్లోని తీసుకువచ్చారు. అక్కడున్న ఏటవాలు నిర్మాణం మీదుగా గుంతలోకి దింపారు. కారుపై పచ్చని వ్రస్తాన్ని కప్పారు. పూజారులు మంత్రాలు చదువుతుండగా పొలారా, కుటుంబసభ్యులు కారుపై పూలు చల్లుతూ పూజలు చేశారు. చివరగా బుల్డోజర్ కారును మట్టితో సమాధి చేసేసింది. વ્હાલસોઈ નસીબદાર કારની સમાધિ !!!અમરેલીમાં પરિવાર માટે લકી કારને વેચવાને બદલે ઘામધૂમથી જમણવાર યોજી સમાધિ અપાઈ, કારના સમાધિ સ્થળે વૃક્ષારોપણ કરાશે #Gujarat #Amreli pic.twitter.com/1c4hiogs7n— Kamit Solanki (@KamitSolanki) November 8, 2024కారొచ్చాక కలిసొచ్చింది..ఈ కారు వచ్చిన తనకు బాగా కలిసొచ్చిందని సూరత్లో నిర్మాణ సంస్థను నడుపుతున్న సంజయ్ పొలారా మీడియాతో చెప్పారు. భవిష్యత్ తరాలకు శాశ్వతమైన జ్ఞాపకంగా ఉండాలనే తన లక్కీ కారును సమాధి చేసినట్టు వెల్లడించారు. "దాదాపు 12 సంవత్సరాల క్రితం నేను ఈ కారు కొన్నాను. ఇది మా కుటుంబానికి అదృష్టాన్ని తెచ్చిపెట్టింది. వ్యాపారంలో విజయాలు దక్కాయి. నా కుటుంబ గౌరవం పెరిగింది. అందుకే దీన్ని అమ్మకుండా మా పొలంలో సమాధి చేశామ"ని సంజయ్ వివరించారు. నెటిజనులు మాత్రం ఈ ఉదంతంపై భిన్నంగా స్పందించారు. ఇదేం పిచ్చంటూ సెటైర్లు వేస్తున్నారు. చదవండి: కన్నవాళ్లు వద్దని విసిరేస్తే.. కిష్టయ్యగా పునర్జన్మ పొందాడు -
గుజరాత్ బుల్లెట్ ప్రాజెక్టులో అపశృతి
అహ్మాదాబాద్: గుజరాత్లోని బుల్లెట్ రైల్ ప్రాజెక్టులో ప్రమాదం చోటు చేసుకుంది. ఆనంద్ జిల్లా వసాద్ దగ్గర పిల్లర్లు కూలిపోయాయి. ఆకస్మికంగా పిల్లర్లు కూలడంతో ఈ ప్రమాదంలో శిథిలాల కింద పలువురు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు తెలిపారు. ప్రాథమిక సమాచారం ప్రకారం.. ఐరన్ బీమ్ కూలిపోవడంతో 3-4 మంది కార్మికులు శిథిలాల కింద చిక్కుకున్నారు. వెంటనే రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. ఇప్పటికే ఇద్దరు వ్యక్తులను రక్షించారు. వారిని ఆసుపత్రికి తరలించామని ఆనంద్ ఎస్పీ గౌరవ్ జసాని చెప్పారు.VIDEO | Gujarat: "According to the primary information, 3-4 workers were trapped under the debris after an iron beam collapsed. The rescue operation started immediately. Two people have already been rescued and were taken to the hospital," says Anand SP Gaurav Jasani on collapse… pic.twitter.com/0N5ze6JR1S— Press Trust of India (@PTI_News) November 5, 2024 -
అంగుళం భూమి కూడా వదులుకోం
భుజ్: దేశ సరిహద్దుల్లో మన భూభాగంలో ఒక్క అంగుళం భూమి కూడా వదులుకోబోమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తేలి్చచెప్పారు. మన భూభాగాన్ని కాపాడుకొనే విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని ఉద్ఘాటించారు. దేశాన్ని కాపాడే విషయంలో సైనిక దళాల శక్తిసామర్థ్యాలపై ప్రజలకు సంపూర్ణ విశ్వాసం ఉందని చెప్పారు. భారత సైనిక దళాలను చూస్తే శత్రువులకు వణుకు తప్పదని అన్నారు. దుష్ట శక్తుల ఆటలు సాగవని హెచ్చరించారు. గుజరాత్ రాష్ట్రం కచ్ జిల్లాలో భారత్–పాకిస్తాన్ సరిహద్దుకు సమీపంలోని సర్ క్రీక్లో ప్రధాని మోదీ గురువారం బీఎస్ఎఫ్తోపాటు త్రివిధ దళాల సైనికులతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. ఆయన ప్రతిఏటా సైనికులతోపాటు దీపావళి పండుగ జరుపుకోవడం ఆనవాయితీగా వస్తున్న సంగతి తెలిసిందే. సర్ క్రీక్లో వేడుకల సందర్భంగా జవాన్లను ఉద్దేశించి మోదీ మాట్లాడారు. ఈ ప్రాంతాన్ని యుద్ధక్షేత్రంగా మార్చడానికి గతంలో ప్రయత్నాలు జరిగాయని చెప్పారు. శత్రు దేశం ఈ ప్రాంతంపై చాలా ఏళ్లుగా కన్నేసిందని, ఆక్రమించుకొనేందుకు కుట్రలు చేస్తోందని పరోక్షంగా పాకిస్తాన్పై మండిపడ్డారు. ‘ఇంటిగ్రేటెడ్ థియేటర్ కమాండ్’ ఏర్పాటు చేస్తాం ‘‘దౌత్యం పేరుతో సర్ క్రీక్ను ఆక్రమించడానికి గతంలో కుట్రలు జరిగాయి. అప్పట్లో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నేను శత్రుదేశం కుట్రలపై గొంతు విప్పాను. దేశాన్ని రక్షించే విషయంలో మన సైనిక దళాల సామర్థ్యంపై ప్రభుత్వానికి విశ్వాసం ఉంది. మన దేశాన్ని శత్రువుగా భావించేవారి మాటలు మేము నమ్మడం లేదు. సైన్యం, నావికాదళం, వైమానిక దళం వేర్వేరు విభాగాలు. కానీ, ఆ మూడు దళాలు ఒక్కటైతే దేశ సైనిక బలం ఎన్నో రెట్లు పెరిగిపోతుంది. ఇందుకోసమే చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్(సీడీఎస్) అనే పదవిని సృష్టించాం. త్రివిధ దళాల మధ్య మరింత సమన్వయం కోసం ఇంటిగ్రేటెడ్ థియేటర్ కమాండ్ ఏర్పాటు చేయబోతున్నాం’’ అని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. -
సైనికులతో ప్రధాని మోదీ దీపావళి.. పాక్కు వార్నింగ్
ప్రతి ఏడాది దీపావళి పండుగను సైనికులతో గడిపే సంప్రదాయాన్ని ప్రధాని మోదీ ఈ సారి కూడా కొనసాగించారు. సరిహద్దుల్లో గుజరాత్ పర్యటనలో ఉన్న ప్రధాని అక్కడి కచ్ ప్రాంతంలో విధులు నిర్వర్తిస్తున్న సరిహద్దు భద్రతా దళం, ఆర్మీ, నేవీ, వాయుసేన సిబ్బందితో కలిసి దీపావళి వేడుకలు జరుపుకున్నారు.ఆర్మీ యూనిఫాం ధరించిన ప్రధాని.. కచ్లోని సర్ క్రీక్ ప్రాంతంలో గల లక్కీ నాలాకు బోటులో చేరుకున్నారు. అనంతరం బీఎస్ఎఫ్, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ సిబ్బందితో సమావేశమయ్యారు. సైనికులకు స్వీట్లు పంచి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ పాకిస్తాన్కు వార్నింగ్ ఇచ్చారు.. ‘‘కచ్వైపు పాక్ కన్నెత్తి చూసే సాహసం చేయదు. ఇక్కడ రక్షణగా సుక్షితులైన సైనికులు ఉన్నారని వారికి తెలుసు అంటూ ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. ‘‘సర్ క్రిక్పై దాడికి గతంలో శత్రు దేశాలు కుట్రలు చేశాయి. ఇక్కడ రక్షణగా ఉన్న సైనికులుగా కుట్రలను తిప్పికొట్టారు.’’ అని మోదీ అన్నారు.దేశ సరిహద్దుల్లో ఒక్క అంగుళం విషయంలోనూ కూడా రాజీపడలేని ప్రభుత్వం ఇప్పుడు ఉంది. దౌత్యం పేరుతో సర్ క్రీక్ను లాక్కోవాలనే కుట్ర గతంలో జరిగింది. గుజరాత్ ముఖ్యమంత్రిగా నేను దానిని వ్యతిరేకించాను’’ అని ప్రధాని చెప్పారు. ప్రపంచం మొత్తం భారతదేశ శక్తిని చూస్తోందని ప్రధాని చెప్పారు.2014 నుంచి ప్రధాని పదవిని చేపట్టినప్పటి నుంచి నరేంద్ర మోదీ దేశంలోని వివిధ ప్రాంతాల్లో గస్తీ కాస్తున్న సైనికులతో దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. 2014లో సియాచిన్, 2015లో పంజాబ్ సరిహద్దు, 2016లో హిమాచల్ ప్రదేశ్లోని సుమ్డో, 2017లో జమ్మూ కాశ్మీర్లోని గురేజ్ సెక్టార్, 2018లో ఉత్తరాఖండ్లోని హర్సిల్, 2019లో జమ్మూ కాశ్మీర్లోని రాజౌరీ, 2019లో రాజస్థాన్, 2019లో కాశ్మీర్లోని నౌషేరా, 2019లో నౌషేరా, 2022లో జమ్మూ కాశ్మీర్లోని కార్గిల్, 2023లో హిమాచల్లోని లెప్చాలో పర్యటించారు. Celebrating Diwali with our brave Jawans in Kutch, Gujarat.https://t.co/kr3dChLxKB— Narendra Modi (@narendramodi) October 31, 2024 -
వన్ నేషన్ వన్ ఎలక్షన్.. ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
అహ్మాదాబాద్: సర్దార్ వల్లభాయ్ పటేల్ 149వ జయంతి సందర్భంగా.. జాతీయ ఐక్యతా దినోత్సవంతోపాటు దీపావళి పండుగ కూడా జరుపుకుంటున్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈసారి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి చాలా ప్రత్యేకమైనదని అన్నారు. గుజరాత్లోని స్టాచ్యూ ఆఫ్ యూనిటీ వద్ద సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి మోదీ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మోదీ ప్రసంగించారు.‘‘దీపావళి పండగ.. భారతదేశాన్ని ప్రపంచ దేశాలతో అనుసంధానం చేయడం ప్రారంభించింది. అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ బుధవారం వైట్హౌస్లో 600 మందికి పైగా ప్రముఖ భారతీయ అమెరికన్లతో దీపావళిని జరుపుకున్నారు. అనేక దేశాల్లో దీపావళి జాతీయ పండుగగా జరుపుకుంటున్నారు. ‘‘వన్ నేషన్, వన్ ఎలక్షన్’’ త్వరలో సాకారమవుతుంది. దేశంలోని అన్ని ఎన్నికలను ఒకే రోజు లేదా నిర్దిష్ట కాలవ్యవధిలో నిర్వహించటమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యం. ‘ఒక దేశం, ఒకే ఎన్నికలు’ ప్రతిపాదనకు త్వరలో లైన్ క్లియర్ అవుతుంది. ఈ ప్రతిపాదనకు ఈ ఏడాది ప్రారంభంలో కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ ఏడాది చివర్లో జరగనున్న పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ప్రతిపాదన సమర్పించనున్నాం.#WATCH | On 'Rashtriya Ekta Diwas', Prime Minister Narendra Modi says "...We are now working towards One Nation One Election, which will strengthen India's democracy, give optimum outcome of India's resources and the country will gain new momentum in achieving the dream of a… pic.twitter.com/vUku6ZCnVv— ANI (@ANI) October 31, 2024 మేం ప్రస్తుతం ‘వన్ నేషన్ వన్ ఎలక్షన్’ దిశగా పని చేస్తున్నాం. ఇది భారతదేశ ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తుంది. భారతదేశ వనరుల సరైన ఫలితాన్ని ఇస్తుంది. అభివృద్ధి చెందిన భారతదేశం కలను సాధించడంలో సాయపడుతుంది. భారతదేశం.. నేషన్ వన్ సివిల్ కోడ్, సెక్యులర్ సివిల్ కోడ్ కలిగి దేవంగా అవతరించనుంది. 2019లో ఆర్టికల్ 370 రద్దు చేశాం. దానిని శాశ్వతంగా పాతిపెట్టాం. రాజ్యాంగాన్ని గురించి మాట్లాడేవారే ఎక్కువగా అవమానిస్తున్నారు’’ అని అన్నారు. -
రక్షణ రంగంలో కొత్త అధ్యాయం
వడోడర: భారత ప్రైవేట్ రక్షణ విమానయాన రంగంలో కొత్త అధ్యాయం ఆరంభమైంది. భారత్లోనే తొలి ప్రైవేట్ సైనిక, సరకు రవాణా విమానం తయారీ పనులు ప్రారంభమయ్యాయి. ఇందుకు గుజరాత్లోని వడోదర పట్టణంలోని టాటా ఎయిర్క్రాఫ్ట్ కాంప్లెక్స్ వేదికైంది. స్పెయిన్ అధ్యక్షుడు పెడ్రో సాంచెజ్తో కలిసి భారత ప్రధాని మోదీ సోమవారం ఈ ప్లాంట్లో సీ295 రకం సైనిక రవాణా విమాన తయారీని ప్రారంభించారు. అక్కడి విడిభాగాల ఎగ్జిబిషన్ను ఇరునేతలు ఆసక్తిగా తిలకించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడారు. ‘‘ భారత్, స్పెయిన్ భాగస్వామ్యం కొత్త మలుపులు తీసుకుంటోంది. ఇది రెండు దేశాల మధ్య సంబంధాలు పటిష్టంచేయడమే కాకుండా మేకిన్ ఇండియా, మేక్ ఫర్ వరల్డ్ లక్ష్యాన్ని సాకారం చేస్తుంది. కొత్త ఫ్యాక్టరీని అందుబాటులోకి తెచి్చన ఎయిర్బస్, టాటా బృందాలకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. భారత్లో విదేశీ సరకు రవాణా విమానం తయారీ కలను సాకారం చేసిన వ్యాపార జగజ్జేత రతన్ టాటాకు ఘన నివాళులు’’ అని అన్నారు. కొత్త పని సంస్కృతికి నిదర్శనం ‘‘ నూతన భారత దేశ కొత్తతరహా పని సంస్కృతికి సీ295 ఫ్యాక్టరీ ప్రతిబింబింగా నిలవనుంది. 2022 అక్టోబర్లో ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన నాటినుంచి ఉత్పత్తిదాకా భారత వేగవంతమైన ఉత్పాదకతకు నిదర్శనం ఈ కర్మాగారం’’ అని మోదీ అన్నారు. ఈ సందర్భంగా ప్రఖ్యాత స్పానిష్ రచయిత ఆంటోనియో మకాడో కవితలోని ‘మనం లక్ష్యం సాధించేందుకు ముందుకెళ్తుంటే మార్గం దానంతట అదే ఏర్పడుతుంది’ అనే వాక్యాన్ని మోదీ గుర్తుచేశారు. ‘‘కొత్తగా మొదలైన టాటా–ఎయిర్బస్ ఫ్యాక్టరీ ద్వారా వేలాది మందికి ఉద్యోగాలు లభిస్తాయి. దేశీయంగా 18,000 విమాన విడిభాగాల తయారీని ఈ ఫ్యాక్టరీ సుసాధ్యం చేయనుంది. భవిష్యత్తులో భారత పౌరవిమానయాన రంగానికి అవసరమైన విమానాల తయారీకి ఈ ఫ్యాక్టరీ బాటలువేస్తోంది’’ అని మోదీ అన్నారు.స్పెయిన్లో యోగా, ఇండియాలో ఫుట్బాల్ ‘‘ఇరుదేశాల ప్రజల మధ్య బంధమే దేశాల మధ్య బంధాన్ని బలీయం చేస్తోంది. యోగా స్పెయిన్లో తెగ పాపులర్. ఇక స్పానిష్ ఫుట్బాల్ను భారతీయులూ బాగా ఇష్టపడతారు. ఆదివారం రియల్ మాడ్రిడ్తో మ్యాచ్ లో బార్సిలోనా బృందం సాధించిన ఘనవిజయం గురించి భారత్లోనూ తెగ చర్చ జరుగుతోంది. ఆహారం, సినిమా లు, ఫుట్బాల్.. ఇలా ప్రజల మధ్య బంధం దేశాల మధ్య పటిష్ట బంధానికి కారణం. 2026 ఏడాదిని ‘ఇండియా–స్పెయిన్ ఇయర్ ఆఫ్ కల్చర్, టూరిజం, ఏఐ’గా జరుపుకోవాలని నిర్ణయించుకోవడం సంతోషకరం’’ అని మోదీ అన్నారు.బంధం బలీయం: స్పెయిన్ అధ్యక్షుడు ‘‘1960లలోనే ప్రఖ్యాత స్పెయిన్ క్లాసిక్, జాజ్ సంగీత కళాకారుడు పాకో డిలూసియా, భారతీయ సంగీత దిగ్గజం పండిత్ రవిశంకర్ రెండు దేశాల సంగీత ప్రియులను ఒక్కటి చేశారు. పారిశ్రామిక అభివృద్ధి, స్నేహబంధాలకు ఈ ఫ్యాక్టరీ గుర్తుగా నిలుస్తుంది’ అని స్పెయిన్ అధ్యక్షుడు పెడ్రో సాంచెజ్ అన్నారు.40 విమానాల తయారీ ఇక్కడే ఎయిర్బస్ సీ295 రకం మధ్యశ్రేణి రవాణా విమానాన్ని తొలుత స్పెయిన్కు చెందిన సీఏఎస్ఏ ఏరోస్పేస్ సంస్థ డిజైన్చేసి తయారుచేసేది. ప్రస్తుతం ఇది యూరప్ బహుళజాతి ఎయిర్బస్ సంస్థలో భాగంగా ఉంది. యుద్ధంలో బాంబులతోపాటు అవసరమైన సందర్భాల్లో వైద్య పరికరాలు, విపత్తుల వేళ బాధితుల తరలింపునకు, తీరప్రాంతాల్లో గస్తీ, నిఘా కోసం సైతం పలురకాలుగా వినియోగించుకోవచ్చు. ఎయిర్బస్ సంస్థతో భారత ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం మొత్తంగా సీ295 రకం 56 విమానాలను సైన్యానికి అప్పగించనున్నారు. వీటిలో 16 విమానాలను స్పెయిన్లోని సవీలేలో తయారుచేసి ఎయిర్బస్ నేరుగా నాలుగేళ్లలోపు భారత్కు పంపనుంది. మిగిలిన 40 విమానాలను టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ వారి ఆధ్వర్యంలో వడోదరలోని తయారీయూనిట్లో తయారుచేస్తారు. -
రతన్ టాటాను గుర్తు చేసుకున్న ప్రధాని మోదీ
వడోదర: ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్లోని వడోదరలో స్పానిష్ ప్రెసిడెంట్ పెడ్రో శాంచెజ్తో కలిసి టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ (టీఏఎస్ఎల్) క్యాంపస్లో టాటా ఎయిర్క్రాఫ్ట్ కాంప్లెక్స్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని టాటా గ్రూప్ ఛైర్మన్ రతన్ టాటాను గుర్తుచేసుకుంటూ రతన్ టాటా ఈ రోజు మన మధ్య ఉండివుంటే, మరింత సంతోషించేవారన్నారు. సీ 295 ఫ్యాక్టరీ కొత్త భారతదేశానికి దిశానిర్దేశం చేస్తుందన్నారు.టీఏఎస్ఎల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ తన స్నేహితుడు పెడ్రో శాంచెజ్ భారత్లో పర్యటించడం ఇదే తొలిసారి. నేటి నుంచి భారత్, స్పెయిన్ మధ్య భాగస్వామ్యానికి కొత్త దిశానిర్దేశం ఏర్పడనుంది. సీ 295 రవాణా విమానాల తయారీ కోసం ఫ్యాక్టరీని ప్రారంభిస్తున్నాం. ఈ ఫ్యాక్టరీ భారతదేశం- స్పెయిన్ మధ్య సంబంధాలను బలోపేతం చేయడమే కాకుండా, మేక్ ఇన్ ఇండియా, మేక్ ఫర్ ది వరల్డ్ మిషన్ను బలోపేతం చేయనుందన్నారు.ఈ సందర్భంగా స్పెయిన్ ప్రెసిడెంట్ పెడ్రో శాంచెజ్ మాట్లాడుతూ నేడు మనం ఆధునిక పరిశ్రమను మాత్రమే ప్రారంభించడం లేదని, రెండు ప్రముఖ కంపెనీల మధ్య ఒక అసాధారణ ప్రాజెక్ట్ ప్రారంభమవడాన్ని చూస్తున్నామన్నారు. భారతదేశానికి, ప్రధాని మోదీ విజన్కు ఇది మరో విజయం అని అన్నారు. భారతదేశాన్ని పారిశ్రామిక శక్తిగా మార్చడం, పెట్టుబడులు, వాణిజ్యాన్ని పెంచడంపై మోదీ దృష్టి సారించారన్నారు. ఇది కూడా చదవండి: స్పెయిన్ ప్రధానితో పీఎం మోదీ మెగా రోడ్ షో -
ప్రాణం తీసిన సెల్ఫ్ డ్రైవింగ్ కార్.. నలుగురు భారతీయులు దుర్మరణం
ఒట్టావా : టెస్లా సెల్ఫ్ డ్రైవింగ్ కారు నలుగురు ప్రాణాలు తీసింది. కెనడా టొరంటో నగరం లేక్ షోర్ బౌలేవార్డ్ ప్రాంతంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు భారతీయులు మృత్యువాత పడ్డారు. ఓ యువతి ప్రాణపాయ స్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గుజరాత్లోని గోద్రా చెందిన ఒకే కుటుంబసభ్యులు కేట్ గోహిల్,నీల్ గోహిల్తో పాటు వారి స్నేహితులు ఆ కారులో ఉన్నట్లు కెనడా స్థానిక మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. స్థానిక పోలీసుల సమాచారం మేరకు..టొరంటో నగరంలో బుధవారం అర్ధరాత్రి 12:15 గంటల సమయంలో లేక్ షోర్ బౌలేవార్డ్ రహదారిలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు టెస్లా సెల్ఫ్ డ్రైవింగ్ కారులో అతి వేగతంతో ప్రయాణిస్తున్నారు. ఆ సమయంలో టెస్లా కారు బ్యాటరీలో లోపాలు తలెత్తాయి. కారు అదుపు తప్పి పక్కనే ఉన్న గార్డ్ రైల్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంతో టెస్లా కారులో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో కారులో ఉన్న యువతి యువకులు మంటల్లో చిక్కుకున్నారు.సరిగ్గా ప్రమాదం జరిగి వెంటనే ఆటుగా వెళ్తున్న ఓ ద్విచక్ర వాహనదారుడు టెస్లా కారు అద్దాలు పగులగొట్టి బాధితుల్ని రక్షించే ప్రయత్నం చేశారు. కారు లోపల ఉన్న ఓ యువతిని బయటకు లాగి ఆస్పత్రికి తరలించారు. మిగిలిన నలుగురు ప్రాణాలు కోల్పోయారు. తీవ్ర గాయాల పాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న యువతి పరిస్థితి సైతం విషమంగా ఉన్నట్లు సమాచారం.టెస్లా కారు ప్రమాదంపై స్థానికుడు ఫోర్మెన్ బారో మాట్లాడుతూ..ప్రమాదం జరిగిన ప్రాంతంలో నది ప్రవహిస్తుంది. ఆ నదికి ఎదురుగా మేం ఉన్నాం. కారు నుంచి 20 నుంచి 20 అడుగుల పైకి మంటలు ఎగిసి పడ్డాయి. దీంతో వెంటనే బాధితుల్ని రక్షించేందుకు ప్రయత్నించాం. అప్పటికే ఘోరం జరిగిందని విచారం వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాద ఘటనపై భారత్లో ఉన్న వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందిస్తామని తెలిపారు. -
అతి తెలివి.. నకిలీ కోర్టు పెట్టి కలెక్టర్ కే షాక్
-
Ranji Trophy 2024: ఆంధ్ర జట్టు కొంపముంచిన ఒకే ఒక్క వికెట్..
రంజీ ట్రోఫీ దేశవాళీ క్రికెట్ టోర్నమెంట్లో ఆంధ్ర జట్టుకు వరుసగా రెండో పరాజయం ఎదురైంది. మాజీ చాంపియన్ గుజరాత్ జట్టుతో సోమవారం ముగిసిన గ్రూప్ ‘బి’ రెండో లీగ్ మ్యాచ్లో ఆంధ్ర జట్టు ఒక్క వికెట్ తేడాతో ఓటమి పాలైంది.ఆంధ్ర నిర్దేశించిన 144 పరుగుల విజయలక్ష్యాన్ని గుజరాత్ జట్టు 50.3 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి ఛేదించింది. 131 పరుగులవద్ద గుజరాత్ 9వ వికెట్ను చేజార్చుకోగా... అర్జన్ నాగ్వాస్వాలా (16 నాటౌట్; 1 ఫోర్) గుజరాత్ జట్టును గట్టెక్కించాడు.ఆంధ్ర జట్టు స్పిన్నర్ లలిత్ మోహన్ 76 పరుగులిచ్చి 7 వికెట్లు పడగొట్టి తమ జట్టుకు విజయంపై ఆశలు రేకెత్తించాడు. శశికాంత్కు ఒక వికెట్ దక్కగా... మరో వికెట్ రనౌట్ రూపంలో వచి్చంది. అంతకుముందు ఫాలోఆన్ ఆడుతూ ఓవర్నైట్ స్కోరు 203/4తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఆంధ్ర జట్టు 90.5 ఓవర్లలో 297 పరుగులకు ఆలౌటైంది. శ్రీకర్ భరత్ (47; 3 ఫోర్లు, 2 సిక్స్లు), హనుమ విహారి (32; 3 ఫోర్లు, 1 సిక్స్), నితీశ్ కుమార్ రెడ్డి (34; 6 ఫోర్లు), త్రిపురాణ విజయ్ (30; 3 ఫోర్లు, 2 సిక్స్లు) రాణించారు. గుజరాత్ బౌలర్లలో అర్జన్ నాగ్వాస్వాలా 4 వికెట్లు తీయగా... సిద్ధార్థ్ దేశాయ్, రవి బిష్ణోయ్ 3 వికెట్ల చొప్పున పడగొట్టారు.చదవండి: Mohammed Siraj: సిరాజ్కు అసలేమైంది? ఫామ్పై ఆందోళన! -
దేశంలో కొత్తగా 10 అణు విద్యుత్కేంద్రాలు
న్యూఢిల్లీ: దేశంలో కొత్తగా పది అణువిద్యుదుత్పత్తి కేంద్రాల నిర్మాణం జరుగుతోందని కేంద్రం వెల్లడించింది. సోమవారం శాస్త్ర, సాంకేతిక, పర్యావరణ, అడవులు, వాతావరణ మార్పుల సంబంధ పార్లమెంటరీ స్థాయీ సంఘం భేటీలో ఈ వివరాలను సభ్యులకు అందజేసింది. 700 మెగావాట్ల స్థాపిత సామర్థ్యంతో గుజరాత్, రాజస్తాన్, హరియాణాల్లో వీటిని నెలకొల్పారు. గుజరాత్లోని కాక్రపార్లో రెండు అణు విద్యుత్కేంద్రాల్లో ఉత్పత్తి మొదలైందని కేంద్రం పేర్కొంది. అయితే వీటి నిర్మాణం చాలా ఆలస్యమవుతోందని కమిటీ సభ్యుడు జైరాం రమేశ్ అసంతృప్తి వ్యక్తంచేశారు. ‘‘2007లో ఆమోదం పొందిన ప్రాజెక్టులు ఇప్పుడు పూర్తి కావస్తుండటం గ్రేట్. ‘సుప్రీం నేత’ కనుసన్నల్లో అభివృద్ధి వేగానికిది నిదర్శనం’’ అని ‘ఎక్స్’లో వ్యంగ్యంగా స్పందించారు. కాక్రపార్–3, కాక్రపార్–4 రియాక్టర్లు కాంగ్రెస్ హయాంలోనే ఆమోదం పొందాయన్నారు. -
మోదీ డిగ్రీపై వ్యాఖ్యలు.. సుప్రీంకోర్టులో కేజ్రీవాల్కు ఎదురుదెబ్బ..
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్కు ఎదురుదెబ్బ తగిలింది. తనపై నమోదైన పరువు నష్టం కేసును సవాల్ చేస్తూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. కాగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ విద్యార్హతపై చేసిన వ్యాఖ్యలపై పరువునష్టం కేసులో క్రిమినల్ విచారణను ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో గుజరాత్ మెట్రోపాలిటన్ కోర్టు జారీ చేసిన సమన్లను రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టు సోమవారం ఆయన చేసిన పిటిషన్ను తోసిపుచ్చింది.కాగా ప్రధాని మోదీ డిగ్రీకి సంబంధించిన వివరాలను వెల్లడించాలని 2016లో తొలిసారి కేజ్రీవాల్ డిమాండ్ చేయడంతో.. ఈ వివాదం ప్రారంభమైంది. అయితే కేజ్రీవాల్ డిమాండ్కు ప్రతి స్పందనగా సమాచార హక్కు చట్టం కింద అందించాలంటూ ప్రధాన సమాచార కమిషనర్ (సీఐసీ) ఆదేశించింది. అయితే గుజరాత్ హైకోర్టు సీఐసీ ఉత్తర్వును కొట్టివేసింది. సమాచారాన్ని విడుదల చేయకుండా అడ్డుకుంది.అనంతరం ప్రధానమంత్రి నరేంద్రమోదీ విద్యార్హతలపై కేజ్రీవాల్ బహిరంగంగా, విలేకరుల సమావేశాల్లో అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ గుజరాత్ యూనివర్సిటీ కోర్టులో పరువునష్టం పిటిషన్ దాఖలు చేసింది. మోదీ విద్యా ప్రమాణాలు, ముఖ్యంగా గుజరాత్ విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ పట్టా పొందడంపై ప్రశ్నిస్తూ.. చేసిన వ్యాఖ్యలను గుజరాత్ యూనివర్సిటీ అవమానకరమైనవిగా, తమ పరువు ప్రతిష్టకు భంగం కలించేవిగా భావించింది.ఈ నేపథ్యంలో యూనివర్సిటీ రిజిష్ట్రర్ పీయూష్ పటేల్ కేజ్రీవాల్తోపాటు ఆప్ నేత సంజయ్ సింగ్పై క్రిమినల్ పరువు నష్టం కేసు దాఖలు చేశారు. ఈ కేసులో కేజ్రీవాల్, ఆప్కి చెందిన సంజయ్ సింగ్లకు గుజరాత్ మెట్రోపాలిటన్ కోర్టు సమన్లు జారీ చేసింది. ఈ సమన్లను కొట్టి వేయాలంటూ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేయడంతో కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తాజాగా, జస్టిస్ హృషికేష్ రాయ్, ఎస్వీఎన్ భట్టిలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం కేజ్రీవాల్ పిటిషన్ను కొట్టివేసింది. -
పంచాయతీ సభ్యురాలికి ఘోర అవమానం
తాపీ: గుజరాత్లోని తాపీ జిల్లాలో పంచాయతీ సభ్యురాలిపై దాడి జరిగింది. తన భర్తతో ప్రేమ వ్యవహారం నడుపుతున్నదంటూ ఓ మహిళ.. పంచాయతీ సభ్యురాలిపై దాడికి తెగబడింది. అంతటితో ఆగక ఆమె జుట్టును కూడా కత్తిరించింది. ఈ అమానవీయ ఘటనలో పోలీసులు ఒకరిని అదుపులోకి తీసుకున్నారు.వివరాల్లోకి వెళితే సోంగాఢ్ పంచాయతీ సభ్యురాలైన ఊర్మిళ గమిత్పై ఒక మహిళతోపాటు మరో ముగ్గురు హాకీ స్టిక్లతో దాడి చేసి, ఆమె జుట్టును కత్తిరించారని సోంగాధ్ పోలీస్ స్టేషన్ అధికారి తెలిపారు. బాధిత మహిళ తన కుమార్తెతో కలిసి ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళుతుండగా ఆమెపై దాడి చేశారు.పంచాయతీ సభ్యురాలు ఊర్మిళపై శోభనా గమిత్ అనే మహిళ, ఆమె కుమారుడితో పాటు వచ్చిన కొందరు వ్యక్తులు కలసి దాడి చేశారు. ఈ దాడిలో ఊర్మిళ ఎడమ చేతి ఎముక విరిగిందని, నడుము, తలపై గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. ఆమె వద్ద ఉన్న బంగారు లాకెట్ను నిందితులు లాక్కొని పారిపోయినట్లు బాధితురాలు ఫిర్యాదులో తెలిపింది. ఊర్మిళను వైద్య చికిత్స కోసం పోలీసులు స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఊర్మిళ తన భర్తతో అక్రమ సంబంధం పెట్టుకున్నదని శోభనా గమిత్ పోలీసుల ఎదుట ఆరోపించింది. కాగా ఈ కేసులో ఒకరిని అరెస్టు చేశామని, సంఘటనా స్థలంలో లభ్యమైన సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.ఇది కూడా చదవండి: హస్తినలో ‘అమర’ ప్రేమికుడు! -
ఆంధ్ర ఫాలోఆన్
అహ్మదాబాద్: రంజీ ట్రోఫీ క్రికెట్ టోర్నీలో భాగంగా మాజీ చాంంపియన్ గుజరాత్తో జరుగుతున్న గ్రూప్ ‘బి’ లీగ్ మ్యాచ్లో ఆంధ్ర జట్టు ఫాలోఆన్లో పడింది. తొలి ఇన్నింగ్స్లో టాపార్డర్ వైఫల్యంతో తక్కువ స్కోరుకే ఆలౌటైన ఆంధ్ర జట్టు... రెండో ఇన్నింగ్స్లో మెరుగైన ప్రదర్శన కనబర్చింది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగుతున్న ఈ పోరులో ఆదివారం ఆట ముగిసే సమయానికి ఆంధ్ర రెండో ఇన్నింగ్స్లో ఫాలోఆన్ ఆడుతూ 66 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. ఓపెనర్లు అభిషేక్ రెడ్డి (113 బంతుల్లో 81; 12 ఫోర్లు, 2 సిక్సర్లు), మహీప్ కుమార్ (55; 5 ఫోర్లు, ఒక సిక్సర్) అర్ధశతకాలతో సత్తా చాటారు. కెప్టెన్ రికీ భుయ్ (0), షేక్ రషీద్ (3) విఫలం కాగా... వికెట్ కీపర్ కోన శ్రీకర్ భరత్ (31 బ్యాటింగ్; ఒక ఫోర్, ఒక సిక్సర్), హనుమ విహారి (24 బ్యాటింగ్; 3 ఫోర్లు) పోరాడుతున్నారు. గుజరాత్ బౌలర్లలో టీమిండియా స్పిన్నర్ రవి బిష్ణోయ్ 3 వికెట్లు పడగొట్టాడు. అంతకుముందు ఓవర్నైట్ స్కోరు 137/5తో మూడో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఆంధ్ర జట్టు చివరకు 51.3 ఓవర్లలో 213 పరుగులకు ఆలౌటైంది. టాపార్డర్ చేతులెత్తేసిన చోట శ్రీకర్ భరత్ (96 బంతుల్లో 98; 15 ఫోర్లు, 2 సిక్సర్లు) ఎదురుదాడికి దిగి ఫలితం రాబట్టాడు. భారీ షాట్లతో చెలరేగిన భరత్ త్రుటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. ఇటీవల బంగ్లాదేశ్తో టి20 సిరీస్లో మెరుపులు మెరిపించిన నితీశ్ కుమార్ రెడ్డి (47; 7 ఫోర్లు, ఒక సిక్సర్), విజయ్ (36; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించారు. గుజరాత్ బౌలర్లలో కెపె్టన్ చింతన్ గాజా 4 వికెట్లు పడగొట్టాడు. తొలి ఇన్నింగ్స్లో 154 పరుగుల ఆధిక్యం దక్కించుకున్న గుజరాత్ జట్టు ఆంధ్రను ఫాలోఆన్ ఆడించగా... రెండో ఇన్నింగ్స్లో టాపార్డర్ మెరుగైన ప్రదర్శన కనబర్చింది. నేడు ఆటకు ఆఖరి రోజు కాగా... చేతిలో 6 వికెట్లు ఉన్న ఆంధ్ర జట్టు 49 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. భరత్, విహారి క్రీజులో ఉన్నారు. స్కోరు వివరాలు గుజరాత్ తొలి ఇన్నింగ్స్ 367; ఆంధ్ర తొలి ఇన్నింగ్స్ 213; ఆంధ్ర రెండో ఇన్నింగ్స్: అభిషేక్ రెడ్డి (ఎల్బీ) రవి బిష్ణోయ్ 81; మహీప్ కుమార్ (బి) రవి బిష్ణోయ్ 55; రికీ భుయ్ (సి అండ్ బి) అర్జాన్ 0; షేక్ రషీద్ (ఎల్బీ) రవి బిష్ణోయ్ 3; శ్రీకర్ భరత్ (బ్యాటింగ్) 31; హనుమ విహారి (బ్యాటింగ్) 24; ఎక్స్ట్రాలు 9; మొత్తం (66 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి) 203. వికెట్ల పతనం: 1–130, 2–131, 3–138, 4–145, బౌలింగ్: చింతన్ గాజా 6–2–21–0; అర్జాన్ 11– 3–20–1; సిద్ధార్థ్ దేశాయ్ 22–4–55–0; రవి బిష్ణోయ్ 17–2–67–3; జయ్మీత్ పటేల్ 6–2–8–0; మనన్ హింగ్రాజియా 4–0–24–0.