ఉప ఎన్నికల ఫలితాలు.. ఆప్‌, కాంగ్రెస్‌, బీజేపీ ముందంజ.. | Four States Bypoll 5 Assembly seats Results Updates | Sakshi
Sakshi News home page

ఐదు స్థానాల ఉప ఎన్నికల ఫలితాలు.. అప్‌డేట్స్‌

Jun 23 2025 7:59 AM | Updated on Jun 23 2025 11:45 AM

Four States Bypoll 5 Assembly seats Results Updates

Four States Bypoll Results Updates..

👉నాలుగు రాష్ట్రాల్లో ఐదు స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు. గుజరాత్, పంజాబ్, కేరళ, బెంగాల్ ఉప ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. 

ఆప్‌, బీజేపీ, తృణముల్‌, కాంగ్రెస్‌ ఆధిక్యం ఇలా.. 

  • బెంగాల్‌లో తృణముల్‌ అభ్యర్థి భారీ ఆధిక్యం..

పంజాజ్‌లో దూసుకెళ్తున్న ఆప్‌ అభ్యర్థి.

కేరళలో​ కాంగ్రెస్‌ అభ్యర్థ ముందంజ. 

గుజరాత్‌లో పోటాపోటీ.. 

 

లీడ్‌లో ఆప్‌, కాంగ్రెస్‌ 

  • గుజరాత్‌లో రెండు స్థానాల్లో బీజేపీ ముందంజ..

  • పంజాబ్‌లో ఆప్‌ లీడింగ్‌

  • కేరళలో కాంగ్రెస్‌ అభ్యర్థి ముందంజ
  • బెంగాల్‌ తృణముల్‌ అభ్యర్థికి లీడ్‌. 

గుజరాత్‌లో ఆప్‌ అభ్యర్థి ముందంజ..

  • విసావదర్ స్థానంలో ఆప్‌ అభ్యర్థి గోపాల్‌ ఇటాలియాకు లీడింగ్‌.
  • రెండో స్థానంలో బీజేపీ 

 

 

👉పంజాబ్‌లో ఆప్‌ అభ్యర్ధి లీడింగ్‌..

 

👉కేరళలో కాంగ్రెస్‌ అభ్యర్థి ముందంజ..

👉జూన్ 19న ఎన్నికలు జరగ్గా నేడు ఫలితాలు వెలువడనున్నాయి. గుజరాత్‌లోని రెండు స్థానాలు విసావదర్, కాడి, పంజాబ్ (లూథియానా వెస్ట్), బెంగాల్ (కాలిగంజ్), కేరళ (నిలంబూర్) అసెంబ్లీ స్థానాల్లో ఉప ఎన్నికలు జరిగాయి.

గుజరాత్‌లో ఇలా.. 
గుజరాత్‌లోని కాదీ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి రాజేంద్రకుమార్‌ దానేశ్వర్‌ చవడా, కాంగ్రెస్‌ అభ్యర్థి రమేష్‌భాయ్‌ చావడ మధ్య గట్టి పోటీ ఉండనుంది. ఇక్కడ బీజేపీ ఎమ్మెల్యే కర్సన్ సోలంకి మరణం కారణంగా ఉప ఎన్నికల జరగుతోంది. అలాగే, మరో స్థానం విసావదార్‌లో బీజేపీ అభ్యర్థి కిరీట్‌ పటేల్‌, ఆప్‌ అభ్యర్థి గోపాల్‌ ఇటాలియా మధ్య హోరాహోరీ ఉండే అవకాశం ఉంది.

 

 కేరళలో.. 
కేరళలోని నీలంబర్ సీటు కాంగ్రెస్ అభ్యర్థి విజయం.. ప్రియాంక గాంధీ వాద్రాకు ప్రతిష్టాత్మకంగా మారనుంది. ఈ స్థానం ఆమె వయనాడ్ నియోజకవర్గంలోకి వస్తుంది. జూన్ 19న జరిగిన ఉప ఎన్నికలకు ముందు ఆమె ఈ ప్రాంతంలో రోడ్‌షో నిర్వహించారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా ఉన్న ఓవి అన్వర్ గెలుస్తారా లేదా? అనేది తేలనుంది.

బెంగాల్ బైపోల్
నాడియా జిల్లా పరిధిలోకి వచ్చే బెంగాల్‌లోని కలిగంజ్ నియోజకవర్గంలో తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే నసీరుద్దీన్ అహ్మద్ మరణం కారణంగా ఉప ఎన్నిక జరిగింది. ఆయన కుమార్తె అలీఫా అహ్మద్ అధికార పార్టీ అభ్యర్థిగా ఆ స్థానాన్ని నిలుపుకోవాలని ఆశిస్తున్నారు. బీజేపీ నుంచి ఆశిష్ ఘోష్‌ను నిలబెట్టగా, కాంగ్రెస్ CPI(M) మద్దతుతో కబిల్ ఉద్దీన్ షేక్‌ పోటీలో ఉన్నారుఉ. కలిగంజ్ ఉప ఎన్నిక ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తృణమూల్, బీజేపీ మధ్య కీలకంగా మారనుంది.

పంజాబ్‌లో త్రిముఖ పోరు.. 
పంజాబ్‌లోని లూథియానా వెస్ట్ స్థానంలో ఆప్‌కు చెందిన సంజీవ్ అరోరా, బీజేపీ జీవన్ గుప్తా, కాంగ్రెస్‌ భరత్ భూషణ్ అషు మధ్య త్రిముఖ పోటీ జరగనుంది. శిరోమణి అకాలీదళ్ ఉప ఎన్నికకు తన అభ్యర్థిగా పరూప్కర్ సింగ్ ఘుమాన్‌ను నిలబెట్టింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement