పోస్టుకార్డులతో గిన్నిస్‌ బుక్‌ రికార్డు  | 1,11,75,000 postcards were written to the PM | Sakshi
Sakshi News home page

పోస్టుకార్డులతో గిన్నిస్‌ బుక్‌ రికార్డు 

Oct 16 2025 6:09 AM | Updated on Oct 16 2025 6:09 AM

1,11,75,000 postcards were written to the PM

ప్రధాని మోదీకి 1.11 కోట్ల లేఖలు  

అహ్మదాబాద్‌:  ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలియజేస్తూ గుజరాత్‌ సహకార రంగానికి సంంధించిన ప్రజలు ఏకంగా 1.11 కోట్లకుపైగా లేఖలు రాశారు. పోస్టుకార్డులు పంపించారు. ఒకేసారి ఒకే వ్యక్తికి భారీసంఖ్యలో పోస్టుకార్డులు రాయడం గిన్నిస్‌ బుక్‌ ప్రపంచ రికార్డులోకి చేరిందని అధికారులు బుధవారం చెప్పారు. 

జీఎస్టీ సంస్కరణతోపాటు ఇతర చర్యలు చేపట్టినందుకు మోదీకి కృతజ్ఞతలు తెలుపుతూ వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో మొత్తం 1,11,75,000 పోస్టుకార్డులు పంపించడం గమనార్హం. ఈ అరుదైన ఘట్టాన్ని గిన్నిస్‌బుక్‌ ప్రపంచ రికార్డు ప్రతినిధులు గుర్తించారు. ఆయా పోస్టుకార్డులను లెక్కించారు. ప్రపంచ రికార్డు సృష్టించినట్లుగా సంబంధిత ధ్రువపత్రాన్ని మంగళవారం అధికారులకు అందజేశారు. ఇప్పటిదాకా 6,666 పోస్టుకార్డులే అతిపెద్ద రికార్డు. గతంలో స్విట్లర్లాండ్‌లో ఈ ఘనత సాధించారు. ఈ రికార్డును గుజరాత్‌ ప్రజలు తిరగరాశారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement