విశ్వాస్ కుమార్ రమేష్ నిజంగా మృత్యుంజయుడే‌.. మరో వీడియోలో | New Video Shows Lone Survivor Walking Out Of Air India incident | Sakshi
Sakshi News home page

విశ్వాస్ కుమార్ రమేష్ నిజంగా మృత్యుంజయుడే‌.. మరో వీడియోలో

Jun 16 2025 6:59 PM | Updated on Jun 16 2025 7:08 PM

New Video Shows Lone Survivor Walking Out Of Air India incident

గాంధీ నగర్‌: అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో మృత్యుంజయుడిగా నిలిచిన ఏకైక వ్యక్తి విశ్వాస్ కుమార్ రమేష్‌కు చెందిన మరో వీడియో వైరల్‌గా మారింది. 

తాజాగా, వెలుగులోకి వచ్చిన వీడియోలో బీజే మెడికల్‌ కాలేజీ క్యాంపస్‌ బిల్డింగ్‌ను ఎయిరిండియా విమానం ఢీకొట్టడంతో అగ్నికిలలు ఎగిసిపడున్నాయి. ఆ ప్రాంతాన్ని పొగ కమ్మేసింది. ఏదో అద్భుతం జరిగినట్లుగా అగ్నికోళం బద్దలైనప్పుడు మంటలు ఏ విధంగా ఎగిసిపడతాయో.. ఆ విధంగా మంటలు ఎగిసిపడుతున్నా 11ఏ సీటులో కూర్చున్న రమేష్, బీజే మెడికల్ కాలేజ్ క్యాంపస్ నుండి బయటకు వస్తూ కనిపిస్తున్న దృశ్యాల్ని మనం చూడొచ్చు. అక్కడ ఉన్న ఒక వ్యక్తి అతన్ని గమనించి, అతని చెయ్యి పట్టుకుని ప్రమాదం స్థలం నుంచి దూరంగా తీసుకెళ్లాడు.

ఏప్రిల్‌ 12న అహ్మదాబాద్‌లోని బీజే మెడికల్‌ కాలేజీ క్యాంపస్‌ బిల్డింగ్‌ను ఎయిరిండియా బోయింగ్‌ 787 డ్రీమ్‌లైనర్‌ ఢీకొట్టింది. ఈపెను విషాదంలో విమానంలో ప్రయాణిస్తున్న 242మందిలో మృత్యుంజయుడు ఒక్కడే సురక్షితంగా బయటపడ్డాడు.తాజా సమాచారం మేరకు ప్రమాద సమయంలో విమానంలో ప్రయాణిస్తున్న 241 మంది, మెడికల్‌ కాలేజీ క్యాంపస్‌ బాధితులతో కలుపుకొని మొత్తం 270 మంది మరణించినట్లు తెలుస్తోంది.

ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండడతో మృతదేహాల్ని గుర్తు పట్టలేని విధంగా ఉన్నాయి. బాధితుల కుటుంబ సభ్యుల డీఎన్‌ఏల ఆధారంగా మృతదేహాల్ని గుర్తిస్తున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement