గుజరాత్‌లో బీజేపీకి బిగ్‌ షాక్‌ | Arvind Kejriwal AAP Wins Gujarat Visavadar Assembly Bypoll Results, Check Out Other 4 Byelection Results | Sakshi
Sakshi News home page

గుజరాత్‌లో బీజేపీకి బిగ్‌ షాక్‌

Jun 24 2025 6:39 AM | Updated on Jun 24 2025 9:53 AM

AAP wins Gujarat Visavadar assembly bypoll Results

విసావదర్‌ ఉప ఎన్నికలో ఆమ్‌ ఆద్మీ పార్టీ విజయం  

పంజాబ్‌లో ఆప్, బెంగాల్‌లో తృణమూల్, కేరళలో యూడీఎఫ్‌ గెలుపు  

న్యూఢిల్లీ/అహ్మదాబాద్‌: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సొంత రాష్ట్రం గుజరాత్‌లో ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌) బీజేపీకి గట్టి షాక్‌ ఇచి్చంది. రాష్ట్రంలో రెండు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగ్గా, ఒక స్థానంలో అరవింద్‌ కేజ్రీవాల్‌ సారథ్యంలోని ఆప్‌ పార్టీ ఘన విజయం సాధించింది. మరో స్థానంలో అధికార బీజేపీ నెగ్గింది. లూథియానా వెస్ట్‌(పంజాబ్‌), కాళీగంజ్‌(పశ్చిమ బెంగాల్‌), కాడీ, విసావదర్‌(గుజరాత్‌), నీలంబూర్‌(కేరళ) శాసనసభ స్థానాలకు ఈనెల 19న ఉప ఎన్నికలు జరిగాయి.

 సోమవారం ఓట్ల లెక్కింపు చేపట్టారు. విసావదర్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో ఆమ్‌ ఆద్మీ పార్టీ అభ్యర్థి గోపాల్‌ ఇటాలియా ఘన విజయం సొంతం చేసుకున్నారు. బీజేపీ అభ్యర్థి కిరీట్‌ పటేల్‌పై 17 వేలకుపైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. గోపాల్‌ ఇటాలియాకు 75,942 ఓట్లు రాగా, కిరీట్‌ పటేల్‌కు 58,000 ఓట్లు వచ్చాయి. గత ఎన్నికల్లో విసావదర్‌ నుంచి గెలుపొందిన ఆమ్‌ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే భయానీ భూపేంద్రభాయ్‌ తన పదవికి, పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు.

 దీంతో ఉపఎన్నిక అనివార్యమైంది. తమ సిట్టింగ్‌ స్థానాన్ని ఆప్‌ నిలబెట్టుకుంది. కాడీ ఎస్సీ రిజర్వ్‌డ్‌ అసెంబ్లీ స్థానంలో బీజేపీ అభ్యర్థి రాజేంద్ర చావ్డా 39,000 ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఇక్కడ బీజేపీ ఎమ్మెల్యే కర్సాన్‌ సోలంకీ మృతిచెందడంతో ఉప ఎన్నిక జరిగింది. పంజాబ్‌లోని లూథియానా వెస్ట్‌లోనూ ఆప్‌ మళ్లీ గెలిచింది. ఆ పార్టీ అభ్యర్థి సంజీవ్‌ అరోరా కాంగ్రెస్‌ అభ్యర్థి భరత్‌ భూషణ్‌పై 10 వేల ఓట్ల మెజార్టీతో నెగ్గారు. బీజేపీ అభ్యర్థి జీవన్‌ గుప్తా మూడో స్థానంలో నిలిచారు. లూథియానా వెస్ట్‌లో ఆప్‌ ఎమ్మెల్యే గుర్‌ప్రీత్‌బస్సీ గోగీ మరణించడంతో ఉప ఎన్నిక జరిగింది. 

బెంగాల్‌లోని కాళీగంజ్‌లో అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత అలీఫా అహ్మద్‌ బీజేపీ అభ్యర్థి ఆశీష్‌ ఘోష్‌పై 50,000 ఓట్ల మెజార్టీతో గెలిచారు. అలీఫా తండ్రి, తృణమూల్‌ ఎమ్మెల్యే నజీరుద్దీన్‌ అహ్మద్‌ మృతిచెందడంతో ఇక్కడ ఉప ఎన్నిక నిర్వహించారు. కేరళలోని నీలంబూర్‌లో కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూడీఎఫ్‌ అభ్యర్థి అర్యదన్‌ షౌకత్‌ వామపక్ష అభ్యర్థి ఎం.స్వరాజ్‌పై 11,000 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. నీలంబూర్‌ అసెంబ్లీ స్థానం కాంగ్రెస్‌ అగ్రనేత ప్రియాంకా    గాంధీ వాద్రా ప్రాతినిధ్యం వహిస్తున్న వయనాడ్‌ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. 

గుజరాత్, పంజాబ్‌లో మాదే విజయం: కేజ్రీవాల్‌  
గుజరాత్, పంజాబ్‌ ఉప ఎన్నికల్లో తమ అభ్యర్థుల విజయం పట్ల ఆప్‌ ఆద్మీ పార్టీ జాతీయ కనీ్వనర్‌ సోమవారం హర్షం వ్యక్తంచేశారు. 2027 అసెంబ్లీ ఎన్నికలకు ఇది సెమీఫైనల్‌ అని, ఇందులో తామే గెలిచామని స్పష్టంచేశారు. రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్‌లను ఓటర్లు పూర్తిగా తిరస్కరించడం ఖాయమని అన్నారు. ఆప్‌ విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరని ధీమా వ్యక్తం చేశారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement