Dhurandhar 2 Movie
-
దురంధర్-2పై సౌత్ స్టార్స్ ప్రశంసలు.. ప్రకాశ్ రాజ్ రియాక్షన్ ఇదే..!
రణ్వీర్ సింగ్ దురంధర్-2పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇప్పటికే మహేశ్ బాబు, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, విజయ్ దేవరకొండ, రామ్ చరణ్, రాం గోపాల్ వర్మ సైతం సీక్వెల్ అద్భుతంగా ఉందంటూ ట్వీట్స్ చేశారు. బాలీవుడ్ మేకర్స్ సైలెంట్గా ఉన్నా.. టాలీవుడ్ స్టార్స్ మాత్రం దురంధర్ మూవీని కొనియాడుతున్నారు. ఆదిత్య ధర్ మరో అద్బుతమైన కంటెంట్ అందించారని.. రణ్వీర్ సింగ్ అదరగొట్టేశాడని ఆకాశానికేత్తేస్తున్నారు.ఈ నేపథ్యంలోనే టాలీవుడ్ నటుడు ప్రకాశ్ రాజ్ రియాక్షన్ కోసం ఎంతోమంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మొదటి నుంచి దురంధర్కు వ్యతిరేకంగా ఉన్న ఆయన.. తాజాగా సౌత్ స్టార్స్ ఈ మూవీ ప్రశంసించడంపై ఎట్టకేలకు స్పందించారు. ఓ నెటిజన్ చేసిన పోస్ట్కు ప్రకాశ్ రాజ్ రిప్లై ఇచ్చారు. దురంధర్-2 మూవీని దక్షిణాది హీరోలు మహేశ్ బాబు, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, విజయ్ దేవరకొండ ప్రశంసించారు.. బాలీవుడ్ నుంచి ఎవరైనా స్పందించారా? అని నెటిజన్ రాసుకొచ్చాడు. దీనికి ప్రకాశ్ రాజ్ బదులిస్తూ.. 'బాధ్యతల సంకేతాలు దక్షిణాదికి కూడా వ్యాపిస్తున్నాయి' అంటూ ట్విటర్లో పోస్ట్ చేశారు. ఇది కాస్తా సోషల్ మీడియాలో వైరల్గా మారింది.అంతకుముందు ప్రకాశ్ రాజ్ ఓ పాత సినిమాకు సంబంధించిన పాటలు వింటున్న వీడియోను ట్విటర్లో షేర్ చేశారు. నేను దురంధర్కు చాలా దూరంగా ఉన్నా.. మీరు కూడానా? అంటూ పాట వింటున్న వీడియోను పోస్ట్ చేశారు. ఈ వీడియోలో హమ్ దోనో(1961) చిత్రంలోని 'అభీ నా జావో ఛోడ్ కర్' ఐకానిక్ పాటను ప్లే చేశారు. మొదటి నుంచి దురంధర్ను వ్యతిరేకిస్తున్న ప్రకాశ్ రాజ్.. ఈ ట్వీట్స్ చూస్తుంటే మరోసారి తనలోని అక్కసును వెళ్లగక్కినట్లు తెలుస్తోంది.కాగా.. దురంధర్కు సీక్వెల్గా వచ్చిన'ధురందర్: ది రివెంజ్' హిందీ, తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ చిత్రంలో అర్జున్ రాంపాల్, సంజయ్ దత్, ఆర్ మాధవన్, సారా అర్జున్, రాకేష్ బేడీ కీలక పాత్రలలో నటించారు. ఈ చిత్రాన్ని జియో స్టూడియోస్, బి62 స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి. Signs of Obligations are spreading South too .. #justasking https://t.co/iB01E1sp7K— Prakash Raj (@prakashraaj) March 19, 2026 -
ధురంధర్ 2 చూసి షాక్ అయిన టాలీవుడ్ స్టార్స్.. ఏం అన్నారంటే...
-
దురంధర్-2 మూవీకి రామ్ చరణ్ రివ్యూ.. ఏమన్నారంటే?
రణ్వీర్ సింగ్ దురంధర్-2పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇప్పటికే మహేశ్ బాబు, అల్లు అర్జున్, రాం గోపాల్ వర్మ సీక్వెల్ అద్భుతంగా ఉందంటూ ట్వీట్స్ చేశారు. బాలీవుడ్ మేకర్స్ సైలెంట్గా ఉన్నా.. టాలీవుడ్ స్టార్స్ మాత్రం దురంధర్పై తమ ప్రేమను చాటుకుంటున్నారు. తాజాగా ఈ లిస్ట్లో మెగా హీరో, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా చేరిపోయాడు. దురంధర్-2 అద్భుతంగా ఉందని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. రణ్వీర్ సింగ్ అద్భుతమైన నటనతో మెప్పించారని.. ఈ సినిమా ఆద్యంతం మిమ్మల్ని కట్టిపడేస్తుందని ట్విటర్లో రాసుకొచ్చారు.రామ్ చరణ్ తన ట్వీట్లో రాస్తూ..'దురంధర్ ది రివెంజ్ చాలా ఉత్కంఠభరితంగా ఉంది. ఈ మూవీలో భావోద్వేగాలను అద్భుతంగా చూపించారు. ఈ చిత్రానికి ఆయన చేసిన పనిని తప్పుకుండా ప్రశంసించాల్సిందే. ఇక రణ్వీర్ సింగ్ అద్భుతంగా ఫర్మామెన్స్తో అదరగొట్టాడు. సినిమా ఆద్యంతం మిమ్మల్ని కట్టిపడేస్తారు. మాధవన్, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్ అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నారు. సారాఅర్జున్ తన పాత్రలో మెప్పించింది. సుస్వత్ మ్యూజిక్ మరో రేంజ్కు తీసుకెళ్లింది. ఇంత ఆసక్తకరమైన మూవీని అందించిన నిర్మాతలకు, చిత్ర బృందానికి నా అభినందనలు.' అంటూ పోస్ట్ చేశారు. కాగా.. దురంధర్కు సీక్వెల్గా వచ్చిన ఈ మూవీ మార్చి 19న థియేటర్లలో రిలీజైంది. ఆదిత్య ధర్ డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది.ఇక రామ్ చరణ్ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం పెద్ది మూవీలో నటిస్తున్నారు. ఈ సినిమాకు బుచ్చిబాబు సనా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా కనిపించనుంది. ప్రస్తుతం షూటింగ్ చివరిదశలో ఉన్న ఈ చిత్రం ఏప్రిల్ 30న థియేటర్లలో సందడి చేయనుంది.#DhurandharTheRevenge is raw, gripping and impactful 🔥@AdityaDharFilms brings scale and emotion together seamlessly. What he has done with this film is truly remarkable.@RanveerOfficial delivers a phenomenal performance - full of intensity and holds your attention…— Ram Charan (@AlwaysRamCharan) March 20, 2026 -
దేవుళ్లనుకునే ఆ హీరోలకు ఇక మనుగడ లేదు: ఆర్జీవీ
ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. గత కొన్నిరోజుల నుంచి 'ధురంధర్ 2' మేనియాలోనే ఉన్నాడు. ఇప్పటికే కొన్ని పదుల సంఖ్యలో ట్వీట్స్ చేస్తున్నాడు. ఇప్పుడు కూడా తెలుగు స్టార్ హీరోలని కౌంటర్ వేస్తూ పెద్ద ట్వీట్ చేశాడు. అది ఆయా హీరోలకే కాదు టాలీవుడ్ ప్రేక్షకులని కూడా ఆలోచనలో పడేసింది.(ఇదీ చదవండి: 'దురంధర్-2 చెత్త సినిమా.. థియేటర్కు అస్సలు వెళ్లకండి')'ధురంధర్ 2 ఓ హారర్ సినిమా. కానీ ఇది ప్రేక్షకులని భయపెట్టలేదు. కేవలం మాస్ మసాలా, లౌడ్నెస్, లాజిక్ లేని చిత్రాలతో కెరీర్ నిర్మించుకున్న దర్శకుల గుండెల్లో వణుకు పుట్టించింది. బుర్రని ఇంట్లోనే వదిలేసి సినిమా చూడాలనే కాలం చెల్లిన డైరెక్టర్లకు ఈ మూవీ ఓ పీడకల. ఇన్నాళ్లు నొప్పి తెలియకుండా గాయపడకుండా కేవలం ఎలివేషన్ల మీద బతికే 'దేవుళ్లు' అనే ఫీలింగ్ ఉన్న హీరోలని రణ్వీర్ సింగ్ తనదైన నటనతో పాతిపెట్టాడు. ఇందులో హీరోకు బలహీనతలు ఉంటాయి. నిజమైన రక్తం చిందస్తూ, తన తెలివైన హీరోయిజం పండించడం చూస్తుంటే పాతకాలపు హీరోలు.. సర్కస్లో జోకర్లలా కనిపిస్తున్నారు. గాల్లో యాభై అడుగులు ఎగిరే ఫైట్స్, గ్రావిటీని అవహేళన చేసే యాక్షన్ సీన్స్ నమ్ముకున్న వారికి ఇక మనుగడ లేదు' అని ఆర్జీవీ స్పష్టం చేశాడు.'పాన్ ఇండియా దర్శకులు.. కేవలం కాస్ట్యూమ్స్, హెయిర్ స్టైల్స్, ఫొటోషాప్తో చేసిన సిక్స్ ప్యాక్లతో పాత్రలని సృష్టించవచ్చని భ్రమపడుతున్నారు. కానీ ఆదిత్య ధర్ మాత్రం మెదడుతో సినిమా తీసి చూపించారు. ధురంధర్ 2 సాధిస్తున్న భారీ కలెక్షన్స్.. పాతకాలపు దర్శకుల నమ్మకాలని పూడ్చి పెడుతున్న శబ్దాలు. ప్రస్తుతం షూటింగ్లో ఉన్న లేదా కొత్త ప్రాజెక్టులు మొదలుపెట్టబోయే డైరెక్టర్స్.. ఇప్పటికైనా 'ధురంధర్ 2'ని పదేపదే చూసి పాఠాలు నేర్చుకోవాలి. లేదంటే వారిని ఆ దేవుడు కూడా కాపాడలేడు. డబ్బు ఉండొచ్చు కానీ ఆదిత్య ధర్ లాంటి విజన్ ఎక్కడ నుంచి తెస్తారు?' అని ఆర్జీవీ చేసిన ట్వీట్ ఇప్పుడు నెటిజన్ల మధ్య చర్చకు దారితీసింది. ఆర్జీవీ ట్వీట్ చూస్తే చాలామందికి నిజమే కదా అనిపించకమానదు. ఎందుకంటే ఇన్నాళ్లు ప్రేక్షకుల్ని చాలా తక్కువగా చూస్తే లాజిక్ లేని సినిమాలు తీస్తూ చాలామంది దర్శకులు కాలం గడిపేస్తున్నారు. ప్రేక్షకులు కూడా మరో దారి లేక వాటిని చూస్తున్నారు. ఇప్పుడు 'ధురంధర్ 2' లాంటి మూవీ చూసిన తర్వాత ప్రేక్షకుల ఆలోచన విధానంలోనూ కచ్చితంగా మార్పు వచ్చే అవకాశముంటుందనేది ఆర్జీవీ ఉద్దేశం అయ్యిండొచ్చు.(ఇదీ చదవండి: తెలుగు స్టార్ హీరోలతో 'ధురంధర్' డైరెక్టర్ మల్టీస్టారర్?)The @Dhurandhar2 is a HORROR.It is a horror for all filmmakers who built their careers and their fortunes on dumbed down, over the top cinema. The cinema that demanded the brain to be left at home . The cinema that was rammed down our throats full of LOUDNESS and MASALA which…— Ram Gopal Varma (@RGVzoomin) March 20, 2026 -
రికార్డులు బద్దలు! ధురంధర్ 2 ఫస్ట్ డే కలెక్షన్స్ సునామి..
-
'దురంధర్-2 చెత్త సినిమా.. థియేటర్కు అస్సలు వెళ్లకండి'.. నటి షాకింగ్ రివ్యూ
కన్నడ నటి, రాజకీయ నాయకురాలు దివ్య స్పందన గురించి పరిచయం అక్కర్లేదు. గతేడాది హీరో దర్శన్పై కామెంట్స్ చేసిన ఒక్కసారిగా వార్తల్లో నిలిచింది. ఓ అభిమానిని హీరో దర్శన్ హత్య చేయడంపై దివ్య స్పందన మండపడింది. దర్శన్.. తన జీవితంలో సరిదిద్దుకోలేని తప్పు చేశాడని నటి రమ్య గతంలో పేర్కొంది. ఆ తర్వాత దర్శన్ ఫ్యాన్స్ దివ్యపై సోషల్ మీడియాలో ట్రోల్స్ చేశారు.తాజాగా ఈ ముద్దుగుమ్మ మరోసారి వార్తల్లో నిలిచింది. ఈనెల 19న రిలీజైన రణ్వీర్ సింగ్ దురంధర్-2పై అభిప్రాయాన్ని తెలిపింది. ఈ మూవీ తనను తీవ్రంగా నిరాశపర్చిందని.. చూస్తున్నంతసేపు నిద్ర వచ్చిందని ఎద్దేవా చేసింది. అసలు ఇది థియేటర్స్లో చూసే సినిమానే కాదంటూ ట్వీట్ చేసింది.మొదటి పార్ట్లో ఉన్న సాంకేతిక విలువలు ఈ సినిమాలో కొరవడ్డాయాని దివ్య స్పందన విమర్శించారు. దర్శకత్వం, డైలాగ్స్, ఎడిటింగ్, నేపథ్య సంగీతం, నటనలో దురంధర్-2 పూర్తిగా తేలిపోయిందని దివ్య స్పందన కామెంట్స్ చేసింది. మార్చి 19న విడుదల ఉందని వారికి ఎవరూ చెప్పలేదేమోనని మేకర్స్ను ఉద్దేశించిన వ్యంగ్యంగా మాట్లాడింది. ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో పెద్దఎత్తున చర్చకు దారితీశాయి. దివ్య తన ట్వీట్లో రాస్తూ..' ఇప్పుడే ధురందర్ 2 చూశాను. మన సహనానికి పరీక్షలా ఉంది. దయచేసి థియేటర్లో మీ సమయాన్ని, డబ్బును వృధా చేసుకోకండి. ఇది ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్లో చూసే మూవీ. దర్శకత్వం, సంభాషణలు, ఎడిటింగ్, నేపథ్య సంగీతం, నటన అన్నీ చెత్తగా ఉన్నాయి. మార్చి 19న విడుదల ఉందని వాళ్లకు ఎవరూ చెప్పలేదేమోనని అనిపించింది. పార్ట్-1 ఫర్వాలేదు కానీ.. సింపుల్గా చెప్పాలంటే ధురందర్ 2 ప్రేక్షకుడిని పూర్తిగా నిరాశపర్చే సినిమా. మరీ అంతంత మాత్రంగానే ఉంది. ఇది ప్రేక్షకుడిని నిద్రపుచ్చే ఓ కామెడీ సినిమా. అసలు ఈ సినిమా 'ఎందుకని మనల్ని ప్రశ్నించేలా చేస్తుంది. రణ్వీర్.. నువ్వు ఇంతకంటే బాగా చేయగలవు. ఆదిత్య ధర్.. జాతీయవాదం, ప్రాపగండ నుంచి మీరు బయటికి రండి.' అంటూ రాసుకొచ్చింది. Just watched Dhurandhar 2 and wow! what a masterclass in how to turn something promising into an endurance test.It’s like reading a textbook of the most boring subject with never-ending chapters and at some point, your brain just gives up and starts laughing out of sheer despair…— Ramya/Divya Spandana (@divyaspandana) March 20, 2026 -
తెలుగు స్టార్ హీరోలతో 'ధురంధర్' డైరెక్టర్ మల్టీస్టారర్?
ప్రస్తుతం దేశంలో 'ధురంధర్ 2' గురించి చర్చ గట్టిగానే నడుస్తోంది. సీక్వెల్ అయిన ఈ చిత్రం.. రెండు రోజుల క్రితం ప్రీమియర్లతో థియేటర్లోకి వచ్చింది. రిలీజ్కి ముందు బీభత్సమైన హైప్ ఏర్పడింది. దర్శకుడు ఆదిత్య ధర్ దాన్ని నిలబెట్టుకున్నాడు. 4 గంటల నిడివి ఉన్నప్పటికీ ఏ మాత్రం బోర్ కొట్టకుండా మ్యాజిక్ చేశాడు. ఈ చిత్రానికి మూడో భాగం ఉంటుందనే రూమర్ కొన్నిరోజుల ముందు వరకు వినిపించింది. కానీ 'ధురంధర్ 2' రిలీజైన తర్వాత అలాంటిదేం లేదని అందరికీ క్లారిటీ వచ్చేసింది.(ఇదీ చదవండి: 'ధురంధర్ 2'.. బాలీవుడ్ కంటే టాలీవుడే ముందు)అయితే 'ధురంధర్' ఫ్రాంచైజీని పూర్తి చేసిన దర్శకుడు ఆదిత్య ధర్.. తర్వాత ఏ సినిమా చేస్తాడు? ఎవరితో చేస్తాడనేది ఇప్పుడు హాట్ టాపిక్ అయిపోయింది. కొన్నాళ్ల క్రితం తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన 'అశ్వద్ధామ' గురించి అల్లు అర్జున్తో ఆదిత్య చర్చలు జరిపాడనే టాక్ బయటకొచ్చింది. తర్వాత దీని అప్డేట్ ఏం లేదు. అయితే 'ధురంధర్ 2' ప్రీమియర్ చూసిన వెంటనే అల్లు అర్జున్.. సినిమాని పొగుడుతూ ట్వీట్ చేయడం, ఆదిత్యని ఆకాశానికెత్తేయడం చూస్తుంటే త్వరలో కలిసి పనిచేస్తారా అనే సందేహం వస్తోంది.ఇందులో అల్లు అర్జున్ మెయిన్ హీరో అయినప్పటికీ ఎన్టీఆర్ కూడా ఓ స్పెషల్ రోల్ చేస్తాడని రూమర్స్ కూడా వస్తున్నాయి. ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం టాలీవుడ్లో వచ్చే బిగ్గెస్ట్ మల్టీస్టారర్ అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. కాకపోతే ఇది నిజమా కాదా అనేది తెలియడానికైనా మరికొన్నేళ్లు పట్టొచ్చు. ఎందుకంటే 2019లో 'ఉరి' రిలీజ్ చేసిన ఆదిత్య ధర్.. దాదాపు ఆరేళ్ల విరామం తర్వాత 'ధురంధర్' రెండు భాగాలతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. మరి తర్వాత మూవీ ఎన్నేళ్లకు వస్తుందనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్.ప్రస్తుతం పాన్ ఇండియా లెవల్లో చూసుకుంటే 'పుష్ప'తో బన్నీ, 'ఆర్ఆర్ఆర్' తారక్ రేంజ్ చాలా పెరిగింది. ప్రస్తుతం వీళ్లు చేస్తున్న ప్రాజెక్టుల స్పాన్ కూడా పెద్దదే. ఒకవేళ కాలం కలిసొచ్చి ఆదిత్య.. అల్లు అర్జున్-ఎన్టీఆర్తో మల్టీస్టారర్ తీస్తే మాత్రం బాక్సాఫీస్ దగ్గర ర్యాంపేజ్ గ్యారంటీ.(ఇదీ చదవండి: ‘ధురంధర్ 2’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్) -
దురంధర్-2 వసూళ్ల ఊచకోత.. ఆ ఒక్కడి వల్లే రూ.500 కోట్లు..!
రణ్వీర్ సింగ్ హీరోగా వచ్చిన స్పై యాక్షన్ థ్రిల్లర్ దురంధర్. గతేడాది డిసెంబర్లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద వసూళ్ల ఊచకోత చూపించింది. 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన మూవీగా నిలిచింది. కేవలం హిందీలో మాత్రమే రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ను షేక్ చేసింది. ఏకంగా రూ.1300 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. తాజాగా ఈ మూవీకి సీక్వెల్గా వచ్చిన చిత్రం దురంధర్ ది రివెంజ్. పార్ట్-2గా వచ్చిన ఈ సినిమా మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది. ఈ సారి హిందీతో పాటు దక్షిణాది భాషల్లోనూ రిలీజైంది. కేవలం ప్రీమియర్స్తోనే వసూళ్లు సునామీ ప్రారంభించిన బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. ఈ నేపథ్యంలో దురంధర్ నటుడు రాకేశ్ బేడీ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. రణ్వీర్ సింగ్ తనతో ఇలా చెప్పారని గుర్తు చేసుకున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన రాకేశ్ బేడీ ఆసక్తికర కామెంట్స్ చేశారు. నా రోల్ షూటింగ్ పూర్తైన రోజు రణ్వీర్ తనకు ఓ మాట చెప్పారని గుర్తు చేసుకున్నారు. ఒకవేళ ఈ మూవీ రూ.1000 కోట్లకు పైగా వసూలుచేస్తే.. అందులో రూ.500 కోట్లు రాకేశ్ వల్లే వస్తాయని అన్నారని తెలిపారు. ఓ నటుడిగా ఇంతకుమించి ఏం కావాలని హర్షం వ్యక్తం చేశారు. నా చివరి రోజు షూటింగ్లో రణ్ వీర్సింగ్ ఏడ్చారని దర్శకుడు ఆదిత్య ధర్ అన్నారు. సెట్లో అంతలా ఎమోషనల్ వాతావరణాన్ని సృష్టించిన మూవీ అని తెలిపారు. కాగా.. ఈ చిత్రంలో రాకేశ్ బేడీ రోల్ ఆడియన్స్ను విపరీతంగా ఆకట్టుకుంది. కరాచీకి చెందిన రాజకీయ నాయకుడు జమాలి పాత్రలో రాకేశ్ బేడీ అదరగొట్టేశారు. రణ్వీర్ సింగ్ ప్రశంసలు..జమాలిగా బేడీ నటన ప్రేక్షకుల నుంచి ప్రశంసలను అందుకుంది. ఓ రాజకీయ నాయకుడి నయవంచక పాత్రలో పాత్రలో ఆయన నటన ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. రణ్వీర్ సింగ్ ప్రశంసలు కురిపించడం చూస్తుంటే బేడీ పాత్ర ప్రభావం, అలాగే సెట్లో వారి మధ్య ఏర్పడిన స్నేహబంధం అర్థమవుతోంది. కాగా.. ఈ చిత్రంలో ఆర్. మాధవన్, సారా అర్జున్, డానిష్ పాండోర్, సంజయ్ దత్ లాంటి స్టార్స్ కీలక పాత్రల్లో కనిపించారు. కాగా.. ధురంధర్ 2 ఫస్ట్ డే, ప్రీమియర్స్తో కలిసి ప్రపంచవ్యాప్తంగా రూ. 172.63 కోట్ల గ్రాస్ రాబట్టింది. -
'ధురంధర్ 2'.. బాలీవుడ్ కంటే టాలీవుడే ముందు
ఓ హిందీ సినిమా కోసం తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూసి చాలా కాలమైపోయింది. పదిపదిహేనేళ్ల క్రితం షారుక్ ఖాన్, ఆమిర్ ఖాన్, సల్మాన్ ఖాన్ తదితరుల చిత్రాలకు తెలుగు రాష్ట్రాల్లోనూ మంచి క్రేజ్ ఉండేది. అందుకు తగ్గట్లే కలెక్షన్స్ వచ్చేవి. కానీ ఇప్పుడు 'ధురంధర్ 2' విషయంలో ఆ జోష్ కనిపిస్తోంది. తెలుగు షోలు పూర్తిస్థాయిలో స్క్రీనింగ్ కానప్పటికీ హిందీ వెర్షన్ అయినా సరే చూసేయాల్సిందే అని ఆలోచనతో ఉన్నారు. హైదరాబాద్ లాంటి నగరాల్లో టికెట్ బుకింగ్స్ చూస్తుంటే ఇదే అనిపిస్తుంది.(ఇదీ చదవండి: ధురంధర్-2 ఫస్ట్ డే కలెక్షన్స్..)ఈ సినిమాలో ఒక్క తెలుగు నటుడు కూడా లేడు. అయినా సరే తొలి పార్ట్ హిట్ అయ్యేసరికి బీభత్సమైన హైప్ ఏర్పడింది. ఈ క్రమంలోనే రెండు రోజుల క్రితమే అంటే బుధవారం సాయంత్రం నుంచి ప్రీమియర్స్ పడ్డాయి. ఈ క్రమంలోనే తెలుగు స్టార్ హీరోలు అయిన అల్లు అర్జున్, మహేశ్ బాబు, ఎన్టీఆర్ తదితరులు ఏకంగా ట్వీట్స్ చేసి మరీ మూవీని ఆకాశానికెత్తేశారు. అదే టైంలో బాలీవుడ్ మాత్రం పూర్తిగా సైలెన్స్ పాటిస్తోంది.'ధురంధర్ 2' ట్రైలర్ రిలీజైనప్పుడు హిందీ ఇండస్ట్రీకి చెందిన హృతిక్ రోషన్, ఆలియా భట్, విక్కీ కౌశల్ లాంటి స్టార్స్ పోస్టులు పెట్టారు గానీ మూవీ వచ్చి రెండు రోజులు కావొస్తున్నా బాలీవుడ్ నుంచి ఒక్కరు కూడా పోస్టుల్లాంటివి పెట్టకపోవడం ఆసక్తికరంగా అనిపిస్తుంది. దీని గురించి సోషల్ మీడియాలోనూ చర్చ నడుస్తోంది. హిందీ సినిమాని సపోర్ట్ చేసే విషయంలోనూ బాలీవుడ్ కంటే టాలీవుడ్ ముందుందిగా అని మాట్లాడుకుంటున్నారు.దీనికి పోటీగా తెలుగు రాష్ట్రాల వరకు పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్' రిలీజైంది. కానీ తొలి షో నుంచే నెగిటివ్ టాక్ వస్తోంది. రొటీన్ ఫక్తు కమర్షియల్ మూవీ అని చూసిన ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు. పవన్ అభిమానులకు తప్పితే ఇది మరెవరికి నచ్చట్లేదనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి! 'ధురంధర్ 2' తెలుగు వెర్షన్ విడుదలైతే.. 'ఉస్తాద్'కి మరింత కష్టాలు తప్పవు.(ఇదీ చదవండి: ‘ధురంధర్ 2’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్) -
సివిల్స్లో సత్తా చాటిన దినసరి కూలీ కొడుకు..! 'ధురంధర్ 2' మూవీ..
ప్రతిష్టాత్మకమైన సివిల్స్లో సత్తా చాటి ఐఏఎస్ అవ్వాలనేది ఎందరో యువత డ్రీమ్. అత్యంత కఠినతరమైన ఎగ్జామ్లో గెలుపుని అందుకోవడమే తమ ధ్యేయంగా ఎంతలా కష్టపడుతుంటారో తెలిసిందే. అంత కష్టమైన ఎగ్జామ్లో తొలిప్రయత్నంలోనే అవలీలగా విజయఢంకా మోగించి అందరిచేత శెభాష్ అనిపించుకున్నాడు ఈ యువకుడు. ఇతడి గెలుపు 'ధురందర్ 2'మూవీ నటుడిని సైతం ఆకట్టుకుంది. అతడు మాములు స్ఫూర్తి కాదంటూ ఆకాశానికి ఎత్తేశాడు. ఇంతకీ ఎవరా వ్యక్తి అంటే..సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ మంచి మంచి వీడియోలను షేర్ చేస్తూ.. అభిమానులకు ఖుషీ చేసే హీరో మాధవన్ ఈసారి కూడా అలానే మంచి స్ఫూర్తిదాయకమైన వీడియోను షేర్ చేశారు. ఇటీవల యూపీఎస్సీ సివిల్స్ పరీక్షలో సత్తా చాటి సుబ్రమణ్య భారతి వీడియోని రీషేర్ చేస్తూ..ఆ యువకుడి అజేయమైన సక్సెస్ జర్నీని మెచ్చుకున్నారు. అందుకు సహకరించిన అతని తల్లిదండ్రులు, అతడికి లభించిన మద్దతు తదితరాలన్ని తనను ఎంతగానో కదిలించాయని, పైగా స్ఫూర్తిని పొందానని పేర్కొన్నారు. పట్టుదల, సరైన మార్గదర్శకత్వం ఎలా మార్పు తీసుకురాగలవో అనేందుకు ఆ యువకుడు సుబ్రమణ్య భారతినే ఉదాహరణ అంటూ పోస్ట్ని ముగించారు మాధవన్. హీరో మాధవన్ షేర్ చేసిన వీడియోలో దినసరి కూలీ కుమారుడైన సుబ్రమణ్య భారతి ఉన్నారు. ఆయన తమిళనాడు ప్రభుత్వ 'నాన్ ముదల్వన్' పథకం సహాయంతో ఈ అధ్భుతమైన ఘనతను సాధించాడు. భారతి తొలి ప్రయత్నంలోనే సివిల్స్లో విజయం సాధించడం విశేషం.తన సక్సెస్ జర్నీ అసాధారణమైనది అభివర్ణించాడు సుబ్రమణ్య భారతి. తాను క్షేత్రస్థాయిలో సమాజానికి సేవ చేయాలనే ఉద్దేశ్యంతోనే తాను సివిల్ సర్వీసెస్ను ఎంచుకున్నానని చెప్పారు. తొలి ప్రయత్నంలోనే ఈ ఘనత సాధించడానికి, ఈ పథకం, కోచింగ్ వంటి మద్దతే కారణమని పేర్కొన్నారు. తాను కేవలం 18 ఏళ్ల వయసులో, ఎలాంటి మార్గదర్శకత్వం లేకుండా ఈ సివిల్స్ ప్రయాణం ప్రారంభించినట్లు తెలిపాడు. అందుకు తల్లిదండ్రులే స్ఫూర్తి అని, ఎందుకంటే వాళ్లు దేశానికి సాధ్యమైనంత ఉత్తమ రీతిలో సేవ చేసేలా వాళ్లు సదా ప్రోత్సహించారని చెప్పుకొచ్చాడు. కాగా, భారతి తండ్రి మరియప్పన్ మాట్లాడుతూ.. తమ కుటుంబం పేద కుటుంబమని, ఇటుకల తయారీ యూనిట్లో రోజువారీ కూలీగా పనిచేస్తుంటానని చెప్పారు. ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ, తన కుమారుడు ఈ ప్రతిష్టాత్మకమైన సివిల్ సర్వీస్కు సన్నద్ధమయ్యాడని అన్నారు. అందులో విజయం సాధించడానికి తమిళనాడు ప్రభుత్వ నాన్ ముదల్వన్ పథకం ఎంతగానో సహాయపడిందని అన్నారు. నాన్ ముదల్వన్ (Naan Mudhalvan) పథకం:తమిళనాడు ప్రభుత్వం ప్రారంభించిన నాన్ ముదల్వన్ (Naan Mudhalvan) పథకం ద్వారా యువతకు నైపుణ్యాభివృద్ధి (Skill Development), ఉపాధి అవకాశాలను పెంచే ఒక ప్రతిష్టాత్మక కార్యక్రమం. ఇది 18-35 ఏళ్ల యువతకు, ముఖ్యంగా కళాశాల విద్యార్థులకు టెక్నాలజీ, భాషా నైపుణ్యాలు, ఇండస్ట్రీ-రెడీ కోర్సులలో శిక్షణ ఇస్తూ, ఉచిత కోచింగ్, స్కాలర్షిప్లను అందిస్తుంది. View this post on Instagram A post shared by Asian News International (@ani_trending)(చదవండి: మా మాష్టారే పేషెంట్గా..!) -
బాక్సాఫిస్ ను బద్దలు కొడుతున్న ధురంధర్ 2
-
పాకిస్తాన్ టీవీలో 'ధురంధర్-2'.. వీడియో షేర్ చేసిన జర్నలిస్ట్
‘ధురంధర్-2’ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలై భారీ వసూళ్లతో రికార్డ్ క్రియేట్ చేస్తుంది. ఫస్ట్ డే ఏకంగా రూ. 172 కోట్ల గ్రాస్ రాబట్టినట్లు ప్రముఖ సంస్థలు పేర్కొన్నాయి. మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ విడుదలైంది. కానీ, ఈ చిత్రం పాకిస్తాన్లో విడుదల కాలేదు. పాకిస్థాన్కు వ్యతిరేకంగా ఈ మూవీని తెరకెక్కించడం కొన్ని దేశాలు దీన్ని బ్యాన్ చేసినట్లు బాలీవుడ్ మీడియా గతంలోనే పేర్కొంది. అయినప్పటికీ పాక్ దేశ ప్రజలు రణవీర్ సింగ్ నటించిన ధురంధర్-2 మూవీని చూడటానికి ఉత్సాహంగా ఉన్నారని స్పష్టంగా తెలుస్తోంది. భారీ సంఖ్యలో పాక్ ప్రజలు ఈ సినిమా పైరసీ వెర్షన్ను చూస్తున్నారు.పాక్లోని లాహోర్లో ధురంధర్-2 సినిమా చూస్తున్న దృశ్యాన్ని పాకిస్తానీ జర్నలిస్ట్ షేర్ చేశారు. అదే పోస్ట్ను భారత్కు చెందిన ఆదిత్య రాజ్ కౌల్ తన సోషల్మీడియాలో షేర్ చేశారు. 'ధురందర్' చిత్రానికి రీసెర్చ్ కన్సల్టెంట్గా ఆయన ఉన్న విషయం తెలిసిందే. పాక్లోని లాహోర్లో ధురంధర్-2 సినిమా చూస్తున్న దృశ్యాన్ని ఒక పాకిస్తానీ జర్నలిస్ట్ షేర్ చేసిన ట్వీట్ను ఆదిత్య రీషేర్ చేశారు. పాకిస్తానీ ఉగ్రవాదాన్ని అణచివేయడం గురించి ఈ సినిమా ఉన్నా సరే వారు పైరసీ కాపీ కోసం వెతికి మరీ చూస్తున్నారు. పాకిస్తాన్లో భారతీయ చిత్రాలు నిషేధించబడినప్పటికీ, అక్కడి ప్రజలు మన సినిమాల పైరసీ వెర్షన్లను చూసి ఆనందిస్తున్నట్లు స్పష్టమవుతోంది. గతంలో, పొరుగు దేశంలో ధురందర్ పార్ట్ 1 పైరసీ వెర్షన్ను కూడా చూశారు. ఆ సమయంలో మూవీ విడుదలైన కేవలం రెండు వారాల్లోనే పాకిస్తాన్లో 1.8 మిలియన్లకు (18 లక్షలు) పైగా ఇల్లీగల్ డౌన్లోడ్ నమోదయ్యాయని అంచనా. ఇప్పుడు ధురందర్ -2 పైరసీ కాపీని టెలిగ్రామ్ గ్రూప్లలో షేర్ చేస్తున్నారు. నెట్ఫ్లిక్స్లో పార్ట్-1 విడుదలైనప్పుడు కూడా పాక్లో ట్రెండింగ్లో నిలిచింది. -
ధురంధర్-2 ఫస్ట్ డే కలెక్షన్స్..
‘ధురంధర్ 2’ ఫస్ట్ డే బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ సునామి సృష్టించింది. స్ట్రీ 2, జవాన్, యానిమల్ వంటి చిత్రాల రికార్డులను బద్దలు కొట్టి, బాలీవుడ్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. రణ్వీర్ సింగ్ హీరోగా, ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ మార్చి 18 నుంచే ప్రీమియర్ షోలతో థియేటర్స్లోకి వచ్చేసింది. ఫస్ట్ డే ‘ధురంధర్ 2’ కలెక్షన్స్ దుమ్మురేపింది. భారతీయ చిత్ర పరిశ్రమలో 'పుష్ప-2' తర్వాత భారీ ఓపెనింగ్స్ రాబట్టిన సినిమాగా ధురంధర్2 నిలిచింది. గతేడాదిలో విడుదలైన ‘పార్ట్-1’ తొలిరోజు కలెక్షన్లు రూ.28.60 కోట్ల (నెట్) రాబట్టిన విషయం తెలిసిందే.ట్రేడ్ అనలిస్ట్ వెబ్ సైట్ సక్నిల్క్ ప్రకారం ధురంధర్ 2 ఫస్ట్ డే, ప్రీమియర్స్తో కలిసి ప్రపంచవ్యాప్తంగా రూ. 172.63 కోట్ల గ్రాస్ రాబట్టింది. నెట్ పరంగా అయితే రూ. 145.55 కోట్లు అని ఆ సంస్థ పేర్కొంది. ఈ క్రమంలో నెట్ కలెక్షన్లలో రూ.100 కోట్లు దాటిన మొదటి హిందీ సినిమాగా ధురంధర్- 2 నిలిచింది. కేవలం హిందీ నుంచే ఈ సినిమాకు రూ.103 కోట్ల నెట్ కలెక్షన్లు రావడం విశేషం. ఇప్పుడు వరసు సెలవులు ఉండటంతో ఫస్ట్ వారంలోనే రూ. 700 కోట్ల మార్క్ను సులువుగా దాటుతుందని అంచనా వేస్తున్నారు.‘ధురంధర్: ది రివెంజ్’ ప్రీమియర్స్తోనే హిట్ టాక్ తెచ్చుకోవడం ఆపై ఉగాది, రంజాన్ వంటి పండుగల సెలవులు ఉండటంతో ఈ మూవీకి కలిసిసొస్తుంది. ఈ మూవీలోని యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. మాధవన్, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్ వంటి స్టార్ యాక్టర్స్ ఈ మూవీకి మరింత బలాన్ని చేకూర్చింది. ప్రస్తుతం ‘ధురంధర్ 2’కు వస్తున్న ఆదరణ చూస్తుంటే కలెక్షన్స్ పరంగా మరిన్ని రికార్డులు సృష్టించే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
దురంధర్-2 మూవీ.. ప్రీమియర్స్తోనే ఆల్టైమ్ రికార్డ్..!
రణ్వీర్ సింగ్ హీరోగా వచ్చిన స్పై యాక్షన్ థ్రిల్లర్ దురంధర్-2 థియేటర్లలో సందడి చేస్తోంది. ఈ రోజే ప్రపంచవ్యాప్తంగా రిలీజైన ఈ సినిమాకు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. దురంధర్ బ్లాక్బస్టర్ హిట్గా నిలవడంతో ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. దీంతో ప్రీమియర్స్ షోలకు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. టికెట్స్ రిలీజైన కొన్ని నిమిషాల్లోనే హాట్ కేకుల్లా అమ్ముడైపోయాయి.తాజాగా ప్రీమియర్ షోల కలెక్షన్స్లో దురంధర్-2 సరికొత్త రికార్డ్ సృష్టించింది. ఇండియాలో కేవలం ప్రీమియర్ షోల ద్వారా ఏకంగా రూ.52 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు సాధించింది. ఈ మూవీ ప్రీమియర్ షోలను దేశవ్యాప్తంగా దాదాపు 12000 వేలకు పైగా షోలు ప్రదర్శించారు. ఈ కలెక్షన్స్ ప్రీమియర్స్లో అత్యధిక వసూళ్లు సాధించిన మూవీగా ఘనత సాధించింది. ఇప్పటి వరకు నమోదైన అన్ని రికార్డులను దురంధర్-2 అధిగమించింది. ఈ చిత్రంలో ఆర్. మాధవన్, అర్జున్ రాంపాల్, సంజయ్ దత్, సారా అర్జున్, రాకేష్ బేడీ కీలక పాత్రల్లో నటించారు. గతేడాది డిసెంబర్ 5న విడుదలైన దురంధర్ ప్రపంచవ్యాప్తంగా రూ. 1,300 కోట్లు వసూలు చేసిన సంగతి తెలిసిందే. -
ధురంధర్ 2, ఉస్తాద్ భగత్ సింగ్.. ఓటీటీలోకి ఎప్పుడు?
తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం ఉగాది సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. మరోవైపు థియేటర్లలోకి ధురంధర్ 2, ఉస్తాద్ భగత్ సింగ్ ' సినిమాలు వచ్చేశాయి. పేరుకే హిందీ అయినప్పటికీ 'ధురంధర్'కి మన దగ్గర కూడా ఫుల్ క్రేజ్ కనిపిస్తోంది. మరోవైపు పవన్ చిత్రానికి అభిమానులు తప్పితే సగటు ఆడియెన్స్ కాస్త దూరంగానే ఉన్నట్లు కనిపిస్తున్నారు. సరే ఈ సంగతులు కాసేపు పక్కనబెడితే ఇంతకీ ఈ మూవీస్ ఓటీటీ స్ట్రీమింగ్ సంగతేంటి? ఎప్పుడు అందుబాటులోకి రావొచ్చు?(ఇదీ చదవండి: ఓటీటీలోకి సుప్రీత చేసిన తెలుగు హారర్ థ్రిల్లర్ సినిమా)ముందుగా 'ధురంధర్ 2' విషయానికొస్తే తొలి భాగం డిజిటల్ హక్కుల్ని నెట్ఫ్లిక్స్కి విక్రయించారు. ఇప్పుడు రిలీజైన సీక్వెల్ని మాత్రం నిర్మాణ సంస్థల్లో ఒకటైన జియో స్టూడియోస్కి చెందిన హాట్స్టార్కి ఇచ్చేశారు. మొదటి పార్ట్లానే ఈసారి కూడా థియేటర్లలోకి వచ్చిన 8 వారాల తర్వాతే స్ట్రీమింగ్ అవుతుంది. అంటే మే చివరి వారంలోనే 'ధురంధర్ 2' డిజిటల్గా అందుబాటులోకి వస్తుంది. అయితే దీన్ని థియేటర్లలోనే చూడాలని చాలామంది అంటున్నారు.మరోవైపు 'ఉస్తాద్ భగత్ సింగ్' విషయానికొస్తే డిజిటల్ హక్కుల్ని నెట్ఫ్లిక్స్కి అమ్మేశారు. అయితే ఇది ఐదు వారాల తర్వాత ఓటీటీలోకి రానుందని నిర్మాత చెప్పుకొచ్చారు. అంటే ఏప్రిల్ చివరి వారంలో పవన్ మూవీ స్ట్రీమింగ్ అయ్యే అవకాశముంటుంది. సోషల్ మీడియాలో వినిపించినట్లు ఇది 'తెరి' రీమేక్ అయితే కాదనే క్లారిటీ వచ్చింది. కాకపోతే రొటీన్ కమర్షియల్ పోలీస్ టెంప్లేట్ స్టోరీతోనే దీన్ని తెరకెక్కించారు. టాక్ అయితే నెగిటివ్గానే వస్తోంది. వీకెండ్ అయ్యేసరికి అసలు సంగతి ఏంటనేది తెలుస్తుంది.(ఇదీ చదవండి: 'ధురంధర్ 2' తెలుగు షోలన్నీ రద్దు.. ఏమవుతోంది?) -
'ధురంధర్ 2' తెలుగు షోలన్నీ రద్దు.. ఏమవుతోంది?
తెలుగు ప్రేక్షకులకు బ్యాడ్ న్యూస్. 'ధురంధర్ 2' మేకర్స్ హ్యాండ్ ఇచ్చేశారు. రిలీజ్ నాడు పడాల్సిన తెలుగు వెర్షన్ షోలన్నీ రద్దయిపోయాయి. ఈ మేరకు టికెట్స్ బుక్ చేసుకున్న వాళ్లందరికీ మెసేజులు వెళ్తున్నాయి. టికెట్ డబ్బులని తిరిగి ఇచ్చేస్తామని అందులో పేర్కొన్నారు. ఇంతకీ అసలేం జరుగుతోంది? తెలుగు షోలు ఎప్పటి నుంచి ఉండొచ్చు?(ఇదీ చదవండి: ‘ధురంధర్ 2’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్)గతేడాది డిసెంబరు తొలివారంలో వచ్చిన 'ధురంధర్'.. 50 రోజులకు పైనే థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమైంది. తర్వాత ఓటీటీలోకి వస్తే అక్కడ కూడా సూపర్ రెస్పాన్స్ వచ్చింది. తొలి పార్ట్ రిలీజైనప్పుడే సీక్వెల్.. మార్చి 19న థియేటర్లలోకి వస్తుందని క్లారిటీ ఇచ్చారు. హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ వెర్షన్ కూడా ఈసారి ఉంటాయని మాటిచ్చారు. కానీ ఇప్పుడది తప్పారు.18వ తేదీన సాయంత్రం 5 గంటల నుంచి తెలుగు షోలు ఉంటాయని చెప్పినప్పటికీ వాటిని రద్దు చేశారు. ఈ క్రమంలోనే దర్శకుడు ఆదిత్య ధర్.. రాత్రి 9 గంటల నుంచి ఉంటాయని పోస్ట్ పెట్టాడు. రాత్రి సంగతి పక్కనబెడితే తర్వాత అంటే 19వ తేదీ అయిన ఈ రోజు కూడా హైదరాబాద్లో తెలుగు వెర్షన్ షోలు రద్దయ్యాయి. డబ్బింగ్ ఇంకా పూర్తిగా జరగకపోవడం, చివరి నిమిషంలో హడావుడి లాంటివి సమస్యలుగా తెలుస్తోంది. ప్రస్తుతానికి బుక్ మై షోలో 20వ తేదీకి తెలుగు షోలు ఉన్నప్పటికీ.. అవి అయినా వేస్తారా లేదా అనేది సందేహమే?'ధురంధర్ 2' విషయానికొస్తే.. రెహమాన్ డెకాయిట్ (అక్షయ్ ఖన్నా) మరణంతో ధురంధర్ పార్ట్ 1 ముగుస్తుంది. ఆ తర్వాత ల్యారీకి తానే నాయకుడినని అర్షద్ పప్పు (అశ్విన్ ధర్)ప్రకటించుకుంటాడు. అన్నచావుకు కారణమైన అర్షద్ పప్పుపై రెహమాన్ సోదరుడు ఉజెయిర్ బలోచ్(డానిష్) కోపంతో రగిలిపోతుంటాడు. వీరిద్దరిని కాదని, ల్యారీని భారత సీక్రెట్ ఏజెంట్ హమ్జా(రణ్వీర్ సింగ్) తన గుప్పింట్లోకి తెచ్చుకొని, భారత ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ అజయ్ సన్యాల్(మాధవన్) అప్పజెప్పిన పనులన్నీ పూర్తి చేసుకొస్తుంటాడు. పాకిస్తాన్ మేజర్ ఇక్బాల్ (అర్జున్ రాంపాల్), ఎంపీ జమీల్ (రాకేష్ బేడీ) కూడా హమ్జాని గుడ్డిగా నమ్ముతారు. ఇలా పాక్ ఉగ్రవాద నాయకులందరిని నమ్మించి.. ఇండియాపై వాళ్లు చేసే కుట్రలన్నింటిని హమ్జా తిప్పికొడతాడు.అసలు భారత్పై పాన్ ఉగ్రవాద సంస్థలు చేసిన కుట్రలు ఏంటి? వాటిని తిప్పికొట్టే క్రమంలో హమ్జాకు ఎదురైన సమస్యలు ఏంటి? హమ్జా ఇండియన్ ఏజెంట్ అనే విషయం ఎలా బయటకు వచ్చింది? ఆ విషయం తెలిసిన తర్వాత మేజర్ ఇక్బాల్ (అర్జున్ రాంపాల్) ఏం చేశాడు?. పాకిస్తాన్లోని ఉగ్రవాద ముఠాలందరికి మార్గనిర్దేశం చేస్తున్న ‘బడే సాహెబ్ ’ ఎవరు? ఆపరేషన్ ధురంధర్ కోసం ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ అజయ్ సన్యాల్.. పంజాబ్లో జైలు జీవితం గడుపుతున్న జస్కరిత్ సింగ్ రంగీ(రణ్వీర్)నే ఎందుకు ఎంచుకున్నాడు? అతని నేపథ్యం ఏంటి? ఇతని కుటుంబానికి ఎమ్మెల్యే సుఖ్వెంధర్ చేసిన అన్యాయం ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.(ఇదీ చదవండి: 'ఉస్తాద్ భగత్ సింగ్' ట్విటర్ రివ్యూ.. సహనానికి పరీక్ష) -
పవన్ VS రణ్వీర్.. ఇది మూడోసారి
భారతీయ ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన రణ్వీర్ సింగ్ 'ధురంధర్ 2' సినిమా థియేటర్లలోకి వచ్చేసింది. ఈ మూవీ ఉన్నప్పటికీ.. తెలుగు రాష్ట్రాల వరకు పోటీగా రిలీజైన చిత్రం పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'. వీటి టాక్ ఏంటి? చూసిన వాళ్లు ఏమంటున్నారు? అనే విషయాల్ని పక్కనబెడితే పవన్ vs రణ్వీర్ పోటీ గురించి సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ నడుస్తోంది. గతంలోనూ ఈ హీరోలిద్దరూ బాక్సాఫీస్ దగ్గర పోటీపడ్డారు.(ఇదీ చదవండి: 'ఉస్తాద్ భగత్ సింగ్' ట్విటర్ రివ్యూ.. సహనానికి పరీక్ష)రణ్వీర్ సింగ్.. హిందీ సినిమాలే చేసినప్పటికీ తెలుగులోనూ కాస్తంత ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. చాన్నాళ్ల నుంచి ఇక్కడ కూడా ఇతడి మూవీస్ రిలీజయ్యాయి. గతంలో అంటే 2011లో పవన్ కల్యాణ్ 'పంజా' వచ్చినప్పుడే రణ్వీర్ 'లేడీస్ వర్సెస్ రిక్కీ బాల్' మూవీ కూడా వచ్చింది. వీటిలో పంజా ఫ్లాప్ కాగా రణ్వీర్ ఎబోవ్ యావరేజ్ అనిపించుకుంది. 2023లోనూ మళ్లీ వీళ్లిద్దరూ ఒకేరోజున చిత్రాల్ని రిలీజ్ చేశారు. పవన్ 'బ్రో' సినిమాతో రాగా రణ్వీర్ 'రాఖీ ఔర్ రాణి కీ ప్రేమ్ కహానీ'తో వచ్చాడు. ఇక్కడ సేమ్ సీన్ రిపీటైంది పవన్ మూవీ ఫ్లాప్ కాగా రణ్వీర్ హిట్ కొట్టాడు.ఇపుడు ముచ్చటగా మూడోసారి రణ్వీర్ వర్సెస్ పవన్ పోటీలో నిలిచారు. ఈసారి రణ్వీర్ 'ధురంధర్ 2' ఆధిపత్యమే కొనసాగేలా కనిపిస్తోంది. ఎందుకంటే 'ఉస్తాద్ భగత్ సింగ్'కి ప్రీమియర్ల నుంచే నెగిటాక్ వస్తోంది. కంటెంట్ మరీ ఔట్ డేటెడ్గా ఉందని అంటున్నారు. ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం 'ధురంధర్ 2' హవా తెలుగులోనూ గట్టిగానే ఉండొచ్చు.(ఇదీ చదవండి: ‘ధురంధర్ 2’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్) -
'ధురంధర్ 2'కి అల్లు అర్జున్ రివ్యూ.. ఏమన్నాడంటే?
రణ్వీర్ సింగ్ హీరోగా ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన సినిమా 'ధురంధర్'. గతేడాది డిసెంబరులో తొలి పార్ట్ రిలీజ్ కాగా.. ఇప్పుడు మూడు నెలలు తిరిగేసరికల్లా సీక్వెల్ వచ్చేసింది. నిన్నటి(మార్చి 18) నుంచి దేశవ్యాప్తంగా ప్రీమియర్లు పడ్డాయి. చూసిన ప్రతిఒక్కరూ అదిరిపోయిందని మాట్లాడుకుంటున్నారు. టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ కూడా ప్రీమియర్ చూసి తనదైన రివ్యూ ఇచ్చేశాడు. మూవీని ఆకాశానికెత్తేశాడు.(ఇదీ చదవండి: ‘ధురంధర్ 2’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్)'దేశభక్తి, స్వాగ్తో ఇప్పుడే 'ధురంధర్ 2' చూశాను. ప్రతి భారతీయుడిని గర్వంగా ఫీలయ్యేలా చేసింది. సినిమాలో క్లాప్స్ కొట్టే సందర్భాలెన్నో. చిత్రబృందానికి శుభాకాంక్షలు. మాధవన్ సహా నటీనటులు అందరూ అదరగొట్టేశారు. నీలాంటి భిన్నమైన యాక్టర్ దేశంలో ఉండటం గర్వకారణంగా ఉంది బ్రదర్ రణ్వీర్ సింగ్. ఆదిత్య ధర్.. మరోసారి బ్లాక్బస్టర్ కొట్టేశాడు. నీలాంటి దర్శకులు మన దేశంలో ఉన్నందుకు గర్వంగా ఉంది. షో రాకర్. ఇది ఇంటర్నేషనల్ స్వాగ్తో తీసిన భారతీయ కథ. జైహింద్' అని అల్లు అర్జున్ ట్వీట్ చేశాడు.మామ పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్' రిలీజైనప్పటికీ.. అల్లు అర్జున్ ముందుగా 'ధురంధర్ 2' చూసి ఏకంగా రివ్యూ ఇవ్వడం తెలుగు ప్రేక్షకుల్లో చర్చకు కారణమైంది. ఎందుకంటే పవన్ సినిమాకు ఎర్లీ మార్నింగ్ షోలు పడ్డాయి. మొత్తం నెగిటివ్ టాక్ వస్తోంది. అల్లు అర్జున్తో పాటు విజయ్ దేవరకొండ తదితరులు.. 'ధురంధర్ 2' సినిమాని బుధవారం సాయంత్రం అల్లు సినిమాస్ థియేటర్లో చూశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.(ఇదీ చదవండి: 'ఉస్తాద్ భగత్ సింగ్' ట్విటర్ రివ్యూ.. ఇలా అంటున్నారేంటి?) -
‘ధురంధర్ 2’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
సినిమా: ధురంధర్: ద రివేంజ్నటీనటులు: రణ్వీర్ సింగ్, మాధవన్, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, అక్షయ్ ఖన్నా, సారా అర్జున్ తదితరులుసంగీతం: శాశ్వత్ సచ్దేవ్సినిమాటోగ్రఫీ: వికాల్ నోవ్లఖాఎడిటర్: శివకుమార్ వి పనికర్రచన-దర్శకత్వం: ఆదిత్య ధర్నిర్మాతలు: జియో స్టూడియోస్, బీ62 స్టూడియోస్నిడివి: 229 నిమిషాలువిడుదల తేదీ: 19 మార్చి 2026గతేడాది డిసెంబరులో ఏ మాత్రం అంచనాల్లేకుండా వచ్చి సంచలనం సృష్టించిన సినిమా 'ధురంధర్'. సీక్వెల్ గురించి అప్పుడే క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు అదే మాటపై నిలబడి 'ధురంధర్: ద రివేంజ్'ని థియేటర్లలోకి తీసుకొచ్చేశారు. స్పై యాక్షన్ థ్రిల్లర్ జానర్లో తెరకెక్కిన ఈ సినిమా రెండో భాగాన్ని హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేశారు. ఇంతకీ ఈ చిత్రం ఎలా ఉంది? తొలి భాగాన్ని మించిపోయిందా లేదా అనేది రివ్యూలో చూద్దాం.కథేంటి?రెహమాన్ డెకాయిట్ (అక్షయ్ ఖన్నా) మరణంతో ధురంధర్ పార్ట్ 1 ముగుస్తుంది. ఆ తర్వాత ల్యారీకి తానే నాయకుడినని అర్షద్ పప్పు (అశ్విన్ ధర్)ప్రకటించుకుంటాడు. అన్నచావుకు కారణమైన అర్షద్ పప్పుపై రెహమాన్ సోదరుడు ఉజెయిర్ బలోచ్(డానిష్) కోపంతో రగిలిపోతుంటాడు. వీరిద్దరిని కాదని, ల్యారీని భారత సీక్రెట్ ఏజెంట్ హమ్జా(రణ్వీర్ సింగ్) తన గుప్పింట్లోకి తెచ్చుకొని, భారత ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ అజయ్ సన్యాల్(మాధవన్) అప్పజెప్పిన పనులన్నీ పూర్తి చేసుకొస్తుంటాడు. పాకిస్తాన్ మేజర్ ఇక్బాల్ (అర్జున్ రాంపాల్), ఎంపీ జమీల్ (రాకేష్ బేడీ) కూడా హమ్జాని గుడ్డిగా నమ్ముతారు. ఇలా పాక్ ఉగ్రవాద నాయకులందరిని నమ్మించి.. ఇండియాపై వాళ్లు చేసే కుట్రలన్నింటిని హమ్జా తిప్పికొడతాడు. అసలు భారత్పై పాన్ ఉగ్రవాద సంస్థలు చేసిన కుట్రలు ఏంటి? వాటిని తిప్పికొట్టే క్రమంలో హమ్జాకు ఎదురైన సమస్యలు ఏంటి? హమ్జా ఇండియన్ ఏజెంట్ అనే విషయం ఎలా బయటకు వచ్చింది? ఆ విషయం తెలిసిన తర్వాత మేజర్ ఇక్బాల్ (అర్జున్ రాంపాల్) ఏం చేశాడు?. పాకిస్తాన్లోని ఉగ్రవాద ముఠాలందరికి మార్గనిర్దేశం చేస్తున్న ‘బడే సాహెబ్ ’ ఎవరు? ఆపరేషన్ ధురంధర్ కోసం ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ అజయ్ సన్యాల్.. పంజాబ్లో జైలు జీవితం గడుపుతున్న జస్కరిత్ సింగ్ రంగీ(రణ్వీర్)నే ఎందుకు ఎంచుకున్నాడు? అతని నేపథ్యం ఏంటి? ఇతని కుటుంబానికి ఎమ్మెల్యే సుఖ్వెంధర్ చేసిన అన్యాయం ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే..ఉగ్రవాదాన్ని అంతం చేయడానికి ఒక జైలు ఖైదీని సీక్రెట్ ఏజెంట్గా పాకిస్తాన్కి పంపడం అనే కొత్త పాయింటే ధురంధర్ విజయానికి కారణం అయింది. ఇంతవరకు వచ్చిన స్పె యాక్షన్ సినిమాలకు ధురంధర్కు మత్య ఉన్న తేడా అదే. దానికి తోడు యాక్షన్ సన్నివేశాలు, బీజీఎం అదిరిపోవడంతో రికార్డు స్థాయి కలెక్షన్స్ వచ్చాయి. ఆ చిత్రానికి కొనసాగింపుగా వచ్చిన ధురంధర్ : ది రివెంజ్ కూడా అదే రేంజ్లో ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు. యాక్షన్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్తో పాటు ఎమోషన్కి కూడా పెద్ద పీట వేశారు. పార్ట్ 1 చూసిన వాళ్లు సినిమా ప్రారంభం నుంచే ధురంధర్ ప్రపంచంలోకి వెళ్లిపోతారు. చూడనివారికి కూడా కథను చాప్టర్ల వారిగా విడగొట్టి.. అర్థమయ్యేలా తెరపై చూపించాడు దర్శకుడు. అయితే పార్ట్ 1 చూస్తేనే కొన్ని పాత్రలకు తాలుకు పవర్ తెలిసి..తర్వాత ఏం జరుగుతుందో ఊహించొచ్చు.చివరిలో వచ్చే కొన్ని ట్విస్టులను మాత్రం ఊహించలేం. అవి థ్రిల్కి గురి చేస్తాయి. పార్ట్1 కంటే నిడివి ఎక్కువైనా.. ఎక్కడా బోర్ కొట్టదు.హమ్జా పాత్ర ప్లాష్బ్యాక్తో సినిమా కథ ప్రారంభం అవుతుంది. తన కుటుంబానికి జరిగిన అన్యాయంపై హీరో పగ తీర్చుకునే క్రమంలో వచ్చే సన్నివేశాలు అయితే ఒళ్లు జలదరించేలా ఉన్నాయి. అక్కడ నుంచి మొదలు సినిమా ఎండింగ్ వరకు యాక్షన్ సీన్స్ను ఓ రేంజ్తో తీర్చిదిద్దారు. ల్యారీ పీఠం దక్కించుకునేందకు హమ్జా ఆడే మైండ్ గేమ్ అదిరిపోతుంది. ఉగ్రవాదులకు అంతం చేసేందుకు వేసే ఎత్తులు థియేటర్స్లో చప్పట్లు కొట్టించేలా ఉంటాయి. 2016లో జరిగిన నోట్ల రద్ధు ఘటనను కూడా ఈ కథలో ప్రస్తావించారు. నోట్ల రద్దు సరైన నిర్ణయం అనేలా ఈ చిత్రంలో చూపించారు. అలాగే మాఫీయా డాన్ దావూద్ని కూడా ఈ కథకు ముడిపెట్టడం ఆసక్తిరేకెత్తించే అంశం. ఫస్టాఫ్ వరకు కాస్త స్లోగా అనిపించినా.. ఇంటర్వెల్ ట్విస్ట్ మాత్రం అదిరిపోతుంది. ద్వితియార్థంలో ఏం జరుగుందా అనే ఆసక్తిని ప్రేక్షకులను కలిగించేలా ఇంటర్వెల్ కట్ చేశారు. ఇక సెకండాప్ మొత్తం కథనం పరుగులు పెడుతుంది. హమ్జాపై ఎన్సీ అస్లాం చౌదరిపై అనుమానం రావడంతో కథనంపై ఆసక్తి పెరుగుతుంది. హమ్జా భారత ఏజెంట్ అని తెలిసిన తర్వాత ఏం జరుగుతుందా అనే క్యూరియాసిటీ ప్రేక్షకుల్లో కలుగుతుంది. ఇక చివరి 30 నిమిషాల్లో వచ్చే ట్విస్టులు అదిరిపోతాయి. క్లైమాక్స్ ఎమోషనల్గా సాగుతుంది. ఎవరెలా చేశారంటే..సీక్రెట్ ఏజెంట్ హమ్జా పాత్రలో రణ్వీర్ సింగ్ ఒదిగిపోయాడు. యాక్షన్ సీన్లతో పాటు ఎమోషనల్ సన్నివేశాల్లోనూ అదరగొట్టేశాడు. పాకిస్తాన్ మేజర్ ఇక్బాల్గా అర్జున్ రాంపాల్ అద్భుతంగా నటించాడు. ఎస్పీ చౌదరిగా నటించిన సంజయ్ దత్ నిడివి కాస్త తక్కువే. ఆయన పాత్ర ముగింపు బాగుంటుంది. ఐబీ చీఫ్ అజయ్ సన్యాల్గా మాధవన్ తెరపై కనిపించేది తక్కువే అయినా.. గుర్తిండిపోయేలా నటించాడు. జమీల్ జమాల్గా నటించిన రాకేశ్ బేడి నవ్వులు పూయించడంతో పాటు థ్రిల్లింగ్కి కూడా గురిచేశాడు. సారా అర్జున్ పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేదు. మిగిలినవారంతా బాగానే చేశారు. సాంకేతికంగా సినిమా చాలా బాగుంది. శాశ్వత్ సచ్దేవ్ బీజీఎం ఈ సినిమాకు మరో ప్రధాన బలం. తనదైన నేపథ్య సంగీతంతో కొన్ని సీన్లకు ప్రాణం పోశాడు. పోరాట ఘట్టాలు వాస్తవికంగా తెరకెక్కించారు. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి. - అంజి శెట్టె, సాక్షి వెబ్డెస్క్ -
టాలీవుడ్ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. తెలుగులోనూ ప్రీమియర్స్
సినీ ఇండస్ట్రీలో ఇప్పుడంతా దురంధర్ ఫీవర్ నడుస్తోంది. ఇప్పటికే ప్రీమియర్స్ పడగా.. థియేటర్లు దద్దరిల్లిపోతున్నాయి. ఇవాళ సాయంత్రం కేవలం హిందీలో మాత్రమే ప్రీమియర్స్ ప్రదర్శించారు. అయితే తెలుగు ఆడియన్స్ కూడా ప్రీమియర్స్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో దురంధర్ టీమ్ గుడ్ న్యూస్ చెప్పింది.ఈ రోజు రాత్రి 9 గంటల నుంచే తెలుగుతో పాటు తమిళంలోనూ ప్రీమియర్స్ ప్రారంభం అవుతాయని ప్రకటించింది. ఈ విషయాన్ని డైరెక్టర్ ఆదిత్య ధర్ వెల్లడించారు. దీంతో టాలీవుడ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. అయితే కన్నడ, మలయాళ భాషల్లో మాత్రం రేపటి నుంచి మాత్రమే ప్రదర్శిస్తామని తెలిపారు. సాంకేతిక సమస్యల వల్లే ప్రీమియర్స్ ఆలస్యమైనట్లు పేర్కొన్నారు.గతేడాది రిలీజైన దురంధర్ సూపర్ హిట్ కావడంతో ఈ మూవీ భారీ అంచనాలు నెలకొన్నాయి. డిసెంబర్ 5న విడుదలైన ఈ స్పై థ్రిల్లర్ బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.1300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. దీంతో సీక్వెల్పై అభిమానుల్లో మరింత ఆసక్తి పెరిగింది. -
దురంధర్-2 ట్విటర్ రివ్యూ.. ఆడియన్స్ ఏమన్నారంటే?
రణ్వీర్ సింగ్ హీరోగా వచ్చిన స్పై యాక్షన్ థ్రిల్లర్ దురంధర్. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించింది. ఈ చిత్రానికి కొనసాగింపుగా దురంధర్-2 ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. కేవలం మూడు నెలల వ్యవధిలోనే సీక్వెల్ను థియేటర్లలో రిలీజ్ చేశారు. ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ ప్రీమియర్ షోలు ఇప్పటికే ఓవర్సీస్తో పాటు ఇండియాలోనూ ప్రదర్శించారు.ఈ మూవీ చూసిన ఆడియన్స్ సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలు పంచుకుంటున్నారు. ప్రముఖ సినీ క్రిటిక్ తరణ్ ఆదర్శ్ సైతం ఈ మూవీపై తన రివ్యూ రాసుకొచ్చారు. దురంధర్-2 ఒక మాస్టర్ పీస్ అని పోస్టులు పెడుతున్నారు. ఇంటర్వెల్ సీక్వెన్స్ స్టన్నింగ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. దురంధర్-2 ఫస్ట్ హాఫ్ బ్లాక్బస్టర్ అంటూ ఆడియన్స్ ట్వీటిర్ వేదికగా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. బిగ్గెస్ట్ బ్లాక్బస్టర్ ఖాయమని ప్రేక్షకులు ట్వీట్స్ పోస్ట్ చేస్తున్నారు. It's a stunning interval now✅Finally watched the Bade Saab 🔔Wait here for the complete #Dhurandhar2Review .#Dhurandhar2 #DhurandharTheRevenge . pic.twitter.com/8zk7CEhmkA— Always Bollywood (@AlwaysBollywood) March 18, 2026 BLOCKBUSTER 🔥#Dhurandhar2 #Dhurandhar2Review#DhurandharTheRevenge pic.twitter.com/j14czkhBWh— ◔‿◔ (@KhusshRaho) March 18, 2026 RANVEER SINGH 🫡Radiant-Relentless-Roaring-Resilient-Raw 👑🔥#Dhurandhar2 #DhurandharTheRevenge #Dhurandhar2Review @RanveerOfficial @AdityaDharFilms pic.twitter.com/65jgu2Bmy4— Shikhar Negi (@ImshikharNegi) March 18, 2026 #Dhurandhar2 crushing cringe Bollywood #DhurandharTheRevenge #Dhurandhar2review pic.twitter.com/Hy83od6XCR— Viral (@drviral1123) March 18, 2026 Ohhh mannnBLOCKBUSTER 1ST HALFThis is not going to stop soonThe opening sequence Jassi's back storyAnd many things Don't want to spoil it for u guyzzBut this is a Box office Tsunami#DhurandharTheRevengePremiere#Dhurandhar2Review Bgm is a hit miss because we are spoiled— Aarav jain (@sanidhya_jain18) March 18, 2026 -
'ధురంధర్ 2' సినిమా.. HD ఫొటోలు
-
'ధురంధర్ 2' రెమ్యునరేషన్ డీటైల్స్.. ఎవరికి ఎన్ని కోట్లు?
స్పై యాక్షన్ థ్రిల్లర్ జానర్లో ట్రెండ్ సెట్ చేసిన 'ధురంధర్' నుంచి ఇప్పుడు సీక్వెల్ వచ్చేసింది. దేశవ్యాప్తంగా ప్రీమియర్ షోలు పడ్డాయి. ప్రింట్స్ టైంకి రాకపోవడంతో తెలుగు వెర్షన్ ప్రీమియర్స్ మాత్రం రద్దయ్యాయి. గురువారం ఉదయం నుంచి తెలుగు షోలు యధావిధిగా స్క్రీనింగ్ కానున్నాయి. ఇప్పటికైతే మూవీపై ఓ రేంజ్ బజ్ ఉంది. దానికి తోడు దర్శకుడు కూడా చివరివరకు కూర్చోండి, ట్విస్టులు బయటపెట్టొద్దని చెప్పడం ఆసక్తికరంగా అనిపిస్తోంది. మరోవైపు సీక్వెల్ కోసం నటీనటులు తీసుకున్న రెమ్యునరేషన్ వివరాలు కూడా వైరల్ అవుతున్నాయి.(ఇదీ చదవండి: 'ధురంధర్' పూర్తి స్టోరీ.. సీక్వెల్ చూడటానికి ముందు మరోసారి)మిగతా పాన్ ఇండియా సినిమాల్లా 'ధురంధర్' రెండు భాగాల షూటింగ్స్ వేర్వేరుగా చేయలేదు. మొత్తం ఒకేసారి కలిపి తీసేశారు. గత నెలలో ప్యాచ్ వర్క్స్ లాంటివి చేశారు. అయితే రెండు భాగాలకు కలిపి నటీనటులకు ఒకేసారి రెమ్యునరేషన్స్ ఇచ్చేసినట్లు తెలుస్తోంది. హమ్జా అలీ, జస్కీరాత్ సింగ్ అనే రెండు పాత్రలు చేసిన రణ్వీర్ సింగ్కి అత్యధికంగా రూ.40-50 కోట్ల వరకు ఇచ్చినట్లు తెలుస్తోంది.రణ్వీర్ కంటే ఎక్కువగా మూవీలో హైలైట్ అయింది అక్షయ్ ఖన్నా చేసిన రహమాన్ డకాయిట్ పాత్ర. తొలి భాగంలోనే రహమాన్ రోల్ ముగిసింది. కానీ సీక్వెల్లో కొన్ని ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్లో ఈ పాత్ర కనిపించనుందట. మొత్తంగా దీనికోసం అక్షయ్ ఖన్నాకు రూ.5 కోట్ల వరకు పారితోషికం ఇచ్చినట్లు సమాచారం.ఎస్పీ అస్లాం చౌదరిగా అదిరిపోయే ఫెర్ఫార్మెన్స్ ఇచ్చిన సంజయ్ దత్.. మొత్తంగా రూ.10 కోట్ల వరకు పారితోషికం అందుకున్నాడట. ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ అజయ్ సన్యాల్ పాత్ర చేసినందుకుగానూ మాధవన్కి రూ.9 కోట్లు, మేజర్ ఇక్బాల్ అనే విలనీ పాత్రలో నటించిన అర్జున్ రాంపాల్, హీరోయిన్గా చేసిన సారా అర్జున్ తలో రూ.కోటి రెమ్యునరేషన్గా అందుకున్నారట. ఇక దర్శకుడు, నిర్మాత అయిన ఆదిత్య ధర్ పారితోషికం గురించి అయితే ఎక్కడా వివరాలు లేవు. కానీ ఈ మూవీ వల్ల ఆదిత్య ధర్ బ్రాండ్ ఇమేజ్ చాలా పెరిగిపోయింది. తర్వాత చేయబోయే చిత్రం ఏంటో తెలియనప్పటికీ.. ఒకవేళ ఏ నిర్మాత అప్రోచ్ అయినా సరే భారీ రెమ్యునరేషన్ అయితే డిమాండ్ చేయడం గ్యారంటీ.'ధురంధర్' విషయానికొస్తే.. మన దేశంపై పాకిస్తాన్ చేస్తున్న వరస దాడులు ఆగాలంటే ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో సహా పెకిలించాలని భారత ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ అజయ్ సన్యాల్ (మాధవన్) భావిస్తాడు. ఆపరేషన్ ధురంధర్కి శ్రీకారం చుడతాడు. ఇందులో భాగంగా జైలుజీవితం గడుపుతున్న ఓ కుర్రాడిని ఏజెంట్ హమ్జా(రణ్వీర్ సింగ్)ని మారుపేరుతో పాకిస్తాన్కి పంపిస్తాడు. జ్యూస్ షాపులో పనిచేసే దగ్గర నుంచి రహమాన్ డకాయిట్ అనే కరుడుగట్టిన గ్యాంగ్స్టర్కి ఆత్మీయుడు అయ్యేంతవరకు ఎలా ఎదిగాడు? ఈ ప్రయాణంలో ఎదురైన సవాళ్లేంటి? చివరకు ఏమైందనేదే స్టోరీ. రహమాన్ డకాయిట్ని హమ్జా చంపడంతో తొలి భాగం ముగిసింది. రెండో పార్ట్లో హమ్జా.. లయారీకి ఎలా డాన్ అయ్యాడు? భారత్ని దాడులు చేసిన మిగతా ఉగ్రవాదుల్ని ఎలా మట్టుబెట్టాడనేది చూపించబోతున్నారు.(ఇదీ చదవండి: 'ధురంధర్' తెలుగు ఫ్యాన్స్కి బ్యాడ్ న్యూస్) -
'ధురంధర్' తెలుగు ఫ్యాన్స్కి బ్యాడ్ న్యూస్
'ధురంధర్' సినిమా గతేడాది డిసెంబరులో థియేటర్లలోకి వచ్చింది. దేశవ్యాప్తంగా అద్భుతమైన ఆదరణ దక్కించుకుంది. తర్వాత ఓటీటీలోకి వచ్చిన తర్వాత అదే రేంజ్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది. తొలి భాగం విడుదలైన మూడు నెలలకు ఇప్పుడు సీక్వెల్ రెడీ అయిపోయింది. ముందే చెప్పినట్లు మార్చి 19నే అంటే రేపటి నుంచే మూవీని రిలీజ్ చేస్తున్నారు. అయితే ఈ క్రమంలోనే తెలుగు సినీ ప్రేక్షకులకు అనుకోని చేదువార్త ఎదురైంది.(ఇదీ చదవండి: నోరు జారా.. క్షమించండి: ఉస్తాద్ భగత్ సింగ్ నటుడు)'ధురంధర్ 2' చిత్రం లెక్క ప్రకారం గురువారం(మార్చి 19) రిలీజ్ అవుతున్నప్పటికీ.. ముందు రోజు సాయంత్రం 5 గంటల నుంచే ప్రీమియర్స్ ప్లాన్ చేశారు. హిందీతో పాటు దక్షిణాది భాషల్లోనూ ఉంటుందని ప్రకటించారు. అందుకు తగ్గట్లే టికెట్స్ కూడా విక్రయించారు. కానీ చివరి నిమిషంలో హడావుడి వల్ల తెలుగు, తమిళ ప్రింట్స్ టైంకి డెలివరీ కాలేదు. దీంతో బుధవారానికి సంబంధించి హిందీ వెర్షన్ మాత్రమే ప్రీమియర్స్ వేస్తున్నారు.తెలుగు, తమిళ వెర్షన్స్.. బుధవారానికి సంబంధించిన షోలు రద్దయ్యాయి. డబ్బులు కూడా రీఫండ్ చేసేశారు. ఇకపోతే గురువారం ఉదయం నుంచి యధావిధిగా తెలుగు వెర్షన్ షోలు పడనున్నాయి. మరోవైపు దర్శకుడు ఆదిత్య ధర్.. మూవీ గురించి ఆసక్తికర పోస్ట్ పెట్టాడు. ట్విస్టులు బయటపెట్టొద్దని చెబుతూనే చివరి వరకు థియేటర్లలోనే ఉండాలని రాసుకొచ్చాడు. దీంతో మూడో భాగం గురించి హింట్ ఇస్తున్నాడా అని మాట్లాడుకుంటున్నారు.'ప్రియమైన 'ధురంధర్' ఫ్యామిలీ.. సినిమాని మీరెంతో ప్రేమించారు. ప్రతి చిన్న అంశాన్ని గుర్తించి మెచ్చుకున్నారు. మళ్లీ మళ్లీ చూసి ఎవరూ గుర్తించలేరనుకునే వాటిని కూడా గుర్తించారు. ఈ ప్రయాణంలో సినిమా మీది అయింది. తర్వాత ప్రపంచానిది కూడా అయింది. 'ధురంధర్: ద రివేంజ్'తో మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాం. భావోద్వేగానికి గురిచేస్తాం. రెడీగా ఉండండి. అందరితో కలిసి ప్రతి ట్విస్ట్, ఎమోషన్ థియేటర్ లోనే అనుభూతి చెందండి. దయచేసి సినిమా చూసిన తర్వాత ట్విస్టులని చెప్పేయకండి. ఎండ్ క్రెడిట్స్ అయ్యేంతవరకు సీట్ల నుంచి లేచి వెళ్లిపోకండి' అని డైరెక్టర్ ఆదిత్య ధర్ చెప్పుకొచ్చాడు.(ఇదీ చదవండి: 'ధురంధర్' పూర్తి స్టోరీ.. సీక్వెల్ చూడటానికి ముందు మరోసారి)🙏🧿♥️#DhurandharTheRevenge releases worldwide on 19 March, on Gudi Padwa, Ugadi, and Eid.Hindi | Telugu | Tamil | Kannada | Malayalam @ranveersingh @rampal72 @duttsanjay @actormaddy #AkshayeKhanna @saraarjunn @therakeshbedi @adityadharfilms #JyotiDeshpande @dhar_lokesh… pic.twitter.com/wgO61vrUUQ— Aditya Dhar (@AdityaDharFilms) March 18, 2026 -
'ధురంధర్' పూర్తి స్టోరీ.. సీక్వెల్ చూడటానికి ముందు మరోసారి
కొన్ని సినిమాలు బాక్సాఫీస్ దగ్గర అద్భుతాలు చేస్తాయి. అలాంటి వాటిలో 'ధురంధర్' ఒకటి. రణ్వీర్ సింగ్ హీరోగా ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఇది. గతేడాది డిసెంబరులో రిలీజయ్యేంత వరకు ఇదో చిత్రం ఉందని కూడా చాలామందికి తెలీదు. ఎప్పుడైతే థియేటర్లలోకి వచ్చిందో సరికొత్త రికార్డులు సృష్టించింది. ఇప్పుడు మూడు నెలలు తిరిగేసరికల్లా సీక్వెల్ రెడీ చేశారు. ఈ రోజే(మార్చి 18) ప్రీమియర్ షోలు పడనుండగా.. రేపటి నుంచి రెగ్యులర్ షోలు వేయనున్నారు. ఈ సందర్భంగా అసలు తొలి భాగంలో ఏం జరిగింది? సీక్వెల్లో ఏం జరగొచ్చనేది చూద్దాం.'ధురంధర్' పూర్తి స్టోరీ30 డిసెంబరు 1999, అఫ్గానిస్తాన్లోని కాందహార్ ఎయిర్పోర్ట్లో భారతదేశానికి చెందిన విమానాన్ని హైజాక్ చేసిన ఐఎస్ఐ వాళ్లు.. ప్రయాణికుల్ని బందీలుగా చేశారు. మన దగ్గర బందీగా ఉన్న 36 మంది టెర్రరిస్టులు రిలీజ్ చేస్తే గానీ జనాల్ని వదలం అనే దగ్గర నుంచి కేవలం ముగ్గురిని విడుదల చేస్తే చాలు అనేంత వరకు వస్తారు. అప్పుడు విదేశాంగ శాఖ మంత్రి దేవరత కపూర్, ఇంటెలిజన్స్ బ్యూరో చీఫ్ అజయ్ సన్యాల్(మాధవన్).. విమానంలో ఉన్న జనాలకు ధైర్యం ఇచ్చేందుకు వస్తారు. అయితే ఐఎస్ఐ వాళ్లలో ఒకడు.. మన దేశాన్ని కించపరుస్తూ అజయ్ సన్యాల్తో దారుణంగా మాట్లాడుతాడు. కానీ మనోడు ఒకడు పాకిస్తాన్లోకి వెళ్లి అక్కడున్న గ్యాంగ్స్ ని మట్టుబెట్టేందుకు 'ధురంధర్' అనే మిషన్ ఉందని అజయ్ సన్యాల్.. విదేశాంగ శాఖమంత్రితో చెబుతాడు. కానీ అదంతా చాలా టైమ్ తీసుకునే మిషన్ అని గ్రీన్ సిగ్నల్ ఇవ్వరు.కట్ చేస్తే 13 డిసెంబరు 2001లో పార్లమెంట్పై దాడి జరుగుతుంది. కాందహార్ హైజాక్లో భాగమైన ఓ టెరర్రిస్ట్.. దీనికి నాయకత్వం వహిస్తాడు. కొందరు పోలీస్ ఆఫీసర్లని చంపేస్తారు. దొరికిపోయే టైంకి ఆత్మాహుతి దాడి చేసుకుని వాళ్లంతా చనిపోతారు. ఈ దెబ్బకు ప్రభుత్వం షేక్ అయింది. సహనం కోల్పోయింది. అందుకే అజయ్ సన్యాల్ చెప్పిన 'ధురంధర్' ఐడియాకు ఓకే చెబుతారు. కట్ చేస్తే 2004లో మన దేశ ఏజెంట్ హంజా అలీ మజారీ(రణ్వీర్ సింగ్) తన ప్రయాణాన్ని మొదలుపెడతాడు. నేరుగా పాకిస్తాన్కి వెళ్లకుండా ఆఫ్గానిస్తాన్ మీదుగా పాక్లోని లయారీకి చేరుకుంటాడు. అక్కడికి వెళ్లిన తర్వాత హంజా.. ఆలం జ్యూస్ సెంటర్ నడుపుతున్న మన దేశానికి చెందిన మరో ఏజెంట్ ఆలం భాయ్ షాపులో పనికి చేరతాడు. ఓ రోజు సాల్ట్ ఛాయ్ తాగుతూ.. లయారీ టౌన్ జియో పాలిటిక్స్ అంతా వివరిస్తాడు.లయరీని ఏలుతున్న బాబు డకాయిట్ అక్రమ సంతానం రహమాన్ డకాయిట్ (అక్షయ్ ఖన్నా). ఈ విషయం చిన్నప్పుడే రహమాన్కి తెలియడంతో సొంత తల్లిని చంపేసి సవతి తండ్రికి దూరంగా ఉంటాడు. తన సొంత సామ్రాజ్యాన్ని సృష్టించుకుంటాడు. తన కజిన్ ఉజైర్ బలూచ్ తో కలిసి ఆయుధాల అక్రమ రవాణా, రమ్మీ క్లబ్, కిడ్నాపులు, రాజకీయ హత్యలు.. ఇలా అన్ని దారుణాలు చేస్తూ కరాచీ అండర్ వరల్డ్ కి డాన్ లా తయారయ్యాడు. రహమాన్ కి ఇద్దరు కొడుకు నయిమ్, ఫైజల్. రహమాన్ అండతో స్థానిక ఎన్నికల్లో రెండుసార్లు గెలిచిన పాకిస్తానీ అవామీ పార్టీ నాయకుడు జమీల్. కానీ రహమాన్ గ్యాంగ్ కి వ్యతిరేకంగా ముస్లిం మూమెంట్ పార్టీ.. బాబు డకాయిట్, అర్షద్ పప్పు చేతిలో ఉంటుంది. బాబు డకాయిట్ కి పక్షవాతం రావడంతో రహమాన్ ని ఎదుర్కొనేందుకు అర్షద్ తో చేతులు కలుపుతాడు. హంజా.. అక్కడే పనిచేసుకుంటూ ఉంటే కుదరదు కాబట్టి ఈ రెండు గ్యాంగ్స్ లో ఏదో ఒకదానిలో చేరేందుకు ప్లాన్ వేస్తాడు. వీళ్లకు బాబు డకాయిట్ గ్యాంగ్ లో ఉన్న మరో ఏజెంట్ సాయం చేస్తాడు. ఓ పెళ్లిలో రహమాన్ కొడుకులపై బాబు డకాయిట్ గ్యాంగ్ దాడి చేయడానికి ప్లాన్ చేస్తున్నారనే సమాచారాన్ని సదరు ఏజెంట్.. హంజాకి చెబుతాడు.అనుకున్నట్లే ఆ పెళ్లిలో రహమాన్ కొడుకులపై బాబు-అర్షద్ గ్యాంగ్ దాడి చేస్తారు. ఇందులో రహమాన్ పెద్ద కొడుకు నయిమ్ చనిపోతాడు. ఇతడిని కాపాడి, రహమాన్ గ్యాంగ్లో హంజా చేరాలనేది ప్లాన్. కానీ పిల్లాడు చనిపోయినా సరే దాన్ని కూడా తనకు అవకాశంగా మార్చుకుని రమమాన్కి హంజా దగ్గరవుతాడు. డబ్బులు ఇస్తానని చెబితే వద్దని.. తనని గ్యాంగ్లో చేర్చుకోమంటాడు. అలా రహమాన్ గ్యాంగ్లో హంజా జాయిన్ అవుతాడు. ఎన్నికల వరకు ఎలాంటి ప్రతీకారాలు వద్దని జమీల్.. రహమాన్కి చెప్పడంతో అంతా సైలెంట్ అవుతాడు. కానీ ఓ రోజు హంజా.. ప్రతీకారం గురించి మాట్లాడటంతో బాబు డకాయిట్ని నడిరోడ్డుపై రహమాన్ దారుణంగా చంపుతాడు.2007లో పీఏపీ పార్టీ 3 లక్షల ఓట్ల మెజార్టీతో గెలుస్తుంది. రహమాన్ ఫాలోయింగ్ జనాల్లో చాలా పెరిగిపోయింది. ఓ రోజు పార్టీ ఫంక్షన్ లో ఖనానీ బ్రదర్స్.. రహమాన్ ని కలుస్తారు. వీళ్లలో ఒకడు కొత్త రాజకీయ పార్టీ పెట్టాలని రహమాన్ కి సలహా ఇస్తాడు. మరోవైపు హంజా.. జమీల్ కూతురు యలీనాని ప్రేమలో పడేస్తాడు. ఈలోపు ఖనానీ బ్రదర్స్, మన రూ.500,రూ.1000 నోట్లని ప్రింట్ చేసే ప్లేట్లు సంపాదించారని అజయ్ సన్యాల్ కి తెలుస్తోంది. ఇది ఎలా జరిగిందో కనుక్కోమని అజయ్ సన్యాల్ తన తోటి అధికారికి చెబుతాడు. మరోవైపు ఐఎస్ఐ చీఫ్ మేజర్ ఇక్బాల్, రహమాన్ కలిసేలా ఖనానీ బ్రదర్స్ ఏర్పాటు చేస్తారు. తనకు గన్స్ కావాలని, కానీ వాటిపై మేడిన్ అమెరికా, మేడిన్ రష్యా అని ఉండాలని చెబుతాడు. ఇలానే ఎందుకంటే రేప్పొద్దున ఎవరైనా దొరికిపోతే పాకిస్తాన్ని ఎవరూ పాయింట్ అవుట్ చేయకూడదనేది మేజర్ ఇక్బాల్ ప్లాన్. అలానే రహమాన్కి రాజకీయంగానూ సాయం చేస్తానని చెప్పడంతో డీల్కి ఓకే చెబుతాడు.ఆ తర్వాత రహమాన్.. ఇక్బాల్కి గన్స్ అందజేస్తాడు. తర్వాత కొన్నిరోజులకు ముంబైలోని తాజ్ హోటల్లో దాడులు జరుగుతాయి. దీనికి కారణం తానే అనుకున్న హంజా.. రహమాన్ ని చంపే అవకాశం కోసం ఎదురుచూస్తుంటాడు. మరోవైపు తను అధికారం ఎక్కడ కోల్పోతానో అని భయపడిన జమీల్.. రహమాన్ని కట్టడి చేసేందుకు ఎస్పీ అస్లాం చౌదరిని రంగంలోకి దింపుతాడు. రహమాన్ కి నమ్మకస్తుడిగా ఉన్న హంజా.. జమీల్, ఎస్పీ అస్లాం చౌదరిలతో చేతులు కలిపి చివరకు రహమాన్నే చంపేస్తాడు. అక్కడితో తొలి భాగాన్ని ముగించారు.రెండో భాగంలో స్టోరీ ఏం ఉండనుంది?మరి రహమాన్ చనిపోయిన తర్వాత లయారీని హమ్జా ఎలా శాసించాడు? రహమన్ సోదరుడు ఉజైర్ బలూర్ ఏమయ్యాడు? అతడిని హమ్జా ఏం చేశాడు?అసలు హమ్జా అలియాస్.. జస్కీరాత్ సింగ్ రంగీ.. మన దేశంలో ఉన్నప్పుడు ఎందుకు జైలుకెళ్లాడు? ఏం నేరం చేశాడు? ఇతడినే ఎందుకు గూఢచారిగా పంపించారు?తొలి భాగంలో హమ్జాని ఎవరు గుర్తుపట్టలేదు. కానీ రెండో భాగంలో అది బయటపడుతుందా? ఒకవేళ ప్రేమించి పెళ్లి చేసుకున్న యలీనాకి ఈ విషయం తెలిసిందా?ఐఎస్ఐకి చెందిన మేజర్ ఇక్బాల్కి హమ్జా దొరికేస్తాడా? రహమాన్ని చంపేందుకు హమ్జాతో చేతులు కలిపిన ఎస్పీ అస్లాం చౌదరి.. హమ్జాని ఏమైనా అడ్డుకున్నాడా?స్వయానా అల్లుడే.. భారతీయ గూఢచారి అని జమీల్ కి ఏమైనా తెలిసిందా? ఒకవేళ తెలిస్తే ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు?తొలి భాగంలో ఎక్కువగా వినిపించిన బడే సాహెబ్.. సీక్వెల్లో కనిపిస్తాడా? లేదంటే దీన్ని మూడో భాగం కోసం ఏమైనా దాస్తారా? ఇలా చాలా ప్రశ్నలు మిగిలిపోయాయి. వీటన్నింటికి 'ధురంధర్ 2'లో సమాధానాలు దొరుకుతాయా అనేది చూడాలి? -
'ధురంధర్ 2'.. మన దగ్గర ఇలా అక్కడ మరోలా
లెక్క ప్రకారం ఈ నెలలో చాలానే పాన్ ఇండియా సినిమాలు రావాలి. కానీ చాలావరకు అవన్నీ వాయిదా పడటంతో చివరకు 'ధురంధర్ 2' మాత్రమే రేసులో మిగిలింది. ఈ గురువారం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. దేశమంతటా దీనిపై హైప్ బీభత్సంగా ఉంది. ప్రీమియర్, రెగ్యులర్ షోల టికెట్స్ వేగంగా బుక్ అయిపోతున్నాయి. అయితే ఓ విషయం మాత్రం ఆసక్తికరంగా అనిపిస్తోంది.(ఇదీ చదవండి: బ్యాడ్ సెంటిమెంట్.. టెన్షన్లో పవన్ ఫ్యాన్స్!)గతేడాది డిసెంబరులో అంటే మూడు నెలల క్రితం 'ధురంధర్' తొలి పార్ట్ రిలీజైనప్పుడు ఏ మాత్రం హైప్ లేదు. ఎప్పుడైతే థియేటర్లలోకి వచ్చిందో మౌత్ టాక్ వల్ల పాన్ ఇండియా లెవల్లో టాక్ ఆఫ్ ద టౌన్ అయిపోయింది. ఈ మూవీ చివరలో చెప్పినట్లుగానే మార్చి 19నే ఇప్పుడు సీక్వెల్ విడుదల చేస్తున్నారు. తొలి భాగం దాదాపు మూడున్నర గంటల నిడివి కాగా.. ఇప్పుడు మరింత నిడివితో సీక్వెల్ రాబోతుంది.'ధురంధర్: ద రివేంజ్' నిడివి మన దేశంలో మూడు గంటల 49 నిమిషాలు కాగా.. ఓవర్సీస్లో మాత్రం 3 గంటల 55 నిమిషాలు. అంటే మన కంటే విదేశీ ప్రేక్షకులు ఆరు నిమిషాల పాటు అదనంగా ఉండే ఫుటేజ్ చూడనున్నారనమాట. రిలీజ్ 19నే అయినప్పటికీ ముందురోజు సాయంత్రం నుంచి దేశవ్యాప్తంగా ప్రీమియర్లు పడనున్నాయి. ముంబై, బెంగళూరు లాంటి నగరాలతో పోలిస్తే హైదరాబాద్లోనే ప్రీమియర్ల బుకింగ్స్ టాప్ రేంజులో ఉన్నట్లు తెలుస్తోంది.ఇక విడుదలకు ముందే రూ.130 కోట్లకు పైగా ప్రీ సేల్స్తో అదరగొట్టిన 'ధురంధర్ 2'.. తెలుగు, తమిళం లాంటి దక్షిణాది భాషల్లోనూ రిలీజ్ కానుంది. దీంతో ఈసారి ఎన్ని వందల కోట్ల కలెక్షన్స్ వస్తాయోనని మూవీ లవర్స్ మాట్లాడుకుంటున్నారు. మరోవైపు దీనితో పాటు విడుదలవుతున్న తెలుగు సినిమా 'ఉస్తాద్ భగత్ సింగ్'.. 2 గంటల 34 నిమిషాల నిడివితో థియేటర్లలోకి వస్తోంది. మరి 'ధురంధర్ 2' పోటీ తట్టుకుని పవన్ మూవీ నిలబడుతుందా లేదా అనేది చూడాలి?(ఇదీ చదవండి: నాకు నయనతార కావాలి.. ఎంపీ షాకింగ్ కామెంట్స్) -
రిలీజ్కు ముందే దూకుడు.. ఓజీ, బాహుబలి-2 రికార్డ్స్ బ్రేక్..!
రణ్వీర్ సింగ్ హీరోగా వచ్చిన స్పై యాక్షన్ థ్రిల్లర్ దురంధర్. పాకిస్తాన్ బ్యాక్డ్రాప్లో తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ను షేక్ చేసింది. గతేడాది డిసెంబర్ 5న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా అత్యధిక వసూళ్లు సాధించిన మూవీగా రికార్డ్ సృష్టించింది. కాంతార-2, ఛావా సినిమాలను అధిగమించి మొదటిస్థానంలో నిలిచింది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.1300 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. ఈ సినిమాకు సీక్వెల్గా దురంధర్-2 ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు మేకర్స్. దురంధర్ ది రివెంజ్ పేరుతో ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది.అడ్వాన్స్ బుకింగ్స్లో దూకుడు..ఇప్పటికే అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్లోనూ దురంధర్-2 దూసుకెళ్తోంది. ప్రీమియర్ షోలు, మొదటి రోజు అడ్వాన్స్ బుకింగ్స్తో కలిసి ఏకంగా రూ.123 కోట్లు వసూలు చేసింది. రిలీజ్కు ముందే సరికొత్త రికార్డులతో అభిమానుల్లో అంచనాలు మరింత పెంచేసింది. మరిన్ని షోల బుకింగ్లు ఇంకా ప్రారంభం కావాల్సి ఉన్నందున.. రాబోయే రెండు రోజుల్లో ఈ వసూళ్ల సంఖ్య భారీగా పెరిగే ఛాన్స్ ఉంది.దేశవ్యాప్తంగా మార్చి 18న 'ధురందర్ 2' ప్రీమియర్ షోలు ప్రదర్శించనున్నారు. ఈ ప్రీమియర్ షో టికెట్స్ ద్వారా రూ.38.50 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. ఈ కలెక్షన్స్తో ఓజీ, బాహుబలి-2 ప్రీమియర్ షోల రికార్డ్స్ బ్రేక్ చేసింది. ఇండియాలో మొదటి రోజు 13 వేల షోల ద్వారా ఈ చిత్రం రూ. 24.50 కోట్ల దేశీయ వసూళ్లు రాబట్టింది. ప్రీ సేల్స్ ద్వారా అంతర్జాతీయ మార్కెట్లలో సుమారు రూ. 60 కోట్లు బిజినెస్ చేసింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా మొత్తం ప్రీ బిజినెస్ రూ. 123 కోట్లకు చేరుకుంది. -
డ్రాగన్ పై దురంధర్ ఎఫెక్ట్..!
-
‘ధురంధర్’తో ఆ విషయం అర్థమైయింది :అక్షయ్ కుమార్
ప్రేక్షకులు అభిరుచి ప్రతి రెండు,మూడేళ్లకు ఓసారి మారుతుందని, అందుకు ‘ధురంధర్’ మంచి ఉదాహరణ అని బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ అన్నాడు. తాజాగా అక్షయ్ కుమార్ ఇండియా టుడే కాంక్లేవ్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాలీవుడ్లో మారుతున్న ట్రెండ్ గురించి అక్షయ్ మాట్లాడుతూ.. ‘ధురంధర్’ సినిమాను తీసుకోండి. ఇది పూర్తి స్థాయి యాక్షన్ చిత్రం. సినిమా మొత్తంలో యాక్షన్ సన్నివేశాలే ఉంటాయి. ప్రేక్షకులు వాటిని ఎంజాయ్ చేస్తున్నారు. రణవీర్ సింగ్ చేసిన హై-ఎనర్జీ యాక్షన్ సన్నివేశాలకు చప్పట్లు కొడుకున్నారు. దీన్ని బట్టి ఇప్పుడు ఆడియన్స్ యాక్షన్ సినిమాలను ఇష్టపడుతున్నారనే విషయం అర్థమవుతుంది.ఇలా రెండు, మూడేళ్లకు ఒకసారి ప్రేక్షకుల అభిరుచి మారుతూనే ఉంటుంది. ఐదారేళ్ల క్రితం పరిస్థితి వేరుగా ఉండేది.అప్పుడు సామాజిక సందేశాత్మక చిత్రాలను ఆదరించారు. నేను చేసిన ‘టాయిలెట్: ఏక్ ప్రేమ్ కథ’, ‘ప్యాడ్ మ్యాన్’ లాంటి సినిమాలు అప్పుడు సూపర్ హిట్గా నిలిచాయి. ఇప్పుడు అలాంటి సినిమాలు తీస్తే.. ఆడుతాయో లేదో తెలియదు. ప్రేక్షకుల కోరికలు ట్రెండ్కు తగ్గట్లుగా మారుతుంటాయి. ప్రస్తుతం హారర్ కామెడీలకూ ఆదరణ లభిస్తోంది. తర్వాత ఆడియన్స్ దేనిని ఇష్టపడతారో మనం ఎప్పటికీ ఊహించలేం’ అని అన్నారు. ధురంధర్ విషయానికొస్తే.. రణ్వీర్ సింగ్ హీరోగా ఆదిత్య ధర్ తెరకెక్కించిన యాక్షన్ థ్రిల్లర్ ఇది. గతేడాది డిసెంబర్లో విడుదలైన ఈ చిత్రం.. బాక్సాఫీస్ని షేక్ చేసింది. దాదాపు రూ. 1300 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. ఇప్పుడీ చిత్రానికి సీక్వెల్గా ధురంధర్ 2 రాబోతుంది. మార్చి 19న ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. -
ధురంధర్ 2 ఛాన్స్ వస్తే వదిలేసుకున్నా: నటుడు
గతేడాది చివర్లో వచ్చిన ధురంధర్ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. ఆదిత్య ధర్ డైరెక్టర్ చేసిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.1300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. రణ్వీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రంలో సారా అర్జున్ కథానాయిక. ఆర్ మాధవన్, సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా, అర్జున్ రాంపాల్ కీలక పాత్రలు పోషించారు.ధురంధర్: రివేంజ్లో ఛాన్స్అయితే మూడు నెలలు కూడా తిరగకముందే ధురంధర్ పార్ట్ 2 వచ్చేస్తోంది. మార్చి 19న 'ధురంధర్: రివేంజ్' రిలీజ్ కానుంది. మొదటి భాగం బిగ్గెస్ట్ బ్లాక్బస్టర్ కాబట్టి ఎవరైనా సరే సీక్వెల్లో ఛాన్స్ వస్తే ఎగిరి గంతేస్తారు. కానీ ఈ బాలీవుడ్ నటుడు మాత్రం తనకు ఛాన్స్ వచ్చినా రిజెక్ట్ చేశాడట!డేట్స్ లేవని..ఆయన మరెవరో కాదు, అనిల్ కపూర్. తాజాగా ఆయన ఓ ఈవెంట్లో మాట్లాడుతూ.. ధురంధర్ 2 సినిమాలో యాక్ట్ చేయమని దర్శకుడు ఆదిత్య నన్ను సంప్రదించాడు. అతిథి పాత్ర ఉంది, చేస్తావా? అని అడిగాడు. కానీ అప్పటికే నా డేట్స్ ఖాళీగా లేవు. వేరే సినిమాలతో బిజీగా ఉన్నాను. నీ సినిమాలో చేయాలనుంది, కానీ నేను ఖాళీగా లేను అని చెప్పి తిరస్కరించాను. ఆ మూవీ కోసం అప్పటికే ఒప్పుకున్న ప్రాజెక్టులను నేను పక్కనపెట్టలేను. కుదర్లేదుఆ నిబద్ధత వల్లే నేను ఇంతకాలం ఇండస్ట్రీలో ఉన్నాను. కేవలం టాలెంట్ ఒక్కటే మన స్థాయిని నిర్ణయించదు. కాకపోతే ధురంధర్ మూవీ అనేది మంచి ఆఫర్.. కానీ, ఏం చేద్దాం.. చేయడం కుదర్లేదు. భవిష్యత్తులో ఆదిత్యతో కలిసి పని చేస్తాననుకుంటున్నాను అని చెప్పుకొచ్చాడు. అనిల్ కపూర్ చివరగా 'సుబేదార్' సినిమాలో కనిపించాడు. ప్రస్తుతం ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది. -
'ధురంధర్-2' పవర్ఫుల్ సాంగ్ విడుదల
'ధురంధర్-2' నుంచి పవర్ఫుల్ సాంగ్ను మేకర్స్ తాజాగా విడుదల చేశారు. రణ్వీర్ సింగ్ హీరోగా నటించిన ఈ చిత్రాన్ని దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించారు. మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ నెల 19న విడుదల చేస్తున్నారు. ప్రమోషన్స్లో భాగంగా 'ధురంధర్: ది రెవెంజ్ ఆరి ఆరి..' సాంగ్ను షేర్ చేశారు. శాశ్వత్ సచ్దేవ్ అందించిన సంగీతం ఈ పాటకు ప్రధాన బలంగా నిలుస్తుంది. -
ధురందర్ 2 టికెట్ రేటు రూ. 3100
భారీ అంచనాలతో విడుదలకు సిద్ధమైన ధురంధర్-2 సినిమా టికెట్ ధరల విషయంలో కొత్త రికార్డు సృష్టించింది. దేశంలోనే అత్యధిక టికెట్ ధరగా రూ.3100ను ఢిల్లీలోని ఐనాక్స్ మెగాప్లెక్స్లోని ఒక ప్రత్యేక స్క్రీన్లో ఫిక్స్ చేశారు. కేవలం 42 సీట్లు మాత్రమే ఉన్న ఈ స్క్రీన్లో ప్రీమియర్స్ కోసం ఈ రేటు అమలు చేస్తున్నారు. బుక్ మై షో చార్జీలతో కలిపితే ధర రూ.3145కి చేరుతుంది. ప్రస్తుతం అదే స్క్రీన్లో ప్రదర్శితమవుతున్న ది కేరళ స్టోరీ-2 టికెట్ ధర కేవలం రూ.500 మాత్రమే. అయితే ధురంధర్-2 క్రేజ్ కారణంగా ప్రీమియర్ షోలకు టికెట్ ధరను అమాంతం పెంచేశారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఇప్పటికే సగానికి పైగా టికెట్లు అమ్ముడయ్యాయి. దేశవ్యాప్తంగా ఒక రోజు ముందే పెయిడ్ ప్రివ్యూలు ప్లాన్ చేశారు. బెంగళూరులో కొన్ని స్క్రీన్లలో టికెట్ ధరలు రూ.800 వరకు ఉన్నాయి. హైదరాబాద్లో కూడా ఎప్పటిలాగే రేట్లు పెంచారు. సాయంత్రం 5 గంటలకే అన్ని ప్రాంతాల్లో ప్రీమియర్స్ ప్రారంభం కానున్నాయి. అడ్వాన్స్ బుకింగ్స్ అద్భుతంగా సాగుతున్నాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా 3 లక్షలకు పైగా టికెట్లు అమ్ముడయ్యాయి. -
రణవీర్ సింగ్ ధురంధర్ 2 మూవీలో ప్రియదర్శి..
-
48 గంటల్లో 312 మిలియన్స్ వ్యూస్.. ‘ధురంధర్ 2’ రికార్డు
రణ్వీర్ సింగ్ హీరోగా ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘ధురంధర్ 2’. గతేడాది బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచిన ‘ధురంధర్’ చిత్రానికి సీక్వెల్ ఇది. ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్పై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక తాజాగా రిలీజైన ట్రైలర్ ఆ అంచనాలను మరింత పెంచేశాయి. అంతేకాదు రిలీజ్కి ముందే ఈ సినిమా రికార్టులను కొల్లగొడుతోంది. యూట్యూబ్లో ఈ మూవీ ట్రైలర్కి రికార్డు స్థాయిలో వ్యూస్ వచ్చాయి. కేవలం 48 గంటల్లో అంటే రెండో రోజుల్లేనే 312 మిలియన్ల వ్యూస్ సాధించింది. ఈ మధ్యకాలంలో ఒక మూవీ ట్రైలర్కు ఈ స్థాయి వ్యూస్ వచ్చిన దాఖలాలు లేవు.ట్రైలర్లో పవర్ఫుల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, స్ట్రైకింగ్ డైలాగ్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ట్రైలర్ ఆడియో ఇన్స్టాగ్రామ్లో ట్రెండ్ అవుతూ, అనేక రీల్స్, ఫ్యాన్ ఎడిట్స్కు ప్రేరణగా మారింది. ఇదే సమయంలో గూగుల్ ట్రెండ్స్లో కూడా ఈ సినిమా, నటీనటులపై సెర్చ్లు భారీగా పెరిగాయి. ఈ చిత్రంలో రణవీర్ సింగ్ ద్విపాత్రాభినయంలో కనిపించనున్నారు. మార్చి 19న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. -
రణ్వీర్ సింగ్ దురంధర్-2.. ఓటీటీ ఫ్లాట్ఫామ్ ఫిక్స్
రణ్వీర్ సింగ్ హీరోగా వచ్చిన స్పై యాక్షన్ థ్రిల్లర్ దురంధర్. పాకిస్తాన్ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ను షేక్ చేసింది. గతేడాది డిసెంబర్ 5న రిలీజైన ఈ సినిమా ఏకంగా రూ.1300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ సినిమాకు ఆదిత్య ధర్ దర్శకత్వం వహించారు. కేవలం హిందీలోనే రిలీజైనప్పటికీ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించింది.అయితే కొన్ని నెలల వ్యవధిలోనే ఈ మూవీకి సీక్వెల్గా దురంధర్ ది రివెంజ్ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇటీవల ట్రైలర్ రిలీజ్ చేయగా.. అంచనాలు మరింత పెంచేసింది. తాజాగా ఈ మూవీకి సంబంధించి ఓటీటీ స్ట్రీమింగ్ ఫ్లాట్ఫామ్ ఖరారైంది. ఈ చిత్రం థియేట్రికల్ రిలీజ్ తర్వాత జియో హాట్స్టార్ వేదికగా అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని ట్రైలర్లోనే వెల్లడించారు. థియేటర్లలో రిలీజైన తర్వాత ఈ మూవీ స్ట్రీమింగ్ తేదీని మేకర్స్ ప్రకటించనున్నారు. కాగా.. ధురంధర్: ది రివెంజ్ మార్చి 19న థియేటర్లలో విడుదల కానుంది.పోటీ నుంచి తప్పుకున్న టాక్సిక్..ఈ మూవీతో మార్చి 19న యశ్ హీరోగా వస్తోన్న టాక్సిస్ రిలీజ్ కావాల్సి ఉంది. అయితే బాక్సాఫీస్ పోటీ నుంచి యశ్ తప్పుకున్నారు. గీతు మోహన్దాస్ దర్శకత్వం వహించిన గ్యాంగ్స్టర్ మూవీ జూన్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
రిలీజ్కు ముందే రికార్డులు.. దురంధర్-2 ప్రభంజనం..!
రణ్వీర్ సింగ్ హీరోగా వచ్చిన స్పై యాక్షన్ థ్రిల్లర్ దురంధర్. పాకిస్తాన్ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ను షేక్ చేసింది. గతేడాది డిసెంబర్ 5న రిలీజైన ఈ సినిమా ఏకంగా రూ.1300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ సినిమాకు ఆదిత్య ధర్ దర్శకత్వం వహించారు. అయితే కొన్ని నెలల వ్యవధిలోనే ఈ మూవీకి సీక్వెల్గా దురంధర్ ది రివెంజ్ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇటీవల ట్రైలర్ రిలీజ్ చేయగా.. అంచనాలు మరింత పెంచేసింది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ప్రీ టికెట్ బుకింగ్స్ ఓపెన్ చేయగా.. సరికొత్త రికార్డులతో దూసుకెళ్తోంది. కేవలం రెండు రోజుల్లో రెండు లక్షలకు పైగా టిక్కెట్లు అమ్ముడు కావడం చూస్తుంటే ఏ రేంజ్లో క్రేజ్ ఉందో అర్థమవుతోంది. అడ్వాన్స్ టికెట్స్ బుకింగ్స్ ద్వారా ఇప్పటికే రూ. 18.11 కోట్ల గ్రాస్ వసూలు చేసిందని ట్రేడ్ వెబ్సైట్ సాక్నిల్క్ తెలిపింది.ఈనెల 19న దురంధర్ ది రివెంజ్ థియేటర్లలోనే సందడి చేయనుంది. అంతకుముందు రోజే ఈ సినిమా ప్రీమియర్ షోలను ప్రదర్శించనున్నారు. ఈ షోల కోసం మేకర్స్ ముందుగానే బుకింగ్లు ప్రారంభించడంతో చాలా థియేటర్లలో టిక్కెట్లు హాట్కేకుల్లా అమ్ముడవుతున్నాయి. హిందీలో మొదటి రోజే టికెట్ ధర ప్రస్తుతం రూ. 450-500 మధ్య ఉంది. ఈ మూవీ రిలీజ్కు ముందే రికార్డులు సృష్టిస్తోంది. ఈ చిత్రం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో కూడా విడుదల కానుంది. -
'ధురంధర్' మేకర్స్కు తెలుగు ప్రేక్షకుల రిక్వెస్ట్
బాలీవుడ్ మూవీ ‘ధురంధర్: ది రెవెంజ్’ తెలుగు ట్రైలర్ తాజాగా విడుదలైన విషయం తెలిసిందే. ఈ సందర్భంలో తెలుగు ప్రేక్షకులు ఒక రిక్వెస్ట్ చేస్తున్నారు. బాలీవుడ్ నటుడు రణ్వీర్ సింగ్ హీరోగా ఆదిత్య ధర్ దర్శకత్వంలో గతేడాది వచ్చిన చిత్రం ‘ధురంధర్’. ఇప్పుడు ఈ మూవీకి సీక్వెల్గా పార్ట్-2 రానుంది. దేశభక్తి కాన్సెప్ట్తో భారీ స్పై యాక్షన్ థ్రిల్లర్గా హిందీలో మాత్రమే విడుదలైన ఈ మూవీ పాన్ ఇండియా రేంజ్లో ప్రేక్షకులను మెప్పించింది. దీనిని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడీ చిత్రానికి సీక్వెల్ రూపొందించారు. హిందీతో పాటు తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళంలో మార్చి 19న విడుదల చేస్తున్నారు. తెలుగు ట్రైలర్ విడుదల తర్వాత టాలీవుడ్ ప్రేక్షకుల నుంచి దర్శకుడికి ఒక విన్నపం అంటూ వైరల్ అవుతుంది.ధురంధర్ -2 నిర్మాతలు తెలుగు ట్రైలర్ను ఆవిష్కరించిన తర్వాత డబ్బింగ్, సంభాషణల పట్ల తెలుగు ప్రేక్షకుల నుండి సానుకూల స్పందన వచ్చింది. తెలుగు డబ్బింగ్ పనులను హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోస్ నిర్వహించినట్లు సమాచారం. అయితే, తెలుగు ప్రేక్షకులకు నుంచి దర్శకుడు ఆదిత్య ధర్కు ఒక స్పష్టమైన అభ్యర్థన వైరల్ అవుతుంది. ఈ చిత్రాన్ని పాన్-ఇండియ రేంజ్లో విడుదల చేస్తున్నందున, అభిమానులు పాటలను తెలుగులోకి డబ్ చేయకుండా వాటి అసలు హిందీ వెర్షన్లోనే ఉంచమని మేకర్స్ను అడుగుతున్నారు.ఈ అభ్యర్థన వెనుక కారణం గతంలో అనేక డబ్ చేసిన సినిమా పాటలు ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేదు. అనువాదంలో విడుదలైన పాటలు బలహీనమైన మిక్సింగ్తో పాటు తప్పుడు అర్థాలు రావడం గమనించారు. డబ్ చేసిన వెర్షన్లలో వచ్చే పాటలు సినిమా ప్రభావాన్ని తగ్గిస్తాయని చెబుతున్నారు. దీని కారణంగా, పాటలు హిందీలోనే ఉంచాలని తెలుగు ప్రేక్షకులు కోరుతున్నారు. మూవీలో డైలాగ్లను మాత్రమే తెలుగులోకి డబ్ చేస్తే మంచిదని చాలామంది భావిస్తున్నారు. నిర్మాతలు ఈ అభ్యర్థనను పరిశీలిస్తారా లేదా తెలుగు-డబ్ చేసిన పాటలతో ముందుకు వెళ్తారా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఈ సినిమాని ఆదిత్య, జ్యోతీదేశ్ పాండే, లోకేశ్ ధర్తో కలిసి సంయుక్తంగా నిర్మించారు. -
పవన్ ఫ్యాన్స్కి బ్యాడ్ న్యూస్!
పవన్ కల్యాణ్ అభిమానులకు ఓ బ్యాడ్ న్యూస్! ఈ హీరో నటించిన లేటెస్ట్ మూవీ 'ఉస్తాద్ భగత్ సింగ్'. హరీశ్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం.. లెక్క ప్రకారం ఈ నెల 26న థియేటర్లలోకి రావాలి. కానీ ఓ వారం ముందుకు తీసుకొచ్చారు. ఉగాది కానుకగా 19నే రిలీజ్ చేస్తున్నట్లు రీసెంట్గానే ప్రకటించారు. కానీ ప్రీమియర్ల విషయంలో మాత్రం మూవీ టీమ్ వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. ఇంతకీ ఏంటి విషయం?'గబ్బర్ సింగ్' తర్వాత పవన్-హరీశ్ శంకర్ కలిసి చేసిన సినిమా 'ఉస్తాద్ భగత్ సింగ్'. చాన్నాళ్ల క్రితం ప్రాజెక్ట్ ప్రకటించినప్పటికీ.. గతేడాది చివరలో షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ నెల 19న థియేటర్లలోకి రానుంది. 18వ తేదీన రాత్రి ప్రీమియర్లు వేయాలని తొలుత అనుకున్నారు కానీ డిస్ట్రిబ్యూటర్ల అభ్యర్థన మేరకు నిర్మాణ సంస్థ.. ప్రీమియర్ల విషయంలో వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. 19న ఉదయం 7 గంటల నుంచి మాత్రమే రెగ్యులర్ షోలు వేయాలని నిర్ణయించుకున్నారట.(ఇదీ చదవండి: త్రిషపై చిల్లర కామెంట్స్.. నోరు జారిన సీనియర్ నటుడు)ప్రీమియర్ల విషయంలో 'ఉస్తాద్' వెనక్కి తగ్గటానికి బజ్ ఏమైనా కారణమా అనిపిస్తుంది. ఎందుకంటే దీనిపై ప్రస్తుతానికి ఓ మాదిరి హైప్ మాత్రమే ఉంది. రెండు పాటలు రిలీజైనప్పటికీ అవేం పెద్దగా మ్యాజిక్ చేయలేదు. ట్రైలర్ వచ్చిన తర్వాతే మూవీ చూడాలా వద్దా అని చాలామంది ఆడియెన్స్ ఓ అంచనాకు రావొచ్చు. దీనితో పాటే తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ అవుతున్న డబ్బింగ్ సినిమా 'ధురంధర్ 2'పై హైప్ బాగానే ఉంది.'ధురంధర్ 2' ప్రీమియర్ షోలు.. 18వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి దేశవ్యాప్తంగా స్క్రీనింగ్ కానున్నాయి. ఇప్పటికే బుకింగ్స్ ఓపెన్ చేశారు. మిగతా నగరాల కంటే హైదరాబాద్లోనే టికెట్స్ ఎక్కువగా సేల్ అవుతున్నట్లు కనిపిస్తున్నాయి. దీని రన్ టైమ్ దాదాపు 4 గంటలు. పోలిక అని చెప్పలేం కానీ 'ధురంధర్ 2' ప్రీమియర్ చూసిన తర్వాత ప్రేక్షకుడు.. 'ఉస్తాద్' ప్రీమియర్ అంటే ఆసక్తి చూపిస్తాడా అంటే సందేహమే. బహుశా ఈ కారణాల వల్లే 'ఉస్తాద్'.. ప్రీమియర్ల రిస్క్ తీసుకోవట్లేదా అనిపిస్తోంది.(ఇదీ చదవండి: నిశ్చితార్థం చేసుకున్న హీరో బెల్లంకొండ శ్రీనివాస్) -
'ధురంధర్-2' తెలుగు ట్రైలర్ వచ్చేసింది
'ధురంధర్-2' తెలుగు ట్రైలర్ తాజాగా విడుదలైంది. మొదట హిందీ వర్షన్ మాత్రమే మేకర్స్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. గతేడాదిలో విడుదలైన ధురంధర్కు సీక్వెల్గా ‘ధురంధర్: ది రెవెంజ్’ మూవీని దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించారు. ఈ చిత్రంలో రణ్వీర్ సింగ్, సారా అర్జున్, సంజయ్ దత్, ఆర్.మాధవన్ తదితరులు నటిస్తున్నారు. అయితే, ఈ సీక్వెల్లో యంగ్ రణ్వీర్ సింగ్ని జస్కిరాత్ సింగ్ రాంగీ అనే పాత్రను ట్రైలర్లో పరిచయం చేశారు. రెహమాన్ మరణం తర్వాత అక్కడి వీధుల్లో ఏర్పడిన వాతావరణాన్ని చూపించారు. హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ నెల 19న విడుదల చేస్తున్నారు. -
భారీ అంచనాలతో.. ధురంధర్ 2.. ట్రైలర్ చూస్తే పూనకాలే
-
'ధురంధర్ 2'ని చూసి టాలీవుడ్ చాలా నేర్చుకోవాలి!
'ధురంధర్' సినిమాని చూసి తెలుగు దర్శకనిర్మాతలు చాలా అంటే చాలా నేర్చుకోవాలి. కేవలం కంటెంట్ అనే కాదు మిగతా విషయాల్లోనూ ఈ మూవీ ఓ గైడ్ లాంటిది అని చెప్పొచ్చు. తాజాగా సీక్వెల్ ట్రైలర్ రిలీజ్ తర్వాత ఈ విషయం మరోసారి చర్చనీయాంశమవుతోంది. ఇంతకీ ఏంటా విషయాలు? టాలీవుడ్ దీనిని చూసి ఏమేం నేర్చుకోవాలి?(ఇదీ చదవండి: నేను బెస్ట్ ఎక్స్ బాయ్ఫ్రెండ్ని.. బ్రేకప్ తర్వాత చాలా ఏడ్చా: షణ్ముఖ్ జస్వంత్)గత కొన్నాళ్ల నుంచి పాన్ ఇండియా, సీక్వెల్ అనే ట్రెండ్ బాగా నడుస్తోంది. తెలుగులోనే చిన్నపెద్ద అనే తేడా లేకుండా ప్రతి దర్శకుడు ఓ సినిమా తీసేయడం, సీక్వెల్ ఉంటుంది అన్నట్లు చివరలో స్టోరీని అర్థంతరంగా వదిలేయడం లాంటివి చాలానే చూశాం. వీటన్నింటికి భిన్నంగా కంటెంట్పై నమ్మకంతో 'ధురంధర్' టీమ్ రెండు భాగాల షూటింగ్ ఒకేసారి పూర్తి చేసింది. తొలి భాగం హిట్టయితేనే రెండో పార్ట్ తీస్తాం అనే ట్రెండ్ని బ్రేక్ చేసింది. ఓ రకంగా చెప్పాలంటే వాళ్ల కంటెంట్పై వాళ్లకు అంత బలమైన నమ్మకం ఉండటమే దీనికి కారణం.టాలీవుడ్ ఓ సినిమాకు సీక్వెల్ అంటే అది ఎన్నేళ్ల తర్వాత వస్తుందో ఎవరూ చెప్పలేరు. అలాంటిది 'ధురంధర్' టీమ్ ఎంత ఫెర్ఫెక్ట్ ప్లానింగ్తో వచ్చారంటే.. తొలి పార్ట్ రిలీజైన మూడు నెలల్లో రెండో పార్ట్ రిలీజ్ చేస్తామని మాటిచ్చారు. ఇప్పుడు దానికే కట్టుబడ్డారు. ఈ నెల 19న 'ధురంధర్ 2'ని థియేటర్లలోకి తీసుకొస్తున్నారు. చాలామంది తెలుగు దర్శకనిర్మాతలు.. తమ సినిమాలో కంటెంట్ అంతంత మాత్రంగానే ఉన్నా ఏదో ఉంది అనేంత హడావుడి చేస్తుంటారు. 'ధురంధర్' టీమ్ మాత్రం ఎక్కువ హడావుడి చేయలేదు. ప్రమోషన్స్ లాంటివి కూడా పెద్దగా చేయలేదు. కేవలం ప్రేక్షకుల్ని మాత్రమే నమ్ముకుంది.(ఇదీ చదవండి: ‘ధురంధర్2’కి పెయిడ్ ప్రీమియర్స్.. రన్టైమ్ ఎంతంటే?)తెలుగులో చాలా సినిమాల పాటలు, టీజర్, ట్రైలర్స్ లాంటివి నేరుగా రిలీజ్ చేయకుండా.. మొదట ఓ అప్డేట్ అంటారు. తర్వాత సాంగ్కి టీజర్ అంటారు. తీరా రిలీజ్ టైంకి వచ్చేసరికి సాంకేతిక కారణాలు చెప్పి వాయిదా వేస్తుంటారు. ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడుతుంటారు. ఈ విషయంలోనూ 'ధురంధర్' టీమ్ని మెచ్చుకోవాలి. ఓ టైమ్ చెప్పారు. సరిగ్గా అదే సమయానికి ట్రైలర్ రిలీజ్ చేసేశారు.తొలి భాగం దేశవ్యాప్తంగా అద్భుతమైన హిట్ అయినా సరే ప్రభుత్వాల నుంచి టికెట్ రేట్ల పెంపులాంటివి అడగలేదు. మూవీ రిలీజ్కి 10-12 రోజులు ముందుగానే టికెట్ బుకింగ్స్ ఓపెన్ చేసేశారు. అదీ సాధారణ ధరలతోనే. టికెట్పై రూ.50-100 అదనం చెప్పి ప్రేక్షకుడి నుంచి దోచుకునే ప్రయత్నం చేయలేదు. పైన చెప్పిన విషయాల్లో చాలావరకు టాలీవుడ్లో చాలామంది పాటించరు.తీసిన సినిమాకు పెట్టిన బడ్జెట్కి టికెట్ ధరలకు ఏ మాత్రం సంబంధం ఉండదు. ఒకవేళ ఏమైనా అంటే వింత వింత కారణాలు చెబుతారు. థియేటర్లకు జనాలు రావట్లేదని బాధపడతారు. చెప్పాలంటే ప్రేక్షకులని గ్రాంటెడ్గా తీసుకుంటున్నారు. ఏం తీసినా సరే చూస్తారులే అని అనుకుంటున్నారు. అందుకే తెలుగులో స్టార్ హీరోల సినిమాలకు సైతం డిజాస్టర్ టాక్లు తప్పట్లేదు.(ఇదీ చదవండి: మరింత వైలెంట్గా ధురంధర్ 2 ట్రైలర్) -
‘ధురంధర్2’కి పెయిడ్ ప్రీమియర్స్.. రన్టైమ్ ఎంతంటే?
రణ్వీర్ సింగ్ హీరోగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్2: ది రివెంజ్’పై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్ ఆ అంచనాలు డబుల్ చేసింది. యాక్షన్తో పాటు ఎమోషనల్ డ్రామాకు కూడా పెద్ద పీట వేసినట్లు ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. మార్చి 19న బాక్సాఫీస్ బద్దలు అవ్వడం ఖాయమని రణ్వీర్ ఫ్యాన్స్ అంటున్నారు. అయితే చిత్రబృందం మాత్రం ఒక రోజు ముందే బాక్సాఫీస్ని షేక్ చేసేందుకు రెడీ అవుతోంది. మార్చి 18న పెయిడ్ ప్రీమియర్స్ వేయబోతున్నారు. ఆ రోజు సాయంత్రం ఫస్ట్ షో నుంచే ‘ధురంధర్2: ది రివెంజ్’ మూవీని ప్రదర్శించబోతున్నారు. ఇప్పటికే బుక్మై షో, డిస్ట్రిక్ట్ యాప్ల ద్వారా టికెట్ బుకింగ్స్ను అందుబాటులోకి తెచ్చారు. అయితే ఈ పెయిడ్ ప్రీమియర్స్కి మాత్రం కేవలం హిందీ భాషలో మాత్రమే బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. హైదరాబాద్లోని వివిధ మల్టీప్లెక్స్లలో ఇప్పటికే టికెట్స్ అందుబాటులోకి వచ్చాయి. మామలుగా అయితే పెయిడ్ ప్రీమియర్స్కి టికెట్ ధరలను పెంచుతారు. కానీ ధురంధర్ 2కి మాత్రం ప్రీమియర్స్కి కూడా నార్మల్ ధరలే ఉండడం గమనార్హం. ఎక్కువ మంది ప్రేక్షకులు థియేటర్స్కి రావడం కోసమే మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.భారీ రన్టైమ్..ధురంధర్ 2 మూవీ రన్టైమ్పై మొన్నటి వరకు సోషల్ మీడియాలో రకరకాల పుకార్లు వచ్చాయి. తాజాగా దీనిపై స్పష్టత వచ్చింది. ఈ మూవీ నిడివి 3 గంటల 55 నిమిషాలు. మొదటి భాగం 3 గంటలా 34 నిమిషాలతో పోలిస్తే ఇది చాలా ఎక్కువే. బ్రేక్ టైమ్తో కలిపితే నాలుగు గంటలకు పైనే ఉంటుంది. ఈ మధ్యకాలంలో ఇంత నిడివితో ఏ చిత్రం రాలేదు. ప్రేక్షకుడిని ఎంగేజ్ చేసే కంటెంట్ ఉంది కాబట్టే.. రన్టైమ్ విషయంలో మేకర్స్ భయపడడం లేదట. మరి ధురంధర్ 2 ఎన్ని రికార్డులను క్రియేట్ చేస్తుందో చూడాలి. -
మరింత వైలెంట్గా 'ధురంధర్ 2' ట్రైలర్
‘ధురంధర్ 2’ మూవీ ట్రైలర్ వచ్చేసింది. బాలీవుడ్ నటుడు రణ్వీర్ సింగ్ హీరోగా దర్శకుడు ఆదిత్యధర్ తెరకెక్కించిన ‘ధురంధర్’కు సీక్వెల్గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. గతేడాది విడుదలైన ఈ మూవీ సంచలన విజయం సాధించింది. దీంతో సీక్వెల్గా తెరకెక్కిన ‘ధురంధర్: ది రివెంజ్’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ మూవీ మార్చి 19న రిలీజ్ కానుంది. హిందీతోపాటు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడలోనూ విడుదల కానుంది. -
వాయిదా రూమర్స్కి చెక్.. ట్రైలర్ రిలీజ్ ఎప్పుడంటే?
'ధురంధర్ 2' సినిమా విడుదలకు ఇంకా రెండు వారాలు కూడా లేదు. టీమ్ నుంచి ఎలాంటి అప్డేట్ లేకపోయేసరికి వాయిదా పడుతుందనే రూమర్స్ వినిపించాయి. యష్ 'టాక్సిక్' తప్పుకోవడంతో.. ధురంధర్ సీక్వెల్ కూడా అలానే చేస్తుందేమోనని మాట్లాడుకున్నారు. కానీ ట్రైలర్ రిలీజ్ అప్డేట్ గురించి అధికారికంగా ప్రకటించి సదరు పుకార్లకు చెక్ పెట్టేశారు.రణ్వీర్ సింగ్ పాన్ ఇండియా మూవీ 'ధురంధర్:ది రివెంజ్' ట్రైలర్ని శనివారం(మార్చి 07) ఉదయం 11:01 గంటలకు విడుదల చేయనున్నట్లు అధికారికంగా అనౌన్స్ చేశారు. దీనిబట్టి మూవీపై ఓ అంచనాకు వచ్చేస్తారు. ఇందులో రణవీర్.. జస్కిరత్ సింగ్, హమ్జా అనే రెండు విభిన్న పాత్రల్లో కనిపించనున్నాడు.(ఇదీ చదవండి: తిరుమలలో రుక్మిణి వసంత్.. ఈమె చెల్లిని చూశారా?)'ధురంధర్' తొలి భాగం.. భారత్తో పాటు అంతర్జాతీయంగానూ హిట్ అయింది. రూ.1300 కోట్లకుపైనే కలెక్షన్ సాధించి రికార్డులు సృష్టించింది. ముఖ్యంగా నార్త్ అమెరికా, కెనడా, యుకే, ఆస్ట్రేలియా లాంటి చోట్ల భారీ విజయాన్ని అందుకుంది. తొలి పార్ట్ కేవలం హిందీలోనే రాగా ఇప్పుడు దక్షిణాది భాషల్లోనూ రిలీజ్ కానుండటం మరింతగా కలిసి రానుంది.జియో స్టూడియోస్ సమర్పణలో, బి62 స్టూడియోస్ నిర్మాణంలో దర్శకుడు ఆదిత్య ధార్ తీసిన ఈ చిత్రం.. పాకిస్థాన్ బ్యాక్డ్రాప్లో తీసిన స్పై యాక్షన్ థ్రిల్లర్. హిందీ, తమిళ, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో ఈ నెల 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. గుడి పాడ్వా, ఉగాది పండుగల సందర్భంలో ఈద్కు ముందుగా విడుదలవుతూ భారీ ఓపెనింగ్ సాధించేందుకు సిద్ధమవుతోంది.(ఇదీ చదవండి: టాలీవుడ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ ప్రేమ పెళ్లి.. అమ్మాయి ఎవరంటే?) -
'ధురంధర్ 2'కి లైన్ క్లియర్.. 'టాక్సిక్' వాయిదా
ఈ నెలలో రావాల్సిన పెద్ద సినిమాల్లో 'టాక్సిక్' ఒకటి. కేజీఎఫ్ లాంటి పాన్ ఇండియా బ్లాక్బస్టర్ సక్సెస్ తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకుని హీరో యష్ చేసిన మూవీ ఇది. లెక్క ప్రకారం మార్చి 19నే థియేటర్లలో రిలీజ్ అన్నారు. నిన్నటి వరకు అదే మాటపై ఉంటూ వచ్చారు. కానీ ఇప్పుడు ఉన్నట్లుండి పరిస్థితులు మారిపోయేసరికి వాయిదా వేయక తప్పని పరిస్థితి ఏర్పడింది. దీంతో కొత్త విడుదల తేదీని అధికారికంగా ప్రకటించారు.(ఇదీ చదవండి: మా బాడీ పార్ట్స్ జూమ్ చేసి ఫొటోలు.. 'కాంతార' హీరోయిన్ ఫైర్)మార్చి 19న రావాల్సిన 'టాక్సిక్' చిత్రాన్ని జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. పశ్చిమ ఆసియా దేశాల్లో యుద్ధ ప్రభావమే దీనికి కారణమని చెప్పుకొచ్చారు. విదేశాల్లో ఆడియెన్స్ కోసం ఈ చిత్రాన్ని తెరకెక్కించామని ప్రస్తుతం యుద్ధ కారణంగా మిడిల్ ఈస్ట్ దేశాల్లో అనిశ్చితి నెలకొందని, తమ పార్ట్నర్స్ ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు నిర్మాణ సంస్థ అధికారికంగా ఓ నోట్ రిలీజ్ చేసింది.'టాక్సిక్' వాయిదా పడింది. దీంతో 'ధురంధర్ 2'కి లైన్ క్లియర్ అయిపోయినట్లే. గతేడాది డిసెంబరులో పెద్దగా హడావుడి లేకుండానే 'ధురంధర్' వచ్చింది. రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఇప్పుడు సీక్వెల్ రాబోతుంది. ట్రైలర్ రిలీజ్ చేస్తే ఇది కూడా వస్తుందా లేదా అనేది క్లారిటీ వస్తుంది. 'ధురంధర్ 2' గురించి వాయిదా లాంటివి రూమర్స్ అయితే ఇప్పటివరకు ఏం రావట్లేదు.(ఇదీ చదవండి: టాలీవుడ్పై ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం ఎంత?) -
ఆశ్చర్యపరుస్తున్న'ధురంధర్ 2' రన్టైమ్..!
బాలీవుడ్ నటుడు రణ్వీర్ సింగ్ హీరోగా ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ధురంధర్.. గతేడాది డిసెంబరు 5న విడుదలైన ఈ మూవీకి సీక్వెల్ రానున్న విషయం తెలిసిందే. అయితే, ఈ మూవీ రన్టైమ్ గురించి సోషల్మీడియాలో పలు కథనాలు వైరల్ అవుతున్నాయి. పార్ట్-1కు సెన్సార్ నుంచి A సర్టిఫికెట్ వచ్చింది. ఆపై దీని రన్టైమ్ 3.34గంటలుగా ఉన్న విషయం తెలిసిందే. అయితే, ఈ మూవీ సీక్వెల్ రన్టైమ్ గురించి వస్తున్న వార్తలు చూస్తుంటే ఆందరిని ఆశ్చర్యపరుస్తుంది.'ధురంధర్ 2: ది రివెంజ్' మూవీ మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా సుమారు ఐదు భాషల్లో విడుదల కానుంది. బాలీవుడ్లో వస్తున్న వార్తల ప్రకారం ఈ మూవీ రన్టైమ్ 3.50 గంటలు ఉండొచ్చని తెలుస్తోంది. అయితే, మరికొన్ని కథనాల్లో మాత్రం 3.40గంటలకు దగ్గరగా ఉంటుందని చెప్పుకొస్తున్నారు. ఈ మూవీ నిడివి అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. పార్ట్-1కు మించే సీక్వెల్ రన్టైమ్ ఉంటుందని క్లారిటీ ఇస్తున్నారు. సుమారు 17ఏళ్ల తర్వాత ఈ రేంజ్ నిడివితో బాలీవుడ్లో సినిమా రావడం విశేషం. 2008లో హృతిక్ రోషన్ నటించిన ‘జోథా అక్బర్’ (3.50గంటలు) రన్టైమ్తో విడుదలైంది. అయితే, నిర్మాతల నుంచి ధురంధర్ తుది రన్టైమ్ను అధికారికంగా ప్రకటన రాలేదు. ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ వర్గాలు ప్రకారం రన్టైమ్ ఎక్కువగానే ఉందని సమాచారం.ధురంధర్ 2 లో సంజయ్ దత్, ఆర్. మాధవన్, అర్జున్ రాంపాల్, సారా అర్జున్ కీలక పాత్రల్లో తిరిగి వస్తున్నారు. యామి గౌతమ్ ఒక ప్రత్యేక అతిధి పాత్రలో కనిపిస్తారని కూడా సమాచారం ఉంది. ఈ చిత్రాన్ని జియో స్టూడియోస్, బి62 స్టూడియోస్ కలిసి నిర్మిస్తున్నాయి. -
దురంధర్ 2 రివ్యూ వచ్చేసింది.. నా భర్త ఇరగదీశాడు అంటున్న యామి..!
-
‘ధురంధర్ 2’ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. ఒక్క మాటతో అంచనాలు రెట్టింపు
రణ్వీర్ సింగ్ హీరోగా నటించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్’ క్రియేట్ చేసిన రికార్డుల గురించి అందరికి తెలిసిందే. గతేడాది డిసెంబర్ 5న విడుదలైన ఈ చిత్రం.. ప్రపంచ వ్యాప్తంగా రూ. 1300 కోట్లకు పైగా వసూళ్లను సాధించి, బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ సృష్టించింది. ఈ చిత్రానికి సీక్వెల్గా రాబోతున్న ధురంధర్ 2 చిత్రం కోసం యావత్ సినీ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఇటీవల రిలీజ్ చేసిన ట్రైలర్ సినిమాపై మరింత హైప్ని క్రియేట్ చేసింది. మార్చి 19న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈనేపథ్యంలో ఈ సినిమా దర్శకుడు ఆదిత్యధర్ సతీమణి యామీ గౌతమ్ ధురంధర్ 2పై తన రివ్యూని ఇచ్చేసింది.భారత్ సమ్మిట్ 2026లో పాల్గొన్న యామీ గౌతమ్.. తాను ఇప్పటికే ‘ధురంధర్ 2’ చూశానని చెబుతూ..భర్తపై ప్రశంసల వర్షం కురిపించింది. ‘ధురంధర్ 2 నేను చూసేశాను. నా భర్త గొప్ప సినిమాలను తీస్తున్నారు. ధురంధర్ 2 చాలా అసాధరణమైన సినిమా. ఆడియన్స్ ఎప్పటికీ మర్చిపోలేని ఓ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. మూవీ చూసి నేను చాలా ఎమోషనల్ అయ్యాను.ఆ రోజు నేను విమానంలో ప్రయాణం చేయాల్సి వచ్చింది. దీంతో ఆదిత్య ధర్తో ఏమీ చెప్పలేకపోయాను. ఆ తర్వాత నేను దేనిపైనా దృష్టి పెట్టలేకపోయాను. విమానం దిగిన తర్వాత ఆదిత్యకు ఏం చెప్పాలా? అని ఆలోచిస్తున్నాను. సినిమాపై నా ఒపీనియన్ చాలా చెప్పాలనుకున్నా. ఆదిత్య తన ఆడియన్స్, దేశాన్ని ఎప్పటికీ ప్రేమిస్తాడు. ఈ మూవీ తెరకెక్కించేందుకు ఆయన ఎంతో శ్రమించారు. ధురంధర్ 2 ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోలేని ఓ అద్భుతం. ప్రతి భారతీయుడు గర్వపడే సినిమా ఇది. ఈ విషయాన్ని నేను కచ్చితంగా చెప్పగలను’ అని యామీ గౌతమ్ అన్నారు.ఇక ధురంధర్ విజయం గురించి మాట్లాడుతూ.. ‘‘ఆర్టికల్ 370’ షూటింగ్లో ఉన్నప్పుడే ‘ధురంధర్’ స్క్రిప్ట్ చదివాను. అది కేవలం 40 పేజీలు మాత్రమే ఉంది. కానీ చదువుతున్నంత సేపు నా కళ్లు చెమర్చాయి. అప్పుడు కూడా ఆదిత్యకు ఏం చెప్పాల్లో అర్థం కాలేదు. కానీ నా స్పందన ఏంటో ఆయను అర్థమైపోయింది. ఈ సినిమా కోసం ఆయన ఎంత కష్టపడ్డాడో నాకు తెలుసు. హిస్టరీ క్రియేట్ చేసే సినిమా అవుతుందని ముందే ఊహించా. ధురంధర్ 2 అంతకు మించి ఉంటుంది’ అంటూ అంచనాలను రెట్టింపు చేసింది. మరి ధురంధర్ 2 ఎన్ని రికార్డులకు బద్దలు కొడుతుందో చూడాలి. -
ఇది ఉత్తరాది-దక్షిణాది మధ్య యుద్ధం కాదు అంతకు మించి
సంక్రాంతి తర్వాత చెప్పుకోదగ్గ స్థాయిలో బాక్సాఫీస్ దగ్గర సౌండ్ లేదు. అయితే మార్చిలో 'ధురంధర్ 2', టాక్సిక్ లాంటి భారీ పాన్ ఇండియన్ మూవీస్ థియేటర్లలోకి రాబోతున్నాయి. వీటి గురించి సగటు ప్రేక్షకుడు ఆత్రుతగా ఎదురుచూస్తున్నాడు. మరోవైపు ఈ చిత్రాల మధ్య పోటీ గురించి.. ప్లస్ మైనస్సుల గురించి దర్శకుడు రాంగోపాల్ వర్మ తనదైన శైలిలో విశ్లేషించాడు. ఈ మేరకు ట్విటర్లో తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు.'నేను కేవలం రెండు పెద్ద సినిమాల గురించి మాట్లాడటం లేదు. భారతీయ సినీ చరిత్రలో ముందెన్నడూ చూడని ఓ భీకర యుద్ధాన్ని చూడబోతున్నాం. ఇది డేవిడ్, గోలియత్ మధ్య జరుగుతున్న పోరాటం. గతంలో 'కేజీఎఫ్ 2' సాధించిన భారీ వసూళ్లు.. 'ధురంధర్' ముందు చిన్నవిగా అనిపించాయి. ఇప్పుడు 'ధురంధర్ 2' అనే డేవిడ్ ముందు 'టాక్సిక్' అనే గోలియత్ నిలబడింది. ధురంధర్ మేకర్స్.. ప్రేక్షకుల తెలివితేటలని గౌరవిస్తున్నారు. 'టాక్సిక్' మేకర్స్ మాత్రం ప్రేక్షకుల్ని మూర్ఖులని భ్రమపడుతున్నారు' అని ఆర్జీవీ రాసుకొచ్చాడు. అలానే కొన్ని పాయింట్స్ కూడా దేనికదే చెప్పుకొచ్చాడు.హీరోయిజం: గుడ్డిగా హీరోని ఆరాధించడం ఓవైపు ఉంటే, కథలోని నైతిక విలువల ద్వారా హీరోని ప్రేక్షకులని అభిమానించడం మరోవైపు.యాక్షన్: గాలిలో ఎగిరే స్టంట్స్, న్యూటన్ ఫార్ములాని వెక్కిరించే ఫైట్స్ 'టాక్సిక్'లో ఉంటే.. ఒళ్లు గగుర్పొడితే సహజ యాక్షన్ 'ధురంధర్' సొంతంమ్యూజిక్: ప్రతి ఐదు నిమిషాలకు విజిల్స్ వేయించే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఒకటైతే, నటనకు అవకాశమిస్తూ నిశ్శబ్దంగా సాగే సంగీతం మరోవైపుకేవలం ఓ నటుడిని దేవుడిలా చూపించడానికి రూ.700 కోట్లు ఖర్చు చేయడం కంటే ప్రతి పాత్రని మనిషిలా చూపించడానికి రూ.130 కోట్లు ఖర్చు చేయడం గొప్ప. ప్రేక్షకులని పిల్లలనుకుని ప్రతిదీ వివరించి చూపించడం మానేయాలి. క్లిష్టంగా ఉండే స్టోరీలని కూడా అర్థం చేసుకోగలరని 'ధురంధర్' నిరూపించింది. అయితే ఇదంతా కూడా ఆదిత్య ధర్ మీద ప్రేమతో రాయడం లేదు. మన సినిమాపై ఉన్న ఆశతో రాస్తున్నాను. మార్చి 19న మన దేశం.. ధురంధర్ 2ని ఎంచుకుంటుందో లేదా టాక్సిక్ మాస్ మత్తులో పడుతుందో చూడాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని రాంగోపాల్ రాసుకొచ్చాడు.ఈ ట్వీట్ చూసిన చాలామంది.. 'ధురంధర్ 2'ని పొగుడుతూ 'టాక్సిక్'ని తక్కువ చేశాడా అని మాట్లాడుకుంటున్నారు. దీంతో ఆర్జీవీ మరో ట్వీట్ చేశాడు. తాను సినిమాల గురించి మాట్లాడట్లేదని.. స్టైల్ ఆఫ్ మూవీస్ గురించి ప్రస్తావించానని క్లారిటీ ఇచ్చాడు.For all the dumbos , who dint understand I just wanted to clarify that , in the context of the 2 releases , I was talking about the styles of cinema and not in particular about a film https://t.co/Ydy61Nr32F— Ram Gopal Varma (@RGVzoomin) February 22, 2026 -
ధురంధర్-2 కు పోటీగా టాక్సిక్.. అసలు తగ్గేదేలే అంటున్న యష్..
-
అతన్ని పడేయాలని ట్రై చేశాను.. కానీ..,: కంగనా రనౌత్
ధురంధర్ సినిమా ఓటీటీలోకి రావడంతో మరోసారి ట్రెండ్ అవుతోంది. అందులో నటించిన అక్షయ్ ఖన్నా మళ్లీ వైరల్ అవుతున్నాడు. ఈ సందర్భంగా అక్షయ్ ఖన్నాపై బాలీవుడ్ నటి కంగనా రనౌత్ గతంలో చేసిన వ్యాఖ్యలు ఓ వీడియో క్లిప్ అందర్నీ ఎట్రాక్ట్ చేస్తోంది. హీరోయిన్గా బాలీవుడ్లో టాప్ రేంజ్లో కొనసాగిన కంగనా.. బీజేపీలో చేరి హిమాచల్ ప్రదేశ్లోని మండి నుంచి ఎంపీగా గెలిచిన విషయం తెలిసిందే.'ధురంధర్' (Dhurandhar)సినిమా చూసిన వారందరూ సోషల్మీడియాలో అతనిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ క్రమంలో కంగనా రనౌత్ పాత ఇంటర్వ్యూ క్లిప్ ఇప్పుడు వైరల్ అవుతుంది. ఈ క్లిప్ 'కాఫీ విత్ కరణ్' కార్యక్రమానికి సంబంధించింది కావడం విశేషం. 2010లో విడుదలైన నో ప్రాబ్లమ్ మూవీ ప్రమోషన్ సమయంలో ఈ కార్యక్రమం జరిగింది. అందులో అనిల్ కపూర్, సంజయ్ దత్లతో పాటు అక్షయ్, కంగనా కూడా కలిసి నటించారు.అతడ్ని ట్రై చేశాను.. కానీ, పడలేదు: కంగనాఈ వీడియోలో కరణ్ జోహార్ మాట్లాడుతూ ఎవరితోనైనా సరసాలాడటానికి ప్రయత్నించారా అని కంగనాను అడగడంతో ఆమె ఏమాత్రం సంకోచించకుండా.., "అవును అంటూ అక్షయ్ ఖన్నా(Akshaye Khanna) పేరును చెప్పారు. 'నేను మొదట అక్షయ్తో మాట్లాడ్డానికి ప్రయత్నించాను. ఆ తర్వాత అతడ్ని నిజంగానే పడేయాలని ట్రై చేశాను. కానీ అతడు ఎప్పుడూ నాతో మాట్లాడలేదు. నాతోనే కాదు, అతడు ఎవరితోనూ పెద్దగా మాట్లాడడు.' స్వయంగా కంగనా రనౌత్ ఆ షోలో అక్షయ్ ఖన్నా గురించి చెప్పిన ఈ క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ధురంధర్ సినిమాలో అక్షయ్ ఖన్నా పోషించిన రెహ్మాన్ డెకాయిత్ పాత్ర సూపర్ హిట్టయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో రణ్బీర్ సింగ్కు ఎంత పేరొచ్చిందో, అక్షయ్ ఖన్నాకు కూడా అంతే పేరొచ్చింది. ఈ సినిమా పార్ట్-2 మార్చి 19న రిలీజ్ అవుతోంది.in Coffee with Karan #KanganaRanaut reveals she once tried flirting with #AkshayeKhanna, but he was completely in hi won world and he didn't even notice her. pic.twitter.com/BccEj0twm6— आदेश 🚩 (@ADfanatic_New) February 8, 2026 -
'ధురంధర్-2'లో దర్శకుడి సతీమణి..
బాలీవుడ్ సినిమా 'ధురంధర్' భారీ హిట్ అందుకుంది. దీంతో దర్శకుడు ఆదిత్య ధర్ సీక్వెల్ను ప్లాన్ చేశారు. పార్ట్-2 మార్చి 19న విడుదల కానుంది. ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్తో జియో స్టూడియోస్ నిర్మిస్తుంది. తాజాగా సీక్వెల్ టీజర్ను విడుదల చేశారు. అయితే, ధురంధర్-2లో ప్రముఖ నటి యామి గౌతమ్ నటిస్తుందని తెలుస్తోంది. గౌరవం సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఫెయిర్ అండ్ లవ్లీ యాడ్తో కూడా భారీగా పాపులర్ అయింది. దర్శకుడితో పెళ్లి తర్వాత కూడా హిందీలో వరుస సినిమాలు, సిరీస్లు చేస్తూ బిజీగా ఉంటున్న యామి ఇప్పుడు ధురంధర్-2లో కీలకమైన పాత్రలో కనిపించనుంది.'ధురంధర్' దర్శకుడు ఆదిత్య ధర్ను నటి యామి గౌతమ్ నాలుగేళ్ల క్రితం పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. రణ్వీర్ సింగ్ హీరోగా ఆయన తెరకెక్కిస్తున్న ‘ధురంధర్: ది రివెంజ్’లో ఒక కీలకమైన పాత్రలో యామి గౌతమి నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ షూటింగ్లో కూడా ఆమె వారం రోజుల పాటు పాల్గొన్నారట. సినిమాలో ఆమె కనిపించేది కొన్ని నిమిషాలే అయినప్పటికీ ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరిచేలా యామి పాత్ర ఉండబోతుందని బాలీవుడ్లో ప్రచారం జరుగుతుంది. కాగా యామీ గౌతమ్ తెలుగులో నువ్విలా, గౌరవం, యుద్ధం, కొరియర్ బాయ్ కళ్యాణ్ వంటి చిత్రాల్లో నటించిన సంగతి తెలిసిందే. బాలీవుడ్లో రీసెంట్గా ఆమె నటించిన హక్ చిత్రంతో మంచి గుర్తింపు వచ్చింది. -
పెద్ది, డకాయిట్.. ఇక ది ప్యారడైజ్ వంతు..!
ఇటీవల కొద్దికాలంగా టాలీవుడ్ సినిమా పరిస్థితి కాస్తా అయోమయానికి గురి చేస్తోంది. పెద్ద హీరోల చిత్రాల రిలీజ్ డేట్లను ముందుగానే అనౌన్స్ చేస్తున్నారు. ఎప్పుడు షూటింగ్ మొదలవుతుంది.. ఎప్పుడు రిలీజవుతుందనేది పక్కాగా ముందే చెప్పేస్తున్నారు. ఆ రోజే గ్రాండ్ రిలీజ్ అంటూ పోస్టర్స్ కూడా రిలీజ్ చేస్తున్నారు. తీరా డేట్ దగ్గరికొచ్చేసరికి వాయిదా వేసుకుంటూ పోతున్నారు. భారీ బడ్జెట్, స్టార్ హీరో ఉన్నా సరే విడుదలకు వెనకాడుతున్నారు. తాజాగా టాలీవుడ్లో జరుగుతున్న పరిణామాలే ఇందుకు నిదర్శనం.తాజాగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పెద్ది మూవీని వాయిదా వేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. మార్చి 27న ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ సినిమా.. ఏకంగా ఏప్రిల్ 30కి పోస్ట్ పోన్ అయింది. గ్లోబల్ స్టార్ చెర్రీ- బుచ్చిబాబు సనా డైరెక్షన్లో వస్తోన్న ఈ మూవీ వాయిదా పడడం అభిమానుల్లో నిరాశ కలిగిస్తోంది. ఈ మార్చిలో పెద్ది చూడాలనుకున్న సినీ ప్రియులకు కూడా ఈ నిరాశే మిగిల్చింది.అంతేకాకుండా అడివి శేష్ డకాయిట్ సైతం మరోసారి వాయిదా పడింది. గతంలో చాలాసార్లు వాయిదా పడినా.. ఈ ఏడాది మార్చి 19న వస్తామని ప్రకటించారు. అంతలోనే డకాయిట్ పోస్ట్ పోన్ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో వెల్లడించారు. ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా కనిపించనుంది.ఇక మార్చిలో వస్తోన్న టాలీవుడ్ మూవీ ది ప్యారడైజ్. నాని హీరోగా వస్తోన్న ఈ చిత్రం మార్చి 26న రిలీజ్ కావాల్సి ఉంది. కానీ అదే రోజు ఉస్తాగ్ భగత్ సింగ్ విడుదల చేయనున్నట్లు తాజాగా ప్రకటించారు. దీంతో నాని మూవీ కూడా దాదాపు వాయిదా పడిందనే వార్తలొస్తున్నాయి. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన మాత్రమే రావాల్సి ఉంది. దీంతో ఈ చిత్రాలన్నీ సమ్మర్కు తరలిపోవడం ఖాయంగా కనిపిస్తోంది.దురంధర్-3 దెబ్బకేనా?ఇలా టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలు వాయిదా వేయడం అభిమానుల్లో నిరాశ పెంచుతోంది. తమ అభిమాన హీరోల చిత్రాలు పోస్ట్పోన్ కావడం వల్ల ఫ్యాన్స్లో ఉన్న క్యూరియాసిటీ తగ్గుతోంది. అయితే ఇలా వరుసగా టాలీవుడ్ సినిమాలు వాయిదా పడడానికి ప్రధాన కారణం ఆ ఒక్క సినిమానేనా అని సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. మార్చి 19న రానున్న దురంధర్-2 దెబ్బకేనని సగటు సినీ ప్రియుడు భావిస్తున్నారు. లేదంటే నిజంగానే షూటింగ్ పెండింగ్ వల్ల వాయిదా వేస్తున్నారా? అనేది తెలియాల్సి ఉంది. వరుసగా మూడు టాలీవుడ్ చిత్రాలు వాయిదా పడడంతో సినీ ప్రియుల్లో అసలేం జరుగుతోందనే డౌటానుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
దురంధర్-2 క్రేజ్.. బాక్సాఫీస్ రికార్డ్స్ గల్లంతేనా?
గతేడాది డిసెంబరులో రిలీజై సంచలనం సృష్టించిన బాలీవుడ్ స్పై యాక్షన్ థ్రిల్లర్ సినిమా 'ధురంధర్'. రణ్వీర్ సింగ్ హీరోగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ను షేక్ చేసింది. పాకిస్థాన్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో ఈ మూవీని తెరకెక్కించారు. 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. ఛావా, కాంతార-2ను వెనక్కి నెట్టి ఫస్ట్ ప్లేస్ సొంతం చేసుకుంది. అంతేకాకుండా బాలీవుడ్లోనే దేశవ్యాప్తంగా వెయ్యి కోట్ల మార్క్ దాటిన చిత్రంగా ఘనత సాధించింది.కేవలం హిందీలో మాత్రమే రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.1300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ క్రమంలోనే కేజీఎఫ్, బాహుహలి, పుష్ప లాంటి సినిమాలను అధిగమించింది. ఇదే మూలవీ దక్షిణాది భాషల్లో కూడా విడుదలై ఉంటే మరిన్ని రికార్డుల తిరగరాసేదని నెటిజన్స్ అభిప్రాయ పడుతున్నారు.దక్షిణాది భాషల్లో సీక్వెల్ రిలీజ్కేవలం నాలుగు నెలల వ్యవధిలోనే ఈ మూవీ సీక్వెల్ కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఇప్పటికే టీజర్ కూడా రిలీజ్ చేశారు మేకర్స్. అయితే ఈ సారి దక్షిణాది మార్కెట్లోనూ దురంధర్-2 విడుదల కానుంది. దీంతో బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాసే ఛాన్స్ ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.భారతీయ చిత్రాల జాబితాలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాల్లో దంగల్, పుష్ప-2, బాహుబలి-2 వరుసగా తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. దురంధర్ మూవీ హిందీలో మాత్రమే రిలీజై కేజీఎఫ్, బాహుబలి, పుష్ప చిత్రాల రికార్డులను దాటేసింది. ఈ నేపథ్యంలో మార్చిలో ప్రేక్షకుల ముందుకు రానున్న దురంధర్-2 బాక్సాఫీస్ను షేక్ చేసే అవకాశం కనిపిస్తోంది.ఆ రికార్డ్స్ గల్లంతేనా?ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ దంగల్, పుష్ప-2, బాహుబలి-2 లాంటి చిత్రాలను రికార్డులను అధిగమించేలా కనిపిస్తోంది. దురంధర్కు వచ్చిన కలెక్షన్స్ చూస్తే ఇది సాధ్యమేనని అనిపిస్తోంది. ఆదిత్య ధార్ దర్శకత్వంలో వస్తోన్న ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించడం ఖాయమని తెలుస్తోంది. ఇప్పటికే ఈ మూవీ రిలీజ్ వల్ల టాలీవుడ్ సినిమాలు సైతం వాయిదా పడుతున్నాయి. డకాయిట్, పెద్ది సినిమాలు పోస్ట్ పోన్ చేసి కొత్త తేదీలను ప్రకటించారు. దురంధర్-2 దెబ్బకు టాలీవుడ్ చిత్రాలు తప్పుకోవడం చూస్తే బాక్సాఫీస్ షేక్ చేయడం ఖాయమేనని అర్థమవుతోంది. -
'ధురంధర్ 2'కి భయపడుతున్నారా? ఎందుకీ వాయిదాలు?
కొన్ని సినిమాల విషయంలో అప్పుడప్పుడు ఊహలకు అందనివి జరుగుతుంటాయి. రెండు నెలల క్రితం అలాంటి ఓ సంచలనానికి కారణమైంది 'ధురంధర్' అనే మూవీ. రిలీజ్ వరకు దీనిపై పెద్దగా బజ్ లేదు. రెగ్యులర్ ఆడియెన్స్ కాస్తోకూస్తో ఆసక్తి చూపించారు గానీ సాధారణ ప్రేక్షకుడికి అయితే థియేటర్లలోకి వచ్చేంతవరకు ఇదో సినిమా ఉందని కూడా తెలియదు. అలాంటిది బ్లాక్బస్టర్ హిట్ కొట్టేసరికి.. దేశవ్యాప్తంగా పెద్ద డిస్కషన్కి కారణమైంది. త్వరలో రాబోతున్న దీని సీక్వెల్ ప్రభావం.. తెలుగు చిత్రసీమపై గట్టిగానే పడినట్లు కనిపిస్తోంది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 14 సినిమాలు.. అవి డోంట్ మిస్)సాధారణంగా వేసవిని తెలుగు దర్శకనిర్మాత మిస్ చేసుకోరు. ఈసారి కూడా అందుకు తగ్గట్లే డకాయిట్, పెద్ది, ప్యారడైజ్ లాంటి మూవీస్ రిలీజ్ అవుతాయని చాన్నాళ్ల క్రితమే ప్రకటించారు. దీంతో ఆయా హీరోల ఫ్యాన్స్, సినిమా లవర్స్ చాలా ఉత్సాహపడ్డారు. తీరా చూస్తే ఈ తెలుగు చిత్రాలన్నీ ఇప్పుడు వాయిదా పడటం గ్యారంటీ. అధికారిక ప్రకటనలు రాలేదు గానీ వాయిదా పడటం అయితే పక్కా.చరణ్ 'పెద్ది', నాని 'ప్యారడైజ్' సినిమాల షూటింగ్ చాలా పెండింగ్లో ఉంది. దీంతో ఇవి వాయిదా పడ్డాయంటే సరేలే ఏదో అనుకోవచ్చు. కానీ అడివి శేష్ 'డకాయిట్' మాత్రం ఇప్పటికే పలుమార్లు వాయిదా పడింది. మార్చి 19న పక్కా వస్తామని శేష్ కూడా కొన్నాళ్ల ముందు జరిగిన ప్రెస్మీట్లో చెప్పాడు. ఇదంతా 'ధురంధర్' విడుదలకు ముందు జరిగింది. కానీ ఈ మూవీ సూపర్ హిట్ అయ్యేసరికి.. రిస్క్ ఎందుకని 'డకాయిట్' టీమ్ వెనకడుగేసింది. ఏప్రిల్లో రావాలని ప్లాన్స్ చేసుకుంటున్నారట.(ఇదీ చదవండి: ఓటీటీలో 'ధురంధర్'.. తెలుగు ఆడియెన్స్ ఏమంటున్నారు?)మరోవైపు 'పెద్ది' కోసం అనుకున్న రిలీజ్ తేదీకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్' చిత్రాన్ని తీసుకురావాలని అనుకుంటున్నట్లు రెండు రోజుల క్రితం వరకు రూమర్స్ వచ్చాయి. ఎప్పుడైతే 'ధురంధర్ 2' రిలీజ్ పక్కా అని క్లారిటీ వచ్చిందో.. 'ఉస్తాద్' టీమ్ రిస్క్ వద్దులే అనుకుందనే టాక్ వినిపిస్తుంది. వీళ్లు కూడా ఏప్రిల్ నెలనే టార్గెట్ చేస్తున్నారని టాక్. ఈ లెక్కన చూసుకుంటే మార్చిలో ప్రామిసింగ్ తెలుగు సినిమా ఒక్కటి కూడా వచ్చే సాహసం చేయట్లేదనిపిస్తుంది. అంటే తెలుగు రాష్ట్రాల్లో 'ధురంధర్ 2'కి దాదాపు లైన్ క్లియర్.అయితే ఈ చిత్రానికి 'టాక్సిక్' పోటీగా నిలబడుతోంది. కన్నడ స్టార్ యష్ నటించిన గ్యాంగస్టర్ డ్రామా మూవీ ఇది. మార్చి 19నే 'ధురంధర్ 2'తో పాటు ఈ చిత్రం కూడా పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అవుతోంది. కాకపోతే ప్రమోషన్ పరంగా చాలా వీక్గా ఉన్నారు. సాంగ్స్, ట్రైలర్స్ లాంటివి రిలీజ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరోవైపు 'టాక్సిక్' వాయిదా పడటానికి అవకాశాల్లేవని తెలుస్తోంది. దానికి కారణాలు చాలానే ఉన్నాయి. విజయ్ 'జన నాయగణ్' నిర్మించిన కేవీఎన్ ప్రొడక్షన్స్ సంస్థనే యష్ మూవీ కూడా తీసింది. ఇది కూడా వాయిదా పడితే కోట్లలో నష్టాలు ఉండొచ్చు. అందుకే 'ధురంధర్ 2' పోటీలో ఉన్నప్పటికీ వెనక్కి తగ్గే పరిస్థితులు అయితే కనిపించట్లేదు.(ఇదీ చదవండి: 'ధురంధర్'తో హిట్.. ఇప్పుడు చిరంజీవి కూతురిగా?) -
చిక్కుల్లో దురంధర్ టీమ్.. కేసు నమోదు..!
రణ్వీర్ సింగ్ దురంధర్-2 మూవీ టీమ్కు ముంబయి పోలీసులు షాకిచ్చారు. అనుమతి లేకుండా డ్రోన్ ఎగరేశారని పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో ఉల్లంఘనలకు పాల్పడ్డారనే ఫిబ్రవరి 1న ఈ కేసు నమోదైంది. దక్షిణ ముంబయిలోని అత్యంత భద్రత కలిగిన ఫోర్ట్ ప్రాంతంలో అనుమతి తీసుకోకుండా డ్రోన్ ఎగరేయడంపై సినిమా లొకేషన్ మేనేజర్ రింకు రాజ్పాల్ వాల్మీకిపై కేసు నమోదు చేశారు.ఈనెల 1వ తేదీన షూటింగ్లో సంజయ్ దత్ కూడా పాల్గొన్నారు. ఈ షూటింగ్ షెడ్యూల్ సమయంలో అనధికార డ్రోన్ కార్యకలాపాలను పోలీసులు గమనించారు. ఆ తర్వాతే పోలీసులు జోక్యం చేసుకున్నారు. డ్రోన్ వాడకాన్ని గుర్తించిన పోలీసు అధికారులు లొకేషన్ మేనేజర్కు నోటీసులు జారీ చేశారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కాగా.. ఈ సినిమా సెట్ డిజైన్లో భాగంగా జనవరి 30న చారిత్రాత్మక ఫోర్ట్ కాంప్లెక్స్లోని కొన్ని భాగాలను పాకిస్తాన్లోని ఒక శక్తివంతమైన పాత వీధిని పోలి ఉండేలా ఏర్పాటు చేశారు.ఎవరైనా సరే మూవీ చిత్రీకరణ కోసం వైమానిక పరికరాలను ఉపయోగించే ముందు అవసరమైన అన్ని అనుమతులు పొందాలి. కానీ చట్టపరమైన అనుమతులు తీసుకోవడంతో దురంధర్ టీమ్ సభ్యులు విఫలమయ్యారు. ప్రతిష్టాత్మక ఫోర్ట్ ప్రాంతంలో మానవరహిత వైమానిక వాహనాల వాడకం ప్రభుత్వ, ఆర్థిక సంస్థలకు దగ్గరగా ఉండటం వల్ల కచ్చితంగా నిబంధనలు పాటించాల్సిందే. ఈ ప్రాంతం నిత్యం పర్యవేక్షణలో ఉంటుంది. ముఖ్యంగా వైమానిక ప్రదేశాల నిబంధనల ఉల్లంఘనను చట్ట అమలు సంస్థలు తీవ్రంగా పరిగణిస్తాయి. నిషేధిత ప్రాంతాల్లో డ్రోన్లు, ఇతర రికార్డింగ్ పరికరాల వినియోగాన్ని నియంత్రించే నిబంధనలను కఠినంగా పాటించాల్సిన అవసరముందని పోలీసులు తెలిపారు. -
'ధురంధర్ 2' టీజర్.. ఇలా మోసం చేశారేంటి?
'ధురంధర్ 2' టీజర్ వచ్చింది. దీన్ని చూసి మూవీ లవర్స్ ఒక్కసారిగా షాకయ్యారు. మమ్మల్ని ఇలా మోసం చేశారేంటి? అని విమర్శిస్తున్నారు. తమకు కొత్త టీజర్ కావాల్సిందే అని కామెంట్స్ పెడుతున్నారు. సోషల్ మీడియాలో ఇప్పుడిదే విషయం హాట్ టాపిక్ అయింది. వచ్చిన టీజర్ కంటే మేకర్స్ చేసిన మోసం గురించి మాట్లాడుకుంటున్నారు. ఇంతకీ అసలేం జరిగిందంటే?గత డిసెంబరులో 'ధురంధర్' సినిమా, థియేటర్లలో రిలీజైంది. దాదాపు 60 రోజుల కావొస్తున్నా, ఓటీటీలోకి వచ్చేసినా సరే బిగ్ స్క్రీన్పై ఇంకా ఆడుతోంది. ఈ మూవీ చివర్లో ఎండ్ క్రెడిట్స్ సీన్స్ కొన్ని వేశారు. సీక్వెల్ ఎలా ఉండబోతుంది అనేలా చిన్న గ్లింప్స్ చూపించారు. ఇప్పుడు అదే వీడియోని టీజర్లా విడుదల చేశారు. టీజర్ అనగానే కొత్త కంటెంట్ ఉండబోతుందని చాలామంది ఎగ్జైట్ అయ్యారు. కానీ థియేటర్లలో, ఓటీటీలో సినిమా చూసిన వాళ్లకు టీజర్ పెద్దగా నచ్చలేదు. ఎందుకంటే ఆల్రెడీ ఈ విజువల్స్ అన్నీ చూసేశారు కాబట్టి. అయితే ఇలా చేయడానికి కారణముందని బాలీవుడ్ మీడియా అంటోంది.(ఇదీ చదవండి: ఓటీటీలో 'ధురంధర్'.. తెలుగు ఆడియెన్స్ ఏమంటున్నారు?)'ధురంధర్ 2' కంటెంట్ ఇంకా పూర్తిస్థాయిలో రెడీ కాలేదట. ప్యాచ్ వర్క్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయని.. దర్శకుడు ఆదిత్య ధర్ ఆ పనుల్లో బిజీగా ఉన్నారట. మార్చి 19నే థియేటర్లలోకి మూవీ రానుందని మరోసారి క్లారిటీ ఇవ్వడం కోసమే ఈ టీజర్ వదిలారని మాట్లాడుకుంటున్నారు. తొలి భాగం కేవలం హిందీలోనే రిలీజ్ కాగా.. సీక్వెల్ మాత్రం హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లోనూ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మేరకు అధికారికంగా ప్రకటించారు కూడా.'ధురంధర్' విషయానికొస్తే.. కాందహార్ హైజాక్, పార్లమెంట్పై ఉగ్రదాడి తర్వాత భారతదేశానికి చెందిన ఓ స్పై ఏజెంట్ హంజా అలీ అలియాస్ జస్క్రీత్ సింగ్.. పాకిస్థాన్లో అడుగుపెడతాడు. కరాచీ లయరీలోని రహమాన్ డకాయిట్ గ్యాంగ్లో చేరతాడు. అంచెలంచెలుగా ఎదుగుతూ రహమాన్కి నమ్మకస్తుడిగా మారతాడు. చివరకు రహమాన్నే చంపేస్తాడు. అక్కడితో తొలి భాగాన్ని ముగించారు. రహమాన్ చనిపోవడంతో అతడి స్థానంలోకి హంజా ఎలా వెళ్లాడు? లయరీలో అతిపెద్ద గ్యాంగ్స్టర్గా ఎలా అవతరించాడు? భారత్పై దాడి చేసిన మిగతా ఉగ్రవాదుల్ని ఎలా మట్టుబెట్టాడు? అనే అంశాలని సీక్వెల్లో చూపించబోతున్నారు.(ఇదీ చదవండి: 'ధురంధర్' సినిమా రివ్యూ)


