ప్రధాన వార్తలు
కర్నూలు ప్రమాదంలో కొత్త కోణం!.. 400 ఫోన్లు పేలడం వల్లే మంటలు
సాక్షి, అమరావతి: కర్నూలు చిన్నటేకూరు సమీపంలో వేమూరి కావేరి ట్రావెల్స్ అగ్నిప్రమాదానికి గురైన ఘటనలో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. బస్సు ప్రమాదానికి సంబంధించిన మరో కొత్త కోణాన్ని ఫోరెన్సిక్ బృందాలు ప్రాథమికంగా గుర్తించాయి. బస్సు లగేజీ క్యాబిన్లో వందల సంఖ్యలో మొబైల్ ఫోన్లు పేలడం వల్లే ప్రమాద తీవ్రత పెరిగి, భారీ ప్రాణ నష్టానికి దారితీసిందని ఫోరెన్సిక్ టీమ్స్ తెలిపాయి.వివరాల ప్రకారం.. ఫోరెన్సిక్ బృందాలు శుక్రవారం ఉదయం ఘటనాస్థలాన్ని, దగ్ధమైన బస్సును పరిశీలించాయి. ఈ క్రమంలో బస్సులో మొబైల్ ఫోన్లను తరలించినట్టు గుర్తించాయి. ‘ప్రమాదం సందర్భంగా ట్రావెల్స్ బస్సు.. బైకును ఢీకొట్టగానే దాని ఆయిల్ ట్యాంక్ మూత ఊడిపడి అందులోని పెట్రోల్ కారడం మొదలైంది. అదే సమయంలో బస్సు కింది భాగంలో బైక్ ఇరుక్కుపోవడంతో, దాన్ని బస్సు కొంత దూరం ఈడ్చుకెళ్లింది. ఈ క్రమంలో మంటలు ప్రారంభమయ్యాయి. ఇవి తొలుత లగేజీ క్యాబిన్కు అంటుకున్నాయి. అందులోనే 400కు పైగా మొబైల్ ఫోన్లతో కూడిన పార్సిల్ ఉండటంతో అధిక వేడికి ఆ ఫోన్ల బ్యాటరీలన్నీ ఒక్కసారిగా పేలాయి. బ్యాటరీలన్నీ ఒక్కసారిగా పేలడం వల్లే భారీ శబ్దం వచ్చింది. ఆ మంటలు లగేజీ క్యాబిన్ పై భాగంలోని ప్రయాణికుల కంపార్ట్మెంట్కు వ్యాపించాయి. దీంతో లగేజీ క్యాబిన్కు సరిగ్గా పైన ఉండే సీట్లలో, బెర్తుల్లో ఉన్న వారికి తప్పించుకునే సమయం లేకుండా పోయింది. అందువల్లే బస్సు మొదటి భాగంలోని సీట్లు, బెర్తుల్లో ఉన్నవారే ఎక్కువగా ప్రాణాలు కోల్పోయారు. అప్పటికే బస్సు దట్టమైన పొగ, మంటల్లో చిక్కుకుంది. బస్సు లోపల చిక్కుకున్న ప్రయాణికులు తప్పించుకునేందుకు యత్నించినా.. కుడివైపునున్న అత్యవసర ద్వారం తెరుచుకోకపోవడంతో వారి ప్రయత్నాలు ఫలించలేదు’ అధికారులు తెలిపారు. మంటలు చెలరేగిన వెంటనే డ్రైవర్ బస్సును నిలిపి అతని సీటు పక్కన ఉండే కిటికీ డోరు నుంచి దిగి వెనక వైపునకు వెళ్లి చూసి అక్కడి నుంచి పారిపోయాడు అని చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో కర్నూలు ప్రమాద ఘటనలో తీవ్రత పెరగడానికి మొబైల్ ఫోన్ల పేలుడే కారణమని ప్రాథమికంగా తేలింది. పార్సెల్ ఆఫీసుల్లో పోలీసులు తనిఖీలు?ఈ ప్రమాదంలో ఫోన్లు పేలడం కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ ట్రావెల్స్ పార్సిల్ ఆఫీసుల్లో.. ఆర్టీవో అధికారులు గానీ, పోలీసులు తనిఖీలు నిర్వహించే అవకాశం ఉంది. ఇలాంటి పేలుడు పదార్థాలకు ప్రధాన కారణంగా ఉన్నటువంటి మొబైల్ ఫోన్లను, సంబంధిత ఇతర వస్తువులను గాని బస్సులలో పంపించకూడదని ఇప్పటికైనా అధికారులు హెచ్చరించే అవకాశం ఏమైనా వుందా? చూడాల్సి ఉంది.
రష్యా చమురు.. భారత్ ఏకాకిగా మారిందా?
అంతర్జాతీయ వాణిజ్యంలో సమానత్వం అవసరమని, ఒకే రకమైన పరిస్థితుల్లో ఉన్న దేశాలకు వేర్వేరు నిబంధనలు వర్తింపజేయడం అన్యాయమని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ అభిప్రాయపడ్డారు. రష్యా చమురు విషయంలో భారత్పైనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒత్తిడి చేస్తుండడం గురించి ప్రస్తావిస్తూ.. ఈ విషయంలో భారత్ ఏకాకిగా మారిందంటూ గోయల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ద్వైపాక్షిక్ష చర్చల్లో భాగంగా జర్మనీ పర్యటనలో ఉన్న ఆయన బెర్లిన్లో జరిగిన ఓ కార్యక్రమాంలో మాట్లాడుతూ.. ‘‘ఈ రోజు పేపర్లో చూశాను. ముడి చమురు కొనుగోలు విషయంలో ఆంక్షల నుంచి మిహాయించాలని జర్మనీ కోరినట్టు అందులో ఉంది. యూకే ఇప్పటికే అమెరికా నుంచి చమురు కొనుగోలు పరంగా మినహాయింపు పొందింది. అలాంటప్పుడు భారత్నే ఎందుకు లక్ష్యం చేసుకుంటున్నారు?.. అని మంత్రి అన్నారాయన. ఇదిలా ఉంటే.. రష్యా చమురు కంపెనీలైన రోజ్నెఫ్ట్, ల్యూక్ ఆయిల్తో ఎవరూ వ్యాపార లావాదేవీలు నిర్వహించరాదంటూ ఈ నెల 22న అమెరికా ఆంక్షలు ప్రకటించింది. అయితే ఈ తరహా సుంకాలు అనుచితం, అన్యాయం, అసమంజసమని భారత్ తరఫున గోయల్ మరోసారి స్పష్టం చేశారు. ఉక్రెయిన్ యుద్ధంలో రష్యాతో భారత్ జరిపే చమురు వాణిజ్యం వల్లే నిధులు సమకూరుతున్నాయని.. తక్షణమే ఆ కొనుగోళ్లను ఆపేయాలంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గత కొంతకాలంగా చెబుతూ వస్తున్నారు. ఈ క్రమంలోనే పెనాల్టీ టారిఫ్లు విధించిన ఆయన.. ఆపకపోతే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరిస్తూ వచ్చారు. అయినప్పటికీ భారత్ మాత్రం జాతి ప్రయోజనాలు తప్పించి.. మరే ఇతర కోణంలోనూ నిర్ణయాలు తీసుకోబోదని స్పష్టం చేసింది. అయితే.. మోదీ తనకు మంచి మిత్రుడని, రష్యా కొనుగోళ్లను ఆపేస్తానని హామీ ఇచ్చారని ట్రంప్ స్వయంగా ప్రకటించారు. భారత్ ఈ ప్రకటనను ఖండించింది. ఆ వెంటనే ఆయన స్వరం మారింది. వైట్హౌజ్ దీపావళి వేడుకల్లో మాట్లాడుతూ.. భారీగా కొనుగోళ్లను జరపబోదంటూ మరో ప్రకటన చేసేశారు. అదే సమయంలో.. ఇండియా-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం కూడా ఓ కొలిక్కి రాబోతోందని తెలిపారు. రష్యా నుంచి ముడి చమురును నిలిపివేయాలంటూ అమెరికా ఒత్తిళ్లు తీసుకువస్తున్న వేళ.. మంత్రి పీయూష్ గోయల్ తాజా వ్యాఖ్యలకు ప్రాధాన్యం నెలకొంది.
IND vs AUS: తొలి వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా
Australia vs India, 3rd ODI Updates And Highlights: టీమిండియాతో నామమాత్రపు మూడో వన్డేలో ఆస్ట్రేలియా టాస్ గెలిచింది. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్లో తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా9.2: సిరాజ్ బౌలింగ్లో ప్రసిద్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగిన ట్రావిస్ హెడ్. 25 బంతులు ఎదుర్కొని 29 పరుగుల చేసిన హెడ్ అవుట్. ఫలితంగా తొలి వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా. మాథ్యూ షార్ట్ క్రీజులోకి రాగా.. మార్ష్ 25 పరుగులతో ఆడుతున్నాడు. పది ఓవర్లలో ఆసీస్ స్కోరు: 63-1ఐదు ఓవర్లలో ఆస్ట్రేలియా స్కోరు: 26-0(5)మిచెల్ మార్ష్ 6, ట్రావిస్ హెడ్ 13 పరుగులతో క్రీజులో ఉన్నారు. సిరాజ్ భారత బౌలింగ్ అటాక్ ఆరంభించగా.. హర్షిత్ రాణా సిరాజ్ కలిసి ఆల్టర్నేటివ్ ఓవర్లలో బరిలోకి దిగాడు.ఒక మార్పుతో బరిలోకిఈ సందర్భంగా ఆసీస్ కెప్టెన్ మిచెల్ మార్ష్ మాట్లాడుతూ.. ‘‘వికెట్ బాగుందనిపిస్తోంది. అందుకే ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాం. యువ ఆటగాళ్లు రాణించడం మా జట్టుకు శుభపరిణామం. 3-0తో సిరీస్ క్లీన్స్వీప్ చేసే సువర్ణావకాశం మా ముందుంది. గత మ్యాచ్లో కూపర్ కన్నోలి అద్భుతంగా ఆడాడు. ఈ వన్డేలో మేము ఒక మార్పుతో బరిలోకి దిగుతున్నాం. జేవియర్ బార్ట్లెట్ స్థానంలో నాథన్ ఎల్లిస్ జట్టులోకి వచ్చాడు’’ అని తెలిపాడు.టీమిండియాలో రెండు మార్పులుమరోవైపు.. టీమిండియా గత మ్యాచ్లలో చేసిన పొరపాటును సరిచేసుకున్నట్లు అనిపిస్తోంది. రెండు వన్డేల్లో బెంచ్కే పరిమితం చేసిన చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్కు ఎట్టకేలకు పిలుపునిచ్చింది. ఈ మ్యాచ్లో భారత్ తమ తుదిజట్టులో రెండు మార్పులు చేసింది. అర్ష్దీప్ సింగ్, నితీశ్ కుమార్ రెడ్డి స్థానాల్లో కుల్దీప్ యాదవ్, ప్రసిద్ కృష్ణలను ఎంపిక చేసుకుంది.టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా మూడో వన్డే తుదిజట్లుటీమిండియారోహిత్ శర్మ, శుబ్మన్ గిల్ (కెప్టెన్), విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, మొహమ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ.ఆస్ట్రేలియామిచెల్ మార్ష్(కెప్టెన్), ట్రావిస్ హెడ్, మాథ్యూ షార్ట్, మ్యాట్ రెన్షా, అలెక్స్ క్యారీ(వికెట్ కీపర్), కూపర్ కన్నోలీ, మిచెల్ ఓవెన్, నాథన్ ఎల్లిస్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా, జోష్ హాజిల్వుడ్.
దీపావళి ఎఫెక్ట్: అమెరికాలో వెల్లువెత్తిన ఫిర్యాదులు
భారత్తో పాటు ప్రపంచంలోని నలుమూలలా భారతీయులు, మన మూలాలు ఉన్నవాళ్లు దీపావళి వేడుకలు ఘనంగా చేసుకున్నారు. అయితే.. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో వేడుకల్లోనూ పలు చోట్ల అపశ్రుతి ఘటనలు చోటుచేసుకున్నాయి. దీంతో ఫిర్యాదులు వెల్లువెత్తగా.. అదే సమయంలో విమర్శలూ వెల్లువెత్తుతున్నాయి. దీపావళి వేడుకల్లో.. గాయాలు, ప్రమాదాలు, చివరాఖరికి మరణాలు కూడా సంభవించిన సందర్భాలు ఉన్నాయి. అయితే అమెరికాలో ఈ ఏడాది జరిగిన వేడుకల్లో ‘నష్టం’ కాస్త ఎక్కువే జరిగిందని పరిస్థితులు చెబుతున్నాయి. మరీ ముఖ్యంగా.. అర్ధరాత్రి పూట అక్కడి భారతీయులు చేసిన హంగామాపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. అందుకు న్యూయార్క్, న్యూజెర్సీ నగరాల్లో జరిగిన డ్యామేజ్ ఉదాహరణంగా నిలిచింది!.న్యూయార్క్ నగరం క్వీన్స్ ప్రాంతంలో.. బాణాసంచా కారణంగా లింకన్ స్ట్రీట్లోని మూడు నివాసాలు తీవ్రంగా దెబ్బ తిన్నాయి. ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. ఇక్కడి దీపావళి వేడుకలకు.. అదీ కూడా అర్ధరాత్రి పూట నిర్వహణకు అసలు అనుమతే లేదని అక్కడి అధికారులు చెబుతున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. సీసీటీవీ ఫుటేజ్ ప్రకారం, ఫైర్వర్క్స్ గాల్లోకి ఎగసి ఓ ఇంట్లోకి నేరుగా దూసుకెళ్లిన తర్వాత మంటలు వ్యాపించాయి. మరోపక్క.. Your #Diwali celebration? My house is gone!What a sad incident, disappointing beyond words.Indians in the U.S., wake up before it's too late!! pic.twitter.com/7SQjiVBgfV— M9 USA🇺🇸 (@M9USA_) October 24, 2025UPDATE: We have received video from the homeowner showing the damage caused by the illegal and irresponsible Diwali fireworks.In addition, a vehicle and the garage were completely burned and damaged. https://t.co/vOh5Oa58o3 pic.twitter.com/436GvhB9KD— YEGWAVE (@yegwave) October 24, 2025న్యూజెర్సీలో ఒక్క ఎడిసన్ నుంచే 40 ఎమర్జెన్సీ కాల్స్ అధికారులకు వెళ్లాయట. ఆస్తి నష్టంతో పాటు ముందస్తు జాగ్రత్తగా కొందరు అభ్యంతరాలు వ్యక్తం చేశారట. తమ నిద్రకు భంగం వాటిల్లిందనే ఫిర్యాదులు చేసిన వాళ్లు ఉన్నారట. దీంతో ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పి వేడుకలను జరగనివ్వకుండా ఆపేశారు కూడా. ఇంకోపక్క.. Look at the aftermath of these Diwali celebrations.It’s chaos. Litter everywhere. Police holding people back. Indians hanging out of cars speeding by.And these people have the audacity to compare Christmas parades to this.I’m fed up.pic.twitter.com/2gX57IcKW3— Anti-Taxxer (@mapleblooded) October 23, 2025దీపావళి వేడుకల కారణంగా అగ్నిప్రమాదాలు సంభవించి కొందరి నివాసాలు పూర్తిగా ధ్వంసమై అయ్యాయని.. కట్టుబట్టలతో వాళ్లు రోడ్డు మీద పడ్డారని కొన్ని వీడియోలు, కథనాలు బయటకు వచ్చాయి. ‘‘ఇలా జరుగుతుందని అనుకోలేదు. మాకేం మిగల్లేదు. నా కొడుకు ఒంటి మీద సరైన బట్టలు కూడా లేవు. హోటల్ గదిలో జీవించాల్సి వస్తోంది’’ అని బాధితురాలు జువానిటా కొలన్ ఓ మీడియా సంస్థతో పేర్కొనడం గమనార్హం. దీంతో.. Indians were celebrating Diwali in US. Their police and fire department came to join the celebration and played Holi. pic.twitter.com/nLLlnFlh8p— Joy (@Joydas) October 23, 2025అమెరికా దీపావళి వేడుకలపై మునుపెన్నడూ లేనిస్థాయిలో అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. అందుకు ఆ స్థాయిలో జరిగిన నష్టమే కారణమని స్పష్టమవుతోంది. దీంతో అధికారులు ఇలాంటి వేడుకలను అనుమతించొద్దని.. ఒకవేళ అనుమతించినా.. సురక్షిత నిబంధనలు పాటించేలా కఠిన మార్గదర్శకాలను తీసుకురావాలని పలువురు అమెరికన్లు కోరుతున్నారు. ఈ ఘటనలకు సంబంధించి.. పోలీసులు ఇంకా విచారణ కొనసాగిస్తున్నారు. ఇప్పటివరకు ఎవరినీ అరెస్ట్ చేయలేదని సమాచారం.Indians have been living a respectful life in USA, UK, Canada and other Countries for over a century. What has really changed with the current expats creating such a ruckus, nuisance, civic garbage, displaying absolute lack of civic sense, cultural bankruptcy, this Diwali❓… pic.twitter.com/dGzt3SrtIs— Raju Parulekar (@rajuparulekar) October 24, 2025
క్లీన్ స్వీప్ మిస్.. బీజేపీకి ‘క్రాస్ ఓటింగ్’ విక్టరీ!
కేంద్ర పాలిత జమ్ము కశ్మీర్ రాజ్యసభ ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి(Jammu Rajya Sabha Results). అధికార నేషనల్ కాన్ఫరెన్స్ క్లీన్ స్వీప్ మిస్ అయ్యింది. నాలుగు స్థానాల్లో మూడింటిని కైవసం చేసుకుంది. మిగిలిన ఒక్క స్థానాన్ని బీజేపీ కైవసం చేసుకోగా.. క్రాస్ ఓటింగ్ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 2019లో ఆర్టికల్ 370 రద్దు అనంతరం జరిగిన తొలి రాజ్యసభ ఎన్నికలు ఇవే. జమ్ము కశ్మీర్ అసెంబ్లీలో శుక్రవారం(అక్టోబర్ 24వ తేదీన) ఓటింగ్ జరిగింది. 88 మంది ఎమ్మెల్యేలకు గానూ.. 86 మంది నేరుగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. జైల్లో ఉన్న ఆప్ ఎమ్మెల్యే మెహరాజ్ మాలిక్ పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటేశారు. కాంగ్రెస్, పీడీపీ, సీపీఐ(ఎం), ఏఐపీ, ఇతర స్వతంత్ర ఎమ్మెల్యేలు నేషనల్ కాన్ఫరెన్స్ అభ్యర్థులకు మద్దతు ఇచ్చారు.ఎన్సీ తరఫున చౌదరి మహ్మద్ రంజాన్, సజ్జాద్ కిచ్లూ, జీఎస్ ఒబెరాయ్, బీజేపీ నుంచి ఆ పార్టీ రాష్ట్ర చీఫ్ సత్ పాల్ శర్మ(Sat Paul Sharma) విజేతలుగా నిలిచారని అసెంబ్లీ సెక్రటరీ ఎంకే పండిత తెలిపారు. भाजपा जम्मू कश्मीर अध्यक्ष श्री @iamsatsharmaca ने आज विधानसभा सचिवालय, श्रीनगर में राज्यसभा सांसद के रूप में विजय का प्रमाण पत्र चुनाव अधिकारी से प्राप्त किया। pic.twitter.com/pZul3mcCjF— BJP Jammu & Kashmir (@BJP4JnK) October 24, 2025నాలుగో సీటు కోసం నేషనల్ కాన్ఫరెన్స్ నుంచి ఇమ్రాన్ నబీ, సత్ శర్మ పోటీ పడ్డారు. అయితే 32 ఓట్లతో శర్మ విజయం సాధించినట్లు అసెంబ్లీ సెక్రటరీ ప్రకటించారు. జమ్ము అసెంబ్లీలో బీజేపీకి కేవలం 28 సీట్లు మాత్రమే ఉండగా.. 4 అదనపు ఓట్లు వచ్చాయి. అయితే బీజేపీ ఊహించినట్లుగానే.. స్వతంత్రులు వాళ్ల వైపు మొగ్గు చూపినట్లు స్పష్టమవుతోంది. మరోవైపు నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత, సీఎం ఒమర్ అబ్దుల్లా ఆ నాలుగు ఓట్లు ఎక్కడివి? అంటూ ఓ ట్వీట్ చేశారు. క్రాస్ ఓటింగ్కు పాల్పడ్డ(Cross Voting For BJP) ఆ నలుగురు ఎవరు అనేది తేలాల్సి ఉంది. ఇక..All of @JKNC_ votes remained intact across the four elections, as witnessed by our election agent who saw each polling slip. There was no cross voting from any of our MLAs so the questions arise - where did the 4 extra votes of the BJP come from? Who were the MLAs who…— Omar Abdullah (@OmarAbdullah) October 24, 2025డోడా నియోజకవర్గ ఆప్ ఎమ్మెల్యే మెహరాజ్ మాలిక్ పోస్టల్ బ్యాలెట్ ద్వారా రాజ్యసభ ఎన్నికల్లో ఓటు వేశారు. పబ్లిక్ సేఫ్టీ యాక్ట్ (PSA) కింద సెప్టెంబర్ 8, 2025న అరెస్ట్ అయ్యారాయన. ఆయన ప్రస్తుతం కథువా జిల్లా జైలులో నిర్బంధంలో ఉన్నారు. 2019లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్ము కశ్మీర్ రాష్ట్రం కాస్త కేంద్ర పాలిత ప్రాంతంగా మారింది. ఛండీగఢ్, లక్షద్వీప్ లాంటి కేంద్ర పాలిత ప్రాంతాలకు అసెంబ్లీ ఉండదు. కాబట్టి వాటికి రాజ్యసభ స్థానాలు ఉండవు. అయితే.. 2020లో జమ్ము కశ్మీర్ రీజనల్ అసెంబ్లీ తిరిగి ఏర్పడింది. అందువల్ల ఇతర రాష్ట్రాల మాదిరిగానే రాజ్యసభ ఎన్నికలు మళ్లీ అసెంబ్లీలోనే జరిగాయి. అంతా ఊహించినట్లుగానే అధికార పార్టీ నేషనల్ కాన్ఫరెన్స్ మెజార్టీ స్థానాలను కైవసం చేసుకుంది.
భరించలేనంత బాధ.. కర్నూల్ ఘటనపై రష్మిక ఎమోషనల్
కర్నూలు జిల్లాలో శుక్రవారం తెల్లవారు జామున జరిగిన వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు ఘోర ప్రమాదం తెలుగు రాష్ట్రాలతో పాటు యావత్ దేశాన్ని కలచి వేసింది. ఈ ఘటన గురించి సినీ నటి రష్మిక మందన్న స్పందించారు. 'కర్నూలులో జరిగిన ఘోర ప్రమాదం నా గుండెను చాలా తీవ్రంగా బాధపెడుతోంది. తగలబడుతున్న బస్సులో కాలిపోయే ముందు ప్రయాణికుల బాధను ఊహిస్తేనే భయంకరంగా ఉంది. చిన్న పిల్లలతో పాటు చాలామంది ప్రాణాలు కోల్పోయారు. ఒక కుటుంబం మొత్తం నిమిషాల్లోనే తమ ప్రాణాలు కోల్పోయిందని తెలుసుకుంటే చాలా బాధేస్తుంది. నిజంగా ఈ సంఘటన వినాశకరమైనది. ఇంతటి విషాదాన్ని మిగిల్చిన ఈ ప్రమాదంలో మరణించిన వారికి నా నివాళి. వారి ఆత్మకు శాంతి చేకూరాలి. మృతుల కుటుంబాలకు నా సానుభూతి.. దేవుడు ధైర్యాన్ని ఇవ్వాలని ప్రార్ధిస్తున్నా'అంటూ సోషల్మీడియాలో ఆమె ఒక పోస్ట్ చేశారు.ఈ ప్రమాదంలో 19 మంది సజీవ దహనం అయ్యారు. నెల్లూరుకు చెందిన అనూష ఆ మంటల్లో ఎలాగైనా తన కుమార్తెను కాపాడుకోవాలని బిడ్డను కౌగిలించుకుని అలాగే కాలిపోయిన దృశ్యం అందరినీ కంటతడి పెట్టించింది. మృతుల్లో ఏపీ, తెలంగాణ, కర్ణాటక వాసులున్నారు. వీరిలో ఇద్దరు చిన్న పిల్లలు కూడా ఉన్నారు. ఈ ప్రమాద సమయంలో బస్సు అద్దాలను ధ్వంసం చేసి అతి కష్టంగా 25 మంది ప్రాణాలతో బయటపడ్డారు.The news from Kurnool has been weighing heavily on my heart. Imagining what those passengers must’ve gone through inside that burning bus is just unbearable..To think that an entire family, including little kids, and so many others lost their lives in minutes it’s truly…— Rashmika Mandanna (@iamRashmika) October 24, 2025
తిరుమలను వదలని వరుణుడు
సాక్షి, తిరుపతి/విశాఖ: అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో ఇప్పటికే విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. తాజాగా.. ఆగ్నేయ బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన తీవ్ర అల్పపీడనం ఇవాళ వాయుగుండంగా రూపాంతరం చెందనుంది. దీంతో.. వాతావరణ శాఖ అధికార యంత్రాగాన్ని అప్రమత్తం చేసింది. ఇంకోవైపు.. తిరుమలలో వారం రోజులుగా ఎడతెరిపి ఇవ్వకుండా కురుస్తున్న వర్షాలతో భక్తులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. మరోవైపు.. జలాశయాలలో బారీగా నీరు వచ్చి చేరుతోంది. ఇప్పటికే గోగర్భం డ్యామ్ నిండిపోవడంతో అధికారులు గేట్లు ఎత్తేశారు. ముంపు ముప్పు దృష్ట్యా.. లోతట్టు ప్రాంతాల గ్రామాలను అప్రమత్తం చేశారు. తిరుమల భక్తుల రద్దీ ఇలా.. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి దర్శనానికి 20 కంపార్టుమెంట్లో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 12 గంటలు, ప్రత్యేక దర్శనానికి 5 గంటల సమయం పడుతోంది. నిన్న(శుక్రవారం) శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 71,110గా ఉంది. తలనీలాలు సమర్పించిన భక్తులు 25,695 మంది. శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.89 కోట్లు.మరిన్ని వర్షాలుఆగ్నేయ బంగాళాఖాతంలో రేపు తీవ్ర వాయుగుండంగా బలపడనుంది. ఎల్లుండికి నైరుతి, ఆనుకుని ఉన్న పశ్చిమమధ్య బంగాళాఖాతంలో తుపానుగా మారే అవకాశం. దీని ప్రభావంతో ఇవాళ(శనివారం, అక్టోబర్ 25)) కోనసీమ,కృష్ణా,బాపట్ల జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. అలాగే.. ప్రకాశం, నెల్లూరు,తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు, మిగతా జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవొచ్చని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ ఒక ప్రకటనలో తెలిపారు.
హైదరాబాద్లో ట్రావెల్స్ బస్సులు, వాహనాల తనిఖీలు.. చలాన్లు చెల్లిస్తేనే అనుమతి..
సాక్షి, హైదరాబాద్: కర్నూలులో ప్రైవేట్ బస్సు ప్రమాదం నేపథ్యంలో తెలంగాణ రవాణాశాఖ(Telangana Transport Department) అధికారులు అలర్ట్ అయ్యారు. శుక్రవారం రాత్రి, శనివారం ఉదయం ట్రాఫిక్ పోలీసులు ట్రావెల్స్ బస్సులను తనిఖీ చేశారు. డ్రంకన్ డ్రైవ్, బీమా, ఫిట్నెస్, పర్మిట్ పత్రాలు, బస్సు లోపల భద్రతను పరిశీలించారు. పర్మిట్ లేకుండా వెళ్తున్న బస్సులపై, నిబంధనలు పాటించని పలు బస్సులపై కేసులు నమోదు చేశారు. అనుమతి లేకుండా నడుపుతున్న ట్రావెల్స్ బస్సులను సీజ్ చేశారు.మరోవైపు.. కూకట్పల్లి, హయత్నగర్, ఎల్బీనగర్ పరిధిలో కూడా ట్రావెల్స్ బస్సులు, ఆటోలు, క్యాబ్ల్లో పోలీసులు తనిఖీలు చేపట్టారు. లైసెన్స్, సరైన పత్రాలు లేని వాహనాలపై కేసులు నమోదు చేశారు. ఈ క్రమంలోనే వాహనాలపై ఉన్న చలాన్లను పోలీసులు వసూలు చేస్తున్నారు. చలాన్లను చెల్లిస్తేనే వెళ్లేందుకు పోలీసులు అనుమతి ఇస్తున్నారు. అలాగే, గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా రవాణాశాఖ అధికారుల తనిఖీలు చేపట్టనున్నారు. నిబంధనలు, భద్రతా ప్రమాణాలు పాటించని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల యాజమాన్యాలపై చర్యలు తీసుకోనున్నారు. ఆరు ప్రత్యేక టీమ్లతో అధికారులు తనిఖీలు చేపట్టనున్నారు.కాగా, కర్నూలు శివారు చిన్నటేకూరు వద్ద ఘోర బస్సు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. బస్సు బైక్ను ఢీకొట్టడంతో ఈ ఘోరం జరిగింది. బైక్ను ఢీకొట్టిన తర్వాత బస్సు దాన్ని 300 మీటర్లు లాక్కెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో దాదాపు 20 మందికి పైగా మృతిచెందారు. అయితే.. ప్రమాదానికి అనేక కారణాలు ఉన్నాయని అధికారులు నిర్ధారణకు వచ్చారు. బస్సులో అనేక లోపాలు ఉన్నాయని కూడా తేలింది. దీంతో తెలంగాణ రవాణా శాఖ అప్రమత్తమైంది.
రిటైర్మెంట్ ప్లానింగ్లో చేయకూడని తప్పులు
ఉద్యోగుల జీవితంలో రిటైర్మెంట్ అనేది ఒక మధురమైన, ముఖ్యమైన ఘట్టం. ఉద్యోగ బాధ్యతల నుంచి తప్పుకొని నచ్చిన పనులను, అలవాట్లను ఆస్వాదించడానికి లభించే విలువైన సమయం. అయితే ఈ కాలాన్ని ఆనందంగా, ఆర్థికపరమైన చింతలు లేకుండా గడపాలంటే సరైన ప్రణాళిక తప్పనిసరి. చాలా మంది తమ రిటైర్మెంట్ ప్లానింగ్లో కొన్ని సాధారణ ఆర్థిక తప్పులు చేస్తారు. ఈ తప్పులు భవిష్యత్తులో వారి జీవితాన్ని కష్టతరం చేయవచ్చు. రిటైర్మెంట్ జీవితం గోల్డెన్డేస్గా మారాలంటే సాధారణంగా చేసే తప్పులను సరి చేసుకోవ్సాలిందే.త్వరగా ప్రారంభించకపోవడంరిటైర్మెంట్ ప్లానింగ్లో చేసే అతిపెద్ద తప్పు.. పదవి విరమణ ప్రణాళికను త్వరగా ప్రారంభించపోవడం. ‘ఇంకా చాలా సమయం ఉంది కదా.. అప్పుడే తొందరేముంది’ అని అనుకుంటూ పొదుపును వాయిదా వేస్తారు. కానీ పెట్టుబడి, రాబడికి సంబంధించి సమయం అనేది అత్యంత శక్తివంతమైన ఆస్తి. చిన్న మొత్తంలో అయినా త్వరగా పెట్టుబడి పెట్టడం వల్ల చక్రవడ్డీ ప్రభావం ద్వారా మెరుగైన రాబడి వస్తుంది. ఆలస్యంగా మొదలుపెడితే అదే లక్ష్యాన్ని చేరుకోవడానికి చాలా పెద్ద మొత్తాలను పోగుచేయాల్సి ఉంటుంది.స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించుకోకపోవడంరిటైర్మెంట్ తర్వాత ఎలాంటి జీవనశైలిని కొనసాగించాలనుకుంటున్నారు? ఆ జీవనానికి ఎంత డబ్బు అవసరమవుతుంది? అనేదానిపై స్పష్టమైన లక్ష్యం లేకపోవడం మరో పెద్ద తప్పు. ద్రవ్యోల్బణం పెరుగుదలను పరిగణనలోకి తీసుకోకుండా లక్ష్యాన్ని అంచనా వేయడం వల్ల అవసరమైన మొత్తం కంటే తక్కువ పొదుపు చేసే ప్రమాదం ఉంది.ద్రవ్యోల్బణం ప్రభావాన్ని విస్మరించడంనేడు రూ.50,000 అయ్యే ఖర్చులు 20 ఏళ్ల తర్వాత కూడా అంతే ఉంటుంది అనుకోవడం పొరపాటు. ద్రవ్యోల్బణం కాలక్రమేణా డబ్బు విలువను హరిస్తుంది. ద్రవ్యోల్బణాన్ని అధిగమించలేని పెట్టుబడి సాధనాలను (ఉదాహరణకు, తక్కువ రాబడిని ఇచ్చే సంప్రదాయ బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లు) మాత్రమే ఎంచుకుంటే రిటైర్మెంట్ కార్పస్ కొన్నాళ్లకు సరిపోకపోవచ్చు. అందుకే ద్రవ్యోల్బణాన్ని మించి రాబడిని ఇచ్చే పెట్టుబడులు (ఈక్విటీ, మ్యూచువల్ ఫండ్స్ వంటివి) అవసరం.ఆరోగ్య ఖర్చులను పట్టించుకోకపోవడంవయసు పెరిగే కొద్దీ ఆరోగ్య సంరక్షణ ఖర్చులు పెరుగుతాయి. చాలా మంది రిటైర్మెంట్ కార్పస్ను లెక్కించేటప్పుడు ఆరోగ్య ఖర్చులను విస్మరిస్తారు. ఊహించని వైద్య అత్యవసర పరిస్థితులు మీ పొదుపు మొత్తాన్ని క్షణాల్లో ఖర్చు చేస్తాయి. అందుకే రిటైర్మెంట్ ప్రణాళికలో భాగంగా సరైన ఆరోగ్య బీమా తీసుకోవడం, వైద్య ఖర్చుల కోసం ప్రత్యేకంగా కొంత మొత్తాన్ని కేటాయించడం చాలా అవసరం.అధిక అప్పులతో రిటైర్మెంట్లోకి అడుగుపెట్టడంరిటైర్మెంట్ దశలోకి అడుగుపెట్టే సమయానికి గృహ రుణాలు, వ్యక్తిగత రుణాలు లేదా క్రెడిట్ కార్డ్ అప్పులు వంటివి ఉండటం చాలా ప్రమాదకరం. స్థిరమైన జీతం లేని సమయంలో ఈ రుణాలకు ఈఎంఐలు చెల్లించడం రిటైర్మెంట్ నిధిపై ఒత్తిడిని పెంచుతుంది. రిటైర్మెంట్కు ముందే అన్ని అప్పులనూ తీర్చేయడం ముఖ్యం.ఇదీ చదవండి: అగ్ని ప్రమాదంలో ఆస్తి నష్టం.. క్లెయిమ్ ప్రాసెస్ ఎలా?
భారత్ పక్కలో చైనా మిసైల్ బల్లెం
న్యూఢిల్లీ: కయ్యాలమారి చైనా ఒకవైపు భారత్కు స్నేహ హస్తం అందిస్తున్నట్టు నటిస్తూనే మరోవైపు సరిహద్దుల్లో భారీగా ఆయుధ వ్యవస్థలను మోహరిస్తోంది. టిబెట్లోని పాంగాంగ్ సరస్సు తూర్పు ఒడ్డున, వాస్తవాధీన రేఖకు కేవలం 65 కిలోమీటర్ల దూరంలోనే అత్యాధునిక గగన రక్షణ వ్యవస్థ బేస్ను నిర్మిస్తోంది. సకల వసతులతోపాటు భారీ ఆయుధాలు, క్షిపణులు మోహరించేలా దీని నిర్మాణాన్ని వేగంగా పూర్తిచేస్తోంది. ఈ బేస్ను మొదట అమెరికాకు చెందిన ఆల్సోర్స్ అనాలిసిస్ అనే సంస్థ గుర్తించింది. శాటిలైట్ చిత్రాల ద్వారా బేస్ను కనిపెట్టింది. 2020లో భారత్–చైనా సైనికుల మధ్య ఘర్షణ జరిగిన గస్తీ పాయింట్కు ఈ ఎయిర్ డిఫెన్స్ కాంప్లెక్స్ 110 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. గార్ కౌంటీలో ఉన్న ఈ కేంద్రం భారత్లో ఇటీవల ఆధునీకరించిన న్యోమా ఎయిర్ఫీల్డ్కు సరిగ్గా ఎదురుగా ఉంటుంది. భారీ క్షిపణులకు కేంద్రంగా.. ఉపగ్రహ చిత్రాలను బట్టి చూస్తే ఈ కాంప్లెక్స్లో భారీ కమాండ్ అండ్ కంట్రోల్ భవనాలు, బ్యార్లు, వాహనాలు నిలిపి ఉంచే షెడ్లు, ఆయుధ నిల్వ గోదాములు, రాడార్ సిస్టంలు ఉన్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా క్షిపణి లాంచింగ్ వాహనాలను రహస్యంగా దాచి ఉంచేందుకు భారీ బంకర్ వంటి భవనాలను నిర్మిస్తున్నారు. ఈ భవనాలకు ముందుకు వెనుకకు జరుపగల పైకప్పును అమర్చినట్లు నిపుణులు గుర్తించారు. అంటే ఆ భవనంలో దాగి ఉన్న వాహనం నుంచి క్షిపణిని ప్రయోగించాలనుకుంటే వెంటనే భవనం పైకప్పు పక్కకు జరుగుతుంది. క్షిపణి ప్రయోగం పూర్తికాగానే మళ్లీ యథాస్థానానికి చేరుకుంటుంది. శత్రువు నిఘాకు దొరక్కుండా తమ క్షిపణి వ్యవస్థలను దాచేందుకు ఈ భవనాలను నిర్మిస్తున్నట్లు చెబుతున్నారు. ఈ ఒక్కో బంకర్ రెండు వాహనాలను నిలిపి ఉంచగల భారీ విస్తీర్ణంలో ఉన్నాయి. ఈ బంకర్ భవనాల్లో చైనా దీర్ఘశ్రేణి సర్ఫేస్ టు ఎయిర్ (భూ ఉపరితలం నుంచి గగనతలంలోకి ప్రయోగించగల క్షిపణి) హెచ్క్యూ–9 క్షిపణి వ్యవస్థలను మోహరించనున్నట్లు ఇంటెలిజెన్స్ నిపుణులు పేర్కొంటున్నారు. ఆల్సోర్స్ అనాలిసిస్ సంస్థ ఈ కాంప్లెక్స్ను బహిర్గతం చేసిన తర్వాత అమెరికాకే చెందిన గగనగల ఇంటెలిజెన్స్ కంపెనీ వంటార్కు చెందిన ఓపెన్సోర్స్ ఇంటెలిజెన్స్ టీం (ఓఎస్ఐఎన్టీ) మరింత కచ్చితమైన చిత్రాలను సేకరించింది. సెపె్టంబర్ 29న తీసిన శాటిలైట్ చిత్రాల్లో కొన్ని బంకర్ భవనాల పైకప్పులు క్షిపణి ప్రయోగానికి అనువుగా తెరిచి ఉండగా, కొన్నింటికి మూసి ఉండటం కనిపించింది. ‘ఈ రకమైన భవనాలు చైనా క్షిపణి వ్యవస్థలకు అన్ని రకాలుగా రక్షణ ఇస్తాయి. అంతేకాకుండా శత్రువుల ఎదురుదాడి నుంచి తన క్షిపణి వ్యవస్థలను రక్షిస్తాయి. మామూలు సమయంలో అక్కడ మిసైల్ లాంచర్స్ ఉన్నట్లు గుర్తించటం కూడా కష్టమే’అని ఆల్సోర్స్ అనాలిసిస్ సంస్థ పేర్కొంది. చైనా గతంలో ఇలాంటి భవనాలనే దక్షిణ చైనా సముద్రంలోని వివాదాస్పద ద్వీపాల్లో నిర్మించినట్లు వార్తలు వచ్చాయి. అయితే, పాంగాంగ్ సరస్సు వద్ద చైనా చేపట్టిన ఈ నిర్మాణాలను గత జూలైలోనే డామియెన్ సైమన్ అనే జియోస్పేషియల్ పరిశోధకుడు గుర్తించాడు. కానీ, అప్పుడు అక్కడ ఏం నిర్మిస్తున్నారన్నది తెలియలేదు.
ఆయేషాకు టైఫాయిడ్, డెంగ్యూ.. తనూజ కోసం వెక్కెక్కి ఏడ్చిన కల్యాణ్!
దీపావళి ఎఫెక్ట్: అమెరికాలో వెల్లువెత్తిన ఫిర్యాదులు
లెక్క తప్పింది.. తెలంగాణ ఎక్సైజ్కు చుక్కెదురు!
ఎట్టకేలకు కుల్దీప్ ఎంట్రీ.. నితీశ్ రెడ్డి అవుట్.. కారణం ఇదేనన్న బీసీసీఐ
రిటైర్మెంట్ ప్లానింగ్లో చేయకూడని తప్పులు
వ్యాపార విస్తరణకు కీలకంగా భారత్
కమల్-రజనీ మూవీ.. శృతి హాసన్, సౌందర్య ఏమన్నారంటే?
భరించలేనంత బాధ.. కర్నూల్ ఘటనపై రష్మిక ఎమోషనల్
ఇన్ఫ్రా కంపెనీలకు తక్షణమే బకాయిలు చెల్లించాలి
IND vs AUS: తొలి వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా
'ఆలస్యం చేయొద్దు.. వేగంగా కొనండి': రాబర్ట్ కియోసాకి
కొడుకుతో వాచ్మెన్కు క్షమాపణ చెప్పించిన ముకేశ్ అంబానీ
బ్రేకప్.. గుండెలోతులో బాధ.. : రష్మిక మందన్నా
ఈ రాశి వారు వాహనాలు, భూములు కొంటారు
పసిడి ధరలు రివర్స్! తులం బంగారం ఒక్కసారిగా..
భారత్తో టీ20 సిరీస్.. ఆసీస్ జట్టు ప్రకటన! విధ్వంసకర వీరుడు వచ్చేశాడు
బిగ్బాస్ 9: సడన్గా రౌడీ బేబి ఎలిమినేట్! ఎందుకంటే?
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం
పెళ్లి తర్వాత తొలి దీపావళి.. అక్కినేని అఖిల్ భార్య స్పెషల్ విషెస్!
ఓటీటీల్లో పండగే.. ఒక్క రోజే 17 సినిమాలు స్ట్రీమింగ్!
'ఉపాసన' సీమంతం.. సందడిగా మెగా ఫ్యామిలీ (ఫోటోలు)
ఉద్యోగులకు డీఏ ఎగ్గొట్టడానికి కొత్త లెక్కలు కనిపెడుతున్నార్సార్!!
ఇవి జరిగితేనే.. బంగారం ధరలు తగ్గుతాయి!
ICC WC 2025: సత్తా చాటి సెమీఫైనల్కు భారత్
కళ్లు తిరిగి పడిపోయిన తనూజ.. ఆరుగురి రీఎంట్రీ !
బంగారం ధర 2026లో కొత్త రికార్డులు సృష్టిస్తుందా?
బతికితే చాలనుకున్నా.. ఆకాశ్ అంబానీ హెల్ప్ చేశారు: తిలక్ వర్మ
కర్నూలులో ఘోర బస్సు ప్రమాదం.. పలువురి సజీవ దహనం
కర్నూలు ఘటన.. స్పందించిన ట్రావెల్స్ యాజమాన్యం
తుని ఘటన: నారాయణరావు మృతదేహం లభ్యం
ఆయేషాకు టైఫాయిడ్, డెంగ్యూ.. తనూజ కోసం వెక్కెక్కి ఏడ్చిన కల్యాణ్!
దీపావళి ఎఫెక్ట్: అమెరికాలో వెల్లువెత్తిన ఫిర్యాదులు
లెక్క తప్పింది.. తెలంగాణ ఎక్సైజ్కు చుక్కెదురు!
ఎట్టకేలకు కుల్దీప్ ఎంట్రీ.. నితీశ్ రెడ్డి అవుట్.. కారణం ఇదేనన్న బీసీసీఐ
రిటైర్మెంట్ ప్లానింగ్లో చేయకూడని తప్పులు
వ్యాపార విస్తరణకు కీలకంగా భారత్
కమల్-రజనీ మూవీ.. శృతి హాసన్, సౌందర్య ఏమన్నారంటే?
భరించలేనంత బాధ.. కర్నూల్ ఘటనపై రష్మిక ఎమోషనల్
ఇన్ఫ్రా కంపెనీలకు తక్షణమే బకాయిలు చెల్లించాలి
IND vs AUS: తొలి వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా
'ఆలస్యం చేయొద్దు.. వేగంగా కొనండి': రాబర్ట్ కియోసాకి
కొడుకుతో వాచ్మెన్కు క్షమాపణ చెప్పించిన ముకేశ్ అంబానీ
బ్రేకప్.. గుండెలోతులో బాధ.. : రష్మిక మందన్నా
ఈ రాశి వారు వాహనాలు, భూములు కొంటారు
పసిడి ధరలు రివర్స్! తులం బంగారం ఒక్కసారిగా..
భారత్తో టీ20 సిరీస్.. ఆసీస్ జట్టు ప్రకటన! విధ్వంసకర వీరుడు వచ్చేశాడు
బిగ్బాస్ 9: సడన్గా రౌడీ బేబి ఎలిమినేట్! ఎందుకంటే?
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం
పెళ్లి తర్వాత తొలి దీపావళి.. అక్కినేని అఖిల్ భార్య స్పెషల్ విషెస్!
ఓటీటీల్లో పండగే.. ఒక్క రోజే 17 సినిమాలు స్ట్రీమింగ్!
ఉద్యోగులకు డీఏ ఎగ్గొట్టడానికి కొత్త లెక్కలు కనిపెడుతున్నార్సార్!!
ఇవి జరిగితేనే.. బంగారం ధరలు తగ్గుతాయి!
ICC WC 2025: సత్తా చాటి సెమీఫైనల్కు భారత్
కళ్లు తిరిగి పడిపోయిన తనూజ.. ఆరుగురి రీఎంట్రీ !
బంగారం ధర 2026లో కొత్త రికార్డులు సృష్టిస్తుందా?
బతికితే చాలనుకున్నా.. ఆకాశ్ అంబానీ హెల్ప్ చేశారు: తిలక్ వర్మ
కర్నూలులో ఘోర బస్సు ప్రమాదం.. పలువురి సజీవ దహనం
కర్నూలు ఘటన.. స్పందించిన ట్రావెల్స్ యాజమాన్యం
తుని ఘటన: నారాయణరావు మృతదేహం లభ్యం
అతడే ఉంటే కథ వేరేలా ఉండేది.. గంభీర్ ఇకనైనా మారవా?
సినిమా
రెండోసారి తల్లి కాబోతున్న 'జయం' చైల్డ్ ఆర్టిస్ట్
'జయం' సినిమా అప్పట్లో ఎంత సెన్సేషన్ సృష్టించిందో తెలిసిందే. ఈ మూవీలో నటించిన హీరోహీరోయిన్తో పాటు మిగిలిన యాక్టర్స్, డైరెక్టర్ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇదే చిత్రంలో హీరోయిన్ చెల్లి పాత్ర చేసిన బాలనటి యామిని కూడా బాగానే క్రేజ్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఈమె.. ఇప్పుడు మరోసారి తల్లికాబోతున్నట్లు శుభవార్త చెప్పేసింది. ఈ మేరకు ఫొటో షేర్ చేసింది.సీరియల్, సినిమాల్లో నటిగా గుర్తింపు తెచ్చుకున్న జయలక్ష్మి కూతురే యామిని శ్వేత. 'జయం' సినిమాలో నటించడాని కంటే ముందు దాదాపు 10 సీరియల్స్లో చేసింది. సీతామహాలక్ష్మీ అనే సీరియల్ చేస్తున్న టైంలో 'జయం' ఆడిషన్స్ గురించి ప్రకటన వచ్చింది. ఇది చూసిన యామిని తండ్రి.. కూతురు ఫొటోలని డైరెక్టర్ తేజకు పంపారు. స్క్రీన్ టెస్ట్ అయిపోయిన తర్వాత యామిని.. హీరోయిన్ చెల్లి పాత్రకు ఎంపికైంది. తన నటనతో నంది అవార్డ్ కూడా అందుకుంది.(ఇదీ చదవండి: సైలెంట్గా ఓటీటీల్లోకి వచ్చిన తెలుగు సినిమాలు) చైల్డ్ ఆర్టిస్ట్గా మాత్రమే శ్వేత.. సినిమాల్లో కనిపించాలని ఆమె తల్లిదండ్రులు భావించారు. దీంతో చిన్నప్పుడు పలు సినిమాలు, సీరియల్స్లో నటింపజేశారు. తర్వాత మాత్రం నో చెప్పేశారు. ఉత్సాహం, అనగనగా ఓ కుర్రాడు తదితర మూవీస్ చేసిన తర్వాత యామిని పూర్తిగా చదువుపై దృష్టి పెట్టింది. విదేశాల్లో మాస్టర్స్ చేసి అక్కడే ఉద్యోగం సంపాదించుకుంది. తర్వాత పెళ్లి చేసుకుని విదేశాల్లో స్థిరపడిపోయింది. కొన్నేళ్ల క్రితం ఈమెకు ఓ కూతురు పుట్టింది. ఇప్పుడు మరోసారి ప్రెగ్నెన్సీతో ఉన్నట్లు యామిని బయటపెట్టింది.దీపావళి సందర్భంగా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన యామిని.. ముగ్గురుగా ఉన్న తన కుటుంబం త్వరలో నలుగురిగా మారబోతుందని చెప్పింది. అలానే బేబీ బంప్ ఫొటోని కూడా పంచుకుంది. ఈ క్రమంలోనే నెటిజన్లు ఈమెకు శుభాకాంక్షలు చెబుతున్నారు.(ఇదీ చదవండి: సింగర్ రాహుల్ సిప్లిగంజ్ పెళ్లి సందడి షురూ) View this post on Instagram A post shared by Yamini Swetha Naidu (@yamini_swetha)
శర్వానంద్ లేటేస్ట్ లుక్.. ఇంతలా మారిపోయాడేంటి?
టాలీవుడ్ హీరో శర్వానంద్ ఇటీవలే తన కొత్త సినిమాకు సంబంధించి అప్డేట్ ఇచ్చారు. ఈ దీపావళి టైటిల్తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్ను పంచుకున్నారు. బైకర్ అనే మూవీలో శర్వానంద్ నటిస్తున్నట్లు నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ పోస్టర్ను రిలీజ్ చేసింది. పోస్టర్ చూస్తుంటే ఈ చిత్రంలో బైక్ రేసర్గా కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ శర్వానంద్ కెరీర్లో 36వ సినిమాగా రానుంది. ఇందులో మాళవిక నాయర్ హీరోయిన్గా కనిపించనుంది.అయితే తాజాగా శర్వానంద్ సోషల్ మీడియాలో ఫోటోలను పోస్ట్ చేశారు. షర్ట్ లెస్తో ఉన్న ఫోటోలు చూసిన ఫ్యాన్స్ షాకింగ్కు గురవుతున్నారు. ఇవీ చూసిన అభిమానులు.. శర్వానంద్ ఇలా మారిపోయాడేంటి? అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే బైకర్ మూవీ కోసమే ఇలా పూర్తిగా తన బాడీని మార్చుకున్నారని తెలుస్తోంది. నిజమైన బైక్ రేసర్గా కనిపించేందుకు బరువు తగ్గినట్లు తెలుస్తోంది. ఇలాంటి ఫిజిక్ కోసం కొన్ని నెలల పాటు వర్కవుట్స్ చేసినట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్గా మారాయి. కాగా.. ఈ చిత్రంలో బ్రహ్మాజీ, అతుల్ కుల్కర్ణి కీలక పాత్రలు పోషిస్తున్నారు. View this post on Instagram A post shared by Sharwanand (@imsharwanand)
శ్రీలంకలో పెద్ది పాట
ప్రేయసితో ప్రేమ పాట పాడుతున్నారు ‘పెద్ది’. రామ్చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందుతున్న పీరియాడికల్ మల్టీ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా, శివ రాజ్కుమార్, జగపతిబాబు, దివ్యేందు శర్మ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.కాగా, ఈ సినిమా తాజా షెడ్యూల్ శ్రీలంకలోప్రారంభమైంది. నేటి (శనివారం) నుంచి రామ్చరణ్, జాన్వీలపై అక్కడి లొకేషన్స్లో ఓ పాటను చిత్రీకరిస్తారు. ఇందుకోసం శుక్ర వారం సాయంత్రం రామ్చరణ్, బుచ్చిబాబు, ఇతర యూనిట్ సభ్యులు శ్రీలంక వెళ్లారు. అక్కడి షెడ్యూల్ వారం రోజుల పాటు ఉంటుందట. ‘‘ఈ సినిమా కోసం రామ్చరణ్ సరి కొత్తగా మేకోవర్ అయ్యారు. ఇప్పటివరకు సిల్వర్ స్క్రీన్పై చూడని చరణ్ను ఈ సినిమాలో చూస్తారు. అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలు ఉన్నాయి’’ అని యూనిట్ పేర్కొంది. వచ్చే మార్చి 27న విడుదల కానున్న ఈ చిత్రానికి సంగీతం: ఏఆర్ రెహమాన్.
ఊహకి కూడా అందదు
హీరో బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం ‘అఖండ 2: తాండవం’. ఈ చిత్రంలో హీరోయిన్ సంయుక్త, ఆది పినిశెట్టి, హర్షాలి మల్హోత్రా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఎం. తేజస్విని నందమూరి సమర్పణలో రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మిస్తున్న ఈ సినిమా డిసెంబరు 5న విడుదల కానుంది.ఈ చిత్రం నుంచి బ్లాస్టింగ్ రోర్ అంటూ ఓ వీడియోను రిలీజ్ చేశారు. ‘‘ఊహకి కూడా అందదు’’ అని బాలకృష్ణ పలికే డైలాగ్ ఈ వీడియోలో ఉంది. బాలకృష్ణ– బోయపాటి శ్రీను కాంబినేషన్లోనే వచ్చిన ‘అఖండ’కు సీక్వెల్గా ‘అఖండ 2: తాండవం’ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.
న్యూస్ పాడ్కాస్ట్
కర్నూలు జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం.. 19 మంది సజీవ దహనం
అన్ని వర్గాలను దారుణంగా మోసం చేసిన చంద్రబాబు
విశాఖ అభివృద్ధి గురించి ఆలోచించింది జగనే..
ఆంధ్రప్రదేశ్లో వ్యవస్థీకృతంగా నకిలీ మద్యం మాఫియా... లిక్కర్ దుకాణాలు, ఇల్లీగల్ పర్మిట్ రూమ్లు, బెల్ట్ షాపులు నడిపేది చంద్రబాబు మనుషులే... వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం
క్రెడిట్ చౌర్యంలో చంద్రబాబు సిద్ధహస్తుడు
చంద్రబాబు దిగిపోయాకే పెరిగిన ఐటీ ఎగుమతులు
గూగుల్ డేటా సెంటర్.. చంద్రబాబు రోల్ నిల్..
అదానీ పేరెందుకు ప్రస్తావించడం లేదు?
అక్రమ మద్యం కుంభకోణం కేసులో చంద్రబాబు ప్రభుత్వం బరితెగింపు.. వాసుదేవరెడ్డి, సత్య ప్రసాద్లను అప్రూవర్లుగా మార్చే కుతంత్రం
డీఏపై దొంగాట.. దీపావళి వేళ ఉద్యోగులు, పెన్షనర్లకు పిడుగుపాటులా చంద్రబాబు సర్కారు చీకటి జీవోలు జారీ
క్రీడలు
ఎన్బీఏలో బెట్టింగ్ కలకలం
న్యూయార్క్: అమెరికాలో ఎప్పుడూ ఆటతోనే పతాక శీర్షికలకెక్కే నేషనల్ బాస్కెట్బాల్ అసోసియేషన్ (ఎన్బీఏ) తాజాగా అవినీతి మకిలీతో పత్రికలకెక్కింది. ఇన్సైడ్ ఇన్ఫర్మెషన్ (జట్టు అంతర్గత సమాచారం) లీక్ చేసి బెట్టింగ్కు పాల్పడటం, మాఫియా కుటుంబాలతో కలిసి క్రీడా పందెంల రిగ్గింగ్, పోకర్ గేమ్ల అనుచిత కార్యకలాపాలు ఎన్బీఏకు మచ్చతెచ్చాయి. దీంతో రంగంలోకి దిగిన ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్బీఐ) పోర్ట్లాండ్ ట్రెయిల్ బ్లేజర్స్ జట్టు హెడ్ కోచ్ చౌన్సే బిలప్స్, మయామి హీట్ జట్టు ప్లేయర్ టెర్రీ రోజియెర్ సహా 30 మందికి పైగా అరెస్టు చేసింది. దీనిపై ముమ్మర దర్యాప్తు చేపట్టినట్లు ఎఫ్బీఐ డైరెక్టర్ కశ్యప్ పటేల్ వెల్లడించారు. భారత సంతతికి చెందిన కశ్యప్ ప్రమోద్ పటేల్ ఆధ్వర్యంలోనే ఈ కేసు విచారణ జరుగుతోంది. గత కొన్నేళ్లుగా భారీఎత్తున ఈ బెట్టింగ్ మాఫియా మిలియన్ డాలర్లను ఆర్జించినట్లు ఎఫ్బీఐ ప్రాథమిక దర్యాప్తులో తేలింది. పెద్ద ఎత్తున జరిగిన నేరపూరిత కుట్రలో ‘హాల్ ఆఫ్ ఫేమ్’లో ఉన్న కోచ్ బిలప్స్ ఉండటం ఎన్బీఏ వర్గాలను విస్మయపరిచింది. అమెరికాలోని ప్రధాన నగరాల్లో ఫిక్సింగ్ కార్యకలాపాల్లో బిలప్స్ హస్తముండగా, మయామి హీట్ ప్లేయర్ రోజియెర్ జట్టు గోప్యతకు భంగం కలిగేలా అంతర్గత సమాచారం లీక్ చేసి స్పాట్ బెట్టింగ్ తరహా మోసాలకు పాల్పడినట్లు ఎఫ్బీఐ డైరెక్టర్ కశ్యప్ తెలిపారు. బిలప్స్, రోజియెర్లవి రెండు వేర్వేరు కేసులు కాగా, ఈ రెండు కేసుల్లోనూ మాజీ ఎన్బీఏ సహాయ కోచ్, మాజీ ఆటగాడు డామన్ జోన్స్ నిందితుడని ఎఫ్బీఐ అధికారులు తెలిపారు. మరి ఎన్బీఏ ఏం చేసింది ఎన్బీఏ ప్రతిష్టకే మచ్చతెచ్చిన వ్యవహారంపై ఎన్బీఐ యాజమాన్యం తీవ్రంగా పరిగణించింది. రిగ్గింగ్, బెట్టింగ్, ఫిక్సింగ్ ఆరోపణల్లో అరెస్టయిన బిలప్స్, రోజియెర్, డామన్ జోన్స్లపై వేటు వేసింది. ఎన్బీఏ క్రీడా సమగ్రతను కాపాడేందుకు ఎఫ్బీఐ అధికారులు, పోలీసులు చేసే విచారణకు పూర్తిస్థాయిలో సహకరిస్తామని ఎన్బీఏ ఒక ప్రకటనలో పేర్కొంది. గతంలో 2007లో కూడా ఎన్బీఏను బెట్టింగ్ ఉదంతం ఉక్కిరిబిక్కిరి చేసింది. అప్పుడు రిఫరీ టిమ్ డొనగే మ్యాచ్ ఫిక్సింగ్, బెట్టింగ్లతో ఎన్బీఏకు మచ్చ తెచ్చారు. ఆ తర్వాత కూడా బ్రాడ్కాస్టింగ్ ఒప్పందంలో అనివీతి ఆరోపణలతో ఎన్బీఐ ప్రతిష్ట మసకబారింది.
విజయంతో ముగిస్తారా!
సిడ్నీ: ఐసీసీ వన్డే టోర్నీ చాంపియన్స్ ట్రోఫీ విజేత హోదాలో భారీ అంచనాలతో ఆ్రస్టేలియాకు వచ్చిన భారత జట్టు పేలవ ప్రదర్శనతో ఇప్పటికే 0–2తో సిరీస్ను కోల్పోయింది. మిగిలిన చివరి మ్యాచ్లోనైనా గెలిస్తే టీమిండియాకు ఊరట దక్కుతుంది. భారత జట్టు తమ వన్డే చరిత్రలో ఒక్కసారి కూడా ఆస్ట్రేలియా చేతిలో క్లీన్స్వీప్నకు గురి కాలేదు. వన్డే ఫార్మాట్లో టీమిండియా కొత్త కెపె్టన్ శుబ్మన్ గిల్ నాయకత్వంలో అలాంటి అవకాశం ఇవ్వరాదని జట్టు పట్టుదలగా ఉంది. ఈ నేపథ్యంలో నేడు భారత్, ఆ్రస్టేలియా మధ్య మూడో వన్డేకు రంగం సిద్ధమైంది. కోహ్లి ఈసారైనా... సిరీస్కు ముందు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మల బ్యాటింగ్ గురించే పెద్ద ఎత్తున చర్చ జరిగింది. తొలి మ్యాచ్లో విఫలమైనా...అడిలైడ్లో అర్ధసెంచరీతో రోహిత్ కాస్త ఫర్వాలేదనిపించాడు. అయితే అతని ఆటలో సహజశైలి, దూకుడు కనిపించలేదు. కోహ్లి అయితే రెండు సార్లూ డకౌట్ అయి పూర్తిగా నిరాశపర్చాడు. ఈ మ్యాచ్లో కూడా సహజంగానే వారిద్దరి బ్యాటింగ్పైనే అందరి దృష్టీ నిలిచింది. గతేడాది అంతర్జాతీయ టి20లకు రిటైర్మెంట్ ప్రకటించిన ఈ ఇద్దరు ఆ్రస్టేలియా గడ్డపై ఆడటం ఇదే చివరిసారి కానుంది. అందుకే ఈ మ్యాచ్పై సిడ్నీ అభిమానులు పెద్ద ఎత్తున ఆసక్తి చూపించడంతో టికెట్లన్నీ పూర్తిగా అమ్ముడుపోయి మైదానం హౌస్ఫుల్గా కనిపించనుంది. కోహ్లి తన స్థాయికి తగినట్లు ఆడి ఆకట్టుకోవాలని అంతా కోరుకుంటున్నారు. అయితే గిల్, కేఎల్ రాహుల్ కూడా విఫలమవుతుండటం భారత్ బృందానికి ఆందోళన కలిగించే అంశం. మరోసారి శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్ కీలకం కానుండగా... ఆంధ్ర క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డితో పాటు వాషింగ్టన్ సుందర్ కూడా బ్యాటింగ్లో ప్రభావం చూపించాల్సి ఉంది. బౌలింగ్లో ఈ మ్యాచ్లోనైనా కుల్దీప్ యాదవ్కు అవకాశం ఇస్తారా అనేది చూడాలి. వారిద్దరికి విశ్రాంతి... అగ్రశ్రేణి ఆటగాళ్లు దూరమైనా... ఆసీస్ యువ క్రికెటర్లు రెండో వన్డేను గెలిపించడం టీమ్ మేనేజ్మెంట్కు ఉత్సాహాన్ని ఇచి్చంది. షార్ట్, కనోలీ, ఒవెన్, రెన్షాలాంటి ఆటగాళ్లంతా ప్రభావం చూపించగలిగారు. బౌలింగ్లో బార్త్లెట్ ఆకట్టుకోగా, లెగ్ స్పిన్నర్ ఆడమ్ జంపా తన విలువను ప్రదర్శించాడు. ఇప్పటికే సిరీస్ గెలిచిన నేపథ్యంలో టాప్ పేసర్లు స్టార్క్, హాజల్వుడ్లకు ఆసీస్ విశ్రాంతినిచ్చే అవకాశం ఉంది. వీరి స్థానాల్లో ఎలిస్, జాక్ ఎడ్వర్డ్స్ బరిలోకి దిగుతారు. పిచ్ బ్యాటింగ్కు అనుకూలం కాబట్టి భారీ స్కోరుకు అవకాశం ఉంది. ఆ్రస్టేలియా ఇక్కడ ఆడిన గత ఆరు వన్డేల్లో విజయం సాధించింది. మ్యాచ్ రోజు వర్షసూచన లేదు. 16 సిడ్నీలో భారత్, ఆస్ట్రేలియా మధ్య 19 వన్డేలు జరిగాయి. భారత్ రెండు మ్యాచ్ల్లో గెలిచి, 16 మ్యాచ్ల్లో ఓడిపోయింది. ఒక వన్డేలో ఫలితం రాలేదు.
‘ఆ రోజే చనిపోయేవాడినేమో’
న్యూఢిల్లీ: భారత క్రికెట్లో ఇప్పుడు నంబూరి ఠాకూర్ తిలక్ వర్మ ఒక సంచలనం. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తరఫున పలు మార్లు తన ఆటతో ఆకట్టుకున్న అతడికి ఇటీవలి ఆసియా కప్ టి20 క్రికెట్ టోర్నీ ఒక్కసారిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టింది. పాకిస్తాన్తో జరిగిన ఫైనల్లో అద్భుత బ్యాటింగ్తో గెలిపించిన ఈ హైదరాబాదీ క్రికెటర్ జాతీయ హీరోగా మారాడు. అయితే మూడేళ్ల క్రితం తన జీవితంలో చోటు చేసుకున్న ఒక కీలక పరిణామం గురించి అతను మొదటిసారి వెల్లడించాడు. ముంబై ఇండియన్స్కు ఒక సీజన్లో ప్రాతినిధ్యం వహించిన తర్వాత తాను అనారోగ్యానికి గురి కావడం... ముంబై యాజమాన్యం తనకు అండగా నిలిచిన విషయాన్ని అతను ఒక ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నాడు. ఐపీఎల్లో ముంబై జట్టుకు నాలుగు సీజన్లుగా (2022 నుంచి) తిలక్ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. తొలి ఐపీఎల్ సీజన్ ముగిసిన తర్వాత తాను కండరాలకు సంబంధించిన ‘రాబ్డోమయాలసిస్’ వ్యాధి బారిన పడ్డానని తిలక్ చెప్పాడు. అది చాలా ప్రమాదకరమైనదని, తన కండరాలు బిగుసుకుపోవడంతో దాని తీవ్రత తెలిసిందని అతను అన్నాడు. ‘ఆ సమయంలో నేను టెస్టు జట్టులో స్థానం దక్కించుకునే ప్రయత్నంలో వరుసగా మ్యాచ్లు ఆడుతున్నాను. ఫిట్గా ఉండే ప్రయత్నంలో అవసరానికి మించి ట్రైనింగ్లో పాల్గొనేవాడిని. విశ్రాంతి రోజుల్లో కూడా జిమ్లోనే గడిపాను. శరీరం కోలుకునేందుకు తగిన సమయం ఇవ్వకుండా దీనిని కొనసాగించాను. చివరకు అది ప్రతికూల ప్రభావం చూపించింది. నా కండరాలు సరిగా పని చేయలేదు. భారత ‘ఎ’ జట్టు తరఫున బంగ్లాదేశ్పై సెంచరీ చేసిన తర్వాత కళ్లు, చేతి వేళ్లు సరిగా పని చేయలేదు. శరీరమంతా రాయిలాగా మారినట్లు అనిపించింది. ఆ మ్యాచ్ నుంచి రిటైర్హర్ట్గా బయటకు వచ్చాను. వేళ్లలో కదలిక లేకపోవడంతో చేతి గ్లవ్స్ను కత్తిరించాల్సి వచి్చంది’ అని తిలక్ నాటి పరిస్థితిని వివరించాడు. అయితే తన ఆరోగ్యం గురించి తెలిసిన వెంటనే ముంబై ఇండియన్స్ యజమాని ఆకాశ్ అంబానీ, అప్పటి బీసీసీఐ కార్యదర్శి జై షా స్పందించి వెంటనే చికిత్సకు ఏర్పాట్లు చేశారని తిలక్ కృతజ్ఞతలు చెప్పాడు. ‘వారిద్దరి చొరవతో వెంటనే నన్ను ఆస్పత్రిలో చేర్పించారు. ఆ సమయంలో నా పరిస్థితి చాలా సీరియస్గా ఉంది. శరీరంలోకి గుచ్చిన సూది కూడా విరిగిపోయింది. కొన్ని గంటలు ఆలస్యమై ఉంటే పరిస్థితి చేయిదాటిపోయేదని, చనిపోవడానికి కూడా అవకాశం ఉండేదని డాక్టర్లు చెప్పారు. ఆ సమయంలో మా అమ్మ నాతోనే ఉంది’ అని తిలక్ భావోద్వేగంతో చెప్పాడు. ఆస్ట్రేలియాతో ఈనెల 29 నుంచి మొదలయ్యే ఐదు టి20 మ్యాచ్ల సిరీస్ కోసం కెపె్టన్ సూర్యకుమార్, శివమ్ దూబే, బుమ్రాలతో కలిసి తిలక్ వర్మ ఆ్రస్టేలియాకు బయలుదేరి వెళ్లాడు. ఆసియా కప్ ట్రోఫీ మాయం! భారత జట్టు విజేతగా నిలిచిన ఆసియా కప్ ట్రోఫీ వివాదం మరో మలుపు తిరిగింది. ఫైనల్ తర్వాత ట్రోఫీని భారత జట్టు అందుకోకపోగా... ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) అధ్యక్షుడు మొహసిన్ నఖ్వీ ఆదేశాల మేరకు దానిని దుబాయ్లోని ఏసీసీ కార్యాలయంలో ఉంచారు. అయితే ఇప్పుడు అక్కడి నుంచి కూడా దానిని తరలించినట్లు తెలుస్తోంది. దానిని ఎక్కడికి తీసుకెళ్లారనే విషయంపై ఎలాంటి స్పష్టత లేదు. బీసీసీఐ అధికారి ఒకరు ఇటీవల ఏసీసీ కార్యాలయానికి వెళ్లగా అక్కడ ట్రోఫీ కనిపించలేదు. దీనిపై అక్కడి ఉద్యోగులను విచారించగా...అబుదాబిలో ఉన్న నఖ్వీ తన వద్దనే ట్రోఫీని ఉంచుకున్నట్లు తెలుస్తోంది. ఫైనల్ మ్యాచ్ జరిగిన రోజున భారత ఆటగాళ్లంతా ట్రోఫీని ఎప్పుడైనా తీసుకురావచ్చంటూ 40 నిమిషాల పాటు ఎదురు చూశామని...ఆ తర్వాతే అసలు విషయం తెలియడంతో ట్రోఫీ లేకుండానే సంబరాలు జరుపుకున్నట్లు తిలక్ వర్మ వెల్లడించాడు.
అవమాన భారంతో ప్రపంచకప్ నుంచి నిష్క్రమించిన పాకిస్తాన్
భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న మహిళల వన్డే ప్రపంచకప్ నుంచి పాకిస్తాన్ జట్టు ఒక్క గెలుపు కూడా లేకుండా అవమాన భారంతో నిష్క్రమించింది. శ్రీలంకతో ఇవాళ (అక్టోబర్ 24) జరగాల్సిన వారి చివరి లీగ్ మ్యాచ్ వర్షం కారణంగా తుడిచిపెట్టుకునపోయింది. దీంతో ప్రస్తుత ఎడిషన్లో గెలుపు నోచుకోని ఏకైక జట్టుగా పాక్ టోర్నీ నుంచి వైదొలిగింది.టోర్నీ ప్రారంభానికి ముందు టీమిండియా సహా అగ్రశ్రేణి జట్లనన్నిటినీ ఓడిస్తామని ప్రగల్బాలు పలికిన పాక్ ప్లేయర్లు.. తొలి మ్యాచ్లోనే వారికంటే బలహీనమైన బంగ్లాదేశ్ చేతిలోనే ఓడారు. టోర్నీ మొత్తంలో 7 మ్యాచ్లు ఆడి 4 పరాజయాలు ఎదుర్కొన్నారు. 3 మ్యాచ్లు వర్షం కారణంగా రద్దయ్యాయి. భారత్పై ఏదో పొడిచేస్తామని బీరాలు పలికిన పాక్ 88 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది. ఆతర్వాత ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా చేతుల్లో కూడా అవమానకర ఓటములు ఎదుర్కొంది. ఇంగ్లండ్, న్యూజిలాండ్, శ్రీలంకతో మ్యాచ్లు రద్దయ్యాయి.ఇవాళ శ్రీలంకతో జరగాల్సిన మ్యాచ్కు ఆది నుంచే వరుణుడు అడ్డు తగిలాడు. కొన్ని గంటల తర్వాత వర్షం కాస్త ఎడతెరిపినివ్వడంతో టాస్ పడింది. శ్రీలంక టాస్ నెగ్గి బౌలింగ్ ఎంచుకోగా.. 4.2 ఓవర్ల తర్వాత మరోసారి భారీ వర్షం మొదలైంది. దీంతో చేసేదేమీ లేక అంపైర్లు మ్యాచ్ను రద్దు చేశారు. మ్యాచ్ నిలిచిపోయే సమయానికి పాక్ వికెట్ నష్టపోకుండా 18 పరుగులు చేసింది.ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్ ఫలితంతో సంబంధం లేకుండానే పాక్, శ్రీలంక జట్లు ఇదివరకే టోర్నీ నుంచి ఎలిమినేట్ అయ్యాయి. ఈ రెండు జట్లతో పాటు బంగ్లాదేశ్, న్యూజిలాండ్ కూడా నిష్క్రమించాయి. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, ఇంగ్లండ్, భారత్ సెమీస్కు అర్హత సాధించాయి. పాయింట్ల పట్టికలో భారత్ నాలుగో స్థానాన్ని ఖరారు చేసుకోగా.. తొలి మూడు స్థానాల కోసం ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, ఇంగ్లండ్ జట్ల మధ్య పోటీ జరుగుతుంది. సెమీస్కు చేరిన నాలుగు జట్లు ఇంకా తలో మ్యాచ్ ఆడాల్సి ఉంది. రేపటి మ్యాచ్లో (అక్టోబర్ 25) ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా తలపడనుండగా.. 26న ఉదయం మ్యాచ్లో ఇంగ్లండ్-న్యూజిలాండ్.. మధ్యాహ్నం మ్యాచ్లో భారత్-బంగ్లాదేశ్ ఢీకొంటాయి.చదవండి: ప్రపంచకప్ నుంచి తప్పుకొన్న పాకిస్తాన్
బిజినెస్
నిజాయితీగా పన్ను చెల్లించేవారితో మర్యాదగా మెలగండి: సీతారామన్
ఘజియాబాద్: నిజాయితీపరులైన పన్ను చెల్లింపుదారులతో మర్యాదగా మెలగలాని, వారికి పన్ను నిబంధనల అమలును సులభతరం చేయాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జీఎస్టీ అధికారులకు సూచించారు. అదే సమయంలో పన్ను ఎగవేతదారుల పట్ల కఠినంగా వ్యవహరించాలన్నారు. ఘజియాబాద్లో సెంట్రల్ జీఎస్టీ భవనాన్ని ప్రారంభించిన సందర్భంగా ఆమె మాట్లాడారు. అధికారులపై క్రమశిక్షణ చర్యలను సకాలంలో ముగించాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు. తద్వారా విధి నిర్వహణలో నిర్లక్ష్యం, అనైతిక, దు్రష్పవర్తనను సహించేది లేదన్న స్పష్టమైన సందేశాన్ని పరోక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీఐసీ) పంపించాలని కోరారు. వేగవంతమైన రిజి్రస్టేషన్కు, ఫిర్యాదుల పరిష్కారానికి వీలుగా టెక్నాలజీని వినియోగించుకోవాలని క్షేత్ర స్థాయి అధికారులకు సూచించారు. టెక్నాలజీ సాయంతో స్మార్ట్ విచారణలు చేయొచ్చు. అవసరమైతే పన్ను చెల్లింపుదారులను సంప్రదించొచ్చు. అంతేకానీ, ఆ పత్రం ఇవ్వండి, ఈ పత్రం ఇవ్వండి అంటూ పన్ను చెల్లింపుదారులపై భారం వేయొద్దు. వర్తకులకు మీకు మధ్య ఎలాంటి ఉక్కు గోడ లేదు. సమస్యను పెంచడానికి బదులు అది ఎక్కడ ఉందన్నది మీరు అర్థం చేసుకోవాలి. నిజాయితీపరులైన పన్ను చెల్లింపుదారులతో మర్యాదగా మెలగాలి. కొత్త తరం జీఎస్టీ కింద వారిని గౌరవిస్తున్నట్టు భావించేలా మసులుకోవాలి. పన్ను చెల్లింపుదారుల్లో ఎవరిలో అయినా నిజాయితీ లోపిస్తే నిబంధనల మేరకు వారిని నిలువరించండి. అంతేకానీ, ప్రతి ఒక్కరినీ అనుమానించొద్దు’’అంటూ మంత్రి జీఎస్టీ అధికారులకు హితవు పలికారు. కొత్త జీఎస్టీ అన్నది కేవలం రేట్లు, శ్లాబులు, సులభతరానికే పరిమితం కాదంటూ, తమను భిన్నంగా చూస్తున్నారన్న భావన పన్ను చెల్లింపుదారుల్లో కలిగేలా ఉండాలన్నారు.
అమెరికాతో త్వరలో డీల్..!
బెర్లిన్/న్యూఢిల్లీ: అమెరికాతో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం విషయంలో మరింత చేరువ అయినట్టు కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. సమీప భవిష్యత్తులోనే రెండు దేశాలు పారదర్శకమైన, సమతుల్యమైన వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోగలవన్న ఆశాభావం వ్యక్తం చేశారు. భారత వాణిజ్య శాఖ కార్యదర్శి రాజేష్ అగర్వాల్ ఆధ్వర్యంలోని బృందం గత వారంలో వాషింగ్టన్కు వెళ్లి చర్చలు నిర్వహించడం తెలిసిందే. అయితే, భారత్ హడావిడిగా వాణిజ్య ఒప్పందాలు చేసుకోబోదని . అమెరికా, ఐరోపా సహా పలు దేశాలతో భారత్ వాణిజ్య ఒప్పందాలపై సంప్రదింపులు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. తలకు తుపాకీ గురిపెట్టినట్టు లేదా నిరీ్ణత గడువులోపే ముగించేయాలన్న హడావిడితో భారత్ వాణిజ్య ఒప్పందాలు చేసుకోబోదన్నారు. ద్వైపాక్షిక వాణిజ్యాన్ని మరింత పెంచుకునే లక్ష్యంతో మంత్రి బెర్లిన్లో పర్యటిస్తున్న సందర్భంగా మాట్లాడారు. దీర్ఘకాల దృష్టితోనే.. వాణిజ్య ఒప్పందాలను దీర్ఘకాల దృష్టితోనే భారత్ చూస్తుందని గోయల్ పేర్కొన్నారు. అమెరికా భారత ఉత్పత్తులపై అధిక టారిఫ్లు విధించిన నేపథ్యంలో కొత్త మార్కెట్లలో అవకాశాలపైనా దృష్టి సారించినట్టు చెప్పారు. భారత్ షరతులతో కూడిన పారదర్శక దీర్ఘకాల ఒప్పందాన్ని పొందుతోందా? అంటూ ఎదునైన ఒక ప్రశ్నకు మంత్రి స్పందిస్తూ.. జాతి ప్రయోజనాలు తప్పించి మరే ఇతర కోణంలోనూ భారత్ తన మిత్రులను నిర్ణయించుకోదు. ఈయూకి మిత్రుడి కాలేరంటూ నాతో ఒకరు అన్నారు. దాన్ని నేను అంగీకరించను. అలాగే, రేపు మరొకరు కెన్యాతో కలసి పనిచేయలేరని అంటారు. అది కూడా ఆమోదనీయం కాదు అని అన్నారాయన
డాక్టర్ రెడ్డీస్ లాభం అప్
న్యూఢిల్లీ: ఫార్మా రంగ హైదరాబాద్ దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ ల్యాబోరేటరీస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26) రెండో త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జూలై–సెపె్టంబర్(క్యూ2)లో నికర లాభం దాదాపు 15 శాతం ఎగసి రూ. 1,437 కోట్లను తాకింది. గతేడాది(2024–25) ఇదే కాలంలో రూ. 1,255 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 8,016 కోట్ల నుంచి రూ. 8,805 కోట్లకు బలపడింది. బ్రాండెడ్ మార్కెట్లలో పుంజుకున్న అమ్మకాలు క్యూ2లో పటిష్ట పనితీరుకు సహకరించినట్లు కంపెనీ కోచైర్మన్, ఎండీ జీవీ ప్రసాద్ పేర్కొన్నారు. యూఎస్లో లెనలిడొమైడ్ అమ్మకాలు క్షీణించినప్పటికీ ప్రధానంగా నికోటిన్ రీప్లేస్మెంట్ థెరపీ(ఎన్ఆర్టీజే పోర్ట్ఫోలియో) నుంచి సాధించిన ఆదాయం ఇందుకు సహకరించినట్లు వెల్లడించారు. కంపెనీకి కీలకమైన విభాగాలను పటిష్టపరచడం, ఉత్పాదకతను పెంచడం, వ్యాపార అభివృద్ధి ప్రణాళికలకు తెరతీయడం తదితరాలపై దృష్టిపెట్టినట్లు తెలియజేశారు. యూరప్ ఆదాయం జూమ్: ఉత్తర అమెరికా జనరిక్స్ (ఎంపిక చేసిన కొన్ని ప్రొడక్టుల ధరల క్షీణత, లెనలిడొమైడ్ అమ్మకాలు తగ్గడం) మినహా మిగిలిన కీలక మార్కెట్లలో పటిష్ట వృద్ధి నమోదైనట్లు డాక్టర్ రెడ్డీస్ వివరించింది. ఉత్తర అమెరికా అమ్మకాలు 13 శాతం నీరసించి రూ. 3,241 కోట్లకు పరిమితంకాగా.. యూరప్ నుంచి ఆదాయం రెట్టింపై రూ. 1,376 కోట్లకు చేరింది. దేశీయంగా అమ్మకాలు 13 శాతం వృద్ధితో రూ. 1,578 కోట్లను తాకాయి. వర్ధమాన మార్కెట్ల ఆదాయం 14 శాతం పురోగమించి రూ. 1,655 కోట్లకు చేరాయి. ఫార్మాస్యూటికల్ సర్వీసులు, యాక్టివ్ ఇన్గ్రెడియంట్స్(పీఎస్ఏఐ) బిజినెస్ 12 శాతం పుంజుకుని రూ. 945 కోట్లయ్యింది. డాక్టర్ రెడ్డీస్ షేరు 0.3% లాభపడి రూ. 1,284 వద్ద ముగిసింది.
ఫెడరల్ బ్యాంక్లో బ్లాక్స్టోన్కు వాటా
న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ సంస్థ ఫెడరల్ బ్యాంక్లో తాజాగా పీఈ దిగ్గజం బ్లాక్స్టోన్ గ్రూప్ మైనారిటీ వాటా సొంతం చేసుకోనుంది. ఇందుకు బోర్డు తాజాగా గ్రీన్సిగ్నల్ ఇచి్చనట్లు ఫెడరల్ బ్యాంక్ పేర్కొంది. వెరసి బ్లాక్స్టోన్ గ్రూప్ సంస్థ ఏషియా 2 టాప్కో 13 పీటీఈ లిమిటెడ్కు రూ. 6,196 కోట్ల విలువైన ప్రిఫరెన్షియల్ వారంట్లను బ్యాంక్ జారీ చేయనుంది. అంతేకాకుండా బోర్డులో ఒక నాన్ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ను నియమించుకునేందుకు బ్లాక్స్టోన్ ప్రత్యేక హక్కును పొందనుంది. ఇందుకు బోర్డు అనుమతించినట్లు ఫెడరల్ బ్యాంక్ తెలియజేసింది. అయితే వారంట్లను పూర్తిగా వినియోగించుకున్న తదుపరి బ్యాంక్ ఈక్విటీలో కనీసం 5 శాతం వాటాను పొందిన తర్వాత మాత్రమే బ్లాక్స్టోన్కు నియామకఅవకాశముంటుంది. రూ. 227 ధరలో ప్రైవేట్ ప్లేస్మెంట్లో భాగంగా ఒక్కొక్కటి రూ. 227 ధరలో 27.29 కోట్ల ప్రిఫరెన్షియల్ వారంట్లను ఫెడరల్ బ్యాంక్ జారీ చేయనుంది. ఇందుకు రూ. 6,196 కోట్లను బ్లాక్స్టోన్ ఇన్వెస్ట్ చేయనుంది. జారీ తేదీ నుంచి వారంట్లకు గడువు 18 నెలల్లో ముగియనుంది. వారంట్లను ఈక్విటీ షేర్లుగా మారి్పడి చేసుకున్నాక బ్యాంక్లో బ్లాక్స్టోన్ వాటా 9.99 శాతానికి చేరనుంది. బ్లాక్స్టోన్కు ప్రిఫరెన్షియల్ వారంట్ల జారీ, డైరెక్టర్ ఎంపికకు ప్రత్యేక హక్కుపై నవంబర్ 19న వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా బ్యాంక్ వాటాదారుల అనుమతిని కోరనుంది. బ్లాక్స్టోన్ పెట్టుబడుల నేపథ్యంలో ఫెడరల్ బ్యాంక్ షేరు బీఎస్ఈలో యథాతథంగా రూ. 227 వద్ద ముగిసింది.
ఫ్యామిలీ
సోఫా డ్రెస్సే... సో బెటర్!
ఓల్డ్ సోఫా కవర్లను మూలన పడేయకుండా, వాటికి సరికొత్త అందాన్ని ఇచ్చింది రెచెల్ డిక్రూజ్. పాత సోఫా కవర్లను కాస్తా అందమైన చిక్ బ్యాక్లెస్ డ్రెస్గా మార్చి నెటిజనులను ఆశ్చర్యానందాలకు గురిచేసింది.‘అద్భుత కళా సృష్టి’ అని నెటిజనులు ఆమెను ప్రశంసించారు. ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన ఈ సోఫా డ్రెస్ వీడియోకు 8 మిలియన్ల వ్యూస్ వచ్చాయి.సోఫా డ్రెస్ను ఒక కొలిక్కి తేవడానికి రెచెల్కు అయిదు గంటల సమయం పట్టింది. అయితే దీనికి వచ్చిన స్పందన తన శ్రమను మరిచి΄ోయేలా చేసింది. ‘ఈ బ్యాక్లెస్ డ్రెస్ను సోఫా ఫ్యాబ్రిక్ నుంచి తయారుచేశారు’ అని చెబితే తప్ప తెలియనంత సహజంగా ఉండడం విశేషం. (చదవండి: 200 ఏళ్లుగా అక్కడ దీపావళి లేదు..! కానీ మహాలయ అమావాస్యే..)
‘రీ–స్టైల్ ఫ్యాషన్ ’ సందేశంతో కూడిన గ్లామర్..!
కొత్త దుస్తులు కొనడం, కొత్త స్టైల్లో కనిపించడం ట్రెండ్ను ఫాలో అవడం... ఇవే ఫ్యాషన్ అని మనలో చాలామంది అనుకుంటారు. కానీ బాలీవుడ్ స్టార్ అలియా భట్ ఆ ధోరణిని మార్చేసింది. ఇటీవల నటి కరీనాకపూర్ ఇచ్చిన దీపావళి పార్టీకి 30 ఏళ్ల నాటి వింటేజ్ సిల్క్ శారీ ధరించి అందరినీ ఆశ్చర్యపరించింది. ‘రీస్టైల్ ఫ్యాషన్‘ ద్వారా సస్టెయినబుల్ లివింగ్ కూడా గ్లామరే అనే సందేశాన్ని ఇస్తోంది. అదే నయా ట్రెండ్గా మన కళ్లకు కడుతోంది. ఆధునిక భారతీయ ఫ్యాషన్ గురించి చెప్పాలంటే చాలా మంది సెలబ్రిటీలు తమ దుస్తులను రీ క్రియేట్ చేస్తూ సోషల్మీడియాలో అందంగా... అబ్బురంగా చూపుతున్నారు. ఇది ఒక స్ఫూర్తిని కలిగించే మార్పు. ఈ మార్పు పర్యావరణ అనుకూలమైనది మాత్రమే కాదు. తరాల వారసత్వాన్ని కూడా పరిచయం చేయడం. సెలబ్రిటీల జీవనవిధానం సమాజాన్ని మార్చగలదనే విషయాన్ని అలియాభట్ తన దుస్తుల ద్వారా తెలియజేస్తుంది. లుంగీ స్టైల్ స్కర్ట్, పింక్ చికంకారీ కుర్తీని ధరించి వేడుకలు జరుపుకుంది. ఆ తర్వాత కరీనాకపూర్ ముంబైలోని తన నివాసం లో నిర్వహించిన దీ΄ావళి వేడుకలకు హాజరయ్యింది.సంగీత్ లెహంగా.. దీపావళి పార్టీలో... కిందటేడాది దీపావళి సమయంలో బాలీవుడ్ గ్లామ్ వేడుకలకు ఆలియాభట్ హాజరయ్యింది. తన పెళ్లి సమయంలో మెహెందీ వేడుకలో మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన పింక్ లెహంగాను ఈ గ్లామ్ పార్టీకి రీ స్టైల్ చేసి తిరిగి ధరించింది. మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన ఈ లెహంగాను రీ–స్టైల్ చేసి ధరించింది. ఈ లెహంగా సుమారు 180 టెక్స్టైల్ ప్యాచ్లతో, రియల్ గోల్డ్, సిల్వర్ నక్షీ, కోరా పూలు, వింటేజ్ సీక్వెన్సెస్తో తయారైంది. పార్టీకి కొత్త డ్రెస్ కొనకుండా, ఆమె ఆ లెహంగానే డిజైనర్ టాప్, జువెలరీ, హెయిర్స్టైల్తో రీ–స్టైల్ చేసింది. పర్యావరణ హితంపర్యావరణ స్పృహ కలిగిన దుస్తుల బ్రాండ్ ఎడ్–ఎ–మమ్మాను స్థాపించింది. ఇది పిల్లల, బాలింతలకు అవసరమయ్యే ఆర్గానిక్ దుస్తుల బ్రాండ్. ఫ్యాషన్ వ్యర్థాలను తగ్గించడానికి చేనేతలను ప్రోత్సహించడానికి కృషి చేస్తుంది. తన పెళ్లి సమయంలో ఉపయోగించిన లెహంగాతో సహా వివిధ రకాల తన దుస్తులను రీ క్రియేషన్ చేయడంలో అలియా ప్రసిద్ధురాలుగా పేరొందింది. అంతేకాదు పర్యావరణ అనుకూల బ్రాండ్లకు మద్దతు ఇస్తుంది.30 ఏళ్ల క్రితం చీర కొత్తగా...ఈ సందర్భంగా అలియాభట్ బంగారు రంగు చీరను ధరించింది. ఇండియన్ డిజైనర్ రీతుకుమార్ 30 ఏళ్ల క్రితం ఈ చీరను డిజైన్ చేశారు. ఈ చీరను స్లీవ్లెస్ బస్టియర్ స్టైల్ బ్లౌజ్తో జత చేసింది. బంగారు చోకర్ నెక్లెస్, ఉంగరాలు, మాంగ్ టిక్కా, బ్రేస్లెట్ను ధరించింది.పాత దుస్తులను కొత్తగా తీర్చిదిద్దడం. ఆ దుస్తులు కూడా కొత్తగా కనిపించేలా మార్చడం అలియా భట్ చూపుతున్న మార్గం. ఆమె స్టైలింగ్ ఫిలాసఫీ కూడా ఇదే. ‘ఫ్యాషన్ అంటే కేవలం లుక్ కాదు, అది మన విలువల ప్రతిబింబం’ అంటుంది ఆలియా. ‘రీ–స్టైల్ ఫ్యాషన్ ’ కేవలం ట్రెండ్ కాదు ఒక సందేశం కూడా! (చదవండి: మంత్లీ మ్యారేజ్ రివ్యూ!)
అక్కడ మహాలయ అమావాస్యే దీపావళి పండుగ..!
దేశమంతా దివ్వెల కాంతులు అద్దుకుని, తారాజువ్వలతో నింగి కూడా మెరిసి΄ోయేది దీపావళి అమావాస్య నాటి రాత్రే! కానీ కర్ణాటక, దావణగేరేలోని లోకికేరే పల్లెలో మాత్రం సీన్ చిత్రంగా ఉంటుంది. ఆ ఊరివాసులు దాదాపు రెండువందల ఏళ్లుగా దీపావళి పండుగను జరుపుకోవట్లేదు. ఆ రాత్రి అక్కడ ముంగిళ్లలో దీపాల కొలువు.. టపాసుల సందడి కాదుకదా కనీసం వీధి దీపాలు కూడా వెలగని విషాదం కనిపిస్తుంది. దానికి ఒక నేపథ్యం ఉంది.అదేంటంటే...రెండు శతాబ్దాల కిందట.. దీపావళికి ముందు.. పండుగకోసం అవసరమైనవి తీసుకురావడానికి లోకికేరేకి చెందిన కొంతమంది యువకులు దగ్గర్లో ఉన్న అడవికి వెళ్లారు. ఆ వెళ్లినవారు ఎంత పొద్దెక్కినా తిరిగి రాలేదు. గ్రామస్తులంతా ఆ అడవికి వెళ్లి అణువణువు గాలించారు. అయినా లాభం లేక΄ోయింది. వాళ్ల ఆనవాళ్లను కూడా కనిపెట్టలేకపోయారు. ఆ యువక బృందం ఆ రాత్రే కాదు.. ఎప్పటికీ తిరిగి రాలేదు. ఆ బాధలో వాళ్లు దీపావళి జరుపుకోలేదు. తర్వాత ఏడాదికీ ఆ విషాదాన్ని మరువలేక΄ోయింది ఆ గ్రామం. కొంతమంది పండుగ ఆనవాయితీకి అంతరాయం ఎందుకు కలిగించాలని ప్రయత్నించి పండుగ జరిపారు. యాదృచ్చికంగా వాళ్లు నష్టాలను చవిచూడటం, అనారోగ్యం, ఇంట్లో దొంగలు పడటం లాంటి పరిణామాలను ఎదుర్కొన్నారు. కుర్రాళ్లు కనిపించకుండా ΄పోయిన బాధను మరిచి వాళ్లు పండుగ జరుపుకున్నందుకే ఆ అరిష్టాలను ఎదుర్కోవాల్సి వచ్చిందని నమ్మారు. దాంతో ఆ నమ్మకమే స్థిరపడి నాటినుంచి ఆ ఊళ్లో దీపావళినాడు ఊరంతా దీపాలు వెలిగించి దీపావళి జరపకోవడాన్నే సంప్రదాయంగా మలుచుకున్నారు. అదలా ఇప్పటికి రెండువందల ఏళ్లుగా కొనసాగుతూనే ఉంది.అయితే...మహాలయ అమావాస్యను మాత్రం ఆ పల్లెలోని పూర్వీకుల సంస్మరణ దినంగా పండుగ జరుపుకుంటారు. ఆ రోజు వాళ్ల సంప్రదాయ, సంస్కృతుల మేరకు దీపావళి నాడు చేయాల్సిన కార్యక్రమాలన్నిటినీ నిర్వహిస్తారు. అంటే మహాలయ అమావాస్యనాడు తమదైన తీరులో దీపావళి జరుపుకుంటారు. ఒకరకంగా మహాలయ అమావాస్యే వారికి దీపావళి. ఇదీ లోకికేరే దీపావళి కథ! (చదవండి: దీపావళి 2025: ఆ పండుగ పేరుతోనే రెండు గ్రామాలు..కానీ అక్కడ..)
మంత్లీ మ్యారేజ్ రివ్యూ!
పుస్తక సమీక్షలు, సినిమా రివ్యూలు, ఇంకా చెప్పుకోవాలంటే నిర్ణీత కాలవ్యవధిలో చేసే ‘వ్యాపార సమీక్ష’ల గురించి మనకు తెలుసు. అయితే ‘మ్యారేజ్ రివ్యూ’ అనేది మనం ఎప్పుడూ విని ఉండలేదు. బెంగళూరుకు చెందిన టెక్ ప్రొఫెషనల్ ప్రతీమ్ భోస్లే, ఫ్రెంచ్ యువకుడు సచా ఎర్బోనెల్ను వివాహం చేసుకొని ఆమ్స్టర్డామ్లో స్థిరపడింది. ఇటీవల ఆమె ‘మంత్లీ మ్యారేజ్ పెర్ఫార్మెన్స్ రివ్యూ’ పేరుతో ‘ఎక్స్’లో షేర్ చేసిన పోస్ట్ నెటిజనులను నవ్వుల్లో ముంచెత్తడమే కాదు ఆలోచింపజేస్తోంది. ఈ పనులు సజావుగా జరుగుతున్నాయి, ఈ పనుల్లో ఇబ్బంది ఏర్పడుతుంది, మెరుగు పరుచుకోవాల్సిన విషయాలు... ఇలా రకరకాల కోణాలలో మ్యారేజ్ మంత్లీ రివ్యూ రాసింది ప్రతీమ్. రివ్యూలో భాగంగా కొన్ని తీర్మానాలు కూడా రాసింది.అనవసర సలహాలు ఇవ్వకూడదు.ఒకరి పనుల్లో ఒకరు సహాయం చేసుకోవాలి.'నీకు ఇంకా ఎన్నిసార్లు చెప్పాలి? ఆల్రెడీ ఎప్పుడో చెప్పాను కదా’ ఇలాంటి మాటలతో తగాదాలకు ఆస్కారం ఇవ్వకూడదు.అనుకోకుండా తగాదా జరిగితే దాని గురించి సోషల్ మీడియాలో రాయకూడదు.‘నవ దంపతులు ప్రతీమ్–సచా ఎర్బోనెల్ మ్యారేజ్ రివ్యూను అనుసరించి తప్పొప్పులను బేరీజు వేసుకుంటే వారి సంసారంలో ఎలాంటి సమస్యలూ ఉండవు’ అని రాశాడు ఒక నెటిజనుడు. నిజమే కదా! (చదవండి: Prabhas Diet: హీరో ప్రభాస్ అన్ని గుడ్లు తినేవాడా? బాహుబలి డైట్ అలా ఉండేదా..?)
ఫొటోలు
ఏపీపై వరుణుడి ఉగ్రరూపం.. దంచికొడుతున్న వానలు (ఫొటోలు)
సరికొత్త హంగులతో సిద్ధమవుతున్న సికింద్రాబాద్ రైల్వేస్టేషన్.. శరవేగంగా అభివృద్ధి పనులు (ఫొటోలు)
ఐటమ్ బ్యూటీ మలైకా 50వ బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)
'మౌగ్లీ' సాంగ్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)
పెళ్లి పనులు మొదలుపెట్టిన రాహుల్ సిప్లిగంజ్ (ఫొటోలు)
తిరుమలలో అభినయ.. కాలినడకన కొండ ఎక్కి.. (ఫోటోలు)
బిగ్బాస్ ఆదిరెడ్డి కూతురి బారసాల వేడుక (ఫొటోలు)
కెనడా ట్రిప్లో అలనాటి హీరోయిన్ భాగ్యశ్రీ (ఫొటోలు)
నితిన్ భార్య షాలినీ దీపావళి సెలబ్రేషన్స్ (ఫొటోలు)
ఇంకా మిరాయ్ జ్ఞాపకాల్లోనే రితికా నాయక్ (ఫోటోలు)
అంతర్జాతీయం
ట్రంప్ నోట మళ్లీ చమురు మాట
వాషింగ్టన్: రష్యా నుంచి భారత్ చౌకగా ముడి చమురు కొనుగోలు చేస్తుండడాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు. భారత్ ఇస్తున్న డబ్బులతోనే ఉక్రెయిన్పై రష్యా యుద్ధం కొనసాగిస్తోందని ఆయన మండిపడుతున్నారు. ఈ కొనుగోళ్లను ఆపేయాల్సిందేనని అంటున్నారు. అదే విషయం మరోసారి స్పష్టంచేశారు. రష్యా నుంచి ముడి చమురు దిగుమతులను నిలిపివేయడానికి భారత్ అంగీకరించిందని చెప్పారు. ఈ ఏడాది ఆఖరు నాటికి ఆ దిగుమతులు దాదాపు సున్నాకు పడిపోతాయని పేర్కొన్నారు. అంటే కొనుగోళ్లు పూర్తిగా ఆగిపోతాయని పరోక్షంగా తేల్చిచెప్పారు. ఈ ప్రక్రియకు కొంత సమయం పడుతుందన్నారు. రష్యా నుంచి ముడి చమురు కొనకుండా చైనాను ఒప్పించడానికి ప్రయతి్నస్తానని ట్రంప్ తెలిపారు. భారత్ బాటలో చైనా కూడా నడిస్తే బాగుంటుందని సూచించారు. ఆయన బుధవారం వైట్హౌస్లో మీడియాతో మాట్లాడారు. ‘‘భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో నిన్ననే ఫోన్లో మాట్లాడాను. రష్యా నుంచి చమురు కొనుగోళ్లు ఆపేయడానికి భారత్ అంగీకరించింది. అయితే, హఠాత్తుగా ఆపేయలేరు కాబట్టి కొంత సమయం పడుతుంది. ఈ ఏడాది ఆఖరు నాటికి ఈ కొనుగోళ్లు పూర్తిగా ఆగిపోతాయి. భారత్ గొప్ప నిర్ణయాలు తీసుకుంటుంది’’అని ఉద్ఘాటించారు. రష్యా చమురు విషయంలో ట్రంప్ పట్టుదలతో ఉన్నారు. భారత్, చైనాలు రష్యాకు ఇచ్చే డబ్బులు ఆగిపోతే ఉక్రెయిన్లో యుద్ధం ఆగుతుందని ఆయన తరచుగా చెబుతున్నారు. ఈ యుద్ధానికి ఆ రెండు దేశాలే ఆర్థిక వనరులు సమకూరుస్తున్నాయని మండిపడుతున్నారు. రష్యా నుంచి చమురు కొనుగోళ్లు బంద్ చేస్తామని ప్రధాని మోదీ తనకు హామీ ఇచ్చారని ట్రంప్ ఇటీవల వెల్లడించారు. అయితే, ఈ విషయాన్ని భారత్ ఖండించింది. మోదీ అలాంటి హామీ ఏదీ ఇవ్వలేదని తేల్చిచెప్పింది. తమ అవసరాల కోసమే రష్యా నుంచి చమురు కొంటున్నామని, ఇందులో మరో ఉద్దేశం లేదని వెల్లడించింది. తన మాట లెక్కచేయనందుకు భారతదేశ ఉత్పత్తులపై డొనాల్డ్ ట్రంప్ ఏకంగా 50 శాతం టారిఫ్లు విధించిన సంగతి తెలిసిందే. త్వరలో చైనా అధినేత షీ జిన్పింగ్తో సమావేశం కాబోతున్నానని, ఉక్రెయిన్–రష్యా యుద్ధాన్ని ముగించడానికి చేపట్టాల్సిన చర్యలపై ఆయనతో చర్చిస్తానని డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. అది చమురు గానీ, ఇంధనం గానీ, ఇంకేదైనా గానీ రకరకాల మార్గాలు అందుబాటులో ఉన్నాయన్నారు. తన ప్రతిపాదనల పట్ల జిన్పింగ్ సానుకూలంగా స్పందిస్తారన్న నమ్మకం ఉందని వివరించారు.
అమెరికాలో ట్రక్కు బీభత్సం.. భారతీయుడి అరెస్ట్
కాలిఫోర్నియా: అమెరికాలో ఓ భారతీయుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. కాలిఫోర్నియాలో జరిగిన రోడ్డు ప్రమాద ఘటనలో ముగ్గురు మృతికి కారణమయ్యాడంటూ జశన్ప్రీత్ సింగ్ (21) అనే యవకుడిని అదుపులోకి తీసుకున్నారు. అమెరికా వార్తా కథనాల ప్రకారం.. అతడు అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించాడని.. డ్రగ్స్ మత్తులో ఉన్నట్లు వెల్లడైంది.2022 మార్చిలో సింగ్.. అమెరికా దక్షిణ సరిహద్దును అక్రమంగా దాటినట్లు సమాచారం. కాలిఫోర్నియాలోని బోర్డర్ పెట్రోల్(Border Patrol) ఏజెంట్లు అతడిని అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద చట్టబద్ధమైన ప్రతాలు లేవని యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ స్పష్టం చేసింది. అప్పటి ప్రభుత్వం తీసుకొచ్చిన ‘ఆల్టర్నేటివ్ టు డిటెన్షన్’ విధానం కారణంగా కొన్ని రోజుల్లోనే అతడు జైలు నుంచి విడుదలయ్యాడు.కాలిఫోర్నియాలో జరిగిన ట్రక్కు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా.. పలువురు గాయపడ్డారు. ఈ ఘటనలో జశన్ప్రీత్ సింగ్ కూడా గాయపడ్డాడు. ట్రక్ నడుపుతోన్న సమయంలో డ్రగ్స్ మత్తులో ఉన్న అతడు.. ట్రాఫిక్లో కూడా బ్రేక్స్ వేయలేదని పోలీసు అధికారులు తెలిపారు. అక్రమ వలసదారులైన ట్రక్ డ్రైవర్లు అమెరికాలో ప్రమాదాలకు కారణమవుతున్న ఘటనల్లో ఇది తాజాది. గత ఆగస్టులోనూ ఇదే తరహా ఘటన జరిగిన సంగతి తెలిసిందే. ఫ్లోరిడాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. 2018లో అక్రమంగా అమెరికాలోకి ప్రవేశించిన హర్జిందర్ సింగ్ ఆ ఘటనకు కారకుడు. 🚨 SHOCKING: ICE sources confirm Jashanpreet Singh, the semi-truck driver behind the deadly DUI crash on CA’s I-10 freeway, is an Indian illegal alien caught & released by the Biden admin at the border in March 2022. Police say Singh was speeding, under the influence, and never… pic.twitter.com/bc1n5vEC9p— Svilen Georgiev (@siscostwo) October 23, 2025
టేకాఫ్ అవుతూ కుప్పకూలిన విమానం.. వీడియో వైరల్
కారాకస్: వెనెజులాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఓ విమానం టేకాఫ్(Venezuela plane crash) అవుతూ కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్గా మారాయి.వివరాల ప్రకారం.. వెనెజులాలోని టాచిరాలోని పరమిల్లో ఎయిర్పోర్ట్లో విమానం టేకాఫ్ అయ్యింది. విమానం రన్వే నుంచి ఎగరగానే ఒక్కసారిగా గింగిరాలు తిరుగుతూ కిందపడిపోయింది. అనంతరం పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదానికి సంబంధించిన షాకింగ్ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. దీనిపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.Ongoing: a PA-31 crashed in San Cristóbal (Venezuela), all 2 aboard died. Aircraft registration was YV1443 (Via pro_plane_pilot) pic.twitter.com/7Vjul7DDgw— Air Safety #OTD by Francisco Cunha (@OnDisasters) October 22, 2025
పాక్ ఆర్మీ చీఫ్ మునీర్కు బిగ్ షాక్.. మగాడివైతే యుద్ధం చేయ్ అంటూ తాలిబన్లు..
ఇస్లామాబాద్: దాయాది పాకిస్తాన్కు మరో బిగ్ షాక్ తగిలింది. పాక్కు చెందిన ఉగ్రవాద సంస్థ తెహ్రీకే తాలిబన్ పాకిస్తాన్ (టీటీపీ)కు చెందిన కమాండర్ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ను టార్గెట్ చేసి చాలెంజ్ విసిరిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మునీర్కు నిజంగా దమ్ముంటే.. మగాడైతే తమను ఎదుర్కోవాలని సవాల్ విసిరారు. అలాగే, పాక్ సైన్యంలోని ఉన్నతాధికారులకు సైతం సవాల్ చేశారు. ఈ మేరకు విడుదల చేసిన వరుస వీడియోలు పాకిస్తాన్ సైనిక నాయకత్వాన్ని తీవ్ర ఇరకాటంలోకి నెట్టాయి.తెహ్రీకే తాలిబన్ పాకిస్థాన్ (టీటీపీ) సంస్థ కమాండర్ కాజిమ్ వీడియోలో మాట్లాడుతూ నేరుగా ఆర్మీ చీఫ్ను ఉద్దేశించి సవాలు విసిరాడు. ఇందులో..‘మాతో పోరాటం చేయడానికి పాకిస్తాన్ సైన్యం ఎందుకు?. వారికి బదులుగా పాక్ సైన్యంలోని ఉన్నతాధికారులు యుద్ధభూమికి రావాలి. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మునీర్కు నిజంగా దమ్ముంటే.. మాగాడే అయితే మమ్మల్ని ఎదుర్కోవాలి. అతను నిజంగా తల్లి పాలే తాగి ఉంటే మాతో యుద్ధం చేయ్ అని సవాల్ విసిరారు. దీనికి సంబంధించిన వీడియో బయటకు రావడంతో అతడి వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఇదే సమయంలో అక్టోబర్ 8న కేపీ ప్రావిన్స్లో టీటీపీ జరిపిన దాడి దృశ్యాలు విడుదల చేసింది. TTP has released exclusive footage from its assault on Jogi military fort in Dogar, Kurram, showcasing seized Pak Army vehicles, weapons & ammunition.Among those leading the attack was top commander Kazim.Pak Army's monsters turn their guns on them. #FailedStatePakistan@kscs58 pic.twitter.com/9UW17xWQvJ— Rashtriya Rifles (@DeltaRR2000) October 23, 2025ఇక, ఈ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన పాకిస్తాన్ ప్రభుత్వం, ఈ నెల 21న కమాండర్ కాజిమ్ ఆచూకీ తెలిపిన వారికి 10 కోట్ల పాకిస్తానీ రూపాయల (పీకేఆర్) రివార్డును ప్రకటించింది. అయితే, అక్టోబర్ 8న ఖైబర్ పఖ్తుంఖ్వాలోని కుర్రంలో టీటీపీ.. పాకిస్తాన్ ఆర్మీపై దాడులు చేసింది. ఈ దాడిలో 22 మంది పాక్ సైనికులు చనిపోయారని టీటీపీ పేర్కొంది. ఈ దాడిలో భాగంగా తాము స్వాధీనం చేసుకున్న మందుగుండు సామగ్రి, వాహనాలను చూపించింది. మరోవైపు, టీటీపీ దాడిలో 11 మంది సైనికులు మరణించారని పాక్ సైన్యం అంగీకరించింది. ఇదిలా ఉండగా.. ఇటీవల ఖతార్, టర్కీ మధ్యవర్తిత్వంతో పాకిస్తాన్, ఆఫ్ఘనిస్థాన్లోని తాలిబన్ ప్రభుత్వాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. ఆఫ్ఘన్ భూభాగం నుంచి పనిచేస్తున్న టీటీపీ వంటి సాయుధ గ్రూపులపై కఠిన చర్యలు తీసుకుంటేనే ఈ ఒప్పందం నిలుస్తుందని పాకిస్తాన్ స్పష్టం చేసింది. అయినప్పటికీ, టీటీపీ దాడులు ఏమాత్రం తగ్గలేదు. 🚨 Alert:The #KPK government has placed a ₹10 crore Bounty on banned TTP commander Kazim from Kurram.He is wanted for attacks on Lt. Col. Junaid Arif, Major Tayyab Rahat, a military convoy to Parachinar, Shia passengers, and an assassination attempt on DC Kurram Javedullah pic.twitter.com/gSBuUzt7nj— Eye (@Eye59763563) October 21, 2025పాక్లో టీటీపీ దడ..తెహ్రీక్ ఏ తాలిబాన్ (TTP) ఉగ్రవాద సంస్థ అనేది పాకిస్తాన్ పెంచిన పెరటి మొక్క. ఇది అనేక తాలిబాన్ వర్గాల కలయికతో ఏర్పడిన ఉగ్రవాద సంస్థ. 2007లో బజావుర్, స్వాట్, ఖైబర్ ప్రాంతాల నుంచి పుట్టుకొచ్చిన ఈ వర్గాలు ఒక్కటై పాకిస్తాన్లోని మిలిటరీ, రాజకీయ వ్యవస్థలపై దాడులు ప్రారంభించాయి. దీని వెనుక అల్ఖైదా ప్రత్యక్ష మద్దతు ఉండటమే కాకుండా, ఒసామా బిన్ లాడెన్ చుట్టూ ఉన్న నెట్వర్క్ ఆరంభంలో దీనిని ప్రభావితం చేసింది. ఆఫ్గాన్ తాలిబాన్, తెహ్రీకే తాలిబాన్ పాక్ మధ్య భావజాల సమానత ఉన్నా, లక్ష్యాలు వేరు. ఆఫ్గాన్ తాలిబాన్ ప్రధానంగా తమ దేశంతోపాటు పాకిస్తాన్లో ఇస్లామిక్ పాలనను స్థాపించడమే లక్ష్యంగా పెట్టుకుంది. టీటీపీ పాకిస్తాన్లో సైనిక వ్యవస్థను కూల్చి దాని స్థానంలో ఇస్లామిక్ శరియా పాలనను తీసుకురావాలని భావిస్తోంది. ఇద్దరి మధ్య మతాధార సాన్నిహిత్యం ఉన్నప్పటికీ, పాకిస్తాన్–ఆఫ్గాన్ సంబంధాలు దిగజారడంతో సంబంధాలు తాజాగా మరింత క్లిష్టంగా మారాయి.టీటీపీ పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతాల్లో పెద్దఎత్తున ఉగ్రదాడులకు పాల్పడుతోంది. ఈ నేపథ్యంలో టీటీపీ ఉగ్రవాద స్థావరాలన్నీ ఆప్ఘనిస్థాన్లోనే ఉన్నాయని పాక్ ఆరోపించింది. ఇటీవలే కాబూల్ నగరంపై పాక్ సైన్యం వైమానిక దాడులు చేసింది. ఈ ఘటన తర్వాత అక్టోబరు 11న పాక్, ఆఫ్గన్ బార్డర్లో సైనిక ఘర్షణ పెరిగింది. తాలిబన్ల దాడుల్లో పెద్దసంఖ్యలో పాక్ సైనికులు చనిపోయారు. సరిగ్గా ఇదే సమయంలో ఆప్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తఖీ భారత్లో పర్యటించడం గమనార్హం.
జాతీయం
రూ. 25 లక్షల ప్రశ్న.. ఆన్సర్ తెలుసా?
భారతదేశంలోని అజ్మీర్లోని మాయో కళాశాలలో 1920లలో చదివి, 1932 నుంచి 1970 వరకు ఒమన్ను పాలించిన సుల్తాన్ ఎవరు?ఎ. తైమూర్ బిన్ ఫైసల్ బి. హైతం బిన్ తారిక్సి. సయీద్ బిన్ తైమూర్డి. తుర్కి బిన్ సయీద్దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్ వ్యాఖ్యాతగా కొనసాగుతున్న కౌన్ బనేగా కరోడ్పతిలో (Kaun Banega Crorepati) అడిగిన 25 లక్షల రూపాయల ప్రశ్న ఇది. తన ముందు హాట్సీట్లో కూర్చున్న శివ చోహాన్ను ఆయన ఈ ప్రశ్న అడిగారు. ఇంతకీ ఆయన సమాధానం చెప్పారా, రూ.25 లక్షలు గెలుచుకున్నారా అనేది తెలుసుకోవాలనుకుంటున్నారా?ప్రస్తుతం కేబీసీ 17 సీజన్ (KBC 17) నడుస్తోంది. చాలా మంది ఇందులో పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శిస్తున్నారు. తాజాగా మధ్యప్రదేశ్ ఇండోర్కు చెందిన శివ చోహాన్ను షోలో పాల్గొన్నారు. ఏటీఎం అథరైజర్గా పనిచేస్తున్న ఆయన తన జీవితంలో ఎదుర్కొన్న కష్టాలను, ఆర్థిక ఇక్కట్లను వివరించారు. చదువుకుంటూనే కూరగాయలు అమ్మానని, ఏటీఎంలో పనిచేశానని చెప్పారు. పుస్తకాలు అమ్మడం తాను చేసిన మొదటి ఉద్యోగమని.. పుస్తకాల కారణంగానే తాను కేబీసీలో కనిపించగలిగానని వెల్లడించారు. ట్యూషన్కు డబ్బు లేకపోవడంతో శివ చోహాన్ తనకు ట్యూటర్గా మారాడని ఆయన సోదరి చెప్పారు.కౌన్ బనేగా కరోడ్పతిలో గెలిచిన డబ్బులతో ఏంచేస్తారని అమితాబ్ ప్రశ్నించగా.. ''నా తల్లి ఆరోగ్యం కోసం వెచ్చిస్తానని శివ చోహాన్ సమాధానమిచ్చారు. గతంలో ఇంట్లో జరిగిన ఒక విషాదకర ఘటన కారణంగా మా అమ్మకు 80 శాతం కాలిన గాయాలు అయ్యాయి. అమ్మకు ఆపరేషన్ చేయాలని డాక్టర్లు చెప్పారు. కానీ అప్పట్లో మా వద్ద అంత డబ్బు లేదు. సరైన చికిత్స చేయించకపోవడంతో అమ్మ ఆరోగ్యం క్షీణించింది. గుండె సంబంధిత సమస్యలు కూడా మొదలయ్యాయి. కేబీసీలో నేను ఎంత ప్రైజ్మనీ గెలిచినా అదంతా అమ్మ చికిత్స కోసమే ఖర్చుపెడతాన''ని శివ చెప్పారు.ఇక గేమ్లోని ఎంటరైన శివ చోహాన్ (Shiva Chohan) ఆడియన్స్, లైఫ్లైన్ సహాయంతో చివరకు పన్నెండున్నర లక్షల రూపాయలు గెల్చుకున్నాడు. మరో ప్రశ్నకు సమాధానం చెప్పివుంటే అతడు 25 లక్షల రూపాయలు గెలిచేవాడు కానీ, సమాధానం తెలియకపోవడంతో అక్కడితో నిష్క్రమించాడు. అయితే తర్వాత అతడు చేసిన గెస్ సరైన సమాధానం అని తేలింది. పైన అడిగిన ప్రశ్నకు సమాధానం C అని కరెక్టుగానే ఊహించాడు. చదవండి: ఇంటికో బెంజ్, బీఎండబ్ల్యూ.. కానీ పక్కా పల్లెటూరు!
పెళ్లి పేరుతో మోసం : ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ అరెస్ట్
ప్రముఖ బాలీవుడ్ గాయకుడు సంగీత దర్శకుడు, సచిన్ సంఘ్వి (Sachin Sanghvi) పై లైంగిక ఆరోపణలు సంచలనం రేపాయి. మ్యూజిక్ ఆల్బమ్లో అవకాశం ఇస్తానని నమ్మిం,ఇ వివాహం హామీ ఇచ్చి లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలపై అరెస్టు చేసినట్లు పోలీసులు శుక్రవారం తెలిపారు.సచిన్-జిగర్ జంటలోని సంగీత దర్శకుడు, తమ్మా, స్త్రీ 2, భేదియా , జరా హట్కే, జరా బచ్కే వంటి చిత్రాలకు హిట్ పాటలతో పాపులర్ అయిన సంఘ్విని లైంగిక ఆరోపణల కింద అరెస్టు చేసినట్లు ఒక అధికారి తెలిపారు. అయితే అనంతరం బెయిల్పై విడుదలైనారు. తన 20 ఏళ్ల వయస్సులో, ఫిబ్రవరి 2024లో సచిన్ సంఘ్వితో పరిచయం ఏర్పడిందని, అతను ఆమెకు ఇన్స్టాగ్రామ్లో సందేశం పంపాడని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది. తనమ్యూజిక్ ఆల్బమ్లో అవకాశం ఇస్తానని హామీ ఇచ్చారని, వారు ఫోన్ నంబర్లు ఇచ్చిపుచ్చుకున్నారు. ఆ తరువాత ఆమెను తన స్టూడియోకు పిలిపించి, పెళ్లి ప్రపోజ్ చేశాడని, తనపై అనేకసార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆ మహిళ ఆరోపించిందని పోలీసు అధికారి తెలిపారు. చదవండి: వైద్యురాలిపై పోలీసుల అఘాయిత్యం, అరచేతిలో సూసైడ్ నోట్ కలకలంఇది ఇలా ఉంటే ఈ కేసులో సచిన్ సంఘ్వి తరపున వాదిస్తున్న న్యాయవాది ఆదిత్య మిథే తన క్లయింట్పై ఉన్న అన్ని ఆరోపణలను ఖండించారు. సంఘ్వీ అరెస్ట్ చట్టవిరుద్ధం అన్నారు. ఈ విషయంపై సచిన్ ఇంకా ఎటువంటి ప్రకటన విడుదల చేయలేదు. అతని అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా @soulfulsachin ఇన్యాక్టివ్గా ఉంది. అటు జిగర్ కూడా ఈ విషయంపై ఎటువంటి ప్రకటన విడుదల చేయలేదు.కాగా రష్మిక మందన్న , ఆయుష్మాన్ ఖురానా జంటగా నటించి , దీపావళికి విడుదలైన థమ్మాకి సచిన్ అండ్ జిగర్ సంగీతం అందించారు. గత ఏడాది స్త్రీ 2 కోసం ఈ ద్వయం స్వర పర్చిన చేసిన "ఆజ్ కీ రాత్" బాగా హిట్అయిన సంగతి తెలిసిందే.చదవండి: కేరళలో పెళ్లి వైరల్ : ఎన్ఆర్ఐలకు పండగే!
అరచేతిపై సూసైడ్ నోట్ రాసి... వైద్యురాలు బలవన్మరణం
సతారా: మహారాష్ట్రలో ఓ సబ్ఇన్స్పెక్టర్ లైంగిక వేధింపులకు ఒక యువ వైద్యురాలు బలైంది. తన ఆవేదనను ఉన్నతాధికారులకు చెప్పుకుందామనుకున్నా ఎవరూ వినిపించుకునే పరిస్థితి లేకపోవటంతో ఉరివేసుకుని తనువు చాలించింది. సతారా జిల్లాలోని ఫాల్తన్ తహసీల్లో ఉన్న ప్రభుత్వ ఆస్పత్రిలో పనిచేస్తున్న 28 ఏళ్ల వైద్యురాలు గురువారం రాత్రి ఓ హోటల్ గదిలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ కఠిన నిర్ణయానికి గల కారణాలను ఆమె తన అరచేయిపై వివరంగా రాసింది. సబ్ఇన్స్పెక్టర్ గోపాల్ బదానే గత ఐదు నెలల్లో తనపై పలుమార్లు లైంగికదాడికి పాల్పడ్డాడని, మానసికంగా వేధిస్తున్నాడని తెలిపింది. తాను నివాసం ఉంటున్న భవనం యజమాని కుమారుడు ప్రశాంత్ బంకర్ కూడా తనను లైంగికంగా, మానసికంగా వేధించాడని సూసైడ్ నోట్లో రాసింది. వైద్యురాలి మృతదేహాన్ని గుర్తించిన హోటల్ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. నిందితులు ఇద్దరిపై అత్యాచారం, ఆత్మహత్యకు ప్రేరేపించిన ఆరోపణలపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. రాజకీయ దుమారం డాక్టర్ ఆత్మహత్య ఘటన మహారాష్ట్రలో రాజకీయ దుమారం రేపుతోంది. హోంశాఖను కూడా చూస్తున్న ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఈ ఘటనపై తీవ్రంగా స్పందించారు. సతారా ఎస్పీ తుషార్ దోషీకి ఫోన్చేసి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఎస్ఐని విధుల నుంచి తొలగించాలని ఆదేశించారు. నిందితులు ఇద్దరు పరారీలో ఉండటంతో వారికోసం గాలిస్తున్నట్లు తుషార్ దోషీ తెలిపారు. డాక్టర్ ఆత్మహత్య ఘటన చాలా తీవ్రమైన అంశమని మహారాష్ట్ర శాసనమండలిలో డిప్యూటీ చైర్పర్సన్ నీలమ్గోర్హే అన్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం ఫడ్నవీస్ను కోరినట్లు తెలిపారు. సతారా సివిల్ సర్జన్తో తాను మాట్లాడానని, వేధింపుల గురించి మృతురాలు తమకేమీ ఫిర్యాదు చేయలేదని సర్జన్ చెప్పినట్లు రాష్ట ఆరోగ్యశాఖ సహాయమంత్రి మేఘన బోర్డికర్ చెప్పారు. సతారా ఘటనపై సతారా పోలీసుల నుంచి నివేదిక కోరినట్టు రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ రూపాలీ చకంకర్ వెల్లడించారు. కాగా, ఈ ఘటనపై మీడియా న్యాయ విచారణ జరపటం మానుకోవాలని మరో మంత్రి పంకజ ముండే ఆగ్రహం వ్యక్తంచేశారు. ఘటనపై ప్రతిపక్ష పార్టీలు ఫడ్నవీస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నాయి. ఫడ్నవీస్ పాలనలో రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని కాంగ్రెస్ నేత సచిన్ సావంత్ ఆరోపించారు. ఈ ఘటనపై స్వతంత్ర దర్యాప్తు జరిపేందుకు సిట్ను ఏర్పాటుచేయాలని శివసేన యూబీటీ నేత సుష్మఅంధరే డిమాండ్ చేశారు. తీవ్రంగా వేధించారు మృతురాలిని ఆమె ఉన్నతాధికారులతోపాటు నిందితులు తీవ్ర వేధింపులకు గురిచేశారని డాక్టర్ బంధువు ప్రయాగ ముండే ఆరోపించారు. ‘ఆమె ఎంతో తెలివైంది. గొప్ప ఆశయాలు కలిగిన అమ్మాయి. చిన్నప్పటి నుంచి ఆమెను మేమే పెంచి, చదివించాం. విధి నిర్వహణలో ఆమె తీవ్రమైన ఒత్తిళ్లు ఎదుర్కొంది. తప్పుడు పోస్ట్మార్టం నివేదికలు ఇవ్వాలని ఆమెపై ఉన్నతాధికారులు ఒత్తిడి చేశారు. అందుకే ఆమె ఆత్మహత్య చేసుకుంది. నిందితులు కఠినంగా శిక్షించాలి’అని డిమాండ్ చేశారు. పనిచేసే చోట సీనియర్లు వేధిస్తున్నారని రెండురోజుల క్రితమే మృతురాలు తమకు తెలిపిందని మరో బంధువు వెల్లడించారు. నిందితుడికి చివరి ఫోన్కాల్ ఆత్మహత్య చేసుకోవటానికి ముందు వైద్యురాలి నిందితుల్లో ఒకడైన ప్రశాంత్ బంకర్కు ఫోన్చేసినట్టు పోలీసులు వెల్లడించారు. ఇద్దరూ ఫోన్లో చాటింగ్ చేశారని వెల్లడించారు. అయితే, ఆ సందేశాల్లో ఏముంది అన్న విషయాన్ని మాత్రం వెల్లడించలేదు.
అడ్వర్టైజింగ్ దిగ్గజం పీయూష్ కన్నుమూత
ప్రచార రంగ దిగ్గజం పీయూష్ పాండే(70) ఇక లేరు. అనారోగ్యంతో శుక్రవారం ఆయన ముంబైలో కన్నుమూశారు. ప్రకటనల రంగంలో నాలుగు దశాబ్దాలకు పైగా సేవలందించిన పాండే ‘ఫెవికాల్, క్యాడ్బెరీ, ఆసియన్ పెయింట్స్..’ ఇలా ఎన్నో ప్రముఖ బ్రాండ్లకు, పలు ప్రభుత్వ కార్యక్రమాల క్యాంపెయిన్లకు ప్రచార స్లోగన్స్ రూపొందించారీయన. భారతీయ ప్రకటనల రంగాన్ని మలుపు తిప్పిన వ్యక్తిగా పీయూష్ పాండేకి గుర్తింపు ఉంది. పీయూష్ 1955లో జైపూర్(రాజస్థాన్)లో జన్మించారు. ఆ కుటుంబంలో తొమ్మిది మంది సంతానం. ఆయన సోదరుడు ప్రసూన్ పాండే ప్రముఖ ఫిల్మ్ డైరెక్టర్. సోదరి ఇలా అరుణ గాయని-నటి. క్రికెట్లో రంజీ ట్రోఫీకి ప్రాతినిధ్యం వహించిన పీయూష్ పాండే.. కన్స్ట్రక్షన్ రంగంలో కొంతకాలం పనిచేశారు. అక్కడి నుంచి అడ్వర్టైజింగ్ రంగంలోకి అడుగుపెట్టారు. 1982లో ఒగిల్వీ ఇండియా Ogilvy Indiaలో చేరి.. మొదట క్లయింట్ సర్వీసింగ్ విభాగంలో పని చేశారు. ఆ తర్వాత క్రియేటివ్ విభాగంలోకి మారిపోయి.. అంచెలంచెలుగా ఎదిగి కీలక పదవులను చేపట్టారు. ఆయన సారథ్యంలో.. భారతీయ సంస్కృతిని ప్రతిబింబిస్తూనే బావోద్వేగాలకు ముడిపెట్టి ఎన్నో ప్రకటనలు రూపొందించారు. పాక్-భారత్ బార్డర్ బ్యాక్డ్రాప్తో ఫెవికిక్ ‘తోడో నహీ జోడో’ యాడ్, క్యాడ్బెరీ డెయిలీ మిల్క్ “कुछ खास है” యాడ్, వోడాఫోన్ హచ్ డాగ్ వినూత్న ప్రచారాలు ఆకట్టుకున్నాయి. 2014 సార్వత్రిక ఎన్నికల సమయంలో ఎన్డీయే కూటమి కోసం అబ్కీ బార్ మోదీ సర్కార్ అనే ప్రచార స్లోగన్ను రూపొందించింది ఈయనే కావడం గమనార్హం. అంతేకాదు.. బిగ్బీ అమితాబ్ బచ్చన్ ‘పల్స్పోలియో’ యాడ్ను స్వయంగా తీర్చిద్దిద్దారు. అడ్వైర్టైజింగ్ రంగంలో ఈయన అందించిన సేవలకుగానూ 2016లో కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీతో సత్కరించింది. 2024లో ఎల్ఐఏ లెజెండ్ అవార్డు ఆయన్ని వరించింది.పీయూష్ పాండే మృతిపై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఎక్స్ వేదికగా విచారం వ్యక్తం చేశారు. ‘‘పీయూష్ పాండే భారతీయ ప్రకటనల రంగాన్ని కొత్త దిశలో నడిపించిన సృజనాత్మక మేధావి. ఆయన రూపొందించిన ప్రకటనలు ప్రజల హృదయాల్లో నిలిచిపోయాయి. ఆయన మృతి భారతీయ క్రియేటివ్ ప్రపంచానికి తీరని లోటు. ఆయన కుటుంబానికి, స్నేహితులకు, Ogilvy India టీమ్కు నా ప్రగాఢ సానుభూతి’’ అని తెలిపారు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్తో పాటు స్మృతి ఇరానీ, ఆనంద్ మహీంద్రా, ఉదయ్ కోటక్ లాంటి వ్యాపారవేత్తలూ ఆయన మృతిపై సంతాపం తెలియజేశారు.వైఎస్ జగన్ దిగ్ర్భాంతివైఎస్సార్సీపీ అధినేత,మాజీ సీఎం వైఎస్ జగన్ దిగ్ర్భాంతిని వ్యక్తం చేశారు. దేశానికి కనెక్టయ్యేలా ఆయన సృజనాత్మక ప్రకటనలు ఉంటాయి.అలాంటి పద్మశ్రీ పాండేని కోల్పోవటం విచారకరం. పాండే కుటుంబ సభ్యులు, స్నేహితులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా. సాక్షి, భారతి సిమెంట్స్ ప్రారంభ సమయంలో ఆయన చేసిన సృజనాత్మక కృషి ఎప్పటికీ గుర్తుండి పోతుంది’అని పేర్కొన్నారు. Truly at a loss for words to express my sadness at the demise of Padma Shri Piyush Pandey.A phenomenon in the world of advertising, his creative genius redefined storytelling, giving us unforgettable and timeless narratives.To me, he was a friend whose brilliance shone… pic.twitter.com/t6ZDSViCrS— Piyush Goyal (@PiyushGoyal) October 24, 2025
ఎన్ఆర్ఐ
టెక్సాస్ గవర్నర్ అధికార నివాసభవనంలోవైభవంగా దీపావళి వేడుకలు
డాలస్, టెక్సాస్: టెక్సాస్ రాష్ట్ర గవర్నర్ గ్రెగ్ అబ్బాట్ , సిసిలీయా అబ్బాట్ దంపతులు రాష్ట్రంలోని కొంతమంది ప్రవాస భారతీయనాయకులను ఆహ్వానించి, తమ అధికార నివాసభవనంలో దీపావళి పండుగను ఘనంగా నిర్వహించారు. గత 11 సంవత్సరాలుగా ప్రతీ ఏడాదీ గవర్నర్ దంపతులు దీపావళి పండుగ జరుపుకోవడం విశేషం. గౌరవ గవర్నర్ గ్రెగ్ అబ్బాట్ దంపతులు వివిధరంగాలలో విశేషంగా కృషి చేస్తూ, టెక్సస్ రాష్ట్ర శరవేగ అభివృద్ధికి తోడ్పడుతున్న ప్రవాస భారతీయులకు కృతజ్ఞతలతోపాటు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. భారతీయ వంటకాలతో దీపావళి విందు ఏర్పాట్లు చెయ్యడమేగాక అందరికీ దీపావళి కానుకలిచ్చి సత్కరించారు. ప్రముఖ పారిశ్రామికవేత్త అనురాగ్ జైన్ దంపతులు ఈ సంవత్సరపు దీపావళి వేడుక ఏర్పాట్లను సమన్వయపరచారు. గౌరవ కాన్సల్ జనరల్ ఆఫ్ ఇండియా డి.సి మంజునాథ్ దంపతులు, టెక్సస్ రాష్ట్ర కార్యదర్శి జేన్ నెల్సన్ లు ప్రత్యేక అతిథులుగా హాజరయ్యారు. టెక్సాస్ రాష్ట్రంలోని వివిధ నగరాలైన డాలస్, హూస్టన్, ఆస్టిన్, శాన్అంటానియో, కార్పస్ క్రిస్టీ, మిడ్ల్యాండ్, ఓడిస్సా మొదలైన నగరాలనుండి 100 మందికి పైగా పాల్గొన్న ప్రవాస భారతీయులలో ప్రవాసాంధ్రులైన డా. ప్రసాద్ తోటకూర, చిన సత్యం వీర్నపు, కుమార్ నందిగం, వెంకట్ ఏరుబండి, వెంకట్ గొట్టిపాటి, సతీష్ మండువ, నీలిమ గోనుగుంట్ల, ఆషా రెడ్డి, సుజిత్ ద్రాక్షారామ్, బంగార్ రెడ్డి, రాజ్ కళ్యాణ్ దుర్గ్ వారి కుటుంబ సభ్యులున్నారు.భారత అమెరికా దేశాలమధ్య సంభందాల బలోపేతం కోసం నిరంతరం కృషి చేస్తున్న టెక్సాస్ రాష్ట్ర గవర్నర్ గ్రెగ్ అబ్బాట్ కు ప్రవాసభారతీయులందరి తరపున డా. ప్రసాద్ తోటకూర కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రవాసభారతీయుల ముఖ్యమైన అన్ని ఉత్సవాలకు హాజరయ్యే గవర్నర్ మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ ఆధ్వర్యంలో డాలస్ లో జరిగిన మహాత్మాగాంధీ 150వ జయంతి ఉత్సవాలలో ముఖ్యఅతిథిగా హాజరైన సంఘటన గుర్తుచేసుకుని గవర్నర్ కు మరోసారి ప్రత్యేక ధన్యవాదములు తెలియజేశారు.
H1b Visa: విదేశీ విద్యార్థులకు భారీ ఊరట
అమెరికాలో చదువుకుంటున్న విదేశీ విద్యార్థులకు భారీ ఊరట లభించింది. కొత్త H-1B వీసా దరఖాస్తులపై 100,000 డాలర్ల ఫీజు నుంచి మినహాయింపు ఉంటుందని అమెరికా సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్(USCIS) పేర్కొంది. హెచ్1బీ ఫీజు పెంపుపై స్పష్టత ఇచ్చే క్రమంలో పలు వివరాలను వెల్లడించింది.హెచ్-1బీ ఫీజు పెంపు కేవలం అమెరికా బయట నుంచి దరఖాస్తు చేసుకొన్నవారికే వర్తిస్తుందని పేర్కొంటూ అమెరికాలో చదువుకొంటున్న విద్యార్థులకు అమెరికా సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ తీపి కబురు చెప్పింది. అలాగే.. ఫీజు పెంపు ప్రకటన వెలువడే సమయానికి అమెరికాలోనే ఉన్నవారికి మినహాయింపు వర్తిస్తుందని వెల్లడించింది.ఇదిలా ఉంటే.. 2025 సెప్టెంబర్ 19న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ‘ప్రెసిడెన్షియల్ ప్రోక్లమేషన్’ విడుదల చేశారు. దీని ప్రకారం, కొత్త H-1B వీసా దరఖాస్తులపై $100,000 ఫీజు విధించబడుతుంది. ఈ ఫీజు 2025 సెప్టెంబర్ 21 నుంచి కొత్త H-1B వీసా పిటిషన్లకు వర్తించడం అమలైంది. అయితే.. USCIS అక్టోబర్ 20న ఫీజు అమలులో పారదర్శకత, మినహాయింపు విధానం, అర్హత ప్రమాణాలు గురించి వివరిస్తూ స్పష్టమైన మార్గదర్శకాలను తెలియజేసింది.మరోవైపు ఓ జాతీయ మీడియా నిర్వహించిన ఈవెంట్లో పాల్గొన్న అమెరికా ఇమ్మిగ్రేషన్ న్యాయవాది నికోల్ గునారా మాట్లాడుతూ.. F-1 (విద్యార్థి వీసా), L-1 (ఇంటర్కంపెనీ ట్రాన్స్ఫర్ వీసా) లబ్ధిదారులు ఈ భారీ ఫీజు నుంచి విముక్తి పొందారని తెలిపారు. ఇది విదేశీ విద్యార్థుల భవిష్యత్తుకు ఉపశమనం కలిగించే నిర్ణయమని అన్నారు. ఇదిలా ఉంటే.. ఈ మార్పులు అమెరికాలో ఉన్న ఉద్యోగదారులకు, అలాగే విద్యార్థులకు.. ఇమ్మిగ్రేషన్ ఖర్చులను తగ్గించేందుకు దోహదపడతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.భారత్ నుంచి వెళ్లే విద్యార్థులు ఎక్కువగా అమెరికాలో నుంచే H-1Bకి మారుతారు. కాబట్టి. ఈ భారీ ఫీజు వాళ్లు చెల్లించాల్సిన అవసరం ఉండదన్నమాట.
లండన్ పార్లమెంట్లో పద్మశ్రీ గరికపాటికి సన్మానం
తెలుగు సంస్కృతి సంఘం ఆధ్వర్యంలో బ్రిటిష్ పార్లమెంట్ హౌస్ ఆఫ్ కామన్స్ ఎంపీ వీరేంద్ర శర్మ, వలేరి వాజ్ బ్రహ్మ శ్రీ, పద్మశ్రీ గరికపాటి నరసింహ రావు గారికి సన్మానం నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా పద్మశ్రీ గరికపాటి నరసింహ రావుభారతీయ రచనలు, పాశ్చాత్య సాహిత్యానికి ఉన్న సంబంధాన్ని, సారూప్యతలను చాలా చక్కగా వివరించారు. గరికపాటి గారు రచించిన ఒషెన్ బ్లూస్ సముద్రం గురించి, ప్రముఖ రచయిత షేక్స్ పియర్ గురించి రాసిన కవితలు అద్భుతంగా వివరించారు.భారతీయ రచనలు, మంగళ ప్రదంగా మొదలై, మంగళ ప్రదంగా నడుస్తూ, మంగళ ప్రదంగా ముగుస్తాయి అని అద్భుతంగా వివరించారు.పాశ్చాత్య రచనల్లో అతి ప్రముఖమైన షేక్స్ పియర్ రచనలైన హామ్లెట్ వంటి రచనల్లో పాత్రధారుల అన్ని కోణాలు ఆవిష్కరించబడతాయని వివరించారు. లండన్ లోని గ్లోబ్ థియేటర్ లో షేక్స్ పియర్ గారి నాటకాలు ఎంత విజయవంతంగా ప్రదర్శించబడ్డాయో వివరించారు.ఈ కార్యక్రమంలో బిట్స్ వ్యవస్థాపకులు సురేష్ మంగళగిరి ,సభ్యులు రాగసుధా ,యశ్వంత్ నూక గారు, అశ్విన్, వాస భరత్ వాస, హర్ష మైనేని, రాజ్ దేవరపు, శరత్ తమ, సుభాష్ రెడ్డి, షణ్ముఖ్, సుదర్శన్ రెడ్డి, రంజిత్, కాటిపల్లి సచిందర్ రెడ్డి, వివేక్, జయా తులసి తదితరులు పాల్గొన్నారు.
భారతదేశ ప్రతిభకు అమెరికా సంస్థల "సాహిత్యభారతి జీవన సాఫల్య పురస్కారాలు"
"అర్చన ఫైన్ ఆర్ట్స్, అమెరికా", "శ్రీ శారద సత్యనారాయణ ట్రస్ట్ – హ్యూస్టన్, అమెరికా" సంస్థలు సంయుక్తంగా 2025 దీపావళి పండుగను మరింత దేదీప్యమానం చేస్తూ, తెలుగు సాహిత్యంలో తమదైన ముద్రను వేసిన మహనీయులకు 'సాహిత్యభారతి జీవన సాఫల్య పురస్కారాలు' ప్రదానం చేసి ఘనంగా సత్కరించాయి. ఈ నిర్వాహక సంస్థల వ్యవస్థాపకులు 'నాట్యభారతి' కోసూరి ఉమాభారతి మరియు ప్రమీల సూర్యదేవర సంయుక్తంగా ఈ అవార్డులను అందజేయడం జరిగింది.సంగీత, సాహిత్య, నాటక రంగాలలో బహుముఖ ప్రజ్ఞా ధురీణులు రామాయణం ప్రసాద రావు; కథా చైతన్య స్రవంతిగా తన కథల ద్వారా మనుషుల్లో చైతన్యాన్ని నింపిన డి.కామేశ్వరి; కథలు, కవితలు, చిత్రాలతో సృజనాత్మక లోకానికి మరింత అందంగా సొబగులద్దిన మన్నెం శారద, దూరదర్శన్ వ్యాఖ్యాతగా అందరి హృదయాలలో నిలిచిన ఓలేటి పార్వతీశం.. తమ సంస్థల తరఫున ఈ సాహిత్యభారతి జీవన సాఫల్య పురస్కారాలు అందుకోవడం చాలా సంతోషంగా ఉందని నిర్వాహకులు కోసూరి ఉమాభారతి, ప్రమీల సూర్యదేవర పత్రికా ప్రకటనలో తెలియజేశారు.అకాడెమీ తరఫున హైదరాబాదులో జ్యోతి వలబోజు నేతృత్వంలో రచయిత్రుల బృందం పురస్కార గ్రహీతల స్వగృహాలలోనే వారిని గౌరవప్రదంగా సత్కరించి పురస్కారాలని అందజేశారు. సాహిత్య కళారంగాలలో పలువురు ప్రముఖులు ఈ పురస్కార ప్రదానంపై తమ హర్షం వ్యక్తం చేస్తూ పురస్కార గ్రహీతలను నిర్వాహకులను అభినందించారు.
క్రైమ్
ఒకే గ్రామంలో ముగ్గురి ఆత్మహత్య
హయత్నగర్: వారంతా ఒకే గ్రామానికి చెందిన వారు. చిన్నప్పుడు ఒకే పాఠశాలలో, ఒకే తరగతిలో చదువుకు న్నారు. కానీ ఏమైందో ఏమో ఉన్నట్టుండి ఒకరి తర్వాత ఒకరు ఉరేసుకొని ఆత్మహత్యలకు పాల్పడ్డారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలం హయత్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలోని కొహెడ గ్రామంలో జరిగిన ఈ ఘటనలు స్థానికంగా కలకలం సృష్టించాయి. పోలీసుల కథనం ప్రకారం గ్రామానికి చెందిన గ్యార శివరాజు కుమార్తె వైష్ణవి (18) కొంతకాలంగా కడుపునొప్పితో బాధపడుతోంది. మంగళవారం కడుపు నొప్పి ఎక్కువ కావడంతో సాయంత్రం డాక్టర్ వద్దకు తీసుకెళ్తామని కుటుంబ సభ్యులు చెప్పారు. అనంతరం స్నానం చేసి వస్తానంటూ వెళ్లిన వైష్ణవి.. బెడ్రూంలో గడియ పెట్టుకొని చీరతో ఫ్యాన్కు ఉరేసుకుంది. ఎంత సేపటికీ ఆమె బయటకు రాకపోవడంతో కుటుంబ సభ్యులు తలుపు బద్దలుకొట్టి చూడగా వైష్ణవి ఫ్యాన్కు వేలాడుతూ కనిపించింది. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ ఘటన జరిగిన మర్నాడే సతాలి వెంకటేశ్ కుమారుడు రాకేశ్ (21) బుధవారం రాత్రి తన సోదరుడి దుకాణంలో పడుకుంటానని కుటుంబ సభ్యులకు చెప్పి వెళ్లి అర్ధరాత్రి తర్వాత ఫ్యాన్కు ఉరేసుకొని తనువు చాలించాడు. గురువారం ఉదయం తల్లి యాదమ్మ షాప్ ఊడ్చేందుకు షట్టర్ తెరిచి చూసి కేకలు పెట్టడంతో చుట్టుపక్కల వారు వచ్చి కిందకు దించి చూడగా అప్పటికే రాకేశ్ మృతిచెందాడు. రాకేశ్ మరణవార్త తెలుసుకొని అతని మృతదేహాన్ని చూసి ఇంటికొచ్చిన బుద్ద నర్సింహ రెండో కుమార్తె శ్రీజ (18) ఇంట్లోకి వెళ్లి లోపలి నుంచి తాళం వేసుకుంది. ఆమె సోదరి గమనించి కజిన్కు విషయం చెప్పడంతో అతను వచ్చి చుట్టుపక్కల వారి సాయంతో తలుపులు తెరిచాడు. అప్పటికే శ్రీజ లుంగీతో ఫ్యాన్కు ఉరేసుకుంది. స్థానికుల సమాచారంతో అక్కడకు చేరుకున్న 108 అంబులెన్స్ వైద్య సిబ్బంది శ్రీజను పరీక్షించి ఆమె మృతి చెందినట్లు నిర్ధారించారు. వరుస ఆత్మహత్య ఘటనలపై కేసులు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
రీల్స్ పిచ్చి : రైలుకెదురెళ్లి తిరిగి రాని లోకాలకు, వీడియో వైరల్
యూట్యూబ్ రీల్స్ పిచ్చి అనేకమంది ప్రాణాలుతీస్తోందని తెలిసినా తీరు మారడం లేదు. నిర్లక్ష్యం కొన సాగుతూనే ఉంది. ఫలితంగా ఒక నిండు ప్రాణం బలైపోయింది. ఒడిశాలోని పూరి జిల్లాలోని జనకదేయ్పూర్ రైల్వే స్టేషన్లో మంగళవారం ఈ విషాదం చోటు చేసుకుంది.ఒడిశాలోని పూరీలో రైల్వే ట్రాక్పై రీల్ చిత్రీకరిస్తున్న 15 ఏళ్ల మైనర్ బాలుడు రైలు ఢీకొని మృతి చెందాడు. మంగళఘాట్ నివాసి విశ్వజీత్ సాహు తన తల్లితో కలిసి దక్షిణకాళి ఆలయాన్ని సందర్శించాడు. అక్కడి కార్యక్రమాలు ముగించుకొని ఇంటికి వస్తుండగా వేగంగా వస్తున్న రైలుకు ఎదురెళ్లి మలీ రీల్స్ తీయడానికి ప్రయత్నించాడు. అంతే అందరూ చూస్తుండగానే లిప్తపాటు క్షణంలోనే బాలుడి ప్రాణాలు గాల్లో కలిసిపోవడం విషాదం.తన మొబైల్ ఫోన్లో చిన్న వీడియో రికార్డ్ చేయడానికి రైల్వే పట్టాలకు దగ్గరగా ప్రమాదకరంగా నిలబడి తన మొబైల్ ఫోన్లో రీల్ చిత్రీకరిస్తుండగా, ఎదురుగా వస్తున్న రైలు బలంగా ఢీకొట్టింది. దీంతో అతను అక్కడికక్కడే ప్రాణాలుకోల్పోయాడని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.ఇదీ చదవండి: డ్రీమ్ హౌస్ అంటూ గుడ్ న్యూస్ చెప్పిన స్వీట్కపుల్సమాచారం అందిన వెంటనే, ప్రభుత్వ రైల్వే పోలీసు (GRP) అధికారులు అక్కడికి చేరుకుని, మృతదేహాన్ని పోస్ట్మార్టం పరీక్ష కోసం సమీపంలోని ఆసుపత్రికి పంపారు. రైల్వే పట్టాల దగ్గర భద్రతా హెచ్చరికలను పట్టించుకోకుండా సోషల్ మీడియా వీడియోను చిత్రీకరించడానికి ప్రయత్నించినప్పుడు బాలుడు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ప్రమాదం జరిగిందని ప్రాథమిక దర్యాప్తులో తేలింది.Tragic accident occurred in Puri district, #Odisha A 15-year-old boy was hit by train & died near #Janakdeipur railway station. The accident occurred while he was filming a video reel on his mobile phone on the railway track.#Reels#reelsvideo pic.twitter.com/XB613GdZX0— Nikita Sareen (@NikitaS_Live) October 23, 2025 కాగా ఈ ఏడాది ఆగస్టులో గంజాం జిల్లా బెర్హంపూర్కు చెందిన 22 ఏళ్ల యూట్యూబర్ కోరాపుట్లోని డుడుమా జలపాతం వద్ద రీల్స్ చిత్రీకరిస్తుండగా కొట్టుకుపోయి కనిపించకుండా పోయిన సంగతి తెలిసిందే. ఇదీ చదవండి: సోదర ప్రేమ, భగినీ హస్త భోజనం : ముహూర్తం ఎపుడంటే
మేన బావతో వివాహం.. మరో వ్యక్తితో వివాహేతర సంబంధం
కామారెడ్డి క్రైం: వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను ప్రియుడితో కలిసి హత్య చేసిందో భార్య. గాంధారి మండల కేంద్రానికి సమీపంలో వారం రోజుల క్రితం వెలుగు చూసిన హత్య కేసును పోలీసులు చేధించారు. మృతుడు, నిందితులను మేడ్చల్ జిల్లా కీసర వాసులుగా గుర్తించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ రాజేష్ చంద్ర వివరాలు వెల్లడించారు. ఈ నెల 16 న గాంధారి శివారు లోని చద్మల్ వెళ్లే దారిలో రోడ్డు పక్కన ఉన్న ఓ కాలువలో మృతదేహం ఉన్నట్లు సమాచారం రావడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ జరిపారు. గుర్తు తెలియని వ్యక్తిని ఎవరో హత్య చేసి పెట్రోల్ పోసి తగలబెట్టినట్లుగా ఉంది. కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో విచారణ జరిపారు. హత్య జరిగగిన సమయంలో అటుగా వెళ్తున్న ఓ యువకుడు మృతదేహం పక్కన మరో వ్యక్తి ఉన్నట్లు గమనించాడు. అతడు ఇచ్చిన ఆనవాళ్లు, సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను మేడ్చల్ జిల్లా కీసర మండలం భవానీ నగర్కు చెందిన ఏలూరి ఆంజనేయులు, ఇరగడింట్ల నవనీతలుగా గుర్తించారు. వారిని బుదవారం అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించినట్లు ఎస్పీ తెలిపారు.మేన బావతో 2012లో వివాహం..కీసర ప్రాంతానికి చెందిన నవనీత కు మేన బావ నరేష్తో 2012 లో వివాహం జరిగింది. వారిద్దరూ కూలీ పనులు చేసుకుంటూ జీవించేవారు. కొంత కాలం క్రితం వారిద్దరూ ఆంజనేయులు వద్దకు కూలీ పనులకు వెళ్లారు. అక్కడ ఆంజనేయులుకు, నవనీతకు మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. ముగ్గురూ కలిసి ఏడాది క్రితం పెద్దగుట్టకు దైవదర్శనానికి వచ్చి వెళ్లారు. కొద్ది రోజులుగా ఆంజనేయులు, నవనీతల వ్యవహారంపై అనుమానం వచ్చిన నరేష్ ప్రశ్నించడం, నవనీతను వేధించడం మొదలు పెట్టాడు. దీంతో అతని అడ్డు తొలగించుకోవాలని పథకం వేశారు. 15 న మరోసారి దైవదర్శనం కోసం అని చెప్పి నవీన్ను ఒప్పించి ముగ్గురూ కలిసి బైక్పై పెద్దగుట్ట వెళ్లారు. తిరుగు ప్రయాణంలో గాంధారి సమీపంలో ఆగి మద్యం సేవించారు. నరేష్కు అతిగా మద్యం తాగించి కాలువలో పడేశారు. ఆపై తీవ్రంగా కొట్టి హత్య చేశారు. మృతదేహాన్ని ఎవరూ గుర్తు పట్టకుండా ఉండాలనే ఉద్దేశంతో సమీపంలోని పెట్రోల్ బంక్ నుంచి పెట్రోల్ తెచ్చి కాల్చివేశారని ఎస్పీ తెలిపారు. నిందితులను రిమాండ్కు తరలిస్తున్నామని అన్నారు. కేసు ఛేదనలో చాకచక్యంగా వ్యవహరించిన సీఐ సంతోష్ కుమార్, ఎస్సై ఆంజనేయులు, సిబ్బంది సంజయ్, రవికుమార్, సాయిబాబా, ప్రసాద్, బంతీలాల్ లను అభినందించారు.
ఇద్దరితో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఉజ్మా..!
కర్నూలు జిల్లా: మండల కేంద్రం వెల్దురిలో ఓ వివాహిత దారుణ హత్యకు గురైంది. బుధవారం ఈ సంఘటన చోటు చేసుకుంది. వివాహేతర సంబంధమే దీనికి కారణంగా తెలుస్తోంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు... వెల్దుర్తిలోని 14 వ వార్డులో నివసించే ఉజ్మా (34)కు, మస్తాన్ అనే గౌండతో 15 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు సంతానం. వెల్దురిలోని వడ్డెగేరిలో నివసించే వ్యక్తితో ఉజ్మా వివాహేతర సంబంధం కొనసాగించింది. ఇటీవల ఆమె బీజేపీ మండల నాయకురాలితో కలిసి పలు కార్యక్రమాల్లో పాల్గొంది. ఈ క్రమంలో కృష్ణగిరి మండలం తొగర్చేడుకు చెందిన మరో వ్యక్తితో పరిచయం ఏర్పడింది. దీంతో అనుమానం పెంచుకున్న మొదటి ప్రియుడు తాను ఖర్చు చేసిన పైకం ఇవ్వాలని ఇటీవల ఆమెపై ఒత్తిడి తెచ్చాడు. ఈ విషయంపై మృతురాలు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయగా ఆ వ్యక్తి కుటుంబ సభ్యులు ఆమెపై దాడి చేసినట్లు తెలిసింది. అయితే, బుధవారం మధ్యాహ్నం ఉజ్మా ఇంటికి మాజీ ప్రియుడు వెళ్లాడు. ఇంట్లో ఏం జరిగిందో తెలియదు కానీ ఆమె రక్తపు మడుగులో పడి ఉంది. కుమార్తెలు ఇంటికి వచ్చి చూస్తే తలుపు వేసి ఉంది. పొరుగువారి సాయంతో తాళం పగలగొట్టి లోపలికి వెళ్లి చూడగా తల్లి విగతజీవిగా కనిపించింది. కాగా మృతురాలు ఇంటా, బయట ఏర్పాటు చేసుకున్న సీసీ కెమెరాల హార్డ్డిస్్క, ఆమె సెల్ఫోన్ సైతం హంతకుడు తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రం సిద్ధిపేట ప్రజ్ఞాపూర్లో గౌండ పని చేసేందుకు వెళ్లిన మస్తాన్.. భార్య హత్య విషయం తెలుసుకుని తిరుగుప్రయాణమయ్యాడు. సమాచారం అందుకున్న సీఐ మధుసూధన్ రావు, ఎస్ఐ అశోక్లు సంఘటనాస్థలికెళ్లి విచారించారు. మృతురాలి తల్లి నూర్జహాన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.
వీడియోలు
అయేషా మిడ్ వీక్ ఎలిమినేషన్..! ఆ కారణం వల్లే..!
ఔను... లోకేష్ కు అంత సీన్ లేదు.. డేటా సెంటర్లు కావాలి.. డబ్బా సెంటర్లు కాదు
హై అలర్ట్.. AP వైపు దూసుకొస్తున్న మొంథా తూఫాన్
5 కిలోల బాల భీముడు
బతుకులు బుగ్గి.. ప్రైవేట్ ట్రావెల్స్ ఎక్కితే పరలోకమే?
AP టీచర్లకు సుప్రీం బిగ్ షాక్
వసంత కృష్ణ ప్రసాద్ కు బిగ్ షాక్.. జనసేన లీడర్ సంచలన వ్యాఖ్యలు
ఈ ప్రమాదాలకు అసలు కారణం వారే
మాస్ హీరోతో.. క్లాస్ హీరో.. సంక్రాంతికి మెగా విక్టరీ
ముంచుకొస్తున్న తూఫాన్.. ఏపీకి భారీ వర్ష సూచన






