-
భానుడు భగభగ.. జనం విలవిల
భువనగిరిటౌన్ : జిల్లాలో భానుడి భగభగలు కొనసాగుతున్నాయి. శుక్రవారం సగం మండలాల్లో 42 డిగ్రీలకు పైగా పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా వలిగొండలో 43.8, ఆలేరు 43.7, ఆత్మకూర్(ఎం) మండంలో 43.1 డిగ్రీల సెల్సీయస్ ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే మోత్కూరు 42.9, రామన్నపేట 42.9, యాదగిరిగుట్ట 42.6, గుండాల 42.5, చౌటుప్పల్ 42.0, భువనగిరి 42, సంస్థాన్నారాయణపురంలో 41.8 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డ్ అయ్యింది. ఉక్కపోతకు తట్టుకోలేక.. శుక్రవారం తీవ్రమైన వడగాలులకు ఉక్కపోత తోడవడంతో జనం అల్లాడిపోయారు. ఫ్యాన్లు, కూలర్ల కింద కూర్చున్నా ఉక్కపోత నుంచి ఉపశమనం లభించలేదు. ఉదయం 11గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఇదే పరిస్థితి నెలకొంది.ఉష్ణోగ్రతలు మున్ముందు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఎండతీవ్రత అధికంగా ఉన్నందున ఇంట్లో ఉన్నప్పటికీ వడదెబ్బకు గురయ్యే ప్రమాదం ఉందని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్న పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండాలంటున్నారు. ఫ సగానికి పైగా మండలాల్లో 42 డిగ్రీలకు పైనే ఉష్ణోగ్రతలు ఫ మున్ముందు మరింత పెరిగే అవకాశం -
సైబర్ నేరాలను అరికట్టాలి
నల్లగొండ రూరల్: సైబర్ నేరాలను అరికట్టే శక్తి సామర్థ్యాలు యువత పెంపొందించుకోవాలని హైదరాబాద్కు చెందిన హంట్ మెట్రిక్స్ సంస్థ డైరెక్టర్ కృష్ణ అన్నారు. శుక్రవారం మహాత్మాగాంధీ యూనివర్సిటీలో హంట్ మెట్రిక్స్, ఎంజీయూ సంయుక్తంగా సైబర్ నేరాలు–సవాళ్లు అనే అంశంపై సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కృష్ణ పాల్గొని మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏటా 10.5 ట్రిలియన్ డాలర్లను ప్రజలు సైబర్ నేరాల కారణంగా నష్టపోతున్నట్లు తెలిపారు. ఒక్క హైదరాబాద్ నగరంలోనే ఏటా రూ.600 కోట్లు నేరగాళ్ల వల్ల నష్టపోతున్నారని అన్నారు. సోషల్ మీడియాలో ప్రజలు తమ వ్యక్తిగత సమాచారాన్ని పొందుపరచడం వల్ల నేరగాళ్ల వలలో పడుతున్నట్లు తెలిపారు. ఉచితాలు, తక్కువ ధరల ముసుగులో నేరగాళ్లు పంపే లింక్ మెసేజ్లు ఓపెన్ చేసి అమాయకులు నష్టపోతున్నారన్నారు. అన్ని రంగాల్లో సైబర్ నేరాలకు అవకాశం ఉందని, దాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టే మానవ వనరులు పెంచుకోవాలన్నారు. సైబర్ నేరాల పట్ల యువత అవగాహన కలిగి ఇతరులను చైతన్యం చేయాలన్నారు. సైబర్ నేరాలు అరికట్టడంలో నైపుణ్యం ఉంటే భవిష్యత్లో వారికి మంచి అవకాశాలు లభిస్తాయన్నారు. విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో అవగాహ న ఒప్పందాలు చేసుకుని స్వల్ప కాలిక కోర్సులను హంట్ మెట్రిక్ సంస్థ ద్వారా అందిస్తున్నట్లు తెలి పారు. కృత్రిమ మేధాయుగంలో ప్రజలు మరింత అప్రమత్తంగా నడుచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ అల్వాల రవి, ఓఎస్డీ కొప్పుల అంజిరెడ్డి, హంటు మెట్రిక్స్ సంస్థ ఎండీ.అయూబ్, రామచందర్, ప్రశాంతి, ప్రేమ్సాగర్, రేఖ, మద్దిలేటి, పాండరయ్య పాల్గొన్నారు. -
అంతర్రాష్ట్ర దొంగ అరెస్టు
నల్లగొండ క్రైం : తాళం వేసిన ఇళ్లే లక్ష్యంగా చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగను మిర్యాలగూడ పోలీసులు అరెస్టు చేశారు. అతడి నుంచి రూ.16లక్షల 24వేల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం నల్లగొండ పట్టణంలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో డీఎస్పీ రాజశేఖర్రాజు విలేకరుల సమావేశం నిర్వహించి కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. విజయవాడలోని బొంబాయి కాలనీ, సీబ్లాక్ ఎఫ్ఎఫ్6లో నివాసం ఉండే దేవరకొండ రాంబాబు పూల వ్యాపారం చేస్తూ జీవనం సాగించేవాడు. రాంబాబు జలస్సాలకు అలవాటు పడి తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఆశతో తాళం వేసిన ఇళ్లే లక్ష్యంగా ఒంటరిగానే చోరీలకు పాల్పడడం ప్రారంభించారు. విజయవాడలో పలు చోరీ కేసుల్లో, గుంటూరులో పలు చోరీలో పట్టుబడి గుంటూరు జైలులో ఏడాది పాటు శిక్ష అనుభవించి 2024 జనవరిలో జైలు నుంచి విడుదలయ్యాడు. అయినా అతడు తీరు మార్చుకోకపోగా మళ్లీ చోరీలకు పాల్పడడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలో ఈనెల 10న మిర్యాలగూడ వన్టౌన్ పరిధిలో మౌర చంద్రశేఖర్ తాళం వేసి బంధువుల ఇంటికి వెళ్లాడు. గమనించిన రాంబాబు రాత్రి సమయంలో తాళం పగులగొట్టి ఇంట్లో ఉన్న రూ.50వేలు చోరీ చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు గాలిస్తుండగా మిర్యాలగూడలోని ఈదులగూడ చౌరస్తా వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా రాంబాబు అనుమానాస్పదంగా కనిపించాడు. అతడిని పట్టుకుని విచారించగా దొంగతనాలు చేసినట్లు విచారణలో ఒప్పుకున్నారు. ఈ ఏడాది జనవరి 30న మిర్యాలగూడలోని కృష్ణాకాలనీలో, ఫిబ్రవరి 9న కృష్ణా జిల్లా గుడివాడలోని సత్యనారాయణపురం సాయిరాం అపార్ట్మెంట్లో, ఫిబ్రవరి18న ఏపీలోని బాపులపాడు, ఫిబ్రవరి 26న మిర్యాలగూడ రూరల్ పరిధిలోని తుంగపాడ్లో, మార్చి 26న మహబూబ్నగర్లోని కల్వకుర్తిలో, మార్చి 29న మిర్యాలగూడలోని తాళ్లగడ్డలో, ఈనెల 10న మిర్యాలగూడలో హౌజింగ్ బోర్డు కాలనీలో తాళం వేసిన ఇళ్లలో చోరీలు ఒప్పుకున్నట్లు తెలిపారు. కేసు దర్యాప్తులో కీలకంగా పనిచేసిన సీ ఐ సుధాకర్, ఎస్ఐ రవికుమార్, కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు, శ్రీను, నాగరాజు, ఐటీకోర్ మధు, ఫింగర్ ప్రింట్ ఏఎస్ఐ శివను డీఎస్పీ అభినందించారు. దొంగతనాల నివారణపై పటిష్ట నిఘా.. జిల్లాలో దొంగతనాలు నివారించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి మరింత నిఘా పెట్టినట్లు ఎస్పీ చందనా దీప్తి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా ప్రజలు దొంగతనాల పట్ల ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. కాలనీలు, ముఖ్య కూడళ్లలో సీసీ కెమెరాలు అమర్చుకోవాలన్నారు. జైళ్ల నుంచి విడుదలైన వారిపై ప్రత్యేక నిఘా ఉంటుందని తెలిపారు. ఫ రూ.16లక్షల 24వేల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం -
కాంగ్రెస్ నాయకుడి కిడ్నాప్ కలకలం !
సూర్యాపేట : బ్లాక్ కాంగ్రెస్ సూర్యాపేట మండల అధ్యక్షుడు వడ్డే ఎల్లయ్య కిడ్నాప్ కలకలం రేపుతోంది. గురువారం మధ్యాహ్నం నుంచి ఎల్లయ్య ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జగ్గయ్యపేటకు చెందిన అపర్ణ అనే మహిళ గురువారం తమ భార్యాభర్తల పంచాయితీ పరిష్కరించాలని చెప్పి సూర్యాపేటకు వచ్చి వడ్డే ఎల్లయ్యను తీసుకొని ఆయన కారులోనే జగ్గయ్యపేటకు బయలుదేరారు. ఎల్లయ్య స్నేహితుడు కోదాడ పట్టణానికి చెందిన మొగిలిచర్ల అంజయ్య అతడితోపాటు ఇంకో వ్యక్తికూడా కలిసి జగ్గయ్యపేటకు ప్రయాణమయ్యారు. మార్గమధ్యలో ఎల్లయ్య స్నేహితులు ఇద్దరు కోదాడలో దిగిపోయారు. జగ్గయ్యపేట బస్టాండ్ సమీపంలోకి రాగానే శ్రీనివాస్ అనే వ్యక్తికి అపర్ణ ఫోన్ చేసి ఎల్లయ్యను తీసుకొచ్చానని, ఇక్కడికి రమ్మని చెప్పింది. బస్టాండ్ దగ్గరకు వచ్చిన శ్రీనివాస్ ఇంటి వద్దకు వెళ్లి మాట్లాడుకుందామని, అక్కడే పెద్ద మనుషులు కూడా ఉన్నారని చెప్పి కారులో శ్రీనివాస్ ఇంటికి వెళ్లారు. కొద్దిసేపటికి ఎల్లయ్య ఫోన్ స్విచ్ ఆఫ్ కావడంతోపాటు అపర్ణ, శ్రీనివాస్ ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ చేసుకున్నారు. దీంతో అనుమానం వచ్చిన వడ్డె ఎల్లయ్య చిన్నమ్మ కొడుకు మారెపల్లి సతీష్ శుక్రవారం జగ్గయ్యపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పలు హత్య కేసుల్లో ప్రధాన నిందితుడిగా ఉన్న వడ్డే ఎల్లయ్య రెండు రోజులుగా కనిపించకపోవడంతో కిడ్నాప్ అయినట్లు భావిస్తున్నారు. -
సీపీఎం అభ్యర్థి ఆస్తులు స్వల్పమే
సాక్షి, యాదాద్రి: భువనగిరి లోక్సభ నియోజకవర్గం సీపీఎం తరఫున పోటీ చేస్తున్న ఎం.డి.జహంగీర్ శుక్రవారం నామినేషన్ వేశారు. నామినేషన్ పత్రాలతో పాటు రిటర్నింగ్ అధికారికి అందజేసిన అఫిడవిట్లో తన ఆస్తుల వివరాలు వెల్లడించారు. జహంగీర్ భార్యపేర నగదు చేతిలో : రూ.35,000 రూ. 5,000 బ్యాంకు అకౌట్లో : రూ.2,03,067 రూ. 2,500 మోటర్బైక్ విలువ : రూ. 55,000 రూ. 55,000 బంగారు అభరణలు విలువ రూ.7,00,000 స్వాగ్రామంలో వ్యవసాయ భూమి 11 గుంటలు. దాని విలువ రూ.6,00,000 మునిపంపులలో సొంత ఇల్లు విలువ : రూ.25,00,000 -
కాంగ్రెస్ పార్టీ భువనగిరి అభ్యర్థిపై భూ కబ్జా కేసు
ఇబ్రహీంపట్నం రూరల్: కాంగ్రెస్ పార్టీ భువనగిరి ఎంపీ అభ్యర్థి చామల కిరణ్కుమార్రెడ్డిపై రంగారెడ్డి జిల్లా ఆదిబట్ల పోలీస్స్టేషన్లో భూకబ్జా కేసు నమోదైంది. సీఐ రాఘవేందర్రెడ్డి కథనం ప్రకారం.. నల్లగొండ జిల్లా పెద్దఅడిశర్లపల్లి మండలం పేర్వాల గ్రామానికి చెందిన కంచర్ల రాధిక, ఆమె భర్త యాదగిరిరెడ్డి తుర్కయంజాల్ పరిధిలోని రాగన్నగూడ సర్వే నంబర్ 500, 501లోని ప్లాట్ నంబర్ 65లో 200 గజాల స్థలాన్ని 2015లో కొనుగోలు చేశారు. అప్పట్లోనే స్థలం హద్దుల మేరకు కడీలు పాతి వదిలేశారు. అయితే, ఫిబ్రవరి 17న కిరణ్కుమార్రెడ్డి, చామర్తి మారుతి రవిశంకర్ అనే ఇద్దరు వ్యక్తులు.. రాధిక దంపతుల ప్లాట్తో పాటు దక్షిణం వైపున్న రోడ్డును ఆక్రమించి కాంపౌండ్ నిర్మించారు. తమకు రాజకీయ అండదండలు ఉన్నాయని బెదిరించారు. దీంతో సదరు మహిళ ఇబ్రహీంపట్నం కోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు ఈ నెల 13న చామల కిరణ్కుమార్రెడ్డి, చామర్తి మారుతి రవిశంకర్పై కేసు నమోదు చేశామని సీఐ తెలిపారు. -
మోత్కుపల్లి నిరసన గళం
సాక్షి, యాదాద్రి : మాజీ మంత్రి సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు సొంత పార్టీపై నిరసన గళం వినిపిస్తున్నారు. కాంగ్రెస్ అధిష్టానంపై ఆయన చేస్తున్న వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఎంపీ టికెట్ల కేటాయింపులో మాదిగలకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఒక్క సీటు ఇవ్వకపోవడాన్ని ఆయన తీవ్రంగా తప్పుపడుతున్నారు. పార్లమెంట్ ఎన్నికల సమయంలో తమ జాతికి జరిగిన అన్యాయాన్ని ఆయన మీడియా, సోషల్మీడియా వేదికల ద్వారా అధిష్టానం దృష్టికితీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నారు. ఎస్సీ రిజర్వుడు స్థానాల్లో మాదిగ సామాజికవర్గానికి టికెట్ లభించలేదని అంటున్నారు. తాను పార్టీలోనే ఉంటూ తమ జాతికి టికెట్ కోసం చివరి వరకు ప్రయత్నం చేస్తానంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్లో చేరిన మోత్కుపల్లి ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ అభ్యర్థుల తరపున ప్రచారం నిర్వహించారు. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల్లో ప్రచారంలో పాల్గొంటారా లేదా అన్నది వేచిచూడాలి. రేవంత్ పునరాలోచించాలి రాష్ట్రంలో కాంగ్రెస్ అధిష్టానంగా ఉన్న సీఎం రేవంత్రెడ్డి మాదిగలకు టికెట్లు ఇచ్చే విషయంలో పునరాలోచించాలని మోత్కుపల్లి కోరుతున్నారు. ప్రధానంగా కడియం శ్రీహరి కుమార్తె కావ్యకు వరంగల్ ఎంపీ టికెట్ ఇవ్వడాన్ని మోత్కుపల్లి తప్పుపడుతున్నారు. తమ జాతికి టికెట్ల కోసం కాంగ్రెస్లో ఉంటూ ప్రయత్నిస్తానంటున్నారు. సామాజిక న్యాయం పాటించడంలో ముందుండే కాంగ్రెస్ పార్టీ.. నామినేషన్లు పూర్తయ్యేలోపు మాదిగలకు టికెట్లు ఇస్తుందన్న నమ్మకంతో ఉన్నానని మోత్కుపల్లి ‘సాక్షి’తో చెప్పారు. ఉమ్మడి జిల్లాలో మోత్కుపల్లి ప్రభావం మాదిగ సామాజికవర్గానికి చెందిన సీనియర్ నేతగా మోత్కుపల్లి నర్సింహులు ప్రభావం ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఉంటుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో మాదిగలు మెజార్టీగా కాంగ్రెస్కు అనుకూలంగా ఉన్నారు. అయితే కాంగ్రెస్ మాదిగలకు టికెట్ ఇవ్వకుండా అన్యాయం చేసిందన్న ప్రచారం ఆ వర్గం నుంచి ఇప్పటికే జోరందుకుంది. అగ్గికి వాయువు తోడైనట్లు మాదిగ సామాజికవర్గ నేతలకు మోత్కుపల్లి అండ లభిస్తోంది. దీంతో నల్లగొండ, భువనగిరి పార్లమెంట్ సీట్ల పరిధిలో జరిగే నష్టం ఎంత అన్న కోణంలో చర్చ జరుగుతోంది. ఫ మాదిగలకు ఎంపీ టికెట్ల కోసం కాంగ్రెస్తో అంతర్గత పోరు ఫ రెండు పార్లమెంట్ సీట్లు కేటాయించాలని డిమాండ్ ఫ పార్టీ మారేది లేదంటూనే.. అసమ్మతి రాగం ఫ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ప్రభావం చూపనున్న మోత్కుపల్లి నర్సింహులు -
నామినేషన్ పత్రాలతో పూజలు
భువనగిరి : భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ బీజేపీ ఎంపీ అభ్యర్థి డాక్టర్ బూర నర్సయ్యగౌడ్ శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. ముందుగా భువనగిరి పట్టణంలోని నల్లగొండ చౌరస్తా సమీపంలో గల శ్రీ సీతారామాంజనేయ స్వామి ఆలయంలో నామినేషన్ పత్రాలతో పూజలు చేశారు. అనంతరం సమీపంలో ఉన్న ఛత్రపతి శివాజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన వెంట బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాశం భాస్కర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పడాల శ్రీనివాస్, కిసాన్ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పడమటి జగన్మోహన్రెడ్డి, పార్టీ పట్టణ అధ్యక్షుడు రత్నపురం పాల్గొన్నారు. -
అన్నదాతల ఆశలు నేలపాలు
భూదాన్పోచంపల్లి, రాజాపేట : పంట చేతికొచ్చే సమయంలో శుక్రవారం సాయంత్రం వీచిన ఈదురుగాలులతో పంటలకు నష్టం వాటిల్లింది. ఆస్తినష్టం జరిగింది. భూదాన్పోచంపల్లి మండలం అంతమ్మగూడెంలో వల్లూరి రాములుకు చెందిన ఇంటి పైకప్పు రేకులు ఎగిరిపోయాయి. అలాగే వాటర్ఫిల్టర్ వద్ద ఉన్న వేపచెట్టు విరిగి ఇంటిపై పడడంతో పాక్షికంగా దెబ్బతింది. అలాగే పలు చోట్ల చెట్ల కొమ్మలు విరిగి కరెంట్ తీగలపై పడటంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కౌలురైతు వస్పరి శంకరయ్యకు చెందిన రెండు ఎకరాల వరిచేను నేలకొరిగింది. అంతమ్మగూడెం, దోతిగూడెం, భీమనపల్లి, కనుముకుల గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాల్లోఽ ధాన్యం కుప్పలపై కప్పిన పట్టాలు లేచిపోయాయి. ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో అరగంట పాటు వర్షం కురిసింది. రాజాపేట మండలంలో.. రాజాపేట మండలంలోని సింగారం, కుర్రారం, జాల, కొత్త జాల, పాముకుంట తదితర గ్రామాల్లో చేతికొచ్చిన మామిడి కాయ నేలరాలింది. సుమారు 20 ఎకరాల్లో మామిడికి నష్టం వాటిల్లింది. జాల గ్రామంలో బర్మ రామచంద్రం పశువు కొట్టం కూలిపోయింది. మొగిలి వెంకటయ్య తదితర రైతుల వరి పొలాలు ఒరిగి ధాన్యం నేలరాలింది. దెబ్బతిన్న పంటలను, పశువుల కొట్టాన్ని ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత పరిశీలించారు. బాధిత రైతులకు వరికి ఎకరానికి రూ.20వేలు, పండ్ల తోటలకు రూ.50 వేలు నష్ట పరిహారం చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బాలమణి, జెడ్పీటీసీ గోపాల్ గౌడ్, మదర్డెయిరీ డైరెక్టర్ గొల్లపల్లి రాంరెడ్డి, బీఆర్ఎస్ మహిళా అధ్యక్షురాలు ఎడ్ల బాలలక్ష్మి, నాయకులు భాస్కర్గౌడ్, గుంటి మధుసూదన్రెడ్డి, సంతోష్ గౌడ్, రాములు నాయక్ పాల్గొన్నారు.ఫ భూదాన్పోచంపల్లి, రాజాపేట మండలాల్లో ఈదురుగాలుల బీభత్సం ఫ వరి, మామిడి తోటలకు నష్టం ఫ ఎగిరిపోయిన ఇళ్ల పైకప్పు రేకులు -
పాత ఇనుప సామగ్రి గోదాములో అగ్నిప్రమాదం
చౌటుప్పల్ : ఓ పాత ఇనుప సామగ్రి గోదాములో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకున్న ఘటన శుక్రవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. చౌటుప్పల్ పట్టణానికి చెందిన సురేష్తో పాటు మరికొంత మంది కలిసి పట్టణ శివారులోని శ్రీని ఫార్మా పరిశ్రమ పక్కన ఎకరం స్థలం అద్దెకు తీసుకొని ఓం సాయిరాం స్క్రాఫ్ పేరిట పాత ఇనుప సామగ్రి గోదాం ఏర్పాటు చేసుకున్నారు. మండలంతో పాటు పరిసర ప్రాంతాల్లోని వివిధ పరిశ్రమల ను ంచి పాత సామగ్రిని కొనుగోలు చేసి నిల్వ చే స్తుంటారు. ఈ క్రమంలో గోదాం వెనుక భాగంలో ఉన్న పత్తిచేనులో ఉన్న చెత్తను రైతులు తగులబెట్టారు. మధ్యాహ్నం 12గంటల ప్రాంతంలో అందులోని నిప్పురవ్వలు ఎగిసివచ్చి పాత ఇనుప సా మగ్రి గోదాంలో పడి మంటలు అంటుకున్నాయి. కొద్దిసేపట్లోనే మంటలు నలుమూలలుగా వ్యాపించి ప్లాస్టిక్ సామగ్రి కావడంతో దట్టమైన పొగలు వ్యాపించాయి. గమనించిన నిర్వాహకులు అగ్ని మాపక సిబ్బందికి సమాచారం అందించారు. ప్లాస్టిక్ సామగ్రి కావడంతో మంటలు తీవ్రం.. ప్లాస్టిక్ సామగ్రి కావడంతో మంటలు తీవ్రస్థాయిలో వ్యాపించాయి. దీంతో స్థానికంగా ఉన్న ఫైర్ఇంజన్ సరిపోకపోవడంతో పరిసర మండలాల నుంచి మరో రెండు ఫైర్ఇంజన్లను రప్పించారు. వాటితో పాటు స్థానిక దివీస్ పరిశ్రమ నుంచి సైతం అత్యాధునికమైన ఫైర్ఇంజన్ను రప్పించారు. అదే విధంగా స్థానికంగా ఉన్న ట్రాక్టర్లతో నీటిని తెప్పించి శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రమాదంలో సుమారుగా రూ.20లక్షల వరకు నష్టం జరిగిందని యజమాని సురేష్ తెలిపారు. విషయం తెలియగానే ఏసీపీ పటోళ్ల మధుసూదన్రెడ్డి, తహసీల్దార్ హరికృష్ణ, సీఐ అశోక్రెడ్డి ఘటనా స్థలాన్ని సందర్శించారు. ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఈమేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
తరుగు పేరిట మోసం
మోత్కూరు : తరుగు, కమీషన్, హమాలీ ఖర్చుల పేరిట పాటిమట్ల గ్రామ ఎక్స్ రోడ్డు వద్ద గల శ్రీమల్లికార్జున వేబ్రిడ్జి కాంటా నిర్వాహకుడు తనను మోసం చేశారని ఆరోపిస్తూ కొండగడపకు చెందిన రైతు తొంట తిరుతపయ్య శుక్రవారం డిఫెన్స్ వినియోగదారుల హక్కుల సంఘానికి ఫిర్యాదు చేశారు. మూడు క్వింటాళ్ల 20 కిలోల ధాన్యాన్ని వేబ్రిడ్జి నిర్వాహకులకు విక్రయించగా క్వింటాకు రూ.1900 చొప్పున కొనుగోలు చేశారని రైతు తెలిపాడు. మొత్తం రూ.5,890 రావల్సి ఉండగా 10 కిలోల తరుగు, రూ.125 హమాలీ, రూ.117 కమిషన్, రూ.100 వే బ్రిడ్జి ఖర్చుల పేరుతో కోత పెట్టి రూ.5,548 చెల్లించారని ఆరోపించారు. తక్కువ డబ్బులు ఇస్తున్నారని ప్రశ్నించగా నిర్వాహకులు తనతో దురుసుగా మాట్లాడారని పేర్కొన్నారు. తనకు న్యాయం చేయాలని రైతు కోరారు. కొనుగోలు కేంద్రాల్లోనే మద్దతు ధర యాదగిరిగుట్ట రూరల్ : రైతులకు కొనుగోలు కేంద్రాల్లోనే మద్దతు ధర దక్కుతుందని, దళారులను నమ్మి మోసపోవద్దని డీఆర్డీఓ కృష్ణన్ పేర్కొన్నారు. యాదగిరిగుట్ట మండలం గౌరాయపల్లిలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. ధాన్యాన్ని కల్లాల్లోనే ఆరబెట్టి, తాలు, చెత్త, మట్టి పెల్లలు లేకుండా శుభ్రం చేసుకొని తీసుకురావాలని రైతులకు సూచించారు. సీరియల్ ప్రకారం పేర్లు నమోదు చేసుకొని ధాన్యాన్ని విక్రయించాలన్నారు. కార్యక్రమంలో ఏపీఎం సుధాకర్, ఐకేపీ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు. సారా తయారీ కేంద్రాలపై దాడులు సంస్థాన్నారాయణపురం : మండల పరిధిలోని కొర్రతండా, డాకుతండా, సీత్యాతండా, రాధానగర్తండా, అంబోత్తండా, పొర్లగడ్డతండాలో శుక్రవారం ఎకై ్సజ్ అధికారులు దాడులు నిర్వహించారు. 68 లీటర్ల సారా, 25 కిలోల బెల్లం స్వాధీనం చేసుకున్నారు. 2,200 లీటర్ల బెల్లంపాకం పారబోశారు. ఎనిమిది మందిపై కేసులు నమోదు చేశారు. ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. అదే విధంగా సంస్థాన్నారాయణపురం, సర్వేల్ గ్రామాల్లోని మద్యం దుకాణాల్లో తనిఖీలు చేశారు. సారా తయారు చేసినా, అక్రమంగా మద్యం తరలించినా చర్యలు తప్పవని ఎకై ్సజ్ అధికారులు హెచ్చరించారు. దాడుల్లో ఎన్ఫోర్స్మెంట్ సీఐ రాధాకిషన్, రామన్నపేట సీఐ బాలాజీనాయక్, ఎస్ఐ శంకర్ సిబ్బంది పాల్గొన్నారు. హాస్టళ్ల నిర్వహణను నిర్లక్ష్యం చేయొద్దు భువనగిరిటౌన్ : ప్రభుత్వ హాస్టళ్ల నిర్వహణ విషయంలో నిర్లక్ష్యం వహించవద్దని వార్డెన్లకు జెడ్పీ సీఈఓ శోభారాణి సూచించారు. శుక్రవారం జెడ్పీ కార్యాలయ సమావేశ మందిరంలో విద్య, వైద్య, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పారిశుద్ధ్యం, మెనూ, విద్యార్థుల హెల్త్చార్ట్ అమలు, వైద్య శిబిరాల ఏర్పాటు విషయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. రికార్డుల పక్కాగా నిర్వహించాలని సూచించారు. ప్రతి నెలా 23వ తేదీన తల్లిదండ్రుల సమావేశం ఏర్పాటు చేయాలని కోరారు. ప్రతి శుక్రవారం వసతి గృహాల నివేదికను కలెక్టర్ అందజేయాలని పేర్కొన్నారు. ముందుగా ఇటీవల భువనగిరి గురుకుల విద్యాలయంలో కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురైన విద్యార్థి ప్రశాంత్ ఆత్మకు శాంతి చేకూరాలని రెండు నిమిషాలు మౌనం పాటించారు. సమావేశంలో డీఎంహెచ్ఓ పాపారావు, డీఆర్డీఓ కృష్ణన్, తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్రంలో ప్రజారంజక పాలన నడుస్తోంది
భువనగిరిటౌన్ : రాష్ట్రలో ప్రజారంజక పాలన నడుస్తుందని ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్రెడ్డి, కాంగ్రెస్ భువనగిరి ఎంపీ అభ్యర్థి చామల కిరణ్కుమార్రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం భువనగిరిలోని దీప్తి హోటల్ జరిగిన పద్మశాలీల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొని మాట్లాడారు. అన్ని వర్గాల సంక్షేమం కోసం కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు అమలు చేస్తుందన్నారు. పద్మశాలీల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం పాటుపడి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మైనింగ్ కార్పొరేషన్ చైర్మన్ ఈరపతి అనిల్, పద్మశాలి నాయకులు పాల్గొన్నారు. 21న సీఎం సభకు తరలిరావాలి ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం రేవంత్రెడ్డి ఈనెల 21న భువనగిరికి రానున్నారని ఎమ్మెల్యే అనిల్కుమార్రెడ్డి తెలిపారు. ర్యాలీ, కార్నర్ మీటింగ్లో పాల్గొని మాట్లాడుతారని, పార్టీ కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని కోరారు. -
ఎన్నికల వ్యయ పరిశీలకుడికి కలెక్టర్ స్వాగతం
నల్లగొండ: లోక్సభ ఎన్నికల వ్యయ పరిశీలకుడిగా నల్లగొండ జిల్లాకు నియమితులైన కళ్యాణ్కుమార్దాస్ శుక్రవారం నల్లగొండలోని పార్లమెంట్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి దాసరి హరిచందన పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. అనంతరం వారు లోక్సభ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ, వివిధ రకాల ఫారాలు, డిపాజిట్ తదితర అంశాలపై చర్చించారు. వారివెంట అదనపు కలెక్టర్ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. -
పాఠశాలల్లో మౌలిక వసతులు
భువనగిరి : ప్రభుత్వ పాఠశాలలను ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు విద్యాశాఖ చర్యలు చేపట్టింది. గతంలో ఉన్న పాఠశాల యాజమాన్య కమిటీల పదవీ కాలం ముగియడంతో వాటి స్థానంలో మహిళా సంఘాల సభ్యులతో అమ్మ ఆదర్శ కమిటీలను ఏర్పాటు చేసింది. వీటి ద్వారా పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు పనులకు చేయించేందుకు రూ.24.05 కోట్లు మంజూరు చేసింది. అయితే జిల్లాలో 712 పాఠశాలలు ఉండగా గతంలో 251 పాఠశాలల్లో మన ఊరు – మన బడి పథకం కింద అభివృద్ధి పనులు చేపట్టింది. ఇందులో 60 పాఠశాలల్లో పనులు చేయగా మిగిలిన స్కూళ్లలో పెండింగ్లో ఉన్నాయి. ఇప్పటి వరకు మౌలిక వసతులకు నోచుకోని 563 పాఠశాలలను విద్యాశాఖ అధికారులు గుర్తించారు. యూడైస్ ఆధ్వర్యంలో అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా వాటిని అభివృద్ధి చేసేందుకు పూనుకుంది. కార్యాచరణ రూపకల్పన పాఠశాలల్లో పనులు చేపట్టేందుకు విద్యాశాఖ కార్యచరణ రూపొందించింది. ఇంజనీరింగ్ అధికారుల అంచనా మేరకు ప్రధానంగా విద్యుత్, తాగునీరు, మరుగుదొడ్లు, బాలికల మూత్రశాలల నిర్మాణం, తరగతి గదుల మరమ్మతులకు జిల్లాకు రూ.24.05 కోట్లు మంజూరు చేసింది. మొదట మౌలిక వసతుల కల్పన, యూనిఫాం కుట్టుకూళ్ల కోసం రూ.25 శాతం నిధులు విడుదల చేయనున్నారు. వీటిని ఇప్పటికే ఎంపీడీఓల ఖాతాల్లో జమ చేస్తున్నారు. వసతుల కల్పనను గరిష్టంగా రూ.14 లక్షలు, కనిష్టంగా రూ.1.35 లక్షల వరకు ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు.అమ్మ ఆదర్శ కమిటీల తీర్మానం మేరకు ఉన్నత అధికారుల ఆదేశాలతో పనులు చేపట్టనున్నారు.ఫ అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా పనులు ఫ జిల్లాలో 563 పాఠశాలలు ఎంపిక ఫ రూ.24.05 కోట్లు మంజూరు అంచనాలు రూపొందిస్తున్నాం ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన కోసం చేపట్టనున్న పనులకు ఇంజనీరింగ్ అధికారులు అంచనాలు రూపొందిస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్రక్రియ కొనసాగుతుంది. అంచనాలకు అనుగుణంగా కార్యచరణ రూపొందిస్తాం. ప్రక్రియ పూర్తయిన తర్వాత మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారిస్తాం. –నారాయణరెడ్డి, డీఈఓ నిధులు డ్రా చేయడం ఇలా.. పాఠశాలలు పునఃప్రారంభమయ్యే నాటికి మౌలిక వసతుల కల్పంచడానికి విద్యాశాఖ అధికారులు సిద్ధమవుతున్నారు. పనులు ప్రారంభమైన తర్వాత డబ్బులు డ్రా చేయడానికి ప్రధానోపాధ్యాయులు, మహిళా సమాఖ్య అధ్యక్షురాలితో ఇప్పటికే బ్యాంకు ఖాతాలు తెరిచారు. రూ. 25 వేల విలువ చేసే పనులు చేపట్టి తర్వాత పాఠశాలల్లో సమావేశమై డబ్బులను విత్ డ్రా చేయనున్నారు. అదే విధంగా రూ.లక్ష వరకు ఎంపీడీఓ అనుమతితో విత్ డ్రా చేయనున్నారు. రూ.లక్షకు పైగా విలువైన పనులు చేస్తే జిల్లా మహిళా సమాఖ్యతో పాటు జిల్లా ఉన్నతాధికారి అనుమతి తీసుకోవాలి. ఈ నిధుల వినియోగంపై అమ్మ ఆదర్శ కమిటీలకు అవగాహన కల్పించారు. -
యాదాద్రీశుడికి లక్ష పుష్పార్చన
యాదగిరిగుట్ట : ఏకాదశిని పురస్కరించుకొని శుక్రవారం యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో లక్ష పుష్పార్చన పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామి, అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి సహస్రనామ పఠనాలతో అర్చకులు, వేద పండితులు వివిధ రకాల పుష్పాలతో లక్ష పుష్పార్చన చేశారు. ఈ వేడుకలో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. అదే విధంగా ప్రధానాలయంలో నిత్య కై ంకర్యాలు కొనసాగాయి. వేకువజామున సుప్రభాత సేవ, అభిషేకం, ఆలయ ముఖ మండపం, ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహహోమం, గజ వాహనసేవ, నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవంతో పాటు శ్రీస్వామి, అమ్మవారి సేవలను ఊరేగించారు. అదే విధంగా ఆండాళ్దేవికి ఊంజలి సేవోత్సవం వైభవంగా నిర్వహించారు. -
కాంగ్రెస్ సభను విజయవంతం చేయాలి
హుజూర్నగర్ : ఈ నెల 21న హుజూర్నగర్లోని రాజీవ్ ప్రాంగణంలో నిర్వహించనున్న ఎన్నికల ప్రచార సభను విజయవంతం చేయాలని నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. హుజూర్నగర్ పట్టణంలో ఎన్నికల ప్రచార సభ ఏర్పాట్లను శుక్రవారం స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎన్నికల ప్రచార సభకు నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి కుందూరు రఘువీర్రెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు హాజరవుతారని తెలిపారు. ఎలాంటి లోటుపాట్లు లేకుండా సభ సవ్యంగా జరిగేలా చూడాలని స్థానిక నేతలకు సూచించారు. నల్లగొండ నియోజకవర్గ ఎంపీ అభ్యర్థి రఘువీర్రెడ్డి రాష్ట్రంలోనే భారీ మెజార్టీతో గెలుస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. నియోజకవర్గంలోని ప్రతి కాంగ్రెస్ కార్యకర్త సభకు హాజరై విజయవంతం చేయాలని కోరారు. అంతకు ముందు ఆదర్శ వివాహం చేసుకున్న హుజూర్ నగర్ పట్టణానికి చెందిన ఎడ్ల విజయ్–శిరీష దంపతులను మంత్రి ఆశీర్వదించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తన్నీరు మల్లికార్జునరావు, దొంగరి వెంకటేశ్వర్లు, గెల్లి రవి, సుంకరి శివరాం యాదవ్, ఆదెర్ల శ్రీనివాసరెడ్డి, మంజూనాయక్, మజీద్ పాల్గొన్నారు. ఫ నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి -
పోలీసుల అదుపులో దొంగలు?
సాక్షి యాదాద్రి : జిల్లాలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న దొంగలను ఎట్టకేలకు పోలీసులు పట్టుకున్నారని సమాచారం. రెండు నెలలుగా యాదాద్రిభువనగరి జిల్లాలో 15కు పైగా చైన్స్నాచింగ్లు జరిగాయి. దీంతో ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న దొంగలను పట్టుకోవడానికి పోలీసులు గట్టిగా నిఘా పెట్టారు. వలిగొండ మండలం సంగెంకు చెందిన ఇద్దరు యువకులు ఈ వరుస దొంగతనాలకు పాల్పడినట్టు తెలుస్తోంది. గుంటూరు జిల్లాకు చెందిన వీరు బతుకుదెరువు కోసం ఇక్కడికి వచ్చినట్లు తెలిసింది. డీసీసీ రాజేష్ చంద్ర ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి దొంగలను పట్టుకున్నట్లు సమాచారం. -
బీజేపీతో దేశానికి ముప్పు
భువనగిరిటౌన్ : బీజేపీతో దేశానికి ముప్పు అని, ప్రజాస్వామ్య వ్యవస్థకు, లౌకికత్వానికి హాని కలిగిస్తుందని సీపీఎం పొలిట్బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు విమర్శించారు. తెలంగాణలో బీజేపీకి సీట్లు రాకుండా అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. శుక్రవారం సీపీఎం భువనగిరి ఎంపీ అభ్యర్థి ఎండీ జహంగీర్ నామినేషన్ దాఖలు చేశారు.అనంతరం కేంద్ర కమిటీ సభ్యుడు చెరుపల్లి సీతారాములు అధ్యక్షతన జరిగిన సభలో ఆయన మాట్లాడారు. పదేళ్ల బీజేపీ పాలనలో దేశానికి పెను ప్రమాదం ఏర్పడిందన్నారు. బీజేపీ తన విధానాలతో రాజ్యాంగ వ్యవస్థకు విఘాతం కలిగిస్తూనే మరోవైపు అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేస్తుందని దుయ్యబట్టారు. తాము రాజ్యాంగ పరిరక్షణ కోసం పూల మాలలు వేస్తామన్నారు. లోక్సభ ఎన్నికల్లో సీపీఎం అభ్యర్థి జహంగీర్ను ఆదరించాలని కోరారు. సీపీఎంకు వేసే ఓటు సీపీఎంకే కాదని, రాష్ట్ర అభివృద్ధికి వేసినట్లని పేర్కొన్నారు. బీజేపీవి ఫాసిస్టు విధానాలు : తమ్మినేని బీజేపీవి ఫాసిస్టు విధానాలని, ఆర్ఎస్ఎస్ భావజాలంతో ప్రజల మధ్య విధ్వేషాలు సృష్టించేందుకు యత్నిస్తుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోపించారు. ముస్లింలు, క్రిస్టియన్లకే కాకుండా హిందువులకు సైతం అన్యాయం జరుగుతుందన్నారు. రాజ్యాంగానికి పెను ప్రమాదం పొంచి ఉందన్నారు. వార్డు సభ్యుల నుంచి సర్పంచ్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఇతర ప్రజాప్రతినిధులు సిగ్గు లేకుండా పార్టీలు మారుతున్నారని, చేర్చుకునే వారికి కూడా సిగ్గులేదని విమర్శించారు. ప్రస్తుత రాజకీయాలు వ్యాపారాలతో ముడిపడి పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. భువనగిరికి తెలంగాణ సాయుధ పోరాటానికి నాయకత్వం వహించిన ఘనమైన చరిత్ర ఉందని, అటువంటి గడ్డపై నుంచి సీపీఎం తరఫున పోటీ చేస్తున్న ఎండీ జహంగీర్ను గెలిపించాలని కోరారు. ఫ పదేళ్ల పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం జరిగింది ఫ సీపీఎం పొలిట్బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు జహంగీర్ను గెలిపిస్తే ప్రజల గొంతుకవుతాడు : వీరయ్య గంగానది ప్రక్షాళనకు కోట్ల రూపాయలు ఖర్చు చేసిన కేంద్ర ప్రభుత్వం మూసీ ప్రక్షాళన విషయాన్ని ఎందుకు పట్టించుకోవడం లేదని పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు ఎస్.వీరయ్య ప్రశ్నించారు. మూసీ కాలుష్యంపై ప్రశ్నించాలంటే సీపీఎం అభ్యర్థి జహంగీర్ను గెలిపించాలని, పార్లమెంట్లో తెలంగాణ ప్రజల గొంతుక అవుతారని పేర్కొన్నారు. దేశంలో కులవృత్తులు దెబ్బతింటున్నాయన్నారు. కార్మికుల కనీస వేతనంపై శాసీ్త్రయ అంచనాలు లేవని, అందుకు సమగ్ర శాసనం తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. అంతకుముందు భారీ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జ్యోతి, మల్లు లక్ష్మి, తీగల సాగర్, జాన్ వెస్లీ, అబ్బాస్, డి.జి. నర్సింగరావు, పోతినేని సుదర్శన్, పాలడుగు భాస్కర్, రాష్ట్ర కమిటీ సభ్యులు తుమ్మల వీరారెడ్డి కొండమడుగు నరసింహ మట్టుపల్లి అనురాధ పైళ్ల ఆశయ్య పాల్గొన్నారు. -
స్ట్రాంగ్ రూమ్కు ఈవీఎంల తరలింపు
తుంగతుర్తి: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఈవీఎంలు జిల్లా కేంద్రం నుంచి తుంగతుర్తి మండల కేంద్రానికి వచ్చాయి. వాటిని సూర్యాపేట జిల్లా అదనపు కలెక్టర్ జీఎస్ లత, ఎన్నికల అధికారులు శుక్రవారం తుంగతుర్తి మండల కేంద్రంలోని స్ట్రాంగ్ రూంలో భద్రపరిచారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ జీఎస్ లత మాట్లాడుతూ తుంగతుర్తి నియోజకవర్గానికి 407 కంట్రోల్ యూనిట్లు, 407 బ్యాలెట్లు యూనిట్లు, 456 వీవీప్యాట్లు వచ్చాయని తెలిపారు. వాటిని వివిధ పార్టీల నాయకుల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్లో భద్రపరిచామన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ రమణారెడ్డి, సీఐ శ్రీను, ఎస్ఐ ఏడుకొండలు, ఆయా పార్టీల నాయకులు పాల్గొన్నారు. -
భువనగిరి బీజేపీ అభ్యర్థి ఆస్తుల వివరాలు ఇవీ..
సాక్షి, యాదాద్రి: భువనగిరి లోక్సభ స్థానం బీజేపీ అభ్యర్థి బూర నర్సయ్యగౌడ్ తన నామినేషన్ సందర్భంగా ఎలక్షన్ కమిషన్కు సమర్పించిన అఫిడవిట్లో ఆస్తులు, అప్పుల వివరాలు ఇలా ఉన్నాయి. ● చేతిలోనగదు, బ్యాంకుడిపాజిట్ కలిపి : రూ.7,74,90,802.26 ● భార్య పేరుపై రూ.1,45,60147.82 ● స్థిరాస్తులు విలువ రూ.19,85,07,500 (భవనాలు, భూములు, ప్లాట్లు) ● భార్య పేరుపై రూ.10,23,76,250 ● స్వయంగా కొనుగోలు చేసిన స్థిరాస్తుల విలువ : రూ 7,43,20,516 ● భార్య పేరుపై ఉన్న ఆస్తుల రూ.27,27,196 ● బ్యాంకు, ఆర్థిక సంస్థల నుంచి, ఇతరుల నుంచి తీసుకున్న రుణాలు రూ.1,28,17,844 భార్య పేరుపై రూ.1,93,83,212 ● బూర నర్సయ్యగౌడ్పై జనగామ ఫస్ట్ క్లాస్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టులో కేసు నడుస్తోంది. ఎఫ్ఐఆర్నెంబర్59/ 2004 ప్రకారం బచ్చన్నపేట పోలీస్స్టేషన్ పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా గుమికూడారని ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. -
యాదాద్రి భువనగిరి
వాతావరణం ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది.7శనివారం శ్రీ 20 శ్రీ ఏప్రిల్ శ్రీ 2024గరిష్టం / కనిష్టంఅంతర్రాష్ట్ర దొంగ అరెస్టు తాళం వేసిన ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగను మిర్యాలగూడ పోలీసులు అరెస్టు చేశారు. - 8లోగోదాములో అగ్నిప్రమాదం చౌటుప్పల్ సమీపంలోని పాత ఇనుప సామగ్రి గోదాములో శుక్రవారం అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. - 8లో -
రెండో రోజూ స్వల్పంగానే..
సాక్షి, యాదాద్రి : లోక్సభ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో భాగంగా భువనగిరి స్థానానికి రెండో రోజు శుక్రవారం ఐదు నామినేషన్లు మాత్రమే దాఖలయ్యాయి. సీపీఎం అభ్యర్థి ఎండీ జహంగీర్, బీజేపీ నుంచి బూర నర్సయ్యగౌడ్, సోషలిస్ట్ పార్టీ (ఇండియా) అభ్యర్థిగా రచ్చ సుభద్రారెడ్డి, స్వతంత్ర అభ్యర్థులుగా మెగావత్ చందునాయక్, రేకల సైదులు ఒక్కో సెట్ చొప్పున నామినేషన్లు దాఖలు చేసినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ హనుమంతు కే.జెండగే తెలిపారు. మొదటి, రెండో రోజు కలిపి మొత్తం ఎనిమిది మంది అభ్యర్థులు తొమ్మిది సెట్ల నామినేషన్లు వేశారు. అట్టహాసంగా సీపీఎం నామినేషన్ సీపీఎం అభ్యర్థి ఎండీ జహంగీర్ అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా భువనగిరి పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. జహంగీర్ వెంట సీపీఎం పోలిట్బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు చెరుపల్లి సీతారాములు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కొండమడుగు నర్సింహ ఉన్నారు. నామినేషన్ అనంతరం బహిరంగ సభ నిర్వహించారు. 23న మరోసారి బీజేపీ నామినేషన్ బీజేపీ అభ్యర్థి డాక్టర్ బూరనర్సయ్యగౌడ్ మొదటి సెట్ నామినేషన్ దాఖలు చేశారు. అయితే జన సమీకరణ చేయకుండా సాదాసీదాగా వచ్చి నామినేషన్ వేశారు. ఆయన వెంట బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాశం భాస్కర్, కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి పడమటి జగన్మోహన్రెడ్డి, బీజేపీ పట్టణ అధ్యక్షుడు రత్నపురం బలరాం, బీజేపీ జిల్లా అధికార ప్రతినిఽధి కోళ్ల భిక్షపతి ఉన్నారు. అయితే 23వ తేదీన భారీ జన సమీకరణతో వచ్చి మరో రెండు సెట్ల నామినేషన్లు దాఖలు చేయనున్నారు. ఈ కార్యక్రమానికి మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డితో పాటు మరికొందరు ముఖ్య నేతలు హాజరుకానున్నారు. శుక్రవారం నామినేషన్ వేసిన అనంతరం బూర నర్సయ్యగౌడ్ విలేకరులతో మాట్లాడారు. 23న నామినేషన్ సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించనున్నామని, పార్టీ శ్రేణులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని కోరారు. ముహూర్తం చూసుకుంటున్న అభ్యర్థులు లోక్సభ ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులు నామినేషన్ వేసేందుకు మంచి ముహూర్తాలు చూసుకుంటున్నారు. నామినేషన్ దాఖలుకు 25వ తేదీ వరకు గడువు ఉంది. మధ్యలో 21వ తేదీ ఆదివారం సెలవు పోను ఏడు రోజులు సమయం ఉంది. ఈ వ్యవధిలో తమకు కలిసొచ్చే రోజు కోసం అభ్యర్థులు పండితులను ఆశ్రయిస్తున్నారు. 18, 19, 21, 23, 24 తేదీల్లో ముహూర్తం బాగుందని పండితులు చెబుతున్నారు. అయినా మొదటి రెండు రోజులు అంతంతమాత్రంగానే నామినేషన్లు దాఖలయ్యాయి. 23,24 తేదీల్లో నామినేషన్లు ఎక్కువగా దాఖలయ్యే అవకాశం ఉంది.నల్లగొండలో.. నల్లగొండ లోక్సభ స్థానానికి రెండో రోజు శుక్రవారం నలుగురు అభ్యర్థులు నామినేషన్లు వేశారు. మొదటి రోజు నలుగురు అభ్యర్థులు ఆరుసెట్లు, రెండో రోజు నలుగురు అభ్యర్థులు ఒక్కో సెట్ చొప్పున నామినేషన్ పత్రాలు సమర్పించారు. రెండు రోజుల్లో ఎనిమిది మంది అభ్యర్థులు పది సెట్ల నామినేషన్లు దాఖలయ్యాయి. ఎన్నికల రిటర్నింగ్ అధికారి, నల్లగొండ కలెక్టర్ హరిచందన నామినేషన్లు స్వీకరించారు. నామినేషన్ వేసింది వీరే.. రెండో రోజు స్వతంత్ర అభ్యర్థులుగా బండారు నాగరాజు, కిన్నెర యాదయ్య, ధర్మసమాజ్ పార్టీ అభ్యర్థిగా తలారి రాంబాబు, మార్క్సిస్టు కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (యునైటెడ్) తరఫున వసుకుల మట్టయ్య నామినేషన్ వేశారు. ఇప్పటి వరకు బీజేపీ అభ్యర్థి తరఫున ఒక నామినేషన్ సెట్ దాఖలు కాగా ముగ్గురు స్వతంత్ర అభ్యర్థుల్లో ఒకరు ఒకటి, ఇద్దరు రెండు సెట్ల చొప్పున, ప్రజావాణి పార్టీ, సోషలిస్టు పార్టీ, ధర్మసమాజ్ పార్టీ, మార్క్సిస్టు కమ్యూనిస్టు పార్టీ తరఫున ఒక్కొక్కరు ఒక్కో సెట్ నామినేషన్ దాఖలు చేశారు. ఫ భువనగిరి ఎంపీ స్థానానికి శుక్రవారం ఐదు నామినేషన్లు దాఖలు ఫ సీపీఎం తరఫున ఎండీ జహంగీర్ ఫ బీజేపీ నుంచి బూర నర్సయ్యగౌడ్ ఫ ఇద్దరు ఇండిపెండెంట్లు ఫ రెండు రోజుల్లో మొత్తం ఎనిమిది మంది నామినేషన్ -
ఎన్నికల ప్రచార రథాలు ప్రారంభం
యాదగిరిగుట్ట : భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి క్యామ మల్లేశ్ గెలుపు కోరుతూ ఆలేరు నియోజకవర్గంలో తిరిగే ఎన్నికల ప్రచార రథాలకు శుక్రవారం యాదాద్రీశుడి వైకుంఠద్వారం వద్ద మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీ తామహేందర్రెడ్డి పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భువనగిరి ఎంపీ స్థానాన్ని బీఆర్ఎస్ కై వసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గడ్డమీది రవీందర్గౌడ్, పట్టణ జనరల్ సెక్రటరీ పాపట్ల నరహరి, కౌన్సిలర్ బూడిద సురేందర్, నాయకులు ఆరె యాదగిరిగౌడ్, మిట్ట వెంకటయ్యగౌడ్, సాయియాదవ్, భాస్కర్గౌడ్, ముక్కెర్ల సతీష్, యాకూబ్, కల్వకొలను సతీష్రాజ్, బండి వాసు, అంకం నర్సింహ తదితరులు పాల్గొన్నారు. -
లారీ ఢీకొని మహిళ మృతి
బీబీనగర్: హైదరాబాద్– వరంగల్ జాతీయ రహదారిపై గుర్తు తెలియని లారీ ఢీకొని ఓ మహిళ మృతి చెందింది. ఈ సంఘటన శుక్రవారం రాత్రి బీబీనగర్లో చోటుచేసుకుంది. ఎస్ఐ రమేష్ తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ జిల్లాకు చెందిన ప్రశాంత్ తన భార్య రాధికతో కలిసి హైదరాబాద్లోని చర్లపల్లిలో నివాసముంటున్నారు. దంపతులిద్దరూ తమ ద్విచక్ర వాహనంపై భువనగిరి మండల పరిధిలో గల స్వర్ణగిరి క్షేత్రాన్ని సందర్శించేందుకు వచ్చారు. దర్శనం అనంతరం తిరిగి రాత్రి బైక్పై హైదరాబాద్కు వెళ్తుండగా బీబీనగర్లోని ఎస్బీఐ ఎదురుగా వెనుక నుంచి వస్తున్న గుర్తు తెలియని లారీవారిని ఢీకొట్టింది. దీంతో బైక్పై వెనుక కూర్చున్న రాధిక(23) అక్కడికక్కడే మృతి చెందింది. ప్రశాంత్కు తీవ్రగాయాలు కావడంతో భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
కమెడియన్ రఘుబాబు కారు ఢీకొని బీఆర్ఎస్ నాయకుడి మృతి
నల్లగొండ క్రైం: నల్లగొండ పట్టణ సమీపంలోని లెప్రసీ కాలనీ వద్ద నార్కట్పల్లి–అద్దంకి రహదారిపై బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో బీఆర్ఎస్ పార్టీ నల్లగొండ పట్టణ కార్యదర్శి సందినేని జనార్దన్రావు (48) అక్కడికక్కడే మృతి చెందారు. ప్రత్యక్ష సాక్షులు, కుటుంబ సభ్యులు, పోలీసుల వివరాల ప్రకారం.. నకిరేకల్ మండలం మంగలపల్లి గ్రామానికి చెందిన జనార్దన్రావు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ నల్లగొండలో స్థిరపడ్డాడు. బుధవారం సాయంత్రం లెప్రసీ కాలనీ వద్ద వెంచర్లో వాకింగ్ చేసి, బైక్పై నల్లగొండ పట్టణంలోని శ్రీనగర్ కాలనీకి వస్తున్నాడు. లెప్రసీ కాలనీ వద్ద రోడ్డు దాటుతుండగా.. హైదరాబాద్ నుంచి మిర్యాలగూడ వైపు బీఎండబ్ల్యూ కారులో వెళ్తున్న హాస్యనటుడు రఘుబాబు వేగంగా వచ్చి ఇతడి బైక్ను ఢీకొట్టాడు. దీంతో జనార్దన్రావు మొదట కారు అద్దంపై పడి, ఆ తర్వాత ఎగిరి 100 మీటర్ల దూరంలో పడ్డాడు. బైక్ కారు ఇంజన్లో ఇరుక్కుపోయింది. జనార్దన్రావు తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. సమీపంలో ఉన్న వారు గమనించి, కమెడియన్ రఘుబాబుతో వాగ్వాదానికి దిగారు. అనంతరం టూటౌన్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు అక్కడకు చేరుకున్నారు. రఘుబాబును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జనార్దన్రావు మృతదేహాన్ని నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. మృతుడికి భార్య నాగమణి, కుమార్తె ఝాన్సీ, కుమారుడు భరత్ ఉన్నారు. కుమార్తె ఇటీవల సాఫ్ట్వేర్ ఉద్యోగంలో చేరగా, కుమారుడు బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. కమెడియన్ రఘుబాబు అజాగ్రత్తగా కారు నడిపి తన భర్త మృతికి కారణమయ్యాడని నాగమణి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు టూటౌన్ ఎస్ఐ నాగరాజు తెలిపారు. పలువురి సంతాపం.. జనార్దన్రావు మృతి పట్ల బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి, బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ సైదిరెడ్డి, మాజీ కౌన్సిలర్లు అభిమన్యు శ్రీనివాస్, మారగోని గణేష్గౌడ్, పార్టీ మండల అధ్యక్షుడు దేప వెంకటరెడ్డి, ఐతగోని యాదయ్యగౌడ్, పలువురు వ్యాపారవేత్తలు సంతాపం తెలిపారు. నల్లగొండ పట్టణంలోని లెప్రసీ కాలనీ వద్ద ఘటన రఘుబాబుపై కేసు నమోదు
Pagination
ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
సీఎం జగన్ ఎంట్రీతో దద్దరిల్లిన కడప
రెండు ఎన్నికలకు ఒక్కరే రిటర్నింగ్ అధికారి !
దేశం కోసం పనిచేసే నాయకుడు మోదీ
అవగాహన లేమి.. తగ్గుతున్న దిగుబడి!
గుణాత్మక బోధనతో మంచి ఫలితాలు
సూర్యాపేట
భీంరెడ్డి పోరాట చరిత్ర మరువలేనిది
పుత్తూరులో సీఎం జగన్ రోడ్ షో: పోటెత్తిన అభిమానం (ఫొటోలు)
వాతావరణం చల్లబడింది
మట్టపల్లిలో నిత్యకల్యాణం
తప్పక చదవండి
- పాపం బ్రెజిల్.. ఎటు చూసినా వరదలే..
- రొమాంటిక్ సీన్స్.. ఒళ్లంతా దద్దుర్లు వచ్చేశాయి: టాలీవుడ్ హీరోయిన్
- నవ్వుతారేమో అనుకున్నా: లాపతా లేడీస్ ప్రతిభ ఇంట్రస్టింగ్ జర్నీ
- ‘సంతోషం’.. కేజ్రీవాల్కు మద్యంతర బెయిల్పై దీదీ
- నామినేషన్ దాఖలుకు బీజేపీ అభ్యర్థి పరుగులు.. చివరికి ఏమైందంటే..
- రెడ్ లిప్స్టిక్ను ఉత్తరకొరియా ఎందుకు బ్యాన్ చేసిందో తెలుసా!
- డాగ్ లవర్స్ బీ అలర్ట్ : ప్రమాదకరమైన కుక్కలపై తమిళనాడు నిషేధం
- ఆదాయాలు రెట్టింపైనా ఉద్యోగాల్లో కోత!
- కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
- ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
Advertisement