breaking news
Yadadri District Latest News
-
లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే చర్యలు తప్పవు
భువనగిరి : లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకోక తప్పదని కలెక్టర్ హనుమంతరావు హెచ్చరించారు. మంగళవారం భవనగిరి కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన జిల్లా అప్రొఫ్రియేట్ కమిటీ సమావేశంలో మాట్లాడారు. లింగ నిర్థారణకు పాల్పడితే వెంటనే హెల్ప్లైన్ నంబర్ 8074261809 ఫిర్యాదు చేయవచ్చన్నారు. ముందుగా జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా కేట్ కట్ చేసి వైద్యులు శుభాకాంక్షలు తెలిపారు. సమీక్షలో జిల్లా సెషన్స్ జడ్జి జయరాజు, అదనపు కలెక్టర్ భాస్కర్రావు, ఏడీసీపీ లక్ష్మీనారాయణ, డీఎంహెచ్ఓ మనోహార్, డిప్యూటీ డీఎంహెచ్ఓ యశోద, శిల్పిని, ప్రోగ్రాం ఆఫీసర్ సాయి శోభ, ప్రమీల, డెమో అంజయ్య, వసంతకుమారి పాల్గొన్నారు. -
మెరుగైన వైద్యసేవలు అందించాలి
చౌటుప్పల్ : ప్రజలంతా ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చేలా వైద్యులు మెరుగైన వైద్యసేవలు అందించాలని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ షమీమ్ అక్తర్ అన్నారు. చౌటుప్పల్లోని ప్రభుత్వాసుపత్రిని మంగళవారం ఆయన సందర్శించారు. అన్ని రకాల బ్లాకులను కలియదిరిగారు. వైద్యులతో మాట్లాడి ఆసుపత్రిలో ఉన్న వసతులు, సౌకర్యాలు, రోగులకు అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. నూతనంగా నిర్మిస్తున్న వంద పడకల ఆసుపత్రి నిర్మాణాన్ని పరిశీలించారు. కాంట్రాక్టర్తో మాట్లాడి ఆసుపత్రి పనులు త్వరగా పూర్తిచేయాలన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. వంద పడకల అసుపత్రి ప్రారంభం అయితే ఎన్నో ప్రాంతాలకు వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు. సాధారణ పర్యటనలో భాగంగానే తాను ఇక్కడికి విచ్చేశానని పేర్కొన్నారు. ఇక్కడ చూసిన అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. ఆయన వెంట జిల్లా వైద్యాధికారి డాక్టర్ మనోహర్, ఆర్డీఓ వెల్మ శేఖర్రెడ్డి, డీసీహెచ్ డాక్టర్ చిన్నూనాయక్, జిల్లా ఉపవైద్యాధికారి డాక్టర్ యశోద, ఏసీపీ పటోళ్ల మదుసూధన్రెడ్డి, తహసీల్దార్ వీరాబాయి, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అలివేలు, మండల వైద్యాధికారి డాక్టర్ చింతకింది కాటంరాజు, సీఐ మన్మథకుమార్, ఆర్ఐ సుధాకర్ ఉన్నారు. ఫ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ షమీమ్ అక్తర్ ఫ చౌటుప్పల్ ప్రభుత్వ ఆసుపత్రి సందర్శన -
నేడు యాదగిరిగుట్టకు మంత్రి ‘అడ్లూరి’ రాక
యాదగిరిగుట్ట, యాదగిరిగుట్ట రూరల్: ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి, ఉమ్మడి నల్లగొండ జిల్లా ఇన్చార్జ్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ బుధవారం యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయానికి రానున్నారని ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య తెలిపారు. శ్రీస్వామి వారిని దర్శించుకుని అనంతరం మంత్రి యాదగిరిగుట్ట మండలం సైదాపురం గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశం కార్యక్రమంలో పాల్గొంటారని వెల్లడించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సహకరించాలి భువనగిరి : ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పూర్తిచేసేందుకు పేద ప్రజలకు ఇసుక, సిమెంట్, స్టీల్, గ్రానైట్ వ్యాపారులతోపాటు, తాపీ మేసీ్త్రలు సహకరించాలని భువనగిరి ఆర్డీఓ కృష్ణారెడ్డి అన్నారు. జూన్ 30 సాక్షి దినపత్రికలో ఇందిరమ్మ ఇళ్లకు ధరల భారం అనే శీర్షికతో ప్రచురితమైన కథనానికి జిల్లా యంత్రాంగం స్పందించారు. ఇందులో భాగంగా మంగళవారం భువనగిరి ఆర్డీఓ కార్యాలయంలో సిమెంట్, స్టీలు యాజమానులు, ఇసుక, గ్రానైట్, తాపీ మేసీ్త్రలతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆర్డీఓ మాట్లాడారు. భువనగిరి మండలంలో 743, పట్టణంలో 580 ఇళ్లు మంజూరు చేశామన్నారు. గృహనిర్మాణ మెటీరియల్ ధరలను పెంచడం వల్ల పేద ప్రజలు ఆర్థికంగా ఇబ్బందులు పడతారన్నారు. పాత ధరల ప్రకారమే అమ్మాలన్నారు. సమావేశంలో డీఏఓ మందడి ఉపేందర్రెడ్డి, మున్సిపల్ కమిషనర్ రామలింగం, ఎంపీడీఓ శ్రీనివాస్, ఎంపీఓ దినాకర్, ఎస్ఐలు లక్ష్మీనారాయణ, అనిల్కుమార్, నాయకులు పోత్నక్ ప్రమోద్కుమార్, ప్రదీప్, నర్సింహ, నానం కృష్ణ,, ఇసుక, స్టీలు, సిమెంట్, గ్రానైట్ యాజమాన్యాలు, తాపీ మేసీ్త్రలు పాల్గొన్నారు. ఉపకరణాలకు దరఖాస్తుల ఆహ్వానం భువనగిరిటౌన్ : దివ్యాంగుల సహకార సంస్థ ద్వారా జిల్లాలోని వివిధ వర్గాల దివ్యాంగులకు ఉచితంగా అందజేస్తున్నట్లు ఉపకరణాల కో సం ఆసక్తిగల వారు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా సంక్షేమ అధికారి కె.నర్సింహారావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో రెట్రోఫిటెడ్ మోటరైజ్డ్ వెహికల్స్ 49, బ్యాటరీ వీల్ చైర్స్ 15, మొబైల్ బిజినెస్ బ్యాటరీ ట్రై సైకిల్స్ 20, బ్యాటరీ మినీ ట్రెండింగ్ ఆటోవెహికల్ 1, హైబ్రిడ్ వీల్ చైర్ అటాచ్మెంట్ వీల్ 5, లాప్టాప్ డిగ్రీ స్టూడెంట్స్ 16, లాప్టాప్ హయ్యర్ ఎడ్యుకేషన్, టెక్నికల్ ఎడ్యుకేషన్ 7, టాబ్స్ 12, 5జీ స్మార్ట్ఫోన్ 2, ట్రై సైకిల్స్ 6, వీల్ చైర్స్ 6, క్రచ్చెస్ 25, ఇయరింగ్ ఎయిడ్ 2, వాకింగ్ స్టిక్స్ 25 స్మార్ట్ కేనన్స్ 12, ఎంసీఆర్ చాఫల్ 12, సహాయ ఉపకరణాలు మంజూరయ్యాయని పేర్కొన్నారు. కావాల్సిన ఉపకారణాల కోసం https-://tgobmms.cgg.gov.in ఆన్లైన్ వెబ్సైట్లో ఈనెల 5తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. సగటు వర్షపాతం 83 మిల్లీమీటర్లు భువనగిరిటౌన్ : నైరుతి రుతుపవనాల ప్రభావంతో జిల్లాలోని పలు ప్రాంతాల్లో సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం సగటున 83 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదూంది. రాజాపేట మండలంలో అత్యధికంగా 44.5 మిల్లీమీటర్ల వర్ష పాతం నమోదైంది. అలాగే ఆలేరులో 44, మోత్కూరు 41, ఆత్మకూర్(ఎం) 41, అడ్డగూడూరు 39 మి.మీ. వర్షం కురిసింది. బొమ్మలరామారం మండలంలో 39, యాదగిరిగుట్ట 38, భువనగిరి 28, గుండాల 25, బీబీనగర్ 24, తుర్కపల్లి మండలంలో 22 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. ఈఏపీ సెట్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఆలస్యంయాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట పట్టణంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో మంగళవారం ఈఏపీ సెట్ విద్యార్థుల సర్టిఫికేషన్ ప్రక్రియ సర్వర్ బిజీతో ఆలస్యంగా కొనసాగింది. సర్వర్ బిజీగా ఉండడంతో మధ్యాహ్నం వరకు కూడా 10 నుంచి 15మంది విద్యార్థుల సర్టిఫికెట్లను మాత్రమే అధికారులు వెరిఫికేషన్ చేశారు. దీంతో విద్యార్థులు, వారితో వచ్చిన తల్లిదండ్రులకు నిరీక్షణ తప్పలేదు. మధ్యాహ్నం తరువాత సర్వర్ మంచిగా పనిచేయడంతో వెరిఫికేషన్ ప్రక్రియ స్పీడ్ అందుకుంది. సాయంత్రం సర్టిఫికేట్ వెరిఫికేషన్ ముగిసే వరకు 165 మంది పాల్గొన్నారని పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ వెంకటేశ్వర్లు వెల్లడించారు. -
పరిశ్రమల్లో భద్రత ఎంత?
సాక్షి, యాదాద్రి, చౌటుప్పల్ రూరల్: సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచి ఫార్మా ఇండస్ట్రీలో రియాక్టర్ పేలి భారీ అగ్ని ప్రమాదం సంభవించి పంద మందికిపైగా కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. ఇలాంటి సంఘటన వల్ల గతంలోనే రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్లోని రసాయన పరిశ్రమలతోపాటు ఇతర పరిశ్రమలను ఔటర్ రింగ్ రోడ్డుకు వెలుపల 50కి.మీ. దూరానికి తరలించాలనే నిర్ణయించింది. దీంతో వందల సంఖ్యలో పరిశ్రమలు జిల్లాలోని పలు మండలాలకు తరలించారు. ఈ నేపథ్యంలో మన జిల్లాలో ఉన్న ఫార్మా పరిశ్రమల్లో భద్రత చర్యలపై సర్వత్రా చర్చ కొనసాగుతోంది. జిల్లాలోని ఉన్న పేలుడు, ఫార్మా కంపెనీల్లో తరుచూ ప్రమాదాలు జరిగి కార్మికుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. సోమవారం పాశమైలారంలో జరిగిన ప్రమాదంతో అక్కడ వివిధ కంపెనీల్లో పనిచేసే కార్మికులు భయం భయంగా విధులకు వెళ్తున్నారు. ఫార్మా కంపెనీలకు అడ్డాగా.. జిల్లాలోని భువనగిరి పారిశ్రామిక వాడ, రాయిగిరి, బీబీనగర్ పారిశ్రామిక వాడల్లోని నెమరగోముల, కొండమడుగు, బీబీనగర్, యాదగిరిగుట్ట, పెద్ద కందుకూరు, మోటకొండూరు మండలం కాటేపల్లి, చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెం, దండుమల్కాపురం, దేవలమ్మ నాగారం, ఎల్లంభావి, తంగడపల్లి, చౌటుప్పల్, ధర్మోజిగూడెం, లింగోజిగూడెం, ఆరెగూడెం, పంతంగి, ఎస్,లింగోటం మందోళ్లగూడెం, చిన్న కొండూరు, జైకేసారం, పోచంపల్లి మండలం దోతిగూడెం, అంతమ్మగూడెం, ఆలేరు మండలం టంగుటూరు ఇలా జిల్లా వ్యాప్తంగా పేలుడు పదార్థాల తయారీ, ఫార్మా కంపెనీలు ఉన్నాయి. భద్రతా ప్రమాణాలు గాలికి.. పరిశ్రమలపై అధికారుల పర్యవేక్షణ కొరవడింది. రియాక్టర్లు, బ్రాయిలర్లు పేలి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. రియాక్టర్లు పేలినప్పుడు రసాయనాలు శరీరంపై పడి కాలిపోయి, పొగతో ఊపిరాడక చనిపోతారు. రియాక్టర్ల వద్ద పనిచేసే కార్మికులు ఆక్సిజన్ ఫైర్ కోట్లు ధరించాలి. ఫోం అందుబాటులో ఉండాలి. కాలం చెల్లిన రియాక్టర్లతో కంపెనీల యాజమాన్యాలు, నైపుణ్యంలేని కార్మికులతో పనులు చేయిస్తున్నారు. కంపెనీల్లో భద్రతా ప్రమాణాలు పాటించకపోవడంతో తరుచూ ప్రమాదాలు జరగుతున్నాయి. ఫ ఫార్మా, పేలుడు పదార్థాల తయారీ కంపెనీల్లో తరచూ ప్రమాదాలు ఫ గాల్లో దీపంలా కార్మికు ప్రాణాలు ఫ కొరవడిన అధికారుల పర్యవేక్షణ ఫ పాశమైలారం ఘటనతో జిల్లాలోని కార్మికుల్లో తీవ్ర భయాందోళన తనిఖీల ఊసేలేదు ! వాస్తవానికి ప్రతి మూడు నెలలకు ఒకసారి పరిశ్రమల ఇన్స్పెక్టరీ ఆఫ్ ఫ్యాక్టరీస్,భూగర్భ గనుల శాఖ,కార్మిక శాఖ అధికారులు తనిఖీ చేయాలి. కానీ ఈ అధికారులు ఎక్కడుంటారో తెలియని పరిస్థితి. కనీసం కార్యాలయాల చిరునామా సైతం తెలియని దుస్థితి నెలకొంది. దీంతో పరిశ్రమల నిర్వహణలో యాజమాన్యాలు నిర్లక్ష్యం ప్రదర్శించడం, భద్రతా చర్యలు పాటించకపోవడం, కార్మిక చట్టాలను అమలు చేయకపోవడం వంటి వాటితో కార్మికులు ప్రమాదాల భారీన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో పరిశ్రమలు కార్మికులకు పూర్తిస్థాయి భద్రత కల్పించేలా చర్యలు చేపట్టాల్సి ఉంది. -
వీధుల్లో చెత్త కుంపటి
మున్సిపాలిటీల్లో పారిశుద్ధ్యం అస్తవ్యస్తం! ఫ ఎక్కడ చూసినా చెత్తకుప్పలే.. ఫ రహదారుల వెంట దుర్గంధం ఫ ప్రతిరోజూ శుభ్రం చేయని సిబ్బంది ఫ అంతటా ప్రబలుతున్న దోమలు ఫ సీజనల్ వ్యాధులు పొంచి ఉన్నాయని ప్రజల్లో భయాందోళన మున్సిపాలిటీల్లో పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా మారింది. ప్రజల్లో అవగాహన లోపంతో ఎక్కడబడితే అక్కడ చెత్త పడేస్తున్నారు. దీనికితోడు మున్సిపల్ సిబ్బంది ప్రధాన రోడ్లను శుభ్రం చేస్తున్నారే తప్పితే కాలనీల్లోని వీధులు, ఖాళీ స్థలాల్లో వేస్తున్న చెత్తను పట్టించుకోవడం లేదు. దీంతో సందు రోడ్ల పక్కన, కాలనీల్లోని ఇళ్ల మధ్యన చెత్త పేరుకుపోయి దుర్వాసన వస్తోందని.. ఫలితంగా దోమల బెడద పెరుగుతోందని మున్సిపాలిటీల్లో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తన్నారు. ప్రస్తుతం మున్సిపాలిటీల్లో వంద రోజుల ప్రణాళిక కొనసాగుతున్నప్పటికీ అది ప్రధాన రోడ్ల శుభ్రతకే పరిమితమైందనే విమర్శలు వినిపిస్తున్నాయి. సీజనల్ వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉన్నందున మున్సిపల్ అధికారులు స్పందించి ప్రతిరోజూ చెత్తను తొలగింపజేస్తూ వీధులు, రోడ్లను శుభ్రంంగా ఉంచాలని ప్రజలు కోరుతున్నారు. భువనగిరిటౌన్ : భువనగిరి మున్సిపల్ పరిధిలోని వివిధ వార్డుల్లో పారిశుద్ధ్యం అధ్వానంగా తయారైంది. మున్సిపల్ పరిధిలో 35 వార్డులు ఉన్నాయి. మొత్తం 225 మంది పారిశుద్ధ్య కార్మికులు విధులు నిర్వహించాల్సి ఉండగా 179 మాత్రమే పని చేస్తున్నారు. సిబ్బంది కొరతతో అన్ని కాలనీల్లో గల్లీలు, రోడ్లకు ఇరువైపులా చెత్త కుప్పలు దర్శనమిస్తున్నాయి. ఖాళీ స్థలాల్లో చెత్త వేస్తున్న వారికి నామమాత్రంగా జరిమానా విధిస్తున్నారు. సకాలంలో చెత్త ట్రాక్టర్లు రావడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇక, మురికి కాలువలలో పేరుకుపోయిన చెత్తను తొలగించక పోవడంతో దోమలు వృద్ధి చెందుతున్నాయి. తద్వారా మలేరియా, టైపాయిడ్, డెంగీ తదితర వ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉందని ప్రజలు భయపడుతున్నారు. 13 వార్డులకు మూడు వాహనాలు భూదాన్పోచంపల్లి : భూదాన్పోచంపల్లి మున్సి పాలిటీలో 22వేల జనాభా ఉంది. జనాభా ప్రతిపాదికన కనీసం 50 మంది పారిశుద్ధ్య కార్మికులు ఉండాలి. కానీ, 34 మందే ఉన్నారు. సిబ్బంది కొరత వల్ల మెయిన్ రోడ్డు మినహా మున్సిపాలిటీలో గల 13 వార్డుల్లో పూర్తి స్థాయిలో పారిశుద్ధ్య చర్యలు చేపట్టడంలేదు. అన్ని వార్డులకు మూడు చెత్త ఆటోలు మాత్రమే తిరుగుతున్నాయి. పాత బస్టాండ్, సాయినగర్ నుంచి నారాయణగిరికి వెళ్లే ప్రధాన దారి పక్కనే చెత్తను పారబోస్తుండటంతో పరిసరాలు అపరిశుభ్రంగా మారుతున్నాయి. లక్ష్మణ్నగర్ కాలనీలో ఇళ్ల మధ్యనే మురుగునీరు చేరి ఉంది. మోడల్స్కూల్ సమీపంలో చెత్తడంపింగ్ యార్డు వల్ల దుర్వాసన వస్తోంది. పట్టణంలో అమృత్ పైప్లైన్ పనులు జరుగుతుండడంతో చాలా చోట్ల పైపులు పగిలి తాగునీరు కలుషితమవుతుంది. ఇప్పటి వరకు నీళ్లట్యాంకులను శుభ్రం పరిచి బ్లీచింగ్ చేసింది లేదు. -
రోజు విడిచి రోజు చెత్త సేకరణ
చౌటుప్పల్ : చౌటుప్పల్ మున్సిపాలిటీలో చెత్త నిర్వహణ అంతంతగానే ఉంది. మున్సిపాలిటీ పరిధిలో 20 వార్డులు, 31,303మంది జనాభా, 8500 ఇళ్లు ఉన్నాయి. చెత్త నిర్వహణకు రెండు ట్రాక్టర్లు, 10 ఆటోలు ఉండగా ట్రాక్టర్లు మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నడుస్తుండగా ఆటోలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించారు. ఒక్కో ఆటో వార్డుల్లో రోజు విడిచి రోజు చెత్తను సేకరిస్తున్నాయి. చాలా మంది చెత్తను ఆటోల్లో వేయకుండా వీధుల్లో వేస్తుండడంతో దుర్గంధం వెదజల్లుతోంది. దోమలు వ్యాప్తిచెందాయి. చెత్త ఎక్కడబడితే అక్కడ వేయకుండా చర్యలు తీసుకోవాల్సి ఉంది. -
సిబ్బంది కొరతతో ఇబ్బంది
ఆలేరు మున్సిపాలిటీలో 12వార్డులు..20 వేల జనాభా ఉంది. మొత్తం పారిశుద్ధ్య సిబ్బంది 44మంది ఉండగా ఇందులో ఇద్దరు రెగ్యులర్ సిబ్బంది కాగా ఆరుగురు డ్రైవర్లు, మిగతా 38మంది చెత్త సేకరణ, మురుగు కాల్వలు శుభ్రం చేస్తుంటారు. వీరిపై పర్యవేక్షణకు ఇద్దరు జవాన్లు ఉన్నారు. 10వేల జనాభాకు సుమారు 28మంది సిబ్బంది ఉండాలనేది నిబంధన. ఆలేరులో ఉన్న 20వేల జనాభాకు 56మంది పారిశుద్ధ్య సిబ్బంది కావాల్సి ఉన్నా 44మందే ఉన్నారు. సిబ్బంది కొరతపై రెండేళ్ల క్రితమే సీడీఎంఏకు మున్సిపల్ అధికారులు ప్రతిపాదనలు పంపినా నియమించలేదు. ఫలితంగా అన్ని కాలనీల్లో చెత్త సేకరణకు ఇబ్బందులు తప్పడం లేదు. సిబ్బంది కొరత విషయాన్ని మరలా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని కమిషనర్ శ్రీనివాస్ అంటున్నారు. దోమలతో వేగలేకపోతున్నాం.. చాలా కాలనీల్లో దోమల బెడదతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రోడ్ల పక్కన చెత్త వేయడం వల్ల ఈ పరిస్థితి నెలకొంది. దోమల నివారణకు కాలనీల్లో ఫాంగింగ్ కొట్టాలి. చెత్త వేయకుండా ప్రజలకు సూచనలు చేయాలి. పందుల సమస్యను పరిష్కరించాలి. – మార్గం వెంకటేశ్, ఆలేరు -
ప్రతిరోజూ చెత్త సేకరించట్లే..
మోత్కూరు : మోత్కూరు మున్సిపాలిటీలో 40 మంది పారిశుద్ధ్య సిబ్బంది పనిచేస్తున్నారు. ఆరు ఆటోలు, రెండు ట్రాక్టర్ల ద్వారా రోజూ 5.50 మెట్రిక్ టన్నుల చెత్తను సేకరించి డంపింగ్ యార్డులకు తరలిస్తున్నారు. ఖాళీ స్థలాలతోపాటు కొన్ని వార్డుల్లో పాడుబడిన బావిబొందల్లో చెత్తను పోస్తున్నారు. కొన్ని వార్డుల్లో డైలీగా శుభ్రం చేయడంలేదు. హనుమాన్ వాడ, గడి బజార్కు చెత్త వాహనం రావడంలేదని, రెండు మూడు రోజులకు ఒకసారి చెత్తను తాము తగబెడుతున్నామని కాలనీ వాసులు అంటున్నారు. ఇందిరానగర్ కాలనీలో ప్రధాన రోడ్డు వెంట మురుగునీరు నిలుస్తుండడంతో దోమలు ప్రబలుతున్నాయి. నూతనంగా మురుగు కాల్వను నిర్మించాలని కాలనీ వాసులు కోరుతున్నారు. -
కోతుల దాడిలో వృద్ధురాలికి గాయాలు
భూదాన్పోచంపల్లి: కోతుల దాడిలో వృద్ధురాలికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన మంగళవారం సాయంత్రం పోచంపల్లి పట్టణ కేంద్రంలో జరిగింది. పోచంపల్లి పట్టణ కేంద్రంలోని పదో వార్డులో జింకల వెంకటమ్మ ఒంటరి నివాసముంటోంది. మంగళవారం సాయంత్రం కోతుల గుంపు వెంకటమ్మ ఇంట్లోకి ప్రవేశించి ఆమైపె దాడి చేశాయి. భయంతో ఆమె బయటకు వచ్చే క్రమంలో కిందపడిపోయింది. దీంతో తుంటి ఎముక విరిగింది. ఇరుగుపొరుగు వారు వచ్చి కర్రలతో కోతులను తరిమేశారు. గాయపడిన వెంకటమ్మను చికిత్స నిమిత్తం హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పోచంపల్లి మున్సిపాలిటీ కేంద్రంలో కోతుల బెడద నుంచి రక్షణ కల్పించాలని ప్రజలు అధికారులను వేడుకుంటున్నారు. తేలు కాటుతో నాలుగేళ్ల బాలుడు మృతినకిరేకల్: తేలు కాటుకు గురై నాలుగేళ్ల బాలుడు మృతిచెందాడు. నకిరేకల్ మండలం పాలెం గ్రామ శివారులోని టేకులగూడెంలో నివాసముంటున్న పక్కీరు పురుషోత్తంరెడ్డికి ఒక కుమారుడు, కుమార్తె సంతానం. కుమార్తె 3వ తరగతి చదువుతుండగా.. కుమారుడు రుత్విక్రెడ్డి(4) పాలెం గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో నర్సరీ చదువుతున్నాడు. గత నెల 29న రుత్విక్రెడ్డికి ఇంట్లో తల్లి స్నానం చేయించి అతడికి నిక్కర్ తొడిగింది. అప్పటికే నిక్కర్లో ఉన్న తేలు రుత్విక్రెడ్డిని కుట్టడంతో అతడు కేకలు వేశాడు. వెంటనే బాలుడిని నకిరేకల్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్లోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మంగళవారం సాయంత్రం మృతిచెందాడు. మృతుడి తండ్రి పురుషోత్తంరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. విద్యుదాఘాతంతో అపస్మారక స్థితిలోకి రైతుఫ సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడిన 108 సిబ్బంది వేములపల్లి: విద్యుదాఘాతానికి గురై అపస్మారక స్థితిలోకి వెళ్లిన రైతు ప్రాణాలను 108 సిబ్బంది సీపీఆర్ చేసి కాపాడారు. ఈ ఘటన వేములపలల్లి మండల కేంద్రం శివారులో మంగళవారం జరిగింది. మాడుగులపల్లి మండలం ఇసుకబాయిగూడెం గ్రామానికి చెందిన రైతు వల్లపుదాసు చంద్రయ్య మంగళవారం వేములపల్లి గ్రామ శివారులోని తన పొలం వద్ద బోరుకు మోటారు బిగించేందుకు వెళ్లాడు. బోరు మోటారు బిగిస్తుండగా విద్యుదాఘాతానికి గురై అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. సమీపంలోని రైతు మంచికంటి వెంకట్రెడ్డి గమనించి ఫోన్ ద్వారా 108 సిబ్బందికి, చంద్రయ్య కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు. 108 సిబ్బంది వెలిజాల సైదులు, పగిళ్ల జానకిరాములు ఘటనా స్థలానికి చేరుకుని అపస్మారక స్థితిలో ఉన్న చంద్రయ్యకు సీపీఆర్ చేయగా అతడు స్పృహలోకి వచ్చాడు. వెంటనే అతడిని 108 వాహనంలో మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. చంద్రయ్య ప్రాణాలు కాపాడిన 108 సిబ్బందికి కుటుంబ సభ్యులు, రైతులు కృతజ్ఞతలు తెలిపారు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణంకొండమల్లేపల్లి: బైక్పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు అదుపుతప్పి రోడ్డు పక్కన ఐరన్ గ్రిల్స్ ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందగా.. మరొకరికి గాయాలయ్యాయి. ఈ ఘటన కొండమల్లేపల్లి మండల కేంద్రంలో మంగళవారం రాత్రి జరిగింది. వివరాలు.. కొండమల్లేపల్లి మండలం చింతకుంట్ల గ్రామానికి చెందిన ఐతరాజు అజయ్(22) ఆటో డ్రైవర్గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన ఐతరాజు అంజి కొండమల్లేపల్లిలోని ఓ పెట్రోల్ బంక్లో పనిచేస్తున్నాడు. మంగళవారం రాత్రి వీరిద్దరు బైక్పై కొండమల్లేపల్లి నుంచి స్వగ్రామానికి వెళ్తుండగా.. మండల కేంద్రంలోని సాగర్ రోడ్డులో శక్రునాయక్తండా సమీపంలో గల పెట్రోల్ బంక్ వద్ద బైక్ అదుపుతప్పడంతో రోడ్డు పక్కన ఉన్న ఐరన్ గ్రిల్స్ని ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో అజయ్ అక్కడికక్కడే మృతి చెందాడు. బైక్పై వెనుక కూర్చున్న అంజికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం దేవరకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించినట్లు ఎస్ఐ అజ్మీరా రమేష్ తెలిపారు. -
కల్వర్టు గోడను ఢీకొట్టిన ట్రావెల్స్ బస్సు
కట్టంగూర్: ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు డ్రైవర్ హైవేపై కల్వర్టు గోడను ఢీకొట్టడంతో 10మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. ఈ ఘటన హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై కట్టంగూర్ మండలం అయిటిపాముల గ్రామ శివారులో మంగళవారం తెల్లవారుజామున జరిగింది. స్థానికులు, ప్రయాణికులు తెలిపిన వివరాల ప్రకారం.. కేవీఆర్ ట్రావెల్స్ బస్సు సోమవారం అర్ధరాత్రి 30మంది ప్రయాణికులతో విజయవాడ నుంచి హైదరాబాద్కు బయల్దేరింది. మంగళవారం తెల్లవారుజామున మార్గమధ్యలో కట్టంగూర్ మండలం అయిటిపాముల గ్రామ శివారులోకి రాగానే డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకోవడంతో బస్సు అదుపుతప్పి విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారిపై గల కల్వర్టు గోడను ఢీకొట్టింది. దీంతో ప్రయాణికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. వెంటనే బస్సులో నుంచి కిందకు దిగేందుకు ప్రయత్నించగా డోర్ లాక్ కావడంతో బయటకు వెళ్లలేకపోయారు. సమాచారం తెలుసుకున్న కట్టంగూర్ 108 సిబ్బంది, పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని బస్సు అత్యవసర డోర్ను ధ్వంసం చేసి ప్రయాణికులను బయటకు తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న సత్యవతి, లక్ష్మి, గణపతిరెడ్డితో పాటు మరో ఏడుగురికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 వాహనాల్లో నార్కట్పల్లిలోని కామినేని ఆస్పత్రికి తరలించారు. బస్సు ఓనర్ ఫిర్యాదు మేరకు డ్రైవర్పై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ ఎం. రవీందర్ తెలిపారు.ఫ 10 మంది ప్రయాణికులకు గాయాలు -
నీటి సంపులో పడి చిన్నారి మృతి
కోదాడరూరల్: ఆడుకుంటూ వెళ్లి ఇంటి ఆవరణలో ఉన్న నీటి సంపులో పడి చిన్నారి మృతిచెందాడు. ఈ ఘటన కోదాడ మండలం గుడిబండ గ్రామంలో మంగళవారం జరిగింది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గుడిబండ గ్రామానికి చెందిన శ్రీపాది గోపి, నాగేశ్వరి దంపతులకు కుమారుడు మహదేవ్(20 నెలలు) ఉన్నాడు. గోపి మంగళవారం మిర్యాలగూడలో కార్పెంటర్ పనికి వెళ్లగా.. నాగేశ్వరి కుమారుడితో కలిసి ఇంటి వద్దే ఉంది. మధ్యాహ్నం సమయంలో నాగేశ్వరి కుమారుడితో కలిసి ఇంట్లో నిద్రించింది. ఈ క్రమంలో మహదేవ్ నిద్రలేచి ఆడుకుంటూ వెళ్లి ఇంటి ఆవరణలో ఉన్న సంపులో పడ్డాడు. అరగంట తర్వాత నాగేశ్వరికి మెళుకువ వచ్చి చూడగా పక్కన కుమారుడు లేకపోవడంతో సంపులో చూడగా అందులో మహదేవ్ మృతిచెంది ఉన్నాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని చిన్నారి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కోదాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చిన్నారి తండ్రి గోపి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ఎం. అనిల్రెడ్డి తెలిపారు. -
మోసంచేసి పారిపోయిన చిట్టీల వ్యాపారి అరెస్ట్
మిర్యాలగూడ అర్బన్: ఎంతో నమ్మకంగా ఉంటూ 46 మందితో చిట్టీలు కట్టించుకుని మోసంచేసి పారిపోయిన చిట్టీల వ్యాపారిని మిర్యాలగూడ టూటౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసు వివరాలను టూటౌన్ సీఐ సోమనర్సయ్య మంగళవారం విలేకరులకు వెల్లడించారు. దామరచర్ల మండలం బొత్తలపాలెం గ్రామానికి చెందిన కటకం సైదిరెడ్డి గత కొన్నేళ్లుగా మిర్యాలగూడ పట్టణంలోని శాంతినగర్లో నివాసముంటూ బియ్యం వ్యాపారం చేస్తున్నాడు. ఈ క్రమంలో కాలనీవాసులతో పరిచయం పెంచుకుని చిట్టీలు వేయడం ప్రారంభించాడు. 46మంది కాలనీవాసులు అతడి వద్ద చిట్టీలు వేశారు. మొదట్లో బాగానే చిట్టీ డబ్బులు చెల్లించిన సైదిరెడ్డి కొంతకాలంగా చిట్టీలు పాడిన వారికి డబ్బులు ఇవ్వకుండా మొహం చాటేస్తున్నాడు. అంతేకాకుండా అధిక వడ్డీ ఆశ చూపి 42 మంది నుంచి రూ.1.50కోట్లు అప్పుగా తీసుకున్నాడు. ఇటీవల చిట్టీ పాడినవారు డబ్బుల కోసం సైదులు ఇంటికి వెళ్లగా తాళం వేసి ఉండటంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిర్యాలగూడ డీఎస్పీ కె. రాజశేఖరరాజు ఆధ్వర్యంలో దర్యాప్తు చేపట్టిన పోలీసులు సోమవారం ఉదయం మిర్యాలగూడ పట్టణంలోని శ్రీమన్నారాయణ ఫంక్షన్హాల్ వద్ద సైదిరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. అంతేకాకుండా సైదిరెడ్డి పారిపోయేందుకు సహకరించిన శాంతినగర్కు చెందిన కటకం వెంకట్రెడ్డి, ముత్తిరెడ్డికాలనీకి చెందిన మామిళ్ల వెంకన్న, రామ్నగర్కు చెందిన గుణగంటి జానయ్యను కూడా అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించినట్లు సీఐ తెలిపారు. చిట్టీలు కట్టిన బాధితులకు తగిన న్యాయం జరిగేలా చూస్తామని పేర్కొన్నారు. ఈ విలేకరుల సమావేశంలో ఎస్ఐలు బి. రాంబాబు, డి. హరీష్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఫ అతడికి సహకరించిన మరో ముగ్గురిని కూడా అదుపులోకి తీసుకున్న పోలీసులు -
నీళ్లొస్తాయా.. బీళ్లుగానే ఉంటాయా..!
సూర్యాపేట: శ్రీరాంసాగర్ ప్రాజెక్టు(ఎస్సారెస్పీ) రెండో దశ ఆయకట్టు రైతులకు కన్నీళ్లే మిగులుతున్నాయి. గత మూడు సీజన్ల నుంచి ఈ ఆయకట్టు పొలాలు ఎండుతూనే ఉన్నాయి. ప్రధాన కాల్వ మినహా ఎక్కడా నీరు పారని పరిస్థితి. ఈ నేపథ్యంలో సూర్యాపేటతో పాటు మహబూబాబాద్ జిల్లాల్లో సుమారు 2.20 లక్షలకు పైగా ఆయకట్టు భూములున్నా.. కనీసం 60 నుంచి 70వేల ఎకరాల్లో కూడా పంటలు పండిన దాఖలు లేవు. ప్రస్తుతం వానాకాలం సీజన్ ప్రారంభం కావడంతో ఈసారైనా తమ భూములకు నీళ్లు వస్తాయా..? బీడు భూములుగానే ఉంటాయా..? అనే ఆందోళనలో రైతులు ఉన్నారు. నాన్ ఆయకట్టు నుంచి.. 2018కు ముందు సూర్యాపేట జిల్లాలోని తుంగతుర్తి, సూర్యాపేట నియోజకవర్గాలు పూర్తిగా నాన్ ఆయకట్టు ప్రాంతాలు. కేవలం వర్షాధార పంటలే పండేవి. హుజూర్నగర్, కోదాడ నియోజకవర్గాలతో పాటు ఇతర ప్రాంతాలు కలిపి 2,29,961 ఎకరాలు నాగార్జునసాగర్, 15,230 ఎకరాలు మూసీ ఆయకట్టు కింద ఉండేది. 2018 వానాకాలం నుంచి 2023 వానాకాలం వరకు రెండు పంటలకూ నీళ్లు అందాయి. ఈ సమయంలో తుంగతుర్తి, సూర్యాపేట నియోజకవర్గాల పరిధిలో మెట్ట పంటలను సాగు చేసిన రైతులంతా వరి వైపు మళ్లారు. వేలాది రూపాయలు వెచ్చించి మెట్ట భూములను తరి భూములుగా మార్చారు. దీంతో సూర్యాపేట జిల్లాలో ఓ వైపు కృష్ణమ్మ, మరోవైపు మూసీనది, ఇంకోవైపు గోదావరి జలాలు పారడంతో త్రివేణి సంగమ జిల్లాగా మారిపోయి దాదాపు 5,85,464 ఎకరాల ఆయకట్టులో వరి పండింది. గత మూడు సీజన్ల నుంచి ఇబ్బందులు.. 2023 యాసంగి నుంచి సూర్యాపేట జిల్లా రైతాంగానికి సాగునీటి కష్టాలు వచ్చాయి. వర్షాభావ పరిస్థితులతో ఈ సీజన్లో ఆరు తడి పంటలకు మాత్రమే నీటిని వదిలారు. అయినా కొందరు వరినాట్లు, మరికొందరు ఆరుతడి పంటలు వేసి తీవ్రంగా నష్టపోయారు. 2024 –25 వానాకాలంలో చాలా ఆలస్యంగా సెప్టెంబర్ మాసంలో నీటిని విడుదల చేశారు. అప్పటికే పంటల కాలం చివరి దశకు రాగా.. జిల్లాలోని ఎస్సారెస్పీ ఆయకట్టు భూములన్నీ పడావు పడి ఉన్నాయి. 2024–25 యాసంగిలో ఎస్సారెస్పీ మొదలుకొని ఎల్ఎండీ వరకు సమృద్ధిగా జలాలు ఉన్నప్పటికీ అరకొర నీటినే విడుదల చేశారు. ఈ క్రమంలో తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలోని భూములకు మాత్రమే నీళ్లు అందాయి. ఇక సూర్యాపేట నియోజకవర్గ పరిధిలో మొయిన్ కాలువ వెంట అందగా, కోదాడ నియోజకవర్గంలోని మోతె, కోదాడ మండలాల వరకు నీళ్లు రానేలేదు. ప్రస్తుతం వానాకాలం సీజన్ ప్రారంభమైన క్రమంలో నీటిపారుదల శాఖ యాక్షన్ ప్లాన్లో జిల్లాలోని ఎస్సారెస్సీ రెండోదశకు పూర్తిస్ధాయిలో నీటిని అందించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా ఆయకట్టు రైతాంగం కోరుకుంటుంది. ఎస్సారెస్పీ రెండోదశ ఆయకట్టు రైతన్నల ఆందోళన ఫ ఇప్పటికే మూడు సీజన్ల నుంచి ఎండుతున్న ఆయకట్టు పొలాలు ఫ 70వేల ఎకరాలకు మించి అందని నీళ్లు ఫ సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల్లో 2.20లక్షల ఎకరాల ఆయకట్టు -
పథకం ప్రకారమే వివాహిత హత్య..?
గుర్రంపోడు: గుర్రంపోడు మండలం జూనూతుల గ్రామానికి చెందిన ఆర్ఎంపీ వైద్యుడు మహేష్ సోమవారం అదే గ్రామానికి చెందిన వివాహితపై అత్యాచారం చేసి ఇంజెక్షన్ ద్వారా ఆమెకు గడ్డి మందు ఇచ్చి హత్య చేసిన విషయం తెలిసిందే. పోలీసులు తమదైన శైలిలో విచారిస్తున్నప్పటికీ.. తనను వివాహిత బ్లాక్మెయిల్ చేస్తున్నందునే ఆమెను పాశవికంగా హత్య చేశానని నిందితుడు చెబుతున్నట్లు తెలుస్తోంది. కానీ బలమైన కారణంతోనే నిందితుడు ఆమెను హతమార్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మృతురాలి, నిందితుడి ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకుని వాట్సాప్, ఫోన్కాల్ డేటాను సేకరిస్తున్నారు. చికిత్స పొందుతున్న సమయంలో మృతురాలు డాక్టర్కు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే నిందితుడు గడ్డి మందు(ట్రైకాట్) డబ్బాను గుర్రంపోడు మండల కేంద్రంలోని ఓ ఫర్టిలైజర్ దుకాణం నుంచి పది రోజుల ముందే కొనుగోలు చేసి కారులో ఉంచుకుని పక్కా ప్రణాళికతో ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. గడ్డి మందు డబ్బాపై గల బ్యాచ్ నంబర్ను బట్టి గుర్రంపోడు మండల కేంద్రంలోనే గడ్డి మందు కొనుగోలు చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. నిందితుడి స్వగ్రామం సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలం కొమ్మాల గ్రామం కాగా.. అతడు ఎనిమిదేళ్లు అక్కడే ఆర్ఎంపీ వైద్యుడిగా పనిచేశాడు. నిందితుడి తోడల్లుడు గుర్రంపోడు మండలం వట్టికోడు గ్రామంలో ఆర్ఎంపీ వైద్యుడిగా స్థిరపడడంతో అతడి ద్వారా జూనూతల గ్రామంలో ఆర్ఎంపీ వైద్యుడు లేడని తెలుసుకుని ఇక్కడ ఇంటిని అద్దెకు తీసుకుని భార్యాపిల్లలతో ఉంటున్నట్లు తెలిసింది. అంతుచిక్కని నిందితుడి నైజం.. నిందితుడు మహేష్ జూనూతల గ్రామంలో ఎనిమిదేళ్లుగా ఉంటున్నా అతడు ముభావంగా ఉంటూ కనీసం ఇంటి పక్కన వాళ్లతోనూ పెద్దగా మాట్లాడేవాడు కాదని, అతడికి గ్రామంలో ఏ ఒక్కరితోనూ మిత్రుత్వం లేదని గ్రామస్తులు చెబుతున్నారు. అయితే నిందితుడు గతంలోనూ తన బంధువుకు ఫోన్లో అసభ్యకరమైన మెసేజ్లు పంపగా.. ఈ విషయంపై వారు రాజీపడినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. ఫ నిందితుడి తీరుపై పలు అనుమానాలు ఫ కొనసాగుతున్న విచారణ ఫ ఫోన్ కాల్ డేటా ఆధారంగా దర్యాప్తు చేస్తున్న పోలీసులు -
లోతు దుక్కులతో బహుళ ప్రయోజనాలు
త్రిపురారం: వానాకాలం సాగులో భాగంగా తొలకరి వర్షాలు కురిసిన తర్వాత రైతులు దుక్కులు దున్నుకోవడం మొదలుపెడతారు. నాగార్జునసాగర్ ఆయకట్టులో మాత్రం తొలకరి తర్వాత కాస్త ఆలస్యంగా దుక్కులు దున్ని విత్తనాలు పెడతారు. అయితే లోతు దుక్కులు దున్నుకోవడం ద్వారా చాలా ఉపయోగాలు ఉన్నాయని కంపాసాగర్ కృషి విజ్ఞాన కేంద్రం సేద్యపు విభాగం శాస్త్రవేత్త చంద్రశేఖర్ సూచిస్తున్నారు. ఫ తొలకరి వర్షాలు కురిసిన తర్వాత ట్రాక్టర్ ఫ్లవ్, రోటావేటర్ల ద్వారా పొలాన్ని దున్నుకోవచ్చు. ఫ లోతు దుక్కులు దున్నడం వలన పొలంలో కలుపు మొక్కలు పెకలించబడతాయి. దీంతో పంటల సాగులో కలుపు సమస్య తగ్గుతుంది. ఫ భూమి లోపలి గట్టి పొరలు పగలడం వల్ల మొక్కల వేరు వ్యవస్థ లోపలికి చొచ్చుకొని వెళ్తాయి. వేరు వ్యవస్థ నేలలోకి బాగా విస్తరించడం వల్ల మొక్కల ఎదుగుదలకు కావాల్సిన తేమ, పోషకాలు అందుతాయి. ఫ పంటలకు మేలు చేసే సూక్ష్మజీవులను అభివృద్ధి పరుచుటకు లోతు దుక్కులు తోడ్పడతాయి. ఫ పంటలకు ఆశించే శిలీంధ్రాలు సైతం లోతు దుక్కులతో ఎండ తాకిడికి చనిపోతాయి. ఫ వివిధ పంటల్లో వచ్చే ఎండు తెగులు అదుపులో ఉంటుంది. ఫ సరైన సమయంలో దుక్కులు దున్నడం వల్ల వర్షపు నీరు నేలలోకి ఇంకి తేమ శాతం వృద్ధి చెందుతుంది. ఫ దీంతో నేల గుల్లబారి విత్తనం నాటేందుకు అనుకూలంగా మారుతుంది. తద్వారా మొలక శాతం పెరుగుతుంది. ఫ అంతేకాకుండా పంట మొదళ్లు, ఆకులు, చెత్త నేలలో కలిసిపోయి సేంద్రియ పదార్థంగా మారి నేల సారవంతంగా మారుతుంది. ఫ కంపాసాగర్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త చంద్రశేఖర్ సూచనలు -
బండరాయి మీద పడి యువకుడి మృతి
మోత్కూరు: బండరాయి కొడుతుండగా.. ప్రమాదవశాత్తు మీద పడి యువకుడు మృతిచెందాడు. ఈ ఘటన మోత్కూరు మున్సిపాలిటీ పరిధిలోని బుజిలాపురం గ్రామంలో మంగళవారం ఉదయం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మోత్కూరు మున్సిపల్ కేంద్రంలోని కాశవారిగూడేనికి చెందిన షేక్ నాగుల్మీరా (31), మరో ఆరుగురు కలిసి మంగళవారం బుజిలాపురం గ్రామ ప్రధాన రహదారి వెంట బీరప్ప గుడి వద్ద గల గుట్ట దగ్గర బండ కొట్టే పనికి వెళ్లారు. పెద్ద బండరాయిని కొడుతుండగా.. అందులో నుంచి ఒక బండ ఊడి షేక్ నాగుల్మీరా మీద పడడంతో తీవ్రంగా గాయపడ్డాడు. అతడితో ఉన్న ఇమామ్ (మామ), షేక్ హోలి, షేక్ జాన్బాషా, షేక్ మౌలానా, షేక్ పక్కీర్లు బండ పైనుంచి పక్కకు దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. వారికి స్వల్ప గాయాలయ్యాయి. నాగుల్మీరాను వెంటనే అంబులెన్స్లో మోత్కూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడి నుంచి భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించగా అప్పటికే అతడు మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడికి భార్య ఇమామ్బీ, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ఘటనా స్థలాన్ని మోత్కూరు ఇన్స్పెక్టర్ సి. వెంకటేశ్వర్లు, హెడ్ కానిస్టేబుల్ నర్సింహ పరిశీలించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
దేశ సేవలో భాగస్వాములు కావాలి
బొమ్మలరామారం : యువత దేశ సేవలో భాగస్వాములు కావాలని సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ సూచించారు. బొమ్మలరామారం మండలం రంగాపూర్లో గల హైదరాబాద్ డిఫెన్స్ అకాడమీలో సోమవారం జరిగిన ఫ్రెషర్స్ డే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దేశ రక్షణ రంగంలో అపారమైన అవకాశాలు ఉన్నాయని, వాటిని అందిపుచ్చుకోవాలని కోరారు. మెరుగైన సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావడంతో పాటు ఉన్నత లక్ష్యాలను ఎంచుకొని అధిరోహించాలన్నారు. ఉత్తమ పౌరులుగా ఎదిగేందుకు ఆర్మీ వెటరన్ ప్రశాంత్ హల్గేరి, హైదరాబాద్ ఎన్సీసీ గ్రూప్ మాజీ కమాండర్లు విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. విద్యార్థుల సాంస్కృతి ప్రదర్శనలు అలరించాయి. ఈ కార్యక్రమంలో కళాశాల చైర్మన్ కొరె రాజ్కుమార్, డైరెక్టర్ నవ్యశ్రీ, చీఫ్ మెంటార్ ఆర్.కె.రావు, ప్రిన్సిపాల్ అంజయ్య, ఫ్యాకల్టీలు పాల్గొన్నారు.ఫ సీబీఐ మాజీ జెడీ లక్ష్మీనారాయణ -
విద్యుత్ మెటీరియల్ స్టోర్ మంజూరు
సాక్షి, యాదాద్రి: జిల్లాకు విద్యుత్ మెటీరియల్ స్టోర్ మంజూరైంది. ఇప్పటి వరకు నల్లగొండలోని స్టోర్ నుంచి మెటీరియల్ను డ్రా చేస్తున్నారు. యాదాద్రి జిల్లాకు స్టోర్ మంజూరుతో రైతులు, వినియోగదారులు, విద్యుత్ సిబ్బందికి ఇబ్బందులు తొలగనున్నాయి. నల్లగొండకు వెళ్లి మెటీరియల్ డ్రా చేయడం తప్పుతుంది. కాగా స్టోర్ ఏర్పాటుకు ఐదు ఎకరాల స్థలం కావాలని ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్రెడ్డి కలెక్టర్ హనుమంతరావును కోరారు. బీబీనగర్ మండలం గూడూరు రెవెన్యూ శివారు పరిధిలోని సర్వే నంబర్ 69లో ఐదు ఎకరాల భూమి ఖరారైందని, అప్పగించడానికి రెవెన్యూ అధికారులు చర్యలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ముగిసిన బేస్లైన్ పరీక్షలు భువనగిరి: గత విద్యాసంవత్సరంలో ప్రభుత్వ విద్యార్థులు సాధించిన కనీస అభ్యసన లక్ష్యాలను అంచనా వేసేందుకు జిల్లా విద్యాశాఖ జూన్ 25నుంచి నిర్వహిస్తున్న బేస్లైన్(ప్రాథమిక) పరీక్షలు సోమవారం ముగిశాయి. జిల్లా వ్యాప్తంగా 715 ప్రభుత్వ పాఠశాలల్లో 1నుంచి 9వ తరగతి విద్యార్థుల్లో కనీస అభ్యసన సామర్థ్యాలను గుర్తించేందుకు బేస్లైన్ పరీక్షలు నిర్వహించారు. జవాబు పత్రాలను మూల్యాంకనం చేసి ఈ నెల 15లోగా ప్రత్యేక యాప్లో నమోదు చేయనున్నారు. తిరిగి నవంబర్ మిడ్లైన్, మార్చిలో ఎండ్లైన్ పరీక్షలు నిర్వహించనున్నట్లు డీఈఓ సత్యనారాయణ తెలిపారు. అన్నప్రసాద వితరణకు రూ.25 లక్షల విరాళం యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తులకు వితరణ చేసే నిత్యాన్నదాన ప్రసాద పథకానికి హైదరాబాద్లోని కొండాపూర్కు చెందిన భూపతిరాజు సూర్యనారాయణరాజు రూ.25 లక్షలు విరాళంగా అందజేశారు. సోమవారం యాదగిరీశుడిని దర్శించుకున్న అనంతరం తన మనుమడు అనంత్ ఇషాన్ పేరున ఈఓ వెంకట్రావ్కు చెక్కు అందజేశారు. . వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జిగా శ్రీనివాస్గౌడ్ ఆలేరు: వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జిగా టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పల్లె శ్రీనివాస్గౌడ్ను టీపీసీసీ అధ్యక్షుడు మహేష్కుమార్గౌడ్ నియమించారు. సోమవారం ఆయన వరంగల్ జిల్లాలోని పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరిగిన కార్యకర్తల సమావేశాల్లో పాల్గొన్నారు. శ్రీనివాస్గౌడ్ను ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, నాయిని రాజేందర్రెడ్డి, నాగరాజు, పలువురు నాయకులు సన్మానించారు. దరఖాస్తుల ఆహ్వానం భువనగిరి : జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు–2025 సంవత్సరానికి గాను అర్హత గల ఉపాధ్యాయుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు డీఈఓ సత్యనారాయణ సోమవారం ఒక ప్రకటనలో కోరారు. ఆసక్తి గల ఉపాధ్యాయులు nationalawardstoteachers.ed ucation.gov.in లో ల వెబ్సైట్ ద్వారా నెల 13వ తేదీలోగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. ఇతర వివరాలను వెబ్సైట్ ద్వారా చూసుకోవచ్చని, రిజిస్ట్రేషన్ చేసిన కాపీని జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో సమర్పించాలని ఆయన పేర్కొన్నారు. అనధికార ప్లాట్ల పరిశీలన ఆలేరురూరల్: ఆలేరు మండలం శారాజీపేట రెవెన్యూ పరిధిలో అనధికారిక ప్లాట్లను సోమవారం లోకాయుక్త బృందం పరిశీలించింది. సర్వే నంబర్ 76లోని రెండు ఎకరాల భూమిని ఓ రైతు వద్ద వజ్జె రజినీ అనే వ్యక్తి 2008 సంవత్సరంలో కొనుగోలు చేశాడు. అనుమతి పొందకుండా లేఅవుట్ చేసి అందులో 270కి పైగా ప్లాట్లను విక్రయించాడు. ఈ విషయంపై బా ధితులు పలుమార్లు ఆలేరు తహసీల్దార్ కార్యాలయంలో ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదు. లోకాయుక్తను ఆశ్రయించడంతో ప్రతినిధుల బృందం ప్లాట్లను పరిశీలించింది. కార్యక్రమంలో లోకాయుక్త విచారణ అధికారి మత్తువ్కుషి, వెంకట్రావు, సుధాకర్, శ్రీనివాస్, తహసీల్దార్ ఆంజనేయులు, సీఐ కొండల్రావు, డీటీ ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు. -
ఖర్గే సభకు జనసమీకరణ
సాక్షి, యాదాద్రి: హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గే పాల్గొనే బహిరంగ సభకు జన సమీకరణపై జిల్లా నాయకత్వం దృష్టి సారించింది. భువనగిరి లోక్సభ నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ల నుంచి 1,500 చొప్పున సభకు తరలించాలని అధిష్టానం జిల్లా నేతలకు సూచించింది. ఈ మేరకు సోమవారం భువనగిరిలో డీసీసీ అధ్యక్షుడు అండెం సంజీవరెడ్డి అధ్యక్షతన టీపీసీపీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. సభను విజయవంతంపై చర్చించారు. రెండు అసెంబ్లీ సెగ్మెంట్లకు ఒక ఇంచార్జిని నియమించారు. మరోసారి మంగళవారం ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, ఎమ్మెల్యేలు కుంభం అనిల్కుమార్రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి, మందుల సామేల్, వేముల వీరేశం, మల్రెడ్డి రంగారెడ్డి, జనగామ కాంగ్రెస్ నియోజవకర్గ ఇంచార్జిలతో డీసీసీ అధ్యక్షుడు, అసెంబ్లీ సెగ్మెంట్ల ఇంచార్జిలు సమావేశం కానున్నారు. ఆర్టీసీ బస్సులు ఏర్పాటు సభకు కార్యకర్తలను ఆర్టీసీ బస్సుల్లో తరలించాలని నిర్ణయించారు. భువనగిరి లోక్సభ నియోజకవర్గం నుంచి ఎక్కువ మందిని తరించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ముఖ్యంగా మండల, గ్రామ శాఖలు, జిల్లా కమిటీలు, అనుబంధ సంఘాల సభ్యులను తరలించనున్నారు. సమావేశంలో పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జిలు కోటంరెడ్డి వినయ్రెడ్డి, బొద్దిరెడ్డి ప్రభాకర్రెడ్డి, నూతి సత్యనారా యణగౌడ్, ఈవీ శ్రీనివాసరావు, నాయకులు పోత్నక్ ప్రమోద్కుమార్, రాచమల్ల రమేష్, సత్యనారాయణ, పడిగెల ప్రదీప్, అతహర్ ప్రవీణ్ పాల్గొన్నారు. ఫ 10,500 మందిని తరలించాలని నిర్ణయం ఫ ఇంచార్జ్లతో డీసీసీ అధ్యక్షుడి సమావేశం ఫ నేడు ఎంపీ, ఎమ్మెల్యేలతో.. -
పేదల డాక్టర్ రంగారెడ్డి
ఫ సామాన్యులకు వైద్యం అందుబాటులోకి తేవాలన్నదే ఆయన తపన ఫ సూర్యాపేటలో ఆస్పత్రి నెలకొల్పిన తొలుత 5 రూపాయలకే వైద్యసేవలు ఫ ప్రస్తుతం రూ.20లకే ఓపీ ఫ పూర్వవిద్యార్థుల సేవాసమితి ఏర్పాటు చేసి పలు కార్యక్రమాలునేడు డాక్టర్స్డే రైతు కుటుంబం నుంచి వచ్చి.. మా సొంతూరు ఆత్మకూర్(ఎస్) మండల కేంద్రం. మాది రైతు కుటుంబం. విద్యాభ్యాసమంతా ప్రభుత్వ విద్యాసంస్థల్లోనే సాగింది. కష్టపడి ఉస్మానియా యూనివర్సిటీలో ఎంబీబీఎస్ పూర్తి చేశాను. పేదలందరికీ వైద్యం అందుబాటులో తేవాలన్న తపనతో సూర్యాపేట పట్టణంలో ఆస్పత్రి నెలకొల్పాను. మొదట రూ.5కే ఓపీ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఓపీ ఫీజు రూ.7, కొన్ని రోజులకు రూ.10, కొన్నాళ్లకు రూ.15చేశాను. ప్రస్తుతం రూ.20లకు ఓపీ చూస్తున్నాను. నా దగ్గరికి వచ్చే రోగులు అత్యంత నిరుపేద కుటుంబాలకు చెందిన వారు ఉండడం చేత మందులు కూడా తక్కువ ధరకు దొరికేవి, నాణ్యతగా ఉండేవి రాస్తాను. సూర్యాపేట అర్బన్: పేద రైతు కుటుంబంలో పుట్టి పెరిగిన ఓ వ్యక్తి కష్టపడి చదవి ఎంబీబీఎస్ పూర్తి చేశారు. పేదలకు వైద్యం అందుబాటులో తీసుకురావాలనే ఆలోచనతో ఆస్పత్రి ఏర్పాటు చేసుకొని నామమాత్రపు ఫీజుతో వైద్య సేవలు అందిస్తూ పేదల వైద్యుడిగా పేరుగాంచారు. పూర్వ విద్యార్థుల సేవా సమితి ఏర్పాటు చేసి వైద్య శిబిరాలతో పాటు అనేక సేవకార్యక్రమాలు నిర్వహిస్తున్నారు సూర్యాపేట పట్టణంలోని ఆదిత్య ఆస్పత్రి డాక్టర్ రంగారెడ్డి. నేడు డాక్టర్స్ డే సందర్భంగా వైద్యుడి జీవిత విశేషాలు, వైద్య రంగంలో చేస్తున్న సేవలు ఆయన మాటల్లోనే.. -
తవ్వింది చెరువంతా!
అనుమతి కొంత.. ఫిర్యాదు చేస్తేనే స్పందిస్తున్న యంత్రాంగం గుట్టలు, చెరువులు, ప్రభుత్వ భూములు, రైతుల పట్టాభూముల నుంచి మట్టి అక్రమ దందా నడుస్తున్న విషయం బహిరంగ రహస్యమే అయినా సంబంధిత శాఖలు చోద్యం చూస్తున్నాయి. నెలవారీ మామూళ్లు తీసుకుంటూ పట్టించుకోవడం లేదని, మరోవైపు రాజకీయ ఒత్తిళ్లు కూడా కారణమని తెలుస్తోంది. చల్లూరులోని మల్పవోని చెరువు నుంచి మూడు రోజుల పాటు రేయింభవళ్లు 60 టిప్పర్ల ద్వారా మట్టి తరలించినా చోద్యం చూడటం అధికారుల తీరును ప్రశ్నిస్తోంది. 100 కాల్ ద్వారా సమాచారం అందితే తప్ప.. స్పందించలేదు. సాక్షి,యాదాద్రి: మట్టి మాఫియాకు అడ్డులేకుండాపోతుంది. ప్రకృతి సంపదను విచ్చలవిడిగా కొల్ల గొడుతూ కోట్ల రూపాయలు వెనుకేసుకుంటోంది. చెరువులు, వాగులు, వంకలు, గుట్టలు.. ఇలా దేన్నీ వదలడం లేదు. అడ్డుకోవాల్సిన యంత్రాంగం నెలవారీ మామూళ్లు తీసుకుంటూ చూసీచూడనట్లుగా వదిలేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఇటీవల రా జాపేట మండలం చల్లూరులోని మల్పవోని చెరువు నుంచి కొందరు వ్యక్తులు నిబంధనలకు విరుద్ధంగా మూడు రోజుల్లోనే కోట్ల రూపాయలు విలువ చేసే మట్టిని తరలించడం అక్రమదందాకు నిదర్శనం. రూ.6 లక్షలకు ఒప్పందం మల్పవోని చెరువు శిఖం భూముల పట్టా దళితుల పేరున ఉంది. గ్రామానికి చెందిన ఓ అధికార పార్టీ నేత దళితులకు, మట్టి వ్యాపారులకు మధ్యవర్తిగా వ్యవహరించాడని, మట్టి తరలించేందుకు రూ.6 లక్షలకు ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది. గత నెల 21,22,23 తేదీల్లో మూడు రోజుల పాటు చెరువులో హిటాచీలు పెట్టి సుమారు 60 టిప్పర్ల ద్వారా నిరంతరాయం మట్టిని తరలించారు. బొమ్మలరామారం, చీకటి మామిడి తదితర ప్రాంతాల్లోని ఇటుక బట్టీలకు మట్టిని చేరవేశారు. మట్టి అక్రమ రవాణా విషయాన్ని 24వ తేదీ రాత్రి 100 ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు మల్ప వోని చెరువు వద్దకు చేరుకుని దాడులు నిర్వహించారు. మట్టి తరలిస్తున్న 23 టిప్పర్లు, హిటాచీలను పట్టుకున్నారు. అయితే హిటాచీలను అదే రాత్రి వదిలేశారని పోలీసులపై ఆరోపణలున్నాయి. టిప్పర్లకు మాత్రం జరిమానా విధించడంతో పాటు డ్రైవర్లపై కేసులు నమోదు చేశారు. చర్చనీయాంశంగా నేతల ఫోన్ సంభాషణ చల్లూరులోని మల్పవోని చెరువు మట్టి తరలింపునకు సంబంధించి ఇద్దరు నేతల మధ్య సుధీర్ఘ ఫోన్ సంభాషణ జరిగింది. ఈ సంభాషణ సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. పరిధి దాటి తవ్వకాలు.. వ్యవసాయ భూములు సారవంతం చేయాలని రైతుల పేరున అనుమతి పొందుతున్నారు. కొంత విస్తీర్ణం మేరకు అనుమతి పొంది చెరువుంతా తవ్వకాలు చేపడుతున్నారు. మట్టిని పొలాలకు కాకుండా ఇటుక బట్టీలు, వెంచర్లు, ఇతర వాణిజ్య అవసరాల నిమిత్తం తరలిస్తున్నారు. ఒక టిప్పర్ మట్టిని రూ.6 వేల నుంచి రూ.10 వేల వరకు అమ్ముతున్నారు. ఇటుక బట్టీల్లో ఇటుకల తయారీకి నీటిపారుదల, రెవెన్యూ, మైనింగ్ శాఖల అనుమతులు తీసుకోవాలి. నిబంధనల ప్రకారం ఆయా శాఖలు నిర్దేశించిన ప్రాంతంలోనే మట్టి తవ్వకాలు జరపాలి. ఇందుకు గాను క్యూబిక్ మీటర్కు రూ.20 చొప్పున రాయల్టీ, ఇతర పన్నులను ముందుగానే ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. కానీ, అక్రమార్కులు నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు జరుపుతూ చెరువులు, గుట్టలు, ప్రభుత్వ భూములు ధ్వంసం చేస్తున్నారు.చల్లూరులోని మల్పవోని చెరువులో విచ్చలవిడి తవ్వకాలుఫ మూడు రోజుల్లోనే రూ.కోట్లు విలువ చేసే మట్టి తరలింపు ఫ సాగుభూముల సారవంతం పేరున అనుమతి ఫ నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు ఫ ఇటుక బట్టీలకు ట్రిప్పు రూ.6 వేల నుంచి రూ.10వేలకు అమ్మకం ఫ మిగతా మండలాల్లోనూ తరలిపోతున్న ప్రకృతి సంపద ఫ కళ్లెదుటే జరుగుతున్నా పట్టించుకోని యంత్రాంగంఅనుమతి తప్పనిసరి మట్టి తరలించాలంటే సంబంధిత శాఖల అనుమతి తప్పనిసరి. పర్మిషన్ తీసుకోకపోతే కఠిన చర్యలు ఉంటాయి. చల్లూరులోని మల్పవోని చెరువు నుంచి మట్టి తరలించిన వారిపై కేసులు నమోదు చేశాం. 24 టిప్పర్లకు జరిమానా విధించాం. టిప్పర్లలో మట్టి తవ్విపోసిన హిటాచీలతో పాటు వాటి డ్రైవర్లను గుర్తించి కేసులు నమోదుచేస్తాం. –కృష్ణారెడ్డి, ఆర్డీఓ -
చాడ చెరువునూ కొల్లగొట్టారు
మోటకొండూరు మండలం చాడ గ్రామంలోని పెద్ద చెరువు నుంచి పెద్ద ఎత్తున మట్టి తరలించారు. సదరు వ్యక్తి మూడు దఫాలు 52,500 టన్నుల మట్టికి అనుమతులు పొందాడు. కానీ, అందుకు విరుద్ధంగా ఏప్రిల్, మే మాసాల్లో వెయ్యి టిప్పర్లకు పైనే మట్టి తరలించాడని తెలుస్తోంది. తరించిన మట్టిని కాటేపల్లి– ముస్త్యాలపల్లి మధ్య 40 ఎకరాల భూమి లీజుకు తీసుకుని అక్కడ నిల్వచేశాడు. ఈ మట్టిని ఇటుక బట్టీలకు తరలించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని గ్రామస్తులు తెలిపారు. తుర్కపల్లి, బీబీనగర్, ఆలేరు, యాదగిరిగుట్ట, చౌటుప్పల్, అడ్డగూడూరు మండలాల్లోని పలు ప్రాంతాల్లో మట్టి తవ్వకాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయి. గుట్టలు, చెరువుల నుంచి నిత్యం వందల టిప్పర్ల మట్టి తరలిపోతోంది. -
వినతులు స్వీకరించి.. మొర ఆలకించి
భువనగిరిటౌన్ : సమస్యల పరిష్కార వేదిక ప్రజా వాణికి సోమవారం జిల్లా నలుమూలల నుంచి ప్రజలు తరలివచ్చారు. తమ సమస్యలపై అధికారులకు వినతులు అందజేశారు. మొత్తం 86 అర్జీలు రాగా అత్యధికంగా భూసమస్యలకు సంబంధించి 54 మంది దరఖాస్తులు ఇచ్చారు. పంచాయతీరాజ్ 8, వ్యవసాయ 4, ఇరిగేషన్ 3, సంక్షేమం 3, హౌసింగ్ 2, కో పరేటివ్ 2, విద్య 2, గ్రామీణాభివద్ధి 2, ఎస్సీ కార్పొరేషన్ 2, ఎస్సీ సంక్షేమం, బీసీ సంక్షేమం, ట్రైబల్ వెల్ఫేర్, పోలీసు శాఖకు సంబంధించి ఒక్కొక్కటి చొప్పున ఉన్నాయి. అదనపు కలెక్టర్లు భాస్కర్రావు, వీరారెడ్డి వినతులను స్వీకరించారు. బాధితుల సమస్యలను నేరుగా తెలుసుకున్నారు. ప్రజావాణి దరఖాస్తులకు ప్రాధాన్యమించి త్వరగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. వినతులు స్వీకరించిన వారిలో జెడ్పీ సీఈఓ శోభారాణి, డీఆర్డీ నాగిరెడ్డి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ జయశ్రీ, వివిధ శాఖల జిల్లా అధికారులు ఉన్నారు. వినతుల్లో కొన్ని.. ● తనకు 2.01 ఎకరాల భూమి ఉండగా 39 గుంటలు కాళేశ్వరం కాలువలో పోయిందని, ఇంకా 42 గుంటలకు రికార్డుల్లో రెండు గుంటలే చూపుతుందని రామన్నపేట మండలం పాశబోయిన జయలక్ష్మి ఫిర్యాదు చేశారు. మిగతా 39 గంటుల భూమిని కూడా ఆన్లైన్ ద్వారా తన పేరున నమోదు చేయాలని విన్నవించారు. ● ఖాళీ స్థలాలకు ఇంటి నంబర్లు ఇస్తున్నారని ఆరోపిస్తూ పంచాయతీ కార్యదర్శిపై బీబీనగర్ మండలం కొండమడుగు గ్రామానికి చెందిన చెందిన కందుల శ్రీనివాస్రావు ఫిర్యాదు చేశారు. ఇంటి నిర్మాణ సమయంలో నంబర్లు కేటాయించాల్సి ఉండగా ఖాళీ స్థలాకు ఇస్తున్నారని , ఇందుకోసం చేతి వాటం ప్రదర్శిస్తున్నారని ఆరోపించారు. విచారణ జరిపి అతనిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ● నాతాళ్లగూడెం రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 249లో పల్లెప్రకృతి వనానికి ఆనుకుని ఉన్న ప్రభుత్వ భూమిని కొందరు ఆక్రమించారని గ్రామానికి చెందిన పలువురు ఫిర్యాదు చేశారు.విచారణ చేయించాలి ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో వార్డు కమిటీ సభ్యులు చేతివాటం ప్రదర్శిస్తున్నాయని ఆరోపిస్తూ బీఆర్ఎస్ భువనగిరి పట్టణ శాఖ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. కమిటీల్లో సభ్యులుగా ఉన్న కాంగ్రెస్ నాయకులు ఇళ్లు మంజూరు చేయిస్తామని రూ.20 వేల చొప్పున వసూలు చేస్తున్నారని, ఈ విషయం సోషల్ మీడియాలో కూడా వైరల్ అయిందన్నారు. అర్హులను కాదని కాంగ్రెస్ కార్యకర్తలకు, తమ అనుయాయులకు ఇళ్లు మంజూరు చేస్తున్నారని, విచారణ చేపట్టాలని కోరారు. ఫ ప్రజావాణిలో అర్జీలు వెల్లువ ఫ అధికంగా భూ సమస్యలపైనే.. ఫ వినతులు స్వీకరించిన అదనపు కలెక్టర్లు -
అధునాతన సేవలపై ప్రజలకు తెలియజేయాలి
భువనగిరి : ప్రభుత్వ ఆస్పత్రుల్లో అందజేస్తున్న అధునాతన వైద్యసేవల గురించి ప్రజలకు తెలియజేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్ హనుమంతరావు సూచించారు. మెడికల్ కళాశాల మానిటరింగ్ కమిటీ సభ్యులు డీఎంఈ నరేందర్, మహేశ్వరం మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ నాగేంద్ర, భువనగిరి మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ రమేష్రెడ్డి, జిల్లా కేంద్ర ఆస్పత్రి సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు, డీసీఎహెచ్ఎస్ చిన్ననాయక్తో కలిసి సోమవారం ప్రభుత్వ మెడికల్ కళాశాల, జిల్లా కేంద్ర ఆస్పత్రిని సందర్శించారు. వివిధ విభాగాలు, బ్లడ్ బ్యాంకు, నూతన భవన నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం జిల్లా కేంద్ర ఆస్పత్రిలో వివిధ విభాగాల అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి రోగులకు అందజేస్తున్న వైద్య సేవలు, ఇతర అంశాలపై సమీక్షించారు. మెరుగైన వైద్య సేవలందించడం ద్వారా ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రజల్లో నమ్మకం పెరుగుతుందన్నారు. మెడికల్ కళాశాలలో అవసరమైన వసతులు ఉండాలని, భోదన, భోదనేతర సిబ్బంది కొరత లేకుండా చూడాలని, ఖాళీల వివరాలు తెలియజేయాలని సూచించారు. ఫ కలెక్టర్ హనుమంతరావు -
డీసీసీబీ టర్నోవర్ రూ.598.16 కోట్లు
నల్లగొండ అగ్రికల్చర్ : డీసీసీబీలో తమ పాలకవర్గం ఏర్పడిన సంవత్సరం కాలంలో ఎన్నడూ లేని విధంగా రూ.598.16 కోట్లుకు టర్నోవర్ పెరిగి మొత్తం రూ.2940.29 కోట్లకు చేరుకుందని డీసీసీబీ చైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. పాలకవర్గం ఏర్పడి సంవత్సరం పూర్తయిన సందర్భంగా సోమవారం డీసీసీబీలో కేక్ కట్చేసి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ పాలకవర్గం బాధ్యతలు స్వీకరించిన వెంటనే పంట రుణాల గరిష్ట పరిమితిని రూ.లక్ష నుంచి రూ.1.50 లక్షలకు పెంచామన్నారు. పంట రుణాల బడ్జెట్ను రూ.100 కోట్లకు తెచ్చామన్నారు. నేషనల్ లైవ్ స్టాక్ మిషన్, గ్రామీణ ప్రాంతాల్లో గృహ రుణాలు, సొసైటీలకు గోడౌన్ల నిర్మాణం కోసం రుణాలు ఇస్తున్నామన్నారు. బ్యాంకు అభివృద్ధికి సహకరిస్తున్న పాలకవర్గం, సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో డైరెక్టర్లు పాశం సంపత్రెడ్డి, కొండా సైదయ్య, ఇరిగినేని అంజయ్య, గుడిపాటి సైదయ్య, దనావత్ జయరాం, బంటు శ్రీనివాస్, సుష్మ, కొమ్ము కరుణ, కె.వీరస్వామి, సీఈఓ శంకర్రావు, జీఎం నర్మద, డీజీఎంలు, ఏజీఎంలు సిబ్బంది పాల్గొన్నారు. ఫ చైర్మన్ కుంభం శ్రీనివాస్రెడ్డి -
వివాహిత మృతదేహంతో ఆందోళన
నేరేడుచర్ల: ప్రియుడికి వీడియో కాల్ చేస్తే స్పందించకపోవడంతో మనస్తాపానికి గురై ఉరేసుకున్న వివాహిత ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందింది. ఆమె మృతికి ప్రియుడే కారణమని మృతదేహాన్ని అతడి ఇంటి ముందు ఉంచి మృతురాలి కుటుంబ సభ్యులు, బంధువులు ఆదివారం రాత్రి ఆందోళన చేపట్టారు. మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. నేరేడుచర్ల మండలం బోడలదిన్నె గ్రామానికి చెందిన మల్గిరెడ్డి అశ్విని(35) తన భర్తతో కలిసి గత మూడేళ్లుగా హైదరాబాద్లోని ఎల్బీనగర్లో నివాసముంటోంది. వీరికి ఒక కుమార్తె సంతానం. బోడలదిన్నె గ్రామానికే చెందిన కందుకూరి సురేష్రెడ్డి కూడా ఎల్బీనగర్లోనే ఉంటున్నాడు. ఈ క్రమంలో అశ్విని, సురేష్రెడ్డి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. ఇటీవల అశ్విని, సురేష్రెడ్డి మధ్య దూరం పెరగడంతో.. నాలుగు రోజుల క్రితం అశ్విని సురేష్రెడ్డికి వీడియో కాల్ చేసి ‘నా వద్దకు రాకపోతే ఆత్మహత్య చేసుకుంటా’ అని చెప్పింది. దీనికి తాను రానని సురేష్రెడ్డి సమాధానం చెప్పడంతో మనస్తాపానికి గురైన అశ్విని తాను ఉంటున్న ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆ తర్వాత అనుమానం వచ్చి సురేష్రెడ్డి అశ్విని ఇంటికి వెళ్లగా ఆమె ఆపస్మారక స్థితిలో ఉండటం చూసి సమీపంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. పరిస్థితి విషమంగా ఉండటంతో సికింద్రాబాద్లోని గాంధీ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందింది. మృతదేహంతో ఆందోళన.. అశ్విని మృతికి సురేష్రెడ్డే కారణమంటూ మృతురాలి బంధువులు, కుటుంబ సభ్యులు ఆదివారం రాత్రి బోడలదిన్నె గ్రామంలోని సురేష్రెడ్డి ఇంట్లో మృతదేహాన్ని ఉంచి ఆందోళన చేపట్టారు. విషయం తెలుసుకున్న నేరేడుచర్ల ఎస్ఐ రవీందర్ తన సిబ్బందితో బోడలదిన్నె గ్రామానికి చేరుకుని బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇరు కుటుంబాలతో గ్రామ పెద్ద మనుషుల సమక్షంలో చర్చలు జరిపి సోమవారం అశ్విని మృతదేహానికి అంత్యక్రియలు పూర్తిచేశారు. అశ్విని మృతికి సురేష్రెడ్డి కారణమంటూ ఆమె కుటుంబ సభ్యులు ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. ఆమె మృతికి ప్రియుడే కారణమని కుటుంబ సభ్యులు, బంధువుల ఆరోపణ -
చెర్వుగట్టు ఆలయాన్ని అభివృద్ధి చేస్తాం
నార్కట్పల్లి: రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాలను అభివృద్ధి చేసినట్లుగానే చెర్వుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వరస్వామి ఆలయాన్ని కూడా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ తెలిపారు. సోమవారం ఆమె నార్కట్పల్లి మండలం చెర్వుగట్టులో గల పార్వతీ జడల రామలింగేశ్వరస్వామి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఆమెకు దేవాదాయ శాఖ కమిషనర్ ఎస్. వెంకట్రావ్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠితో పాటు ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కల్యాణ మండపం, కోనేరు, మెట్ల దారి, కాలభైరవ, ఆంజనేయస్వామి ఆలయాలతో పాటు పరిసరాలను పరిశీలించారు. అనంతరం ఆలయ ఈఓ చాంబర్లో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో ఆమె పాల్గొని.. ఆలయ అభివృద్ధికి ఇదివరకే మంజూరు చేసిన రూ.12 కోట్లతో చేపట్టిన పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. చెర్వుగట్టు పైనుంచి కిందకు ప్రత్యేక రహదారి, మెట్ల దారి విస్తరణ, కాటేజీల నిర్మాణం చేపట్టాలని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఆమెను కోరారు. చెర్వుగట్టు ఆలయానికి సంబంధించి గట్టు పైన 44 ఎకరాల స్థలం, కొండ కింద 90 ఎకరాల స్థలం ఉందని, ప్రస్తుతం ఆలయ నిధులు రూ.24 కోట్లు ఉన్నట్లు దేవాదాయశాఖ కమిషనర్ ఎస్. వెంకట్రావ్ ఆమెకు వివరించారు. సంవత్సర ఆదాయం రూ.14కోట్ల నుంచి రూ.16 కోట్ల వరకు వస్తుందని, రెండు కిలోల 640 గ్రాముల బంగారం, 241 కిలోల వెండి ఉన్నట్లు తెలిపారు. ప్రభుత్వం చెర్వుగట్టు సమీపంలో హరిత హోటల్ మంజూరు చేసిందని, అయితే హోటల్ నిర్మించే స్థలానికి సంబంధించి ఎస్సీ సంక్షేమ శాఖ నుంచి క్లియరెన్స్ రావాల్సి ఉందని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆమెకు వివరించారు. ఈ కార్యక్రమంలో ధార్మిక పరిషత్ ప్రత్యేక సలహాదారు గోవింద హళ్లి, స్థపతి వల్లినాయగం, ఆర్కిటెక్ట్ సూర్యనారాయణమూర్తి, నల్లగొండ ఆర్డీఓ వై. అశోక్రెడ్డి, డీఎస్పీ శివరాంరెడ్డి, దేవాదాయ శాఖ ఎస్ఈ ఓం ప్రకాష్, ఈఈ శ్రీనివాస శర్మ, దేవాలయ ఈఓ నవీన్కుమార్, తహసీల్దార్ వెంకటేశ్వరరావు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బత్తుల ఉశషయ్య, వడ్డె భూపాల్రెడ్డి, బండ సాగర్రెడ్డి, పాశం శ్రీనివాస్రెడ్డి, పున్నంరాజు యాదగిరి, నేతకాని కృష్ణ, రేగట్టే నవీన్రెడ్డి, రేగట్టే నర్సిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ఛాయా సోమేశ్వర ఆలయ చరిత్రను కాపాడాలిరామగిరి(నల్లగొండ): నల్లగొండ మున్సి పాలిటీ పరిధిలోని పానగల్లులో గల ఛాయా సోమేశ్వర ఆలయ చరిత్రను కాపాడాలని దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ అన్నారు. సోమవారం ఆమె ఛాయా సోమేశ్వర ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు, అభిషేకం చేశారు. ఆలయ అర్చకులు ఆమెకు పూర్ణకుంభంతో స్వాగతం పలికి విశేష పూజల అనంతరం వేద ఆశీర్వచనం చేశారు. ఈ సందర్భంగా దేవాలయ చరిత్రను తెలుసుకున్న ఆమె ఆలయ ప్రాముఖ్యత, శిల్ప కళ, చరిత్రను అందరికీ తెలిసేలా చూడాలని ఆర్కిటెక్ట్ సూర్యనారాయణమూర్తి, ధార్మిక పరిషత్ సలహాదారు గోవింద హళ్లితో చెప్పారు. అనంతరం ఆలయం వద్ద ఉన్న కొనేరును సందర్శించారు. ఆమె వెంట కలెక్టర్ ఇలా త్రిపాఠి, నల్లగొండ ఆర్డీఓ వై. అశోక్రెడ్డి తదితరులు ఉన్నారు. -
బైక్ను ఢీకొట్టిన లారీ.. ఒకరు మృతి
నాగార్జునసాగర్: బైక్ను లారీ ఢీకొట్టడంతో ఓ వ్యక్తి మృతిచెందగా, మరొకరికి గాయాలయ్యాయి. ఈ ఘటన నాగార్జునసాగర్కు సమీపంలోని పాత కంకరమిల్లు మూలమలుపు వద్ద సోమవారం జరిగింది. విజయపురి టౌన్ ఎస్ఐ ముత్తయ్య తెలిపిన వివరాల ప్రకారం.. నాగార్జునసాగర్లోని సెయింట్ జోసెఫ్ పాఠశాలలో కరాటే నేర్పడానికి హాలియా నుంచి కరాటే మాస్టర్ కందుల రమేశ్(36), అతడి సమీప బంధువు పెదమాము మనోజ్కుమార్ బైక్పై వస్తున్నారు. నాగార్జునసాగర్కు మూడు కిలోమీటర్ల దూరంలో పాత కంకరమిల్లు మూలమలుపు సమీపంలోకి రాగానే వెనుక నుంచి లారీ వచ్చి బైక్ను ఢీకొట్టింది. దీంతో రమేష్, మనోజ్కుమార్ ఎగిరి రోడ్డు పక్కనే ఉన్న లోయలో పడిపోయారు. రమేశ్ తలకు బలమైన దెబ్బ తలగడంతో అక్కడికక్కడే మృతిచెందగా.. మనోజ్కుమార్ కాలు, చేయి విరిగింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాయాలపాలైన మనోజ్ను స్థానిక కమలానెహ్రూ ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం నల్ల గొండకు తీసుకెళ్లారు. రమేశ్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కమలానెహ్రూ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. మృతుడు రమేష్ స్వస్థలం త్రిపురారం మండలం దుగ్గపల్లి కాగా, అతడికి భార్య మహేశ్వరి, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. క్షతగాత్రుడు మనోజ్కుమార్ స్వస్థలం నిడమనూరు మండలం ఎర్రబెల్లి గ్రామం. మరొకరికి గాయాలు -
బంగారంపై లోన్ ఇచ్చారు.. నకిలీదంటున్నారు!
మోతె: తాకట్టు పెట్టిన బంగారాన్ని బ్యాంకు నుంచి విడిపించుకున్న తర్వాత అది నకిలీదని బ్యాంకు వారు చెప్పడంతో బాధితుడు (ఖాతాదారుడు) ఒక్కసారిగా అవాక్కయ్యాడు. ఈ ఘటన సోమవారం మోతె ఎస్బీఐలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలు.. మోతె మండల కేంద్రానికి చెందిన జిల్లపెల్లి పరశురాములు 2023 మార్చిలో తన అవసరం నిమిత్తం 18 గ్రాముల బంగారు గొలుసును స్థానిక ఎస్బీఐలో కుదువపెట్టి లోన్ తీసుకున్నాడు. రెండేళ్లపాటు తాను తీసుకున్న లోను బాపతు ఏటా వడ్డీ డబ్బులు చెల్లించి రెన్యువల్ చేయించుకున్నాడు. ఈ నేపథ్యంలో ఖాతాదారుడిని బ్యాంకు వారు పిలిచి అసలు, వడ్డీ చెల్లించి బంగారం విడిపించుకోవాలని సూచించారు. బాధితుడు సోమవారం బ్యాంకులో అసలు వడ్డీతో సహా చెల్లించాడు. బ్యాంకు మేనేజర్ బాధితుడికి బంగారం ఇస్తూ ఇది నకిలీ బంగారమని తెలిపారు. మీరు బ్యాంకులో తాకట్టుపెట్టిన కొన్ని నెలల తర్వాత ఆడిట్ వారు మీ బంగారాన్ని చెక్ చేయగా నకిలీ బంగారమని నిర్ధారించారని మేనేజర్ తెలిపారు. బ్యాంకులో బంగారం తాకట్టు పెట్టిన సమయంలో చెక్ చేసి లోన్ ఇచ్చారని, ఇప్పుడు నకిలీ బంగారం ఎలా అవుతుందని బాధితుడు ప్రశ్నించాడు. ఈ క్రమంలో బ్యాంకు అధికారులతో కొద్దిసేపు వాగ్వాదానికి దిగాడు. నాకు ఈ బంగారం వద్దు నా ఒరిజనల్ బంగారం నాకు ఇవ్వండి అని బ్యాంకు వారి వద్దనే వదిలి వచ్చానని సదరు బాధితుడు పేర్కొన్నాడు. ఈ విషయంపై బ్యాంకు మేనేజర్ మాట్లాడుతూ.. బ్యాంకు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి వారి ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు. తన బంగారం తనకు ఇవ్వాలంటున్న బాధితుడు బ్యాంకు అధికారులతో వాగ్వాదం మోతె ఎస్బీఐలో ఘటన -
నలుగురు ఆలయ ఉద్యోగుల సస్పెన్షన్
● మరో ఇద్దరికి చార్జీ మెమోలు జారీ●● చింతపండు చోరీ ఘటనలో అధికారుల చర్యలు యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట ఆలయ ప్రసాద విక్రయశాల గోదాంలో సరుకులు, చింతపండు చోరీ చేసిన ఘటనకు సంబంధించి నలుగురిని సస్పెండ్ చేయడంతో పాటు మరో ఇద్దరికి చార్జీ మెమోలు జారీ చేస్తూ దేవాదాయశాఖ కమిషనర్, ఆలయ ఈఓ వెంకట్రావ్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ చోరీకి ఘటనపై విచారణ చేసేందుకు నియమించిన కమిటీ ప్రసాద విక్రయశాల, గోదాంలను పరిశీలించి, ఉద్యోగులు, సిబ్బందిని విచారించి.. ఆ రిపోర్ట్ను ఈఓ వెంకట్రావ్కు అందజేశారు. ఆ నివేదికను పరిశీలించిన ఈఓ.. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన స్టోర్ గుమాస్తా పి. నవీన్ (సీనియర్ అసిస్టెంట్)తో పాటు సహాయ పాచకులు టి. వాసు, ఎస్బీ. సంతోష్, ఎస్. కృష్ణమాచార్యులను విధుల నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు. అదేవిధంగా ప్రసాద తయారీ స్టాక్, రిజిస్టర్లను పరిశీలించడంలో విఫలమైన పర్యవేక్షకులు ఎ. సత్యనారాయణశర్మ, వి. వెంకటేశంకు చార్జీ మెమోలు ఇచ్చారు. పెట్రోల్ బంక్ మిషన్లు పోలీస్ స్టేషన్కు తరలింపుమోత్కూర్: రైతు సేవా సహకార సంఘం ఆధ్వర్యంలో నడుస్తున్న పెట్రోల్ బంక్లోని మిషన్లను సోమవారం మోత్కూరు పోలీసులు పోలీస్ స్టేషన్ కు తరలించారు. వివరాలు.. మోత్కూరు మండలం దత్తప్పగూడెంలో 2020 డిసెంబర్లో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐఓసీ) సహకారంతో మోత్కూరు రైతు సేవా సహకార సంఘం ఆధ్వర్యంలో పెట్రోల్ బంక్ ఏర్పాటు చేశారు. ఏడాది క్రితం సంఘానికి నూతన పాలకవర్గం ఏర్పడగా.. వారు బంక్ వ్యవహారాలను పట్టించుకోలేదనే ఆరోపణలు ఉన్నాయి. ఫలితంగా బంక్ మూతబడింది. ఈ నేపథ్యంలో సోమవారం ఐఓసీ సిబ్బంది బంక్లో పెట్రోల్, డీజిల్ కొట్టే మిషన్లను ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా తమ వాహనంలో తరలిస్తుండగా.. సంఘం సీఈఓ కొనతం వరలక్ష్మి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు బంక్ వద్దకు చేరుకొని మిషన్లను తరలిస్తున్న వాహనాన్ని పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ ఘటనపై సంఘం సీఈఓ వరలక్ష్మిని వివరణ కోరగా.. గతంలో వినియోగదారుల సేవా కేంద్రంగా ఉన్న బంక్ను మూడు నెలల క్రితం కమర్షియల్గా మార్చినట్లు తెలిపారు. కలెక్టరేట్ నుంచి బీఫాం రావాల్సి ఉండడంతో వినియోగంలోకి తీసుకురాలేదని, ఐఓసీ సిబ్బంది తమకు సమాచారం ఇవ్వకుండానే మిషన్లు తీసుకెళ్తున్నారని పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు తెలిపారు. ఐఓసీ మేనేజర్తో మాట్లాడితే కొత్త మిషన్లు ఇస్తామని చెప్పారని పేర్కొన్నారు. విద్యుదాఘాతంతో ఐదు గేదెలు మృతిమునగాల: విద్యుత్ స్తంభం కూలడంతో భూమిపై పడిన కరెంట్ తీగలకు తగిలి ఐదు గేదెలు మృతిచెందాయి. ఈ ఘటన మునగాల మండలం తిమ్మారెడ్డిగూడెం గ్రామ శివారులో సోమవారం జరిగింది. బాధిత రైతులు తెలిపిన వివరాల ప్రకారం.. మునగాల మండలం కొక్కిరేణి గ్రామానికి చెందిన గడ్డం రామానుజంకు చెందిన రెండు గేదెలు, ఎల్లావులు వెంకన్న, ఎల్లావుల సంతోష్, తెలిబోయిన నాగరాజుకు చెందిన మూడు గేదెలను సోమవారం ఉదయం మేత కోసం వదిలారు. గేదెలు మేత మేసుకుంటూ వెళ్లి తిమ్మారెడ్డిగూడెం శివారులో విద్యుత్ స్తంభం కూలడంతో భూమి మీద పడిన కరెంట్ తీగలను తాకి విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందాయి. గేదెల విలువ రూ.2.50లక్షలు ఉంటాయని, తమకు నష్టపరిహారం ఇప్పించాలని బాధితులు కోరుతున్నారు. బస్సు టైరు కిందపడి వృద్ధురాలికి గాయాలు కొండమల్లేపల్లి: వృద్ధురాలు ఆర్టీసీ బస్సు టైరు కిందపడి తీవ్రంగా గాయపడింది. ఈ ఘటన కొండమల్లేపల్లి ఆర్టీసీ బస్టాండ్లో సోమవారం జరిగింది. పెద్దవూర మండలం కల్వకుర్తికి చెందిన ముదిరెడ్డి ప్రమీల హైదరాబాద్లో ఉంటున్న తన కుమార్తె వద్దకు వెళ్లి సోమవారం తిరిగి స్వగ్రామానికి వెళ్తోంది. హైదరాబాద్ నుంచి బస్సులో వచ్చి కొండమల్లేపల్లి బస్టాండ్లో దిగింది. అనంతరం స్వగ్రామానికి వెళ్లడానికి మిర్యాలగూడ బస్సు ఎక్కాల్సిన ఆమె పొరపాటున నల్లగొండ బస్సు ఎక్కింది. అది మిర్యాలగూడ బస్సు కాదని తెలిసి బస్సు దిగుతుండగా జారి టైరు కిందపడింది. ఆమె ఎడమ కాలు పైనుంచి బస్సు వెళ్లడంతో కాలు నుజ్జునుజ్జయ్యింది. స్థానికులు ఆమెను దేవరకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అనంతరం హైదరాబాద్కు తీసుకెళ్లారు. బాధితురాలి బంధువుల ఫిర్యా దు మేరకు డ్రైవర్పై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ అజ్మీరా రమేష్ తెలిపారు. -
ఉరేసుకుని గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్య
నార్కట్పల్లి: నార్కట్పల్లి మండల కేంద్రం సమీపంలోని బృందావన్ వెంచర్ వద్ద రోడ్డు పక్కన చెట్టుకు సోమవారం తెల్లవారుజామున గుర్తుతెలియని వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానిక ఎస్ఐ క్రాంతికుమార్ తెలిపారు. మృతుడి వయస్సు సుమారు 45ఏళ్లు ఉండవచ్చని, అతడి చేతికి కంకణం, ఒంటిపై జంజం, మెడలో తాయత్తు ఉందని ఎస్ఐ పేర్కొన్నారు. మృతుడి వివరాలు తెలిసిన వారు 6309680086, 8712670186 నంబర్లను సంప్రదించాలని సూచించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.మనస్తాపంతో బలవన్మరణంఆత్మకూరు(ఎం): ఆత్మకూరు(ఎం) మండల కేంద్రానికి చెందిన బిర్రు శ్రీనివాస్(67) సోమవారం సాయంత్రం ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. శ్రీనివాస్ భార్య పది నెలల క్రితం అనారోగ్యంతో మృతి చెందింది. అప్పటి నుంచి శ్రీనివాస్ పక్షవాతానికి గురయ్యాడు. దీంతో మనస్తాపానికి గురై సోమవారం సాయంత్రం ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. అందరి వివాహాలు అయ్యాయి. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. విధుల్లో చేరిన వారం రోజుల్లోనే.. ● పవర్ప్లాంట్ నీటిలో మునిగి వ్యక్తి మృతిమఠంపల్లి: తాత్కాలిక ఉద్యోగిగా పవర్ ప్లాంట్లో విధుల్లో చేరిన వారం రోజుల్లోనే నీటిలో మునిగి వ్యక్తి మృతిచెందాడు. వివరాలు.. మఠంపల్లి మండలం యాతవాకిల్ల వద్ద గల వేములూరు రిజర్వాయర్పై నిర్మించిన పవర్ ప్లాంట్లో తాత్కాలిక ఉద్యోగిగా పనిచేస్తున్న నేరేడుచర్ల మండలం పీర్లగూడేనికి చెందిన షేక్ ఉస్మాన్ (35) సోమవారం పవర్ ప్లాంట్ గేట్లకు మర్మతులు చేస్తూ నీటిలో మునిగి మృతిచెందాడు. సమాచారం తెలుసుకున్న హుజూర్నగర్ సీఐ గజ్జె చరమందరాజు, ఎస్ఐ పి. బాబు ఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. నాగార్జునసాగర్ నుంచి గజ ఈతగాళ్లను పిలిపించి గాలింపు చర్యలు చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. -
యాదగిరి క్షేత్రంలో కోలాహలం
యాదగిరిగుట్ట: నిత్యపూజలు, భక్తుజనులతో ఆదివారం యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి దివ్యక్షేత్రంలో కోలాహలం నెలకొంది. వేకువజామున స్వామి వారి మేల్కొలుపులో భాగంగా సుప్రభాత సేవ చేపట్టిన అర్చకులు.. గర్భాలయంలో స్వయంభూలు, సువర్ణ ప్రతిష్ఠా అలంకారమూర్తులకు అభిషేకం, సహస్రనామార్చనలు చేశారు. అనంతరం ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజవాహనసేవ, స్వామి, అమ్మవారి నిత్యకల్యాణ వేడుక ఆగమశాస్త్రం ప్రకారం నిర్వహించారు. ముఖ మండపంలో అష్టోత్తర పూజలు, సాయంత్రం ఆలయంలో వెండి జోడు సేవను ఊరేగించారు. ఆయా వేడుకల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. రాత్రి శ్రీస్వామి, అమ్మవార్లకు శయనోత్సవం చేసి ఆలయద్వారబంధనం చేశారు. -
ఆలయం, భక్తుల భద్రతకు ప్రాధాన్యం
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం, భక్తుల భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తుందని, అందుకోసం పటిష్ట భద్రత ఏర్పాటు చేయాలని ఆలయ ఈవో వెంకట్రావ్ ఆదేశించారు. ఆలయ భ్రదతపై ఆదివారం యాదగిరికొండపైన ప్రధాన కార్యాలయంలో ఉన్నతాధికారులతో సమీక్షించారు. భద్రతను కట్టుదిట్టం చేసే చర్యల్లో భాగంగా ఎస్పీఎఫ్, హోంగార్డులను పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. సెక్యూరిటీ, సీసీ కెమెరాల పనితీరును మెరుగుపర్చాలని ఆదేశించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన సీసీ కెమెరాలను అదనంగా ఏర్పాటు చేయాలని సూచించారు. వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా జూలైలో దేవస్థానం ఆధ్వర్యంలో ఆలయ పరిధిలోని ఐదు ప్రాంతాల్లో మొక్కలు నాటనున్నట్లు వెల్ల డించారు. అందుకు అవసరమైన మొక్కలు సమకూర్చుకోవాలని స్పష్టం చేశారు. అంతేకాకుండా వాహన పూజల స్థలాన్ని ఘాట్ రోడ్డు–2 సర్కిల్ పక్కన ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో డిప్యూటీ ఈఓ దోర్భల భాస్కర్శర్మ, ఆలయ అధికారులు దయాకర్రెడ్డి, నవీన్కుమార్, జే.కృష్ణ, గజివెల్లి రమేష్బాబు, శ్రావణ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఆలయ ఈఓ వెంకట్రావ్ -
ధరల భారం!
ఇందిరమ్మ ఇళ్లకుపెరిగిన స్టీల్, సిమెంట్, ఇసుక, కంకర ధరలుసాక్షి,యాదాద్రి : పెరిగిన సిమెంట్, స్టీల్, ఇసుక ధరలతో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణదారులపై భారం పడుతోంది. ఇళ్ల నిర్మాణాలు గాడిన పడుతున్న తరుణంలోనే సామగ్రి రేట్లు అధికం కావడం ప్రతిబంధకంగా మారింది. వీటికి తోడు కంకర, కూలి రేట్లు సైతం పెంచారు. పెరిగిన ధరలను బట్టి ఒక్కో ఇంటిపై రూ.3 నుంచి రూ.4లక్షల వరకు అదనపు భారం పడేలా ఉందని లబ్ధిదారులు వాపోతున్నారు. రెండు విడతల్లో మంజూరైన ఇళ్లు..తొలి విడతలో జిల్లాలోని 17 గ్రామాల్లో పైలట్ ప్రాజెక్టు కింద 761 ఇళ్లు మంజూరయ్యాయి. రెండో విడతలో నియోజకవర్గాల వారీగా 8,191 ఇళ్లు మంజూరయ్యాయి. ఇందులో మొదటి, రెండో పేజ్ కలిపి సుమారు 4వేల ఇళ్లు వివిధ దశల్లో ఉన్నాయి. ప్రభుత్వం విడతల వారీగా లబ్ధిదారుకు రూ.5లక్షల సాయం అందజేస్తుంది. మండుతున్న సిమెంట్..ఇందిరమ్మ ఇంటికి 500 నుంచి 525 బస్తాల సిమెంట్ కావాలి. నెల రోజుల క్రితం బస్తా ధర రూ.280 ఉండగా ప్రస్తుతం గ్రేడ్ను బట్టి ఒక్కో బస్తాపై రూ.50నుంచి రూ.80 వరకు విక్రయిస్తున్నారు. పాత ధర ప్రకారం రూ.1,47,000 సిమెంట్ ఖర్చు వచ్చేది. ప్రస్తుత రేటును బట్టి కట్టకు రూ.50 అదనంగా వేసుకున్నా రూ.1,73,250 అవుతుంది. ఈ లెక్కన ఒక్కో లబ్ధిదారుడిపై సిమెంట్ రూపేణా రూ.26,250 వరకు అదనపు భారం పడుతోంది. కట్టకు రూ.80 అయితే రూ.1,89,000 అవుతుంది. ట్రాక్టర్ ఇసుక రూ.3,500కుపైనే..ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక ఉచితంగా సరఫరా చేయాల్సి ఉంది. కానీ, ట్రాక్టర్ల యజమానులు నిబంధనలు తుంగలో తొక్కుతున్నారు. ట్రిప్పు ఇసుకకు రూ.3,500 వరకు వసూలు చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో రూ.4వేల వరకు తీసుకుంటున్నట్లు లబ్ధిదారులు వాపోతున్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ముందు ట్రాక్టర్ ఇసుక ఏరియాను బట్టి రూ.1,500 నుంచి రూ.రెండు వేల వరకు సరఫరా చేసేవారు. స్టీల్ ధరలకు రెక్కలుస్టీల్ ధర కంపెనీని బట్టి గతంలో క్వింటా కనిష్టంగా రూ.5,500 ఉండగా ఇప్పుడు గరిష్టంగా రూ.7,800కు చేరింది. ఇంటి నిర్మాణానికి కనీసం 1.50 టన్నుల స్టీల్ పడుతుందని లబ్ధిదా రులు చెబుతున్నారు. రూ.5,500 చొప్పున రూ.82,500 అవుతుండగా.. సగటున క్వింటాకు రూ.7,500 చొప్పున రూ.1,12,500 ఖర్చవుతుంది. ఈ లెక్కన రూ.30,000 వరకు అదనపు భారం పడుతుంది. రాయి, దొడ్డు కంకరకు రూ.1,800 పెంపుబేస్మెంట్ నిర్మాణానికి రాయి తప్పనిసరి. గతంలో ట్రాక్టర్ రాయి, దొడ్డు కంకర రూ.3,200 ఉండగా ప్రస్తుతం రూ.3,500 నుంచి రూ.4,000 వరకు పలుకుతోంది. ఇక స్లాబ్లో ప్రత్యేకంగా సన్న కంకర వాడాల్సి ఉంటుంది. దాని ఖర్చు అదనం. ఇకనుంచి తహసీల్దార్ల పర్యవేక్షణలో ఇసుక సరఫరాఇసుక సమస్యను అధిగమించేందుకు యంత్రాంగం చర్యలు చేపట్టింది.కొరత ఉన్న ప్రాంతాలకు ఇసుక నిల్వలున్న వాగులు, మూసీ నుంచి అవసరం మేరకు సరఫరా చేయాలని నిర్ణయించారు. తహసీల్దార్ పర్యవేక్షణలో ఇసుక సరఫరా జరుగుతుంది. అలాగే గోదావరి రీచ్లనుంచి ఇసుక తీసుకువచ్చి నిల్వ చేయడానికి డిపోలు ఏర్పాటు చేయనున్నారు. ఇంటి నిర్మాణ సామగ్రి రేట్లు (రూ.ల్లో) మెటీరియల్ గతంలో ప్రస్తుతంసిమెంట్ (బస్తా) 280 330 - 360స్టీల్ (క్వింటా) 5,500 6,000 - 7,800ఇసుక (ట్రాక్టర్) 1500 3,500 - 4,000రాయి (ట్రాక్టర్) 3,200 3,000 - 4,000 ఇసుక (ట్రాక్టర్) 1,500 3,500 - 4,000కూలి (పురుషులు) 800 1,300మహిళలకు 500 1,000 అడ్డా కూలీలకు ఫుల్ డిమాండ్ ప్రభుత్వం ఇస్తున్న ఆర్థిక సాయం రూ.5 లక్షలు అదనంగా రూ.4 లక్షల వరకు ఖర్చు ధరల నియంత్రణకు చర్యలు తీసుకోవాలంటున్న లబ్ధిదారులుఅడ్డా కూలీలకూ ఫుల్ డిమాండ్ గతంలో అడ్డా కూలీకి పురుషులకు రోజుకు రూ.800 ఉండేది. ప్రస్తుతం రూ.1,300 అడుగుతున్నారు. మహిళలకు రూ.500 ఉండగా రూ.1000 డిమాండ్ చేస్తున్నారని, కూలి ఎక్కువ ఇచ్చినా కూలీలు దొరికే పరిస్థితి లేదని హమాలీలు చెబుతున్నారు. నేల స్వభావాన్ని బట్టి నిర్మాణ వ్యయం పెరిగిన సిమెంట్, స్టీల్, ఇసుక, రాయి, కంకర, కూలీల రేట్ల కారణంగా ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం ఇచ్చే రూ.5లక్షలకు అదనంగా మరో రూ.4లక్షల వరకు ఖర్చు వస్తుందని లబ్ధిదారులు అంటున్నారు. నేల స్వభావాన్ని బట్టి కూడా నిర్మాణ వ్యయం పెరుగుతుంది. చౌడు నేలలో తప్పనిసరిగా పిల్లర్లు పోయాల్సి వస్తుండటంతో మరింత భారం పడుతుంది. -
నిజామాబాద్కు బస్సు సౌకర్యం
రాజాపేట: యాదగిరిగుట్ట డిపో నుంచి రాజాపేట మండలంలోని రఘునాథపురం మీదుగా నిజామాబాద్కు ఆదివారం బస్సు సర్వీస్ను ప్రారంభించారు. బస్సుకు గ్రామస్తులు స్వాగతం పలికారు. నిజామాబాద్కు బస్సు సౌకర్యం కల్పించినందుకు రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, గుట్ట డిపో మేనేజర్కు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ శ్రవణ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్గా రజనీభువనగిరిటౌన్ : జిల్లా కేంద్రంలోని ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి కోర్టుకు గవర్నమెంట్ అసిస్టెంట్ ప్లీడర్గా సీనియర్ అడ్వకేట్ రజనీని నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం తరఫున సివిల్ కేసులను ఆమె వాదించనున్నారు. మూడేళ్ల పాటు అసిస్టెంట్ ప్లీడర్గా కొనసాగుతారని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. తన నియామకానికి సహకరించిన ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. -
అరచేతిలో అందం.. ఆరోగ్యం..!
సూర్యాపేట అర్బన్, రామగిరి(నల్లగొండ): ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు అతివలకు గోరింటాకు గుర్తుకువస్తుంది. ఆషాఢం గడిచేలోగా ఏదో ఒక రోజున గోరింటాకు పెట్టుకొని తీరాలంటూ పెద్దలు చెబుతారు. అతివలకు ఆరోగ్యంతోపాటు ఆధ్యాత్మికాన్ని పెంపొందించే గోరింటాకు సందడి జిల్లాలో మొదలైంది. ఆషాఢంలో గోరింటాకు పెట్టుకోవడం సౌభాగ్యానికి, శ్రేయస్సుకు సంకేతంగా భావిస్తారు. గోరింటాకు మహిళల చేతులు, కాళ్లకు కొత్త అందాన్నిస్తుంది. యువతుల చేతికి గోరింటాకు ఎంత ఎర్రగా పండితే.. అంత మంచి భర్త దొరుకుతాడని విశ్వసిస్తారు. గోరింటాకు శుభానికి చిహ్నంగా భావిస్తారు. అనేక ఔషధ గుణాలు వేసవిలో మన శరీరం వేడితో కూడుకుని ఉంటుంది. ఆషాఢంలో బయటి వాతావరణం చల్లబడిపోతుంది. అలాంటి సమయంలో మన శరీరంలోని వేడి.. బయట చల్లబడిన వాతావరణానికి విరుద్ధంగా తయారవుతుంది. దీంతో అనారోగ్య సమస్యలు వస్తాయి. గోరింటాకుకు శరీరంలో ఉండే వేడిని తగ్గించే శక్తి ఉంటుంది. అంతేకాకుండా గోరింటాకు రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. ఆషాడంలో గోరింటాకు తప్పకుండా పెట్టుకోవా లని డాక్టర్లు కూడా చెప్తున్నారు. ఆరోగ్యానికి ఎంతో మేలు గోరింటాకు పెట్టుకోవడంతో అంటురోగాలు దరికి చేరవు. గోరింటాకు శరీరాన్ని చల్ల పరచడానికి సహాయపడుతుంది. జ్వరం, తలనొప్పిని తగ్గిస్తుంది. జుట్టును రాలకుండా సంరక్షిస్తుంది. కేశాల పెరుగుదలకు సహాయపడుతుంది. చుండ్రును తొలగించేందుకు ఎంతగానో ఉపయోగపడుతుంది. రుతువు మారడంతో మహిళలు గోరింటాకు పెట్టుకోవడం ఆరోగ్యానికి మంచిది. – డాక్టర్ పాల ఆనంద్, జనరల్ మెడిసిన్, సూర్యాపేట రవీంద్రనగర్లో గోరింటాకు పెట్టుకుంటున్న మహిళలుప్రయోజనాలు ఇలా.. ఫ చర్మ వ్యాధుల నుంచి రక్షణ ఫ ఒంట్లోని వేడిని తగ్గించడం ఫ రోగనిరోధక శక్తిని పెంచడం ఫ రక్త ప్రసరణను మెరుగుపర్చడం ఫ గోళ్లను ఆరోగ్యంగా ఉంచడంగోరింటాకును శుభకార్యాలు, పండుగలప్పుడు పెట్టుకోవడం ఆనవాయితీ. కొన్ని సంప్రదాయాల ప్రకారం గోరింటాకు గర్భాశయ దోషాలను తొలగిస్తుందని, సీ్త్ర ఆరోగ్యాన్ని కాపాడుతుందని నమ్ముతారు. ఆయుర్వేధంలో గోరింటాకు వేర్లు, బెరడు, ఆకులు, పూలు, విత్తనాలు అన్నీ ఔషధ గుణాలు కలిగి ఉన్నాయని చెబుతారు. ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోవడం సీ్త్రలకు సౌభాగ్యానికి చిహ్నంగా భావిస్తారు. ఇది సీ్త్ర తత్వానికి, అందానికి ప్రతీక అని నమ్ముతారు. ఆషాఢంలో మహిళలు గోరింటాకు పెట్టుకోవడం ద్వారా సౌభాగ్యాన్ని పొందిన వారవుతారని జ్యోతిష్యులు అంటున్నారు. పట్టణాల్లో సామూహికంగా..పట్టణాల్లో పలు కాలనీలలో మహిళలు ఒక చోట చేరి గోరంటాకు సేకరిస్తారు. సంప్రదాయ పద్ధతిలో రోలులో గోరంటాకును నూరుతారు. అంతా ఒకచోట సమూహంగా కూర్చొని పాటలు పాడుతూ ఒకరికొకరు గోరింటాకు పెట్టుకుంటారు. ●దోషాలను నివారిస్తుందిఆషాఢ మాసంలో అతివల గోరింటాకు సందడి ఫ సౌభాగ్యానికి, శ్రేయస్సుకు సంకేతంగా భావిస్తున్న మహిళలు ఫ పట్టణాల్లోని కాలనీల్లో సామూహికంగా వేడుకలు ఫ గోరింటాకు పెట్టుకుని మురిసిపోతున్న అతివలు -
పెండింగ్ కేసులకు పరిష్కారం చూపండి
భువనగిరిటౌన్ : రాజీ పడదగిన కేసులతో పాటు ఇతర కేసులు త్వరగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ అధ్యక్షులు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జయరాజు ఆదేశించారు. శనివారం జిల్లా కోర్టులో జరిగిన జిల్లా స్థాయి కోఆర్డినేషన్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. పెండింగ్ కేసులు, నాన్ బెయిలబుల్ వారంట్లు తదితర అంశాలపై సమీక్షించి సూచనలు చేశారు. చిన్నచిన్న కేసులను త్వరగా పరిష్కరించడం వల్ల రాజీకి ఆమోదయోగ్యంకాని కేసులపై దృష్టి సారించవచ్చన్నారు. అనంతరం భువనగిరిలోని సబ్ జైల్ను ఆయన సందర్శించి ఖైదీలతో ముఖాముఖి సమావేశం అయ్యారు. న్యాయ సహకారం అవసరమైన ఖైదీలు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. సమావేశంలో మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి ముక్తిదా, జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి మాధవిలత, ప్రధాన సీనియర్ సివిల్ జడ్జి ఉషశ్రీ, అదనపు డీసీపీ లక్ష్మీనారాయణ, ఏసీపీలు పాల్గొన్నారు.ఫ జిల్లా ప్రధాన న్యాయమూర్తి జయరాజు -
ఏసీపీగా విజయ్కుమార్
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ ఏసీపీగా జి.విజయ్కుమార్ను నియమిస్తూ డీజీపీ శనివారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. ఇక్కడ విధులు నిర్వహిస్తు న్న ఏసీపీ సైదులు గతంలోనే బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో కరీంనగర్ సీసీఆర్బీలో ఏసీపీగా పనిచేస్తున్న విజయ్కుమార్ను నియమించారు. ఒకటి, రెండు రోజుల్లో విజయ్కుమార్ బాధ్యతలు స్వీకరించనున్నారు. దరఖాస్తుల ఆహ్వానంభువనగిరి : మండలంలోని అనంతారం పరిధిలో గల పూలే బీసీ బాలుర డిగ్రీ కళాశాలలో గెస్ట్ ఫ్యాకల్టీల నియామకానికి దరఖాస్తులు కోరుతున్నట్లు ప్రిన్సిపాల్ స్వప్న శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.గణితం, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులకు సంబంధించి వివిధ విభాగాల్లో ఖాళీ పోస్టులను భర్తీ చేస్తున్నట్లు తెలిపారు. అర్హత కలిగిన అభ్యర్థులు జూలై 3వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాల కోసం సెల్ నంబర్లు 9948984800, 7396121244ను సంప్రదించాలని కోరారు. హెల్మెట్తో రక్షణ భువనగిరి : విధి నిర్వహణలో తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని విద్యుత్ శాఖ ఎస్ఈ సుధీర్కుమార్ సిబ్బందికి సూచించారు. సేఫ్టీ వారోత్సవాల్లో భాగంగా శనివారం స్థానిక సర్కిల్ కార్యాలయంలో విద్యుత్ సిబ్బందితో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. విధి నిర్వహణలో భాగంగా ప్రమాదకరమైన పనులు చేసే అవకాశం ఉంటుందని, అలాంటప్పుడు హెల్మెట్, హ్యాండ్ గ్లౌజ్లు తది తర రక్షణ కవచాలను ధరించాలని సూచించారు. అనంతరం సిబ్బందికి హెల్మెట్లు అందజేశారు. టిప్పర్లకు జరిమానా రాజాపేట : మండలంలోని చల్లూరు మల్వ వాని చెరువునుంచి అనుమతి లేకుండా మట్టి తరలిస్తున్న టిప్పర్లకు లక్ష 22 వేల 866 రూపా యలు జరిమానా విధించారు. వారం రోజులు గా అనుమతి లేకుండా మల్వవాని చెరువునుంచి టిప్పర్ల ద్వారా అక్రమంగా మట్టి తరలిస్తున్నారు. 100 కాల్ ద్వారా అందిన ఫిర్యాదు మేరకు పోలీసులు దాడులు నిర్వహించి 23 టిప్పర్లను పట్టుకున్నారు. వాటిని మైనింగ్ అధికారులకు అప్పగించగా జరిమానా విధించారు. చెరువునుంచి ఎంత మట్టి తరలించారన్న విషయాన్ని త్వరలో వెల్లడిస్తామని ఏడీ తెలిపారు. ప్రతి దరఖాస్తునూ పరిశీలించాలి భువనగిరి, చౌటుప్పల్ : భూ భారతి రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన ప్రతి దరఖాస్తును క్షుణ్నంగా పరిశీలించి పరిష్కారం చూపాలని అదనపు కలెక్టర్ వీరారెడ్డి ఆదేశించారు. శనివారం ఆయన భువనగిరి, చౌటుప్పల్ ఆర్డీఓ కార్యాలయాలను సందర్శించారు. ఆర్డీఓలు, తహసీల్దార్లు, డీటీలు, ఆర్ఐలతో సమావేశమై దరఖాస్తుల పరిష్కారంపై సమీక్షించారు. పాత రికార్డుల ఆధారంగానే దరఖాస్తులను పరిష్కరించాలని, తప్పులకు తావుండరాదన్నారు. సమావేశంలో ఆర్డీఓలు కృష్ణారెడ్డి, శేఖర్రెడ్డి, తహసీల్దార్లు శ్రీ నివాస్రెడ్డి, వీరాభాయి, దశరథనాయక్, లాల్బహదూర్సింగ్, శ్రీనివాస్రెడ్డి, డిప్యూటీ తహసీల్దార్లు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు. టీజీఈఏపీ సెట్ కౌన్సిలింగ్ ప్రారంభం రామగిరి(నల్లగొండ): ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలలో ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు టీజీఈఏపీ సెట్ –2025 కౌన్సెలింగ్ శనివారం ప్రారంభమైంది. నల్లగొండలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల హెల్ప్లైన్ సెంటర్లో కౌన్సెలింగ్కు ఏర్పాట్లు పూర్తి చేసినట్టు ప్రిన్సిపాల్ నరసింహారావు తెలిపారు. ఎంపీసీ స్ట్రీమ్లో అర్హత సాధించిన విద్యార్థులకు మూడు విడతలుగా కౌన్సెలింగ్ ప్రక్రియ పూర్తి చేయనున్నట్లు తెలిపారు. కౌన్సెలింగ్కు హాజరయ్యే విద్యార్థులు టీజీఈఏపీ సెట్ ర్యాంక్ కార్డ్, సెట్ హాల్ టికెట్, ఎస్ఎస్సీ మెమో, ఇంటర్ మెమో, స్టడీ సర్టిఫికెట్స్, ఒరిజినల్ టీసీ, కుల ఆధాయ ధ్రువీకరణ పత్రాలు తీసుకోని రావాలన్నారు. -
ఉపాధ్యాయురాలిపై ఐలయ్య ఆగ్రహం
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట పట్టణంలోని పాత గోశాల జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల తనిఖీకి వెళ్లిన ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్యకు చేదు అనుభవం ఎదరైంది. శనివారం మధ్యాహ్న సమయంలో పాఠశాలను ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. విద్యార్థుల వండిన భోజనాన్ని పరిశీలించారు. భోజనం నాణ్యతగా ఉండటంలేదని, మెనూ అమలు చేస్తలేరని విద్యార్థులు ఐలయ్య దృష్టికి తీసుకెళ్లారు. దీంతో మధ్యాహ్న భోజన ఇంచార్జిగా ఉన్న ఉపాధ్యాయురాలు రాధికను పిలిపించారు. మెనూ ప్రకారం శనివారం మిక్స్డ్ కూరగాయలు ఉండాలని.. కానీ, ఎక్కువగా దోసకాయలు ఉండటం ఏమిటని ప్రశ్నించారు. అందుకు ఆమె ప్రభుత్వ విప్పైకి వేలు చూపుతూ.. భోజనం ఇట్లానే ఉంటదని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పింది. అవాకై ్కన ఐలయ్య.. ఆమైపె ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే సంబంధిత ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై మధ్యాహ్న భోజన ఇంచార్జి టీచర్ రాధికను వివరణ కోరగా.. తనను మహిళ అని చూడకుండా అగౌరవపరిచేలా మాట్లాడారని చెప్పారు. -
జనగణనకు సనా్నహాలు
సిబ్బంది జాబితా, గ్రామాల వారీగా మ్యాప్లు రెడీసాక్షి, యాదాద్రి: 16వ జనాభా లెక్కల సర్వేకు జిల్లా యంత్రాంగం సమాయత్తమవుతోంది. జనగణనకు సంబంధించి ఇటీవల కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లలో యంత్రాంగం నిమగ్నమైంది. ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లు, పర్యవేక్షణ అధికారుల నియామకం, సమకూర్చుకోవాల్సిన సామగ్రి తదితర అంశాలపై దృష్టి సారించింది. ఇప్పటికే సిబ్బంది నియామకం, గ్రామాల వారీగా మ్యాప్లు కొలిక్కి వచ్చాయి. చివరి సారిగా 2011లో జనాభా లెక్కింపు సాధారణంగా ప్రతి పదేళ్లకోసారి జనాభా లెక్కలు వెల్లడిస్తారు. చివరిసారి 2011లో జనగణన చేపట్టారు. నాటి లెక్కల ప్రకారం జిల్లా జనాభా 7,70,833 మంది ఉన్నారు. ఆ తరువాత 2021లో లెక్కించాల్సి ఉండగా కరోనా కారణం వల్ల ప్రక్రియ నిలిచిపోయింది. తాజాగా కేంద్రం జనగణన గెజిట్ విడుదల చేయడంలో జిల్లాలోనూ జనాభాను లెక్కించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. గతంలో పేపర్ ద్వారా జనగణన చేపట్టగా.. ఈసారి జిటల్ మొబైల్ యాప్ ద్వారా సర్వే చేయనున్నారు. జిల్లా, మండల స్థాయిలో కమిటీలు జనాభా లెక్కల సేకరణకు జిల్లా, మండల స్థాయిలో ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేయనున్నారు. కలెక్టర్, అదనపు కలెక్టర్(రెవెన్యూ), డీఆర్ఓ, చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్, మరికొందరు అధికారులతో జిల్లా కమిటీ ఉంటుంది. మండల స్థాయిలో తహసీల్దార్, ఏఎస్ఓ(అసిస్టెంట్ స్టాటిస్టికల్ అధికారి)తో కమిటీ ఉంటుంది. తహసీల్దార్ జనాభా లెక్కల సేకరణ అధికారిగా, ఏఎస్ఓ సహాయ అధికారిగా వ్యవహరిస్తారు. డిజిటల్ మొబైల్ యాప్తో సర్వేఉపాధ్యాయులను ఎన్యూమరేటర్లుగా నియమించనున్నారు. ఐదుగురు ఎన్యూమరేటర్లకు ఒక సూపర్వైజర్ ఉంటాడు. వీరికి జిల్లా పరిధిలోనే వివిధ స్థాయిల్లో శిక్షణ ఇస్తారు. ఉన్నతస్థాయి కమిటీలకు హైదరాబాద్లో శిక్షణ ఉంటుంది.ఈసారి డిజిటల్ మొబైల్ యాప్ను జనాభా లెక్కల సేకరణకు వినియోగించనున్నారు. పట్టణ జనాభాపై దృష్టిపెరుగుతున్న పట్టణీకరణకు అనుగుణంగా శివారు ప్రాంతాలను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మున్సిపాలిటీల శివారు ప్రాంతాలను గుర్తించి వాటిని విస్తరించేందుకు అనువైన పరిస్థితులను గుర్తించే ప్రక్రియ ఇప్పటికే మొదలైంది. వీటి అభివృద్ధికి జనాభా లెక్కలు దోహదపడనున్నాయి.రెండు విడతల్లో లెక్కింపురెండు విడతల్లో జనాభా లెక్కించనున్నారు. మొదటి విడత 2025 అక్టోబర్ 1, రెండో దశ 2027 మార్చి1 నాటికి జనాభా లెక్కలు సేకరించనున్నారు. ఎన్యుమరేటర్లు ప్రతి ఇంటికి రెండుదఫాలు వెళ్తారు. మొదటి సారి ఇళ్లను లెక్కించడంతో పాటు కుటుంబ స్థితిగతులు, ఆస్తులు, ఆదాయం, వసతులు వంటి అంశాలను సేకరిస్తారు. రెండో దశలో జనాభా వివరాలు సేకరించేందుకు ఇంటింటికి వెళ్తారు. కుల, ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక సమాచారం సేకరిస్తారు. ముఖ్య ప్రణాళిక, రెవెన్యూ, మున్సిపల్, పంచాయతీ శాఖల అధికారులు, ఎన్యూమరేటర్లు సేకరించి రూపొందించిన జాబితాల ఆధారంగా ప్రత్యేక కమిటీలు క్షేత్రస్థాయికి వెళ్లి నిర్ధారిస్తాయి. ఎన్యూమరేటర్లుగా ఉపాధ్యాయులు పర్యవేక్షణకు జిల్లా, మండల స్థాయిలో కమిటీలు త్వరలో హైదరాబాద్లో, జిల్లా పరిధిలోనూ శిక్షణ బ్లాక్లుగా ఇళ్ల విభజన 2027 మార్చి 1వ తేదీ నాటికి జనాభా లెక్కల సేకరణజిల్లా స్వరూపం భౌగోళిక విస్తీర్ణం 3,795 కి.మీ రెవెన్యూ గ్రామాలు 321మండలాలు 17మున్సిపాలిటీలు 06పంచాయతీలు 428మొత్తం జనాభా (2011 లెక్కల ప్రకారం) 7,70,833పురుషులు 3,90,492మహిళలు 3,80,341గ్రామీణ జనాభా 6,47,668పట్టణ జనాభా 1,23,165నివాస గృహాలు 1,88,520 -
సాగు చట్టాలపై అవగాహన అవసరం
భూదాన్పోచంపల్లి, చౌటుప్పల్, సంస్థాన్నారాయణపురం : సాగు చట్టాల గురించి రైతులకు తెలిసి ఉండాలని, వాటిపై అవగాహన కల్పించడమే సాగు న్యాయయాత్ర ప్రధాన ఉద్దేశమని తెలంగాణ రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి తెలిపారు. శనివారం భూదాన్పోచంపల్లిలోని వినోబాభావే మందిరం నుంచి లీఫ్స్ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు భూమి సునీల్ ఆధ్వర్యంలో సాగు న్యాయయాత్రకు శ్రీకారం చుట్టారు. యాదాద్రి జిల్లా పరిధిలో పోచంపల్లి, చౌటుప్పల్, సంస్థాన్నారాయణపురం మండలాల్లో యాత్ర కొనసాగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశాల్లో భూమి సునీల్తో కలిసి ఆయన మాట్లాడారు. పెరిగిన సాగు పెట్టుబడికి అనుగుణంగా దిగుబడి రాకపోవడంతో రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారని పేర్కొన్నారు. ముఖ్యంగా నకిలీ విత్తనాలు, ఎరువుల వాడకం వల్ల నష్టపోయినప్పుడు, పంటల బీమా వర్తించనప్పుడు చట్టాల ద్వారానే లబ్ధిపొందడం సాధ్యమవుతుందన్నారు. అందుకే సాగు చట్టాలపై ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తుండాలని రైతులకు సూచించారు. రైతు కుటుంబంలో జన్మించిన రేవంత్రెడ్డి.. రైతుల సంక్షేమానికి అనేక పథకాలను అమలు చేస్తున్నారని కొనియాడారు. కార్యక్రమం ఏదైనాపోచంపల్లి నుంచే : సునీల్తాను ఇప్పటి వరకు చేపట్టిన ప్రతి కార్యక్రమాన్ని భూదాన్పోచంపల్లి నుంచే ప్రారంభించానని లీఫ్స్ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు భూమి సునీల్ గుర్తు చేశారు. కేంద్ర, రాష్ట్ర పరిధిలో కలిపి భూమి, వ్యవసాయానికి సంబంధించి 174 చట్టాలు ఉన్నాయని, వీటిపై రైతులకు అవగాహన ఉండాలన్నారు.హైదరాబాద్లోని బాపుఘాట్ వద్ద అక్టోబర్ 2న యాత్ర ముగుస్తుందన్నారు. యాత్రలో తమ దృష్టికి వచ్చిన సమస్యలను ప్రభుత్వం ముందుంచుతామని చె ప్పారు. హైకోర్టు, సుప్రీంకోర్టుకు నివేదిస్తామన్నారు. భూదానస్థూపం వద్ద నివాళిభూదాన్పోచంపల్లిలో ఆచార్య వినోబాభావే, వెదిరె రాంచంద్రారెడ్డి విగ్రహాలతో పాటు భూదానస్థూ పం వద్ద పూలమాలలు వేసి నివాళులర్పించారు. సాగు న్యాయయాత్ర కరపత్రాలను ఆవిష్కరించారు. రైతుల సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జలాల్పురం గ్రామానికి చెందిన రైతు గోరంటి శ్రీనివాస్రెడ్డి లీఫ్స్సంస్థకు రూ.50వేల ఆర్థిక సహాయం అందజేశారు. కార్యక్రమంలో రైతు కమిషన్ సభ్యుడు కేవీఎన్ రెడ్డి, భూదానయజ్ఞబోర్డు మాజీ అధ్యక్షుడు గున్నా రాజేందర్రెడ్డి, లీఫ్స్ సంస్థ ప్రతినిధులు జీవన్రెడ్డి, మల్లేశ్, అభిలాష్, రవి, ప్రవీణ్, గాంధీగ్లోబల్ ఫ్యామిలీ ప్రతినిధి యానాల ప్రభాకర్రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పాక మల్లేశ్, డీసీసీ ఉపాధ్యక్షులు కళ్లెం రాఘవరెడ్డి, సామ మధుసూధన్రెడ్డి, నర్సింహారెడ్డి, పీఏసీఎస్ వైస్చైర్మన్ సామ మోహన్రెడ్డి, ఏడీఏ వెంకటేశ్వర్రావు, మున్సిపల్ మాజీ చైర్మన్ రాజు, మార్కెట్ వైస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి, ఏఓ నాగరాజు, పీఏ సీఎస్ చైర్మన్ రఘుమారెడ్డి తదితరులు పాల్గొన్నారు.నారాయణపురంలో సమస్యల ఏకరువు నారాయణపురంలోని సర్వే నంబర్ 255లోని అసైన్డ్ భూముల్లో తరాతరాలుగా సాగు చేసుకుంటున్నామని, పట్టాలు కూడా ఇచ్చారని, బ్యాంకు రుణాలు తీసుకున్నామని, అధికారులు తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా భూములను తిరిగి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారని బాధిత రైతులు వాపోయారు. రాచకొండలోని రెవెన్యూ భూముల్లో ఎస్టీ, ఎస్సీ, బీసీ రైతులు సుమారు 3వేల మంది తరతరాలుగా సేద్యం చేసుకుంటున్నామని, అన్ని ఆధారాలున్నా ఆటవీ శాఖ ఆధికారులు తమను ఇబ్బంది పెడుతున్నారని, సాగు జాలాలు అందించేలా చర్యలు తీసుకోవాలని.. ఇలా వివిధ సమస్యలపై రైతులు, సీపీఐ నాయకులు విన్నవించినారు. ఈ కార్యక్రమంలో నీటి పోరాట నాయకుడు కేవీఎన్ రెడ్డి, గోవింద్, హరి, మల్లేష్, సీపీఐ మండల కార్యదర్శి దుబ్బక భాస్కర్, చిలుదేరు అంజయ్య, మందుగుల భాలకృష్ణ, ఏపూరి సతీష్, ధన్వంత్రెడ్డి పాల్గొన్నారు. రాష్ట్ర రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి, భూ చట్టాల నిపుణుడు భూమి సునీల్ లీఫ్స్ సంస్థ ఆధ్వర్యంలో సాగు న్యాయయాత్ర -
నేడు ఎంజీయూలో పరికరాల ప్రదర్శన
నల్లగొండ టూటౌన్: మహాత్మాగాంధీ యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు ఆవిష్కరించిన పరికరాలను శుక్రవారం యూనివర్సిటీలోని ఇంజనీరింగ్ కళాశాల ఆవరణలో ప్రదర్శించనున్నట్లు ప్రిన్సిపాల్ సీహెచ్. సుధారాణి గురువారం తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా వైస్ చాన్స్లర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్, రిజిస్ట్రార్ అల్వాల రవి హాజరుకానున్నట్లు ఆమె పేర్కొన్నారు. గురువారం వైస్ చాన్స్లర్ ఖాజా అల్తాఫ్ హస్సేన్ ప్రదర్శనకు సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆకుల రవి, రేఖ, జయంతి పాల్గొన్నారు. -
లంచం డిమాండ్.. పంచాయతీ కార్యదర్శి అరెస్ట్
పెన్పహాడ్: బొగ్గు బట్టీ నిర్వహణకు అనుమతి ఇచ్చేందుకు లంచం డిమాండ్ చేసిన పంచాయతీ కార్యదర్శిని ఏసీబీ అధికారులు గురువారం అరెస్ట్ చేశారు. నల్లగొండ రేంజ్ ఏసీబీ డీఎస్పీ జగదీష్ చందర్ తెలిపిన వివరాల ప్రకారం.. పెన్పహాడ్ మండలం నాగులపాటి అన్నారం గ్రామానికి చెందిన వ్యక్తి బొగ్గు బట్టీ నిర్వహణకు అనుమతి ఇవ్వాలని ఆ గ్రామ పంచాయతీ కార్యదర్శి అనంతుల సతీష్కుమార్కు దరఖాస్తు చేసుకున్నాడు. దీంతో పంచాయతీ కార్యదర్శి రూ. 15వేలు లంచం డిమాండ్ చేశాడు. అంత డబ్బు ఇవ్వలేనని, బతుకుదెరువు కోసం బొగ్గు బట్టీ పెట్టుకుంటున్నానని చెప్పినప్పటికీ కార్యదర్శి అనుమతి ఇవ్వలేదు. ఈ క్రమంలో బాధితుడు రూ.8వేలు ఇస్తానని చెప్పి ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. తన దగ్గర ఉన్న ఆధారాలను బాధితుడు ఏసీబీ అధికారులకు ఇవ్వడంతో అధికారులు విచారణ జరిపి పంచాయతీ కార్యదర్శి లంచం అడిగినట్లు రుజువు కావడంతో గురువారం అరెస్ట్ చేశారు. శుక్రవారం హైదరాబాద్లోని నాంపల్లి కోర్టులో హాజరుపర్చనున్నట్లు ఏసీబీ డీఎస్పీ జగదీష్ చందర్ తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
కనగల్: బైక్ను ట్రాక్టర్ ఢీకొట్టడంతో ఓ వ్యక్తి మృతిచెందగా.. అతడి కుమార్తెకు గాయాలయ్యాయి. ఈ ఘటన కనగల్ మండలం బోయినపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని కుమ్మరిగూడెం గ్రామ స్టేజీ వద్ద బుధవారం రాత్రి జరిగింది. ఎస్ఐ పి. విష్ణుమూర్తి తెలిపిన వివరాల ప్రకారం.. కనగల్ మండలం బచ్చన్నగూడెం గ్రామానికి చెందిన పల్లెబోయిన సత్తయ్య(43) రెండో కుమార్తె కావ్య బుధవారం సూర్యాపేటలో పరీక్ష రాసి రాత్రి 7గంటల సమయంలో కనగల్ బస్టాండ్కు వచ్చింది. ఆమెను ఆమెను సత్తయ్య బైక్పై ఎక్కించుకొని స్వగ్రామానికి వెళ్తుండగా.. కుమ్మరిగూడెం గ్రామ స్టేజీ వద్ద చండూరు మండలం తాస్కానిగూడెం గ్రామానికి చెందిన వంగూరి బిక్షం వేగంగా ట్రాక్టర్ నడుపుకుంటూ వచ్చి బైక్ను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో సత్తయ్య బైక్ పైనుంచి కిందపడగా అతడిపై మీద నుంచి ట్రాక్టర్ వెళ్లడంతో తీవ్రంగా గాయపడ్డాడు. బైక్ వెనుక కూర్చున్న కావ్యకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులిద్దరిని 108 వాహనంలో నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే సత్తయ్య మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. గురువారం పోస్టుమార్టం అనంతరం సత్తయ్య మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతుడి భార్య అలివేలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. ఫ అతడి కుమార్తెకు గాయాలు -
నిరంతర సాధనతోనే విజయాలు సాధ్యం
నల్లగొండ టూటౌన్: నిరంతర సాధనతోనే విజయాలు సాధ్యమని నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీలో విద్యార్థులకు ఉచిత పోటీ పరీక్షల శిక్షణ కార్యక్రమాన్ని గురువారం వైస్ చాన్స్లర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్తో కలిసి ఆమె ప్రారంభించి మాట్లాడారు. విద్యార్థులు అవాంతరాలను అధిగమిస్తూ విజయపథంలో ముందుకుసాగాలని సూచించారు. మానవీయ సమాజ నిర్మాణమే లక్ష్యంగా విద్యార్థులు నడుచుకోవాలన్నారు. ఈ సందర్భంగా యూపీఎస్సీ సాధనలో తన అనుభవాలను విద్యార్థులతో పంచుకున్నారు. అనంతరం ఉచిత పోటీ పరీక్షల శిక్షణకు సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. వైస్ చాన్స్లర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ మాట్లాడుతూ.. నైపుణ్యాభివృద్ధి, మెంటారింగ్ ద్వారా సివిల్స్పై అవగాహన పెంచేందుకు 12 అంశాల్లో విద్యార్థులకు శిక్షణ అందిస్తున్నామన్నారు. ఈ శిక్షణ 3 సంవత్సరాల పాటు కొనసాగుతుందన్నారు. ఈ సందర్భంగా అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని విద్యార్థులు, అధ్యాపకులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో కృష్ణ ప్రదీప్, భవానీ శంకర్, రిజిస్ట్రార్ అల్వాల రవి, సురేష్రెడ్డి, ప్రిన్సిపాల్ సీహెచ్. సుధారాణి, కె. అరుణప్రియ, ప్రేమ్సాగర్, డాక్టర్ మద్దిలేటి, లక్ష్మీప్రభ, అనితా కుమారి, ఇందిర, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఫ నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి -
టెక్స్టైల్ పార్కులో చోరీ
ఫ గార్మెంటరీ షెడ్లో 35 కుట్టుమిషన్లు ఎత్తుకెళ్లిన గుర్తుతెలియని వ్యక్తులు చౌటుప్పల్ రూరల్: చౌటుప్పల్ మండలం దండుమల్కాపురం గ్రామ పరిధిలోని టెక్స్టైల్ పార్కులోని ఓ గార్మెంటరీ షెడ్లో గురువారం కుట్టు మిషన్లు చోరీకి గురయ్యాయి. వివరాలు.. చోడవరపు చిట్టిబాబు కరోనా వరకు టెక్స్టైల్ పార్కులో గార్మెంటరీ షెడ్ నిర్వహించాడు. కరోనా కాలంలో షెడ్ను మూసివేశాడు. ఇటీవల తిరిగి గార్మెంటరీ షెడ్ను తెరిచేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ క్రమంలో వారానికి ఒకసారి వచ్చి షెడ్ను చూసుకుని వెళ్తుంటాడు. వారం క్రితం గార్మెంటరీ షెడ్లోని ఉన్న బట్టలను తీసుకుని వెళ్లాడు. గురువారం ఉదయం వచ్చి చూడగా అందులో ఉన్న 35 కుట్టు మిషన్లు కనిపించలేదు. వెంటనే 100కు డయల్ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని పరిశీలించారు. ఒక్కో కుట్టుమిషన్ విలువ రూ.35వేలు ఉంటుందని నిర్వాహకుడు చిట్టిబాబు తెలిపారు. ఈ మేరకు చౌటుప్పల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నాడు. నాలుగు నెలల క్రితం టెక్స్టైల్ పార్కులోనే వేరొక గార్మెంటరీ షెడ్ వద్ద ఇనుప స్తంభాలను గుర్తుతెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. -
రైతులను మోసం చేసి సంబురాలా..?
రామన్నపేట: రైతు రుణమాఫీ పూర్తిగా చేయకుండా రైతులను మోసం చేసిన రేవంత్రెడ్డి ప్రభుత్వం సంబురాలు చేసుకోవడమేమిటని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ప్రశ్నించారు. గురువారం రామన్నపేట మండలం లక్ష్మాపురం గ్రామంలో ఓ కార్యక్రమంలో పాల్గొని తిరిగి వస్తున్న ఆయన నీర్నెముల గ్రామంలో మహిళలతో ముచ్చటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మాజీ సీఎం కేసీఆర్ పదకొండు పర్యాయాలు రూ.75వేల కోట్లు రైతుబంధు పేరుతో రైతులకు పెట్టుబడి సహాయం అందిస్తే రేవంత్రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మొదటి పంటకు ఎకరాకు రూ.5వేలు మాత్రమే ఇచ్చాడని, రెండో పంటకు పూర్తిగా ఎగ్గొట్టి, మూడో పంటకు నాలుగెకరాల వరకు కూడా రైతు భరోసా ఇవ్వలేదని విమర్శించారు. రూ.2లక్షల లోపు పంట రుణం ఉన్న రైతులకు పూర్తిస్థాయిలో రుణమాఫీ జరుగలేదని, రూ.2లక్షలకు పైగా రుణం రైతులు డబ్బులను బ్యాంకులకు చెల్లించి రుణమాఫీ కోసం ఎదురు చూస్తున్నారని తెలిపారు. ఆత్మీయ భరోసాకు కొర్రీలు పెట్టారని, సబ్సిడీ గ్యాస్ ఇవ్వడం లేదని, తులం బంగారం ఊసేలేదని, ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా మహిళలకు నెలకు రూ.2500 ఆర్థికసాయం అందించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని ఆరోపించారు. అంతకుముందు ఆయన లక్ష్మాపురంలో ఇటీవల మృతిచెందిన నీల స్వామి చిత్రపటం వద్ద పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన వెంట నాయకులు పోచబోయిన మల్లేశం, బత్తుల శంకరయ్య, కమ్మంపాటి శ్రీనివాస్, సాల్వేరు అశోక్, ఎస్కే చాంద్, ఎండీ ఆమేర్, బత్తుల వెంకటేశం, పులిపలుపుల వీరస్వామి, కొయ్యగూరి వెంకన్న, జాడ సంతోష్, బత్తిని మహేష్, ముక్కాముల సత్తయ్య, కుమార్ తదితరులు ఉన్నారు ఫ నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య -
రుణాలపై అవగాహన పెంచాలి
ఫ నాబార్డ్ చీఫ్ జనరల్ మేనేజర్ ఉదయ్ భాస్కర్ఖమ్మం వ్యవసాయం: వ్యవసాయ, వ్యవసాయేతర రుణాలపై రైతులతో పాటు అన్నివర్గాల వారికి అవగాహన పెంపొందించాలని నాబార్డ్ చీఫ్ జనరల్ మేనేజర్(సీజీఎం) ఉదయ్భాస్కర్ సూచించారు. ఖమ్మంలో గురువారం వ్యవసాయ, వ్యవసాయేతర రుణాలపై ప్రాంతీయ(ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి నల్లగొండ జిల్లాల) స్థాయి బ్యాంకర్ల అవగాహన సదస్సు నాబార్డ్ ఆధ్వర్వంలో నిర్వహించారు. ఈ సదస్సులో సీజీఎం మాట్లాడుతూ.. రుణాలు అందుబాటులో ఉన్న విషయమై రైతులు, ప్రజలకు అవగాహన కల్పిస్తే సద్వినియోగం చేసుకుంటారని తెలిపారు. వివిధ రంగాల వారికి ప్రయోజనం కలిగేలా ప్రభుత్వాలు పథకాలను రూపొందించి సబ్సిడీ కల్పిస్తున్నాయని, కూరగాయల సాగు, సూక్ష్మసేద్య పరికరాలు, డ్రోన్లు, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ఏర్పాటుకు రుణాలు అందుబాటలో ఉన్నాయని చెప్పారు. ఈ విషయమై బ్యాంకర్లు విస్తత అవగాహన కల్పించాలని సీజీఎం తెలిపారు. ఈ సమావేశంలో నాబార్డ్ జనరల్ మేనేజర్ గణపతి, డిప్యూటీ జనరల్ మేనేజర్ శ్రీకాంత్, ఎస్బీఐ రీజనల్ మేనేజర్ రాజశేఖర్, నల్లగొండ డీసీసీబీ సీఈఓ శంకర్రావు, అధికారులు ఆర్య రవీంద్రన్, వినయ్కుమార్, సుజిత్కుమార్, రవీందర్నాయక్, పాండురంగ తదితరులు పాల్గొన్నారు. -
లోకాయుక్త ఆధ్వర్యంలో స్టోన్ క్రషర్ మిల్లుల పరిశీలన
బొమ్మలరామారం: మండలంలోని రామలింగంపల్లి, పెద్దపర్వతాపూర్, బొమ్మలరామారం గ్రామాల్లోని పలు స్టోన్ క్రషర్ మిల్లులను లోకాయుక్త అధికారులతో పాటు పలు శాఖల అధికారుల బృందం గురువారం పరిశీలించారు. మండలంలోని సామాజిక కార్యకర్త మైలారం జంగయ్య ఫిర్యాదు మేరకు అధికారుల బృందం మండలంలో పర్యటించారు. ఈ సందర్భంగా స్టోన్ క్రషర్ మిల్లుల నిర్వహణకు అవసరమైన ప్రభుత్వ అనుమతులపై ఆరా తీశారు. నిబంధనల మేరకే మైనింగ్ తవ్వకాలు జరుగుతున్నాయా, ఎక్స్ప్లోజివ్ వినియోగం, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ నిబంధనలు పాటిస్తున్నారా, సక్రమంగా రాయల్టీ చెల్లిస్తున్నారా లాంటి అంశాలను పరిశీలించారు. క్రషర్ మిల్లుల యాజమానులు వారి వద్ద ఉన్న అనుమతి పత్రాలను వారంలోగా తమకు సమర్పించాలన్నారు. ఏ క్రషర్ మిల్లు యజమాని ప్రభుత్వ నిబంధనలు పాటించడం లేదని, వారి ఇష్టానుసారంగా క్రషర్ మిల్లులు నడిపిస్తున్నట్లు తమ పరిశీలనలో తేలిందని లోకాయుక్త అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో లోకాయుక్త సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వెంకట్రావ్, డీఎస్పీ విద్యాసాగర్రావు, భువనగిరి ఆర్డీఓ కృష్ణారెడ్డి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఈఓ వెంకన్న, జిల్లా మైనింగ్ అధికారి రాఘవరెడ్డి, తహసీల్దార్ శ్రీనివాసరావు, జిల్లా మైనింగ్ అసిస్టెంట్ డైరెక్టర్ రవికుమార్, మైనింగ్ డిజిటల్ సర్వేయర్ సుజాత, భువనగిరి రూరల్ సీఐ చంద్రభాను, ఎస్ఐ బుగ్గ శ్రీశైలం, ఎంఆర్ఐ వెంకట్రెడ్డి, సర్వేయర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు
కోదాడరూరల్: కోదాడ వద్ద జరిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏపీకి చెందిన ఎస్ఐ, కానిస్టేబుల్ దుర్మరణం చెందారు. మరో హెడ్ కానిస్టేబుల్, కారు డ్రైవర్కు గాయాలయ్యాయి. ఈ ఘటన హైదరాబా ద్–విజయవాడ జాతీయ రహదారిపై కోదాడ పట్టణ పరిధిలోని దుర్గాపురం జంక్షన్ సమీపంలో గురువారం తెల్లవారుజామున జరిగింది. వివరాలు.. ఏపీలోని కోనసీమ జిల్లా అలమూరు పోలీస్ స్టేషన్ ఎస్ఐ ముద్దాల అశోక్(43), అదే స్టేషన్లో ఐడీ పార్టీ హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్న సుబ్రహ్మణ్యస్వామితో పాటు ఆత్రేయపురం పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్న సుంకర బ్లెసీన్ జీవన్(31) కలిసి గంజాయి కేసులో నిందితులను పట్టుకునేందుకు ఎర్టిగా కారులో డ్రైవర్ రమేష్తో కలిసి బుధవారం రాత్రి 10గంటల సమయంలో హైదరాబా ద్కు బయల్దేరారు. మార్గమధ్యలో డ్రైవర్కు నిద్రవస్తుందని చెప్పడంతో అంతర్రాష్ట్ర సరిహద్దు వద్ద ఏపీ వైపు గంటన్నరపాటు కారు పక్కకు ఆపి నిద్రించారు. బయల్దేరిన 10 నిమిషాలకే.. కొద్దిసేపటి తర్వాత వీరు తిరిగి హైదరాబాద్కు బయల్దేరగా.. ఆ తర్వాత పది నిమిషాలకే కోదాడ పట్టణ పరిధిలోని దుర్గాపురం జంక్షన్లో రోడ్డుపై ఆగి ఉన్న లారీని వెనుక నుంచి కారుతో ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ఎస్ఐ అశోక్, కానిస్టేబుల్ బ్లెస్లీన్ జీవన్ అక్కడికక్కడే మృతిచెందారు. హెడ్ కానిస్టేబుల్ సుబ్రహ్మణ్యస్వామి, డ్రైవర్ రమేష్కు గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న కోదాడ పట్టణ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కోదాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం స్థానికంగా ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. కారులో ఇరుక్కుపోయిన ఎస్ఐ మృతదేహం లారీని కారు వెనుక నుంచి ఢీకొట్టడంతో కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. కారు ముందు భాగంలో కూర్చున్న ఎస్ఐ మృతదేహం అందులో ఇరుక్కుపోయింది. కోదాడ పోలీసులు కారు భాగాలను తొలగించి అతికష్టం మీద ఎస్ఐ మృతదేహాన్ని బయటకు తీశారు. ఎస్ఐ అశోక్ది ఏపీలోని నరసాపురం అని, 2009 బ్యాచ్లో ఎస్ఐగా ఎంపికయ్యాడని, త్వరలోనే సీఐ ప్రమోషన్ రానుందని ఘటనా స్థలానికి వచ్చిన ఆయన స్నేహితులు తెలిపారు. అశోక్కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. కానిస్టేబుల్ బ్లెసీన్ జీవన్ అవివాహితుడు. ఈ ఘటన తర్వాత లారీతో సహా డ్రైవర్ పరారయ్యాడు. అయితే పోలీసులు లారీని పట్టుకుని డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. నివాళులర్పించిన కోనసీమ అడిషనల్ ఎస్పీ, కోదాడ డీఎస్పీ కోదాడ ప్రభుత్వ వైద్యశాలలో ఎస్ఐ, కానిస్టేబుల్ మృతదేహాలకు కోనసీమ జిల్లా అడిషనల్ ఎస్పీ ఏవీఆర్పీబీ ప్రసాద్, కోదాడ డీఎస్పీ శ్రీధర్రెడ్డి నివాళులర్పించారు. అనంతరం మృతదేహాలను ఏపీ పోలీసులకు అప్పగించారు. క్షతగాత్రుడు హెడ్ కానిస్టేబుల్ సుబ్రహ్మణ్యస్వామి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు కోదాడ పట్టణ సీఐ శివశంకర్ తెలిపారు. ఫ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికిచెందిన ఎస్ఐ, కానిస్టేబుల్ దుర్మరణం ఫ మరో హెడ్ కానిస్టేబుల్, డ్రైవర్కు తీవ్ర గాయాలు ఫ కేసు విచారణ నిమిత్తం కోనసీమ జిల్లా అలమూరు స్టేషన్ నుంచి హైదరాబాద్కు వెళ్తుండగా ప్రమాదం ఫ సూర్యాపేట జిల్లా కోదాడ సమీపంలోని దుర్గాపురం క్రాస్రోడ్ వద్ద ఘటన -
పల్లెపోరుపై వీడిన ఉత్కంఠ
సాక్షి, యాదాద్రి : మూడు నెలల్లో సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు బుధవారం తీర్పు ఇచ్చింది. ఈ మేరకు ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ఎన్నికల క మిషన్ను ఆదేశించింది. స్థానిక సంస్థలైన ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలతోపాటు సర్పంచ్ ఎన్నికలు కూడా నిర్వహించాల్సి ఉన్నా జాప్యం జరుగుతోంది. ఈ నేపథ్యంలో హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. అయితే గత ఎన్నికల సందర్భంగా ఇచ్చిన రిజర్వేషన్లు కొనసాగుతాయా..లేక కొత్తగా చేస్తారా తేలాల్సి ఉంది. ముందుగా పంచాయతీలకు.. గత ఏడాది ఫిబ్రవరిలో పంచాయతీ, జూలైలో ఎంపీటీసీ, జెడ్పీటీసీలు, జనవరిలో మున్సిపాలిటీ పాలవర్గాల పదవీ కాలం ముగిసింది. అన్నింటికి ఎన్నికలు నిర్వహించడానికి ఇప్పటికే ప్రభుత్వం సిద్ధం అవుతోంది. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 30లోపు గ్రామ పంచాయతీ పాలక వర్గాలకు ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం ఎన్నికలు రెడీ అవుతోంది. అయితే ముందుగా పంచాయతీలకు, ఆ తర్వాత పార్టీ గుర్తుల మీద జరిగే స్థానిక సంస్థలైన ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందని అధికార వర్గాలు అంటున్నాయి. పోరుకు సిద్ధమవుతున్న రాజకీయ పార్టీలు హైకోర్టు తీర్పులో జిల్లాలోని ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలతోపాటు, సీపీఎం, సీపీఐ, సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీలు కూడా ఎన్నికల్లో పోటీకి సిద్ధం అవుతున్నాయి. ఇందుకోసం అధికార కాంగ్రెస్ పార్టీలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీలోని కీలక నాయకులు ఇప్పటికే ఆశావహులకు దిశానిర్దేశం చేశారు. ఇప్పటికే గెలుపు గుర్రాలను దాదాపు ఖరారు చేసి పోరుకు సిద్ధంగా ఉండాలని సంకేతాలిచ్చారు. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ కూడా గత ఎన్నికల మాదిరిగానే మెజార్టీ స్థానాలపై కన్నేసింది. బీజేపీ కూడా స్థానిక పోరుకు సిద్ధమవుతోంది. బలమైన అభ్యర్థులను బరిలో దింపి విజయం సాధించే పనిలో ఆ పార్టీ నాయకత్వం ఉంది. సీపీఎం, సీపీఐ పార్టీల ప్రభావం ఉన్న ప్రాంతాల్లో బలమైన అభ్యర్థులను బరిలో దింపే ప్రయత్నాలు సాగుతున్నాయి. సీపీఐ ఎంఎల్ న్యూడెమాక్రసీ పార్టీ సైతం తమకు గతంలో ఉన్న స్థానాలను నిలబెట్టుకునే పనిలో పడింది. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బరిలోకి దిగడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఆశావహులు సై అంటున్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలయ్యేనా! స్థానిక సంస్థల ఎన్నికలకు రిజర్వేషన్ల అంశంపై అన్ని రాజకీయ పార్టీల్లో చర్చ సాగుతోంది. బీసీలకు 42శాతం రిజర్వేషన్ అమలు జరుగుతుందా లేదా అని ఉత్కంఠ నెలకొంది. బీసీ రిజర్వేషన్ పార్లమెంట్లో చట్టం కాలేదు కాబట్టి ఈ సారి అమలువుతుందో లేదో.. అయితే ఎంత మేరకు ఇస్తారో అనేది చర్చ మొదలైంది. అయితే పార్టీలే తాము ఇచ్చే టికెట్లలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కేటాయించే ప్రతిపాదన కూడా వస్తోంది. గత ఎన్నికలకు ముందు చేసిన చట్టం ప్రకారం రిజర్వేషన్ రెండు విడతలుగా ఉంటుంది. ప్రస్తుతం ఆ చట్టంపై ఎలాంటి మార్పు జరగలేదు. దీంతో గత ఎన్నికల్లో ఉన్న రిజర్వేషనే ఇప్పుడు కూడా అమలయ్యే అవకాశం ఉంటుందని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఫ సెప్టెంబర్ 30లోపు సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలన్న హైకోర్టు ఫ గ్రామాల్లో మొదలైన సందడి ఫ బీసీ రిజర్వేషన్లపై సర్వత్రా చర్చ -
బస్సు సౌకర్యం కల్పించాలని ధర్నా
యాదగిరిగుట్ట: మా గ్రామానికి ఏడాదిన్నర నుంచి బస్సులు లేక ఇబ్బందులు పడుతున్నామని, వెంటనే బస్సు సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తూ వలిగొండ మండలం కేర్చిపల్లి గ్రామస్తులు బుధవారం యాదగిరిగుట్ట ఆర్టీసీ డిపో ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ మద్దెల మంజులనాగరాజు మాట్లాడుతూ మా గ్రామం నుంచి వలిగొండ, భువనగిరి ప్రాంతాలకు రావాలంటే బస్సు సౌకర్యం లేక చాలా ఇబ్బందులు పడుతున్నామన్నారు. ఐదు రోజుల క్రితం గ్రామానికి బస్సు పంపిస్తామని అధికారులు హామీ ఇస్తే భారీగా స్వాగతం ఫలికేందుకు ఏర్పాట్లు చేశామని, ఇంకా వారం రోజులు పడుతుందని డిపో మేనేజర్ చెప్పడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ధర్నాలో గ్రామ మహిళలు, యువకులు పాల్గొన్నారు. -
పథకాలు పక్కాగా అమలు కావాలి
సాక్షి, యాదాద్రి : ప్రభుత్వం సంక్షేమ పథకాలను పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ హనుమంతరావు అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో అన్ని మండలాల స్పెషల్ అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ఎంపీఓలతో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల ప్రగతిపై నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. ఇళ్ల నిర్మాణాల్లో జిల్లాను అగ్రస్థానంలో నిలిపేందుకు అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి పనిచేయాలన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా విత్తనాలు, ఎరువులను అందుబాటులో ఉంచాలన్నారు. సీజనల్ వ్యాధులైన మలేరియా, డెంగీ, చికున్ గున్యా వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. వన మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటడానికి అనువైన ప్రదేశాలను గుర్తించాలన్నారు. సమీక్షలో అదనపు కలెక్టర్లు వీరారెడ్డి, భాస్కర్రావు, జెడ్పీసీఈఓ శోభా రాణి, ఆర్డీఓలు కృష్ణారెడ్డి, శేఖర్రెడ్డి, డీఆర్డీఓ నాగిరెడ్డి, హౌసింగ్ పీడీ విజయసింగ్, డీపీఓ సునంద, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ జయశ్రీ ఉన్నారు. భూ అర్జీలకు త్వరగా పరిష్కారం చూపండి భూభారతి రెవెన్యూ సదస్సుల్లో ప్రజల నుంచి వచ్చిన అర్జీలను త్వరగా పరిష్కంచాలని కలెక్టర్ హనుమంతరావు తహసీల్దార్లను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో తహసీల్దార్లతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి క్లియర్ చేయాలన్నారు. అన్ని మాడ్యుల్స్లో దాఖలైన భూభారతి దరఖాస్తులను పెండింగ్ ఉంచొద్దన్నారు. రెవెన్యూ సిబ్బంది పలు సూచనలు చేశారు. సమావేశంలో అదనపు కలెక్టర్ వీరారెడ్డి, ఆర్డీఓలు కృష్ణారెడ్డి, శేఖర్రెడ్డి, మండలాల తహసీల్దార్లు పాల్గొన్నారు. ఫ కలెక్టర్ హనుమంతరావు -
కరెన్సీ నోట్లపై అంబేద్కర్ ఫొటో ముద్రించాలి
యాదగిరిగుట్ట: ఆర్బీఐ స్ఫూర్తి ప్రదాత, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్.అంబేద్కర్ ఫొటోను కరెన్సీ నోట్లపై ముద్రించాలని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కరెన్సీ నోట్లపై అంబేద్కర్ ఫొటో సాధన సమితి జాతీయ అధ్యక్షుడు డాక్టర్ జేరిపోతుల పరశురామ్ ఉస్మానియా ఆర్ట్స్ కళాశాలలో ప్రారంభించిన పోస్టుకార్డు ఉద్యమ యాత్ర బుధవారం యాదగిరిగుట్టకు చేరుకుంది. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ఆధ్వర్యంలో కరెన్సీ నోట్లపై అంబేద్కర్ ఫొటో ముద్రించాలని పోస్టు కార్డులో రాసి ప్రధాని నరేంద్రమోదీకి పంపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ ఫొటోను కరెన్సీ నోట్లపై ముద్రించాలనే న్యాయమైన డిమాండ్ను నెరవేర్చానలని ప్రధానికి విన్నవించారు. ఈ కార్యక్రమంలో కరెన్సీపై అంబేద్కర్ ఫొటో సాధన సమితి జాతీయ అధ్యక్షుడు డాక్టర్ జేరిపోతుల పరశురామ్, గౌరవ అధ్యక్షుడు భట్టు రాంచంద్రయ్య, జిల్లా అధ్యక్షుడు కొడారి వెంకటేష్, బత్తిని సుమన్, మచ్చ కుమార్ తదితరులున్నారు. ఫ ప్రధానికి పోస్టు కార్డు రాసిన ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య -
మహోన్నత వ్యక్తి.. డాక్టర్ అంబేద్కర్
అడ్డగూడూరు : అణగారిన వర్గాల అభ్యున్నతికి జీవితాంతం కృషిచేసిన మహాన్నత వ్యక్తి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ, బహుజన యుద్ధనౌక ఏపూరి సోమన్న అన్నారు. అడ్డగూడూరు మండలం చౌల్లరామారం గ్రామంలో అభిల పక్ష యువత ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్.అంబేద్కర్ విగ్రహాన్ని బుధవారం వారు ఆవిష్కరించి మాట్లాడా రు. అంబేద్కర్ ఆశయాల సాధనలో భాగంగా ఎస్సీ వర్గీకరణ సాధించామన్నారు. భవిష్యత్లో బీసీలకు 50శాతం రిజర్వేషన్ల కోసం కొట్లాడుతామన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ దర్శనాల అంజయ్య, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కొమ్మిడి ప్రభాకర్రెడ్డి, మాజీ జెడ్పీటీసీ శ్రీరాముల జ్యోతి అయోధ్య, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చిప్పపల్లి మహేంద్రనాథ్, కుమారస్వామి, అఖిల పక్ష యూత్ కమిటీ సభ్యులు బాకి సుధీర్, మందుల కిరణ్, తలపాక మహేష్ పాల్గొన్నారు. ఫ ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ -
సంప్రదాయబద్ధంగా నిత్యకల్యాణ వేడుక
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో బుధవారం నిత్య కల్యాణ వేడుకను అర్చకులు సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. శ్రీస్వామి వారి ప్రధానాలయాన్ని వేకువజామునే తెరచిన అర్చకులు స్వయంభూ, ప్రతిష్ఠా అలంకార మూర్తులకు సుప్రభాతం, అర్చన, అభిషేకం వంటి సంప్రదాయ పూజలను నిర్వహించారు. ఆలయ ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజవాహన సేవ చేపట్టి నిత్య కల్యాణం వేడుకను వేద మంత్రోత్సరణలతో జరిపించారు. ముఖ మండపంలో సువర్ణ పుష్పార్చన మూర్తులకు అష్టోత్తర పూజలు చేపట్టారు. ఆయా పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. రాత్రి శ్రీస్వామి వారికి శయనోత్సవం జరిపించి, ద్వార బంధనం చేశారు. విద్యార్థులను భాగస్వామ్యం చేద్దాంభువనగిరి : పర్యావరణ పరిరక్షణలో విద్యార్థులను భాగస్వామ్యం చేద్దామని డీఈఓ సత్యనారాయణ అన్నారు. పర్యావరణ పరిరక్షణపై జూలై 1 నుంచి ఆగస్టు 21వ తేదీ వరకు జరిగే క్విజ్ పోటీల కోసం నేషనల్ గ్రీన్ కోర్ కమిటీ తయారు చేసిన పోస్టర్ను బుధవారం డీఈఓ భువనగిరిలోని తన కార్యాలయంలో ఆవిష్కరించి మాట్లాడారు. చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పోటీల్లో పాల్గొనేందుకు విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. ఐదు దశలలో జరిగే పోటీలకు సంబందించి ఫలితాలు ఆగస్టు 30న వెలువడతాయన్నారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖఏడీ ప్రశాంత్రెడ్డి, ఎన్జీసీ స్టేట్ ప్రాజెక్టు ఆఫీసర్ రాజశేఖర్, సెక్టోరియల్ అధికారులు పాల్గొన్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చూడాలిభువనగిరి : సీజనల్ వ్యాధులు ప్రబలకుండా వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని డీఎంహెచ్ఓ డాక్టర్ మనోహర్ అన్నారు. బుధవారం భువనగిరి కలెక్టరేట్ కార్యాలయంలోని మినీ సమావేశ మందిరంలో ప్రకృతి వైపరిత్యాలు, ఆరోగ్య సమస్యలు, సీజనల్ వ్యాధులపై పారా మెడికల్ సిబ్బందితో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. సీజనల్ వ్యాధుల నివారణకు సంబంధించిన మందులు సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. గ్రామీణ, గిరిజన ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, ప్రతి శుక్రవారం డ్రై డేగా పాటించాలని సూచించారు. ఈ సమావేశంలో ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ సాయిశోభ, డాక్టర్ రామకృష్ణ, డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ శిల్పిని, యశోద, సిబ్బంది పాల్గొన్నారు. క్రీడా పోటీల్లో రాణించాలిభువనగిరి : విద్యార్థులు క్రీడా పోటీల్లో రాణించి తెలంగాణ రాష్ట్ర క్రీడా పాఠశాలలో ప్రవేశాలు పొందాలని జిల్లా యువజన క్రీడల అభివృద్ధి అధికారి కె.ధనుంజనేయులు అన్నారు. బుధవారం భువనగిరి ఎస్సీ గురుకులంలో క్రీడా పాఠశాలలో ప్రవేశాల కోసం జిల్లా స్థాయి ఎంపిక పోటీలను ప్రారంభించి మాట్లాడారు. జిల్లా నుంచి వెళ్లిన విద్యార్థులు రాష్ట్ర స్థాయి పోటీల్లో ప్రతిభను కనబర్చాలన్నారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది జానకిరాములు, మురళి, రేఖ, జయ, రాజశేఖర్, శ్రీను, ఎస్జీఎఫ్ సెక్రటరీ దరశథ, పీడీలు, పీఈటీలు తదితరులు పాల్గొన్నారు. -
‘స్థానిక’ పోటీకి దరఖాస్తులు అందజేయండి
భువనగిరిటౌన్ : స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే యువజన కాంగ్రెస్ నాయకులు పార్టీ కార్యాలయంలో దరఖాస్తులు అందజేయాలని యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు జక్కిడి శివచరణ్రెడ్డి, యువజన కాంగ్రెస్ రాష్ట్ర ఇన్చార్జ్ ఖలీల్ జావేద్ కోరారు. భువనగిరిలోని సంకల్ప్ హోటల్లో నిర్వహించిన యువజన కాంగ్రెస్ జిల్లా విస్తృతస్థాయి సమావేశంలో వారు మాట్లాడారు. యువజన కాంగ్రెస్ నాయకత్వానికి స్థానిక సంస్థల ఎన్నికల్లో తగిన స్థానం కల్పిస్తామన్నారు. సోషల్ మీడియాపై యూత్ కాంగ్రెస్ ప్రత్యేక ఫోకస్ పెట్టాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై యువజన కాంగ్రెస్ నాయకులు పోరాడాలన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు అడెం సంజీవరెడ్డి, జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్ అవైస్ చిస్తీ, యువజన కాంగ్రెస్ జిల్లా ఇంచార్జ్ దుబ్బాక చంద్రిక, నాయకులు కుంభం కిర్తీరెడ్డి, వెల్మినేటీ సురేష్, నిఖీల్, లకావత్ సురేష్, బొల్లెపల్లి జానకిరామ్ తదితరులు పాల్గొన్నారు. -
వర్షపాతం తక్కువే..!
గుండాల మండలం గంగాపురానికి చెందిన ఈ రైతు పేరు దూదిగామ నాగరాజు. రోహిణి కార్తెలో వర్షాలు పడడంతో తనకున్న రెండున్నర ఎకరాల్లో పత్తి గింజలు నాటారు. పత్తి గింజలకు రూ.7వేలు, దున్నకం ఖర్చు రూ.6,500, విత్తనాలు నాటిన కూళ్లు రూ.2,500తో కలిపి మొత్తం 16వేలు ఖర్చు చేశాడు. సకాలంలో వర్షాలు కురవక సగం విత్తనాలు కూడా మొలకెత్తలేదు. మొలకెత్తని వాటి స్థానంలో రెండోసారి విత్తనాలు విత్తేందుకు రూ.4,200, కూలీలకు రూ.1,500తో కలిపి రూ.5,700 ఖర్చుచేసేందుకు సిద్ధమయ్యాడు. మొత్తంగా రెండున్నర ఎకరాలకు రెండోసారి విత్తనాలు విత్తితే రూ.21,700 ఖర్చు వస్తుందని రైతు అంటున్నాడు. ఈ రైతు పేరు కంబాల మహేందర్. ఈయనది అడ్డగూడూరు మండలం చౌళ్లరామారం. తనకున్న మూడు ఎకరాల భూమిలో గత నెల 28న పత్తి విత్తనాలు నాటాడు. మూడు ఎకరాలకు గాను రూ.21వేలు పెట్టుబడి పెట్టాడు. నాటినుంచి వర్షం పడకపోవడంతో డ్రిప్ ఏర్పాటు చేసి తన వ్యవసాయ బోరు నుంచి రోజూ పత్తి చేనుకు నీరందిస్తున్నాడు. దీంతో 60 శాతం పత్తిచేను మొలకెత్తింది. ఈదురుగాలులు, ఎండలు కొడుతుండడంతో మొలకెత్తిన మొక్కల్లో 20 శాతం వాడిపోతున్నాయని సదరు రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. -
ట్రిపుల్ ఆర్ నిర్వాసితులకు న్యాయం చేయాలి
భువనగిరిటౌన్, చౌటుప్పల్ : రీజినల్ రింగ్ రోడ్డు (ట్రిపుల్ ఆర్) నిర్మాణంలో భాగంగా భూములు కోల్పోతున్న నిర్వాసితులకు తగిన నష్టపరిహారం అందజేసి న్యాయం చేయాలని ట్రిపుల్ ఆర్ భూ నిర్వాసితుల ఐక్య వేదిక నాయకులు కోరారు. ఈ మేరకు మంగళవారం భువనగిరిలో అదనపు కలెక్టర్ వీరారెడ్డికి వినతిపత్రం అందజేసి మాట్లాడారు. పాత అలైన్మెంట్ ప్రకారంగానే రీజినల్ రింగ్రోడ్డు ఉత్తర భాగాన్ని నిర్మించాలని కోరారు. ట్రిపుల్ ఆర్ నిర్మాణానికి సంబంధించి రెండు భాగాలకు ఒకే నిబంధన ఉండాల్సి ఉన్నప్పటికీ వేర్వేరుగా ఎలా ఉంటాయని ప్రశ్నించారు. కొందరు పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకుల ప్రయోజనాల కోసం అలైన్మెంట్ను కుదించారన్నారు. భూనిర్వాసితుల సమస్యలపై చౌటుప్పల్, భువనగిరి ఆర్డీఓలకు పలు సార్లు వినతి పత్రాలు సమర్పించినా రైతులకు ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. బహిరంగ మార్కెట్ రేటు ప్రకారం భూములకు నష్టపరిహారం చెల్లించాలన్నారు. అలైట్మెంట్ మార్చుతామని నమ్మించి మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి స్థానిక సంస్థల ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పడం ఖాయమని పేర్కొన్నారు. కార్యక్రమంలో భూ నిర్వాసితులు చింతల దామోదర్రెడ్డి, దబ్బేటి రాములు గౌడ్, గుజ్జుల సురేందర్రెడ్డి, అవిశెట్టి పాండుయాదవ్, జాల వెంకటేష్ యాదవ్, బోరెం ప్రకాష్రెడ్డి, నర్సిరెడ్డి, బొమ్మిడి ఉపేందర్రెడ్డి, సందగళ్ల మల్లేష్ గౌడ్, గజ్వేల్ జోసెఫ్, జాల జంగయ్య యాదవ్, జాల శ్రీశైలం యాదవ్, జాల నరసింహ యాదవ్, జాల అంజయ్య యాదవ్, గుండెబోయిన వేణు యాదవ్, గజ్వేల్ బాల మల్లయ్య, కార్తీక్, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. -
వన మహోత్సవాన్ని విజయవంతం చేస్తాం
సాక్షి, యాదాద్రి : ప్రజలను భాగస్వామ్యంతో వన మహోత్సవం కార్యక్రమం విజయవంతం చేస్తామని కలెక్టర్ హనుమంతరావు అన్నారు. మంగళవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి కె.రామకృష్ణారావు ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలపై జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెనన్స్కు భువనగిరి కలెక్టరేట్ నుంచి అదనపు కలెక్టర్లు వీరారెడ్డి, భాస్కర్రావు కలిసి హాజరయ్యారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ వానాకాలం మొదలైనందున వన మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటేందుకు అనువైన ప్రదేశాలను గుర్తించాలన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలన్నారు. రైతులకు ఎరువుల కొరత లేకుండా చూడాలన్నారు. సీజనల్ వ్యాధులైన మలేరియా, డెంగీ, చికున్గున్యా తదితర వ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టాలన్నారు. పలు అంశాలపై చర్చించి అధికారులకు సూచనలు చేశారు. వీడియో కాన్ఫరెన్స్లో జెడ్పీ సీఈఓ శోభారాణి, డీఆర్డీఓ నాగిరెడ్డి, భువనగిరి, చౌటుప్పల్ ఆర్డీఓలు కృష్ణారెడ్డి, శేఖర్రెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ హనుమంతరావు -
ఖిలా పనులు ప్రారంభమెప్పుడు?
భువనగిరి : భువనగిరి ఖిలా అభివృద్ధి పనుల ప్రారంభంపై సందిగ్ధత నెలకొంది. రోప్ వే నిర్మాణం కోసం 2013లో 2.30 ఎకరాలు సేకరించిన అధికారులు మరో 1.10 ఎకరాల భూమి కోసం రైతులతో పలుమార్లు చర్చలు జరిపారు. అయితే రైతులు కూడా సానుకూలంగా స్పందించి భూమి ఇచ్చేందుకు అంగీకరించారు. ఈ ప్రక్రియ కూడా పూర్తయి పనుల కోసం టెండర్లు ఆహ్వానించారు. టెండర్ల ప్రక్రియ కూడా పూర్తి చేసి సుమారు మూడు నెలలు కావొస్తుంది. రోప్ వే, లిప్టు, రాజ్మహల్ వద్ద ఏర్పాటు చేయనున్న వాటర్ పౌంటెయిన్ నమూనా చిత్రాలను అధికారులు గత అక్టోబర్లోనే విడుదల చేసినా పనులు మాత్రం ప్రారంభించలేదు. అభివృద్ధి పనులకు రూ.118 కోట్లుస్వదేశీ దర్శన్ – 2.0 పథకంలో భాగంగా భువనగిరి ఖిలాను పర్యాటక కేంద్రగా అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందు కోసం రూ.118 కోట్లు మంజూరు చేసింది. ఇందులో మొదటి విడతలో రూ.60 కోట్లు, మలి విడతలో రూ.58 కోట్లతో అభివృద్ధి పనులు పూర్తిచేయాలని నిర్ణయించారు. ఈ పనులకు గత ఏడాది ప్రధాని నరేంద్రమోదీ వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేశారు. అనంతరం రాష్ట్ర పర్యాటక శాఖ అధికారులు, ఎల్ అండ్ టీ సంస్థకు చెందిన ప్రతినిధులు పలుమార్లు ఖిలాను సందర్శించి పనులకు సంబంధించి ప్రదేశాలను పరిశీలించారు. టెండర్ల ప్రక్రియ పూర్తయినా..అభివృద్ధి పనుల్లో ప్రధానంగా మౌలిక వసుతుల కల్పన, లైటింగ్, పార్కులు, కన్వెన్షన్ హాళ్లు, మూత్రశాలలు, మరుగుదొడ్ల నిర్మాణంతోపాటు ఖిలాపైకి ఒకేసారి 250 మంది ఎక్కేందుకు రోప్ వే ఏర్పాటు చేయడంతోపాటు కోటపైకి వెళ్లేందుకు మూడు దశల్లో లిఫ్టు పనులు చేపపట్టాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు ప్రభుత్వానికి నివేదిక కూడా అందజేశారు. ఈ అభివృద్ధి పనులు జరిగితే ఈ ప్రాంతం పర్యాటకంగా అభివృద్ధి చెందుతుందని స్థానికులు భావించారు. కానీ పనులకు సంబంధించిన టెండర్లు పూర్తి చేసి నెలలు గడుస్తున్నా పనులు మాత్రం ప్రారంభించడం లేదు. పూర్తయిన టెండర్ల ప్రక్రియ భూ సేకరణకు రైతులు సానుకూలం ఇప్పటికే ప్రభుత్వానికి అందిన నివేదిక ఇంకా మొదలుపెట్టని పనులుత్వరలోనే పనులు ప్రారంభించే అవకాశం భువనగిరి ఖిలాపై అభివృద్ధి పనులకు సంబంధించి టెండర్ల ప్రక్రియ పూర్తయింది. త్వరలోనే పనులకు సంబంధించి వర్క్ ఆర్డర్ జారీ చేసే అవకాశం ఉంది. పనులు పూర్తయితే భువనగిరి ప్రాంతం పర్యాటకంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. – మందడి ఉపేందర్రెడ్డి, రాష్ట్ర పర్యాటశాఖ జనరల్ మేనజర్ -
రైతు భరోసాలో కోత!
సాక్షి, యాదాద్రి : రైతు భరోసా డబ్బులు రైతులందరికీ పూర్తిస్థాయిలో అందలేదు. ఒక్క సీజన్కు సంబంధించి ప్రభుత్వం ఎకరానికి రూ.6 వేల చొప్పున రైతు భరోసా ఇస్తోంది. జిల్లాలో పలువు రు రైతులకున్న భూములకు విస్తీర్ణానికి అనుగుణంగా వానాకాలం సీజన్ డబ్బులు జమ కాలేదు. ప్రధానంగా సాగు యోగ్యమైన భూమికి రైతు భరోసా ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో భాగంగా యాసంగి సీజన్కు ముందు జిల్లా వ్యాప్తంగా 22 వేల ఎకరాలను సాగు యోగ్యంకాని భూమిగా గుర్తించారు. ఒక సీజన్లో సాగుకు దూరంగా ఉన్న భూమికి కూడా భరోసా డబ్బులు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అదేవిధంగా యాసంగిలో డబ్బులు జమ చేసింది. కానీ ఈ సారి మాత్రం కొందరికి అంతంత మాత్రంగానే రైతు భరోసా అందడంపై అయోమయానికి గురవుతున్నారు. సాగు భూమికి మాత్రమే వర్తింపుప్రస్తుతం వానాకాలం సీజన్లో ఎకరాల చొప్పున కాకుండా సాగు భూమికి మాత్రమే రైతు భరోసా డబ్బులు జమ అవుతున్నాయి. గత యాసంగి సీజన్ తర్వాత వ్యవసాయ విస్తరణాధికారులు, శాటిలైట్ ద్వారా సాగు విస్తీర్ణంపై సర్వే చేశారు. దీంతో సాగుచేసిన భూమికి మాత్రమే రైతు భరోసా డబ్బులు రైతుల ఖాతాల్లో జమ అవుతున్నాయి. దీంతో ఎకరాలతో నిమిత్తం లేకుండా తక్కువ మొత్తం డబ్బులు జమ కావడంతో గ్రామాల్లో రైతులు వ్యవసాయాధికారులను నిలదీస్తున్నారు. తమకున్న భూమికి కాకుండా తక్కువ డబ్బులు వచ్చాయని కొందరు.. తమకు మొత్తానికి మొత్తమే రాలేదని మరికొందరు ఫిర్యాదులు చేస్తున్నారు. కొందరైతే తమకు పూర్తిస్థాయిలో రైతు భరోసా పడలేదని, మరికొందరు తమకు మొత్తంగా పడలేదని వెంటనే జమచేయాలని సోమవారం భువనగిరి కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్కు విన్నవించారు. కాగా జిల్లా వ్యాప్తంగా మంగళవారం సాయంత్రం వరకు 2,27,544 మంది రైతులకు రూ.288.97 కోట్లు జమ అయ్యాయని అధికారులు చెబుతున్నారు.రైతు భరోసా అందిందిలా.. మొత్తం రైతులు : 2,84,250మంగళవారం వరకు అందిన రైతులు : 2,27,544జమ అయిన నగదు : రూ.288.97 కోట్లు ఖాతాల్లో అరకొరగా డబ్బులు జమ అయోమయంలో రైతులు వ్యవసాయాధికారులకు ఫిర్యాదుల వెల్లువ పూర్తిస్థాయిలో అందించాలని కలెక్టర్కు విన్నపాలుతక్కువ డబ్బులు పడ్డాయి మా గ్రామంలో 5 ఎకరాల భూమి ఉన్న రైతుల ఖాతాల్లో రైతు భరోసా డబ్బులు జమయ్యాయి. నాకు 1.3 ఎకరాల భూమి ఉంది. పట్టా పాసు పుస్తకం కూడా ఉంది. భూమి కూడా సాగులోనే ఉన్నా తక్కువ డబ్బులు వచ్చాయి. – జెట్ట శ్రీనివాస్, సర్వేపల్లి, ఆత్మకూర్(ఎం) మండలం -
సీఎంతో ముఖాముఖికి స్పందన అంతంతే..
మోత్కూరు, బొమ్మలరామారం : రైతు భరోసా సంబరాల్లో భాగంగా మంగళవారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతు వేదికల నుంచి నిర్వహించి రైతులతో ముఖాముఖి కార్యక్రమానికి రైతులు అంతంత మాత్రంగానే హాజరయ్యారు. జిల్లాలోని పలుచోట్ల రైతు వేదికలకు కొద్దిమందే రాగా కొన్నిచోట్ల అధికారులే కనిపించారు. దీంతో రైతు వేదికలు వెలవెలబోయి కనిపించాయి. మోత్కూరు మండలం అనాజిపురం, పాటిమట్ల, దత్తప్పగూడెం క్లస్టర్ రైతు వేదికల్లో జరిగిన సీఎం వీడియో కాన్ఫరెన్స్కు రైతులు పదుల సంఖ్యలోనే హాజరయ్యారు. హాజరైన వారుకూడా మధ్యలోనే వెళ్లిపోయారు. ఆయాచోట్ల పలువురు రైతులు తమకు పూర్తి స్థాయిలో రైతు భరోసా డబ్బులు పడలేదని అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. బొమ్మలరామారం మండలం రైతు వేదికల్లో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్కు హాజరైన చాలామంది రైతులు రైతు భరోసా రాలేదన్న ప్రశ్నలకే ఏఈఓలు సమాధానం చెప్పలేక దాటవేశారు. రైతు భరోసా జమకాని రైతుల కోసం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఏమైన ప్రకటన చేస్తారేమోనని ఎదురుచూసి నిరాశగా వెనుదిరిగారు. -
క్షేత్రపాలకుడికి క్షీరాభిషేకం
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయానికి క్షేత్రపాలకుడిగా ఉన్న శ్రీఆంజనేయస్వామికి అర్చకులు మంగళవారం ఆకుపూజను విశేషంగా నిర్వహించారు. ఆంజనేయస్వామికి ఇష్టమైన రోజు కావడంతో ప్రధానాలయంతో పాటు విష్ణు పుష్కరిణి వద్ద, పాతగుట్ట ఆలయాల్లో సింధూరంతో పాటు పాలతో అభిషేకించారు. అనంతరం తమలపాకులతో అర్చన జరిపించారు. హనుమంతుడికి ఇష్టమైన నైవేధ్యాన్ని సమర్పించి, భక్తులకు ప్రసాదంగా అందజేశారు. ఇక ప్రధానాలయంలో నిత్య పూజలు సంప్రదాయంగా జరిగాయి. శ్రీసుదర్శన నారసింహ హోమం, గజవాహన సేవ, నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం జరిపించి, సాయంత్రం వెండి జోడు సేవలు వంటి పూజలు కొనసాగాయి. ‘మత్స్యగిరి’ హుండీలు లెక్కింపు వలిగొండ : మండలంలోని వెంకటాపురంలో గల శ్రీ మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో మంగళవారం దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారుల సమక్షంలో హుండీలు లెక్కించారు. వివిధ హుండీల ద్వారా 90 రోజులకు గాను రూ.12,85,884 ఆదాయం సమకూరిందని ఆలయ కమిటీ చైర్మన్ కొమ్మారెడ్డి నరేష్ కుమార్రెడ్డి, ఆలయ కార్యనిర్వహణ అధికారి మోహనబాబు తెలిపారు. అలాగే ఇటీవల గ్రామ శివారులో నిర్మించిన శ్రీవేంకటేశ్వర స్వామి కల్యాణ కట్ట హుండీలో రూ.24,644 ఆదాయం వచ్చిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ పరిశీలకులు వెంకటలక్ష్మి, ధర్మకర్తలు, వేదపండితులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. పాలిసెట్ కౌన్సిలింగ్ ప్రారంభంరామగిరి(నల్లగొండ) : పాలిసెట్ – 2025 కౌన్సిలింగ్ మంగళవారం ప్రారంభమైందని నల్లగొండ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ సిహెచ్.నరసింహ అన్నారు. నల్ల గొండ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో కౌన్సిలింగ్కు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ఈ నెల 24 నుంచి 28వ తేదీ వరకు సర్టిఫికెట్ల పరిశీలనకు స్లాట్ బుకింగ్ చేసుకోవాలన్నారు. జూన్ 26 నుంచి 28వ తేదీ వరకు సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుందని.. కౌన్సిలింగ్ పూర్తి చేసుకున్న అభ్యర్థులు జూన్ 26 నుంచి జూలై 1వ తేదీ వరకు కాలేజీ ఎంపికకు ఆన్లైన్లో ఆప్షన్లు పెట్టుకోవాలని సూచించారు. -
రైతు సంక్షేమంలో రాజీలేదు
భువనగిరిటౌన్ : రైతు సంక్షేమం విషయంలో ప్రభుత్వం రాజీ పడకుండా రైతు భరోసా అందిస్తోందని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్రెడ్డి అన్నారు. వానాకాలం పంటల సాగు కోసం రైతుభరోసా నగదు బదిలీ విజయవంతంగా పూర్తయిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం రైతు పండుగ పేరుతో చేపట్టిన సంబరాల్లో భాగంగా మంగళవారం భువనగిరి జిల్లా కేంద్రంలో సీఎం రేవంత్రెడ్డి ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్రెడ్డి మాట్లాడుతూ ఇచ్చిన మాట ప్రకారం 9 రోజుల్లోనే రైతు భరోసా నగదు బదిలీ చేయడం రాష్ట్ర చరిత్రలోనే రికార్డు అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయం చైర్మన్ అవైస్ చిస్తీ, పోత్నక్ ప్రమోద్ కుమార్, టీపీసీసీ సభ్యులు తంగళ్ళపల్లి రవికుమార్, నాయకులు పోతంశెట్టి వెంకటేశ్వరు, కూర వెంకటేష్, బర్రె జహంగీర్, కృష్ణ రెడ్డి, నర్సింహ, సలాద్దీన్, ఈరపాక నర్సింహ, బీసుకుంట్ల సత్యనారాయణ పాల్గ్గొన్నారు. ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్రెడ్డి -
మనువాద సిద్ధాంతం వ్యాప్తి
బీజేపీ, ఆర్ఎస్ఎస్లు మనువాద సిద్ధాంతం వ్యాప్తి చేస్తున్నాయని డిప్యూటీ స్పీకర్ రాంచందర్నాయక్ అన్నారు. - 8లోఈ ఫొటోలోని రైతు ఆత్మకూర్ (ఎం) మండలం తుక్కాపూర్ గ్రామానికి చెందిన ఎమ్మ మధు. ఈయనకు 2.13 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. గత యాసంగిలో రూ.14,025 అతని ఖాతాలో జమ అయ్యాయి. వానాకాలం రైతు భరోసా కేవలం రూ.1,500 మాత్రమే జమ అయ్యింది. దీంతో సదరు రైతు ఏఈఓ క్రాంతి కుమార్ కు వెళ్లి ఫిర్యాదు చేయగా నా పరిధిలో ఏమి లేదని అధికారి చెప్పారు. మధుతో పాటు ఆయన తమ్ముడు ప్రశాంత్కు కూడా రెండు ఎకరాల 13 గంటల భూమికి రూ.1,500 మాత్రమే పడ్డాయి. వారి వ్యవసాయ భూముల్లో ప్రస్తుతం పత్తి పంట సాగు చేస్తున్నారు. జిల్లాలో చాలామంది రైతుల పరిస్థితి ఇలాగే ఉంది. -
ఊరు నిర్మించిన పాఠశాల
చిట్యాల: 36 ఏళ్ల క్రితం ఆ ఊరి ప్రజలంతా కలిసి కొంత నగదును పోగేసి స్వయంగా శ్రమదానం చేసి పాఠశాలను నిర్మించుకున్నారు. అలా ఊరందరి పాఠశాలగా నిలిచిపోయిన ఆ స్కూల్ నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వట్టిమర్తి గ్రామంలోని జెడ్పీహెచ్ఎస్. 1989లో పాఠశాల నిర్మాణానికి బీజం..1989లో వట్టిమర్తి గ్రామానికి చెందిన నర్రా రాఘవరెడ్డి నకిరేకల్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. అప్పట్లో ఆ గ్రామం నల్లగొండ శాసనసభ పరిధిలో ఉండేది. గ్రామానికి చెందిన కొందరు అప్పటి సర్పంచ్ రాచమల్ల రామచంద్రం ఆధ్వర్యంలో వట్టిమర్తి గ్రామాభివృద్ధికి సహకరించాలని నకిరేకల్ ఎమ్మెల్యేగా ఉన్న నర్రా రాఘవరెడ్డిని కోరారు. దీంతో తమ గ్రామంలో ప్రభుత్వ పాఠశాలను ఏర్పాటు చేయాలని ఆయన తలంచారు. గ్రామస్తులంతా కలసి స్థలం సమకూరిస్తే ప్రభుత్వ పాఠశాల ఏర్పాటుకు ప్రభుత్వ అనుమతి తీసుకొస్తానని రాఘవరెడ్డి హామీనిచ్చారు. అదే సమయంలో నేరడ గ్రామానికి చెందిన సీపీఎం నాయకుడు చెరుపల్లి సీతారాములు జెడ్పీ వైస్ చైర్మన్గా పనిచేస్తుడంటంతో పాఠశాల ఏర్పాటుకు మార్గం సుగమమైంది. గ్రామస్తులంతా తమకు తోచినంత నగదు పోగేసి గ్రామంలో నాలుగున్నర ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేశారు. ఊరందరి శ్రమదానంతో..పాఠశాల నిర్మాణం కోసం కొనుగోలు చేసిన స్థలంలో గ్రామస్తులంతా శ్రమదానం చేసి పాఠశాల నిర్మాణంలో పాలుపంచుకున్నారు. అలా నిర్మాణం చేసుకున్న పాఠశాలలో తరగతుల నిర్వహణకు నర్రా రాఘవరెడ్డి అనుమతి తీసుకువచ్చారు. పాఠశాల నిర్వహణ కోసం పాఠశాల ఆవరణలోనే పండ్ల తోటలు సాగుచేసి ప్రతియేటా ఆదాయాన్ని పొందేట్లుగా తీర్చిదిద్దారు. అయితే 2013లో విద్యార్థులు తగ్గిపోయి ఈ పాఠశాల మూసివేసే పరిస్థితి నెలకొంది. దీంతో గ్రామానికి చెందిన ఆదర్శ యువజన సంఘం సభ్యులు మరోసారి నర్రా రాఘవరెడ్డిని కలిసి సమస్యను వివరించడంతో ఆయన ఆయన గ్రామస్తులందరితో సమావేశం నిర్వహించి గ్రామంలోని పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించాలని తీర్మానం చేయించారు. దీంతో ఈ పాఠశాల ఎందరినో ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దింది. ప్రస్తుతం ఈ జెడ్పీహెచ్ఎస్లో 80మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఎందరినో ఉద్యోగులను తీర్చిదిద్ది.. ఈ పాఠశాలలో చదివిన ఎందరో విద్యార్థులు నేడు ప్రభుత్వ ఉద్యోగులుగా, మరెందరో ప్రైవేటు రంగంలో ఉద్యోగులుగా స్థిరపడ్డారు. ఈ గ్రామంలో 520 కుటుంబాలుండగా 100 మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. వీరిలో డాక్టర్లు, ఎస్ఐలు, తహసీల్దార్లు, జడ్జిలు, ప్రొఫెసర్లు, ఇంజనీర్లు, ఉపాధ్యాయులు, విద్యుత్, ఆర్టీసీ ఉద్యోగులు ఉన్నారు. గ్రామస్తుల విరాళాలతో ఏర్పాటైన వట్టిమర్తి జెడ్పీహెచ్ఎస్ శ్రమదానం చేసి నిర్మాణంలో పాలుపంచుకున్న ఊరి ప్రజలు 36 ఏళ్లుగా ఎందరినో ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దిన పాఠశాల -
మనువాద సిద్ధాంతం వ్యాప్తి చేస్తున్న బీజేపీ, ఆర్ఎస్ఎస్
సూర్యాపేట: బీజేపీ, ఆర్ఎస్ఎస్లు దేశంలో మనువాద సిద్ధాంతాన్ని వ్యాప్తిచేస్తూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలను అణిచివేస్తున్నాయని డోర్నకల్ ఎమ్మెల్యే, శాసనసభ డిప్యూటీ స్పీకర్ రాంచందర్నాయక్ అన్నారు. మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని రెడ్డి హాస్టల్లో మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి, మాజీ ఎంపీపీ, మార్కెట్ కమిటీ డైరెక్టర్ థరావత్ వీరన్ననాయక్ అధ్యక్షతన నిర్వహించిన ఉమ్మడి జిల్లా ఆదివాసీ బునియాది కార్యకర్తల శిక్షణా శిబిరానికి ఆయన హాజరై మాట్లాడారు. దేశంలో బీజేపీ, ఆర్ఎస్ఎస్లు మతోన్మాదాన్ని పెంచి పోషిస్తున్నాయని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ మాత్రమే అన్నివర్గాలను సమానంగా ఆదరిస్తుందని అన్నారు. ఆదివాసీల భూములను వారికి అప్పగించే విధంగా కాంగ్రెస్ పార్టీ అనేక చట్టాలను తీసుకొచ్చిందని పేర్కొన్నారు. రాజ్యాంగ పరిరక్షణ కోసమే రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా భారత్ జోడో యాత్ర చేపట్టారని అన్నారు. బంజారాల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ జయంతిని సీఎం రేవంత్రెడ్డి సెలవు దినంగా ప్రకటించారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయానికి కృషి చేస్తుందని, కావున కాంగ్రెస్ పార్టీకి అన్నివర్గాలు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. ఆదివాసీ బంజారా బిడ్డలు కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను తెలుసుకోవా లని, అందుకోసమే శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్రెడ్డి, ట్రైకార్ చైర్మన్ బెల్లయ్యనాయక్, ఏఐసీసీ సభ్యుడు రాంరెడ్డి సర్వోత్తమ్రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ రాష్ట్ర కోఆర్డినేటర్ భూక్యా కోటియానాయక్, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు ఎలిమినేటి అభినయ్, ప్రోగ్రాం ఇన్చార్జి లింగంనాయక్, బాబునాయక్, నాగేశ్వర్నాయక్, శ్రీను, మల్లికార్జున్, శివనాయక్ తదితరులు పాల్గొన్నారు. శాసనసభ డిప్యూటీ స్పీకర్ రాంచందర్నాయక్ -
అప్పుల బాధతో యువకుడి బలవన్మరణం
చండూరు: అప్పుల బాధతో ఉరేసుకుని యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన చండూరు మండల కేంద్రంలో సోమవారం రాత్రి జరిగింది. మంగళవారం ఎస్ఐ నర్సింగ్ వెంకన్నగౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. చండూరు మండల కేంద్రంలోని సర్దార్ కాలనీకి చెందిన అన్నపురెడ్డి మహేష్(30) మద్యానికి బానిసై స్నేహితుల వద్ద అప్పులు చేశాడు. అప్పులు ఎక్కువ కావడంతో సోమవారం రాత్రి ఇంట్లో ఉరేసుకున్నాడు. మహేష్ తండ్రి నరసింహ గమనించి అతడిని మొదట నల్ల గొండ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి హైదరాబాద్లోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతిచెందాడు. మంగళవారం మృతుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.కుక్కను ఢీకొట్టిన బైక్.. మహిళ మృతి● ఆమె కుమారుడికి గాయాలుభువనగిరిటౌన్ : తల్లి, కుమారుడు బైక్పై వెళ్తుండగా కుక్కను ఢీకొట్టి అదుపుతప్పి కిందపడడంతో తల్లి మృతిచెందింది. కుమారుడికి గాయాలయ్యాయి. ఈ ఘటన భువనగిరి పట్టణ శివారులో మంగళవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యాదగిరిగుట్ట మండలం రామోజీపేటకు చెందిన తునిక లక్ష్మి(41) భువనగిరి బస్టాండ్లో పూల దుకాణం నిర్వహిస్తోంది. మంగళవారం దుకాణం తీసేందుకు గాను ఆమె తన కుమారుడు క్రాంతితో కలిసి బైక్పై భువనగిరికి వస్తున్నారు. భువనగిరిలోని లక్ష్మీనరసింహస్వామి డిగ్రీ కళాశాల వద్దకు రాగానే రోడ్డుపై అడ్డంగా వచ్చిన కుక్కను ఢీకొట్టి అదుపుతప్పి కిందపడ్డారు. ఈ ప్రమాదంలో తునిక లక్ష్మి డివైడర్పై పడడంతో అక్కడికక్కడే మృతిచెందింది. ఆమె కుమారుడు క్రాంతికి గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్రాంతిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. లక్ష్మి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు భువనగిరి పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
సులభతరమైన మూల్యాంకనం చేయాలి
నల్లగొండ టూటౌన్ : యూనివర్సిటీల్లో అధ్యాపకులు పొరపాట్లకు అవకాశం ఇవ్వకుండా సులభతరమైన మూల్యాంకనం చేయాలని మహాత్మాగాంధీ యూనివర్సిటీ(ఎంజీయూ) వైస్ చాన్స్లర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ అన్నారు. ఎంజీయూలో మంగళవారం ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్వాలిటీ అక్రిడిటేషన్ సంస్థ ఆధ్వర్యంలో అధ్యాపకులకు ఫలితాలు, మూల్యాంకనం మెళకువలపై నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో వీసీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్రిడిటేషన్ ఎక్స్పర్ట్ డాక్టర్ పి. రవీందర్రెడ్డి అధ్యాపకులకు మ్యాట్రిక్స్ వినియోగం గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో కొప్పుల అంజిరెడ్డి, జయంతి, ప్రిన్సిపాల్ డాక్టర్ ప్రేమ్సాగర్, అరుణప్రియ, సుధారాణి, రమణారెడ్డి పాల్గొన్నారు. మహాత్మాగాంధీ యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ -
భళా.. పోచంపల్లి ఇక్కత్ కళ
భూదాన్పోచంపల్లి: పోచంపల్లి ఇక్కత్ ఎంతో కళాత్మకంగా ఉందని వివిధ దేశాలకు చెందిన జర్నలిజం అండ్ పబ్లిక్ రిలేషన్స్ అధికారుల బృందం కొనియాడారు. హైదరాబాద్లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల సంస్థలో అంతర్జాతీయ శిక్షణ పొందుతున్న నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్, తజకిస్తాన్, ఇథియోపియా, కెన్యా, సౌత్ సూడాన్, సెషెల్లస్, మొజాంబిక్, ఉగాండా, ట్యునీషియా, సిర్రా ల్యునే, లెసొతో, ట్రినిడాడ్ అండ్ టొబాగో, చిలీ దేశాలకు చెందిన 50 మంది జర్నలిజం అండ్ పబ్లిక్ రిలేషన్స్ అధికారులు, జర్నలిస్టులు భూదాన్పోచంపల్లిని మంగళవారం సందర్శించారు. టూరిజం పార్కు, చేనేత గృహాలు, మాస్టల్వీవర్స్ హ్యాండ్లూమ్ యూనిట్, చేనేత సహకార సంఘాన్ని సందర్శించారు. నూలు వడకడం, చిటికి కట్టడం, రంగులద్దకం, మగ్గాలపై వస్త్రాలను తయారు చేసే విధానాలను ప్రత్యక్షంగా తిలకించారు. సహకార సంఘంలో చేనేత వస్త్రాల నాణ్యత, డిజైన్లను పరిశీలించి చేనేత కళాకారుల నైపుణ్యాలను అభినందించారు. పోచంపల్లి ఇక్కత్కు అంతర్జాతీయంగా ఉన్న గుర్తింపును తెలుసుకొని అబ్బురపడ్డారు. ఈ సందర్భంగా మర్రి చెన్నారెడ్డి మానవవనరుల అభివృద్ది సంస్థ నోడల్ అధికారి సురేశ్కుమార్ మాట్లాడుతూ.. ఈ నెల 28 వరకు ఆయా దేశాలకు చెందిన ప్రభుత్వ ఆర్గనైజేషన్లలో పనిచేస్తున్న మీడియా ప్రతినిధులకు కోర్సు డైరెక్టర్ రావులపాటి మాధవి ఆధ్వర్యంలో ఇండియన్ టెక్నికల్ అకడమిక్ కోఆపరేషన్ సౌజన్యంతో అంతర్జాతీయ శిక్షణ తరగతులు జరుగుతున్నాయని చెప్పారు. అందులో భాగంగా క్షేత్రస్థాయి పర్యటన నిమిత్తం వారు పోచంపల్లికి వచ్చారని తెలిపారు. వీరికి చేనేత జౌళి శాఖ డీఓ రాజేశ్వర్రెడ్డి, చేనేత కార్మిక సంఘం అధ్యక్షుడు అంకం పాండు, చేనేత సహకార సంఘం మేనేజర్ రుద్ర అంజనేయులు, కార్మిక సంఘం నాయకులు బొమ్మ హరిశంకర్, భారత భూషణ్, పొట్టబత్తిని వేణు మార్గదర్శకం చేశారు. పోచంపల్లిని సందర్శించిన వివిధ దేశాలకు చెందిన జర్నలిజం అండ్ పబ్లిక్ రిలేషన్స్ అధికారుల బృందం -
ప్రభుత్వ పాఠశాలల్లోనే ఉపాధ్యాయుల పిల్లలు
పెన్పహాడ్ : తాము విధులు నిర్వహిస్తున్న పాఠశాలల్లోనే తమ పిల్లలను చేర్పించి పలువురికి ఆదర్శంగా నిలిస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయులు. పెన్పహాడ్ మండలం చీదెళ్ల ప్రాథమిక పాఠశాలలో ఎస్జీటీగా పనిచేస్తున్న కొప్పుల శోభ తన చిన్న కుమారుడు సిద్దార్ధ ఆర్యన్రెడ్డిని అదే పాఠశాలలో 4వ తరగతిలో చేర్పించింది. శోభ భర్త పరెడ్డి వీరారెడ్డి కూడా ప్రభుత్వ ఉపాధ్యాయుడే కావడం విశేషం. అదేవిధంగా చెట్లముకుందాపురం ప్రాథమికోన్నత పాఠశాలలో ఎస్జీటీగా పనిచేస్తున్న వేల్పుల జాకోబు రాజకుమార్ తన కుమార్తెను ఎలిజబెత్ అమూల్యను అదే పాఠశాలలో 3వ తరగతిలో చేర్పించారు. కుమారులిద్దరు సర్కారు బడికే..రాజాపేట : రాజాపేట మండలంలోని సింగారం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఫిజిక్స్ టీచర్గా పనిచేస్తున్న చిలివేరు సుప్రియ తన ఇద్దరు కుమారులు విశాల్, వివేక్ను మంగళవారం రఘునాథపురం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చేర్పించారు. సుప్రియన కుటంబంతో కలిసి రఘునాథపురం గ్రామంలోనే నివాసముంటోంది. ఆమె కుమారులు గతంలో భువనగిరిలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో చదవగా.. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలలో చేర్పించింది. మండల విద్యాధికారి చందా రమేష్, ప్రధానోపాధ్యాయులు మనోజ్కుమార్ సుప్రియను, ఆమె భర్త రమేష్ను అభినందించారు. ఇద్దరు కుమార్తెలు తన వెంటే..తుంగతుర్తి: మండల పరిధిలోని వెంపటి ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న మల్లెపాక రవీందర్ తన ఇద్దరు కుమార్తెలకు తాను చదువు చెప్పే పాఠశాలలోనే అడ్మిషన్ తీసుకున్నారు. పెద్ద కూతురు మాన్విజ్ఞను రెండేళ్ల క్రితమే ప్రభుత్వ పాఠశాలలో చేర్పించగా.. ఆమె ప్రస్తుతం ఫస్ట్ క్లాస్ చదువుతోంది. రెండో కుమార్తె అద్విత కోసం అదే పాఠశాలలో మంగళవారం ప్రధానోపాధ్యాయురాలు వెంకటరామనరసమ్మ వద్ద అడ్మిషన్ తీసుకున్నారు. -
మేకలు చోరీ చేస్తున్న నిందితుల అరెస్ట్
కొండమల్లేపల్లి: మేకలు చోరీ చేస్తున్న నలుగురు నిందితులను కొండమల్లేపల్లి పోలీసులు మంగళవారం పట్టుకున్నారు. ఇన్చార్జి సీఐ రాజు తెలిపిన వివరాల ప్రకారం.. కొండమల్లేపల్లి మండలం మేగ్యతండాకు చెందిన ఆంగోతు గోపిచంద్, హైదరాబాద్లోని కర్మన్ఘట్కు చెందిన పొడిపాటి స్టాలిన్ అలియాస్ సాయిచరణ్, చింతపల్లి మండలం గౌరారం గ్రామానికి చెందిన ఉడుత శివ, మరో బాలుడు కలిసి ఈ నెల 6వ తేదీన కొండమల్లేపల్లి మండలం గుమ్మడవెల్లి గ్రామంలో ఓ మేకల షెడ్లో పది మేకలను అపహరించారు. మేకల షెడ్ యజమాని ఫిర్యాదు మేరకు కొండమల్లేపల్లి ఎస్ఐ అజ్మీర రమేష్ కేసు నమోదు చేశారు. మంగళవారం కొండమల్లేపల్లి పట్టణంలోని చౌరస్తాలో అనుమానంగా తిరుగుతున్న నలుగురిని పోలీసులు పట్టుకుని విచారించగా.. నిజం ఒప్పుకున్నారు. వీరిపై నాంపల్లి పోలీస్ స్టేషన్ పరిధి 2 కేసులు, గుర్రంపోడులో ఒక కేసు ఉన్నట్లు సీఐ తెలిపారు. వారి నుంచి రూ.2.20లక్షల నగదు స్వాధీనం చేసుకుని, రిమాండ్కు తరలించినట్లు పేర్కొన్నారు. యాదగిరీశుడి సేవలో బీసీ కమిషన్ చైర్మన్ యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ కుటుంబ సభ్యులతో కలిసి మంగళవారం దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ఆయనకు సంప్రదాయంగా స్వాగతం పలికారు. అనంతరం ఆయన గర్భాలయంలోని స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులకు ప్రత్యేక పూజలు చేశారు. వారికి అర్చకులు వేద ఆశీర్వచనం చేశారు. ఆలయ అధికారులు లడ్డూ ప్రసాదం, స్వామివారి చిత్రపటం అందజేశారు. -
పక్కా భవనాలు, ప్రహరీలకు నిధులు
ఉపాధిహామీ పథకం కింద రూ.8.47 కోట్లు మంజూరు రామన్నపేట: 2025–26 ఆర్థిక సంవత్సరానికి జాతీయ ఉపాధిహామీ పథకం కింద జిల్లాకు రూ.8.47 కోట్లు మంజూరయ్యాయి. ఈ నిధులతో ఆలేరు, మునుగోడు, తుంగతుర్తి, నకిరేకల్ నియోజకవర్గాల్లో 63 శాశ్వత నిర్మాణ పనులు చేపట్టనున్నారు. ఈ నిధులతో ఎంపిక చేసిన అంగన్వాడీ కేంద్రాలు, పంచాయతీ కార్యాలయాలకు పక్కా భవనాలు, పాఠశాలలకు ప్రహరీలు నిర్మించనున్నారు. పంచాయతీ భవనాలకు రూ.2కోట్లు.. జిల్లాలోని పది గ్రామ పంచాయతీలకు శాశ్వత భవన నిర్మాణాల కోసం రూ.2కోట్లు మంజూరయ్యాయి. ఇందులో ఆలేరు మండలంలోని కందిగడ్డతండా, బొమ్మలరామారం మండలం కాజీపేట, గుండాల మండలం మాసాన్పల్లి, రాజాపేట మండలం కుర్రారం, తుర్కపల్లి మండలం గుజ్జవానికుంటతండా, యాదగిరిగుట్ట మండలం రాళ్లజనగాం చౌటుప్పల్ మండలం పెద్దకొండూరు, సంస్థాన్నారాయణపురం మండలం డాకుతండా, రామన్నపేట మండలం ఇస్కిళ్ల, అడ్డగూడూరు పంచాయతీలు ఉన్నాయి. ఒక్కో పంచాయతీకి రూ.20 లక్షల చొప్పున కేటాయించారు. అంగన్వాడీ సిబ్బందికి తీరనున్న సమస్యలు 26 అంగన్వాడీ భవన నిర్మాణాలకు రూ 3.12కోట్లు మంజూరయ్యాయి. ఒక్కో భవన నిర్మాణానికి రూ.12లక్షలు కేటాయించారు. ఆలేరు నియోజకవర్గంలోని తూర్పుగూడెం, పటేల్గూడెం, రాయిపల్లి, ఉప్పలపహాడ్, బొమ్మలరామారం(2), నూనెగూడెం, అనంతగూడెం, అమ్మనబోలు, మాటూరు, మొల్లగూడెం, చల్లూరు, ముల్కలపల్లి, ధర్మారం, సాదువెల్లి, చిన్నకందుకూరు, మునుగోడు నియోజకవర్గంలో దండుమల్కాపురం, జైకేసారం, సంస్థాన్ నారాయణపురం, జనగాం, నకిరేకల్ నియోజకవర్గంలో ఎన్నారం, సిరిపురం, తుంగతుర్తి నియోజకవర్గంలో అజీంపేట, గోవిందాపూర్, దత్తప్పగూడెం, పాలడుగు గ్రామాల్లో అంగన్వాడీ భవనాలు నిర్మించనున్నారు. ప్రస్తుతం వీటిని అద్దె భవనాల్లో నిర్వహిస్తున్నారు. సరైన సౌకర్యాలు లేకపోవడం, పైగా ఇరుకుగదులు కావడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. భవనాలు అందుబాటులోకి వస్తే అంగన్వాడీ సిబ్బందికి సమస్యలు తీరనున్నాయి. ప్రహరీలతో పాఠశాలలకు రక్షణ పాఠశాలలకు ప్రహరీలు లేకపోవడంతో రక్షణ లేకుండాపోయింది. పశవులు, ఇతర మూగజీవాలు వస్తున్నాయి. రాత్రి సమయాల్లో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతున్నాయి. ఉపాధిహామీ పథకం కింద 27 పాఠశాలలకు రూ 3.35 కోట్లు మంజూరయ్యాయి. వీటిలో ఒక యూపీఎస్, 14 ఉన్నత, 12 ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. మిగతా కేంద్రాలకూ నిధులివ్వాలి సిరిపురంలో నాలుగు అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. నాలుగు కేంద్రాలకు సొంత భవనాలు లేవు. భవనాల నిర్మాణాలకు అవసరమైన స్థలాన్ని దాతలు గ్రామ పంచాయతీకి అప్పగించారు. ఒక అంగన్వాడీ కేంద్రానికి నిధులు మంజూరయ్యాయి. మిగతా మూడు కేంద్రాలకు కూడా దశలవారీగా నిధులు మంజూరు చేయాలి. –అప్పం లక్ష్మీనర్సు, తాజామాజీ సర్పంచ్, సిరిపురం ఫ పంచాయతీ కార్యాలయాలు, అంగన్వాడీ కేంద్రాలకు శాశ్వత భవనాలు ఫ 27 పాఠశాలలకు ప్రహరీల నిర్మాణం ఇది రామన్నపేట మండలంలోని కొమ్మాయిగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల. మారెపల్లి మల్లారెడ్డి అనే దాత ఇచ్చిన స్థలంలో ఆర్ఎంఎస్ఏ నిధులు వెచ్చించి 2012 సంవత్సరంలో పాఠశాల ఏర్పాటు చేశారు. కానీ, ప్రహరీ నిర్మించలేదు. చుట్టూ పెరిగిన కంపచెట్లే పాఠశాలకు కంచెగా మారాయి. ప్రహరీ నిర్మాణానికి ఉపాధిహామీ నిధులు రూ.20 లక్షలు మంజూరు కావడంతో పనులు ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. -
షెడ్లలోనే చెత్త ట్రాక్టర్లు!
ఆత్మకూర్(ఎం), యాదగిరిగుట్ట రూరల్: పల్లెల్లో చెత్త సేకరణ నత్తనడకన సాగుతోంది. నిరంతరం కొనసాగాల్సిన ఈ ప్రక్రియ.. వారంలో ఒకటి, రెండు దఫాలే జరుగుతోంది. ట్రాక్టర్లలో డీజిల్ లేకపోవడమే ఇందుకు కారణం. సర్పంచ్ల పదవీకాలం ముగియడంతో ప్రభుత్వాలనుంచి నిధులు నిలిచి పంచాయతీల నిర్వహణ కష్టంగా మారింది. మొన్నటి వరకు అప్పు చేసి పనులు చేపట్టిన పంచాయతీ కార్యదర్శులు.. ఆర్థికభారం భరించలేక ట్రాక్టర్ల నిర్వహణ చూడలేమంటూ మండల పరిషత్ కార్యాలయాల్లో తాళం చేతులు అప్పగించారు. నాటినుంచి డీజిల్ లేక ట్రాక్టర్లు షెడ్లకే పరిమితం అయ్యాయి. మేజర్ గ్రామ పంచాయతీల్లో మాత్రం వారంలో ఒకటి, రెండుసార్లు కార్యదర్శులు సొంత ఖర్చులతో ట్రాక్టర్లకు డీజిల్ పోయించి చెత్త సేకరిస్తున్నారు. నిధులు నిల్ పల్లెల్లో చెత్త సేకరణ, మొక్కలకు నీరు పోస్తేందుకు గత ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పంచాయతీకి ఒకటి చొప్పున ట్రాక్టర్, ట్యాంకర్ మంజూరు చేసింది. అందులో భాగంగా యాదాద్రి జిల్లాలోని 421 పంచాయతీలు ప్రభుత్వ నిధులతో ట్రాక్టర్లు కొనుగోలు చేశారు. మేజర్ పంచాయతీల్లో ప్రతి రోజూ, చిన్న గ్రామ పంచాయతీల్లో రెండు రోజులకు ఒకసారి తప్పనిసరిగా చెత్త సేకరించాల్సి ఉంటుంది. పెద్ద పంచాయతీలో డీజిల్ ఖర్చు నెలకు రూ.10వేలు వరకు, చిన్న గ్రామ పంచాయతీలో రూ.5 వేలు చొప్పున ఖర్చు వస్తుంది. అయితే పంచాయతీల్లో ప్రజాప్రతినిధుల కాలపరిమితి ముగియడంతో 15 నెలలుగా ప్రత్యేకాధికారుల పాలన సాగుతోంది. భారమంతా కార్యదర్శులపైనే.. నాటినుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే నిధులు ఆగిపోవడం, ప్రత్యేకాధికారులు అటువైపు కూడా చూడకపోవడంతో పంచాయతీల నిర్వహణ కార్యదర్శులు చూడాల్సి వస్తుంది. ఉన్నతాధికారుల ఒత్తిడి మేరకు ఇంతకాలం సొంతఖర్చులతో సమస్యలు పరిష్కరిస్తూ వచ్చారు. ముఖ్యంగా ట్రాక్టర్ల నిర్వహణ భారం తడిసిమోపడయ్యేది. కానీ, ప్రభుత్వం నుంచి బిల్లులు రాకపోవడం, ఆర్థిక భారం భరించలేక పంచాయతీ కార్యదర్శుల అసోసియేషన్ పిలుపుమేరుకు ట్రాకర్ల నిర్వహణ చూడలేమంటూ కార్యదర్శులు మండల పరిషత్ కార్యాలయాల్లో తాళం చేతులు అప్పగించారు. ఇంధనం లేక కదలని బండ్లు ఫ ఇంటింటి చెత్త సేకరణకు ఆటంకం ఫ మేజర్ పంచాయతీల్లోనే వారంలో ఒకటి, రెండు దఫాలు సేకరణ ఫ చిన్న పంచాయతీల్లో పూర్తిగా బంద్ ఫ పది రోజులుగా పల్లెల్లో దుర్గంధం -
నేడు రైతులతో ముఖాముఖి
భువనగిరిటౌన్ : ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మంగళవారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతులతో ముఖాముఖి సమావేశం కానున్నారని కలెక్టర్ హనుమంతరావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. రైతుభరోసా డబ్బులు నేటితో రాష్ట్రవ్యాప్తంగా రైతులందరి ఖాతాల్లో జమకానున్నాయని, ఈ సందర్భాన్ని పురస్కరించుకుని రైతులతో సీఎం ముఖాముఖి అవుతారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని పండుగలా నిర్వహించేందుకు రైతువేదికల్లో ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఇందుకోసం ప్రతి రైతువేదికకు ఒక నోడల్ ఆఫీసర్ను నియమించినట్లు వెల్లడించారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో 2,27,544 మంది రైతుల ఖాతాల్లో రూ.288,97,96,361 జమ అయినట్లు కలెక్టర్ తెలిపారు. రైతుల ఖాతాల్లో రూ.288.97 కోట్లు జమ సాక్షి యాదాద్రి : వానాకాలం సీజన్కు గాను అర్హులైన రైతుల ఖాతాల్లో ప్రభుత్వం నగదు జమ చేస్తోంది. జిల్లాలో 2,27,544మంది రైతులకు గాను సోమవారం వరకు 2,23,525 మంది ఖాతాల్లో రూ.288.97 కోట్లు జమ అయ్యాయి. మిగిలిన వారికి మంగళవారం జమకానున్నట్లు వ్యవసాయ అధికారులు తెలిపారు. పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష భువనగిరిటౌన్ : ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, వన మహోత్సవం, భూ భారతి, ఆయిల్పామ్ సాగు, సీజనల్ వ్యాధులపై కలెక్టర్ హనుమంతరావు ఆయా శాఖల అధికారులతో సమీక్షించారు. సీజనల్ వ్యాధులను అరిక్టేందుకు ముందస్తు ప్రణాళికలు రూపొందించుకోవాలని ఆదేశించారు. ఆయిల్పామ్ సాగువల్ల ప్రయోజనాలు, ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహకాలపై అవగాహన కల్పించి రైతులను ప్రోత్సహించాలన్నారు.భూ భారతి రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం పూర్తి చేయించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ సీఈఓ శోభారాణి, డీఆర్డీఓ నాగిరెడ్డి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ జయశ్రీ, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. శివుడికి విశేష పూజలుయాదగిరిగుట్ట: యాదగిరీశుడి అనుబంధ క్షేత్రమైన శ్రీపర్వతవర్థిని సమేత రామలింగేశ్వరస్వామి ఆలయంలో సంప్రదాయ పూజలు చేపట్టారు. సోమవారం శివుడికి ఇష్టమైన రోజు కావడంతో రుద్రాభిషేకం, బిల్వార్చన తదితర పూజలు కనుల పండువగా నిర్వహించారు. ఆయా పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. ప్రధానాలయంలోనూ నిత్యారాధనలు కొనసాగాయి. వేకువజామున సుప్రభాత సేవ చేపట్టిన అర్చకులు.. గర్భాలయంలోని స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులకు అభిషేకం, తులసీదళ అర్చనతో కొలిచారు. అనంతరం ప్రాకార మండపంలో సుదర్శన నారసింహహోమం ఆగమశాస్త్రం ప్రకారం నిర్వహించి, ఆ తరువాత స్వామి, అమ్మవారికి కల్యాణం జరిపించారు. సాయంత్రం ఆలయంలో వెండి జోడు సేవను ఊరేగించారు. రాత్రి స్వామివారికి శయనోత్సవం చేసి ఆలయ ద్వారబంధనం చేశారు. స్కూల్ బస్సులకు ఫిట్నెస్ తప్పనిసరి యాదగిరిగుట్ట: పట్టణంలోని ప్రైవేట్ పాఠశాలల బస్సులను సోమవారం యాదగిరిగుట్ట ట్రాఫిక్ పోలీసులు తనిఖీ చేశారు. బస్సుల ఫిట్నెస్, డ్రైవర్ల లెసెన్స్కు సంబంధించిన ధ్రు వీకరణ పత్రాలను పరిశీలించారు. స్కూల్ బస్సులు తప్పనిసరిగా ఫిట్నెస్ సర్టిఫికెట్ కలిగి ఉండాలని, డ్రైవర్లు లైసెన్స్, ఆర్సీ, ఇన్సురెన్స్తో పాటు ఖాకీ కలర్ చొక్కా ధరించాలని ట్రాఫిక్ సీఐ కృష్ణ సూచించారు. విద్యార్థులు బస్సు ఎక్కే సమయంలో, దిగే సమయాల్లో జాగ్రతలు తీసుకోవాలపి స్పష్టం చేశారు. ప్రతి విద్యార్థిని ఇంటి నుంచి క్షేమంగా తీసుకెళ్లి తిరిగి ఇంటికి చేర్చే బాధ్యత డ్రైవర్లదేనన్నారు. కుటుంబసభ్యుల్లా భావించి విద్యార్థులతో మెదులుకోవాలన్నారు. తనిఖీల్లో ఎస్ఐలు దేవేందర్, రాజు, కానిస్టేబుల్స్ శ్రీధర్రెడ్డి, హనుమంతు, కాశీం, నరేష్, భిక్షపతి పాల్గొన్నారు. -
వినతులు.. వేడుకోలు
భువనగిరిటౌన్ : కలెక్టరేట్ కార్యాలయం సోమవారం జనంతో కిక్కిరిసింది. తమ సమస్యలు విన్నవించుకోవడానికి జిల్లా నలుమూలల నుంచి వందలాది మంది ప్రజావాణి కార్యక్రమానికి తరలివచ్చారు. సామూహికంగా, వ్యక్తిగతంగా అర్జీలు అందజేయడంతో పాటు తమ బాధలను నేరుగా అధికారులకు విన్నవించారు. భూమి కబ్జా చేశారని, ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని, పింఛన్ వస్తలేదని, సదరం క్యాంపులో అర్హులకు సర్టిఫికెట్లు అందడం లేదని.. ఇలా ఒక్కొక్కరు ఒక్కో సమస్య ఏకరువుపెట్టారు. ● ప్రైవేట్ స్కూళ్లలో ఫీజుల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని లంబాడీ హక్కుల పోరాట సమితి జిల్లా కమిటీ నాయకులు ప్రజావాణిలో వినతిపత్రం అందజేశారు. పాఠశాలల్లో కనీస వసతులు లేకపోయినా వేల రూపాయలు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ● రైతుభరోసా రాలేదని భువనగిరి మండలంలోని గౌస్నగర్ గ్రామానికి చెందిన పలువురు రైతులు మాజీ సర్పంచ్ ఈర్ల కృష్ణ అధ్వర్యంలో ప్రజావాణి కార్యక్రమానికి వచ్చారు.కలెక్టర్కు వినతిపత్రం అందజేసి తమ సమస్య పరిష్కరించాలని వేడుకున్నారు. ● భువనగిరిలోని ఏరియా ఆస్పత్రిలో సదరం క్యాంపులో నిర్ధారణ పరీక్షలు నిర్వహించకుండానే డబ్బులు తీసుకుని సర్టిఫికెట్లు జారీ చేస్తున్నారని ఆరోపిస్తూ వికలాంగుల పరిరక్షణ కమిటీ సభ్యులు ఫిర్యాదు చేశారు. వికలత్వం ఎక్కువ ఉన్నవారికి తక్కువ శాతం వేసి సర్టిఫికెట్లు ఇస్తున్నారని, దీంతో అర్హులు ప్రభుత్వ పథకాలకు దూరమవుతున్నారని పేర్కొన్నారు. అర్జీల వెల్లువ ప్రజావాణి కార్యక్రమానికి అర్జీలు వెల్లువెత్తాయి. జిల్లాల నలుమూలల నుంచి ప్రజలు తరలివచ్చి వినతులు అందజేశారు. వివిధ సమస్యలపై వంద వరకు అర్జీలు వచ్చాయి. అందులో అత్యధికంగా భూ సమస్యలకు సంబంధించి 54,జిల్లా గ్రామీణాభివృద్ధి 6, పంచాయతీ రాజ్ 5, సర్వే లాండ్స్ 4, జిల్లా పరిషత్ 4, మున్సిపాలిటీ 2, జిల్లా వైద్యారోగ్య 2, విద్యుత్, అటవీ, రోడ్లు, భవనాలు, ఎంప్లాయిమెంట్, సంక్షేమ శాఖలకు సంబంధించి ఒక్కొకటి చొప్పున అర్జీలు వచ్చినట్లు కలెక్టర్ తెలిపారు. అదనపు కలెక్టర్లు వీరారెడ్డి, భాస్కర్రావు, జెడ్పీ సీఈఓ శోభారాణి, డీఆర్డీఓ నాగిరెడ్డి తదితర జిల్లా అధికారులతో కలిసి కలెక్టర్ హనుమంతరావు ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరించారు. దరఖాస్తులకు సత్వర పరిష్కారం చూపాలని ఆదేశించారు. భూమి కబ్జా చేశారు ఇక్కడ కనిపిస్తున్న రైతులది సంస్థాన్నారాయణపురం మండలం అల్లాపురం గ్రామం. గ్రామంలోని సర్వే నంబర్ 85లో గల పది ఎకరాల ప్రభుత్వ భూమిలో గత కొన్నేళ్లుగా నివాసం ఏర్పరుచుకొని ఉంటున్నారు. కొందరు వ్యక్తులు పక్క భూముల రైతుల సహకారంతో భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారని, గుడిసెలు తొలగించి తమను వెళ్లిపోవాలని బెదిరిస్తున్నారని కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఈ భూమి రాచకొండ రెవెన్యూ పరిధిలో ఉందని, దీనిపై గతంలో తహసీల్దార్కు అర్జీ పెట్టినా స్పందించలేదన్నారు. నిరుపేదలమైన తమకు న్యాయం చేయాలని కోరారు.ఫ ప్రజావాణికి తరలివచ్చిన జనం ఫ వివిధ సమస్యలపై సుమారు వంద అర్జీలు ఫ వినతులు స్వీకరించి, పరిష్కారానికి భరోసా ఇచ్చిన కలెక్టర్ -
మహిళా సంఘాల పనితీరు మెరుగునకే కరదీపిక
భువనగిరిటౌన్ : నూతనంగా ఏర్పాటైన మహిళా సంఘాల నిర్వహణ, సంఘాల లీడర్ల శక్తివంతీకరణకు దోహదపడే ఉద్దేశంతో ప్రత్యేకంగా రూపొందించిన అక్షరాస్యత సమాచార కరదీపికను సోమవారం కలెక్టర్ హనుమంతరావు ఆవిష్కరించారు. మహిళలు శక్తివంతులు కావడం వల్ల దేశానికి బలం చేకూరుతుందన్నారు. సంఘాల నిర్వహణ, నాయకత్వ లక్షణాలు, ఆర్థిక నిర్వహణ, గ్రూపుల పనితీరు మెరుగుపర్చుకునేందుకు కరదీపిక దోహదపడుతుందన్నారు. కరదీపికను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు భాస్కర్రావు, వీరారెడ్డి, డీఆర్డీఓ నాగిరెడ్డి, అదనపు డీఆర్డీఓ జంగారెడ్డి, డీపీఎంలు, స్వయం సహాయక మహిళా సంఘాల లీడర్లు పాల్గొన్నారు. -
దొంగతనం కేసులో ఐదుగురి అరెస్ట్
సూర్యాపేటటౌన్: దొంగతనం కేసులో ఐదుగురు నిందితులను సోమవారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు సూర్యాపేట డీఎస్పీ ప్రసన్నకుమార్ తెలిపారు. డీఎస్పీ విలేకరులకు వెల్లడించిన వివరాల ప్రకారం.. నాగారం మండలం ఈటూరు గ్రామానికి చెందిన బోడ వెంకటేష్ మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లా మేడిపల్లిలో నివాసముంటూ ఆటో డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఈటూరు గ్రామానికే చెందిన నంగునూరి బయ్యమ్మ కుటుంబ సభ్యులు ఉపాధి నిమిత్తం తమిళనాడు రాజధాని చైన్నెలో స్థిరపడ్డారు. బయ్యమ్మ గ్రామంలో ఒంటరిగా నివసిస్తోంది. ఆమె భూమిని బోడ వెంకటేష్ మామ యాల రమేష్ కౌలుకు చేస్తున్నాడు. దీంతో అప్పుడప్పుడు రమేష్తో పాటు వెంకటేష్ కూడా బయ్యమ్మ ఇంటికి వచ్చి వెళ్తుండేవాడు. ఈ క్రమంలో బయ్యమ్మ ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలను కాజేయాలని వెంకటేష్ నిర్ణయించుకున్నాడు. ఈ నెల 17వ తేదీ రాత్రి వెంకటేష్తో పాటు తిరుమలగిరి మండలం మాలిపురం గ్రామానికి చెందిన అతడి స్నేహితుడు పోతరాజు నాగరాజు, అడ్డగూడూరు మండలం కాంచనపల్లి గ్రామానికి చెందిన ఎడ్ల చంద్రశేఖర్, నాగారం మండలం మాచిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన కొమ్ము సోమయ్య, వడ్డె పున్నం కలిసి కారులో హైదరాబాద్ నుంచి ఈటూరుకు వచ్చారు. బయ్యమ్మ ఒక్కతే ఇంట్లో నిద్రిస్తుండగా.. ఆమె ఇంటి వెనక నుంచి గోడ దూకి తమ వెంట తెచ్చుకున్న కట్టర్తో కరెంట్ కట్ చేశారు. వెంకటేష్ను బయ్యమ్మ గుర్తుపడుతుందని భావించి మిగతా నలుగురు వెళ్లి ఆమెను గట్టిగా పట్టుకొని చీరతో చేతులు కట్టేశారు. ఆమె మెడలోని నల్లపూసల గొలుసు, చేతి గాజులతో పాటు ఇళ్లంతా వెతికి దొరికిన డబ్బులతో అక్కడి నుంచి పారిపోయారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే చోరీ చేసిన సొత్తును విక్రయించేందుకు సోమవారం నిందితులు కారులో వెళ్తుండగా.. నాగారం సీఐ రఘువీర్రెడ్డి, ఎస్ఐ, పోలీస్ సిబ్బంది తిరుమలగిరిలో వారిని పట్టుకుని విచారించగా నిజం ఒప్పుకున్నారు. వారి నుంచి కారు, నల్లపూసల గొలుసు, ఐదు సెల్ఫోన్లు, కట్టర్ స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో నాగారం సీఐ రఘువీర్రెడ్డి, ఎస్ఐ, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
లక్కీ డ్రా స్కీం పేరుతో మోసం
మిర్యాలగూడ: ‘ప్రతి నెలా రూ.1000 కట్టు.. నెల చివరలో తీసే లక్కీ డ్రాలో ప్రైజ్ కొట్టు’ అంటూ ఓ ప్రైవేట్ సంస్థ నిర్వాహకులు అమాయక ప్రజలను నిండాముంచారు. మిర్యాలగూడ పట్టణంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ మోసంపై బాధితులు, మిర్యాలగూడ వన్టౌన్ పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆర్కే ఎంటర్ప్రైజెస్ పేరిట మిర్యాలగూడకు చెందిన కె. రమేష్, కె. కోటేశ్వర్రావు, బచ్చలకూరి శ్రీనివాస్ లక్కీ డ్రా స్కీం ఏర్పాటు చేశారు. వారి వ్యాపారాన్ని పెంచుకునేందుకు ఏజెంట్లను కూడా నియమించుకున్నారు. మిర్యాలగూడతో పాటు సూర్యాపేట జిల్లా గరిడేపల్లి, నేరేడుచర్ల , ఏపీ సరిహద్దు గ్రామాల్లోనూ ఏజెంట్లను ఏర్పాటు చేసుకుని సభ్యులను చేర్చుకున్నారు. ఈ స్కీంలో చేరిన ఒక్కో సభ్యుడి నుంచి 15నెలల పాటు ప్రతి నెలా రూ.1000 చొప్పున వసూలు చేశారు. ఇలా 2600 మందిని సభ్యులుగా చేర్చుకుని ప్రతి నెలా డ్రా తీసి 10మందికి రూ.15వేల విలువైన వస్తువులను అందజేస్తున్నారు. గతేడాది అక్టోబర్లో ప్రారంభమైన ఈ లక్కీ డ్రా స్కీం ఈ ఏడాది జనవరిలో ముగిసింది. ఇప్పటి వరకు 150మందికి డ్రా పద్ధతిలో వస్తువులు అందజేసిన నిర్వాహకులు ఆ తర్వాత స్కీంను అర్ధాంతరంగా ఎత్తివేశారు. గత ఆరునెలలుగా నిర్వాహకులు పత్తా లేకపోవడంతో స్కీంలో చేరిన సభ్యులు వారి కోసం ఆరా తీశారు. వారిని సభ్యులుగా చేర్పించిన ఏజెంట్లను నిలదీయడంతో తాము మోసపోయామని గ్రహించి పోలీసులను ఆశ్రయించారు. ఈ స్కీం పేరిట ఇప్పటివరకు 2600మంది సభ్యుల నుంచి రూ.4 కోట్ల వరకు వసూలు చేసినట్లు తెలుస్తోంది. చివరి నెల డ్రాలో కారు ఇస్తామని నిర్వాహకులు చెప్పినట్లు బాధితులు తెలిపారు. స్కీంలో చెప్పిన విధంగా చెల్లింపులు చేయకపోవడం, బంపర్ డ్రా తీయకపోవడంతో మిర్యాలగూడ పట్టణం కలల్వాడకు చెందిన మొరుగు వెంకటమ్మ అనే మహిళ తనను సభ్యురాలిగా చేర్పిన మందారి మల్లేశ్వరి, స్కీం నిర్వాహకుడు కె. రమేష్పై వన్టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ విషయం తెలుసుకున్న మిగిలిన బాధితులు కూడా సోమవారం పోలీస్ స్టేషన్కు వచ్చి తమను మోసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. ఒక్క మిర్యాలగూడ పట్టణంలోనే 900 మంది బాధితులున్నట్లు సమాచారం. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు వన్టౌన్ సీఐ మోతీరాం తెలిపారు. 2600 మంది నుంచి రూ.4కోట్లకు పైగా వసూలు బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు -
‘ఇచ్చంపల్లి–సాగర్’తో ఆర్థిక భారం
పోలవరం టు సాగర్ ప్రాజెక్టు అనుకూలం ● గోదావరి జలాలను పోలవరం నుంచి సాగర్ టెయిల్పాండ్కు తరలింవచ్చు ● ఈ ప్రాజెక్టుతో ఖర్చు కూడా తక్కువ ● తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్ల సంఘంనాగార్జునసాగర్: గోదావరి జలాలను కృష్ణాబేసిన్కు మళ్లించేందుకు ఇచ్చంపల్లి–నాగార్జునసాగర్, పోలవరం–బనకచర్ల అనుసంధానం కన్నా పోలవరం నుంచి శ్రీశైలం జలాశయానికి అనుసంధానం చేసే పథకమే బాగుంటుందని తెలంగాణ విశ్రాంత ఇంజనీర్ల సంఘం పేర్కొంటోంది. ఇచ్చంపల్లి నుంచి నాగార్జునసాగర్ జలాశయానికి అనుసంధానం చేసే పథకానికి సుమారు 350 కిలోమీటర్లకు పైచిలుకు పొడవు కాల్వ తవ్వాల్సి ఉంటుంది. కాల్వ లైనింగ్లతో కలిపితే సుమారు అరకిలో మీటరు వెడల్పులో భూసేకరణ చేయాల్సి ఉంటుంది. నాగార్జునసాగర్ ఎడమ కాల్వ ద్వారా ఆయకట్టుకు కేవలం ఒక టీఎంసీ నీటిని మాత్రమే తరలిస్తారు. గోదావరి నీటిని కృష్ణాబేసిన్కు మళ్లించే కాల్వలో రెండు టీఎంసీలకు పైచిలుకే నీటిని తరలించాలి. ఈ కాల్వ తవ్వకానికి గాను సుమారు 50వేల ఎకరాల భూసేకరణ చేయాలని ఇంజనీర్లు పేర్కొన్నారు. ఆ భూమంతా తెలంగాణలో ఇప్పటికే ఏదో ఒక ప్రాజెక్టు ద్వారానో, చెరువుల కిందనో బోరు బావుల ద్వారానో సేద్యమవుతూనే ఉంటుంది. భూసేకరణకు దాదాపు రూ.10వేల కోట్లు నిధులు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ప్రాజెక్టు పూర్తి చేసేందుకు మరో రూ.20 వేల కోట్లకు పైచిలుకే ఖర్చు కానున్నట్లు అంచనా. తెలంగాణ డిమాండ్లను అమలు చేశాకే గోదావరి నీరు బనకచర్లకు గోదావరి నుంచి బనకచర్లకు 200టీఎంసీల నీటిని తరలించాలని ఆంధ్రప్రధేశ్ ప్రభుత్వం కేంద్ర జలశక్తి మంత్రి కార్యాలయానికి ప్రతిపాదనలు పంపింది. తెలంగాణ రాష్ట్ర డిమాండ్లను అమలు చేశాకే బనకచర్లకు నీటి తరలింపు పనులు మొదలు కావాలని తెలంగాణ రాష్ట్ర రిటైర్డ్ ఇంజనీర్ల సంఘం డిమాండ్ చేస్తోంది. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను గాలికి వదిలి నీటిని తరలంచాలని భావిస్తే ప్రజలలో తిరుగుబాటు వచ్చే అవకాశం లేకపోలేదు. గోదావరి ఉపనదులపై ఉన్న ప్రాజెక్టులు, నిర్మాణంలో ఉన్నవి, భవిష్యత్తులో నిర్మించే ప్రాజెక్టులకు నికర జలాలు కేటాయించాలని డిమాండ్లలో పెట్టారు. పోలవరం నుంచి గోదావరి జలాలు 200టీఎంసీలు పెన్నా బేసిన్లోకి తరలించి సాగుకు వినియోగించే ప్రతిపాదన ఉన్నందున, అంతే నీటిని కృష్ణానదిలో తెలంగాణకు వాటాకు అదనంగా కేటాయించాలి. అన్ని అనుమతులు వచ్చాకే ఈ ప్రాజెక్టును చేపట్టాలి. డీపీఆర్ను గోదావరి నది యాజమాన్య బోర్డు (జీఆర్ఎంబీ) పరిశీలించి సాధ్యాసాధ్యాలను రిపోర్టు ఇచ్చిన తర్వాత సీడబ్ల్యూసీ నుంచి హైడ్రాలాజికల్ అనుమతి పొందాలి. అనంతరం అపెక్స్ కౌన్సిల్ ఆమోదం పొందాలని, అప్పుడే ప్రాజెక్టు మొదలు పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వమే చేపట్టి రెండు తెలుగు రాష్ట్రాలకు ఆర్థిక భారాన్ని తప్పించి, త్వరగా పూర్తి చేయాలని కోరారు. దీంతో పాలమూరు–రంగారెడ్డి, డిండి, కల్వకుర్తి, నెట్టెంపాడు, ఎస్ఎల్బీసీ ఉదయ సముద్రం తదితర ప్రాజెక్టుకు నికరంగా జలాల కేటాయింపులు జరుగుతాయి. ఇదే విషయాలపై తెలంగాణ రిటైర్ల ఇంజనీర్లు త్వరలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నట్లు సమాచారం.పోలవరం – సాగర్ టెయిల్పాండ్తోనే తెలంగాణకు న్యాయం పోలవరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను నాగార్జునసాగర్ టెయిల్పాండ్లోకి తరలించే పథకం ద్వారనే తెలంగాణకు న్యాయం జరుగుతుందని రిటైర్డ్ ఇంజనీర్ల సంఘం అధ్యక్షుడు మేరెడ్డి శ్యాంప్రసాద్రెడ్డి తెలిపారు. ఇరు రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టు అయినందున కేంద్ర ప్రభుత్వ నిధులతో పూర్తి చేయాలన్నారు. ఈ నీటి తరలిపుతో ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమకు సాగునీటిని అందించడంతో పాటు తెలంగాణ రాష్ట్రంలో కృష్ణానదిపై గల ప్రాజెక్టులకు, గోదావరి నదులపై గల ప్రాజెక్టులకు నికర జలాలు అందుతాయి. తక్కువ ఖర్చుతో ఉన్న వనరులను వినియోగించుకోని త్వరలో ప్రాజెక్టును పూర్తి చేసే అవకాశాలుంటాయి. – మేరెడ్డి శ్యాంప్రసాద్రెడ్డి, రిటైర్డ్ ఇంజనీర్ల సంఘం అధ్యక్షుడుపోలవరంతో రోజుకు 3, 4టీఎంసీలు తరలించవచ్చుపోలవరం ప్రాజెక్టు డైవర్షన్ ద్వారా సీజన్లో 100 రోజుల పాటు నీటి రాకను బట్టి 200 నుంచి 300 టీఎంసీల నీటిని నాగార్జునసాగర్ టెయిల్పాండ్కు తరలించవచ్చు.అక్కడి నుంచి రివర్సబుల్ టర్బైన్ల ద్వారా నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టులకు తక్కువ ఖర్చుతో నీటిని తరలించే అవకాశాలున్నట్లు తెలంగాణ ఇంజనీర్ల ఫోరం తెలిపింది. పోలవరం నుంచి ప్రస్తుతం కుడి కాల్వకు సమాంతరంగా మూడు నుంచి నాలుగు టీఎంసీల నీటిని మళ్లించేందుకు తాజా కాల్వను రూపొందించాలి. ఎటువంటి భూసేకరణ లేకుండానే కృష్ణానదికి 300 టీఎంసీల గోదావరి జలాలను తరలించవచ్చు. 2019లోనే తెలంగాణ, ఆంధ్రప్రధేశ్ ముఖ్యమంత్రులు రెండు రాష్ట్రాల ఇంజనీర్లు, అధికారులతో కలిసి రెండు సమావేశాలు నిర్వహించారు. దక్షిణ తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్లోని రాయలసీమలో సాగునీటి కొరత తీర్చేందుకు గోదావరి నీటిని కృష్ణానది జలాశయాల్లోకి మళ్లించడం గురించి చర్చించారు. ఈ ప్రాజెక్టుకు అయ్యే ఖర్చు కేవలం రూ.25,000కోట్లు మాత్రమేనని అంచనా వేశారు. -
సమష్టి కృషితోనే లాభాల బాట
నల్లగొండ అగ్రికల్చర్: పాలకవర్గం, సహకార సంఘాల చైర్మన్లు, ఉద్యోగుల సమష్టి కృషితోనే జిల్లా కేంద్ర సహకార బ్యాంకు(డీసీసీబీ) లాభాల బాటలో పయనిస్తోందని ఆ బ్యాంకు చైర్మన్ కుంభం శ్రీనివాస్రెడ్డి అన్నారు. సోమవారం నల్లగొండలోని డీసీసీబీ కార్యాలయంలో జరిగిన మహాజన సభలో ఆయన మాట్లాడారు. గత ఆర్థిక సంవత్సరంలో బ్యాంకు రూ.2,850.81 కోట్ల టర్నోవర్కు చేరుకుని రూ.42.31కోట్ల గ్రాస్ ప్రాఫిట్, రూ.26.97కోట్ల నెట్ ప్రాఫిట్ను సాధించిందన్నారు. రుణం పొందిన వ్యక్తులు ఏదేని కారణంతో చనిపోతే వారి కుటుంబాలపై ఆర్థిక భారం పడకుండా ఓటీఎస్ విధానం అమలు చేస్తున్నామన్నారు. సహకార సంఘాలకు నాబార్డు రీ ఫైనాన్స్ ద్వారా కిసాన్ డ్రోన్లు అమలు చేయనున్నామన్నారు. నేషనల్ లైవ్స్టాక్ మిషన్ ద్వారా రైతులు కోళ్లు, కోళ్ల ఫారాలు, పాడి పరిశ్రమ ఏర్పాటు చేసుకునేందుకు రుణాలు అందిస్తున్నామన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో గృహ నిర్మాణాల కోసం తక్కువ వడ్డీతో గరిష్టంగా రూ.35లక్షల వరకు రుణం ఇచ్చేలా కొత్త పాలసీ తీసుకొచ్చామన్నారు. ఇప్పటి వరకు 116మంది రైతులకు రూ.17 కోట్లు రుణాలు అందించామన్నారు. బంగారు ఆభరణాలపై రూ. 623.92 కోట్ల రుణాలను అందించామన్నారు. డిపాజిట్ల సేకరణ లక్ష్యాన్ని త్వరలో పూర్తిచేస్తామన్నారు. సమావేశంలో వైస్ చైర్మన్ ఏసిరెడ్డి దయాకర్రెడ్డి, డైరెక్టర్లు గొంగిడి మహేందర్రెడ్డి, పాశం సంపత్రెడ్డి, గుడిపాటి సైదులు, ధనావత్ జయరామ్, అందెల లింగంయాదవ్, కోడి సుష్మ, ప్రవీణ్రెడ్డి, దొండపాటి అప్పిరెడ్డి, రంగాచారి, బంటు శ్రీనివాస్, కొండ సైదయ్య, రామచంద్రయ్య, సీఈఓ రావులపాటి శంకర్రావు పాల్గొన్నారు. డీసీసీబీ చైర్మన్ కుంభం శ్రీనివాస్రెడ్డి -
నీటి నిల్వ పనులకు ప్రాధాన్యం ఇవ్వాలి
మునుగోడు: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో నీటి నిల్వకు ఉపయోగపడే పనులకు ప్రాధాన్యం ఇవ్వాలని కేంద్ర జలవనరుల కమిటీ అధికారి ఆనంద్బాబు సూచించారు. సోమవారం మునుగోడు మండలంలోని కొరటికల్, గూడపూర్, సింగారం, జమస్తాన్పల్లి తదితర గ్రామాల్లో నీటి నిల్వ కోసం చేపట్టిన చెక్డ్యాంలు, పత్తి, ఊట కుంటలతో పాటు వరద కట్టల పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మండలంలో ఎక్కడెక్కడ ఎన్ని పనులు చేశారు, వాటికి ఎంత ఖర్చయ్యింది. వాటి వల్ల భూగర్భ జలాలు ఏమైనా పెరిగియా అనే విషయాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రోజురోజుకు అడుగంటుతున్న భూగర్భజలాలను పెంచేందుకు వర్షపు నీరు వృథా కాకుండా భూమిలో ఇంకేలా చొరవ చూపాలని సూచించారు. ఆయన వెంట మండల అభివృద్ధి అధికారి విజయభాస్కర్, ఎంపీఓ స్వరూపరాణి, ఏపీఓ నాగరాజు, టీఏలు, ఫీల్డ్ అసిస్టెంట్లు, రైతులు ఉన్నారు. కేంద్ర జలవనరుల కమిటీ అధికారి ఆనంద్బాబు -
● పత్తి రైతు కష్టాలు
ఆత్మకూరు(ఎం) మండలం రహీంఖాన్పేట గ్రామానికి చెందిన రైతు తాళ్లపల్లి నర్సయ్యగౌడ్ ఐదెకరాల భూమి కౌలుకు తీసుకుని పత్తి సాగు చేస్తున్నాడు. ఇప్పటి వరకు పత్తి విత్తనాలకు, దున్నకానికి, కలుపుతీతకు, గుంటుక తోలినందుకు గాను రూ.50వేల వరకు పెట్టుబడి వచ్చింది. వర్షాలు ముఖం చాటేయడంతో మొలకెత్తిన పత్తి మొక్కలు వాడిపోయే దశకు చేరుకున్నాయి. దీంతో సోమవారం నర్సయ్యగౌడ్ తన కుటుంబ సభ్యులతో కలిసి బక్కెట్లు, బిందెల సహాయంతో పత్తి మొక్కలకు నీళ్లు పోసి వాటిని కాపాడుకునే ప్రయత్నం చేశాడు. – ఆత్మకూరు(ఎం) -
రోడ్డు ప్రమాదంలో గుర్తుతెలియని వ్యక్తి మృతి
దేవరకొండ: రోడ్డు వెంట నడుచుకుంటూ వెళ్తున్న గుర్తుతెలియని వ్యక్తిని ద్విచక్ర వాహనం ఢీకొట్టడంతో మృతిచెందాడు. ఈ ఘటన పెద్దఅడిశర్లపల్లి మండలం చిల్కమర్రి సమీపంలో కోదాడ–జడ్చర్ల జాతీయ రహదారిపై ఆదివారం రాత్రి జరిగింది. గుడిపల్లి ఎస్ఐ నర్సింహులు తెలిపిన వివరాల ప్రకారం.. గుడిపల్లి మండలం ఘణపురం గ్రామానికి చెందిన బొడ్డుపల్లి ఆంజనేయచారి తన ద్విచక్ర వానంపై ఆదివారం రాత్రి కొండమల్లేపల్లి నుంచి ఘణపురం గ్రామానికి వెళ్తుండగా.. పెద్దఅడిశర్లపల్లి మండలం చిల్కమర్రి గ్రామ స్టేజీ సమీపంలోకి రాగానే కోదాడ–జడ్చర్ల జాతీయ రహదారి వెంట నడుచుకుంటూ వెళ్తున్న మతిస్థిమితం లేని గుర్తుతెలియని వ్యక్తిని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో అతడితో పాటు ఆంజనేయచారికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వారిని 108 వాహనంలో దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. వైద్యులు పరీక్షించి గుర్తుతెలియని వ్యక్తి అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. ఆంజనేయచారి తలకు తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం హైదరాబాద్కు తరలించారు. మృతుడి వయస్సు సుమారు 25 నుంచి 30 ఏళ్లు ఉంటుందని, అతడి ఎడమ చేతిపై చమన్ అని ఇంగ్లిష్ అక్షరాలతో పచ్చబొట్టు ఉందని పోలీసులు తెలిపారు. మృతుడి వివరాలు తెలిసిన వారు 8712670227 నంబర్కు సమాచారం ఇవ్వాలని ఎస్ఐ సూచించారు. చిల్కమర్రి గ్రామ పంచాయతీ కార్యదర్శి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. జీవితంపై విరక్తితో యువకుడి ఆత్మహత్మ దేవరకొండ: జీవితంపై విరక్తితో ఉరేసుకుని యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సోమవారం చింతపల్లి మండలం నసర్లపల్లి గ్రామంలో జరిగింది. చింతపల్లి ఎస్ఐ రామ్మూర్తి తెలిపిన విరాల ప్రకారం.. నసర్లపల్లి గ్రామానికి చెందిన జింకల శివ(32) హైదరాబాద్లోని కారు డ్రైవింగ్ చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. గతేడాది అతడి భార్య అనారోగ్యంతో మృతిచెందింది. అతడికి కూడా ఆరోగ్యం బాగోలేకపోవడం, కుటుంబ సమస్యల కారణంగా మనోవేదనకు గురవుతున్నాడు. దీంతో జీవితంపై విరక్తితో సోమవారం మధ్యాహ్నం గ్రామ సమీపంలోని ఓ వ్యవసాయ బావి వద్ద చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సాయంత్రం అటుగా వెళ్లిన గ్రామస్తులకు శివ ఉరికి వేలాడుతూ కనిపించడంతో వెంటనే అతడి బంధువులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. మద్యానికి బానిసై గొంతు కోసుకుని.. భువనగిరిటౌన్: మద్యానికి బానిసైన యువకుడు గొంతు కోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన భువనగిరి పట్టణంలోని హనుమాన్వాడలో సోమవారం రాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హనుమాన్వాడకు చెందిన బి. నవీన్ (26) ప్లంబర్గా పనిచేస్తున్నాడు. అతడు మద్యానికి బానిసయ్యాడు. కొంతకాలంగా మానసిక సమస్యలతో బాధపడుతున్న నవీన్ సోమవారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో కత్తితో గొంతు కోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ కుమారస్వామి తెలిపారు. మంటల్లో ద్విచక్ర వాహనం దగ్ధంనార్కట్పల్లి: నార్కట్పల్లి మండలం ఏపీ లింగోటం గ్రామానికి చెందిన మాజీ వార్డు సభ్యుడు గోరెమియా రోజుమాదిరిగా ఆదివారం రాత్రి తన బైక్ను ఇంటి ముందు పార్కింగ్ చేశాడు. అర్ధరాత్రి సమయంలో బైక్కు మంటలు అంటుకోవడంతో గోరెమియా గమనించి ఇంటి బయటికి వచ్చి చూసేసరికి బైక్ పూర్తిగా కాలిపోయింది. గుర్తుతెలియని వ్యక్తులు తన బైక్కు నిప్పంటించారని బాధితుడు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఎస్ఐ క్రాంతికుమార్ సోమవారం ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
మాదిగలు విద్యతోపాటు ఆర్థికంగా ఎదగాలి
బీబీనగర్: సామాజిక న్యాయం జరగాలంటే మాదిగలు చదువుతో పాటు ఆర్థికంగా ఎదగాలని ప్రొఫెసర్ కాశీం పేర్కొన్నారు. ఆదివారం బీబీనగర్లో నిర్వహించిన జ్ఞానచైతన్య సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. మాదిగ జాతిలో మార్పు రావాలంటే ఉన్నత చదువులు చదవాలని తద్వారా ఆర్థికంగా బలపడుతారని పేర్కొన్నారు. ఎస్సీ వర్గీకరణ సాధన కోసం మంద కృష్ణమాదిగ అలుపెరగని ఉద్యమం చేశారన్నారు. రైల్వే రిటైర్డ్ చీఫ్ కమర్షియల్ మేనేజర్ భరత్ భూషణ్, ప్రజాకవి ఏపూరి సోమన్న మాట్లాడుతూ పోటీ ప్రపంచంలో అక్షరజ్ఞానం కలిగిఉన్నప్పుడే అన్ని రంగాల్లో రాణించగలుగుతామన్నారు. ఈకార్యక్రమంలో నాయకులు నాగారం అంజయ్య, కుమార్, నరసింహ, పొట్ట వెంకటేశ్వర్లు, నగేష్, కిషన్, రామచంద్రయ్య, జహంగీర్, సుదర్శన్, మహేష్, పొట్ట నవీన్ పాల్గొన్నారు. స్పోర్ట్స్ స్కూళ్లలో ప్రవేశానికి ఎంపిక పోటీలుభువనగిరి: క్రీడా పాఠశాలల్లో 2025–26 విద్యా సంవత్సరానికి 4వ తరగతిలో ప్రవేశానికి స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో ఈ నెల 24,25 తేదీల్లో విద్యార్థులకు ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్టు జిల్లా యువజన క్రీడల అభివృద్ధి అధికారి ఒక ప్రకటనలో తెలిపారు. 24న బాలికలకు, 25న బాలురకు జిల్లా కేంద్రంలో ఎంపిక పోటీలు జరుగుతాయన్నారు. పూర్తి వివరాలకు సెల్ నంబర్ 8074487020ను సంప్రదించాలని కోరారు. పీఆర్ఓ వ్యవస్థను రద్దు చేయాలియాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో పీఆర్ఓ వ్యవస్థను రద్దు చేయాలని, పెండింగ్ పనులను పూర్తి చేయాలని కోరుతూ ఆలయ ఈఓ వెంకట్రావ్కు సీపీఐ జిల్లా కార్యదర్శి గోద శ్రీరాములు ఆధ్వర్యంలో ఆదివారం వినతిపత్రం అందజేశారు. భక్తులు యాదగిరికొండపైన వ్రతపూజలు నిర్వహించేందుకు ప్రత్యేక భవనం నిర్మించాలని, శని, ఆదివారాల్లో భక్తుల రద్దీకి అనుగుణంగా ఆర్టీసీ బస్సులు నడిపించాలని, పాత హైస్కూల్ ఖాళీ స్థలంలో భక్తుల వసతికోసం భవనాలు నిర్మించాలని కోరారు. కాంట్రాక్టు ఉద్యోగులకు కనీస వేతన చట్టం అమలు చేయాలన్నారు. చింతపండు చోరీ కేసులో బాధ్యులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు కళ్లెం కృష్ణ, మండల కార్యదర్శి కల్లెపల్లి మహేందర్, సహాయ కార్యదర్శి పేరబోయిన మహేందర్, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు గోరేటి రాములు ఉన్నారు. -
పర్యావరణ పరిరక్షణే లక్ష్యం
పాఠశాలల్లో ఎకో క్లబ్ల ఏర్పాటుకు సన్నాహాలు ఫ జూలై 29వ తేదీ లోపు కమిటీలు ఫ ఈ విద్యా సంవత్సరం ఎకో క్లబ్ ఫర్ మిషన్ లైఫ్ పేరుతో ఏడు అంశాలపై ప్రచారం ఫ పక్కాగా అమలయ్యేలా కార్యాచరణ అవగాహన కల్పించే ఏడు అంశాలు ఇవే.. ఇంధన పొదుపు నీటి పొదుపు సింగిల్ యూజ్ వాడొద్దు సుస్థిర ఆహార వ్యవస్థలు వృథాను అరికట్టడం ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవర్చుకోవడం ఈ–వ్యర్థాలను తగ్గించడం భువనగిరి : పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా వివిధ అంశాలపై ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులకు విద్యార్థి స్థాయి నుంచే అవగాహన కల్పించేందుకు కేంద్ర విద్యా శాఖ చర్యలు చేపట్టింది. విద్యార్థులను పర్యావరణ సంబంధిత కార్యకలాపాల నిర్వహణలో వారిని భాగస్వాములు చేసేందుకు ప్రభుత్వం ఎకో క్లబ్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. దీనిపై ఈ క్లబ్లను ఈ విద్యాసంవత్సరం నుంచి ‘ఎకో క్లబ్ ఫర్ మిషన్ లైఫ్’గా పిలవనున్నారు. అన్ని ప్రభుత్వ పాఠశాలలతో పాటు ప్రైవేట్ పాఠశాలల్లోనూ కొత్త క్లబ్ల ఏర్పాటుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతేడాది ఇవి ఆశించిన స్థాయిలో పనిచేయకపోవడం ఈ సంవత్సరం పకడ్బందీగా నిర్వహించేలా జిల్లా అధికారులు నిర్ణయించారు. వచ్చే నెలాఖరులోగా.. ఈ నెల 16 నుంచి వచ్చేనెల 29 వరకు జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో ఎకో క్లబ్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రతి తరగతి నుంచి చురుగ్గా ఉన్న నలుగురు లేదా ఐదుగురు విద్యార్థులను ఎంపిక చేసి టీచర్లను, పాఠశాల కమిటీ చైర్మన్ను క్లబ్లో భాగస్వాములు చేయనున్నారు. పాఠశాల యాజమాన్య కమిటీలు, ఉపాధ్యాయులు ఇందులో సభ్యులుగా ఉండాలి. ప్రధానోపాధ్యాయుడు పర్యవేక్షించాల్సి ఉంటుంది. ఏడు అంశాలకు సంబంధించిన యాక్టివిటీ ఫొటోలు, వీడియోలు తీసి ప్రత్యేక వెబ్సైట్లో అప్లోడ్ చేయాలి. ప్రతి స్కూల్ నుంచి ఒక కమిటీ జిల్లాలో 715 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా వాటిలో 35,558 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ప్రైవేట్ స్కూళ్లు 156 ఉండగా వాటిలో 49,651 మంది విద్యార్థులు ఉన్నారు. ఇందులో ప్రతి పాఠశాల నుంచి ఒక కమిటీ ఏర్పాటు చేయనున్నారు. ప్రపంచ ప్రజా ఉద్యమంగా చేపట్టిన ఏడు అంశాల్లో ఎకో క్లబ్లను భాగస్వామ్యం చేస్తారు. జిల్లాలో పాఠశాలలు.. ప్రభుత్వ 715 విద్యార్థులు 35,558ప్రైవేట్ స్కూళ్లు 156 విద్యార్థులు 49,651 -
ఆరు నెలలు.. 44,755 కేసులు
యాదగిరిగుట్ట : ట్రాఫిక్ ఉల్లంఘనలు యథేచ్ఛగా సాగుతున్నాయి. అతివేగం, రాంగ్ రూట్, సిగ్నల్ జంప్, త్రిబుల్ రైడింగ్తో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. పోలీసులు ఎన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా, కేసులు నమోదు చేస్తున్నా, జరిమానా విధిస్తున్నా వాహనదారుల్లో మార్పు రావడం లేదు. యాదగిరిగుట్ట సర్కిల్ పరిధిలో ఈ ఏడాది జనవరి నుంచి మేల నెల వరకు కేవలం ఐదు నెలల్లోనే 44,755 ట్రాఫిక్ ఉల్లంఘన కేసులు నమోదయ్యాయి. ఫైన్ వేయడంతో వచ్చిన ఆదాయం ఐదు నెలల్లో 44,775 మందికి చలాన్లు విధించి, రూ.73,09,800 జరిమానా వేశారు. ఇందులో సెల్ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం ద్వారా రూ.4,59,000, నో పార్కింగ్ ప్రదేశంలో వాహనాలు నిలిపినందుకు రూ.2,96,400, యూనిఫామ్ ధరించనందుకు రూ.2,82,400, నంబర్ ప్లేట్లు సరిగా లేనందుకు రూ.4,15,600, సీట్ బెల్ట్ ధరించని వారికి రూ.16,90,100, ధ్రువీకరణ పత్రాలు లేకపోవడం రూ.421000, ట్రిపుల్ రైడింగ్ రూ.7,46,400, డ్రైవింగ్ లైసెన్స్ లేని వాహనదారులకు రూ.63,000 జరిమానా విధించారు. మద్యం సేవించి డ్రైవింగ్ చేస్తూ.. జనవరి నుంచి మే నెల వరకు పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో మద్యం సేవించి వాహనాలు నడుపుతూ 210 మంది పట్టుబడ్డారు. తాగి వాహనాలు నడిపి పట్టుబడ్డ వ్యక్తులకు కోర్టు జరిమానాతో పాటుగా, జైలు శిక్ష కూడా ఖరారు చేస్తుంది. మద్యం తాగి వాహనాలు నడపడం వల్ల తలెత్తే అనర్థాలపై పోలీసులు అవగాహన కల్పిస్తున్నారు.అతివేగం, రాంగ్రూట్, సిగ్నల్ జంప్ ఫ చలానాలు విధిస్తున్నా మారని వాహనదారులు ఫ గుట్ట సర్కిల్ పరిధిలో జనవరి నుంచి రూ.73,09,800 జరిమానా హెల్మెట్ ధరించని వారే ఎక్కువ పోలీసులు విధించిన జరిమానాల్లో హెల్మెట్ ధరించని వారే ఎక్కువగా ఉన్నారు. వీరికి రూ.20,54,300 జరిమానాను విధించారు. ద్విచక్రవాహనదారులు తప్పకుండా హెల్మెట్ ధరించాలని, లేదంటే ప్రాణాలకే ముప్పు వాటిల్లుతుందని ట్రాఫిక్ పోలీసులు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా తీరు మార్చుకోవడం లేదు. రూల్స్ అతిక్రమిస్తే ఉపేక్షించేది లేదు వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నియమాలు పాటించాలి.ద్విచక్రవాహనదారులు డ్రైవింగ్ చేసే సమయంలో హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలి. మద్యం సేవించి వాహనాలు నడిపితే జైలుకు వెళ్లాల్సి ఉంటుంది. మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదు.ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే ఉపేక్షించేది లేదు. ఎప్పటికప్పుడు అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి ప్రజలకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పిస్తున్నాం. –యెలగొండ కృష్ణ, ట్రాఫిక్ సీఐ, యాదగిరిగుట్ట -
పవర్తగ్గిన లూమ్స్!
గిట్టుబాటు ధర లభించక, ప్రభుత్వ సహకారం అందక..రాజపేట మండలం రేణికుంటకు చెందిన రేగొండ రాజు పవర్లూమ్ కార్మికుడు. ప్రారంభంలో వృత్తిపరంగా బాగానే ఉన్నా క్రమంగా ఆదా యం తగ్గింది. రోజంతా కష్టపడిని రూ.7వేలు కూడా రావడంలేదు. వృత్తి మానేసి కుటుంబ పోషణకోసం రోజులో కొంత సమయం పెట్రోల్ బంకులో, సాయంత్రం టీ స్టాల్లో పని చేస్తున్నానని రాజు ఆవేదన వ్యక్తం చేశాడు. ఫ మూలనపడుతున్న మరమగ్గాలు ఫ పూటగడవని స్థితిలో కుటుంబాలు ఫ వాచ్మన్లుగా, గుమస్తాలుగా, వ్యవసాయ పనుల్లోకి కార్మికులు ఫ నాడు జిల్లాలో ఆరు వేలకు పైగా మరమగ్గాలతో ఒక వెలుగు.. ఫ నేడు దయనీయస్థితిని ఎదుర్కొంటున్న పరిశ్రమ -
మోదీ పాలనలోనే దేశ పురోగతి
మోత్కూరు : ప్రధాని నరేంద్రమోదీ పాలనలోనే దేశం అన్ని రంగాల్లో పురోగతి సాధించిందని బీజేపీ సూర్యాపేట జిల్లా అధ్యక్షురాలు చల్లా శ్రీలతారెడ్డి, తుంగతుర్తి నియోజకవర్గ ఇంచార్జ్ కడియం రామచంద్రయ్య అన్నారు. ప్రధానిగా నరేంద్రమోదీ 11 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మోత్కూరు మండలంలోని పాటిమట్ల గ్రామంలో బీజేపీ మండల అధ్యక్షుడు గూదె మధుసూదన్ యాదవ్ ఆధ్వర్యంలో ఆదివారం సంకల్ప సభ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఎక్కడా అవినీతి లేదన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం కోసం ఉచితాల పేరుతో ప్రజలను మోసం చేస్తుందని విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు సాధించేందుకు కృషి చేయాలని పార్టీ శ్రేణులను కోరారు. అనంతరం పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసి గ్రామంలో మొక్కలు నాటారు. వివిధ పార్టీలకు చెందిన పలువురు నాయకులు బీజేపీలో చేరారు. సమావేశంలో జిల్లా నాయకులు ఏనుగు జితేందర్రెడ్డి, అండెం సుధాకర్రెడ్డి, భీముడి తిరుమలరెడ్డి, ఉపాధ్యక్షులు లెల్లల బాలనర్సయ్య, రాదారపు మల్లేషం, ప్రధాన కార్యదర్శి వేముల దశరథ, మండల ఎస్సీ మోర్చా కొంపెల్లి గణేష్, కోశాధికారి కడమంచి సైదులు, కార్యదర్శి బత్తిని సతీష్, గ్రామ శాఖ అధ్యక్షుడు ఈట్టబోయిన ఆంజనేయులు, నల్లపోగుల వెంకన్న, కక్కరేను మల్లేష్, ముక్కాముల గణేష్, ఆళ్ల శివప్రసాద్, నిలిగొండ జయమ్మ, మార్గం సుజాత, మహేశ్వరం నిఖిత, కల్పన, మహేష్, మచ్చగిరి, నరేష్, అజయ్, మత్స్యగిరి, కిరణ్, మౌలానా తదితరులు పాల్గొన్నారు. ఫ బీజేపీ సూర్యాపేట జిల్లా అధ్యక్షురాలు చల్లా శ్రీలతారెడ్డి -
ఇక్కత్ డూప్లికేషన్ను అరికట్టాలని వినతి
భూదాన్పోచంపల్లి: పోచంపల్లి ఇక్కత్ డిజైన్ల డూ ప్లికేషన్ను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆదివారం హైదరాబాద్లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్కుమార్ను భూదాన్పోచంపల్లికి చెందిన పలువురు చేనేత నాయకులు కలిసి వినతిపత్రం అందజేశారు. గుజ రాత్, సూరత్, రాజస్థాన్ కేంద్రంగా పోచంపల్లి ఇక్కత్ డిజైన్లను ప్రింటింగ్ చేసి మార్కెట్లో అతితక్కువ ధరకు విక్రయిస్తున్నారని, దీనివల్ల లక్షలాది మంది చేనేత కార్మికుల ఉపాధిపై ప్రభావం పడుతుందన్నారు. ఇందుకు మంత్రి సానుకూలంగా స్పందించారని చేనేత నాయకులు తెలిపారు. అనంతరం బండి సంజయ్ను పోచంపల్లి శాలువాతో సన్మానించారు. కార్యక్రజుమంలో బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ చిక్క కృష్ణ, చేనేత సెల్ జిల్లా కన్వీనర్ గంజి బస్వలింగం, పట్టణ అధ్యక్షుడు డబ్బీకార్ సాహేశ్, ప్రధాన కార్యదర్శి ఏలే శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
స్వర్ణగిరిలో నేత్రపర్వంగా తిరువీధి సేవ
భువనగిరి : పట్టణ పరిధిలోని స్వర్ణగిరి క్షేత్రంలో ఆదివారం సాయంత్రం చేపట్టిన శ్రీవేంకటేశ్వరస్వామి తిరువీధి సేవ నేత్రపర్వంగా సాగింది. ఈ సందర్భంగా స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి ఆలయ తిరువీధుల్లో ఊరేగించారు. అంతకుముందు సుప్రభావ సేవ, తోమాల సేవ, సహస్ర నామార్చన, నిత్య కళ్యాణం తదితర పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం సుమారు 5వేలమంది భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. సాయంత్రం స్వామివారికి కర్పూరంతో మంగళహారతుల సమర్పించారు. సెలవు దినం కావడంతో ఆలయ మాడవీధులు భక్తులతో కిటకిటలాడాయి. -
రేషన్ బియ్యం స్వాధీనం
చిట్యాల: చిట్యాల మండలం చిన్నకాపర్తి గ్రామ శివారులో గల ఓ వ్యవసాయ పొలం వద్ద నిల్వ చేసిన పది క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని ఆదివారం పోలీసులు పట్టుకున్నారు. ఓ వ్యక్తి స్కూటీపై చిన్నకాపర్తితో పాటు వెంబాయి, బోయగుబ్బ, మొగిదిదొరి గ్రామాల్లో తిరుగుతూ రేషన్ లబ్ధిదారుల నుంచి తక్కువ ధరకు రేషన్ బియ్యం కొనుగోలు చేసి చిన్నకాపర్తి గ్రామ శివారులోని ఓ వ్యవసాయ పొలం వద్ద నిల్వ చేస్తూ వస్తున్నాడు. విశ్వసనీయ సమాచారం మేరకు ఆదివారం పోలీసులు వ్యవసాయ పొలంపై దాడి చేసి సుమారు పది క్వింటాళ్ల(20 బస్తాలు) రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ బియ్యాన్ని నూకలుగా మార్చి కోళ్ల ఫారాలకు విక్రయిస్తున్నట్లు తెలిసింది. నల్లబెల్లం, పటిక పట్టివేతకొండమల్లేపల్లి: కారులో అక్రమంగా తరలిస్తున్న నల్లబెల్లం, పటికను శనివారం అర్ధరాత్రి ఎకై ్సజ్ అధికారులు పట్టుకున్నారు. ఆదివారం నల్లగొండ ఎకై ్సజ్ ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ కమిషనర్ సంతోష్ తెలిపిన వివరాల ప్రకారం.. కొండమల్లేపల్లి మండలంలోని హైదరాబాద్లో రోడ్డులో చెన్నారం గేటు వద్ద శనివారం అర్ధరాత్రి వాహనాల తనిఖీల్లో భాగంగా ఎకై ్సజ్ అధికారులు ఓ కారును ఆపి తనిఖీ చేస్తుండగా.. డిండి మండలం బొగ్గులతోనకు చెందిన బాలకోటి కారును అక్కడే వదిలి పరారయ్యాడు. కారులో 660 కిలోల నల్లబెల్లం(22 బస్తాలు), 10 కిలోల పటికను పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కారును సీజ్ చేసి కేసు నమోదు చేసినట్లు ఎకై ్సజ్ ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ కమిషనర్ తెలిపారు. ఆయన వెంట ఎక్సైజ్ సీఐ రాకేష్, సిబ్బంది అయూబ్, శేఖర్రెడ్డి, రమేష్ తదితరులున్నారు. రైల్లో నుంచి జారిపడి వ్యక్తికి గాయాలు వలిగొండ: రైల్లో నుంచి జారిపడి వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన వలిగొండ మండలం గొల్నేపల్లి సమీపంలో ఆదివారం జరిగింది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గొల్నేపల్లి–వలిగొండ గ్రామాల మధ్య రైల్లో నుంచి ఓ వ్యక్తి జారిపడి తీవ్రంగా గాయపడినట్లుగా రైల్వే సిబ్బంది ఇచ్చిన సమాచారం మేరకు రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వ్యక్తిని 108 వాహనంలో నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రి తరలించారు. క్షతగాత్రుడి నుంచి వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నించగా. తన పేరు విజయ్ అని, తనది మహారాష్ట్రలోని ఉదగిర్ గ్రామమని చెబుతున్నట్లు రైల్వే ఎస్ఐ రామకృష్ణ పేర్కొన్నారు. అతడి తల, కాలుకు తీవ్ర గాయాలవ్వడంతో పూర్తి వివరాలు చెప్పలేకపోతున్నాడని పేర్కొన్నారు. ఈ మే రకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. వ్యక్తిపై దాడి.. ముగ్గురిపై కేసు అడ్డగూడూరు: వ్యక్తిపై దాడి చేసిన ముగ్గురిపై అడ్డగూడూరు పోలీసులు కేసు నమోదు చేశారు. ఆదివారం ఎస్ఐ వెంకట్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. అడ్డగూడూరు మండల కేంద్రానికి చెందిన మేకల పవన్ శనివారం రాత్రి 11.30 గంటలకు ఇంటికి వెళ్తుండగా.. అడ్డగూడూరు మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద కొంతమంది గుమికూడటం గమనించి అక్కడకు వెళ్లాడు. ఈ క్రమంలో లక్ష్మిదేవికాల్వ గ్రామానికి చెందిన కప్పల రాజేష్తో పాటు అడ్డగూడూరు మండల కేంద్రానికి చెందిన గూడెపు నాగరాజు, గజ్జెల్లి రవి కలిసి పవన్పై కర్రలతో దాడి చేశారు. ఈ దాడిలో పవన్ చేతికి గాయాలయ్యాయి. తనపై దాడి చేసి, కులం పేరుతో దుషించారని ఆదివారం పవన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
ప్రభాకర్రెడ్డి ఎంతో ప్రతిభావంతుడు
రామగిరి(నల్లగొండ): నల్లగొండ జిల్లాకు చెందిన దివంగత నటుడు, దర్శక–నిర్మాత డాక్టర్ ఎం. ప్రభాకర్రెడ్డి ఎంతో ప్రతిభావంతుడని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. ప్రభాకర్రెడ్డి సినీ జీవితంపై నల్లగొండ ఫిలిం సొసైటీ సెక్రటరీ పున్నమి అంజయ్య రచించిన పుస్తకాన్ని ఆదివారం గుత్తా సుఖేందర్రెడ్డి నల్లగొండ పట్టణంలోని తన క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సినీ కార్మికుల సంక్షేమం కోసం అహర్నిశలు కృషిచేసిన ఎం. ప్రభాకర్రెడ్డికి తెలుగు చిత్ర పరిశ్రమలో సరైన గౌరవం దక్కలేదని అన్నారు. ప్రభాకర్రెడ్డి సినీ జీవితం గురించి పుస్తకం వెలువరించడం అభినందనీయమన్నారు. పుస్తక రచయిత పున్నమి అంజయ్య మాట్లాడుతూ.. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన గద్దర్ అవార్డుల ప్రదానోత్సవంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన దివంగత నటులు కత్తి కాంతారావు, ఎం. ప్రభాకర్రెడ్డిలను గుర్తుచేసుకోకపోవడం ఎంతో బాధాకరమన్నారు. ఉమ్మడి జిల్లాకు చెందిన కత్తి కాంతారావు, ఎం. ప్రభాకర్రెడ్డి, హాస్యనటుడు వేణుమాధవ్ కుటుంబ సభ్యులకు రూ.కోటి, 500 గజాల స్థలాన్ని కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఫిలిం సొసైటీ సభ్యులు ఫసీ, విద్యాసాగర్, జిల్లా రచయితల సంఘం అధ్యక్షుడు మేరెడ్డి యాదగిరిరెడ్డి, కోమలి కళాసమితి అధ్యక్షుడు బక్క పిచ్చయ్య, సభ్యులు వంగూరు భాస్కర్, తేజస్విని, సాహితీ సాంస్కృతిక సంస్థ అధ్యక్షుడు పెందోట సోము, ప్రముఖ కవి రచయిత డాక్టర్ సాగర్ల సత్తయ్య, ఉనికి సంస్థ అధ్యక్షుడు బండారు శంకర్, విశ్వకర్మ సేవా సమితి కన్వీనర్ పగిడిమర్రి వెంకటాచారి, తదితరులు పాల్గొన్నారు ఫ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి -
ఐదు దశాబ్దాల తర్వాత ఆత్మీయ కలయిక
సూర్యాపేట: సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జెడ్పీ బాలుర పాఠశాలలో 1969లో హెచ్ఎస్సీ చదివిన పూర్వ విద్యార్థులు ఆదివారం పాఠశాలలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో కలుసుకున్నారు. 56 ఏళ్ల తర్వాత చిన్ననాటి స్నేహితులను కలుసుకొని ఆనందంగా గడిపారు. ఆనాడు తమకు చదవు చెప్పిన గురువులు ఒంటెద్దు వెంకట్రెడ్డి, ఎన్. సత్యనారాయణను ఘనంగా సత్కరించి పాదాభివందనం చేశారు. ఈ కార్యక్రమంలో గెజిటెడ్ ప్రధానోపాధ్యాయురాలు గోలి పద్మ, రిటైర్డ్ టీచర్ గుండా రమేష్, పూర్వ విద్యార్థులు ప్రభాకరాచారి, వెంపటి వెంకన్న, అంజని, శ్రీనివాసరావు జయాకర్, వి. సూర్యనారాయణ, భాస్కర్, సుబ్రహ్మణ్య శాస్త్రి తదితరులు పాల్గొన్నారు. 41 ఏళ్ల తర్వాత.. గరిడేపల్లి: గరిడేపల్లి మండల పరిధిలోని కల్మలచెరువు జెడ్పీహెచ్ఎస్లో 1982–83 విద్యా సంవత్సరంలో పదోతరగతి చదివిన పూర్వ విద్యార్థులు ఆదివారం ఆత్మీయ సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించారు. 41ఏళ్ల తర్వాత ఒకచోట చేరి వారి చిన్ననాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. తమకు విద్యాబుద్ధులు నేర్పిన ఆనాటి ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు మూలగుండ్ల సీతారాంరెడ్డి, ఈగ శ్రీనివాసరావు, కృష్ణ, ఒంటెద్దు వెంకట్రెడ్డి, బండారు పిచ్చయ్య, నలబోలు సైదిరెడ్డి, ధనమ్మ, అలుగుబెల్లి సైదిరెడ్డి, గుమ్మిత నర్సిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరి దుర్మరణం
బీబీనగర్: కారును వెనుక నుంచి ద్విచక్ర వాహనం ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. ఈ ఘటన బీబీనగర్ మండలంలోని గూడూరు టోల్ప్లాజా శనివారం రాత్రి జరిగింది. సీఐ ప్రభాకర్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. తిరుమలగిరికి చెందిన తంగెళ్లపల్లి సత్యనారాయణచారి(50), భువనగిరికి చెందిన ఎర్రోజు రాజు(42) కలిసి పని నిమిత్తం శనివారం హైదరాబాద్కు ద్విచక్ర వాహనంపై వెళ్లారు. తిరిగి రాత్రి ఇంటికి వస్తుండగా.. బీబీనగర్ మండలం గూడూరు టోల్ప్లాజా సమీపంలోకి రాగానే ముందు వెళ్తున్న కారును అదుపుతప్పి ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో సత్యనారాయణచారి, రాజుకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం హైదరాబాద్లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో రాజు మృతిచెందాడు. ఆస్పత్రికి చేరుకున్నాక సత్యనారాయణ మృతిచెందాడు. మృతుల కుటుంబ సభ్యులు పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. మిన్నంటిన రోదనలు.. భువనగిరి: ఎర్రోజు రాజు, సత్యనారాయణచారి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం భువనగిరి జిల్లా కేంద్ర ఆస్పత్రిలోని మార్చురీలో భద్రపర్చారు. విషయం తెలుసుకున్న మృతుల కుటుంబ సభ్యులు, బంధువులు ఆదివారం ఉదయం ఆస్పత్రికి చేరుకోవడంతో వారి రోదనలతో మిన్నంటాయి. రాజుకు భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను స్వగ్రామాలకు తీసుకెళ్లారు. -
వెంచర్ నిర్వాహకులపై పోలీసులకు ఫిర్యాదు
చిట్యాల: ఐదేళ్ల క్రితం ప్లాట్లు విక్రయించి అగ్రిమెంట్ ప్రకారం రిజిస్ట్రేషన్ చేయకుండా ఇబ్బందులకు గురిచేస్తున్న వెంచర్ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని చిట్యాల పోలీస్ స్టేషన్లో ఆదివారం పలువురు బాధితులు ఫిర్యాదు చేశారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. ఐదేళ్ల క్రితం చిట్యాల మున్సిపాలిటీ పరిధిలో శ్రీనివాస టౌన్షిప్(కార్తికేయ వెంచర్) పేరుతో కొందరు రియల్ ఎసే్ట్ట్ వ్యాపారులు వెంచర్ ఏర్పాటు చేశారు. ఆ టౌన్షిప్లో చిట్యాల మండలంలోని పలు గ్రామాలకు చెందిన వారితో పాటు వివిధ ప్రాంతాలకు చెందిన సుమారు 30మంది వరకు ప్లాట్లు కొనుగోలు చేసి వెంచర్ డెవలపర్స్తో అగ్రిమెంట్ చేసుకున్నారు. ఇందుకుగాను ఒక్కొక్కరు రూ.5లక్షల నుంచి రూ.8లక్షల వరకు టౌన్షిప్ నిర్వాహకులకు ఇచ్చారు. అనంతరం వెంచర్ డెవలపర్లు వివిధ కారణాలను చూపుతూ కొనుగోలు చేసిన ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేయకుండా జాప్యం చేస్తూ వస్తున్నారు. ఇటీవల ఆ వెంచర్లో ప్లాట్లకు రేట్లు పెరగడంతో ఇప్పటికే అగ్రిమెంట్ చేసుకున్న వారికి కాకుండా ఇతరులకు రిజిస్ట్రేషన్ చేస్తున్నారని ఆరోపిస్తూ.. ప్లాట్లు కొనుగోలు చేసినవారు ఆ వెంచర్లో ఆదివారం సమావేశమయ్యారు. అనంతరం తమను మోసం చేసిన వెంచర్ డెవలపర్స్పై తగిన చర్యలు తీసుకోవాలని చిట్యాల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన వారిలో బత్తుల జనార్దన్, లింగస్వామి, అయిలయ్య, సత్యనారాయణలతో మరికొందరు ఉన్నారు. ఫ ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయకుండా మోసం చేశారని బాధితుల ఆరోపణ -
ఆర్యవైశ్యులు రాజకీయంగా ఎదగాలి
సూర్యాపేట: ఆర్యవైశ్యులు రాజకీయంగా ఎదగాలని ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు అమరవాది లక్ష్మీనారాయణ అన్నారు. ఆదివారం సూర్యాపేట పట్టణంలోని శ్రీసంతోషిమాత దేవస్థానంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆర్యవైశ్యులు ఎక్కువ స్థానాల్లో నిలబడి గెలిచి ప్రజలకు మరింత సేవలందించాలని అన్నారు. అన్ని రాజకీయ పార్టీలు ఆర్యవైశ్యులకు సముచిత స్థానం కల్పించాలని కోరారు. పేద ఆర్యవైశ్యులకు, ఆర్యవైశ్య విద్యార్థులకు సహాయం అందించాలన్నారు. ఈ సందర్భంగా సంతోషిమాత దేవస్థాన కమిటీ సభ్యులు ఆయనను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సంతోషిమాత దేవస్థాన అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బ్రాహ్మణపల్లి మురళీధర్, నూక వెంకటేశం, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు బండారు రాజా, ఉపాధ్యక్షుడు గోపారపు రాజు, కోశాధికారి చెల్లా లక్ష్మీకాంత్, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఊరే లక్ష్మణ్, పప్పా ప్రకాష్, భువనగిరి విజయ్కుమార్, కొత్త మల్లికార్జున్, రాచర్ల కమలాకర్, వెంకటేశ్వర్లు, గుడిపాటి రమేష్, పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు. ఫ ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు అమరవాది లక్ష్మీనారాయణ -
పేదలకు ఉచిత విద్య, వైద్యం అందించాలి
బాగుబడిబోరు మోటార్ల వైర్లు చోరీమిర్యాలగూడ టౌన్: వ్యవసాయ బావుల వద్ద బోరు మోటార్ల వైర్లను గుర్తుతెలియని వ్యక్తి చోరీ చేశారు. ఈ ఘటన శనివారం రాత్రి మిర్యాలగూడ మండలం బోట్యానాయక్తండా పరిధిలో జరిగింది. బాధిత రైతులు తెలిపిన వివరాల ప్రకారం.. బోట్యానాయక్తండాకు చెందిన రైతు, మాజీ సర్పంచ్ సాగర్నాయక్ శనివారం రాత్రి 10.30 గంటల సమయంలో తన పొలానికి నీళ్లు పెట్టేందుకు వెళ్తుండగా.. తన బోరు మోటారు వద్ద లైట్ వెలుగుతుడటం గమనించాడు. అక్కడికి వెళ్లి చూడగా గుర్తుతెలియని వ్యక్తి బోరు మోటారు వైరు చోరీ చేస్తూ కనిపించాడు. దీంతో సాగర్నాయక్ అతడిని నిలదీయగా ద్విచక్ర వాహనాన్ని అక్కడే వదిలి పరారయ్యాడు. అనంతరం సాగర్నాయక్ బోరు మోటారు వద్దకు వెళ్లి చూడగా స్టార్టర్ బాక్స్లో ఫ్యూజు తొలగించడంతో పాటు మోటారు వైరును చోరీకి గురైనట్లు గుర్తించాడు. ఈవిధంగా తండా పరిధిలోని 30మంది రైతుల వ్యవసాయ బావుల వద్ద బోరు మోటార్ల వైర్లు చోరీకి గురవ్వడంతో ఆదివారం బాధిత రైతులంతా కలిసి మిర్యాలగూడ రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. గుర్తుతెలియని వ్యక్తి వదిలి వేసిన వెళ్లిన ద్విచక్ర వాహన్నాఇ పోలీసులు స్టేషన్కు తరలించారు. రైతుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ ఎస్ఐ మల్లికంటి లక్ష్మయ్య తెలిపారు. చిట్టీల పేరుతో మోసం ఫ కోటిన్నర రూపాయలతో ఉడాయించిన వ్యక్తి ఫ పోలీసులకు ఫిర్యాదు చేసిన 40మందికి పైగా బాధితులుమిర్యాలగూడ అర్బన్: అందరితో పరిచయాలు ఏర్పచుకుని, నమ్మకంగా ఉంటూ చిట్టీలు కట్టించుకున్న వ్యక్తి సుమారు కోటిన్నర రూపాయలతో ఉడాయించాడు. ఈ ఘటన మిర్యాలగూడ పట్టణంలోని శాంతినగర్లో ఆదివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు.. శాంతినగర్లో నివాసముంటున్న ఓ వ్యక్తి కాలనీవాసులను నమ్మించి 40మందితో చిట్టీలు కట్టించుకున్నాడు. మొదట్లో చిట్టీ డబ్బులు బాగానే ఇచ్చిన ఆయన.. కొద్దిరోజులుగా చీటీలు పాడిన వారికి డబ్బులు ఇవ్వకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. దీంతో చిట్టీలు పాడిన వారు అతడి ఇంటి వద్దకు వచ్చి చూడగా తాళం వేసి ఉండటంతో చుట్టుపక్కల వారిని వాకబు చేశారు. సదరు వ్యక్తి కొద్దిరోజులుగా కనిపించడంలేదని చుట్టుపక్కల వారు తెలపడంతో.. అతడి ఫోన్ చేసినా స్విచ్చాఫ్ రావడంతో తాము మోసపోయామని గ్రహించిన బాధితులు మిర్యాలగూడ టూటౌన్ పోలీసులను ఆశ్రయించారు. సుమారు 40మందికి పైగా బాధితుల వద్ద కోటిన్నర రూపాయల వరకు వసూలు చేసి పారిపోయినట్లు తెలుస్తోంది. బాధితుల పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సోమనర్సయ్య పేర్కొన్నారు. సూర్యక్షేత్రంలో ప్రత్యేక పూజలుఅర్వపల్లి: జాజిరెడ్డిగూడెం మండలం తిమ్మాపురంలోని అఖండజ్యోతి స్వరూప సూర్యనారాయణస్వామి క్షేత్రంలో ఆదివారం భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు తెల్లవారుజామున ఉషాపద్మిని ఛాయా సమేత సూర్యనారాయణస్వామిని ప్రత్యేకంగా అలంకరించి అభిషేకాలు జరిపించారు. అనంతరం యజ్ఞశాలలో మహాసౌరహోమాన్ని వైభవంగా నిర్వహించారు. ఆయా పూజల్లో కాకులారపు రజిత, గణపురం నరేష్, కర్నాటి నాగేశ్వర్రావు, కాసబోయిన సత్యనారాయణ, యాదగిరి, మణికంఠ, గిరి, బెలిదె లక్ష్మయ్య, అర్చకులు భీంపాండే, మోనూపాండే, శ్రీరాంపాండే తదితరులు పాల్గొన్నారు.వలిగొండ: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేదలకు ఉచిత విద్య, వైద్యం అందించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ అన్నారు. శనివారం రాత్రి వలిగొండ మండలం పులిగిళ్లలో సీపీఎం మాజీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు వేముల మహేందర్ నాల్గవ వర్ధంతి కార్యక్రమానికి జాన్ వెస్లీ హాజరై మహేందర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జాన్ వెస్లీ మాట్లాడుతూ.. సీపీఎం అధికారంలో ఉన్న కేరళ రాష్ట్రంలో ప్రజలకు ఉచిత విద్య, వైద్యం అందిస్తుందని.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు ఈవిధంగా ఉచిత విద్య, వైద్యం అందించగలరా అని ప్రశ్నించారు. మధ్యతరగతి ప్రజలు అప్పు చేసి విద్య, వైద్య సేవలు పొందాల్సిన పరిస్థితి ఏర్పడిందని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రైవేట్, కార్పొరేట్ శక్తులకు పెద్దఎత్తున సహకరిస్తున్నాయని ఆరోపించారు. మహేందర్ ప్రజా సమస్యల పరిష్కారానికి అనేక పోరాటాలు చేశారని కొనియాడారు. ఆయన స్ఫూర్తితో ప్రజా సమస్యలపై ఉద్యమిద్దామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎండీ జహంగీర్, సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు కొండమడుగు నరసింహ, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాటూరి బాలరాజు, కల్లూరి మల్లేశం, మండల కార్యదర్శి సిర్పంగి స్వామి, జిల్లా కమిటీ సభ్యులు మద్దెల రాజయ్య, గణపతిరెడ్డి, నాయకులు కొమ్మిడి లక్ష్మారెడ్డి, వాకిటి వెంకటరెడ్డి, తుర్కపల్లి సురేందర్, మెరుగు వెంకటేశం, కళ్లెం సుదర్శన్రెడ్డి, దొడ్డి భిక్షపతి, వేముల నాగరాజు, మారబోయిన నరసింహ, బుగ్గ అయిలయ్య, బుగ్గ చంద్రమౌళి, పైళ్ల వీరారెడ్డి, వడ్డమాని వెంకటయ్య, వడ్డెమాని మధు, బుగ్గ ఉదయ్, వేముల జ్యోతిబసు తదితరులు పాల్గొన్నారు. నార్కట్పల్లి–అద్దంకి రహదారిపై అడ్డంగా పడిన కంటైనర్ ఫ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ -
ఫ బాతులే జీవనాధారం
భూదాన్పోచంపలి: భూదాన్పోచంపల్లి మండలంలోని మూసీ పరీవాహక గ్రామాల్లో ఎక్కడ చూసినా బాతులు సందడి చేస్తున్నాయి. ప్రతిఏటా వరికోతలు పూర్తవ్వగానే ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు, గుంటూరు తదితర జిల్లాల నుంచి పదుల కొద్ది కుటుంబాలు బాతు పిల్లలను తీసుకొని భూదాన్పోచంపల్లి మండలానికి వస్తుంటారు. మూసీ పరీవాహకంలోని కాలువలు, పొలాలలో బాతులను మేపుతూ వాటిని పెద్దచేసి గుడ్లు పెట్టే దశకు పెంచుతారు. రెండు నెలల పాటు ఇక్కడే ఉండి బాతు గుడ్లను సేకరించి మధ్యవర్తుల ద్వారా గుడ్లను ఉత్తరాది రాష్ట్రాలకు రవాణా చేస్తూ జీవనోపాధి పొందుతున్నారు. -
పంద్రాగస్టు నాటికి పరిష్కారం..
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : భూ భారతి చట్టం అమలులో భాగంగా గ్రామాల్లో నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులను ఆగస్టు 15 నాటికి పరిష్కారించనున్నారు. ఈ నెల 3వ తేదీ నుంచి 20 వరకు 17 రోజుల పాటు నిర్వహించిన ఈ రెవెన్యూ సదస్సుల్లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రైతులు వివిధ సమస్యలపై 1,01,605 దరఖాస్తులు సమర్పించారు. దాదాపు 15 రకాల సమస్యలపై దరఖాస్తులు వచ్చాయి. శుక్రవారంతో రెవెన్యూ సదస్సులు ముగియడంతో అధికారులు దరఖాస్తుల పరిశీలన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆగస్టు 15లోగా అన్ని సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. 1,136 గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొత్తం 1,136 రెవెన్యూ గ్రామాల్లో భూ భారతి గ్రామసభలు నిర్వహించారు. మొత్తం 1,01,605 దరఖాస్తులు ప్రజల నుంచి స్వీకరించారు. అయితే ఇందులో అత్యధికంగా మిస్సింగ్ సర్వే నంబర్లు, ఫౌతితో పాటు అసైన్డ్ భూముల సమస్యలు, పెండింగ్ మ్యుటేషన్పైనే దరఖాస్తులు అధికంగా వచ్చాయి. ప్రారంభమైన దరఖాస్తుల పరిశీలన గత ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణితో పెద్ద ఎత్తున భూ సమస్యలు పేరుకుపోయాయి. వాటిని పరిష్కరించేందుకు ప్రస్తుత ప్రభుత్వం ధరణిని రద్దు చేసి భూ భారతిని తీసుకొచ్చింది. అన్ని భూ సమస్యలను పరిష్కరించేలా భూ భారతిలో ఆప్షన్లను సిద్ధం చేసింది. 20వ తేదీ వరకు అన్ని రెవెన్యూ గ్రామాల్లో తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్ల ఆధ్వర్యంలో రెవెన్యూ సదస్సులు నిర్వహించి భూ సమస్యలపై రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. సదస్సులు ముగియడంతో అధికారులు దరఖాస్తులను కేటగిరీల వారీగా విభజించి పరిశీలిస్తున్నారు. ఆయా స్థాయిలో పరిష్కారం చిన్న చిన్న సమస్యలకు మండలస్థాయిలోనే తహసీల్దార్ నేతృత్వంలో పరిష్కరించి వెంటనే ఆన్లైన్లో నమోదు చేయనున్నారు. ఆర్డీఓ స్థాయిలో మ్యూటేషన్, ఫౌతిలను పరిష్కరిస్తారు. పెద్ద సమస్యలు ఉంటే కలెక్టర్ స్థాయిలో పరిష్కరించాల్సి ఉంటుంది. కలెక్టర్ స్థాయిలో కాని వాటిని సీసీఎల్కు పంపనున్నారు. సమస్యల విషయంలో బాధితులను పిలిపించి రికార్డులను పరిశీలించి కొన్నింటిని పరిష్కరించే అవకాశం ఉంటుంది. మరికొన్నింటి విషయంలో దరఖాస్తుల ఆధారంగా వారికి నోటీసులు ఇచ్చి రెవెన్యూ బృందాలు గ్రామాలకు వెళ్లి క్షేత్రాస్థాయిలో అన్నీ పరిశీలించి అక్కడే పరిష్కరించేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. రెవెన్యూ సదస్సుల్లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1,01,605 దరఖాస్తులు ఫ వాటి పరిశీలన ప్రారంభించిన అధికారులు ఫ మండల స్థాయిలోనే కేటగిరీల వారీగా విభజన ఫ తహసీల్దార్, ఆర్డీఓ, కలెక్టర్ స్థాయిలో ఆగస్టు 15 నాటికి పరిష్కరించేలా ప్రణాళిక సాదాబైనామాలు పెండింగేనా.. ప్రభుత్వం అన్ని రకాల భూ సమస్యలను ఆగస్టు 15 నాటికి పూర్తి చేయాలని నిర్ణయించింది. అయితే సాదాబైనామాల విషయం హైకోర్టులో పెండింగ్లో ఉంది. అవి తప్ప మిగిలిన సమస్యలన్నింటికీ ఆగస్టు 15 నాటికి పరిష్కారం చూపనున్నారు. ఆలోగా సాదాబైనామాలను పరిష్కరించేలా హైకోర్టు ఉత్తర్వులు ఇస్తే వాటిని కూడా పరిష్కరించే అవకాశం ఉంది. దరఖాస్తుల వివరాలు జిల్లా దరఖాస్తులు నల్లగొండ 42,534సూర్యాపేట 44,741యాదాద్రి 14,330మొత్తం 1,01,605 -
నృసింహుడికి విశేష పూజలు
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శనివారం నిత్యారాధనలు ఆగమశాస్త్రం ప్రకారం ఘనంగా నిర్వహించారు. స్వామివారి మేల్కొలుపులో భాగంగా ప్రభాతవేళ సుప్రభాత సేవ చేపట్టిన అర్చకులు.. గర్భాలయంలోని స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తుకు అభిషేకం, తులసీదళ అర్చనతో కొలిచారు. అనంతరం ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహహోమం, గజవాహన సేవ, నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం తదితర కై ంకర్యాలు గావించారు. సాయంత్రం వేళ వెండి జోడు సేవలను మాడవీధిలో ఊరేగించారు. వివిధ పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. -
రెడ్క్రాస్ సేవలను గ్రామాలకు విస్తరించాలి
భువనగిరి: ఇండియన్ రెడ్క్రాస్ సేవలను గ్రామాలకు విస్తరించాలని కలెక్టర్ హనుమంతరావు పేర్కొన్నారు. భువనగిరిలో ఏర్పాటు చేసిన రెడ్క్రాస్ సొసైటీ జిల్లా కార్యాలయాన్ని శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గ్రామీణ యువతను రక్తదానం చేసేలా ప్రోత్సహించాలన్నారు. రెడ్క్రాస్ సొసైటీ అందజేసిన రక్తం యూనిట్లతో ఎంతోమంది ప్రాణాలు నిలిచాయన్నారు. అనంతరం ఆర్ట్ ఆఫ్ లివింగ్, రెడ్క్రాస్ సొసైటీ సంయుక్తంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని డీసీపీ అక్షాంశ్యాదవ్ ప్రారంభించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని యోగాసనాలు వేశారు. అంతకుముందు జాతీయ పతాకాన్ని కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ లక్ష్మీనరసింహారెడ్డి, డివిజన్ చైర్మన్ సద్ది వెంకట్రెడ్డి, జిల్లా వైస్ చైర్మన్ దిడ్డి బాలాజీ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మహేందర్రెడ్డి, కోశాధికారి అంజయ్య, పట్టణ కమిటీ చైర్మన్ వెల్లంకి పురుషోత్తంరెడ్డి, డైరెక్టర్లు షేక్ హమీద్ పాష, ప్రభాకర్రెడ్డి, ఎస్ఎన్చారి, కలీల్, తాళ్లపల్లి చంద్రశేఖర్ పాల్గొన్నారు. ఫ కలెక్టర్ హనుమంతరావు -
సాగు ఖర్చులు ఎకరానికి.. (రూ.ల్లో)
ఎకరాకు రూ.15వేలకు పైగా ఖర్చు పత్తి సాగు చేయడానికి రైతులు ఇప్పటికే పెద్ద మొత్తంలో పెటుబడి పెట్టారు. దున్నకాలు, ఎరువులు, విత్తనాల కొనుగోలు, కూలీలకు ఎకరానికి రూ.15 వేలకు పైనే పెట్టుబడి పెట్టారు. మరో వారం రోజుల్లో వర్షాలు కురువకపోతే ఈ సంవత్సరం కూడా నష్టాలు తప్పేలా తప్పేలా లేవని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎరువులు 5,000 ఎరువు చల్లడం 1,000దున్నకాలకు 3,000 అచ్చు తోలుటకు 1,000 విత్తనాలు (రెండు ప్యాకెట్లు) 3,000 కలుపు మందు 2,000 కూలీలు 1,200 -
మూడు దఫాలు పత్తి గింజలు వేశాను
25 ఎకరాల్లో పత్తి సాగుచేశాం. రోహిణి కార్తెలో తొలకరి వానాలకు విత్తనాలు వేశాం. ఆ తరువాత వానలు పడకపోవడంతో మొలకెత్తలేదు. రోహిణి చివరి వారంలో రెండో దఫా విత్తనాలు పెట్టాం. అడపాదడపా కురిసిన వానలకు మొలకలు వచ్చాయి. మృగశిర కార్తె నుంచి చినుకు జాడలేకపోవడం, ఎండలు పెరగడంతో మొలకలు చనిపోయాయి. దీంతో మళ్లీ మూడో దఫా విత్తనాలు వేశాం. మొలకలు వచ్చినప్పటికీ వర్షాలు లేకపోవడంతో ఎదగడం లేదు. ఇప్పటి వరకు రూ.1.5 లక్షలు పెట్టుబడి వచ్చింది. –చిన్నబత్తిని కస్పరాజు, సికింద్రనగర్, మోటకొండూరు మండలం -
కేసులను త్వరగా పరిష్కరించండి
సాక్షి, యాదాద్రి: పెండింగ్ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులను సత్వరం పరిష్కరించాలిని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వివిధ శాఖ అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఎస్సీ, ఎస్టీ సంక్షేమ పథకాల అమలు, సబ్ప్లాన్, వివిధ శాఖల ద్వారా వెచ్చిస్తున్న నిధులపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీల సమస్యల పట్ల అధికారులు మానవతా దృక్పథంతో పని చేయాలన్నారు. కార్పొరేషన్ రుణాలు, పథకాలు అర్హులకు అందేలా శ్రద్ధ తీసుకోవాలనిసూచించారు. పదోన్నతుల్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ (ఆర్ఓఆర్) తప్పనిసరిగా పాటించాలని, కుల ధ్రువీకరణ పత్రాల జారీలో అలసత్వం వహించరాదన్నారు. ప్రతి నెలా చివరి శనివారం పౌర హక్కుల దినోత్సవం నిర్వహించి తహసీల్దార్, పోలీస్ అధికారులు తప్పనిసరిగా హాజరయ్యేలా చొరవ చూపాలని కలెక్టర్కు సూచించారు. మూడు నెలలకు ఒకసారి నిర్వహించే డీవీఎంసీ సమావేశాల్లో ఎస్సీ, ఎస్టీల సమస్యలు తెలుసుకుని పరిష్కరించేందుకు సంబంధిత శాఖల అధికారులు కృషి చేయాలని కోరారు. కలెక్టర్ హనుమంతరావు మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న అట్రాసిటీ కేసుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. అంతకుముందు ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ వెంకటయ్య.. పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. భువనగిరి పట్టణ పరిధిలోని సింగన్నగూడెంలో గల అంబేద్కర్ భవనాన్ని సందర్శించి నిర్మాణ పనులు పరిశీలించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు వీరారెడ్డి, భాస్కరరావు, అడిషనల్ డీసీపీ లక్ష్మీనారాయణ, రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులు జిల్లా శంకర్, రాంబాబునాయక్, రేణుకుంట్ల ప్రవీణ్, కొనకాటి లక్ష్మీనారాయణ, జెడ్పీ సీఈఓ శోభారాణి, ఆర్డీఓలు కృష్ణారెడ్డి, శేఖర్రెడ్డి , జిల్లా ఎస్సీ సంక్షేమ అధికారి శ్యాంసుందర్, డీఆర్డీఓ, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ఇంచార్జి అధికారి నాగిరెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఫ పదోన్నతుల్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ తప్పనిసరిగా పాటించాలి ఫ తెలంగాణ ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య ఫ కలెక్టరేట్లో అధికారులతో సమీక్ష సమావేశం చైర్మన్కు ఘన స్వాగతం రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ చైర్మన్ బక్కి వెంకటయ్యకు కలెక్టర్ హనుమంతరావు, డీసీపీ అక్షాంంశ్యాదవ్, అదనపు కలెక్టర్ వీరారెడ్డి స్వాగతం పలికారు. సమావేశం అనంతరం కలెక్టర్ మెమెంటో అందజేసి శాలువాతో సత్కరించారు. -
బోర్వెల్ వాహనం నుంచి డీజిల్ చోరీ
నకిరేకల్: ఇంటి ముందు పార్కింగ్ చేసిన బోర్వెల్ వాహనం నుంచి గుర్తుతెలియని వ్యక్తులు డీజిల్ చోరీ చేశారు. ఈ ఘటన శనివారం తెల్లవారుజామున నకిరేకల్ పట్టణంలో జరిగింది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. నకిరేకల్ పట్టణంలోని వాసవీనగర్లో సామ శ్రీనివాస్రెడ్డి అనే వ్యక్తి నూతనంగా ఇల్లు నిర్మిస్తున్నాడు. తన బోర్వెల్ వాహనాన్ని ఆ ఇంటి ముందు పార్కింగ్ చేశాడు. అతడు కుటుంబంతో కలిసి స్థానిక పద్మానగర్ జంక్షన్ వద్ద నివాసముంటున్నాడు. శనివారం తెల్లవారుజామున గుర్తుతెలియని వ్యక్తులు ఇన్నోవా కారులో బోర్వెల్ వాహనం వద్దకు వచ్చి డీజిల్ ట్యాంక్కు వేసిన తాళాలు పగులగొట్టి సుమారు 300 లీటర్ల డీజిల్ దొంగిలించి పరారయ్యారు. చుట్టుపక్కల వారు శ్రీనివాస్రెడ్డికి సమాచారం ఇవ్వడంతో అతడు వాహనం వద్దకు చేరుకుని పరిశీలించి, అనంతరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ద్విచక్ర వాహనం అదుపుతప్పి యువకుడు మృతినడిగూడెం: ద్విచక్ర వాహనం అదుపు తప్పి గుంతలో పడడంతో యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన శనివారం మోతె మండలం మామిళ్లగూడెం విద్యుత్ సబ్స్టేషన్ వద్ద జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మునగాల మండలం నారాయణగూడేనికి చెందిన చింత శ్రీకాంత్(27) మునగాల నుంచి మోతె మీదుగా ఖమ్మంకు ద్విచక్ర వాహనంపై వెళ్తున్నాడు. మార్గమధ్యలో ఖమ్మం–సూర్యాపేట రహదారిపై మోతె మండలం మామిళ్లగూడెం వద్ద ద్విచక్ర వాహనం అదుపుతప్పడంతో రహదారి వెంట ఉన్న గుంతలో పడిపోయాడు. తీవ్రంగా గాయపడిన శ్రీకాంత్ అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి భార్య రమణమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. లారీ ఢీకొని..మర్రిగూడ: మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లాలోని కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో ఔటర్ రింగ్రోడ్డు వద్ద శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మర్రిగూడ మండల కేంద్రానికి చెందిన వ్యక్తి మృతిచెందాడు. మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మర్రిగూడ మండల కేంద్రానికి చెందిన యాచారం శ్రీరాములు(55) అదే గ్రామానికి చెందిన బోయపల్లి శంకర్ వద్ద డీసీఎం డ్రైవర్గా పనిచేస్తున్నాడు. శ్రీరాములు శుక్రవారం సంగారెడ్డిలో డీసీఎంలో బొగ్గు లోడ్ చేసుకుని తిరిగి వస్తుండగా.. కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని ఔటర్ రింగ్ రోడ్డు వద్దకు రాగానే వెనుక నుంచి లారీ వచ్చి డీసీఎంను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన శ్రీరాములు అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. శ్రీరాములు రెండో కుమారుడు కూడా 2నెలల క్రితం నాంపల్లి మండల కేంద్రం నుంచి గ్రామానికి ద్విచక్ర వాహనంపై వస్తుండగా.. రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. తండ్రి, కొడుకు రోడ్డు ప్రమాదంలో మృతిచెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. -
పేదలందరికీ సొంత ఇల్లు
సాక్షి, యాదాద్రి, తుర్కపల్లి: పేదలకు సొంతింటి కల నిజం చేసేందుకు రాష్ట్రంలో 20 లక్షల ఇళ్లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని రాష్ట్ర రెవెన్యూ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గురువారం తుర్కపల్లి మండలం వాసాలమర్రి గ్రామంలో అర్హులైన 205 మంది పేదలకు ఇందిరమ్మ ఇళ్ల పత్రాలను పంపిణీ చేశారు. గ్రామానికి చెందిన ఆకుల ఆగవ్వకు మొదటి ప్రొసీడింగ్ పత్రం అందజేశారు. అనంతరం వాసాలమర్రిలో జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా రూ.22.500 కోట్లతో నాలుగున్నర లక్షల ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. ఇలా రాబోయే మూడున్నరేళ్లలో 20 లక్షల ఇళ్లు కట్టాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమన్నారు. వాసాలమర్రి గ్రామ అభివృద్ధికి సహకరిస్తామని ఈ నెల 6న తిర్మాలపురంలో జరిగిన బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారని చెప్పారు. మొదటగా ఇందిరమ్మ ఇళ్లు నిర్మించాలని నిర్ణయించి, 205 మంది లబ్ధ్దిదారులకు ఇళ్ల పట్టాలను అందజేస్తున్నామన్నారు. గత ప్రభుత్వం తెచ్చిన ధరణి ద్వారా రైతుల భూ సమస్యలు పరిష్కారం కాలేదన్నారు. ప్రతి రైతుకు న్యాయం చేయాలనే ఆలోచనలతో భూభారతి– 2025 తీసుకువచ్చామన్నారు. ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య మాట్లాడుతూ.. ఆలేరును రెవెన్యూ డివిజన్గా ప్రకటిస్తే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని తెలిపారు. వాసాలమర్రిలో లబ్ధిదారులందరూ ఇల్లు నిర్మించుకునేలా అధికారులు బాధ్యత తీసుకోవాలని సూచించారు. ఎంపీ కిరణ్కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. అన్ని శాఖల మంత్రులతో సమన్వయం చేసుకుంటూ ఆలేరు అభివృద్ధిలో ముందుండేలా చూసుకుంటున్నామని తెలిపారు. ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ సాగునీటి సమస్య పరిష్కారానికి గంధమల్ల ప్రాజెక్టు నిర్మాణం చేపడుతున్నామన్నారు. కలెక్టర్ హనుమంతరావు, మహిళా సహకార అభివృద్ధి సంస్థ చైర్పర్సన్ బండ్రు శోభారాణి, అదనవు కలెక్టర్లు వీరారెడ్డి, భాస్కర్ రావు, ఆర్డీఓ కృష్ణా రెడ్డి, తహసీల్దార్ దేశ్యానాయక్, ఇన్చార్జ్ ఎంపీడీఓ వెంకటేశ్వర్లు, హౌసింగ్ ఏఈ శ్రీరాములు, ఆలేరు మార్కెట్ కమిటీ చైర్మన్ ఐనాల చైతన్య మహేందర్ రెడ్డి, మదర్ డెయిరీ చైర్మన్ గుడిపాటి మధుసూదన్ రెడ్డి, నాయకులు నీలం సంజీవ రెడ్డి, జనగాం ఉపేందర్ రెడ్డి, దనావత్ శంకర్ నాయక్, చాడ భాస్కర్ రెడ్డి, రాజారాం నాయక్, పలుగుల శ్రీనివాస్, ఎలుగల రాజయ్య, బోరెడ్డి హనుమంతురెడ్డి, మహిపాల్ రెడ్డి, బాబు పాల్గొన్నారు. ఫ రాష్ట్ర రెవెన్యూ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఫ వాసాలమర్రిలో లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాల పంపిణీ -
ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యుడిగా వెంకటరమణ
కోదాడరూరల్ : కోదాడ మండల పరిధిలోని కాపుగల్లుకు చెందిన ముత్తవరపు వెంకటరమణ ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యుడిగా ఎంపికయ్యారు. ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్(ఏఐసీటీఈ) వారు బుధవారం న్యూఢిల్లీలో జరిగిన సమావేశంలో ఆయనను ఎంపిక చేశారు. ఇండియాలో ఫార్మసీ ఎడ్యుకేషన్ను అభివృద్ధి చేయడం, నూతన కళాశాలల మంజూరుతో పాటు రెన్యువల్ చేయడంలో ఆయన కీలకపాత్ర పోషించనున్నారు. కాపుగల్లుకు చెందిన ముత్తవరపు భాస్కర్రావు, కుమారి దంపతుల కుమారుడు వెంకటరమణ 10వ తరగతి వరకు కోదాడలోని సెయింట్ జోసెఫ్ సీసీరెడ్డి పాఠశాలలో, ఇంటర్మీడియట్ విజయవాడలోని విశ్వశ్రీ కళాశాలలో , బీఫార్మసీని కర్ణాటకలో, ఎం ఫార్మసీ అన్నామలై యూనివర్సిటీలో, పీహెచ్డీ నాగార్జున యూనివర్సిటీలో పూర్తి చేశారు. ఆయన ప్రస్తుతం మొయినాబాద్లోని ఆజాద్ ఫార్మసీ కళాశాల ప్రిన్సిపల్గా, నేషనల్ ఫార్మసీ టీచర్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయనను డీసీసీబీ మాజీ చైర్మన్ ముత్తవరపు పాండురంగారావు, కాపుగల్లు మాజీ సర్పంచ్ తొండపు సతీష్, పీఏసీఎస్ చైర్మన్ నంబూరి సూర్యం, రిటైర్డ్ హెచ్ఎం ముత్తవరపు రామారావు, హనుమంతరావు, గ్రామస్తులు అభినందించారు. -
కొత్త అడ్మిషన్లు 4,884
అందరి సహకారంతోనే అడ్మిషన్ల సంఖ్య పెరిగింది కలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకుని ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టడంతో పాటు జిల్లాలోని ఉపాధ్యాయులు నిబద్ధతతో పనిచేయడం, శ్రమించడం వల్లే ఈ సారి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల అడ్మిషన్ల సంఖ్య పెరిగింది. ఈసారి ప్రభుత్వ ఉపాధ్యాయులు సైతం తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించారు. ఈ విద్యా సంవత్సరం పదో తరగతిలో కార్పొరేట్కు దీటుగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఫలితాలు సాధించారు. – సత్యనారాయణ, జిల్లా విద్యాశాఖ అధికారి ఫ ప్రభుత్వ పాఠశాలల్లో పెరిగిన నూతన ప్రవేశాలు ఫ గత సంవత్సరంతో పోలిస్తే 21 శాతం పెరుగుదల ఫ సత్ఫలితాలిచ్చిన బడిబాట ఫ 35,989కు చేరిన విద్యార్థుల సంఖ్యభువనగిరి: జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు జోరందుకున్నాయి. ఇటీవల ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి తీసుకున్న నిర్ణయాలతో పాటు బడిబాట కార్యక్రమం సత్ఫలితాలిస్తోంది. పాఠశాలలు ప్రారంభమైన రోజు నుంచే పాఠశాలల్లో అడ్మిషన్లు కూడా ప్రారంభమయ్యాయి. ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్ల పెంపు కోసం ఈ నెల 6 నుంచి ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట ప్రారంభించారు. 14 రోజుల పాటు కొనసాగిన ఈ కార్యక్రమం గురువారంతో ముగిసింది. ఈ సారి ప్రభుత్వ పాఠశాలల్లో 4,884 మంది విద్యార్థులు కొత్తగా అడ్మిషన్లు పొందారు. గత రెండేళ్లతో పోల్చితే ఈసారి విద్యార్థుల సంఖ్య పెరిగింది. ప్రస్తుతం విద్యార్థుల సంఖ్య 35,989 జిల్లాలో 715 పాఠశాలలు ఉన్నాయి. వీటిల్లో మొత్తం 35,558 మంది విద్యార్థులు ఉన్నారు. జిల్లాలో 484 ప్రాథమిక పాఠశాలు ఉండగా వీటిల్లో 14,195 మంది విద్యార్థులు, 68 ప్రాథమికోన్నత పాఠశాలలు ఉండగా వీటిల్లో 3216 మంది విద్యార్థులు, 163 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు ఉండగా వీటిల్లో 18,147 మంది విద్యార్థులున్నారు. మార్చిలో జరిగిన పదో తరగతి వార్షిక పరీక్షలకు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలకు చెందిన మొత్తం 4453 విద్యార్థులు పరీక్షలకు హాజరై పాఠశాలలను వదిలి వెళ్లారు. దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య 31,105కు చేరింది. ఈ నెల 6 నుంచి 19వ తేదీ వరకు నిర్వహించిన బడిబాట కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు పొందిన వారి సంఖ్య 4,884 మంది విద్యార్థులు కావడంతో ప్రస్తుతం మొత్తం 35,989కి చేరింది. దీంతో గత సంవత్సరం కంటే ప్రస్తుతం 431 మంది విద్యార్థులు అధికంగా పాఠశాలల్లో చేరారు. ఈ సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది. ఫలితాలిచ్చిన కార్యక్రమాలు ఇవీ.. ఫ డీఎస్సీ–2024 ద్వారా కొత్త ఉపాధ్యాయుల నియామకం, బదిలీలు, పదోన్నతలు ప్రక్రియ చేపట్టి ఖాళీగా ఉన్న పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత లేకుండా చేశారు. ఫ అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన, డిజిటల్ తరగతులు, చదువులో వెనుకబడిన విద్యార్థుల ప్రత్యేక శ్రద్ద పెట్టారు. ఫ కలెక్టర్ హనుమంతరావు ప్రత్యేక చొరవ తీసుకుని పదో తరగతి పరీక్షల్లో విద్యార్థులు మంచి ఫలితాలు సాధించేందుకు విద్యార్థుల ఇంటి తలుపు తట్టే కార్యక్రమంతో పాటు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుని పదో తరగతిలో 500కు పైగా మార్కులు తెచ్చుకున్న విద్యార్థులకు ప్రోత్సాహకంగా సైకిళ్లను పంపిణీ చేశారు. ఫ ఈ సారి ముందస్తుగా బడిబాట కార్యక్రమం నిర్వహించారు. బడిబాట ద్వారా పాఠశాలల్లో చేరిన విద్యార్థులు సంవత్సరం విద్యార్థులు 2023 & 24 4,419 2024 & 25 4,040 2025 & 26 4,884 -
విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడొద్దు
మోటకొండూర్: విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడొద్దని బీజేపీ జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు మాధురి, యువమోర్చా జిల్లా అధ్యక్షులు పట్నం కపిల్ అన్నారు. మోటకొండూర్ మండల కేంద్రంలోని మహాత్మా జ్యోతిరావు పూలే బాలికల గురుకుల పాఠశాలలో సీఈసీ గ్రూప్ను అప్పాజిపేటకు గురుకుల పాఠశాలకు తరలించొద్దని డిమాండ్ చేస్తూ బీజేపీ మండల అధ్యక్షుడు ఝెల్లంల శ్రీధర్రెడ్డి ఆధ్వర్యంలో గురువారం పాఠశాల ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇంటర్ సీఈసీ గ్రూప్ను ఇక్కడే కొనసాగించాలన్నారు. అనంతరం పాఠశాల ప్రిన్సిపాల్కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు పీసరి తిరుమలరెడ్డి, చిర్ర రవీందర్, పన్నాల చంద్రశేఖర్రెడ్డి, తండ కృష్ణగౌడ్, జోరుక ఎల్లేష్, ఆలేటి నాగరాజు, శనిగరం ప్రదీప్, దాసరి నాగరాజు పాల్గొన్నారు. ఫ బాలికల గురుకుల పాఠశాల ఎదుట బీజేపీ నాయకుల ధర్నా -
పెండింగ్ సమస్యలకు మోక్షం కలిగేనా!
సాక్షి, యాదాద్రి : ఎస్సీ, ఎస్టీలకు సంబంధించి అనేక సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదు. ప్రభుత్వ భూముల పంపిణీ, వివిధ అభివృద్ధి పనులకు సంబంధించి నిధుల కేటాయింపు, సబ్ ప్లాన్ నిధులతో పాటు అట్రాసిటీ కేసుల విషయంలో న్యాయం జరగడం లేదని, ఎస్సీ కార్పొరేషన్ రుణాలు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈక్రమంలో శుక్రవారం, శనివారం రెండు రోజులు జిల్లాలో ఎస్సీ కమిషన్ చైర్మన్ పర్యటించనున్న నేపథ్యంలో తమ సమస్యలు ఏ కరువు పెట్టేందుకు సంబంధిత వర్గానికి చెందిన నాయకులు సిద్ధమవుతున్నారు. ఎస్సీ, ఎస్టీలకు సంబంధించి దీర్ఘకాలికంగా పెండింగ్లో కేసులు పరిష్కరించాలని, వివిధ అభివృద్ధి పథకాలు, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు, కులాంతర వివాహాల ప్రోత్సాహకాలు, సబ్ప్లాన్ నిధులు, అట్రాసిటీ కేసుల విషయంలో సత్వర న్యాయం చేయాలని కమిషన్ దృష్టికి తీసుకెళ్లడానికి దళిత, గిరిజన సంఘాల నాయకులు సిద్ధమవుతున్నారు. పర్యటనకు ఏర్పాట్లు చేస్తున్న యంత్రాంగం రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య శుక్రవారం యాదగిరిగుట్టకు చేరుకుని రాత్రి అక్కడే బస చేస్తారు. శనివారం కలెక్టరేట్లో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. పూలే అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్ వార్షికోత్సవంలో పాల్గొంటారు. కమిషన్ చైర్మన్ రాక సందర్భంగా జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. రెండు రోజులు పర్యటించనున్న ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ ఫ నేడు రాత్రి యాదగిరిగుట్టలో బస ఫ శనివారం కలెక్టరేట్లో సమీక్షా సమావేశం ఫ ఎస్సీ, ఎస్టీలకు సంబంధించి సమస్యలు ఏకరువు పెట్టేందుకు సిద్ధమవుతున్న నాయకులు దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న సమస్యలు ఎస్సీ, ఎస్టీ కేసులకు సత్వర పరిష్కారం లభించడం లేదు. యాదాద్రి భువనగిరి జిల్లా ఏర్పడి పదేళ్లవుతున్నా ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఇంకా ఇక్కడ ఏర్పాటు కాలేదు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు నల్లగొండ జిల్లా కేంద్రంలోనే ఉండడంతో బాధితులు అక్కడకు వెళ్లి రావడం అసౌకర్యంగా ఉంది. అత్యాచార బాధితుల కేసులో పరిహారాలు అందడం లేదు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో పరిహారం ప్రొసీడింగ్స్కే పరిమితమవుతున్నాయి. జిల్లాలో సుమారు రూ.50 లక్షల వరకు చెల్లించాల్సిన పరిహారం పెండింగ్లో ఉంది. బెస్ట్ అవైలబుల్ స్కీంలో ఒకటవ తరగతి నుంచి పదో తరగతి వరకు, ప్రతి సంవత్సరం 120 మంది విద్యార్థులను ప్రైవేట్ పాఠశాలల్లో చేర్పిస్తారు. నాలుగు సంవత్సరాలుగా ప్రైవేట్ పాఠశాలలకు ఇవ్వాల్సిన డబ్బులు ప్రభుత్వం ఇవ్వకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులే చెల్లించాలని యాజమాన్యాలు ఒత్తిడి తెస్తున్నాయి. 2021 నుంచి ఎస్సీ, ఎస్టీ కులాంతర వివాహాలకు సంబంధించి ప్రోత్సాహకం అందడం లేదు. జిల్లా వ్యాప్తంగా సుమారు 90 జంటలు కులాంతర వివాహాలు చేసుకోగా.. ప్రభుత్వం ఇచ్చే రూ. 2.50 లక్షల కోసం ఎస్సీ డెవలప్మెంట్ అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. ఎస్సీ యువతకు స్వయం ఉపాధి కల్పించడం కోసం ఇవ్వాల్సిన సబ్సిడీ దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉంది. -
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పరిశీలన
భువనగిరి: మండలంలోని బండసోమారం గ్రామంలో గురువారం మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించారు. ఇంటి యజమానులతో మాట్లాడారు. ఇళ్ల ఎలా ఉందని, ఇంటి కల నేరవేరిందా అని, ఇంటి నిర్మాణం కోసం డబ్బులు వస్తున్నాయా అని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఇంటి యాజమానులకు దస్తులు, గ్యాస్ స్టౌవ్ అందజేసి వారిని శాలువాలతో సన్మానించారు. ఆయన వెంట ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్రెడ్డి, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి, కలెక్టర్ హనుమంతరావు, అదనపు కలెక్టర్లు భాస్కర్రావు, వీరారెడ్డి, డీఆర్డీఓ నాగిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు తంగళ్లపల్లి రవికుమార్, పోత్నక్ ప్రమోద్కుమార్, మున్సిపల్ మాజీ చైర్మన్లు బర్రె జహంగీర్, వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఎలిమినేటి కృష్ణారెడ్డి, ఫక్కీర్ కొండల్రెడ్డి, చిక్కుల వెంకటేశం, మాజీ సర్పంచ్ నానం పద్మ కృష్ణ, సురుపంగ అయిలయ్య, ఉప సర్పంచ్ యాట రాజు, దంతూరి శ్రీనివాస్గౌడ్, మాజీ సర్పంచ్లు, ప్రజాప్రతినిధులు ఉన్నారు. రోగులకు పండ్లు పంపిణీ ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ జన్మదినం సందర్భంగా గురువారం భువనగిరి పట్టణంలోని జిల్లా కేంద్ర ఆస్పత్రిలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ చేశారు. అంతకు ముందు ఆస్పత్రి ఆవరణలో కేట్కట్ చేసి స్వీట్లు అందజేశారు. -
భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం
భువనగిరి: రెవెన్యూ సదస్సుల ద్వారా భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని కలెక్టర్ హనుమంతరావు అన్నారు. గురువారం భువనగిరి మండలంలోని చీమలకొండూరు గ్రామంలో నిర్వహించిన భూ భారతి రెవెన్యూ సదస్సును ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రెవెన్యూ సదస్సుల్లో సమర్పించే ప్రతి దరఖాస్తును స్వీకరించాలని అధికారులకు సూచించారు. సానుకూలంగా స్పందించి సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించాలని చెప్పారు. అంతకు ముందు రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించి వారితో మాట్లాడారు. వచ్చిన దరఖాస్తులను ఆన్లైన్లో చేస్తున్నారా లేదా అని అధికారులను అడిగి తెలుసుకున్నారు. వివరాల నమోదులో తప్పిదాలకు తావు లేకుండా జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. ఆయన వెంట డిప్యూటీ తహసీల్దార్ కళ్యాణ్, రెవెన్యూ సిబ్బంది ఉన్నారు. రెవెన్యూ సదస్సులో వడాయిగూడెం గ్రామస్తుల ఆందోళనభువనగిరి మండలంలోని రాయగిరి గ్రామంలో గురువారం నిర్వహించిన రెవెన్యూ సదస్సులో వడాయిగూడెం గ్రామానికి చెందిన ప్రజలు ఆందోళన చేశారు. గ్రామంలోని సర్వే నంబర్ 518లో ఉన్న 467 ఎకరాలు భూదాన్ భూములుగా రికార్డులో ఉండడంతో తాము అన్ని రకాలుగా నష్టపోతున్నామని వాపోయారు. తమ భూమి భూదాన్లో ఎలా నమోదు అయిందని అధికారులను నిలదీశారు. భూములకు సంబంధించి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. భూదాన్ భూముల అంశం హైకోర్టు పరిధిలో పెండింగ్ ఉందని ఆర్డీఓ కృష్ణారెడ్డి గ్రామస్తులకు తెలిపారు. కాగా.. గ్రామంలో మధ్యాహ్నం తర్వాత రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించగా.. 119 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. సమావేశంలో ఆర్డీఓ కృష్ణారెడ్డి, తహసీల్దార్ అంజిరెడ్డి, రెవెన్యూ అధికారులు, రాయగిరి, వడాయిగూడెం గ్రామస్తులు పాల్గొన్నారు. ఫ కలెక్టర్ హనుమంతరావు -
దోస్త్ రిజిస్ట్రేషన్ గడువు పెంపు
రామన్నపేట: డిగ్రీ కళాశాలల్లో ప్రథమ సంవత్సరంలో అడ్మిషన్లు పొందేందుకు దోస్త్ రిజిస్ట్రేషన్ను జూన్ 25వరకు పెంచినట్లు రామన్నపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ రాహత్ఖానం గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్, తత్సమాన పరీక్ష పాసై, ఇది వరకు రిజిస్ట్రేషన్ చేసుకోని విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. కళాశాలలో ఏర్పాటు చేసిన హెల్ప్లైన్ సెంటర్లో ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయనున్నట్లు తెలిపారు. యాదగిరి క్షేత్రంలో సంప్రదాయ పూజలుయాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో గురువారం సంప్రదాయ పూజలు నిర్వహించారు. శ్రీస్వామి అమ్మవార్లకు సుప్రభాతం జరిపించారు. అనంతరం స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులకు నిజాభిషేకం, తులసీ దళాలతో అర్చన చేశారు. ఆలయ ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజ వాహన సేవ, నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం వంటి కై ంకర్యాలను నిర్వహించారు. ముఖ మండపంలో సువర్ణ పుష్పార్చన మూర్తులకు అష్టోత్తర పూజలు జరిపించారు. భక్తులు వివిధ పూజల్లో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. వన మహోత్సవానికి సిద్ధం కావాలిబొమ్మలరామారం: వన మహోత్సవంలో భాగంగా అధికారులు మొక్కలు నాటేందుకు సిద్ధం కావాలని జెడ్పీసీఈఓ శోభారాణి అన్నారు. బొమ్మలరామారం మండలంలోని హాజీపూర్లోని నర్సరీని గురువారం ఆమె సందర్శించి మాట్లాడారు. వన మహోత్సవంలో ప్రజలను భాగస్వాములను చేసి విజయవంతం చేయాలన్నారు. అనంతరం మండల కేంద్రం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించారు. ప్రతి ఇందిరమ్మ ఇంటికి ఇంకుడుగుంత తప్పని సరిగా ఏర్పాటు చేసుకోవాలన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో ఉపాధి హామీ పనులపై సమీక్ష నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ రాజాత్రివిక్రమ్, సూపరింటెండెంట్ జ్ఞాన ప్రకాష్రెడ్డి, ఈసీ పుష్ప, పంచాయతీ కార్యదర్శి హన్మాన్, ఎఫ్ఏ సంజీవ, ఈజీఎస్ సిబ్బంది పాల్గొన్నారు. మహిళా నాయకత్వాన్ని బలోపేతం చేయాలియాదగిరిగుట్ట రూరల్: గ్రామస్థాయి నుంచి మహిళా నాయకత్వాన్ని బలోపేతం చేయడానికి కృషి చేయాలని వీలీడ్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ అంబేద్కర్ అన్నారు. బోస్కో సేవా కేంద్రం, యాత్ర స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో యాదగిరిగుట్ట మండలంలోని వంగపల్లి గ్రామంలోని రైతు వేదికలో గురువారం జెండర్ సమానత్వం–మహిళా నాయకత్వం–సాధికారతపై మహిళా నాయకులకు ఒక రోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వీ లీడ్ ప్రోగాం కోఆర్డినేటర్ అంబేద్కర్ మాట్లాడుతూ.. మహిళలు విద్య, ఉద్యోగ, రాజకీయంగా ముందుకు వెళ్లేందుకు ప్రభుత్వాలు అందించే పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. మహిళా సాధికారితకు యాత్ర సంస్థ ద్వారా అవగాహన సమావేశాలు నిర్వహిస్తున్నట్లు, రెండవ విడత శిక్షణ వచ్చే నెలలో ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో యాత్ర సంస్థ డైరెక్టర్ సురుపంగ శివలింగం తదితరులు పాల్గొన్నారు. -
రెగ్యులర్ పద్ధతిన నియామకాలు చేపట్టాలి
యాదగిరిగుట్ట: రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాల్లో పనిభారం తగ్గించేందుకు గాను ఖాళీగా ఉన్న పోస్టుల్లో రెగ్యులర్ పద్ధతిన నియామకాలు చేపట్టాలని టీఎన్జీఓల సంఘం సెంట్రల్ యూనియన్ అధ్యక్షుడు మారం జగదీష్ ప్రభుత్వాన్ని కోరారు. యాదగిరిగుట్టలోని పాత గోశాలలో గురువారం ఏర్పాటు చేసిన రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాల ఉద్యోగులు, సిబ్బంది సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రధాన దేవాలయాల ఉద్యోగులకు హెల్త్ కార్డులు, పీఆర్సీ అనుమతించి, రాబోయే ప్రభుత్వ జీఓలో ప్రత్యేకంగా పొందుపరచాలన్నారు. జీఓ నంబర్ 888ను దేవాలయాల్లో ఉన్న పోస్టులకు అనుగుణంగా పూర్తి స్థాయిలో సవరణ చేయాలని, జీఓ నంబర్ 261ని సవరించాలన్నారు. పదవీ విరమణ దగ్గర్లో ఉన్న ఉద్యోగులు, అనారోగ్యంతో బాధపడుతున్న ఉద్యోగులను మానవతా దృక్ఫథంతో తమ తమ మాతృ సంస్థలకు బదిలీ లేదా డిప్యూటేషన్పూ పంపాలని కోరారు. సీపీఎస్ ఉద్యోగులకు పాత పెన్షన్ విధానం వర్తింపజేయాలన్నారు. అనంతరం ప్రధాన దేవాలయాల్లో ఉద్యోగులు ఎదుర్కొటున్న సమస్యల పరిష్కారం, ఉద్యోగులకు అవసరమ్యే అంశాలపై చర్చించారు. త్వరలోనే దేవాదాయ, ధర్మదాయ శాఖ మంత్రి కొండా సురేఖను కలిసి తమ సమస్యలను ఆమె దృష్టికి తీసుకెళ్తామని వెల్లడించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధాన దేవాలయాల ఉద్యోగుల జేఏసీ చైర్మన్ గజవెల్లి రమేష్బాబు, టీఎన్జీఓల సంఘం రాష్ట్ర జనరల్ సెక్రటరీ ముజీబ్, అసోసియేట్ ప్రెసిడెంట్ కస్తూరి వెంకటేష్, ముక్కెర్ల సత్యనారాయణ, జిల్లా జేఏసీ చైర్మన్ మందడి ఉపేందర్రెడ్డి, ఆయా దేవాలయాల అధ్యక్షులు వి. శ్రీనివాస్రెడ్డి (భద్రాచలం), కూరగాయల శ్రీనివాస్ (వేములవాడ), సుదర్శన్ (బాసర), మల్లికార్జునస్వామి (కొమురవెల్లి), చందు (కొండగట్టు), దూశెట్టి కృష్ణ, దయానంద్ (యాదగిరిగుట్ట), 150 మంది ఉద్యోగులు పాల్గొన్నారు. -
భక్తులకు అభిషేక జల సంప్రోక్షణ, హారతి
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి వచ్చే ప్రతి భక్తుడికి ప్రధానాలయంలో అభిషేక జల సంప్రోక్షణ, హారతి ఇచ్చేలా చర్యలు చేపట్టాలని ఆలయ ప్రధానార్చకులకు, అధికారులకు ఈఓ వెంకట్రావ్ ఆదేశాలు జారీ చేశారు. గురువారం ఆలయ అధికారులు, అర్చకులతో ఈఓ తన కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. స్వామివారి అంతరాలయములో వెళ్లే భక్తులు తప్పనిసరిగా సంప్రదాయ దుస్తులను ధరిస్తేనే అనుమతి ఇవ్వాలని సూచించారు. భక్తులు అధిక సంఖ్యలో వస్తున్న నేపథ్యంలో శని, ఆదివారాల్లో సాధారణ భక్తులకు త్వరితగతిన దర్శన సదుపాయం కల్పించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి శని, ఆదివారాల్లో ప్రొటోకాల్ పరిధిలోకి వచ్చే ప్రముఖులు స్వయంగా వస్తేనే ప్రొటోకాల్ దర్శనం కల్పించబడుతుందన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో ప్రొటోకాల్ దర్శనము వారందరూ టికెట్ తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. భక్తుల్లో భక్తి భావం పెంపొందించేందుకు శ్లోకములు, వాటి అర్థాలను వివరిస్తూ బోర్డులు, పెయిటింగ్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అంతేకాకుండా దేవస్థాన భద్రతకు సంబంధించి పటిష్టమైన భద్రత ఏర్పాటు చేసి అంకితభావంతో విధులు నిర్వహించాలని ఎస్పీఎఫ్ సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో డిప్యూటీ ఈఓ భాస్కర్శర్మ, ప్రధానార్చకులు నల్లంథీఘల్ లక్ష్మీనరసింహచార్యులు, కాండూరి వెంకటచార్యులు, అధికారులు దయాకర్రెడ్డి, రామారావు, రాజన్బాబు, ఎస్పీఎఫ్ ఆర్ఐ శేషగిరిరావు తదితరులున్నారు. ఫ ఏర్పాట్లు చేయాలని ఆదేశించిన యాదగిరిగుట్ట ఈఓ వెంకట్రావ్ -
తాళం వేసిన ఇళ్లే టార్గెట్
సూర్యాపేటటౌన్: తాళం వేసిన ఇళ్లే టార్గెట్ చేసుకొని దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురు దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసు వివరాలను గురువారం సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ కె. నరసింహ విలేకరులకు వెల్లడించారు. ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. హుజూర్నగర్ పట్టణానికి చెందిన ఇటికాల ఫణిచంద్, కోదాడకు చెందిన నాగేంద్రబాబు, మరో ఇద్దరు బాలురు జల్సాలకు అలవాటుపడి రాత్రిపూట తాళం వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేసి చోరీలకు పాల్పడుతున్నారు. చోరీ చేసిన సొత్తును అమ్మేందుకు కోదాడ పట్టణానికి రాగా స్థానిక పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి ఎనిమిది తులాల బంగారం, బైక్, మూడు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు ఫణిచంద్ వివిధ పోలీస్ స్టేషన్లలో 17 కేసులు ఉన్నాయని, గతంలో జైలుకు వెళ్లి కూడా వచ్చినట్లు ఎస్పీ తెలిపారు. ఫణిచంద్, నాగేంద్రబాబును రిమాండ్కు తరలించగా.. ఇద్దరు బాలురను జువైనల్ హోంకు తరలించినట్లు తెలిపారు. నిందితులను పట్టుక్ను కోదాడ పోలీసులను ఎస్పీ అభినందించారు ఫ నలుగురు దొంగల అరెస్ట్ -
ఆత్మీయ భరోసా పథకాన్ని అమలు చేయాలి
మునగాల: రాష్ట్రంలో భూమిలేని వ్యవసాయ కార్మికులకు ప్రభుత్వం ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని అమలు చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జి. నాగయ్య డిమాండ్ చేశారు. గురువారం మునగాల మండలంలోని కొక్కిరేణి గ్రామంలో నిర్వహించిన వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భూమిలేని నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం ద్వారా ఏడాదికి రూ.12వేల ఆర్తికసాయాన్ని అందిస్తామని హామీ ఇచ్చి.. 16నెలలు గడుస్తున్నా నేటికీ ఇచ్చిన హామీని అమలు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చి ఆదుకోవాలని, భూభారతిలో అసైన్డ్ భూములకు పట్టాలు ఇవ్వాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న డిజిటల్ సర్వేను వెంటనే రద్దు చేయాలని కోరారు. రాష్ట్రంలో లక్షలాదిగా ఉన్న ప్రభుత్వ భూములన్నింటిని పేద వ్యవసాయ కార్మిక కుటుంబాలకు పంచాలని కోరారు. ఈ సమావేశంలో సంఘం జిల్లా అధ్యక్షుడు ములకలపల్లి రాములు, జిల్లా కార్యదర్శి మట్టిపల్లి సైదులు, జిల్లా ఉపాధ్యక్షులు కొదమగుండ్ల నగేష్, జిల్లా కమిటీ సభ్యులు బెల్లంకొండ వెంకటేశ్వర్లు, సొంపంగు జానయ్య, పోసనబోయిన హుస్సేన్, గుంజ వెంకటేశ్వర్లు, షేక్ సైదా హుస్సేన్, నారసాని వెంకటేశ్వర్లు, జంపాల స్వరాజ్యం, గుండు సైదులు, ఆరె రామకృష్ణారెడ్డి, దోసాపాటి భిక్షం పాల్గొన్నారు. ఫ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాగయ్య -
ట్రాక్టర్ తిరగబడడంతో రైతు మృతి
తిప్పర్తి: పొలం దున్నుతుండగా ట్రాక్టర్ తిరగబడడంతో రైతు మృతిచెందాడు. ఈ ఘటన తిప్పర్తి గ్రామ పంచాయతీ పరిధిలోని తిప్పలమ్మగూడెంలో గురువారం జరిగింది. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తిప్పలమ్మగూడెం గ్రామానికి చెందిన దేవిరెడ్డి వెంకట్రెడ్డి(51) ట్రాక్టర్తో గురువారం పొలం దున్నుతుండగా ట్రాక్టర్ బురదలో దిగబడింది. బురదలో నుంచి ట్రాక్టర్ను బయటకు తీసే క్రమంలో ట్రాక్టర్ తిరగబడింది. దీంతో వెంకట్రెడ్డి ట్రాక్టర్ కింద పడి అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి భార్య సరిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తిప్పర్తి పోలీస్ స్టేషన్ ఏఎస్ఐ రాంమూర్తి తెలి పారు. మృతుడికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ట్రాక్టర్ పైనుంచి పడి.. నూతనకల్: ట్రాక్టర్ పైనుంచి పడి డ్రైవర్ మృతి చెందాడు. ఈ ఘటన నూతనకల్ మండలం పరిధిలోని పెద నెమిల గ్రామ పంచాయతీలో గురువారం జరిగింది. స్థానిక ఎస్ఐ ప్రవీణ్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. పెద్ద నెమిల గ్రామ పంచాయతీకి చెందిన గంగుల వీరస్వామి(50) అదే గ్రామానికి చెందిన జెన్నారెడ్డి వివేక్రెడ్డి వద్ద ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. బుధవారం వ్యవసాయ పొలంలో వీరస్వామి ట్రాక్టర్తో దుక్కి దున్నుతుండగా.. బండ రాయిని ఎక్కడంతో అదుపుతప్పి వీరస్వామి ట్రాక్టర్పై నుంచి కిందపడ్డాడు. తీవ్రంగా గాయపడిన అతడిని చికిత్స నిమిత్తం సూర్యాపేట ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతిచెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మృతుడి కుమారుడు కమలాకర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ప్రవీణ్కుమార్ తెలిపారు. -
దొంగతనం కేసులో నిందితుడి అరెస్ట్
మిర్యాలగూడ: ఆటో చోరీ కేసులో నిందితుడిని గురువారం దామరచర్లలో పోలీసులు అరెస్ట్ చేశారు. మిర్యాలగూడ రూరల్ సీఐ పీఎన్డీ. ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. దామరచర్ల మండల కేంద్రానికి చెందిన వెంపటి శ్రీనివాస్ ఈ నెల 7వ తేదీ రాత్రి 10గంటల సమయంలో తన ఆటోను తన దుకాణం ముందు ఉంచి ఇంటికి వెళ్లి నిద్రించాడు. మరుసటి రోజు ఉదయం వచ్చి చూడగా ఆటో కనిపించలేదు. దీంతో బాధితుడు ఈ నెల 11న వాడపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పల్నాడు జిల్లా పిడుగురాళ్లలోని బుడిగజంగాల కాలనీకి చెందిన పెల్లూరి ఆంజనేయులు గురువారం దామరచర్ల చెక్పోస్టు వద్ద దొంగిలించిన ఆటోలో వస్తుండగా.. పోలీసులు అతడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. మరో నిందితుడు పిడుగురాళ్లకు చెందిన కొండపల్లి ఆంజనేయులు పరారీలో ఉన్నట్లు సీఐ తెలిపారు. సీఐ వెంట ఎస్ఐ శ్రీకాంత్రెడ్డి, పోలీస్ సిబ్బంది ఉన్నారు. -
వర్మీ కంపోస్టుతో అధిక దిగుబడి
ప్రభుత్వ బడిలో కుమారుడిని చేర్పించిన టీచర్నార్కట్పల్లి: నార్కట్పల్లి మండలం ఏపీ లింగోటం గ్రామ జెడ్పీహెచ్ఎస్ ఉపాధ్యాయుడు ఆదిమల్ల మణిరాజ్ తన కుమారుడు సత్యరాజును అదే పాఠశాలలో 10వ తరగతిలో గురువారం చేర్పించారు. 9వ తరగతి ప్రైవేట్ స్కూల్లో చదివిన తన కుమారుడిని 10వ తరగతిలో ప్రభుత్వ పాఠశాలలో చేర్పించడంతో మణిరాజును పాఠశాల ఉపాధ్యాయుల బృందం అభినందించారు. పాఠశాలలో చేరిన విద్యార్థులందరికీ నాణ్యమైన విద్యా బోధన చేయనున్నట్లు ప్రధానోపాధ్యాయుడు మల్లేపల్లి కాశయ్య తెలిపారు.గుర్రంపోడు : గతంలో రైతులు సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేసేవారు. కాలానుగుణంగా పంటలు అధిక దిగుబడి సాధించడం కోసం రైతులు రసాయన ఎరువులు వాడడం మొదలు పెట్టారు. రసాయన ఎరువుల మోతాదును పెంచుకుంటూ పోవడంతో ఏర్పడిన దుష్ఫలితాలను గ్రహించిన రైతులు మళ్లీ సేంద్రియం వైపు మొగ్గు చూపుతున్నారు. సేంద్రియ ఎరువు వాడడం వల్ల రైతులు వ్యవసాయంలో అధిక దిగుబడి సాధించే అవకాశం ఉంది. సేంద్రియ ఎరువంటే పశువుల ఎరువే కాదు..జీవన ఎరువులు, పచ్చి రొట్ట ఎరువులు, వర్మీ కంపోస్టు కూడా వస్తాయి. వర్మీ కంపోస్టు తయారీపై అనుముల ప్రాంతీయ ఉద్యానవన శాఖ అధికారి మురళి అందిస్తున్న సలహాలు, సూచనలు ఆయన మాటల్లోనే.. రైతు మిత్రులుగా వానపాములు వ్యవసాయ వ్యర్థ పదార్థాలతో తయారయ్యే వర్మీ కంపోస్టు ముఖ్యమైన సేంద్రియ ఎరువుగా చెప్పవచ్చు. పురాతన కాలం నుంచి వానపాములను రైతు మిత్రులుగానే పరిగణిస్తాం. ఈ వానపాములు పాక్షికంగా కుళ్లిన వ్యర్థ పదార్థాలను తిని విసర్జించిన పదార్థాన్నే వర్మీ కంపోస్టు అంటారు. వర్మీ కంపోస్టు తయారీ విధానం ఫ మూడు అడుగుల వెడల్పుతో కావలసిన పొడువు వరకు ఒక్కో బెడ్ చొప్పున లభించే వ్యర్థ పదార్థాలు, స్థలాన్ని బట్టి బెడ్లు ఏర్పాటు చేసుకోవాలి. ఫ ఈ బెడ్ను వర్షపు నీరు, సూర్యరశ్మి, అధిక ఉష్ణోగ్రతల నుంచి కాపాడడానికి పైన తాటాకు పందిర్లతో లేదా రేకులతో కప్పు నిర్మించాలి. ఫ బెడ్ అడుగు భాగంలో సిమెంట్తోగాని, పేడతోగాని అలికి గట్టిగా ఉండేలా చూడాలి. ఫ అడుగు భాగం నుంచి 10 సెం.మీ ఎత్తు వరకు పాక్షికంగా కుళ్లిన వ్యర్థ పదార్థాలను వేయాలి. దీనిపై పలుచగా నీరు చల్లాలి. ఫ ఆ తర్వాత మళ్లీ మరో వరుస 15–30 సెం.మీ మందంలో సేంద్రియ వ్యర్థ పదార్థాలు, కుళ్లిన కూరగాయలు వేసుకోవచ్చు. దీనిపైన పలుచగా నీరు పెట్టి, వరి గడ్డితోగాని, పాత గోనె సంచులతోగాని కప్పి ఉంచాలి. ఫ ఈ బెడ్కు ప్రతిరోజు పలుచగా నీరు పెడుతూ ఒక వారం రోజుల తర్వాత ఒక చదరపు మీటరుకు 1000 వానపాముల చొప్పున వదలాలి. ప్రతిరోజు నీరు పెడుతూ అప్పుడప్పుడు బెడ్ను కదిలించాలి. ఫ బెడ్లలో వేసిన వ్యర్థ పదార్థాలు అదే రూపంలో లేకుండా తేలికగా, నల్లగా, వాసన లేకుండా ఉండే పదార్థంగా ఏర్పడినట్లయితే వర్మీ కంపోస్టు తయారైనట్లుగా భావించవచ్చు. ఫ ఈ దశలో నీరు పెట్టడం ఆపేస్తే వానపాములన్నీ బెడ్ల అడుగు భాగానికి చేరుతాయి. ఫ ఆ తర్వాత పైన ఉండే వర్మీ కంపోస్టును జల్లడ పట్టినట్లయితే వర్మీ కంపోస్టు వస్తుంది. ఫ అనంతరం వానపాములను మరో బెడ్లోకి వదలాలి. జాగ్రత్తలు ఫ సేంద్రియ వ్యర్థ పదార్థాలు వేసేటప్పుడు దానిలో ప్లాస్టిక్ కవర్లు, గాజు పెంకులు వంటివి లేకుండా చూసుకోవాలి. ఫ బెడ్లలో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. వర్మీ కంపోస్టు వల్ల ఉపయోగాలు ఫ నేలలో సేంద్రియ కర్భనం పెంచుతుంది. ఫ భూ భౌతిక రసాయన పరిస్థితులను మెరుగుపరుస్తుంది. ఫ భూసారాన్ని పరిరక్షిస్తూ ఉత్పాదకతను పెంచుతుంది. ఫ భూమిలో గాలి ప్రసరణ, నీరు నిల్వ చేసుకునే సామర్థ్యం పెంచుతుంది. ఫ పోషకాల లభ్యత పెంచడంలో మొక్క సులభంగా గ్రహించడంలో తోడ్పతుంది. ఫ పండ్ల తోటల్లో ఒక చెట్టుకు 5 కిలోలు, పూల కుండీల్లో 250 గ్రాములు వర్మీ కంపోస్టు వాడుకోవచ్చు. -
భువనగిరి ఖిలా టికెట్ ధరలు పెంపు
భువనగిరి: భువనగిరి ఖిలా సందర్శనకు టికెట్ ధరలను పెంచుతూ తెలంగాణ హెరిటేజ్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ ఈ నెల 6న ఉత్తర్వులు జారీ చేశారు. ఉత్తర్వుల ప్రకారం ఖిలా సందర్శనకు గాను పెద్దలకు గతంలో రూ.10 టికెట్ ఉండగా.. ప్రస్తుతం రూ. 20కు పెంచారు. అదేవిధంగా పిల్లలకు గతంలో రూ.5 టికెట్ ఉండగా.. ఇప్పుడు రూ.10కు పెంచారు. మిగిలిన ధరలు యాథావిధిగా ఉన్నాయి. గతంలో సందర్శకుల ద్వారా వచ్చిన ఆదాయం తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖకు వెళ్లేది. తాజాగా జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం వచ్చిన ఆదాయాన్ని మ్యూజియం నిర్వహణ, రికార్డుల నిర్వహణ కోసం ఉపయోగించుకునే అవకాశాన్ని కల్పించారు. ప్రైవేట్ పాఠశాలల బస్సుల అడ్డగింతఆత్మకూర్ (ఎస్): ఆత్మకూర్(ఎస్) మండల పరిధిలోని ఏపూరు గ్రామం నుంచి సూర్యాపేటలోని వివిధ ప్రైవేట్ పాఠశాలలకు విద్యార్థులను తీసుకెళ్లే స్కూల్ బస్సులను గురువారం గ్రామస్తులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ.. లక్షల్లో ఫీజులు వసూలు చేసే ప్రైవేట్ పాఠశాలల బస్సులు తమ గ్రామానికి రావొద్దని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులను పిలిపించి కొందరు గ్రామస్తులు తమ పిల్లలకు ప్రభుత్వ స్కూల్లో చేర్పించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఇద్దరికి జైలు శిక్షరామగిరి(నల్లగొండ): నల్లగొండ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడిన ఇద్దరు వ్యక్తులను నల్లగొండ సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ గురువారం ఒక రోజు జైలు శిక్షతోపాటు రూ.వెయ్యి జరిమానా విధించారు. ఈ సందర్భంగా ఎస్ఐ సైదాబాబు మాట్లాడుతూ మద్యం సేవించి వాహనాలు నడిపినా, మైనర్లు వాహనాలు నడిపినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
అధ్వానంగా కాల్వలు
సీసీ లైనింగ్తో ఆధునీకరించాలి శాలిగౌరారం ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వలను సీసీ లైనింగ్తో పూర్తిస్థాయిలో ఆధనీకరించాలి. అప్పుడు ప్రాజెక్టు సాగునీరు వృథాకావడం, అక్రమంగా నీటిని ఎగువకు తరలించడం పూర్తిగా నిలిచిపోవడంతో ఆయకట్టుకు పూర్తిస్థాయిలో సాగునీరందుతుంది. పేరుకే ప్రాజెక్టు ఆయకట్టులో ఉన్నాం. కానీ ఏనాడు చివరి భూములకు సాగునీరందిన దాఖలాలు లేవు. – కట్ట వెంకట్రెడ్డి, రైతు, అడ్లూరు పూడికతీతకు నిధులు లేవు శాలిగౌరారం ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వల్లో పూడిక తీసేందుకు నీటిపారుదలశాఖలో నిధులు లేవు. ప్రభుత్వం నుంచి నిధులు మంజూరైతే తప్ప ప్రత్యేకంగా నిధులు వెచ్చించే పరిస్థితి నీటిపారుదలశాఖకు ఉండదు. ప్రస్తుతం వానాకాలం సాగు నేపథ్యంలో రైతులే తమ సొంత ఖర్చులతో కాల్వల్లో పూడికతీత పనులు చేయించుకోవాలని కోరుతున్నాం. – సత్యనారాయణ, ఇరిగేషన్ డీఈఈ, శాలిగౌరారం ప్రాజెక్టు శాలిగౌరారం: ఉమ్మడి జిల్లాలో మధ్యతరహా ప్రాజెక్టులలో ఒకటైన శాలిగౌరారం ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వలు అధ్వానంగా మారాయి. ప్రధాన కాల్వలు దెబ్బతినడం, ప్రధాన కాల్వలపై ఉన్న పంట కాల్వల తూములు, షట్టర్లు పూర్తిగా ధ్వంసం కావడంతో సాగునీరు వృథాగాపోతుంది. అంతేకాకుండా కాల్వల్లో కంపచెట్లు, చెత్తాచెదాం నిండడడంతో ఆయకట్టు చివరికి సాగునీరందడం కష్టంగా మారుతోంది. దీంతో ఆయకట్టు చివరి భూముల రైతులు సాగునీరు కోసం నానా అవస్థలు పడుతున్నారు. శాలిగౌరారం ప్రాజెక్టు 1200 ఎకరాల విస్తీర్ణంలో 21 అడుగుల నీటి నిల్లవ సామర్ధ్యంతో 6వేల ఎకరాల ఆయకట్టు కలిగి ఉంది. ప్రస్తుతం ప్రాజెక్టులో 19 అడుగుల మేర నీరు ఉంది. సాగునీరందేది 6 కి.మీ. మాత్రమే.. శాలిగౌరారం ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వల మొత్తం పొడవు 12 కిలోమీటర్లు. అందులో కుడి కాల్వ పొడవు 6.5 కిలోమీటర్లు, ఎడమ కాల్వ పొడవు 5.5 కిలోమీటర్లు. దశాబ్దాల కాలంగా ప్రధాన కాల్వలు మరమ్మతులకు నోచుకోకవడంతో పూర్తిగా ధ్వంసమయ్యాయి. ప్రస్తుతం ఒకొక్క కాల్వ ద్వారా గరిష్టంగా 3 కిలోమీటర్ల వరకు కూడా సాగునీరు ప్రవహించని పరిస్థితి. ప్రధాన కాల్వల వెంట అక్రమంగా విద్యుత్ మోటార్లు ఏర్పాటు చేసి ఎగువ ప్రాంతానికి నీటిని తరలించడంతో ఆయకట్టు చివరి భూములకు నీరందని పరిస్థితి నెలకొంది. మురుగునీటితో కష్టంగా పూడికతీత.. కుడి, ఎడమ ప్రధాన కాల్వలు నిత్యం డ్రెయినేజీ నీటితో నిండి ఉంటున్నాయి. కుడి కాల్వలోకి తిరుమలరాయునిగూడెం, బాలిశెట్టిగూడెం, మార్కెట్కాలనీ, పావురాలగూడెం గ్రామాల నుంచి డ్రెయినేజీలను కలిపారు. అదేవిధంగా ఎడమ కాల్వకు రామగిరి గ్రామం నుంచి వచ్చే డ్రెయినేజీని కలిపారు. దీంతో కుడి, ఎడమ కాల్వలు నిత్యం మురుగునీటితో నిండి ఉండటంతో కనీసం ఉపాధి హామీ పథకంలో భాగంగా కాల్వలను పూడిక తీసేందుకు కూలీలు ముందుకు రావడంలేదు. రైతులు సొంత ఖర్చులతో జేసీబీల సహాయంతో కాల్వలలో పూడిక తీసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఫ కంప చెట్లు, చెత్తాచెదారం, మురుగునీటితో నిండిన శాలిగౌరారం ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వలు ఫ ఆందోళనలో ఆయకట్టు చివరి రైతులు -
‘ధర్మారెడ్డిపల్లి’కి కదలికొచ్చింది
కాల్వ ఆధునీకరణ పనులు పరుగులు ఫ ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ స్తంభాలు షిఫ్టింగ్ ఫ పురోగతిలో 108 వంతెనలు ఫ వెల్లంకి శివారులో వందల సంఖ్యలో కార్మికులతో క్యాంపులు ఫ డిసెంబర్ నెలాఖరు వరకుపనులు పూర్తయ్యేలా ప్రణాళిక ఫ రూ.123.98 కోట్లు మంజూరు చేసిన ప్రభుత్వం కాల్వ స్వరూపం నీఇ సామర్థ్యం 50 నుంచి 208 క్యూసెక్కులకు పెంపు పొడవు 51.51 కి.మీ పూర్తయినది 29.72 కి.మీ కాల్వ పరిధిలోని మండలాలు : వలిగొండ, రామన్నపేట, చిట్యాల, నార్కట్పల్లి గ్రామాలు 40 చెరువులు 41నిర్మిస్తున్న వంతెనలు 108ఆయకట్టు 17,787 ఎకరాలురామన్నపేట: ధర్మారెడ్డి కాల్వ ఆధునీకరణపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. యాదాద్రి భువనగిరి, నల్లగొండ జిల్లాలో 17,787 ఎకరాలకు సాగు నీరందించే పనులు మొదలయ్యాయి. ఈ రెండు జిల్లాల పరిధిలో 51.51 కి.మీ మేర కాల్వ విస్తరించి ఉంది. అదనపు ఆయకట్టు స్థిరీకరించి సాగునీరు అందించేలా కాల్వను డిజైన్ చేశారు. పనులను డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. పెరిగిన కాల్వ సామర్థ్యం ధర్మారెడ్డిపల్లి కాలువ పాత సామర్థ్యం 50 క్యూసెక్కులు. స్థిరీకరించిన ఆయకట్టు 5,126 ఎకరాలు. అధనంగా 12,661 ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో కాల్వ సామర్థ్యాన్ని 208 క్యూసెక్కులకు పెంచుతూ ఇరిగేషన్ శాఖ అధికారులు డిజైన్ రూపకల్పన చేశారు. ధర్మారెడ్డిపల్లి కత్వ 0 కి.మీ నుంచి 12.41 కి.మీ (గోకారం చెరువు) వరకు కాల్వ అడుగుభాగం 10 మీటర్ల వెడల్పు (బెడ్విడ్త్), అక్కడి నుంచి చిట్యాల మండలం శివనేని గూడెం వరకు మహాలింగం చెరువు (45.10కి.మీ)వరకు అడుగుభాగం 6 మీ, శివనేనిగూడెం నుంచి ఏపీ లింగోటం (51.51) వరకు అడుగుబాగం 3 మీటర్ల ఉండే విధంగా కాల్వను తవ్వడం ప్రారంభించారు. కాల్వ విస్తరణలో భాగంగా 108 చోట్ల వంతెనలు నిర్మిస్తున్నారు. కాల్వ మొత్తం పొడవు 51.51 కి.మీ కాగా.. గతంలో 29.72 కి.మీ మేర విస్తరణ పనులు పూర్తయ్యాయి. 113.09 ఎకరాల భూమి సేకరించి రైతులకు రూ రూ.1.50 కోట్ల పరిహారం చెల్లించారు. మరో 24.20 ఎకరాలను సేకరించే పనులు ముమ్మరం చేశారు. ఇందుకు సంబంధించిన కొందరు రైతుల పరిహారం డబ్బులు ఆర్డీలలో జమ చేశారు. కాల్వ ఆధునీకరణ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం రూ.123.98 కోట్లు మంజూరు చేసింది. గడువుకు ముందే పూర్తి చేస్తాం ధర్మారెడ్డిపల్లి కాల్వ ఆధునీకరణ పనులు వేగంగా జరుగుతున్నాయి. పనుల ప్రగతిని అధికా రులతో పాటు ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. రైతులు సహకరిస్తున్నారు.కాల్వ తవ్వకం, సిమెంట్ కాంక్రీట్ పనులు ఏకకాలంలో పూర్తి కానున్నాయి. మిగిలిన భూ సేకరణ, రైతులకు పరిహారం చెల్లింపులు జరుగుతున్నాయి. నిర్ణీత గడువుకంటే ముందే పనులు పూర్తి చేసే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాం. –కృష్ణారెడ్డి, నీటిపారుదల శాఖ డీఈ ముమ్మరంగా పనులు ధర్మారెడ్డిపల్లి కాల్వ ఆధునీకరణ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. వెల్లంకి, సిరిపురం, వనిపాకల శివారులలో పదకొండు భారీ యంత్రాలు రాత్రింభవళ్లు పనిచేస్తున్నాయి. ఐబీ అధికారులు, కాంట్రాక్ట్ సంస్థ ప్రతినిధులు నిత్యం పనులను పర్యవేక్షిస్తున్నారు. వెల్లంకి శివారులో వందల సంఖ్యలో కార్మికులతో ప్రత్యేక క్యాంప్ ఏర్పాటు చేశారు. కాల్వ తవ్వకం పనులకు అడ్డుగా ఉన్నటువంటి ట్రాన్స్ఫార్మర్లను, విద్యుత్ స్తంభాలను షిఫ్ట్ షిప్ట్ చేస్తున్నారు. యాసంగి సీజన్ నాటికి సాగునీరు అందుతుందనే ఆశతో రైతులు ఉన్నారు. -
భూ భారతితో సమస్యలు సత్వర పరిష్కారం
యాదగిరిగుట్ట: భూ భారతి చట్టం ద్వారా భూ సమస్యలకు సత్వర పరిష్కారం లభిస్తుందని కలెక్టర్ హనుమంతరావు పేర్కొన్నారు. యాదగిరిగుట్ట మున్సిపాలిటీ పరిధి యాదగిరిపల్లిలో బుధవారం నిర్వహించిన రెవెన్యూ సదస్సులో కలెక్టర్ పాల్గొన్నారు. రైతులతో మాట్లాడి భూ సమస్యలపై తెలుసుకున్నారు. భూ భారతి చట్టంపై అవగాహన పెంచుకుని భూ సమస్యలు పరిష్కరించుకోవాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం గ్రామగ్రామన రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తుందని, వీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రైతులకు సహకరించేందుకు సదస్సుల్లో హెల్ప్డెస్క్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలి పారు. యాదగిరిపల్లికి చెందిన దండు విజయలక్ష్మి భూమిని ఆమెకు తెలియకుండా రికార్డులనుంచి తొలగించిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్కు మిట్ట వెంకటయ్యగౌడ్, సీస కృష్ణ, బరిగే రాంచందర్ విన్నవించారు. కార్యక్రమంలో ఆర్డీఓ కృష్ణారెడ్డి, తహసీల్దార్ గణేష్, డీటీ సత్యం, ఆర్ఐలు పాల్గొన్నారు. -
రైతు భరోసా.. ఇదేమి గోస!
మూడు ఎకరాల్లోపే ఉన్నా అందని పెట్టుబడి సాయం మూడు రోజుల్లో రూ.122 కోట్లు .. భువనగిరిటౌన్ : రైతుల ఖాతాల్లో రైతుభరోసా డబ్బులు జమ అవుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా 2,84,250 మంది రైతులు ఉండగా రూ.317.57 కోట్లు పంట పెట్టుబడి సాయం అందాల్సి ఉంది. వీరిలో మూడు ఎకరాల్లోపు ఉన్న 1,68,349 మంది రైతులకు బుధవారం వరకు రూ. 122 కోట్లు వారి ఖాతాల్లో జమ చేసినట్లు జిల్లా వ్యవసాయ అధికారి గోపాల్ తెలిపారు. యాదగిరిగుట్ట రూరల్: మూడు ఎకరాల్లోపే ఉన్నా రైతు భరోసా డబ్బులు జమకాకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటి వరకు మూడెకరాల్లోపు రైతులందరి ఖాతాల్లో రైతుభరోసా డబ్బులు జమ అయినట్లు అధికారులు చెబుతున్నారు. కానీ కొందరి ఖాతాల్లో సగం నగదే జమ కాగా, మరికొందరికి అసలే అందలేదు. దీంతో వ్యవసాయ కార్యాలయాలు, బ్యాంకులకు వచ్చి అధికారులను సంప్రదిస్తున్నారు. టీజీబీలో ఎక్కువ మంది బాధితులు ముఖ్యంగా తెలంగాణ గ్రామీణ బ్యాంకు (టీజీబీ)లో ఖాతాలున్న రైతుల్లో చాలా మందికి రైతుభరోసా డబ్బులు జమకాలేదు. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు పేరును గత కొన్ని రోజుల క్రితం తెలంగాణ గ్రామీణ బ్యాంకుగా మార్చారు. నూతన ఐఎఫ్ఎస్ కోడ్ అమలు చేసింది. ఈ కారణంగా టీజీబీలో ఖాతా ఉన్న రైతులకు రైతుభరోసా డబ్బులు జమకాలేదని వ్యవసాయశాఖ అధికారులు అంటున్నారు. బ్యాంకు అధికారులను సంప్రదించగా తమకు సంబంధం లేదంటున్నారని రైతులు చెబుతున్నారు. వేర్వేరు బ్యాంకుల్లో ఖాతాలున్న రైతులకు పూర్తిస్థాయిలో రైతుభరోసా డబ్బులు జమకాలేదు. యాదగిరిగుట్టకు చెందిన పంజాల సురేష్ అనే రైతుకు ఎకరం 30 గుంటల భూమి ఉండగా 52 గుంటలకు మాత్రమే రైతుభరోసా వచ్చింది. గత ప్రభుత్వం మొత్తం భూమికి వచ్చిందని, రెండు దఫాలుగా పూర్తిస్థాయిలో రావడం లేదని, అధికారులు తమకు తెలియదని సమాధానం చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇటువంటి బాధితులు చాలా మంది ఉన్నారు. ఫ కొందరికి సగం, మరికొందరికి అసలే జమకాని నగదు ఫ వ్యవసాయ, బ్యాంకు అధికారులను సంప్రదిస్తున్న రైతులు -
వాసాలమర్రిని ఆదర్శంగా తీర్చిదిద్దుతాం
తుర్కపల్లి: వాసాలమర్రి గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య స్పష్టం చేశారు. రెవెన్యూ, హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి గురువారం తుర్కపల్లి మండలం వాసారాలమర్రి గ్రామానికి రానున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను బుధవారం ఆయన పరిశీలించారు. అనంతరం కలెక్టర్ హనుమంతరావు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్రావుతో కలిసి విలేకరులతో మాట్లాడారు. వాసాలమర్రి పునర్ నిర్మాణంపై సీఎం రేవంత్రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారని, తిరుమలాపూర్ సభలోనూ గ్రామ అభివృద్ధిపై ప్రస్తావించారని పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇళ్లతో గ్రామ పునర్నిర్మాణానికి పునాది వేస్తామని చెప్పారు. 227 ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తామని, లబ్ధిదారులందరికీ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి చేతులమీదుగా ప్రొసీడింగ్స్ పంపిణీ చేస్తారని వెల్లడించారు. మొదట ఆకుల ఆగవ్వకు ప్రొసీడింగ్ కాపీ అందజేస్తామన్నారు. ఇందిరమ్మ గృహాలే కాకుండా పాఠశాలలు, రోడ్లను అభివృద్ధి చేస్తామని, మైలిక వసతులు కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ చైతన్య మహేందర్రెడ్డి, ఎంపీడీఓ వెంకటేశ్వర్లు, నాయకులు దనావత్ శంకర్నాయక్, చాడ భాస్కర్రెడ్డి, గడిమీది నిఖిల్, బాబు, దుర్వాసులు, రాజారాం నాయక్, భాస్కర్నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఫ నేడు మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి రాక ఫ ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య బండసోమారంలో ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించనున్న మంత్రి భువనగిరి : మండలంలోని బండసోమారం గ్రామానికి మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి రానున్నట్లు కలెక్టర్ హనుమంతరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10.30 గంటలకు గ్రామానికి చేరుకుని ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలిస్తారని పేర్కొన్నారు. 11 గంటలకు సూర్యాపేట జిల్లాకు బయలుదేరి వెళ్తారని వివరించారు. -
కొత్తగా
సాక్షి ప్రతినిధి, నల్లగొండ, సాక్షి, యాదాద్రి: ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో నియోజకవర్గాలను పెంచాలన్న నిబంధన ఉంది. అయితే, 2021లో జరగాల్సిన జనగణన ఆలస్యం కావడంతో నియోజకవర్గాల పునర్విభజన ఆగిపోయింది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం జనగణనకు రెండు రోజుల కిందట గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయడంతో మళ్లీ నియోజకవర్గాల పునర్విభజన చర్చ తెరపైకి వచ్చింది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ప్రస్తుతం 12 నియోజకవర్గాలు ఉన్నాయి. 2001 జనాభా లెక్కల ప్రకారం 2008 చివరలో నియోజక వర్గాలను పునర్ వ్యవస్థీకరించారు. అంతకుముందు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 12 నియోజకవర్గాలు ఉండేవి. 2008 పునర్విభజన తర్వాత కూడా ఉమ్మడి జిల్లాలో 12 నియోజకవర్గాలున్నాయి. అదనంగా ఏమీ పెరుగలేదు. అప్పట్లో రామన్నపేట నియోజకవర్గం రద్దయి, కొత్తగా హుజూర్నగర్ ఏర్పడగా, చలకుర్తి నియోజకవర్గం స్థానంలో నాగార్జునసాగర్ నియోజకవర్గంగా ఏర్పడింది. ప్రస్తుతం ఉమ్మడి జిల్లా జనాభా 50 లక్షల వరకు పెరిగినట్లు అంచనా. దాని ప్రకారం మూడు నియోజకవర్గాలు కొత్తగా ఏర్పడనున్నాయి. నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి, భువనగిరి జిల్లాల్లో ఒక్కో నియోజకవర్గం పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు, రాజకీయ నేతలు చెబుతున్నారు. జిల్లా పరిధి మారకుండా పునర్విభజన నియోజకవర్గాల పునర్విభజనను భౌగోళిక అంశాలు, పరిపాలన సౌలభ్యం పరిగణనలోకి తీసుకొని ఆ జిల్లాల్లోనే నియోజకవర్గాల పరిధిలోని మండలాలు, గ్రామాలు ఉండేలా చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం కొన్ని మండలాలు ఒక జిల్లా పరిధిలో ఉండగా, మరికొన్ని మండలాలు మరో జిల్లా పరిధిలోని నియోజకవర్గంలో ఉన్నాయి. రామన్నపేట, మోత్కూరు, చౌటుప్పల్, సంస్థాన్ నారాయణపురం, శాలిగౌరారం మండలాలే ఇందుకు నిదర్శనం. ఈ నేపథ్యంలో ఒక నియోజకవర్గంలోని మండలాలు, గ్రామాలు అదే జిల్లాలో ఉండేలా పునర్విభజన చేసే అవకాశం ఉంది. మరోవైపు 2027లో పూర్తయ్యే జనగణన తర్వాతే నియోజకవర్గాల పునర్విభజన జరగనుంది. కేంద్ర ఎన్నికల సంఘం జనాభా ప్రతిపాదికనా.. లేక ఓటర్ల ప్రాతిపదికన నియోజక వర్గాలను ఏర్పాటు చేస్తుందా అనేది కూడా తేలాల్సి ఉంది. తెరపైకి పాత నియోజకవర్గాలు.. గతంలో రద్దయిన పాత నియోజకవర్గాలు మళ్లీ తెరపైకి వస్తున్నాయి. 2027లో జనగణన ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన జరుగనుంది. అయితే మూడు నియోజకవర్గాలు కొత్తగా ఏర్పడనున్నందున అందులో తిరిగి రద్దయిన పాత నియోజకవర్గాల పేర్లు కూడా తెరపైకి వస్తున్నాయి. మరోవైపు నల్లగొండ, సూర్యాపేట పట్టణాల్లో అర్బన్, రూరల్ నియోజకవర్గాలు ఏర్పాటు చేస్తారన్న చర్చ జరగుతోంది. నల్లగొండ అర్బన్, రూరల్ నియోజకవర్గాలుగా.. నల్లగొండ జిల్లా కేంద్రంలో నల్లగొండ నియోజకవర్గం రెండు నియోజకవర్గాలుగా ఏర్పడతాయన్న చర్చ గత కొంత కాలంగా సాగుతోంది. నల్లగొండ పట్టణంలో రెండు లక్షలపైగా జనాభా, 1.20 లక్షల వరకు ఓటర్లున్నారు. నల్లగొండ పట్టణంతో పాటు రూరల్ మండలం కలుపుకుని నల్లగొండ అర్బన్ ని యోజక వర్గంగా ఏర్పాటు చేస్తారనే చర్చ జరుగుతోంది. మరోవైపు కనగల్, తిప్పర్తి, మాడుగులపల్లి మండలాలను కలుపుకొని నల్లగొండ రూరల్ నియోజకవర్గంగా ఏర్పాటు చేయవచ్చనే చర్చ సాగుతోంది. నాగారం కూడా.. ప్రస్తుతం తుంగతుర్తి నియోజకవర్గంలోని నాగారంను కూడా నియోజకవర్గం చేస్తారనే చర్చ జరుగుతోంది. నాగారం గతంలో నియోజవర్గంగా ఉంది. అక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి 1962లో ఎ.రంగారెడ్డి గెలుపొందారు. అయితే 1966లో ఆ నియోజకవర్గం రద్దయి, తుంగతుర్తి ఏర్పడింది. ప్రస్తుతం నియోజకవర్గాల పునర్విభజనలో మళ్లీ దానిని ఏర్పాటు చేస్తారన్న చర్చ సాగుతోంది. నాగారంను తిరిగి నియోజకవర్గంగా చేయాల్సి వస్తే నాగారం, అడ్డగూడురు, తిరుమలగిరి, అర్వపల్లి మండలాలతో చేసే అవకాశం ఉంది. సూర్యాపేట అర్బన్.. ప్రస్తుతం సూర్యాపేట నియోజకవర్గంలో సూర్యాపేట టౌన్తో పాటు రూరల్ మండలాన్ని కలుపుకొని సూర్యాపేట అర్బన్ నియోజకవర్గ కేంద్రంగా ఏర్పాటు చేస్తారన్న చర్చ సాగుతోంది. సూర్యాపేట రూరల్ నియోజకవర్గాన్ని ఆత్మకూర్ (ఎస్), చివ్వెంల, పెన్పహాడ్, ప్రస్తుతం కోదాడలోని మోతె మండలాలను కలుపుతూ ఏర్పాటు చేసే అవకాశం ఉంది. అయితే నాగారం నియోజకవర్గం ఏర్పాటైతే సూర్యాపేట రూరల్ నియోజకవర్గం ఉండకపోవచ్చని, సూర్యాపేట రూరల్ ఉంటే నాగారం నియోజకవర్గం ఏర్పాటు చేసే అవకాశం ఉండదనే చర్చ రాజకీయవర్గాల్లో జరుగుతోంది. అసెంబ్లీ సెగ్మెంట్లుమోత్కూరు, చౌటుప్పల్ నియోజకవర్గాలకు డిమాండ్ చౌటుప్పల్, మోత్కూరు కేంద్రాలుగా నియోజకవర్గాల డిమాండ్ వస్తోంది. మోత్కూరు నియోజకవర్గం అడ్డగూడూరు, మోత్కూరు, గుండాల, ఆత్మకూర్(ఎం), వలిగొండ, మోటకొండూరు మండలాలతో ఏర్పాటు చేయాలని మోత్కూరు ప్రాంత ప్రజలు కోరుతున్నారు. తమ ప్రాంతాన్ని తుంగతుర్తి నియోజకవర్గంలో కలపడం వల్ల రాజకీయంగా తీవ్రంగా నష్టపోయామని అంటున్నారు. మరో వైపు డివిజన్ కేంద్రమైన చౌటుప్పల్ను నియోజకవర్గ కేంద్రం చేయాలన్న చర్చ కూడా జరగుతోంది. 33 శాతం మహిళా రిజర్వేషన్ కొత్తగా ఏర్పాటు చేసే నియోజకవర్గాల పునర్విభజనతోపాటు 33 శాతం చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ల కోసం కేంద్రం చర్యలు చేపడుతోంది. 2028 అసెంబ్లీ ఎన్నికల్లో దీనిని కచ్చితంగా అమలు చేసే అవకాశం ఉంది. ఈ లెక్కన ఉమ్మడి జిల్లాలోనూ 2028 అసెంబ్లీ ఎన్నికల్లో నాలుగు సీట్లు మహిళలకే దక్కనున్నాయి. -
ఏటీఎంల వద్ద మోసాలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్
హుజూర్నగర్: ఏటీఎంల వద్ద డబ్బులు డ్రా చేసి ఇస్తానని అమాయకులను బురిడీ కొట్టించి డబ్బులు కాజేస్తున్న వ్యక్తిని పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. హుజూర్నగర్ సీఐ చరమంద రాజు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని విజయవాడ కృష్ణలంకకు చెందిన చింతల సురేష్బాబు ఏటీఎంల వద్ద డబ్బులు డ్రా చేసేందుకు వచ్చే అమాయకులు, వృద్ధులు, మహిళల ఏటీఎం కార్డులను తీసుకొని దాని స్థానంలో నకిలీ కార్డును వారికి ఇచ్చి.. ఆ తర్వాత వారి అసలు ఏటీఎం కార్డులను ఉపయోగించుకొని డబ్బులు కాజేస్తున్నాడు. గతేడాది నవంబర్ 19న హుజూర్నగర్కు చెందిన మంద విజయ కరుణ పట్టణంలోని ఓ ఏటీఎంలో డబ్బులు తీసేందుకు ఇతడి సహాయం కోరగా ఆమె చెప్పిన పిన్ నంబర్ ఉపయోగించి డబ్బులు డ్రా చేసి ఆమెకు డబ్బులతో పాటు నకిలీ ఏటీఎం కార్డును చేతిలో పెట్టి నిజమైన కార్డును తీసుకొని వేరే ప్రదేశాల్లో రూ.1.25 లక్షలు డ్రా చేశాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు సురేష్బాబుపై స్థానిక పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. బుధవారం హుజూర్నగర్ పట్టణంలోని హెచ్డీఎఫ్సీ ఏటీఎం వద్ద సురేష్బాబు అనుమానాస్పదంగా తిరుగుతుండగా.. పోలీసులు అతడిని పట్టుకుని విచారించగా చేసిన నేరాలను ఒప్పుకున్నాడు. అతడి వద్ద నుంచి రూ.లక్ష స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు సీఐ తెలిపారు. నిందితుడిపై రెండు తెలుగు రాష్ట్రాల్లో 44 కేసులు నమోదైనట్లు పేర్కొన్నారు. నిందితుడిని పట్టుకున్న ఏఎస్ఐ బలరామిరెడ్డి, కానిస్టేబుళ్లు వరప్రసాద్, నాగరాజును సీఐ అభినందించారు. -
ఈతకు వెళ్లి రైల్వే ఉద్యోగి మృతి
డోర్నకల్: స్నేహితులతో కలిసి సరదాగా ఈతకు వెళ్లిన రైల్వే ఉద్యోగి ప్రమాదవశాత్తు నీటమునిగి చనిపోయాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ సమీపంలోని మున్నేరువాగులో బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. సూర్యాపేట జిల్లా కోదాడకు చెందిన ఎర్రంశెట్టి సందీప్(28) డోర్నకల్లో రైల్వే ట్రైన్ మేనేజర్గా విధులు నిర్వహిస్తున్నాడు. బుధవారం మిత్రులతో కలిసి సరదాగా మున్నేరువాగులో ఈతకు వెళ్లాడు. అక్కడ మిత్రులు ఈత కొడుతుండగా ఈతరాని సందీప్ వాగు ఒడ్డున నీటిలోకి దిగాడు. ప్రమాదవశాత్తు వాగులోకి జారి గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది, పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. స్థానిక మత్స్యకారుల సాయంతో వాగులోనుంచి సందీప్ మృతదేహాన్ని బయటకు తీశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, మృతుడికి నాలుగు నెలల క్రితం వివాహం జరిగినట్లు సమాచారం. -
సీఈసీ గ్రూప్ అప్పాజిపేటకు తరలింపు
మోటకొండూర్: మోటకొండూర్ మండల కేంద్రంలోని మహాత్మా జ్యోతిరావు పూలే బాలికల గురుకుల పాఠశాలలో ఇంటర్ సీఈసీ గ్రూప్ను నల్లగొండ మండలంలోని అప్పాజిపేటలో గల బాలికల గురుకుల పాఠశాలకు తరలిస్తున్నారని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మోటకొండూర్ గురుకుల పాఠశాలలో గతేడాది బైపీసీ, సీఈసీ, ఎంపీసీ గ్రూప్లలో ఇంటర్ మొదటి, ద్వితీయ సంవత్సరం విద్యను బోధించారు. కాగా ఈ సంవత్సరం అడ్మిషన్ల సమయంలో కూడా ఆన్లైన్లో ఇంటర్ సీఈసీ మోటకొండూర్ చూపించడంతో విద్యార్థులు ఆప్షన్ ఇచ్చుకున్నారు. తీరా ఇక్కడికి వచ్చిన విద్యార్థులకు మాత్రం నల్లగొండ మండలంలోని అప్పాజిపేట గురుకుల పాఠశాలలో సీఈసీ బోధన ఉంటుందని ప్రిన్సిపాల్ జ్యోతి చెబుతున్నారు. ఇంటర్ సీఈసీ సబ్జెక్ట్లు బోధించడానికి సరైన ఫ్యాకల్టీ, తరగతి గదులు లేవని దీంతో ఇంటర్ మొదటి, ద్వితీయ సంవత్సరం సీఈసీని అప్పాజిపేటలోని గురుకులంలో నిర్వహిస్తారని ఆమె తెలిపారు. దీంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆన్లైన్లో చూపించకుండా అక్కడే చూపిస్తే మేము ఆప్షన్ పెట్టుకోకుండా ఉండేవారమని, అలాగే ఇంటర్ మొదటి సంవత్సరం సీఈసీ ఇక్కడ చదువుకున్న విద్యార్థులు ద్వితీయ సంవత్సరం కూడా ఇక్కడే కొనసాగించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఫ మోటకొండూర్ బాలికల గురుకుల పాఠశాల నుంచి తరలించడంతో విద్యార్థినులకు ఇబ్బందులు -
తప్పు అధికారులది.. శిక్ష వినియోగదారుడికి..
నల్లగొండ: విద్యుత్ శాఖ అధికారులు చేసిన తప్పిదానికి వినియోగదారుడు బలైన సంఘటన నల్లగొండ జిల్లా కేంద్రంలో వెలుగులోకి వచ్చింది. గృహ వినియోగానికి.. కమర్షియల్ విద్యుత్ మీటర్ అమర్చడంతో ఒక్క నెలలోనే రూ.1.50లక్షల కరెంట్ బిల్లు వచ్చింది. ఇదేమిటని సదరు వినయోగదారుడు విద్యుత్ అధికారుల వద్దకు వెళ్తే.. కమర్షియల్ మీటర్ తీసేసి గృహానికి సంబంధించిన మీటర్ పెట్టారు. కానీ పాత బిల్లు సరిచేస్తామని చెప్పిన అధికారులు ఏళ్లు గడుస్తున్నా పట్టించుకోలేదు. తాజాగా బిల్లు మొత్తం చెల్లించాలంటూ విద్యుత్ సరఫరా నిలిపివేశారు. ఐదేళ్లుగా కాలయాపన.. నల్లగొండ మున్సిపాలిటీ పరిధిలోని చంద్రగిరి విల్లాస్లో నివాసముంటున్న మేడి లింగయ్య అలియాస్ లింగస్వామి ఇంటికి 2014లో (సర్వీస్ నంబర్ 0401402486) కమర్షియల్ మీటర్ను విద్యుత్ అధికారులు పెట్టారు. అయితే లింగయ్య పని నిమిత్తం ఇతర రాష్ట్రాలకు వెళ్తుంటాడు. ప్రతి నెల నల్లగొండకు వచ్చినప్పుడల్లా కరెంట్ బిల్లు ఎక్కువగా వస్తున్నా కూడా కడుతూ వచ్చాడు. కరెంట్ బిల్లు ఎక్కువ వస్తుందని 2020లో విద్యుత్ అధికారుల దృష్టికి తీసుకెళ్లగా.. మీటర్ చెక్ చేస్తామంటూ డీడీలు కూడా కట్టించుకున్నారు. ఈ మేరకు మీటర్ను చెక్ చేసి అది కమర్షియల్ మీటర్ అని అధికారులు రిపోర్టు ఇచ్చి ఆ మీటర్ను మార్చారు. అప్పటి వరకు కరెంట్ బిల్లు రూ.1.50లక్షలకు చేరుకుంది. మీటర్ మార్చిన సందర్భంలో పాత బిల్లంతా రివైజ్ చేస్తామని చెప్పడంతో లింగయ్య దరఖాస్తు చేసుకున్నాడు. ఇందుకు విద్యుత్ అధికారులు, ఏడీఏలు కూడా సంతకం చేసి అంగీకరించారు. ఆ తర్వాత బిల్లు తగ్గించకుండానే కొత్త బిల్లుతో పాటు పాత బిల్లు కలుపుతూ వస్తున్నారు. ఈ విషయంపై ఏఈ, డీఈ, ఎస్ఈలతో పాటు విద్యుత్ వినియోగదారుల ఫోరంలో కూడా లింగయ్య దరఖాస్తులు ఇవ్వడంతో బిల్లును సరిచేస్తామని చెప్పి దాటవేస్తూ వచ్చారు. ప్రస్తుతం ఆ బిల్లు రూ.1.79లక్షలకు చేరుకుంది. అయితే బిల్లు మొత్తం చెల్లించాలంటూ మంగళవారం లింగయ్య ఇంటికి విద్యుత్ సరఫరాను నిలిపివేయడంతో అతడు విద్యుత్ ఆపరేషన్స్ ఎస్ఈ వద్దకు వెళ్లి ప్రశ్నించగా.. విద్యుత్ సరఫరాను తిరిగి పునరుద్ధరించారు. కానీ బిల్లులో ఎలాంటి మార్పు చేయలేదు. దీంతో లింగయ్య న్యాయపరంగా ముందుకు వెళ్తానంటూ సాక్షికి వివరించాడు. విద్యుత్ అధికారులు చేసిన పొరపాటును సరిదిద్దుకోకుండా తనను ఇబ్బందులకు గురిచేస్తూ విద్యుత్ సరఫరా నిలిపివేయడం ఎంత వరకు సమంజసమని లింగయ్య వాపోతున్నాడు. ఫ గృహ వినియోగానికి కమర్షియల్ విద్యుత్ మీటర్ ఇచ్చిన అధికారులు ఫ కరెంట్ బిల్లు ఎక్కువ వస్తుండడంతో మీటర్ మార్పు ఫ బిల్లు సరిచేస్తామని చెప్పి ఏళ్ల తరబడి సాగదీత ఫ మొత్తం బిల్లు చెల్లించాలంటూ విద్యుత్ సరఫరా నిలిపివేత -
సినీ ఫక్కీలో బంగారం చోరీ
ఫ వృద్ధురాలిని మంచానికి కట్టేసి 9 తులాల బంగారంతో ఉడాయించిన కేటుగాళ్లు నాగారం: సినీ ఫక్కీలో వృద్ధురాలిని మంచానికి కట్టేసి 9 తులాల బంగారాన్ని గుర్తుతెలియని వ్యక్తులు అపహరించారు. ఈ ఘటన మంగళవారం రాత్రి నాగారం మండలం ఈటూరు గ్రామంలో జరిగింది. బుధవారం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈటూరు గ్రామానికి చెందిన నంగునూరి బయ్యమ్మకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు సంతానం. వీరందరికి వివాహాలు అయ్యాఇ. బయ్యమ్మ కుమారుడు శ్రీరాములు ఉద్యోగ రీత్యా చైన్నెలో ఉంటున్నాడు. బయ్యమ్మ భర్త కొనేళ్ల క్రితం మృతిచెందాడు. దీంతో ఆమె ఇంటి వద్ద ఒంటరిగానే ఉంటుంది. మంగళవారం రాత్రి బయ్యమ్మ ఇంట్లో నిద్రించగా.. అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో కరెంట్ పోయింది. దీంతో ఆమె ఇంటి బయటికి వచ్చి వరండాలో మంచం వేసుకొని నిద్రించింది. ఆమె నిద్రలోకి జారుకున్న కొద్దిసేపటికే నలుగురు గుర్తుతెలియని వ్యక్తులు ఇంటి వెనుక నుంచి వచ్చి బయ్యమ్మ రెండు చేతులను చీరతో మంచానికి కట్టి, నోట్లో గుడ్డలు కుక్కి ఆమె మెడలో ఉన్న 2తులాల బంగారు నల్లపూసల గొలుసు గుంజుకున్నారు. అనంతరం ఇంట్లోకి చొరబడి ఇంట్లోని ట్రంక్ పెట్టెలో దాచిన 4 తులాల బంగారు పెద్ద గొలుసు, 3 తులాల పుస్తెలతాడుతో పాటు ఆమె నడుముకున్న చెక్కుడు సంచిలో ఉన్న రూ.2500 లాక్కోని పారిపోయారు. బుధవారం బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు స్థానిక ఎస్ఐ ఎం. ఐలయ్య తెలిపారు. యాదగిరిగుట్ట ఆలయంలో రికార్డుల పరిశీలన యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి సంబంధించిన పలు రికార్డులను విజిలెన్స్ అధికారులు బుధవారం పరిశీలించారు. ప్రతి ఆరు నెలలు, ఏడాదికి ఒకసారి విజిలెన్స్ అధికారులు ఆలయంలో రికార్డులను పరిశీలించినట్లుగానే బుధవారం విజిలెన్స్ అధికారులకు ఆలయానికి వచ్చి రికార్డులు పరిశీలించినట్లు ఆలయ అధికారులు చెప్పారు. అడిషనల్ ఎస్పీ స్థాయి అధికారితో పాటు మరో ఐదుగురు సభ్యులతో కలిసి ఆలయ అకౌంట్ సెక్షన్లో రికార్డులను చూ శారు. ఆలయానికి ఆదాయం ఎంత వస్తుంది, గతేడాది ఎంత వచ్చింది, రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నులు సరిగ్గా చెల్లిస్తున్నారా లేదా, నగలు ఎంత ఉన్నాయి, ఖర్చులు ఎంత అవుతున్నాయే అంశాలపై రికార్డులను పరిశీలించి వెళ్లారు. వారి వెంట ఆలయ డిప్యూటీ డీఈఓ దోర్భల భాస్కర్శర్మ, పలువురు ఉద్యోగులున్నారు. కోర్టు ఆదేశాలు ధిక్కరణ.. ఐదుగురికి రిమాండ్ నూతనకల్: నూతనకల్ మండలం యడవెల్లి గ్రామానికి చెందిన బొడ్డు సైదులు, వనం రాజు, పిట్టల కృష్ణ, బొడ్డు రాజాలు, నెల్లుట్ల సైదులు గతంలో గ్రామంలో ఘర్షణకు పడగా.. వారిపై పోలీసులు కేసు నమోదు చేసి కోర్టుకు రిమాండ్ చేశారు. అయితే వారు కేసు వాయిదాలకు హాజరుకాకుండా కోర్టు ధిక్కారణ చర్యలకు పాల్పడడంతో బుధవారం నాన్ బెయిలెబుల్ వారెంట్ కింద అరెస్ట్ చేసి కోర్టుకు తరలించినట్లు ఎస్ఐ ప్రవీణ్కుమార్ పేర్కొన్నారు. వైభవంగా నిత్య కల్యాణంమఠంపల్లి: మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో బుధవారం శ్రీరాజ్యలక్ష్మీచెంచులక్ష్మీసమేత శ్రీలక్ష్మీనరసింహ స్వామి నిత్యకల్యాణాన్ని అర్చకులు వైభవంగా నిర్వహించారు. ఈసందర్భంగా ఆలయంలో సుప్రభాత సేవ, పంచామృతాభిషేకం, ఎదుర్కోలు మహోత్సవ సంవాదం జరిపించారు. కల్యాణ వేడుకలో భాగంగా విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, రక్షాబంధనం, మదుఫర్కపూజ, మాంగల్యధారణ పూర్గిగావించారు. అనంతరం గరుడ వాహనంపై స్వామివారిని ఊరేగించారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు విజయ్కుమార్, మట్టపల్లిరావు, ఈఓ నవీన్కుమార్, భక్తులు పాల్గొన్నారు. -
రూ.3.50లక్షల విలువైన కిట్లు పంపిణీ
సంస్థాన్ నారాయణపురం: ౖెహదరాబాద్కు చెందిన రిలయబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సంస్థాన్నారాయణపురంలోని జిల్లా పరిషత్ బాలుర, బాలికల ఉన్నత పాఠశాలల విద్యార్థులకు బుధవారం స్కూల్ కిట్లు అందజేశారు. 340 మంది విద్యార్థులకు రూ.3.50 లక్షల విలువ చేసే స్కూల్ కిట్లను డీఈఓ సత్యనారాయణ, ట్రస్ట్ ఎండీ తుపాకుల రవి అందజేశారు. రిలయబుల్ ట్రస్ట్ సహకారం అభినందనీయమని, ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి దాతలు ముందుకురావాలని డీఈఓ కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ప్రమోద్కుమార్, ఎంఈఓ శ్రీనివాస్, హెచ్ఎంలు రమాదేవి, ఉదయ, కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ శివరంజని, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పర్నె శివారెడ్డి, సుక్క సుదర్శన్, ఆముదాల పరమేష్ తదితరులు పాల్గొన్నారు. షార్ట్ సర్క్యూట్తో బేకరీలో మంటలు మిర్యాలగూడ అర్బన్: బేకరీలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి సామగ్రి పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటన మిర్యాలగూడ పట్టణంలో బుధవారం జరిగింది. వివరాలు.. మిర్యాలగూడ పట్టణంలోని రాజీవ్ చౌక్ వద్ద గల గోకుల్ బేకరీలో పై అంతస్తులో సామగ్రి నిల్వ చేసిన గదిలో బుధవారం మధ్యాహ్నం 12గంటల సమయంలో షార్ట్ సర్క్యూట్తో మంటలు అంటుకున్నాయి. దట్టమైన పొగ కమ్ముకోవడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందించగా.. వారు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పేందుకు మంటలను అదుపులోకి తెచ్చారు. రూ.4.50లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు బాధితుడు రాహుల్ అగర్వాల్ తెలిపాడు. -
‘దోస్త్’ రిజిస్ట్రేషన్కు నేడే చివరి తేదీ
రామన్నపేట: డిగ్రీ కళాశాలల్లో ఫస్టియర్లో చేరేందుకు గాను డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్, తెలంగాణ(దోస్త్)లో రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు గురువారం చివరి తేదీ అని రామన్నపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రాహత్ ఖానం బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇంటర్ పాసైన విద్యార్థులు, ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రామన్నపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బీఎస్సీ ఎంపీసీ, బీజెడ్సీ, డైరీ సైన్స్ కోర్సులు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. స్వర్ణగిరీశుడికి అష్టదళ పాదపద్మార్చన సేవ భువనగిరి: భువనగిరి పట్టణ శివారులోని స్వర్ణగిరి క్షేత్రంలో వేంకటేశ్వరస్వామికి బుధవారం 108 బంగారు అష్టదళ పద్మపుష్పాలతో అష్టోత్తర శతనామాలతో అష్టదళ పాదపద్మార్చన సేవ కార్యక్రమాన్ని నిర్వహించారు. అంతకుముందు ఆలయంలో స్వామి వారికి ఉదయం సుప్రభాత సేవ, తోమాల సేవ, సహస్రనామార్చన సేవ, మధ్యాహ్నం సుమారు 3వేల మంది భక్తులకు అన్నప్రసాద వితరణ, సాయంత్రం తిరువీధి ఉత్సవ సేవ, కర్పూర మంగళహరతుల సమర్పణ చేశారు. ఆయా కార్యక్రమాల్లో ఆలయ అర్చకులు, భక్తులు పాల్గొన్నారు. శతాధిక వృద్ధురాలు మృతిచిలుకూరు: చిలుకూరు మండలం నారాయణపురం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ తమ్మనబోయిన శంకర్ మాతృమూర్తి తమ్మనబోయిన వెంకమ్మ(105) బుధవారం అనారోగ్యంతో మృతిచెందింది. ఆమెకు ఐదుగురు కుమారులు, ఆరుగురు కుమార్తెలు సంతానం. వెంకమ్మ కుటుంబంలో కుమారులు, కుమార్తెలు, మనమలు, మనవరాళ్లు, ము ని మనవళ్లు, ముని మనవరాళ్లు కలిపి 60 మంది ఉన్నారు. వెంకమ్మ ఎలాంటి దీర్ఘకాలిక వ్యా దుల బారిన పడకుండా వందేళ్లకు పైగా జీవించినట్లు ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. ఎదురెదురుగా ఢీకొన్న ఆటో, ఆర్టీసీ బస్సుఫ ఆటో డ్రైవర్కు తీవ్ర గాయాలు ఆత్మకూర్(ఎస్)(సూర్యాపేట): ఆటో, ఆర్టీసీ బస్సు ఎదురెదురుగా ఢీకొనడంతో ఆటో డ్రైవర్కు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన ఆత్మకూర్(ఎస్) మండల పరిధిలోని నెమ్మికల్లు గ్రామంలో బుధవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆత్మకూర్(ఎస్) మండల కేంద్రానికి చెందిన ఉప్పుల శ్రీశైలం ఆటోలో పాల డబ్బాలతో సూర్యాపేటకు వెళ్తుండగా.. నెమ్మికల్లు గ్రామంలో సూర్యాపేట నుంచి వరంగల్ వెళ్తున్న ఆర్టీసీ బస్సు, ఆటో ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ శ్రీశైలంకు తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు అతడిని చికిత్స నిమిత్తం సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం అతడిని హైదరాబాద్కు తరలించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. -
మహిళ మృతికి కారణమైన ఇద్దరి రిమాండ్
తాళ్లగడ్డ (సూర్యాపేట): మహిళ మృతికి కారణమైన ఇద్దరిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను బుధవారం సూర్యాపేట రూరల్ పోలీస్ స్టేషన్లో రూరల్ సీఐ రాజశేఖర్ విలేకరులకు వెల్లడించారు. సీఐ తెలిపిన వివరాల ప్రకారం.. ఆత్మకూరు మండలం కోటపహాడ్ గ్రామ పంచాయతీ పరిధిలోని తెట్టెకుంట తండాకు చెందిన బాణోతు విజయ (36)ను అదే తండాకు చెందిన బాణోతు ఉపేందర్ లైంగికంగా వేధిస్తూ తరచూ ఫోన్ చేసి ఇబ్బంది పెట్టేవాడు. ఈ నెల 13న ఉదయం కూడా ఉపేందర్ విజయకు ఫోన్ చేయగా ఆమె కుమార్తె అఖిల ఎత్తింది. శ్రీమీ అమ్మ ఎటు వెళ్లిందిశ్రీ అంటూ దుర్భాషలాడాడు. కాసేపటికే ఉపేందర్ భార్య శారద విజయ ఇంటికి వెళ్లి తన భర్తతో వివాహేతర సంబంధంపై ప్రశ్నించడంతో విజయ మనస్తాపం చెంది అదే రోజు పొలం దగ్గర పురుగుల మందు తాగింది. అనంతరం ఇంటికి వచ్చిన విజయ వాంతులు చేసుకోవడంతో ఆమె కుమార్తె గ్రామస్తుల సాయంతో సూర్యాపేట జనరల్ హాస్పిటల్లో చేర్పించగా.. చికిత్స పొందుతూ ఈ నెల 15న మృతిచెందింది. విజయ భర్త బాలు ఫిర్యాదు మేరకు బాణోతు ఉపేందర్, బాణోతు శారద, ఉపేందర్ అన్న గంగరాజు, వదిన మంగమ్మపై ఆత్మకూరు ఎస్ఐ శ్రీకాంత్గౌడ్ కేసు నమోదు చేశారు. దర్యాప్తు అనంతరం బాణోతు ఉపేందర్, అతని భార్య శారదను రూరల్ సీఐ రాజశేఖర్ అరెస్టు చేసి రిమాండ్కు పంపారు. ఉపేందర్ అన్న గంగరాజు, వదిన మంగమ్మ పాత్ర గురించి దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో కార్యక్రమంలో ఆత్మకూర్ ఎస్ఐ శ్రీకాంత్గౌడ్ పాల్గొన్నారు. -
స్పిల్వేను పరిశీలించిన నిపుణులు
నాగార్జునసాగర్: నాగార్జునసాగర్ డ్యాం స్పిల్వేను మరమ్మతుల నిపుణుల బృందం బుధవారం పరిశీలించింది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకున్న తర్వాత క్రస్ట్ గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేసినప్పుడు అధిక ఒత్తిడితో స్పిల్వే మీద నుంచి జారి బక్కెట్ పోర్షన్ తాకి ఎగిసిపడతాయి. సుమారు 300 నుంచి 350 మీటర్ల ఎత్తు నుంచి అధిక ఒత్తిడితో నీరు పడటం కారణంగా స్పిల్వేపై పెద్ద పెద్ద గుంతలు ఏర్పడుతున్నాయి. వీటిని ప్రతి సంవత్సరం మరమ్మతులు చేపట్టకపోతే డ్యాం పటిష్టతకు ఆటంకం ఏర్పడుతుంది. సాగర్ డ్యాం స్పిల్వే మరమ్మతులకు ప్రభుత్వం కోట్ల రూపాయలు వెచ్చిస్తోంది. ఎంత ఖర్చు చేసినా ప్రతి ఏడాది క్రస్ట్ గేట్ల ద్వారా నీరు విడుదల చేసిన తర్వాత స్పిల్వే దెబ్బతినడం.. మరలా మరమ్మతులు చేపట్టడం సర్వసాధారణమైంది. గతేడాది కూడా రూ.20కోట్లతో స్పిల్వేకు మరమ్మతులు చేపట్టారు. కానీ నీటి విడుదల తర్వాత స్పిల్వే దెబ్బతిని గుంతలు ఏర్పాడ్డాయి. ఈ విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇరిగేషన్ ఉన్నతాధికారులు, నిపుణుల కమిటీ సమావేశమై శాశ్వత పరిష్కారం దిశగా ఆలోచనలు చేస్తున్నారు. దీనిలో భాగంగా బుధవారం ఎంవైకే ఆర్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ప్రతినిధులు కులదీప్ తివార్, ఏఎన్ శ్రీకాంత్రాజ్, ఆదిత్య విక్రం వర్మ, సుజిత్ చంద్ర, ఎంజీ ప్రశాంత్లు డ్యాంను సందర్శించి స్పిల్వేను పరిశీలించారు. వీరితో పాటు సాగర్ డ్యాం ఇన్చార్జి ఎస్ఈ మల్లిఖార్జునరావు, డీఈ శ్రీనివాస్, ఏఈ సత్యనారాయణ ఉన్నారు. స్పిల్ వే మరమ్మతులకు ఎలాంటి మెటిరీయల్ను వినియోగించాలి, వాటి సామర్థ్యం ఎంతమేరకు తట్టుకోగలదు వంటి విషయాలపై అధ్యయనం చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే మూడు దఫాలుగా ఎంవైకే కంపెనీ ప్రతినిధులు సాగర్ స్పిల్వేను పరిశీలించారు. ఈ బృందం పూర్తిస్థాయి నివేదికను ఉన్నత స్థాయి ఇరిగేషన్ అధికారులకు అందజేసిన తర్వాత ప్రభుత్వ నిర్ణయాన్ని బట్టి, అందుబాటులో ఉన్న కాలాన్ని బట్టి స్పిల్వేకు మరమ్మతులు నిర్వహించనున్నారు. వీరి ప్రతిపాదనలను ప్రభుత్వం ఒప్పుకుంటే పూర్తిస్థాయిలో మరమ్మతులు చేపట్టేందుకు సమయం సరిపోదు కాబట్టి దెబ్బతిన్న స్పిల్వేపై ఉన్న గుంతలకు మరమ్మతులు చేపట్టనున్నారు. జలాశయం నిండి క్రస్ట్ గేట్ల ద్వారా నీటి విడుదల పూర్తయిన తర్వాత మరమ్మతులు చేసిన స్పిల్వే గుంతలు నీటి ప్రవాహాన్ని ఒత్తిడిని తట్టుకుని ఉండగల్గితే అప్పుడు పూర్తిస్థాయిలో మరమ్మతులు చేపట్టనున్నారు. ఫ సాగర్ డ్యాం ఇంజనీర్లతో కలిసి మరమ్మతులపై అధ్యయనం -
అబద్ధాలతో కాంగ్రెస్ ప్రభుత్వ పాలన
నల్లగొండ టూటౌన్: మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధాలతో పాలన సాగిస్తోందని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. బుధవారం నల్లగొండలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో కర్రు కాల్చి వాత పెడతారనే భయంతో రైతులకు రైతు భరోసా ఇస్తున్నారని అన్నారు. ఒక్కో రైతుకు పాత బకాయి రూ.30వేలు ఉందని, ఇలా గత యాసంగిలో ఉమ్మడి జిల్లా రైతులకు రూ.800కోట్లు రైతు భరోసా నిధులు బాకీ పడ్డారని తెలిపారు. పెండింగ్లో ఉన్న రైతు భరోసా రైతులకు ఇప్పించే బాధ్యత జిల్లా మంత్రులు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జిల్లాకు కాంగ్రెస్ మంత్రులు చేసిందేమీ లేదని, చేతగాని మంత్రులుగా మిగిలిపోయారని విమర్శించారు. జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు కబ్జాలు, ఆక్రమణలకే పెద్దపీట వేస్తున్నారని ఆరోపించారు. వారికి కమీషన్లు వచ్చే పనులను పట్టుకుని ముఖ్యమంత్రి చుట్టూ తిరిగేందుకు సమయం సరిపోతలేదని ఎద్దేవా చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో చేస్తున్న విచారణ ఓ బూటకమని, ఫార్ములా–ఈ కేసులో ఏం జరగకపోయినా కేటీఆర్పై కక్ష సాధింపులో భాగంగానే నోటీసులు, విచారణ అంటూ వేధిస్తున్నారని అన్నారు. కేటీఆర్పై ఇప్పటి వరకు 14 కేసులు అక్రమంగా పెట్టారని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ఎన్ని కేసులు పెట్టినా బీఆర్ఎస్ భయపడదని, ప్రజల తరఫునన ప్రభుత్వ వ్యతిరేక విధానాలు, హామీల అమలుపై పోరాటమని చేస్తామని స్పష్టం చేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్తోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని, స్థానిక సంస్థల్లో బీఆర్ఎస్దే విజయమన్నారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. ఫ గత యాసంగిలో రైతులకు రూ.800 కోట్లు బాకీ పడ్డారు ఫ కక్ష సాధింపులో భాగంగానే కేటీఆర్కు నోటీసులు ఫ నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య -
గిడ్డంగుల్లో ధాన్యం నిల్వతో లాభాలు పొందవచ్చు
గరిడేపల్లి: గిడ్డంగుల్లో ధాన్యాన్ని నిల్వ చేసుకుని రైతులు అధిక లాభాలు పొందవచ్చని జాతీయ మొక్కల ఆరోగ్య పరిరక్షణ సంస్థ జాయింట్ డైరెక్టర్ ఎ. మరియాదాస్ అన్నారు. బుధవారం గరిడేపల్లి మండలం గడ్డిపల్లిలోని కృషి విజ్ఞాన కేంద్రంలో వేర్హౌజ్ డెవలప్మెంట్ రెగ్యూలేటరీ యాక్ట్, నెగోషియబుల్ వేర్హౌజ్ రిసిప్ట్పై రైతులు, వ్యాపారులు, పప్పు మిల్లు యాజమానులకు ఒక రోజు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మరియాదాస్ పాల్గొని మాట్లాడారు. రైతులు ధాన్యం నిల్వలో తగు జాగ్రత్తలు తీసుకోకుంటే 10 నుంచి 30శాతం ధాన్యం చీడ పురుగులు, ఎలుకల వల్ల నష్టం వాటిల్లుతుందని అన్నారు. ధాన్యం నిల్వపై ప్రతిఒక్కరూ సరైన అవగాహన కలిగి ఉండాలన్నారు. అనంతరం రైతులను నేరేడుచర్లలోని స్టేట్ వేర్హౌజింగ్ కార్పొరేషన్ గిడ్డంగుల సంస్థకు తీసుకెళ్లి ధాన్యం నిల్వ గురించి ప్రాక్టికల్గా అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కేవీకే శాస్త్రవేత్తలు డి. ఆదర్శ్, ఎ. కిరణ్, టి. మాధురి, సీహెచ్. నరేష్, రైతులు పాల్గొన్నారు. ఫ జాతీయ మొక్కల ఆరోగ్య పరిరక్షణ సంస్థ జాయింట్ డైరెక్టర్ మరియాదాస్ -
19న ప్రధానాలయాల ఉద్యోగుల సమావేశం
యాదగిరిగుట్ట: రాష్ట్రంలోని ప్రధాన ఆలయాల ఉద్యోగుల సమావేశం ఈనెల 19వ తేదీన యాదగిరిగుట్ట పట్టణంలో నిర్వహించనున్నట్లు దేవాలయ ఉద్యోగుల జేఏసీ అధ్యక్షుడు గజివెల్లి రమేష్బాబు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. యాదగిరిగుట్ట, వేములవాడ, భద్రాచలం, కొండగట్టు, కొమురవెల్లి, బాసర ఆలయాల్లో పనిచేస్తున్న మతపర, మినిస్టీరియల్, నాల్గో తరగతి సిబ్బంది సమావేశంలో పాల్గొంటారని పేర్కొన్నారు. యాదగిరిగుట్ట పట్టణంలోని పాత గోశాలలో గల ఫంక్షన్ హాల్లో ఉదయం 11 గంటలకు సమావేశం జరుగుతుందన్నారు. టీఎన్టీఓల సెంట్రల్ యూనియన్, రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీష్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నట్లు ఆయన వెల్లడించారు. ఆంజనేయుడికి నాగవల్లి దళార్చన యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయానికి క్షేత్రపాలకుడిగా ఉన్న ఆంజనేయస్వామికి నాగవల్లి దళార్చన శాస్త్రోక్తంగా చేపట్టారు. మంగళవారం ఆంజనేయస్వామికి ఇష్టమైన రోజు కావడంతో ప్రధానాలయం, విష్ణు పుష్కరిణి, పాతగుట్ట ఆలయంలో ఆంజనేయస్వామి విగ్రహాలను సింధూరంతో అలంకరించి, పాలాభిషేకం, తమలపాకులతో అర్చన చేశారు. హనుమంతుడికి ఇష్టమైన నైవేద్యాన్ని సమర్పించి, భక్తులకు ప్రసాదంగా అందజేశారు. ప్రధానాలయంలోనూ సంప్రదాయంగా కొనసాగాయి. శ్రీసుదర్శన నారసింహహోమం, గజవాహన సేవ, నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం తదితర సేవలు నిర్వహించారు. రాష్ట్రస్థాయి హాకీ పోటీలకు ఎంపికభువనగిరిటౌన్ : ఉమ్మడి జిల్లా సబ్ జూనియర్ హాకీ జట్టు తరఫున రాష్ట్రస్థాయి హాకీ పోటీలకు ఎంపికై న ఆలేరు విద్యార్థులను కలెక్టర్ హనుమంతరావు మంగళవారం తన చాంబర్లో అభినందించారు. ఉత్తమ ప్రదర్శన కనబరిచి రాష్ట్ర జట్టులోనూ చోటు సంపాదించాలని వారికి సూచించారు. రాష్ట్రస్థాయికి ఎంపికై న విద్యార్థుల్లో గడ్డం సందీప్, బీరు సాయిగణేష్, రాజబోయిన మణికంఠ, శనిగరం పార్థసారధి, కె.వెంకటేష్ ఉన్నారు. వీరు ఇటీవల అదిలా బాద్లో జరిగిన సబ్ జూనియర్స్ చాంపియన్ షిప్లో ఉత్తమ ప్రదర్శన కనబరిచారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు వీరారెడ్డి, భాస్కర్రావు, క్రీడల అభివృద్ధి అధికారి ధనుంజయనేయులు పాల్గొన్నారు. 19న వాసాలమర్రికి మంత్రి పొంగులేటి రాకతుర్కపల్లి: రెవెన్యూ, హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ఈనెల 19న తుర్కపల్లి మండలం వాసాలమర్రి గ్రామానికి రానున్నారు. గ్రామంలో ఏర్పాటు చేసే కార్యక్రమంలో 227 మంది ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంత్రి చేతుల మీదుగా మంజూరు పత్రాలు అందజేయనున్నారు. ఇందుకు సంబంధించి గ్రామంలో జరుగుతున్న ఏర్పాట్లను మంగళవారం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్రావు, భువనగిరి అర్డీఓ కృష్ణారెడ్డి పరిశీలించారు. వారి వెంట తహసీల్దార్ దేశ్యానాయక్, కొక్కండ సత్తయ్య, పలుగుల లింగయ్య, బాబు, వెంకటేష్ తదితరులు ఉన్నారు. -
● తరలించకపోతే ముప్పే..
రామన్నపేట మండలం వెల్లంకి సబ్స్టేషన్ నుంచి పదిహేనేళ్ల క్రితం సిరిపురం శివారులో ఏర్పాటు చేసిన క్రషర్కు విద్యుత్ లైన్ వేశారు. లైన్ కోసం వెల్లంకి గ్రామంలోని ఈదుల చెరువులో స్తంభాలు పాతారు. అప్పట్లో చెరువులో నీళ్లు లేకపోవడం వల్ల ఎవరూ అభ్యంతరం చెప్పలేదు. కొన్నేళ్లుగా పిల్లాయిపల్లి కాలువ నీటితో చెరువు ఎప్పడూ నిండుగా ఉంటుంది. స్తంభాల్లో కొన్ని వంగిపోయాయి. మరమ్మతులు ఏర్పడినప్పుడు విద్యుత్ సిబ్బంది బోటు సాయంతో వెళ్లి సరి చేయాల్సి వస్తుంది. పశువులు నీళ్లు తాగే సమయంలో, గ్రామస్తులు చేపలు పట్టే సమయంలో ప్రాణాపాయం సంభవించే ప్రమాదం లేకపోలేదు. విద్యుత్ స్తంభాలను సురక్షితమైన ప్రాంతం నుంచి ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. – రామన్నపేట -
ముందస్తు జాగ్రత్తలతోనే వ్యాధుల నివారణ
సాక్షి,యాదాద్రి : సీజనల్ వ్యాధులు ప్రభలకుండా ముందస్తు జాగ్రత్తగా నివారణ చర్యలు చేపట్టాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్రావు ఆదేశించారు.మంగళవారం కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. పంచాయతీ అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని, వీధుల్లో పిచ్చిమొక్కలను తొలగించాలని, వాటర్ ట్యాంకులను ఎప్పటికప్పుడు శుభ్రపర్చాలని సూచించారు. వసతి గృహాల్లో నీటి ట్యాంకులను క్లోరినేషన్ చేసి శుభ్రపరచాలన్నారు. ప్రతి శుక్రవారం ఫ్రైడే– డ్రై డే గా పాటించాలని, దోమల నివారణకు ఫాగింగ్ చేయాలని, అవసరమైన చోట ఆయిల్ బాల్స్ వేయాలని, నీటి పైపులైన్లకు మరమ్మతులు చేయాలని స్పష్టం చేశారు. అంగన్వాడీ కేంద్రాలు, వసతిగృహాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ శోభారాణి, డీపీఓ సునంద, డీఎంహెచ్ మనోహర్, మిషన్ భగీరథ ఎస్ఈ కరుణాకర్, ఎస్సీ సంక్షేమ అధికారి జినుకల శ్యాంసుందర్ మున్సిపల్ కమిషనర్లు, ఎంపీఓలు పాల్గొన్నారు. అభివృద్ధిలో ముందుండాలిఅభివృద్ధిలో గ్రామాలను జాతీయస్థాయిలో ముందుంచాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు సూచించారు. పల్లెల అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై మండల పరిషత్, పంచాయతీరాజ్ అధికారులతో కలెక్టరేట్లో శిక్షణ ఇచ్చారు. అభివృద్ధికి సంబంధించి తొమ్మిది అంశాలపై వారికి అవగాహన కల్పించారు. వీటిని పక్కాగా అము చేస్తే గ్రామాలు అలవోకగా అభివృద్ధి చెందుతాయన్నారు. అదనపు కలెక్టర్ భాస్కర్రావు -
ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య
చౌటుప్పల్ రూరల్: ప్రభుత్వ పాఠశాలల్లో నిష్ణాతులైన ఉపాధ్యాయులున్నారని, విద్యార్థులకు నాణ్య మైన విద్య అందుతుందని డీఈఓ సత్యనారాయణ అన్నారు. చౌటుప్పల్ మండలం ఆరెగూడెంలోని జిల్లా పరిషత్ పాఠశాలను మంగళవారం ఆయన సందర్శించారు. తరగతి గదులు, డిజిటల్ క్లాస్, పాఠశాల ఆవరణను పరిశీలించారు. బోధన తీరుపై ఆరా తీశారు. అడ్మిషన్లు ఎలా ఉన్నాయని ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు సులువైన రీతిలో పాఠాలు అర్థమయ్యేలా బోధనం చేయాలని ఉపాధ్యాయులకు స్పష్టం చేశారు. ప్రాథమిక దశలోనే లక్ష్యాలను ఎంచుకుని పట్టుదలతో చేరుకోవాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు నల్లెంకి శంకరయ్య, ఉపాధ్యాయులు శ్వేత, విజయ్ప్రతాప్, నర్సిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. డీఈఓ సత్యనారాయణ -
బ్యాంకుల వద్ద బారులు
భువనగిరిటౌన్ : జిల్లా వ్యాప్తంగా అన్ని బ్యాంకులు మంగళవారం రద్దీగా మారాయి. ప్రభుత్వం ఈ నెల 16 సాయంత్రం నుంచి రైతుల ఖాతాల్లో రైతుభరోసా డబ్బులు జమ చేస్తోంది. డబ్బులు డ్రా చేసుకునేందుకు రైతులు పెద్ద సంఖ్యలో బ్యాంకుల బాట పట్టారు. జిల్లాలో 2.84,250 మంది రైతులకు రూ.317.57 కోట్లు పంట పెట్టుబడి సాయం అందాల్సి ఉంది. వీరందరి ఖాతాల్లో తొమ్మిది రోజుల్లో నగదు జమచేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఎకరానికి రూ.6వేల చొప్పున మూడు ఎకరాల వరకు 1,33,736 మంది రైతుల ఖాతాల్లో రూ.72.62 కోట్లు జమయ్యాయి. బ్యాంకర్ల తీరుతో రైతుల అవస్థలుబ్యాంకర్ల తీరుతో రైతుభరోసా డబ్బులు డ్రా చేసుకోవడానికి ఇబ్బందులు పడినట్లు పలువురు రైతులు వాపోయారు. రైతుభరోసా సాయాన్ని ఇతర రుణాలకు లింక్పెట్టవద్దని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కానీ, కొన్ని బ్యాంకులు అవేమీ పట్టించుకోకపోవడం రైతులు సాయంత్రం వరకు నిరీక్షించాల్సి వచ్చింది. విత్డ్రా ఓచర్లు ఇవ్వలేదని, అధికారులు సరైన సమాధానం చెప్పలేదని భువనగిరిలోని యూనియన్ బ్యాంకుకు వచ్చిన రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.కర్షకుల ఖాతాల్లో రైతుభరోసా డబ్బులు జమ రెండు రోజుల్లో రూ.72.62 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం విత్డ్రా చేసుకోవడానికి బ్యాంకుల్లో అన్నదాతల క్యూఇబ్బందులకు గురి చేస్తున్నారు రైతుభరోసా డబ్బులు తీసుకోవడానికి భువనగిరిలోని యూనియన్ బ్యాంకుకు వెళ్లాను. పైసలు తీసుకునేందుకు ఓచర్ అడగగా అధి కారులు కాలయాపన చేశారు. సాయంత్రం వరకు వేచి చూడాల్సి వచ్చింది. నాలాంటి పరిస్థితినే చాలా మంది రైతులు ఎదుర్కొన్నారు. – మచ్చ భాస్కర్, రైతు -
కొనుగోళ్లలో రాణించారు
ధాన్యం సేకరణ ద్వారా మహిళా సంఘాలకు భారీగా కమీషన్సాక్షి,యాదాద్రి: ధాన్యం కొనుగోలులో మహిళలు శభాష్ అనిపించుకున్నారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోళ్లలో స్వయం సహాయక మహిళా సంఘాలు కీలకపాత్ర పోషిస్తూ రూ.కోట్లలో వ్యాపారం చేశాయి. యాసంగి సీజన్లో తమకు కేటాయించిన ఐకేపీ కేంద్రాల ద్వారా 1,77,228 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించి రూ.3.44 కోట్లు కమీషన్ రూపంలో ఆర్జించాయి. ఇందిరా మహిళా శక్తి పథకాల ద్వారా అతివల ఆర్థికాభివృద్ధికి తోడ్పాటునందిస్తున్న ప్రభుత్వం.. ధాన్యం సేకరణలోనూ వారికి అవకాశం కల్పించడంతో సత్తా చాటారు. కొనుగోలు చేసిన ధాన్యం ఇలా..యాసంగి సీజన్లో ధాన్యం కొనుగోలుకు 321 కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇందులో ఐకేపీ ఆధ్వర్యంలో 91 కేంద్రాలు ఏర్పాటు చేయగా వాటిని స్వయం సహాయక సంఘాలకు కేటాయించారు. వీటి ద్వారా 1,77,228 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. ఇందుకు గాను క్వింటాకు రూ.32 చొప్పున ప్రభుత్వం కమీషన్ చెల్లించింది. మొత్తం రూ.3.44 కోట్లు మహిళా సంఘాల ఖాతాల్లో జమకానున్నాయి. కమిషన్లో కొనుగోలు కేంద్రాల నిర్వహణ, ఇతర ఖర్చులు పోను 50 శాతం డబ్బులు స్రీనిఽధి ఖాతాలో జమ చేస్తారు. ఇకనుంచి 50 శాతం కేంద్రాలు..ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో మహిళా స్వయం సహాయక సంఘాలకు 50 శాతం కేటాయించాలని ప్రభుత్వం నిబంధన పెట్టింది. యాసంగి ధాన్యం కొనుగోలుకు 321 కేంద్రాలు ఏర్పాటు చేయగా అందులో 30 శాతం అంటే 91సెంటర్లు ఐకేపీకి కేటా యించారు. ప్రస్తుత వానాకాలం 50 శాతం కేటాయించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. గతంలో 20 శాతం కేంద్రాలను మాత్రమే కేటాయించేవారు. ఇదిలా ఉండగా యాసంగి సీజన్లో గోకారం, కక్కిరేణి, వెల్లంకి, శోభనాద్రిపురం, శివారెడ్డిగూడెం, పెద్దగూడెంలోని కొనుగోలు కేంద్రాల్లో పెద్ద ఎత్తున ధాన్యం సేకరించారు. యాసంగి సీజన్లో 1,77,228 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు రూ.3.44 కోట్లు కమీషన్గా ఆర్జించిన స్వయం సహాయక సంఘాలు కొనుగోలు కేంద్రాల్లో 30 శాతం వారివే.. వానాకాలం నుంచి 50 శాతానికి పెంపుడిపాజిట్లలో నంబర్ వన్ ధాన్యం కొనుగోళ్లలో స్వ యం సహాయక సంఘాల పనితీరు ప్రశంసనీయం. వారికిచ్చిన లక్ష్యాన్ని 45 రోజుల్లోనే పూర్తి చేశారు. ఒక్క యాసంగి సీజన్లోనే కమిషన్ రూపంలో రూ.3.44 కోట్లు సంపాదించారు. ప్రస్తుతం జిల్లా స్రీనిధి బ్యాంకులో ఐకేపీ కేంద్రాల డిపాజిట్లు రూ.12 కోట్లు ఉన్నాయి. ఇది రాష్ట్రంలోనే నంబర్ వన్ స్థానం. ఈ వానాకాలం నుంచి మొత్తం కొనుగోలు కేంద్రాల్లో 50 శాతం మహిళా సంఘాలకే కేటాయిస్తాం. – నాగిరెడ్డి, డీఆర్డీఓ శిక్షణ సద్వినియోగంధాన్యం సేకరణకు తీసుకోవాల్సిన చర్యలపై స్వ యం సహాయక సంఘాల సభ్యులకు డీఆర్డీఓ ఆధ్వర్యలో శిక్షణ ఇచ్చారు. డేటా ఎంట్రీ, తేమ శాతం చూడటం, బుక్ కీపింగ్, కాంటా వేసిన నంబర్లకు తదితర అంశాలపై శిక్షణ ఇచ్చారు. కలెక్టర్, అదనపు కలెక్టర్, డీఆర్డీఓ పీడీ, ఇతర ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో ధాన్యం కొనుగోళ్లను పర్యవేక్షించారు. దీంతో మహిళా సంఘాల సభ్యులు తమకు కేటాయించిన కేంద్రాల్లో విజయవంతంగా కొనుగోళ్లు పూర్తి చేసి భారీ కమీషన్ ఆర్జించారు. -
భూ భారతితో సమస్యలు పరిష్కారం
వలిగొండ : భూ భారతి చట్టంతో భూసమస్యల పరిష్కారానికే సత్వర పరిష్కారం లభించనుందని అదనపు కలెక్టర్(రెవెన్యూ) వీరారెడ్డి పేర్కొన్నారు. మంగళవారం వలిగొండ మండలంలోని పహిల్వాన్పురం, వేములకొండ గ్రామాల్లో భూ భారతి సదస్సులు నిర్వహించారు. పహిల్వాన్పురం సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. కొత్త చట్టం ద్వారా భూముల లావాదేవీలు, రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్, ఆర్ఓఆర్ వంటి సేవలు సలుభంగా పరిష్కారం అవుతాయన్నారు. రెవెన్యూ సదస్సులు ముగిసిన అనంతరం దరఖాస్తులను పరిశీ లించి సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు. పహిల్వాన్పురంలో 41, వేములకొండలో 23 దరఖాస్తులు వచ్చినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ దశరథ, డిప్యూటీ తహసీల్దార్ పల్లవి, రెవెన్యూ అధికారులు మనోహర్, కర్ణాకర్రెడ్డి, నగేష్, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అదనపు కలెక్టర్ వీరారెడ్డి -
సిటీ స్కాన్ సేవలెప్పుడు?
ప్రైవేట్ ల్యాబ్లే దిక్కు.. ● భువనగిరి పట్టణానికి చెందిన ఓ మహిళ తలకు సంబంధిత సమస్యలతో ఆస్పత్రిలో చేరింది. సిటీ స్కాన్ తీయాలని వైద్యులు సూచిచండంతో ప్రైవేట్ ల్యాబ్కు వెళ్లింది. రూ.5వేల వరకు ఖర్చు వచ్చినట్లు బాధితురాలు వాపోయింది. ● ఆలేరుకు చెందిన ఓ వ్యక్తి కిడ్నీ సంబంధిత సమస్యలతో ఆస్పత్రికి వచ్చారు. వ్యాధి నిర్ధారణ కోసం ప్రైవేట్ ల్యాబ్లో సిటీ స్కాన్ తీయించుకోగా రూ.4వేల వరకు తీసుకున్నారని వాపోయాడు. ప్రైవేట్లో సీటీ స్కాన్ కోసం వేలాది రూపాయలు చెల్లించాల్సి రావడం పేద రోగులకు భారంగా మారింది. ఆస్పత్రిలో సిటీ స్కాన్ సేవలు అందుబాటులోకి వస్తే రోగులకు బాధలు తప్పనున్నాయి.భువనగిరి: జిల్లా కేంద్ర ఆస్పత్రికి నిత్యం 500కుపైగా రోగులు వస్తుంటారు. 100 పడకలు సామర్థ్యం కలిగిన ఈ ఆస్పత్రిలో అనేక విభాగాల్లో ఇన్పేషెంట్లకు నిత్యం సేవలందిస్తున్నారు. న్యూరాలజీ, మోకాల నొప్పులు, తల, ఎముకలు, శ్వాసకోశ సమస్యలు, గుండె సంబంధిత తదితర వ్యాధులకు సంబంధించి సిటీ స్కాన్ పరీక్షలు తప్పనిసరి అవుతున్నాయి. ఆస్పత్రికి రెండు నెలల క్రితం నూతనంగా సీటీ స్కాన్ మిషన్ మంజూరైనా సేవలు అందుబాటులోకి రావడం లేదు. ఫలితంగా స్కానింగ్ అవసరమైన రోగులకు ప్రైవేట్ ల్యాబ్లే దిక్కవుతున్నాయి. రూ.2.5 కోట్లతో యంత్రం కొనుగోలురాష్ట్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కార్యదర్శి క్రిస్టినా జెడ్ భువనగిరిలోని జిల్లా ఆస్పత్రి సందర్శనకు వచ్చిన సమయంలో ఆస్పత్రికి సిటీ స్కాన్ అవసరమని గుర్తించారు. ఆమె ఆదేశాల మేరకు ఆస్పత్రి వైద్యులు ప్రతిపాదనలు రూపొందించి వైద్యారోగ్య శాఖకు పంపగా.. సిటీ స్కాన్ యంత్రాన్ని మంజూరు చేసింది. ఈ యంత్రం రెండు నెలల క్రితమే ఆస్పత్రిలోని తెలంగాణ డయోగ్నోస్టిక్ సెంటర్కు చేరినా వినియోగంలోకి తేవడం లేదు. దీని విలువ రూ.2.5 కోట్ల వరకు ఉంటుంది. నెలలు గడుస్తున్నా మంజూరుకాని విద్యుత్ కనెక్షన్ ప్రస్తుతం ఆస్పత్రికి విద్యుత్ సరఫరా జరుగుతున్న లైన్ సామర్థ్యం సిటీ స్కాన్ యూనిట్ నిర్వహణకు సరిపోదు.హై టెన్షన్ విద్యుత్ కనెక్షన్ కోసం వైద్యాధికారులు ట్రాన్స్కోకు దరఖాస్తు చేశారు. దీనికోసం సుమారు రూ.11 లక్షల వరకు అంచనా వ్యయంతో ప్రతిపాదించారు. రెండు నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు చలాన్ కట్టకపోవడంతో అనుమతి రాలేదని తెలుస్తోంది. టెక్నీషియన్ల నియామకానికి ప్రతిపాదనలుసిటీ స్కాన్ నిర్వహణకు రేడియాలజిస్ట్ అందుబాటులో ఉండగా ఇంకా నలుగురు టెక్నీషియన్లు కావాలి. వీరి నియామకానికి వైద్యాధికారులు ప్రతి పాదనలు పంపారు. నిరుపయోగంగా రూ.2.5 కోట్ల యంత్రం జిల్లా కేంద్ర ఆస్పత్రికి రెండు నెలల క్రితమే చేరిక వినియోగంలోకి తేవడంలో జాప్యం ప్రైవేట్ ల్యాబ్లను ఆశ్రయిస్తున్న రోగులువిద్యుత్ కనెక్షన్ అనుమతి రాలేదు సీటీ స్కాన్ యూనిట్ నిర్వహణకు గాను హైటెన్షన్ విద్యుత్ కనెక్షన్ కోసం దరఖాస్తు చేశారు. అనుమతి రాగానే సీటీ స్కాన్ సేవలు అందుబాటులోకి తీసుకువస్తాం. అదే విధంగా ప్రత్యేకంగా నలుగురు టెక్నీషియన్లు అవసరం ఉండగా సబంధిత శాఖకు ప్రతిపాదనలు పంపాం. –వెంకటేశ్వర్లు జిల్లా కేంద్ర ఆస్పత్రి సూపరింటెండెంట్ -
మత్స్య పరిశ్రమకు పెరుగుతున్న ఆదరణ
సీ్త్రశక్తికి తగిన గుర్తింపు ఆక్వా రంగం (చేపల పెంపకం)లో మహిళలను ప్రోత్సహించేలా రాష్ట్రం నుంచి ఆరుగురు మహిళలను ఢిల్లీలో నిర్వహించిన గణతంత్ర వేడుకలకు పంపించగా.. అందులో నల్లగొండ జిల్లా గుర్రంపోడు మండల కేంద్రానికి చెందిన వంపు స్వాతి కూడా ఉన్నారు. నిరుపేద దళిత మహిళ అయిన స్వాతి తన భర్త సహకారంతో సాగుకు యోగ్యంకాని తన మూడెకరాల భూమిలో చిన్న చెరువులను ఏర్పాటు చేసుకుని చేపల పెంపకం చేపట్టి విజయవతంగా ముందుకు సాగుతోంది. తొలుత చేపలను పెంచాలనే ఆసక్తితో తనకున్న వంపు భూమిలో నీరు నిలిచే గుంతలో కొర్రమీనలు సాగు చేసుకోగా అదే వృత్తిగా మరింతగా విస్తరించారు.గుర్రంపోడు: వ్యవసాయ అనుబంధ రంగాల్లో ఒకటైన చేపల పెంపకంపై ఆదరణ పెరుగుతోంది. సాగునీటి వసతి పుష్కలంగా ఉండి పంటలకు అనువైన భూములు లేని చోట్ల ఆసక్తి ఉన్న రైతులు చేపల చెరువులను తవ్వుకుని చేపల పెంపకం చేపడతూ ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. గుర్రంపోడు మండలంలో సుమారు వంద ఎకరాల్లో చెరువులను ఏర్పాటు చేసుకుని చేపలను పెంచుతున్నారు. ప్రధానంగా పంటలకు అనువుగా లేని చౌడు భూముల్లో, వాగు నీటి వంపుల్లో చేపల చెరువులు ఎక్కువగా ఏర్పాటు చేస్తున్నారు. మత్స్యశాఖతో పాటు ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన ద్వారా అందుతున్న సబ్సిడీ అందిస్తుండడంతో ఏటా చేపల పెంపకం చేపడుతున్న రైతుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. కోనసీమను తలపించేలా..ఐదెకరాలు, పదెకరాల వరకు చేపల చెరువులను తవ్వుకుని చేపల చెరువులను ఏర్పాటు చేసుకున్న చోట్ల కోససీమను తలపించే వాతావరణం కనిపిస్తుంది. గుర్రంపోడు మండలంలోని వెంకటాపురం(కె) గ్రామంలో రామగిరి వెంకటరమణారావు అనే రైతు తనకు 20 ఎకరాల్లో, ఆమలూరు గ్రామానికి లక్ష్మయ్య సుమారు 30 ఎకరాల్లో చేపల చెరువులను ఏర్పాటు చేసుకుని చేపలను పెంచుతున్నారు. కొయగూరవానిబావి, తేనపల్లి, గుర్రంపోడు, చేపూరు తదితర గ్రామాల్లో చేపల చెరువులు ఉన్నాయి. ఈ చెరువుల్లో బొచ్చ, రవ్వ, రూప్చంద్, కొర్రమేను తదితర రకాల చేపలను పెంచుతున్నారు. సొంతంగా దాణా తయారీ..చేపల దాణా అవసరమైన ముడిసరుకులను రైతులే స్వయంగా తెచ్చుకుని చైనాతో పాటు ఢిల్లీ, రాజస్తాన్ ప్రాంతాల నుంచి యంత్రాలను దిగుమతి చేసుకుని పెద్ద షెడ్డు ఏర్పాటు చేసుకుని దాణా తయారు చేసుకుంటున్నారు. వెంకటాపురంలోని చేపల చెరువు ఏఎమ్మార్పీ ఆయకట్టులో విరివిగా చేపల చెరువులు ఆధునిక సాంకేతికతను జోడించి చేపల పెంపకంప్రోత్సాహం అందించాలి ప్రభుత్వం చేపల పెంపకందారులను ప్రోత్సహించేలా రాయితీలు అందించాలి. చెరువులు ఏర్పాటు చేసుకున్న వారందరికీ రాయితీలు రావడం లేదు. దాణాపై పన్నులు తగ్గించి తక్కువ ధరకే అందించేలా చర్యలు తీసుకోవాలి. చేపలు వ్యాధుల బారిన పడకుంగా తీసుకోవల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించాలి – వేముల లక్ష్మయ్య, మత్స్యకార్మికుడు -
టిప్పర్ బోల్తా.. ట్రాఫిక్కు అంతరాయం
మునగాల: సూర్యాపేట నుంచి కోదాడ వైపు వెళ్తున్న టిప్పర్ మంగళవారం రాత్రి విజయవాడ–హైదరాబాద్ హైవేపై మునగాల మండల కేంద్రంలోని సివిల్ ఆస్పత్రి ఎదురుగా అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ఘటనతో అర్ధగంట ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మునగాల ఎస్ఐ బి. ప్రవీణ్కుమార్ ఘటనా స్థలానికి చేరుకొని ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు. టిప్పర్ను రోడ్డు పక్కకు తొలగించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ట్రాఫిక్కు అంతరాయం కల్గడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. విద్యుదాఘాతంతో వ్యక్తి మృతిఆత్మకూరు(ఎం): ఇంటి వద్ద సింగిల్ ఫేజ్ మోటారుకు రిపేర్ చేస్తుండగా విద్యుదాఘాతానికి గురై వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన ఆత్మకూరు(ఎం) మండలం తుక్కాపురం గ్రామ పంచాయతీ పరిధిలోని పోసానికుంటలో మంగళవారం జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. పోసానికుంట గ్రామానికి చెందిన సామ సుధాకర్రెడ్డి(45) మంగళవారం ఉదయం తన ఇంటి వద్ద సింగిల్ ఫేజ్ మోటారును రిపేరు చేస్తుండగా విద్యుదాఘాతానికి గురయ్యాడు. కుటుంబ సభ్యులు గమనించి అతడిని భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. మృతుడికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. మృతుడి కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.