చౌటుప్పల్ : ప్రజా సమస్యల పరిష్కారంలో జిల్లా అధికారుల విఫలమయ్యారని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు ఎస్.వీరయ్య విమర్శించారు. చౌటుప్పల్లో శుక్రవారం జరిగిన సీపీఎం జిల్లా ప్రాంతీయ సమావేశంలో మాట్లాడారు. ప్రజలకు మౌలిక వసతులు కల్పించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి ఎండి.జహంగీర్, కె.నర్సింహ, ఎం.బాలరాజు, కృష్ణారెడ్డి, జి.శ్రీనివాసచారి, పెంటయ్య, పాషా, సైదులు, కరుణాకర్, కిష్టయ్య, నర్సిరెడ్డి, శ్రీనివాస్రెడ్డి, స్వామి, బి.నర్సింహ, సంజీవరెడ్డి, అంజిరెడ్డి, మధుకృష్ణ పాల్గొన్నారు.


