భువనగిరి: జిల్లాలో ఫిబ్రవరి 25న ప్రారంభమైన ఇంటర్మీడియేట్ ఫస్ట్ ఇయర్ జనరల్ పరీక్షలు గురువారం ముగిశాయి. జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 28 కేంద్రాలలో ఉదయం 9 గంటల నుంచి మద్యాహ్నం 12 గంటల వరకు కెమిస్ట్రీ, కామర్స్ పేపర్–1 పరీక్ష జరిగింది. ఆయా పరీక్షలకు మొత్తం 6,642 మంది విద్యార్థులకు గాను 6,359 మంది హాజరు కాగా 282 మంది గైర్హాజరైనట్లు డీఐఈఓ రమణి తెలిపారు. కాగా ఇంటర్ ఫస్ట్ ఇయర్ జనరల్ పరీక్షల ముగింపు రోజు కావడంతో విద్యార్థులు ఒకరినొకరి బైబై చెప్పుకుంటూ స్వగ్రామాలకు వెళ్లారు.


