యాదగిరిగుట్ట : యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రానికి అనుబంధంగా ఉన్న శ్రీపర్వత వర్థిని సమేత రామలింగేశ్వరస్వామి ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు వైభవంగా కొనసాగుతున్నాయి. శనివారం ఉదయం శివాలయంలో సీతారామచంద్రస్వామి వారికి నిత్యారాధనలు నిర్వహించారు. మధ్యాహ్నం స్వామివారికి పట్టాభిషేకం జరిపించారు. సాయంత్రం నిత్యారాధనలు, రాత్రి 7 గంటల నుంచి 8.30గంటల వరకు శివాలయ యాగ మండపంలో సహస్రనామార్చనలు, నివేదన, నీరాజన, మంత్ర పుష్ప కార్యక్రమాలు చేపట్టారు. ఆయా వేడుకల్లో ఆలయ అనువంశిక ధర్మకర్త బి.నర్సింహమూర్తి, పూజారులు, భక్తులు పాల్గొన్నారు.


