మూడు ఎకరాల్లో వరిసాగు చేశాను. రోజూ ఐదు నుంచి ఆరు గంటలే విద్యుత్ సరఫరా అవుతోంది. దీంతో మూడు ఎకరాల వరిలో 30 గుంటల వరకు ఎండితే గొర్లను మేపాను. 12 గంటలు కరెంట్ సరఫరా చేస్తే ఉన్న పొలం ఎండిపోకుండా ఉంటుంది లేదంటే పూర్తిగా ఎండిపోతుంది.
– కాకళ్ల శేఖర్, రాజపేట
మా పక్క రైతు బోరు వేయడంతో మా బావి వట్టిపోయింది. కరెంట్ సక్రమంగా సరఫరా కాక మూడెకరాల వరి గింజదశలో పూర్తిగా ఎండిపోవడంతో మూగజీవాలకు మేతగా ఇచ్చాను. – రాజమణి, మహిళా రైతు, పల్లెర్ల,
ఆత్మకూర్(ఎం) మండలం


