breaking news
Nalgonda
-
మనోవిజ్ఞాన నిపుణుల అవసరం ఎంతో ఉంది
నల్లగొండ టూటౌన్: మనుషులు అనేక ఒత్తిళ్లు, ఒడిదుడుకులకు గురవుతున్న సందర్భంలో మనోవిజ్ఞాన శాస్త్ర నిపుణుల అవసరం ఎంతో ఉందని ఎంజీ యూనివర్సిటీ వీసీ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ అన్నారు. నల్లగొండలోని ఎంజీ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన సైకాలజీ విభాగం నూతన ల్యాబొరేటరీని శుక్రవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులు ఎదుర్కొనే మానసిక సమస్యలతోపాటు, వృద్ధుల్లో పెరుగుతున్న కుంగుబాటు, నిరుత్సాహం, పిల్లలకు మొబైల్ వినియోగం లాంటి అలవాట్లు కాకుండా ఉండటానికి మనో వైజ్ఞానికులు దిక్సూచిగా సహాయకారిగా నిలవాలని తెలిపారు. కార్యక్రమంలో అలువాల రవి, అరుణప్రియ, అంజిరెడ్డి, ఆకుల రవి, సైకాలజీ విభాగం అధ్యాపకులు అరవింద్, తన్వీర్, నారాయణరెడ్డి, చక్రి పాల్గొన్నారు. ఫ ఎంజీయూ వీసీ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ -
చిన్నారిపై లైంగికదాడికి యత్నం
చౌటుప్పల్ : మద్యం మత్తులో ఉన్న ఇద్దరు కామాంధులు లడ్డూ ఇస్తానని ఆశ చూపించి నాలుగేళ్ల చిన్నారిని తమ వెంట తీసుకెళ్లి లైంగికదాడికి యత్నించారు. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని లింగోజిగూడెం గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని రేవా జిల్లా మహాసువ గ్రామానికి చెందిన దినేష్ కాల్(45), శివరాజ్ కాల్(44) గత మూడు నెలల క్రితం లింగోజిగూడెం గ్రామానికి వచ్చారు. స్థానికంగా ఉన్న ఓ పరిశ్రమలో కాంట్రాక్టర్ కింద దినసరి కూలీలుగా పనిచేస్తున్నారు. వీరు లింగోజిగూడెం గ్రామంలోని బీసీకాలనీలో (రైస్మిల్ దగ్గర) మరికొంత మంది కూలీలతో కలిసి అద్దె ఇంట్లో ఉంటున్నారు. అదేవిధంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అలహాబాద్కు చెందిన బాలిక కుటుంబం సైతం మూడు నెలల క్రితం ఉపాధి నిమిత్తం ఇక్కడికి వచ్చారు. బాలిక తండ్రి అదే పరిశ్రమలో పెయింటింగ్ కాంట్రాక్టర్ వద్ద కార్మికుడిగా పనిచేస్తున్నాడు. వీరు.. నిందితులు ఉంటున్న ఇంటి వెనుక భాగంలో ఉన్న అద్దె ఇంట్లో ఉంటున్నారు. లడ్డూ ఇప్పిస్తామని చెప్పి.. చిన్నారి తండ్రి కూలికి వెళ్లగా తల్లి ఇంటి వద్దే ఉంది. శుక్రవారం ఉదయం 11గంటల సమయంలో తల్లి ఇంట్లో దుస్తులు ఉతుకుతండగా చిన్నారులు బయట ఆడుకుంటున్నారు. డ్యూటీకి వెళ్లని దినేష్, శివరాజ్లు పూటుగా మద్యం సేవించారు. మద్యం మత్తులో ఉన్న వారిద్దరు ఇంటి ఆరుబయట ఆడుకుంటున్న చిన్నారి దగ్గరకు వెళ్లారు. లడ్డూ ఇప్పిస్తానని ఆశ చూపించి తమ వెంట తీసుకెళ్లారు. వారు బాలికపై లైంగిక దాడికి యత్నిస్తుండగా రోదించడంతో బాలిక తల్లి బయటకు వచ్చి వెతకసాగింది. ఇద్దరు వ్యక్తులు మీ కుమార్తెను తీసుకెళ్లారని స్థానికంగా ఉన్న ఓ బాలిక చెప్పింది. దీంతో వెంటనే పక్కింటి వారి సాయంతో తల్లి అక్కడకు వెళ్లి బాలికను తీసుకువచ్చి పోలీసులకు సమాచారమిచ్చింది. పోలీసులు అక్కడకు చేరుకుని స్థానికులతో మాట్లాడి వివరాలు సేకరించారు. వైద్యచికిత్స నిమిత్తం బాలికను చౌటుప్పల్లోని ప్రభుత్వ ఆస్పత్రికి, మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి హైదరాబాద్ ఆస్పత్రికి తరలించారు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ మన్మథకుమార్ తెలిపారు. లడ్డూ ఆశ చూపి తమ వెంట తీసుకెళ్లిన ఇద్దరు నిందితులు బాలిక రోదనలు విని అప్రమత్తమైన తల్లి పక్కింటి బాలిక సమాచారంతో నిందితుల ఇంట్లో చిన్నారి గుర్తింపు -
సార్.. మీరు వెళ్లొద్దు
మాడుగులపల్లి: మాడుగులపల్లి మండలంలోని కుక్కడం గ్రామంలో గల మండల పరిషత్ పాఠశాలలో ప్రధానోపాద్యాయుడిగా పనిచేస్తున్న నన్నూరి వెంకట్రెడ్డి ఉద్యోగ విరమణ కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు భావోద్వేగానికి లోనయ్యారు. మీరు వెళ్లొద్దు సార్.. మాతోనే ఉండాలి అంటూ రోదించారు. హెచ్ఎం వారిని ఓదార్చి వెళ్లిపోయారు. గ్రామస్తులు కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు. కార్యక్రమంలో ఎంఈవో వెంకటమ్మ, నూతన హెచ్ఎం వీరయ్య, కేజీబీవీ ఎస్ఓ వసంతకుమారి, ఉపాధ్యాయులు నిరంజన్రెడ్డి, వేణుగోపాల్రెడ్డి, ప్రభాకర్రెడ్డి, ఇంతియాజ్ తదితరులు పాల్గొన్నారు. ● హెచ్ఎం ఉద్యోగ విరమణ పొంది వెళ్లిపోతుండడంతో రోదించిన విద్యార్థులు -
బీటెక్ విద్యార్థి బలవన్మరణం
సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా సుల్తాన్పూర్లో ఉన్న జేఎన్టీయూ క్యాంపస్లో బీటెక్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసుల కథనం ప్రకారం.. సూర్యాపేట జిల్లా మోతె మండలం సిరికొండ గ్రామానికి చెందిన బానోతు మహేందర్(24) సీఎస్ఈ మూడో సంవత్సరం చదువుతున్నాడు. శుక్రవారం మధ్యాహ్నం తన హాస్టల్ గదిలోకి వెళ్లి బ్లాంకెట్తో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన తోటి విద్యార్థులు వెంటనే కళాశాల అధ్యాపకులకు చెప్పగా, వారు సంగారెడ్డిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి, అక్కడి నుంచి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే మహేందర్ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. సమాచారం తెలుసుకున్న మహేందర్ తండ్రి చెన్వేశ్వర్రావు అక్కడకు చేరుకున్నారు. మహేందర్ బాగానే చదువుకునేవాడని కళాశాల ప్రిన్సిపాల్ విశ్వానందరాజు తెలిపారు. అయితే ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. మహేందర్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ చేపట్టాలని ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు.ఫ హాస్టల్ గదిలో ఉరివేసుకున్న మహేందర్ ఫ సుల్తాన్పూర్ జేఎన్టీయూ క్యాంపస్లో ఘటన -
రైతు నేస్తం.. వాట్సాప్ చానల్
తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ రూపొందించిన వాట్సాప్ చానల్ అన్నదాతలకు ఉపయోగకరంగా ఉంటుంది. ఇందులో వ్యవసాయ శాస్త్రవేత్తలు రైతులకు అవసరమైన సలహాలు, సూచనలు అందిస్తారు. పంటల తెగుళ్లు, వాటి నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై ఎప్పటికప్పుడు రైతులను అప్రమత్తం చేస్తారు. తద్వారా సాగు ఖర్చులు తగ్గడంతో పాటు మంచి దిగుబడులు కూడా పొందవచ్చు. – శ్రవణ్కుమార్, డీఏఓ, నల్లగొండ ఫ అధికారిక చానల్ ప్రారంభించిన వ్యవసాయ శాఖ ఫ దీని ద్వారా అన్నదాతలకు సలహాలు, సూచనలు ఇవ్వనున్న అధికారులు దేవరకొండ: పంటల సాగులో తరుచూ ఎదురయ్యే తెగుళ్లు, వాటి నివారణకు సరైన మందుల ఎంపికలో అవగాహన లోపం కారణంగా రైతులు ఆశించిన మేర దిగుబడులు సాధించ లేక నష్టపోతున్నారు. ఈ సమస్యను అధిగమించేందుకు తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ సాంకేతికత ఆధారంగా రైతుల ముంగిట ముఖ్య సమాచారాన్ని అందించేందుకు ఈ ఏడాది ఆగస్టు 8న ప్రత్యేక అధికారిక వాట్సాప్ చానల్ను ప్రారంభించింది. రైతు వేదికల ద్వారా ఇప్పటికే సమాచార కల్పన ప్రారంభమైంది. త్వరలో వాట్సాప్ చానల్పై ప్రతి గ్రామంలో ప్రత్యేక సదస్సులు ఏర్పాటు చేసి అవగాహన కల్పిస్తారు. చానల్ ద్వారా లభించే ప్రయోజనాలు ఫ తెగుళ్ల గుర్తింపు, నివారణకు సరైన సలహాలు ఫ రోగ నిరోధక వంగడాలు, గుణాత్మక విత్తనాల ఎంపికలో మార్గదర్శకత్వం ఫ పంటల రక్షణ, ఎరువుల వినియోగం, నీటి నిర్వహణపై సూచనలు ఫ వాతావరణ సమాచారం, మార్కెట్ ధరలు, ప్రభుత్వ పథకాల వివరాలు ఫ రాయితీ విత్తనాల లభ్యత, మౌలిక వసతులపై తాజా సమాచారం నిపుణుల సలహాలు రైతులు సాగు చేసే పంటకు మొలక దశ నుంచి కోత దశ వరకు ఏ తెగులు వచ్చినా, దాని ఫొటోను చానల్కు పోస్టు చేస్తే వ్యవసాయ శాస్త్రవేత్తలు ఆ తెగుళ్లను వెంటనే గుర్తిస్తారు. తెగులు నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఏ మందులు ఏ మోతాదులో ఉపయోగించాలో వివరిస్తారు. చానల్లో చేరేందుకు ఆయా గ్రామ రైతులు తమ క్లస్టర్ పరిధిలోని అసిస్టెంట్ అగ్రికల్చర్ అధికారి (ఏఈవో)ను సంప్రదించాల్సి ఉంటుంది. వారికి సదరు రైతు తమ మొబైల్ నంబర్ అందిస్తే వారు వాట్సాప్ చానల్లో చేరుస్తారు. -
ధాన్యం ఎలా ఉన్నా కొనుగోలు చేయాలి
చిట్యాల, నకిరేకల్ : అకాల వర్షంతో ధాన్యం తడిసినందున.. ఏ విధంగా ఉన్నా వెంటనే కొనుగోలు చేయాలని బీజేపీ రాష్ట్ర అద్యక్షుడు రాంచందర్రావు డిమాండ్ చేశారు. కిసాన్ మోర్చ ఆధ్వర్యంలో ధాన్యం, పంటల పరిశీలన భాగంగా హైదరాబాద్ నుంచి ఖమ్మం జిల్లా పర్యటనకు వెళ్తున్న ఆయన చిట్యాల, నకిరేకల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయా చోట్ల ఆయన మాట్లాడుతూ రైతులు 20 రోజులుగా కేంద్రాలకు ధాన్యం తెచ్చి కాంటాలు కాక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ధాన్యం తూకంలో తేడాల విషయంలో రైస్ మిల్లర్లతో కాంగ్రెస్ నేతలు కుమ్మకై ఉంటే వారిపై చర్యలు తీసుకుని జైలు పంపించాలన్నారు. తేమశాతం ఎలా ఉన్నా తూకంలో మోసాలు జరగకుండా దిగుమతులు జరిగేలా ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. ఆయన వెంట బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్రెడ్డి, కిసాన్ మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శి గోలి మధుసూదన్రెడ్డి, రాష్ట్ర నేతలు గంగడి మనోహర్రెడ్డి, చికిలంమెట్ల అశోక్, పిల్లి రామరాజ్యాదవ్, వీరెళ్లి చంద్రశేఖర్, శ్యాంసుందర్, నకిరేకంటి మొగిలయ్య, గుడుగుంట్ల సాయన్న, మండల వెంకన్న, గర్రె మరళి మోహన్, బుడిగే సైదులు,యానాల శ్రీనివాస్రెడ్డి, కొండెటి శ్రీను, మైల నర్సింహ, పీక వెంకన్న, నర్సింహగౌడ్, గుండాల నరేష్గౌడ్, పాపని వాసుదేవ్, అంశల అనిల్కుమార్, కన్నేబోయిన మహాలింగం ఉన్నారు. ఫ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు -
పెండింగ్ దరఖాస్తులను పరిష్కరించాలి
నల్లగొండ : పెండింగ్లో ఉన్న భూ రికార్డులు, భూ భారతి, భూ వివాదాల దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి రెవెన్యూ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో రెవెన్యూ అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రతి మండలంలో పెండింగ్ ఫిర్యాదులను వారానికి ఒకసారి సమీక్షించాలని తెలిపారు. భూ సంబంధ వ్యవహారాల్లో పారదర్శకతకు ప్రాధాన్యం ఇవ్వాలని, ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. సాదాబైనామాల, అసైన్డ్ భూముల ఫిర్యాదులను చిత్తశుద్ధితో పరిష్కరించాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్, స్థానిక సంస్థలు ఇన్చార్జి అదనపు కలెక్టర్ నారాయణ్ అమిత్, ఆర్డీఓలు వై.అశోక్రెడ్డి, రమణారెడ్డి, శ్రీదేవి పాల్గొన్నారు. ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి -
యాదగిరి క్షేత్రంలో ఊంజల్ సేవోత్సవం
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో ఆండాళ్ అమ్మవారికి ఊంజలి సేవోత్సవాన్ని ఆలయ అర్చకులు శుక్రవారం విశేషంగా జరిపించారు. అమ్మవారికి ఇష్టమైన రోజు కావడంతో సాయంత్రం వేళ ఆండాళ్ అమ్మవారిని బంగారు ఆభరణాలు, వివిధ రకాల పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించారు. ఆండాళ్ అమ్మవారిని అలకరించిన తరువాత ఆలయ తిరు, మాఢ వీధుల్లో ఊరేగించారు. ఈ సమయంలో మహిళ భక్తులు మంగళ హారతులతో స్వాగతం ఫలికారు. అనంతరం అమ్మవారిని అద్దాల మండపంలో అధిష్టించి ఊంజలి సేవోత్సవం చేపట్టారు. అనంతరం హారతినిచ్చారు. ఇక ఆలయంలో సుప్రభాతం, సహస్రనామార్చన, శ్రీసుదర్శన నారసింహ హోమం, నిత్య కల్యాణం, బ్రహ్మోత్సం, ఇతర పూజలు నిర్వహించారు. శివాలయంలో కార్తీక దీపారాధనలు యాదగిరిగుట్ట: కార్తీక మాసాన్ని పురస్కరించుకుని శుక్రవారం యాదగిరి కొండపై శ్రీపర్వత వర్ధిని సమేత రామలింగేశ్వరస్వామి ఆలయ సన్నిధిలో భక్తులు కార్తీక దీపారాధనలు నిర్వహించారు. మహాశివుడిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. అమ్మవారి ఉప ఆలయం ఎదుట భక్తులు శ్రీ ఆకారంలో దీపాలు వెలిగించారు. -
ఆయాసంతో బాధపడుతూ ఆస్పత్రిలో మహిళ మృతి
మిర్యాలగూడ అర్బన్: తీవ్ర జ్వరం, ఆయాసంతో బాధపడుతూ చికిత్స నిమిత్తం శుక్రవారం మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి వచ్చిన మహిళ మృతి చెందింది. మిర్యాలగూడ మండలంలోని ముల్కలకాల్వ గ్రామానికి చెందిన నాగిళ్ల వెంకటమ్మ(35) తీవ్ర జ్వరం, ఆయాసంతో బాధపడుతుండగా చికిత్స నిమిత్తం ఆమె కుమారుడు శుక్రవారం ఉదయం మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తీసుకువచ్చాడు. ఓపీ నమోదు చేయించుకుని ఆస్పత్రిలో చేర్పించుకున్నారు. అయితే ఆయాసం ఎక్కువ కావడంతో శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారి మృతి చెందింది. సకాలంలో వైద్య సేవలు అందించకపోవడంతోనే మృతిచెందిందని కుటుంబసభ్యులు ఆస్పత్రి ఎదుట ఆందోళన చేశారు. సుమారు రెండు గంటల పాటు వైద్యం అందించలేదని పేర్కొన్నారు. సకాలంలో ఆక్సిజన్ అందించి వైద్యం చేస్తే మా అమ్మ బతికేదని కుమారుడు ఆవేదన వ్యక్తం చేశాడు. విషయం తెలుసుకున్న సీపీఐ డివిజన్ అధ్యక్షుడు బంటు వెంకటేశ్వర్లు ఆస్పత్రికి చేరుకుని మృతురాలి కుటుంబ సభ్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. వైద్యం అందించడంతో నిర్లక్ష్యం వహించిన వైద్యులను తక్షణమే సస్పండ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఏరియా ఆస్పత్రి ఎదుట రోగి బంధువులతో కలిసి ఆందోళనలో పాల్గొన్నారు. జిల్లా ఉన్నతాధికారులు స్పందించి ఇలాంటి సంఘనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ను వివరణ కోరగా రోగి ఆస్పత్రికి వచ్చే సమయానికి ఆమె పరిస్థితి విషమంగా ఉందని, ఆమెను పరీక్షించి వైద్యం అందించే లోపే మృతి చెందిందని తెలిపారు. ఫ వైద్యుల నిర్లక్ష్యమే కారణమని ఆస్పత్రి ఎదుట కుటుంబ సభ్యుల ఆందోళన -
ప్రిన్సిపాల్ మందలించారని..
కొండమల్లేపల్లి: ప్రిన్సిపాల్ మందలించడంతోపాటు, ఉపాధ్యాయురాలు విద్యార్థుల ముందు హేళనగా మాట్లాడారని మనస్థాపం చెందిన విద్యార్థిని శుక్రవారం సాయంత్రం డెటాల్ తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. తిరుమలగిరి సాగర్కు చెందిన సభావట్ శ్రీను, కళ దంపతుల కుమార్తె సభావట్ మౌనిక దేవరకొండ పట్టణ పరిధిలో గల టీటీడబ్ల్యూఆర్ఎస్ బాలికల గురుకుల పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. మౌనిక వారం క్రితం తన ఇంటికి వెళ్లి శుక్రవారం పాఠశాలకు వచ్చింది. అయితే విద్యార్థిని తరచుగా పాఠశాలకు గైర్హాజరు అవుతుండడంతో ప్రిన్సిపాల్ మందలించారు. అదేవిధంగా ఉపాధ్యాయురాలు తోటి విద్యార్థినుల ముందు మౌనికతో హేళనగా మాట్లాడారు. దీంతో మనస్థాపం చెందిన విద్యార్థిని సాయంత్రం హాస్టల్ గదిలో ఉన్న డెటాల్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గమనించిన తోటి విద్యార్థినులు అక్కడ ఉన్న ఉపాధ్యాయులకు చెప్పడంతో హుటాహుటిన దేవరకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. ప్రస్తుతం మౌనిక ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. టీచర్ల వేధింపుల వల్లే తమ కుమార్తె ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని విద్యార్థిని తల్లిదండ్రులు ఆరోపించారు. గతంలోనూ పాఠశాలకు ఆలస్యంగా వచ్చిందని గంటసేపు తరగతి బయట నిలబెట్టడంతో కళ్లు తిరిగి కిందపడిన సందర్భాలు కూడా ఉన్నాయని పేర్కొన్నారు. ఫ డెటాల్ తాగి విద్యార్థిని ఆత్మహత్యాయత్నం -
అండ చూపరు.. ఆదుకోరు
చందంపేట : చందంపేట మండలంలోని నక్కలగండి ప్రాజెక్టులో ముంపునకు గురైన నక్కలగండితండా వాసుల్లో ఎవరిని కదిలించిన కన్నీటి వరద పారుతోంది. 2008లో ప్రారంభమైన నక్కలగండి ప్రాజెక్టు పనులు నేటికీ నత్తనడకన సాగుతుండడంతో.. ఇక్కడ ముంపునకు గురవుతున్న గిరిజనులు తండాలోనే ఉంటూ భూములు సాగు చేసుకుంటున్నారు. మంగళ, బుధ వారాల్లో కురిసిన వర్షాల వల్ల వారు సాగు చేసిన పంటలు నీటి పాలయ్యాయి. ఇళ్లలోకి నీరు చేరింది. దీంతో రెవెన్యూ అధికారులు తెల్దేవర్పల్లిలోని ఆశ్రమ పాఠశాలలో వారికి తాత్కాలిక పునరావాసం కల్పించారు. ఇళ్లస్థలాలు ఇవ్వలే.. నక్కలగండి నిర్వాసితులకు ఆర్అండ్ఆర్ ప్యాకేజీలో భాగంగా చింతపల్లి వద్ద ఇళ్ల స్థలాలు కేటాయిస్తామని చెప్పారు. ఏళ్లు గడుస్తున్న ఇప్పటివరకు వారికి అక్కడ ప్లాట్లను ఇవ్వలేదు. దీంతో తప్పనిసరి పరిస్థితిలో వారు నక్కలగండితండాలో ఉంటున్నారు. చింతపల్లి వద్ద ప్లాట్లను కేటాయిస్తే.. కూలీనాలి చేసుకొని బతుకుతామని, ఇక్కడ పంట పొలాలు నీటిలో మునిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. ఫ ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కోసం ఏళ్ల తరబడి నిరీక్షణ ఫ దిక్కుతోచని స్థితిలో నక్కలగండి నిర్వాసిత కుటుంబాలు -
ఫ మహాశివుడికిలక్ష్మీ అలంకరణ
చెర్వుగట్టు ఇన్చార్జి ఈఓగా మోహన్బాబునార్కట్పల్లి : మండలంలోని చెర్వుగట్టు శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవాలయం ఇన్చార్జి ఈఓగా మోహన్బాబు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఆయన ప్రస్తుతం ఆంథోల్ మైసమ్మ, వేములకొండ ఆలయాల ఈఓగా విధులు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు ఇన్చార్జి ఈఓగా పనిచేసిన నవీన్కుమార్ను చెర్వుగట్టు బాధ్యతల నుంచి తప్పిస్తూ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా మోహన్బాబు మాట్లాడుతూ చెర్వుగట్టు ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని.. భక్తులకు ఇబ్బందులు కలగకుండా చూస్తానని పేర్కొన్నారు. ఫుట్బాల్ సెలక్షన్ పోటీలు ప్రారంభంనల్లగొండ టూటౌన్ : నల్లగొండ పట్టణంలోని మేకల అభినవ్ స్టేడియంలో శుక్రవారం ఎస్జీఎఫ్ అండర్–14, 17 ఫుట్బాల్ బాల, బాలికల ఫుట్బాల్ సెలక్షన్ పోటీలను ఎస్జీఎఫ్ కార్యదర్శి విమల శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ ఉమ్మడి జిల్లా నుంచి 300 మంది క్రీడాకారులు పోటీలకు హాజరైనట్లు తెలిపారు. ఇక్కడ ప్రతిభ కనభర్చిన వారిని రాష్ట్రస్థాయి పోటీలకు పంపుతామని పేర్కొన్నారు. కార్యక్రమంలో డీఎస్డీఓ అక్బర్ అలీ, వ్యాయామ ఉపాధ్యాయులు బొమ్మపాల గిరిబాబు, యుగందర్రెడ్డి, గఫార్, రేణుక, భావన, మాణిక్యం, అలిమ్, కళావతి, కవిత, నుస్రత్ సుల్తానా పాల్గొన్నారు. జీఎన్ఎం శిక్షణకు దరఖాస్తులునల్లగొండ టౌన్ : ప్రభుత్వ, ప్రైవేట్ జనరల్ నర్సింగ్, మిడ్ వైపరి (జీఎన్ఎం) 3 సంవత్సరాల శిక్షణ కోర్సులో ప్రవేశానికి అర్హత గల పురుష, మహిళా అభ్యర్థుల నుంచి నవంబరు 10 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవచ్చని డీఎంహెచ్ఓ పుట్ల శ్రీనివాస్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. పూర్తి వివరాలకు డీఎంహెచ్ఓ కార్యాలయ ప్రిన్సిపాల్ను సంప్రదించాలని సూచించారు. ఎన్జీ కళాశాలకు ద్వితీయ బహుమతినల్లగొండ : జిజ్ఞాస రాష్ట్రస్థాయి పోటీల్లో ఎన్జీ కళాశాల విద్యార్థులు ద్వితీయ బహుమతి పొందారు. ఇటీవల ప్రభుత్వ డిగ్రీ కళాశాలల విద్యార్థులకు సబ్జెక్టుల వారీగా నిర్వహించిన పోటీల్లో ఎన్జీ కళాశాల ఫిజిక్స్ విభాగం విద్యార్థులు అగ్రికల్చర్ వీడర్ యంత్రాన్ని రూపొందించి ప్రదర్శించి రాష్ట్రస్థాయిలో ఉత్తమ ప్రాజెక్టుగా ఎంపికై ద్వితీయ బహుమతి సాధించారు. హైదరాబాద్లో నిర్వహించిన కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ ఉపేందర్ విద్యార్థుల తరఫున బహుమతి అందుకున్నారు. ప్రాజెక్టు రూపొందించిన విద్యార్థులను శుక్రవారం ఆయన అభినందించి సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ శ్రీనివాస్రెడ్డి, వెంకటేశం, రిటైర్డ్ ఉపాధ్యాయుడు రవిప్రసాద్, విద్యార్థులు పాల్గొన్నారు. -
డీఆర్డీఎల్ ల్యాబ్ డైరెక్టర్గా రాజాపేట వాసి
రాజాపేట : రాజాపేట మండల కేంద్రానికి చెందిన డీఆర్డీఎల్ శాస్త్రవేత్త అంకతి రాజు డీఆర్డీఎల్ హైదరాబాద్ ల్యాబ్ డైరెక్టర్గా శుక్రవారం నియామకమయ్యారు. ఆయన బెంగుళూరులో 1991 నుంచి 2002 వరకు 11 సంవత్సరాలపాటు డీఆర్డీఎల్లోని గ్యాస్ టర్బైన్ రీసర్చ్ ఎస్టాబ్లిష్మెంట్ (జీటీఆర్ఈ)లో శాస్త్రవేత్తగా విధులు నిర్వహించారు. 2002 నుంచి 2022 వరకు డీఆర్డీఎల్ హైదరాబాద్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్లో లిక్విడ్ ప్రొఫెషన్ డివిజన్లో దీర్ఘశ్రేణి హేర్ టూ హేర్ మిసైల్ ప్రాజెక్టు డైరెక్టర్గా విధులు నిర్వహించారు. 2022లో ఈఆర్డీఈ (అర్మమెంట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్) డైరెక్టర్గా పూణెకు వెళ్లారు. ప్రస్తుతం డీఆర్డీడీఓకు విశిష్ట శాస్త్రవేత్తగా ఉంటూ డీఆర్డీఎల్ హైదరాబాద్ ల్యాబ్ డైరెక్టర్గా బాధ్యతలు చేపట్టారు. విద్యుదాఘాతంతో వ్యక్తి మృతిమోటకొండూర్ : ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన శుక్రవారం మోటకొండూర్ మండలంలోని నాంచారిపేట గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ఎండీ ఖరీమ్(46) ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారు. ఇంటి పనులు దాదాపుగా పూర్తికావస్తున్నాయి. అతను తన కుటుంబంతో వేరే ఇంట్లో ఉంటున్నాడు. పనులు జరుగుతున్న ఇంటిలో కరెంట్ బల్బ్ వేసేందుకు ప్రయత్నించాడు. ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి కింద పడిపోయాడు. అంబులెన్స్లో భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుడు ముత్తిరెడ్డిగూడెంలో ప్రైవేటు స్కూల్లో బస్ డ్రైవర్గా పని చేస్తున్నాడు. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉంది. స్వర్ణగిరిలో సహస్ర కుంకుమార్చనభువనగిరి : పట్టణ శివారులోని స్వర్ణగిరి క్షేత్రంలో గల శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో శుక్రవారం పద్మావతి అమ్మవారికి ఆలయ అర్చకులు సహస్ర కుంకుమార్చన సేవ నిర్వహించారు. అంతకు ముందు ఆలయంలో స్వామి వారికి సుప్రభాత సేవ, తోమాల సేవ, సహస్ర నామార్చన సేవ, సత్యనారాయణ వ్రతం, నిత్య కల్యాణ మహోత్సవం, సాయంత్రం తిరువీధి ఉత్సవ సేవ జరిపించారు. కార్యక్రమంలో ఆలయ అర్చకులు, భక్తులు పాల్గొన్నారు. -
దేవలమ్మనాగారంలో హైనా సంచారం
చౌటుప్పల్ రూరల్: చౌటుప్పల్ మండలం దేవలమ్మనాగారం గ్రామ పరిసరాల్లో హైనా సంచారం హల్చల్ చేసింది. గ్రామ పరిసరాల్లోని అటవీ ప్రాంతంలో చిరుత సంచరిస్తుందని కొంతమంది గ్రామంలో చెప్పడంతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. గ్రామంలో చిరుతపులి సంచరిస్తుందని మొదటగా పాఠశాల విద్యార్థులు చూసి చెప్పడంతో గ్రామస్తులు అటవీ శాఖ అధికారులకు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు గ్రామంలోని అటవీ ప్రాంతానికి వెళ్లి పరిశీలించారు. అయితే ఓ గొర్రెల కాపరి అది హైనా అని అటవీశాఖ సిబ్బందికి, పోలీసులకు చెప్పాడు. చిరుతపులి ఆనవాళ్లు కనిపించకపోవడంతో అధికారులు తిరిగి వచ్చారు. గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఫ చిరుతపులి అనుకొని భయాందోళన చెందిన గ్రామస్తులు -
5.98 కోట్ల చేప పిల్లలు
జిల్లాకు 5.98 కోట్ల ఉచిత చేప పిల్లలు మంజూరయ్యాయి. ఆదివారం నకిరేకల్లోని పెద్ద చెరువులో చేప పిల్లలను పోస్తాం. జిల్లాలో నిండిన అన్ని రిజర్వాయర్లు, చెరువులు, కుంటల్లో చేపపిల్లలను పోయడం ద్వారా మత్స్యకారులకు ప్రయోజనం చేకూరుతుంది. నాణ్యమైన పిల్లలను పంపిణీ చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. – రాజారాం, మత్స్యశాఖ జిల్లా అధికారి నల్లగొండ టూటౌన్ : మత్స్యకారుల జీవనోపాధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఉచిత చేప పిల్లల పంపిణీకి జిల్లా యంత్రాంగం ముహూర్తం ఫిక్స్ చేసింది. జిల్లాకు 5.98 కోట్ల చేప పిల్లలు కావాలని మత్స్య శాఖ అధికారులు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం అందించారు. ఈనెల 2వ తేదీన నకిరేకల్ పట్టణంలోని పెద్ద చెరువులో చేపపిల్లల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. నకిరేకల్లో ఎమ్మెల్యే వేములు వీరేశం చెరువులో చేపపిల్లలు పోయనున్నారు. ఇందుకోసం జిల్లా మత్స్యశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ముందుగానే జలకళ జిల్లా వ్యాప్తంగా డిపార్ట్మెంట్ చెరువులు, రిజర్వాయర్లు, గ్రామ పంచాయితీ చెరువులు, కుంటలు కలిపి మొత్తం 1160కి పైగానే ఉన్నాయి. ఈ ఏడాది భారీ వర్షాలు కురవడం, రిజర్వాయర్లకు వరద పోటెత్తడంతో ఆగస్టు నెలాఖరులోనే అన్ని చెరువులు, కుంటలు నిండాయి. కానీ చేప పిల్లల పంపిణీకి సంబంధించి టెండర్ల ప్రక్రియ ఆలస్యం అయింది.జిల్లాలోని అన్ని చెరువులు, జలాశయాల్లో మత్స్యకార సొసైటీల ద్వారా చేప పిల్లలను వదలనున్నారు. 260 సహకార సంఘాలు జిల్లా వ్యాప్తంగా 260 వరకు మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలు ఉండగా, అందులో 28 వేల మంది మత్స్యకారులు సభ్యులుగా ఉన్నారు. సొసైటీల్లో సభ్యత్వం ఉన్న వారి కుటుంబ సభ్యులను కలుపుకుంటే దాదాపు 55 వేల నుంచి 60 వేల మంది వరకు ఉచిత చేపపిల్లల పంపిణీ ద్వారా లబ్ధి చేకూరనుంది. నిండిన అన్ని చెరువులు, రిజర్వాయర్లు, కుంటల్లో చేప పిల్లల పంపిణీ ప్రక్రియ నెల రోజుల్లో పూర్తి చేయాలని ప్రభుత్వం బావిస్తోంది. జిల్లాలోనే అతి పెద్ద రిజర్వాయర్లు అయిన నాగార్జునసాగర్, డిండి, పెద్దదేవులపల్లి, మూసీ, అయిటిపాముల, కనగల్ జలాశయాల్లో కూడా ఉచిత చేప పిల్లలను వదలనున్నారు. ఆలస్యంగా మొదలవుతున్న ప్రక్రియ.. ఈ ఏడాది ముందుగానే వర్షాలతో కురిసి రిజర్వాయర్లు, చెరువులు పూర్తిగా నిండినా.. ఉచిత చేప పిల్లల పంపిణీపై రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో నిర్ణయం తీసుకోలేదు. ఇక, టెండర్ల ప్రక్రియలో గుత్తేదారులు మొదటిసారి పాల్గొనకపోవడం కారణంగా చేప పిల్లల పంపిణీ ఆలస్యమయ్యింది. వరుణుడు ముందుగానే కరుణించిగా ప్రభుత్వం సకాలంలో స్పందించకపోవడం మత్స్యకారుల ఉపాధిపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కొన్ని చెరువులు, కుంటల్లో మార్చి వరకు మాత్రమే నీరు ఉంటుంది. ఆ తరువాత నీరు తగ్గుతుందని అధికారిక గణాంకాలను బట్టి తెలుస్తోంది. అయితే.. ఎనిమిది నెలల నుంచి ఒక సంవత్సరం పాటు నీటిలో ఉంటేనే చేప పిల్లలు తగిన స్థాయిలో బరువు పెరగడానికి అవకాశం ఉంటుంది. కానీ ముందుగానే చెరువుల్లో నీరు తగ్గితే పెద్దగా ప్రయోజనం ఉండదు.చెరువుల్లో పోసేందుకు ప్రణాళిక ఫ రేపు నకిరేకల్ పెద్ద చెరువులో చేపపిల్లలు వదలనున్న ఎమ్మెల్యే వీరేశం ఫ నెల రోజుల్లోగా అన్ని చెరువుల్లోకి చేరనున్న చేపపిల్లలు -
రైతుల గోస పట్టని పాలకులకు బుద్ధి చెప్పాలి
మిర్యాలగూడ : వర్షాలతో పంట నష్టపోయి ఆందోళనలో ఉన్న రైతుల గోస పట్టకుండా ఎన్నిక ప్రచారం చేస్తున్న పాలకులకు ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. శుక్రవారం తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో మిర్యాలగూడ సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడారు. మోంథా తుపాన్ కారణంగా రాష్ట్రంలో లక్షలాది ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందని, నల్లగొండ జిల్లాలో సుమారు లక్ష ఎకరాలకు పైగా పంట నీటిపాలు అయ్యిందని ఆవేదన వ్యక్తం చేశారు. చేతికొచ్చిన పంట నాశనం కావడంతో అన్నదాతలు ఆందోళనలో ఉన్నారని, ఈ పరిస్థితుల్లో రైతులను ఓదార్చి అండగా నిలవాల్సిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో పాల్గొనడం సరైంది కాదన్నారు. పంట నష్టం వివరాలను సేకరించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఐకేపీ కేంద్రాల్లో తడిసిన ధాన్యాన్ని సైతం ప్రభుత్వం మద్దతు ధరకు కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని కోరారు. లేనపక్షంలో రైతులను సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు వీరేపల్లి వెంకటేశ్వర్లు, నాయకులు రాగిరెడ్డి మంగారెడ్డి, చౌగాని సీతారాములు, మల్లు గౌతంరెడ్డి, బావండ్ల పాండు, వినోద్నాయక్, పోలెబోయిన వరలక్ష్మి, పాల్వాయి రాంరెడ్డి, గోవింద్రెడ్డి, వీరారెడ్డి, శ్రీనివాస్రెడ్డి, వెంకట్రెడ్డి, అరుణ, దయానంద్, కోటిరెడ్డి, వెంకన్న, కృష్ణయ్య, రామకృష్ణ, సూర్యం, లతీఫ్ తదితరులు పాల్గొన్నారు. ఫ మాజీ ఎమ్మెల్యే రంగారెడ్డి -
కేంద్రాల్లో రైతులను ఇబ్బంది పెట్టొద్దు
తిప్పర్తి, మాడుగులపల్లి : ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులను ఇబ్బంది పెట్టవద్దని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. గురువారం తిప్పర్తి, మాడుగులపల్లి మండలంలోని చిరుమర్తి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆమె.. ఎస్పీ శరత్చంద్ర పవార్తో కలిసి పరిశీలించారు. ఆయా చోట్ల రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. తిప్పర్తిలో రైతులు తమ ధాన్యం కాంటా వేసి మూడు రోజులు అయ్యిందని, లారీలను ఏర్పాటు చేయకపోవడం వల్ల ధాన్యం బస్తాలు మొలకెత్తాయని కలెక్టర్కు వివరించగా వెంటనే స్పందించిన ఆమె కొనుగోలు కేంద్రం నిర్వాహకుడికి షోకాజ్ నోటీసు జారీ చేయాలని ఆదేశించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో సిబ్బంది నిర్లక్ష్యం వహించొద్దని, కేంద్రానికి వచ్చిన ధాన్యం నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా ఉంటే వెంటనే కొనుగోలు చేసి మిల్లులకు పంపిచాలన్నారు. వర్షాలకు ధాన్యం తడిసి రంగు మారిపోయిన నేపథ్యంలో కొనుగోలు కేంద్రాలకు అనుసంధానం చేసిన రైస్ మిల్లులతో సమన్వయం చేసుకుని ధాన్యం దించుకునేలా చూడాలని డీఆర్డీఓ శేఖర్రెడ్డిని ఆదేశించారు. కేంద్రాల్లో ధాన్యం తడవకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, నల్లగొండ ఆర్డీఓ అశోక్రెడ్డి, డీఎస్ఓ వెంకటేశ్, డీఎం గోపికృష్ణ, మార్కెటింగ్ ఏడీ ఛాయాదేవి, డీసీసీబీ డైరెక్టర్ పాశం సంపత్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కొర్రీలు పెట్టకుండా దిగుమతి చేసుకోవాలి మిర్యాలగూడ : ఐకేపీ కేంద్రాల నుంచి వచ్చే ధాన్యానికి ఎటువంటి కొర్రీలు పెట్టకుండా త్వరగా దిగుమతి చేసుకోవాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. గురువారం ఆమె మిర్యాలగూడ మండలం గూడూరు గ్రామ పరిధిలోని రామకృష్ణ రైస్ మిల్లును పరిశీలించి మిల్లర్లతో మాట్లాడారు. వానాకాలం సీజన్లో సన్న ధాన్యంతోపాటు ఐకేపీ కేంద్రాల నుంచి ధాన్యం వస్తున్నందున మిల్లర్లు రైతులను ఇబ్బందులకు గురి చేయకుండా త్వరితగతిన దిగుమతి చేసుకోవాలన్నారు. ధాన్యం స్టోరేజీ విధానాన్ని, డ్రై చేసే విధానాన్ని రైస్ మిల్లర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కర్నాటి రమేష్ను అడిగి తెలుసుకున్నారు. సీఎంఆర్ ధాన్యాన్ని స్టోరేజీ చేస్తున్న విధానాన్ని గోదాముల్లో ఆమె పరిశీలించారు. ఆమె వెంట అదనపు కలెక్టర్ శ్రీనివాస్, మిర్యాలగూడ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు గౌరు శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి వెంకటరమణచౌదరి, ఉపాధ్యక్షుడు జి.రామశేఖర్, కార్యదర్శి పొలిశెట్టి ధనుంజయ, కోశాధికారి గందె రాము, తహసీల్దార్ సురేష్కుమార్ తదితరులు ఉన్నారు. ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి -
యాదగిరిగుట్ట ఆలయ ఎలక్ట్రికల్ ఈఈ రిమాండ్
యాదగిరిగుట్ట: రూ.1.90లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డ యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయ ఎలక్ట్రికల్ ఈఈ ఊడేపు వెంకట రామారావును ఏసీబీ అధికారులు గురువారం రిమాండ్కు తరలించారు. బుధవారం రాత్రి నుంచి గురువారం మధ్యాహ్నం వరకు యాదగిరి కొండపైన గల ఆయన కార్యాలయంలో ఏసీబీ డీఎస్పీ జగదీశ్ చందర్ ఆధ్వర్యంలో విచారణ చేశారు. అనంతరం నాంపల్లిలోని ఏసీబీ కోర్టులో హాజరుపరిచి, రిమాండ్కు తరలించినట్లు నల్లగొండ రేంజ్ ఏసీబీ డీఎస్పీ జగదీశ్ చందర్ తెలిపారు. గురువారం ఆయన యాదగిరి కొండపైన విలేకరులతో మాట్లాడారు. కాంట్రాక్టర్లు ప్రసాదం మిషనరీ రిప్లేస్మెంట్, రిపేర్ల బిజినెస్లో భాగంగా బిల్లు మంజూరు చేసేందుకు వెంకటరామారావు రూ.2లక్షలకు పైగా డబ్బులు డిమాండ్ చేశాడని, ఒప్పందం ప్రకారం.. రూ.1.90లక్షలు ఇస్తానని కాంట్రాక్టర్లు ఒప్పుకున్నారని తెలిపారు. ఈ విషయంపై కాంట్రాక్టర్లు ఫిర్యాదు చేయడంతో రామారావు వ్యవహారంపై నిఘా పెట్టి, గతంలో ఉన్న ఆరోపణలు, వీడియో, ఆడియో ఎవిడెన్స్ కలెక్ట్ చేశామని ఏసీబీ డీఎస్పీ చెప్పారు. దేవాదాయశాఖ ఇన్చార్జ్ ఎస్ఈగా ఉన్న రామారావు మేడారం ఆలయ పరిశీలనకు వెళ్లి, హైదరాబాద్కు తిరిగి వచ్చే క్రమంలో కాంట్రాక్టర్ల నుంచి లంచం డబ్బులు తీసుకుంటున్న క్రమంలో మేడిపల్లిలో రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నట్లు తెలిపారు. అనంతరం ఆయనను కస్టడీలోకి తీసుకొని యాదగిరిగుట్ట ఆలయంలోని కార్యాలయంలో రికార్డులు పరిశీలించినట్లు చెప్పారు. ఆయనొక్కడే డీలింగ్ ఈఈ రామారావు అక్రమంగా సంపాదించే విషయంలో అంతా ఆయన ఒక్కడే డీలింగ్ చేస్తాడని తేలింది. కాంట్రాక్టర్ల నుంచి కమీషన్ రూపంలో వచ్చే డబ్బుల విషయంలో అతనొక్కడే తీసుకుంటాడని తెలిసింది. విచారణలో ఉన్నతాధికారుల ప్రమేయం లేదని రామారావు ఏసీబీ అధికారుల ముందు ఒప్పుకున్నట్లు సమాచారం. కొండపైన తనకు సంబంధించిన శాఖలో ఎవరైనా కాంట్రాక్టర్లు పనులు చేయాలంటే కమిషన్ పర్సంటేజ్ మాట్లాడిన తరువాతే బిల్లులు మంజూరు చేశాడని పలువురు కాంట్రాక్టర్లు చెబుతున్నారు. విలువైన డాక్యుమెంట్లు స్వాధీనం హైదరాబాద్లోని ఎల్బీనగర్లో ఈఈ రామారావు నివాసం ఉంటున్న ఇంటిలో ఏసీబీ అధికారులు నిర్వహించిన సోదాల్లో విలువైన భూమి పత్రాలు, డాక్యుమెంట్లు, నగదు దొరికినట్లు తెలుస్తోంది. రామారావు అక్రమంగా సంపాదించిన నగదు, భూముల పత్రాలను, ఆయన ఎవరి పేరున భూములు రిజిస్ట్రేషన్ చేశాడు, ఆయనకు వచ్చే జీతం ఎంత, అక్రమంగా సంపాదించిన నగదు అంశాలపై ఏసీబీ అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేసినట్లు తెలిసింది. ఎల్బీనగర్లోని రామారావు ఇంట్లో హైదరాబాద్ రేంజ్ ఏసీబీ అధికారులు 8 మంది సోదాలు చేశారు. అదేవిధంగా యాదగిరిగుట్ట దేవాలయంలోని ఈఈ కార్యాలయంలో 15మంది ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. -
మూసీకి పోటెత్తిన వరద
నకిరేకల్ : మూసీ ప్రాజెక్టుకు గురువారం ఎగువ నుంచి వరద పోటెత్తింది. అధికారులు తొమ్మిది క్రస్ట్ గేట్లను ఎత్తి వరదను దిగువకు వదులుతున్నారు. మోంథా తుపాను ప్రభావంతో హైదరాబాద్, జనగాం, ఆలేరు, వరంగల్ తదిరత ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో బిక్కేరు, వసంత వాగు, మూసీ ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఆయా వాగుల ద్వారా గురువారం ఉదయం రిజర్వాయర్లోకి 49,791 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. దీంతో గురువారం ప్రాజెక్టు ఏడు క్రస్ట్గేట్లను పది అడుగులు, రెండు క్రస్ట్గేట్లను ఐదు అడుగులు (మొత్తం 9గేట్లు) పైకెత్తి 51,990 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. సాయంత్రానికి ఇన్ఫ్లో 33,931 క్యూసెక్కులకు తగ్గటంతో అధికారులు ఒక గేటును మూసివేసి ఎనిమిది గేట్లను పది అడుగులకు ఎత్తి ఉంచి 33,931 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. -
విద్యుదాఘాతంతో అసిస్టెంట్ లైన్మెన్ మృతి
మోత్కూరు : వ్యవసాయ బావి వద్ద ట్రాన్స్ఫార్మర్ మరమ్మతులు చేస్తుండగా అసిస్టెంట్ లైన్మెన్ విద్యుత్షాక్తో మృతిచెందాడు. ఈసంఘటన గురువారం మోత్కూరు మండలం పాలడుగు గ్రామ శివారులో చోటుచేసుకుంది. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి పాలడుగు గ్రామ శివారులో బొడిగ కిష్టయ్య వ్యవసాయ బావి సమీపంలో ఉన్న ట్రాన్స్ఫార్మర్ ప్లింత్ప్లాట్ ఫామ్ నుంచి ఒరిగింది. దానిని సరి చేసేందుకు దత్తప్పగూడెం గ్రామానికి చెందిన అసిస్టెంట్ లైన్మెన్ ఓర్సు సురేష్ (34), మరొక హెల్పర్తో కలిసి అక్కడికి వెళ్లాడు. ట్రాన్స్ఫార్మర్ను సరి చేసి బిగించే క్రమంలో ఎల్టీ వైరు హెచ్టీ వైరుకు తాకడంతో సురేష్ విద్యుత్షాక్కు గురయ్యాడు. చికిత్స నిమిత్తం భువనగిరి ఆస్పత్రికి తరలిస్తుండగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుడికి మృతుడికి భార్య, పదేళ్ల లోపు ముగ్గురు పిల్లలు ఉన్నారు. పది రోజుల్లోపే విద్యుత్ శాఖకు చెందిన ఇద్దరు మృతి పది రోజుల లోపే విద్యుత్ శాఖకు చెందిన ఇద్దరు సిబ్బంది విద్యుదాఘాతంతో మృతి చెందారు. ఈ నెల 25న మోత్కూరులోని ట్రాన్స్ఫార్మర్ మరమ్మతుల కేంద్రంలో రోజువారీ వర్కర్గా పనిచేస్తున్న బద్దిపడగ భాస్కర్రెడ్డి (23) వైండింగ్ చేసిన ట్రాన్స్ఫార్మర్ టెస్టింగ్ చేస్తున్న క్రమంలో మెయిన్ హ్యాండిల్ ఆన్ చేయగా విద్యుత్షాక్ కొట్టి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన మరువక ముందే దత్తప్పగూడేనికి చెందిన అసిస్టెంట్ లైన్మెన్ సురేష్ ట్రాన్స్ఫార్మర్ వద్ద రిపేరు చేస్తుండగా మృతి చెందాడు. ఇద్దరూ విద్యుత్ శాఖకు చెందిన సిబ్బంది కావడంతో ఆ శాఖ ఉద్యోగులు, సిబ్బంది తీవ్ర ఆందోళన చెందుతున్నారు. విద్యుత్ సిబ్బందికి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని బాధితుల కుటుంబాలు కోరుతున్నాయి. ఫ ట్రాన్స్ఫార్మర్ రిపేర్ చేస్తుండగా ఘటన -
ఆగని దుందుబి ఉధృతి
డిండి: మోంథా తుపాన్ కారణంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో రెండు రోజుల పాటు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి దిగువకు ప్రవహిస్తున్న దుందుబి వాగు ఉధృతి కొనసాగుతోంది. డిండి మండల కేంద్రంలోని డిండి ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు కుడి భాగంలో నాగర్కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండలం లత్తీపూర్ గ్రామ శివారులో ఉన్న అలుగు గుండా నీటి ప్రవాహం అధికమవడంతో హైదరాబాద్–శ్రీశైలం వెళ్లే 765 హైవేపై నిర్మించిన బ్రిడ్జి బుధవారం అర్ధరాత్రి దెబ్బతిని కూలిపోయింది. -
ప్రమాణస్వీకారం చట్టవిరుద్ధం
ఫ ప్రధాన ఎన్నికల అధికారికి వినతి పత్రం యాదగిరిగుట్ట రూరల్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా ఎన్నికల నియమావళి అమలులో ఉన్నప్పుడు తెలంగాణ ప్రభుత్వం అజారుద్దీన్ను మంత్రిగా ప్రకటించి ప్రమాణ స్వీకారోత్సవ ఏర్పాట్లు చేయడం చట్ట విరుద్ధమని, ఎన్నికల ఫలితాలు వెలువడే వరకు ఈ ప్రమాణ స్వీకారోత్సవాన్ని నిలుపుదల చేయాలని కోరుతూ యాదగిరిగుట్ట మండలం గౌరాయపల్లి గ్రామానికి చెందిన ప్రజాస్వామ్య పరిరక్షణ కన్వీనర్ గుజ్జుల రాంచంద్రారెడ్డి గురువారం తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికా రికి వినతి పత్రం అందజేశారు. జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో ఒక వర్గాన్ని ప్రలోభ పెట్టాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, ఇది చట్ట విరుద్ధమని పేర్కొన్నారు. -
నందనంలో విషాదఛాయలు
భువనగిరి: భువనగిరి మండలంలోని నందనం గ్రామానికి చెందిన రచ్చ కృష్ణవేణి(45) తన తండ్రి అంత్యక్రియలకు వెళ్లి వస్తుండగా వాగులో పడి మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కృష్ణవేణి తండ్రి రవీందర్ ఈ నెల 25న మృతిచెందగా అంత్యక్రియల నిమిత్తం ఇబ్రహీంపట్నం నెర్రపల్లి గ్రామానికి వెళ్లింది. గురువారం పంచదినకర్మ సందర్భంగా తండ్రి అస్థికలను వాడపల్లిలోని కృష్ణానదిలో కలిపేందుకు ఆమె భర్త ప్రభాకర్తో కలిసి వెళ్లింది. సాయంత్రం తిరిగి నెర్రపల్లి గ్రామానికి వచ్చారు. అనంతరం బైక్పై భర్తతో కలిసి స్వగ్రామానికి బయలుదేరారు. ఈ క్రమంలో రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్టు మండలంలోని మజీద్పూర–బాటసింగారం మధ్య ఉధృతంగా ప్రవహిస్తున్న వాగును దాటే క్రమంలో అందులో పడిపోయారు. స్థానిక యువకులు గమనించి ప్రభాకర్ను బయటకు తీయగా కృష్ణవేణిని కాపాడేలోపు ఆమె మృతి చెందింది. కృష్ణవేణి గ్రామంలో అంగన్వాడీ టీచర్గా విధులు నిర్వహిస్తుంది. ఆమెకు కుమారుడు, కుమార్తె ఉంది. ఫ తండ్రి అంత్యక్రియలకు వెళ్లి వస్తుండగా వాగులో పడి మహిళ మృతి -
సురేష్ మృతికి విద్యుత్ అధికారుల నిర్లక్ష్యమే కారణం
భువనగిరి: అసిస్టెంట్ లైన్మెన్ ఓర్సు నరేష్ మృతికి విద్యుత్ అధికారుల నిర్లక్ష్యమే కారణమని గురువారం విద్యుత్ ఉద్యోగ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో భువనగిరి విద్యుత్ డివిజన్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అధికారులు అనవసర ఒత్తిడిలు పెట్టడంతోనే విద్యుత్ కార్మికులు విధులు సక్రమంగా నిర్వహించలేకపోతున్నారన్నారు. కార్యక్రమంలో తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ 1104 అధ్యక్షుడు పడిగం యాదగిరి, కార్యదర్శి బొబ్బలి మురళి, విద్యుత్ ఉద్యోగ సంఘాల నాయకులు దొడ్డి యాదగిరి, రాజేష్, కుసంగి శ్రీనివాస్, బోట్ల రమేష్, జోగు వెంకటేశం, మీర్జా షకిల్ బేగ్, రమేష్రెడ్డి, సత్యనారాయణ, బాలనర్సింహ, లింగం, బాబురావు, రవీందర్, విజయకుమార్, స్వరూప, స్వప్న, విజయలక్ష్మి పాల్గొన్నారు. -
పానగల్లు వేంకటేశ్వర ఆలయంలో కూలిన విగ్రహం
రామగిరి(నల్లగొండ): పానగల్లు వేంకటేశ్వరస్వామి ఆలయంపై ఉన్న విగ్రహం ఒకటి కింద పడింది. ఎడతెరిపిలేని వర్షానికి ఆలయం విమాన గోపురంపై ఉన్న దశావతార విగ్రహాల్లో ఒక విగ్రహం పడి ముక్కలైంది. వేంకటేశ్వర స్వామి చారిత్రక ఆలయాల్లో ఇది ఒకటని, విగ్రహాన్ని వెంటనే పునఃనిర్మించాలని వేద పండితులు పేర్కొంటున్నారు. వరుసగా వాహనాలు ఢీనార్కట్పల్లి: నార్కట్పల్లి సమీపంలోని హైదరాబాద్ – విజయవాడ రహదారిలో గురువారం వాహనాలు వరుసగా ఢీకొన్నాయి. నార్కట్పల్లి శివారులో రోడ్డు పక్కన ఆగి ఉన్న డీసీఎంను కారు ఢీకొంది. అదే రోడ్డుగుండా వస్తున్న హైదరాబాద్ నుంచి ఖమ్మంకు ఖైదీలను తరలిస్తున్న పోలీస్ వాహనం ముందున్న కారును ఢీకొంది. ఈ పోలీస్ వాహనాన్ని మరో కారు వచ్చి ఢీకొంది. ఈ ఘటనలో వాహనాలు దెబ్బతినగా.. అందులో ప్రయాణిస్తున్న వారికి ఎలాంటి గాయాలు కాలేదు. పోలీసులు ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు. ఆయిల్ పరిశ్రమలో తనిఖీలుచిట్యాల: మండలంలోని వట్టిమర్తి గ్రామ పరిధిలో గల అగ్రో ఆయిల్ పరిశ్రమలో గురువారం ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేశారు. పరిశ్రమలో తయారు చేస్తున్న రిఫైన్డ్ ఆయిల్ ప్యాకింగ్ డబ్బాలపై సరైన వివరాలు లేనట్లు అధికారులు గుర్తించారు. ఈ అంశాలపై రికార్డు చేసిన పత్రాలపై సంబంధిత పరిశ్రమ ఉద్యోగులు సంతకాలు చేయకుండా నిరాకరించడంతోపాటు తనిఖీలు చేయకుండా అధికారులను అడ్డుకున్నారు. ఈ విషయాన్ని ఉమ్మడి జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారిణి జ్యోతిర్మయికి తెలపడంతో ఆమె పరిశ్రమ వద్దకు చేరుకుని పరిశీలించారు. సుమారుగా 1600 లీటర్ల ఆయిల్ డబ్బాలతోపాటు, 4800 కేజీ ఆయిల్ ముడి పదార్థాలు గుర్తించారు. ఆయిల్ డబ్బాలు నిబంధనల మేరకు లేనట్లు గుర్తించి వాటిని సీజ్ చేసి పరీక్ష నిమిత్తం ల్యాబ్కు తరలించారు. దాడికి పాల్పడిన వారికి ఆరు నెలల జైలు తుంగతుర్తి : భూ వివాదం కారణంగా ఓ వ్యక్తిపై కరలత్రో దాడి చేసిన నలుగురికి ఆరు నెలల జైలు, రూ.500 జరిమానా విధిస్తూ తుంగతుర్తి జూనియర్ సివిల్ కోర్టు జడ్జి ఎండీ గౌస్పాషా గురువారం తీర్పునిచ్చారు. తిరుమలగిరి మండలంలోని బండ్లపల్లి గ్రామానికి చెందిన రాగుశాల నరసింహ స్వామికి, లింగంపల్లి నరసింహస్వామి మధ్యన భూ వివాదం ఉంది. ఈక్రమంలో 2015లో రాగుశాల నరసింహస్వామిపై లింగంపల్లి నరసింహ, ఆయన భార్య లక్ష్మి, వారి కుమారుడు వెంకటేశ్వర్లు, కోడలు సుజాత కర్రలతో దాడి చేశారు. దీంతో రాగుశాల నరసింహ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. అప్పటి ఎస్ఐ మహేష్ కేసు నమోదు చేశారు. గురువారం సాక్షులను విచారించిన న్యాయమూర్తి ఎండీ గౌస్ పాషా నిందితులైన లింగంపల్లి నరసింహతో పాటు అతని భార్య లక్ష్మి, వారి కుమారుడు వెంకటేశ్వర్లు, కోడలు సుజాతలకు ఆరు నెలల జైలు, రూ.500 జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించారు. -
నేడు యూనిటీ మార్చ్
నల్లగొండ టూటౌన్ : భారత మాజీ ఉప ప్రధాని, ఉక్కు మనిషి సర్ధార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా ఆయనను స్మరించుకుంటూ శుక్రవారం నల్లగొండలోని బీజేపీ కార్యాలయం నుంచి పెద్ద గడియారం సెంటర్ వరకు యూనిటీ మార్చ్ నిర్వహించనున్నట్లు బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిత్రెడ్డి తెలిపారు. గురువారం బీజేపీ కార్యాలయంలో వల్లభాయ్ పటేల్ 150వ జయంతి పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వల్లభాయ్పటేల్ ఉప ప్రధానిగా, స్వాతంత్య్ర సమరయోధుడిగా దేశానికి, దేశప్రజలకు ఎనలేని సేవ చేశారని కొనియాడారు. యూనిటీ మార్చ్లో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి పోతెపాక లింగస్వామి, కంచర్ల విద్యాసాగర్డ్డి, ఉపాధ్యక్షుడు పకీరు మోహన్రెడ్డి, మిర్యాల వెంకటేశం, పిన్నింటి నరేందర్రెడ్డి, దుబ్బాక సాయికుమార్, మేకల అనిల్కుమార్, దాసరి కృష్ణ పాల్గొన్నారు. ప్రవాహం తగ్గడంతో గురువారం యథాస్థితిలో కనిపిస్తున్న గురుకుల పాఠశాల -
నేటి నుంచి రైళ్ల పునరుద్ధరణ
భువనగిరి: సికింద్రాబాద్ నుంచి భువనగిరి మీదుగా విజయవాడ, విశాఖపట్నం వెళ్లే రైళ్లను శుక్రవారం నుంచి పునరుద్ధరించనున్నారు. మోంథా తుపాన్ కారణంగా ఆయా స్టేషన్లకు భువనగిరి మీదుగా వెళ్లే గౌతమి, గోదావరి, కృష్ణా ఎక్స్ప్రెస్ రైళ్లు రద్దు చేసిన విషయం తెలిసిందే. డోర్నకల్లో వరద నీరు ఉండడంతో ఆయా రైళ్లను నల్లగొండ రైలు మార్గం గుండా వెళ్లేందుకు మళ్లించారు. అయితే ఇప్పటికే తెలంగాణ, దక్షిణ ఎక్స్ప్రెస్ రైళ్లు భువనగిరి మీదుగా ఢిల్లీకి వెళ్తున్నాయి. రద్దు చేసిన రైళ్లు శుక్రవారం నుంచి భువనగిరి మీదుగా వెళ్లే అవకాశం ఉన్నట్లు సమాచారం. మద్యం దుకాణంలో చోరీభువనగిరిటౌన్ : భువనగిరిలోని లక్ష్మి వైన్స్లో బుధవారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. వైన్స్ వెనుక డోర్ ధ్వంసం చేసి లోనికి ప్రవేశించిన దొంగలు కౌంటర్ లోని రూ.50 వేల నగదు, ఐదు మద్యం ఫుల్ బాటిళ్లను అపహరించుకుపోయారు. సీసీ కెమెరాల హార్డ్ డిస్క్ సైతం ఎత్తుకెళ్లారు. గురువారం ఉదయం వైన్స్ నిర్వాహకుడు షాపు తెరిచేందుకు రాగా చోరీ జరిగినట్లు గుర్తించారు. వైన్స్ నిర్వాహకుడు విజయ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఇంటి పైకప్పు కూలి రెండు ఆవులు మృతిగుండాల : మండలంలోని వెల్మజాల గ్రామంలో రైతు నర్రముల యాదయ్యకు చెందిన రెండు ఆవులు మృతి చెందాయి. బుధవారం సాయంత్రం భారీ వర్షం కురుస్తున్న సమయంలో ఆవులు వ్యవసాయ బావి పక్కన నిరుపయోగంగా ఉన్న ఇంట్లోకి వెళ్లాయి. వాటిని అక్కడే వదిలేసి ఇంటికి వచ్చాడు. గురువారం ఉదయం వెళ్లి చూడగా ఇంటి స్లాబ్ కూలి ఆవులు మృతి చెంది ఉన్నాయి. సుమారు రూ.లక్ష నష్టం వాటిల్లిందని రైతు వాపోయాడు. -
చికిత్స పొందుతున్న యువకుడు మృతి
నార్కట్పల్లి : నార్కట్పల్లి మండల కేంద్రంలో ఈనెల 20న జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఇద్దరు యువకుల్లో ఒకరు ఆస్పత్రికి తరలించేలోపే మృతిచెందగా.. చికిత్స పొందుతున్న మరో యువకుడు గురువారం మృతిచెందాడు. అమ్మనబోలు రోడ్డు పక్కన ఆగి ఉన్న ట్రాక్టర్ను ఇద్దరు యువకులు కొత్త చంద్రశేఖర్, దుర్గం రుషికేష్ ఈనెల 20న బైక్పై అమ్మనబోలు రోడ్డు నుంచి నార్కట్పల్లికి వస్త్తుండగా.. ప్రమాదవశాత్తు ఆగి ఉన్న ట్రాక్టర్ను వెనుక నుంచి ఢీకొట్టారు. దీంతో వీరికి తీవ్రగాయాలయ్యాయి. స్థానిక ఆస్పత్రికి తరలించగా చంద్రశేఖర్ మృతి చెందిన విషయం తెలిసిందే. మెరుగైన చికిత్స నిమిత్తం రుషికేష్ను హైదరాబాద్కు తరలించగా.. గురువారం సాయంత్రం మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ క్రాంతి కుమార్ తెలిపారు. -
పారదర్శకత, జవాబుదారీతనంతో విధులు నిర్వహిస్తాం
నాగార్జునసాగర్: నీతి, నియమావళిని అవలంబిస్తూ పూర్తి పారదర్శకత, జవాబుదారితనంతో విధులు నిర్వహిస్తామని నాగార్జునసాగర్లోని తెలంగాణ రాష్ట్ర పవర్ జనరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ ఉద్యోగులు గురువారం ప్రతిజ్ఞ చేశారు. జెన్కో లోని విజిలెన్స్ విభాగం వారు ఈనెల 21న నిఘా అవగాహన (విజిలెన్స్ అవేర్నెస్ వీక్) వారోత్సవాలు చేపట్టి నవంబర్ 2వ తేదీవరకు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా నాగార్జునసాగర్లో సెంట్రల్ ఆఫీసులో ఉద్యోగులచే ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ర్యాలీ నిర్వహించారు. నైతిక వ్యాపార పద్ధతులను ప్రోత్సహిస్తామని, నిజాయితీ, సమగ్రత సంస్కృతిని పెంపొందిస్తామని, సమాజం యొక్క హక్కులు, ప్రయోజనాలను రక్షిస్తామని ప్రతిజ్ఞలో పేర్కొన్నారు. కార్యక్రమంలో జెన్కో సీఈ మంగేశ్కుమార్ ఎస్ఈ, డీఈలు పాల్గొన్నారు. -
శాలిగౌరారం మార్కెట్ యార్డుకు తాళం
శాలిగౌరారం: మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్యార్డు ఆవరణలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ధాన్యం కొనుగోలు కేంద్రానికి గురువారం మార్కెట్యార్డు ప్రధాన గేట్కు మార్కెట్ కార్యదర్శి చీనానాయక్, పీఏసీఎస్ సీఈఓ నిమ్మల ఆంజనేయులు తాళం వేశారు. ధాన్యం రాశులతో వ్యవసాయ మార్కెట్యార్డు పూర్తిగా నిండిపోవడంతో స్థలం కొరత ఏర్పడిందని, అందుకే రైతులు ధాన్యం తీసుకురాకుండా మార్కెట్యార్డు ప్రధాన గేటుకు తాళం వేసినట్లు వారు తెలిపారు. మార్కెట్యార్డులోని ధాన్యం రాశులు మోంథా తుఫాన్తో తడవడంతో ధాన్యాన్ని ఆరబోసుకునేందుకు యార్డు ఆవరణలో స్థలసమస్య ఏర్పడిందన్నారు. తడిసిన ధాన్యం రాశులను కనీసం తిరగబోసుకునేందుకు కూడా స్థలం లేకపోవడంతో రైతుల మధ్య గొడవలు జరుగుతున్నాయన్నారు. దీనికి తోడు వాతావరణంలో ఏర్పడుతున్న మార్పుల వల్ల సమస్య మరింత జఠిలమయ్యే పరిస్థితి ఏర్పడడం, జరుగుతున్న నష్టాన్ని దృష్టిలో పెట్టుకొని రైతుల ప్రయోజనాల కోసం బయటి నుండి మార్కెట్యార్డు లోపలికి ధాన్యం తరలిరాకుండా ముందస్తు చర్యల్లో భాగంగా మార్కెట్ గేటుకు తాళం వేసినట్లు తెలిపారు. నవంబర్ 4 వరకు మార్కెట్యార్డు గేటుకు తాళం వేయనున్నట్లు చెప్పారు. వాతావరణం అనుకూలించి కొనుగోలు ప్రారంభమైతే 4వ తేదీ నుంచి మార్కెట్యార్డు లోపలికి ధాన్యాన్ని అనుమతిస్తామన్నారు. రైతులు వాస్తవ పరిస్థితులను గమనించి ధాన్యం కొనుగోలు కేంద్ర నిర్వాహకులకు సహకరించాలని కోరారు. ఫ ధాన్యం రాశులతో కొనుగోలు కేంద్రంలో స్థలం కొరత -
Telangana: ఓరుగల్లు క‘న్నీరు’
సాక్షి, నెట్వర్క్: మోంథా తుపాను దెబ్బకు వరంగల్ నగరం కన్నీరు పెడుతోంది. ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్టుగా బుధవారం ఉదయం 8.30 గంటల నుంచి రాత్రి పది గంటల వరకు కురిసిన కుంభవృష్టితో వరంగల్, హనుమకొండ, కాజీపేట ప్రాంతాల్లోని 141 కాలనీలు వరద నీటిలో చిక్కుకున్నాయి. గురువారం కూడా కాలనీలు, రహదారులపై మోకాలిలోతు నీళ్లు నిలిచి ఉండటంతో జనజీవనం స్తంభించింది. ఇళ్లలోకి వరద నీరు చేరి నిత్యావసరాలు, విలువైన వస్తువులన్నీ తడిసిపోవటంతో ప్రజలు ఆకలిదప్పులతో అలమటించే పరిస్థితి ఏర్పడింది. ముంపు బాధితులను డీఆర్ఎఫ్, ఎస్జీఆర్ఎఫ్, పీజీ ఎఫ్టీ బృందాలు పడవల సహాయంతో పునరావాస కేంద్రాలకు తరలించాయి. ఇళ్ల పైకప్పులపై తలదాచుకున్న వారికి డ్రోన్ల ద్వారా ఆహారం అందించారు. గురువారం సాయంత్రానికి వరదనీరు తగ్గినా బురద ఉండడంతో దుర్వాసనతో ప్రజలకు తిప్పలు తప్పలేదు. ఎస్ఆర్ నగర్లోని ఓ ఇంట్లోకి వరద నీరు చేరడంతో అనారోగ్యానికి గురై మంచంలో ఉన్న వ్యక్తి నీటిలో పడి చనిపోయాడు. ప్రముఖుల పర్యటన: వరంగల్లోని ఎన్ఎన్ నగర్, బీఆర్ నగర్లో మంత్రి కొండా సురేఖ, జిల్లా కలెక్టర్ సత్యశారద గురువారం పర్యటించి వరద బాధితులను పరామర్శించారు. రామన్నపేటలో మేయర్ గుండు సుధారాణి, హనుమకొండ అలంకార్ జంక్షన్లో వరదనీటి ప్రవాహ తీరును కలెక్టర్ స్నేహ శబరీష్తో కలిసి గ్రేటర్ వరంగల్ మునిసిపల్ కమిషనర్ చాహత్ బాజ్పాయ్ పరిశీలించారు. నయీంనగర్ బ్రిడ్జి, జవహర్ కాలనీ, దేవరాజ్ కాలనీ, వడ్డెపల్లి శ్యామల గార్డెన్ ప్రాంతాల్లో బల్దియా కమిషనర్ పర్యటించారు. ఎంపీ కడియం కావ్య లోతట్టు ప్రాంతాల్లో పర్యటించి బాధితులకు భరోసానిచ్చారు. ఒక్కసారిగా తన్నుకొచ్చిన వరద: ఐనవోలు మండలం కొండపర్తి చెరువు కట్టకు గండిపడంతో ఆ నీళ్లంతా కొత్తపల్లి, భట్టుపల్లి చెరువు నుంచి నేరుగా బొందివాగు నాలా ద్వారా హంటర్ రోడ్డు పరిసరాలను ముంచెత్తింది. బంధం చెరువు, బెస్తం చెరువు, ఉర్సు రంగసముద్రం చెరువుల మత్తళ్లు పొంగి నగరాన్ని ముంచెత్తాయి. కొన్నిచోట్ల రోడ్లపైకి వచ్చిన నీళ్లలో యువకులు వలలు వేసి చేపలు పట్టారు. ఆక్రమణలే సమస్యకు కారణం.. వరంగల్ నగరం ఏటా వర్షాకాలంలో ముంపునకు గురవుతోంది. ముఖ్యంగా బెస్తం చెరువు, ఉర్సు రంగ సముద్రం, బంధం చెరువు, వడ్డెపల్లి చెరువు, గోపాల్పూర్ చెరువు, చిన్నవడ్డెపల్లి చెరువు, బొందివాగు నాలా, కట్టమల్లన్న నుంచి చిన్నవడ్డెపల్లికి వచ్చే నాలా, అగర్తాలా నాలా, సాకారాశి కుంట నాలా తదితర నీటి వనరులు అక్రమణకు గురికావడంవల్లే ఈ పరిస్థితి వచ్చిందని స్థానికులు చెబుతున్నారు. సరైన మురుగు నీటి నిర్వహణ వ్యవస్థ లేకపోవడం కూడా ముంపునకు కారణమవుతోంది. రూ.100 కోట్లతో నయీంనగర్ నాలాను పటిష్టం చేయటంతో కొన్ని కాలనీలు వరద ముంపు నుంచి తప్పించుకున్నాయి. 2020 సెపె్టంబర్లో భారీ తుపాన్కు వరంగల్ నగరంలో వరద ముంచెత్తి ఏడుగురు వ్యక్తులు కొట్టుకుపోయారు. 171 కాలనీలు వారం రోజులపాటు జలదిగ్బంధంలో ఉన్నాయి. ఐదేళ్ల తరువాత మోంథా తుపాను వరంగల్ను అతలాకుతలం చేసింది. నగరంలోని 141 కాలనీలు వరద గుప్పిట్లో చిక్కుకున్నాయి. నేడు సీఎం రేవంత్రెడ్డి ఏరియల్ సర్వే... నీట మునిగిన వరంగల్ మహానగరం సహా ఉమ్మడి జిల్లాలో శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. అకాల వర్షం, వరదలపై ఉమ్మడి వరంగల్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికారులతో సీఎం గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వరంగల్ లో పర్యటిస్తానని తెలిపారు. భయం గుప్పిట్లోనే పరీవాహకం మోంథా తుపాన్ ప్రభావంతో మున్నేరు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఖమ్మం జిల్లా కేంద్రంలోని కాల్వ ఒడ్డు వద్ద మున్నేటి వరద ప్రవాహం గురువారం సాయంత్రం 5 గంటలకు 25.80 అడుగుల మేర నమోదైంది. బుధవారం మధ్యాహ్నం నుంచి వర్షం లేకున్నా మున్నేరుకు వరద పెరుగుతుండడంతో పరీవాహక ప్రజలు ఆందోళనకు గురయ్యారు. వరద ఉధృతి దృష్ట్యా బుధవారం సాయంత్రం నుంచే కొందరిని పునరావాస కేంద్రాలకు తరలించారు. గురువారం వెంకటేశ్వరనగర్, పద్మావతినగర్, మోతీనగర్, పెద్దమ్మతల్లి గుడి వెనుక రోడ్డు, ధంసలాపురం కాలనీల్లోకి వరద నీరు చేరింది. ఖమ్మం నయాబజార్ కళాశాలకు 100 కుటుంబాలు, ధంసలాపురం పాఠశాలకు 30 కుటుంబాలను తరలించారు. ఖమ్మం–బోనకల్ రహదారిపై నీరు చేరి రాకపోకలు నిలిచిపోయాయి. ఐదుగురు మృతి.. పలువురు గల్లంతు మోంథా తుపాన్ ప్రభావంతో వాగులు, వంకలు ఉప్పొంగటంతో ముగ్గరు వ్యక్తులు మరణించారు. పలువురు గల్లంతయ్యారు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన అప్పని నాగేంద్రం (58) బుధవారం సాయంత్రం హనుమకొండలో విధులు ముగించుకుని ఇంటికి వస్తుండగా గ్రామానికి వెళ్లే కల్వర్టు వద్ద వరదనీటిలో పడి చనిపోయాడు. వరంగల్ నగరంలోని ఎస్ఆర్ నగర్కు చెందిన అడపా కృష్ణమూర్తి అనే వృద్ధుడు వరదనీటిలో పడి మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం గాజులగట్టులో కోల రామక్క (80) ఇంట్లో పడుకోగా వర్షానికి గోడ కూలి చనిపోయింది. వరంగల్ జిల్లా గీసుకొండ మండలం గట్టుకిందిపల్లెకు చెందిన పులి అనిల్ (30) ఖిలావరంగల్ సమీపం చింతల్ ప్రాంతంలో ప్రధాన రహదారిపై బైక్పై వెళ్తుండగా వరద ఉధృతికి కొట్టుకుపోయాడు. హైదరాబాద్ నుంచి బైక్పై వస్తున్న ఓ ప్రేమజంట జనగామ జిల్లా జఫర్గఢ్ మండలంలో వరదలో చిక్కుకుంది. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం దమ్మన్నపేటకు చెందిన శ్రావ్య (19), రంగారెడ్డి జిల్లా యాచారం మండలం నకర్తమేడేపల్లికి చెందిన బరిగెల శివకుమార్ కలిసి బైక్పై వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వరద ఉధృతికి శివకుమార్ బైక్తో సహా కొట్టుకుపోతుండగా శ్రావ్య అతన్ని కాపాడేందుకు ప్రయత్నించి వరదలో పడిపోయింది. శివకుమార్ చెట్టుకొమ్మల సహాయంతో ప్రాణం కాపాడుకోగా, గల్లంతైన శ్రావ్య కోసం పోలీసులు గాలిస్తున్నారు. భీమదేవరపల్లి మండలానికి చెందిన ప్రణయ్ (28), కల్పన (24) దంపతులు బుధవారం బైక్పై సిద్దిపేట జిల్లా అక్కన్నపేటకు వెళ్తుండగా మోత్కులపల్లి వాగులో కొట్టుకుపోయారు. వారి కోసం రెస్క్యూ సిబ్బంది గాలిస్తున్నారు. ప్రస్తుతం కల్పన గర్భవతిగా ఉన్నట్లు కుటుంబీకులు తెలిపారు. ఈ ఘటనపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ జిల్లా కలెక్టర్ హైమావతికి ఫోన్ చేసి ఆరా తీశారు. దంపతుల బాధిత కుటుంబాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ ఓదార్చారు. మహబూబాబాద్ మండలం రెడ్యాలకు చెందిన పులిగుజ్జు సంపత్ (30) జంపన్నవాగు (చిన్నవాగు) కల్వర్టుపై వరదలో గల్లంతయ్యాడు. గురువారం గాలింపు చేపట్టగా వాగుకు కొంతదూరంలో సంపత్ మృతదేహం లభ్యమైంది. అదేవిధంగా హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం కొండపర్తిలో తన ఇంటిలో పడుకున్న గద్దల సూరమ్మ (58)పై గురువారం తెల్లవారుజామున గోడ కూలి పడడంతో చనిపోయింది. హనుమకొండ జిల్లా వేలేరు మండలంలోని మల్లికుదుర్లలోని కోళ్ల ఫారాల్లో వర్షాలతో సుమారు 15 వేల కోళ్లు మృతి చెందాయి. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలంలోని సూరిపల్లి గ్రామానికి చెందిన బోళ్ల కుమారస్వామికి చెందిన 25 గొర్రెలు మృత్యువాత పడ్డాయి. నాగర్కర్నూలు జిల్లా ఉప్పునుంతల మండలం లత్తీపూర్ గ్రామ శివారులో పొలానికి వెళ్లిన రైతులు బుధవారం దుందుభి వాగు మధ్యలో చిక్కుకుపోయారు. తాడు సహాయంతో పోలీసు సిబ్బంది అవతలి ఒడ్డుకు చేరుకొని గురువారం రైతులకు ఆహారం అందజేశారు. వారు రెండు రోజులు అక్కడే ఉండనున్నారు. హైదరాబాద్ – శ్రీశైలం హైవేపై వాహనాల దారిమళ్లింపు నల్లగొండ జిల్లాలోని డిండి ప్రాజెక్టు కుడి భాగంలో నాగర్కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండలం లత్తీపూర్ గ్రామ శివారులో ఉన్న అలుగు నీటి ప్రవాహం ధాటికి హైద్రాబాద్–శ్రీశైలం హైవేపై బ్రిడ్జి వద్ద రోడ్డు బుధవారం అర్థరాత్రి కొట్టుకుపోయింది. దీంతో అధికారులు రాకపోకలు నిలిపి వేశారు. వాహనాలను నాగర్కర్నూల్ జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లి మీదుగా అచ్చంపేట మండలం హాజీపూర్ చౌరస్తా నుంచి శ్రీశైలం, అచ్చంపేటకు పంపిస్తున్నారు. కొట్టుకపోయిన రోడ్డు పునరుద్ధరణ పనులు గురువారం ప్రారంభించారు. మరోసారి తెరపైకి ‘లైడార్ సర్వే’హైదరాబాద్ నగరంలోని జలాశయాలు, చెరువులు, నాలాల అక్రమణదారులపై హైడ్రా ద్వారా ఉక్కుపాదం మోపుతున్న రాష్ట్ర ప్రభుత్వం.. అదే తరహాలో వరంగల్లోనూ ఓ ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటుచేయాలని భావిస్తోంది. హైడ్రా తరహాలో వాడ్రాను తీసుకురావాలని ఇప్పటికే సామాజికవేత్తలు డిమాండ్ చేస్తున్నారు. కాగా, వరంగల్లోని చెరువులపై లైట్ డిటెక్షన్ అండ్ రేజింగ్ (లైడార్) సర్వే చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. గతంలోనే ఈ సర్వే చేయాలనుకున్నా అనివార్య కారణాల వల్ల ఆగిపోయింది. తాజాగా మోంథా తుపానుతో నగరం మొత్తం నీట మునగటంతో మళ్లీ లైడార్ సర్వే తెరపైకి వచ్చింది. వరంగల్, హనుమకొండ జిల్లాల్లోని 75 చెరువులపై నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఎన్ఆర్ఎస్సీ) సహకారంతో సర్వే నిర్వహించాలని భావిస్తున్నారు. -
నాపై కాంగ్రెస్ వాళ్లే తప్పుడు ప్రచారం: రాజగోపాల్ రెడ్డి
సాక్షి, యాదాద్రి భువనగిరి: తాను పార్టీ మారుతున్నట్టు వస్తున్న వార్తలను కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఖండించారు. రాజకీయంగా తాను ఏదైనా నిర్ణయం తీసుకోవాలనుకున్నప్పుడు ఆయనే ప్రెస్ మీట్ పెట్టి చెబుతాను అంటూ క్లారిటీ ఇచ్చారు. పార్టీ మార్పు అంటూ తప్పుడు ప్రచారాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గురువారం చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలోని లక్కారం, చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలోని చెరువులను పరిశీలించి గంగ పూజను నిర్వహించారు. చౌటుప్పల్ మున్సిపాలిటీలోని చెరువు నిండినప్పుడు కాలనీలు జలమయం కాకుండా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు. అనంతరం, రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ..‘చౌటుప్పల్ మున్సిపాలిటీ అభివృద్ధికి 500 కోట్ల రూపాయలతో ప్రణాళిక రూపుదిద్దబోతున్నాం. చౌటుప్పల్ చెరువుకు ఎలాంటి నష్టం జరగకుండా ముందస్తుగా ప్రణాళికలు వేసి దండు మల్కాపురం, లక్కారం వద్ద వరద నీటిని డైవర్ట్ చేయడంతో మున్సిపాలిటీ ప్రజలకు వరద ముప్పు తప్పిందని తెలిపారు.పార్టీ మార్పుపై.. పార్టీ మారుతున్నానని సొంత పార్టీ వాళ్లు, బయట పార్టీ వాళ్లు నాపై కావాలని దుష్ప్రచారం చేస్తున్నారు. ప్రజలు దుష్ప్రచారాలను ఎవరు నమ్మవద్దు. నేను ఏదైనా నిర్ణయం తీసుకున్నట్లయితే స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి మరి ప్రకటిస్తాను. నేను ప్రస్తుతం సిన్సియారిటీ కలిగిన కాంగ్రెస్ కార్యకర్తను, ఎమ్మెల్యేను.. పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకే పని చేస్తాను. క్రమశిక్షణ గల కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా కార్యకర్తగా అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా కూడా దానికి కట్టుబడి ఉంటా. నా ముందు మునుగోడు అభివృద్ది తప్ప, మరో ఆలోచన లేదు. నాపై సోషల్ మీడియాలో వచ్చే దుష్ప్రచారాలను నమ్మవద్దు అంటూ కామెంట్స్ చేశారు. -
ప్రేమ పెళ్లి చేసుకున్న పన్నెండు రోజులకే..
నల్గొండ జిల్లా: వారిద్దరు ప్రేమించుకుని పెద్దలను ఒప్పించి పన్నెండు రోజుల క్రితం పెళ్లి చేసుకున్నారు. కానీ కాళ్ల పారాణి ఆరకముందే నవ వధువు రోడ్డు ప్రమాదంలో మృతిచెందింది. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. గుర్రంపోడు మండలం చామలేడు గ్రామానికి చెందిన శిలువేరు నవీన్ నాంపల్లి మండలం దామెర గ్రామానికి చెందిన అనూష(20) ప్రేమించుకున్నారు. మొదట్లో అనూష తల్లిదండ్రులు వారి ప్రేమకు అంగీకరించకపోవడంతో గుడిలో పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత పెద్దలను ఒప్పించి ఈ నెల 17న గ్రామంలో సాంప్రదాయబద్ధంగా వివాహం చేసుకన్నారు. నవీన్ పెయింటర్గా పనిచేస్తున్నాడు. నవీన్, అనూష కలిసి బుధవారం బైక్పై గుర్రంపోడుకు వస్తున్నారు. అదే సమయంలో గుర్రంపోడు గ్రామానికి చెందిన రేపాక లచ్చయ్య బైక్పై తన పిల్లలకు తీసుకుని గ్రామ శివారులోని బ్రిడ్జి వద్ద వాగు ప్రవాహాన్ని చూపించి మళ్లీ గుర్రంపోడు వైపు వెళ్లేందుకు బైక్ను తిప్పుతున్నాడు. అదే సమయంలో ఎదురుగా వస్తున్న నవీన్ సడన్ బ్రేక్ వేస్తూ లచ్చయ్య బైక్ను ఢీకొట్టి నల్లగొండ– దేవరకొండ రహదారిపై ఎడుమ వైపునకు పడిపోయాడు. బైక్పై వెనుక కూర్చున్న అనూష ఎగిరి బ్రిడ్జి రెయిలింగ్పై నుంచి వాగులోకి పడిపోయింది. అక్కడే ఉన్న స్థానికులు ఎవరో వాగులో పడినట్లు గుర్తించి వాగులోకి వెళ్లి వెతకడం ప్రారంభించారు. అర్ధగంట తర్వాత వాగు ప్రవాహం అంచున గుంతలో అనూష మృతదేహం లభ్యమైంది. తలకు తీవ్ర గాయమైన నవీన్ను 108 వాహనంలో నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి.. అక్కడి నుంచి హైదరాబాద్కు తీసుకెళ్లారు. కాగా ఈ ఘటనపై ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. -
ఏసీబీ వలలో యాదగిరిగుట్ట ఆలయ విద్యుత్ ఈఈ
యాదగిరిగుట్ట: యాదగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయం విద్యుత్ ఈఈ రామారావు కాంట్రాక్టర్ వద్ద రూ.1.90లక్షలు లంచం తీసుకుంటూ బుధవారం ఏసీబీకి పట్టుబడ్డారు. ఏసీబీ డీఎస్పీ జగదీశ్ చంద్రం తెలిపిన వివరాల ప్రకారం.. యాదగిరిగుట్ట ఆలయంలో లడ్డూ, పులిహోర ప్రసాదం తయారీ మిషన్ల మెయింటనెన్స్ టెండర్ను యాదగిరిగుట్ట పట్టణానికి చెందిన ఉపేందర్, సందీప్రెడ్డి గతేడాది రూ.10లక్షలకు దక్కించుకున్నారు. కానీ గత సంవత్సర కాలంగా వారికి బిల్లులు రావడం లేదు. దీంతో తమకు రావాలి్సన రూ.10లక్షల బిల్లులు ఇవ్వాలని ఉపేందర్, సందీప్రెడ్డి గత కొన్ని నెలలుగా ఈఈ రామారావును అడుగుతూ వస్తున్నారు. రూ.2లక్షలు ఇస్తేనే..అయితే రూ.10లక్షల బిల్లుల్లో రూ.2లక్షలు తనకు ఇవ్వాలని రామారావు డిమాండ్ చేశాడు. రూ.1.90లక్షలు ఇస్తామని ఉపేందర్, సందీప్రెడ్డి చెప్పారు. ఈ విషయాన్ని వారు ఏసీబీ అధికారుల దృష్టికి రెండు నెలల క్రితం తీసుకెళ్లారు. రామారావు వివిధ పనుల్లో బిజీగా ఉండి ఉపేందర్, సందీప్రెడ్డిని ఈ రెండు నెలలు డబ్బులు అడగలేదు. బు«ధవారం విధులు ముగించుకొని హైదరాబాద్కు వెళ్తూ మార్గమధ్యలో రూ.1.90లక్షలు తీసుకుంటానని ఉపేందర్, సందీప్రెడ్డికి రామారావు చెప్పాడు. దీంతో వారు ఏసీబీ అధికారులకు సమాచారం ఇచ్చారు. మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లా మేడిపల్లిలోని ఓ ఆస్పత్రి సమీపంలో ఉపేందర్, సందీప్రెడ్డి నుంచి రామారావు రూ.1.90లక్షలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. గతంలో 9 నెలలు సస్పెండ్.యాదగిరిగుట్ట ఆలయంలో సురక్ష సిబ్బంది వద్ద ఈఈ రామారావు డబ్బులు తీసుకొని వారిని ఉద్యోగంలో పెట్టుకున్నారని గతేడాది ఆరోపణలు రావడంతో అప్పటి ఈఓ భాస్కర్రావు విచారణ చేసి రామారావును సస్పెండ్ చేశారు. 9 నెలలు సస్పెండ్కు గురైన తర్వాత పైరవీలు చేసుకొని తిరిగి ఈ ఏడాది ఏప్రిల్లో ఉద్యోగంలో చేరినట్లు తెలుస్తోంది. ఆయన అక్రమ పద్ధతిలో ఉద్యోగం సంపాదించాడని, కింది స్థాయి ఉద్యోగులు, సిబ్బంది, ప్రైవేట్ సిబ్బందిని ఇబ్బందులకు గురిచేసేవారనే ఆరోపణలు ఉన్నాయి. తన వద్ద పనిచేసే సిబ్బందితో తన వ్యవసాయ బావి వద్ద పనులు చేయించుకునే వారని, వినకుంటే వ్యక్తిగతంగా దూషించి, ఉద్యోగంలో నుంచి తీసేస్తానని బెదిరించేవాడని సమాచారం. ఇక్కడ ఈఈ, మేడారంలో ఎస్ఈ..?ములుగు జిల్లా మేడారంలో వచ్చే ఏడాది జరగనున్న సమ్మక్క–సారక్క జాతర జరగనుండగా.. అక్కడ అభివృద్ధి పనులు జరుగుతున్న నేపథ్యంలో దేవాదాయ శాఖలో ఖాళీగా ఉన్న ఎస్ఈ పోస్టుకు రామారావును ఇన్చార్జిగా రెండు రోజుల క్రితం నియమించినట్లు తెలుస్తోంది. విద్యుత్ విభాగంలో పనిచేస్తున్న రామారావు.. సివిల్ విభాగంలో ఇన్చార్జి ఎస్ఈగా పదోన్నతి పొందడంపై స్థానిక ఆలయ ఉద్యోగుల్లో చర్చ మొదలైంది. ఇదిలా ఉండగా.. బుధవారం యాదగిరి క్షేత్రంలోని లక్ష్మీ పుష్కరిణిని సందర్శించేందుకు వచ్చిన సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాస్రాజుతో కలిసి ఇన్చార్జి ఎస్ఈ హోదాలో రామారావు పరిశీలించాడు. ఇంట్లో సోదాలుఏసీబీ డీఎస్పీ జగదీశ్ చంద్రం ఆధ్వర్యంలో రామారావు ఇంట్లోతో పాటు ఆయన బంధువులు, సన్నిహితుల ఇళ్లలో ఏకకాలంలో సోదాలు చేపట్టినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా యాదగిరిగుట్ట ఆలయంలో రామారావు కార్యాలయంలో సైతం ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించి పలు ఫైల్స్ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. -
యాదగిరి క్షేత్రానికి ‘మోంథా’ ఎఫెక్ట్
యాదగిరిగుట్ట: కార్తీక మాసంలో యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామిని దర్శించుకోవడానికి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు. మోంథా తుపాన్ కారణంగా మంగళవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండటంతో బుధవారం స్వామివారి క్షేత్రానికి భక్తుల రాక తగ్గింది. దీంతో ఆలయ పరిసరాలు, క్యూలైన్లు, మాడ వీధులు భక్తులు తక్కువగా కనిపించారు. ఆరు బ్యాచ్లుగా సత్యనారాయణస్వామి వ్రత పూజలను 114 జంటలు నిర్వహించాయి. వివిధ పూజలతో స్వామివారికి నిత్యాదాయం రూ.9,17,614 వచ్చినట్లు ఆలయాధికారులు వెల్లడించారు. తుపాన్ కారణంగా తగ్గిన భక్తులు -
నదిలో చిక్కుకున్న వ్యక్తిని కాపాడిన పోలీసులు
మేళ్లచెరువు: చేపల వేటకు వెళ్లి కృష్ణా నదిలో చిక్కుకున్న వ్యక్తిని బుధవారం పోలీసులు కాపాడారు. మేళ్లచెరువు మండల కేంద్రంలోని శ్రీరా మనగర్ కాలనీకి చెందిన పరసగాని శ్రీను మంగళవారం తెల్లవారుజామున చింతలపాలెం మండలం పాతవెల్లటూరు గ్రామ పరిధిలోని కృష్ణా నదిలోకి పడవలో చేపల వేటకు వెళ్లాడు. వేట మధ్యలో వర్షం పడుతుండగా పడవ ఇంజన్ రిపేరు వచ్చింది. దీంతో పడవను ఒడ్డుకు చేర్చడం కష్టంగా మారింది. ఎలాగో అలా అతడు నది ఒడ్డుకు వెళ్లి రాత్రంతా వర్షంలో బిక్కుబిక్కమంటూ ఉన్నాడు. బుధవారం ఉదయం శ్రీనుకు కుటుంబ సభ్యులు ఫోన్ చేయగా.. ఎటు వెళ్లాలో దారి తెలియక ఇబ్బంది పడుతున్నట్లు చెప్పాడు. దీంతో కుటుంబ సభ్యులు రెవెన్యూ అధికారులు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు ఏపీలోని పల్నాడు జిల్లా బెల్లంకొండ పోలీసులకు సమాచరం అందించగా.. వారు శ్రీను చిక్కున్న ప్రదేశానికి వెళ్లి అతడిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ప్రథమ చికిత్స చేయించి ఇంటికి పంపించారు. -
భువనగిరి గుండా వెళ్లే పలు రైళ్లు రద్దు
భువనగిరి: మోంథా తుపాన్ కారణంగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండడంతో బుధవారం భువనగిరి రైల్వే స్టేషన్ గుండా వెళ్లే పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే అధికారులు రద్దు చేశారు. సికింద్రాబాద్ నుంచి భువనగిరి రైల్వే స్టేషన్ మీదుగా విజయవాడ, కాకినాడ, విశాఖపట్నంకు వెళ్లే రైళ్లు రద్దయ్యాయి. సమచారం తెలుసుకుని ప్రయాణికులు రైల్వే స్టేషన్ నుంచి వెనుదిరిగి వెళ్లిపోయారు. ప్రయాణికుల ఇబ్బందులు..బీబీనగర్ : రైళ్లు రద్దు కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బీబీనగర్ రైల్వే స్టేషన్కు వచ్చిన ప్రయాణికులు రైళ్లు రద్దయిన విషయం తెలుసుకుని వరంగల్–హైదరాబాద్ హైవేకు చేరుకొని బస్సులను ఆశ్రయించారు. తుపాన్ కారణంగా సికింద్రాబాద్–బీబీనగర్ రైల్వే మార్గం గుండా వెళ్లే భాగ్యనగర్, నారాయణాద్రి, విశాఖ, కాకతీయ నర్సాపూర్ ఎక్స్ప్రెస్లను రద్దు చేశారు.రైళ్ల రాకపోకలు ఇలా..సికింద్రాబాద్ నుంచి సిర్పూర్ కాగజ్నగర్ వెళ్లే రైలును అప్ అండ్ డౌన్లో రద్దు చేశారు. భాగ్యనగర్ రైలును, సికింద్రాబాద్ నుంచి కాకినాడ పోర్టు వరకు వెళ్లే గౌతమి ఎక్స్ప్రెస్ను రద్దు చేశారు. కాకినాడ నుంచి వచ్చే రైలు యథావిధిగా నడుస్తోంది. గుంటూరు నుంచి విజయవాడ మీదుగా సికింద్రాబాద్కు వచ్చే అప్ అండ్ డౌన్ రైలును కాజీపేట మీదుగా కాకుండా దారి మళ్లించి గుంటూరు–నడికుడి మీదుగా.. ఆదిలాబాద్–తిరుపతి కృష్ణా ఎక్స్ప్రెస్ రైలును ఖాజీపేట మీదుగా కాకుండా బీబీనగర్–నడికుడి మీదుగా నడిపిస్తున్నారు. కాకతీయ, పుష్పుల్ రైళ్లను యథావిఽధిగా నడిపిస్తున్నారు. -
జాతీయ రహదారిపై కెమికల్ ట్యాంకర్ బోల్తా
కేతేపల్లి: హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై కేతేపల్లి మండలం కొర్లపహాడ్ టోల్ప్లాజా వద్ద బుధవారం సాయంత్రం కెమికల్ లోడుతో వెళ్తున్న ట్యాంకర్ అదుపుతప్పి బోల్తా పడింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం హైదరాబాద్ నుంచి కెమికల్ ట్యాంకర్ విజయవాడకు బయల్దేరింది. మార్గమధ్యలో కేతేపల్లి మండలం కొర్లపహాడ్ టోల్ప్లాజా దాటిన వెంటనే ట్యాంకర్ అదుపుతప్పి రోడ్డుపై బోల్తా పడింది. దీంతో ట్యాంకర్లోని కెమికల్ రోడ్డుపై పడి నురగలు రాటడంతో పాటు తెల్లని పొగ కమ్ముకుంది. సమాచారం అందుకున్న కేతేపల్లి పోలీసులు, నకిరేకల్ అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని రోడ్డుపై పడిన పారిన కెమికల్ను నీటితో శుభ్రం చేశారు. అనంతరం పోలీసులు క్రేన్ల సహాయంలో ట్యాంకర్ను రోడ్డుపై నుంచి పక్కకు తొలగించారు. ఈ ఘటనలో ట్యాంకర్ డ్రైవర్ సురక్షితంగా బయటపడ్డాడు. -
రిటర్న్ గిఫ్ట్గా రాజ్యాంగం పుస్తకాలు
ఇబ్రహీంపట్నం రూరల్: తన కుమార్తె వివాహ వేడుకకు హాజరైన బంధువులు, అతిథులకు రాజ్యాంగం పుస్తకాలను రిటర్న్ గిఫ్ట్గా ఇచ్చారు ఓ న్యాయవాది. వివరాలు ఇలా ఉన్నాయి.. సూర్యాపేట జిల్లాలోని ఫణిగిరికి చెందిన విశాఖ మాధవ కృష్ణారెడ్డి హైకోర్టు న్యాయవాదిగా పనిచేస్తూ హైదరాబాద్లో నివాసముంటున్నారు. బుధవారం తన కుమార్తె ఆశృతరెడ్డి వివాహాన్ని రంగారెడ్డి జిల్లా కొంగరకలాన్లోని ఓ ఫంక్షన్ హాల్లో ఘనంగా నిర్వహించారు. న్యాయవాద వృత్తిపై ఉన్న మమకారంతో పాటు భారత రాజ్యాంగంపై అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో పెళ్లికి హాజరైన వెయ్యి మందికి పైగా అతిథులకు రాజ్యాంగం పుస్తకాలను అందజేశారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంతో పాటు మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, కంచె అయిలయ్య తదితరులు రిటర్న్ గిఫ్ట్లు తీసుకుని వకీల్సాబ్ ఆలోచనను అభినందించారు. మహిళపై దాడి కేసులో ఆరుగురికి జైలుశిక్ష రామన్నపేట, వలిగొండ: మహిళపై దాడిచేసి గాయపరిచిన కేసులో ఆరుగురికి జైలుశిక్ష, జరిమానా విధిస్తూ రామన్నపేట అదనపు జ్యూడీషియల్ ఫస్ట్క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు జడ్జి ఎస్. శిరీష బుధవారం తీర్పు వెలువరించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వలిగొండ మండల పరిధిలోని నర్సాపురం గ్రామానికి చెందిన ఓ మహిళపై 2019వ సంవత్సరంలో విజయదశమి వేడుకల్లో అదే గ్రామానికి చెందిన కవాటి మహేష్, కవాటి నరేష్, కవాటి శివ, ఏనుగుల ఉప్పలయ్య, జక్కుల రామకృష్ణ, కవాటి సుదర్శన్ దాడి చేసి గాయపరిచారు. దీంతో సదరు మహిళ ఆరుగురిపై వలిగొండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు అప్పటి ఎస్ఐ పి. శివనాగప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సరైన ఆధారాలు, సాక్ష్యాలు సేకరించి ఆరుగురిపై కోర్టులో చార్జ్షీట్ దాఖలు చేశారు. నేరం రుజువు కావడంతో ఆరుగురు నిందితులకు ఏడాది జైలుశిక్షతో పాటు ఒక్కొక్కరికి రూ.500 చొప్పున జరిమానా విధిస్తూ జడ్జి తీర్పు వెలువరించారు. -
ఢిల్లీలో ఫార్మర్స్ ప్రొడ్యూసింగ్ ఆర్గనైజేషన్ సదస్సుకు ఎంపిక
రామగిరి(నల్లగొండ): దేశ రాజ ధాని ఢిల్లీలో గురువారం, శుక్రవారం జరగనున్న ఫార్మర్స్ ప్రొడ్యూసింగ్ ఆర్గనైజేషన్ సదస్సుకు నల్లగొండ పట్టణంలోని గొల్ల గూడ పీఏసీఎస్ ఎంపికై ంది. ఈ మేరకు పీఏసీఎస్ చైర్మన్ నాగరత్నంరాజు బుధవారం సీఈఓ కంచర్ల అనంతరెడ్డితో కలిసి ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. ఈ సందర్భంగా నాగరత్నంరాజు మాట్లాడుతూ.. తెలంగాణ నుంచి 5 సొసైటీలు ఎంపిక కాగా అందులో గొల్లగూడ సొసైటీ ఒకటని పేర్కొన్నారు. ఆత్మకూర్(ఎం) పీఏసీఎస్ కూడా.. ఆత్మకూరు(ఎం): ఫార్మర్స్ ప్రొడ్యూసింగ్ ఆర్గనైజేషన్ సదస్సుకు ఆత్మకూరు(ఎం) పీఏసీఎస్ కూడా ఎంపిక కాగా.. పీఏసీఎస్ చైర్మన్ జిల్లాల శేఖర్రెడ్డి, సీఈఓ యాస కిరణ్ బుధవారం ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. వ్యక్తి అదృశ్యం.. కేసు నమోదు రామన్నపేట: కుటుంబ సమస్యలతో ఇంట్లో నుంచి వెళ్లిపోయిన వ్యక్తి అదృశ్యమయ్యాడు. బుధవారం రామన్నపేట ఎస్ఐ నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం.. రామన్నపేట మండలం సిరిపురం గ్రామానికి చెందిన శివరాత్రి తేజ, అతడి భార్య శిరీష మధ్య ఇటీవల గొడవ జరిగింది. దీంతో శిరీష తరఫు కుటుంబ సభ్యులు, కుల పెద్దలు తేజను మందలించారు. దీంతో ఈ నెల 25న తేజ ఎవరికీ చెప్పకుండా ఇంటి నుంచి వెళ్లిపోయాడు. అతడి కోసం బంధువులు ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు. తేజ భార్య శిరీష రామన్నపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
ప్రేమ పెళ్లి చేసుకున్న పన్నెండు రోజులకే..
గుర్రంపోడు: వారిద్దరు ప్రేమించుకుని పెద్దలను ఒప్పించి పన్నెండు రోజుల క్రితం పెళ్లి చేసుకున్నారు. కానీ కాళ్ల పారాణి ఆరకముందే నవ వధువు రోడ్డు ప్రమాదంలో మృతిచెందింది. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. గుర్రంపోడు మండలం చామలేడు గ్రామానికి చెందిన శిలువేరు నవీన్ నాంపల్లి మండలం దామెర గ్రామానికి చెందిన అనూష(20) ప్రేమించుకున్నారు. మొదట్లో అనూష తల్లిదండ్రులు వారి ప్రేమకు అంగీకరించకపోవడంతో గుడిలో పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత పెద్దలను ఒప్పించి ఈ నెల 17న గ్రామంలో సాంప్రదాయబద్ధంగా వివాహం చేసుకన్నారు. నవీన్ పెయింటర్గా పనిచేస్తున్నాడు. నవీన్, అనూష కలిసి బుధవారం బైక్పై గుర్రంపోడుకు వస్తున్నారు. అదే సమయంలో గుర్రంపోడు గ్రామానికి చెందిన రేపాక లచ్చయ్య బైక్పై తన పిల్లలకు తీసుకుని గ్రామ శివారులోని బ్రిడ్జి వద్ద వాగు ప్రవాహాన్ని చూపించి మళ్లీ గుర్రంపోడు వైపు వెళ్లేందుకు బైక్ను తిప్పుతున్నాడు. అదే సమయంలో ఎదురుగా వస్తున్న నవీన్ సడన్ బ్రేక్ వేస్తూ లచ్చయ్య బైక్ను ఢీకొట్టి నల్లగొండ– దేవరకొండ రహదారిపై ఎడుమ వైపునకు పడిపోయాడు. బైక్పై వెనుక కూర్చున్న అనూష ఎగిరి బ్రిడ్జి రెయిలింగ్పై నుంచి వాగులోకి పడిపోయింది. అక్కడే ఉన్న స్థానికులు ఎవరో వాగులో పడినట్లు గుర్తించి వాగులోకి వెళ్లి వెతకడం ప్రారంభించారు. అర్ధగంట తర్వాత వాగు ప్రవాహం అంచున గుంతలో అనూష మృతదేహం లభ్యమైంది. తలకు తీవ్ర గాయమైన నవీన్ను 108 వాహనంలో నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి.. అక్కడి నుంచి హైదరాబాద్కు తీసుకెళ్లారు. కాగా ఈ ఘటనపై ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. రోడ్డు ప్రమాదంలో నవ వధువు మృతి భర్తకు తీవ్ర గాయాలు -
అక్రమ దత్తత నుంచి శిశువులకు విముక్తి
నల్లగొండ: ఇద్దరు శిశువులను అక్రమంగా దత్తత తీసుకున్న వారి నుంచి పోలీసులు విడిపించి శిశుగృహకు తరలించారు. ఏడుగురిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు నల్లగొండ ఎస్పీ శరత్చంద్ర పవార్ తెలిపారు. బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ విలేకరులకు వివరాలు వెల్లడించారు. తిరుమలగిరి(సాగర్) మండలం ఎల్లాపురం గ్రామానికి చెందిన కుర్ర బాబుకు 11 ఏళ్ల క్రితం పార్వతితో వివాహమైంది. వీరు నల్లగొండ మున్సిపాలిటీ పరిధిలోని బీటీఎస్లో నివాసముంటున్నారు. బాబు కూలి పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. బాబు, పార్వతి దంపతులకు మొదట కుమారుడు పుట్టి చనిపోగా.. ఆ తర్వాత ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు. అందులో ఒక పాప 2సంవత్సరాల క్రితం అనారోగ్యంతో మృతిచెందింది. 15 రోజుల క్రితం హాలియాలోని నిర్మలా ఆస్పత్రిలో పార్వతి మళ్లీ ఆడపిల్లకు జన్మించింది. కాగా.. ఆడపిల్లను పెంచి పోషించడం తనకు భారమవుతుందని అదే ఆస్పత్రిలో పనిచేస్తున్న శాంతిప్రియ అనే డాక్టర్కు బాబు చెప్పాడు. దీంతో డాక్టర్ శాంతిప్రియ ఆ పాపను దత్తత ఇప్పించేందుకు తనకు తెలిసిన ఏపీలోని ఏలూరుకు చెందిన సాంబమూర్తి, రజిత దంపతులకు చెప్పింది. సాంబమూర్తి, రజిత దంపతులు ఈ నెల 25న నల్లగొండకు వచ్చి సాయంత్రం 7గంటల సమయంలో నల్లగొండ బస్టాండ్ నుంచి రైల్వే స్టేషన్కు వెళ్లే దారిలో బాబు, పార్వతి దంపతుల నుంచి రూ.2.30లక్షలకు పాపను దత్తత తీసుకుంటామని ఒప్పందం చేసుకుని రూ.10వేలు ఇచ్చారు. పాప హెల్త్ చెకప్ చేసిన తర్వాత లీగల్ ప్రాసెస్ పూర్తిచేసి మిగతా డబ్బులు ఇస్తామనే ఒప్పందంతో పాపను సాంబమూర్తి దంపతులు తమ వెంట తీసుకెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న ఐసీడీఎస్ సూపర్వైజర్ సరస్వతి నల్ల గొండ వన్టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు డాక్టర్ శాంతిప్రియను మంగళవారం హైదరాబాద్లో అదుపులోకి తీసుకుని విచారించారు. ఆమె ఉక్రెయిన్లో ఎంబీబీఎస్ చేసి హాలియాలోని నిర్మల ఆస్పత్రిలో డాక్టర్గా చేస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. డాక్టర్ శాంతిప్రియ తమ బంధువు సరస్వతి ద్వారా ఏపీలోని ఏలూరుకు చెందిన సాంబమూర్తి దంపతులు పిల్లలను దత్తత తీసుకోవాలని చూస్తున్నారని తెలుసకుందని, కుర్ర బాబు దంపతులు కూడా తమకు పుట్టిన పాపను విక్రయిస్తామనడంతో సాంబమూర్తి దంపతులకు శాంతిప్రియ సమాచారం ఇచ్చిందని ఎస్పీ వివరించారు. ఈ కేసులో కుర్ర బాబుతో పాటు సాంబమూర్తి, ఆయన భార్య రజిత, డాక్టర్ శాంతిప్రియను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్పీ తెలిపారు.21 రోజుల బాబును అక్రమంగా దత్తత తీసుకున్న కేసులో ముగ్గురిని అరెస్టు చేయగా.. మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు ఎస్పీ తెలిపారు. ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. గుర్రంపోడు మండలం కోనాయిగూడెం గ్రామానికి చెందిన ఓర్సు శ్రీను, సుజాత దంపతులకు ముగ్గురు పిల్లలు సంతానం. భార్య సుజాత, పిల్లలకు దూరంగా ఉంటున్న ఓర్సు శ్రీను ఆరేళ్ల క్రితం మట్టి పని కోసం ఒరిస్సాకు వెళ్లి అక్కడ జంకర్మాల అలియాస్ మమతను రెండో వివాహం చేసుకున్నాడు. వీరికి ఒక పాప పుట్టింది. మమత రెండోసారి గర్భవతి కాగా.. రెండు నెలల క్రితం ఆమెతో కలిసి ఓర్సు శ్రీను స్వగ్రామానికి వచ్చాడు. అయితే కోనాయిగూడేనికే చెందిన వేముల నాగరాజు, సువర్ణను తమ దూరపు బంధువైన కనగల్ మండలం బోయినపల్లికి చెందిన శ్రీను రెండు నెలల క్రితం కలిసి పిల్లలు విక్రయించేవారుంటే చెప్పాలని కోరాడు. ఈ విషయాన్ని నాగరాజు, సువర్ణ కలిసి ఓర్సు శ్రీను, మమత దంపతులకు చెప్పారు. దీంతో ఓర్సు శ్రీను, మమత దంపతులు తమకు పుట్టబోయే బిడ్డను విక్రయించి తిరిగి ఒరిస్సా వెళ్లాలని నిర్ణయించుకుని అందుకు ఒప్పుకున్నారు. ఈ నెల 8న మమత మగ బిడ్డకు జన్మినిచ్చింది. పుట్టిన బిడ్డను విక్రయించాలని నిర్ణయించుకున్న ఓర్సు శ్రీను, మమత దంపతులు వేముల నాగరాజు, సువర్ణకు విషయం చెప్పారు. రూ.6లక్షలకు శిశువును విక్రయిస్తామని చెప్పడంతో మధ్యవర్తి అయిన శ్రీను, నాగరాజు, సువర్ణ ఈ నెల 10న ఈ నెల 10న రూ.4.50లక్షలకు ఒప్పందం చేసుకున్నారని ఎస్పీ తెలిపారు. ఈ నెల 15న డబ్బులు చెల్లించి బాబును తీసుకెళ్లారు. ఈ ఘటనపై కూడా ఐసీడీఎస్ సూపర్వైజర్ సరస్వతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టి మధ్యవర్తి శ్రీనుతో పాటు బాబును కొన్న వేముల నాగరాజు, సువర్ణను అరెస్టు చేసి రిమాండ్కు తరలించామని, బాలుడి తండ్రి ఓర్సు శ్రీను, మమత పరారీలో ఉన్నట్లు ఎస్పీ తెలిపారు. పై రెండు కేసుల్లో మొత్తం ఏడుగురిని అరెస్ట్ చేశామని, శిశువులను శిశుగృహకు అప్పగించినట్లు ఎస్పీ పేర్కొన్నారు. ఈ విలేకరుల సమావేశంలో డీఎస్పీ శివరాంరెడ్డి, ఐసీడీఎస్ పీడీ నిర్మల, సీఐలు రాజశేఖర్రెడ్డి, రాఘవరావు, గణేష్ తదితరులు పాల్గొన్నారు.మరో కేసులో ముగ్గురి అరెస్టు శిశుగృహకు అప్పగించిన పోలీసులు ఏడుగురి అరెస్టు వివరాలు వెల్లడించిన నల్లగొండ ఎస్పీ శరత్చంద్ర పవార్ -
ఆశ్రమ పాఠశాల జల దిగ్బంధం
దేవరకొండ : దేవరకొండ మండలం కొమ్మేపల్లి గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాల చుట్టూ వరద నీరు చేరడంతో జల దిగ్బంధంలో చిక్కుకుంది. దీంతో పాఠశాలలో విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు. విషయం తెలుసుకున్న కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ శరత్చంద్ర పవార్ పాఠశాల వద్దకు చేరుకుని విద్యార్థులను సురక్షిత ప్రాంతానికి తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. రంగంలోకి దిగిన రెస్క్యూ టీం రోప్ సహాయంతో 500 మంది విద్యార్థులను, 26 మంది టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బందిని బయటికి తీసుకొచ్చింది. అక్కడి నుంచి విద్యార్థులను ప్రైవేల్ స్కూల్ బస్సుల్లో మండల పరిధిలోని బీసీ బాలుర గురుకుల పాఠశాలకు తరలించారు. దీంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. నల్లగొండ : కొమ్మేపల్లి ఆశ్రమ పాఠశాలలోకి వర్షపు నీరు చేరిన ఘటనపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి బుధవారం ఆరా తీశారు. పాఠశాలకు ప్రహరిగోడ లేకపోవడం, లోతట్టు ప్రాంతంలో ఉండడం వల్ల స్కూల్లోకి నీరు చేరిందని కలెక్టర్ ఇలా త్రిపాఠి మంత్రికి వివరించారు. రెవెన్యూ, పోలీస్ అధికారుల సహకారంతో విద్యార్థులను పక్కనే ఉన్న బీసీ గురుకులంలోకి తరలించామని చెప్పారు. స్కూల్లో వర్షపు నీరు చేరిందని తెలియగానే అడిషనల్ ఎస్పీ, పోలీసు సిబ్బందితో కలిసి విద్యార్థులను సురక్షితంగా బయటకు తీసుకువచ్చామని ఎస్పీ శరత్చంద్ర పవార్ మంత్రి దృష్టికి తెచ్చారు. జిల్లా వ్యాప్తంగా పోలీస్ యంత్రాంగం అప్రమత్తంగా ఉందన్నారు. వెంటే స్పందించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసిన కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ శరత్చంద్ర పవార్ మంత్రి అభినందించారు. అప్రమత్తంగా ఉండాలి : మంత్రి కోమటిరెడ్డి భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని, ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఆదేశించారు. పోలీస్, రెవెన్యూ, విద్యుత్, ఇరిగేషన్, ఆర్అండ్బీ, పంచాయతీ రాజ్, వైద్య ఆరోగ్య శాఖల సమన్వయంతో పనిచేయాలని సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని ఆయన కలెక్టర్, ఎస్పీని ఆదేశించారు. మూసీ పరివాహక ప్రాంతంలో నీటి ప్రవాహంపై ఆరా తీసి.. అత్యవసరం అయితే అక్కడి ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని సూచించారు. -
ధాన్యం కొనుగోలు కేంద్రాల పరిశీలన
హలియా : గుర్రంపోడు మండలంలోని కొప్పోలు, చామలోనిబావి గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ ఇలా త్రిపాఠి బుధవారం పరిశీలించారు. చామలోనిబావి కేంద్రంలో వరద నీరు ప్రవహిస్తుండటాన్ని గమనించిన ఆమె వరద ఎక్కువై కుప్పలు కొట్టుకుపోయే ప్రమాదం ఉన్నందున తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వర్షాలు తగ్గేవరకు వరికోతలు కోయవద్దని, పచ్చి ధాన్యాన్ని కేంద్రాలకు తీసుకునిరావద్దని రైతులకు సూచించారు. ఆమె వెంట అదనపు కలెక్టర్ శ్రీనివాస్, డీఆర్డీఓ శేఖర్రెడ్డి, దేవరకొండ ఆర్డీఓ రమణారెడ్డి, తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీఓ విజయభాస్కర్, ఏఓ మాధవరెడ్డి, ఏపీఎం ఏశయ్య తదితరులు ఉన్నారు. -
రైళ్ల రాకపోకలకు అంతరాయం
మిర్యాలగూడ అర్బన్ : మోంథా తుపాన్ ప్రభావం రైళ్ల రాకపోకలపై పడింది. తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలకు సికింద్రాబాద్ నుంచి నల్లగొండ మీదుగా వెళ్లే పలు రైళ్లను రద్దు చేయడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రెండు రాష్టాలను కలుపుతూ వెళ్లే జన్మభూమి, విశాఖ, ఫలక్నుమా రైళ్లు బుధవారం కొంత ఆలస్యంగా నడిచాయి. కాగా బుధవారం సాయంత్రం గుంటూరు వెళ్లాల్సిన పల్నాడు ఎక్స్ప్రెస్ను రైల్వే శాఖ రద్దు చేసింది. గురువారం ఉదయం రావాల్సిన పల్నాడు ఎక్స్ప్రెస్ కూడా రద్దయినట్లు రైల్వే అధికారులు పేర్కొన్నారు. సమయానికి వ్యాక్సిన్లు వేయాలిపెద్దవూర : చిన్నపిల్లలకు వ్యాక్సిన్లను సమయానుసారంగా వేయాలని.. ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ చేయవద్దని జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ ఎస్.పద్మ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని హెల్త్ సబ్ సెంటర్, ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పిల్లలకు వ్యాక్సినేషన్ ప్రక్రియను, రికార్డులను పరిశీలించి తగు సూచనలు చేశారు. బాలింతలు, చిన్న పిల్లల తల్లులకు వ్యాక్సినేషన్పై అవగాహన కల్పించేలా ఆశ వర్కర్లకు దిశానిర్దేశం చేయాలన్నారు. ఆమె వెంట మండల వైద్యాధికారి డాక్టర్ నగేష్, రాము, ఉదయ్, సీహెచ్ఓ శ్రీనివాస్, ఏఎన్ఎం వెంకటమ్మ ఉన్నారు. డ్రగ్స్ నియంత్రణలో విఫలంనల్లగొండ టౌన్ : డ్రగ్స్ నియంత్రణలో పోలీసులు, నిఘా సంస్థలు విఫలమయ్యాయని ఐద్వా కేంద్ర నాయకురాలు పుణ్యవతి అన్నారు. బుధవారం నల్లగొండలోని యూటీఎఫ్ భవన్లో ఏర్పాటు చేసిన ఐద్వా సదస్సులో ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మాదక ద్రవ్యాలు, మద్యం సమాజాన్ని దెబ్బతీస్తాయని అన్నారు. ఐద్వా ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా అనేక ఉద్యమాలు, పోరాటాలు చేస్తున్నామని, గ్రామీణ స్థాయి వర కు ఈ ఉద్యమాలను విస్తరించి మహిళలను చైతన్యవంతులను చేసి పోరాడుతామన్నారు. సమావేశంలో పాలడుగు ప్రభావతి, పోలెబోయిన వరలక్ష్మి, కొండ అనురాధ, తుమ్మల పద్మ, పాదూరి గోవర్ధన, ఎండీ సుల్తానా తదితరులు పాల్గొన్నారు. ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలికట్టంగూర్ : వైద్యాధికారులు, సిబ్బంది సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని డీఎంహెచ్ఓ డాక్టర్ శ్రీనివాస్ ఆదేశించారు. కట్టంగూర్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని బుధవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా రికార్డులు, సిబ్బంది హాజరు పట్టికను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సిబ్బంది తప్పనిసరిగా సమయపాలన పాటించాలని, విధి నిర్వహణలో అలసత్వం ప్రదర్శిస్తే సహించేది లేదన్నారు. ఆయన వెంట డిప్యూటీ డీఎంహెచ్ఓ వేణుగోపాల్రెడ్డి, మండల వైద్యాధికారిణి శ్వేత, వైద్య సిబ్బంది ఉన్నారు. -
సామాజిక రుగ్మతలను రూపుమాపాలి
నాటికను ప్రదర్శిస్తున్న కళాబృందం మాట్లాడుతున్న వీసీ అల్తాఫ్ హుస్సేన్ నల్లగొండ టూటౌన్ : విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగుతూ సామాజిక రుగ్మతల రూపుమాపడంలో క్రియాశీలక పాత్ర పోషించాలని ఎంజీ యూనివర్సిటీ వీసీ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ పేర్కొన్నారు. ‘ఎంజాయ్ పేరుతో గంజాయి వద్దు’ పేరుతో తెలంగాణ ప్రజానాట్యమండలి ఆధ్వర్యంలో హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ వరకు నిర్వహిస్తున్న బస్సు కళాజాత బృందం బుధవారం ఎంజీ యూనివర్సిటీకి చేరుకుంది. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ విద్యార్థులు తమలోని నైపుణ్యాలను గుర్తించి సాధనతో ఉన్నత లక్ష్యాలకు చేరుకోవాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రజానాట్య మండలి సామాజిక రుగ్మతలపై కళాజాతాలు నిర్వహించి విద్యార్థులకు అవగాహన కల్పించడం అభినందనీయమన్నారు. అనేక ప్రజా పోరాటాల్లో విద్యార్థుల పాత్ర వారి త్యాగాలు మరువలేనివని, యువశక్తి.. దేశ ప్రగతికి, సామాజిక మార్పునకు ఉపయోగపడాలన్నారు. తెలంగాణ భాష సాంస్కతిక శాఖ సలహా మండలి సభ్యుడు పల్లె నరసింహ బృందం ఆధ్వర్యంలో గంజాయి మహమ్మారిపై లఘు నాటికను ప్రదర్శించారు. ఈ సందర్భంగా కళాబృందం పాటలు, నృత్యాలు అలరించాయి. కార్యక్రమంలో ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, తెలంగాణ ప్రజానాట్యమండలి రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్, విద్యార్థి నాయకులు, రెహమాన్, మురళి, జిల్లా యాదయ్య, అధ్యాపకులు మారం వెంకటరమణారెడ్డి, అనితాకుమారి, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. ఫ ఎంజీయూ వీసీ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ -
చట్టాలకు విలువ ఇవ్వనివారు దేశద్రోహులు
నల్లగొండ టౌన్ : దేశంలో రాజ్యాంగాన్ని గౌరవించని, చట్టాలకు విలువ ఇవ్వని వారు దేశద్రోహులు అని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ అన్నారు. నల్లగొండలోని ఆర్అండ్బీ అతిథి గృహంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. దళితులపై ఇప్పటికీ వివక్ష, అంటరానితనం, దాడులు, హత్యలు, అత్యాచారాలు జరుగుతున్నాయన్నారు. సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ దళితుడైన గవాయ్పై దాడి జరగడం బాధాకరమన్నారు. ఈ ఘటన జరిగి మూడు వారాలు గడుస్తున్నా ఢిల్లీ పోలీసులు మౌనంగా ఉన్నారని, కేసులు పెట్టలేదని, న్యాయవ్యవస్థ సుమోటోగా కేసు తీసుకోలేదని ఆయన విమర్శించారు. మానవ హక్కుల కమిషన్ కూడా స్పందించ లేదంటే ఈ దేశంలో దళితులకు ఎంత రక్షణ ఉందో అర్థమవుతోందన్నారు. ఆ దాడిని, దళితులందరిపై జరిగిన దాడిగా భావిస్తూ నవంబర్ 1న హైదరాబాద్లో నిరసన ర్యాలీ నిర్వహిస్తున్నామని తెలిపారు. సమావేశంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గోవింద్ నరేష్, ఎంఎస్ఎఫ్ జాతీయ అధ్యక్షుడు చిప్పలపల్లి సోమశేఖర్, బకరం శ్రీనివాస్, ఇరిగి శ్రీశైలం, మల్లేపాక వెంకన్న, మేడి శంకర్, కొమిరె స్వామి, కూరపాటి కమలమ్మ, పోలె యాదయ్య పాల్గొన్నారు. రైతాంగాన్ని ఆదుకోవాలి శాలిగౌరారం : మోంథా తుపాన్ కేంద్ర ప్రభుత్వం ప్రకృతి విపత్తుగా ప్రకటించి నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక జాతీయ అద్యక్షుడు మంద కృష్ణ కోరారు. బుధవారం ఆయన మండల కేంద్రంలో ఓ కార్యక్రమానికి హాజరై విలేకరులతో మాట్లాడారు. రైతుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వాలు క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి నష్టపోయిన రైతులకు నష్ట పరిహారం అందించి ఆదుకోవాలన్నారు. ఫ మంద కృష్ణమాదిగ -
వికసిత్ భారత్ లక్ష్యంగా సర్దార్ @150
నల్లగొండ : వికసిత్ భారత్ లక్ష్యంగా సర్దార్ @150 యూనిటీ మార్చ్ నిర్వహించనున్నట్లు రాజ్యసభ సభ్యుడు కేసరి దేవ్సిన్హా జ్వాల తెలిపారు. బుధవారం ఆయన హైదరాబాద్ నుంచి నల్లగొండ, సూర్యాపేట జిల్లాల అధికారులు, మీడియా ప్రతినిధులతో ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫెరెన్స్లో మాట్లాడారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా యూనిటీ మార్చ్ నిర్వహిస్తున్నామని.. ఈ కార్యక్రమానికి తాను ఉమ్మడి జిల్లా ఇన్చార్జిగా నియమితులైనట్లు తెలిపారు. జాతి నిర్మాణంలో యువతను ప్రోత్సహించడం ద్వారా 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యంగా ముందుకెళ్తున్నామన్నారు. ఈనెల 31 నుంచి నవంబర్ 25వ తేదీ వరకు విడతల వారీగా కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు. మార్చ్లో 3 రోజుల పాదయాత్రను జిల్లాస్థాయిలో నిర్వహించాలని పేర్కొన్నారు. యూనిటీ మార్చ్ నిర్వహించడంలో భాగంగా జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన అధికారులతో కోర్ కమిటీలను ఏర్పాటు చేశామన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ జీవితాన్ని ప్రజలకు తెలియజేయడం, వైద్య శిబిరాల నిర్వహణ, యోగా క్యాంపులు, ఎగ్జిబిషన్లు, వర్క్షాప్లు, విద్యార్థులకు డిబేట్లు, వీధి నాటకాలు, ప్రచారాలు, స్వచ్ఛత కార్యక్రమాలను చేపట్టాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం నల్లగొండ కలెక్టరేట్లో ఆర్డీఓ అశోక్రెడ్డి యూనిటీ మార్చ్ పోస్టర్ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రమేష్, డీపీఆర్ఓ వెంకటేశ్వర్లు, జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి ఎండీ.అక్బర్అలీ, జెడ్పీ సీఈఓ శ్రీనివాసరావు, మెప్మా పీడీ శ్రీనివాస్, డీఈఓ భిక్షపతి, సురేష్ గుప్తా తదితరులు పాల్గొన్నారు. -
2 వరకు విద్యుత్ విజిలెన్ వారోత్సవాలు
నల్లగొండ: జిల్లా కేంద్రలోని కలెక్టరేట్లో మంగళవారం కలెక్టర్ ఇలా త్రిపాఠి విద్యుత్ విజిలెన్స్ వారోత్సవాల పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ నెల 27 నుంచి నవంబరు 2వ తేదీ వరకు నిర్వహించనున్న విద్యుత్ విజిలెన్స్ అవగాహన వారోత్సవాల సందర్భంగా కలెక్టర్ ఇలా త్రిపాఠితో పాటు విద్యుత్ అధికారులు, సిబ్బంది ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఏసీపీ మౌనిక, అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, బి. ప్రతాప్కుమార్, విద్యుత్ అధికారులు కె. ఇందిర, ఎస్.కె. గౌస్, ఎస్.నాగరాజుయాదవ్, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. -
కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా బీజేపీ
నల్లగొండ టౌన్ : ఎన్డీఏ ప్రభుత్వం ఎల్ఐసీలో ఉన్న రూ.33 వేల కోట్ల ప్రజల బీమా సొమ్మును సంక్షోభంలో ఉన్న ఆదానీ కంపెనీకి కట్టబెట్టి కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా వ్యవహరిస్తోందని సీపీఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డి విమర్శించారు. మంగళవారం నల్లగొండలోని ఆ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ప్రజలు తిరుగుబాటు చేయాలని పిలుపునిచ్చారు. ఖమ్మం వేదికగా డిసెంబర్ 26న జరిగే సీపీఐ శతాబ్ద ఉత్సవ ముగింపు బహిరంగ సభకు పార్టీ కార్యకర్తలు, నాయకులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. పార్టీ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం మాట్లాడుతూ భారీ వర్షాల కారణంగా పంటలు దెబ్బతిని రైతాంగం తీవ్రంగా నష్టపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. తడిసిన ధాన్యం, పత్తిని మద్దతు ధరతో కొనుగోలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. జిల్లా వ్యాప్తంగా నవంబర్ 17 నుంచి చేపట్టే సీపీఐ జాతను జయప్రదం చేయాలని కోరారు. సమావేశంలో ఉజ్జిని యాదగిరిరావు, పల్లా నర్సింహారెడ్డి, మల్లేపల్లి ఆదిరెడ్డి, పల్లా దేవేందర్రెడ్డి, లోడంగి శ్రవణ్కుమార్, పబ్బు వీరస్వామి, గురిజ రామచంద్రం, బంటు వెంకటేశ్వర్లు, బొల్గూరి నర్సింహ, నల్పరాజు రామలింగయ్య, తీర్పాటి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. -
ఆగ్రహించిన పత్తి రైతు
శాలిగౌరారం: సీసీఐ కేంద్రానికి వచ్చిన పత్తిని కొనుగోలు చేయకుండా నిలిపివేడంపై పత్తి రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీసీఐ అధికారుల వైఖరిని నిరసిస్తూ శాలిగౌరారం మండలంలోని మాధారంకలాన్ గ్రామపంచాయతీ పరిధిలో టీఆర్ఆర్ కాటన్మిల్లు ఎదుట జాతీయ రహదారిపై రైతులు మంగళవారం రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా పత్తి బస్తాలను జాతీయ రహదారిపై వేసి నిప్పుపెట్టి నిరసన తెలిపారు. సీసీఐ అధికారుల వైఖరిని నిరసిస్తూ రైతులు నినాదాలు చేశారు. సుమారు రెండు గంటలపాటు రైతులు రాస్తారోకో చేయడంతో ఇరువైపుల సుమారు రెండు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ సీసీఐ కేంద్రం ప్రారంభం కావడంతో స్లాట్ బుకింగ్ చేసుకొని పత్తిని కేంద్రానికి తీసుకొచ్చామని.. తేమశాతం అధికంగా ఉందన్న పేరుతో సీసీఐ అధికారులు పత్తిని కొనుగోలు చేయడం లేదన్నారు. తుపాన్ ప్రభావానికి ఎండిన పత్తిలో సైతం తేమశాతం పెరుగుతుందన్నారు. సంబంధిత అధికారులు వచ్చి పత్తి కొనుగోలు చేస్తామని హామీ ఇస్తేనే రాస్తారోకోను విరమిస్తామని తేల్చిచెప్పారు. విషయం తెలుసుకున్న మండల అధికారులు రైతులకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా వారు ససేమిరా అనడంతో విషయాన్ని జిల్లా ఉన్నతాధికారులకు చెప్పారు. దీంతో నల్లగొండ ఆర్డీఓ అశోక్రెడ్డి, జిల్లా మార్కెటింగ్ అధికారి ఛాయాదేవి, శాలిగౌరారం సీఐ కొండల్రెడ్డి, తహసీల్దార్ వరప్రసాద్, వ్యవసాయ మార్కెట్ కార్యదర్శి చీనానాయక్ రైతుల వద్దకు చేరుకొని మాట్లాడారు. ఈ క్రమంలో రైతులు, అధికారుల మధ్య వాగ్వాదం జరిగింది. జిల్లా ఉన్నతాధికారులు.. సీసీఐ అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించారు. ప్రస్తుతం పత్తి విక్రయానికి 22 ట్రాక్టర్లు రాగా అందులో 11 ట్రాక్టర్ల పత్తిని బుధవారం, మరో 11 ట్రాక్టర్ల పత్తిని గురువారం కొనుగోలు చేసేలా సీసీఐ అధికారులతో మాట్లాడారు. దీంతో రైతులు రాస్తారోకో విరమించారు. ప్రస్తుతం కేంద్రానికి వచ్చిన 22 ట్రాక్టర్ల మినహా.. తుపాన్ ప్రభావంతో పత్తి కొనుగోలు నిలిపివేస్తున్నట్లు సీసీఐ అధికారులు ప్రకటించారు. తుపాన్ ప్రభావం తగ్గిన తర్వాత పత్తి కొనుగోలు చేస్తామని సీసీఐ సీపీఓ రవీందర్ తెలిపారు. కార్యక్రమంలో మధారంకలాన్, వంగమర్తి, పెర్కకొండారం, చిత్తలూరు, వల్లాల గ్రామాల రైతులు పాల్గొన్నారు.ఫ కొనుగోలుకు కొర్రీలు పెడుతున్నారని ఆవేదన ఫ జాతీయ రహదారిపై పత్తికి నిప్పుపెట్టి నిరసన -
కేంద్రాలకు ఒకేసారి ధాన్యం తేవొద్దు
నల్లగొండ : రైతులు కొనుగోలు కేంద్రాలకు ఒకేసారి ధాన్యం తేవొద్దని.. విడతల వారీగా ధాన్యం తెచ్చేలా అధికారులు అవగాహన కల్పించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి కోరారు. ధాన్యం సేకరణపై శనివారం వివిధ శాఖల అధికారులు, మిల్లర్లతో మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. కొనుగోలు కేంద్రాలు, మిల్లులకు రైతులు ఒకేసారి ధాన్యం తీసుకురావడం వల్ల ఇబ్బందులు ఏర్పడే ప్రమాదం ఉందన్నారు. వ్యవసాయ శాఖ అధికారులు వరి కోతల ఆధారంగా ఒక షెడ్యూల్ను రూపొందించాలని ఆదేశించారు. ఒకేసారి వరి కోతలు జరగకుండా ఇదివరకే డివిజన్ల వారిగా హార్వెస్టర్లతో సమావేశాలు నిర్వహించినట్లు తెలిపారు. మిర్యాలగూడ ప్రాంతంలో సన్నధాన్యం ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్నందున ఒక్కోసారి మిల్లుల వద్ద ట్రాక్టర్లు నిలిచిపోయి ట్రాఫిక్ జామ్ ఏర్పడే అవకాశం ఉందన్నారు. సన్నధాన్యం కొనుగోలు విషయంలో మిల్లర్లు ఎలాంటి సమస్యలు సృష్టించవద్దని పేర్కొన్నారు. పత్తిలో 8 నుంచి 12 శాతం తేమ ఉంటేనే కొనుగోలు కేంద్రానికి తీసుకెళ్లాలని సూచించారు. తేమను పరిశీలించుకునేందుకు ప్రతి క్లస్టర్కు ఒక మిషన్ ఇచ్చామన్నారు. ఎస్పీ శరత్చంద్ర పవార్ మాట్లాడుతూ ధాన్యం కొనుగోలుకు పోలీస్ శాఖ తరఫున సహకారం అందిస్తామన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, మిల్లర్ల అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు శ్రీనివాస్, భద్రాద్రి, ఏఎస్పీ మౌనిక, డీఆర్డీఓ శేఖర్రెడ్డి, ఆర్డీఓలు రమణారెడ్డి, శ్రీదేవి, డీఎస్పీ శివరాంరెడ్డి, రాజశేఖర్శర్మ, డీసీఓ పత్యానాయక్, డీఎస్ఓ వెంకటేశం, డీఎం గోపికృష్ణ, డీఏఓ శ్రవణ్కుమార్ పాల్గొన్నారు. ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి -
వైద్యులు సమయపాలన పాటించాలి
దేవరకొండ : ప్రభుత్వ వైద్యులు సమయపాలన పాటిస్తూ అందుబాటులో ఉండి మెరుగైన వైద్య సేవలు అందించాలని డీఎంహెచ్ఓ పుట్ల శ్రీనివాస్ పేర్కొన్నారు. మంగళవారం చందంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రోగులతో మాట్లాడి అందుతున్న వైద్య సేవలపై ఆరాతీశారు. అనంతరం రికార్డులను పరిశీలించి పలు సూచనలు చేశారు. ఆయన వెంట డిప్యూటీ డీఎంహెచ్ఓ రవి, వైద్యులు రాజేష్, వైద్య సిబ్బంది ఎస్తేర్ రాణి, రమేష్, శరత్ తదితరులున్నారు. కపాస్ కిసాన్ యాప్ను సద్వినియోగం చేసుకోవాలితిప్పర్తి : పత్తి రైతులు కపాస్ కిసాన్ యాప్ను సద్వినియోగం చేసుకోవాలని మార్కెటింగ్ ఏడీ ఛాయాదేవి అన్నారు. మంగళవారం తిప్పర్తి మార్కెట్ యార్డులో ఆ యాప్పై రైతులకు అవగాహన కల్పించారు. పత్తి అమ్ముకోడానికి ఈ యాప్ను ఎలా ఉపయోగించాలో వివరించారు. బుక్ చేసిన స్లాట్ వివరాలను ఈయాప్ ద్వారా తెలుసుకోవచ్చని పేర్కొన్నారు. ఆమె వెంట ఏఓ సన్నిరాజు, ఏఈఓ సంతోషి తదితరులు పాల్గొన్నారు. నూతన కార్యవర్గం ఎన్నిక నల్లగొండ టూటౌన్ : తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ డివిజన్ మహాసభ మంగళవారం నల్లగొండ పట్టణంలోని యూటీఎఫ్ భవన్లో జరిగింది. ఈ మహాసభలో అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలకుర్తి కృష్ణమూర్తి, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు లింగా అరుణ సమక్షంలో నల్లగొండ డివిజన్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. డివిజన్ గౌరవాధ్యక్షుడిగా చిట్టిపోలు భిక్షమయ్య, అధ్యక్షుడిగా గుండాల భిక్షమయ్య, ప్రధాన కార్యదర్శిగా చేపూరి పరశురాములు, ఉపాధ్యక్షులుగా కొమ్మారెడ్డి రాయపురెడ్డి, ఏశాల జయలక్ష్మి, సామ అంజిరెడ్డి, కోశాధికారిగా రాపోలు వెంకటేశం, కార్యదర్శులుగా సావిత్రి పటాలే, పెండెం విజయకుమారి, మౌలానా అస్కర్, రచ్చ సూర్యనారాయణ, ఆడిట్ కన్వీనర్గా వనమా నరసింహ ఎన్నికయ్యారు. కార్యక్రమంలో అసోసియేషన్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు నూకల జగదీష్చంద్ర, పందిరి శ్యాంసుందర్, జిల్లా గౌరవాధ్యక్షుడు కుకుడాల గోవర్ధన్, ఎండి.అబ్దుల్ఖాదర్, వనం శ్రీవాణి, రమేష్, కె.రాఫెల్, వై.సత్తయ్య, భిక్షపతి తదితరులు పాల్గొన్నారు. 1న దళితుల ఆత్మగౌరవ ర్యాలీనల్లగొండ: సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్పై దాడి జరిగితే ఇప్పటికీ కేసు నమోదు చేయకపోవడాన్ని నిరసిస్తూ నవంబర్ 1 న ఛలో హైదరాబాద్ పేరుతో లక్షలాది మందితో దళితుల ఆత్మగౌరవ ర్యాలీ నిర్వహించనున్నట్లు ఎంఎస్ఎఫ్ జాతీయ అధ్యక్షుడు చిప్పలపల్లి సోమశేఖర్ తెలిపారు. నల్లగొండలోని ప్రభుత్వ కేపీఎం జూనియర్ కళాశాలలో మంగళవారం ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జస్టిస్ గవాయ్పై దాడి ఘటనపై కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేసి జైల్లో పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై సుప్రీం కోర్టు రిటైర్డు జడ్జితో విచారణ చేయించాలన్నారు. సమావేశంలో ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు ఇరిగి శ్రీశైలం, ఎంఈఎఫ్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు మలపాక వెంకన్న, జిల్లా నరసింహ, సాయి కిరణ్ గోపీచంద్, నరేష్, మురళి స్వామి, అన్నపూర్ణ, శైలజ, వాణి, శ్రీలత పాల్గొన్నారు. -
విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి
హాలియా : చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఇంటర్మీడియట్ ప్రత్యేక అధికారి భీమ్సింగ్ సూచించారు. హాలియా ప్రభుత్వ జూనియర్ కళాశాలను మంగళవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ పేస్ రికగ్నిషన్ సిస్టమ్లో విద్యార్థులు తమ పేరును నమోదు చేసుకోవాలని చెప్పారు. హాజరుశాతం తక్కువగా ఉన్న విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడి వారి నుంచి తగిన కారణాలతో కూడిన ఉత్తరాలు తీసుకోవాలని సూచించారు. నవంబర్ నుంచి ప్రతి కళాశాలకు డిజిటల్ బోర్డులు అందజేస్తామన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ జాఖీర్ హుస్సేన్, అధ్యాపకులు ఆదిరెడ్డి, బాలరాజు, వెంకట్నాయక్, హరికృష్ణ, సంజీవరెడ్డి, లింగమూర్తి తదితరులు ఉన్నారు. నాగార్జునసాగర్లో.. విద్యార్థులను వార్షిక పరీక్షలకు సిద్ధం చేయాలని ఇంటర్మీడియట్ విద్యామండలి జాయింట్ సెక్రటరీ భీమ్సింగ్ సూచించారు. మంగళవారం నాగార్జునసాగర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఆయన తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన పలువురు విద్యార్థుల నివాసాలను సందర్శించి తల్లిదండ్రుకు సూచనలు చేశారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ దాసరి రాజశేఖర్, అధ్యాపకులు చింతపల్లి వెంకటయ్య, ప్రసన్నలక్ష్మి, బంగారు ఉపేంద్రాచారి, గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
పోచంపల్లిలో శిక్షణ కార్మికులు
ప్రీలూమ్స్, మగ్గాలపై శిక్షణ పొందుతున్న చేనేత కార్మికులు భూదాన్పోచంపల్లిని సందర్శించారు. - 8లోఈ ఫొటోలోని రైతు నల్లగొండ మండలం రసూల్పుర గ్రామానికి చెందిన గుండెబోయిన లింగయ్య. ఈ రైతు పదెకరాలు కౌలుకు తీసుకుని వరిసాగు చేశాడు. 15 రోజుల క్రితం నర్సప్పగూడెంలోని కొనుగోలు కేంద్రానికి ధాన్యం తెచ్చాడు. రోజూ కురస్తున్న వర్షాలకు ధాన్యం అంతా తడుస్తోంది. అందులో కొంత మొలకెత్తింది. ధాన్యం ఆరబెట్టుకునేందుకు సెంటర్ నిర్వాహకులు టార్పాలిన్లు ఇవ్వడం లేదు. దీంతో రోజూ 40 పట్టాల వరకు కిరాయికి తీసుకొస్తున్నాడు. వాటికి రోజుకు రూ.వెయ్యి వరకు కిరాయి అవుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. -
ప్రజల ముందు దోషులుగా నిలబెట్టాలి
యాదగిరిగుట్ట: కాళేశ్వరం ప్రాజెక్టులో వేల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడిన మాజీ మంత్రి హరీష్రావు, సంతోష్రావు, వీరి బినామీలను ప్రజల ముందు దోషులుగా నిలబెట్టాలని భువనగిరి ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు. మాజీ ఎంపీ కవిత ఆరోపణలతో హరీష్రావు, సంతోష్రావులపై చర్యలు తీసుకొని, వారిపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తూ యాదగిరిగుట్ట పోలీస్ స్టేషన్లో పట్టణ సీఐ భాస్కర్కు సోమవారం ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. మాజీ ఎంపీ కవిత చేసిన అవినీతి ఆరోపణల ఆధారణంగా విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలన్నారు. బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ సంపదను దోచుకున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ అవినీతిని స్వయంగా కేసీఆర్ కుమార్తె కవిత నిర్ధారించారని పేర్కొన్నారు. ప్రజా పాలనపై బీఆర్ఎస్ నేతలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ముఖ్యమంత్రి అనే మర్యాద లేకుండా రేవంత్రెడ్డి చెంప చెల్లుమనిపించాలని మాజీ మంత్రి హరీష్రావు మాట్లాడటం సరైంది కాదన్నారు. బీఆర్ఎస్ దోచుకున్నందుకు 2023 ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో, కంటోన్మెంట్ ఎన్నికల్లో ఇంటికి పంపించారని అన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో సైతం బీఆర్ఎస్కు చెంప చెల్లుమనేలా ఓటర్లు సమాధానం ఇస్తారన్నారు. వీరి వెంట డీసీసీ అధ్యక్షుడు అండెం సంజీవరెడ్డి, మదర్ డెయిరీ చైర్మన్ మధుసూదన్రెడ్డి, నాయకులు బందారపు బిక్షపతి, చీర శ్రీశైలం, ముక్కెర్ల మల్లేశం, గుండ్లపల్లి భరత్, ఎరుకల హేమేందర్ తదితరులు ఉన్నారు. విచారణ చేపడుతున్నాం..మాజీ మంత్రి హరీష్రావు, మాజీ ఎంపీ సంతోష్కుమార్, నవీన్రావులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ భువనగిరి ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి, ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య సోమవారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారని యాదగిరిగుట్ట పట్టణ సీఐ భాస్కర్ తెలిపారు. ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ఇచ్చిన ఫిర్యాదుతో విచారణ చేస్తున్నామని, తదుపరి చర్యలు తీసుకుంటామని, ఇంకా కేసు నమోదు చేయలేదని సీఐ పేర్కొన్నారు. హరీష్రావు, సంతోష్రావుపై విచారణ చేపట్టాలి యాదగిరిగుట్ట పోలీస్స్టేషన్లో ఎంపీ, ఎమ్మెల్యే ఫిర్యాదు -
చెల్లిని ఇవ్వొద్దు..
తిరుమలగిరి(నాగార్జునసాగర్): ఆడ శిశువు పుట్టిన పదిరోజులకే గిరిజన దంపతులు విక్రయించారు. వివరాల్లోకి వెళితే.. నల్లగొండ జిల్లా తిరుమలగిరి(సాగర్) మండలం యల్లాపురంతండాకు చెందిన కొర్ర బాబు–పార్వతి దంపతులు నల్లగొండలో కూలి పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. పార్వతి మొదటి కాన్పు 2016లో మగబిడ్డకు జన్మనిచ్చింది. ఉమ్మనీరు అధికంగా తాగడంతో పుట్టినబాబు అదే రోజున మృతిచెందాడు. ఆ తర్వాత పార్వతి రెండు, మూడు కాన్పుల్లోనూ ఆడపిల్లలకు జన్మనిచ్చింది. వారసుడి కోసం పార్వతి నాలుగోసారి గర్భం దాల్చింది.పది రోజుల క్రితం నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవించగా.. మళ్లీ ఆడపిల్లే జన్మించింది. అయితే ముగ్గురు ఆడపిల్లలను సాకలేమని భావించిన ఆ దంపతులు ఆ శిశువు అమ్మకానికి సిద్ధమయ్యారు. మధ్యవర్తుల ద్వారా గుంటూరు జిల్లా బాపట్లకు చెందిన దంపతులకు ఆడశిశువును రూ.3 లక్షలకు రెండు రోజుల క్రితం విక్రయించారు. బాబు–పార్వతి దంపతులు శిశువును విక్రయిస్తుండగా.. వారి కుమార్తెలు చెల్లిని ఇవ్వొద్దంటూ గుక్కపట్టి ఏడుస్తున్న వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అమ్మా, నాన్న చెల్లిని ఇవ్వకండి అంటూ ఏడుస్తున్న వీడియో చూసిన ప్రతి ఒక్కరి మనసు కలిచివేసింది. ఆ తర్వాత పార్వతి తన పుట్టినిల్లు పెద్దవూర మండలం ఊరబావితండాకు వెళ్లింది. శిశువుని విక్రయించిన విషయం కొర్ర బాబు అన్న సురేశ్నాయక్కు తెలియడంతో ఆ చిన్నారిని మనమే సాకుదామని విక్రయించిన శిశువును తిరిగి తీసుకురావాలని కుటుంబ సభ్యులపై ఒత్తిడి తీసుకొచ్చాడు. ఈ క్రమంలోనే విషయం అంగన్వాడీ అధికారుల దృష్టికి వెళ్లింది. అధికారులు వారి ఇంటికి వచ్చి వివరాలు సేకరించారు. -
జాక్పాట్ కొట్టిన నల్లగొండ దంపతులు
సాక్షి, హైదరాబాద్,సూర్యాపేట టౌన్: వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణానికి చెందిన రాజేశ్వర్రావు, సాంబలక్ష్మి దంపతులు ఈసారి మద్యం దుకాణాల్లో జాక్పాట్ కొట్టారు. లక్కీడ్రాలో రాజేశ్వర్రావు, సాంబ లక్ష్మిలకు చెరో దుకాణం మంజూరైంది. 25 ఏళ్లుగా మద్యం వ్యాపారంలో ఉంటున్న వీరు ఈసారి కూడా టెండర్లు దాఖలు చేశారు. జి.సాంబలక్ష్మి నర్సంపేట –5 నంబర్ దుకాణం దక్కించుకోగా భర్త జి.రాజేశ్వర్రావు ఆత్మకూర్–38 షాపు లాటరీ డ్రాలో విజేతగా నిలిచాడు. కాగా, రెండు షాపులు దక్కడం అదృష్టంగా భావిస్తున్నామని భార్యాభర్తలు తెలిపారు. వందలో ఒక్కడు.. హనుమకొండ జిల్లా నడికూడ మండల పరిధిలోని 14 గ్రామాలకు కలిపి ఒకే వైన్షాపు ఉంది. ఈ దుకాణానికి 100 అప్లికేషన్లు వచ్చాయి. సోమవారం లాటరీ పద్ధతిలో డ్రా తీయగా 100 అప్లికేషన్ల నుంచి జి.రమణారెడ్డి అనే వ్యక్తికి లక్కు తగిలింది. వందలో ఒక్కడు అంటూ ఈ వార్త సామాజిక మాధ్యమాల్లో వైరలైంది. భార్యాభర్తలను వరించిన అదృష్టం మద్యం దుకాణాల టెండర్ల డ్రాలో భార్యాభర్తలను అదృష్టం వరించింది. నల్లగొండ జిల్లా వేములపల్లి మండలం లక్ష్మీదేవిగూడెం గ్రామానికి చెందిన ఎలికట్టి భరత్, ఆయన భార్య శ్రావణి సూర్యాపేట పట్టణంలో చెరో మద్యం షాపును దక్కించుకున్నారు. ఒకే ఇంట్లో ముగ్గురికి.. సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండల కేంద్రానికి చెందిన ఒకే కుటుంబంలోని ముగ్గురికి మద్యం దుకాణాలు దక్కాయి. మండల కేంద్రానికి చెందిన రిటైర్డ్ ఉద్యోగి గిలకత్తుల ఉప్పల మల్లయ్యకు సూర్యాపేటలో, ఆయన కుమారుడు నవీన్కు మద్దిరాలలో, కోడలు సృజనకు తిరుమలగిరిలోని వైన్ షాపులు డ్రాలో వచ్చాయి. ఉప్పల మల్లయ్య కొన్ని సంవత్సరాలుగా మద్యం వ్యాపారంలోనే ఉన్నారు. 2,601 మద్యం దుకాణాల డ్రా... తెలంగాణలో రెండేళ్లపాటు మద్యం దుకాణాలు నడుపుకోవడానికి దరఖాస్తు చేసుకున్న వారికి సంబంధించి జిల్లాల కలెక్టర్ల సమక్షంలో డ్రా తీశారు. మొత్తం 2,620 దుకాణాల కోసం దరఖాస్తులు ఆహ్వానించారు. కాగా అందులో 2,601 దుకాణాలకు డ్రా తీసి గెలుపొందిన వారికి అనుమతినిచ్చారు. డ్రా సమయంలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోలేదని ఎక్సైజ్ వర్గాలు తెలిపాయి. 2,620 దుకాణాలకు మొత్తం 95,137 దరఖాస్తులు రాగా, ఒక్కో దరఖాస్తుకు ఫీజు కింద రూ.3 లక్షల లెక్కన రూ. 28.54 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి సమకూరింది. ఎలాంటి ఉద్రిక్త ఘటనలు జరుగకుండా డ్రా ప్రక్రియ ముగియడంపై ఎక్సైజ్ కమిషనర్ హరికిరణ్ యంత్రాంగాన్ని అభినందించారు. కాగా, మిగిలిన 19 మద్యం దుకాణాలకు మంగళవారం నోటిఫికేషన్ జారీ చేయడంతోపాటు దరఖాస్తులు తీసుకుంటామని అధికారులు తెలిపారు. నవంబర్ 1 వరకు మద్యం షాపులకు దరఖాస్తుల స్వీకరణ, నవంబర్ 3న 19 మద్యం షాపులకు డ్రా తీయనున్నట్లు ఎౖMð్సజ్ ఉన్నతాధికారి పేర్కొన్నారు.ప్రభుత్వ టీచర్కుమద్యం దుకాణం.. విచారణ చేస్తామన్న డీఈఓ మహబూబ్నగర్ క్రైం: మద్యం దుకాణాల కేటాయింపు లక్కీడిప్లో ఓ ప్రభుత్వ టీచర్కు మద్యం దుకాణం దక్కింది. మహబూబ్నగర్ కలెక్టరేట్లో కలెక్టర్ విజయేందిర బోయి ఆధ్వర్యంలో ఏ4 మద్యం దుకాణాలకు లక్కీడిప్ నిర్వహించారు. ఇందులో గెజిట్ నంబర్ 16వ దుకాణానికి లక్కీడిప్ తీసిన క్రమంలో 17వ టోకెన్ నంబర్ కలిగిన బి.పుష్ప అనే ప్రభుత్వ పీఈటీ ఉపాధ్యాయురాలికి దుకాణం వచ్చింది. ఆమె ప్రస్తుతం జిల్లాకేంద్రంలోని రాంనగర్ ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్నారు. ఈ విషయంపై డీఈఓ ప్రవీణ్కుమార్ను వివరణ కోరగా, సీసీఏ నిబంధనల ప్రకారం ప్రభుత్వ ఉద్యోగి ఎలాంటి వ్యాపారాలు చేయరాదని, ఒకవేళ చేస్తే చర్యలు తీసుకుంటామని తెలిపారు. విచారణ నివేదిక ఉన్నతాధికారులకు అందజేస్తామని డీఈఓ తెలిపారు. -
ముగిసిన అనూషారెడ్డి అంత్యక్రియలు
గుండాల: ఏపీలోని కర్నూలు జిల్లాలో గురువారం రాత్రి జరిగిన ట్రావెల్స్ బస్సు ప్రమాదంలో సజీవ దహనమైన గుండాల మండలం వస్తాకొండూర్ గ్రామానికి చెందిన మహేశ్వరం అనూషారెడ్డి(22)అంత్యక్రియలు సోమవారం స్వగ్రామంలో కుటుంబ సభ్యులు, బంధువుల అశ్రునయనాల మధ్య పూర్తయ్యాయి. ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన అంబులెన్స్లో మృతురాలి బంధువులు కర్నూలు నుంచి అనూషారెడ్డి మృతదేహాన్ని తీసుకుని సోమవారం ఉదయం 6.30గంటలకు వస్తాకొండూర్ గ్రామానికి వచ్చారు. అనంతరం అంత్యక్రియలు నిర్వహించారు. అనూషారెడ్డి మృతదేహానికి ఆమె తండ్రి శ్రీనివాస్రెడ్డి తలకొరివి పెట్టారు. ఆమె తల్లిదండ్రులు విలపిస్తున్న తీరును చూసి గ్రామస్తులు కంటతడి పెట్టారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి పరామర్శరాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి సోమవారం భువనగిరి ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి, ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్యతో కలిసి అనూషారెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఉన్నత చదువులు చదివి బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్న అనూషారెడ్డి మరణం తీవ్రంగా కలిచివేసిందని అన్నారు. వారి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. జాతీయ రహదారులపై వాహనాల స్పీడును తగ్గించేందుకు ఇటీవల సమీక్ష సమావేశం నిర్వహించి అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. వాహనాలు జాగ్రత్తగా వెళ్లేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. -
బైక్పై వెళ్తూ వాగులో పడిపోయిన వ్యక్తి
అర్వపల్లి: జాజిరెడ్డిగూడెం మండలంలోని తిమ్మాపురం–సంగెం రహదారి విస్తరణ పనుల్లో భాగంగా కోడూరు వద్ద వాగుపై వంతెన నిర్మాణం జరగాల్సి ఉంది. అయితే ఇంతవరకు వంతెన నిర్మాణ పనులు మొదలు కాలేదు. దీంతో వర్షాలు కురిసినప్పుడు వాగు పొంగి రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగు పొంగి ప్రవహిస్తోంది. సోమవారం ఓ వ్యక్తి బైక్పై వెళ్తూ కోడూరు వద్ద వాగు దాటుతుండగా.. అదుపుతప్పి వాగులో పడిపోయాడు. వంతెన నిర్మాణ పనులను తొందరగా పూర్తిచేయాలని ప్రయాణికులు అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు. -
స్టేట్మెంట్ రికార్డు కోసం బెంచ్ దిగొచ్చిన జడ్జి
రామన్నపేట: నడవలేని స్థితిలో ఉన్న వ్యక్తి వద్దకు నేరుగా జడ్జి వెళ్లి స్టేట్మెంట్ రికార్డు చేశారు. రామన్నపేట కోర్టులో సోమవారం ఈ సంఘటన జరిగింది. మోత్కూరు మండలం దాచారం గ్రామానికి చెందిన అంతటి లింగస్వామి 2019లో నమోదైన ఓ కేసు విషయంలో స్టేట్మెంట్ ఇవ్వడానికి సోమవారం కోర్టుకు వచ్చాడు. పక్షవాతం రావడంతో అతడు నడవలేని స్థితిలో ఉన్నాడు. కుటుంబ సభ్యులు అతడిని కోర్టుకు కారులో తీసుకొచ్చారు. పరిస్థితిని గమనించిన ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఎస్. శిరీష కారులో ఉన్న లింగస్వామి వద్దకు వెళ్లి విచారించి స్టేట్మెంట్ రికార్డు చేశారు. స్థానిక ఎన్నికల్లో నాలుగు స్తంభాలాటనల్లగొండ: స్థానిక సంస్థల ఎన్నికల్లో రాష్ట్రంలో నాలుగు స్తంభాలాట మొదలైందని తెలంగాణ ప్రజారాజ్యం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జిలకర రవికుమార్ అన్నారు. సోమవారం నల్లగొండలోని ప్రెస్ క్లబ్లో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు దీటుగా తెలంగాణ ప్రజారాజ్యం పార్టీ పురుడు పోసుకుందని తెలిపారు. యువతన రాజకీయ నాయకులుగా తయారుచేసే ఏకైక పార్టీ తమదేనన్నారు. -
ఆలేరు కేంద్రంగా అధిక వడీ్డ దందా..!
ఆలేరు: ‘రూ.లక్ష అప్పు తీసుకుంటే చేతికి ఇచ్చేది రూ.75వేలు మాత్రమే.. మిగతా రూ.25వేలు వడ్డీ కింద తీసుకుంటారు. ఈ వడ్డీ కేవలం పది రోజులకే’ ఇది క్యాసినో జూదంలో నష్టపోయిన ఓ బాధితుడి ఆవేదన. క్యాసినో జూదం పేరుతో ఆలేరు కేంద్రంగా పెద్దఎత్తున అధిక వడ్డీ దందా కొనసాగుతోంది. ఇటీవల గోవా క్యాసినో జూదం వ్యవహారం వెలుగులోకి రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. అధిక వడ్డీ బాధితులు కొందరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. క్యాసినో జూదంలో రూ.లక్షల్లో నష్టపోయి, అధిక వడ్డీలు కట్టలేక కొందరు మధ్యతరగతి వర్గాలు కుదేలవుతుండగా.. అధిక వడ్డీకి అప్పులు ఇస్తూ, ముందు జాగ్రత్తగా అప్పు తీసుకున్న వారి నుంచి తెల్ల కాగితాలపై వడ్డీ వ్యాపారులు సంతకాలు చేయించుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై ప్రశ్నించిన బాధితులను సదరు వడ్డీ వ్యాపారులు బెదిరింపులకు గురిచేస్తున్నట్లు సమాచారం. గెలిచినా డబ్బులు ఇవ్వరు.. క్యాసినో జూదం ఆడేందుకు గోవాకు చాలామంది వెళ్తుండగా.. క్యాసినో ఆడేందుకు ఏజెంట్ల పేరు మీద నిర్వాహకుల వద్ద రూ.లక్ష వరకు డిపాజిట్ చేస్తుంటారు. ఇందుకు నిర్వాహకులు రూ.లక్ష విలువ చేసే కాయిన్లను ఇస్తారు. ఈ కాయిన్లతో పలు రకాల జూదం ఆడుతారు. ఒకవేళ జూదంలో గెలిచినా డబ్బులు ఇవ్వడానికి నిర్వాహకులు కొర్రీలు పెడుతుంటారని సమాచారం. రూ.లక్ష గెలుచుకుంటే కేవలం ఖర్చుల కోసం రూ.30వేల మాత్రమే అందజేస్తుంటారని, పెట్టుబడి రూ.లక్ష, గెలుచుకున్న రూ.లక్షలో రూ.30వేలు పోను మిగతా రూ.70వేలను బ్యాంకు ఖాతాలో జమచేస్తామని క్యాసినో ఆడిన వారిని నిర్వాహకులు బురిడీ కొట్టిస్తున్నారని తెలుస్తోంది. ఈ విషయమై తమను గోవాకు తీసుకెళ్లిన ఏజెంట్లు కూడా నిర్వాహకులను ప్రశ్నించరని క్యాసినో బాధితులు చెబుతున్నారు. ఒకవేళ ఎవరికై నా డబ్బులు కావాలంటే మరోసారి గోవాకు వచ్చినప్పుడు క్యాసినో ఆడేందుకు పెండింగ్ మొత్తానికి కాయిన్లు అందజేస్తారని తెలుస్తోంది. ఇలా తనకు రూ.3లక్షల వరకు ఇవ్వలేదని ఓ బాధితుడు పేర్కొన్నాడు. రూ.లక్ష అప్పుగా తీసుకుంటే పది రోజులకే రూ.25వేల వడ్డీ ముందుగానే అప్పు తీసుకున్న వారితో తెల్ల కాగితాలపై సంతకాలు పోలీసులకు క్యాసినో బాధితుల ఫిర్యాదుబిట్ కాయిన్ సెటిల్మెంట్లుక్యాసినో జూదం తరహాలోనే ఆలేరులో బిట్ కాయిన్ వ్యవహారాలూ పెద్దఎత్తున జరుగుతున్నట్లు పోలీసుల దృష్టికి వచ్చింది. కొందరు ఏజెంట్లుగా అవతారమెత్తి మహిళలు, యువకులతో బిట్ కాయిన్లో రూ.లక్షల్లో పెట్టుబడులు పెట్టిస్తున్నట్లు సమాచారం. బిట్ కాయిన్లో సుమారు రూ.8లక్షల వరకు పెట్టుబడి పెట్టి నష్టపోయానని పది రోజుల కిత్రం ఓ మహిళ పోలీస్ స్టేషన్కు వచ్చింది. ఈ విషయం తెలుసుకున్న కొందరు నాయకులు పోలీస్ స్టేషన్కు చేరుకుని సదరు మహిళకు నచ్చజెప్పారు. తర్వాత ఏజెంట్తో మాట్లాడి సుమారు రూ.4లక్షలకు సెటిల్మెంట్ చేసుకున్నట్లు సమాచారం. ఇలా బిట్ కాయిన్ వివాదాలను గుట్టుచప్పుడు కాకుండా ఏజెంట్లు బాధితులతో సెటిల్మెంట్ చేసుకుంటూ కేసులు కాకుండా జాగ్రత్త పడుతున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి వ్యవహారాలను చక్కదిద్దేందుకు మధ్యవర్తులు కొందరు పెద్దఎత్తున డబ్బులు తీసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆలేరులో బిట్ కాయిన్ ఉచ్చులో పడి సుమారు 300 మంది రూ.లక్షల్లో పెట్టుబడులు పెట్టగా, చాలా మంది నష్టాలను చవిచూస్తున్నట్లు తెలిసింది. -
లక్కు.. కొందరికే
నల్లగొండ : జిల్లాలో మద్యం దుకాణాల లక్కీ డ్రా ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలో 154 షాపులకు 4,906 మంది దరఖాస్తులు సమర్పించగా.. సోమవారం హైదరాబాద్ రోడ్డులోని లక్ష్మీగార్డెన్స్లో కలెక్టర్ ఇలా త్రిపాఠి.. ప్రొహిబిషన్ ఎకై ్సజ్ సూపరింటెండెంట్ సంతోష్, నల్లగొండ ఆర్డీఓ అశోక్రెడ్డితో కలిసి లక్కీ డ్రా నిర్వహించి దుకాణాలను కేటాయించారు. లక్కీడ్రా కోసం దరఖాస్తుదారులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఉదయం 11 గంటలకు లక్కీ డ్రా ప్రక్రియ ప్రారంభం కాగా.. మొదట నల్లగొండ ఎకై ్సజ్ స్టేషన్ పరిధిలోని వైన్స్లకు లక్కీ డ్రా నిర్వహించారు. అంతా ఉత్కంఠ.. వైన్ షాపుల లక్కీ డ్రా నేపథ్యంలో లక్ష్మీగార్డెన్స్ ఆవరణలో అధికారులు మైక్లు ఏర్పాటు చేశారు. వేలాదిగా తరలివచ్చిన దరఖాస్తుదారులు లక్కీ డ్రా నిర్వహిస్తున్న సమయంలో ఉత్కంఠగా ఎదురుచూశారు. అక్కడ ఉదయం నుంచి సాయంత్రం వరకు టెన్షన్ వాతావరణం కనిపించింది. షాపులు వచ్చిన వారు ఆనందంతో గంతులు వేయగా.. డ్రాలో షాపులు రాని వారు నిరాశతో వెనుదిరిగారు. ఎక్కువగా సిండికేట్గానే.. ప్రభుత్వం మద్యం దుకాణాల దరఖాస్తుల రుసుం ప్రభుత్వం రూ.3 లక్షలకు పెంచడంతో ఈసారి సింగిల్గా దరఖాస్తు వేసేందుకు చాలా మంది వెనుకడుగు వేశారు. సిండికేట్గా ఏర్పడి దరఖాస్తులు సమర్పించారు. ● ఓ సిండికేట్ బృందం 150 షాపులకు టెండర్లు వేస్తే వారికి 4 షాపులు దక్కాయి. ● ఓ టీమ్ 27 మంది కలిసి సిండికేట్గా 27 షాపులకు దరఖాస్తులు వేస్తే వారికి 3 షాపులు దక్కాయి. ● మరో బృందం 21 షాపులకు దరఖాస్తులు సమర్పిస్తే 2 షాపులు దక్కాయి. ● జిల్లాలో అత్యధికంగా 154 దరఖాస్తులు వచ్చిన కనగల్ మండలం ధర్వేశిపురం వైన్స్.. తిప్పర్తికి చెందిన ఉయ్యాల రాములమ్మకు దక్కింది. లక్కి డ్రా మద్యం షాపుల కేటాయింపును పారదర్శకంగా నిర్వహించాం. 154 షాపులకు 4906 దరఖాస్తులు రాగా దాని ద్వారా ప్రభుత్వానికి రూ.147.18 కోట్ల ఆదాయం వచ్చింది. జీహెచ్ఎంసీ తర్వాత నల్లగొండ జిల్లాలోనే అత్యధిక దరఖాస్తులు వచ్చాయి. ఎంపిక ప్రక్రియ అంతా వీడియో రికార్డింగ్ చేశాం. దుకాణాల ఎంపిక నివేదికను ప్రభుత్వానికి పంపుతాం. – కలెక్టర్ ఇలా త్రిపాఠి ఫ ప్రశాంతంగా ముగిసిన మద్యం దుకాణాల లక్కీ డ్రా ఫ 154 షాపులకు 4,906 దరఖాస్తులు ఫ కలెక్టర్ చేతుల మీదుగా లక్కీ డ్రా.. షాపుల కేటాయింపు ఫ పెద్దఎత్తున తరలివచ్చిన దరఖాస్తుదారులు -
దేవరకొండ పోలీస్స్టేషన్ 125 వసంతాల వేడుక
కొండమల్లేపల్లి : దేవరకొండ పోలీస్స్టేషన్ 125 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పోలీస్స్టేషన్ పనితీరు, వివిధ విభాగాలు, ఆయుధాలు, సాంకేతిక పరికరాల గురించి వివరించారు. ఈ సందర్భంగా ఏఎస్పీ మౌనిక మాట్లాడుతూ విద్యార్థులకు పోలీసు వ్యవస్థపై అవగాహన కల్పించడం, పోలీసులకు–ప్రజలకు మధ్య సత్సంబంధాలు పెంపొందించడంలో ఓపెన్ హౌస్ కార్యక్రమాలు ఎంతో ఉపకరిస్తాయని తెలిపారు. కార్యక్రమంలో పోలీస్స్టేషన్ సిబ్బంది, పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
ధాన్యం సేకరణలో నిర్లక్ష్యం వహించొద్దు
కనగల్ : ధాన్యం సేకరణలో నిర్లక్ష్యం వహిస్తే కఠినచర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి హెచ్చరించారు. సోమవారం ఆమె కనగల్ మండల పరిధిలోని పగిడిమర్రిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఇటీవల కురిసిన వర్షానికి ధాన్యం తడవడంపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఏపీఎం, సెంటర్ ఇన్చార్జికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. పగిడిమర్రిలో ఐకేపీ కొనుగోలు కేంద్రం సరైన స్థలంలో లేనందున మరో ప్రదేశానికి మార్చాలని తహసీల్దార్ పద్మను ఆదేశించారు. కొనుగోలు కేంద్రం నిర్వాహకులు రోజూ ధాన్యం తేమశాతాన్ని పరీక్షించాలన్నారు. తేమశాతం వచ్చిన ధాన్యాన్ని కాంటాలు వేసిన వెంటనే మిల్లులకు పంపాలన్నారు. వర్షాలు వచ్చే అవకాశం ఉన్నందున ధాన్యం తడవకుండా టార్పాలిన్లు కప్పి ఉంచాలన్నారు. కలెక్టర్ వెంట డీఆర్డీఓ శేఖర్రెడ్డి, ఆర్డీఓ వై.అశోక్రెడ్డి, డీఎస్ఓ వెంకటేశం, మేనేజర్ గోపికృష్ణ, తహసీల్దార్ పద్మ, ఏపీఎం మైసేశ్వరరావు, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గడ్డం అనూప్రెడ్డి, ఆర్డీఏ మెంబర్ కుసుకుంట్ల రాజిరెడ్డి, గోలి నర్సిరెడ్డి, గోలి జగాల్రెడ్డి, సుంకిరెడ్డి కృష్ణారెడ్డి, సుంకిరెడ్డి కేశవరెడ్డి తదితరులు ఉన్నారు. 85 శాతం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాం నల్లగొండ : జిల్లాలో వానాకాలం సీజన్ ధాన్యం సేకరణకు ఇప్పటివరకు 85 శాతం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించామని కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. సోమవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర పౌర సరఫరాల, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా నుంచి కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. జిల్లాలో ఇప్పటి వరకు 41 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించామని.. ధాన్యం అమ్మిన రైతులకు రూ.16 కోట్లను వారి ఖాతాల్లో జమ చేశామని తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, స్థానిక సంస్థల ఇన్చార్జి అదనపు కలెక్టర్ నారాయణ్ అమిత్, డీఆర్డీఓ శేఖర్రెడ్డి, డీఎస్ఓ వెంకటేష్, డీఎం గోపికృష్ణ, మార్కెటింగ్ ఏడీ ఛాయాదేవి, డీఏఓ శ్రవణ్కుమార్ పాల్గొన్నారు. ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి -
విజిలెన్స్ అధికారుల ప్రతిజ్ఞ
నల్లగొండ : విద్యుత్ విజిలెన్స్ వారోత్సవాల్లో భాగంగా సోమవారం విద్యుత్ ఎస్ఈ కార్యాలయం ఎదుట విద్యుత్ అధికారులతో విజిలెన్స్ అధికారులు ప్రతిజ్ఞ చేయించారు. వినియోగదారులకు సేవలు అందించడంతో పాటు ఎవరూ అక్రమాలకు పాల్పడవద్దని చెప్పడంతోపాటు తదితర అంశాలపై అవగాహన కల్పించారు. విజిలెన్స్ అధికారి మహేందర్ ప్రతిజ్ఞ చదివించారు. కార్యక్రమంలో విద్యుత్ విజిలెన్స్ అధికారులు పాల్గొన్నారు. ఎంసీఏ విద్యార్థులకు ఓరియంటేషన్నల్లగొండ టూటౌన్ : నల్లగొండలోని ఎంజీ యూనివర్సిటీలో ఎంసీఏ మొదటి సంవత్సరం విద్యార్థులకు ట్రిపుల్ ఈ విభాగం ఆధ్వర్యంలో సోమవారం ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా ప్రొఫెసర్ సాంబశివరావు మాట్లాడారు. ఎంసీఏ కోర్సు విధివిధానాలుతో కూడిన సమగ్ర సమాచారాన్ని ఆయన వివరించారు. అనంతరం విద్యార్థులతో ముఖాముఖి చర్చించారు. కార్యక్రమంలో ఎం.జయంతి, ప్రిన్సిపాల్ సుధారాణి, సంధ్యారాణి, ప్రశాంతి, సురేష్రెడ్డి, హరీష్కుమార్ తదితరులు పాల్గొన్నారు. జూనియర్ కళాశాల తనిఖీనార్కట్పల్లి : నార్కట్పల్లి పభుత్వ జూనియర్ కళాశాలను ఇంటర్ బోర్డ్ ప్రత్యేక అధికారి, డిప్యూటీ సెక్రటరీ భీమ్సింగ్ సోమవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల ఎఫ్ఆర్ఎస్ హాజరు శాతం 28 నుంచి 31 శాతం పెంపు, ఉత్తీర్ణత పెంచే విషయంపై అధ్యాపకులకు పలు సూచనలు చేశారు. అధ్యాపకులు 90 రోజుల యాక్షన్ ప్లాన్ తయారుచేసి రాబోయే వార్షిక పరీక్షలకు విద్యార్థులను సంసిద్ధం చేయాలని ఆదేశించారు. ఐఐటీ, జేఈఈ, నీట్లో మెరుగైన ఫలితం సాధించేలా ఆన్లైన్ తరగతులు నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ బాలాజీ, అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు. -
సాగుచేసే రైతులకు పట్టాలిస్తాం
మిర్యాలగూడ : ‘భూమిని సాగు చేసుకుని జీవనం సాగిస్తున్న రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు అందించడమే లక్ష్యంగా ఉన్నాం. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్, ఎత్తిపోతల పథకాలు, ఇతర అభివృద్ధి పనుల్లో భూములు కోల్పోయిన నిర్వాసితులకు పరిహారం అందించాం. ప్రభుత్వం అందిస్తున్న అన్ని సంక్షేమ పథకాల అమలులో మిర్యాలగూడ డివి జన్ను ముందుంచాం’ అని సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్ అన్నారు. మిర్యాలగూడ సబ్ కలెక్టర్గా బా ధ్యతలు చేపట్టిన ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా సోమవారం ఆయన ‘సాక్షి’తో పలు అంశాలను పంచుకున్నారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భూముల సర్వేకు డివిజన్లోని తిరులమగిరి(సాగర్) మండలాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేయగా 14 గ్రామాల్లోని 245 సర్వే నెంబర్లలోని 4,174 ఎకరాల ప్రభుత్వ భూమిలో 4,856 మంది శివాయి జమ్మెదార్ లబ్ధిదారులను గుర్తించి 3,800 మందిని ఆన్లైన్లో నమోదు చేశాం. డివిజన్ పరిధిలో మొత్తం 18,459 భూభారతి దరఖాస్తులు రాగా ఇప్పటివరకు 6,200కు పైగా దరఖాస్తులను పరిష్కరించి మిర్యాలగూడ డివిజన్ను రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిపాం. సాదాబైనామా, అసైన్డ్, పీవోపీ దరఖాస్తులను కూడా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ప్రస్తుతం దామరచర్ల మండలంలో భూసర్వే నిర్వహిస్తున్నాం. వీర్లపాలెం, కేశవాపురం, కొండ్రపోల్లో సర్వే పూర్తి చేశాం. మిగిలిన గ్రామాల్లో కూడా సర్వే కొనసాగుతుంది. సర్వే పూర్తిగాకానే అందరికీ పట్టాలు అందిస్తాం. దామరచర్ల మండలంలో చేపట్టిన యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణంలో భూములు, ఇళ్లు కోల్పోయిన 500 కుటుంబాలకు ఉద్యోగ అవకాశాలు కల్పించి ఇటీవల నియామక పత్రాలు అందించాం. ప్లాంట్ ప్రభావిత 262 మందికి, పోడు భూముల పట్టా కలిగిన 113 మందికి ఉద్యోగ నియామకాల కోసం ప్రతిపాదనలు పంపించాం. నెల్లికల్ ఎత్తిపోతల పథకం నిర్మాణంలో భాగంగా రైతులు కోల్పోయిన 17.28 ఎకరాల భూమికి ఎకరాకు రూ.24లక్షల చొప్పున పరిహారం చెల్లించాం. బొత్తలపాలెం, వీర్లపాలెం, దున్నపోతులగండి ఎత్తిపోతల పతకాల నిర్మాణంలో భూములు కోల్పోయిన వారితోపాటు అడవిదేవులపల్లి మండల చిట్యాల టెయిల్పాండ్ నీటి ద్వారా నిర్వాసితులవుతున్న వారికి పరిహారం అందించేందుకు ప్రతిపాదనలు పంపించాం. మిర్యాలగూడ మున్సిపాలిటీ పరిధిలో జాతీయ రహదారి –167 వెడల్పులో భాగంగా ఆస్తి కోల్పోయిన 254 మందికి రూ.54 కోట్లు చెల్లించాల్సి ఉండగా ఇప్పటివరకు 180 మందికి రూ.37 కోట్లు వారి అకౌంట్లలో జమ చేశాం. మిర్యాలగూడ మండలంలోని లక్ష్మీపురంలో 44 మందికి, అనుముల మండలంలోని హజారిగూడెంలో 85 మందికి, తిరుమలగిరి(సాగర్) మండలంలోని బోయగూడెంలో 195 మందికి, సిలిగాపురంలో 120 మందికి, కొంపల్లిలో 120 మందికి, యల్లాపురంలో 115 మందికి, మిర్యాలగూడలో 90 మందికి ఇళ్ల స్థలాల పట్టాలను పంపిణీ చేశాం. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల సౌకర్యార్థం, ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు హైదరాబాద్ తరువాత రాష్ట్రంలోనే తొలిసారిగా మిర్యాలగూడలో సాండ్ బజార్ ప్రారంభించాం. మిస్ వరల్డ్ పోటీల్లో భాగంగా వచ్చిన వివిధ దేశాల పోటీదారుల నాగార్జునసాగర్ పర్యటనను విజయవంతంగా నిర్వహించాం. ఉమ్మడి జిల్లాలో నల్లగొండ తరువాత మిర్యాలగూడలో జంతువుల కుటుంబ నియంత్రణ కేంద్రం పనులకు శంకుస్థాపన చేశాం. మిర్యాలగూడ మున్సిపాలిటీలో ఆస్తి పన్ను వసూలు తదితర అంశాల్లో డివిజన్కు రాష్ట్రంలో మంచి గుర్తింపు లభించింది. ఫ నిర్వాసితులకు పరిహారం అందించాం ఫ పథకాల అమలులో డివిజన్ను ముందుంచాం ఫ పేదలకు ఇళ్ల పట్టాలిచ్చాం ఫ ‘సాక్షి’తో మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్ ఫ సబ్ కలెక్టర్గా బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తి డివిజన్ పరిధిలో మొత్తం 21,190 కొత్త రేషన్కార్డుల మంజూరుతోపాటు 26,322 పేర్లను కార్డులో కొత్తగా చేర్చాం. ఖాళీగా ఉన్న 30 రేషన్ దుకాణాలకు డీలర్లను నియమించడంతోపాటు 18 దుకాణాలను ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపాం. ఇటీవల కొన్ని దుకాణాలను కొత్తగా ప్రారంభించాం. డివిజన్లో 2,051 మంది కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లబ్ధిదారులకు రూ.20.53కోట్లు మంజూరు చేశాం. డివిజన్ పరిధిలోని పది భవిత కేంద్రాలను ఆధునీకరించాం. వీటిలో ప్రస్తుతం 200 మంది దివ్యాంగ విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. -
చికిత్స పొందుతూ యువకుడి మృతి
భూదాన్పోచంపల్లి: పాము కాటుకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న యువకుడు సోమవారం తెల్ల వారుజామున మృతిచెందాడు. మృతుడి కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భూదాన్పోచంపల్లి పట్టణ కేంద్రంలోని గాంధీనగర్కు చెందిన చెక్క రమేశ్(34) ఫొటోగ్రాఫర్గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. వీరికి కొంత భూమి ఉండడంతో వ్యవసాయం కూడా చేస్తున్నారు. ఈ నెల 13న పొలం వద్దకు వెళ్లిన రమేశ్ గట్టుపై నడుచుకుంటూ వస్తుండగా పాముకాటుకు గురై అపస్మారకస్థితిలోకి వెళ్లాడు. అరగంట తర్వాత స్పృహాలోకి వచ్చిన రమేశ్ తెలిసిన వ్యక్తి బైక్పై ఇంటికి చేరుకుని.. తనకు పాము కరిచిందని కుటుంబ సభ్యులకు తెలిపాడు. వెంటనే అతడి హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నాలుగు రోజులు వైద్యం చేసినప్పటికీ అతడు కోలుకోకపోవడంతో సికింద్రాబాద్లోని గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు పరీక్షించి సకాలంలో వైద్యం అందకపోవడంతో పాము విషం శరీరం మొత్తం పాకి రెండు కిడ్నీలు చెడిపోయాయని పేర్కొన్నారు. వారం రోజులుగా వైద్యులు రమేశ్కు డయాలసిస్ చేస్తుండగా సోమవారం తెల్ల వారుజామున గుండెపోటు వచ్చి మృతిచెందాడు. మృతుడికి భార్య సబిత, కుమారుడు ఉన్నాడు. ప్రస్తుతం అతడి భార్య 7 నెలల గర్భవతి అని తెలిసింది. మృతుడి అన్న మల్లేశ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ భాస్కర్రెడ్డి తెలిపారు. గుర్తుతెలియని మహిళ.. భువనగిరిటౌన్ : భువనగిరి బస్టాండ్లో అనారోగ్యంతో పడి ఉన్న గుర్తుతెలియని మహిళను 108 సిబ్బంది భువనగిరి ఏరియా ఆస్పత్రిలో చేర్పించగా.. చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందినట్లు పట్టణ ఎస్ఐ నరేష్ తెలిపారు. మృతురాలి పేరు లక్ష్మి(60) అని, పసుపు, ఎరుపు రంగులతో కూడిన చీర, జాకెట్ ధరించిందని, ఆమె వివరాలు తెలిసిన వారు పట్టణ పోలీస్ స్టేషన్కు సమాచారం ఇవ్వాలని సూచించారు. -
అనూషారెడ్డి మృతదేహం బంధువులకు అప్పగింత
గుండాల: ఏపీలోని కర్నూలు జిల్లాలో గురువారం రాత్రి ట్రావెల్స్ బస్సు దగ్ధమైన ఘటనలో సజీవ దహనమైన గుండాల మండలం వస్తాకొండూర్ గ్రామానికి చెందిన మహేశ్వరం అనూషారెడ్డి మృతదేహానికి డీఎన్ఏ పరీక్షలు నిర్వహించినట్లు బంధువులు తెలిపారు. అక్కడి జిల్లా ఉన్నతాధికారుల సమాచారం మేరకు మృతురాలి ఆధార్ కార్డు, తండ్రి ఆధార్ కార్డుతో పాటు బ్యాంకు అకౌంట్ జిరాక్స్లను తీసుకొని ఆస్పత్రికి చేరుకున్న బంధువులకు మృతదేహం అప్పగించినట్లు చెప్పారు. ఆస్పత్రి నుంచి మృతదేహాన్ని వస్తాకొండూర్ తీసుకొచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 108 వాహనాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సోమవారం ఉదయం 2 గంటల సమయంలో మృతదేహం గ్రామానికి వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. అనూషారెడ్డి కుటుంబానికి పరామర్శ అనూషారెడ్డి కుటుంబాన్ని ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్యగౌడ్ ఆదివారం పరామర్శించారు. కుటుంబానికి అండగా ఉంటామని చెప్పారు. విద్యుదాఘాతంతో యువకుడి మృతిసంస్థాన్ నారాయణపురం: తల్లి కళ్ల ముందే కుమారుడు విద్యుదాఘాతంతో మృతిచెందాడు. ఈ ఘటన ఆదివారం సంస్థాన్ నారాయణపురం మండలం గుజ్జ గ్రామంలో జరిగింది. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుజ్జ గ్రామానికి చెందిన చెన్నోజు రామాచారి(26) హైదరాబాద్లో అద్దెకు ఉంటూ చిన్న చిన్న కంప్యూటర్ పనులు చేస్తూ.. పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్నాడు. గుజ్జ గ్రామంలో నెల రోజుల క్రితం తన ఇంటికి మర్మమతులు చేపట్టారు. శనివారం హైదరాబాద్ నుంచి స్వగ్రామానికి వచ్చిన రామాచారి కొత్తగా కొనుగోలు చేసిన మోటారును ఆదివారం ఫిట్టింగ్ చేసి గోడలకు నీళ్లు కొట్టాడు. ఈ క్రమంలో రామాచారి పూర్తిగా తడిసిపోయాడు. గోడలకు నీళ్లు కొట్టడం పూర్తికావడంతో తల్లి చంద్రకళను మోటారు స్విచ్ ఆఫ్ చేయమని చెప్పాడు. ఈ క్రమంలో మోటారు దగ్గర ఉన్న వైరు ప్లగ్ తీస్తుండగా.. రామాచారి విద్యుదాఘాతానికి గురయ్యాడు. కుమారుడికి ఏమైందో చూసేందుకు వెళ్లిన చంద్రకళకు కూడా ఎర్తింగ్ రావడంతో ఆమె వెనుకకు వచ్చింది. కర్ర తీసుకొని రామాచారి చేతిలోని వైరును తొలగించి చుట్టుపక్కల వారి సహాయంతో హైదరాబాద్లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే అతడు మృతిచెందినట్ల వైద్యులు నిర్ధారించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ జగన్ తెలిపారు. మృతుడికి తల్లి, ఇద్దరు సోదరిణులున్నారు. -
రాజకీయాల్లో అగ్రవర్ణాల ఆధిపత్యం కొనసాగుతోంది
నల్లగొండ: రాజకీయాలపై ఎస్సీ, ఎస్టీ, బీసీల్లో చైతన్యం లేకనే అగ్రవర్ణాల ఆధిపత్యం కొనసాగుతోందని మాజీ ఎమ్మెల్సీ, తెలంగాణ రాష్ట్రీయ లోక్దళ్(టీఆర్ఎల్డీ) పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కపిలవాయి దిలీప్కుమార్ అన్నారు. టీఆర్ఎల్డీ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన రథయాత్ర ఆదివారం నల్లగొండకు చేరుకుంది. ఈ సందర్భంగా క్లాక్టవర్ సెంటర్లో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 98శాతం బడుగు వర్గాలే ప్రాణాలు వదిలారన్నారు. అయినా బహుజన తెలంగాణ రాలేదన్నారు. హరీష్రావు, సంతోష్రావు అవినీతికి పాల్పడి కోట్ల రూపాయలు సంపాదించారని కల్వకుంట్ల కవిత ఆరోపించిందని గుర్తుచేశారు. మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్రెడ్డికి మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చి ఆయనకు వెన్నుపోటు పొడిచారన్నారు. ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే బడుగు, బలహీన వర్గాలకు చెందిన అభ్యర్థులు, ఇతర పార్టీల నుంచి బీఫారం లభించని వారు తనను సంప్రదిస్తే టీఆర్ఎల్డీ పార్టీ నుంచి బీఫారంలు ఇస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలన్నారు. నిరుద్యోగులకు వ్యక్తిగత రుణాలు, నిరుద్యోగ భృతి ఇవ్వాలని, పంటల బీమా పథకాన్ని తక్షణమే అమలు చేయాలని, మహిళలకు నెలకు రూ.2500 ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు దుడుకు లక్ష్మీనారాయణ, పార్టీ నాయకులు ముద్దము మల్లేష్, బండిపాడు జానయ్య, నర్సింగ్ రావు, సుధాకర్, బీరప్ప, కోరే సాయిరాం పాల్గొన్నారు. జాతీయ రహదారిపై వాహనాల బారులుచౌటుప్పల్ : 65వ నంబర్ జాతీయ రహదారిపై ఆదివారం వాహనాల రద్దీ నెలకొంది. వీకెండ్తో పాటు పెద్ద సంఖ్యలో వివాహాలు, ఇతర శుభకార్యాలు ఉండడంతో హైదరాబాద్–విజయవాడ మార్గంలో వాహనాలు బారులుదీరాయి. రద్దీ కారణంగా చౌటుప్పల్ పట్టణంలోని తంగడపల్లి చౌరస్తా జంక్షన్ను పోలీసులు మూసివేశారు. దీంతో వాహనదారులు, స్థానికులు ఆర్టీసీ బస్స్టేషన్, వలిగొండ క్రాస్రోడ్డుల మీదుగా రాకపోకలు కొనసాగించాల్సి వచ్చింది. వాహనాల రద్దీకి వారాంతపు సంత జనం సైతం తోడుకావడంతో మరింత గజిబిజి ఏర్పడింది. గూడూరు టోల్ప్లాజా వద్ద వాహనాల రద్దీ బీబీనగర్: బీబీనగర్ మండలం గూడూరు టోల్ప్లాజా వద్ద ఆదివారం వాహనాల రద్దీ నెలకొంది. ఉదయం భువనగిరి వైపు, సాయంత్రం హైదరాబాద్ వైపు వాహనాలు బారులుదీరాయి. ఫ తెలంగాణ రాష్ట్రీయ లోక్దళ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కపిలవాయి దిలీప్కుమార్ -
త్రిఫ్ట్ డబ్బులేవీ..!
భూదాన్పోచంపల్లి: చేనేత కార్మికులకు నాలుగు నెలలుగా త్రిఫ్ట్ (పొదుపు పథకం) డబ్బులు రావడంలేదు. ప్రభుత్వం నేతన్నలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ఈ ఏడాది ఏప్రిల్ నుంచి త్రిఫ్ట్ (పొదుపు పథకాన్ని) అమలు చేస్తోంది. దీంతో యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా చేనేత కార్మికులు ఉన్న మండలాలు, గ్రామాలలో అధికారులు సమావేశాలు నిర్వహించి త్రిఫ్ట్ పథకంపై అవగాహన కల్పిస్తూ కార్మికుల నుంచి పెద్దఎత్తున దరఖాస్తులు స్వీకరించారు. దీంతో జిల్లా వ్యాప్తంగా 10,790 మంది మగ్గం నేసే కార్మికులు, అనుబంధ కార్మికులు త్రిఫ్ట్ పథకంలో చేరారు. అమలు ఇలా.. చేనేత వృత్తిపై ఆధారపడి జీవనోపాధి పొందుతున్న చేనేత కార్మికులు తమ వేతనం నుంచి 8 శాతం వాటాను రికరింగ్ డిపాజిట్(ఆర్డీ) అకౌంట్–1లో జమ చేస్తే ప్రభుత్వం ఆ మొత్తానికి రెండింతలు అనగా 16 శాతం మ్యాచింగ్ గ్రాంటును ఆర్డీ అకౌంట్–2లో కార్మికుడి ఖాతాలో జమ చేస్తుంది. కార్మికుడు పనిచేసిన నెల వేతనం నుంచి గరిష్టంగా రూ.12వేలు, అనుబంధ కార్మికుడైతే రూ.800 బ్యాంకులో జమచేసుకోవచ్చు. రెండేళ్ల మెచ్యూరిటీ అనంతరం జమ అయిన మొత్తాన్ని కార్మికుడు డ్రా చేసుకోవచ్చు. అదేవిధంగా మర మగ్గాలకు కూడా కార్మికులు గరిష్టంగా నెలకు రూ.1000, అనుబంధ కార్మికుడు రూ.600 జమచేస్తే ప్రభుత్వం అంతే మొత్తంలో ఆర్డీ–2 అకౌంట్లో జమ చేస్తుంది. ఒక్క నెల మాత్రమే జమ.. త్రిఫ్ట్ పథకంలో నమోదు చేసుకున్న కార్మికులు ఆయా బ్యాంకుల్లో ఆర్డీ–1 అకౌంట్లు తెరిచి నెలనెలా వస్తున్న ఆదాయం నుంచి తమ వాటా కింద రూ.1.85 కోట్లు జమ చేస్తున్నారు. ప్రభుత్వం కూడా తమ వాటా కింద రెండింతలు అనగా రూ.2.17 కోట్లు జమ చేయాల్సి ఉంది. అయితే ప్రభుత్వం కేవలం మే నెల మాత్రమే తమ వాటా జమ చేసింది. జూన్ నెల నుంచి ఇప్పటి వరకు నాలుగు నెలలుగా అకౌంట్లో డబ్బులు జమ చేయడంలేదు. ఫ నాలుగు నెలలుగా ప్రభుత్వం నుంచి జమకాని డబ్బులు ఫ నెలనెలా డబ్బులు జమ చేయాలని కోరుతున్న చేనేత కార్మికులు -
గంజాయి సేవిస్తున్న ముగ్గురు యువకుల అరెస్టు
మిర్యాలగూడ అర్బన్: గంజాయి సేవిస్తున్న ముగ్గురు యువకులను ఆదివారం మిర్యాలగూడ వన్టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. ఎస్ఐ సైదిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మిర్యాలగూడ పట్టణంలోని తాళ్లగడ్డ మల్లెతోట సమీపంలో కొందరు యువకులు గంజాయి సేవిస్తున్నారనే విస్వసనీయ సమాచారంతో పోలీసులు అక్కడికి వెళ్లగా.. పున్రెడ్డి కార్తీక్రెడ్డి, గొర్రెల సాయిశ్రీరామ్, బంటు నగేష్ను అదుపులోకి తీసుకున్నారు. వారికి టీహెచ్సీ కిట్లతో పరీక్షలు చేయగా పాజిటివ్ వచ్చిందని ఎస్ఐ తెలిపారు. దీంతో ముగ్గురిపై కేసు నమోదు చేసి రిహాబిలిటేషన్ సెంటర్కు తరలించినట్లు పేర్కొన్నారు. కల్వర్టుపై వరద నీటిలో అదుపుతప్పిన కారు పెద్దవూర: కల్వర్టుపై నుంచి ప్రవహిస్తున్న వరద నీటిలో కారు అదుపుతప్పి కిందికి జారిపోయింది. ఈ ఘటన ఆదివారం పెద్దవూర మండలంలోని తుంగతూర్తి గ్రామంలో జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. తుంగతూర్తి గ్రామంలో ఓ వివాహానికి హాజరయ్యేందుకు బంధువులు కారులో వచ్చారు. ఈ క్రమంలో గ్రామ సమీపంలోని కల్వర్టుపై నుంచి వరద నీరు ప్రవహిస్తోంది. కొంచెం లోతులోనే నీరు ప్రవహిస్తుందని తప్పుగా అంచనా వేసిన డ్రైవర్ కారును ముందుకు పోనిచ్చాడు. కల్వర్టు సగానికి పోగానే వరద ప్రవాహానికి కారు అదుపుతప్పి కిందికి జారిపోయింది. గమనించిన గ్రామస్తులు కారులో ఉన్న వారిని బయటకు తీసుకొచ్చారు. పది మందికి పైగా ప్రయత్నించినా కల్వర్టు కింది నుంచి కారును పైకి తీసుకురాలేకపోయారు. దీంతో ట్రాక్టర్కు తాళ్లను బిగించి అతికష్టం మీద బయటకు తీసుకొచ్చారు. -
రామ్మూర్తి యాదవ్తో అనుబంధం మరువలేనిది
త్రిపురారం: చలకుర్తి మాజీ ఎమ్మెల్యే గుండెబోయిన రామ్మూర్తి యాదవ్తో తన అనుబంధం మరువలేనిదని మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి అన్నారు. త్రిపురారం మండలం పెద్దదేవులపల్లి గ్రామంలో ఏర్పాటుచేసిన రామ్మూర్తి యాదవ్ విగ్రహాన్ని ఆదివారం నాగార్జునసాగర్ ఎమ్మెల్యే కుందూరు జైవీర్రెడ్డి, మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ కెతావత్ శంకర్నాయక్, రామ్మూర్తి యాదవ్ కుటుంబ సభ్యులతో కలిసి జానారెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కర్లకంటిగూడెంలో ఉన్న ఎల్–10 లిప్టు ఇరిగేషన్కు రామ్మూర్తి యాదవ్ పేరు పెడుతున్నట్లు గ్రామస్తుల సమక్షంలో జానారెడ్డి ప్రకటించారు. వరద కాల్వకు కూడా రామ్మూర్తి యాదవ్ పేరు పెట్టాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఎమ్మెల్యే జైవీర్రెడ్డి మాట్లాడుతూ.. రామ్మూర్తి యాదవ్ జీవితం అందరికీ ఆదర్శమని అన్నారు. గుండెబోయిన కోటేష్ యాదవ్, గుండెబోయిన నగేష్ యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, జిల్లా మహిళ అధ్యక్షురాలు గోపగాని మాధవి, మండల అధ్యక్షుడు ముడిమళ్ల బుచ్చిరెడ్డి, అనుముల శ్రీనివాస్రెడ్డి, ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు సోమయ్య, బహునూతుల నరేందర్, మర్ల చంద్రారెడ్డి, పెద్దబోయిన శ్రీనివాస్, గుండెబోయిన వెంకటేశ్వర్లు, అనుముల వెంకట్రెడ్డి, బహునూతుల శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీ అంబటి రాము, నాయిని సంతోష్కుమార్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రామ్మూర్తి యాదవ్ సేవలు మరువలేనివి చలకుర్తి మాజీ ఎమ్మెల్యే రామ్మూర్తి యాదవ్ సేవలు మరువలేనివని ఎమ్మెల్సీ కోటిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే నోముల భగత్యాదవ్ అన్నారు. పెద్దదేవులపల్లి గ్రామంలో రామ్మూర్తి యాదవ్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి వారు హాజరై నివాళులర్పించారు. వారి వెంట ట్రైకార్ మాజీ చైర్మన్ ఇస్లావత్ రాంచందర్ నాయక్, త్రిపురారం మాజీ సర్పంచ్ అనుముల శ్రీనివాస్రెడ్డి, పీఏసీఎస్ వైస్ చైర్మన్ గుండెబోయిన వెంకటేశ్వర్లు, అనుముల శ్యాంసుందర్రెడ్డి తదితరులు ఉన్నారు. ఫ మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి -
అందుబాటులోకి ఎయిమ్స్ అడ్మినిస్ట్రేటివ్ భవనం
బీబీనగర్: బీబీనగర్ ఎయిమ్స్ వైద్య కళాశాలలో నూతనంగా నిర్మించిన అడ్మినిస్ట్రేటివ్, అకాడమీ భవన సముదాయం అందుబాటులోకి వచ్చింది. దీంతో నిమ్స్ ఆస్పత్రి కోసం 2009లో నిర్మించిన భవనంలో కొనసాగుతూ వచ్చిన కార్యకలాపాల విభాగాలను నూతన భవనం నుంచి కొనసాగిస్తున్నారు. నూతన భవనాన్ని అధునాతనంగా నిర్మించడంతో లోపలి భాగం అద్దాల మేడలా దర్శనమిస్తోంది. భవనం ముందు గ్రీనరీ, విద్యుత్ దీపాల ఏర్పాటు, ఎంట్రెన్సీ పనులను చేపడుతున్నారు. జాతీయ రహదారికి దగ్గరగా ఉన్న ఈ భవనం ఆకట్టుకుంటోంది. -
స్కాన్ చేస్తే పాఠాలు
రామగిరి(నల్లగొండ): కేంద్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థ బలోపేతానికి అనేక కార్యక్రమాలను అమలు చేస్తోంది. విద్యార్థులకు సాంకేతికతను వినియోగించి ఉత్తమ విద్యను అందించాలనే లక్ష్యంతో దీక్ష(డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ నాలెడ్జ్ షేరింగ్) యాప్ను ప్రవేశపెట్టింది. విద్యార్థులు రోజువారీ పాఠాలు వినేలా ఈ యాప్ను రూపొందించారు. ఇదొక డిజిటల్ లెర్నింగ్ ప్లాట్ఫామ్. ఏదైనా కారణాల చేత విద్యార్థి పాఠశాలకు గైర్హాజరు అయితే ఉపాధ్యాయులు చెప్పే పాఠాలు వినే అవకాశం ఉండదు. ఆ ఇబ్బంది లేకుండా దీక్ష యాప్ను సెల్ఫోన్లో డౌన్లోడ్ చేసుకుని పాఠ్యపుస్తకంపై ఉన్నక్యూఆర్ కోడ్ స్కాన్ చేసి పాఠాలు వినవచ్చు. ఈ యాప్ తెలుగు, హిందీ, ఇంగ్లిష్, తమిళం, మరాఠీ వంటి ప్రముఖ భారతీయ భాషల్లో అందుబాటులో ఉంది. ఫ దీక్ష యాప్లో పాఠశాల సిలబస్ ఫ ప్రతి పుస్తకంపై క్యూఆర్ కోడ్ ఫ సులభంగా అర్ధమయ్యేలా రూపకల్పన -
ముగిసిన ఎస్జీఎఫ్ రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలు
భువనగిరి: భువనగిరి పట్టణంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల మైదానంలో శనివారం ప్రారంభమైన 69వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్(ఎస్జీఎఫ్) రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలు ఆదివారం ముగిశాయి. ఆఖరి రోజు నాకౌట్ మ్యాచ్లతో పాటు సెమీఫైనల్, ఫైనల్ పోటీలు హోరాహోరీగా జరిగాయి. ఈ పోటీల్లో ప్రథమ స్థానంలో ఉమ్మడి వరంగల్ జిల్లా, ద్వితీయ స్థానంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా, తృతీయ స్థానంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జట్లు నిలిచాయి. విజేతలకు కళాశాల ప్రిన్సిపాల్ కరుణాకర్రెడ్డి ట్రోఫీలు అందజేశారు. ఈ పోటీల్లో ప్రతిభ కనబర్చిన 15 మంది క్రీడాకారులను మధ్యప్రదేశ్లో జరగనున్న జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక చేశారు. ఈ కార్యక్రమంలో వాలీబాల్ పోటీల రాష్ట్ర పరిశీలకుడు ప్రసాద్, కళాశాల పరిశీలకుడు శ్రీనివాస్రెడ్డి, అధ్యాపకులు అంజనేయులు, నర్సింహ, పీడీలు, పీఈటీలు పాల్గొన్నారు. ఫ ప్రథమ స్థానంలో వరంగల్, ద్వితీయ స్థానంలో రంగారెడ్డి జిల్లా జట్లు ఫ జాతీయ స్థాయి పోటీలకు 15 మంది ఎంపిక -
రేణుకా ఎల్లమ్మకు కుంకుమ పూజలు
కనగల్: మండలంలోని దర్వేశిపురం రేణుకా ఎల్లమ్మ ఆలయంలో కార్తీకమాసం సందర్భంగా ఆదివారం ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో సామూహిక కుంకుమార్చన పూజలు నిర్వహించారు. శివుడి విగ్రహం వద్ద ప్రమిదలు వెలిగించి దీపారాధన చేశారు. పుట్టలో పాలు పోసి నాగ పడగలకు మొక్కుకున్నారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ చీదేటి వెంకట్రెడ్డి దంపతులు, ఈఓ అంబటి నాగిరెడ్డి, ఆర్యవైశ్య సంఘం జిల్లా అధ్యక్షుడు తేలుకుంట్ల చంద్రశేఖర్, ఆర్యవైశ్య సంఘం మహిళా అధ్యక్షురాలు నాంపల్లి భాగ్య నరసింహ, ఆర్యవైశ్య సంఘం మండల అధ్యక్షుడు కొత్తమాస్ ప్రభాకర్ పాల్గొన్నారు. -
‘స్వనిధి’ రుణసాయం పెంపు
నల్లగొండ టూటౌన్ : వీధి వ్యాపారులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పీఎం స్వనిధి పథకం రుణ సాయాన్ని పెంచి తీపికబురు వినిపించింది. ఎనిమిది నెలల క్రితం పీఎం స్వనిధి సైట్ను మూసివేయడంతో చాలామంది వీధి వ్యాపారులు ఇక ఆ పథకం రద్దు అయినట్లేనని భావించారు. కానీ, కేంద్ర ప్రభుత్వం మళ్లీ దీనిని పునః ప్రారంభిస్తూ గతనెలలో మార్గదర్శకాలు విడుదల చేసింది. 2030 వరకు ప్రస్తుతం ఇచ్చిన మార్గదర్శకాలు కొనసాగుతాయని ఉత్తర్వుల్లో పేర్కొంది. గతంలో రూ.10వేలు ఇచ్చిన దానిని తాజా మార్గదర్శకాల ప్రకారం దానిని రూ.15 వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. రెండవ విడత ఇచ్చే రుణాన్ని రూ.25వేలకు పెంచుతూ బ్యాంకర్లకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఒక వీధి వ్యాపారి మొదట రూ.15 వేల రుణం తీసుకొని నెలనెలా తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. ఆ రుణం తీరిన తరువాత రెండవ విడత రూ.25 వేలు ఇస్తారు. ఇది కూడా బ్యాంకుల్లో నెల వారీగా చెల్లించిన తరువాత మూడవ సారి రుణం రూ.50 వేలు ఇస్తారు. రూ.50వేలు అప్పు తీరిన తరువాత నాల్గవ సారి రుణం తీసుకుంటే ఎలాంటి పెంపుదల చేయలేదు. నామమాత్రపు వడ్డీకే రుణం.. వీధి వ్యాపారం చేసుకొని స్వయం ఉపాధి పొందే పేదల కోసం కేంద్రం పీఎం స్వనిధి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. నామమాత్రపు వడ్డీకే వీధి వ్యాపారులకు బ్యాంకుల ద్వారా రుణం లభించనుంది. బ్యాంకర్లకు చెల్లించిన వడ్డీలో కూడా కేంద్రం రూ.40 శాతం తిరిగి చెల్లిస్తుంది. బ్యాంకుల్లో ఎలాంటి తనఖా లేకుండా ఇచ్చే రుణం వలన వేల మంది పేదలకు ఎంతో ప్రయోజనకరంగా మారింది. మున్సిపాలిటీల వారీగా టార్గెట్ పీఎం స్వనిధి ద్వారా బ్యాంకర్లతో మాట్లాడి అర్హులైన పేదలకు రుణాలు ఇప్పించాలని కేంద్రం మున్సిపాలిటీల వారీగా లక్ష్యం విధించింది. దీంతో జిల్లాలోని ఎనిమిది మున్సిపాలిటీల్లోని మెప్మా సిబ్బంది దృష్టి సారించారు. మొదటి విడతగా జిల్లాలోని ఆయా మున్సిపాలిటీల్లో 2,141 మందికి వీధి వ్యాపారులకు రుణాలు ఇప్పించాల్సి ఉంది. వీధి వ్యాపారుల కోసం పీఎం స్వనిధి పునః ప్రారంభమైంది. గత నెలలోనే ఉత్తర్వులు వచ్చాయి. మున్సిపాలిటీలకు విధించిన టార్గెట్ ప్రకారం వీధి వ్యాపారులకు రుణాలు ఇప్పించేందుకు చర్యలు తీసుకుంటాం. ప్రతిఒక్క వీధి వ్యాపారి పీఎం స్వనిధి పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి. – శివాజీ, మెప్మా ఉద్యోగిఫ వీధి వ్యాపారులకు తీపికబురు వినిపించిన కేంద్రం ఫ ఎనిమిది నెలల తర్వాత పథకం పునఃప్రారంభం ఫ రూ.10 వేల నుంచి రూ.15 వేలకు పెంచిన రుణం ఫ 2,141 మందికి రుణాలు ఇప్పించాలని లక్ష్యం రుణాల టార్గెట్.. మున్సిపాలిటీ వీధి వ్యాపారులు నల్లగొండ 678మిర్యాలగూడ 630నకిరేకల్ 03నందికొండ 76హాలియా 120చిట్యాల 137దేవరకొండ 298చండూరు 199 -
43 వసంతాలకు అపూర్వ కలయిక
డిండి : వారంతా 43 ఏళ్ల క్రితం ఒకే స్కూల్లో పదో తరగతి చదువుకున్న చిన్ననాటి స్నేహితులు. ఆత్మీయ సమ్మేళనం పేరిట ఆదివారం ఒకే వేదికపై కలిశారు. తమ చిన్ననాటి జ్ఞాపకాలను పంచుకున్నారు. వీరే డిండి మండల కేంద్రంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1981–82 సంవత్సరంలో పదో తరగతి చదివిన పూర్వ విద్యార్థులు. 43 వసంతాల తర్వాత ఒకే వేదికపై కలుసుకున్న వీరంతా ఒకరినొకరు ఆప్యాయంగా ఆత్మీయ ఆలింగనం చేసుకుని యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అప్పట్లో తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులను గుర్తుచేసుకుని ఆనందంగా గడిపారు. ఈ కార్యక్రమంలో నరేందర్రావు, శ్రీనివాసులు, నగేష్, మధుసూదనాచారి, లక్ష్మీనర్సింహ, రాజేందర్రెడ్డి, రాములు, ఏసోబు, తిర్పతయ్య, రాజేశ్వరి, అరుణమ్మ, విజయమ్మ తదితరులు పాల్గొన్నారు. -
ఫుడ్ సేఫ్టీ నిబంధనలకు పాతర!
నల్లగొండ టూటౌన్ : పిల్లలతోపాటు పెద్దలు అమితంగా ఇష్టపడే మిఠాయిల (స్వీట్ల) తయారీలో కొందరు వ్యాపారులు నిబంధనలు పాటించడం లేదు. వాటి తయారీకి వినియోగిస్తున్న ముడి పదార్థాలు, కారం, పిండి మొదలైనవి కాలం చెల్లిన పురుగులు పట్టినవి వాడుతూ ఫుడ్ సేఫ్టీ యాక్ట్ నిబంధనలకు తిలోదకాలిస్తున్నారు. ఇంట్లో ఏ శుభకార్యమైనా..కొత్త దుకాణాలు ప్రారంభమైనా అక్కడ స్వీట్స్ ఉండాల్సిందే. తీపితోనే మొదలు పెట్టాలనే సెంట్మెంట్ను స్వీట్స్ షాపు వ్యాపారులు బాగా వినియోగించుకుంటున్నారు. వినియోగదారులను ఆకట్టుకునేందుకు హానికరమైన రసాయనాలు కలుపుతూ ఘుమఘుమలాడే మిఠాయిలు తయారీ చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. నాణ్యతాప్రమాణాలు పాటించకుండా.. ఉమ్మడి జిల్లాలోని నల్లగొండ, మిర్యాలగూడ, సూర్యాపేట, భువనగిరి, దేవరకొండ, చిట్యాల, చౌటుప్పల్, హాలియా, కోదాడ, హుజూర్నగర్, నేరేడుచర్ల, నకిరేకల్, తిరుమలగిరి ముఖ్య పట్టణాలతో పాటు మండల కేంద్రాల్లో కొనసాగుతున్న షాపుల్లో నాణ్యమైన స్వీట్స్ను తయారీ చేయకుండా కల్తీమయం చేస్తున్నారు. కనీస నాణ్యతా ప్రమాణాలు పాటించడంలేదనేది బహిరంగ రహస్యం. ఇటీవల దీపావళి ముందు రోజు ఉమ్మడి జిల్లాలోని పలు స్వీట్స్ దుకాణాలను ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీ చేయగా స్వీట్స్ షాపు యాజమానుల డొల్లతనం బయట పడిన విషయం తెలిసిందే. తనిఖీలు లేకనే నాణ్యత డొల్ల.. ముఖ్య పట్టణాలతో పాటు మండల కేంద్రాల్లో కూడా ఇటీవల స్వీట్స్ షాపులు పెరిగాయి. ఇళ్లలో తయారు చేసుకునే కంటే ఎక్కువగా దుకాణాల్లోనే స్వీట్స్ కొనుగోలు చేయడానికి జనం ఆసక్తి చూపుతున్నారు. కానీ పెరుగుతున్న ఆహార పదార్థాల దుకాణాలకు తగ్గట్టుగా ఫుడ్ సేఫ్టీ ఉద్యోగులు లేకపోవడం.. ఉన్న ఉద్యోగులు కూడా ఫుడ్ సేఫ్టీ కమిషనర్ ఆదేశాలు వస్తే తప్ప తనిఖీలు చేయడంలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. దాంతో స్వీట్ల తయారీ దుకాణాల్లో అపరిశుభ్రత, బూజు, పురుగులు, ఈగలు వాలినా, ఎలుకలు తిరుగుతున్నా పట్టించుకోవడంలేదనే ఆరోపణలు ఉన్నాయి. స్వీట్స్ తినే గడువు ముగిసినా సంబంధిత యాజమానులు వాటిని తీసేయకుండా వినియోగదారులకు అంటగడుతున్నారు. వ్యాపారుల్లో మార్పు రావాలంటే సంబంధిత అధికారులు ప్రతినెలా ఆకస్మిక తనిఖీలు చేపట్టాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఫ స్వీట్స్ తయారీలో పాటించని నాణ్యతాప్రమాణాలు ఫ కాలం చెల్లిన కారం.. పురుగులు పడిన ముడి పదార్థాలు వాడకం ఫ ఆకర్షణ కోసం హానికరమైన రసాయనాలు మిక్సింగ్ ఫ ఇటీవల అధికారుల తనిఖీల్లో బయటపడిన వ్యాపారుల డొల్లతనం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇటీవల స్వీట్స్ షాపుల దుకాణాలపై ఆకస్మిక తనిఖీలు చేపట్టి 20 రకాలు స్వీట్స్ను ల్యాబ్కు పంపించాం. ఇప్పటికే 15 దుకాణాలకు నోటీసులు జారీ చేశాం. ల్యాబ్ నుంచి నివేదిక రాగానే తదుపరి చర్యలు తీసుకుంటాం. ఫుడ్ సేఫ్టీ నిబంధనలు ఉల్లంఘిస్తే చట్ట ప్రకారం చర్యలు తప్పవు. – జ్యోతిర్మయి, యాదాద్రి జోనల్ ఫుడ్ సేఫ్టీ అసిస్టెంట్ కంట్రోలర్ -
నేడు మద్యం దుకాణాలకు లక్కీడ్రా
నల్లగొండ: జిల్లాలో మద్యం దుకాణాలకు సోమవారం లక్కీ డ్రా తీయనున్నారు. ఇందుకు సంబంధించి జిల్లా ఎకై ్సజ్ అధికారులు హైదరాబాద్ రోడ్డులోని లక్ష్మీగార్డెన్స్లో అన్ని ఏర్పాట్లు చేశారు. జిల్లాలో 154 మద్యం దుకాణాలకు టెండర్ల స్వీకరణ ప్రక్రియ పూర్తయిన విషయం తెలిసిందే. వాటికి సంబంధించి మొత్తం 4,906 టెండర్లు వచ్చాయి. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం వరకు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి సమక్షంలో దుకాణాల వారీగా లక్కీ డ్రా తీసి విజేతలకు షాపులు కేటాయించనున్నారు. ఫీజు బకాయిలు విడుదల చేయాలినల్లగొండ: ఇంజనీరింగ్, డిగ్రీ, పీజీ చదివే విద్యార్థుల ఫీజుల బకాయిలు సుమారు రూ.5 వేల కోట్లను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు అయితగోని జనార్దన్గౌడ్ అన్నారు. ఆదివారం నల్లగొండలోని సంఘం జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పీజీ కోర్సుల్లో సీట్లు పొందినవారికి, ఇతర దేశాల్లో ఉద్యోగాలు వచ్చిన వారికి కూడా ఆయా కాలేజీల యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని ఆరోపించారు. ఈ సమావేశంలో కారింగ్ నరేష్గౌడ్, కన్నబోయిన రంజిత్యాదవ్, జక్కల పరమేష్, ఆవుల ప్రశాంత్, సతీష్, పృథ్వీరాజ్, అంద రాకేష్, ఎర్రబోయిన గణేశ్, నిఖిల తదితరులు పాల్గొన్నారు. సమస్యల పరిష్కారానికి ఉద్యమించాలి నల్లగొండ: ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల పదోన్నతుల విషయంలో నష్టం కలిగించేలా ఉన్న అడ్వకసీ, ఇతర సమస్యల పరిష్కారానికి ఉద్యమించాలని ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు తొంట సత్యనారాయణ పిలుపునిచ్చారు. ఆదివారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ భవనంలో నిర్వహించిన ఎస్సీ, ఎస్టీ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలను ఏకం కావాలన్నారు. అనంతరం నూతనంగా పదోన్నతి పొందిన ఎస్సీ, ఎస్టీ గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులకు సన్మానించారు. ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం జిల్లా శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో ఆ సంఘం ప్రధాన కార్యదర్శి పెంట అంజయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్లు చాగంటి ప్రభాకర్, సూర్యదేవర దానయ్య, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు నరసింహనాయక్, జిల్లా అధ్యక్షుడు ఆరెకంటి వెంకటయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి నూనె విష్ణు, ఉపాధ్యక్షుడు శ్రీపతి యాదయ్య, జిల్లా కార్యదర్శి దొడ్డి కై లాస్, జిల్లా కోశాధికారి రాసమల్ల శేఖర్, వివిధ ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల నాయకులు పాల్గొన్నారు. యాదగిరి క్షేత్రంలో కోలాహలంయాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో కోలాహలం నెలకొంది. కార్తీకమాసం, ఆదివారం సెలవుదినం కావడంతో భక్తులు ఉదయం నుంచే స్వామివారి దర్శనం కోసం వేలాది తరలివచ్చారు. వేకుజామున ఆలయాన్ని తెరిచిన అర్చకులు.. సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొలిపారు. గర్భాలయంలో కొలువుదీరిన స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులకు అభిషేకం, తులసీదళ అర్చనతో కొలిచారు. అనంతరం ప్రాకార మండపంలో సుదర్శన నారసింహ హోమం, గజవాహనసేవ, నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం తదితర పూజలు నిర్వహించారు. వివిధ పూజల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించి, కార్తీక దీపారాధనన చేశారు. -
‘మొంథా’ తుపానుతో జాగ్రత్త
నల్లగొండ: రానున్న రెండు, మూడు రోజులు ‘మొంథా’ తుపాను ప్రభావం ఉండే అవకాశం ఉన్నందున జిల్లా ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. ఆమె ఆదివారం నల్లగొండ నుంచి వివిధ శాఖల అధికారులతో టెలికాన్పరెన్స్ నిర్వహించిన సందర్భంగా మాట్లాడారు. శ్రీమొంథ్ఙా తుపానుతో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసినట్లు ఆమె పేర్కొన్నారు. జిల్లాలోని లోతట్టు ప్రాంతాల్లో కిందికి వేలాడే విద్యుత్ వైర్లు, ఒరిగిన విద్యుత్ పోల్స్, ట్రాన్స్ఫార్మర్ల సమీపంలోకి ప్రజలు వెళ్లవద్దని సూచించారు. రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తడిసిన ధాన్యాన్ని తీసుకురావద్దన్నారు. రానున్న మూడు రోజుల పాటు తహసీల్దార్లు వారు పనిచేసే కార్యస్థానాలలోనే ఉండాలని, ఒకవేళ ఇదివరకే సెలవు దరఖాస్తు చేసి ఉంటే సెలవులన్నీ రద్దు చేస్తున్నట్లు తెలిపారు. తహసీల్దార్లు ఈనెల 27 మధ్యాహ్నం నుంచి పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంటూ వారి పరిధిలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలు తనిఖీ చేయడమే కాకుండా, నాణ్యత కలిగిన ధాన్యాన్ని మిల్లులకు తరలించేందుకు లారీలను సిద్ధం చేసుకోవాలన్నారు. మొంథా తుపాన్ను దృష్టిలో ఉంచుకొని ధాన్యం తడవకుండా గ్రామ పాలనాధికారులు.. కేంద్రాల నిర్వాహకులకు, రైతులకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. ధాన్యం సేకరణలో నిర్లక్ష్యంగా ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించి ఎప్పటికప్పుడు ట్యాబ్ ఎంట్రీ చేయాలన్నారు. సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్, నల్లగొండ ఆర్డీఓ వై.అశోక్ రెడ్డి, డీఆర్డీఓ శేఖర్రెడ్డి, డీసీఓ పత్యా నాయక్, మార్కెటింగ్ ఏడీ ఛాయదేవి పాల్గొన్నారు. ఫ తడిసిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావొద్దు ఫ జిల్లా రైతులు, ప్రజలకు కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచన -
బీఆర్ఎస్ నేతలకు అహంకారం తగదు
శాలిగౌరారం: ప్రజా వ్యతిరేకతతో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీ నేతలు ఇంకా అహంకారంతో వ్యవహరించడం తగదని టీపీసీసీ ప్రచారకమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కీగౌడ్ అన్నారు. శాలిగౌరారం మండలం తుడిమిడి గ్రామంలో ఆదివారం రాత్రి ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన తిరుగు ప్రయాణంలో మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ మండల సీనియర్ నాయకుడు చామల జయపాల్రెడ్డి ఇంట్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్పార్టీ అధికారం చేపట్టి ఇచ్చిన మాటకు కట్టుబడి సంక్షేమ పథకాలను అమలు చేసుకుంటూ ముందుకు సాగుతుందన్నారు. గత బీఆర్ఎస్ పాలనలో అప్పులపాలైన తెలంగాణను ఆర్థికపరంగా అనేక ఒడిదుడుకులు వచ్చిన వాటిని తట్టుకుంటూ ప్రభుత్వం పాలనను అందిస్తుందన్నారు. కాంగ్రెస్ ప్రజాపాలనను తట్టుకోలేని బీఆర్ఎస్పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తోపాటు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితోపాటు కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలను ఇష్టమొచ్చిన బూతులు తిడుతూ అహంకారాన్ని ప్రదర్శిస్తున్నారన్నారు. వారు మాట్లాడే భాష, వ్యవహారశైలిని తాను తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. కాంగ్రెస్పార్టీ వహిస్తున్న మౌనాన్ని అసమర్థత అనుకుంటే పొరపాటేనని, కాంగ్రెస్పార్టీ కార్యకర్తలు తిరుగబడితే బీఆర్ఎస్పార్టీ నాయకులకు లాగులు కూడా ఉండవన్నారు. పదేళ్లలో ఊహకందని రీతిలో అక్రమార్జన, ప్రజాధనం దోపిడీలకు పాల్పడిన బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తూ రాజకీయంగా లబ్ధిని పొందేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. కాంగ్రెస్పార్టీ బలోపేతానికి పార్టీకి చెందిన ప్రతి ఒక్కరూ సైనికుడిలా పనిచేయాలని కోరారు. సమావేశంలో డీసీసీ ఉపాధ్యక్షుడు అన్నెబోయిన సుధాకర్, బ్లాక్కాంగ్రెస్ అధ్యక్షుడు బండపల్లి కొమరయ్య, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బొల్లికొండ గణేశ్, మండల సియర్ నాయకులు చామల జయపాల్రెడ్డి, చింత ధనుంజయ్య, వడ్లకొండ పరమేశ్, జమ్ము అశోక్, పుల్లూరి దేవేందర్, అంజయ్య, అనిల్, భరత్, ఇబ్రహీం, నాగరాజు, కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.ఫ టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మాధుయాష్కీగౌడ్ -
బస్సు ప్రమాదం
ఏపీలోని పల్నాడు జిల్లాలో మిర్యాలగూడ డిపోకు చెందిన పల్లె వెలుగు బస్సు ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టింది. పూర్తిస్థాయి నీటి మట్టం : 590 అడుగులు ప్రస్తుత నీటి మట్టం : 587.20 అడుగులు ఇన్ఫ్లో : 34,204 క్యూసెక్కులు అవుట్ ఫ్లో : 34,204 క్యూసెక్కులు విద్యుదుత్పాదన కేంద్రం ద్వారా : 29,232 క్యూసెక్కులు కుడికాల్వ ద్వారా : నిల్ ఎడమకాల్వ ద్వారా : 2,878 క్యూసెక్కులు ఏఎమ్మార్పీకి : 1800 క్యూసెక్కులు వరద కాల్వకు : 300 క్యూసెక్కులు- 8లోయూత్ లైఫ్స్టైల్ మారింది. క్రీడా రంగంలో పాశ్చాత్య సంస్కృతి దూసుకొస్తోంది. ఇలా పాశ్చాత్య క్రీడ అయిన స్నూకర్ చిన్నపట్టణాలకూ విస్తరిస్తోంది. ఈ ఆటకు గతంలో మన దగ్గర మంచి ఆదరణ ఉండేది. సినిమాల్లో హీరోలు స్నూకర్ గేమ్ ఆడుతూ ఉన్న సీన్లు ఉండేవి. కొంతకాలం కనుమరుగైన ఈ స్నూకర్ గేమ్ ఇప్పుడు మెల్లమెల్లగా నగరాల నుంచి పట్టణాలకు విస్తరిస్తోంది. స్టేటస్కు ప్రతీకగా భావించే ఈ క్రీడను ఆడేందుకు ప్రస్తుతం యువత ఆసక్తి చూపిస్తోంది. స్నూకర్.. చిన్న పట్టణాలకు విస్తరిస్తున్న పాశ్చాత్య క్రీడ పట్టణాల్లో వెలుస్తున్న స్నూకర్ పాయింట్లు ఆసక్తి చూపుతున్న యువతరిలాక్సేషన్ గేమ్రామగిరి (నల్లగొండ) : స్నూకర్ గేమ్ మళ్లీ విస్తరిస్తోంది. ఉమ్మడి జిల్లాలోని నల్లగొండ, మిర్యాలగూడ, సూర్యాపేట, భువనగిరి తదితర పట్టణాల్లో స్నూకర్ పాయింట్లు వెలుస్తున్నాయి. స్నూకర్ ఆడేందుకు పట్టణవాసులు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. డిమాండ్ ఎక్కువగా ఉండడంతో రూ.లక్షల వెచ్చించి స్నూకర్ పాయింట్లను ఏర్పాటు చేస్తూ నిరుద్యోగులు ఉపాధి పొందుతున్నారు. బ్రిటన్ గేమ్ స్నూకర్.. పార్టీ గేమ్ కల్చర్ పాశ్చాత్య దేశాల నుంచి మన దగ్గరకు దూసుకొచ్చింది. యూరప్లోని బ్రిటన్ దేశంలో స్నూకర్ ఆట పురుడు పోసుకుంది. కాలక్రమేణా మల్టీనేషనల్ కంపెనీల ఉద్యోగుల ద్వారా ఇండియాలోకి ప్రవేశించింది. రిలాక్సేషన్తోపాటు టీమ్ బాండింగ్కు ఉపయోగపడే ఈ స్నూకర్ ఇప్పుడు యూత్కు క్రేజ్గా మారింది. చిన్న పట్టణాలకు విస్తరణ ఒకప్పుడు క్లబ్బులు, స్పోర్ట్స్ అకాడమీల్లో ఉండే స్నూకర్ గేమ్ ఇప్పుడు చిన్న పట్టణాలకు విస్తరిస్తోంది. క్రికెట్, వాలీబాల్, బ్యాడ్మింటన్ మాదిరిగా ప్రస్తుత యువతకు స్నూకర్ ఒక గేమ్గా మారింది. దీని కోసం ప్రత్యేకంగా హాల్ నిర్మించి గేమ్ ఆడడానికి కావాల్సిన సామగ్రిని సమకూర్చుతున్నారు. ఒకేచోట రెండు నుంచి మూడు టేబుల్స్ ఏర్పాటు చేస్తున్నారు. ఆడేవారి నుంచి గంటల వారీగా లేదా ఒక ఆటకు రూ.150 నుంచి రూ.200 వరకు తీసుకుంటున్నారు. స్నూకర్ పాయింట్లలో చదువుకునే వారు ఉద్యోగాలు చేసేవారు రోజూ సాయంత్రం వచ్చి గేమ్ ఆడుతున్నారు. కొన్నిసార్లు యువతులు కూడా వచ్చి స్నూకర్ ఆడుతున్నారు. నేను రోజూ స్నూకర్ ఆడతాను. ఏడు సంవత్సరాలుగా ఈ గేమ్ అడుతున్నాను. ఒకవేళ హాలిడేస్లో వేరే పట్టణాలకు వెళ్తే అక్కడ కూడా ఆడుతాను. రోజుకు కనీసం రెండు గేమ్లు ఆడతాను. –ఎండీ.ఇమద్, నల్లగొండ స్నూకర్ ఆట అంటే అమితమైన ఇష్టం. 1994 నుంచి స్నూకర్ ఆడుతున్నా. ఒకప్పుడు పెద్ద పెద్ద సిటీల్లో మాత్రమే స్నూకర్ గేమ్ ఆడడానికి అవకాశం ఉండేది. ఇప్పుడు చిన్నచిన్న పట్టణాల్లో కూడా స్నూకర్ పాయింట్లు అందుబాటులోకి వచ్చాయి. దీంతో యువత ఎక్కువ మంది ఆడడానికి అవకాశం ఉంది. – షకీర్, నల్లగొండ నల్లగొండ స్నూకర్ పాయింటు ఏర్పాటు చేసి సంవత్సరం అవుతోంది. మొదటగా ఆడేవారు పెద్దగా రాలేదు. ఇప్పుడు యువకులు, ఉద్యోగులు, విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు. కొన్ని సమయాల్లో లేడీస్ కూడా వచ్చి ఆడుతున్నారు. ప్రస్తుతం ఆదరణ బాగానే ఉంది. హాలిడేస్లో ఆడే వారి సంఖ్య ఎక్కవగా ఉంటుంది. – ఎండీ.ముజఫర్, స్నూకర్ పాయింట్ నిర్వాహకుడు, నల్లగొండ -
బస్సులను జాగ్రత్తగా నడపాలి
మిర్యాలగూడ : ప్రైవేట్ పాఠశాలల బస్సు డ్రైవర్లు క్రమశిక్షణతో, జాగ్రత్తగా బస్సులను నడపాలని డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ వాణి అన్నారు. ట్రస్మా ఆధ్వర్యంలో శనివారం మిర్యాలగూడలో ప్రైవేట్ పాఠశాలల బస్సుల భద్రతపై నిర్వహించిన అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు. ప్రైవేట్ పాఠశాలల బస్సు డ్రైవర్లు విద్యార్థులను సురక్షితంగా వారి ఇంటి వద్ద దింపి తిరిగి పాఠశాలలకు రావాలన్నారు. బస్సు నడిపే సమయంలో మొబైల్ ఫోన్లు వాడకూడదని, ఓవర్ స్పీడ్తో వెళ్లకూడదని సూచించారు. కార్యక్రమంలో ఎంవీఐ వి.చంద్రశేఖర్, మోటార్ వెహికల్ సిబ్బంది స్వప్న, కె.శ్రీనివాస్, ట్రస్మా రాష్ట్ర అసోసియేషన్ ప్రెసిడెంట్ వంగాల నిరంజన్రెడ్డి, శ్రీనివాస్రెడ్డి, శ్రీనివాసచారి, వరప్రసాద్, ఓరుగంటి శ్యాంసుందర్, శ్రీధర్రెడ్డి, మధుసూదన్రెడ్డి, అమరేందర్రెడ్డి, నర్సిరెడ్డి, వెంకట్, సలీం, దామోదర్, సురేందర్రెడ్డి, జయరాజు తదితరులు పాల్గొన్నారు. -
రైస్ మిల్లర్లు బ్యాంక్ గ్యారెంటీ సమర్పించాలి
ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి మిర్యాలగూడ : ధాన్యం సేకరణలో భాగంగా ఈ వానాకాలానికి సంబంధించి రైస్ మిల్లర్లు తక్షణమే బ్యాంక్ గ్యారెంటీలను సమర్పించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. శనివారం మిర్యాలగూడ సబ్ కలెక్టర్ కార్యాలయంలో రైస్ మిల్లర్ల సంఘం ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ ధాన్యం సేకరణలో భాగంగా ఈ వానాకాలం ధాన్యాన్ని మిల్లర్లు ఎప్పటికప్పుడు దిగుమతి చేసుకోవాలని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలిగించవద్దని సూచించారు. అకాల వర్షాల కారణంగా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిపోయే ప్రమాదం ఉన్నందున నాణ్యత ప్రమాణాలతో వచ్చిన ధాన్యాన్ని దిగుమతి చేసుకోవడంలో జాప్యం చేయొద్దన్నారు. అనంతరం ఆమె అవంతీపురం సమీపంలోని సూర్యతేజ రైస్ మిల్లును సందర్శించి అక్కడ ధాన్యం ప్రాసెసింగ్ ప్రక్రియను పరిశీలించారు. బాయిల్డ్ రైస్, డ్రైయర్స్ తదితర అంశాలను మిల్లు యాజమాన్యాన్ని అడిగి తెలుసుకున్నారు. ఆమె వెంట అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ్అమిత్, జిల్లా పౌర సరఫరాల అధికారి వెంకటేష్, జిల్లా మేనేజర్ గోపికృష్ణ, మిర్యాలగూడ రైస్ మిల్లర్ల సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్, జనరల్ సెక్రటరీ వెంటరమణచౌదరి, మిల్లర్లు గంటా సంతోష్రెడ్డి, జైని ప్రకాశ్రావు, జైని మురళి, గుడిపాటి శ్రీనివాస్, పైడిమర్రి సురేష్, పైడిమర్రి రంగనాథ్ తదితరులు ఉన్నారు. -
29 మండలాల్లో వర్షం
నల్లగొండ అగ్రికల్చర్ : అల్పపీడనద్రోణి కారణంగా శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం వరకు జిల్లాలోని 29 మండలాల్లో వర్షం కురిసింది. అత్యధికంగా శాలిగౌరారం మండలంలో 92.5 మీల్లీమీటర్ల వర్షం కురిసింది. జిల్లాలో 17.7 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. నార్కట్పల్లి 36.5మి.మీ, కట్టంగూరు 34.0, నకిరేకల్ 47.4, కేతేపల్లి 34.3, తిప్పర్తి 36.7, కనగల్ 43.3, చండూరు 31.7, అనుముల హాలియా 22.5, మాడుగులపల్లి 31.0, వేములపల్లి 34.3, అడవిదేవులపల్లిలో 32.6 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. స్టాఫ్ క్లబ్ సెక్రటరీగా సుధాకర్రామగిరి(నల్లగొండ) : నల్లగొండ ఎన్జీ కళాశాల స్టాఫ్ క్లబ్ కమిటీని శనివారం ఎన్నుకున్నారు. సెక్రటరీగా సిహెచ్. సుధాకర్ ఎన్నికయ్యారు. కళాశాల అధ్యాపకుల విస్తృత స్థాయి సమావేశంలో శనివారం జరిగింది. ఈ సమావేశంలో అధ్యాపకులు సుధాకర్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలేజీలో అధ్యాపకులకు ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. నూతన కమిటీ అధ్యక్షుడిగా పరంగి రవికుమార్, సభ్యులుగా ఆదె మల్లేశం, వెంకట్రెడ్డి, వాసుదేవు, గోవర్ధనగిరి, శివరాణి, వెంకటేశం ఎన్నికయ్యారు. కార్యక్రమంలో అంతటి శ్రీనివాస్, ప్రసన్నకుమార్, వెల్దండి శ్రీధర్, నాగరాజు, అనిల్ అబ్రహం, మునిస్వామి, గంజి భాగ్యలక్ష్మి, జోత్స్న పాల్గొన్నారు. న్యాయవాదులు నిరంతర విద్యార్థులురామగిరి(నల్లగొండ) : నిరంతర నేర్చుకుకోవడంతో న్యాయవాదులకు అనుభవం వస్తుందని వరంగల్కు చెందిన ప్రముఖ న్యాయవాది జి.విద్యాసాగర్రెడ్డి అన్నారు. శనివారం నల్లగొండ బార్ అసోసియేషన్, ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ ఆధ్వర్యంలో న్యాయవాదులకు చట్టాలపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన ఆర్ట్ ఆఫ్ క్రాస్ ఎగ్జామినేషన్, భారతీయ సాక్ష్య అధినియంపై న్యాయవాదులకు అవగాహన కల్పించారు. మారుతున్న చట్టాలపై న్యాయవాదులు అవగాహన పెంచుకోవాలని సూచించారు. హైకోర్ట్ న్యాయవాది బి.భరత్ ఆర్టిఫిషయల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి న్యాయవాదులు మంచి ఫలితాలను ఎలా పొందాలో తెలియజేశారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు, ఇండియన్ అసోసియేషన్ అఫ్ లాయర్స్ జిల్లా అధ్యక్షుడు కట్టా అనంతరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కార్యదర్శి మంద నగేష్, ఐఏఎల్ రాష్ట్ర అధ్యక్షుడు బొమ్మగాని ప్రభాకర్, బార్ కౌన్సిల్ సభ్యుడు దుస్స జనార్దన్, న్యాయవాదులు మునగాల నారాయణరావు, గుండె వెంకటేశ్వర్లు, మల్లేపల్లి ఆదిరెడ్డి, అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్లు జి.జవహర్లాల్, ప్రభుత్వ న్యాయవాది నాంపల్లి నర్సింహ, ఐఏఎల్ జిల్లా ప్రధాన కార్యదర్శి బి.వెంకన్న తదితరులు పాల్గొన్నారు. -
27న వైన్స్ల కేటాయింపు
నల్లగొండ : మద్యం దుకాణాల టెండర్ల ప్రక్రియ ముగియడంతో ఈ నెల 27న లాటరీ పద్ధతిలో షాపులు కేటాయించనున్నారు. జిల్లాలో 154 మద్యం షాపులకు గత నెల 26న ఎకై ్సజ్ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. 23వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించగా జిల్లాలో 154 షాపులకు 4,906 దరఖాస్తులు వచ్చాయి. కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆధ్వర్యంలో 27న నల్లగొండలోని లక్ష్మీగార్డెన్స్లో ఈ డ్రా ప్రక్రియ నిర్వహిస్తున్నారు. డ్రా విధానం ఇలా.. జిల్లాలో 154 మద్యం షాపులు ఉండగా.. 1వ నంబర్ షాపు నుంచి డ్రా విధానం ప్రారంభమవుతుంది. మొదట 20 షాపులకు సంబంధించి దరఖాస్తులు సమర్పించిన అందరినీ హాల్లోకి పిలిచి షాపు నంబర్ ప్రకారంగా కూర్చొబెడతారు. మొదట 1వ నంబర్ షాప్నకు దరఖాస్తు చేసిన వారికి సీరియల్ నంబర్ ప్రకారం కాయిన్స్ ఇచ్చి ఆ కాయిన్స్ను ఒక బిందెలో వేసి కలుపుతారు. వేదిక మీద కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎకై ్సజ్ సూపరింటెండెంట్ సంతోష్ ఒక కాయిన్ డ్రా తీస్తారు. ఆ కాయిన్లో ఏ నంబర్ ఉంటుందో ఆ వ్యక్తికే 1వ నెంబర్ షాపు డ్రాలో వచ్చినట్లు ప్రకటించి షాపును అలాట్ చేస్తారు. ఇదే పద్ధతిలో 150 షాపుల వరకు డ్రా తీస్తారు. మొదటి 20 షాపులు పూర్తయ్యాక మరో 20 షాపులకు సంబంధించిన టెండర్దారులను పిలిచి డ్రా తీస్తారు. 1/6వ వంతు డబ్బులు చెల్లించాలి డ్రాలో షాపు దక్కిన వారు 28వ తేదీలోగా 1/6వ వంతు డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. అయితే జిల్లాలో 3 కేటగిరిల వారీగా వైన్ షాపులు ఉన్నాయి. రూ.65 లక్షల రెంటల్ విధానం ఉన్న వైన్ షాపును పొందిన వారు రూ.10,83,334, రూ.55 లక్షల రెంటల్ షాపును దక్కించుకున్న వారు రూ.9,16,700, రూ.50 లక్షల రెంటల్ షాపు దక్కించుకున్న వారు రూ.8,33,334 ఈ నెల 28లోగా చెల్లించాలి. లేకపోతే డ్రాలో వచ్చిన షాపును రద్దు చేసి రీ నోటిఫికేషన్ చేస్తారు.ఫ నల్లగొండలో లాటరీ ఫ జిల్లాలోని 154 మద్యం దుకాణాలకు 4,906 దరఖాస్తులు మద్యం షాపుల డ్రా ప్రక్రియ ఈ నెల 27న నిర్వహిస్తున్నాం. అందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. ఉదయం నుంచి సాయంత్రం వరకు డ్రా ప్రక్రియ కొనసాగనుంది. ఈ కార్యక్రమానికి కలెక్టర్ ఇలా త్రిపాఠి హాజరవుతారు. – సంతోష్, ఎకై ్సజ్ సూపరింటెండెంట్ -
వివాహేతర సంబంధంతో పరువు తీసిందని హత్య
సూర్యాపేటటౌన్: వివాహేతర సంబంధం పెట్టుకుని కుటుంబం పరువు తీస్తుందని కుటుంబ సభ్యులే మహిళను హత్య చేశారు. ఈ నెల 21న ఆత్మకూరు(ఎస్) మండలం ఏపూర్ గ్రామంలో జరిగిన మహిళ హత్య కేసులో నిందితులను అరెస్టు చేసి రిమాండ్ తరలించినట్లు సూర్యాపేట డీఎస్పీ ప్రసన్నకుమార్ తెలిపారు. గురువారం డీఎస్పీ కార్యాలయంలో ఆయన ఈ కేసు వివరాలను విలేకరులకు వెల్లడించారు. ఏపూర్ గ్రామానికి చెందిన కొరివి మల్లయ్య, భిక్ష్మమమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు సంతానం. మల్లయ్య డ్రైవర్గా పనిచేస్తున్నాడు. కొద్దిరోజులుగా భిక్ష్మమమ్మ సమీప గ్రామానికి చెందిన మరో వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తుండడంతో కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయి. పలుమార్లు హెచ్చరించినా భిక్షమమ్మ మాట వినకపోవడంతో కుటుంబం పరువు పోతుందని భర్త మల్లయ్య, ఇద్దరు కుమారులు ప్రవీణ్, భరత్తో కలిసి భిక్ష్మమ్మను హత్య చేయాలని స్కెచ్ వేశారు. ఈ మేరకు మల్లయ్య అన్న కుమారుడు మహేష్, స్నేహితులు వంశీ, జనార్దన్తో కలిసి గ్రామంలో నడిరోడ్డుపై భిక్షమమ్మని కర్కశంగా కత్తితో గొంతుకోసి హత్య చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. వారి నుంచి కారు, రెండు ద్విచక్ర వాహనాలు, 5 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకుని గురువారం రిమాండ్కు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో రూరల్ సీఐ రాజశేఖర్, ఎస్ఐలు శ్రీకాంత్గౌడ్, మహేశ్వర్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఏపూర్ గ్రామంలో మహిళ హత్య కేసులో నిందితుల అరెస్టు -
బాస్కెట్ బాల్, బీచ్ వాలీబాల్ జిల్లా జట్ల ఎంపిక
నల్లగొండ టూటౌన్ : స్కూల్ గ్రేమ్స్ ఫెడరేషన్ (ఎస్జీఎఫ్) ఆధ్వర్యంలో గురువారం నల్లగొండ పట్టణంలోని ఎన్జీ కాలేజీలో అండర్–14, 17 బాలబాలికల బాస్కెట్ బాల్, బీచ్ వాలీబాల్ జిల్లా జట్లకు క్రీడాకారులను ఎంపిక చేశారు. ఈ సందర్భంగా ఎన్జీ కళాశాల ప్రిన్సిపాల్ ఉపేందర్ ఎంపిక పోటీలను ప్రారంభించి మాట్లాడారు. విద్యార్థులు పట్టుదల, క్రమశిక్షణతో క్రీడా పోటీల్లో శిక్షణ తీసుకుంటే అంతర్జాతీయ స్థాయికి ఎదగవచ్చన్నారు. బాస్కెట్ బాల్, బీచ్ వాలీబాల్ క్రీడా పోటీల్లో ప్రతిభ కనబర్చిన వారిని జిల్లా జట్లకు ఎంపిక చేసినట్లు ఎస్జీఎఫ్ కార్యదర్శి డి.విమల తెలిపారు. -
గాలికుంటు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు కృషి
చిట్యాల: తెలంగాణను గాలికుంటు వ్యాధి రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని రాష్ట్ర పశుసంవర్ధకశాఖ సంచాలకుడు డాక్టర్ బి. గోపి తెలిపారు. గురువారం చిట్యాల మండలం పిట్టంపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన ఉచిత పశువైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఆవులకు, గేదెలకు గాలికుంటు వ్యాధి సోకకుండా నివారణ టీకా వేయించాలని రైతులకు సూచించారు. ప్రభుత్వం ప్రతి యేటా రెండు పర్యాయాలు ఉచితంగా గాలికుంటు వ్యాధి నివారణ టీకాలను పంపిణీ చేస్తుందని పేర్కొన్నారు. తెలంగాణకు గాలికుంటు వ్యాధి రహిత రాష్ట్రంగా గుర్తింపు వస్తే అంతర్జాతీయ మార్కెట్లో మన పాడి, పశు ఉత్పత్తులకు డిమాండ్ పెరిగి, రైతుల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని వివరించారు. రైతులు విధిగా తమ ఆవులు, గేదెలకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పశుసంవర్ధక అధికారి జీవీ రమేష్, మండల పశువైద్యాధికారులు అభినవ్, అమరేందర్, సిబ్బంది శ్రీను, సైదులు, శ్రీనివాస్, మల్లారెడ్డి, వెంకన్న, సునీత, సతీష్ గోపాలమిత్ర సత్యనారాయణ పాల్గొన్నారు. రాష్ట్ర పశుసంవర్ధక శాఖ సంచాలకుడు గోపి -
నిరుపయోగంగా డ్రయ్యర్లు !
చౌటుప్పల్: తడిసిన, తేమ అధికంగా ఉన్న వరి ధాన్యాన్ని ఎండబెట్టేందుకు గాను చౌటుప్పల్, వలిగొండ వ్యవసాయ మార్కెట్ యార్డులకు ధాన్యం ఆరబెట్టే యంత్రాలను(డ్రయ్యర్లు) యాదాద్రి భువనగిరి జిల్లా అదనపు కలెక్టర్ సమకూర్చారు. మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో ఒక్కో దానికి రూ.14.90లక్షలు వెచ్చించి ఈ ఏడాది మే నెలలో కొనుగోలు చేసి మార్కెట్ యార్డులకు పంపించారు. వాతావరణం అనుకూలించని పరిస్థితుల్లో ఈ యంత్రం సాయంతో రైతులు ధాన్యాన్ని ఆరబెట్టుకోవచ్చు. అయితే ఆయా మార్కెట్ యార్డులలో ఉన్న ఈ యంత్రాలను ఇప్పటివరకు ఒక్క రైతు కూడా వినియోగించుకోలేదు. ట్రాక్టర్ ధాన్యానికి రూ.4000 ఖర్చు.. ఈ డ్రైయింగ్ మిషన్ ద్వారా ధాన్యం ఆరబెట్టుకోవడం రైతులకు పెను భారంగా మారింది. ఒక్కో ట్రాక్టర్ ధాన్యం(సుమారు 24 క్వింటాళ్లు) ఆరబెట్టేందుకు సుమారుగా రెండు గంటల సమయం పడుతోంది. ఈ యంత్రాన్ని నడిపించేందుకు ప్రత్యేకంగా ట్రాక్టర్ కావాల్సి ఉంది. ధాన్యం ఆరబెట్టుకోవాలంటే ట్రాక్టర్తో పాటు డ్రయ్యర్కు 10లీటర్ల చొప్పున డీజిల్ అవసరం అవుతుంది. రెండు గంటల సమయంలో ఒక ట్రాక్టర్ ధాన్యం మాత్రమే ఆరబెట్టే అవకాశం ఉంది. అలా ఒక్కో ట్రాక్టర్ ధాన్యం ఆరబెట్టేందుకు గాను రైతుకు సుమారుగా అన్ని ఖర్చులు కలిపి రూ.4000కు పైగానే అవుతుండడంతో ఈ యంత్రాన్ని వినియోగించుకునేందుకు ఎవరూ పెద్దగా ఆసక్తి చూపించడంలేదు. మార్కెట్ యార్డులోనే యంత్రం డ్రయ్యర్ వినియోగించకపోవడంతో ప్రస్తుతం చౌటుప్పల్ మార్కెట్ యార్డులో నిరుపయోగంగా ఉంది. ఈ విషయాన్ని మార్కెట్ అధికారులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. నిరుపయోగంగా ఉన్నందున వేరే చోటుకై నా తీసుకెళ్లాలని కోరారు. అయితే ఆ యంత్రాల వినియోగానికి అయ్యే ఖర్చు మార్కెట్ నుంచి భరించాలని ఉన్నతాధికారులు సూచించారు. దీంతో ఆ ఖర్చులు భరించలేమని పాలకవర్గం, అధికారులు చేతులెత్తేశారు. అటు రైతులు ముందుకు రాక, మరోవైపు అధికారులు స్పందించక చివరికి ఆ డ్రయ్యర్లు నిరుపయోగంగా మారాయి. చౌటుప్పల్, రామన్నపేట మార్కెట్ యార్డులకు ధాన్యం ఆరబెట్టే యంత్రాలు సమకూర్చిన మార్కెటింగ్ శాఖ రెండు గంటల పాటు వినియోగించడానికి రూ.4000 ఖర్చు ఆర్థిక భారంతో ముందుకురాని రైతులు -
పాడి పశువుల పెంపకంపై రైతులకు శిక్షణ
గరిడేపల్లి: పీవీ నరసింహారావు తెలంగాణ వెటర్నరీ విశ్వవిద్యాలయం–రాజేంద్రనగర్, సద్గురు ఫౌండేషన్ సంయుక్త సహకారంతో గరిడేపల్లి మండలంలో ని గడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రం(కేవీకే)లో పాడి రైతులకు పాడి పశువుల యాజ మాన్యంపై రెండు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని గురువారం ప్రారంభించినట్లు కేవీకే సీనియర్ సైంటిస్ట్ అండ్ హెడ్ ఇన్చార్జి నరేష్ తెలిపారు. ఈ కార్యక్రమానికి వెటర్నరీ విశ్వవిద్యాలయం విస్తరణ సంచాలకుడు డాక్టర్ కిషన్కుమార్ ముఖ్యఅతిధిగా హాజరై రైతులకు పాల ఉత్పిత్తి పెంపుదల, తక్కువ ధరలో దాణా తయారీ, పునరుత్పత్తి, విచక్షణాపూరితంగా ఔషధ వినియోగం గురించి అవగాహన కల్పించినట్లు పేర్కొన్నారు. అదేవిధంగా పశుసంవర్ధక శాఖ డాక్టర్ కిరణ్కుమార్ రైతులకు సబ్సిడీలు, ఇతర పథకాల గురించి తెలియజేశారన్నారు. ఈ కార్యక్రమంలో వరంగల్లోని మామ్నూరు కేవీకే ప్రోగ్రాం కోఆర్డినేటర్ బిందుమాధురి, మామ్నూరు కేవీకే శాస్త్రవేత్తలు అరుణజ్యోతి, సాయికిరణ్, గడ్డిపల్లి కేవీకే శాస్త్రవేత్తలు ఎన్. సుగంధి, సీహెచ్. నరేష్, ఎ. కిరణ్, పి. అక్షిత్, పశువైద్యాధికారిణి జయసుధ, 50మంది రైతులు తదితరులు పాల్గొన్నారు. -
మద్యం దరఖాస్తులు 4,906
నల్లగొండ: మద్యం టెండర్ల గడువు గురువారంతో ముగిసింది. అయినా ఆబ్కారీ శాఖ ఆశించిన స్థాయిలో దరఖాస్తులు రాలేదు. జిల్లాలో 154 మద్యం దుకాణాలకు గతనెల 26న టెండర్ల ప్రక్రియను ప్రారంభమై ఈ నెల 18న గడువు ముగిసింది. దీంతో 4,620 దరఖాస్తులే వచ్చాయి. టెండర్ల చివరి బీసీ బంద్ కారణంగా తాము దరఖాస్తులు చేయలేకపోయామని కొందరు వ్యాపారులు గడువు పెంచాలని ప్రభుత్వానికి విన్నవించారు. దీంతో ప్రభుత్వం ఈనెల 23 వరకు గడువు పెంచింది. అయితే ఈనెల 19న ఆదివారం, 20న (సోమవారం) దీపావళి పండుగ రావడంతో 2 రోజులు దరఖాస్తుల స్వీకరించలేదు. మిగిలిన మూడు రోజుల్లో మంగళవారం తొమ్మిది దరఖాస్తులు రాగా, బుధవారం 24, చివరి రోజైన గురువారం అత్యధికంగా 253 దరఖాస్తులు వచ్చాయి. వీటితో కలిపి మొత్తం 4,906 టెండర్లు దాఖలయ్యాయి. గడువు పెంచినా దరఖాస్తులు అంతంతే.. ప్రభుత్వం మద్యం దుకాణాల టెండర్ల గడువు పెంచినా కేవలం 286 దరఖాస్తులే పెరిగాయి. 2023లో 7,057 దరఖాస్తులు రావడంతో అప్పుడు డిపాజిట్ ఫీజు రూ.2 లక్షలు ఉండడంతో రూ.141.41 కోట్ల ఆదాయం వచ్చింది. ఇప్పుడు 4,906 దరఖాస్తులు వచ్చాయి. అయితే ఈ సారి టెండర్ ఫీజు రూ.3లక్షలకు పెంచినప్పటికీ రూ.147.18 కోట్ల ఆదాయమే సమకూరింది. గతంతో పోలిస్తే కేవలం రూ.5.77 కోట్ల ఆదాయమే అదనంగా వచ్చింది. అయితే ఆబ్కారీ శాఖ జిల్లా నుంచి ఫీజు రూపంలో రూ.200 కోట్ల వరకు ఆదాయం వస్తుందని భావించినా అంచనాను చేరుకోలేదు. రేణుకా ఎల్లమ్మ కరుణ ఎవరికో.. దర్వేశిపురం వైన్స్కు జిల్లాలో అత్యధికంగా 152 దరఖాస్తులు వచ్చాయి. ఒక్కో దరఖాస్తుకు రూ.3 లక్షల చొప్పున ఆ ఒక్క వైన్స్ నుంచే రూ.4.56 కోట్ల ఆదాయం సమకూరింది. అయితే జిల్లాలో ఉన్న షాపుల్లో గతంలో కూడా ఈ వైన్స్కే అత్యధికంగా దరఖాస్తులు వచ్చాయి. అయితే ఒక్కొక్కరు పదుల సంఖ్యలో ఆ వైన్స్కు దరఖాస్తులు చేసినా సింగిల్ దరఖాస్తు చేసిన వ్యక్తికే టెండర్లో వైన్స్ దక్కింది. ఈసారి పెద్ద ఎత్తున దరఖాస్తులు వేశారు. కానీ ఆ రేణుకా ఎల్లమ్మ అమ్మవారు ఎవరిపై కరుణ చూపుతుందో వేచిచూడాలి. దరఖాస్తులు సమర్పిస్తున్న టెండర్దారులు దరఖాస్తులు నింపుతున్న మద్యం టెండర్దారులుఈనెల 27న జిల్లాలోని మద్యం దుకాాణాలకు వచ్చిన టెండర్లకు లక్కీ డ్రా ద్వారా షాపులను కేటాయించనున్నారు. నల్లగొండలోని హైదరాబాద్ రోడ్డులోని లక్ష్మీగార్డెన్స్లో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆధ్వర్యంలో లక్కీ డ్రా తీస్తారు. ఫ ముగిసిన టెండర్లు ఫ గడువు పెంచినా స్పందన నామమాత్రమే.. ఫ చివరి రోజు 253 దరఖాస్తులు ఫ దర్వేశిపురం మద్యం దుకాణానికి అత్యధికంగా 152 టెండర్లు -
రోడ్డు నిండా ధాన్యం.. బురదలోకి స్కూల్ వాహనం
తిప్పర్తి : నల్లగొండ పట్టణం నుంచి తిప్పర్తి మండలం దుప్పలపల్లి వరకు ఉన్న అద్దంకి–నార్కట్పల్లి రహదారి సర్వీస్రోడ్డులో రైతులు ధాన్యం కుప్పలు పోశారు. దీంతో వాహనాలు రోడ్డు దిగి వెళ్లాల్సి వస్తోంది. గురువారం ఉదయం ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు రోజు మాదిరిగానే విద్యార్థులను తీసుకెళ్లడానికి దుప్పలపల్లికి వస్తుండగా ధాన్యం రాశులు రోడ్డు కిందకు దిగింది. రోడ్డు కింది భాగం వర్షాలతో బురదమయంగా మారడంతో బస్సు బురదలో కూరుకుపోయి ఒక పక్కకు ఒరిగింది. ఈ ఘటన జరిగిన సమయంలో బస్సులోకి ఇంకా పిల్లలు ఎక్కలేదు. దీంతో ఎలాంటి ప్రమాదం చోటుచేసుకోలేదు. -
రైలు కింద పడి యువకుడి బలవన్మరణం
బీబీనగర్, భూదాన్పోచంపల్లి: రైలు కింద పడి బీటెక్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన బుధవారం అర్ధరాత్రి బీబీనగర్ మండల కేంద్ర పరిధిలోని ఎయిమ్స్ ఎదురుగా రైల్వే ట్రాక్పై జరిగింది. రైల్వే జీఆర్పీ ఇన్చార్జి కృష్ణారావు తెలిపిన వివరాల ప్రకారం.. భూదాన్పోచంపల్లి మండలం అంతమ్మగూడెం గ్రామానికి చెందిన రైతు వస్పరి వెంకటేశ్, పద్మ దంపతులకు ఇద్దరు కుమార్తెలతో పాటు కుమారుడు అభిలాష్(19) సంతానం. అభిలాష్ మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లా ఘట్కేసర్లోని విజ్ఞాన భారతి ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. రోజుమాదిరిగా బుధవారం కళాశాలకు వెళ్లి వచ్చిన అభిలాష్ అర్ధరాత్రి ఇంట్లో ఎవరికీ చెప్పకుండా కారు తీసుకొని బయటకు వచ్చాడు. బీబీనగర్ ఎయిమ్స్ సమీపంలోని రైల్వే ట్రాక్ పక్కన సర్వీస్ రోడ్డులో కారును నిలిపి ట్రాక్పై చేరుకొని ఎదురుగా వస్తున్న మణుగూరు ఎక్స్ప్రెస్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. గురువారం ఉదయం సమాచారం తెలుసుకున్న రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతుడి ఫోన్ను స్వాధీనం చేసుకుని, అందులోని సిమ్ తీసి వేరే మొబైల్లో వేసి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు. అంతమ్మగూడెంలో విషాదఛాయలుఅభిలాష్ మృతితో అంతమ్మగూడెం గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆత్మహత్యకు పాల్పడే ముందు అభిలాష్ తన చిన్న సోదరికి ఫోన్కు తన మెడలో బంగారు చైన్ ఉందని, అలాగే కొందరు స్నేహితులు డబ్బులు ఇవ్వాలని మెసేజ్ పెట్టినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. పోస్టుమార్టం అనంతరం గురువారం సాయంత్రం స్వగ్రామంలో అభిలాష్ అంత్యక్రియలు నిర్వహించారు. చేతికందొచ్చిన ఒక్కగానొక్క కుమారుడు ఆత్యహత్య చేసుకోవడంతో అభిలాష్ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. అభిలాష్ ఆత్మహత్యకు గల కారణాలు మాత్రం తెలియరాలేదు. -
పత్తి కొనుగోళ్లకు సీసీఐ సిద్ధం
నల్లగొండ అగ్రికల్చర్: నేటి నుంచి జిల్లాలో సీసీఐ (కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) కొనుగోలు కేంద్రాలను ప్రారంభించనున్నారు. ఇందుకు మార్కెటింగ్ శాఖ ఏర్పాట్లు చేసింది. గతేడాది మందుగానే సీసీఐ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం వల్ల రైతులు ఆయా కేంద్రాల్లో పత్తిని అమ్ముకుని ప్రభుత్వ మద్దతు ధర పొందారు. జిల్లా వ్యాప్తంగా 5,56,826 ఎకరాల్లో రైతులు పత్తి పంటను సాగు చేశారు. ఇప్పటికే రెండు విడతల్లో పత్తిని ఏరారు. కానీ సీసీఐ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించని కారణంగా కూలీలకు డబ్బులను చెల్లించడం కోసం రైతులు తమ పత్తిని దళారులకు, జిన్నింగ్ మిల్లులకు అమ్ముకుంటున్నారు. అయితే ప్రభుత్వ మద్దతు ధర క్వింటాల్కు రూ.8,100 కాగా వ్యాపారులు రైతుల అవసరాన్ని అసరాగా తీసుకుని క్వింటాల్కు రూ.5 వేల నుంచి రూ.6 వేల వరకు మాత్రమే కొనుగోలు చేస్తూ రైతులను నట్టేటా ముంచుతున్నారు. ఈ క్రమంలో తమకు మద్దతు ధర దక్కడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా వ్యాపారులు లక్ష క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేసినట్లు మార్కెటింగ్ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. తొలుత 9 కేంద్రాలు జిల్లా వ్యాప్తంగా 25 జిన్నింగ్ మిల్లులు ఉన్నాయి. అందులో రెండు జిన్నింగ్ మిల్లు మినహా మిగిలిన 23 జిన్నింగ్ మిల్లుల్లో సీసీఐ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి పత్తిని కొనేందుకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తుంది. దీంట్లో భాగంగా శుక్రవారం తొలుత తొమ్మిది సీసీఐ కొనుగోలు కేంద్రాను ఏర్పాటు చేయడానికి మార్కెటింగ్ శాఖ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో సలపార్ కాటన్ మిల్ చండూరు, వరలక్ష్మి కాటన్ మిల్ చిట్యాల, శ్రీలక్ష్మీనర్సింహ ఆగ్రో ఇండస్ట్రీ మాల్ ఏ, శివగణేష్ కాటన్ మిల్ మాల్ బీ, శివగణేష్ కాటన్మిల్మల్లెపల్లి ఏ, తిరుమల కాటన్మిల్ మల్లేపల్లి బీ, శ్రీనాఽథ్ కాటన్ మిల్ నకిరేకల్, సత్యనారాయణ కాటన్ మిల్ నల్లగొండ, టీఆర్ఆర్ కాటన్ మిల్ శాలిగౌరారం కొనుగోలు కేంద్రాలు ఉన్నాయి. తగ్గనున్న దిగుబడి వరుస వర్షాల కారణంగా జిల్లాలో ప్రస్తుత సీజన్లో పత్తి దిగుబడి సగానికి తగ్గే అవకాశం ఉన్నట్లు వ్యవసాయశాఖ అధికారులు పేర్కొంటున్నారు. పత్తి కాయదశ నుంచే వరుస వర్షాలు కురిసిన కారణంగా చేలు ఎర్రబారి కాయ, పత్తి రాలిపోయింది. దీంతో ఎకరాకు 8 క్వింటాళ్లకు బదులు 4 క్వాంటాళ్ల దిగుబడి వచ్చే అవకాశమే ఉందని అంటున్నారు. సీసీ కేంద్రాలకు రైతులు తీసుకొచ్చే పత్తిలో తేమ శాతం 8 నుంచి12 వరకు ఉండేలా ఆరబెట్టాలి. తేమ శాతం తక్కువ ఉంటేనే ప్రభుత్వ మద్దతు ధర క్వింటాకు రూ.8,100 చెల్లిస్తారు. స్లాట్ బుక్ చేసుకున్నాక పత్తిని సీసీఐ కేంద్రాలకు తీసుకెళ్లాలి. – ఛాయాదేవి, జిల్లా మార్కెటింగ్ ఏడీ నేడు తొమ్మిది కొనుగోలు కేంద్రాలు ప్రారంభం ఫ మొత్తం 23 కేంద్రాల ఏర్పాటుకు మార్కెటింగ్ శాఖ సన్నాహాలు ఫ ఇప్పటి వరకు సీసీఐ కేంద్రాలు లేక వ్యాపారులకు అమ్ముతున్న రైతులు ఫ మద్దతు ధర దక్కడం లేదని తీవ్ర ఆవేదన -
‘మీ డాడీ బాగున్నాడా అమ్మ.. మళ్లీ కేసీఆర్ రావాలి’
యాదగిరిగుట్ట: ‘మీ డాడీ బాగున్నాడా.. మళ్లీ కేసీఆర్ రావాలి.. ఒక్క మీటింగ్ పెట్టమను నాయనను.. అందరం కలిసికట్టుగా వస్తాం.. రేవంత్రెడ్డి వచ్చినాక బంగారం లేదు.. చీరలు లేవు.. ఏమీ ఇస్తలేడు’ అంటూ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితతో మహిళలు సంభాషించారు. గురువారం యాదగిరి క్షేత్రానికి వచ్చిన కల్వకుంట్ల కవితను కొండపైకి వెళ్లే మార్గంలో రెండవ ఘాట్ రోడ్డు వద్ద వడాయిగూడెం గ్రామానికి చెందిన సుక్కల లక్ష్మితో పాటు పలువురు మహిళలు కలిశారు. ఈ సందర్భంగా బాగున్నారా అంటూ కవిత వారిని పలకరించి ‘రేవంత్రెడ్డి ప్రభుత్వం రూ.4వేలు ఇస్తుందా.. కాంగ్రెస్ పాలన ఏవిధంగా ఉంది.. అందరికి చీరలు వచ్చాయా.. పథకాలు అందుతున్నాయా’ అని అడిగారు. దీంతో సుక్కల లక్ష్మి మాట్లాడుతూ.. కేసీఆర్ ఉండగా చీరలు ఇచ్చిండు, ఒక్కసారి కేసీఆర్ను మీటింగ్ పెట్టమనుండ్రి ఎంత మందిమి వస్తామో రేవంత్రెడ్డికి తెలుస్తుంది. డాడీ బాగుండా.. మీ నాయన ఆరోగ్యంగా ఉండాలి అంటూ చెప్పింది. రేవంత్రెడ్డికి ఓటు వేసి ఘోరంగా మోసపోయామని కవితతో మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. ● వాహనాల నిలిపివేతకల్వకుంట్ల కవిత కాన్వాయ్లోని వాహనాలు కొండపైకి వెళ్లకుండా ఎస్పీఎఫ్ సిబ్బంది నిలిపివేశారు. అన్ని వాహనాలకు అనుమతి లేదని, కవిత వాహనంతో పాటు మరో 4 వాహనాలను మాత్రమే పంపిస్తామని చెప్పారు. అనంతరం దేవస్థానం అధికారులు జోక్యం చేసుకొని వాహనాలను కొండపైకి పంపించారు. యాదగిరిగుట్టలో కల్వకుంట్ల కవితతో మహిళల సంభాషణ -
ఖర్చు ఎక్కువ అవుతోంది
మంచి ఉద్దేశంతో అదనపు కలెక్టర్ డ్రయ్యర్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. అయితే దానిని వినియోగించాలంటే ప్రత్యేకంగా ట్రాక్టర్ అవసరం ఉంటుంది. సొంత ట్రాక్టర్ లేని రైతులు అద్దెకు తెచ్చుకోవాలి. ట్రాక్టర్కు కిరాయితో డీజిల్, డ్రయ్యర్కు డీజిల్ ఖర్చు భరించడం రైతులకు సమస్యగా మారుతోంది. 20 నుంచి 30ఎకరాల్లో పంట సాగు చేసే రైతులు సొంతంగా డబ్బులు ఖర్చు పెట్టుకొని ధాన్యాన్ని ఆరబెట్టుకోవడం సాధ్యమవుతుంది. సాధారణ రైతులకు సాధ్యమయ్యే పరిస్థితి ఎంతమాత్రం లేదు. – ఉబ్బు వెంకటయ్య, వ్యవసాయ మార్కెట్ చైర్మన్, చౌటుప్పల్ -
ముస్లింల సమస్యల పరిష్కారానికి కృషి
ఫ మాజీ మంత్రి జానారెడ్డి రామగిరి(నల్లగొండ): ముస్లిం మైనార్టీల సమస్యల పరిష్కారానికి కృషిచేస్తానని మాజీ మంత్రి జానారెడ్డి అన్నారు. గురువారం నల్లగొండ జిల్లా కేంద్రానికి వచ్చిన జానారెడ్డి.. జమియత్ ఉలేమా హింద్ జిల్లా అధ్యక్షుడు మౌలానా ఎహసానుద్దీన్ సాబ్ను మర్యాదపూర్వకంగా కలిశారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ముస్లిం మైనార్టీలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలతోపాటు ముస్లిం స్థితిగతులపై చర్చించారు. ఈ సందర్భంగా జానారెడ్డి మాట్లాడుతూ ఉలేమాలు ప్రస్తావించిన అన్ని విషయాలు సీఎం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. ఆయన వెంట ఎమ్మెల్సీ శంకర్ నాయక్, కాంగ్రెస్ పార్టీ నల్లగొండ పట్టణ అధ్యక్షుడు గుమ్ముల మో హన్రెడ్డి, గ్రంథాలయ చైర్మన్ హఫీజ్ ఖాన్, నీలగిరి మున్సిపల్ మాజీ చైర్మన్ బుర్రి శ్రీనివాస్రెడ్డి తదితరులు ఉన్నారు. జాబ్మేళాను వినియోగించుకోవాలి హుజూర్నగర్ : హుజూర్నగర్లో ఈనెల 25న నిర్వహించే మెగా జాబ్మేళాను యువత సద్వినియోగం చేసుకోవాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ కోరారు. హుజూర్నగర్ పట్టణంలోని పెర్ల్ ఇన్ఫినిటీ ఇంటర్ నేషనల్ స్కూల్లో నిర్వహించే జాబ్ మేళా ఏర్పాట్లను ఎస్పీ కె. నరసింహ, నిర్వాహకులతో కలిసి గురువారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కంపెనీల వారీగా స్టాల్స్ కేటాయింపుల వివరాలను అందజేయాలని సింగరేణి ప్రతినిధి చందర్ను ఆదేశించారు. కార్యక్రమంలో అధికారులు, నాయకులు పాల్గొన్నారు. -
విద్యార్థులు సైబర్ నేరాల బారిన పడొద్దు
నల్లగొండ: విద్యార్థులు తమ సెల్ఫోన్లలో అనవసరమైన యాప్లను డౌన్లోడ్ చేసుకుని సైబర్ నేరాల బారిన పడొద్దని ఎస్పీ శరత్చంద్ర పవార్ అన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా గురువారం నల్లగొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని ఎస్పీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సోషల్ మీడియా, ఇన్స్టా గ్రామ్, ఫేస్బుక్లో అవసరమైన వీడియోలు చూస్తూ సమయాన్ని వృథా చేయకుండా చదువు మీద శ్రద్ధచూపి అనుకున్న లక్ష్యాలను సాధించాలన్నారు. పోలీస్ డాగ్స్ వాటి పనీతీరు, నేరాలు, దొంగతనాలు జరిగినప్పుడు నిందితులను కనిపెట్టే విషయంలో కావాల్సిన అన్ని రకాల టెస్టింగ్ కిట్లతో స్టాల్స్ను ఏర్పాటు చేస్తామన్నారు. విద్యార్థులకు పోలీస్ విధులను వివరించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ రమేష్, నల్లగొండ డీఎస్పీ శివరాంరెడ్డి, ఏఆర్ డీఎస్పీ శ్రీనివాస్, సీఐలు రాఘవరావు, రాము, మహా లక్ష్మయ్య, కరుణాకర్, రాజశేఖర్రెడ్డి, ఆర్ఐలు సంతోష్, శ్రీను, సూరప్ప నాయుడు, ఆర్ఎస్ఐలు కళ్యాణ్రాజ్, రాజీవ్, సాయిరాం, సంతోష్, అశోక్, శ్రావణి, మమత పాల్గొన్నారు. ఫ ఎస్పీ శరత్చంద్ర పవార్ -
పాలకుల నిర్లక్ష్యం.. రైతులకు శాపం
చిట్యాల: పత్తి, ధాన్యం కొనుగోళ్ల విషయంలో రాష్ట్రంలోని కాంగ్రెస్ పాలకులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వలన రైతులకు శాపంగా మారిందని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆరోపించారు. గురువారం చిట్యాల మండల పరిధిలోని పెద్దకాపర్తి గ్రామ శివారులోని పత్తి చేలను ఆయన పరిశీలించి రైతులతో మాట్లాడారు. వరుసగా కురుస్తున్న వర్షాలతో చేతికొచ్చిన పత్తి పాడవుతుందని, సీసీఐ కొనుగోళ్లు ప్రారంభించకపోవడంతో ఏరిన పత్తిని నిల్వ చేసుకోవడానికి ఇబ్బంది పడాల్సి వస్తుందని రైతులు చిరుమర్తి దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతుల భవిష్యత్తును కాంగ్రెస్ ప్రభుత్వం దళారుల చేతుల్లో పెట్టేందుకు కుట్ర చేస్తోందని ఆరోపించారు. పత్తితీత మొదలై నెలరోజులు దాటినా సీసీఐ కొనుగోళ్లు ప్రారంభించకపోవడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని అన్నారు. రైతుల సంక్షేమాన్ని రాష్ట్ర ప్రభుత్వం గాలికి వదిలిందని ఆరోపించారు. ధాన్యం, పత్తి కొనుగోళ్లను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఆవుల ఐలయ్య, కల్లూరి మల్లారెడ్డి, కొలను వెంకటేష్, ఆరూరి శ్రీశైలం, మర్రి జలేంధర్రెడ్డి, వెంకటరమణారెడ్డి తదితరులు ఉన్నారు. నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య -
‘ఇంటిగ్రేటెడ్’ నిర్మాణానికి ప్రతిపాదనలు పంపండి
మిర్యాలగూడ : యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ భవన నిర్మాణానికి ప్రతిపాదనలు సమర్పించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి రెవెన్యూ అధికారులను ఆదేశించారు. గురువారం ఆమె మిర్యాలగూడ మండలం జప్తివీరప్పగూడెం గ్రామంలో గల సర్వే నంబర్ 214లో ఉన్న ప్రభుత్వ స్థలాన్ని పరిశీలించి మాట్లాడారు. గుర్తించిన మొత్తం 25 ఎకరాల స్థలంలో భవన నిర్మాణాలు చేపట్టేందుకు సరిహద్దులు నిర్ధారించి మ్యాప్తో సహా పంపించాలని సూచించారు. ఆమె వెంట సబ్ కలెక్టర్ నారాయణ్అమిత్, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ పవన్, తహసీల్దార్ సురేష్ పాల్గొన్నారు. వైద్యసిబ్బంది అప్రమత్తంగా ఉండాలినార్కట్పల్లి: సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్న నేపథ్యంలో వైద్యసిబ్బంది అప్రమత్తంగా వ్యవహరిస్తూ సమయపాలన పాటించాలని డీఎంహెచ్ఓ డాక్టర్ శ్రీనివాస్ ఆదేశించారు. నార్కట్పల్లి, అక్కెనపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను గురువారం ఆయన తనిఖీ చేశారు. నార్కట్పల్లి పీహెచ్సీలో రికార్డులను ప్రగతి నివేదికను పరిశీలించారు. అక్కెనపల్లి పీహెచ్సీ వైద్యాధికారి వరూధినిని అడిగి టీబీ, లెప్రసీ, ఎన్సీడీ, మాతాశిశు సంరక్షణ కార్యక్రమాల నివేదికలు తెప్పించుకుని పరిశీలించి మాట్లాడారు మాతాశిశు సంరక్షణపై శ్రద్ధ వహించాలన్నారు. ఆయన వెంట జిల్లా డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ వేణుగోపాల్రెడ్డి, జిల్లా క్షయ నివారణ అధికారి డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, డాక్టర్ విజయ్ కుమార్, నర్సింగ్ అధికారి లక్ష్మీ ఉన్నారు. ప్రభుత్వం పంపిన ప్రశ్నపత్రాలే వాడాలినల్లగొండ టూటౌన్ : జిల్లాలోని అన్ని యాజమాన్య పాఠశాలల్లో ప్రభుత్వం పంపిన ప్రశ్నపత్రాలతోనే విద్యార్థులకు పరీక్షలు నిర్వహించాలని డీఈఓ భిక్షపతి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. శుక్రవారం నుంచి ఈనెల 31 వరకు ఎస్ఏ–1 పరీక్షలను నిర్దేశించిన కాలనిర్ణయ పట్టిక ప్రకారం నిర్వహించాలని పేర్కొన్నారు. పరీక్షల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. నవంబర్లో జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శన భారత శాస్త్ర సాంకేతిక మండలి న్యూఢిల్లీ, రాష్ట్ర విద్యాపరిశోధన శిక్షణ సంస్థ హైదరాబాద్ ఆధ్వర్యంలో నవంబర్ నాలుగో వారంలో జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహించనున్నట్లు డీఈఓ భిక్షపతి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో సైన్స్, గణితం, పర్యావరణ అంశాలపై 114 ఇన్స్పైర్ ప్రాజెక్టులు ప్రదర్శించబడుతాయని తెలిపారు. జిల్లాలోని అన్ని యాజమాన్యాల ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల నుంచి తప్పనిసరిగా ఉప అంశాల వారీగా ప్రాజెక్టులను విద్యార్థులచే తయారు చేయించాలని డీఈఓ పేర్కొన్నారు. పూర్తి వివరాలకు సెల్ : 9848578845 నంబర్లో సంప్రదించానలని కోరారు. నారసింహుడికి నిత్యారాధనలుయాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో గురువారం సంప్రదాయ పూజలు ఘనంగా నిర్వహించారు. వేకువజామున స్వామివారి మేల్కొలుపులో భాగంగా సుప్రభాతం సేవ చేపట్టిన అర్చకులు.. గర్భాలయంలోని అభిషేకం, సమస్రనామార్చనతో కొలిచారు. అనంతరం ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజవాహన సేవ, ఉత్సవమూర్తులకు నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం, ముఖ మండపంలో సువర్ణ పుష్పార్చన పూజలు నిర్వహించారు. -
పత్తి రైతుల ఫోన్ నంబర్లు అప్డేట్ చేయాలి
నార్కట్పల్లి: పత్తి అమ్మకాలకు ఆన్లైన్లో స్లాట్ బుకింగ్ చేసుకోవాల్సి ఉన్నందున పత్తి రైతుల ఫోన్ నంబర్లు అప్డేట్ చేయాలని రాష్ట్ర వ్యవసాయ, పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ బి.గోపి సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన నార్కట్పల్లి మండలం చౌడంపల్లి వద్ద వరమహాలక్ష్మి జిన్నింగ్ మిల్లును జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠితో కలిసి సందర్శించారు. జిల్లాలో ఈ వానాకాలం సీజన్లో పత్తి దిగుబడి అంచనా, జిన్నింగ్ మిల్లుల ఏర్పాటు వివరాలను వ్యవసాయ శాఖ జిల్లా అధికారులను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో 2.77 లక్షల మంది పత్తి రైతులున్నట్లు వారు డైరెక్టర్కు తెలిపారు. ఈ సందర్భంగా డైరెక్టర్ గోపి మాట్లాడుతూ రోజు వారీగా ఎంతమంది రైతులు పత్తిని మిల్లులకు తీసుకొస్తున్నారో.. రాబోయే వారం రోజుల్లో మిల్లులకు వచ్చే పత్తి రైతుల వివరాలన్నిటినీ డాష్ బోర్డులో నమోదు చేయాలన్నారు. ఫోన్లు అప్డేట్ చేసిన రైతుల ఆధార్ వివరాలు, బ్యాంకు ఖాతా వివరాలన్నీ ఆటోమేటిక్గా అప్డేట్ అయ్యేలా సీసీఐ కొత్త సాఫ్ట్ వేర్ రూపొందించిందన్నారు. అన్ని జిన్నింగ్ మిల్లుల వద్ద వ్యవసాయ శాఖ తరఫున ఒక్కో అధికారిని నియమించాలన్నారు. అనంతరం వరమహాలక్ష్మి కాటన్ మిల్లుకు పత్తి తీసుకొచ్చిన రైతులతో మాట్లాడారు. రైతులకు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నివాస్, ఇన్చార్జి అదనపుకలెక్టర్ నారాయణ్ అమిత్, నల్లగొండ ఆర్డీఓ అశోక్రెడ్డి, మార్కెటింగ్ ఏడీ ఛాయాదేవి, డీఆర్డీఓ శేఖర్రెడ్డి పాల్గొన్నారు. ఫ రాష్ట్ర వ్యవసాయ, పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ గోపి -
రెండు రోజుల్లో 33 దరఖాస్తులు
ఫ వైన్స్ టెండర్లకు నేడు ఆఖరు నల్లగొండ : మద్యం దుకాణాలకు రెండు రోజుల్లో 33 దరఖాస్తులు వచ్చాయి. ఈ నెల 18వ తేదీతో మద్యం టెండర్ల గడువు ముగియగా.. ప్రభుత్వం 23వ తేదీ వరకు గడువు పొడిగించిన విషయం తెలిసిందే. కానీ ఈ రెండు రోజుల్లో అనుకున్న స్థాయిలో దరఖాస్తులు రాలేదు. దరఖాస్తులకు గురువారం ఆఖరి గడువు ఉంది. అయితే ఇప్పటి వరకు మొత్తం దరఖాస్తులు 4,653 రాగా.. దరఖాస్తుల ద్వారా ప్రభుత్వానికి రూ.139.59 కోట్ల ఆదాయం వచ్చింది. గతంలో దరఖాస్తుల ద్వారా రూ.141.44 ఆదాయం రాగా ఇప్పుడు తక్కువగానే వచ్చింది. గురువారం మరో 62 దరఖాస్తులు గతంలో వచ్చిన ఆదాయాన్ని చేరుకుంటుంది. ఉన్నత లక్ష్యాలు ఏర్పర్చుకోవాలికొండమల్లేపల్లి : విద్యార్థులు ఉన్నత లక్ష్యాలు ఏర్పర్చుకోవాలని డీఈఓ భిక్షపతి అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని కేజీబీవీని ఆయన సందర్శించి విద్యార్థులతో మాట్లాడి మెనూ వివరాలతోపాటు సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రాబోయే పదవ తరగతి పరీక్షలకు ప్రణాళికబద్ధంగా సిద్ధమవ్వాలని, ఉత్తమ మార్కులు సాధించాలని ఆకాంక్షించారు. ఆయన వెంట ఎస్ఓ కత్తుల సరళ, ఉపాధ్యాయులు ఉన్నారు. 30న విద్యా సంస్థల బంద్నల్లగొండ టౌన్ : పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని కోరుతూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఈ నెల 30న రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థల బంద్ నిర్వహించనున్నట్లు ఆ సంఘం రాష్ట్ర కార్యదర్శి తాళ్ల నాగరాజు తెలిపారు. బుధవారం నల్లగొండలోని ఎస్ఎఫ్ఐ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు ఆకారపు నరేష్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో కళాశాలల యాజమాన్యాలు విద్యార్థులకు సర్టిఫికెట్స్ ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నాయని అన్నారు. అన్ని విద్యార్థి సంఘాలు పాల్గొని బంద్ను విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఖమ్మంపాటి శంకర్, కుర్ర సైదానాయక్, కోరె రమేష్, ముస్కు రవీందర్, మారుపాక కిరణ్, కర్రెం రవి, ప్రసన్న, మూడవత్ జగన్నాయక్, జగదీష్, సైఫ్ నవదీప్ తదితరులు పాల్గొన్నారు. నేత్రపర్వం.. నృత్యోత్సవంయాదగిరిగుట్ట: యాదగిరి పట్టణంలోని వైకుంఠద్వారం వద్ద బుధవారం దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు కనువిందు చేశాయి. భరతనాట్యం, కూచిపూడి నృత్యాలను కళాకారులు అద్భుతంగా ప్రదర్శించి భక్తులను అలరించారు. యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి జన్మనక్షత్రమైన స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకొని సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఎయిమ్స్ నూతన డైరెక్టర్ నేడు బాధ్యతల స్వీకరణ బీబీనగర్: ఎయిమ్స్ నూతన డైరెక్టర్ అమితా అగర్వాల్ గురువారం బాధ్యతలు స్వీకరించనున్నారు. గతంలో డైరెక్టర్ పని చేసిన వికాస్భాటియా మే నెలలో ఢిల్లీ ఎయిమ్స్కు బదిలీ అయ్యారు.ఆయన స్థానంలో ఆంధ్రప్రదేశ్లోని మంగళగిరి ఎయిమ్స్ డైరెక్టర్ అహెంతా శాంతాసింగ్ను ఇంచార్జిగా నియమించారు. కాగా పూర్తిస్థాయి డైరెక్టర్గా లక్నోలోని సంజయ్గాంధీ పోసు్ట్రగాడ్యుయేట్ ఇనిస్టిట్యూట్లో సీనియర్ ప్రొఫెసర్గా విధులు నిర్వహిస్తున్న అమితా అగర్వాల్ను బీబీనగర్ ఎయిమ్స్ డైరెక్టర్గా నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్రం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన నేడు బాధ్యతలు స్వీకరిస్తారని ఎయిమ్స్ అధికారులు తెలిపారు. -
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో జైలు శిక్ష, జరిమానా
సూర్యాపేటటౌన్ : సూర్యాపేట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన ఐదుగురిని బుధవారం సూర్యాపేట కోర్టులో హాజరుపర్చగా.. అందులో ఒకరికి రెండు రోజుల జైలు శిక్ష, రూ.2000 జరిమానా, మరో నలుగురికి కలిపి రూ.4,000 జరిమానా విధిస్తూ ద్వితీయ శ్రేణి న్యాయమూర్తి పీవీ రమణ తీర్పు వెలురించినట్లు ట్రాఫిక్ ఎస్ఐ సాయిరాం తెలిపారు. జిల్లా ఎస్పీ నరసింహ ఆదేశాల మేరకు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. ఆర్టీసీ బస్సుకు తప్పిన ప్రమాదంభూదాన్పోచంపల్లి: ఎదురుగా వచ్చే వాహనానికి సైడ్ ఇచ్చే క్రమంలో ఆర్టీసీ బస్సు పంట పొలంలోకి ఒరిగిపోయింది. ఈ ఘటన బుధవారం ఉదయం భూదాన్పోచంపల్లి మండలం శివారెడ్డిగూడెం, ఇంద్రియాల గ్రామాల మధ్యలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. యాదగిరిగుట్ట డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు పోచంపల్లి నుంచి వయా శివారెడ్డిగూడెం, ఇంద్రియాల, పెద్దరావులపల్లి గ్రామా ల మీదుగా భువనగిరికి వెళ్తోంది. ఈ క్రమంలో శివారెడ్డిగూడెం, ఇంద్రియాల గ్రామాల మధ్య న ఇరుకు రోడ్డులో మరొక వాహనం ఎదురుగా రావడంతో దానికి దారిచ్చే క్రమంలో డ్రైవర్ బస్సును రోడ్డు పక్కకు తీసుకెళ్లగా.. పక్కనే ఉన్న పంటపొలంలో దిగబడి బస్సు ఒకవైపు ఒరిగిపోయింది. దీంతో ఆందోళన చెందిన ప్రయాణికులంతా వెంటనే బస్సులో నుంచి కిందకు దిగారు. అనంతరం జేసీబీ సహాయంతో బస్సును పంట పొలంలో నుంచి బయటకు లాగారు. లూజ్ సిమెంట్ విక్రయిస్తున్న వ్యక్తిపై కేసు చిట్యాల: సిమెంట్ పరిశ్రమల నుంచి వచ్చే ట్యాంకర్ల ద్వారా లూజ్ సిమెంట్ సేకరించి ప్రజలకు విక్రయిస్తున్న వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు చిట్యాల ఎస్ఐ రవికుమార్ బుధవారం తెలిపారు. చిట్యాల పట్టణ శివారులో భువనగిరి రోడ్డులో గుండాల శ్రీను సిమెంట్ ట్యాంకర్ల నుంచి సేకరించిన లూజ్ సిమెంట్ను విక్రయిస్తుండగా మంగళవారం రాత్రి పోలీసులు పట్టుకున్నారు. ఆ సమయంలో అతడి వద్ద 83బస్తాల సిమెంటు నిల్వ ఉంది. ఒక్కో బస్తాలో 50 కేజీల చొప్పున సిమెంట్ నింపి విక్రయిస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
వృద్ధురాలి హత్య కేసులో ముగ్గురు నిందితుల అరెస్ట్
సూర్యాపేటటౌన్: హుజుర్నగర్ పట్టణంలో ఇటీవల జరిగిన వృద్ధురాలి హత్య కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ తెలిపారు. బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన కేసు వివరాలను వెల్లడించారు. హుజూర్నగర్ పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రి వెనుక నివాసముంటున్న చెన్న అనసూర్యమ్మ ఈ నెల 14వ తేదీ రాత్రి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. హుజుర్నగర్కు చెందిన లింగం సతీష్ అనసూర్యమ్మ ఇంటికి అప్పుడప్పుడు వెళ్లి వస్తుంటాడు. వృద్ధురాలు ఒంటరిగా ఉంటున్నట్లు గమనించిన లింగం సతీష్ ఆమె ఇంట్లో దొంగతనం చేయాలని పథకం రచించాడు. ఈ క్రమంలో సతీష్, అతని మేనల్లుడు(మైనర్ బాలుడు) ఈ నెల 14వ తేదీ అర్ధరాత్రి మద్యం మత్తులో అనసూర్యమ్మ ఇంటికి వెళ్లారు. లింగం సతీష్ ఆమె నోరు, ముక్కు చేతులతో మూయగా మైనర్ బాలుడు ఆమె రెండు కాళ్లను గట్టిగా పట్టుకుని ఊపిరాడకుండా చేసి హత్య చేశారు. అనసూర్యమ్మ చనిపోయిందని గ్రహించిన వారు ఆమె చెవులకు ఉన్న బంగారు దిద్దులు, మాటీలు, ఆమె బొడ్డు సంచిలో గల బంగారు ఉంగరం, నాను తాడు(బనరు గొలుసు)లను దొంగిలించి, గతంలో సతీష్ ఆమె వద్ద అప్పుగా తీసుకున్న రూ.50,000కు సంబంధించిన ప్రామిసరీ నోట్ను కూడా బీరువాలో నుంచి అపహరించి అక్కడి నుంచి పారిపోయారు. ఈ క్రమంలో సతీష్ తన భార్య లింగం మౌనికకు చోరీ చేసిన సొత్తును చూపించి ఆమె సలహా ప్రకారం బంగారాన్ని విజయవాడ తీసుకెళ్లి అక్కడ కరిగించి తమ వద్ద ఉంచుకున్నారు. దర్యాప్తులో భాగంగా హుజూర్నగర్ పోలీసులు లింగం సతీష్, లింగం మౌనిక, మైనర్ బాలుడు ముగ్గురిని మంగళవారం సాయంత్రం అదుపులోకి తీసుకొని విచారించగా నేరం అంగీకరించారు. వారి వద్ద నుంచి బంగారు ముద్ద, బంగారు కడ్డీ స్వాధీనం చేసుకుని రిమాండ్కు పంపించినట్లు ఎస్పీ తెలిపారు. ఈ కేసు ఛేదించిన హుజూర్నగర్ సీఐ చరమంద రాజు, కానిస్టేబుళ్లు డి. నాగరాజు, జి. శంభయ్యకు ఎస్పీ రివార్డు అందించి అభినందించారు. ఫ రూ.3.60లక్షల విలువైన బంగారం స్వాధీనం ఫ వివరాలు వెల్లడించిన సూర్యాపేట ఎస్పీ నరసింహ -
భక్తుల దీపారాధన
యాదగిరిగుట్ట: యాదగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకొని బుధవారం భక్తులు దీపారాధన చేశారు. కార్తీక మాసం ప్రారంభం, స్వాతి నక్షత్రం కావడంతో స్వామిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులు వైకుంఠద్వారం వద్ద, కొండపైన శివాలయం, ఆలయ మాడ వీధిలో దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. శివకేశవులు కొలువైన యాదగిరి క్షేత్రంలో కార్తీక మాసంలో దీపారాధన చేయడం ఎంతో పవిత్రమని భక్తుల విశ్వాసం. దీంతో ఈ మాసమంతా ఆలయంలో భక్తులు కార్తీక దీపారాధనలకు ఎక్కువ ప్రాధాన్యమిస్తారు. -
ఆరు మిల్లుల్లో సీఎంఆర్ ధాన్యం మాయం
చిట్యాలలోని వరలక్ష్మి మిల్లులో 59,538.52 క్వింటాళ్లు, నల్లగొండలోని రామ్లక్ష్మణ్ మిల్లులో 78,110.70 క్వింటాళ్లు, మునుగోడులోని మురళి మనోహర ఆగ్రోఫుడ్ ప్రొడక్ట్స్ మిల్లులో 4,500 క్వింటాళ్లు, నల్లగొండలోని ఆర్జాలబావిలో ఉన్న సుమాంజలి మిల్లులో 67,662.11 క్వింటాళ్లు, ఆర్జాలబావిలోని గౌతమి ఇండస్ట్రీస్లో 1,59,803.92 కింటాళ్లు, నల్లగొండలోని కనకామహాలక్ష్మి మిల్లులో 80,260.59 క్వింటాళ్ల ధాన్యం నిల్వ లేదని విచారణ బృందం తనిఖీలో తేలింది. సాక్షి ప్రతినిధి, నల్లగొండ : ప్రభుత్వానికి సీఎంఆర్ (కస్టమ్ మిల్లింగ్ రైస్) కింద ఇవ్వాల్సిన ధాన్యాన్ని మిల్లర్లు పక్కదారి పట్టించారు. 4,49,875 క్వింటాళ్ల ధాన్యానికి సంబంధించి సీఎంఆర్ కింద బియ్యం ఇవ్వకుండా కాకినాడ పోర్టుకు తరలించారని వచ్చిన ఫిర్యాదు మేరకు అధికారులు జిల్లాలోని ఆరు మిల్లులపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే. అదనపు కలెక్టర్ ఏర్పాటు చేసిన విచారణ బృందం ఆరు మిల్లుల్లో అక్రమాలు జరిగింది వాస్తవమే అని తేల్చి చెప్పింది. ఆ నివేదికను బృందం ఉన్నతాధికారులకు అందించింది. నెలలు గడుస్తున్నా.. సీఎంఆర్ ధాన్యాన్ని మింగేసిన వారిపై జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకోకుండా మీనమేషాలు లెక్కిస్తోంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి అందిన ఫిర్యాదు 2022–23 యాసంగి సీజన్కు సంబంధించి చిట్యాలలోని వరలక్ష్మి, నల్లగొండలోని రామ్లక్ష్మణ్, మునుగోడులోని మురళీమనోహర్ ఆగ్రోఫుడ్, నల్లగొండ ఆర్జాలబావి సమీపంలోని సుమాంజలి, గౌతమి ఇండస్ట్రీస్, నల్లగొండలోని కనకమహాలక్ష్మి పార్బాయిల్డ్ మిల్లులు ప్రభుత్వ కొనుగోలు సంస్థల నుంచి ధాన్యం తీసుకుని సీఎంఆర్ బియ్యాన్ని ఇవ్వలేదని జూన్ 25వ తేదీన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సోమారపు శ్రీదేవి ఫిర్యాదు చేశారు. దీంతో పౌర సరఫరాల శాఖ కమిషనర్ దానిపై విచారణ చేయాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. అదనపు కలెక్టర్ విచారణకు కమిటీ వేశారు. అందులో డీఎస్ఓ, డీఎంతోపాటు నల్లగొండ ఆర్డీఓ, నల్లగొండ లీగల్ మెట్రాలజీ అధికారి, తహసీల్దార్, నల్లగొండ సీవిల్ సప్లయ్ ఆర్ఐల ఆధ్వర్యంలో ఈ ఆరు మిల్లుల్లో తనిఖీలు చేశారు. మిల్లులు అక్రమాలకు పాల్పడింది వాస్తవమేనని విచారణ కమిటీ నిర్ధారించింది. ఈ మేరకు ప్రభుత్వానికి ఆగస్టు 30వ తేదీన నివేదిక అందించారు. చర్యలు చేపట్టడంలో విఫలం.. ఆరు మిల్లులు అక్రమాలు జరిగినది వాస్తవమే అని విచారణ కమిటీ ప్రభుత్వానికి నివేదిక అందింది. 4,49,875 క్వింటాళ్ల ధాన్యం ఎక్కడ పోయిందో కూడా తేల్చలేదు. కాకినాడ పోర్టుకు తరలించారంటూ ఫిర్యాదు అందింది. అయిని అక్రమాలకు పాల్పడ్డ మిల్లులపై చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమవుతోంది. ప్రభుత్వ సొమ్మును అప్పనంగా కాజేసి అక్రమాలకు పాల్పడ్డ మిల్లులపై జిల్లా యంత్రాంగం తీరు అనుమానాలకు తావిస్తోంది. ఇప్పటికై నా అధికార యంత్రాంగం స్పందించి అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుని ప్రభుత్వానికి రావాల్సిన సొమ్మును రికవరీ చేయాల్సిన అవసరం ఉంది. ఫ 4,49,875 క్వింటాళ్లు పక్కదారి పట్టినట్లు తేల్చిన అధికారుల కమిటీ ఫ ప్రభుత్వానికి అందిన నివేదిక ఫ మిల్లర్లపై చర్యలు తీసుకోవడంలో మీనమేషాలు -
ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి కృషి
నల్లగొండ టూటౌన్ : ఎమ్మెల్సీగా తాను ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని ఎమ్మెల్సీ శ్రీపాల్రెడ్డి అన్నారు. బుధవారం నల్లగొండలోని చిన్న వెంకట్రెడ్డి ఫంక్షన్ హాల్లో పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు కాళం నారాయణరెడ్డి అధ్యక్షతన జరిగిన సర్వసభ్య సమావేశంలో శ్రీపాల్రెడ్డి మాట్లాడారు. 53 సంవత్సరాల క్రితం పంచాయతీరాజ్ ఉపాధ్యాయుడి ఆత్మగౌరవం కాపాడడం కోసం, సగటు ఉపాధ్యాయుడి జీవన ప్రమాణం పెంచడం కోసం ఏర్పడిన పీఆర్టీయూ నేడు 80 వేల మంది సభ్యులతో భారతదేశంలోనే అతిపెద్ద ఉపాధ్యాయ సంఘంగా అవతరించిందన్నారు. ఉపాధ్యాయుల ప్రమోషన్లు, బదిలీలు, 317 ఉద్యోగుల పరస్పర బదిలీలు, మోడల్ స్కూల్ ఉపాధ్యాయుల బదిలీలు, కేజీబీపీ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం లాంటివి సాధించామన్నారు. సమావేశంలో సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పుల్లం దామోదర్రెడ్డి, సుంకరి భిక్షంగౌడ్, మోహన్రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల జానారెడ్డి, జిల్లా గౌరవ అధ్యక్షుడు తిరందాసు సత్తయ్య, పేరి వెంకట్రెడ్డి, జగన్మోహన్ గుప్తా, సోమిరెడ్డి, నివాస్రెడ్డి, కోమటరెడ్డి నర్సింహారెడ్డి, గాదె వెంకట్రెడ్డి, కిరణ్ కుమార్, వెంకట్రెడ్డి, సుదర్శన్రెడ్డి, సీతారాంచందర్ రావు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఫ ఎమ్మెల్సీ శ్రీపాల్రెడ్డి -
రాకపోకలు.. ఆన్లైన్!
మిర్యాలగూడ, నాగార్జునసాగర్ : రాష్ట్ర సరిహదుల్లో రవాణా చెక్ పోస్టులను బుధవారం నుంచి తొలగించారు. నేరుగా పన్నుల వసూళ్లలో జరిగే అక్రమాలకు చెక్ పెట్టినందుకు ప్రభుత్వం ఆన్లైన్ విధానాన్ని అమలు చేస్తోంది. దీనిపై గతంలోనే జీవో విడుదల చేయగా వాహనదారులకు అవగాహన కల్పించేందుకు గాను రవాణశాఖ ఆధ్వర్యంలో తాత్కాలిక చెక్పోస్టులను నిర్వహించారు. తాజాగా ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావడంతో రవాణశాఖ కమిషనర్ ఆదేశానుసారం అంతరాష్ట్ర సరిహద్దుల వద్ద రవాణా శాఖ చెకపోస్టులను బుధవారం మూసివేశారు. చెక్పోస్టుల వద్ద రోడ్లపై ఉన్న బారీకేడ్లు, డ్రములు తొలగించారు. చెక్పోస్టుల్లో ఉన్న రికార్డులు, పరికరాలు, ఫర్నీచర్, వాహనాల వివరాల దస్త్రాలను నల్లగొండకు తరలించారు. బుధవారం వాడపల్లి వద్ద ఉన్న చెక్పోస్టును జిల్లా రవాణా శాఖ అధికారి లావణ్య సందర్శించారు. చెక్పోస్టుల తొలగింపుపై సిబ్బందికి సూచనలు చేశారు. ఉమ్మడి జిల్లాలో మూడు చోట్ల తొలగింపు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక రాష్ట్ర వ్యాప్తంగా 15 చెక్పోస్టులు ఏర్పాటు కాగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో వాడపల్లి, నాగార్జునసాగర్, కోదాడ సమీపంలోని నల్లబండగూడెం వద్ద తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి రాకపోకలు సాగించే తదితర వాహనాల నుంచి పన్ను వసూలు చేస్తున్నారు. ఈ చెక్పోస్టుల ద్వారా ప్రతి నెలా సుమారు రూ.2 కోట్ల వరకు ఆదాయం సమకూరుతోంది. బుధవారం నుంచి ఈ మూడు చోట్ల చెక్పోస్టులను తొలగించారు. నూతన విధానంలో వాహనదారులు తాత్కాలిక, పర్మినెంట్ ట్యాక్స్లను ఆన్లైన్లో చెల్లించి రాష్ట్రంలోకి ప్రవేశించాల్సి ఉంటుంది. ఫ రాష్ట్ర సరిహద్దుల్లో చెక్పోస్టులు ఎత్తివేత ఫ రోడ్లపై బారికేడ్ల తొలగింపు ఫ ఫర్నిచర్ నల్లగొండకు తరలింపు ఆన్లైన్ పన్ను వసూలుకు కోసం ప్రభుత్వం వాహన యాప్ను అమల్లోకి తెచ్చింది. ఈ విధానం అమలులో భాగంగా సరిహద్దు వద్ద రవాణాశాఖ ఏఎన్పీఆర్ (ఆటో నెంబర్ ప్లేట్ రీడర్) కెమెరాలను ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం ఈ – ఎన్ఫోర్స్మెంట్ సాఫ్ట్వేర్ను రూపొందించారు. రాష్ట్రంలోకి ప్రవేశించే వాహనాలను గుర్తించేలా దానికి వాహన యాప్ను అనుసంధానం చేయనున్నారు. తద్వారా ఇతర రాష్ట్రాలకు చెందిన వాహనాల వివరాల తెలుస్తాయి. ఎవరైనా అక్రమంగా ప్రవేశిస్తే మొబైల్ టీమ్లు వారిని పట్టుకుని కేసులు నమోదు చేస్తాయి. రవాణాశాఖ ఉన్నతాధికారుల ఆదేశాలను పాటిస్తున్నాం. ప్రస్తుతం అంతరాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న చెక్పోస్టులను మూసివేయాలని ఆదేశాలు అందాయి. ఈ మేరకు వాడపల్లి వద్ద ఉన్న చెక్పోస్టును ఎత్తివేశాం. అక్కడ ఉన్న బోర్డులు, బారీకేడ్లను తొలగించి ఫర్నీచర్, పరికరాలు, రికార్డులను జిల్లా కేంద్రానికి తరలించాం. ఇకమీదట అంతరాష్ట్ర సరిహద్దుల్లో ఆన్లైన్ విధానంలో పన్ను వసూలు చేస్తాం. – ఎ.సతీష్, ఏఎంవీఐ, వాడపల్లి -
రాష్ట్రస్థాయి ఎస్జీఎఫ్ జూడో పోటీలకు ఎంపిక
మోత్కూరు: మోత్కూరు మున్సిపాలిటీ కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్ ఆవరణలో నిర్వహించిన 69వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఉమ్మడి జిల్లా స్థాయి అండర్–14, అండర్–17 బాలబాలికల జూడో పోటీల్లో పాల్గొన్న విద్యార్థుల్లో పలువురు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై నట్లు జూడో కోచ్ అన్నెపు వెంకట్ తెలిపారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. అండర్–14(44 కేజీల) విభాగంలో కె. నిధి, 50 కేజీల విభాగంలో ఎ. సాయిసృజిత్ చంద్ర, అండర్–17(36 కేజీల) విభాగంలో ఎం. విమలశ్రీ, 52 కేజీల విభాగంలో ఎం. సాక్షి, 45 కేజీల విభాగంలో ఎస్కే పరహాన్, 50 కేజీల విభాగంలో పి. అర్జున్, 55 కేజీల విభాగంలో అవినాష్, 40 కేజీల విభాగంలో ఎ. రాకేష్ ఉత్తమ ప్రతిభ కనబర్చి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై నట్లు పేర్కొన్నారు. గెలుపొందిన విద్యార్థులను ఇన్స్పెక్టర్ కె. వెంకటేశ్వర్లు, ఎంఈఓ గోపాల్రెడ్డి, స్కూల్ గేమ్స్ జిల్లా సెక్రెటరీ దశరథరెడ్డి అభినందించారు. ఉరేసుకుని ఆత్మహత్యరాజాపేట: ఇంట్లో ఉరేసుకుని యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన రాజాపేట మండలం కొండ్రెడ్డిచెర్వు గ్రామంలో బుధవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొండ్రెడ్డిచెర్వు గ్రామానికి చెందిన కర్రె కనకయ్య మొదటి భార్య 13 సంవత్సరాల క్రితం మృతిచెందింది. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. మొదటి భార్య మృతిచెందిన తర్వాత కనకయ్య లలిత అనే మహిళను వివాహం చేసుకున్నాడు. వీరికి అక్షిత్ అనే కుమారుడు ఉన్నాడు. కాగా కనకయ్య తల్లి పెంటమ్మ అనారోగ్యానికి గురికావడంతో నాలుగు రోజుల క్రితం చికిత్స నిమ్తితం ఆమెను గజ్వేల్ సమీపంలోని ఆర్వీఎం ఆస్పత్రిలో చేర్పించారు. అప్పటి నుంచి ఆస్పత్రిలో నాయనమ్మ వద్ద ఉన్న కనకయ్య మొదటి భార్య కుమారుడు కర్రె మహేష్(22) మంగళవారం రాత్రి ఆస్పత్రి నుంచి ఇంటికి తిరిగి వచ్చాడు. మహేష్ను అన్నం తినమని కనకయ్య రెండో భార్య లలిత చెప్పగా సరే అంటూ ఇంట్లోకి వెళ్లాడు. బుధవారం ఉదయం అతని గది తెరిచి చూసేసరికి చున్నీతో ఉరేసుకుని కనిపించాడు. దీంతో లలిత భర్త కనకయ్యకు విషయం చెప్పింది. మహేష్ ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ అనిల్కుమార్ తెలిపారు. -
ఇంజనీరింగ్ విద్యార్థులకు శిక్షణ
నల్లగొండ టూటౌన్ : నల్లగొండలోని ఎంజీ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ విద్యార్థులకు బుధవారం ‘మహిళా వ్యాపారవేత్తలు – నైపుణ్యాల పెంపు – చిన్న తరహా సమూహాల నుంచి సుస్థిరమైన వ్యాపారాలు’ అనే అంశంపై ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ అలీఫ్ ఇంక్యుబేషన్ సెంటర్ మేనేజర్ నవీన్కృష్ణ మాట్లాడుతూ అధిక జనాభా కలిగిన భారతదేశంలో వ్యాపారానికి అనేక అవకాశాలు ఉన్నాయన్నారు. విద్యార్థులు పరిశీలన ద్వారా సమగ్రమైన పరిశోధనతో అవకాశాలను పొందవచ్చని సూచించారు. ఇంజనీరింగ్ విద్యార్థులు తమ సృజనశక్తితో సమాజ హితమైన ప్రయోగాలతో ఉత్పత్తులను సమాజానికి అందించడం ద్వారా వ్యాపారవేత్తలుగా ఎదగాలని కోరారు. కార్యక్రమంలో సత్యనారాయణ, వెంకటేష్, సీహెచ్.సుధారాణి, సాంబశివరావు, జయంతి, మౌనిక, మారేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. -
ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం విఫలం
నకిరేకల్: ధాన్యం కొనుగోలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆరోపించారు. నకిరేకల్లోని చీమలగడ్డలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బుధవారం ఆయన సందర్శించి రైతులతో మాట్లాడారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రైతులు కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తెచ్చి 20రోజులు అవుతున్నా తేమ శాతం పేరుతో కొనుగోళ్లు ఆలస్యం చేస్తున్నారని మండిపడ్డారు. ఎలాంటి షరతులు లేకుండా ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను కోరారు. కొనుగోళ్లలో జాప్యం జరగకుండా జిల్లా అధికార యంత్రాంగం మిల్లర్లను సమన్వయం చేస్తూ ముందుకు సాగాలని అన్నారు. ఆయన వెంట బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ప్రగడపు నవీన్రావు, పీఏసీఎస్ మాజీ చైర్మన్ పల్రెడ్డి మహేందర్రెడ్డి, నాయకులు గోర్ల వీరయ్య, సిలివేరు ప్రభాకర్, రాచకొండ శ్రవణ్, గుర్రం గణేష్, ఇమడపాక వెంకన్న, పేర్ల కృష్ణకాంత్, గోనె నర్సింహారావు, చెట్టిపల్లి జానయ్య, దైద పరమేశం, మాద నగేష్ తదితరులు పాల్గొన్నారు. ఫ నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య -
అన్ని రాష్ట్రాల్లోనూ నిరుద్యోగ సమస్య
సూర్యాపేట: దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ గ్రామీణ యువత నిరుద్యోగ సమస్యను ఎదుర్కొంటుందని, ఉన్నత చదువులు చదివినప్పటికీ ఉద్యోగాలు రాకపోవడం అందరికీ ఆవేదన కలిగించే విషయమని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. బుధవారం సూర్యాపేట కలెక్టరేట్లో మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం 20 నెలల కాలంలో 75వేల మంది యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించిందన్నారు. ఇటీవల గ్రూప్–1, గ్రూప్–2 అభ్యర్థులకు నియామక పత్రాలు అందించడమే కాకుండా లైసెన్స్డ్ సర్వేయర్లకు లైసెన్స్లు ఇచ్చామన్నారు. ప్రైవేటు రంగంలోనూ ఎక్కువ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని దేశ విదేశాల నుంచి పెట్టుబడులు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో నిరుద్యోగ యువతకు పెద్దఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలన్న ఉద్దేశంతో సింగరేణి కాలరీస్, డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ తెలంగాణ సహకారంతో హుజూర్నగర్లో ఈనెల 25న జాబ్ మేళా నిర్వహిస్తున్నామని చెప్పారు. జాబ్ మేళాకు హాజరయ్యే నిరుద్యోగ యువతకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలిపారు. ప్రత్యేకించి గ్రామీణ ప్రాంత ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ సమావేశంలో రాంరెడ్డి సర్వోత్తమ్రెడ్డి, చెవిటి వెంకన్నయాదవ్, కొప్పుల వేణారెడ్డి, పోతు భాస్కర్, చింతల లక్ష్మీనారాయణరెడ్డి, చకిలం రాజేశ్వరరావు పాల్గొన్నారు. ఫ 20 నెలల కాలంలోనే 75వేల మందికి ఉద్యోగ అవకాశాలు ఫ రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి -
అన్నదాత ఆగమాగం
మిర్యాలగూడ : బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా జిల్లాలో రోజూ వర్షం కురుస్తోంది. కొనుగోలు కేంద్రాల్లో ఆరబెట్టిన ధాన్యం తడుస్తోంది. ఇక కోతకొచ్చిన వరిచేలు నేలవాలి రైతులకు నష్టాన్ని మిగిల్చుతున్నాయి. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో భారీగా నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దిగుబడి తగ్గే అవకాశం వర్షాల కారణంగా ఆయకట్టులో వరి చేలకు నష్టం వాటిల్లుతోంది. ప్రస్తుతం ఆయకట్టులో వరి చేలు పొట్ట, గింజ పాలుపోసుకునే దశలో ఉన్నాయి. ఈ సమయంలో వర్షాలతో పంటకు నష్టం వాటిల్లుతుందని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికే రైతులు ఎకరానికి రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకు పెట్టుబడి పెట్టారు. పంట కోతకు వచ్చే సమయంలో ఈ అకాల వర్షాలు అన్నదాతను నట్టేట ముంచాయి. ఇప్పటికే ఈనిన చేలలో వరి కంకులకు ఉన్న గింజలు రాలిపోయాయి. దీనివల్ల పూర్తిగా దిగుబడి తగ్గే అవకాశం కనిపిస్తోంది. క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్న వ్యవసాయాధికారులు.. అకాల వర్షాల కారణంగా నష్టపోయిన పంటల వివరాలను సేకరించేందుకు వ్యవసాయాధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. గ్రామాల్లో ఉన్న ఏఈఓల ద్వారా వివరాలను సేకరిస్తున్నారు. ఏయే గ్రామాల్లో పంట ఎన్ని ఎకరాల్లో నేలకొరిగిందనే విషయాలను రైతుల ద్వారా తెలుసుకుంటున్నారు. రైతుల వివరాలను, ఎన్ని ఎకరాల్లో నష్టపోయిందో రికార్డుల్లో నమోదు చేసుకుంటున్నారు. వరి పొలాలు పాలు పోసుకునే దశలో ఉంటే నేలకొరిగిన అంతగా నష్టం ఉండదని, గింజలు పోసుకోని ఉన్నప్పుడే నేలకొరిగితే నష్టం ఏర్పడుతుందని అధికారులు చెబుతున్నారు. ఫ వర్షాలతో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం ఫ ఆయకట్టులో నేలవాలుతున్న వరిచేలు ఫ ప్రభుత్వం ఆదుకోవాలంటున్న రైతులు -
ఎడమ కాల్వ పవర్హౌస్ లక్ష్యం చేరింది
నాగార్జునసాగర్: సాగర్ జలాశయం ఎడమ కాల్వ పవర్ హౌజ్లో విద్యుత్ ఉత్పత్తిలో కేటాయించిన లక్ష్యాన్ని ముందుగానే చేరుకున్నట్లు జెన్కో చీఫ్ ఇంజనీర్ మంగేష్కుమార్ పేర్కొన్నారు. బుధవారం నాగార్జునసాగర్ జెన్కో కార్యాలయంలో ఎడమ కాలువ విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో నిర్ణయించిన లక్ష్యాన్ని ముందుగానే చేరుకున్న సందర్భంగా కేట్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేసి శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ఈ సందర్భంగా సీఈ మాట్లాడుతూ ప్రాజెక్టు ఎడమ కాలువపై ఉన్న విద్యుత్ ఉత్పత్తి కేంద్రం 2025–26 విద్యుత్ సంవత్సరానికి గాను 70 మిలియన్ యూనిట్లు విద్యుత్ ఉత్పత్తిని లక్ష్యంగా నిర్ణయించినట్లు వెల్లడించారు. ఈ విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో 30 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఉన్న రెండు యూనిట్ల ద్వారా మంగళవారం రాత్రి తమ లక్ష్యాన్ని అధిగమించినట్లు తెలిపారు. కాగా ప్రధాన జలవిద్యుత్ కేంద్రంలో విద్యుదుత్పాదనలో 1450 మిలియన్ యూనిట్ల లక్ష్యాన్ని రెండు వారాల క్రితమే పూర్తి చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జెన్కో డైరెక్టర్ అజయ్, హైడల్ చీఫ్ ఇంజనీర్ నారాయణ, జెన్కో ఎస్ఈలు రామకృష్ణారెడ్డి, రఘురాం, లెఫ్ట్ కెనాల్ పవర్ హౌజ్ ఇంజనీర్లు, సిబ్బంది పాల్గొన్నారు. -
ధాన్యం తడవకుండా చూసుకోవాలి
రామగిరి(నల్లగొండ) : వర్షానికి ధాన్యం తడవకుండా చూసుకోవాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. బుధవారం నల్లగొండ మండలం ముషంపల్లి, జికే అన్నారం గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సరిపడా తేమ శాతం ఉంటే ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి మిల్లులకు పంపించాలన్నారు. ఒకవేళ తేమ, తాలు, తరుగు కారణాల వల్ల కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం ఉండాల్సి వస్తే వర్షానికి తడవకుండా అవసరమైన టార్పాలిన్లు, ఇతర అన్ని ఏర్పాట్లు పక్కాగా ఉండాలని చెప్పారు. అనంతరం వెంకటసాయి రైస్ మిల్లును తనిఖీ చేసి ధాన్యం ఎగుమతి, దిగుమతులను వేగవంతం చేయాలని, లోడింగ్ అన్లోడింగ్లో జాప్యం చేయవద్దని సూచించారు. ఆమె వెంట అదనపు కలెక్టర్ జే.శ్రీనివాస్, ఆర్డీఓ వై.అశోక్రెడ్డి, ప్రత్యేక అధికారి నాగేశ్వరరావు, మార్కెటింగ్ శాఖ ఏడీ ఛాయాదేవి, పౌరసరఫరాల జిల్లా మేనేజర్ గోపికృష్ణ, జిల్లా పారసరఫరాల అధికారి వెంకటేష్, డీఆర్డీఓ శేఖర్రెడి, సహకార అధికారి పత్యానాయక్, కనగల్ తహసీల్దార్ పద్మ ఉన్నారు. కొనుగోళ్లు వేగవంతం చేయాలి నల్లగొండ : ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. ధాన్యం సేకరణపై బుధవారం ఆమె వివిధ శాఖల అధికారులతో నల్లగొండలోని తన ఛాంబర్లో సమావేశమై మాట్లాడారు. కేంద్రాల్లో ధాన్యం నాణ్యతా ప్రమాణాలను తనిఖీ చేసి, తేమను చూసి సరైన ప్రమాణాలతో ఉంటే వెంటనే కాంటావేసి మిల్లులకు తరలించాలని ఆదేశించారు. ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి -
యాదగిరీశుడికి శతఘటాభిషేకం
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి జన్మ నక్షత్రమైన స్వాతిని పురస్కరించుకొని బుధవారం ఉదయం ఆలయంలో అష్టోత్తర శతఘటాభిషేకం నిర్వహించారు. అదేవిధంగా ఆలయ ముఖ మండపంలో స్వాతి హోమం, పంచామృతాలు, శుద్ధ జలాలు, పుష్పాలు, సుగంధ ద్రవ్యాలతో నింపిన బంగారు, వెండి కలశాలకు ప్రత్యేక పూజలు జరిపించారు. అనంతరం స్వయంభూ, ప్రతిష్ఠా అలకారమూర్తులకు అష్టోతర శతఘటాభిషేకం చేపట్టారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆలయంలో నిత్య పూజలు కొనసాగాయి. స్వాతి నక్షత్రం పురస్కరించుకొని కొండ చుట్టూ గిరి ప్రదక్షిణ నిర్వహించారు. ఉదయం 5గంటలకు ప్రారంభమైన గిరి ప్రదక్షిణలో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, కలెక్టర్ హనుమంతరావు, భక్తులు, ఆలయ ఉద్యోగులు, అర్చకులు, స్థానికులు పాల్గొన్నారు. ఫ గిరి ప్రదక్షిణలో పాల్గొన్న ప్రభుత్వ విప్ ఐలయ్య, కలెక్టర్ హనుమంతరావు -
బ్రెయిన్ డెడ్ .. యువకుడి అవయవాలు దానం
నార్కట్పల్లి: రోడ్డు ప్రమాదంలో గాయపడి బ్రెయిన్ డెడ్ అయిన యువకుడి అవయవాలను అతడి తల్లిదండ్రుల దానం చేశారు. నార్కట్పల్లి మండల కేంద్రానికి చెందిన నడింపల్లి సత్యనారాయణ, హేమలత దంపతులు గత కొన్నేళ్లుగా హైదరాబాద్లో ఉంటున్నారు. సత్యనారాయణ డ్రైవర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇటీవల సొంతూళ్లో ఇల్లు కట్టుకుందామని నిర్ణయించుకొని బేస్ మెంట్ వరకు పనులు చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులు సంతానం. పెద్ద కుమారుడు శ్రీహర్ష(18) రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ వద్ద గల బ్రిలియంట్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ మొదటి సంవత్సరం, రెండో కుమారుడు ఇంటర్ ఫస్టియర్ చదువుతున్నాడు. ఈ నెల 17న పెద్ద కుమారుడు శ్రీహర్ష కళాశాలకు వెళ్లి తిరిగి ఇంటికి వచ్చే క్రమంలో విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారి దాటుతుండగా కారు ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన శ్రీహర్షను ఆస్పత్రికి తరలించగా బ్రెయిన్ డెడ్ అయ్యిందని వైద్యులు తెలిపారు. నాలుగు రోజులు చికిత్స పొందిన శ్రీహర్ష మంగళవారం రాత్రి మృతి చెందాడు. ఇంత బాధలోనూ తమ కుమారుడు మరణించినప్పటికీ మరో నలుగురికి ప్రాణం పోయాలనే ఉద్దేశంతో శ్రీహర్ష గుండె, కిడ్నీ, ఇతర అవయవాలను అతడి తల్లిదండ్రులు దానం చేశారు. నార్కట్పల్లిలో బుధవారం శ్రీహర్ష అంత్యక్రియలు నిర్వహించారు. -
క్యాంపస్ ఇంటర్వ్యూలకు స్పందన
నల్లగొండ టూటౌన్ : మహాత్మాగాంధీ యూనివర్సిటీలో ప్లేస్మెంట్ సెల్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్యాంపస్ ఇంటర్వ్యూలకు అపూర్వ స్పందన లభించిందని ఎంజీయూ ప్లేస్మెంట్ సెల్ డైరెక్టర్ డాక్టర్ వై.ప్రశాంతి అన్నారు. బుధవారం ఎంజీ యూనివర్సిటీలో ప్రాంక్లిన్ టెక్ లిమిటెడ్ హైదరాబాద్ సంస్థ సహకారంతో నిర్వహించిన ప్లేస్మెంట్ డ్రైవ్కు 220 మంది అభ్యర్థులుగా హాజరైనట్లు వెల్లడించారు. వారిలో 70 మందిని షార్ట్ లిస్ట్ చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో కో ఆర్డినేటర్లు శేఖర్, సత్యనారాయణరెడ్డి, వెంకట్, ఫ్రాంక్లిన్టెక్ సీఈఓ ఆర్.శివకుమార్, కంపెనీ హెచ్ఆర్ ప్రతినిధులు వేణు, ప్రతాప్, దివ్య, పృథ్వీ, శ్రీకాంత్, విష్ణు తదితరులు పాల్గొన్నారు. -
పవర్ హౌస్ టెయిల్ రేస్ను పరిశీలించిన జెన్కో డైరెక్టర్
నాగార్జునసాగర్: నాగార్జునసాగర్ ప్రాజెక్టు ప్రధాన జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రం టెయిల్ రేస్ను బుధవారం జెన్కో సివిల్ డైరెక్టర్ అజయ్ సందర్శించారు. వ్యాప్కో సంస్థ కొన్ని రోజుల క్రితం ప్రధాన విద్యుత్ ఉత్పత్తి కేంద్రం దిగువ భాగాన నీటి ప్రవాహం సాఫీగా వెళ్లే విధంగా ప్రధాన జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో రివర్స్ పంపింగ్ జరిగే తరుణంలో ఎలాంటి అడ్డంకులు లేకుండా ఉండేందుకు గాను చేపట్టాల్సిన చర్యల నివేదికను జెన్కో అధికారులకు అందించారు. ఈ సందర్భంగా జెన్కో సివిల్ డైరెక్టర్ అజయ్ ఆధ్వర్యంలో పవర్ హౌస్ టెయిల్ రేస్ ప్రాంతాన్ని సందర్శించి చేపట్టవల్సిన పనుల గురించి అధికారులకు సూచించారు. ప్రధాన జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రం దిగువ భాగాన భారీగా రాళ్లగుట్టలు ఉన్నందున విద్యుత్ ఉత్పత్తి కేంద్రం నుంచి విడుదలైన నీటి ప్రవాహానికి ఆటంకాన్ని కలిగిస్తున్నాయి. అంతేకాకుండా పవర్హౌస్లో రివర్స్ పంపింగ్ జరిగే ప్రక్రియలో అడ్డంకులు కూడా ఉత్పన్నమవుతుండటంతో పవర్ హౌస్ దిగువ భాగాన ఉన్న రాళ్ల గుట్టలను తొలగించనున్నారు. త్వరలోనే వీటికి సంబంధించిన పనులను ప్రారంభంచనున్నట్లు ఆయన తెలిపారు. ఆయన వెంట సాగర్ జెన్కో సీఈలు మంగేష్కుమార్, నారాయణ, ఎస్ఈలు రఘురాం, రామకృష్ణారెడ్డి, డీఈలు, ఏఈలు ఉన్నారు. -
పేద కుటుంబానికి పెద్ద కష్టం
మఠంపల్లి: ఆ కుటుంబాన్ని విధి వంచించింది. కుటుంబ పెద్దతో పాటు అతడి ఇద్దరు కుమారులు వివిధ రకాల జబ్బులతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంచానికే పరిమితమయ్యారు. వైద్య ఖర్చుల కోసం దాతలు సాయం చేయాలని ఆ ఇంటి మహిళలు కోరుతున్నారు. వివరాలు.. మఠంపల్లి మండల కేంద్రానికి చెందిన తవిడబోయిన చంద్రయ్య(50)కు ఐదేళ్ల క్రితం పక్షవాతం రావడంతో చికిత్స చేయించుకుంటూ మంచానికే పరిమితమయ్యాడు. దీంతో అప్పటి నుంచి అతడి పెద్ద కుమారుడు వీరబాబు(30) కుటుంబ పోషణ కోసం కష్టపడుతున్నాడు. అయితే గత మూడేళ్లుగా వీరబాబు కూడా కిడ్నీ, లివర్ జబ్బుతో మంచానికే పరిమితమయ్యాడు. అంతేకాకుండా పాఠశాలకు వెళ్లి చదువుకునే చంద్రయ్య చిన్న కుమారుడు గోపాలకృష్ణ(11)కు కూడా ఏడాది క్రితం మెదడు సంబంధిత వ్యాధి సోకింది. దీంతో చంద్రయ్య భార్య సైదమ్మ, పెద్ద కుమారుడు వీరబాబు భార్య సంధ్య అతి కష్టం మీద కుటుంబ భారాన్ని మోస్తూ వారికి వైద్య చికిత్స చేయిస్తున్నారు. చంద్రయ్య, వీరబాబు ఖమ్మంలోని ప్రశాంతి ఆస్పత్రిలో, చిన్న కుమారుడు గోపాలకృష్ణకు నల్లగొండలోని ఐకాన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వైద్య ఖర్చుల కోసం వారికి ఉన్న కొద్దిపాటి ఆస్తిపాస్తులు కూడా అమ్ముకోవడంతో కుటుంబం పోషణ భారంగా మారింది. వైద్యానికి అయ్యే ఖర్చు భరించలేక దాతల సాయం కోసం ఎదురుచూస్తున్నారు. దయార్ధ హృదయులు ఎవరైనా ఉంటే తమకు ఆర్థిక సాయం అందజేసి తమ కుటుంబాన్ని ఆదుకోవాలని చంద్రయ్య భార్య సైదమ్మ, కోడలు సంధ్య కోరుతున్నారు. మా కుటుంబంలో మగవాళ్లందరు అనారోగ్య కారణాలతో ఇంటికే పరి మితమయ్యారు. దీంతో గత ఐదేళ్లుగా నిద్రలేని రాత్రులు గడుపుతున్నాం. కుటుంబ పోషణకు, వైద్యం చేయించడానికి నేను, నా కోడలు మా శక్తినంతా దారపోస్తున్నాం. ప్రసుత్తం దిక్కులేకుండా అయ్యాం. మమ్ములను దాతలు, ప్రభుత్వం ఆదుకోవాలి. – తవిడబోయిన సైదమ్మ, చంద్రయ్య భార్య ఫ అనారోగ్యంతో మంచానికే పరిమితమైన తండ్రి, ఇద్దరు కుమారులు ఫ వైద్యం చేయించడానికి డబ్బులు లేక ఇబ్బందులు ఫ దాతల సాయం కోసం ఎదురుచూపులు -
షార్ట్ సర్క్యూట్తో సెలూన్ షాపు దగ్ధం
ఆలేరు: షార్ట్ సర్క్యూట్తో సెలూన్ షాపులో ఫర్నిచర్ దగ్ధమైంది. ఈ ఘటన ఆలేరు పట్టణంలో మంగళవారం రాత్రి జరిగింది. బుధవారం ఆలేరు ఎస్ఐ వినయ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆలేరు మండలం గుండ్లగూడెం గ్రామానికి చెందిన బొప్పాపురం కిష్టయ్య ఆలేరు పట్టణంలోని వేణు కాంప్లెక్స్ మొదటి అంతస్తులో ప్రిన్స్ హెయిర్ సెలూన్ షాపు నడుపుతున్నాడు. మంగళవారం సాయంత్రం దుకాణాన్ని మూసివేసి యాదగిరిగుట్టకు వెళ్లాడు. రాత్రి సుమారు 10.30గంటల సమయంలో పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులు సెలూన్ షాపు నుంచి పొగలు రావడాన్ని గమనింంచారు. షాపు యజమానికి పోలీసులు ఫోన్ చేయగా.. షాపు పక్కన గదిలో ఉంటున్న వారి వద్ద తాళం ఉందని చెప్పాడు. పోలీసులు షాపు తెరిచి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను ఆర్పారు. షాపులోని కుర్చీలు, ఫర్నిచర్ దగ్ధం కాగా.. సుమారు రూ.5లక్షల వరకు ఆస్తి నష్టం వాటిల్లినట్టు యజమాని చెప్పాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఆలేరు పట్టణ అధ్యక్షుడు ఇజాజ్ ఘటనా స్థలాన్ని పరిశీలించి ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యకు ఫోన్లో విషయం వివరించగా.. బాధితుడి మాట్లాడిన ఎమ్మెల్యే ప్రభుత్వ తరపున సాయం అందేలా చూస్తానని హామీ ఇచ్చారు. -
కారుతో ఢీకొట్టి.. కత్తులతో గొంతు కోసి
ఆత్మకూర్ (ఎస్)(సూర్యాపేట) : పట్టపగలు ఓ మహిళను గుర్తు తెలియని దుండగులు కారుతో ఢీకొట్టి.. కత్తులతో గొంతు కోసి దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా ఆత్మ కూర్ (ఎస్) మండలం ఏపూర్ గ్రామంలో మంగళవా రం జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరా ల ప్రకారం.. ఏపూర్ గ్రామానికి చెందిన కొరివి మల్ల య్య–భిక్షమమ్మ(40) దంపతులకు ఇద్దరు కుమారు లు. మల్లయ్య లారీ డ్రైవర్గా, పెద్ద కుమారుడు భరత్ హైదరాబాద్లో మెకానిక్గా, చిన్నకుమారుడు ప్రవీణ్ సూర్యాపేటలో ఓ చికెన్ షాపులో పనిచేస్తున్నాడు. మల్లయ్య–భిక్షమమ్మ దంపతులకు ఇటీవల తగాదాలు జరగ్గా.. మంగళవారం పెద్దల సమక్షంలో మా ట్లాడి భిక్షమమ్మ ఇంటికి తిరిగి వస్తోంది. గ్రామ నడిబొడ్డుకు రాగానే గుర్తుతెలియని వ్యక్తులు భిక్షమమ్మను వెనుక నుంచి కారుతో ఢీకొట్టారు. కిందపడిన ఆమె వద్దకు దుండగులు కారు దిగి వచ్చి తమ వెంట తెచ్చుకున్న కత్తులతో గొంతు కోసి అక్కడి నుంచి పరారయ్యారు. దీంతో భిక్షమమ్మ అక్కడికక్కడే మృతిచెందింది. వివాహేతర సంబంధం నేపథ్యంలో.. మృతురాలు భిక్షమమ్మకు ఆమె భర్త మల్లయ్యకు కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. భిక్షమమ్మకు వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో భర్త మల్లయ్య, కుటుంబ సభ్యులు పలుమార్లు మందలించారు. ఈ విషయమై పెద్దలు సైతం పంచాయితీలు చేసి సర్ది చెప్పినట్టు తెలిసింది. ఇటీవల సూర్యాపేటకు చెందిన ఓ దేశ గురువు భిక్షమమ్మతో చనువుగా ఉండటంతో కుటుంబ సభ్యులు ఇద్దరినీ మందలించారు. ఇదే విషయమై మల్లయ్య పెద్దల సమక్షంలో భార్యను మందలించేందుకు స్థానికంగా ఓ పార్టీ కార్యాలయానికి పిలిపించి మాట్లాడారు. పెద్దలు ఇరువురిని సముదాయించి పంపించగా.. కొద్దిసేపటికే ఆ పార్టీ కార్యాలయ సమీపంలోనే భిక్షమమ్మ దారుణ హత్యకు గురైంది. మృతురాలి భర్త మల్లయ్య, కుటుంబ సభ్యులతోపాటు దేశ గురువు, వారి కుటుంబ సభ్యులపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పట్టపగలే హత్య జరిగిన సమాచారం తెలుసుకున్న సూర్యాపేట డీఎస్పీ ప్రసన్నకుమార్, సీఐ రాజశేఖర్, ఎస్ఐ శ్రీకాంత్గౌడ్లు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. -
నీలగిరి మున్సిపాలిటీలో పేరుకుపోయిన బకాయిలు
నల్లగొండ టూటౌన్ : నీలగిరి మున్సిపాలిటీలో ఆస్తి పన్ను బకాయిలు పేరుకుపోతున్నాయి. మున్సిపాలిటీలో కొన్ని సంవత్సరాలుగా పన్ను బకాయిలు మొత్తం రూ. 28 కోట్ల వరకు ఉన్నాయి. వీటిలో మొదటి 500 మంది బకాయిదారుల లెక్కలు తీయగా రూ.9.68 వరకు ఉన్నట్లు తేలింది. వీరంతా రాజకీయ పైరవీరలతో కాలం గడుపుతూ ఆస్తిపన్ను చెల్లించడం లేదని తెలుస్తోంది. ఈ ఏడాది మొండి బకాయిలను ఎట్టి పరిస్థితుల్లోలైనా వసూలు చేయడానికి మున్సిపల్ యంత్రాంగం సన్నద్ధమవుతోంది. ఇందుకోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. నలుగురు రెవెన్యూ ఇన్స్పెక్టర్లతో కలిసి 36 మంది వార్డు ఆఫీసర్లతో బకాయిదారులందరికీ రెడ్ నోటీస్లు అందజేస్తోంది. వారం గడువు.. తరువాత ఆస్తుల జప్తు ఆస్తి పన్ను చెల్లించకుండా బకాయి పడ్డ తొలి 500 మంది జాబితాను ప్రత్యేకంగా తయారు చేసింది. వీరితోపాటు పాత బకాయి ఉన్న వాణిజ్య, వ్యాపార దుకాణాలు, ఫంక్షన్హాల్స్, మాల్స్ యజమానులకు రెడ్ నోటీసులు ఇస్తున్నారు. రెడ్ నోటీస్లు తీసుకున్న వారు ఆస్తి పన్ను చెల్లించడానికి వారం రోజులు గడువు ఉంది. వారు వారం రోజుల గడువులోగా ఆస్తి పన్ను చెల్లించకుంటే మున్సిపల్ చట్టం వారి ఆస్తులను జప్తు చేయాలని మున్సిపల్ యంత్రాంగం నిర్ణయించింది. అయితే.. గత మార్చి నెలలో కూడా రెడ్ నోటీస్లు జారీ చేసినా బకాయిపడ్డ యజమానులు ఆస్తి పన్ను చెల్లించకుండా రేపు, మాపు అంటూ కాలయాపన చేశారు. ఈ సారి ఫిబ్రవరి, మార్చి వరకు వేచి చూడకుండా మున్సిపల్ యంత్రాంగం ముందస్తుగానే స్పందించింది. మూడు నెలల్లో వసూలు చేయాలని లక్ష్యం ఈ సారి అక్టోబర్ నెలలోనే నోటీస్లు ఇస్తుండడంతో ఇక బకాయిదారులు ఎన్ని వాయిదాలు పెట్టినా తప్పించుకునే అవకాశం లేకపోవచ్చు. ఇప్పటి నుంచి మూడు నెలల్లోనే మొత్తం పాత బకాయిలు వసూలు చేయాలనే లక్ష్యంతో మున్సిపల్ అధికారులు ముందుకుపోతున్నారు. అయితే.. బకాయిలు మొత్తం వసూలు చేయాలంటే రాజకీయ నాయకులు.. బకాయిదారులకు మద్దతుగా నిలవపోతే సాధ్యమయ్యే అవకాశం ఉంది. కానీ కొందరు ఓట్ల కోసం బకాయిదారులను వెనకేసుకొస్తున్నారన్న ప్రచారం ఉంది. కానీ అలాంటి వారితో పోటీ చేసే వారికి ఎలాంటి ప్రయోజనం ఉండబోదని కొందరు ఉద్యోగులు స్పష్టం చేస్తున్నారు.కొన్ని సంవత్సరాలుగా మున్సిపాలిటీకి ఆస్తి పన్ను చెల్లించకుండా బకాయిపడ్డ వారి జాబితా తయారు చేశాం. పాత బకాయిలు రూ.28 కోట్లు వసూలు కావాల్సి ఉంది. ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం బకాయిపడ్డ వారికి రెడ్ నోటీస్లు జారీ చేస్తున్నాం. వారం రోజుల్లో చెల్లించకుంటే చట్ట ప్రకారం ఆస్తుల జప్తు చేస్తాం. – శివరాంరెడ్డి, రెవెన్యూ ఆఫీసర్, నల్లగొండ ఫ కేవలం 500 మందివే రూ.9.68 కోట్లు ఫ పన్ను వసూలుకు ప్రత్యేక బృందాలు ఫ బకాయిదారులకు రెడ్ నోటీసులు జారీ చేస్తున్న యంత్రాంగం ఫ వారంలోగా చెల్లించకుంటే.. ఆస్తి జప్తు చేస్తామని హెచ్చరిక -
పోలీస్ అమరుల త్యాగాలు మరువలేనివి
నల్లగొండ : శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసుల అమరవీరుల త్యాగాలు మరువలేనివని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. మంగళవారం పోలీసు అమరవీరుల దినోత్సవంగా ఎస్పీ శరత్చంద్ర పవార్, అమరవీరుల కుటుంబ సభ్యులతో కలిసి ఎస్పీ కార్యాలయంలో పోలీసు అమరవీరులకు నివాళి అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడూతూ పోలీస్శాఖ శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజారక్షణకు విధి నిర్వహణలో ప్రాణాలు లెక్క చేయకుండా సమర్థవంతంగా విధులు నిర్వహిస్తున్నారని చెప్పారు. విధి నిర్వహణలో అమరులైన వారి త్యాగాలు మరువలేమన్నారు. అమరవీరుల కుటుంబాలకు ప్రభుత్వ యంత్రాంగం అండగా ఉంటుందన్నారు. ఎస్పీ శరత్చంద్ర పవార్ మాట్లాడుతూ పోలీస్ సిబ్బంది ఎంతో శ్రమకోర్చి, ప్రాణాలు లెక్క చేయకుండా పని చేస్తున్నారని.. వారి త్యాగాల వల్లే శాంతియుత వాతావరణం ఏర్పడిందన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 15 మంది విధుల్లో అమరులయ్యారని, వారి కుటుంబ సభ్యులకు తమ శాఖ అండగా ఉంటుందన్నారు. అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకుని అన్ని పోలీస్స్టేషన్లలో ఈనెల 30 వరకు వివిధ కార్యక్రమాలు, పోలీస్ ఓపెన్ హౌజ్, రక్తదాన శిబిరాలు, షార్ట్ ఫిల్మ్, ఫొటోగ్రఫి, వ్యాసరచన పోటీలు, సైకిల్ ర్యాలీలు నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నారాయణ్ అమిత్, అదనపు ఎస్పీ రమేష్, ఎస్బీ డీఎస్పీ మల్లారెడ్డి, డీఎస్పీ శివరాంరెడ్డి, ఏఆర్ డీఎస్పీ శ్రీనివాసులు, సీఐ రాఘవరావు, రాము, మహాలక్ష్మయ్య, రాజశేఖర్రెడ్డి, రఘువీర్రెడ్డి, శ్రీనునాయక్, ఆర్ఐలు సంతోష్, శ్రీను, హరిబాబు, సూరప్పనాయుడు పాల్గొన్నారు. ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి -
దరఖాస్తుల ఆహ్వానం
నల్లగొండ : వెటర్నరీ, యానిమల్ హస్పెన్డరీ, ఫిషరిస్ విభాగాల్లో ఉద్యోగాల భర్తీకి అవుట్ సోర్సింగ్ ఏజెన్సీల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి ఎన్.పద్మ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. డేటా ఎంట్రీ ఆపరేటర్ (3), ఆఫీస్ సబార్డినేట్లు (38) ఖాళీ భర్తీ కోసం అవుట్సోర్సింగ్ ఏజెన్సీలు ఈ నెల 24న సాయంత్రం 4 గంటల్లోగా జిల్లా ఉపాధి కల్పన కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. అవుట్సోర్సింగ్ ఏజెన్సీలను కలెక్టర్ డ్రా పద్ధతి ద్వారా ఎంపిక చేస్తారని తెలిపారు.సురక్ష బీమా యోజనలో చేర్పించాలి నల్లగొండ : రోజువారీ పనులు చేసుకునే వారందరితో ప్రధామంత్రి సురక్ష బీమా యోజనలో చేర్పించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. మంగళవారం నల్లగొండలోని తన ఛాంబర్లో మున్సిపల్ కమిషనర్లతో ఆమె సమావేశమై మాట్లాడారు. పనులు చేసేవారికి బ్యాంకులు రూ.2 లక్షల వరకు బీమా సౌకర్యాన్ని కల్పిస్తున్నాయని తెలిపారు. సంవత్సరానికి రూ.20 చెల్లించిన వారు మరణిస్తే రూ.2 లక్షలు, అంగవైకల్యం కలిగితే రూ.లక్ష బీమా వస్తుందని తెలిపారు. ఈ విషయంపై మున్సిపల్ కమిషనర్లు పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ నారాయణ్ అమిత్, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు. -
వందశాతం ఉత్తీర్ణతే ధ్యేయం
తిరుమలగిరి(నాగార్జునసాగర్): టెన్త్, ఇంటర్మీడియట్ ఫలితాల్లో వందశాతం ఉత్తీర్ణత సాధించడమే ధ్యేయంగా కేజీబీవీల్లో ప్రత్యేక ప్రణాళికలను రూపొందించి అమలు చేస్తున్నట్లు జీసీడీఓ కత్తుల అరుంధతి అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు, సిబ్బంది హాజరు పట్టికలను, రికార్డులను పరిశీలించారు. అనంతరం తరగతి గదుల్లోకి వెళ్లి విద్యార్థినులను పలు అంశాలపై ప్రశ్నలు అడిగారు. మౌలిక వసతులపై ఆరా తీశారు. ఉపాధ్యాయులు చెప్పే పాఠ్యాంశాలను ఆరోజే చదువుకోవాలని, సబ్జెక్టు పరంగా ఏమైనా అనుమానాలు ఉంటే వెంటనే నివృత్తి చేసుకోవాలని సూచించారు. వర్షాకాలం దృష్ట్యా వంటగది, భోజనశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. మెనూను తప్పనిసరిగా అమలు చేసి విద్యార్థినులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని అన్నారు. -
స్వీట్ షాపుల్లో తనిఖీలు
నల్లగొండ టూటౌన్ : నల్లగొండలోని పలు స్వీట్ షాపులు, తయారీ కేంద్రాలు, రిటైల్ యూనిట్లలో ఫుడ్సేఫ్టీ అధికారులు మంగళవారం తనిఖీలు నిర్వహించారు. 12 స్వీట్ తయారీ కేంద్రాలు, 7 స్వీట్ షాపుల్లో తనిఖీలు నిర్వహించి శాంపిల్స్ సేకరించారు. వంట గదుల్లో అపరిశుభ్రత పసుపు, కారం, ఇతర మసాలాల్లో నాణ్యత లేకపోవడాన్ని గుర్తించారు. నిబంధనలు పాటించని తయారీ కేంద్రాల యజమానులకు నోటీసులు జారీ చేసినట్లు ఫుడ్ సేఫ్టీ ఉమ్మడి జిల్లా నోడల్ అధికారి జ్యోతిర్మయి తెలిపారు. కార్యక్రమంలో ఫుడ్సేఫ్టీ సిబ్బంది పాల్గొన్నారు. -
భర్తతో గొడవ..పిల్లల్ని చంపి..ఆ తర్వాత తల్లి
నల్గొండ జిల్లా: కొండమల్లేపల్లి పట్టణంలో పండుగ పూట విషాదం చోటుచేసుకుంది. ఆనందంగా గడపాల్సిన రోజున కుటుంబ కలహాల కారణంగా ఇద్దరు పిల్లలను చంపి తాను ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది ఓ తల్లి. ఈ విషాద ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.స్థానికుల వివరాల ప్రకారం.. ఏపీ బాపట్ల జిల్లా జనకాల గ్రామానికి చెందిన కుంచాల రమేష్ ,నాగలక్ష్మి(27)దంపతులు నాలుగు సంవత్సరాల క్రితం బతుకు దెరువు కోసం నల్గొండ జిల్లాకు వచ్చి కొండమల్లేపల్లిలో ఉంటున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు అవంతిక(9),మోహన్ సాయి(7) ఉన్నారు. భర్త రమేష్ తాగుడుకు బానిస కావడంతో భార్యాభర్తల మధ్య గత కోన్నాళ్లుగా గొడవలు జరుగుతుండేవని స్థానికులు చెబుతున్నారు .ఇదే క్రమంలో అక్టోబర్ 19న రాత్రి భార్యాభర్తల మధ్య గొడవ జరగగా భర్త రమేష్ ఇంటి నుంచి వెళ్లిపోయి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు. దీంతో మనస్థాపానికి గురైన నాగలక్ష్మి తన ఇద్దరి పిల్లల గొంతు నులిమి తాను ఇంట్లో ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఘటనా స్థలానికి వచ్చిన కొండమల్లేపల్లి పోలీసులు కేసు నమోదు చేసి పోస్టుమార్టం కోసం మృతదేహాలను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
తెల్లారితే కేఫ్ ఓపెనింగ్.. అంతలోనే అనంతలోకాలకు..
నల్గొండ జిల్లా: తెల్లారితే కేఫ్ ఓపెనింగ్.. అందుకోసం కేఫ్ నిర్వాహకుడు తన కుటుంబ సభ్యులతో కలిసి ఒక రోజు ముందుగాను కేఫ్ వద్దకు చేరుకుని ఏర్పాట్లు చేసుకుని రాత్రి అక్కడే నిద్రించారు. తెల్ల వారుజామున కేఫ్ పైకప్పుపై ఏర్పాటు చేసిన వాటర్ ట్యాంక్ కూలి కేఫ్ నిర్వాహకుడి భార్య, కుమారుడు మృతిచెందారు. ఈ ఘటన చిట్యాల మండల పరిధిలోని పెద్దకాపర్తి శివారులో జరగగా.. మృతుల స్వస్థలం మాడుగులపల్లి మండల కేంద్రం కావడంతో స్థానికంగా విషాధచాయలు అలుముకున్నాయి.వివరాలు.. మాడుగులపల్లి మండల కేంద్రానికి చెందిన తగుళ్ల వెంకన్న, నాగమణి(30) దంపతులకు కుమారుడు విరాట్‡కృష్ణ(7), కుమార్తె నందిని సంతానం. వెంకన్న రైల్వే శాఖలో గ్యాంగ్మెన్గా పనిచేస్తున్నాడు. వీరు ఆర్ధికంగా ఉన్నతంగా బతకాలన్న ఉద్ధేశంతో చిట్యాల మండలం పెద్దకాపర్తి శివారులో విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారి పక్కన నూతనంగా కేఫ్ ఏర్పాటు చేసుకున్నారు. ఆదివారం కేఫ్ ప్రారంభించాలని అనుకుని శనివారం రాత్రి కుటుంబ సభ్యులందరూ కలిసి కేఫ్ వద్దకు వెళ్లి రాత్రి అక్కడే నిద్రించారు. ఆదివారం తెల్లవారుజామున వెంకన్న నిద్రలేచి పనులు చేసుకుంటున్నాడు. అదే సమయంలో కేఫ్ రేకుల పైన ఏర్పాటు చేసిన ప్లాస్టిక్ ట్యాంక్ అక్కడే నిద్రిస్తున్న వెంకన్న కుటుంబ సభ్యులపై పడిపోయింది. వెంకన్న వెంటనే వారిని ఆస్పత్రికి తరలించగా అతడి భార్య నాగమణి(30), కుమారుడు విరాట్‡కృçష్ణ(7) అప్పటికే మృతిచెందారు. అతడి కుమార్తె కూతురు నందిని, తల్లి పార్వతమ్మకు తీవ్ర గాయాలయ్యాయి. పార్వతమ్మను మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్లోని యశోదా ఆస్పత్రికి తరలించారు. మృతిచెందిన నాగమణి, విరాట్ కృష్ణకు నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. గ్రామానికి చేరుకున్న మృతదేహాలను స్థానికులు సందర్శించి కన్నీరుమున్నీరుగా విలపించారు. అనంతరం నాగమణి, విరాట్ కృష్ణ మృతదేహాలకు మాడుగులపల్లిలో అంత్యక్రియలు నిర్వహించారు.నేత్రదానం..నాగమణి, విరాట్ కృష్ణ నేత్రాలను దానం చేసేందుకు గాను ఐ డొనేషన్ సెంటర్ వారు నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రిలో కుటుంబ సభ్యులను అవగాహన కల్పించగా.. వారు ఒప్పుకున్నారు. దీంతో నాగమణి, విరాట్ కృష్ణ కంటి కార్నియాను టెక్నీషియన్ బచ్చలకూరి జాని సేకరించారు. -
సూక్ష్మ సైజులో అమరవీరుల స్థూపం
భువనగిరి: భువనగిరి పట్టణానికి చెందిన స్వర్ణకారుడు చోల్లేటి శ్రీనివాసచారి ఈ నెల 21న పోలీసు అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకొని సూక్ష్మ సైజులో పోలీసు అమరవీరుల స్థూపాన్ని తయారు చేశారు. 40 గ్రాముల వెండితో నాలుగు ఇంచుల ఎత్తులో రూపొందించి ఔరా అనిపించారు. ఆయన గతంలోనూ బంగారం, వెండితో వీసా టవర్, క్రికెట్ స్టేడియం, క్రికెట్ వరల్డ్ కప్, భారత పార్లమెంటు భవనం, వీణ, బంగారు బతుకమ్మ, తెలంగాణ చిత్రపటం, ఫుట్బాల్ వరల్డ్ కప్, క్రికెట్ బాల్ వంటివి తయారు చేశాడు. వెండితో తయారు చేసిన పోలీసు అమరవీరుల స్థూపం -
అంతలోనే అనంతలోకాలకు..
తెల్లారితే కేఫ్ ఓపెనింగ్..మాడుగులపల్లి: తెల్లారితే కేఫ్ ఓపెనింగ్.. అందుకోసం కేఫ్ నిర్వాహకుడు తన కుటుంబ సభ్యులతో కలిసి ఒక రోజు ముందుగాను కేఫ్ వద్దకు చేరుకుని ఏర్పాట్లు చేసుకుని రాత్రి అక్కడే నిద్రించారు. తెల్ల వారుజామున కేఫ్ పైకప్పుపై ఏర్పాటు చేసిన వాటర్ ట్యాంక్ కూలి కేఫ్ నిర్వాహకుడి భార్య, కుమారుడు మృతిచెందారు. ఈ ఘటన చిట్యాల మండల పరిధిలోని పెద్దకాపర్తి శివారులో జరగగా.. మృతుల స్వస్థలం మాడుగులపల్లి మండల కేంద్రం కావడంతో స్థానికంగా విషాధచాయలు అలుముకున్నాయి. వివరాలు.. మాడుగులపల్లి మండల కేంద్రానికి చెందిన తగుళ్ల వెంకన్న, నాగమణి(30) దంపతులకు కుమారుడు విరాట్ కృష్ణ(7), కుమార్తె నందిని సంతానం. వెంకన్న రైల్వే శాఖలో గ్యాంగ్మెన్గా పనిచేస్తున్నాడు. వీరు ఆర్ధికంగా ఉన్నతంగా బతకాలన్న ఉద్ధేశంతో చిట్యాల మండలం పెద్దకాపర్తి శివారులో విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారి పక్కన నూతనంగా కేఫ్ ఏర్పాటు చేసుకున్నారు. ఆదివారం కేఫ్ ప్రారంభించాలని అనుకుని శనివారం రాత్రి కుటుంబ సభ్యులందరూ కలిసి కేఫ్ వద్దకు వెళ్లి రాత్రి అక్కడే నిద్రించారు. ఆదివారం తెల్లవారుజామున వెంకన్న నిద్రలేచి పనులు చేసుకుంటున్నాడు. అదే సమయంలో కేఫ్ రేకుల పైన ఏర్పాటు చేసిన ప్లాస్టిక్ ట్యాంక్ అక్కడే నిద్రిస్తున్న వెంకన్న కుటుంబ సభ్యులపై పడిపోయింది. వెంకన్న వెంటనే వారిని ఆస్పత్రికి తరలించగా అతడి భార్య నాగమణి(30), కుమారుడు విరాట్కృష్ణ(7) అప్పటికే మృతిచెందారు. అతడి కుమార్తె కూతురు నందిని, తల్లి పార్వతమ్మకు తీవ్ర గాయాలయ్యాయి. పార్వతమ్మను మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్లోని యశోదా ఆస్పత్రికి తరలించారు. మృతిచెందిన నాగమణి, విరాట్ కృష్ణకు నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. గ్రామానికి చేరుకున్న మృతదేహాలను స్థానికులు సందర్శించి కన్నీరుమున్నీరుగా విలపించారు. అనంతరం నాగమణి, విరాట్కృష్ణ మృతదేహాలకు మాడుగులపల్లిలో అంత్యక్రియలు నిర్వహించారు. నేత్రదానం..నాగమణి, విరాట్ కృష్ణ నేత్రాలను దానం చేసేందుకు గాను ఐ డొనేషన్ సెంటర్ వారు నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రిలో కుటుంబ సభ్యులను అవగాహన కల్పించగా.. వారు ఒప్పుకున్నారు. దీంతో నాగమణి, విరాట్ కృష్ణ కంటి కార్నియాను టెక్నీషియన్ బచ్చలకూరి జాని సేకరించారు. వాటర్ ట్యాంక్ కూలి తల్లి, కుమారుడు మృతి మాడుగులపల్లి మండల కేంద్రంలో విషాధచాయలు -
అసమానతలు లేని సమాజం కోసం ఉద్యమించాలి
రామన్నపేట: అసమానతలు లేని సమాజ నిర్మాణం కోసం యువత ఉద్యమించాలని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం పిలుపునిచ్చారు. ఆదివారం రామన్నపేటలో నిర్వహించిన యువ కమ్యూనిస్టుల సమ్మేళనాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా యువకులతో కలిసి బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం జరిగిన సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. దేశంలో పెట్టుబడిదారీ విధానం వల్ల అసమానతలు పెరుగుతున్నాయని అన్నారు. ఈ ప్రపంచంలో కమ్యూనిజం మహోన్నతమైన సిద్ధాంతమని, కమ్యూనిస్టులు పురోగామిశక్తులు అని చెప్పడానికి శ్రీలంక వంటి పరిణామాలే నిదర్శనమని వివరించారు. పార్టీలు రాజకీయ లబ్ధి కోసం ఆచరణ సాధ్యంకాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక వాటి అమలు కోసం ప్రజలను ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేస్తున్నారని విమర్శించారు. ప్రజలకు ఉచిత విద్య, వైద్య అందించినప్పుడే దేశం అభివృద్ధి సాధిస్తుందని చెప్పారు. పార్టీ జిల్లా కార్యదర్శి ఎండీ జహంగీర్ మాట్లాడుతూ.. యువత దోపిడి వ్యవస్థను నిలువరించాలని, మతోన్మాదశక్తులను అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. పార్టీ మండల కార్యదర్శి జెల్లెల పెంటయ్య అధ్యక్షతన జరిగిన ఈ సమ్మేళనంలో నాయకులు మేక అశోక్రెడ్డి, జెల్లెల పెంటయ్య, గడ్డం వెంకటేశం, బల్గూరి అంజయ్య, వనం ఉపేందర్, కూరెళ్ల నర్సింహాచారి, బోయిని ఆనంద్, కందుల హన్మంత్, కల్లూరి నాగేష్, గొరిగె సోములు, నాగటి ఉపేందర్, విజయ్భాస్కర్, మీర్ఖాజా, బాలరాజు, రామచంద్రం, శ్రవన్, శివ, ఉదయ్ పాల్గొన్నారు. సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం -
22 నుంచి కార్తీక పూజలు
యాదగిరిగుట్ట: యాదగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఈ నెల 22వ తేదీ నుంచి నవంబర్ 20వ తేదీ వరకు కార్తీక మాసం ఉత్సవాలను నిర్వహింంచేందుకు ఆలయ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. తెలంగాణాతో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన భక్తులు అధికంగా యాదగిరి క్షేత్రంలో ఈ కార్తీక మాసంలో శ్రీసత్యనారాయణస్వామి వ్రతాలు జరిపించేందుకు ఆసక్తి కనబరుస్తారు. వ్రత పూజల్లో పాల్గొనేందుకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కొండ దిగువన ఉన్న సత్యనారాయణస్వామి వ్రత మండపంలోని రెండు హాల్స్లో పూజ సామాగ్రి, వ్రత పీటలను, వ్రతంలో ఉపయోగించే ప్రసాదాలను ప్యాకింగ్ చేసి సిద్ధం చేశారు. యాదగిరి ఆలయానికి అనుబంధంగా ఉన్న పాతగుట్టలో సైతం భక్తులు వ్రతాలను జరిపించేందుకు ఏర్పాట్లు చేశారు. ● యాదగిరి క్షేత్రంలో..యాదగిరి క్షేత్రంలో నెల రోజుల పాటు 6 బ్యాచ్లుగా వ్రతాలను నిర్వహించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. మొదటి బ్యాచ్ ఉదయం 7గంటల నుంచి 8గంటల వరకు, రెండో బ్యాచ్ ఉదయం 9గంటల నుంచి 10 గంటల వరకు, మూడో బ్యాచ్ 11గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు, నాల్గవ బ్యాచ్ మధ్యాహ్నం 1గంటల నుంచి 2గంటల వరకు, ఐదో బ్యాచ్ మధ్యాహ్నం 3గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు, ఆరో బ్యాచ్ సాయంత్రం 5గంటల నుంచి 6గంటల వరకు నిర్వహించనున్నారు. ● పాతగుట్ట ఆలయంలో..యాదగిరీశుడి అనుబంధ ఆలయమైన పాతగుట్ట లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో నాలుగు బ్యాచ్లుగా వ్రతాలు నిర్వహిస్తామని అధికారులు పేర్కొన్నారు. మొదటి బ్యాచ్ ఉదయం 9గంటలకు, రెండో బ్యాచ్ 11గంటలకు, మూడో బ్యాచ్ మధ్యాహ్నం 2గంటలకు, నాల్గవ బ్యాచ్ సాయంత్రం 4గంటలకు నిర్వహిస్తారు. ● కార్తీక పౌర్ణమి రోజు..వచ్చే నెల 5వ తేదీన కార్తీక శుద్ధ పూర్ణిమ నేపథ్యంలో యాదగిరి కొండకు దిగువన ఉన్న సత్యనారాయణస్వామి వ్రత మండపంలో ఉదయం 5గంటల నుంచి రాత్రి 7గంటల వరకు 8 బ్యాచ్లుగా వ్రతాలు నిర్వహించనున్నారు. ప్రతి గంటకు ఒక్క బ్యాచ్ చొప్పున 8 బ్యాచ్లు నిర్వహిస్తామని ఇప్పటికే ఆలయ ఈఓ రవినాయక్ వెల్లడించారు. కాగా పాతగుట్ట ఆలయంలో 6 బ్యాచ్లుగా వ్రతా లను భక్తులచే జరిపిస్తారు.వ్రత మండపంలో సిద్ధం చేస్తున్న వ్రత పీటలు యాదగిరి క్షేత్రంలో ఏర్పాట్లు పూర్తిచేసిన అధికారులు వ్రత మండపంలో పీటలు, ప్రసాదాలు రెడీ -
దీపావళి వెలుగులు నింపాలి
● శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి నల్లగొండ: నల్లగొండ జిల్లా ప్రజలకు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ దీపావళి పండుగ ప్రతిఒక్కరి జీవితంలో వెలుగును నింపాలని కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ప్రజలంతా దీపావళిని ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. నేడే దీపావళి పండుగరామగిరి(నల్లగొండ): దీపావళి పండుగను సోమవారమే జరుపుకోవాలని నిర్ణయించినట్లు అఖిల బ్రాహ్మణ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బొల్లా వేణుగోపాలరావు ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నెల 20న నరకచతుర్ధశి నివాళులు, 21న ధనలక్ష్మి పూజలు జరుపుకోవాలని ఆయన అన్నారు. అమావాస్య ఘడియలు సోమవారం మధ్యాహ్నం 3.46 నుంచి మంగళవారం సాయంత్రం 5.56 నిమిషాల వరకు ఉన్నందున నోములు సోమవారం, మంగళవారం రెండు రోజులు జరుపుకోవచ్చని సూచించారు. ఈసారి కొత్త నోములు లేవని పాత వారు కేదారిశ్వరి వ్రతం చేసుకోవాలన్నారు. సోమవారం నివాళులు ఇచ్చుకోవాలని పేర్కొన్నారు. ఆకట్టుకున్న నృత్య ప్రదర్శన భువనగిరి: భువనగిరి మండలం రాయగిరి గ్రామ పరిధిలోగల మినీ శిల్పారామంలో ఆదివారం శ్రీచంద్ర కళా నిలయం ఆధ్వర్యంలో పెరుమాండ్ల షంతోష్ శిష్య బృందం ఆంధ్ర నాట్య కళా ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహించారు. సెలవు దినం కావడంతో శిల్పారామానికి వచ్చిన సందర్శకులు నృత్య ప్రదర్శనను తిలకించి ఆనందించారు. ఈ నృత్య ప్రదర్శనలో కళాకారులు వష్తిక, సుహని, రితిక, నిత్యశ్రీ, అశ్రిత, దీక్షిత, అక్షిత పాల్గొన్నారు. -
ప్రజలకు దీపావళి పండుగ శుభాకాంక్షలు
నల్లగొండ : ఒక్కో దీపాన్ని వెలిగిస్తూ చీకటిని తరిమేసినట్లుగానే మనుషుల్లో అజ్ఞానమనే చీకటిని తొలగిస్తూ జ్ఞాన వెలుగులు నింపే దీపాల పండుగ దీపావళి అని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. జిల్లా ప్రజలకు ఆయన దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలు పటాకులు కాల్చేటప్పుడు జాగ్రత్తలు పాటిస్తూ పండుగ జరుపుకోవాలని సూచించారు. చెడుపై మంచి సాధించిన విజయం ఈ పండుగ అన్నారు. హక్కుల సాధనకు పోరాడాలినల్లగొండ : ప్రభుత్వ ఉపాధ్యాయులు న్యాయపరంగా రావాల్సిన హక్కుల కోసం పోరాడాల్సిన అవసరం ఉందని ప్రభుత్వ ఉపాధ్యాయుల సంఘం (జీటీఏ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సైదుల్రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం నల్లగొండలోని బోయవాడ పాఠశాలలో నిర్వహించిన సంఘం జిల్లా జనరల్ బాడీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ ఉపాధ్యాయులకు న్యాయబద్ధంగా రావాల్సిన ఎంఈఓ, డిప్యూటీ డీఈఓ, లెక్చరర్, డైట్ ప్రిన్సిపాల్ పదోన్నతుల కోసం న్యాయస్థానంలో పోరాటానికి ఉపాధ్యాయులు కలిసి రావాలని పిలుపునిచ్చారు. రాజ్యాంగబద్ధం కానీ ఏకీకృత సర్వీస్ రూల్స్ సాధ్యపడదని ముందు నుంచే ప్రభుత్వ ఉపాధ్యాయుల సంఘం పోరాడుతోందని చెప్పారు. అనంతరం జీటీఏ జిల్లా నూతన కమిటీని ఎనుకున్నారు. అధ్యక్షుడిగా కె.సంపత్ కుమార్, ప్రధాన కార్యదర్శిగా పతేపురం సైదయ్య, గౌర వ అధ్యక్షుడిగా బుచ్చి రాములు, కోశాధికారిగా ఆర్.వెంకట్ రమణ, అసోసియేట్ అధ్యక్షుడిగా వై.బద్రీనాథ్, వైస్ ప్రెసిడెంట్లుగా కొంపెల్లి లింగయ్య, జానయ్య ఎన్నికయ్యారు. సమావేశంలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కాసం ప్రభాకర్, దూ దిగామ స్వామి, ధర్మానాయక్ పాల్గొన్నారు. మూసీకి కొనసాగుతున్న వరద కేతేపల్లి : మూసీ ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద కొనసాగుతోంది. ఆదివారం ప్రాజెక్టుకు 1,912 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండగా ప్రాజెక్టు ఒక క్రస్ట్ గేటును పైకెత్తి 1,104 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మూసీ కుడి, ఎడమ కాల్వలకు 293 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. సీపేజీ, లీకేజీ, ఆవిరి రూపంలో 52 క్యూసెక్కుల నీరు వృథా అవుతోంది. మూసీ ప్రాజెక్టు గరిష్ట నీటిమట్టం 645 అడుగులు కాగా నీటిమట్టాన్ని 644.50 అడుగుల వద్ద నిలకడగా ఉంచి అదనంగా వచ్చిన నీటిని దిగువకు విడుదల చేస్తున్నామని అధికారులు పేర్కున్నారు. -
కూటమి ప్రభుత్వానిది కక్షసాధింపు చర్య
నల్లగొండ టౌన్ : ‘ప్రజల గొంతుకగా నిలుస్తున్న సాక్షి మీడియాపై చంద్రబాబు ప్రభుత్వం కక్ష సాధిపు చర్యలకు పాల్పడుతోంది. రాజ్యాంగ హక్కులు, పత్రికా స్వేచ్ఛను కాలరాస్తూ కుట్రలకు పదును పెడుతోంది. నోటీసుల పేరుతో సాక్షి ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డిని వేధిస్తోంది. నోటీసులు తీసుకుంటున్నా, పోలీసులకు సహకరిస్తున్నా వేధింపులు మాత్రం ఆగడం లేదు.’ అంటూ.. సాక్షి పత్రికపై ఏపీ ప్రభుత్వ దాడులను విద్యార్థి, యువజన సంఘాలు ఖండిస్తున్నాయి. ప్రభుత్వ తీరు మార్చుకోకపోతే ప్రజల ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పత్రికలు, జర్నలిస్టులకు స్వేచ్ఛ లేకుండా పోయింది. సాక్షి ఎడిటర్ ధనంజయరెడ్డిపై అక్రమ కేసులన్నీ.. పత్రికల మీద జరిగిన దాడిగా పరిగణిస్తున్నాం. ఇలాంటి చర్యలతో కూటమి ప్రభుత్వం కాలగర్భంలో కలిసిపోవడం ఖాయం. – ఖమ్మంపాటి శంకర్, ఎస్ఎఫ్ఐ కేంద్ర కమిటీ సభ్యుడు సాక్షి దినపత్రిక మీద దాడులు చేయడం అప్రజాస్వామిక చర్య. ప్రజల గొంతుకగా ఉండే సాక్షిపై దాడులు చేయడం అంటే భావప్రకటన స్వేచ్ఛను హరించడమే. సాక్షి దినపత్రికపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కక్షగట్టి దాడులు చేయడాన్ని మా సంఘం తీవ్రంగా ఖండిస్తోంది. – మురళీకృష్ణ, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి సాక్షి పత్రికపై కూటమి ప్రభుత్వం పథకం ప్రకారం కుట్రలకు పాల్పడుతోంది. సాక్షి ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డిపై కేసులు పెట్టడమే దీనికి నిదర్శనం. చంద్రబాబు ప్రభుత్వానికి రాజ్యాంగంపై ఏమాత్రం గౌరవం, విశ్వాసం ఉన్నా సాక్షిపై పెట్టిన కేసులు వెనక్కి తీసుకోవాలి. – మల్లం మహేష్, డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి సాక్షిపై దాడులు చేయడం, కేసులు బనాయించడం కూటమి ప్రభుత్వ పిరికిపంద చర్య. పత్రికలపై పదేపదే దాడులు, దౌర్జన్యాలకు దిగడం చంద్రబాబు రౌడీయిజానికి పరాకాష్ట. ప్రజల సమస్యలను తెలిపే పత్రికలకు అడ్డుకట్ట వేయాలనుకోవడం సూర్యుడి వెలుగును అడ్డుకోవాలని చూడటమే. కూటమి ప్రభుత్వం ఇప్పటికై నా సాక్షిపై దాడులు ఆపకపోతే ప్రజలే తగిన బుద్ధి చెబుతారు. – ఏర్పుల శ్రవణ్ కుమార్, ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు -
ధాన్యం వర్షార్పణం
చిట్యాల : మండలంలోని పెద్దకాపర్తి గ్రామంలో ఆదివారం సాయంత్రం కురిసిన వర్షంతో రైతులు కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చిన ధాన్యం తడిసింది. అకస్మాత్తుగా వర్షం రావడంతో ఆరబెట్టిన ధాన్యపు రాశులతోపాటు కొనుగోలుకు సిద్ధంగా ఉన్న ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. ధాన్యం కొనుగోళ్లు మందకొడిగా సాగుతుండడంతోపాటు వర్షం పడడంతో అమ్మకానికి సిద్ధంగా ఉన్న ధాన్యంలో తేమ శాతం పెరిగిపోయి కొనుగోళ్లు మరింత జాప్యం జరిగే అవకాశం ఉంది. దీంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తడిసిన ధాన్యంను ఎలాంటి షరతులు లేకుండా కొనుగోలు చేయాలని రైతులు మార్కెటింగ్ శాఖ అధికారులను కోరుతున్నారు. -
ఆదాయ వేటలో.. ఆబ్కారీ!
మద్యం దుకాణాల దరఖాస్తుల గడువు 23వ తేదీ వరకు పొడిగింపు సాక్షి ప్రతినిధి, నల్లగొండ : ఎకై ్సజ్ శాఖ ఆదాయ వేటలో పడింది. ఈసారి మద్యం దుకాణాల టెండర్లలో దరఖాస్తు ఫీజు ద్వారా అధిక ఆదాయం వస్తుందని భావించించింది. మద్యం దుకాణాల రెండేళ్ల కాల పరిమితికి టెండర్లు పిలిచిన ఎకై ్సజ్ శాఖ, ఆదాయం పెంచుకునేందుకు డిపాజిట్ మొత్తాన్ని పెంచింది. గతంలో ఒక్కో దరఖాస్తుకు రూ.2 లక్షలు నాన్ రీఫండబుల్ డిపాజిట్గా నిర్ణయించగా, కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని రూ.3 లక్షలకు పెంచింది. అధికారులంతా పెద్ద ఎత్తున ఆదాయం వస్తుందని భావించినా.. ఆశించిన స్థాయిలో దరఖాస్తులు రాకపోవడంతో గతంలో కంటే ఆదాయం తగ్గిపోయింది. దీంతో ఆదాయం పెంచుకునేందుకు టెండర్ల గడువును ఈ నెల 23వ తేదీ వరకు పొడిగించింది. అయినా ఆదాయం పెరుగుదలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 154 దుకాణాలకు టెండర్లు.. జిల్లాలో 154 మద్యం షాపులు ఉన్నాయి. వాటికి దరఖాస్తులు ఆహ్వానించగా.. సెప్టెంబర్ 26వ తేదీ నుంచి ఈ నెల 18వ తేదీ వరకు మొత్తం 4,620 దరఖాస్తులు వచ్చాయి. వాటి ద్వారా రూ. 138.60 కోట్ల ఆదాయం వచ్చింది. అయితే 2023 సంవత్సరంలో 7,057 దరఖాస్తులు రాగా, రూ.2 లక్షల పీజుతో రూ.141.14 కోట్ల ఆదాయం వచ్చింది. అంటే గతంలో కంటే ఈసారి ఆదాయం తగ్గిపోయింది. దీంతో ప్రభుత్వం గడువు పొడిగించింది. దరఖాస్తులకు మూడు రోజులు అవకాశం ఆశించిన ప్రకారం ఫీజు రూపంలో ఆదాయ రాకపోవడంతో ఎకై ్సజ్ శాఖ మద్యం షాపుల దరఖాస్తుల గడువును ఈ నెల 23వ తేదీ వరకు పొడిగించింది. 18వ తేదీ సాయంత్రంతో గడువు ముగిసినా మళ్లీ 23వ తేదీ వరకు దరఖాస్తుల గడువు పెంచింది. 19 ఆదివారం కాగా, 20వ తేదీ దీపావళి అవుతోంది. దీంతో మంగళ, బుధ, గురువాల్లో దరఖాస్తు చేసుకునేలా మళ్లీ అవకాశం ఇచ్చింది. ఈ మూడు రోజుల్లో ఏ మేరకు దరఖాస్తులు వస్తాయన్న దానిపై అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. రూ.200 కోట్లు వస్తాయని భావించినా.. ప్రభుత్వం డిపాజిట్ మొత్తాన్ని పెంచి ఆదాయం పెంచుకోవాలని చూసింది. అయితే గతంలో టెండర్లు పిలిచినప్పుడు నల్ల గొండ జిల్లాలో రూ.141.14 కోట్లు వస్తే.. ఈసారి రూ.200 కోట్ల వరకు ఆదాయం వస్తుందని జిల్లా అధికారులు అంచనా వేశారు. కానీ.. గతంలో కంటే రూ.3 కోట్లు తక్కువగానే వచ్చింది. ఈ పరిస్థితుల్లో మరో మూడు రోజులు గడువు పెంచినా.. అనుకున్న లక్ష్యాన్ని చేరుకునేది కష్టంగానే కనిపిస్తోంది. ఫ 2023లో రూ.2 లక్షల ఫీజుతో వచ్చిన ఆదాయం రూ.141 కోట్లు ఫ ప్రస్తుతం రూ.3 లక్షలకు పెంచినా వచ్చింది రూ.138 కోట్లే.. ఫ రెండేళ్ల తరువాత కూడా పెరగని ఫీజు ఆదాయం ఫ దరఖాస్తు గడువు పొడిగించినా ఆదాయం పెరుగుదలపై అనుమానాలుస్టేషన్ షాపులు దరఖాస్తులు నల్లగొండ 38 1363 నకిరేకల్ 18 480 చండూరు 14 373 మిర్యాలగూడ 26 914 హాలియా 20 474 దేవరకొండ 22 576 నాంపల్లి 16 440 మొత్తం 154 4,620 -
సహకారం.. విస్తరణ
నల్లగొండ అగ్రికల్చర్ : జిల్లా సహకార కేంద్ర బ్యాంకు(డీసీసీబీ) తన సేవలను విస్తరిస్తోంది. ఇప్పటికే ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 41 బ్రాంచ్ల ద్వారా ప్రజలు, రైతులకు వివిధ రకాల రుణాలను అందిస్తూ అండగా నిలుస్తోంది. ప్రస్తుతం మరో 6 కొత్త బ్రాంచ్ల ఏర్పాటుకు ఆర్బీఐ(రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా) అనుమతిని ఇస్తూ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా మొత్తం 47 బ్రాంచ్ల ద్వారా తన సేవలను మరింత విస్తరించనుంది. కొత్తగా సూర్యాపేట జిల్లా మోతె, చిలుకూరులో, నల్లగొండ జిల్లాలోని శాలిగౌరారం, నాంపల్లి, పెద్దవూర, మిర్యాలగూడ పట్టణంలో ఒక బ్రాంచ్ ఉండగా అదనంగా బ్రాంచ్–2 ఏర్పాటు కానుంది. ఉమ్మడి జిల్లాలోనే ఎక్కువ బ్రాంచ్లు రైతుల సంక్షేమం కోసం 107 సంవత్సరాల క్రితం ఏర్పడిన జిల్లా సహకార కేంద్ర బ్యాంకు అంచెలంచెలుగా విస్తరిస్తూ రైతులకు సేవలు అందిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా.. నల్లగొండ డీసీసీబీనే ఎక్కుగా బ్రాంచ్లను కలిగి ఉంది. డీసీసీబీ ప్రస్తుతం రూ.3,400 కోట్ల టర్నోవర్కు చేరుకుంది. మార్చి 2026 వరకు రూ.5 వేల కోట్ల టర్నోవర్కు చేరుకోవాలన్న లక్ష్యంగా పాలకవర్గం, అధికారులు ప్రణాళికలను సిద్ధం చేశారు. వాణిజ్య బ్యాంకులకు దీటుగా పంట రుణాలు, విదేశీ విద్యారుణాలు, బంగారు ఆభరణాల రుణాలు, స్వల్పకాలిక, దీర్ఘకాలిక, గృహ, మార్టిగేజ్, వాహన, పౌల్ట్రీ, పాడి వంటి రుణాలను రైతులకు అందిస్తోంది. యాసంగిలోనూ రూ.50 కోట్ల పంట రుణాలు ప్రస్తుత వానాకాలంలో రైతులకు రూ.50 వేల కోట్ల పంటరుణాలను అందించిన డీసీసీబీ యాసంగి సీజన్లో కూడా రూ.50 కోట్ల పంటరుణాలను అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. తీసుకున్న రుణాలను రైతులు సకాలంలో తిరిగి చెల్లిస్తున్న నేపథ్యంలో రైతులు రుణాలను విరివిగా రుణాలు ఇవ్వాలని నిర్ణయించింది. తక్కువ వడ్డీకే రుణాలను అందిస్తున్నందున రైతులు రుణాల కోసం బారులుదీరుతున్నారు. మహిళా సంఘాల బలోపేతం కోసం ఈ ఆర్థిక సంవత్సరంలో తక్కువ వడ్డీకి ఎలాంటి ప్రాసిసెంగ్ ఫీజు లేకుండా రుణాలను ఇవ్వాలని పాలకవర్గం నిర్ణయించింది. నాబార్డు రీఫైనాన్స్ ద్వారా రూ.200 కోట్ల రుణాలను ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది. బంగారు రుణాలను ఇప్పటి వరకు రూ.1,040 కోట్ల ఇచ్చి రాష్ట్రంలోని డీసీసీబీలో ప్రథమ స్థానంలో నిలిచింది. వచ్చే ఆర్థిక సంవత్సరం నాటికి టర్నోవర్ రూ.5 వేల కోట్లకు చేరుకుని.. రూ.70 కోట్ల సాధించాలని పట్టుదలతో ఉంది. ఫ డీసీసీబీకి మరో ఆరు కొత్త బ్రాంచ్లు ఫ అనుమతి ఇచ్చిన ఆర్బీఐ ఫ రైతులకు చేరువకానున్న సేవలు -
సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి
మిర్యాలగూడ : రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి పాలకులు కృషి చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. ఆదివారం మిర్యాలగూడ సీపీఎం కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో పాలకులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం సరైందికాదని, మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రజా సేవలను మరిచిపోయి తిట్ల పురాణం, ఆరోపణలు చేసుకోవడంపై ప్రజలు అసహ్యించుకుంటున్నారని మండిపడ్డారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేసి తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలన్నారు. సమావేశంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు డబ్బికార్ మల్లేష్, జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు వీరేపల్లి వెంకటేశ్వర్లు, నాయకులు మల్లు గౌతంరెడ్డి, శశిధర్రెడ్డి పాల్గొన్నారు.ఫ మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి -
నందీశ్వరుడికి పంచామృతాభిషేకం
మేళ్లచెరువు : మండల కేంద్రంలో శ్రీఇష్టకామేశ్వరీ సమేత శ్రీస్వయంభు శంభులింగేశ్వరస్వామి దేవాలయంలో శనివారం బహుళ త్రయోదశి పర్వదినం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం గణపతి పూజ, పూణ్యాహవచనం, మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, సహస్రనామార్చన, మహాలింగార్చన, పుష్పార్చన, మహానివేదన, మంగళనిరాజనం అనంతరం తీర్థప్రసాద వినియోగం గావించారు. సాయంత్రం ప్రదోష సమయంలో నందీశ్వరుడికి పంచామృతాభిషేకాలు జరిపారు. కార్యక్రమంలో ఆలయ మేనేజర్ ఎన్.శంభిరెడ్డి, ఆలయ చైర్మన్ శాగంరెడ్డి శంభిరెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు కొంకపాక విష్ణువర్ధన్ శర్మ, ధనుంజయశర్మ, సిబ్బంది కొండారెడ్డి, నర్సింహరెడ్డి భక్తులు పాల్గొన్నారు. -
అధిక వడ్డీ దందా.. గుండెపోటుతో యువకుడి మృతి
చందంపేట: అధిక వడ్డీ దందా ఓ యువకుడి ప్రాణాలను బలిగొంది. వివరాలు.. నాగర్కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం లక్ష్మాపురం గ్రామానికి చెందిన పలువురు అధిక వడ్డీ చెల్లిస్తామంటూ నల్ల గొండ జిల్లా చందంపేట మండలం పోల్య నాయక్తండాలో కొంతమంది దగ్గర డబ్బులు తీసుకున్నారు. అనుకున్న ప్రకారమే మొదట్లో అధిక వడ్డీ ఇస్తుండడంతో మరికొందరు వారికి డబ్బులు ఇవ్వడం మొదలుపెట్టారు. ఇలా గ్రామానికి చెందిన సుమారు పదిహేను మంది నుంచి రూ.2కోట్ల వరకు వసూలు చేశారు. అదే గ్రామానికి చెందిన ఇస్లావత్ నాత్య కుమారుడు ఇస్లావత్ నరేష్(30) కుటుంబంతో పాటు హైదరాబాద్లో నివాసముంటూ శుభకార్యాలలో వంటలు చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. నరేష్ కూడా రూ.9లక్షల వరకు అప్పు తెచ్చి వారికి వడ్డీకి ఇచ్చాడు. మొదట్లో అనుకున్న మేరకు అధిక వడ్డీ చేతికి అందగా.. ఆ ఆతర్వాత సరైన స్పందన లేకపోవడంతో అనుమానం వచ్చిన నరేష్ వారిని గట్టిగా నిలదీశాడు. దీంతో రేపు, మాపు అంటూ కాలం వెళ్లదీస్తూ వస్తున్నారు. దీంతో నరేష్కు అప్పు ఇచ్చిన వారి నుంచి ఒత్తిడి పెరగడంతో తీవ్ర మనోవేదనకు గురై శుక్రవారం ఉదయం గుండెపోటుతో మృతిచెందాడు. -
ఆర్థిక ఇబ్బందులతో ఉరేసుకుని ఆత్మహత్య
చౌటుప్పల్: ఆర్థిక ఇబ్బందులతో ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన శనివారం చౌటుప్పల్ పట్టణంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చౌటుప్పల్ పట్టణంలోని రత్నానగర్కాలనీలో నివాసముంటున్న పల్లె స్వామిగౌడ్(49)కు భార్య సుశీల, కుమార్తె అఖిల ఉన్నారు. అతడు చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధి లింగోజిగూడెం గ్రామంలోని ఓ పెట్రోల్ బంక్లో క్యాషియర్గా పనిచేస్తున్నాడు. అతడి భార్య లక్కారం శివారులోని ఓ పెట్రోల్ బంక్లో పనిచేస్తోంది. ఇటీవల వారి కుమార్తె వివాహం జరిగింది. స్వామిగౌడ్ పెట్రోల్ బంక్లో పనిచేయడంతో పాటు ఫైనాన్స్ వ్యాపారం కూడా నిర్వహిస్తుంటాడు. ప్రతి రోజు సాయంత్రం 6గంటల సమయంలో తన భార్య డ్యూటీ ముగించుకొని ఇంటికి వస్తుంది. ఈ క్రమంలో బస్టాండ్ వద్దకు వెళ్లి ఆమెను బైక్పై ఇంటికి తీసుకొస్తుంటాడు. శనివారం సాయంత్రం కూడా స్వామిగౌడ్కు అతడి భార్య ఫోన్ చేయగా.. అతడు లిఫ్ట్ చేయలేదు. దీంతో ఆమె నడుచుకుంటూనే ఇంటికి చేరుకుంది. తలుపులు దగ్గరకు వేసి ఉండడంతో నెట్టుకొని లోపలికి వెళ్లగా.. స్వామిగౌడ్ ఉరికి వేలాడుతూ కనిపించాడు. చుట్టుపక్కల వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. 18 పేజీల సూసైడ్ నోట్ స్వాధీనం ఇంట్లో స్వామిగౌడ్ రాసిన 18 పేజీల సూసైడ్ నోట్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తన బంధువులకు, మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్రెడ్డికి, సొంత అల్లుడికి, స్థానికంగా తనతో అనుబంధం కలిగిన 18మంది రాజకీయ నాయకులకు, క్లాస్మేట్స్కు వేర్వేరుగా స్వామిగౌడ్ సూసైడ్ నోట్ రాశాడు. అందులో ‘నాకు అప్పులు అయ్యాయి. ఇబ్బందులు ఎదుర్కొంటున్నాను. ఈ అప్పులతో ఇబ్బంది పడుతున్న విషయం ఇంట్లో కూడా తెలియదు. తెలిస్తే ముందుగా నా భార్య చనిపోతుంది. అందుకే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. నాకు సొంత ఇల్లు కూడా లేదు. నాకు ఇందిరమ్మ ఇల్లు రాలేదు. నా కుటుంబాన్ని ఎమ్మెల్యే రాజగోపాల్రెడ్డి, స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు ఆదుకోవాలి. మనం ఇన్ని సంవత్సరాలు కలిసిమెలిసి ఉన్నాం, కావున ఇకపై మీరంతా నా కుటుంబానికి అండగా నిలవాలి’ అని క్లాస్మేట్స్కు విజ్ఞప్తి చేశాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు చౌటుప్పల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
యాదగిరీశుడిని దర్శించుకున్న పీవీ సింధు
యాదగిరిగుట్ట రూరల్: ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి, ఒలంపిక్ పతక విజేత పీవీ సింధు శనివారం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు సంప్రదాయరీతిలో స్వాగతం పలికారు. ప్రధానాలయంలోని స్వయంభువులను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. స్వామి వారి నిత్యకల్యాణంలో పాల్గొన్నారు. అనంతరం అర్చకులు వారికి వేదాశీర్వచనం చేశారు. స్వామి వారి లడ్డూ ప్రసాదాన్ని పీవీ సింధుకు ఆలయ అధికారులు అందజేశారు. సాగర్ను సందర్శించిన ఏపీ గవర్నర్ నాగార్జునసాగర్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ శనివారం నాగార్జునసాగర్కు వచ్చారు. ఆయనకు విజయవిహార్ అతిథిగృహం వద్ద నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, అధికారులు స్వాగతం పలికారు. మధ్యాహ్నం భోజనం అనంతరం ప్రత్యేక లాంచీలో ఆయన నాగార్జునకొండకు వెళ్లారు. అక్కడ మ్యూజియంలోగల బౌద్ధశిల్పాలు, బోధివృక్షం, అలనాటి నాగరికత విశేషాలను తెలుసుకున్నారు. సాయంత్రం విజయవిహార్ అతిథిగృహానికి చేరుకుని రాత్రి అక్కడే బస చేశారు. ఆదివారం ఉదయం స్థానికంగా మరికొన్ని సందర్శనీయ స్థలాలకు చూస్తారు. సాయంత్ర తిరిగి అమరావతికి వెళ్లనున్నారు. ట్రాక్టర్ ఢీకొని ఏఎన్ఎం దుర్మరణం వలిగొండ: స్కూటీపై వెళ్తున్న ఏఎన్ఎంను ట్రా క్టర్ ఢీకొనడంతో మృతి చెందింది. ఈ ఘటన వలిగొండ మండలం వర్కట్పల్లిలో శనివా రం జరిగింది. వలిగొండ మండల కేంద్రానికి చెందిన పోలేపాక(దేవరాయ) సుజాత (43) వర్కట్పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏఎన్ఏంగా విధులు నిర్వర్తిస్తోంది. శనివారం సాయంత్రం పీహెచ్సీలో విధులు ముగించుకొని తన కుమారుడిని తీసుకొని స్కూటీపై ఇంటికి తిరిగి వస్తుండగా.. పీహెచ్సీ సమీపంలో ట్రాక్టర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సుజాత తలపై నుంచి ట్రాక్టర్ టైరు వెళ్లడంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. ఆమె కుమారుడికి కాలు విరిగడంతో పాటు తలకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రామన్నపేట ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ యుగంధర్ తెలిపారు. సంప్రదాయ పూజలుయాదగిరిగుట్ట రూరల్: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శనివారం సంప్రదాయ పూజలు ఘనంగా నిర్వహించారు. అదేవిధంగా సుప్రభాత సేవ, అభిషేకం, తులసీదళాలర్చన, అష్టోత్తర పూజలు, సుదర్శన నారసింహా హోమం, గజవాహన సేవ, నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం నిర్వహించారు. సాయంత్రం వెండి జోడు సేవను ఆలయ మాడ వీధిలో ఊరేగించారు. -
కాలం చెల్లిన మందులిచ్చారని పీహెచ్సీ ఎదుట నిరసన
తుర్కపల్లి: కాలం చెల్లిన మందులు ఇచ్చారంటూ ఓ రోగి శనివారం సాయంత్రం తుర్కపల్లి పీహెచ్సీ ఎదుట నిరసనకు దిగాడు. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. తుర్కపల్లి మండలం వాసాలమర్రి గ్రామానికి చెందిన తొలిచుక్క అంజయ్య కాలుకు మూడు రోజుల క్రితం ఇనుప చువ్వ గుచ్చుకోగా.. చికిత్స నిమిత్తం స్థానిక పీహెచ్సీకి వచ్చాడు. పీహెచ్సీ డాక్టర్ రుచిరారెడ్డి సూచన మేరకు స్టాఫ్ నర్సు రజిత అంజయ్యకు ఇంజెక్షన్తో పాటు మందులు ఇచ్చింది. ఇంటికి వెళ్లిన అనంతరం అంజయ్య కాలుకు ఇన్ఫెక్షన్ కావడం, తీవ్ర నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు మందులను చూడగా కాలం చెల్లినట్లు గుర్తించారు. దీంతో అంజయ్య శనివారం సాయంత్రం పీహెచ్సీ ఎదుట ఆందోళన చేపట్టాడు. ఈ ఘటనపై డాక్టర్ రుచిరారెడ్డి స్పందిస్తూ.. స్టాఫ్ నర్సు రజిత, ఫార్మసిస్ట్ మహేశ్వరిపై విచారణ జరిగి తగిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ విషయంపై డీఎంహెచ్ఓకు నివేదిక అందజేస్తామని ఆమె తెలిపారు. -
పుస్తెలతాడు చోరీకి యత్నం.. దొంగకు దేహశుద్ధి
నార్కట్పల్లి: పత్తి చేను వద్దకు వెళ్తున్న మహిళ మెడలోని పుస్తెలతాడును గుర్తుతెలియని యువకుడు అపహరించేందుకు యత్నించగా గ్రామస్తులు అతడిని పట్టుకొని చితకబాది పోలీసులకు అప్పజెప్పారు. ఈ ఘటన శనివారం నార్కట్పల్లి మండలం దాసరిగూడెం గ్రామ శివారులో జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. దాసరిగూడెం గ్రామానికి చెందిన ఉప్పల సునీత శనివారం ఉదయం 11గంటల సమయంలో తమ పత్తి చేను వద్దకు వెళ్తోంది. అదే సమయంలో అటుగా బైక్పై వచ్చిన గుర్తుతెలియని యువకుడు బైక్ను కొద్దిదూరంలో ఆపి సునీత వద్దకు నడుచుకుంటూ వచ్చాడు. ఇక్కడ గుంట తంగడి ఆకు దొరుకుతదా అంటూ మాటల్లో పెట్టి ఆమె మెడలోని పుస్తెలతాడు లాక్కోని పారిపోబోయాడు. సునీత అతడితో పెనుగులాడి కేకలు వేయడంతో అటుగా కారులో వెళ్తున్న వారు వచ్చి దొంగను పట్టుకున్నారు. గ్రామస్తులకు సమాచారం తెలియడంతో దొంగను చితకబాది పోలీసులకు సమాచారం ఇచ్చారు. నార్కట్పల్లి ఎస్ఐ క్రాంతికుమార్ తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని దొంగను అరెస్ట్ చేశారు. పోలీసులకు అప్పగించిన గ్రామస్తులు దాసరిగూడెం శివారులో ఘటన -
నిజాయితీ చాటుకున్న ఆటో డ్రైవర్
నల్లగొండ: ఆటోలో ప్రయాణికురాలు మర్చిపోయిన బ్యాగును పోలీసులకు అప్పగించి నిజాయితీ చాటుకున్నాడు ఓ ఆటో డ్రైవర్. టూటౌన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ నుంచి శనివారం ఆటోలో మిర్యాలగూడకు బయల్దేరిన నెమ్మాని సంధ్య తన గమ్యస్థానం రాగానే ఆటోలో ల్యాప్టాప్, రూ.1500 నగదు మర్చిపోయి వెళ్లిపోయింది. ఆటో డ్రైవర్ ఎండీ లతీఫ్ బ్యాగును గమనించి నల్లగొండ టూటౌన్ పోలీస్ స్టేషన్లో వాటిని అప్పగించాడు. పోలీసులు విచారణ చేసి సంధ్యను పోలీస్ స్టేషన్కు పిలిపించి ఆమెకు ల్యాప్టాప్, రూ.1500 నగదు అప్పగించి ఆటో డ్రైవర్ లతీఫ్ను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ సైదులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.


