డ్రగ్స్‌పై వినూత్నంగా అవగాహన | - | Sakshi
Sakshi News home page

డ్రగ్స్‌పై వినూత్నంగా అవగాహన

Mar 30 2026 7:24 AM | Updated on Mar 30 2026 7:24 AM

కోదాడ : మోతె మండల పరిధిలోని మామిళ్లగూడెంలో ఆదివారం జరిగిన వారాంతపు సంతలో సామాజిక కార్యకర్త, తెలుగు ఉపాధ్యాయుడు రాచకొండ ప్రభాకర్‌ బ్రాహ్మణుడి వేషధారణలో ఉగాది పంచాంగం చెబుతూ గంజాయి, డ్రగ్స్‌, మత్తు పదార్థాలకు బానిసలు కావొద్దని వినూత్నంగా అవగాహన కల్పిచారు. మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటే సమాజంలో గౌరవం, మర్యాదలు పెరుగుతాయని అన్నారు. రోడ్డు భద్రతా నియమాలు పాటించకపోతే తీవ్ర ప్రమాదాలు జరిగి కుటుంబాలు రోడ్డు న పడుతాయన్నారు. కార్యక్రమంలో వెంకటనా రాయణ, నరేష్‌, జయకృష్ణ, రవి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement