మఠంపల్లి : మండలంలోని రఘునాథపాలెంలో రామనవమి వేడుకలను పురస్కరించుకుని నిర్వహిస్తున్న జాతీయ స్థాయి ఎడ్ల పందేలు ఆదివారం రెండోరోజూ రసవత్తరంగా సాగాయి. సూర్యాపేట, నల్లగొండ, ఖమ్మంతో పాటు ఏపీలోని గుంటూరు, ప్రకాశం జిల్లాలకు చెందిన ఒంగోలు గిత్తలు ఈ పోటీల్లో పాల్గొని బండ లాగాయి. మరో మూడురోజుల పాటు ఈ పోటీలు జరగనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కమనీనరసింహారావు, మాజీ ఎంపీపీ తిరుమలశెట్టి అప్పయ్య, మాజీ పీఏసీఎస్ చైర్మన్ రామచంద్రయ్య, ఉప సర్పంచ్ శ్రీనివాసరెడ్డి, సయ్యద్ నిజాం, బొబ్బా రవీందర్రెడ్డి, నాగుల్మీరా, నాయుడు ఆంజనేయులు, మాజీ ఎంపీటీసీ మేడి సామేలు, దస్తగిరి, సంకలమద్ది అప్పిరెడ్డి పాల్గొన్నారు.


