తల్లిదండ్రులు మందలించారని యువకుడి ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

తల్లిదండ్రులు మందలించారని యువకుడి ఆత్మహత్య

Mar 30 2026 7:24 AM | Updated on Mar 30 2026 7:24 AM

నకిరేకల్‌ : తల్లిదండ్రులు మందలించారని మనస్తాపంతో యువకుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన నకిరేకల్‌ మున్సిపాలిటీ పరిధిలోని బాబాసాహెబ్‌గూడెంలో ఆదివారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాబాసాహెబ్‌గూడేనికి చెందిన నిమ్మల నర్సయ్య తన భార్య, కుమారుడు అక్షయ్‌(28)తో కలిసి ముంబైలో పాల వ్యాపారం చేసుకుంటూ అక్కడే నివసిస్తున్నారు. అక్షయ్‌ జల్సాలకు అలవాటుపడి ఏ పనిచేయకుండా స్నేహితులతో కలిసి తిరుగుతుండడంతో తల్లిదండ్రులు మందలించారు. దీంతో అక్షయ్‌ ముంబై నుంచి శనివారం ఉదయం స్వగ్రామం బాబాసాహెబ్‌గూడేనికి వచ్చాడు. మధ్యాహ్నం 3గంటల సమయంలో తల్లిదండ్రులకు ఫోన్‌చేసి డబ్బులు కావాలని అడిగాడు. డబ్బులు లేవని, ముంబై వచ్చి ఏదైనా పని చూసుకోవాలని తల్లిదండ్రులు అక్షయ్‌కు సూచించారు. దీంతో మనస్తాపానికి గురైన అక్షయ్‌ శనివారం రాత్రి ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. చుట్టుపక్కల వారు గమనించి మృతుడి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. ఆదివారం మృతుడి తండ్రి నిమ్మల నర్సయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు సీఐ హరిబాబు తెలిపారు.

ట్రాక్టర్‌ను ఢీకొని ఒకరు మృతి

కొండమల్లేపల్లి : బైక్‌పై వెళ్తూ ట్రాక్టర్‌ను ఢీకొని వ్యక్తి మృతిచెందాడు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన దేవరకొండ మండలం బొడ్డుపల్లి గ్రామ శివారులో ఆదివారం రాత్రి జరిగింది. ఎస్‌ఐ నారాయణరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. డిండి మండలానికి చెందిన మాచర్ల రాములు(52) తన భార్య తిరుపతమ్మతో కలిసి పని నిమిత్తం ఆదివారం బైక్‌పై దేవరకొండకు వచ్చారు. రాత్రి తిరిగి స్వగ్రామానికి బయల్దేరారు. మార్గమధ్యలో దేవరకొండ మండలం బొడ్డుపల్లి గ్రామ శివారుకు రాగానే రోడ్డు పక్కన ఆగి ఉన్న ట్రాక్టర్‌ను ఢీకొట్టారు. రాములు తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. అతడి భార్య తిరుపతమ్మకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని 108 వాహనంలో తిరుపతమ్మను దేవరకొండ ప్రభుత్య ఆస్పత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement