breaking news
Health
-
గర్భంలో పడినప్పుడే..ఆయుర్ధాయం ఖరారు..!
మనిషి ఆయుర్దాయంపై ఎన్నో పరిశోధనలు చేస్తూనే ఉన్నారు శాస్త్రవేత్తలు. దాని సాయంతో వృద్ధాప్యాన్ని, పలు రోగాల బారి నుంచి మనిషిని రక్షించి.. దీర్ఘాయువుని ప్రసాదించే దిశగా ఏళ్లుగా ప్రయోగాలు, పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. దానికి ఓ మార్గం దొరికేలా సరికొత్త విషయం వెలుగులోకి వచ్చింది తాజా పరిశోధనల్లో. ఒకరకంగా ఇది మనిషి జీవితకాలంపై సరికొత్త ఆశాకిరణం అందించిందని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. ఇంతకీ మనిషికి దీర్ఘాయువు సాధ్యమేనా అంటే..అమెరికా శాస్త్రవేత్తల తాజా పరిశోధనల ప్రకారం పుట్టకకు ముందు అనుభవించే వాతావరణం ఆయుర్ధాయంపై ప్రభావం చూపగలదనే విషయం నిర్థారణ అయ్యింది. అంటే గర్భధారణ సమయంలో పిండ దశలో ఉండగానే ఆయుర్థాయం నిర్ణయింపబడి ఉంటుందంట. ఆ సమయంలో ఆ పిండానికి ఆరోగ్యం నుంచి వృద్ధాప్య దశలు ఎలా ఉంటాయి..పైగా ఎంతవరకు జీవించగలడనేది కూడా నిర్థారించొచ్చని ఈ కొత్త పరిశోధన వెల్లడించింది. ఈ పరిశోధన నేచర్ హెల్త్లో ప్రచురితమైంది. గర్భధారణ సమయంలో పిండ దశలో ఉన్నప్పుడే ఆ జీవి బాల్యం, జీవిత కాల ఆరోగ్యం, స్థితిస్థాపకత తదితరాలతో అతడి దీర్ఘాయువుని తెలుసుకోగలమని అంటున్నారు. సింపుల్గా చెప్పాలంటే వాటి సాయంతో అతడి ఆయువుని నిర్ణయించొచ్చని అన్నారు. ఈ మేరకు శాస్త్రవేత్తలు PROSPER అనే ప్రసవ పూర్వం పరిశోధనపేరుతో అధ్యయనం మొదలు పెట్టినట్లు వెల్లడించారు. గర్భంలోని పరిస్థితులు జీవితాంతం కొనసాగే విధంగా శరీర అభివృద్ధిని ప్రభావితం చేస్తాయని అధ్యయనంలో గుర్తించారు. జన్యువులు ముఖ్యమైనవి అయినప్పటికీ, దీర్ఘకాలిక ఆరోగ్యం, స్థితి స్థాపకతన నిర్ణయించడంలో గర్భస్థ వాతావరణం కూడా గణనీయమైన పాత్ర పోషిస్తుందని పరిశోధనలు పేర్కొన్నాయని అన్నారు. గర్భధారణ సమయంలో తల్లి పోషణ, ఒత్తిడి స్థాయిలు, మొత్తం ఆరోగ్యం వంటి అంశాలు పుట్టుకకు మందు శరీర అవయవాలు, వ్యవస్థలు ఎలా అభివృద్ధి చెందుతాయనేదాన్ని ప్రభావితం చేస్తుందని చెబుతున్నారు పరిశోధకులు. అలాగని పుట్టకకు మందే భవిష్యత్తు నిర్ణయించబడిపోతుందని భయపడిపోవాల్సిన అవసరం కూడా లేదంటున్నారు. జననం తర్వాత కూడా సమతుల్య ఆహారం, క్రమం తప్పని వ్యాయామం, మంచి నిద్ర, ధూమపానానికి దూరంగా ఉండటం వంటి ఆరోగ్యకరమై జీవనశైలితో ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చని, వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చని చెబుతున్నారు. అయితే ఈ పరిశోధన గర్భధారణ సమయంలో పరిస్థితులను మెరుగుపరిస్తే గనుక ఒక వ్యక్తి జీవితకాల ఆరోగ్యానికి ప్రయోజనం చేకూర్చగలదని నిరూపించిందన్నారు. ఇది ఒకరకంగా తల్లి ఆరోగ్యం, ప్రసవ పూర్వ సంరక్షణ తదితరాలపై దృష్టి పెట్టేలనే అంశం గురించి నొక్కి చెప్పిందన్నారు పరిశోధకులు.(చదవండి: ఆ అలవాట్లతో 15 కిలోలు బరువు..! 5 ఏళ్ల పాటు అలానే..) -
హెర్నియా ఆపరేషన్కి రూ. 11 లక్షలా? నెటిజన్లు గగ్గోలు
సాక్షి,ముంబై: ఇప్పటిదాకామనం అమెరికా వైద్య ఖర్చులు గురించిన కథనాలు చదివాం. ఇపుడు మన దేశంలోనే ఒక మామూలు ఆపరేషన్ కోసం ఏకంగా రూ. 11.04 లక్షల బిల్లు గురించి తెలుసుకుంటూ ఔరా అనాల్సిందే. భారతదేశంలోని మెట్రో నగరాల్లో సామాన్యుడికి వైద్యం ఎంత భారంగా మారుతుందో, అలాగే మెడికల్ బిల్లింగ్ విధానంలో పారదర్శకత ఎంత అవసరమో స్పష్టం చేస్తోంది. ముంబైలోని ఒక ప్రముఖ ఆసుపత్రిలో సాధారణ హెర్నియా శస్త్రచికిత్స (Hernia Surgery) చేయించుకున్న ఒక రోగికి ఏకంగా రూ. 11.04 లక్షల బిల్లు రావడం సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. 'నిఖిల్ ఝా' అనే ఎక్స్ యూజర్ షేర్ చేసిన వివరాల ప్రకారం ఫాలోవర్ ఒకరు ముంబైలో 'ఇంగువినల్ హెర్నియా' సర్జరీ చేయించుకున్నారని అంటూ దానికి సంబంధించిన ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఇతర వివరాలను పంచుకున్నారు. కేవలం నాలుగు రోజులు(జూలై 6 నుంచి 10 వరకు)ఆసుపత్రిలో ఇన్పేషెంట్గా ఉన్నారు. ఈ ఆపరేషన్ కోసం ఆసుపత్రి బిల్లు అక్షరాలా రూ. 11,04,100. ఇందులో ఇన్సూరెన్స్ సెటిల్మెంట్: రూ. 4,64,000 మాత్రమే క్లెయిమ్ వచ్చింది. దీంతో అవాక్కవ్వడం వారి వంతైంది.ఒక చిన్న హెర్నియా సర్జరీకే ఇంత ఖర్చయితే, పెద్ద పెద్ద సర్జరీల పరిస్థితి ఏంటి? ముంబైలో ఆసుపత్రిలో చేరడం నేరమా? అంటూ ప్రశ్నించారు. నాణ్యమైన వైద్యం కేవలం ధనవంతులకు మాత్రమేనా? అటూ నిఖిల్ ఝా సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. ఇదీ చదవండి: మూడో పెళ్లి : ఫత్వా, లవ్ జిహాద్ ఆరోపణలపై స్పందించిన ఆమీర్ A follower messaged us yesterday about their hernia surgery at a top Mumbai hospital.The total cost=11.04LYes, 11.04L for a hernia surgery,We were shocked and stunned by the cost,If this is the cost for a small hernia surgery,What will be the cost for bigger surgeries?… pic.twitter.com/RUfAOy5UVL— Nikhil Jha (@NIKHILLJHA) July 15, 2026నెటిజన్లు ఏమన్నారంటే? ఈ పోస్ట్పై నెటిజన్లు, వైద్యులు రకరకాలుగా స్పందించారను. ఒక వైద్యుడు స్పందిస్తూ, "హెర్నియా సర్జరీకి రూ. 11 లక్షలా? ఇందులో ఏమైనా హెలికాప్టర్ పికప్ అండ్ డ్రాప్ సౌకర్యం కూడా ఉందా?" అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. సూరత్లో రూ. 1.5 లక్షలకే అయ్యే ఈ సర్జరీకి, ముంబైలో రూ. 11 లక్షలు వసూలు చేయడంపై ఒకరు మండిపడ్డారు. మెట్రో నగరాల్లో పెరిగిపోతున్న వైద్య ఖర్చుల వల్ల అందరి హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంలు కూడా పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు కేవలం ఈ ఒక్క మెసేజ్ చూసి నిర్ధారణకు రాలేమని, రోగికి ఏ రకమైన రూమ్ కేటగిరీ ఇచ్చారు? ఏమైనా కాంప్లికేషన్స్ వచ్చి ఐసీయూలో ఉంచారా? వంటి వివరాలు 'డిశ్చార్జ్ సమ్మరీ' ,'ఆపరేషన్ నోట్స్' చూస్తేనే క్లారిటీ వస్తుందని మరికొందరు అభిప్రాయపడ్డారు.ఇదీ చదవండి: 18 ఏళ్ల ఎన్ఆర్ఐ జీవితం నుంచి : మెటా టెకీ ఎమోషనల్ పోస్ట్ వైరల్ -
ఆ అలవాట్లతో 15 కిలోలు బరువు..! 5 ఏళ్ల పాటు అలానే..
వెయిట్లాస్ జర్నీలో చాలామంది సునాయాసంగా బరువు తగ్గే ప్రయత్నం చేస్తారు. ఆ క్రమంలో విజయం సాధిస్తారు కూడా. అయితే ఆ బరువునే మెయింటైన్ చేయడం అతి పెద్ద సవాలు. మళ్లీ యథాస్థితికి రాకుండా..అంతే స్మార్ట్గా మెయింటైన్ చేయడమే అత్యంత ముఖ్యం అని అంటోంది ఇషితా లంబా అనే మహిళ. చాలామంది బరువు తగ్గగలరు అంతే..కొందరే దాన్ని నిలబెట్టుకోగలరు అంటూ ఇన్స్టాగ్రామ్ పోస్ట్తో తన వెయిట్ లాస్ అనుభవాలను షేర్ చేసుకున్నారు. మరి అవేంటో చూసేద్దామా..!.తాను ఎలాంటి క్రాష్డైట్లపై ఆధారపడకుండా నిలకడగా 20 వాస్తవిక అలవాట్లను పాటించి సునాయాసంగా 15 కిలోలు వరకు బరువు తగ్గినట్లు చెప్పుకొచ్చారు. అయితే దాన్ని ఐదేళ్ల పాటు నిలకడగా నిలబెట్టుకున్నానని చెప్పారు. ఈ వెయిట్లాస్ జర్నీలో బరువు తగ్గడం పెద్ద సమస్య కాదని తగ్గిన బరువుని మెయింటైన్ చేయడమే అతిపెద్ద సవాలని పేర్కొంది. అందుకోసం తాను ఏం చేసిందో సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. అవేంటంటే..అతిగా తిన్న తర్వాత పస్తులుండాల్సిన పనిలేదు..ఒక్కోసారి ఎక్కువగా తినేస్తాం. దాంతో సాధారణంగా మరుసటి రోజు పస్తులుండే ప్రయత్నం చేస్తుంటారు. అయితే తాను అలా చేయనని, తన సాధారణ దినచర్యకు తిరిగి వచ్చేస్తానంటోంది. అంటే ఇదివరకటి సాధారణ ఆహారపు అలవాట్లను యథావిధిగా ఫాలో అయితే చాలు అని అంటోంది. అంతేగాదు తన ప్రతి భోజనం తర్వాత రెండు వేల అడుగులు వేస్తానని చెబుతోంది. కేలరీల పరిమితి కంటే ప్రోటీన్కు ప్రాముఖ్యతన ఇస్తానని నొక్కి చెప్పారు. సాధ్యమైనంత వరకు తక్కువ తినడం కంటే ప్రోటీన్ లక్ష్యాన్ని చేరుకోవడంపైనే ఫోకస్ పెడతానని తెలిపింది. అంతేగాదు తన శరీర బరువులో ప్రతి కిలోగ్రాముకు 1.2-1.6 గ్రాముల ప్రోటీన్ ఉండేలా చూసుకుంటానని అన్నారు. బరువులు ఎత్తడం, తగినంత నీరు తీసుకోవడం..వ్యాయామం కోసం ఇషితా తాను వారానికి నాలుగు సార్లు బరువులు ఎత్తుతానని, వారానికి రెండుసార్లు కార్డియో చేస్తానని పంచుకున్నారు. దాంతోపాటు వాలుగా నడవడం, సైక్లింగ్ లేదా ఈత కొట్టడం వంటివి చేస్తానని అన్నారు. అలాగే రోజుకు మూడు నుంచి నాలుగు లీటర్ల నీరు తాగడానికి ప్రయత్నిస్తానని చెప్పుకొచ్చింది. అలాగే రాత్రి భోజనం తర్వాత సోంపు నీరు కూడా తాగుతానని చెప్పింది. ఇఇ జీర్ణక్రియకు సహాయపడుతుందని, మంచి నిద్ర పట్టేలా చేస్తుందని వెల్లడించింది. అలాగే వ్యాయామం చేయాలని అనిపించని రోజున దానికి బదులుగా మ్యూజిక్ వింటూ వాక్ చేస్తుంటానని అన్నారామె. తాను ఇప్పటికీ పిజ్జా, డెజర్ట్లు, బర్గర్లు తింటానని, అయితే ప్రతిరోజూ కాదని చెప్పుకొచ్చింది. ఒకవేళ డ్రింక్ చేయాలనిపిస్తే ముందుగా భోజనం చేసి, చక్కెర కలిపిన వాటికి ప్రత్యామ్నాయంగా ఎంచుకుంటానని చెప్పింది. అలాగే స్వీట్స్ తినాలనిపించినప్పుడూ ప్రోటీన్ బార్లు లేదా ఆరోగ్యకరమైన కుకీలను, ఉప్పగా తినాలనిపించినప్పుడు ఇంట్లో తయారుచేసిన వేయించిన మఖానాను తీసుకుంటానని చెప్పుకొచ్చింది. నిలకడగా దినచర్యను పాటించాలంటే..నచ్చిన ఆహారాలను తినడమే మంచిదని అంటోంది. ప్రయాణాలు చేసేటప్పడు నడుస్తానని, వీలైనప్పుడల్లా మెట్లు ఎక్కుతానని చెప్పుకొచ్చింది. ఒక్కోసారి వ్యాయామం చేసే తీరిక దొరక్కపోతే..కనీసం 30 నిమిషాలైనా వ్యాయామం చేసేలా చూస్తానని వెల్లడించింది. అలాగే రోజుకు నాలుగు నుంచి ఐదుసార్లు కొద్దికొద్దిగా ఆహారం తీసుకుంటానని తెలిపింది. చివరగా బరువు తగ్గడం అంటే తీవ్రమైన డైటింగ్లు చేయడం కాదని..దీర్ఘకాలం పాటు కొనసాగించ గల అలవాట్లనే ఎంచుకుంటే ఈజీగా బరువు తగ్గగలరని అన్నారు.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: మామ్ వెయిట్లాస్ స్టోరీ..! 103 కిలోలు నుంచి 71 కిలోలకు..) -
వయసు పైబడితే..నీళ్లు తాగేటప్పుడు జర భద్రం..!
ఒక అరవై ఏళ్లుపై బడ్డ సీనియర్ సిటిజన్ రాత్రి 11:00 గంటలకు ఒక గ్లాసు నీళ్లు తాగుతూ ఊపిరాడక అవస్థ పడ్డాడు. సకాలంలో ఆస్పత్రికి తరలించినప్పటికీ..ఆయన మరణించారు. ఇలాంటివి ఇటీవల కాలంలో చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. అందుకు గల కారణం, ఎలాంటి జాగ్రత్తు తీసుకుంటే మంచిది వంటి వాటి గురించి సవివరంగా తెలుసుకుందామా.!.ఇలాంటి ఘటనలు ఒక ముఖ్యమైన విషయాన్ని తెలియజేస్తుంటాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. అందుకే వయసు పైబడిన వారు జీవితంలో ఏ పని చేసినా, ముఖ్యంగా ఈ రెండు విషయాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. అవేంటంటే..పడకుండా జాగ్రత్తపడటం (Prevent Falling)గొంతుకు అడ్డం పడకుండా (దండుపోకుండా) చూసుకోవడం (Prevent Choking)60 ఏళ్లు దాటితే..ఈ అలవాట్లను అలవర్చుకోవాలి..నీళ్లు తాగేటప్పుడు:మిగతా పనులన్నీ పక్కన పెట్టి, పూర్తి శ్రద్ధతో నీటిని నెమ్మదిగా, జాగ్రత్తగా తాగాలి. వృద్ధులలో గొంతు మింగడానికి సహాయపడే కండరాలు బలహీనపడటం వల్ల గొంతుకు అడ్డం పడే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని హెచ్చిరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. అలాగే నీరు, పాలు, సూప్ వంటి ద్రవపదార్థాలు గొంతుకు అడ్డం పడటం వల్ల వృద్ధులలో 'ఆస్పిరేషన్ న్యుమోనియా' (Aspiration Pneumonia) వచ్చే అవకాశం చాలా ఎక్కువ.ఇంట్లో వృద్ధులు ఉంటే గమనించాల్సిన ముఖ్య విషయాలు:స్ట్రా (Straw) ఉపయోగించండి: వీలైనంత వరకు నీళ్లు తాగడానికి స్ట్రా ఉపయోగించండి. అలాగే నీటిని మింగేటప్పుడు తల కొద్దిగా దించి (క్రిందికి వంచి) మింగాలి.చిక్కటి సూప్లు ఇవ్వండి: పల్చటి సూప్ల కంటే చిక్కటి (Thick) సూప్లు ఇవ్వడం మంచిది. పల్చటి ద్రవాలు నోట్లోకి వేగంగా ప్రవహిస్తాయి, దీనివల్ల శ్వాస తీసుకోవడంలో స్వల్ప తేడా వచ్చినా వెంటనే గొంతుకు అడ్డం పడతాయి.నోట్లో ఆహారం ఉన్నప్పుడు నీళ్లు వద్దు: నోట్లో ఘనపదార్థం (అన్నం లేదా టిఫిన్) నములుతున్నప్పుడు లేదా నోట్లో ఆహారం ఉన్నప్పుడు ద్రవపదార్థాలు తాగకూడదు. నీరు నోటిలో ఎక్కువసేపు ఉండిపోతే, అది తెలియకుండానే శ్వాసనాళంలోకి (Trachea) వెళ్లిపోయే ప్రమాదం ఉంది.మాట్లాడటం లేదా తల తిప్పడం చేయకూడదు: నోట్లో అన్నం లేదా నీళ్లు ఉన్నప్పుడు అస్సలు మాట్లాడకూడదు, అలాగే అటు ఇటు తల తిప్పకూడదు.శారీరక బలం తక్కువగా ఉంటుంది: యువకులకు ఉన్నంత శారీరక శక్తి, తట్టుకునే సామర్థ్యం వృద్ధులకు ఉండవు.ఒకవేళ ఏదైనా ద్రవం లేదా ఆహారం శ్వాసనాళంలోకి వెళ్లి, దాన్ని బయటకు దగ్గడానికి ప్రయత్నించినప్పుడు ముఖం ఎర్రగా మారిపోతుంది. అలాగే రక్తపోటు (Blood Pressure) అకస్మాత్తుగా పెరుగుతుంది. కొన్నిసార్లు ఈ ఊపిరి ఆడకపోవడం ప్రాణాంతకం కావచ్చు. అందువల్ల వయసు పెరుగుతున్న కొద్దీ నీటిని నెమ్మదిగా, శ్రద్ధగా, జాగ్రత్తగా తాగడం అలవాటు చేసుకోవాలని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. (చదవండి: Sanjay Dutt: వైరల్ ఫ్లూలా భావించి..కేన్సర్తో పోరాడా..!) -
వైరల్ ఫ్లూలా భావించి..ఆ వ్యాధిని జయించా..!: సంజయ్ దత్
బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ విలక్షణమైన నటనకు పేరుగాంచిన హీరో. సంజు బాబాగా పిలిచే ఆయన తన నాలుగు దశాబ్దాల సినీ కెరీర్లో ఎన్నో అవార్డులు సొంతం చేసుకున్నారు. ఆయన స్టేజ్ 4 లంగ్ కేన్సర్ని జయించిన వారియర్ కూడా. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో సంజయ్ దత్ స్వయంగా తాను ఈ కేన్సర్ని ఎలా జయించానో వెల్లడించారు. అంతేగాదు అందరూ ఇలానే పోరాడాలంటూ కేన్సర్ బాధితుల్లో స్ఫూర్తి నింపే ప్రయత్నం చేశారు. సంజయ్ దత్కు 2020 ఆగస్టులో స్టేజ్ 4 ఊపిరితిత్తుల కేన్సర్ నిర్థారణ అయింది. ఆయనకు ఊపిరితిత్తుల్లో ద్రవంచ చేరడంతో శ్వాస తీసుకోవడలో చాలా ఇబ్బందిపడ్డారు. ఆయన ముంబైలో చికిత్స తీసుకున్నారు. ఆ తర్వాత అక్టోబర్ 2020లోనే కేన్సర్ నుంచి బయటపడ్డారు కూడా. దాంతో ఒక్కసారిగా కుటంబసభ్యులు, అభిమానులు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఈ కేన్సర్ని జయించడంలో తను ఎలాంటి మానసిక ధైర్యంతో ఉన్నానో పంచుకున్నారు. తాను ఆ సమయంలో కేన్సర్ని వైరల్ ఫ్లూ వ్యాధిలా చూశానని, అన్నారు. ఎప్పుడూ మనం పోరాట యోధులుగా ఉండాలే తప్ప.. అంత సులభంగా వదిలేయకూడదని అన్నారు. అనారోగ్య సమస్య ఎలాంటిదైనా ధైర్యంగా పోరాడలని అన్నారు. కేన్సర్ బాధితులు ఎవరైనా..ఆ వ్యాధికి లొంగిపోకూడదని, బదులుగా ఇతర అనారోగ్యాల మాదరిగా చూడాలని హితవు పలికారు. నిజానికి అది కష్టమని తనకు తెలుసని..అయినప్పటికీ మనం నవ్వుతూనే పోరాడలన్నారు. కేన్సర్ నుంచి కోలుకుంటున్నప్పుడూ ఎదురయ్యే శారీరక బాధలు గురించి తనకు తెలుసన్నారు. ముఖ్యంగా మహిళలు ఈ విషయంలో ఎక్కువ ఇబ్బంది పడతారని అన్నారు. అదే సమయంలో తనకు సూదులంటే ఎంత భయమో కూడా చెప్పారు. తను యోగా లేదా ధ్యానం వంటివి చేయనని, కానీ జిమ్లో వర్కౌట్లు చేస్తానని చెప్పారు. అలాగే తను శివ భక్తుడనని, తనకు శివుడే సర్వస్వం అని చెప్పారు. చివరగా ఆయన జీవితంలో ఎలాంటి పరిస్థితుల్లోనైనా పోరాడాల్సిందేనని అన్నారు. మనం పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు పోరాడుతూనే ఉంటామని అన్నారు. పుట్టినప్పుడు మొదటగా ఆక్సిజన్ కోసం పోరాడతాం, ఆ తర్వాత ఆరోగ్యం లేదా వ్యక్తిగత సమస్యల కోసం పోరాడతామని అన్నారు. ఒక్కటి గుర్తించుకోండి సమస్యను ఎదుర్కోండి తప్ప పారిపోకండని పిలుపునిచ్చారు. ఒక్కసారిగా సమస్యను ఎదుర్కోవడం మొదలుపెడితే..ఆటోమేటిగ్గా పరిష్కరించుకోవడం ప్రారంభిస్తారని అన్నారు. అందుకే ఏ సమస్యనైనా ఎదుర్కోండి తప్ప పారిపోయే ప్రయత్నం చేయకండి దానివల్ల సమస్య మరింత ఎక్కువవుతుంతే గానీ దానికి పులిస్టాప్ పడదంటూ తన సంభాషణను ముగించారు. (చదవండి: ప్రేమ కోసం సైకిల్పై భారత్ నుంచి స్వీడన్కు..! ట్విస్ట్ ఏంటంటే..) -
మామ్ వెయిట్లాస్ స్టోరీ..! 103 కిలోలు నుంచి 71 కిలోలకు..
వెయిట్లాస్ ఒక్కోక్కరూ ఒక్కో విధానం అనుసరిస్తూ బరువు తగ్గుతారు. బరువు తగ్గించుకోవడమే కాదు దాన్ని అదుపులో ఉంచుకునేలా మెయింటైన్ చేయడమే అత్యంత ముఖ్యం అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. శరీరానికి అనుగుణంగా, నిలకడైన జీవనశైలితో నిధానంగా బరువు తగ్గడం అన్ని విధాల మేలు అని అందరికీ తెలిసిందే. ఆ విధంగానే ఈ ఇన్ఫ్లుయెన్సర్ మామ్ అనుసరించి ఏకంగా 32 కిలోలు తగ్గింది. అంతేగాదు అందుకోసం తాను ఏమి అనుసరించిందో కూడా ఇన్స్టాగ్రామ్ వేదికగా షేర్ చసుకుంది. మరి అవేంటో చూద్దామా.!.శాన్ డియాగోకు చెందిన ఇన్ఫ్లుయెన్సర్, తానియా అనే పిల్లల తల్లి వెయిట్లాస్ జర్నీ ఇది. ఆమె 103 కిలోల నుంచి 71 కిలోలకు తగ్గిన జర్నీని షేర్ చేసుకుంది. అంతలా 32 కిలోలు తగ్గడానికి సులభమైన నిలకడైన అలవాట్లే కారణమని అంటోంది. తాను ప్రధానంగా ఆరోగ్యకరమైన ఆహారం తినడం, వ్యాయామం చేయడంపై దృష్టిసారించానని అంటోంది. మూడేళ్లలో దీన్ని సాధించానని పేర్కొంది. తాను వెయిట్ట్రైనింగ్, యోగ ద్వారా బరువు తగ్గినట్లు పోస్ట్లో తెలిపింది. ఇంట్లోనే సులభంగా బరువు తగ్గాలంటే ఐదు పనులు చేయాలని వెల్లడించింది. అవేంటంటే..ప్రోటీన్రోజుకు 3 సార్లు కనీసం 30 గ్రాముల ప్రోటీన్ తీసుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించింది. ప్రాసెస్ చేసిన ప్రోటీన్ల కంటే..సహజసిద్ధమైన వాటికే ప్రాధాన్యత ఇచ్చానని తెలిపింది. బరువు తగ్గాలనుకుంటే రోజుకి శరీరానికి తగినంత ప్రోటీన్ మస్ట్ అని అంటోందామె.వ్యాయామంలో సౌలభ్యం..ఒక తల్లిగా, ఖచ్చితమైన' వ్యాయామ సమయం కోసం వెతకడం మానేశాను. కొన్ని రోజులు ఉదయం 5 గంటలకు, కొన్ని రోజులు నా బిడ్డ నిద్రపోతున్నప్పుడు మధ్యాహ్నం 3 గంటలకు, మరికొన్ని రోజులు అందరూ నిద్రపోయిన తర్వాత రాత్రి 9 గంటలకు కూడా వ్యాయామం చేశానని ఆమె చెప్పుకొచ్చింది. తన ఉద్దేశ్యంలో క్రమంతప్పకుండా చేయగలిగే సమయమే ఉత్తమమైన వ్యాయామ సమయం అని చెబుతోందామె. కచ్చితమైన షెడ్యూల్ అంటూ టై వేస్ట చేయొద్దని హెచ్చరించింది. జీవితానుగుణంగా కదలికలు ఉండేలా చూసుకోవడమే ముఖ్యం అని అంటోందామె. బరువులు ఎత్తడంతమకు సాధ్యమైనంత బరువును ఎత్తాలి. వారానికి 3 సార్లు బరువులు ఎత్తాలి. తక్కువ బరువుతో ప్రారంభించండి, క్రమబద్ధతను పెంచుకోమని చెబుతోంది. అలాగే పూర్తి శరీర వ్యాయామాలపై దృష్టి పెట్టండి, నెమ్మదిగా బరువులను పెంచుతూ పోవాలని సూచించింది.శరీరానికి తగినంత నీరు..హైడ్రేటెడ్గా ఉన్నారని నిర్ధారించుకోండి. రీర బరువులో సగం ఔన్సుల నీటిని తాగాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపింది.ఉదాహరణకు:బరువు 120 పౌండ్లు అయితే, రోజుకు 60 ఔన్సులు తాగాలని లక్ష్యంగా పెట్టుకోండి. హైడ్రేటెడ్గా ఉండటం శక్తికి, కోలుకోవడానికి మద్దతు ఇస్తుంది, అలాగు అత్యుత్తమ పనితీరును కనబరచడానికి సహాయపడుతుంది.నిద్రవీలైనంత నాణ్యమైన నిద్రను లక్ష్యంగా పెట్టుకోండి. ప్రసవానంతర దశలో ఉంటే, కొన్ని రాత్రులు పరిపూర్ణంగా ఉండకపోవచ్చని అయినప్పటికీ ఫర్వాలేదని అంటోందామె. అలాంటి తల్లులు వీలైనప్పుడల్లా విశ్రాంతికి ప్రాధాన్యత ఇవ్వండి, ఎందుకంటే కోలుకోవడం, కొవ్వు తగ్గడం, కండరాల నిర్మాణం, మొత్తం ఆరోగ్యం అన్నీ దానిపైనే ఆధారపడి ఉంటాయి.ఇలా కనీసం ఆరు నుంచి 12 వారాల పాటు ప్రయత్నించి చూస్తే..కచ్చితంగా మనలోని మార్పు మనమే స్వయంగా చూస్తామని నమ్మకంగా చెబుతోంది. అంతేగాదు ఇలా క్రమంతప్పకుండా చేస్తే..ఆలోచనా విధానంలో మార్పు తోపాటు శరీరం కూడా బలంగా మారడాన్ని చూస్తామని అంటోంది.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. View this post on Instagram A post shared by TaniaUnplugged | Yoga&More (@taniaunplugged) (చదవండి: అత్యంత క్లిష్టమైన అరుదైన కణితిని విజయవంతంగా తొలగించిన వైద్యులు) -
8 కిలోలు తగ్గిన సోనమ్.. ఇకపైనా ఆహారం తీసుకోకుంటే జరిగేది ఇదే!
విద్యావేత్త, వాతావరణ కార్యకర్త సోనమ్ వాంగ్చుక్ జంతర్ మంతర్ వద్ద చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష బుధవారంతో 17వ రోజుకు చేరుకుంది. ఆయన ‘నీట్’అవకతవకలపై జంతర్ మంతర్ వద్ద నిరసన తెలుపుతున్న ‘కాక్రోచ్ జనతా పార్టీ’కి మద్దతు ప్రకటిస్తూ, జూన్ 29న ఈ నిరాహార దీక్షకు దిగిన సంగతి తెలిసిందే. సుదీర్ఘ ఉవాసం కారణంగా..ఇప్పటికే ఆయన ఏకంగా 8.2 కిలోల బరువు తగ్గి ఆరోగ్యం క్షీణిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఇంతలా సుదీర్ఘ ఉపవాసం కారణంగా శరీరంలో ఏ జరుగుతుంది?, ఎదురయ్యే ఆరోగ్య ప్రమాదాల గురించి సవివరంగా తెలుసుకుందామా.!ఇంతలా వాంగ్చుక్ సుదీర్ఘ ఉపవాసం కొనసాగిస్తే.. కలిగే వైద్యపరమైన ప్రమాదాలపై సర్వత్రా ఆందోళన నెలకొంది. అంతేగాదు ఇప్పటికే ఆయన రక్తంలో గ్లూకోజ్స్థాయిలో 67 mg/dLకి పడిపోగా, ఆయన రక్తపోటు 107/70 mm Hgగా నమోదైంది. ఇలా సుదీర్ఘకాలం ఆహారం తీసుకోవపోవడం ఎలాంటి శారీరక ప్రభావాన్ని చూపిస్తుందో.. విషమిస్తున్న ఆయన ఆరోగ్యమే నిదర్శనం అంటున్నారు వైద్యులు. అదీగాక వాంగ్చుక్ తీవ్రమైన నొప్పితో విలవిలలాడుతున్నట్లు సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. అందుకే ఆయన్ను దీక్ష విరమించమని కోరుతున్న అందుకు ఆయన నిరాకరిస్తున్నట్లు వెల్లడించాయి. శాంతియుత నిరసన రూపంగా ఇలాంటి నిరాహార దీక్షలు ఎంచుకున్నప్పటికీ..దీర్ఘకాలిక ఉపవాసం తీవ్రమైన ఆరోగ్య ప్రమాదాలకు దారితీస్తుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒక వ్యక్తి తగినంత పోషణ లేకుండా ఎంత ఎక్కువ కాలం ఉంటే, అంతకు రెట్టింపుగా ప్రాణాంతక సమస్యలు వచ్చే ప్రమాదం అధికమవుతుందని అంటున్నారు. అసలు అన్ని రోజులు ఆహారం తీసుకోకుంటే ఏం జరుగుతుందంటే..దీర్ఘకాలిక ఉపవాస సమయంలో ఏం జరుగుతుందంటే..శరీరం మొదట శక్తి కోసం నిల్వ ఉన్న గ్లూకోజ్పై ఆధారపడుతుంది. ఈ నిల్వలు అయిపోయిన తర్వాత, అది ఇంధనం కోసం కొవ్వును విచ్ఛిన్నం చేయడం ప్రారంభిస్తుంది. అయితే, ఉపవాసం కొనసాగుతున్న కొద్దీ, శరీరం తన శక్తి అవసరాలను తీర్చడానికి కండరాల ప్రోటీన్ను ఉపయోగించడం ప్రారంభిస్తుంది. దీని ఫలితంగా కండరాలు క్షీణించి బలహీన పడటంతో వేగంగా బరువు తగ్గడం జరుగుతుంది. దీర్ఘకాలిక ఉపవాస సమయంలో, శక్తిని ఆదా చేయడానికి జీవక్రియ కూడా నెమ్మదిస్తుంది. ఫలితంగా ఈ లక్షణాలు అనుభవిస్తారు..అలసట, తీవ్రమైన బలహీనతతల తిరగడం, స్పృహ కోల్పోవడంఏకాగ్రత లోపంనిరంతర తలనొప్పిచిరాకు, మానసిక స్థితిలో మార్పులుకండరాల నొప్పులుడీహైడ్రేషన్ (నిర్జలీకరణం)వాంగ్చుక్ కేవలం రెండు వారాల్లో 8.2 కిలోలు బరువు తగ్గినట్లు ఆరోగ్య నివేదికలు చెబుతున్నాయి. ఇంతలా తక్కువ సమయంలో గణనీయంగా బరువు తగ్గడం అనేది కొవ్వు, కండర ద్రవ్యరాశి రెండింటిలోనూ గణనీయమైన క్షీణతను సూచిస్తుంది.ప్రమాదకర స్థాయిలో గ్లూకోజ్ స్థాయిలు..వాంగ్చుక్ రక్తంలో గ్లూకోజ్ స్థాయి 67 mg/dLగా నమోదైంది, ఇది చాలా మంది ఆరోగ్యవంతులైన పెద్దలలో ఉండే సాధారణ ఉపవాస స్థాయి కంటే తక్కువ. రక్తంలో చక్కెర స్థాయి తగ్గడం (హైపోగ్లైసీమియా) వల్ల వణుకు, చెమటలు పట్టడం, దృష్టి మసకబారడం, గందరగోళం, వేగంగా గుండె కొట్టుకోవడం, మాట్లాడటంలో ఇబ్బంది, తీవ్రమైన సందర్భాల్లో స్పృహ కోల్పోవడం వంటివి సంభవించవచ్చు. వైద్య సహాయం లేకుండా రక్తంలో చక్కెర స్థాయి తగ్గుతూనే ఉంటే, అది వైద్య అత్యవసర పరిస్థితిగా మారే ప్రమాదం లేకపోలేదని హెచ్చరిస్తున్నారు వైద్యులు.దీర్ఘకాలిక ఉపవాసం దాదాపు ప్రతి అవయవ వ్యవస్థను ప్రభావితం చేస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా వైద్య పర్యవేక్షణ లేకుండా, ఉపవాసం చాలా వారాల పాటు కొనసాగితే, ఈ సమస్యలు తీవ్రంగా మారే ప్రమాదం లేకపోలేదని హెచ్చరిస్తున్నారు. ఇలానే నిరాహార దీక్ష కొనసాగితే వచ్చే అనారోగ్య సమస్యలు ఏంటంటే.ఎలక్ట్రోలైట్ అసమతుల్యతలు, అసాధారణ గుండె లయల ప్రమాదాన్ని పెంచుతాయితక్కువ రక్తపోటు, దీనివల్ల తల తిరగడం, స్పృహ కోల్పోవడం కలుగుతాయికండర ద్రవ్యరాశి క్షీణించడం, గుండె కండరం బలహీనపడటంతో సహావిటమిన్, ఖనిజ లోపాలురోగనిరోధక శక్తి తగ్గడం, దీనివల్ల ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం పెరుగుతుందిడీహైడ్రేషన్ కారణంగా మూత్రపిండాల సమస్యలుదీర్ఘకాలిక జీవక్రియ మార్పుల వల్ల కాలేయంపై ఒత్తిడితప్పనిసరిగగా వైద్య పర్యవేక్షణ దీర్ఘకాలిక ఉపవాసాలు లేదా నిరాహార దీక్షలు చేసే వ్యక్తులకు క్రమం తప్పని వైద్య పర్యవేక్షణ అవసరం. ఎందుకంటే వైద్యులు సాధారణంగా రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు, రక్తపోటు, హృదయ స్పందన రేటు, శరీర బరువు, శరీరంలో నీటి శాతం, ఎలక్ట్రోలైట్ స్థాయిలు, మూత్రపిండాలు, కాలేయ పనితీరును పర్యవేక్షిస్తుంటారు. ఈ పర్యవేక్షణ, ప్రమాదకరమైన మార్పులను ముందుగానే గుర్తించడానికి, తక్షణ చికిత్స అవసరమా కాదా అనే నిర్ణయాలకు మార్గనిర్దేశం చేస్తుంది.నిరాహార దీక్షలు ఒక రకమైన శాంతియుత నిరసన అయినప్పటికీ, నిశితమైన వైద్య పర్యవేక్షణ లేకుండా సుదీర్ఘకాలం పాటు ఉపవాసం ఉండకూడదని వైద్య నిపుణులు నొక్కి చెబుతున్నారు. తీవ్రమైన బలహీనత, గందరగోళం, స్పృహ కోల్పోవడం, ఛాతీ నొప్పి, లేదా నిరంతరంగా రక్తంలో చక్కెర స్థాయిలు తక్కువగా ఉండటం వంటి ముందస్తు హెచ్చరిక సంకేతాలను గుర్తించడం అనేది కోలుకోలేని సమస్యలను నివారించడానికి చాలా కీలకం అని నొక్కి చెబుతున్నారు వైద్యులు.(చదవండి: మరణాన్ని జయించాలనుకుంటే..చివరికి ఆ వ్యాధి భారిన..!) -
తాతయ్య కంటే మనవడికే బీపీ ఎక్కువ..
యువతలో రక్తపోటు (హైపర్టెన్షన్) కేసులు వేగంగా పెరుగుతున్నాయని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు వృద్ధులలో మాత్రమే కనిపించే ఈ సమస్య, ప్రస్తుతం 20, 30 ఏళ్ల వయసు వారిలోనూ ఎక్కువగా బయటపడుతోంది. శారీరక శ్రమ లేకపోవడం, ఊబకాయం, మానసిక ఒత్తిడి, నిద్రలేమి, జంక్ ఫుడ్ అలవాట్లే దీనికి ప్రధాన కారణాలని కార్డియాలజిస్టులు చెబుతున్నారు. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం భారతదేశంలో 15 ఏళ్లు పైబడిన వారిలో 19.4% మహిళలు, 22.1% పురుషులు అధిక రక్తపోటుతో బాధపడుతున్నారు.గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే పట్టణాల్లో ఈ తీవ్రత మరింత ఎక్కువగా ఉంది. ‘ఐసీఎమ్ఆర్’ అధ్యయనం ప్రకారం, ప్రతి నలుగురు భారతీయులలో ఒకరికి హైపర్టెన్షన్ ఉంటోంది. అత్యంత ప్రమాదకరమైన విషయం ఏంటంటే, ఈ వ్యాధి ఎలాంటి లక్షణాలు లేకుండా నిశ్శబ్దంగా దాడి చేస్తుంది. గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్ లేదా కిడ్నీ వ్యాధులు వచ్చే వరకు చాలామందికి తమకు బీపీ ఉందనే విషయమే తెలియడం లేదు.అందుకే ఇంట్లోనే డిజిటల్ డివైజ్ల ద్వారా తరచూ బీపీని పరీక్షించుకోవాలని, వారానికి కనీసం 150 నిమిషాల శారీరక శ్రమ, తక్కువ ఉప్పు వాడకం, పండ్లు-కూరగాయలు ఎక్కువగా తీసుకోవడం వంటి జీవనశైలి మార్పుల ద్వారా ఈ ముప్పు నుంచి తప్పించుకోవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. -
‘అన్యురిజమ్’ అంటే..! బ్రెయిన్లో రావడానికి రీజన్..
దేహంలోని రక్తనాళాల్లో కొన్ని రక్తనాళాల పొరల నిడివి అంతటా ఒకే లాంటి మందం కలిగి ఉండకపోవచ్చు. ఆ రక్తనాళాల్లో కొన్ని కొన్నిచోట్ల బలహీనమైన చోట్లు / ప్రదేశాలు ఉండవచ్చు. మెదడులోనూ అల్లుకున్న రక్తనాళాల్లో బలహీనమైన చోట చిన్న బుడగలా ఉబ్బిపోయి... ఆ రక్తనాళపు పొర మరింత బలహీనపడ్డవేళ ఒక్కోసారి అది ఒక్కసారిగా చిట్లిపోతే మెదడులో రక్తస్రావం అయ్యే ప్రమాదం ఉంది. ఇలా మెదడులో రక్తనాళాల్లో ఎక్కడైనా బలహీనమైన ప్రాంతం ఉండి, అక్కడ రక్తం బుడగలా మారడాన్ని ‘సెరిబ్రల్ అన్యురిజమ్స్’ అంటారు. ఆ బలహీనమైన రక్తనాళ పొర అకస్మాత్తుగా చిట్లిపోవడం జరిగితే అది ఆ వ్యక్తికి అదిప్రాణాంతకంగా మారవచ్చు. ఇలా రక్తనాళాల్లో బలహీనమైన చోట ఉబ్బిపోయి... అది చిట్లిపొవడం ఎందుకు, అలా రక్తనాళపు పొరలు బలహీనపడి ‘అన్యురిజమ్’గా దారితీసే పరిస్థితులేమిటి లాంటి అనేక అంశాలపై అవగాహన కోసం ఈ కథనం.దాదాపు 30 నుంచి 40 ఏళ్ల కిందట ‘అన్యురిజమ్స్’పై వైద్యవర్గాల్లో పెద్దగా అవగాహన లేకపోవడంతో పేషెంట్ ఆకస్మికంగా చనిపోతే అది ఎందువల్లనో తెలియని పరిస్థితే ఎక్కువగా ఉండేది. సుమారు 30 ఏళ్ల కిందట ప్రతి లక్షమందిలో 5 నుంచి 10 మంది అన్యురిజమ్స్తో చనిపోయినా... అప్పట్లో ఆ మరణాలకు కారణం పెద్దగా తెలిసేది కాదు. ఎందుకంటే కారణం తెలిసేలోపే పేషెంట్ మరణించే పరిస్థితులే ఎక్కువగా ఉండేవి. ఈ అన్యురిజమ్స్ గురించి ఇప్పుడు చాలా ఎక్కువగా అవగాహన పెరిగింది. ఈ నేపథ్యంలో వాటి గురించి సమగ్రంగా తెలుసుకుందాం.మెదడులో వచ్చే అన్యూరిజమ్లు (సెరిబ్రల్ ఎన్యురిజమ్స్)మెదడు అన్యూరిజమ్ (సెరిబ్రల్ / ఇంట్రాక్రేనియల్ ఎన్యురిజమ్) అనేది మెదడులోని ఒక ధమని (ఆర్టరీ) గోడలోని లోపలి పొర బలహీనపడటం వల్ల ఆ రక్తనాళం ఒక చిన్న బుడగ (బ్లిస్టర్) లాగా ఉబ్బిపోవడం. ఈ ఉబ్బిన భాగం క్రమంగా చాలా పలుచగా మారి ఎలాంటి సూచనగానీ హెచ్చరికగానీ ఇవ్వకుండానే చిట్లిపోయే ప్రమాదం ఉంటుంది. ఇలా అన్యూరిజమ్ చిట్లిపోయినప్పుడు మెదడు చుట్టూ ఉన్న ఖాళీ ప్రదేశంలో రక్తస్రావం జరుగుతుంది. దీనిని సబ్ అరాక్నాయిడ్ హీమరేజ్ (ఎస్ఏహెచ్) అంటారు. ఇటువంటి రక్తస్రావాలలో సుమారు 90% అన్యూరిజమ్ చిట్లిపోవడం వల్లే సంభవిస్తాయి. ఇది పక్షవాతం (స్ట్రోక్), కోమా లేదా మరణానికి కూడా దారితీయవచ్చు.మెదడు అన్యూరిజమ్ ఏర్పడడానికి కారణాలు- అధిక రక్తపోటు (హైపర్టెన్షన్)- పొగతాగడం (సిగరెట్, బీడీ, చుట్ట తాగడం లాంటి అలవాట్లు)- పుట్టుకతో వచ్చే (జన్యుపరమైన) కారణాలతో.- రక్తనాళాలకు గాయం లేదా దెబ్బతగలడం- కొన్ని రకాల బ్లడ్ ఇన్ ఫెక్షన్ల కారణంగా వచ్చే పరిణామాలతో.అన్యూరిజమ్ ఎలా చిట్లుతుందంటే... - అన్యూరిజమ్ సంచిలో (స్యాక్) చిన్న రంధ్రం ఏర్పడినప్పుడు అది చిట్లినట్లుగా భావిస్తారు. - రంధ్రం చిన్నదైతే కొద్దిపాటి రక్తం మాత్రమే లీక్ అవుతుంది.- రంధ్రం పెద్దదైతే తీవ్రమైన రక్తస్రావం జరుగుతుంది.- చిట్లని అన్యూరిజమ్ (అన్ రప్చర్డ్ అన్యురిజమ్) అంటే ఇంతకుముందు ఎప్పుడూ రక్తం లీక్ కాని అన్యూరిజమ్.పగలని (అన్ రప్ఛర్డ్) అన్యూరిజమ్ లక్షణాలు- పక్షవాతం (స్ట్రోక్ ) – 37%- తలనొప్పి – 37%- ఫిట్స్ (మూర్ఛ) – 18%- చూపు సమస్యలు – 29%పగిలిన (రప్చర్డ్) అన్యూరిజమ్ లక్షణాలు- జీవితంలో ఎన్నడూ / ఎప్పుడూ అనుభవించని తీవ్రమైన తలనొప్పి- స్పృహ కోల్పోవడం- పక్షవాతం (స్ట్రోక్) - మాట్లాడలేకపోవడం, నోరు ఒకవైపు వంగిపోవడం - ఫిట్స్ (మూర్ఛ)చికిత్స విధానాలు...- ఔషధ చికిత్స (మెడికల్ / నాన్ సర్జికల్ థెరపీ) - శస్త్రచికిత్స (సర్జికల్ క్లిప్పింగ్) ∙ఎండోవాస్క్యులర్ చికిత్స (ఎండోవాస్క్యులార్ కాయిలింగ్)- అవసరమైతే స్టెంట్ లేదా బెలూన్ సహాయంతోమన దేశంలోని పరిస్థితి ఇది... ప్రతి ఏటా మన దేశంలో ప్రతి లక్షమందికి పది నుంచి పన్నెండు మందికి పైగా అన్యురిజమ్ బారిన పడుతున్నట్లు ఓ అంచనా. ఇటీవల వీరి సంఖ్య పెరిగినట్లుగా కూడా గణాంకాలు చెబుతున్నాయి. ఇందులో దాదాపు 40 శాతం మంది మృతిచెందుతుంటారు. బతికి బయటపడ్డ వారిలోనూ దాదాపు మూడింట రెండు వంతుల మంది ఏదో ఒక రకమైన వైకల్యం లేదా అవయవలోపం కలుగుతుంది. అంటే వారు ఏదో ఒక రకమైన న్యూరలాజికల్ డెఫిసిట్తో బాధపడాల్సిన పరిస్థితి. మెదడులో రక్తస్రావమై... అది అవయవాలను నియంత్రించే సెంటర్లపై దుష్ప్రభావం చూపడం వల్ల ఈ పరిస్థితి వస్తుంది.కొందరిలో జీవితకాలంలో బయటపడకపోవచ్చు...అన్యురిజమ్స్ ఉన్న చాలామందిలో మెదడులో రక్తనాళాలు కొంత బలహీనంగా ఉండవచ్చు. చాలా బలహీనంగా కూడా ఉండవచ్చు. అయినప్పటికీ అదృష్టవశాత్తు జీవితకాలంలో అవి చిట్లకపోవచ్చు. ఉదాహరణకు ఒక రక్తనాళంలో అంగుళంలో ఎనిమిదో వంతు ఉండే అన్యురిజమ్స్లో 50 శాతం నుంచి 80 శాతం ఎప్పటికీ చిట్లకపోవచ్చు. ఇక కొందరిలో ఈ రక్తనాళాల్లోని ఉబ్బు అంగుళం కంటే పెద్దగా కూడా ఉండవచ్చు. వీటినే ‘జెయింట్ అన్యురిజమ్స్’ అంటారు. ఇలాంటి జెయింట్ అన్యురిజమ్స్ అకస్మాత్తుగా చిట్లడానికి ఆస్కారం ఉంది. ఇవి చిట్లాక రోగికి అకస్మాత్తుగా పక్షవాతం రావచ్చు.నిర్ధారణ కోసం సెరిబ్రల్ ఏంజియోగ్రామ్...గుండెపోటు వచ్చిన వారిలో నిర్ధారణ కోసం చేసే యాంజియోగ్రామ్ పరీక్ష లాగే మెదడుకూ యాంజియోగ్రామ్ చేస్తారు. ఇందులో న్యూరోఇంటర్వెన్షనల్ సర్జన్ ఒక ట్యూబ్ ద్వారా మెదడు రక్తనాళాల వరకు చేరి... అక్కడ ఒకరకమైన రంగు పదార్థాన్ని (డై అని పిలిచే రంగుపదార్థం) మెదడులోని రక్తనాళాల్లోకి వదులుతారు. దాంతో ఆ రంగు పదార్థం రక్తనాళాల్లో చేరి ఉబ్బినట్లుగా ఉన్న ప్రాంతాలను (అన్యురిజమ్స్ను) స్పష్టంగా చూపుతుంది. ఇలాంటి చిత్రాలను చూపించే ప్రక్రియను ‘ఫ్లోరోస్కోప్’గా చెబుతారు. ఈ చిత్రాల సహాయంతో మెదడులోని ఏయే ప్రాంతాల్లో అన్యురిజమ్స్ ఉన్నాయి, వాటి పరిమాణం, ఆకృతి వంటి అనేక కీలకమైన అంశాలను తెలుసుకోగలుగుతారు. వాటి తీవ్రత ఆధారంగా అవసరమైన చికిత్సను డాక్టర్లు సూచిస్తారు.అన్యురిజమ్ మెదడులోనే వస్తాయా?అన్యురిజమ్స్ అంటే బలహీనమైన చోట్లలో రక్తనాళాలు ఉబ్బడం. అది దేహంలోని ఏ ప్రాంతలో ఉన్న రక్తనాళల్లోనైనా జరగవచ్చు. అయితే... దేహంలోని మిగతా ప్రాంతాల్లో అలా ఉబ్బు రావడం లేదా చిట్లడం వల్ల తక్షణ ప్రమాదంగానీ లేదాప్రాణాపాయంగానీ పెద్దగా ఉండకపోవచ్చు. కానీ మెదడు విషయంలో అలా కాదు. మెదడులో రక్తస్రావం జరిగితే... శరీరంలోని అన్ని కీలకమైన అవయవాలనూ, అలాగే దేహ భాగాలను నియంత్రించే నాడులు అక్కడే ఉంటాయి కాబట్టి అవి దెబ్బతినిప్రాణాపాయం కలిగే అవకాశాలెక్కువ. అందుకే మెదడులో సంభవించే అన్యురిజమ్ను తేలికగా తీసుకోకూడదు. ఇలా మెదడులో వచ్చే అన్యురిజమ్స్ను ‘సెరిబ్రల్ అన్యురిజమ్స్’గా చెబుతారు. మిగతా చోట్ల వచ్చే వాటిని దేహంలోని ఆ ప్రదేశం పేరుతో చెబుతారు. ఉదాహరణకు ఛాతీ ప్రాంతంలో వస్తే వాటిని థొరాసిక్ అన్యురిజమ్స్ అని పేర్కొంటారు.1. మందులతో చేసే చికిత్స (మెడికల్ థెరపీ) ఈ చికిత్స సాధారణంగా చిట్లిపోని (అన్ రప్చర్డ్) అన్యూరిజమ్లకు మాత్రమే ఉపయోగిస్తారు. చికిత్స తర్వాత ప్రధానంగా...- పొగతాగే అలవాటు పూర్తిగా మానేయడం- రక్తపోటును నియంత్రణలో ఉంచడం- వైద్యుడు సూచించిన ఆహార నియమాలు పాటించడం- క్రమం తప్పకుండా వ్యాయామం చేయడంఈ చర్యలే అన్యూరిజమ్ ఏర్పడటం, పెరగడం లేదా చిట్లుపోవడం వంటి ముప్పులను తప్పించడానికి దోహదపడేవిగా నిరూపితమయ్యాయి.అలాగే, అన్యూరిజమ్ పరిమాణం లేదా పెరుగుదలను గమనించేందుకు డాక్టర్లు అవసరాన్ని ఎమ్మారై, సీటీ స్కాన్ లేదా సంప్రదాయ యాంజియోగ్రఫీ వంటి పరీక్షలను క్రమం తప్పకుండా చేయాలని సూచించవచ్చు.2. శస్త్రచికిత్స (సర్జికల్ క్లిప్పింగ్)ఈ విధానంలో క్రేనియోటమీ అనే శస్త్రచికిత్స ద్వారా పుర్రెలో చిన్న రంధ్రం చేసి మెదడును, అలాగే ప్రభావితమైన రక్తనాళాల వరకు చేరుకుంటారు. అన్యూరిజమ్ను గుర్తించిన తర్వాత, చుట్టూ ఉన్న మెదడు కణజాలం నుంచి దాన్ని (అన్యురజమ్ను) జాగ్రత్తగా వేరుచేస్తారు.తర్వాత టైటానియంతో తయారు చేసిన చిన్న మెటల్ క్లిప్ను అన్యూరిజమ్ వచ్చిన ప్రాంతంలో (దీన్ని సాధారణంగా నెక్ అని వ్యవహరిస్తారు) వద్ద అమర్చుతారు. దీంతో అన్యూరిజమ్లోకి రక్త ప్రవాహం పూర్తిగా ఆగిపోతుంది. దాంతో మెదడులో సాధారణ రక్తప్రసరణ తిరిగి కొనసాగుతుంది.3. ఎండోవాస్క్యులర్ కాయిలింగ్ఈ విధానంలో కాలులోని ఫెమొరల్ ఆర్టరీ ద్వారా ఒక క్యాథెటర్ను ప్రవేశపెట్టి, దాని ద్వారా చిన్న మైక్రోక్యాథెటర్ను అన్యూరిజమ్ వరకు తీసుకెళ్తారు. ఆ తర్వాత అన్యూరిజమ్ లోపల ప్రత్యేకమైన మెటల్ కాయిల్స్ వేస్తారు. దీంతో అన్యూరిజమ్లో రక్తప్రవాహం ఆగి అది మూసుకుపోతుంది.ఈ చికిత్సలో తల / పుర్రె (స్కల్)ను తెరవాల్సిన అవసరం ఉండదు. అందువల్ల శస్త్రచికిత్స చాలా తక్కువ సమయంలోనే పూర్తవుతుంది.మత్తుమందు (అనస్థీషియా) అవసరం కూడా తక్కువే. చాలా వేగంగా కోలుకుంటారు.4. స్టెంట్ లేదా బెలూన్ సహాయంతో కాయిలింగ్కొన్ని సంక్లిష్టమైన అన్యూరిజమ్లలో... మరీ ముఖ్యంగా వెడ్ నెక్డ్ అన్యురిజమ్ అనే అన్యురిజమ్స్లో లేదా పెద్ద లేదా అతి పెద్ద (లార్జ్ అండ్ జెయింట్ అన్యురిజమ్) వంటి సందర్భాల్లో స్టెంట్ లేదా బెలూన్ సహాయంతో కాయిలింగ్ చేస్తారు. ఇలా చేయడం వల్ల కాయిల్స్ ప్రధాన రక్తనాళంలోకి జారిపోకుండా నివారించవచ్చు. లేదంటే పక్షవాతం (స్ట్రోక్) వచ్చే ప్రమాదం ఉంటుంది.బెలూన్–అసిస్టెడ్ కాయిలింగ్లో, కాయిల్స్ వేస్తున్న సమయంలో అన్యూరిజమ్ నెక్ ప్రాంతంలో బెలూన్ ను తాత్కాలికంగా ఉబ్బించి ఉంచుతారు.5. ఫ్లో డైవర్షన్ అన్యూరిజమ్ చికిత్స కోసం సుమారు ఏడు సంవత్సరాల క్రితం ఫ్లో డైవర్టర్ (ఎఫ్డీ) స్టెంట్లు అందుబాటులోకి వచ్చాయి. ఇవి ట్యూబ్ ఆకారంలో ఉండే ప్రత్యేక స్టెంట్లు. ఇవి రక్తప్రవాహాన్ని అన్యూరిజమ్ వైపు వెళ్లకుండా మళ్లిస్తాయి. దీంతో అన్యూరిజమ్ స్యాక్లోకి వెళ్లే రక్తప్రవాహం క్రమంగా తగ్గిపోతుంది. ఫలితంగా అన్యూరిజమ్ నెమ్మదిగా పూర్తిగా మూసుకుపోయి, కాలక్రమేణా సహజంగా నయమవుతుంది.చికిత్సలో ఎదురయ్యే సవాళ్లుచిట్లిన లేదా చిట్లని... ఇలా రెండు రకాల మెదడు అన్యూరిజమ్ల చికిత్సలు ఇటు పేషెంట్కూ, అటు డాక్టర్లకూ ఓ పెద్ద సవాలుగా మారడం చాలా సాధారణం.గుండెపోటు లాగే అన్యురిజమ్ కూడా... అన్యురిజమ్స్తో వచ్చే పరిణామాలను మనం గుండెజబ్బు అనంతర పరిణామాలతో పోల్చవచ్చు. అకస్మాత్తుగా హార్ట్ ఎటాక్ వచ్చినట్టుగానే అన్యురిజమ్స్ కూడా అంతే అకస్మాత్తుగా రావచ్చు. గుండెపోటు విషయంలో గుండెకు రక్తాన్ని చేరవేసే రక్తనాళాల్లోని పూడిక చేరినందువల్ల అడ్డంకులు ఏర్పడి గుండెపోటు వస్తే... అన్యురిజమ్స్ విషయంలో మాత్రం మెదడుకు చేరవేసే రక్తనాళాలు చిట్లడం వల్ల ఈ సమస్య వస్తుంది. గుండెపోటుకు పొగాకు వాడకం, కుటుంబంలో ఎవరికైనా గుండెజబ్బుల చరిత్ర (ఫ్యామిలీ హిస్టరీ) రిస్క్ ఫ్యాక్టర్లు అయినట్లుగానే... దీనికీ పొగాకు, ఫ్యామిలీ హిస్టరీలే పెద్ద రిస్క్ ఫ్యాకర్లు.మరికొన్ని రిస్క్ ఫ్యాక్టర్లు కూడా... శరీర నిర్మాణానికి దోహదపడే కొన్నిప్రోటీన్లకు సంబంధించిన జబ్బులు (ఉదాహరణకు ఎహ్లర్స్–డాన్లోస్ సిండ్రోమ్, మార్ఫన్స్ సిండ్రోమ్), కండరాల జబ్బు అయిన ఫైబ్రోమస్క్యులార్ డిస్ప్లేసియా, దీర్ఘకాలికంగా ఉండే రక్తపోటు, కుటుంబ సభ్యుల్లో చాలా దగ్గరి వారికి అన్యురిజమ్స్ ఉండటం, కోకెయిన్ వంటి మాదకద్రవ్యాలు తీసుకునే దురలవాటు, మూత్రపిండాల్లో నీటితిత్తుల ఉండే పాలిసిస్టిక్ కిడ్నీ డిసీజ్ ఉండటం... అన్యురిజమ్కు రిస్క్ఫ్యాక్టర్లు.గ్లాస్గో కోమా స్కేల్పై తీవ్రత కొలతతో గ్రేడింగ్... అన్యురిజమ్స్ కారణంగా కానీ లేదా ఇతరత్రాగానీ... ఒక వ్యక్తి కోమాలోకి వెళ్లినప్పుడు దాని తీవ్రతను కొలిచేందుకు ఉపయోగపడే స్కేల్ను గ్లాస్గో కోమా స్కేల్గా అంటారు. ఇందులో ఒక్కోరకమైన స్పందనకు ఒక్కో స్కోర్ ఇస్తారు. ఉదాహరణకు పేషెంట్ కంటి కదలికలకూ, డాక్టర్ మాటలకు పేషెంట్ స్పందించే తీరుకూ, ఇలా... ఒక్కోదానికి కొంత స్కోర్ ఉంటుంది. ఇందులో డాక్టర్ ఇచ్చిన ఏ ఆదేశానికీ పేషెంట్ నుంచి స్పందన లేకపోతే కనిష్టంగా స్కోర్ మూడుగా నమోదవుతుంది. అదే ఆదేశాలకు పేషెంట్ స్పందిస్తున్న కొద్దీ గ్లాస్గో కోమా స్కేల్పై స్కోర్ పెరుగుతుంది. అంటే మూడు స్కోర్ ఉంటే అది పేషెంట్ నుంచి ఏ స్పందనా లేని పరిస్థితి. అంటే అది పూర్తిస్థాయి కోమా అని అర్థం. అదే స్కోర్ పెరుగుతూ... అన్ని ఆదేశాలకూ స్పందిస్తే అది నార్మల్గా 15 ఉంటుంది. ఈ స్కోర్ను బట్టి అన్యురిజమ్స్ కారణంగా సబర్కనాయిడ్ హామరేజ్ జరిగినప్పుడు పేషెంట్లో దాని తీవ్రతను గ్రేడింగ్ చేస్తారు. (వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ న్యూరలాజికల్ సర్జన్స్ ఆమోదించిన గ్రేడింగ్ ప్రక్రియ ఇది).హేమరేజ్ జరిగిన కేసుల్లో పేషెంట్ తాలూకు గ్లాస్గో కోమా స్కేల్పై కొలతల గ్రేడ్... - స్కోరు 15 ఉంటే రోగి కోలుకోవడానికి పూర్తిగా అవకాశాలుంటాయి.- స్కోరు 3 ఉంటే రోగి కోలుకోడానికి అవకాశాలు ఉండవు.- స్కోరు 8 లేదా అంతకంటే ఎక్కువ ఉంటే రోగి కోలుకోవడానికి మంచి అవకాశాలుంటాయి.- స్కోరు 3 – 5 ఉంటే అది ప్రమాదకరమైన స్థితి.చివరగా... ఒకప్పుడు పాశ్చాత్య దేశాల్లో కాస్త ఎక్కువగా కనిపించే ఈ కేసులు ఇటీవల మన దేశంలోనూ ఎక్కువగా వస్తున్నాయి. అప్పట్లో మన దగ్గర వ్యాధి నిర్ధారణకు అవసరమైన పరీక్షలు అంతగా అందుబాటులో లేవు. కానీ ఇప్పుడా పరీక్షలు, వాటితో పాటు సరికొత్త చికిత్స ప్రక్రియలు అందుబాటులోకి రావడంతో మన దగ్గర కూడా ఆ పేషెంట్ల వివరాలు తెలియడంతో పాటు చాలామందిని రక్షించడమూ ఇప్పుడు సాధ్యమవుతోంది.- డా. కిశోర్ కుమార్, సీనియర్ న్యూరో సర్జన్- నిర్వహణ: యాసీన్ -
శస్త్ర చికిత్స లేకుండా 'ఏఐ' ఎండోమెట్రియోసిస్ను నిర్థారించగలదా?
టెక్ బిలియనీర్, దీర్ఘాయువు ప్రచారకర్త బ్రయాన్ జాన్సన్ తన స్నేహితురాలు కేట్కు శస్త్ర చికిత్స చేయించుకోకుండానే ఎండోమెట్రియోసిస్ ఉన్నట్లు నిర్ధారణ అయిందని చెప్పారు. ఏళ్ల తరబడి స్కానింగ్ల తర్వాత ఏఐ సహాయక ఎంఆర్ఐ విశ్లేషణలో ఎండోమెట్రియోసిస్ని సులభంగా నిర్థారించిదని వెల్లడించారు. శస్త్ర చికిత్స లేకుండా నిర్థారించలేని ఈ సమస్యను తాము ఏఐ ఆధారిత స్కానింగ్, బహుళ రక్త పరీక్షల సాయంతో నిర్థారించామని అన్నారు. ఈ నేపథ్యంలో అసలు ఏంటి ఎండోమెట్రియోసిస్?, ఈ సమస్యను గుర్తించడంలో ఏఐ ప్రత్యామ్నాయంగా ఉంటుందా? తదితరాల గురించి సవివరంగా తెలుసుకుందామా.!.ఎండోమెట్రియోసిస్ అంటే..ఇది మహిళల్లో కనిపించే ఒక సాధారణ మరియు దీర్ఘకాలిక ఆరోగ్య సమస్య. ఇందులో, గర్భాశయం లోపలి పొరను పోలి ఉండే కణజాలం (ఎండోమెట్రియం) గర్భాశయం వెలుపల.. అండాశయాలు, ఫెలోపియన్ ట్యూబ్లు, లేదా పొత్తికడుపులోని ఇతర అవయవాలపై పెరగడం ప్రారంభమవుతుంది. దీన్నే ఎండోమెట్రియోసిస్ అంటారు. దీనివల్ల వాపు, మచ్చలు, తీవ్రమైన కటి నొప్పి కలుగుతాయి. డబ్ల్యూహెచ్ఓ ప్రకారం..ప్రపంచవ్యాప్తంగా సంతానోత్పత్తి వయస్సులో ఉన్న ప్రతి 10 మంది మహిళల్లో ఒకరు దీని బారిన పడుతున్నారని అంచనా. దీని కారణంగా మహిళలు ఈ కింది సమస్యలు ఎదుర్కొంటారు.లక్షణాలు..నెలసరి సమయంలో తీవ్రమైన కడుపు నొప్పి, నడుము నొప్పిరుతుస్రావం సమయంలో లేదా సంభోగం సమయంలో విపరీతమైన నొప్పిఅధిక రక్తస్రావం (హెవీ పీరియడ్స్)వంధ్యత్వం (గర్భం దాల్చడంలో ఇబ్బందులు)దీన్ని నిర్థారించడం ఎందుకంత కష్టం అంటే..ఈ సమస్య లక్షణాలు తరచుగా ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ (IBS), పెల్విక్ ఇన్ప్లమేటరీ డిసీజ్ లేదా అండాశయ తిత్తులు వంటి ఇతర ఆరోగ్య సమస్యలతో కలిసి ఉంటాయి. ఫలితంగా, చాలా మంది మహిళలకు ఈ వ్యాధి నిర్ధారణ కావడానికి 6 నుంచి 10 ఏళ్ల వరకు వేచి ఉండాల్సి వస్తుంది.సాధారణ స్కాన్లు గుర్తించలేకపోవడానికి రీజన్..ఇక్కడ బ్రయాన్ జాన్సన్ తన గర్ల్ఫ్రెండ్ కేట్ మొదటగా ఎమ్మారై, ట్రాన్స్వజైనల్ అల్ట్రాసౌండ్ చేయించుకుందని చెప్పారు. కానీ ఈ రెండూ ఆ వ్యాధిని గుర్తించడంలో విఫలమయ్యాయని చెప్పారు. నిజానికి సాధారణ ఇమేజింగ్ పద్ధతుల ద్వారా ఎండోమెట్రియోసిస్ గాయాలను గుర్తించడం కష్టమని వైద్యులు కూడా చెబుతున్నారు. అండాశయాలు లేదా లోతైన పెల్విక్ కణజాలాలను ప్రభావితం బాగా ప్రభావితం చేసే ముదిరిన పరిస్థితుల్లోనే సాంప్రదాయ స్కానింగ్లో దీన్ని గుర్తించగలరట. అదీగాక దశాబ్దాలుగా, ఎండోమెట్రియోసిస్ను నిర్ధారించడానికి లాపరోస్కోపీని (వైద్యులు పెల్విక్ కుహరాన్ని నేరుగా పరీక్షించడానికి వీలు కల్పించే అతి తక్కువ కోతతో చేసే శస్త్రచికిత్సా విధానం) అత్యుత్తమ ప్రమాణంగా పరిగణిస్తున్నారు. ఇక్కడ ఏఐ ఆధారిత అధిక నాణ్యత ఇమేజింగ్ ఆ కోతను కూడా తగ్గించి సులభంగా ఈ సమస్యను గుర్తించడం విశేషం.కృత్రిమ మేధ (AI) రోగ నిర్ధారణను మెరుగుపరచగలదా?మహిళల ఆరోగ్య రంగంలో కృత్రిమ మేధ ఒక ఆశాజనకమైన సాధనంగా ఆవిర్భవించనుంది. పెల్విక్ MRI స్కాన్లను విశ్లేషించడానికి, రేడియాలజిస్టులు కూడా గమనించలేని సూక్ష్మమైన నమూనాలను గుర్తించడానికి AI అల్గారిథమ్లను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేస్తున్నారు. అందువల్ల ఈ సాంకేతికత లోతుగా చొచ్చుకుపోయే ఎండోమెట్రియోసిస్ను గుర్తించడంలో చక్కటి మెరుగుదలను అందిస్తుందని అంటున్నారు నిపుణులు. ఇక్కడ జాన్సన్ AI-సహాయక ఇమేజింగ్, ఎండోమెట్రియోసిస్-నిర్దిష్ట అల్ట్రాసౌండ్తో పాటు వివధ రక్త పరీక్షల ఆధారంగా ఈ సమస్యను నిర్థారించినట్లు తెలిపారు. అందువల్ల ఇది కచ్చితంగా మెరుగైన ఫలితాలు ఇవ్వగలదని చెప్పలేమని..ఇంకా పలు క్లినికల్ ట్రయల్స్ నిర్వహించాల్సి ఉందని అంటున్నారు. అందువల్ల తాము ఏఐ సాధనం గైనకాలజిస్ట్ నిపుణుడికి ప్రత్యామ్నాయం కాదని గుర్తుపెట్టుకోండని హెచ్చరిస్తున్నారు.ప్లీజ్ ఈ విషయాలన్ను విస్మరించొద్దు..అందుకనే మహిళలు ఎండోమెట్రియోసిస్ను సూచించే లక్షణాలు ఉంటే, కేవలం ప్రాథమిక స్కాన్ ఆధారంగా నిర్లక్ష్యం చేయొద్దని అంటున్నారు. ఎండోమెట్రియోసిస్ విషయంలో అనుభవం ఉన్న గైనకాలజిస్ట్ను సంప్రదించి వారి సలహాలు, సూచనలు తీసుకోవడం ఉత్తమం అని అంటున్నారు. ఇక్కడ జాన్సన్ చెబుతోంది దీర్ఘకాలిక కటి నొప్పితో బాధపడుతున్న లక్షలాది మంది మహిళలకు, ఈ ఆవిష్కరణలు ముందస్తు నిర్థారణకు, అలాగే తక్కువ బాధతోనే త్వరితగతిని వైద్య పరీక్షలు చేయించుకునే అవకాశానికి వీలు కల్పిస్తుందనే ఆశను అందిస్తుందే తప్ప..దీనిపై మరిన్ని పరిశోధనలు చేయాల్సి ఉందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.(చదవండి: కేన్సర్తో పోరాడుతూ షూటింగ్లో పాల్గొన్నా..! ఆ కారణంగానే ఆమె..) -
కేన్సర్తో పోరాడుతూ షూటింగ్లో పాల్గొన్నా..! ఆ కారణంగానే ఆమె..
బాలీవుడ్ నటి, మోడల్ నఫీసా అలీ కేన్సర్ వారియర్. ఇప్పటికీ దానిపై పోరాడుతున్నారామె. నిజానికి ఇలాంటి వ్యాధి ఎంతటి వ్యక్తులనైనా కుంగదీసేస్తుంది. కానీ ఆమె ఆ మహమ్మారి విడవకుండా మరోసారి తిరగబెడుతున్నా..నవ్వుతూనే పోరాడుతోంది. పైగా ఎందుకిలానో ఆమెనే స్వయంగా వెల్లడించారు. అంతేగాదు తనకు తొలిసారి కేన్సర్ నిర్థారణ అయినప్పుడూ కూడా షూటింగ్ల్లో పాల్గొన్నానని అందుకు కారణం ఉందంటూ ఆలోచింప చేసేలా మాట్లాడారామె. ఆ ఆసక్తికర విషయాల గురించి సవివరంగా తెలుసుకుందామా. బాలీవుడ్ ప్రముఖ నటి నఫీసా అలీ జూనూన్' (1979), 'మేజర్ సాబ్' (1998), 'లైఫ్ ఇన్ ఎ మెట్రో' (2007), 'గుజారిష్' (2010), 'యమ్లా పగ్లా దీవానా' (2011) వంటి బ్లాక్బస్టర్ చిత్రాలలో నటనకు పేరుగాంచింది. తన నటన, అభినయంతో విమర్శకులు ప్రశంసలు అందుకున్న ఈ బెంగాలీ భామకు 'మ్యాక్స్, మిన్ అండ్ మ్యావ్జాకి' షూటింగ్ సమయంలోనే స్టేజ్ 3 కేన్సర్తో పోరాడుతున్నట్లు తెలిపింది. అయితే ఆ టైంలో ఈ మూవీని పూర్తి చేయగలనా..ఆ పాత్రలో నటించగలనా అనే భయాలు వెంటాడుతున్న తరుణంలో ఆ చిత్రనిర్మాత పద్మకుమార్ నరసింహమూర్తి తనపై పూర్తి నమ్మకం ఉంచారని అందుకు ఆయనకు శతకోటి ధన్యవాదాలని అన్నారామె. ఆయన తనని ప్యాడీ అని ముద్దుగా పిలిచేవారని, ఆ టైంలో అంత ధైర్యంగా సినిమా చేయడానికి కారణం కూడా ఆయనే అని నాటి ఘటనను గుర్తుతెచ్చుకున్నారు. ఆ చ్రితం కూడా చక్కటి సందేశాన్ని ఇచ్చేది కావడం ఒకటైతే, కేన్సర్ లాంటి వ్యాధితో పోరాడుతూ కూడా తన పనుల్లో సాగిపోవాలని భవిష్యత్తు తరాలకు కొత్త ఆశను అందించేందుకు అంటోంది నఫీసా అలీ. అంతేగాదు తన జీవితంతో ఒక సందేశాన్ని అందించాలనే పోరాటమే అత్యంత ముఖ్యమైనదని తెలుసుకున్నా. ఎందుకంటే ఎప్పుడు ఏం జరుగుతోందో ఎవ్వరికీ తెలియదు, అలాంటప్పడు నాకే ఇలా అనే కుంగుబాటుకు లోనవ్వాల్సిన పనిలేదు అని చెప్పేందుకని అంటోందామె. ఇలాంటి సమయంలో మనం ఒకరినొకరు జాగ్రత్తగా చూసుకోవాలి, అందరూ దీని గురించి ఆలోచించడం ముఖ్యం. అలాగే ఇలాంటి పరిస్థితుల్లో తీసుకోవాల్సిన తగిన జాగ్రత్తలు, నైతిక బాధ్యత గురించి ఆలోచించాలని చెబుతోంది. జీవితం ఎప్పటికీ అనూమ్యమైనదే, అందుకనే ప్రజలు సదా కరుణతో ఉండాలి, సాముహిక బాధ్యతను కలిగి ఉండాలన్నేదే నమ్ముతానని అంటోంది. ఈ రోజు ఇక్కడ ఉన్నానని, రేపు ఏం జరుగుతుందనే ఎవరికి తెలుసు కాబట్టి ఆ వ్యాధిపై ధైర్యంగా పోరాడుతూనే ఉండండి..ఆ సత్యాన్ని చెప్పేందుకే ఆ సమయంలో కూడా షూటింగ్లలో పాల్గొన్నట్లు తెలిపింది. తాను అప్పుడు స్టేజ్ 3 కేన్సర్తో పోరాడా, గెలిచా..కానీ మళ్లీ తిరగబెట్టి స్టేజ్ 4 కు చేరుకుంది అయినా..తన పోరాటం ఆపనని ధీమాగా చెబుతోందామె. ఆమె ముందు క్రీడాకారిణి..కోల్కతాలో బెంగాలీ తండ్రికి, ఆంగ్లో ఇండియన్ తల్లికి జన్మించిన నఫిసా అలీ విభిన్న సంస్కృతులు కలగలసిన కుటుంబ నుంచి వచ్చారామె. ఆమె స్విమ్మింగ్లో అర్జున అవార్డు గ్రహిత. క్రీడాకారుడైన కల్నల్ రవీందర్ సింగ్ సోధీని పెళ్లి చేసుకున్నారు. నటలోకి ప్రవేశించడానికి ముందే ఆమె నేషనల్ స్విమ్మింగ్ ఛాంపియన్గా ఉండేవారు. 1976లో ఈవ్స్ వీక్లీ మిస్ ఇండియా టైటిల్ను గెలుచుకున్నారు. అంతేగాదు శశి కపూర్, ధర్మేంద్ర, అమితాబ్ బచ్చన్ వంఇ ప్రముఖ నటనలతో పనిచేశారు. 2004, 2009లలో లోక్సభ ఎన్నికలలో పోటీ చేశారు. 2005లో, ఆమె చిల్డ్రన్స్ ఫిల్మ్ సొసైటీ ఆఫ్ ఇండియా (CFSI) ఛైర్పర్సన్గా నియమితులయ్యారు. నవంబర్ 2018లో, ఆమెకు స్టేజ్ 3 పెరిటోనియల్, ఓవేరియన్ కేన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. View this post on Instagram A post shared by Nafisa Ali Sodhi (@nafisaalisodhi) (చదవండి: కదులుతున్న రైలులో పూజలు..! రైల్వే ఏం చెప్పిందంటే) -
'వాకింగ్'కి అత్యంత అనుకూలమైన నగరం అదే..! కానీ హారన్ కొట్టారో..
నగరాల్లో వాకింగ్ వెళ్లాలంటే విసుగొచ్చేస్తుంది. కొద్ది దూరం నడిచేటప్పటికే అలసట, చికాకు అన్ని వచ్చేస్తాయి. ఎందుకంటే రద్దీగా ఉండే రహదారులు, వీధులు, ఓ పక్క హారన్ మోతలలో హోరెత్తిపోతుంది. కాబట్టి హాయిగా నడవడం చాలా కష్టం. ఏ పార్క్ లేదా చక్కటి ఉద్యానవనం లాంటి ప్రదేశాల్లోనే ప్రశాంతంగా వాకింగ్ చేయగలం అంతే. కానీ భారత్లోనే ఓ నగరం వాకింగ్ అత్యంత అనుకూలమైంది. అక్కడ నడిస్తే ఎంత హాయిగా అనిపిస్తుందంటే..అలసట కూడా తెలియదు. మన దేశంలో ఎక్కడుందంటే ఆ నగరం..పట్టణ ప్రాంతాలు ఎల్లప్పుడూ వాకింగ్కి అనుకూలంగా ఉండవనేది తెలిసిందే. భారత్లో ప్రతిచోటా ట్రాఫిక్, మరోవైపు ఫుట్పాత్లపై కూడా ద్విచక్రవాహనాలు దర్శనం ఇవ్వడంతో..నడకకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. అయితే ఇలాంటి సమస్యలే లేని ప్రశాంతమైన నగరం భారత్లో ఉంది. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ట్రావెల్ వ్లాగర్ తాన్య ఖనిజో ఆ నగరం గురించి నెటింట షేర్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చంది. ఆమె తన వీడియోకి ‘భారతదేశంలో అత్యంత నడవడానికి అనువైన నగరం’ అనే క్యాప్షన్ జోడించి మరి ఆ నగరం విశేషాల గురించి వీడియోలో వివరించారు. అది ఉత్తర భారతదేశంలోని పర్వత ప్రాంత రాష్ట్రమైన సిక్కిం రాజధాని గ్యాంగ్టక్ అని పేర్కొంది. తాన్యా పోస్ట్లో తన అభిప్రాయంలో, భారతదేశంలో అత్యంత నడవడానికి అనువైన నగరం ఇదే అని రాశారు. ఈ గ్యాంగ్టక్ భారతదేశంలోని పట్టణ నగరాలలో ప్రత్యేకంగా నిలిచే, పాదచారులకు అత్యంత అనుకూలమైన గమ్యస్థానం. నగరంలోని ఎత్తైన నడక మార్గాలు వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగించకుండా ప్రజలు సురక్షితంగా ప్రయాణించడానికి వీలు కల్పిస్తాయని చెప్పుకొచ్చింది. తాను ఇప్పటి వరకు వెళ్లిన నగరాలలో నడవడానికి అనుకూలమైన నగరం ఇదే. ఇక్కడ ట్రాఫిక్కు అంతరాయం కలిగించని, అంతరాయం లేని ఎత్తైన ఫుట్పాత్లు చాలానే ఉన్నాయన్నారు. నడుస్తున్నప్పుడు ఎంతో హాయిగా సురక్షితంగా ఉంటుందన్నారు. ఒకవేళ హారన్ కొట్టారో ఏకంగా రూ. 1000 జరిమానా పడుతుందని తెలిపింది. అందువల్ల ఈ నగరం ప్రశాంతమైన వాతావరణానికి ప్రసిద్ధి చెందిందని వెల్లడించింది. ఈ నగరం ఆహ్లాదకరమైన వాతావరణంతో కూడిన సుదీర్ఘ నడకలను ప్రోత్సహిస్తుందని, అందువల్లే తాను తెలియకుండానే అరగంటపైనే నడిచానని సంబరంగా చెప్పింది. ముఖ్యంగా మహిళలు ఒంటరిగా నడుస్తున్నప్పుడు ఇబ్బందికరమైన చూపులు లేదా వేధింపులకు గురికాకపోవడం వల్ల సురక్షితంగా భావిస్తారని పేర్కొంది. మహిళలు సోలాగా వాక్ చేయాలనుకుంటే ఈ నగరమే అత్యంత అనుకూలమైందని అంటోంది. చివరగా వ్లాగర్ తాన్య నడవడానికి అనువైన ప్రాంతాల విషయంలో ఇంతటి ఉన్నత ప్రమాణాలు, మహిళల ప్రదేశాలకు ఇచ్చే గౌరవం, సామాన్య ప్రజల అవసరాలపై అవగాహన తదితరాలను చూసి ఆశ్చర్యంగా అనిపిస్తోందని అంటోంది. నగరాలన్ని ఇలానే ఉంటే బాగుండును అంటూ తన వీడియోని ముగించింది. నెటిజన్లు కూడా నగరాన్ని అందరికీ నివాసయోగ్యంగా మార్చడానికి గ్యాంగ్టక్ చూపిస్తున్న నిబద్ధతను ప్రశంసించగా, మరికొందరు ప్లీజ్ దీని గురించి మరి ఎక్కువగా ప్రచారం చేయకండి, లేదంటే ప్రజలంతా తండొపతండాలుగా వచ్చి ఆ ఆహ్లాదభరితమైన వాతావరణాన్ని కూడా పాడుచేస్తారంటూ ఆందోళన వ్యక్తం చేస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Tanya Khanijow (@tanyakhanijow) (చదవండి: ఐఐటీ నేపథ్యం కాదు..కానీ ఏకంగా యూఎస్ ఎన్విడియాలో రూ. 2.6 కోట్ల జీతం) -
Health: నా బిడ్డకు ఏమైనా ప్రమాదమా?
నా వయస్సు 22 సంవత్సరాలు. నాకిప్పుడు ఏడోనెల. ఇటీవల పరీక్ష చేయించుకుంటే రక్తపోటు ఎక్కువగా ఉందని డాక్టర్ చెప్పారు. మందులు కూడా వాడమన్నారు. ఈ సమస్య వల్ల నాకు లేదా నా బిడ్డకు ఏమైనా ప్రమాదమా? ఈ మందులు గర్భంలో సురక్షితమేనా? – చైత్ర, మంచిర్యాల.గర్భధారణ సమయంలో మొదటిసారిగా అధిక రక్తపోటు రావడాన్ని ‘ప్రీఎక్లాంప్సియా’ అంటారు. సాధారణంగా రక్తపోటు ‘140/90 ఎమ్ఎమ్హెచ్జీ’ లేదా అంతకంటే ఎక్కువగా ఉన్నప్పుడు దీనిని అనుమానిస్తారు. కొంతమందిలో దీనితో పాటు మూత్రంలో ప్రొటీన్ కనిపించడం, రక్తపరీక్షల్లో మార్పులు లేదా కాలేయం, మూత్రపిండాల పనితీరులో లోపాలు కూడా ఉండవచ్చు. కొన్ని పరిస్థితుల్లో ఈ సమస్య వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మొదటిసారి గర్భం దాల్చడం, చాలా చిన్న వయస్సులో లేదా ఎక్కువ వయస్సులో గర్భం ధరించడం లేదా గత గర్భంలో అధిక రక్తపోటు వచ్చినా, కవల పిల్లలు గర్భంలో ఉన్నా, గర్భానికి ముందే రక్తపోటు లేదా మధుమేహం ఉన్నా, అధిక బరువు ఉన్నా లేదా సంతానలేమి చికిత్సల ద్వారా గర్భం దాల్చినా ప్రమాదం కొంత ఎక్కువగా ఉంటుంది. ఈ సమస్య సాధారణంగా 20 వారాల తర్వాత ప్రారంభమవుతుంది. ఎక్కువగా మూడో త్రైమాసికంలో కనిపిస్తుంది. అరుదుగా ప్రసవం తర్వాత ఆరు వారాల వరకు కూడా రావచ్చు.చాలామంది గర్భిణీల్లో ఈ సమస్యకు మొదట్లో ఎలాంటి లక్షణాలు కనిపించవు. సాధారణ గర్భధారణ పరీక్షల్లోనే ఇది బయటపడుతుంది. అయితే కొందరిలో అకస్మాత్తుగా బరువు పెరగడం, శరీరం మొత్తం వాపు రావడం, స్కానింగ్లో బిడ్డ ఎదుగుదల తగ్గడం వంటి మార్పులు కనిపించవచ్చు. అయితే కొందరిలో తీవ్రమైన తలనొప్పి, చూపు మసకబారడం లేదా వెలుగులు మెరుస్తున్నట్లు కనిపించడం, వాంతులు, ముఖం, చేతులు లేదా కాళ్లలో అకస్మాత్తుగా వాపు రావడం, మూత్రం తగ్గిపోవడం, కడుపు పైభాగంలో తీవ్రమైన నొప్పి, తీవ్రమైన పరిస్థితుల్లో మూర్ఛలు (సీజర్లు) రావడం వంటి లక్షణాలు కనిపించవచ్చు.ప్రీఎక్లాంప్సియా నిర్ధారణ అయితే రక్తపోటును నియంత్రించేందుకు మందులు అవసరం అవుతాయి. సాధారణంగా ‘లాబెటాలోల్’లేదా ‘నైఫెడిపిన్’ వంటి మందులు గర్భధారణలో సురక్షితంగా పరిగణించబడతాయి. వైద్యుడి సూచన మేరకు వీటిని క్రమం తప్పకుండా తీసుకోవాలి. స్వయంగా మందులు ఆపడం లేదా మోతాదు మార్చడం చేయకూడదు. గర్భధారణ ప్రారంభ దశలో చేసిన ఎన్ టీ స్కాన్, ఇతర రక్తపరీక్షల ఆధారంగా ప్రీఎక్లాంప్సియా వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని గుర్తిస్తే, నివారణ కోసం కొంతమందికి తక్కువ మోతాదులో మందును సూచిస్తారు.ప్రీఎక్లాంప్సియాను నిర్లక్ష్యం చేస్తే తల్లికీ, బిడ్డకీ కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. తల్లిలో రక్తపోటు మరింత పెరగడం, మూర్ఛలు రావడం, కాలేయం లేదా మూత్రపిండాల పనితీరు దెబ్బతినడం, ముందస్తు ప్రసవం లేదా అత్యవసర శస్త్రచికిత్స అవసరమయ్యే పరిస్థితులు ఏర్పడవచ్చు. బిడ్డలో ఎదుగుదల తగ్గిపోవడం, గర్భాశయంలో నీటి పరిమాణం తగ్గడం, ముందుగానే పుట్టడం లేదా పుట్టిన తర్వాత కొంతకాలం ప్రత్యేక సంరక్షణ అవసరం కావడం వంటి సమస్యలు రావచ్చు.అయితే భయపడాల్సిన అవసరం లేదు. ఈ సమస్యను ముందుగానే గుర్తించి, రక్తపోటును నియంత్రిస్తూ, క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకుంటూ, బిడ్డ ఎదుగుదలను పర్యవేక్షిస్తే చాలా వరకు ఈ ప్రమాదాలను తగ్గించవచ్చు. అందుకే గర్భధారణ సమయంలో ప్రతి పరీక్షను సమయానికి చేయించుకోవడం, వైద్యులు సూచించిన మందులు క్రమం తప్పకుండా వాడటం, తలనొప్పి, చూపు మసకబారడం, శరీరం ఎక్కువగా వాపు రావడం లేదా బిడ్డ కదలికలు తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆసుపత్రికి వెళ్లడం చాలా ముఖ్యం. సరైన సమయంలో గుర్తించడం, సరైన చికిత్స తీసుకోవడం, నిరంతర వైద్య పర్యవేక్షణలో ఉండడం వల్ల తల్లి, బిడ్డ ఇద్దరూ సురక్షితంగా ఉండే అవకాశం చాలా ఎక్కువ. కాబట్టి ఆందోళన చెందకుండా మీ వైద్యుల సూచనలు తప్పకుండా పాటించండి.- డా. కడియాల రమ్య, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్ -
అరుదైన సార్కోమా క్యాన్సర్.. గుర్తించడం ఎలా?
క్యాన్సర్ అనగానే మనకు సాధారణంగా రొమ్ము, ఊపిరితిత్తులు లేదా ప్రేగుల క్యాన్సర్లు మాత్రమే గుర్తుకు వస్తుంటాయి. అయితే శరీరంలోని అనుసంధాన కణజాలాలలో (connective tissues) వచ్చే ‘సార్కోమా’ అనే అరుదైన క్యాన్సర్ను త్వరగా గుర్తించలేం. ఫలితంగా తీవ్రమైన పరిణామాలు ఎదురయ్యే ప్రమాదం ఉంది. సార్కోమా క్యాన్సర్లు ఎముకలు, కండరాలు, కొవ్వు, మృదులాస్థి (cartilage), రక్తనాళాలు, నరాలు, ఇతర మృదువైన కణజాలాలలో (soft tissues) ఉత్పన్నమవుతాయి. పెద్దవారిలో వచ్చే క్యాన్సర్లలో ఇవి కేవలం ఒక శాతం మాత్రమే అయినప్పటికీ, ఇవి అటు పిల్లలపై, ఇటు పెద్దలపై కూడా ప్రభావం చూపిస్తాయి. దీని ప్రారంభ లక్షణాలు చాలా స్వల్పంగా, నొప్పి లేకుండా ఉండటం వల్ల వ్యాధి నిర్ధారణ ఆలస్యమవుతున్నది. అందుకే దీనిపై అవగాహన పెంచుకోవడం ఎంతో అవసరం.సార్కోమా అంటే ఏమిటి?మ్యాక్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మెడికల్ ఆంకాలజీ ప్రిన్సిపల్ డైరెక్టర్ డాక్టర్ సమీర్ ఖత్రీ తెలిపిన వివరాల ప్రకారం.. సార్కోమా అనేది ఒక అసాధారణ క్యాన్సర్. ఇది స్పష్టమైన కారణం లేకుండానే వస్తుంది. ‘సార్కోమా బారిన పడిన చాలామందికి అది తమకు ఎందుకు వచ్చిందో అసలు తెలియదు. చాలా కేసులలో దీనికి నిర్దిష్టమైన జీవనశైలి అలవాట్లు గానీ లేదా బాహ్య కారణాలు గానీ బాధ్యత వహించవు’ అని ఆయన వివరించారు. సార్కోమాలో 100 కంటే ఎక్కువ ఉప రకాలు ఉన్నాయి. ఒక్కొక్కటి ఒక్కోలా ప్రవర్తిస్తుంది. అందుకే దీని నిర్ధారణ, చికిత్స చాలా సవాలుతో కూడుకున్నవి. అయితే, ఈ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచే కొన్ని అంశాలను వైద్యులు గుర్తించారు.ప్రమాద కారకాలు సార్కోమాను సాధారణంగా నివారించలేనప్పటికీ, దీని ముప్పును పెంచే కొన్ని అంశాలను వైద్యులు గుర్తించారు. అవి.. ‘లి-ఫ్రౌమెని సిండ్రోమ్’ వంటి వంశపారంపర్య జన్యుపరమైన సమస్యలు. న్యూరోఫైబ్రోమాటోసిస్ టైప్ 1.. గతంలో ఇతర క్యాన్సర్ల కోసం రేడియేషన్ థెరపీ తీసుకోవడం. దీర్ఘకాలంగా ఉండే లింఫెడెమా (lymphoedema - వాపు సమస్య). కొన్ని రకాల పారిశ్రామిక రసాయనాలకు సుదీర్ఘకాలం గురికావడం.ఉపేక్షించకూడని హెచ్చరిక సంకేతాలుసార్కోమా ఆలస్యంగా నిర్ధారణ కావడానికి ప్రధాన కారణం.. దీని ప్రాథమిక లక్షణం నొప్పి లేని గడ్డలా కనిపించడమే. క్యాన్సర్ నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం.. నిరంతరం పెరుగుతూ ఉండే గడ్డ, ఐదు సెంటీమీటర్ల కంటే పెద్దగా (సుమారుగా ఒక గోల్ఫ్ బంతి పరిమాణంలో) ఉండే వాపు, కండరాల లోపల లోతుగా ఉండే గడ్డ, ఎటువంటి గాయం కాకపోయినా ఎముకలలో నిరంతరం నొప్పి రావడం, రాత్రి వేళల్లో ఎముకల నొప్పి మరింత తీవ్రం కావడం, తగ్గకుండా పదే పదే వచ్చే వాపు. శరీరంలో వచ్చే చాలా గడ్డలు ప్రమాదకరమైనవి కానప్పటికీ, ఏదైనా వాపు తగ్గకుండా ఉన్నా లేదా పరిమాణం పెరుగుతున్నా వెంటనే వైద్య నిపుణులను సంప్రదించి పరీక్షించుకోవాలి.వ్యాధి నిర్ధారణ ఎలా చేస్తారు?అనుమానాస్పదంగా ఉన్న గడ్డలను పరీక్షించడానికి వైద్యులు సాధారణంగా ఎంఆర్ఐ స్కాన్లు, పెట్-సిటి ఇమేజింగ్, ముందస్తు ప్రణాళికతో చేసే బయాప్సీ, ఇమ్యునోహిస్టోకెమిస్ట్రీ, మాలిక్యులర్, జన్యుపరమైన పరీక్షలు, నెక్స్ట్-జనరేషన్ సీక్వెన్సింగ్ వంటి పద్ధతులను ఉపయోగిస్తారు. సార్కోమా చికిత్సలో అనుభవజ్ఞులైన కేంద్రాలలోనే బయాప్సీ చేయించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.నివారించడం సాధ్యమేనా?మిగతా సాధారణ క్యాన్సర్లలా కాకుండా, సార్కోమా రావడానికి ఖచ్చితమైన కారణం తెలియదు కాబట్టి దీనిని నివారించడానికి నిర్దిష్టమైన మార్గాలేవీ లేవు. అయితే, అనవసరమైన రేడియేషన్కు గురికాకపోవడం, ప్రమాదకర రసాయనాలను ఉపయోగించే కార్యాలయాల్లో భద్రతా ప్రమాణాలు పాటించడం, వంశపారంపర్య క్యాన్సర్ సమస్యలు ఉన్నవారు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవడం, శరీరంలో తగ్గని గడ్డలు లేదా ఎముకల నొప్పులు ఉన్నప్పుడు వెంటనే వైద్యులను సంప్రదించడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. -
పాటలు పాడటం.. నిజంగానే ఊపిరితిత్తులకు మంచిదా?
స్నానం చేస్తూ పాటలు పాడుతున్నారా? అయితే మీ ఆరోగ్యానికి కూడా మేలు చేస్తున్నట్టే! పాటలు పాడేటప్పుడు ఊపిరిని లోతుగా తీసి వదలాల్సి ఉంటుంది. దీంతో ఊపిరితిత్తుల పనితీరు మెరుగుపడుతుంది. అంటే... మీ బాత్రూమ్ కచేరీ కూడా ఒక చిన్న వ్యాయామమే!. అదెలాగో సవివరంగా తెలసుకుందామా..!పాటలు పాడటం అనేది కేవలం కళ మాత్రమే కాదు, ఇది ఒక అద్భుతమైన వ్యాయామం. క్రమం తప్పకుండా పాటలు పాడటం వల్ల డయాఫ్రాగమ్, ఇంటర్కోస్టల్ కండరాలు బలపడి, ఊపిరితిత్తుల సామర్థ్యం (lung capacity), శ్వాస నియంత్రణ మెరుగుపడతాయిశ్వాసకోశ కండరాల బలోపేతం: దీర్ఘమైన శ్వాస దశలు, నియంత్రిత శ్వాస తీసుకోవడం, నెమ్మదిగా శ్వాస వదలడం అనేవి డయాఫ్రమ్, ఇంటర్కోస్టల్ సహాయక కండరాలను ఉత్తేజపరిచి, ఓర్పును, సామర్థ్యాన్ని పెంచుతాయి.మెరుగైన శ్వాస నియంత్రణ సామర్థ్యం: సంగీత శిక్షణ సౌకర్యవంతమైన ఉచ్ఛ్వాస సమయాన్ని పెంచుతుంది. ఊపిరితిత్తుల అసలు పరిమాణం మారకపోయినా, ఇప్పటికే ఉన్న ఊపిరితిత్తుల పరిమాణాన్ని మెరుగ్గా ఉపయోగించడం ద్వారా క్రియాత్మక కీలక సామర్థ్యాన్ని పెంచుతుంది.మెరుగైన శ్వాస సామర్థ్యం: పాడటం నెమ్మదిగా, నియంత్రితంగా శ్వాస తీసుకునే విధానాలను ప్రోత్సహిస్తుంది. దీనివల్ల అనవసరమైన వేగవంతమైన, నిస్సారమైన శ్వాసలు తగ్గి, వాయు మార్పిడి ప్రక్రియ మెరుగుపడుతుంది.వాయుమార్గం తెరుచుకోవడం, శ్లేష్మం తొలగిపోవడం: ఫిజియోథెరపీ పద్ధతులతో కలిపి ఉపయోగించినప్పుడు, దీర్ఘకాలిక శ్వాసకోశ సమస్యలు ఉన్నవారిలో స్వర వ్యాయామాలు సున్నితమైన ఉచ్చారణ శ్లేష్మాన్ని కదిలించి, వాయుమార్గం శుభ్రపరచడాన్ని మెరుగుపరుస్తాయి.అంతేగాదు పాడటం శ్వాస, మింగడం మధ్య సమన్వయాన్ని మెరుగుపరుస్తుంది. ఇది న్యూరోజెనిక్ డిస్ఫేజియా, కొన్ని నాడీకండర రుగ్మతలకు ఉపయోగపడుతుంది.సమూహ గానం ఒత్తిడి, ఆందోళనను తగ్గించి ఆయాసం అనే భావనను తొలగిస్తుంది. టానమిక్ సమతుల్యతను (సింపథెటిక్ టోన్ను తగ్గించడం) అనుకూలంగా మార్చవచ్చు, తద్వారా పరోక్షంగా శ్వాస సరళకి ప్రయోజనం చేకూరుస్తుంది.(చదవండి: దెయ్యంపై కేసు..! జడ్జీ వేసిన ఆ ఒక్క ప్రశ్నతో..) -
39 అత్యవసర ఔషధాల ధరల్లో మార్పు
దేశంలో సామాన్యుడి వైద్యభారాన్ని తగ్గించే దిశగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నిరంతరం వాడాల్సిన అత్యవసర మందుల ధరలను నియంత్రిస్తూ జాతీయ ఔషధ ధరల నియంత్రణ సంస్థ (ఎన్పీపీఏ) సరికొత్త ఉత్తర్వులు జారీ చేసింది. మధుమేహం (డయాబెటిస్), రక్తపోటు (బీపీ), గుండె జబ్బులు వంటి దీర్ఘకాలిక వ్యాధుల చికిత్సకు ఉపయోగించే 39 కీలక ఔషధాల (న్యూ డ్రగ్ ఫార్ములేషన్స్) రిటైల్ ధరలపై ఎన్పీపీఏ గరిష్ఠ పరిమితిని (క్యాపింగ్) విధించింది. డ్రగ్స్ ప్రైస్ కంట్రోల్ ఆర్డర్ (డీపీసీఓ), 2013 నిబంధనల ప్రకారం ఇటీవల జారీ చేసిన ఈ అధికారిక నోటిఫికేషన్లు తక్షణమే అమలులోకి రానున్నాయి.కీలక సవరణలు.. ధరల వివరాలుఎన్పీపీఏ తాజా ఉత్తర్వుల ప్రకారం, నిత్యం ప్రజలు ఉపయోగించే విటమిన్లు, అత్యవసర ఇంజెక్షన్ల ధరలను ఈ క్రింది విధంగా నిర్ణయించారు:కాల్షియం, విటమిన్ D3 మాత్రలు: ఎముకల పుష్టికి, విటమిన్లోప నివారణకు విస్తృతంగా వాడే ఈ మాత్రల గరిష్ఠ రిటైల్ ధరను అన్ని పన్నులతో కలిపి ఒక టాబ్లెట్కు రూ.8.93గా స్థిరీకరించారు.యాంటీ-రేబీస్ ఇమ్యునోగ్లోబులిన్ ఇంజెక్షన్: పిచ్చి కుక్కలు లేదా ఇతర జంతువులు కరిచినప్పుడు అత్యవసరంగా ఇచ్చే ఈ ప్రాణరక్షక ఇంజెక్షన్ (150 IU/ml) ధరను రూ.119.48గా సవరించారు.కార్డియాక్, బీపీ ఔషధాలు: గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదాలను తగ్గించే క్లోపిడోగ్రెల్ + ఆస్పిరిన్ + అటోర్వాస్టాటిన్ క్యాప్సూల్ ధరను ఒక్కోదానికి రూ.6.37గా, హైపర్టెన్షన్ చికిత్సకు వాడే అమ్లోడిపైన్ + బైసోప్రోలోల్ + టెల్మిసార్టాన్ టాబ్లెట్ ధరను రూ.14.74గా నిర్ణయించారు.జీవనశైలి జబ్బుల బాధితులకు ఊరటభారతదేశంలో వైద్య ఖర్చులు చాలా ఎక్కువ. ముఖ్యంగా ఇంట్లో వృద్ధులు లేదా దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు ఉన్న కుటుంబాలకు నెలవారీ మందుల బిల్లులు పెద్ద భారంగా మారుతున్నాయి. తాజా నిర్ణయం ద్వారా బీపీ, షుగర్, హెచ్ఐవీ, శ్వాసకోశ సమస్యలు, కంటి ఇన్ఫెక్షన్ల ఔషధాల ధరలు నియంత్రణలోకి రావడం వల్ల మధ్యతరగతి, పేద కుటుంబాల బడ్జెట్కు పెద్ద ఊరట లభించనుంది.ఇదీ చదవండి: నిప్పుల కొలిమిలో నగరాలు -
జనాభా.. జగమెరుగని సత్యాలు
ప్రతి ఏటా జూలై 11న ప్రపంచవ్యాప్తంగా ‘ప్రపంచ జనాభా దినోత్సవం’ నిర్వహిస్తారు. జనాభా పెరుగుదల వల్ల కలిగే పరిణామాలు, వనరుల కొరత, లింగ సమానత్వం, మానవ హక్కులపై అవగాహన కల్పించడానికి ఐక్యరాజ్యసమితి ఈ రోజును కేటాయించింది.– మొదటి ‘వంద కోట్లు’ చేరడానికి లక్షల ఏళ్లు!మానవ చరిత్ర ప్రారంభమైనప్పటి నుంచి ప్రపంచ జనాభా మొదటి 100 కోట్లకు చేరడానికి కొన్ని లక్షల సంవత్సరాలు పట్టింది (దాదాపు క్రీ.శ. 1804 లో). కానీ, ఆ తర్వాత కేవలం 200 ఏళ్లలోనే ఆ సంఖ్య ఏకంగా ఎనిమిది రెట్లు పెరిగిపోవడం విశేషం!– 830 కోట్లుగణాంకాల ప్రకారం ప్రస్తుతం ప్రపంచ జనాభా 830 కోట్లు దాటి దూసుకుపోతోంది. 2022 నవంబర్ నాటికి మనం 800 కోట్ల మార్కును దాటగా, కేవలం ఈ నాలుగేళ్లలోనే జనాభా ఎంత వేగంగా పెరిగిందో దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు.– 1000 కోట్లకు ఎప్పుడు చేరుతాం?ఐక్యరాజ్యసమితి నివేదికల ప్రకారం.. ప్రపంచ జనాభా 2030 నాటికి 850 కోట్లకు, అలాగే 2050 నాటికి 970 కోట్లకు చేరుకుంటుంది. ఇక 2080 నాటికి ప్రపంచ జనాభా గరిష్టంగా 1030 కోట్లకు చేరి, ఆ తర్వాత స్థిరంగా ఉండిపోతుందని లేదా క్రమంగా తగ్గుముఖం పడుతుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.– సెకనుకు నలుగురుప్రపంచవ్యాప్తంగా ప్రతి సెకనుకు సగటున నలుగురు పిల్లలు జన్మిస్తుంటే, ఇద్దరు మరణిస్తున్నారు. అంటే ప్రతి సెకనుకు ఇద్దరు చొప్పున ప్రపంచ జనాభాకు అదనంగా చేరుతున్నారు. ఈ లెక్కన రోజుకు దాదాపు 2 లక్షల మందికి పైగా కొత్తగా భూమిపైకి వస్తున్నారు. -
World Population Day: మనదే పైచేయి.. కాని..
ప్రపంచంలో అత్యధికంగా ఫర్టిలిటీ రేట్ ఉన్న దేశాలు నైజర్, చాడ్, సోమాలియా, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో వంటి ఆఫ్రికా దేశాలు ఉన్నాయి. ఇక్కడ ఒక్కో మహిళ సగటున ఐదు నుంచి ఆరుగురు పిల్లలకు జన్మనిస్తోంది. మరోవైపు దక్షిణ కొరియా, సింగపూర్, హాంకాంగ్, మకావ్, ఇటలీ వంటి దేశాల్లో ఈ రేటు ఒక శాతం కంటే తక్కువగా ఉంది. అందుకే ఇప్పుడు ఆ దేశాలు పిల్లల్ని కనే కుటుంబాలకు ప్రత్యేకమైన ప్రోత్సాహకాలు, పన్ను రాయితీలు, ఉచిత శిశు సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసి జనాభా పెంపునకు ప్రయత్నాలు చేస్తున్నాయి.మనదే పైచేయి.. కాని..దాదాపు 70 సంవత్సరాల పాటు ప్రపంచ జనాభాలో చైనాదే అగ్రస్థానం. కాని 2023లో చరిత్ర పూర్తిగా మారిపోయింది. 146 కోట్ల జనాభాతో చైనాను వెనక్కి నెట్టి భారత్ అగ్రస్థానంలోకి వెళ్లిపోయింది. ప్రస్తుతం ప్రపంచ భూభాగంలో భారత్ వాటా కేవలం 2.4 శాతం అయినా జనాభాలో మాత్రం దాదాపు 17.8 శాతం, కలిగి ఉంది. ఇప్పుడు ప్రపంచంలో ప్రతి వంద మందిలో దాదాపు 18 మంది భారతీయులే.. సరాసరి చూస్తే భూమి మీద ప్రతి ఆరుగురిలో ఒకరు భారతీయుడే. ఇంత వరకూ బాగానే ఉన్నా..ఒకప్పుడు భారతదేశంలో ఒక్కో మహిళ సగటున ఆరుగురు పిల్లలకు జన్మనిచ్చేది. ప్రస్తుతం ఆ సంఖ్య దాదాపు రెండుకి చేరుకుంది.పట్టణీకరణ, ఉపాధి అవకాశాలు, మహిళా విద్య, కుటుంబ నియంత్రణ, ఆలస్యంగా పెళ్లిళ్లు చేసుకోవడం, పిల్లల పెంపకంపై పెరుగుతున్న వ్యయాలు వంటి కారణాల వల్ల మనదేశంలో జనాభా వృద్ధి రేటు 2.1 శాతంగా ఉండాల్సింది పోయి 1.94కి తగ్గింది. ప్రస్తుతం మనదేశంలో బీహార్లో అత్యధిక జననాల రేటు (3.0) ఉండగా తర్వాత రాష్ట్రాలు మేఘాలయ, ఉత్తరప్రదేశ్లు ఉన్నాయి. మరోవైపు ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు వంటి రాష్ట్రాలలో 1.4 నుంచి 1.6 మధ్య లో జననాల రేటు ఉంది. మన తెలుగు రాష్ట్రాలలో కూడా 1.5 నుంచి 1.6 శాతం ఉంది. ఒకప్పుడు జనాభా పెరుగుదల ఎక్కువగా ఉందని ఆందోళన చెందిన తెలుగు రాష్ట్రాలలోనే ఇప్పుడు జనాభా కొరత కనిపించడం గమనార్హం.ఇదీ ఇవాళ్టి ప్రస్థానం!ప్రతి ఏటా జూలై 11వ తేదీన, ప్రపంచ దేశాలన్నీ భూమిపై మారుతున్న జనాభా పోకడలను, అవి మన భవిష్యత్తుపై చూపే ప్రభావాన్ని అంచనా వేయడానికి ఒకక్షణం ఆగి ఆలోచిస్తాయి. ప్రస్తుతం ప్రపంచ జనాభా ఏకంగా 830 కోట్లు దాటిన తరుణంలో, ఈ ఏడాది ప్రపంచ జనాభా దినోత్సవం ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. చారిత్రాత్మక మైలురాళ్ల నుంచి నేటి యువత ఆకాంక్షల వరకు.. ఈ ఏడాది జనాభా దినోత్సవాన్ని ప్రత్యేకంగా మార్చే ఐదు ముఖ్యమైన అంశాలు...ఈ ఏడాది థీమ్ ప్రపంచ జనాభా దినోత్సవం 2026 ప్రధాన నినాదం ‘యువత ఆశలు, ఆకాంక్షలను.. నేడు.. భవిష్యత్తు కోసం సాకారం చేయడం’. అంటే నేటి యువత తమ బంధాల గురించి, కుటుంబ నియంత్రణ లేదా పిల్లలను కనడం గురించి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు? వారి ఆశలు ఏమిటి? వారు ఎదుర్కొంటున్న సవాళ్లు ఏమిటి? అనే విషయాలపై ప్రపంచవ్యాప్తంగా నిర్వహించిన ఒక సర్వే ఆధారంగా ఈ ఏడాది థీమ్ను రూపొందించారు.చారిత్రాత్మక మైలురాయి1987 జూలై 11 నాటికి జనాభా సరిగ్గా ఐదు వందల కోట్లకు చేరింది. అప్పట్లో దీనిపై ప్రపంచ వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ నడిచింది. దాంతో జనాభా సమస్యలపై నిరంతరం అవగాహన కల్పించడం కోసం 1989లో ఐక్యరాజ్యసమితి ప్రతి ఏటా జూలై 11ను ప్రపంచ జనాభా దినోత్సవంగా ప్రకటించింది. అప్పటి నుంచి ప్రతి ఏడాది జూలై 11న ప్రపంచ వ్యాప్తంగా జనాభా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.ఇలా మొదలైంది..మొట్టమొదటి అధికారిక ప్రపంచ జనాభా దినోత్సవాన్ని 1990లో 90 కి పైగా దేశాల భాగస్వామ్యంతో ఘనంగా నిర్వహించారు. అప్పటి నుంచి ఏటా ఈ రోజున భాగస్వామ్యం వహిస్తున్న దేశాలు, సంస్థలు, స్వచ్ఛంద సంఘాల సంఖ్య నిరంతరం పెరుగుతూనే ఉంది. జనాభా సమస్యలతో పాటు అవి ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్యం, అభివృద్ధి, పర్యావరణంపై చూపే ప్రభావాల గురించి అవగాహన పెంచడానికి ప్రపంచవ్యాప్తంగా అందరూ చేతులు కలుపుతున్నారు.ఆరోగ్య సంరక్షణే లక్ష్యం!అన్ని ప్రాంతాల వారికి, ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాలలోని మహిళలు, యువతకు సార్వత్రిక పునరుత్పత్తి ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలు అందేలా చూడటమే ఈ రోజు ప్రధాన లక్ష్యం. కుటుంబ నియంత్రణ, మాతా శిశు సంరక్షణ విషయాలలో ప్రజలు సరైన నిర్ణయాలు తీసుకునేలా అవగాహన కల్పించడం ఈ రోజు జరుపుకోవడంలో ఉన్న ముఖ్య ఉద్దేశ్యం. దీనిని మానవ హక్కులు, లింగ సమానత్వం, ప్రపంచ సుస్థిర అభివృద్ధితో ఐక్యరాజ్యసమితి నేరుగా ముడిపెట్టింది.పెరుగుదల ఒకేలా లేదు!ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా జనాభా మార్పులు చాలా విచిత్రంగా ఉన్నాయి. భారతదేశం వంటి దేశాలు ఇప్పటికీ వేగవంతమైన జనాభా వృద్ధిని నమోదు చేస్తుంటే, జపాన్ వంటి దేశాలలో జనాభా క్రమంగా పడిపోతోంది. ఈ భిన్నమైన పోకడలు ఆయా దేశాలకు వేర్వేరు సవాళ్లను విసురుతున్నాయి. పెరుగుతున్న జనాభా వల్ల ఇళ్లు, ఉద్యోగాలు, వైద్యం, వనరుల కొరత ఏర్పడుతుంటే, తగ్గుతున్న జనాభా వల్ల సమాజంలో వృద్ధుల సంఖ్య పెరిగి, పనిచేసే యువశక్తి తగ్గిపోతోంది. దీనివల్ల వివిధ దేశాలు తమ సామాజిక, ఆర్థిక అవసరాలకు తగ్గట్టుగా భిన్నమైన ప్రణాళికలు వేసుకోవాల్సి వస్తోంది. ఇలా నాణ్యమైన ప్రమాణాలతో జీవించే దేశాలలో జనాభా రోజురోజుకీ తగ్గిపోతోంది. మా దేశానికి రండి జనాభాను పెంచండి..మీకు ఉపాధి కల్పిస్తాం..ఉద్యోగాలిస్తాం అంటూ పలు దేశాలు ప్రకటనలు చేయడం ఇప్పటికే మనం చూస్తున్నాం.– శ్రావణ్ జయ -
అవేర్నెస్ ఆపొద్దు..
పిరియడ్స్ గురించిన అవేర్నెస్ను మళ్లీ మళ్లీ గుర్తు చేసుకోవాల్సిందేఒక అమ్మాయి స్కూల్కు సెలవు పెట్టడానికిఒక క్రీడాకారిణి మైదానానికి దూరంగా ఉండడానికిఉద్యోగినులు చాలాసార్లు ఇబ్బంది పడటానికిఈ సమస్య పై అవగాహన లోపమే కారణం.శరీరం పెట్టే ఇబ్బంది కంటే సమాజం చేస్తున్న అవమానమే జాస్తి.చైతన్యం కోసం అందరూ తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు.సినిమా రంగంలో కూడా ‘ప్యాడ్మ్యాన్’ వంటి సినిమాలు నిశ్శబ్దంగా ఉన్న గోడలను బద్దలు కొట్టాయి. ఇప్పుడు ‘పిరియడ్ సేఫ్’ పేరుతో మన వంతు కాంపెయిన్ మనం చేశాం.స్కూల్ పిల్లల నుంచి జాతీయ క్రీడాకారిణుల వరకు వారి గొంతు విన్నాం. కానీ... ఇది సరిపోదు. ఈ సంభాషణ ఇక్కడితో ఆగకూడదు. ప్రతి అమ్మాయికి సురక్షితమైన గౌరవప్రదమైన పిరియడ్ దక్కే వరకు మన పోరాటం ఆగదు. ఈరోజు మనం మాట్లాడింది రక్తం గురించి కాదు. రేపటి తరం ధైర్యం గురించి.నెలసరి సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సమస్యలకు పరిష్కారాలు తెలియజేస్తున్నవారి సూచనలను మనమూ పాటిద్దాం. మన ఇంట్లోనూ పీరియడ్ ఫేజ్ నిశ్శబ్దపు గోడలను కూల్చేద్దాం. ‘ఆ రోజులలో’ ఆమె పరిస్థితిని అర్థం చేసుకుందాం.. అండగా ఉందాం..టీచర్లే ముందు గుర్తించగలరుమాది కో ఎడ్యుకేషన్ స్కూల్. అబ్బాయిలకన్నా అమ్మాయిల సంఖ్యే అధికం. నెలసరి సమయంలో అమ్మాయిల శారీరక, మానసిక స్థితి ఎలా ఉంటుందో తెలుసు కాబట్టి దానిపై వారికి అవగాహన కోసం ఏడాదికి మూడుసార్లైనా అవేర్నెస్ క్యాంపులను ఏర్పాటు చేయిస్తాం. అమ్మాయిల నెలసరి సమస్యలను అడిగి తెలుసుకుంటాం. నెలసరి సమయంలో శుభ్రత పాటించకపోతే భవిష్యత్తులో ఎలాంటి ఇన్ఫెక్షన్లు వస్తాయి, అవి దీర్ఘకాలం ఎలా బాధిస్తాయో వివరిస్తాం. ఇన్ఫెక్షన్లు వచ్చిన మహిళలు తల్లులు కావాలనుకుంటే ఎలాంటి సమస్యలు వస్తాయో తెలియజేస్తాం. శానిటరీ ప్యాడ్స్ వాడకం గురించి చెబుతూ, ఎన్జీవోల సాయంతో స్కూల్స్కి శానిటరీ ప్యాడ్స్ తెప్పిస్తుంటాం. ఆరు నెలలకు సరిపడా అమ్మాయిలకు కావల్సిన ప్యాడ్స్ ఒకేసారి పంపిణీ చేస్తాం. ఆరోగ్యంగా ఎదగడానికి కావల్సిన అవగాహన స్కూల్లో కలిగిస్తాం. – వాణీ సక్కుబాయి, జెడ్పిహెచ్ఎస్ టీచర్ఇంటింటికీ వెళ్లి అవగాహనఆశావర్కర్గా ఇరవై ఏళ్లుగా పనిచేస్తున్నాను. గ్రామీణ ప్రాంతంలో తల్లీ పిల్లల ఆరోగ్య సంరక్షణ గురించి ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటాం. ప్రసవం తర్వాత మహిళలు చాలా సమస్యలు ఎదుర్కొంటుంటారు. అధిక రక్తస్రావం, నెలసరి సక్రమంగా రాకపోవడం, రక్తహీనత వంటి సమస్యల గురించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో మహిళలకు చెబుతుంటాం. స్కూళ్లకు వెళ్లి నెలసరి సమయంలో శుభ్రత లేకపోతే వచ్చే సమస్యల గురించి వివరించడం, సర్వైకల్ క్యాన్సర్ గురించి చెప్పడం, వ్యాక్సిన్లు వేయించడం చేస్తుంటాం. బిడ్డ పుట్టిన దగ్గర నుంచి ఆ బిడ్డ తల్లి అయ్యి, ఆరోగ్యకర జీవనం గడిపే వరకు మా పాత్ర ఉంటుంది. ఫోన్ల ద్వారానూ, ఇంటింటికి వెళ్లి కూడా మా సేవలను అందిస్తాం. – గంగిలి ధనలక్ష్మి, ఏఎన్ఎమ్తరచూ వర్క్షాప్స్మేం వాటర్, శానిటరీ క్లీనింగ్కు సంబంధించి వర్క్ చేస్తుంటాం. దీంట్లో భాగంగా తరచూ యువతులకు, మహిళలకు శుభ్రతకు సంబంధించిన వర్క్షాప్స్ నిర్వహిస్తుంటాం. ఉపయోగించిన ప్యాడ్స్ను ఎలా డిస్పోజ్ చేయాలో చెబుతాం. మట్టిలో పూడ్చిపెట్టడం కన్నా వాడిన ప్యాడ్స్ను కాల్చేయమని సూచిస్తాం. పీరియడ్స్ వచ్చిన సమయంలో చేతులు, డ్రెస్సుల శుభ్రత, ప్యాడ్స్ మార్చుకోవడం, ఇన్ఫెక్షన్స్ గురించి తరచూ చెబుతుంటాం. కొందరు తమ సమస్యలను నేరుగా వచ్చి, చర్చిస్తుంటారు. వ్యక్తిగత పరిశుభ్రతతోపాటు పరిసరాల శుభ్రతను పాటించడం కూడా చాలా ముఖ్యం.– రేవతి, వాటర్ ఎయిడ్ ఇండియా, స్వచ్ఛంద స్వస్థ కమ్యూనిటీ ఫెసిలిటేటర్కుటుంబ మద్దతు అవసరంనెలసరి సమయంలో అమ్మాయిల మనస్తత్వంలో చాలా మార్పులు ఉంటాయి. వారు తినే ఆహారం, పెరిగిన వాతావరణం కూడా వారి శారీరక, మానసిక ఆరోగ్యాలపై ప్రభావం చూపుతుంటాయి. ముఖ్యంగా చదువుకునే పిల్లలు నెలసరి సమయంలో వచ్చే సమస్యలను అంత సులువుగా అర్థం చేసుకోలేక ఆందోళన పడుతుంటారు. ఆ సమయంలో వారికి మనస్తత్వ నిపుణుల కౌన్సెలింగ్ అవసరం. ఉద్యోగినులు నెలసరి సమయంలో తమ వర్క్ ప్లేస్లో బ్యాలెన్స్డ్గా ఉండటానికి ప్రయత్నిస్తున్నారు. ఇంట్లో మాత్రం చిన్న విషయాలకు కూడా తీవ్రంగా ప్రతిస్పందిస్తారు. పీరియడ్స్ ఉన్నవారి మనస్తత్వాన్ని అర్ధం చేసుకుంటూ కుటుంబం వారికి మద్దతుగా ఉండాలి. అప్పుడే ‘ఆమె’ సంతోషంగా ఉంటుంది. కుటుంబమూ సంతోషంగా ఉంటుంది. – డాక్టర్ సునీతాప్రసాద్, సైకాలజిస్ట్నిర్వహణ: నిర్మలారెడ్డి -
వర్షాకాలంలో ఆ ఇన్ఫెక్షన్ల బారిన పడకూడదంటే..! తప్పనిసరిగా ఆ ఆహారాలు..
తొలకరి జల్లులతో హమ్మయ్యా అనేలా..భగభగ మండే ఎండల నుంచి చల్లటి ఉపశమనం కలిగించే ఆహ్లాదభరిత వాతావరణం ఇది. ఎంతో చల్లగా ఉండే ఈ సీజన్ ఆహారం, నీరు కలుషితమయ్యే అవకాశాలు పుష్కలంగా ఉండే కాలం కూడా. అందువల్లే ఈ సీజన్లో తాజాగా వండిన భోజనం, సురక్షితమైన తాగు నీటిని ఎంచుకుంటేనే కాలానుగుణ వ్యాధులకు అడ్డుకట్ట వేయగలమని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. వెచ్చని ఉష్ణోగ్రతల కలయికలో బ్యాక్టీరియా, వైరస్లు, ఫంగస్లు పెరగడానికి సరైన సమయం ఇది. ఫలితంగా కడుపు ఇన్ఫెక్షన్లు, ఫుడ్ పాయిజనింగ్ డయేరియా, గ్యాస్ట్రోఎంటరైటిస్, టైఫాయిడ్, హెపటైటిస్ ఏ వంటి అనేక వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువ ఈ కాలంలో. అందువల్ల ఎలాంటి ఆహారం తింటే అనారోగ్యం బారిన పడకుండా ఉంటాం, అందుకోసం ఏం చేయాలి తదితరాల గురించి సవివరంగా తెలుసుకుందామా.!.స్ట్రీట్ ఫుడ్..వర్షాకాలంలో దూరంగా ఉండవలసిన అతిపెద్ద ఆహారాలలో వీధి ఆహారం ఒకటి. చాట్, పానీ పూరీలు, కోసిన పండ్లు, మూతపెట్టని చిరుతిళ్లు, బహిరంగ ప్రదేశాల్లో తయారు చేసే ఆహారాలు తదితరాలకు దూరంగా ఉండటం మంచిది. అమ్మకందారులు సురక్షితమైన నీటిని వినియోగించనట్లయితే..కడుపు ఇన్ఫెక్షన్ల ప్రమాదం అధికంగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు. అందువల్ల తాజాగా ఇంట్లో తయారు చేసిన ఆహారాన్ని ఎంచుకోవడమే సురక్షితమైందని సూచిస్తున్నారు.పచ్చి ఆకు కూరలు, సలాడ్లుపచ్చి ఆకుకూరలలో, ముఖ్యంగా వర్షాకాలంలో, మట్టితోపాటు పరాన్నజీవులు, హానికరమైన సూక్ష్మజీవులు ఉండవచ్చు. వాటిని సరిగ్గా కడగకపోతే, అవి జీర్ణాశయ సంబంధిత ఇన్ఫెక్షన్లకు కారణం కావచ్చు. వండటం వల్ల వ్యాధులను కలిగించే చాలా సూక్ష్మక్రిములు నశిస్తాయి కాబట్టి, సాధ్యమైనంత వరకు వండిన కూరగాయలను తినమని వైద్యులు సిఫార్సు చేస్తున్నారు. ఒకవేళ సలాడ్లు తినాలనుకుంటే, వాటిని ఇంట్లో శుభ్రమైన నీటితో బాగా కడిగి తీసుకోవడం మేలు. పండ్లు, కూరగాయలను బాగా కడిగే ముందు, వాటిని కొద్దిగా వెనిగర్ కలిపిన నీటిలో నానబెట్టి తీసుకోవడం మరింత మంచిది.తాజాగా లేని సముద్రపు ఆహారంవర్షాకాలంలో సముద్రపు ఆహారాన్ని జాగ్రత్తగా తినాలి. ఎందుకంటే ఈ కాలంలో చాలా చేపలకు సంతానోత్పత్తి కాలం. దాంతో ఈ సమయంలో, కలుషితం కావడం,పాడైపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సముద్రపు ఆహారాన్ని తినాలని ఎంచుకుంటే, అది తాజాగా, పూర్తిగా ఉడికించినదైతేనే తీసుకోవడం సురక్షితం. సరిగ్గా ఉడకని లేదా పాడైపోయిన సముద్రపు ఆహారం వల్ల ఆహార సంబంధిత అనారోగ్యాలు, కడుపు ఇన్ఫెక్షన్ల ప్రమాదం అధికంగా ఉంటుంది.మిగిలిపోయిన..పాడైపోయిన ఆహారంఎక్కువ కాలం పాటు రిఫ్రిజిరేటర్లో ఉంచిన లేదా చాలా గంటల పాటు బయట వదిలేసిన ఆహారాన్ని తినడం మానుకోవాలి. ఎందుకంటే తేమతో కూడిన వాతావరణంలో బ్యాక్టీరియా చాలా వేగంగా వృద్ధి చెందుతుంది. దీనివల్ల మిగిలిపోయిన ఆహారాన్ని సరిగ్గా నిల్వ చేయకపోతే అది సురక్షితం కాదు. తప్పనిసరిగా ఆహారాన్ని నిల్వ చేయాల్సి వస్తే, దానిని త్వరగా రిఫ్రిజిరేటర్లో పెట్టి, తినే ముందు బాగా వేడి చేసుకోండి.వేయించిన నూనెతో కూడిన ఆహారాలువర్షాకాలంలో ప్రజలు తరుచుగా పకోడాలు, సమోసాలు, ఇతర వేయించిన చిరుతిళ్లను తినేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. ఈ ఆహారాలు బరువుగా ఉండి, జీర్ణం కావడం కష్టంగా ఉంటాయి. పైగా ఇలాంటి ఆహారాల వల్ల ఎసిడిటీ, కడుపు ఉబ్బరం, అజీర్ణం వంటి అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం అధికంగా ఉంటుంది.చక్కెర పానీయాలు, డెజర్ట్లు, పచ్చి ఆహారాలుఅధిక చక్కెర పానీయాలు , డెజర్ట్లు వాపుకు కారణం కావచ్చు. పైగా మొత్తం రోగనిరోధక శక్తిని ప్రభావితం చేయగలవు. వర్షాకాలంలో బయట అమ్మే పచ్చి మొలకలు,ముందుగా కోసిన పండ్లకు దూరంగా ఉండటం మంచిది.ఎందుకంటే అవి బ్యాక్టీరియా వృద్ధికి సులభంగా నిలయాలుగా మారతాయి. బదులుగా, అరటిపండ్లు దానిమ్మపండ్లు వంటి తొక్క తీయగలిగే సీజనల్ పండ్లను ఎంచుకోవడం మేలు.ఆరోగ్యకరమైన ఆహారపు చిట్కాలుతేలికగా, పోషక విలువలతో, సులభంగా జీర్ణమయ్యే, తాజాగా తయారుచేసిన ఇంట్లో వండిన భోజనంపై దృష్టి పెట్టాలని సూచిస్తున్నారు వైద్యులుబాటిల్లోని నీటిని లేదా మరిగించిన నీటిని మాత్రమే తాగండి. అవసరమైతే..వాటర్ ప్యూరిఫైయర్ను ఉపయోగించండి లేదా క్లోరిన్ టాబ్లెట్ను కలపండి.వీధి ఆహారానికి దూరంగా ఉండి, ఇంట్లో వండిన భోజనానికే ప్రాధాన్యత ఇవ్వండి.గోధుమలు, పిండిచేసిన ధాన్యాలు సురక్షితమైనవిపండ్లు, కూరగాయలను క్షుణ్ణంగా కడగి తీసుకోవడం మేలుపచ్చి మొలకలు, కోసిన పండ్లకు దూరంగా ఉండండి: ఇవి బ్యాక్టీరియా వృద్ధికి నిలయాలుగా మారతాయిశుభ్రమైన పాత్రలు, పళ్ళాలు వాడండి: వాటిని సబ్బుతో క్షుణ్ణంగా కడగండిశరీరంలో నీటి శాతం తగ్గకుండా చూసుకోండి: పుష్కలంగా ద్రవపదార్థాలు తాగండితరచుగా చేతులు కడుక్కోండి: ముఖ్యంగా తినడానికి ముందు, వాష్రూమ్కి వెళ్లి వచ్చాక తప్పనిసరిగా చేతులు కడుక్కుని తినడం మంచిది. గమనిక: ఇది కేవలం అగాహన కోసం మాత్రమే. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: సంస్కృతం చదవడం రాదు.. ఐనా భగవద్గీతను ఎంబ్రాయిడరీ చేసింది!) -
మెన్స్ట్రువల్ లీవ్.. ఓ చర్చ! బలమా... బలహీనతా?
ఉద్యోగాలు చేసే మహిళలకు ఇచ్చే మెన్ స్ట్రువల్ లీవ్ పాలసీపై సానుకూల, ప్రతికూల కోణాల్లో దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. కొన్ని కార్పొరేట్ కంపెనీలు, కర్ణాటక వంటి కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఈ దిశగా అడుగులు వేస్తుండగా.. సుప్రీంకోర్టు, పలువురు మేధావులు మహిళలకు పీరియడ్స్ లీవ్స్ తప్పనిసరి చేయడం వల్ల వారు ఉపాధి రంగంలో వెనుకబడిపోయే ప్రమాదం ఉండటమే కాదు, ప్రాజెక్ట్ డెడ్లైన్లు, వ్యాపార ఉత్పాదకతను దృష్టిలో ఉంచుకుని కార్పొరేట్ సంస్థలు పురుషులకేప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఇలాంటి సెలవుల వల్ల పురుషులతో సమానంగా గుర్తింపు, వేతనం కోసం మహిళలు దశాబ్దాలుగా చేస్తున్న పోరాటాలు నీరుగారిపోయి, మహిళలను శారీరకంగా బలహీనులుగా చూసే పాతకాలపు మూస పద్ధతులు మళ్లీ బలపడతాయని ప్రముఖంగా వినిపిస్తున్న వాదన.కాబట్టి మహిళల కెరీర్ను దృష్టిలో ఉంచుకుని సమతుల్యమైన విధానాలను రూ΄÷ందించాలి. అంటే ‘ఆ రోజుల్లో’ ఇంటినుంచి పనిచేసే సౌలభ్యం ఇవ్వడం, మెడికల్ లీవ్స్ పెంచడం, పనిగంటల్లో వెసులుబాటు... వంటివి. దీనివల్ల యాజమాన్యాలకు నష్టం జరగకుండా.. పని ఉత్పాదకత లో మార్పు లేకుండా ఉంటుంది. మహిళలకూ ఉపశమనంగా ఉంటుంది. దీనివల్ల మెన్స్ట్రువల్ లీవ్ అనే ప్రత్యేక లేబుల్ లేకుండా.. మహిళల గోప్యతకు భంగం లేకుండా కూడా ఉంటుందని పలువురి అభిప్రాయం. -
Health: శరీరం ఇచ్చే సంకేతాలను వినాలి..
‘నెలసరి సమస్యల గురించి, పాటించాల్సిన జాగ్రత్తల గురించి ఎంత ఎక్కువ మాట్లాడుకుంటే అంత అవగాహన పెరుగుతుంది’ అంటున్నారు వైద్యులు. ‘శరీరం ఇచ్చే సంకేతాలను వినాలి, అర్థం చేసుకోవాలి’ అంటున్నారు. పీరియడ్ సేఫ్ గురించి స్త్రీల వైద్య నిపుణులు చెప్పే విషయాలు తెలుసుకుందాం.. ఆచరణలో పెడదాం..సేఫ్ పీరియడ్ పద్ధతిని అనుసరించాలనుకునే మహిళలు ముందుగా తమ రుతుక్రమ చక్రాన్ని కనీసం ఆరు నెలల నుంచి ఒక సంవత్సరం వరకు గమనించడం మంచిది. ప్రతి నెల పీరియడ్స్ ప్రారంభమైన తేదీని నమోదు చేసుకోవడం, చక్రం క్రమబద్ధంగా ఉందో లేదో తెలుసుకోవడం అవసరం. అవసరమైతే మొబైల్ యాప్ లేదా క్యాలెండర్ను ఉపయోగించవచ్చు. సాధారణంగా 28 రోజుల క్రమబద్ధమైన నెలసరి చక్రం ఉంటుంది. అయితే, ప్రతి మహిళ రుతుక్రమ చక్రం ఒకేలా ఉండదు. కొందరికి 21 రోజులు, మరికొందరికి 35 రోజుల వరకు కూడా సైకిల్ ఉండవచ్చు. ఒత్తిడి, హార్మోన్ల మార్పులు, ప్రయాణాలు, అనారోగ్యం, బరువులో మార్పులు వంటి కారణాల వల్ల అండాల విడుదల తేదీ మారవచ్చు. అందుకని ఎవరికి వారు మెన్స్ట్రువల్ క్యాలెండర్ని ఏర్పాటు చేసుకోవాలి.ప్యాడ్స్ పడేయడమూ సమస్యే!రుతుక్రమం సమయంలో శుభ్రత పాటించేవాళ్లు ఎక్కువకాలం ఆరోగ్యంగా ఉంటారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ శానిటరీ ప్యాడ్స్ కొనుక్కోవాలనే అవగాహన ఉంది. కానీ, వాటిని ఎక్కడ పడేయాలో తెలియక, ఇంట్లో పిల్లలు ప్రశ్నిస్తారనో, ఎవరూ చూడకుండా చీకటిపడ్డాక తీసేద్దామని అలాగే ఉంచడం.. ఈ కారణాలతో రోజంతా ప్యాడ్స్లోనే ఉంటారు. కొందరు తక్కువ స్రావం అవుతుందని ప్యాడ్స్ ఖర్చు తగ్గించుకోవడానికి కూడా రోజంతా అలాగే వాడతారు. ప్రతి 4 నుంచి 8 గంటలలోపు ప్యాడ్ మార్చుకోవాలి. లేదంటే అలెర్జీ, ఇన్ఫెక్షన్ వస్తాయి. గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లోని వారికి మహిళా సంఘాలు, స్వచ్ఛంద సంస్థల ద్వారా ప్యాడ్స్ అందిస్తే వాడి పడేస్తారు. తిరిగి అడగరు. వారికై వారు కొనుగోలు చేయరు. సమస్య మళ్లీ మొదలవుతుంది. వారికి మెనుస్ట్రువల్ కప్స్ వాడకాన్నిప్రోత్సహిస్తే సమస్య చాలా వరకు పరిష్కారం అవుతుంది. పీరియడ్ సేఫ్ గురించి సరైన అవగాహన కలిగి ఉండటం ప్రతి ఒక్కరికీ అవసరం. ఆరోగ్యంపై అవగాహన, శాస్త్రీయ సమాచారం, వైద్యుల సూచనలు ఉంటేనే మహిళలు తమ పునరుత్పత్తి ఆరోగ్యాన్ని మరింత సురక్షితంగా కాపాడుకోగలరు.అవగాహన తప్పనిసరి..పిల్లలు కావాలని డాక్టర్లను సంప్రదించేవారే తమ రుతుక్రమ సైకిల్ను శ్రద్ధగా పట్టించుకుంటున్నారు. మిగిలిన వాళ్లు మాత్రం రుతుక్రమ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల పట్ల నిర్లక్ష్యంగానే ఉంటున్నారు. స్కూల్కి వెళ్లే అమ్మాయిలకు తమ శరీరం గురించి, రుతుక్రమం సైకిల్ గురించి సరైన అవగాహన లేక΄ోవడం వల్ల గర్భధారణ, విచ్చిత్తి.. వంటి సంఘటనలు కూడా చూస్తున్నాం. పీరియడ్స్ వచ్చిన అయిదవ రోజు నుంచి శరీరంలో జరిగే మార్పుల గురించి అమ్మాయిలకు చె΄్పాలి. ఈ విషయంలో టీచర్లు, తల్లులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. – డాక్టర్ మనోరమ, ఇన్ఫెర్టిలిటీ స్పెషలిస్ట్, ల్యాప్రోస్కోపిక్ సర్జన్సొంత నిర్ణయాలు వద్దు..చాలా మంది నెలసరి సమయాలలో అధిక రక్తస్రావం, హార్మోన్లలో మార్పులు, రక్తహీనత, తీవ్రమైన నొప్పి.. వంటి సమస్యలెన్నో ఎదుర్కొంటుంటారు. ఇక గర్భధారణ లేదంటే గర్భం రాకూడదనుకునేవాళ్లు తమ సొంత నిర్ణయాలు అమలు చేస్తుంటారు. నెలసరి ఆలస్యం కావడానికి వాడే మాత్రలు, గర్భనిరోధక పద్ధతులు వైద్యుల సూచన మేరకే ఉపయోగించాలి. లేదంటే మరిన్ని ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది. ప్రతి మహిళ శరీరం భిన్నమైనది. వ్యక్తిగత ఆరోగ్య పరిస్థితికి అనుగుణంగా వైద్యుల సలహా పాటించడం సురక్షితమైన మార్గం.– డాక్టర్ శిరీషా రెడ్డి, గైనకాలజిస్ట్ -
5 రకాల ఫుడ్స్ కంప్లీట్ బంద్ : 11 నెలల్లో 32 కిలోలు తగ్గింది
మహిళలు పెళ్లి, పిల్లలు తరువాత చాలా బరువు పెరుగుతారు. ఇలా అదనంగా పెరిగిన బరువును తగ్గించు కోవడానికి చాలానే కష్టపడాల్సి వస్తుంది. కానీ అసాధ్యం కాదు. ఈ విషయాన్నే అక్షరాలా నిరూపించారు గురుగ్రామ్కు చెందిన దీప్తి హర్షానా. ఆహారం కూడా అంతే కీలక పాత్ర పోషిస్తుంది. డైటీషియన్ సహాయం లేకుండా, ఖరీదైన డైట్ ప్లాన్స్ జోలికి వెళ్లకుండానే తన బరువును 92 కిలోల నుండి 60 కిలోలకు తగ్గించుకున్నారు. అదెలాగో ఒకసారి చూద్దాం.క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం మరియు చురుకైన జీవనశైలిని కలిగి ఉండటం బరువు తగ్గడానికి ఎంతగానో సహాయపడినప్పటికీ, బరువు తగ్గాల నుకునే వారికి సరైన ఆహారపు అలవాట్లు (డైట్) చాలా ముఖ్యం. ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ దీప్తి హర్షానా సోషల్ మీడియాలో షేర్ చేసిన వివరాల ప్రకారం ఆమె కేవలం ఇంట్లో వండుకునే సాధారణ భోజనం, రోజుకు 45 నిమిషాల వ్యాయామంతో ఈ విజయాన్ని సాధించారు. ముఖ్యంగా 5 పదార్థాలను తన ఆహారం నుండి పూర్తిగా దూరం పెట్టి ఈ సక్సెస్ను సాధించడం విశేషం. View this post on Instagram A post shared by Deepti | Mom • Fitness • Lifestyle (@deepti_harshana)చక్కెర పానీయాలు (Sugary Drinks)ఇవి శరీరంలో కేలరీలను, బరువును మరియు ముఖం ఉబ్బిపోయేలా చేసే 'వాటర్ రిటెన్షన్'ను పెంచుతాయి. దీనికి ప్రత్యామ్నాయంగా ఆమె నిమ్మరసం, కొబ్బరి నీళ్లు మరియు గ్రీన్ టీ తాగడం అలవాటు చేసుకున్నారు. వైట్ బ్రెడ్ (White Bread)మైదాతో చేసే వైట్ బ్రెడ్లోని రిఫైన్డ్ కార్బోహైడ్రేట్లు రక్తంలో చక్కెర స్థాయిలను వేగంగా పెంచి, కొవ్వు పేరుకుపోయేలా చేస్తాయి. దీనికి బదులుగా మల్టీగ్రెయిన్ లేదా హోల్ వీట్ (గోధుమ) బ్రెడ్, సోర్డో (sourdough) బ్రెడ్ మరియు ఓట్స్ ఎంచుకున్నారు.ప్యాక్ చేసిన స్నాక్స్ (Packaged Snacks)చిప్స్, కుర్కురే లాంటి స్నాక్స్లో ఉప్పు, కేలరీలు ఎక్కువగా ఉంటాయి. ఇవి కడుపు ఉబ్బరానికి (bloating, ఇంకా లేనిపోని ఆకలికి కారణమవుతాయి. వీటి స్థానంలో కొద్దిగా వేయించిన శనగలు (roasted chana), డ్రై ఫ్రూట్స్ (nuts), తామర గింజలు (makhana) తిన్నారు.నూనెలో వేయించిన ఫాస్ట్ ఫుడ్ (Fried Fast Food)వీటిలోని అధిక కొవ్వు, ఉప్పు బరువును పెంచడమే కాకుండా శరీరాన్ని బద్ధకంగా మారుస్తాయి. అందుకే ఇంట్లోనే చేసుకునే హెల్తీ వ్రాప్స్ (wraps), పనీర్ లేదా చికెన్ టిక్కా మరియు సాధారణ ఇంటి భోజనాన్ని ప్రాధాన్యత ఇచ్చారు. ఇదీ చదవండి: 256 గంటలు, 131 మంది శ్రమ : ఆమీర్-గౌరీ అరుదైన వెడ్డింగ్ రింగ్అర్ధరాత్రి స్నాక్స్ (Late-Night Snacking)రాత్రి వేళల్లో ఆలోచించకుండా ఏది పడితే అది తినడం వల్ల శరీరానికి అవసరం లేని అదనపు కేలరీలు చేరతాయి. ఈ విషయాన్నిగ్రహించిన ఆమె రాత్రి వేళ చిరుతిండ్లను పూర్తిగా దూరం పెట్టాడు. అలాగే ఆకలిగా లేదా ఏదైనా తినాలనిపిస్తే హెర్బల్ టీ తాగాలని ఆమె సూచించారు. ఇంకా రోజుకు 2-3 లీటర్ల నీళ్లు తాగడం, 7 గంటల నిద్ర, ప్రతీరోజూ వాకింగ్ చేస్తే, బాడీలో, ముఖ్యంగా మార్పు తప్పకుండా గమనిస్తారు అంటూ చెప్పుకొచ్చారు. View this post on Instagram A post shared by Deepti | Mom • Fitness • Lifestyle (@deepti_harshana)నోట్: కచ్చితమైన ప్రణాళిక, నిపుణుల పర్యవేక్షణ ఉంటే అధిక బరువును తగ్గించుకోవడం సులువే అవుతుంది. ఈ సమాచారం కేవలం సాధారణ అవగాహన కోసం మాత్రమే. బరువు తగ్గడానికి ఎలాంటి డైట్ పాటించాలన్నా ముందుగా వైద్యులను లేదా నిపుణులను సంప్రదించడం మంచిది.ఇదీ చదవండి: ఆమీర్ భార్య గౌరి బ్రైడల్ లుక్ : 'పఠానీ హార్' విశేషాలు తెలుసా? -
సంతోషాన్ని ప్రకటించడానికి 'నవ్వు' చాలు..
నవ్వే ఆరోగ్యం అని, ఔషధం అనీ కొందరంటుంటే అందానికి చిహ్నం అని మరికొందరు అంటున్నారు.. నవ్వుల రేడు చార్లీ చార్లిన్ నవ్వలేని రోజు వృథా అంటాడు... శతకాల్లో నవ్వును గురించి పెద్దలు ఏం చెప్పారో తెలుసుకుందాం.సభల్లో, పెద్దల ముందు ఎవరిని చూసి నవ్వకూడదో సుమతీ శతకంలో బద్దెన చెప్పాడు...‘నవ్వకుమీ సభ లోపల నవ్వకుమీతల్లిదండ్రి నాధులతోడన్నవ్వకుమీ పరసతితో నవ్వకుమీ విప్రవరుల నయమిది సుమతీ‘తాను చెప్తున్నది లోకనీతి అంటూ ఎవరితో అపహాస్యంగా నవ్వకూడదో ఒక జాబితా తయారు చేశాడు బద్దెన. ఏడు శతాబ్దాలు దాటినా బద్దెన చెప్పిన మాటలు ఇప్పటి సామాజిక పరిస్థితులకు అనువర్తించేలా ఉంటాయి..వేమన ‘కల్మషం లేని నవ్వును, నిర్మలమైన మనస్సులేని నవ్వును నిజమైన నవ్వు కాద’ని తీర్పే ఇచ్చాడు.అదే తోవలో కపట నవ్వుని ప్రస్తావిస్తూ ఆ నవ్వు నవ్వే కాదని తేల్చేశాడు.‘మనసునందు మాలిన్యంబు మానకుండామాటలందు మైత్రి నాటింపనేలలోని కల్మషంబు లేకుండ నవ్వని నవ్వు నవ్వు గాదు నరులకెల్లవిశ్వదాభిరామ వినుర వేమ..’ అని అంటాడు.నిర్మలమైన మనసుకు నవ్వే అందం అంటాడు.‘తప్పులెన్నువారు తమ తమ తప్పులెరుగురు’ అన్నట్లు..‘తమకుగల్గు పెక్కు తప్పులునుండగా ఓగు నేరమంచు నోరులగాంచి చక్కిలంబుగాంచి జంతిక నగినట్టు విశ్వదాభిరామ వినుర వేమ ‘పద్యం లో ‘నగి’ అంటే నవ్వు గూర్చి ప్రస్తావన... చక్కిలాన్ని చూసి జంతిక నవ్విందట.మరో సందర్భంలో వేమన ఏమని అంటున్నాడో చదవండి.‘భూమి నాదియనిన భూమి ఫక్కున నవ్వుదానహీను జూచి ధనము నవ్వుకదన భీతు జూచి కాలుండు నవ్వును ‘ఇందులో నవ్వు మాట వచ్చినా వేదాంతం గోచరిస్తుంది..ఈ రోజుల్లో భూమి కోసం హత్యలు చేస్తున్నారు... యాజమాన్యం మారుతుంది, భూమి మారదు, అందుకే నవ్వుతుందేమో.. దానం చేయమని, యుద్ధంలో పారిపోకుండా ఉండాలని యోగి భావన.భాస్కర శతకం ద్వారా ‘పరులను హేళన చేసేవాడు తానే నవ్వుల పాలవుతాడు’ చెప్పారు..సంతోషాన్ని ప్రకటించడానికి నవ్వు చాలు.. మనసారా నవ్వండి.– డా. కందాళ సత్యనారాయణ మూర్తి -
నీళ్లు తాగితే ఇరుక్కుపోతాయేమోనని.. తాగడమే మానేశా!
నాకు 24 ఏళ్లు. నేను బీటెక్ చేసి ఉద్యోగ ప్రయత్నాలలో ఉన్నాను. మా నాన్న చిన్నప్పుడే మమ్మల్ని వదిలి వెళ్లిపోయారు. అప్పటినుంచి మా అమ్మే ఎంతో కష్టపడి నన్ను, నా ఇద్దరు చెల్లెళ్లను చదివిస్తోంది. నాకు గత ఆరు నెలలుగా గొంతులో ఏదో ముద్ద ఉన్నట్లుగా అనిపిస్తోంది. మొదట్లో తినడానికి, తాగడానికి ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదు. కానీ క్రమంగా ఏదైనా తింటే లేదా నీళ్లు తాగితే అవి గొంతులోనే ఇరుక్కుపోతాయేమో, ఊపిరాడక చనిపోతానేమో అనే భయం మొదలై, అన్నం, నీళ్లు చాలా తక్కువగా తీసుకుంటున్నాను. దాంతో నా బరువు కూడా బాగా తగ్గిపోయింది. ఈఎన్టీ స్పెషలిస్టును సంప్రదించాను. ఆయన పరీక్షించి గొంతులో ఎలాంటి సమస్యా లేదని, ఒకసారి సైకియాట్రిస్టును కలవమని సూచించారు. గొంతులో మింగడానికి ఇబ్బంది ఉంటే సైకియాట్రిస్టును ఎందుకు కలవాలన్నది నా సందేహం. – సుజాత, తిరుపతిమీరు పడుతున్న ఇబ్బంది, మీ మనసులోని ఆందోళన అర్థమైంది. అధైర్య పడకండి, సమస్య ఏదైనా... దానికి పరిష్కారం ఉంటుంది. మీరు చెప్పిన వివరాల ప్రకారం వైద్యపరిభాషలో ఈ సమస్యను ‘గ్లోబస్ ఫారింజియస్’ లేదా ‘ఫాగోఫోబియా’ అంటారు, అంటే మింగడానికి భయపడటం. మన మనసుకు, శరీరానికి విడదీయరాని సంబంధం ఉంది. తీవ్రమైన మానసిక ఒత్తిడి లేదా ఆందోళన ఉన్నప్పుడు, శరీరం రకరకాలుగా స్పందిస్తుంది. మీ విషయంలో ఆ ఒత్తిడి గొంతులోని కండరాలను గట్టిగా బిగుసుకుపోయేలా చేసింది, దాంతో ఏదో ముద్దలా అడ్డం పడినట్లు అనిపిస్తోంది. ఇది శారీరక రోగం కాదు, తీవ్రమైన ఆందోళన వల్ల శరీరం చూపే స్పందన మాత్రమే, దీనినే ‘సైకోసోమాటిక్ సింప్టమ్’ అంటారు.రూపాయి నాణెంలో బొమ్మను, బొరుసును ఎలా వేరు చేయలేమో మనిషి మనసును– శరీరాన్ని కూడా వేరు చేయలేము. వాటిలో ఒకటి ఒత్తిడికి లోనయితే మరొకటి స్పందిస్తుంది. ఇలాంటి వాటిని నయం చేయడానికి సైకియాట్రిస్ట్లే సరైన నిపుణులు. ఒంట్లో నలతగా ఉంటే జనరల్ ఫిజీషియన్ ను ఎలా కలుస్తామో... మనసులో ఆందోళన ఎక్కువైతే సైకియాట్రిస్ట్ను అలాగే కలవాలి, ఇందులో సంకోచించడానికేం లేదు.మీరు తిరుపతిలోనే ఉన్నారు కాబట్టి, అక్కడ ఉన్న మంచి మానసిక వైద్యుణ్ణి కలవండి, మీ ఆందోళన తగ్గడానికి వారు కొన్ని సురక్షితమైన మందులు, కౌన్సెలింగ్ ఇస్తారు, దీనివల్ల గొంతు కండరాలు రిలాక్స్ అయి, మింగడం మళ్లీ మామూలైపోతుంది. మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది. మీరు త్వరగా కోలుకుంటేనే, మీ కుటుంబానికి మీరు అనుకున్నట్లుగా ఆసరాగా నిలబడగలుగుతారు. మంచి వైద్యం అందుబాటులో ఉన్న ఈ చిన్న సమస్యను, అనవసరమైన అపోహలతో పెద్దది చేసుకోకండి, మీరు త్వరలోనే సంపూర్ణ ఆరోగ్యంతో, ఉద్యోగంలో స్థిరపడాలని ఆశిస్తున్నాను, మీకు అంతా మంచే జరుగుతుంది!- డా. ఇండ్ల విశాల్ రెడ్డి, సీనియర్ సైకియాట్రిస్ట్, విజయవాడ.మీ సమస్యలు, సందేహాలు పంపవలసిన మెయిల్ ఐడీ: sakshifamily3@gmail.com -
నెలసరి అని సరిపెట్టద్దు
ఒకప్పుడు స్త్రీల ‘నెలసరి’ ఒక దాపరికం. సిగ్గు, భయం, ఆందోళనల మధ్య ఇంటిలో ఏదో మూలన దాగే దైన్యం. ఇప్పుడా పరిస్థితి లేదు. ఎలాంటి సందర్భంలోనైనా తమని తాము నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. వెండితెరపైన రాకుమార్తెల్లా మెరిసే ఈ హీరోయిన్లు షూటింగ్లలో పాల్గొనేటప్పుడు పీరియడ్స్ సమయంలో తమ సమస్య గురించి వివిధ సందర్భాలలో పంచుకున్న విషయాలు..అదేమీ నిషిద్ధ విషయం కాదునెలసరి గురించిన సంభాషణలు ఇప్పటికీ గుసగుసగా జరుగుతుంటాయి. అది ఒక నిషిద్ధ విషయంగా పరిగణిస్తారు. మహిళలుగా మనం చాలా విషయాల్లో ఎంతో ముందున్నాం. కానీ, ఇప్పటికీ నెలసరికి సంబంధించిన విషయాల్లో సిగ్గుపడుతుంటాం. పాతకాలపు భావనలు బద్దలు కొట్టడం ఈ రోజుల్లో చాలా కీలకం. మన రుతుక్రమాలు చాలా శక్తిమంతమైనవి. ఎప్పుడూ తేలికగా తీసుకోకూడదు. – సమంతఎక్స్క్యూజ్ ఉండదు‘సాంగ్ అండ్ డ్యాన్స్ స్వీక్వెన్స్ టైమ్లో పీరియడ్స్ వస్తే ఏం చేస్తారు’ అని అడుగుతుంటారు కొందరు. నావరకు ఫైట్సీన్లు ఉన్న ప్రతిసారీ పీరియడ్స్లోనే ఉంటాను. నా టీమ్ జోక్ చేస్తారు కూడా.. ‘మేడమ్ డేట్ వచ్చిందా, మీకు ఫైట్ సీన్ తప్పక ఉంటుంది..’ అంటారు. ఫైట్ సీన్లలో తాళ్లు పట్టుకొని పైకి ఎక్కడం, దిగడం, పరిగెత్తడం.. ఇవన్నీ ఉంటాయి. కానీ, ‘నాకు పీరియడ్స్ వచ్చింది, ఈ టైమ్లో చేయలేను. నన్ను ఎక్స్క్యూజ్ చేయండి’ అని అడగడానికి ఉండదు. షూట్లో కొన్నిసార్లు ΄్యాడ్స్ మార్చుకోవడానికి కూడా వీలుండదు. ఒకసారి ఫైట్ సీన్లు చేసే సమయంలో ఓవర్ బ్లీడింగ్ అయ్యింది. చెయిర్ పైన కూడా కనిపించి, చాలా ఇబ్బందిగా అనిపించింది. కానీ, అలాంటి టైమ్లో కూడా మేనేజ్ చేయక తప్పదు. మహిళలకు శారీరకపరంగా ప్రతినెలా ఈ సమస్య తప్పదు. ఇది మన శరీరం. మహిళలుగా మన శరీరాన్ని మనం అర్థం చేసుకోవాలి. అందుకు తగిన జాగ్రత్తలూ తీసుకోవాలి. – వరలక్ష్మి శరత్పరిమితులు ఉండవునేను చేసిన ఫాస్ట్ బీట్ సాంగ్స్ అన్నీ ప్రశంసలు అందుకున్నాయి. నేను నెలసరిలో ఉన్నప్పుడు కూడా షూటింగ్లో పాల్గొన్నా. పీరియడ్ టైమ్లో కూడా మాకు ఎక్స్క్యూజ్ ఉండదు. అంతే జోష్తో సాంగ్స్ షూట్లో పాల్గొనాలి. మిగతావారితో సమానంగా డ్యాన్స్ చేయాలి. స్త్రీలకు శారీరకంగా కొన్ని పరిమితులు ఉంటాయి. అవి మానసికంగానూ ప్రభావం చూపేవీ ఉంటాయి. అయినా వర్క్ విషయంలో వేటికీ పరిమితులు ఉండవు. శారీరక అడ్డంకులను అధిగమించి ముందుకు వెళ్లాల్సిందే. – శ్రీ లీలపీరియడ్స్ పురుషులకు ఉంటే...మగవాళ్లు కూడా ఒక్కసారన్నా నెలసరిని అనుభవించి, ఆ నొప్పిని, ఆ వేదనను తెలసుకోవాలని నేను కోరుకుంటున్నాను. హార్మోన్ల అసమతుల్యత కారణంగా మనకు అర్థం కాని భావోద్వేగాలను అనుభవిస్తాం. ఆ పెయిన్, ఆ ట్రామా, హార్మోనల్ ఇన్ బ్యాలన్స్, ఆ ఒత్తిడిని ఎంత వివరించినా వారికి ఆ ఫీలింగ్స్ అర్థం కావు. కాబట్టి మగవారికి ఒక్కసారైనా నెలసరి వస్తే, నెలసరి నొప్పి ఎలా ఉంటుందో భరిస్తే.. అర్ధం అవుతుంది. నాకు పీరియడ్స్ సమయంలో కడుపు నొప్పి వస్తే ఆ బాధ వర్ణనాతీతం. చాలాసార్లు అబ్డామినల్ స్కాన్, బ్లడ్ టెస్టులు చేయించాల్సి వచ్చింది. చాలా మంది డాక్టర్లను కలిశాను. కానీ, ఎలాంటి ఉపయోగమూ లేదు. ప్రతి నెలా దేవుడు నన్ను ఎందుకు ఇంత టార్చర్ పెడుతున్నాడు .. నేనేం చేశానా అని ఫీలవుతుంటాను కూడా. ఈ బాధ అర్థం చేసుకోవాలంటే అబ్బాయిలకి కూడా ఒక్కసారి పీరియడ్స్ వస్తే బాగుండు అనిపిస్తుంది. – రష్మికా మందన్నాపోరాటం తప్పదునెలసరి సమయంలో చాలా నొప్పితో బాధపడుతుంటాను. అలాంటి సమయంలో నటిగా డ్యాన్స్, స్టంట్స్ చేస్తున్నప్పుడు చాలా కష్టంగా ఉంటుంది. అప్పటికే అలసిన శరీరంతో పోరాడుతుంటాం. ఇక వర్క్ విషయంలో మరింత శక్తిని ధారపోయక తప్పదు. ఆ సమయంలో కొందరు విశ్రాంతి తీసుకుంటారు. కానీ, మాలో చాలా మందికి నెలసరి విశ్రాంతి ఉండదు. సాకుగా కూడా చెప్పలేం. – శృతీ హాసన్ నిర్వహణ: నిర్మలారెడ్డి -
యువ క్రికెటర్ బలి : ఇంత ప్రమాదమా ఈ వ్యాధి? లక్షణాలేంటి?
Shapoor Zadran ఆఫ్గానిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షాపూర్ జద్రాన్(38) అకాల మరణం క్రికెట్ అభిమానులను దిగ్భ్రాంతికి గురిచేసింది. అరుదైన, ప్రాణాంతక అనారోగ్య సమస్యతో బాధపడుతూ ఎంతో ఉజ్వలమైన భవిష్యత్తు మిగిలి ఉండగానే చిన్న వయసులోనే కన్ను మూశాడు. అసలేంటీ వ్యాధి? తెలుసుకుందాం.'హీమోఫాగోసిటిక్ లింఫోహిస్టియోసైటోసిస్' ((Hemophagocytic Lymphohistiocytosis) అనే వ్యాధితో చికిత్స పొందుతూ జద్రాను మరణించాడని ప్రకటించిన ఆఫ్గానిస్తాన్ క్రికెట్ బోర్డు (ACB) తీవ్ర విచారాన్ని వెలిబుచ్చింది. ఆఫ్గానిస్తాన్ క్రికెట్ ఎదుగుదలలో, దేశ క్రికెట్ను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడంలో షాపూర్ జద్రాన్ అందించిన సేవలు, నిబద్ధత ఎనలేనివంటూ బోర్డు అతనికి నివాళులర్పించింది.HLH అంటే ఏంటి? లక్షణాలు, చికిత్సఇది చాలా అరుదైన, తీవ్రమైన రోగనిరోధక వ్యవస్థ (Immune System) రుగ్మత. సాధారణంగా మన రోగనిరోధక వ్యవస్థ బాక్టీరియా, వైరస్ల నుండి శరీరాన్ని రక్షిస్తుంది. కానీ, ఈ వ్యాధి సోకినప్పుడు రోగనిరోధక వ్యవస్థ చాలా యాక్టివ్ అయి పోతుంది. ఇన్ఫెక్షన్లపై పోరాడాల్సింది పోయి సొంత శరీరంలోని ఆరోగ్యకరమైన కణజాలాలు, అవయవాలపైనే దాడి చేయడం ప్రారంభిస్తుంది. ఫలితంగా లివర్, ప్లీహం (Spleen), ఎముక మజ్జ (Bone Marrow), మెదడు వంటి ముఖ్యమైన అవయవాలు తీవ్రంగా దెబ్బతింటాయి.HLH రావడానికి కారణలు1. సాధారణంగా వంశపారంపర్యంగా వస్తుంది. తల్లిదండ్రుల నుండి వచ్చే జన్యుపరమైన లోపాల వల్ల వస్తుంది. ఎక్కువగా చిన్నపిల్లల్లో కనిపిస్తుంది.2. అలాగే కొన్ని రకాల అనారోగ్య సమస్యల వల్లఈ వ్యాధిసోకవచ్చు. తీవ్రమైన వైరల్ ఇన్ఫెక్షన్లు (ఉదాహరణకు ఎప్స్టీన్-బార్ వైరస్), లూపస్ వంటి ఆటోఇమ్యూన్ వ్యాధులు లేదా బ్లడ్ క్యాన్సర్ (లింఫోమా, ల్యుకేమియా) వంటి వాటి వల్ల ఇది రావచ్చు.ముఖ్యలక్షణాలుదీని లక్షణాలు సాధారణ ఇన్ఫెక్షన్ల లాగే ఉండటం వల్ల మొదట్లో గుర్తించడం కష్టం.తగ్గని తీవ్రమైన జ్వరం, తీవ్రమైన అలసట, బలహీనతకాలేయం (లివర్), ప్లీహం వాపునకు గురవడంచర్మంపై దద్దుర్లు, సులభంగా రక్తస్రావం కావడం లేదా వాతలు పడటంరక్తహీనత వల్ల చర్మం తెల్లబడటం లేదా కామెర్లు (Jaundice) రావడంతీవ్రమైన సందర్భాల్లో ఫిట్స్ (Seizures) రావడం లేదా మతిస్థిమితం తప్పడం.వ్యాధి నిర్ధారణ , చికిత్సఈ వ్యాధి సోకిందని నిర్ధారించేకు కొన్ని పరీక్షలు చేయాల్సి ఉంటుంది. కేవలం ఒకే ఒక పరీక్షతో దీనిని నిర్ధారించలేరు. రక్తం లోని కణాల సంఖ్య, ఫెర్రిటిన్ (Ferritin) స్థాయిలు, లివర్ ఫంక్షన్ టెస్ట్లు, మరియు బోన్ మ్యారో పరీక్షల ద్వారా వైద్యులు దీనిని గుర్తిస్తారు.మితిమీరిన రోగనిరోధక శక్తిని అదుపు చేయడానికి కార్టికోస్టెరాయిడ్స్, కీమోథెరపీ మందులు, ఇమ్యునోథెరపీ ఇస్తారు. ఇన్ఫెక్షన్ల నివారణకు యాంటీబయాటిక్స్ వాడుతుంటారు. జన్యుపరమైన సమస్య ఉన్నవారికి లేదా పరిస్థితి తీవ్రంగా ఉన్నవారికి 'స్టెమ్ సెల్ (బోన్ మ్యారో) ట్రాన్స్ప్లాంటేషన్' మాత్రమే ఏకైక మార్గం.ఇదీ చదవండి: రెడ్ బెనారసీ డ్రెస్లో పార్టీ లుక్.. తొలిసారి ఇలా అన్షులా! -
కంచంలో ఉన్నది అమృతమేనా?
‘మనిషి తినే ఆహారం ఔషధంలా ఉండాలి... ఔషధమే ఆహారంలా మారే పరిస్థితి రాకూడదు’ అని హిప్పోక్రటీస్ ఏనాడో చెప్పాడు. కానీ నేడు పరిస్థితి ఏమిటి? మనం తినేది ఆహారమో, విషమో తెలియని దుఃస్థితి. కల్తీ ఆహారం అనేది ‘స్లో పాయిజన్’. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం 2021లో ప్రపంచవ్యాప్తంగా 86 కోట్లకు పైగా ఆహార సంబంధిత అనారోగ్య కేసులు నమోదయ్యాయి. 15 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ఇది కేవలం రికార్డుల్లోకెక్కిన లెక్క మాత్రమే!అవే లెక్కల ప్రకారం, మన దేశంలోని మొత్తం మరణాల్లో 63 శాతం అంటురోగాలు కానివాటివల్లే కలుగుతున్నాయి. అందులో 27 శాతం మంది గుండె జబ్బుల వల్లే కన్నుమూస్తున్నారు. క్యాన్సర్ల గురించైతే ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఐసీఎమ్ఆర్ అంచనా ప్రకారం ఒక్క 2022లోనే భారత్లో 14.6 లక్షల కొత్త క్యాన్సర్ కేసులు నమోదయ్యాయి. ప్రతి 9 మంది భారతీయుల్లో ఒకరికి తమ జీవితకాలంలో క్యాన్సర్ ముప్పు పొంచి ఉందట! మరోవైపు, దాదాపు 13.8 కోట్ల మంది దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధులతో మగ్గి పోతున్నారు.ఎందుకిలా జరుగుతోంది? కూర గాయల నుంచి పండ్ల దాకా కొడుతున్న రసాయనాలు... హోటళ్లలో వాడిన నూనెనే పదే పదే వాడటం, ప్రాసెస్డ్ ఫుడ్లో ఉండే విషపూరిత ప్రిజర్వేటివ్స్, అల్లం పేస్ట్ నుంచి కారం వరకు అన్నింటిలో జరుగుతున్న కల్తీ– ఇవన్నీ మనిషిని బతకనిస్తాయా? అందుకే అభివృద్ధిచెందిన దేశాలు ఆహార భద్రతకు ప్రాధాన్యం ఇస్తున్నాయి.మన తెలంగాణ విషయానికి వస్తే... గతంలో జరిగిన తప్పులను సరిదిద్దు కుంటూ... ‘కల్తీ లేని తెలంగాణ’ లక్ష్యంగా 2024 జనవరి నుండి సరికొత్త వ్యూహంతో ముందుకు వెళ్తోంది. ఇందులో భాగంగానే హెచ్ఫాస్ట్, ప్రత్యేక ఫుడ్ సేఫ్టీ టాస్క్ఫోర్స్ బృందాలను రంగంలోకి దించి కఠిన చర్యలు తీసుకుంటోంది.2024 నుండి 5,500కి పైగా ముమ్మర తనిఖీలు చేసి, నాణ్యత లేని 2,000కి పైగా సంస్థలకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. తీవ్ర ఉల్లంఘనలకు పాల్పడిన 150కి పైగా హోటళ్లు, తయారీ కేంద్రాలను సీజ్ చేయడమే కాకుండా, రూ. 2 కోట్లకు పైగా జరిమానాలు విధించారు. 100కి పైగా క్రిమినల్ కేసులు నమోదు చేసి నిర్వాహకులను అరెస్ట్ చేశారు. దేశాన్ని అభివృద్ధి చేయడంతో పాటు ప్రజల కంచంలో పడే అన్నం సురక్షితంగా ఉండేలా ప్రభుత్వాలు చూడాలి. మన కంచంలోని ఆహారం సురక్షితం కాకపోతే... అభివృద్ధి కథనాలన్నీ చివరకు ఆసుపత్రి కారిడార్లలో ముగిసి పోతాయి. – నవీన్ కుమార్ రెడ్డి, సీనియర్ జర్నలిస్ట్ -
డాక్టర్ రోబో..! ఎంత దూరం నుంచైనా..
మనిషి నిర్మించిన యంత్రాల్లో అద్భుతమైనదీ, మానవుడికి ఇప్పుడు దాదాపుగా ప్రత్నామ్నాయం లాంటిది ‘రోబో’. అప్పట్లో కేవలం సైన్స్ ఫిక్షన్లా ఉన్న ‘ రోబో’లు ఇప్పుడు మానవ దేహ నిర్మాణానికి ఉండే పరిమితులను అ«ధిగమించి పనిచేస్తున్నాయి. దాంతో కొన్ని సమయాల్లో ఫిక్షన్కూ, వాస్తవానికీ మధ్య ఉండే సన్నటి రేఖ కూడా చెరిగిపోయిందా అనిపిస్తుంటుంది. ఎందుకంటే మానవుడు చేయడానికి కొంత ఇబ్బంది పడేవీ, లేదా పూర్తిగా చేయలేకపోయే ఎన్నింటినో ‘రోబో’ అలవోకగా చేసేస్తుంది.అందులో సర్జరీలూ ఉండటం విశేషం. సర్జరీలో మనిషి చేయి కొన్ని సంక్లిష్టమైన చోట్లకు చేరడం సాధ్యం కాకపోవచ్చు. కానీ ‘యంత్రుడి’ వేళ్లు అలాంటి చోట్లకూ చేరగలవు. నిజానికి ఈ పనులు రోబో చేస్తున్నట్టు అనిపించినా మళ్లీ వాటిని నిజానికి చేసేది నిపుణులైన శస్త్రచికిత్సకులే. కొన్ని కష్టసాధ్యమైన శస్త్రచికిత్సల్ని రోబోలు ఎలా చేస్తున్నాయో, ఏయే వైద్యవిభాగాల్లోని ఏయే శస్త్రచికిత్సలు జరుగుతున్నాయో తెలపడంతో పాటు రోబోలకు సంబంధించి అనేక అంశాలను ఈ కథనంలో చూద్దాం.రోబోటిక్ టెలీ సర్జరీతో వైద్యరంగంలో కొత్త అధ్యాయం ఈ రోబో శస్త్రచికిత్సలని చెప్పవచ్చు. ప్రస్తుతం రోబోటిక్ టెలీ సర్జరీ ప్రపంచ వైద్యరంగంలో విప్లవాత్మక సాంకేతికతగా గుర్తింపు పొందుతోంది. అమెరికాలో దాదాపు పదేళ్ల క్రితమే ఈ విధానం ప్రయోగాత్మకంగాప్రారంభమైంది. యుద్ధరంగంలోని సైనికులకు నేరుగా వెళ్లి శస్త్రచికిత్స చేసే అవకాశం ఉండకపోవడంతో... సమరరంగంలో ఉన్నవారికీ సర్జరీలు చేసే ఉద్దేశంతో మొదలైన ఈ ప్రయోగాత్మక శస్త్రచికిత్సలు ఇప్పుడు పూర్తిస్థాయిలో అవసరమైన బాధితులకు అందుతున్నాయి.మన భారతదేశంలో మాత్రం గత మూడేళ్లుగా ఈ సాంకేతికత మరింత వేగంగా అభివృద్ధి చెందుతూ, వైద్య సేవలను మరింత మందికి అందునా సుదూరప్రాంతాల్లోని పేషెంట్స్కు పెద్ద పెద్ద నగరాల్లో ఉండే అత్యంత నిపుణులైన శస్త్రచికిత్సల నైపుణ్యాలను అందుబాటులోకి తీసుకువస్తోంది. మన ఇండియా వంటి విశాలమైన దేశంలో, ఒక రాష్ట్రంలో ఉన్న నిపుణులైన వైద్యులు మరో రాష్ట్రంలో ఉన్న పేషెంట్లకు ప్రత్యక్షంగా అక్కడికి వెళ్లకుండానే రోబోటిక్ టెలీ సర్జరీ ద్వారా శస్త్రచికిత్సలు చేయగలగడం ఈ సాంకేతికత తాలూకు ప్రధాన ప్రయోజనం. దీంతో నాణ్యమైన వైద్య సేవలు దూర ప్రాంతాల రోగులకు కూడా అందుబాటులోకి వస్తున్నాయి.భారతదేశంలో రోబోటిక్ టెలీ సర్జరీకి శ్రీకారం చుట్టిన వారిలో డాక్టర్ సుధీర్ శ్రీవాత్సవ ప్రముఖులు. ఆయన ఢిల్లీలోని ఒక ఆసుపత్రి నుంచి మరో ఆసుపత్రికి దూర నియంత్రణ ద్వారా తొలి గుండె బైపాస్ శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. తర్వాత కిడ్నీ, ప్రోస్టేట్ తదితర సంక్లిష్ట శస్త్రచికిత్సలు కూడా ఈ విధానంలో విజయవంతంగా నిర్వహితమయ్యాయి.ఈ రంగంలో మరో ముఖ్యమైన మైలురాయిగా డా. చంద్రమోహన్ వడ్డి (ప్రస్తుత ఈ కథన / ఆర్టికల్) రచయిత కూడా ఢిల్లీలోని రోబోటిక్ కన్సోల్ నుంచి హైదరాబాద్లో ఉన్న కేవలం 16 నెలల చిన్నారికి ప్రపంచంలోనే అత్యంత చిన్న వయస్సులో రోబోటిక్ టెలీ సర్జరీని విజయవంతంగా నిర్వహించారు. ఈ విజయం తాలూకు కేసు వివరాలు ఇటీవల ఇండియన్ జర్నల్ ఆఫ్ యూరాలజీలో ప్రచురితమయ్యాయి.అటు తర్వాత దేశంలోని పలుప్రాంతాల మధ్య, అలాగే ఒక దేశం నుంచి మరో దేశానికి కూడా రోబోటిక్ టెలీ సర్జరీలు విజయవంతంగా నిర్వహితమవుతున్నాయి. ఇటీవల చైనా నుంచి హైదరాబాద్లోని పేషెంట్కూ టెలీ సర్జరీ నిర్వహించడం ఈ సాంకేతికత ప్రపంచవ్యాప్తంగా ఎంత వేగంగా విస్తరిస్తోందో తెలియజేస్తోంది. భవిష్యత్తులో రోబోటిక్ టెలీ సర్జరీ ద్వారా దూరప్రాంతాల్లోని రోగులకు అత్యున్నత స్థాయి వైద్య సేవలను వేగంగా, సురక్షితంగా అందించడానికి విస్తృత అవకాశాలు ఉన్నాయని వైద్య నిపుణులు అభిప్రాయం.ఇటీవలి చైనా కేస్ స్టడీ : ఇటీవలే మన భారతీయ డాక్టర్ ఒకరు చైనా నుంచి దాదాపుమూడు వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న మన హైదరాబాద్లోని పేషెంట్కు రోబో సహాయంతో శస్త్రచికిత్స చేశారు. దాదాపు 90 నిమిషాల పాటు నిర్వహించిన ఈ సర్జరీలో సుదూరంలో ఉన్న ఊహాన్ నగరంలోని టాంగ్జీ హాస్పిటల్లోంచి... దేశ దేశాంతరాలు దాటి మరీ మన హైదరాబాద్లోని పేషెంట్కు శస్త్రచికిత్స చేయడం... ఆ చేసిన వైద్యుడు కూడా డాక్టర్ సయ్యద్ మొహమ్మద్ గౌస్ అనే మన భారతీయ డాక్టర్ కావడం మన దేశవాసులందరికీ గర్వకారణమైన విషయం. అల్ట్రాఫాస్ట్ 5జీ ఇంటర్నెట్ కనెక్టివిటీతో జరిగిన ఈ సర్జరీ చేసింది. మన ఖ్యాతిని ఇనుమడింపజేసిన ఈ విషయాన్ని భారత్లోని చైనా ఎంబసీ స్పోక్స్పర్సన్ యూ జింగ్ తన ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. ‘‘3000 కిలోమీటర్ల దూరంలోని హైదరాబాద్ పేషెంట్కు 5జీ టెక్నాలజీ సహాయంతో సరిహద్దులను అధిగమించి జీవితాన్ని రక్షించే వైద్య సహాయం అందించడం ఓ అద్భుతం’’ అని ఆమె ‘ఎక్స్’లో ప్రస్తావించారు.ఆపరేషన్కు ముందర ఇక్కడ హైదరాబాద్లో కూడా డాక్టర్లు అవసరమైన ఉపకరణాలను, హై–డెఫినిషన్ కెమెరాలను సిద్ధం చేసుకోవడం వంటి పనులు చేశాక... అక్కడ వూహాన్లోని టాంగ్జీ హాస్పిటల్లో డాక్టర్ గౌస్ శస్త్రచికిత్స మొదలు పెట్టగానే ఇక్కడి రోబోటిక్ హస్తాలు శస్త్రచికిత్స చేయాల్సిన భాగాన్ని 3–డీ చిత్రాల్లో చూస్తూ తమ పనులు పూర్తి చేశాయి. హైస్పీడ్ 5జీ నెట్వర్క్ కావడంతో కేవలం 200 మిల్లీసెకండ్స్లోనే డాక్టర్ ఆజ్ఞలు పేషెంట్కు చేరి సజావుగా సర్జరీ జరగడంతో పాటు అది విజయవంతమూ అయ్యింది. అయితే సమాంతరంగా ఇక్కడ హైదరాబాద్లో కూడా ఏదైనా ఎమర్జెన్సీ అవసరమైతే రంగంలోకి దూకడానికి సిద్ధంగా డాక్టర్లంతా శస్త్రచికిత్స జరుగుతున్నంత సేపూ అప్రమత్తంగా అక్కడే ఉన్నారు.‘ద ఇంటర్నేషనల్ హెపాటో ΄్యాంక్రియాటో బిలియరీ అసోసియేషన్’, చైనీస్ చాప్టర్ ఆధ్వర్యంలో నిర్వహించిన 26 డెమాన్స్ట్రేషన్స్లో ఈ శస్త్రచికిత్స కూడా ఒకటి. ఇందులో లైవ్గా శస్త్రచికిత్స చేసి చూపినవారిలో... భారత్, బ్రెజిల్, జార్జియా, గ్రీస్, ఉజ్బెకిస్తాన్ దేశాల నుంచి వచ్చిన వైద్యనిపుణులున్నారు.చూడగలిగే రేంజ్ కూడా ఎక్కువే... రోబో చేతుల సహాయంతో సర్జరీ చేస్తున్నప్పుడు... డాక్టర్ తాను శస్త్రచికిత్స నిర్వహిస్తున్న అవయవాన్నీ, అందులోని భాగాల్నీ (ఫీల్డ్ను) 3–డీ ఇమేజ్లో తెరపై స్పష్టంగా చూస్తుంటారు. ఆ వర్చువల్ ఇమేజ్ చాలా పెద్దగా, స్పష్టంగా ఉండటంతో అక్కడి నరాలూ, రక్తనాళాలు చాలా పెద్దగా (మాగ్నిఫికేషన్తో) కంటికి కనిపిస్తుంటాయి. ఈ అంశం కూడా సాంప్రదాయికమైన శస్త్రచికిత్స కంటే రోబో చేసే సర్జరీని మరింత ప్రత్యేకంగా నిలుపుతుంది. అంటే... సంప్రదాయ శస్త్రచికిత్సలో సదరు అవయవభాగం కాస్త వెనక ఉంటే అది స్పష్టంగా కనిపించక... తెగకూడని భాగం ప్రమాదవశాత్తూ తెగేందుకు అవకాశం ఉంటే ఉండవచ్చుగానీ... చాలా ఎక్కువ మాగ్నిఫికేషన్తో అన్ని అవయవాలూ, నరాలూ, రక్తనాళాలూ కనిపిస్తున్నప్పుడు మరి దేన్నీ టచ్ చేయకుండా కేవలం కోయాల్సిన భాగంలోనే కోత పడటమూ, రక్షించాల్సిన అవయవాలకు ఏమాత్రం దెబ్బతగలకుండా చూసుకోవడం సాధ్యమవుతాయి.స్పష్టత ఎక్కువ... మెరుగుదలా ఎక్కువే... సంప్రదాయ శస్త్రచికిత్సలో నేరుగా చూసేవాటితో పోలిస్తే... ఇక్కడ రోబోటిక్ శస్త్రచికిత్సలో.... డాక్టర్లు తాము తొలగించాల్సిన హానికరమైన చిన్న కణుతుల్నీ, గడ్డలనూ... లేదా కుట్లు వేయాల్సిన అత్యంత సన్నటి సూచర్స్ వంటి వాటిని (అంటే కొన్నిసార్లు పెన్సిల్లోపలి లెడ్ కంటే సన్నటి రక్తనాళాల్నీ, అలాంటి అవయవాల్ని) స్పష్టంగా చూడగలుగుతుంటారు. దాంతో తాము చేయాల్సిన పనుల్ని నైపుణ్యంతో మరిత సమర్థంగానూ చేయగలుగుతారు. ఇక్కడ నిశితత్వం కూడా ఎక్కువే. అంటే ఉదాహరణకు తొలగించాల్సిన కణజాలాన్ని అత్యంత ఖచ్చితంగా అవసరమైనంత మేరకే తొలగించవచ్చు. అదే నేరుగా మనిషి చేతితో చేసే శస్త్రచికిత్సల్లో హానికర కణజాలాన్ని మళ్లీ పెరగకుండా నివారించేందుకు కొంత ఆరోగ్యకరమైన కణజాలాన్నీ తొలగించాల్సి రావచ్చు. కానీ రోబో సాయంతో అదెంతో ఆక్యురేట్గా జరుగుతుంది. కాబట్టి మున్ముందు హానికర కణజాలం మళ్లీ పెరగకుండా ఉండేందుకే అవకాశాలు మరింత ఎక్కువగా ఉంటాయి. ఎందుకు మరింత సురక్షితమంటే... కోత చాలా చిన్నగా, ఖచ్చితంగా ఉండటంవల్ల కోలుకునే సమయం తగ్గుతుంది. గాయమూ వేగంగా మానుతుంది. కోతా, గాయం తక్కువ కావడం వల్ల ఇన్ఫెక్షన్కు అవకాశాలు బాగా తక్కువ. అంతేకాదు... సర్జరీకి పట్టే సమయమూ, అవసరమైన మత్తుమందూ, రక్తస్రావం... ఇఅన్నీ తక్కువే. దాంతో శస్త్రచికిత్స మరింత సురక్షితం కావడంతో కోలుకోవడమూ చాలా వేగంగా జరుగుతుంది.ఏయే శాఖల్లో ఏయే శస్త్రచికిత్సలు? మొదట్లో రోబో సహాయంతో నిర్వహించే శస్త్రచికిత్సలు... మెదడు వంటి కీలకమైన, సున్నితమైన ప్రదేశాల్లో చాలా లోతుగా ఉండి, మానవ హస్తంగా అంత తేలిగ్గా చేరలేని భాగాల్లోనే జరిగేవి. ఉదాహరణకు... మెదడు కణితి తొలగింపు చికిత్సల్లో ట్యూమర్ చాలా స్పష్టంగా కనిపిస్తుంటే... చిన్న రంధ్రంనుంచి అత్యంత నిశితంగా, ఎంతో నైపుణ్యంతో శస్త్రచికిత్స నిర్వహించడానికి రోబో చక్కగా సహాయపడుతుంది. బాధితులు త్వరగా కోలుకుంటారు. అలాగే మూర్ఛవ్యాధికి సాధారణంగా మందులతోనే చికిత్స జరుగుతుంది. అయితే ఎంతకీ తగ్గని కేసుల్లో అత్యంత సునిశితంగా శస్త్రచికిత్స నిర్వహించడానికి రోబో సహాయం తీసుకోవడం వల్ల సర్జరీ మరింత ఎక్కువ సురక్షితంగా జరుగుతుంది.అయితే... వైద్యశాస్త్ర విజ్ఞానం పెరుగుతున్న కొద్దీ రోబోల సర్జరీలు ఇప్పుడు రకరకాల వైద్యవిభాగాల్లోకి విస్తరించాయి. ఉదాహరణకు సంయుక్తంగా మొత్తం మూత్ర వ్యవస్థ (యూరో, నెఫ్రో, గైనిక్) విభాగాలతో పాటు ఇంకా అనేక విభాగాల్లో రోబో సహాయంతో శస్త్రచికిత్సలు జరుగుతున్నాయి. రోబోలు శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్న దేహ వ్యవస్తలూ... ఆ వ్యవస్థల్లో ఏయే శస్త్రచికిత్సలను అవి నిర్వహిస్తున్నాయో చూద్దాం.ఇతరత్రా విభాగాల్లోని శస్త్రచికిత్సలివి... ∙విపుల్ ప్రొసీజర్ : పాంక్రియాస్ (క్లోమం)లోని ‘హెడ్’ అనే భాగాన్నీ, అలాగే చిన్నపేగుల్లోని ‘డియోడినమ్’ అనే భాగాన్ని, గాల్బ్లాడర్ను (పిత్తాశయాన్ని), బైల్ డక్ట్ను తొలగించే శస్త్రచికిత్సను ‘పాంక్రియాటికో–డియోడనెక్టమీ’ అంటారు. ఇది చాలా సంక్లిష్టమైన ప్రక్రియ. ఆయా భాగాల్లోని గడ్డల తొలగింపుతో పాటు... పాంక్రియాస్, చిన్నపేగులు, గాల్బ్లాడర్లోని కొన్ని జబ్బులు (డిజార్డర్స్)లో ఇది ఉపయోగపడుతుంది. ఉదాహరణకు క్రానిక్ పాంక్రియాటైటిస్, డియోడనల్ ట్రామా వంటి చికిత్సల్లో ఎంతో బాగా ఉపయోగపడుతుంది.థైరాయిడెక్టమీ..క్యాన్సర్కు గురైన థైరాయిడ్ను తొలగించడానికి చేసే సంప్రదాయ శస్త్రచికిత్స తర్వాత మెడ చుట్టూ గీత కనిపిస్తుంది. కానీ రోబో చేసే శస్త్రచికిత్స తర్వాత ఎలాంటి గీతా ఉండదు. అందంగా కనిపించాలని కోరుకునే యువతీ యువకులకూ / పెళ్లి కావాల్సిన యువతకు కాస్మటిక్గా ఇదో వరం.భవిష్యత్ ఆశారేఖగా ‘మైక్రో–రోబో’ చికిత్స! సెకండరీ నిమోనియా ఇన్ఫెక్షన్స్ చాలా ప్రమాదకరమైనవి. ఇవి ఎంతటి ప్రమాదాన్ని తెచ్చిపెడతాయన్నది డాక్టర్లతో పాటు చాలామంది పేషెంట్లకూ తెలిసిన విషయమే. తొలుత వచ్చిన ఇన్ఫెక్షన్ కారణంగా అటు తర్వాత ఊపిరితిత్తుల్లో నిమోనియా వస్తే దాన్ని ‘సెకండరీ నిమోనియా ఇన్ఫెక్షన్’ అంటారు. నేరుగా వచ్చే నిమోనియా కంటే దీంతో ప్రమాదం చాలా ఎక్కువ.ఇలాంటి ప్రమాదకరమైన నిమోనియాకి చాలా చాలా చిన్నవైన మైక్రోస్కోపిక్ ‘రోబో’లతో కొంతకాలం కిందట వైద్య పరిశోధకులు ఎలుకల్లో ఓ ప్రయోగాత్మకమైన చికిత్స నిర్వహించారు. అతి చిన్న ఆల్గైలను (పాచిలాంటి మొక్కలను) సేకరించి మైక్రోస్కోపులో చూస్తే తప్ప కనిపించనంతటి ఆ చిన్న చిన్న జీవమున్న మొక్కలపై ‘యాంటీబయాటిక్ నానోపార్టికిల్స్’ను పైపూతగా పూశారు. ఈ పూత... ఇన్ఫెక్షన్లను సమూలంగా నిర్మూలించే తెల్లరక్తకణాల్లోని ‘న్యూట్రోఫిల్స్’.వాటినే ఓ పూతలా పూసి నిమోనియాతో బాధపడుతున్న ఎలుకల ఊపిరితిత్తులోకి ఈ సజీవ ‘మైక్రో–రోబో’లను పంపారు. జీవమున్న ఈ మైక్రో రోబోలకు ‘మైక్రోబో’ (మైక్రో + రోబో = మైక్రోబో) అని పేరు పెట్టారు. యాంటీబయాటిక్ నానోపార్టికిల్స్ పూత ఉన్న ఈ ‘మైక్రోబో’లు ఊపిరితిత్తుల్లో కదులుతూ, ఈదులాడుతూ నిమోనియాకు కారణమైన అతి చిన్న సూక్ష్మజీవులను తుదముట్టించాయి. నిమోనియా వచ్చిన కేసుల్లో చాలావరకు ‘సూడోమొనాస్ ఆరిజినోసా’ అనే అత్యంత సూక్ష్మజీవులు ఇన్ఫెక్షన్ను కలిగించి, బాధితుల మరణానికి కారణమవుతుంటాయి.ఈ సూడోమొనాస్ ఆరిజినోసా మైక్రోబ్స్ కారణంగా నిమోనియా ఇన్ఫెక్షన్ గురైన వాటిల్లోని సగం ఎలుకల్లోకి ఈ మైక్రోబోలను పంపి, మరో సగానికి పంపకుండా వదిలేశారు. మైక్రో రోబోలు పంపిన ఎలుకలన్నీ బతికాయి. మిగతావి మూడు రోజుల్లో చనిపోయాయి. ఈ ప్రయోగ ఫలితాలు ‘నేచర్ మెటీరియల్స్’ అనే మెడికల్ జర్నల్లో ప్రచురితమయ్యాయి. ఇలాంటి పరిశోధనల ఫలితాలను బట్టి చూస్తే... భవిష్యత్తులో మరింత సూక్ష్మాతి సూక్ష్మమైన ప్రక్రియల నిర్వహణకు మైక్రో రోబోలు ఎలా పనిచేయగలవో అన్నది ఊహించవచ్చు. ఇది ప్రయోగదశలో ఉన్న మున్ముందు సాకారం కాబోయే చికిత్స ప్రక్రియ.మానవ హస్తం కంటే రోబోతో సర్జరీలు కొంత ఈజీ... ఎందుకంటే... మానవ మణికట్టును అటు ఇటు తిప్పి చూసినప్పుడు కొంతవరకే తేలిగ్గా తిరగగలుగుతుంది. అయితే ఓ రోబో మణికట్టు మాత్రం ఎటువైపైనా దాదాపు 270 డీగ్రీల వరకు తిరిగేలా రూపొందిస్తారు. ఇక రోబో చేతులూ, వేళ్లూ సన్నగా, బాగా పొడుగ్గా ఉంటాయి. దాంతో సన్నటి ఇరుకైన చోట్లకు కూడా చేరగలుగుతాయ. అంతేకాదు... వాటికి అందించిన ఆదేశాల మేరకు ముందుగా నిర్దేశించిన మేరకు మాత్రమే కోసేలా... ఖచ్చితంగా అంతే గాటు పెట్టేలా చూస్తాయి. ఇలా మానవహస్తానికి కష్టసాధ్యమైన శస్త్రచికిత్స ప్రక్రియల్ని రోబో సహాయంతో డాక్టర్లు చేయగలుగుతారు.మూత్ర / గైనిక్ వ్యవస్థలో ... ∙మూత్రపిండాల శస్త్రచికిత్సలో : మూత్రపిండం నుంచి మూత్రాశయానికి (బ్లాడర్కు) మూత్రం తీసుకొచ్చే పైపులు... యురేటర్లలో ఏవైనా అడ్డంకులు ఏర్పడినప్పుడు ‘పైలో΄్లాస్టీప్రొసిజర్’ అనే శస్త్రచికిత్సతో దాన్ని చక్కదిద్దవచ్చు. (ఉదాహరణకు యురేటరో–పెల్విక్ జంక్షన్లో అడ్డంకి. దీన్నే యూపీజే అబ్స్టక్షన్ అని అంటారు). అలాగే మూత్రపిండాల్లో ఏర్పడ్డ గడ్డల (రీనల్ ట్యూమర్స్) తొలగింపు, కిడ్నీని పూర్తిగా తొలగించడానికి చేసే నెఫ్రెక్టమీ వంటి చికిత్సల్లో రోబోలు బాగా ఉపయోగపడతాయి.ప్రోస్టెక్టమీ :ప్రోస్టేట్ గ్రంథిని తొలగించే శస్త్రచికిత్సలో..గైనకాలజీలో: గర్భసంచికీ... అలాగే గర్భాశయ ముఖద్వారంలో క్యాన్సర్ (ప్రీ–మెలిగ్నెంట్ సర్విక్స్ అండ్ యుటెరస్) వచ్చే అవకాశముందని తెలిసినప్పుడు; ఫైబ్రాయిడ్, అడినోమయోసిస్ వంటి గడ్డల తొలగింపులో; ఎండోమెట్రియాసిస్ కేసుల్లో సమస్యాత్మకమైన / వ్యాధికి గురైన భాగాలను తొలగించడానికి రోబోలు చక్కగా ఉపయోగపడతాయి. మామూలుగా ఇలాంటి సమస్య ఉన్నప్పుడు బాధితుల్లో రుతుస్రావం సరిగా రాకపోవడం, తీవ్రమైన నొప్పి వంటి సమస్యలు ఎక్కువ. రోబో శస్త్రచికిత్సలతో వాటిని తేలిగ్గా సరిదిద్దవచ్చు. యుటెరస్ పెద్దదిగా ఉన్నప్పుడు రోబో చేసే శస్త్రచికిత్సతో తేలిగ్గా తొలగించవచ్చు. మరీ ముఖ్యంగా ఎండోమెట్రియమ్ శస్త్రచికిత్సలో అడ్హెషన్స్ వచ్చినప్పుడు (ఒక అవయవంలో ఒక భాగం ఇతర శరీర అవయవ భాగాలకు అతక్కుపోవడం) అది సర్జన్లకు ఓ సవాలుగా మారుతుంది. రోబో చేతులు వాటిని తేలిగ్గా విడదీస్తాయి.యూరో–గైనకాలజీ శస్త్రచికిత్సల్లో: పొత్తికడుపు కింది భాగంలోని అవయవాలు చాలా దగ్గరదగ్గరగా ఉంటాయి. అవి మరో అవయవంలోకి చొచ్చుకునిపోయి (హెర్నియా కేసులతో) బాధించేప్పుడు చేసే సాక్రోకాల్పోపెక్సీ చేయడానికీ; అలాగే దగ్గినప్పుడూ, ఒత్తిడికి గురైనప్పుడు తమ ప్రమేయం లేకుండా బాధితుల్లో మూత్రం పడిపోయే కేసుల్లో చేసే కాల్పోసస్పెన్షన్ప్రొసీజర్లలో, ఫిస్టులా రిపేర్ల వంటి కేసుల్లో సర్జరీ కాంప్లికేషన్లను తగ్గించేందుకు రోబోలు ఎక్కువగా సహాయపడుతుంటాయి.భవిష్యత్తులో మరింత చవగ్గా... ఇప్పుడు చాలా చోట్ల అమెరికన్ తయారీ రోబోలు ఉపయోగంలో ఉన్నాయి. ఇవి బాగా ఖరీదు కావడంతో ఈ శస్త్రచికిత్సలూ కాస్త ఖరీదే. అయితే భారతీయ రోబోలు అతి వేగంగా అందుబాటులోకి రానున్నాయి. ఎస్ఎస్ఐ మంత్ర ఇలాంటి వాటిల్లో ఒకటి. ఇవి అమెరికన్ రోబోల ఖరీదులో సగానికే దొరుకుతాయి. ఫలితంగా అవి అందుబాటులోకి వస్తే ఇప్పటివరకూ అడ్వాన్స్డ్గా పరిగణిస్తున్న లాపరోస్కోపీ సర్జరీల స్థానంలో ఇవి... అన్ని వర్గాల ప్రజలకూ అందుబాటులోకి వచ్చే అవకాశముంది. అందునా చాలా చవగ్గా కూడా.- డా. వి. చంద్రమోహన్, సీనియర్ యూరో సర్జన్. నిర్వహణ: యాసీన్ -
ముద్దు చేస్తే మొదటికే మోసం
రోజురోజుకూ పెంపుడు జంతువులు పెంచుకునే వారి సంఖ్య పెరుగుతోంది. పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ కుక్కలు, పిల్లులను, కుందేళ్లను, చిలుకలును పెంచుకోవడానికి ఇష్టపడతున్నారు. వాటితో ఆడుకోవడం, ఫొ టోలు దిగడం. సరదాగా బయటకు తీసుకెళ్తూ ఎంజాయ్ చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో వాటిని ము ద్దాడుతూ సంబరపడిపోతుంటారు. అయితే పెట్స్ పెంచుకునే వాళ్లు చాలా జాగ్రత్తలు తీసుకోవాలని.. వాటిన వల్ల మనకు వ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. జూలై 6వ తేదీని ప్రపంచవ్యాప్తంగా జూనోసిస్ డే సందర్భంగా జంతువుల నుంచి మనుషులకు సోకే వ్యాధులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను మంచిర్యాల జిల్లా పశుసంవర్థక శాఖ అధికారి యాకుబ్రెడ్డి తెలిపారు. జూనోసిస్ వ్యాధులు అంటే..జంతువుల నుంచి మనుషులకు సంక్రమించే వ్యాధులను జూనోసిస్ వ్యాధులు అంటారు. పశువులు, కుక్కలు, పిల్లులు, పక్షులు, కోళ్లు వంటి జంతువుల నుంచి మనుషులకు సుమారు 200 రకాల వ్యాధులు సోకే అవకాశం ఉంది. పశువుల పాకల అపరిశుభ్రత, సరైన జాగ్రత్తలు లేకపోవడం వంటి కారణాలతో ఈ వ్యాధులు వ్యా ప్తి చెందుతాయి. ఈ రోజు పశుపోషకులు, పెంపుడు జంతువుల ప్రేమికులు అప్రమత్తంగా ఉండాలని, అవగాహన కల్పించాలని జిల్లా పశుసంవర్థక శాఖ అధికారులు సూ చిస్తున్నారు. అప్రమత్తం కోసం జూనోసిస్ డే1885వ సంవత్సరం జూలై 6వ తేదీన ఫ్రెంచ్ శాస్త్రవేత్త లూయిస్ పాశ్చర్ చరిత్రాత్మకమైన ప్రయోగం చేశారు. పిచ్చి కుక్క కరిచిన ఒక బాలుడికి ఆయన మొదటిసారిగా రేబిస్ వ్యాధి నివారణ టీకా ఇచ్చారు. ఆ ప్రయత్నం విజయవంతం కావడంతో జూలై 6న ప్రపంచ జూనోసిస్ దినోత్సవంగా పాటించడం ప్రారంభమైంది. ఈ రోజు జంతువుల నుంచి వచ్చే వ్యాధుల నివారణపై విస్తృత అవగాహన కల్పించడం, అప్రమత్తం చేయడం, టీకాల ప్రాముఖ్యతను తెలియజేయడం ఈ రోజు ప్రత్యేకత. తీసుకోవాల్సిన జాగ్రత్తలు..పెంపుడు కుక్కలను శాస్త్రీయ పద్ధతిలో, పశువైద్యుని సలహా మేరకు పెంచకపోతే వాటి నుండి వచ్చే వ్యాధులు ప్రాణాంతకంగా మారవచ్చు. శుచి, శుభ్రత పాటించడం అత్యంత ముఖ్యం. పెంపుడు కుక్కలకు సకాలంలో టీకాలు వేయించడం వల్ల యజమానులు, కుటుంబ సభ్యులు, పొరుగువారు అందరూ సురక్షితంగా ఉంటారు. కుక్కలతో సన్నిహితంగా ఉండేవారు కూడా రేబిస్ టీకా వేయించుకోవాలి. జూనోసిస్ వ్యాధుల నుండి రక్షణకు జాగ్రత్తలుపశువుల పాకలు, ఇళ్లు ఎప్పుడూ శుభ్రంగా ఉంచాలి. పెంపుడు జంతువులకు క్రమం తప్పకుండా టీకాలు వేయించాలి. అనుమానాస్పద జంతువులను తాకకూడదు. గాయాలు ఉంటే వెంటనే వైద్య సహాయం తీసుకోవాలి. పాలు, మాంసం బాగా ఉడికించి తినాలి. పశువైద్యుని సలహా తీసుకుని జంతువులను పెంచాలి.వీరికి జూనోసిస్ వ్యాధులు..కొన్ని వృత్తులు, జీవన విధానాలు జూనోసిస్ వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతాయి. పశువుల కాపరులు, పశువైద్యులు, పెంపుడు కుక్కలు, పక్షులు పెంచేవారు, పౌల్ట్రీ ఫారాలు, డెయిరీ కార్మికులు, మాంసాహారులకు జూనోసిస్ వ్యాధులు సోకే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.రేబిస్ ప్రాణాంతకం..అత్యంత ప్రమాదకరమైన జూనోసిసూ్జనోసిస్ వ్యాధుల్లో రేబిస్ ప్రాణాంతకమైనది. ఇది రా బ్డోవైరస్ అనే వైరస్ వల్ల వస్తుంది. పిచ్చి కుక్క కాటు, లాలాజలం గాయానికి అంటడం ద్వా రా ఈవ్యాధి సోకుతుంది. కుక్కలు, పిల్లులు, నక్కలు, ముంగీసలు,తోడేళ్లువంటిజంతువుల ద్వారా మనుషులు, పశువులకు సోకుతుంది. లక్షణాలు..కుక్క కరిచిన 2–3 వారాల తర్వాత లక్షణాలు కనిపిస్తాయి. ముఖం, మెడ ప్రాంతంలో కాటు వేస్తే వ్యాధి త్వరగా వ్యాపిస్తుంది. చివరికి నాడీ వ్యవస్థ ప్రభావితమై పక్షవాతం, మరణం సంభవిస్తుంది. ఒకసారి లక్షణాలు కనిపించిన తర్వాత చికిత్స దాదాపు అసాధ్యం. రేబిస్ వ్యాధి నివారణకు ఏఆర్వీ (ఆంటీ రేబిస్ వ్యాక్సిన్) టీకా అత్యంత ప్రభావవంతం. మొదటి డోసు 30వ రోజు, బూస్టర్ డోసు 90వ రోజు, తర్వాత ఏడాదికి ఒకసారి ఇవ్వాలి. జూనోసిస్ దినోత్సవం కేవలం ఒక రోజు పాటించే వేడుక కాదు. ఇది జంతువులు, మనుషుల మధ్య ఆరోగ్య సంబంధాన్ని బలోపేతం చేసే అవగాహనా కార్యక్రమం. సరైన జాగ్రత్తలు, సకాలంలో టీకాలు వేయించడం ద్వారా మనం ఈ వ్యాధుల బారిన పడకుండా సురక్షితంగా ఉండవచ్చు. -
Beauty Tips: ఈ మాస్క్తో ముడతలు దూరం
వయసు పెరిగే కొద్దీ చర్మంలో మార్పులు రావడం సహజం. మార్కెట్లో దొరికే చాలా రకాల ఎల్ఈడీ ఫేస్ మాస్క్లు కేవలం ముఖంపై వచ్చే ముడతలు, చారలు, మచ్చలను మాత్రమే తగ్గిస్తాయి. కానీ, సోలావేవ్ నెక్ – చెస్ట్ రెజువనేటింగ్ మాస్క్ ముఖం కింద ఉండే నెక్, చెస్ట్ చర్మ సంరక్షణలోనూ తోడ్పడుతుంది.ముఖం లాగే మెడ, ఛాతీ భాగాలపై కూడా వయసు పైబడిన లక్షణాలు స్పష్టంగా కనిపిస్తాయి. అందువల్ల చర్మం సాగడం, ముడతలను తగ్గించుకోవాలనుకునే వారి కోసం సోలావేవ్ సంస్థ రూపొందించిన ఈ రెజువనేటింగ్ పరికరం ఉపయోగకరంగా ఉంటుంది. ఇది ‘మైక్రోకరెంట్’, ‘రెడ్ లైట్ థెరపీ’ సాంకేతికతతో పనిచేస్తుంది. ఈ మాస్క్ మెడ, ఛాతీ భాగాలపై ఉండే సన్నని ముడతలను సున్నితంగా తొలగిస్తుంది. చర్మాన్ని బిగుతుగా, కాంతివంతంగా మారుస్తుంది. రోజుకు పది నిమిషాలు దీనిని ఉపయోగిస్తే చాలు. దీనిని చేతులతో పట్టుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. బెల్ట్తో ఫిక్స్ చేసుకుంటే సరిపోతుంది.బొగ్గుపొడితో దంతాలు ధగధగకొన్ని సందర్భాల్లో కాఫీ, టీ లు ఎక్కువగా తాగడం, ఎనామిల్ పొర బలహీనపడటం వల్ల దంతాలు పచ్చగా మారిపోతుంటాయి. ఇందుకోసం డెంటిస్టుల చుట్టూ తిరిగి డబ్బులు ఖర్చు చేయాల్సిన పనిలేకుండా, సహజంగా దొరికే వస్తువులతోనే దంతాలను మెరిపించుకోవచ్చు.దంతాలను సహజంగా క్లీన్ చేయడానికి బేకింగ్ సోడా అద్భుతంగా పనిచేస్తుంది. ఇది దంతాలపై పేరుకుపోయిన మరకలను సున్నితంగా తొలగిస్తుంది. అలాగే యాపిల్ సైడర్ వెనిగర్ దంతాలపై ఉండే రంగు మారిన పొరలను తొలగిస్తుంది. అయితే దీనిని చాలా జాగ్రత్తగా, తక్కువ మోతాదులో మాత్రమే వాడాలి. చూడటానికి నల్లగా ఉన్నప్పటికీ, బొగ్గుపొడి పళ్లపై ఉండే టాక్సి¯Œ ్స, రంగు మరకలను తన వైపుకు లాక్కునే ప్రత్యేక గుణాన్ని కలిగి ఉంటుంది. దీనిని కూడా తక్కువ మోతాదులో మాత్రమే ఉపయోగించాలి.సాంబ్రాణితో సహజ మెరుపు!తలస్నానం చేసిన వెంటనే నేడు జుట్టు ఆరబెట్టుకోవడానికి హెయిర్ డ్రైయర్లను వాడుతున్నారు. కానీ పూర్వం ఎంతటి పొడవాటి జుట్టునయినా ఆరబెట్టుకోవడానికి తలకు ‘ధూపం’ వేసుకునేవారు.ఇది నేటి తరానికి కేవలం సువాసన కోసం చేసే ప్రక్రియగా అనిపించినప్పటికీ ఇందులో ఎన్నో ఆయుర్వేద, ఆరోగ్య రహస్యాలు దాగున్నాయి. సాంబ్రాణిని వేయడం వల్ల, ఆ వెచ్చని పొగ జుట్టులోని తేమను వేగంగా పీల్చేస్తుంది. రక్త ప్రసరణను మెరుగుపరచి తలనొప్పి వంటి సమస్యలు రాకుండా కాపాడుతుంది. ఇందులో ఉండే శక్తిమంతమైన యాంటీ–మైక్రోబియల్, యాంటీ–ఫంగల్ గుణాలు తలలో చుండ్రు చేరకుండా రక్షిస్తాయి. -
36 గంటల ఆపరేషన్తో.. ఒకే పేషెంట్కి ఐదు అవయవాల మార్పిడి!
హైదరాబాద్లోని ప్రముఖ ప్రభుత్వ ఆసుపత్రి ‘ఉస్మానియా జనరల్ హాస్పిటల్’ (Osmania General Hospital) వైద్య బృందం దేశంలోనే అత్యంత అరుదైన, సరికొత్త రికార్డును సృష్టించింది. ఏకబిగిన 36 గంటల పాటు శ్రమించి ఒకేసారి ఒక రోగికి అయిదు రకాల శస్త్రచికిత్సలను (Organ Transplants) విజయవంతంగా నిర్వహించారు. ఈ అసాధారణ విజయాన్ని సాధించిన ఉస్మానియా వైద్యులు, నర్సింగ్, ఇతర సహాయక సిబ్బందికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ మేరకు సిరిసిల్ల జిల్లాకు చెందిన 30 ఏళ్ల యువ ఇంజనీర్కు జీర్ణాశయం, డ్యూడెనమ్, ప్యాంక్రియాస్, చిన్నపేగు, పెద్దపేగు అవయవాలను ఒకేసారి మార్పిడి చేసి దేశంలోనే అరుదైన వైద్య ఘనతను సాధించారు ఉస్మానియా వైద్యులు. మరిన్ని వివరాలకు ఈ కింద లింక్పై క్లిక్ చేయండి. (చదవండి: ఎవరీ డాక్టర్ ల్యుడ్మిలా ఖోఖ్లోవా? రష్యాలో భారత్ గురించి..) -
ఏఐ ఫిట్నెస్ యాప్స్ని నమ్మొచ్చా?
సాంకేతిక ప్రపంచాన్ని శాసిస్తున్న ఏఐ ఫిట్నెస్ రంగంలోకి కూడా దూసుకొచ్చింది. మనం వ్యాయామం చేసే విధానాన్ని, లైఫ్స్టైల్ను ఇది పూర్తిగా మార్చేస్తోంది. ప్రతి ఒక్కరి శరీర తత్వానికి తగ్గట్టుగా పర్సనలైజ్డ్ వర్కవుట్ ప్లాన్స్ ఇవ్వడం, న్యూట్రిషన్ నియమాలను సూచించడం, రోజువారీ పురోగతిని ట్రాక్ చేస్తూ రియల్–టైమ్ సమాచారాన్ని అందించడం వంటి ఎన్నో ఫీచర్ల తో ఏఐ యాప్స్ సరికొత్త ట్రెండ్ను సృష్టి్టస్తున్నాయి. అయితే ఈ ఏఐ ఫిట్నెస్ యాప్స్తో లాభాలెన్నో.. నష్టాలు కూడా అదేవిధంగా ఉంటాయంటున్నారు ఫిట్నెస్ నిపుణులు.ఏఐ యాప్స్ డేటాను విశ్లేషించడంలో ఎంత నైపుణ్యం కలిగి ఉన్నప్పటికీ, ఒక హ్యూమన్ కోచ్ స్థానాన్ని భర్తీ చేయలేవు. ఉదాహరణకు, ఎవరైనా డెడ్లిఫ్ట్ వ్యాయామం చేస్తున్నప్పుడు.. పొడవాటి కాళ్లు ఉన్న వ్యక్తి చేసే విధానం, పొట్టిగా ఉండే వ్యక్తి చేసే విధానం వేరువేరుగా ఉంటాయి. ఒక మంచి ఫిట్నెస్ కోచ్ మాత్రమే ఈ శారీరక వ్యత్యాసాలను గమనించి సరైన గైడెన్స్ ఇవ్వగలరు. కానీ ఏఐ యాప్స్ ఈ తేడాలను గుర్తించలేక, కరెక్ట్గా చేస్తున్నా తప్పు అని చెప్పే ప్రమాదం ఉంది.అంతేకాకుండా, గతంలో ఏవైనా గాయాలు అయ్యాయా? బాడీలో ఎక్కడైనా నొప్పి ఉందా? లేదా అలసట కారణంగా తప్పుగా చేస్తున్నారా? అనే మానవీయ కోణాలను ఏఐ అర్థం చేసుకోలేదు. ఇవి కేవలం మీ ఫిట్నెస్ను మెరుగుపరచడానికి మాత్రమే, ఏదైనా అనారోగ్యం లేదా గాయం ఉంటే మాత్రం ఖచ్చితంగా డాక్టర్ సలహా తీసుకోవాల్సిందే.ఫోన్ లో సులభంగా ఫిట్నెస్ ప్లాన్ కావాలనుకునే వారికి, క్రీడాకారులకు ఏఐ యాప్స్ ఎంతగానో ఉపయోగపడతాయి. వ్యాయామాన్ని మరింత సరదాగా మార్చుకోవడానికి ఇవి చక్కటి సాధనాలు. అయినప్పటికీ, ఒక ప్రొఫెషనల్ ఫిట్నెస్ కోచ్ పర్యవేక్షణలో వీటిని వాడుకుంటేనే ఆశించిన ఫలితాలు వస్తాయి. ఏఐ ఫిట్నెస్ యాప్స్ చాలా అద్భుతమైనవే.. కానీ అవి ఎప్పటికీ ఒక నిజమైన కోచ్కి ప్రత్యామ్నాయం కాలేవు. -
అందరిలా కాదు.. నీలా నువ్వుండు చాలు!
మనకు లేనిదానిపైనే మన చూపంతా.. యువతలో బాగా ప్రబలుతున్న ఈ మానసిక నిర్లిప్తత ఇప్పుడు బడికెళ్లే పిల్లల్లోనూ కనిపిస్తోంది. సోషల్ మీడియా ప్రభావం పెద్దలకే కాదు.. చిన్నపిల్లల్లో కూడా కనిపిస్తూ కన్నవాళ్లను కలవరపెడుతోంది. ‘అందరూ ఏదేదో చేస్తున్నారు.. ఎక్కడికంటే అక్కడికెళుతున్నారు వారిలా నేనెందుకు లేను.. వారిలా నేనెందుకు ఏ పనీ చేయలేకపోతున్నాను.. ’ఈ భావననే ‘ఫెమో’ (ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్) అంటారు. ఎప్పుడూ ఎదుటివారిలా తానెందుకు ఉండలేకపోతున్నానని బాధపడడం, ఎప్పుడూ తనని తాను నిందించుకుంటూ ఉండడం, కోపం వచ్చినా.. దానిని ఎవరి మీద చూపించాలో తెలియక అవస్థలు పడడం... ఇలాంటి లక్షణాలు మీ పిల్లల్లో కనిపిస్తే ఏం చేయాలో వెంటనే ఈ సూచనలు పాటించడం మంచిది.ఎవరిలో ఫెమో ఉంది?1. తరచూ ఫోన్లో తన వయసువాళ్ల వీడియోలు, రీల్స్ చూడడం, తనెందుకు చేయలేకపోతున్నానని బాధపడడం2. తమకు లేని ప్రతిభ కోసం లేదా తమ దగ్గర లేని వస్తువుల కోసం పట్టుబట్టడం.3. ప్రతి విషయానికీ ఇతరులతో పోల్చుకోవడం. ఆత్మన్యూనతాభావానికి లోనవ్వడం.4. చిన్న పొరపాటు జరిగినా తమని తాము నిందించుకోవడం.5. ఏ పని చేయాలన్నా ఆసక్తి కనబరచక పోవడం, ఒంటరిగా ఫీలవ్వడం.ఏం చేయాలి?1. ఫెమో సమస్య కి విరుగుడు జెమో (జాయ్ ఆఫ్ మిస్సింగ్). పిల్లల ప్రవర్తన చూసి తల్లిదండ్రులు వారిని మందలించడం కంటే ప్రతిరోజు వారితో కాస్త సమయం గడపాలి. వారి సమస్యల్ని వినాలి. 2. సోషల్ మీడియాలో కనిపించేదంతా నిజ జీవితం కాదని వారికి అర్థమయ్యేలా చె΄్పాలి.3. స్క్రీన్ టైమ్కు పరిమితులు విధించి, ఆటలు, పుస్తక పఠనం, సంగీతం, కుటుంబంతో కలిసి గడిపే సమయాన్ని ్రపోత్సహించాలి. 4. ఎవరినో చూసి వారిలా ఉండాలని కోరుకోవడం కన్నా నువ్వు నీలా ఉంటేనే మంచిదని తెలిసేలా చేయాలి.5. నచ్చిన పని చేసినప్పుడు వచ్చే అనుభూతే నిజమైన ఆనందమని వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించాలి. -
సీతాకోకచిలుకలా... ప్రయోజనాలను ఇచ్చే బద్ధకోణాసనం!
డెస్క్ ఉద్యోగాల్లో ఒత్తిడిని తగ్గించి, శరీరానికి మంచి ప్రయోజనాలను అందించడంలో అధిక ప్రయోజనాలను ఇచ్చే యోగాసనాల్లో బద్ధకోణాసనం ఒకటి. ఈ యోగా భంగిమలో సీతాకోక చిలుక రెక్కల్లా మోకాళ్లు కదలికలు ఉంటాయి కాబట్టి దీనిని ఈ పేరుతో పిలుస్తారు. కాళ్లు, తుంటి, వెన్ను భాగాలకు ఇది ఎంతో మేలు చేస్తుంది.ఉదయం లేదా సాయంత్రం రోజూ కొన్ని నిమిషాలు ఈ బటర్ఫ్లై ఆసనాన్ని సాధన చేస్తే మెరుగైన ప్రయోజనాలను పొందవచ్చు. కంప్యూటర్లలో పని చేసే వారు, వెన్ను నొప్పి, మెడ, తుంటి నొప్పితో ఇబ్బంది పడేవారికి ఇది ఎంతో ఉపయోగకరం.చేసే విధానం (20 నుంచి 30 సార్లు)నేలపై యోగా మ్యాట్పై కూర్చోవాలి.రెండు పాదాలను ఒకదానికొకటి తాకించి, చేతులతో పాదాలను పట్టుకోవాలి.వెన్నెముకను నిటారుగా ఉంచాలి.శ్వాసను గమనిస్తూ మోకాళ్లను సీతాకోకచిలుక రెక్కల్లా మెల్లగా పైకి–కిందికి మెల్లగా కదిలించాలి ∙సాధారణ శ్వాసతో 20 నుంచి 30 సార్లు చేయాలి.ప్రయోజనాలు...పెల్విక్ప్రాంతంలో రక్తప్రసరణ మెరుగుపడుతుంది.వెన్ను నొప్పి, నడుము బిగుతు తగ్గించడంలో సహాయపడుతుంది.ఎక్కువసేపు కూర్చునే వారికి ఉపశమనం కలిగిస్తుంది.మహిళల్లో పెల్విక్ ఆరోగ్యానికి, గర్భధారణ సమయంలో (నిపుణుల పర్యవేక్షణలో) ఉపయోగకరంగా ఉంటుంది.శరీర ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది.లోయర్ బ్యాక్ కండరాలకు బలం చేకూరుతుంది.ఒత్తిడి తగ్గి మనసు ప్రశాంతంగా ఉంటుంది. జీర్ణక్రియ మెరుగుపడుతుంది.వెన్ను, మెడ, తుంటి నొప్పులు తగ్గడంలో సహాయపడుతుంది.జాగ్రత్తలు...మోకాలి లేదా హిప్కు తీవ్రమైన గాయం ఉంటే చేయకూడదు. ∙మోకాళ్లను బలవంతంగా నేలకు నొక్కకూడదు. ∙వెన్ను వంచకుండా నిటారుగా ఉంచాలి.నొప్పి అనిపిస్తే వెంటనే ఆపాలి.గర్భిణులు తప్పనిసరిగా శిక్షణ పొందిన యోగా గురువు పర్యవేక్షణలో మాత్రమే చేయాలి.-అనిత పాతర్ల, యోగా ట్రైనర్ -
చినుకుల్లో చింత లేకుండా!
వర్షాకాలం వచ్చేసింది. అడపాదడపా చినుకులు పడుతున్నాయి. వర్షాలు పడటం అందరికీ ఆనందాన్నిచ్చే విషయమే అయినప్పటికీ సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే మాత్రం ఇబ్బందులు తప్పవు. ఎందుకంటే ఇదే వర్షాకాలం అనేక రోగాలకు కేరాఫ్ అడ్రస్గా కూడా మారుతుంది. వాతావరణంలో వచ్చే మార్పుల వల్ల ఈ సీజన్ లో మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్, కలరా, జలుబు, దగ్గు, ఇన్ఫెక్షన్ల వంటి వ్యాధులు వేగంగా విజృంభిస్తాయి. అందుకే, ఈ కాలంలో మన ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ, చిన్నచిన్న చిట్కాలు పాటించడం ఎంతో అవసరం.నీటితోనే ప్రమాదం ఎక్కువ..వర్షాకాలంలో కలుషిత నీటి వల్లనే ఎక్కువ శాతం వ్యాధులు వస్తాయి. ముఖ్యంగా డయేరియా, టైఫాయిడ్ వంటివి. ఎట్టి పరిస్థితుల్లోనూ బయటి నీటిని తాగకూడదు. ఇంట్లో కూడా కాచి చల్లార్చిన నీటిని తాగడం అలవాటు చేసుకోవాలి. అలాగే వాటర్ ఫిల్టర్లను క్రమంతప్పకుండా క్లీన్ చేసుకోవాలి.దోమల నివారణ..వర్షపు నీరు నిల్వ ఉండటం వల్ల దోమలు విపరీతంగా పెరుగుతాయి. దీనివల్ల డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా వంటి ్రపాణాంతక జ్వరాలు వస్తాయి. అందువల్ల ఇంటి పరిసరాలలో, పూల కుండీలలో, పాత టైర్లలో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. పడుకునేటప్పుడు దోమతెరలు వాడాలి. బయటకు వెళ్లేటప్పుడు శరీరం పూర్తిగా కప్పబడేలా దుస్తులను ధరించడం మంచిది.పర్సనల్ హైజీన్వర్షాకాలంలో ఇది చాలా ముఖ్యం. బయట నుంచి రాగానే చేతులు, కాళ్ళను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి. వర్షంలో తడిస్తే వెంటనే స్నానం చేసి, శరీరాన్ని ΄÷డిగా తుడుచుకోవాలి. ఎక్కువసేపు తడి బట్టలతో ఉంటే ఫంగల్ ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంది. పిల్లల గోళ్లను క్రమంతప్పకుండా కత్తిరించాలి, ఎందుకంటే గోళ్ల ద్వారా బ్యాక్టీరియా ΄÷ట్టలోకి వెళ్లే అవకాశం ఉంది.మన వెంటే!వర్షాకాలంలో వర్షం ఎప్పుడు కురుస్తుందో, ఎప్పుడు ఆగుతుందో ఊహించడం చాలా కష్టం. అందువల్ల ఎల్లప్పుడూ గొడుగు, రెయిన్కోట్ వంటి వాటిని వెంట ఉంచుకోవాలి. మన వద్ద ఉండే మొబైల్, ల్యాప్ టాప్ వంటివి తడవకుండా ఒక మంచి ΄్లాస్టిక్ కవర్ను దగ్గర ఉంచుకోవడం మంచిది. అలాగే వర్షాకాలంలో జీన్స్ వంటివి ధరించడం కూడా అంత మంచిది కాదు. వర్షాకాలాన్ని ఆస్వాదించాలంటే ఆరోగ్యంగా ఉండటం ముఖ్యం. చిన్న అజాగ్రత్త కూడా పెద్ద ఆరోగ్య సమస్యకు కారణమవుతుంది. అందువల్ల ముందుగానే జాగ్రత్తలు తీసుకోవడం, ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం.నో జంక్ఫుడ్, నో స్ట్రీట్ ఫుడ్ఈ సీజన్ లో వాతావరణంలో బ్యాక్టీరియా, వైరస్లు వేగంగా వృద్ధి చెందుతాయి. రోడ్ల పక్కన తెరిచి ఉంచే చాట్, పానీపూరి, కట్ చేసిన పండ్లను అస్సలు తినకూడదు. అలాగే జంక్ఫుడ్కి కూడా దూరంగా ఉండాలి. ఇంట్లో వండుకునే ఆహార పదార్థాలను కూడా ఎల్లప్పుడూ మూతపెట్టి ఉంచాలి. ఎప్పటికప్పుడు వేడివేడిగా ఉండే తాజా ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. రాత్రి మిగిలిపోయిన పదార్థాలను, ఫ్రిజ్లో నిల్వ ఉంచినవి తినకపోవడమే బెటర్.ఇమ్యూనిటీతో సేఫ్!ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా ఉండాలంటే శరీరంలో రోగనిరోధక శక్తి బలంగా ఉండాలి. ముఖ్యంగా వర్షాకాలంలో. అల్లం, వెల్లుల్లి, పసుపు, మిరియాలు వంటి రోగనిరోధక శక్తిని పెంచే పదార్థాలను రోజూవారీ ఆహారంలో చేర్చుకోవాలి. రోజుకు ఒకసారైనా వేడి వేడి సూప్ లేదా హెర్బల్ టీ తాగడం వల్ల గొంతు ఇన్ఫెక్షన్ల నుంచి ఉపశమనం లభిస్తుంది. విటమిన్–సి పుష్కలంగా ఉండే నిమ్మ, నారింజ వంటి పండ్లను ఆహారంలో తప్పనిసరి చేసుకోవాలి. -
అంటార్కిటికాలో ఆశాకిరణం..
క్యాన్సర్ చికిత్సలో, సాధారణ కణజాలానికి నష్టం కలగకుండా క్యాన్సర్ కణాలను నాశనం చేయడమనేది అతి పెద్ద సవాలు. ఈ నేపథ్యంలో యూనివర్శిటీ ఆఫ్ సౌత్ ఫ్లోరిడా (యూఎస్ఎఫ్) శాస్త్రవేత్తల పరిశోధన కొత్త ఆశను రేకెత్తిస్తోంది.అంటార్కిటికాలో గడ్డ కట్టిన నీటి అడుగున నివసించే ఒక సముద్రజీవి భవిష్యత్లో క్యాన్సర్ చికిత్సలో కీలక పాత్ర పోషించే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యకరమైన మానవ కణాలకు నష్టం కలిగించకుండా క్యాన్సర్ చికిత్సలో ఉపయోగపడే అంటార్కిటిక్ సీ స్క్విర్ట్ జాతి బ్యాక్టీరియాను శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ ఆవిష్కరణ క్యాన్సర్ చికిత్సలో ఒక ముందడుగు అని చెబుతున్నారు.‘సీ స్క్విర్ట్’ను అసిడియన్స్ అని కూడా పిలుస్తారు. భూమిపై అత్యంత కఠినమైన వాతావరణంలో అంటార్కిట్ జాతులు లక్షలాది సంవత్సరాలుగా పరిణామం చెందుతున్నాయి. వేటాడే జంతువులు, వ్యాధుల నుండి తమను తాము రక్షించుకోవడానికి ప్రత్యేకమైన రసాయన రక్షణలను (కెమికల్ డిఫెన్స్) అభివృద్ధి చేసుకున్నాయి. ఈ రక్షణలు కొత్త ఔషధాల తయారీలో బాగా ఉపయోగపడతాయి.పరిశోధనలో భాగంగా శాస్త్రవేత్తలకు అంటార్కిటికాలో ఎన్నో సమస్యలు ఎదురయ్యాయి. అయినా వెనక్కి తగ్గలేదు.క్యాన్సర్ నిరోధక సమ్మేళనాన్ని బ్యాక్టీరియ ఎలా ఉత్పత్తి చేస్తుందో అర్థం చేసుకోవడానికి సీ స్క్విర్ట్ డీఎన్ఏ, కెమిస్ట్రీ... మొదలైన వాటిని శాస్త్రవేత్తల బృందం అధ్యయనం చేస్తోంది. ఈ ఆవిష్కరణ చికిత్సగా మారడానికి కొంత సమయం పడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. -
స్క్రీన్కు దూరం – లైఫ్కు దగ్గర!
2026 మార్చి 25న అమెరికాలోని లాస్ ఏంజిల్స్ కోర్టు ఇచ్చిన తీర్పు చర్చనీ యాంశమైంది. ఇన్స్టాగ్రామ్ మాతృసంస్థ మెటా, యూట్యూబ్ మాతృసంస్థ గూగుల్ ఒక యువతి మానసిక ఆరోగ్యానికి హాని కలిగించాయని జ్యూరీ నిర్ధారించింది. బాధితురాలికి 6 మిలియన్ డాలర్ల నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించింది.ఈ సందర్భంగా న్యాయ నిపుణులు సోషల్ మీడియా యాప్స్ బయటకు వినోదం, సమాచారం, స్నేహాలు అందిస్తున్నట్టే కనిపించినా లోపల మాత్రం పిల్లల మానసిక ఆరోగ్యాన్ని మెల్లగా దెబ్బతీస్తున్నాయని వ్యాఖ్యానించారు. ప్రపంచంలోనే మొదటిసారి సోషల్ మీడియా వేదికలను ‘లోప భూయిష్టమైన ఉత్పత్తులు’గా గుర్తిస్తూ వచ్చిన తీర్పు కావడం దీనికి మరింత ప్రాధాన్యం తెచ్చింది.ఈ కేసులో వాది అయిన కెలీ అనే యువతి చిన్న వయస్సులోనే యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ వాడటం ప్రారంభించింది. ఇతరులతో తన రూపాన్ని పోల్చుకోవడం, బ్యూటీ ఫిల్టర్స్ వాడటం, లైక్స్, కామెంట్స్ కోసం ఎదురుచూడటం ఆమె మానసిక స్థితిని ప్రభావితం చేశాయి. చివరకు ఆమె డిప్రెషన్, ఆందోళన, బాడీ డిస్మోర్ఫియా వంటి సమస్యలకు గురైంది. ‘నా జీవితంలోని అమూల్యమైన సంవత్సరాలు స్క్రీన్ వెనుక మాయ మయ్యాయి’ అన్న ఆమె మాటలు ఎందరినో ఆలోచనలో పడేశాయి.భారతదేశంలో 75 కోట్లకు పైగా ఇంటర్నెట్ వినియోగదారులు ఉండగా, 40 కోట్లకు పైగా సోషల్ మీడియా వేదికలను వాడుతున్నారు. ముఖ్యంగా 13 నుండి 24 ఏళ్ల మధ్య యువత రోజుకు అనేక గంటలు యాప్స్లో గడుపు తున్నారు. ఇందువల్ల నిద్రలేమి, ఆందోళన, సైబర్ బుల్లీయింగ్, బాడీ షేమింగ్ వంటి సమస్యలు పెరుగుతున్నాయని మానసిక ఆరోగ్య నిపుణులు హెచ్చరి స్తున్నారు. పాఠాలపై శ్రద్ధ తగ్గడం, కుటుంబ సంబంధాలు దూరమవడం, అవుట్డోర్ ఆటలపై ఆసక్తి తగ్గడం వంటి ప్రభావాలు స్పష్టంగా కనిపిస్తు న్నాయి. భారతదేశపు ‘ఎకనామిక్ సర్వే 2025–26’ నివేదిక పిల్లల్లో పెరుగు తున్న డిజిటల్ వ్యసనాన్ని ప్రస్తావిస్తూ, సోషల్ మీడియా వినియోగానికి తప్పనిసరి వయసు నిర్ధారణ ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. భారత ప్రభుత్వం కూడా ఆస్ట్రేలియా తరహాలో 18 ఏళ్ల లోపు వారికి వయస్సు ఆధారిత నియంత్రణలు పెట్టాలనీ, రాత్రి పూట సోషల్ మీడియా లాగిన్ అవ్వకుండా టైమ్–లిమిట్స్ పెట్టాలనీ యోచిస్తోంది.లాభాల కోసం రూపొందించిన అడిక్టివ్ టెక్నాలజీ ఇప్పుడు పిల్లల బాల్యాన్నీ, యువత మానసిక ఆరోగ్యాన్నీ ప్రభావితం చేస్తోందనే విషయం స్పష్టమవుతోంది. ఈ విధమైన సాంకేతికతను తిరస్కరించడం సాధ్యం కాక పోయినా, బాధ్యతాయుత వినియోగం అత్యవసరం. భవిష్యత్ భారతాన్ని నిర్మించే యువతను పుస్తకాలు, క్రీడలు, సృజనాత్మకత, మానవ సంబంధాల వైపు మళ్లించాల్సిన సమయం వచ్చింది. – ఏటూరి సోమశేఖర్ శర్మ, విశ్రాంత జిల్లా విద్యాశాఖాధికారి -
ఆ మహిళ బ్రెయిన్లో 38 పరాన్న జీవులు..!కానీ సర్జరీ చేయకుండానే..
ఒక విదేశీ మహిళ విపరీతమైన తలనొప్పితో బాధపడింది. ఆమె సాధారణ తలనొప్పి అనుకుంది కానీ..అది చూస్తుండగానే బుర్ర బద్దలైపోయేంతట విపరీతమైన నొప్పి..మూర్చ, మతిస్థిమతం వంటివి అటాక అయ్యి..కుప్పకూలిపోయింది. అప్పటిదాక బాగానే ఉన్న ఆమెకు ఆకస్మికంగా ఇలా ఎందుకు జరిగిందని విచారిస్తే..అసలు విషయం బయటపడింది. అలాగే వైద్య పరీక్షల్లో ఆమె బ్రెయిన్ స్కానింగ్ రిపోర్టు చూసి వైద్యులకే నోట మాటరాలేదు. అయితే ఇలాంటి సమస్య ఆ దేశంలో అత్యంత అరుదు కావడంతో ఎలా వచ్చింది అని విచారిస్తే ఆశ్చర్యకరమైన విషయాలు బయటపడటమే గాక..ఆమె ఈ సమస్య నుంచి బయటపడటానికి పడరాని నరకం అనుభవించింది. ఇంతకీ ఎవారా ఆ మహిళంటే..యూకేకు చెందిన లోరీ డెన్మాన్ అనే మహిళ విపరీతమైన తలనొప్పితో బాధపడుతూ..మూర్చ వంటి సమస్యలు ఎదుర్కొంది. రాను రాను సమస్య మరింత దిగజారిపోయింది. ఒకరోజు ఉన్నట్లుండి కుప్పకోలిపోయింది. ఆ తర్వాత ఆమెను ఆస్పత్రికి హుటాహుటినా తీసుకెళ్లగా వైద్యపరీక్షల్లో ఆశ్చర్యకరమైన విషయాలు బయటపడ్డాయి. ఆమె బ్రెయిన్ స్కానింగ్ రిపోర్టు చూసి వైద్యులే కంగుతిన్నారు. చివరికి తనకు ఈ సమస్య ఎలా వచ్చిందో తెలిసి విస్తుపోవడమే కాదు..రోజురోజుకి ఆమె మరింత దిగజారి ప్రాణాంతకంగా మారింది. అసలు ఇలా ఎందుకు జరిగిందని విచారించగా తాను భారత్ పర్యటకు వెళ్లానని..ఆ టూర్కి వెళ్లి ఇప్పటికీ మూడేళ్లు అవతుందని పేర్కొంది. అయితే ఆ తర్వాత ఒక రోజు మలవిసర్జనలో టేప్వామ్ని చూసి విస్తుపోయానని చెప్పింది. ఆ తర్వాత నుంచి పరిస్థతి నార్మల్గా ఉండటంతో లైట్ తీసుకున్నానని చెప్పింది. అప్పటి నుంచి తనలో ఈ బద్దెపురుగులు ఉన్నాయా అని వైద్యలును ప్రశ్నించింది లోరి. అయితే వైద్యులు పలు టెస్ట్లు చేసి శరరీంలో ఎక్కడ ఈ సమస్య లేదని, కేవలం బ్రెయిన్లోనే ఏకంగా 38 టేప్వార్మ్లు ఉన్నాయని అన్నారు. దీన్ని వైద్య పరిభాషలో ‘న్యూరోసిస్టిసెర్కోసిస్’ అని పిలుస్తారని అన్నారు. యూకేలో ఈ సమస్య చాలా అరుదని, ఈ వ్యాధి ప్రబలంగా ఉన్న ప్రాంతాల నుంచి వలస వచ్చినవాళ్లే ఈ సమస్య బారిన పడతారని అనడంతో కంగుతింది లోరీ.న్యూరోసిస్టిసెర్కోసిస్ అంటే..ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం, ఇది పంది టేప్వార్మ్ వల్ల కేంద్ర నాడీ వ్యవస్థకు సోకే ఒక పరాన్నజీవి సంక్రమణ. సరిగ్గా ఉడకని ఆహారం, ముఖ్యంగా పంది మాంసం తినడం వల్ల మనుషులు ఈ వ్యాధి బారిన పడతారని అన్నారు. అలాగే టేప్వార్మ్ గుడ్లతో కలుషితమైన నీటి ద్వారా కూడా ఇది సంభవిస్తుందని తెలిపారు వైద్యులుఈ వ్యాధిని గుర్తించిన తర్వాత లోరీకి పరాన్న జీవి నిరోధక మందులు, స్టెరాయిడ్లు ఇచ్చారు. అవి మొదట్లో బాగానే పనిచేశాయి. కానీ రాను రాను దుష్ప్రభావాలు చూపించడం మొదలుపెట్టింది. గందరగోళానికి గురవ్వడం, శరీరంలో తిమ్మిర్లు, జలదరింపు, బ్రాంతి వంటి మానసిక రుగ్మతలు బారినడపడింది. రోజురోజుకి పరిస్థితి మరింత దిజగారిపోయింది. చూడటానికి ఒక చిన్నపిల్ల మాదరి ప్రవర్తించడం మొదలుపెట్టింది. అలా ఆమె కోలుకుని యథాస్థితికి రావడానికి చాలా సమయమే పట్టింది. ప్రస్తుతం 42 ఏళ్లు ఉన్న ఆమె జీవితాంతం మూర్చ వ్యాధి మందులు వాడుతూనే ఉండాల్సి రావడం బాధకరం. అంతేగాదు ఆమెకు సర్జరీ చేయకుండానే ఆ పరాన్నజీవులను మట్టుబెట్టారు. అవి మెడిసిన్ ప్రభావంతో బ్రెయిన్లోనే గట్టిపడిపోతాయని చెప్పారు వైద్యులు. ఇప్పుడు ఆమె పూర్తి స్థాయిలో కోలుకోవడమే కాదు.. ఆ వ్యాధిపై అందరికీ అవగాహన కల్పిస్తోంది. పైగా తనలా ఎవ్వరూ ఏ సమస్య వచ్చినా తేలిగ్గా తీసుకోవద్దని హెచ్చరిస్తోందామె.(చదవండి: లక్షల జీతం వదులుకుని వెయిటర్గా..! ఎందుకంటే..) -
నా చేతి రాత మారి.. నా బతుకు రాతను మార్చేసింది!
నా వయసు 45 సంవత్సరాలు. నేను ఒక రచయితను, నా రచనలన్నీ చేత్తోనే రాసుకోవడం నా అలవాటు. కానీ గత రెండు సంవత్సరాల నుంచి సరిగా రాయలేక పోతున్నాను. కొంచెంసేపు రాసేటప్పటికి, వేళ్ళు విపరీతంగా నొప్పులు పుట్టి, అక్షరాలు చిన్నవిగా, వంకరగా మారిపోయి, ఇతరులకు అర్థం కావడం లేదు. పదినిమిషాలు వరుసగా రాస్తే మళ్ళీ పది నిమిషాలు రెస్ట్ తీసుకుంటే గానీ రాయలేకపోతున్నాను. దీనివల్ల ఈ మధ్య నా రచనా వ్యాసంగంలో బాగా వెనుకబడ్డాను. అదే నా బతుకు దెరువు. మా ఫ్యామిలీ డాక్టర్ను సంప్రదిస్తే, దీనికి చికిత్స లేదంటున్నారు. మీరే ఏదైనా పరిష్కారం చూపిస్తారనే ఆశతో రాస్తున్నాను. – సుబ్రహ్మణ్యం. అమలాపురంమీరు ‘రైటర్స్ క్రాంప్’ అనే ఒక అరుదైన సమస్యతో బాధ పడుతున్నారు. మానసిక, నాడీ మండలానికి సంబంధించిన ఈ సమస్యతో బాధపడేవారిలో, రాసే సమయంలో చేతివేళ్లు పట్టేయడం, వంకర్లు తిరిగిపోవడం, విపరీతమైన నొప్పితో కొంతసేపు రాసిన వెంటనే ఆగిపోవడం ఈ సమస్య లక్షణం. కొన్ని రకాల వృత్తుల్లో ఉన్నవారు అంటే టైపిస్టులు, ఎక్కువగా పెన్నుతో రాసేవారు, ఏదైనా సంగీత వాద్యాన్ని, వేళ్ళతో ఎక్కువగా పని చేసేవారిలో ఈ సమస్యను చూస్తుంటాము. దీనివల్ల మొదట్లో కొన్ని వాక్యాలు బాగా రాసినా, సడన్గా చేతివేళ్ళు పట్టేసి, చేతిరాత అధ్వానంగా మారిపోతుంది.నొప్పితో΄ాటు, చేతిలో వణుకు కూడా రావచ్చు. కొంత విరామం తర్వాత మళ్ళీ మామూలు స్థాయికి రావచ్చు. ఈ సమస్య వల్ల కొంత టెన్షన్కు లోనై, పోనుపోను బటన్స్ పెట్టుకోవడం, షేవింగ్ చేసుకోవడంలో కూడా ఇబ్బందులు రావచ్చు. గతంలో టెలిగ్రామ్ పంపే పోస్ట్ ఆఫీస్లో పనిచేసేవారు, చేత్తో తీరికలేకుండా టైపు చేయడం ద్వారా కూడా వారిలో ఈ సమస్య ఎక్కువగా వచ్చేది. అసలు సమస్యతో ΄ాటు దీనివల్ల పనిలో వెనుకబడి, మానసిక ఒత్తిడికి గురై ఈ సమçస్య మరింత జటిలమవుతుంది.ఈ సమస్యకు కూడా చికిత్స ఉందనేది చాలామందికి తెలియక, ఉద్యోగాలు మానేసిన వారు కూడా ఉన్నారు. ‘బొటాక్స్’ ఇంజక్షన్’ ద్వారా ఈ సమస్యను చాలా వరకు నయం చేయవచ్చు. ‘సుపినేటా రైటింగ్’ అనే ఒక ప్రత్యేక మానసిక చికిత్సా పద్ధతితో΄ాటు, ఒత్తిడి తగ్గించేందుకు కొన్ని మందులు, రిలాక్సేషన్ ఎక్సర్సైజ్ ద్వారా ఈ ‘రైటర్స్ క్రాంప్’ సమస్యను నయం చేయవచ్చు. మీరు అధైర్యపడకుండా దగ్గర్లోని సైకియాట్రిస్టును సంప్రదించి తగిన చికిత్స చేయించుకోండి. ఆల్ ది బెస్ట్!- డా. ఇండ్ల విశాల్ రెడ్డి, సీనియర్ సైకియాట్రిస్ట్, విజయవాడ.- మీ సమస్యలు, సందేహాలు పంపవలసిన మెయిల్ ఐడీ: sakshifamily3@gmail.com -
మెడ వణుకుతోంది… కనీసం ఫోన్ను పట్టుకోలేకపోతున్నా!
ఆ యువతి తరచూ మెడ నొప్పి, చేతుల్లో బలం తగ్గిపోతున్న సమస్యతో డాక్టర్ను సంప్రదించింది. తన జీవనశైలి, రోజువారీ అలవాట్లు, ఉద్యోగ ఒత్తిడి, నిద్రపోయే భంగిమ.. ఇవన్నీ కారణాలేమోనని ఆమె ముందుగానే అనుకుంది. కానీ అన్ని వివరాలు విన్న తర్వాత డాక్టర్ చెప్పిన మాటలు ఆమెను ఆశ్చర్యంలో ముంచేశాయి. ‘‘అది సాధారణ అలసట కాదు… ఆమె శరీరం ఫోన్ ప్రభావానికి లోనవుతోంది’’ అనే వ్యాఖ్యతో అసలు సమస్యపై కొత్త చర్చ మొదలైంది.స్మార్ట్ఫోన్ వినియోగం ఇప్పుడు లింగ భేదానికి పరిమితం కాని సమస్యగా మారుతోందని నిపుణులు చెబుతున్నారు. గంటల తరబడి స్క్రీన్పై గడపడం వల్ల మెడపై ఒత్తిడి పెరగడం, భంగిమలో మార్పులు, చేతి బలం తగ్గడం వంటి లక్షణాలు యువతలో సాధారణంగా కనిపిస్తున్నాయని పరిశోధనలు సూచిస్తున్నాయి. ముఖ్యంగా పని, చదువు, వినోదం అన్నీ డిజిటల్ పరికరాలపైనే ఆధారపడటం వల్ల ఈ ప్రభావం మరింత విస్తరిస్తోందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇది ఒక్కరి సమస్య కాదు… ఆధునిక జీవనశైలి కలిగిస్తున్న సామూహిక ఆరోగ్య సవాలుగా మారుతోందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.స్మార్ట్ఫోన్లు, ల్యాప్టాప్లు వంటి డిజిటల్ పరికరాలు మన శరీర ఆకృతినే నిశ్శబ్దంగా ప్రభావితం చేస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. దీని వల్ల మెడ వంగిపోవడం, చూపు బలహీనపడటం, చేతి బలం తగ్గడం, మోటార్ స్కిల్స్పై ప్రభావం వంటి సమస్యలు పెరుగుతున్నాయని పరిశోధనలు సూచిస్తున్నాయి. పైగా ఈ మార్పులన్నింటినీ ఇప్పుడు నిపుణులు ఒక కొత్త పదంతో వివరిస్తున్నారు. అదే “ఫోన్ బాడీ (Phone Body)”. అంటే..ఫోన్ అధికంగా ఉపయోగించడం వల్ల శరీరంలో కనిపిస్తున్న మార్పులు, భంగిమలో వచ్చే మార్పుల సమాహారం అని దీని అర్థం. ఇది వైద్యపరంగా అధికారిక పదం కాకపోయినా.. ఆధునిక జీవనశైలి ప్రభావాన్ని వివరించేందుకు వాడుతున్నారు. బీబీసీ టెక్నాలజీ జర్నలిస్ట్ థామస్ జర్మైన్ తన తాజా వ్యాసంలో ఈ వివరాలను సమగ్రంగా వెల్లడించారు.అందులో నిపుణుల చెప్పిన వివరాల ప్రకారం సమస్య కేవలం “స్క్రీన్ టైమ్” మాత్రమే కాదు.. ఎక్కువ సమయం ఇంట్లో కూర్చొని ఫోన్, కంప్యూటర్లకు అతుక్కుపోవడం కూడా ప్రధాన కారణంగా మారుతోంది. ముఖ్యంగా పిల్లలు, యువతలో శారీరక చురుకుదనం తగ్గిపోవడం దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకు దారి తీస్తోందని హెచ్చరిస్తున్నారు.👉ప్రపంచవ్యాప్తంగా మయోపియా (దూరం చూపు బలహీనత) కేసులు వేగంగా పెరుగుతున్నాయి. అయితే దీని ప్రధాన కారణం ఫోన్ను దగ్గరగా చూడటం మాత్రమే కాదని, బయట సమయం తగ్గిపోవడమే ముఖ్య కారణమని నిపుణులు చెబుతున్నారు. సహజ కాంతి కళ్ల ఆరోగ్యానికి సహాయపడుతుందని పరిశోధనలు సూచిస్తున్నాయి.👉మరోవైపు “టెక్ నెక్” (Tech Neck) అనే సమస్య కూడా వేగంగా పెరుగుతోంది. నిరంతరం తల వంచి ఫోన్ చూడటం వల్ల మెడపై తీవ్ర ఒత్తిడి పడుతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తల వంచే కోణం పెరిగే కొద్దీ మెడపై పడే బరువు అనేక రెట్లు పెరుగుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. దీని వల్ల నొప్పులు, కండరాల గట్టిపడటం మాత్రమే కాకుండా భవిష్యత్తులో పోశ్చర్(posture) మార్పులు కూడా రావచ్చని డెర్మటాలజీ నిపుణులు హెచ్చరిస్తున్నారు.👉ఇక చేతి బలం విషయంలోనూ ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రపంచవ్యాప్తంగా యువతలో గ్రిప్ స్ట్రెంగ్త్ తగ్గుతున్నట్లు పలు అధ్యయనాలు చెబుతున్నాయి. ఇది కేవలం చేతుల బలహీనత మాత్రమే కాకుండా మొత్తం శారీరక ఆరోగ్య సూచికగా పరిగణించబడుతోంది.👉టెక్నాలజీ మోటార్ స్కిల్స్పైనా ప్రభావం చూపుతోందని పరిశోధకులు చెబుతున్నారు. ఫోన్పై స్వైప్ చేయడం, క్లిక్ చేయడం వంటి పనుల్లో నైపుణ్యం పెరుగుతున్నప్పటికీ, చేతి-మెదడు సమన్వయంపై దీర్ఘకాలిక ప్రభావం ఉండొచ్చని హెచ్చరిస్తున్నారు.అయితే నిపుణులు భయపడాల్సిన అవసరం లేదని సూచిస్తున్నారు. రోజూ కొంతసేపు ఫోన్కు విరామం ఇవ్వడం.. కొన్ని అలవాట్లు మార్చుకుంటే “ఫోన్ బాడీ” ప్రభావాలను గణనీయంగా తగ్గించుకోవచ్చు.20–20–20 రూల్ప్రతి 20 నిమిషాలకు ఒకసారి, 20 అడుగుల దూరంలో ఉన్న వస్తువును కనీసం 20 సెకన్లు చూడాలని సూచిస్తున్నారు. ఇది కంటి ఒత్తిడిని తగ్గిస్తుంది.మెడ పోశ్చర్పై దృష్టిఫోన్ను కిందకి వంచి చూడకుండా, కంటి లెవెల్లో ఉంచుకోవడం ద్వారా “టెక్ నెక్” ప్రమాదాన్ని తగ్గించవచ్చు.స్క్రీన్ టైమ్ పరిమితిరోజులో నిర్దిష్ట సమయాన్ని మాత్రమే ఫోన్ వినియోగానికి కేటాయించడం మంచిదని నిపుణుల సూచన. అవసరం లేని స్క్రోలింగ్ తగ్గించాలి.శారీరక కదలికలు తప్పనిసరిప్రతి గంటకోసారి లేచి నడవడం, స్ట్రెచింగ్ చేయడం వల్ల కండరాల గట్టిపడటం తగ్గుతుంది.గ్రిప్ & చేతి వ్యాయామాలుబంతి పట్టుకోవడం, స్ట్రెస్ బాల్ వాడడం, చిన్న హ్యాండ్ ఎక్సర్సైజ్లు చేయడం చేతి బలం మెరుగుపరుస్తాయని చెబుతున్నారు.బయట గడిపే సమయం పెంచాలిసహజ కాంతి కళ్ల ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది. రోజులో కనీసం కొంత సమయం బయట గడపడం మయోపియా ప్రమాదాన్ని తగ్గించగలదు.డిజిటల్ డీటాక్స్ అలవాటువారానికి ఒకసారి కొన్ని గంటలు ఫోన్ లేకుండా గడపడం మానసికంగా, శారీరకంగా ఉపశమనం ఇస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.మొత్తం మీద, ఫోన్ ఇప్పుడు మన జీవితంలో భాగంగా మారినప్పటికీ, అది శరీరంపై నెమ్మదిగా కానీ స్పష్టంగా ప్రభావం చూపుతోందని తాజా పరిశోధనలు హెచ్చరిస్తున్నాయి. టెక్నాలజీని పూర్తిగా దూరం చేయలేకపోయినా, దాన్ని నియంత్రితంగా ఉపయోగించడం ద్వారా శరీరంపై దాని ప్రభావాన్ని గణనీయంగా తగ్గించుకోవచ్చని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. -
స్లిమ్గా ఉపాసన కొణిదెల..! ట్విన్స్ తర్వాత బరువు తగ్గాలంటే..
ఈ ఏడాది జనవరిలో టాలీవుడ్ హీరో రామ్ చరణ్ భార్య ఉపాసన కొణిదెల కవలలకు జన్మినిచ్చిన సంగతి తెలిసిందే. ఇటీవల హీరో రామ్చరణ్ పెద్ది సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు. ఆ నేపథ్యంలో జరిగి సక్సెస్ మీట్లో ఉపాసన ఫోటోలు నెట్టింట తెగ వైరల్గా మారాయి. ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చి ఐదు నెలలే అయినా ఎంత స్మార్ట్గా మారింది అంటూ సర్వత్రా చర్చలు మొదలయ్యాయి. ఒక్కరికి జన్మనిచ్చిన తల్లులు బరువు తగ్గడమే కష్టం అలాంటిది ఇద్దర పిల్లలకు జన్మనిచ్చిన తల్లలు బరువు తగ్గడం మరింత సవాలుగా ఉంటుంది. అలాంటిది ఉపాసన ఐదు నెలల్లోనే చాలా నాజుగ్గా ఆకర్షణీయంగా మారారు. అసలు ట్విన్స్ తర్వాత బరువు తగ్గడం ఎలా?, అది సాధ్యమేనా? అంటే..ఒక గర్భంతో పోలిస్తే.. కవలల గర్భం తర్వాత బరువు తగ్గడం చాలా కష్టమనే చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. సాధారణంగా మహిళలు గర్భధారణ సమయంలో అధికంగా బరువు పెరుగుతారు. వారి శరీరాలు మరిన్నీ శారీరక, హార్మోనల్ మార్పులకు లోనవ్వుతాయి. శరీరం కోలుకోవడం కోసం కండరాల బలం తిరిగి నిర్మించుకోవడానికి, ఇద్దరు పిల్లల సంరక్షణ ఇదంతా ఒక పెద్ద సవాలుగా పేర్కొన్నారు. కొత్త తల్లులు యథావిధిగా ఇదివరకటిలా నార్మల్ స్థితికి రావడానికి ఎక్కువ సమయం పడుతుందని కూడా అన్నారు. అయితే ప్రసవానంతరం కోలుకోవడం అనేది పరుగుపందెం లాంటిది కాదని గ్రహించాలన్నారు. ప్రతి మహిళ శరీరం ఒకేలా స్పందించదని అన్నారు అందువల్ల ఆరోగ్యకరంగా స్థిరంగా బరువు తగ్గేందుకే ప్రయత్నించాలని అన్నారామె. బరువు తగ్గాలంటే..ప్రసవానంతరం బరువు తగ్గాలంటే చక్కటి నిద్ర, సమతుల్య భోజనం, తగినంత నీరు, తగిన కదలికలు ఉండాలన్నారు. కొత్త తల్లులు కఠినమైన ఆహార నియమాలు పాటించొద్దని అన్నారు. ముఖ్యంగా పాలిచ్చేవాళ్లకు మరింత ప్రమాదమని అన్నారు. శరీరం ఆ స్థితి నుంచి కోలుకోవడానికి, శక్తి కోసం తగిన పోషకాలు అవసరం. ఈ టైంలో కేలరీలు లెక్కించడం మానేసి, ప్రోటీన్, ఫైబర్, పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉండే పౌష్టికరమైన భోజనంపై దృష్టి సారించమని సూచిస్తున్నారు. ఆ తప్పులు అస్సలు చెయ్యొద్దు..సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల ప్రభావంతో బరువు తగ్గే ప్రయత్నం చేయొద్దని అంటున్నారు. ఎందుకంటే వాళ్లు పోషకాహర నిపుణులు, ఫిట్నెస్ ట్రైనర్ల సమక్షంలో ఆయా డైట్ విధానాలు అనుసరిస్తారు కాబట్టి గుడ్డిగా అనుసరించొద్దని అన్నారు. అలాగే తక్షణ ఫలితాలు ఆశించొద్దని చెప్పారు. తొమ్మిది నెలల్లో పెరిగిన బరువు కొన్ని వారాల్లో మాయమవ్వాలంటే తీవ్రమైన డైటింగ్, భోజనం మానేయడం, అతిగా వ్యాయామాలు చేయడం, బరువు తగ్గించే సప్లిమెంట్లపై ఆధారపడటం వంటివి పూర్తి స్థాయిలో కోలుకోవడాన్ని ఆటంక పరుస్తుందని అన్నారు.కొత్త తల్లులూ ఇది మరవద్దు..ప్రసవానంతరం ఫిట్నెస్ అంటే బలాన్ని తిరిగి నిర్మించుకోవడం అంతేతప్ప మాటిమాటికీ బరువు చెక్చేస్తూ..నెంబర్ని వెంబడించడం కాదు. ఆరోగ్యకరమైన శరీరం, స్థిరమైన పురోగతి, బిడ్డను చూసుకోవడానికి తగినంత శక్తిమంతంగా ఉండటం అనేవి ప్రధానం అని గ్రహించండి. ఏ క్రాష్ డైట్ ఈ సమయంలో అస్సలు పనికిరాదు. కేవలం ఓర్పు, నిలకడతో పాటించే మంచి అలవాట్లతోనే సత్ఫలితాలను పొందగలరని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. View this post on Instagram A post shared by Varinder Chawla (@varindertchawla) గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: అనురాగ్ కశ్యప్ వెయిట్లాస్ స్టోరీ..!అలా తగ్గడం మంచిదేనా?) -
అనురాగ్ కశ్యప్ వెయిట్లాస్ స్టోరీ..!అలా తగ్గడం మంచిదేనా?
కొన్ని వెయిట్లాస్ స్టోరీలు స్ఫూర్తిదాయకంగా ఉన్నా..అందరికీ సరిపడవు. ఆయా వ్యక్తిగత సమస్యలు, వైద్య నిపుణుల పర్యవేక్షణ ఆధారంగా ప్రయత్నించాలే తప్ప..లేదంటే అసలుకే ప్రమాదం. ఇక్కడ సినీ నిర్మాత అనురాగ్ కశ్యప్ వెయిట్లాస్ స్టోరీ అలాంటిదే. ఆయన గుండెపోటుకి గురై కోలుకున్న తర్వాతా దాదాపు 27 కేజీల బరువు తగ్గారు. ఈ అద్భుతమైన మార్పు అందరికీ స్ఫూర్తినిచ్చినప్పటికీ..ఆయన ఫాలో అయిన డైట్ మంచిదేనా అనే సందేహాలు వెల్లువెత్తాయి. మరి ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారు. ఒక్కోసారి ఆరోగ్య సమస్యల రీత్యా క్రాష్డైట్లు ఫాలో అవ్వొచ్చా అంటే..అనురాగ్ కశ్యప్ గుండెపోటు తర్వాత చాలా తక్కువ టైంలోనే అనూహ్యంగా బరువు తగ్గారు. అది కూడా ఇంత వేగంగా అందులోనూ గుండె సంబంధిత సమస్య నుంచి కోలుకున్నాక..ఇది సరైనదేనా అనే సందేహాలు ప్రజల్లో వ్యక్తమయ్యాయి. అయితే వైద్యులు అది ఆయన ఆరోగ్య పరిస్థితికి అనుగుణంగా రూపొందించిన ప్రత్యేక డైట్ అని అంటున్నారు. అలాంటి క్రాష్ డైట్లు అందరికీ సరిపడవని హెచ్చరిస్తున్నారు. ఆయనకి ఉన్న రుగ్మతల దృష్ట్యా నిపుణుల పర్యవేక్షణలో తగిన జాగ్రత్తలతో అనుసరించిని డైట్ అని చెప్పారు. ఇలా గుండెపోటు వచ్చిన వాళ్లందరికి ఇలాంటి క్రాష్ డైట్లు సరిపడవని హెచ్చరించారు. పైగా అది మేలు కంటే కీడే చేసే అవకాశం ఎక్కువ ఉందన్నారు. అలాగే ఇక్కడ ప్రతి రోగి కోలుకోవడం అనేది అప్పటికే ఉన్న ఆరోగ్య పరిస్థితులు, మందులు, పోషకాహార స్థితి, మొత్తం గుండె పనితీరు వంటి అంశాల ఆధారపడి ఉంటుందన్నారు. ఇక్కడ కశ్యప్కు ఆస్తమా చరిత్ర, స్టెరాయిడ్ల వాడకం ఉంటం వల్ల వైద్య బృందం ఆయనకు లిక్విడ్ క్రాష్ డైట్ని సూచించిందని చెప్పారు. గుండెపోటు తర్వాత క్రాష్డైట్ ఎందుకు మంచిదికాదంటే..గుండెపోటు తర్వాత, గుండె కండరం ఇంకా కోలుకుంటూ ఉంటుంది. ఇక్కడ క్రాష్ డైట్లో కేలరీలను తీవ్రంగా పరిమితం చేస్తారు. ఫలితంగా శరీరంపై అదనపు ఒత్తిడిని తగ్గించి, సమస్యల ప్రమాదాన్ని పెంచుతుంది. తీవ్రమైన కేలరీల పరిమితి కండరాల క్షీణత, ఎలక్ట్రోలైట్ అసమతుల్యత, అలసట, తలతిరగడం వంటి సమస్యలు కోలుకోవడంలో ఆలస్యానికి దారితీయవచ్చని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. అంతేగాదు గుండె సంబంధిత సమస్యల ప్రమాదాన్ని మరింత పెంచే ప్రమాదం ఉందని అంటుఉన్నారు.గుండె జబ్బులు ఉన్నవాళ్లు ఎలా బరువు తగ్గాలంటే..గుండెపోటు తర్వాత వేగంగా బరువు తగ్గడానికి నిశితమైన వైద్య పర్యవేక్షణలో మాత్రమే ప్రయత్నించాలని వైద్యులు చెబుతున్నారు. గుండె జబ్బులు ఉన్న చాలా మంది రోగులకు వారానికి సుమారు 0.5 నుంచి 1 కిలోల చొప్పున క్రమంగా బరువు తగ్గడం సురక్షితమని సూచిస్తున్నారు. దీర్ఘకాలిక గుండె ఆరోగ్యాన్ని కాపాడే నిలకడైన ఆహారపు అలవాట్లతో బరువు తగ్గడం మంచిదంటున్నారు. గుండెకు మేలు చేసే ఆహారంపీచుపదార్థం అధికంగా ఉండే పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలుచేపలు, పప్పుధాన్యాలు, స్కిన్లెస్ కోడి మాంసం వంటి కొవ్వు తక్కువగా ఉండే ప్రోటీన్ఒమేగా-3 అధికంగా ఉండే ఆహారాలతో సహా ఆరోగ్యకరమైన కొవ్వులురక్తపోటును నియంత్రించడంలో సహాయపడటానికి తక్కువ ఉప్పు ఉన్న భోజనంఅలాగే ఆరోగ్య నిపుణులు ప్రత్యేకంగా సలహా ఇస్తే తప్ప, తీవ్రమైన ఉపవాసాలు, డిటాక్స్ ప్రణాళికలు, జీరో-కార్బ్ డైట్లను సాధారణంగా నివారించాలి.ఈ లక్షణాలు కనిపిస్తే..అకస్మాత్తుగా నీరసించడంగుండె దడనిరంతర నిర్జలీకరణంతల తిరగడం లేదా స్పృహ కోల్పోవడంమానసిక గందరగోళం లేదా అయోమయంఈ లక్షణాలను మనం అనుసరిస్తున్న ఆహార నియమం శరీరంపై అధిక ఒత్తిడిని కలిగిస్తోందనేందుకు సూచనగా గుర్తెరగాలి.అందువల్ల గుండెపోటు నుంచి కోలుకుంటున్న ఎవరైనా క్రాష్ డైట్లకు దూరంగా ఉండాలని, బదులుగా సమతుల్య పోషణ, నిలకడ అనుసరించి చక్కటి జీవనశైలిని పాటించాలని చెబుతున్నారు నిపుణులు. సాధ్యమైనంత వరకు నిలకడగా బరువు తగ్గడంపై దృష్టి పెట్టాలని వైద్యులు నొక్కి చెబుతున్నారు. ఇక్కడ గుండెను కాపాడుకోవడం అంటే త్వరగా బరువు తగ్గడం కాదు, సురక్షితంగా బరువు తగ్గడం అని నొక్కి చెబుతున్నారు వైద్యులు.(చదవండి: ఐఐటీ డ్రాపౌట్ అయినా..మైక్రోసాఫ్ట్, గూగుల్లో ఉద్యోగం!) -
అందమైన జుట్టు కోసం.. తలకట్టు.. దీర్ఘమూ..!
చిన్నప్పుడు అక్షరాలు దిద్దే టైమ్లో తలకట్టూ, దీర్ఘం చదువుకుంటాం. స్టైల్గా అక్షరంపైన స్టైల్గా, ఠీవిగా ఉండే దాన్ని తలకట్టు అంటాం కదా. అలా తలపైనా అందంగా, స్టైల్గా ఉండేజుట్టునీ తలకట్టు అంటాం. అమ్మాయిల అందం ఇనుమడించాలంటే ఆ తలకట్టు పొడవుగా, సు‘దీర్ఘం’గా ఉండాలి. చదువుకుంటూ అక్షరాలు దిద్దినప్పుడు ఉండే ఆ తలకట్టూ, దీర్ఘాలే యుక్తవయసు దాటాక కూడా కొనసాగాలనేది టీనేజ్ నుంచీ యువతీయువకులందరి కోరిక.ఇక అమ్మాయిలూ మహిళలూ కోరుకునేది మంచి పొడవాటి జడ. ఒకవేళ ఈ రోజుల్లో జడ ఎవరూ వేసుకోవడం లేదనుకున్నా... జలపాతంలా జారిపోయే మృదువైన పొడవైన జుట్టు. మంచి అందమైన, పొడవైన జుట్టుకోసం అమ్మాయిలూ, హీరో లాంటి లూక్ కోసం అబ్బాయిలూ... ఎవరెవరు ఎంతెంత ఖర్చు పెడుతుంటారో లేక్కేలేదు. మాటల్లో ‘ఆఫ్టరాల్ వెంట్రుక...’ అంటూ వ్యవహరించే ఈ జుట్టు కోసం కోట్లాది రూపాయల బిజినెస్ జరుగుతుందంటే అతిశయోక్తే కాదు. ఆ జుట్టు ఎందుకు, ఎలా పెరుగుతుంటుంది, ఎందుకు రాలుతుంది అలా రాలకూడదంటే ఏం చేయాలి లాంటి అనేక ప్రశ్నలకు సమాధానాల సమాహారమే ఈ కథనం.జుట్టు, రోమాలు, తలకట్టు, వెంట్రుకలు, అందమైన భాషలో కురులు అంటూ పిలిచే ఆ నల్లటి, సన్నటి, పొడవైన తీగలాంటి జుట్టు నిర్మాణం నిజానికి చాలా సంక్లిష్టం. చూడ్డానికి సింపుల్గా కనిపించే ఆ జుట్టు కథ ఏమిటో, ఎలా పుడుతుందో, దానికి వచ్చే రకరకాల సమస్యలేమిటన్న అనేక అంశాలను విపులంగా తెలుసుకుందాం.జుట్టు ఎలా పెరుగుతుందంటే... ప్రతిరోజూ వెంట్రుక 0.3 మి.మీ. నుంచి 0.4 మి.మీ. వరకు పెరుగుతుంది. అంటే ఏడాదికి దాదాపు ఆరు అంగుళాలు పెరుగుతుంది. వెంట్రుక పెరుగుదలలో కెటాజెన్, టిలోజెన్, అనాజెన్ అనే దశలు ఉంటాయి.కెటాజన్ : మొత్తం జుట్టులో కనీసం మూడు శాతం ఎప్పుడూ ఈ దశలోనే ఉంటుంది. నిజానికి వెంట్రుక పెరుగుదలలో ఇదో సంధి దశ. ఈ దశలో వెంట్రుక 2 – 3 వారాలు ఉంటుంది. ఈ దశలో వెంట్రుక నిద్రాణంగా ఉండటం వల్ల దానిలో పెరుగుదల ఏమాత్రం ఉండదు.టిలోజెన్ : మన మొత్తం జుట్టులో 10–15 శాతం ఎప్పుడూ ఈ దశలో ఉంటుంది. ఈ దశ మాడుపై ఉన్న వెంట్రుకలలో సాధారణంగా 100 రోజుల పాటు కొనసాగుతుంది. ఇక కనుబొమలు, కనురెప్పలు, బాహుమూలాల్లో ఉండే వెంట్రుకల్లో ఈ దశ మరింత దీర్ఘకాలం ఉంటుంది. ఈ దశలోనే వెంట్రుక తన పూర్తిస్థాయి పొడవులో ఉంటుంది. ఈ దశలో ఉన్నప్పుడు పీకితే వెంట్రుక కింద దాని గసగసాల్లా ఉండే గుండ్రటి, తెల్లటి భాగం కనిపిస్తుంది.అనాజెన్ : వెంట్రుక పెరుగుదల తాలూకు దశలన్నింటిలోనూ అనాజెన్ చురుకైన దశ. ఈ దశలో వెంట్రుక మూలంలో కణవిభజన వేగంగా జరుగుతుంటుంది. కింద కొత్త కణాలు వస్తున్న కొద్దీ పాత కణాలు ముందుకు వెళ్తుంటాయి. దాంతో కింది నుంచి వేగంగా వెంట్రుక పెరుగుతూ పోతుంది. ఈ దశలో ప్రతి 28 రోజులకు వెంట్రుక ఒక సెం.మీ. పెరుగుతుంది. ఈ పెరుగుదల ఇలా రెండు నుంచి ఆరేళ్లు కొనసాగుతుంది. కొందరిలో ఆ వ్యవధి తర్వాత వెంట్రుక అదే వేగంతో పెరగదు. కొంత పొడవు పెరిగి ఆగిపోతుంది. అయితే తల మీద ఉన్న వెంట్రుకలు రెండు నుంచి ఆరేళ్లు పెరుగుతాయి. బాహుమూలాల్లో, కాళ్లపైనా, కనుబొమలు, కనురెప్పపై ఉండే వెంట్రుకల్లో ఈ వ్యవధి 30–45 రోజులు మాత్రమే ఉంటి, ఆ తర్వాత పెరుగుదల ఆగిపోతుంది. ఈ కారణం వల్లనే ఈ ప్రాంతాల్లోని వెంట్రుకలు మాడుపై ఉండే వెంట్రుకలంతగా పెరగవు.వెంట్రుకల తీరుతెన్నులు : కొందరిలో వెంట్రుకలు స్ట్రెయిట్గా పెరుగుతాయి. ఇలా పెరిగే వారి జుట్టు సాఫీ (స్ట్రెయిట్)గా ఉంటుంది. అదే కొందరిలో జుట్టు పెరుగుతున్న కొద్దీ వెంట్రుక ఒంపు తిరుగుతుంటుంది. ఇలా జరిగేవారికి రింగులు రింగులుగా ఉండే ఉంగరాల జుట్టు వస్తుంది. వెంట్రుకను అడ్డుగా కోసినప్పుడు ఆ అడ్డుకోత గుండ్రంగా ఉంటే అది సాఫీగా (స్ట్రెయిట్)గా పెరుగుతుంది. అదే ఒకవేళ ఆ అడ్డుకోత దీర్ఘవృత్తంలా ఉంటే అది రింగులుగా పెరుగుతుంది. సాఫీగా (స్ట్రెయిట్గా) ఉండే జుట్టుకు... అడుగున ఉండే సబేషియస్ గ్రంథి నుంచి పోషకాలు సాఫీగా అందుతాయి. దాంతో ఇవి మరింత జీవంతో ఉంటాయి. ఇలా కనిపించడం కోసమే చాలామంది జుట్టును తిన్నగా ఉండేలా (హెయిర్ స్రెయిటెనింగ్) చేయించుకుంటుంటారు. అదే ఉంగరాల్లా తిరిగే జుట్టు వారిలో పోషకాలు చివరివరకూ చేరడానికి కాస్త అడ్డంకులు ఉండటంతో పొడవు జుట్టు ఉన్నవారి కంటే ఉంగరాల జుట్టు కాస్తంత మెరుపు తక్కువగా ఉంటుంది.జుట్టు రాలడానికి కారణాలు శారీరక ఒత్తిడి : రోజూ తీవ్రమైన శారీరక ఒత్తిడులు లేదా తీవ్రంగా జబ్బు పడటం వంటి అంశాలు జుట్టులో భౌతికంగా మార్పులు తెచ్చి వాటిని రాలిపోయేలా చేస్తాయి. ఇలా జుట్టు రాలడాన్ని ‘టిలోజెన్ ఎఫ్లూవియమ్’ అంటారు. అంటే ఈ దశలో జుట్టు ఊడిపోయే దశ అయిన టిలోజెన్ వైపునకు ప్రయాణం కొనసాగి, టిలోజెన్ దశ దీర్ఘకాలం కొనసాగుతుంది. దాంతో తలపై జుట్టు పలచబడినట్లుగా కనిపిస్తుంది. ఈ దశలో రాలిన జుట్టు చివరి భాగంలోని తెల్లని పదార్థం పచ్చిగా కాకుండా ఎండిపోయినట్లుగా ఉండటాన్ని గమనించవచ్చు.పరిష్కారం ఇలా : ఇలా రాలిన జుట్టు సాధారణంగా ఒత్తిడి తొలిగాక మళ్లీ మొలుస్తుంది.గర్భధారణ తర్వాత : చాలామంది మహిళల్లో ప్రసవం తర్వాత తలపై జుట్టు రాలిపోయి మాడుపై జుట్టు బాగా పలచబారిపోయినట్టుగా కనిపిస్తుంటుంది. ఈ దశలో మహిళల శారీరక ఒత్తిడి కూడా జుట్టు రాలడానికి ఒక కారణం. పైగా జుట్టుకు అందాల్సిన పోషకాలు అందకుండా పోవడం కూడా మరో కారణం. ఆ సమయంలో జుట్టుకు అవసరమైన ఐరన్, ఫోలిక్ యాసిడ్, ఇతర విటమిన్లు కడుపులోని బిడ్డకు అందడంతో ఇలా పోషకాలు జట్టుకు అందకుండాపోతాయి. పరిష్కారం ఇలా : తగినంత ఐరన్ సప్లిమెంట్లు, మల్టీవిటమిన్లు జుట్టుకు అందే విధంగా చూడటం వల్ల దీన్ని అరికట్టవచ్చు.ప్రోటీన్ లోపాలతో : ప్రోటీన్లోపం కారణంగా జుట్టు రాలిపోవడం చాలా మందిలో కనిపిస్తుంటుంది. ఇలాంటివారు తమ ఆహారంలో తగినంతగా ప్రోటీన్ తీసుకోకపోవడమే ఇందుకు కారణం. ఈ ప్రోటీన్లే అమైనో ఆసిడ్స్గా మారి జుట్టు పెరుగుదలకూ, రిపేర్లకూ ఉపయోగపడతాయి.పరిష్కారం ఇలా : ఈ కారణంతో జుట్టు ఎక్కువగా రాలుతున్నవారు ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఆహారమైన చేపలు, గుడ్లు, మాంసాహారం ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. శాకాహారులైతే ప్రోటీన్ మోతాదులు ఎక్కువగా ఉండే... గ్రీన్పీస్, నట్స్, శనగలు, పప్పుధాన్యాలు, సోయా తీసుకోవాలి.విటమిన్–ఏ మరీ ఎక్కువగా తీసుకోవడం వల్ల : ఆహారంలో విటమిన్–ఏ మోతాదులు మరీ ఎక్కువైతే కూడా జుట్టు రాలుతుంది. విటమిన్–ఏ మనకు ప్రతిరోజూ 5000 ఐయూ (ఇంటర్నేషనల్ యూనిట్స్) అవసరం. ప్రతిరోజూ విటమిన్–ఏ ను 10,000 ఐయూ కంటే ఎక్కువగా తీసుకునేవారు దాన్ని అదేపనిగా చాలాకాలం పాటు తీసుకుంటూ ఉంటే జుట్టు రాలే అవకాశాలు ఎక్కువ.పరిష్కారం ఇలా : విటమిన్–ఏ టాబ్లెట్లు తీసుకునేవారు కేవలం డాక్టర్ల సలహా మేరకు మాత్రమే, వారు నిర్ణయించిన మోతాదులోనే తీసుకోవాలి. హార్మోన్ లోపాల (హార్మోనల్ ఇంబ్యాలెన్స్) వల్ల : సాధారణంగా హార్మోన్ లోపాల సమస్య మహిళల్లో ఎక్కువ. స్త్రీలలో కూడా పురుష హార్మోన్ అయిన టెస్టో స్టెరాన్ కొద్ది మోతాదులో స్రవిస్తుంటుంది. పాలిసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్ (పీసీఓఎస్) ఉన్నవారిలో టెస్టోస్టెరాన్ ఎక్కువగా స్రవిస్తుంది. ఇది జుట్టు రాలిపోడానికి ఒక కారణమవుతుంది. హైపోథైరాయిడిజమ్ కండిషన్ కూడా జుట్టు రాలడానికి మరో కారణం.పరిష్కారం ఇలా : పీసీఓఎస్తో బాధపడే మహిళలు హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ ద్వారా... అలాగే హైపోథైరాయిడిజమ్తో బాధపడేవారు థైరాక్సిన్ సప్లిమెంట్స్ తీసుకోవడం జుట్టు రాలడం తగ్గవచ్చు.కొన్ని ఆటోఇమ్యూన్ కండిషన్ల వల్ల : తమ సొంత వ్యాధి నిరోధకశక్తే తమకు దేహంపై ప్రతికూలంగా పనిచేయడం వల్ల వచ్చే జబ్బులను ఆటోఇమ్యూన్గా చెబుతారు. ఉదాహరణకు...పేనుకొరుకుడు (అలొపేషియా ఏరేటా) వల్ల... మాడు, కనుబొమలు, మీసం, గడ్డం, శరీరంలో ఏభాగంలోనైనా వెంట్రుకలన్నీ రాలిపోయి ప్యాచ్లుగా కనిపిస్తుంటాయి.లైకెన్ ΄్లానస్ అనే ఆటోఇమ్యూన్ కండిషన్ వల్ల జుట్టు శాశ్వతంగా ఊడిపోయే అవకాశం ఉంది. ∙లూపస్ అనే మరో ఆటో ఇమ్యూన్ కండిషన్ వల్ల కూడా శాశ్వతంగా జుట్టు రాలిపోయే ముప్పు ఉంటుంది.పరిష్కారం ఇలా : ఆటోఇమ్యూన్ కారణాల వల్ల జుట్టు రాలిపోవడాన్ని నివారించడానికి డ్యాప్సోన్ అనే మందులు కొంతవరకు పనిచేస్తాయి.ఏయే మందులతో జుట్టు రాలవచ్చు...మొటిమలకు వాడే మందులు (ఆక్నే మెడిసిన్స్),కొన్ని యాంటీబయాటిక్స్ కొన్ని యాంటీ ఫంగల్ మందులు,యాంటీ డిప్రెసెంట్స్నోటి ద్వారా తీసుకునే గర్భనిరోధక మందులు,రక్తాన్ని పలచబార్చే యాంటీ కోయాగ్యులెంట్స్ (బ్లడ్ థిన్నర్స్),యాంటీకొలెస్ట్రాల్ మందులు ∙ఇమ్యునోసప్రెసెంట్స్,కీమోథెరపీ మందులు.మూర్చ చికిత్సలో వాడే ఎపిలెప్సీ మందులు,హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీలో వాడే ఈస్ట్రోజెన్, ప్రోజెస్టెరాన్, పురుషులకు వాడే టెస్టోస్టెరాన్, యాండ్రోజెన్,ఇంటర్ఫెరాన్స్,వేగంగా మారిపోయే మూడ్స్ను నియంత్రించడానికి వాడే మూడ్ స్టెబిలైజేషన్ మందులు,నొప్పినివారణకు వాడే ఎన్ఎస్ఏఐడీ మందులు,స్టెరాయిడ్స్, ∙థైరాయిడ్ మందులు.పరిష్కారం ఇలా...మందులు వాడటం మానేయగానే సాధారణంగా జుట్టు మళ్లీ రావచ్చు.జుట్టు రాలడం మరీ ఎక్కువగా ఉంటే కొన్ని మందులు వాడటం ద్వారా.జుట్టు రాలడాన్ని అరికట్టే మందులు వాడటం ద్వారాకీమోథెరపీ ఇచ్చే సమయంలో హైపోథెర్మియా అనే ప్రక్రియను ఉపయోగించడం ద్వారా. ఈ ప్రక్రియలో కీమోథెరపీ ఇచ్చే ముందర... ఇచ్చిన అరగంట తర్వాత మాడుపై ఐస్తో రుద్దుతారు. ఫలితంగా కీమోథెరపీలో ఇచ్చిన మందు ఫాలికిల్లోకి అంతగా ప్రవేశించదు. ఇలా చల్లబరిచే ప్రక్రియ హెయిర్ ఫాలికిల్ను కాస్త నెమ్మదించేలా చేసి, జుట్టు రాలడాన్ని నివారిస్తుంది.స్కారింగ్ అలొపేషియా : ఈ సమస్య కారణంగా దాదాపు మూడు శాతం మందిలో జుట్టు రాలిపోతుంటుంది. ఇలా రాలిపోయే జుట్టు మళ్లీ రాదు. ఎందుకంటే ఇందులో ఫాలికిల్ శాశ్వతంగా దెబ్బతింటుంది. ఆ స్థానంలో స్కార్ కణజాలం భర్తీ అవుతుంది. అందుకే ఈ కారణంగా జుట్టు రాలిపోతే అది మళ్లీ మొలవదు. ఇలా జుట్టు రానప్పుడు అది ప్యాచ్లు ప్యాచ్లుగా ఉండి, ఆ ప్యాచులు క్రమంగా పెరుగుతుంటాయి. కొన్ని సందర్భాల్లో జుట్టు రాలిన చోట కనిపించే ప్యాచ్లలో దురద, మంట, నొప్పి కూడా ఉండవచ్చు. డిసెక్టింగ్ సెల్యులైటిస్, ఇసినోఫిలిక్ పస్ట్యూల్ ఫాలిక్యులైటిస్, ఫాలిక్యులార్ డీజనరేషన్ సిండ్రోమ్, లైకెన్ ΄్లానో పైలారిస్, సూడోపెలేడ్ ఆఫ్ బ్రాక్ అనే కండిషన్లు... స్కారింగ్ అలొపేషియాకు కారణమవుతాయి.జుట్టును రాల్చే ఇన్ఫెక్షన్లు...రింగ్వార్మ్ : ఇది ఒక రకం ఫంగల్ ఇన్ఫెక్షన్. ఈ కండిషన్ను టీనియా కాపిటిస్ అంటారు. ఇది ఫంగస్ కారణంగా మాడుపై వస్తుంది. మొదట చిన్న మొటిమలా వచ్చి క్రమంగా పరిమాణం పెరుగుతూ పోతుంది. విస్తరించిన చోట పొలుసుల్లా వచ్చి... ఆ ప్రదేశంలో తాత్కాలికంగా జుట్టు మొలవదు.చికిత్స: టెర్బినఫిన్, ఫ్లుకోనజోల్, గ్రీషియోఫల్విన్, ఇట్రాకొనజోల్ వంటి యాంటీఫంగల్ మందులతో చికిత్స చేయవచ్చు.ఫాలిక్యులైటిస్ : ఇది జుట్టు ఫాలికిల్ (అంకురాల్లో) ఇన్ఫ్లమేషన్ (వాపు, నొప్పి) వచ్చే కండిషన్. ఇది వచ్చినవారిలో వెంట్రుక మొదల్లో ఎర్రటి పొక్కులు వచ్చినట్లుగా కనిపిస్తుంటుంది. ఇది స్టెఫలోకాకస్, సూడోమొనాస్ వంటి బ్యాక్టీరియా కారణంగా వస్తుంది.చికిత్స : యాంటీబయాటిక్ మందులతో దీన్ని తగ్గించవచ్చు.పీడ్రా : ఇది వెంట్రుకకు వచ్చే ఒక రకం ఫంగల్ ఇన్ఫెక్షన్.డెమోడెక్స్ ఫాలిక్యులోరమ్ : ఇది కనురెప్పల వెంట్రుకలను ప్రభావితం చేసే కండిషన్. ఈ జబ్బుకు దారితీసే సూక్ష్మజీవి కనురెప్పలను మెరిసేలా చేసే నూనెను ఎక్కువగా స్రవించేలా చేయడం వల్ల ఈ రుగ్మత వస్తుంది.సెబోరిక్ డర్మటైటిస్ : వాస్తవానికి ఇది ఇన్ఫెక్షన్ కాని కండిషన్. ఈ కండిషన్లో చర్మం పగుళ్లు ఫంగల్ ఇన్ఫెక్షన్తో పాటు కలిసి వస్తాయి. ఈ పరిస్థితిని సల్ఫర్, సెలీనియమ్ సల్ఫైడ్, జింక్ పైరోథియాన్ (జడ్పీటీఓ), తార్, శాల్సిలిక్ ఆసిడ్ లేదా ఆయిల్ ఆఫ్ లేడ్, కార్టికోస్టెరాయిడ్ లోషన్లతో చికిత్స చేసి, నియంత్రణలోకి తెస్తారు.వెంట్రుక తీగ (షాఫ్ట్)కు వచ్చే లోపాలు...వెంట్రుకలో మనకు పైకి కనిపించే తీగ వంటి భాగాన్ని షాఫ్ట్ అంటారు. ఈ లోపాలకు ప్రధాన కారణం జన్యుపరమైనవి. వాటిలో కొన్ని...లూజ్ అనాజెన్ సిండ్రోమ్ : దీన్నే లూజ్ హెయిర్ సిండ్రోమ్ అంటారు. దీని పేరే దీని వల్ల కలిగే లోపాన్ని సూచిస్తుంది. అంటే అనాజెన్ దశలో వెంట్రుక వదులుగా అయి చిన్నగా లాగినా ఊడి వచ్చేస్తుంది. ముఖ్యంగా యుక్తవయస్కులైన బాలికల్లో ఈ లోపం కనిపిస్తుంది. ఇలా ఊడిన జుట్టు ఒకపట్టాన తేలిగ్గా మొలవదు. అందుకే మాడుపై జుట్టు పలచబారే అవకాశం ఉంది.పరిష్కారం : సాధారణంగా ఇలా ఊడిన జుట్టు దానంతట అదే రావాల్సిందే. చికిత్సతో పెద్దగా ప్రభావం ఉండదు.ట్రాక్షన్ అలొపేషియా: చాలామంది తల్లులు జడవేసే సమయంలో తమ పిల్లలకు జుట్టును బాగా లాగి టైట్గా జడవేస్తుంటారు. ఇలా చాలాకాలం పాటు జుట్టును చాలా బలంగా లాగుతుండటం వల్ల జుట్టు శాశ్వతంగా దెబ్బతింటుంది.ట్రైకో టిల్లోమేనియా : ట్రైకో టిల్లోమేనియా అనే కండిషన్లో కొందరు తమ జుట్టును తామే బలంగా పీకేసుకుంటుంటారు. బాగా ఒత్తిడితో ఉండేవారు తమ గోళ్లు విపరీతంగా కొరుక్కున్నట్టుగానే ఈ సమస్య ఉన్నవారు తమ జుట్టు తామే పీకేసుకుంటుంటారు. వీళ్లు తమ కనురెప్పల వెంట్రుకలు, కనుబొమల వెంట్రుకలు కూడా లాగుతూ ఉంటారు.ట్రైకోఫేజియా : ఇది కూడా తమ జుట్టు తాము లాక్కోవడం లాంటిదే. అయితే ఈ రుగ్మత ఉన్నవారు అలా లాగిన జుట్టును తినేస్తుంటారు. ఇది చాలా తీవ్రమైన జబ్బు. ఇలాంటి వారికి తక్షణమే చికిత్స (ఎమర్జెన్సీ ట్రీట్మెంట్) ఇవ్వడం అవసరం. చివరగా... జుట్టు రాలుతున్నప్పుడు వెంట్రుకలకు ఉన్న సమస్య ఏమిటో తెలుసుకుని... ఆ మేరకు చికిత్స అందించాల్సి ఉంటుంది. అయితే ఇటీవల వైద్యపరంగా తగిన విద్యార్హతలు లేనివారు జుట్టుకు చికిత్స అందిస్తున్నారు. దీనివల్ల జుట్టు శాశ్వతంగా దెబ్బతినడం లేదా రాలిపోవడం జరగవచ్చు. అందుకే తమ జుట్టు సమస్యలకు తగిన విద్యార్హతలు ఉన్న నిపుణలను సంప్రదించడం అన్న జాగ్రత్త తీసుకోవడం మంచిది.తొలి రోమం పుట్టేదిలా... బిడ్డ తన తల్లి కడుపులో ఉన్నప్పుడు పిండం తాలూకు 22వ వారంలోనే వెంట్రుక మూలాలు చిన్నారి తాలూకు దేహమ్మీద ఆవిర్భవిస్తాయి. వాటిని ఫాలికిల్స్ అంటారు. అంటే పుట్టుకకు ముందే బిడ్డ శరీరంపై 50 లక్షల ఫాలికిల్స్ ఉంటాయి. వీటిల్లో పదిలక్షలు తల (మాడు) మీద ఉంటాయి. పుట్టుకకు ముందు ఈ ఫాలికిల్స్ (వెంట్రుక మూలాలు) ఎన్ని ఉంటాయో జీవితాంతం అన్నే ఉంటాయి. అంతేతప్ప వీటి సంఖ్య జీవితకాలంలో ఎప్పుడూ పెరగదు. పైగా వ్యక్తులు పెరుగుతున్నకొద్దీ వీటి సంఖ్య తగ్గుతూ పోతుంది.వెంట్రుక నిర్మాణం ఇలా... వెంట్రుకను ప్రధానంగా రెండు భాగాలుగా చెప్పవచ్చు. అదే మాడు మీది చర్మం లోపల ఉండే ‘అంకురం’ (బల్బ్) భాగం. ఇక మనకు బయటకు కనిపించే భాగాన్ని ‘వెంట్రుక’ (షాఫ్ట్) అంటారు. ఇలా వెంట్రుకలో బల్బ్ అలాగే షాఫ్ట్ అని రెండు భాగాలుంటాయి.బల్బ్ అని పిలిచే ఈఅంకురంలో అనేక పొరలు ఉంటాయి. అంకురం లోపల ఒక మోలక(్రపొజెక్షన్)లా ఉండే భాగాన్ని పాపిల్లా అంటారు. దీనికి రక్తసరఫరా ఉంటుంది. వెంట్రుకలో జీవంతో ఉండే భాగం ఇదే. ఈ బల్బ్లో ఎప్పుడూ కణవిభజన జరుగుతూ ఉంటుంది. ఇంత వేగంగా శరీరంలోని మరేప్రాంతంలోనూ కణవిభజన జరగదు. ప్రతి 23 నుంచి 72 గంటలకొకసారి కణాల విభజన జరుగుతూ ఉండటం వల్ల వెంట్రుకలు పెరుగుతూ ఉంటాయి. ఇక ప్రతి అంకురం పక్కనే ఒక గ్రంథి ఉంటుంది. దాన్ని ‘సబేషియస్ గ్రంథి’ అంటారు. ఇది నూనెలాంటి ద్రవాన్ని స్రవిస్తుంటుంది. ఇది జుట్టుకు స్వాభావికమైన (నేచురల్) కండిషనర్లా పనిచేస్తుంటుంది. చిన్నపిల్లలు తమ టీనేజీలోకి రాగానే ఈ గ్రంథి నుంచి స్రావం ఎక్కువై జుట్టులో మెరుపును పెంచి, ఆ వయసులో కౌమార బాలబాలికలు మరింత అందంగా కనిపించేలా చేస్తుంది.మందుల వల్ల...రకరకాల ఆరోగ్య సమస్యలకు కొన్ని రకాల మందులు వాడుతున్న కొందరిలో వాటి దుష్ప్రభావం వల్ల జుట్టు రాలడం సాధారణంగా జరుగుతుంటుంది. కొందరిలోనైతే ఇది అవాంఛిత రోమాల పెరుగుదలకూ దారితీస్తుంది. ఈ మందులు జుట్టు పెరుగుదలలో ఉండే అనాజెన్, కెటాజెన్, టిలోజెన్ దశల్లో జోక్యం చేసుకోవడం వల్ల జుట్టు పెరుగుదల/జీవిత చక్రాల (సైకిల్)లో మార్పు వస్తుంది. ఫలితంగా టిలోజెన్ ఎఫ్లువియమ్, అనాజెన్ ఎఫ్లూవియమ్ అనే రెండు రకాల మార్పులు వచ్చి అవి జుట్టు రాలేలా చేస్తాయి.టిలోజెన్ ఎఫ్లూవియమ్ : ఏదైనా రుగ్మతకు మందులు వాడటం మొదలుపెట్టాక 2 నుంచి 4 నెలల్లో మందు ప్రభావంతో వెంట్రుక ఫాలికిల్ విశ్రాంతి దశలోకి వెళ్తుంది. ఫలితంగా జుట్టు రాలాక మళ్లీ మొలవడం ఆలస్యం అవుతుంది.అనాజెన్ ఎఫ్లూవియమ్ : ఈ దశలో జుట్టు రాలడం విషయంలో... వెంట్రుకలు తమ పెరుగుదల దశలోనే రాలిపోతుంటాయి. ఈ ఫలితం మందు వాడటం మొదలుపెట్టిన కొద్దిరోజుల్లోనే ఇది కనిపిస్తుంది. ఉదాహరణకు కీమోథెరపీ తీసుకునేవారిలో అనాజెన్ ఎఫ్లూవియమ్ వల్లనే జుట్టురాలడం సంభవిస్తుంది. ఈ మందుల వల్ల కేవలం తలపైన ఉండే జుట్టే కాకుండా కనుబొమలు, కనురెప్పల వెంట్రుకలూ రాలిపోతాయి.జుట్టు... దానిపై రసాయనాల ప్రభావం... జుట్టుకు రంగువేయడం, స్ట్రెయిటెన్ చేసుకోవడం, బ్లీచింగ్ వంటి ప్రక్రియల్లో వెంట్రుకలు... రసాయనాలకు ఎక్స్పోజ్ అవుతుంటాయి. ఫలితంగా వాటిపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుంది. దీనివల్ల ఒక్కోసారి వెంట్రుకలు మళ్లీ రిపేర్ చేయలేని విధంగా దెబ్బతినవచ్చు. మనకు కనిపించే వెంట్రుక పై పొర అయిన క్యూటికిల్ పూర్తిగా దెబ్బతినవచ్చు. ఇలా వెంట్రుక పైపొర అయిన క్యూటికిల్ దెబ్బతింటే లోపల ఉండే కార్టెక్స్ అనే భాగం బయటకు కనిపిస్తుంది. ఇది పైపొరలా నునుపుగా కాకుండా కాస్త గరుకుగా ఉంటుంది. ఈ కార్టెక్స్ భాగం బయటపడిన జుట్టు నిర్జీవంగా కనిపిస్తుంటుంది. ఇక నీళ్లలో, వాతావరణంలో, షాంపూల్లో, హెయిర్స్ప్రేలలో ఉండే రసాయనాలు క్యూటికిల్నే కాకుండా కార్టెక్స్నూ దెబ్బతీయవచ్చు. అప్పుడు వెంట్రుక తేలిగ్గా విరిగిపోతూ ఉంటుంది.వెంట్రుకను దెబ్బతీసే భౌతిక పద్ధతులు : విపరీతంగా దువ్వడం, చాలా బలంగా దువ్వడం, జుట్టు తడిగా ఉన్నప్పుడే దువ్వడం, వెనక్కు దువ్వడం, బలమైన వేడిగాలి తగిలేలా డ్రైయర్ను ఉపయోగించడం వంటి ప్రక్రియలు సైతం వెంట్రుకలను దెబ్బతీస్తాయి. ఇలా భౌతికపద్ధతుల ద్వారా దెబ్బతిన్న వెంట్రుక సాఫీగా లేకుండా ఒకచోట ఉబ్బు మరోచోట పలచబారినట్లుగా ఉంటుంది. ఇలా కనిపించే వెంట్రుకలను ‘బబుల్డ్ హెయిర్’ అంటారు. ఇలాంటి వెంట్రుకలు బలహీనంగా, తేలిగ్గా విరిగిపోయేలా ఉంటాయి.పుట్టుకతోనే జుట్టు రాలిపోయే కండిషన్లు... హైపోట్రైకోసిస్ : జుట్టు సమస్యల్లో ఇదో రకం. అలొపేషియాలో మొదట జుట్టు ఉన్న చోట రాలిపోయి, మళ్లీ మొలవడంలో ఇబ్బందులు ఏర్పడితే... ఈ ‘హైపోట్రైకోసిస్’ అనే సమస్యలో అసలు జుట్టు పెరగాల్సిన చోట... మొదట్నుంచి కూడా వెంట్రుకలే మొలవవు. దాంతో పుట్టుకతోనే జుట్టు మొలవకపోవడంతో పాటు... జీవితకాలంలో అసలెప్పుడూ వారిలో జుట్టు మొలవదు. ఇందుకు కారణాలు ప్రధానంగా జన్యుపరమైనవి. ఇక పిండదశలో వచ్చే లోపాల వల్ల కూడా ఇలా జరగవచ్చు. ఈ సమస్యతో పాటు కనిపించే గ్రాహమ్ లిటిల్ సిండ్రోమ్, ఒఫ్యూజీ సిండ్రోమ్, మేవిక్ క్లేవ్ సిండ్రోమ్ వంటివి కూడా ఇందుకు కారణమవుతాయి.కంజెనిటల్ అలొపేషియా : ఈ కండిషన్ కారణంగా పుట్టుకతోనే బట్టతల వస్తుంది.ట్రైయాంగ్యులార్ అలొపేషియా : ఈ కండిషన్లో కణతల వద్ద జుట్టు రాలిపోతుంది. కంజెనిటల్ ఏట్రికియా : పిల్లల్లో కనిపించే ఈ కండిషన్లో మొదట వారికి ఒత్తైన జుట్టు ఉండి, అది రాలిపోయి మళ్లీ మొలవదు.- డా. విజయ గౌరి బండారు, సీనియర్ కన్సల్టెంట్ డెర్మటాలజిస్ట్.నిర్వహణ : యాసీన్ -
జస్ట్ 24 వారాల్లో 25 కిలోలు బరువు ..! నిలకడగా ఆ మూడు అలవాట్లు..
బరువు తగ్గడానికి ఎల్లప్పుడూ కఠినమైన ఆహార నియమాలు లేదా తీవ్రమైన వ్యాయామాలు అవసరం లేదని కొందరు ఫిట్నెస్ ఔత్సాహికులు నిరూపిస్తున్నారు. కేవలం నిలకడతో జీవనశైలి మార్పులను అనుసరిస్తే చాలంటున్నారు. తాజాగా మరో ఫిట్నెస్ నిపుణుడు అలా చేసే జస్ట్ ఆరు నెలల్లో 25 కిలోలు పైనే తగ్గి చూపించాడు. తన శరీరాకృతిని స్లిమ్గా మార్చుకోవడానికి సహాయపడిన ఆచరణాత్మక నియామాలను ఇన్స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నారు. అవేంటంటే..ఫిట్నెస్ నిపుణుడు జీషన్అలీ తాను సులభమైన జీవనశైలి మార్పులతోనే 25 కిలోలు పైనే తగ్గానని అన్నారు. కడుపు నిండినట్లు అనిపించకపోవడమే అధికంగా తినాలనే కోరికలను రేకెత్తిస్తుందని అన్నారు. ఫలితంగా జింక్ ఫుడ్పైకి మనసు మళ్లుతుందని అన్నారు. అందుకోసం తాను జస్ట్ మూడు నియమాలను పాటించానని అన్నారు.నిద్రకు ప్రాధాన్యత ఇవ్వండి..నీరు తాగండి..నిద్ర నీరు రహస్య ఆయుధాలని నొక్కి చెబుతున్నాడు. తాను ప్రతి రాత్రి 10:30 గంటలకల్లా పడుకునేవాడినని, రోజూ మూడు నుంచి నాలుగు లీటర్ల నీరు తాగేవాడినని అన్నారు. ఇక్కడ ఎక్కువ నిద్ర, ఎక్కువ నీరు అంటే.. ఎక్కువ శక్తి, తక్కువ ఆకలి అని చెప్పారు. ప్రతిరోజు ఒక దినచర్యను పాటించడం..అంటే నిద్ర, జిమ్, వాకింగ్లకు సమాన ప్రాధాన్యతి ఇస్తూ చేయాలి. ముందుగా ప్లాన్ చేసుకుని అనుసరిస్తే..సవ్యంగా ఉంటుంది లేదంటే ఆ ప్లాన్ కాగితానికే పరిమితం అవుతుందని అంటున్నారు.తగినంత ప్రోటీన్ తీసుకోండి..అతని బరువు తగ్గే ప్రయాణంలో ఆకలిని నియంత్రించడంలో ప్రోటీన్ కీలకపాత్ర పోషిస్తుందని అంటున్నారు. తాను తక్కువ ఆహారం తీసుకున్నప్పటికీ..ప్రోటీన్ మాత్రం రోజుకి 180–200 గ్రాములకు పరిమితం చేశానని అన్నారు. కండరాలను కాపాడుకోవడానికి, ఆకలి కోరికలు తగ్గించుకోవడానికి, అలాగే జీవక్రియను మెరుగ్గా ఉంచడానికి ఇది ఉపకరిస్తుందని అన్నారు. దీనివల్ల పొట్టకొవ్వు వేగంగా తగ్గుతుందని చెబుతున్నారు. అలా 46 ఏళ్ల వయసులో 24 వారాల్లో తాను 101 కేజీల నుంచి 76 కేజీలకు తగ్గానని చెప్పారు. View this post on Instagram A post shared by Zee Ali - South Asian Health and Fitness Expert (@_zeeali1)గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: 'టైప్రైటర్'తో అద్భుతమైన చిత్రం..! ఆ క్రియేటివిటీకి మాటల్లేవ్ అంతే) -
చూపును తినేస్తున్న మధుమేహం.. యువతను టార్గెట్ చేస్తున్న క్యాటరాక్ట్!
న్యూఢిల్లీ: సాధారణంగా వృద్ధాప్యంలో వచ్చే కంటి సమస్యగా భావించే క్యాటరాక్ట్ (కంటి శుక్లాలు) ఇప్పుడు దేశంలో యువతను, ముఖ్యంగా 50 ఏళ్ల లోపు ఉన్నవారిని కలవరపెడుతోంది. భారతదేశంలో మధుమేహం (డయాబెటిస్) మహమ్మారిలా విస్తరిస్తుండటమే దీనికి ప్రధాన కారణమని నేత్ర వైద్య నిపుణులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రక్తంలో అదుపు తప్పిన చక్కెర స్థాయిలు కంటి సహజ లెన్స్ను దెబ్బతీస్తూ, చిన్న వయసులోనే చూపు మసకబారేలా చేస్తున్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.షుగర్ పెరిగితే ప్రమాదంలో కంటిచూపు దేశంలో దాదాపు 10.1 కోట్ల మంది డయాబెటిస్ బాధితులు, మరో 13.6 కోట్ల మంది ప్రీ-డయాబెటిస్ (మధుమేహం వచ్చే ముందు దశ) బాధితులు ఉన్నట్లు అంతర్జాతీయ డయాబెటిస్ ఫెడరేషన్ గణాంకాలు చెబుతున్నాయి. ఢిల్లీలోని డాక్టర్ అగర్వాల్స్ ఐ హాస్పిటల్ రీజినల్ డైరెక్టర్ డాక్టర్ జె.ఎస్. తితియాల్ తెలిపిన వివరాల ప్రకారం.. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు సుదీర్ఘకాలం పాటు ఎక్కువగా ఉండటం వల్ల కంటి లెన్స్లో జీవ రసాయన మార్పులు జరిగి, చిన్న వయసులోనే అది మసకబారుతోంది. ప్రస్తుతం 40, 50 ఏళ్ల వయసున్న సాఫ్ట్వేర్ ఉద్యోగులు, ఇతర వృత్తుల వారు కూడా ఈ సమస్యతో ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు.మారిన జీవనశైలి.. మసకబారుతున్న స్క్రీన్లుడయాబెటిస్ మాత్రమే కాకుండా ఊబకాయం, రక్తపోటు (బీపీ) వంటి జీవనశైలి సమస్యలు కూడా క్యాటరాక్ట్ రోగుల వయసును తగ్గించేస్తున్నాయి. రోజులో ఎక్కువ సమయం మొబైల్స్, కంప్యూటర్ స్క్రీన్ల ముందు గడిపే నేటి యువతకు స్వల్ప క్యాటరాక్ట్ ఉన్నా అది వారి పనితీరుపై తీవ్ర ప్రభావం చూపుతోంది. రాత్రి పూట డ్రైవింగ్ చేస్తున్నప్పుడు కాంతిని తట్టుకోలేకపోవడం, స్క్రీన్లు స్పష్టంగా కనిపించకపోవడం, కంటి అద్దాల నంబర్లు తరచూ మారడం, రంగులు వెలవెలబోయినట్లు అనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయవద్దని వైద్యులు సూచిస్తున్నారు.ముదరనివ్వకండి.. అపోహలు వీడండికంటి శుక్లాల చికిత్సలో ఎన్నో ఆధునిక సాంకేతికతలు అందుబాటులోకి వచ్చినప్పటికీ, సమాజంలో ఉన్న కొన్ని అపోహల వల్ల ప్రజలు సకాలంలో చికిత్స పొందడం లేదని డాక్టర్ సిద్ధార్థ్ సైన్ ఆందోళన వ్యక్తం చేశారు. క్యాటరాక్ట్ పూర్తిగా ముదిరిన తర్వాతే ఆపరేషన్ చేయించుకోవాలనే పాత నమ్మకం చాలా ప్రమాదకరమని, అలాగే కంటి చుక్కల మందులతో శుక్లాలు కరిగిపోతాయనడం కేవలం భ్రమ మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు. ఆపరేషన్ ఆలస్యం చేసే కొద్దీ కంటి లెన్స్ మరింత గట్టిపడి, సర్జరీ క్లిష్టతరంగా మారుతుందని, చూపు తిరిగి రావడం ఆలస్యమవుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. -
హాట్ వర్సెస్ ఐస్ ప్యాక్: ఎలాంటప్పుడు మంచిదంటే..
దేహంలో ఎక్కడైనా వాపుగానీ నొప్పిగానీ వస్తే కాపడం పెట్టడం చాలా సాధారణం. ఇలా కాపడం పెట్టడం ద్వారా నొప్పి నుంచి ఉపశమనం పొందడం ఎప్పటినుంచో అనుసరిస్తున్న ప్రక్రియ. అయితే ఏయే సందర్భాల్లో ఐస్ ప్యాక్ (ఐస్ కాపడం) పెట్టాలో... మరే సందర్భంలో వేడి కాపడం అవసరమవుతుందో చూద్దాం. ఐస్ప్యాక్ ఎప్పుడంటే... గాయం తగిలిన చోట ఐస్తో అద్దడం వల్ల ఉపశమనం కలగడం అన్నది తాజాగాయాల విషయంలోనే ఎక్కువ. దెబ్బతగిలినప్పుడు ఆ ప్రాంతం ఎర్రబడుతుంది. వాపు వచ్చి ఆ ప్రదేశం కాస్త వేడిగా అనిపిస్తుంటుంది. అప్పుడు అక్కడ ఐస్ పెట్టడం వల్ల అక్కడి (లోకల్) ఉష్ణోగ్రతలు తగ్గుతాయి. ఆ ప్రాంతంలోని రక్తనాళాలు సంకోచిస్తాయి. కొద్ది నిమిషాల తర్వాత అవే రక్తనాళాలు వ్యాకోచిస్తాయి. ఇలా రక్తనాళాల సంకోచ–వ్యాకోచాలను ‘లూయీస్–హంటింగ్ చర్య’ అంటారు. దీనివల్ల చిన్న రక్తనాళాలు వ్యాకోచించగానే దెబ్బతగిలినప్పుడు ఏర్పడ్డ మలిన పదార్థాలన్నీ రక్తంలో ఒక్కసారిగా కలిసి పలచ బారిపోతాయి. దాంతో వాపు తగ్గుతుంది. ఐస్ పెట్టడం వల్ల కోల్డ్ రిసెప్టార్స్ ఉత్తేజం చెంది ఎండార్ఫిన్స్, ఎన్కెఫలిన్స్ అనే ఉత్ప్రేరకాలు విడుదల అవుతాయి. దాంతో నొప్పి తగ్గుతుంది. ఐస్ వల్ల నరాల నుంచి వెళ్లే సంకేతాల వేగం (నర్వ్ కండక్షన్ వెలాసిటీ) తగ్గుతుంది. కండరాల బిగుతు కూడా తగ్గుతుంది. ఐస్ప్యిక్ అన్నది కనీసం 10–15 నిమిషాలు పెట్టాలి. ఐస్ క్యూబ్స్ను నేరుగా అద్దడం కంటే... టవల్లోగాని, లేదా ఏదైనా కవర్లోగాని పెట్టి ఐస్ప్యిక్ పెట్టవచ్చు. ఎప్పుడెప్పుడు మంచిదంటే... : ఆర్థరైటిస్ ఉన్నప్పుడు / వాపు, మంట వచ్చిన చోట (టెండర్పాయింట్స్లో) / తాజా గాయాలు (ఫ్రెష్ ఇంజరీస్) అయినప్పుడు. హాట్ ప్యాక్ (వేడికాపడం) ఎప్పుడంటే... సాధారణంగా దీర్ఘకాలికంగా వచ్చే నొప్పులూ, అలాగే నొప్పి ఒక చోటి నుంచి మరోచోటికి పాకుతున్నప్పుడు వేడికాపడం ద్వారా మంచి ఉపశమనం దొరుకుతుంది. ఈ వెచ్చదనం ప్రభావం చర్మం పైపొరలకే పరిమితం కాకుండా, కండరాల మీద కూడా ప్రభావం చూపుతుంది. వేడికాపడం వల్ల ఆ పరిసరాల్లో రక్తప్రసరణ వేగవంతమవుతుంది. దాంతో అక్కడ జీవక్రియల వేగం (మెటబాలిక్ రేట్) కూడా పెరుగుతుంది. వేడికాపడంతో కండరాలు రిలాక్స్ అవుతాయి. ఈ చర్యలన్నింటి వల్ల ఉపశమనం కలుగుతుంది. వేడికాపడం అన్నది కాస్త కాస్తగా కాపడం పెడుతూ 10–15 నిమిషాలు కొనసాగించాలి. వేడికాపడం బట్టను వేడి చేయడం ద్వారాగానీ, హాట్ వాటర్ బ్యాగ్తోగాని, ఎలక్ట్రిక్ హీట్ప్యాక్ పెట్టవచ్చు. ఎప్పుడెప్పుడు మంచిదంటే... : నడుమునొప్పి / ఏదైనా పనిచేయడం ద్వారా వచ్చిన వెన్ను నొప్పి (మెకానికల్ బ్యాక్పెయిన్) / డిస్క్ప్లాప్స్ / సయాటికా. -
రోగనిరోధక శక్తిని ఎలా పెంచాలి?
డాక్టర్ గారు, నా రెండేళ్ల బాబుకు తరచూ జలుబు, దగ్గు, జ్వరం వస్తుంటాయి. చాలాసార్లు యాంటీబయాటిక్స్ కూడా వాడాల్సి వస్తోంది. అతని రోగనిరోధక శక్తిని ఎలా పెంచాలి?– రమణి, నెల్లూరు. ముందుగా ఒక విషయం తెలుసుకోవాలి. రెండు సంవత్సరాల వయసులో పిల్లలకు సంవత్సరానికి ఆరు నుంచి పదిసార్లు జలుబు లేదా వైరల్ ఇన్ఫెక్షన్లు రావడం సాధారణమే. ఇది ఇమ్యూనిటీ బలహీనంగా ఉందని అర్థం కాదు. ఈ వయసులోనే పిల్లల రోగనిరోధక వ్యవస్థ వివిధ సూక్ష్మక్రిములను ఎదుర్కొంటూ క్రమంగా బలపడుతుంది. అయితే తరచుగా యాంటీబయాటిక్స్ అవసరం అవుతున్నాయనిపిస్తే, పిల్లల వైద్యుడిని సంప్రదించి నిజంగా యాంటీబయాటిక్స్ అవసరమా లేదా అని నిర్ధారించుకోవాలి. ఎందుకంటే చాలా జలుబులు, వైరల్ జ్వరాలకు యాంటీబయాటిక్స్ ఉపయోగం ఉండదు. అందుకే, వారి ఇమ్యూనిటీ పెంచే ప్రయత్నం చేయాలి. ఇందుకోసం పిల్లల ఇమ్యూనిటీ పెంచడానికి 7 బంగారు సూత్రాలు ఉన్నాయి.1. రంగురంగుల ఆహారంప్రతి రోజు పిల్లల ప్లేట్లో వివిధ రంగుల పండ్లు, కూరగాయలు ఉండేలా చూడండి. పిల్లల రోగనిరోధక శక్తిని మెరుగుపరచడంలో సమతుల్య ఆహారం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. బొప్పాయి, జామ, నారింజ, క్యారట్, టొమాటో, పాలకూర వంటి పండ్లు, కూరగాయలను ఆహారంలో చేర్చాలి. ఇవి విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లను అందించి శరీర రక్షణ వ్యవస్థను బలోపేతం చేస్తాయి.2. ప్రొటీన్ తప్పనిసరిరోగనిరోధక కణాలు, యాంటీబాడీలు తయారవ్వడానికి ప్రొటీన్ కీలకం. గుడ్లు, పాలు, పెరుగు, పప్పులు, శనగలు, చికెన్ లేదా చేపలు వంటి ప్రోటీన్ పదార్థాలు తీసుకోవడం అవసరం.3. తగినంత నిద్రనిద్రలోనే శరీరం తనను తాను పునరుద్ధరించుకుని రోగనిరోధక శక్తిని మెరుగుపరచుకుంటుంది. అందుకే, రెండేళ్ల పిల్లలకు రోజుకు 11 నుంచి 14 గంటల నిద్ర తప్పనిసరి.4. బయట ఆడుకోవడంప్రతిరోజూ కనీసం గంటసేపు బయట ఆడుకునేలా ప్రోత్సహించండి. సూర్యరశ్మి ద్వారా విటమిన్–డి లభించడంతో పాటు శారీరక దారుఢ్యం, ఆరోగ్యకరమైన ఎదుగుదల, మెరుగైన రోగనిరోధక శక్తి లభిస్తుంది.5. అన్ని టీకాలు సమయానికి వేయించండిటీకాలు పిల్లల శరీరానికి వివిధ వ్యాధులను ఎదుర్కోవడం నేర్పించే రక్షణ కవచంలాంటివి. అన్ని టీకాలను సమయానికి వేయించడం కూడా చాలా అవసరం. దీంతో అనేక తీవ్రమైన అంటువ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది.6. జంక్ ఫుడ్కు దూరంగా ఉంచండిచాక్లెట్లు, చిప్స్, కూల్డ్రింక్స్, ప్యాకెట్ ఫుడ్స్ వంటి జంక్ ఫుడ్ను పరిమితం చేయాలి. కడుపు నిండటం ఒకటి అయితే, శరీరానికి అవసరమైన పోషకాలు అందడం మరొకటి. ఈ రెండింటి మధ్య తేడాను గుర్తుంచుకోవాలి.7. చేతుల పరిశుభ్రత అలవాటు చేయండిఅనేక ఇన్ఫెక్షన్లు చేతుల ద్వారా వ్యాపిస్తాయి. అందుకే, చిన్నప్పటి నుంచే పరిశుభ్రతను నేర్పించాలి. భోజనం ముందు మరుగుదొడ్డి ఉపయోగించిన తర్వాత బయట నుంచి ఇంటికి వచ్చినప్పుడు సబ్బుతో చేతులు కడుక్కోవడం అలవాటు చేయాలి. అయితే సంవత్సరానికి పదిసార్లకుపైగా తీవ్రమైన ఇన్ఫెక్షన్లు రావడం, తరచూ న్యూమోనియా బారిన పడటం, బరువు సరిగా పెరగకపోవడం, నోటిలో పదేపదే ఫంగల్ ఇన్ఫెక్షన్లు రావడం లేదా తరచూ ఆసుపత్రిలో చేరాల్సిన పరిస్థితి ఉంటే పిల్లల వైద్యుడిని సంప్రదించాలి. అవసరమైతే ప్రత్యేక ఇమ్యూనిటీ పరీక్షలు చేయవచ్చు. గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఇమ్యూనిటీని ఒక్కసారిగా పెంచే మంత్రం లాంటి సిరప్ లేదా టానిక్ ఏదీ లేదు. సమతుల ఆహారం, తగిన నిద్ర, పూర్తి టీకాలు, శారీరక చలనం, పరిశుభ్రత వంటి ఆరోగ్యకరమైన అలవాట్లే పిల్లల రోగనిరోధక శక్తిని సహజంగా బలపరుస్తాయి. డా‘‘ కె. పవన్ కుమార్, సీనియర్ పీడియాట్రిషియన్, పీడియాట్రిక్ అలర్జిస్ట్, ప్రొఫెసర్ ఆఫ్ పీడియాట్రిక్స్ -
మూత్రపిండం ప్రాణగండం
మన దేహంలో మూత్రపిండాలు (కిడ్నీలు) ప్రతి క్షణం మన రక్తాన్ని వడపోస్తూ ఉంటాయి. ఈ ప్రక్రియలో అవి రక్తంలోని విషపదార్థాలనూ, వ్యర్థాలను, అదనపు నీటిని బయటకు పంపిస్తూ ఉంటాయి. అయితే కొన్ని పరిస్థితుల్లో కిడ్నీలు అకస్మాత్తుగా పనిచేయడం మానేస్తాయి. ఈ కండిషన్నే ‘అక్యూట్ కిడ్నీ ఇంజరీ’ (ఏకేఐ) అంటారు. ఇది కొంత ప్రమాదకరమైన పరిస్థితే. ఎందుకంటే ఈ పరిస్థితుల్లో బాధితులకు తగిన చికిత్స అందక΄ోతే కొన్ని గంటలు లేదా రోజుల్లోనే ప్రాణాపాయ స్థితికి తీసుకెళ్లే అవకాశమూ ఉంటుంది. ఈ మెడికల్ ఎమర్జెన్సీ కండిషన్ ఎప్పుడు ఏర్పడుతుంది, దీనికి కారణాలేమిటి, దీనికి నివారణ, చికిత్స వంటి అంశాలపై అవగాహన కోసం ఈ కథనం.కొంతమందిలో యూరిన్ పాస్ చేస్తున్న సమయంలో మూత్రం తక్కువగా రావడం జరుగుతుండవచ్చు. అలా మూత్రం పరిమాణం తగ్గడం అంత మంచి సూచన కాదు. అలాగే దేహంలో ముఖం లేదా కాళ్లూ చేతుల్లో వాపు, తీవ్రమైన అలసట (ఫెటీగ్) వంటి లక్షణాలను చిన్న సమస్యగానే అనుకుని కొంత నిర్లక్ష్యం చేసే అవకాశమూ ఉంది. అయితే ఈ లక్షణాలన్నీ కిడ్నీలు ప్రమాదంలో ఉన్నాయని తెలిపే తొలి సంకేతాలు కావచ్చు. సమయానికి చికిత్స తీసుకోక΄ోతే దేహంలో విషపదార్థాలు పేరుకు΄ోయి గుండె, ఊపిరితిత్తులు, మెదడు వంటి కీలక అవయవాలపై ప్రతికూల ప్రభావం చూపే ప్రమాదమూ ఉంటుంది. చికిత్స ఇలా... అక్యూట్ కిడ్నీ ఇంజరీ (ఏకేఐ)కి కారణమైన సమస్యను వెంటనే గుర్తించి, దానికి తక్షణ చికిత్స అందించడమన్నది ఏకేఐ చికిత్సలో అత్యంత కీలకం. ఉదాహరణకు డీ–హైడ్రేషన్ వల్ల దేహంలో ద్రవాలు తగ్గితే వెంటనే సెలైన్ ఎక్కించడం ద్వారా శరీరంలో నీటిమోతాదు సమతుల్యంగా ఉండేలా చూడాలి. అలాగే ఏదైనా ఇన్ఫెక్షన్ కారణంగా ఈ ముప్పు వాటిల్లినట్టు తెలిస్తే దాన్ని తగ్గించడం కోసం అవసరమైన చికిత్స ఇవ్వడం, కిడ్నీలకు హానికరమైన మందులను నిలిపివేయడం, అవసరమైతే తాత్కాలికంగా డయాలసిస్ చేయడం ద్వారా కిడ్నీలు తిరిగి కోలుకునేలా చేయాల్సిన అవసరం రావచ్చు. అంటే... ఏకేఐలో అందుకు కారణాన్ని బట్టి తగిన చికిత్స అందించాల్సి ఉంటుంది. చివరగా... మూత్రం పరిమాణం అకస్మాత్తుగా తగ్గిపోవడం చిన్న విషయం కాదు. అది కిడ్నీలు ప్రమాదంలో ఉన్నాయని దేహం ఇస్తున్న హెచ్చరిక కావచ్చు. అక్యూట్ కిడ్నీ ఇంజరీ సమస్యను ముందుగానే గుర్తించి సకాలంలో చికిత్స తీసుకుంటే కిడ్నీలనూ... ఒక్కోసారి ప్రాణాలనూ కాపాడుకోవచ్చని గుర్తుంచుకోవాలి.డాక్టర్ అరుణ్కుమార్ దొనకొండ కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ – కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఫిజీషియన్(చదవండి: హాట్ వర్సెస్ ఐస్ ప్యాక్: ఎలాంటప్పుడు మంచిదంటే..) -
హమ్మయ్యా... అది కూడా ఆరోగ్యమేనట!
ఆరోగ్యం అంటే ఏమిటి? కండలు తిరిగిన దేహమా? జబ్బుల్లేని జీవితమా? ఎంత తిన్నా లావు కాకపోవడమా? లేక ఎలాంటి చింతా, దిగులు లేకుండా జీవించడమా?..నిజానికి, ఆరోగ్యం అంటే శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా అంతే ముఖ్యం. అయితే భారతీయ సమాజంలో ఇప్పటికీ మానసిక ఆరోగ్యానికి తగిన ప్రాధాన్యం దక్కడం లేదు. దేశంలో ప్రతి ఏడుగురిలో ఒకరు ఏదో ఒక మానసిక సమస్యతో బాధపడుతున్నప్పటికీ, వారిలో మూడింట ఒక వంతు మంది మాత్రమే నిపుణుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. "మెంటల్" అనే ముద్ర పడుతుందేమో, నలుగురికి తెలిస్తే పరువు పోతుందేమో అనే భయంతో చాలామంది తమ సమస్యను బయటకు చెప్పడానికే వెనుకాడుతున్నారు.అయితే ఈ పరిస్థితిలో క్రమంగా మార్పు కనిపిస్తోంది. మణిపాల్ సిగ్నా నిర్వహించిన ఇండియా హెల్త్ కోషెంట్ సర్వే ప్రకారం తొలిసారిగా భారతీయులు శారీరక, మానసిక ఆరోగ్యాలకు దాదాపు సమాన ప్రాధాన్యం ఇస్తున్నారు. 35 ఏళ్లలోపు వారిలో 54 శాతం మంది మానసిక ఆరోగ్యమే అత్యంత ముఖ్యమని భావిస్తుండగా, 50 ఏళ్లు దాటిన వారిలో 53 శాతం మంది ఇప్పటికీ వ్యాయామం, ఫిట్నెస్కే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు.మెదడు పగిలేంత ఒత్తిడి... కానీ సమస్యే కాదట!ఈ అధ్యయనం బయటపెట్టిన మరో ఆందోళనకర విషయం భారతీయులు.. స్ట్రెస్ను చాలా తేలికగా తీసుకోవడం!. సర్వేలో పాల్గొన్న వారిలో 82 శాతం మంది తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నామని చెప్పినా, అది తమ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తోందని అంగీకరించింది కేవలం ఒక శాతం మాత్రమే. అంటే ఒత్తిడి ఎంత తీవ్రమైనా, దాన్ని ఆరోగ్య సమస్యగా భావించే అవగాహన ఇంకా చాలామందిలో లేదన్నమాట.ఆరోగ్యానికి, ఆర్థిక పరిస్థితికి మధ్య ఉన్న సంబంధాన్ని కూడా ఈ అధ్యయనం స్పష్టం చేసింది. ఆరోగ్య ఖర్చుల భారం చాలామందిలో ఆందోళన (యాంగ్జైటీ)ని పెంచుతుండగా, ఆరోగ్య బీమా ఉన్నవారిలో ఈ ఒత్తిడి కొంత తక్కువగా కనిపించింది.శారీరక, మానసిక ఆరోగ్యాలను వేర్వేరుగా చూడలేమని, రెండూ ఒకదానిపై మరొకటి ప్రభావం చూపుతాయని మణిపాల్ సిగ్నా సీఈవో జోయ్దీప్ సాహా పేర్కొన్నారు. ఈ రెండింటికీ సమాన ప్రాధాన్యం పెరగడం సానుకూల పరిణామమని ఆయన అభిప్రాయపడ్డారు.అయితే సవాళ్లు ఇంకా పెద్దవే. దాదాపు 147 కోట్ల జనాభా ఉన్న భారతదేశంలో మానసిక వైద్యుల సంఖ్య పదివేలకు కూడా చేరకపోవడం పరిస్థితి తీవ్రతను చూపిస్తోంది. అయినప్పటికీ, మానసిక ఆరోగ్యంపై అవగాహన క్రమంగా పెరుగుతుండటం మాత్రం ఆశాజనక పరిణామమే.భారతదేశంలో ఎక్కువగా కనిపించే ఐదు మానసిక సమస్యలు1. డిప్రెషన్:సుమారు 4.57 కోట్ల మంది భారతీయులు డిప్రెషన్తో బాధపడుతున్నారు. దేశంలో ఏటా జరిగే దాదాపు 2.5 లక్షల ఆత్మహత్యలకు ఇది ప్రధాన కారణంగా భావిస్తున్నారు. నిరుద్యోగం, లింగ వివక్ష, సామాజిక అసమానతలు, దీర్ఘకాలిక వ్యాధులు వంటి అంశాలు దీనికి కారణమవుతున్నాయి. పురుషుల కంటే మహిళల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తోంది.2. యాంగ్జైటీ డిజార్డర్స్:ఓసీడీ, పీటీఎస్డీ, పానిక్ డిజార్డర్, సోషల్ యాంగ్జైటీ, ఫోబియాలు వంటి అనేక సమస్యలు ఈ కోవలోకి వస్తాయి. వీటిని చాలామంది అసలు మానసిక సమస్యలుగానే గుర్తించకపోవడం వల్ల లక్షలాది మంది చికిత్సకు దూరమవుతున్నారు.3. మద్యం, మత్తు పదార్థాల వ్యసనం: దేశంలో దాదాపు 16 కోట్ల మంది మద్యం సేవిస్తుండగా, వారిలో 83 లక్షల మంది తీవ్ర వ్యసనపరులుగా ఉన్నారు. గంజాయి వంటి మత్తు పదార్థాలను వినియోగించే వారు 3.7 కోట్ల మంది ఉన్నట్లు అంచనా. సుమారు 18 లక్షల మంది చిన్నారులు కూడా వివిధ రకాల మత్తు పదార్థాల బారిన పడటం ఆందోళన కలిగించే విషయం.4. బైపోలార్ డిజార్డర్:దేశ జనాభాలో కనీసం రెండు శాతం మంది ఈ సమస్యను ఎదుర్కొనే అవకాశం ఉంది. కొంతకాలం అమితమైన ఉత్సాహంతో ఉండటం, ఆ తర్వాత తీవ్ర డిప్రెషన్లోకి వెళ్లిపోవడం దీని లక్షణం. సరైన సమయంలో చికిత్స అందకపోతే ఆత్మహత్య ప్రమాదం కూడా పెరుగుతుంది.5. స్కిజోఫ్రేనియా:ప్రతి వెయ్యి మందిలో ముగ్గురు ఈ మానసిక సమస్యతో బాధపడుతున్నారు. లేనివి ఉన్నట్లు ఊహించుకోవడం, భ్రాంతులు, ఆలోచనల్లో గందరగోళం, సమాజానికి దూరంగా ఉండడం దీని ప్రధాన లక్షణాలు. పురుషుల్లో ఇది తక్కువ వయసులోనే కనిపించగా, మహిళల్లో గర్భధారణ, ప్రసవం సమయంలో బయటపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది.మనసు ఆరోగ్యంగా ఉంటేనే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. మానసిక సమస్యలు కూడా ఇతర అనారోగ్యాల్లాగే వైద్య చికిత్స అవసరమయ్యే పరిస్థితులే. వాటిని దాచిపెట్టడం కాదు, గుర్తించి సరైన సమయంలో నిపుణులను సంప్రదించడమే నిజమైన ఆరోగ్యానికి మొదటి అడుగు.- గిళియారు గోపాలకృష్ణ మయ్యా -
బరువు తగ్గడానికి ఏది బెస్ట్?
ఆరోగ్యకరమైన బ్రేక్ఫాస్ట్ అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది గుడ్డు! రకరకాల పోషకాలు, విటమిన్లు, ప్రోటీన్ ఉండే ఎగ్ని కొందరు ఉడకబెట్టుకుని తింటే.. మరికొందరు వేడివేడిగా ఆమ్లెట్ వేసికుని లాగించేస్తుంటారు. ఈ రెండు రకాలు కూడా శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే బరువు తగ్గడానికి, శరీరానికి అవసరమైన ప్రోటీన్ అందడానికి ఈ రెండింటిలో ఏది బెస్ట్? అనే విషయంలో చాలా మందికి స్పష్టత ఉండదు.కొందరు ఆమ్లెట్ తింటే కడుపు నిండుగా ఉంటుందని నమ్మితే, మరికొందరు ఉడకబెట్టిన గుడ్డే ఉత్తమం అని వాదిస్తారు. మనం గుడ్డును వండే విధానం, అందులో కలిపే ఇతర పదార్థాల వల్ల దాని పోషక విలువలు ఎలా మారిపోతాయో తెలిస్తే.. మన ఫిట్నెస్ లక్ష్యాలకు ఏది సరైనదో సులభంగా ఎంచుకోవచ్చు.మీరు క్యాలరీలను చాలా ఖచ్చితంగా లెక్కబెడుతూ డైట్ ఫాలో అవుతుంటే, నిస్సందేహంగా ఉడకబెట్టిన గుడ్డుకే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. ఎందుకంటే ఇందులో దాగి ఉన్న కొవ్వులు లేదా అదనపు క్యాలరీలు ఉండే అవకాశం అస్సలు లేదు. అయితే, కూరగాయలతో పక్కాగా తయారుచేసిన ఆమ్లెట్కు మరో ప్రత్యేకమైన ప్లస్ పాయింట్ ఉంది. రెండు గుడ్లకు ఎక్కువ కూరగాయలు కలిపి వేసుకునే ఆమ్లెట్ ఎక్కువ క్వాంటిటీని ఇస్తుంది. ఇది మీ ఆకలిని సమర్థవంతంగా అణిచివేసి, జంక్ ఫుడ్స్ తినకుండా నియంత్రిస్తుంది. ఇందుకే చాలా మంది న్యూట్రిషనిస్టులు మీ డైట్ అవసరాలను బట్టి రోజు మార్చి రోజు ఈ రెండింటినీ మార్చుకుంటూ తినాలని సలహా ఇస్తుంటారు.చివరగా చెప్పాలంటే.. బరువు తగ్గాలనుకునే వారి హెల్తీ డైట్లో ఉడకబెట్టిన గుడ్డు, ఆమ్లెట్ రెండూ కూడా అద్భుతమైన భాగాలే. మీ జీవనశైలికి, మీ రుచికి ఏది కంఫర్ట్గా ఉంటే దానిని సరైన పద్ధతిలో వండుకుని తినడమే అత్యుత్తమం. -
సానుకూల శక్తికి విపరీత కరణి ఆసనం..
విపరీత కరణి ఆసనం ఒక సరళమైన కానీ అత్యంత ప్రభావవంత మైన ఆసనం. రోజుకు కేవలం 10–15 నిమిషాలు ఈ ఆసనం సాధన చేస్తే శరీరానికి విశ్రాంతి, మనసుకు ప్రశాంతత, జీవితానికి సానుకూల శక్తి లభిస్తాయి. విపరీత కరణి అనే సంస్కృత పదంలో ‘విపరీత’ అంటే తలకిందులైన లేదా వ్యతిరేకమైన, ‘కరణి’ అంటే చర్య లేదా స్థితి. ఈ ఆసనంలో శరీరాన్ని విశ్రాంతిగా ఉంచి, కాళ్లను గోడకు ఆనించి పైకి ఎత్తుతారు. ఇది శరీరానికి, మనసుకు ప్రశాంతతను అందించే యోగాసనం.ప్రయోజనాలు...ఒత్తిడి, ఆందోళన, టెన్షన్ ను తగ్గించి మనసును ప్రశాంతంగా ఉంచుతుంది.కాళ్లలో నిలిచిన రక్తం గుండె వైపు సులభంగా ప్రవహించడానికి సహాయపడుతుంది.ఎక్కువసేపు నిలబడే వారు, నడిచే వారికి కాళ్ల నొప్పి, వాపు తగ్గించడంలో సహాయపడుతుంది.నిద్రలేమి సమస్యలను తగ్గించి ప్రశాంతమైన నిద్రకు తోడ్పడుతుంది.పెల్విక్ ప్రాంతంలో రక్తప్రసరణ మెరుగుపడటానికి సహాయపడుతుంది. హార్మోన్ల సమతుల్యతకు పరోక్షంగా ఉపయోగపడవచ్చు.పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ను ఉత్తేజపరిచి శరీరాన్ని రిలాక్స్ చేస్తుంది.అలసటను తగ్గించి శరీరానికి తాజాదనాన్ని అందిస్తుంది. థైరాయిడ్ సమస్యలను నియంత్రించడానికి సహాయపడుతుంది.జాగ్రత్తలు....తీవ్రమైన మెడ, వెన్నెముక గాయాలు ఉన్నవారు, అధిక రక్తపోటు లేదా గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు యోగా నిపుణుల పర్యవేక్షణలో చేయాలి.ఆసనం చేస్తూ ఎటువంటి ఒత్తిడి లేదా నొప్పి కలిగితే వెంటనే ఆపాలి.భోజనం చేసిన వెంటనే చేయకూడదు. కనీసం 2–3 గంటల విరామం ఉండాలి.- అనిత పాతర్ల, యోగా ట్రైనర్ -
90 డేస్ టీ చాలెంజ్! ఏం‘టీ’ నిజమా?
రోజూ ఉదయం నిద్రలేవగానే గుర్తొచ్చేది తాజా టీ. ఆఫీసు టెన్షన్లు, ఆర్థిక ఇబ్బందులు, మానసిక ఒత్తిళ్లు, ఇంకేవో గందరగోళాలు.. ఇలా హడావిడిగా సాగే జీవితంలో ఎన్ని అగచాట్లున్నా చక్కని, చిక్కని ఓ టీ కప్పు సిప్పు చేస్తే తప్ప వాటన్నింటికీ పరిష్కారం దొరకదు. మనదేశంలో టీతోనే రోజు మొదలెట్టేవారు కోట్లలో ఉంటారు. భాషాభేదం లేకుండా, నార్త్, సౌత్ అనకుండా అందరినీ మమేకం చేసి అదో రకం మైకంలో ముంచేసే టీ నిజంగా ఓ రకం డ్రగ్.. అయితే ఇలాంటి టీని ఓ తొంభై రోజులు తాగడం మానేస్తే ఏమవుతుంది?మొదటివారంలో..టీలో ఉండే కెఫీన్కు శరీరం అలవాటు పడుతుంది. అందుకే ఉన్నట్టుంటి టీ తాగడం మానేస్తే మొదటివారం రోజులు చికాకు, దేనిమీద ఏకాగ్రత లేకపోవడం, తలనొప్పి, నిద్రమత్తు వంటి లక్షణాలు కనిపిస్తాయి. శరీరానికి అలవాటైన కెఫీన్ ఒక్కసారిగా దూరమైతే వచ్చే ప్రతి స్పందన ఇది.2–4 వారాల్లో...టీ తాగడం తగ్గించాక తర్వాత చాలామందిలో రాత్రి పూట తొందరగా నిద్రపట్టడం, మధ్యలో మెలకువలు తగ్గడం వంటి మార్పులు గమనించవచ్చు. అలాగే ఉదయం కూడా తాజాగా నిద్రలేవడం ఉషారుగా ఉండడం జరుగుతుంది. ఈ మార్పులు రాత్రిళ్లు టీ తాగే అలవాటు ఉన్నవారిలో ఎక్కువగా కనిపిస్తుంది.ఆందోళనకి దూరంటీలోని కెఫీన్ శరీరంలో గుండె వేగాన్ని పెంచుతుంది. సాధారణంగా టీ గ్యాప్ వస్తే కొందరిలో ఆందోళన కనిపించడం, చేతులు వణుకుతుండడం మనం గమనిస్తూనే ఉంటాం. ఆల్కహాల్ అలవాటున్నవారిలో ఈ లక్షణాలు ఇంకా అధికం. గ్యాస్ట్రిక్ సమస్యలు, అసిడిటీతో కొందరు ఇబ్బంది పడుతుంటారు. ఇలాంటి వారు టీ మానేస్తే సగానికి సగం సమస్యలు తగ్గే అవకాశం ఉంటుంది. అలాగే చక్కెర వినియోగం కూడా తగ్గడం వల్ల మధుమేహం నియంత్రణలో ఉంటుంది.ఏం‘టీ’ నిజమా?ప్రపంచవ్యాప్తంగా నీరు తర్వాత అత్యధికంగా తాగే పానీయం టీ.టీ ఉత్పత్తిలోనూ, వినియోగంలోనూ చైనా తర్వాత భారత్ రెండో స్థానంలో ఉంది.ప్రపంచంలో ప్రతి రోజూ మూడు బిలియన్ల కప్పులకు పైనే టీని తాగేస్తున్నారు.బ్రిటీషర్లు భారత్కి టీ పరిచయం చేస్తే భారతీయులు అందులో పాలు, పంచదార కలిపి కొత్త రూపాన్నిచ్చారు. ఆ తర్వాత ఏలకులు, లవంగాలు, అల్లం కలిపి మసాల టీగా రూపాంతరం చెందింది.ఎంతోప్రాచుర్యం పొందిన టీ పుట్టిన ప్రదేశం మాత్రం చైనానే. క్రీస్తు పూర్వం 2737లో అప్పటి ప్రజలు తొలిసారిగా టీ రుచి చూశారు.వైట్ టీ తెలుసా?బ్లాక్ టీ, గ్రీన్ టీ, హెర్బల్ టీ గురించి విన్నాం. మనలో చాలామంది వాటిని రుచి చూశాం కాని వైట్ టీ ఏంటి? అనుకుంటున్నారా? ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన టీ పొడి. అత్యంత స్వచ్ఛమైన సహజమైన టీ రకాలలో ఈ వైట్ టీ ఒకటి. ఈ టీ పొడి కోసం కేమెలియా సినెన్సిస్ అనే మొక్కకు వచ్చే లేత మొగ్గలను, చిన్న ఆకులను మాత్రమే కోస్తారు. దీని డికాషన్ ముదురు రంగులో కాకుండా చాలా తేలికపాటి పసుపు లేదా వెండి రంగులో ఉంటుంది. రుచి కూడా కాస్త తియ్యగా పూల వాసనతో ఉంటుంది. కేవలం వసంత కాలంలో మాత్రమే దొరికే ఈ టీ ఆకులను చాలా జాగ్రత్తగా కోసి ప్రాసెస్ చేస్తారు. రకాన్ని బట్టి దీని రేటు కిలోకి ఐదు వేల నుంచి నాణ్యతను బట్టి లక్షల రూపాయల వరకు ఉంటుంది. -
వయసు 25.. వొంటికి 35.. కారణమేంటి?
‘వయసు కేవలం ఒక సంఖ్య’ అంటారు. కానీ ఇప్పుడు శాస్త్రవేత్తలు చెబుతున్నది మాత్రం అందుకు భిన్నం. క్యాలెండర్ మీ వయసు 25 లేదా 30 ఏళ్లు అయినా... మీ శరీరం మాత్రం 35 లేదా 40 ఏళ్ల వ్యక్తిలా పని చేస్తుండచ్చట! తాజాగా వెలువడిన ఓ అధ్యయనం ఈ సంచలన విషయాన్ని వెల్లడించింది.అమెరికాలోని పరిశోధకులు లక్షలాది మంది ఆరోగ్య వివరాలను విశ్లేషించగా.. నేటి తరం యువత శరీరాలు గత తరాలతో పోలిస్తే మరింత వేగంగా వృద్ధాప్యంలోకి వెళ్తున్నట్లు గుర్తించారు. దీనినే ‘బయోలాజికల్ ఏజింగ్’ అంటారు. అంటే పుట్టిన తేదీ ప్రకారం వచ్చే వయసు కన్నా శరీరం లోపల జరిగే మార్పుల వల్ల ఎంత వేగంగా ముసలితనం వస్తుందనేదే అసలు విషయం.వయసుదేముందిలే అని సరిపెట్టుకోవచ్చు అనుకుంటారేమో కానీ ఈ అకాల, అనూహ్య, వేగవంతమైన వృద్ధాప్యం వల్ల 50 ఏళ్లలోపే క్యాన్సర్ బారినపడే ప్రమాదం పెరుగుతుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా జీర్ణాశయం, ఊపిరితిత్తులు, గర్భాశయం వంటి అవయవాలకు సంబంధించిన క్యాన్సర్ల బారిన పడే ప్రమాదం కనిపిస్తోందని తెలి΄ారు.అయితే దీనికి ఇతమిత్థంగా ఇదీ కారణం అని చెప్పలేమనీ, ఫాస్ట్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్, వ్యాయామం లేకపోవడం, ఊబకాయం, ఒత్తిడి, నిద్రలేమి, కాలుష్యం వంటి అనేక అంశాలు కలిసి శరీరాన్ని వయసు కంటే ముందే బలహీనపరుస్తున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.అలాగని ఇది అంత భయపడాల్సిన విషయం కూడా కాదని నిపుణులు చెబుతున్నారు. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, సమతులాహారం తీసుకోవడం, తగినంత నిద్రపోవడం, ఒత్తిడిని తగ్గించుకోవడం ద్వారా శరీర వృద్ధాప్య వేగాన్ని కొంతవరకు నియంత్రించే అవకాశం ఉందని సూచిస్తున్నారు.తరచు నీరు తాగడం వల్ల కూడా వృద్ధాప్య ఛాయలను తగ్గించుకోవచ్చు. వాటర్ తాగడం పెరిగితే, మూత్రవిసర్జన, చెమట, పేగు కదలికలతో శరీరంలోని వ్యర్థాలు బయటకు పోతాయి. ఫలితంగా శరీర ఉష్ణోగ్రత సాధారణ స్థితికి చేరుకుంటుంది. చర్మం నిగారింపు సంతరించుకుంటుంది. మనం సాధారణంగా విటమిన్ డిని సూర్యరశ్మి ద్వారా పొందుతాం. ఇది వృద్ధాప్య ఛాయలను దూరం చేస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. దీంతో మెరిసే చర్మం మీ సొంతమవుతుంది.– నిర్వహణ: డి.వి.ఆర్ -
మీ పాప టీనేజ్లోకి అడుగు పెట్టిందా? ఈ సూచనలు మీకోసమే!
చిన్నారులు బాల్యం నుంచి యవ్వనంలోకి అడుగుపెడుతున్న కౌమార దశ లేదా టీనేజ్ ఎంతో కీలకం. ఆ సమయంలో వారు చేసుకునే అలవాట్లు, జీవనశైలి సూత్రాలే వాళ్ల ఆరోగ్యకరమైన భవిష్యత్తుకు పునాది. అందువల్ల తల్లిదండ్రులు కొన్ని సూత్రాలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో తెలుసుకుందాం!సరిగ్గా చెప్పాలంటే, టీనేజ్లోనే భావోద్వేగాల పరిణతి వస్తుందట. ప్రతిదీ ఈ దశలోనే నేర్చుకుంటారట. ఇలాంటప్పుడు తల్లిదండ్రులు అయినదానికీ కానిదానికీ పిల్లలను విమర్శిస్తూ, కఠినంగా వ్యవహరిస్తే కుటుంబంతోనూ, తోటి పిల్లలతోనూ వాళ్లు ఎమోషనల్గా దూరమవుతారని, తమ సమస్యలను చెప్పడానికి భయపడతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందువల్ల వారి తప్పు సరిచేసే ముందు వాళ్ల ఆత్మగౌరవానికి భంగం కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత పేరెంట్స్దేనని చెబుతున్నారు. టీనేజీ పిల్లలను కుటుంబ సభ్యులను, టీచర్లు మరింతగా అర్థం చేసుకోవాలని సూచిస్తున్నారు.శుభ్రతా ముఖ్యమే... ఇక పీరియడ్స్ మొదలయ్యాక మరో కొత్త సవాలు ఎదురైవుతాయి. ముఖ్యంగా, పరిశుభ్రత, ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా ఉండాలంటే, క్రమం తప్పకుండా స్నానం, దుస్తులు, లోదుస్తులు మార్చుకోవడం అలవాటు చేయాలని సూచిస్తున్నారు.తగ్గ ఆహారం... ఎదిగే వయసులో అమ్మాయిలకు పోషకాహారం తప్పనిసరంటున్నారు నిపుణులు. ఎంత బిజీగా ఉన్నా సరే, మంచి ఆహారం అందించడం మాత్రం మర్చిపోవద్దని చెబుతున్నారు. అధి కప్రోటీన్లు, విటమిన్లు, మినరల్స్, లో–ఫ్యాట్, లో–కార్బోహైడ్రేట్లు ఉండే ఆహారం ఇవ్వాలి.క్లాస్, చదువుల్లో పడి స్కూల్లో నీళ్లు తాగడం మర్చిపోతారు కాబట్టి, మీ పాప రోజుకి కనీసం 12 గ్లాసుల నీళ్లు తాగేలా చూసుకోవాలని సూచిస్తున్నారు. అలాగే, చక్కెర లేని పండ్ల రసాలూ మంచివేని సలహా ఇస్తున్నారు. ఈ క్రమంలో కాఫీ, టీ, కార్బొనేటెడ్ డ్రింక్లు, కృత్రిమ తీపి కలిగిన పానీయాలకూ దూరంగా ఉంచాలని తెలియజేస్తున్నారు.ప్రశాంతంగా: ఓ వైపు శరీరంలో మార్పులు, మరోవైపు చదువు ఇవన్నీ పిల్లల్లో ఒత్తిడి కలిగిస్తాయి కాబట్టి రోజుకి ఒక గంటైనా వాళ్లు ప్రశాంతంగా కూర్చొనేలా సమయమివ్వడం వల్ల తమ గురించి తాము ఆలోచించుకునేందుకు సాయపడుతుంది. డ్రాయింగ్, పెయింటింగ్, కథల పుస్తకాలు, క్రియేటివ్ క్రాఫ్ట్వర్క్ వంటివి చేసేలాగాప్రోత్సహించాలని పేర్కొంటున్నారు. అప్పుడే మానసికంగా బ్యాలెన్స్డ్గా ఉండగలుగుతారు.అంతేకాకుండా, టీనేజ్ పిల్లలకు వారి పరిధి మేరకు సెక్స్ ఎడ్యుకేషన్ గురించి అవగాహన కల్పించడమూ ముఖ్యమంటున్నారు నిపుణులు. గుడ్టచ్, బ్యాడ్టచ్ లాంటి వాటి గురించి తెలియజేయాలని చెబుతున్నారు. అప్పుడే వాళ్లు చైల్డ్ అబ్యూజింగ్ లాంటివి ఎదుర్కోకుండా ఉంటారని సూచిస్తున్నారు.హార్మోన్లలో మార్పులు...టీనేజ్లో అమ్మాయిల్ని ఇబ్బంది పెట్టే మరో సమస్య మొటిమలు ఒకటి. ఇవే వారిలో ఆత్మన్యూనతకూ దారితీస్తాయంటున్నారు నిపుణులు. కాబట్టి, ఇందుకు కారణం హార్మోనుల్లో మార్పులే అని పిల్లలకు అర్థమయ్యేలా చెబుతూనే వాటి గురించి జాగ్రత్తలూ చెప్పాలంటున్నారు. వాటిని గిల్లడం, వత్తడం లాంటివి చేయనీయకూడదు.అర్థం అయేలా చెప్పాలి...రుతుక్రమం... శారీరకంగా, మానసికంగా అమ్మాయిల్లో చాలా మార్పులే వస్తాయి. కాబట్టి, వాటి గురించి పీరియడ్స్ మొదలవక ముందే పిల్లలకు అర్థమయ్యేలా వారి మనసు నొప్పించకుండా సున్నితంగా చెప్పాలనీ, అప్పుడే, మనసులో ఉన్న భయాలూ, అపోహలూ తొలగిపోయి, తమలో వస్తోన్న మార్పులను అర్థం చేసుకుంటారని చెబుతున్నారు.వ్యాయామంతో...సిగ్గు, బిడియం లాంటి వాటి వల్ల టీనేజ్ అమ్మాయిలు ఆటలకు దూరం అవుతున్నారనీ, కాబట్టి, ఆ ఫీలింగ్స్ను పోగొట్టి వాళ్లు బయటకు వచ్చేలా ప్రోత్సహించాలంటున్నారు నిపుణులు. స్విమ్మింగ్, బాస్కెట్బాల్, వాకింగ్, రన్నింగ్ ఇలా ఏదో ఒకదాన్లో భాగమయ్యేలా చూడాలి. వ్యాయామం అలవాటు చేయడం వల్ల భవిష్యత్తులో పిల్లలకు జీవనశైలి వ్యాధులు రాకుండా ఉంటాయి. -
అమ్మాయిలూ ఎల్లప్పుడూ ‘మంచి’గా వద్దు..! పరిశోధనలు సైతం..
చిన్నప్పటి నుంచి ఆడిపిల్లలకు సర్దుకుపోవడం, అందరికి చేదోడు వాదోడుగా, మంచిగా వ్యవహరించేలా పెంచుతారు. పైగా వాళ్ల భావోద్వేగాలను బయటకు వ్యక్తం చేయనివ్వరు పెద్దలు. దాని కారణంగానే మహిళలు ఆ వ్యాధి బారిన పడుతున్నారంటూ సామాజిక మాధ్యమాల్లో వార్తలు గుప్పుమన్నాయి. ఆ కారణంగానే ఈ వ్యాధి అని పరిశోధనలు కూడా చెబుతున్నాయి. అందుకు సంబంధించిన ఓ మహిళా సంభాషణ వీడియో నెట్టిటంట తెగ వైరల్గా మారింది. ఇంతకీ ఇందులో వాస్తవమెంత? వైద్య నిపుణులు ఏమంటున్నారు?ఇటీవల సామాజిక మాధ్యమాల్లో మహిళలకు ఆ కారణంగానే ఆటోఇమ్యూన్ వ్యాధి వస్తోందంటూ పోస్టులు వైరల్ అయ్యాయి. అందుకు లక్షలాదిమంది మహిళలు మద్దతు తెలపడం విశేషం. ప్రతి ఒక్కరు అది వాస్తవమని, ఇప్పటికైన మనమంతా మేల్కొందాం అంటూ పిలుపునివ్వడం విశేషం. అంతేగాదు అమ్మాయిలూ సదా ‘మంచిగా’ ఉండొద్దు అది మన ఆరోగ్యానికే హానికరం అనే నినాదం మొదలైంది. ఇతరులను సంతోషపెట్టే అలవాటు మనల్ని మానసికంగా కుంగదీయడమే కాదు, చివరికీ శారీరక అనారోగ్యానికి గురిచేస్తుందని వాదన మొదలైంది నెట్టింట. ఇలా ఎందుకు అంటున్నారంటే..ఆటోఇమ్యూన్ వ్యాధులతో బాధపడుతోంది అధికంగా మహిళలే కావడంతో ఈ వాదన ఊపందుకుంది నెట్టింట. ఇటీవల ఒక ఇన్ఫ్లుయెన్సర్ హర్పిందర్ కౌర్ ఈ ట్రెండీ వాదన గురించి షేర్ చేస్తూ..'మంచి' అమ్మాయి అంటే అందరితో ఏకీభవించే, నిస్వార్థపరురాలైన సర్దుకుపోయే అమ్మాయిగా నాకు నేర్పించారు. ఇదే ఆ అనారోగ్య సమస్యకు కారణం అని అంటోందామె. ఆ కారణంగానే మహిళల్లో ఈ సమస్య ఎక్కువని. అందుకు ప్రధాన కారణాలు సాంస్కృతిక అలవాట్లు, దీర్ఘకాలిక ఒత్తిడి, వ్యక్తపరచని భావోద్వేగాలు, తమ అవసరాల కంటే ఇతరుల అవసరాలకే ప్రాధాన్యత ఇవ్వడం తదితరాలేనని తేల్చి చెప్పింది. అంతేగాదు ఏళ్ల తరబడి చాలామంది తమ బావోద్వేగాలను అణిచివేసి, నిరంతర సంరక్షణ, ఇతరులను సంతోషపెట్టే తపనతో జీవిస్తారు. దాంతో శరీరం దీర్ఘకాలిక ఒత్తిడికి గురై చివరిక దీర్ఘాకాలిక అనారోగ్యానికి బలి అవుతోందంటూ అవేదన వ్యక్తం చేసింది. ఆఖరికి పరిశోధనలు కూడా ఆటోఇమ్యూన్ వ్యాధులతో బాధపడుతున్న వారిలో దాదాపు 80 శాతం మంది మహిళలేనని పేర్కొంది. View this post on Instagram A post shared by Harpinder Kaur Mann Yoga 🌕 (@harpindermannyoga) లూపస్, స్జోగ్రెన్ సిండ్రోమ్ వంటి వ్యాధులు పురుషుల కంటే మహిళలల్లో ముఖ్యంగా 20 నుంచి 50 ఏళ్ల మధ్య వయసు వారిలో గణనీయంగా అధిక రేట్లలో ప్రభావం చూపుతోందని చెప్పింది. నిజానికి ఈ వైరల్ పోస్టులన్నీ మహిళలు తీవ్ర నిరాశనిస్ప్రహలకు లోనవ్వడంతోనే ఈ వ్యాధులు బాధపడుతున్నారనే విషయాన్ని వ్యక్తం చేశాయి. అలాగే ఇది ఒత్తిడి రుగ్మతలకు సంబంధించిందేనని శాస్త్రవేత్తలు గుర్తించారు కూడా. అయితే దృఢంగా ఉన్నంత మాత్రాన ఈ సమస్యను తిప్పికొట్టగలమని చెప్పేందుకు ఎలాంటి ఆధారాలు లేవు. పైగా ఆటోఇమ్యూన్ వ్యాధికి అవే కారణమని శాస్త్రీయంగా నిరూపితం కాలేదు కానీ మహిళలు ఏ విధంగా ఒత్తిడికి లోనవ్వుతున్నారనేది వెల్లడైందంటున్నారు నిఫుణులు. అతేగాదు అమ్మాయిలూ..వద్దు అని చెప్పడం నేర్చుకోవడం, కోపాన్ని వ్యక్తపరచగలగడం, మనకోసం మనం నిలబడటం వంటివి చేస్తే ఈ సమస్య బారిన పడమని ముక్తకంఠంతో నినదించారు. అంతేగాదు ఇలా వ్యవహరించాలంటే మనకు యోగా ఉపకరిస్తుందని, స్వతంత్రంగా, ధైర్యంగా బతకడం ఎలాగో నేర్పిస్తుందని అన్నారు. మానసిక నిపుణులు కూడా ఇవన్నీ సరైనా కారణాలే అయినా..శాస్త్రీయంగా నిర్థారించలేమని అన్నారు. View this post on Instagram A post shared by Tochi Angel (@tochithangel) (చదవండి: కలెక్టర్ గారూ..అదే నా చివరి కోరిక! 94 ఏళ్ల బామ్మ విజ్ఞప్తి..) -
మామ్ వెయిట్లాస్ స్టోరీ..! జస్ట్ 11 నెలల్లో 32 కిలోలు..
ప్రసవం తర్వాత బరువు తగ్గడం అంత ఈజీ కాదు.ముఖ్యంగా సీ సెక్షన్ నుంచి కోలుకుంటున్న తల్లులకు మరింత కష్టం. నిలకడ, సులభమైన వ్యాయామాలు, శ్వాసవ్యాయమాలతో ఓ పిల్లల తల్లి సునాయాసం 32 కిలోలు పైనే తగ్గింది. అది కూడా జస్ట్ 11 నెలల్లోనే. మరి ఆమెకు అదెలా సాధ్యమైందో ఆమె మాటల్లోనే తెలుసుకుందామా.!.కంటెంట్ క్రియేటర్ దీప్తి హర్షనా ఇద్దరు పిల్లల తల్లి. అదులోనూ సీసెక్షన్ చేయించుకుందామె. అలాంటప్పుడు పొట్ట భాగం దగ్గర నుంచి మిగతా శరీర భాగం అంతా షేప్ అవుట్గా ఉంటుంది. పైగా బరువు తగ్గడం కూడా అంత ఈజీ కాదు. అయితే ఆమెకు కూడా ఎలా తన అధిక బరువుని తగ్గించుకోవాలో తెలియలేదట. కానీ ప్రసవానంతరం బరువు తగ్గాలంటే తప్పనిసరిగా వ్యాయామాలు ముఖ్యం. అయితే ఎలా ప్రారంభించాలో తెలియలేదని, దాంతో యూట్యూబ్లో పొట్ట భాగం తగ్గాలంటే ఎలాంటి వ్యాయామాలు చేస్తే మంచిది అని సర్చ్ చేసి మరి ప్రారభించినట్లు తెలిపింది. తాను చేసిన వ్యాయమాలు గురించి కూడా వివరించింది.వర్కౌట్ 1: ప్రారంభకులకు అనువైన చేతి వ్యాయామాలుదీప్తి, తక్కువ పరికరాలు అవసరమయ్యే సులభమైన నిలబడి చేసే వ్యాయామాలతో ప్రారంభించాలని సిఫార్సు చేస్తోంది. ఎక్కడైనా నిలబడి, అందుబాటులో ఉన్న వాటర్ బాటిల్ లేదా డంబెల్ ఏదైనా తీసుకుని, ప్రతి వైపు 15 సార్లు చొప్పున మూడు సెట్లు చేయాలని ఆమె సలహా ఇస్తోంది.వర్కౌట్ 2: డంబెల్ ఆర్మ్ రైజెస్5 కేజీల డంబెల్ను ఉపయోగించి, దీప్తి చేతులను బలోపేతం చేసే తేలికపాటి వ్యాయామాలు చేసినట్లు తెలిపింది. ముందుగా 5 కేజీల డంబెల్ను పట్టుకుని, చేతులను నిటారుగా ఉంచి ప్రారంభించాలని చెప్పింది. దీన్ని ప్రతివైపు 15 సార్లు చొప్పున మూడు సార్లు చేయాలని చెప్పిందామె.వర్కౌట్ 3: స్క్వాట్స్స్క్వాట్స్ ఆమె దినచర్యలో మరొక ముఖ్యమైన వ్యాయామం. కొత్తగా చేసేవారైతే డంబెల్ లేకుండా వీటిని చేయవచ్చు. లేకపోతే, డంబెల్ పట్టుకుని సాధారణ స్క్వాట్స్ చేయాలని పేర్కొంది. ఇలా మొత్తం15 రిపిటీషన్లు చొప్పున మూడు సెట్లు చేయమని సూచిస్తుంది.వర్కౌట్ 4: స్టాండింగ్ కిక్స్అలాగే ఆమె తన దినచర్యలో స్టాండింగ్ కిక్ వ్యాయామాలను కూడా చేర్చుకుంటుంది. కేవలం తన్నడం లేదా తాకేలా చేసే వ్యాయామం. ఇక్కడ ఏది సౌకర్యంగా ఉంటే అది చేయవచ్చు. ఇక్కడ ప్రతి వ్యాయామాన్ని 15 సార్లు పునరావృతం చేస్తూ, మూడు సెట్లు చేయాలని ఆమె వివరించారు.వర్కౌట్ 5: తలపైన చేతులతో చప్పట్లుఇది కూడా ఒక సులభమైన కదలిక. చేతులను తల పైకి ఎత్తి, పదేపదే చప్పట్లు కొట్టాలి. ఈ వ్యాయామం చాలా సులభం. చేతులు పైకి, అదే పనిగా చప్పట్లు కొట్టాలి.వర్కౌట్ 6: వెనుకకు కాలును చాచడంతన చివరి వ్యాయామం కోసం, దీప్తి తన చేతులను తలపైన జోడించి, ఒక కాలును వెనుకకు చాచాలి. ఇక్కడ కాలును వీలైనంత వెనుకకు తీసుకువెళ్లి, ఆ తర్వాత ముందుకు తీసుకురండి. ప్రతి వైపు 15 సార్లు పునరావృతం చేస్తూ, మూడు సెట్లు పూర్తి చేయాలిన చెప్పిందామె.గమనిక: ప్రసవానంతర వ్యాయామ దినచర్యలను ఆరోగ్య సంరక్షణ నిపుణుడిని సంప్రదించిన తర్వాత మాత్రమే ప్రారంభించాలి, ముఖ్యంగా సి-సెక్షన్ తర్వాత, ఎందుకంటే కోలుకోవడానికి పట్టే సమయం వ్యక్తిని బట్టి మారుతూ ఉంటుంది. View this post on Instagram A post shared by Deepti | Mom • Fitness • Lifestyle (@deepti_harshana) (చదవండి: ఆరు నెలల్లో పదికిలోలు..కానీ అనుహ్యంగా యథావిధి ఎందుకిలా అంటే..!) -
గుండెకు బ్యాడ్ మార్నింగ్
సాక్షి, హైదరాబాద్: పగటి పూట తీసుకునే ఆహారాలు శక్తి స్థాయిలు, జీవక్రియ, జీవ గడియారం తీరుపై (సర్కాడియన్ రిథమ్)పై తీవ్ర ప్రభావం చూపుతాయా? దీర్ఘకాలంలో ఇవి గుండె ఆరోగ్యంపై ప్రతికూలమైన ప్రభావానికి కారణమవుతాయా? ఈ ప్రశ్నలకు నిపుణుల నుంచి అవుననే సమాధానం వస్తోంది. గుండె ఆరోగ్యానికి మేలు చేసే అలవాట్ల విషయానికి వస్తే, క్రమంతప్పని వ్యాయామం, ఎక్కువ మోతాదులో కూరగాయలు తినడం, ఏటా క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు వంటి సమాధానాలు టక్కు న వస్తాయి. ఇవి ఆరోగ్యపరిరక్షణకు దోహదం చేసినప్పటికీ, గుండె ఆరోగ్యం వీటిపై మాత్రమే ఆధారపడి ఉండదని, మరికొన్ని జాగ్రత్తలు అవసరమని తెలుస్తోంది. మధ్యాహ్నం అధిక మోతాదులో చక్కెరలు ఉన్న స్నాక్స్ తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పెరగడం, నీరు తాగకుండా ఎక్కువసేపు కూర్చోవడం వల్ల జీర్ణక్రియ సరిగ్గా జరగకపోవడం, సాయంత్రం ఆరు గంటల తర్వాత టీ, కాఫీ వంటివి (కెఫిన్ పదార్థాలు) తీసుకోవడం వల్ల నిద్ర ఆలస్యం కావడం వంటివి నిశ్శబ్ద ఆరోగ్య ప్రమాదాలుగా పరిణమిస్తున్నాయని వైద్యనిపుణులు, పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. క్రోనోన్యూట్రిషన్ అంటే ఏమిటి? » క్రోనోన్యూట్రిషన్ అంటే ఆహారపుటలవాట్లలోని సమయం, క్రమబద్ధతలు శరీరం యొక్క అంతర్గత సర్కాడియన్ రిథమ్తో సంకర్షణ చెంది జీవక్రియను, ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో వివరించే శాస్త్రం. మీరు ఏమి తింటారనేది ఎంత ముఖ్యమో, ఎప్పుడు తింటారనే విషయం కూడా అంతే ముఖ్యమని ఈ శాస్త్రం చెబుతుంది. సర్కాడియన్ రిథమ్ను నియంత్రించేది ఏది? » సర్కాడియన్ రిథమ్ శరీరం లోపల జన్యువులు, హార్మోన్ల ద్వారా నియంత్రితమవుతుంది. శరీరం బయటి నుంచి ప్రభావితం చేసే కూడా కారకాలున్నాయి. వాటిని జైట్ గేబర్స్ అంటారు. సూర్యరశ్మి, వ్యాయమం, ఆహారం వంటివి. మన వెంట ఉన్న ప్రమాదాలివి.. » క్యాండీలు, పేస్ట్రీలు, చక్కెర వేసిన కాఫీల వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పెరిగి, అంతే వేగంగా పడిపోతాయి. ఇది హృదయనాళ వ్యవస్థపై భారాన్ని, ఇన్సులిన్ నిరోధకతను పెంచుతుంది. » సాయంత్రం తర్వాత కాఫీలు, ఎనర్జీ డ్రింక్స్ తాగడం వల్ల ‘అడెనోసిన్ రిసెప్టర్లు’ప్రేరేపితమై మనిషిని మెలకువగా ఉంచుతూ, సహజ నిద్ర చక్రానికి అంతరాయం కలిగిస్తాయి. » మధ్యాహ్న భోజనం చేయకపోతే సాయంత్రానికి అతిగా ఆకలి వేస్తుంది. ఇది ఆహారాన్ని ఎక్కువ మోతాదులో తినేటట్లు ప్రేరేపించడంతోపాటు మనసును అనారోగ్యకరమైన ఆహారం మీదకు మళ్లిస్తుంది. » పనిలో పడి పగలంతా నీళ్లు తాగకపోతే డీహైడ్రేషన్కు దారితీస్తుంది. ఇది మతిమరుపుకు, అతిగా తినడానికి, అనారోగ్యకరమైన చక్కెర పానీయాలను తాగేలా ప్రభావితం చేస్తుంది. ఆహారపు అలవాట్లు ఇకపై ఇలా » ప్రోటీన్, ఫైబర్పై దృష్టి పెట్టాలి. గ్రీక్ యోగర్ట్, నట్స్, పండ్లు, కూరగాయలతో కూడిన హమ్మస్ వంటి సమతుల ఆహారం తీసుకోవాలి. ఇవి కడుపు నిండిన అనుభూతినివ్వడంతోపాటు నీరసం రానివ్వకుండా ఎక్కువ సేపు శక్తిని అందిస్తాయి. » గంటకొకసారి 5 నిమిషాలపాటు దేహానికి కదలిక కోసం నడవాలి. మధ్యాహ్న భోజనం తర్వాత తేలికపాటి నడక వల్ల చక్కెర స్థాయి అకస్మాత్తుగా పెరగకుండా నిలువరించవచ్చు. » రాత్రి భోజనం ఎనిమిది గంటలకు ముగిస్తే శరీర సహజ జీవప్రక్రియలు సజావుగా సాగుతాయి. ఈ అలవాటు కేలరీలను మెరుగ్గా దహించడానికి వీలు కల్పిస్తుంది. » పగలంతా నీటిని కొద్దికొద్దిగా తాగడాన్ని అలవాటుగా పాటించాలి. శరీరంలో నీటిశాతం తగినంత ఉంటే కెఫిన్ డ్రింక్స్ తీసుకోవాలనే కోరిక కలగదు. -
అల్కా యాగ్నిక్కి అరుదైన వినికిడి సమస్య..ఎందువల్ల వస్తుందంటే..
రెండోవిడత ‘పద్మ’ పురస్కారాల ప్రదానోత్సవం మంగళవారం ఘనంగా జరిగింది. వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన దాదాపు 65 మంది ప్రముఖులకు రాష్ట్రపతి ద్రౌపదిముర్ము పురస్కారాలు అందజేశారు. ఈ వేడుకకు ప్రముఖ బాలీవుడ్ ప్లేబ్యాక్ సింగర్ అల్కా యాగ్నిక్ కూడా హాజరయ్యారు. ఆమెకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పద్మవిభూషణ్ను ప్రదానం చేశారు. ఆమెకు లభించిన ఈ గుర్తింపును చూసి యాగ్నిక్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన వీడియోలో ఆమె చాలా బలహీనంగా కనిపించారు. పైగా ఆమెను సిబ్బంది చాలా జాగ్రత్తగా తీసుకురావడం స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో ఆమె అప్పటి నుంచి ఇంకా కోలుకోలేదా అన్న అనుమానాల లేవనెత్తాయి అభిమానుల్లో. యాగ్నిక్ 2024లో తాను అరుదైన వినికిడి సమస్యతో బాధపడుతున్నట్లు ప్రకటించగానే..ఒక్కసారిగా వినికిడి ఆరోగ్యంపై చర్చలు మొదలవ్వడమే గాదు అవగాహన ప్రాముఖ్యతను నొక్కి చెప్పింది. ఇంతకీ యాగ్నిక్ ఫేస్ చేస్తున్న వినికిడి సమస్య ఏంటంటే..60 ఏళ్ల గాయని అల్కా యాగ్నిక్ అత్యంత అరుదైన సెన్సోరిన్యూరల్ హియరింగ్ లాస్(SNHL)తో బాధపడుతోంది. ఆమె కారణంగానే ప్రపంచవ్యాప్తంగా లక్షలాదిమంది ఈ సమస్యను ఏదో ఒక దశలో ఎదుర్కొంటున్నట్లు నివేదికల్లో వెల్లడైంది. అసలేంటి సమస్య అంటే..#WATCH | Delhi | Eminent playback singer Alka Yagnik conferred with Padma Bhushan by President Droupadi Murmu(Video source: Rashtrapati Bhavan) pic.twitter.com/ui2U9koEMy— ANI (@ANI) June 23, 2026సెన్సోరిన్యూరల్ హియరింగ్ లాస్ అంటే?లోపలి చెవి (కోక్లియా) లేదా మెదడుకు ధ్వని సంకేతాలను పంపే శ్రవణ నాడి మార్గాలకు నష్టం జరిగినప్పుడు సెన్సోరిన్యూరల్ హియరింగ్ లాస్ (SNHL) సంభవిస్తుంది.చెవిలో గులిమి పేరుకుపోవడం లేదా ఇన్ఫెక్షన్ల వల్ల కలిగే తాత్కాలిక వినికిడి సమస్యల వలె కాకుండా, SNHL తరచుగా శాశ్వతంగా ఉంటుంది. ఇది ఒక మనిషి వినగల, మాట్లాడగల సామర్థ్యాన్ని గణనీయంగా ప్రభావితం చేస్తుంది. ఇక గాయని యాగ్నిక్కిఒక ఆకస్మిక వైరల్ దాడి కారణంగా ఈ వినికిడి లోపం మొదలైందట. దీని కారణంగా ఆమె వినికిడి సామర్థ్యం ఊహించని విధంగా తీవ్రంగా క్షీణించింది.సెన్సోరిన్యూరల్ వినికిడి లోపం లక్షణాలుసెన్సోరిన్యూరల్ హియరింగ్ లాస్ లక్షణాలు తీవ్రతను బట్టి మారవచ్చని అంటున్నారు వైద్యులు.ఆకస్మిక లేదా క్రమమైన వినికిడి లోపంసంభాషణలను అర్థం చేసుకోవడంలో ఇబ్బందిచెవులలో రింగుమని శబ్దం (టిన్నిటస్)మసకగా వినిపించే శబ్దాలుశబ్దాలతో కూడిన వాతావరణంలో వినడంలో ఇబ్బందిఇతరులు అస్పష్టంగా మాట్లాడుతున్నారని అనిపించడంకొన్ని సందర్భాల్లో, వినికిడి లోపం అకస్మాత్తుగా సంభవించవచ్చు, తక్షణ వైద్య సహాయం అవసరం కావచ్చు.SNHLకి కారణం..సెన్సోరిన్యూరల్ వినికిడి లోపానికి అనేక కారకాలు దోహదం చేస్తాయి, వాటిలో ఇవి ఉన్నాయి:వైరల్ ఇన్ఫెక్షన్లుకొన్ని రకాల వైరల్ ఇన్ఫెక్షన్లు వినికిడికి బాధ్యత వహించే లోపలి చెవి నిర్మాణాలను దెబ్బతీస్తాయి.పెద్ద శబ్దానికి గురికావడంపెద్ద సంగీతం, కచేరీలు, హెడ్ఫోన్లు లేదా వృత్తిపరమైన శబ్దానికి దీర్ఘకాలం పాటు గురికావడం వల్ల కోక్లియా లోపల ఉన్న సున్నితమైన హెయిర్ సెల్స్ శాశ్వతంగా దెబ్బతినవచ్చు.వయసు పైబడటంవయసు సంబంధిత వినికిడి లోపం అనేది సెన్సోరిన్యూరల్ వినికిడి లోపం (SNHL) అత్యంత సాధారణ రూపాలలో ఒకటి.కొన్ని రకాల మందులుఓటోటాక్సిక్గా పిలిచే కొన్ని రకాల మందులను దీర్ఘకాలం పాటు వాడినప్పుడు, అవి వినికిడిని దెబ్బతీయవచ్చు.వైద్య పరిస్థితులుఆటోఇమ్యూన్ రుగ్మతలు, తల గాయాలు, కణితులు, రక్తప్రసరణ సమస్యలు కూడా వినికిడిని ప్రభావితం చేయగలవు.వినికిడి ఆరోగ్యం ఎందుకు ముఖ్యం?వినికిడి లోపం కేవలం చెవులను మాత్రమే ప్రభావితం చేయదు. చికిత్స చేయని వినికిడి సమస్యలు మానసిక ఆరోగ్యం, సామాజిక సంబంధాలు, సంభాషణ, మొత్తం జీవన నాణ్యతపై ప్రభావం చూపుతాయని పరిశోధనలు చెబుతున్నాయి. వినికిడి లోపం ఉన్నవారు సామాజిక ఒంటరితనం, ఆందోళన, నిరాశ, పని ప్రదేశంలో ఉత్పాదకత తగ్గడం, సంభాషణలో ఇబ్బందులు,కొన్ని సందర్భాల్లో మతిమరుపు సంబంధిత సమస్యలు ఎదురవుతాయని చెబుతున్నారు. ముంచికిత్స చేయవచ్చా?చికిత్స అనేది వినికిడి లోపం కారణం,తీవ్రతపై ఆధారపడి ఉంటుంది.వినికిడి పరికరాలు (హెయిరింగ్ ఎయిడ్స్)కాక్లియర్ ఇంప్లాంట్లుసహాయక వినికిడి పరికరాలుశ్రవణ పునరావాసంఅంతర్లీన వైద్య పరిస్థితులకు చికిత్సఅకస్మాత్తుగా వినికిడి లోపం సంభవించిన సందర్భాలలో తక్షణ వైద్య మూల్యాంకనం చాలా కీలకం. ఎందుకంటే ముందస్తు జోక్యం కోలుకునే అవకాశాలను మెరుగుపరుస్తుంది.తీసుకోవాల్సిన జాగ్రత్తలు..వినికిడి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి నిపుణులు కొన్ని సులభమైన చర్యలను సూచించారు. అవేంటంటే..హెడ్ఫోన్ వాల్యూమ్ను 60 శాతం కంటే తక్కువగా ఉంచండిబిగ్గరగా ఉండే పరిసరాలలో ఎక్కువసేపు ఉండటాన్ని పరిమితం చేయండిఅవసరమైనప్పుడు చెవి రక్షణను ఉపయోగించండిఅకస్మాత్తుగా వినికిడిలో మార్పులు వస్తే వైద్యుడిని సంప్రదించండిక్రమం తప్పకుండా వినికిడి పరీక్షలను చేయించుకోవడం(చదవండి: ఆరు నెలల్లో పదికిలోలు..కానీ అనుహ్యంగా యథావిధి ఎందుకిలా అంటే..!) -
తగ్గినట్టే తగ్గి..మళ్లీ యథావిధిగా! స్ట్రిక్ట్ డైటింగ్ చేసినా ఎందుకిలా అంటే..
బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్న చాలామంది మొదట ధనాధన్ బరువు తగ్గిపోతారు. కానీ ఆ తర్వాత మళ్లీ యథావిధిగా బరువు పెరగకుండా కాపాడుకోవడమే అత్యంత ముఖ్యం. అయితే ఇది చాలా కష్టం. ఇక్కడొక నలభైఏళ్లు పైబడిన మహిళ ఈ సమస్యనే ఎదుర్కొంటోంది. ఆరు నెలలపాటు క్రమశిక్షణతో కూడిన ఆహారం, రోజువారీ నడక తర్వాత దాదాపు పది కిలోల బరువుని విజయవంతంగా తగ్గించుకుంది. కానీ అదే దినచర్యను కొనసాగించినా..మరింత బరువు తగ్గకపోగా..మళ్లీ యథావిధిగా పెరుగుతున్నట్లు అనిపించిందామెకు. ఎందుకంటే ఆకలి కోరికలు పెరగడం, ఎక్కువ కేలరీలు ఖర్చు చేయలేకపోయినట్లు వాపోయింది. ఇది చాలామందికి ఎదురయ్యే పెనుసమస్యే. ఎందుకిలా అంటే..ప్రపంచవ్యాప్తంగా ఇలా డైటింగ్ చేస్తున్నా లక్షలాదిమందికి ఎదురైన అనుభవమే ఇది. మనం వెయిట్లాస్ అవ్వాలనుకున్నప్పుడు మానవశరీరం జీవశాస్త్రపరంగా సిద్దంగా ఉంటుందని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. హార్మోనల్, న్యూరోలాజికల్, మెటబాలిక్ అనుసరణ కలయిక ద్వారా శరీరం కోల్పోయిన బరువుని తిరిగి పొందడానికి ప్రయత్నిస్తుందని అన్నారు. అందువల్లే దీర్ఘాకాలిక బరువు నిర్వహణ సవాలుగా మారిందని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. ఇలా బరువు తగ్గినట్టే తగ్గి యథావిధిగా పెరగడాన్ని 'వెయిట్-లాస్ ప్లాటో'గా పిలుస్తారని అన్నారు. ఇలా ఎందుకు జరుగుతుందంటే..శరీరం బరువు తగ్గే కొద్దీ శక్తిని ఆదా చేసి, మరింత బరువు తగ్గకుండా నిరోధించడం మొదలుపెడుతుందట. దీనిలో బ్రెయిన్ పాత్ర కీలకంగా ఉంటుందని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. ఎందుకంటే బరువు తగ్గాలని గట్టిగా నిశ్చయించుకుంటామో..అందుకు అనుగుణంగా మన బ్రెయిన్ కడపు నిండిన భావన, శక్తి సమతుల్యతకు సంబంధించిన సంకేతాలను శరీరానికి అందిస్తుందట. దాంతో మనం అమాంతం బరువు తగ్గుతూ వస్తూ ఉంటామని అన్నారు. అయితే..కాలక్రమేణ శరీరం ఒక ప్రాధాన్య బరువు పరిధిని ఏర్పరచుకుంటుందట. దీనిని 'సెట్ పాయింట్' అని అంటారని అన్నారు. శరీర బరువు ఈ పరిధి కంటే తక్కువకు పడిపోయినప్పుడూ..మెదడు ఆ మార్పును ఒక సంభావ్య ముప్పుగా భావించి, కోల్పోయిన బరువును తిరిగి పొందడానికి ఉద్దేశించిన ప్రతిస్పందనలను ప్రేరేపిస్తుందట. ఇక్కడ మెదడు తరుచుగా గణనీయమైన బరువు తగ్గడాన్ని ఆకలితో అలమటించే సంకేతంగా పరిగణిస్తుంది, తద్వారా కోల్పోయిన శక్తి నిల్వలను తిరిగి పొందడంలో సహాయపడటానికి రూపొందించిన యంత్రాంగాలను ప్రేరేపిస్తుంది. దాంతో కేలరీలను తక్కువగా ఖర్చు చేస్తాం. పైగా ఆకలి కోరికలు ఎక్కువవ్వడం మొదలవుతాయట. ఫలితంగా యథావిధాగా బరువు పెరుగుతామని అన్నారు. అలాగే బరువు తగ్గాక రోజువారీ శక్తి వ్యయం ఆటోమేటిగ్గా తగ్గుతుందట. దాంతో మొదట ఏ ఆహారం అయితే బరువు తగ్గడానికి సహాయపడిందో అదే మరింత బరువు తగ్గడానికి సరిపడకపోవచ్చని అన్నారు. అలాగే బరువు తగ్గాక హార్మోన్లలో మార్పులు సంభవిస్తాయని చెబుతున్నారు నిపుణులు. కడుపు నిండినట్లు సంకేతం ఇచ్చే కొవ్వు కణజాలం ద్వారా ఉత్పత్తి అయ్యే లెప్టిన్ అనే హార్మోన్ స్థాయిలు బరువు తగ్గిన తర్వాత తగ్గుతాయి. అదే సమయంలో, ఆకలితో సంబంధం ఉన్న గ్రెలిన్ అనే హార్మోన్ స్థాయిలు పెరుగుతాయి. ఫలితంగా ఆకలి ఎక్కువగా అనిపించి.. ఎక్కువ లాగించడం తోపాటు ఖర్చు చేసే కేలరీల సంఖ్య కూడా తగ్గిపోతుందట. ఈ జీవసంబంధమైన కలయికే ఎక్కువగా తినేలా చేయడానికి, కోల్పోయిన బరువుని తిరిగి పొందడానికి కారణమవుతుందని అన్నారు. అందువల్ల బరువు తగ్గడం అనేది మెదడు, హార్మోన్లు, జీవక్రియలు మధ్య ఉన్న సంక్లిష్టసంబంధంగా పరిగణించాలి. ఆరోగ్యకరమైన ఆహారం, శారీరక శ్రమ తోపాటు శరీరం సహజ నిరోధకతను అర్థం చేసుకోవాలన్నారు. ప్రజలు తమ ఫిట్నెస్ జర్నీని సహనంతో వాస్తవిక అంచనాలతో జాగురుకతతో చేపట్టాలని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు.(చదవండి: డెలివరి బాయ్ నుంచి ఏకంగా మెసేజింగ్ ప్లాట్ఫామ్కు గ్లోబల్ హెడ్ రేంజ్కు!) -
అతిగా పాలు తాగడం ఎముకలకు హానికరమా? వైద్యులు ఏమంటున్నారంటే..
పాలు ఆరోగ్యానికి మంచిదని, దానిలో కాల్షియం సమృద్ధిగా ఉంటుందని విన్నాం. అయితే అతిగా తాగితే అవే పాలు హానికరమై ఎముకలు పెళుసుగా మారిపోయి విరిగిపోతాయనే అపోహ కూడా ప్రబలంగా ఉంది. ముఖ్యంగా మాంసం, పాల ఉత్పత్తులు ఎక్కువగా తీసుకుంటే ఈ సమస్య మరింత ఎక్కువ అంటూ సోషల్ మీడియా పోస్టులు తెగ వైరల్ అయ్యాయి. కానీ ఇందులో ఏమంత వాస్తవం లేదని తేల్చి చెబుతున్నారు వైద్యులు. చాలామంది పాల ఉత్పత్తులు అధికంగా తీసుకుంటే ఆస్టియోపొరోసిస్ వస్తుందని చెబుతుంటారు.. ఇది కూడా ఎంతమాత్రం నిజం కాదని అంటున్నారు ఆర్ధోపెడిక్ సర్జన్లు. అసలు ఈ అపోహ ఎందుకు వచ్చింది?, నిజంగానే పాలు అధికంగా తీసుకోకూడదా అంటే..?మాంసం, పాల ఉత్పత్తులు అధికంగా తీసుకుంటే శరీరంలో ఆమ్లత్వం పెరిగి దానిని తటస్థీకరించడానికి ఎముకల నుంచి కాల్షియం గ్రహించాల్సి వస్తుందని, తత్ఫలితంగా ఎముకల సంబంధిత సమస్యలు అధికమవుతాయని పలువురు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇది నిజం కాదని పరిశోధనల్లో ఇలా జరుగుతుందని నిర్థారితం కాలేదని అన్నారు. ఆహారంలోని ప్రోటీన్ ముఖ్యం, సరైన మోతాదులో కాల్షియం తీసుకుంటే ఎముకలను దృఢంగా మార్చడమే కాకుండా ఎముకలు విరగకుండా కాపాడతాయని చెబుతున్నారు. పాలు అధికంగా తీసుకుంటే ఆస్టియోపొరోసిస్ వస్తుందనే వాదనకు శాస్త్రియ ఆధారాలు లేవని తేల్చి చెప్పారు. అలాగే ఆమ్లీకరణం సమస్య వస్తుందనేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని అన్నారు. ఆస్టియోపొరోసిస్ అంటే..ఎముకల ఖనిజ సాంద్రత తగ్గడం వల్ల ఎముకలు బలహీనపడి, సులభంగా విరిగిపోయే పరిస్థితి. ఇది అనేక జన్యు, జీవ, జీవనశైలి కారకల వల్ల ఈ సమస్య వస్తుందని వైద్యులు చెబుతున్నారు. అలాగే వృద్ధాప్యం, హార్మోన్ల స్థితిలో మార్పులు, విటమిన్ డి లోపం, శారీరక శ్రమ లేకపోవడం, ధూమపానం, సరైన పోషకాహారం లేకపోవడం తదితర కారణాల వల్ల ఈ వ్యాధి వస్తుందని అన్నారు. అయితే పాలల్లో కాల్షియం, ప్రోటీన్లు, ఫాస్ఫరస్ (బలవర్ధకమైన) విటమిన్ డి ఉంటాయి. ఇవి శరీరంలో ఎముకల నిర్మాణంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని అన్నారు. కానీ అతిగా తీసుకుంటే అసమతుల్యత ఏర్పడి పోషకాహార లేమికి దారితీస్తుందే తప్ప..ఆస్టియోపొరోసిస్ ప్రమాదాన్ని పెంచదన్నారు. ఎప్పుడైతే పాలను ఎక్కువగా తీసుకుంటామో ఫలితంగా ముఖ్యమైన పోషకాలు శరీరానికి అందకుండా పోతాయన్నారు. అలాగే అజీర్ణం, పాలు పడకపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయన్నారు. ఎముకల బలం కోసం బేషుగ్గా పాలు తీసుకోవచ్చని అన్నారు. కానీ మితంగా తీసుకుంటే మంచి ప్రయోజనాలు పొందగలమని చెప్పారు. పైగా ఆస్టియోపొరోసిస్ను నివారిస్తుందన్నారు. చాలామటుకు సమతుల్యతకు పెద్దపీట వేస్తూ..అన్ని రకాల పోషకాలు అందేలా తీసుకుంటే మంచి ప్రయోజనాలు పొందగలమని అంటున్నారు. (చదవండి: రాయల్ ఆస్కట్ కార్యక్రమంలో డ్రెస్కు బదులుగా చీర..! బ్రిటన్ పౌరురాలేనే ఐనా..) -
అలా మధుమేహాన్ని తగ్గించుకున్నా: హోంమంత్రి అమిత్షా
కేంద్ర హోంమంత్రి అమిత్షా ఒక ప్రతిష్టాత్మక కార్యక్రమంలో తన ఆరోగ్యానికి సంబంధించిన వ్యక్తిగత అనుభవాన్ని పంచుకున్నారు. తాను మే 2020 నుంచి ఇప్పటివరకు తన జీవనశైలిలో భారీ మార్పులు చేసుకున్నట్లు తెలిపారు. ఫలితంగా మధుమేహం సమస్య నుంచి బయటపడ్డానన్నారు. తాను గతంలో షుగర్ వ్యాధితో బాధపడ్డానని, అందుకోసం అధిక మొత్తంలో మందులు, ఇన్సులిన్ వాడకం నుంచి విముక్తి పొందాలని అనుకున్నాని అన్నారు. ఆ నేపథ్యంలోనే ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రారంభించి..బరువు తగ్గడమే గాక మధుమేహం సమస్యను అధిగమించానన్నారు. అందుకోసం తాను ఏం చేశానో, అలాగే యువత ఏం చేస్తే ఆరోగ్యంగా ఉంటారో తదితరాల గురించి అమూల్యమైన సలహాలు, సూచనలు అందించారు అమిత్షా. అవేంటంటే..అమిత్ షా ఆరోగ్య అనుభవంకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. ఆ వీడియోలో తన ఫిట్నెస్ జర్నీ గురించి గుర్తుచేసుకుంటూ ఇలా చెప్పుకొచ్చారు. గతంలో తాను మధుమేహంతో బాధపడ్డానని, మే 2020లో ఎలాగైన ఈ సమస్యను అధిగమించాలనే కృతనిశ్చయంతో భారీ మార్పులు చేశానని అన్నారు. అందుకోసం తాను తగినంత నీళ్లు తాగడం, వేళకు భోజనం, క్రమం తప్పని వ్యాయామాలు చేసేలా కేర్ తీసుకున్నానన్నారు. అవి తనకెంతో మేలు చేస్తాయన్నారు. అన్నింటికంటే నిలకడగా ఆ అలవాట్లను భాగం చేసుకుంటే మొత్తం ఆరోగ్యం మెరుగ్గా ఉంటుందన్నారు. పైగా తనకు మందులపై ఆధారపడటం నుంచి విముక్తి లభించిందని చెప్పారు. ఆ జీవనశైలి మార్పులను అవలంభించి ఇవాల్టికి ఐదేళ్లవుతుందని, పైగా 20 కిలోల బరువు కూడా తగ్గానన్నారు. ముఖ్యంగా తాను వాడే అల్లోపతి మందులు, ఇన్సులిన్ వాడకం నుంచి బయటపడ్డానన్నారు. ఈ ప్రయోజనాలు శారీరక ఆరోగ్యానికి మించినవని అన్నారు. అంతేగాదు తన జీవనశైలిలో మార్పులు తన మానసిక చురుకుదనాన్ని, పని సామర్థ్యాన్ని కూడా మెరుగుపరిచాయన్నారు. ముఖ్యంగా పనిచేసే, ఆలోచించే విధానంలో మంచి మార్పుని తీసుకువచ్చిన చక్కటి నిర్ణయాలు తీసుకునేలా మెరుగుపరిచిందన్నారు. యువతకు సందేశం..తన అనుభవం ఫ్యాడ్ డైట్లు, తక్షణ పరిష్కారాల కంటే రోజువారి స్థిరమైన అలవాట్లు ఎంతటి గణనీయమైన మెరుగుదలకు దారితీస్తాయనేది చెబుతోందన్నారు. అందువల్ల యువత తమ ఆరోగ్యం కోసం వారే శ్రద్ధ తీసుకోవాలని కోరారు. శారీరక శ్రమకు, విశ్రాంతికి తగిన సమయం కేటాయించాలని నొక్కి చెప్పారు. దాంతోపాటు రోజుకు రెండు గంటల వ్యాయాయమం, బ్రెయిన్కి ఆరుగంటల నిద్ర కేటాయించమని కోరారు. తగినంత నిద్ర శారీరక ఆరోగ్యానికి మాత్రమే కాకుండా, మెరుగైన ఏకాగ్రత, మంచి నిర్ణయాలు తీసుకునే సామర్థ్యానికి దోహదపడుతుందని చెప్పారు.#WATCH | Delhi: At the event organised by ILBS (Institute of Liver and Biliary Sciences) on World Liver Day, Union Home Minister Amit Shah says, "... I made a huge change in my life since May 2020 till today. The required amount of sleep, water and diet, and routine exercise has… pic.twitter.com/HxDZgv0YGh— ANI (@ANI) April 19, 2025 (చదవండి: weight loss: 72 కిలోల నుంచి 49 కిలోలకు..! ఆ ఎనిమిది అలవాట్లకు తక్షణమే..) -
72 కిలోల నుంచి 49 కిలోలకు..! ఆ ఎనిమిది అలవాట్లకు తక్షణమే..
వెయిట్లాస్ జర్నీలో ఒక్కోక్కరిది ఒక్కో విధానం. వారి శరీరానికి అనుగుణమైన విధంగా..భారంగా కాకుండా నిలకడగా చేసేలా హెల్దీగా అధిక బరువుని తగ్గించుకుని ఆదర్శంగా నిలుస్తున్నారు చాలామంది. తాజాగా ఆ కోవలోకి మరో ఫిట్నెస్ ట్రైనర్ చేరారు. ఆమె తాను చేస్తున్న తప్పిదాలను సరిచేసుకుంటూ బరువు తగ్గి స్ఫూర్తిగా నిలిచారామె. అధిక బరువుని తగ్గించుకోవడానికి ఆంటకంగా ఉన్న అలవాట్లకు స్వస్తి పలికి మరీ ఏకంగా 23 కిలోలు తగ్గారు. మరి అదెలాగో ఆమె మాటల్లోనే చూద్దామా..!.ఫిట్నెస్ కోచ్ శిఖా సురానా అందుకోసం ఎలాంటి క్రాష్ డైట్లు, డిటాక్స్ టీలను తీసుకోలేదు. కేవలం తన వెయిట్లాస్ జర్నీలో చేస్తున్న తప్పులను సరిచేసుకుని మంచి ఫలితాలను అందుకున్నట్లు చెబుతోంది ఫిట్నెస్ కోచ్ శిఖా సురానా. ఆమె ఏ అలవాట్లను వదులుకున్నారు..ఏ తప్పిదాలను పునరావృతం కానివ్వలేదంటే..అల్పాహారం మానేయడం..బరువు తగ్గాలనే ఉద్దేశంతో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మానేసేదాన్ని దాంతో విపరీతమైన ఆకలితో ఉండేదాన్ని అన్నారు. ఫలితంగా జీవక్రియ మందగించేది. అదీగాక నేరుగా రాత్రిపటే తినేదాన్ని అన్నారు. దీని వల్ల తెలియకుండానే ఎక్కువ తినేయడం, బరువులో పెద్దగా మార్పులు కనిపించకపోవడం గమనించి ఆ విధానాన్ని పూర్తిగా మానేశానని చెప్పారు. ఆ తర్వాత నుంచి నిద్రలేచిని గంటలోపే తినడం మొదలు పెట్టానని అన్నారు. చక్కెర పానీయాలకు దూరంగా ఉండటం..జ్యూస్లు, చక్కెరతో కూడిన టీ, కోల్డ్ కాఫీ వంటి ద్రవాలు ఆరోగ్యకరమైనవిగా అనిపించినా..అవి ఎంతమంది మంచివి కావని అన్నారు. అందుకు బదులుగా నీళ్లు, బ్లాక్ కాఫీ, చక్కెర లేని సాధారణ టీ తీసుకోవడం ప్రారంభించినట్లు తెలిపారు. ఆరోగ్యకరమైన ఫుడ్స్ మోతాదు మేరకే..మఖానా, డ్రై ఫ్రూట్స్, పీనట్ బటర్ వంటివి ఆరోగ్యకరమైనవే అయినా..మోతాదు మేరకు తీసుకుంటేనే మంచివని అన్నారు. ఎంత పోషకవంతమైనదైనా..కేలరీల లెక్క మాత్రం అలానే ఉంటుంది. కాబట్టి అదనపు మోతాదులు త్వరగా కేలరీలను పెంచేస్తాయన్నారు. వెయిట్ ట్రైనింగ్ అస్సలు చేయకపోవడం..తాను బరువులు ఎత్తడం మొదలు పెట్టాకే శరీరంలో నిజమైన మార్పు రావడం కనిపించింది. ట్రెడ్మీల్ మీద గంటల తరబడి ఉండటం కంటే..ఇలాంటివి మంచివని తెలుసుకున్నానని అన్నారు. తక్కువ నిద్ర, ఎక్కువ ఒత్తిడిరాత్రిపూట ఆలస్యంగా నిత్రపోవడం, కార్డిసాల్ స్థాయిలు అధికంగా ఉండటం తదితరాల వల్ల తెలియకుండానే అధికంగా తినాలేన కోరక కలుగుతుందని అన్నారు. మంచి ఆరోగ్యానికి ఏడు నుంచి ఎనిమిది గంటల నిద్ర తప్పనిసరని అన్నారు. బయట తినడం మానేయడం..రెస్టారెంట్ భోజనం అప్పడప్పుడు పర్లేదనే భావన తప్పుడు ఆలోచన అని అంటోంది. ఇంటి భోజనమే మంచిదని, వెయిట్లాస్ కోసం ప్రయత్నించేవారికి ఇది అత్యంత ముఖ్యమని పేర్కొంది. చీట్ మీల్ వద్దు..పోనీలే సరదాగా పిజ్జా, కేక్ చిన్న ముక్కే కదా వంటివి వద్దు. ఏది చేసినా..పరిపూర్ణత కంటే..నిలకడగా చేయడం అనేది అత్యంత ప్రధానం అని గ్రహించండని నొక్కి చెబుతోంది. మంచి సమయం లేదా..అనుకూలమైన రోజు అంటూ గడపడం ఏ దినచర్య పాటించడానికి అయినా..క్రమశిక్షణ అత్యంత ముఖ్యం. ఏ మార్పు చేసినా..సరైన సమయం కోసం కాకుడం వెంటనే ఆచరించడండని అన్నారు.ప్రతీరోజు ఆలోచనాత్మకంగా ఆరోగ్యదాయకమైనవి ఎంచుకుంటూ స్థిరంగా బరువు తగ్గడం కీలకం. అదే మిమ్మల్ని నాజూకుగా మారుస్తుందని అంటోంది. అందుకు సంబంధించిన వీడియోను కూడా ఫిట్నెస్ కోచ్ శిఖా సురానా నెట్టింట షేర్ చేశారు.గమనిక: ఇది కేవలం అవగాన కోసం మాత్రమే. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించండి. View this post on Instagram A post shared by Shikha Surana (@coachshikhasurana) (చదవండి: Weight Loss: 144 కిలోలు నుంచి 65 కిలోలు..! నో జిమ్, నో ట్రైనర్ జస్ట్..) -
కొన్ని తలనొప్పులను.. సీరియస్గా తీసుకోవాల్సిందే! లేదంటే..
ప్రతి ఒక్కరి జీవితకాలంలో ఏదో ఒక సమయంలో కనీసం ఒక్కసారైనా తలనొప్పి సమస్యను ఎదుర్కొంటారు. అలా చూసినప్పుడు తలనొప్పి చాలా సాధారణ సమస్య. అయితే కొన్ని జబ్బులకు తలనొప్పి ఒక సూచనలా, ఒక లక్షణంగా కూడా కనిపించవచ్చు. అందుకే తరచూ తలనొప్పితో బాధపడేవారిలో దాని కారణం కనుగొనడం కూడా డాక్టర్లకూ తలనొప్పే. తలనొప్పుల్లో రకరకాలు ఉంటాయి. రకరకాల కారణాలతోనూ వస్తుంటాయి. ఎప్పుడో ఒకసారి తలనొప్పి కనిపించినా లేదా ఏదైనా ప్రత్యేక కారణంతో అప్పుడప్పుడూ వచ్చే తలనొప్పుల గురించి అంతగా పట్టించుకోనక్కర్లేదుగానీ... కొన్ని తలనొప్పులను చాలా సీరియస్గా తీసుకోవాల్సిందే. అసలు స్థూలంగా చూసినప్పడు తలనొప్పులను ఎలా విభజించుకోవచ్చు. ఏయే సందార్భాల్లో తలనొప్పుల సీరియస్గా తీసుకోవాలో చూద్దాం.గతంతో పోలిస్తే ఇప్పుడు తలనొప్పులు మరింత తరచుగా కనిపిస్తూ ఉన్నాయి. పైగా ఒకప్పుడు కాస్త పెద్దవయసువారిలో తరచూ కనిపించే ఈ తలనొప్పులు ఇటీవల చిన్నవయసువారిలోనూ కనిపిస్తున్నాయి. ఇక కొన్ని తలనొప్పులు జీవనశైలి మార్పుల వల్ల వస్తున్నట్లు డాక్టర్లు చెబుతున్నప్పటికీ అన్నింటినీ ఒకేగాటన కట్టడమూ సరికాదు. ఇలా చిన్నవయసు వారిలో తలనొప్పులు కనిపించగానే కళ్ల డాక్టర్తో కళ్లను పరీక్షింపజేసుకోవడమూ మామూలే. అలాగని మొత్తం కేసులను కళ్ల సమస్య ఖాతాలోనూ వేయడం సరికాదు. అందుకే తరచూ వస్తున్న తలనొప్పులను... అవి వచ్చే వేళలనూ, ఏదైనా ప్రత్యేక సందర్భంలో అంటే ఏదైనా వాసనలు పీల్చినప్పుడో లేదా ఏవైనా కాలుష్యాలకు గురైనప్పుడో వస్తుంటే వాటిని డాక్టర్లకు వివరించడమూ అవసరం. అప్పుడవి ఏ కారణంగా వస్తున్నాయో అంచనా వేయడానికీ డాక్టర్లకు అవకాశముంటంది.తలనొప్పుల గురించి విపులంగా...ప్రైమరీ తలనొప్పులు : సాధారణంగా ఇవన్నీ మెదడులోని రసాయనాల సమతౌల్యత తప్పడం వల్ల తలలో ఉద్భవించే తలనొప్పులని చెప్పవచ్చు. వీటిలో ప్రధానమైనవి...మైగ్రేన్...తలనొప్పులన్నింటిలోనూ మైగ్రేన్ చాలా సాధారణమైనది. ఇది టీనేజీలో చాలా ఎక్కువగా కనిపిస్తుంటుంది. అందునా యువకుల్లో కంటే యువతుల్లో మరింత ఎక్కువ. సాధారణంగా ఒక వయసు వచ్చాక దానంతట అదే తగ్గిపోయే అవకాశం ఉన్నప్పటికీ... అది వచ్చినప్పుడు నొప్పి తీవ్రత భరించలేనంతగా ఉంటూ చాలా ఎక్కువగా బాధిస్తుంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఉత్పాదక వయసులో ఉన్న చాలా మందిలో వాళ్ల పనిగంటలనూ, స్కూలు పిల్లలూ, విద్యార్థుల్లో వాళ్లు చదివే సమయాన్ని ఎక్కువగా వృథాచేసే తలనొప్పి ఇదే.లక్షణాలు...ఈ తలనొప్పి చాలా సందర్భాల్లో తలకు ఒకే వైపు వస్తుంటుంది. అందుకే చాలా సందర్భాల్లో చాలాచోట్ల దీన్ని ‘పార్శ్వపు నొప్పి’ అని కూడా అంటుంటారు. అయితే కొంతమందిలో మాత్రం కొన్ని సార్లు ఇది తలకు ఇరుపక్కలా వస్తుంటుంది. వచ్చినప్పుడు రెండు నుంచి నాలుగు గంటలు మొదలుకొని... కొన్ని సందర్భాల్లో 72 గంటల వరకూ రావచ్చు. తీవ్రమైన తలనొప్పితో పాటు వికారం / వాంతులు; కాంతిని చూడలేకపోవడం, వెలుతురు లేని చీకటి గదిలో ఉండాలనిపించడం... లేదా చూసినా, శబ్దాలు విన్నా తలనొప్పి విపరీతంగా పెరగడం, నిద్రపడితే తగ్గడం వంటి లక్షణాలుంటాయి. కొంతమందిలో కళ్లకు చిత్రవిచిత్రమైన కాంతి వలయాలు, కాంతిపుంజాలు, మెరుపులూ (ఆరా / ఫ్లాషింగ్ లైట్స్) కనిపిస్తాయి.కారణాలు... మైగ్రేన్కు చాలా కారణాలే ఉండవచ్చు. ఉదాహరణకు... తీవ్రమైన ఒత్తిడీ, యాంగై్జటీ; తమకు సరిపడని పదార్థాలేవైనా తినడం (ఉదాహరణకు చాక్లెటు, ఛీజ్, వెన్న, సోయా సాస్, కాఫీలోని కెఫిన్, ప్రాసెస్ చేసిన మాంసాహార పదార్థాలు, సిట్రస్ ఫ్రూట్స్ అంటే నిమ్మ జాతి పండ్లు వంటివి... ఇవి వేర్వేరు వ్యక్తుల్లో వేర్వేరుగా ఉండవచ్చు); తగినంత నిద్రలేకపోవడం, సమయానికి తినకుండా ఆకలితోనే ఉండిపోవడం, తీవ్రమైన శారీరక శ్రమ తర్వాతా, వాతావరణంలో వచ్చే ఆకస్మిక మార్పులు, అగరుబత్తీలూ లేదా కొన్ని రసాయనాలతో తయారుచేసిన సెంట్ల నుంచి వచ్చే బాగా ఘాటైన వాసనలు, ఆల్కహాల్ (ముఖ్యంగా రెడ్వైన్), చైనీస్ ఫుడ్ ఐటమ్స్ (ముఖ్యంగా చైనా సాల్ట్ వాడిన పదార్థాలు), యువతుల్లో హార్మోన్ల మార్పులు, తలస్నానం చేస్తూనే తలకు బిగుతైన హెయిర్ బ్యాండ్ ధరించడం, ఎండకు ఒక్కసారిగా ఎక్స్పోజ్ కావడం, మలబద్దకం వంటి అంశాలు మైగ్రేన్ తలనొప్పిని ప్రేరేపించడంతో పాటు మరింత తీవ్రతరం చేస్తాయి.ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్...ఇవే కాకుండా కొందరిలో వారికి మాత్రమే ప్రత్యేకమైన కారణాలు కూడా మైగ్రేన్ను ట్రిగర్ చేయవచ్చు. అంటే మైగ్రేన్ అన్నది ఒక్కొక్కరిలో ఒక్కోకారణం వల్ల వచ్చే అవకాశమూ ఉంది. అందుకే మైగ్రేన్ రావడానికి ముందు 6– 12 గంటల వ్యవధిలో ఏమైనా తిన్నారా, దేనికైనా ఎక్స్పోజ్ అయ్యారా వంటి అంశాలను డాక్టర్లు అడిగి తెలుసుకుంటారు. దీని ద్వారా నిర్దిష్టంగా తలనొప్పి ఏ కారణంగా వస్తుందో తెలుస్తుంది. ఈ కారణాలను మైగ్రేన్ను ప్రేరేపించే అంశాలు (ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్)గా చెబుతారు.నిర్ధారణ ఇలా...మైగ్రేన్ నిర్ధారణకు నిర్దిష్టంగా వైద్య పరీక్ష అంటూ ఏదీ ఉండదు. అంటే మైగ్రేన్ అనేది నిర్దిష్టంగా ఏ వైద్యపరీక్షలోనూ తెలిసేందుకు అవకాశం లేదు. ఎందుకంటే దాన్ని పట్టి ఇచ్చే ΄్యాటర్న్ అంటూ ఏదీ ఉండదు. అందుకే... తలనొప్పుల నిర్ధారణ కోసం చేసే అన్ని వైద్యపరీక్షల్లోనూ ఏ లోపమూ కనిపించకపోవడంతో పాటు... మైగ్రేన్లో కనిపించే ఒకవైపు తలనొప్పి లేదా దాని లక్షణాలతో అది తరచూ అదేపనిగా వస్తుండటం, మాటిమాటికీ తిరగబెడుతుండటం వంటి లక్షణాలతో దీన్ని నిర్ధారణ చేస్తారు.చికిత్స..మైగ్రేన్కు రెండు రకాల చికిత్స చేస్తారు. మొదటిది... తలనొప్పి తీవ్రతను వెంటనే తగ్గించడానికి చేసే తక్షణ చికిత్స. రెండోది... ఆ తర్వాత అది మళ్లీ తిరగబెట్టకుండా ఉండేందుకు ఇచ్చే దీర్ఘకాలిక చికిత్స. ఇందుకోసం డాక్టర్ల సలహా మేరకు మూడు నెలలు లేదా అంతకంటే ఎక్కువ కాలం పాటు ముందులు వాడాల్సి ఉంటుంది. ఇక మైగ్రేన్కు మందులతో పాటు యోగా, ధ్యానం (మెడిటేషన్) వంటి రిలాక్సేషన్ టెక్నిక్స్ కూడా కొంతవరకు ఉపయోగపడతాయి. ఇటీవల మందులతో తగ్గని కొన్ని మైగ్రేన్లకు బొటాక్స్ ఇంజెక్షన్ను ఉపయోగించి కూడా చికిత్స చేస్తున్నారు. మెగ్నీషియమ్, రైబోఫ్లేవిన్ (బి2 విటమిన్) సమృద్ధిగా ఉన్న ఆహార పదార్థాలు (గోధుమ వంటి ధాన్యాలు– పండ్లు, ఆకుకూరల్లో ఇవి అధికం) తీసుకోవడం ద్వారా కూడా ఉపశమనం దొరకుతుంది.క్లస్టర్ హెడేక్... మైగ్రేన్తో పోలిస్తే... ఇది కాస్తంత అరుదుగా కనిపించే తలనొప్పి. కంటి పాపల వెనక బాగా తీవ్రమైన నొప్పితో ఇది మొదలవుతుంది. రెండు మూడు గంటలపాటు తీవ్రంగా బాధిస్తుంది. ఒక్కోసారి ఇది మాటిమాటికీ తిరగబెడుతూ కొద్దిరోజుల పాటు వస్తూ ఉంటుంది. రోజూ ఒకే వేళకు కనిపిస్తూ ఉంటుంది. ఏడాదిలో 8–10 వారాల పాటు రావచ్చు. ఒకసారి అలా వచ్చాక మళ్లీ ఏడాది పాటు మళ్లీ రాకపోవచ్చు. అయితే... ఆ మరుసటి ఏడాది కూడా మొదటిసారి వచ్చినట్లే మళ్లీ 8–10 వారాల పాటు అదే వేళకు వస్తూ ఉంటుంది.చికిత్స...దీనికి తక్షణ చికిత్సగా ఆక్సిజన్ను అందిస్తారు లేదా ముక్కు ద్వారా పీల్చే ట్రి΄్టాన్ మందులను ఇస్తారు. ఇలా మొదట వచ్చే నొప్పిని తగ్గిస్తారు. ఇక ఆ తర్వాత ఈ తరహా తలనొప్పిని రాకుండా చేయడానికి దీర్ఘకాలిక చికిత్స అందించాల్సి ఉంటుంది.టెన్షన్ హెడేక్ : తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నవారికి విపరీతమైన తలనొప్పి రావడం మనలో చాలా మందికి తెలిసిన విషయమే. ఈ నొప్పి తలకు ఇరువైపుల గానీ లేదా కొన్నిసార్లు తలలో అన్నివైపులా ఉంటుంది. కొన్ని సార్లు చాలాకాలం (దీర్ఘకాలం పాటు) వస్తుంటుంది. ఒత్తిడి తీవ్రతను బట్టి తలనొప్పి తీవ్రత కూడా పెరుగుతుండటం, ఒక్కోసారి రోజులూ, నెలల తరబడి కనిపించడం కూడా జరుగుతుంటుంది. మార్కెట్లో దొరికే సాధారణ తలనొప్పి మందులతోనే దీన్ని తగ్గించుకోవచ్చు. రిలాక్సేషన్ టెక్నిక్స్ అవలంబిస్తూ ఒత్తిడి తగ్గించుకోడానికి అవలంబించే మార్గాలతో ఈ తలనొప్పి కూడా తగ్గుముఖం పట్టే అవకాశముంది.క్రానిక్ డైలీ హెడేక్... దీర్ఘకాలం పాటు రోజూ వచ్చే మైగ్రేన్, టెన్షన్ తలనొప్పులను తగ్గించుకోడానికి తరచూ నొప్పి నివారణ మందులు వాడటం వల్ల వచ్చే తలనొప్పి ఇది. మాత్ర వాడగానే మొదట్లో తలనొప్పులు తగ్గినప్పటికీ ఒక దశ తర్వాత నొప్పి నివారణ మందు తీసుకోగానే ఈ తరహా తలనొప్పి వస్తూ ఉంటుంది.ప్రైమరీ కాఫ్ అండ్ లాఫ్ హెడేక్... తీవ్రంగా దగ్గడం లేదా గట్టిగా చాలాసేపు నవ్వడం లేదా గట్టిగా తుమ్మడం వల్ల అకస్మాత్తుగా వచ్చే తలనొప్పి ఇది. చాలా అరుదుగా ఇది తలలోని సెరిబ్రోస్పినల్ ఫ్లుయిడ్ వంటి ద్రవాలను అడ్డుకోవచ్చు. ఒక్కోసారి తలలోని రక్తనాళాలనూ అడ్డుకోవచ్చు. ఒక్కోసారి గుండె నుంచి మెడ ద్వారా తలలోకి రక్తాన్ని తీసుకెళ్లే కెరోటిడ్ ఆర్టరీ అనే మంచి రక్తనాళం సన్నబడటం వల్ల కూడా ఈ తరహా తలనొప్పి రావడానికి అవకాశముంది.ప్రైమరీ స్టాబింగ్ హెడేక్... తలలో కత్తితో పొడిచినట్లుగా ఉండే తలనొప్పిని ఈ పేరుతో పిలుస్తారు.ప్రైమరీ హెడేక్ అసోసియేటెడ్ విత్ సెక్సువల్ ఇంటర్కోర్స్... సెక్స్లో పాల్గొన్నప్పుడు భావ్రపాప్తి పొందే సమయంలో అకస్మాత్తుగా వచ్చే తలనొప్పి ఇది. సెక్స్ ముగిశాక వచ్చే ఈ తలనొప్పి సాధారణంగా పురుషుల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఎర్గాటమైన్ లేదా ఇండోమెథాసిన్ వంటి మందులను సెక్స్కు ముందుగా వాడటం ద్వారా ఈ తరహా తలనొప్పిని నివారించవచ్చు. ఇక దీర్ఘకాలం పాటు ఈ నొప్పి రాకుండా ఉండటానికి ప్రొపనలాల్, డిల్టియాజెమ్ వంటి మందులు సూచిస్తారు.హిప్నిక్ హెడేక్... ఈ తరహా తలనొప్పి నిద్రలో మొదలై... నిద్రలేచాక కూడా దాదాపు 15–30 నిమిషాల పాటు వస్తూనే ఉంటుంది. సాధారణంగా 60 ఏళ్లు దాటిన వారిలో అందునా మరీ ముఖ్యంగా మహిళల్లో ఎక్కువగా కనిపిస్తుంటుంది. నిద్రకు ఉపక్రమించే ముందు ఒక కాఫీ తాగడం లేదా లిథియమ్ మాత్రలు వంటివి ఈ తరహా తలనొప్పికి చికిత్స.తలనొప్పులు స్థూలంగా ఎన్ని రకాలంటే...తలనొప్పుల తీరుతెన్నులు, వాటి నిర్ధారణ పద్ధతులు, చికిత్సలూ, ఇతరత్రా చాలా అంశాల ఆధారంగా తలనొప్పులను చాలారకాలుగా విభజించవచ్చు. అయితే... తలనొప్పులు ఎందుకొస్తున్నాయనే కారణాలూ లేదా అవి ఉద్భవించే తీరుతెన్నులను బట్టి నిపుణులు వాటిని ప్రధానంగా మూడు రకాలుగా విభజించవచ్చు. అవి...1. ప్రైమరీ తలనొప్పులు : ఈ తలనొప్పులు నేరుగా తలలోనే పుడతాయి. అంటే... ఈ నొప్పులకు కారణం తలలోనే ఉంటుంది. అంటే ఏదైనా ఆరోగ్య సమస్య ఉన్నప్పుడు వాటి రిఫరల్ పెయిన్ తలకు పాకడం వల్ల ఇవి రావడం లేదనీ... ఇవి నేరుగా తలలోనే పుడుతున్నాయని అర్థం.2. సెకండరీ తలనొప్పులు: ఈ తరహా తలనొప్పులు ఇంకేదో బయటి కారణంతోగానీ లేదా ఇతరత్రా ఆరోగ్య సమస్య కారణంగా గానీ వస్తుంటాయి. అంటే... తలలో గడ్డలు ఏర్పడటం లేదా తలకు గాయం కావడం లేదా పక్షవాతం వంటి కారణాల వల్ల ఈ తలనొప్పులు రావచ్చు. అందుకే వీటిని సెకండరీ తలనొప్పులుగా చెప్పవచ్చు.3. క్రేనియల్ న్యూరాల్జియా లేదా ఫేషియల్ పెయిన్స్తో పాటు ఇతర తలనొప్పులు : తల లోపల 12 నరాలు ఉంటాయి. వీటినే క్రేనియల్ నర్వ్స్ అంటారు. ఈ నరాలు ఏవైనా కారణాలతో ఉద్రిక్తతకు లోనైతే వచ్చే తలనొప్పులను ఇలా చెప్పవచ్చు.సెకండరీ తలనొప్పులు...నేరుగా తలలో పుట్టే నొప్పులు కాకుండా... ఇతరత్రా కారణాలతో వచ్చే తలనొప్పులివి. వీటిలో ఈ కింద పేర్కొన్నవి కొన్ని ప్రధానమైన తలనొప్పులు.మెనింజైటిస్... ఇది మెదడు పొరల్లో ఒకదానికి వచ్చే ఇన్ఫెక్షన్ కారణంగా తలనొప్పి వస్తుంది. ఇందులోని లక్షణాలు... తలనొప్పితో పాటు జ్వరం, వాంతులు, మెడ బిగుసుకుపోయి ఉండటం, వెలుగు చూడటానికి ఇబ్బందిగా ఉండటం లేదా శబ్దాలు వినడానికి ఇబ్బందిగా ఉండటం. మెనింజైటిస్ సమస్యను సీఎస్ఎఫ్ (మెదడులోని ద్రవం – సెరిబ్రోస్పినల్ ఫ్లుయిడ్)ను పరీక్షించడం ద్వారా నిర్ధారణ చేయవచ్చు.బ్రెయిన్ ట్యూమర్... మెదడులో ఏర్పడే గడ్డల వల్ల తలనొప్పి వస్తుంది. ఇలా వచ్చే తలనొప్పిలో.... మెదడులోని గడ్డ పెరుగుతున్న కొద్దీ నొప్పి కూడా పెరుగుతూ పోతుంది. కొన్ని సందర్భాల్లో వారాల తరబడి తలనొప్పి వస్తూనే ఉంటుంది. నిద్రలేవగానే నొప్పి ఎక్కువగా ఉండవచ్చు. కొందరిలో తలనొప్పితో పాటు వాంతులూ కావచ్చు. ఒక్కోసారి ఫిట్స్ కూడా రావచ్చు. ముందుకు ఒంగినప్పుడు తలనొప్పి తీవ్రత ఎక్కువగా ఉంటుంది లేదా ఏదైనా వస్తువులను ఎత్తినప్పుడు తలనొప్పి మరింత పెరుగుతుంది.ఇంట్రాక్రేనియల్ హేమరేజ్ తలనొప్పులు... తల (పుర్రె)లో అంతర్గత రక్తస్రావం కావడం వల్ల వచ్చే తలనొప్పి ఇది. అకస్మాత్తుగా తలనొప్పి వచ్చి శరీరంలోని ఏదైనా అవయవం బలహీనంగా కావడం లేదా చచ్చుబడిపోయినట్లుగా కావడం జరగవచ్చు. ఒక్కోసారి మాట ముద్దముద్దగా రావడం వంటి మార్పులూ కనిపించవచ్చు. ఈ తరహా తలనొప్పిని సీటీ స్కాన్ పరీక్షతో నిర్ధారణ చేయవచ్చు.టెంపోరల్ ఆర్టిరైటిస్... ఇది సాధారణంగా 60 ఏళ్ల వారిలో కనిపించే తలనొప్పి. ఆ వయసు వారిలో మొదటిసారి కనిపించే తలనొప్పి ఇది. దీనితో పాటు జ్వరం, బరువు తగ్గడం, దవడ నొప్పి, ఏదైనా నములుతున్నప్పుడు నొప్పి పెరగడం, రాత్రిళ్లు నొప్పి ఎక్కువగా ఉండటం, కణతల వద్ద నొక్కినప్పుడు నొప్పి ఎక్కువగా ఉండటం వంటివి ఇందులో కనిపించే లక్షణాలు. రక్తపరీక్ష చేయించినప్పుడు ఈఎస్ఆర్ చాలా ఎక్కువగా ఉంటుంది. టెంపొరల్ ఆర్టరీ బయాప్సీ ద్వారా దీన్ని నిర్ధారణ చేస్తారు.గ్లకోమా హెడేక్... కంట్లో ఇంట్రా ఆక్యూలార్ ప్రెషర్ అనే ఒత్తిడి పెరగడం వల్ల వచ్చే తలనొప్పి ఇది. ఇందులో తలనొప్పితో పాటు వికారం, వాంతులు వంటి లక్షణాలు ఉంటాయి. ఈ సమస్య నెమ్మదినెమ్మదిగా క్రమక్రమంగా బాధితులకు తెలియకుండానే చూపును హరించి వేస్తుంది. కాబట్టి తలనొప్పి బాధిస్తున్నప్పుడు డాక్టర్ను సంప్రదించడం తప్పనిసరి. ఇవే గాక... పక్క మీద తలగడ సరిగా లేనప్పుడు, మన దేహం భంగిమ (పోష్చర్) సరిగా లేనప్పుడు కూడా తలనొప్పులు వస్తుంటాయి. ఇలా ఇతరత్రా కారణాలతో వచ్చే తలనొప్పులు చాలా ఎక్కువగానే ఉంటాయి.క్రేనియల్ న్యూరాల్జియా...మన తలలోని పుర్రెను క్రేనియమ్ అంటారు. ఇందులో కీలకమైన 12 నరాలు ఉంటాయి. వీటినే క్రేనియల్ నర్వ్స్ అంటారు. వీటి నుంచి వచ్చే తలనొప్పులను ‘క్రేనియల్ న్యూరాల్జియా’ అంటారు. న్యూరా.. అంటే నరం అనీ, అలాగే ఆల్జియా అంటే నొప్పి అని అర్థం. అందుకే ఈ తరహా తలనొప్పులను క్రేనియల్ న్యూరాల్జియా అని చెబుతుంటారు.ఆక్సిపెటల్ న్యూరాల్జియా... ఎక్కువ తీక్షణమైన కాంతిని చూసినప్పుడు తలలోని వెనుక భాగంలో (ఆక్సిపెటల్ అనే ప్రాంతంలో) ఉండే నరాలు ఉద్రిక్తతకు గురై తలనొప్పి రావచ్చు. ఇలా వచ్చే తలనొప్పిని ఆక్సిపెటల్ న్యూరాల్జియా అంటారు.ట్రైజెమినల్ న్యూరాల్జియా... ట్రైజెమినల్ నర్వ్ అని పిలిచే ఈ నరం... నుదుటి నుంచి చెంప, దవడ వరకు అంటే దాదాపు పూర్తి ముఖానికి వెళ్లే తలనరాలలో ప్రధానమైనది. ఇది తీవ్రంగా ఉద్రిక్తమైనపుపడు ఏ పదార్థాన్ని కూడా నమలలేనంత / తినలేనంత తీవ్రమైన నొప్పి వస్తుంది. ఇందులో ఉడికించిన కోడిగుడ్డులోని తెల్లటి భాగాన్ని కూడా నమలలేనంత తీవ్రమైన నొప్పి వస్తుంటుంది. కనీసం మాట్లాడటం కూడా సాధ్యం కాదు. ప్రముఖ బాలివుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఈ నొప్పితో చాలాసార్లు బాధపడ్డాడు. ఈ తరహా తలనొప్పిని ముందుగా మందులతో తగ్గిస్తారు. 95 శాతం కేసుల్లో మందులతోనే తగ్గుతుంది. అయితే మందులతో తగ్గనప్పుడు చిన్న శస్త్రచికిత్స లేదా రేడియో శస్త్రచికిత్స ద్వారా ఈ నొప్పిని శాశ్వతంగా తగ్గించవచ్చు.ఒక అపోహ – వాస్తవం... కొంతమంది హైబీపీ వల్ల తలనొప్పి వస్తుందని అపోహ పడుతుంటారు. నిజానికి హైబీపీ కారణంగా తలనొప్పి రావాలంటే బీపీ కొలత 180 / 110 ఉండాలి. అప్పుడు హైబీపీ కారణంగా తలనొప్పి వస్తుంది.తలనొప్పిని తీవ్రంగా పరిగణించి, ఎప్పుడు చికిత్సకు వెళ్లాలంటే...జీవితంలో మొట్టమొదటిసారే అయినప్పటికీ అది భరించలేనంత తీవ్రమైన తలనొప్పిగా వస్తున్నప్పుడు. మొదలు కావడమే తలబద్ధలైపోతూ భరించలేనంతగా తలనొప్పి వస్తున్నప్పుడు.సమయం గడుస్తున్నకొద్దీ ఏమాత్రం ఉపశమనం లేకుండా అసలేమీ తగ్గకుండా తలనొప్పి తీవ్రత అంతకంతకూ పెరుగుతూ పోతున్నప్పుడు.తలనొప్పితో పాటు జ్వరం/నీరసం/ఫిట్స్/ చేయి లేదా కాలిలో బలహీనత వచ్చి కళ్లు మసకబారుతున్నప్పుడు.పైకి లేస్తున్నప్పుడు లేదా ఏదైనా వస్తువును ఎత్తుతున్నప్పుడు లేదా ముందుకు వంగుతున్నప్పుడు తలనొప్పి వస్తుంటే.నిద్రలో తలనొప్పి వచ్చి నిద్రాభంగం అవుతున్నప్పుడు పైన పేర్కొన్న లక్షణాలు కనిపిస్తున్నప్పుడు తప్పనిసరిగా డాక్టర్ను సంప్రదించి సీటీ స్కాన్/ఎమ్మారై స్కాన్ అవసరాన్ని బట్టి మెదడు నుంచి నీరు తీసి చేసే సీఎస్ఎఫ్ (సెరిబ్రోస్పినల్ ఫ్లుయిడ్) పరీక్ష వంటివి చేయించాల్సి ఉంటుంది.సాధారణ తలనొప్పి నివారణ ఇలా...తరచూ తలనొప్పి వస్తోందా? డాక్టర్ను సంప్రదించేలోపు ఈ జాగ్రత్తలు తీసుకోండి. తలనొప్పి రాకపోయినా భవిష్యత్తులో రాకుండా నివారించడానికి ఇవే జాగ్రత్తలు పనికివస్తాయి. అవి...కంప్యూటర్పై పనిచేసేతవారు కంటిపై ఒత్తిడి పడకుండా స్క్రీన్ ముందు కూర్చునేటప్పుడు యాంటీ గ్లేయర్ గ్లాసెస్ ధరించడం. అలాగే ప్రతి గంటకోమారు అయిదు నిమిషాల పాటు రిలాక్స్ కావడం. కంప్యూటర్పై పని చేసేవారు అదేపనిగా కనురెప్ప కొట్టకుండా తదేకంగా స్క్రీన్ను చూడటం సరికాదు.కుట్లు, అల్లికలు వంటివి చేసేవారు, అత్యంత సూక్ష్మమైన ఇంట్రికేట్ డిజైన్ల అల్లకం పని చేస్తుండేవారు తమ పనిలో తరచూ బ్రేక్ తీసుకుంటుండటం అవసరం.పిల్లల్లో తలనొప్పులు వస్తే నిర్లక్ష్యం చేయకూడదు. ఐ సైట్ వల్ల తలనొప్పి వచ్చే అవకాశాలు ఉంటాయి. తలనొప్పితో పాటు తల తిరగడం, వాంతుల కావడం వంటివి జరిగితే వెంటనే న్యూరాలజిస్టుతో పాటు కంటి వైద్యులనూ సంప్రదించడం మంచిది.రోజూ ప్రశాంతంగా కంటినిండా కనీసం ఏడు నుంచి ఎనిమిది గంటలపాటు నిద్ర పోవాలి. కొంతమందికి వారి వ్యక్తిగత నిద్ర అవసరాలను బట్టి కాస్త ఎక్కువగా, తక్కువగా నిద్రపోతారు. కాబట్టి వ్యక్తిగతంగా ఎవరికి సరిపడినంతగా వారు నిద్రించడం మంచిది.మనకు సరిపడని పదార్థాలు తీసుకోవడం ఆపేయడం.ఆల్కహాల్, పొగతాగడం వంటి దురలవాట్లు తప్పనిసరిగా మానేయడం మేలు.కాఫీ, చాకొలెట్స్, కెఫిన్ ఎక్కువగా ఉండే కాఫీ లాంటి పదార్థాలను మరీ ఎక్కువగా తీసుకోకూడదు. కెఫిన్ మోతాదు ఎక్కువగా ఉండే కొన్ని రకాల శీతల పానియాలకు దూరంగా ఉండటం మంచిది.ఏదైనా అలవాటు తలనొప్పిని దూరం చేస్తుందనే అపోహతో (ఉదాహరణకు టీ, కాఫీ తాగడం వంటివి) పరిమితికి మించి తీసుకోవడం సరికాదు.ఘాటైన వాసనలకు దూరంగా ఉండాలి. సరిపడని పెర్ఫ్యూమ్స్ను వాడటం మంచిదికాదు.తీవ్రమైన చప్పుళ్లకూ, చెవులు బద్దలు కొట్టే రణగొణ శబ్దాలకు ఎక్స్పోజ్ కాకుండా చూసుకోవాలి. పరిసరాలు ప్రశాంతంగా ఉండటం వల్ల చాలారకాల తలనొప్పులు రాకుండా నివారించవచ్చు.ఇతర రకాల తలనొప్పులు... ఇవేగాక న్యూ డైలీ పర్సిస్టింగ్ హెడేక్ (ఎన్డీపీహెచ్), ప్రైమరీ థండర్క్లాప్ హెడేక్, క్లస్టర్ హెడేక్స్లో ఒక రకమైన ప్రైమరీ పారాక్సిస్మల్ హెమిక్రేనియా వంటి చాలా రకాల తలనొప్పుల కూడా ఉన్నాయి. కొన్నిసార్లు పంటినొప్పి, చెవినొప్పి, గొంతునొప్పి, కళ్లు నొప్పిగా ఉండటం వంటి కారణాలు కూడా తలనొప్పికి దారితీస్తాయి. అంటే దేహంలో ఒకచోట వచ్చిన నొప్పి మరోచోటికి పాకుతుంది. రిఫరింగ్ పెయిన్ కారణంగా ఈ నొప్పులు తలనొప్పి రూపంలో కనిపిస్తుంటాయి.తలనొప్పి వచ్చినప్పుడు అంతగా ఆందోళన పడకూడదు. అయితే మాటిమాటికీ తలనొప్పి వస్తుంటే మాత్రం డాక్టర్ను కలిసి కారణాన్ని కనుగొనేందుకు అవసరమైన నిర్ధారణ పరీక్షలు చేయించాలి. తెలిసిన కారణాన్ని బట్టి తగిన చికిత్స తీసుకోవాలి.చివరగా... ముందుగా చెప్పినట్లు ప్రతి వ్యక్తి జీవితంలో ఏదో ఒక సమయంలో తలనొప్పి కనిపించకమానదు. అయితే మంచి జీవనశైలి (లైఫ్ స్టైల్) అలవాట్లతో చాలా రకాల తలనొప్పులను మాత్రమే కాదు... చాలా రకాల జబ్బులనూ నివారించుకోవచ్చు. అయితే కొన్ని సందర్భాల్లో ఉదయం నిద్రలేవగానే కనిపించే తలనొప్పలూ, వాటితో పాటు వాంతులు, వికారం, స్పృహ తప్పిపడిపోవడం వంటి తీవ్రమైన లక్షణాలు కనిపిస్తే మాత్రం తప్పనిసరిగా, వీలైనంత త్వరగా డాక్టర్ను సంప్రదించాలని తప్పక గుర్తుపెట్టుకోవాలి.- డా. ఎస్. రమేశ్, సీనియర్ న్యూరోసర్జన్ నిర్వహణ : యాసీన్ -
144 కిలోలు నుంచి 65 కిలోలు..! నో జిమ్, నో ట్రైనర్ జస్ట్..
ఒక పారిశ్రామిక వేత్త అత్యంత అధిక బరువుతో నరకం చూశాడు. బరువు తగ్గేందుకు ప్రయత్నించినా.. సాధ్యం కాలేదు. చివరికి ఒక రోజు తీవ్ర అనారోగ్యం పాలవ్వడమే మేల్కోలుపుగా మారి..అతడి వెయిట్లాస్ పరివర్తను నాంది పలకింది. అలా ఓపికతో ఆరోగ్యకరమైన రీతిలో బరువు తగ్గేందుకు ప్రయత్నించి సఫలమవ్వడమే గాక తనలా ఇబ్బంది పడుతున్నవాళ్లు కూడా స్లిమ్గా మారాలని '3ఈ' ఫిట్నెస్ సెంటర్ని కూడా స్థాపించాడు. అంతేగాదు అందరు ఆరోగ్యంగా ఉండాలన్నదే తన ఆకాంక్ష అంటూ తన వెయిట్లాస్ స్టోరీని షేర్ చేస్తూ..ఆరోగ్య స్పృహ కలిగిస్తున్నాడు.అతడే 'ADSMITH' వ్యవస్థాపకుడు నీరజ్ ఝూ. తన సంస్థ బాధ్యతలతో తలామునకలవ్వుతూ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేశారు. దాంతో అతడు ఏకంగా 144 కిలోల బరువుతో ఊబకాయంతో ఇబ్బందిపడేవాడు. అలాంటి వ్యక్తి కేవలం రెండేళ్ల వ్యవధిలో ఏకంగా 65 కిలోలు తగ్గి.. సుమారు 79 కిలోల బరువుకు చేరుకున్నాడు. అయితే దీని కోసం ఎలాంటి వెయిట్లాస్ మందులు, సెలబ్రిటీ ఫిట్నెస్ ట్రైనర్, జిమ్ వంటి వాటి జోలికి పోకుండా ఆరోగ్యకరమైన పద్ధతిలో తన బరువుని తగ్గించుకుని ఆదర్శంగా నిలిచాడు. అతడు తన పాత అలవాట్లకు స్వస్తి పలకాలనే దృఢమైన సంకల్పంతోనే స్లిమ్గా మారానని చెబుతున్నాడు. తాను వృత్తిపరంగా సక్సెస్ అందుకున్నా..అందుకు మూల్యం తన శరీరం చెల్లించాల్సి వచ్చిందంటాడు. తనకు ఆ అధిక బరువుతో అస్సలు నిద్ర పట్టేది కాదని, పైగా వొంట్లో అస్సలు శక్తి ఉండేది కాదని, చాలా ఆయాసంగా ఉండేదని చెప్పుకొచ్చాడు. అయితే తాను కూడా అందరిలా బరువు తగ్గే ప్రయత్నం మొదలుపెట్టి మధ్యలోనే వదిలేసేవాడినని చెప్పుకొచ్చాడు. శరీరం బాగా అలిసిపోయినట్లుగా అనిపించి, మధ్యలో స్కిప్ చేసేవాడినని అన్నాడు. కానీ బయట వాళ్ల నుంచి వచ్చే ఛీత్కారాలకు భయపడి మళ్లీ బరువు తగ్గే ప్రయత్నాలు చేసేవాడినని చెప్పుకొచ్చాడు. ఐసీయూ తెచ్చిన మేల్కొలుపు..ఒకరోజు తీవ్రం అనారోగ్య బారినపడి, ఆస్పత్రిలో చేరినప్పుడు నరకం చూశానని, నాటి సంఘటనను గుర్తు తెచ్చుకున్నాడు. చాలాసార్లు ఆస్పత్రిలో చేరాను కానీ ఆవేళ మాత్రం తన పరిస్థితి ఘెరంగా ఉందని, తీవ్రమైన ఎల్ఆర్టీఐ(దిగువ శ్వాసకోశ ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్) కారణంగా శ్వాస తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడ్డానని చెప్పుకొచ్చాడు. వైద్యులు బైపాప్ యంత్రాన్ని అమర్చారు. అది తనకు ఆరోగ్యంపై శ్రద్ధ ఉండాలనే కనువిప్పుని కలగజేసిందన్నారు. అంతేగాదు చాలా ఏళ్ల తర్వాత హాయిగా నిద్రపోయినట్లు పేర్కొన్నారు. అప్పుడే తెలిసింది ఏళ్లుగా తాను ఊపిరాడక సతమతమయ్యాననని తెలుసుకున్నానని అన్నాడు. అసలు బరువు తగ్గించుకుంటే తనకు ఇలాంటి సమస్య వచ్చి ఉండేది కాదని తెలిసి వచ్చిందని అంటాడు నీరజ్. అయితే అందరిలా జిమ్, ట్రైనర్ల జోలికిపోకుండా ..చాలామందిలా జిమ్లో జాయినవ్వడం, ఫిట్నెస్ ట్రైనర్లను పెట్టుకోవడం వంటివి చేయకుండా..ప్రాథమికంగా తాను చేయగలిగే వాటిపై దృష్టిపెట్టాడు. ముందు నిలకడగా వ్యాయామాలు చేసేలా చిన్నగా ప్రారంభించాడు. అలాగే ఆహారపరంగా కేలరీలోటు మంత్రని అనుసరించాడు. చిన్నగా వాకింగ్ మొదలుపెట్టి..నెమ్మదిగా అధిక దూరాలకు నడిచేలా కేర్ తీసుకున్నాడు. అలాగే పదే పదే వెయిట్ చెక్ చేయడం వంటివి కూడా చేయలేదని చెప్పుకొచ్చాడు. అయితే ఒత్తిడి మనల్ని ఆహారం తినేలా ప్రోత్సహిస్తుంది కాబట్టి దాన్ని అధిగమించే ప్రయత్నం చేసినట్లు తెలిపాడు. మంచి లేదా చెడు జరిగినా కూడా..నిశబ్దంగా పరిస్థితిని అంగీకరిస్తూ..ఆందోళన, ఒత్తిడి వంటి సమస్యలకు దూరంగా ఉన్నట్లు తెలిపాడు. దాంతో దాదాపు 120 కిలోలు తగ్గానని చెప్పుకొచ్చాడు నీరజ్. అయితే ఆ తర్వాత మాత్రం తన శరీరంలో అంగుళం కడా మార్పు రాకపోవడంతో షుగర్కి సంబంధించిన వాటన్నింటిని దూరం పెట్టి, అధిక ప్రోటీన్, తక్కువ కార్బోహైడ్రేట్లు ఉన్న ఆహారం తీసుకున్నట్లు తెలిపాడు. అలా గుడ్లు, చికెన్, చేపలు, పనీర్, గ్రీక్ యోగర్ట్, కూరగాయలు తీసుకోవడం వంటి మార్పులు చేసినట్లు తెలిపాడు. అలాగే శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్ల వినియోగాన్ని తగ్గించి రెండు పుల్కాలు వంటివి తీసుకున్నట్లు తెలిపారు. అలాగే బిస్కెట్లు, అధిక చక్కెర ఉండే పండ్లకు, మద్యంకు దూరంగా ఉన్నట్లు వెల్లడించారు. అలా 18 నెలలు కష్టపడగా చివరకు 79 కేజీల బరువుకి చేరుకున్నట్లు తెలిపారు. తాను పూర్తిగా ఇదివరకటి నీరజ్లా రూపుదిద్దుకున్నట్లు చెప్పుకొచ్చారు ఆ మూడు సూత్రాల ఆధారంగా..అలా తనలా మరింత మంది చక్కగా స్లిమ్గా అవ్వాలనే ఉద్దేశ్యంతో 3E ఫిట్నెస్ను స్థాపించాడు. తన జీవితాన్ని మార్చిన మూడు సూత్రాలపై ఈ వెల్నెస్ ఫ్లాట్ఫామ్ని ప్రారంభించాడు. ఆ మూడు Eలు – చెప్పేది..సరైన ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, మానసికంగా స్ట్రాంగ్గా ఉండటం. వైద్యులు సైతం ఆయన అనుసరించిన వెయిట్లాస్ జర్పీపై ప్రశంసల జల్లులు కురిపించారు. నెమ్మదిగా, స్థిరంగా బరువు తగ్గడం వల్ల శరీరం జీవక్రియ, హార్మోన్ల స్థాయి మెరుగ్గా ఉండటమే కాకుండా కండర ద్రవ్యరాశిని నిలుపుకోవడానికి సహాయపడుతుందని అన్నారు. అలాగే మళ్లీ తిరిగి బరువు పెరిగే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని అన్నారు. ఎప్పుడైనా బరువు తగ్గడం అనేది మానసిక భారంలా కాకుండా..చిన్నగా వాకింగ్, తేలికపాటి వ్యాయామాలతో మొదలుపెడితే సునాయాసం బరువు తగ్గగలరని చెబుతున్నాడు నీరజ్. ఇక్కడ కేవలం వదులుకోకుండా నిలకడతో క్రమం తప్పకుండా చేస్తే.. తప్పక సత్ఫలితాలను అందుకోగలమని, అందుకు నిదర్శనం తానేనని చెబుతున్నాడు. -
పిల్లలకు టై కడుతున్నారా? ఈ తప్పు చేయొద్దు!
తెలుగు రాష్ట్రాల్లో కొత్త విద్యాసంవత్సరం ప్రారంభమై పాఠశాలలు సందడిగా మారాయి. యూనిఫాంలు, షూస్, బ్యాగులతో చిన్నారులు మళ్లీ బడిబాట పట్టారు. అయితే స్కూల్ యూనిఫాంలో భాగమైన ఒక అంశం గురించి వైద్య నిపుణులు హెచ్చరికలను ఓసారి చర్చిద్దాం. చాలామంది తల్లిదండ్రులు సాధారణంగా భావించే ఈ విషయం.. పిల్లల సౌకర్యం, ఆరోగ్యంతో ముడిపడి ఉందని చెబుతున్నారు. స్కూల్ యూనిఫాంలో టై అనేది తప్పనిసరి. పిల్లలు చక్కగా కనిపించాలనే ఉద్దేశంతో తల్లిదండ్రులు టైలను సరిగ్గా కట్టి పంపిస్తుంటారు. మరీ ముఖ్యంగా చిన్నపిల్లల విషయంలో ఊడిపోకూడదని భావిస్తుంటారు. అయితే టైని అతిగా బిగించడం వల్ల పిల్లలకు అసౌకర్యం కలిగే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.మెడకు బిగిగా టై ధరించడం వల్ల.. మెదడుకు వెళ్లే రక్తప్రసరణపై స్వల్ప ప్రభావం ఉండే అవకాశం ఉందని నిపుణులు గుర్తు చేస్తున్నారు. జర్మనీకి చెందిన పరిశోధకులు.. నిర్వహించిన అధ్యయనంలో బిగుతుగా కట్టిన టై మెదడుకు వెళ్లే రక్తప్రసరణను తాత్కాలికంగా తగ్గించే అవకాశం ఉందని గుర్తించారు. పిల్లల డాక్టర్లు చెబుతోంది ఏంటంటే.. పిల్లలు రోజులో చాలా గంటల పాటు తరగతి గదుల్లో కూర్చుంటారు. అలాంటి సమయంలో మెడపై అనవసర ఒత్తిడి పడితే తలనొప్పి, తలతిరుగుడు, వికారం, చిరాకు, ఏకాగ్రత లోపించడం వంటి సమస్యలు కనిపించే అవకాశం ఉంటుంది. టై బిగుతుగా ఉందా? లేదా? అనేది కొందరు పిల్లలు చెప్పలేని సందర్భాలు ఉంటాయి. కొందరు అసౌకర్యంగా ఉన్నా కూడా స్కూల్ నిబంధనల కారణంగా భరిస్తుంటారు. అందుకే ఉదయం పిల్లలను స్కూల్కు పంపే ముందు టై మరీ గట్టిగా ఉందేమో ఒకసారి పరిశీలించాలని నిపుణులు సూచిస్తున్నారు.మరోవైపు పరిశుభ్రత విషయంలో కూడా టైలను నిర్లక్ష్యం చేయొద్దని వైద్యులు హెచ్చరిస్తున్నారు. యూనిఫాంలను తరచూ ఉతికే తల్లిదండ్రులు టైలను మాత్రం చాలాసార్లు మర్చిపోతుంటారు. పిల్లలు టైలను చేతులతో తాకడం, కొన్నిసార్లు నోటికి దగ్గరగా తీసుకెళ్లడం వల్ల వాటిపై సూక్ష్మక్రిములు పేరుకుపోయే అవకాశం ఉంటుంది. అందుకే టైలను కూడా క్రమం తప్పకుండా శుభ్రం చేయడం అవసరం.తల్లిదండ్రులు పాటించాల్సిన జాగ్రత్తలు..* టైని మెడకు అతిగా బిగించవద్దు.* మెడకు, టైకి మధ్య ఒకటి లేదా రెండు వేళ్లు వెళ్లేంత ఖాళీ ఉండాలి.* పిల్లలు అసౌకర్యంగా ఉందని చెబితే వెంటనే టైని వదులుగా చేయాలి.* ఇంటికి వచ్చిన తర్వాత టైని తీసేయాలి.* టైలను కూడా యూనిఫాంల మాదిరిగానే క్రమం తప్పకుండా ఉతకాలి.* తలనొప్పి, తలతిరుగుడు వంటి సమస్యలు తరచూ ఉంటే వైద్యులను సంప్రదించాలి.అయితే పైన చెప్పిన అధ్యయనం నేరుగా చిన్నారులపై జరగకపోయినా.. పిల్లల విషయంలో కూడా అతిగా బిగించిన టైలు ఇబ్బందులకు దారితీయవచ్చని వైద్యులు చెబుతున్నారు. టై అనేది యూనిఫాంలో చిన్న భాగమే కావచ్చు. కానీ పిల్లల సౌకర్యం, ఆరోగ్యం విషయంలో ఏ విషయాన్నీ నిర్లక్ష్యం చేయకూడదు. స్కూల్కు పంపే ముందు టై సరిగ్గా ఉందా, బిగుతుగా లేదో ఒకసారి చూసుకోవడం ద్వారా అనవసరమైన అసౌకర్యాన్ని నివారించవచ్చు. పిల్లలు చక్కగా కనిపించడం ఎంత ముఖ్యమో.. వారు రోజంతా సౌకర్యంగా, ఆరోగ్యంగా ఉండటం అంతకంటే ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు. -
ప్రాణాంతక వ్యాధి లాస్ట్ స్టేజ్..ఐనా రోజుకు 12 గంటలు..!
ప్రాణాంతక వ్యాధితో పోరాడుతూ మంచి పని కోసం తపించడం అంటే..మాటలకందని గొప్ప విషయం. అలా చేయాలంటే ఎంతో స్థైర్యం కావాలి. అంతేగాదు అతడు ఆ వ్యాధి చివరిదశలో ఉండి కూడా.. తనలా మరొకరు ఈ వ్యాధికి బలి కాకూడదని తపిస్తుండటం విశేషం. చిన్నపాటి కదలికలకు కూడా నలుగురు వ్యక్తులపై ఆధారపడాల్సిందే..ఐనా 12 గంటలు పనిచేస్తున్నాడు. అంతలా తగ్గేదేలా అంటూ మనోధైర్యంతో సాగుతున్న అతడి గుండె ధైర్యానికి చేతులెత్తి నమస్కరించాల్సిందే. అతడెవరంటే..ఆ వ్యక్తే ఈ కామర్స్ దిగ్గజం JD.com లో ఉపాధ్యక్షుడిగా పనిచేసిన 48 ఏళ్ల కైలే. చైనాకు చెందిన కైలే ఏడేళ్లుగా మోటార్ న్యూరాన్ వ్యాధి (ALS) తో పోరాడుతున్నాడు. నయంకాని ఈ వ్యాధి అతడిని పూర్తిగా కదలలేని, మాట్లాడలేని స్థితికి తీసుకువచ్చింది. ప్రస్తుతం టైప్ చేయడానికి, మాట్లాడటానికి పూర్తిగా కంటి ట్రాకింగ్ టెక్నాలజీపై ఆధారపడిన కై, రోజుకు దాదాపు 12 గంటలు పనిచేస్తూ..ఏఎల్ఎస్ ఔషధాల తయారీకి తనను తాను అంకితం చేసుకుంటున్నాడు. తనలా మరెవ్వరూ ఈ వ్యాధికి బలికాకూడదని.. శాస్త్రవేత్తలు, వైద్యులతో కలసి నిర్విరామంగా పనిచేస్తున్నాడుమరణం ఒక్కటే నన్ను ఆపగలదు ఇంకేది కాదంటూ..ఆ స్థితిలో కూడా ఓపికతో పరిశోధనకు తన వంతు సహకారం అందిస్తున్న అతడిని శెభాష్ అని అభినందించకుండా ఉండలేరెవ్వరూ. కై ఇప్పుడు బీజింగ్ ఐసికాంగ్ మెడికల్ టెక్నాలజీకి ఛైర్మన్గా ఉన్నారు. ఆయన మోటార్ న్యూరాన్ వ్యాధి (ALS) పరిశోధన కోసం దాదాపు రూ. 13 కోట్లు వరకు విరాళం ఇచ్చినట్లు సమాచారం. ఆయన ఈ వ్యాధికి అంకితమైన నాలుగు స్వచ్ఛంద సంస్థలను కూడా స్థాపించారు. అలాగే అనేక ప్రయోగశాలలను ఏర్పాటు చేయడానికి ప్రముఖ శాస్త్రవేత్తలు, వైద్యులతో కలిసి పనిచేస్తున్నారు. బాధకరం ఏంటంటే ఏఎల్ఎస్ను తొలిసారి గుర్తించిన దాదాపు రెండు శతాబ్దాల తర్వాత కూడా ఏ ఔషధం కూడా దాని పురోగతిని ఆపలేకపోయింది. ఆయన బృందం ప్రస్తుతం 300కు పైగా ఔషధ కార్యక్రమాలను అభివృద్ధి చేస్తోంది. ఒక జన్యు-లక్షిత చికిత్స అనేక మంది రోగులను కాపాడినప్పటికీ, కైకిలా స్పోరాడిక్ ALS ఉన్న చాలా మందికి సహాయం చేయలేదు. ఈ ఏడాది ప్రారంభంలో RAG-17 అనే ప్రయోగాత్మక ఔషధంతో ఒక పురోగతిని ప్రకటించారు. ట్రయల్స్లో కూడా చక్కటి ఫలితాలు వచ్చాయి. కాగా కై లే బృందం ఏజెన్సీ రుసుములు లేకుండా రోగులను నేరుగా సంరక్షకులతో అనుసంధానించే ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్ను సృష్టించింది. స్వతహాగా ఫార్మసీ గ్రాడ్యుయేట్లు అయిన కై , అతని భార్య డువాన్ రుయ్లకు ఒక కుమారుడు ఉన్నాడు. భార్య డువాన్ తన "బ్రేకింగ్ ది ఐస్ స్టేషన్" అనే సోషల్ మీడియా ఖాతా ద్వారా పరిశోధన కోసం నిధులను సేకరిస్తుంది. కైకి ALS వ్యాధిపై పోరాటంలో సహాయం చేయడం కేవలం కుటుంబ జీవితాన్ని కాపాడుకోవడం కంటే ఎక్కువ అని, అతనితో గడిపే ప్రతి క్షణాన్ని తాను ఎంతో విలువైనదిగా భావిస్తానని కై భార్య చెప్పడం విశేషం. అంతేగాదు కై దృఢ సంకల్పానికి ఫిదా అవ్వతూ ప్రశంసలు వెల్లువెత్తాయి.(చదవండి: 25 వేల ఈకలు, నాలుగు లక్షల పూసలు..ఏకంగా రూ. 1,155 గంటల ఎంబ్రాయిడరీ!) -
ప్రసవానంతరం 14 కిలోల బరువు ...! జస్ట్ 21 రోజుల్లోనే..
ప్రసవానంతరం చాలామంది మహిళలకు నార్మల్ స్థితికి రావడానికి చాలా సమయం పడుతుంది. చాలామందికి ఆ సమయంలో ఉన్నంత లావు తదనంతర కొనసాగుతుంది. పైగా బిడ్డకు పాలివ్వాల్సి ఉంటుంది కాబట్టి బరువు తగ్గడం అన్నది కష్టసాధ్యమైనదే. కానీ ఈ మామ్ 21 రోజుల పాటు జపనీస్ ఆహారపు అలవాట్లను పాటించి ఏకంగా 14 కిలోలు బరువు తగ్గింది. అదెలాగో ఆమె మాటల్లోనే సవివరంగా తెలుసుకుందామా..!.జపనీయులు ఆహార విధానం చాలా సింపుల్గా ఉంటుంది. ముఖ్యంగా ఆలోచనాత్మకంగా తినడం, సమతుల్య పరిమాణంలో తీసుకోవడం, అతిగా తినకుండా ఆహారాన్ని ఆస్వాదించడం వంటి వాటిపై ఆధారపడి ఉంటుంది. అందుకే ఈ భారతీయ తల్లి, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ మాన్సీ ఆ ఆహారపు అలవాట్లును ప్రయత్నించి చూసి సత్ఫలితాలను అందుకుంది. ఆ విషయాన్ని ఇన్స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసుకుంది. ఈ జపనీస్ ఆహారపు అలవాట్లు నిజంగానే మంచి మార్పు తీసుకువస్తాయా? లేదా? అనే కుతూహలంతో ఈ ప్రయోగాన్ని ప్రయత్నించి చూసినట్లు తెలిపింది. ఆ నేపథ్యంలోనే 21 రోజుల పాటు జపనీసులు తినే ఆహారపద్ధతిని యథతథంగా పాటించినట్లు తెలిపింది. ఇందులో ఎలాంటి ఆహార మార్పులు, షార్ట్కట్లు ఉండవు. జపాన్ వాళ్లు సరిగ్గా ఎలా తింటారో అలానే తింటే చాలు అంటోంది. ఆ ఐదు జపాన్ రూల్స్..ముందుగా కళ్లతో తినండి..భోజనం తినే ముందు అది చూడటానికి అందంగా ఉండాలని జపనీయులు నమ్ముతారు. చిన్న చిన్న భాగాలు, రకరకాల రంగులు..ఇలా ప్రతిదీ శ్రద్ధగా అమర్చి ఉండాలి అని ఆ ఇన్ఫ్లుయెన్సర్ వివరించారు. ఇది ఒక్కటే తినే వేగాన్ని తగ్గించి, అతిగా తినడాన్ని నివారిస్తుందని చెబుతోందామె.హరా హచి బు..ఇది ఒక సాంప్రదాయ జపనీస్, కన్ఫ్యూషియన్-ప్రేరిత పద్ధతి. దీని అర్థం కడుపు 80% నిండే వరకు తినాలి. ఇది శ్రద్ధగా ఆహార పరిమాణాన్ని నియంత్రించడానికి ఒక సున్నితమైన విధానంగా పనిచేస్తుంది. అలాగే శరీరానికి కడుపు నిండినట్లు గ్రహించడానికి సమయం ఇవ్వడం ద్వారా అతిగా తినడాన్ని నివారిస్తూ జీర్ణక్రియకు సహాయపడవచ్చు. ఇలా ప్రతి భోజనంలో దీనిని పాటిస్తూ.. ఏమీ కోల్పోతున్నాననే భావన కలగకుండా ఆహార పరిమాణాలు సహజంగానే తగ్గుతాయట.ప్రతి భోజనంలో అన్నం.. కానీ చిన్న చిన్న భాగాలుగా!తెల్ల అన్నమే చిన్న చిన్న భాగాలుగా తీసుకుంటానంటోంది. అయితే ప్రోటీన్ ఉండేలా..కూరగాయలు, మిసోసూప్తో కలిపి తింటానని మాన్సీ తెలిపారు. ఈ కలయిక రక్తంలోని చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచుతుంది. పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోకుండా నివారిస్తుందని ఇన్ఫ్లుయెన్సర్ తెలిపారు.భోజనానికి ముందు మిసో సూప్మిసో సూప్లో పులియబెట్టిన పదార్థాలు ఉంటాయి. ఇది పేగుల ఆరోగ్యానికి మంచిదని పేర్కొంది. మాన్సీ ప్రకారం, ఇది ఆమె దినచర్యలో ఒక భాగంగా మారిందని చెప్పుకొచ్చింది.భోజనం మధ్యలో చిరుతిండ్లు..మాన్సీ ప్రకారం, జపాన్లో భోజనాల మధ్య తినడం అనేది ఒక సాధారణ అలవాటు కాదు. దానికి బదులుగా, మధ్యలో ఏమీ తినకుండా రోజుకు మూడు పూటలా సరిగ్గా భోజనం చేయడంపై దృష్టి పెడతారు. ఇది జీర్ణవ్యవస్థకు విశ్రాంతి తీసుకోవడానికి సమయం ఇస్తుందని, అలాగే ఆకలి సంకేతాల పట్ల శ్రద్ధ వహించడానికి సహాయపడుతుందని పేర్కొంది మాన్సీ.ఇక్కడ ఈ తల్లి మాన్సీ వెయిట్లాస్ స్టోరీ.. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను పెంపొందించుకోవాలంటే.. మన ప్లేట్లో ఉండే భోజనం ఎంత ముఖ్యమో అంతే విధంగా ఆలోచనాత్మకంగా తినడం, పరిమాణంపై శ్రద్ధ పెట్టడం అంతే ముఖ్యమని చెప్పకనే చెబుతోంది కదూ..!. View this post on Instagram A post shared by Mansi (@mommytoivaan_)గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: ఎలాంటి డైటింగ్ చేయకుండానే 9 కిలోలు..! ఆ నాలుగు రూల్స్ ..) -
బ్రెయిన్కు బూస్ట్.. ఇక ఆందోళనకు చెక్!
యోగా.. నేటి ఆధునిక ప్రపంచంలో ఎవరికీ పరిచయం చేయక్కర్లేని పదం. పాఠశాల స్థాయి నుంచి సాఫ్ట్వేర్ ఎంప్లాయిస్ వరకు ప్రతి ఒక్కరికీ తెలిసిందే. అయితే ఇది కేవలం శారీరక వ్యాయామం మాత్రమే కాదు.. బ్రెయిన్ను రీవైరింగ్ చేస్తూ.. మానసిక ఆరోగ్యానికి దివ్యౌషధంగా పనిచేస్తుందని అనేక పరిశోధనల్లో సైతం రుజువయ్యింది. అందుకే యోగా ఒక్క భారతదేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగానూ ఎంతగానో ప్రాచుర్యం పొందింది. ప్రతి ఏటా జూన్ 21న ప్రపంచవ్యాప్తంగా నిర్వహించే ‘అంతర్జాతీయ యోగా దినోత్సవం’ కేవలం ఒక రోజు వేడుక కాదు, అది ప్రపంచవ్యాప్తంగా ఒక గొప్ప ఆరోగ్య విప్లవంగా మారింది.బ్రెయిన్కు బూస్ట్యోగా అనగానే చాలామందికి కేవలం శరీరాన్ని విల్లుగా వంచడం, శ్వాసపై ధ్యాస పెట్టడం లేదా శారీరక దృఢత్వం కోసం చేసే ఒక వ్యాయామం మాత్రమే గుర్తొస్తుంది. కానీ, యోగా అంతకుమించి మన మెదడును సమూలంగా మార్చేయగలదని, మానసిక ఒత్తిడిని దూరం చేయగలదని ఇప్పటికే ఎన్నో పరిశోధనల్లో తేలింది. మెదడులోని నాడీ వ్యవస్థ తనను తాను పునర్నిర్మించుకునే ప్రక్రియను న్యూరోప్లాస్టిసిటీ అంటారు. క్రమం తప్పకుండా యోగా చేయడం వల్ల మెదడులో ఈ ప్రక్రియ వేగవంతమై, మానసిక స్థితి పూర్తిగా మారుతుందని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు.ఒత్తిడి హార్మోన్లకు బ్రేక్!మనం తీవ్రమైన ఆందోళన, డిప్రెషన్ లో ఉన్నప్పుడు శరీరంలో ‘కార్టిసాల్’ అనే ఒత్తిడి హార్మోన్ విపరీతంగా విడుదలవుతుంది. ఇది మెదడు పనితీరును దెబ్బతీస్తుంది. శాస్త్రవేత్తల పరిశోధనల ప్రకారం, కేవలం ఒకే ఒక్క యోగా సెషన్తోనే శరీరంలో కార్టిసాల్ స్థాయులు 30 శాతం వరకు తగ్గినట్లు గుర్తించారు. యోగాలోని ‘్రపాణాయామం’ మన శరీరంలోని పారాసింపథెటిక్ నాడీ వ్యవస్థ ఉత్తేజితమవుతుంది. ఇది గుండె వేగాన్ని, శ్వాసను నియంత్రించి శరీరానికి, మనస్సుకు పూర్తి ప్రశాంతతను ఇస్తుంది.ఆందోళనకు చెక్మెదడును ప్రశాంత పరిచే ‘గాబా’ అనే కెమికల్ కొరత వల్ల మనుషుల్లో యాంగ్జైటీ, డిప్రెషన్ పెరుగుతాయి. నిరంతర యోగా సాధన వల్ల మెదడులో ఈ ‘గాబా’ స్థాయులు గణనీయంగా పెరుగుతాయని, తద్వారా ఎలాంటి మందులు లేకుండానే మానసిక ఆందోళనలను అదుపులోకి తీసుకురావచ్చని పరిశోధకులు చెబుతున్నారు. తీవ్రమైన మానసిక గాయాలతో బాధపడేవారికి కూడా యోగా ఒక అద్భుతమైన థెరపీలా పనిచేస్తోందని తేలింది.అయితే యోగా వల్ల కలిగే ఈ మానసిక ప్రయోజనాలు శాశ్వతంగా ఉండాలంటే మాత్రం క్రమం తప్పకుండా చేయడం మాత్రం తప్పనిసరి. ఇది ‘యూజ్ ఇట్ ఆర్ లూజ్ ఇట్’ అనే సూత్రంపై ఆధారపడి ఉంటుంది. అంటే యోగా ఆపేస్తే మెదడు మళ్లీ పాత స్థితికి చేరుకుంటుంది. అందువల్ల రోజుకు కనీసం 10 నుంచి 15 నిమిషాల పాటు సరళమైన ఆసనాలు,ప్రాణాయామం చేసినా మెదడును ఆధునీకరిస్తుంది. అద్భుతాలను సృష్టిస్తుంది. లేదంటే వాడని వస్తువులు తుప్పు పట్టినట్లే మెదడు కూడా ముందు స్థితికి చేరుకుంటుంది.ఈ ఏడాది యోగా థీమ్...ఈ సంవత్సరం అంటే 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ‘ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా 'Yoga for Healthy Ageing' అనే ప్రత్యేక థీమ్తో నిర్వహిస్తున్నారు. వయసు పైబడుతున్న కొద్దీ వచ్చే శారీరక మార్పులను తట్టుకుని, మానసిక స్థిరత్వంతో ఆరోగ్యంగా ఎలా జీవించాలనేదే దీని ముఖ్య ఉద్దేశం. -
నడుము, కాళ్లు, వెన్నెముకకు శక్తినిచ్చే త్రికోణాసనం!
త్రికోణాసనం అర్థం... ‘త్రి‘ అంటే మూడు, ‘కోణం‘ అంటే కోణం. శరీరం త్రిభుజాకారంలో ఉండే ఆసనాన్ని త్రికోణాసనం అంటారు. చేసే విధానం... నిటారుగా నిలబడి కాళ్లను 3–4 అడుగుల దూరంలో ఉంచాలి. చేతులను భుజాల స్థాయిలో పక్కలకు చాచాలి. కుడి పాదాన్ని కుడివైపుకు తిప్పాలి.శ్వాస వదులుతూ కుడివైపుకు వంగి, కుడి చేతిని కుడి పాదం దగ్గర ఉంచాలి. ఎడమ చేతిని పైకి చాచి, చూపును ఎడమ చేతి వేళ్లపై నిలపాలి. 10–30 సెకన్లు ఈ స్థితిలో ఉండాలి. శ్వాస తీసుకుంటూ మళ్లీ మొదటి స్థితికి రావాలి. ఇదే విధంగా ఎడమ వైపు చేయాలి.ప్రయోజనాలు... శరీర కండరాలను బలోపేతం చేస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. సమతుల్యత, ఏకాగ్రతను పెంచుతుంది. కాళ్లు, తొడలు, నడుము భాగాలను దృఢంగా చేస్తుంది. శరీరంలోని అదనపు కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది. ఛాతీ విస్తరించి శ్వాసక్రియ మెరుగుపడుతుంది.జాగ్రత్తలు... తీవ్రమైన వెన్నునొప్పి లేదా మెడ నొప్పి ఉన్నవారు జాగ్రత్తగా చేయాలి. తల తిరగడం లేదా అధిక రక్తపోటు ఉన్నవారు నిపుణుల పర్యవేక్షణలో చేయాలి. ఆసనాన్ని బలవంతంగా చేయకూడదు. – అనిత పాతర్ల, యోగా ట్రైనర్ -
ఖర్చు లేకుండా.. ప్రశాంతతను చేకూర్చే సహజ ఔషధం ఇదే..!
ఎలాంటి ఖర్చు లేకుండా మనస్సుకు ప్రశాంతతను చేకూర్చే ఒక అద్భుతమైన సహజ ఔషధం మ్యూజిక్. కేవలం వినోద సాధనంగానే కాకుండా, శారీరక, మానసిక ఆరోగ్యానికి కూడా సంగీతం ఒక దివ్యౌషధంగా పనిచేస్తోందని పరిశోధనలు చెబుతున్నాయి.శాస్త్రీయ సంగీతం మనస్సుకు ఎనలేని ప్రశాంతతను, నిశ్చలతను ఇస్తే, రాప్ సంగీతం జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పుడు మానసిక బలాన్ని, ఉత్సాహాన్ని నింపుతుంది. అలాగే పక్షుల కిలకిలరావాలు, వాన జల్లుల చప్పుడు, సముద్రపు అలల ధ్వనులు గుండె వేగాన్ని నియంత్రించి, ఒత్తిడిని పూర్తిగా దూరం చేస్తాయి.అందువల్ల మనకు నచ్చిన సంగీతాన్ని వినడం వల్ల మన మెదడులోని రసాయన ప్రక్రియల్లో సానుకూల మార్పులు వస్తాయి. ఇది ఒత్తిడిని కలిగించే హార్మోన్లను తగ్గించి, మూడ్ను మెరుగుపరుస్తుంది. ప్రతికూల ఆలోచనల నుంచి మనస్సును పక్కకు మళ్లించడానికి ఇది ఒక సులువైన మార్గం.ఆఫీసులో ప్రతిరోజూ 30 నిమిషాల పాటు సంగీతం వినే ఉద్యోగుల్లో కేవలం నెల రోజుల్లోనే ఒత్తిడి స్థాయిలు భారీగా తగ్గినట్లు పరిశోధనల్లో గుర్తించారు.అలసిపోయి ఇంటికి వచ్చినప్పుడు ఉత్సాహభరితమైన పాటలు వింటూ ఇల్లు లేదా డెస్క్ శుభ్రం చేసుకోవడం వల్ల అలసట తెలియదు. అలాగే, చదువుకునేటప్పుడు లేదా ఆఫీస్ పనులు చేసేటప్పుడు లిరిక్స్ లేని కేవలం ఇ¯Œ స్ట్రుమెంటల్ సంగీతాన్ని బ్యాక్గ్రౌండ్లో ప్లే చేయడం వల్ల ఏకాగ్రత పెరుగుతుంది.ఈ ఉరుకుల పరుగుల జీవితంలో కాసేపు ప్రశాంతత కోసం హెడ్ఫోన్స్ తగిలించుకుని మీకు నచ్చిన సంగీత ప్రపంచంలోకి వెళ్ళిపోవడమే ఒత్తిడికి సరైన పరిష్కారం! -
మనం వాడుతున్న టొమాటోలు.. ఏ దేశానికి చెందినవో తెలుసా..?
నిత్యం మనం వాడుతున్న కొన్ని పదార్థాలు ఎక్కడినుంచి వచ్చాయి? ఆ పదార్థాలతో లాభాలేంటి అనే కొన్ని విషయాల గురించి తెలుసుకుందాం!ఇండియాలో మిరపకాయలను, టొమాటోలను, బంగాళా దుంపలను ఎక్కువగా వాడుతుంటారు. ఇందులో టొమాటోలు లేని కూరలు అసలే ఉండదు. అలాంటి ఈ టొమాటోలు అసలు మనదేశానివే కావనే విషయం మీకు తెలుసా..? వీటిని పోర్చుగీసు వారు భారత దేశానికి తీసుకొచ్చారు.జలుబు, దగ్గు లేదా సైనస్ సమస్యలు వచ్చినప్పుడు తల్లులు పిల్లలకు పాలు తాగించడం మానేస్తారు. అయితే పాలు ఎలాంటి హాని కలిగించవు, సైనస్ సమస్యలను మరింత తీవ్రతరం చేయవు. జలుబుతో బాధపడే పిల్లలు, పెద్దవారు ఎలాంటి భయం లేకుండా పాలు తాగొచ్చు. -
బాదంతో.. కంటి చూపు భేష్!
బాదం పప్పు ఆకారం చూస్తే అచ్చం కన్నులాగే ఉంటుంది. అందువల్ల దీనిని కనుదృష్టి కోసం వాడతారు. బాదం పప్పులు 200 గ్రాములు తీసుకొని రాత్రి వేడి నీటిలో నానబెట్టాలి.తెల్లవారిన తరువాత పై తోలు తీసి నలగ్గొట్టి చూర్ణం చేసుకొని ఎండబెట్టి పొడి చేసుకోవాలి.అదే విధంగా సోంపు గింజలు 200 గ్రాములు తీసుకొని దోరగా వేయించి దంచి పొడి చేసుకొని దానికి మెత్తగా పొడి చేసిన 200 గ్రాముల కండ చక్కెర కలుపుకొని ఒక గాజు పాత్రలో నిల్వ చేసుకోవాలి.పెద్దలకు రెండు స్పూన్లు మోతాదుగా ఆవుపాలు వేడి చేసుకొని అందులో ఈ చూర్ణం కలుపుకొని సేవిస్తుంటే నేత్ర దృష్టి పెరుగుతుంది. పిల్లలకయితే ఒక స్పూన్ చాలు. ఈ విధంగా ఒక సంవత్సరం వాడితే కంటిచూపు బాగుండటమే గాక జ్ఞాపక శక్తి పెరుగుతంది. కృశించి ΄ోయిన శరీర భాగాలు కూడా ఉత్తేజం చెందుతాయి. -
ఆ రోజుల్లో కూడా యోగా చేయొచ్చు!
క్రమం తప్పకుండా యోగా సాధన చేయడం వల్ల హార్మోన్ల సమతుల్యత మెరుగుపడి శారీరక, మానసిక ఆరోగ్యం కూడా మెరుగవుతుందని అందరికీ తెలిసిందే.అయితే స్త్రీలు రుతుక్రమం (పీరియడ్స్) సమయంలో యోగా చేయకూడదనే అపోహతో ఆ రోజుల్లో యోగాకు దూరంగా ఉంటారు చాలామంది స్త్రీలు. కానీ నిపుణుల అభిప్రాయం ప్రకారం సరైన మార్గదర్శకత్వంతో యోగా చేయడం పీరియడ్స్ సమయంలో కూడా సురక్షితమే కాకుండా అనేక ప్రయోజనాలను అందిస్తుంది. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా...చాలామంది మహిళలు పీరియడ్స్ సమయంలో యోగాకు దూరంగా ఉంటారు. అయితే పిరియడ్స్లో ఉన్నా, యోడసాధనను ఆపాల్సిన అవసరం లేదని నిపుణులు అంటున్నారు. పీరియడ్స్ టైంలో శరీరాన్ని తలక్రిందులుగా ఉంచే ఇన్వర్షన్ ఆసనాల విషయంలో మాత్రం ఎలాంటి అసౌకర్యం అనిపించినా వాటిని చేయకుండా ఉండటం ఉత్తమం.పీరియడ్స్ సమయంలో యోగా చేయడం వల్ల శరీరం రిలాక్స్ అవడంతో పాటు ఎండార్ఫిన్స్ అనే హ్యాపీ హార్మోన్స్ విడుదలై మానసిక ప్రశాంతత కలుగుతుందంటున్నారు నిపుణులు.. పీరియడ్స్ సమయంలో యోగా చేస్తే రుతుచక్రం మారిపోతుందని కొందరు భావిస్తారు. కానీ ఇది కూడా అపోహేనని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. పైగా క్రమం తప్పకుండా యోగా చేయడం వల్ల హార్మోన్ల సమతుల్యత మెరుగుపడి రుతుచక్రం క్రమబద్ధంగా ఉండే అవకాశాలు పెరుగుతాయని చెబుతున్నారు. -
వర్షాకాలం వచ్చేసింది.. పాదరక్షలతో పదిలం!
వర్షాకాలం వచ్చేసింది. ధరించే దుస్తుల విషయంలో జాగ్రత్తలు తీసుకున్నట్లే వేసుకునే చెప్పుల విషయంలోనూ జాగ్రత్తలు ముఖ్యమే. లేదంటే కొద్దిపాటి అజాగ్రత్తగా ఉన్నా జారిపడటమో, ఫంగల్ ఇన్ఫెక్షన్లు రావడమో జరుగవచ్చు. అందుకోసం ఈ చిన్నచిన్న టిప్స్...మంచి గ్రిప్ ముఖ్యం: వర్షాకాలంలో అడుగు భాగంలో అరిగిపోయిన ఫ్లాట్ చెప్పులను అస్సలు వాడకూడదు. తడి నేలపై నడిచేటప్పుడు జారిపడకుండా ఉండటానికి గరుకుగా, గట్టిగా నేలను పట్టుకునే గ్రిప్ ఉన్న చెప్పులను మాత్రమే ఎంచుకోవాలి.వాటర్ ప్రూఫ్వి: లెదర్, కాన్వాస్ లేదా బట్టతో చేసిన చెప్పులు నీటిని ఎక్కువగా పీల్చుకుంటాయి. ఇవి త్వరగా ఆరకపోవడమే కాకుండా దుర్వాసనకు, బ్యాక్టీరియాకు నిలయంగా మారుతాయి. కాబట్టి రబ్బర్, సిలికాన్ లేదా ప్లాస్టిక్తో తయారైన వాటర్ ప్రూఫ్ చెప్పులను వాడటం ఉత్తమం.సరైన సైజ్: చెప్పులు మరీ లూజ్గా గానీ, మరీ టైట్గా గానీ ఉండకూడదు. బురదలో నడిచేటప్పుడు కాళ్ళు బెణకకుండా ఉండేందుకు యాంకిల్ సపోర్ట్ ఉన్న చెప్పులు మరింత సురక్షితం. -
ఏఐ వల్ల మరో ముప్పు.. ఈ సారి ఉద్యోగాలు పోవడం కాదు..
చిన్న సందేహం వచ్చినా చాలా మంది కృత్రిమ మేధస్సు (ఏఐ)ను ఆశ్రయిస్తున్నారు. అలా ప్రతిదానికీ కృత్రిమ మేధస్సుపై ఆధారపడితే మెదడుపై ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆలోచించడం, గుర్తు పెట్టుకోవడం వంటి పనులను మనమే చేయకపోతే మెదడు చురుకుదనం తగ్గవచ్చని చెబుతున్నారు. ఇది వయస్సు పెరిగిన తర్వాత వచ్చే డిమెన్షియా వంటి సమస్యలను ఎదుర్కొనే సామర్థ్యాన్ని కూడా బలహీనపరచవచ్చని అభిప్రాయపడుతున్నారు. అమెరికాలోని పొసిబిలిటీ ఇన్స్టిట్యూట్ ప్రధాన శాస్త్రవేత్త, సిద్ధాంత న్యూరోసైంటిస్టు వివియెన్ మింగ్ ఈ విషయంపై హెచ్చరిక చేశారు. అయితే కృత్రిమ మేధస్సు వల్ల నేరుగా వ్యాధి రాదని, దాన్ని ఎలా వినియోగిస్తున్నామన్నదే అసలు అంశమని ఆమె స్పష్టం చేశారు.వివియెన్ మింగ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ప్రతిరోజు చిన్న విషయాల గురించి కూడా కృత్రిమ మేధస్సుపై తరచుగా ఆధారపడటం వల్ల డిమెన్షియాను ఎదుర్కొనే మెదడు సహజ రక్షణ బలహీనపడే అవకాశం ఉందని హెచ్చరించారు. దీనికి కారణం నిపుణులు "కాగ్నిటివ్ రిజర్వ్" అని పిలిచే సామర్థ్యం తగ్గిపోవడమేనని చెప్పారు. కాగ్నిటివ్ రిజర్వ్ అంటే వయస్సు పెరగడం లేదా వ్యాధుల ప్రభావం వచ్చినా మెదడు పనితీరును కొనసాగించే సామర్థ్యం.కృత్రిమ మేధస్సు నేరుగా నాడీ సంబంధిత వ్యాధులను కలిగించదని వివియెన్ మింగ్ చెప్పారు. అయితే, ప్రజలు దాన్ని ఎలా వినియోగిస్తున్నారన్నదే ఆందోళన కలిగించే అంశమని వివరించారు. అసలు సమస్య "క్రానిక్ సబ్స్టిట్యూషన్"లో ఉందని తెలిపారు. అంటే, కృత్రిమ మేధస్సు పని చేస్తోందనే కారణంతో యూజర్లు తమ ఆలోచనా శ్రమను మానేయడమేనని వివరించారు.క్రానిక్ సబ్స్టిట్యూషన్ అంటే మనం స్వయంగా ఆలోచించకుండా ఆ పనిని దీర్ఘకాలం పాటు కృత్రిమ మేధస్సుకు పూర్తిగా అప్పగించే అలవాటు. కాలక్రమంలో ఈ అలవాటు వల్ల కాగ్నిటివ్ రిజర్వ్ను పెంచుకునే, నిలబెట్టుకునే మెదడు సామర్థ్యం తగ్గే అవకాశం ఉందని చెప్పారు. వయస్సు పెరగడం వల్ల వచ్చే నష్టాన్ని, డిమెన్షియాను ఎదుర్కోవడంలో ఈ సామర్థ్యం కీలక పాత్ర పోషిస్తుందని వివరించారు.కాగ్నిటివ్ రిజర్వ్ అంటే శారీరక మార్పులు లేదా వ్యాధి వచ్చినా మెదడు పరిస్థితులకు అనుగుణంగా తన పనితీరును కొనసాగించే సామర్థ్యం. నిరంతర మానసిక శ్రమ, కొత్త విషయాల అభ్యాసం, చురుకైన మేధో కార్యకలాపాల వల్ల ఇది బలపడుతుంది.కృత్రిమ మేధస్సుపై అధికంగా ఆధారపడటం వల్ల ఈ ప్రక్రియ దెబ్బతినే ప్రమాదం ఉందని వివియెన్ మింగ్ అభిప్రాయపడ్డారు. మానసిక చురుకుదనం తగ్గిపోతే, దీర్ఘకాలంలో మెదడు ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మరింత కష్టమవుతుందని హెచ్చరించారు.మెక్గిల్ విశ్వవిద్యాలయం అధ్యయనం ప్రకారం.. దారి తెలుసుకోవడానికి తరచుగా జీపీఎస్పై ఆధారపడిన వారిలో, స్వయంగా దారి గుర్తించే స్థల అవగాహన జ్ఞాపకశక్తి బలహీనంగా కనిపించింది.అలాగే, ఎంఐటీ మీడియా ల్యాబ్ నిర్వహించిన చిన్న అధ్యయనంలో.. పెద్ద భాషా నమూనాలను ఉపయోగించి రచనలు చేసిన వారిలో, సంప్రదాయ పద్ధతులు ఉపయోగించిన వారితో పోలిస్తే మెదడు నాడీ అనుసంధానం బలహీనంగా కనిపించిందని వెల్లడైంది. అంతేకాదు, తాము ఇప్పుడే రాసిన విషయాన్నే గుర్తు పెట్టుకోవడంలో కూడా వారు ఇబ్బంది పడ్డారని అధ్యయనం తెలిపింది. -
హఠ యోగా అంటే..? అమెరికన్లు ఇష్టపడటానికి కారణ ఇదేనా..
ఇవాళ ఉరుకుల పరుగుల కాలంలో యోగా మళ్లీ అందరి జీవితంలో భాగమయ్యేలా క్రేజ్ సంతరించుకుంటుంది. ఆధునికంగా జిమ్, ఏరోబిక్ వంటి ఎన్నో రకాల వర్కౌట్లు ఉన్నా ప్రముఖులు, సెలబ్రిటీల వరకు అంతా యోగాకే ప్రాముఖ్యత ఇవ్వడం విశేషం. అదీగాక మరి కొద్దిరోజుల్లోనే(జూన్ 21)న యోగా దినోత్సవం పురస్కరించుకుని అమెరికన్లు అంతగా మెచ్చే హఠయోగా గురించి సవివరంగా తెలుసుకుందామా.!. గూగుల్స్ ట్రెండ్స్ డేటా ప్రకారం అమెరికన్లు ఎంత ఇష్టపడే సాధాన హఠ యోగా. ఇది శారీరక భంగిమలు, మైండ్ఫుల్నెస్తో చేసే శ్వాస పద్ధతులను మిళితం చేసే సాంప్రదాయ యోగా. ఇది శరీరం, మనస్సు మధ్య బలమైన బంధాన్ని సృష్టించడంపై దష్టిసారించడం వల్లే ప్రజలు అంతగా ఆకర్షితులవ్వుతారని చెబుతున్నారు ప్రముఖ యోగా నిపుణులు. హఠ యోగా అంటే..హఠ యోగా అత్యంత పురాతనమైన..చాలామంది ఆచరించే యోగా రూపాలలో ఒకటి. సాంప్రదాయకంగా, ఇది ఆసనాలు, శ్వాసవ్యాయామాలు, ధ్యానంతో మిళితమయ్యే యోగా ప్రక్రియ. నెమ్మదైన కదలికలతో ఆసనాల్లో ఎక్కువసేపు ఉండాల్సి ఉంటుంది. ఈ పేరులోని 'హా', 'ఠ'లను సూర్యచంద్రులకు ప్రతీకలుగా చెబుతారు యోగా నిపుణులు. అందువల్ల ఇది శరీరం-మనస్సు మధ్య ఘర్షణను శాంతపరిచేలా సమతుల్యత తీసుకురావడాన్ని లక్ష్యంగా చేసుకుంటుందట. అమెరికన్లు ఇష్టపడటానికి రీజన్..ప్రారంభకులు సలుభంగా చేయగలిగేలా ఉండటం తోపాటు అధిక తీవ్రత గల ఫిట్నెస్ తరగతులకు భిన్నంగా నెమ్మదైన కదలిక, శ్వాసపై ఫోకస్ తదితరాల వల్ల ఈజీగా చేయగలమనే నమ్మకంతో ఇష్టపడుతున్నారనేది వాదన. కొందరు కఠినమైన వ్యాయమాల కంటే ఇది శారీరకంగా, మానసికంగా స్ట్రాంగ్గా, హెల్దీగా ఉండేలా చేస్తుందని ప్రగాఢంగా విశ్వసించడం మరొక కారణం. అదీగాక ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరూ ఒత్తిడి, నిరాస నిస్ప్రుహలను ఎదుర్కొనడం అధికమవ్వడం వల్లే ఈ హఠ యోగాకి ఆదరణ పెరిగిందని అంటున్నారు యోగా నిపుణులు. కలిగే ఉపయోగాలు..ఏకాగ్రతను పెంచుతుంది. దీనిలోని శ్వాన వ్యాయామాలు భావోద్వేగ పరిస్థితులను హ్యాండిల్ చేసే శక్తిని అందించి ప్రశాంతతను చేకూరుస్తాయి. ఒత్తిడితోకూడని పనివేళలు, డిజిటల్ పరధ్యానంకు చెక్పెట్టే గొప్ప సాధనవర్తమానంలో ఉండగలిగే శక్తిని అందిస్తుంది. ఇది శరీరానికి వ్యాయమానికి మించింది కూడా. ధ్యానానిక పునాదిగా మారుతుంది. ఈ కారణాల వల్లే అమెరికన్లు హఠయోగకి ప్రాధాన్యత ఇస్తున్నారని చెబుతున్నారు యోగా నిపుణులు. అక్కడ ఇది ఒక ఫిట్నెస్ ట్రెండ్కి మించిందని చెబుతుండటం విశేషం. యోగా గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఈ కింది లింక్పై క్లిక్ చేయండి -
పీసీఓఎస్తో జస్ట్ రెండు నెలల్లో తొమ్మిది కిలోలు..!
సాధారణంగా బరువు తగ్గడం అనేది సవాలుతో కూడుకున్నది. అందులోనూ పీసీఓఎస్ అంటే అంత సులభం కాదు బరువు తగ్గడం. అలాంటిది ఈ కంటెంట్ క్రియేటర్ జస్ట్ రెండు నెల్లలోనే ఏకంగా తొమ్మిది కిలోలు తగ్గి అందర్నీ ఆశ్చర్యపరిచింది. అందుకోసం తానే ఏం చేసింది? ఎలాంటి ట్రిక్స్ ఫాలో అయ్యిందో షేర్ చేసుకుంది. మరి అవేంటో చూద్దామా..!.పీసీఓఎస్తో బరువు తగ్గడం అనేది అసంభవం అనిపించే సవాలులా ఉంటుంది. పైగా అందరికీ ఈ సమస్య ఒకేలా ఉండదు. అలాగే అందరికీ సరిపోయే డైటింగ్, వ్యాయామాలు ఉండవు. అలాంటిది కంటెంట్ క్రియేటర్ తాన్య మాత్రం పీసీఎస్ని ఆరోగ్యవంతంగా నిర్వహించుకుంటూనే బరువు తగ్గిందామె. పైగా ఎలాంటి కఠినమైన ఆహార నియామాలు, తీవ్రమైన వ్యాయమాల జోలికి పోకుండా నిలకడగా జీవనశైలి మార్పులను పాటించానని అంటోంది. అంతేగాదు తాను ఎలా బరువు తగ్గిందో కూడా షేర్ చేసుకున్నారామె. ఆమె కేవలం రెండు నెలల్లో 75 కిలోల నుంచి 66 కిలోలు అంటే మొత్తం 9 కిలోలు తగ్గినట్లు పేర్కొంది. అయితే ఇలా పీసీఓఎస్తో బరువు తగ్గే ప్రయత్నంలో తాను ఆ ఐదు తప్పిదాలను చేయకుండా జాగ్రత్తపడ్డానని అంటోంది. అందువల్ల ఇంత సులభంగా బరువు తగ్గానని పంచుకుంది. చేయకూడని తప్పిదాలు..అల్పాహారం మానేయడంతాన్య ప్రకారం, అల్పాహారం మానేయడం తాను చేసిన అతిపెద్ద తప్పులలో ఒకటి. చాలా కాలం పాటు, తక్కువ తినడం వల్ల వేగంగా బరువు తగ్గుతానని నమ్మేదాన్ని అంటోంది. అయితే, ప్రోటీన్ అధికంగా ఉండే అల్పాహారంపై దృష్టి పెట్టడం ప్రారంభించాక పరిస్థితులు మారాయని వెల్లడించింది.అంతులేని కార్డియో చేయడంగంటల తరబడి కార్డియో చేయడమే బరువు తగ్గడానికి కీలకం అని చాలా మంది అనుకుంటారు. తాన్య దీనితో ఏకీభవించదు. అంతులేని కార్డియో సెషన్లతో తనను తాను బలవంతం చేసుకోవడం కంటే, స్ట్రెంగ్త్ ట్రైనింగ్, క్రమం తప్పకుండా నడవడం తనకు చాలా బాగా పనిచేశాయని ఆమె చెప్పింది.ఆహారానికి భయపడటంతాను వదిలేసిన మరో అలవాటు ఆహారాన్ని శత్రువులా చూడటం అని చెబుతోంది తాన్య. PCOS ఉన్నంత మాత్రాన పస్తులుండటం లేదా క్రాష్ డైట్లపై ఆధారపడటం కానేకాదని అంటోందామె. బదులుగా ప్రోటీన్తో కూడిన సరైన భోజనమే ఎంతో మేలు చేస్తుందని చెబుతోంది.పానీయాల ద్వారా కేలరీలు తీసుకోవడంచక్కెర పానీయాలలో దాగి ఉన్న కేలరీల గురించి కూడా తాన్య ప్రస్తావించింది. ఫ్యాన్సీ కాఫీ డ్రింక్స్ నుంచి ప్యాకేజ్డ్ జ్యూస్ల వరకు, ఈ పానీయాలు కడుపు నిండినట్లు అనిపించకుండానే అదనపు కేలరీలను చేర్చగలవు. ఇలాంటి పానీయాలు ఇన్సులిన్ స్థాయిలను కూడా పెంచుతాయని, PCOS ఉన్న చాలా మంది మహిళలు దీన్ని నియంత్రించడానికి ప్రయత్నించరని అన్నారామె.అనారోగ్యకరమైన అలవాట్లను తేలిగ్గా తీసుకోవడంకొందరు అనారోగ్యకరమైన అలవాట్లని తెలిసి కూడా చాలా తేలిగ్గా తీసుకుంటుంటారు. ఏదో అప్పడప్పుడూ అంటూ ఆ అలవాట్లకు దూరంగా ఉండరు. ఇక్కడ కేవలం తన రూపానికి సంబంధించి కాదు బరువు తగ్గడం, ఇది తన మొత్తం ఆరోగ్య శ్రేయస్సుకి సంబంధించింది అని భావించి ఆ చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని అంటోంది తాన్య. శరీరంలో అధిక కొలెస్ట్రాల్ని తగ్గించుకునే యత్రం చేయాలి. ఇది కేవలం రూపం కోసం కాదు భవిష్యత్తులో ఆరోగ్య ప్రమాదాన్ని తగ్గించుకోవడానికి పీసీఓఎస్ని మెరుగ్గా నిర్వహించుకోవడానికి అన్న దృక్పథంతో జాగుకరకతతో బరువు తగ్గే ప్రయత్నం చేస్తే..సత్ఫలితాలను అందుకోగలమని అంటోంది. అందుకోసం తీవ్రమైన ఆహార నియమాలు లేదా కఠినమైన వ్యాయామాలు కంటే నిలకడగా పాటించే అలవాట్లు, సమతుల్య భోజనం, శక్తినిచ్చే శిక్షణ, దీర్ఘకాలిక ఆరోగ్యంపై దృష్టి పెట్టడం వంటివి మంచి మార్పుని తీసుకొస్తాయని నమ్మకంగా చెబుతోంది కంటెంట్ క్రియేటర్ తాన్య. గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులను లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. View this post on Instagram A post shared by Tanya (@tanyabackstage) (చదవండి: స్లోవేకియాలో ప్రధాని మోదీకి బ్రెడ్, ఉప్పుతో స్వాగతం..! ఆహారంతో స్వాగతం పలికే దేశాలివే..) -
జస్పాల్ రాణా మృతి: గుండెపోటు విషయంలో బహుపరాక్!
భారత దిగ్గజ షూటర్, కోచ్ జస్పాల్ రాణా శుక్రవారం కన్నుమూసిన సంగతి తెలిసిందే. నిజానికి ఆయన ప్రయాణంలో ఉండగానే.. ఆసుపత్రికి చేరుకునే ముందు కూడా ఛాతీ నొప్పి కొనసాగింది. అక్కడ వైద్యులు ఆయన పరిస్థితిని స్థిరీకరించినప్పటికీ, గుండె పంపింగ్ సామార్థ్యం ఫెయిలై మృతి చెందారు. అంతేగాదు వైద్యులు ఆయన మరణం భారతదేశంలో మధ్య వయస్కులలో పెరుగుతున్న గుండె సంబంధిత మరణాలపై ఆందోళన రేకెత్తించింది. చాలామంది తేలిగ్గా కొట్టిపారేయడంతోనే ఆ టైంలో గోల్డెన్ అవర్ని పోగొట్టుకుని ప్రాణాలు కోల్పోతున్నారంటూ చర్చలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో గుండె సంబంధిత సమస్యలను గోల్డెన్ అవర్లోనే గుర్తించి ఎలా ప్రాణాలు రక్షించుకోవాలో సవివరంగా తెలుసుకుందామా.ప్రముఖ భారత షూటర్, కోచ్ జస్పాల్ రాణా విషాద మరణం, గుండెపోటు కేవలం వృద్ధులకు, అనారోగ్యవంతులకు మాత్రమే వస్తుందనే అపోహపై చర్చలను లేవనెత్తింది. వైద్యుల ప్రకారం, రాణాకు తెలియకుండానే మూడు రోజుల పాటు గుండెపోటుతో బాధపడ్డట్టు సమాచారం. ఆ తర్వాత ఆయన వైద్య సహాయం తీసుకున్నారు. అక్కడికి రాణాకు అత్యవసర చికిత్స విజయవంతంగా అందించినప్పటికీ, ఆ ఆలస్యం చివరికి ప్రాణాంతకంగా మారింది. గుండెపోటు విషయంలో ప్రతి నిమిషం విలువైనదేనని ఆయన ఉదంతం గట్టిగా గుర్తుచేస్తుంది. సన్నగా, దృఢంగా, కండరాలతో ఉంటే ఆరోగ్యంగా ఉన్నట్లు కాదని హెచ్చిరిస్తున్నారు వైద్యులు. అంతేగాదు చాలామటుకు పలు కేసుల్లో 30 ఏళ్ల మగవారిలోనే ఈ గుండెపోటు ప్రమాదం ఎక్కువగా ఉందని తెలుస్తోంది. ఇందుకు ఆహారం, జీవనశైలి వంటివే కారణాలని చెబుతున్నారు వైద్యులు.ఇక్కడ జస్పాల్ రాణా కూడా విదేశాలకు ప్రయాణిస్తున్నప్పుడూ తీవ్రమైన ఛాతీ అసౌకర్యాన్ని అనుభవించాడు. కానీ ఆ లక్షణాలు ఎసిడిటీ లేదా గ్యాస్ట్రిక్ డిస్ట్రెస్ (జీర్ణకోశ సమస్య)కు సంబంధించినవిగా భావించాడు. పైగా ప్రయాణం కొనసాగించాడు. ఆ క్షణమే తక్షణ వైద్య సహాయం తీసుకోవాల్సి ఉంది, కానీ ఆయన తీసుకోకపోవడంతో గుండె పనితీరు బలహీనమై వైఫల్యానికి దారితీసిందని చెబుతున్నారు వైద్యులు. నిజానికి రాణా మొదట్లో కోలుకుంటున్నట్లు కనిపించినా..ఆ తర్వాత ఆయన కార్డియాక్ రప్చర్ (గుండె పగిలిపోవడం) సంభవించిందని వైద్యులు తెలిపారు. ఇది తీవ్రమైన గుండెపోటు తర్వాత సంభవించే ఒక అరుదైన ప్రాణాంతక సమస్యగా పేర్కొన్నారు వైద్యులు.గోల్డెన్ అవర్ ఎందుకు ముఖ్యం?గుండెపోటు ప్రారంభమైన తర్వాత మొదటి 60 నిమిషాలను హృద్రోగ నిపుణులు "గోల్డెన్ అవర్" అని పిలుస్తారు. ఈ సమయంలో, సత్వర చికిత్స గుండె కండరాల నష్టాన్ని గణనీయంగా తగ్గించి, మనుగడ అవకాశాలను మెరుగుపరుస్తుంది. గుండెపోటు సమయంలో ప్రతి నిమిషం విలువైనది. రోగులు మొదట్లో కోలుకుంటున్నట్లు కనిపించినప్పటికీ, చికిత్సలో జాప్యం కోలుకోలేని గుండె నష్టం, ప్రాణాంతక సమస్యల ప్రమాదాన్ని గణనీయంగా పెంచుతుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.ముఖ్యంగా కొన్ని గంటలకు మించి ఆలస్యం అయితే గుండెకు కోలుకోలేని నష్టం వాటిల్లుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒకసారి రక్త సరఫరా నిలిచిపోతే, గుండె కండర కణాలు చనిపోవడం ప్రారంభిస్తాయి. చికిత్సను ఎంత ఆలస్యం చేస్తే, గుండె వైఫల్యం, ప్రమాదకరమైన అరిథ్మియాలు, కార్డియోజెనిక్ షాక్, గుండె పగిలిపోవడం వంటి సమస్యల ప్రమాదం అంత తీవ్రంగా ఉంటుంది. అందుకే కీలకమైన ముందస్తు చికిత్స అందించడం వల్ల రోగిని అనేక సంభావ్య సమస్యల నుంచి కాపాడవచ్చు అని చెబుతున్నారు. కానీ లక్షణాలు అందరికీ ఒకేలా ఉండవ్..గుండెపోటును తరచుగా గుర్తించలేకపోవడానికి ఒక కారణం ఏమిటంటే, దాని లక్షణాలు ఎల్లప్పుడూ తీవ్రమైన ఛాతీ నొప్పిగా కనిపించవు. సాధారణ హెచ్చరిక సంకేతాలు:ఛాతీలో ఒత్తిడి, బరువుగా అనిపించడం, బిగుతుగా ఉండటం లేదా నొప్పిచేయి, దవడ, మెడ, భుజం లేదా వీపుకు వ్యాపించే నొప్పిఆయాసంఅధికంగా చెమట పట్టడంవికారం లేదా వాంతులుతల తిరగడం లేదా అసాధారణమైన అలసటఎసిడిటీగా పొరబడే పై పొట్టలో అసౌకర్యందాదాపు మూడింట ఒక వంతు గుండెపోటులను మొదట్లో అజీర్ణం, కండరాల ఒత్తిడి లేదా అలసటగా కొట్టిపారేయవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు.యువకుల్లోనే అధికం ఎందుకంటే..గతంలో కంటే ఇప్పుడు యువకులలో గుండె జబ్బులు ఎక్కువగా వస్తున్నాయని కార్డియాలజిస్టులు చెబుతున్నారు. నిశ్చల జీవనశైలి, ఎక్కువసేపు కూర్చోవడం, పొగాకు వాడకం, సరిగా నిద్రపోకపోవడం, ఒత్తిడి, మధుమేహం, ఊబకాయం, అధిక స్క్రీన్ సమయం, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు తదితరాలే కారణమని చెబుతున్నారు. అలాగే కుటుంబ చరిత్రలో చిన్నవయసులోనే ఈ సమస్య బారిన పడినట్లయితే అప్రమత్తంగా ఉండాలన్నారు. అలాగే శారీరకంగా దృఢంగా ఉండటం, లేదా సాధారణ శరీర బరువుని కలిగి ఉండటం అనేది హృదయ సంబంధ వ్యాధుల దరిచేరవని కాదు అని హెచ్చరిస్తున్నారు వైద్యులు.తీసుకోవాల్సిన జాగ్రత్తులు..క్రమం తప్పకుండా రక్తపోటు, కొలెస్ట్రాల్, మధుమేహం పరీక్షలు చేయించుకోవడంధూమపానం, పొగాకు అలవాట్లకు దూరంగా ఉండటం. వారానికి కనీసం 150 నిమిషాలు వ్యాయామం చేయడంపండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు వంటి గుండెకు మేలు చేసే ఆహారం తీసుకోవడంఆరోగ్యకరమైన నిద్ర అలవాట్లను పాటించడంఒత్తిడిని సమర్థవంతంగా నిర్వహించడం(చదవండి: ఏరోస్పేస్ ఉద్యోగాన్ని వదిలి కేఫ్..! ఏడాదికి రూ. 1.44 కోట్లు..) -
'30-60-90-108' సూర్య నమస్కారాల సాధన..! నటి కరీనా సైతం..
బరువు తగ్గడం కోసం జిమ్, ఇతర అధిక తీవ్రతర వర్కౌట్ల కంటే యోగా బెస్ట్ అని చాలామంది ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. అందులో ఉండే కొన్ని రకాల ఆసనాలు కండరాలు, కీళ్లను బలోపేతం చేసి..అదనపు కొవ్వు తగ్గించుకోవడానికి ఎంతగానో ఉపకరిస్తాయి. వాటిలో అత్యంత ప్రసిద్ధిగాంచింది సూర్యనమస్కారాలు. వెయిట్ ట్రైనింగ్ కోసం ప్రతి వారాంతంలో చేయగల ఒక వ్యాయామం 30-60-90-108 సూర్య నమస్కారాలు. బరువు తగ్గాలనుకునేవారందరికీ ఇది బెస్ట్ అని చెబుతోంది ప్రముఖ యోగనిపుణురాలు రూపాళ్ సిధ్. బాలీవుడ్ నటి కరీనా కపూర్ ఖాన్తో కూడా ఇది చేయించానని అన్నారు. ఈ ముద్దుగుమ్మ కరీనా ఒకేసారి 50 సూర్య నమస్కారాలు, ఆ తర్వాత 108 రౌండ్లు చేసేదన్నారు. మరి అంతలా సూర్యనమస్కారాలు ఎలా చేయాలి..?, బరువు తగ్గాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? తదితరాల గురించి ఆమె మాటల్లోనే సవివరంగా తెలుసుకుందామా.!.యోగా నిపుణురాలు సిధ్ బరువు తగ్గాలనుకుంటే..సూర్యనమస్కారాలు ఎలా చేయాలి, ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలి, వంటి వాటి గురించి ఇన్స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసుకున్నారు. ముందుగా చేయాల్సినవి కొన్ని..ప్రతిరోజూ 10 వేల అడుగులు వేయండివేగంగా కొవ్వు తగ్గించుకోవడానికి, జీవక్రియను పెంచేందుకు ప్రతిరోజూ 6 పూటలా చిన్న చిన్న భోజనాలు చేయండివెయిట్ ట్రైనింగ్తో కండరాలను పెంచుకోండి. బరువులు ఎత్తడం ప్రారంభించండి, కానీ క్రమంగా పెంచండిప్రతిరోజూ కనీసం 3 లీటర్ల నీరు త్రాగండిఉదయం పూట ముందుగా కొవ్వును కరిగించండిప్రతిరోజూ కనీసం 45 నిమిషాల యోగా/వర్కౌట్ చేయండిప్రతి భోజనం తర్వాత నడవండిచిన్న చిన్న భాగాలుగా ఆహారం తీసుకోండికనీసం 8 గంటలు నిద్రపోండి108 రౌండ్లు సూర్య నమస్కారాలు ఎలా చేయాలంటే..సూర్య నమస్కారం అనేది బలం, చలనశీలత, వశ్యత, సమతుల్యత, హృదయ సంబంధ ఓర్పుని మిళితం చేసే ఒక పూర్తి శరీరా కదలికల క్రమం. 108 రౌండ్లు పూర్తి చేయడం అనేది రోజువారీ ఫిట్నెస్ అవసరం కంటే ఎక్కువ. పైగా శారీరకంగా మానసికంగా సవాలుగా ఉంటుంది. ఇన్ని సార్లు చేయాలంటే..నెమ్మదిగా సెషన్లు పెంచడమే తెలివైన విధానం అని అంటున్నారామె. పరుగు లేదా బలవర్ధక శిక్షణ మాదిరిగానే, పునరావృతమయ్యే కదలికలకు శరీరం అలవాటు పడటానికి సమయం పడుతుంది. కొన్ని రోజుల పాటు సూర్య నమస్కారాలను 30 నుంచి 60కి, ఆపై 90కి, చివరకు 108కి పెంచాలి. దీని వల్ల కండరాల ఓర్పు, కీళ్లు తట్టుకునే శక్తి, హృదయ సంబంధ సామర్థ్యాలను మెరుగుపరచడంలో సహాయపడటం తోపాటు తరుచుగా అయ్యే గాయాల ప్రమాదాలను కూడా తగ్గిస్తుందని చెబుతున్నారు యోగా నిపుణులు. అయితే ఇక్కడ రౌండ్లు పెంచడం అనేది వ్యక్తిగత ఫిట్నెస్ స్థాయిలు, వయస్సు, కోలుకునే సామర్థ్యం, టెక్నిక్ నాణ్యతపై ఆధారపడి ఉంటుందని అన్నారు.అయితే సరైన పద్ధతిలో 20–30 సూర్య నమస్కారాలు సునాయాసంగా చేసేవారికి, ప్రతి వారం మరిన్ని అదనపు రౌండ్లు జోడించొచ్చు కానీ..ప్రారంభకులు మాత్రం ఒకేసారి ఎక్కువ రౌండ్లు చేస్తే మాత్రం మణికట్టు నొప్పి, భుజం బెణకడం, నడుము నొప్పి లేదా అధిక అలసటకు దారితీయవచ్చు. ఒక సూర్యనమస్కారం భుజాలు, ఛాతీ, వీపు, కోర్, గ్లూట్స్, కాళ్లతో సహా అనేక కండర సముహాలను కదిలిస్తుంది. అలాంటిది వీటిని వందసార్లకు పైగా పునరావృతం చేస్తే..కీళ్లు, కండరాలపై గణనీయమైన భారం పడుతుందనేది గుర్తెరగాలి. కాబట్టి వీటన్నింటిన పరిగణలోని తీసుకుని యోగా నిపుణులు సమక్షంలో చేయడం ఉత్తమం. వైద్యపరంగా కూడా సంఖ్యకు ప్రాధాన్యత ఇవ్వకుండా నిలకడగా..చేయడానికి ప్రాధాన్యత ఇవ్వాలి. చాలామటుకు క్రమం తప్పకుండా చేస్తే 12–24 నాణ్యమైన రౌండ్లు మంచి ప్రయోజనాలు ఇస్తాయని నమ్మకంగా చెప్పారు.ఎవరైనా 108 చేయాలనుకుంటే..1–2 వారాలు: 24–30 రౌండ్లు3–4 వారాలు: 40–50 రౌండ్లు5–6 వారాలు: 60–75 రౌండ్లు7–8 వారాలు: 90+ రౌండ్లుఆ తర్వాత, రికవరీ టెక్నిక్ బలంగా ఉన్నప్పుడు 108 ప్రయత్నిస్తే మంచిదని అన్నారు. ఇక్కడ ఫిట్నెస్ సవాళ్లను పరీక్షలా కాకుండా, శిక్షణలా స్వీకరించాలని అన్నారు. View this post on Instagram A post shared by Rupal Sidhpura Faria | Yoga & Travel (@rupal_sidh)గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. అనుసరించే మందుకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: థాయిలాండ్లో ఒకరోజు..! పనిమనిషి సోలో ట్రిప్ ..) -
30 ఏళ్లు దాటాయా? జాగ్రత్త.. ఈ అలవాటు లేకపోతే ఇబ్బందులే!
చాలామంది వృద్ధాప్యం వచ్చాకే శరీరం బలహీనపడుతుందని భావిస్తారు. కానీ కండరాల బలం తగ్గే ప్రక్రియ 30 ఏళ్ల తర్వాతే నెమ్మదిగా ప్రారంభమవుతుంది. 60 ఏళ్లు దాటాక ఇది మరింత వేగంగా సాగుతుంది. ఫలితంగా శక్తి తగ్గడం, నడకలో సమతుల్యత కోల్పోవడం, తరచూ పడిపోవడం, ఎముకలు బలహీనపడటం వంటి సమస్యలు పెరుగుతాయి. అంటే సమస్య వయసు కాదు.. వయసుతో పాటు తగ్గిపోతున్న కండరాల బలమే అని నిపుణులు చెబుతున్నారు.వయసు పెరుగుతోందంటే వెంట్రుకలు తెల్లబడటం, ముడతలు పడటమే కాదు. మీకు తెలియకుండానే శరీరంలోని కండరాలు కూడా క్రమంగా బలహీనపడుతున్నాయి. 30 ఏళ్లు దాటిన తర్వాత మొదలయ్యే ఈ ప్రక్రియను పట్టించుకోకపోతే.. 60, 70 ఏళ్ల వయసులో మెట్లు ఎక్కడం, కుర్చీ నుంచి లేవడం, రోజువారీ పనులు చేసుకోవడం కూడా కష్టంగా మారే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే ఇప్పటి నుంచే అప్రమత్తం కావాలని సూచిస్తున్నారు.నడక ఒక్కటే సరిపోదంట: ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ నడిస్తే చాలని చాలా మంది అనుకుంటారు. అయితే నడక గుండె ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ.. కండరాల బలాన్ని కాపాడుకోవడానికి మాత్రం స్ట్రెంగ్త్ ట్రైనింగ్ కూడా అవసరమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఇందుకోసం జిమ్కు వెళ్లి భారీ బరువులు ఎత్తాల్సిన అవసరం లేదు. కుర్చీ నుంచి లేచి కూర్చోవడం, స్క్వాట్స్, గోడకు ఆనుకుని పుష్అప్స్ చేయడం, మెట్లు ఎక్కడం, రెసిస్టెన్స్ బ్యాండ్లతో చేసే వ్యాయామాలు కూడా కండరాలను బలోపేతం చేస్తాయి.మొదట్లోనే అతి వద్దు: అయితే ఒక్కసారిగా ఎక్కువ వ్యాయామం చేయడం ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వారానికి రెండు లేదా మూడు రోజులు, రోజుకు 20 నుంచి 30 నిమిషాల పాటు తేలికపాటి వ్యాయామాలతో ప్రారంభించాలని సూచిస్తున్నారు. శరీరం అలవాటు పడిన తర్వాత క్రమంగా తీవ్రత పెంచాలని చెబుతున్నారు.కండరాలు బలపడితే: స్ట్రెంగ్త్ ట్రైనింగ్ వల్ల కేవలం కండరాలే కాదు.. ఎముకలు కూడా బలపడతాయి. రక్తంలో చక్కెర నియంత్రణ మెరుగవుతుంది. గుండె ఆరోగ్యం బాగుంటుంది. శరీర సమతుల్యత పెరుగుతుంది. ముఖ్యంగా వృద్ధాప్యంలో ఇతరులపై ఆధారపడకుండా స్వతంత్రంగా జీవించే సామర్థ్యం పెరుగుతుందని పరిశోధనలు చెబుతున్నాయి.50.. 60.. 70 వచ్చినా.. డోంట్ వర్రీ: "ఇప్పుడేం ఉపయోగం?" అని అనుకునేవారికి నిపుణులు ఒక ముఖ్యమైన సందేశం ఇస్తున్నారు. కండరాల బలాన్ని పెంచుకోవడానికి వయసు అడ్డంకి కాదని చెబుతున్నారు. 50, 60, 70 ఏళ్ల వయసులో కూడా క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే మంచి ఫలితాలు సాధ్యమవుతాయని పేర్కొంటున్నారు.వ్యాయామంతో పాటు: కండరాల నిర్మాణానికి ప్రోటీన్ చాలా అవసరం. పాలు, పెరుగు, గుడ్లు, పప్పులు, చేపలు, మాంసాహారం వంటి ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే వ్యాయామం తర్వాత సరైన విశ్రాంతి కూడా అవసరమే. ఎందుకంటే కండరాలు వ్యాయామం చేసే సమయంలో కాకుండా.. విశ్రాంతి సమయంలోనే మరింత బలపడతాయి.వయసు పెరగడం ఎవరి చేతుల్లోనూ లేదు. కానీ వయసు పెరిగాక ఎంత చురుకుగా, ఎంత స్వతంత్రంగా జీవించాలన్నది మాత్రం మన చేతుల్లోనే ఉంది. అందుకే 30 దాటిందంటే నిర్లక్ష్యం చేయొద్దు. మీ శరీరంలోని కండరాలు నిశ్శబ్దంగా బలహీనపడకముందే అప్రమత్తం కావాలని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పుడే స్ట్రెంగ్త్ ట్రైనింగ్ మొదలుపెట్టకపోతే.. వృద్ధాప్యంలో మూల్యం చెల్లించాల్సి రావచ్చని స్పష్టం చేస్తున్నారు. -
Health: కాళ్లు వాచిపోతే.. ఎలర్ట్ టైమ్!
ప్రతి ఒక్కరి జీవితంలో పాదాల వాపు ఏదో ఒక సమయంలో కనిపించడం చాలా సాధారణం. రకరకాల కారణాల వల్ల పాదాల్లో వాపు కనిపిస్తుంటుంది. చాలాసేపు ఏదైనా వాహనంలోగానీ లేదా బస్సులోగానీ కూర్చుని ప్రయాణం చేశాక... పాదాల్లో వాపు రావడం చాలామందిలో కనిపించేదే. ఇది నిరపాయకరమైన వాపు. దీన్ని బినైన్ ఎడిమా అంటారు. అయితే సందర్భాల్లో మాత్రం పాదాల వాపు కాస్తంత సీరియస్ ఆరోగ్య సమస్యలనూ సూచించవచ్చు. అందుకే సాధారణంగా ప్రయాణం చేసిన వెంటనే కాకుండా మామూలుగా ఇతర సందర్భాల్లో పాదాల వాపు కనిపిస్తే ఒకసారి డాక్టర్ను సంప్రదించడం అవసరం. ఏయే సందర్భాల్లో పాదాల వాపు అన్నది ప్రమాదకరమైన సూచన కావచ్చనే అంశంపై అవగాహన కోసం ఈ కథనం...కాళ్లలో/పాదాల్లో వాపు కనిపించే లక్షణాన్ని వైద్య పరిభాషలో ‘ఎడిమా’ అంటారు. దీనికి చాలా కారణాలు ఉంటాయి. వీటిలో ముందుగా అనుమానించాల్సినవి సెల్యులైటిస్, డీప్వీన్ థ్రాంబోసిస్ అనే కండిషన్లు. ఇవి మాత్రమే కాకుండా... హార్ట్ ఫెయిల్యూర్, కిడ్నీ ఫెయిల్యూర్, లివర్ ఫెయిల్యూర్... ఈ మూడు కీలక అవయవాల పనితీరు తగ్గడం వల్ల కూడా కాళ్లలో వాపు కనిపించవచ్చు. అలాగే కొన్ని సందర్భాల్లో హైపోథైరాయిడిజమ్ వల్ల కూడా పాదాల వాపు కనిపించవచ్చు. కొన్ని మందుల వాడకం వల్లగానీ లేదా అసలే కారణమూ తెలియకుండా కూడా పాదాల్లో వాపు రావచ్చు.పాదాల వాపునకు రకరకాల కారణాలివి...పాదాల వాపునకు కారణాలలో రెండు రకాలుంటాయి. అందులో 1. సాధారణ (కామన్) కారణాలు... 2. తీవ్రమైన కారణాలు.1. సాధారణ కారణాలు (కామన్ కాజెస్) ∙ రక్తహీనత ∙హైపోథైరాయిడిజమ్ ∙ మూత్రం ద్వారా ్రపోటీన్ పోవడం (్రపోటీన్ లాస్ ఇన్ యూరిన్) ∙ కొన్ని రకాల మందుల వాడకం వల్ల (మెడికేషన్స్)2. తీవ్రమైన కారణాలు (సీరియస్ కాజెస్) ∙ కాలేయ వ్యాధులు (లివర్ డిసీజెస్) ∙ మూత్రపిండాల వైఫల్యం (రీనల్ ఫెయిల్యూర్) ∙ గుండె వైఫల్యం (హార్ట్ ఫెయిల్యూర్)కొన్ని కారణాల గురించి మరింత విపులంగా...లివర్ ఫెయిల్యూర్ వల్ల... కాలేయ వైఫల్యం (లివర్ ఫెయిల్యూర్) అయిన వాళ్లలో కాళ్లు లేదా పాదాల్లో వాపు కనిపించే అవకాశాలెక్కువ. ఇలాంటి సందర్భాల్లో ‘లివర్ ఫంక్షన్ టెస్ట్ (ఎల్ఎఫ్టీ) అనే పరీక్ష చేయించి, ఆ వాపు లివర్ ఫెయిల్యూర్ వల్లనా లేదా మరో కారణం వల్లనా అనే విషయం తెలుసుకుంటారు. సమస్య నిర్ధారణ తర్వాత దానికి అనుగుణంగా డాక్టర్లు చికిత్స అందిస్తారు.కిడ్నీ ఫెయిల్యూర్ వల్ల...కిడ్నీ ఫెయిల్యూర్ కండిషన్లో ముఖం మాత్రమే కాకుండా చాలా సందర్భాల్లో కాళ్లలో వాపు కూడా కనిపించవచ్చు. కిడ్నీ ఫెయిల్యూర్ నిర్ధారణకు రీనల్ ఫంక్షన్ టెస్ట్ అనే పరీక్ష చేయించి, దానికి అనుగుణంగా చికిత్స అందించాల్సి ఉంటుంది.పాదాలకూ, గుండెకూ సంబంధమిలా... పాదాల వాపు గుండెజబ్బుకు ఒక ప్రధాన సూచన. గుండె జబ్బు కారణంగా పాదాల వాపు వస్తే అది రెండు కాళ్లలోనూ కనిపిస్తుంది. తొలినాళ్లలో కాలి ముందు భాగంలోనూ, మడమ భాగంలోనూ ఉంటుంది. ఆ తర్వాత పాదం పైన కూడా కనిపించవచ్చు. ఈ వాపు కారణంగా ఎలాంటి నొప్పీ ఉండదు. కాబట్టి ఈ సమస్యతో డాక్టర్ వద్దకు రావడం చాలా అరుదుగా జరుగుతుంది. అయితే ఈ లక్షణంతో పాటు ఆయాసం రావడం, నడవలేకపోవడం వంటి లక్షణాలు కనిపించినప్పుడు మాత్రం బాధితులు డాక్టర్ దగ్గరికి వస్తుంటారు. ఆయాసం, గుండెదడ, ఛాతీ నొప్పి లాంటి లక్షణాలు రాకముందే ఆ పాదాల వాపు అన్నది గుండె జబ్బుకు సూచన కావచ్చన్నది అనుమానించడం వల్ల... సమస్య నిర్ధారన కాస్త త్వరగా జరిగే అవకాశముంది. అలాగో చూద్దాం.గుండెజబ్బులో పాదాల వాపు ఎందుకొస్తుందంటే...పాదాలవాపు అనేది గుండె పంపింగ్ సామర్థ్యం (పంపింగ్ కెపాసిటీ) తగ్గినప్పుడు కనిపించే ఓ ముఖ్యమైన లక్షణం. గుండెలో తాను సంకోచించే శక్తి తగ్గినా లేక వ్యాకోచించే సామర్థ్యం లోపించినప్పుడు కాళ్ల వాపు కనిపించవచ్చు. ఒక్కోసారి రక్తపోటు పెరిగి ఉండటానికి కూడా కాళ్లవాపు అన్నది ఒక లక్షణంగా గుర్తించాలి. గుండెజబ్బు కారణంగా కాళ్ల వాపు వచ్చిందా అన్న విషయం తెలుసుకోడానికి బీఎన్పీ అనే రక్తపరీక్ష చేయించాల్సి ఉంటుంది. బీఎన్పీ విలువ 100 కంటే ఎక్కువ ఉంటే అప్పుడు అది గుండెజబ్బు కారణంగానేమో అని అనుమానించాల్సి ఉంటుంది. అప్పుడు కార్డియాలజిస్టును సంప్రదించి ఆయన సలహా మేరకు ఈసీజీ, ఎకోకార్డియోగ్రఫీ వంటి పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. దాంతో కాలివాపు గుండెజబ్బు కారణంగానా, కాదా అన్నది నిర్ధారణ చేయవచ్చు.ఒకవేళ కాలివాపు అన్నది గుండెజబ్బు కారణంగానే అయితే... కాలి వాపు అన్నది గుండె జబ్బు కారణంగానే వస్తే... ఆ సమస్యకు డైయూరెటిక్స్ అనే మందులు ఇవ్వాల్సి ఉంటుంది. ఆ డైయూరెటిక్స్ మందులు... దేహంలోంచి నీటిని మూత్రం రూపంలో బయటికి పోయేలా చేస్తాయి. అయితే గుండెజబ్బు ఉన్నప్పుడు మాత్రమే ఈ డైయూరెటిక్స్ వాడటం వల్ల ప్రయోజనం ఉంటుంది. గుండెజబ్బు లేకుండా ఆ మందులు వాడితే అవి ప్రమాదకరంగా పరిణమించవచ్చు. అంతేకాదు... గుండెజబ్బు కాకుండా ఇతరత్రా ఏదైనా ఇతర కారణం వల్ల పాదాల / కాళ్ల వాపు వచ్చి ఉంటే... ఆ అసలు కారణాన్ని కనుగొనే అవకాశాన్ని కోల్పోయే ముప్పు కూడా ఉంటుంది. అందుకే ఈ విషయంలో డాక్టర్లు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తారు.ఊపిరితిత్తుల్లో రక్తపోటు కారణంగా కనిపించే పాదాల వాపు కాళ్లకు నీరు పట్టి కాళ్లలో వాపు కనిపించడానికి మరో ప్రధాన కారణం ఊపిరితిత్తుల్లో రక్తపోటు పెరగడం. ఇటీవల చాలామందిలో పెరుగుతున్న ఊబకాయం వల్ల నిద్రపోతున్నప్పుడు ఊపిరి ఒక్క క్షణం ఆగిపోయి ఉలిక్కిపడి లేవడం జరుగుతుంది. దాంతో ఆ సమయంలో ఊపిరితిత్తుల్లో రక్తపోటు కూడా పెరగవచ్చు.ఊపిరితిత్తుల్లో రక్తపోటు పెరిగినప్పుడు కనిపించే లక్షణాలు : ∙ పెద్దగా గురకపెట్టడం∙ నిద్రలో ఉలిక్కిపడి లేవడం∙ దగ్గుతో పొలమారి నిద్రనుంచి మెలకువ రావడం∙ నిద్రపోతున్నప్పుడు ఊపిరి తీసుకోవడం కష్టంగా మారడం. ఈ వ్యాధి గురించి అంతగా అవగాహన లేకపోవడంతో నిర్ధారణ సరిగా జరగడం లేదు.చేయించాల్సిన వైద్య పరీక్షలు : ఊపిరితిత్తుల్లో రక్తపోటు పెరగడాన్ని నిర్ధారణ చేయడం కోసం ఎకో పరీక్ష చేయించాలి. కాళ్ల వాపులు వచ్చే వ్యక్తులకు 45 ఏళ్లు దాటితే... వారికి తప్పనిసరిగా ఎకో పరీక్ష చేయించాలి.చికిత్స : ఊపిరితిత్తుల్లో రక్తపోటు కారణంగా వచ్చే స్లీప్ ఆప్నియాకు తప్పనిసరిగా చికిత్స చేయించాలి. దాంతో స్లీప్ ఆప్నియా సమస్య తగ్గడంతో పాటు అలా ఆ సమస్య తగ్గినంతున కాళ్ల వాపు కూడా తగ్గుతుంది.కొన్ని రకాల ఇతర వ్యాధులూ... కాళ్ల వాపులు ఈ కాళ్లలో వాపు అన్నది కొన్ని రకాల ఇతర జబ్బుల వల్ల కూడా కనిపించవచ్చు. ఇందులో ప్రధానమైనవి... మూత్రపిండాల జబ్బులు, కాలేయ వ్యాధులు కాగా... వాటితో పాటు కటి (నడుము కింది) భాగంలో వచ్చే కొన్ని రకాల క్యాన్సర్లలో కూడా కాళ్ల వాపు కనిపించవచ్చు. కొందరు గర్భవతుల్లో కాలి సిరలు పటుత్వం కోల్పోవడం వల్ల కూడా కాళ్ల వాపు రావచ్చు. కొన్ని సార్లు థైరాయిడ్ హార్మోన్ లోపించనప్పుడూ ఈ సమస్య కనిపించడం కాస్త సాధారణమే. శరీరంలో ్రపోటీన్లు మూత్రం ద్వారా పోతున్నప్పుడు కూడా కాళ్ల వాపు కనిపించవచ్చు. అందుకే కాళ్ల వాపు లక్షణం కనిపించినప్పుడు ప్రధాన కారణాలను కనుగొని వాటికి సరైన చికిత్స తీసుకోవాలి.కొన్ని రకాల మందుల వాడటం వల్ల... కొన్నిసార్లు మనం వాడే మందుల వల్ల కూడా కాళ్ల వాపు రావచ్చు. సాధారణంగా రక్తపోటు, మధుమేహం వంటి జబ్బులకు వాడే మందుల వల్ల ఇలా జరిగే అవకాశముంది. అలాగే నొప్పుల నివారణ కోసం వాడే ఇబు్రపోఫెన్, డయాబెటిస్ను నియంత్రణలో ఉంచేందుకు వాడే పయోగ్లిటజోన్, స్టెరాయిడ్స్తో కాళ్ల వాపులు వచ్చినప్పుడు... పేషెంట్స్ ఏవైనా మందులు వాడుతుండటం వల్ల ఈ వాపు వచ్చిందా అనే విషయాన్ని డాక్టర్లు నిర్ధారణ చేసుకోవాలి. ఒకవేళ మందుల వల్లనే కాళ్ల వాపు వచ్చి ఉంటే తక్షణం వాటిని ఆపివేయడం, వాటిని ప్రత్యామ్నాయంగా వేరే మందులు ఇవ్వడం వల్ల సమస్యకు పరిష్కారం దొరికే అవకాశాలెక్కువ.కారణం తెలియని కాళ్ల వాపులు... మహిళల్లో ముఖ్యంగా 30– 40 ఏళ్లు దాటిన వారిలో కాళ్ల వాపు సమస్య చాలా ఎక్కువ. కాలి వాపుతో పాటు ముఖం, చేతులు కూడా ఉబ్బి ఉండటం సాధారణంగా కనిపిస్తుంటాయి. దీనికి ఇదమిత్థంగా ఎలాంటి కారణం ఉండదు. అందువల్ల వైద్య చికిత్స చేయడం కూడా ముందుగా జరగదు. ఇలాంటి వారికి అన్ని సాధారణ పరీక్షలు చేసి... ఎలాంటి కారణం లేదని నిర్ధారణ చేశాక మాత్రమే కాలివాపునకు చికిత్స చేయడానికి డైయూరెటిక్స్ వాడుతుంటారు. ఇలాంటి వారు కాలి వాపు తగ్గడానికి ఆహారంలో ఉప్పు తక్కువగా తీసుకోవాలి.సిరల (వెయిన్స్) సామర్థ్యలోపం వల్ల... రక్తాన్ని కాలు మొదలుకొని ఇతరత్రా దేహభాగాల నుంచి గుండెకు తీసుకెళ్లే రక్తనాళాలను సిరలు అని అంటారు. సాధారణంగా డీ–ఆక్సినేటెడ్ (ఆక్సిజన్ లేకుండా కార్బన్ డై ఆక్సైడ్తో కూడిన) రక్తాన్ని ఈ సిరలు వెనక్కు గుండెవైపునకు తీసుకెళ్తూ ఉంటాయి. మనలోని జీవక్రియల వల్ల కొన్ని కాలుష్యాలు వెలువడతాయి. ఆ కాలుష్యాలు కలిసిన రక్తమే చెడు రక్తం. ఉదాహరణకు నడక అనే ప్రక్రియలో... రక్తం కాలి సిరల నుంచి ఊపిరితిత్తులకు చేరి అక్కడ శుభ్రపడి మళ్లీ గుండె నుంచి ధమనుల ద్వారా మళీ కాళ్లకు సరఫరా అవుతుంది.కొన్ని సార్లు కాళ్లలోని సిరల సామర్థ్య లోపం వల్ల రక్తంలోని నీరు అక్కడే ఉండిపోతుంది. అది పాదాల వాపు రూపంలో బయటపడుతుంది. వయసు పెరుగుతున్న కొద్దీ ఈ సమస్య ఎక్కువ మందిలో కనిపిస్తుంది. ఎక్కువసేపు నిల్చుని పనిచేసేవారిలో లేదా ఊబకాయం ఉన్నవారిలో ఈ సమస్య మరికాస్త ఎక్కువగా కనిపించవచ్చు. కాలివాపు కనిపించినప్పుడు అనుమానించాల్సిన కారణాలలో ఈ సిరల సామర్థ్య లోపం చాలా ప్రధానమైనదీ చాలా సాధారణమైనది కూడా. వయసు పెరుగుతున్న కొద్దీ ఆ జబ్బు వచ్చే ముప్పు మరింతగా పెరుగుతుంటుంది. తొలి దశలో ఎక్కువ సేపు ప్రయాణం చేసినప్పుడు ఈ సమస్య కనిపిస్తుంది.ప్రధానంగా ప్రయాణాల సమయంలో సాయంత్రానికి కాళ్ల వాపు కనిపిస్తుంది. దీని వల్ల ఇబ్బంది లేకపోవడంతో చాలామంది దీన్ని నిర్లక్ష్యం చేసే అవకాశాలెక్కువ. ఈ సమస్య ఉన్నవారిలో పిక్కల్లో కూడా నొప్పి అనిపించడం, కాళ్లు బరువుగా ఉన్నట్లు అనిపించడమూ జరుగుతుంది. క్రమంగా కాళ్లపైనా, మడమ లోపలి వైపున నల్లటి మచ్చలు ఏర్పడతాయి. కాలి సిరలు ఉబ్బి మెలికలు తిరిగి ఉన్నట్లుగా చర్మంలోంచి బయటికి కనిపిస్తాయి. అవి పచ్చగా లేక నల్లగా కనిపిస్తుంటాయి. ఈ కండిషన్ను వేరికోస్ వెయిన్స్ అంటారు. తొలి దశలో కేవలం సాయంత్రాలు మాత్రమే కనిపించే ఈ సమస్య ఆ తర్వాత రోజంతా ఉంటుంది.కొందరిలో సెల్యులైటిస్ అనే కండిషన్లోనూ కాళ్ల వాపు కనిపిస్తుంది. అంతేకాదు.. ఇలా వాపు వచ్చిన కారణంగా కాలు కాస్త మెరుపుతో కనిపిస్తుంది. దీనితో పాటు కాలి సిరల్లో రక్తం గడ్డకట్టడం వల్ల కనిపించే ‘డీప్ వీన్ థ్రాంబోసిస్ – (డీవీటీ)’ అనే కండిషన్లో కూడా కాలివాపు కనిపిస్తుంది. ఈ కండిషన్స్ అన్నింటి నిర్ధారణ కోసం కాలి సిరలకు వీనస్ డాప్లర్ టెస్ట్ అనే పరీక్ష చేయించాలి.సిరల సామర్థ్య లోపంవల్ల సమస్య వస్తే... ∙ ఎక్కువసేపు నిలబడకుండా చూసుకోవడం ∙ఎలాస్టిక్ స్టాకింగ్స్ వేసుకుని ఉండటం ఈ జాగ్రత్తలు తీసుకుంటే కాలివాపు రాకుండా ఉంటుంది. స్టాకింగ్ వల్ల కాలిపై పడే ఒత్తిడి కారణంగా సిరలకు అది మంచి సపోర్ట్ అందడంతో పాటు ఈ కారణంగా సిరల్లో మళ్లీ రక్తం సులువుగా / సాఫీగా ప్రవహిస్తుంటుంది. ఒకవేళ సమస్యను ఈ దశలో నిర్లక్ష్యం చేయడం వల్ల అది ముదిరి వేరికోస్ వెయిన్స్ అనే వ్యాధిగా పరిణమిస్తుంది. వ్యాధి బాగా ముదిరితే కాళ్లకు పుండ్లు పడే అవకాశమూ ఉంటుంది.జాగ్రత్తలు / ఫస్ట్లైన్ చికిత్స... కాళ్లవాపులు కనిపించినప్పుడు బాధితులు...చాలాసేపు నిలబడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.వాపు ఉన్న కాళ్లపై ఎలాస్టిక్ స్టాకింగ్స్ తొడగాలి. ఈ జాగ్రత్తలతో కాలివాపును నివారించవచ్చు.స్టాకింగ్ సిరలకు అది మంచి సపోర్ట్ ఇవ్వడం వల్ల క్రమేణా రక్తం సజావుగా ప్రవహిస్తుంటుంది.ఈ దశలో నిర్లక్ష్యం చేసి, సమస్య ముదిరి ‘వేరికోస్ వెయిన్స్’గా పరిణమిస్తే, కాళ్లకు పుండ్లు పడటం వంటి కాంప్లికేషన్లు కనిపించవచ్చు.అలాంటప్పుడు ఆయా లక్షణాలూ, కండిషన్లకు అనుగుణంగా రేడియాలజీ చికిత్స, శస్త్రచికిత్సలు చేయించాల్సిన అవసరం పడవచ్చు.చివరగా... కాళ్లు లేదా పాదాలలో వాపు రావడానికి ఉన్న కారణాలు తెలుసుకున్న తర్వాత... ఎప్పుడో, ఏదో సందర్భంలో అరుదుగా కాళ్లూ లేదా పాదాలలో వస్తున్న వాపులను మినహాయిస్తే... ఈ పాదాల వాపు తరచూ కనిపించడం మరీ ముఖ్యంగా ఏవైనా మందులు వాడుతున్నప్పుడో... ఏదైనా జబ్బు (అండర్ లైయింగ డిసీజ్) కారణంగా కాళ్ల వాపులు వస్తున్నాయేమో అని అనుమానం వస్తే... తక్షణం డాక్టరు / మెడికల్ స్పెషలిస్ట్కు చూపించుకుని, తగిన పరీక్షలు చేయించుకుని... అవి మామూలుగా వస్తే కాళ్లవాపులే అని నిర్ధారణ అయితే నిశ్చింతగా ఉండవచ్చు. లేదా మరేదైనా కారణం వల్ల వచ్చే కాళ్లవాపులని తేలితే... తగిన చికిత్స చేయించుకుని... ఆ సమస్య నుంచి విముక్తి పొందవచ్చు. - డాక్టర్ శివరాజు సీనియర్ ఫిజీషియన్నిర్వహణ : యాసీన్ -
జామ గింజలతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా..!
జామకాయలు అందరికీ సులభంగా దొరికే పండు. అలాగే ప్రతి ఇంటి పెరటిలో ఉండే మొక్క కూడా. అందుకే ఈ పండు అంటే మనకు చిన్న చూపు. జామకాయ అనగానే పైన వగరుగా ఉండే తొక్క, గింజలు పడేసి తింటుంటారు కొందరు. అంతేగాదు ఈ జామ గింజలు అరగవని, కడుపునొప్పి పట్టుకుంటుందని చెబుతుంటారు పెద్దలు. కానీ అదంతా అపోహేనని కొట్టిపారేస్తున్నారు ఐసిఎఆర్–నేషనల్ డెయిరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) ఆదర్శ గౌడ. అంతేగాదు అరుగుదల తక్కువగా ఉండి, సున్నితమైన జీర్ణ సంబంధిత వ్యాధులుంటే వైద్యులను సంప్రదించి ఈ పండు తినడం మంచిదన్నారు. కానీ చాలామటుకు జామపండు ఆరోగ్యానికి మంచిదేనని, ముఖ్యంగా గింజలు ఎక్కువ ఉండే జామకాయలు మరింత ఆరోగ్యానికి మంచిదని చెబుతున్నారు. అసలు ఈ జామగింజలతో కలిగే లాభాలేంటో ఆయన మాటల్లోనే సవివరంగా తెలుసుకుందామా..!జామగింజలు తినదగినవి, వాటిల్లోని పీచు పదార్థం, ఆరోగ్యకరమైన కొవ్వులతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు ఆదర్శగౌడ. పండుతో సహా వీటిని ఎప్పుడైతే తింటామో..మొతం పీచు పదార్థం శరీరానికి అందతుంది. ఫలితంగా జీవక్రియ క్రమబద్ధతకు, పేగు ఆరోగ్యానికి, కడుపు నిండిన భావన వంటి ఉపయోగాలు ఉంటాయని చెబుతున్నారు.కలిగే లాభాలు..జామ గింజల నూనెలో అసంతృప్త కొవ్వు ఆమ్లాలు, తక్కువ మొత్తంలో ఒమేగా-3, ఒమేగా -6 కొవ్వుల తోపాటు విటమిన్ ఈ, పాలీఫెనాల్స్ వంటి యాంటీఆక్సిడెంట్లు కూడా ఉన్నాయని పరిశోధకులు గుర్తించారు. గింజలను నలపడం లేదా నమలడం వల్ల వాటిలో దాగిఉన్న పోషకాలు నేరుగా విడుదల కావడానికి సహాయపడతాయట. తద్వారా జీర్ణక్రియ(అరుగుదల) సమయంలో అవి మరింత సులభంగా అందుబాటులోకి వస్తాయి. ఇవి ఆరోగ్యకరమైన కొవ్వుల తోపాటు పీచు పదార్థాన్ని అందిస్తాయి. ఇది మలానికి బలాన్ని చేకూర్చి జీర్ణవ్యవస్థ ద్వారా ఆహారం కదలడానికి సహాయపడుతుందనట. అలాగే ఈ పండులో విటమిన్ సీ, లైకోపీన్, పొటాషియం సమృద్ధిగా ఉంటాయట. అందువల్ల జామ అందుబాటులో ఉన్న అత్యంత పోషక-సాంద్రత కలిగిన ఉష్ణమండల పండ్లలో ఒకటిగా పేర్కొటారని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. గింజలు గట్టిగా ఉన్నప్పటికీ, ఆరోగ్యంగా ఉన్నవాళ్లంతా పండులో ఉన్న ఈ భాగాన్ని నిరంభ్యంతరంగా తినవచ్చుని చెబుతున్నారు నిపుణులు. వీటిలో పోషక విలువలు తక్కువగానే ఉండవచ్చు, కానీ వాటిని పారేయడం వల్ల విలువైన పీచుపదార్థం, సహజంగా లభించే ఫైటోన్యూట్రియెంట్లను కోల్పోయినట్లేనని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు.అందుకే గింజలను ఉమ్మివేయడానికి బదులుగా, పండిన జామకాయను తినేటప్పుడు వాటిని బాగా నమలండి లేదా అదనపు పీచుపదార్థం, ప్రయోజనకరమైన కొవ్వుల కోసం పండు మొత్తాన్ని స్మూతీస్లో కలుపుకోని తినమని సూచిస్తున్నారు నిపుణులు.(చదవండి: 90 కిలోల నుండి 72 కిలోలకు..! అందుకోసం ఆ హీరో ఏం చేశాడంటే..) -
నో స్ట్రిక్ట్ డైట్ : శాస్త్రవేత్తలకే షాకిస్తున్న ‘30’ ఏళ్ల బామ్మ ఫిట్నెస్ సీక్రెట్
ఆరోగ్యంగా, దృఢంగా ఉండాలంటే ఆరోగ్యవంతమైన జీవన శైలి, సమతుల ఆహారం, కనీసం వ్యాయామం అవసరమని ఆరోగ్యనిపుణులు నిరంతరం చెప్పేమాట. దాదాపు 93 ఏళ్ల వయసులోనూ సగం వయసున్న వారి కంటే ఎక్కువ ఫిట్నెస్తో జీవించాలంటే ఏం చేయాలి? శాస్త్రవేత్తలనే అబ్బుర పరిచిన ఇటలీకి చెందిన ఎమ్మీ మరియా మజ్జెంకా (Emma Maria Mazzenga) ఫిట్నెస్ రహస్యాల గురించి తెలుసుకుందాం.ఇటలీలోని పాడువా నగరానికి చెందిన 92 ఏళ్ల ఎమ్మీ మరియా మజ్జెంకా ఒక రిటైర్డ్ హైస్కూల్ సైన్స్ టీచర్. 90-94 ఏళ్ల విభాగంలో పలు ప్రపంచ రికార్డులను సృష్టించిన ఎలైట్ స్ప్రింటర్ (పరుగు పందెం క్రీడాకారిణి). ఆమె శారీరక దృఢత్వంపై శాస్త్రవేత్తలు పరిశోధనలు చేయగా అద్భుతమైన విషయాలు వెలుగు చూశాయి.ఆమె శరీరం ఆక్సిజన్ను గ్రహించి, కండరాలకు సరఫరా చేసే సామర్థ్యం ప్రస్తుతం 30 ఏళ్ల యాక్టివ్ యువతులలో ఉన్నంత శక్తివంతంగా ఉంది. కణాలకు శక్తిని అందించే మైటోకాండ్రియా (Mitochondria) పని తీరు 20 ఏళ్ల యువతలో ఉన్నంత బలంగా ఉండటం శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరిచింది. వ్యాయామం ద్వారా వృద్ధాప్య ప్రక్రియను పూర్తిగా మార్చేయవచ్చని ఎమ్మీ జీవితం నిరూపిస్తోందని వ్యాయామ ఫిజియాలజిస్ట్ సిమోన్ పోర్సెల్లి పేర్కొన్నారు.ఎమ్మీ ఫిట్నెస్ వ్యూహం గంటల తరబడి కష్టపడే మారథాన్లపై ఆధారపడలేదు. ఆమె కేవలం క్రమశిక్షణ (Consistency) ను నమ్ముకున్నారు.వర్కౌట్ ప్లాన్ఆమె వారంలో కేవలం మూడు రోజులు మాత్రమే వర్కౌట్ చేస్తారు. ప్రతి సెషన్ గంట లోపే ఉంటుంది. ఆమె సుదీర్ఘ పరుగు పందాల్లోనూ పాల్గొనరు.తేలికపాటి జాగింగ్తో వార్మప్, కొన్ని షార్ట్ స్ప్రింట్స్ (వేగవంతమైన పరుగు), ప్రతిరోజూ అవుట్డోర్ వాకింగ్, అప్పుడప్పుడు తేలికపాటి రెసిస్టెన్స్ వ్యాయామాలు అంతే ఆమె రొటీన్.ఇక ఆహార నియమాలువిషయానికి వస్తే..పెద్దగా నియంత్రణలు కూడా ఏమీలేవు. కఠినమైన డైట్ జోలికి వెళ్లరు. కానీ చాలా తేలికపాటి సమతుల్య ఆహారాన్ని తీసుకుంటారు. ముఖ్యంగా చేపలు, గుడ్లు, కూరగాయలు ఎక్కువగా తింటారు. అయితే, తనకు నచ్చినప్పుడు ఎలాంటి సంకోచం లేకుండా మాంసం కూడా తింటూ సమతుల్యతను కాపాడుకుంటారు.90 ఏళ్ల వయసు దాటినా కూడా శరీరం వ్యాయామానికి ఎంతో అద్భుతంగా స్పందిస్తుందని ఎమ్మీ మరియా మజ్జెంకా జీవితం ప్రపంచానికి నిరూపిస్తోంది. ఒక విధంగా చెప్పాలంటే ఎమ్మీ జీవనశైలి ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) వృద్ధాప్య మార్గదర్శకాలకు అనుగుణంగా ఉంది.WHO ప్రకారం 65 ఏళ్లు పైబడిన వారు పాటించాల్సిన రూల్స్ వారానికి కనీసం 150 నుండి 300 నిమిషాల మధ్యస్థ-తీవ్రత కలిగిన వ్యాయామం, లేదా 75 నుండి 150 నిమిషాల కఠినమైన వ్యాయామం .శారీరక సమతుల్యత , కండరాల బలాన్ని పెంచే వ్యాయామాలను వారానికి 3 లేదా అంతకంటే ఎక్కువ రోజులు చేయడం వల్ల కింద పడకుండా ఉండటంతో పాటు ఎముకల ఆరోగ్యం మెరుగవుతుంది.కదలికలు లేకుండా కూర్చునే అలవాట్లను మానుకుని, కేవలం తేలికపాటి వాకింగ్ చేసినా కూడా వృద్ధాప్యంలో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. ఇదీ చదవండి : విడాకులు మంజూరు : భర్తను వాటేసుకుని ఎమోషనల్, ఎందుకో తెలుసా? -
90 కిలోల నుండి 72 కిలోలకు..! అందుకోసం ఆ హీరో ఏం చేశాడంటే..
బరువు తగ్గడం అనేది వివిధ రకాల డైట్లు, వర్కౌట్ల సమాహారం. అందుకు తగిన ఓపిక, నిలకడ, క్రమశిక్షణతో కూడిన జీవన విధానం ఉండాలి. ముఖ్యంగా భారంగా కాకుండా ఇష్టంగా ఆరోగ్య కోసం అనే స్పృహతో సులభంగా బరువు తగ్గొచ్చని చాలామంది నిరూపించారు. ఆ కోవకు చెందిన వ్యక్తే బాలీవుడ్ హీర్ కార్తిక్ ఆర్యన్. ఆయన ప్రధాన పాత్రలో నటించిన హిందీ స్పోర్ట్స్ డ్రామా చిత్రం ‘చందు ఛాంపియన్’ కోసం ఏకంగా 18 కిలోలు ఎలాంటి మందులు వాడకుండా సహజ పద్ధతిలో తగ్గి అందర్నీ ఆశ్చర్యపరిచారు. అందుకోసం ఆర్యన్ ఎంతలా కష్టపడ్డాడో తెలిస్తే..స్మార్ట్గా మారాలంటే మన నుంచి కనీసం ఈ మాత్రం కష్టం ఉండక తప్పదని అంగీకరిస్తారు. మరి ఆర్యన్ ఏకంగా 90 నుంచి 72 కిలోలు బరువు తగ్గేందుకు ఏం చేశాడో సవివరంగా తెలుసుకుందామా..!.సరిగ్గా రెండేళ్ల క్రితం ప్రపంచం మర్చిపోయిన భారతదేశపు మొట్టమొదటి పారా ఒలింపిక్స్ స్వర్ణ విజేత మురళీకాంత్ పేట్కర్ పాత్రలో కార్తిక్ ఒదిగిపోయారు. ఆయన ఆ పాత్ర కోసం పరకాయ ప్రవేశం చేసినట్లు తన ఆకృతిని మార్చుకున్నారు. ఆర్యన్ నటనకు విమర్శకు ప్రశంసలందుకున్నప్పటికీ..ఆ సినిమాకి అయ్యిన వ్యయానికి తగ్గట్టుగా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు రాబట్ట లేకపోయింది. కారణాలు ఏవైనా..ఈ మూవీ ఓటమిని అంగీకరించిన ఓ క్రీడాకారుడి కథ. గాయలు, ఎదురుదెబ్బల నుంచి పతకాలు దక్కించుకున్ను శక్తిమంతమైన క్రీడాకారుడి స్టోరీ. మరి ఆ పాత్ర ప్రేక్షకుడిని మంత్రముగ్ధుడ్ని చేసేలా ఉండాలంటే..ఆర్యన్ ఆ యోధుడి రూపంలోకి మారక తప్పదు. ఆ నేపథ్యంలోనే 90 కేజీల బరువు ఉండే ఆర్యన్ 72 కిలోలకు తగ్గేలా శిక్షణ తీసుకున్నారు. ఎలాంటి మందులు వినియోగించకుండా నేచురల్ పద్ధతిలో బరువు తగ్గడం విశేషం. వెయిట్లాస్ కోసమే ఆర్యన్ బాక్సింగ్ శిక్షణ తీసుకోవడం నుంచి ఆహారం నుంచి చక్కెరను పూర్తిగా తొలగించడం వరకు ఎన్నో త్యాగాలు, ఎంతో శారీరక శ్రమ దాగి ఉంది. ఆయన ఫిట్నెస్ శిక్షణ అందించిన త్రిదేవ్ పాండే సైతం నిజమైన బాక్సర్ అనుసరించే శిక్షణా విధానాన్ని తీసుకున్నట్లు తెలిపారు. ఆ తర్వాత నెలల తరబడి కఠినమైన క్రమశిక్షణ, నిరంత కృషి ఉందన్నారు. అయితే ఆయన మొదట్లో ఒక్క పుష్ అప్ కూడా చేయలేకపోయారని, కానీ క్రమంగా వీపుపై 50 నుంచి 60 కేజీల అదనపు బరువుతో వాటిని చేసే స్థాయికి చేరుకున్నట్లు తెలిపారు. అదేవిధంగా అతని స్కిప్పింగ్ కూడా మెరుగపడింది. ప్రాథమిక ఫుట్వర్క్తో ఇబ్బందుల నుంచి సుమారు 14 నుంచి 15 ఇతన ఆధునతాన జిమ్ వర్కౌట్లు చేసే స్థాయికి చేరుకున్నారు. అంతేగాదు అనుకున్నట్లుగానే 14 నెలల్లో 18 కేజీలు తగ్గి అద్భుతంగా కనిపించడమే కాదు, ఆ పాత్రకు అనుగుణంగా నటించి ప్రేక్షకులను మెప్పించి ప్రశంసలందుకున్నారు కార్తీక్ ఆర్యన్. చెయ్యాలి అని బలంగా అనుకుంటే..ఎన్ని కష్టాలకైనా ఓర్చి..అనుకున్నది సాధిస్తాం అనేందుకు హీరో కార్తీక్ ఆర్యన్నే ఉదాహరణ. View this post on Instagram A post shared by KARTIK AARYAN (@kartikaaryan) గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యలు లేదా నిపుణుల సలహాలు, సూచనలు తీసుకుని అనుసరించడం ఉత్తమం. (చదవండి: 92 ఏళ్ల టీచరమ్మ ఫిట్నెస్కి ఫిదా అవ్వాల్సిందే..! శాస్త్రవేత్తలు సైతం..) -
92 ఏళ్ల టీచరమ్మ ఫిట్నెస్కి ఫిదా అవ్వాల్సిందే..! శాస్త్రవేత్తలు సైతం..
తొమ్మిది పదుల వయసులో వృద్ధాప్యాన్ని దిక్కరించేలా చురుగ్గా ఉందామె. సింపుల్గా చెప్పాలంటే 30 ఏళ్ల వ్యక్తిలా ఉంది. ఆమె కండరాల శక్తి, యాక్టివిటీని చూసి శాస్త్రవేత్తలే విస్తుపోయారు. అంతేగాదు డబ్ల్యూహెచ్ఓ మార్గదర్శకాలకు మించి తీవ్రమైన వ్యాయామాలు చేస్తంటుంది. పైగా 60 దాటినవారు చేయకూడని వ్యాయమాలే అయినా..ఈ బామ్మ మాత్రం చాలా సునాయాసంగా చేసేస్తుంది. అంతేగాదు ఆమెను చూడగానే తొమ్మిది పదుల వయసు ఉన్న వ్యక్తిలా కనిపించదు..జస్ట్ 30 ఏళ్లే అన్నట్లుగా ఉంటుంది ఆమె ఆహార్యం. ఇంతలా యంగ్లుక్లో ఆశ్చర్యపరుస్తున్న ఆ బామ్మ దీర్ఘాయువు రహస్యం గురించి సవివరంగా తెలుసుకుందామా.!.ఆ బామ్మ పేరే ఎమ్మా మరియా మజెంగా. ఇటలీలో పాడువాలో నివశిస్తున్న రిటైర్డ్ సైన్స్ టీచరమ్మ. ఆమె ఎన్నో ప్రపంచిరికార్డులు కలిగి ఉన్న అగ్రశ్రేణి స్ప్రింటర్. పరుగు పందెంలో ఆమెకు సాటిలేరెవ్వెరూ అన్నట్లుగా ఎన్నో పతకాలు సొంతం చేసుకుందామె. వయసు పరంగా 90 ఏళ్లు పైబడిన వ్యక్తిలా ఉండదు..30 ఏళ్ల మాదిరిగా కనిపిస్తోంది. వృద్ధాప్యాన్నే ధిక్కరించేలా హెల్దీగా ఉండే తీరు శాస్త్రవేత్తలను సైతం అబ్బురపర్చింది. వాళ్లు సైతం ఆమె ఆరోగ్యంపై స్టడీ చేయగా..ఆమె శరీరంలోని కండరాలు..30 ఏళ్ల వ్యక్తుల మాదిరిగా శక్తిమంతంగా ఉన్నాయని చెప్పారు. తొంభై ఏళ్ల వయసులో కూడా ఈ రన్నింగ్ పోటీల్లో ఎలా పాల్గొనగలుగుతోందే అనే కుతూహలంతో ఆమె శరీరం తీరుపై పరిశోధన చేయగా..30 ఏళ్ల క్రీడాకారుల ఫిట్నెస్ని పోలి ఉండటం చూసి ఆశ్చర్యపోయారు. అంతేగాదు ఆక్సిజన్ను శక్తిగా మార్చే మైటోకాండ్రియా, ఆమె కండరాలలోని 20 ఏళ్ల యువకుడిలో ఉన్నంత దృఢత్వంతో పనిచేస్తోందట. ఎమ్మా కథ వ్యాయామ దినచర్య వృద్ధాప్యాన్ని తిరగరాయగలదని చెబుతోంది. అయితే గంటల తరబడి మారథాన్ చేయదామె..కేవలం నిలకడతో తేలికపాటి వ్యాయామాలోతోనే ఈ ఫిట్నెస్ని సాధించిందామె. ఎమ్మా చేసే వ్యాయామం గంటలోపే పూర్తవ్వుతుందట. వార్మప్, తేలికపాటి జాగింగ్, లక్షిత స్ప్రింట్ల శ్రేణి, వాకింగ్, చిన్నపాటి తీవ్రత వ్యాయామాలు ఉంటాయంతే. అలాగే డైట్ పరంగా గుడ్లు, చేపలు, కూరగాయలపై దృష్టి పెడుతూ..సమతుల్యత పాటిస్తానంటోందామె.ప్రపంచ ఆరోగ్య ప్రమాణాలుఎమ్మా జీవనశైలి, ఆరోగ్యకరమైన వృద్ధాప్యం దీర్ఘాయువు కోసం ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) మార్గదర్వకాలను అనుగుణంగా ఉంటుందట. 65 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న పెద్దల కోసం డబ్ల్యూహెచ్ఓ వారమంతా 150 నుంచి 300 నిమిషాల తీవ్రత ఏరోబిక్ శారీరక శ్రమను, లేదా 75 నుంచి 150 నిమిషాల అధిక-తీవ్రత ఏరోబిక్ శారీరక శ్రమను సిఫార్సు చేస్తుంది. అలాగే పడిపోవడాన్ని నివారిస్తూ..ఎముకల ఆరోగ్యం కోసం మూడు లేదా అంతకంటే ఎక్కువ రోజులు శక్తి శిక్షణకు ప్రాధాన్యతనిచ్చే వర్కౌట్లను సూచించింది. అలాగే వృద్ధులు తమ వ్యక్తిగత ఫిట్నెస్కు అనుగుణంగా తమ శ్రమ స్థాయిలను సర్దుబాటు చేసుకోవాలని WHO స్పష్టంగా పేర్కొన్నప్పటికీ, ఎమ్మా వంటి వారు అందుకు విభిన్నమని తొంభైలో కూడా యువకుల మాదిరి అధిక తీవ్రత వ్యాయమాలు చేయగలరని తెలుస్తోంది. View this post on Instagram A post shared by The Washington Post (@washingtonpost) (చదవండి: నా కూతురు మాటలే కొండంత ధైర్యాన్ని ఇచ్చాయ్! భావోద్వేగంలో ఓ నాన్న..) -
మా బాబుకి రెండేళ్లు! ఎంత పిలిచినా.. చూడటం లేదు..
మా బాబుకు రెండేళ్లు. పేరు పిలిచినా చాలాసార్లు తిరిగి చూడడం లేదు. సరిగ్గా ఆడుకోవడం లేదు. మాటలు కూడా సరిగా రావడం లేదు. ఒకే పనిని మళ్లీ మళ్లీ చేస్తుంటాడు. ఇవన్నీ ఆటిజం లక్షణాలా? నాకు చాలా ఆందోళనగా ఉంది. – రాము, ఒంగోలు.ముందుగా మీరు ఒక ముఖ్యమైన విషయం తెలుసుకోవాలి. ఆటిజం అనేది తల్లిదండ్రుల తప్పు వల్ల వచ్చే సమస్య కాదు. ఇది పిల్లల మెదడు అభివృద్ధికి సంబంధించిన ఒక పరిస్థితి. భయపడాల్సిన అవసరం లేదు. కానీ ‘ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచి ఫలితం’ అనేది మాత్రం చాలా నిజం. సాధారణంగా ఆటిజం లక్షణాలు 9 నుంచి 12 నెలల వయస్సు నుంచే కొద్దికొద్దిగా కనిపించడం ప్రారంభమవుతుంది.అయితే చాలామంది పిల్లల్లో 18 నుంచి 24 నెలల మధ్య స్పష్టమైన సంకేతాలు కనిపిస్తాయి. గర్భధారణ నుంచి రెండేళ్ల వయస్సు వరకు ఉండే మొదటి వెయ్యి రోజులు మెదడు అభివృద్ధికి చాలా ముఖ్యమైన సమయం. ఈ దశలోనే ముందస్తు చికిత్స లేదా థెరపీ ప్రారంభిస్తే పిల్లల్లో భాష, సామాజిక నైపుణ్యాలు, నేర్చుకునే సామర్థ్యం మెరుగుపడే అవకాశం ఉంటుంది. తల్లిదండ్రులు కొన్ని ప్రారంభ సంకేతాలను జాగ్రత్తగా గమనించాలి. చిన్నపిల్లలలో ఆటిజం లేదా అభివృద్ధి ఆలస్యాలను ముందుగానే గుర్తించడానికి ఉపయోగపడే తొమ్మిది సింపుల్ స్క్రీనింగ్ ప్రశ్నలు ఉన్నాయి. అవే ఇవీ.. 1. పేరు పిలిచినప్పుడు తిరిగి చూస్తాడా?2. కంటి చూపు బాగా కలుపుతాడా?3. నవ్వు లేదా ముఖభావాలకు స్పందిస్తాడా?4. కావాల్సిన వస్తువును చూపించి అడుగుతాడా?5. చేతితో బైబై లేదా ఇతర సంకేతాలు చేస్తాడా?6. ఇతర పిల్లలతో లేదా పెద్దలతో కలవాలనే ఆసక్తి ఉందా?7. మాటలు లేదా శబ్దాల అభివృద్ధి వయస్సుకు తగ్గట్టుగా ఉందా?8. ఒకే పని లేదా అలవాటు పదేపదే చేస్తూ ఉంటాడా?9. నేర్చుకున్న మాటలు లేదా సామాజిక నైపుణ్యాలు తగ్గిపోయాయా?ఈ ప్రశ్నల్లో ఏదైనా ఆందోళన కలిగిస్తే ‘ఇంకొంచెం పెద్దవాడైతే సర్దుకుంటాడు’ అని ఆలస్యం చేయకుండా పిల్లల వైద్యుడిని లేదా అభివృద్ధి నిపుణుడిని సంప్రదించడం మంచిది.ఆటిజంను పూర్తిగా నివారించే కచ్చితమైన పద్ధతి లేదు. ఎందుకంటే దీనికి ఒకే ఒక్క కారణం ఉండదు. అయితే పిల్లల మెదడు ఆరోగ్యకర అభివృద్ధికి కొన్ని విషయాలు చాలా ఉపయోగపడతాయి. గర్భధారణ సమయంలో మంచి పోషకాహారం తీసుకోవడం, ఫోలిక్ యాసిడ్, ఐరన్, అయోడిన్ వంటి పోషకాలు సరిపడా తీసుకోవడం, రెగ్యులర్ చెకప్స్ చేయించుకోవడం చాలా ముఖ్యం. అలాగే పిల్లలకు టీకాలు సమయానికి వేయించాలి. టీకాలు ఆటిజం కలిగిస్తాయనేది పూర్తిగా అపోహ మాత్రమే. చిన్నపిల్లల్లో స్క్రీన్ టైమ్ కూడా తగ్గించాలి. పిల్లలతో ఎక్కువగా మాట్లాడటం, కథలు చెప్పడం, పాటలు పాడటం, ఆటలు ఆడించడం వల్ల మెదడు అభివృద్ధికి చాలా మంచిది. ఆటిజంను ముందుగానే గుర్తించడం అంటే పిల్లలకు ఒక ‘లేబుల్’ వేయడం కాదు, వాళ్ల భవిష్యత్తుకు సరైన సహాయం అందించడానికి అవకాశం కల్పించడం. తల్లిదండ్రుల గమనికే పిల్లల మొదటి రక్షణ. - డా‘‘ కె. పవన్ కుమార్, సీనియర్ పీడియాట్రిషియన్ , పీడియాట్రిక్ అలర్జిస్ట్, ప్రొఫెసర్ ఆఫ్ పీడియాట్రిక్స్ -
కాబోయే అమ్మకు కడుపులో వికారం
గర్భధారణ తర్వాత చాలామంది మహిళల్లో వాంతులు అవుతుండటం చాలా సాధారణం. వాంతులు కావడం అనే లక్షణాన్ని బట్టి ఒక మహిళ గర్భవతి అయ్యిందనే సూచన మన చాలా సినిమాల్లో కనిపించడం సాధారణమే. గర్భవతులైన అందరిలోనూ ఇదే లక్షణం కనిపించకపోయినప్పటికీ కొందరిలో ఇలా వాంతులు కావడం చాలా సాధారణం. అలాగే గర్భధారణ జరిగిన చాలామంది మహిళల్లో వికారం (నాసియా) అనే లక్షణమూ కనిపిస్తుంది. గర్భవతుల్లో ఇలా ఎందుకు జరుగుతుందో, వికారంగా ఉండటం లేదా వాంతులు ఎక్కువగా అవుతున్న మహిళల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం.గర్భవతుల్లో కనిపించే వాంతులు ఎక్కువగా కావడం, వికారంగా ఉండటాన్ని డాక్టర్లు సాధారణ పరిభాషలో ‘మార్నింగ్ సిక్నెస్’గా డాక్టర్లు చెబుతుంటారు. ఈ లక్షణాలు కనిపించడానికి దేహంలో స్రవించే ఒక హార్మోన్ కారణమవుతుంది. మార్నింగ్ సిక్నెస్తో బాధపడుతున్న మహిళలు తీసుకోవాల్సిన జాగ్రత్తలివి... మార్నింగ్ సిక్నెస్ కారణంగా వాంతులు అవుతున్న గర్భవతులు రోజూ కొద్ది కొద్ది మోతాదుల్లో ఎక్కువసార్లు తింటుండాలి. కొవ్వులు, మసాలాలూ ఎక్కువగా ఉండే హెవీ ఫుడ్ కాకుండా... ఆహారం చాలా తేలిగ్గా ఉండి, సులువుగా జీర్ణమయ్యేలాంటి బ్లాండ్ డైట్ తీసుకుంటూ ఉండటం మేలు. ద్రవాహారాలు... అంటే... కొబ్బరినీళ్లు, మజ్జిగ, పండ్లరసాలు, ఎలక్ట్రాల్ ద్రవాలు ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. పండ్లు కూడా ఎక్కువగానే తింటూ ఉండటం మంచిది. పచ్చళ్లు, నూనెవస్తువులు వీలైనంత తక్కువగా తీసుకోవాలి. వాంతులు అవుతున్నా దాన్ని విస్మరించి, ఏదో ఒకటి తింటూ ఉండండి. ఎందుకంటే... వాంతులవుతున్నందున అసలే తినకపోతే ఎసిడిటీ వల్ల కడుపులో యాసిడ్ పేరుకొని పసరువాంతులు, రక్తపువాంతులు అయ్యే ప్రమాదం పెరుగుతుంది. ఇలాంటివారు అవసరమైనప్పుడు డాక్టర్ పర్యవేక్షణలో మాత్రమే కొన్ని రకాల యాంటాసిడ్ మందులు, వాంతులను, వికారాన్ని తగ్గించే మందులైన యాంటీఎమెటిక్ మందులను వాడవచ్చు. అయితే వీటిని కేవలం డాక్టర్ల పర్యవేక్షణలో మాత్రమే వాడాలి. చాలామందిలో మార్నింగ్ సిక్నెస్ చాలా సహజం. దాని గురించి ఆందోళన అక్కర్లేదు. అయితే అది చాలాకాలం కొనసాగుతుంటే తప్పనిసరిగా డాక్టర్ను సంప్రదించాలి. వాంతుల కారణంగా బిడ్డకు పోషకాలు అందవా?కొత్తగా ప్రెగ్నెన్సీ వచ్చిన మహిళలకు తమకు చాలా ఎక్కువగా వాంతులు అవుతున్నాయనీ, దాంతో కడుపులోని బిడ్డకు అందాల్సిన పోషకాలు అందవేమోనని ఆందోళన పడుతుంటారు. ఇది కేవలం అపోహ మాత్రమే. వాంతులు అవుతున్నా బిడ్డకు అందాల్సిన పోషకాలు అందుతూనే ఉంటాయి.ఇటీవలి అధ్యయనాల్లో తేలిన విషయం ఏమిటంటే...ఇటీవల ఓ తాజా అధ్యయనంలో తేలిన విషయం ఏమిటంటే... గర్భవతుల్లో వాంతులకు ప్రధానంగా గ్రోత్ డిఫరెన్సియేషన్ ఫ్యాక్టర్ –15 (జీడీఎఫ్–15) అనే అంశం కూడా ఒక ప్రధాన కారణమని తేలింది. ఈ ఫ్యాక్టర్ వల్ల కొత్తగా గర్భధారణ జరిగిన మహిళల్లో... ఆకలి లేకపోవడం, ఏ ఆహారమూ రుచిగా అనిపించక΄ోవడం / రుచి తెలియక΄ోవడం, వికారం, బరువు తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తాయనే విషయం తాజాగా వెల్లడయ్యింది. గర్భధారణ తర్వాత మహిళల్లో వాంతులు ఎందుకంటే...ప్రెగ్నెన్సీ తర్వాత మహిళల్లో ‘హ్యూమన్ కోరియానిక్ గొనాడోట్రాపిన్’ (హెచ్సీజీ) అనే హార్మోన్ విడుదల అవుతుంది. మహిళ దేహానికి ఈ హర్మోన్ ఒక సందేశం పంపిస్తుంది. అదేమిటంటే... ‘ఈ దేహంలో గర్భధారణ ప్రక్రియ మొదలైంది. కాబట్టి నెలనెలా వచ్చే పీరియడ్స్ ప్రక్రియను ఆపేసి, ఇక గర్భధారణ ప్రక్రియ కోసం అవసరమైన ప్రొజెస్టెరాన్ను స్రవించమనీ, తద్వారా... అండం ఆశ్రయం తీసుకోవాల్సిన ‘ఎండోమెట్రియమ్–యుటెరైన్’ పొరలను మరింత మందంగా చేయడం, తద్వారా గర్భం నిలబడేలా చేయాలం’టూ ఈ హెచ్సీజీ హార్మోన్ ద్వారా దేహానికి సందేశం అందుతుంది. అయితే కొందరిలో ఈ ‘హ్యూమన్ కోరియానిక్ గొనాడో ట్రాపిన్ (హెచ్సీజీ) చాలా తక్కువ మోతాదులో, మరికొందరిలో చాలా ఎక్కువ మోతాదులో విడుదలవుతుంది. ఆ హార్మోన్ కారణంగా గర్భవతుల్లో కొందరిలో తక్కువగానూ, మరికొందరిలో ఓ మోస్తరుగా, మరికొంతమందిలో చాలా ఎక్కువగా వాంతులు అవుతుంటాయి. మరికొందరిలో ఎలాంటి లక్షణాలూ ఉండవు. డాక్టర్ పి. స్వప్న, సీనియర్ కన్సల్టెంట్ అబ్స్టెట్రిక్స్ – గైనకాలజీ నిర్వహణ: యాసీన్(చదవండి: ఫైట్ అండ్ ప్లైట్లో గ్రాండ్ మాస్టర్) -
ఫైట్ అండ్ ప్లైట్లో గ్రాండ్ మాస్టర్
మన శరీరంలో కొన్ని అవయవాలు పరిమాణంలో చిన్నవైనా, వాటి పని మాత్రం అసాధారణంగా ఉంటుంది. అలాంటి వాటిల్లో అడ్రినల్ గ్రంథులు ఒకటి. ప్రతి అడ్రినల్ గ్రంథి సుమారు 4–6 గ్రాముల బరువు మాత్రమే ఉంటుంది. ఆకారంలో చిన్న త్రిభుజంలా కనిపించే ఈ గ్రంథులు ఒక్కో కిడ్నీపైన ఒక్కటి ఉంటాయి. జీవక్రియలకు అత్యవసరమైన హార్మోన్లను ఉత్పత్తి చేసే శక్తిమంతమైన గ్రంథులివి. ఈ అడ్రినల్ గ్రంథి చేసే అద్భుతమైన పనులేమిటో తెలుసుకుందాం.చాలా మందికి అడ్రినల్ గ్రంథుల గురించి పెద్దగా తెలియదు. కానీ ప్రతి రోజు మన శరీరంలో జరిగే అనేక ముఖ్యమైన ప్రక్రియలను ఇవే నియంత్రిస్తాయి.ఒత్తిడి సమయంలో అడ్రినల్ గ్రంథుల పాత్ర మనిషి ప్రమాదంలో ఉన్నప్పుడు లేదా అత్యవసర పరిస్థితుల్లో అడ్రినల్ గ్రంథులు వెంటనే స్పందిస్తాయి. ఈ సమయంలో అడ్రినలిన్ విడుదల అవుతుంది. ఫలితంగా గుండె వేగంగా కొట్టుకోవడం రక్తపోటు పెరగడం శరీరానికి తక్షణ శక్తి అందించడం మెదడు అప్రమత్తంగా మారడం జరుగుతుంది. ఇలా జరగడాన్ని వైద్యపరంగా ‘ఫైట్ లైదా ఫ్లైట్ రెస్పాన్స్’ అంటారు. అంటే ప్రమాదాన్ని ఎదుర్కొని పోరాడటానికీ లేదా ఆ పరిస్థితి నుంచి తప్పించుకోవడానికి శరీరం సిద్ధమవుతుంది.కార్టిసోల్ అంటే ఏమిటి... ఎందుకు అవసరం?కార్టిసోల్ను చాలామంది ‘స్ట్రెస్ హార్మోన్’ అని పిలుస్తారు. కానీ ఇది కేవలం ఒత్తిడికి సంబంధించిన హార్మోన్ మాత్రమే కాదు. ఇది... రక్తంలో చక్కెర స్థాయుల నియంత్రణ, రక్తపోటు నిర్వహణ ఇన్ఫెక్షన్లకు ప్రతిస్పందన శరీర జీవక్రియలు (మెటబాలిజం) శక్తి వినియోగం వంటి అనేక ప్రక్రియల్లో కీలక పాత్ర పోషిస్తుంది.ఆల్డోస్టెరోన్ పని ఏమిటి?ఆల్డోస్టెరోన్ శరీరంలో సోడియం, పొటాషియంలతోపాటు నీటి సమతుల్యతను నియంత్రిస్తుంది. దీని ద్వారా రక్త΄ోటు నియంత్రణ జరుగుతుంది. కొంతమందిలో ఆల్డోస్టెరోన్ అధికంగా తయారవుతుంది. దీనిని ‘ప్రైమరీ హైపర్ ఆల్డోస్టెరోనిజం’ అంటారు. ఇది అధిక రక్త΄ోటుకు ఒక ముఖ్యమైన కారణం. కానీ... దీన్ని గుర్తించడం కష్టం. ముఖ్యంగా చిన్న వయసులోనే తీవ్రమైన బీపీ రావడం, మూడు నాలుగు మందులతో కూడా బీపీ నియంత్రణలోకి రాక΄ోవడం, రక్తంలో పొటాషియం తగ్గిపోవడం వంటి పరిస్థితుల్లో ఈ వ్యాధిని అనుమానించాలి. సరైన పరీక్షలతో దీన్ని గుర్తించి చికిత్స చేస్తే బీపీని గణనీయంగా నియంత్రించవచ్చు.అడ్రినల్ గ్రంథి ఆరోగ్యానికి చేయాల్సిందేమిటి...?కంటినిండా నిద్ర క్రమబద్ధంగా చేసే వ్యాయామం ఒత్తిడి నియంత్రణ ధ్యానం సమతుల్య ఆహారం... ఇవి అవసరం. చివరిగా... అడ్రినల్ గ్రంథులు పరిమాణంలో చిన్నవైనా, జీవానికి అత్యంత కీలకమైన హార్మోన్లను ఉత్పత్తి చేసే శక్తివంతమైన గ్రంథులు. శరీర సమతుల్యతను కాపాడడంలో ఇవి చేసే పని అసాధారణం. అందుకే శరీర సంకేతాలను నిర్లక్ష్యం చేయకుండా, అవసరమైతే ఎండోక్రైనాలజిస్ట్ను సంప్రదించడం మంచిది.డాక్టర్ రవిశంకర్ ఇరుకులపాటి,సీనియర్ ఎండోక్రైనాలజిస్ట్, -
వృక్షాసనం.. ఏకాగ్రతను నేర్పే అద్భుతమైన యోగాసనం!
వృక్షాసనం అంటే ‘చెట్టు భంగిమ‘ అని అర్థం. ‘వృక్షాసనం మనకు చెట్టు వంటి స్థిరత్వం, సమతుల్యత, ఏకాగ్రతను నేర్పే అద్భుతమైన యోగాసనం. ‘వృక్షాసనం అనేది ఒక కాలి మీద నిలబడి, శరీర సమతుల్యతను కాపాడుకునే యోగాసనం. చెట్టు మాదిరిగా స్థిరంగా ఉండటం వల్ల దీనికి ఆ పేరు వచ్చింది. ఉదయాన్నే ఖాళీ కడుపుతో లేదా భోజనం చేసిన 4–6 గంటల వ్యవధి తర్వాత ఈ ఆసనం వేయడం అత్యంత శ్రేయస్కరం.వృక్షాసనం చేసే విధానం..యోగా మ్యాట్పై నిలబడి, రెండు కాళ్లను దగ్గరగా ఉంచండి. ఇప్పుడు కుడి కాలిపై నిలబడి, శరీర బరువును బ్యాలెన్స్ చేయండి.ఎడమ మోకాలిని వంచి, ఎడమ పాదాన్ని కుడి కాలి తొడ లోపలి భాగానికి (తొడమూలానికి వీలైనంత దగ్గరగా) గట్టిగా ఆన్చండి. రెండు చేతులను నెమ్మది గా పైకి లేపి, నమస్కార ముద్రలో అరచేతులను కలపాలి.ముందు భాగంలో ఏదైనా ఒక వస్తువుపై దృష్టిని కేంద్రీకరిస్తూ, శ్వాసను సాధారణంగా తీసుకుంటూ 10–20 సెకన్ల పాటు ఈ భంగిమలో ఉండాలి.ఇదే పద్ధతిని కుడి పాదాన్ని ఎడమ తొడపై ఉంచి మరోవైపు రిపీట్ చేయాలి..ప్రయోజనాలు..విద్యార్థుల్లో పరీక్షల ఒత్తిడి తగ్గి, ఏకాగ్రత పెరుగుతుంది, మనో నిబ్బరం, జ్ఞాపకశక్తి మెరుగుపడతాయి.కాళ్లు, చీలమండలు, వెన్నెముక దృఢంగా మారతాయి.నాడీ వ్యవస్థకు ప్రశాంతత చేకూరుతుంది.నడుము నొప్పి, సయాటికా నరాల నొప్పుల నుంచి ఉపశమనం ఇస్తుంది.ఒత్తిడి, ఆందోళనలను తగ్గించి, మనస్సుకు ప్రశాంతతను ఇస్తుంది.శరీరం బ్యాలెన్స్, స్టెబిలిటీ పెరుగుతాయి.జాగ్రత్తలు..తీవ్రమైన మైగ్రేన్, అధిక లేదా తక్కువ రక్తపోటు సమస్యలు ఉంటే ఈ ఆసనం వేయకూడదు.నిద్రలేమి సమస్య ఉన్నవారు దీనిని నిపుణుల సమక్షంలోనే చేయాలి.మోకాళ్లు, తుంటి లేదా మెడకు సంబంధించిన సర్జరీలు అయినవారు ఈ ఆసనాన్ని వేయరాదు.మొదటిసారి చేసేవారు బ్యాలెన్స్ కోల్పోకుండా ఉండటానికి గోడ సపోర్ట్ తీసుకోవచ్చు లేదా కుర్చీని పట్టుకుని చేయవచ్చు.- అనిత పాతర్ల, యోగా ట్రైనర్ -
నేరేడు పండ్లు తింటున్నారా?
నేరేడు ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలిసిందే. ఆయుర్వేద పరంగా అన్ని విధాల ఆరోగ్యానికి మేలు అన్నది జగమెరిగిన సత్యం. అయితే ఇలాంటి సమస్యలు ఉంటే తీసుకోకపోవడమే మేలు అని చెబుతున్నారు వైద్యులు. ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉంటే నేరేడు పండ్లు తీసుకోకూడదో తెలుసుకుందామా.!.నేరేడు పండ్లు ఇపుడు మార్కెట్లో విరివిగా లభిస్తున్నాయి. యాంటీఆక్సిడెంట్లు, పోషకాలు పుష్కలంగా ఉండే ఈ పండు, అందరికీ మేలు చేయకపోవచ్చు. నేరేడు పండ్లు రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో, ఇన్సులిన్ సామర్థ్యాన్ని పెంచడంలో తోడ్పడతాయి. అయితే, డయాబెటిస్ కోసం మందులు వాడుతున్న వారు వీటిని అధికంగా తీసుకుంటే, రక్తంలో షుగర్ లెవెల్స్ ఒక్కసారిగా పడిపోయే ప్రమాదం ఉంది. దీనివల్ల కళ్ళు తిరగడం, విపరీతంగా చెమటలు పట్టడం, కంగారు, గుండె వేగం పెరగడం, స్పృహ తప్పడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ పండ్లలో సహజంగానే ఆక్సలేట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి మూత్రంలోని క్యాల్షియంతో కలిసి కిడ్నీలో రాళ్లుగా మారే అవకాశం ఉంది. కాబట్టి, ఇప్పటికే కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడుతున్న వారు లేదా ఆ సమస్య వచ్చే అవకాశం ఉన్నవారు నేరేడు పండ్లను పరిమితంగానే తినాలి. నేరేడు పండ్లలో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది, ఇది జీర్ణక్రియకు మంచిదే. కానీ, ఒకేసారి వీటిని అతిగా తింటే కడుపు ఉబ్బరం, గ్యాస్, మలబద్ధకం, లేదా కడుపు తిప్పడం వంటి సమస్యలు రావచ్చు. ∙ఈ పండ్లను అతిగా తింటే బ్లడ్ షుగర్ హెచ్చుతగ్గులకు లోనయ్యే ప్రమాదం ఉంది. అందువల్ల గర్భిణులు నేరేడు పండ్లను తినే ముందు డాక్టర్ను సంప్రదించడం ఉత్తమం. అలర్జీ హిస్టరీ ఉన్నవారు ఈ పండును మొదటిసారి తినేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. కొందరికి నేరేడు పండ్ల వల్ల అలర్జీ వచ్చే అవకాశం ఉంది. -
బరువు తగ్గాలంటే.. మోయాలంతే!
స్మార్ట్ ఉండాలంటే ఆలోచిస్తే సరిపోదు.. ఫిట్గా కూడా ఉండాలి. అలాంటప్పుడే బ్రెయిన్ బాగా పని చేస్తుంది. పోస్ట్ కోవిడ్ తర్వాత చాలామంది ఫిట్సెస్ సెంటర్లకు వెళ్లడానికి ఆసక్తి చూపుతున్నారు. వ్యాయామాల్లో కూడా కొత్త విధానాలొచ్చేస్తున్నాయి. జిమ్, ఏరోబిక్స్, యోగా లాంటివి..కాని ఇవ్వన్నీ కామన్.. ఇప్పుడు కొత్తరకం ఫిట్నెస్ మంత్ర వచ్చింది అదే ‘రక్కింగ్’.కొత్త ఫిట్నెస్ ట్రెండ్ ఇప్పుడు బాగాప్రాచుర్యం పొందుతోంది. ఈ పద్ధతిలో ఒక నిర్దిష్ట బరువున్న వెస్ట్ను లేదా బ్యాక్ప్యాక్ను ధరించి నడస్తూ వెళ్లాలి. అలా అనుకున్న టార్గెట్ వరకు వెళ్లేందుకు ప్రయత్నించాలి. ఒకసారి టార్గెట్ పూర్తయ్యాక నడకలో కాస్త వేగాన్ని పెంచాలి. అమెరికా, యూరప్లలో ఇప్పటికే ఈ పద్ధతిని లక్షల మంది ఫాలో అవుతున్నారు.ఈ రక్కింగ్ వల్ల కాళ్ల కండరాలు రక్తప్రసరణ జరిగి ఎక్కువ కేలరీలు ఖర్చవుతాయి. వాస్తవానికి ఇదేం కొత్త పద్ధతేం కాదు.. మిలటరీ శిక్షణలో భాగంగా సైనికులకు తుపాకీ, బ్యాక్ప్యాక్ ఇచ్చి నడిపిస్తారు. ఈ పద్ధతినే జనబాహుళ్యంలోకి తీసుకొచ్చి కొత్తరకం ఫిట్నెస్ సూత్ర అంటూ ప్రచారం చేస్తున్నారు. కాని ఊబకాయంతో బాధపడేవారికి మాత్రం ఈ రక్కింగ్ పద్ధతే కరెక్ట్... పైగా రక్కింగ్ చేయడానికి జిమ్లకు, యోగా క్లాసులకు వెళ్లక్కర్లేదు. ఎవరైనా ఇంట్లో ఉంటూ రక్కింగ్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. -
ఆ నటుడికి అరుదైన బ్రెస్ట్ కేన్సర్..!ఎందువల్ల వస్తుందంటే..
రొమ్ము కేన్సర్ అంటే మహిళలకే వస్తుందని అనుకుంటారు. కానీ పురుషులకు కూడా వస్తుందట. అయితే పురుషుల్లో ఇది అత్యంత అరుదు. మరి మగవాళ్లలో ఈ కేన్సర్ లక్షణాలు ఏ విధంగా ఉంటాయి?, ఎందువల్ల వస్తుంది?, నివారణ చర్యలు తదితరాల గురించి సవివరంగా తెలుసుకుందామా.!.హాలీవుడ్ నటుడు, మాజీ ప్రొఫెషనల్ రెజ్లర్, టైలర్ మానేకు బ్రెస్ట్ కేన్సర్ ఉన్నట్లు వైద్యులు ఇటీవలే నిర్థారించారు. అందుకోసం కీమోథెరపీ చేయించుకుంటున్నట్లు కూడా తెలిపారు. 59 ఏళ్ల హీరో పురుషుల రొమ్ము కేన్సర్పై అవగాహన కల్పించడం కోసం ఇన్స్టాగ్రామ్లో ఇలా రాసుక్చొఆరు. అవును నాకు బ్రెస్ట్ కేన్సర్ ఉంది. ఇది చాలా అరుదైనది, పైగా ఇది 1% మంది మగవాళ్లే ఈ సమస్య బారిన పడతారట. నిజం చెప్పాలంటే మొదట బహిరంగంగా మాట్లాడాలనుకోలేదు. కానీ తర్వాత నాకు తెలిసిందేంటంటే..దీని గురించి మాట్లాడకపోవడం, దీనికోసం తెలుసుకోకపోవడం వల్లే పురుషులలో ఈ వ్యాధి చాలామటుకు లాస్ట్ స్టేజ్లో నిర్థారిస్తున్నట్లు తెలిసింది. ఆ నేపథ్యంలోనే దీని గురించి మాట్లాడాలని నిర్ణయించుకున్నా. డాక్టర్లంతా కొట్టిపారేసినా..నా భార్య ఆ గడ్డను తొలగించుకోమని ఒత్తిడి చేయడంతోనే ముందుగానే చికిత్స తీసుకుంటున్నా. ప్రతి 755 మంది పురుషులలో ఒకరికి వారి జీవితకాలంలో రొమ్ము కేన్సర్ నిర్థారణ అవుతున్నట్లు వైద్యులు తెలిపారు. దీన్ని ముందుగానే గుర్తింస్తే..చికిత్స చేయడం సులభం. అందువల్ల ఇకనైనా మేల్కోవాలి, తక్షణమే స్పందించాలి అని పిలుపునిచ్చారు.పురుషుల రొమ్ము కేన్సర్ అంటేరొమ్ము కణజాలంలోని అసాధారణ కణాలు అనియంత్రితంగా పెరిగి కణితిగా ఏర్పడినప్పుడు పురుషులలో రొమ్ము కేన్సర్ వస్తుంది. పురుషులకు రొమ్ము కణజాలం తక్కువగా ఉంటుంది, అంటే అక్కడ కేన్సర్ వచ్చే అవకాశం ఉంది, అయినప్పటికీ ఇది మహిళలతో పోలిస్తే తక్కువ.కేన్సర్ లక్షణాలుప్రారంభ సంకేతాలను గుర్తించడం సకాలంలో రోగ నిర్ధారణ, చికిత్సకు సహాయపడుతుంది.కొన్ని సాధారణ లక్షణాలు:రొమ్ములో గడ్డ లేదా వాపురొమ్ము కణజాలం గట్టిపడటంరొమ్మును కప్పి ఉంచే చర్మంలో మార్పులు, ఎరుపు లేదా గుంటలు పడటం వంటివిచనుమొన నొప్పి లేదా సున్నితత్వంలోపలికి తిరిగిన చనుమొనచనుమొన నుండి స్రావం, కొన్నిసార్లు రక్తంతో కూడి ఉండవచ్చుచంక కింద శోషరస గ్రంథులు వాపునిరంతర పుండ్లు లేదా చనుమొనల చుట్టూ మార్పులుపురుషులు తమ ఛాతీ లేదా రొమ్ము ప్రాంతంలో ఏవైనా అసాధారణ మార్పులను నిర్లక్ష్యం చేయకూడదు. ఒకవేళ గడ్డ నొప్పిలేకుండా ఉన్నప్పటికీ, దానిని ఆరోగ్య నిపుణుడిచే పరీక్ష చేయించుకోవాలి.పురుషులలో రొమ్ము కేన్సర్కు ప్రమాద కారకాలుఅనేక కారకాలు పురుషులలో రొమ్ము కేన్సర్ వచ్చే అవకాశాన్ని పెంచుతాయి. వాటిలో ఇవి ఉన్నాయి:వయస్సు పెరగడం: చాలా కేసులు 60 ఏళ్లు పైబడిన పురుషులలో నిర్ధారణ అవుతాయి. సాధారణంగా వయస్సు పెరిగే కొద్దీ ప్రమాదం పెరుగుతుంది.కుటుంబ చరిత్ర: దగ్గరి బంధువులకు రొమ్ము క్యాన్సర్ ఉన్న పురుషులకు ప్రమాదం ఎక్కువగా ఉండవచ్చు. వంశపారంపర్యంగా వచ్చే జన్యు మార్పులు కూడా ఒక పాత్ర పోషిస్తాయి.జన్యు మార్పులు: కొన్ని జన్యువులలో, ముఖ్యంగా BRCA2 జన్యువులో మార్పులు, పురుషులలో రొమ్ము కేన్సర్ ప్రమాదాన్ని గణనీయంగా పెంచుతాయి.హార్మోన్ల అసమతుల్యత: ఈస్ట్రోజెన్ స్థాయిలు ఎక్కువగా ఉండటం లేదా టెస్టోస్టెరాన్ స్థాయిలు తక్కువగా ఉండటం రొమ్ము కేన్సర్ అభివృద్ధికి దోహదపడవచ్చు.స్థూలకాయం: శరీరంలో అధిక కొవ్వు ఈస్ట్రోజెన్ స్థాయిలను పెంచుతుంది, ఇది ప్రమాదాన్ని పెంచవచ్చు.కాలేయ వ్యాధి: సిర్రోసిస్ వంటి పరిస్థితులు హార్మోన్ల సమతుల్యతను ప్రభావితం చేసి, కేన్సర్కు గురయ్యే అవకాశాన్ని పెంచుతాయి.రేడియేషన్ ప్రభావం: గతంలో ఛాతీ ప్రాంతానికి రేడియేషన్ చికిత్స చేయించుకోవడం వల్ల.. రొమ్ము కేన్సర్ వచ్చే అవకాశాలు పెరగవచ్చు.నివారణరొమ్ము కేన్సర్ను పూర్తిగా నివారించడం ఎల్లప్పుడూ సాధ్యం కానప్పటికీ, కొన్ని జీవనశైలి ఎంపికలు ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. ప్రమాదం.అధిక బరువు ఉండటం అనేది అధిక ఈస్ట్రోజెన్ స్థాయిలతో ముడిపడి ఉంటుంది. క్రమం తప్పని వ్యాయామం, సమతుల్య ఆహారం ఆరోగ్యకరమైన శరీర బరువును నిర్వహించడానికి సహాయపడతాయి.అధికంగా మద్యం సేవించడం వల్ల రొమ్ము కేన్సర్తో సహా అనేక కేన్సర్ల ప్రమాదం పెరగవచ్చు.క్రమం తప్పని శారీరక శ్రమ హార్మోన్ల స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది, మొత్తం ఆరోగ్యానికి తోడ్పడుతుంది.కుటుంబంలో రొమ్ము క్యాన్సర్ చరిత్ర ఉన్న పురుషులు తమ ప్రమాదం గురించి ఆరోగ్య సంరక్షణ నిపుణులతో చర్చించాలి. కొన్ని సందర్భాల్లో, జన్యుపరమైన కౌన్సెలింగ్ సిఫార్సు చేయవచ్చు కూడా.క్రమం తప్పని ఆరోగ్య పరీక్షలు సత్వరమే సమస్యను గుర్తించడానికి సహాయపడతాయి. రొమ్ము మార్పుల గురించి అవగాహన పెంచుకోవాలి. పురుషులు తమ ఛాతీ ప్రాంతంలోని సాధారణ స్వరూపం, స్పర్శ గురించి తెలుసుకోవాలి. ఏవైనా గడ్డలు, వాపు లేదా చనుమొనలలో మార్పులను ఆలస్యం చేయకుండా వైద్యుడికి తెలియజేయడం వలన ముందుగానే ఈ సమస్య నుంచి సత్వరమే బయటపడే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. View this post on Instagram A post shared by Tyler Mane (@therealtylermane)గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: అందుకే అంత లావు..! భావోద్వేగంలో నటుడు అనుపమ్ ఖేర్) -
సాగుబడి: 'ఇప్ప పండు..'తో బోలెడు ఉపయోగాలు!
నల్లమల అడవుల్లో ఇప్ప చెట్ల సాంద్రత తగ్గింది. ప్రస్తుతం ఈ చెట్లను నరకడంపై పూర్తి నిషేధం ఉంది. ఇప్పపై సమగ్రంగా పరిశోధించి, విలువ ఆధారిత పదార్థాలను ప్రజల చెంతకు చేకూర్చిననాడు, దీని ఉనికికి సార్ధకం చేకూర్చిన వారమవుతాం.20 మీటర్ల ఎత్తు.. వందేళ్లు!ఇప్ప ఉష్ణమండలంలోని ఆకులురాల్చే చెట్ల జాతుల్లో ఒకటి. నిటారుగా పెరిగేతత్వం గలది. ఇంచుమించు 16–20 మీటర్ల ఎత్తు వరకు పెరగగలదు. మాను చేవ కలిగి బలిష్ఠంగా ఉంటుంది. దీని ఆవాసం ఇండియా అని చెప్పవచ్చు. కానీ శ్రీలంక, నేపాల్, మయన్మార్ మొదలగు దేశాలలో కూడా ఇప్ప చెట్లు కనిపిస్తాయి.ఎక్కువగా అడవులలో ఉన్నప్పటికీ, మైదాన ప్రాంతాల్లో కూడా విరివిగా పెరుగుతాయి. ఇండియాలో ఇంచుమించు, ఉత్తర, మధ్య, దక్షిణాది రాష్ట్రాలే కాకుండా బీహార్, జార్ఖండ్, గుజరాత్, ఒడిషాలలోనూ ఉన్నాయి. ఒకప్పుడు నల్లమల అడవులు ఈ చెట్లకు మంచి ఆవాసంగా ఉండేది. వీటి సాంద్రత చాలా వరకు తగ్గినదనవచ్చు. వీటి జీవిత కాలం దాదాపు వంద సంవత్సరాలంటారు. కానీ పూత, కాత మాత్రం అరవై ఏళ్ల వరకు ఉండగలదంటారు. ఇప్ప బహుళ ప్రయోజనకారి. కాబట్టి దీన్ని రక్షించటం అందరి కర్తవ్యం. తెలుగు రాష్ట్రాలు ఈ చెట్టుకు పెట్టింది పేరు. దీని ఉనికి అపారమైనది.ఇప్ప చెట్టు పేర్లు వివిధ భాషల్లో ... అస్సామీ: మహారువ ఇంగ్లీష్: హానిట్రీ, బట్టర్ ట్రీ ఉర్దూ: చికన్, గర్, గులు, మహువ ఒరియా: మహుల మహ్వా కన్నడ: హిప్పే, ఇప్పె తమిళం: ఇలుప్పయి, కట్టిరుప్పెయి తెలుగు: ఇప్ప, విప్ప, మధుకము బెంగాలీ: మౌల్, మహూయ మరాఠీ: మౌహ, మవద, కట్ – ఇల్లిపి మలయాళం: ఇరిప్ప, ఇలుపు హిందీ: మహువ, మొహవ, మొవరి, గిలౌడ్, గర్, వన్ ప్రస్త్ సంస్కృతం: మధుక, మధుకం, మోహ అని అంటారు.ఇప్ప ఉపయోగాలు:ఏ చెట్టుకూ లేని ఉపయోగాలు ఇప్ప చెట్టుకు ఉన్నాయి.ఒక చెట్టు నుంచి ఏడాదికి 60–80 కిలోల గింజలు పొందవచ్చు. అదే పెద్ద చెట్టులో ఒక క్వింటాలు వరకు పూమొగ్గలను పొందవచ్చు.విత్తనాలలో 30–35% వరకు నూనె ఉంటుంది.విత్తనాలలో 14–16% వరకు ప్రోటీనులు ఉంటాయి.విప్ప పువ్వుల నుండి తీసిన నూనె వంట కోసం ఉపయోగిస్తారు. దీనికి ఎన్నో ఔషధ గుణాలున్నాయి.గింజల నుండి తీసిన నూనెను చర్మ రక్షణ తైలంగా, కీళ్ళనొప్పులకు మర్దన తైలంగా కూడా వాడుతారు. శుద్దీకరించిన నూనెను వనస్పతి, సబ్బులు, కొవ్వొత్తులు, ఫ్యాటి ఆమ్లాలు తయారు చేయడంలో ఉపయోగిస్తారు.గిరిజనులు ఇప్ప పూల అంబలి తయారు చేసి వాడుతారు.దేశవాళి సారాయి (ఇప్పసార)ని తయారీకి ఉపయోగిస్తారు. ఒక టన్ను ఇప్ప పూల నుంచి దాదాపు 400 లీటర్ల పైననే సారాయి వస్తుందని అంచనా.ఇప్ప సారాను సేవిస్తే త్వరగా వృద్ధాప్య లక్షణాలు రాకుండా ఉంటాయని గిరిజనుల నమ్మకం.ఇప్ప పూల ఔషధాలను పక్షవాతం నయం చేయటానికి ఉపయోగిస్తారు. ఇప్ప పూలతో పండ్లు తోముకుంటే దగ్గు సమస్యలను నివారించవచ్చు.ఇప్ప పూల తైలానికి ఆయుర్వేదంలో మంచి విలువ ఉంది.ఇప్ప పూలతో లడ్డూలు, పచ్చళ్లు తయారు చేస్తారు.ఇప్ప గింజల (5.1%) నూనె నుంచి బట్టర్ను తయారు చేస్తారు.ఇప్ప పూలను పశువులకు మేతగా వేస్తారు. పశువులు ఇష్టంగా తింటాయి.ఇప్ప పండు తొక్కను తింటారు. పండు కింది పొరను పొడిచేసి కేక్ల తయారీకి ఉపయోగిస్తారు.ఇప్ప గింజల నూనె దీపాలకు కూడా వాడుతారు.నూనె తీయగా వచ్చిన చెక్కను ఎరువుగా వాడుతారు.ఇప్ప ఆకులను కరువు కాలంలో పశువులు తింటాయి.పూలలో ఉండే చక్కెర, విటమిన్లు, క్యాల్షియం, నూనె ఎంతో ఉపయోగకరమైనవి.ఆకులను,పూలను బ్రొంకైటీస్కు వైద్యంలో ఉపయోగిస్తారు.ఇప్పపూల లడ్డు..పదార్ధాల మోతాదు:ఇప్పపువ్వు – కిలో, మొలాసిస్ – 400 మిల్లీ లీటర్లు. రాగిపిండి–500 గ్రా., జీడిపప్పు– 100గ్రా., నువ్వులు 50 గ్రా., సోంపు పొడి 10 గ్రా., కొబ్బరిపొడి– 100 గ్రా., సిట్రిక్ ఆసిడ్–4 గ్రా., మెంతిపొడి–10 గ్రా., నెయ్యి 100 మీ.లీ. సొంఠి పొడి 5 గ్రా.తయారీ విధానం:- పొయ్యి మీద పాత్రలో మొలాసిస్ను 400 మి.లీ. నీళ్ళల్లో వేడి చేసి, దానికి 2 గ్రాముల సిట్రిక్ ఆమ్లాన్ని కలపాలి.- అది జిగటగా మారగానే నెయ్యిలో వేయించిన రాగి పొడిని అందులో కలపాలి.- ముందే నెయ్యిలో వేయించిన ఇప్ప పూలను అందులో కలపాలి.- ఆ తరువాత నువ్వులు, జీడిపప్పు, శొంఠి పొడి, మెంతి పొడి, సోంపు పొడిని కలుపాలి.- అన్నీ బాగా కలియ బెట్టాలి.- ఈ విధంగా చిరుమంటపై ఉంచి, పైన తెలిపిన పదార్థాలన్నీ దోరగా, చిక్కగా అయిన తర్వాత మంట ఆర్పివేయాలి.- వేడి తగ్గిన తర్వాత కొబ్బెర తురుముతో కలిపి లడ్డూల రూపం వచ్చే విధంగా గుండ్రంగా చేయాలి.- ఈ విధంగా తయారు అయిన లడ్లు చాలా రుచిగా ఉంటాయి.- మీరు చేసి చూడండి. ఏమైనా మార్పులు–చేర్పులు చేసి ఇంకా రుచికరంగా తయారుచేసే విధానాన్ని రూపొందించండి.ఇప్ప కలప గట్టిది..ఇప్ప చెట్టు కలప చాలా గట్టిది. దూలాలకు మిద్దె ర్యాప్టర్లకు, పలకలకు, ఫర్నీచర్ తలుపులు, కిటికీల ఫ్రేములకు, బ్రిడ్జిలు వేసేటప్పుడు సప్పోర్ట్ దిమ్మెలుగా, బండ్ల మణిగం, పలుగడి, పడవల చెక్కలు, ఓడల దిమ్మెలు, వ్యవసాయ పనిముట్లకు కూడా ఉపయోగపడుతుంది. ఇప్ప చెట్టు కలప, పూలు, కాయలు, పండ్లల్లో ఎన్నో తెలియని ఉపయోగాలున్నాయి. వీటిలోని యాంటి ఆక్సిడెంట్స్, ఆమ్లాలను మందుల తయారీలో వాడుతారు. దీని ఉపయోగాలపై ప్రయోగాలు చేసి, ఆ విషయాలను రైతుల చెంతకు చేర్చితే ఎంతో లాభసాటిగా ఉంటుంది. - డాక్టర్ మొరుపోజు పద్మయ్య, విశ్రాంత ప్రధాన శాస్త్రవేత్త, ఐసీఏఆర్ – ఐఐఓఆర్, రాజేంద్రనగర్, హైదరాబాద్. మొబైల్: 94407 08924నిర్వహణ: పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి డెస్క్ -
ఎనిమిది వారాల్లో కాలేయ మార్పిడి రోగులు కోలుకుంటున్నారు..
కాలేయ మార్పిడి శస్త్ర చికిత్స చేయించుకన్న చేయించుకున్న వారు ఎనిమిది వారాల్లోనే పూర్తి స్థాయిలో కోలుకుంటున్నారని సౌత్ ఏషియన్ లివర్ ఇనిస్టిట్యూట్ వ్యవస్థాపకులు, ప్రొఫెసర్ డాక్టర్ టామ్ చెరియన్ అన్నారు. ప్రపంచ అవయవ ట్రాన్స్ప్లాంట్ డే వేడుకలను ఆయన బంజారాహిల్స్లోని సౌత్ ఏషియన్ లివర్ ఇనిస్టిట్యూట్లో ఘనంగా నిర్వహించారు.ఈ వేడుకల్లో భాగంగా ఆయన 1995లో అయవవ దానంతో పాటు ట్రాన్స్ప్లాంటేషన్ చట్టం తీసుకొచ్చిన నాటి హెల్త్ ప్రిన్సిపల్ సెక్రటరీ మాజీ ఏఐఎస్ ఏపీవీఎన్ శర్మతో పాటు లివర్ దాతలను, కాలేయ గ్రహితలను ఆయన ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చాలా మందికి ఆల్కహాల్ వల్ల లివర్ సమస్యలు వస్తాయనే అపోహలు ఉన్నాయని 30 శాతం ఫ్యాటీ లివర్ కేసుల్లో మాత్రమే ఆల్కహాల్ వల్ల సంభవిస్తాయని 70 శాతం కేసుల్లో జన్యుపరంగా, డయాబెటిస్, ఒబేసిటి కారణాలు ఉంటాయని అన్నారు. ఫ్యాటీ లివర్ స్థాయిలో ఉన్నప్పుడు జాగ్రత్త పడాలని లివర్ సిరోసిస్గా మారి వ్యాధి ముదిరితే ఇబ్బందులు పడాల్సి వస్తుందని ఆయన అన్నారు. అవయవ దానంపై ఎంతో అవగాహన పెరుగుతుందని ప్రతియేటా దేశంలో 2లక్షల మందికిపైగా అవయవాలు ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకొని ఆరోగ్యంగా జీవిస్తున్నారని అయవవ ట్రాన్స్ప్లాంటేషన్ చికిత్సల్లో మన దేశంలో ప్రపంచంలోనే అయిదో స్థానంలో ఉందని ఆయన తెలిపారు. -
కేరళలో మళ్లీ నిపా వైరస్ కలకలం : హై అలర్ట్
కేరళలో మరో సారి నిపా వైరస్ (Nipah Virus) కలకలం రేపుతోంది. కోజికోడ్లోని ఫెరోక్కు చెందిన 40 ఏళ్ల వ్యక్తికి ప్రాథమిక పరీక్షలో నిపా వైరస్ సోకినట్లు నిర్ధారణ కావడంతో కేరళ ఆరోగ్య అధికారులు అప్రమత్త మయ్యారు. ప్రస్తుతం రోగి పరిస్థితి నిలకడగానే ఉందని పుణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (NIV) రిపోర్ట్ కోసం ఎదురు చూస్తున్నామని ఆరోగ్య అధికారులు తెలిపారు.ప్రాథమిక పరిశీలన ప్రకారం, రోగికి మొదట మామూలు జ్వరం వచ్చి తగ్గింది, ఆ తర్వాత మళ్లీ అనారోగ్యానికి గురయ్యాడు. నిపా అనుమానిత కేసుగా గుర్తించడానికి ముందు పలు ఆసుపత్రిలను సందర్శించిన తరువాత సదరు రోగి ప్రభుత్వ ఆసుపత్రి అవుట్పేషెంట్ విభాగానికి వచ్చారు. దీంతో మరింత ఆందోళన వ్యక్తమవుతోంది. ఒక గిడ్డంగిని శుభ్రం చేస్తున్నప్పుడు అతనికి ఈ ఇన్ఫెక్షన్ సోకి ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. ఆ ప్రదేశంలో వైరస్ సోకిన గబ్బిలాలు ఉండటమే వైరస్ వ్యాప్తికి ప్రాథమిక కారణమని దర్యాప్తు అధికారులు బలంగా అనుమానిస్తున్నారు. అయితే దీనికి సంబంధించిన ఖచ్చితమైన మూలాలు ఇంకా నిర్ధారణ కావాల్సి ఉంది. ఇదీ చదవండి: రూ. 954 కోట్ల స్కాం : భారత సంతతి వ్యాపారవేత్త అరెస్ట్దీంతో వైద్యశాఖ అప్రమత్తమైంది. పరిస్థితిని సమీక్షించి, తదుపరి చర్యలు తీసుకోనేందుకు గురువారం తిరువనంతపురంలోని ఆరోగ్యమంత్రి కె. మురళీధరన్ కార్యాలయంలో సీనియర్ ఆరోగ్య అధికారులతో సమావేశం కానున్నారు. ఆరోగ్య అధికారులు ఇప్పటికే కాంటాక్ట్-ట్రేసింగ్ చర్యలను ప్రారంభించారని, పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారని ఆరోగ్య మంత్రి ప్రకటించారు. ఆందోళన వద్దు : కేరళ ఆరోగ్య మంత్రిబాధిత వ్యక్తి చాలా మందిని కలిసినప్పటికీ, ప్రస్తుత దశలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి స్పష్టం చేశారు. సంబంధిత రోగి చికిత్స కోసం వెళ్లిన ప్రైవేట్ ఆసుపత్రిలోని పలు విభాగాలను సందర్శించారని, దీనివల్ల ఇతరులకు కూడా వైరస్ వ్యాపించి ఉండవచ్చనే ఆందోళనలు ఉన్నాయని మంత్రి తెలిపారు. ముందు జాగ్రత్త చర్యగా, ఆ రోగి వెళ్లినఆసుపత్రి సిబ్బందిని క్వారంటైన్లోకి వెళ్లాలని ఆదేశించినట్లు చెప్పారు.ఇదీ చదవండి: వాహనదారులకు గుడ్ న్యూస్, ఆ పెట్రోల్పై ఎక్సైజ్ సుంకం రద్దు -
40ల తరువాత అల్ట్రామారథాన్ : తృటిలో తప్పిన ముప్పు
ఆరోగ్యంగా ఉండాలని అందరూ అనుకుంటారు. ఉద్యోగ ఒత్తిళ్లు, గంటల తరబడి కూర్చునే జాబ్ నుంచి ఫిట్గా మారాలని నిర్ణయించుకుని, తీవ్ర కసరత్తు చేస్తారు. కానీ దీనికి సంబంధించి వైద్యుల సలహాలు, మందస్తు ప్రిపరేషన్ లేకపోతే ముప్పు తప్పదు. బెంగళూరుకు చెందిన ఒక ఉద్యోగికి ఎదురైన చేదు అనుభవం ఈ విషయాన్నే మరోసారి రుజువు చేసింది. పరుగు మంచిదే, కానీ ముందస్తు ప్రిపరేషన్ అవసరం,సురక్షితమైన ఆరోగ్యమే అంతిమ లక్ష్యం కావాలి అనే అంశంపై ఓ కథనం.బెంగళూరుకు చెందిన, 40 ఏళ్ల మధ్య వయసు కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్ ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని భావించాడు. ఏళ్ల తరబడి ఒత్తిడితో కూడినడెస్క్ జాబ్నుంచి ఫిట్గా మారాలను కున్నాడు. అంతేకాదు లాంగ్-డిస్టెన్స్ రన్నింగ్ను చేపట్టాలని నిర్ణయించుకున్నాడు అమెరికాలో 100 కిలోమీటర్ల అల్ట్రామారథాన్ను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. కానీ అంతలోనూ ఊహించని ప్రమాదం అతణ్ని మృత్యువు అంచుల దాకా తీసుకెళ్లింది. ఇంతకీ ఏమైందంటే.అల్ట్రామారథాన్కోసం శ్రద్ధగా శిక్షణ పొందాడు. గుండె జబ్బులు, ఇతర అనారోగ్య సంకేతాలవీ లేకుండా ఆరోగ్యంగా కనిపించాడు. ఆ తర్వాత జరిగిన సంఘటన అతనికి షాక్ ఇచ్చింది. అతను తన ప్రాక్టీస్ రన్ల సమయంలో ట్రాక్పై కుప్పకూలిపోయాడు. అక్కడే ఉన్న స్నేహితులు ఎమర్జెన్సీ రూమ్కు తీసుకువెళ్లారు. వైద్య పరీక్షలో అతని గుండెకు రక్తాన్ని సరఫరా చేసే మూడు ప్రధాన కరోనరీ ధమనులలో క్లాట్స్ ఉన్నట్లు తేలింది. అంతేకాదు ఆ తరువాత పరీక్షల్లో హై కొలెస్ట్రాల్ స్థాయిలు, కుటుంబంలో గుండె జబ్బుల చరిత్రతో సహా, ఏళ్లుగా గుర్తించడని పలు అంతర్లీన ప్రమాద కారకాలు బయటపడ్డాయి.ఒక విధంగా చెప్పాలంటే అతను చాలా అదృష్టవంతుడు. ఒక పెను ప్రమాదం జరగక ముందే అతని పరిస్థితిని గుర్తించారు. గుండె ఆరోగ్యానికి పరుగు ఉత్తమమైన వ్యాయామమే అయినప్పటికీ, మధ్య వయస్సులో ఎలాంటి ముందస్తు సన్నాహం లేకుండా అకస్మాత్తుగా తీవ్రమైన ఓర్పు శిక్షణను ప్రారంభించడం, సంవత్సరాలుగా నిశ్శబ్దంగా ఉన్న అంతర్లీన వ్యాధిని కొన్నిసార్లు బయట పెట్టగలదని ఈ కేసు గుర్తు చేస్తుంది.పరుగు తీయడం వల్ల గుండె జబ్బులు రావు. నిజానికి ఇది గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అయితే, సుదీర్ఘకాలం పాటు ఎటువంటి శారీరక శ్రమ లేకుండా చాలా కాలం గడిపి, ఒక్కసారిగా 40 ఏళ్ల వయసులో తీవ్రమైన పరుగు పందాలు (మార్గాథాన్లు) ప్రారంభించడం వల్ల, లోపల దాగి ఉన్న గుండె సమస్యలు అకస్మాత్తుగా బయటపడే ప్రమాదం ఉంది. 40 ఏళ్లు పైబడిన వారు ఎందుకు జాగ్రత్తగా ఉండాలి?అధిక కొలెస్ట్రాల్, బీపీ, మధుమేహం, ధూమపానం వంశపారంపర్య గుండె జబ్బుల వంటి రిస్క్ ఫ్యాక్టర్లు చాలా సంవత్సరాలుగా లోపల నెమ్మదిగా ధమనులలో కొవ్వు పేరుకుపోయేలా చేస్తాయి.బయటకు ఎంతో ఫిట్గా కనిపించే వ్యక్తికి కూడా లోపల గుండె ధమనులలో తీవ్రమైన బ్లాక్స్ ఉండే అవకాశం ఉంది.ఒక్కసారిగాతీవ్రంగా శ్రమించడం వల్ల గుండెపై ఒత్తిడి పెరిగి, రక్తపోటు ఎక్కువ అవుతుంది. దీనివల్ల లోపల ఉన్న కొవ్వు పలకలు (plaques) ఊడిపోయి హార్ట్ ఎటాక్కు దారితీయవచ్చు.40 ఏళలు దాటిన తరువాత ముందే కార్డియాక్ స్క్రీనింగ్ అంటే గుండె పరీక్షలు చేయించుకోవాలి. డాక్టర్ల సలహా మేరకు ECG, ఎకోకార్డియోగ్రామ్ , ట్రెడ్మిల్ టెస్ట్ వంటివి చేయించుకోవడం ఉత్తమం. పరుగు, లేదా కఠిన వ్యాయామాలను ఆరంభించే ముందు ఒకసారి వైద్యులను సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలి.ప్రధానంగా రక్తపోటు, రక్తంలో చక్కెర స్థాయిలు, కొలెస్ట్రాల్ పరీక్షలతో ఫ్యామిలీ హిస్టరీని కూడా పరిగణనలోకి తీసుకోవాలి.రిస్క్ ఎక్కువగా ఉన్నవారికి 'కరోనరీ CT యాంజియోగ్రఫీ' ద్వారా లోపల ఉన్న బ్లాక్స్ను ముందే గుర్తించవచ్చు.వ్యాయామాన్ని ఒకేసారి తీవ్రం చేయకూడదుకొన్ని సంవత్సరాలుగా రన్నింగ్ చేయని వారు ఒక్కసారిగా కొన్ని నెలల్లోనే పెద్ద రేసులకు సిద్ధం కాకూడదు.తొలుతసాధారణ నడకతో ప్రారంభించి, ఆపై వేగంగా నడవడం (Brisk Walking), ఆ తర్వాతే రన్నింగ్ చేయడం అలవాటు చేసుకోవాలి.వేగం లేదా దూరం కంటే క్రమం తప్పకుండా చేయడం (Consistency) ముఖ్యం. దీనివల్ల గుండె, కండరాలు, కీళ్లకు తగిన సమయం దొరుకుతుంది.మరి ఏం చేయాలి?40 ఏళ్లు దాటిన తర్వాత శరీరంలో కండరాల సాంద్రత సహజంగానే తగ్గుతుంది. కాబట్టి కేవలం పరుగు మాత్రమే సరిపోదు. స్ట్రెంత్ ట్రైనింగ్ (కండరాల వ్యాయామం) తప్పనిసరివారానికి కనీసం రెండు సార్లు కండరాలను బలోపేతం చేసే వ్యాయామాలు (Strength Training) చేయాలి.ఇది మోకాళ్లు, నడుము, తుంటి భాగాలపై ఒత్తిడిని తగ్గించి గాయాలు కాకుండా కాపాడుతుంది.అంతేకాదు భారీ భోజనం వెంటనే రన్నింగ్ చేయకూడదు. ఆహారం తిన్న తర్వాత కనీసం రెండు గంటల సమయం ఇచ్చి, ఆపై రన్నింగ్ చేయడం వల్ల జీర్ణక్రియ సమస్యలు రావు. శరీరం కూడా బాగా సహకరిస్తుంది. ఇదీ చదవండి: 10 రోజులు లీవ్ తర్వాత ఉద్యోగికి బాస్ బంపరాఫర్ -
గంటలతరబడి కుర్చీలో కూర్చుంటున్నారా.. అయితే జాగ్రత్త!
ఆధునిక యుగంలో సాఫ్ట్వేర్ ఉద్యోగులు, ఐటీ ఉద్యోగులు, వ్యాపారస్తుల్లో కొంతమంది గంటల తరబడి కుర్చీలకే పరిమితమవుతున్నారు. దీంతో అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి అంటున్నారు వైద్య నిపుణులు. దీన్నే 'సిట్టింగ్ డిసీజ్' అని పిలుస్తున్నారు. ఈ సిట్టింగ్ డిసీజ్ ఇతర రోగాలకన్న ప్రమాదకరమైనది. చాపకింద నీరులా.. అనారోగ్య సమస్యల్ని మరింత తీవ్రం చేస్తుంది.ఆరోగ్య సమస్యలు..ఒకే చోట గంటల తరబడి కూర్చోవడం వల్ల వెన్నెముకపై తీవ్ర ఒత్తిడి పడుతుంది. ఫలితంగా నడుము, మెడ నొప్పులు వస్తాయి. అలాగే శారీరక శ్రమ లేకపోవడం వల్ల క్యాలరీలు ఖర్చు కాక స్థూలకాయానికి దారి తీస్తుంది. రక్తప్రసరణ మందగించి, గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుంది. శరీరం ఇన్సులిన్ను సరిగ్గా ఉపయోగించుకోలేదు. దీనివల్ల టైప్-2 డయాబెటిస్ వచ్చే అవకాశం ఉంది. దీంతోపాటు స్క్రీన్లను నిరంతరం చూడటం వల్ల కళ్లు పొడిబారడం, తలనొప్పి అదనంగా వచ్చే అనారోగ్య సమస్యలు.అయితే, ఎంత సేపు కూర్చుంటే, ఎంత ప్రమాదం ఉంటుందనే విషయంలో కొన్ని లెక్కలు చెబుతున్నారు నిపుణులు.రోజుకి 4 గంటలోపు కూర్చుంటే.. ప్రమాద తీవ్రత కాస్త తక్కువే ఉంటుందట.అదే 4 - 8 గంటలు కూర్చోవడంతో మధ్యస్థ ప్రమాదంగా చెప్పవచ్చు.8- 11 గంటలు పాటు కూర్చోవడంతోనే మరింత ఎక్కువ ప్రమాదానికి దారి తీస్తుందంటున్నారు.రోజుకి 11 గంటల కంటే ఎక్కువ సమయం కూర్చోవడం అంటే ప్రమాదం అంచున ఉన్నట్టే. ఎంతలా అంటే.. హఠాత్తుగా గుండెపోటు రావడం, పక్షవాతం, శరీరం చలించకపోవటంవంటి సమస్యలు వస్తాయి.ఈ ప్రమాదంనుంచి మనల్ని మనం రక్షించుకోవాలంటే కనీసం వ్యాయామం తప్పనిసరి. క్రమం తప్పని వ్యాయామంతో ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి?20-20-20 నియమం: ప్రతి 20 నిమిషాలకు ఒకసారి స్క్రీన్ చూడటం ఆపాలి. 20 సెకన్ల పాటు 20 అడుగుల దూరంలోని వస్తువును చూడటం వల్ల కంటి రెటినా పొర చల్లబడుతుంది.చిన్న విరామాలు: ప్రతి గంటకు కనీసం 5 నిమిషాలు సీటు నుండి లేచి నడవాలి. దాంతో శరీర కండరాల్లో కదలిక వల్ల రక్త ప్రసరణ సక్రమంగా సాగుతుంది.సరైన భంగిమ: వెన్నుముక నిటారుగా ఉండేలా కుర్చీలో కూర్చోవాలి. వెన్నుముక వంపుగా ఉంచి.. కుర్చీని ఆనుకుని ఉండటం వల్ల శరీరం మొద్దుబారి, మెదడు నిద్దురను కోరుకుంటుంది.స్క్రీన్ ఎత్తు: కంప్యూటర్ మానిటర్ మన కంటి ఎత్తుకు సమానంగా ఉండేలాగా చూసుకోవాలి. దీంతో మెడ కండరాల్లో నొప్పి రాకుండా ఉంటుంది.శారీరక వ్యాయామం: మెడ, చేతులు అలాగే నడుమును క్రమంగా స్ట్రెచ్ చేస్తూనే ఉండాలి. కదలకుండా కూర్చోవడంతో శరీర కండరాలు తిమ్మిరెక్కి, రక్త ప్రసరణకు అంతరాయం కలుగుతుంది.హైడ్రేషన్: పని మధ్యలో తగినంత నీరు తాగడం వల్ల గుండె సంబంధిత వ్యాధులు రాకుండా కాపాడవచ్చు. -
అదే తలమానికం.. మార్చుకోకండి!
మన తలపై ఉండే ఉపరితల భాగమైన మాడును ఇంగ్లిష్లో స్కాల్ప్ను అంటారన్నది తెలిసిందే. నిజానికి మాడు అంటే అదో దేహ భాగం అనుకునేందుకు అవకాశముంది. కానీ అది సరికాదు... ఇంగ్లిష్లో పేరు పెట్టిన ఆ యాక్రొనిమ్కి విస్తృతార్థం ఉంది. ఇంగ్లిష్ స్కాల్ప్ స్పెల్లింగ్లోని ఐదు ఇంగ్లిష్ అక్షరాల్లో... ‘ఎస్’ అంటే స్కిన్ అనీ, ‘సీ’ అంటే కనెక్టివ్ టిష్యూ అనీ, ‘ఏ’ అంటే ఎపోన్యూరోటికా అనీ, ‘ఎల్’ అంటే లూజ్ ఏరియోలా అనీ, ‘పీ’ అంటే పెరియాస్టియమ్ అని అర్థం. ఆ ఐదు అక్షరాలూ కలిసి ‘స్కాల్ప్’గా ఏర్పడ్డాయని ఈ పదాల వల్ల తెలుస్తుంది. ఇందులో మొదటిదైన స్కిన్ అంటే చర్మం నుంచి మొదలుకొని... ‘పి’ అంటే పెరియాస్టియమ్ అనే పుర్రె ఎముక వరకు వరసగా ఉంటే పొరల తాలూకు ఇంగ్లిష్ పేర్లతో ఈ ‘స్కాల్’ అనే ఇంగ్లిష్ పదం ఏర్పడింది. మాడు అనే స్కాల్ప్ సంరక్షణ ఎలాగో తెలుసుకుందాం...మాడును వెంట్రుకలు కప్పేసి ఉంచి కొంత రక్షణ కల్పిస్తాయి. అయితే ఈ వెంట్రుకలు దట్టంగా ఉన్నవారిలో ఎండకూ, వెలుతురుకూ అడ్డు పడటం ద్వారా అక్కడ పుట్టే చెమట తాలూకు తేమ వాతావరణం కొన్ని సూక్ష్మజీవులు పెరిగే వాతావరణాన్ని కల్పించడం వల్ల దురద రావడం వంటి నలుగురిలో ఇబ్బంది పెట్టే లక్షణాలూ కనిపించవచ్చు. అలాగే ఎండ వల్ల కూడా మాడుపై కొన్ని అనర్థాలూ కనిపించవచ్చు. ఆ అనర్థాలూ, నష్టాలూ ఎలా వస్తాయో చూద్దాం.ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటే మాడుకు కలిగే అనర్థాలేమిటంటే...మానవ దేహం మీద మిగతా చర్మంతో పోలిస్తే మాడు మీద ఉండేవీ... నూనె స్రవించే గ్రంథుల సంఖ్య దాదాపు పది రెట్లు ఎక్కువ. ఈ నూనెను స్రవించే గ్రంథులను సెబేషియస్ గ్లాండ్స్ అని పిలుస్తారు, అలా స్రవించే నూనెను సీబమ్ అంటారు. ఈ సీబమ్ ఎప్పుడూ స్రవిస్తూ ఉన్నప్పటికీ ఎంత తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు మరింత ఎక్కువగా సీబమ్ స్రవిస్తుంటుంది. దానికి తోడు మిగతా చర్మం కంటే మాడులో ఈ సెబేషియస్ గ్రంథులు పది రెట్లు ఎక్కువ కావడం వల్ల స్రావాల పరిమాణం కూడా బాగా పెరురుగుతుంది. దాంతో చర్మం త్వరగా జిడ్డుగా మారే అవకాశాలెక్కువ.చర్మంలో ప్రధానంగా మూడు రకాలుంటాయి. అవి... 1. పొడి చర్మం (డ్రై స్కిన్)2. సాధారణ చర్మం (మాడరేట్ స్కిన్)3. జిడ్డు చర్మం (ఆయిలీ స్కిన్)పైన చెప్పిన నేపథ్యంలో జిడ్డు చర్మం (ఆయిలీ స్కిన్) ఉన్నవారిలో సీబమ్ మరింత ఎక్కువగా స్రవిస్తుంటుంది. దాంతో ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న సమయాల్లో తల మరింత జిడ్డుగా మారడం చాలా సాధారణం. దానికి తోడు చర్మంపై చెమట పట్టే గుణం ఎక్కువగా ఉన్నవారిలో తల మరింత జిడ్డుగా మారే అవకాశాలెక్కువ.జిడ్డు చర్మంపై చుండ్రు ప్రభావం ఎందుకు ఎక్కువగా ఉంటుందంటే...‘మలసేజియా’ అనే ఒక రకం ఫంగస్ పెరగడానికి మన తలపైన ఉండే మాడు చాలా అనువైన ప్రదేశం. ఆ మలసేజియా ఫంగస్ అనేది ఈ ‘సీబమ్’ను ఆహారంగా తీసుకుంటుంది. దాంతో సీబమ్ ఎక్కువగా స్రవించేవారిలో మలజేజియా పెరగడానికి అనువైన వాతావరణం ఏర్పడుతుంది. ఫలితంగా ఈ ఫంగస్ మరింత ఎక్కువగా వృద్ధి చెంది అదే చుండ్రు పెరుగుదలకు కారణమవుతుంది. దానికి తోడు తలమీద ఫంగస్ మరింతగా పెరిగిపోతే అది ‘సెబోరిక్ డర్మటైటిస్’ అనే చర్మవ్యాధికి కారణమై... చర్మంపై నుంచి జిడ్డు పొడిబారినప్పుడు అది పొట్టుగా రాలుతుంటుంది. అందుకే మాడుపైన ఈ తరహా పెరుగుదల ఉన్నవారి తలలో దురదగా ఉండటం, గీరినప్పుడు పొట్టు రాలుతుండటంతో నలుగురిలో ఇబ్బందిగా ఫీలవుతుంటారు.ఫాలిక్యులైటిస్ వంటి సమస్యలు కూడా... మాడుపై సీబమ్ ఎక్కువగా స్రవించడంతో పాటు కొందరిలో వారి శరీర తత్వాన్ని బట్టి చెమట ఎక్కువగా పడుతుండటం, దానికి తోడు జుట్టు దట్టంగా ఉండేవారిలో ఈ చెమట కారణంగా తలలో చెమ్మ వాతావరణం ఏర్పడి... అక్కడ మరికొన్ని రకాల బ్యాక్టీరియా కూడా విపరీతంగా పెరుగుతుంది. వాటి కారణంగా కొందరిలో రోమాంకురాలకు (హెయిర్ ఫాలికిల్స్కు) ఇన్ఫెక్షన్స్ రావచ్చు. ఈ సమస్యనే వైద్యపరిభాషలో ‘ఫ్యాలిక్యులైటిస్’ అంటారు. ఈ సమస్య వచ్చిన వారిలో మాడు మీద చీము పొక్కులు (పస్ నిండినట్లుగా కనిపించే కురుపులు, గుల్లలు) వస్తుంటాయి. వాటి వల్ల తీవ్రమైన నొప్పి, విపరీతమైన దురద రావచ్చు. ఈ పరిస్థితి కూడా ఆ వ్యక్తుల్ని నలుగురిలో మెలగడానికి చాలా ఇబ్బందికరంగా ఉండేలా చేస్తుంది.ఎలా దువ్వుకోవడం అన్నది మాడుకు మంచిదంటే...జుట్టు రాలకుండా ఉండటంతో పాటు మాడు ఆరోగ్యం బాగుండాలంటే జుట్టు దువ్వుకునే సమయంలో ఈ కింద పేర్కొన్న జాగ్రత్తలు పాటించడం మేలు.తల మీద ఉన్న జుట్టు కుదుళ్లకు రక్త ప్రసరణ బాగా జరిగితే జుట్టు ఆరోగ్యంగా ఉండటంతో పాటు త్వరగా రాలిపోకుండా ఉంటుంది. ఇందుకోసం పరిశుభ్రమైన మంచి దువ్వెనతో దువ్వుకోవడం మంచిది.జుట్టును పాయలు పాయలుగా విడదీస్తూ, కుదుళ్ల మొదలు దగ్గర నుంచి చివర్ల వరకు జుట్టును దువ్వాలి. ఇందుకు మరీ సన్నటి పళ్లు ఉన్న దువ్వెన కంటే కాస్తంత వెడల్పాటి పళ్లు ఉన్న దువ్వెనతో దువ్వడమే మంచిది. సన్నటి పళ్ల దువ్వెన వల్ల జుట్టును లాగినట్టుగా ఉంటుంది. కాస్త వెడల్పాటి పళ్లున్న దువ్వెన వల్ల రోమాంకురాలకు అంతగా నష్టం ఉండదు. జుట్టును ఇలా పాయలు పాయలుగా విడదీసే సమయంలో మాడుపై వెలుగూ వెలుతురూ ఎక్కువగా ప్రసరించడం వల్ల చుండ్రు పెరిగే వాతావరణానికి భంగం కలిగి చుండ్రు అంతగా పెరగదు. దీనికి తోడు ఇలా దువ్వడం వల్ల తలలో దుమ్ము తగ్గి అది మాడుకు మేలు చేస్తుంది.మాడు సంరక్షణ కోసం ఆహారపరమైన జాగ్రత్తలివి...మనం తీసుకునే ఆహారంలో కూరగాయలు, ఆకుకూరలు, ప్రోటీన్లు, ఖనిజలవణాలతో పాటు తాజా పండ్లు కూడా ఉండేలా చూసుకోవాలి. ఇలా అన్ని రకాల పోషకాలతో కూడిన సమతుల ఆహారం తీసుకుంటూ, తగినన్ని ద్రవాహారాలూ, నీళ్లు తీసుకుంటూ ఉండటం వల్ల మంచి ఆరోగ్యం లభించడంతో పాటు వ్యాధి నిరోధక వ్యవస్థ కూడా బలోపేతమవుతుంది. దాంతో సాధారణ ఆరోగ్యం బాగుండటంతో పాటు... మాడుకు వచ్చే అనేక సమస్యలూ నివారితమవుతాయి.ప్రతిరోజూ రెండు లీటర్లకు తగ్గకుండా లేదా కనీసం ఎనిమిది నుంచి పది గ్లాసులకు తగ్గకుండా నీళ్లు తాగుతూ ఉండడటం వల్ల మాడు మీద ఏర్పడుతుండే మృత కణాలు ఎప్పటికప్పుడు తొలగిపోతాయి. దాంతో మాడు ఎప్పుడూ ఆరోగ్యంగా ఉంటుంది.జుట్టు సంబంధిత సమస్యలు ఉన్నవారు వీలైనంతవరకు మాంసం, పంచదార, మైదా, స్ట్రాంగ్ టీ, కాఫీ, పచ్చళ్లు, నిల్వ పదార్థాలకు దూరంగా ఉండటం మంచిది. అయితే తప్పనిసరి అయినప్పుడు వీటిని చాలా పరిమితంగా తీసుకోవాలి.మాడు విషయంలో డాక్టర్ను ఎప్పుడు సంప్రదించాలంటే...ఈ కింద పేర్కొన్న లక్షణాలలో ఏదైనా కనిపిస్తే మాడుకు ఏదైనా సమస్య వచ్చినట్లు గ్రహించి తక్షణం డాక్టర్ను సంప్రదించడం మంచిది. ఆ లక్షణాలేమిటంటే...మాడు మీద దురద విపరీతం వస్తూ మరింతగా పెరుగుతూ పోతుండటంఎండలోకి వెళ్లగానే దురద మరింతగా పెరగడంమాడుపైన ఎర్రగాగనీ లేదా చీముతో కూడిన కురుపులు కనిపించడంమాడు మీద తెలుపు లేదా గ్రే కలర్లో పెచ్చులు వస్తున్నప్పుడుఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ జుట్టు మరింతగా రాలిపోతుండటం.అపోహలూ... వాస్తవాలుమంచి షాంపూతో తల స్నానం చేశాక ఎండలోకి వెళ్తే జుట్టు బాగా మెరుస్తూ అందంగా కనిపిస్తుంటుందనీ, అలాగే ఎండ నుంచి రక్షించుకోడానికి హెల్మెట్ పెట్టుకోవడం వల్ల జుట్టు రాలిపోతుందనే అపోహలు చాలామందిలో ఉంటాయి. అవెంతవరకు వాస్తవమో చూద్దాం.ఎండవేడిమిలో జుట్టు ఆరబెట్టుకుంటే సూర్మరశ్మి కారణంగా వెంట్రుకలు మెరిసిపోతూ జుట్టు అందం ఇనుమడిస్తుందా?ఇది చాలామందిలో ఉండే అపోహే. మంచి షాంపూతో తలస్నానం చేశాక... కాసేపు మంచి ఎండలో వెంట్రుకలను ఆరబెట్టుకోవడం వల్ల జుట్టు బాగా మెరుస్తూ కనిపిస్తుందని చాలామంది అనుకుంటుంటారు. నిజానికి జుట్టుపై ఎండ తీవ్రత నేరుగా పండటం అంత మంచిది కాదు. నేరుగా వెంట్రుకలపై పడే ఎండ తీవ్రత వాటిని డల్గా మార్చేసేందుకు అవకాశాలెక్కువ. జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే... ఎండ సమయంలో వెంట్రుకలకు రక్షణగా గాలి ఆడుతూ ఉండే బ్రిమ్ హ్యాట్ లేదా క్యాప్ ధరించడం మేలు. కాస్తంత వదులుగా ఉండే కాటన్ క్యాప్ అయితే మరీ మంచిది. అంచులు వెడల్పుగా ఉండే బ్రిమ్ క్యాప్ అయితే వెంట్రుకలకు మరింత ఎక్కువ రక్షణ కలుగుతుంది.ఎండ వల్ల కూడా జుట్టు రాలే ముప్పు... ఎండ తీవ్రత నేరుగా మాడుపై పడే కొందరిలో జుట్టు రాలిపోయే ముప్పు కూడా ఎక్కువే. దీనికి కారణమూ ఉంది... నేరుగా వెంట్రుకలపై పడే ఎండ కారణంగా కొందరిలో ‘రోమాంకురాలు’ (హెయిర్ ఫాలికిల్స్) దెబ్బతినే ప్రమాదమూ ఉంటుంది. ఫలితంగా వెంట్రుకలు రాలిపోతుంటాయి. ఈ సమస్యనే ‘ఎక్టినిక్ టెలోజెన్ ఎఫ్లూవియమ్’ అని కూడా అంటారు. ఈ సమస్యతో పాటు మరికొందరిలో నుదుటి మీద చిన్న చిన్న పొక్కులు లేదా మొటిమల వంటివి కూడా కనిపిస్తుంటాయి. ఎండ తీవ్రత నుంచి మాడును రక్షించుకోవడమిలా...ఎండలో మాడును రక్షించుకోడానికీ, దాని ఆరోగ్యాన్ని కాపాడుకోడానికి ఈ కింద పేర్కొన్న సూచనలు పాటించడం మేలు. అవి...మాడుపై సీబమ్ ఎక్కువగా స్రవించే దేహలక్షణం ఉన్నవారిలో జుట్టు జిడ్డుగా మారడం చాలా ఎక్కువ. ఆ జిడ్డు కారణంగా జుట్టు మరీ ఎక్కువ డల్గా కనిపించవచ్చు. ఇలా జుట్టు డల్గా కనిపించకూడదంటే... జిడ్డు చర్మం ఉన్నవారు వారంలో రెండు సార్లు లేదా రోజు విడిచి రోజు తలస్నానం చేయడం మంచిది.స్కాల్ప్పైనున్న మన దేహ భాగంలో పీహెచ్ విలువ 5.5 ఉంటుంది. ఇలాంటివారు సరిగ్గా ఇదే పీహెచ్ ఉన్న షాంపూలను వాడితే అది వాళ్ల మాడుకు ఉపయుక్తంగా ఉంటుంది.చుండ్రు లేదా ఫాలిక్యులైటిస్ సమస్యలు ఉన్నవారు తప్పనిసరిగా డర్మటాలజిస్టులను పాటించడం మంచిది. సాధారణంగా చుండ్రు ఉన్నవారికి డర్మటాలజిస్టులు వారికి అనువైన లేదా కీటకెనజోల్ వంటి యాంటీఫంగల్ షాంపూలను సూచిస్తుంటారు. ఆ మేరకు బాధితులు వాటిని మెయింటెనెన్స్ ట్రీట్మెంట్లాగా వాడుకోవచ్చు.జిడ్డు చర్మం, జిడ్డుగా ఉండే మాడు ఉన్నవారు తలకు నూనె పట్టించడం అంత మంచిది కాదు.ఎక్కువగా నీళ్లు తాగడంతో పాటు, ద్రవాహారాలు కూడా ఎక్కువగా తీసుకోవడం అన్నది జిడ్డు చర్మంతో ఉండేవారితో పాటు అందరికీ మేలు చేసే అంశం.హెల్మెట్ వల్ల జుట్టు రాలుతుందా? హెల్మెట్ పెట్టుకోవడం వల్ల జుట్టు మరింత ఎక్కువగా రాలుతుందనే అపోహ చాలామందిలో ఉంటుంది. గాలి ఆడక చెమట పడుతుండటం వల్ల ఇలాంటి అభి్రపాయం చాలామందిలో కలగడం చాలా సాధారణం. అయితే నిజానికి హెల్మెట్ అన్నది ప్రమాద సమయంలో తలనూ ్రపాణాలనూ కాపాడటమే కాదు... దాన్ని ధరించడం వల్ల అది ఇటు జుట్టునూ, అటు మాడునూ ఏకకాలంలో రక్షిస్తుంటుంది. అంతేకాదు... బయటి వాతావరణంలోని కాలుష్యం నుంచి కూడా జుట్టును కాపాడుతుంది. నిజం చెప్పాలంటే... హెల్మెట్ ధరించని బైక్ రైడర్స్తో పోలిస్తే హెల్మెట్ వాడే వారిలోనే జుట్టు రాలిపోకుండా సురక్షితంగా ఉంటుందని చెప్పవచ్చు.హెల్మెట్ వాడే వారు పాటించాల్సిన సూచన... అయితే హెల్మెట్ తొడుక్కునేప్పుడు ఒక జాగ్రత్త పాటిస్తే మంచిది. ఒక పరిశుభ్రమైన పొడి గుడ్డను కాస్తంత లూజ్గా ఉండేలా తల మీద కప్పుకొని, ఆ పైనుంచి హెల్మెట్ ధరించాలి. ఆ గుడ్డ కూడా కాటన్తో తయారైన మృదువైన కర్చిఫ్లాంటిదైతే మరింత మేలు. ఇలా ధరించడం వల్ల హెల్మెట్ పైభాగం ఆ వ్యక్తి తాలూకు చెమటతో తడిసిపోకుండా ఎప్పుడూ పొడిగా ఉంటుంది. దాంతో చెమటతో తడిసిన హెల్మెట్నే మాటిమాటికీ పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. మనం తలపైన పరచుకునే గుడ్డను మారుస్తూ దాన్ని మాటిమాటికీ ఉతుక్కోవచ్చు. ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఉతికిన వస్త్రాన్ని వాడుకోవచ్చు. అయితే ఇలా కాకుండా హెల్మెట్ను నేరుగా ధరిస్తుంటే... దాన్ని శుభ్రపరచుకోవడం సాధ్యం కాదు కాబట్టి నిపుణులు ఈ జాగ్రత్తను సూచిస్తుంటారు.చివరగా... మనిషిని చూడగానే మొదటగా అందరికీ కనిపించేది తల... దానిపైన ఉండే మాడు భాగం మాత్రమే. అది ఆరోగ్యంగా కనిపిస్తుంటేనే సదరు వ్యక్తి కూడా పూర్తిగా ఆరోగ్యకరంగా ఉన్నట్లు కనిపిస్తుంటాడు. కేవలం నలుగురిలోకి వెళ్లినప్పుడు కలిగే ఇబ్బందికరమైన పరిస్థితిని తొలగించుకోడానికే కాకుండా... మాడును ఆరోగ్యంగా ఉంటేనే మనిషి కూడా ఆరోగ్యంగా కనిపిస్తాడని గుర్తుంచుకోవాలి. ఆ మేరకు మాడు విషయంలో జాగ్రత్త వహించడమన్నది మిగతా దేహ ఆరోగ్యానికీ మేలు చేసే అంశమని గుర్తుంచుకోవాలి. - డాక్టర్ స్వప్నప్రియ, సీనియర్ డర్మటాలజిస్ట్నిర్వహణ : యాసీన్ -
బ్రెయిన్ ట్యూమర్కి వైఫై, స్మార్ట్ఫోన్లే కారణమా?
గత కొంతకాలంగా బ్రెయిన్ ట్యూమర్ కేసులు అంతకంతకు పెరుగుతున్నాయి. దాంతో అంతా మొబైల్ ఫోన్లు, వైఫై రౌటర్లు, స్క్రీన్ టైం తదితరాలే అందుకు కారణమని చాలామంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పైగావీటన్నింటికి ఒత్తిడి కూడా తోడవ్వుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ జూన్ 8 ప్రపంచ బ్రెయిన్ ట్యూమర్ డే (World Brain Tumor Day) సందర్భంగా డిజిటల్ వినియోగం ఈ సమస్యకు ఎంత వరకు కారణం? శాస్త్రీయపరంగా ఇది ఎంత వరకు కరెక్ట్ వంటి వాటి గురించి సవివరంగా తెలుసుకుందామా..!.వై-ఫై, స్మార్ట్ఫోన్లు, ఒత్తిడి, లేదా అధిక స్క్రీన్ టైమ్ వంటివే బ్రెయిన్ ట్యూమర్కి ప్రధాన కారణమని చెప్పడానికి సరైన ఆధారాలే లేవని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. నిజంగా డిజిటల్ వాడకం వల్ల రేడియేషన్ బారినపడతారనే దానిపై లోతుగా అధ్యయనం చేయాల్సి ఉందన్నారు. మొబైల్ ఫోన్లు మరియు వై-ఫై పరికరాల నుంచి లువడే రేడియోఫ్రీక్వెన్సీ (RF) రేడియేషన్ కారణంగానే ఈ ఆందోళన వ్యక్తమైందది గానీ..ఎక్స్-రేలు లేదా అణు పదార్థాల నుంచి వెలువడే అయనీకరణ రేడియేషన్ లా కాకుండా RF రేడియేషన్ను తక్కువ-శక్తి గలదిగా, అయనీకరణం చెందనదిగా పరిగణిస్తారని అన్నారు. అందువల్లే కేన్సర్ పరిధకులు..మొబైల్ ఫోన్లు లేదా వై-ఫై సాధారణ వాడకం బ్రెయిన్ కేన్సర్కు కారణమని నిర్థారించలేమని చెబుతున్నారు. స్మార్ట్ఫోన్ వాడకం బ్రెయిన్ ట్యూమర్ ప్రమాదాన్ని ఎంత మేరకు కలిగించగలదో చేసిన అధ్యయనంలో మిశ్రమ ఫలితాలే వచ్చాయన్నారు. కొన్ని అధ్యయనాల్లో ఫోన్ని అతిగా వాడే వారిలో కొన్ని అరుదైన కణితులు పెరిగినట్లు తేలిందని..మరికొన్ని పరిశోధనల్లో సరైన ఫలితాలివ్వలేదని చెబుతున్నారు. దీనిపై మరింత దీర్ఘకాలిక పరిశోధన అవసరమని చెబుతున్నారు.అధిక స్క్రీన్ సమయం బ్రెయిన్ని దెబ్బతీస్తుందా?స్క్రీన్ సమయం బ్రెయిన్ ట్యూమర్కి కారణమని నేరుగా చెప్పలేకపోయినా.. అధికంగా వాడకం మాత్రం ఇతర మార్గాల్లో మొత్తం ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే ప్రమాదం లేకపోలేదన్నారు. ఒకవేళ స్క్రీన్ల ముందు ఎక్కువ గంటలు గడడితే మాత్రం..కంటి ఒత్తిడి, తలనొప్పులునిద్ర నాణ్యత తగ్గడంఒత్తిడి, ఆందోళన పెరగడంశారీరక శ్రమ తగ్గడంమానసిక అలసటకానీ స్క్రీన్ల నుంచి వెలువడే నీలి కాంతి, ముఖ్యంగా రాత్రి పొద్దుపోయాక పరికరాలను ఉపయోగించినప్పుడు, మెలటోనిన్ ఉత్పత్తికి ఆటంకం కలిగించి, నిద్ర చక్రాలను కూడా భంగపరచవచ్చు. అందుకే ఆరోగ్య నిపుణులు వినోదం కోసం చూసే స్క్రీన్ సమయాన్ని పరిమితం చేసుకోవాలని, క్రమం తప్పకుండా విరామం తీసుకోవాలని సూచిస్తున్నారు. ఏదీఏమైనా..ఈ అధిక డిజిటల్ వినియోగం మానసిక శారీరక ఆరోగ్యంపై కచ్చితంగా ప్రతికూల ప్రభావం చూపుతుందని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు.ఒత్తిడి కారణమా?కేన్సర్తో సహా అన్ని రోగాలకు ఒత్తిడే కారణమని చెబుతుంటారు. దీర్ఘకాలిక ఒత్తిడి రోగనిరోధక శక్తిని బలహీనపరిచి, వాపును పెంచి, మొత్తం ఆరోగ్యాన్ని ప్రభావితం చేసినప్పటికీ..ఒత్తిడి మెదడు కణితులకు కారణమవుతుందని నిరూపించే శాస్త్రీయ ఆధారాలు మాత్రం లేవనే అంటున్నారు.అసలు కారణం ?చాలా సందర్భాలలో, మెదడు కణితులకు ఖచ్చితమైన కారణం తెలియాల్సి ఉందన్నారు. అయితే, శాస్త్రవేత్తలు తమ పరిశోధనల్లో అనేక ప్రమాద కారకాలను గుర్తించారు. అవేంటంటే..జన్యుపరమైన పరిస్థితులు, వారసత్వంగా వచ్చే సిండ్రోమ్లుఅధిక మోతాదులో అయోనైజింగ్ రేడియేషన్కు గురికావడంవయస్సుకొన్ని రకాల కేన్సర్ల కుటుంబ చరిత్రఅరుదైన సందర్భాల్లో పర్యావరణ విషపదార్థాలుసాధ్యమైనంత వరకు మంచి నిద్ర, ఒత్తిడి నిర్వహణ, క్రమం తప్పని వ్యాయామం, సమతుల్య పోషణతో ఆరోగ్యంగా ఉండే ప్రయత్నం చేయాలి. అలాగే రెగ్యులర్ చెకప్లతో ముందుగానేబ్రెయిన్ ఆరోగ్యంపై దృష్టి పెట్టడం వంటివి చేస్తే..ఈ సమస్య దరిచేరదని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. -
ఏడాదిగా తలనొప్పి, చూపు మసక : బహుపరాక్
World Brain Tumour Day 2026 బాపట్ల జిల్లాకు చెందిన ఎస్.శ్రీహరి ఏడాదిగా తలనొప్పి, చూపు మసకగా కనిపించం లాంటి లక్షణాలతో బాధపడుతూ పలు ఆస్పత్రులు తిరిగినా సమస్య పరిష్కారం కాలేదు. చిట్టచివరకు గుంటూరులో న్యూరోసర్జరీ వైద్యులను సంప్రదించగా తలలో గడ్డ ఉందని( బ్రెయిన్ట్యూమర్) నిర్ధారించి ఆపరేషన్ చేసి తలలో ఉన్న గడ్డను తొలగించారు.ఆధునిక జీవనశైలి వల్ల బ్రెయిన్ ట్యూమర్లు పెరిగిపోవటంపై వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బ్రెయిన్ ట్యూమర్లను సకాలంలో గుర్తించక పోవటంతో అవి ప్రాణాంతకంగా మారుతున్నాయి. పెద్దవారితోపాటుగా చిన్నపిల్లల్లోనూ ట్యూమర్స్ కనిపిస్తూ ఉండటంతో ప్రతిఒక్కరు వ్యాధి పట్ల అవగాహన కల్గి ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. బ్రెయిన్ ట్యూమర్లపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రతి ఏడాది జూన్ 8న వరల్డ్ బ్రెయిన్ ట్యూమర్ డేను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ‘సాక్షి’ అందిస్తున్న ప్రత్యేక కథనం. ఇదీ చదవండి: ప్రియుడితో వధువు పరార్, చెల్లితో పెళ్లి ఫిక్స్, మళ్లీ ప్రియుడి లొల్లి!బాధితులకు చికిత్స ఎలా..? బ్రెయిన్ ట్యూమర్ సమస్యలతో బాధపడుతూ చికిత్స కోసం న్యూరోసర్జరీ వైద్య నిపుణులు, న్యూరాలజిస్టులను సంప్రదిస్తున్నారు. జిల్లాలో 20 మంది న్యూరోసర్జన్లు, 25 మంది న్యూరాలజిస్టులు ఉన్నారు. వారంలో ఇరువురు లేదా ముగ్గురు బ్రెయిన్ ట్యూమర్స్ సమస్యలతో వైద్యులను సంప్రదిస్తున్నారు. గుంటూరు జీజీహెచ్లో న్యూరోసర్జరీ వైద్య విభాగంలో ప్రతినెలా 20 మందికి బ్రెయిన్ ట్యూమర్ సర్జరీలు చేస్తున్నారు. న్యూరో సర్జరీ వైద్య విభాగంలో 2023లో 2,011 మంది, 2024లో 2,603 మంది, 2025లో 8,795 మంది, 2026 జనవరి నుంచి మే వరకు 4597 చికిత్స పొందారు. న్యూరాలజీ వైద్య విభాగంలో 2023లో 16,176 మంది, 2024లో 40, 381 మంది, 2025లో 50994 మంది, 2026లో జనవరి నుంచి మే వరకు 21937 వివిధ రకాల బ్రెయిన్ సంబంధిత సమస్యలతో చికిత్స పొందారు. లక్షణాలు... బ్రెయిన్లో సర్వసాధారణంగా సెల్స్ చనిపోయి కొత్తవి పుట్టుకొస్తుంటాయి. కొన్ని సమయాల్లో కణాలు చనిపోకుండానే కొత్తకణాలు పుట్టుకొచ్చి కొత్తగా వచ్చిన కణాలు ట్యూమర్గా(గడ్డ) మారతాయి. కొన్ని గడ్డలు క్యాన్సర్గా మారి ప్రాణాలు తీస్తాయి. కొన్ని గడ్డలు ప్రమాదకరమైనవి కావు. ఆపరేషన్ చేసి తొలగించవచ్చు. బ్రెయిన్ ట్యూమర్ ఉన్నవారిలో విపరీతమైన తలనొప్పి ఉండడం, వాంతులు అవ్వగానే తలనొప్పి తగ్గటం జరుగుతుంది. ఎక్కువగా ఉదయం వేళల్లో ఈ సమస్య కనిపిస్తుంది. మాట్లాడటం కష్టంగా ఉంటుంది. వినికిడి సమస్య, చూపు మసకబారటం, నడవటం కష్టంగా ఉండటం తదితర లక్షణాలు ఉంటాయి. బ్రెయిన్ ట్యూమర్ సైజును బట్టి, అది బ్రెయిన్లో ఏర్పడిన ప్రదేశం బట్టి, ట్యూమర్ రకాన్ని బట్టి లక్షణాలు ఒక్కో మనిషిలో ఒక్కో రకంలా కనిపిస్తాయి. ఇదీ చదవండి : పిల్లనిచ్చిన అత్తతో అల్లుడి ప్రేమ, పెళ్లి వీడియో వైరల్బ్రెయిన్ ట్యూమర్కు కారణాలు... బ్రెయిన్ ట్యూమర్లు జన్యుపరలోపాల వల్ల, వంశపారంపర్యంగా వస్తాయి. బ్రెయిన్కు రేడియేషన్ సోకటం వల్ల, సెల్ఫోన్ విపరీతంగా వాడటం వల్ల రేడియేషన్ సోకి మెదడులో గడ్డ వచ్చే అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి. పిల్లలు, పెద్దవారు అనే తేడా లేకుండా అన్ని వయస్సుల వారికి బ్రెయిన్ ట్యూమర్లు వస్తాయి.జీజీహెచ్లో ఉచిత ఆపరేషన్లు గుంటూరు జీజీహెచ్ న్యూరోసర్జరీ వైద్య విభాగంలో అత్యాధునిక వైద్య పరికరాలతో బ్రెయిన్ ట్యూమర్ సర్జరీలను చేస్తున్నారు. ఆపరేషన్ చేసేందుకు నాలుగు గంటల నుంచి ఎనిమిదిగంటల వరకు సమయం పడుతుంది. సుమారు రూ.3లక్షల ఖరీదు చేసే ఆపరేషన్లు ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఉచితంగా చేస్తున్నారు.ఆధునిక సర్జరీలతో మెరుగైన జీవితం... బ్రెయిన్ సర్జరీలు గతంలో ఆరు గంటలకు పైగా సమయం పడితే ఆధునిక టెక్నాలజీ వల్ల నేడు కేవలం అరగంటలోనే పూర్తి చేస్తున్నాం. ఒకరోజు పట్టే ఆపరేషన్లు సైతం గంటలోనే పూర్తి చేస్తున్నాం. ఎండోస్కోపిక్ సర్జరీలు, కీహోల్ సర్జరీలు, నేవిగేషన్ గైడెడ్, మైక్రోస్కోపిక్ సర్జరీలు అందుబాటులో ఉన్నాయి. న్యూరోసర్జరీలో వచ్చిన ఆధునిక వైద్య పద్ధతులతో బ్రెయిన్ ట్యూమర్ ఆపరేషన్ చేయించుకున్న వారు గతంలో కంటే చాలా మెరుగైన జీవితాన్ని గడపవచ్చు. ఆధునిక వైద్యం ద్వారా నూటికి 95శాతం రోగికి మంచి జీవితాన్ని ప్రసాదించవచ్చు. బ్రెయిన్ ట్యూమర్స్లో నూటికి 10శాతం మాత్రమే ప్రాణాంతకమైనవి. – డాక్టర్ భవనం హనుమ శ్రీనివాసరెడ్డి, న్యూరోసర్జన్ ప్రాథమిక దశలోనే గుర్తించవచ్చు... బ్రెయిన్ ట్యూమర్లను నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ప్రమాదం. ప్రాథమిక దశలోనే తలలో గడ్డలను గుర్తిస్తే ఆపరేషన్లతో పనిలేకుండా మందులతో పూర్తిగా నయం చేయవచ్చు. అన్ని ట్యూమర్లకు ఆపరేషన్లు చేయాల్సిన పనిలేదు. జనాభాలో ఒకశాతం మంది బ్రెయిన్ ట్యూమర్లతో బాధపడుతున్నారు. ప్రజలకు బ్రెయిన్ ట్యూమర్స్పై అపోహలు చాలా ఉన్నాయి. అవగాహన చాలా తక్కువగా ఉంది. – డాక్టర్ పమిడిముక్కల విజయ, న్యూరో సైంటిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షురాలుఇదీ చదవండి: నర్సింగ్ దుస్తులపై బీజేపీ ఎంపీ కంగనా సంచలన వ్యాఖ్యలు -
చాయ్-ఇడ్లీ కలిపి తినకూడదా..? కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ ఏమన్నారంటే..
దక్షిణ భారతదేశంలో చాలామందికి చాయ్ తోపాటు ఏదో ఒకటి ముంచుకునే తినే అలవాటు ఉంది. అలాంటి వాటిలో ఈ చాయ్ ఇడ్లీ కలిపి తినడం అనేది కూడా ఒకటి. అయితే ఇలా తినొచ్చా అంటే..ఇటీవల సోషల్ మీడియాలో చాయ్ ఇడ్లీ కాంబినేషన్ సూపర్ అంటూ పెట్టిన పోస్ట్ నెట్టింట హాట్టాపిక్గా మారి చర్చలకు తెరతీసింది. ఆ పోస్ట్పై సీనియర్ కాంగ్రెస్ నేత, తిరువనంతపురం ఎంపీ శశిథరూర్ స్పందిస్తూ..ఆయన ఆ పోస్ట్లో షేర్ చేసిన ఫోటోలో.. చాయ్ ఇడ్లీ కనిపించిన విధం గురించి మాట్లాడారు. ఆ చిత్రంలో ఇడ్లీ పసుపు వర్ణంలో చాలా గట్టిగా ఉన్నట్లుగా కనిపిస్తుందన్నారు. "బహుశా అందుకే ఇలా చాయ్ ఇడ్లీ కాంబినేషన్ సూపర్ అంటున్నారేమె. మాములుగా ఆ ఇడ్లీని తినడం కష్టం..ఇలా గట్టిదైతే వేడివేడి చాయ్లో ముంచుకుంటే సులభంగా నోటిలో కరిగిపోతుంది. అందుకు ఇలా అభిప్రాయ పడి ఉండొచ్చు. కానీ ఇడ్లీ అనేది మల్లెపువ్వుతా స్పాంజ్లా ఉండాలి. అలాంటి ఇడ్డీని కచ్చితంగా చాయ్లో ముంచి తినడం అంత ఈజీ కాదు. ఆయన చివరికి చెప్పేందేంటంటే..ఆ రెండింటిని వేర్వేరుగా ఆస్వాదించడమే మంచిదన్నారు." ఇడ్లీని చాయ్లో ముంచడం కంటే ఇడ్లీ తినేశాక చాయ్ తీసుకుంటే బెటర్ అని అన్నారు. తాను బ్రేక్ఫాస్ట్ లేదా భోజనం చేశాకే టీ తాగడానికి ప్రాధాన్యత ఇస్తానని అన్నారు. అలాగే తనకు చాయ్ అంటే మహా ఇష్టమని, ఇక అల్పాహారంలో ఇడ్లీ అంటే చాలా ఇష్టంగా తింటానని అన్నారు. నిపుణులు ఏం అంటున్నారంటే..టీ తాగేటప్పుడు తినే కొన్ని రకాల స్నాక్స్, ఆహారాల కాంబినేషన్ మంచిదికాదంటున్నారు. ముఖ్యంగా ఇడ్లీలు, బిస్కెట్ల కాంబినేషన్తో చాయ్ తాగడం అస్సలు మంచిది కాదనే చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ఇలా టీ కాంబినేషన్తో తింటే అరుగుదల,జీర్ణాశయం సంబంధిత సమస్యలు వస్తాయని చెబుతున్నారు. అంతేగాదు కడుపు ఉబ్బరం, ఇన్ఫ్లమేషన్ వంటి సమస్యలు వస్తాయని అంటున్నారు. పైగా మెటబాలిజం కూడా నెమ్మదించి అజీర్తి సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని చెబుతున్నారు. ఇవే కాదు మరే ఇతర పోషకమైన వాటిని కూడా చాయ్ కాంబినేషన్తో వద్దనే అంటున్నారు. దానివల్ల ఆయా పోషకాలు శరీరానికి సరిగా అందవని అంటున్నారు. అందువల్ల కాస్త విరామం ఇచ్చి వేర్వేరుగా తీసుకోవడమే మంచిదని నిపుణులు చెబుతున్నారు.Oh, I see what you're doing here! Aside from provoking me, that is.I have to be honest: that idli looks a bit too solid and dense for my liking. And the discolouration in the pic is not very appetising. There’s something about a perfectly soft, snowy-white, fluffy idli that… https://t.co/O9GsGAGPa6— Shashi Tharoor (@ShashiTharoor) June 7, 2026 (చదవండి: 145 కేజీల నుంచి 90 కేజీలకు..! ఆ ఏడు ఆహారాలు..) -
145 కేజీల నుంచి 90 కేజీలకు..! ఆ ఏడు ఆహారాలు..
బరువు తగ్గడం అంటే కేలరీల లోటు, జిమ్లో ఎక్కువ గంటలు గడపడం వంటివి మాత్రమే అనుకుంటాం. కానీ దాంతోపాటు ఇతర మార్పులు కూడా తప్పనిసరి. ముఖ్యంగా జీవనశైలిలోని ఆహారపు అలవాట్లే అత్యంత ప్రధానం. తీసుకునే ఆహారం పోషకవంతమైనది, బరువు అదుపులో ఉంచేది తీసుకుంటే అద్భుతాలు సృష్టించొచ్చు అని అంటోంది ఈ ముంబై ఇన్ఫ్లుయెన్సర్. ఆమె ఒకప్పుడు ఏకంగా 145 కేజీల పైనే బరువు ఉండేదాన్ని అని తెలిపింది. ఇప్పుడు ఏకంగా 55 కేజీల బరువు తగ్గి నాజుగ్గా మారానని, అందుకోసం ఆ ఏడు ఆహారాలను తీసుకుంటున్నానంటూ తన వెయిట్లాస్ సీక్రెట్ని వెల్లడించారామె. మరి ఆ ఆహారాలేంటో సవివరంగా తెలుసుకుందామా..!.ముంబై ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ డాలీ సుమారు 145 నుంచి 90 కేజీ బరువు తగ్గేందుకు చేసిన ఆ ఏడు ఆహార మార్పుల గురించి సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. ఆ పోస్ట్లో తాను చేసిన ఈ ఆహారపు మార్పులు అదనపు కేలరీలను తగ్గించి..వేగంగా బరువు తగ్గేందుకు సహాయపడిందని నమ్మకంగా చెబుతోందామె. మరి అవేంటంటే..చక్కెర పానీయాలుడాలీ చక్కెర పానీయాలను పూర్తిగా దూరంగా ఉన్నట్లు తెలిపింది. ఈ చక్కెర పానీయాలను అధికంగా తీసుకోవడం వల్ల అధిక కేలరీలు శరీరంలోకి చేరి, బరువు పెరిగే అవకాశం ఉందని చెప్పుకొచ్చింది. దానికి బదులుగా, తాను నిమ్మరసం, కొబ్బరి నీరు, చక్కెర లేని గ్రీన్ టీ వంటి ప్రత్యామ్నాయాలను తీసుకున్నట్లు డాలీ వెల్లడించింది. తెల్ల రొట్టె(మైదాతో చేసేవి)శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లు రక్తంలో చక్కెర స్థాయిలను వేగంగా పెంచి, అతిగా తినడానికి దారితీస్తుంది. కాబట్లి ఆమె తెల్ల రొట్టెను పూర్తిగా తగ్గించేసింది. దానికి బదులుగా ఆ ఇన్ఫ్లుయెన్సర్ గోధుమ రొట్టె, మల్టీగ్రెయిన్ బ్రెడ్, ఓట్స్ను తీసుకోవడం ప్రారంభించింది.చిప్స్, ప్యాక్ చేసిన స్నాక్స్వాటిలో ఉప్పు, కేలరీలు అధికంగా ఉండటం వల్ల ఆమె చిప్స్, ప్యాక్ చేసిన స్నాక్స్ తినడం మానేసినట్లు పేర్కొంది. దానికి బదులుగా ఆమె మితంగా వేయించిన మఖానా, వేయించిన శనగలు, నట్స్ను ఎంచుకుంది.ఫాస్ట్ ఫుడ్ఫాస్ట్ ఫుడ్లో కొవ్వు, ఉప్పు, కేలరీలు అధికంగా ఉండటం వల్ల దానిని పూర్తిగా తగ్గించేసింది. దానికి బదులుగా డాలీ పనీర్ శాండ్విచ్లు, గోధుమ కూరగాయల ర్యాప్లు లేదా ఇంట్లో తయారుచేసిన భోజనం వంటి ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయాలను ఎంచుకుందామె.ఐస్ క్రీమ్ఐస్ క్రీమ్లో తరచుగా చక్కెర,కేలరీలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి దానిని తన ఆహారం నుంచి తొలగించింది. గ్రీక్ యోగర్ట్, పండ్లు, ఫ్రోజెన్ బనానా స్మూతీలు లేదా చిన్న మొత్తంలో డార్క్ చాక్లెట్ తినడం ద్వారా ఆమె తన కోరికలను నియంత్రించుకుంది.మద్యంమద్యపానం డీహైడ్రేషన్కు, ముఖం ఉబ్బడానికి కారణమవుతుందని అందుకే తాను దానిని పూర్తిగా మానేసినట్లు తెలిపింది డాలీ. నిమ్మరసం కలిపిన సోడా నీరు, చక్కెర కలపని తాజా పండ్ల రసం, డిటాక్స్ వాటర్ ఆమె ఇష్టపడే ప్రత్యామ్నాయాలుగా మారాయి.ప్రాసెస్ చేసిన ఆహారాలుప్రాసెస్ చేసిన ఆహారాలలో తరచుగా సోడియం సంకలితాలు అధికంగా ఉంటాయి కాబట్టి వాటిని మానేశారు. దానికి బదులుగా, ఆమె గుడ్లు, టోఫు, పనీర్, పెరుగు, పప్పుధాన్యాలు, మొక్కల ఆధారిత ప్రోటీన్ వంటి సహజమైన ఆహార వనరులపై దృష్టి సారించింది.పైన చెప్పిన ఈ ఆహార పదార్థాలను పూర్తిగా తగ్గించి.. ఎక్కువ నీరు తీసుకుంటూ.. బాగా నిద్రపోండి. అలాగే మీరు నిర్దేశించుకున్న డైట్ క్రమం తప్పకుండా ఉండేలా చూసుకోమని సూచిస్తోంది. ఇలా చేస్తే కచ్చితంగా శరీరం వేగంగా నాజూకుగా మారుతుందంటూ తన పోస్ట్ని ముగించింది డాలీ.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం.(చదవండి: ఒక్క ఏడాదిలో 35 కిలోలు..!ఆ ఆరుబోరింగ్ అలవాట్లు..) -
జస్ట్ ఏడాదికే 35 కిలోలు..! ఆ ఆరు బోరింగ్ అలవాట్లు..
బరువు తగ్గే జర్నీలు ఇప్పటి వరకు వర్కౌట్లు, పక్కా ప్లాన్తో నిలకడగ చేసి.. స్లిమ్గా మారిన వారి గురించి విన్నాం. అలా కాకుండా ఈ మహిళ వెరైటీగా రోజువారీ జీవితంలో భాగమైన బోరింగ్ అలవాట్లతో బరువు తగ్గింగిదట. సంక్లిష్టమైన డైట్, వర్కౌట్లు లేకుండా.. సింపుల్గా చేసేవి, మన రోజువారి కొన్ని రకాల అలవాట్లకే దూరంగా ఉంటే బరువు తగ్గడం సులభం అంటోంది ఆ మహిళ. మరి అదెలాగో ఆమె మాటల్లోనే తెలుసుకుందామా.!షావీ అనే మహిళ తాను కేవలం 12 నెలల్లో 35 కిలోలు తగ్గానంటూ..తనకు ఉపకరించిన ఆరు ప్రభావవంతమైన జీవనశైలి మార్పులను సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. తన రోజువారీ క్రమశిక్షణలో పాతుకుపోయిన సరళమైన, స్థిరమైన అలవాట్లు తన బరువు తగ్గే ప్రయాణంలో ఎలా కీలక పాత్ర పోషించాయో సవివరంగా వెల్లడించారామె.డైనింగ్ టేబుల్ వద్ద కుటుంబంతో కలిసి రాత్రి భోజనం చేయకపోవడంఇది తాను బరువు తగ్గే దశలో చేసిన తాత్కాలిక మార్పుగా షావీ పేర్కొంది. కుటుంబంతో ఉంటే తన డైట్ గురించి చేసే వ్యాఖ్యలు బరువు తగ్గడంపై ఫోకస్ని దూరం చేస్తాయని ఈ మార్పు చేసినట్లు వివరించారామె. అందుకే తాను వారితో కలిసి తినడం మానేశానని అన్నారామె. తనకు, ఇది కుటుంబం నుంచి భావోద్వేగపరంగా దూరం కావడం గురించి కాదని పేర్కొంది.రాత్రి భోజనం చేసిన వెంటనే బ్రష్ చేయడంఆ రోజుకు తినడం అధికారికంగా ముగిసిందని తన మెదడుకు అది ఒక అధికారిక 'షట్ డౌన్' లాంటిది," అని ఆమె అంటోంది. నియంత్రణ కోల్పోయి, మళ్ళీ తినేసిన రోజుల్లో, తాను మరోసారి బ్రష్ చేసుకునేదాన్నని షావీ చెబుతుంది. ఆ చిన్న చర్య తన మనసులో ఒక హద్దును సృష్టించి.. వంటగది క్లోజ్ అయ్యిందని చెబుతుండేదని అన్నారామె.స్క్రీన్ లేకుండా ఎక్కువగా తినే అలవాటును పాటించడంఇలా చేస్తే ఎక్కువగా తినం, పైగా తింటున్న ఆహారంపై అటెన్షన్ ఉంటుందని అంటోంది. ఎప్పుడైనా ఎక్కువగా తినాలనిపిస్తే, ఏ స్క్రీన్ లేకుండానే పూర్తి చేస్తానని అంటోంది.ఎక్కువగా తినడాన్ని రేపటికి వాయిదా వేయడంనియంత్రణకు బదులుగా, పోస్ట్పోన్ చేయడం ఒక సాధనంగా మారుతుంది. ‘నేను దీన్ని రేపు తినగలను’ అని చెప్పుకుంటూ ఉంటే.. ఎప్పుడోకప్పుడూ తింటాననే సంతృప్తి అతిగా తినడాన్ని నియంత్రణలో ఉంచుతుందని అంటున్నారు.ఫ్రిజ్లో ప్రోటీన్ను కనిపించేలా ఉంచడంతినే ఆహారం కంటికి కనిపించే చేరువలో పెడితే..అవి తీసుకోవాలనే స్పృహ ఉంటుందని అంటోంది. అందుకే వేయించిన శనగలు, సోయా, పనీర్, ఉడికించిన గుడ్లు, చీజ్, ఇవి ఎప్పుడూ కంటికి కనిపించేలా పెట్టుకునేదాన్ని అని చెబుతున్నారామె.ఫుడ్ రీల్స్కి దూరంగా ఉండటం..కంటెంట్ వినియోగానికి, తినాలనే కోరికలకు మధ్య ప్రత్యక్ష సంబంధాన్ని వివరించింది షావీ. రోజంతా బ్రెయిన్కి ఆహార సంబంధిత కంటెంట్ను అందించడం ఆపేసినప్పుడు, తినాలనే కోరికలు చాలా వరకు తగ్గుతాయని అంటోంది. మనం ఏం చూస్తామో అదే తినాలని అనుకుంటామని అని చెబుతోంది షావీ. వినడానికి విచిత్రంగా ఉన్నా..కష్టంగా లేకుండా ఆచరణాత్మకంగా చిన్నపాటి మార్పులతోనే సులభంగా బరువు తగ్గే బెస్ట్ రెమిడ్స్లా ఉన్నాయి కదూ. ఇంకెందుకు ఆలస్యం ప్రయత్నించి చూడండి మరి. View this post on Instagram A post shared by Shavy | 35 kgs off (@shavyjain7) (చదవండి: ఆత్మవిశ్వాసం ఉంటే..అద్భుతం చేయొచ్చు!: మిస్ యూనివర్స్ కేరళ) -
వారానికి ఒక్క డోస్.. షుగర్, వెయిట్ అన్నీ కంట్రోల్!
న్యూ ఓర్లీన్స్: ఫార్మా రంగంలో సరికొత్త అధ్యాయం ఆవిష్కృతమయ్యింది. ఊబకాయం సమస్యతో బాధపడేవారికి సరికొత్త ఆశలు రేకెత్తిస్తూ ప్రముఖ ఫార్మా దిగ్గజం ‘ఎలి లిల్లీ’ ఒక అద్భుతమైన మందును కనుగొంది. శనివారం (జూన్ 6) న్యూ ఓర్లీన్స్లో జరిగిన అమెరికన్ డయాబెటిస్ అసోసియేషన్ కాన్ఫరెన్స్లో కంపెనీ తన తాజా క్లినికల్ ట్రయల్స్ ఫలితాలను వెల్లడించింది. ‘రెటాట్రుటైడ్’ (Retatrutide) అని పిలిచే ఈ నెక్స్ట్-జనరేషన్ ఊబకాయం డ్రగ్.. ఒక్క బరువు తగ్గించడమే కాకుండా.. ప్రాణాంతక స్లీప్ అప్నియా (నిద్రలో శ్వాస ఆడకపోవడం), తీవ్రమైన మోకాళ్ళ నొప్పులను సైతం సమర్థవంతంగా నివారిస్తుందని పరిశోధనల్లో తేలింది.మూడో దశ ట్రయల్స్లో సంచలన ఫలితాలుఎలి లిల్లీ నిర్వహించిన ఫేజ్-3 క్లినికల్ ట్రయల్స్ ఫలితాల ప్రకారం.. ఊబకాయంతో బాధపడుతున్న వయోజనులకు వారానికి ఒకసారి ఈ ‘రెటాట్రుటైడ్’ ఇంజెక్షన్ ఇవ్వడం ద్వారా, వారిలో తీవ్రమైన అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా సమస్య ఏకంగా 60.6 శాతానికి పైగా తగ్గినట్లు రాయిటర్స్ వార్తా సంస్థ నివేదించింది. అంతేకాదు మోకాళ్ళ కీళ్లనొప్పుల తీవ్రతను ఈ డ్రగ్ గరిష్టంగా 73.1 శాతం వరకు తగ్గించిందని వైద్య నిపుణులు తెలిపారు. ఇప్పటికే ఈ సంస్థకు చెందిన ‘జెప్బౌండ్’ అనే పాత డ్రగ్కు ఈ తరహా చికిత్స కోసం అనుమతులు ఉండగా, ఇప్పుడు ‘రెటాట్రుటైడ్’ మరింత మెరుగైన ఫలితాలను చూపించింది.ట్రిపుల్ జి ఫార్ములా విశేషాలుఈ ప్రయోగాత్మక ఔషధం మానవ శరీరంలో బరువు, మధుమేహాన్ని నియంత్రించే కీలక హార్మోన్లను టార్గెట్ చేస్తుంది. అంతకుముందు జరిగిన అధ్యయనాల్లో ఈ మందు వాడిన రోగులు తమ శరీర బరువులో 28 శాతం వరకు తగ్గడమే కాకుండా, టైప్-2 డయాబెటిస్ బాధితుల్లో రక్తంలో చక్కెర స్థాయిలు గణనీయంగా తగ్గినట్లు ఎలి లిల్లీ గతంలోనే వెల్లడించింది.లాన్సెట్ జర్నల్ నివేదిక - మార్కెట్ పోటీప్రఖ్యాత 'ది లాన్సెట్' జర్నల్లో ప్రచురితమైన వివరాల ప్రకారం, ఈ డ్రగ్ అత్యల్ప మోతాదు తీసుకున్న రెండు శాతం మంది డయాబెటిస్ రోగుల్లో గుండె జబ్బులకు సంబంధించిన కొన్ని ప్రతికూల సంఘటనలు నమోదయ్యాయి. అయితే ఇవి నేరుగా ఈ మందు వల్లే సంభవించాయని చెప్పలేమని పరిశోధకులు పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన గిరాకీ ఉన్న ఊబకాయం, మధుమేహం మందుల మార్కెట్ను శాసించేందుకు ఇండియానా కేంద్రంగా పనిచేసే ఎలి లిల్లీ సంస్థ, డెన్మార్క్కు చెందిన నోవో నార్డిస్క్ సంస్థల మధ్య తీవ్ర పోటీ నడుస్తోంది.ఇది కూడా చదవండి: వాట్సాప్లో ‘బొద్దింకల పార్టీ’: క్లిక్ చేస్తే అకౌంట్ ఖాళీ! -
ప్లీజ్ అంతా అయిపోయాక కాదు..! ముందుగానే తెలుసుకుందాం..
ఏ విషయంలోనైన అశ్రద్ధ ఉన్నా..పర్లేదు కానీ..ఆరోగ్య విషయంలో అలా కాదు. ఒక్కసారి పెద్దయ్యాక..చూద్దాంలే అనుకుంటూ..ఉంటే..కథే అడ్డం తిరుగుతుంది. మనం యంగ్ ఏజ్లో తీసుకున్న ఆహారాలు, జీవనశైలి వంటివే నాలుగుపదుల వయసులో మన ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. వృద్ధాప్యం సమీపించే సమయానికి రకరకాల వ్యాధుల బారినపడి..ఆరోగ్యాన్ని చేజాతులారా పాడు చేసుకుంటారని అంటున్నారు ప్రముఖ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్. అంతేగాదు. ముందుగానే ఈవిషయాలు తెలిసి ఉంటే బాగుండును అనుకునే ఐదు శక్తిమంతమైన ఆరోగ్య పాఠాలపై అందరికీ అవగాహన ఉండాలంటున్నారు. అవేంటంటే..యంగ్ ఏజ్లో ఉండగా..ఆ తర్వాత అంటూ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తుంటారని అన్నారు. నిశబ్దంగా నష్టం జరిగిపోయాక గానీ మేల్కోరని అంటున్నారామె. నిద్ర అలవాట్ల నుంచి తీసుకునే ఆహారం వరకు ప్రతిదాంట్లో కేర్ఫుల్గా ఉండాలని అంటున్నారు.తెలుసుకోవాల్సిన ఐదు శక్తిమంతమైన పాఠాలు..తన 20 ఏళ్ల వయసులో తనకు తెలిసి ఉంటే బాగుండేదని అతను భావించే ఐదు శక్తివంతమైన పాఠాలు ఇక్కడ ఉన్నాయి:జీర్ణవ్యవస్థ ఆరోగ్యం మిగతా అన్నింటినీ నిర్ధారిస్తుంది..శక్తి, మానసిక స్థితి, చర్మం, రోగనిరోధక శక్తి, మానసిక స్పష్టత అన్నీ జీర్ణవ్యవస్థలోనే మొదలవుతాయని అంటున్నారు వైద్యులు. ఇదంతా జీర్ణవ్యవస్థలో నిశ్శబ్దంగా ఉంటుంది,నిద్ర అనేది మీరు తర్వాత భర్తీ చేసుకోగలిగేది కాదుచాలా మంది అనుకున్నట్లుగా నిద్రలేమిని పూడ్చలేము. ప్రతి రాత్రి సరిగా నిద్రపోకపోవడం కాలక్రమేణా పేరుకుపోతుంది. కోల్పోయిన నిద్రకు బ్యాంకు ఖాతా లేదు,అని వైద్యులు చెబుతున్నారు. దీర్ఘకాలిక నిద్రలేమి వేగవంతమైన జీవసంబంధమైన వృద్ధాప్యం, అధిక జీవక్రియ ప్రమాదంతో ముడిపడి ఉందని పరిశోధనలు చెబుతున్నాయని చెబుతున్నారు.ఆహారం కంటే.. ఒత్తిడి ఆరోగ్యాన్ని చిత్తు చేస్తుంది..దీర్ఘకాలిక ఒత్తిడి శరీరంపై ప్రత్యక్ష జీవసంబంధమైన ప్రభావాన్ని చూపుతుంది. మానసిక ఒత్తిడి కొన్ని గంటల్లోనే జీర్ణవ్యవస్థ, శరీరాన్ని ప్రభావితం చేయగలదు. నాడీ వ్యవస్థ నియంత్రణ గురించి మంచి అవగాహన ఉండాలి.ఇష్టంగా తినే అతిగా ప్రాసెస్ చేసిన ఆహారం..ఇవాల్టి ఆహారపు అలవాట్లు దీర్ఘకాలిక కాలేయం, జీవక్రియ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయని అంటున్నారు. ఫ్యాటీ లివర్ వ్యాధి వంటి సమస్యలు అకస్మాత్తుగా రావు, దశాబ్దాల తరబడి పునరావృతమయ్యే ఆహారపు అలవాట్ల వల్ల వచ్చేవని అంటున్నారు.అత్యంత శక్తిమంతమైన పదార్థం ఫైబర్అందరు రోజుకు కేవలం పది నుంచి 15 గ్రాముల ఫైబరే తీసుకుంటున్నారు. తగినంత ఫైబర్ పెద్ద ప్రేగు కేన్సర్, గుండెజబ్బులు వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని గణనీయంగా తగ్గిస్తుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. View this post on Instagram A post shared by Saurabh Sethi MD MPH | Gastroenterologist (@doctor.sethi) (చదవండి: భారత్ని విడిచి వెళ్తున్న ప్రతిసారి గుండె పగిలిపోతోంది ..!) -
కరోనా నాటి ఘోర తప్పిదం.. నేడు వేలాది ప్రాణాలకు ముప్పు!
ప్రపంచాన్ని కుదిపేసిన కోవిడ్-19 మహమ్మారి సృష్టించిన అల్లకల్లోలం అంతా ఇంతా కాదు. ఆస్పత్రులు రోగులతో కిక్కిరిసిపోవడం, లాక్డౌన్లు, వ్యాక్సినేషన్ డ్రైవ్లు మాత్రమే మనకు గుర్తున్నాయి. కానీ, ఈ విపత్తు వెనుక ఎవరికీ తెలియకుండా ఒక నిశ్శబ్ద సంక్షోభం దాగి ఉందనే దిగ్భ్రాంతికర నిజాన్ని పరిశోధకులు ఇప్పుడు బయటపెట్టారు. కరోనా విజృంభణ సమయంలో రొటీన్ హెల్త్కేర్ సేవలు నిలిచిపోవడంతో, వేలాది మంది క్యాన్సర్ రోగుల వ్యాధి నిర్ధారణ (డయాగ్నోసిస్) ఆలస్యమైంది. ఇది భవిష్యత్తులో వారి ప్రాణాలకే ముప్పుగా మారే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.‘ది లాన్సెట్ ఆంకాలజీ’ సంచలన అధ్యయనంప్రఖ్యాత అంతర్జాతీయ వైద్య జర్నల్ ‘ది లాన్సెట్ ఆంకాలజీ’ ప్రచురించిన ఒక సంచలన అధ్యయనం ప్రకారం కోవిడ్-19 మహమ్మారి ప్రారంభమైన మొదటి తొమ్మిది నెలల్లో ప్రపంచంలోని ఏడు అభివృద్ధి చెందిన దేశాలలో సుమారు 55,000 క్యాన్సర్ నిర్ధారణ కేసులు రికార్డు కాలేదు. ఆస్ట్రేలియా, కెనడా, డెన్మార్క్, ఐర్లాండ్, న్యూజిలాండ్, నార్వే, బ్రిటన్ దేశాలకు చెందిన దాదాపు 26 లక్షల మంది రోగుల డేటాను శాస్త్రవేత్తలు విశ్లేషించారు. 2020 ఏప్రిల్ నుండి డిసెంబర్ మధ్య కాలంలో, కరోనాకు ముందుతో పోలిస్తే క్యాన్సర్ నిర్ధారణలు ఏకంగా 16 శాతం తగ్గాయని వారు కనుగొన్నారు. సాధారణ పరిస్థితులు ఉంటే గుర్తించాల్సిన వేలాది కేసులు వ్యవస్థలోకి రాలేదంటే, ఆ క్యాన్సర్లు మాయమయ్యాయని కాదు, కేవలం నిర్ధారణ కాకుండా రోగుల శరీరాల్లోనే ఉండిపోయాయని అర్థం.కొంపముంచిన లాక్డౌన్ఈ అంతరాయం వల్ల అన్ని రకాల క్యాన్సర్ల కంటే కొన్ని నిర్దిష్ట క్యాన్సర్ల గుర్తింపు తీవ్రంగా ప్రభావితమైందని పరిశోధనలో తేలింది. ముఖ్యంగా పురుషులలో వచ్చే ‘ప్రోస్టేట్ క్యాన్సర్’ నిర్ధారణలు అత్యధికంగా 24 శాతం తగ్గాయి. అలాగే మహిళల్లో వచ్చే రొమ్ము క్యాన్సర్ కేసులు 18 శాతం, చర్మ క్యాన్సర్కు సంబంధించిన మెలనోమా కేసులు కూడా 18 శాతం మేర పడిపోయాయి. అయితే, ఊపిరితిత్తుల క్యాన్సర్ , అండాశయ క్యాన్సర్ నిర్ధారణలపై ఈ ప్రభావం కొంత తక్కువగానే ఉంది. సాధారణ హెల్త్ స్క్రీనింగ్లు లేదా సాధారణ ఓపీ సంప్రదింపులపై ఆధారపడే క్యాన్సర్లే లాక్డౌన్ల వల్ల ఎక్కువగా వెలుగులోకి రాలేదని నిపుణులు విశ్లేషిస్తున్నారు.నిర్ధారణలు తగ్గడానికి గల ప్రధాన కారణాలుకరోనా సమయంలో క్యాన్సర్ పరీక్షలు ఇంతలా క్షీణించడానికి అనేక కారణాలు దోహదం చేశాయి. అప్పట్లో వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి, కోవిడ్ రోగులకు వైద్య సేవలు అందించడానికి అనేక దేశాలు క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్లను తాత్కాలికంగా నిలిపివేసాయి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ముఖాముఖి అపాయింట్మెంట్లు దొరకడం గగనమైంది. మరోవైపు, ఆస్పత్రులకు వెళ్తే ఎక్కడ కోవిడ్ సోకుతుందోననే భయంతో ప్రజలు కూడా స్వచ్ఛందంగా వైద్య పరీక్షలను వాయిదా వేసుకున్నారు. సాధారణంగా క్యాన్సర్ తొలిదశలో కనిపించే చిన్నపాటి లక్షణాలను నిర్లక్ష్యం చేయడం వల్ల, వ్యాధి తీవ్రత పెరిగే వరకు అది బయటపడకుండా ఉండిపోయింది.కొన్ని దేశాల ముందస్తు వ్యూహం ఈ విపత్కర పరిస్థితుల్లోనూ కొన్ని దేశాలు మెరుగైన పనితీరును కనబరిచాయి. బ్రిటన్, ఐర్లాండ్ దేశాలతో పోలిస్తే నార్వే, న్యూజిలాండ్ దేశాలలో క్యాన్సర్ నిర్ధారణల తగ్గుదల చాలా తక్కువగా ఉంది. అంతేకాకుండా ఆ దేశాలు చాలా వేగంగా కోలుకుని తిరిగి సాధారణ స్థితికి వచ్చాయి. స్క్రీనింగ్, డయాగ్నోస్టిక్ సేవలను నిరంతరాయంగా కొనసాగించగల బలమైన ఆరోగ్య వ్యవస్థలు ఉండటమే దీనికి కారణమని తేలింది. భవిష్యత్తులో వచ్చే ఇలాంటి ప్రజారోగ్య అత్యవసర పరిస్థితులను ఎలా ఎదుర్కొనాలో , ఆరోగ్య సేవలు దెబ్బతినకుండా ఎలా కాపాడుకోవాలో అర్థం చేసుకోవడానికి ఈ దేశాల వ్యూహాలు ఎంతో సహాయపడతాయని ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్ ప్రతినిధి ఇసాబెల్లె సోర్జోమతారమ్ పేర్కొన్నారు.భవిష్యత్తులో పొంచి ఉన్న దీర్ఘకాలిక ముప్పువైద్య సేవల్లో జరిగిన ఈ ఆలస్యం వల్ల రోగుల ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం వాటిల్లుతుందనేది ఇప్పుడు అతిపెద్ద ప్రశ్నగా మారింది. 2020లో ఆలస్యంగా గుర్తించిన క్యాన్సర్లు వెంటనే తీవ్రమైన దశకు చేరుకున్నట్లు స్పష్టమైన ఆధారాలు ప్రస్తుత అధ్యయనంలో లభించనప్పటికీ, దీర్ఘకాలిక ప్రభావం ఎలా ఉంటుందో ఇప్పుడే చెప్పలేమని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. క్యాన్సర్ అనేది శరీరంలో ఏళ్ల తరబడి పెరుగుతుంది. కాబట్టి ఈ ఆలస్యపు పరిణామాలు భవిష్యత్తు డేటాలో మాత్రమే స్పష్టంగా తెలుస్తాయి. ఇప్పటికే ‘జామా ఆంకాలజీ’ ప్రచురించిన మరో అధ్యయనం ప్రకారం, అమెరికాలో 2020-21లో జరిగిన క్యాన్సర్ కేర్ అంతరాయాల వల్ల ఏడాదిలోనే దాదాపు 17,390 మంది అదనంగా మరణించారని అంచనా వేయడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.వైద్య రంగానికి ఈ పరిశోధన నేర్పిన పాఠాలుఏదైనా ఒక మహమ్మారి వచ్చినప్పుడు కేవలం ఆ ఒక్క వ్యాధిపైనే కాకుండా, ఇతర ప్రాణాంతక వ్యాధుల చికిత్సపై కూడా దృష్టి పెట్టాలనే పఠాన్ని ఈ అధ్యయనం నేర్పుతోంది. భవిష్యత్తులో ఎలాంటి సంక్షోభాలు ఎదురైనా క్యాన్సర్ స్క్రీనింగ్, డయాగ్నోస్టిక్ పరీక్షలు, సాధారణ వైద్య సేవలను ప్రాధాన్యత క్రమంలో కొనసాగించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఆరోగ్య వ్యవస్థల స్థితిస్థాపకత అనేది కేవలం అత్యవసర ముప్పును ఎదుర్కోవడమే కాదు, ప్రజలకు అందాల్సిన అవసరమైన నివారణ, రోగనిర్ధారణ సేవలను నిరంతరాయంగా అందించడంలోనే ఉందని ఈ పరిశోధన స్పష్టం చేస్తోంది.ఇది కూడా చదవండి: నాటి రోజుల్లో కేరళ రుతుపవన సంకేతాలు -
గాటు లేకుండా ‘పొడి’చేసే గన్!
మూత్రపిండాల్లో రాళ్లు వచ్చినప్పుడు కలిగే బాధ తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. నిజానికి మూత్రపిండాలు మన దేహంలోని జీవక్రియల తర్వాత వెలువడే అనేక వ్యర్థాలూ, విషపదార్థాలను వడపోసి మూత్రం ద్వారా బయటకు పంపేస్తాయి. ఈ క్రమంంలో కొన్ని రకాల వ్యర్థాలు పేరుకుపోయి ఒక స్ఫటికంలా మారే అవకాశాలుంటాయి. వీటినే మనం రాళ్లుగా చెబుతుంటాం. ఇటీవల ఈ రాళ్ల తొలగింపు చాలా సులభం అయ్యింది. ఇప్పటికీ సంప్రదాయ శస్త్రచికిత్సతో రాళ్లను తొలగించే అవకాశమున్నప్పటికీ కొన్ని ఆధునిక వైద్య ప్రక్రియలతో దేహంపై ఎలాంటి గాటు పెట్టకుండానే శబ్దతరంగాల సహాయంతో వాటిని పౌడర్లా చేసే ప్రక్రియలూ అందుబాటులో ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుందాం...సహజంగానే రోజూ తక్కువ నీళ్లు తాగేవారిలో, అలాగే నిత్యం ఏసీ రూముల్లో ఉండటం వల్ల నీళ్లు తక్కువగా తాగేవారిలో, చాక్లెట్లు, కెఫిన్ వంటివి ఎక్కువగా తీసుకునేవారితోపాటు... కొందరిలో వారి దేహస్వభావంలోనే రాళ్లు ఏర్పడే అవకాశముంటుంది. వీటి తొలగింపు అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. రాయి సైజు, దాని గట్టిదనం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని శస్త్రచికిత్స నిపుణులు తొలగింపు ప్రక్రియను ఎంపిక చేస్తారు. అయితే చిన్నపాటి గాటు పెట్టి చేసే శస్త్రచికిత్సలతో పాటు అసలు ఎలాంటి గాటూ లేకుండా కేవలం ఒక గన్లాంటి ఉపకరణంతో రాళ్లను పౌడర్ చేయడం ద్వారా వాటిని తొలగిస్తారు.కిడ్నీలో రాళ్లు ఎలా ఏర్పడతాయి?రెండు మూత్ర పిండాలూ రక్తంలోని వ్యర్థాలను వడపోస్తూ ఉంటాయి. రక్తంలోని అనేక అంశాలను శుద్ధి చేసి సమయం లో అవసరమైన వాటిని తీసుకొని, వ్యర్థాలను మాత్రం మూత్రంతో పాటు బయటకు పంపిస్తాయి. ఈ క్రమంలో కొన్ని వ్యర్థాలైన క్యాల్షియమ్ ఆక్సలేట్, సిస్టిన్ వంటివి స్ఫటికాలుగా పోగుపడుతూ రాళ్ల రూపాన్ని సంతరించుకుంటాయి. నిజానికి ఆ రాళ్లు యురేటర్ లేదా మూత్రనాళం సైజు కంటే తక్కువగా ఉంటే అవి మూత్రంతో పాటు బయటకు వెళ్తుంటాయి. కానీ ఒక రాయి 5 మి.మీ. కంటే ఎక్కువ సైజ్కు పెరిగితే మూత్రంలో కొట్టుకొనిపోలేక... మూత్రవిసర్జక వ్యవస్థలో ఇరుక్కుపోవచ్చు. ఇలా రాళ్లు ఇరుక్కుపోయినప్పుడు తీవ్రమైన కడుపునొప్పి, మూత్రధారకు ఏదో అడ్డుపడ్డట్లుగా ఉండటం వరకు అనేక లక్షణాలు కనిపిస్తాయి. చిన్న గాటు కూడా పెట్టాల్సిన అవసరమే లేకుండా... ఎక్స్ట్రా కార్పోరియల్ షాక్ వేవ్ లిథోట్రిప్సీ (ఈఎస్డబ్ల్యూఎల్) అని పిలిచే ఈ అత్యాధునిక ప్రక్రియ సహాయంతో మూత్రపిండం ఉండే భాగంలో చర్మంపై నుంచే కేవలం గన్లాంటి అత్యాధునిక ఉపకరణం సహాయంతో ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ తరంగాలూ అలాగే బలమైన అల్ట్రా సౌండ్ తరంగాలను పంపుతారు. ఈ చికిత్స ప్రక్రియలో అల్ట్రాసోనిక్ తరంగాల ద్వారా రాయిని చాలా చిన్న చిన్న పలుకులు లేదా పొడి పొడి అయ్యేలా చేస్తారు. ఆ పలుకులు, పొడి రూపంలో ఉన్న రాళ్లు మూత్రంతో పాటు బయటకు వెళ్లిపోతాయి. రాతిని పలుకులు, పొడిగా చేశాక... కొన్ని కేసుల్లో మాత్రమే యురేటర్లో స్టెంట్ వేయాల్సి రావచ్చు. ఎందుకంటే ఈ రాతిపలుకుల వల్ల మూత్రనాళాలు లేదా బ్లాడర్ గోడలు ఒరుసుకుపోయి గాయపడకుండా ఉండటానికి ఈ ఏర్పాటు చేస్తారు. బాధితుల ఒంట్లోనుంచి రాతి పౌడర్లాంటి చిన్న చిన్న పలుకులు పూర్తిగా పడిపోయాక స్టెంట్ను తొలగిస్తారు. ఈ ప్రక్రియ ద్వారా బాధితులకు ఎలాంటి బాధ, శ్రమ లేకుండా చికిత్స జరుగుతుంది. రాయి సైజు ఎక్కువగా ఉన్నా... ఎక్కువ గట్టిగా ఉన్నా రెండో సిట్టింగ్ అవసరం పడవచ్చు. సర్జరీ ఎప్పుడంటే... బాధితుల్లో తీవ్రమైన నొప్పి ఉండి, మూత్రపిండాల వ్యవస్థ విఫలమైనప్పుడు, కిడ్నీలు ఇన్ఫెక్షన్కు గురైనప్పుడు మాత్రం సర్జరీ చేయాల్సి ఉంటుంది. ఆపరేషన్ ఇష్టపడని రోగులు ఒక నెల రోజులు ఆగి చూసి అప్పటికీ రాయి దానంతట అదే పడిపోకపోతే తప్పనిసరిగా ఆపరేషన్ చేయించాలి. లేకపోతే రాయి వల్ల ఇన్ఫెక్షన్ పాకి మూత్రపిండాలు దెబ్బతినే అవకాశాలుంటాయి. చివరగా... మూత్రపిండాల్లో రాళ్లను నివారించడానికి పెరుగు చాలా తోడ్పడుతుంది. దీంతోపాటు తగినన్ని నీళ్లు ద్రవాహారాలు తీసుకోవడం మంచిది.లక్షణాలు... → భరించలేని నొప్పి → మూత్రంలో రక్తం పడటం → మూత్రంలో చీము రావడం → విసర్జన సమయంలో మూత్ర మార్గంలో మంట → మూత్రం పరిమాణం తగ్గడం. యురెథ్రాలో కాని మూత్రాశయంలో కాని లేదా రెండింటిలో కాని రాళ్లు ఉన్నప్పుడు ఇలా జరగవచ్చు ∙∙అబ్డామినల్ డిస్టెన్షస్లో... తల తిరగడం, వాంతులవడం. ఈ లక్షణాలతో పాటు ఒక్కోసారి చలి, జ్వరం. పోస్ట్రిరీనల్ అజోటీమియా... కిడ్నీలో రాయి యురేటర్ని బ్లాక్ చేయడం, తద్వారా కిడ్నీ ఫెయిల్యూర్కు దారి తీయడం ఫ్రీక్వెన్సీ ఇన్ మిక్చ్యురిషన్... ఎక్కువసార్లు మూత్రవిసర్జన చేయాల్సి రావడం. అలాగని ఒక రోజుకు రెండున్నర లీటర్లకంటే ఎక్కువ మూత్రవిసర్జన ఉండదు. తక్కువ మోతాదులో విసర్జిస్తూ ఎక్కువసార్లు వెళ్లాల్సి రావడం జీర్ణవ్యవస్థ అస్తవ్యస్తం కావడం వల్ల ఆకలి లేకపోవడం / ఆహారం తీసుకోవాలన్న ఆసక్తి లేకపోవడం, దాంతో బరువు తగ్గడం వంటి లక్షణాలూ కనిపిస్తాయి.నిర్థారణ పరీక్షలు...మూత్రపరీక్ష, అల్ట్రాసౌండ్ పరీక్ష, ఇంట్రావీనస్ యూరోగ్రఫీ (ఐవీయూ), ఎక్స్–రే, సీటీ స్కాన్ అబ్డామిన్ల వంటి పరీక్షలు అవసరమవుతాయి. వీటితో పాటు డాక్టర్లు సూచించే మరికొన్ని నిర్దిష్టమైన పరీక్షలూ చేయించాల్సి రావచ్చు.ఇతర చికిత్సలు... కిడ్నీ స్టోన్స్ చాలావరకు ఆపరేషన్ చేయాల్సిన అవసరం లేకుండా వాటంతట అవే మూత్రంతో పాటు పడిపోతుంటాయి. రాయి సైజు, మూత్రవిసర్జక వ్యవస్థలో రాయి ఉన్న ప్రాంతం వంటి అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుని చేయాల్సిన చికిత్స నిర్ణయిస్తారు. ఉదాహరణకు రాయి సైజు 2 సెం.మీ కంటే తక్కువగా ఉంటే యుటెరోస్కోపీ (యూఆర్ఎస్) అనే ప్రక్రియతోనూ, 2 సెం.మీ కంటే ఎక్కువగా ఉండి, కాస్తంత సంక్లిష్టంగా అంటే జింక కొమ్ముల (స్టాగ్ హార్న్) వంటి ఆకృతి ఉన్నవాటిని పీసీఎన్ఎల్ అనే చిన్న గాటు పెట్టే ప్రక్రియలతోనూ అలాగే 2 సెం.మీ. పరిణామంలో ఉండే రాళ్లను ఆర్ఐఆర్ఎస్ అనే బ్లాడర్లోకి పైప్ను పంపుతూ లేజర్ సహాయంతో లోపల ఉన్న రాయిని పౌడర్ చేసే ప్రక్రియలాంటి వాటిని ఉపయోగిస్తారు. పీసీఎన్ఎల్ మినహా యూఆర్ఎస్, ఆర్ఐఆర్ఎస్లలోనూ ఎలాంటి గాటూ ఉండదు.డాక్టర్ పూర్ణచంద్రా రెడ్డిసీనియర్యూరాలజిస్ట్– యాసీన్ -
65 కేజీల నుంచి 58 కేజీలకు..! ఆ ఐదు వ్యాయామాలతో..
బరువు తగ్గాలంటే కఠినమైన ఆహార నియమాలు, కష్టతరమైన వ్యాయమాల క్రమం అనుకుంటారు అంతా. కానీ తెలివిగా ఎంజాయ్ చేస్తూ సులభంగా తగ్గే ప్రక్రియ అని అంటోంది ఫిట్నెస్ కమ్ యోగా కోచ్ త్రిప్తి. చాలామంది. ఇక్కడ స్మార్ట్గా ఆలోచిస్తే స్లిమ్ అవ్వడం చాలా సులవు అని చెబుతోందామె. మరి అదెలాగో త్రిప్తి మాటల్లోనే తెలుసుకుందామా.!.దుబాయ్కు చెందిన ఫిట్నెస్, స్ట్రెంత్, యోగా కోచ్ త్రిప్తి తను కేవలం ఏడు నెలల్లో 7.7 కేజీల బరువు తగ్గినట్లు పేర్కొంది. ఎక్కువ కేలరీలు ఖర్చు చేసేందుకు, పొట్ట దగ్గర కొవ్వు తగ్గించుకోవడానికి సహాయపడిన సులభమైన ప్రభావవంతమైన వ్యాయామాలను పంచుకున్నారామె. తాను కాంపౌండ్ వ్యాయామాల తోపాటు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటూ 7.7 కిలోలు తగ్గినట్లు తెలిపారు. ఇది కొవ్వు తగ్గడాన్ని వేగవంతం చేయడంలోనూ, మొత్తం ఫిట్నెస్ను మెరుగుపరచడంలోనూ కీలకపాత్ర పోషిస్తుంది.మోకాలి-నుంచి-మోచేతి క్రంచెస్త్రిప్తి తన వర్కౌట్ను మోకాలి-నుంచి-మోచేతి క్రంచెస్తో ప్రారంభించారు. ఈ వ్యాయామం కోర్ తోపాటు శరీర దిగువ భాగాన్ని ఉత్తేజపరచడంలో సహాయపడుతుంది. కొత్తగా చేసేవారికి, కేవలం శరీర బరువును ఉపయోగించి ప్రతి వైపు 10 రెప్స్ చేయమని ఆమె సిఫార్సు చేశారు.కాలును పైకి లేపేటప్పుడు శ్వాసను బయటకు వదలండి, తిరిగి ప్రారంభ స్థానానికి వచ్చేటప్పుడు శ్వాసను లోపలికి తీసుకోండి. కదలిక అంతటా మీ కోర్ను బిగుతుగా ఉంచి, నిటారుగా ఉండే భంగిమను కొనసాగించాలని చెప్పారామె. అలాగే క్రమం తప్పకుండా వర్కౌట్ చేసేవారికి లేదా జిమ్కు వెళ్లేవారికి, బరువులను జోడించి, రెప్స్ సంఖ్యను 20కి పెంచమని త్రిప్తి సూచించారు. నిలబడి మోకాలిని కాలివేళ్లకు తాకించడంతరువాత, ఆమె నిలబడి మోకాలిని కాలివేళ్లకు తాకించింది. ఇది కోర్, హామ్స్ట్రింగ్స్ మరియు హిప్ ఫ్లెక్సర్లను లక్ష్యంగా చేసుకునే ఒక సులభమైన వ్యాయామం. తొలిసారిగా ప్రారంభించేవారు తమ శరీర బరువును ఉపయోగించి ప్రతి వైపు 10 రెప్స్తో మొదలుపెట్టవచ్చు. ఆ తర్వాత ఆమె 10 కేజీల డంబెల్ను పట్టుకొని అదే వ్యాయామాన్ని చేసింది. మరింత సవాలు కోరుకునే వారు వేగాన్ని పెంచుకోవచ్చు లేదా సరైన భంగిమను పాటిస్తూ ప్రతి వైపు 15-20 రెప్స్ చేయవచ్చు.మోకాలిని తిప్పే వ్యాయామంఆ తర్వాత త్రిప్తి మోకాలిని తిప్పే వ్యాయామం గురించి వివరించింది. ఈ వ్యాయామం ఒబ్లిక్స్ను బలపరచడానికి, మొండెం కదలికను మెరుగుపరచడానికి సహాయపడుతుంది. ఈ కదలికను చేయడానికి, ఒక మోకాలిని పైకి లేపి, కోర్ను బిగుతుగా ఉంచుతూ పై శరీరాన్ని దాని వైపుకు తిప్పండి. తొలిసారిగా ప్రారంభించినవారు ప్రతి వైపు 10 రెప్స్ లక్ష్యంగా పెట్టుకోవచ్చు. ఈ కదలికను మరింత సవాలుగా మార్చడానికి, ఆమె డంబెల్ లేదా వెయిట్ ప్లేట్ను జోడించమని సూచించింది. అధునాతన వ్యాయామం చేసేవారు వేగంపై కాకుండా నియంత్రిత మెలికలపై దృష్టి పెడుతూ, 5-10 కేజీల బరువును పట్టుకొని ప్రతి వైపు 15-20 రెప్స్ చేయవచ్చు.హై నీస్ (లేదా హై-నీ మార్చ్)ఈ వర్కౌట్లో హై నీస్ కూడా ఉంది. ఇది ఒక కార్డియో వ్యాయామం, ఇది ఓర్పును పెంచుతూనే కోర్, గ్లూట్స్, కాలి కండరాలను ఉత్తేజపరుస్తుంది. తొలిసారి ప్రారంభించేవారు సౌకర్యవంతమైన వేగంతో మోకాళ్లను నడుము ఎత్తు వరకు పైకి లేపుతూ, 10-12 సార్లు హై-నీ మార్చ్ చేయవచ్చు. తీవ్రతను పెంచడానికి, ఇంతకు ముందు వర్కౌట్ అనుభవం ఉన్నవారు ప్రతి చేతిలో తేలికపాటి డంబెల్స్ పట్టుకుని 45-60 సెకన్ల పాటు హై నీస్ చేయవచ్చు. నిటారుగా కూర్చోవడం,చేతులను పంప్ చేయడం ఈ వర్కౌట్ను మరింత మెరుగుపరుస్తాయి.ఓవర్హెడ్ డంబెల్ లాటరల్ లెగ్ రైజ్ఆమె ఓవర్హెడ్ డంబెల్ లాటరల్ లెగ్ రైజెస్ చేసింది. ఈ వ్యాయామం భుజాలు, కోర్, గ్లూట్స్, బయటి తొడలను లక్ష్యంగా చేసుకోవడంతో పాటు బ్యాలెన్స్, స్థిరత్వాన్ని కూడా మెరుగుపరుస్తుంది. తొలిసారిగా ప్రారంభించేవారు కేవలం తమ శరీర బరువును ఉపయోగించి, ప్రతి వైపు 10 రెప్స్తో ప్రారంభించవచ్చు. ఈ కదలిక అంతటా కోర్ను నిమగ్నంగా ఉంచడం నిటారుగా కూర్చోవడంపై దృష్టి పెట్టాలి.వ్యాయామం చేసేటప్పుడు డంబెల్ను తలపైన పట్టుకోవాలని త్రిప్తి సూచించారు. క్రమం తప్పకుండా వ్యాయామం చేసేవారు మధ్యస్థం నుండి ఎక్కువ బరువును ఉపయోగిస్తూ ప్రతి వైపు 15-20 రెప్స్ వరకు పెంచుకోవచ్చు. చివరగా ఆమె ఈ వ్యాయామాల తోపాటు ఆరోగ్యకరమైన ఆహారం, సరైన నిద్ర రోజువారీ కదలికలు కలిపి చేస్తే..బరువులో మాత్రమే కాకుండా, బలం, శక్తి, ఆత్మవిశ్వాసంలో కూడా మార్పుని గమనించగలుగుతాం అని అంటోంది త్రిప్తి. ఇక్కడ కేవలం నిలకడ, క్రమశిక్షణే మంచి ఫలితాలను తెలస్తుందని అంటున్నారామె. అందుకు సంబంధించిన వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేశారామె. గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. View this post on Instagram A post shared by TriptiFitFlow | Strength•Yoga•Transformation (@triptifitflow) (చదవండి: గుప్పెడు పూలు... గుండెనిండా పరిమళం) -
విటమిన్–సి పుల్లటి పండ్లలో కంటే వాటిల్లోనే అధికం..!
మన శరీరానికి అవసరమైన పోషకాల్లో విటమిన్–సి అత్యంత కీలకమైనది. ఇది ఇమ్యూనిటీని పెంచడమే కాకుండా, చర్మ సౌందర్యానికి, కణాల మరమ్మత్తుకు ఎంతగానో సహాయపడుతుంది. అందుకని మన రోజూవారీ ఆహారంలో వీటిని చేర్చుకోవడం ద్వారా ఈ విటమిన్ని సులభంగా పొందవచ్చు. సిట్రస్ జాతికి చెందిన నారింజ పండ్లలో విటమిన్–సి పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరానికి తక్షణ శక్తిని ఇవ్వడమే కాకుండా గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. విదేశీ పండైనప్పటికీ ప్రస్తుతం మన దేశంలో విరివిగా లభిస్తున్న కివీ పండులో విటమిన్–సి తోపాటు యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. చాలామంది విటమిన్–సి కేవలం పుల్లటి పండ్లలోనే ఉంటుందని భావిస్తారు. కానీ, ఎర్రటి క్యాప్సికమ్లో నారింజ కంటే ఎక్కువ మొత్తంలో విటమిన్–సి ఉంటుంది. ప్రతిరోజూ తగిన మోతాదులో విటమిన్–సి ఉన్న ఆహార పదార్థాలను తీసుకోవడం ఆరోగ్యానికి మేలు. యాంగ్జైటీ తగ్గించే యాలక్కాయ!భోజనం ముగిసిన వెంటనే ఒక యాలక్కాయను నోట్లో వేసుకుని నమలడం మంచిది. యాలకుల్లో ఉండే సహజసిద్ధమైన నూనెలు లాలాజలాన్ని, డైజెస్టివ్ ఎంజైమ్లను ఎక్కువగా ఉత్పత్తి చేసి జీర్ణక్రియను వేగవంతం చేస్తాయి. వీటిల్లో ఉన్న కార్మినేటివ్ గుణాలు కడుపులో గ్యాస్ తయారవ్వకుండా నిరోధిస్తాయి. ఆహారంలోని పోషకాలను శరీరం సరిగ్గా గ్రహించేలా చేస్తాయి. వీటి నుంచి వచ్చే సువాసనలో మానసిక ఒత్తిడిని తగ్గించే గుణం ఉంది. యాంగ్జైటీ వల్ల వచ్చే జీర్ణ సమస్యలకు ఇది చక్కటి పరిష్కారం. (చదవండి: గుప్పెడు పూలు... గుండెనిండా పరిమళం) -
రాజస్థాన్లో ఎబోలా కలకలం : హై అలర్ట్
భారతదేశంలో మరో రాష్ట్రంలో ఎబోలా వైరస్ సోకిందనే వార్త ఆందోళన రేపుతోంది. రాజస్థాన్లో ఎబోలా వైరస్ వ్యాధికి సంబంధించిన తొలి అనుమానిత కేసు నమోదైంది. ఉగాండా నుండి రాజస్థాన్లోని జైపూర్కు వచ్చిన పర్యాటకురాలికి ఈ వైరస్ లక్షణాలు కనిపించడంతో, వైద్యులు ఆమెను జైపూర్లోని RUHS ఆసుపత్రిలో ఐసోలేషన్లో ఉంచారు.శుక్రవారం ఉదయం ఎయిర్ అరేబియా విమానంలో షార్జా నుంచి జైపూర్కు వచ్చిన ఉగాండాకు చెందిన ఒక మహిళలో విమానాశ్రయంలో తనిఖీల సమయంలో సంబంధింత లక్షణాలు కనిపించాయి. వెంటనే ఆమెను ఆసుపత్రిలో చేర్పించారు. ఇదీ చదవండి: ప్రముఖ హాలీవుడ్ నటుడి దారుణ హత్య : ప్రియురాలి కొడుకు అరెస్ట్ ఆర్యూహెచ్ఎస్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అనిల్ గుప్తా ప్రకారం, ఆ మహిళకు ఎబోలా వ్యాధి నిర్ధారణ కాలేదు. ఆమెలో వ్యాధిని పోలిన లక్షణాలు కనిపిస్తున్నప్పటికీ, ఖచ్చితమైన నిర్ధారణ చేయాల్సి ఉందన్నారు. ప్రస్తుతం ఆమెను అంటువ్యాధుల నియంత్రణ నిబంధనల ప్రకారం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. హైదరాబాద్లో కూడా అనుమానిత ఎబోలా వైరస్ కేసు నమోదైంది. సూడాన్ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చిన విదేశీ ప్రయాణికుడికి థర్మల్ స్క్రీనింగ్ ద్వారా లక్షణాలు గుర్తించి, గాంధీ ఆసుపత్రికి తరలించారు ఇదీ చదవండి: రూ. 549 కోట్ల బ్రిడ్జ్పై పగుళ్లు : వీడియో తీస్తోంటే.. ట్విస్ట్! -
ఏడు నెలల్లో 101 కేజీల నుంచి 65 కేజీలకు..!
బరువు తగ్గడం ఒక్కోక్కరికీ ఒకోలా ఉంటుంది. కొందరు సులభంగా బరువు తగ్గితే..కొందరికీ అది భారంగా ఉంటుంది. కాఈ ఇక్కడ ఈ ఫిట్నెస్ కంటెంట్ క్రియేటర్ అధిక బరువు ఏ రేంజ్లో ఉందంటే తగ్గుతుందామె అనే ప్రశ్న కలిగేలా ఉంది. అంత అధిక బరువును తగ్గించుకునేందుకు ఉపక్రమించి..చాలా కొద్ది టైంలో మంచి పలితాన్ని అందుకుంది. పైగా ఓ హీరోయిన్ మాదిరి స్మార్ట్ లుక్తో అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది.ఆ ఫిట్నెస్ కంటెంట్ క్రియేటరే కాజల్. తన బరువు తగ్గే ప్రయాణాన్ని ఇన్స్టాగ్రామ్లో డాక్యుమెంట్ చేస్తూ..ఏడాది లోపే 101 కేజీల నుంచి 65 కేజీలకు ఎలా తగ్గిందో పంచుకుంది. ఆమె వీడియోల ప్రకారం, కాజల్ ఆగస్టు 2025లో తన పరివర్తన ప్రయాణాన్ని ప్రారంభించి, ఏడు నెలల్లో దాదాపు 36 కేజీలు తగ్గారు. అందుకోసం డైట్ విషయంలో చాలా కేర్ తీసుకున్నానని, అదే తనను ఇంతలా బరువు తగ్గేలా చేసిందని చెప్పుకొచ్చింది. భోజన ప్రణాళిక..తొలిరోజు..ఆమె వారంలోని మొదటి రోజు ఒక సాధారణమైన, సమతుల్యమైన ఇంట్లో వండిన భోజనంతో మొదలవుతుంది. ఉదయం, ఆమె నానబెట్టిన ఐదు నట్స్తో ఒక కప్పు జీరా నీటిని తాగుతుంది. ఆ తర్వాత పుదీనా చట్నీతో రెండు చిన్న బేసన్ చిల్లాలను ప్రోటీన్ అధికంగా ఉండే అల్పాహారంగా తీసుకుంటుంది. ఉదయం పూట చిరుతిండిగా, ఆమె ఒక గిన్నెడు పండ్లు అంటే.. మాగ్జిమ్ బొప్పాయితో పాటు, ఒక టేబుల్ స్పూన్ పొద్దుతిరుగుడు గింజలను ఇష్టపడుతానని అన్నారు. మధ్యాహ్న భోజనంలో అర కప్పు బ్రౌన్ రైస్, శనగపప్పు, బెండకాయ కూర ఉంటాయి. తర్వాత, ఆమె 20 గ్రాముల వేయించిన మఖానాతో ఒక కప్పు గోరువెచ్చని హెర్బల్ టీ తాగుతుంది. రాత్రి భోజనంలో, ఆమె టోఫు బుర్జీ, వేయించిన బీన్స్, ఒక బాజ్రా రోటీ తింటుంది.రెండవ రోజురెండవ రోజు, కాజల్ జీరా నీటికి బదులుగా నానబెట్టిన చియా గింజలతో గోరువెచ్చని నిమ్మ నీటిని తీసుకుంటుంది. అల్పాహారంగా సోయా చంక్స్తో వెజిటబుల్ పోహా తింటుంది. ఆమె ఉదయం పూట అల్పాహారంగా ఒక పూర్తి ఆపిల్, ఒక టేబుల్ స్పూన్ గుమ్మడి గింజలు తింటుంది. తర్వాత మధ్యాహ్న భోజనంలో రెండు రోటీలు, పెసరపప్పు, సొరకాయ కూర, సలాడ్ తీసుకుంటుంది. సాయంత్రం అల్పాహారం కోసం, కాజల్ ఒక కప్పు మజ్జిగ, వేయించిన శనగలను ఎంచుకుంటుంది. ఆమె తన రోజును 100 గ్రాముల పాలక్ పనీర్, ఒక జొన్న రొట్టె, దోసకాయ రైతాతో ముగిస్తుంది.3వ రోజుఆమె 3వ రోజు భోజనాలు సాదాసీదాగా కడుపు నింపే వాటికి ప్రాధాన్యత ఇస్తుంది. ఆమె ఉదయాన్ని అలోవెరా షాట్, గోరువెచ్చని నీటితో ప్రారంభిస్తుంది. ఆ తర్వాత రాగి దోస, ప్రోటీన్ అధికంగా ఉండే సాంబార్, చట్నీ తీసుకుంటుంది. ఉదయం పూట చిరుతిండిగా, ఆమె ఒక జామకాయ, ఒక టేబుల్ స్పూన్ అవిసె గింజలు తింటుంది. మధ్యాహ్న భోజనంలో ఒక చిన్న జొన్న రొట్టె, కందిపప్పు, పాలకూర కూర, సలాడ్ ఉంటాయి. సాయంత్రం, ఆమె చియా గింజలు, బెర్రీలు లేదా దానిమ్మ గింజలతో కలిపిన తీపి లేని గ్రీక్ పెరుగు గిన్నెను ఎంచుకుంటుంది. రాత్రి భోజనంలో వెజిటబుల్ క్వినోవా పులావ్, దోసకాయ-టమోటా సలాడ్ ఉంటాయి.4వ రోజుకాజల్ 4వ రోజు భోజన ప్రణాళిక నానబెట్టిన మెంతి గింజల నీరు, వెజిటబుల్ ఉప్మాతో ప్రారంభమవుతుంది. ఆ తర్వాత ఒక బేరీపండు, 8-10 నానబెట్టిన ఎండుద్రాక్షలు తీసుకుంటుంది. మధ్యాహ్న భోజనంలో, ఆమె మిల్లెట్ ఖిచిడీ, కచ్రీ తింటుంది. సాయంత్రం, ఆమె నిమ్మరసం తాగి, హమ్మస్తో రెండు రైస్ కేక్లు తింటుంది. రాత్రి భోజనంలో సోయా కూర, ఒక రోటీ ఉంటాయి.5వ రోజుఆమె తన రోజును నిమ్మ-అల్లం నీళ్లు, నానబెట్టిన ఐదు వాల్నట్లు, కూరగాయలు, గ్రీన్ చట్నీతో కూడిన ఓట్స్ చిల్లాతో ప్రారంభిస్తుంది. ఆ తర్వాత, ఈ కంటెంట్ క్రియేటర్ పండ్లు, గింజలు, ఆపై మధ్యాహ్న భోజనంలో రెండు బాజ్రా రోటీలు, మసూర్ పప్పు, బెండకాయ కూర, సలాడ్ తింటుంది. సాయంత్రం, ఆమె మజ్జిగ వేయించిన వేరుశెనగలు తింటుంది. రాత్రి భోజనంలో పనీర్ టిక్కా, వేయించిన జుకినీ,అర కప్పు బ్రౌన్ రైస్ ఉంటాయి.బరువు తగ్గే ఫలితాలు ఒక్కొక్కరికి ఒక్కోలా ఉన్నప్పటికీ, దీర్ఘకాలిక ఫిట్నెస్ లక్ష్యాలను సాధించడానికి కృషి చేస్తున్నప్పుడు నిలకడ, పరిమాణ నియంత్రణ, సమతుల్య ఆహారపు అలవాట్ల ప్రాముఖ్యత అత్యంత ముఖ్యమని అంటున్నారు కాజల్. అప్పుడే చక్కటి ఫలితాలను సత్వరమే అందుకోగలమని అన్నారు.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. View this post on Instagram A post shared by Fit kajal (@flex_fit_kajal) (చదవండి: 'సక్సెస్'కి సరైన నిర్వచనం ఇదే..! తొలిసారిగా పేరెంట్స్ని..) -
శరీరం 10 శాతం కాలితే ఐసీయూ కాపాడలేదా?
న్యూఢిల్లీలోని మాలవీయ నగర్ హోటల్లో సంభవించిన ఘోర అగ్నిప్రమాదం దేశ రాజధానిని ఒక్కసారిగా కుదిపేసింది. ఈ ప్రమాదంలో 21 మంది సజీవ దహనమవ్వడం అత్యంత విషాదకరం. అయితే, ఈ దారుణ ఘటన భారతదేశ అత్యవసర వైద్య సేవల్లో, ముఖ్యంగా కాలిన గాయాల బాధితులకు అందించే చికిత్సా వసతులలో ఉన్న ఒక తీవ్రమైన లోపాన్ని మరోసారి బహిర్గతం చేసింది. బాధితులను కాపాడటంలో సాధారణ ఐసీయూల పరిమితులు ఏంటో ఈ ప్రమాదం కళ్లకు కట్టినట్లు చూపింది.10 శాతం మార్క్ కీలకంఒక వ్యక్తి శరీర ఉపరితల వైశాల్యం(టీబీఎస్ఏ)లో కేవలం 10 శాతానికి మించి కాలిన గాయాలైతే, ఆ బాధితుడి శరీరం స్పందించే తీరు పూర్తిగా మారిపోతుంది. సాధారణ గాయాల కంటే ఇవి అత్యంత సంక్లిష్టమైనవి కావడం వల్లే ఈ 10 శాతం మార్క్ అనేది వైద్యంలో అత్యంత కీలకమైనదిగా మారుతుంది. మన చర్మం అనేది శరీరానికి ఒక రక్షణ కవచం లాంటిది. అది 10 శాతం కంటే ఎక్కువ దెబ్బతిన్నప్పుడు, శరీరం నుండి ద్రవాలు వేగంగా ఆవిరైపోతాయి. దీనివల్ల రక్తపోటు పడిపోవడం, తీవ్రమైన ఇన్ఫెక్షన్లు సోకడం, చివరికి శరీరంలోని కీలక అవయవాలు పని చేయడం మానేసే ప్రమాదం పొంచి ఉంటుంది.సాధారణ ఐసీయూలలో..సాధారణ ఐసీయూలను గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్, శ్వాసకోస సమస్యలు లేదా ఇతర తీవ్రమైన ఇన్ఫెక్షన్ల నిర్వహణ కోసం రూపొందిస్తారు. కానీ 10 శాతానికి పైగా తీవ్రంగా కాలిన రోగులకు కావలసిన ప్రత్యేక సదుపాయాలు అక్కడ ఉండవు. కాలిన గాయాల బాధితులకు నిరంతరం గాయాలను శుభ్రం చేయడం, శరీర ద్రవాలను భర్తీ చేయడం, ప్రత్యేక పోషకాహారం అందించడం, కొన్ని వారాల పాటు వరుస సర్జరీలు చేయడం అవసరమవుతుంది. ఈ బహుళ అవసరాలకు సరిపోయే సదుపాయాలు సాధారణ ఐసీయూలలో అందుబాటులో ఉండవు. అందుకే ఇవి తీవ్రమైన బర్న్ కేసులకు సరిపోవు.ప్రత్యేక బర్న్ ఐసీయూలలో..కాలిన గాయాల బాధితులకు అతిపెద్ద శత్రువు ఇన్ఫెక్షన్. చర్మం దెబ్బతినడం వల్ల బ్యాక్టీరియా సులభంగా రక్తంలోకి ప్రవేశించి ‘సెప్సిస్’ అనే ప్రాణాంతక పరిస్థితికి దారితీస్తుంది. అందుకే ప్రత్యేక బర్న్ ఐసీయూలను (Burn ICUs) ప్రత్యేకమైన ఇన్ఫెక్షన్ నియంత్రణ చర్యలతో, ఐసోలేషన్ సదుపాయాలతో నిర్మిస్తారు. అక్కడి సిబ్బందికి బర్న్ మేనేజ్మెంట్లో ప్రత్యేక శిక్షణ ఇస్తారు. సాధారణ వార్డులలో లేదా ఐసీయూలలో ఉండే గాలి ద్వారా కూడా ఈ రోగులకు ఇన్ఫెక్షన్లు సోకే ప్రమాదం ఉంది.పొగను పీల్చడం వల్లే..మాలవీయ నగర్ ప్రమాదంలో మెజారిటీ బాధితులు మంటల కంటే ముందుగా దట్టమైన విషపూరిత పొగను పీల్చడం వల్లే మరణించారని వైద్యులు ప్రాథమికంగా నిర్ధారించారు. అగ్నిప్రమాదాల్లో పొగ అనేది ఒక అదృశ్య హంతకి. విషవాయువులు, వేడి గాలి ఊపిరితిత్తులను, శ్వాసనాళాలను తీవ్రంగా దెబ్బతీస్తాయి. అందుకే పైకి తక్కువ గాయాలు కనిపించినప్పటికీ, విషపూరితమైన పొగ పీల్చడం వల్ల తలెత్తే సమస్యలకు ప్రత్యేక విభాగాల్లోనే చికిత్స అందించాల్సి ఉంటుంది.బర్న్ కేర్ మౌలిక వసతుల లేమి..ప్రస్తుతం భారతదేశం బర్న్ కేర్ మౌలిక వసతుల కొరతను ఎదుర్కొంటోంది. దేశంలో ప్రతి సంవత్సరం దాదాపు 10 లక్షల మందికి పైగా జనం కాలిన గాయాల బారిన పడుతుండగా, సుమారు 1,40,000 మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇంత భారీ సంఖ్యలో బాధితులు ఉన్నప్పటికీ, దేశవ్యాప్తంగా కేవలం 67 నమోదిత బర్న్ సెంటర్లు మాత్రమే ఉన్నాయి. వీటిలో ప్రత్యేక బెడ్ల సంఖ్య కేవలం 1,330 మాత్రమే కాగా, బర్న్ ఐసీయూ బెడ్లు 300 కంటే తక్కువగా ఉన్నాయి. మాలవీయ నగర్ లాంటి దుర్ఘటనలు జరిగినప్పుడు మాత్రమే మన దేశంలో ఉన్న ఈ మౌలిక వసతుల కొరత తీవ్రత వార్తల్లో కనిపిస్తుంటుంది.ఇది కూడా చదవండి: ‘చికెన్స్ నెక్’పై భారత్ పట్టు.. చైనా, ‘బంగ్లా’ కుట్రలకు చెక్! -
ఎబోలా వైరస్ అవగాహన చాలు ఆందోళన వద్దు
ఇటీవల ప్రపంచాన్ని భయపెడుతున్న వైరల్ ఇన్ఫెక్షన్స్లో ఎబోలా వైరస్ కూడా ఒకటి. ఈ వ్యాధిగ్రస్తుల్లో మరణాల రేటు 25% నుంచి 90% వరకు ఉండటంతో ప్రపంచ వ్యాప్తంగా ఇది బెంబేలెత్తిస్తోంది. అదే ఇటీవల ప్రపంచాన్ని ఆందోళనకు గురి చేసిన కరోనా వైరస్ (కోవిడ్)లో మరణాల రేటు కేవలం 0.5% నుంచి 2% మాత్రమే. అయితే కోవిడ్లో మరణాల రేటు తక్కువగా ఉన్నప్పటికీ ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో ప్రబలడంతో దాని మృతుల సంఖ్య ప్రపంచాన్ని నివ్వెరపరచింది. అలా కాకుండా ఎబోలా వైరస్ మాత్రం ఇప్పటికీ కేవలం ఆఫ్రికాలోని సబ్–సహారా దేశాల్లోనే వ్యాప్తిలో ఉంది. అయితే ఇటీవల రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ యంత్రాంగాలు అప్రమత్తమయ్యాయి. ఇటు తెలంగాణలో హైదరాబాద్తో పాటు అటు ఆంధ్రప్రదేశ్లోకి... చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి దేశవిదేశాల ప్రయాణికులు వస్తున్న నేపథ్యంలో ఎబోలాపై ఆందోళన ముప్పిరిగొంటోంది. ఈ నేపథ్యంలో ‘ఎబోలా వైరస్ డిసీజ్’పై ప్రాథమిక అవగాహన కోసం ఈ కథనం.ఇటీవలే ఎబోలా వైరస్ పీడిత దేశాల నుంచి 28 మంది ప్రయాణికులు దేశంలోకి వచ్చినట్టుగా అధికారులు గుర్తించారు. దాంతో ఒక్కసారిగా అప్రమత్తమైన ఆరోగ్య యంత్రాంగం విమానాశ్రయంలో ప్రయాణికులను పరీక్షించడమే కాకుండా... ఒకవేళ వారు ఎబోలా విస్తరిస్తున్న ప్రాంతాల నుంచి వచ్చినట్టు గుర్తిస్తే... వెంటనే వారిని 21 రోజుల పాటు ఐసోలేషన్లో ఉంచి పరిశీలించడానికి పూనుకుంటున్నారు. ఇది మినహా ఇప్పటివరకూ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఎబోలా తాలూకు ఎలాంటి కేసులూ లేవు. కాబట్టి దీని గురించి ఆందోళన పడాల్సిన అవసరం లేదు, అవగాహన పెంచుకోవడం అవసరమని గుర్తిస్తే చాలు. ఈ నేపథ్యంలో ఎబోలా అంటే ఏమిటి, అదెలా వ్యాపిస్తుంది, లక్షణాలేమిటి వంటి అంశాలను సంక్షిప్తంగా తెలుసుకుందాం. ఏమిటీ ఎబోలా? ఎబోలా వైరల్ డిసీజ్ను మునుపు ‘ఎబోలా హీమరేజిక్ ఫీవర్’ అని పిలిచేవారు. ఒకరకంగా చూస్తే 25% నుంచి 90% ఫెటాలిటీ రేటుతో ఇది చాలాసార్లు ప్రాణాంతకంగా పరిణమించేదే. ఇందులో చాలా రకాల వైరల్ ప్రజాతులున్నాయి. ఇవి ఫైలోవిరిడే అనే కుటుంబానికి చెందిన వైరస్లు. ఈ రకం వైరస్లు ‘వైరల్ హీమరేజిక్ ఫీవర్’ అనే జ్వరాలకు కారణమవుతాయి. ఆ జ్వరాల్లో కలిగే తీవ్రమైన బాహ్య, అంతర్గత రక్తస్రావం వల్ల పరిస్థితి తీవ్రమవుతుంది. ఈ వైరస్ మన శరీరంలోని రోగనిరోధక వ్యవస్థపై దాడి చేసి అవయవాల పనితీరును దెబ్బతీస్తుంది. వ్యాధి తీవ్రమైనప్పుడు బాహ్య, అంతర్గత రక్తస్రావం, వ్యవస్థల వైఫల్యం (మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్)తో మరణం సంభవిస్తుంది. ప్రభుత్వాల ఆరోగ్య సంస్థల హెచ్చరికలు... ఎబోలా వైరస్ ఒక వ్యక్తి నుంచి మరొకరికి నేరుగా శరీర ద్రవాల ద్వారా వ్యాపిస్తుంది. భారతదేశంలో ఇప్పటివరకూ ఎబోలా వైరస్కు సంబంధించి ఎలాంటి కేసులూ నమోదు కాలేదు. అయితే మన హైదరాబాద్, పొరుగున ఉన్న చెన్నై వంటి అంతర్జాతీయ విమానాశ్రయాలున్న నగరాలకు ప్రపంచంలోని అన్ని దేశాల నుంచి రాకపోకలు కొనసాగుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరముంది. అందుకే కేంద్ర ప్రభుత్వం, తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రభుత్వాలు, ఐసీఎమ్ఆర్ సంస్థలు... ఎబోలా ప్రభావిత ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికుల కోసం కొన్ని మార్గదర్శకాలు ఏర్పరచి ఆ మేరకు వాటిని అమలు చేస్తున్నాయి. ఎబోలా వైరస్ రకాలు... ఎబోలా వైరస్కు చెందిన ఆరు రకాల ప్రజాతులను గుర్తించారు.వ్యాప్తి ఇలా... ఎబోలా వైరస్... కరోనా వైరస్లా గాలి ద్వారా ఒకరి నుంచి మరొకరికి వ్యాపించదు. ఇది... బాధితుల రక్తంతో గానీ లేదా వారి శరీరద్రవాలను తాకడం వల్ల, వారికోసం ఉపయోగించిన (ఇన్ఫెక్టెడ్) వైద్యపరికరాలను తాకడం వల్ల, బాధితులతో లైంగికంగా కలవడం వల్ల వ్యాప్తి చెందే అవకాశాలుంటాయి. ఇలా వ్యాప్తి చెందదు... బాధితుల పక్కనే కూర్చోవడం ∙వారు వదిలిన గాలిని పీల్చడం ∙వారితో కలిసి తినడం ∙దోమ కాటు వల్ల వ్యాప్తి చెందదు. బాధితుల ఫ్లుయిడ్స్తో కాంటాక్ట్లోకి రావడం మినహా మరే రకంగానూ ఇది వ్యాప్తి చెందే అవకాశం లేదు కాబట్టి దీని గురించి ఆందోళన పడనక్కర లేదు. నిర్ధారణ పరీక్షలు... ఎబోలా వ్యాధి తాలూకు మొదటి లక్షణాలు మలేరియా, టైఫాయిడ్, డెంగీ వంటి వ్యాధి లక్షణాలతో పోలి ఉండటం వల్ల వెంటనే దీని నిర్ధారణ ఒకింత కష్టం. అయితే రెండో, మూడో దశల్లోని లక్షణాలతో పోల్చుకుని చూసుకోవడం వల్ల నిర్ధారణ చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఈ వ్యాధి నిర్ధారణ కోసం వైద్యులకు పనికి వచ్చే అంశాలేమిటంటే... ∙గత 21 రోజుల వ్యవధిలో వ్యాప్తి చెందుతున్న ఆఫ్రికా దేశాల్లో ప్రయాణం చేసి ఉండటం, ఎబోలా వ్యాధి సోకినవారి అంత్యక్రియలకు హాజరు కావడం, వృత్తి సంబంధంగా ఏవైనా ప్రయోగశాలల సందర్శనతో పాటు... ∙ఆర్టీపీసీఆర్ పరీక్ష ∙ఎలీజా పరీక్ష ∙వైరస్ కల్చర్ వంటి పరీక్షతో. ఇది వైరల్ జ్వరం కావడం వల్ల ప్రస్తుతానికి మందులేం అందుబాటులో లేవు. అయితే 2019లో ఆర్ వీఎస్వీ జెబోవ్ అనే వ్యాక్సిన్ కూడా అందుబాటులోకి వచ్చింది. అయితే ఇన్బాజెబ్, ఎబాంగా వంటి మందులతోనూ... అలాగే దేహం డీహైడ్రేట్ కాకుండా తగినన్ని ద్రవాలను ఇవ్వడం, సెలైన్ పెట్టడం, రక్తపోటు అదుపులో ఉండేలా చూడటం, అవసరమైతే ఆక్సిజన్ పెట్టడం, మంచి పోషకాహారాన్ని అందించడం. ఈ చికిత్సలతోపాటు వ్యాధి నిరోధకత తగ్గడం వల్ల వచ్చే బ్యాక్టీరియల్, ఫంగల్ ఇన్ఫెక్షన్లకు చికిత్స అందించడం ద్వారా దీనివల్ల కలిగే అనర్థాలను తగ్గించడానికి తగిన చికిత్సలు అందిస్తూ బాధితులను కాపాడేందుకు చాలావరకు అవకాశాలున్నాయి. చివరిగా... 38 డిగ్రీల సెంటీగ్రేడ్ లేదా 100 ఫారెన్హీట్ కంటే ఎక్కువగా జ్వరం ఉండటంతోపాటు తలనొప్పి, వాంతులు లేదా విరేచనాలు, కళ్ల నుంచి పంటి చిగుర్ల నుంచి రక్తస్రావం, తీవ్రమైన నీరసం, నిస్సత్తువ, అలసట వంటి లక్షణాలు కనిపిస్తే తక్షణం వైద్యులను సంప్రదించాలి. అయితే ఇప్పటివరకూ ఎబోలాకు సంబంధించిన ఒక్క కేసు కూడా నమోదు కానందున... ఈ ప్రాథమిక అవగాహనను పెంచుకోవడం మినహా ప్రస్తుతానికి దీని గురించి ఆందోళన అక్కర్లేదు. లక్షణాలు... ఎబోలా వైరస్ శరీరంలోకి ప్రవేశించిన తరువాత 2నుంచి 21 రోజుల మధ్య లక్షణాలు కనిపించవచ్చు. లక్షణాలను ఎంత త్వరగా గుర్తిస్తే బాధితులను కాపాడుకోవడానికి అంతగా అవకాశముంటుంది. మొదటిది ప్రారంభ దశ... ఇందులో... ∙ఒక్కసారిగా తీవ్రమైన జ్వరం (హై ఫీవర్) ∙తీవ్రమైన అలసట (ఫెటీగ్) ∙తీవ్రమైన తలనొప్పి (సివియర్ హెడేక్) ∙కండరాల నొప్పులు (మజిల్ పెయిన్స్) ∙తీవ్రమైన గొంతు నొప్పి రెండో దశను మధ్యంతర దశగా చెప్పవచ్చు. ఇందులో... ∙వాంతులు ∙చాలా ఎక్కువగా విరేచనాలు కావడం ∙కడుపునొప్పి ∙కళ్లుఎర్రబడటం ∙చర్మంపై దద్దుర్లు ∙ఎక్కిళ్లు ∙ఛాతినొప్పిమూడో దశలో లక్షణాల తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. ఇందులో... ∙కళ్లు, ముక్కు చెవుల నుంచీ, దంతాల నుంచి రక్తస్రావం ∙కాలేయం, మూత్రపిండాల వైఫల్యం ∙తీవ్రమైన షాక్ ∙అయోమయం, ఫిట్స్ ∙తీవ్రమైన డీహైడ్రేషన్- డాక్టర్ బి. వెంకట్ నాని కుమార్సీనియర్ కన్సల్టెంట్ఇంటర్నల్ మెడిసిన్ – యాసీన్ -
వృద్ధులకు వెయిట్ లిఫ్టింగ్ ట్రైనింగ్ ఎందుకు మంచిదంటే..!
వయసు పెరిగే కొద్దీ ఆరోగ్యంగా, యాక్టివ్గా ఉండేందుకు బల శిక్షణ(స్ట్రెంగ్త్ ట్రైనింగ్) ఎంతో మంచిదంటోంది హెల్త్ అండ్ ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ జీనా అరాగాన్. కండరాల క్షీణత, ఎముకలు, కీళ్లు బలహీనపడటం వంటి ఇతర కారణాల వల్ల వయసు పెరిగే కొద్దీ ప్రజలు బలహీనపడతారు. దీనికి విరుగుడు బరువులు మోయడ మేలని చెబుతోంది. అదెలాగో తన 87 ఏళ్ల తండ్రిని ఉదాహరణగా చూపిస్తూ..ఆయన జిమ్ వర్కౌట్లతో ఎలా మెరుగ్గా ఉన్నారో వివరించేలా వీడియోని షేర్ చేశారామె. ఆయన ప్రతి వారం ఈ వెయిట్ లిఫ్టింగ్ చేసేలా చూస్తుంటానని చెప్పారామె. అయితే తన తండ్రి కేవలం పైకి, కిందకు వెయిట్లిప్ట్ చేస్తూ..కండరాలకు మాత్రమే పనికల్పిస్తున్నాని అనుకుంటారు. కానీ అంతకు మించి ప్రభావవంతమైందని, మొత్తం బాడీలోని అన్నింటికి మంచిదని ఆయనకు తెలియదని చెప్పుకొచ్చింది. ఆయన వయసు పైబడుతున్ను కొద్దీ ఆరోగ్యంగా ఉండటానికి తోడ్పడే వ్యాయం ఇదేనని, అందుకే ఆయన చురుకుగా, బలంగా ఉండేలా ఇలా కండరాలకు ఇలా బరువులు ఎత్తే శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. ఆయనను పదేపదే జిమ్కి వచ్చేలా చూడటమే తన పని అంటోంది. అయితే ఆయన ఈ జిమ్ సెషన్లో పాల్గొనెటప్పడూ..మంచి అనుభూతితో, తన కేర్ని అర్థం చేసుకునేలా చేస్తానంటోంది. ముఖ్యంగా ఆయన తన తదుపరి సెషన్ కోసం ఆసక్తిగా ఎదురుచూసేలా వాతావరణం కల్పిస్తున్నట్లు తెలిపారు. ఆయన వెయిట్లిఫ్ట్కి సంబంధించిన రెండు రకాల ప్రత్యేక వ్యాయామాలు చేస్తుంటారని అన్నారామె. ఎత్తైన ప్రదేశాలపైకి ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు కూడా తన తండ్రి బ్యాలెన్స్ చేసుకోగలరని, అలాగే 80 పౌండ్ల కంటే ఎక్కువ బరువును మోయగల సామర్థ్యం ఆయనకు ఉందని చెప్పుకొచ్చారు. అంతేగాదు వృద్ధులకు బరువులు ఎత్తడం వంటి వర్కౌట్లు ఎంతో మేలు చేస్తాయని అన్నారు. View this post on Instagram A post shared by Jeana Aragon (김제나) (@jeana.aragon) (చదవండి: సినిమా సీన్ని తలపించేలా.. ఆర్మీ పైలట్ లవ్ ప్రపోజ్!) -
చింతగింజలతో మైక్రోప్లాస్టిక్కి చెక్..!
ప్లాస్టిక్ భూతం ఏ రేంజ్లో ఉందో తెలిసిందే. ముఖ్యంగా నీటిలో ఉన్న మైక్రోప్లాస్టిక్ను తొలగించడం అంత సులభం కాదు. అదీగాక నీటి నుంచి మైక్రోప్లాస్టిక్ని వేరుచేయడం అంటే కచ్చితంగా రసాయనాలు కలపక తప్పని పరిస్థితి, ఖర్చు కూడా అధికమే. ఆ సమస్యకు చక్కటి పరిష్కార మార్గం చూపి ఎర్త్ప్రైజ్ గెలుచుకున్నారు ఈ టీనేజర్లు.వాళ్లే వివాన్ ఛావ్చారియా, అరియానా అగర్వాల్, అవ్యానా మెహతా అనే భారతీయ విద్యార్థుల బృందం. ఈ విద్యార్థులు నీటి నుంచి మైక్రోప్లాస్టిక్లను వేరు చేయడానికి తక్కువ ఖర్చుతో కూడిన పద్ధతిని అభివృద్ధి చేసి అందర్నీ ఆశ్చర్యపరిచారు. అందుకోసం చింత గింజల పొడిని ఉపయోగించి జీవవిచ్ఛిన్నమయ్యే పదార్థాన్ని రూపొందించారు. ఇది కలుషితమైన నీటిలో ఉన్న చిన్న ప్లాస్టిక్ కణాలకు అంటుకుంటుంది. ప్లాస్-స్టిక్ అని పిలువబడే ఈ ఆవిష్కరణ రసాయనాలను జోడించకుండా, సాంప్రదాయ ఫిల్టర్లు తరచుగా వదిలివేసే మైక్రోప్లాస్టిక్లను ఎలా బంధించగలదో పరిశోధనలో వెల్లడైంది. అంతేందుకు ఇప్పుడు వాటర్ టిన్లు, బాటిల్స్ అన్ని ప్లాస్టిక్. అందువల్ల తాగు నీటిలో తప్పక చిన్న చిన్న ప్లాస్టిక్ కణాలు దాగి ఉంటాయి. కానీ అవి కంటికి కనిపించనంత చిన్నవిగా ఉంటాయి. వాటిని పారేసి చింతగింజలతో తయారు చేసిన ప్రత్యేక పొడితో ఈ మైక్రోప్లాస్టిక్ చెక్పెట్టారు.ఈ చింతగింజల పొడి అయస్కాంతం మాదిరిగా ప్లాస్టిక్ని ఆకర్షించి వేరు చేస్తుందట. దీనివల్ల శుభ్రమైన నీటిని సులభంగా పొందొచ్చని చెబుతోంది ఆ విద్యార్థుల బృందం. సేకరించిన ప్లాస్టిక్ను టైల్స్ లేదా కోస్టర్స్ వంటి చిన్న, ఉపయోగకరమైన వస్తువులుగా మారుస్తారు. ఫలితంగా అది తిరిగి ప్రకృతిలోకి చేరదు. ఈ ఆవిష్కరణలో జంతువులు, మానవులు కనిపించన ప్లాస్టిక్ కాలుష్యం బారిన పడకుండా కాపాడగలుగుతామని చెబుతున్నారు. ఆ విద్యార్థులకు గ్రామీణ ప్రాంతాలను సందర్శించనప్పుడే ఈ ఆలోచన తట్టిందని, అక్కడ చాలామంది ప్రజలు ప్లాస్టిక్ పాత్రలలోని నీటిని నిల్వ ఉంచడం చూశామని అన్నారు. వెనుబడిన గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ప్లాస్టిక్ పాత్రల్లో నిల్వ ఉంచిన నీటిని తాగి ఈ మైక్రోప్లాస్టిక్ బారిన పడటం చూశాక ఈ ఆవిష్కరణకు పురికొల్పామని అన్నారు. ఈ ప్రాజెక్టు ప్రభావవంతమైనదే కాకుండా తక్కువ ఖర్చుతో కూడుకున్నది, పైగా స్థానికంగా లభించే వనరులతోనే దీన్ని ఆవిష్కరించడంతో ఈ టీనేజర్లపై ప్రశంసలు జల్లు కురిపిస్తున్నారు అంతా. కలుషితమైన నీటి వనరులతో ఇబ్బంది పడుతున్న వర్గాలకు ఇది గొప్ప ఆచాణాత్మకమైనదని అన్నారు. ఆ నేపథ్యంలోనే ఈ విద్యార్తి బృందం ‘ది ఎర్త్ ప్రైజ్ గ్లోబల్ విజేతలుగా ’ ఎంపికయ్యారు. ఇలా గుర్తింపు పొందిన బృందం మాదే కావడంతో ఎంతో సంతోషంగా ఉందంటున్నారు ఆ ముగ్గురు టీనేజర్లు. కాగా అధికారిక వెబ్సైట్ ప్రకారం, ప్రజా ఓటింగ్ ద్వారా ప్రపంచ విజేతను ఎంపిక చేశారు. అంతేగాదు ఈ ఆవిష్కరణ సంక్లిష్టమైన కాలుష్య సమస్యలను సరళమైన, ప్రకృతి ఆధారిత ఆలోచనలు ఎలా పరిష్కరించగలవో చెప్పడానికి ఉదాహరణగా నిలిచింది. ఈ విజయం యువత నేతృత్వంలోని విజ్ఞాన శాస్త్రానికి, ప్రపంచవ్యాప్తంగా మైక్రోప్లాస్టిక్ తొలగింపు సాంకేతికతల కోసం పెరుగుతున్న కృషికి ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తుంది.(చదవండి: ముంబై స్లమ్ నుంచి అంతర్జాతీయ కెరీర్ రేంజ్కు..! వైరల్గా టెకీ స్టోరీ) -
నాలుగు నెలల్లో 15 కిలోలు తగ్గాలంటే..! ఈ ఐదు సింపుల్ చిట్కాలతో..
బరువు తగ్గాలంటే చక్కని డైట్లు, ఫోర్స్బుల్ వ్యాయామాలు చేస్తుంటారు. శరీరానికి భారం కలిగించేలా ఇలాంటి వర్కౌట్లతో బరువు తగ్గడం ఎలా ఉన్నా.. సమస్యలే ఎక్కువ. కొందరు తగ్గకపోగా..మరింత బరువు పెరుగుతారు. అలా కాకుండా శరీరానికి హాయినిచ్చేలా సులభంగా చేసే వ్యాయామాలు ఆరోగ్యానికి మేలు చేయడమే గాక సులభంగా బరువు తగ్గగలుగుతారని చెబుతోంది ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ దిశా. మరి అదెలాగో ఆమె మాటల్లోనే చూద్దామా.!.15 కిలోల బరువును విజయవంతంగా తగ్గించుకున్న ఆమె తన వెయిట్లాస్ జర్నీని సాధారణమైన రోజువారీ జీవనశైలి అలవాట్లతో ప్రారంభించినట్లు తెలిపారు. ఏం చేసినా..స్కిప్ చేయకుండా నిలకడగా చేస్తే తప్పక ఫలితం పొందగలమని అంటోందామె. తాను తీవ్రమైన వ్యాయామాలు, స్ట్రిక్ట్ డైట్ల జోలికి పోకుండా తగ్గానని చెబుతోంది. అందుకోసం ఏం చేసిందో కూడా షేర్ చేశారామె. వాకింగ్..ఇది కార్షియో వ్యాయామంలా పనిచేస్తుంది. కుదిరినప్పుడల్లా మెట్లు ఎక్కండి, లిఫ్టులు వాడండి.నీరు తాగడం..నిద్రలేవగానే నీళ్లు తాగండి, గోరువెచ్చని నీరైనా.మరే ఏవిధంగానైన నీటిని ఎక్కువగా తీసుకుంటూ హైడ్రేటెడ్గా ఉండేలా చేసుకోండి. ఇది జీవక్రియకు సహాయపడుతుంది. దీనివల్ల రోజంతా మన శక్తిని స్థిరంగా ఉంచుతుంది.ఫైబర్ను మర్చిపోవద్దుప్రోటీన్ ముఖ్యమే, కానీ ఫైబర్ కూడా అంతే ముఖ్యమని గుర్తించండి. అదుకోసం భోజనంలో మంచి మొత్తంలో ఫైబర్ను చేర్చుకునే ప్రయత్నం చేయాలి. ఇది మొత్తం జీర్ణవ్యవస్థ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది.ఇంట్లో వండిన ఆహారంప్రాసెస్ చేసిన ఆహారాలకు బదులుగా ఇంట్లో తయారు చేసిన వాటికే ప్రాధాన్యత ఇవ్వండి. దీనివల్ల పదర్థాఆల పరిమాణాలు, వంట పద్ధతులపై ఒక నియంత్రణ ఉంటుంది. అలాగే అధిక సోడియం, ఉప్పుని తగ్గించే వీలు కూడా ఉంటుంది.కేలరీ లోటుతినే ఆహార పరిమాణాలను అర్థం చేసుకోండి. ద్రవరూప క్యాలరీల పట్ల జాగ్రత్త వహించండి. పండ్ల రసాల కంటే ఎల్లప్పుడూ పండ్లనే తినండి. కొవ్వును తగ్గించుకోవడానికి, కొద్దిపాటి కేలరీ లోటును పాటించాల్సి ఉంటుంది.తమ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలని, ఫిట్నెస్ లక్ష్యాలను సాధించాలని చూస్తున్న వారికి, ఈ సాధారణ అలవాట్లు చాలా బాగా హెల్ప్ అవుతాయని చెబుతోంది ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ దిశా. (చదవండి: 76 కేజీల నుంచి 56 కేజీలకు..! జస్ట్ సింపుల్ వ్యాయమాలతోటే..) -
చద్దన్నం తినడం మంచిదా? కాదా?..
మిగిలిపోయిన అన్నాన్ని నీటిలో, పెరుగులో లేదా మజ్జిగలో నానబెట్టి మరుసటి రోజు తినడం ఒకప్పుడు మన ఇళ్లలో సాధారణ అలవాటు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో చద్దన్నం ఉదయపు ఆహారంలో అంతర్భాగంగా ఉండేది. అయితే కాలం మారేకొద్దీ ఈ అలవాటు క్రమంగా కనుమరుగవుతోంది. రాత్రంతా నానబెట్టిన అన్నం ఆరోగ్యానికి మంచిది కాదనే అభిప్రాయం చాలామందిలో బలపడింది. కానీ తరతరాలుగా కొనసాగుతున్న ఈ ఆహారపు అలవాటు వెనుక నిజంగా ఏదైనా శాస్త్రీయ కారణం ఉందా? చద్దన్నం కేవలం పాతకాలపు ఆహారమేనా, లేక ఆరోగ్యానికి మేలు చేసే గుణాలు ఇందులో నిజంగానే దాగి ఉన్నాయా?.. సైన్స్ మరోసారి ఈ అనుమానాలను నివృత్తి చేసే ప్రయత్నం చేసింది.. వండిన అన్నాన్ని రాత్రంతా నీటిలో నానబెడితే ఉదయానికి సహజ కిణ్వ ప్రక్రియ (ఫెర్మెంటేషన్) ప్రారంభమవుతుంది. ఈ ప్రక్రియలో లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా పెరిగి, అన్నంలోని సంక్లిష్ట కార్బోహైడ్రేట్లను విచ్ఛిన్నం చేస్తాయి. దీంతో అన్నం మరింత సులభంగా జీర్ణమవుతుంది. ఇది కేవలం పుల్లటి రుచిని ఇవ్వడమే కాదు.. శరీరానికి ఉపయోగపడే మంచి సూక్ష్మజీవుల పెరుగుదలకు కూడా దోహదపడుతుంది. అందుకే చద్దన్నాన్ని సహజ ఫెర్మెంటెడ్ ఆహారంగా పరిగణిస్తారు.మిగిలిపోయిన అన్నం.. పోషకాల నిల్వ?ఫెర్మెంటేషన్ వల్ల ఆహారంలోని కొన్ని పోషకాలు శరీరానికి మరింత సులభంగా అందుబాటులోకి వస్తాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా బీ-కాంప్లెక్స్ విటమిన్ల లభ్యత పెరగడంతో పాటు ఐరన్, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం వంటి ఖనిజాలను శరీరం మరింత సమర్థంగా గ్రహించగలుగుతుంది. సాధారణంగా ఆహారంలోని కొన్ని పదార్థాలు ఖనిజాల శోషణకు అడ్డుపడతాయి. ఫెర్మెంటేషన్ ఆ అవరోధాలను తగ్గించడం వల్ల పోషకాలు మరింత ఉపయోగకరంగా మారుతాయి.గట్ హెల్త్పై ఎందుకింత చర్చ?ఇటీవలి కాలంలో ప్రపంచవ్యాప్తంగా "గట్ హెల్త్" అంటే పేగుల ఆరోగ్యం గురించి విస్తృతంగా చర్చ జరుగుతోంది. మన పేగుల్లో ఉండే మంచి బ్యాక్టీరియా జీర్ణక్రియ, రోగనిరోధక శక్తి, శరీర పోషకాల శోషణలో కీలక పాత్ర పోషిస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో గట్ హెల్త్ను మెరుగుపరిచే ఆహారాలపై ఆసక్తి పెరిగింది.ఇక్కడే చద్దన్నం ప్రాధాన్యం పెరుగుతోంది. ఖరీదైన ప్రోబయోటిక్ డ్రింక్స్, సప్లిమెంట్లకు బదులుగా ఇందులో సహజంగా ఏర్పడే లాక్టోబాసిల్లస్ వంటి మంచి బ్యాక్టీరియా జీర్ణక్రియను మెరుగుపరచడంలో, కడుపు ఉబ్బరం తగ్గించడంలో, మలబద్ధకం వంటి సమస్యలను నియంత్రించడంలో సహాయపడతాయని అధ్యయనాలు సూచిస్తున్నాయి.వేసవిలో ఎందుకు ఎక్కువగా తినేవారు?భారతదేశంలో చద్దన్నం సంప్రదాయం ఎక్కువగా వేసవికాలంలో కనిపించడం యాదృచ్ఛికం కాదు. ఇది శరీరాన్ని చల్లబరచడంలో, హైడ్రేట్గా ఉంచడంలో సహాయపడుతుంది. చద్దన్నంలో నీటి శాతం ఎక్కువగా ఉండటంతో శరీరానికి తేమ అందుతుంది. అలాగే ఫెర్మెంటేషన్ వల్ల ఏర్పడే లాక్టిక్ యాసిడ్ శరీర ఉష్ణోగ్రతను సమతుల్యం చేయడంలో తోడ్పడుతుందని నిపుణులు చెబుతున్నారు. అందుకే ఒకప్పుడు రైతులు, కూలీలు ఎండలో పనికి వెళ్లే ముందు చద్దన్నం తినేవారు. ఇది కడుపు నిండిన భావనను కలిగించడంతో పాటు రోజంతా శక్తిని అందించేదని పెద్దలు చెబుతుంటారు.ఎలా తింటే మంచిది?రాత్రి మిగిలిన అన్నాన్ని శుభ్రమైన పాత్రలో నీటితో నానబెట్టి, ఉదయం పెరుగు లేదా మజ్జిగ కలిపి తినవచ్చు. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొద్దిగా ఉప్పు జోడిస్తే రుచితో పాటు పోషక విలువలు కూడా పెరుగుతాయి. కొందరు నిపుణుల అభిప్రాయం ప్రకారం మట్టి పాత్రలో నానబెడితే సహజ ఫెర్మెంటేషన్కు మరింత అనుకూలంగా ఉంటుంది.అందరికీ సరిపోతుందా?చద్దన్నం చాలామందికి మేలు చేసినా.. ప్రతి ఒక్కరికీ ఒకే విధంగా సరిపోతుందని చెప్పలేం. మధుమేహం ఉన్నవారు పరిమిత మోతాదులో మాత్రమే తీసుకోవాలి. అలాగే జీర్ణకోశ సమస్యలు లేదా ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారు వైద్యులు లేదా పోషకాహార నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.మొత్తానికి... చద్దన్నం గురించి ఇన్నాళ్లూ ఉన్న అనుమానాలకు శాస్త్రం ఆసక్తికరమైన సమాధానం చెబుతోంది. ఇది ఏదో అద్భుత ఔషధం కాకపోయినా.. సహజ ఫెర్మెంటేషన్ వల్ల జీర్ణక్రియకు, పేగుల ఆరోగ్యానికి, వేసవిలో శరీరానికి తేమ అందించడంలో ఉపయోగపడే సంప్రదాయ ఆహారంగా గుర్తింపు పొందుతోంది. ఒకప్పుడు "మిగిలిపోయిన అన్నం"గా తక్కువగా చూసిన చద్దన్నం.. ఇప్పుడు శాస్త్రీయ పరిశోధనల్లో కొత్త కోణంలో కనిపిస్తోంది. ఖరీదైన ఆరోగ్య ఆహారాల కోసం వెతుకుతున్న ఈ కాలంలో.. మన వంటింట్లోనే తరతరాలుగా ఉన్న ఈ సాధారణ ఆహారం వెనుక దాగి ఉన్న విజ్ఞానాన్ని సైన్స్ మరోసారి గుర్తు చేస్తోంది. -
మతి మరపు @ అతి బరువు
వయసు పెరుగుతున్న కొద్దీ మతిమరుపు వస్తుండటం సహజం. ఇప్పడు పెరిగే వయసుతో పాటూ పెరిగే బరువు కూడా మతిమరపును ప్రేరేపిస్తోందంటూ కొన్ని పరిశోధనలు తెలుపుతున్నాయి. ఇందులో అత్యంత సాధారణం అల్జీమర్స్ అనే మతిమరపు. దీనికి పెరిగే వయసుతో పాటు బరువు పెరుగుతుండట కూడా అల్జీమర్స్కూ అంతే కారణమవుతోందనేందుకు పరిశోధనల రూపంలో తార్కాణాలు లభ్యమవుతున్నాయి. ఇలా బరువు పెరుగుతుండటంతో పాటు అల్జీమర్స్కు కారణమవుతున్న ఇతర అంశాలేమిటన్నది తెలుసుకుంటూ బరువు తగ్గించుకోవడం ద్వారా మెదడు ఆరోగ్యం ఎలా మెరుగవుతుందో చూద్దాం...మతిమరపును ఇంగ్లిష్లో ‘డిమెన్షియా’ అంటారు. డిమెన్షియాకు కారణాల్లో అత్యంత సాధారణమైనది ‘అల్జీమర్స్’. డిమెన్షియా కొత్త అంశాల్ని నేర్చుకునేందుకు సహాయపడే (కాగ్నిటివ్) నైపుణ్యాల్లోని జ్ఞాపకశక్తి (మెమరీ)పైనా, తార్కికంగా ఆలోచించే సామర్థ్యం (రీజనింగ్)పైనా ప్రతికూలంగా ప్రభావం చూపుతుంది. ఇటీవలి కాలంలో అల్జీమర్స్ బాగా పెరుగుతోంది. ఇది అకస్మాత్తుగా కాకుండా క్రమంగా... అంటే కొన్ని నెలలు మొదలుకొని ఏళ్ల వ్యవధిలోమరచిపోయే అంశాలను పెంచుతూ పోతుంటుంది. ఉదాహరణకు మొదట్లో పేర్లు, కొద్దిసేపటి కిందట జరిగిన సంఘటనలూ, ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇవ్వలేకపోవడం, కుటుంబ సభ్యుల్ని అడిగిన ప్రశ్నల్నే మళ్లీ మళ్లీ అడగడం, సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడం, అటు తర్వాత తెలిసిన దారులనూ, అటు తర్వాత సమీప వ్యక్తులనూ, కుటుంబ సభ్యులను మరచిపోవడం జరుగుతుంది. చివరగా... భయభ్రాంతులకు లోనవ్వడం, మలమూత్ర విసర్జనలపై నియంత్రణ కోల్పోవడం వరకు జరగవచ్చు. ఒక్కమాటలో చెప్పాలంటే నేర్చుకున్న అనేక అంశాలు రాతిమీది రాతల్లా ఉండిపోవాల్సినవి కాస్తా... పలక మీద రాతలా చెరిపివేతకు గురవ్వడాన్ని అల్జీమర్స్గా చెప్పవచ్చు. ఒకసారి అల్జీమర్స్ మొదలయ్యాక బాధితుల్ని మునపటిలా పూర్తిగా నార్మల్ అయ్యేలా చేయడం ఇప్పటికి సాధ్యం కాదు.చికిత్స...అల్జీమర్స్ను పూర్తిగా తగ్గించే మందులు లేకపోయినప్పటికీ... వాటి పురోగతిని ఆలస్యం చేయడానికి మందులు అందుబాటులో ఉన్నాయి. లక్షణాల తీవ్రత ఆధారంగా డోనెపెజిల్, రివాస్టిగ్మిన్, మెమాంటిన్, గ్యాలంటమైన్ వంటి మందులు ఇవ్వాల్సి ఉంటుంది. మెదడులోని అన్నిరకాల కార్యకలాపాలను నిర్వహించే ఎసిటైల్ కోలిన్ అనే రసాయనం సరైన మోతాదుల్లో ఉంచడానికి ఇవి ఉపయోగపడతాయి. గత కొద్దికాలం కిందట ‘లెకనిమ్యాబ్’, ‘డొనానిమ్యాబ్’ అనే సరికొత్త మందుల్ని ఎఫ్డీఏ ఆమోదించింది. పైవన్నీ నోటిద్వారా తీసుకునే మందులు కాగా... లెకానిమ్యాబ్ను రెండోవారాలకు ఒకసారి సూది మందు రూపంలో ఇస్తారు. ఈనెలలోనే (మే, 2026లో) ‘డొనానిమ్యాబ్’ అనే సరికొత్త మందు మనకు అంటే రెండు తెలుగు రాష్ట్రాలకూ అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు అందుబాటులోకి వచ్చిన ఈ మందు అల్జీమర్స్ తొలిదశలో ఇది అత్యంత ప్రభావవంతమైనది. దీన్ని నెలకొక ఇంజెక్షన్ చొప్పున తీసుకోవాలి.పెరిగే బీఎమ్ఐతో జ్ఞాపకశక్తి తగ్గు తున్నా... అది నివారించగలిగే అంశమే... యూనివర్జిటీ ఆఫ్ జార్జియాలో నిర్వహించిన ఇటీవలి తాజా పరిశోధన ఫలితాలేమిటంటే... వయసు పెరుగుతున్న కొద్దీ వారి జ్ఞాపకశక్తి గతంలో వారు యువకులుగా ఉన్నంతగా ఉండకపోవచ్చు. దీనికి తోడు పెరుగుతున్న బరువు (బాడీ మాస్ ఇండెక్స్–బీఎమ్ఐ) పెరుగుతున్న కొద్దీ వారిలోనూ అభ్యాసనం ద్వారా నేర్చుకునే (కాగ్నిటివ్) నైపుణ్యాలూ, గుర్తుంచుకునే సామర్థ్యాలు (మెమరీ), భావోద్వేగాల అదుపు (మేనేజింగ్ ఎమోషన్స్), ప్లానింగ్ అలాగే నిర్వహణ సామర్థ్యాలూ, ఏకాగ్రత (కాన్సంట్రేషన్) తగ్గుతాయని తేలింది. 24 నుంచి 50 ఏళ్ల మధ్య వయసు వారిలో దాదాపు 8,200 మందిపై నిర్వహించిన ఓ అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. అయితే ఇదేమీ చెడు వార్త కాదనీ... ఒకవేళ మనం మన బరువును అదుపులో పెట్టుకుంటే ఆ దుష్పరిణామాలు నివారించవచ్చని ఈ అధ్యయనంలో పాల్గొన్న యూనివర్సిటీ ఆఫ్ జార్జియాలో కాలేజ్ ఆఫ్ పబ్లిక్ హెల్త్కు చెందిన లీడ్ ప్రొఫెసర్ డాక్టర్ సుహాంగ్ సాంగ్ పేర్కొన్నారు.నివారణ... పై అంశాలలో పెరిగే వయసు, జన్యుపరమైన అంశాలు నిరోధించలేనివి. ఇవి మినహా మిగతా రిస్క్ ఫ్యాక్టర్స్ను చాలావరకు ప్రయత్నపూర్వకంగా అదుపులో ఉంచడం ద్వారా వీటిని చాలావరకు నివారించవచ్చు. ఈ కింది అంశాలు నివారణకు చాలావరకు తోడ్పడతాయి.ఆహారం... పోషకాలన్నీ ఉండే సమతులాహారం తీసుకోవడం మెదడు ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ముఖ్యంగా భారతీయ వంటల్లో వాడే పసుపుతో పాటు పాశ్చాత్య ఆహారాల్లో మెడిటేరియన్ డైట్ (ఆల్మండ్స్, వాల్నట్, డార్క్ చాక్లెట్స్, ఆలివ్ ఆయిల్, క్రాన్బెర్రీ) వంటివి మతిమరపు నివారణకు బాగా తోడ్పడతాయి.మెదడుకు మేత కొత్త భాషలు నేర్చుకోవడం, పుస్తక పఠనం, పజిల్స్ వంటి సమస్యలకు పరిష్కారాలను కనుగొనడం వంటి మెదడుకు మేత కల్పించే పొడుపుకథలు, ఉల్లాసంగా ఉంచే హాబీలు, మానసిక వ్యాయామాలు మెదడును చాలా కాలం పాటు ఆరోగ్యంగా ఉంచి మతిమరపు నివారణకు తోడ్పడతాయి.వ్యాయామం...దేహాన్ని చురుగ్గా ఉంచే వ్యాయామాలు చేయాలి. దాంతో మెదడుకు రక్తప్రసరణ బాగాజరిగి, న్యూరాన్లూ వాటి న్యూరల్ కనెక్షన్లు, వివిధ జీవక్రియల కోసం మెదడు స్రవించే రసాయనాలు ఆరోగ్యకరంగా ఉంటాయి. ఫలితంగా జ్ఞాపకశక్తి మెరుగవుతుంది.నిర్ధారణ అల్జీమర్స్ నిర్ధారణ కోసం ఇప్పడు కొన్ని రకాల పరీక్షలు కూడా అందుబాటులోకి వచ్చాయి. గతంలోని ఎమ్మారై బ్రెయిన్తో పాటు కొన్ని రక్తపరీక్షలూ ఇప్పుడ అందుబాటులో ఉన్నాయి. అందులో ముఖ్యమైనవి టీఏయూ (టావు) అండ్ అమైలాయిడ్ శాతాన్ని నిర్ధారణ చేయడం; అమైలాయిడ్ పెట్ స్కాన్ ద్వారా అల్జీమర్స్ను నిర్ధారణ చేయవచ్చు. ఇవి చాలా తాజాగా అందుబాటులోకి వచ్చిన వైద్యపరీక్షలు.సమాజంలో నలుగురితో పాటు ఒకరిగా మెలగడం...వేడుకలు, పుట్టినరోజులూ, పెళ్లిళ్ల వంటి ఫంక్షన్లలో పదిమందినీ కలవడం వంటివి మతిమరపును దూరం చేస్తుంది. అలాంటి ఉల్లాస జీవితం వల్ల భవిష్యత్తులో అల్జీమర్స్ వచ్చే ముప్పూ తగ్గుతుంది.దీర్ఘకాలిక వ్యాధుల అదుపు...డయాబెటిస్, హైబీపీ, క్రానిక్ ఇన్ఫ్లమేషన్స్ వంటి వాటిని అదుపులో పెట్టుకోవాలి.మతి మరుపు, అల్జీమర్స్ కారణమయ్యే అంశాల్లో కొన్ని...మతిమరుపునకూ, అల్జీమర్స్కూ అనేక అంశాలు కారణమవుతుంటాయి. వాటిల్లోని అతి ముఖ్యమైన ఓ అరడజను కారణాలేమిటో చూద్దాం...1. జన్యుపరమైనవి : అల్జీమర్స్తో వచ్చే మతిమరుపునకు జన్యుపరమైన అంశాలు అతి ముఖ్య కారణాలు. కొందరి కుటుంబాల్లో అల్జీమర్స్ వంశాపారంపర్యంగా కనిపిస్తుంటుంది. ఏపీఓఈ 4 ఎల్లీల్ జన్యువు వంటి కొన్ని నిర్దిష్టమైన జన్యువులు ఈ అల్జీమర్స్ ముప్పును పెంచుతాయి.2. వయసు : పెరుగుతున్న వయసు పై సమస్యలకు ప్రధానమైన ముప్పు (రిస్క్ ఫ్యాక్టర్). పైగా ఇది నిరోధించలేని అంశం.3. పెరుగుతుండే బరువు : అధిక బరువు / ఊబకాయం (ఒబేసిటీ) వల్ల దేహంలో కొవ్వుల మోతాదు పెరగడమనే అంశం అల్జీమర్స్ వ్యాధి వచ్చే ముప్పును పెంచుతుందని ఇటీవల కొన్ని తాజా అధ్యయనాల్లో తేలింది. దేహంలోనూ, అందునా మరీ ముఖ్యంగా నడుము చుట్టూ కొవ్వు పెరగడంతో పాటు ఫిట్నెస్ తగ్గడమనే అంశం మెదడును మందకొడిగా మార్చడంతో పాటు మతిమరపును తెచ్చిపెట్టే ప్రమాదమైన సిగ్నల్స్ కారణంగా అల్జీమర్స్ వస్తుందనేది కొన్ని పరిశోధనల్లో తేలిన అంశం.4. జీవనశైలి (లైఫ్ స్టైల్) : ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించినవారిలో... అంటే... ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోకపోవడం, కొవ్వులు, చక్కెరలు ఎక్కువగా తీసుకోవడం, చురుకైన జీవితానికి దూరంగా ఒకేచోట మందకొడిగా ఉండటం, వ్యాయామం లేకుండా బద్ధకంగా ఉండటం, పొగతాగడం, ఆల్కహాల్ తీసుకోవడం వంట అనారోగ్యకరమైన జీవనశైలి ఉన్నవాళ్లలో అల్జీమర్స్ ముప్పు ఎక్కువ.5. దేహంలో దాగి ఉన్న ఇతర సమస్యలు : దీర్ఘకాలికంగా ఉండే డయాబెటిస్, హైబీపీ, గుండెజబ్బులు (కార్డియో వాస్క్యులార్ సమస్యలు)లతో పాటు దీర్ఘకాలికంగా దేహంలో ఉండే ఇన్ఫ్లమేషన్ (క్రానిక్ ఇన్ఫ్లమేషన్) మెదడు పనితీరుపై ప్రతికూల ప్రభావం చూపుతూ అల్జీమర్స్కు కారణమయ్యే అవకాశాలెక్కువ.6. వాతావరణ అంశాలు : వాతావరణంలోని కాలుష్యాలు, విషపూరిత (టాక్సిక్) పదార్థాలు కూడా అల్సైమర్స్ మతిమరపునకు కారణమవుతాయి. దీనికి విరుధ్ధంగా వీలైనంతవరకు పరిశుభ్రమైన ప్రదేశాలూ, కాలుష్యాలు లేని వాతావరణాలూ వీటి నివారణకు చాలావరకు తోడ్పడతాయి.- డాక్టర్ బి. చంద్రశేఖర్ రెడ్డిసీనియర్ న్యూరో ఫిజీషియన్ నిర్వహణ యాసీన్ -
గంటకు 400 కిలోమీటర్ల వేగం!
మనం ఏదైనా వస్తువును తాకినా లేదా ఏదైనా ఆలోచించినా, ఆ సమాచారం మన నరాల ద్వారా మెదడుకు, అలాగే మెదడు నుంచి శరీర భాగాలకు అత్యంత వేగంగా చేరుకుంటుంది.ఈ సంకేతాలు మన నరాల వ్యవస్థలో ఏకంగా గంటకు 400 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఈ వేగం ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఒక బుల్లెట్ ట్రైన్ లేదా ఒక సూపర్ కార్ టాప్ స్పీడ్ కంటే కూడా ఎక్కువ కావడం విశేషం.మన శరీరంలో ఉన్న ఈ అద్భుతమైన వైరింగ్ సిస్టమ్ వల్లే మనం ప్రమాదాల నుంచి త్వరగా తప్పించుకోగలుగుతున్నాం. ఉదాహరణకు, మనం ఏదైనా వేడి వస్తువును తాకగానే, మనం ఆలోచించే లోపే చేతిని వెనక్కి లాగేసుకుంటాం. దీనికి కారణం నరాల ద్వారా మెదడుకు అందే ఈ మెరుపు వేగపు సంకేతాలే! -
మీ ఫ్యామిలీకి బీమా ఎంత?
ఒకప్పుడు బైపాస్ సర్జరీ రూ.1.5 లక్షలకే పూర్తయ్యేది. ఇపుడైతే రూ.3–5 లక్షలు కూడా చాలని పరిస్థితి. అవయవ మార్పిడి చికిత్సకు వెళ్లాల్సి వస్తే రూ.20–30 లక్షలు ఖర్చుచేయక తప్పదు. ఇక సర్జరీ తర్వాత సమస్యలు తలెత్తితే బిల్లు ఏ స్థాయికి పోతుందో ఊహించటమే కష్టం. స్టేజ్ను బట్టి, చికిత్సను బట్టి క్యాన్సర్కు రూ.కోటి కూడా దాటిపోతున్న రోజులివి. కాబట్టి ఎప్పుడో కొనుగోలు చేసిన హెల్త్ ఇన్సూరెన్స్, జీవితాంతం భరోసా ఇస్తుందనుకోవటం కరెక్టు కాదు. కుటుంబ ఆరోగ్య సంరక్షణ అవసరాలు వయసుతోపాటే పెరుగుతూ పోతాయి. కొన్నేళ్ల క్రితం కవరేజీ, సదుపాయాల పరంగా మెరుగ్గా అనిపించిన పాలసీ.. ఇప్పటి వైద్య ద్రవ్యోల్బణాన్ని (పెరిగే చార్జీలు), కుటుంబ అవసరాలను తట్టుకోలేకపోవచ్చు. అత్యాధునిక చికిత్సలకు కవరేజీని ఆఫర్ చేయకపోవచ్చు. అందుకే ప్రతి కుటుంబానికి హెల్త్ ఇన్సూరెన్స్ ఆడిట్ తప్పనిసరి. ఆటో రెన్యువల్ ఆఫ్ చేయండి. ఒక్కసారి ఫోకస్ లైట్ వేసి చూడండి. ఇప్పటికే ఉన్న రక్షణ ఎంత? ముందుగా కుటుంబానికి ఇప్పటికే ఉన్న ఆరోగ్య బీమా పాలసీలను ఒక్కచోటకు చేర్చి, సమగ్రంగా పరిశీలించుకోవాలి. చాలా కుటుంబాల్లో ఒకటి కంటే ఎక్కువ పాలసీలుంటాయి. కానీ, వాటి సదుపాయాల గురించి పెద్దగా గుర్తుండదు. కొన్ని కుటుంబాలకు ఒక్క పాలసీ కూడా ఉండదు. → వ్యక్తిగత హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు → ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్లు → కంపెనీలు ఉద్యోగులకు అందించే గ్రూప్ హెల్త్ ప్లాన్ → టాపప్ లేదా సూపర్ టాపప్ ప్లాన్లు → సీనియర్ సిటిజన్ హెల్త్ పాలసీలు → పాలసీలకు ఉన్న యాడ్ ఆన్లు, రైడర్లుకుటుంబానికి అసలు ఎంత కవరేజీ కావాలి? అన్ని కుటుంబాలకు ఒకే రకమైన ఆరోగ్య బీమా కవరేజీ (సమ్ ఇన్సూర్డ్) అర్థవంతంగా ఉండదు. తమ కుటుంబ వాస్తవ పరిస్థితుల ఆధారంగానే కవరేజీ, సదుపాయాలను ఎంపిక చేసుకోవాలి. కుటుంబంలో ఎంత మంది ఉన్నారు? ఎంత తరచుగా వైద్యసాయం అవసరమవుతుంది? అత్యవసర వైద్యానికి ప్రస్తుత హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ భరోసానిస్తుందా? అన్నది ఒక్కసారి ప్రశ్నించుకోవాలి. ఏదో ఒక పాలసీ తీసుకోవడం కాకుండా, మీ కుటుంబ వాస్తవ పరిస్థితుల ఆధారంగా ఎంత కవరేజీ అవసరమో లెక్కించాలి. → కుటుంబ సభ్యుల వయసుకు ప్రాధాన్యం ఉంటుంది. ఎందుకంటే వయసు పెరుగుతున్న కొద్దీ వైద్య ఖర్చులు పెరుగుతాయి. → ప్రస్తుతం బీపీ, షుగర్ లాంటి దీర్ఘకాలిక వ్యాధులు ఏవైనాఉన్నాయా? → చికిత్స అవసరం పడితే మీరు నివసించే ప్రాంతంలో లేదా నగరంలోని ఏ హాస్పిటల్స్కు వెళ్లడానికి ప్రాధాన్యం చూపిస్తారు? అక్కడ వైద్య ఖర్చులు ఎలా ఉన్నాయో విచారించాలి. మీరు నివసించే ప్రాంతం జోన్ ఆధారంగా ప్రీమియాన్ని కంపెనీలు నిర్ణయిస్తుంటాయి. ఒక జోన్ పరిధిలో పాలసీ తీసుకుని, ఇంకో జోన్లో చికిత్స తీసుకుంటే కొంత మొత్తాన్ని సొంతంగా (కోపేమెంట్) చెల్లించుకోవాల్సి వస్తుంది. → మీకు నచ్చిన హాస్పిటల్స్ ఇన్సూరెన్స్ నెట్వర్క్ పరిధిలో ఉన్నాయా? → ప్రసవ ఖర్చులు (మెటర్నిటీ), చిన్న పిల్లల సంరక్షణ లేదా వృద్ధుల చికిత్స అవసరాలు ఉన్నాయా? వీటిల్లో మీ అవసరాలు ఏవన్నవి నిర్ణయించుకోవాలి.ప్రీమియం చెక్ చేసుకోండి.. ఆన్లైన్ ప్రీమియం క్యాలిక్యులేటర్ల సాయంతో ఏ నిర్ణయమైనా సులభంగా తీసుకోవచ్చు. జేబు నుంచి డబ్బులు పెట్టకుండానే ఏ ప్లాన్కు ఎంత ఖర్చవుతుందో వీటితో సులభంగా తెలుసుకోవచ్చు. → వ్యక్తిగత పాలసీ తీసుకోవాలా లేక ఫ్యామిలీ ఫ్లోటర్ నయమా? → బేసిక్ ఇండెమ్నిటీ పాలసీ కవరేజీ (సమ్ ఇన్సూర్డ్) పెంచితే ప్రీమియం ఎంత అదనంగా చెల్లించాల్సి వస్తుంది? → బేసిక్ ప్లాన్ తక్కువగా ఉంచి, దానికి సూపర్ టాపప్ జోడిస్తే ప్రీమియం ఎంత ఆదా అవుతుంది? ఎందుకంటే సాధారణంగా బేసిక్ ప్లాన్ సమ్ ఇన్సూర్డ్ను పెంచడం కంటే అదనపు కవరేజీతో సూపర్ టాపప్ జోడించుకోవడం చాలా చౌక మార్గం. పాలసీ లోపాలు – అదనపు ఖర్చులు ఈ ఆడిట్ వల్ల మీ పాలసీలో ఉన్న లోపాలను గుర్తించొచ్చు. అనవసరమైన వాటికి డబ్బులు చెల్లించకుండా చూసుకోవచ్చు. పాలసీ లోపాలు → రూమ్ రెంట్ పరిమితులు: మీ పాలసీలో రూమ్ రెంట్పై పరిమితి ఉంటే, క్లెయిమ్ సమయంలో మీ బిల్లులో చాలా కోత పడుతుంది. ఉదాహరణకు షేర్డ్ రూమ్ అనే క్లాజ్ ఉందనుకుందాం. ఆస్పత్రిలో చేరినప్పుడు సింగిల్ రూమ్ వసతి పొందితే బిల్లులో భారీ తేడా వస్తుంది. షేర్డ్ రూమ్లో అందించే చికిత్సల చార్జీలు, సింగిల్ రూమ్ కంటే తక్కువగా ఉంటాయి. కనుక సింగిల్ రూమ్లో చేరడం కారణంగా ఎంత వ్యత్యాసం వచ్చిందో అంతమేర బిల్లు నుంచి బీమా కంపెనీలు తెగ్గోస్తాయి. → కో–పేమెంట్ క్లాజ్: క్లెయిమ్ మొత్తంలో మీ జేబు నుంచి పెట్టుకోవడం. ఉదాహరణకు 20 శాతం కోపేమెంట్ నిబంధన ఉంటే.. రూ.5 లక్షల బిల్లులో రూ.లక్ష పాలసీదారుడు సొంతంగా చెల్లించుకోవాలి. → వెయిటింగ్ పీరియడ్: పాలసీ తీసుకునే నాటికి ఉన్న వ్యాధుల కవరేజీకి ఎంత కాలం పాటు వేచి ఉండాలన్నది ఇందులో ఉంటుంది. → వ్యాధుల వారీ పరిమితులు: వ్యాధుల వారీ చెల్లింపుల పరిమితుల్లేకుండా చూసుకోవాలి. అ లాగే టెక్నాలజీ సాయంతో చాలా చికిత్సలను వేగంగా కానిచ్చేస్తున్నారు. దీంతో రోగి కొన్ని గంటల పాటు ఆస్పత్రిలో ఉంటే సరిపోతుంది. వీటిని డేకేర్ ప్రొసీజర్స్గా పేర్కొంటారు. కనుక మీ ప్లాన్లో డేకేర్ ప్రొసీజర్స్ అన్నింటికీ కవరేజీ ఉండేలా చూసుకోవాలి. → రీస్టోరేషన్: మీ ప్లాన్లో రీస్టోరేషన్ కూడా ఉండాలి. ఒక ఏడాదిలో సమ్ ఇన్సూర్డ్ మొత్తం ఖర్చయిపోతే, తిరిగి మళ్లీ అంతే మొత్తం దీనికింద బీమా సంస్థ పునరుద్ధరిస్తుంటుంది. అపరిమిత రీస్టోరేషన్ ఫీచర్నూ కంపెనీలు ఆఫర్ చేస్తున్నాయి. → ప్రీ– అండ్ పోస్ట్–హాస్పిటలైజేషన్: ఆస్పత్రిలో చేరడానికి ముందు, డిశ్చార్జ్ అయిన తర్వాత ఎన్ని రోజులకు చెల్లింపులు చేస్తుందో తెలుసుకోవాలి. అదనపు ఖర్చులు → డూప్లికేట్ కవరేజీ: పనిచేసే కంపెనీ ఇచ్చే గ్రూప్ హెల్త్ప్లాన్ అన్నింటికీ సరిపోతుంటే, విడిగా అదే రకమైన పాలసీపై అనవసరంగా ఖర్చు చేస్తున్నారా? ఒక్కసారి గమనించండి. కంపెనీ ఆఫర్ చేసినా, విడిగా కుటుంబానికి ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్ కచ్చితంగా ఉండాలి. కనుక పనిచేసే సంస్థ నుంచి బీమా కవరేజీ పొందుతుంటే.. అందులో లేని సదుపాయాలతో కూడిన ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్ను రూ.5 లక్షల కవరేజీతో తీసుకోవచ్చు. → అనవసర యాడ్ ఆన్లు: గతంలో ఎప్పుడో తీసుకున్న మెటర్నిటీ రైడర్ ఇప్పుడు అవసరం లేకపోయినా ప్రీమియం కడుతున్నారా? అలాగే, అవసరం లేని యాడాన్ ఇంకేవైనా ఉన్నాయా? → సరైన ప్లాన్ లేకపోవడం: వృద్ధులైన తల్లిదండ్రులను ఫ్యామిలీ ఫ్లోటర్లో ఉంచడం వల్ల ప్రీ మియం భారం పెరుగుతుంటే, వారిని విడి గా సీనియర్ సిటిజన్ ప్లాన్లోకి మార్చాలి. దీనివల్ల ప్రీమియం ఎంతో ఆదా అవుతుంది. క్లెయిమ్ సాఫీగా.. సదుపాయాలు, ప్రీమియం పరంగా పాలసీ ఆకర్షణీయంగా అనిపించినప్పటికీ.. అవసరానికి నగదు రహిత చికిత్స అందించలేకపోతే వృథా. కనుక ఈ ప్రశ్నలకు సమాధానం కనుక్కోవాలి. → బీమా సంస్థ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో ఎలా ఉంది? → డిజిటల్ రూపంలో క్లెయిమ్ సపోర్ట్, కస్టమర్ కేర్ సేవలు సరిగ్గా అందుతున్నాయా? → క్లెయిమ్ ప్రాసెస్ సులభంగా, వేగంగా ఉందా? → నెట్వర్క్ హాస్పిటల్స్ జాబితా పెద్దదేనా? నగదు రహిత చికిత్సలను సులభంగా లభిస్తున్నాయా?ఆచరణ.. ఆడిట్ పూర్తయ్యాక, రాబోయే రెన్యువల్ సమయంలో కింది మార్పులు చేసుకోండి. → ప్రస్తుత ప్లాన్ను కవరేజీ చాలదనుకుంటే సూపర్ టాపప్ జోడించుకోండి. ఇప్పటికే ఉన్న సమ్ ఇన్సూర్డ్ను డిడక్టబుల్గా ఎంపిక చేసుకోండి. ఉదాహరణకు రూ.5 లక్షలకు సమ్ ఇన్సూర్డ్తో ప్లాన్ ఉంటే, రూ.5 లక్షల డిడక్టబుల్తో రూ.25– 50– 100 లక్షలకు సూపర్ టాపప్ను చాలా తక్కువ ప్రీమియంకే సొంతం చేసుకోవచ్చు. → అనవవసరమైన యాడాన్లను రద్దు చేసుకోండి. → ముఖ్యంగా పాలసీ వర్డింగ్స్ డాక్యుమెంట్ను ఆసాంతం చదివి అందులోని కవరేజీ ఆప్షన్లు, మినహాయింపులు ఏవైనా ఉంటే అవగాహన తెచ్చుకోవాలి. లేని కవరేజీలను యాడాన్ రూపంలో జోడించుకోవచ్చేమో చూడండి. → ప్రస్తుత బీమా సంస్థ సేవలు సంతృప్తికరంగా లేకపోతే, రెన్యువల్ సమయంలో పోర్టింగ్ ద్వారా మరొక బీమా కంపెనీ ప్లాన్లోకి మారిపోవచ్చు.గుర్తు పెట్టుకోండి.. ఇన్సూరెన్స్ ఆడిట్ అనేది కనీసం ప్రతి ఐదేళ్లకు ఒకసారైనా అవసరం. అప్పుడే మారుతున్న వైద్య ఖర్చులకు, మీ కుటుంబ అవసరాలకు తగినట్లుగా మీ పాలసీ అప్డేట్గా ఉంటుంది. ఆటో–రెన్యువల్స్ జోలికి వెళ్లకుండా, ప్రీమియం క్యాలిక్యులేటర్ సాయంతో సరైన ప్లాన్ ఎంచుకుని మీ కుటుంబానికి పూర్తి ఆర్థిక భరోసా కల్పించుకోండి.– సాక్షి, వెల్త్ -
76 కేజీల నుంచి 56 కేజీలకు..! జస్ట్ సింపుల్ వ్యాయమాలతోటే..
బరువు తగ్గడం అనగానే తీవ్రమైన జిమ్ సెషన్లు, అధిక వ్యాయామాలు, స్ట్రిక్ట్ డైట్ తప్పనిసరని అనుకుంటాం. అలాగే చాలామంది శ్రమతో కూడిన వ్యాయామాలు చేసి..చివరికి శరీరం అలిసిపోయి..మా వల్ల కాదని మధ్యలోనే వెయిట్లాస్ జర్నీని వదిలేస్తుంటారు. అయితే అలా ఇబ్బందిపడకుండా కొద్దిపాటి వ్యాయామాలతోనే సులభంగా కేజీల కొద్దీ బరువు తగ్గొచ్చని అంటున్నారు ఫ్యాట్ లాస్ కోచ్. కీళ్లపై అధిక ఒత్తిడిని కలిగించకుండా, కేలరీలను బర్న్ చేసే చిన్నపాటి వ్యాయామాలు కూడా ఉన్నాయని అంటున్నురామె. అదెలాగో తెలుసుకుందామా.!.అధికబరువుతో ఉండి కొవ్వు తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తుంటే..వర్కౌట్లు చాలా ప్రభావవంతంగా ఉంటాయంటున్నారామె. అయితే కీళ్లకు నొప్పి కలిగించి, ప్రేరణను దూరం చేసే అధిక ప్రభావ వ్యాయామాలతో ప్రయత్నించమని చెబుతున్నారు. మోకాళ్లు, కీళ్లను దెబ్బతీయకుండా కొవ్వును కరిగించే, క్రమబద్ధమైన, తక్కువ-ప్రభావం, అధిక-తీవ్రత గల వ్యాయామాలను ఎంచుకోమని చెబుతున్నారు.స్టాండింగ్ జాక్స్తక్కువ-ప్రభావం గల స్టాండింగ్ జాక్స్ మీ హృదయ స్పందన రేటును పెంచడానికి మరియు కేలరీలను కరిగించడానికి కీళ్లకు అనుకూలమైన మార్గం. ఒక పాదాన్ని నేలపై ఉంచడం ద్వారా, మొత్తం శరీరాన్ని నిమగ్నం చేస్తూనే ప్రభావాన్ని తగ్గిస్తారు. కొవ్వు తగ్గించే కోచ్ నియంత్రిత కదలికతో 20 సార్లు చేయమని సిఫార్సు చేస్తున్నారు.స్టాండింగ్ హై నీస్ఒక పాదాన్ని నేలపై ఉంచి, మోకాళ్లను మీ ఛాతీ వరకు పైకి లేపండి. ఈ వ్యాయామం మీ కోర్ను తీవ్రంగా నిమగ్నం చేస్తుంది, హృదయ స్పందన రేటును పెంచుతుంది. చేసే వేగం ఆధారంగా కచ్చితంగా ఎన్ని కేలరీలు ఖర్చు చేస్తారనేది ఆధారపడి ఉంటుంది. అందుకోస ఆన్లైన్ కేలరీ బర్న్ కాలిక్యులేటర్ను కూడా ఉపయోగించవచ్చు. ఈ కదలికను స్థిరమైన వేగంతో 20 సార్లు యండి.పల్స్ స్క్వాట్స్ఈ బాడీవెయిట్ వ్యాయామం కీళ్ళను సురక్షితంగా ఉంచుతూనే,క్వాడ్స్ (తొడ ముందు కండరాలు), గ్లూట్స్ (పిరుదులు), కోర్ (శరీర మధ్యభాగం) కండరాలను ఉత్తేజపరుస్తుంది. సాధారణ స్క్వాట్లో ఉండే పూర్తిగా నిలబడి, తిరిగి యధాస్థానానికి వచ్చే కదలికను తొలగించడం ద్వారా,కండరాలపై నిరంతర ఒత్తిడిని ఉంచుతారు. ఇది లీన్ కండరాలను నిర్మించడానికి, జీవక్రియ రేటు పెంచడానికి సహాయపడుతుంది.వాల్ క్లైంబర్పాదాలను నేలపై స్థిరంగా ఉంచి, 30 రెప్స్ చేయడం వల్ల భుజాలు, ఛాతీ, కోర్ కండరాలు ఉత్తేజితమవుతాయి. ఇది హృదయ స్పందన రేటును పెంచుతూ, మోకాళ్లు కీళ్లపై ఒత్తిడిని తగ్గిస్తుంది. దీనివల్ల కేలరీలను కరిగించడంలో సహాయపడే కార్డియోవాస్కులర్ ప్రభావం ఏర్పడుతుంది.వివరాలకు ఈ వీడియోపై క్లిక్ చేయండి(చదవండి: పిల్లలకు సమయం కేటాయించాలి) -
మండే ఎండల్లో పచ్చి ఉల్లిపాయలు తినొచ్చా?
దేశవ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. పలు రాష్ట్రాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ప్రజలు శరీరాన్ని చల్లబరుచుకోవడానికి పూర్వ కాలపు వేసవి చిట్కాలను ఆశ్రయిస్తున్నారు. మజ్జిగ నుంచి నానబెట్టిన సబ్జా గింజలు, పచ్చి ఉల్లిపాయల వరకు... సాంప్రదాయ చలవ చేసే ఆహారాలు ఇప్పుడు ప్రతిచోటా కనిపిస్తున్నాయి. అయితే ఈ చిట్కాలలో కొందరు వేసవిలో పచ్చి ఉల్లిపాయలు తినాలని కచ్చితంగా చెబుతుంటే, మరికొందరు ఇవి ఎసిడిటీకి కారణమవుతాయని, కాబట్టి వీటిని అస్సలు తినకూడదని నమ్ముతారు. దీంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. తీవ్రమైన ఎండలు ఉన్నప్పుడు నిజంగా పచ్చి ఉల్లిపాయలు తినవచ్చా? అవి సమస్యను మరింత తీవ్రం చేస్తాయా? వంటి ప్రశ్నలకు సమాధానం ఇదిగో..డీహైడ్రేషన్ను తగ్గించడంలో పచ్చి ఉల్లిపాయలు సహాయపడతాయని చాలామంది నమ్ముతారు. పచ్చి ఉల్లిపాయలు వేడి వాతావరణంలో శరీరానికి కొన్ని విధాలుగా సహాయకరమే కానీ వాటిని ఎక్కువగా తినడం వల్ల కొంతమందికి సమస్యలు కూడా రావచ్చు. తరతరాలుగా ఉల్లిపాయలకు, వేసవి కాలానికి బలమైన సంబంధం ఉంది. చాలా ఇళ్లలో, ఎండలు ఎక్కువగా ఉన్నప్పుడు భోజనంతో పాటు ఉల్లిపాయ ముక్కలు తింటారు. ఉల్లిపాయలు వడగాల్పులు నుంచి శరీరాన్ని రక్షించడంలో సహాయపడతాయని గ్రామాలు, చిన్న పట్టణాల ప్రజలు ఇప్పటికీ నమ్ముతారు.ఉల్లిపాయలు, ఎండ నుండి రక్షణకు సంబంధించి రాజస్థాన్లో ఒక ఆసక్తికరమైన సాంప్రదాయ పద్ధతి కూడా ఉంది. రాజస్థాన్లోని ఒక సాంప్రదాయం ప్రకారం, ప్రజలు శరీరాన్ని చల్లగా ఉంచుకోవడానికి తమ ఛాతీపై, చెవుల వెనుక ఉల్లిపాయ పేస్ట్ను రుద్దుకుంటారు. సైన్స్ ప్రతి సాంప్రదాయ చిట్కాను పూర్తిగా నిర్థారించకపోవచ్చు. కానీ ఈ పద్ధతులు చాలా వరకు తరతరాలుగా కొనసాగుతూనే ఉన్నాయని న్యూట్రిషనిస్టులు చెబుతున్నారు.వేసవి కాలంలో ఉల్లిపాయలను ఉపయోగించడానికి ప్రధాన కారణం నీటి శాతం. పచ్చి ఉల్లిపాయలలో అధిక మొత్తంలో నీరు ఉంటుంది. ఇది తీవ్రమైన వేడి వాతావరణంలో శరీరాన్ని హైడ్రేటెడ్గా ఉంచడానికి సహాయపడుతుంది. ఉష్ణోగ్రతలు పెరిగినప్పుడు, శరీరం చెమట ద్వారా నిరంతరం నీటిని కోల్పోతుంది. కాబట్టి, ఎక్కువ నీటి శాతం ఉన్న ఆహారాలు శరీరానికి ఉపశమనాన్ని ఇస్తాయి.అయితే వేసవిలో ఉల్లిపాయలు ఉపయోగపడటానికి అది ఒక్కటే కారణం కాదు. సాంప్రదాయ వైద్యం ప్రకారం, ఉల్లిపాయ మన శరీరంపై చలవ చేసే ప్రభావాన్ని చూపుతుంది. వీటిలో క్వెర్సెటిన్ అనే యాంటీఆక్సిడెంట్, ప్రిబయోటిక్స్, మంచి నీటి శాతం ఉంటాయని న్యూట్రిషనిస్టులు అంటున్నారు. అలాగే పచ్చి ఉల్లిపాయలు వడదెబ్బ నుంచి పూర్తి రక్షణ ఇవ్వలేవని.. అవి తమలోని పోషకాలు, నీటి శాతం కారణంగా శరీరానికి తోడ్పడగలవు కానీ, అవి మంచినీళ్లు తాగడానికి ప్రత్యామ్నాయం కాదంటున్నారు.కొంతమంది ఎటువంటి సమస్య లేకుండా ప్రతిరోజూ వీటిని తినగలిగినప్పటికీ, మరికొందరు ఎక్కువ పచ్చి ఉల్లిపాయలను తిన్న తర్వాత ఎసిడిటీ, కడుపు ఉబ్బరం, గ్యాస్, గుండెల్లో మంట వంటి సమస్యలను ఎదుర్కోవచ్చుని వైద్య నిపుణులు చెబుతున్నారు. తీవ్రమైన ఎండలు ఉన్నప్పుడు, జీర్ణక్రియలో వచ్చే ఇబ్బందులు మరింత అసౌకర్యాన్ని కలిగిస్తాయి. అధికంగా పచ్చి ఉల్లిపాయలు తిన్న తర్వాత కొందరు అసౌకర్యంగా భావించడానికి కారణం ఇదే. ఇక్కడ సమస్య ఉల్లిపాయది కాదు, దానికి మన జీర్ణవ్యవస్థ ఎలా స్పందిస్తుందనేది ముఖ్యం.ఎసిడిటీతో బాధపడేవారు పచ్చి ఉల్లిపాయలు తిన్న తర్వాత మరింత సమస్యను ఎదుర్కొంటారు. పచ్చి ఉల్లిపాయలు నేరుగా వడదెబ్బకు కారణమవుతాయని చెప్పడానికి ప్రస్తుతం ఎటువంటి స్పష్టమైన శాస్త్రీయ ఆధారాలు లేవు. అయితే, ఎక్కువ పచ్చి ఉల్లిపాయలు తినడం వల్ల వికారం, ఎసిడిటీ, కడుపు నొప్పి కలిగితే.. హీట్వేవ్ సమయంలో మనిషిని మరింత నీరసపరుస్తుందని వైద్యులు చెబుతున్నారు. -
Yoga ఉత్కటాసనంతో లాభాలేంటో తెలుసా?
ఉత్కటాసనం (chair pose) అనేది యోగాలో ఒక ముఖ్యమైన నిలబడి చేసే ఆసనం. ఇది ఒక ఊహాజనిత కుర్చీపై కూర్చున్నట్లుగా శరీర భంగిమను కలిగి ఉంటుంది. ఇది కాళ్లను, పిరుదులను, వెన్నెముకను బలపరుస్తుంది.చేసే విధానం: ముందుగా యోగా మ్యాట్పై నిటారుగా (తాడాసనం) నిలబడండి. రెండు పాదాలు దగ్గరగా ఉంచాలి.. గాలిని పీలుస్తూ రెండు చేతులను తల పైకెత్తి నమస్కార ముద్రలో ఉంచాలి.ఇప్పుడు శ్వాసను వదులుతూ, మోకాళ్ళను వంచి, పిరుదులను వెనక్కి నెట్టండి మీరు కుర్చీలో కూర్చున్నట్లుగా కిందకు వంగాలి.మీ మోకాళ్ళు కాలి వేళ్ల కంటే ముందుకు రాకుండా జాగ్రత్త పడాలి.వీపును నిటారుగా ఉంచి, మీ భుజాలను రిలాక్స్గా ఉంచాలి. సాధారణ శ్వాస తీసుకుంటూ ఈ భంగిమలో 30 సెకన్ల పాటు ఉండాలి.ప్రయోజనాలు: తొడలు, పిరుదులు, చీలమండలు, కాళ్ల కండరాలు దృఢంగా మారతాయి.ఊపిరితిత్తుల సామర్థ్యం పెరుగుతుంది. గుండె పనితీరు మెరుగుపడుతుంది.శరీర సమతుల్యతను, ఏకాగ్రతను పెంపొదిస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.జాగ్రత్తలు: మోకాళ్ల నొప్పులు, ఆర్థరైటిస్ లేదా చీలమండల సమస్యలు ఉన్నవారు, అధిక రక్త΄ోటు ఉన్నవారు ఈ ఆసనాన్ని చెయ్యకూడదు.– అనిత పాతర్ల, యోగా ట్రైనర్ -
3,500 ఏళ్ల క్రితం ప్రజల తెలివి.. నేటి టెక్నాలజీకే సవాల్!
ఓ నాలుగైదు గంటలు కరెంటు లేకపోతే ఏమవుతుంది? ఉక్కపోత గురించి పక్కన పెడితే ఫ్రిజ్లో ఉన్న పాలు పాడైపోతాయేమో, కూరగాయలు కుళ్లిపోతాయేమో అనే కంగారు మొదలవుతుంది. కానీ ఎలాంటి విద్యుత్ సౌకర్యం, ప్లాస్టిక్ డబ్బాలు, ఆధునిక కోల్డ్ స్టోరేజ్ టెక్నాలజీ లేని 3,500 ఏళ్ల కిందట జీవించిన ప్రజలు తమ ఆహారాన్ని ఎంతో భద్రంగా దాచుకునేవారు. అప్పట్లో సాగు చేసిన పంట మరుసటి ఏడాది వరకు పాడవకుండా చక్కగా కాపాడుకునేవారు. ఎండ తీవ్రత 40 డిగ్రీలు దాటినా, కీటకాలు, ఎలుకల భయం ఉన్నా వారు ధాన్యాన్ని నెలల తరబడి సురక్షితంగా ఉంచుకోగలిగేవారు.. ఇదంతా ఎలాగంటారా? దానికి కారణం వారు ఉపయోగించిన సాంకేతికతనో మరేదో కాదు.. భూమి అంటే ఆశ్చర్యం కలగక మానదు.తమిళనాడులోని కోయంబత్తూర్ సమీపంలో పశ్చిమ కనుమల అడుగుభాగంలో ఉన్న మొలపాళయం అనే ప్రాంతంలో తమిళ విశ్వవిద్యాలయ పురావస్తు శాస్త్రజు్ఞలు ఇటీవల జరిపిన తవ్వకాల్లో నవీన శిలా యుగం (నియోలిథిక్ ఎరా) నాటి అద్భుతమైన భూగర్భ గృహాలు బయటపడ్డాయి. ఇందులోనే వారు అన్నీ దాచుకునేవారు. ఇవి కేవలం పంట దాచుకునే సాధారణ గిడ్డంగులు మాత్రమే కావు.. నాటి కుటుంబాల జీవన కేంద్రాలు. కొన్ని గుంతలలో ప్రాచీన రుబ్బురాళ్లు లభించాయి. అంటే ఇవి వంటగదులుగా కూడా ఉపయోగపడేవని పరిశోధకులు భావిస్తున్నారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు మనుషులు దాక్కోవడానికి వీలుగా వీటిని పెద్ద పరిమాణంలో నిర్మించారు.మరి ఎలా పని చేస్తాయ్?ఈ మొలపాళయం గుంతల నిర్మాణం వెనుక ఎంతో లోతైన భౌతిక, రసాయన శాస్త్ర సూత్రాలు దాగి ఉన్నాయి. భూమి ఉపరితలంపై ఎండ తీవ్రత ఎంత ఎక్కువగా ఉన్నా, భూమి లోపలి పొరల్లో ఉష్ణోగ్రత ఎప్పుడూ స్థిరంగా, చల్లగా ఉంటుంది. ఈ సూత్రాన్ని ఆధారంగా చేసుకునే వీటిని నిర్మించారు. తమిళనాడులోని ఉక్కపోత, తేమ వల్ల ధాన్యం బూజు పట్టకుండా ఉండటానికి గుంతల లోపలి గోడలకు చెరువు మట్టి, వరి తవుడు, వరి గడ్డి కలిపిన మిశ్రమంతో పూత పూసేవారు. ఇవి తేమను పూర్తిగా పీల్చేసుకుంటాయి. అలాగే క్రిమికీటకాలు చేరకుండా ఉండేందుకు గోడలపై ఆవు పేడ నీటిని చల్లేవారు. ఇది సహజ యాంటీసెప్టిక్గా పనిచేస్తుంది. ఇక బయటి భాగాలకు సున్నం పూసేవారు. ధాన్యం తీసే ప్రతిసారీ గాలి లోపలికి వెళ్లి పంట పాడవకుండా ఉండటానికి, ఈ గుంతల అడుగు భాగంలో చిన్న రంధ్రాలను ఏర్పాటు చేశారు. వీటి ద్వారా అవసరమైనప్పుడు కొద్దికొద్దిగా ధాన్యాన్ని బయటకు తీసుకునే వీలుండేది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఈ సాంకేతికత కేవలం చరిత్రకే పరిమితం కాలేదు. గత 20వ శతాబ్దం మధ్యకాలం వరకు తమిళనాడులోని సేలం, ఈరోడ్, దిండిగల్ ప్రాంతాల రైతులు ‘కులుమై’, ‘కుదిర్’అని పిలిచే మట్టి నిల్వ పద్ధతులను ఉపయోగించేవారు. భారతదేశంలో దాదాపు 70 శాతం ధాన్యాన్ని పూర్వం ఇటువంటి దేశీయ పద్ధతుల్లోనే భద్రపరిచేవారని అంచనా. కానీ హరిత విప్లవం రాకతో, రసాయన మందులు, ఆధునిక ఇనుప గిడ్డంగులు అందుబాటులోకి వచ్చాయి. దీంతో ఈ అద్భుతమైన విధానాన్ని ‘పాతకాలపు పద్ధతి’గా కొట్టిపారేసి, పూర్తిగా మరుగునపడేశారు.ప్రస్తుతం అవసరమే.. ప్రస్తుత తరుణంలో ఈ విధానం ప్రపంచానికి ఎంతో అవసరం అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దేశంలో ఏటా సరైన నిల్వ వసతులు లేక లక్ష లాది టన్నుల ఆహార ధాన్యాలు వృథా అవుతున్నాయి. ఆధునిక కోల్డ్ స్టోరేజ్ పద్ధతులు విపరీతమైన విద్యుత్ను వినియోగిస్తూ, పర్యావరణానికి హాని కలిగిస్తున్నాయి. మారుతున్న వాతా వరణ పరిస్థితులు, పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో శాస్త్రవేత్తలు మళ్లీ పాత పద్ధతుల వైపు మొగ్గు చూపుతున్నారు. 3,500 ఏళ్ల కిందట మన పూరీ్వకులు కనిపెట్టిన ఈ జీరో కార్బన్ విధానాలను తక్కువ ఖర్చు తో కూడిన ప్రత్యామ్నాయాలుగా మార్చడానికి పరిశోధనలు చేస్తున్నారు. ప్రకృతిని గౌరవిస్తూ వారు సాధించిన ఈ విజయం, నేటి ఆధునిక ప్రపంచానికి ఒక గొప్ప పాఠం. -
ఫిట్నెస్... ఫర్ స్ట్రెస్!
గ్లామర్ రంగంలో ఉంటూ ఫిట్నెస్ ద్వారా ప్రభావం చూపిన అతి కొద్దిమంది వ్యక్తులలో మిళింద్ సోమన్ ఒకరు. చాలామందికి రిటైర్ మెంట్ తీసుకునే 60 ఏళ్ల వయసులో ఆయన యువతరానికి గొప్ప స్ఫూర్తిని ఇస్తూనే ఉండడం విశేషం.‘యూరప్ నుంచి ఆఫ్రికా దాకా 15 కి.మీ దూరం సముద్రంలో ఈత కొట్టాను. అదో అందమైన అనుభవం’ అంటూ ఇటీవల సోషల్ మీడియాలో షేర్ చేశారు మిళింద్ సోమన్. బాడీ ఫిట్నెస్తో దేశంలో తరచు చర్చనీయాంశం గా మారే ఏకైక సెలబ్రిటీ మిళింద్. తెరపై నటుడిగా ఆయన సినిమా ప్రేక్షకులకు మాత్రమే పరిచితులు కావచ్చు.. ఫిట్నెస్ ఐకాన్గా మాత్రం కోట్లాది మందికి స్ఫూర్తి.సూపర్ మోడల్ టూ సూపర్ రన్నర్...ఆయన ప్రయాణం 1990లలో సూపర్ మోడల్గా నిలవడంతో మొదలైంది. ఆ తర్వాత జుర్మ్ , ఫోర్ మోర్ షాట్స్ ప్లీజ్, డిసెంబర్ 16, ఎమర్జెన్సీ వంటి చిత్రాల ద్వారా ప్రేక్షకులకు దగ్గరయ్యారు. మరోవైపు దాదాపు పాతికేళ్లుగా రన్నింగ్ ట్రాక్ మీద సాటిలేని స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. సుదూరప్రాంతాలు, కఠినమైన భూభాగాలు అనూహ్యమైనప్రాంతాల్లో పరుగులు తీయడం ద్వారా ఫిట్నెస్కు సరికొత్త అర్థాన్ని చె΄్పాడు. చెప్పులు లేకుండా పరుగెత్తడంలో కూడా ఆయన పాపులర్.పింక్థాన్.. మహిళలకు ఇన్స్పిరేషన్ప్రస్తుతం దాదాపు ప్రతినగరంలో సర్వసాధారణంగా మారిన మారథాన్లు, ఫిట్నెస్ ఈవెంట్స్కు ఆయన దాదాపు దశాబ్దమున్నర క్రితమే రూపకల్పన చేశారు. దేశవ్యాప్తంగా పరుగు కార్యక్రమాలు నిర్వహిస్తున్నా మహిళల భాగస్వామ్యం 4–5 శాతం మించి లేదని గమనించాక... మహిళల కోసం ప్రత్యేకించి ఒక ఈవెంట్ను రూపకల్పన చేయాలన్న ఆలోచనతో గత 2012లో, సోమన్, ఆయన భార్య అంకితా కోన్వర్లు కలిసి ప్రారంభించిన పింక్థాన్ ఈవెంట్ ప్రస్తుతం మన దేశంలోనే అతిపెద్ద మహిళల రన్నింగ్ ఈవెంట్ గా అవతరించింది.హిట్... ఫిట్... ఫీట్స్ ఎన్నో...50 ఏళ్ల వయసులో గత 2015లో స్విట్జర్లాండ్లోని జ్యూరిచ్లో జరిగిన ఐర¯Œ మ్యాన్ ట్రయాథ్లాన్ ఛాలెంజ్లో పాల్గొన్నాడు. 3.86 కిలోమీటర్ల ఈత, 180.25 కిలోమీటర్ల సైకిల్ రైడ్, 42.2 కిలోమీటర్ల పరుగును కలిపి... 15 గంటల 19 నిమిషాల్లో పూర్తి చేశాడు.2017లో ఫ్లోరిడాలో 3రోజుల పాటు జరిగిన, 517 కిలోమీటర్ల ట్రయాథ్లా¯Œ లో భాగంగా 10 కిలోమీటర్ల ఈత, 421 కిలోమీటర్ల సైకిల్, 84.4 కిలోమీటర్ల పరుగు పూర్తి చేశాడు.సిక్స్ ΄్యాక్ కాదు... స్ట్రెస్ బ్యాక్ ముఖ్యంకండలు తిరిగిన శరీరం కన్నా తన దృష్టిలో ఫిట్నెస్ అంటే ఒత్తిడిని ఎదుర్కోగల సామర్థ్యమేనంటాడు సోమన్. శారీరక ఒత్తిడి, మానసిక ఒత్తిడి, భావోద్వేగ ఒత్తిడి... వీటిని ఎంత బాగా ఎదుర్కోగలిగితే, ఆరోగ్యం అంత మెరుగ్గా ఉంటుందని ఆయన అభి్రపాయం. ఎంతో డబ్బు వెచ్చించి జిమ్లకు వెళ్లడానికి బదులు పుష్–అప్స్ పుల్–అప్స్ వంటి సహజమైన బాడీ వెయిట్ వ్యాయామాలపై దృష్టి పెట్టాలని, స్వల్పకాలిక శిక్షణ కంటే రోజువారీ కదలికకుప్రాధాన్యత ఇవ్వాలని సూచిస్తున్నాడు. సమతుల్యమైన, ΄ోషకాహారం కోసం ఇంటి భోజనానికేప్రాధాన్యత ఇవ్వాలని చెబుతున్నాడు.30 రోజుల్లో 1500 కి.మీ. పరుగు తీయడం ద్వారా లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు దక్కించుకున్నాడు.59 ఏళ్ల వయసులో ఐదు రోజుల్లో పూణే నుంచి వసాయి వరకు 240 కి.మీ. పరుగెత్తాడు. – ఎస్. సత్యబాబు, సాక్షి, హైదరాబాద్ -
దాహం లేకున్నా నీళ్లు తాగండి.. ఎందుకంటే?
సాక్షి, హైదరాబాద్: ఎండ దెబ్బకు గుండె గుభేల్మంటోంది. పగటి ఉష్ణోగ్రతలు సుమారు 45 డిగ్రీల దాకా నమోదవుతుండటం, తీవ్ర వడగాడ్పులు వీయడం, వాతావరణంలో మార్పులతో హృద్రోగాలు పెరుగుతున్నాయి. సమ్మర్ హార్ట్ ఎటాక్స్ కేసులు పెరుగుతున్నాయి. హైదరాబాద్లోనూ ఇలాంటి కేసులు నమోదవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో దీర్ఘకాలిక రోగాలకు మందులు వాడుతున్న వారు, హృద్రోగులు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు.శరీర సాధారణ ఉష్ణోగ్రత 35 డిగ్రీల నుంచి 38 డిగ్రీల వరకు ఉంటుంది. ఈ సమయంలో గుండె నిమిషానికి 72 సార్లు కొట్టుకుంటుంది. ఉష్ణోగ్రత ఒక డిగ్రీ పెరిగితే గుండె 10 సార్లు ఎక్కువ కొట్టుకుంటుందని వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకుపైనే నమోదవుతుండటంతో వేసవిలో హార్ట్ ఎటాక్స్ వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. చర్మం నుంచి చెమట రూపంలో సోడియం, పొటాషియం వంటివి ఎక్కువ మోతాదులో బయటకు వెళ్లిపోతాయి. లవణాలు బ్యాలెన్స్ తప్పితే గుండెలయ తప్పుతుంది. డీహైడ్రేషన్కు గురైనప్పుడు రక్తం చిక్కగా మారి గడ్డకట్టే ప్రమాదం ఏర్పడుతుంది. దీనివల్ల ప్రాణాలకే ముప్పు వాటిల్లుతుందని వైద్యులు చెబుతున్నారు.వాతావరణంలో మార్పులకు అనుగుణంగా గుండె పనితీరు మారుతుందని.. తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే సమ్మర్ కార్డియాక్ అరెస్టు ప్రమాదం పొంచి ఉందని హెచ్చరిస్తున్నారు. సాధారణంగా ప్రతి లక్షలో 200 మంది నుంచి 500 మందిలో గుండెపోటు సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందని.. వేసవి వడగాల్పులు, అధిక ఉష్ణోగ్రతలతో ఈ సమస్య 2–3 రెట్లు పెరుగుతుందని వైద్యులు స్పష్టం చేస్తున్నారు.దాహం లేకున్నా నీళ్లు తాగండి డీహైడ్రేషన్ వల్ల రక్తం చిక్కగా మారిపోతుంది. వేసవిలో దాహం అనిపించినా లేకున్నా అరగంటకోసారి 50 మిల్లీలీటర్ల నుంచి 80 మిల్లీలీటర్ల నీరు, మజ్జిగ, నిమ్మరసం వంటివి తాగడం మంచిది. బీపీకి మందులు (బీటా బ్లాకర్స్) వినియోగించే వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. వేసవి వేడికి హార్ట్ రేటు పెరుగుతుంది. దీన్ని బీపీ మందులు కంట్రోల్ చేస్తాయి. దీంతో శరీరానికి అవసరమైన రక్త సరఫరా జరగదు. వేసవిలో రక్తనాళాలు వ్యాకోచిస్తాయి. చర్మంలో రక్తనాళాల పరిమాణం పెరిగితేనే చెమట వస్తుంది.ఇలాంటి సమయంలో మెదడు, ఇతర శరీర అవయవాలకు రక్త సరఫరా తగ్గిపోతుంది. దీంతో కార్డియాక్ అరెస్ట్ అయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఎండల తీవ్రత ఎక్కువగా ఉండే ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య ప్రజలు ప్రత్యేకించి వృద్ధులు ఎండలో తిరగొద్దు. అలాగే సాలిడ్ ఫ్రూట్ జ్యూస్, సోడా, మద్యం, కాఫీ వంటి వాటికి దూరంగా ఉండాలి. – డాక్టర్ ఓరుగంటి సాయి సతీశ్,హెచ్ఓడీ కార్డియాలజీ యూనిట్–1, నిమ్స్ -
మైక్రో ప్లాస్టిక్స్ను తరిమికొడుతున్న ‘కిమ్చి’!
వాయు కాలుష్యం కారణంగా శరీరంలోకి చొచ్చుకుపోయి అవయవాల్లో తిష్టవేస్తున్న మైక్రో, నానో ప్లాస్టిక్ రేణువులను తరిమికొట్టడంలో దక్షిణ కొరియా పాపులర్ వంటకం కిమ్చి ఎంతగానో తోడ్పడుతున్నట్లు శాస్త్రవేత్తలు తాజాగా గుర్తించారు. ప్లాస్టిక్ రేణువులను అదిమిపట్టి బయటకు పంపుతున్నట్లు పేర్కొన్నారు. ఇంతకీ ప్లాస్టిక్ పనిపడుతున్న ఆ వంటకంలో ఉన్నది ఏమిటో తెలుసా? ప్రోబయోటిక్స్. అంటే లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా అన్నమాట.పులియబెట్టడంతో..కిమ్చి అనేది దక్షిణ కొరియా సంప్రదాయ వంటకం. క్యాబేజీ, ముల్లంగి, ఇతర కూరగాయలను పులియబెట్టి దీన్ని తయారు చేస్తారు. కిమ్చిని పులియబెట్టడం వల్ల అందులో లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. ఈ బ్యాక్టీరియాకు మైక్రో, నానో ప్లాస్టిక్ రేణువులను గట్టిగా అతుక్కునే గుణం ఉందని గుర్తించారు.కిమ్చి వంటి ప్రో బయోటిక్స్తో కూడిన ఆహారాన్ని తిన్నప్పుడు అందులోని లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా ఉదరంలోకి చేరి నానో ప్లాస్టిక్స్కు అతుక్కుంటుంది. అనంతరం శరీర జీర్ణ ప్రక్రియలో భాగంగా ఆ బ్యాక్టీరియా ఆహారంలోని వ్యర్థాలతోపాటు నానో ప్లాస్టిక్స్తో సహా బయటకు విసర్జితం అవుతుంది. నానో ప్లాస్టిక్స్ శరరీ అవయవాల్లోకి చేరకుండా అడ్డుకోవాలంటే ఆ ప్లాస్టిక్ రేణువులు ఉదరం, పేగుల్లో ఉండగానే విసర్జితం అయ్యేలా చూడటమే ఉత్తమ మార్గమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.ఎలుకలపై ప్రయోగాలతో.. ఎలుకలపై నిర్వహించిన ప్రయోగాల్లో ఈ విషయం నిరూపితమైందన్నారు. ఎలుకలకు అందించిన ఆహారంలో ప్రో బయోటిక్ బ్యాక్టీరియా కలిపినప్పుడు వాటి విసర్జితాల్లో నానో ప్లాస్టిక్స్ ఆనవాళ్లు ఎక్కువ మొత్తంలో కనిపించాయని పేర్కొన్నారు. పులియబెట్టిన ఆహారం ద్వారా ఎన్ని రకాల ప్రయోజనాలు ఉన్నాయనే విషయాన్ని అధ్యయనం చేయడానికి దక్షిణ కొరియా జాతీయ ఆహార సంస్థ వరల్డ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కిమ్చి పేరిట ఒక విభాగాన్ని ఏర్పాటు చేసింది. ఈ సంస్థ అధ్యక్షుడు హే చూన్ చాంగ్ బృందం కిమ్చిలో పులియబెట్టిన ఆహారంపై పరిశోధన ఫలితాలను ప్రకటించింది. ఈ ఫలితాలు వ్యవసాయ ఇంజనీరింగ్లో అగ్రస్థానంలో ఉన్న బయోరిసోర్స్ టెక్నాలజీ (ఇంపాక్ట్ ఫ్యాక్టర్ 9.0) అనే జర్నల్లో ప్రచురితమయ్యాయి.అవయవాల్లోకి ప్లాస్టిక్ చేరితే.. నానో ప్లాస్టిక్స్ అనేవి ఒక మైక్రోమీటర్ (మిల్లీమీటర్లో వెయ్యోవంతు) పరిమాణంలో ఉండే అత్యంత సూక్ష్మమైన కణాలు. పెద్ద ప్లాస్టిక్ పదార్థాలు కాలక్రమేణా విచ్ఛిన్నమవుతూ సూక్ష్మ పరిమాణంలో విభజితమవుతాయి. ఇవి మన ఆహారం, తాగునీటిలో సులువుగా కలిసిపోయి తినేటప్పుడు, తాగేటప్పుడు ఉదరంలోకి చేరిపోతాయి. ఈ ప్లాస్టిక్ రేణువులను అలాగే వదిలేస్తే క్రమంగా పేగుల్లోంచి మూత్రపిండాలు, మెదడుకు కూడా చేరి అక్కడే పేరుకుపోయి అవయవాలను దెబ్బతీసే ప్రమాదం పొంచి ఉంటుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. -
కాలేయం ఆరోగ్యం కోసం..!
ఇటీవల కాలంలో ఫ్యాటీ లివర్ సమస్య అధికమైంది. ఆల్కహాల్ తాగకపోయినా ఈ సమస్య బారినపడుతున్నారు చాలామంది. అసలు కాలేయం అనారోగ్యం బారిన పడకూడదంటే జీవనశైలిలో ఈ మార్పలు చోటుచేసుకుంటే చాలు అని చెబుతున్నారు ICAR–నేషనల్ డెయిరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) డా. ఆదర్శ గౌడ. సమతుల్య ఆహారం, రోజూవారీ వ్యాయామంతో ఈ సమస్యకు చెక్కుపెట్టొచ్చని అంటున్నారు. జస్ట్ ఒక అరగంట వ్యాయామాలు, మంచి ఆహారంతోనే కాలేయాన్ని ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చిన చెబుతున్నారు. అదెలాగో ఆయన మాటల్లోనే సవివరంగా తెలుసుకుందాం.ముందుగా కాలేయంపై భారాన్ని తగ్గించడని విజ్ఞప్తి చేస్తున్నారు. అతిగా ప్రాసెస్ చేసిన ఆహారాలు, అనవసరమైన పెయిన్ కిల్లర్ మందులు అతిగా వాడటం, దీర్ఘకాలిక ఒత్తిడి, సరిగా నిద్రపోవకపోవడం వంటి వాటితో కాలేయంపై అతిగా భారాన్ని మోపొద్దు అంటున్నారు. అంటే సమయానికి భోజనం, నిద్ర ఉండేలా కేర్ తీసుకుంటూ ఆరోగ్యకరమైన పోషకవంతమైన ఆహారాలను తినమని సూచిస్తున్నారు. తీసుకోవాల్సినవి..కాలేయం ఆరోగ్యానికి నిమ్మకాయ ఎంతగానో ఉపయోగపడుతుందని చెబుతున్నారు. దీనిలోని యాంటీఆక్సిడెంట్లు గ్లూటాథియోన్ రీసైక్లింగ్కు మద్దతు ఇస్తుంది. నిమ్మరసం కలిపిన నీరు శరీరానికి తగినంత నీటిని అందించి హైడ్రేటెడ్గా ఉండేలా చేస్తుంది. ముఖ్యంగా శరీరం నుంచి వ్యర్థాలను బయటకు పంపించేస్తుంది.మిల్క్ థిస్టిల్: అనేది శతాబ్దాలుగా ఆయుర్వేద వైద్యంలో వాడుతున్న ఒక పురాతన మూలిక. దీనిలో ఉండే 'సిలిమరిన్' అనే క్రియాశీలక సమ్మేళనం కాలేయ ఆరోగ్యానికి (Liver health) అత్యంత మేలు. ఇది లివర్ వాపును తగ్గించి, విషతుల్య పదార్థాలను బయటకు పంపి కణాలను పునరుద్ధరిస్తుంది. హెపటైటిస్, కామెర్లు వంటి సమస్యల నివారణకు ఇది బాగా పనిచేస్తుంది. డయాబెటిస్ ఉన్నవారిలో ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. చర్మంపై ముడతలను తగ్గించి, ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షిస్తుందినిమ్మకాయ పరోక్షంగా డిటాక్స్కు మద్దతు ఇస్తుంది. ఇది విటమిన్ సిని అందిస్తుంది, ఇది యాంటీఆక్సిడెంట్ రక్షణకు సహాయపడుతుంది మరియు గ్లూటాథియోన్ రీసైక్లింగ్కు మద్దతు ఇస్తుంది. నిమ్మరసం కలిపిన నీరు శరీరానికి తగినంత నీటిని అందిస్తుంది, ఇది చాలా ముఖ్యం ఎందుకంటే వ్యర్థాల విసర్జన అనేది పైత్యరస ప్రవాహం, మూత్ర విసర్జన మరియు జీర్ణక్రియపై ఆధారపడి ఉంటుంది.క్రూసిఫెరస్ కూరగాయలు తీసుకోవడం: దీనిలో గ్లూకోసినోలేట్లు ఉంటాయి, ఇవి సల్ఫోరాఫేన్ సంబంధిత సమ్మేళనాలుగా మారగలవు. ఇవి ఫేజ్ 2 డిటాక్స్ ఎంజైమ్ చర్యకు, యాంటీఆక్సిడెంట్ ప్రతిస్పందన మార్గాలకు మద్దతు ఇస్తాయి.క్రూసిఫెరస్ కూరగాలు అంటే..బ్రోకలీక్యాబేజీకాలీఫ్లవర్ముల్లంగిపాలకూర (కాలే)బోక్ చోయ్ఔషధాల పరంగా: గ్లూటాథయాన్ అండ్ బి విటమిన్లు ఫ్యాటీ లివర్ ఫేజ్ 2కు కీలకమైన సాధనాలు. గ్లూటాథయాన్ రియాక్టివ్ సమ్మేళనాలను బంధించి, తటస్థీకరించడంలో సహాయపడుతుంది. బి విటమిన్లు మిథైలేషన్, శక్తి జీవక్రియ డిటాక్స్ మార్గాలకు మద్దతు ఇస్తాయి.వీటితోపాటు ప్రోటీన్, గ్లైసిన్, సిస్టీన్, ఫోలేట్, బి12, బి6, రిబోఫ్లేవిన్, మెగ్నీషియం ఉండే ఆహారాలను తీసుకోవడంపై దృఫ్టి పెట్టాలి.వెల్లుల్లి సల్ఫర్ సమ్మేళనాలను అందిస్తుంది, ఇవి డిటాక్స్ కెమిస్ట్రీకి, యాంటీఆక్సిడెంట్ రక్షణకు మద్దతు ఇస్తాయి. ఇది హృదయ సంబంధ, రోగనిరోధక మార్గాలకు కూడా మద్దతు ఇస్తుంది. ఇలా ఆహారంలో ఆరోగ్యకరమైన ఆహారాలతో మార్పులు చేర్పులు చేసుకుంటే..మంచి ఆరోగ్యం సులభంగా సొంతం చేసుకోవచ్చిన అంటున్నారు. మరిన్ని వివరాలకు ఈ కింది లింక్పై క్లిక్ చేయండి (చదవండి: వైట్ రైస్ వర్సెస్ బ్రౌన్ రైస్ ఆరోగ్యానికి ఏది మంచిదంటే..) -
60 ఏళ్ల తల్లి వెయిట్లాస్ స్టోరీ..! దెబ్బకు థైరాయిడ్, షుగర్..
పెద్దవాళ్లు అందులోనూ ఇంట్లోనే ఉండే తల్లులు బరువు తగ్గే ప్రయత్నాలు చేసేందుకు సిగ్గుపడుతుంటారు. అందులోనూ ఈ వయసులోనా..! అనే భయం వాళ్లను వెంటాడుతుంటుంది. ఓ అమ్మ ఆ మూసధోరణిని బద్దలుకొట్టేలా..జిమ్కి వెళ్లి ఏకంగా 18 కిలోలు తగ్గింది. అంతేగాదు ఎన్నాళ్లుగానో వేధిస్తున్న దీర్ఘకాలిక వ్యాధులకు సైతం చెక్ పెట్టింది. అదెలాగో తెలుసుకుందామా..!.కంటెంట్ క్రియేటర్ హరీష్ ఠాకూర్ తన తల్లి స్ఫూర్తిదాయకమైన వెయిట్లాస్ జర్నీని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. తాను ఎన్నోసార్లు తన తల్లికి వ్యాయామాలు చేయమని చెప్పినా..ఆమె సామాజిక ఒత్తిడి, ఇతరులు ఏమనుకుంటారో అన్న భయంతో ఎలా వెనకాడుతూ ఉండేదో చెప్పుకొచ్చారు. తన బలవంతంపైనే ఏదోలా జిమ్కి వచ్చిందని నాటి సంగతులను గుర్తుచేసుకున్నారు. అలా ఒక ఏడాదిపాటు క్రమం తప్పకుండా వ్యాయామాలు చేసిన తర్వాత ఆమె తల్లిలో వచ్చిన మార్పుని చూసి ఆశ్చర్యపోయానని అన్నారు. ఆమె కూడా తనంతాటే ఇష్టంగా వ్యాయామాలు చేయడం ప్రారంభించిందని అన్నారు. ఫలితంగా రక్తపోటు, థైరాయిడ్ ఆరోగ్యం మెరుగపడిందని అన్నారు. ఈ మేరకు హరీష్ తల్లి సైతం జిమ్కి వెళ్లాక ఆరోగ్యం బాగుందని, ఏకంగా 18 కిలోలు తగ్గానని అంటోంది. అంతేగాదు షుగర్, రక్తపోటు, థైరాయిడ్ సమస్యలన్నీ తగ్గిపోయాయని ఆనందంగా చెబుతోంది. అలాగే కంటెంట్ క్రియేటర్ హరీష్ కూడా అందరు తమ తల్లిదండ్రుల ఆరోగ్యానికే ప్రాదాన్యత ఇవ్వాలని కోరాడు. అంతేగాదు తల్లి వ్యాయమాలు చేస్తున్న వీడియోలను కూడా షేర్ చేశారు. ఆమె ఫిట్నెస్ చర్యలో భాగంగా డెడ్లిఫ్ట్లను కూడా ఎత్తుతారామె. ఆమె కూడా తనలా ఇతరులు ఏమనుకుంటారో అని భయపడే వాళ్లు తమ పిల్లలు మాట విని ఆరోగ్యంగా ఉండాలని అన్నారామె.పెద్దలకు మంచిదేనా..?60 ఏళ్ల అనంతరం సరైన మార్గదర్శకత్వంలో వ్యాయామం చేయడం వల్ల బలం, సమతుల్యత, చలనశీలత తదితరాలన్ని మెరుగుపడతాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. క్రమం తప్పని వ్యాయామాలు కండరాల క్షీణతను తగ్గించి, ఎముకలను బలోపేతం చేసి పడిపోయే ప్రమాదాన్ని నివారిస్తుందన్నారు. View this post on Instagram A post shared by HotFix | Harish Thakur (@itshotfix) (చదవండి: 30 రోజుల్లో ఏడు కిలోలు..! ఆ 15 రూల్స్ మస్ట్) -
30 రోజుల్లో ఏడు కిలోలు..! ఆ 15 రూల్స్ మస్ట్
అందరికీ స్మార్ట్గా, స్లిమ్గా అవ్వాలని ఉంటుంది. కానీ తక్కువటైంలోనే తగ్గాలనేది అందరి కోరకి. కానీ ఆ క్రమంలో శరీరం కాస్త ఒత్తిడికి గురై బరువు తగ్గడం ఎలా ఉన్నా అధిక బరువు పెరిగిపోతుంటాం. అలాంటి వాళ్లు హెల్దీ కమ్ స్పీడ్గా బరువు తగ్గేందుకు ఈ 15 రూల్స్ని ఫాలో అయితే చాలని అంటున్నారు ప్రముఖ ఫిట్నెస్ ట్రైనర్ తకై రాషిద్. కేవలం చీటింగ్కి తావు లేకుండా క్రమశిక్షణతో కూడిని దినచర్యకు కట్టుబడి ఉంటే చాలని అంటున్నారామె. అలాంటప్పుడే ఈ 15 నియమాలు చాలా సమర్థవంతంగా ఫలితాలనిస్తాయిని చెబుతున్నాడు.క్రమబద్దమైన ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామాలు, సరైన నిద్ర, క్రమశిక్షణతో కూడిన దినచర్యను పాటించే డెడికేషన్ తదితరాలు ఉంటే 30 రోజుల్లో బరువు తగ్గడం సులభమేనని అంటున్నారు ఫిట్నెస్ ట్రైనర్ తకై రాషిద్. అందుకోసం ప్లాన్ ఎలా ఉండాలో సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. నియంత్రిత ఆమారం, అధిక ప్రోటీన్తో కూడినా ఆహారాలు, శారీరక శ్రమ వంటి వాటితో కొలెస్ట్రాల్ తగ్గుతుందని చెబుతున్నారు రాషిద్. అందుకోసం స్ట్రిక్ట్గా శిక్షణను కొనసాగించాలని నొక్కి చెప్పారు. ఆ వెయిట్లాస్ ప్లాన్ ఏంటంటే..కేలరీల లోటుతో తినండినిర్వహణ స్థాయి కంటే 500-750 తక్కువ. గరోజువారీ ప్రోటీన్ లక్ష్యాన్ని చేరుకోండిశరీర బరువులో ప్రతి పౌండ్కు 0.8-1 గ్రా. చాలా మందికి కనీసం 130-180 గ్రా.ప్రతి భోజనంలో 20-30 గ్రా ప్రోటీన్ తినండిప్రోటీన్కు అనుగుణంగా ప్రతి భోజనం ఉండాలివారానికి కనీసం 3 సార్లు స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేయండివారానికి 3-5 సార్లు ఇంక్లైన్ వాక్ / స్టెయిర్మాస్టర్ చేయండి 30-45 నిమిషాలు. ఈ వారం నేను పంచుకున్న వాకింగ్ ఛాలెంజ్ లాగా.ప్రతిరోజూ పదివేల పైనే అడుగులు నడవడంఇది ఒత్తిడి లేకుండా కొవ్వును కరిగించడం.రాత్రికి 7-9 గంటలు నిద్రపోండినిద్ర లేకపోతే కొవ్వు కరగడం నెమ్మదిస్తుంది.భోజనాన్ని ముందుగానే ప్లాన్ చేసుకోండిప్రణాళిక లేకపోతే ఇష్టం వచ్చినట్లు తినడంతో ఫలితం పొందలేరు. ప్రధానంగా సంపూర్ణ ఆహారాలనే తినండి. కొవ్వు తక్కువగా ఉండే మాంసం, అన్నం, గుడ్లు, పండ్లు, ఓట్స్, ఆకుకూరలు.అధిక కేలరీలు గల పానీయాలను మానుకోండినీళ్లు, కాఫీ, కేలరీలు లేని పానీయాలు. స్మూతీలను లెక్కపెడితే ఫర్వాలేదు.ప్రాసెస్ చేసిన చక్కెరను తగ్గించండిమిఠాయిలు, పేస్ట్రీలు, చక్కెర కలిపిన తృణధాన్యాలు, లేదా జంక్ ఫుడ్ వద్దు.చివరగా 30 రోజుల పాటు చీట్ మీల్స్ వద్దుప్రతిరోజూ ఉదయాన్నే లేవగానే బరువు చూసుకోండిమొదట్లో కాస్త కష్టంగా అనిపించినా..స్మార్ట్గా మారాలన్న లక్ష్యంపై గురిపెడితే ప్రతి శారీరక బాధ ఇష్టంగా మారుతుందని అంటున్నారు ఫిట్నెస్ ట్రైనర్ తకై రాషిద్ . View this post on Instagram A post shared by Takai Raashid | MacroMaster® (@takai.raashid)గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: వైట్ రైస్ వర్సెస్ బ్రౌన్ రైస్ ఆరోగ్యానికి ఏది మంచిదంటే..) -
వైట్ రైస్ వర్సెస్ బ్రౌన్ రైస్ ఆరోగ్యానికి ఏది మంచిదంటే..
ఇటీవలకాలంలో అందరు ఆరోగ్య స్పృహతో పోషకవంతమైన ఆహారానికే ప్రాధాన్యత ఇస్తున్నారు. ముఖ్యంగా భోజనం విషయంలో వైట్రైస్ కంటే బ్రౌన్రైస్ని, చపాతీలను, తాజా పండ్లు, కూరగాయలను వినయోగిస్తున్నారు. కొందరు మితంగా వైట్ రైస్ తీసుకుంటూ ఆకుకూరలు, నట్స్కి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇంతకీ వైట్రైస్ అసలు తినకపోవడమే మంచిదా?, బ్రౌన్ రైస్ మాత్రమే ఆరోగ్యానికి మంచిదా? అంటే ఆ ఆలోచనే సరైనది కాదంటున్నారు ICAR–నేషనల్ డెయిరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) డా. ఆదర్శ గౌడ . బ్రౌన్ ఆరోగ్యానికి మంచిదనేది నిజమే అయినప్పటికీ పూర్తిగా వైట్ రైస్ తీసుకోకూడదని కాదు అంటున్నారు. ఆయా వ్యక్తుల ఆరోగ్య రీత్యా ఏది తీసుకుంటే మంచిదనేది ఆధారపడి ఉంటుందంటున్నారు. అదెలాగంటే..తెల్లబియ్యం..తెల్ల బియ్యంలో ఫైబర్ తక్కువగా ఉండటం వల్ల, అది సులభంగా జీర్ణమవుతుంది. కొన్ని ప్రత్యేక సమయాల్లో కొంతమందికి ఇది ప్రయోజనకరంగా ఉండవచ్చు. ఉదాహరణకు, ఇన్ఫ్లమేటరీ బవెల్ డిసీజ్ లేదా ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ వంటి సమస్యలు తీవ్రమైనప్పుడు, తప్పక ఫైబర్ తీసుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది. అదీగాక తెల్ల బియ్యం త్వరగా ఉడుకుతుంది, తినేందుకు మృదువుగా ఉంటుంది.బ్రౌన్రైస్ఇందులో పోషకమైన మొలక, పీచుపదార్థం గల ఊక, కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండే ఎండోస్పెర్మ్ తదితరాలు ఉంటాయి. దీని గరుకైన ఊక ఉపరితలం కారణంగా నమలడానికి గట్టిగానూ ఉడికేందుకు కాస్త సమయం ఎక్కువ తీసుకుంటుంది.పోలిస్తే..సమతుల్య ఆహారంలో తెల్ల బియ్యం, బ్రౌన్ రైస్ రెండూ ఉంటాయి. అయితే, తెల్ల బియ్యంతో పోలిస్తే, బ్రౌన్ రైస్లో ఊక, ఎక్కువ పోషకాలు ఉంటాయి. ఉదాహరణకు, తెల్ల బియ్యంతో పోలిస్తే బ్రౌన్ రైస్లో ఫైబర్, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్ అనేక బి విటమిన్లు (బి1, బి3, బి6, మరియు బి9) అధిక స్థాయిలో ఉంటాయిఆరోగ్య పరంగా..ఆరోగ్యంగా ఉండాలని ఆలోచిస్తుంటే, బ్రౌన్ రైస్ వంటి ఫైబర్ అధికంగా ఉండే తృణధాన్యాలు ఎక్కువగా తీసుకుంటే గుండె జబ్బులు, టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం తగ్గడం, అలాగే బరువును మెరుగ్గా నియంత్రించుకోవడం వంటి అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అలాగే తెల్ల బియ్యం గ్లైసెమిక్ ఇండెక్స్ 73 ± 4, ఇది అధికం. బ్రౌన్ రైస్ను మధ్యస్థ గ్లైసెమిక్ ఇండెక్స్ 68 ± 4 కారంగా ఆరోగ్యప్రదంగా పరిగణించారు నిపుణులు. అదీగాక, బ్రౌన్ రైస్ తినడం వల్ల టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం తక్కువగా ఉంటుంది, కానీ తెల్ల బియ్యం తినడం వల్ల ఈ ప్రమాదం మరింత ఎక్కువగా ఉంటుంది.ఎలా తీసుకుంటే మంచిదంటే..చాలా మంది బ్రౌన్ రైస్ మంచిదన్న ఉద్దేశ్యంతో దీనికే ప్రాధాన్యత ఇస్తారు. అయితే దీనిలోని అధిక ఫైబర్ జీర్ణం చేసుకోవడం కష్టతరం చేసి జీర్ణసంబంధిత రుగ్మతలు తీవ్రమై ప్రమాదం లేకపోలేదని అంటున్నారు ఆదర్శ గౌడ. అందువల్ల బ్రౌన్ రైస్, వైట్రైస్ రెండిటిని కలిపి ఎంచుకోమని సూచిస్తున్నారు నిపుణులు. మెరుగైన పోషకాహారం కోసం కొద్దిపాటి మార్పులతో రెండిటిని సమంగా తీసుకునే ప్రయత్నం చేయమని అంటున్నారు అప్పుడు శరీరానికి సమతుల్య పోషకాలు అందుతాయని చెబుతున్నారు ప్రముఖ నిపుణులు ఆదర్శ గౌడ.(చదవండి: బాదంపప్పులు నానబెట్టే ఎందుకు తినాలంటే..! పరిశోధనలో షాకింగ్ విషయాలు) -
మృగశిర కార్తెకు-చేపలకు ఉన్న సంబంధం? ఆ రోజే చేపప్రసాదం ఎందుకుంటే..
ప్రతీ ఏడాది మృగశిర కార్తె ప్రారంభం రోజున హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో చేపమందు ప్రసాదం పంపిణీ చేస్తారు. ఈ ఏడాది కూడా చేప ప్రసాదం పంపిణీకి సర్వం సిద్ధం చేశారు అధికారులు. మరికొన్ని రోజుల్ల చేపమందు ప్రసాదం పంపిణీ ప్రారంభం కానుంది. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి చేప మందు కోసం ఆస్తమా బాధితులు వచ్చారు. మృగశిర కార్తె రోజే చేపమందు ఎందుకు పంపిణీ చేస్తారంటే..అప్పుడే ఎందుకు?మృగశిర కార్తె ప్రవేశించిన సమయంలో ఎండలు తగ్గుతాయి. మృగశిర కార్తె రాగానే వర్షాలు ప్రారంభమవుతాయి. శరీరంలో ఉష్ణోగ్రత తగ్గుతుంది. శరీరంలో వేడి పెంచడానికి మృగశిర కార్తె రోజు నుంచి చేపలు ఎక్కువగా తింటారు. 15 రోజుల పాటు శరీరం చల్లగా ఉండటంతో తగినంత వేడి కోసం చేపలను ఎక్కువగా తింటుంటారు. దీని వల్ల గుండె జబ్బులు, ఆస్తమా రోగులకు ఉపశమనం కలుగుతుంది. వాతావరణం మారటంతో.. ఒక్కసారిగా సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందుతాయి. దీంతో.. జనాల్లో రోగ నిరోధక శక్తి తగ్గడం, జీర్ణశక్తి సైతం తగ్గుతుంది. జ్వరం, దగ్గు, ఇతరత్రా సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ఉండేందుకు మాంసాహారులు చేపలను తింటారు. ఉబ్బసం సమస్యతో బాధపడేవారికి ఈ కార్తె ప్రారంభమైన 2 రోజులపాటు హైదరాబాద్లో చేప ప్రసాదం ఇవ్వడం తెలిసిందే. మరోవైపు ఈ కార్తెకు రెండు మూడు రోజుల ముందు నుంచే చేపల మార్కెట్లలో రద్దీ పెరుగుతుంది. అయితే మృగశిర కార్తె ప్రారంభమైన రోజునే.. చేప ప్రసాదం ఇస్తే బాధితులకు సరిగ్గా పని చేస్తుందని నమ్మకం.చేపలకు మృగశిరకు ఉన్న సంబంధం..రోళ్లను సైతం పగులగొట్టే భగమండే ఎండలు తగ్గిపోతాయి. తొలకరి జల్లులతో వర్షాలు మొదలవుతాయి. అదీగాక 15 రోజుల పాటు ఈ కార్తె ఉంటుంది. మృగశిర కార్తె చేపలు తినడాన్ని మన పూర్వీకుల నుంచి ఆనాదిగా వస్తోంది. ఎండకాలం తర్వాత వాతావరణం చల్లబడటంతో మన శరీరంలో ఉష్ణోగ్రత తగ్గుతుంది. ఈ క్రమంలో వేడి ఉండేందుకు చేపలను తింటారు. దీని వల్ల గుండె జబ్బులు, ఆస్తమా రోగులకు ఉపశమనం కలుగుతుంది. ఇదేకాక ఈ సీజన్లోచాలా మందికి జీర్ణశక్తితోపాటు రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంటుంది. జ్వరం, దగ్గు బారిన పడతారు. ఇలాంటి నుంచి గట్టెక్కాలంటే చేపలు తినాల్సిందే.చేప మందు చరిత్ర..ఈ మందును మొదట 1847లో తయారు చేశారు. అప్పట్లో ఓ సాధువు దేశపర్యటన చేస్తూ హైదరాబాద్ పాతబస్తీకి వచ్చారు. ఆ ప్రాంతంలో సంచరిస్తుండగా బత్తిని వీరన్నగౌడ్ ఆయనకు ఆశ్రయం కల్పించారు. ఆ సమయంలోనే చేప మందు తయారు చేశారు. ఈ మందును ఉచితంగా పంపిణీ చేస్తే నీకు అన్ని విధాలా మంచి జరుగుతుందని చెప్పి తయారు చేసే విధానం ఆయనకు వివరించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు బత్తిని కుటుంబ సభ్యులు ఈ మందును పంపిణీ చేస్తున్నారు.ఇందులో ఏం ఉంటాయంటే..ఈ చేపప్రసాదం కోసం చిన్న చిన్న కొరమీను చేపలనే వాడతారు. ఈ మందులో పాలపిండి, ఇంగువ, బెల్లం, పసుపు, ఇతర వనమూలికలు ఉంటాయి.చేప ప్రసాదం (ఫిష్ ప్రసాదం) అనేది ఉబ్బసం (ఆస్తమా) ఇతర శ్వాసకోశ వ్యాధుల నివారణకు హైదరాబాద్లోని బత్తిని కుటుంబం సుమారు 170 ఏళ్లుగా పంపిణీ చేస్తున్న ఒక ప్రసిద్ధ సాంప్రదాయ మందు. ఈ ప్రసాదాన్ని ప్రతి ఏడాది హిందూ క్యాలెండర్ ప్రకారం రుతుపవనాల ప్రారంభాన్ని సూచించే మృగశిర కార్తి రోజున నిర్వహిస్తారు. ఈ ఏడాది జూన్ 8 నుంచి హైదరాబాద్లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ (హైదరాబాద్)లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. బత్తిని కుటుంబ సభ్యులు ప్రత్యక్షంగా సుమారు 2 అంగుళాల పరిమాణంలో ఉన్న చిన్న 'కొరమీను' చేప నోటిలో ప్రత్యేకమైన పసుపు పసరు (మందు) పెట్టి, దానిని రోగి గొంతులోకి జొప్పిస్తారు. శాకాహారులకు, చేపలు తినలేని వారికి ఈ మందును బెల్లంతో కలిపి ఇస్తారు. ఈ మందు పూర్తిగా ఉచితం, కానీ రోగులు బయట స్టాళ్లలో దొరికే చిన్న చేపలను సొంతంగా కొనుగోలు చేసి తీసుకురావాలి. మందు తీసుకున్న తర్వాత 30 నిమిషాల వరకు నీరు త్రాగరాదు. ఈ మందు ప్రభావం చూపడానికి బత్తిని కుటుంబం సూచించిన 45 రోజుల కఠినమైన ఆహార నియమాలు (డైట్) ఖచ్చితంగా పాటించాలి.(చదవండి: బాదంపప్పులు నానబెట్టే ఎందుకు తినాలంటే..! పరిశోధనలో షాకింగ్ విషయాలు) -
బాదంపప్పులు నానబెట్టే ఎందుకు తినాలంటే..!
నట్స్ తినడం ఆరోగ్యానికి మంచిదన్న విషయం తెలిసిందే. అందులోనూ బాదం పప్పులు మరింత ఆరోగ్యప్రదం కూడా. వీటిని ఎవ్వరైనా ధీమాగా తినొచ్చు. బాలింతలు, దగ్గర నుంచి చిన్న పిల్లల వరకు అందరికి మంచిది. అయితే వీటిని నీటిలో నానబెట్టి తింటే మరింత ప్రయోజనం పొందొచ్చని చెబుతున్నారు ICAR–నేషనల్ డెయిరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) డా. ఆదర్శ గౌడ . అధ్యయనాలు సైతం ఆ మాట నొక్కి చెబుతున్నాయి. నీటిలో నానబెట్టకుండా గట్టిగా ఉన్న బాదం పప్పులనే తింటే జీర్ణం చేసుకోవడానికి శరీరం ఎలా ఇబ్బంది పడుతుందో కూడా వివరించారు.బాదంపప్పులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటిలో కీలక ఖనిజాలు ఉంటాయని పరిశోధనలు వెల్లడించాయి కూడా. అందువల్ల వీటిని రాత్రంతా నీటిలో నానబెట్టి లేదా కనీసం ఓ 12 గంటలైన నానబెట్టి తినడమే మంచిదని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు ఆదర్శగౌడ. ఎందుకంటే..పచ్చిగా ఉండే బాదం పప్పుల్లో ఫైటిక్ ఆమ్లం ఉంటుందట. ఇది బాదంలో సహజంగా లభించే సమ్మేళనం. ఇది బాదంలోని జింక్, ఇనుము, మెగ్నీషియం, కాల్షియం వంటి ఖనిజాలతో బంధం ఏర్పరచుకుని కరగని సమ్మేళనాలను ఏర్పరస్తుంది. ఎప్పుడైతే నానబెట్టకుండా తింటామో..ఫలితంగా జీర్ణవ్యవస్థ గుండా శోషించబడకుండానే ప్రయాణిస్తుందట. ఎప్పుడైతే మనం బాదం పప్పులను 12 గంటల పాటు నానాబెడితే..ఫైటిక్ ఆమ్లం పరిమాణం 50 శాతం వరకు గణనీయంగా తగ్గుతుందట. తద్వారా బంధింపబడే ఉండే ఖనిజాల లభ్యత సులభం అవుతుందట. అంటే నానబెట్టడం వల్ల ఫైటిక్ ఆమ్లంలో గట్టిగా బంధిపబడి ఉన్న కీలకమైన ఖనిజాలన్ని శరీరానికి సమృద్ధిగా అందుతాయి. ఇలా నానబెట్టడం శరీరానికి కావాల్సిన ఇనుము సులభంగా అందుతుందని పరిశోధనల్లో తేలింది. నానబెట్టడం వల్ల దానిలోని పోషకాలు, ఖనిజాలను సులభంగా శోషించుకునే శాతం మెరుగ్గా ఉంటుందని అధ్యయనాల్లో వెల్లడైంది. అంతేగాదు నానబెట్టడం వల్ల గింజలు ఉత్తేజితమై..మెలకెత్తే ప్రక్రియను ప్రారంభించే ఎంజైములు సైతం యాక్టివ్ అవుతాయట. దీని వల్ల బి విటమిన్ పరిమాణం పెరుగుతుందట. అంటే ఇలా అన్ని గంటల పాటు నానడం వల్ల బాదం పప్పులో ఉన్న విటమిన్లు, ఖనిజాలు నేరుగా అందేలా సులభంగా జీర్ణం అవుతుంది. పైగా మన శరీరానికి అన్ని పోషకాలు అందుతాయని చెబుతున్నారు ఆదర్శగౌడ. అదే అలానే బాదం పప్పులు గట్టిగానే తినేస్తే..శరీరం జీర్ణం చేసుకోవడానికి ఇబ్బందిపడటమే కాకుండా..దానిలో ఉన్న ప్రోటీన్లు మన శరీరానికి అందవని, పైగా ఇతరత్ర సమస్యలు తలెత్తే అవకాశం ఉందని చెబుతున్నారు. సుమారు 12 నుంచి 24 గంటల వరకు నానబెట్టే సమయం పెరిగే కొద్ది ఎంజైమ్ క్రియాశీలత, పోషకాల లభ్యత క్రమంగా పెరుగుతుందని చెబుతున్నారు. నానబెట్టిన తర్వాత పూర్తిగా కడగడం వల్ల ఎంజైమ్ల నిరోధకం అయిన ఫైటిక్ అమ్లం పూర్తిగా తొలిగిపోతుందని చెబుతున్నారు. కాబట్టి నానబెట్టే బాదం గింజలు తినడం మంచిదని సూచిస్తున్నారు ఆరోగ్యనిపుణులు.(చదవండి: ఎర్ర జామ వర్సెస్ తెల్ల జామ ఏది ఆరోగ్యానికి మంచిది?) -
ఎర్ర జామ వర్సెస్ తెల్ల జామ ఏది ఆరోగ్యానికి మంచిది?
సీజన్తో సంబంధం లేకుండా ఏడాది పొడవునా లభించే ఫ్రూట్.. జామ (Guava). ఇందులో విటమిన్ సీ తోపాటు ఐరన్, క్యాల్షియం, ఫాస్పరస్ వంటి పోషకాలు ఎక్కువగా ఉంటాయి. అయితే, సాధారణంగా మార్కెట్లలో మనకు తరచుగా రెండు రకాల జామకాయలు కనిపిస్తుంటాయి. ఒక రకానికి చెందినవి తెల్లగా ఉంటే, మరొకటి ఎర్రగా ఉంటుంది. ఈ తెల్ల జామ, ఎర్ర జామలు రెండూ పోషకాలతో నిండి ఉన్నప్పటికీ టేస్ట్, న్యూట్రిషన్ వాల్యూ, హెల్త్ బెనిఫిట్స్లో కాస్త విభిన్నంగా ఉంటాయి. మరి ఈ రెండింటిలో ఏది మంచిది, వాటివల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ICAR–నేషనల్ డెయిరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) డా. ఆదర్శ గౌడ మాటల్లో తెలుసుకుందామా.!.ఎర్ర జామ, తెల్ల జామ రెండూ ఆరోగ్యానికి చాలా మంచివే. అయితే ఎర్ర జామలో నీటి శాతం ఎక్కువ, చక్కెర, కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉంటాయి. తెల్ల జామలో విటమిన్-సీ, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ. మధుమేహం (షుగర్) ఉన్నవారికి బరువు తగ్గాలనుకునే వారికి ఎర్ర జామ కొంత మేలు చేస్తుంది. రెండింటిని పోల్చి చూస్తే..తెల్ల జామకాయతెల్ల జామ ఎక్కువ తియ్యగా, రుచిగా ఉంటుంది. దీంట్లో షుగర్, స్టార్చ్, గింజల పరిమాణం అధికంగా ఉంటుంది. ఈ తెల్ల జామలో విటమిన్ C పుష్కలంగా ఉంటుంది. రోగ నిరోధక శక్తిని పెంచడంలో ఇది బాగా హెల్ప్ చేస్తుంది. తెల్ల జామను తింటే ఓవరాల్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. డైజేషన్ మెరుగై బరువు తగ్గడంలో హెల్ప్ చేస్తుంది. బ్లడ్లో షుగర్ లెవల్స్ని రెగ్యులేట్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. మహిళలకు తెల్ల జామతో ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి. చర్మ కణాలకు హైడ్రేషన్ని పెంచి తాజాగా ఉండేలా చేస్తుంది. పీరియడ్స్ సమయంలో వచ్చే పెయిన్ నుంచి రిలీఫ్ని ఇస్తుంది. ఇందులోని యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు క్యాన్సర్ కణాలతో పోరాడి ఈ వ్యాధి ముప్పుని తగ్గిస్తాయి. రోగనిరోధక శక్త పరంగా తెల్లజామకాయ బెస్ట్ అని చెబుతున్నారు ఆదర్శ గౌడ. డయాబెటిస్ పేషెంట్లకు ఎర్రజామ మేలు..ఎర్ర జామకాయలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. తెల్ల జామతో పోలిస్తే షుగర్, స్టార్చ్, విటమిన్ C కంటెంట్ తక్కువగా ఉంటుంది. ఈ ఎర్రజామలో గింజలు అంత ఎక్కువగా ఉండవు. లైకోపీన్ వంటి పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్, కెరోటినాయిడ్ల కారణంగా దీనిలోని గుజ్జుకి ఎరుపు రంగు వస్తుంది. ఇందులో లైకోపీన్ ఎక్కువగా ఉండటంతో గుండెకు రక్షణగా నిలుస్తుంది. చర్మ ఆరోగ్యాన్ని ఇంప్రూవ్ చేస్తుంది. విటమిన్ A, ఒమేగా-3, ఒమేగా- 6 ఫ్యాటీ ఆమ్లాలు సమృద్ధిగా ఉంటాయి. ఫైబర్తో నిండి ఉండటంతో డైజేషన్ మెరుగై వెయిట్ మేనేజ్మెంట్కు తోడ్పడుతుంది. ఇందులో చక్కెర కంటెంట్ తక్కువగా ఉండటం వల్ల షుగర్ పేషెంట్లకు మంచిది.అయితే రక్తంలో చక్కెరను తగ్గించే మందులు తీసుకుంటుంటే జామకాయను తీసుకునే ముందు వైద్యుడిని సంప్రదించడం చాలా ముఖ్యం. ఏదైనా శస్త్రచికిత్స తర్వాత వెంటనే జామ పండ్లు తినకూడదు. ఎందుకంటే జామ తినడం వల్ల రక్తస్రావం ప్రమాదం పెరుగుతుంది. దీంతో గాయం మానడం ఆలస్యం అవుతుందని చెబుతున్నారు ఆదర్శ గౌడ .(చదవండి: Health Benefits of Cucumber : పరగడుపునే కీరా తినొచ్చా..!?) -
వామ్మో.. థైరాయిడ్! కీళ్ల నొప్పులు, డిప్రెషన్..
కొద్దిగా పని చేసినా నిస్సత్తువ ఆవహించడం, చిన్న విషయాలకే కోపం రావడం, ముఖం ఉబ్బుగా కనిపించడం, చర్మం పొడిబారడటం, కీళ్ల నొప్పులు వేధించడం, ఊబకాయం రావడం, అకస్మాత్తుగా సన్నబడటం వంటి లక్షణాలు ఏమైనా కనిపిస్తే వెంటనే ఓసారి పరీక్షించుకోండంటూ వైద్యులు సూచిస్తున్నారు. ఎందుకంటే ఇటీవల ప్రతి పది మందిలో ఒకరికి థైరాయిడ్ వ్యాధి వేధిస్తోంది. దీనిని నిర్లక్ష్యం చేస్తే దీర్ఘకాలిక సమస్యగా మారి శరీరాన్ని ఛిద్రం చేస్తుంది. ఈ గ్రంథి పనిచేయకపోతే దేహంలోని ఇతర అవయవాల పనితీరు మందగిస్తుంది. ముఖ్యంగా మహిళల్లో ఈ సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీనిపై అవగాహన లేక చికిత్సలో జాప్యంతో ఆరోగ్య సమస్యలకు దారితీస్తున్నాయి. నేడు వరల్డ్ థైరాయిడ్ డే సందర్భంగా ప్రత్యేక కథనం.. ఈ లక్షణాలు కనిపిస్తే.. థైరాయిడ్లో హైపోథైరాయిడిజం (థైరాయిడ్ హార్మోన్ల ఉత్పత్తి తక్కువగా ఉండటం), హైపర్ థైరాయిడిజం (హార్మోన్లు అధికంగా ఉత్పత్తి కావడం) ప్రధానమైనవి. థైరాయిడ్ నోడ్యూల్స్, గాయిటర్ (థైరాయిడ్ గ్రంథి వాపు), థైరాయిడ్ క్యాన్సర్ కూడా ఉన్నాయి. అలసట, బరువు పెరడగం, చలి అనుభూతి, జుట్టు రాలడం, నీరసం, డిప్రెషన్, మలబద్ధకం వంటివి హైపోౖథెరాయిడిజం లక్షణాలు, బరువు తగ్గడం, ఆందోళన, వేగంగా గుండె చప్పుడు, చెమటలు, వణుకు, నిద్రలేమి హైపర్ థైరాయిడిజం లక్షణాలు. గాయిటర్ లేదా నోడ్యూల్స్ ఉన్నవారిలో మెడ వాపు, గొంతులో అసౌకర్యం వంటివి కనిపిస్తాయి. ఇలా కణితి ఉన్న ప్రతి ఒక్కరికీ ఆపరేషన్ అవసరం లేదు. క్యాన్సర్గా మారితేనే ఆపరేషన్ చేయించుకోవాలి. గడ్డలు ఏర్పడ్డ వారిలో 5 శాతం మందిలో మాత్రమే క్యాన్సర్ కణితులు ఉంటాయి. వీరికి మాత్రమే ఆపరేషన్ చేసి కణితి తొలగించాల్సి ఉంటుంది. కారణాలు.. థైరాయిడ్ సమస్యకు కారణాలు అనేకం. సరైన ఆహారపు అలవాట్లు, జీవనశైలి సరిగ్గా లేకపోవడం వల్ల హార్మోన్లు అసమతుల్యం అవుతాయి. తద్వారా థైరాయిడ్ వ్యాధి వస్తుంది. హైపోౖథెరాయిడిజం సాధారణంగా ఆటోఇమ్యూన్ రుగ్మతలు, అయోడిన్ లోపం, థైరాయిడ్ శస్త్రచికిత్స, రేడియేషన్ థెరపీతో గానీ, కొన్ని రకాల మందులతో వస్తుంది. హైపర్ థైరాయిడిజం గ్రేవ్స్ డిసీజ్, థైరాయిడ్ గ్రంథి వాపు వస్తుంది. జన్యు కారణాలు, ఒత్తిడి, హార్మోన్ల అసమతుల్యత, గర్భం/ ప్రసవం తర్వాత హార్మోన్ల మార్పులు కూడా థైరాయిడ్ సమస్యలకు కారణం. అయోడిన్ లోపం గానీ, అధికంగా ఉన్నా దీని బారినపడతారు. నివారణ ఇలా.. థైరాయిడ్ సమస్య వస్తే సమతుల ఆహారం, అయోడిన్ సమృద్ధిగా ఉండే ఆహారాలు (సీఫుడ్, పాల ఉత్పత్తులు, అయోడైజ్డ్ ఉప్పు) తీసుకోవాలి. వైద్య పరీక్షలు, ఆరోగ్యకరమైన జీవనశైలి కూడా సహాయపడతాయి. చికిత్సలో హైపోౖథెరాయిడిజం కోసం లెవోథైరాక్సిన్ వంటి హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ, హైపర్ థైరాయిడిజం కోసం యాంటీథైరాయిడ్ మందులు, రేడియో అయోడిన్ థెరపీ, శస్త్రచికిత్స ఉన్నాయి. థైరాయిడ్ క్యాన్సర్ ఉన్నవారి శస్త్ర చికిత్స, కిమోథెరపీ గానీ రేడియేషన్ గానీ అవసరం కావచ్చు మహిళల్లోనే అధికం.. మహిళల్లో థైరాయిడ్ సమస్యలు పురుషుల కంటే 58 రెట్లు ఎక్కువగా కనిపిస్తాయి. ముఖ్యంగా గర్భం, ప్రసవం తర్వాత, రుతుక్రమం ఆగిన తర్వాత ఈస్ట్రోజెన్ హార్మోన్ స్థాయిలు థైరాయిడ్ గ్రంథి పనితీరును ప్రభావితం చేయవచ్చు. గర్భధారణ సమయంలో హైపోౖథెరాయిడిజం, హైపర్ౖథెరాయిడిజం మాతా,శిశు ఆరోగ్యంపై ప్రభావం చూపవచ్చు. జిల్లాలో థైరాయిడ్ బాధితులు అధికంగా ఉండటంతో ప్రతీ పీహెచ్సీలో థైరాయిడ్ పరీక్షలు అందుబాటులో ఉంచాలని రోగులు కోరుతున్నారు.త్వరగా గుర్తిస్తే మేలు సమాజంలో 11 శాతం మందిలో హైపోౖథెరాయిడ్, రెండు శాతం మందిలో హైపర్ థైరాయిడ్ సమస్య ఉంది. ఈ సమస్యను త్వరగా గుర్తిస్తే ఇబ్బందులు రాకుండా చేయవచ్చు. జాగ్రత్తలు పాటిస్తూ క్రమం తప్పకుండా మందులు వాడాలి. – డాక్టర్ దల్లి సురేష్రెడ్డి, ఎండీ, క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్, ఇచ్ఛాపురంగర్భిణులు జాగ్రత్త.. థైరాయిడ్ సమస్య ఉన్న గర్భిణులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. వైద్యుల సూచనలు పాటిస్తూ మందులు వాడాలి. పుట్టబోయే బిడ్డకు కూడా పరీక్ష చేయించాలి. థైరాయిడ్ ఉందంటే మందులు వాడాలి. లేకపోతే బుద్ధిమాంద్యం వచ్చే అవకాశాలు అధికం. – డాక్టర్ ఎ.రమ్యారెడ్డి, వైద్యాధికారి, ఈదుపురం మరిన్ని వివరాలకు ఈ కింది వీడియోపై క్లిక్ చేయండి -
‘తాయ్ చి’ వాకింగ్ ట్రెండ్..! ఇది పెద్దలకు మంచిదా?
ఇటీవల సామాజిక మాధ్యమాల్లో తాయ్ చి వాకింగ్ తెగ ట్రెండ్ అవుతోంది. ప్రజలు కూడా ఈ వాకింగ్ చేసేందుకు అమితమైన ఆసక్తికనబరుస్తుండటం విశేషం. ఈ వాకింగ్ పొట్లలోని కొవ్వుని అమాంతం కరిగించేస్తుందని, బరువు తగ్గిపోతారంటూ తెగ ఊదరగొట్టేస్తున్నాయి కొన్ని యూట్యూబ్ ఛానెళ్లు. ముఖ్యంగా పెద్దలకు, వృద్ధులకు చాలామంచిదని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అసలు ఏంటి తాయ్ చి వాకింగ్..?, దీని వల్ల నిజంగా ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయా? వంటి వాటి గురించి సవివరంగా చూద్దామా..!.ఈ తాయ్ చి వాకింగ్ గురించి ముంబైకి చెందిన తాయ్ చి గురువు సెన్సాయి సందీప్ దేశాయ్ ఇన్స్ట్రాగ్రామ్ వేదికగా సవివరంగా వెల్లడించారు. ఇది ఎలా చేస్తారు. దీని వల్ల కలిగే లాభలు ఏంటి వంటి వాటి గురించి తెలిపారు. తాయ్ చి వాకింగ్ అంటే..తాయ్ చి వాకింగ్ అనేది శరీరాన్ని నెమ్మదిగా, ఉద్దేశపూర్వకంగా కదిలించే ఒక విధమైన నడక పద్ధతి. దీనిలో సమతుల్యత, శరీర భంగిమ, సమన్వయం, కీళ్లపై అధిక భారం పడకుండా నియంత్రిత బరువు మార్పిడిపై ఫోకస్ పెడతూ చేసే వాకింగ్ అని చెప్పుకొచ్చారు సందీప్ దేశాయ్. తాయ్గా ఈ పిలిచే ఈ వర్కౌట్ యుద్ధ కళల సాధనలో ఒక భాగం అని అన్నారు. ఇది పూర్తిగా కదలికపై దృష్టి సారించే ఒక వ్యాయామం అని చెప్పారు. ఇటీవల కాలంలో దీనికి అమిత ఆదరణ పెరిగిందన్నారు. అయితే ఈ తాయ్ చి అనేది వేల సంవత్సరాల చైనా చరిత్ర, సంస్కృతికి సంబంధించిన అంతర్గత యుద్ధ కళ, ఆరోగ్య వ్యాయామం కూడా. భారత్కి యోగా ఎలాగో అక్కడ చైనాలో ఈ తాయ్ చి అలా అని సందీప్ దేశాయ్ అన్నారు.ఎలా చేస్తారంటే..సరైన విధంగా నేర్చుకోవడం అనేది అత్యంత కీలకం. ఇది శరీర బరువుని మారుస్తూ జాగ్రత్తగా చేసే వ్యాయామం. ఒక కాలుపై శరీరం బరువు మోపుతూ నిదానంగా మరోక కాలు ఎత్తాలి. ఆ తర్వాత మెల్లగా గాల్లో ఉన్న ఆ పాదాన్ని మడంపై ఆనించి నెమ్మదిగా భూమిపై పూర్తిగా ఆనాలి. ఆ తర్వాత మరో కాలుని నెమ్మదిగా ఎత్తి ఈ పాదంపై శరీర బరువుని మోపాతూ.. కంటిన్యూ చేయాలి.వృద్ధులకు ఇది ఎందుకు మంచిదంటే..ఈ వాకింగ్ కాళ్లపై చాలా తక్కువ ఒత్తిడిని కలిగిస్తుంది. సాధారణంగా వృద్ధులకు మోకాళ్ల నొప్పి, బిగువు లేదా నడుమునొప్పితో బాధపడేవారికి చాలా ముఖ్యం. శరీర బరువుని ఒక కాలు నుంచి మారుస్తూ తనను తాను మెరుగ్గా స్థిరపరుచుకునే ట్రైన్ చేస్తుంది. అలాగే స్లిప్ అయ్యే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. శరీరాన్ని నిటారుగా వంచడంలో ఉపకరిస్తుంది. పైగా ఇది మనస్సు, శరీరంపై ధ్యాస పెట్టి చేయాల్సిన వర్కౌట్కావడంతో ఏకాగ్రత మెరుగుపడుతుంది. కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..హృదయ సంబంధ వ్యాధుల పరంగా చూస్తే, ఇది రక్త ప్రసరణ, శ్వాస, ఊపిరితిత్తుల పనితీరు తోడ్పడే తేలికపాటి ఏరోబిక్ కదలికలా పనిచేస్తుంది. ముఖ్యంగా వృద్ధులకు, నాడీ సంబంధిత సమస్యలు ఉన్న రోగులకు ఎంతో ప్రయోజనకరం. ఎందుకంటే ఇది సమతుల్యమైన నడకను ప్రోత్సహిస్తుంది. అలాగే శరీరం-మనస్సు సమన్వయాన్ని మెరుగుపరుస్తుందని డాక్టర్ పటేల్ నొక్కి చెప్పారు.ఇది అనారోగ్యం లేదా గాయం నుంచి కోలుకోవడాన్ని కూడా వేగవంతం చేస్తుంది. చాలా మంది అథ్లెట్లు, క్రీడాకారులు, యోగా సాధకులు, మార్షల్ ఆర్టిస్టులు మెరుగ్గా ఉండేలా, గాయాల బారి నుంచి రక్షించుకోవడానికి ఈ తాయ్ చి వాకింగ్ని చేస్తారని సెన్సాయి సందీప్ అన్నారు. అంతేగాదు శారీరక శ్రమకు దూరంగా ఉన్నవారికి ఫిట్నెస్లోకి తిరిగి రావడానికి ఇది ఒక మంచి మార్గంగా పనిచేస్తుంది.బరువు తగ్గిస్తుందా అంటే..కేవలం ఏడు నిమిషాల తాయ్ చి మాత్రమే పొట్టలోని కొవ్వును అద్భుతంగా కరిగించకపోవచ్చు. పరుగు లేదా తీవ్రమైన కార్డియో వ్యాయామం లాగా ఇది అధిక కేలరీలను దహించే వ్యాయామం కాదని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి దీనిని బరువు తగ్గడానికి ఒక షార్ట్కట్గా భావించడం సరైనది కాదని అంటున్నారు. కానీ పొట్టలోని కొవ్వును తగ్గించడానికి, కోర్ స్ట్రెంగ్తెనింగ్ వ్యాయామాలు, అధిక తీవ్రతతో కూడిన వర్కౌట్లు, నియంత్రిత కార్బోహైడ్రేట్లతో కూడిన సమతుల్యత, ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారం కలయికతోనే బరువు తగ్గడం సాధ్యమని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు.తప్పక తెలుసుకోవాల్సినవి..తాయ్ చి వాకింగ్ని సరైన మార్గదర్శకత్వంలోనే చేయాలి లేదంటే కీళ అమరిక, జాయింట్ల మధ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని చెబుతున్నారు నిపుణులు. ఇప్పటికే కీళ్లవాతం లేదా వెన్నుముక సమస్యలు ఉన్నవారు నిపుణుల పర్యవేక్షణలో చేయడమే ఉత్తమం. View this post on Instagram A post shared by Sensei Sandeep Desai (@taichiyogiindia)(చదవండి: నాడు నీట్ ఫెయిల్యూర్..ఇవాళ బయోటెక్నాలజీ నిపుణురాలు!) -
‘షిగెల్లా’ మళ్లొచ్చింది.. ఇద్దరు చిన్నారులకు పాజిటివ్
కోజికోడ్: కేరళలోని కోజికోడ్ జిల్లా పెరుమన్నలో ఇద్దరు చిన్నారులకు షిగెల్లా ఇన్ఫెక్షన్ సోకినట్లు నిర్ధారణ అయింది. రెండుమూడేళ్ల వయస్సు గల ఈ ఇద్దరు చిన్నారులు ప్రస్తుతం కోజికోడ్ ప్రభుత్వ వైద్య కళాశాల ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. చిన్నారుల ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. పెరుమన్న పంచాయతీ పరిధిలోని పరక్కండం, పుతియోటిల్ ప్రాంతాలకు చెందిన ఈ చిన్నారులకు అనారోగ్య లక్షణాలు కనిపించడంతో, మొదట స్థానిక ఆరోగ్య కేంద్రంలో చేర్పించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం వారిని మెడికల్ కాలేజీకి తరలించారు.తీసుకుంటున్న జాగ్రత్తలుషిగెల్లా నిర్ధారణ కావడంతో ఆ ప్రాంతంలో ఆరోగ్య శాఖ, పంచాయతీ అధికారులు అప్రమత్తమయ్యారు. వ్యాధి వ్యాప్తిని అరికట్టేందుకు తక్షణమే నివారణ చర్యలు చేపట్టారు. గతంలో కోజికోడ్లోని పెరువయల్ గ్రామ పంచాయతీలో షిగెల్లా ప్రబలి, ఒక చిన్నారి ప్రాణాలు కోల్పోగా, నివారణ చర్యలతో దానిని అదుపులోకి తెచ్చారు. అదే తరహా చర్యలను ఇప్పుడు పెరుమన్నలో కూడా అమలు చేస్తున్నారు.షిగెల్లా అంటే ఏమిటి?‘షిగెల్లా’ బ్యాక్టీరియా గ్రూపు వల్ల కలిగే పేగు సంబంధిత ఇన్ఫెక్షన్నే ‘షిగెల్లోసిస్’ అని పిలుస్తారు. ఇది చాలా వేగంగా వ్యాపిస్తుంది. ప్రధానంగా విరేచనాలు, తీవ్రమైన సందర్భాల్లో రక్తంతో కూడిన విరేచనాలు దీని ప్రధాన లక్షణాలు. ఈ వ్యాధి వల్ల కలిగే ‘డీహైడ్రేషన్’ అత్యంత ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. సకాలంలో చికిత్స అందకపోతే ఇది ప్రాణాపాయానికి దారితీయవచ్చు. ఐదేళ్ల లోపు పిల్లలు ఈ వ్యాధి బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే, సరైన సమయంలో చికిత్స అందిస్తే దీనిని పూర్తిగా నియంత్రించవచ్చని నిపుణులు చెబుతున్నారు.లక్షణాలుషిగెల్లా బ్యాక్టీరియా పేగు పొరలకు సోకినప్పుడు, అది ‘షిగెల్లా టాక్సిన్’ అనే విషాన్ని విడుదల చేస్తుంది. ఇన్ఫెక్షన్ సోకిన ఒకటి నుండి మూడు రోజులలోపు (కొన్ని సందర్భాల్లో వారం రోజులలోపు) లక్షణాలు కనిపిస్తాయి.* రక్తం, శ్లేష్మంతో కూడిన విరేచనాలు* తీవ్రమైన కడుపు నొప్పి* వాంతులు, వికారం* మల విసర్జన తర్వాత కూడా ఇంకా అవ్వాలనే భావన కలగడం* కొన్ని సందర్భాల్లో ఫిట్స్ వంటి నాడీ సంబంధిత సమస్యలు తలెత్తవచ్చు.చికిత్సడీహైడ్రేషన్ నివారణ: శరీరంలో కోల్పోయిన నీరు, లవణాలను భర్తీ చేయడం ప్రధాన చికిత్స. ఓఆర్ఎస్ ద్రావణం, ఉప్పు కలిపిన గంజి నీటిని ఎక్కువగా తీసుకోవాలి. సాధారణ విరేచనాలకు యాంటీబయాటిక్స్ అవసరం ఉండదు. కానీ షిగెల్లోసిస్ విషయంలో ఇన్ఫెక్షన్ తీవ్రతను, వ్యాప్తిని తగ్గించడానికి వైద్యులు వీటిని సూచించవచ్చు. సకాలంలో వ్యాధిని గుర్తించకపోవడం వల్లే సమస్య తీవ్రమవుతోందని, రోగులు ఆసుపత్రికి వచ్చేసరికి తీవ్రమైన నిర్జలీకరణకు లోనవుతున్నారని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇది కూడా చదవండి: ఒక్క కాఫీ.. చిన్న పేస్ట్రీ.. పెద్ద ఉపశమనం! -
పరగడుపునే కీరా తినొచ్చా..!?
చవకగా దొరికేది అన్ని వేళలా లభించే కీరా దోసకాయతో కలిగే లాభాలు అన్ని ఇన్ని కావని చెబుతున్నారు ICAR–నేషనల్ డెయిరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) డా. ఆదర్శ గౌడ. అందరికి దొరికే కీరాను పరగడుపున తింటే చాలామంచిదని చెబుతున్నారు. ముఖ్యంగా ఈ సమ్మర్ ఉష్ణోగ్రతలకు ఇది ఎంతో పోషకవంతమైనదని అన్నారు. దీన్ని ఉదయమే అల్పాహారంగా తీసుకుంటే ఆరోగ్యానికి ఏంతో మేలని తెలిపారు. అంతేగాదు దీనిలో ఉండే పోషక విలులు, ఉపయోగాలు గురించి సవివరంగా వెల్లండించారు.ప్రతిరోజు ఉదయం పరగడుపునే కీరా దోసకాయ లేదా కీరా జ్యూస్ తీసుకుంటే శరీరంలోని వ్యర్థాలన్నీ బయటకి వెళ్లిపోయి మలబద్ధకం సమస్య తగ్గుతుందని చెబుతున్నారు. ముఖ్యంగా వ్యాధుల బారిన పడకుండా రక్షిస్తుందని అన్నారు. అధిక బరువుతో బాధపడే వాళ్లకు ఎంతో మేలని అంటున్నారు. ముఖ్యంగా పొట్ట భాగంలో ఉన్న కొవ్వు ఇట్టే కరిగిపోతుందని చెబుతున్నారు. ముఖ్యంగా వేసవి తాపాన్ని తగ్గిస్తుంది, వడదెబ్బ బారిన పడకుండా కాపాడుతుందని చెబుతున్నారు. అలాగే మధుమేహులు దీన్ని తీసుకోవడం వల్ల చక్కెర, కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచుతుంది. తద్వారా గుండె ఆరోగ్యం మెరుగ్గుఉంటుందని అన్నారు. కీరలక్ష అధికంగా ఉండే ఫైబర్ జీర్ణ సంబంధిత సమస్యలను తగ్గిస్తుందని అన్నారు. దీనిలో ఉండే విటమిన్ సీ ఇమ్యూనిటీని పెంచి వ్యాధులు దరిచేరకుండా చేస్తుందని చెబుతున్నారు.ఎలాగంటే..శరీరానికి తేమ: కీరాలో సుమారు 95% నీరు ఉండటం వల్ల ఉదయాన్నే శరీరాన్ని డిహైడ్రేషన్ నుంచి కాపాడుతుంది.జీర్ణక్రియ మెరుగుపడుతుంది: ఇందులో ఉండే ఫైబర్ మలబద్ధకం సమస్యను నివారించి, ప్రేగు కదలికలను మెరుగుపరుస్తుంది.బరువు నియంత్రణ: కేలరీలు చాలా తక్కువగా ఉండటం వల్ల బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచి అల్పాహారం.రోగనిరోధక శక్తి: దీనిలోని విటమిన్ సీ, ఇతర యాంటీఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయిఅలాగే ఫైబ్రాయిడ్లు లేదా ఈస్ట్రోజెన్ ఆధిపత్యాన్ని ఎదుర్కొంటున్న మహిళలకు, ఇందులోని ఫైటోన్యూట్రియెంట్లు తేలికపాటి యాంటీ-ఈస్ట్రోజెనిక్ ప్రభావాన్ని కలిగి ఉంటాయి. బ్రేక్ఫాస్ట్గా తీసుకుంటే..రక్తంలో చక్కెర స్థాయిలు స్థిరంగా ఉంటాయని చెబుతున్నారు.చర్మం, కళ్ళు, జుట్టు ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటుంది. రక్తపోటుని తగ్గిస్తుంది, చర్మ ఆరోగ్యానికి మేలు చేస్తుంది కూడా.ఎవరు తీసుకోకూడదంటే..దోసకాయ చల్లబరిచే ప్రభావాన్ని కలిగి ఉంటుంది. అందువల్ల ఇది శరీరంలో కఫ దోషాన్ని తీవ్రతరం చేస్తుంది. తరచుగా జలుబు, దగ్గు, శ్లేష్మం, సైనస్ సమస్యలు, ఉబ్బసం లేదా కఫంతో బాధపడేవారు కీరాను పూర్తిగా నివారించాలి.ఇరిటబుల్ బోవల్ సిండ్రోమ్ (IBS), జీర్ణ సమస్యలు ఉన్నవారికి మంచిది కాదుకీళ్ల నొప్పులు ఉంటే తినకపోవడమే మేలుమూత్ర విసర్జనకి సంబంధించిన సమస్యలతో బాధపడుతుంటే వైద్యులను సంప్రదించే తీసుకుంటే మంచిది. గ్లూకోజ్ని తగ్గించే మందలు ఉపయోగించే వాళ్లు కూడా వైద్యులను సంప్రదించే తీసుకోవాలని చెబుతున్నారు.(చదవండి: చెట్లు నాటడానికి రూ. 4.8 లక్షల విరాళం..! హృదయాన్ని కదిలించే స్టోరీ) -
ఐదు నెలల్లో 30 కేజీలు..! నో షార్ట్కట్, నో స్ట్రిక్ట్ డైట్
బరువు తగ్గడం అనగానే కఠినమైన వ్యాయామాలు, స్ట్రిక్ట డైట్నే ఫాలో అయిపోతుంటారు. నిజానికి ఇలా ఎప్పుడైతే శరీరాన్ని ఒకేసారి కష్టపెడతామో అదికాస్తా సహకరించడానికి బదులుగా వ్యతిరేకించడం మొదలుపెడుతుంది. ఫలితంగా బరువు తగ్గడం దేవుడెరుగు మొత్తానికి మరిన్ని సమస్యలు, ఇబ్బందులు ఎదురవ్వుతాయని అంటోంది ఈ ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్. చిన్నచిన్న మార్పులే అద్భుతం చేస్తాయని..త్వరిగతిన బరువు తగ్గుతామని అంటున్నారామె. అదెలాగంటే..ఫ్యాట్ లాస్ కోచ్ అంజలి సచన్ కేవలం ఐదు నెలల్లో 30 కేజీలు తగ్గారు. అందుకోసం ఎలాంటి టెక్నిక్స్ ఫాలో అయ్యారో సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నారు. నిజానికి కఠినమైన వ్యాయామాలు, డైట్లు త్వరిగతగతిన అలిసిపోయేలా చేసి, బరువు తగ్గడాన్న మధ్యలోనే వదిలేస్తారని చెబుతోందామె. అదే చిన్నగా శరీరం అలవాటుపడేలా నెమ్మదిగా పెంచుకుంటూ పోతే అద్భుతమైన ఫలితాలు పొందుతామని అంటోంది. తానేమి కఠినమైన డైట్లు, రెండు గంటల జిమ్ సెషన్లు వంటివి చేయలేదన్నారామె. తాను అనుసరించిన విధానం అందరు చూసి నవ్వేలా, సిగ్గుపడేంతగా మొదలైందని చెబుతోంది. అంటే అంతా రోజూ పదివేల అడుగులతో దినచర్య మొదలుపెడితే, తానే కేవలం 4000 అడుగులతో తన వెయిట్లాస్ని మొదలుపెట్టానని అంటోంది. ఎందుకంటే అధిక బరువు ఉన్నవాళ్లకు ప్రారంభంలోనే అధిక వర్కౌట్లు సమస్యాత్మకమవుతాయని అంటోందామె. శరీరం మనం చేసే వ్యాయామాలకు అలవాటుపడుతుందనగా, నెమ్మదిగా, నిధానంగా వర్కౌట్లు, అడుగులు పెంచాలని సూచిస్తోంది. ఇక్కడ లక్ష్యం కేవలం కొలెస్ట్రాల్ని తగ్గించుకోవడం కాదని అంటోంది. అలాగే ఆయాసం, శ్రమతో కూడిన విధంగా వర్కౌట్లు చేయొద్దని అంటున్నారు. సంతోషంగా ఎంజాయ్ చేసేలా మొదలుపెట్టండి, బాడీ అలవాటు పడుతుందనగా చిన్నగా కార్డియోసెషన్ వంటి వేగవంతమైనవి మొదలు పెట్టమని అంటోంది. అలా చేయడం వల్ల కీళ్లు మరింత బలపడతాయి, తెలియకుండానే ఆ వర్కౌట్లకు అలవాటుపడేలా కోలుకుంటారు. అదీగాక భారాన్ని తట్టుకునే సామర్థ్యం శరీరానికి పెరుగుతుంది. నెమ్మదగా దశల వారీగా సాగే ప్రక్రియని, రాత్రికి రాత్రే జరిగేది కానీ తేల్చి చెప్పారామె. కేవలం స్థిరంగా నిదానంగా, ఓపికతో చేస్తుకుంటూ వెళ్తే..అనుకున్నది సాధ్యమవుతుందని చెబుతోందామె. View this post on Instagram A post shared by Anjali Sachan (@_anjali_sachan_) (చదవండి: 40 డిగ్గ్రీల ఉష్ణోగ్రతల్లో సైతం ఇళ్లను కూల్గా..! ఆ ఐడియాకు ఆనంద్ మహీంద్రా ఫిదా) -
టెన్షన్ పెడుతోన్న కంటికి కనిపించని శత్రువు
దేశంలో అంటువ్యాధుల కంటే జీవనశైలి కారణంగా వచ్చే వ్యాధుల తీవ్రత పెరిగి΄ోతోంది. అందులో హైపర్ టెన్షన్ ఒకటి. నిశ్శబ్దంగా చుట్టుముట్టి.. గుండెను బలహీనపరిచే ఈ హైపర్ టెన్షన్ కంటికి కనిపించని ఒక శత్రువు. ప్రపంచ ఆరోగ్య సంస్థ, భారత వైద్య పరిశోధన మండలి నివేదికల ప్రకారం.. అధిక రక్తపోటుతో బాధపడుతున్న వారి సంఖ్య ప్రపంచ వ్యాప్తంగా పెరిగిపోతోంది. భారత్లో సుమారు 30% మంది (దాదాపు 21.20 కోట్ల మంది) అధిక రక్తపోటుతో సతమతమవుతున్నారు. అంటే ప్రతి నలుగురిలో ఒకరి కంటే ఎక్కువ మంది దీని బారిన పడ్డారు.గతంలో 50 ఏళ్లు దాటిన వారిలో కనిపించే ఈ సమస్య, ఇప్పుడు 25–30 ఏళ్ల యువతలోనూ అధికంగా కనిపిస్తోంది. అధ్యయనాల ప్రకారం, గ్రామీణ ప్రాంతాలతో (10–15%) పోలిస్తే, పట్టణ ప్రాంతాలలో (25%) అధిక రక్తపోటు సమస్య ఎక్కువగా ఉంది. పురుషుల్లో రక్తపోటు నియంత్రణ 13% మాత్రమే ఉండగా, మహిళల్లో ఇది 22% గా నమోదైంది. భారతదేశంలో గుండె జబ్బులకు, మరణాలకు అధిక రక్తపోటు ఒక ప్రధాన కారణంగా ఉంది, దీనివల్ల ఏటా సుమారు 16 లక్షల మరణాలు సంభవిస్తున్నాయి. ∙సుమారుగా ప్రతి ముగ్గురిలో ఒకరికి మాత్రమే వ్యాధి నిర్ధారణ జరుగుతుంది. ప్రతి ఐదుగురిలో ఒకరి కంటే తక్కువ మంది చికిత్స పొందుతున్నారు. ఇదీ చదవండి: 1500 గంటలు, వేలాది క్రిస్టల్స్, కాన్స్ క్వీన్ ఐశ్వర్య లుక్ స్పెషాల్టీ!ప్రపంచవ్యాప్తంగా.. 30–79 ఏళ్ల మధ్య ఉన్న వారిలో సుమారు 140 కోట్ల మంది రక్తపోటుతో బాధపడుతున్నారు. అంటే 33 శాతం మంది. వీరిలో దాదాపు 60 కోట్ల మందికి (44%) అసలు తమకు ఈ సమస్య ఉందనే విషయమే తెలియదు.కేవలం 44% మంది మాత్రమే వ్యాధిని గుర్తించి చికిత్స పొందదుతున్నారు. చికిత్స పొందుతున్న వారిలో కేవలం 23% (320 మిలియన్లు) మంది మాత్రమే రక్తపోటును నియంత్రణలో ఉంచుకోగలుగుతున్నారు. -
ప్లీజ్..వ్యాధులకు ఆహారం ఇవ్వడం ఆపండి!
మనం తీసుకునే ఆహారంపైనే మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. శరీరానికి శక్తినిచ్చే ఆహారమే ఆరోగ్యకరమైనది. నాలుకకు రుచిగా, కంటికి ఇంపుగా కనిపించే జంక్ఫుడ్ ఎన్నటికీ అనారోగ్యమే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. తీసుకునే ఆహారం విషయంలో శ్రద్ద తీసుకుంటే ఆరోగ్యకరమైన జీవితం సొంతం అవుతుందని అంటున్నారు. మనం తీసుకునే ఆహారమే ఒత్తిడి, అలసట, నిరుత్సాహం వంటి మూడ్స్కి కారణమవుతుందని గమనించారా అని ప్రశ్నిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. ఆ ఆహారం కారణంగానే..మన ఒత్తిడి, ఆందోళన బారిన పడి క్రమంగా దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడే ప్రమాదం పొంచి ఉందని చెబుతున్నారు నిపుణులు. అదెలాగో వారి మాటల్లోనే తెలుసుకుందాం.మన తీసుకునే ఆహారం కేవలం కేలరీలు మాత్రమే కాదు, శక్తి, మానసిక స్థితి, నిద్ర, ఏకాగ్రత, స్వస్థత వంటి వాటిక మూలం. నిరంతరం అలసటగా, ఉబ్బరంగా, ఆందోళన, నిరుత్సాహం, ఒత్తిడి ఎదురవ్వుతుంటే శరీరం ఆహారాన్నికాదు పోషణను కోరుకుంటుందని అర్థమట. అందుకే శుభ్రమైన ఆహరం తినమని సూచిస్తున్నారు నిపుణులు. ముఖ్యంగా హైడ్రేటెడ్గా ఉండేందుకు ఎక్కువ నీరు తాగమని చెబుతున్నారు. ప్రాసెస్ చేసిన ఆహారానికి బదులుగా సహజమైన ఆహారాన్నే ఎంచుకోమని సూచిస్తున్నారు. ఎందుకంటే ఆరోగ్యకరమైన ఆహారంతోనే ఆరోగ్యకరమైన మనస్సు + ఆరోగ్యకరమైన శరీరం అని నొక్కి చెబుతున్నారు. దయచేసి వ్యాధులకు ఆహారం ఇవ్వడం ఆపండి.. స్వస్థతకు ఆహారం ఇవ్వడం ప్రారంభించండి అని కోరుతున్నారు ఆరోగ్య నిపుణులు.డా. ఆదర్శ గౌడచీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO)AIC-SRS-ICAR-NDRI ఫౌండేషన్, అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ (నీతి ఆయోగ్)గమనిక: ఇది కేవలం అవగాహన కోసం నిపుణుల ఆధారంగా ఇచ్చిన కథనం. అనుసరించే ముందు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: చేతులతో ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన తొలి వ్యక్తి..!) -
కిమ్ కర్దాషియాన్:'రోజుకు 35 సప్లిమెంట్లు తీసుకుంటా'
అమెరికన్ రియాలిటీ టెలివిజన్ స్టార్, మోడల్, బిలియనీర్ కిమ్ కర్దాషియాన్ రోజకు 35 సప్లిమెంట్లు తీసుకుంటుందట. వాటిని రోజుకు మూడుసార్లుగా విభజించుకుని మరి తీసుకుంటానని ఇటీవల అమీ పోలర్ పోడ్కాస్ట్లో పాల్గొన్నప్పుడు ఆమెనే స్వయంగా తెలిపింది. దీని కారణంగా 'పిల్ ఫెటీగ్' (మాత్రల అలసట)తో బాధపడుతున్నానని కూడా తెలిపింది. అయితే ఆ ఫిష్ ఆయిల్ సప్లిమెంట్స్ తీసుకోలేక కొన్నాళ్లు ఆపేసినట్లు తెలిపింది. అయితే కొద్దిరోజుల్లనే మళ్లీ మొదలుపెట్టాల్సి వచ్చిందన్నారు. ప్రతిరోజూ ఈ మందులను నేరుగా శరీరంలోకి ఎక్కించుకునేలా ఐవీ డ్రిప్ ఉంటే బాగుండును ప్రతిసారి వర్క్టైంలో గుర్తుపెట్టుకుని వేసుకోలేక అవస్థ పడుతున్నా అని బాధగా చెబుతుంది. అసలు నిజంగా ఒక మనిషి ఇన్ని సప్లిమెంట్లు తీసుకోవచ్చా? ఆరోగ్యానికి ఎలాంటి ప్రమాదం ఉండదా? అంటే..సప్లిమెంట్లు అదనపు పోషణను అందించి, పోషకాహార లోపాలను భర్తీచేయడంలో సహాయపడినప్పటికీ, రోజుకు 35 సప్లిమెంట్లు అంటే.. సురక్షితం కాదనే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఒకవేళ అధికంగా తీసుకుంటే మాత్రం ఆరోగ్యానికి తీవ్రమైన హాని అని, అవయవాలు దెబ్బతినొచ్చు లేదా జీర్ణ సమస్యలు, కణజాలంలో విషపదార్థాలు పేరుకుపోవడం వంటి సమస్యలకు దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు.సప్లిమెంట్లు ఎప్పుడూ ఆరోగ్యకరమైన ఆహారానికి ప్రత్యామ్నాయం కాదని నొక్కి చెబుతున్నారు. ఇవి కేవలం పోషకాహార లోపాలకు చికిత్స చేయడానికి, ఇతర వ్యాధులకు , అనారోగ్య సమస్యల నుంచి బయపడటానికి ఉపయోగపడతాయని అన్నారు. ముఖ్యంగా శరీరం కొవ్వులో కరిగే విటమిన్లు ఎ, డి, ఇ, కె లను నిల్వ చేసుకోగల సామర్థ్యం కారణంగా, వాటిని అధికంగా తీసుకుంటే చాలా ప్రమాదకరంగా మారుతుందని అన్నారు. అంతేకాకుండా, కొన్ని సప్లిమెంట్లను అధిక మోతాదులో తీసుకోవడం వల్ల కాలేయానికి నష్టం, మూత్రపిండాల్లో రాళ్లు, జీర్ణ సమస్యలు, నరాల దెబ్బతినడం, ఔషధాల మధ్య ప్రతిచర్యలు తదితరాలు సంభవిస్తాయని అన్నారు. ఇదేదో ట్రెండ్లా లేదా సెలబ్రిటీలు వాడుతున్నారనో అస్సలు తీసుకోవద్దని గట్టిగా హెచ్చరిస్తున్నారు నిపుణులు. సప్లిమెంట్లను అధికంగా తీసుకుంటే వచ్చే ఆరోగ్య ప్రమాదాలు1. విటమిన్ విషప్రభావం (విటమిన్ టాక్సిసిటీ)అధిక మోతాదు తీసుకోవడం వల్ల మూత్రపిండాల దెబ్బతినడం, కాలేయం దెబ్బతినడం, కడుపునొప్పి, విరేచనాలు, నరాల దెబ్బతినడం వంటి తీవ్రమైన సమస్యలకు దారితీయవచ్చు.2. ఖనిజాల అధిక భారం (మినరల్ ఓవర్లోడ్)విటమిన్ల మాదిరిగానే, ఖనిజాల అధిక భారం కూడా తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తుంది. ఉదాహరణకు, సప్లిమెంట్ల రూపంలో తీసుకునే అదనపు ఐరన్ తీవ్రమైన జీర్ణాశయ సంబంధిత సమస్యలను కలిగించి, కాలక్రమేణా కాలేయాన్ని దెబ్బతీస్తుంది.ప్రమాదకరమైన ఔషధ రియాక్షన్ (డ్రగ్ ఇంటరాక్షన్స్)సప్లిమెంట్లు శరీరం మందులను ప్రాసెస్ చేసే విధానాన్ని మార్చగలవు. ఉదాహరణకు, విటమిన్ కె రక్తాన్ని పల్చబరిచే మందుల (బ్లడ్ థిన్నర్స్) ప్రభావాన్ని తగ్గిస్తుంది, దీనివల్ల పక్షవాతం (స్ట్రోక్) వచ్చే ప్రమాదం పెరుగుతుంది.అధిక వినియోగంబ్రేక్ఫాస్ట్ సెరియల్స్, ఎనర్జీ బార్లు, జ్యూస్ల వంటి అనేక రోజువారీ ప్రాసెస్ చేసిన ఆహారాలలో విటమిన్లను అధికంగా కలుపుతారు. రోజువారీ మల్టీవిటమిన్ల తోపాటు నిర్దిష్ట లక్షిత సప్లిమెంట్లు తీసుకుంటే మాత్రం తెలియకుండానే అధికంగా తీసుకునే ప్రమాదం ఉంటుందటపరిగణించవలసిన భద్రతా చిట్కాలుఏ రకమైన ఆహార సప్లిమెంట్లు అయినా వాడే ముందు వైద్యుల పర్యవేక్షణ, సలహాలు, సూచనలతో తీసుకోవాలి. అలాగే మనం వాడే సప్లిమెంట్లు మంచి నమ్మదగిన బ్రాండ్వేనా ధృవీకరించుకోవాల్సి ఉంటుంది. అలాగే మీరు ఏదైనా సప్లిమెంట్ వాడుతున్నప్పుడు వికారం, కడుపు నొప్పి, కామెర్లు, గుండె దడ లేదా అలసట వంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకూడదు. తక్షణమే వైద్యులను సంప్రదించి వాడొచ్చో లేదా నిర్థారించుకోవాలని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తి గత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: నో ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్, నో ప్రిజర్వేటివ్స్..! ఈ బామ్మ చేసే ఐస్క్రీమ్కి ఫిదా అవ్వాల్సిందే..) -
జూనియర్ ఎన్టీఆర్ నాలుగు నెలల్లో 15 కేజీలు..! ఎలా తగ్గారంటే..
మే 20న టాలీవుడ్ హీరో, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా డ్రాగన్ చిత్ర నిర్మాతలు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న టీజర్ను విడుదల చేశారు. ఆయన న్యూలుక్కి సంబంధించిన పోస్టర్లు అభిమానులను థ్రిల్కి గురయ్యేలా చేసింది. ఎంత స్మార్ట్ లుక్లో కనిపించారంటే మన హీరో తారక్నే కదా అనే సంభ్రమాశ్చర్యాలకు లోను చేసేలా అద్భుతమైన లుక్లో కనిపించారు జూనియర్ ఎన్టీఆర్. ఈ మూవీలోని తన పాత్రం కోసం ఆయన కేవలం నాలుగు నెలల్లో దాదాపు 15 కేజీలు తగ్గారని దర్శకుడు ప్రశాంత్ నీల్ తెలిపారు. అందుకోసం ఆయన ఎంతలా కష్టపడ్డారో..ఎలాంటి ఫిజికల్ ట్రైనింగ్ తీసుకున్నారంటే.!ఆ మూవీలో హంతకుడు పాత్ర కోసం ఆయన్ను మరింత సన్నగా ఉంటే బాగుంటదని చెప్పానని అన్నారు దర్శకుడు ప్రశాంత్నీల్. ఆయన తన పాత్ర కోసం మరింత ఆకర్షణీయంగా కనిపించేలా కష్టపడతారని అనుకున్నా కానీ ఇంతలా తను రూపురేఖల్ని మార్చుకుంటారని తాము ఊహించలేదన్నారు. తాను అలా స్మార్ట్గా అవ్వడంతో ఆయన భార్య, తల్లి తనపై చాలా కోపంగా ఉన్నారని కూడా చెప్పారు. అందుకోసమే ఎన్జీఆర్ నాలుగు నెలలపాటు షూటింగ్కి కూడా రాలేదన్నారు. ఒకానొక సమయంలో దాదాపు 15 కేజీలు తగ్గారు. అది చూసి మధ్యలోనే చాలు ఆపేయండని కోరినా..ఆయన ఆపలేదంటూ నాటి సంఘటనలు గుర్తు తెచ్చుకున్నారు. ఆ హీరో మరీ అంతలా కష్టపడటం కూడా చాలా బాధగా అనిపించిందన్నారు.అందుకోసం ఏం చేశారంటే..ట్రైనర్ డెక్కన్ క్రానికల్ ప్రకారం..స్మార్ట్ చురుకైన శరీరాకృతి కోసం కార్డియో- వ్యాయామాలు, రెసిస్టెన్స్ శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. ప్రతి ఉదయం 45 నుంచి 90 నిమిషాల సెషన్లు ఇవే చేసినట్లు తెలిపారు. అలాగే ఆహార పరంగా సాధారణంగా ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాన్ని అనుసరించడానికి బదులుగా, తక్కువ ప్రోటీన్తో కూడిన ఆహారాన్ని ఎంచుకున్నట్లు డైట్ ట్రైనర్ కుమార్ మన్నవ తెలిపారు. ఆయన పెంచుకున్న కండర ద్రవ్యరాశిని ఈ విధానం సులభంగా తగ్గేలా చూసి సరికొత్త లుక్తో కనిపించేలా చేసిందన్నారు. ముఖ్యంగా డ్రాగన్ పాత్రకు అనుగుణమైన ఆహార్యంతో అందర్నీ ఆశ్చర్యపరిచారని చెబుతోంది చిత్ర బృందం. తామెవ్వరూ ఇంతలా మార్చుకుంటారని గానీ, ఇంత స్పీడ్గా బరువు తగ్గి స్మార్ట్గా మారిపోతారని ఊహిచలేదని చెబుతోంది మూవీ బృందం. (చదవండి: మండుటెండలకు ఎలాంటి ఫుడ్ మంచిదంటే..!) -
శ్వాసకోశ వైఫల్యం: బతికే ఛాన్సే లేదన్నారు! కట్చేస్తే..
ఊపిరితిత్తులు ఏ కారణం చేతనైన ఇన్ఫెక్షన్కు గురై పనిచేయడం మానిస్తే..రెస్పిరేటరీ ఫెయిల్యూర్" లేదా శ్వాసకోశ వైఫల్యం అంటారు. ఆ పరిస్థితుల్లో రోగి బతికి బట్టకట్టే అవకాశమే ఉండదు. సింపుల్గా చెప్పాలంటే చాలా క్లిష్టమైన పరిస్థితి. కానీ ఓ రోగి అంత క్రిటికల్ స్టేజ్లో ఉండగా అత్యాధునిక వైద్య విధానంతో ప్రాణంపోసి సరికొత్త చికిత్సా విధానానికి నాంది పలికారు. అసలేం జరిగిందంటే..55 ఏళ్ల వైద్యుడు తీవ్రమైన శ్వాసకోశ వైఫల్యం బహుళ అవయవాల సమస్యలతో బాధపడుతున్నాడు. అతని ఊపిరితిత్తులు తీవ్ర ఇన్ఫెక్షన్ బారినపడటంతో సెప్టిక్ షాక్కి గురై(శరీరంలో రక్తపోటు ప్రమాదకర స్థాయికి పడిపోయే ప్రాణాంతక పరిస్థితి) వారాల తరబడి పోరాటం అనంతరం అత్యాధునిక ఆస్పత్రికి హుటాహుటినా తరలించారు. అక్కడ వైద్యులు రోగిని వెంటిలేటర్, ప్రోన్ వెంటిలేషన్తో సహా అన్ని రక్షణా చర్యలతో చికిత్స అందించారు. ఎంత ప్రయత్నించినా..అతడి పరిస్థితి మరింత దిగజారడంతో ప్రముఖ రెస్పిరేటరీ నిపుణుల బృందం రంగంలోకి దిగింది. ఆ బృందం ఆ వైద్యుడికి ECMO అనే ప్రాణాన్ని నిలబెట్టే చికిత్సు అందించారు.ECMO అంటే..ఎక్స్ట్రాకార్పోరియల్ మెంబ్రేన్ ఆక్సిజనేషన్ (ECMO) అనేది ప్రాణాలను కాపాడే ఒక యాంత్రిక జీవ సహాయక విధానం. ఇది రోగి రక్తాన్ని నిరంతరం శరీరం బయట ఉన్న కృత్రిమ ఊపిరితిత్తులకు పంప్ చేసి, ఆక్సిజన్ను జోడించి, కార్బన్ డయాక్సైడ్ను తొలగించి, తిరిగి రక్తాన్ని పంపుతుంది. ECMO బలహీనపడుతున్న గుండెలకు, ఊపిరితిత్తులకు విశ్రాంతి తీసుకుని, కోలుకోవడానికి సమయం ఇస్తుంది.అతడిని అనేక వారాల పాటు ICU, CTVS, IDలలో ఉంచి చికిత్స అందించారు. క్రమంగా, అతని ఊపిరితిత్తులు, ఇతర అవయవాల పనితీరు మెరుగుపడింది. ఆ తర్వాత ECMO మద్దతును క్రమంగా తొలగించారు. ఆ తర్వాత కొద్దిరోజులకే ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అతను ఇప్పుడు మునపటిలా యథాస్థితికి వచ్చాడని వెల్లడించారు వైద్యులు. ఇలా ఊపిరితిత్తులు ఇన్ఫెక్షన్ బారినపడి ఇతర అవయవాలు పనిచయుండా విశ్రాంతి స్థితికి వచ్చేసినప్పుడు ఈ ECMO ఒక కృత్రిమ గుండె , ఊపిరితిత్తుల మాదిరిగా సహాయక వ్యవస్థగా పనిచేస్తుందని చెబుతున్నారు. తద్వారా రోగి ప్రాణాలను రక్షించగలమని అన్నారు.(చదవండి: మండుటెండలకు ఎలాంటి ఫుడ్ మంచిదంటే..!) -
మా ఆయన రాత్రంతా నిద్రపోడు.. నన్ను నిద్ర పోనివ్వడు!
నా వయసు 32 సంవత్సరాలు. నాకు పెళ్లై 10 సంవత్సరాలు అయ్యింది. పెళ్లైన మొదటి నుంచే నా భర్తకు నా మీద అనుమానం ఉండేది. రెండు సంవత్సరాలుగా ఎక్కువైంది. ఆయన రాత్రంతా పడుకోకుండా మెలకువగానే ఉంటారు. నేను బయటికి వెళ్లి వచ్చినా, బాత్రూమ్కి వెళ్లి వచ్చినా, ఎక్కడికి వెళ్లినా గొడవ చేస్తారు.పెద్దలు సంపాదించిన ఆస్తి ఉండటం వల్ల ఆయనకు పెద్దగా పనిచేయాల్సిన అవసరం లేదు. అందుకే ఉదయం పూటంతా ఇంట్లోనే ఉంటారు. రాత్రి పూట మాత్రం పడుకోకుండా నన్ను గమనిస్తూ ఉంటారు. అలాగే మా బంధువులు, నా అన్నదమ్ములు ఎవరైనా నా దగ్గరకు వచ్చి మాట్లాడినా కూడా అనుమానిస్తారు. ఎవరితోనూ మాట్లాడనివ్వరు. కొన్నిసార్లు ఇంటికి తాళం వేసుకుని కూడా వెళ్తారు. ఆయనను హాస్పిటల్కి తీసుకువెళ్లడం కూడా చాలా కష్టంగా మారింది. మా అత్తమామలు కూడా ‘సర్దుకుపోమ్మా’ అని మాత్రమే అంటున్నారు. కానీ నా వల్ల ఇక కావడంలేదు. కేవలం కౌన్సిలింగ్ ద్వారా ఆయనను మార్చవచ్చా? ఎందుకంటే ఆయన మందులు వేసుకోవడానికి ఒప్పుకోరు. ఆయనను హాస్పిటల్కి తీసుకువచ్చి చికిత్స చేయించడానికి ఏదైనా మంచి సలహా ఇవ్వండి.– స్వర్ణ, నల్గొండమీ భర్త ప్రవర్తన కేవలం మామూలు పొసెసివ్ నేచర్’ మాత్రమే కాదు. ఇది ఒక తీవ్రమైన మానసిక సమస్య అయ్యే అవకాశం ఉంది. ఆధారాలు లేకపోయినా భార్యపై అనుమానం ఉండడం, రాత్రుళ్లు మెలకువగా ఉండడం, హింసించడం, ఎవరితో మాట్లాడనివ్వకపోవడం, బయటకు వెళ్లనివ్వకుండా ఇంటికి తాళాలు వేసుకుని వెళ్లడం వంటి లక్షణాలు‘అనుమానం జబ్బు’ లేదా ‘ఒథెల్లో సిండ్రోమ్’ అనే మానసిక సమస్యలో భాగంగా కనిపించవచ్చు. ఇలాంటి సమస్యలు మెదడులో వచ్చే కొన్ని రసాయన మార్పులవల్ల రావచ్చు. అలాగే చిన్నతనంలో జరిగిన ట్రామా లేదా మనుషులపై నమ్మకం కోల్పోయే అనుభవాల వల్ల కూడా ఈవిధమైన సమస్యలు పెరగవచ్చు. ఇది కేవలం కౌన్సిలింగ్ ద్వారా మాత్రమే తగ్గిపోయే సమస్యకాదు. కొన్నిసార్లు ఇలాంటి అనుమానాలు తీవ్రమై హింస, కొట్టడం, లేదా ప్రాణహాని వరకు వెళ్లే ప్రమాదం కూడా ఉంటుంది. ఖచ్చితంగా ఆయనకు చికిత్స అవసరం. ‘హాస్పిటల్కి వెళ్దాం’ అంటే ఆయన ఒప్పుకోకపోవచ్చు. అందుకే మొదట ‘స్ట్రెస్ ఎక్కువగాఉంది’ ‘నిద్ర సరిగ్గా రావట్లేదు కాబట్టి ఒకసారి డాక్టర్కు చూపించుకుందాం’ అనే విధంగా తీసుకురావడానికి ప్రయత్నించండి. హాస్పిటల్కి వచ్చిన తర్వాత డాక్టర్లు మాట్లాడి అవసరమైన మందులు ప్రారంభించే అవకాశం ఉంటుంది. మందులు కొంతకాలం క్రమంగా వాడితే, తర్వాత కౌన్సిలింగ్కు కూడా ఒప్పుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ మందులు లేదా కౌన్సిలింగ్కు పూర్తిగా నిరాకరిస్తూ, హింసాత్మకంగా ప్రవర్తిస్తే, అవసరమైతే కుటుంబ సభ్యుల సహాయంతో బలవంతంగానైనా హాస్పిటల్లో చేర్చి చికిత్స చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. మీరు నిరుత్సాహ పడకండి. మీ కుటుంబ సభ్యులు, మీ అమ్మ తరపువాళ్లు, అలాగే మీ అత్తగారిని కూడా ఇందులో భాగస్వామ్యం చేయండి. సరైన వైద్యంతో ఈ సమస్య నుంచి మీ భర్తను పూర్తిగా బయట పడేయవచ్చు. షేక్ స్పియర్ రాసిన ఒథెల్లో నాటకంలో కూడా క«థ ఇలాంటిదే. అందుకే ఈ సమస్యను ‘కాంజుగల్ పారనోయియా’ లేదా ‘ఒథెల్లో సిండ్రోమ్’ అని అంటారు.డా. ఇండ్ల విశాల్ రెడ్డి, సీనియర్ సైకియాట్రిస్ట్, విజయవాడ. మీ సమస్యలు, సందేహాలు పంపవలసిన మెయిల్ ఐడీ: sakshifamily3@gmail.com -
హెర్నియా: చొచ్చుకుపోయే చిచ్చు..! ఎవరిలో అధికం అంటే..
మన కడుపులో ఉన్న అవయవాలూ, శరీర భాగాలు, పేగులు... ఇవన్నీ మన పొట్ట అడుగు భాగంలో ఉండే పొరల మీద అమరిపోయి ఉంటాయి.ఏవైనా కారణాల వల్ల ఈ ΄పొట్ట కండరాలు బలహీనంగా ఉన్నట్లయితే పొట్టలోపల ఉండే భాగాలు... బలహీనంగా ఉన్న ఆ అబ్డామిన్ పొరల్లోంచి దూసుకొని (చర్మంలోనే) బయటకు వెళ్తాయి. ఇలా జరిగినప్పుడు పురుషుల్లోనైతే ఆ పేగులు... వృషణాల సంచిలోకి జారిపోవచ్చు. ఒకవేళ మహిళల్లోనైతే పొట్టలోని ఆ అవయవాలు అబ్డామిన్ కండరాలను దాటి లోపలికి వెళ్లవచ్చు. పొట్టలోనివే కాదు... మరే భాగంలోనైనా... ఒక దేహభాగం మరో దేహభాగంలోకి చొచ్చుకు వెళ్లడాన్ని ‘హెర్నియా’ అంటారు. ఇందులో చాలా రకాలుంటాయి. ఈ హెర్నియాలోని రకాలు, అలా జరిగినప్పుడు చేయించాల్సిన చికిత్సల వంటి పలు అంశాలను తెలుసుకుందాం...పొత్తికడుపు పొరల్లో బాగా బలహీనంగా ఉన్నచోటి నుంచి పొత్తికడుపులోని కొన్ని భాగాలు దూసుకుపోయి చర్మం కిందికి చేరుకుంటాయి. బయటి నుంచి చూసినప్పుడు అక్కడి చర్మం భాగం ఉబ్బినట్లుగా కనిపిస్తుంటుంది. సాధారణంగా పొత్తికడుపు ముందు భాగంలో చర్మం, కొవ్వు, కండరాలు వంటి పలుచోట్ల పొరలు ఉంటాయి. ఇవి పేగులతో పాటు కడుపులోని అంతర్గత భాగాలను తమ తమ స్థానాల్లో ఉండేలా చూస్తాయి. ఈ కండరాలు బలహీనంగా ఉన్న చోట్ల నుంచి కడుపులోని పేగులలో కొంత భాగం బయటకు వచ్చి చర్మం కింది నుంచి ఉబ్బు కనిపిస్తుంది. చేత్తో ముట్టుకున్నప్పుడు ఆ పేగుల భాగాలూ చేతి స్పర్శకు తెలుస్తుంటాయి. సహజంగా హెర్నియా వచ్చేందుకు అవకాశమున్న భాగాలు...కడుపులోని భాగాలు డయాఫ్రమ్ అనే భాగాన్ని దాటి ఛాతీ (లోయర్ ఛెస్ట్)లోకి. కడుపు కింది భాగాల నుంచి పొత్తికడుపు లేదా గజ్జల్లోని లోపలి భాగాల్లోకి. కడుపుకు మధ్యభాగం (మిడ్లైన్)లోకి. కడుపుపై శస్త్రచికిత్స జరిగినప్పుడు... బలహీనపడ్డ ఆ కోత భాగంలోకి.హెర్నియాల్లో రకాలివి... హెర్నియాల్లో అనేక రకాలుంటాయి. అందులో కొన్ని ముఖ్యమైనవి...ఇంగ్వైనల్ హెర్నియా : చాలా సాధారణంగా / ఎక్కువమందిలో కనిపించే హెర్నియా ఇది. మొత్తం హెర్నియాల్లో 75% ఇదే కనిపిస్తుంది. ఎక్కువగా పురుషుల్లో కనిపిస్తుంది. రెండు వైపులా కూడా రావచ్చు. సాధారణంగా ఎక్కువ బరువు ఎత్తినప్పుడు కడుపులోని పేగులు... ఇంగ్వైనల్ కెనాల్ అనే ప్యాసేజ్ ద్వారా తొడల (అప్పర్ థైస్) భాగంలోకి వెళ్తాయి.ఫీమోరల్ హెర్నియా : ఇది కాస్తంత అరుదుగానే కనిపిస్తుంది. ఇంగ్వైనల్ కెనాల్ కింద ఉండే ఫీమోరల్ కెనాల్ ద్వారా కడుపులోని భాగాలు ముఖ్యంగా కొవ్వుపొరలు తొడల (అప్పర్ థైస్) దగ్గరికి చొచ్చుకురావడం వల్ల ఈ హెర్నియా కనిపిస్తుంది. సాధారణంగా ఫీమోరల్ హెర్నియా మహిళల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఇంగ్వైనల్ హెర్నియాతో పోలిస్తే ఈ ఫీమోరల్ హెర్నియా కాస్త చిన్నదిగా ఉంటుంది. హయటల్ హెర్నియా : ఇది చాలామందిలో చాలా సాధారణంగా కనిపించే హెర్నియా. మన ఛాతీలో ఊపిరితిత్తులుండే భాగాన్నీ, కడుపులోని పేగులుండే భాగాన్ని వేరు చేస్తూ... డయాఫ్రమ్ అనే పొర ఉంటుంది. ఈ డయాఫ్రమ్ నుంచే...ఆహారాన్ని కడుపులోకి తీసుకెళ్లే అన్నవాహిక వెళ్తుంది. ఈ అన్నవాహిక కడుపులోకి వెళ్లే చోట డయాఫ్రమ్ దగ్గర బలహీనంగా ఉన్న సమయాల్లో కడుపులోని భాగాలు ఛాతీలోకి దూసుకువస్తాయి. ఈ కండిషన్నే హయటస్ / హయటల్ హెర్నియా అంటారు.కంజెనైటల్ డయాఫ్రమాటిక్ హెర్నియా : హయటల్ హెర్నియాలోలాగే ఇక్కడ కూడా డయాఫ్రమ్ లోంచి ఛాతీలోకి పైకి వస్తాయి. అయితే ఇది పుట్టకతోనే (కంజెనైటల్గా) వచ్చే సమస్య. అంటే పిండం అభివృద్ధి చెందుతున్న సమయంలో అన్నవాహిక కడుపులోకి వెళ్తే చోట డయాఫ్రమ్ పూర్తిగా ముసుకుపోయినట్టుగా అభివృద్ధి చెందకపోవడంతో కడుపులోని భాగాలు ఛాతీలోని ఊపిరితిత్తులున్న చోటికి వస్తాయి.ఇన్సిషనల్ హెర్నియా : సర్జరీ వంటివి చేస్తున్నప్పుడు... కడుపుపైన గాటు పెట్టిన చోట అక్కడి కణజాలం బలహీనం కావచ్చు. అలాంటి సందర్భాల్లో ఆ గాటు ఉన్న చోటి నుంచి కడుపులోని భాగాలు బయటకు చొచ్చుకు వచ్చినట్లుగా చర్మం కింది నుంచి ఉబ్బి కనిపిస్తూ ఉంటాయి. మునుపు శస్త్రచికిత్స గాయం లేదా మచ్చ ఉన్న ప్రాంతంలో... ఆ గాయం సరిగా మానకపోయినా లేదా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఈ తరహా హెర్నియా వచ్చే అవకాశాలెక్కువ. సాధారణంగా సర్జరీ తర్వాత రెండేళ్లలోపు ఇది కనిపిస్తుంది.అంబిలికల్ హెర్నియా / పారా అంబిలికల్ హెర్నియా : బొడ్డు దగ్గర బలహీనంగా ఉన్న ప్రాంతంలోంచి కడుపులోని భాగాలు బయటకు రావడాన్ని అంబిలికల్ హెర్నియా అంటారు. ఇది సాధారణంగా పుట్టుకతోనే (కంజెనైటల్గా) కనిపిస్తుంటుంది. చాలా సందర్భాల్లో చిన్నారికి ఏడాది వయసు వచ్చేనాటికి దానంతట అదే తగ్గిపోయే అవకాశాలెక్కువ. ఇక పారాంబిలికల్ హెర్నియా పెద్దవారిలో వస్తుంది. ఇది నాభి పైభాగంలో కనిపిస్తుంది. ఇందులోకి పేగులు చొచ్చుకుపోయి అక్కడ ఇరుక్కుపోయే ముప్పు ఉండటం వల్ల శస్త్రచికిత్స అవసరమవుతుంది. వెంట్రల్ హెర్నియా : కడుపు కింది భాగంలో ఉండే పొరల నుంచి అవయవాలు దూసుకు రాకుండా... కడుపు ముందుభాగంలోంచే కడుపులోని అవయవాలు ముందుకు వస్తుంటే దాన్ని ‘వెంట్రల్ హెర్నియా’ అని చెప్పవచ్చు. ఒకరకంగా చె΄్పాలంట అంబిలికల్ హెర్నియా, బొడ్డు దగ్గర వచ్చే ‘ఎపిగ్యాస్ట్రిక్ హెర్నియా’ వంటి వాటిని ‘వెంట్రల్ హెర్నియా’గా చెప్పవచ్చు.హెర్నియా ఎవరెవరిలో వస్తుందంటే... హెర్నియా అన్నది పురుషుల్లోనూ, మహిళల్లోనూ... ఇలా ఇద్దరిలో వచ్చే కండిషన్. చాలామంది పురుషుల్లో వచ్చే హైడ్రోసిల్ కండిషన్ను హెర్నియాతో పోల్చుకుని... ఆ రెండో ఒకటే అని అపోహ పడుతుంటారు. కడుపు కిందిభాగంలోని పొర... వయసు పెరగడం వల్లగానీ లేదా అరుగుదల వల్లగానీ, దెబ్బతగలడం వల్లగానీ లేదా కొందరిలో సహజంగానే ΄పొట్ట అడుగుభాగంలోని కండరం బలహీనపడ్డ సమయంలో కడుపులోని భాగాలు అందులోంచి దూసుకుని కిందికి వెళ్లడాన్నే ‘హెర్నియా’ అంటారు. స్త్రీ, పురుషుల్లో హెర్నియా పలు రకాలుగా రావచ్చు. అయితే పురుషులకు ఇంగ్వైనల్ హెర్నియా వచ్చే అవకాశాలెక్కువ. ఎందుకంటే పిండం శిశువుగా అభివృద్ధి చెందుతున్నప్పుడు వృషణాలు పొత్తికడుపులోంచి నుంచి స్క్రోటమ్లోకి దిగేందుకు ఒక చిన్న మార్గం ఉంటుంది. దాన్నే ఇంగ్వైనల్ కెనాల్ అంటారు. బిడ్డ కడుపులో ఉన్నప్పుడు టెస్టిస్ (బీజాలు) కూడా కడుపులోనే ఉంటాయి. మగబిడ్డ పుట్టగానే కడుపులోని ఆ టెస్టిస్ (బీజాలు) అదే మార్గం ద్వారా వృషణాల సంచిలోకి జారతాయి. మున్ముందు ఆ కెనాల్లోంచే పేగులు కూడా వృషణాల సంచిలోకి జారడం వల్ల ఇంగ్వైనల్ హెర్నియా వస్తుంది. ఇక పెద్ద వయసువారిలో ఏదైనా కారణం వల్లగానీ లేదా మలబద్దకం కారణంగా ముక్కినప్పుడు పొత్తికడుపుపై ఒత్తిడి పెరగడం వల్ల కూడా హెర్నియా వస్తుంది. ఇదే కాకుండా పొత్తికడుపుపై ఇతరత్రా కారణాలతో ఒత్తిడి పడటం కూడా హెర్నియాకు దారితీయవచ్చు. ఇక చిన్నారుల్లో సైతం పుట్టుకతో వచ్చే హెర్నియాలూ ఉండనే ఉన్నాయి. కడుపు కండరాలపై ఒత్తిడి కారణంగా హెర్నియా రావడానికి కారణాలు... క్రానిక్ అలర్జీల వల్ల చాలాకాలం పాటు గట్టిగా దగ్గాల్సిరావడం. పురుషుల్లో చాలా ఎక్కువసేపు అదేపనిగా నిలబడే వృత్తులో ఉండటం. గర్భధారణ వల్లగానీ చాలా ఎక్కువసార్లు ప్రెగ్నెన్సీలు రావడం వల్ల. ఎక్కువ బరువు ఉండటం (బీఎమ్ 30 కంటే ఎక్కువగా ఉండటం).బరువైన వస్తువులను అకస్మాత్తుగా ఎత్తడం లేదా ఎక్కువ ఫోర్స్తో తోయడం.మలవిసర్జన సమయంలో ముక్కుతూ చాలా ఎక్కువ ఒత్తిడితో విసర్జనకు ప్రయత్నించడం. పెల్విస్ భాగంలో అయిన సర్జరీల వల్ల. చిన్నారుల్లో కంజెనైటల్ హెర్నియాలకు కారణాలు... నెలల పూర్తిగా నిండకముందే పుట్టడం (ప్రీ–మెచ్యుర్ డెలివరీస్). కనెక్టివ్ టిష్యూ డిజార్డర్ అనే ఆరోగ్య సమస్య ఉండటం. కడుపులోని బీజాలు సంచిలోకి వెళ్లకపోవడం (అన్–డిసెండెడ్ టెస్టిస్). మూత్ర వ్యవస్థ / రీప్రొడక్టరీ సిస్టమ్లో ఏవైనా సమస్యలుండటం. మూత్ర విసర్జనలో ఇబ్బంది ఉండేవారిలో... మరీ ముఖ్యంగా ్ర΄ోస్టేట్ సమస్య ఉన్నవారిలో కూడా హెర్నియా వచ్చే అవకాశాలు ఎక్కువ.పెద్దవారిలో కనిపించే లక్షణాలుబరువైన వస్తువులు ఎత్తిన తర్వాత పొత్తికడుపు కింది భాగం (గ్రోయిన్)లో చిన్న ఉబ్బ / గడ్డలా కనిపించడం. మొదట్లో దాన్ని చేతితో లోపలికి నెట్టినప్పుడు కనిపించకుండా పోవడం తర్వాత మెల్లగా బయటకు రావడం దగ్గినప్పుడు లేదా గట్టిగా నవ్వినపుపడు ఉబ్బు బయటకు రావడం పడుకున్నప్పుడు ఉబ్బు / వాపు తగ్గిపోవడం. ఎందుకు చికిత్స అవసరమంటే...?సాధారణంగా హెర్నియా పెద్దగా నొప్పిని కలిగించదు. కానీ కొంతమందిలో నొప్పి లేదా బరువుగా అనిపించవచ్చు. కాలక్రమంలో ఉబ్బు / వాపు పెద్దదవుతుంది. పురుషుల్లో కొన్ని సందర్భాల్లో స్క్రోటమ్లోకి దిగిపోవచ్చు. ఇక పురుషుల్లోనూ, మహిళల్లోనూ కనిపించే హయటస్ హెర్నియాలో కడుపులోని యాసిడ్ పైకి తోసుకువచ్చే యాసిడ్ రిఫ్లక్స్ వంటి సందర్భాల్లో ఛాతీలో మంట, తీవ్రమైన అసౌకర్యం వంటి లక్షణాలు కనిపించి చాలా ఇబ్బందికి గురిచేస్తాయి. ఇక అప్పుడే పుట్టిన చిన్నారుల్లో కనిపించే కాంప్లికేషన్ల కారణంగా వాటిని సరిదిద్దాల్సిన అవసరం తప్పనిసరి. ఇక పెద్దవారిలో వచ్చే హెర్నియాలు సాధారణంగా ప్రమాదకరమైనవి కాకపోయినా చికిత్స చేయడం అవసరం. ఇందుకు కారణాలు... కొన్ని సందర్భాల్లో హెర్నియా ఎటూ కదలలేకుండా ‘బిగుసుకుపోవచ్చు’. ఇలా బిగుసుకుపోవడాన్ని ‘ఇన్కార్సెరేషన్’ అంటారు. ఇలాంటి ‘ఇన్కార్సెరేటెడ్ హెర్నియా’లో నొప్పితో పాటు కొన్నిసార్లు చాలా ప్రమాదకరమైన పరిస్థితికి దారితీస్తుంది. ఉదాహరణకు హెర్నియా కండిషన్ పెద్దపేగును బాగా బిగదీసి నొక్కుకుపోయేలా చేసినప్పుడు బయటకు వెళ్లాల్సిన గ్యాస్, విసర్జన జరగాల్సిన పదార్థాలూ అక్కడే ఆగిపోవచ్చు. ఇక కొన్నిసార్లు పేగు భాగం ఇరుక్కుపోయి ‘స్ట్రాంగ్యులేషన్’ అనే ప్రమాదకర పరిస్థితి ఏర్పడవచ్చు. అప్పుడు బిగదీసుకుపోయిన చోటి నుంచి కింది భాగానికి రక్తప్రసరణ ఆగిపోవడం వల్ల తీవ్రమైన నొప్పితో పాటు పేగు దెబ్బతిని అక్కడి కణజాలం నశించిపోయే ప్రమాదం ఉంది. దీన్నే నెక్రోసిస్ / గ్యాంగ్రీన్గా కూడా చెబుతారు. ఇంగ్వైనల్ హెర్నియాలకంటే ఫెమోరల్ హెర్నియాల్లో ఈ ముప్పు చాలా ఎక్కువ. ఇలా జరిగినప్పుడు ఒక్కోసారి అది రవాణ సదుపాయానికి కూడా దారితీయవచ్చు. అందుకే హెర్నియా కండిషన్ను శస్త్రచికిత్స ద్వారా సరిచేయాల్సి ఉంటుంది. నిర్ధారణ బాధితుల్లోని ఉబ్బు భాగాన్ని భౌతికంగా పరీక్షించడం (ఫిజికల్ ఎగ్జామ్) ద్వారా హెర్నియాను చాలావరకు నిర్ధారణ చేస్తారు. కొన్ని సందర్భాల్లో సీటీ స్కాన్ వంటి ఇమేజింగ్ ప్రక్రియలు అవసరం పడవచ్చు. హెర్నియాను ఎలా సరిచేస్తారు?హెర్నియాను చిన్నపాటి శస్త్రచికిత్స ద్వారా డాక్టర్లు సరిచేస్తారు. అయితే చిన్నపాటివీ (మైల్డ్), కొద్దిపాటి వాటికి వెంటనే శస్త్రచికిత్స అవసరం లేదు. ఇలాంటి వాటి విషయంలో డాక్టర్లు ‘వెయిట్ అండ్ వాచ్’ పద్ధతిని అనుసరిస్తారు. మరీ ప్రమాదకరం కాకుంటే తక్షణం శస్త్రచికిత్స అవసరం లేదు. అయితే పరిస్థితి ప్రమాదకరంగా మారే అవకాశముందని అంచనా వేస్తే తప్పక శస్త్రచికిత్స అవసరం. ఇది మందులతో తగ్గే కండిషన్ కాదు. పాతకాలంలో ‘ట్రస్’ (సపోర్ట్) పద్ధతి ద్వారా శస్త్రచికిత్స చేసేవారు. అయితే ఇప్పుడు ఆ పద్ధతిని ఎవరూ అనుసరించడం లేదు. శస్త్రచికిత్సలో రకాలుఓపెన్ సర్జరీ / హెర్నియా రిపేర్ సర్జరీ : హెర్నియాను శస్త్రచికిత్స ద్వారా సరిచేస్తారు. అంతర్గత అవయవాల్లోకి చొచ్చుకుపోయిన అవయవాలను / పేగులను లోపలికి యథాస్థానంలోకి నెట్టి, పొరలు బలహీనంగా ఉన్న చోటి నుంచి అవయవాలు మళ్లీ లోనికి జారిపోకుండా అక్కడ ‘మెష్’ (వల వంటి భాగాని అమర్చుతారు. మామూలుగానైతే 3–4 అంగుళాల కోత పెట్టి హెర్నియాను సరిచేస్తారు. సాధారణంగా స్పైనల్ అనస్థీషియా ఇస్తారు.లాపరోస్కోపిక్ హెర్నియా రిపేర్ : చిన్న చిన్న గాట్ల ద్వారా అతి చిన్న కెమెరా (లాపరోస్కోప్) సహాయంతో శస్త్రచికిత్స చేస్తారు. మెష్ను పెట్టి స్లేప్లింగ్ చేస్తూ దాన్ని స్థిరంగా ఉండేలా చూస్తారు. ఆ మెష్ కారణంగా మళ్లీ అవయవాలు లోపలికి జారవు. ఇందులో కూడా సాధారణంగా జనరల్ అనస్థీషియాతో ఇస్తారు.లాపరోస్కోపిక్ సర్జరీతో ప్రయోజనాలుచిన్న గాటు తక్కువ నొప్పి త్వరగా కోలుకోవడం త్వరగా వృత్తులకు వెళ్లగలగడం (అటెండ్ కావడం)రొబోటిక్ సర్జరీ : ఇప్పుడు రొబోటిక్స్ సహాయంతో కూడా శస్త్రచికిత్స నిర్వహించడం సాధ్యమే. దీంతో మరింత ఖచ్చితమైన రీతిలో (ప్రెసిషన్తో) శస్త్రచికిత్స చేయడం వల్ల త్వరగా కోలుకోవడం, తక్కువ నొప్పి వంటి ప్రయోజనాలన్నీ ఇందులోనూ ఉంటాయి.హెర్నియా నివారణ సాధ్యమేనా? హెర్నియాకు కారణమయ్యే కొన్ని అంశాలు మానవ నియంత్రణకు సాధ్యం కావు. అయితే కొన్ని సాధారణ అంశాలు పాటించడం ద్వారా హెర్నియాను చాలావరకు నివారించవచ్చు. అవి... బరువును అదుపులో ఉంచుకోవడం / అధిక బరువు తగ్గించడం ∙బరువైన వస్తువులను ఎత్తే సమయంలో జాగ్రత్తగా ఉండటం / అకస్మాత్తుగా ఎత్తకుండా జాగ్రత్తలు తీసుకోవడం / బరువైన వస్తువులను తోసే విషయంలోనూ ఈ జాగ్రత్తలు అవసరంచాలాకాలం పాటు దగ్గుతూ / తుమ్ములు వస్తూ ఉండే క్రానిక్ పల్మునరీ ఆరోగ్య సమస్యలకు తగిన చికిత్స తీసుకుంటూ దగ్గు రాకుండా చూసుకోవడం మలబద్ధకం సమస్య లేకుండా చూసుకోవడం పురుషుల్లో ప్రొస్టేట్ సమస్య ఉంటే దాన్ని పరిష్కరించుకోవడం.హెర్నియాలు వారసత్వంగా వస్తుంటాయా? కొంతవరకు అవుననే చెప్పవచ్చు. ఎందుకంటే జన్యుపరంగానూ, వాళ్ల దేహం తాలూకు స్వభావం వల్ల కడుపు కింది భాగంలోని పొరలు బలహీనంగా ఉండటం జరగవచ్చు. ఇలాంటి కుటుంబాల్లో తర్వాతి తరాల్లోనూ హెర్నియా రావచ్చు. అంతమాత్రాన తర్వాతి తరాల్లో ఇది అందరికీ వస్తుందని కాదుగానీ... హెర్నియా వచ్చేందుకు అవకాశాలు కాస్తంత ఎక్కువ.చివరగా... ముందుగా చెప్పినట్టు మైల్డ్ కేసుల్లో డాక్టర్లు వెయిట్ అండ్ వాచ్ పద్ధతిలో హెర్నియాను గమనిస్తూ ఉన్నప్పటికీ... డాక్టర్లు సర్జరీ తప్పదని చెప్పినప్పుడు శస్త్రచికిత్సకు వెళ్లడమే మంచిది. ఎందుకంటే హెర్నియా బిగదీసుకుపోయే ‘స్ట్రాంగ్యులేషన్’ కేసుల్లో అది మెడికల్ ఎమర్జెన్సీగా పరిగణించవచ్చు. అంతేకాదు... కొన్నిసార్లు ప్రాణాంతకమూ అయ్యే అవకాశాలెక్కువ. అందుకే డాక్టర్ల సూచనలు తప్పనిసరిగా పాటించడం అవసరం.డాక్టర్ ఎన్. భరత్కుమార్, సీనియర్ సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ నిర్వహణ: యాసీన్(చదవండి: గర్భధారణలో రెండుసార్లు అలా..ఇది బిడ్డకు ప్రమాదమా?) -
ఫోరెన్సిక్ వైద్యంలో 'మరణపూర్వ గాయాలు' అంటే? ఎలా గుర్తిస్తారంటే..
భోపాల్లో గత వారం అనుమానాస్పద స్థితిలో మరణించిన మాజీ మిస్ పూణే , కంటెంట్ క్రియేటర్ 33 ఏళ్ల ట్విషా శర్మ మరణానికి సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆమె మరణించడానికి ముందు శరీరంపై పలు చోట్ల తీవ్ర గాయలయ్యాయని ఫోరెన్సిక నివేదిక పేర్కొంది. ఈ నేపథ్యంలో మరణపూర్వ గాయాలు అంటే ఏంటీ?, ఫోరెన్సిక్ వైద్యులు వాటిని ఎలా గుర్తిస్తారు వంటి వాటి గురించి తెలుసుకుందామా.!.ఫోరెన్సిక్ దర్యాప్తులలో ఇవి అత్యంత కీలకమైన ఆధారాలు. ఓ వ్యక్తి అనుమానాస్పదంగా మరణిస్తే పోస్ట్మార్టం నిర్వహించడానికి తరలిస్తారు పోలీసులు. అక్కడ ఫోరెన్సిక నిపుణులు ఆ వ్యక్తి ఎలా మరణించాడో నిర్థారించే ప్రక్రియ జరుగుతుంది. ఆ తర్వాత నిపుణులు పోస్ట్మార్టం నివేదికలో మరణానికి ముందు గాయాలు, మరణానంతర గాయాలు అని పేర్కొంటూ ఇస్తారు. ఇవి కేసుని చేధించడానికి ఎంత కీలకం అంటే..ఆయా వ్యక్తుల మరణానికి కారణమైన నేరస్తులను వెలకితీయడానికి ప్రధాన ఆధారాలు. 'మరణపూర్వ గాయాలు' అంటే ..ఫోరెన్సిక్ వైద్యంలో, "మరణపూర్వ" అంటే మరణానికి ముందు జరిగే గాయలని అర్థం. జీవించి ఉండగానే అయ్యిన గాయాలని అర్థం. అవికోతలు లేదా రాపిడి గాయాలువాపుఎముకలు విరగడంఅంతర్గత రక్తస్రావంబలహీనమైన దెబ్బలుఆత్మరక్షణ గాయాలు తదితరాలు.వైద్యులు చెప్పేదేమిటంటే, ఈ పదం గాయాలు ఎలా జరిగాయో దానంతట అదే వెల్లడించనప్పటికీ, మరణానికి దారితీసిన పరిస్థితులను నిర్థారించడంలో కీలకపాత్ర పోషిస్తుంద.ఎలా గుర్తిస్తారంటే?మరణానంతర పరీక్ష సమయంలో, ఫోరెన్సిక్ నిపుణులు మరణానికి ముందు శరీరం గాయానికి ప్రతిస్పందించిందని చూపే ఆధారాలను సేకరిస్తారు. కణజాలంలోకి రక్తస్రావం, వాపు లేదా ఉబ్బరం, రంగు మార్పులతో కూడిన కమిలిన గాయాలు, రక్తం గడ్డకట్టడం, రక్త ప్రసరణ చురుకుగా ఉందని సూచించే కణజాల ప్రతిచర్యలు వంటివి ముఖ్యమైన సంకేతాలు. గుండె ఇంకా రక్తాన్ని పంపింగ్ చేస్తూ, శరీరం సజీవంగా ఉన్నప్పుడు మాత్రమే ఈ ప్రతిస్పందనలు సాధ్యమవుతాయి. ఇవి చట్టపరంగా అత్యంత ప్రాముఖ్యత సంతరించుకున్న నివేదిక. దర్యాప్తు అధికారులు ఈ గాయాలు మరణానికి ఏవిధంగా దోహదపడ్డాయి, ఆ టైంలో ఏదైన పెనుగులాట జరిగిందా, ప్రమాదవశాత్తు జరిగాయ, స్వయంగా జరిగినవా వంటివి నిర్థారిస్తారు. ముఖ్యంగా ఆత్మహత్య చేసుకున్న కేలుసలలో లేదా ఏదైన కుట్రపన్ని ఉద్దేశ్యపూర్వకంగా చంపేసిన ఘటనల్లోనే ఇలాంటి బహుణ మరణ పూర్వగాయాలకు ఆస్కారం ఉంటుంది. అదీగాక పోలీసులు వైద్య నివేదికలు లేకుండా ఒక నిర్ధారణకు రాకూడదని నిపుణులు హెచ్చరిస్తుంటారు. మరణానంతర గాయాలు అంటే..మరణం తర్వాత కలిగే గాయాలను మరణానంతర గాయాలు అంటారు. ఇవి సాధారణంగా అవే జీవసంబంధమైన ప్రతిచర్యలను చూపించవు.మరణానికి పూర్వం-మరణానంతర గాయాల మధ్య వ్యత్యాసం..మరణానికి ముందు గాయాలుమరణానికి ముందు సంభవిస్తాయిరక్తస్రావం, వాపును చూపుతాయిగాయం జరిగినప్పుడు శరీరం సజీవంగా ఉందని సూచిస్తాయిమరణానంతర గాయాలుమరణం తర్వాత సంభవిస్తాయిసాధారణంగా వాపు లేదా కణజాల ప్రతిచర్య ఉండదుమృతదేహాన్ని తరలించే సమయంలో, పర్యావరణానికి గురైనప్పుడు లేదా శరీరాన్ని తాకినప్పుడు జరగవచ్చు. ఇక్కడ కేసుని చేధించడంలో ఫోరెన్సిక్ నివేదిక అనేది దర్యాప్తులో ఒక భాగం మాత్రమే. అధికారులు ఒక నిర్ధారణకు రావడానికి ముందు పోలీసుల ఇన్విస్టిగేషన్, సాక్షుల వాంగ్మూలాలు, టాక్సికాలజీ నివేదికలు, డిజిటల్ ఆధారాలు, వైద్య చరిత్ర వంటి వాటిని పరిగణనలోకి తీసుకుంటారు.(చదవండి: సింగింగ్'తో జీర్ణక్రియ మెరుగుపడుతుందా? హార్వర్డ్ నిపుణుల షాకింగ్ విషయాలు) -
పాటలు పాడటం ఇంత మంచిదా..? హార్వర్డ్ నిపుణుల షాకింగ్ విషయాలు
సంగీతానికి వ్యాధులను నయం చేసే శక్తి ఉందని మన పెద్దలు చెబతుండటం విన్నాం. అంతెందుకు శ్రావ్యమైన సంగీతం వింటుంటే శారీరకంగా, మానసికంగా బాగుంటాం అని నిపుణులు సైతం అంటున్నమాటే. తాజాగా వినడమే కాదు పాటలు పాడితే మన జీర్ణక్రియ మెరుగ్గా ఉంటుందట. పైగా గట్ హెల్త్ బాగుంటుందని సాక్షాత్తు హార్వర్డ్ నిపుణులే చెబుతున్నారు. అదేవిధంగానో ఆ నిపుణుల మాటల్లోనే తెలుసుకుందామా.!.పాడటం అనేది కళాత్మక ప్రక్రియ. మరి దీనికి జీర్ణక్రియకు సంబంధం ఎలా అంటే.. పాటలు పాడినప్పుడు మనసు, పేగులు, నాడీ వ్యవస్థపై దాని ప్రభావం ఎలా ఉంటుందో పరిశోధనలు చేశారు శాస్త్రవేత్తలు. ఒక బృందంగా పాడుతున్నప్పుడు శరీరంలో ఇమ్యూనోగ్లోబిన్ (ఏ), కార్డిసాల్ స్థాయిల్లో ఎలాంటి మార్పులు సంభవిస్తాయో గమనించారు. పాడటం అనేది మానవ శరీరంపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. అలాగే జీర్ణ ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపిస్తుందట. ఒత్తిడి, ఆందోళనతో చాలామంది బాధపడుతుంటారు. కానీ కొందరు దీన్ని అధిగమించిగలుగుతారు అందుకు ఇదే కారణమని అంటున్నారు.పాడినప్పుడు ఏం జరుగుతుందంటే..శరీరంపై సానుకూల ప్రభావం మెదడు నుంచి మొదలై వేగస్ నాడి ప్రేరణ ద్వారా జీర్ణవ్యవస్థను ప్రభావితం చేస్తుంది. అందుకోసం బీథోవెన్ సంగీతాన్ని ఆలపిస్తున్న బృందంపై పరిశోధనలు చేయగా, వారందిరలోనూ పాడటం కారణంగా లాలాజలంలో ఒక కీలకమైన రోగనిరోధక యాంటీబాడీ నాటకీయంగా పెరగడం గుర్తించామని తెలిపారు. ఆ యాంటీబాడీ.. జీర్ణవ్యవస్థ లోపలి పొర, గొంతు, శ్వాస మార్గాలలో మన శరీరానికి మొదటి రక్షణ కవచంలా పనిచేస్తుందట. ఫలితంగా వ్యాధికారకాలు మనపై పట్టు సాధించే అవకాశం రాకమునుపే ఈ యాంటీబాడీ అడ్డుగోడగా మారుతుందని చెబుతున్నారు పరిశోధకులు. అందుకే గానానికి ఆరోగ్యానికి పరస్పర సంబంధం ఉందని చెబుతున్నారు. మెదడుకు, పేగుకి మధ్య ఉన్న ప్రధాన సమాచార ప్రసార మార్గం అయిన వేగస్ నాడి పాటను ఆలపించగానే ఉత్తేజితమవుతుందట. ఎప్పుడైతే పాట కోసం ఉదర శ్వాసను ఉపయోగిస్తామో అప్పుడు ఈ వేగస్ నాడీ తక్షణమే యాక్టివ్ అవుతుందట. దాంతో విశ్రాంతి, జీర్ణక్రియ అనే ప్రక్రియ ఆటోమేటిగ్గా ఆన్ అయ్యి ప్రేగులు అత్యుత్తమంగా పనిచేయడం ప్రారంభిస్తాయట. ఫలితంగా జీర్ణక్రియ మెరుగుపడటమేగాక, ప్రేగుల లోపలి పొర ఆరోగ్యంగా ఉంటుందని చెబుతున్నారు. అంతేగాదు శరీరంలో మంచి సూక్ష్మజీవుల సమతుల్యతకు మద్దతిస్తుందట. గానం ఎలా హెల్ప్ అవుతుందంటే..గానం విశ్రాంతిని ప్రోత్సహించి ఒత్తిడిని తగ్గిస్తుంది. అంటే ఆటోమేటిగ్గా మనం రిలాక్స్ మోడ్లోకి వెళ్లిపోతాం. దాంతో జీర్ణక్రియ పనితీరు మెరుగుపడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇక్కడ పాట పడటం కోసం ఉదర శ్వాసను వినియోగిస్తాం దాంతో శ్వాశ, నాడీవ్యవస్థ నియంత్రణ ఫలితం ప్రేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని అన్నారు. జీర్ణవ్యవస్థకు మెదడు నుంచి సరైన సంకేతాలు అందితేనే తన పనిని సజావుగా జరపగలదట. అందువల్లే గానం జీర్ణక్రియను మెరుగుపరుస్తుందని నొక్కి చెప్పగలమని అన్నారు. గానం నాడీ వ్యవస్థపై ప్రభావం చూపిస్తుంది. అది సమర్థవంతంగా సంకేతాలను అందించడంతో ప్రేగుల ఆరోగ్యం మెరుగ్గా ఉంటుందని అన్నారు. అందరూ పాడేటప్పుడు లోతైన శ్వాసను తీసుకుంటే వేగస్ నాడీ ఉత్తేజమయ్యి..జీర్ణవ్యవస్థ బాగుండేలా చేస్తుందని చెప్పుకొచ్చారు. అందుకే మన పూర్వీకులు మన చేత నిరంతరం జపాలు, పారాయణాల పేర్లతో మంత్రాలు, భక్తిపాటలను లయబద్ధంగా ఆలపించేలా చేసేవారని అంటున్నారు. అంటే మెరుగైన ఆరోగ్యానికి చక్కటి జీవనశైలి, శ్వాస, మానసిక ఆరోగ్యం అత్యంత కీలకమనేది గుర్తురెగండి అని సూచిస్తున్నారు నిపుణులు. గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం View this post on Instagram A post shared by Akanksha Pandey (@acanxa) (చదవండి: వడదెబ్బకు పారాసెటమాల్ ఉపయోగిస్తున్నారా? వైద్యులు ఏమంటున్నారంటే..) -
టీ, కాఫీ తాగుతున్నారా? పరిశోధనలో ఏం తేలిందంటే?
టీ లేదా కాఫీని చాలా మంది ప్రాణానికి ప్రాణంలా భావిస్తుంటారు. సమయానికి కాఫీ తాగనిదే ఏదీ తోచదు. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది జీవితంలో భాగమైపోయిన కాఫీపై ఎన్నో పరిశోధనలు జరిగాయి. తాజాగా, జరిగిన మరో పరిశోధనలో శాస్త్రవేత్తలు మరిన్ని విషయాలు గుర్తించారు. రోజుకు 2-3 కప్పుల కాఫీ తాగడం డిమెన్షియా (చిత్త వైకల్యం) ప్రమాదాన్ని తగ్గిస్తుందని గుర్తించారు. ముఖ్యంగా 75 ఏళ్ల లోపు వయస్సు వారిలో ఈ ప్రభావం బాగా కనిపించింది. కెఫీన్ మెదడు కణాలను చురుకుగా ఉంచడంలో సహాయపడుతుంది. అలాగే అల్జీమర్స్ వ్యాధితో సంబంధం ఉన్న వాపు, హానికర ప్లాక్ పేరుకుపోవడాన్ని తగ్గించవచ్చు. అయితే, అధికంగా కాఫీ తాగితే మాత్రం చాలామంది అంతగా ప్రయోజనాలు పొందలేరు. మితంగా, మోతాదులో తాగేవారిలో డిమెన్షియా ప్రమాదాన్ని గణనీయంగా తగ్గింది. పూర్తి వివరాలు...మోతాదులో కెఫీన్ ఉన్న కాఫీ లేదా టీ తాగితే వయస్సు పెరిగేకొద్దీ డిమెన్షియా ప్రమాదం తగ్గవచ్చని తాజా పరిశోధన ద్వారా తెలుస్తోందని శాస్త్రవేత్తలు చెప్పారు. అమెరికాలో జరిగిన ఈ అధ్యయనాన్ని 131,821 మంది నర్సులు, ఆరోగ్య రంగ నిపుణులను 43 ఏళ్ల పాటు పరిశోధకులు చేశారు. అధ్యయనం ప్రారంభమైనప్పుడు ఇందులో పాల్గొన్నవారి వయస్సు 40 ఏళ్ల ప్రారంభ దశలో ఉంది. అధ్యయనం కాలంలో 11,033 మందికి డిమెన్షియా వచ్చింది. మొత్తం పాల్గొన్నవారిలో ఈ సంఖ్య సుమారు 8 శాతం మాత్రమే. మితమైన మోతాదులో కెఫీన్ ఉన్న కాఫీ లేదా టీ తాగినవారిలో డిమెన్షియా వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయని పరిశోధకులు గుర్తించారు. 75 ఏళ్ల లోపు వయస్సు ఉన్నవారిలో మంచి ప్రయోజనాలు కనిపించాయి. రోజుకు 250ఎంజీ నుంచి 300ఎంజీ వరకు కెఫీన్ తీసుకున్నవారిలో, అంటే సుమారు 2 నుంచి 3 కప్పుల కాఫీ తాగినవారిలో డిమెన్షియా ప్రమాదం 35 శాతం తగ్గింది. అంతకంటే ఎక్కువ కెఫీన్ తీసుకున్నా అదనపు రక్షణ కనిపించలేదు.అధ్యయనం ప్రారంభంలో మహిళలు రోజుకు సగటున నాలుగున్నర కప్పుల కాఫీ లేదా టీ తాగుతున్నట్లు చెప్పారు. పురుషులు సుమారు రెండున్నర కప్పులు తాగుతున్నట్లు తెలిపారు. ఎక్కువ కెఫీన్ ఉన్న కాఫీ తాగినవారు సాధారణంగా తక్కువ వయస్సు ఉన్నవారే అయినా.. వారు ఎక్కువ మద్యం సేవించడం, ఎక్కువగా పొగ తాగడం, అధిక కేలరీలు తీసుకోవడం వంటివి చేశారు. ఇవన్నీ డిమెన్షియా ప్రమాదంతో సంబంధం ఉన్న అంశాలు.డీకాఫ్ కాఫీ (కాఫీ గింజల నుంచి 97 శాతం కంటే ఎక్కువ కెఫిన్ను తొలగించి తయారుచేసే కాఫీ) విషయంలో అనూహ్య ధోరణిని కూడా పరిశోధకులు గుర్తించారు. ఎక్కువ డీకాఫ్ తాగినవారిలో జ్ఞాపకశక్తి తగ్గుదల వేగంగా కనిపించింది. నిద్ర సమస్యలు, అధిక రక్తపోటు, గుండె స్పందనలో లోపాలు వచ్చిన తర్వాత కొందరు డీకాఫ్కు మారి ఉండవచ్చని పరిశోధకులు భావిస్తున్నారు. ఈ సమస్యలు జ్ఞాపకశక్తి తగ్గుదల, డిమెన్షియాతో సంబంధం ఉన్నాయి.కెఫీన్ మెదడును ఎలా రక్షిస్తుంది?కెఫీన్ మెదడుకు ఆరోగ్యకర ప్రయోజనాలు అందించడానికి పలు జీవశాస్త్ర కారణాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కెఫీన్ అడెనోసిన్ అనే రసాయనాన్ని అడ్డుకుంటుంది. ఇది డోపమైన్, అసిటైల్కోలిన్ వంటి ముఖ్యమైన మెదడు సందేశ రసాయనాల పనితీరును మందగింపజేస్తుంది. వయస్సు పెరిగేకొద్దీ, అల్జీమర్స్ వంటి వ్యాధుల్లో ఈ రసాయనాలు సహజంగానే తగ్గుతాయి. కెఫీన్ ఆ తగ్గుదలను ఎదుర్కోవడంలో సహాయపడవచ్చు.కెఫీన్ వాపును తగ్గించడం, రక్తంలో చక్కెర వినిమయాన్ని నియంత్రించడం ద్వారా కూడా మెదడు ఆరోగ్యానికి సహాయపడుతుంది. జీవితాంతం రోజు 2 కప్పులకంటే ఎక్కువ కాఫీ తాగినప్పటికీ డిమెన్షియా రాని వ్యక్తుల మెదడులో అమైలాయిడ్ ప్లాక్ స్థాయులు తక్కువగా ఉన్నట్లు అధ్యయనాలు తేల్చాయి. అల్జీమర్స్ ఉన్నవారిలో ఈ విషపూరిత ప్లాక్లు సాధారణంగా కనిపిస్తాయి.


