breaking news
Health
-
మౌని అమావాస్య : ధార్మికమే కాదు.. ఆరోగ్యానికి ‘సూపర్ ఫుడ్’
నేడు (ఆదివారం) మౌని అమావాస్య. హిందూ ధర్మంలో ఈ రోజుకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఉత్తరాదిన దీనిని మాఘ అమావాస్య అని కూడా అంటారు. ఈ రోజున పుణ్య స్నానం, దానధర్మాలు, పూర్వీకులకు పిండ ప్రదానాలు చేయడం ఎంతో ఉత్తమమని పండితులు చెబుతుంటారు. ఆధ్యాత్మిక, యోగ సాధకులు మౌని అమావాస్య నాడు నిశ్శబ్ద ఉపవాసం పాటిస్తారు. అంటే రోజంతా మౌనంగా ఉంటారు. ఎవరైనా సరే మౌనం వహించినప్పుడు లోపలికి దృష్టిని సారిస్తారు. నిశ్శబ్దం అనేది మనసును ప్రశాంతపరుస్తుంది. ఆలోచనలను శుద్ధి చేస్తుంది. ఆధునిక జీవనశైలిలో..నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మనమంతా నిరంతరం శబ్ద కాలుష్యం మధ్య బతుకీడుస్తున్నాం. ట్రాఫిక్ రొద, మొబైల్ రింగ్టోన్లు, రోజంతా సాగే అనవసరపు సంభాషణలు మనల్ని శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా విపరీతంగా అలసిపోయేలా చేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ‘మౌన వ్రతం’ లేదా కాసేపు నిశ్శబ్దంగా ఉండటం అనేది మనకు ఒక వరంగా పరిణమిస్తుంది.అశాంతికి, ఒత్తిడికి చెక్..మౌనం అంటే కేవలం బయటి శబ్దాలకు దూరంగా ఉండటం కాదు. ఇది అంతర్గత స్వేచ్ఛకు, నిజమైన ఆనందానికి మార్గం. ఆయుర్వేదంలో పేర్కొన్న వివరాల ప్రకారం, అతిగా మాట్లాడటం వల్ల శరీరంలో ‘వాత దోషం’ పెరుగుతుంది. ఫలితంగా మనసు అశాంతికి గురికావడం, ఒత్తిడి పెరగడం, శక్తి క్షీణించడం లాంటి సమస్యలు తలెత్తుతాయి. మౌనంగా ఉండటం వల్ల మనసులో సత్వగుణం పెరిగి, ఏకాగ్రత, ధ్యాన శక్తి మరింతగా మెరుగుపడుతుంది. భగవద్గీతలో కూడా మౌనాన్ని ఒక మానసిక తపస్సుగా అభివర్ణించారు. ఇది వాక్కుపై నియంత్రణను సాధించి, శరీరంలోని ఓజస్సును కాపాడుతూ, రక్తపోటు (బీపీ)BP)అదుపులో ఉంచుతూ, గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది.మౌనంపై సైన్స్ ఏమంటోంది?మౌనం వల్ల కలిగే ప్రయోజనాలను ఆధునిక విజ్ఞాన శాస్త్రం కూడా రుజువుచేసింది. శబ్ద కాలుష్యం మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీయడమే కాకుండా, ఒత్తిడిని పెంచి, శారీరక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. మరోవైపు, మౌనం మెదడుపై లోతైన ప్రభావాన్ని చూపుతుంది. ఒక ప్రముఖ అధ్యయనం ప్రకారం, రోజుకు కనీసం రెండు గంటల పాటు మౌనంగా ఉండటం వల్ల మెదడు కణాల (Brain Cells) అభివృద్ధి జరుగుతుంది. ఇది జ్ఞాపకశక్తిని పెంచి, భావోద్వేగాలను నియంత్రించడంలో, కొత్త విషయాలను నేర్చుకోవడంలో సానుకూల ప్రభావం చూపుతుందని శాస్త్రవేత్తలు గుర్తించారు.అద్భుత ఆరోగ్య ప్రయోజనాలుమౌన వ్రతాన్ని ఆచరించడం వల్ల శరీరంలో ఒత్తిడిని పెంచే ‘స్ట్రెస్ హార్మోన్లు’ తగ్గుముఖం పడతాయి. తద్వారా మనసు ప్రశాంతంగా మారుతుంది. ప్రతిరోజూ కాసేపు మౌనంగా ఉండే వారికి నిద్రలేమి సమస్యలు దూరమై, గాఢ నిద్ర పడుతుంది. ప్రశాంతమైన వాతావరణంలో మెదడు మరింత సమర్థవంతంగా ఆలోచించగలుగుతుంది. దీనివల్ల ఏకాగ్రత, సృజనాత్మకత పెరుగుతాయి. అంతేకాకుండా చిన్న చిన్న విషయాలకే చికాకు పడటం, కోపం తెచ్చుకోవడం లాంటి భావోద్వేగ అస్థిరత నుంచి ఉపశమనం లభించి, ఎమోషనల్ బ్యాలెన్స్ సాధ్యమవుతుంది. విపత్కర పరిస్థితుల్లో హింసకు దారితీయకుండా, శాంతియుతంగా సమస్యలను పరిష్కరించే శక్తివంతమైన సాధనం ‘మౌనం’ అనడంలో ఎంతమాత్రం సందేహం లేదు. ఇది కూడా చదవండి: మిషన్ డాల్ఫిన్: నదీ గర్భంలో భారీ ‘ఆపరేషన్’ -
పుడుతూనే మధుమేహం..
సాధారణంగా షుగర్ వ్యాధి అంటే పెద్దవాళ్లకే వస్తుందని మనం అనుకుంటాం. అయితే అప్పుడే కళ్లు తెరిచిన పసిబిడ్డలను కూడా ఈ వ్యాధి వెంటాడుతోంది. దానికి కారణం ఓ అరుదైన జన్యు లోపమని అంతర్జాతీయ శాస్త్రవేత్తలు తాజాగా గుర్తించారు. ఆరు నెలల వయసులోపు పిల్లల్లో కనిపించే ఈ వింత పరిస్థితి వెనుక ఉన్న అసలు కారణాన్ని గుర్తిస్తూ, వైద్య ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచే కీలక విషయాలను పరిశోధకులు వెల్లడించారు.‘నియోనాటల్ డయాబెటిస్’ వెనుక..ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మందిని వేధిస్తున్న మధుమేహం (Diabetes) ఒక వయసు దాటినవారికే పరిమితం కాలేదు. అది పసిపిల్లలపై కూడా ప్రభావం చూపుతోంది. ఆరు నెలలలోపు శిశువులలో కనిపించే ‘నియోనాటల్ డయాబెటిస్’ (Neonatal Diabetes) అనేది సాధారణ టైప్-1 డయాబెటిస్కు భిన్నమైనది. ఇది ఆటో ఇమ్యూన్ సమస్య వల్ల కాకుండా, ఇన్సులిన్ ఉత్పత్తిని ప్రభావితం చేసే జన్యువులోని మార్పుల వల్ల వస్తున్నదని ‘డయాబెటిస్ యూకే’ తన తాజా అధ్యయనంలో పేర్కొంది. శిశువుల్లో మధుమేహంపై ఇటీవల ‘ది జర్నల్ ఆఫ్ క్లినికల్ ఇన్వెస్టిగేషన్’లో అధ్యయన ఫలితాలు ప్రచురితమయ్యాయి. యూనివర్సిటీ ఆఫ్ ఎక్సెటర్ మెడికల్ స్కూల్, బెల్జియంలోని యూనివర్సిటీ లిబ్రే డి బ్రెక్సెల్స్ (యూఎల్బీ) శాస్త్రవేత్తలు సంయుక్తంగా నవజాత శిశువులలో డయాబెటిస్కు కారణమయ్యే ఒక అరుదైన జన్యుపరమైన రుగ్మతను గుర్తించారు.ఆరుగురు చిన్నారులపై పరిశోధనఈ పరిశోధన కోసం శాస్త్రవేత్తలు అత్యాధునిక డీఎన్ఏ సీక్వెన్సింగ్, స్టెమ్ సెల్ రీసెర్చ్ మోడల్ను ఉపయోగించారు. పుట్టిన ఆరు నెలల లోపునే డయాబెటిస్ బారిన పడిన ఆరుగురు చిన్నారులను క్షుణ్ణంగా పరిశీలించగా, వారికి మధుమేహంతో పాటు మూర్ఛ, మైక్రోసెఫాలీ లాంటి నాడీ సంబంధిత సమస్యలు కూడా ఉన్నట్లు తేలింది. ఈ ఆరుగురు పిల్లలలోనూ ‘టీఎంఈఎం1ఏ’ అనే ఒకే రకమైన జన్యువులో మ్యుటేషన్లు (మార్పులు) ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. ఈ జన్యు లోపమే పిల్లల్లో ఒకేసారి మెటబాలిక్, న్యూరోలాజికల్ సమస్యలకు ప్రధాన కారణమని ఈ అధ్యయనం ద్వారా స్పష్టమైంది.కణాల పనితీరుపై ప్రభావం ఈ జన్యువు శరీరంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసుకునేందుకు ప్రొఫెసర్ మిరియం క్నోప్ బృందం స్టెమ్ సెల్స్ ద్వారా ఇన్సులిన్ ఉత్పత్తి చేసే ‘బీటా కణాలను’ సృష్టించింది. సీఆర్ఐఎస్పీఆర్ జీన్-ఎడిటింగ్ విధానం ద్వారా ‘టీఎంఈఎం1ఏ’ జన్యువును మార్పు చేసి పరీక్షించి చూశారు. ఈ జన్యువు దెబ్బతిన్నప్పుడు, ఇన్సులిన్ ఉత్పత్తి చేసే కణాలు తమ సామర్థ్యాన్ని కోల్పోతాయని, కణాలలో ఒత్తిడి పెరిగి అవి అంతరించిపోతాయని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ జన్యువు కేవలం ఇన్సులిన్ కణాలకే కాకుండా మెదడులోని న్యూరాన్ల పనితీరుకు కూడా అత్యంత కీలకమని వెల్లడైంది.వైద్య నిపుణుల విశ్లేషణ యూనివర్సిటీ ఆఫ్ ఎక్సెటర్కు చెందిన డాక్టర్ ఎలిసా డి ఫ్రాంకో ఈ విషయమై మాట్లాడుతూ శిశువులలో డయాబెటిస్కు కారణమయ్యే డీఎన్ఏ మార్పులను గుర్తించడం ద్వారా.. ఇన్సులిన్ స్రావంలో కీలక పాత్ర పోషించే జన్యువుల గురించి మరింతగా తెలుసుకోవచ్చని పేర్కొన్నారు. ‘టీఎంఈఎం1ఏ’ వంటి అంతగా తెలియని జన్యువు పనితీరును అర్థం చేసుకోవడం వైద్యశాస్త్రంలో ఒక ముందడుగు అని ఆమె పేర్కొన్నారు. ఈ ఆవిష్కరణ వ్యాధి లక్షణాలను అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుందన్నారు. అలాగే భవిష్యత్తులో అరుదైన డయాబెటిస్ రకాలకు కొత్త చికిత్సలను అభివృద్ధి చేయడానికి నమూనాగా ఉపకరిస్తుందని ప్రొఫెసర్ క్నోప్ ఆశాభావం వ్యక్తం చేశారు.ఇది కూడా చదవండి: ఆయుర్వేదానికి షాకిస్తున్న ‘వెండి బంగారాలు’ -
12 ఏళ్ల మూత్ర సమస్యకు శస్త్రచికిత్సతో శాశ్వత విముక్తి
హైదరాబాద్: 12 సంవత్సరాలుగా మూత్ర విసర్జనలో తీవ్ర ఇబ్బందులతో బాధపడుతున్న 45 ఏళ్ల మహిళకు ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ (AINU) వైద్యులు విజయవంతంగా శస్త్రచికిత్స నిర్వహించి సాధారణ మూత్ర విసర్జనను పునరుద్ధరించారు. అరుదైన బక్కల్ మ్యూకోసల్ గ్రాఫ్ట్ యూరేత్రోప్లాస్టీ శస్త్రచికిత్స ద్వారా ఆమెకు కొత్త జీవితం అందించారు.జార్ఖండ్కు చెందిన గృహిణి (పేరు మార్చారు – పల్లవి) గత దశాబ్దానికి పైగా మూత్ర విసర్జన సమయంలో నొప్పి, మూత్ర ప్రవాహం తక్కువగా ఉండటం, మధ్యలో ఆగిపోవడం, తరచూ మూత్రనాళ ఇన్ఫెక్షన్లు వంటి సమస్యలతో బాధపడుతున్నారు. బాత్రూమ్లో ఒక్కసారి మూత్ర విసర్జనకు 15–20 నిమిషాల వరకు సమయం పట్టేది. అనేక చోట్ల చికిత్సలు తీసుకున్నా, తాత్కాలిక ఉపశమనం తప్ప సమస్య పూర్తిగా తగ్గలేదు.ఈ పేషెంట్ కి ఏఐఎన్యూ బంజారాహిల్స్లోని కన్సల్టెంట్ ఫీమేల్ యూరాలజిస్ట్ డాక్టర్ సారికా పాండ్యా, రీకన్స్ట్రక్టివ్ యూరాలజీ విభాగాధిపతి డాక్టర్ భవతేజ్ ఎంగంటి కలిసి శస్త్రచికిత్స నిర్వహించారు. శస్త్రచికిత్స అనంతరం నాలుగు నెలల్లో ఆమె మూత్ర ప్రవాహం పూర్తిగా సాధారణ స్థాయికి చేరింది.డాక్టర్ సారికా పాండ్యా మాట్లాడుతూ, మహిళకు ఫీమేల్ యూరేత్రల్ స్ట్రిక్చర్ అనే మూత్ర సంబంధ సమస్య ఉందని తెలిపారు. మూత్రనాళం సన్నబడటం వల్ల ఈ సమస్య వస్తుందని, దీని లక్షణాలుగా మూత్రం చుక్కలుగా రావడం, మధ్యలో ఆగిపోవడం, మూత్రాశయం పూర్తిగా ఖాళీ కాలేదన్న భావన, తరచూ ఇన్ఫెక్షన్లు ఉంటాయని వివరించారు.తరచూ మూత్రనాళ ఇన్ఫెక్షన్లు, సిజేరియన్ లేదా గర్భాశయ తొలగింపు వంటి శస్త్రచికిత్సల సమయంలో క్యాథెటర్ వాడకం, సరైన నిర్ధారణ లేకుండా పదేపదే యూరేత్రల్ డైలటేషన్ చేయడం వల్ల ఈ సమస్య ఎక్కువయ్యే అవకాశముందని చెప్పారు.“యూరేత్రల్ డైలటేషన్ తాత్కాలిక ఉపశమనం మాత్రమే ఇస్తుంది. నెలకు ఒకసారి లేదా రెండు నెలలకు ఒకసారి ఈ ప్రక్రియ చేయించుకోవడం వల్ల మూత్రనాళం మరింత దెబ్బతిని సమస్య తీవ్రమవుతుంది,” అని డాక్టర్ సారిక తెలిపారు.పురుషుల్లో చాలాకాలంగా ఉపయోగిస్తున్న బకల్ మ్యూకోసల్ గ్రాఫ్ట్ యూరేత్రోప్లాస్టీని ఇప్పుడు మహిళల్లోనూ విజయవంతంగా చేస్తున్నారు. నోటిలోని లోపలి పొర నుంచి తీసుకున్న కణజాలంతో మూత్రనాళాన్ని పునర్నిర్మించడం ద్వారా దీర్ఘకాలిక పరిష్కారం లభిస్తుందని ఆమె వివరించారు. ఈ శస్త్రచికిత్స వల్ల మూత్ర అదుపు కోల్పోయే ప్రమాదం లేదని కూడా స్పష్టం చేశారు.గత ఐదేళ్లలో ఏఐఎన్యూలో ఈ విధమైన శస్త్రచికిత్సను 60 మంది మహిళలకు నిర్వహించగా, దాదాపు అందరిలోనూ మంచి ఫలితాలు వచ్చాయని తెలిపారు. మరో పేషెంట్ కి కూడా మూత్రాశయం పూర్తిగా ఖాళీ కాకపోవడం వల్ల తరచూ ఇన్ఫెక్షన్లు వస్తుండగా, శస్త్రచికిత్స తర్వాత స్పష్టమైన మెరుగుదల కనిపించిందని చెప్పారు.డాక్టర్ భవతేజ్ ఎంగంటి మాట్లాడుతూ, “మహిళల్లో యూరేత్రల్ స్ట్రిక్చర్ పెద్ద సమస్యగా గుర్తించరు. దీంతో వారు సంవత్సరాల తరబడి బాధపడుతుంటారు. సరైన సమయంలో నిర్ధారణ చేసి ఆధునిక శస్త్రచికిత్స చేయిస్తే, ఎంతకాలంగా ఉన్న సమస్యనైనా సమర్థంగా నయం చేయవచ్చు అన్నారు.మూత్ర విసర్జనకు ఎక్కువ సమయం పట్టడం, మూత్ర ప్రవాహం బలహీనంగా ఉండటం, మధ్యలో ఆగిపోవడం, తరచూ మూత్రనాళ ఇన్ఫెక్షన్లు రావడం వంటి లక్షణాలు ఉన్న మహిళలు తప్పనిసరిగా నిపుణ వైద్యులను సంప్రదించాలని డాక్టర్ సారిక సూచించారు. ఈ సమస్య ఎక్కువగా 40 ఏళ్లకు పైబడిన మహిళల్లో కనిపిస్తుందని, మూత్ర సంబంధిత సమస్యలతో వచ్చే మహిళల్లో 10–20 శాతం మందిలో ఇది ఉండొచ్చని తెలిపారు. మహిళల్లో మూత్ర సమస్యలు కేవలం వైద్య పరమైన సమస్యలే కాకుండా సామాజిక, భావోద్వేగ భారం కూడా అవుతాయని వైద్యులు పేర్కొన్నారు. మూత్ర విసర్జన ఇబ్బందులపై మాట్లాడటాన్ని చాలామంది మహిళలు ఇబ్బందిగా భావిస్తారని, ఇదే సమస్య తీవ్రత పెరగడానికి కారణమవుతోందని అన్నారు. అవగాహన, సమయానుకూల చికిత్స ద్వారా ఇలాంటి సమస్యలకు శాశ్వత పరిష్కారం సాధ్యమని వారు స్పష్టం చేశారు. -
స్కిన్ చికెన్ తింటున్నారా? ఇది మీ కోసమే..
ఆదివారం రాగానే.. నాన్ వెజ్ కోసం ఉరుకులు పెడుతుంటారు. రేటు బోర్డు వంక ఒక చూపు చూసి.. కావాల్సిన క్వాంటిటీని ఆర్డర్ చేస్తుంటారు. ఇందులో చికెన్లో స్కిన్ కోడికి ప్రయారిటీ ఇచ్చేవాళ్లు లేకపోలేదు. తోలుతో కూడిన కోడిని.. అందునా కరెంట్.. గ్యాస్ స్టౌలపై కాల్పించుకుని మరీ ముక్కలు కొట్టిస్తుంటారు. అయితే ఏరికోరి పట్టుకెళ్లే ఇలాంటి చికెన్ నిజంగానే ఒంటికి మంచిదేనా?..స్కిన్ చికెన్ తినడం మంచిదా? కాదా? అని చాలామందికి అనుమానాలు, అనేక అపోహలు ఉన్నాయి. రుచి కోసం తహతహలాడే వాళ్లు కొందరైతే.. తింటే ఏదైనా జరగొచ్చని ఒకటికి పదిసార్లు ఆలోచిస్తుంటారు మరికొందరు. అయితే కోడి చర్మం చెడ్డదేం కాదు. అలాగని పూర్తిగా మంచిది కూడా కాదు. ఈ విషయంలో నిపుణులు చెబుతోంది కూడా ఇదే..చికెన్ స్కిన్లో ఎక్కువగా (unsaturated fatty acids-UFAs) ఉంటాయి. ఇవి శరీరానికి ఎంతో ఉపయోగకరమైనవి. చెడు కొలెస్ట్రాల్ (LDL) తగ్గించడంలో సహాయపడతాయి. పైగా ఇవి ఆలివ్ ఆయిల్లో ఉండే ఏక అసంతృప్త కొవ్వులు(monounsaturated fats) లాంటివే. కాబట్టి గుండెకు చాలా మంచిది. అలాగే.. కోడి చర్మంలో కొంత ప్రోటీన్, కొంత కాలజెన్ కూడా ఉంటుంది. ఇవి చర్మం, కండరాలు, కీళ్లకు బలాన్ని ఇస్తాయి. ఈ ప్రయోజనాల గురించి తెలియకుండానే చాలామంది ఉత్త రుచి కోసమే స్కిన్ కోడి వైపు మొగ్గు చూపుతుంటారు.అదే సమయంలో కోడి చర్మం అధిక కేలరీలు, కొవ్వు కలిగిన భాగం కూడా. ఒక ఔన్స్ చికెన్ స్కిన్లో సుమారు 90–128 కేలరీలు ఉంటాయి. కాబట్టి ఎక్కువగా తిన్నా.. హృదయ సంబంధ సమస్యలు, బరువు పెరగడం లాంటి ప్రమాదాలు ఉన్నాయి. కాబట్టి స్కిన్ చికెన్ మితంగా.. వారానికి ఒకసారి లేదంటే నెలలో నాలుగైదుసార్లు మాత్రమే తీసుకోవడం ఉత్తమం అని అంటున్నారు. అప్పుడే గుండెకు..ఆరోగ్యానికి మంచిదని చెబుతున్నారు.కాల్చే పద్ధతులపైనా..కాల్చిన కోడికి ప్రాధాన్యత ఇస్తుంటారు చాలా మంది. అందునా కట్టెల పొయ్యి అయితే బాగుంటుందని ఫీలవుతుంటారు. కానీ.. టౌన్లు, సిటీల్లో గ్యాస్ పొయ్యిలు, ఎలక్ట్రిక్ స్టౌలే కనిపిస్తుంటాయి. అయితే..రుచి బాగుంటుందని కట్టెల పొయ్యి ప్రిపర్ చేసేవాళ్లకు అలర్ట్. అలాంటి పొగలో హానికారక రసాయనాలు ఉంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కట్టెల పొయ్యి నుంచి వెలువడే పాలీసైక్లిక్ ఆరోమెటిక్ హైడ్రోకార్బన్స్(PAHs), హెటిరోసైక్లిక్ అమెన్స్ (HCAs) వంటి రసాయనాలు క్యాన్సర్కు దారి తీయొచ్చని పరిశోధనలు చెబుతున్నాయి కూడా. కాబట్టి.. గాలి సరైన విధంగా బయటకు వెళ్లే రీతిలో ఉన్న గ్యాస్ స్టౌ, అసలు పొగ వెలువడని ఎలక్ట్రిక్ స్టౌలతోనే మంచిదని గుర్తించాలి.స్కిన్లెస్లో బ్రెస్టే బెస్ట్స్కిన్ లెస్ చికెన్లో బ్రెస్ట్ పీస్కు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం ఉత్తమమని నిపుణులు చెబుతున్నారు. లెగ్ పీస్లతో పోలిస్తే.. పై భాగంలో కొవ్వు చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి గుండెకు మంచిది. సంతృప్త కొవ్వు(Saturated fat) తక్కువగా ఉండటం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. కండరాల పెరుగుదల, శరీర కణాల మరమ్మతుకు సాయపడే అధిక ప్రొటీన్ లభిస్తుంది. అలాగే స్కిన్ లేకుండా వాడితే కేలరీలు తగ్గుతాయి. బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచి ఎంపిక. వీటికి తోడు.. బ్రెస్ట్ పీస్లోని లీన్ మీట్(తక్కువ కొవ్వు (fat) కలిగిన మాంసం).. సులభంగా జీర్ణం అవుతుంది.సరిగ్గా ఉడకకపోయినా..స్కిన్ లేదంటే స్కిన్లెస్..ఏదైనా సరే చికెన్ తినడం శరీరానికి లాభాలు ఉన్నాయి. చికెన్లో అదనంగా విటమిన్లు B6, B12, నియాసిన్, సెలనియం, పాస్పరస్.. పోషకాలు ఉంటాయి. ఇవి మెటబాలిజంతో పాటు రక్తకణాల ఉత్పత్తి, రోగనిరోధక శక్తి పెంపు కోసం అవసరంపడేవే. అయితే వండే విధానం, తీసుకునే పరిమాణం ఆధారంగానే ఫలితం డిసైడ్ అవుతుంది. తాజా చికెన్కే ఎప్పుడూ ప్రాధాన్యత ఇవ్వాలి. చికెన్ను ఉడికించడం, గ్రిల్, బేక్ చేయడం మంచిది. సరైన వేడిలో.. సరిగ్గా ఉడకకపోతే బాక్టీరియాల వల్ల ఫుడ్ పాయిజన్ అయ్యే ప్రమాదం లేకపోలేదు. అలాగే డీప్ఫ్రైలు, స్కిన్ చికెన్ అధికంగా తీసుకుంటే గుండె జబ్బులు తప్పవు. -
మర్చిపోతున్నారా? ఇవిగో ఈ టెక్నిక్స్ మీకోసమే!
నేటి రోజుల్లో చాలా మందికి ఏం చేయాలో సరిగా గుర్తుండడం లేదు. చేద్దాం చేద్దాం అని అనుకుంటూనే చేయాల్సిన పనులు మర్చిపోతుంటారు. ఇది చాలా మామూలు విషయమే అయినా.. అలాగే ఉంటే కొద్దికాలానికి అంటే వృద్ధాప్యం రాకమునుపే మెదడు మొద్దుబారిపోతుంది. అలా కాకుండా మెదడును చురుగ్గా ఉంచాలంటే కొన్ని ప్రత్యేక పద్ధతులు పాటించాలి. ముఖ్యంగా జపాన్ నుంచే కొన్ని విశేషమైన జ్ఞాపకశక్తిని పెంచే పద్ధతులు వచ్చాయి. ఈ జపనీస్ చిట్కాల వల్ల మెదడు చురుకుగా మారి, విషయాలు మర్చిపోకుండా గుర్తుంచుకునే శక్తిని పొందుతుంది. ఆ చిట్కాల గురించి తెలుసుకుందాం.శిసా కాన్కోశిసా కాన్కో అంటే ఒక విషయాన్ని చూపిస్తూ బిగ్గరగా మాట్లాడటం. అంటే శరీరానికి, మెదడుకి ఏకకాలంలో పని చెప్పడం లేదా మాటలు చెప్పడం. దీనివల్ల మన దృష్టి పూర్తి స్థాయిలో ఆ విషయంపైనే ఉంటుంది. జపాన్లో రైలు నడిపే ఆపరేటర్లు (మనదేశంలో అయితే ఇంజిన్ డ్రైవర్లు) ఈ విధానాన్ని ఎక్కువగా అనుసరిస్తుంటారు.కొటోడమాజపనీయులు విశ్వసించే మరో శక్తిమంతమైన టెక్నిక్ కొటోడమా. ఇది ఒక పదం లేదా వాక్యాన్ని పదే పదే పునరావృతం చేయడం. దీనివల్ల ఆ పదం మన మెదడులో నిలిచిపోతుంది. విద్యార్థులు లేదా ప్రసంగం ఇచ్చే వ్యక్తులు ఈ పద్ధతిని వాడితే వారి జ్ఞాపకశక్తి బలపడుతుంది.ఇదీ చదవండి: స్వీపర్గా నెలకు రూ.లక్ష : ఇండియన్ టెకీ ఇంట్రస్టింగ్ స్టోరీఉకెటమోఉకెటమో అనే ఈ భావన టొహౌకు అనే జపనీస్ మతపరమైన వర్గం నుండి వచ్చింది. దీని అర్థం నిజాయితీగా అంగీకరిస్తాను. మనం ఏ అంశాన్నైనా హృదయపూర్వకంగా అంగీకరిస్తే మానసికంగా స్థిరంగా ఉండగలమని అప్పుడు మన భావోద్వేగాలు నియంత్రణలో ఉంటాయని ఇది చెబుతోంది.మన జ్ఞాపకశక్తి బలపడాలని, వృద్ధాప్యం మీద పడినా, మతిమరుపు లేకుండా ఉండాలంటే అనుకుంటే జపనీయులు శతాబ్దాలుగా పాటిస్తున్న ఈ చిట్కాలను అనుసరించ వచ్చు. ఇవి ఖచ్చితంగా మీ మెదడును చురుగ్గా ఉంచి మీరు మరిచి పోతున్న విషయాలను గుర్తుపెట్టుకునేలా చేస్తాయి. ప్రయత్నిస్తే మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. (టీనేజ్ లవర్స్ : 40 ఏళ్లకు 60లలో మళ్లీ పెళ్లి)కన్ సాట్సూఈ పద్ధతిని జపాన్లో సన్యాసులు, కళాకారులు ఎక్కువగా పాటిస్తారు. కన్ సాట్సూ అంటే చుట్టూ ఉన్న విషయాలను నిశ్శబ్దంగా గమనించడం. మనం ఏమీ మాట్లాడకుండా చుట్టుపక్కల ఉన్న ప్రతి చిన్న విషయాన్ని గమనిస్తే మెదడు సానుకూలంగా స్పందిస్తుంది. అన్ని విషయాలను శ్రద్ధగా గుర్తుంచుకుంటుంది. కళలతో సంబంధం ఉన్న వ్యక్తులలో ఎక్కువగా కనిపించే ఇది ఒక రకమైన మైండ్ ఫుల్ నెస్ టెక్నిక్.నైకాన్కాలం గడిచే కొద్దీ మన జ్ఞాపకశక్తి తగ్గిపోతుందని అనుకుంటాం. అయితే జపనీయులు నైకాన్ అనే విధానాన్ని పాటిస్తూ.. మౌనంగా ఉండటం ద్వారా పాత జ్ఞాపకాలను తిరిగి గుర్తుకు తెచ్చుకునే ప్రయత్నం చేస్తారు. ప్రశాంత వాతావరణంలో కూర్చొని నేను ఎవరికి ఏం ఇచ్చాను..? ఎవరి నుంచి ఏం తీసుకున్నాను..? ఎవరి వల్ల నాకు ఇబ్బంది కలిగింది..? వంటి ప్రశ్నలను మనలో మనం వేసుకుంటే పాత జ్ఞాపకాలు తిరిగి గుర్తొస్తాయని వారు చెబుతున్నారు.మన జ్ఞాపకశక్తి బలపడాలని, వృద్ధాప్యం మీద పడినా, మతిమరుపు లేకుండా ఉండాలంటే అనుకుంటే జపనీయులు శతాబ్దాలుగా పాటిస్తున్న ఈ చిట్కాలను అనుసరించవచ్చు. ఇవి ఖచ్చితంగా మీ మెదడును చురుగ్గా ఉంచి మీరు మరిచిపోతున్న విషయాలను గుర్తుపెట్టుకునేలా చేస్తాయి. ప్రయత్నిస్తే మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. -
ఐవీఎఫ్ రాజధాని.. తమిళనాడు!
దేశంలో 2026 జనవరి 6 నాటికి మొత్తం 2,650 ఐవీఎఫ్ క్లినిక్స్ ఉన్నాయి. ఇందులో 25 శాతానికిపైగా క్లినిక్స్తో.. భారతదేశపు ఐవీఎఫ్ క్లినిక్ల రాజధానిగా తమిళనాడు అవతరించిందని ‘నేషనల్ ఎ.ఆర్.టి. (అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీ), సరోగసీ రిజిస్ట్రీ; ఎస్.ఆర్.ఎస్. (శాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్) రిపోర్ట్ – 2023 గణాంకాలు చెబుతున్నాయి. కృత్రిమ విధానంలో సంతాన భాగ్యం ప్రసాదించే చికిత్సా విధానమే ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్. దీనికి గతంలో ఎన్నడూ లేనంతగా దేశంలో ఇప్పుడు క్రేజ్ పెరిగింది. ఫలితంగా క్లినిక్కులూ పెరుగుతున్నాయి. నేషనల్ ఎ.ఆర్.టి. (అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీ), సరోగసీ రిజిస్ట్రీ గణాంకాల ప్రకారం దేశంలో అత్యధిక ఐవీఎఫ్ క్లినిక్లు తమిళనాడులో ఉన్నాయి. ఎంత ఎక్కువగా అంటే రెండో స్థానంలో ఉన్న గుజరాత్లో 361 ఉంటే.. దాదాపు వాటికి రెట్టింపుగా 669 క్లినిక్లు ఉండటంతో సంతాన సాఫల్య చికిత్సలకు తమిళనాడు ప్రధాన కేంద్రంగా మారింది.సామాజిక కారణాలుతమిళనాడులో ఐవీఎఫ్ క్లినిక్లు అత్యధిక స్థాయిలో ఉండటానికి సామాజిక, ఆరోగ్య అంశాలను రిజిస్ట్రీ ప్రధాన కారణాలుగా చూపింది. తగ్గుతున్న జననాల రేటు, ఆలస్యంగా పెళ్లిళ్లు చేసుకోవటం, కెరీర్పై దృష్టి పెట్టటం వంటి వాటి వల్ల ఆ రాష్ట్రంలో సంతానోత్పత్తి రేటు జాతీయ సగటు (2.0) కంటే కూడా బాగా తగ్గిపోయి ఐవీఎఫ్ చికిత్సలకు డిమాండ్ పెరిగిందని విశ్లేషించింది. అంతేకాదు, తమిళనాడులో ప్రైవేట్ వైద్య రంగం అధునాతన సదుపాయాలతో ఉంది. కొత్త సాంకేతికతను వెంటవెంటనే అందిపుచ్చుకుంటోంది. అందువల్ల సంతాన సాఫల్య చికిత్సలు ఆ రాష్ట్రంలో సులువుగా అందుబాటులోకి వస్తున్నాయని తెలిపింది.చట్టబద్ధమైన నమోదుప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎ.ఆర్.టి. నియంత్రణ చట్టం, తమిళనాడులోని క్లినిక్లు తమ పేర్లను నమోదు చేసుకోవటంలో పారదర్శకంగా ఉండేందుకు దోహదపడుతోందని రిజిస్ట్రీ తెలిపింది. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఇక్కడ నిబంధనల అమలు మెరుగ్గా ఉండటం వల్ల కూడా అధికారిక లెక్కల్లో క్లినిక్ల సంఖ్య ఎక్కువగా కనిపిస్తోంది. చెన్నై వంటి నగరాలు ఇప్పుడు కేవలం తమిళనాడుకే కాకుండా, దేశవ్యాప్తంగా, ఇతర దేశాల నుంచి వచ్చే వారికి కూడా ‘ఫెర్టిలిటీ హబ్’గా మారాయి. నిపుణులైన డాక్టర్లు, అత్యాధునిక వైద్య పరికరాలు అందుబాటులో ఉండటం కూడా తమిళనాడుకు ఈ గుర్తింపును తెచ్చిపెట్టిందని పేర్కొంది.ఆ రాష్ట్రాల్లో ఎక్కువగా..గణాంకాల ప్రకారం చూస్తే.. దేశంలో సంతానోత్పత్తి రేటు తక్కువగా ఉన్న తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక వంటి కొన్ని రాష్ట్రాల్లో ఈ ఐవీఎఫ్ క్లినిక్కులు ఎక్కువగా ఉన్నాయి. మహారాష్ట్ర, కేరళలలో సంతానోత్పత్తి రేటు తక్కువగా ఉన్నప్పటికీ క్లినిక్లు ఎక్కువగా లేవు. -
ఇదేం విడ్డూరం..! డైరీ రాస్తూ..86 కిలోలు బరువు తగ్గిందా!?
బరువు తగ్గించే చిట్కాలు..సింపుల్ రెమిడీస్ వంటివి ఎన్నో చూశాం. పలానా వ్యాయామం, డైట్ అంటూ ఏవేవో కొంగొత్త విధానాలతో బరువు తగ్గిన ఉదంతాలు చూశాం. కొందరు ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా తీసుకుంటూ..కార్డియాక్ వర్కౌట్లు, వాకింగ్లు, స్కిప్పింగ్లు అంటూ ఎంతో శ్రమ పడి తగ్గగా.. మరికొందరు సైక్లింగ్తో కుస్తీలు పడ్డారు. ఒక్కోక్కరూ ఒక్కోదారిలో వెళ్లి బరువు తగ్గి స్ఫూర్తిగా నిలిచారు. కానీ ఈ మహిళ ఇంతలా కష్టపడకుండా అందరు సులభంగా చేసే, చాలా తేలికైన అలవాటుతో ఇట్టే బరువు తగ్గింది. అది కూడా ఏకంగా 86 కిలోలు బరువు తగ్గడం అంటే మాటలు కాదు కదా..!. అలా అని షార్ట్కట్లు, ఏవేవో మందులు, ఇంజెక్షన్లు తీసుకోలేదు సుమీ..!. మరి ఆమె ఎలా అంతలా బరువు తగ్గింది..?, ఏంటా హాబీ..? అంటే..బరువు తగ్గించే జర్నీలో అందరికీ అతిపెద్ద టాస్క్ వ్యాయామం, వర్కౌట్లు. కానీ ఈ అమెరికా మహిళ కామ్ ఆ పాట్లు ఏం పడకుండా చాలా స్మార్ట్గా చిన్న చిన్న అలవాట్లతో మైండ్ని సెట్ చేసుకుంటూ సులభంగా బరువు తగ్గి అద్భుతం చేసింది. తాను ఎలాంటి ఫిట్నెస్ ట్రైనర్, స్నేహితులు, బంధువుల సహాయం తీసుకోకుండా కేవలం ఆ చిన్న అలవాటుతో బరువు తగ్గించుకున్నానంటోంది. తాను చెప్పబోయే అలవాటు వినడానికి హాస్యస్పదంగా, నమ్మశక్యంగా అనిపించకపోయినా..అద్భుతం చేసిందనేది నమ్మక తప్పని వాస్తవం అని అంటోందామె. కామ్ తనకు ఉన్న డైరీ రాసే అలవాటే అద్భుతంగా బరువు తగ్గేందుకు హెల్ప్ అయ్యిందట. అలా ఏకంగా 86 కిలోలు పైనే బరువు తగ్గానని చెబుతోంది. ఆ డైరీలో తన వెయిట్లాస్ జర్నీని ఎందుకు ప్రారంభించింది.. ఆ టైంలో తాను ఎలా ఉండేది వంటి పోటోలతో సహా పొందుపరిచింది. వాటిని చూసుకుంటూ..తన శరీర పరివర్తనలో మార్పులకు శ్రీకారం చుట్టిందట. ఎందుకంటే ఆ డైరీ ఓపెన్ చేయగానే తన దినచర్య సరిగా ఉందా, ఆహారం మితంగా తిన్నానా లేదా అని తరచి.. తరచి.. చూసుకోవడమే కాకుండా జవాబుదారీగా ఉండాలే చేస్తుందట. ఆ క్రమంలో తనకు స్ఫూర్తిని కలిగించే సూక్తులు, మార్గదర్శకులు తదితరాలన్నింటి గురించి రాసేదట. అంతేగాదు ఒకరకంగా ఏం తిన్నాను, ఏం వ్యాయామాలు చేశాను అన్నది రాస్తున్నప్పుడూ..అబ్బా ఇది చేయలేకపోయాను..ఇంకా బాగా చేయాలి అనే ఫీడ్ బ్యాక్ ఇస్తుంటుందట ఆ అలవాటు. దాంతో బరువు తగ్గాలనే ఆలోచన బలంగా మదిలో నాటుకుని..అన్నింటిపై సరైన ఫోకస్ పెడతామట. ఫలితంగా బరువు తగ్గడం సులభం అవుతుందని అంటోందామె. నిజంగా హెల్ప్ అవుతుందా అంటే..?బరువు తగ్గించే జర్నీలో డైరీ రాసే అలవాటు పెద్ద పాత్ర పోషిస్తుందని పరిశోధనలు సైతం చెబుతుండటం విశేషం. హార్వర్డ్ నివేదిక ప్రకారం, దాదాపు 1,700 మంది రోజువారి ఆహార రికార్డులను తమ డైరీలో ట్రాక్ చేయగా..వారంతా రెండు రెట్లు బరువు తగ్గారట. అలాగే మిచిగాన్ స్టేట్ యూనివర్శిటీ ప్రచురించిన 2012 జర్నల్ సైతం ఇలా డైరీ రాసే వ్యక్తులు అధిక మొత్తంలో బరువు తగ్గినట్లు అధ్యయనం పేర్కొంది. ఇలా మనం తినేవాటిని వ్రాయడం, ప్రాముఖ్యతను హైలెట్ చేయడం వల్ల తమ ఆహారపు అలవాట్లు ఎలా ఉన్నాయనేది తరచి చూసుకునే అవకాశం వస్తుందట..దాంతో బరువు తగ్గుతారట. ఇలా ఎంత ఎక్కువగా తాము తినే ప్రతి ఆహారం గురించి నమోదు చేసే అలవాటు ఉంటే అంత అధిక మొత్తం లో బరువు తగ్గుతారని పలువురు నిపుణులు చెబుతున్నారు. మరి వెయిట్లాస్ జర్నీలో మంచి ఫలితాలు అందుకునేందుకు డైరీ రాసే అలవాటుని సత్వరమే ప్రారంభిద్దామా మరి..(చదవండి: Beauty Tips: శీతాకాలంలో ఆరోగ్యకరమైన మెరిసే చర్మం కోసం.. ఈ ఆరు సూప్లు..!) -
జొమాటో సీఈవో ధరించిన ‘టెంపుల్’ గురించి తెలుసా?
జొమాటో వ్యవస్థాపకుడు దీపేందర్ గోయెల్ ముఖం మీద ఉన్న రహస్య పరికరంపై సోషల్మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇటీవల ఓ కార్యక్రమంలో అతను మాట్లాడుతున్న సమయంలో అతని ముఖంపై అతికించి ఉన్న ఆ చిన్న వస్తువే హాట్టాపిక్గా మారింది. కొందరు ఫోన్ చార్జర్ అని, మరి కొందరు బబుల్గమ్ అతికించుకుని ఉంటాడని కూడా వ్యంగోక్తులు విసిరారు. ఇంతకీ అందేంటో తెలుసా?దీపిందర్ అందించిన వివరాల ప్రకారం ఆ పరికరం పేరు టెంపుల్. ఇది మానవ శరీరంలోని రక్త ప్రవాహాన్ని పర్యవేక్షిస్తూ.మెదడు కార్యకలాపాలను నియంత్రిస్తూ, ఓవరాల్గా మన శరీరానికి ఆరోగ్యాన్ని అందించే పరికరం. ప్రస్తుతం ప్రయోగ దశలో ఉన్న టెంపుల్ ఇంకా మార్కెట్లోకి రాలేదు. కానీ ఏడాది కాలం నుంచి దీన్ని వినియోగిస్తున్నానని దీపీందర్ చెప్పారు.ఇది ఎలా పని చేస్తుందంటే..టెంపుల్ ధరించిన వ్య క్తి తన మెదడులో రక్త ప్రవాహం... వేగం వివరాలు గుర్తించడంతో పాటు... రక్త ప్రసరణ గురించి, మనపై ఏదైనా ఒత్తిడి వచ్చినప్పడు.. శరీరంలో కలిగే మార్పులను ఇది గుర్తించి మనకు తెలియజేస్తుంది. రియల్ టైమ్ లో మన బాడీ పరిస్థితి... అది మెదడును ఎలా ప్రభావితం చేస్తోందనే అంశాలను పసిగడుతుంది. ఇదీ చదవండి: బిచ్చగాడిలా బతికాడు, చనిపోయాక డబ్బు కట్టలు చూసి అందరూ షాక్!అలసట, మనస్సు కేంద్రీకరించకపోవడం, జ్ఞాపకశక్తి సమస్యలు, వృద్ధాప్య ప్రక్రియలో సమస్యలను గుర్తించి... వాటి నివారణకు కూడా ఈ యంత్రం సహకరిస్తుంది. అయితే ఈ పరికరం మార్కెట్లోకి అందుబాటులోకి రాలేదు. ఈ పరికరం పరిశీలన దశలో ఉన్నందున, దీపేందర్ గోయెల్ వ్యక్తిగత పరిశోధన చేస్తున్నట్లు సమాచారం. ప్రయోగ దశలో ఉన్న ఈ పరికరం మార్కెట్లోకి రావాలంటే చాలా విషయాల్లో క్లీన్చిట్ లభించాల్సి ఉంటుంది. దీన్ని వినియోగిస్తే ఇతర సమస్యలు వచ్చే ప్రమాదముందనే వాదన కూడా ఉంది. ధర విషయంలోనూ ఇంకా స్పష్టత లేదు. ప్రస్తుతానికి ఈ పరికరం విలువ 25 మిలియన్ డాలర్లు అని నిర్ణయించారు... అంటే మన దేశ కరెన్సీలో సుమారు 200 కోట్ల రూపాయలు. ఇదీ చదవండి: పెళ్లికి పిలిస్తే రాలేదు.. కట్ చేస్తే అస్థిపంజరం దొరికింది -
దేవుడంటే భక్తి.. అయినా ఎందుకిలా..?
నాకు మొదటినుంచి దేవుడంటే విపరీతమైన భయభక్తులు. తరచు గుళ్లకు వెళుతుంటాను. రోజూ పూజ చేస్తుంటాను. అయితే గత రెండేళ్లుగా దేవుళ్లపైన విపరీతమైన చెడు ఆలోచనలు వస్తున్నాయి. దేవుడిని బూతుమాటలు తిట్టినట్లు, దేవుడి పటాలను అగౌరవపరచినట్టు... ఇలా రాయడానికి వీలులేని చెడ్డ తలంపులు వస్తున్నాయి. దాంతోటే ‘ఇది చాలా తప్పు, నాలాంటి భక్తుడికి ఇలాంటి చెడు ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి...’ అని మాన సికంగా చాలా మధన పడుతున్నాను. ఈ ఆలోచనల మూలాన దేవుడు నన్ను శపిస్తాడేమోననే భయంతో సరైన తిండి, నిద్రలతోపాటు మనశ్శాంతికి కూడా దూరం అయియాను. ఏ పనిమీదా ధ్యాస పెట్టలేకపోతున్నాను. నాకీ బాధనుంచి విముక్తి కలిగే మార్గం చెప్పగలరు. – రఘురామ్, నల్గొండఎంత వద్దనుకున్నా మనసులో ఇలా మాటిమాటికీ చెడు తలంపులు వచ్చి, మనసును బాధించే ఇలాంటి ఆలోచనలను అబ్సెషన్స్ అంటారు. ఆ చెడు తలంపులనుంచి బయటపడేందుకు మాటిమాటికీ లెంపలేసుకోవడం, దండాలు పెడుతూ ఉండటాన్ని కంపల్షన్స్ అంటారు. ఇది ఒక ప్రత్యేకమైన మానసిక రుగ్మత. దీనిని ఓసీడీ అంటారు. మన మెదడులోని సెరటోనిన్ అనే ఒక ప్రత్యేకమైన రసాయన పదార్థం సమతుల్యతలో తేడాలొచ్చినప్పుడు కొందరిలో ఇలాంటి విపరీతమైన ఆలోచనలు, ధోరణులు కలుగుతాయి. ఇవి రాకూడదని ప్రయత్నించినకొద్దీ మరింత ఎక్కువగా మనసులోకి చొచ్చుకొచ్చి విపరీతమైన మానసిక సంఘర్షణకు గురిచేస్తాయి. ఈ ఆలోచనలకు మూలకారణమైన మీ మెదడులోని రసాయన చర్యను సరిచేయడం ద్వారా ఈ అబ్సెషన్స్ను పూర్తిగా అదుపు చేయవచ్చు. ఆధునిక మానసిక వైద్యశాస్త్రంలో ఈ ఓసీడీ జబ్బును పూర్తిగా తగ్గించేందుకు మంచి మందులు, కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ అనే మానసిక చికిత్స అద్భుతంగా పని చేస్తాయి. మందులతోపాటు థాట్ స్టాపింగ్, ఎక్స్పోజర్ రెస్పాన్స్ అండ్ ప్రివెన్షన్ అనే మానసిక చికిత్స ద్వారా దేవుడిపైన మీకు కలిగే చెడు ఆలోచనలనుంచి విముక్తి కలిగించవచ్చు. ఓసీడీ జబ్బును తగ్గించేందుకు వీటికితోడు ఇటీవలే వచ్చిన ఆర్.టి.ఎం.ఎస్. అనే అత్యాధునిక పరికరాన్ని వాడుతున్నాము. మీరు వెంటనే మీకు అందుబాటులో ఉన్న సైకియాట్రిస్టును కలిసి చికిత్స తీసుకోండి. ఆల్ ది బెస్ట్!డా. ఇండ్ల విశాల్ రెడ్డి, సీనియర్ సైకియాట్రిస్ట్, విజయవాడ. (మీ సమస్యలు, సందేహాలు పంపవలసిన మెయిల్ ఐడీ: sakshifamily3@gmail.co) -
చికిత్సలోనూ వివక్ష!
‘‘భారతీయ మహిళకు మానసిక చికిత్స అవసరమైన సందర్భాల్లో ఇటు కుటుంబంగానీ అటు సమాజం కానీ మహిళ పట్ల సానుభూతితో సహానుభూతితో వ్యవహరించడం లేదు. ఇంకా చెప్పాలంటే కాస్త కఠినంగానే వ్యవహరిస్తూనే వచ్చాయి. మనది సహజంగా పితృస్వామ్య వ్యవస్థ కావడంతో అనాదిగా మహిళల పట్ల చిన్నచూపు అలా కొనసాగుతూ పోయిందం’’టూ ఆవేదన వ్యక్తం చేశారు ‘ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ’ ప్రెసిడెంట్ డాక్టర్ సవిత మల్హోత్ర.‘ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ ఫౌండేషన్ డే’ సందర్భంగా హైదరాబాద్లో బుధవారం నిర్వహించిన కార్యక్రమానికి హాజరైన డాక్టర్ సవిత మల్హోత్ర ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మానసిక చికిత్సల విషయంలో భారతీయ మహిళలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై మాట్లాడారు. మహిళలకు మానసిక వైద్యం అవసరమైనప్పుడు... చికిత్స అందాల్సిన వివిధ సందర్భాల్లో ఇప్పటికీ ఆమె ఎదుర్కొంటున్న వివక్ష గురించి వివరించారు. ఈ సందర్భంగా డాక్టర్ సవిత మల్హోత్ర వెలిబుచ్చిన ఆవేదన ఆమె మాటల్లోనే...చికిత్సలో మహిళలు ఎదుర్కొంటున్న సవాళ్ళుమహిళలకు మానసికమైన సమస్యలున్నప్పుడు మన సమాజం వారి పట్ల వివక్షతోనే వ్యవహరిస్తూ వచ్చింది. ఇప్పటికీ పల్లెల్లో మహిళలకు మానసిక చికిత్స సక్రమంగా అందడం లేదన్నది నిర్వివాదాంశం. కాకపోతే పాశ్చాత్య సంస్కృతి, అక్కడి స్వేచ్ఛావాతావరణం తాలూకు ప్రభావాలూ మెట్రోపాలిటన్ నగరాలూ, పెద్ద పెద్ద పట్టణాల్లో వారిని స్వేచ్ఛగా వ్యవహరించేలా చేసినప్పటికీ చిన్న చిన్న పల్లెటూళ్లలో మాత్రం వివక్ష అలాగే ఉంది. అయితే ఇక్కడ మరో ప్రమాదం పొంచి ఉంది. పాశ్చాత్య దేశాల విపరీతమైన, మితిమీరిన స్వేచ్ఛాభావన ల్లాంటి పెడ ధోరణులతో ఆమె విశృంఖలంగా ప్రవర్తిస్తున్న సందర్భాల్లో పురుషుడే కాస్తంత బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సి వస్తోంది. అయితే మహిళలు ఈ రెండు ఎక్స్ట్రీమ్స్లో కాకుండా బ్యాలెన్స్డ్గా ఉండాలి. మెట్రోపాలిటన్ నగరాలూ, చాలా పెద్ద పెద్ద నగరాల్లో మితిమీరిన నాగరికతా ధోరణులున్న కొన్ని పరిమితప్రాంతాల్లో తప్ప మిగిలిన చోట్లంతా మహిళ తీవ్రమైన వివక్షకు గురవుతూనే ఉంది.మహిళలు వివక్షకు లోనయ్యే తీరుతెన్నులునిజం చెప్పాలంటే ఆ వివక్ష చెప్పనలవి కాదు. ఉదాహరణకు ఓ మహిళకు పెళ్లి తర్వాత తనకేదైనా మానసిక చికిత్స అవసరమైందనుకోండి. వెంటనే అత్తింటివాళ్లు ఆమెను నిర్దాక్షిణ్యంగా పుట్టింటికి పంపేస్తారు. ఆ మానసిక సమస్య నుంచి విముక్తి కలిగితే తప్ప అత్తింటికి రావద్దంటూ ఆంక్షలు పెడతారు. ఒకవేళ మహిళలు వైద్యం తీసుకునే పరిస్థితి లేకపోతే వాళ్లు అత్తింటి నుంచి శాశ్వతంగా దూరమయ్యే దయనీయమైన పరిస్థితి ఉంటుంది. అదే పురుషుడికి ఏదైనా మానసిక సమస్య వచ్చిందనుకుందాం. అప్పుడు అతడి చికిత్స విషయంలో ఆమె అతడికి చేయూతనందిస్తూ అతడినే అంటిపెట్టుకుని ఉంటుంది. అతడు బాగుపడేందుకు అండదండలందిస్తూనే ఉంటుంది. ఇక పెళ్లికాని అమ్మాయిల పరిస్థితి ఇంకా దారుణం. మానసిక చికిత్స అవసరమైన మహిళకు అసలు పెళ్లికావడమే పెద్ద సమస్యగా మారుతుంది. ఇక్కడ కూడా పురుషుడికి ఉండే అనుకూతలు వేరు. మగవాడికి ఏదైనా మానసిక సమస్య వస్తే... ‘‘పెళ్లయితే అంతా సర్దుకుంటుంది’’ అంటూ అతడి సమస్య బాధ్యత నుంచి తల్లిదండ్రులు తప్పించుకుని ఓ మహిళ నెత్తిమీదికి నెట్టేస్తారు. ఒక్కమాటలో చెప్పాలంటే పురుషుడికి మానసిక సమస్య వస్తే మహిళ ఓ సపోర్ట్ సిస్టమ్గా అతడికి అండగా ఉంటుంది. కానీ మహిళకే ఆ సమస్య వస్తే అది ఆమెలో ఎమోషనల్ స్ట్రెస్ను మరింత పెంచుతుంది.గతంతో పోలిస్తే కొంత పురోగతి!నగరాలూ పట్టణప్రాంతాల్లో కొంతమేరకు నయమేగానీ చిన్నచిన్న ఊళ్లల్లోనూ, పల్లెల్లో ఇంకా మూఢనమ్మకాలు రాజ్యమేలుతూనే ఉన్నాయి. ఉదాహరణకు పల్లెప్రాంతాల్లో అమ్మవారు పూనడం, దెయ్యం పట్టడం లాంటి ‘΄÷సెషన్ స్టేట్’ మానసిక సమస్యలు మహిళల్లోనే కనిపిస్తుండటం గమనించవచ్చు. దెయ్యాన్ని వదిలించడంలో భాగంగా... చికిత్స పేరిట వాళ్లను బెత్తంతో కొట్టడం, దారుణంగా బాధించడం చేస్తుంటారు. గతంతో పోలిస్తే కాస్త నయమే అయినప్పటికీ పల్లెల్లో ఇంకా ఈ ధోరణులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పుడొచ్చిన మార్పు సరిపోదు. ఇలాంటి మానసికమైన సమస్యలు ఎవరిలో వచ్చినా... ఇంకా ప్రధానంగా మహిళల్లో కనిపించినప్పుడు ఆధునిక వైద్యచికిత్స అందించడం అన్నది ఇప్పుడు చాలా ముఖ్యం. మానసికమైన అంశాల మీద ఆహారం ప్రభావంగతంలో మానసిక సమస్యలతో బాధపడే బాధితుల ఆహారం గురించి పెద్ద పట్టింపు ఉండేది కాదు. కానీ అనేక ఆధునిక పరిశోధనల తర్వాత ‘న్యూట్రిషనల్ సైకియాట్రీ’ విభాగం కూడా ఇప్పుడు చాలా కీలకంగా మారుతోంది.మహిళలకుమరింత మెరుగైనచికిత్స అందడానికి కుటుంబం, సమాజం అందించాల్సిన సపోర్ట్కెరియర్ విషయంలోగానీ, మేధస్సుపరంగాగానీ మహిళా, పురుషుడూ సమానం. కానీ బయాలజీ, ఫిజియాలజీ పరంగా మహిళ మానసిక స్థితిగతులూ, పురుషుడి మానసిక పరిస్థితులూ వేర్వేరుగా ఉంటాయి. దీన్ని అంగీకరించి తీరాలి. మానసిక ప్రవర్తనల ధోరణుల విషయంలోనూ పురుషుడూ, మహిళలూ భిన్నంగా వ్యవహరిస్తుంటారు. ఉదాహరణకు సాధారణంగా ఒక పురుషుడు ఒక అంశంపై ఫోకస్గా వ్యవహరిస్తూ ఉంటే మహిళ మాత్రం తన మల్టీటాస్కింగ్ నైపుణ్యాలతో ఏకకాలంలో అనేక కార్యకలాపాలు నిర్వహిస్తూ ఉంటుంది. ఒక విషయాన్ని పురుషుడు తన మెదడు పరిష్కార ధోరణితో ఆలోచిస్తున్న తరుణంలో... అదే సమస్య విషయంలో మహిళ తన మనసుతో ఆలోచిస్తుంది. తన పార్ట్నర్ తాలూకు ఎమోషనల్ సపోర్ట్తో ఉద్వేగభరితమైన చేయూతతో దాన్ని పరిష్కరించాలనే ధోరణిని పురుషుడి నుంచి ఆశిస్తుంటుంది. ఆ భావోద్వేగాల సపోర్ట్ పురుషుడి నుంచి రావాలని ఎదురుచూస్తుంటుంది. కెరియర్కు సంబంధించిన రంగంలో లేదా ప్రొఫెషనల్ స్కిల్స్ ప్రదర్శించాల్సిన చోట మహిళకు తన తోటి ప్రొఫెషనల్స్ నుంచే తాను కోరుకునే సమాన భావన అందదు. మరో మూడువారాల్లో దేశరాజధానిలో సైకియాట్రిస్టుల సదస్సు జరగనుంది. ఈ విషయమే అక్కడ ప్రస్తావనకు తేవాలనుకుంటున్నాను. ఒక తల్లికి నలుగురు బిడ్డలుంటే... తాను పెద్దగా చదువుకోకపోయినా... ఆ నలుగురు చిన్నారుల స్వభావాలూ, మనస్తత్వాలూ, ప్రవర్తనల తీరుతెన్నులు ఆమెకు స్పష్టంగా తెలుస్తాయి. అలా ఆమెలో అవ్యక్తంగానే లోపల ఓ మనస్తత్వవేత్త ఇన్బిల్ట్గా ఉంటారు. దాంతో మానసిక రంగాల విషయంలో రానున్న రోజుల్లో ఆమె మరింత క్రియాశీలంగా వ్యవహరిస్తుందని నా భావన. ఈలోపు వ్యక్తిగతంగా ఆమెకు ఇవ్వాల్సిన స్పేస్ను ఇస్తూ, ఆమెను ఓ మనిషిగా చూస్తూ, మహిళను తన తోటి వ్యక్తిగా గౌరవించాల్సిన బాధ్యత పురుషులపై ఉందనేది నా స్పష్టమైన అభిప్రాయం. కుటుంబ సభ్యులకే కాదు... ఆమెనో సాటిమనిషిగా చూడాల్సిన బాధ్యత ఈ సమాజానికీ ఉంది’’ అంటూ తన అభిప్రాయాలను వెలిబుచ్చారు డాక్టర్ సవిత మల్హోత్రా.పిండదశలో ఉన్నప్పట్నుంచే మానసిక సమస్యలు!ఓ చిన్నారి పిండదశలో ఉన్నప్పట్నుంచే మానసిక సమస్యలను ఎదుర్కొంటూ వస్తోంది. ఉదాహరణకు... ఓ మహిళ గర్భవతిగా ఉన్నప్పుడు ఒత్తిడి (స్ట్రెస్)గానీ, ఉద్విగ్న పరిస్థితుల్ని (యాంగై్జటీ)గానీ, ఆందోళన, వ్యాకులత, కుంగుబాటు (డిప్రెషన్) వంటివి చోటుచేసుకున్నప్పుడు ఆమె మెదడులోని జీవరసాయనాల్లో మార్పులు రావడం సహజం. ఆ జీవరసాయనాలూ, హార్మోన్ల వంటివే ఆమెలోని మూడ్స్ మార్పులకు కారణమవుతాయి. కాబోయే తల్లిలో... ఆ హార్మోన్లు, జీవరసాయనాల సమతుల్యతల్లో మార్పులు వచ్చాయంటే అవి కడుపులోని బిడ్డపైనా, తన మానసిక స్థితిపైనా ప్రభావాలు చూపే అవకాశముంది. అందుకే గతంలోని మామూలు చైల్డ్ సైకియాట్రీ కంటే ఇప్పుడు మరింత లోతుగా... సైన్స్ గణనీయంగా పురోగమించడంతో... కడుపులోని పిండానికి మానసికంగా కలిగే ప్రభావాలను అధ్యయనం చేసే ఫీటల్ సైకియాట్రీ, అప్పుడే పుట్టిన బిడ్డ విషయంలో ఇన్ఫ్యాంట్ సైకియాట్రీ, చైల్డ్ సైకియాట్రీ, అడాలసెంట్ సైకియాట్రీ, వృద్ధాప్యంలోని మానసిక సమస్యల గురించి తెలిసే జీరియాట్రిక్ సైకియాట్రీ అంటూ మానసిక శాస్త్రం ఇప్పుడు చాలా చాలా విస్తృతంగా, ఎంతో లోతుగా అధ్యయనం చేయాల్సిన సైన్స్గా పరిణమిస్తూ... విస్తరిస్తోంది. -
బ్రయాన్ జాన్సన్లా భారత్ యువకుడు..! ఏకంగా ఏడువేల..
వృద్ధాప్యఛాయలు కనిపించకుండా ఆరోగ్యంగా ఉండాలన్న ఉద్దేశంతో కాలిఫోర్నియాకు చెందిన బ్రియాన్ జాన్సన్ అనే వ్యాపారవేత్త ఎన్ని కోట్లు ఖర్చుచేస్తున్నాడో తెలిసిందే. ఇప్పటి వరకు ఎన్నో చికిత్సలు, అనుక్షణం హెల్త్ ట్రాకింగ్లు, చుట్టూ వందలాది డాక్టర్లను మెయింటైన్ చేస్తూ వార్తల్లో నిలిచాడు. అదీగాక ఇటీవల త్వరలో వృద్ధాప్యాన్ని, చావుని జయిస్తానిని చాలా నమ్మకంగా ప్రకటించేశాడు కూడా. ఇది ఎంత వరకు సాధ్యం అన్న సందేహాలు వెల్లువెత్తున్న తరుణంలో ఒక భారత యువకుడు తాను కూడా బ్రయన్ జాన్సన్లా కావాలనుకుంటున్నా అంటూ షాంకింగ్ ప్రకటన చేశాడు. ఆయన బాటలోనే నడుస్తున్నానంటూ..తప వ్యక్తిగత ఆరోగ్య ప్రయోగం గురించి పూసగుచ్చినట్లు వివరించి నోరెళ్లబెట్టేలా చేశాడు. యవ్వనంపై ఇంత వ్యామోహమా అని నెటిజన్లు ఆ యువకుడిని ఏకీపారేస్తున్నారు నెటిజన్లు..ఇంతకీ ఆ యువకుడి ఏవిధంగా తనపై ప్రయోగాలు చేసుకుంటున్నాడంటే..బెంగళూరు సెడోనా హెల్త్ స్టార్టప్ వ్యవస్థాపకుడు 23 ఏళ్ల పునర్వ్ దినకర్ భారత్ బ్రయన్ జాన్సన్గా అవతరించాలని కోరుకుంటున్నా అని సోషల్ మీడియా ఎక్స్లో పేర్కొన్నాడు. అందులో భాగంగా తన వ్యక్తిగత ఆరోగ్య ప్రయోగాన్నికూడా మొదలు పెట్టేశానని, ప్రతీ అవయవం పనితీరుపై ఫోకస్ పెట్టేలా ట్రాక్ చేస్తున్నట్లు కూడా వెల్లడించాడు. అంతేకాదండోయ్ ఏకంగా ఇప్పటి వరకు ఏడు వేలకు పైగా రక్తపరీక్షలు కూడా చేయించుకున్నాడట. ఆఖరికి నిద్ర, ఒత్తిడిని ట్రాక్ చేసేలా WHOOPని కొనుగోలు చేసాను - నా కార్యకలాపాలను ట్రాక్ చేయడానికి స్ట్రావా, నా కేలరీలను ట్రాక్ చేయడానికి Amy, ఈ పరీక్షలన్నింటిని ట్రాక్ చేసేలా Sedona వంటివి అన్నింటిని సెటప్ చేశానని చెబుతున్నాడు. పైగా తన ఆరోగ్యానికి సంబంధించి ప్రతి అణవణువు శోధించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపాడు. అయితే ఈ యువకుడి లక్ష్యం బ్రయాన్లా వృద్ధాప్యాన్ని తిప్పికొట్టడం కానే కాదట. ఇతడి ఆశయం అత్యంత భిన్నగా ఉంది. బదులుగా డేటా ఆధారిత ఆప్టిమైజేషన్ ద్వారా జీవితాన్ని పూర్తి స్థాయిలో జీవించడం అనేది అతడి లక్ష్యమట. అలాగే ఇతరులు తన ఆరోగ్యం గురించి తెలసుకునేందుకు మొత్తం డేటాని బహిర్గతం చేసేలా డాక్యుమెంట్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాడట. తన శరీరంలో కొలిచే, ట్రాక్ చేసే, మెరుగుపరిచే ప్రతి విషయాన్ని డాక్యుమెంట్ చేస్తాను కాబట్టి ఇతరులు కూడా సులభంగా తనలా స్వచ్ఛందంగా ముందుకొచ్చేలా ప్రేరణగా ఉంటుదనేది అతడి అభిప్రాయం. చావుని జయించి దీర్ఘాయువుతో ఉండాలనే దానిపై విపరీతంగా పెరుగుతున్న ఆసక్తి నేపథ్యంలో దినకర్ ప్రకటన రావడం విశేషం. కాగా, దీపిందర్ గోయల్(జోమాటో వ్యవస్థాపకుడు) వంటి ప్రముఖ వ్యక్తులు కూడా మెదడు రక్త ప్రవాహాన్ని ట్రాక్ చేయడానికి ధరించగలిగే కంటిన్యూ', 'టెంపుల్' వంటి ప్రాజెక్టులతో ఈ రంగంలోకి అడుగుపెట్టారు. అయితే నెటిజన్లు దినకర్ ఇంత చిన్న వయసులోనే ఇలాంటి ప్రయోగాలకు సిద్ధమవ్వడానికి ప్రశంసించినప్పటికీ..ఇలా నిరంతరం ఆరోగ్యాన్ని ట్రాక్ చేస్తే..చిన్న చిన్ని వాటికి ఆందోళన చెందే పరిస్థితికి దారితీస్తుందనేది వారి వాదన. పైగా దీని కారణంగా ఒత్తిడి బారినపడే ప్రమాదం కామెంట్ చేస్తూ పోస్టుల పెట్టారు. అంతేగాదు బ్రో ఎవ్వరూ జీవితాన్నిపూర్తి స్థాయిలో ఆస్వాదించలేరనేది జగమెరిగిన సత్యం అంటూ పోస్టులు పెట్టారు.To everyone reading this, Hi, I'm Punarv.I'm 23 and starting today, I will be the Bryan Johnson of India.- Got a blood test done worth 7k covering all the imp biomarkers- Bought a WHOOP last month to track sleep, strain and recovery- Strava to track my activities, Amy to… pic.twitter.com/h8079K5LHW— punarv (@ycocerious) January 5, 2026 (చదవండి: తండ్రికి చదువు లేదు, తల్లి సూట్లు కుట్టేది....కానీ కూతురు ఐపీఎస్..!) -
ఎక్స్రే, సీటీ స్కాన్, ఎమ్మారైలు సురక్షితమేనా?
ఈరోజున ఎక్స్–రేలు లేని మెడికల్ సైన్స్ను ఊహించుకోలేం. ఏదైనా సమస్యతో డాక్టర్ దగ్గరికి వెళ్లగానే చేయించే పరీక్షల్లో మొట్టమొదటిది రక్తపరీక్షలైతే.. రెండోది తప్పకుండా ఎక్స్–రే అయి ఉంటుంది. దేహాన్ని కోయకుండా... కత్తిగాటు పెట్టకుండా లోపలి అవయవాల తీరుతెన్నులు తెలుసుకునే ఈ పరీక్ష వైద్యశాస్త్రంలోనే ఓ తిరుగులేని వరదాయిని. ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు దేహంలోపలి అవయవాలకు గానీ, ఎముకలకు గానీ... ఏ ముప్పు వాటిల్లిందో, ప్రమాదం తాలూకు దుష్ప్రభావమెంతో తెలుసుకోవడంలో ఎక్స్–రేలను మించిన పరీక్షలేదు కదా... అలాంటిది అసలీ ఎక్స్–రేలను తెలుçసుకోవడమే ఓ యాక్సిడెంట్! ఎక్స్–రే అంటే ఏమిటో, దాని వివరాలూ, తీయాల్సింది ఎందుకు, ఎప్పుడెప్పుడు, దాని తాలూకు దుష్ప్రభావాలేమిటి... అవే ఎక్స్–రేలను మరింత తక్కువ మోతాదులో ఉపయోగించి తీసే సీటీ–స్కాన్ ఏమిటి? అదెప్పుడు తీస్తారు వంటి అనేక వివరాలను తెలుసుకుందాం...ఎక్స్–రే అంటే కూడా ఒక రకం కాంతి. అనంత కాంతి పటలంలో కంటికి కనిపించేది కొంతమేరకు మాత్రమే. ఇక కంటికి కనిపించని కాంతి పుంజాలు... ఇన్ఫ్రారెడ్ అనీ, అల్ట్రా వయొలెట్ అనీ, ఎక్స్ రేస్ అనీ ఇలా వేర్వేరుగా ఉంటాయి. విస్తృతమైన రేడియేషన్లో కంటికి కనిపించే కాంతి ఒక వేవ్లెంగ్త్తో (అంటే కాంతి వేవ్లెంగ్త్ 380 నుంచి 750 నానో మీటర్ల మధ్యన) ఉంటే... ఈ రకరకాల రేడియేషన్ రూపాలు కొన్ని నిర్దిష్టమై వేవ్లెంగ్త్స్తో రకరకాలుగా ఉంటాయి. వాటి వేవ్లెంగ్త్ తాలూకు ఫ్రీక్వెన్సీలను బట్టి వాటికి ఆయా పేర్లు పెడతారు.మిగతా రేడియేషన్ల తాలూకు తీవ్రత కాంతి కంటి భిన్నంగా ఉండటంతో పాటు కాంతిలా నిరపాయకరంగా ఉండదు. ఆయా కాంతి కిరణాల తీవ్రత కారణంగా వాటి దుష్ప్రభావమూ తీవ్రంగానే ఉంటుంది. అందుకే వైద్య పరీక్షల కోసం వెలువరించే ఆ రేడియేషన్తో కొన్ని ముప్పులూ, దుష్ప్రభావలూ తప్పవు. అయితే వైద్యశాస్త్ర అవసరాల దృష్ట్యా బేరీజు వేసినప్పుడు... వాటి వల్ల కలిగే దుష్ప్రభావం కంటే వాటితో ఒనగూరే మేలు ఎక్కువ అనుకున్నప్పుడు డాక్టర్లు ఈ కిరణాలను ఉపయోగించే ఎక్స్–రే పరీక్ష లేదా సీటీ స్కాన్ చేయించమని సూచిస్తారు. అయితే ఆధునిక వైద్యశాస్త్రవేత్తలు తమ కొత్త కొత్త ఆవిష్కరణలతో ఇప్పుడీ ఎక్స్–రేల దుష్ప్రభావాలను గతం కంటే చాలా చాలా తగ్గించారు. దాంతో ఇప్పుడు ఎక్స్–రేలు చాలావరకు నిరపాయకరమే అని చెప్పవచ్చు.కనుగొనడమే ఓ యాదృచ్ఛికమైన అద్భుతం! ఎక్స్–రేలను కనుగొనడమే చాలా యాదృచ్ఛికంగా జరిగింది. ఈ అత్యద్భుతమైన ఆవిష్కారం జరిగిన తీరు కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఓ గాజు సిలిండర్లో క్యాథోడ్ కిరణాలను దారిమళ్లించాక... అవి తప్పించుకుపోకుండా ఉంచిన ఫ్లోరెసెంట్ స్క్రీన్ మెరుస్తుండటంతో అక్కడ ఒకరకమైన కిరణాలు పడుతున్నాయని విల్హెమ్ కోనార్డ్ రాంట్జన్ అనుకున్నాడు. అకస్మాత్తుగా తన చేతిని అడ్డుపెడితే చేతిలోని ఎముకలు కనిపించాయి. దాంతో తన భార్యను పిలిచి... ఆమె చేతిని కూడా ఆ కిరణాలకు అడ్డుగా ఉంచినప్పుడు ఆమె కూడా తన చేతిలోని ఎముకలు చూసి భయంతో బెంబేలెత్తిపోయింది. అలా చాలా యాక్సిడెంటల్గా రాంట్జన్ కనుగొన్న ఎక్స్–రేలతో వైద్యచికిత్సలో ఒక విప్లవాత్మకమైన మార్పు వచ్చింది. అంతకుముందు చాలా అసాధ్యంగా భావించిన సంక్లిష్టమైన చికిత్సలు చాలా చాలా సులువయ్యాయి. మరీ ముఖ్యంగా ఎముకలు మొదలుకొని శరీరంలోని కొన్ని భాగాల చికిత్స ఎంతో సులభతర మయ్యింది.అసలు ఎక్స్–రే అంటే ఏమిటి? ఏదైనా వస్తువును చూడటానికి కాంతి అవసరమవుతుంది. కానీ నిజానికి ‘కాంతి’ అంటే అనేక వేవ్లెంత్ గల రేడియేషన్ తరంగాల కిరణాల్లో అదో చిన్న భాగం మాత్రమే. అందులోని ఇతర వేవ్లెంగ్త్ ఉన్న భాగాలు నేరుగా మన కంటికి కనిపించవు. కాంతి కిరణాల కంటే ఈ ఎక్స్–రే తరంగాలు బలమైనవి. కాబట్టి కాంతి మన శరీరాన్ని తాకి వెనుదిరిగిపోతుంది. కానీ ఈ ఎక్స్ కిరణాలు మాత్రం శరీరంలోకి బలంగా దూసుకుపోతాయి. కాంతి ఓ వస్తువును తాకి వచ్చి తిరిగి మన కంటిని చేరినప్పుడు... మనమా వస్తువును చూడగలిగినట్లే... ఈ కిరణాలూ శరీరం లోపలికి వెళ్లి అక్కడి అంతర్భాగాలపై ప్రతిఫలిస్తాయి కాబట్టి... వాటిని రేడియాలజిస్ట్ (రేడియేషన్తో పని చేయగలిగే సామర్థ్యం ఉన్న నిపుణులు) మరికొంత సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి, వాటి సహాయంతో చూడగలుగుతాడు. అలాగే ఆ ప్రతిబింబాన్ని ఫొటో తీసి, ఫిల్మ్పై ముద్రించగలిగినప్పుడు అది ‘ఎక్స్–రే’ పిక్చర్ అవుతుంది. ఇప్పుడున్న సాంకేతికత సహాయంతో ఆ ప్రతిబింబాన్ని టీవీ మీదగానీ లేదా కంప్యూటర్ తెర మీదగానీ ఒడిసి పట్టగలగడమూ సాధ్యమే. వేర్వేరు ప్రాంతాల్లో వేర్వేరు రేడియేషన్లు! ఈ ప్రపంచంలో ప్రతిచోటా రేడియేషన్ ఉండనే ఉంటుంది. సగటున ఒక వ్యక్తి ప్రతి ఏడాదీ 3 ఎమ్ఎస్వీ రేడియేషన్కు గురవుతుంటాడని ఓ అంచనా. అయితే అది సగటు మాత్రమే. కొన్నిచోట్ల రేడియేషన్ తీవ్రత ఎక్కువగా ఉండవచ్చు. మరికొన్ని చోట్ల తక్కువ. ఉదాహరణకు పీఠభూమి (ప్లేటో) ్రపాంతాల్లో ఉండేవారు తమ తోటి కోస్తా (కోస్టల్) ్రపాంతాల్లో ఉండేవారితో పోలిస్తే 1.5. మిల్లీ స్టీవెర్ట్ (ఎమ్ఎస్వీ... అంటే రేడియేషన్ను కొలవడంలో ఉపయోగపడే కొలతల్లో ఒక రకమైన యూనిట్) ఎక్కువగా నేచురల్ రేడియేషన్కు గురవుతుంటారు. అలాగే మనం మన ఇండ్లలోపలే ఉన్నప్పటికీ ఎంతోకొంత రేడియేషన్కు గురవుతూనే ఉంటాం. వాతావరణంలోని రాడాన్ గ్యాస్ కూడా ఈ రేడియేషన్ మోతాదులోని మార్పులకు కారణమవుతుంటుంది. రాడాన్ వల్ల రేడియేషన్ పెరుగుతుంది (ఏడాదికి షుమారు 2 ఎమ్ఎస్వీ). ఒకదేశంలో ఉండే రేడియేషన్కీ మరో దేశం తాలూకు రేడియేషన్లో కూడా తేడాలుంటాయి. ఉజ్జాయింపుగా ఒక ఉదాహరణ చె΄్పాలంటే... మనం 10 రోజుల పాటు స్వాభావికంగానే ఎంత రేడియేషన్కు ఎక్స్పోజ్ అవుతామో... ఛాతీ ఎక్స్–రే తీయించుకోవాలనుకున్నప్పుడు కేవలం ఆ కొద్ది క్షణాల్లోనే 10 రోజులకు సరిపడా రేడియేషన్ను గురవుతామన్నది నిపుణుల తాలూకు ఓ రఫ్ అంచనా. సీటీ స్కాన్లో ఉండేవీ ‘ఎక్స్–రే’లే! వైద్య పరీక్షల్లో భాగంగా ‘సీటీ స్కాన్’గా పరిగణించే స్కానింగ్ ప్రక్రియల్లోనూ ఎక్స్–రేలనే ఉపయోగిస్తారు. కాకపోతే వాటినే మరికొంత అడ్వాన్స్డ్ ప్రక్రియల్లో ఉపయోగించి ఎక్స్–రే కంటే అదనపు ప్రయోజనాలను సాధిస్తారు. కాకపోతే ఎక్స్–రేతో పోలిస్తే సీటీ స్కాన్లో రేడియేషన్ మోతాదులు ఎక్కువ. ఫలితం కూడా ఎక్కువే. ఇందులో రేడియేషన్ తాలూకు మోతాదూ, తీవ్రతా కాస్తంత ఎక్కువ. కాబట్టి తీయించుకోవడంలోనూ డాక్టర్ల సలహాలు, సూచనలు, విచక్షణ అవసరం. అందుకే వారి సలహా లేకుండా పేషెంట్లు తామంతట తాము సీటీ స్కాన్ కోసం పట్టుబట్టడం అంత సరైనది కాదు.రేడియేషన్తో ఎప్పుడూ ప్రమాదమేనా..? నిజానికి వైజ్ఞానికి ఆవిష్కరణ అన్నది ఎప్పుడూ పదునైన కత్తి లాంటిది. ఆ పదునుతో ఎన్ని సౌలభ్యాలుంటాయో, అన్ని ప్రమాదాలూ ఉంటాయి. ఎక్స్–రే, సీటీ స్కాన్ వంటి కొన్ని పరీక్షల తాలూకు మరో కోణాన్నీ చూద్దాం. అవును. రేడియేషన్తో కచ్చితంగా ఎంతో కొంత ప్రమాదం ఉండితీరుతుంది. అయితే రేడియేషన్ అంటే అదేదో కేవలం ఎక్స్–రేలలోనే ఉండదు. నిజానికి మన చుట్టూ ఉండే వాతావరణంలోనూ ఎల్లప్పుడూ ఎంతోకొంత రేడియేషన్ ఉంటుంది. కాకపోతే అది మనకు హానికలిగించే పరిమాణంలోఉండకపోవచ్చు. వాతావరణంలో ఉన్న రేడియేషన్ అన్నది మనం తన ఉనికిని గుర్తించేంతగా ఉండదు. అదే... ఎక్స్–రే తీసేచోట లేదా వాటితో పనిచేసే చోట అది ఎక్కువగా ఉంటుంది. మితిమీరిన రేడియేషన్ కారణంగా ఎన్నో అనర్థాలూ, ఆరోగ్య సమస్యలూ వచ్చే ముప్పు ఉంటుంది.‘రేడియేషన్’ను ఎలా కొలుస్తారంటే....? ఒక ప్రదేశంలో రేడియేషన్ ఎంత పరిమాణంలో ఉందనే విషయాన్ని తెలుసుకోడానికి లేదా కొలవడానికి ఒక కొలత (యూనిట్) ఉంది. దాని పేరే మిల్లీ సీవెర్ట్ (ఎమ్ఎస్వీ). అలాగే రేడియేషన్ మోతాదునూ, తీవ్రతలను కొలవడానికీ రెడ్, రెమ్, రోంట్జెన్, సీవెర్ట్, గ్రే వంటి యూనిట్లూ ఉంటాయి. ఈ వేర్వేరు కొలతలతో మనకు ఉపయోగం ఏమిటి? కాంతి మన శరీరాన్ని తాకి వెనుదిరుగుతుంది. కానీ ఎక్స్–రేలు లోపలికి ఎముకల వరకూ వెళ్తాయి . అలాగే మన శరీరంలో వేర్వేరు అవయవాలు వాటివాటి స్వభావాన్ని బట్టి ఎక్స్–రేలను తమలోకి అనుమతించడం విషయంలో వేర్వేరుగా స్పందిస్తాయి. అంటే... ఎముకల వరకు వెళ్లాలంటే ఒక మోతాదు బలం అవసరం. అలాగే ఊపిరితిత్తులు మెత్తగా ఉంటాయి కదా. వాటిని చూడాలంటే ఎక్స్–రే వేరే మోతాదులో కావాలి. అలా మనం మన దేహంలోకి చూడాల్సిన అవయవాన్ని బట్టి వేర్వేరు మోతాదులో ఎక్స్–రే పరిమాణాన్ని లోపలికి పంపాలి. అలా మనం మన దేహంలో ఫొటో తీయాలనుకున్న అవయవాన్ని బట్టి వేర్వేరు మోతాదుల్లో ఎక్స్–రే కిరణాలను పంపాల్సి ఉంటుంది. అందుకే ఈ రెడ్, రెమ్, రోంట్జెన్, గ్రే వంటి కొలతలు అవసరమవుతాయి.సీటీ స్కాన్తోనూ ఇదే ముప్పా ? ఉంటుంది. ఎందుకంటే... సీటీ స్కాన్లోనూ వెలువడే రేడియేషన్ కూడా హానికరమైనదే. అందుకే రేడియాలజిస్ట్లు సీటీ స్కాన్ తీసేప్పుడు వాడే రేడియేషన్ తాలూకు తీవ్రతనూ వీలైనంతగా తగ్గించేలా శిక్షణ ΄÷ందుతారు. అందుకే... ఎక్స్–రేగానీ లేదా సీటీ స్కాన్ గానీ తీయించుకోవడం తప్పనప్పుడు ఈ రేడియేషన్ ప్రమాదాలకు భయపడకూడదు. అలాగే మనకు అవసరం లేకపోయినా... రొటీన్ పరీక్షల పేరిట రేడియేషన్ ఇన్వాల్వ్ అయి ఉన్న పరీక్షలనూ తరచూ చేయించుకోవడమూ సరికాదు.ఇదే ఇలాగుంటే మరి ఎమ్మారైతో...? ఎక్స్–రేలూ, సీటీ స్కాన్లతో ఇంత ముప్పు అయితే మరి వీటన్నికంటే మరింత లోతైన ఫలితాలను చెప్పే ఎమ్మారైతో ఎంత ముప్పు కలుగుతుందో అన్న సందేహం వైద్య పరిజ్ఞానం అంతగా లేని సాధారణ ప్రజల్లో కలగవచ్చు. నిజానికి ఎక్స్–రే, సీటీ స్కాన్తో పోలిస్తే ఎమ్మారైతో రేడియేషన్ ప్రమాదమే ఉండదు. ఎందుకంటే ఎమ్మారై అంటే ‘మేగ్నటిక్ రిజోనెన్స్ ఇమేజింగ్’ అని అర్థం. అంటే ఇందులో కేవలం అయస్కాంత బలాన్ని మాత్రమే ఉపయోగిస్తూ, రేడియేషన్ వాడరు కాబట్టి ఎమ్మారైతో అంతటి ప్రమాదాలు ఉండవు. రేడియేషన్ కిరణాలతో క్యాన్సర్ వంటి వైద్యచికిత్సలు... రేడియో సర్జరీలు! రేడియేషన్తోనూ వైద్యచికిత్సలు సాధ్యమవుతాయన్న సంగతి తెలిసిందే. అయితే గతంలో రేడియేషన్ థెరపీ విషయానికి వస్తే గతంలో అది చాలా భయం గొలిపేదిగా ఉండేది. అయితే ఇప్పుడలాంటి దుష్ప్రభావాలు చాలావరకు తగ్గాయి. ‘ర్యాపిడ్ ఆర్క్ ఇమేజ్ గైడెడ్ రేడియోథెరపీ’ వల్ల కేవలం క్యాన్సర్ కణాలకు మాత్రమే రేడియేషన్ తగులుతుంది. ఇలాంటి చికిత్సల్లో రేడియేషన్ కేవలం క్యాన్సర్ కణాల్ని మాత్రమే తన లక్ష్యంగా చేసుకుంటుంది. అత్యాధునిక ప్రక్రియల సహాయంతో దేహంలోని అత్యంత కీలకమైన అవయవాలైన మెదడు, ఊపిరితిత్తులు, కాలేయం వంటి చోట్ల నిర్భయంగా రేడియేషన్ను ప్రసరింపజేయవచ్చు. ఇక ఇటీవలే అందుబాటులోకి వచ్చిన ‘ఎఫ్ బీమ్’ వల్ల చాలా సురక్షితంగా ‘రేడియోసర్జరీ’ చేయవచ్చు. సాధారణ సర్జరీలో రోగిని ఆసుపత్రిలో చేర్చాలి. కానీ రేడియోసర్జరీలో రోగిని ఆసుపత్రిలో చేర్చాల్సిన అవసరమే ఉండదు. పైగా రేడియేషన్తో చేసేదైనప్పటికీ ఇది పూర్తిగా సురక్షితం.ఎక్స్–రే ఉపయోగాలేమిటి...? ఎక్స్–రే వంటి బలమైన కిరణాలు బలంగా శరీరంలో లోపలికి చొచ్చుకుపోతాయి. అవి శరీరంలోని అనేక కీలక అవయవాలను చేరి, ఫొటోలు తీసి... అక్కడి సమాచారాన్ని అందిస్తాయి. దాన్ని ఎక్స్–రే ఫిల్మ్ సహాయంతో నిక్షిప్తం చేసుకోవచ్చు. మనకు తెలిసిందల్లా... ఎక్స్–రే అంటే... ఆ కిరణాల సహాయంతో ఎముకలు విరిగాయా అన్న సమాచారం తెలుస్తుందనే సాధారణ విషయం మాత్రమే. కానీ డాక్టర్లు మాత్రం ఈ ఎక్స్–రే కిరణాల సహాయంతో చాలా రకాల సమాచారమూ, ఫలితంగా ఎన్నో ప్రయోజనాలు ΄÷ందుతారు. ఉదాహరణకు... దేహంలోకి ఓ పైప్ను పంపాలంటే... అది దేహంలోకి ఇతర అంతర్గత అవయవాలకూ తగలకుండా సాఫీగా ఎలా పంపగలమని చూస్తారు. అలాగే దేహం లోపల ఏదైనా ఉపకరణాన్ని లేదా పరికరాన్ని అమర్చాలంటే నిర్దిష్టంగా ఎక్కడ అమర్చాలన్న విషయాన్ని ఎక్స్–రేల సహాయంతోనే తెలుసుకుంటారు. ఎక్స్–రేతో ఇలాంటి ఎన్నో ప్రయోజనాలు సమకూరుతాయి. ఎక్స్–రేలు సురక్షితమేనా...? ఒక్కమాటలో చెప్పాలంటే... పూర్తిగా సురక్షితమైతే కాదు. మరెందుకు తీయించుకుంటున్నామనే ప్రశ్న ఆవిర్భవిస్తుంది. అయితే... ఎక్స్–రేలకు ఎక్స్ పోజ్ అయినప్పుడు ఉన్న రిస్క్తో పోలిస్తే... నిజంగా మనకు అవసరమైనప్పుడు చేయించిన వైద్యపరీక్షతో మనకు ఒనగూరే లాభం ఎక్కువ కాబట్టి. అందుకే ఎక్స్–రే లేదా ఇతరత్రా రేడియేషన్ సహాయంతో సీటీ స్కాన్ వంటివి తీసేప్పుడు సాధ్యమైనంత తక్కువ రిస్క్తో... సాధ్యమైనంత ఎక్కువ ప్రయోజనం పోందేలా రేడియాలజిస్టులు పనిచేస్తారు. అలా వారు శిక్షణపోందుతారు. మన ఇంట్లో మామూలు బల్బ్ ఆర్పేశాక... కాంతి మాయం అయినట్లే... ఒకసారి ఎక్స్–రే స్విచ్ ఆఫ్ చేశాక మళ్లీ అక్కడ రేడియేషన్ ఉండదు. కాబట్టి ఎక్స్–రే ప్రక్రియ ముగిశాక అక్కడ అరకొర ఎక్స్–రే దుష్ప్రభావాలు ఉండిపోయి... అవి మనకు హానిచేస్తాయేమో అనే ఆందోళన ఎంతమాత్రమూ అవసరం లేదు. అలా అనుకోవడం మన అపోహ మాత్రమే.ఎక్స్–రేలు... గర్భవతి పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు మామూలు వ్యక్తులకే ఎక్స్–రేలతో ఎంతోకొంత హాని ఉందనుకుంటే... మరి గర్భవతి కడుపులో పెరుగుతున్న చిన్నారులకూ ఇంకా ఎక్కువ హాని ఉండనే ఉంటుంది. అందుకే గర్భవతికి ఎక్స్–రే విషయంలో డాక్టర్లు చాలా జాగ్రత్తగా ఉంటారు. ఆమెకు మందులు ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఒక ఫిజీషియన్ ఎంత నిశితంగా వ్యవహరిస్తాడో... ఆమెకు ఎక్స్–రే అవసరమైనప్పుడు ఒక రేడియాలజిస్ట్ అంతే నిశితంగా ఉంటాడు. అయితే ప్రతి సందర్భంలోనూ బిడ్డకు ఎక్స్–రే తప్పనిసరిగా హానికరంగా పరిణమిస్తుందని కాదు. కాకపోతే ఇది అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు కడుపులోని బిడ్డ ఏ వయసుకు పెరిగింది (అంటే ఏ నెల గర్భం), దానికి హాని చేయకుండా ఎంత మోతాదు ఎక్స్–రేకు గురిచేయవచ్చు... లాంటి అనేక అంశాల మీద ఈ ఎక్స్–రేల తాలూకు ముప్పు ఆధారపడి ఉంటుంది. ఒకవేళ ఏదైనా కారణం చేత గర్భవతి తాలూకు తల, చెయ్యి, కాలు, ఛాతీ వంటి భాగాలకు ఎక్స్–రే తీయాల్సివస్తే... ఆమె కడుపులోని బిడ్డ వాటికి నేరుగా ఎక్స్పోజ్ అయ్యే ముప్పు అంతగా ఉండదు. కేవలం ఆమె ΄÷ట్టభాగంలో లేదా ΄÷త్తికడుపు భాగాల్లో ఎక్స్–రే తీయాల్సి వచ్చినప్పుడే బిడ్డ రేడియేషన్కు ఎక్స్పోజ్ అయ్యే ప్రమాదం ఏర్పడుతుంది. అందుకే మిగతావాళ్లతో పోల్చినప్పుడు ఎంతో అవసరమైతే తప్ప గర్భవతికి ఎక్స్–రే పరీక్ష నిర్వహించరు. ఒకవేళ చేయాల్సి వచ్చినా ఆమెకు చాలా తక్కువ మోతాదులో ఎక్స్–రేలు వాడేలా నిశితమైన జాగ్రత్తలు తీసుకుంటారు.గర్భవతులకు ఇప్పుడు ఆందోళన అక్కర్లేదు... ఏదైనా పనిలో రిస్క్ ఉందంటే... అది అన్నిసార్లూ అన్నే అనర్థాలను తెచ్చిపెట్టకపోవచ్చు. ఎక్స్–రే విషయంలోని ముప్పు కూడా అంతే. ఒకవేళ నిజంగా గర్భవతికి ఎక్స్–రే నిర్వహించాల్సి వస్తే అది తప్పకుండా అనర్థాలు తేకపోవచ్చు. కాకపోతే ఆ కిరణాల వల్ల కడుపులోని బిడ్డకు రిస్క్ ఉన్న అంశాన్ని పరిగణనలోకి తీసుకుని దాన్ని ఏ మేరకు తగ్గించగలరో... అంత మేరకు తగ్గించేలా రేడియాలజిస్టులు జాగ్రత్తలు తీసుకుంటారు. కాబట్టి గర్భవతికి నిజంగా ఎక్స్–రే తీయాల్సిన అవసరమైనప్పుడు వారు ఈ విషయంలో మరీ ఎక్కువగా ఆందోళన పడాల్సిన అవసరం ఇప్పుడు లేదు. ఎందుకంటే వైద్యపరిశోధనల్లో వచ్చిన ఎన్నో రకాల మార్పులు ఎక్స్–రే ముప్పులనూ గణనీయంగా తగ్గించగలిగాయి. నిర్వహణ: యాసీన్ -
సత్తు ప్లస్ దాల్చిన చెక్క నీటితో బెల్లీఫ్యాట్ మాయం..!
చాలామందికి బానపొట్ట పెద్దగా ఉండి ఏ డ్రెస్ లేదా చీర కట్టుకోవాలన్న ఇబ్బందిగా ఉంటుంది. ఓపట్టాన తగ్గదు కూడా. బొడ్డుకొవ్వుతో ఉండే ఇబ్బంది అంత ఇంత కాదు. అలాంటి మొండి బొడ్డుకొవ్వుని ఈ పానీయం సులభంగా కరింగించేయడమే కాకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తోంది. మరి ఆ పానీయం ఏంటో పోషకాహార నిపుణుల మాటల్లోనే సవివరంగా తెలుసుకుందామా..!.అతిగా తినడం లేదా క్రమరహిత దినచర్యల కారణంగా అధికబరువు, బెల్లీఫ్యాట్ వంటి సమస్యలను ఫేస్ చేస్తుంటాం. అలాంటి వారు దాల్చిన చెక్క పొడిని, సత్తు నీటికి జత చేసి తీసుకుంటే అద్భుత ఫలితం ఉంటుదని చెబుతున్నారు నిపుణులు. సత్తులో పుష్కలమైన ఫైబర్ ఉంటుంది. ఇది కడుపు నిండిన అనుభూతిని అందిస్తుంది. జీర్ణక్రియకు మద్దతిస్తుంది. పేగు ఆర్యోగం, రక్తంలోని చక్కెర నియంత్రణకు మద్దతిస్తుంది. ఇది బరువు తగ్గడానికే కాకుండా బొడ్డు కొవ్వుని కరిగించడంలోనూ అద్భుతంగా పనిచేస్తుంది. ఈ పానీయం మలబద్ధకాన్ని తగ్గించగలదని పరిశోధనల్లో కూడా వెల్లడైంది. ఆకలి బాధను అదుపులో ఉంచగలదు, శక్తిస్థాయిలను పెంచుతుంది. మెక్కల ఆధారిత ప్రోటీన్, ఖనిజాలతో నిండి ఉన్న సత్తు శరీరానికి కావల్సిన తక్షణ శక్తిని అందిస్తుంది. ఇది సంక్లిష్ట పదార్థాల మిశ్రమం కాబట్టి నెమ్మదిగా శక్తిని విడుదల చేస్తాయి. అలాగే దాల్చిన చెక్కలోని యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని విషపదార్థాలను సులభంగా బయటకి పంపించగలదు. తయారీ విధానం.. సత్తు: 1 టేబుల్ స్పూన్ గోరువెచ్చని నీరు: 1 గ్లాసుదాల్చిన చెక్క పొడి: చిటికెడునిమ్మరసం: కొన్ని చక్కలుచేయు విధానం: సత్తుని గోరువెచ్చని నీటిలో బాగా కలిపి, దానిలో చిటికెడు దాల్చిన చెక్క పొడి, నిమ్మచుక్కలు వేసి తాజాగా కలుపుకుని తాగితే సరి. అయితే దీనికి చక్కెర వంటి స్వీట్ని జోడించకపోవడమే మంచిది. ప్రయోజనాలు..ఈ పానీయంలో ఉండే అధిక ప్రోటీన్, ఫైబర్ కంటెంట్ జీర్ణక్రియను నెమ్మదించి, సంతృప్తిని ప్రోత్సహిస్తుంది. ఇది మొత్తం కేలరీలను తీసుకోవడాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. ఇక దాల్చిన చెక్క ఇన్సులిన్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. అలాగే బొడ్డు చుట్టూ కొవ్వు నిల్వకు దోహదపడే చక్కెర స్పైక్లను నివారిస్తుంది.పైగా రక్తంలో చక్కెర స్థాయిలను, ఆకలిని సమర్థవంతంగా నిర్వహిస్తుంది.ఎవరికి మంచిది కాదంటే..కిడ్నీ సమస్యలు ఉన్నవారికి ఇది మంచిది కాదు. ఎందుకంటే సత్తులో అధికంగా ప్రోటీన్లు, ఖనిజాలు ఉంటాయి. ఇవి మూత్రపిండాల సమస్యలు ఉన్నవారికి ఇది తీసుకుంటే మూత్రపిండాలపై మరింత భారం పడుతుంది. కొన్ని రకాల పిండుల మిశ్రమం అయిన ఈ సత్తు కొందరికి ఆయా పప్పులు వల్ల ఎలర్జీ ఉంటే వారికి కూడా మంచిది కాదు. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను తక్కువగా ఉండేలా చేస్తుంది కాబట్టి కొందరిలో ఇది హైపోగ్లైసీమియాకు గురయ్యేలా చేసే ప్రమాదం ఉంది. అలాగే జీర్ణక్రియ సమస్యలు ఉన్నవారికి కూడా ఇది కాస్త అసౌకర్యాన్ని కలిగించవచ్చు. చివరగా ఈ పానీయం అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు అందిచినప్పటికీ..దానికి మన ఆరోగ్యకరమైన జీవనశైలి తోడైతేనే మంచి ఫలితాలను మనం అందుకోగలుగుతామని అంటున్నారు నిపుణులు. ఇది ఒక్కటే బొడ్డుకొవ్వుని మాయం చేస్తుందనే అపోహలో ఉండొద్దని హచ్చరిస్తున్నారు నిపుణులు. దీనితోపాటు హైడ్రేటెడ్గా ఉండేలా చూసుకోవడం, అధిక శుద్ధి చేసిన చక్కెర పదార్థాలను నివారించడం, తగినంత ప్రోటీన్, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులను చేర్చడం వంటివి చేయాలి. అలాగే తేలికపాటి వ్యాయమాలు కూడా జోడిస్తే..మరిన్ని ప్రయోజనాలను పొందగలమని చెబుతున్నారు నిపుణులు. అలాగే భోజనం చేసిన వెంటనే కాస్త నాలుగు అడుగులు వేయమని సూచిస్తున్నారు నిపుణులు.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: నటుడు ఆర్నాల్డ్ 'క్రాష్ డైట్'..!బరువు తగ్గడానికి కాదు..) -
ఆ కారణంగానే శాకాహారిగా మారా..!: నటి జెనీలియా
ఇటీవల కాలంలో వేగనిజం అత్యంత ప్రజాదరణ పొందుతోంది. చాలామంది ప్రముఖులు, సెలబ్రిటీలు వేగన్గా మారుతున్నారు. తాజాగా టాలీవుడ్ నటి, ప్రముఖ బాలీవుడ్ హీరో భార్య జెనీలియి డిసౌజా కూడా పూర్తిగా శాకాహారిగా మారినట్లు వెల్లడించారు. అయితే తాను మొదట్లో పూర్తిగా మొక్కల ఆధారిత ఆహారం తీసుకునేదాన్ని కాదని, తర్వాత పూర్తిగా వేగన్గా మారిపోయానని అన్నారు. ఎందువల్ల ఈ మార్పు, దానికి గల కారణాలను కూడా ఆమె షేర్ చేసుకున్నారు. చాలామంది ప్రముఖులు, ఇన్ఫ్లుయెన్సర్లు మొక్కల ఆధారిత ఆహారం తీసుకుంటున్నారు. అలాంటి వారి జాబితాలోకి తాజాగా జెనీలియా డిసౌజా కూడా చేరారు. ఆమె 2020 నుంచి వేగన్గా మారారట. సోహా అలీఖాన్ యూట్యూబ్ ఛానెల్లో జరిగిన సంభాషణలో జెనీలియా తాను 2017లో మాంసాహారం నుంచి పూర్తిగా శాకాహారానికి మారినట్లు చెప్పారు. తాను 2017 నుంచి మాంసం తినడం మానేసినట్లు తెలిపింది. అయితే పూర్తిగా మొక్కల ఆధారిత ఆహారం తీసుకునేదాన్ని కాదని, కొద్దిగా పాల ఉత్పత్తులు, చీజ్, గుడ్లు వంటివి తీసుకునేదాన్ని అని అన్నారు. చాలామంది కూరగాయలు తినడం మొదలు పెడితే ఆధ్యాత్మిక స్థితికి చేరుకుంటారని తరుచుగా చాలామంది చెబుతుండే వారు. తనకు కూడా అలాంటి అనుభూతే కలిగిందని అంటోంది జెనీలియా. ఆరోగ్యానికి మంచిదన్న ఉద్దేశ్యంతోనే ఈ రకమైన జీవనశైలిని అవలంభించానని అన్నారామె. తాను మాంసం తినే కుటుంబంలో జన్మించానని, తనకు పెద్దగా శాకాహారం అంటే ఏంటో తెలియదని అన్నారు. తాను బఠానీలు, బంగాళదుంపలు, పనీర్ మాత్రమే శాకాహారం అనుకునేదాన్ని, ఆ తర్వాత తెలిసింది అంతకుమంచి మంచి ప్రోటీన్ మాంసకృత్తులు ఉన్నా ఆహారాలు శాకాహారంలో కూడా ఉన్నాయని. అయితే తాను జంతు ప్రేమికురాలినే అయినప్పటికీ..అప్పుడు మాత్రం మాంసాన్ని ఇష్టంగా ఆస్వాదించేదాన్ని అని చెప్పుకొచ్చారు. కానీ ఎప్పుడైతే మాంసాహారాన్ని పరిమితం చేయడం మొదలు పెడతామో..అప్పుడు..ప్రతిది హాయిగా ఆస్వాదించగలుగుతాం, చాలా తేలికగా కూడా ఉంటుందన్నారామె. ఎలా మొదలైందంటే..మహమ్మారి సమయంలో 2020లో తాను పూర్తిగా వేగన్గా మారానని జెనీలియా పేర్కొన్నారు. తన భర్త రితేష్ కారణంగా ఇదంతా జరిగిందన్నారు. 2016లో ఆయన మాంసం తింటుంటే ఏదో బాగోలేని అనుభూతి కలుగుతోందని మానేశారు..అయితే అప్పటికీ తాను మాంసహారిగానే ఉన్నానని గుర్తుచేసుకున్నారు. అలా జనవరి 1, 2017న తాము దీన్ని పూర్తిగా మానేయాలనే నిర్ణయానికి వచ్చామన్నారు. అయితే అప్పటికీ తాము గుడ్లు, పాల ఉత్పత్తులు తీసుకునేవాళ్లం. కరోనా మహమ్మారి సమయం ప్రతిఒక్కరూ బిక్కుబిక్కుమంటున్న టైంలో రితేష్ ఎందుకు జంతు ఉత్పత్తులను కూడా మానేయకూడదు అని అడిగారు. దాంతో తాను సరే ఈ మార్పు ప్రయత్నించి చూద్దాం అన్నాను. రాను రాను అది అద్భుతంగా అనిపించడం ప్రారంభించింది, మా రోటీలో కొద్దిగా పాలు, లేదా వెన్న తినిన ప్రతిసారి కడుపు నిండిన అనుభూతి కలిగింది. ఇలా మారడం అంత ఈజీ కాదు, అలానే పూర్తిస్థాయిలో శాకాహారిగా మారలేరు కూడా. రోజులు గడుస్తున్న కొద్దిపూర్తిగా వేగన్గా మారడం ఎలా అనేది అవగతమవుతుంటుందని, ఇంకా ఇప్పటికీ తాను నేర్చుకుంటూనే ఉన్నానని చెప్పుకొచ్చారు జెనీలియా. పూర్తి శాకాహారంతో ఆరోగ్యంగా ఉండగలమా..?శాకాహారులుగా ఉన్న చాలామంది పోషకాహార లోపాలు ఎదుర్కొంటున్నారు కదా, మరి అలాంటప్పుడూ ఇది ఏవిధంగా ఆరోగ్యానికి మంచిది అనేది అందరిలోనూ ఎదురయ్యే సందేహం. అయితే పోషకాహార నిపుణులు ప్రాథమికంగా ఏ ఆహారమైన తీసుకునే విధానం బట్టే అన్ని ప్రోటీన్లు పుష్కలంగా తీసుకోవడం సాధ్యమవుతుందంటున్నారు. మాంసం తినేవారికి సైతం బీ12 లోపం ఉంటుందనేది గుర్తెరగాలి. అందువల్ల ఇలా శాకాహారిగా మారాలనుకునే వాళ్లు..అన్ని విటమిన్లు, ప్రోటీన్లు అందేలా సవ్వంగా మార్పులు చేసుకోవాలి. అలాగే మొక్కల ఆధారిత ఆహారాలు మన శరీరానికి అన్నింటిని అందించలేకపోవచ్చు గానీ..ఆ లోపాన్ని ఆయా సప్లిమెంట్స్తో ఈజీగా భర్తీ చేసుకోవచ్చని సూచిస్తున్నారు పోషకాహార నిపుణులు. (చదవండి: ఫ్యాక్టరీ కార్మికుడి నుంచి ఫుల్స్టాక్ డెవలపర్ రేంజ్కి..!) -
జిమ్స్ జామ్ : న్యూ ఇయర్ జోష్...కసరత్తుల కళకళ
ఎప్పటి మాదిరిగానే కొత్త ఏడాది సందర్భంగా ఆరోగ్యార్థుల తీర్మానాల ఫలితంగా నగరంలోని జిమ్ సబ్స్క్రిప్షన్లు రికార్డు స్థాయిలో పెరిగాయి. దీంతో జిమ్ములు కసరత్తులు చేసే వారితో కళకళలాడాయి. నగరంతో పాటు దేశవ్యాప్తంగా ఇదే ట్రెండ్ ఉన్నట్లు పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. దేశవ్యాప్తంగా గత యేడాదితో పోలిస్తే ఈ సంవత్సరంలో 14% జిమ్ సభ్యత్వాలు పెరిగాయని, నగరంలోనూ అదే పరిస్థితి కనిపిస్తోందని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఇక గత డిసెంబర్తో పోలిస్తే 20–25% పెరుగుదల కనిపించినట్లు తెలుస్తోంది. న్యూ ఇయర్ తీర్మానాలతో పాటు భారీ డిస్కౌంట్ ఆఫర్లు కూడా దీనికి కారణమని స్పష్టమవుతోంది. – సాక్షి, సిటీబ్యూరో కొత్త సంవత్సరం ఆరోగ్యార్థులతో జిమ్స్ కళకళలాడాయి. ముఖ్యంగా మధ్య వయసు్కల సందడి అధికంగా కనిపించింది. న్యూ ఇయర్ తీర్మానాల్లో భాగంగా రికార్డు స్థాయిలో కొత్త సభ్యత్వాలు నమోదుకాగా.. దీనికి న్యూ ఇయర్ డిస్కౌంట్లు, ఆఫర్లు కూడా కారణమేనని తెలుస్తోంది. అయితే ఎప్పటి మాదిరిగానే మొదటి నెలలోనో.. లేదా రెండు నెలల తర్వాతనో వదిలేస్తే.. అది ఆరంభ శూరత్వంగా మారుతుందని ట్రైనర్లు చెబుతున్నారు. ఒక్కసారిగా భారీ స్థాయిలో కసరత్తులు చేసి.. ఆ వెంటనే వదిలేయడం సరికాదని, రోజుకు కొంత సమయం అనుకుని ఆ మేరకు క్రమంగా పెంచుకుంటూ వెళితే మంచి ఫలితాలు సాధించవచ్చని ట్రైనర్లు సూచిస్తున్నారు. తీర్మానాల ఫలం.. జిమ్కు బలం.. సాధారణ బరువు తగ్గించే లక్ష్యాలు మొదలుకుని.. పలు రకాల వ్యాధులకు చికిత్సగా వ్యాయామాలను సూచిస్తున్నారు నిపుణులు.. దీంతో ముందస్తు నివారణే ముఖ్యమనే ఆలోచనతో అనేక మంది జిమ్స్లో చేరుతున్నట్లు ట్రైనర్లు చెబుతున్నారు. నిశ్చల ఆధునిక జీవనశైలి కారణంగానే అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయనే అవగాహన అనేక మందిలో కలుగు తుండడంతో వాయిదా వేస్తూ వచి్చన వ్యాయామ కార్యాచరణను కొత్త ఏడాది సందర్భంగా అమలులోకి తీసుకొచ్చారు. జనవరి నెలలో యేటా ఈ పెరుగుదల ఉంటుందనేది ముందే తెలుసు కాబట్టి, పేరొందిన బ్రాండెడ్ జిమ్స్.. సభ్యత్వ రుసుములపై 30 నుంచి 50 శాతం వరకూ డిస్కౌంట్స్ ప్రకటించడం ఈ సారి మరింత ఊపుని అందించింది. ఇంట్లోనే వర్కవుట్స్.. ‘ఇంట్లోనే వ్యాయామం చేయాలని, హోమ్ జిమ్స్ ఏర్పాటు చేసుకోవాలని ఆశించే వారి సంఖ్య కూడా ఈ సారి భారీగానే పెరిగింది. ఇంట్లోనే వర్కవుట్ చేసుకునేందుకు వీలైన పరికరాలను ఎంచుకునే వారు పెరగడంతో మేము ‘గెట్ ఫిట్ డేస్’ పేరిట ప్రత్యేక విభాగాన్ని ప్రారంభించాం’ అంటూ ఆన్లైన్ విపణి అమెజాన్ బజార్ ప్రతినిధి ఒకరు వెల్లడించారు. ఈ మేరకు డిసెంబర్ నెలాఖరులో భారీగా జిమ్ ఎక్విప్మెంట్ అమ్ముడుపోయినట్లు వివరించారు. మధ్య వయసువారే అధికం.. ఈ ఏడాది కొత్తగా జిమ్స్ సభ్యత్వాలు తీసుకున్నవారిలో మధ్య వయస్కులు అధికంగా ఉండడం విశేషం అని నగరంలోని ఓ జిమ్ నిర్వాహకులు త్రినేత్ర తెలిపారు. తాము అందుకున్న సభ్యత్వాల్లో దాదాపు 54 శాతం మిడిల్ ఏజ్డ్ వాళ్లవే కాగా 40 శాతం యువత, మిగిలిన వారు ఉన్నారని, యువతుల సంఖ్య కూడా భారీగానే పెరిగిందని ఆయన వివరించారు. డయాబెటిస్, బీపీ తదితర దీర్ఘకాలిక వ్యాధుల నియంత్రణ కోసం మందులపై ఆధారపడే పరిస్థితిని తగ్గించే శక్తి వ్యాయామానికి ఉందనే అవగాహన పెరగడమే దీనికి కారణమని వ్యాయామ శిక్షకుడు విజయ్ గంధం తెలిపారు. చదవండి: కర్ణాటకలో అద్భుతం : ఇది ‘మామూలు చిరుత’ కాదుస్లో.. స్టడీ.. విన్.. అయితే సభ్యత్వ రుసుములు చెల్లించి జిమ్లో, ఫిట్నెస్ స్టూడియోల్లో చేరినంత సులభంగా వ్యాయామాన్ని క్రమబద్ధంగా కొనసాగించడం కష్టమని ప్రముఖ సెలబ్రిటీ ట్రైనర్ కరణ్ చెబుతున్నారు. జనవరిలో పెరిగినట్టు కనిపించిన సభ్యత్వాల సంఖ్య కేవలం ఫిబ్రవరి కల్లా 20 శాతానికి అలాగే మార్చి నెల వచ్చే సరికి 35 శాతానికి పైగా తగ్గిపోతున్నట్లు పాత గణాంకాలు వెల్లడిస్తున్నాయన్నారు. కాబట్టి త్వరిత ఫలితాల కోసం ఆధారపడకుండా, సహేతుకమైన లక్ష్యాలతో ముందుకు సాగాలని సూచించారు. కొత్తగా వ్యాయామం ప్రారంభించినప్పుడు వచ్చే ఒళ్లునొప్పులు, శారీరక సమస్యల విషయంలో గాభరా పడకుండా నిత్యం శిక్షకులు, వైద్యుల సూచనలను అనుసరిస్తూ ఫిట్నెస్ రొటీన్ కొనసాగించాలని, అదే విధంగా డైట్లోనూ తగిన మార్పులు, చేర్పులు చేసుకోవాలని స్పష్టం చేశారు. ఇదీ చదవండి: రూ. 25 వేలకే అమ్మాయిలు : మంత్రి భర్త వ్యాఖ్యలు వీడియో వైరల్ -
కిమ్స్లో జాతీయస్థాయి రుమటాలజీ సదస్సు
హైదరాబాద్, సాక్షి : ఆర్థరైటిస్, ఆస్టియో ఆర్థరైటిస్, లూపస్, ఆటో ఇమ్యూన్ వ్యాధులు తదితర రుమటాలజీ సమస్యలకు ప్రపంచవ్యాప్తంగా అనేక కొత్త రకాల చికిత్సా పద్ధతులు వస్తున్నాయని, వీటి గురించి రుమటాలజిస్టులు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ రోగులకు సాంత్వన కలిగించేందుకు ప్రయత్నించడం ముదావహమని కిమ్స్ ఆస్పత్రుల ఛైర్మన్, ఎండీ డాక్టర్ బొల్లినేని భాస్కరరావు అన్నారు. ఆస్పత్రి ప్రాంగణంలో రెండు రోజుల పాటు జరిగే క్లినికల్ రుమటాలజీ కాన్ఫరెన్స్ 2026 (సీఆర్సీ 2026) సదస్సును ఆయన ప్రారంభించారు.దేశం నలుమూలల నుంచి 400 మందికి పైగా రుమటాలజిస్టులు ఈ సదస్సుకు హాజరయ్యారు. రెండేళ్లకు ఒకసారి మాత్రమే నిర్వహించే ఈ సదస్సులోఅనుభవజ్ఞులైన రుమటాలజిస్టులు అత్యంత సంక్లిష్టమైన కేసులకు ఎలా చికిత్స చేశారన్న విషయాన్ని కేసుల వారీగా చర్చించిన తరువాత, తద్వారా సదస్సులో పాల్గొన్న అందరికీ ఈ తరహా కేసులకు ఎలా చికిత్స చేయాలన్న విషయాలను వివరించారు.సదస్సు ప్రారంభోత్సవంలో కిమ్స్ ఆస్పత్రి సీఎండీ డాక్టర్ బొల్లినేని భాస్కరరావు, కిమ్స్ హాస్పిటల్స్ సికింద్రాబాద్ మెడికల్ డైరెక్టర్ డా. సంబిత్ సాహు, డా. బి. శ్రీనివాస్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్, మినిస్టర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, డా. వినోద్ రవీంద్రన్ ప్రెసిడెంట్ ఎలెక్ట్, ఇండియన్ రుమాటాలజీ అసోసియేషన్, సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రి రుమటాలజీ విభాగం క్లినికల్ డైరెక్టర్ డాక్టర్ శరత్ చంద్రమౌళి, హైదరాబాద్ రుమటాలజీ సెంటర్ డైరెక్టర్ డాక్టర్ రాజ్కిరణ్ తదితరులు పాల్గొన్నారు. సదస్సు ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ వీరవల్లి శరత్ చంద్రమౌళి, సీఆర్సీ 2026 సైంటిఫిక్ ఛైర్ డాక్టర్ వినోద్ రవీంద్రన్, నేతృత్వంలో జరిగిన ఈ సదస్సులో రుమటాయిడ్ ఆర్థరైటిస్, లూపస్, యాంకైలోజింగ్ స్పాండిలైటిస్, సోరియాటిక్ ఆర్థరైటిస్, గౌట్, వాస్కులైటిస్, బాల్య ఆర్థరైటిస్, అరుదైన రుమాటిక్ కండిషన్ల వంటి అంశాలపై చర్చించారు. ఈ సదస్సులో ట్రైనీల కోసం రుమటాలజీ క్విజ్ కూడా నిర్వహించారు. సీఆర్సీ 2026 ప్రత్యేకతలలో ఒకటి కొత్తగా చేర్చిన ఇమేజ్ పోటీ. సదస్సులో పాల్గొన్న పలువురు ఈ అంశంలో చాలా చురుగ్గా పాల్గొన్నారు. సదస్సుకు తమ సృజనాత్మక కోణాన్ని జోడించారు. అదనంగా, భారతదేశం నలుమూలల నుండి 269 కేసు సారాంశాలను సమర్పించారు. ప్రతి కేటగిరీలో ఎంపిక చేసిన ముఖ్యమైన కేసులను కాన్ఫరెన్స్ సెషన్లలో చర్చించారు.ఈ సందర్భంగా డాక్టర్ వీరవల్లి శరత్ చంద్రమౌళి మాట్లాడుతూ, “సీఆర్సీ 2026 విజయవంతం కావడం, దేశవ్యాప్తంగా ఉన్న రుమటాలజిస్టులు ఉత్సాహభరితంగా భాగస్వామ్యం వహించడం ఎంతో సంతోషంగా ఉంది. ఇక్కడ సదస్సులో హాజరైన అనుభవజ్ఞులైన రుమటాలజిస్టులు అందరూ తమ తమ విజ్ఞానాన్ని పదిమందితో పంచుకోవడం, అత్యంత సమస్యాత్మకమైన కేసుల గురించి చర్చించడానికి ఈ సదస్సు ఒక విలువైన అవకాశాన్ని కల్పించింది. ఇందులో ప్రధానంగా రుమాటిక్, కండరాలు, లూపస్ వ్యాధులపై అవగాహన పొందగలిగాము” అన్నారు.భారతదేశంలో రుమటాలజీ రంగాన్ని అభివృద్ధి చేయడానికి క్లినికల్ రుమటాలజీ కాన్ఫరెన్స్ 2026 ఒక ప్రముఖ వేదికగా తన ప్రాముఖ్యతను మరోసారి నిరూపించింది. రుమటాలజీలో విజ్ఞాన భాగస్వామ్యం, వృత్తిపరమైన అభివృద్ధి సంప్రదాయాన్ని కొనసాగించడానికి సిద్ధంగా ఉన్న సీఆర్సీ తదుపరి ఎడిషన్ కోసం ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం అవుతున్నాయి. -
న్యూ ఇయర్ హ్యాంగోవర్: ఇలా చేస్తే క్షణాల్లో రిలీఫ్..!
న్యూ ఇయర్ సెలబ్రేషన్స్లో రాత్రంత ఆడిపాడి ఎంజాయ్ చేయడం కామన్. ముఖ్యంగా బిర్యానీలు, కూల్డ్రింక్స్తో చిల్ అవ్వుతూ..తెలియకుండానే ఎక్కువగా లాగించేస్తాం. దానికి తోడు లేటుగా ఏ అర్థరాత్రో బాగా పొద్దుపోయాక పడుకోవడంతో..తిన్న ఆహారమంతా అరగక పొద్దున్నంతా నరకరం చూస్తాం. తలంత పట్టేసి..అబ్బా చాలా ఇబ్బందిగా ఉంటుంది చాలామందికి. ఆ హ్యాంగోవర్ని వదులించుకోవడం అంత ఈజీ కాదు కూడా. అలాంటి సమస్యను ఈ రిఫ్రెషింగ్ డిటాక్స్ పానీయాలతో సులభంగా చెక్ పెట్టేయొచ్చని చెబుతున్నారు నిపుణులు. అదెలాగో తెలుసుకుందామా..!.రాత్రిపూట..అందులోనూ బాగా లేట్నైట్ వేపుళ్లు, అధిక నూనెతో కూడిన పదార్థాలు తినడం కారణంగా జీర్ణక్రియ మందగిస్తుంది. ముఖ్యంగా తలనొప్పి, వికారం, పొట్ట ఉబ్బరం, అలసట, పార్టీ హ్యాంగోవర్ వంటి సమస్యలతో సతమతమవుతుంటారు. అలాంటి వాళ్లు ఈ సమస్య నుంచి తర్విరతగతిన రిలీఫ్ పొందాలంటే సరైన డిటాక్స్ పానీయాలను తీసుకుంటే చాలు అని చెబుతున్నారు. ఇవి హైడ్రేటెడ్గా ఉండేలా చేసి, కాలేయ పనితీరు, జీర్ణక్రియకు మద్దతిస్తాయి. శరీరం వేగంగా కోలుకోవడానికి సహాయపడతాయట. ముఖ్యంగా మద్యం సేవించినవారికి ఇవి మరింత హెల్ప్ అవుతాయని చెబుతున్నారు. ఇవి ఇంట్లోనే సులభంగా తయరు చేసుకోవచ్చట కూడా. గోరువెచ్చని నీళ్లు నిమ్మకాయ..ఇది హ్యాంగోవర్కు చాలా ప్రయోజనకరమైనది. గోరువెచ్చని నిమ్మకాయ నీళ్లు హైడ్రేటెడ్గా ఉండేలా చేసి, జీర్ణక్రియను ప్రేరేపిస్తుందట. విటమిన సీ మోతాదు..కాలేయ ఎంజైమ్లకు మద్దతిస్తుందట. వికారం, పొట్ట ఉబ్బరాన్ని తగ్గిస్తుంది. చిటికెడు ఉప్పు, కొబ్బరి నీరు.. కొబ్బరి నీరు, ఉప్పు శరీరాన్ని తిరిగా ఉత్సాహభరితంగా ఉండేలా చేస్తుంది. ఇందులోని పొటాషియం, సహజ ఎలక్ట్రోలైట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది హైడ్రేషన్కి అనువైనది. అలాగే శరీరంలోని సోడియం స్థాయిలను పునరుద్ధరించడంలో సహాయపడుతుంది. కడుపుని తేలికగా చేస్తుంది. తలతిరగడం, నోరు పొడిబారడం, వంటి సాధారణ హ్యాంగోవర్ లక్షణాలను తగ్గిస్తుంది. అల్లం, తేనె నీరుఅల్లం, తేనె నీరు అనేది హ్యాంగోవర్ను సులభంగా నయం చేసే అద్భుతమై డీటాక్స్ వాటర్. అల్లం జీర్ణవ్యవస్థను శాంతపరచడానికి సహాయపడుతుంది. గ్యాస్ట్రిక్ సమస్యను నివారిస్తుంది. వికారం తగ్గడమే కాకుండా ఇందులోని తేనే సహజ గ్లూకోజ్ని అందిస్తుంది.దోసకాయ, పుదీనా, నిమ్మకాయ డిటాక్స్ వాటర్ఇది పొట్ట ఉబ్బరాన్ని తగ్గించి, హైడ్రేషన్కు మద్దతిస్తుంది. ముక్కలు చేసిన దోసకాయ, పుదీనా ఆకులు, నిమ్మకాయ ఒక బాటిల్ వాటర్లో వేసి రోజంతా త్రాగండి. దోసకాయలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. పుదీనా జీర్ణక్రియకు మద్దతిస్తుంది. నిమ్మకాయ కాలేయ పనితీరుకు మద్దతిస్తుంది.ఉసిరి నీళ్లు..శీతాకాలంలో ఉసిరిని చేర్చుకోవడం ఎంతో మంచిది. ఆమ్లాలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సీ పుష్కలంగా ఉంటాయి. ఇవి కాలేయ ఆరోగ్యానికి మద్దతిస్తాయి. ఆల్కహాల్ వల్ల కలిగే ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి. అల్లం జీర్ణవ్యవస్థను శాంతపరచడానికి సహాయపడుతుంది. హ్యాంగోవర్ తర్వాత అద్భుతమైన రికవరీ పానీయంగా మారుతుంది. అలాగే జీర్ణక్రియకు, శక్తి స్థాయిలను మెరుగుపరచడంలోనూ సహాయపడుతుంది,జీరా (జీలకర్ర) నీరుజీరా కలిపిన నీరు మీ మొత్తం ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉండటమే కాకుండా నూతన సంవత్సరానంతర హ్యాంగోవర్ను నయం చేయడానికి కూడా గొప్ప నివారణి కూడా. జీరా నీటి ఆమ్లత్వం పొట్ట ఉబ్బరం నుంచి బయటపడేలా చేస్తుంది. బరువు, మలబద్దకం, కడుపు అసౌకర్యం వంటి వాటి నుంచి బయటపడేలా చేస్తుంది.నివారించాల్సినవి:హ్యాంగోవర్ సమయంలో వీటికి మాత్రం దూరంగా ఉండాలికాఫీ తీసుకోకుంటేనే మంచిది. ఆ సమయంలో కడుపులో అసౌకర్యాన్ని కలిగిస్తుంది. ఎనర్జీ డ్రింక్లు రక్తంలోని చక్కెరను పెంచుతాయి, అలాగే కాలేయంపై మరింత ఒత్తిడి ఏర్పడేలా చేస్తుంది. నొప్పి నివారణ మందులు దరిచేరనివ్వకుండా ఉండటం.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: గాంధీ కుటుంబం మెచ్చే రణతంబోర్ నేషనల్ పార్క్..! అక్కడ న్యూ ఇయర్కి..) -
2025కి గుడ్బై.. 2026కి హెల్తీ వెల్కమ్
2025కు గుడ్బై పలికేశారా? కొత్త ఏడాదికి స్వాగతం అనేస్తున్నారా?. ఓకే.. గుడ్. 2026లో మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని నిర్ణయించుకున్నారా?.. అయితే ఈ ఈజీ టిప్స్ మీకోసమే. 2025లో శాస్త్రవేత్తల పరిశోధనల ఫలితాలివి! ఆలస్యమెందుకు?.. చదివేయండి.. తెలివిగా తినండి.. గుండె ఆరోగ్యంతోపాటు మన జీర్ణక్రియ సక్రమంగా ఉండేందుకు, నిద్ర, మూడ్ సమస్యలు అధిగమించేందుకు, రకరకాల నొప్పుల నుంచి ఉపశమనం కోసం కొంచెం తెలివిగా తినాలని, తాగాలని 2025లో జరిగిన పరిశోధనలు చెబుతున్నాయి. ఇంతకీ ఆ తినడం ఎలా ఉండాలంటే.. ➡️వారంలో ఒకటి నుంచి ఆరు వరకూ కోడిగుడ్లు తినడం గుండెజబ్బులతో చచ్చిపోయే ప్రమాదాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్న వారికీ కూడా ఇది వర్తిస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి. అలాగని అతిగా తినడం మంచిది కాదు.➡️అధిక రక్తపోటు నుంచి తప్పించుకునేందుకు ఉప్పు తినడం తగ్గించడం కాకుండా.. ఆహారంలో మరింత పొటాషియం ఉండేలా చూసుకోవడం మేలు. అరటిపండ్లు, ఆప్రికాట్స్, చిలగడదుంపల్లో పొటాషియం పుష్కలంగా లభిస్తుంది.పొటాషియం అధికంగా ఉండేవి.. • అరటిపండ్లు• ఆప్రికాట్స్ (జారదాలు)• చిలగడదుంపలు (Sweet potatoes)• పాలకూర, గోంగూర, కూరగాయలు• బీన్స్, పప్పులు• కొబ్బరి నీరు• కలబంద (Avocado)గమనిక.. కిడ్నీ సమస్యలు ఉన్నవారు అధిక పొటాషియం తీసుకోవడం ప్రమాదకరం కావొచ్చు. కాబట్టి, నిపుణుల సలహా తీసుకుని ఆహారంలో పొటాషియం బ్యాలెన్స్ తప్పకుండా చూసుకోవాలి➡️రోజంతా కూర్చునే ఉంటున్నారా? అయితే మీ రక్తనాళాలను కాపాడుకోవాలంటే... కోకోలోని ఫ్లేవనాల్స్ బాగా ఉపయోగపడతాయి. ఇవి ‘సిట్టింగ్ డిసీజ్’తో వచ్చే సమస్యల తీవ్రతను తగ్గిస్తాయి. పరిశోధనల ప్రకారం.. రోజుకు కోకో పౌడర్ లేదా డార్క్ చాక్లెట్ (70% పైగా కోకో ఉన్నది) తీసుకోవడం రక్తనాళాల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఫ్లేవనాల్స్ రక్తంలో నైట్రిక్ ఆక్సైడ్ ఉత్పత్తిని పెంచి, రక్తనాళాలను సడలిస్తాయి. దీని వల్ల రక్తప్రవాహం పెరుగుతుంది, గుండెజబ్బుల ప్రమాదం తగ్గుతుంది.ఎలా తీసుకోవాలంటే.. డార్క్ చాక్లెట్ (చక్కెర తక్కువగా ఉండే)కోకో పౌడర్ (unsweetened)కాకా నిబ్స్కోకో డ్రింక్స్ (చక్కెర లేకుండా)అధిక చక్కెర, పాలు కలిపిన చాక్లెట్ తీసుకుంటే ప్రయోజనం తగ్గిపోతుంది.మితంగా తీసుకోవాలి (రోజుకు 10–20 గ్రాముల డార్క్ చాక్లెట్ సరిపోతుంది).కొన్ని రకాల కొవ్వులు కేన్సర్ కణితులతో మన రోగ నిరోధక వ్యవస్థ పోరాడే సామర్థ్యాన్ని తగ్గిస్తాయి. అయితే మొక్కల ఆధారిత కొవ్వులు (plant-based fats) అలాంటి ప్రతికూల ప్రభావం చూపవు. మంచి కొవ్వులు• ఆలివ్ ఆయిల్• కొబ్బరి నూనె• పామ్ ఆయిల్ (మితంగా)• అవకాడో, డ్రైఫ్రూట్స్👆 ఇవి ఇమ్యూన్ సిస్టమ్ను దెబ్బతీయవు. కొన్ని సందర్భాల్లో యాంటీ-ఇన్ఫ్లమేటరీ ప్రభావం చూపుతాయి.➡️మలబద్ధకాన్ని తొలగించేందుకు పీచు పదార్థం ఎక్కువగా ఉన్న పండ్లు ఉపయోగపడతాయి. అయితే కీవీ పండ్లు ఈ జాబితాలో తొలిస్థానంలో ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.➡️ఆలివ్ ఆయిల్ వంటి ఆరోగ్యకరమైన కొవ్వులతోపాటు, శాఖాహార ప్రధానమైన మెడిటరేనియన్ ఆహారం ఐబీఎస్ (ఇరిటెబుల్ బౌల్ సిండ్రోమ్) సమస్యను తగ్గిస్తుంది.➡️అరటి పండు స్మూతీల్లో వాడే పదార్థాల్లోని మంచి పోషకాలు సరిగ్గా జీర్ణం కానివ్వదు. అరటిలో సహజంగా ఉన్న పోషకాలు, ఇతర పదార్థాల కలయిక వల్ల శరీరానికి పూర్తిగా అందకపోవచ్చు. కాబట్టి.. అరటితో పాలు / బాదం పాలు(ప్రోటీన్, కాల్షియం అందిస్తాయి), పీనట్ బట్టర్ / బాదం బట్టర్ (ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్ అందిస్తుంది), ఓట్స్ (ఫైబర్, శక్తినిస్తుంది), కాకా పొడి (unsweetened cocoa) యాంటీఆక్సిడెంట్లు, చియా సీడ్స్ / ఫ్లాక్స్ సీడ్స్ (ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు), బెర్రీలు (స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ) (విటమిన్ C, యాంటీఆక్సిడెంట్లు), తేనె / ఖర్జూరం (సహజమైన తీపి) అందిస్తాయి. అలాగే.. అరటితో కలపకూడనివి కొన్ని ఉన్నాయి. సిట్రస్ ఫలాలు (కమలపండు, మొసంబి, నిమ్మ) వీటివల్ల ఆమ్లత్వం(యాసిడిటీ) పెరిగి అరటిలోని పోషకాలు శోషణ తగ్గుతుంది. అధిక చక్కెర / ఐస్క్రీమ్ వల్ల ఫైబర్ దక్కకపోగా.. విటమిన్ ప్రయోజనం తగ్గిపోతుంది.ప్రాసెస్డ్ ప్రోటీన్ పౌడర్ల వల్ల కొన్ని సందర్భాల్లో జీర్ణక్రియకు ఆటంకం కలుగుతుంది. చాక్లెట్ సిరప్ (అధిక చక్కెర) సహజంగానే పోషకాలను తగ్గిస్తుంది. కాఫీ / టీ పొడి చేరిస్తే.. ఐరన్, కాల్షియం శోషణకు ఆటంకం కలుగుతుంది. ➡️చక్కెరల కంటే కృత్రిమ చక్కెరలతో కూడిన పానీయాలు మధుమేహం వచ్చే అవకాశాలను ఎక్కువ చేస్తాయి. కాబట్టి ఆ రకమైన పానీయాలు తీసుకోకపోవడం మేలు.పునరుత్తేజానికి వ్యాయామం..సరైన నిద్ర + సరైన వ్యాయామం= ఆరోగ్యం. అయితే హై-ఇంపాక్ట్ వ్యాయామాలు (జంపింగ్, రన్నింగ్) కీళ్ల సమస్యలు పెంచే అవకాశం ఉంది. కాబట్టి నడక, సైక్లింగ్, ఈత వంటివి మేలు. సుఖ నిద్రతో మన వ్యాయామ అలవాట్లు మెరుగవుతాయి. అయితే.. సాయంత్రాలు వ్యాయామం చేయడం అంత మంచిదేం కాదు. హృదయ స్పందన, శరీర ఉష్ణోగ్రత పెరిగి నిద్రకు భంగం కలగొచ్చు. నిద్రను నిర్లక్ష్యం చేస్తే వ్యాయామం ప్రయోజనం తగ్గిపోతుంది. కాబట్టి.. నిద్రకు ఎక్కువ ప్రాధాన్యమివ్వాలి. ఒకవేళ సాయంత్రమే చేసే వీలుంటే గనుక.. తేలికపాటి వ్యాయాయాలు (నడక, యోగా, స్ట్రెచింగ్) చేసుకోవచ్చు. ఇవి నిద్రకు ఆటంకం కలిగించవు.మానసిక సంతోషానికి.. జీవనశైలిలోని చిన్న చిన్న అలవాట్లు మన మానసిక ఆరోగ్యంపై, పనితీరుపై గణనీయమైన ప్రభావం చూపుతాయి. తాజా పరిశోధనలు కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెలుగులోకి తెచ్చాయి.క్రియాటిన్ సాధారణంగా కండరాల శక్తి పెంపు కోసం ఉపయోగించే పోషక పదార్థం. కానీ, ఇది మెదడు శక్తి వినియోగాన్ని మెరుగుపరచడంతో పాటు డిప్రెషన్ (మనోవ్యాకులత) చికిత్సలో సహాయక పాత్ర పోషిస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి. అదెలాగంటే.. క్రియాటిన్ తీసుకోవడం వల్ల మెదడు కణాలు శక్తిని సమర్థవంతంగా వినియోగించుకుంటాయి, ఫలితంగా మూడ్ స్థిరంగా ఉండేలా చేసి చికిత్సలో మెరుగైన ఫలితాన్ని చూపిస్తుంది. తిట్టుకోవడం.. పనితీరు పెంపుతిట్టుకోవడం అనేది.. ప్రతికూలంగా భావించే అంశమే. కానీ.. శాస్త్రవేత్తలు చెబుతున్నది ఏమిటంటే తీవ్ర ఒత్తిడి లేదంటే కష్టమైన పనిలో మనల్ని మనం కాస్త ఘాటు పదాలతో తిట్టుకోవడం వల్ల శరీరం ఎక్కువ శక్తి ఇస్తుంది. ఇది నొప్పి తట్టుకునే సామర్థ్యాన్ని పెంచి.. పనితీరు మెరుగుపరుస్తుంది. క్రీడల్లో, కఠినమైన వ్యాయామాల్లో ఇది సహజ రీతిలో కనిపించే అంశమే.ఉదయాన్నే కాఫీ.. మూడ్ మెరుగుదలకాఫీలోని కెఫిన్ మెదడులో డోపమైన్, సెరోటోనిన్ వంటి రసాయనాల స్థాయిని పెంచుతుంది. ఫలితంగా, రోజంతా ఉత్సాహం, ఏకాగ్రత, మూడ్ మెరుగుపడతాయి. ఉదయం ఒక కప్పు కాఫీ తాగడం వల్ల పనితీరు పెరిగి, జీవనశైలి ఉల్లాసంగా ఉంటుంది. ఇది మేం చెబుతున్నమాట కాదు.. పరిశోధనల్లో తేలిన అంశమే. -
మైగ్రేన్ తలనొప్పి ఎందుకొస్తుందంటే..!
మైగ్రేన్తో బాధపడేవారికి పనిదినాన్ని కోల్పోవడం లేదా అనారోగ్య సెలవు తీసుకోవడం సాధారణ అనుభవమే. అయితే, ఇది ఉత్పాదకత తగ్గడానికి ప్రధాన కారణాలలో ఒకటిగా మారుతుందనే విషయం చాలామందికి తెలియదు. ముఖ్యంగా 20 నుంచి 50 ఏళ్ల వయసు గల వారిలో ఎక్కువగా కనిపించే సమస్య ఇది. క్రమరహిత పనివేళలు లేదా సమావేశాలు, అధిక స్క్రీన్ వినియోగం, దీర్ఘకాలం పాటు సరైన భంగిమలో కూర్చోవడంలో పొరపాట్లు, అలాగే నిరంతర ఒత్తిడి లేదా బర్నౌట్కు దగ్గరైన భావన వంటి అనేక కారణాలు మైగ్రేన్కు కారణాలు. ఈ సవాళ్లను గుర్తించి పరిష్కరించడం అత్యవసరం అని అంటున్నారు యశోదా హాస్పిటల్స్ డాక్టర్ జయదీప్ రే చౌదరి.మైగ్రేన్ సమయంలో ఏం జరుగుతుందంటే..ప్రపంచవ్యాప్తంగా, మైగ్రేన్ను కేవలం తలనొప్పిగా కాకుండా, ఒక నర సంబంధ వ్యాధిగా గుర్తిస్తున్నారు. గణాంకాల ప్రకారం, ప్రతి నలుగురిలో ఒకరు మైగ్రేన్తో బాధపడుతుండగా, భారతదేశ జనాభాలో దాదాపు 25 శాతం మంది ఈ సమస్యను అనుభవిస్తున్నారని అంచనా. ది లాన్సెట్ (2019) నివేదిక ప్రకారం, మైగ్రేన్లు ప్రపంచవ్యాప్తంగా రెండవ అత్యధికంగా అంగవైకల్యాన్ని కలిగించే నర సంబంధ వ్యాధిగా పేర్కొంది.చాలా మంది రోగులు మైగ్రేన్తో జీవితాంతం పోరాడాల్సి వస్తుంది. దీనివల్ల వ్యక్తిగతంగా, వృత్తిపరంగా తీవ్రమైన ప్రభావాలు ఎదురవుతాయి. మైగ్రేన్ సమయంలో, మెదడు తన చుట్టూ ఉన్న రక్షణ పొరలైన మెనింజెస్కు సంకేతాలను పంపుతుంది. దీనికి ప్రతిస్పందనగా, CGRP (కాల్సిటోనిన్ జన్యు-సంబంధిత పెప్టైడ్) వంటి రసాయనాలు విడుదలవుతాయి. ఈ CGRP నిర్దిష్ట గ్రాహకాలతో బంధించబడినప్పుడు, మెనింజెస్లోని రక్తనాళాలు విస్తరించి వాపుకు గురవుతాయి.ఈ నాళాల విస్తరణ, క్రిమిరహిత వాపు కలయిక మైగ్రేన్ లక్షణ నొప్పిని ఉత్పత్తి చేస్తుంది. నొప్పి సంకేతం అప్పుడు మెదడులోకి తిరిగి ప్రయాణిస్తుంది, అక్కడ అది ప్రాసెస్ చేయబడుతుంది, ఫలితంగా వికారం, కాంతికి సున్నితత్వం (ఫోటోఫోబియా), ధ్వనికి సున్నితత్వం (ఫోనోఫోబియా) వంటి లక్షణాలు ఏర్పడతాయి. పరిష్కారం ఎలాగంటే..యశోదా హాస్పిటల్స్ న్యూరాలజిస్ట్ డాక్టర్ జయదీప్ రే చౌదరి, ఈ సమస్యను ఇలా పరిష్కారిస్తామని చెప్పుకొచ్చారు. లక్ష్యం కేవలం నొప్పిని లేదా ఒక్కో ఎపిసోడ్ను నియంత్రించడం మాత్రమే కాదు, మైగ్రేన్ నుంచి నిజమైన విముక్తిని సాధించడం. ఇందుకు మైగ్రేన్ వచ్చే పౌనఃపున్యాన్ని తగ్గించడం, దాని వ్యవధిని కుదించడం మరియు రోజువారీ జీవితంపై పడే ప్రభావాన్ని తగ్గించడం అవసరం. అలా చేయడం ద్వారా ప్రజలు తమ జీవన నాణ్యతను తిరిగి పొందగలుగుతారు, పనికి పూర్తి స్థాయిలో తిరిగి చేరగలుగుతారు. మైగ్రేన్ నుంచి స్వేచ్ఛను పొందడమే మా తుది ఆశయం.”పని రోజుల్లో మైగ్రేన్ ప్రభావంభారతదేశంలో మైగ్రేన్లు ఉత్పాదకతపై గణనీయమైన ప్రభావం చూపుతున్నాయి. మైగ్రేన్తో బాధపడే వ్యక్తులు నెలకు సగటున 5.9 పనిదినాలను కోల్పోతున్నారు. దీనివల్ల వ్యక్తిగతంగా ఇబ్బందులు పెరగడమే కాకుండా, దేశ ఆర్థిక వ్యవస్థపై కూడా భారమైన ప్రభావం పడుతోంది. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ఆదాయ నష్టం, జీవన నాణ్యతతో బాధపడుతున్నారు. మైగ్రేన్ కారణంగా వారు ముఖ్యమైన పని, వ్యక్తిగత కార్యక్రమాలకు హాజరు కాలేకపోతున్నారు, చివరి నిమిషంలో ప్లాన్లను రద్దు చేయాల్సి వస్తోంది లేదా శరీరం సహకరించకపోయినా పని చేయాల్సి వస్తోంది. దీని కారణంగా భారతదేశంలో ఒక్క వ్యక్తికి సంవత్సరానికి సగటు ఆర్థిక నష్టం రూ. 8,731గా అంచనా. అంటే దేశానికి మొత్తం ఆర్థిక నష్టం సుమారు రూ. 18,674 కోట్లకు పైగా నష్టంగా అంచనా.ఇది శారీరక నొప్పిని మించి, మైగ్రేన్లు తరచుగా ఏకాగ్రత లోపానికి, పని వేగం తగ్గడానికి, పనితీరు మందగించడానికి కారణమవుతుంది. కొన్ని సందర్భాల్లో ఇవి వ్యక్తులను తమ వృత్తి ఎంపికలు, కెరీర్ మార్గాలను మళ్లీ ఆలోచించాల్సిన పరిస్థితికి కూడా నెట్టేస్తాయి.ఈ సమస్య నుంచి బయటపడాలంటే..మైగ్రేన్ సంరక్షణకు సమగ్ర దృక్పథం అవసరం. రోగులు సూచించిన మందులు, వైద్య సలహాలను క్రమబద్ధంగా అనుసరించడానికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఎందుకంటే ఈ జోక్యాలు దీర్ఘకాలిక వ్యాధి భారాన్ని గణనీయంగా తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. చికిత్స ప్రారంభ సమయం, సాధ్యమైన దుష్ప్రభావాలు, చికిత్సకు కట్టుబడి ఉండటం వంటి అంశాలపై వైద్యులు, న్యూరాలజిస్టులతో జరిగే స్పష్టమైన, నిరంతర కమ్యూనికేషన్ నమ్మకాన్ని బలోపేతం చేస్తుంది.తలనొప్పి ప్రారంభమైన వెంటనే మైగ్రేన్ మందులు తీసుకుంటే అవి అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తాయి. అలాగే, నిర్మాణాత్మక పని విరామాలు తీసుకోవడం, సరిపడా నీరు త్రాగడం, ఆరోగ్యకరమైన నిద్రా సమయాలను పాటించడం, స్క్రీన్ సమయం-తో పాటు స్క్రీన్ కాంతిని సమర్థంగా నిర్వహించడం వంటి జీవనశైలి చర్యలు మైగ్రేన్ దాడుల తరచుదనాన్ని గణనీయంగా తగ్గించగలవు. తలనొప్పి డైరీలో లక్షణాలు, ట్రిగ్గర్లను నమోదు చేయడం ప్రారంభ దశలోనే జోక్యం చేసుకోవడానికి, అలాగే వ్యక్తిగత ట్రిగ్గర్లను గుర్తించి నివారించడానికి ఒక ఉపయోగకరమైన అభ్యాసంగా పనిచేస్తుంది.ఇంటర్నేషనల్ హెడకే సొసైటీ తన క్లినికల్ థెరపీ దృక్కోణంలో ‘మైగ్రేన్ ఫ్రీడమ్’ అనే కొత్త లక్ష్యాన్ని ప్రతిపాదించింది. ఇకపై చికిత్స లక్ష్యం కేవలం నొప్పిని తగ్గించడం లేదా ఒక్కో ఎపిసోడ్ను నివారించడం మాత్రమే కాదు, మైగ్రేన్ నుంచి సంపూర్ణ విముక్తిని సాధించడమే. ఈ దృక్కోణం వ్యక్తులు తమ సాధారణ పనితీరును తిరిగి పొందేందుకు, వేగంగా పనికి పునరాగమనం చేసేందుకు, మొత్తం జీవన నాణ్యతను మెరుగుపరుచుకునేందుకు సహాయపడటంపై దృష్టి సారిస్తుంది. సరైన ఔషధ చికిత్స, వ్యక్తిగత ట్రిగ్గర్లను గుర్తించడం, లక్ష్యిత జీవనశైలి సర్దుబాట్ల సమన్వయంతో, ఈ లక్ష్యాన్ని సాధించడం సాధ్యమవుతుంది. మనస్సు స్పష్టంగా, పనిదినాలు ఉత్పాదకంగా కొనసాగేందుకు మార్గం సుగమమవుతుంది.--డాక్టర్ జయదీప్ రే చౌదరి, న్యూరాలజిస్ట్, యశోదా హాస్పిటల్స్(చదవండి: వాట్ యాన్ ఐడియా..! యువతకు సాంకేతికతో భావోద్వేగ సందేశం..) -
కేవలం 15 వారాలలో 22 కిలోల బరువు తగ్గాలంటే..!
బరువు తగ్గేందుకు రకరకాల డైట్లు, వ్యాయామాల తోపాటు..డిటాక్స్ డ్రింక్లు తోడైతే మరింత త్వరితగతిన బరువు తగ్గుతాం. ఇవి మన ఇంట్లోదొరికే వాటితోనే సులభంగా తయరు చేసుకోవచ్చు కడా. కఠినమైన డైట్, వర్కౌట్ల కంటే..ఇలాంటి సింపుల్ చిట్కాలతో మరింత సులభంగా బరువు తగ్గిపోగలమని చెబుతున్నారు ఫిట్నెస్ నిపుణులు. తేలిక పాటి వర్కౌట్లు, చక్కటి ఆరోగ్యకరమైన డైట్ తోపాటు ఇలాంటి కొలెస్ట్రాల్ని తగ్గించే అద్భతమైన పానీయాలు త్వరితగతిన వెయిట్లాస్ అవ్వడంలో బాగా హెల్ప్అవుతాయట. నిశబ్దంగా వొంట్లో కొవ్వుని తగ్గించే ఆ గట్ రీసెంట్ డ్రింక్ ఏంటి? ఎలా తయారు చేసుకోవాలి వంటి వాటి గురించి సవివరంగా తెలుసుకుందామా..!.ఫిట్నెస్ కోచ్ నేహా పరిహార్ కేవలం 15 వారాలలో 22 కిలోల బరువు తగ్గారట. అందుకు ఈ గట్ రీసెట్ డ్రింక్ బాగా హెల్ప్ అయ్యిందట. ఇది మన ఇంట్లో దొరికే దేశీ వస్తువులతో తయారు చేసే సాధారణ దేశీ మిశ్రమ టానిక్గా చెబుతున్నారు నేహా. అందుకు కావాలసినవి:అజ్వైన్ (వాము): 1 టేబుల్ స్పూన్ సోంపు : 2 టేబుల్ స్పూన్లు మెంతి గింజలు (మెంతి గింజలు): 1 టేబుల్ స్పూన్ తాజాగా తురిమిన అల్లం: 1 టేబుల్ స్పూన్ నీరు: 2.5 లీటర్లతయారీ విధానం:నీటిలో వాము, సొంపు, మెంతి గింజలు వేసి బాగా మరిగించాలి. ఆ తర్వాత మంటను కాస్త తగ్గించిన అప్పుడే తురిమిన తాజా అల్లం వేసి కొద్దిసేపు మరగనివ్వండి. ఆ తర్వాత వడకట్టి దానికి కొంచెం నిమ్మకాయ రసం జోడించి సేవించాలి. ఇది గోరువెచ్చగా ఉన్నప్పుడే తీసుకోవాలి. ఇలా 14 రోజుల చేసి చూస్తే..తప్పక మంచి ఫలితాన్ని అందుకుంటామని చెబుతున్నారు ఫిట్నెస్ కోచ్ నేహా.కలిగే లాభాలు..నేహా ప్రకారం,కొలెస్ట్రాల్ని ఎలా కరిగిస్తుందంటే..జీర్ణక్రియను మెరుగ్గా ఉంచుతుంది, కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుందిఅదనపు నీటి నిలుపుదలను బయటకు పంపిచేయడంలో సహాయపడుతుందిఇన్సులిన్ పనితీరు మెరుగవుతుంది. జీవక్రియ పనితీరుని మెరుగ్గా ఉంచుతుందిపేగు మంటను శాంతపరుస్తుందిచెడుకొలెస్ట్రాల్ని బయటకు పంపించేస్తుందిచివరగా ఈ పానీయం బరువు తగ్గేలా చేయదు, మన శరీర వ్యవస్థకు మద్దతు ఇచ్చి..ఆయా వ్యవస్థల పనితీరుని సమర్థవంతంగా ఉంచి..బరువుతగ్గేందుకు దారితీస్తుందని చెబుతోంది నేహా. దీంతోపాటు సమతుల్య భోజనం, తేలికపాటి వ్యాయామాలు, వేళ్లకు నిద్ర తోడైతే బరువు తగ్గడం మరింత సులభమని చెబుతోంది ఫిట్నెస్ కోచ్ నేహా. ఈ చిన్నపాటి సాధారణ మార్పులు చోటుచేసుకుంటే సత్ఫలితాలను త్వరితగతిన పొందుగలమని చెప్పుకొచ్చింది.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణుల సూచనలు సలహాలు పాటించటం ఉత్తమం. View this post on Instagram A post shared by Neha Parihar (@growithneha) (చదవండి: సల్మాన్ ఖాన్ ఐకానిక్ ఫిరోజా బ్రాస్లెట్ వెనుక ఇంట్రస్టింగ్ స్టోరీ ఇదే..! అంత ఖరీదా..?) -
హీరో మహేశ్ నేర్చుకుంటున్న కలరిపయట్టుతో..ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా!
వారణాసి’మూవీతో ప్రేక్షకుల ముందుకురానున్నారు హీరో మహేశ్ బాబు. ఆ మూవీ కోసం ప్రాచీన భారత యుద్ధ కళ కలరిపయట్టు (Kalarippayattu) నేర్చుకున్నారు. ఆయనకు శిక్షణ ఇచ్చిన ట్రైనర్ పెట్టిన పోస్ట్తో ఈ విషయం బయటకు వచ్చింది. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో మహేశ్బాబు ‘రుద్ర’ పాత్రలో నటిస్తోన్న విషయం తెలిసిందే. ఈ పవర్ఫుల్ పాత్ర కోసం ఆయన కలరిపయట్టు నేర్చుకుంటున్నట్లు సమాచారం. ఇక కలరిపయట్టు ఇటీవల చాలామంది ప్రముఖులు, సెలబ్రిటీలు కూడా ఎంతో ఇష్టంతో నేర్చుకుంటున్నారు. ముఖ్యంగా ఫిట్నెస్ కోసం, మానసిక రుగ్మతల నుంచి బయటపడేందుకు దీన్ని నేర్చుకునేందుకు మక్కువ చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలేంటి కలరియపట్టు యుద్ధ కళ? ఇది ఫిట్నెస్కి ఎలా ఉపకరిస్తుంది సవివరంగా తెలుకుందాం.!.ఇంతకముందు ఈ కలరిపయట్టుని సైనా నెహ్వాల్ బయోగ్రఫీలో కథానాయకిగా తన నటనతో మెప్పించి తెలుగువారి అభిమానాన్నీ పొందిన బాలీవుడ్ నటి పరిణితిచోప్రా కూడా నేర్చుకున్నట్లు ఓ ఇంటర్వ్యూలో ఆమె స్వయంగా వెల్లడించారు కూడా. దీన్ని సాధన చేస్తే..బాడీ ఎంతో యాక్టివ్గా ఉన్నట్లు ఉంటుందని చెప్పుకొచ్చారామె. కలరిపయట్టు అంటే.కళరిపయట్టు లేదా కళరి అనేది కేరళ రాష్ట్రంలో ఆవిర్భవించిన ఒక ద్రవిడ యుద్ధ క్రీడ. దీన్ని ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన యుద్ధ క్రీడగా అభివర్ణిస్తారు. దీన్ని కేరళ, తమిళనాడు, శ్రీలంక, మలేషియాలో ఉండే మలయాళీలు తప్పక ప్రదర్శిస్తారట. కలరిపయట్టు శిక్షణలోని వేగవంతమైన కదలికలు ప్రతిచర్యలు, కంటి-చేతి ఏకీకరణ వంటివి ప్రాథమిక మోటార్ నైపుణ్యాలను మెరుగుపరుస్తాయి. అంతేగాదు మన శరీరం, మనస్సును అప్రమత్తంగా, చురుకుగా ఉంచుతాయి.ఎలా శిక్షణ ఇస్తారంటే..కలరి'గా పిలిచే ఒక ప్రత్యేక శిక్షణా స్థలంలో ఈ యుద్ధ కళ నేర్పుతారు. పోటీ పడుతున్న ప్రత్యర్థి కలరి అభ్యాసకుడికి కొత్త పోరాట కదలికలను నేర్పిస్తుంటాడు. శిక్షణ పొందే వ్యక్తి ఈ కొత్త విధానాలను గుర్తించి, వాటికి అనుగుణంగా ప్రతిఘటించే సామర్థ్యాన్ని పెంపొందించుకోవాల్సి ఉంటుంది. దీన్ని తమిళ రాజ్యాలతో యుద్ధాల చేసే సమయంలో మళయాళులు దీన్ని ఉపయోగించేవారని చరిత్రకారులు చెబుతున్నారు. ఆరోగ్య ప్రయోజనాలు..కలరిపయట్టు శిక్షణలో బలం, ఓర్పు ప్రాముఖ్యతను నేర్పిస్తుంది. ఇది శరరీ ధృడ్వత్వాన్ని పెంచుతుంది. హృదయనాళ ఆరోగ్యం మెరుగుపడుతుంది : ఇందులో వుండే వేగవంతమైన ఏరోబిక్ కదలికలు, శక్తివంతమైన దాడులు హృదయ స్పందన రేటును పెంచుతాయి. రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. ఊపిరితిత్తుల సామర్థ్యం మెరుగ్గా ఉంటుందిప్రాథమిక మోటారు వ్యవస్థకు సంబంధించిన డిజార్డర్తో బాధపడేవారికి, నరాల సమస్యలతో బాధపడేవారికి కలరిపయట్టుని నిపుణుల సమక్షంలో తర్ఫీదు పొందితే మంచి ఫలితం ఉంటుందట. అలా పలువురి విషయంలో నిరూపితమైందట కూడా. అంతేగాదు ఈ ప్రాచీన యుద్ధ విద్య పనిలో ఏకాగ్రత, నైపుణ్యాన్ని మెరుగుపరుస్తుందట. ఇంకెందుకు ఆలస్యం ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న కలరియపట్టుని నేర్చుకుని..ఆరోగ్యకరమైన జీవితాన్ని పొందుదాం. View this post on Instagram A post shared by kalari Hyderabad (@a_martialarts_space) (చదవండి: పదేళ్లుగా బాధపడ్డ ఆ వ్యాధితో..!భారత్ ఆరోగ్య సంరక్షణపై ఎన్నారై ప్రశంసల జల్లు) -
పదేళ్లుగా బాధపడ్డ ఆ వ్యాధితో..! హాట్టాపిక్గా భారత సంతతి వ్యక్తి పోస్ట్
భారత ఆరోగ్య రక్షణ వ్యవస్థపై ఓ ఎన్నారై ప్రశంసల జల్లు కురింపించాడు. తాను అమెరికాలో ఆ వ్యాధి కోసం చాలా డబ్బులు ఖర్చుపెట్టానని, కానీ నయం కాలేదని వాపోయాడు. పదేళ్లుకు పైగా ఆ వ్యాధితో నరకం చూశానని..కానీ తన మాతృభూమిలో సులభంగా నయమైపోయిందంటూ భారత చికిత్స విధానాన్ని మెచ్చుకుంటూ చేసిన పోస్ట్ నెట్టింట వైరల్గా మారడమే గాకా ఆ అంశం హాట్టాపిక్గా మారింది. అంతేగాదు భారతదేశంలో అభివృద్ధి చెందుతున్న ఆధునిక వైద్య విధానంపై చర్చలకు తెరలేపింది కూడా. ఎవరా ఆ ఎన్నారై?, ఏమా కథ చూద్దామా..అమెరికాలో స్టాప్ డేటా సైంటిస్ట్గా పనిచేస్తున్న ఓ ఎన్నారై ఓ వ్యాధి విషయంలో అమెరికాలో తాను ఎదుర్కొన్న అనుభవాన్ని రెడ్డిట్లో షేర్ చేసుకున్నాడు. ఆ పోస్ట్లో ఆ ఎన్నారై ఇలా రాసుకొచ్చాడు. "నేను అమెరికాలో పదేళ్లకు పైగా ఉన్నాను. అక్కడే తన చదువు, కెరీర్ అద్భుతం సాగింది. కానీ ఇంటిని, ఫ్యామిలీని బాగా మిస్ అయ్యా. అయితే అక్కడ సైంటిస్ట్గా పనిచేస్తున్నప్పుడు 2017లో స్కిజోఆఫెక్టివ్ డిజార్డర్ అనే మానసిక సమస్యతో బాధపడ్డాను. దీనివల్ల రోగులు నమ్మశక్యం కానీ బ్రాంతులకు గురై ఉద్యోగ కెరీర్, వ్యక్తిగత సంబంధాలు ఇబ్బందిగా మారపోతుంటాయి. ఈ మానసిక రోగంతో చాలా ఇబ్బంది పడ్డ. అందుకోసం అమెరికాలో చికిత్స కూడా తీసుకున్నా. అయితే అక్కడ అమెరికా డాక్టర్లు తనను డబ్బులు ఇచ్చే యంత్రంలా చూశారే గానీ, సరైన విధంగా చికిత్స చేయడంలో విఫలమయ్యారు. చాలా డబ్బు ఖర్చే చేశాను, ఏకంగా పదేళ్లకుపైగా బాధపడ్డను. కానీ, ఆ సమస్య నుంచి భయటపడింది కూడా లేదు. అయితే తనకు అక్కడ వైద్యులు ఆందోళన వల్ల ఈ సమస్య వస్తుందని, దాన్నితగ్గించుకునే ప్రయత్నంచేయమని సూచించేవారు, అందుకు సంబంధించి మందులే ఇచ్చారు. అంతేగాదు దీన్ని అధిగమించగలమే కానీ, నయం కాదని కూడా తేల్చి చెప్పారు. అయితే తాను మరో డాక్టర్ని సంప్రదించి సలహా తీసుకోవాలనే ఉద్దేశ్యంతో భారత్కి తిరిగి వచ్చి బెంగళూరులోని నిమ్హాన్స్లోని ప్రముఖ మానసిక వైద్యుడిని సంప్రదించాను. అక్కడ ఆ వైద్యలు ఆధ్వర్యంలో తీసుకున్న చికిత్స కారణంగా కాస్త రీలిఫ్ లభించడమే కాకుండా..చాలమటుకు క్యూర్ అయ్యింది. అంతేగాదు..ఈ మానసిక రుగ్మత నుంచి బయటపడ్డానని, కానీ ఆందోళన మాత్రం దరిచేరకుండా చూసుకోమని వైద్యులు సూచించారు అని "రాసుకొచ్చాడు". అందువల్లే తాను సాధ్యమైనంత తొందరలో భారత్కు వచ్చేసేలా ప్లాన్ చేసుకుంటున్నట్లు కూడా ఆ పోస్ట్లో పేర్కొన్నాడు. కాగా, నెటిజన్లు కూడా అతడి పోస్ట్తో ఏకభవిస్తూ..తాము కూడా అక్కడ ఉన్నప్పుడూ ఎదుర్కొన్న మానసిక సమస్యలను షేర్ చేసుకున్నారు. అంతేగాదు అక్కడ వాతావరణం కారణంగా రోగనిరోధక వ్యవస్థ సన్నగిల్లి మానసిక రుగ్మతలు బారినపడతామని అక్కడ వైద్యులు చెప్పారని మరికొందరూ పోస్ట్లు పెట్టడం గమనార్హం.(చదవండి: సంపాదన కంటే అదే అత్యంత ముఖ్యం! వైరల్గా ఎన్నారై పోస్ట్) -
ఇయర్ఫోన్ వాడకం ఇంత పరేషాన్ చేస్తుందా..?
హెడ్ఫోన్ ధరించడం కొందరికి ఫ్యాషన్ అయితే మరికొందరు ఏకాగ్రత, పనితీరు కోసం ఉపయోగిస్తుంటారు. ముఖ్యంగా చుట్టూ గందరగోళంగా ఉంటే..ఈ హెడ్ఫోన్లు ఎంతో హెల్ప్ అవుతాయి. అదీగాక సౌకర్యవంతమైన స్థాయిలో వాల్యూమ్ని ఎడ్జెస్ట్ చేసుకునే వెసులుబాటు కూడా ఉంటుంది. అయితే అవే హెడ్ఫోన్లు సుదీర్ఘకాలం లేదా గంటల తరబడి ఉపయోగిస్తే..చాలా ఆరోగ్య సమస్యలు ఫేస్ చేయక తప్పదని హెచ్చరిస్తున్నారు ..ఈఎన్టీ స్పెషలిస్ట్ డాక్టర్ జ్యోతిర్మయి హెగ్డే. మరి అవేంటో ఆయన మాటల్లోనే సవివరంగా తెలుసుకుందామా..!.వినికిడి నష్టం (NIHL)అధిక వాల్యూమ్లో ఎక్కువ సేపు హెడ్ఫోన్స్ పెట్టుకుని వింటే వినికిడి సమస్య వచ్చే ప్రమాదం ఎక్కువవుతుంది పరిశోధనలు చెబుతున్నాయి. గంటల తరబడి వినయోగించకపోవటమే మేలని చెబుతున్నారు.టిన్నిటస్ఇలా ఎక్కువసేపు హెడ్ఫోన్ ఉపయోగించడం వల్ల చెవులో వింత వింత శబ్దాలు వినిపించే టిన్నిటిస్ లక్షణాలు ఎదుర్కొనాల్సి వస్తుందట.అలసటకు గురవ్వడంఎక్కువసేపు హెడ్ఫోన్ ఉపయోగించడం వల్ల చెవి, మెదడు అలసటకు గురై..దృష్టి కేంద్రీకరించడం, లేదా ప్రసంగించడంలో సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉంటుందట. ఇది వైద్య పరమైన రుగ్మత కానప్పటికీ..ప్రభావం మాత్రం తారాస్థాయిలో ఉంటుందంటున్నారు.మిగతా శబ్దాలపై అవగాహన లోపం..అదేపనిగా హెడ్ఫోన్స్ ఉపయోగించటం వల్ల ఆ శబ్దాలకే అలవాటుపడి చుట్టుపక్కల పరిసరాల శబ్దాలను గ్రహించలేని పరిస్థితి ఎదురవ్వుతుందని ఆడియాలజిస్టులు హెచ్చరిస్తున్నారు. మతిమరుపు వచ్చే అవకాశంఅతిగా ఇయర్ ఫోన్స్ ఉపయోగించే వారిలో శ్రద్ధ లోపించి..జ్ఞాపకశక్తిని కోల్పోయే ప్రమాదం ఉందని పలు అధ్యయనాల్లో తేలిందని హెచ్చరిస్తున్నారు.సురక్షితంగా ఎలా ఉపయోగించాలంటే..ఇయర్ ఫోన్ని సురక్షితమైన పద్ధతిలో వాడుకుంటూ..వినికిడి, జ్ఞాపకశక్తిని కోల్పోయే సమస్యల బారిన పడకూడదంటే ఈ సింపుల్ చిట్కాలు అనుసరిస్తే చాలట.తక్కువ వాల్యూమ్తో వినడం.తప్పనిసరి అయితే తప్ప.. హెడ్ఫోన్ వినియోగాన్ని పరిమితంగా ఉపయోగించేలా చూడటం. సరైన హెడ్ఫోన్స్ని ఉపయోగించి..వాల్యూమ్ నేరుగా చెవిలోకి చొచ్చుకుపోనివ్వని సురక్షితమైనవి వాడటం మేలుఅంతేగాదు వినికిడి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయో లేదో గమనించుకోవడంచివరగా ఏ వస్తువైనా సరైన మార్గంలో పరిమితంగా వినియోగిస్తే ఎలాంటి సమస్యలు దరిచేరవు..పైగా మంచి ఆరోగ్యవంతమైన జీవితాన్ని బేషుగ్గా లీడ్ చేయగలుగుతామని చెబుతున్నారు ఈఎన్టీ నిపుణులు డాక్టర్ జ్యోతిర్మయి. --డాక్టర్ జ్యోతిర్మయ్ ఎస్ హెగ్డే, ఈఎన్టి స్పెషలిస్ట్, ఆస్టర్ వైట్ఫీల్డ్ ఆస్పత్రి (చదవండి: Travel Trends 2026: కొత్త ఏడాది టాప్-10 ప్రదేశాలు ఏవంటే..?) -
చలికాలం... ఫుడ్ విషయంలో జాగ్రత్త!
గజగజలాడించే చలికాలంలో... ఎప్పుడూ వేడివేడిగా, మసాలాలు బాగా దట్టించిన ఫుడ్ తినాలని అనిపిస్తూంటుంది. చలి కాబట్టి దాహం కూడా అనిపించదు. చాలామంది వేడివేడి కాఫీ, టీలతోనే గడిపేస్తూంటారు. అయితే చలికాలంలో ఇలాంటి అలవాట్లు అస్సలు మంచివి కావంటున్నారు వైద్యులు. గరం గరం ఆహారం, కాఫీ, టీలు.. జిహ్వ రుచికి హాయినిచ్చినా.. ఆరోగ్యానికి మాత్రం అస్సలు సరిపడవని అంటున్నారు. అందుకే ఈ వింటర్ సీజన్లో ఫుడ్ విషయంలో ఈ పొరపాట్లు అస్సలు చేయొద్దని హెచ్చరిస్తున్నారు. మరి అవేంటో చూద్దామా..ఈ చలికాలంలో సమతుల్య ఆహారాన్నే తీసుకోవాలని సూచిస్తున్నారు పోషకాహార నిపుణులు. అంతేకాదు ఈ కాలంలో తీసుకునే ఆహారం, రోగనిరోధక వ్యవస్థను, జీర్ణక్రియ, చర్మపరిస్థితి, శక్తిస్థాయిలు, హార్మోన్ సమతుల్యతకు అనుగుణమైన పోషకవంతమైన ఆహారమే తీసుకోవాలని చెబుతున్నారు. తప్పనిసరిగా తినాల్సినవి..ఈ కాలంలో సూప్లు, కిచిడి, పప్పులు, తృణధాన్యాల గంజి, తదితరాలు శరీరాన్ని వెచ్చగా ఉండచడమే కాకుండా, తగిన ఫైబర్ కూడా పుష్కలంగా లభిస్తుందని అంటున్నారు. అల్లం, పసుపు, దాల్చిన చెక్క, జీలకర్ర వంటి సుగంధద్రవ్యాలు పోషకవిలువను తగ్గించవు, వణికించే చలిని తట్టుకునేందుకు ఉపకరిస్తాయి కూడా. చలికాలం అని చాలామంది పండ్లు, కూరగాయల వినియోగాన్ని పరిమితం చేస్తారు. ఇది మలబద్ధకం, పొట్ట ఉబ్బరం, పోషకాల కొరతకు దారితీస్తుందట. నిజానికి ఈ కాలంలో లభించే పళ్లను తీసుకోవడం మంచి ఫలితాలనిస్తుందటతేలికగా వేయించిన ఆకుకూరలు, కాల్చిన దుంపలు, పండ్లు తదితరాల్లో ఫైబర్లు, యాంటిఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. పైగా జీర్ణక్రియకు మద్దతిస్తాయి. అంతేకాకుండా ఈ కాలంలో సిట్రస్ పండ్లు, ఆపిల్స్, జామ వంటవి రోగనిరోధక వ్యవస్థను మెరుగ్గా ఉంచడంలో హెల్ప్ అవుతాయటఇక 30 ఏళ్ల దాటిన మహిళలు, పెద్దల్లో కండరాల అలసట, ఆకలి పెరగడం, జుట్టు రాలడం, జీర్ణక్రియ నెమ్మదించడం వంటి సమస్యలను ఎదుర్కొంటారు కాబట్టి తీసుకునే ఆహారం కచ్చింగా పోషకవంతమైనేద తీసుకుంటే మేలు. పప్పులు, పన్నీర్, గుడ్లు, టోఫు, పెరుగు, నట్స, చేపలు, లీన్ మాంసాలు తదితరాలు ఆరోగ్యానికి మంచివే కాకుండా పోషక స్థిరత్వాన్ని అందించి శరీరాన్ని వెచ్చగా ఉంచేలా చేస్తాయట. ఈ కాలంలో హైడ్రేషన్ సమస్య ఎక్కువగా ఉంటుందట. ఎందుకంటే ఈ కాలంలో దాహం వేయదు, అందులోనూ చలికాలం కావడంతో పరిమితంగానే నీటిని తీసుకుంటారు అందువల్ల ఈ సమస్య ఉత్ఫన్నమవుతుందని చెబుతున్నారు. ఈ సీజన్లో స్వీట్స్ ఎక్కువగా తినాలనిపిస్తుంటుంది. ఇది హార్మోన్ల అసమతుల్యతకు, మానసిక స్థితిపై గట్టి ప్రభావం చూపిస్తాయట. స్వీట్స్కి ప్రత్యామ్నాయంగా సహజంగా లభించే తియ్యటి పండ్లు, ఖర్జురం, బెల్లం లేదా డార్క్ చాక్లెట్లు తీసుకుంటే మేలుచాలామంది కొవ్వులను అనారోగ్యకమరని తప్పుగా అపోహపడుతుంటారు. అయితే వింటర్లో ఆరోగ్యకరమైన కొవ్వలు హార్మోన్ల ఉత్పత్తికి, చర్మపరిస్థితికి, శరీర ఉష్ణోగ్రత నియంత్రకు ముఖ్యమైనవట. ఈ సమయంలో నెయ్యి, ఆలివ్ నూనె, నట్స్, అవకాడోలు, కొవ్వుచేపలను పరిమిత క్వాంటిటీలో తీసుకుంటే మంచిదట. ఇవి కడుపు నిండిన అనుభూతిని ఇవ్వడమే కాకుండా, దీర్ఘకాలిక ఆరోగ్యానికి ఎంతో మంచివని చెబుతున్నారు పోషకాహార నిపుణులు.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పాటించే ముందు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం.(చదవండి: Best Brain Boosting Foods: బ్రెయిన్కు మేలు చేసే ఆహారాలు..!) -
డయాబెటిస్?... ఈ పరీక్షలు మేలు చేస్తాయి!
మీరు మధుమేహులా? రోజూ మాత్రలు లేదంటే ఇంజెక్షన్లు వేసుకుంటున్నారా. అయితే ఈ కథనం మీ కోసమే. మీలో కొన్ని విటమిన్, సూక్ష్మ పోషకాల లోపం ఉండవచ్చు. వాటిని సరిచేసుకుంటే రక్తంలో చక్కర మోతాదులు కూడా మెరుగు అవుతాయి అని బ్రిటిష్ మెడికల్ జర్నల్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇంతకీ ఏ విటమిన్లు తక్కువ ఉంటే గ్లూకోజ్ ఎక్కువ అవుతుంది? వాటికీ మధుమేహానికి సంబంధం ఏమిటీ?మన శరీరం ఒక సంక్లిష్ట యంత్రం అన్నది అందరికి తెలిసిన విషయమే. ఇది సక్రమంగా నడవాలంటే కనీసం 13 విటమిన్లు, మరెన్నో సూక్ష్మ పోషకాలు అవసరం. ఇవన్నీ మనం తినే ఆహారం ద్వారా లభించడం కష్టం. పైగా వయసు పెరిగే కొద్దీ తిన్న ఆహారం నుంచి విటమిన్లు, పోషకాలను శోషించుకోవడం కూడా కష్టం అవుతుంది. ఈ సమస్యకు మరికొన్ని కారణాలు కూడా చేరడం వల్ల మనం వ్యాధుల బారిన పడుతూంటాము. మధుమేహం విషయానికి వస్తే... ఈ వ్యాధి బారిన పడ్డ వారు ఆధికుల్లో విటమిన్ డి, బీ 12 లు తక్కువగా ఉంటాయి అని శాస్త్రవేత్తలు గుర్తించారు. కొంచెం కచ్చితంగా చెప్పాలంటే 60 శతం మధుమేహుల్లో విటమిన్ డి తక్కువగా ఉంటుంది. అలాగే 29 శతం మంది ఆంటే నలుగురిలో ఒకరికి ఉండాల్సినంత బీ 12 ఉండదని పరిశోధనలు చెబుతున్నాయి. అంతే కాదు. 42 శాతం మధుమేహుల్లో మెగ్నీషియం లోపం ఉంటె 28 శాతం మందిలో ఐరన్ తక్కువగా ఉంటోంది. క్రోమియం, జింక్ లు కూడా తక్కువగా ఉంటాయని గుర్తించారు. ఈ లోపాలను సరిదిద్దుకుంటే మధుమేహం కూడా కంట్రోల్ లూకి వచ్చే అవకాశం ఉంటుంది.ఒక్కో దానిది ఒక్కో పాత్ర...విటమిన్ డి, బీ 12, మెగ్నీషియం, ఐరన్, జింక్, క్రోమియం లు మధుమేహ నియంత్రణలో తమదైన పాత్ర పోషిస్తాయి. విటమిన్ డి విషయం తీసుకుందాం. ఇన్సులిన్ మెరుగ్గా పని చేసేందుకు, సరిగ్గా స్రవించేందుకు అవసరం. తక్కువ అయితే హెచ్ బీ 1ఏసీ ఎక్కువ అవుతుంది. నరాలు బాగా పని చేసేందుకు కావాల్సిన బీ 12 తక్కువ అయినా పరోక్షంగా మధుమేహాన్ని ప్రభావితం చేస్తుంది.రెండు పద్ధతులు..విటమిన్, పోషక లోపాలను సరిదిద్దుకునేందుకు రెండు పద్ధతులు ఉన్నాయి. మొదటిది.. ఆకుకూరలు, నట్స్ (వేరుశెనగలు, కాజు, బాదాం, పప్పులు వంటివి) గుమ్మడి, దోస లేదా ఇతర విత్తనాలు తీసుకోవడం. సహజ సిద్దమైన పద్దతి. కుదరదు, వయసు, ఇతర ఆరోగ్య సమస్యలు ఉంటే ఈ విటమిన్లు, పోషకాల మాత్రలు తీసుకోవాలి. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఏ రకమైన మాత్రా అయినా సరే డాక్టర్ సలహా మేరకే తీసుకోవాలి. మధుమేహుల విషయంలో ఇది మరీ ముఖ్యం. అన్నింటి కంటే ముందు.. మీరు విటమిన్, పోషకాల లోపాలను గుర్తించేందుకు పరీక్షలు చేసుకోవాలి. లోపాలను గుర్తిస్తే వాటిని సప్లిమెంట్ల ద్వారా భర్తీ చేసుకుంటే మధుమేహం నియంత్రణలోకి వచ్చే అవకాశాలు మెరుగవుతాయి. వైద్యుల సలహా, సూచనల మేరకు ఒకసారి ప్రయత్నించి చూడండి. -
బ్రెయిన్కు మేలు చేసే ఆహారాలు..!
మెదడు ఎంతటి కీలకమైనదంటే... మన శరీరం బరువులో దాని బరువు కేవలం 2 శాతం మాత్రమే. కానీ మొత్తం దేహానికి అందే ఆక్సిజన్లో 20 శాతం దానికే కావాలి. దేహం మొత్తం వినియోగించే శక్తిలో 20 శాతం దానికే చెందాలి. ఇక అదెంతటి అద్భుతమో చూద్దాం... దాదాపు 1.3 కిలోల నుంచి 1.4 కిలోల బరువుండే మెదడులో 85 శాతం నీళ్లే. అన్నీ కొవ్వు కణాలే. అంటే మెదడు కణాలన్నీ కొవ్వుతో నిర్మితమైనవే. కొవ్వు లేకపోతే మెదడే లేదు. అంటే... శరీరంలోని 25 శాతం కొలెస్ట్రాల్ మెదడులోనే ఉంటుంది. మన ఆలోచనలకూ, పనులకూ, తెలివితేటలకూ అదే మూలం. కొన్ని రకాల ఆహారాలు తీసుకుంటే అది మందకొడిగానూ, మరికొన్ని ఆహారాలతో అది చురుగ్గానూ ఉంటుంది. అది చురుగ్గా పనిచేయడానికి ఎలాంటి ఆహారం కావాలో తెలిపే కథనం.మెదడుకు హాని చేసే ఆహారాలునిల్వ ఉంచిన ఉప్పు కలిపిన పదార్థాలైన చిప్స్, టిన్న్డ్ సూప్స్తోపాటు ప్రిజర్వేటివ్స్ కలిపిన ఆహార పదార్థాలు మెదడుకు హానికరం. కాబట్టి వాటిని చాలా పరిమితంగా తీసుకోవాలి. మనం తీసుకునే ఉప్పు రోజుకు 6 గ్రాములకు మించితే అది ఆరోగ్యానికే కాదు... మెదడుకూ చేటు చేస్తుంది. కొవ్వుల్లో డాల్డా వంటి ట్రాన్స్ఫ్యాట్స్, అలాగే మాంసాహారంలో ఉండే కొవ్వులు మెదడుకు అంత మంచిది కాదు. అందుకే మాంసాహారం (Non Veg) తినేవారు కొవ్వు తక్కువగా ఉండే చికెన్, చేపలే తీసుకోవాలి. బటర్, క్రీమ్ వంటి కొవ్వులనూ చాలా పరిమితంగానే (అరుదుగా కేవలం రుచి కోసమే) వాడాలి. ఆల్కహాల్ మెదడుకు హాని చేస్తుంది. ఇది తీసుకున్నప్పుడు తక్షణ ప్రభావంగా మెదడు స్తబ్ధుగా ఉంచుతుంది. ఇక దీర్ఘకాలంలో డిమెన్షియా (మతిమరపు) వంటి మెదడు సమస్యలకు దారి తీస్తుంది. కాబట్టి దీన్ని పూర్తిగా మానేయాలి. అలాగే మెదడును ఉత్తేజపరచడానికి తాగే సిగరెట్ లాంటి పొగతాగే అలవాటు కూడా దీర్ఘకాలంలో మెదడు పనితీరును మందకొడిగా మారుస్తుంది. మెదడుకు అందే ఆక్సిజన్ మోతాదులనూ తగ్గిస్తుంది. అందుకే మెదడు చురుగ్గా పనిచేయాలనీ, మెదడుకు సంబంధించిన అల్జైమర్స్ వంటి జబ్బులు నివారించడానికి మద్యం, పొగతాగడం వంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి.ఈలోకంలోని జీవులన్నింటిలోకెల్లా అత్యంత తెలివైన మెదడు మానవులని పిలుచుకునే మన హోమో సేపియన్ జీవులదే. ఈ మొత్తం కాస్మోస్లో ఇంకా తెలివిగల జీవం ఇంకెక్కడుందో ఇప్పటికీ తెలియదు కాబట్టి... ప్రస్తుతానికి ఈ సమస్త విశ్వంలో ఇంతటి సంక్లిష్టమైన మెదడు, అత్యంత అద్భుతమైన మెదడు మానవులది మాత్రమే. అందులో ఎన్ని కణాలు ఉన్నాయనేదానికి నిర్దిష్టమైన లెక్క లేదు. కానీ దాదాపు 1,000 కోట్ల కణాలు ఉన్నాయని ఒక అంచనా. ప్రతి కణాన్నీ న్యూరాన్ అంటారు. ఒక్కో కణం 40,000 ఇతర కణాలతో అనుసంధానితమై ఉంటుంది. ఇలా అనుసంధానితమై ఉండటాన్ని ‘సైనాప్స్’ అంటారు. కేవలం ఇసుక రేణువంత భాగంలో కనీసం లక్ష న్యూరాన్లు, పొరుగు కణాలతో అనుసంధానితమైన ఉన్న కనెక్షన్లు 100 కోట్ల వరకు ఉన్నందువల్లనే బహుశా ఇంతటి సంక్లిష్టమైన నిర్మాణం విశ్వంలోనే మరొకటి లేదనేది ఒక భావన.ఎదుగుదలలోనే అద్భుతాలు..తల్లికడుపులో బిడ్డ ఉండగానే మెదడు ప్రతి నిమిషానికీ 2,50,000 కొత్త కణాలు పుడుతూ ఉంటాయి. ఇలా ఆ బిడ్డ.. ఈ లోకాన్ని చూసే నాటికి అతడు 1000 కోట్ల కణాలతో పుడతాడు. పన్నెండు నెలల వయసప్పుడు తీసిన మెదడు స్కాన్, దాదాపు యుక్తవయసులో ఉన్నప్పటి మెదడు స్కాన్ దాదాపు ఒకేలా ఉంటాయి. కాక΄ోతే ట్రిలియన్ల కొద్దీ సైనాప్స్లు ఏర్పడుతూ ఉంటాయి. పదేళ్ల వయసు నుంచి చాలా వేగంగా సామాజిక, ఉద్వేగపూరితమైన, బుద్ధికి సంబంధించిన ఎదుగుదల జరుగుతుంది. మనం ఏయే అంశాలపై దృష్టి పెడతామో అవి పెరగడం, దృష్టి పెట్టని అంశాలు తగ్గడం జరుగుతాయి. ‘దీన్నే యూజ్ ఇట్... ఆర్ లూజ్ ఇట్’గా పేర్కొంటారు. మనకు ఆనందం ఇచ్చే అంశాలనూ ఈ సమయంలోనే అభివృద్ధి చేసుకుంటాం. దాదాపు 18 నుంచి 20 ఏళ్ల వయసు వచ్చేనాటికి మన వికాసం దాదాపుగా పూర్తవుతుంది. ఈ వికాస క్రమంలోనూ, అటు తర్వాత మెదడు బాగా చురుగ్గా పనిచేయడానికి కొన్ని ఆహారాలు దోహదపడుతుంటాయి. మెదడు చురుగ్గా ఉండటానికి, చాలాకాలం పాటు దాని ఆరోగ్యం చక్కగా ఉంచడానికి తీసుకోవాల్సిన ఆహారపదార్థాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.పిండదశలో... పిండ దశ నుంచీ మెదడు ఎదుగుదలకు ఉపయోగపడే కీలకమైన పోషకమే ‘ఫోలిక్ యాసిడ్’. అందుకే ఓ మహిళ గర్భం దాల్చగానే లేదా దంపతులు ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేసుకుంటూ ఉన్నప్పుడు గర్భం దాల్చకముందు నుంచే మహిళలకు ‘ఫోలిక్ యాసిడ్’ పోషకాన్ని డాక్టర్లు సిఫార్సు చేస్తుంటారు. ఈ ఫోలిక్ యాసిడ్ పోషకం మహిళ గర్భవతిగా ఉన్నప్పట్నుంచే మెదడు తాలూకు మంచి ఎదుగుదలకూ, పిండంలో న్యూరల్ ట్యూబ్కు సంబంధించిన సమస్యల నివారణకూ తోడ్పడుతుంటుంది. ఫోలిక్ యాసిడ్ అనే ఈ పోషకం అన్ని రకాల ఆకుకూరల్లోనూ పుష్కలంగా ఉంటుంది. ఫోలియేజ్ అంటే ఆకులు. అందుకే పాలకూర వంటి అన్ని ఆకుకూరల్లో సమృద్ధిగా లభ్యమవుతుంది కాబట్టే దీనికి ‘ఫోలిక్ యాసిడ్’ అని పేరు.బిడ్డ పుట్టాక...ఇక బిడ్డ పుట్టి నేల మీద పడ్డాక... ఆ చిన్నారి మెదడు ఆరోగ్యంగా ఎదగాడానికి అవసరమైనది ‘డొకోజా హెగ్జాయినోయిక్ యాసిడ్’ (సంక్షిప్తంగా ‘డీహెచ్ఏ’) అనే మరో రకం పోషకం అవసరం. ఇది ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్లో ఒక రకం. ఈ పోషకం తల్లిసాలలో సమృద్ధిగా లభిస్తుంది. బిడ్డలు పెరిగి పెద్దయ్యా వారికి ఇదే పోషకం కావాలంటే చేపల్లో సమృద్ధిగా దొరుకుతుంది. ఇక బిడ్డల పెరుగుదల తర్వాత, వారు యుక్తవయస్కులుగా మారాక... అటు పిమ్మట కూడా ఆ మెదడు ఆరోగ్యం సక్రమంగా నిర్వహితం కావాలంటే అవసరమైన పోషకాలు ఇవి...సంక్లిష్టమైన పిండిపదార్థాలు(కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్)...మెదడు చురుగ్గానూ, అలాగే సక్రమంగానూ పనిచేస్తూ... అది చేసే పనిలో సునిశితత్వం, వేగం, చురుకుదనం ఉండాలంటే ముందుగా మొత్తం శరీరానికి శరీరం తీసుకునే శక్తిలో 15 శాతం దానికే కావాలి. అంటే మొత్తం శరీరానికి శక్తినిచ్చే గ్లూకోజ్లో 15 శాతానికి తగ్గకుండా మెదడుకు సమృద్ధిగా అందుతూ ఉండాలి. అందుకోసం... ఆ శక్తిని సమకూర్చేందుకు తీసుకోవాల్సిన ఆహార పదార్థాల్లో మొదటివి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్. మనకివి పొట్టు తీయని కాయధాన్యాల నుంచి లభ్యమవుతాయి. ఉదాహరణకు దంపుడు బియ్యం లేదా ముడిబియ్యం, పొట్టుతీయకుండా పిండి పట్టించిన గోధుమలు మొదలుకొని పొట్టు తీయని అనేక ముడిధాన్యాల నుంచి ఈ కాంప్లెక్స్ కార్బోహేడ్రేట్లు అందుతాయి. శక్తి కోసం మనం తీసుకోదగ్గ వాటిలో ఇవి ప్రధానమైనవి. పొట్టుతీయకపోవడం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటంటే... పొట్టుతీసిన ఆహారం నుంచి దొరికే గ్లూకోజ్ దేహంలోకి చేరగానే తక్షణం వినియోగితమై΄ోతుంది. ఆ తర్వాత వెంటనే మళ్లీ గ్లూకోజ్ (Glucose) అవసరమవుతుంది. కానీ పొట్టుతీయని ఆహారం ద్వారా అందిన గ్లూకోజ్ ఒక క్రమమైన పద్ధతిలో చాలాసేపు పాటు మెదడుకు అందుతూ ఉంటుంది.అత్యవసరమైన కొవ్వులు (ఎసెన్షియల్ ఫ్యాటీ ఆసిడ్స్ )...మెదడు చురుగ్గా పనిచేయడానికి అవసరమయ్యే అత్యంత కీలకమైన కొవ్వు పదార్థాలు ఇవి. అందుకే మెదడుకు అవసరమైన ఈ కొవ్వులను ‘ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్’ (ఈఎఫ్ఏ) అంటారు. ఇవే ప్రధాన ఒమెగా –3 ఫ్యాటీ యాసిడ్ అయిన అల్ఫా లినోలినిక్ యాసిడ్ (ఏఎల్ఏ), ఇకోజా పెంటాయినిక్ యాసిడ్ (ఈపీఏ), డొకాజో హెగ్జాయినిక్ యాసిడ్ (డీహెచ్ఏ) వంటివి. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిందేమిటంటే... మెదడు కణాలన్నీ కేవలం కొవ్వు కణాలే. ఒకరకంగా చూస్తే... మెదడు బరువులో 60 శాతం పూర్తిగా కొవ్వే. ఇక మిగతా దానిలోనూ మరో 20 శాతం ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ను నుంచి తయారైన పదార్థాలే. ఈ ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ను దేహం తనంతట తాను తయారు చేసుకోలేదు. కాబట్టి వాటిని ఆహారం నుంచి తీసుకోవాలి. ఆ ఎనెన్షియల్ కొవ్వుల సాయంతోనే మెదడుకు అవసరమైన కీలక కొవ్వు కణాల మెయింటెనెన్స్ జరుగుతూ ఉంటుంది.ఎసెన్షియల్ ఫ్యాటీ ఆసిడ్స్ అంటే... మనం తీసుకునే ఆహారంలో ఒమెగా 3 ఫ్యాటీ ఆసిడ్స్, ఒమెగా 6 ఫ్యాటీ ఆసిడ్స్ వంటి వాటితో పాటు మరికొన్ని పోషకాలను ఎసెన్షియల్ ఫ్యాటీ ఆసిడ్స్ అనుకోవచ్చు. అవి మనకు చేపలు, ముఖ్యంగా సాల్మన్, మెకరెల్స్, సార్డిన్ వంటి చేపల నుంచి... ఇంకా గుడ్లు, నట్స్, అవిశెనూనె నుంచి లభ్యమవుతాయి.మెదడుకు మేలు చేయని కొవ్వులు...మెదడు సక్రమంగా చురుగ్గా పనిచేయడానికి కొవ్వులు కావలసినా, మళ్లీ అన్ని రకాల కొవ్వులూ మెదడుకు మంచి చేయవు. కొన్ని కొవ్వులు దాన్ని మందకొడిగా మారుస్తాయి. అవి ఏవంటే... ట్రాన్స్ఫ్యాట్స్ అని పిలిచే హైడ్రోజనేటెడ్ కొవ్వులు. ఇవి మెదడు ఆరోగ్యానికి అంత మంచిది కాదు. అవి మెదడు చురుగ్గా పనిచేయడానికి అవసరమైన ఎసెన్షియల్ ఫ్యాటీ ఆసిడ్స్ను అడ్డుకుంటాయి. తేలిగ్గా అర్థమయ్యేలా చెప్పుకోవాలంటే... ఈ హైడ్రోజనేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ కృత్రిమ నెయ్యిలో (వనస్పతిలో) ఎక్కువగా ఉంటాయి. వీటితో తయారు చేసే కేక్లు, బిస్కెట్, తీపి పదార్థాలు మెదడును చురుగ్గా ఉంచలేవు. అవి మెదడును కాస్త మందకొడిగా చేయడంతోపాటు ఆరోగ్యానికీ అంతగా మేలు చేయవు. అందుకే చాలా పాశ్చాత్య దేశాల్లో ఈ ట్రాన్స్ఫ్యాట్స్ను నిషేధించారు.తినుబండారాలు కొంటున్నారా... తస్మాత్ జాగ్రత్త...మనం మార్కెట్లో కొనే తినుబండారాల ప్యాకెట్లపై ఉండే పదార్థాల జాబితాను తప్పక పరిశీలించాలి. ఒకవేళ అందులో హైడ్రేజనేటెడ్ ఫ్యాట్స్/ఆయిల్స్ ఉంటే వాటిని కేవలం రుచికోసం పరిమితంగానే తీసుకోవాలి. అదికూడా అరుదుగానే ఎప్పుడైనా తీసుకోవడం మంచిది. మెదడుకు అవసరమైన కొవ్వులు (అసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్) కోసం చేపలు (Fishes) ఎక్కువగా తినడం అన్ని విధాలా మెదడుకు మేలు చేస్తుంది. ఎందుకంటే చేపల్లో మెదడును చురుగ్గా ఉంచడానికి అవసరమైన ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఒమెగా 6 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి.అమైనో యాసిడ్స్...మెదడులోని అనేక కణాల్లో ఒకదాని నుంచి మరోదానికి సమాచారం ఇచ్చిపుచ్చుకునేందుకు దోహదపడే అంశాలను న్యూరోట్రాన్స్మిటర్స్ అంటారు. ఈ న్యూరో ట్రాన్స్మిటర్స్ సహాయంతో సమాచారం తాలూకు ట్రాన్స్మిషన్ ఎంత వేగంగా జరిగితే మెదడు అంత చురుగ్గా పనిచేస్తుంది. ఇందుకు సహాయపడేవే ‘అమైనో ఆసిడ్స్’. ఇవి మనకు ప్రోటీన్స్ నుంచి లభ్యమవుతాయి.మన మూడ్స్ కూడా న్యూరో ట్రాన్స్మిటర్స్పైనే...మనకు కలిగే రకరకాల మూడ్స్ కూడా ఈ న్యూరోట్రాన్స్మిటర్స్పైనే ఆధారపడి ఉంటాయి. ఉదాహరణకు మనకు హాయిగా, గాఢమైన నిద్ర పట్టాలంటే సెరటోనిన్ అనే జీవరసాయనం కావాలి. దానికి ట్రిప్టొఫాన్ అనే అమైనో యాసిడ్ అవసరం. ఈ ట్రిప్టొఫాన్లలో పుష్కలంగా ఉంటుంది. అందుకే మంచి నిద్రపట్టాలంటే నిద్రకు ఉపక్రమించేముందు గోరువెచ్చని పాలు తాగాలంటూ డాక్టర్లు సూచిస్తుంటారు.విటమిన్లు / మినరల్స్ (ఖనిజలవణాలు)... మెదడు పనితీరు బాగా చురుగ్గా కొనసాగడానికి అవసరమైన పోషకాల్లో అత్యంత ముఖ్యమైనవి విటమిన్లు, ఖనిజలవణాలు చాలా ప్రధానమైనవి. ఇవి అమైనో యాసిడ్స్ను న్యూరోట్రాన్స్మిటర్లుగా మార్చడంలోనూ, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లను గ్లూకోజ్లో మార్చడంలోనూ తోడ్పడతాయి. మెదడు చురుకుదనానికి విటమిన్ బీ–కాంప్లెక్స్లోని బి–1, బి–6, బి–12 ప్రధానంగా అవసరమైవుతాయి. మళ్లీ వీటిన్నింటోనూ విటమిన్ బి–12 ఇంకా కీలకం. ఈ విటమిన్లు తాజా కూరగాయల్లో, ముదురాకుపచ్చటి ఆకుకూరల్లో, పాలలో సమృద్ధిగా దొరుకుతాయి. అయితే వీటన్నింటిలోనూ మెదడు చురుకుదనానికి దోహదం చేసే బి–12 మాంసాహారంలోనే ఎక్కువ. అందుకే... ఇటీవల చాలామంది స్ట్రిక్ట్ వెజిటేరియన్స్ (వీగన్స్)లోనూ, ఎండ అంతగా సోకనివారిలో (ఎండకు ఎక్కువగా ఎక్స్΄ోజ్ కానివారిలో) విటమిన్ ‘డి’.. ఈ రెండు రకాల విటమిన్ల లోపం కారణంగా వాళ్లలో మెదడు చురుగ్గా పనిచేయని స్థితి ఏర్పడుతుంది. ఈ పరిస్థితి కారణంగా ఒక్కోసారి వారు అకస్మాత్తుగా అపస్మారక స్థితిలోకి వెళ్లే ప్రమాదం ఎదురవుతుంది. ఇలా జరగడాన్ని వైద్య పరిభాషలో ‘సింకోప్’ / ‘సింకోపీ’ అంటారు ఇటీవల ఆధునిక జీవనశైలిలో భాగంగా ఇప్పుడీ కండిషన్ చాలామందిలో కనిపిస్తోంది. ఇలాంటివారంతా డాక్టర్ల సూచన మేరకు విటమిన్–డి సప్లిమెంట్లతోపాటు దేహంలో విటమిన్ బి–12 మోతాదులను పెంచే సప్లిమెంట్లను బయటి నుంచి తీసుకోవాలి. ఇక విటమిన్–ఈ కూడా మనలో విద్యలూ–నైపుణ్యాలు నేర్చుకునే ప్రక్రియను చురుగ్గా జరిగేలా చేస్తుంది.నీళ్లు...మెదడులోని ఘనపదార్థంలో చాలావరకు కొవ్వులే కాగా... ఇక మొత్తం మెదడులో 80 శాతం వరకు నీళ్లే ఉంటాయి. మెదడులోని న్యూరోట్రాన్స్మిటర్స్ చురుగ్గా పనిచేయడానికి నీళ్లు ఎక్కువ మోతాదులో తీసుకోవడం అవసరం. మనం మన మూత్రం రూపంలోనూ, అలాగే మనం ఊపిరి వదులుతున్నప్పుడు (ఉచ్ఛాస్వనిశ్వాసల్లో) రోజులో కనీసం 2.5 లీటర్ల నీటిని బయటకు విసర్జిస్తాం. ఇలా బయటకు పోయే నీటిని ఎప్పటికప్పుడు మళ్లీ భర్తీ చేసుకోవడం అవసరం. దీనికోసం అదేమొత్తంలో మళ్లీ నీటినీ తీసుకోవాలి. అనేక కారణాల వల్ల కొంతమంది నీళ్లు ఎక్కువగా తాగరు. ఎంతటి తక్కువ మోతాదులో నీళ్లు తాగేవారైనా రోజులో కనీసం 1.5 లీటర్లను తప్పక తీసుకోవాలి. (మిగతా నీళ్ల మోతాదు కాస్తా మనం రోజూ తీసుకునే ఘనాహారం నుంచి, మన శరీరంలో జరిగే జీవక్రియల్లో విడుదలయ్యే నీటి నుంచి భర్తీ అవుతుంటుంది. ఎవరిలోనైనా వారు రోజులో తీసుకునే నీళ్లు 1.5 లీటర్ల కంటే తగ్గాయంటే వాళ్ల మెదడు పనితీరులో చురుకుదనం ఎంతోకొంత తగ్గుతుందని గుర్తుంచుకోవాలి. ఆ మేరకు నీరు తగ్గిందంటే అది వాళ్ల వాళ్ల మూడ్స్పై కూడా ప్రభావం చూపేందుకు అవకాశాలు ఎక్కువ. అందుకే ప్రతిఒక్కరూ రోజూ 6–8 గ్లాసుల నీళ్లతో పాటు, పాలు, మజ్జిగ, పండ్లరసాలు, రాగిజావ, వంటివి తీసుకుంంటూ ఉండటం మంచిది. అప్పుడు... నీటితో పాటు తీసుకునే ఆ ద్రవాహారాలు మెదడును చురుగ్గా ఉంచడంలో సహాయపడతాయి. ఇక ద్రవాహారాల్లో టీ, కాఫీల వంటివి డీహైడ్రేషన్ను వేగవంతం చేస్తాయి. అంటే శరీరం నుంచి నీళ్లను తొలగించే పనిని చేస్తుంటాయి. అందుకే టీ, కాఫీలూ, కెఫిన్ ఉండే పానీయాలను చాలా పరిమితంగా (అంటే రోజుకు రెండు కప్పులకు మించకుండా) మాత్రమే తీసుకోవడం మంచిది. అంతకు మించితే ఆ పానీయాలు తొలుత మెదడును చురుగ్గా చేసినప్పటికీ... ఇలా వేగంగా పనిచేయించడం వల్ల మెదడు అంతే వేగంగా అలసిపోతుంది. చక్కెర కలిపిన పానీయాలు, కార్బొనేటెడ్ సాఫ్ట్డ్రింక్స్వల్ల కూడా ఇదే హాని జరుగుతుంది. మెదడుకి మేలు చేసే ఆహారాలు...మెదడు చురుగ్గా పనిచేయాలనుకుంటే మనం తీసుకునే ఆహారాల్లో ఈ కింద పేర్కొన్నవి సమృద్ధిగా ఉండేలా చూసుకోవాలి. ఆకుకూరలతోపాటు కూరగాయల్లో...పాలకూర మెదడును చురుగ్గా ఉంచుతుంది. ఇక బీట్రూట్, చిక్కుళ్లు వంటి వాటిల్లో ఉండే యాంటీ–ఆక్సిడెంట్స్ మెదడు కణాలను చాలాకాలం ΄ాటు ఆరోగ్యంగా ఉంచడంతో ΄ాటు అనేక వ్యాధులనుంచి రక్షణ కల్పిస్తాయి. వీటితో ΄ాటు చాకొలెట్, గ్రీన్ టీ కూడా మెదడుకు మేలు చేస్తాయి.చేపలు...పండుగప్ప / పండు చేప, వంజరం, కనగర్తలు (మాకరెల్), సాల్మన్, హెర్రింగ్ వంటి చేపల్లో మెదడు చురుకుదనానికి సహాయపడే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ.నూనెల్లో...మెదడు చురుకుదనానికి దోహదం చేసే నూనెల్లో ఆలివ్ ఆయిల్ చాలా మంచిది. ఇది రక్త΄ోటును కూడా తగ్గిస్తుంది. రక్తంలో కొలెస్ట్రాల్, కొవ్వులను అరికడుతుంది. కాబట్టి మెదడుకు వచ్చే పక్షవాతం (స్ట్రోక్), అలై్జమర్స్ వ్యాధులను ఆలివ్ ఆయిల్ కొంతమేరకు నివారిస్తుందని చెప్పవచ్చు.పండ్లు...మెదడుకు మేలు చేసే పండ్లలో బెర్రీ పండ్లు చాలా మంచివి. స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ, నేరేడు వంటివి మెదడుకు మేలు చేస్తాయి. - డాక్టర్ హరిత శ్యామ్ .బి, సీనియర్ డైటీషియన్ చదవండి: భాయిజాన్ సల్మాన్ఖాన్ ఫిట్నెస్ సీక్రెట్..! -
60లో కూడా సల్మాన్లా కండలు తిరిగిన బాడీ ఉండాలంటే...
బాలీవుడ్ ప్రముఖ నటుడు భాయిజాన్ సల్మాన్ఖాన్కి ఈ డిసెంబర్ 27కి 59 ఏళ్లు నిండనున్నాయి. ఇంకో ఆరు రోజుల్లో 60వ పుట్టిన రోజు జరుపుకునున్నారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో తన ఫోటోలను షేర్ చేస్తూ.. తాను అరవైవ దశకంలో కూడా ఇంతే యంగ్గా ఫిట్గా ఉండాలనుకుంటున్నా అంటూ పోస్టుపెట్టారు. అంతే ఒక్కసారిగా ఈ పోస్ట్ వైరల్గా మారడమే కాకుండా, 'మీరు ఫిట్నెస్ ఐకాన్' అంటూ ప్రశంసిస్తూ అభిమానులు పోస్టులు పెట్టారు. అంతలా ఆరు పదుల వయసులోనూ అలాంటి బాడీ మెయింటైన్ చేయాలంటే ఈ ఆరోగ్య సూత్రాలు ఫాలో అవ్వాల్సిందే అని చెబుతున్నారు నిపుణులు. అవేంటంటే..కండలు కలిగిన దేహధారుఢ్యం కోసం..ముందు నుంచి వ్యాయమాలు చేసే అలవాటు ఉంటే..మంచి ఫిట్నెస్ ట్రైనర్ సమక్షంలో కసరత్తులు ప్రారంభించాలి. క్రమంతప్పకుండా వర్కౌట్లు చేసేలా ప్లాన్ చేసుకోవాలి. ముఖ్యంగా కండలు తిరిగి దేహధారుడ్యం కోసం.. ట్రెడ్మిల్, క్రాస్ ట్రైనర్, సైక్లింగ్..లాంటి కార్డియో వ్యాయామాలు, వెయిట్ ట్రైనింగ్ కసరత్తులు, తదితరాలు తప్పనిసరి అని చెబుతున్నారు ఫిట్నెస్ నిపుణుల.అంతేగాదు ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం ఆరుపదుల వయసులోనూ యంగ్గా ఆరోగ్యంగా ఉండాలంటే.. వారానికి 150 నిమిషాల వ్యాయామం లేదా శారీరక శ్రమ చేయాలని నొక్కిచెప్పింది. అంతేగాదు ఏం చేయాలన్నా.. ఆరోగ్యం బాగుండాలన్న సూత్రం మరువకండి అంటున్నారు నిపుణులు.కనీసం జిమ్ వెళ్లని వాళ్లు ఓ ఇరవై నిమిషాలు నడిస్తే మంచిదని సూచించింది డబ్ల్యూహెచ్ఓ.డైట్ ఎలా ఉండాలంటే..ఉదయం: 5 ఎగ్వైట్స్, ఉడికించిన కూరగాయలు. పాల నుంచి తీసిన పెద్ద చెంచాడు వెన్న ప్రొటీన్. రెండుసార్లు రెండు రకాల పండ్లు. పది వేయించిన లేదా నానబెట్టిన బాదం పప్పులు.మధ్యాహ్నం: నూనె లేకుండా చేసిన 100 గ్రాముల చికెన్, కూరగాయలు, 50 గ్రాముల అన్నం, 150 గ్రాముల పండ్లు.రాత్రి: 100 గ్రాముల చికెన్ లేదా 150 గ్రాముల చేపలు, కూరగాయలు. వాటితోపాటు మూడు పూటలా కూరగాయలు, కీర దోస, పండ్లు ఎక్కువగా ఉండేలా చూసుకుంటే చాలట. అయితే ఇది వ్యక్తికి-వ్యక్తికి డైట్ మారిపోతుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. వ్యక్తిగత ఆరోగ్య సమస్యల దృష్ట్యా మార్పులు చేర్పులు ఉంటాయన్నారు. ఇది కేవలం ఆరోగ్యకరమైన వృధాప్యాన్ని ఆస్వాదించడం కోసం ఇచ్చిందే తప్ప అందరికీ సరిపడదని కూడా హెచ్చరించారు ఆరోగ్య నిపుణులు. View this post on Instagram A post shared by Salman Khan (@beingsalmankhan)గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పాటించే ముందు వ్యక్తిగత నిపుణులు లేదా వైద్యులను సంప్రదించడం ఉత్తమం.చదవండి: విండో క్లీనర్ నుంచి బిలియనీర్ రేంజ్కి..! ఆ ఉద్యోగాల వల్లే.. -
ఆత్మసాక్షాత్కారానికి ప్రాథమిక మార్గం క్రియాయోగం
హైదరాబాద్: ఏటా డిసెంబర్ 21వ తేదీని ప్రపంచ ధ్యాన దినోత్సవంగా జరుపుకోవాలని ఐక్యరాజ్యసమితి ప్రకటించినప్పటి నుంచి ప్రపంచ వ్యాప్తంగా ధ్యానంపై ఆసక్తి పెరుగుతోంది. ధ్యానాన్ని భగవంతుడ్ని చేరే మార్గంగా ఆధ్యాత్మికవేత్తలు నిర్వచిస్తుంటారు. ప్రతిరోజూ కొంచెం సమయమైనా ధ్యానంలో గడిపే సులభమైన అభ్యాసం ద్వారా మనం మన ప్రశాంతత స్థాయిలను, శారీరక ఆరోగ్యాన్ని గణనీయంగా మెరుగు పరుచుకోగలుగుతాం.పశ్చిమ దేశాలలో యోగ పితామహునిగా విస్తృతంగా గుర్తింపు పొందిన, ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొందిన "ఒక యోగి ఆత్మకథ" (Autobiography of a Yogi) గ్రంథ రచయిత అయిన పరమహంస యోగానంద, మానవులందరికీ ధ్యానం అత్యంత ప్రాముఖ్యత కలిగినదని నొక్కి చెప్పారు. క్రియాయోగం లాంటి శాస్త్రీయ ధ్యాన మార్గాన్ని అనుసరించడం వల్ల - ఉన్నత ఆత్మతో అనుసంధానం చెందుతాం. క్రియా యోగం ఒక సమగ్రమైన, వైజ్ఞానిక, సర్వవ్యాప్త పద్ధతి. ప్రతి వ్యక్తి సంపూర్ణ మానసిక శాంతిని పొందడం వైపు అభివృద్ధి సాధిస్తాడు. అంతే కాకుండా, క్రియాయోగ ధ్యాన పద్ధతి, దాని అనుబంధ పద్ధతులు శరీరం, మనస్సు, ఆత్మకు ఎంతో అవసరమైన పునరుజ్జీవనాన్ని అందిస్తాయి.'యోగ' అనే పదం వాస్తవానికి భగవంతునితో ఐక్యాన్ని సూచిస్తుంది. యోగ మార్గంలో ధ్యాన సాధన ఒక అంతర్భాగం. పరమహంస యోగానంద ద్వారా 1917లో స్థాపించబడిన యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా (వై.ఎస్.ఎస్.) , ఆ మహాగురువు ఉపదేశించిన క్రియాయోగ బోధనలను వ్యాప్తి చేస్తుంది. ఈ బోధనలు ఆత్మసాక్షాత్కారం అనే ఉన్నత లక్ష్యాన్ని సాధించడానికి ప్రాథమిక మార్గంగా క్రమం తప్పకుండా చేసే గాఢమైన ధ్యానానికి అత్యంత ప్రాధాన్యతను ఇస్తాయి.'ఒక యోగి ఆత్మకథ'లో, పరమహంస యోగానంద క్రియాయోగ ధ్యాన విజ్ఞానం అన్ని ఇతర ఆధ్యాత్మిక సాధనా పద్ధతుల కంటే ఉన్నతమైనదని, భక్తితో కూడినప్పుడు, అది అంతిమ లక్ష్యాన్ని సాధించడంలో ఖచ్చితంగా సఫలం అవుతుందని పేర్కొన్నారు! ధ్యానాన్ని తమ దైనందిన దినచర్యలలో చేర్చుకోవడంలో వాయిదా వేసేవారు వివిధ రకాల వృత్తినిపుణులు తీవ్రంగా పొరపాటుపడ్డారు. తీరిక లేని జీవితానికి, అనివార్యంగా దానితో పాటు వచ్చే ఒత్తిడులను మెరుగ్గా ఎదుర్కోవడానికి ధ్యాన సాధన మరింత అవసరం.హార్వర్డ్ విశ్వవిద్యాలయం అధ్యయనం ప్రకారం క్రమం తప్పకుండా ధ్యానం చేసే సీఈఓలు వారి వృత్తి జీవితంలో కూడా స్పష్టంగా మరింత విజయవంతంగా ఉంటారని వెల్లడించింది. ఆధునిక మనస్తత్వ సంపూర్ణ ఆరోగ్య నిపుణులు కూడా ఆరోగ్యకరమైన, సంతోషకరమైన, సంతృప్తికరమైన జీవితాలను గడపడానికి ధ్యానాన్ని ఒక అద్భుతమైన మార్గంగా ప్రతిపాదిస్తారు.ఇప్పటికే నిరంతర ఆధ్యాత్మిక సాధనను అత్యంత ప్రాధాన్యతగా ఎంచుకున్న వారికి, వారు గాఢంగా ధ్యానం చేయడానికి ఎంత ఎక్కువ సమయం కేటాయించగలిగితే అంత మంచిది. సంవత్సరాల తరబడి చేసే ధ్యానం ప్రతి మానవుడిని మరింత ఉల్లాసంగా, సమతుల్యంగా, సమర్థవంతంగా. శారీరకంగా కూడా ఆరోగ్యంగా మారుస్తుంది, ఇది నిశ్చయం.పరమహంస యోగానంద గుర్తుండి పోయేలా ఇలా అన్నారు, "ఇది వేచి ఉండగలదు, అది వేచి ఉండగలదు, కానీ భగవంతుని కోసం మీ అన్వేషణ ఆగకూడదు!" ఆ అన్వేషణను వేగవంతం చేసే మార్గం ధ్యానమే!పరమహంస యోగానందకు గురువైన స్వామి శ్రీయుక్తేశ్వర్ గిరిగా ప్రసిద్ధి చెందిన వారు, ఎంతో స్ఫూర్తిదాయకంగా ధ్యానం గురించి చెప్పారు: "మీరు ఇప్పుడు ఆధ్యాత్మిక ప్రయత్నం చేస్తే భవిష్యత్తులో ప్రతిదీ మెరుగుపడుతుంది" ఈ జీవితంలో శాశ్వత శాంతిని, ఆనందాన్ని మనం కనుగొనాలంటే ధ్యానం ఒక ఐచ్ఛిక కార్యం కాదని, అది మన జీవితాలలో తప్పనిసరి చర్య అని ప్రపంచ ధ్యాన దినోత్సవం మనందరికీ గుర్తుచేసే విధంగా ఉండాలి. మరింత సమాచారం కోసం: yssofindia.org చూడొచ్చు. -
అధికబరువుతో బాధపడేవారికి గుడ్ న్యూస్
అధిక బరువు ఊబకాయంతో నానాబాధలు పడుతున్నవారికి ఇది నిజంగా గుడ్ న్యూస్. బరువు తగ్గడానికి, జీవక్రియ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సహాయపడే ఒక కొత్త గట్ బాక్టీరియాను పరిశోధకులు కనుగొన్నారు. ఈ స్పెషల్ బాక్టీరియాను అమెరికాలోని ఉటా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు గుర్తించారు. ఎలుకలపై చేసిన అధ్యయనాలలో, టురిసిబాక్టర్ అని పిలువబడే ఒక నిర్దిష్ట రకం గట్ బాక్టీరియా జీవక్రియ ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుందని, బరువు పెరగడాన్ని తగ్గిస్తుందని ఉటా విశ్వవిద్యాలయం బృందం కనుగొంది. ప్రస్తుతం మార్కెట్లో బరువు తగ్గించే ఇంజెక్షన్లు, మందులు అందుబాటులో ఉన్నప్పటికీ, సహజసిద్ధంగా ఈ సమస్యను అధిగమించేందుకు ఈ పరిశోధన మార్గం సుగమం చేయగలదని భావిస్తున్నారు.ట్యూరిసిబాక్టర్ (Turicibacter) అనే పేగు బాక్టీరియా బరువు పెరుగుదలను నియంత్రించడంలో సమర్థవంతంగా పని చేస్తున్నట్టు గుర్తించారు. ఊబకాయం ఉన్నవారిలో టురిసిబాక్టర్ తక్కువగా ఉంటుంది. ఇది మానవులలో కూడా ఆరోగ్యకరమైన బరువుకు తోడ్పడుతుంది. గట్ బాక్టీరియాను సర్దుబాటు చేయడం ద్వారా బరువును నియంత్రించడానికి కొత్త మార్గాల అన్వేషణకు ఈ ఫలితాలు దారితీయవచ్చని సెల్ మెటబాలిజం జర్నల్లో ప్రచురించిన అధ్యయనంలో పరిశోధకులు జూన్ రౌండ్, కేంద్ర క్లాగ్ తెలిపారు. రక్తంలో చక్కెర, కొవ్వు స్థాయిని, హైఫ్యాట్ డైట్లోని సెరామైడ్ స్థాయిలను రాడ్ ఆకారంలోని టురిసిబాక్టర్ సింగిల్ హ్యాండెడ్గా తగ్గిస్తుందని కను గొన్నామన్నారు. అయితే టురిసిబాక్టర్ ప్రభావాలు ప్రత్యేకంగా ఉండే అవకాశం లేదు; విభిన్నమైన గట్ బాక్టీరియా బహుశా జీవక్రియ ఆరోగ్యానికి దోహదం చేస్తుంది. అలాగే జంతు నమూనాల ఆధారంగా ఈ ఫలితాలు ప్రజలకు వర్తించకపోవచ్చని కూడా చెప్పారు.అధిక కొవ్వు ఆహారంతో సెరామైడ్ స్థాయిలు పెరుగుతాయి. అధిక స్థాయి సిరామైడ్లు టైప్ 2 డయాబెటిస్ మరియు గుండె జబ్బులతో సహా అనేక జీవక్రియ రుగ్మతలతో సంబంధం కలిగి ఉంటాయి. కానీ టురిసిబాక్టర్ ఉత్పత్తి చేసే కొవ్వులు అధిక కొవ్వు ఆహారం మీద ఎలుకలకు కూడా సిరామైడ్ స్థాయిలను తక్కువగా ఉంచుతాయి. ట్యూరిసిబాక్టర్ చిన్న ప్రేగు ద్వారా గ్రహించబడే కొవ్వు అణువులను ఉత్పత్తి చేయడం ద్వారా జీవక్రియ ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది. ఇది ఎలుకలలో బరువు తగ్గడాన్ని గమనించినప్పటికీ, ఇది మానవులలో ఎంతవరకు సాధ్యపడుతుందని అనేది చూడాలన్నారు. కానీ ఆరోగ్యకరమైన జీవక్రియను ప్రోత్సహించేందుకు, అధిక బరువు పెరగకుండా నిరోధించే చికిత్సలను అభివృద్ధి చేయడానికి టురిసిబాక్టర్, ఈ ప్రభావాన్ని చూపే లిపిడ్ను గుర్తించడం భవిష్యత్తులో ఇది తొలి ఫ్యాక్టర్ కాగాలదని పరిశోధకులు తెలిపారు. అలాగే వ్యక్తిగత సూక్ష్మజీవులను మరింత పరిశోధించడం ద్వారా, భవిష్యత్తులో సూక్ష్మ జీవులను ఔషధంగా తయారు చేయగలమనీ, వివిధ వ్యాధులతో బాధపడుతున్న వారిలో వివిధ కీటకాల కన్సార్టియంను సృష్టించడానికి సురక్షితమైన బ్యాక్టీరియాను గుర్తించే అవకాశం ఉందని అని వర్సిటీ పరిశోధకుడు క్లాగ్ అన్నారు.గట్ మైక్రోబయోమ్లోని తేడాలు - గట్లోని బ్యాక్టీరియా, శిలీంధ్రాలు - ఊబకాయం మరియు బరువు పెరుగుదలతో సంబంధం కలిగి ఉంటాయి, మైక్రోబయోమ్ను మార్చడం వల్ల ఆరోగ్యాన్ని మెరుగుపడే అవకాశాన్ని పెంచుతుంది. కానీ వ్యక్తి ప్రేగులో వందలాది విభిన్న సూక్ష్మజీవుల జాతులు ఉంటాయి, ఏ జాతి సహాయపడుతుందో చెప్పడం కష్టతరం. అయితే ఈ ఫలితాలు మానవులకి కూడా వర్తిస్తే, ట్యూరిసిబాక్టర్-ఉత్పన్న సమ్మేళనాలు జీవక్రియ ఆరోగ్యం, ఆరోగ్యకరమైన బరువును ప్రోత్సహించడానికి ప్రభావవంతమైన చికిత్సా విధానాలుగా ఉంటాయనడంలో సందేహం లేదు. -
డబ్ల్యూహెచ్ఓ అంతర్జాతీయ మెడిసిన్ సదస్సులో హాట్టాపిక్గా అశ్వగంధ..!
డబ్ల్యూహెచ్ఓ గ్లోబల్ ట్రెడిషన్ మెడిసిన్ సమ్మిట్లో అశ్వగంధ ప్రయోజనాలు చర్చనీయాంశంగా మారింది. ఆయుర్వేదంలో అత్యంత అగ్రభాగాన ఉండే మూలికల్లో ఒకటైన అశ్వగంధ ఈ అంతర్జాతీయ కార్యక్రమంలో అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ రెండొవ డబ్ల్యూహెచ్ఓ గ్లోబల్ ట్రెడిషనల్ మెడిసిన్ సమ్మిట్ 2025కి భారత్ వేదికగా మారింది. సాంప్రదాయ వైద్యాన్ని ముందుకు తీసుకువెళ్లేలా భారత్ నాయకత్వం వహించడంతో అశ్వగంధ ప్రధాన టాపిక్గా మారింది. అంతేగాదు 'అశ్వగంధ: ట్రెడిషనల్ విజ్డమ్ టు గ్లోబల్ ఇంపాక్ట్ - పెర్స్పెక్టివ్స్ ఫ్రమ్ లీడింగ్ గ్లోబల్ ఎక్స్పర్ట్స్' అనే సెషన్ను ఆయుష్ మంత్రిత్వ సహకారంతో భారత్లో ఈ వేడుకను నిర్వహించింది. ఈ అశ్వగంధలో అడాప్టోజెనిక్, న్యూరోప్రొటెక్టివ్, ఇమ్యునోమోడ్యులేటరీ లక్షణాలకుగానూ అంతర్జాతీయ గుర్తింపు పొందుతున్న తరుణంలో శాస్త్రీయ సమకాలిన వైద్యం బలోపేతం చేసే దిశగా చర్చలపై దృష్టి సారించింది. యావత్తు ప్రపంచం క్లినికల్ మద్దతు ఇచ్చేలా దాని ప్రామాణికత, ప్రాముఖ్యతను నొక్కి చెప్పింది భారత్. అందరూ వినియోగించేలా భద్రత, నాణ్యత, చికిత్స అనువర్తనాలను హైలెట్ చేసింది. అయితే మిస్సీసిపీ విద్యాలయం రీసెర్చ్ డైరెక్టర్ డాక్టర్ ఇఖ్లాస్ ఖాన్ అందరూ వినియోగించేలా చేయడానికి బలమైన శాస్త్రీయ ఆధారాలు అత్యంత అవసరమని నొక్కి చెప్పారు. అందుకోసం ప్రపంచవ్యాప్తంగా దీనిపై శాస్త్రీయ పరిశోధనలకు పిలుపునివ్వడమే కాకుండా వినియోగించేలా చేయాలనే చర్చలకు వేదికైంది భారత్ అశ్వగంధతో కలిగే లాభలు..ఆధునిక కాలంలో అంటువ్యాధులులా మారిన ఒత్తిడి, ఆందోళనలను నివారిస్తుంది "ఆయుర్వేద మూలికల రాజు" అశ్వగంధ.నిద్రలేమిని నివారిస్తుంది. దీనిలో ప్రధాన ఒత్తిడి హార్మోన్ అయిన కార్టిసాల్ను నియంత్రించే సామర్థ్యం ఉందటకండరాల ద్రవ్యరాశి, బలాన్ని పెంచి శారీరక పనితీరుని మెరుగుపరుస్తుంది. జ్ఞాపకశక్తి మెరగవ్వుతుంది, మెదుడు ఆరోగ్యం బాగుంటుందిరోగ నిరోధక శక్తిని పెంచుతుంది. గుండె ఆరోగ్యాన్ని పెంచుతుందిరక్తంలో చక్కెర స్థాయిలను క్రమబద్దీకరిస్తుందిటెస్టోస్టీరాన్ ఉత్పత్తిని పెంచుతుంది, ప్రోటీన్ సంశ్లేషణను ప్రేరేపిస్తుంది.ఉపయోగించే విధానం..కనీసం 60 రోజుల పాటు వినియోగిస్తే.. మంచి సత్ఫలితాలను పొందగలమని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఒక గ్లాసు వెచ్చని పాలలో 1/4 నుంచి 1/2 టీస్పూన్ అశ్వగంధ పొడిని కలిపి తీసుకుంటే మంచి పలితం ఉంటుందటదీన్ని ఆవునెయ్యిలో కలిపి మాత్రల మాదిరిగా కూడా తీసుకోవచ్చట. ఉయదం బ్రేక్ ఫాస్ట్ స్మూతీ లేదా ఓట్ మీల్కు ఈ పొడిని జోడించి తీసుకోవచ్చట.వాళ్లకి మాత్రం మంచిది కాదు..గర్భిణీ స్త్రీలు హార్మోన్ల సమతుల్యతకు అంతరాయం కలిగించే అవకాశం ఉన్నందున ఈ అశ్వగంధని వినియోగించపోవడమే మేలుథైరాయిడ్ రుగ్మతలు ఉన్నవారు వైద్యులను సంప్రదించి వాడటమే మంచిది. ఆటోఇమ్యూన్ పరిస్థితులు ఉన్నవారు కూడా వైద్యుల సూచనలు మేరకు తీసుకోవడం మంచిది.గమనిక: ఇది కేవలం అవగాహన మన సంప్రదాయ వైద్య విధానం గొప్పతనం తెలియజేయడం గురించే ఇచ్చాం ఈ కథనం. ఈ మూలికను వినియోగించే ముందు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణును సంప్రదించడం ఉత్తమం. చదవండి: ప్రేమ, ఆప్యాయతలకు కేరాఫ్ 'ఆహారమే'..! అదెలాగంటే.. -
తొమ్మిది పదుల వయసులో 400 పుష్-అప్లు..!
ఓ అరవై ఏళ్లు రాగానే..మనలో శక్తి సన్నిగిల్లుతుంది, ఆటోమెటిగ్గా చేసే వ్యాయామాల జోరు తగ్గుతుంది. వయసులో ఉన్నంత సులభంగా వృధాప్యంలో వ్యాయమాలు చేయలేం. ఫిట్నెస్ నిపుణులు పర్యవేక్షణలో ఈజీగా చేయగలిగే వర్కౌట్లనే ఆశ్రయిస్తాం. అలాంటిది 92 ఏళ్ల తాత 20 ఏళ్ల యువకుడిలా ఎన్నిపుష్ అప్లు చేస్తాడో తెలిస్తే కంగుతింటారు. చెప్పాలంటే అతడు ముసలి తాతలా కనిపించే యువకుడిలా ఉంటుంది.. వ్యాయమాలు చేసే తీరు. అతనెవరు, ఫిట్నెస్ సీక్రెట్ ఏంటి వంటి వాటి గురించి తెలుసుకుందామా..!.బ్రిస్టల్లోని స్పైక్ ద్వీపంలో నివసించే కెన్ అనే తాతకు 92 ఏళ్లు. కానీ అతడు 20 ఏళ్ల యుకుడి మాదిరిగా ఎలాంటి ఆయాసం లేకుండా అలవోకగా పుష్ అప్లు చేస్తుంటాడు. మాజీ కాంకోర్డ్ ఇంజనీర్ అయిన ఈ తాత ఫిట్నెస్ పరంగా అందరికీ స్ఫూర్తి అని చెప్పొచ్చు. అతడు రోజుకి దగ్గర దగ్గర 400 నుంచి 600దాక పుష్ అప్లు చేయగలడట. అక్కడితో వర్కౌట్లు ఆపేయడు. దీని తర్వాత కోర్ వ్యాయామాలు చేస్తాడు, బరువుల ఎత్తుతాడు కూడా. దాంతోపాటు సుమారు 5 నుంచి 10 కి.మీ నడక కూడా తప్పనిసరిగా ఉంటుందట. చాలామంది ఇన్ని ఎందుకు చాలా తేలిగ్గా చేసే వాటిపై దృష్టిసారించమని హితబోధ చేసిన పట్టించుకోడట. ఎందుకిలా అంటే.. తాను చాలా ఏళ్ల నుంచి దినచర్యను ఇంట్రస్టింగ్ ఉండేలా చేసుకుంటానని చెబుతుంటాడు ఈ కెన్ తాత. ఎందుకంటే రొటీన్గా ఎప్పుడూ చేసే వ్యాయామాలు చేయడం అనేది చాలా బోరింగ్గా మారిపోతుందట. అందుకే..పుష్ అప్లు తర్వాత కడుపుని సాగదీసేలా హామ్ స్ట్రింగ్లు, పరుగు, తదితరాలు చేస్తూ..ఆసక్తికరంగా మార్చుకుంటాడట. కేవలం తాను క్రమం తప్పకుండా వ్యాయామాలు చేయాలనే డెడీకేషన్, యాక్టివ్గా ఉండటంపై నిరంతర ఫోకసే ఇంతలా ఈ వయసులో ఫిట్నెస్గా ఉండటానికి కారణమని అంటాడు కెన్. మరి అతడు ఎలాంటి ఆహారం తీసుకుంటాడంటే..డైట్..కెన్ తన రోజుని జంబో ఓట్స్, గోధుమలు, చియా గింజలతో కూడిన బ్రేక్ఫాస్ట్తో ప్రారంభిస్తాడట. వాటితోపాటు అరటిపండు, ఎండుద్రాక్ష, పాలు తదితరాలు కూడా తీసుకుంటానని చెబుతున్నాడు.కెన్లా సుదీర్ఘకాలం ఆరోగ్యంగా ఉండాలంటే..పెద్దయ్యే కొద్ది సిక్స్ప్యాకలు, మంచి శరీరాకృతి వంటి వాటిపై ఫోకస్ తగ్గి..ఆరోగ్యంగా జీవించాలనే కాంక్ష పెరుగుతుందట. అలా అనుకునేవాళ్లు క్రమం తప్పకుండా వ్యాయామాలు చేయడం, సమతుల్య ఆహారానికి పెద్ద పీటవేయడం వంటివి చేయాలట. ముఖ్యంగా గుండె, మెదడు ఆరోగ్యం బాగుండాలంటే..నడక, ఈత, సైక్లింగ్ తప్పనిసరి అట. ఇవి శరీరానికి తేలికపాటి శక్తి శక్షణ నిచ్చి..రక్తపోటు, చక్కెర, కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతాయట. అంతేగాదు మానసిక ఆరోగ్యం మెరుగగ్గా ఉండి.. ఒంటరితనం, ఆందోళన, నిరాశతో పోరాడగలిగేలా ఆరోగ్యకరమైన రసాయనాలు శరీరంలో విడుదలవుతాయట.ఇ క్కడ కెన్లా అంతలా వ్యాయామాలు చేయలేకపోయినా..కనీసం నడక, చిన్నపాటి కండరాల కదలికల కోసం కాస్త తేలికపాటి వర్కౌట్లు చేసినా.. సుదీర్ఘకాలం ఆరోగ్యంగా ఉంటామని చెబుతున్నారు నిపుణులు. గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. అనుసరించే ముందు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: స్నేహితుడి కూతురు కోసం వెల కట్టలేని గిఫ్ట్..! నెటిజన్లు ఫిదా) -
కొద్ది సేపు బ్రేక్ ఇచ్చే కిక్ వేరేలెవెల్..!
పని చేయటం, విశ్రాంతి తీసుకోవటం అనేవి జీవితంలో రెండు అత్యంత ప్రధాన విషయాలు. ఈ రెండింటిలో సమతుల్యత కలిగి ఉండటం అనేది నైపుణ్యతకు సంబంధించినది. ఈ రెండింటిపై సరైన పట్టు తెలిసి ఉండటమే జ్ఞానం. పనిచేయడంలో విశ్రాంతి, విశ్రాంతిలో కార్యచరణతను చూడటం అనేది అంతులేని స్వేచ్ఛని అందిస్తుంది.బ్రేక్ ప్రాముఖ్యత...కాలం అనేది ప్రవహించే నది లాంటిది. ఆనందంగా ఉన్న సమయాన్ని సైతం తన ప్రవాహంలో తీసుకుపోతుంది. కొన్నిసార్లు ఆ ప్రవాహంలో ముక్కుపుటాలవరకు మునిగిపోతాం. ఆ తర్వాత నది ఒరవడి తగ్గాక లేదా వరద ఉద్ధృతి తగ్గాక ఒడ్డుకి చేరుకుంటారు. అలేగా జీవితంలో కూడా ఒక్కోసారి సంపూర్ణంగా కాలంతో ఉండాల్సి ఉంటుంది. కొన్నిసార్లు ఒడ్డుకు చేరి కూర్చొని గమనించాలి కూడా. అలాగే జీవితంలో కూడా ఇలాంటి సమతుల్యతను పాటించాల్సిన అవసరం తప్పక ఉంది.సరైన కార్యాచరణే విశ్రాంతికి పునాది..!ఎంత ఎత్తైన భవనాన్ని నిర్మించాలన్నా దానికి సరైన పునాది లోతుగా ఉండాల్సిందే. వింటినారిని ఎంత భాగా వెనక్కు లాగితే అంతవరకు బాణం దూరంగా వెళ్తుంది. అలాగే మన పనులు ఫలవంతమై, విజయం సాధించాలంటే. మనకు సరైన సమయంలో తగిన విశ్రాంతి అంత అవసరం. ధ్యానం అంటే..ధ్యానం అంటే ఏం చేయకుండా ఉండే ఓ అద్భుత కళ. ఇది గాఢ నిద్రలో పొందే విశ్రాంతి కంటే విలువైనది. శ్వాస మీద ధ్యాస పెట్టే ఈ సుదర్శన క్రియ. మెదడులోని ఆల్ఫా, బీటా తరంగాలు రెండింటిని పెంచి, ఒత్తిడిని కలిగించే కార్టిసాల్ హార్మోన్ను నియంత్రిస్తుంది. ఫలితం విశ్రాంతిగా ఉంటూనే అప్రమత్తంగా(ఎరుకగా) ఉంటాం. ఫలితంగా ఒత్తిడికి గురికాకుండా పనిచేయగలుగుతాం.బ్యాలెన్సింగ్ లైఫ్ కోసం..ధ్యానం వెనుకకు లాగిపట్టి లోలోపలకు తీసుకువెళ్లి..పరిస్థితుల నుంచి పారిపోనివ్వకుండా చేస్తుంది. ఇది సమతత్వాన్నిసాధించేందుకు చేసే అభ్యాసం. అంతరంగంలో ప్రశాంతత, బాహ్యంగా చైతన్యంగా ఉండేలా చేస్తుంది.ఇది అందరికి తప్పక అవసరమైనది. మనలో కలిగే సంఘర్షణలకు పరిష్కారం తోపాటు అంతరంగ శాంతికి ఇది ఎంతో సహాయపడుతుంది. ఎప్పుడైతే అంతరంగంలో ప్రశాంతత ఏర్పడుతుందో..సానూకూలంగా స్పందించగలుగుతాం. సున్నితంగా ఉంటూ సానకూలంగా వ్యవహరించడం అత్యంత అవసరం. ఎందుకంటే సున్నిత మనస్కులు చిన్న విషయాలకే ఆవేశ పడిపోతారు. అతిగా స్పందించేవారు ఇతరులు ఏమనుకుంటారనేది అనవసరం, తమ వైఖరే సరైనదనేది వారి నమ్మకం. అందువల్ల సున్నతత్తం స్పందించే మనసు రెండూ అవసరమే మనిషికి. ఈ నాగరిక సమాజంలో మనగలగాలంటే..సంబంధాలు, సమతుల్యత రెండూ అవసరం. ముఖ్యంగా మన భావ ప్రకటన సవ్యంగా ఉంటే ఎలాంటి ఘర్షణలకు తావుండదు.విరామపు శక్తని ఎలా పెంపొందించుకోవాలంటే..మొదటగా విరామం అవసరం అన్న ఆలోచనే మిమ్మల్ని విశ్రాంతిగా ఉండనివ్వదు. బాగా కష్టపడి పనిచేయాలన్న ఆలోచన అలసట తెప్పిస్తుంది.తక్కువ సమయమైనా విశ్రాంతి పునరుత్తేజాన్ని అందిస్తుంది. ధ్యానం చేసేందుకు నాకు ఏం అక్కర్లేదు, నేను ఏం కాను, ఏమి చేయడం లేదు అనే వాటిని వదిలేయండి. మూడు కాలం మిమ్మల్ని నియంత్రించేలా చేయకండి, సమయం సరిపోవటం లేదన్న ఆలోచనే వద్దు. చివరగా చేసే పనిలో తీసుకునే ఆహారంలో సమతుల్యత పాటించండి. ఇక్కవ విశ్రాంతి తీసుకున్నప్పుడు శక్తిపొందుతారు, పనిచేసినప్పుడూ శక్తిని వ్యక్తపరుస్తారు. ఈ రెండిటి కలయికే జీవితం.సృజనాత్మకత, చైతన్యానికి మూలం ధ్యానం..చివరగా ధ్యానం చేయండి, అది మిమ్మల్ని, మీ మనసుని శుభ్రపరిచి, పనిభారాన్ని స్వీకరించేందుకు సిద్ధం చేస్తుంది. మనసు విశ్రాంతి పొందినప్పుడే బుద్ధి పదునెక్కుతుంది.ప్రశాంతమైన, స్థిరమైన మనసు మందకోడిగా ఉంటుంది. అది ఉత్సాహానికి, సృజనాత్మకతకు నెలవుగా మారి, ప్రపంచంలోని అత్యుత్తమమైన వాటన్నింటిని పొందగలిగేలా చేస్తుంది. -
వెయిట్ లిఫ్టింగ్తో తస్మాత్ జాగ్రత్త..! వైద్యుల స్ట్రాంగ్ వార్నింగ్
చాలామటుకు ఆర్థోపెడిక్ సమస్యలు ఉన్నవారు, పెద్దవాళ్లు వెయిట్లిప్టింగ్తో ఫిట్గా ఉండే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే ఆ మోకాళ్ల సమస్యల నుంచి బయటపడుతున్నారు కూడా. కానీ ఒక్కోసారి ఇలాంటి వెయిట్ లిఫ్టింగ్లు అనుకోని సమస్యలు కూడా తెచ్చుపెడుతుందట. భారీ వెయిట్ లిఫ్టింగ్లు ఎత్తితే కంటి చూపే పోయే ప్రమాదం ఉంటుందట. ఇది చాలా అరుదుగా సంభవించే గాయమట. ఇలా ఎందుకు జరుగుతుంది..? ఫిట్నెస్ కోసం చేసే వ్యాయామాలు కంటిచూపుపై ప్రభావం చూపించడానికి రీజన్.27 ఏళ్ల ఆరోగ్యవంతమైన వ్యక్తి భారీ వెయిట్ లిఫ్టింగ్ ఎత్తిన వెంటనే ఆకస్మికంగా దృష్టికోల్పోయాడు. ఒక సాధారణ జిమ్ సెషన్ కాస్తా అత్యవసర వైద్య పరిస్థితిగా మారింది. నిజానికి అంతకుమునుపు అతడి కంటికి సంబంధించి ఎలాంటి ఫిర్యాదులు కూడా లేవు. జిమ్లో డెడ్లిఫ్ట్ సమయంలో ఒత్తిడికి గురైన వెంటనే ఆ వ్యక్తికి దృష్టి సమస్యలు మొదలయ్యాయి. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లగా కుడి కంటిలో అస్పష్టత ఉందని, ఎడమకన్ను సాధారణంగా ఉందని చెప్పారు. అయితే ప్రభావిత కంటిలో దృష్టిలోపం గణనీయంగా ఉందని చెప్పారు. వ్యాయమాం చేసిన వెంటనే ఎంత అకస్మికంగా ఇబ్బందిగా అనిపించిందో వైద్యులకు వివరించాడు. అది ఎలాంటి నొప్పి లేకుండా ఒక గందరగోళంలా జరిగిందని అన్నాడు. ఎందువల్ల ఇలా అంటే..అతనికి దట్టమైన ప్రీ రెటీనా ఉందని, దీనిని సబ్హైలాయిడ్ హెమరేజ్ అని కూడా పిలుస్తారు. ఇది మాక్యులా పైన ఉంటుంది. ఇది పదునైన దృష్టికి కారణమయ్యే రెటీనా కేంద్ర భాగం. దీన్ని క్షణ్ణంగా స్కాన్ చేయగా ఆ రోగికి విట్రియస్ హెమరేజ్ ఉన్నట్లు గుర్తించారు వైద్యులు. ఇది ఆకస్మికంగా భయపడినప్పుడూ లేదా తీవ్రమైన బరువు ఎత్తడం వల్ల వస్తుందట. ప్రస్తుతం ఈ రోగి ఎదుర్కొంటున్న సమస్యను 'వల్సాల్వా రెటినోపతి'గా పేర్కొన్నారు. వల్సాల్వా రెటినోపతి అంటే..వల్సాల్వా రెటినోపతి అనేది రెటీనా రక్తస్రావం. ఇది దగ్గు, ఎత్తడం లేదా గట్టిగా వాంతు చేసుకున్నప్పుడూ..ఛాతీ ఒత్తిడిలో అకస్మాత్తుగా పెరుగుదల కారణంగా రెటీనా కేశనాళికలు పగిలిపోయి కంటిలో రక్తస్రావం కలుగుతుందట. దాంతో అకస్మాత్తుగా, నొప్పిలేకుండా దృష్టి నష్టానికి దారితీస్తుంది. సాధారణంగా ఇలాంటి సమస్య కాసేపటి తర్వాత దానంతట అదే తగ్గిపోతుంది. కానీ కొన్నిసార్లు తీవ్రంగా ఉంటే లేజర్ లేదా శస్త్రచికిత్స అవసరం అవుతుంది. బరువులు ఎత్తడం, వాంతులు లేదా లైంగిక కార్యకలాపాలు వంటి కార్యకలాపాల తర్వాత ఆరోగ్యంగా ఉన్నవారిలో కూడా ఈ సమస్య అత్యంత సాధారణం అని చెబుతున్నారు.ఇది ఎందువల్ల అంటే ఏదో తెలియని ఒత్తిడి ఫలితం ఇలాంటివి సంభవిస్తాయని చెబుతున్నారు. ఇది ఎక్కువగా ఆరోగ్యకరమైన చురుకైన వ్యక్తులనే ప్రభావితం చేస్తుందట. లక్షణాలునిపుణుల అభిప్రాయం ప్రకారం, దృష్టిలో అకస్మాత్తుగా తగ్గుదల, తరచుగా ఒక కంటిలో. రోగులు వారి కేంద్ర దృష్టిలో ఒక చీకటి మచ్చ లేదా నీడను గురించి వివరిస్తారు. దాన్ని కొన్నిసార్లు సిరా మచ్చ లేదా అద్దాలపై మరకలా ఉందని చెబుతుంటారు. అస్పష్టమైన లేదా వక్రీకరించబడిన దృశ్య క్షేత్రాలు, తేలియాడే మచ్చలు అరుదుగా, గణనీయమైన రక్తస్రావం జరిగితే తేలికపాటి అసౌకర్యంముఖ్యంగా శారీరక శ్రమ లేదా శ్రమ తర్వాత మీ దృష్టిలో ఆకస్మిక మార్పులను మీరు గమనించినట్లయితే అత్యవసర అంచనాను పొందడం చాలా అవసరం.ఎలా చికిత్స చేస్తారంటే..ఈ పరిస్థితికి చికిత్స చేయడం అంటే.. రక్తస్రావంను సురక్షితంగా, వేగంగా క్లియర్ చేసి, దృష్టిని పునరుద్ధరించడం. అలాగే శాశ్వత రెటీనా నష్టాన్ని నివారించడం అని వైద్యులు అంటున్నారు. చిన్నపాటి రక్తస్రావం కోసం, రోగి దృష్టి, రెటీనా ఆరోగ్యాన్నినిశితంగా పరిశీలించి చికిత్స అందించడం జరుగుతుంది. .యాగ్ లేజర్ చికిత్సరక్తం లోపలి పరిమితి పొర కింద చిక్కుకున్నప్పుడు, YAG లేజర్ చికిత్సను సూచిస్తారు వైద్యులు. అరుదుగానే శస్త్ర చికిత్స అవసరం అవుతుందని చెప్పుకొచ్చారు వైద్యులు. . -
క్రిటికల్ కేర్ తక్షణ.. రక్షణ!
‘‘ఆయనది చాలా క్రిటికల్ కండిషన్ అట!’’... ఒకరికి చాలా సీరియస్గా ఉన్నప్పుడు చాలామంది ఈ మాట వాడుతుంటారు. కార్డియాలజీ, న్యూరాలజీ... ఇలాంటి అనేక విభాగాల్లాగే ‘క్రిటికల్ కేర్’ అనేది కూడా ఒక విభాగం. కాకపోతే కార్డియాలజీ, న్యూరాలజీలతో పాటు ఇలాంటి అన్ని విభాగాల వారికీ చికిత్స అందించే అత్యంత కీలక విభాగమిది. అయితే... వైద్యశాస్త్ర పరిజ్ఞానం ఉన్న కొందరు తప్ప... చాలామంది క్రిటికల్ కేర్నూ, ఎమర్జెన్సీ విభాగాన్నీ ఒకటే అనుకుంటారు. కానీ అది సరికాదు. కానీ... క్రిటికల్ కేర్ అన్నా లేదా ఇంటెన్సివ్ కేర్ యూనిట్ అన్నా దాదాపుగా ఒకటే. కాకపోతే కార్డియాలజీ, న్యూరాలజీలకు ప్రత్యేకంగా ఐసీసీయూ (ఇంటెన్సివ్ కార్డియాక్ కేర్ యూనిట్), ఎన్ఐసీయూ (న్యూరో ఇంటెన్సివ్ కేర్ యూనిట్) ఇలా చాలా పెద్ద పెద్ద హాస్పిటళ్లలో వేర్వేరు ఇంటెన్సివ్ కేర్ యూనిట్లు ఉండవచ్చు. కానీ ఓ మోస్తరు పెద్ద హాస్పిటల్స్లో ఒకే ఐసీయూ ఉంటుంది. క్రిటికల్ పరిస్థితుల్లో ఉండే బాధితులకు ఈ క్రిటికల్ కేర్ యూనిట్స్లో అందే చికిత్సలూ, అందజేసే నిపుణులైన డాక్టర్లు... ఆ క్రిటికల్ కేర్ ప్రత్యేకతలేమిటో చూద్దాం.క్రిటికల్ కేర్, ఎమర్జెన్సీ కేర్ ఒకటి కాదు. ఎమర్జెన్సీ అంటే... ఏదైనా చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్న బాధితులప్రాణాలు నిలిపేందుకు కొద్దిసేపు మాత్రమే అక్కడ ఉంచి చికిత్స అందించి... ఇకప్రాణాలు నిలుస్తాయన్న తర్వాత క్రిటికల్ కేర్ / ఇంటెన్సివ్ కేర్ యూనిట్కు తరలించి అక్కడ మాత్రం చాలా సేపు ఉంచి చికిత్స అందించి, ఒక వార్డుకు లేదా రూమ్కు తరలించి చికిత్స అందిస్తారు. ఒక్కమాటలో చెప్పాలంటే ఎమర్జెన్సీ కొద్ది కాలం... క్రిటికల్ కేర్లో కాస్తంత ఎక్కువ కాలం చికిత్స అందిస్తారు.క్రిటికల్ కేర్కూ, ఎమర్జెన్సీకీ ఇదీ తేడా...మనకు తేలిగ్గా అర్థమయ్యేందుకు ఒక ఉదాహరణ చెప్పుకుందాం. విషం తీసుకున్న ఒక వ్యక్తిని ఎమర్జెన్సీకి తీసుకురాగానే... ఒక సెకండ్లోని చాలా సూక్ష్మమైన భాగం అంటే క్షణాల్లోనే గొంతులోకి పైప్ వేయగలంత సమర్థులు ఎమర్జెన్సీలో ఉంటారు. అలా ఆ గొట్టం ద్వారా కడుపులో ఉన్న విషాన్ని బయటకు తీసుకువస్తారు. అలాగే ఓ రోడ్డు యాక్సిడెంటు లేదా ఇతరత్రా ప్రమాదాలకు గురైనవారినీ (ట్రామా కేసు) లేదా గుండెపోటు వచ్చినా, పక్షవాతానికి గురైనా... తక్షణప్రాణాపాయం ఉన్నవారికి... తక్షణ వైద్యసేవ అందాల్సిన అవసరం ఉన్న వ్యక్తికి... ఆ తక్షణ చికిత్స అందేలా చేసేదే ఎమర్జెన్సీ వార్డు. ఇక అలా ఎమర్జెన్సీ చికిత్స అందిన తర్వాత... అప్పటికప్పుడు వచ్చే ప్రమాదం తప్పినప్పటికీ... తక్షణ అవసరం పెద్దగా ఏదీ లేకపోయినా... పూర్తి ప్రమాదం ఇంకా ఉండనే ఉందనీ, కొంతకాలం పాటు చాలా అప్రమత్తంగా చూసుకోవాల్సిన అవసరం ఉందని తెలిశాక... అంతటి అప్రమత్తతతో పేషెంట్స్ను చూసుకునే విభాగమే ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లేదా క్రిటికల్ కేర్ యూనిట్. ఎమర్జెన్సీలో ఉండే అన్ని రకాల అప్రమత్తమైన సేవలూ క్రిటికల్ కేర్లో ఉన్నప్పటికీ... ఇక్కడ పేషెంట్ను ఎమర్జెన్సీ వార్డులో కంటే ఎక్కువ సేపు ఉంచి చికిత్స అందిస్తారు. కొన్ని దేశాల్లో దీన్ని ‘క్రిటికల్ కేర్ విభాగం’ అంటారు. మరికొన్ని చోట్ల దీన్నే ‘ఇంటెన్సివ్ కేర్ విభాగం’ అంటారు. పేరు ఏదైనప్పటికీ... అక్కడి డాక్టర్లు, వైద్య సిబ్బంది అనునిత్యం అప్రమత్తంగా ఉంటారు. ఇందుకోసం క్రిటికల్ కేర్ డాక్టర్లు ప్రత్యేక శిక్షణ పొంది ఉంటారు. పేషెంట్ జీవితాన్ని కాపాడాటానికి రోజులోని 24 గంటలూ అంతే సావధానంగా ఉంటారు. అందుకే వీళ్లను ఇంటెన్సివిస్ట్స్ అని కూడా అంటారు.ఇక్కడి పేషెంట్స్ ఎవరంటే...?తక్షణ చికిత్స అందక అలాగే వదిలేస్తే కొద్ది క్షణాల్లోనేప్రాణాపాయం సంభవించగల అవకాశం ఉన్న పేషెంట్స్ను క్రిటికల్ కేర్ యూనిట్కు తరలిస్తారు. అత్యవసరంగా వైద్యసేవలు అవసరమైన రోగులు ఆసుపత్రిలో తొలుత వచ్చే ప్రదేశమిది. సాధారణంగా గుండెపోటు, పక్షవాతం, ఏదైనా రోడ్డు / వాహన / రైలు ప్రమాదానికి గురైనవారు, అగ్నిప్రమాదాల బారిన పడ్డవారు, పాము లేదా తేలు కాటుకు గురైనవారు, విషం తాగినవారు, ఏదైనా ప్రమాదకరమైన ఇన్ఫెక్షన్కు గురై తక్షణ చికిత్స అవసరమైనవారు... ఇలాంటి కేసులను క్రిటికల్ కేర్ యూనిట్కు తరలిస్తారు.అన్ని విభాగాలలోనూ నిష్ణాతులు... క్రిటికల్ కేర్ ఇంటెన్సివిస్టులు ఒక పేషెంట్స్కు... ఏ ప్రత్యేకమైన దేహభాగం లేదా అవయవానికి (గుండె లేదా మెదడు... ఇలా) లేదా ఓ వ్యవస్థకు (కార్డియాలజీ / న్యూరాలజీ / గ్యాస్ట్రో ఎంటరాలజీ వ్యవస్థ) ఎలాంటి వైద్యచికిత్స అవసరమో... ఆ డాక్టర్తో పాటు మిగతా అనుబంధ విభాగాలలోని ఆ డాక్టర్ల బృందమంతా వెంటనే పేషెంట్కు చికిత్స అందించడం మొదలుపెడతారు. ఉదాహరణకు ఒక వ్యక్తి రోడ్డు యాక్సిడెంట్కు లోనైనప్పుడు మొదట తలకు దెబ్బతగిలి ఉండే న్యూరో సర్జన్తో పాటు ఎముకలకు ఏదైనా హాని జరిగిందేమోనంటూ ఆర్థోపెడిక్ సర్జన్... అలాగే ఆ దెబ్బ తగిలిన చోటును బట్టి రక్తప్రసరణ వ్యవస్థకు ఏదైనా విఘాతం కలిగితే దానికి సంబంధించిన నిపుణులు... ఇలా అవసరాన్ని బట్టి ప్రధాన వైద్య నిపుణులతో బాటూ ఇతర నిపుణులూ కలిసి పనిచేసి పేషెంట్ను రక్షించడానికి ప్రయత్నిస్తారు. అలా మొదటగా అతడిలోని జీవక్రియలకు సంబంధించిన వ్యవస్థలన్నీ సక్రమంగా పనిచేసేలా చూస్తారు. ఇలాంటి పత్యేక శిక్షణ పొందిన వైద్యులను ‘ఇంటెన్సివిస్ట్స్’ అంటారు. అంటే వాళ్ల చికిత్స చాలా కేంద్రీకృతంగా, తక్షణం పేషెంట్ప్రాణాలను రక్షించడం కోసమే అయి ఉంటుంది. ఈ ఇంటెన్సివిస్ట్లందరూ కేవలం ఒక నిర్ణీతమైన దేహవ్యవస్థా లేదా ఓ నిర్దిష్టమైన అవయవం విషయంలోనే కాకుండా... పూర్తిగా అన్ని శారీరక దేహ వ్యవస్థలూ (అంటే నాడీ, జీర్ణ, రక్తప్రసరణ, గుండె ఇలా అన్ని రకాల వ్యవస్థలూ), దేహభాగాలూ / అవయవాలన్నింటిపైనా మంచి పట్టు, వాటి చికిత్సల్లో అద్భుతమైన నైపుణ్యంగలవారిగా ఉంటారు.గతం కంటే ఇప్పుడు మరిన్ని నైపుణ్యాలతోనూ ఇంకింత ప్రత్యేకంగా... దాదాపుగా గత మూడు శతాబ్దాల క్రితం అన్ని రంగాలకు చెందిన వైద్యులంతా ఈ ఇంటెన్సివ్ కేర్ యూనిట్/క్రిటికల్ కేర్ విభాగంలో ఉండేవారు. అన్ని రకాల సేవలూ అక్కడే దొరికేవి. కానీ ఇప్పుడు ఆధునిక యుగంలో ఇంటెన్సివ్ కేర్ యూనిట్లు / క్రిటికల్ కేర్ యూనిట్ల పనితీరు పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు వైద్యరంగంలో వచ్చిన ఆధునిక వైద్య పరిజ్ఞానం, అత్యున్నతమైన సేవలు అందుబాటులోకి వచ్చిన తర్వాత... పేషెంట్లను ఉంచే ప్రదేశాలూ, అక్కడి వసతులు అన్నీ ప్రత్యేకంగా మారాయి. ఉదాహరణకు... శ్వాస తీసుకోలేని రోగులకు కృత్రిమశ్వాస అందించేందుకు వెంటిలేటర్లు, పేషెంట్స్కు సంబంధించిన అన్ని రకాల కీలకమైన రీడింగ్స్ను తీసుకునే అత్యున్నత స్థాయి పరిజ్ఞానం కలిగిన సున్నితమైన (ప్రెసిషన్గా పనిచేసే సెన్సిటివిటీ ఎక్కువగా ఉండే) పరికరాలు, మూత్రపిండాలు విఫలమైన సందర్భాల్లో కృత్రిమంగా దేహంలో లేదా రక్తంలోని మలినాలన్నింటినీ తొలగించే డయాలసిస్ యంత్రాలు... ఇలా ఎన్నో కీలకమైన ఉపకరణాలన్నీ ఏ రంగానికి కావాల్సినవి ఆ రంగాలకు చెందిన ప్రత్యేక ఇంటెన్సివ్ కేర్ యూనిట్లలో ఇప్పుడు అమర్చి ఉంచుతున్నారు.అన్నింటా పురోగతితో పాటు అత్యవసర వైద్యసేవల్లో కూడా...ఇప్పటితో పోలిస్తే కొద్ది కాలం కిందట వైద్యచికిత్సలు ఇప్పటికంటే కాస్త నింపాదిగా, కాస్తంత మెల్లగా సాగేవి. అందుకే ఒకప్పటి తీవ్రమైన జబ్బులకూ శానిటోరియమ్ల తరహాలోనే ఆసుపత్రులు ఉండేవి. అత్యవసరంగా వైద్యసేవలు అందించాల్సిన చాలా సందర్భాలలో పేషెంట్లు చనిపోవడం లాంటి దుర్ఘటనలే ఎక్కువగా చోటుచేసుకునేవి. కానీ ఇప్పుడు ఆధునిక వైద్య చికిత్స ప్రక్రియల్లో గణనీయమైన పురోగతి రావడంతో ఈ చికిత్స అందించే క్రమంలోనూ విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి. అంటే ఎంత వేగంగా హాస్పిటల్కు తీసుకొస్తే అంతటి ఉత్తమమైన / వేగవంతమైన చికిత్స అందేలాగా... దానికి అనుగుణంగానే ప్రభావాలు (రిజల్ట్స్) కనిపించేలా పరిస్థితులు మారిపోయాయి. ఉదాహరణకు... పెను ప్రమాదాలేవైనా సంభవించినప్పుడు... అది జరిగిన మొదటి అరగంటలోనే పేషెంట్స్ను తీసుకువస్తే... ఆ వ్యవధిని ΄్లాటినమ్ మొమెంట్స్ అని,ప్రాణాపాయాన్ని తప్పించగల అవకాశాలు పుష్కలంగా ఉంటాయని, రెండో అరగంటను గోల్డెన్ మొమెంట్స్ అని, ఆ తర్వాతి క్షణాలను సిల్వర్ మొమెంట్స్... అంటూ అభివర్ణిస్తున్నారు. అంటే గోల్డెన్ మొమెంట్స్లోప్రాణాపాయాన్ని తప్పించడానికి మంచి అవకాశం ఉండగా... ఆ తర్వాతి క్షణాల్లో ఒక మోస్తరు అవకాశాలుంటాయని... ఇలా ప్రమాదమైనా, గుండెపోటు, పక్షవాతం లాంటి ఆరోగ్య పెనుముప్పులనైనా తప్పించే అవకాశం ఉంటుందని స్పష్టంగా తెలుస్తోంది. దీనికి తోడు అన్ని విభాగాల్లోనూ సూపర్స్పెషాలిటీలు, అందులోనూ మళ్లీ సబ్స్పెషాలిటీలు రావడం మొదలైంది. ఈ మార్పుకు తగినట్లుగానే క్రిటికల్ కేర్ యూనిట్లు సైతం తమ తమ విభాగాల్లో ఇంకా ప్రత్యేకతలను సంతరించుకోవడం మొదలుపెట్టాయి. అత్యాధునిక ఉపకరణాలు,ప్రాణాలను కాపాడేందుకు కొత్త కొత్త అత్యాధునిక వైద్యసేవలు ఆవిష్కృతమవుతున్నాయి. ఈ యూనిట్లలోకి కొత్త పరికరాలు వస్తున్నాయి. ఇక్కడ పనిచేసే వైద్యులు సైతం పీజీ (ఎం.డి.) తర్వాత ఇంకా మళ్లీ క్రిటికల్ కేర్ మెడిసిన్ అనే ప్రత్యేక విద్యార్హత / ప్రత్యే శిక్షణ పొందాల్సి ఉంటుంది.ఇక్కడి నిపుణుల ప్రత్యేకత ఏమిటంటే...ఏదైనా ఒక అవయవానికి ఓ వ్యాధి వచ్చిందనుకోండి. తొలుత అది ఆ అవయవానికే పరిమితమవుతుంది. కొంతకాలం తర్వాత అది మరింతగా తీవ్రమైతే ΄÷రుగునే ఉన్న అవయవాలకూ లేదా దానితో సంబంధం ఉన్న అవయవాలకూ, సంబంధిత వ్యవస్థలకూ విస్తరిస్తుంది లేదా వాటిపై తన ప్రతికూలతలను చూపుతుంది. ఉదాహరణకు... గుండెపోటుతో గుండె కండరం విఫలం కావడం మొదలైతే... అది కేవలం గుండెకే పరిమితం కాకుండా... రక్తసరఫరా సరిగా జరగకపోవడంతో మెదడుకు కూడా రక్తం అందకపోవడం, దాని పనితీరూ ప్రభావితం కావడం జరుగుతాయి. మెదడు అన్ని కీలక అవయవాలను నియంత్రిస్తుంటుంది కాబట్టి దాని అధీనంలో ఉండే అన్ని అవయవాలూ చచ్చుబడిపోయేందుకు అవకాశాలు పెరుగతాయి. ఒకవేళ మెదడులో రక్తస్రావం అయి, గుండెను నియంత్రించే కేంద్రంపై దాని ప్రభావం పడితే గుండెనూ ప్రభావితం చేస్తుంది. అందుకే క్రిటికల్ కేర్ యూనిట్లో ఉన్నప్పుడు వ్యాధి సోకిన అవయవం గాకుండా... దాని వల్ల ప్రభావితమైన అవయవాలూ పనిచేయకుండా పోయే కండిషన్ను ‘మల్టీ ఆర్గాన్ డిస్ఫంక్షన్’ అంటారు. ఇక అన్ని అవయవాలూ పూర్తిగా విఫలమైతే దాన్ని ‘మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్’గా చెబుతారు. ఇలాంటి పరిస్థితి రాకుండా క్రిటికల్ కేర్ యూనిట్లోని డాక్టర్లందరూ నిరంతరం శ్రమిస్తుంటారు. అందుకే క్రిటికల్ కేర్ యూనిట్లో పనిచేసే వైద్యులకు కేవలం ఒక ప్రత్యేకమైన అవయవానికి సంబంధించిన పరిజ్ఞానమో లేదా ఒక వ్యవస్థకు చెందిన పరిజ్ఞానమో కాకుండా... శరీరంలోని అన్ని అవయవాలకు సంబంధించిన సంపూర్ణ పరిజ్ఞానం ఉండేలా శిక్షణ పొందుతారన్నమాట. అందుకోసం ప్రత్యేకంగా క్రిటికల్ కేర్ మెడిసిన్ (సీసీఎమ్) అనే విభాగమే రూపొందింది. వీళ్ల నేతృత్వంలోనే అత్యంత సంక్లిష్టమైనప్రాణాపాయాన్ని నివారించే విధులు నిర్వర్తించే కీలకమైన పనులు జరుగుతుంటాయి.ఉదాహరణకు ఒక కేస్ స్టడీ...ఒక వ్యక్తికి నిమోనియా సోకిందనుకుందాం. నిజానికి నిమోనియా లంగ్స్కు సంబంధించిన సమస్య. దేహంలోని ఎన్నో వ్యవస్థల్లో ‘శ్వాసకోశ వ్యవస్థ’ ఒకటి. నిమోనియా ఆ వ్యవస్థ కిందికి వస్తుంది. సాధారణంగా నిమోనియా చికిత్స కోసం యాంటీబయాటిక్స్తో చికిత్స అందిస్తే చాలు. కానీ ఏవైనా కారణాల వల్ల సమస్య అదుపులో లేకుండా పోయి... పేషెంట్కు శ్వాస అందకపోతే ఆక్సిజన్ పెట్టాలి. కృత్రిమ శ్వాస ఇవ్వడానికి వెంటిలేటర్ అవసరం. ఒకవేళ లంగ్స్ కు ఉన్న ఇన్ఫెక్షన్ రక్తానికీ వ్యాపించి, సెప్సిస్గా మారితే అప్పుడు కేవలం యాంటీబయాటిక్స్తో మాత్రమే చికిత్స చేస్తే సరిపోదు. ఆ పరిస్థితుల్లో అన్ని వ్యవస్థలూ సక్రమంగా పనిచేయించేలా మందులు ఇవ్వాలి. గుండె, రక్తప్రసరణ వ్యవస్థ అన్ని సక్రమంగా ఉండేలా చూడాలి. రక్తపోటు నియంత్రణలోకి వచ్చేలా చూడాలి. ఒక్కోసారి అతడికి గుండె పనితీరును మెరుగుపరచడానికి హార్ట్లంగ్ బైపాస్ అనే చికిత్సనూ అందించాల్సి రావచ్చు. ఇలా చేయడాన్ని ‘ఎక్స్ట్రా కార్పోరియల్ ఆక్సిజనేషన్’ అంటారు. ఒకవేళ ఇన్ఫెక్షన్ లంగ్స్ నుంచి కిడ్నీలకు పాకితే... అప్పుడతడి రక్తంలోని వ్యర్థాలను తొలగించడానికి ‘డయాలిసిస్’ అనే ప్రక్రియను నిర్వహించాలి. రక్తం పూర్తిగా కలుషితమైతే దాన్ని బయటకు తీసుకువచ్చి అక్కడ కృత్రిమంగా శుభ్రం చేసి మళ్లీ ఆ ఇన్ఫెక్షన్ తొలగిపోయాక శరీరంలోకి ఎక్కిస్తారు. దీన్ని ‘ఎక్స్ట్రా కార్పోరియల్ ప్యూరిఫికేషన్’ అంటారు. ఇలాంటి సేవలెన్నో ఇప్పుడు ఇంటెన్సివ్ కేర్/క్రిటికల్ కేర్ యూనిట్లలో దొరుకుతాయి.ఇదో టీమ్ స్పిరిట్తో కూడిన ప్రక్రియఅత్యంత సంక్లిష్టమైన ఈ క్రిటికల్ కేర్ విభాగాల్లో కేవలం ఇంటెన్సివిస్టులు మాత్రమే కాకుండా... ఆయా విభాగాలకు చెందిన నిపుణులూ సేవలందిస్తుంటారు. ఉదాహరణకు... ఆయా అవయవానికి సంబంధించిన వైద్యులు, క్రిటికల్ కేర్ కోసం ప్రత్యేకంగా శిక్షణ పొందిన నర్స్లు, సాంకేతిక నిపుణులు (టెక్నీషియన్స్)... ఇలా ఎందరో ఒక బృందంగా (టీమ్గా) పనిచేస్తుంటారు. ఈ టీమ్ వర్క్ అంతా ఒక సీనియర్ ఇంటెన్సివిస్ట్ నేతృత్వంలో, అతడి ఆదేశాల మేరకు పనిచేస్తుంటారు. వీళ్లంతా ఒక టీమ్స్పిరిట్తో పేషెంట్ను అతడున్న సంక్లిష్ట పరిస్థితి (క్రైసిస్) నుంచి బయటపడేసి సేవ్ చేస్తారు. అందుకే ఈ వైద్యవిభాగాన్ని గౌరవపూర్వకంగా ‘క్రిటికల్ కేర్ మెడిసిన్’గా లేదా ఇంటెన్సివ్ కేర్ చికిత్స అందే ప్రదేశంగా అభివర్ణిస్తారు.ఎవరెవరికి ఈ సేవలుఅవసరమంటే...? సాధారణంగా చాలా పెద్దవీ, అలాగే అత్యంత సంక్లిష్టమైనవీ అయిన శస్త్రచికిత్సలు పూర్తయ్యాక పేషెంట్ పరిస్థితి బాగా నిలకడ స్థితికి వచ్చే వరకు క్రిటికల్ కేర్లోనే ఉంచుతారు. వాళ్లే కాకుండా ఇంకా పెద్ద పెద్ద ప్రమాదాలకు గురైనవారు, గుండెపోటు వచ్చినవారూ, పక్షవాతానికి గురైన వారూ, అవయవాల మార్పిడి చికిత్స అందుకున్నవారూ, నీళ్లలో ముగినిపోయినవారు, క్యాన్సర్ వ్యాధిగ్రస్తుల్లో కీమోథెరపీ తర్వాతా అలాగే మలేరియా, డెంగ్యూ, స్వైన్ఫ్లూ వంటి మామూలు జబ్బులు సైతం కొందరిలోప్రాణాంతకంగా మారినప్పుడు వారికీ ఈ క్రిటికల్ కేర్ సేవలు అవసరమవుతాయి. ఇంకేవైనా రోడ్డు ప్రమాదాలూ, బాంబు పేలుళ్లు జరిగి అనేకమంది పదులు, వందల సంఖ్యల్లో ప్రమాదాలకు గురైనప్పుడు కూడా క్రిటికల్ కేర్ సేవలు నిరంతరం, నిరంతరాయంగా అందుతుంటాయి.నిర్దిష్టమైన పనివేళలంటూ ఉండవు... అన్నీ పనివేళలే... అక్కడ పనిచేసే సిబ్బందికి నిర్దిష్టమైన పనివేళలంటూ ఉండవు. ఏ క్షణాల్లో అత్యవసర సేవలు అవసరమవుతాయో తెలియక అనుక్షణం అప్రమత్తంగా ఉండేలా షిఫ్టుల్లో నిపుణులైన నర్సులు, సిబ్బంది పనిచేస్తుంటాయి. సవాళ్లతో కూడిన పరిస్థితుల్లోనూ ఇంకా గట్టిగా పనిచేస్తారు. వారు కోలుకున్న తర్వాత మళ్లీ మరొకరిప్రాణాలు రక్షించే పనుల్లో... ఇలా నిరంతరమూ తమ పనుల్లో నిమగ్నమవుతుంటారు.అంతరాయాలను నివారించేందుకు కొద్దిమందికే అనుమతి... ఇంటెన్సివ్ కేర్ యూనిట్లలో పనులు సాఫీగానూ లేదా అంతరాయాలు లేకుండా కొనసాగేందుకు వీలుగా సాధారణ వ్యక్తులను చాలా పరిమితంగా మాత్రమే అనుమతిస్తుంటారు. ఒకవేళ వెళ్లాల్సివచ్చినా ప్రత్యేకమైన గౌనులు, మాస్కులు, క్యాప్స్ ధరించి వెళ్లాల్సి ఉంటుంది. ఈ జాగ్రత్తలు కూడా పేషెంట్స్కు మేలు చేసేందుకు ఉద్దేశించినవే. అక్కడ (ఐసీయూలో) ఇన్ఫెక్షన్ వ్యాప్తి చెందే ప్రమాదలను బాగా తగ్గించడానికే. ఆగిన గుండెను మళ్లీ స్పందిచేలా చేసే సీపీఆర్ (కార్డియో పల్మునరీ రిససియేషన్) చేసే సిబ్బంది వంటి ప్రత్యేక నిపుణులు అక్కడ ఉంటారు. ఈ సంయుక్త సేలవన్నింటి వల్ల ఇప్పుడు... అత్యంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో గాయపడ్డా... వారిలోప్రాణాలు కోల్పేయేవారి సంఖ్య దాదాపుగా తగ్గిపోయింది. ఇలా అందరిప్రాణాలూ కాపాడటం కోసం ఉద్దేశించిన అంత్యంత కీలకమైనదే ఈ క్రిటికల్ కేర్ విభాగం. -
ఆ యువ సైక్లిస్ట్ గట్స్కి మాటల్లేవ్..! ఏకంగా 30 దేశాలు..
ఓ యువ సైక్లిస్ట్ ఖండాల మీదుగా అసాధారణ పర్యాటనకు పూనుకున్నాడు. ఏదో రికార్డు సృష్టించాలనో..తానెంటో ప్రపంచానికి తెలియజేయాలన్న ఉద్దేశ్యంతోనో కాదు. స్వలాభం ఆశించకుండా ఓ గొప్ప సందేశాన్ని అందించేలా సాహసోపేతమైన స్ఫూర్తిదాయక పర్యాటనను చేపట్టాడు ఆ యువకుడు. ఏకంగా 18 వేల కిలోమీటర్లు తొక్కి..తన టూర్ని సక్సెస్ఫుల్గా పూర్తిచేశాడు. తాను వయసులో చిన్న గానీ ఔదార్యంలో అందరికంటే మిన్నా అని చాటిచెప్పాడు. ఎవరా యువకుడు..ఏ లక్ష్యం కోసం ఇంత పెద్ద సాహసానికి పూనుకున్నాడంటే..ఫ్రాన్స్కు చెందిన 24 ఏళ్ల యువ సైక్లిస్ట్ కిలియన్ లే గయాడర్ తన స్వస్థలం నుంచి చైనాకు 18,000 కిలోమీటర్లు తొక్కుకుంటూ సైకిల్పై వెళ్లడం విశేషం. అతడు ఖండాలు మీదుగా చేపట్టి అసాధారణ టూర్ని చేపట్టి..ఏకంగా 30కి పైగా దేశాలు చుట్టేశాడు. ఈ ఏడాది ప్రారంభంలో ఈ టూర్ని వాయువ్య ఫ్రెంచ్ నగరం రెన్నెస్ నుంచి ప్రారంభించి..నెలల తరబడి నిరంతరం ప్రయాణిస్తూ..ఇటీవలే చైనాకు చేరుకున్నాడు. సింపుల్గా చెప్పాలంటే..లే గయాడర్ తన జీవితంలో మర్చిపోలేని గొప్ప సాహసోపేతమైన పర్యాటనను విజయవంతంగా పూర్తిచేశాడు. ఇది తన లైఫ్లోనే అత్యంత చిరస్మరణీయ విజయాలలో ఒకటిని సమర్థవంతంగా పూర్తిచేయగలిగానంటున్నాడు. ఎందుకోసం ఈ పర్యాటన అంటే..అనారోగ్యంతో పోరాడుతూ కూడా మన డ్రీమ్స్ని, లక్ష్యాలను నెరవేర్చుకోవచ్చు అని చెప్పేందుకే ఈ సాహసోపతమైన పర్యాటనకు పూనుకున్నట్లు తెలిపాడు. ఇక లె గయాడర్ 2023లో ఫ్రెంచ్ విశ్వవిద్యాలయంలో గ్రాడ్యుయేషన్ పూర్తిచేశాడు. 14 ఏళ్ల ప్రాయంలో అడవిలో ఉండే బొరేలియా బాక్టీరియా కారణంగా లైమ్ వ్యాధి బారిన పడ్డాడు. దాన్నుంచి కోలుకునేందుకే నెలలు, సంవత్సరాలు పట్టింది. ఆ తర్వాత క్రమంగా శక్తిని పొంది, పూర్తిస్థాయిలో ఆరోగ్యంవంతుడయ్యేందుకు దాదాపు మూడేళ్లు పట్టింది. ఆ నేపథ్యంలోనే ఈ వ్యాధిపై ప్రజలందిరికీ అవగాహన కలిగేలా చేయాలని.. ఇలా సైకిల్ యాత్రకు సంకల్పించాడు. తనలా మరెవ్వరూ ఇంతలాబాధ పడకుండా, ముందు జాగ్రత్తలు తీసుకునేలా అవగాహన కల్పించేందుకే ఈ సాహస యాత్ర అని చెప్పుకొచ్చాడు. ఫ్రాన్స్ నుంచి యూరప్ ఆసియా అంతటా దాదాపు 10 వేల కిలోమీటర్లు పైనే ఒంటిరిగా సైకిల్ తొక్కాడు. టర్కీ, జానీయాల వరకు తన స్నేహితుడు తోడు రాగా, అక్కడ నుంచి లె గయాడర్నే ఒంటరిగా చైనాకు చేరుకున్నాడు. అయితే చైనాకు చేరుకునే మార్గం చాలా కఠినమైన భూభాగం, చాలా సవాళ్లుతో కూడిన వాతావరణమని అంటున్నాడు. ఏకంగా ఎనిమిది నెలలు..ఈ యాత్ర కోసం నిధులు సేకరించడానికి సుమారు ఎనిమిద నెలల పనిచేశాడు. అయితే ఈ మొత్తం పర్యాటకు అతడికి సుమారు రూ.15 లక్షలు పైనే ఖర్చయ్యింది. ఈ టూర్కి ఫ్రెంచ్ బ్యాంకు, స్థానిక కౌన్సిల్, సంస్థల నుంచి ఆర్థిక సహాయం సైతం అందింది లె గయాడర్కు. నిజానికి తన ఆరోగ్య సమస్యలను దృష్టిలో పెట్టుకుంటే ఈ మార్గాలలో తాను ప్రయాణిచడం అత్యంత క్లిష్టమైన సవాలు, పైగా ప్రత్యేక అనుభవ కూడా అని అంటున్నాడు ఆ యువ సైక్లిస్ట్.లైమ్ వ్యాధి (Lyme disease) అంటే:ఇది బోర్రెలియా (Borrelia) అనే బ్యాక్టీరియా వల్ల కలిగే ఇన్ఫెక్షన్. అడవుల్లో, గడ్డిపొదల గుండా వెళ్లినప్పుడూ ఈ వ్యాధి బారిన పడతారట. దీని కారనంగా ఎర్రటి వలయాకారపు దద్దుర్లు , జ్వరం, తలనొప్పి, అలసట, కీళ్ల నొప్పులు వస్తాయి. సకాలంలో చికిత్స తీసుకోకపోతే గుండె, నాడీ వ్యవస్థ, కీళ్లపై ప్రభావం చూపి ప్రాణాంతకంగా మారుతుందట. (చదవండి: ఎముకలు కొరికే చలిలో..టీ,కాఫీ తాగుతున్నారా?) -
ఎముకలు కొరికే చలిలో..టీ,కాఫీ తాగుతున్నారా?
వణికించే చలిలో వెచ్చగా మారడానికి చాలా మంది తేనీటి మీదే ఆధారపడతారు. మిగిలిన కాలాల్లో రోజుకి ఒకటి రెండు సార్లు మించి తాగే అలవాటు లేనివాళ్లు కూడా వింటర్లో టీ హంటర్స్గా మారిపోతారు. ఎక్కువ సార్లు టీ లేదా కాఫీ తాగడం ప్రారంభిస్తారు.కానీ ఈ శీతాకాలపు అలవాటు మన శరీరంపై, దాని పనితీరుపై ఊహించని దుష్ప్రభావాలను చూపుతుందని రాయ్పూర్లోని ఎయిమ్స్ ఆర్థోపెడిక్ స్పోర్ట్స్ ఇంజురీ సర్జన్ డాక్టర్ దుష్యంత్ చౌహాన్ అంటున్నారు. ఆయన ఇటీవల రాసిన ఓ ఇన్స్ట్రాగామ్ పోస్ట్లో ఈ సీజన్లో ఎడాపెడా టీ తాగేయడం ఎంతగా ఆరోగ్యపరమైన అనర్ధాలు తెస్తుందో వివరించారు మితంగా తీసుకోవడం ఎందుకు ముఖ్యమో కూడా తెలియజేశారు.వేడి పానీయాలు ఎముకల ఆరోగ్యానికి మధ్య ఉన్న మనం ఊహించని సంబంధాన్ని డాక్టర్ చౌహాన్ హైలైట్ చేశారు. చల్లని వాతావరణంతో కలిపినప్పుడు అధిక కెఫిన్ కీళ్ల ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో ఆయన వివరిస్తున్నారు. ‘‘టీ వేడిగా ఉంటుంది, కానీ అది మీ ఎముకలను ‘చల్లబరుస్తుంది’. అని చెబితే అది వినడానికి కొంచెం వింతగా అనిపించవచ్చు, కానీ అది వాస్తవం అంటున్నారాయన. శీతాకాలంలో చాలా మంది టీ లేదా కాఫీ తీసుకునే డోస్ పెంచడంతో, మోకాళ్ల లోపల మృదులాస్థి మరింత దుర్బలంగా మారుతుందని ఆయన వెల్లడించారు. ఆయన చెబుతున్న ప్రకారం...‘‘ మోకాళ్ల లోపల మృదులాస్థి రెండు ఎముకల మధ్య ఉండే పొర, ఎండిపోవచ్చు. ఇది కీళ్లలో సున్నితత్వాన్ని మొద్దుబారుస్తుంది. ఎముకలు ఒకదానికొకటి రుద్దినప్పుడు ఎక్కువ నొప్పిని కలిగిస్తుంది శీతాకాలంలో కూడా డీహైడ్రేషన్ సమస్య ఉంటుంది. అయితే ఈ డీ హైడ్రేషన్ గుర్తించబడదు. చల్లని వాతావరణం నుంచి టీ, కాఫీలు తక్షణ ఓదార్పునిచ్చినప్పటికీ, శరీరానికి సరళత కీళ్ల పనితీరుకు అవసరమైన ద్రవాలను అవి భర్తీ చేయలేవు మనం త్రాగేవి మన ఎముకలు కీళ్లను ప్రభావితం చేస్తాయని చాలా మంది గ్రహించరు .అయితే టీని ఆస్వాదించవచ్చు, కానీ దానితో పాటు తగినంత నీరు త్రాగడం చాలా అవసరం. ‘‘హైడ్రేట్గా ఉండటం వల్ల డీహైడ్రేషన్ను నివారించవచ్చు, ఇది శీతాకాలంలో సర్వసాధారణం ఆరోగ్యకరమైన కీళ్లను నిర్వహించడానికి చాలా ముఖ్యమైనది". వేడి పానీయాలను ఆస్వాదిస్తున్నప్పుడు తగినంత నీరు తీసుకోవడం వంటి సాధారణ చర్యలు గణనీయమైన మేలు చేస్తాయి.ఆర్థోపెడిక్ ట్రామా రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ డాక్టర్ పి సి జగదీష్ ఆంగ్లపత్రిక ఇంటర్వ్యూలో ఇలా చెప్పారు, ‘‘మృదులాస్థి అధిక శాతం నీటితో తయారవుతుంది దాని స్థితిస్థాపకత, షాక్ శోషణ సామర్థ్యం మృదులాస్థి ఉపరితలాన్ని నిర్వహించడానికి తగినంత హైడ్రేషన్పై ఆధారపడుతుంది. శరీరం డీ హైడ్రేషన్కి గురైనప్పుడు, మృదులాస్థి దాని అంతర్గత నీటి శాతాన్ని కోల్పోతుంది, ఇది కీళ్లను కుషన్ చేసే సామర్థ్యాన్ని తగ్గిస్తుంది కదలిక సమయంలో ఇబ్బందులను పెంచుతుంది. అయితే కెఫీన్ స్వయంగా నేరుగా కీళ్లను దెబ్బతీయదని, అది తేలికపాటి మూత్రవిసర్జన ప్రభావాన్ని కలిగి ఉంటుందని తద్వారా తక్కువగా నీటిని తీసుకునే అలవాటున్న వ్యక్తులలో ద్రవ నష్టాన్ని బాగా పెంచడానికి దోహదం చేస్తుందని ఆయన చెబుతున్నారు.. శీతాకాలంలో, నీటి తీసుకోవడం తగ్గిస్తూ దానిని నీటిని టీ లేదా కాఫీతో భర్తీ చేస్తారని ఆయన పేర్కొన్నారు, అక్కడే నిజమైన ప్రమాదం దాగి ఉంది.రోజుకు పలు కప్పుల చాయ్ లేదా కాఫీ తాగే వ్యక్తులకు, శరీర బరువు కార్యాచరణ స్థాయిని బట్టి, మొత్తం రోజువారీ ద్రవం తీసుకోవడం 2 నుంచి 2.5 లీటర్ల వరకు ఉండాలనేది సాధారణ సలహా అని డాక్టర్ జగదీష్ చెప్పారు. ‘తగినంత హైడ్రేషన్ను నిర్వహించడానికి ప్రతి కెఫిన్ పానీయం ఒక గ్లాసు సాదా నీటితో సమతుల్యం చేసుకోవాలి అని ఆయన సూచిస్తున్నారు.శీతాకాలపు కీళ్ల నిర్వహణలో హైడ్రేషన్ ఒక భాగం మాత్రమే నంటున్న ఆయన. ‘క్రమం తప్పకుండా కదలిక వ్యాయామాలు, కీళ్ల చుట్టూ కండరాల బలాన్ని నిర్వహించడం, ఎక్కువసేపు కూర్చోకుండా ఉండటం శరీరాన్ని వెచ్చగా ఉంచడం అన్నీ మెరుగైన కీళ్ల ఆరోగ్యానికి దోహదం చేస్తాయి. ఆస్టియో ఆర్థరైటిస్ ఉన్నవారు తరచుగా నడక, సైక్లింగ్ లేదా నీటి ఆధారిత వ్యాయామాలు వంటి తక్కువ ప్రభావ కార్యకలాపాల ద్వారా ప్రయోజనం పొందుతారని, అలాగే విటమిన్ డి, కాల్షియం ఒమేగా–3 అధికంగా ఉండే ఆహారాలను తగినంతగా తీసుకోవాలని సిఫార్సు చేస్తున్నారు.(చదవండి: ఆ హరిహరసుతుడి అరవణ ప్రసాదం డబ్బాల కొరత..) -
నోటిఫికేషన్లతో కెరీర్ డేమేజ్
అర్ధరాత్రి సరిగ్గా 2:17 గంటలకు అర్చనకు టీమ్స్ నోటిఫికేషన్ వచ్చింది. కళ్లు తెరవాలనిపించలేదు. కానీ ఏం నోటిఫికేషన్ వచ్చిందో వెంటనే చెక్ చేయమని మెదడు అరుస్తోంది. మెదడే నెగ్గింది. అర్చన స్మార్ట్ ఫోన్ ఓపెన్ చేసింది. ‘Tomorrow's Deck Updated’’ అని నోటిఫికేషన్ కనిపించింది. నిద్ర ఎగిరిపోయింది. ఇది కేవలం అర్చన కథ కాదు. ప్రతి నగరంలో, ప్రతి కంపెనీలో వేలాది మంది ప్రొఫెషనల్స్ ఇలా ఫోన్ నోటిఫికేషన్ శబ్దాలకు నిద్రను కోల్పోతున్నారు. చూడ్డానికి ఇది చిన్న డిస్టర్బెన్స్ అనిపిస్తుంది. కానీ దాని ప్రభావం వృత్తి, వ్యక్తిత్వం, మానసిక ప్రశాంతత... ఇలా అన్నిటిపై పడుతుంది. ఫోన్ నోటిఫికేషన్లు మన జీవితం మీద చేస్తున్న దాడులు కేవలం శబ్దాల దాడులు కావు. అవి మైక్రో–బ్రెయిన్ హిట్స్. ప్రతి పింగ్ ఒక చిన్న ఒత్తిడి. ప్రతి చిన్న ఒత్తిడి ఒక పెద్ద డిస్టర్బెన్స్. ప్రతి డిస్టర్బెన్స్ చివరకు బర్న్ఔట్కు దారితీస్తుంది. సైన చెప్పే అసలు నిజం...మన మెదడు ఏ పని మీదైనా ఫోకస్ పెట్టగలిగే సమయం సుమారు 8 నుంచి 12 నిమిషాలు మాత్రమే. ఆ సమయంలో దానికి విఘాతం కలిగితే తిరిగి ఫోకస్ రావడానికి 23 నిమిషాలు పడుతుందని బ్రెయిన్ సైంటిస్టులు చెప్తున్నారు. ఉద్యోగులకు రోజుకు వచ్చే నోటిఫికేషన్ల సంఖ్య: వాట్సప్–120, ఈమెయిల్ అలర్ట్స్–40–100, టీమ్స్ 85–150, కేలండర్ పింగ్స్ 10–20. అంటే రోజుకు సగటున 250–300 విఘాతాలు. అంటే మీ ఎనిమిది పని గంటల సమయంలో ఐదు గంటలు పూర్తిగా ఫోకస్ లేకుండా వృథా అవుతున్నాయి. అందుకే చాలామంది ప్రొఫెషనల్స్ రోజంతా బిజీగా ఉన్నప్పటికీ రోజు చివర్లో ‘ఏం చేశాను?’ అనిపిస్తుంది. ఇది మీ తప్పు కాదు. ఇది మీ మెదడుపై జరిగిన దాడి.అలసట కాదు, బ్రెయిన్ డామేజ్ప్రపంచ ఆరోగ్య సంస్థ 2019లో బర్న్ఔట్ను occupational phenomenon’ జాబితాలో పెట్టింది. వర్క్ ప్లేస్ ఒత్తిడి వల్ల మెదడు ఎగ్జాస్ట్ అవుతోందని అర్థం. బర్న్ఔట్కు మూడు ప్రాథమిక లక్షణాలున్నాయి. ∙భావోద్వేగ అలసట. అంటే, ఉదయం లేచిన వెంటనే శక్తి లేకపోవడం. ‘ఇవాళ కూడా ఇదేనా...’ అనిపించడం. ∙పనిపట్ల విసుగు. ఎంతో ఇష్టంగా చేసిన పని కూడా ఇప్పుడు చిరాకు తెప్పించడం. ∙పనితీరు పడిపోవడం, సృజనాత్మకత క్షీణించడం. చిన్న చిన్న నిర్ణయాలు తీసుకోవడంలో కూడా గందరగోళం.షాకింగ్ విషయం ఏమిటంటే నోటిఫికేషన్లు ఈ మూడు లక్షణాలను డైరెక్ట్గా పెంచుతాయని పరిశోధనలు చెబుతున్నాయి. స్టాన్ఫర్డ్ న్యూరోసైన్స్ ల్యాబ్స్ స్టడీ ప్రకారం నోటిఫికేషన్ల వల్ల పనితీరు 17శాతం పడిపోతుంది. ‘ఒక్క నిమిషం...’తో కెరీర్ డ్యామేజ్నిరంతర నోటిఫికేషన్లతో ఫోకస్ కోల్పోవడం వల్ల జరిగే నష్టం మూడు దిశల్లో సాగుతుంది.1. నోటిఫికేషన్లు మీ డీప్ జోన్ను విచ్ఛిన్నం చేసి మిమ్మల్ని ఒక రియాక్షన్–మోడ్ ఉద్యోగిగా మార్చేస్తాయి. దీనివల్ల మీరు క్రియేటివ్ థింకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్స్ లాంటి డీప్ వర్క్స్ సమర్థంగా చేయలేరు. దాంతో గుర్తింపు, పదోన్నతి, నాయకత్వ స్థానాలకు దూరమవుతారు. 2. ‘ఏం జరిగినా వెంటనే స్పందించాలి’ అనుకోవడం విధేయత కాదు, బర్న్ అవుట్ ప్రారంభదశ. దీనివల్ల భావోద్వేగ క్షీణత జరుగుతుంది. 3. మీరు రోజంతా బిజీగా ఉన్నా ప్రభావం శూన్యం కావడం మీ కెరీర్ గ్రోత్కు అత్యంత ప్రమాదకరం. మేనేజర్లు, హెచ్ఆర్, ఉన్నతాధికారులు దీన్ని గమనిస్తారు.ఇది కేవలం మీ తప్పా?ఇది కేవలం మీ తప్పు కానే కాదు, ఈనాటి వర్క్ ప్లేస్ సమస్య. ఈనాటి ఆఫీసుల్లో మీటింగ్స్ ఎక్కువ, మెసేజింగ్ యాప్స్ ఎక్కువ. డెడ్ లైన్లు నెత్తిమీద కూర్చుంటాయి. అందరూ ‘అర్జెన్సీ అడిక్షన్’లో చిక్కుకు పోయారు.పరిష్కారాలు... 1. రోజులో కనీసం రెండు గంటలు ‘నో నోటిఫికేషన్ జోన్’. ఆ సమయాన్ని మీ డీప్ వర్క్కు ఉపయోగించండి. 2. నోటిఫికేషన్ డైట్ పాటించండి. అంటే, వాట్సప్ గ్రూప్లను మ్యూట్ చేయండి. సోషల్ మీడియాను ఆఫ్ చేయండి. ఈమెయిల్స్ రోజుకు మూడుసార్లు మాత్రమే చెక్ చేయండి. 3. ప్రతి 90 నిమిషాల పని తర్వాత ఐదు నిమిషాల బ్రేక్ తీసుకోండి. ఆ సమయంలో కొద్దిగా నడవండి. లేదా నీళ్లు తాగండి. ఇది మీ కాగ్నిటివ్ ఎనర్జీని తిరిగి పెంచుతుంది. 4. మల్టీ టాస్కింగ్ అనేది మెదడుకు విషం లాంటిది. సింగిల్ టాస్క్ ఆక్సిజన్ లాంటిది. అందుకే ఒకసారి ఒకేపని అనే నిబంధన పెట్టుకుని పాటించండి. -సైకాలజిస్ట్ విశేష్ఫౌండర్, జీనియస్ మేట్రిక్స్ హబ్సైకాలజిస్ట్ విశేష్www.psyvisesh.com -
చిట్కాలున్నా... చికిత్సే ముఖ్యం!
సోషల్ మీడియా వచ్చాక ఓ ఉత్పాతమూ వచ్చిపడింది. ‘పాత పేషెంట్ కొత్త డాక్టర్తో సమాన’మంటూ అప్పట్లో ఓ సామెత లాంటి వాడుక ఉండేది. దాన్ని నిజం చేస్తూ పాత పేషెంట్లూ అంతకుమించి పాపులర్ సెలిబ్రిటీలైన సోనాలీ బెంద్రే, మనీషా కోయిరాలా, క్రికెట్ దిగ్గజం యువరాజ్ సింగ్, హాలీవుడ్ మోడల్ లీజా రే వంటి జనాల్లో మంచి క్రేజ్ ఉన్న వ్యక్తులు... ‘ఆటోఫేజీ’ అనే ఓ సైంటిఫిక్ పదాన్ని... ఇటీవలి పాపులర్ చిట్కా మంత్రా పదమైన ‘వెల్నెస్ చికిత్స’తో కలగలిపి ‘వెల్నెస్’ అద్భుతాల తాలూకు ప్రభావాలను సోషల్ మీడియా ప్రచారం చేస్తున్నారు. ఉపవాసాలూ, డీటాక్స్ విధానాల్లాంటివే అద్భుత మాయా–మంత్రాలంటూ ప్రజలకు ఇంపుగా ప్రజెంట్ చేస్తున్నారు. అసలు అన్నం కంటే పక్కన అంచుకుపెట్టుకుని నంజుకునే చిరుతిండినే నిజభోజనంగా వర్ణిస్తున్నారు. వాళ్ల మాటల మాయల్లో పడుతున్న జనాలు... అసలు వాస్తవాల కంటే అద్భుతాలనే ఎక్కువగా నమ్ముతున్నారు. ఫలితంగా ఈ ‘మిరాకిల్స్ థెరపీ’లను ఎక్కువగా నమ్ముతూ ఉండే అదే క్యాన్సర్కు అద్భుత చికిత్సేమోనంటూ అమాయక ప్రజలు అసలుకే మోసం తెచ్చుకుంటున్నారు. ఈ విషయంపై క్యాన్సర్ నిపుణులైన డాక్టర్ల మాటేమిటో చూద్దాం.వాళ్లు క్యాన్సర్ను జయించిన యోధులే. అద్భుత మనోబలంతో క్యాన్సర్ మహమ్మారిని ఎదుర్కొన్న మహామహులే. తాము క్యాన్సర్ను అధిగమించాక తాము అనుసరించిన చిట్కాలను వెల్లడిస్తూ వాళ్లు చెబుతున్న కొన్ని మాటలేమిటో చూద్దాం. → ఇంటర్మిట్టెంట్ ఫాస్టింగ్ (రోజుకు నియమిత వేళల్లోనే తిని... మిగతా సమయమంతా ఉపవాసంలో గడపడం), యాంటీ ఇన్ఫ్లమేషన్ డైట్ తీసుకోవడం, కొద్దిపాటి వ్యాయామంతో తాను క్యాన్సర్నుంచి బయటపడ్డానంటోంది ప్రముఖ బాలీవుడ్– టాలీవుడ్ ఫేమ్ సోనాలి బెంద్రే. → క్లీన్ ఈటింగ్ ప్రాసెస్ చేయని, రిఫైన్ చేయని, పొట్టుతీయని ముడి ధాన్యాలతో వండిన భోజనం)తో పాటు యోగా, ప్రాణాయామం వంటి వాటితో క్యాన్సర్ను జయించానన్నది ప్రముఖ నటి మనీషా కోయిరాలా మాట. → కీమోతో పాటు... క్రమశిక్షణతో కూడిన జీవనమూ భోజనమూ, దేహంలోని విషాలను శుభ్రపరిచే డీ–టాక్స్ ఆహార విహారాలూ తననుంచి క్యాన్సర్ను దూరం చేశాయంటాడు క్రికెటర్ యూవీ (యువరాజ్ సింగ్). → శాకాహారంతో కూడిన భోజనం, ధ్యానం (మెడిటేషన్), యోగా ఆయుర్వేద మార్గాల పయనం వల్లనే తనకు క్యాన్సర్ నయమయ్యిందంటోంది ప్రముఖ మోడల్, లీజా రే. ఇక్కడ ఈ ప్రముఖులు చెప్పిన చిట్కాలన్నీ ‘ఆటోఫేజీ’ అనే ప్రక్రియను వేగవంతం చేశాయనీ... అందువల్లనే తమకు క్యాన్సర్ వేగంగా, ప్రభావపూర్వకంగా నయమైందంటూ చెబుతున్న సోషల్ మీడియా వేదికగా చెబుతున్న మాటలు సాధారణ ప్రజల మెదళ్లలోకి తేలిగ్గా ఎక్కుతున్నాయి. వాళ్ల మనసుల్లోకి సులువుగా వెళ్తున్నాయి. అయితే జీవనశైలిలో ఆరోగ్యకరమైన మార్పులైన ఆ వెల్నెస్ మార్గాలు మంచివే. కానీ అవే క్యాన్సర్ను పూర్తిగా నయం చేయలేవని అంటున్నారు. ‘ఆటోఫేజీ’ అనే ఇటీవలి సైంటిఫిక్ పరిభాషకు చెందిన ఆ పదం అర్థం ఏమిటో తెలుసుకోవాల్సిన అవసరం ఎక్కువగా ఉందన్నది వైద్యప్రముఖుల మాట. దాంతోపాటు ‘అపాప్టోసిస్’, ‘ ప్రోటీయోజోమ్’ అనే పదాలకు అర్థాలు వాటి వెనక పరమార్థాలూ తెలుసుకుంటే కేవలం అద్భుతాలనిపించే చికిత్సప్రక్రియలు... (మిరాకిల్ రెమిడీలు) మాత్రమే కాకుండా వాస్తవ చికిత్సలకు తోడుగా... ఈ అనుబంధ మార్గాలూ జతగూడినప్పుడే అసలు ఫలితాలు వస్తాయంటున్న డాక్టర్ల మాటల ఆంతర్యాలను తెలుసుకుందాం...అసలు ‘ఆటోఫేజీ’ అంటే ఏమిటి? దేహంలో ఎప్పటికప్పుడు కణాలు పుడుతూ, చనిపోతూ ఉంటాయి. అందులో చనిపోయిన కణాలతో పాటు కొన్ని నిరర్థకమైనవీ, వ్యర్థమైనవీ ఉంటాయి. మన దేహంలోని శుభ్రం చేసే వ్యవస్థ ఇలాంటి మృతకణాలూ, నిరర్థక, వ్యర్థకణాలను తొలగిస్తూ ఉంటుంది. ఇలా ఆరోగ్యకరమైన కణాల మనగడను సుగమం చేస్తూ, ఈ మృత, వ్యర్థ, నిరర్థక కణాలను తినేసే ప్రక్రియనే ‘ఆటోఫేజీ’ అంటారు. ఈ సెలిబ్రిటీల మాటేమిటంటే... పైన చెప్పిన ఉపవాసాలూ, ప్రాణాయామ ధ్యానాలూ, డీటాక్స్ ప్రక్రియల వంటి వెల్నెస్ మార్గాల ద్వారా మన ఆరోగ్యకరమైన కణాలన్నీ ‘క్యాన్సర్ కణాలనే’ తినేస్తే? అప్పుడు క్యాన్సర్ హరించుకుపోయి ఆరోగ్యం దక్కుతుందనేలా వారి సోషల్ మీడియా సందేశాలు ప్రజలకు చేరుతున్నాయి. అంతకంటే సంక్లిష్టమైనది ఆటోఫేజీ...నిజానికి ‘క్యాన్సర్ బయాలజీ’లో ఆటోఫేజీ ప్రక్రియ అంతకంటే చాలా సంక్లిష్టమైనది అంటున్నారు ఆధునిక వైద్యచికిత్సకులు. ఒకసారి అదేమిటో చూద్దాం. ∙కణంలో మరిన్ని సూక్షమైన అంతర్గతమైన భాగాలు (ఆర్గనెల్స్) దెబ్బతిన్నప్పుడు ఆ కణం మనుగడ కష్టం. అది చనిపోయే ప్రక్రియలో దేహం దాన్ని శుభ్రం చేసి తొలగిస్తుంది. అందులోని ప్రోటీన్ శిథిలాలను ఒకచోట చేర్చి ఊడ్చేస్తుంది. అలా చనిపోయిన లేదా బలహీనపడి నిరర్థకం కాబోతున్న కణాలను దేహం తొలగించివేస్తుంది. దీన్నే ‘ఆటోఫేజీ’ అంటారు.అదీ మరచిపోతున్న ముప్పు... ఇదీ చేస్తున్న తప్పు... ఇక్కడ సెలిబ్రిటీలు ఒక విషయం మరచిపోతున్నారు. తమకున్న పరిమితమైన వైద్యపరిజ్ఞానంతో అసలు విషయాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. ఉపవాసాలు చేస్తున్నప్పుడు తన జీవక్రియల కోసం దేహంలోని కణాలు తమకు కావాల్సిన ఆహారం కోసం మృత/వ్యర్థకణాలనూ, క్యాన్సర్ కణాలనూ తినేస్తాయని భావిస్తున్నారు. కానీ ఇక్కడ వారు ఒక ముప్పును విస్మరిస్తున్నారు. క్యాన్సర్ కణం కూడా ఒక కణమే. దానికీ ఆహారం కావాలి. ఉపవాసం ద్వారా దానికి అవసరమైన ఆహారాలు అందనప్పుడు అది కూడా ఆరోగ్యకరమైన కణాలనూ తినేయడం మొదలుపెట్టేందుకు అవకాశాలు ఎక్కువ. అంతేకాదు... మామూలు కణం కంటే కూడా అది మరింత చురుగ్గా, మరింత వేగంగా ఆరోగ్యకరమైన కణాలను కబళించవచ్చు. పైగా ఆహారం అందకపోవడంతో దేహాన్ని రక్షించుకునే వ్యాధి నిరోధక వ్యవస్థ మరింత బలహీనపడితే క్యాన్సర్ కణజాలాలే మామూలు ఆరోగ్యవంతమైన కణాలను తినేయడం ప్రారంభిస్తే అది మొదటికే మోసం వచ్చే పరిస్థితి! అంటే ఉపవాసం వల్ల క్యాన్సర్ ఎండిపోవడానికి (ఫాస్టింగ్ స్టార్వ్స్ క్యాన్సర్) బదులుగా తామే ఆకలితో మాడాల్సి వస్తుందని తెలిసినప్పుడు క్యాన్సర్ కణాలు ఇంకా ఇంకా కుతంత్రాలతో (కన్నింగ్గా) ఆరోగ్యవంతమైన కణాలను తినేయడం మొదలుపెట్టే ప్రమాదలెన్నో పొంచి ఉంటాయి.ఆటోఫేజీ లాంటిదే ఆటాప్టోసిస్... సెలిబ్రిటీలు ఆటోఫేజీ గురించి సోషల్ మీడియాలో మాట్లాడటం వల్ల దాని గురించి మామూలు ప్రజలకు తెలియరావచ్చు. కానీ... ఈ రంగంలో ఇలా ఆటోఫేజీలా పనిచేస్తూ క్యాన్సర్ కణాలను తినేసేందుకు దోహదపడే పరిశోధనలూ, అలాంటి పరిజ్ఞానాలూ, పరిభాషా... ఇలాంటివి వాళ్లకు తెలియని అంశాలెన్నో ఇంకా ఉన్నాయి. ఉదాహరణకు అటాప్టోసిస్, యూబిక్విటిన్– ప్రోటియోజోమ్ సిస్టమ్ వంటివి. ఉదాహరణకు అటాప్టోసిస్ అంటే ఏమిటో చూద్దాం. ఎవరినైనా బాగా కించపరిచి, కోలుకోలేనంతగా నిందిస్తే వాళ్లేం చేస్తారు? తట్టుకోలేక ఆత్మహత్యకూ ఒడిగట్టవచ్చు కదా! అచ్చం అపాప్టోసిస్ ప్రక్రియలో కూడా అలాంటిదే జరుగుతుంది.యుబిక్విటిన్ – ప్రోటియోజోమ్ సిస్టమ్ అంటే... యుబిక్విటిన్ అనేది ఏ ప్రోటీన్కు అంటుకుంటుందో దాన్ని కాలపరిమితి ముగిసిపోయిన లేదా చెడిపోయిన / లోపభూయిష్టమైన ప్రోటీన్గా గుర్తించవచ్చు. అది కణంలో ఉన్నప్పుడు కణం సమతౌల్యాన్ని దెబ్బతీస్తుంది. అందుకే యుబిక్విటిన్ ప్రోటీన్ కణం నుంచి తొలగిపోవాలి. అప్పుడే కణం చురుగ్గా నార్మల్ కణంగా ఉంటుంది. అలా కణం నుంచి యుబిక్విటిన్ను తొలగించడానికి తోడ్పడేందుకు ఉద్దేశించిన వ్యవస్థ... అంటే యుబిక్విటిన్ ప్రోటీన్ను ధ్వంసం చేసేందుకు తోడ్పడే వ్యవస్థే ప్రోటియోజోమ్ వ్యవస్థ. అంటే ప్రోటియోజోమ్ అన్నది ప్రోటీన్ డిస్ట్రక్షన్ సిస్టమ్ అన్నమాట. ఈ యుబిక్విటిన్ అనేది అలాగే ఉంటే అది చెడిపోయిన కణానికి అమరత్వం ఇస్తుంది. ఒకవేళ ఆ చెడిపోయిన కణాలకు అమరత్వం ఉంటే అవి తొలగిపోవు. కాబట్టి ఈ ప్రోటియోజోమ్... తన డబుల్ నెగెటివ్ మార్గంలో వాటిని గుర్తించి ధ్వంసం చేస్తుంది. అలా చెడుకణాలూ లేదా దెబ్బతిన్న/లోపభూయిష్టమైన కణాలను తొలగిస్తుంది. ఇతి జరిగేందుకు దోహదపడేదే ‘యుబిక్విటిన్ – ప్రోటియోజోమ్ వ్యవస్థ’గా చెబుతారు.కొన్ని మందులతో ప్రోటీయోజోమ్ ప్రక్రియను అడ్డుకుని క్యాన్సర్ను తగ్గించడం ఇలా... ఈ యుబిక్విటిన్– ప్రోటియోజోమ్ ప్రక్రియను గుర్తించిన వైద్య శాస్త్రవేత్తలు ‘బార్టెజోమిబ్’ అలాగే ‘కార్ఫిల్జోమిబ్’ వంటి ప్రోటియోజోమ్ ఇన్హిబిటర్లను తయారు చేసి ప్రయోగించారు. ఈ మందులతో ‘మైలోమా’ అనే క్యాన్సర్ నయం కావడం మొదలైంది. ఇలాంటి మందులను ( ప్రోటియోజోమ్ ఇన్హిబిటర్స్ను) మరిన్ని కనుగొనడం ద్వారా అనేక రకాల క్యాన్సర్లను తగ్గించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇలా చూసినప్పుడు ఆటోఫేజీ, అపాప్టోసిస్, ప్రోటీయోజోమ్ అనేవి చాలా సంక్లిష్టమైన ప్రక్రియలు. అవి కొనసాగే మార్గాలను (పాత్ వేస్) అనేక మందుల సహాయంతో నిర్వహితమయ్యేలా చేయడం వల్ల క్యాన్సర్ కణం తనంతట తాను మటుమాయమయ్యే పరిస్థితి ఉంటుంది. ఇప్పటికి ఇది ‘మైలోమా’లోనే సఫలీకృతమైంది. కానీ ఇంకా కొన్ని క్యాన్సర్ల (సాలిడ్ ట్యూమర్స్) విషయంలోనూ, మరిన్ని క్యాన్సర్లలోనూ విజయవంతం కావాల్సి ఉంది. ఇందుకోసం రకరకాల కాంబినేషన్లలో అపాప్టోసిస్ మాడ్యులేటర్లు, ఇమ్యూనో, టార్గెట్ థెరపీ ప్రక్రియలూ, ప్రోటియోజోమ్ ఇన్హిబిటర్లు రూపొందించడంలో వైద్యశాస్త్రజ్ఞులు నిమగ్నమై ఉన్నారు.ఆ అపోహలన్నీ అలా ఆవిర్భవించినవే... ఎన్నో ఏళ్లుగా అటాప్టోసిస్ ప్రక్రియను క్యాన్సర్ను జయించేందుకు ఒక ప్రత్యామ్నాయ ‘నేచర్ క్యూర్’ ప్రక్రియగా జనం అపోహపడుతున్నారు. కొన్ని ఆహారాల ద్వారా క్యాన్సర్ లాంటి లోపభూయిష్టమైన కణాలు తమంతట తామే తమ మరణశాసనం రాసుకునేలా చేయడం (యాక్టివేటెడ్ / ప్రోగ్రామ్డ్ సెల్ డెత్)గా చాలామంది పొరబడుతుంటారు. కానీ అది పొరబాటు. క్యాన్సర్ కణాలు ఎంత జిత్తులమారివి అంటే... అవి ‘అటాప్టోసిస్’నూ తప్పించుకోగలవు. అదెలాగంటే... సెల్ను అపాప్టోసిస్కు గురిచేసే ప్రక్రియలో క్యాన్సర్ కణంలోని పవర్హౌజ్ అయిన మైటోకాండ్రియాను దెబ్బతీసే ప్రయత్నం జరుగుతుంది. అదే సమయంలో ‘బీసీఎల్–2’ అనే కుటంబానికి చెందిన మరో ప్రోటీన్ విడుదలై అది యాంటీ అపాప్టోటిక్ ప్రక్రియ ద్వారా క్యాన్సర్ కణంలోని మైటోకాండ్రియాలోకి రసాయనాలు వెళ్లకుండా చేయడం ద్వారా తనను తాను రక్షించుకుంటుంది.చివరగా... ప్రస్తుతానికి అందుబాటులో ఉన్న ప్రభావవంతమైన క్యాన్సర్ చికిత్సలు రేడియోథెపీ, కీమోథెరపీ, శస్త్రచికిత్సలే. వీటి తర్వాతే ఉపవాసాలూ, యోగా, ధ్యానం, డీ–టాక్స్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఆహారాలూ, పోషకాహారాలూ, నేచురోథెరపీలను అనుబంధంగా ఉపయోగించుకోవాలి. ఏ సెలిబ్రిటీలు చెప్పినా అవి ప్రత్యామ్నాయ చిట్కాలే తప్ప ప్రధాన చికిత్సలు కావని అందరూ తెలుసుకోవాలంటున్నారు డాక్టర్లు.అపాప్టోసిస్ అంటే... క్యాన్సర్ అంటేనే అది చెడిపోయిన / నార్మల్గా ఉండని కణం అన్న విషయం తెలిసిందే. ఏవైనా రసాయనాల ద్వారా ఓ చెడిపోయి దెబ్బతిన్న కణాన్ని మరింతగా అవమానించేలా చేస్తే అది బాగా కుంగి కుచించుకుపోయి నశించిపోయే పరిస్థితే ‘అపాప్టోసిస్’ అని చెప్పవచ్చు. నిజానికి చాలా సంక్లిష్టమైన జీవరసాయన పద్ధతికి ఇక్కడ చెప్పినది మామూలు ప్రజానీకానికి అర్థమయ్యేలా చెప్పేందుకు ఇదో సింపుల్ వివరణ అనుకోవచ్చు. అంటే కొన్ని రసాయనాలను ఉపయోగించి ఓ కణాన్ని అవమానించడం ద్వారా దాని మరణాన్ని అదే తెచ్చుకునే ‘ ప్రోగ్రామ్డ్ సెల్ డెత్’ కార్యక్రమం ఈ అపాప్టోసిస్.నిర్వహణ: యాసీన్ -
90 ఏళ్లకు మించి బతుకుతామా? ఈ ఐదు పరీక్షలు నెగ్గితే!
ఆధునిక ప్రపంచంలో ఆరోగ్యకరమైన సుదీర్ఘ జీవితం కావాలని అందరూ కోరుకుంటారు. అయితే ఎంత కాలం జీవించగలం అనేది జెనెటిక్ అంశాలతో పాటు, జీవనశైలి, రోజువారీ అలవాట్ల మీద కూడా ఆధారపడి ఉంటుందని చాలా అధ్యయనాలు ద్వారా తెలుస్తోంది. దీర్ఘాయుష్కులుగా 90 అంతకంటే ఎక్కువ కాలం జీవించ గలమా లేదా అనేది తెలుసుకోవాలంటే 5 అద్భుతమైన పరీక్షలున్నాయి, వీటిల్లో చాలామంది మూడు పరీక్షల్లోనే ఫెయిలవుతున్నారు అంటూ డాన్ గో అనే ఫిట్నెస్ కోచ్ ఇన్స్టా పోస్ట్ నెట్టింట ఇంట్రిస్టింగ్ మారింది. మరి ఆ పరీక్షలేంటో ఒకసారి చూసేద్దామా?సాధారణంగా సుదీర్ఘం కాలం ఆరోగ్యంగా బతకాలంటే ఒత్తిడి లేని జీవితం, సమతుల ఆహారం, చక్కటి వ్యాయామం, ఒక వయసుదాటిన తరువాత కొన్ని ఆరోగ్య పరీక్షలు (ఇతర ప్రమాదకర అనారోగ్య సమస్యలు ఏమీ లేనివారు) చేయించుకుంటూ ఉంటే సరిపోతుంది కదా. మరి 90 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ జీవించగలరా అనేది తెలియాలంటే ఈ అయిదు పరీక్షలు చాలా కీలకమంటూ ఆరోగ్య కోచ్ షేర్ చేశారు. View this post on Instagram A post shared by Dan Go | Fitness Coach (@coachdango)నడక వేగంఎంత వేగంగా నడవ గలరు అనేదాని మీద కూడా మన ఆయుష్షు ఆధారపడి ఉంటుందట. ఇచ్చిన సమయ వ్యవధిలో మీరు ఎంత వేగంగా నడవగలరో చెక్ చేసుకోవాలి. ఇది గుండెలోని నాళాల పనితీరుకు సంకేతం. 1 మీ/సె (2.2 మైళ్ల) కంటే ఎక్కువ వేగం ఎక్కువ ఆయుర్దాయం కలిగిస్తుందని అంచనా. . 2.7 మైళ్ల కంటే ఎక్కువ వేగంగా నడవ గలిగితే మరణం ముప్పు తగ్గుతుందట. వేగంగా నడిచేవారిలో వృద్ధాప్యం లక్షణాలు తొందరగా కనిపించవు.విశ్రాంతి హృదయ స్పందన రేటులో రెస్టింగ్ హాట్ బీట్ రేట్ (ఏ పనీలేదా వ్యాయామం చేయకుండా విశ్రాంతిగా ఉన్నపుడు) మన గండెప నితీరుకు, ఒత్తిడిని తట్టుకునే శక్తికి నిదర్శనం.నిమిషానికి 70 బీట్స్ (బిపిఎం) కంటే తక్కువ కొట్టుకుంటే సాలిడ్గా ఉన్నట్టు. 60 బిపిఎం కంటే తక్కువ అంటే ఎలైట్ దీర్ఘాయువు ప్రాంతం.అదే విశ్రాంతి సమయంలో 80-90 బిపిఎం కంటే ఎక్కువ గుండె స్పందన ఉంటే గుండె దృఢత్వానికి సంబందించిన వ్యాయామాలు మొదలు పెట్టాల్సిందే అని సూచన.కూర్చుని పైకి లేచే ( Sit and Rise) పరీక్షడాన్ చెప్పిన దాని ప్రకారం 87 శాతం మంది ఈ పరీక్షలో ఫెయిల్ అవుతున్నారట.ఇది చాలా సులభం అనుకుంటారుగానీ, నేలపై కూర్చుని,చేతుల సాయం లేకుండా తిరిగి నిలబడటం అనేది వయస్సు పెరిగే కొద్దీ బలం, సమతుల్యత, చలనశీలత, సమన్వయానికి నిదర్శనం. 85 సంవత్సరాల వయస్సులో, గాయాలకు సంబంధించిన అన్ని మరణాలలో దాదాపు 2/3 వంతు పడిపోవడంవల్లే సంభవిస్తాయి. 8 మంది పెద్దవారిలో ఒకరు మాత్రమే ఈ ఎక్సర్సైజ్ చేయగలరు.బార్ హ్యాంగ్స్ (గ్రిప్ స్ట్రెంత్)దీనికి ఆహారం లేదా వ్యాయామంతో సంబంధం లేదు.బలమైన పట్టు గుండె ఆరోగ్యం, కండరాల బలం, ,ఎముక సాంద్రతకు సూచిక. గ్రిప్ స్ట్రెంత్ దీర్ఘాయువును అంచనా వేస్తుంది. అందుకే పరిశోధకులు దీనిని ఆరో ముఖ్యమైన సంకేతం అంటారు. 90 సెకన్లలో బార్ పట్టుకుని వేలాడితే సాధారణం కంటే బెటర్గా ఉన్నట్టు.ఒక మైలు పరుగు సమయంఏ వయసులోనైనా 10 నిమిషాల్లో ఒక మైలు పరుగెత్తగలిగితే, హృదయనాళ వ్యవస్థ మంచి స్థితిలో ఉన్నట్టు. 8 నిమిషాల కంటే తక్కువ సమయమైతే దీర్ఘాయుష్షు-అథ్లెట్ స్థాయి ఫిట్నెస్తో ఉన్నట్టు అర్థం. ఇది ఫిట్నెస్ స్థాయికి స్నాప్షాట్ లాంటిది. ఎంత ఫిట్గా ఉన్నారో అంచనా వేయడానికి శరీర ప్రతిస్పందనలే సూచిక అని డాన్ వెల్లడించారు.నోట్ : ఆరోగ్య , ఫిట్నెస్కు సంబంధించి ఇది ఒక సలహా మాత్రమే. ఏదైనా అనారోగ్య సమస్యలున్నవారు సంబంధిత వైద్యుల సలహా తీసుకోవడం సరియైన మార్గం. -
ఎందుకొచ్చిన తలనొప్పి ఇది?
ఒక విచిత్రమైన విషయం తెలుసా? మన ఎమోషన్స్కూ, ఆలోచనలకూ, ఉపాయాలకూ, బాధలకూ, సంతోషాలకూ కారణమైన మెదడులో ఉండేదంతా కేవలం కొవ్వుల కణజాలం మాత్రమే. అయినా ఒంట్లో ఎక్కడెక్కడి నొప్పులనూ తాను ఇట్టే తెలిసేలా చేస్తుంది కదా... కానీ ఇంతా చేసి ఇలా అన్ని నొప్పుల్నీ తెలియజేసే ఈ మెదడుకు మాత్రం నొప్పి తెలియదు. తనను కోస్తున్నా తనకు నొప్పే తెలియని ఇదే మెదడు... మిగతా ‘తల’నొప్పులను మాత్రం ఎందుకు తెలియజేస్తుంది? అసలు తలనొప్పి అంటే ఏమిటి? అది ఎందుకు వస్తుంది?... ఇలాంటి అనేక ప్రశ్నలకు సమాధానాలు.మామూలుగా తలనొప్పి అనగానే తేలిగ్గా తీసుకున్నా... ‘అబ్బ... అదో తలనొప్పి రా’ అనే వాడుక మాట వల్ల అదెంత దుర్భరంగా ఉంటుందో, ఎలా మన రోజునూ, సంతోషాలనూ పాడుచేస్తుందో చెప్పకనే చెప్పినట్లవుతుంది. అన్నట్టు తలనొప్పి వచ్చినప్పుడు ఓ ఆసక్తికరమైన ప్రశ్న కూడా ఉద్భవిస్తుంది. అదేమిటంటే... మెదడుకు నొప్పి అనే అనుభూతే కలగక΄ోతే... తలనొప్పి సమయంలో ఇంత బాధ ఎందుకు కలుగుతుంది? అప్పుడు తలలో ఏం జరుగుతుందంటే... ఎప్పుడెప్పుడు...? నాడీ వ్యవస్థలో ఏమైనా సమస్యలున్నా, మైగ్రేన్ వంటి సమస్య లేదా ఏదైనా తీవ్రమైన మానసిక ఒత్తిడి వంటి సమస్యలు ఉన్నప్పుడు చాలామందిలో తలనొప్పి వస్తుంటుంది. అంతేకాదు... ఈ తలనొప్పుల రహస్యాలను ఇంకా ఎందరో పరిశోధకులూ, వైద్యశాస్త్రవేత్తలూ శోధిస్తూ తలనొప్పుల కారణాలను అన్వేషిస్తూ కొత్త కొత్త విషయాలను తెలుసుకుంటున్నారు. తోడు తెచ్చుకునే ఇతర నొప్పులెన్నో! సాధారణంగా తలనొప్పి ఒంటరిగా రాకుండా... మరికొన్ని నొప్పులతో పాటు వస్తుంటుంది. ఉదాహరణకు... ∙వికారం ∙ముక్కు కారుతుండటం కళ్ల నుంచి నీళ్లు కారుతుండటం ∙దేనిపైనా దృష్టి కేంద్రీకరించలేని సమయాల్లో... ఇలా పైన పేర్కొన్న లక్షణాలతోపాటు తలనొప్పి ఎందుకు వస్తుంటుందన్నది స్పష్టంగా తెలియదు. కానీ ఇప్పటికి తెలిసిందల్లా... దేహాన్ని రక్షించే ప్రక్రియలో భాగంగానే ఇలా జరుగుతోందన్న విషయం మాత్రం స్పష్టం. ఎందుకు వస్తాయి? సాధారణంగా శరీరం ఏదో రకమైన ఒత్తిడి.. శారీరకమైన ఒత్తిడి లేదా భావోద్వేగాల వల్ల లేదా పర్యావరణపరమైన ఒత్తిడుల వల్ల కావచ్చు. మెదడు, మెడ చుట్టూ ఉండే నరాలు, రక్తనాళాలు చాలా సున్నితమైన మార్పులకూ తేలిగ్గా ప్రతిస్పందించేలా ఉంటాయి. దాంతో పైన పేర్కొన్న ఏ మార్పులు కలిగినా వెంటనే ఇరిటేట్ అయి నొప్పిని కలిగించేలా చేస్తాయి. వైరల్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు, అలర్జీలు, కౌమారసమయంలో హార్మోన్లలో వచ్చే మార్పులు, నిద్రలేమి, ఒంట్లో నీరు తగ్గడం (డీహైడ్రేషన్), ఆహారం తీసుకోక΄ోవడం, మోతాదుకు మించి కెఫిన్ తీసుకోవడం వంటి వాటితో తలనొప్పులు రావచ్చు. అలాగే తీవ్రమైన భావోద్వేగాలకు లోనుకావడం వల్ల కూడా తలనొప్పిని ప్రేరేపిస్తుంది. ఉదాహరణకు బాగా ఉద్విగ్నతకు లోనుకావడం, తీవ్రంగా ఎక్సైట్ కావడం, తీవ్రమైన విచారంలో మునిగి΄ోవడం వంటి చర్యలు మెదడులోని కొన్ని రసాయనాల సమతుల్యతను భగ్నం చేస్తాయి. కండరాల్లో ఒత్తిడిని కలిగిస్తాయి. ఇవన్నీ కలిసి తలనొప్పులను ప్రేరేపిస్తాయి. ఒక్కోసారి వాతావరణంలో తీవ్ర మార్పు... ఉదాహరణకు ఒక ప్రదేశంలో ఎక్కువగా ఉన్న వాతావరణ ఒత్తిడి కారణంగా సైనస్లలో ఒత్తిడి పెరిగి అది ముఖం కండరాల్లో ముఖ్యంగా నుదురు వెనకనుండే ప్రదేశం, చెంపలు, కళ్ల దగ్గర ఉండే కండరాల్లో టెన్షన్ వృద్ధి చేయడం వల్ల కూడా తలనొప్పి రావచ్చు. నివారణ / చికిత్స తలనొప్పులకు చికిత్స అందించాలంటే ముందుగా దానికి నిర్దిష్టమైన కారణం ఏదో తెలుసుకోవాలి. మైగ్రేన్ లాంటి తీవ్రమైన, డాక్టర్ దగ్గర చికిత్స అందించాల్సిన తలనొప్పి మినహా చాలా రకాల తలనొప్పులు సింపుల్గా జీవనశైలిలో మార్పులు చేసుకోవడం వల్లనే తగ్గి΄ోతాయి. ఉదాహరణకు నీళ్లు ఎక్కువగా తాగుతూ దేహాన్ని హైడ్రేటెడ్గా ఉంచుకోవడం లాంటి సాధారణ సూచనలతోనూ తగ్గుతాయి. ఇక వేళకు తినడం, వేళకు నిద్ర΄ోవడం వల్ల నాడీవ్యవస్థలో సమతౌల్యత, క్రమం తప్పని వ్యాయామం వల్ల ఒత్తిడి తగ్గడం వంటి చర్యలతో చాలావరకు నివారితమవుతాయి లేదా అవి వచ్చే అవకాశాలు బాగా తగ్గుతాయి. దీనికి తోడుగా యోగా, రిలాక్సేషన్ టెక్నిక్స్, బ్రీతింగ్ ఎక్సర్సైజ్లతో ఒత్తిడి తగ్గించుకోవడం ద్వారానూ నివారించుకోవచ్చు. చికిత్స విషయానికి వస్తే... ఒకటి రెండుసార్లు పెయిన్ కిల్లర్స్ వాడాక అప్పటికీ తలనొప్పలు వస్తూనే ఉంటే.... దానికి ఇంకేదో కారణం (అండర్ లైయింగ్ కాజ్) ఉంటుందని గ్రహించి, దానికి చికిత్స తీసుకోవాలి. ఇక మైగ్రేన్కు డాక్టర్లు అప్పటికప్పుడు నొప్పిని తగ్గించేందుకు ఒక రకం, మళ్లీ మళ్లీ రాకుండా ఉండేందుకు మరో రకం... ఇలా రెండు రకాల మందులు వాడతారు. ఇలా తలనొప్పులకు కారణాలు తెలుసుకునే దానికి తగ్గ చికిత్స తీసుకోవడం ద్వారా తలనొప్పులు తగ్గుతాయి. – యాసీన్తలనొప్పి అంటే ఏమిటి?తలనొప్పిని అర్థం చేసుకోవాలంటే మొదట మెదడు నొప్పిని అనుభవించదు అనే విషయాన్ని తెలుసుకోవాలి. ఎందుకంటే మెదడులో నొప్పిని తెలుసుకునే పెయిన్ రిసె΄్టార్స్ ఉండవు. దాంతో మెదడుకు గాయమైనా లేదా మెదడును కోస్తున్నా అది నొప్పిని అనుభవించదు. ఇటీవల కొన్ని సందర్భాల్లో మెదడుకు సర్జరీ చేస్తుంటే బాధితుడికి సినిమా చూపిస్తూ శస్త్రచికిత్స నిర్వహించామంటూ న్యూస్పేపర్లలో, టీవీల్లో చూసిన సంఘటనలు చాలామందికి గుర్తుండే ఉంటాయి. అయితే మెదడు చుట్టూ ఉండే అనేక పొరలు, రక్తనాళాలు, వాటిని రక్షించే కణజాలం, నాడీతంత్రులు, నరాల్లో నొప్పిని గ్రహించే పెయిన్ రిసె΄్టార్స్ వల్లనే తలనొప్పి అనుభవంలోకి వస్తుంది.మైగ్రేన్ అంటే ఏమిటి?మైగ్రేన్ అనేది తలనొప్పుల్లో చాలా తీవ్రంగా నొప్పిని కలగజేస్తుంటుంది. తలబద్దలవుతున్నట్లుగా వచ్చే ఈ తలనొప్పితో పాటు వికారం, వాంతులు, వెలుతురు చూడలేక΄ోవడం/ శబ్దాలు వింటుంటే చికాకు, కళ్ల ముందు మిరిమిట్లు గొలుపుతున్నట్లుగా వింతకాంతులు ఇలాంటి లక్షణాలూ కలగలసి బాధను మరింత తీవ్రతరం చేస్తాయి. ప్రతి పదకొండు మంది పిల్లల్లో ఒకరిని బాధించే ఈ మైగ్రేన్ వల్ల చాలామంది పిల్లలు చదువులో వెనకబడతారు. ఆడుకోలేరు, గదిలోంచి కదల్లేనంతగా బాధపడుతుంటారు. తమకు సరిపడని ఏదో అంశం పిల్లలను ట్రిగర్ చేయడం వల్ల వచ్చే ఈ తలనొప్పిలో మెదడులోని నొప్పిని తెలిపే పాత్వేస్ అవసరానికంటే ఎక్కువగా... అంటే మరింతగా ప్రతిస్పందించడం వల్ల నొప్పి కలుగుతుంది. తల్లిదండ్రుల్లో ఈ వ్యాధి ఉన్నవారి పిల్లల్లో ఇది అనువంశీకంగా కూడా రావచ్చు. తీవ్రమైన ఎండ, గాఢమైన వాసనలు, చెవులు బద్దలయ్యే శబ్దాలు, వేళకు తినక΄ోవడం / వేళకు నిద్ర΄ోక΄ోవడం వంటి అంశాలు మైగ్రేన్ను ప్రేరేపించవచ్చు. -
సూపర్స్టార్ రజనీకాంత్ ఫిట్నెస్ సీక్రెట్..! ఇప్పటికీ యువ హీరోలా..
తమిళ సినిమా ఐకాన్ రజనీకాంత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికీ కుర్రహారోల మాదిరిగా అంతే ఫిట్గా ఉండటమే కాదు, స్టైలిష్గా డ్యాన్స్లు కూడా చేస్తుంటారు. ఏడు పదుల వయసులోనూ అంతే స్ట్రాంగ్ పర్సనాలిటి మెయింటైన్ చేస్తున్న సూపర్స్టార్ డైట్ సీక్రెట్ తెలిస్తే ఆశ్చర్యపోతారు. అంతేగాదు ఒక చెన్నై డాక్టర్ రజనీ డైట్ గురించి వివరిస్తూ ఇన్స్టాగ్రామ్లో ఓ వీడియోను కూడా ఇషేర్ చేశారు. మరి ఇవాళ (డిసెంబర్ 12) రజనీకాంత్ 75వ పుట్టిన రోజు సందర్భంగా ఆయన ఆరోగ్య రహాస్యాలు, డైట్ ఎలా ఉంటుంది వంటి వాటి గురించి ఆ డాక్టర్ మాటల్లోనే తెలుసుకుందామా.చెన్నై బారియాట్రిక్ సర్జన్ డాక్టర్ ప్రీతి మృణాళిని రజనీ ఆరోగ్య రహస్యం గురించి ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. ఆయన ఐదు తెల్లటి ఆహారాలను నివారించడం వల్ల ఇంతలా ఆరోగ్యంగా యాక్టివ్గా ఉన్నారని అన్నారామె. ఉప్పు, చక్కెర, మైదా, పాలు, పెరుగు అతిగా తీసుకుంటే వాపు, ఇన్సులిన్ స్పైక్లు, ఆమ్లత్వం, గట్ సమస్యలకు దోహదం చేస్తాయి. అలాగే ఆయన మంచి పోషకవంతమైన ఆహారం తోపాటు రోజువారీ వ్యాయామాలు, ధ్యానం వంటివి ఆరోగ్యకరమైన వృద్ధాప్యానికి దోహదపడతాయని అన్నారు. అలాగే డాక్టర్ మృణాళిని రజనీ డ్యాన్సులు చేస్తున్న వీడియోలు పంచుకుంటూ..మన సూపర్ స్టార్ రజనీకాంత్ 74 సంవత్సరాల వయస్సులో కూడా చాలా అందంగా నృత్యం చేస్తున్నారు కదా..!. దానికి కారణం ఏంటో తెలుసా..అంటూ ఆయనే స్వయంగా తాను ఎలాంటి ఆహారం తీసుకుంటాననేది చెబుతున్న వీడియోని కూడా ఆమె జోడించారు. ఆ వీడియోలో రజనీకాంత్ స్వయంగా తాను తెల్లటి ఆహారాలకు దూరంగా ఉంటానని అన్నారు. అవేంటో కూడా ఆయనే చెప్పారు కూడా.ఆ ఐదు ఎందుకు నివారించాలంటే.1. ప్రాసెస్ చేసిన తెల్లటి చక్కెరడాక్టర్ మృణాళిని మాట్లాడుతూ.. "ఇది బొడ్డు కొవ్వు, ఇన్సులిన్ నిరోధకత, ఆకలి కోరికలను పెంచుతుంది. కాబట్టి, దీన్ని ఎంత త్వరగా నివారిస్తే అంత మంచిది." అని సూచించారు.2. తెల్ల ఉప్పుపరిమితంగా తీసుకోకపోతే పొట్ట ఉబ్బరం, అధిక బిపి (రక్తపోటు) కూడా రావొచ్చు3. తెల్ల బియ్యందీన్ని (తెల్ల బియ్యం) కూరగాయలతో కలిపి మితమైన పరిమాణంలో తీసుకుంటే పర్లేదు లేదంటే బరువు వేగంగా పెరిగిపోయేందుకు దారితీస్తుందని హెచ్చరించారు డాక్టర్ మృణాళిని. 4. మైదాబియ్యంలో కొద్దిగా ఫైబర్ ఉంటుంది, కానీ మైదాలో పూర్తిగా జీరో కేలరీలు ఉంటాయి. కాబట్టి, బరువు పెరగడం ఖాయం అని హెచ్చరిస్తున్నారు వైద్యులు5. పాలు, పెరుగు వెన్న వంటి పాల ఉత్పత్తులుఇవి కాల్షియం, ప్రోటీన్లకు మంచి మూలం. కానీ, 40 ఏళ్ల తర్వాత, జీవక్రియ మందగించడం ప్రారంభమవుతుందట. అందువల్ల వీటిని ఎక్కువగా తీసుకోకపోవడమే మంచిదని అంటున్నారు. అప్పుడే పొట్ట ఉబ్బరం, అధిక బరువు సమస్య దరిచేరవని అంటున్నారు.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. View this post on Instagram A post shared by Dr.Preethi Mrinalini | Laparoscopic & Bariatric Surgeon (@dr.preethimrinalini) చదవండి: డెలివరీ బాయ్ నుంచి జొమాటో డిజైనర్ రేంజ్కు! మనసును కదిలించే సక్సెస్ స్టోరీ.. -
మధుమేహులకు గుడ్ న్యూస్ : నోవో నార్డిస్క్ మందు వచ్చేసింది
డానిష్ ఔషధ తయారీ సంస్థ నోవో నార్డిస్క్ తన బ్లాక్బస్టర్ యాంటీ-టైప్-2 డయాబెటిస్ డ్రగ్ ఓజెంపిక్ (సెమాగ్లుటైడ్ ఇంజెక్షన్)ను ఇండియాలో లాంచ్ చేసింది. దీన్ని అధిక బరువు నియంత్రలో కూడా వాడుతున్నారు. 0.25 మిల్లీగ్రాముల డోసేజ్ వెర్షన్కు వారానికి రూ. 2,200 ప్రారంభ ధరకు భారతదేశంలో విడుదల చేస్తున్నట్లు శుక్రవారం ప్రకటించింది.ఈ ఔషధం 0.25మి.గ్రా., 0.5 మి.గ్రా, 1 మి.గ్రా మూడు మోతాదు రూపాల్లో లభిస్తుంది నొప్పి లేకుండా సబ్కటానియస్ నోవోఫైన్ నీడిల్స్ ఇంజెక్షన్. ఇది సింగిల్-యూజ్ ప్రీ-ఫిల్డ్ పెన్. ‘ఒజెంపిక్’ను మొదటి 4 వారాల పాటు వారానికి ఒకసారి చొప్పున 0.25 మి.గ్రాతో ప్రారంభిస్తారు, ఆ తర్వాత కనీసం 4 వారాల పాటు వారానికి ఒకసారి 0.5 మి.గ్రా స్టెప్ అప్ డోసేజ్ ఇస్తారు. లాంగ్ డోసేజ్ కింద వారానికి ఒకసారి 1 మి.గ్రీ వరకు తీసుకోవచ్చు.ఇదీ చదవండి : దీన్ని సివిక్ సెన్స్ అంటారా..రోడ్డుపై రచ్చ మూడు మోతాదుల ఇంజెక్షన్గా ప్రీ-ఫిల్డ్ పెన్ను వస్తుంది. దీని ఖరీదు నెలకు రూ.8800 (వారానికి రూ.2200), మరొక డోస్ ధర రూ.10,170 (వారానికి రూ.2542.5), నెలకు రూ.11,175 (వారానికి రూ.2793.75) అవుతుందని కంపెనీ చెప్పింది.భారతదేశంలో ఇన్సులిన్ ధరల జోన్లోనే ఇది అందుబాటులో ఉందన్నారు. ఇదొక కీలకమైన అభివృద్ధిగా అభివర్ణించారు. వైద్య చరిత్రను మార్చిన పెన్సిలిన్ , యాంటీ బయాటిక్స్ ఆవిష్కరణలకు ఇది సమానమని నోవో నార్డిస్క్ ఇండియా కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్, మేనేజింగ్ డైరెక్టర్ విక్రాంత్ శ్రోత్రియ పేర్కొన్నారు. నిజంగా ఓజెంపిక్ను ఈ ధర జోన్లోకి తీసుకురావడం చాలా కష్టతర మైందన్నారు. ఇండియాలో వైద్యులు సూచన మేరకు ఎక్కువ మంది తమ మందును వాడాలని ఆశిస్తున్నామన్నారు. దీని వాడకంపై ఆందోళనలుమానసిక-ఆరోగ్య సవాళ్లు, ఆత్మహత్య ధోరణుల ఆందోళనలపై బరువు తగ్గించే మందులపై ఆస్ట్రేలియా కొత్త భద్రతా హెచ్చరిక మధ్య, విస్తృతమైన ప్రపంచ & భారతీయ నియంత్రణ సంస్థ పరిశీలన నేపథ్యంలో ఇండియాలో అలాంటి ప్రతిసవాళ్లేవీ లేవని విక్రాంత్ శ్రోత్రియ ప్రకటించారు.కాగా చైనా తర్వాత భారతదేశంలో టైప్ 2 డయాబెటిస్ రోగులు అధికంగా ఉన్నారు. వేగంగా పెరుగుతున్న ఊబకాయం రేట్లతో పాటు, వేగంగా అభివృద్ధి చెందుతున్నబరువు తగ్గించే మందుల మార్కెట్లో వాటా కోసం పోటీ పడుతున్న ప్రపంచ ఔషధ తయారీదారులకు కీలకమైన జోన్గా ఇండియా మారింది. దీనికి సంబంధించి ప్రపంచ మార్కెట్ దశాబ్దం చివరి నాటికి ఏటా 150 బిలియన్ డాలర్లుగా ఉంటుందని అంచనా. -
ఆరోగ్యకరమైన జీవనశైలితో డయాబెటిస్ తగ్గిపోతుందా..?
చాలామందిని వేధించే సమస్య డయాబెటిస్. గణాంకాలు సైతం రానున్న రోజుల్లో భారత డయాబెటిస్ కేరాఫ్గా మారనుందంటూ హెచ్చరిస్తున్నాయి కూడా. కొందరికి అధిక బరువుతో మొదలై డయాబెటిస్ బారినపడి ఇబ్బందులు పడుతున్నవారెందరో. కానీ కొందరూ ఆ వ్యాధి రావడంతోనే మేల్కొని ఆరోగ్య స్పృహ తెచ్చుకుని మరి బరువు తగ్గడమే కాదు డయాబెటిస్ని ితిప్పుకొడుతున్నారు. ఆ కోవలో ఈ కామెడీ హీరో కూడా చేరిపోయి ప్రేరణ కలిగిస్తున్నారు. ఏకంగా 78 ికిలోలు వరకు బరువు ఉండే ఆయన అంతలా ఎలా బరువు తగ్గారో సవివరంగా తెలుసకుందామా...!.అమెరికా హాస్య నటడు 'మైక్ అండ్ మోలీ' స్టార్ బిల్లీ గార్డెల్ టైప్ 2 అధికబరువుతో ఇబ్బంది పడుతూ ఉండేవాడు. డయాబెటిస్ నిర్ధారణ అయ్యేటప్పటికీ సుమారు 172 కిలోలు పైనే బరువు పెరిగిపోయాడు. సరిగ్గా 2020లో రక్తంలో చక్కెర స్థాయిలు అధికమయ్యేంత వరకు మేల్కొలేదు. అదీగాక ఆ టైంలో మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో బిల్లీ గార్డెల్ అధిక బరువు, స్లీప్ అప్నియా, ధూమపానం చేసేవాడు, టైప్ 2 డయాబెటిస్, ఉబ్బసం వంటి అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటుండేవాడు. ఓపక్క కరోనా మహమ్మారి,మరోవైపు అనారోగ్యా జాబితాతో భయాందోళనలకు లోనై ఆరోగ్య స్పృహపై ఫోకస్ పెట్టాడు. కానీ తగ్గుదామని ఉపక్రమించిన ప్రతిసారి పెరిగిపోవడంతో లాభం లేదనుకుని..తన వ్యక్తిగత వైద్యులతో చర్చించి మరి బరువు తగ్గించే సర్జరీలకు ప్లాన్ చేశాడు.మార్పు వచ్చిందా అంటే..ఈ 53 ఏళ్ల గార్డెల్ జూలై 2021లో బారియాట్రిక్ శస్త్రచికిత్స చేయించుకున్నాడు. ఇది అతడి పరివర్తనలో తొలి అడుగు. ఆహారం విషయంలో తీసుకున్న జాగురకత..మంచి మార్పుకి శ్రీకారం చుట్టింది. కడుపు ఫుల్గా ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలతో ఓదార్పునిచ్చే ఆహారం తీసుకుంటూ..ఆకలిని నియంత్రించగలిగాడు. అలా 78 కిలోల వరకు అధిక బరువుని తగ్గించుకుని స్లిమ్గా హీరోలా మారిపోయాడు. అంతేగాదు డయాబెటిస్ కూడా నయం అయిపోయింది.ఇది మంచిదేనా అంటే..నిపుణుల అభిప్రాయం ప్రకారం, ముఖ్యంగా ఊబకాయం ఉన్నవారు గణనీయమైన బరువు తగ్గడం వల్ల టైప్ 2 డయాబెటిస్ను తిప్పికొట్టగలరని చెబుతున్నారు. ఇక్కడ హాస్య నటుడు కాలేయం , క్లోమంలో కొవ్వును తగ్గించి.. ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరిచాడు. ఇది రక్తంలో చక్కెర స్థాయిలు తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడానికి వీలు కల్పించి డయాబెటిస్ నుంచి ఉపశమనం అందిస్తుంది. అయితే బరువు పెరిగితే మాత్రం మళ్లీ డయాబెటిస్ తిరగబెట్టొచ్చు. అందువల్ల ఇలా సర్జరీ చేయించుకున్నవాళ్లు ఆ బరువుని మెయింటైన్ చేసేలా..జీవనశైలిలో మార్పులు, వ్యాయామం తదితరాల విషయాల్లో కేర్ తీసుకుంటే చాలని చెబుతున్నారు నిపుణులు. అంతేగాదు ఇక్కడ బరువు తగ్గించే సర్జరీతో కేవలం ఐదు నుంచి పది శాతమే బరువు తగ్గుతారని, ఆ తర్వాత అంతా ఫిజికల్గా మనం కష్టపడి స్లిమ్గా మారాల్సిందేనని చెబుతున్నారు నిపుణులు.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం . పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: భారత్ గుర్తింపును "మధురంగా" మార్చిన మహిళ..!ఆనంద్ మహీంద్రా ప్రశంసల జల్లు..) -
తస్మాత్ జాగ్రత్త..! బాడీబిల్డర్లు కండలు ముఖ్యమే కానీ..
‘జిమ్కు వెళ్లేవారు స్టెరాయిడ్లు వాడుతున్నారు’ అనే మాట వినిపించినప్పుడు కళ్ల ముందు కండలు తిరిగిన పురుషుడి చిత్రం ఆవిష్కృతం అవుతుంది. అయితే సీన్ మారుతోంది. పురుషులే కాదు స్టెరాయిడ్లు వాడుతున్న మహిళల సంఖ్య కూడా పెరుగుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి...ప్రపంచవ్యాప్తంగా మహిళలలో అనబాలిక్ స్టెరాయిడ్ల వాడకం పెరిగిందని చెబుతోంది ఇంటర్నేషనల్ స్టడీస్ సిస్టమేటిక్ రివ్యూ. 2014లో స్టెరాయిడ్లు వాడిన మహిళలు 1.6 శాతం ఉండగా, 2024 రివ్యూ ప్రకారం 4 శాతం మంది మహిళలు స్టెరాయిడ్లు ఉపయోగిస్తున్నారు. మహిళా బాడీబిల్డర్లలో దాదాపు 17 శాతం మంది, ప్రతి ఆరుగురిలో ఒకరు స్టెరాయిడ్లను ఉపయోగిస్తున్నారని నివేదిక చెబుతోంది. ఈ పెరుగుదలకు సోషల్ మీడియాలోని ‘ఫిట్ఫ్లూయెన్సర్స్’ ప్రభావమే కారణం అనే విమర్శ ఉంది.స్టెరాయిడ్లు వాడుతున్న వారిలో ఎక్కువమంది మహిళలకు దీర్ఘకాలంలో వాటి దుష్ప్రభావం గురించి అవగాహన లేదు. వీటిని వాడుతున్న క్రమంలో అనారోగ్య సమస్యలు ఎదురైనా వైద్యులను సంప్రదించడం లేదు.గతంతో పోల్చితే పవర్లిఫ్టింగ్, వెయిట్ లిఫ్టింగ్, బాడీబిల్డింగ్లలో మహిళల సంఖ్య వేగంగా పెరిగింది. ‘ఆటతీరు మెరుగు పడాలి. ప్రత్యర్థిపై పైచేయి ఉండాలంటే మాదకద్రవ్యాలు వాడాలి’ అనే భావన వల్ల కొందరు వాటికి దగ్గరవుతున్నారు.ఆస్ట్రేలియా, స్కాండినేవియాలలో చేసిన ఒక అధ్యయనం ప్రకారం...పురుష స్నేహితులు, కోచ్ల వల్ల స్టెరాయిడ్లను ఉపయోగించడం మొదలుపెడతారు. ఇవి హానికరం అనే భావన కంటే పోటీకి అనివార్యమనే భావనే వారిలో ఉంటుంది. స్టెరాయిడ్లు ఆటకు ఎంత మేలు చేస్తాయనేది పక్కన పెడితే ఆరోగ్యానికి హాని చేస్తాయి.వాటిలో కొన్ని...ముఖంపై వెంట్రుకలు పెరగడం స్వరంలో మార్పులు రుతుక్రమంలో మార్పులు, సంతానలేమి రొమ్ము కణజాలం తగ్గడం మొటిమలు రావడం, వెంట్రుకలు రాలడం ఆందోళన, చిరాకు, తీవ్రమైన మానసిక స్థితిస్టెరాయిడ్లలో సీసం, ఆర్సెనిక్, కాడ్మియంలాంటి ప్రమాదకరమైన విషపూరితాలు ఉంటాయని పరిశోధనలు తెలియజేస్తున్నాయి. ఇవి క్యాన్సర్, హృదయ సంబంధ వ్యాధులకు కారణమయ్యే విషాలు.‘ఈ ప్రమాదాలను నివారించాలంటే స్టెరాయిడ్ల వాడకం వల్ల కలిగే నష్టాల గురించి సోషల్ మీడియా వేదికగా ఫిట్నెస్ ఇన్ఫ్లూయెన్సర్ల ద్వారా విస్తృత ప్రచారం చేయడమే మార్గం’ అంటున్నారు నిపుణులు. (చదవండి: అయోర్టిక్ స్టెనోసిస్ అంటే..? తొమ్మిది పదుల వయసులో ఇది తప్పదా..?) -
నవ్వినా.. ఏడ్చినా... కుప్పకూలిపోతుంటాను..?
డాక్టర్ గారూ, నేనొక చిత్రమైన సమస్యతో బాధపడుతున్నాను. అదేమంటే, రాత్రి నేను ఎంతసేపు పడుకున్నా. రోజంతా మగత గానే ఉంటుంది. కంప్యూటర్ ముందు కూర్చున్నా టీ.వి చూస్తున్నా. చివరకు భోజనం చేస్తూ చేస్తూ అలాగే పడుకుని ΄ోతాను. డ్రైవింగ్ చేస్తూ నిద్రపోతానేమో అని ఈ మధ్య డ్రైవింగ్ చేయడం కూడా మానేశాను. అలాగే బాగా భయపడ్డా, గట్టిగా నవ్వినా కుప్పకూలిపోతాను. నేను కావాలనే ఇదంతా చేస్తున్నాననుకుని మా ఇంట్లో వాళ్లు నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళడం లేదు. నేను సాక్షిలో మీ కాలమ్ రెగ్యులర్గా చదువుతాను. కనీసం మీ సమాధానం చూసైనా ఇంట్లో వాళ్ళు నన్ను డాక్టర్కి చూపిస్తారనే నమ్మకంతో, నా సమస్యను మీకు మెయిల్ చేస్తున్నాను! – స్వాతి,ప్రొద్దుటూరుమీ సమస్య చాలా ఇబ్బందికరమైనది, మీ పరిస్థితికి బాధ కూడా కలుగుతోంది. కేవలం అవగాహనా లోపం వలన సరియైన చికిత్స అందుబాటులో ఉన్న సమస్యలని కూడా పట్టించుకోక పోవడం వల్ల ఎలా జరుగుతోందో మీ విషయాన్ని బట్టి అర్థం అవుతుంది. మీరు చెబుతున్న లక్షణాలని బట్టి మీరు ‘నార్కోలెప్సీ’ అనే సమస్యతో బాధపడుతున్నారని అనిపిస్తోంది. ఇది మెదడులోని ‘హైపోథాలమస్ అనే భాగం పని విధానంలో మార్పుల వలన వచ్చే ఒక న్యూరో.. సైకియాట్రిక్ డిజార్డర్. ఈ సమస్యలో నిద్రకి సంబంధించిన సాధారణ లయ దెబ్బతింటుంది. నిద్రలో వచ్చే REM & NREM అనే రెండు నిద్ర దశల క్రమ పద్ధతిలో మార్పులు ఈ సమస్యకి ప్రధాన కారణం. దాని వలన పడుకునే ముందు, నిద్రలేచే ముందు వివిధ రకాల భ్రాంతులు కలుగుతాయి. విపరీతమైన కలలు వస్తాయి. నిద్ర లేచే ముందు శరీరం పక్షవాతానికి గురైనట్లు అనిపిస్తుంది. కాళ్లూ చేతులు కదిలించలేరు. అన్నీ వినబడతాయి, కనబడతాయి, కానీ సమాధానం చెప్పలేరు. దీని వలన విపరీతమైన భయానికి, అసౌకర్యానికీ గురౌతారు. అలాగే బాగా ఎమోషనల్ అయినప్పుడు మెలకువ స్థితిలోనే, మెదడు REM స్థితిలోకి వెళ్ళిపోతుంది. దీనివలన ఒక్కసారిగా కుప్పకూలిపోతారు. ఈ అనుభవం కూడా అత్యంత భయానకంగా ఉంటుంది. ఒక్కొక్కసారి ఈ కండిషన్ను ‘ఫిట్స్’ అనుకొని తప్పుగా వైద్యం కూడా చేసే కేసులు కూడా చూస్తూంటాను. కొంతమంది కావాలనే ఇలా చేస్తున్నారనే అసలు చికిత్సే ఇప్పించరు. పాలిమ్నోగ్రఫీ అనే పరీక్ష ద్వారా ఈ సమస్యను నిర్ధారించవచ్చు. అలాగే ‘స్టిమ్యులెంట్సు, కొన్ని రకాల ‘యాంటీ డిప్రెసెంట్’ మందులు వాడితే ఈ సమస్య నియంత్రణలో ఉంటుంది. ఎక్కువగా ఎమోషన్స్కి గురికాకుండా కౌన్సెలింగ్ కూడా తీసుకోవాలి. ఉదయంపూట కొంచెంసేపు నిద్రపోవడం కూడా ఈ సమస్యలోంచి బయట పడేందుకు దోహదం చేస్తుంది. మీరు నిరాశకు గురికాకుండా మీ ఇంట్లో వాళ్ళకి ‘సాక్షి’లో నా సలహా చూపించండి. అర్థం చేసుకొని మీకు వైద్య సహాయం అందిస్తారని నా నమ్మకం. ఆల్ ది బెస్ట్! డా. ఇండ్ల విశాల్ రెడ్డి, సీనియర్ సైకియాట్రిస్ట్, విజయవాడ. మీ సమస్యలు, సందేహాలు పంపవలసిన మెయిల్ ఐడీ: sakshifamily3@gmail.com -
అయోర్టిక్ స్టెనోసిస్ అంటే..? తొమ్మిది పదుల వయసులో ఇది తప్పదా..?
90 ఏళ్ల ప్రముఖ బాలీవుడ్ నటుడు ప్రేమ్ చోప్రాకు తీవ్రమైన అయోర్టిక్ స్టెనోసిస్ ఉన్నట్లు నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే. ఆ నేపథ్యంలోనే ఆయనకు ట్రాన్స్కాథెటర్ అయోర్టిక్ వాల్వ్ ఇంప్లాంటేషన్ (TAVI) ప్రక్రియ జరిగింది. దీన్ని గుండె సంబంధిత పరిస్థితిగా పేర్కొన్నారు వైద్యులు. గుండె కవాటాలు పనిచయకపోవడం వల్లే వచ్చే సమస్యగా పేర్కొన్నారు. అంటే గుండె, శరీరంలోని వివిధ భాగాల మధ్య ప్రధాన రక్త వాహక ధమని అయిన అయోర్టాకు రక్త ప్రవాహాన్ని ప్రభావితం చేస్తుంది. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నట్లు అల్లుడు షర్మాన్ జోషి ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అసలు అయోర్టిక్ స్టెనోసిస్ అంటే ఏంటి, ఇది ఎందువల్ల వస్తుంది తదితరాల గురించి తెలుసుకుందామా..!.అయోర్టిక్ స్టెనోసిస్ అంటే ఏమిటి?అయోర్టిక్ స్టెనోసిస్ (AS) అనేది అయోర్టిక్ వాల్వ్ తీవ్రమైన పరిస్థితి. ఈ స్థితిలో, బృహద్ధమని కవాటం ఇరుకుగా మారి పూర్తిగా తెరుచుకోదు. ఈ సంకుచితం గుండె నుంచి బృహద్ధమనిలోకి, తర్వాత శరీరంలోని మిగిలిన భాగాలకు రక్త ప్రవాహాన్ని అడ్డుకుంటుందని కార్డియాలజిస్ట్లు చెబుతున్నారు.ఎందువల్ల ఇలా అంటే.."రక్త ప్రవాహం తగ్గినప్పుడు, గుండె కండరం బలహీనపడవచ్చు. నిజానికి ఇది తీవ్రమైన సమస్య సకాలంలో సమస్యను నిర్థారించి చికిత్స అందించకపోతే తీవ్రమైన బృహద్ధమని స్టెనోసిస్ గుండె వైఫల్యంతో తీవ్ర సమస్యలకు దారితీస్తుందని చెప్పుకొచ్చారు.వయసు పెరిగే కొద్దీ, గుండె కవాటాల కాల్సిఫికేషన్ కారణంగా ఈ పరిస్థితి తరచుగా అభివృద్ధి చెందుతుంది. కాలక్రమేణా, కాల్షియం నిక్షేపాలు గట్టిపడతాయి వాల్వ్ కరపత్రాలను గట్టిపరుస్తాయి. దాంతో వాల్వ్ పూర్తిగా తెరవడం కష్టతరం చేస్తుంది. సింపుల్గా చెప్పాలంటే.. ఇది ఇరుక్కుపోయిన తలుపును తెరవడానికి ప్రయత్నించడం లాంటిది. అంటే ఊపిరిరాడని పరిస్థితి ఎదురవ్వుతుంది. బలవంతంగా ప్రయత్నిస్తే మరో సమస్య ఎదురుకావొచ్చని చెబుతున్నారు వైద్య నిపుణులు.లక్షణాలు ఎలా ఉంటాయంటే..ఊపిరి ఆడకపోవడం, ఛాతీ నొప్పి లేదా మూర్ఛపోవడం వంటి లక్షణాలను అనుభవిస్తే.. ఇరుకైన వాల్వ్ గుండెపై ఒత్తిడి తెస్తుందని అర్థం. ఇది గుండె వైఫల్య అవకాశాలను పెంచుతుంది. సకాలంలో చికిత్స అందకపోతే ప్రాణాలకే ముప్పు వాటిల్లుతుంది.ముందస్తుగా గుర్తించగలమా..?బృహద్ధమని స్టెనోసిస్ గమ్మత్తైనది. ఎందుకంటే ప్రారంభ దశల్లో గుర్తించడ కష్టం. ఇరుకైన బృహద్ధమని కవాటం ఉన్న చాలా మందికి ఎటువంటి లక్షణాలు ఉండవు. ఇది ప్రారంభ రోగ నిర్ధారణలను కోల్పోవడానికి దారితీస్తుంది. మితమైన బృహద్ధమని స్టెనోసిస్ ఉన్న చాలా మందికి లక్షణాలు ఉండవని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ కూడా పేర్కొంది. మరి ఎలా నిర్ధారిస్తారు?లక్షణాలు వెంటనే స్పష్టంగా కనిపించకపోవచ్చు కాబట్టి బృహద్ధమని స్టెనోసిస్ను గుర్తించడం కష్టంగా ఉంటుంది. ఈ పరిస్థితిని నిర్ధారించడానికి, ఇమేజింగ్ కీలక పాత్ర పోషిస్తుంది. బృహద్ధమని స్టెనోసిస్ తీవ్రతను విశ్లేషించడానికి, అంచనా వేయడానికి ఉత్తమ ప్రారంభ పరీక్ష ట్రాన్స్థొరాసిక్ ఎకోకార్డియోగ్రఫీ (TTE) ఈ పరీక్ష వాల్వ్ ప్రాంతం, రక్త ప్రవాహ వేగం, అలాగే వాల్వ్ అంతటా పీడన ప్రవణతలతో సహా సమాచారాన్ని అందిస్తుంది.వాటి తోపాటు ఎలక్ట్రో కార్డియోగ్రామ్లు (ECGలు), ఛాతీ ఎక్స్-కిరణాలు వంటి పరీక్షలు గుండె ఆరోగ్యాన్ని బాగా అర్థం చేసుకోవడానికి మనకు సహాయపడతాయి.TAVI ఒక్కటే ప్రత్యామ్నాయమా..ప్రేమ్ చోప్రా వంటి వృద్ధాప్య రోగులకు, TAVI నిజమైన ఆశను అందిస్తుంది. సాంప్రదాయకంగా, తీవ్రమైన బృహద్ధమని స్టెనోసిస్కు చికిత్స చేయడం అంటే ఓపెన్-హార్ట్ సర్జరీ కిందకు వస్తుంది. దానికంటే ఈ TAVI తక్కువ ప్రమాదంతో సులభంగా బయటపడతారు. ఈ చికిత్సలో తక్కువ రోజులో ఆస్పత్రిలో ఉంటే వెసులుబాటు తోపాటు తొందరగా కోలుకోగలం కూడా. అలాగే ఇది జీవన నాణ్యతను కొనసాగించే అవకాశాన్ని కూడా అందిస్తుంది.(చదవండి: -
రాగులు ఆరోగ్యానికి ఇంత మంచిదా..? అందుకే ఉపాసన అలా..
ఇటీవల కాలంలో ప్రజలలో ఆరోగ్య స్పృహ ఎక్కువైంది. అంతా పోషకాహారాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ముఖ్యంగా చిరుధాన్యాలను తీసుకునేందుకు చాలా ఆసక్తి కనబరుస్తున్నారు. ఆ చిరుధాన్యాలలో ఒకటి ఈ రాగులు. ఇవి ఆరోగ్యానికి ఎంత మంచిదంటే..సెలబ్రెటీలు, ప్రముఖులు సైతం వీటిని రోజువారీ ఆహారంలో భాగం చేసుకునేందుకే ఇష్టపడుతున్నారు. ముఖ్యంగా టాలీవుడ్ హీరో రామ్చరణ్ భార్య, మెగా ఇంటి కోడలు ఉపాసన సైతం ఇది డైట్లో తప్పనిసరని ఓ ఇంటర్వ్యూలో ఆమెనే స్వయంగా చెప్పడం విశేషం. అంతలా అందిరి మదిని దోచిన ఈ చిరుధాన్యం రాగులతో కలిటే లాభాలు, ఎలా తీసుకుంటే మంచిది తదితరాల గురించి సవివరంగా చూద్దామా..!.ఉపాసన కూడా క్రమశిక్షణతో కూడిన డైట్కే ప్రాధాన్యత ఇస్తారామె. 36 ఏళ్ల ఆమె ప్రతి రోజు ఆరోగ్యకరమైన పోషకాహారాన్నే తీసుకోవాలనే విశ్వసిస్తానంటోంది. చిరుధాన్యాల్లో తనకు బాగా నచ్చింద రాగులని పేర్కొంది. అంతేగాదు తనకు సద్గురు జగ్గీ వాసుదేవ్ ఇచ్చిన సలహాలను గుర్తు చేసుకుంటూ..ఉపాసన రాగులను ఏదోరూపంలో మీ డైట్ బాగంగా చేసుకోండని సూచించినట్లు వెల్లడించింది. అలాగే ఆయన కుమార్తే రాధా జగ్గీతో జరిగిన సంభాషణను కూడా షేర్ చేసుకున్నారామె. భరతనాట్య నృత్యకారిణి అయిన ఆమెకు సద్గురువే స్వయంగా రాగి గంజిని చేసి ఇచ్చేవారని, అదే తనను ఇంతలా ఫిట్గా ఆకర్షణీయంగా కనిపించేలా చేస్తోందని ఆమె చెప్పినట్లు పేర్కొన్నారు ఉపాసన. అందుకే దీన్ని తన కుమార్తె డైట్లో కూడా భాగం చేశానని చెప్పుకొచ్చింది. అయితే తన కూతురు ఈ రాగులను ఇష్టపడిందా అని అడిగితే మాత్రం..ఆరోగ్యం కోసం తప్పదు, తనకు మరో ఛాయిస్ లేదని నవ్వేశారామె. మరి నిజంగానే రాగులు అంత పోషకవంతమైనదా అంటే..ఎముకలకు బలం..రాగుల్లో క్యాల్షియం అధికంగా ఉంటుంది. ఇది ఎముకలను దృఢంగా మార్చి ఆరోగ్యంగా ఉంచుతుంది. వృద్ధాప్యంలో ఆస్టియో పోరోసిస్ వంటి ఎముకల సంబంధిత సమస్యలు రాకుండా చూస్తుంది. చిన్నారులు, వృద్ధులు రాగులను తింటే ఎంతో మేలు జరుగుతుంది. ఎముకలు బలహీనంగా మారకుండా ఉంటాయి. పాలిచ్చే తల్లులు కూడా రాగును తింటే శిశువుకు ఎంతో మేలు జరుగుతుంది. శిశువు ఆరోగ్యం మెరుగు పడుతుంది. ఎముకలు బలంగా మారుతాయి. చక్కగా ఎదుగుతారు.మధుమేహం రోగులకు..డయాబెటిస్ ఉన్నవారికి రాగులు ఎంతో మేలు చేస్తాయి. రాగుల గ్లైసీమిక్ ఇండెక్స్ విలువ చాలా తక్కువగా ఉంటుంది. అందువల్ల రాగులను తింటే రక్తంలో చక్కెర స్థాయిలు నెమ్మదిగా పెరుగుతాయి. దీని వల్ల షుగర్ లెవల్స్ నియంత్రణలో ఉంటాయి. డయాబెటిస్ ఉన్నవారికి ఎంతో మేలు జరుగుతుంది. రాగుల్లో అధికంగా ఉండే ఫైబర్, పాలిఫినాల్స్ షుగర్ లెవల్స్ను తగ్గించేందుకు సహాయం చేస్తాయి. రాగుల్లో ఫైబర్ అధికంగా ఉన్న కారణంగా జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. మలబద్దకం తగ్గుతుంది. అధికంగా బరువు ఉన్నవారు బరువును తగ్గించుకునేందుకు గాను రాగులు సహాయం చేస్తాయి.రక్తహీనతకు..రాగుల్లో ఐరన్ అధికంగా ఉంటుంది. ఇది సహజసిద్ధంగా మనకు లభిస్తుంది. అందువల్ల రాగులను తింటుంటే రక్తం వృద్ధి చెందుతుంది. రక్తహీనత తగ్గుతుంది. ముఖ్యంగా మహిళలు, చిన్నారులలో వచ్చే రక్తహీనత సమస్యను తగ్గించవచ్చు. రాగుల్లో అనేక రకాల యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. అనేక ఫినోలిక్ సమ్మేళనాలు సైతం ఉంటాయి. ఇవి ఆక్సీకరణ ఒత్తిడి తగ్గేందుకు సహాయం చేస్తాయి. దీని వల్ల కణాలకు జరిగే నష్టం నివారించబడుతుంది. ఫ్రీ ర్యాడికల్స్ వల్ల శరీరానికి జరిగే నష్టం తగ్గుతుంది. ఫలితంగా గుండెపోటు, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు రాకుండా అడ్డుకోవచ్చు.మితంగానే మంచిది..ఇన్నిప్రయోజనాలు కలిగించే రాగులున తగు మోతాదులోనే తీసుకోవాలని చెబుతున్నారు నిపుణుల. న్యూట్రిషన్ల ప్రకారం..రాగులను పిండి రూపంలో తీసుకుంటే రోజుకు 100 గ్రాముల వరకు తీసుకోవచ్చు. మరీ అధికంగా తింటే శరీరంలో ఆగ్జాలిక్ యాసిడ్ పెరిగే అవకాశం ఉంటుంది. ఇది కిడ్నీ స్టోన్లను కలగజేస్తుంది -
కాలేయ మార్పిడి చేయించుకున్న వారికి ఇన్ఫెక్షన్లు
గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో సైతం కాలేయ సంబంధిత సమస్యలు ఎదుర్కొంటున్న వారిలో ఇన్ఫెక్షన్ల తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు తేలడం ఆందోళన కలిగిస్తున్నదని సౌత్ ఏషియన్ లివర్ ఇనిస్టిట్యూట్ లివర్ ట్రాన్స్ప్లాంట్ విభాగాధిపతి ప్రొఫెసర్ డాక్టర్ టామ్ చెరియన్ అన్నారు. మంగళవారం బంజారాహిల్స్లో సౌత్ ఏషియన్ లివర్ ఇనిస్టిట్యూట్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రెండున్నరేళ్ళ పాటు కాలేయ మార్పిడి శస్త్రచికిత్స చేయించుకున్న 67 మంది రోగుల ఆరోగ్యంపై నిర్వహించిన అధ్యయనంలో బహుళ మల్టీ డ్రగ్ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్(ఎండీఆర్) తీవ్ర స్థాయిలో ఉన్నట్లు తేలిందన్నారు. 24 శాతం మందిలో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు ఉండగా మరి కొంత మందిలో ఇతర సమస్యలు ఉన్నాయన్నారు. 16 బ్యాక్టీరియా కేసుల్లో 15 మందిలో యాంటీ బయాటిక్స్కు పూర్తిగా రెసిస్టెంట్గా ఉండటం ఆందోళనకరంగా ఉందన్నారు. దీంతో పాటు కొన్ని కేసుల్లో యాక్సా జోలిడినోన్ తరగతికి చెందిన ఔషదాల పట్ల కూడా ప్రతిఘటన కనిపించడం ఆందోళన కలిగించే అంశమన్నారు. పాజిటీవ్ వచ్చిన 16 మందిలో తొమ్మిది మంది సర్జరీకి ముందే రక్త పరీక్షల్లో బ్యాక్టీరియా ఉన్నట్లు తేలిందని వారు అప్పటికే ఎండీఆర్ బ్యాక్టీరియాతో ఉన్నారని వెల్లడి అయిందన్నారు. ఈ అధ్యయనం వల్ల ఆరోగ్య విధానాల్లో చికిత్సా పద్ధతుల్లో మార్పు అవసరం ఉన్నదని సూచిస్తోందన్నారు. గత వందేళ్ళుగా రోగులకు ఇన్ఫెక్షన్ వ్యాప్తి చెందకుండా నియంత్రించడమే ఆస్పత్రుల ప్రధాన లక్ష్యంగా ఉండేదని తాజా అధ్యయనంలో ఆస్పత్రికి వచ్చే ముందే వారిలో ఎండీఆర్ ఇన్ఫెక్షన్ ఉండటం పరిశీలిస్తే ప్రస్తుతం అవలంభిస్తున్న విధానాలు సరిపోవని తేలిందన్నారు. కాలేయ మార్పిడి శస్త్ర చికిత్సకు ముందే ఇలాంటి ఇన్ఫెక్షన్లను గుర్తించి నియంత్రించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఇది జాతీయ స్థాయిలో ఆరోగ్య సంక్షోభంగా భావించాల్సి ఉంటుందని ప్రజలతో పాటు అన్ని వర్గాల వారు ఈ సమస్యపై తక్షణమే దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో లివర్ క్రిటికల్ కేర్ కన్సల్టెంట్ ఎ. గోగినేని తదితరులు పాల్గొన్నారు. -
మిసెస్ మామ్ గ్రాండ్ ఫినాలె..!
ఇటీవలి కాలంలో ప్రసవం అంటేనే సిజేరియన్ అంటున్నారని, వాటి కంటే సురక్షిత, సాధారణ ప్రసవాలే ఎప్పుడూ శ్రేయస్కరమని కిమ్స్ గ్రూప్ ఆస్పత్రుల సీఈఓ డాక్టర్ అభినయ్ తెలిపారు. సాధారణ ప్రసవాల మీద అవగాహన పెంపొందించే లక్ష్యంతో డాక్టర్ కె.శిల్పిరెడ్డి ఫౌండేషన్, కిమ్స్ కడల్స్ ఆస్పత్రి ఆధ్వర్యంలో గత ఎనిమిది సంవత్సరాలుగా విజయవంతంగా నిర్వహించిన మిసెస్ మామ్ తొమ్మిదో సీజన్ గ్రాండ్ ఫినాలె కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. డాక్టర్. శిల్పిరెడ్డి, డా. శిల్పిరెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ ప్రత్యేక కార్యక్రమం గర్భిణీ స్త్రీలకు మాతృత్వంలో ఉన్న సవాళ్లు, ఆనందాల గురించి తెలుసుకోవడానికి ఒక అవకాశాన్ని కల్పించింది. తొమ్మిదో సీజన్కు మొత్తం 220 జంటలు పేర్లు నమోదుచేసుకోగా వారిలో 57 జంటలు గ్రాండ్ ఫినాలెకు అర్హత సాధించారు. వారందరినీ డాక్టర్ అభినయ్ అభినందించారు. మాతృత్వం అనేది ఒక మధురానుభవం అని, అందులోని ప్రతి దశనూ తల్లిదండ్రులు ఇద్దరూ ఆస్వాదించాలని తెలిపారు. గర్భిణి అయిన భార్యను కంటికి రెప్పలా కాపాడుకోవడంతో పాటు, పుట్టబోయే బిడ్డ సంరక్షణ విషయంలో కూడా తండ్రులది చాలా కీలక పాత్ర అని ఆయన చెప్పారు. భర్త చేదోడువాదోడుగా ఉంటే భార్య తన మాతృత్వాన్ని మరింత ఆస్వాదించగలదని వివరించారు. సాధారణ లేదా సిజేరియన్ సురక్షిత ప్రసవాలు మంచివని డాక్టర్ అభినయ్ అన్నారు. గ్రాండ్ ఫినాలెకు హాజరైన అతిథులు, జంటలను ఉద్దేశించి కిమ్స్ కడల్స్ ఆస్పత్రి ఆబ్స్టెట్రిక్స్, గైనకాలజీ క్లినికల్ డైరెక్టర్ డాక్టర్ కె. శిల్పిరెడ్డి మాట్లాడుతూ.. “సాధారణ ప్రసవాలను ప్రోత్సహించడంతో పాటు కుటుంబం యొక్క గొప్పతనాన్ని పరిచయం చేయడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం. తల్లిదండ్రులు ఏం తినాలి, పిల్లలకు ఏం పెట్టాలనే అంశాలను వారికి వివరించాం. 70-80 రకాల అంశాలను ఈ తల్లిదండ్రులకు పరిచయం చేశాం. ఇంతమందికి ఒకేచోట అవగాహన కల్పించగలిగితే వాళ్లు సమాజంలో ఈ సందేశాన్ని పంచుతారు. సాధారణ ప్రసవం అనగానే నొప్పులు భరించలేం అన్నట్లుగా చెబుతున్నారు. ఇది తప్పు. గతంలో అన్నీ సాధారణ ప్రసవాలే ఉండేవి. తర్వాత క్రమంగా వివిధ కారణాలతో సిజేరియన్లు పెరిగాయి. ప్రసవం అనేది సహజంగా జరిగే ప్రక్రియ. దాన్ని అలాగే జరగనివ్వాలి. ఇంతకుముందు సీజన్లలో పాల్గొన్నవారిలో 85% మందికి సాధారణ ప్రసవాలే జరిగాయి. వక్రీకరణలు చాలా జరుగుతున్నాయి కాబట్టి, వీరికి అవగాహన పెంచాలి. ఇక్కడ పాల్గొన్నవారు తమ బంధువులు, స్నేహితులకు చెప్పినా నెమ్మదిగా సమాజం మొత్తం మారుతుంది” అని చెప్పారు. గర్భధారణ సంరక్షణ తోపాటు భవిష్యత్తు తల్లిదండ్రులకు అవసరమైన అవగాహన కల్పించారు. చదవండి: మేనరికాల జోడు..భావితరాలకు చేటు..! -
మేనరికాల జోడు..భావితరాలకు చేటు..!
బిడ్డ పుట్టగానే చుట్టాలూ పక్కాలూ అందరి ముఖాల్లో సంతోషమే. బిడ్డ కాళ్లూ వేళ్లూ... ఇలా అవయవాలన్నీ సరిగా ఉన్నాయో లేదో చూసి అంతా బాగుంటే పండంటి బిడ్డ అంటూ ఆనందిస్తారు, ఆశీర్వదిస్తారు. ఎదుగుతున్నకొద్దీ ఆ చిన్నారి కనబరుస్తున్న తెలివితేటలను చూసి ఇంకాస్త మురిసిపోతుంటారు. కానీ ఇలా ఎదిగే సమయంలో ఏవైనా మానసిక సమస్యలు కనిపిస్తే మాత్రం ఆ తల్లిదండ్రుల వేదన చెప్పనలవి కాదు. ఆ బాధను మాటల్లో వర్ణించడానికి వీలు కాదు. సాధారణంగా ఇలాంటి శారీరక వైకల్యాలూ, లేదా మానసికమైన ఎదుగుదల లోపాలూ కనిపించే పిల్లలు మేనరికపు వివాహాల్లోని జంటలకే పుట్టడం ఎక్కువ. అందుకే డాక్టర్లు కూడా దగ్గరి సంబంధాలు వద్దనే సూచిస్తుంటారు. ఎందుకు? మేనరికపు వివాహాల్లో ఇలా ఎందుకిలా జరుగుతుంది, ఒకవేళ మేనరికపు పెళ్లిళ్లు తప్పనప్పుడు బిడ్డ పుట్టకముందూ, కడుపున పడ్డ తర్వాత చేయించుకోవాల్సిన పరీక్షలూ, తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటనే పలు అంశాలను తెలుసుకునేందుకు ఉపయోగపడే కథనమిది.ఓ బిడ్డలో లోపం వచ్చిందంటే ... తల్లిదండ్రులిద్దరిలోంచి వచ్చిన జన్యువులే (జీన్స్) సాధారణంగా ఇందుకు కారణం. తల్లిదండ్రులకు చెందిన ఆ జన్యువుల్లో ఏ లోపాలూ లేకపోతే ఆరోగ్యకరమైన అవయవాలే బిడ్డలకు వస్తాయి. సాధారణంగా ఒక లోపం వచ్చిదంటే... తల్లిదండ్రుల్లో ఎవరిదో ఒకరి జీన్ లోపభూయిష్టంగా ఉండవచ్చు. అయితే ఆ లోపం తల్లిదండ్రుల్లో ఎవరినుంచి వచ్చిందో చెప్పడం కష్టం. ఇది ఎలా జరుగుతుందంటే... ఓ అవయవానికి సంబంధించి తల్లిదండ్రులిద్దరి నుంచీ జీన్స్ బిడ్డకు వస్తాయి. ఈ రెండింటిలో ఒకదాంట్లో లోపం ఉందనుకోండి. అప్పుడు అదే అవయవానికి సంబంధించిన మంచి జీన్... లోపమున్న జీన్ను డామినేట్ చేసి... ఆ లోపం రాకుండా నివారిస్తుంది. ఒకవేళ తల్లిదండ్రులిద్దరి జన్యువుల్లోనూ లోపం ఉంటే...? అప్పుడు ఆ బిడ్డకు ఆ అవయవానికి సంబంధించిన లోపం వస్తుంది. ఇప్పుడు తల్లిదండ్రులిద్దరూ ఎలాంటి దగ్గరి సంబంధాలూ లేని వేర్వేరు కుటుంబాలకు చెందిన వారనుకుందాం. అప్పుడు తల్లిదండ్రుల్లో ఒకరిలో జన్యులోపం ఉంటే లోపం లేని మరో జన్యువు దాన్ని డామినేట్ చేసి లోపాన్ని నివారిస్తుంది. అయితే ఒకే కుటుంబాల వారిలో (మేనరికాల్లో అదే కుటుంబాల వారి మధ్య పెళ్లి అవుతుంది కాబట్టి) ఇద్దరి జన్యువులూ లోపంతోనే ఉండే అవకాశముంటుంది కాబట్టి ఆ లోపం వచ్చే అవకాశాలు పెరుగుతాయి. అందుకే దగ్గరి సంతతికి చెందిన... దగ్గరి సంబంధం కలిగిన వ్యక్తుల మధ్య పెళ్లిళ్లను ఆధునిక వైద్యశాస్త్రం అంతగా ప్రోత్సహించదు. మరి ఎలాంటి దగ్గరి సంబంధాలు లేనప్పుడు ఇలాంటి అవకరాలకు అవకాశం లేదా? ఉంటుంది. కానీ... దూరపు సంబంధాల్లో ప్రతి 400 జంటల్లో ఒకరికి లోపమున్న బిడ్డ పుట్టే అవకాశం ఉంటే... దగ్గరి సంబంధాల విషయంలో కేవలం 200 జంటల్లోనే లోపమున్న బిడ్డ పుట్టేందుకు ఛాన్సులెక్కువ. అందుకే ఆరోగ్యకరమైన బిడ్డ కోసం దూరపు సంబంధాలనూ, వీలైతే అసలు రక్తసంబంధాలే లేని ఇతర కుటుంబాల వారితో వివాహాలను ఆధునిక వైద్యశాస్త్రం ప్రోత్సహిస్తోంది. కానీ... దగ్గరి సంబంధాల వివాహాలతో పుట్టబోయే బిడ్డలకు ముప్పు పొంచి ఉంటుందిలా... దగ్గరి వివాహాలను వైద్య పరిభాషలో కన్సాంగ్వినియస్ మ్యారేజెస్ అంటారు. అంటే ఉదాహరణకు అక్కకూతుర్ని... అంటే కోడలు వరసయ్యే అమ్మాయి తన మామను చేసుకోవడం, లేదా మేనమామ, మేనత్త పిల్లలను పెళ్లి చేసుకోవడం. ఇలాంటి దగ్గరి సంబంధాల వల్ల పుట్టబోయే బిడ్డల్లో అనేక రకాల అవయవలోపాల నుంచి బుద్ధిమాంద్యం వరకు ఎన్నో రకాల రుగ్మతలు, సిండ్రోమ్స్ వచ్చే అవకాశం పొంచి ఉంటుంది.పేరెంట్స్ నుంచి బిడ్డలకు పోలికలూ, గుణాలూ లక్షణాలెలా వస్తాయంటే... బిడ్డ పుట్టగానే బంధువులందరూ చుట్టూ చేరి మురిపెంగా చూసుకుంటూ రకరకాల వ్యాఖ్యానాలు చేస్తుంటారు. ‘‘అరె... వీడి ముక్కు చూడండి. అచ్చం వాళ్ల నాన్నదే. వాడి కళ్లు చూడండి. అచ్చం వాళ్ల అమ్మవే’’ అంటూ మురిపెంగా పోలికలు చూస్తూ మురిసిపోతుంటారు. బిడ్డలో ఎలా వస్తాయి ఈ పోలికలు? ఎలాగంటే... మనిషి దేహం కోటానుకోట్ల కణాలతో నిర్మితమై ఉంటుంది. ఈ కణాలన్నీ మొదట ఒకే ఒక తొలికణంతో మొదలైన జైగోట్ నుంచి అనేకానేక కణవిభజనల తర్వాత ఏర్పడతాయి. ఇక మానవుని ప్రతి కణంలో 46 క్రోమోజోములుంటాయి. అంటే 23 జతలు. వీటిలో ఈ జతలో... 23 మహిళ నుంచి, మరో 23 పురుషుడి నుంచి వచ్చి కలిసి... తొలి కణం ఏర్పడుతుంది. దీన్నే మనం పిండం అంటాం. ఈ పిండంలోని 23 జతల క్రోమోజోములపై అనేక జన్యువులు ఉంటాయి. జన్యువు అంటే ఏమిటంటే... దేహంలోని ప్రతి అంశానికీ, ప్రతి అవయవానికీ, ఎదుగుదలకూ, బిడ్డ అవయవాల షేపుకూ, సైజ్కూ, పెరిగే ఒడ్డూ పొడవునకు సంబంధించిన ప్రతి సమాచారమూ ఈ జన్యువుల్లో నిక్షిప్తమై ఉంటుంది. ఈ జన్యువులన్నీ క్రోమోజోములపై ఉంటాయి. ఈ క్రోమోజోముల 23 జతలు ఒకదానితో మరొకటి కలిసి ఒక కణంగా రూపొందే సమయంలో తల్లిదండ్రుల నుంచి బిడ్డలకు ΄ోలికలు, తల్లిదండ్రుల లక్షణాలూ, శరీరాకృతి, రంగు వంటి అనేక అంశాలు సంక్రమిస్తాయి. ఇలా ఈ లక్షణాలన్నీ ఒక తరం నుంచి మరో తరానికి బదిలీ అవుతుంటాయి.దగ్గరివాళ్లలో పెళ్లిళ్లతో లోపాలు ఎందుకంటే... క్రోమోజోములపై లక్షణాలను సంక్రమింపజేసే జన్యువులు తండ్రి నుంచి ఒకటీ, తల్లి నుంచి మరొకటి కలిసి సంపూర్ణమవుతాయన్న విషయం తెలిసిందే. ఉదాహరణకు... ఒక మహిళలో (కాబోయే తల్లిలోని) ఒక జన్యువు కాస్త చెడి΄ోయి... బిడ్డలో అది ఆస్తమా వ్యాధిని కలగజేసే అవకాశం ఉందనుకుందాం. ఆ మహిళ తన కుటుంబంలోని దగ్గరి వారిని కాకుండా అసలు ఏ సంబంధమూ లేనివారిని పెళ్లి చేసుకుందని అనుకుందాం. ఆ పురుషుడిలోని అదే రకమైన జన్యువు ఆరోగ్యంగా ఉందనుకుందాం. ఈ ఆరోగ్యకరమైన పురుషుడి జన్యువు, అనారోగ్యకరమైన ఆ స్త్రీ జన్యువును అధిగమిస్తుంది. అంటే ఇంగ్లిష్లో చెప్పాలంటే డామినేట్ చేస్తుంది. ఇలా లొంగి ఉండే అనారోగ్యకరమైన జన్యువును ‘రెసెసివ్’ జీన్ అంటారు. అలాగే డామినేట్ చేసే జన్యువును ‘డామినెంట్’ జీన్ అంటారు. ఒకవేళ కుటుంబ సభ్యుల్లోని దగ్గరి సంబంధంలోనే పెళ్లి జరిగిందనుకోండి. అప్పుడు తల్లిదండ్రులిద్దరూ ఒకే కుటుంబం నుంచి వచ్చినవారు కాబట్టి వారిద్దరిలోనూ ఆ జన్యువులు ఒకేలా ఉంటాయి. దాంతో ఇద్దరి జన్యువుల్లోనూ ఏదీ మరొకదాన్ని డామినేట్ చేయక΄ోవడం, రెండూ లోపంతోనే ఉండటంతో పుట్టబోయే బిడ్డలో ఆస్తమా బయటపడుతుంది. ఇది ఒక జన్యువు ఉదాహరణ మాత్రమే. ఇలా తల్లిదండ్రుల లక్షణాలను మోసుకెళ్లే జన్యువులు ఒక్క క్రోమోజోమ్పై దాదాపు 20,000 వరకూ ఉంటాయి. అంటే భవిష్యత్తులో ఆ పుట్టబోయే బిడ్డ ప్రతి లక్షణమూ ముందే ప్రోగ్రామ్ అయి΄ోయి జన్యువుల్లో నిక్షిప్తమై ఉంటుంది. అందుకే దంపతులిద్దరూ అపరిచిత కుటుంబాల నుంచి పెళ్లిళ్లు చేసుకుంటే ఒకరిలో అనారోగ్యకరమైన జన్యువు (ఫాల్టీ జీన్) ఉన్నా... దాన్ని దంపతుల్లోని మరో ఆరోగ్యకరమైన జన్యువు డామినేట్ చేస్తుంది. అయితే ఇక్కడ పేర్కొన్న ఆస్తమా ఉదాహరణలా ఇది అన్నివేళలా ఇలాగే బిడ్డలో వ్యక్తమవ్వాలనే నిబంధన ఏదీ ఉండదు. కొన్ని ఫాల్టీ జీన్స్... ఇలా ఒక తరం నుంచి మరో తరానికి వెళ్లే క్రమంలో మరింతగా చెడిపోతూ.... చెడిపోతూ... అకస్మాత్తుగా ఒక పెద్ద లోపంగా బిడ్డలో వ్యక్తం (ఎగ్జిబిట్) కావచ్చు. అందువల్లనే మేనరికాల్లో దంపతులిద్దరూ ఒకే కుటుంబానికి చెందినవారు కావడంతోఫాల్టీ జీన్స్ అనేవి దంపతులిద్దరిలోనూ ఒకేలా ఉండి అవయవ లోపాలూ లేదా జబ్బులూ వ్యక్తమవుతాయి. ఎలాంటి జబ్బులకు ఆస్కారం ఉంది? మేనరికపు వివాహాలు చేసుకున్న వారిలో అవయవలోపాలూ, పుట్టుకతో వచ్చే జబ్బులు (కంజెనిటల్ డిసీజెస్), రక్తసంబంధిత వ్యాధులైన హీమోఫీలియా, థలసీమియా వంటివి, సిస్టిక్ ఫైబ్రోసిస్, మూత్రపిండాల వ్యాధులు (కంజెనిటల్ యురెట్రో పెల్విక్ అబ్స్ట్రక్షన్), కండరాల, నరాలకు సంబంధించిన వ్యాధులు, కొన్ని రకాల సిండ్రోములు (అనే జబ్బుల లక్షణాల మిశ్రమంతో ప్రయుక్తమయ్యే జబ్బులన్నింటినీ కలుపుకుని ఒకే ఒక మాటరూపంలో ‘సిండ్రోమ్’ అని పిలుస్తారు), బుద్ధిమాంద్యత, వికినిడి సమస్యలు, కళ్లసమస్యలు, గుండెకు సంబంధించిన సమస్యలు (గుండెలో రంధ్రాలు, వాటి ధమనుల్లో లోపాలు), చిన్నప్పుడే వచ్చే డయాబెటిస్, జన్యుపరమైన సమస్యలు రావచ్చు. ఇక కాబోయే తల్లిలో మాటిమాటికీ జరిగే గర్భస్రావాలు, బిడ్డ పుట్టగానే చనిపోవడం, బిడ్డకు శ్వాససంబంధిత సమస్యలు, జీవక్రియలకు సంబంధించిన (మెటబాలిక్) సమస్యలు ఇలా అనేక వైద్యపరమైన సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. జన్యుపరమైన సమస్యలూ – రకాలు సాధారణంగా జన్యుపరమైన సమస్యలను మూడు రకాలుగా విభజించవచ్చు. అవి... 1) ఆటోజోమల్ డామినెంట్ : ఇలాంటి జీన్స్ వచ్చిన పిల్లల్లో సమస్య బయటకు కనిపిస్తూ ఉంటుంది. పైగా లోపంతో ఉన్న జీన్ డామినెంట్గా ఉంటుంది. దాంతో ఒక్క జీన్ సంక్రమించినా పిల్లల్లో సమస్య బయటపడుతుంది. 2) ఆటోజోమల్ రెసెసివ్ : వీటిలో సమస్య బయటపడదుగానీ... సమస్యను / వ్యాధిని కలగజేసే జన్యువులు తల్లిదండ్రులిద్దరిలోనూ నిశ్శబ్దంగా లోపలే ఉంటాయి. వీళ్లు తర్వాత తరానికి సమస్యను మోసుకెళ్తారు. కాబట్టి వీరిని ‘క్యారియర్స్’ అంటారు. ఇద్దరు ‘క్యారియర్స్’ పెళ్లాడితే... రెండు రెసెసివ్ జీన్స్ కలిసి... పుట్టబోయే బిడ్డలో సమస్య తప్పక బయటపడుతుంది. 3) ఎక్స్ లింక్డ్ సమస్యలు : ఇలాంటి సమస్యలు ‘ఎక్స్’ క్రోమోజోమ్పై నిక్షిప్తమై ఉంటాయి. దాంతో ఈ జీన్ కలిగిన ఆడపిల్లలు సమస్యకు ‘క్యారియర్స్’గా ఉంటారు. సమస్య మగపిల్లల్లో బయటపడుతుంది.పెళ్లి తప్పదనుకుంటే... ఈ సమస్యలను దృష్టిలో పెట్టుకుని మేనరికపు వివాహాలకు దూరంగా ఉండటమే చాలావరకు మంచిది. ఒకవేళ ఈ అంశాలన్నీ తెలియక నిశ్చితార్థమో, వివాహమో చేసుకుంటే... అప్పుడు ఆ జంట చేయాల్సిన పనులివి... వివాహానికంటే ముందుగా : పెళ్లికి ముందే అమ్మాయీ, అబ్బాయి... ఈ ఇద్దరినీ ప్రీ–మేరిటల్ అండ్ జెనెటిక్ కౌన్సెలింగ్ కోసం నిపుణులను కలవాలి. అప్పుడా నిపుణులు కుటుంబ ఆరోగ్య చరిత్రను పరిగణనలో తీసుకుంటారు. అంటే వీరి తల్లిదండ్రులు, మేనత్త, మేనమామ, తాతలు, ముత్తాతల్లో ఏవైనా దగ్గరి సంబంధం చేసుకోవడం వల్ల వచ్చిన సమస్యలు ఉన్నాయా అని తెలుసుకుంటారు. ఉంటే... వీరికి పుట్టే పిల్లలకు ఆ ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయో విశ్లేషణాత్మకంగా అంచనావేస్తారు. వాటి ఆధారంగా రిస్క్ తీసుకోవచ్చా లేదా అనేది ఆ జంట నిర్ణయించుకోవచ్చు. అవసరమైతే ఆ జంటకు కొన్ని రక్తపరీక్షలూ చేయించే అవకాశమూ ఉంటుంది. సాధారణంగా వచ్చే జన్యుపరమైన సమస్యలను తెచ్చే జీన్స్ ఏమైనా ఉన్నాయా అనేది తెలుసుకోడానికి ఇద్దరికీ జెనెటిక్ టెస్టింగ్ చేస్తారు. అయితే ఎన్ని పరీక్షలు చేసినా వారికి ఏ సమస్యా రాదనో, వస్తుందనో నిర్ధారణగా చెప్పడం కష్టం. ఒకవేళ ఆటోజోమల్ డామినెంట్ సమస్యలు వస్తాయని తెలిస్తే వీలైనంతవరకు ఆ పెళ్లి వద్దనుకోవడమే మంచిది. పెళ్లి తర్వాత : పెళ్లి తర్వాత కూడా జెనెటిక్ కౌన్సెలింగ్కు వెళ్లి పైన పేర్కొన్నవన్నీ పాటించవచ్చు. గర్భం దాల్చడానికి మూడు నెలల ముందునుంచే ఫోలిక్యాసిడ్ మాత్రలు రోజుకు ఒకటి చొప్పున తీసుకోవాలి. గర్భం వచ్చాక : ఇక్కడ పేర్కొంటున్న సమస్యలన్నీ జన్యుపరమైనవి కావడంతో పుట్టబోయే పిల్లల్లో ఏ సమస్యా రాకుండా చేయడమన్నది ఏ నిపుణులకూ సాధ్యం కాదు. కాక΄ోతే కొన్ని గుర్తించదగిన సమస్యలను ముందుగానే పసిగట్టడం వల్ల, పుట్టిన తర్వాత వెంటనే చెయ్యగలిగిన చికిత్సలేవైనా ఉంటే వాటికోసం తక్షణమే సన్నద్ధమయ్యేలా జాగ్రత్త తీసుకోవడం చేయవచ్చు. లేదా లోపల ఉన్న సమస్యను తెలుసుకోవడం... ఒకవేళ అది మెదడుకు సంబంధించినదీ లేదా ఎప్పటికీ సరిచేయలేనిదని తెలిస్తే గర్భస్రావం (ఐదు నెలల లోపల) అవకాశాల గురించి ఆలోచించడం లేదా బిడ్డను కనడం... ఈ రెండింటిలో వారికి అనువైన / తగిన నిర్ణయం తీసుకోవచ్చు. చివరగా... మేనరికపు పెళ్లిళ్ల వల్ల పుట్టే పిల్లలకు వచ్చే అవయవ లోపాలను రాకుండా చేసేందుకు గర్భంతో ఉన్నప్పుడే ఇచ్చే మందులు, చేసే ఇంజెక్షన్లు ఉన్నాయని చాలామంది అనుకుంటారు. కానీ అది కేవలం అపోహ మాత్రమే. అలాంటి ఇంజెక్షన్లుగానీ మందులు గానీ ఉండవు. ఇక మేనరికపు వివాహాల వల్ల పిల్లలకు అవకరాలు వచ్చే అవకాశాలు ఎక్కువ కాబట్టి ఆస్తి కోసమో లేదా ఇతరత్రా కుటుంబ భద్రతల దృష్ట్యా అలాంటి వాటిని చేసుకుని... ఆర్థికంగా, మానసికంగాబాధపడటం కంటే... ఆరోగ్యకరమైన బిడ్డల కోసం కాస్తంత మంచి సంబంధాలు వెదికి బయటి సంబంధాలు చేసుకోవడమే మేలు అని గుర్తుంచుకోవాలి. అయితే ఇది వారి వారి వ్యక్తిగతమైన కుటుంబ పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది. రక్తసంబంధాల్లోనే వివాహాలకు కారణాలివి... ఆర్థిక కారణాలూ, తెలిసినవారి కుటుంబంలో అయితే బిడ్డ బాగోగులు తెలుస్తాయనే ఈ రెండు అంశాలే దగ్గరి బంధుత్వాల్లో పెళ్లిళ్లకు కారణం. అందునా... ప్రధానంగా ఆర్థిక అంశాలే బాగా దగ్గరి సంబంధాలు చేసుకునేలా చాలావరకు ఆ కుటంబాలవారిని ప్రభావితం చేస్తుంటాయి. మేనత్త / మేనమామ పిల్లలను చేసుకుంటే ఆస్తి బయటివారికి చెందకుండా... ఆస్తిలో ఆస్తి కలుస్తుందనే అంశమే చాలా సందర్భాల్లో ఇలాంటి పెళ్లిళ్లను ఎక్కువగా ప్రోత్సహిస్తుంది. ఇక రెండో ప్రధాన అంశం... ఉద్వేగపూరిత బంధం. అంటే ఎమోషనల్ రిలేషన్షిప్. మనం ప్రాణప్రదంగా పెంచుకున్న మన బిడ్డను ఎక్కడో దూరంగా ఉన్నవారికి ఇచ్చి పెళ్లి చేస్తే... వారెలా చూసుకుంటారో, బాగా చూసుకుంటాఓ లేక ఆరళ్లు పెడుతూ బాధలకు గురిచేస్తారో? అదే... బిడ్డ మన కళ్లెదురుగా ఉంటే మనమూ కూతురి బాగోగులు కళ్లారా చూస్తూ ఉండవచ్చు. ఈ రెండు అంశాల కారణంగా కులాలు, మతాలు, ప్రాంతాలకు అతీతంగా దగ్గరి బంధువుల్లోనే పెళ్లిళ్లు జరుగుతుంటాయి. దాంతో తమ జీవనశైలుల్లోనూ, తమ సాంస్కృతిక విధానంలో దంపతులిద్దరూ తేలిగ్గా ఇమిడిపోతారు... దాంతో దంపతులకు ఇబ్బందులు రావనే భావన ఇలాంటి వివాహాలను ప్రోత్సహిస్తుంది.మేనరికపు పెళ్లిళ్లు... దంపతులు చేయించుకోవాల్సిన పరీక్షలు :గర్భందాల్చిన మూడో నెలలో (12 వారాల్లో) డబుల్ మార్కర్ టెస్ట్ అనే రక్తపరీక్ష చేయించుకుంటే బిడ్డలో డౌన్స్ సిండ్రోమ్, ట్రైజోమ్ 18, 13 వంటి కొన్ని రకాల జన్యుపరమైన సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయా లేక తక్కువగా ఉన్నాయా అని తెలుస్తుంది. ఈ పరీక్షల ఫలితాలను బట్టి వేరే పరీక్షలు అవసరమా కాదా అని తెలుస్తుంది. మూడో నెలలో (12వారాలప్పుడు) న్యూకల్ ట్రాన్స్లుయెన్సీ స్కాన్ (ఎన్టీ స్కాన్) చేయించుకుంటే, ఆ సమయానికి బయటపడే సమస్యలు ఏమైనా ఉంటే తెలుస్తాయి. పై పరీక్షల్లో కొన్ని జన్యుపరమైన సమస్యలు వచ్చే అవకాశం ఉందనే సందేహం కలిగినప్పుడు దాన్ని నిర్ధారణ చేయడానికి బిడ్డ చుట్టూ ఉండే మాయ నుంచి కొంత ముక్క సేకరించి ‘కోరియా విల్లస్ బయాప్సీ’ అనే పరీక్ష చేస్తారు. ఐదో నెలలో ట్రిపుల్ మార్కర్ లేదా క్వాడ్రపుల్ మార్కర్ వంటి రక్తపరీక్షలు చేయించుకుంటే పుట్టబోయే బిడ్డలో కొన్ని రకాల జన్యుపరమైన సమస్యల ముప్పు ఎక్కువా లేదా తక్కువా అన్నది తెలుస్తుంది. ఇందులో రిస్క్ ఎక్కువగా ఉన్నట్లు ఫలితాలు వస్తే ఆమ్నియోసెంటైసిస్ అనే పరీక్ష చేయించాలి. ఇందులో గర్భంలోని బిడ్డ చుట్టూ ఉండే ఉమ్మనీరు లోంచి 10 – 20 ఎమ్ఎల్ తీసి జన్యువుల పరీక్షకు (క్యారియోటైపింగ్కు) పంపించి సమస్యను నిర్ధారణ చేస్తారు. ఈ పరీక్ష వల్ల ఒక శాతం మందిలో గర్భస్రావమయ్యే అవకాశం ఉంటుంది. ఐదో నెల చివరిలో 18–22 వారాలప్పుడు ‘టిఫ్ఫా’ అనే స్కానింగ్ చేయడం వల్ల బిడ్డలో వచ్చే అవయవలోపాలను ముందుగానే గుర్తించవచ్చు. దీనితో ΄ాటు జెనెటిక్ సోనోగ్రామ్ చేయించుకుంటే కొన్ని జన్యుసంబంధిత వ్యాధులను సూచించే సాఫ్ట్ మార్కర్లను గుర్తించి, దానికి తగినట్లుగా తర్వాతి నిర్ణయం తీసుకోవచ్చు. ఆరో నెలలో 22–24 వారాల్లో 2డీ ఫీటల్ ఎకో కూడా చేయించుకుంటే గుండెకు సంబంధించిన లోపాలను తెలుసుకోవచ్చు. స్కానింగ్లో నూటికి నూరు శాతం లోపాలను కనుక్కోలేకపోవచ్చు. కొందరిలో బిడ్డ పొజిషన్, ఉమ్మనీటి శాతం, తల్లి పొట్ట మీద అధికకొవ్వు వంటి అంశాలను బట్టి కూడా కొన్ని లోపాలను కనుగొనడం మిస్సయ్యే అవకాశం ఉంది. బిడ్డ పుట్టాక : బిడ్డపుట్టిన తర్వాత మొదటి వారంలోనే నియోనేటల్ స్క్రీనింగ్ పరీక్షలు చేయించడం వల్ల త్వరగా చికిత్స చేయదగిన వ్యాధులు ఏవైనా ఉంటే తెలుస్తుంది. అంటే ఎర్రర్స్ ఆఫ్ మెటబాలిజమ్ వంటివి గుర్తించవచ్చు. బిడ్డ మూడో నెలలో వినికిడి లోపాలను గుర్తించే పరీక్షలు చేయించి, ఒకవేళ ఉంటే వాటిని చాలావరకు సరిదిద్దవచ్చు.డాక్టర్ శ్రీజ గుర్రాల, సీనియర్ కన్సల్టెంట్ యూరోగైనకాలజిస్ట్ (చదవండి: హార్న్బిల్ ఫెస్టివల్ ..! ఫుడ్ మెనూ చూస్తే..మతిపోవడం ఖాయం..!) -
జంటలకు ఐవీఎఫ్ వైఫల్యం వర్రీ ఉండదు..! క్లినిక్లు కూడా..
భారతదేశంలో అభివృద్ధి చెందుతున్న ఐటీ హబ్లలో ముఖ్యంగా బెంగళూరు, హైదరాబాద్, పూణే, చెన్నైలలో కెరీర్ ప్లానింగ్కే ప్రాధాన్యత ఇస్తున్నారు ఐటీ జంటలు. దాంతో ఆ తర్వాత పేరెంట్స్గా మారలేకపోతున్నాం అని బాధపడుతున్న జంటలెందరో. సుదీర్ఘ పనిగంటలు, జీవనశైలి మార్పులు, ఆలస్యంగా వివాహం, పని ఒత్తిడి తదితర కారణాలతో చాలా జంటలు తమ సంతానోత్పత్తి ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడేస్తున్నారు. చివకికి ఏక్లినిక్ని సంప్రదిస్తే మంచిదన్న టెన్షన్తో సన్నిహితులు, బంధువులు సూచనలను ఆశ్రయిస్తారు. చివరికి అక్కడ ఈ ఐవీఎఫ్ సంతాన సాఫల్య కేంద్రాలను ఆశ్రయిస్తారు. ఆఖరికి అందులో కూడా వరుస ఫెయిలర్స్ చూసి విసిగివేసారిన దంపతులెందరో. కొందరు మాత్రం పట్టుదలతో తల్లిందండ్రలవ్వగా మరికొందరికి మాతం అదొక కలగానే మిగిలిపోతుంది. ఆ సమస్యను చక్కబెట్టేందుకు ఒయాసిస్ ఫెర్టిలిటీ మరో ముందడుగు వేసింది. సహజంగా గర్భం దాల్చలేక ఇబ్బందిపడి క్లినిక్లను ఆశ్రయిస్తే ఆఖరికి ఐపీఎఫ్లో కూడా నిరాశను ఎదుర్కొన్న జంటలకు ఊరటనిచ్చేలా..భావోద్వేగ మద్దతను అందిస్తోంది ఒయాసిస్ ఆస్పత్రి. సౌకర్యవంతమైన టెలి-కన్సల్టేషన్లతో మద్దతిస్తోంది దంపతులకు. అంతేగాదు సంతానోత్పత్తి సంరక్షణ వృత్తిపరమైన నిబద్ధతలతో సమలేఖనం చేసేందుకు ప్రయత్నిస్తోంది. దీన్ని అన్ని ఆస్పత్రులు అమలు చేసేందుకు ముందుకొస్తే.. చాలా జంటలకు తల్లిందండ్రులు అయ్యే అవ్వకాశం ఉంటుందని పేర్కొంది. డాక్టర్ వరలక్ష్మి యాకసిరి, ప్రాంతీయ వైద్య విభాగాధిపతి, ఒయాసిస్ ఫెర్టిలిటీ చదవండి: అతి పిన్న వయస్కురాలైన యువ బిలియనీర్..! ఏకంగా రూ. 10వేల కోట్లు.. -
మలబద్ధకం నివారణ కోసం...
మలబద్ధకం చాలామందిని బాధిస్తూ ఉంటుంది. ఫ్రీ మోషన్ కాకపోవడం వల్ల వచ్చే ఈ సమస్యతో దీర్ఘకాలంలో మరిన్ని ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలూ ఉంటాయి. అందుకే ఈ సమస్యను నివారించుకోవడం ఎంతోముఖ్యం. అందుకు పాటించాల్సిన కొన్ని సూచనలుఫైబర్ (పీచు) సమృద్ధిగా ఉండే ఆహారాలతో మలబద్ధకాన్ని నివారించుకోవడం తేలికే. వాటివల్ల జీర్ణాశయమార్గం శుభ్రమవ్వడమే కాకుండా తేలిగ్గా విరేచనం అయ్యేందుకు ఆ పీచు సహాయపడుతుంది. ఫైబర్ వల్ల దేహంలో మనం తీసుకున్న పిండిపదార్థాల నుంచి చక్కెర నెమ్మదిగా విడుదలవుతుంది. ఫలితంగా రక్తంలో చక్కెర మోతాదులు ఒకేసారి పెరగవు. పొట్టుతో కూడిన అన్ని రకాల ధాన్యాల్లోనూ ఈ పీచు ఎక్కువ. అందుకే పొట్టు తీయని ధాన్యాలు... మరీ ముఖ్యంగా వరి విషయానికి వస్తే దంపుడు బియ్యం వంటివి మేలు చేస్తాయి. ఇక మామూలు ధాన్యాల్లో కంటే తృణధాన్యాల్లో పీచు మోతాదులు ఎక్కువ. కాయగూరలు, ఆకుకూరలు, మొలకెత్తిన ధాన్యాల్లోనూ పీచుపాళ్లు ఎక్కువ. ఇవి మలబద్ధకంతో పాటు చాలా రకాల క్యాన్సర్లనూ నివారిస్తాయి. చిక్కుళ్లలో ప్రోటీన్ తోపాటు ఫైబర్ కూడా ఎక్కువే. ఇవి కండరాలకు బలాన్నివ్వడంతోపాటు మలబద్దకం నివారణకూ తోడ్పడుతూ ఒకేసారి రెండు ప్రయోజనాలనిస్తాయి. తాజాపండ్లలోనూ పీచు ఎక్కువగానే ఉంటుంది. అందుకే అతిగా తీపి ఉండని తాజాపండ్లు డయాబెటిస్ ఉన్నవారికీ మేలు చేస్తాయి. బొప్పాయి, పుచ్చ, నారింజ వంటి పండ్లలో పీచు మోతాదు ఎక్కువగా ఉండటంతో మలబద్ధకాన్ని తేలిగ్గా నివారిస్తాయి. పండ్లను పళ్లరసాల రూపంలో తీసుకుంటే అందులో పీచుపదార్థాలు దాదాపుగా ఉండవు. అందుకే పండ్లను కొరికి తినడమే మేలు. పీచుపదార్థాలతోపాటు తగినన్ని నీళ్లు తాగడం వల్ల విరేచనం సాఫీగా అవుతుంది. రోజుకు కనీసం రెండు లీటర్ల (కనీసం పది గ్లాసుల) నీళ్లు తాగడం మంచిది. (చదవండి: డయాబెటిక్ నెఫ్రోపతి: చాపకింద నీరులా వ్యాపిస్తుంది..జరభద్రం) -
డయాబెటిక్ నెఫ్రోపతి: చాపకింద నీరులా వ్యాపిస్తుంది..జరభద్రం
డయాబెటిస్ (మధుమేహం) అంటే కేవలం రక్తంలో చక్కెర మోతాదులు పెరగడం మాత్రమే కాదు. అది దేహంలోని అనేక అవయవాలను నిశ్శబ్దంగా దెబ్బతీసే ప్రమాదకారి. డయాబెటిస్ వల్ల మిగిలిన అన్ని అవయవాల్లో కన్నా కిడ్నీలు దెబ్బతినే అవకాశాలెక్కువ. ఎంత ఎక్కువ అంటే... డయాబెటిస్తో బాధపడే వ్యక్తులలో 60% మందికి కిడ్నీలు దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. పైగా ఆ సమస్య తారస్థాయికి చేరే వరకూ చాలామందికి ఆ విషయం తెలియనే తెలియదు. ఇలా చాపకింద నీరులా నిశ్శబ్దంగా పెరుగుతూపోయే డయాబెటిక్ నెఫ్రోపతీ అనే ఈ కిడ్నీల వ్యాధి కారణంగా వచ్చే అనర్థాలూ, లక్షణాలూ, చికిత్స వంటి అంశాలపై అవగాహన కోసం...ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే డయాబెటిస్తోపాటు దానివల్ల కలిగే అనర్థాలు పెరిగిపోయాయి. టైప్ 1 అలాగే టైప్ 2... ఈ రెండు రకాల డయాబెటిస్లూ నెఫ్రోపతీకి దారితీస్తాయి, అయితే ఎక్కువ మందికి టైప్ 2 డయాబెటిస్ ఉండటం వల్ల చాలా కేసుల్లో కిడ్నీ పనిచేయకపోడానికి ఇదే కారణం. పైగా కిడ్నీ దాదాపుగా దెబ్బతిని పూర్తిగా పనిచేయకుండా పోయేవరకు చాలామందికి ఈ విషయం తెలియనే తెలియదు. డయాబెటిస్తో కిడ్నీలు ఎలా దెబ్బతింటాయంటే... కిడ్నీలు నిరంతరం రక్తాన్ని వడ΄ోస్తూ, అందులోని వ్యర్థాలూ, విషపదార్థాలను తొలగిస్తూ, వాటిని మూత్రం ద్వారా బయటకు ΄ోయేలా చేస్తుంటాయి. రక్తంలో చక్కెర మోతాదులు ఎక్కువగా ఉన్నకొద్దీ కిడ్నీలోని అత్యంత సన్నటి రక్తనాళాలు దెబ్బతింటాయి. ఫలితంగా వాటి వడ΄ోత సామర్థ్యం క్రమంగా తగ్గుతూ పోతుంటుంది. ఒకనాటికి కిడ్నీ పూర్తిగా పనిచేయని పరిస్థితి వస్తుంది. దాంతో జీవితాంతం డయాలసిస్ మీద ఆధారపడాల్సి వస్తుంది లేదా కిడ్నీ మార్పిడి తప్ప వేరే ప్రత్యామ్నాయమే ఉండదు.ముందుగానే గుర్తించడం ఇలా... డయాబెటిక్ నెఫ్రోపతికి చికిత్స చేసి మళ్లీ మొదటిలా కిడ్నీని పనిచేయించడం అసాధ్యం. అంటే దీనిని రివర్స్ చేయలేమని అర్థం. పైగా దాదాపుగా కిడ్నీ పూర్తిగా దెబ్బతినేవరకు దీని లక్షణాలు కనిపించవు. అందుకే నిశ్శబ్దంగా వృద్ధిచెందే ఈ వ్యాధిని తెలుసుకోడానికి క్రమం తప్పకుండా స్క్రీనింగ్ పరీక్షలు చేయిస్తుండటం అవసరం.ఇవీ వైద్యపరీక్షలు... మైక్రో అల్బుమిన్ మూత్ర పరీక్ష : ఈ పరీక్షతో మూత్రంలో కొద్ది మొత్తంలోనైనా లీక్ అవుతుండే ప్రోటీన్ (అల్బుమిన్)ను గుర్తించవచ్చు. కిడ్నీ దెబ్బతినడంలో ఇది తొలి దశ. సీరం క్రియాటినిన్ అండ్ ఈ–జీఆర్ఎఫ్ (ఎస్టిమేటెడ్ గ్లోమెరులర్ ఫిల్టరేషన్ రేట్) : ఈ పరీక్షతో కిడ్నీ వడ΄ోత సామర్థ్యాన్ని కొలవవచ్చు. ఈ–జీఆర్ఎఫ్ తగ్గడం అంటే అది కిడ్నీ పనితీరు తగ్గడానికి ఒక సూచన.రక్తపోటును నిరంతరం పర్యవేక్షిస్తుండటం : హైబీపీ అన్నది కిడ్నీ దెబ్బతినే ప్రక్రియను వేగవంతం చేస్తుంది. అందుకే రక్తపోటును ఎప్పటికప్పుడు పరీక్షించుకుంటూ ఉండటం, మందులతో అదుపులో పెట్టుకోవడం అవసరం. వార్షిక ఆరోగ్య పరీక్షలు: మధుమేహం ఉన్న ప్రతి ఒక్కరికీ, ముఖ్యంగా ఐదేళ్ల కంటే ఎక్కువగా డయాబెటిస్తో బాధపడుతున్న ఆరోగ్య చరిత్ర ఉన్నవారు ప్రతి ఏడాదీ వార్షిక పరీక్షలు చేయించుకుంటూ ఉండటం అవసరం. ఎందుకంటే ఈ డయాబెటిస్ ఏ అవయవంపై తన ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందో ఎవరికీ తెలియదు. అందుకే డయాబెటిస్తో బాధపడే ప్రతి ఒక్కరూ ఇలా ప్రతి ఏడాది అన్ని రకాల వైద్యపరీక్షలూ చేయించుకోవడం మేలు.ఎండ్ స్టేజ్ కిడ్నీ డిసీజ్కి చికిత్సలిలా:కిడ్నీ పనితీరు పూర్తిగా దెబ్బతిని, కిడ్నీ సామర్థ్యం పూర్తిగా తగ్గినట్లయితే, మూత్రపిండాల మార్పిడి చికిత్స (రీనల్ రీప్లేస్మెంట్ థెరపీ) అవసరం డయాలసిస్: ఈ ప్రక్రియ ద్వారా రక్తంలోని వ్యర్థాలనూ, విషాలతో కూడిన ద్రవాలను తొలగిస్తారు హీమో–డయాలసిస్: శరీరం వెలుపల అమర్చే యంత్రంతో వారానికి పలు మార్లు రక్తాన్ని వడ΄ోయడం పెరిటోనియల్ డయాలసిస్: కడుపులోని పెరిటోనియమ్ అనే పొరలో అమర్చే క్యాథటర్ (గొట్టం లాంటి పరికరం) సహాయంతో దేహంలోని వ్యర్థాలూ, విషాలను వడపోయడం చివరగా కిడ్నీ మార్పిడి చికిత్స : చనిపోయిన వ్యక్తి నుంచి సేకరించిన లేదా బతికే ఉన్న దగ్గరి బంధువైన దాత నుంచి తీసుకున్న కిడ్నీని బాధితులకు అమర్చేందుకు చేసే శస్త్రచికిత్స ఇది ∙ఇక టైప్ 1 మధుమేహంతో బాధపడే బాధితులకు కిడ్నీ–ప్రాంక్రియాస్ మార్పిడి చికిత్స కూడా ఒక ప్రత్యామ్నాయం కావచ్చు.మేనేజ్మెంట్ : పరిస్థితి డయాలసిస్ లేదా కిడ్నీ మార్పిడి వరకు వెళ్లకూడదనుకునే బాధితులు ఎప్పటికప్పుడు వైద్యులు సూచించిన మందులు వాడుతూ, తమ బీపీ, చక్కెర మోతాదులు అదుపులో ఉండేలా చూసుకోవాలి.చివరగా... డయాబెటిక్ నెఫ్రోపతీ అనేది రివర్స్ చేయలేని తీవ్రమైన వేదన కలిగించే పరిస్థితి. డయాబెటిస్ను ఎప్పటికప్పుడు అదుపులో పెట్టుకోవడం, క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకోవడం, జీవనశైలి మార్పులను క్రమశిక్షణతో అవలంబించడం, డాక్టర్ సూచనలను తప్పక పాటించడం వంటి జాగ్రత్తలతో చాలా ఖర్చుతో కూడినవీ లేదా బాధించేవైన డయాలసిస్, కిడ్నీ మార్పిడి వరకు వెళ్లకుండా జాగ్రత్త పడవచ్చని అవగాహన పెంచుకోవడమన్నది అవసరమని అందరూ గుర్తుంచుకోవాలి. మొదటి, రెండో దశల్లో... జీవనశైలిలో మార్పులు:రక్తంలో చక్కెరను అదుపులో ఉంచడం ( గ్లైసీమిక్ కంట్రోల్) : రక్తంలోని చక్కెర మోతాదులను పరిమిత స్థాయిలోనే ఉండేలా చూసేందుకు కొన్ని మందులు అవసరమైన వారికి ఇన్సులిన్ వంటివి ఇవ్వడం. రక్తపోటును అదుపు చేయడం (బీపీ కంట్రోల్) : ఏంజియోటెన్సిన్ కన్వర్టింగ్ ఎంజైమ్ (ఏసీఈ) ఇన్హిబిటర్స్ లేదా ఏంజియోటెన్సిన్ రిసెప్టార్ బ్లాకర్స్ సహాయంతో బీపీని 130 / 80 అనే కొలతకంటే తక్కువగా ఉండేలా మందులివ్వడం ఆహారంలో మార్పులు : తీసుకునే ఆహారంలో ఉప్పు మోతాదులు తగ్గించడం అలాగే ్ర΄ోటీన్ నియంత్రిత స్థాయిలోనే ఉండేలా జాగ్రత్త తీసుకోవడం వంటి జాగ్రత్తలు క్రమ తప్పకుండా చేసే వ్యాయామలు : బరువును ఆరోగ్యకరమైన పరిమితిలోనే ఉంచుకునేందుకు క్రమం తప్పకుండా వ్యాయామాలు చేయడం దురలవాట్లకు దూరంగా ఉండటం : పొగతాగడం, మద్యం వంటి అలవాట్లకు పూర్తిగా దూరంగా ఉండటం.డయాబెటిక్ నెఫ్రోపతీ లక్షణాలు సాధారణంగా డయాబెటిక్ నెఫ్రోపతీ తాలూకు మొదటి దశల్లో గుర్తించదగిన లక్షణాలేవీ కనిపించవు. అయితే జబ్బు పెరుగుతున్నకొద్దీ ఈ కింద పేర్కొన్న లక్షణాలూ, సూచనలూ కనిపించవచ్చు పాదాలు, చీలమండలు లేదా కళ్ల చుట్టూ ఉబ్బు లేదా వాపు (కిడ్నీల పనితీరు తగ్గడంతో దేహంలోని నీరు బయటకు పోలేకపోవడవంతో ఈ ఉబ్బు / వాపు కనిపిస్తుంది) అలసట, నీరసం, నిస్సత్తువ, బలహీనతఆకలి లేకపఓవడం లేదా వికారం మరీ ఎక్కువగాగానీ లేదా తక్కువగాగానీ జరిగే మూత్ర విసర్జన నురుగుతో కూడిన మూత్రం (ప్రోటీన్ నష్టం వల్ల)నిరంతరం అధిక రక్తపోటు (కన్సిస్టెంట్గా హైబీపీ)శ్వాస ఆడకపోవడం (దేహంలోని నీరు ఊపిరితిత్తుల్లో చేరడం వల్ల) ఈ లక్షణాలను గమనించినట్లయితే, కిడ్నీ వ్యాధి నిర్ధారణ కోసం వెంటనే డాక్టర్ను సంప్రదించాలి.డయాబెటిక్ నెఫ్రోపతి చికిత్సలుదీనికి నిర్దిష్టంగా కాకుండా ఒక ప్రణాళికాబద్ధంగానూ, వ్యక్తిగతంగానూ (పర్సనలైజ్డ్ ట్రీట్మెంట్) చికిత్సలు ఉంటాయి. ఈ వైద్య చికిత్సల ద్వారా కిడ్నీ దెబ్బతినడం మరింత వేగంగా జరగకుండా చూడటంతోపాటు అప్పటికే దెబ్బతిన్నందున ఆరోగ్యంపై పడే ప్రతికూల ప్రభావాలను తగ్గించడమే లక్ష్యంగా చేస్తారు.ఇవీ వాడాల్సిన మందులు ఎస్జీఎల్టీ 2 ఇన్హిబిటర్లు (ఉదాహరణకు, డపాగ్లిఫ్లోజిన్, ఎంపాగ్లిఫ్లోజిన్); అలాగే జీఎల్పీ – 1 రిసెప్టర్ అగోనిస్ట్లు (ఉదాహరణకు లిరాగ్లూటైడ్, సెమాగ్లూటైడ్) అనేవి టైప్ 2 మధుమేహంతో బాధపడుతున్న బాధితుల్లో కిడ్నీ వ్యాధి మరింత వేగంగా పురోగమించకుండా చూడటంతోపాటు గుండెకు సంబంధించిన జబ్బులను తగ్గించడానికి ఉపయోగించే కొత్త మందులివి ఫైనెరెనోన్ (కెరెండియా) అనేది ఒక నాన్–స్టెరాయిడల్ మినరలో కార్టికాయిడ్ రిసెప్టర్ యాంటాగనిస్ట్ డ్రగ్. కిడ్నీ వైఫల్యమూ అలాగే గుండె సంబంధిత జబ్బుల వల్ల కలిగే ప్రమాదాలను తగ్గించడానికి వాడే మందు అధిక కొలెస్ట్రాల్ను అదుపు చేయడానికి స్టాట అనే మందులు. డాక్టర్ గంధె శ్రీధర్, సీనియర్ కన్సల్టెంట్ నెఫ్రాలజీ అండ్ ట్రాన్స్ప్లాంట్ ఫిజీషియన్ (చదవండి: కూతురిని అలా చూసి..! ఆ తల్లిదండ్రుల రియాక్షన్ మాములుగా లేదుగా..!) -
గుండెకు 'చలిపోటు'
సాక్షి, అమరావతి: చలికాలం అనారోగ్య సమస్యలకు పుట్టినిల్లు లాంటిది. వైరస్, బ్యాక్టీరియల్ జబ్బులతో పాటు గుండెజబ్బుల ముప్పు చలికాలంలో ఎక్కువని వైద్యులు హెచ్చరిస్తున్నారు. రాష్ట్రంలో రోజురోజుకు ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. జనవరి, ఫిబ్రవరి నెలల్లో చలితీవ్రత మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఈ కాలంలో సాధారణ రోజుల్లో ఎదురయ్యే గుండెపోటు తీవ్రత కంటే ముప్పు 50 శాతం అధికంగా ముప్పు ఉంటుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. నవంబర్–ఫిబ్రవరి మధ్య గుండెపోటు ఘటనలు 15–20 శాతం అధికంగా నమోదయ్యే అవకాశం ఉందని ఇండియన్ హార్ట్ అసోసియేషన్ హెచ్చరిస్తోంది. మిగిలిన రోజులతో పోలిస్తే చలి వాతావరణం రోజుల్లో రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టే స్వభావం 14–20 శాతం అధికంగా ఉంటుంది. ఈ సమస్య హార్ట్, బ్రెయిన్ స్ట్రోక్లకు, గుండె వైఫల్యానికి కారణమవుతుంది. చలితీవ్రతకు శ్వాసనాళాలతో పాటు గుండెకు రక్తం సరఫరాచేసే రక్తనాళాలు కుంచించుకుపోతాయి. గుండె ఎక్కువగా శ్రమించాల్సి వచ్చి, అదనపు ఒత్తిడి పడుతుంది. ఈ సమస్య వయస్సు పైబడిన వారిలో ఎక్కువగా తలెత్తే అవకాశం ఉంటుంది. ధూమపానం, మద్యపానం వంటి అలవాట్లు, ఊబకాయం, అనారోగ్యకరమైన జీవనశైలి ఉంటే 40 ఏళ్లలోపు వారిలోను గుండె ఎక్కువగా శ్రమించాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. దీంతో రక్తంలో కెటాకెలోమిన్స్ హార్మోన్ స్థాయి పెరిగి, రక్తనాళాల్లో అప్పటికే పూడికలు ఉంటే అక్కడ రక్తం గడ్డకట్టి గుండెపోటుకు దారితీస్తుందని శాస్త్రీయంగా నిర్ధారణ అయినట్టు వైద్యులు తెలిపారు. చలిని తట్టుకోవడం కోసం కొందరు అధికంగా ధూమపానం, మద్యపానం చేస్తుంటారు. ఇది గుండె వేగాన్ని, లయను నియంత్రించే నాడీవ్యవస్థపై దు్రష్పభావం చూపి గుండె లయ తప్పుతుంది. అత్యంత వేగంగా కొట్టుకుని హార్ట్ అరిథ్మియాకు దారితీస్తుంది.వీరు జాగ్రత్త » ఇప్పటికే గుండె జబ్బులున్నవారు » బీపీ, షుగర్, ఇతర దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు » ధూమపానం, మద్యపానం చేసేవారు » కుటుంబంలో గుండెజబ్బు చరిత్ర ఉన్నవారు » ఊబకాయం, నిత్యం ఒత్తిడితో బాధపడేవారు » రక్తంలో చెడు కొలె్రస్టాల్ ఎక్కువగా ఉన్నవారు ఈ లక్షణాలుంటే అశ్రద్ధ వద్దు » ఛాతీ మధ్య, పైభాగంలో నొప్పి » ఛాతీ పట్టేసినట్టు, బరువుగా అనిపించడం » శ్వాస తీసుకోవడం కష్టతరం కావడం » చలిలోను చెమటలు పట్టడంశరీరంలో నీటిశాతం తగ్గకుండా చూడాలిచలికాలం కాబట్టి సాధారణంగా అందరూ తక్కువగా నీరు తాగుతుంటారు. దీంతో శరీరంలో నీటిశాతం తగ్గిపోతూ ఉంటుంది. దీంతో రక్తం చిక్కబడుతుంది. ఈ క్రమంలో ఇప్పటికే రక్త నాళాల్లో కొవ్వు పేరుకుపోయిన వ్యక్తుల్లో రక్తం చిక్కబడి క్లాట్లు వస్తాయి. చలికి రక్తనాళాలు సైతం కుంచించుకుపోయే అవకాశం ఉండటంతో గుండె పోటు సంభవించే ప్రమాదం ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరు శరీరంలో నీటిశాతం తగ్గకుండా జాగ్రత్తపడాలి. జీవనశైలి మార్చుకోవాలని కొందరు కొత్తగా వ్యాయామాలు ప్రారంభిస్తుంటారు. అలాంటివారు తొలుత వైద్యులను సంప్రదించి జాగ్రత్తలు తెలుసుకోవాలి. తేలికపాటి వ్యాయామాలు చేయాలి. దీర్ఘకాలిక అలర్జీలు, ఆస్తమా వంటి సమస్యలున్నవారు శీతలపానీయాలు, ఐస్క్రీమ్స్ వంటి వాటికి దూరంగా ఉండాలి. – డాక్టర్ ప్రభాకర్రెడ్డి, విభాగాధిపతి, కార్డియో వాసు్క్యలర్ సర్జరీ, కర్నూలు జీజీహెచ్ -
ఊపిరితిత్తుల్లో గుచ్చుకుపోయిన ఇనుప రాడ్లు
భాగ్యనగరంలో నిర్మాణంలో ఉన్న ఒక భవనం మూడో అంతస్తు నుంచి నవీన్ కుమార్ అనే ఓ భవన నిర్మాణ కార్మికుడు ప్రమాదవశాత్తు పడిపోయాడు. అతడి ఊపిరితిత్తుల్లోకి ఇనుప రాడ్లు గుచ్చుకుపోయి, వాటికి రంధ్రం పడింది. అయినా సరే.. ఆ కార్మికుడికి అమోర్ ఆస్పత్రి వైద్యులు రికార్డు సమయంలో అత్యవసర శస్త్రచికిత్స చేసి, అతడి ప్రాణాలు నిలబెట్టారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి..42 ఏళ్ల వయసున్న నవీన్ కుమార్ను ఆస్పత్రికి తీసుకొచ్చేసరికి అతడి శరీరం నుంచి రెండు ఇనుప రాడ్లను తొలగించాల్సి ఉంది. అప్పటికే అతడు స్పృహ కోల్పోయాడు, అతడి రక్తపోటు కేవలం 50/30 మాత్రమే ఉంది. ఇక ఆక్సిజన్ శాచ్యురేషన్ అయితే కనీసం లెక్కలకు కూడా అందనంత తక్కువగా ఉంది. అతడి హృదయం వద్ద పెద్ద గాయం ఉండడం, అందులోంచి గుండె, ఊపిరితిత్తులు కూడా కనిపిస్తుండడం, దాదాపు 2-3 లీటర్ల వరకు రక్తం పోవడం, ఊపిరితిత్తులకు-ఛాతీ గోడకు మధ్య రక్తం గడ్డకట్టడం, ఊపిరితిత్తులకు రంధ్రం పడడం... ఇన్ని సమస్యలు అతడికి ఉన్నాయి.ముందు అత్యవసరంగా అతడిని వెంటిలేటర్ మీద పెట్టారు. శరవేగంగా రక్తం ఎక్కించి, రీససిటేషన్ చేశారు. గాయం చాలా పెద్దగా ఉన్నట్లు సీటీ స్కానింగ్లో తెలిసింది. దాంతో వెనువెంటనే అతడిని ఆపరేషన్ థియేటర్కు తరలించారు. వైద్యులు అతడికి అత్యవసరంగా థొరకాటమీ శస్త్రచికిత్స చేశారు. అతడి ఎడమ ఊపిరితిత్తిలోని శ్వాసకోశం పూర్తిగా ధ్వంసమైపోయింది. దాంతో దాన్ని తొలగించాల్సి వచ్చింది. కానీ రక్తస్రావం చాలా ఎక్కువగా ఉండడంతో నవీన్ రక్తపోటు మరింతగా పడిపోసాగింది. ఫలితంగా రక్తం మరింత ఎక్కించారు. ఒక ఊపిరితిత్తి మాత్రమే పనిచేస్తుండడంతో దాన్ని రక్షించేందుకు వెంటిలేషన్ వ్యూహాలను అమలుచేశారు. అతడికి ఆక్సిజన్ ఏమాత్రం అందకపోతున్నా కూడా మెదడు, ఇతర కీలక అవయవాలు ఏవీ దెబ్బతినకుండా వైద్యబృందం చాలా కష్టపడింది.ఈ కేసు సంక్లిష్టత గురించి అమోఆర్ ఆస్పత్రి మేనేజింగ్ డైరెక్టర్, ఆర్థో ఆంకాలజీ సర్జన్ డాక్టర్ కిశోర్ బి. రెడ్డి మాట్లాడుతూ, “మేం చికిత్స చేసిన వాటిలో ఇది అత్యంత సంక్లిష్టమైన, సమస్యాత్మకమైన ట్రామా కేసు. నవీన్కు తగిలిన గాయాలన్నీ ప్రాణాంతకమే. ప్రతి నిమిషం చాలా విలువైనది. దాంతో మా అత్యవసర, సర్జికల్, ఎనస్థీషియా, క్రిటికల్ కేర్ బృందాల్లోని వైద్యులందరూ అద్భుతమైన సమన్వయంతో పనిచేసి అతడి ప్రాణాలు కాపాడారు. ప్రపంచస్థాయి ట్రామాకేర్ సదుపాయాలు, సరైన సమయానికి చికిత్స అందించాం అనడానికి అతడి ప్రాణాలు నిలబడడమే నిదర్శనం. ఇప్పుడతడు కోలుకుని సాధారణ జీవితం గడపడం మాకెంతో ఆనందాన్నిస్తోంది” అని తెలిపారు.నవీన్ చాలా అద్భుతంగా కోలుకోవడంతో, 48 గంటల్లోనే వెంటిలేటర్ తొలగించారు. కాసేపటి తర్వాత అతడు ఒకరి సాయంతో నడవగలిగాడు. వారం రోజుల్లోపే అతడు ఎలాంటి సాయం అవసరం లేకుండా తన కాళ్ల మీద తాను నడుస్తూ కోలుకోవడంతో డిశ్చార్జి చేశాం.అతడికి చికిత్స చేసిన వైద్యబృందంలో శస్త్రచికిత్స నిపుణులు డాక్టర్ కళ్యాణ్, డాక్టర్ పూజిత, ఎమర్జెన్సీ బృందానికి చెందిన డాక్టర్ నందీప్, డాక్టర్ అశోక్, క్రిటికల్ కేర్ విభాగ నిపుణులు డాక్టర్ ప్రత్యూష, ఎనస్థీషియా నిపుణులు డాక్టర్ జగదీష్ కీలకంగా వ్యవహరించారు.(చదవండి: మాంజా మెడకు చుట్టుకుని తెగిన రక్తనాళాలు..హెల్మెట్ పెట్టుకున్నా..!) -
ఊపిరితిత్తుల కేన్సర్కి విలన్..జస్ట్ స్మోకింగ్ మాత్రమే కాదు..!
ఊపిరితిత్తుల కేన్సర్ ఎందువల్ల వస్తుదంటే...అందరూ చెప్పేది బీడి,చుట్ట సిగరెట్ల వల్ల అనే ఠక్కున చెప్పేస్తారు. కానీ అదొక్కటే కారణం కాదని శాస్త్రవేత్తలు నొక్కి చెబుతున్నారు. మనచుట్టూ ఉన్న పరిసరాలే ప్రధాన ముప్పుగా పరిణమిస్తునన్నాయిని హెచ్చరిస్తున్నారు. మరి అదెలాగో సవివరింగా తెలుసుకుందాం. నిజానికి ఇటీవల కాలంలో పట్టణ ప్రాంతాల్లో ధూమపానం చేయని వారి సంఖ్య పెరుగుతున్నప్పటికీ చాలామంది ఈ మహమ్మారిని బాధపడుతున్నారని వైద్యులు చెబుతున్నారు. కనీసం సిగరెట్ వాసన కూడా చూడని వారిలో కూడా పీఎం2.5గా పిలిచే కణాలు ఊపిరితిత్తుల్లోనూ, రక్తప్రవాహంలో ప్రవహించి కణాలను దెబ్బతీసి, ఊపిరితిత్తుల కేన్సర్కు దారితీసే ఉత్పరివర్తనాలను ప్రేరేపిస్తాయని చెబుతున్నారు. ఇది కేవలం నగరాల్లోనూ కాదు గ్రామాల్లో కూడా ఇదే పరిస్థితని చెబుతున్నారు. ఎందుకంటే..డీజిల్, పంట అవశేషాలను కాల్చడం వల్ల ఈ మహమ్మారి బారిన పడుతున్నట్లు అధ్యయనాల్లో తేలింది. అదీగాక గ్రామీణ ప్రాంతాల్లో కట్టెల పొయ్యిమీద వంట చేస్తారు. దాన్నుంచి వచ్చే పొగ, ఒకవేళ కిచెన్లో సరైన వెంటిలేషన్ లేకపోతే.. ఆ పొగాకు ఎక్కువసేపు గురవ్వాల్సి వస్తుంది. ఫలితంగా ఊపిరితిత్తుల కేన్సర్ బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు నిపుణులు. అలాగే రాడాన్ వాయువు, సహజంగా సంభవించే రేడియో ధార్మిక వాయువుకి ఎక్కువ ఎక్స్పోజ్ అయినా..ఈ వ్యాధి బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అన్నారు. అలాగే మైనింగ్, సిలికా దుమ్మ లేదా డీజిల్తో నడిచే కర్మాగారాల్లో వర్క్చేసే వ్యక్తులు ఈ వ్యాధి బారిన పడుతుంటారని చెప్పుకొచ్చారు. ధూమపానం చేయనివారు ఎందుకు సేఫ్గా లేరు...ధూమపానం చేయనివారిలో, ముఖ్యంగా యువకులు, మహిళల్లో ఊపిరితిత్తుల కేన్సర్ ఉపరకం అయినా అడెనోకార్సినోమా పెరుగుదల ఉన్నట్లు గుర్తించారు. అలాగే పర్యావరణం తోపాటు జన్యుపరమైన కారకాలు కూడా పెద్దపాత్ర పోషిస్తున్నట్లు పేర్కొన్నారు. ముఖ్యంగా వాయకాలుష్యం, జీవనశైలి, ఆహారపు అలవాట్లు ఈ ప్రమాదాన్ని మరింత పెంచుతాయని చెబుతున్నారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు..రోజువారీ AQI (ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్) స్థాయిలను పర్యవేక్షించడంకాలుష్యం ఎక్కువగా ఉన్న రోజుల్లో, బహిరంగ కార్యకలాపాలను పరిమితం చేయడంట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉన్న సమయంలో కిటికీలు మూసి ఉంచడం.ఎగ్జాస్ట్ ఫ్యాన్లు, ఎయిర్ ప్యూరిఫైయర్లు లేదా సహజంగా గాలిని ఫిల్టర్ చేసే పీస్ లిల్లీస్, స్పైడర్ ప్లాంట్లు వంటి మొక్కలను ఉపయోగించండి.పొగ రహిత గృహాలు, కార్యాలయాల ఉండేలా మెయింటైన్ చేయడంవర్కింగ్లో దుమ్ము లేదా రసాయనాలకు గురికాకుండా ఉండటం. చెట్ల పెంపకానికి ప్రాధాన్యత ఇవ్వడం.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే. మెరుగైన ఫలితాల కోసం వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: బెడ్షీట్స్ మార్చి ఎంత కాలమైంది?) -
నానబెట్టిన మెంతుల నీళ్లతో డయాబెటిస్ నిజంగా తగ్గుతుందా?
రాత్రంతా నానబెట్టిన మెంతుల నీళ్లను పరగడుపున తాగితే ఆరోగ్య ప్రయోజలున్నాయా? ముఖ్యంగా డయాబెటిస్ ను కంట్రోల్ చేస్తుందా? బరువు, ఆకలిని అదుపులో ఉంచుతుందా? పదండి దీనికి సంబంధించి కొన్ని విషయాలను తెలుసుకుందాం. ఖాళీ కడుపుతో మెంతి నీరు తాగడం వల్ల బరువు తగ్గడంతో డయాబెటిస్కు సహాయపడుతుందని ఆయుర్వేదం వైద్య విధానం ఇటీవలి అధ్యయనాల ద్వారా తెలుస్తోంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి మెంతి నీరు అత్యంత విస్తృతంగా సిఫార్సు చేస్తున్న సహజ నివారణలలో ఒకటి. సాంప్రదాయ వైద్యం, కొన్ని పరిశోధనలు కూడా ఇదే సూచిస్తున్నాయి.ఆరోగ్య ప్రయోజనాలు మెంతి గింజలలోని సమ్మేళనాలు ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తాయి.మెంతిలో ఒక అమైనో ఆమ్లం ఉంటుంది, ఇది క్లోమం నుండి ఇన్సులిన్ విడుదలను ప్రేరేపిస్తుందని తేలింది. ఇది హైపోగ్లైసీమిక్ చర్యకు నేరుగా దోహదం చేస్తుంది.కరిగే ఫైబర్ సమృద్ధిగా ఉండే మెంతి గింజలు ఒక రకమైన కరిగే ఫైబర్ను కలిగి ఉంటాయి, ఇది పేగులో జెల్ లాంటి పదార్థాన్ని సృష్టించి చక్కెర , కార్బోహైడ్రేట్ల శోషణను గణనీయంగా నెమ్మదిస్తుంది. ఇది భోజనం తర్వాత పదునైన, ఆకస్మిక రక్తంలో చక్కెర స్పైక్లను నివారిస్తుంది.HbA1c తగ్గింస్తుంది: మెంతి నీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల HbA1c స్థాయిలు(మూడు నెలల్లో సగటు ) అదుపులో ఉంటాయి ఇది టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారికి స్పష్టమైన ప్రయోజనాలను అందిస్తుంది.ఖాళీ కడుపుతో మెంతి నీటిని తీసుకోవడం గ్లూకోజ్ జీవక్రియను పెంచుతుంది.మెంతులులోని ఫైబర్ ఆకలిని అదుపులో ఉంచుతుంది.మలబద్ధకం వంటి సమస్యలను దూరం చేస్తుంది.కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది . వమెంతి గింజలలో ఉండే ఫైబర్ చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి తద్వారా గుండె జబ్బులను నివారించడానికి ఉపయోగపడుతుంది. మెంతి గింజలలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మన చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు మొటిమలు లేదా మచ్చలను తగ్గించడంలో సహాయ పడతాయి.అంతేకాదు ప్రోటీన్, నికోటినిక్ ఆమ్లాలు సమృద్ధిగా ఉండే మెంతి గింజల నీళ్లు జుట్టు పెరుగుదలకు దోహదం చేస్తుంది.నోట్: సూపర్ ఫుడ్ మెంతి నీటిని రోజువారీ దినచర్యలో తీసుకోవడం అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. కానీ మీ ఆరోగ్యంపై వ్యక్తిగత శ్రద్ధ అవసరం. కనీసం వ్యాయాయం, సమతుల ఆహారం, ఒత్తిడి లేని జీవితం, సరియైన నిద్ర, నీళ్లు తాగడం చాలా కీలకమైంది. ఏమైనా సమస్య ఉంటే వైద్యుడిని సంప్రదించితగిన చికిత్స తీసుకోవడం ఉత్తమం. కానీ శ్రద్ధ వహించండి మరియు సరైన మార్గదర్శకత్వం కోసం విశ్వసనీయ వైద్య సలహా తీసుకోండి -
కొద్దిగా... వెచ్చగా
మిగతా కాలాలతో పోల్చితే చలికాలం నోటికి విభిన్న రకాల రుచులను అందించాలనుకుంటాం. నచ్చిన ఫుడ్ని కర కర నమిలివేయాలనుకుంటాం. వేడి వేడి పానీయాలు ఓ వైపు.. వివిధ రకాల స్నాక్స్, వేయించిన పదార్ధాలు మరో వైపు.. ఈ కాలంలో సహజంగా కలిగే ఆహార కోరికల జాబితా ఎక్కువే. అవన్నీ అనారోగ్యానికి దారితీసేవి.. జీర్ణవ్యవస్థ చురుకుగా పనిచే సే పదార్థాలపై దృష్టి ఎంత వరకు, ఎందుకు అవసరమో ఈ వింటర్ స్పెషల్ గురించి నిపుణులు సూచనలు తప్పనిసరి.బాగా వేయించిన స్నాక్స్ని మరో ఆలోచన లేకుండా హ్యాపీగా తినేస్తుంటాం. ఇంకా మరిన్ని వేయించిన స్నాక్స్ కావాలనుకుంటాం కూడా. ఈ సీజన్లోనే ఇలాంటి ఆలోచనలు ఎక్కువ. అందుకని, మన జిహ్వపై మనం అదుపు సాధిస్తూ, ఆరోగ్యకరమైన మార్గాలపై దృష్టి సారించాలని లైఫ్స్టైల్ కోచ్ నిధి నహత సూచిస్తున్నారు.కాఫీతో కాకుండా స్మూతీతో ప్రారంభంచాలా మందికి ఉదయం పూట డీహైడ్రేషన్ వల్ల ఆకలిగా అనిపిస్తుంది. అందుకని కాఫీ, టీలకు బదులు ఆరోగ్యకరమైన స్మూతీతో రోజును ప్రారంభించాలి. బాదం పాలు, అరటిపండు, తాజా పాలకూర, కొద్దిగా అవిసె గింజల పొడి వేసి, మిక్సర్ జార్లో గ్రైండ్ చేసుకొని, తాగాలి. ఈ మిశ్రమం కొన్ని గంటల పాటు కడుపును నిండుగా ఉంచుతుంది. శక్తిమంతం చేస్తుంది. ఉదయం అంతా రక్తంలో చక్కెర స్థాయులను స్థిరంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఉదయపు చలికి పానీయం ఎలా సేవిస్తాం.. అనుకునేవారు గోరువెచ్చని ఓట్ మిల్క్ను స్మూతీ బేస్గా ఉపయోగించి ప్రయత్నించవచ్చు.రోస్ట్ బెస్ట్... డీప్ ఫ్రై వరస్ట్తినడానికి వేయించిన స్నాక్స్ బదులుగా, కాల్చిన వాటిని తినడానికి ఎంచుకోవాలి. కాల్చిన బఠాణీ, మఖానా, వేరుశెనగలు వంటి క్రిస్పీ, ఆరోగ్యకరమైన స్నాక్స్ మంచి ఎంపికలు. మరింత రుచి కోసం సముద్రపు ఉప్పు, పసుపు వంటివి జోడించవచ్చు. గింజలు తినడం ఇష్టపడకపోతే వాటి బదులుగా ఉడికించిన ఉసిరికాయ, మొలకెత్తిన గింజలు.. వంటివి ఉపయోగించవచ్చు.వేడి వేడి సలాడ్లుసలాడ్ల గురించి ఆలోచించినప్పుడు ఆకుకూరలు ఆలోచనలోకి రావాలి. ఈ సీజన్ లో వేడి సలాడ్లను తీసుకోవడానికి ప్రయత్నించడం మంచిది. పప్పులు, చిరుధాన్యాలు ఉడికించి, ఆలివ్ లేదా నువ్వుల నూనె వేసి, కూరగాయలతో కలిపి వంటకం తయారు చేసుకోవచ్చు. చల్లగా ఉండే ఈ సీజన్లో శరీరానికి అవసరమైన పోషకాలను కూడా ఇవి ఇస్తాయి. అయితే వీటిని వేగంగా కాకుండా నెమ్మదిగా తినడానికి ప్రయత్నించాలి. పోషకాహారం తయారీలోనూ, తినడంలోనూ సమయాన్ని కేటాయించినప్పుడు దాని వల్ల లభించే ఆనందాన్ని కూడా పొందాలి. అప్పుడే ఆ ఆహారం జీర్ణక్రియ పనితీరు సక్రమంగా ఉండటానికి సహాయపడుతుంది.స్నాక్స్కు మసాలా దినుసులుజీలకర్ర, దాల్చినచెక్క, అల్లం, వాము, శొంఠి.. వంటి శీతాకాలపు సుగంధ ద్రవ్యాలతో చిరుతిండిని మెరుగుపరుచుకోవాలి. ఈ సుగంధ ద్రవ్యాలు భోజనాన్ని రుచికరంగా మార్చడమే కాకుండా మన జీవక్రియను మెరుగు పరచడంలో, శీతాకాలం అతిగా తినాలనే కోరికను తగ్గించడంలోనూ సహాయపడతాయి. మసాలా దినుసులు సరిపడవు అనకునేవారు వాటి బదులుగా పుదీనా, తులసి లేదా కొత్తిమీర వంటి వాటిని ఉపయోగించవచ్చు.ఫైబర్ ఫుడ్తక్కువ ఫైబర్ ఉన్న ఆహారం వల్ల రక్తంలో చక్కెర స్థాయులు హెచ్చుతగ్గులకు గురవుతాయి. దీనివల్ల సాయంత్రం వేళల్లో ఎక్కువసేపు తినాలనే కోరిక పెరుగుతుంది. దీన్ని నివారించడానికి, అధిక ఫైబర్ ఉన్న ఆహారాలను తినడానికి ప్రయత్నించాలి. క్యారెట్, బీట్రూట్ వంటి కూరగాయల ముక్కలు వెన్నతో, పండ్ల ముక్కలు తినడం మంచిది. ఈ స్నాక్స్ రక్తంలో చక్కెరను స్థిరంగా ఉంచడంతో పాటు ఎక్కువసేపు కడుపు నిండిన అనుభూతిని కలిగించడంలో సహాయపడతాయి. జీర్ణ సమస్యలు ఉంటే, అసౌకర్యాన్ని నివారించడానికి ఫైబర్ ఉన్న ఆహారం తీసుకోవడం మంచిది.భావోద్వేగాల బ్యాలెన్స్చలి కాలం భావోద్వేగపరంగా సమస్యలను ఎదుర్కోవడం సహజం. దీంతో తరచూ ఆకలిగా అనిపిస్తుంది. ఒంటరిగా లేదా ఒత్తిడికి గురవుతున్నట్టు అనిపించి పదే పదే స్నాక్స్ తీసుకుంటారు. తినాలనే కోరిక అనిపించినప్పుడు, ‘నేను నిజంగా దేని కోసం ఆకలిగా ఉన్నాను?‘ అని తమని తాము ప్రశ్నించుకోవాలి. స్నేహితులతో మాట్లాడటం, ధ్యానం చేయడం లేదా వేగంగా నడవడం వంటివి చిరుతిండిని తినాలనే ధ్యాసను మళ్లించడంలో ఎక్కువ సహాయపడతాయి.కాలానుగుణంగా లభించే పండ్లుచలికాలంలో నారింజ, జామపండ్లు, దానిమ్మ వంటి విటమిన్– సి అధికంగా ఉండేవి ఈ కాలంలో మనకు విరివిగా లభిస్తాయి. ఈ పండ్లు తీపి తినాలనే కోరికను తీర్చుతాయి. మన రోగనిరోధక శక్తిని పెంచుతాయి. శీతాకాలపు జలుబులను నివారించడానికి సహాయపడతాయి. మనకు ఏవి అవసరమో ప్రకృతి వాటినే మనకు అందిస్తుందని గుర్తించాలి. ఉసిరి తినలేకపోతే మరేమైనా పుల్లని పండ్లు తినొచ్చు. ’ హెర్బల్ టీ మేలుచల్లగా ఉండే వాతావరణంలో నీళ్లు తక్కువ తాగుతుంటారు చాలా వరకు. వేడి కోసం టీ లు కూడా ఎక్కువ సేవిస్తుంటారు. దీని బదులుగా దాల్చిన చెక్క లేదా తులసి, అల్లం.. వంటి మూలికలతో టీ చేసి, తాగడం వల్ల అవి శరీరాన్ని వెచ్చగా, మనసును ప్రశాంతంగా ఉంచుతాయి. ఈ మూలికలతో వ్యతిరేక ప్రభావం చూపే, మందులను తీసుకుంటే ముందుగా వైద్య నిపుణులతో చర్చించాలి.నిద్ర కోసం సూర్యరశ్మితగినంత సూర్యరశ్మి శరీరానికి తగలకపోయినా, సరైన నిద్ర పోకపోయినా తీవ్రమైన కార్బోహైడ్రేట్ విడుదలై తినాలనే కోరికలకు దారితీస్తుంది. ప్రతి రాత్రి కనీసం ఏడు గంటలు మంచి నిద్ర పొందడానికి ప్రయత్నించాలి. ఉదయం 15 నిమిషాలు సూర్యరశ్మి శరీరాన్ని తాకేలా చూసుకోవాలి. ఈ సాధారణ అలవాట్లు అతిగా తినాలనే కోరికలను తగ్గించడంలో, మానసిక స్థితిని మెరుగుపరచడంలో సహాయపడతాయి. హార్మోన్లు సక్రమంగా పని చేస్తాయి.మీవైన స్నాక్స్ ప్లానింగ్! కాల్చిన గింజలు, ఖర్జూరం, పండ్లు ఇంట్లో తయారుచేసిన ఎనర్జీ లడ్డూలు వంటి ఆరోగ్యకరమైన స్నాక్స్ను తీసుకోవాలి. తినాలనే కోరిక పెరిగినప్పుడు ప్రాసెస్ చేసిన జంక్ ఫుడ్ను నివారించడానికి ఇది సహాయపడుతుంది. చురుగ్గా ఉండటం ద్వారా సక్సెస్ కోసం తమని తాము సిద్ధం చేసుకోవచ్చు. చలికి స్వెటర్ ధరించడం అంటే మొత్తం ముసుగు వేసిట్టే అని, చబ్బీగా కనిపిస్తామని ఆందోళన చెందుతారు ఫిట్ అండ్ స్లిమ్గా ఉండాలనుకునేవారు. టర్టిల్ నెక్, లాంగ్ స్లీవ్స్, హాఫ్ జాకెట్ అంటూ స్వెటర్లలో నేడు చాలా మోడల్స్ వచ్చాయి. స్టైలిస్ట్, ఇమేజ్ కోచ్ ఆషి వర్మ స్వెటర్ ఎంపికల గురించి ఇచ్చిన సమాచారం ఈ సీజన్ని మరింత బ్రైట్గా, వెచ్చగా ఉంచుతుంది.కొన్ని డ్రెస్సుల్లో సన్నగా, మరికొన్ని డ్రెస్సుల్లో బొద్దుగా కనిపిస్తుంటారు కొందరు. ఇదంతా నెక్లైన్ బట్టే ఉంటుంది. ఇక ఈ రోజుల్లో చాలామంది అమ్మాయిలు బెల్లీ ఫ్యాట్ సమస్యతో బాధపడుతున్నారు. ఏ డ్రెస్ ధరించినా ఫోకస్ బెల్లీ ఫ్యాట్పైనే ఉంటుంది. ఇక, ఈ చలికాలం స్వెట్టర్లు ధరించడం వల్ల ఇంకా బొద్దుగా కనిపిస్తారు. స్వెటర్లోనూ ఫిట్గా, బ్రైట్గా కనిపించాలంటే...నెక్ లైన్∙టాప్స్, బ్లౌజ్ల విషయంలోనే కాదు బొద్దుగా కనిపించడంలో స్వెటర్ నెక్లైన్ నిర్ణయిస్తుంది. అందుకే రౌండ్ నెక్ లేదా టర్టిల్ నెక్ స్వెటర్లను ఎంచుకోకూడదు. ఇవి ఛాతీ ఏరియాను ఎక్కువ ఫోకస్ చేస్తాయి. దీంతో.. బరువు పెరిగినట్టు కనిపిస్తారు. వీటిబదులు వి– నెక్ స్వెటర్ లేదా రాప్–స్టైల్ కోటు అయితే మంచి ఆప్షన్.హాఫ్ స్లీవ్స్∙వింటర్ వేర్ షర్టులు, డ్రెస్సులు, టర్టిల్నెక్లతో సులభంగా స్టైల్ చేయగలవి, మహిళలకు ఉత్తమమైనవి స్లీవ్, హాఫ్ స్వెటర్ లు. ఇవి, చలికాలానికి అనువైనవిగా, వెచ్చదనంతో ఉండచ్చు. హాఫ్ స్వెటర్ల వల్ల బొద్దుగా కనిపించరు. ∙హాఫ్ స్లీవ్ స్వెటర్లను షర్టులు, టర్టిల్నెక్, శారీస్.. వంటి ఇతర దుస్తులతో కూడా జత చేయవచ్చు. ఈ స్వెటర్ల వల్ల మొత్తం కప్పుకున్న విధంగా కాకుండా తేలికైన అనుభూతినిస్తాయి. విహారయాత్రలు, ఆరుబయట జరిగే మీటింగ్స్కి కూడా వీటిని సులభంగా ధరించవచ్చు. ∙ఫ్రంట్లో పెద్ద బటన్లు, వి–నెక్ ప్యాటర్న్తో కార్డిగాన్ స్టైల్ డిజైన్ ను అందిస్తున్న ఈ స్వెటర్ రెగ్యులర్ ఫిట్తో ఉంటుంది. సౌలభ్యం కోసం రెండువైపులా సైడ్ ఫ్రంట్ పాకెట్లు ఉన్నవి ఎంచుకోవచ్చు. ఈ హాఫ్ స్వెటర్ను షర్టులు,హై–నెక్ డ్రెస్సులు, వెస్ట్రన్ లేదా ఎథ్నిక్ అవుట్ఫిట్లపై కూడా ధరించవచ్చు.రౌండ్ నెక్ – హాఫ్ జిపర్∙సౌకర్యం, రక్షణ కోసం స్ప్రెడ్ కాలర్ ఉండే క్లాసిక్ డిజైన్తో ఉంటుంది. లాంగ్ టూర్లు, మరీ చలిగా ఉండే ప్రదేశాలకు వెళ్లినప్పుడు వీటిని ఎంచుకోవచ్చు. ∙స్వెటర్ సెట్స్లో టాప్ అండ్ బాటమ్స్ తో ఉన్నవీ వస్తున్నాయి. వీటిలో ఒకే రంగులో ఉండే స్వెటర్ టాప్, ట్రౌజర్తో స్టైల్ చేయవచ్చు. ∙ప్యాటర్న్ స్వెటర్ వేసినప్పుడు ఫుట్వేర్, ఇతర అలంకరణలో మినిమలైజ్ను పాటించాలి.వి నెక్ – ఓవర్ సైజ్∙వి–నెక్ స్వెటర్ను షర్టులు, కుర్తాలు, చీరలపై కూడా స్టైల్ చేయవచ్చు. సరైన ఫిట్తో వి–నెక్ ప్యాటర్న్, రిబ్బెడ్ హెమ్ను అందించే వింటర్ వేర్ వార్డ్రోబ్లో తప్పనిసరిగా ఉండాల్సిందే. ∙రిలాక్స్డ్ స్వెటర్లు అంటే ఓవర్ సైజ్తో ఉండేవి. ఈ సీజన్లో ఓవర్సైజ్ కూడా ఫ్యాషన్ కాబట్టి, ఇవి స్టైలిష్గా కనిపిస్తాయి. షార్ట్స్ మీదకు, టైట్ బాటమ్స్కి ఈ ఓవర్సైజ్డ్ స్వెటర్లు బాగుంటాయి.కలర్ కాంబినేషన్స్∙ స్వెటర్ అనగానే మనకు చాలావరకు ప్లెయిన్గా ఒకే రంగులో ఉండేవి కనిపిస్తాయి. కానీ, ఇటీవల వీటిలో కలర్ కాంబినేషన్స్, ప్రింట్లు, వివిధ మోడల్స్లో వస్తున్నాయి.∙ చాకొలెట్, బ్రౌన్, బ్లాక్, వైట్, న్యూట్రల్ టోన్స్తో ఉండే స్వెటర్లు రిచ్లుక్నిస్తాయి. వాతావరణం మరీ చల్లగా ఉంటే వి నెక్ స్వెటర్తో పాటు ఉలెన్ స్టోల్ ధరిస్తే ఫ్యాషనబుల్గా కనిపిస్తారు. -
మరో వ్యాధి కలకలం, లక్షణాలివే
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ స్క్రబ్ టైఫస్ (Scrub typhus )విజృంభిస్తోంది. అతి సులభ చికిత్స గల వ్యాధి గనుక భయాందోళనలు లేవు గానీ వ్యాప్తి మాత్రం ఎక్కువగానే ఉందని అర్థమవుతున్నది. ఈ వ్యాధికారక బ్యాక్టీరియాను వైద్యశాస్త్ర పరిభాషలో ‘ఓరియంటా సుట్స్ గమిషి’ అంటారు. ఈ వ్యాధి ఇప్పుడు ఆసియా ఖండం మొత్తం వ్యాపించి ఉంది. మన పొరుగు దేశాలైన పాకిస్తాన్, చైనా, బంగ్లాదేశ్, శ్రీలంకల్లో వ్యాధిగ్రస్థులు బయటపడుతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదికలు తెలియజేస్తున్నాయి.ఈ స్క్రబ్ టైఫస్ కారక బ్యాక్టీరియా ప్రత్యక్షంగా మన శరీరంలోకి ప్రవే శించలేదు. బ్యాక్టీరియాను కలిగి వాహకాలుగా పేర్కొనే ఈగలు, పేలు, నల్లులు, చిగ్గర్లు కుట్టడం ద్వారా అది మన శరీరంలోకి ప్రవేశిస్తుంది. కుట్టిన చోట నల్లని మచ్చ ఏర్పడుతుంది. నొప్పి ఉండదు. కొన్ని రోజులలోనే ఎండిపోతుంది. దీనినే ‘ఎస్కార్’గా పేర్కొంటారు. కుట్టిన ప్రదేశం నుండే బ్యాక్టీరియా రక్తంలోకి ప్రవేశించి శరీరమంతా వ్యాపిస్తుంది. ఆరు లేదా ఏడు రోజుల తర్వాత వ్యాధి లక్ష ణాలు బయట పడటం మొదలవు తుంది. తొలుత తీవ్ర జ్వరం, తలనొప్పి, చలితో లక్షణాలు మొదలవుతాయి. కండ రాల నొప్పులు ఉంటాయి. లింఫు గ్రంథుల వాపు ఉంటుంది. 50%మందిలో శరీరంపై దద్దుర్లు కనిపిస్తాయి. కొందరిలో కళ్ళు ఎర్రబడవచ్చు. దగ్గు ఉండవచ్చు. నీరసం ఉంటుంది. పిల్లలలో, 60 సంవత్సరాలు దాటిన వృద్ధు లలో, వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్న ఏ వయసు వారిలోనైనా వ్యాధి లక్షణాలు తీవ్రంగా ఉంటాయి. సకాలంలో గుర్తించి చికిత్స పొందకపోతే అన్ని ప్రధాన అవయవాలపై ప్రభావం పడుతుంది.ఇదీ చదవండి: ఇల్లు కట్టాలంటే రూ. 20 లక్షలు లంచం, టెకీ ఆత్మహత్యస్క్రబ్ టైఫస్ వ్యాధి నిర్ధారణకు ఎస్కార్ మచ్చలు, రక్త పరీక్షలలో ఎలీసా, ఇమినో ఫ్లోరోసెంట్ ఎస్సే(ఐ.ఎఫ్.ఎ.), పి.సి.ఆర్. వంటి మాలిక్యులర్పరీక్షలు ఉపయోగపడతాయి. వ్యాధిని పూర్తిగా నయం చేసే మందు లున్నాయి. తొలి దశలో అయితే అతి సులువుగా చికిత్స చేయవచ్చు. చికిత్స ప్రారంభించిన 24 నుండి 48 గంటలలోనే లక్షణాల తీవ్రత తగ్గుముఖం పడుతుంది. శరీరం డీహైడ్రేషన్కు గురికాకుండా ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. సులభంగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవడం మంచిది. సాధారణంగా ప్రాణాంతక వ్యాధి కాదు కనుక భయపడవలసిన అవసరం లేదు. కానీ వ్యాప్తిని నియంత్రించి వ్యక్తుల ఆరోగ్య, ఆర్థిక నష్టాలను అరికట్ట వలసిన అవసరం ఎంతైనా ఉంది.– డా.టి. సేవకుమార్ , వైద్య నిపుణులు, గుంటూరు -
ఆందోళనతో కంటికి కునుకే కరువైంది!
నా వయస్సు 72 సంవత్సరాలు. ఉద్యోగం నుంచి రిటైరై దాదాపు 14 ఏళ్లయింది. నేను చాలా సంవత్సరాల నుండి ఒక సమస్యతో బాధపడుతున్నాను. అదేమిటంటే ప్రతి చిన్న విషయం గురించి ఎక్కువగా ఆలోచించటం. ఎప్పుడూ మనసులో గందరగోళంగా ఉంటుంది. ఈ ఆలోచన వలన చేసే పనిలో ధ్యాస ఉండదు. రాత్రి పడుకున్న తర్వాత విపరీతంగా కలలు వస్తుంటాయి. దీనివల్ల ప్రశాంతంగా నిద్ర కూడా ఉండడం లేదు. ఈ సమస్య ఎప్పుడు మొదలైందో గుర్తు లేదు కానీ, రిటైర్మెంట్ తర్వాత నన్ను మరింతగా బాధిస్తోంది. నాకు షుగర్, బీపీ కూడా ఉన్నాయి. నా సమస్యకు పరిష్కారం చూడగలరు. –కె.ఎల్.వి ప్రసాద్, హైదరాబాద్మీరు రాసిన లక్షణాలను బట్టి మీకున్న సమస్యను ‘యాంక్సైటీ డిజార్డర్‘ (నిరంతర ఆందోళన రుగ్మత) అంటారు. యాంగై్జటీ లేదా భయం అనేవి ప్రమాదాలనుండి మనల్ని మనం కాపాడుకోవడానికి ప్రకృతి ఏర్పరచిన, ఒక ర క్షణ వ్యవస్థ. మనుషులతో పాటు జంతువుల్లో కూడా ఈ వ్యవస్థ ఉంటుంది. అయితే కొన్ని సార్లు మెదడు రసాయనాల్లో మార్పులు, చిన్న వయసులో ఎదుర్కొన్న ఇబ్బందుల వల్ల, ఈ రక్షణ వ్యవస్థలో లోపం ఏర్పడుతుంది. ఆ కారణంగానే మెదడు ఆందోళనకు గురవుతూ ఉంటుంది. రోజూవారి వ్యవహారాలు, చిన్నచిన్న సమస్యలని కూడా మెదడు భూతద్దంలో చూస్తూ ఎప్పుడూ వాటి గురించే ఆలోచిస్తూ ఉంటుంది. దీని వల్ల ప్రశాంతత ఉండదు. చేసే పని మీద ధ్యాస ఉండదు. ఎప్పుడూ కంగారు కంగారుగా భయంగా ఉంటుంది. రాత్రిపూట కూడా మెదడు ఇలా ఆతిగా ఆలోచనలు చేయడం వల్ల నిద్ర కూడా పట్టదు. ఇది యుక్తవయసులోనే మొదలైతే చాలా సంవత్సరాలు ఇబ్బంది పడవలసి ఉంటుంది. తర్వాతి కాలంలో ఇది తీవ్రమైన డిప్రెషన్కు దారి తీయొచ్చు. దీనికి ఆధునిక వైద్య విధానంలో చక్కని పరిష్కారం ఉంది. కొన్ని ప్రత్యేకమైన మందులు, చికిత్స పద్ధతులను మానసిక వైద్యుల సూచన మేరకు కొంతకాలం వాడాల్సి ఉంటుంది. అలాగే కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ, సైకోడైనమిక్ థెరపీ, ఎక్స్΄ోజర్ థెరపీ వంటి కౌన్సెలింగ్ పద్దతుల ద్వారా క్లినికల్ సైకాలజిస్టులు ఈ సమస్య తీవ్రతని తగ్గించగలరు. మీరు దగ్గరలోని మానసిక వైద్యుని కలిసి ఖచ్చితంగా ఈ సమస్య నుండి పూర్తిగా విముక్తి పొందగలరు. ఆల్ ది బెస్ట్!డా. ఇండ్ల విశాల్ రెడ్డి, సీనియర్ సైకియాట్రిస్ట్, విజయవాడ. మీ సమస్యలు, సందేహాలు పంపవలసిన మెయిల్ ఐడీ: sakshifamily3@gmail.com -
దేశంలోనే తొలిసారి ఎనిమిదేళ్ల పాపకు పాంక్రియాస్ శస్త్రచికిత్స
మన శరీరంలో క్లోమం (పాంక్రియాస్) అత్యంత కీలకం, అదే సమయంలో బాగా సున్నితం. అలాంటి పాంక్రియస్లో కణితి ఏర్పడితే చాలా ప్రమాదకరం. కేవలం ఎనిమిదేళ్ల వయసులో అలాంటి ఇబ్బంది వచ్చిన ఒక పాపకు.. సీతమ్మధారలోని కిమ్స్ ఆస్పత్రి వైద్యులు అత్యంత అధునాతన పద్ధతిలో శస్త్రచికిత్స చేసి, ఊరట కల్పించారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఆస్పత్రికి చెందిన చీఫ్ కన్సల్టెంట్ గ్యాస్ట్రో ఇంటెస్టినల్, హెపటో-బైలియరీ, పాంక్రియాటిక్ సర్జన్ డాక్టర్ మురళీధర్ నంబాడ తెలిపారు."విశాఖ నగరానికి చెందిన ఎనిమిదేళ్ల బాలిక తీవ్రమైన కడుపునొప్పితో ఆస్పత్రికి వచ్చింది. ఈ చిన్న పాపను గ్యాస్ట్రోఎంటరాలజీ డాక్టర్ ఆచంట చలపతి రావు ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్ పరీక్షల ద్వారా అరుదైన సాలిడ్ సూడోపాపిలరీ ఎపితెలియల్ నియోప్లాజమ్ (స్పెన్) అనే పాంక్రియాటిక్ కణితి ఉన్నట్లు గుర్తించారు. భారత దేశంలో ఈ తరహా సమస్యకు శస్త్రచికిత్స జరిగిన అత్యంత చిన్నవయసు రోగిగా ఈ పాప చరిత్ర సృష్టించింది. పాపకు పాంక్రియాస్లో కణితి ఉండడం, అది అత్యంత అరుదైనది కావడంతో దాంట్లో క్యాన్సర్ లక్షణాలు చాలా తక్కువగానే ఉన్నా, తర్వాత ఎలాంటి సంక్లిష్ట సమస్యలు రాకూడదంటే శస్త్రచికిత్స చేసి దాన్ని తొలగించాలని నిర్ణయించాం.మూడు గంటల పాటు అత్యంత కచ్చితత్వంతో కీహోల్ సర్జరీ (లాప్రోస్కోపిక్ సెంట్రల్ ప్యాంక్రియాటెక్టమీ)మొదలుపెట్టాం వీలైనంత వరకు రక్తస్రావం లేకుండా చూడడంతో పాటు, పాంక్రియస్ కణజాలాన్ని కూడా వీలైనంత వరకు కాపాడుకుంటూ కణితి మొత్తాన్ని తొలగించగలిగాం. ఈ శస్త్రచికిత్స తర్వాత బాలిక చాలా త్వరగా కోలుకుంది. ఎలాంటి సమస్యలు లేకపోవడంతో ఐదు రోజుల్లోనే పాపను ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశాం. ఇప్పుడు ఆమె స్కూలుకు కూడా వెళ్తూ చదువులో, ఆట లో చక్కగా రాణిస్తోంది. ఇలాంటి అత్యంత అరుదైన పాంక్రియాటిక్ కణితులను తొలగించడంలో ఉన్న నైపుణ్యాలకు ఈ శస్త్రచికిత్సే నిదర్శనం. ఇలాంటి కణుతులు చాలా అరుదైనప్పటికీ, తమ అనుభవంలో గత పదేళ్ళలో 12 గుర్తించి వైద్యం చేశాం". అని శస్త్ర చికిత్స నిపుణులు డా. మురళీధర్ నంబాడ వివరించారు. (చదవండి: అక్కడ కాన్పు కోసం గర్భిణిని అంగడికి తీసుకువెళ్తారట..?) -
అసలు నిజమేంటి?.. ఎందుకిలా జరుగుతుంది?
నిద్రలో కాళ్లు చేతుల ఆడవు.. మెడను నొక్కస్తున్నట్లు ఉంటుంది అది దెయ్యం పనేనా..??? అర్ధరాత్రి..! గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఉన్నట్లుండి ఎవరో మంచం పక్కన కూర్చున్నట్లు అనిపిస్తుంది..! క్రమంగా గుండెలపైకెక్కి కూర్చున్నట్లు.. గొంతు నులుముతున్నట్లు అనిపిస్తుంది..! మనం అసంకల్పిత ప్రతీకార చర్యలో భాగంగా ఒక్క తోపు తోసేయాలనుకుంటాం.కానీ, చేతులు కదలవు..! కాళ్లను కదపలేం..! ఇలాంటి అనుభవం దాదాపుగా ప్రతిఒక్కరూ ఎదుర్కొనే ఉంటారు..! కొందరికి ఈ స్థితి ఒకరెండ్రుసార్లు ఎదురైతే.. మరికొందరికి నిద్రలో ఇదో నిత్యకృత్యం..! ఇందుకు కారణాలేంటి? కొందరైతే దెయ్యమే ఆ పని చేస్తోందంటారు. మరికొందరైతే.. గిట్టనివారు చేతబడి చేయడం వల్ల ఇలా జరిగిందంటారు..! అసలు నిజం ఏమిటో తెలుసుకోవాలని ఉందా..!ఏ సమయంలో ఇలా జరుగుతుంది??అర్ధరాత్రి సరిగ్గా 12.30 గంటలు దాటాకే చాలా మంది ఇలాంటి ఫీలింగ్ను ఎదుర్కొన్నట్లు పలు పరిశోధనలు చెబుతున్నాయి. తెల్లవారుజామున 3.30 వరకు ఎప్పుడైనా ఈ పరిస్థితి రావొచ్చని పేర్కొంటున్నాయి. ఎవరో గుండెలమీద కూర్చుని, పీక నొక్కుతున్నట్లు.. గుండెలపై బరువు అంతకంతకూ పెరుగుతున్నట్లు అనిపిస్తుంది. కాళ్లు, చేతులను కదిలించలేని స్థితిలో.. ఏమీ చేయలేని దుస్థితి ఎదురవుతుంది. అంతేకాదు.. గట్టిగా అరవాలనిపించినా.. అరవలేరు. కళ్లు కూడా తెరవలేరు. దాంతో.. గుండెలో దడ మొదలవుతుంది. మదినిండా ఆందోళనలతోకూడిన ఆలోచనలు వస్తుంటాయి. కళ్లు మూసుకుని ఉన్నా.. బెడ్రూంలో పరిసరాలు కనిపిస్తుంటాయి. ఒక్కోసారి ఎదురుగా వింతవింత ఆకారాలు ఉన్నట్లు అనిపిస్తుంది.అంతా ట్రాష్ అంటున్న సైంటిస్టులుఈ పరిస్థితి కలలాంటిదే అని చాలా మందికి తెలియదు. కాస్త మెలకువ వచ్చేముందు.. భయంతో దేవుడి నామస్మరణ చేసుకుంటారు. ఆ తర్వాత నిద్ర లేస్తారు. దాంతో.. దేవుడి పేరు చెప్పగానే దెయ్యం పారిపోయిందనుకుంటారు. కానీ.. ఇదంతా దెయ్యం పనో.. చేతబడుల ఫలితమో కాదని, అవన్నీ ట్రాష్ అని అంటున్నారు శాస్త్రవేత్తలు. ఇలాంటి పరిస్థితులకు శాస్త్రీయ కారణాలున్నాయని చెబుతున్నారు. నిద్రకు సంబంధించిన మానసిక రుగ్మతలైన స్లీప్ టెర్రర్, నైట్ మేర్ డిజార్డర్, స్లీప్ వాకింగ్ మాదిరిగానే.. స్లీప్ పెరాలసీస్ అనే రుగ్మత కారణంగా ఇలా జరుగుతుందని వివరిస్తున్నారు. అంటే.. ఈ పరిస్థితిని నిద్రలో పక్షవాతం అని అనవచ్చు. ఇలా అందరికీ జరుగుతందా? అంటే.. చెప్పలేం..! స్లీప్ పెరాలసిస్ అనేది కొన్ని క్షణాలు మాత్రమే ఉంటుంది. ఆ కొద్ది క్షణాలు శరీరమంతా లాక్ అవుతుంది.స్లీప్ పెరాలసిస్ అంటే..అసలు స్లీప్ పెరాలసిస్ అంటే ఏమిటో తెలుసుకుందాం. సాధారణంగా పెరాలసిస్.. అదే పక్షవాతం వస్తే.. పూర్తిగానో.. పాక్షికంగానో కాలు, చేయి చచ్చుబడిపోయి.. నోరు ఓవైపునకు జారిపోతుంది. స్లీప్ పెరాలసిస్ మాత్రం కొన్ని క్షణాలే ఉంటుంది. అయితే.. పక్షవాతానికి మెదడుకు సంబంధం ఉన్నట్లుగానే.. స్లీప్ పెరాలసిస్కు కూడా మెదడు నుంచి విడుదలయ్యే కమాండ్స్ కారణమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంటే.. అంతకు ముందు విన్న విషయాలో.. హారర్ స్టోరీలో మెదడులో స్టోర్ అయిపోతాయి. నిద్రలో జాగ్రత్, స్వప్న, సుశుప్త దశలుంటాయి. వీటినే.. ర్యాపిడ్ ఐ మూవ్మెంట్, స్లీప్, డీప్ స్లీప్ అంటారు.స్లీప్ క్వాలిటీ కోసం స్మార్ట్ వాచ్లు పెట్టుకుని, నిద్రపోయేవారికి ఈ విషయాలు బాగా తెలుసు. మనం నిద్రిస్తున్నప్పుడు మెదడు కూడా రెస్ట్ తీసుకుంటుంది. అప్పుడు వెన్నెపూస మెదడులా పనిచేస్తుంది. అందుకే.. నిద్రలో దోమలు కుట్టినప్పుడు మనం అది కుట్టిన చోట తెలియకుండానే గట్టిగా చరుస్తాం. దీన్నే అసంకల్పిత ప్రతీకార చర్య అంటాం.ర్యాపిడ్ ఐ మూవ్మెంట్ దశలో మెదడులో నిక్షిప్తమైన పాత జ్ఞాపకాలు స్లీప్ పెరాలసిస్కు కారణాలవుతాయని క్లినికల్ సైకాలజిస్టులు చెబుతున్నారు. ఎవరైనా నిద్రిస్తున్నప్పుడు.. ఎప్పుడైతే ఎవరో పక్కన కూర్చున్నారనే భావన వస్తుందో.. గుండె దడ పెరగడం వల్ల ఛాతీపై ఎవరో కూర్చున్నారనే ఫీలింగ్ కలుగుతుంది. దానికి పాత జ్ఞాపకాలు కలిసి.. భయం పెరుగుతుంది. అంతే.. కొన్ని సెకన్లపాటు స్లీప్ పెరాలసిస్ వస్తుంది. ఇది కనీసం 30 సెకన్లు ఉంటుంది. గరిష్ఠంగా ఇంత సమయం అని చెప్పలేం.కంటినిండా నిద్ర లేకపోవడమే కారణం..స్లీప్ పెరాలసిస్ అంటే తెలుసుకున్నారు కదా? నిద్ర నుంచి మెలకువ రాగానే స్లీప్ పెరాలసిస్ దశ నుంచి బయట పడతారు. కాసేపు ఆందోళన చెందుతారు. అంతా భ్రాంతి అని అర్థం చేసుకుని, మళ్లీ నిద్రకు ఉపక్రమిస్తారు. ఇలా స్లీప్ పెరాలసిస్ రావడానికి దెయ్యాలో, చేతబడులో కారణం కాదు. కంటి నిండా నిద్ర లేకపోవడం, సరైన సమయంలో నిద్రకు ఉపక్రమించకపోవడం, నిద్ర షెడ్యూల్ డిస్టర్బ్ అవ్వడం ప్రధాన కారణాలు. ఒత్తిడి, నిరాశ, అతిగా ఆలోచించడం, ప్రతికూల ఆలోచనలు, కలత వంటివి ఇతర కారణాలు అని క్లినికల్ సైకాలజిస్టులు చెబుతున్నారు. ముఖ్యంగా పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ ఉన్నవారు ఎక్కువగా స్లీప్ పెరాలసిస్కు గురవుతుంటారు. రోజులో ఎనిమిది గంటల నిద్ర మాత్రమే స్లీప్ పెరాలసిస్కు చెక్ పెట్టగలదని పేర్కొంటున్నారు.-హెచ్. కమలాపతిరావు(చదవండి: ఎముకలు కొరికే చలిలో..టీ,కాఫీ తాగుతున్నారా?) -
చలి... చర్మ సమస్యలూ, జాగ్రత్తలు..!
శీతకాలంలోని చల్లటి వాతావరణంలో చలి ప్రభావం నేరుగా చర్మం మీదే పడుతుంది. అందుకే ఆ చలి బాధను మొదట అనుభవించేది చర్మమే. పైగా ఈ సీజన్లో వాతావరణంలో తేమ బాగా తగ్గి΄ోవడంతో... దాన్ని మళ్లీ భర్తీ చేయడానికి మన చర్మం నుంచే తేమను అప్పుడున్న వాతావరణం లాగేస్తుంటుంది. ఈ కారణంగానే ఈ సీజన్లో చర్మం పొడిబారిపోయి కనిపిస్తుంటుంది. ఫలితంగా ఈ సీజన్లో చర్మంపై గోటితో గీరగానే గీతలు పడుతుంటాయి. అంతేకాదు.. ఈ సీజన్లో ఇతర అలర్జీలతో పాటు చర్మ–అలర్జీలూ పెరుగుతాయి. ఫలితంగా చర్మం పగలడం, కాళ్లు పగుళ్లు ప్రస్ఫుటంగా కనిపించే ఎగ్జిమా వంటి కేసులు పెరుగుతాయి. అందువల్ల మరీ ముఖ్యంగా మడమలు పగలడం కూడా ఈ సీజన్లోనే చాలా ఎక్కువ. ఇలా మడమల పగుళ్లు కనిపించడమన్నది యువతులు, మహిళల్లో మరికాస్త ఎక్కువ.ఎగ్జిమా : కాళ్లూ, చేతులు పగుళ్లబారి కనిపించడం ఎగ్జిమా తాలూకు ప్రధాన లక్షణం. ఈ సీజన్లో చలి కారణంగా పెరిగి΄ోయి కనిపించే కేసుల్లో ఎగ్జిమానే ఎక్కువ. అందుకే దాని నివారణ, చికిత్సల గురించి తెలుసుకుందాం.నివారణ, చికిత్స : ఎగ్జిమా నివారణ/చికిత్సలు ఇవి... ∙దురద అంతగా లేనివారు సువాసన లేని, మామూలు హై΄ో అలర్జిక్ మాయిశ్చరైజర్స్ రాసుకుంటూ చర్మాన్ని సంరక్షించుకోవాలి. ∙ఒకవేళ దురద ఎక్కువగా ఉంటే డాక్టర్ సలహా మేరకు వాటిని తగ్గించే పూత మందులు (టాపికల్ మెడిసిన్స్) వాడాలి.హౌజ్వైఫ్ డర్మటైటిస్ : పేరునుబట్టి ఇది గృహిణులకు మాత్రమే వచ్చే సమస్యగా అనిపించవచ్చు గానీ అది నిజం కాదు. కొన్నిసార్లు మధ్యవయస్కులతో ΄ాటు, యువతుల్లోనూ కనిపిస్తుంది. అంటే ఇరవై నుంచి నలభై ఏళ్ల వయసులో ఉన్న మహిళలకు ‘హౌజ్వైఫ్ డర్మటైటిస్’ ముప్పు ఎక్కువ. ఈ వయసు మహిళలు... తాము ముఖం కడుక్కోవడానికి వాడే సబ్బులు, బట్టలు ఉతకడం కోసం వాడే డిటర్జెంటు సబ్బులు, ΄ûడర్లు; అలాగే కొన్ని సందర్భాల్లో వారు ముఖానికి పసుపు, కుంకుమ రాసుకోవడం కారణంగా ముఖం బాగా ΄÷డిబారి΄ోవడం వంటి సమస్యలు కనిపిస్తాయి. ఫలితంగా చర్మంపై పగుళ్లు, దురదలు వస్తాయి. ఈ సమస్యనే ‘హౌజ్వైఫ్ డర్మటైటిస్’ అంటారు. నివారణ : ∙తమకు అలర్జీ కలిగించే అన్ని రకాల పదార్థాలను గుర్తించి, వాటి నుంచి దూరంగా ఉండటం. ∙మడమలు పగలినవారు శాల్సిలిక్ యాసిడ్ ఉండే కాంబినేషన్ క్రీములు వాడటం వల్ల ఉపశమనం కలుగుతుంది. కాళ్లు పగిలిన వారు రాత్రి వేళ సాక్స్ ధరించి పడుకోవడం వల్ల మడమల పగుళ్లు చాలావరకు తగ్గుతాయి.చలికాలంలో పూర్తిస్థాయి చర్మ సంరక్షణ కోసం... చలికాలంలో బాగా పొగలుగక్కే వేణ్ణీళ్లు మంచివి అని కొందరు పొరబడుతుంటారు. ఇది కేవలం అ΄ోహ మాత్రమే. నిజానికి ఈ సీజన్లోని వాతావరణం మన చర్మం నుంచి తేమను లాగేస్తుంటుంది. ఫలితంగా వేడినీళ్లతో స్నానం చర్మాన్ని మరింత పొడిబార్చే ప్రమాదం ఉంది. అందుకే స్నానానికి గోరువెచ్చని నీళ్లు వాడటమే మేలు స్నానానికి అరగంట ముందు ఒంటికి ఆలివ్ లేదా కొబ్బరి నూనె పట్టించాలి. స్నానానికి మాయిశ్చరైజింగ్ సబ్బు వాడటం కూడా మంచిదే చల్లటి వాతావరణంలో దాహం వేయక΄ోవడంతో నీరు తాగడం తగ్గించడం సరికాదు. రోజూ కనీసం రెండు లీటర్ల నీటిని తాగడమే మంచిది అరచేతులు, పాదాలు పగిలినవాళ్లు పాదాలకూ సాక్స్, చేతులకూ కాటన్ గ్లౌజ్ ధరించడం మంచిది పెదవులు పగలకుండా పెట్రోలియమ్ జెల్లీగానీ లేదా లిప్ బామ్గానీ పెదవులపై తరచూ రాసుకుంటూ ఉండటం మంచిది చలికాలమే అయినప్పటికీ తగినంత ఎస్పీఎఫ్ ఉండే సన్స్క్రీన్ లోషన్ను రాసుకుంటూ ఉండటం మంచిది. (చదవండి: -
వివక్ష తొలగిపోతేనే ఎయిడ్స్ నియంత్రణ
హైదరాబాద్: ఎయిడ్స్ అనేది చాపకింద నీరులా విస్తరిస్తున్న ప్రమాదకరమన వ్యాధి. అయితే, తగిన అవగాహన ఉంటే దాన్ని నియంత్రించడం సాధ్యమవుతుందని డా. అనురాధ జాయింట్ డైరెక్టర్ తెలంగాణ సార్క్ (సైంటిఫిక్ అండ్ అప్లైడ్ రీసెర్చ్ సెంటర్) తెలిపారు. ప్రపంచ ఎయిడ్స్ డే సందర్భంగా సోమవారం కామినేని ఆస్పత్రి ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహనా నడక కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొని కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. పలువురు వైద్యులు, వైద్యవిద్యార్థులు, నర్సింగ్ సిబ్బంది, సామాన్య ప్రజలు.. మొత్తం 300 మందితో అవగాహన నడక కార్యక్రమం నిర్వహించారు. ఇందులో అందరూ ప్లకార్డులు పట్టుకుని, హెచ్ఐవీ/ఎయిడ్స్ గురించి అందరికీ అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు.ఈ సందర్బంగా ఆస్పత్రికి చెందిన కన్సల్టెంట్ ఫిజిషియన్ డాక్టర్ శ్రీకృష్ణ రాఘవేంద్ర మాట్లాడుతూ, ‘‘దేశంలో 24 లక్షల మందికి హెచ్ఐవీ ఉంది. తెలంగాణలో 1.4 లక్షల మందికి హెచ్ఐవీ ఉంది. వీరిలో సగం మంది పురుషులు, సగం మంది మహిళలు ఉన్నారు. చాలామంది పరీక్షలు చేయించుకోవడంతో పిల్లల్లో కూడా పాజిటివ్ కనపడుతోంది. ఇలాంటి కేసులు చాలావరకు తల్లిదండ్రుల నుంచి సంక్రమిస్తాయి. ఏమాత్రం లక్షణాలు కనిపించినా, తరచు జ్వరం వస్తున్నా, ఆహారం తీసుకున్నా సరే నీరసంగా ఉంటున్నా వైద్యుల వద్దకు వెళ్లి అవసరమైన పరీక్షలు చేయించుకోవాలి. హెచ్ఐవీ సోకిందన్నంత మాత్రాన భయపడాల్సిన అవసరం లేదు. గుర్తించిన కేసులను ముందుగా ఐసీటీసీ సెంటర్లో రిజిస్టర్ చేయించుకోవాలి. ఎల్బీనగర్ పరిసర ప్రాంత వాసులకు సమీపంలో వనస్థలిపురంలో ఒక ఐసీటీసీ సెంటర్ ఉంది. పీపీపీ పద్ధతిలో ఏఆర్టీ సెంటర్ కామినేనిలో ఉంది. ఇది 2022లో స్థాపించారు. ఇది ఫంక్షనల్ ఐసీటీసీ సెంటర్. ఇందులో యాంటీ రెట్రోవైరల్ మందులను ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉచితంగా పంపిణీ చేస్తారు. ఇక్కడ కాకుండా ఇంకా నగర పరిధిలో గాంధీ, ఉస్మానియా, చెస్ట్ ఆస్పత్రిలో కూడా ఉన్నాయి. కామినేని ఎఫ్ఐసీటీసీలో ఇప్పటివరకు 1200 మంది రిజిస్టర్ అయి ఉన్నారు. దాదాపు రోజుకు 35-40 మంది వరకు వచ్చి ప్రభుత్వం ఉచితంగా ఇస్తున్న మందులు తీసుకుంటారు. నిజానికి రాష్ట్రంలోని ప్రతి వైద్య కళాశాలలో ఒక ఏఆర్టీ సెంటర్ ఉండాలి. అప్పుడు అందరికీ చికిత్స అందుబాటులో ఉంటుంది. ప్రస్తుతానికి హైదరాబాద్లో పెద్దసంఖ్యలో రోగులను చూస్తూ, ఎప్పటికప్పుడు తగిన పరీక్షలు చేస్తూ, ప్రతినెలా ఫాలో అప్ చేసుకుంటూ, వారికి మందులు ఇస్తున్నది కామినేని పీపీపీ ఏఆర్టీ సెంటర్ మాత్రమే. ఇక్కడ కేవలం మందులు ఇవ్వడమే కాక.. మహిళలు, ట్రాన్స్జెండర్లు, ఇతరులకు అవగాహన తెప్పించి హెచ్ఐవీ రాకుండా జాగ్రత్తలు చెబుతున్నాం. నిపుణుల కన్సల్టేషన్ కావాలి’’ అని తెలిపారు.సీనియర్ కన్సల్టెంట్ ఫిజిషియన్ డాక్టర్ ఎం.స్వామి మాట్లాడుతూ, ‘‘హెచ్ఐవీ రోగుల విషయంలో ఇప్పటికీ మన సమాజంలో వివక్ష కొనసాగుతోంది. దీన్ని అరికట్టాలంటే విస్తృత ప్రచారం అవసరం. ఇంకా చెప్పాలంటే అసలు హెచ్ఐవీ రోగులను తాము చూడబోమని, చికిత్స అందించేది లేదనే వైద్యులూ కొంతమంది ఉన్నారు. అలా కాకుండా అందరూ అందరినీ చూడాలనే అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది’’ అని చెప్పారు. మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ అంజయ్య కనుసాలి మాట్లాడుతూ, ‘‘హెచ్ఐవీ రకరకాలుగా వ్యాపిస్తుంది. అరక్షిత శృంగారం ద్వారాను, రక్తమార్పిడి చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోకపోయినా.. ఇలా ఎలాగైనా సోకే అవకాశం ఉంటుంది. మనకు తెలిసినంత మేర జాగ్రత్తలు తీసుకుంటే దాని బారిన పడకుండా ఉండచ్చు. ఒకవేళ హెచ్ఐవీ సోకినట్లు పరీక్షల్లో తేలినా భయపడాల్సిన అవసరం లేదు. యాంటీ రెట్రోవైరల్ మందులను ప్రభుత్వం అందిస్తోంది. మా ఏఆర్టీ సెంటర్లో నమోదుచేసుకుని, ఎప్పటికప్పుడు ఆ మందులు తీసుకుంటే సరిపోతుంది’’ అని వివరించారు.ఈ అవగాహన కార్యక్రమంలో ఆర్గనైజింగ్ ఛైర్పర్సన్, జనరల్ మెడిసిన్ విభాగాధిపతి, ప్రొఫెసర్ డాక్టర్ శ్యాంసుందర్, ప్రిన్సిపాల్ డా. సుధీర్ బాబు పడుగుల్, సీనియర్ కన్సల్టెంట్ ఫిజిషియన్ డాక్టర్ జె.హరికృష్ణ, కన్సల్టెంట్ ఫిజిషియన్ డాక్టర్ ప్రదీప్ కుమార్ పటేల్, ఏఆర్టీ సెంటర్ సీఎంఓ డాక్టర్ పెద్ది రామకృష్ణ, ప్రొఫెసర్ డాక్టర్ పి. రత్నాచారి, డాక్టర్ ఐ. సురేష్, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ దాక్షాయని తదితరులు పాల్గొన్నారు. -
ముందుగానే డెలివరీ జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి..?
నేను ప్రస్తుతం 30 వారాల గర్భిణిని. ఇది నా మొదటి బిడ్డ. నా గ్రోత్ స్కాన్ లో బిడ్డ పెరుగుదల కొంచెం తక్కువగా ఉందని. తరచుగా స్కాన్లు చేయించుకోవాలని, మెరుగుదల లేకపోతే ముందుగానే డెలివరీ చేయాల్సి రావచ్చని చెప్పారు. నేను చాలా ఆందోళనగా ఉన్నాను. ఇది ఎందుకు జరిగిందో అర్థం కావడం లేదు. బిడ్డ పెరుగుదల మెరుగుపడటానికి, ముందుగానే డెలివరీ జరగకుండా ఉండటానికి నేను ఏమి చేయాలి?– సుశీల, రాజమండ్రి. మీ ఆందోళన అర్థమవుతోంది. చాలామంది గర్భిణులకీ ఇలాంటి పరిస్థితి ఎదురవుతుంది. గర్భధారణలో బిడ్డ ఎదుగుదల గర్భకాలానికి తగినంతగా లేకపోతే దానిని ‘ఫీటల్ గ్రోత్ రిస్ట్రిక్షన్ ’ లేదా ‘ఇంట్రా యూటరైన్ గ్రోత్ రిస్ట్రిక్షన్ ’ అంటారు. ఇది సుమారు పది శాతం గర్భధారణల్లో కనిపించే పరిస్థితి. అంటే ఇది అరుదు కాదు, కానీ జాగ్రత్తగా పర్యవేక్షించాల్సినది. ఈ పరిస్థితి రావడానికి పలు కారణాలు ఉంటాయి. గర్భిణి మహిళకు అధిక రక్తపోటు ఉండటం, మధుమేహం, అధిక బరువు, వయస్సు ముప్పై ఐదు ఏళ్లు దాటడం, జంట గర్భం లేదా మల్టిపుల్ గర్భధారణ, గతంలో చనిపోయిన బిడ్డ పుట్టిన చరిత్ర, రక్తహీనత, గుండె సంబంధిత వ్యాధులు లేదా ఆటో ఇమ్యూన్ సమస్యలు. కొన్నిసార్లు ఎటువంటి కారణం లేకపోయినా సహజంగానే బిడ్డ ఎదుగుదల కొంచెం మందగించవచ్చు. అయితే మంచి విషయం ఏమిటంటే, చాలామంది ఇలాంటి బిడ్డలు పుట్టిన తరువాత పూర్తిగా ఆరోగ్యంగా ఎదుగుతారు. కాబట్టి ముందుగా భయపడకుండా వైద్యుల సూచనలను జాగ్రత్తగా పాటించాలి. ముందుగా మీరు చేయాల్సింది ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడం.ప్రోటీన్లు, పండ్లు, కూరగాయలు సమృద్ధిగా ఉండే ఆహారం తీసుకోవాలి. తగినంత నీరు తాగాలి. డాక్టర్ సూచించినంత వరకే తేలికపాటి వ్యాయామాలు చేయాలి. ధూమపానం, మద్యం అలవాట్లు ఉంటే వెంటనే వాటిని పూర్తిగా మానేయాలి. ఇవి బిడ్డకు ఆక్సిజన్ సరఫరా తగ్గించి ఎదుగుదలపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. నియమితంగా వైద్య పర్యవేక్షణలో ఉండటం చాలా ముఖ్యం. బిడ్డ ఎదుగుదలలో తేడా ఉన్నప్పుడు, డాక్టర్ తరచుగా గ్రోత్ స్కాన్లు సూచిస్తారు. ఈ స్కాన్లలో బిడ్డ బరువు, రక్తప్రవాహం, యామ్నియోటిక్ ద్రవం పరిమాణం వంటి అంశాలు చూస్తారు. డాప్లర్ పరీక్షల ద్వారా బిడ్డకు తల్లి నుంచి రక్తప్రవాహం ఎలా జరుగుతోందో అంచనా వేస్తారు. ఈ వివరాల ఆధారంగా డాక్టర్ తదుపరి చర్యలను నిర్ణయిస్తారు. కొన్ని సందర్భాల్లో తల్లి రక్తంలో చక్కెర స్థాయులు లేదా రక్తపోటు నియంత్రణలో లేకపోతే బిడ్డ ఎదుగుదలపై ప్రభావం చూపుతుంది. కాబట్టి ఆ విలువలను ఎప్పటికప్పుడు చెక్ చేయించుకోవాలి. ప్రోటీన్ లోపం ఉంటే ఆహారంతో దాన్ని పూడ్చుకోవాలి. చాలామంది తరచుగా స్కాన్ చేయించుకోవడమే బిడ్డకు హానికరమని అనుకుంటారు. కానీ అది పూర్తిగా తప్పు. అల్ట్రాసౌండ్ పరీక్ష గర్భంలోని బిడ్డను అంచనా వేయడానికి అత్యంత సురక్షితమైన విధానం. బిడ్డ ఎదుగుదల పూర్తిగా ఆగిపోతే లేదా స్కాన్లో రక్తప్రవాహం తగ్గిపోతే, బిడ్డలో ఒత్తిడి లక్షణాలు కనిపిస్తే, అప్పుడే ముందుగా డెలివరీ చేయడం అవసరం అవుతుంది. అలాంటి సందర్భాల్లో బిడ్డ ఊపిరితిత్తులు పక్కాగా పనిచేయేందుకు ముందుగానే స్టెరాయిడ్ ఇంజెక్షన్లు ఇస్తారు. డెలివరీ విధానం సాధారణమా లేదా సిజేరియన్ చేయాలా అనేది బిడ్డ ఆరోగ్యం, తల్లి పరిస్థితి, గర్భధారణ వయస్సు లాంటి అంశాలపై ఆధారపడి నిర్ణయిస్తారు. ఇప్పుడున్న ఆధునిక పరీక్షలు, ముఖ్యంగా స్కాన్లు, బిడ్డ ఎదుగుదల మందగించే ప్రమాదం ఉన్న మహిళలను ముందుగానే గుర్తించడానికి సహాయ పడుతున్నాయి. కొన్ని బయోకెమికల్ పరీక్షలతో పాటు, ప్రమాదం ఎక్కువగా ఉన్నవారికి తక్కువ మోతాదులో ఆస్పిరిన్ మందు ఇవ్వడం ద్వారా ఫీటల్ గ్రోత్ రెస్ట్రిక్షన్ తగ్గించవచ్చు. అందుకే, మీరు మీ వైద్యుడి దగ్గర క్రమం తప్పకుండా ఫాలోఅప్ చేయించుకోవాలి. భయపడకండి. జాగ్రత్తగా వైద్యుల సూచనలను పాటిస్తే, మీ బిడ్డ సురక్షితంగా, ఆరోగ్యంగా పుడతారు. డాక్టర్ కడియాల రమ్య, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్హైదరాబాద్ (చదవండి: ‘ఎగ్’సలెంట్ లుక్, గోళ్ల ఆరోగ్యం కోసం!) -
రేపు వరల్డ్ ఎయిడ్స్ డే.. కొత్త తరానికి చెప్పాలి..
మొదట్లో అభివృద్ధి చెందిన సంపన్న దేశాల్లో మాత్రమే విస్తరించిన ఎయిడ్స్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తమయ్యింది. ఆ సంపన్న దేశాల్లోని మత్తు ఇంజెక్షన్ల సంస్కృతి, హోమో సెక్సువల్ ధోరణులతో ఇలా జరిగింది. ఇవేవీ లేని మనలాంటి దేశాల్లో దీని విస్తృతి మొదట్లో దాదాపుగా లేనేలేదు. కానీ తర్వాత్తర్వాత ఇది మనలాంటి అభివృద్ధి చెందుతున్న దేశాలతో పాటు... పేద దేశాల్లో కూడా విపరీతంగా వ్యాపించిందని తేలింది. ఈ వ్యాధిపై మొదట్లో ఉన్నంత బజ్ ఇప్పుడు లేకపోవడంతో చాపకింది నీరులా ఇది వ్యాపిస్తోంది. అందుకే మరోసారి ఈ వ్యాధి గురించి మాట్లాడాల్సిన సమయం ఇది. ఈ సందర్భంగా ఎయిడ్స్వ్యాధి విషయంలో సమాజంలో చైతన్యం తేవడం కోసం ఏం చేయాలో, అలాగే అనుసరించాల్సిన మార్గాలేమిటన్నది నిపుణులైన డాక్టర్లు సూచిస్తున్న అంశాలివి.ఎయిడ్స్ వ్యాప్తిని అరికట్టడానికి వేర్వేరు దేశాల్లో వేర్వేరు అంశాలు అడ్డంకులుగా నిలుస్తున్నాయి. హోమో సెక్సువాలిటీకి సామాజిక ఆమోదం లేనిచోట్ల, ఇంజెక్షన్ డ్రగ్స్ వాడకం నేరంగా ఉన్న దేశాల్లో వారు తీవ్రమైన వివక్షకు లోనవుతుండటంతో తమ గుర్తింపులను దాచుకోడానికి చేసే ప్రయత్నంలో వారికి చికిత్స అందడం లేదు. దాంతో ఈ తాజా ధోరణులతో హెచ్.ఐ.వి. వ్యాప్తి తీరు మారుతున్నది. సెక్స్ వర్కర్స్, హోమోసెక్సువల్స్, డ్రగ్స్ ఇంజెక్షన్లు తీసుకునేవారూ, ట్రాన్స్జెండర్ వ్యక్తులు, ఖైదీల వంటి సమూహాలలో ఈ వైరస్ తీవ్రమైన వేగంతో వ్యాపిస్తోంది. ఇక ఆఫ్రికాలాంటి వెనకబడిన దేశాల్లో అవగాహన లేమితో ఈ వ్యాధి విస్తృతంగా వ్యాప్తిచెందుతోంది. ప్రస్తుతం కొత్తగా సోకుతున్న హెచ్.ఐ.వి. ఇన్ఫెక్షన్లలో ఆఫ్రికాలో 25 శాతం, మిగతా ప్రపంచంలో 80 శాతం ప్రజల్లో ఎయిడ్స్ అన్నది పైన పేర్కొన్న హోమో సెక్సువల్, ట్రాన్స్జెండర్, డ్రగ్స్ బాధితులు, ఖైదీల వంటి రిస్క్ గ్రూపులలోనే ఎక్కువ. భారతదేశంలోనూ మిగతా జనాభాతో పోలిస్తే ఇలాంటి సమూహాల్లోనే హెచ్.ఐ.వి. వ్యాప్తి సాధారణ జనాభా కంటే 15–17 రెట్లు ఎక్కువ.భారతదేశం, తెలుగు రాష్ట్రాల పరిస్థితి జాతీయ ఎయిడ్స్ నివారణ సంస్థ 2023 అంచనాల ప్రకారం, భారతదేశంలో 25 లక్షల 44 వేల మంది హెచ్ఐవితో జీవిస్తున్నారు. 15–49 సంవత్సరాల మధ్య వయసు ఉన్నవారిలో ప్రతి వెయ్యి మందిలో ఇద్దరిలో (0.20%) హెచ్.ఐ.వి. వ్యాపించింది. మహారాష్ట్రలో అత్యధికంగా 3.90 లక్షల మంది హెచ్ఐవి తో జీవిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో 3 లక్షల 14 వేల మంది. తెలంగాణలో 1 లక్షా 58 వేల మంది వ్యాధిగ్రస్తులు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో 15–49 ఏళ్ల మధ్య వయసు వారిలో హెచ్ఐవి సోకినవారు జాతీయ సగటు కంటే చాలా ఎక్కువ ఉన్నారు. అంటే ప్రతి వెయ్యిలో ఆరుగురు పైగా (0.62%); తెలంగాణలో ప్రతి వెయ్యికి దాదాపు ఐదుగురు (0.47%) ఉన్నారు. 2019లో ఆంధ్రప్రదేశ్లో దేశంలోనే అత్యధిక ఎయిడ్స్ మరణాలు నమోదయ్యాయి. అంటే ఇక్కడ 11,430 మంది చనిపోయారు. 2010తో పోల్చినప్పుడు 2023లో కొత్త ఇన్ఫెక్షన్లలో అత్యధిక తగ్గుదల ఆంధ్రప్రదేశ్లోనే కావడం (తగ్గుదల శాతం 76.19%) కొంత ఊరట.2025లో హెచ్.ఐ.వి. మళ్లీ పెచ్చరిల్లడానికి ఇవీ కారణాలు... ఈ ఏడాది 2025లో ప్రపంచవ్యాప్తంగా సంభవించిన అనేక చారిత్రక పరిణామాల వల్ల హెచ్.ఐ.వి. కార్యక్రమాలకు నిధుల సంక్షోభం ఎదురైంది. ఈ ఏడాది అమెరికా ప్రభుత్వం 430 కోట్ల డాలర్ల నిధుల కేటాయింపును ఆకస్మికంగా, ఏకపక్షంగా నిలిపివేయడం వల్ల... దిగువ ఆదాయ, అలాగే మధ్యస్థ ఆదాయ దేశాల్లో హెచ్ఐవి / ఎయిడ్స్ సేవలకు తీవ్రమైన అంతరాయం కలిగింది. అంతర్జాతీయ సంస్థ యుఎన్ ఎయిడ్స్ అంచనా ప్రకారం ఈ నిధులు శాశ్వతంగా నిలిచిపోతే 2029 నాటికి అదనంగా మరో 60 లక్షల కొత్త హెచ్ఐవి కొత్తకేసులు వచ్చే అవకాశముంది. ప్రపంచవ్యాప్తంగా 40 లక్షల మంది ఎయిడ్స్ సంబంధిత జబ్బులతో మరణించే ప్రమాదం ఉంది. అంతేకాదు... హెచ్.ఐ.వి. రిస్క్ ఉన్న ప్రత్యేక సమూహాలకు చికిత్స అందిస్తూ ఎయిడ్స్ పై పోరాడే వారిని నేరస్తులుగా చూసే దేశాల సంఖ్య పెరిగింది. పురుష స్వలింగ సంబంధాలు, ట్రాన్స్ జెండర్లకు సామాజిక ఆమోదం లేకపోవడం, డ్రగ్స్ వాడకాన్ని తీవ్రమైన నేరంగా పరిగణిస్తూ కొన్ని దేశాల్లో కొత్తగా చేసిన కఠిన చట్టాల కారణంగా వారు తమ వ్యాధిని దాచుకోవడం, చికిత్స కోసం ముందుకు రాకపోవడంతో ఎయిడ్స్ సంక్షోభం మరింత ముదిరే ప్రమాదం ఉంది. దీనివల్ల ఈ వ్యాధి పీడితులకు ఆరోగ్య, వైద్య సేవలు అందించడమూ కష్టసాధ్యమవుతుంది. ఇదీ ఈ ఏడాది (2025) ప్రపంచ ఎయిడ్స్ డే నినాదం ‘సంక్షోభాన్ని అధిగమిస్తూ... కొత్త మార్గంలో పయనిస్తూ’ అన్నది (ఓవర్కమింగ్ డిజ్రప్షన్ – ట్రాన్స్ఫార్మింగ్ ద ఎయిడ్స్ రెస్పాన్స్) ఈ ఏడాది నినాదం. అంతర్జాతీయ వితరణ సంస్థలు తగినన్ని నిధులను ఇవ్వడం, ఈ వ్యాధి నివారణ కోసం కృషి చేస్తున్న కమ్యూనిటీలు కలిసి పనిచేయడం, మానవ సహజమైన లైంగిక ప్రవృత్తులను సానుభూతితో అర్థం చేసుకోవడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా మానవులందరి హక్కులను పరిరక్షించడం, దేశాల నాయకత్వాలు నిబద్ధతతో వ్యవహరించడం, ఈ వ్యాధి తాలూకు మందులను అందరికీ అందుబాటులోకి తేవడం వంటి చర్యలతో ఈ వ్యాధిని వీలైనంతగా నివారించవచ్చు. అలాగే యౌవన ప్రాంగణంలోకి ఇప్పుడిప్పుడే ప్రవేశిస్తున్న కొత్త తరాల వారికి ఈ వ్యాధిపై అవగాహన కల్పిస్తూ... అందుబాటులో ఉన్న అన్ని సామాజిక మాధ్యమాల ద్వారా సురక్షిత శృంగారం, కండోమ్ వాడకం గురించి విస్తృత ప్రచారం చేస్తే ఈ వ్యాధిని దాదాపుగా పూర్తిగా తుదముట్టించినంతగా నివారించవచ్చునన్నది ప్రముఖమైన వైద్య నిపుణులందరి మాట.కొత్త ఆవిష్కరణలతో పరిస్థితి కొంత ఆశాజనకంలెనాకపావిర్, కాబోటెగ్రావిర్ వంటి దీర్ఘకాలం పనిచేసే కొత్త ఇంజెక్షన్ మందులతో హెచ్.ఐ.వి. నివారణలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావచ్చు. ఏడాదిలో కేవలం రెండు సార్లు ఇంజెక్షన్లు తీసుకోవడంతోనే హెచ్ఐవి నివారణ సాధ్యమవుతుంది. దీంతో ప్రస్తుతం అత్యధిక కొత్త ఇన్ఫెక్షన్స్ వెలుగు చూస్తున్న రిస్క్ గ్రూపుల్లో నివారణ సులభతరమవుతుంది. అయితే వాటి ధరలు ప్రస్తుతం కాస్త ఎక్కువగా ఉన్నందున ఆ ధరలు తగ్గించి ప్రతి దేశంలోని ఆ సమూహాలకు ఈ ఇంజెక్షన్లను అందుబాటులోకి తేవడం అత్యవసరం.డాక్టర్ యనమదల మురళీకృష్ణ, ఎండి, ఎయిడ్స్ వ్యాధి నిపుణులు, కాకినాడ -
మేకప్ ఆర్టిస్ట్ అంబికా పిళ్ళై వెయిట్లాస్ కష్టాలు..!
బరువు తగ్గడం కొందరికి అతి పెద్ద సవాలు. పైగా అదొక భారమైన సమస్యగా మారిపోతుంటుంది. ఎందుకంటే వారికి సాధారణ ఆహార మార్పులు ఓ పట్టాన పనిచేయవు. అలా.. బరువు తగ్గినట్టే తగ్గి ..ఇట్టే పెరిగిపోతుంటా. దాంతో విసుగు పుట్టుకొచ్చేస్తుంటుంది కూడా. అలానే ఇబ్బంది పడింది మేకప్ ఆర్టిస్ట్ అంబికా పిళ్ళై. ఆమెకు బరువు తగ్గడం శారీరకంగా, మాససికంగా పెను సమస్యగా మారింది. ఏ డైట్ ఫాలో అయిన ఫలితం శూన్యం. తగ్గినట్టు తగ్గి పెరిగిపోతోంది. చివరికి ఆమె ఏం చేసి బరువు తగ్గగలిగిందంటే..రక్తపోటు సమస్యల కారణంగా అంబికాను కార్డియాలజిస్ట్లు బరువు తగ్గేందుకు ప్రయత్నించమని సూచించారు. బరువు తగ్గితే ఆమె వాడే అన్ని మందులు ఆపేయొచ్చట. అందుకే తాను చాలామందిని వెయిట్లాస్ జర్నీలో తనతో కలిసి జాయిన్ అవ్వమని పిలునిస్తుందట కూడా. ఈ బరువుని నిర్లక్ష్యం చేస్తే భారీకాయంతో మూల్యం చెల్లించుకుంటామంటోంది. అధిక బరువు.. అన్ని అనారోగ్య సమస్యలకు మూలం కాబట్టి పట్టుదలతో దానిపై యుద్ధం చేయాలని అంటోంది. డైట్ మార్పులు.. తగ్గినట్టు తగ్గి..కొన్ని నెలలో బరువు పెరిగిపోవడంతో విసిగిపోయి..డైట్లోనే మార్పులు చేసింది. నో బ్రెడ్, చపాతీ, రైస్, పరాఠా, మాల్వా పరాఠా అని స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యింది. అందుకు బదులుగా కూరగాయలు, చికెన్, చేపలు ఎక్కువగా తీసుకునేదాన్ని అని అంటోంది. చాలామటుకు ఆవిరిలో లేదా రోస్ట్ చేసినవి తీసుకునేదాన్ని అని చెప్పుకొచ్చింది. అప్పుడే తన బరువులో స్వల్ప మార్పులు సంభవించాయని అంటోంది. పిండి పదార్థాలకు దూరంగా ఉండటం తోపాటు డీప్ ఫ్రై చేసిన ఆహారాలను కూడా దరిచేరనిచ్చేదికాదు. సాధ్యమైనంతవరకు ఆవిరిలో ఉడికించిన వాటికి ప్రాధాన్యత ఇచ్చి..సుమారు ఐదు కిలోల బరువు తగ్గిందట. అంతేగాదు బరువు తగ్గడంలో తనలా హెచ్చు తగ్గులతో ఇబ్బంది పడుతుంటే గనుక అనారోగ్యకరమైన కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండే ఆహారాలను తగ్గించడానికి ప్రయత్నిస్తే..సత్వర మార్పుల తోపాటు బరువు తగ్గడం కూడా తథ్యం అని నమ్మకంగా చెబుతోంది. అందుకు సంబంధంచిన వీడియో కూడా నెట్టింట తెగ వైరల్ అవుతోంది. గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. View this post on Instagram A post shared by Ambika Pillai (@ambika_pillai) (చదవండి: పొలాల నుంచి డిజిటల్ ప్రపంచంలోకి..ఇవాళ 400 మందికి పైగా యువతకు..!) -
వణికించే చలి...వేడినీటితో స్నానం... ఎవరు చేయవచ్చు? ఎవరు చేయకూడదు?
శీతాకాలంలో, చాలా మంది వెచ్చని నీటితో స్నానం చేయడానికి ఇష్టపడతారు,ఎందుకంటే ఇది వెచ్చగా హాయిగా అనిపిస్తుంది. కానీ వేడి నీటితో స్నానం చేయడం ఆరోగ్యానికి హానికరం అని వారికి తెలీదు. నీటి ఉష్ణోగ్రత ఆరోగ్యంలో పాత్ర పోషిస్తుంది. కొన్ని లాభాలు ఉన్నప్పటికీ... నష్టాలు మరింత ఎక్కువ ఉన్నాయి. ఈ నేపథ్యంలో వైద్యులు చెబుతున్న ప్రకారం... వేడి నీటి స్నానం వల్ల కలిగే లాభాలు, నష్టాలను ఒకసారి పరిశీలిద్దాం...ప్రయోజనాలున్నాయి...వేడీ నీటి స్నానం వల్ల నష్టాలు అనేకం ఉన్నప్పటికీ... కొన్ని ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా వేడి నీరు బిగుతుగా ఉన్న కండరాలు విశ్రాంతి తీసుకోవడానికి వాటికి ఉపశమనం అందించేందుకు ఉపకరిస్తుంది. అంతేకాకుండా అది రక్తనాళాలను విస్తరించి తద్వారా శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరచడానికి సహాయపడుతుంది. రోజు మొత్తం ఏర్పడిన పని ఒత్తిడిని తగ్గించడానికి ఒక మార్గంగా కూడా పనిచేస్తుంది. సీజనల్ సమస్యలు ఎదుర్కునే వారు, శీతాకాలపు నొప్పులు లేదా అలసటను అనుభవించే వ్యక్తులకు అవి దూరం చేసేందుకు అనువైనది అలాగే శ్వాసకోశ ఆరోగ్యం సరిగా లేని లేదా తక్కువ ఉష్ణోగ్రతలను తట్టుకోలేని వారికి మేలు చేస్తుంది. వేడి నీటి నుంచి వచ్చే ఆవిరి నాసికా భాగాలను క్లియర్ చేయడంలో, స్రవించే ముక్కును నియంత్రించడంలో సహాయపడుతుందిదుష్ప్రభావాలెన్నో...చాలా మందికి ఈ సీజన్లో అసౌకర్యంగా ఉండవచ్చు గానీ నిజానికి చల్లటి నీటి స్నానం రోగనిరోధక శక్తిని పెంచుతుంది. వేడి నీరు అలవాటు అయితే ఆ లాభాన్ని కోల్పోతాం. అంతేకాదు వేడి నీటికి ఎక్కువసేపు గురికావడం వల్ల చర్మం నుంచి సహజ నూనెలు కోల్పోతుంది. ఇది శీతాకాలంలో చర్మం పొడిబారడాన్ని మరింత తీవ్రతరం చేసి దురదకు దారితీస్తుంది. వేడి నీరు చర్మం బయటి పొరను కూడా దెబ్బతీస్తుంది తేమను నిలుపుకునే సామర్ధ్యాన్ని, పర్యావరణ సమస్యల నుంచి కాపాడుకునే సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. అలాగే తామర లేదా సోరియాసిస్ వంటి కొన్ని పరిస్థితులను మరింత దిగజార్చవచ్చు రక్తపోటు పెరిగేకొద్దీ వెచ్చని నీటితో స్నానం చేయడం గుండెపై ఒత్తిడి పెంచుతుంది. వెచ్చని నీటితో స్నానం వల్ల్ల ఊపిరితిత్తులలో వాపు వచ్చే అవకాశం ఉంది. తద్వారా శ్వాస తీసుకోవడం కష్టమై అది తీవ్రమైన సమస్యలకు దారితీస్తుంది. వేడి నీటితో స్నానం తలపై కేశాల మూలాలను బలహీనపరుస్తుంది, జుట్టు విరిగిపోవడానికి రాలడానికి దారితీస్తుంది.అంతేకాదు గుండె జబ్బులు, ఆర్థరైటిస్ లేదా కండరాల సంబంధిత సమస్యలు ఉండే వారికి మంచిది కాదు. నష్టాలు ఉన్నప్పటికీ.. కఠినమైన చలిని నివారించడానికి ప్రతిరోజూ వెచ్చని నీటితో స్నానం చేయకుండా ఉండడం అంత సులభం కాదు.. మరి ఈ పరిస్థితుల్లో ఎలాంటి జాగ్రత్తలు అవసరం?ఏం చేయాలి?నీటి ఉష్ణోగ్రత వీలైనంత తక్కువగా ఉంచడం. అలాగే వేడినీటిలో ఎక్కువ సేపు ఉండకపోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి.శీతాకాలంలో వెచ్చని నీటిలో స్నానం గోరువెచ్చని నీటితో మాత్రమే చేయాలి. జుట్టు రాలడాన్ని నివారించడానికి మాయిశ్చరైజింగ్ హెయిర్ కండిషనర్ను అప్లై చేయాలి.పనిని బట్టి చేసే శారీరక శ్రమని బట్టి 2 పూటలా కాకుండా ఒక్క పూటకు పరిమితం చేయడాలి. -
రుతుక్రమ సమస్యలకు సీడ్ సైకిల్
ఈ రోజుల్లో మహిళల రుతుక్రమంలో సమస్యలు తలెత్తడం ఎక్కువ కనిపిస్తోంది.. హార్మోన్ల హెచ్చుతగ్గులు వీటికి ప్రధాన కారణంగా ఉంటుంటాయి. ఈ సమస్యను సరిదిద్దడానికి మన ప్రాంతీయ సంప్రదాయ ఆహారం ఎంతో మేలు చేస్తుంది. సమతుల ఆహారంతో పాటు సీడ్ సైక్లింగ్ థెరపీ పీసీఓఎస్ సమస్యలో ప్రధాన పాత్ర పోషిస్తుంది అంటున్నారు పోషకాహార నిపుణులు. 30 నుంచి 50 ఏళ్లు పైబడిన మహిళలు ... పీసీఓఎస్, థైరాయిడ్, మెనోపాజ్ సమస్యలు ఎదుర్కొంటున్నప్పుడు రోజువారీ తీసుకునే ఆహారంలో మార్పులు చేసుకుంటే ఆరోగ్యమూ మెరుగ్గా ఉంటుంది. → మెటబాలిజంను బ్యాలెన్స్ చేసే క్యాలీఫ్లవర్, క్యాబేజీ, బ్రోకలీలను ఆహారంలో చేర్చాలి. ఇవి ఈస్ట్రోజెన్ హార్మోన్లను వృద్ధి చేస్తాయి. క్యాన్సర్ కారక రిస్క్ను కూడా తగ్గిస్తాయి.→ సాల్మన్ ఫిష్, చియా, అవిశ గింజలలో ఆరోగ్యానికి మేలు చేసే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ సమృద్ధిగా లభిస్తాయి. చియా, అవిశ గింజలను ఉదయం అల్పాహారంలో చేర్చుకోవచ్చు. చియా సీడ్స్ మజ్జిగ, నీళ్లలో నానబెట్టి తీసుకోవచ్చు. → హోల్ గ్రెయిన్స్లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది. కూరగాయలు, శనగలు, చిరుధాన్యాలు, మిల్లెట్స్, బ్రౌన్ రైస్ తీసుకోవాలి. ఇవి రక్తంలో చక్కెర, ఇన్సులిన్ స్థాయులను సమం చేస్తాయి. ఈస్ట్రోజెన్ హార్మోన్ సరిగ్గా పనిచేస్తే ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గి, బ్లడ్ షుగర్ లెవల్స్ బ్యాలెన్స్ అవుతాయి. → పప్పులు, శనగలు, బొబ్బర్లు.. వంటి వాటిలో బి12 ఎక్కువ ఉంటుంది. ఈ రోజుల్లో బి12 లోపం చాలా మందిలో కనిపిస్తుంది. ఈ పప్పులను చేర్చడం వల్ల బి12తో పాటు హార్మోన్ల సమతుల్యత దెబ్బతినదు. పప్పులను ఉడికించి రోజూ ఒక కప్పు రోజువారీ ఆహారంలో ఉండేలా చూసుకోవాలి. → బాదంపప్పు, వాల్ నట్స్లలో మెగ్నిషియం లభిస్తుంది. నట్స్ అండ్ సీడ్స్ రోజూ మూడు నెలల పాటు రోజూ తీసుకుంటే హార్మోన్ల హెచ్చుతగ్గులు బ్యాలెన్స్ అవుతాయి. → గట్ హెల్త్ని సపోర్ట్ చేసే పెరుగు, యోగర్ట్, మజ్జిగ.. వంటివి ఆహారంలో చేర్చాలి. హార్మోన్ల అసమతుల్యత వల్ల బరువు పెరగడం తగ్గడం సమస్య కూడా ఉంటుంది. థైరాయిడ్, హార్మోన్లకు సపోర్ట్ చేసే ఎగ్ లేదా టోఫూ వంటివి ఉపయోగించాలి. → కల్తీ నూనెలు కాకుండా ఫ్లాక్స్ సీడ్, అవకాడో, ఆలివ్ ఆయిల్స్, స్వచ్ఛమైన నెయ్యి వాడాలి. ఆకుకూరలు, చిలకడ దుంప, నట్స్ .. మెగ్నిషియం ఉండే పదార్థాలను చేర్చుకుంటే పిఎమ్ఎస్ లక్షణాలు తగ్గుతాయి. గింజలను పొడులు చేసి, నేరుగా తీసుకోవచ్చు. లేదంటే పెరుగు, ఓట్స్లో కలుపుకోవడం ద్వారా లేదంటే చిన్న చిన్న లడ్డూలు కట్టి కూడా తీసుకోవచ్చు. ఇతర జంక్ఫుడ్ తిని సీడ్ సైక్లింగ్ పాటించడం వల్ల ఉపయోగం ఉండదు. ఆరోగ్యకరమైన ఆహారంతో పాటు సీడ్ సైక్లింగ్ పాటిస్తూ, వ్యాయామాలు చేస్తూ, రోజువారి జీవనశైలి బాగుండేలా చేసుకుంటే ఇవి సాయపడతాయి. ప్రభావం వెంటనే కనిపించలేదు అనుకోకుండా 2–3 నెలల పాటు ప్రతిరోజూ వాడితే మంచి ఫలితాలు వస్తాయి. నిల్వ ఉండే పదార్థాలు, జంక్ ఫుడ్ కాకుండా మన సంప్రదాయ ఆహారం ద్వారానే హార్మోన్లు బ్యాలెన్స్ అవుతాయి. నెలసరి సమస్యలు దరిచేరవు.సీడ్ సైక్లింగ్పీసీఓఎస్ ఫేజెస్ను బట్టి సీడ్ సైక్లింగ్ విధానం ఎంతో మేలు చేస్తుంది. హార్మోన్ల సపోర్ట్ కోసం ఈ విధానాన్ని అనుసరిస్తారు. రుతుక్రమం సరిగా రాని వాళ్లకు ఈ విధానాన్ని ఆవలంబించమని నిపుణులు చెబుతుంటారు. సీడ్ సైక్లింగ్ మెథడ్ను రుతుక్రమం ఆగిపోయిన మొదటి రోజు నుంచి తిరిగి రుతుక్రమం ప్రారంభమయ్యే రోజు వరకు పాటించాలి.పారిక్యులర్ ఫేజ్ఇది సీడ్ సైక్లింగ్లో మొదటి ఫేజ్. రుతుక్రమం ఆగిపోయిన మొదటి రోజు నుంచి 14వ రోజు వరకు ఒక దశ. దీనిలో గుమ్మడి గింజల పొడి 1–2 టీ స్పూన్లు, అవిశ గింజల పొడి 1–2 టీ స్పూన్లు రోజూ తీసుకోవాలి. దీనివల్ల ఈస్ట్రోజెన్, ప్రొజెస్టిరాన్ హార్మోన్ల పనితీరు బాగుంటుంది. నెలసరి సమస్యలు తగ్గుతాయి.లూటియల్ ఫేజ్ రుతుక్రమం ఆగిపోయిన 15వ రోజు నుంచి 28వ రోజు వరకు సన్ఫ్లవర్ గింజలు, నువ్వులు ఉపయోగించాలి. సన్ఫ్లవర్, నువ్వులలో విటమిన్–ఇ ఉంటుంది కాబట్టి హార్మోన్ బ్యాలెన్స్ చేయడానికి ఉపయోగపడతాయి. హార్మోన్ల అసమతుల్యత కారణంగా వచ్చే క్రాంప్స్, యాక్నె, నొప్పి, మూడ్ స్వింగ్స్ .. వంటివి కూడా తగ్గుతాయి. మెనోపాజ్, థైరాయిడ్ సమస్యలకు ఈ విధానం సరైన పరిష్కారం.డా. సుజాతా స్టీఫెన్, న్యూట్రిషియనిస్ట్ -
జంక్ఫుడ్ ఇంత ప్రమాదకరమా..? పాపం ఆ ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్..
జంక్ఫుడ్ ప్రమాదకరమని నిపుణులు హెచ్చిరిస్తుంటే..పెడచెవిన పెట్టిన వాళ్లెందరో. అంతెందుకు చీట్మీల్ పేరుతో బర్గర్లు, పీజాలు లాగించేసేవాళ్లు కోకొల్లలు. అలాంటి వాళ్లందరికీ ఈ ఘటన ఓ కనువిప్పు. మారథాన్ ఛాలెంజ్లో భాగంగా తిన్న జంకఫుడ్ ఓ ఇన్ఫ్లుయెన్సర్ ప్రాణాలనే హరించేసింది. ఎవ్వరూ ఇలాంటి ఛాలెంజ్స్లో పాల్గొనేందుకు జంకేలా చేసింది కూడా.అసలేం జరిగిందంటే..రష్యన్ ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ 30 ఏళ్ల డిమిత్రి నుయాన్జిన్, బరువు తగ్గించే కార్యక్రమాన్ని ప్రోత్సహించే నిమిత్తం ఈటింగ్ ఛాలెంజ్లో పాల్గొన్నాడు. ఆయన సదుద్దేశ్యంతో చేస్తే..ఆ ప్రయోగం అతడి ప్రాణమే పోయింది. అదికూడా నిద్దురలోనే ప్రాణం పోవడం బాధకరం. అధిక బరువు ఎంత పెద్ద సమస్య అని అవగాహన కల్పించే నిమిత్తం డిమిత్రి 25 కిలోలు బరువు పెరగాలన్న లక్ష్యం పెట్టుకున్నాడు. ఈ మేరకు మారథాన్లొ భాగంగా అతిగా తినే ఛాలెంజ్లో పాల్గొన్నాడు. తన క్లయింట్లు తనలా బరువు తగ్గేలా ప్రేరణనివ్వాలని ఈ ఛాలెంజ్ పాల్గొన్నాడు. ఆ నేఫథ్యంలోనే రోజుకు దాదాపు 10 వేల కేలరీలకు పైగా జంక్ఫుడ్ తిన్నాడు. అనుకున్నట్లుగా బరువు పెరిగాడు..తన ఫాలోవర్స్కి కూడా తనలోని ఆ ఛేంజ్ని బహిర్గతం చేయడమే కాకుండా ఆ అధిక బరువుని తగ్గించుకునేలా కూడా ప్లాన్ చేస్తున్నట్లు వెల్లడించాడు కూడా. అయితే అనూహ్యంగా చనిపోవడానికి ఒక రోజు ముందు తను చేసే వర్కౌట్ల సెషన్ను రద్దు చేసుకున్నాడు కూడా. తాను ఆరోగ్యంగా ఉన్నానని, వైద్యుడుని సంప్రదించాలను చూస్తున్నట్లు నెటిజన్లతో షేర్ చేసుకున్నాడు కూడా. అయితే అదే చివరి మాట అవుతుందని అనుకోలేదు అతడి అభిమానులు, ఫాలోవర్లు. అతడి సన్నిహిత వర్గాల సమాచారం ప్రకారం అతడి గుండె నిద్దురలోనే ఆగిపోయిందని, అవే అతడి చివరి మాటలయ్యాయనని బాధగా చెబుతున్నారు. అంతేగాదు డిమిత్రి గత నవంబర్ 18న చివరి ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో లేస్ ప్యాక్ తినడం తోపాటు తాను 105 కిలోలు బరువు పెరిగినట్లు కూడా వెల్లడించాడు. అంతేగాదు నెలలో కనీసం 13 కిలోలు పెరిగినట్లు తెలిపాడు. నెటిజన్లు డిమిత్రి మృతికి స్పందిస్తూ..అతడి కుటుంబానికి సంతాపం తెలియజేశారు. అలాగే ఇలాంటి ఈటింగ్ ఛాలెంజ్ల్లో పాల్గొనేవాళ్లకు ఈ సంఘటన ఓ గొప్ప పాఠం అంటూ పోస్టులు పెట్టారు. కాగా, డిమిత్రీ ఈ ఈటింగ్ ఛాలెంజ్లో భాగంగా రోజు వారీ ఆహారంలో పేస్ట్రీలు, కేక్లు, మయోన్నెస్లో ఉడికించిన డంపింగ్స్, రాత్రి భోజనంలో రెండు పిజ్జాలు తప్పనిసరిగా తిన్నట్లు తెలిపాడు. అధిక బరువుని తగ్గించడం ఎలా అనేదానిపై ప్రేరణ కలిగించేలా బరువు పెరగాలనుకుంటే..అది అతడి ఉసురే తీసేసింది. డిమిత్రీ సెయింట్ పీటర్స్బర్గ్లోని ఓరెన్బర్గ్ ఒలింపిక్ రిజర్వ్ స్కూల్ అండ్ నేషనల్ ఫిట్నెస్ యూనివర్సిటీ గ్రాడ్యుయేట్, పైగా ఒక దశాబ్దం పాటు ఉన్నత రష్యన్లకు వ్యక్తిగత కోచ్ కూడా ఆయన. అలాంటి వ్యక్తి జంక్ ఫుడ్ ఎంత ప్రమాదకరం అనేది చూపిద్దామనుకుంటే అతడి ప్రాణాల్లో గాల్లో కలిసిపోయాయి. నిజంగానే ఇంత ప్రమాదమా అంటే..జంక్ఫుడ్ ఆరోగ్యానికి మంచిది కాదు.ఎందుకంటే ఇందులో చక్కెర, అనారోగ్యకరమైన కొవ్వులు, సోడియం ఎక్కువగా ఉంటాయి. ఇందులో మనకు అవసరమైన పోషకాలు తక్కువగా ఉంటాయి. దీనిని తరచుగా తినడం వల్ల ఊబకాయం, మధుమేహం, గుండె జబ్బులు, రక్తపోటు వంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి.(చదవండి: ఇంజనీర్ కమ్ డాక్టర్..! విజయవంతమైన స్టార్టప్ ఇంజనీర్ కానీ..) -
కొత్త వస్తువులు చూస్తే కొనకుండా ఉండలేకపోతున్నాను!
నాకు చిన్నప్పటి నుంచి ఏ కొత్త వస్తువు చూసినా, కొనాలన్న ఆశ ఎక్కువ. స్కూలు రోజుల్లో రకరకాల పెన్నులు, ప్రతీ సంవత్సరం రెండు మూడు స్కూల్ బ్యాగులు, చెప్పులు, షూస్ కొనేవాడిని. తర్వాత నా ఆసక్తి బట్టలు మీదకు మళ్ళింది. మార్కెట్లోకి కొత్త రకం డ్రెస్లు వచ్చినప్పుడల్లా కొనమని పట్టుబట్టేవాణ్ణి. కొనక΄ోతే అలిగి అన్నం తినడం మానేసేవాడిని. తర్వాత నా మోజు సైకిళ్ళ మీకికి తిరిగింది. టీవీలో కొత్త మోడల్ సైకిల్ కనిపించగానే పాత సైకిల్ అమ్మేసి కొత్తదాన్ని కొనేవాడిని. కాలేజి రోజుల్లో ప్రతి నెలా ఫోన్ మార్చేవాడిని, డిగ్రీ పూర్తయ్యాక బైకులు నాకొత్త వ్యసనం అయ్యాయి. మార్కెట్ లో కొత్త బైక్ విడుదలయితే నా పాత బైక్ తక్కువ ధరకే అమ్మేసి అప్పు తీసుకొని మరీ కొత్త బైక్ కొనేవాడిని. ప్రస్తుతం ఆన్లైన్లో ఆఫర్స్, డీల్స్ కోసం వెతకడం, నియంత్రణ లేకుండా ఖర్చు చేయడం చేస్తున్నాను. ఇలా కొన్న వాటిని తక్కువ ధరకు అమ్మి మళ్లీ కొత్త వస్తువులు కౌంటున్నాను. దీనివలన డబ్బులు కోల్పోతున్నాను. ఇంట్లో భార్యతో గొడవలు, మనశ్శాంతి కూడా ఉండడం లేదు. ఈ అలవాటుని ఎలా మార్చుకోవాలి? – శ్యామ్ సుందర్, గోదావరిఖనిమీరు చెప్పిన లక్షణాలన్నీ ‘కంపల్సివ్ బైయింగ్ డిజార్డర్’ అనే మానసిక సమస్యకు దగ్గరలో ఉన్నాయి. ఇది ‘ఇంపల్సివ్ కంట్రోల్ డిజార్డర్’అనే మానసిక వ్యాధుల కేటగిరీలోకి వస్తుంది. దీనిలో ఏదో ఒక విషయం మీద విపరీతమైన తపన ఉంటుంది. ఆ పని చేసేదాకా మనసులో నిలకడ ఉండదు. ఎప్పుడూ అనే ఆలోచనలే ఉంటాయి. ఆ పని చేయగానే ఎంతో హాయిగా, ప్రశాంతంగా ఉంటుంది. దీనివలన నష్టం జరిగినప్పుడు తర్వాత బాధపడుతూ ఉంటాము. అది షాపింగ్ అవ్వొచ్చు, జూదం అనొచ్చు, ఎక్కువగా సెక్స్ ఆలోచనలు రావడం కావచ్చు లేదా అతిగాని తినాలనే ఆరాటం కావచ్చు. వీటన్నింటిలో ‘డోపమైన్‘ అనే రసాయనం స్థాయి పెరుగుతుంది. దానివలన తాత్కాలికంగా చాలా ఆనందం కలుగుతుంది. ఒక్కసారి డోపమైన్ స్థాయి తగ్గితే మళ్ళీ ఆ పని చేస్తేనే ఆ రసాయనం పెరిగి ఆనందం కలుగుతుంది. క్రమేణా ఇదొక వ్యసనం లాగా మారుతుంది. చాలా మంది ఆల్కహాల్, ఇతర డ్రగ్స్ కి బానిసలా అవడం వెనుక కూడా ఇదే మెకానిజం ఉంటుంది. ఇక మీ సమస్య విషయానికి వస్తే ‘కంపల్సివ్ బైయింగ్ డిజార్డర్కు ఖచ్చిత మైన మందులు లేనప్పటికీ ‘యాంటీ డిప్రెసెంట్‘ ‘యాంటీ క్రేవింగ్’ మందులు వాడి కొంత వరకు మీ ప్రవర్తనని అదుపు చేయవచ్చు. దానితోపాటు సైకోథెరపీ, మారైటల్ థెరపీ కూడా ఉపయోగ పడుతుంది. ఎవరో చెప్పినట్లు ఆఫర్లో కొంటే 50 శాతం డబ్బులు మిగులుతాయి. అసలు ఆఫర్లకి దూరంగా ఉంటే 100 శాతం మన డబ్బులు మన దగ్గరే ఉంటాయి కదా... మీరు దిగులు చెందకుండా వెంటనే మంచి సైకియాట్రిస్టుని కలవండి. అన్నీ కుదుట పడతాయి.(డా. ఇండ్ల విశాల్ రెడ్డి, సీనియర్ సైకియాట్రిస్ట్, విజయవాడ. మీ సమస్యలు, సందేహాలు పంపవలసిన మెయిల్ ఐడీ: sakshifamily3@gmail.com)(చదవండి: సమయం ఆసన్నమైంది మిత్రమా..) -
ఎనిమిదేళ్ల బాలుడికి కిడ్నీ నిండా రాళ్లు
ఇటీవలి కాలంలో చిన్న పిల్లల్లో, ఇంకా చెప్పాలంటే చివరకు నవజాత శిశువుల్లో కూడా కిడ్నీ రాళ్ల సమస్య కనిపిస్తోంది. ప్రధానంగా కొంత పెద్ద పిల్లలు తగినంత నీళ్లు తాగకపోవడం, అల్ట్రా ప్రాసెస్డ్ ఆహారాలు తీసుకోవడం లాంటివి ఇందుకు కారణాలవుతున్నాయి. మరీ చిన్నపిల్లల్లో అయితే మెటబాలిక్ కారణాల వల్ల కిడ్నీల్లో రాళ్లు ఏర్పడుతున్నాయి. ఆహారపు అలవాట్లలో మార్పులు, ఊబకాయం, పర్యావరణ కారణాల వల్ల కూడా ఇవి ఏర్పడుతున్నాయి. ఆహారంలో ఉప్పు వాడకం, తీపి పానీయాలు తగ్గించాలి. తాజాగా వరంగల్ ప్రాంతానికి చెందిన ఎనిమిదేళ్ల బాలుడికి ఎడమవైపు కిడ్నీ నిండా రాళ్లు ఏర్పడడంతో అతడిని హైదరాబాద్ బంజారాహిల్స్లోని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ (ఏఐఎన్యూ)కు ఆ బాలుడిని తీసుకొచ్చారు. ఇక్కడ వైద్యులు విజయవంతంగా మొత్తం రాళ్లన్నింటినీ తొలగించి, బాలుడికి ఊరట కల్పించారు. తొలుత ఆ అబ్బాయికి విపరీతమైన కడుపునొప్పి, జ్వరం ఉండడంతో అది కిడ్నీలో రాళ్ల సమస్యేనని గుర్తించి ఈ చికిత్స చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలు, పిల్లల్లో కిడ్నీ రాళ్ల సమస్యల గురించి ఏఐఎన్యూకు చెందిన కన్సల్టెంట్ పీడియాట్రిక్, ట్రాన్సిషనల్ యూరాలజిస్ట్ డాక్టర్ పి.అశ్విన్ శేఖర్ ఇందుకు సంబంధించిన వివరాలు తెలిపారు. “బాలుడిని ఇక్కడకు తీసుకురాగానే సమస్యను గుర్తించి, పెర్క్యుటేనియస్ నెఫ్రో లితోటమీ (పీసీఎన్ఎల్) చేయాలని నిర్ణయించాం. ఇందులోభాగంగా వీపు భాగంలో చిన్న రంధ్రం చేసి, నెఫ్రోస్కోప్ ద్వారా కిడ్నీలోకి వెళ్లి ఎక్కువ నొప్పి లేకుండా రాళ్లను తొలగించాం. సంప్రదాయ శస్త్రచికిత్సల కంటే ఇందులో త్వరగా కోలుకుంటారు. దీనివల్ల ఆస్పత్రిలో ఉండాల్సిన సమయం తగ్గుతుంది.కిడ్నీలో రాళ్ల సమస్య ఇంతకుముందు పెద్దవారిలోనే కనిపించేది. ఇప్పుడు పిల్లల్లో కూడా ఎక్కువగా వస్తోంది. ఎవరైనా సరే రోజూ తగినంత నీళ్లు తాగాలి. ఎన్ని తాగాం అన్నదాని కంటే, ఎంత మూత్రం వస్తోందన్నది ముఖ్యం. రోజుకు కనీసం లీటరున్నర మూత్రం పోయేలా నీళ్లు తాగాలి. అలా తాగకపోతే మూత్రం చిక్కబడుతుంది. అదే కిడ్నీలో రాళ్లు ఏర్పడడానికి సూచిక. పిల్లల్లో కిడ్నీరాళ్ల తొలగింపు చాలా జాగ్రత్తగా, కచ్చితత్వంతో చేయాలి. అత్యాధునిక టెక్నిక్లు ఉపయోగించడం ద్వారా ఈ కేసులో విజయం సాధించాం. ఇందులో ఒక పెద్దరాయి, మరికొన్ని చిన్నరాళ్లు అన్నింటినీ ఒకే సిటింగ్లో తొలగించాం. సాధారణంగా పెద్దరాళ్ల తొలగింపునకు 2-3 సిటింగ్లు అవసరం అవుతాయి. కానీ పీసీఎన్ఎల్ తరహాలో అయితే పెద్ద, సంక్లిష్టమైన రాళ్లనూ తొలగించగలం.తెలంగాణలో కిడ్నీ రాళ్లు, కిడ్నీ వ్యాధులు ఎక్కువవుతున్నాయి. ఇది ప్రమాదకరంగా పెరుగుతోంది. ముఖ్యంగా వేసవిలో ఉష్ణోగ్రతలు పెరగడం, నీళ్లు తాగినా చెమటరూపంలో పోవడంతో తగినంత మూత్రం విడుదల కాక ఈ సమస్య వస్తోంది. మన దేశంలోనే అత్యధికంగా క్రానిక్ కిడ్నీ డిసీజ్ (సీకేడీ) కేసులు తెలంగాణలో 6.2% ఉన్నాయి. గడిచిన 15-20 ఏళ్లలో పిల్లలకు కిడ్నీల్లో రాళ్ల సమస్య రెట్టింపు నుంచి నాలుగు రెట్లు అయ్యింది. పిల్లల్లో కిడ్నీ రాళ్లు ఏర్పడినప్పుడు.. నెల, రెండు నెలల తర్వాత మెటబాలిక్ సమస్యలేమైనా ఉన్నాయేమో పరీక్షించాలి. ఇందుకు 24 గంటల యూరిన్ మెటబాలిక్ పరీక్షలు, సీరం కెమిస్ట్రీలు చూసుకోవాలి. కొన్ని కేసుల్లో జన్యుపరమైన సమస్యల వల్ల ఇవి వస్తున్నాయి. చాలా వరకు మాత్రం నివారించదగ్గ కారణాలే ఉంటున్నందున మన జాగ్రత్తలు చాలాముఖ్యం” అని డాక్టర్ అశ్విన్ శేఖర్ వివరించారు.(చదవండి: తక్కువ వ్యర్థాలతో హెల్దీ లైఫ్ ..! మాజీ ఇస్రో శాస్త్రవేత్త జీరో వేస్ట్ పాఠాలు) -
ప్రకృతి వైద్యమే మంచిదా..! నటి సోనాలి బింద్రే సైతం..
ఆధునిక వైద్యం కొంత పుంతలు తొక్కుతున్న వేళ..చాలామంది ప్రకృతి వైద్యం వైపుకే మగ్గు చూపుతున్నారు. ఆఖరికి సెలబ్రిటీలు, ప్రముఖులు కూడా వాటినే ప్రమోట్ చేస్తుండటం విశేషం. అయితే పూర్తిగా ప్రకృతి వైద్య మీద ఆధారపడితే కష్టం అని..ఆధునిక చికిత్సల తోపాటు దీన్ని తీసుకుంటే బెటర్ అనేది కొందరి నిపుణులు వాదన. అయితే తాజాగా టాలీవుడ్ నటి సోనాలి బింద్రే ఈ ప్రకృతి వైద్యంపై ఆమె పెట్టిన పోస్ట్ హాట్టాపికగ్ మారింది. పైగా ఆమెకు పిచ్చి పట్టిందా అంటూ తిట్టిపోస్తున్నారు కూడా. కానీ సోనాలి మాత్రం తన వాదనను సమర్థించడమే కాదు అది తన అనుభవం అని నొక్కి చెబుతూ మరోసారి పోస్ట్ పెట్టారామె. అసలు ఇంతకీ ఆమె ఏం అన్నారు? అన్నింట్లకంటే ప్రకృతి వైద్యమే మంచిదా అంటే..గతవారం సోషల్ మీడియ ఎక్స్లో ఆటోఫాగి గురించి రాసుకొచ్చింది. తనకు 2018లో కేన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయ్యిందని, అప్పుడే తన ప్రకృతి వైద్యుడు ఈ సహజ చికిత్సను పరిచయం చేసినట్లు తెలిపింది. దానిగురించి పరిశోధించి మరీ అనుసరించినట్లు పేర్కొంది. ఆ ఆటోఫాగిని ఇప్పటికీ అనుసరిస్తున్నట్లు తెలిపింది. ఆటోఫాగి అంటే..ఒక కణం తనను తాను శుభ్రం చేసుకునే సహజ ప్రక్రియ, దీని ద్వారా అది పాత, దెబ్బతిన్న కణ భాగాలను విచ్ఛిన్నం చేసి, వాటిని తిరిగి ఉపయోగించుకుంటుంది. ఇది కణ ఆరోగ్యాన్ని నిర్వహించడానికి, కణాలలో శక్తిని పునరుత్పత్తి చేయడానికి సహాయపడుతుంది, ముఖ్యంగా ఉపవాసం లేదా ఒత్తిడి వంటి పరిస్థితులలో ఇది చాలా కీలకం. అందుకు ది లివర్ డాక్ ఆన్గా ప్రసిద్ధి చెందిన హెపాటాలజిస్ట్ సిరియాక్ అబ్బి ఫిలిప్స్ స్పందించి పోస్ట్లో ఇలా రాసుకొచ్చారు. సోనాలి తన కేన్సర్ చికిత్స కోసం ఆధునిక వైద్యం వైపు మొగ్గు చూపారని గుర్తు చేశారు. "కీమోథెరపీ, రేడియేషన్, శస్త్రచికిత్సతో సహా తీవ్రమైన కేన్సర్ చికిత్సల కోసం న్యూయార్క్కు వెళ్లారని చెప్పుకొచ్చాడు. 2019లో ఆ వ్యాధి నుంచి ఉపశమనం పొంది అధికారికంగా కేన్సర్ రహితంగా భారతదేశానికి తిరిగి వచ్చారని గుర్తు చేశాడు. అంతేగాదు అధునాతన క్యాన్సర్ చికిత్స ఆసుపత్రిలో కీమోథెరపీ, రేడియేషన్,శస్త్రచికిత్స వల్లే మీకు ఉపశమనం లభించిందని పేర్కొన్నాడు. ముమ్మాటికి ఇది ప్రకృతి వైద్యం కాదని, శాస్త్రీయ చికిత్సే మీకు హెల్ప్ అయ్యిందంటూ పోస్ట్లో రాసుకొచ్చారు.దాంతో సోనాలి తాజాగా తన ఎక్స్ పోస్ట్లో అతడు పెట్టిన ఫోటోని స్క్రీన్షాట్ తీసి మరీ పోస్ట్లో ఇలా స్పష్టం చేసింది. ఆ కేన్సర్ వ్యాధి తెచ్చే భయం అంతా ఇంత కాదు. నొప్పి, అనిశ్చతి వంటి వాటిని తట్టుకోవాలి. అందుకు అభ్యాసం, అనుభవం అత్యంత ముఖ్యం. ఇప్పటివరకు తాను చెప్పిన వన్ని తన అనుభవం ఆధారంగా చెప్పాను.తాను పదే పదే చెప్పినట్లుగా.. ఏ రెండు కేన్సర్లు ఒకేలా ఉండవు. అలాగే చికిత్సా విధానాలు కూడా వేరుగా ఉంటుంది. చాలా సమగ్రంగా పరిశోధన, వైద్య మార్గదర్శకత్వం తర్వాత వ్యక్తగతంలో తెలుసకున్నది ఈ ఆటోఫాగి. అప్పట్లో దీని ప్రభావం, తేడాను గమనించానని, పైగా అది నేటికి కొనసాగుతుందని పేర్కొంది. అయినా అందరూ నాతో ఏకభవించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే..వేర్వేరు విధానాల వైపు మొగ్గు చూపుతున్నందున..తన మాటలను తోసిపుచ్చాల్సిన పనిలేదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది సోనాలి. తన అనుభవాన్ని చాలా నిజాయితీగా పంచుకున్నానే తప్ప తప్పుదోవ పట్టేంచే ఉద్దేశ్యమే లేదని,ప్రకృతి వైద్యాన్ని సమర్థిస్తు పోస్టు ట్టారు.అందుకుగాను ది లివర్ డాక్ ఇలా పోస్ట్ పెట్టింది.సోనాలి బింద్రే ఒక పిచ్చిది కాదు. ఆమె సలహా తీసుకుంటున్న ప్రకృతి వైద్యుడు ఒక పిచ్చివాడు. సోనాలి బింద్రే, ఆమెకు ముందు తర్వాత చాలా మంది ఇలాగే అనుసరించి, బాధతులుగా మారారని ఫైర్ అయ్యింది. అయినా విద్య తెలివి తేటలకు, హేతుబద్ధతకు సమానం కాదు అనే విషయంపై దృష్టి పెట్టండి అని పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం నెట్టింట ఈ అంశం హాట్టాపిక్గా మారి, చర్చనీయాంశం గామారింది. ప్రకృతి వైద్యం అంటే..ప్రకృతి వైద్యం అనేది ఒక ప్రత్యామ్నాయ వైద్య విధానం. ఇది ఆహారం, నీరు, ఉపవాసం, వ్యాయామం, యోగా వంటి సహజ పద్ధతుల ద్వారా ఆరోగ్యాన్ని మెరుగుపరచడం, వ్యాధులను దరిచేరకుండా చేస్తుంది. ఇది శరీరానికి సహజంగా ఉండే స్వస్థత శక్తిని ఉపయోగించుకుంటుంది. ఈ విధానంలో హోమియోపతి, ఆక్యుపంక్చర్, హెర్బల్ మెడిసిన్ వంటి సంప్రదాయ పద్ధతులతో పాటు, కొన్ని ఆధునిక పద్ధతులను కూడా మిళితం చేసి అందిస్తుంటారు ప్రకృతి వైద్య నిపుణులు. గమనిక: ఇది కేవలం అవగహనం కోసం మాత్రమే ఇచ్చింది. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యలు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం(చదవండి: ఇష్టారాజ్యంగా యాంటీబయాటిక్స్ వాడొద్దు !) -
హై రిస్క్ ప్రెగ్నెన్సీస్..ఇవీ జాగ్రత్తలు..!
ఒక్కమాటలో చెప్పాలంటే కాబోయే ప్రతి మాతృమూర్తి తాలూకు గర్భధారణా అలాగే ప్రసవంలో ఎంతోకొంత రిస్క్ ఉండనే ఉండవచ్చు.అయితే కొందరి గర్భధారణలు (ప్రెగ్నెన్సీలు) చాలా రిస్క్తో కూడుకున్నవే అవుతాయి. ఉదాహరణ ఒక మహిళకు హైబీపీ, డయాబెటిస్ లేదా గుండెజబ్బులు ఉండటం... ఒకవేళ ఆమె 35 ఏళ్లు దాటాక లేట్గా గర్భవతి కావడం... ఇలాంటి సందర్భాల్లో ఆమె గర్భధారణ అన్నది ప్రసవం వరకూ చాలా జాగ్రత్తగా పర్యవేక్షించాల్సిన సందర్భం అవుతుంది. ఇటీవల దాదాపు ప్రతి ప్రసవమూ ఆసుపత్రుల్లో ప్రసవాలు జరుగుతుండటంతో (ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ అవుతుండటంతో) రిస్క్ అనేది చాలావరకు తగ్గినప్పటికీ... కొన్ని గర్భధారణల్లో ఏ సందర్భంలో ఎటుపోయి ఎటువస్తుందో చెప్పలేని పరిస్థితీ, ఎలాంటి ఆకస్మిక పరిణామాలు ఎదురవుతాయో తెలియని అనిశ్చితి ఉండనే ఉంటుంది. ఇలాంటివాటినే హై రిస్క్ ప్రెగ్నెన్సీలుగా చెప్పవచ్చు. ఏయే సందర్భాలను ‘హై రిస్క్ ప్రెగ్నెన్సీలు’గా పరిగణిస్తారో, ఆ సందర్భాల్లో చేయించాల్సిన వైద్యపరీక్షలు, స్కాన్లతో సాటు తీసుకోవాల్సిన జాగ్రత్తల వంటి అనేక అంశాలను తెలిపే కథనమిది.ఇటీవల వైద్యవిజ్ఞానశాస్త్రాల్లో చాలా అభివృద్ధి చోటుచేసుకుంది. ఇంత పురోభివృద్ధి తర్వాత కూడా కొన్ని సందర్భాల్లో మాత్రం గర్భం ఎంత మేర నిలుస్తుందో చెప్పలేని సందర్భాలు ఎప్పుడూ ఉంటాయి. అది తల్లీ బిడ్డా ఇద్దరికీ కాస్తంత ప్రమాదకరంగా మారే అవకాశాలూ పొంచి ఉంటాయి. అలా తల్లికి గానీ లేదా కడుపులోని బిడ్డకుగానీ... ఒక్కోసారి ఈ ఇద్దరికీ సురక్షితమని చెప్పలేని పరిస్థితి ఉంటుంది. ఎన్నో రకాల కాంప్లికేషన్లు ఎదురయ్యే పరిస్థితి ఉంటుంది. అలాంటి గర్భధారణను ‘హైరిస్క్ ప్రెగ్నెన్సీ’గా చెప్పవచ్చు.ఎవరెవరిలో హైరిస్క్ ముప్పు ఉంటుందంటే... ప్రధానంగా ఈ కింద పేర్కొన్న మహిళలు ‘హై–రిస్క్ ప్రెగ్నెన్సీ’ కిందికి వస్తారని చెప్పవచ్చుదాదాపు 35 ఏళ్లు దాటాక (35 – 40 ఏళ్ల మధ్య వయసులో) గర్భవతులైనవారు.ఇప్పుడు గర్భవతిగా ఉన్న ఆ మహిళకు గతంలో వరసగా అబార్షన్లు కావడం లేదా పుట్టిన వెంటనే బిడ్డ చనిపోవడం వంటి వైద్యచరిత్ర (మెడికల్ హిస్టరీ) ఉండటం. మహిళలకు తాము గర్భందాల్చక ముందే అధిక రక్త΄ోటు(హైబీపీ), మధుమేహం (డయాబెటిస్), గుండెజబ్బులు, ధైరాయిడ్ సమస్య, ఆటోఇమ్యూన్ డిజార్డర్స్, మూర్ఛ (ఎపిలెప్సీ) వంటి ఆరోగ్య సవస్యలు ఉన్నవారు. ముందుగా డయాబెటిస్ లేనప్పటికీ గర్భధారణ తర్వాత మధుమేహం (జెస్టేషనల్ డయాబెటిస్), హైబీపీ కనిపించిన మహిళలు.గర్భధారణకు సంబంధించిన సమస్యలు... అంటే... గర్భంలో కవలలు లేదా ట్రిప్లెట్స్ ఉండటం, స్కాన్ చేసినప్పుడు బిడ్డకు ఆరోగ్యపరమైన సమస్యలుగానీ లేదా లోపాలుగానీ ఉన్నట్లు తెలిసిన సందర్భాల్లో, కడుపులో బిడ్డకు ఎదుగుదల సమస్యలు ఉండటం, బిడ్డలో జన్యుపరమైన లోపాలుండటం... వంటి సందర్భాల్లో. సాధారణ మహిళలతో పోలిస్తే... ఈ తరహా వైద్య చరిత్ర (మెడికల్ హిస్టరీలు) ఉన్నవాళ్లను ‘హైరిస్క్ ప్రెగ్నెన్సీ’ కేటగిరీలోకి వస్తారని చెప్పవచ్చు.హై రిస్క్ ప్రెగ్నెన్సీ...తెలుసుకోవడం ఇలా...ఒక మహిళ హైరిస్క్ గ్రూప్ కిందికి వచ్చే వస్తుందా అన్న విషయం నిర్ధారణ చేసుకోడానికి ఈ కింద పేర్కొన్న అంశాలు సహాయపడతాయి. వీటి సహాయంతో ఒక మహిళ తాను హైరిస్క్ ప్రెగ్నెన్సీ జాబితాలోకి వస్తుందా రాదా అన్నది తనకు తానే తెలుసుకోవచ్చు. గర్భధారణ నాటికి 35 ఏళ్ల వయసు మించి ఉండటం. దీనివల్ల సాధారణ మహిళలతో ΄ోలిస్తే... ఇలా లేట్గా గర్భధారణ జరగడంతో పుట్టే పిల్లల్లో క్రోమోజోమ్స్కు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. కేవలం బాగా ఆలస్యంగా జరిగిన గర్భధారణలోనే కాకుండా... ఒకవేళ ఓ అమ్మాయి 18 ఏళ్ల లోపు చిన్నవయసు బాలిక కావడం, చిన్న వయసులోనే ఆమెకు గర్భధారణ జరిగినప్పుడు కూడా పుట్టబోయే పిల్లల్లో ఎదుగుదల లోపాలు కనిపించే అవకాశాలుండటంతో దీన్నీ హైరిస్క్గానే పరిగణించాలి. ఒకవేళ గర్భంలో ఒకరికంటే మించి (అంటే... కవలలు లేదా ట్రిప్లెట్స్) ఉండటం వల్ల హైబీపీ రావడం లేదా నెలలు నిండకముందే ప్రసవం లాంటి సమస్యలు వచ్చే అవకాశాలుంటాయి. గర్భంలోని బిడ్డకు ఎదుగుదల లోపాలు ఉన్నప్పుడు. గర్భధారణ జరిగిన మహిళలకు హైబీపీ, చక్కెరవ్యాధి (డయాబెటిస్), గుండె జబ్బులు, థైరాయిడ్ సమస్య, ఆటోఇమ్యూన్ సమస్యలు, మూర్ఛ వంటి ఆరోగ్య సమస్యలున్నప్పుడు. ఇప్పటికే ఓసారి ఒక మహిళకు జన్యుపరమైన సమస్యలున్న బిడ్డ ఉండటం లేదా... ఆ బిడ్డకు గుండెజబ్బుగానీ, లోపంతో కూడిన ఎముకల కారణంగా బిడ్డకు వైకల్యం రావడం వంటి ఆరోగ్య చరిత్ర (మెడికల్ హిస్టరీ) ఉండటం. మహిళకు గర్భధారణ వ్యవస్థలో పెద్ద గడ్డలు (ఫైబ్రాయిడ్స్) వంటివి వచ్చిన వైద్య చరిత్ర (మెడికల్ హిస్టరీ) ఉండటం. గతంలో తరచూ అబార్షన్లు కావడం, మునుపు పిండం గర్భసంచిలో కాక... బయట ట్యూబుల్లోనే పెరగడం, గతంలో నెలలు పూర్తిగా నిండకముందే ప్రసవం జరగడం (ప్రీవియస్ హిస్టరీ ఆఫ్ ప్రిమెచ్యూర్ బర్త్), గతంలో బిడ్డ లోపలే చనిపోవడం వంటి మెడికల్ హిస్టరీ ఉంటే... హెచ్ఐవీ వంటి ఇన్ఫెక్షన్లు ఉండటం వల్ల అవి బిడ్డకు సోకే అవకాశాలున్నప్పుడు. పిల్లలు కలగడానికి చాలాకాలం చికిత్స తీసుకున్న తర్వాత గర్భం రావడం... ఇక్కడ పేర్కొన్న సందర్భాల్లో ఒక మహిళ గర్భందాల్చితే దాన్ని ‘హైరిస్క్ ప్రెగ్నెన్సీ’గా చెప్పవచ్చు. ఇలాంటి మహిళలకు గర్భధారణ సమయంలోనూ లేదా ప్రసవం సమయంలోనూ అనేక రకాల కాంప్లికేషన్లు కనిపించే అవకాశాలు ఎక్కువ. ఈ కాంప్లికేషన్లను రెండు రకాలుగా నివారించవచ్చు. మొదటిది మహిళ తానంతట తానే కొన్ని జాగ్రత్తలూ, సూచనలు పాటించి కాంప్లికేషన్లను నివారించుకోవడం, రెండోది వైద్యనిపుణుల సహాయంతో కాంప్లికేషన్లు నివారించుకోవడం. మహిళలు తమకు తాముగా ప్రెగ్నెన్సీ రిస్క్ల తాలూకు కాంప్లికేషన్ల నివారించుకోవడమిలా...హైరిస్క్ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ముందుగానే ఒకసారి ‘ప్రీ– కన్సెప్షనల్ కౌన్సెలింగ్’ కోసం డాక్టర్ను సంప్రదించాలి. ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలనుకున్నప్పుడు... దాదాపు మూడు నెలల ముందునుంచే కనీసం రోజుకు 400 మైక్రోగ్రాముల ఫోలిక్ యాసిడ్ తీసుకోవడం... (ఈ ఫోలిక్ యాసిడ్ మాత్రను గర్భం దాల్చాక కూడా పూర్తి గర్భధారణ టైమ్ మొత్తం వాడాలి. గర్భం ధరించిన సమయంలో వీలైనంతవరకు ఎలాంటి మందులూ తీసుకోకూడదు. ఒకవేళ తీసుకోవాల్సి వస్తే... ప్రతి మందునూ తప్పనిసరిగా డాక్టర్ సలహా మేరకు వాళ్లకు తెలిసి మాత్రమే తీసుకోవాలి. కొందరు మహిళలకు మూర్ఛ (ఎపిలెప్సీ), హైబీపీ, డయాబెటిస్ వంటి ఆరోగ్య సమస్యలు ఉంటే... గర్భం వచ్చినట్లు తెలియగానే కొందరు మహిళలు తాము వాడే మందుల్ని తమంతట తామే ఆపేస్తారు. అది తల్లీ, బిడ్డా ఇద్దరికీ ప్రమాదకరం. కాబట్టి తామేవైనా మందులు వాడాలన్నా లేదా అంతకుముందునుంచి వాడుతున్న మందులు ఆపేయాలన్నీ డాక్టర్ను సంప్రదించాకే ఆ పని చేయాలి. ఎందుకంటే హైబీపీ, మూర్చ (ఎపిలెప్సీ) వంటి వ్యాధులున్న మహిళలకు డాక్టర్లు వారి గర్భధారణ తసమయంలో వాడుతున్న మందులను గానీ లేదా వాటి మోతాదులనుగానీ మారుస్తారు. గర్భం దాల్చినట్లు నిర్ధారణ అయినప్పటి నుంచి క్రమం తప్పకుండా డాక్టర్తో నిత్యం డాక్టర్లు సూచించిన పరీక్షలు చేయిస్తూ ఉండాలి. కనీసం నెలలో ఒకసారైనా లేదా పరిస్థితి తీవ్రతను బట్టి డాక్టర్లు సూచించిన వ్యవధిలో డాక్టర్ను కలిసి అవసరమైన పరీక్షలు చేయిస్తుండాలి. ఏడో నెల దాటాక ఈ పరీక్షలు మరింత తరచుగా చేయించాల్సి రావచ్చు. సరైన టైముల్లో సరైన టీకాలు (ప్రాపర్ ఇమ్యూనైజేషన్) తీసుకోవాలి. మహిళలు తమ ఎత్తుకు తగినట్లుగా తమ ఆరోగ్య నిర్వహణకు తగిన బరువు ఉండేలా చూసుకోవడం, ఇందుకు సరైన ఆహార నియమాలు పాటించడం, అవసరమైన శారీరక వ్యాయామాలను చేయడం అవసరం. ఈ వ్యాయామాలు మరింత శ్రమ కలిగించేలా ఉండకూడదు. కొన్నిరకాల హైరిస్క్ ప్రెగ్నెన్సీల్లో డాక్టర్ బెడ్రెస్ట్ తీసుకోమని అంటే... దాన్ని తప్పనిసరిగా పాటించాలి. అయితే బెడ్రెస్ట్ అంటే పూర్తిగా మంచానికే పరిమితం కావడం కాదు. డాక్టర్ సలహా మేరకు కాబోయే తల్లి ఏమేరకు శారీరక శ్రమ చేయాలో... అలాగే ఏ మేరకు విశ్రాంతి తీసుకోవాలో చెబుతారు. దాన్ని అక్షరాలా పాటించాలి.వైద్యనిపుణులూ, సిబ్బంది సహాయంతో కాంప్లికేషన్ల నివారణ ఇలా... హై రిస్క్ ప్రెగ్నెన్సీ వల్ల ప్రసవ సమయంలో కలిగే దుష్పరిణామాలు, ప్రమాదకర పరిస్థితుల (కాంప్లికేషన్స్)ను నివారించడమన్నది ఈ రోజుల్లో చాలావరకు సాధ్యమే. ఇలాంటి రిస్క్లు ఉన్న మహిళలు... ఫిజీషియన్, ఎండోక్రినాలజిస్ట్, గుండెజబ్బుల నిపుణుడు, రుమటాలజిస్ట్, నరాల నిపుణుడు అందుబాటులో ఉండే హయ్యర్ మెడికల్ సెంటర్లలో తమ ప్రసవం జరిగేలా చూసుకోవడం మంచిది. ఫలితంగా ఆ మహిళకు అవసరం ఉన్న వైద్య చికిత్సలను బట్టి ఆ ప్రసవాన్నీ ఎలా ΄్లాన్ చేయాలో అన్నది వైద్యనిపుణులు చర్చించుకుని ఆ మేరకు సురక్షిత ప్రసవం జరగడానికి అవసరమైన నిర్ణయాలు తీసుకోడానికి, వాటిని అమలు చేయడానికి వీలవుతుంది. గర్భిణుల్లో రొటీన్ రక్తపరీక్షలకు తోడుగా... ఆమెకు తన రెండో నెలలోనే రక్తంలో చక్కెర మోతాదులను నిర్ధారణ చేసే పరీక్ష, థైరాయిడ్ పరీక్ష వంటివి నిర్వహిస్తే... పుట్టబోయే బిడ్డ, కాబోయే తల్లి తాలూకు ఆరోగ్య పరిస్థితిని ముందునుంచే తెలుసుకుంటూ ముందస్తు చికిత్స చేయడం... తద్వారా తర్వాతి కాంప్లికేషన్లను నిరోధించడమన్నది చాలావరకు సాధ్యమవుతుంది. ఇక మూత్రపిండాల (కిడ్నీ) సమస్య ఉన్న మహిళలు, హైబీపీ ఉన్నవాళ్లు, థైరాయిడ్ సమస్యతో బాధపడేవారు, తరచూ అబార్షన్లు అయినవారు గర్భధారణకు ముందే కొన్ని రక్త పరీక్షలు చేయించడం అవసరం, ప్రెగ్నెన్సీ సమయంలో 7–8 వారాలప్పుడే కొన్ని ఇంజెక్షన్లు వాడటం ద్వారా మున్ముందు చోటుచేసుకోబోయే చాలా రకాల ప్రమాదాలను (కాంప్లికేషన్లను) నివారించవచ్చు. స్కాన్ల సహాయంతో... అల్ట్రాసౌండ్ స్కాన్ సహాయంతో ముందుగానే గర్భంలోపల ఉన్న పరిస్థితిని తెలుసుకుని తగిన చికిత్స చేయడంతో టు... లోపాలు సరిదిద్దడానికీ ఆ స్కాన్లు ఉపయోగపడతాయి. బిడ్డలోని వైకల్యాలను, అసా«ధారణ పరిస్థితులనూ, లో΄ాలను తెలుసుకునేందుకు స్కాన్స్ ఎంతగానో ఉపయోగపడతాయి.అల్ట్రాసౌండ్ స్కాన్తో 11–14 వారాల సమయంతో గర్భధారణ నిర్దిష్టంగా ఎప్పుడు జరిగింది, గర్భంలోపల ఉన్న బిడ్డ ఒకరా, కవలలా, ఒకవేళ కవలలైతే ఒక వాళ్లు ఒకే అండం నుంచా లేక రెండు వేర్వేరు అండాల నుంచా అన్నది తెలుస్తుంది. న్యూకల్ ట్రాన్సు్యలెన్సీ స్కాన్ వల్ల చిన్నారిలో క్రోమోజోమ్కు సంబంధించిన లోపాలు ఏవైనా ఉంటే అవి పిండ దశలోనే తెలిసి΄ోతాయి. బిడ్డ స్వరూపం (స్ట్రక్చర్) ఎలా ఉందో కూడా కొంతవరకు తెలుస్తుంది. ఇది ఒక రకమైన స్క్రీనింగ్ పరీక్ష. ఇక 20–22 వారాలప్పుడు చేసే రొటీన్ స్కాన్ వల్ల చిన్నారి పూర్తి స్వరూపం (స్ట్రక్చర్) తెలుస్తుంది. అన్ని అవయవాలూ సక్రమంగా రూ΄÷ందాయో లేదో కూడా తెలిసిపోతుంది. క్రమం తప్పకుండా చేయించే స్కాన్ల వల్ల బిడ్డ మెదడు వంటి అత్యంత ప్రధాన అవయవాల్లో రక్తప్రసరణ వంటి కీలక అంశాలు తెలుస్తాయి. ఫలితంగా పిండదశలోనే ఏవైనా లో΄ాలు ఉంటే వాటిని చక్కదిద్దే అవకాశాలుంటాయి. ఇలాంటి పలు రకాల స్కాన్ల కాంబినేషన్లతో ఒక ప్రెగ్నెన్సీలో రిస్క్ మోతాదు ఎంత అన్నది నిర్థారణ చేస్తారు. దాన్ని బట్టి ఆ ప్రెగ్నెన్సీది హైరిస్కా, తక్కువ రిస్కా, లేదా రిస్కేమీ లేదా అన్నది దాదాపు 90 శాతం వరకు చెప్పగలుగుతారు. ఇప్పుడు అడ్వాన్స్డ్ చికిత్సలూ అందుబాటులో... గర్భధారణ సమయంలో ఎదురయ్యే రిస్క్లకు ఇప్పుడు చాలా రకాల చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. ఇటీవలి కాలంలో నియోనేటల్ చికిత్స ప్రక్రియలు చాలా అడ్వాన్స్ అవ్వడం వల్ల ఇలాంటి బేబీస్కు ఇప్పుడు అన్ని రకాల చికిత్సలు అందిస్తూ వాళ్లు మామూలుగానే మనుగడ సాధించేలా చేయవచ్చు. గతంలో వాళ్లకు న్యూరలాజికల్ సమస్యలు వస్తాయనే భావన ఉండేది. ఇప్పుడున్న వైద్యపరిజ్ఞానంతో అలాంటి సమస్యలనూ చాలావరకు అధిగమించవచ్చు. అలాంటి పిల్లల్లో కొన్ని అవయవాలు అంటే ఉదాహరణకు ఊపిరితిత్తులు అభివృద్ధి కావు. అప్పుడు కొన్ని ఇంజెక్షన్లను ఇవ్వడం ద్వారా ఊపిరితిత్తులను పూర్తిగా అభివృద్ధి చెందేలా చేయవచ్చు. అయితే ఇలాంటి చికిత్సలు– అన్ని అధునాతన సదు΄ాయాలు ఉన్న చికిత్స కేంద్రాల్లో ఉంచి తగిన పరిచర్యలు చేయడం ద్వారా బిడ్డనూ, తల్లినీ సంరక్షించవచ్చు. అలాగే బిడ్డ మానసిక ఎదుగుదలకు, తెలివితేటలకూ థైరాయిడ్ హార్మోన్లు అవసరం. అలాంటప్పుడు తల్లిలో థైరాయిడ్ లోపాలుంటే వాటిని సరైన సమయంలో పసిగట్టి చికిత్స అందించడం ద్వారా మంచి మానసిక ఆరోగ్యం, తెలివితేటలు ఉండే బిడ్డను కనేలా చేయవచ్చు. కాబోయే తల్లికి బీపీ, షుగర్ వంటివి ఉన్నట్లయితే వాటిని సమర్థంగా నియంత్రణలో పెట్టి తల్లినీ, బిడ్డనూ సంరక్షించవచ్చు. అందుకే... హైరిస్క్ ప్రెగ్నెన్సీలలో తల్లినీ, బిడ్డనూ సురక్షితంగా ఉంచాలంటే... ముందునుంచే మంచి వైద్యపర్యవేక్షణతో పాటు... కాబోయే తల్లికీ కొంత ప్రాథమిక పరిజ్ఞానం, కొన్ని అంశాలపై అవగాహన, పరిజ్ఞానం ఉండటం అవసరం. అలాంటివి వైద్య నిపుణులు తమ కౌన్సెలింగ్ సమయంలో చెబుతూ ఆమెకూ పలు అంశాలపై అవగాహన కల్పిస్తారు. డాక్టర్ శ్రుతి రెడ్డి పొద్దుటూరు కన్సల్టెంట్ ఆబ్స్టెట్రీషియన్, గైనకాలజిస్ట్ – లాపరోస్కోపిక్ సర్జన్ (చదవండి: Farah Khan: వెయిట్ లాస్ జర్నీ కోసం ఫరా ఖాన్ పాట్లు..! ఏకంగా సర్జరీ, జుట్టు కోసం..) -
వెయిట్ లాస్ జర్నీ కోసం ఫరా ఖాన్ పాట్లు..! ఏకంగా సర్జరీ, జుట్టు కోసం..
బరువు తగ్గడం సాధారణ వ్యక్తులుకే కాదు సెలబ్రిటీలకు సైతం కష్టమే. బాగా లగ్జరీ ఉంటారు కాబట్టి ఏవేవో షార్ట్కట్లతో అమాంతం బరువు తగ్గిపోతారని అనుకుంటుంటారు, కానీ అది అపోహే అని బాలీవుడ్ చిత్రనిర్మాత, కొరియోగ్రాఫర్ ఫరా ఖాన్ని చూస్తే ఇట్టే అర్థమవుతుంది. సోహా అలీఖాన్తో జరిగిన సంభాషణలో చాలా ఓపెన్గా నిజాయితీగా తన వెయిట్ లాస్ జర్నీ గురించి చెప్పిన విధానం వింటే..అబ్బా బరువు తగ్గడానికి ఇంత కష్టపడిందా అనిపిస్తుంది. ఇంతకీ ఆమెకు స్లిమ్ మారడానికి ఎంత టైం పట్టిందంటే..ఫరాఖాన్ సోహా అలీఖాన్తో జరిగిన పాడ్కాస్ట్ ఆల్ అబౌట్ హర్ సంభాషణలో 60 ఏళ్ల వయసులో తన బరువు తగ్గే జర్నీ గురించి మాట్లాడింది. అంతేగాదు ఆ క్రమంలో తాను ఎదుర్కొన్న చర్మం, జుట్టు సమస్యల గురించి కూడా చెప్పుకొచ్చింది. ఆ సంభాషణలో సోహా అలీ ఖాన్ ..మీరు ఎంతో అద్భుతంగా కనిపిస్తునన్నారని ఫరాని ప్రశంసిస్తుంది. అయితే ఎల్లప్పుడూ ఇలానే ఉండిపోలేం అని నవ్వుతూ కౌంటర్ ఇచ్చేసింది ఫరా. తాను పిల్లలు పుట్టే వరకు చాలా సన్నగా ఉండేదాన్ని అని, అయితే చర్మం చాలా భయంకరంగా ఉండేదని తెలిపింది. అందులోనూ తాను డే అండ్ నైట్ షిప్ట్లో నిరంతరం పనిచేస్తూ ఉండటంతో మరిన్ని ఆరోగ్య సమస్యలు ఫేస్ చేసినట్లు వెల్లడించింది. ఒకసారి తన భర్త, పిల్లలను తీసుకుని వెకేషన్కి వెళ్లామని, అప్పుడు తాను చాలా అధిక బరువుతో ఉన్నట్లు గుర్తు చేసుకున్నారామె. అయితే తాము అక్కడ ఒక రూమ్ తీసుకుని ఉన్నప్పుడూ ఒక మహిళా క్లీనర్ వచ్చి..తన భర్తను చూసి మీ అబ్బాయిని బయటకు వెళ్లమనిండి ఇల్లు తుడుస్తాను అంటుంది. దాంతో ఫరా కంగుతింటుంది. ఆ ఘటన తనను చాలా కలవరపాటుకు గురి చేసిందని తెలిపింది. అలా తాను 60 ఏళ్ల వయసులో బరువు తగ్గే జర్నీని ప్రారంభించానని, అదనపు బరువు కోల్పోవడానికి తనకు ఏడేళ్లే పైనే పట్టిందని తెలిపింది.తనకు పుట్టుకతో అదనపు చర్మం ఉండటం వల్ల బరువు తగ్గడంలో మార్పులు సత్వరం కనిపించలేదని, అందుకోసం టమ్మీ టక్ సర్జరీ చేయించుకోవాల్సి వచ్చిందని పేర్కొంది. అంతేగాదు 50 ఏళ్ల వయసులో చర్మ వ్యాధి నిపుణుడిని క్రమం తప్పకుండా సంప్రదించడం, దాంతోపాటు వెల్నెస్ స్పాలో విటమిన్ డ్రిప్స్, లింఫాటిక్ మసాజ్లు వంటివి తీసుకున్నట్లు వివరించింది. ఇక తన జుట్టు కోసం కూడా క్రమం తప్పకుండా విటమిన్లు తీసుకుంటున్నట్లు తెలిపింది. అంతలా కేర్ తీసుకుంటే గానీ ఫరా అంతలా స్లిమ్గా మారలేదన్నమాట. (చదవండి: కిరీటం గెలుపొందితే సరిపోదు..ఆ బాధ్యతలు కూడా చేపట్టాలి!) -
పిల్లల్లోనూ డిప్రెషన్? అందుకు అనేక రీజన్లు..
‘పిల్లలకు ఎలాంటి కష్టాలు ఉంటాయి? వారు రోజంతా ఆడుకుంటూ సంతోషంగా ఉంటారు’’ అని చాలామంది అనుకుంటారు. కానీ ఇది సరైన అభిప్రాయం కాదు. డిప్రెషన్ అనేది పెద్దవారికే కాదు... అది చిన్న పిల్లల్లో కూడా కనిపించే ఓ భావోద్వేగ సమస్య. అనేక పరిశోధనలు క్లినికల్ అనుభవాలు చిన్నపిల్లల్లో కూడా డిప్రెషన్ కనిపిస్తుందని నిర్ధారణ చేస్తున్నాయి. చిన్నపిల్లల్లో డిప్రెషన్ రావడానికి అనేక అంశాలు కారణమవుతాయి. అవి... పిల్లల్లో డిప్రెషన్ ఎందుకు వస్తుందంటే... 1. బయోలాజికల్ / శారీరక కారణాలుకుటుంబంలో డిప్రెషన్ లేదా యాంగై్జటీలతో కూడిన మెడికల్ హిస్టరీ ఉండటం మెదడులోని రసాయనాల (కెమికల్స్) అసమతుల్యత కారణంగా నిద్ర–ఆహార శైలిలో గందరగోళం 2. సైకాలజికల్ / భావోద్వేగ కారణాలు పిల్లల సున్నితమైన స్వభావం భయం, ఆత్మవిశ్వాసం లేకపోవడం చదువులో ఒత్తిడి 3. సామాజిక కారణాలు ఇంట్లో కలహాలు స్కూల్లో బుల్లీయింగ్కు గురికావడం స్నేహితుల లేమి, ఒంటరితనం ఎక్కువ సమయం టీవీ లేదా మొబైల్ స్క్రీన్కు అంటిపెట్టుకుని ఉండటం డిప్రెషన్ పిల్లల్లో ఎలా బయటపడుతుందంటే... చిరాకు, చిన్న విషయానికే ఏడవడం ఒంటరిగా ఉండాలనిపించడం స్కూల్కు వెళ్లడంలో నిరాసక్తత ఆటల్లో ఆసక్తి తగ్గిపోవడం ఆకలి తగ్గడం లేదా ఎక్కువగా తినడం నిద్రలో మార్పులు (ఎక్కువ నిద్ర / నిద్రలేమి) అలసట, నీరసం, నిస్సత్తువ ఆత్మవిశ్వాసం తగ్గుదల ∙తరచూ ‘‘పొత్తికడుపు నొప్పి, తలనొప్పి’’ వంటి ఫిర్యాదులుఈ లక్షణాలు 2–3 వారాలు కొనసాగితే నిపుణుడిని సంప్రదించడం మంచిది.ప్రతి బాధ డిప్రెషన్ కాకపోవచ్చు కానీ పిల్లల విషయంలో జాగ్రత్త అవసరం. ఎందుకంటే చిన్న పిల్లలు తమ భావాలను మాటల్లో చెప్పలేరు. వారు తమ ప్రవర్తన ద్వారానే తమ బాధల్ని వ్యక్తం చేస్తారు. అందుకే పిల్లల్లో ఆకస్మికంగా వచ్చిన మార్పులను తల్లిదండ్రులు, టీచర్లు గమనించాలి.తల్లిదండ్రులకు కొన్ని ముఖ్యమైన సూచనలు1. పెద్దలు తీర్పులు ఇవ్వకుండా పిల్లల మాట వినాలి (నాన్ జడ్జిమెంటల్ ఆటిట్యూడ్) ∙‘‘ఇంత చిన్న విషయానికే ఎందుకు బాధపడుతున్నావు?’’ వంటి మాటలను అనకూడదు. ∙పిల్లల అభిప్రాయాలనూ, భావాలనూ తగ్గించే మాటలు అనకుండా, ఠక్కున ఓ అభిప్రాయానికి వచ్చి దాన్ని వెల్లడించకుండా వారు చెప్పే మాటల్ని శ్రద్ధగా వినాలి. ఇది పిల్లల్లో భద్రతా భావాన్ని, నమ్మకాన్ని పెంచుతుంది.2. పిల్లలతో ఎక్కువ సమయం గడపడం (స్పెండింగ్ మోర్ అండ్ క్వాలిటీ టైమ్) ప్రతిరోజూ కొంత సమయం పూర్తిగా పిల్లలకోసమే కేటాయించాలి.∙కథలు చెప్పడం, బయట ఆటలు, కలిసి చేసే చిన్న పనులే అయినప్పటికీ ఇవన్నీ పిల్లల్లో వాళ్ల భావోద్వేగ బలాన్ని పెంచుతాయి. ∙నాణ్యమైన సమయం ఇవ్వడమన్నది పిల్లలను డిప్రెషన్కు గురికాకుండా చేసే ఒక సహజ రక్షణలాంటిది. చికిత్స ఇలా... కౌన్సిలింగ్ / ప్లే థెరపీ బిహేవియర్ థెరపీ అవసరమైనప్పుడు మాత్రమే అది కూడా సైకియాట్రిస్ట్ పర్యవేక్షణలోనే మందులు వాడటం. ఎంత త్వరగా చికిత్స చేస్తే ఫలితాలు అంతగా బాగుంటాయి. చివరగా... డిప్రెషన్ చిన్న పిల్లల్లోనూ కనిపించేందుకు అవకాశమున్న ఒక భావోద్వేగ సమస్య. దీన్ని వైద్య నిపుణుల సహాయంతో నయం చేయవచ్చు. సమయానికి గుర్తించడం, వారి ప్రవర్తనపై తీర్పులు ఇవ్వకుండా ప్రేమ, ఆప్యాయతలతో వారితో పెద్దలు ఎక్కువ సమయం గడపడం ద్వారా, అలాగే నిపుణుల సహాయం తీసుకుంటే వారిని డిప్రెషన్ను నుంచి దూరం చేయగలిగితే చిన్నారులు పూర్తిగా ఆరోగ్యంగా కోలుకుని, ఆనందంగా ఎదుగుతారు. డాక్టర్ గౌతమి నాగభైరవ, సీనియర్ సైకియాట్రిస్ట్ (చదవండి: ఎకాంథోసిస్ నైగ్రికాన్స్! చక్కెర చారలు..!) -
పీరియడ్స్ సమయంలో వ్యాయామం చేయొచ్చా?
స్త్రీలు తమ పీరియడ్స్ సమయంలో వ్యాయామాలు చేయకూడదని కొందరు అభిప్రాయపడుతుంటారుగానీ... నిజానికి మహిళలు తమ రుతు సమయంలో ఎలాంటి సంకోచాలూ లేకుండా వ్యాయామాలు చేయవచ్చు. ఆ టైమ్లో చేయకూడదన్నది కేవలం అపోహ మాత్రమే. చాలామంది క్రీడాకారిణులు తమ రెగ్యులర్ ప్రాక్టీస్లో భాగంగా రుతుసమయంలోనూ వ్యాయామం చేస్తుంటారు. దాంతో ఎలాంటి నష్టమూ జరగదు. అయితే మహిళలు తమ రుతు సమయంలో ఒక విషయంలో కొంత అప్రమత్తతతో ఉండాలి. అదేమిటంటే... రుతు సమయంలో వాళ్లు రక్తం కోల్పోతూ ఉండటం వల్ల వాళ్ల దేహంలో ఐరన్ మోతాదులు తగ్గే అవకాశం ఉన్నందున... ఐరన్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకుంటూ ఉండటం చాలా మేలు చేస్తుంది. ఐరన్ మోతాదులు ఎక్కువగా ఉండే ఆహారాలు... మాంసాహారాల్లో వేటవూంసం, చికెన్, చేపలు, లివర్, శాకాహారులైతే తాజా ఆకుకూరలు (పాలకూర వంటివి), ఎండుఖర్జూరం, గసగసాలు, చిక్కీ వంటి పదార్థాల్లో ఐరన్ మోతాదులు ఎక్కువ. ఇవి కేవలం పీరియడ్స్ సమయంలోనే కాకుండా మామూలు టైమ్లోనూ తీసుకుంటుంటే వారిలో ఐరన్ ఎప్పటికప్పుడు భర్తీ అవుతుంది.దూరంగా ఉండాల్సిన పదార్థాలివే... రుతు సవుయంలో వారు నువ్వులు, ఉప్పు, కొవ్వులు ఎక్కువగా ఉన్న ఆహారాన్ని ఎక్కువగా తీసుకుంటే దేహం కాస్తంత మందకొడిగా మారడంతో వ్యాయామాలు చురుగ్గా చేయలేక΄ోవచ్చు. కేవలం రుతు సమయంలోనే కాకుండా మిగతా టైమ్లో కూడా వీటితో చురుకుదనం తగ్గవచ్చు. కాబట్టి చురుగ్గా ఉండాలంటే... మహిళలు తమ ఆహారంలో ఉప్పు, కొవ్వులు తగ్గించాలి. రుతు సవుయంలో సాధారణ రోజుల కంటే నీళ్లు, పండ్లరసాల వంటి ద్రవాహారాలు ఎక్కువగా తీసుకోవడం మేలు చేస్తుంది. అంతేకాదు... వేళకు పడుకుని, కంటినిండా నిద్రపోవడం వల్ల పూర్తి ఆరోగ్యమూ బాగుంటుంది. వ్యాధినిరోధక వ్యవస్థ (ఇమ్యూనిటీ) మెరుగుపడుతుంది. (చదవండి: పార్కిన్సన్ రోగులకు హెల్ప్ అయ్యే 'ఆన్క్యూ') -
డ్రైఫ్రూట్స్ తెగ తినేస్తున్నారా? ఈ విషయం తెలుసుకోండి!
డ్రై ఫ్రూట్స్ సరైన మోతాదులో తీసుకోవడం వలన ఇందులో ఉండే పోషకాలు శరీరానికి చాలా మేలు చేస్తాయి. కానీ కొందరు వీటిని ఆరోగ్యానికి మంచిదని అతిగా తింటుంటారు. కానీ వీటిలో అధిక చకకెర ఉండటం వలన ఎక్కువ మోతాదులో తీసుకోవడం వలన ఇది ఆరోగ్య సమస్యలను కలిగించే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎంత వరకు తీసుకోవచ్చు?డ్రై ఫ్రూట్స్ సాధారణంగా, ప్రతి రోజు 20 నుండి 30 గ్రాముల తీసుకోవడం చాలా మంచిది. ఈ మోతాదులో తీసుకోవడం వలన శరీరానికి మంచి ΄ోషకాలు అందుతాయి. కానీ డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకుంటే ఇందులోని అధిక చక్కెర, ఫ్యాట్ అధికంగా ఉండి ఇవి అధికబరువుకు కారణం అవుతాయి.ఇదీ చదవండి: 17 ఏళ్ల తరువాత ఇండియాకు ఎన్ఆర్ఐ జంట, వీడియో వైరల్ -
సెలబ్రిటీల ఫిట్నెస్ సీక్రెట్..ఇలా చేస్తే..!
ఫిట్ నెస్, ఆరోగ్యకరమైన జీవనశైలి ప్రతి ఒక్కరికి చాలా ముఖ్యం. అయితే రకరకాల కారణాల వల్ల ఈ రోజుల్లో చాలామంది ఫిట్ నెస్, ఆరోగ్యంపై తగినంత శ్రద్ధ చూపలేకపోతున్నారు. కొంతమంది సినిమా సెలబ్రిటీలు మాత్రం తమ ఫిట్ నెస్, ఆరోగ్యకరమైన జీవనశైలితో ఎంతోమందికి స్ఫూర్తినిస్తున్నారు. వారెవరో, వారి ఆరోగ్య రహస్యాలేమిటో తెలుసుకుందాం. దీపికా పదుకోన్, అక్షయ్ కుమార్, శిల్పా శెట్టి వంటి సినీ తారలు తమ ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, వ్యాయామాలతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఈ సెలబ్రిటీలు శరీరాన్ని ఫిట్ గా ఉంచుకోడానికి, ఆరోగ్యాన్ని కా΄ాడుకోడానికి అసలు ఏం తింటారు, ఏం చేస్తారో తెలుసుకుందాం. శిల్పాశెట్టి.. ఒకప్పుడు భారత సినీ ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసిన నటి శిల్పాశెట్టి. ఈ మంగుళూరు భామ తరచు తన ఫిట్ నెస్ వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది. శిల్పా శెట్టి ఆహారపు అలవాట్లు, వ్యాయామ నియమాలు చాలా మందికి స్ఫూర్తినిస్తున్నాయి. దాదాపుగా ఐదుపదుల వయస్సులో కూడా శిల్పాశెట్టి ఫిట్ గా ఉండటానికి ఆమె ఆహారపుటలవాట్లే కారణం. ఉదయాన్నే నిమ్మరసం, తేనె కలిపిన గోరువెచ్చని నీరు తాగే శిల్పాశెట్టి.. బ్రేక్ ఫాస్ట్ గా ఓట్స్, పోహా, పప్పు చీలా వంటి ప్రొటీన్ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకుంటుంది. లంచ్లో బ్రౌన్ రైస్, కూరగాయలు, పండ్లు, చికెన్, చేపలు వంటివి తీసుకుంటుంది. చక్కెర, ప్రాసెస్ చేసిన ఆహారాలకు దూరంగా ఉంటానంటుంది శిల్పాశెట్టి.శిల్పాశెట్టి ఆరోగ్య యోగం: రెగ్యులర్గా యోగా చేయడంతోపాటు వెయిట్ ట్రైనింగ్, కార్డియో వ్యాయామాలు కూడా చేస్తూ చురుగ్గా ఉండటమే ఆమె ఆరోగ్య రహస్యం. అక్షయ్ కుమార్.. ఆరుపదల వయస్సుకు చేరువ అవుతున్నా కూడా ఫిట్ నెస్ విషయంలో ఈ బాలీవుడ్ హీరోని మించినవాళ్లు లేరంటే అతిశయోక్తి లేదు. క్రమశిక్షణకు మారుపేరైన అక్షయ్ కుమార్వ్యాయామం, యోగా, కార్డియోలకు ప్రాధాన్యతనిస్తారు. ఇవి ఆయన శరీరాన్ని ఎప్పుడూ ఫిట్గా, టోన్గా ఉంచుతాయి. ఆహారం విషయానికొస్తే అక్షయ్ కుమార్.. శరీరానికి కావాల్సిన ప్రొటీన్లను, శక్తిని అందించేలా ఉదయాన్నే పాలు, పరాటాలు తీసుకుంటారు. దీపికా పదుకోన్.. భారత సినీ పరిశ్రమలోనే కాకుండా విదేశాల్లో కూగా తన నటనతో అద్భుతమైన ప్రశంసలు,ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన దీపికా పదుకొణె ఫిట్ నెస్ విషయంలో అసలేమాత్రం రాజీపడదు. త్వరలోనే నాలుగవ పదిలోకి అడుగు పెట్టనున్న దీపికా పదుకోన్ ఫిట్ నెస్, అందం వెనుక ఆరోగ్యకరమైన ఆహారమే అసలు రహస్యం.దీపికా పదుకొణె ఉదయం ఆహారంలో గ్రీన్ టీ, ఓట్ మీల్ తీసుకుంటుంది. దీపికాకి సౌత్ ఇండియన్ ఫుడ్ అంటే బాగా ఇష్టపడే దీపికా బ్రేక్ ఫాస్ట్ లోకి దక్షిణ భారతీయ వంటకాలైన ఇడ్లీ, దోసెలను తీసుకుంటుంటుంది. క్రమం తప్పకుండా యోగా, వ్యాయామం చేస్తుంది. రణ్వీర్ సింగ్.. తన డిఫరెంట్ లుక్స్, స్టైల్, స్మైల్తో అందరినీ ఆకట్టుకునే బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్.. తన రోజును వ్యాయామం, కార్డియోతో ప్రారంభిస్తాడు, ఇది అతని శరీరాన్ని ఎల్లప్పుడూ చురుగ్గా, ఫిట్గా ఉంచడంలో తోడ్పడతాయి. ఉదయాన్నే ఎనర్జీ డ్రింక్స్ తాగుతాడు. ఆ తర్వాత అల్ఫాహారంలోకి ఓట్స్, డ్రై ఫ్రూట్స్, స్మూతీలు తీసుకుంటానంటున్నాడు. నిజానికి వీరు అనుసరించేవన్నీ చాలా చిన్న చిన్న ఆరోగ్య నియమాలే. అయితే వాటినే మనం ఫాలో కాము అసలు. ఇక్కడే వచ్చింది అసలు తేడా. -
పిల్లలను ఏ వయసులో కంటే మంచిది?!
ఏ వయసుకు ఆ ముచ్చట అంటుంటారు పెద్దలు. పెళ్లి, పిల్లల విషయంలోనే ఈ ప్రస్తావనను తీసుకు వస్తుంటారు. కానీ, మారిన రోజులు స్త్రీని తన కెరీర్ వైపు మొగ్గు చూపేలా చేస్తున్నాయి. ఉన్నత చదువులు, ఉద్యోగం, ఆర్థిక స్థిరత్వం, సరైన భాగస్వామి.. ఈ ఎంపికలతో పెళ్లి, పిల్లలను కనడం సాధారణంగానే ఆలస్యం అవుతోంది. ఇవి అమ్మాయిల ఆరోగ్యరీత్యా, సామాజిక రీత్యా ఇబ్బందులకు లోనయ్యే అంశం అని సర్వత్రా వినిపిస్తున్న మాటలు. ఇటీవల ఐఐటి హైదరాబాద్ విద్యార్థులతో ముచ్చటించిన ఉ΄ాసన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.‘పెళ్లి చేసుకుంటున్నారా...?!’ అని అడిగిన ప్రశ్నకు అమ్మాయిల కంటే అబ్బాయిలే ఎక్కువగా చేతులు పైకెత్తారని, మహిళలు కెరీర్ను నిర్మించుకోవడంపై దృష్టి పెట్టారని దీనిని బట్టి అర్ధమైంది. ఇది సరికొత్త భారత్’ అని పోస్ట్లో ఉ΄ాసన పేర్కొన్నారు. అమ్మాయిలు తమ అండాలను మెడికల్ పద్ధతిలో ఫ్రీజ్ చేసుకోవచ్చని, ఆర్థికంగా స్థిరపడిన తర్వాతే పెళ్లి చేసుకోవడం మంచిదని తన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. దీనిపై ఎంతోమంది నెటిజన్లు తమ భిన్నాభి్ర΄ాయాలను వెలిబుచ్చారు. దీనిపై ఉపాసన రియాక్ట్ అవుతూ మరో పోస్టు పెట్టారు. ‘నా దృష్టిలో పెళ్లి, కెరీర్ ఒకదానితో మరొకటి పోటీ కాదు. కానీ, ప్రతిదానికీ ప్రత్యేక సమయం ఉంటుందని భావిస్తున్నా. సరైన భాగస్వామి ఎదురయ్యే వరకు అమ్మాయి వేచి చూడటం తప్పా? పిల్లలకు ఎప్పుడు జన్మనివ్వాలన్నది పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవడం తప్పా ?’ అంటూ కొన్ని ప్రశ్నలు సంధించారు. ఈ సందర్భంగా ఏ వయసులో పిల్లలకు జన్మనివ్వడం మంచిది, దీనిపైన నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం.. – నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధిఒక అవకాశం మాత్రమే! దేనికుండే అవకాశాలు దానికి ఉన్నాయి. 30 ఏళ్లు దాటక ముందే పిల్లలను కనడం మంచిదే. 35 ఏళ్ల తర్వాత అంటే కష్టం. ఈ వయసులో అండాల విడుదల వేగం తగ్గిపోతుంటుంది. ప్రీ మెనోపాజ్ సమస్యలు తలెత్తుతుంటాయి. కెరీర్ను దృష్టిలో పెట్టుకొని... పెళ్లి, పిల్లల సంగతి తర్వాత చూద్దాం అనుకున్న అమ్మాయిలు వయసులో ఉన్నప్పుడే ఎగ్ ఫ్రీజ్ చేసుకోవచ్చు. క్యాన్సర్ వంటి ఆరోగ్య సమస్యలకు చికిత్సలు తీసుకుంటున్నవారూ ఈ పద్ధతిని అనుసరించవచ్చు. అందరూ చేయించుకోవాలనేం లేదు. అండాన్ని నిల్వ చేయడానికి ముందు చేసే మెడికల్ ప్రాసీజర్ కాస్ట్, ఎగ్ ఫ్రీజింగ్కి ఫీజు చెల్లించి, ప్రతియేడూ రెన్యువల్ చేసుకోవచ్చు. అయితే, ఇది ఒక ఆప్షన్ మాత్రమే. బయలాజికల్గా పిల్లలను కనడమే సరైన పద్ధతి. ఏదైనా సమస్యను అధిగమించేంతవరకే ఆలోచించాలి. కొంతమంది అమ్మాయిలు పై చదువులకు, ఉద్యోగాలకు విదేశాలకు వెళ్లాలి అనే ఆలోచనలో ఉంటారు. ఇలాంటప్పుడు పెళ్లి, పిల్లలను కనడంలో ఆలస్యం అవుతుంటుంది. తమ లక్ష్యంపై ఫోకస్ చేసుకోవడానికి ఎగ్ ఫ్రీజ్ చేసుకోవడంలో తప్పేమీ లేదు. కానీ, ఎక్కువ సమయం తీసుకోకూడదు. ఎందుకంటే ఫ్రీజింగ్ టెక్నాలజీ ఉన్నప్పటికీ సక్సెస్ రేట్ వంద శాతం ఎప్పుడూ ఉండదు. వందమందికి ఐవిఎఫ్ చేస్తే పది శాతం సక్సెస్ కావచ్చు. ప్రభుత్వ రూల్స్ ప్రకారం అమ్మాయిలు 21 ఏళ్ల నుంచి ఎగ్ ఫ్రీజ్ చేసుకోవచ్చు. 35 ఏళ్ల తర్వాత ఎగ్ ఫ్రీజింగ్ అంటే దాని సక్సెస్ రేట్ ఊహించలేం. విదేశాలలో కొన్ని ఆఫీసులలో తమ మహిళా సిబ్బందికి కంపెనీలే ఎగ్ ఫ్రీజింగ్ వెసులుబాటు కల్పిస్తున్నాయి. దీర్ఘకాలం కాకుండా నిర్ణీత సమయంలో తమ లక్ష్యాన్ని పూర్తి చేసుకోవాలనేవారికి ఇదొక అవకాశం మాత్రమే. – డాక్టర్ సుధారాణి బైర్రాజు, ఇన్ఫెర్టిలిటీ (ఐవిఎఫ్) స్పెషలిస్ట్, -
బ్యాక్టీరియా ఫ్యాక్టరీతో అంతా క్లీన్!
మీకు తెలుసా? తాగే నీరు స్వచ్ఛంగా ఉంటే చాలా రోగాలు మీ దగ్గరకు రావని? దురదృష్టం ఏమిటంటే.. దేశం ఎంతో పురోగమించింది కానీ.. ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణలతోపాటు పలు రాష్ట్రాల్లో కలుషితమైన నీరు ప్రజల ఆరోగ్యాన్ని దారుణంగా దెబ్బతీస్తోంది. మరీ ముఖ్యంగా సీసం (లెడ్). హైదరాబాద్, విశాఖపట్నాల్లో పారిశ్రామిక వ్యర్థాలను యథేచ్ఛగా కాలువల్లోకి కలిపేస్తూండటంతో తాగునీటిలో సీసం మొతాదు పెరిగిపోతోంది. ఫలితంగా పిల్లల్లో నాడీ సంబంధిత, ఎదుగుదల సమస్యలు, పెద్దల్లో గుండె, కిడ్నీ సమస్యలు వస్తున్నాయి. వ్యవసాయంలో వాడే రసాయనిక ఎరువులు నీటిలో కలిసినప్పుడు కూడా లెడ్ మోతాదు ఎక్కువైపోతుంది. యునిసెఫ్ అంచనా ప్రకారం ప్రపంచం మొత్తమ్మీద 80 కోట్ల మంది, భారత్లో సుమారు 27 కోట్ల మంది పిల్లలు లెడ్తో కలుషితమైన నీటి కారణంగా ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. అయితే... గౌహతిలోని ఐఐటీ శాస్త్రవేత్తలు ఇప్పుడు దీనికో వినూత్నమైన పరిష్కారం కనుక్కున్నారు. అది కూడా అతి తక్కువ ఖర్చుతో. వివరాలు ఇలా ఉన్నాయి....బ్యాక్టీరియా. పేరు చెప్పగానే వ్యాధులే గుర్తుకొస్తాయి కానీ కొన్ని బ్యాక్టీరియా మనకు ఎంతో మేలూ చేస్తాయి. గౌహతిలోని ఐఐటీ శాస్త్రవేత్తలు కూడా సీసం కాలుష్యాన్ని తొలగించేందుకు బ్యాక్టీరియా ఏదైనా ఉపయోగపడుతుందా? అని పరిశోధించినప్పుడు వారికి ఓ అద్భుతం కనిపించింది. సయనో బ్యాక్టీరియాలోని ఒకానొక రసాయనానికి నీటిలోని లెడ్ను 92.5 శాతం వరకూ తొలగించగలదని తెలిసింది. ఇది పేరుకు బ్యాక్టీరియా కానీ.... చెట్ల మాదిరి సూర్యుడి వెలుతురును వాడుకుని శక్తిని తయారు చేసుకోగలదు. ఇంకేముంది. ఈ బ్యాక్టీరియా సాయంతో శాస్త్రవేత్తలు నీటిని సీసం నుంచి శుద్ధి చేసేందుకు ఒక పద్ధతిని అభివృద్ధి చేశారు. ఈ పరిశోధన వివరాలు ప్రఖ్యాత ‘జర్నల్ ఆఫ్ హజార్డస్ మెటీరియల్స్’లో ప్రచురితమైంది. లెడ్ ఒకసారి నీటిలో కలిసిందంటే కొన్ని దశాబ్దాలపాటు అక్కడే ఉండిపోతుంది. ఈ నీరు తాగిన వారి శరీరాల్లో పోగుబడుతూ ఉంటుంది. ఇప్పటివరకూ ఈ కాలుష్యాన్ని తొలగించేందుకు రసాయనాలు లేదంటే కృత్రిమ పదార్థాలను ఉపయోగిస్తున్నారు. రెండూ ఖరీదెక్కువ. పైగా వీటి తయారీతోనూ కాలుష్యం ఎక్కువ అవుతుంది. ఈ నేపథ్యంలో గౌహతిలోని ఐఐటీ శాస్త్రవేత్తలు సహజ పద్ధతుల ద్వారా నీటిలోని లెడ్ను తొలగించే ప్రయత్నాలు ప్రారంభించారు. నేలలో సహజసిద్ధంగా ఉండే సయనో బ్యాక్టీరియా రకాలను వెతికి లెడ్కు అతుక్కుపోయే ఒక జాతిని గుర్తించారు. ‘ఫోమ్మిడియం కోరియం, ఎన్ఆర్ఎంసీ-50 అని పిలిచే ఈ జాతి బ్యాక్టీరియాను క్షుణ్ణంగా అధ్యయనం చేసినప్పుడు దీని సామర్థ్యం గురించి తెలిసిందని ఈ పరిశోధనలకు నేతృత్వం వహించిన బయోసైన్సెస్ అండ్ బయో ఇంజినీరింగ్ విభాగపు శాస్త్రవేత్త దెబాశీష్ దాస్ తెలిపారు. ఫ్యాక్టరీల్లాంటివి ఏవీ కట్టే అవసరం లేకుండా.. అతితక్కువ ఖర్చుతో ఈ బ్యాక్టీరియా నీటిని శుద్ధి చేస్తుందని తెలిపారు. ప్రస్తుతం ఉపయోగిస్తున్న పద్ధతులతో పోలిస్తే సగం ఖర్చుతోనే పని పూర్తిచేయవచ్చునన్నారు. మున్సిపాలిటీ, కార్పొరేషన్లు ఈ పద్ధతిని వాడుకోవడం ద్వారా పారిశ్రామిక ప్రాంతాల నుంచి వెలువడే లెడ్ వ్యర్థాలను నియంత్రించవచ్చునని తెలిపారు. ఎన్నో ప్రయోజనాలు..సయనో బ్యాక్టీరియా ద్వారా నీటిలో కలిసిన లెడ్ మాత్రమే కాకుండా.. క్రిమి సంహారకాలు, కలుపు నాశినిలు, పెట్రోలు, డీజిల్ వంటి హైడ్రోకార్బన్లు, కృత్రిమ రంగులను కూడా తొలగించవచ్చునని గౌహతి ఐఐటీ శాస్త్రవేత్తలు తెలిపారు. అంతేకాకుండా... బ్యాక్టీరియా తొలగించిన రసాయనాలను వేరు చేసి మళ్లీ వాడుకునేందుకూ అవకాశం ఉందని చెప్పారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉపయోగిస్తున్న రసాయనాల స్థానంలో వీటిని వాడటం వల్ల పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతుంది. ప్రస్తుతం తాము ఈ ప్రయోగాలను చిన్న స్థాయిలో జరిపామని, పెద్ద ఎత్తున జరిపేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశామని వివరించారు. -
జరగబోయేవన్నీ చెప్పగలనంటాడు!
నమస్తే డాక్టర్ గారు! నాకు 3 నెలల క్రితమే వివాహం అయింది. నా భర్త ఒక ప్రైవేట్ కంపెనీలో పని చేస్తాడు. ఆయన ప్రవర్తన, మాటలు చాలా విచిత్రంగా ఉంటాయి. ఎవరితోనూ పెద్దగా మాట్లాడడు. ఎప్పుడూ తన ఆలోచనల్లోనే మునిగిపోయి ఉంటాడు. ఎవరినీ నమ్మకూడదు అంటాడు. బయటకు వెళ్ళడానికి ఇష్టపడడు, ఇంట్లో కూడా వింతగా మాట్లాడుతుంటాడు. మొక్కలు, జంతువులు, పక్షుల భాషలు తనకు తెలుసని వాటితో ఏవేవో శబ్దాలతో మాట్లాడుతుంటాడు. ఇంటికి ఎవరైనా వస్తే వారి మొహం చూసి, కళ్ళు మూసుకొని, మీకిలా జరుగుతుంది అని అందరికీ భవిష్యత్తు గురించి చెబుతున్నాడు. నన్ను బాగానే చూసుకుంటాడు. డాక్టర్ దగ్గరికి వెళదామంటే ‘నీకేమైనా పిచ్చా’ అని అందరినీ దబాయిస్తున్నాడు. మాకేం చేయాలో అర్థం కావడం లేదు. మీరే ఏదైనా మంచి సలహా ఇస్తారని ఆశిస్తున్నాను! మీరు వివరించిన లక్షణాల ప్రకారం మీ భర్తకు కనిపిస్తున్న ప్రవర్తన ‘స్కిజో టైపల్ పర్సనాలిటీ డిజార్డర్ ‘ అనే ఒక మానసిక భ్రాంతికి దగ్గరగా ఉంది. ఈ సమస్యతో బాధపడే వ్యక్తుల ఆలోచనలు, నమ్మకాలు, ప్రవర్తన ఇతరులకు చాలా విచిత్రంగా, అసాధారణంగా కనిపిస్తాయి. ఉదాహరణకు, విపరీతమైన మూఢనమ్మకాలు, వాళ్ళకి ప్రత్యేక శక్తులు ఉన్నాయనుకోవడం, అందరిపై అనుమానం, మీరు చెప్పినట్లు, జంతువులు, మొక్కలతో మాట్లాడటం లాంటివి చేస్తుంటారు. మిగిలిన వారికి సాధారణంగా అనిపించే విషయాలలో కూడా వీళ్ళు నిగూఢ అర్థాలు వెతుకుతారు. వీరు ప్రపంచాన్ని చూసే విధానమే వేరుగా ఉంటుంది. ఎక్కువగా ఊహా ప్రపంచంలో బ్రతుకుతారు. అయితే వీరు తమ పనిని చేసుకోగలరు. లిమిటెడ్గా కుటుంబం వరకు బాగానే ఉన్నా బయట సామాజిక సంబంధాలు మాత్రం కలిగి ఉండలేరు. తమకి ఉన్నది ఒక సమస్య అని వారు గుర్తించలేరు. ఇది స్కిజోఫ్రీనియా అనే తీవ్రమైన మానసిక జబ్బు కాదు, కానీ దాని తేలికపాటి రూపం ఇది అని చెప్పవచ్చు. అనేక పరిశోధనల ప్రకారం స్కిజోఫ్రీనియా ఉన్న వారి కుటుంబ సభ్యులలో ఈ సమస్య ఎక్కువగా కనపడినట్లు నిరూపణలు ఉన్నాయి. కొన్నిసార్లు ఈ సమస్య తరువాతి కాలంలో పూర్తిస్థాయి ‘స్కిజోఫ్రేనియా’ లేదా ‘ఓసీడీ’ జబ్బు లాగా రూపాంతరం చెందవచ్చు కూడా. ఇదొక అరుదైన సమస్య కాబట్టి పూర్తిగా మార్చడం కూడా కష్టం, అయినా, సహనంతో, ప్రేమతో, మానసిక నిపుణుల సహాయంతో అతని ప్రవర్తనను చాలా వరకు మెరుగు పరచవచ్చు. మీరు మీకు దగ్గర్లో ఉన్న సైకియాట్రిస్ట్ని సంప్రదించండి. కొన్ని లక్షణాలు మందులతో తగ్గించవచ్చు, అతని ఆలోచనలు మార్చడం కోసం, సామాజిక వైపుణ్యాల అభివృద్ధి కోసం ‘సైకో థెరపీ’ చాలావరకు ఉపయోగపడుతుంది. అన్నింటికీ మించి కుటుంబ సభ్యులు అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం.డా. ఇండ్ల విశాల్ రెడ్డి, సీనియర్ సైకియాట్రిస్ట్(విజయవాడ. మీ సమస్యలు, సందేహాలు పంపవలసిన మెయిల్ ఐడీ: sakshifamily3@gmail.com)(చదవండి: PM Narendra Modi's Watch: రూపాయి నాణెంతో కూడిన ప్రధాని మోదీ వాచ్..! ధర ఎంత ఉంటుందంటే..) -
చలికాలం మూడ్ భద్రం
చలికాలం పని చేయబుద్ధి కాదు. హుషారుగా అనిపించదు. అదో వెలితిగా అనిపించే భావన. నిరాశ. ఆకలి లేకపోవడం. ఎండ, వెలుతురు లేక చిరాకు. ఇదంతా ఏదో మామూలు విషయం కాదని ‘సీజనల్ ఎఫెక్టివ్ డిజార్డర్’ (శాడ్) అనే ఒక విధమైన డిప్రెషన్ అని మనస్తత్వ నిపుణులు హెచ్చరిస్తున్నారు. చలికాలం వస్తే మూడ్ను చెక్ చేసుకుంటూ జాగ్రత్తలు తీసుకోడవం చాలా అవసరం అంటున్నారు. అసలు ఈ ‘శాడ్’ ఏమిటి?ఉదయాన్నే సూర్యుడి ముఖం చూసి పనిలో పడితే అదోతృప్తి. సూర్యకిరణాలు ఒంటిని తాకితే లోలోపల ఉత్తేజం. కాసింత ఎండ పొడ తగిలితే మనసంతా ఉత్సాహం. కాని చలికాలంలో వణికించే చలి ఆ అవకాశాన్ని అరుదుగా ఇస్తుంది. పొద్దున లేవగానే మంచు స్వాగతం పలుకుతుంది. రోజంతా పలుచటి వెలుతురు తప్ప సూర్యుడు అందించే ఉత్తేజం మనకు చేరదు. దాంతో ఒళ్లంతా బద్దకంగా, మనసంతా గజిబిజిగా అనిపిస్తుంది. ఇలాంటి స్థితిని ‘వింటర్ బ్లూస్’ అంటుంటారు. ఇంత వరకూ మామూలే. కాని కొందరికి ఈ సమయం చాలా నిరాశ, నిర్లిప్తతలు ఆవరిస్తాయి. ఏదో కోల్పోయినట్టు, అంతా ముగిసిపోయినట్టు అనిపిస్తుంది. కొందరికి ఆకలి మందగిస్తుంది. తెలియని డిప్రెషన్ కి కొందరు లోనవుతారు. దీన్నే ‘సీజనల్ ఎఫెక్టివ్ డిజార్డర్’ (శాడ్) అంటున్నారు వైద్యులు. ఇలాంటి పరిస్థితిని గమనించుకుంటూ ఉండాలని హెచ్చరిస్తున్నారు.ఎండకు– మెదడుకు...చలికాలం తొందరగా నిద్ర లేవాలనిపించదు. చలిలో లేచి ఏదైనా చేయాలనిపించదు. ఎనిమిది గంటలు దాటితే తప్ప సూర్యుడు తేటగా కనిపించడు. కాసింత వేడి ఒంటికి తగిలాక కొంచెం ఉత్సాహం వచ్చి పనులు మొదలుపెడతారు చాలామంది. ఇదంతా ఎందుకు? వాతావరణానికీ, మన మనసుకు మధ్య ఉండే సంబంధమే ఇందుకు కారణం అంటున్నారు మానసిక శాస్త్ర నిపుణులు. ‘సూర్యుడి వెలుగు కారణంగా మెదడులో కొన్ని రసాయనాలు విడుదలవుతాయి. అవి మనలో ఉత్సాహాన్ని నింపుతాయి. చలికాలంలో ఆ చర్యలు జరగకపోవడం వల్ల నిస్సారంగా, బద్దకంగా అనిపిస్తుంది’ అని వివరిస్తున్నారు.చలికాలమే మేలు అనుకుంటారా?ఎండాకాలం తట్టుకోలేనంత వేడి ఉంటుంది. చలికాలం వస్తే బాగుండని ఆ వేడి తట్టుకోలేక కొందరు అనుకుంటారు. కానీ కొందరికి మాత్రం చలికాలం నచ్చదు. రోజంతా ఉత్సాహం లేని పనులు చేస్తూ, గంటల కొద్దీ ఒకేచోట గడుపుతూ ఉంటారు. ఈ సమయంలో ఒంట్లో సెరటోనిన్, మెలటోనిన్ రసాయనాలు విడుదల కాకపోవడమే ఇందుకు కారణమంటున్నారు వైద్యులు. సూర్యరశ్మి తక్కువగా ఉండటం కూడా దీనికి తోడై డిప్రెషన్ లోకి నెట్టేస్తుందని అంటున్నారు. అందుకే చలికాలం అనగానే కొందరిలో ఆనందం మాయమైపోతుంది. సంతోషం దూరమవుతుంది. ఏ పనీ చేసేందుకు ఆసక్తి రాక మిన్నకుండిపోతుంటారు.దీన్ని గుర్తించేదెలా?‘సీజనల్ ఎఫెక్టివ్ డిజార్డర్’ అందరిలో ఉంటుందని చెప్పలేం. ఒకవేళ ఉన్నా, దాన్ని గుర్తించడం కష్టం. అత్యల్ప ఉష్ణోగ్రతలు కలిగిన దేశాల్లో చాలామంది దీని బారిన పడుతున్నారు. ఇటువంటి వారు తొందరగా డిప్రెషన్ లోకి వెళ్లిపోతున్నారు. తమకున్నది ‘సీజనల్ ఎఫెక్టివ్ డిజార్డర్’ అన్న విషయం కూడా వారికి తెలియడం లేదు. కొందరు ఈ డిప్రెషన్ నుంచి బయటపడేందుకు అధికంగా తినడం, దురలవాట్లకు లోనవడం వంటివి చేస్తున్నారు. దీంతో ఆ ప్రభావం అంతా వారి ఆరోగ్యం మీద పడి తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారు.శాడ్ లక్షణాలు...→ రోజువారి పనుల్లో ఆసక్తి కోల్పోవడం → నిరాశ ∙ఏకాగ్రత కోల్పోవడం→ ఒంటరితనం, ఏకాంతం ఇష్టపడటం→ నిద్రలేమి, అలసట (లేదా) అధిక నిద్ర, అధిక తిండి → నలుగురిలో కలవకపోవడంఏమిటి పరిష్కారం?→ చలికాలంలో రోజూ పొద్దున్నే లేచి వ్యాయామం, యోగా చేయడం ఉత్తమమైన మార్గం. దీని వల్ల శరీరానికి ఉల్లాసంగా అనిపించడంతోపాటు మానసికంగా ఏదో ఒక పని చేయాలన్న సంసిద్ధత ఏర్పడుతుంది.→ ఎక్కువసేపు ఒకే చోట కూర్చుని పనిచేయకుండా రకరకాల పనులపై దృష్టి నిలపడం మరో పరిష్కారం. → డిప్రెషన్ భావన వచ్చినప్పుడు ఆత్మీయులతో మాట్లాడటం, సంగీతం వినడం, డ్యాన్స్ చేయడం వంటివి మనసును తేలికపరుస్తాయని అంటున్నారు. → చలికాలాన్ని ప్రకృతి సహజమైన విషయంగా భావించి, మనసు దృఢ పరుచుకుంటే మానసికంగా బలవంతులు అవుతారని వైద్యులు సూచిస్తున్నారు. -
జస్ట్ నాలుగు నెలల్లో..24 కిలోల బరువు..! ఈ సింపుల్ డైట్ ప్లాన్తో..
వెయిట్లాస్ జర్నీలో కొందరు అద్భుతాలు సృష్టిస్తుంటారు. ఎంతలా అంటే.. ఎలాంటి క్రాష్ డైట్లు పాటించకుండా ఆరోగ్యకరమైన రీతీలో ఏదో మాయ చేసినట్లుగా అమాంతం స్లిమ్గా మారిపోయి అందర్నీ ఆశ్చర్యపరుస్తారు. ఇక్కడ అలానే జాహ్నవి అనే మహిళ ఎంత అద్భుతంగా బరువు తగ్గిందంటే..చాలా తక్కువ సమయంలోనే అధిక బరువుని కోల్పోయింది. అదికూడా ఆరోగ్యకరమైన పద్ధతిలోనే తగ్గడం విశేషం. అదెలాగో ఆమె మాటల్లోనూ సవివరంగా తెలుసుకుందామా..!.జాహ్నవి అనే మహిళ వెయిట్ లాస్ జర్నీలో అందరికీ స్ఫూర్తి అంటూ ఫిట్నెస్ నిపుణుడు మాక్ సింగ్ ఇన్స్టాగ్రామ్లో అందుకు సంబంధించిన వీడియోని షేర్ చేశారు. అంతేగాదు త్వరిగతిన ఫలితాలు పొందాలనుకునేవారికి ఆమె ప్రేరణ అని పోస్ట్లో పేర్కొన్నారు. బరువు తగ్గడం అనేది కాస్త కఠినమైన టాస్క్ అయినా..క్రమశిక్షణ, డెడికేషన్ ఉంటే..ఈజీగా బరువు తగ్గిపోవచ్చట. ముందుగా ఈ వెయిట్లాస్ జర్నీలో ప్రతిఒక్కరికి స్థిరత్వంతో కూడిన అంకితభావం ప్రధానమని..నొక్కి చెబుతోంది జాహ్నవి. తాను 94 కిలోల మేర అధిక బరువు ఉండేదాన్ని..జస్ట్ నాలుగు నెలల్లోనే 24 కిలోలు వరకు తగ్గిపోయానని పేర్కొంది. పైగా తన డైట్ ఎలా ప్లాన్ ఎలా ఉండేదో కూడా వివరించింది. ఉదయం నిద్ర లేచిన వెంటనే ఉసిరి కాయ రసం, ఐదు బాదం పప్పులు, అజ్వైన్(క్యారమ్ గింజలు), దాల్చిన చెక్క నీరు, నానబెట్టిన వాల్నెట్స్, మెంతినీరు తప్పనిసరిగా తీసుకుంటానని అంటోంది. బ్రేక్ఫాస్ట్ రొటీన్ (ఉదయం 8)అల్పాహారం కోసం, జాహ్నవి మిల్లెట్ దోస, చియా సీడ్ స్మూతీ, పెసరపప్పుతో చేసే ఇడ్లీ తింటానంటోంది.మిడ్-మార్నింగ్ రొటీన్ (ఉదయం 11)ఈ సమయంలో, ఫిట్నెస్ ప్రియురాలు సీజనల్ పండ్లు, ఫ్రూట్ స్మూతీ, రాగి (ఫింగర్ మిల్లెట్) మాల్ట్ను ఆశ్రయించింది.లంచ్ రొటీన్ (మధ్యాహ్నం 2)ఆమె లంచ్ మెనూలో బియ్యం, కూరగాయల కూర, పెరుగు, లేదా మిల్లెట్ పులావ్, మిశ్రమ కూరగాయలు, రైతా వంటి సరళమైన వంటకాలు ఉన్నాయి.స్నాక్ రొటీన్ (సాయంత్రం 4)స్నాక్స్ కోసం, జాహ్నవి తనకు తానుగా ఉడికించిన గుడ్డు, భెల్(మరమరాలు), నల్ల చన్నా (సెనగలు) చాట్ తీసుకున్నట్లు తెలిపింది.డిన్నర్ రొటీన్ (రాత్రి 7)ఆమె తన విందును ముందుగానే ముగించేదాన్ని అంటోంది. ఆమె ఆహారంలో కూరగాయలతో ఉడికించిన చికెన్, గుడ్డు ఆమ్లెట్, కూరగాయల కూరతో మిల్లెట్ రోటీ ఉన్నాయి.పడుకునే ముందు (రాత్రి 9)పడుకునే ముందు, జాహ్నవి హెర్బల్ టీ లేదా పుదీనా, కొత్తిమీర నీరు వంటి ఆరోగ్యకరమైన పానీయాలను తీసుకున్నట్లు తెలిపింది. ఇలా కేర్ఫుల్గా తీసుకునే డైట్పై ఫోకస్ పెడితే.. హెల్దీగా బరువు తగ్గడం ఏమంత కష్టం కాదని అంటోంది జాహ్నవి. గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం(చదవండి: అత్యుత్తమ చికెన్ రెసిపీ జాబితాలో బటర్ చికెన్కి చోటు..! ఎన్నో స్థానంలో ఉందంటే..) View this post on Instagram A post shared by Fitelo | Customised Diet Plans (@fitelo_tamil) -
కేన్సర్కు ఆహారం ఆన్సర్..!
ఇంగ్లిష్లోనూ తెలుగులోనూ కామన్గా ఓ సామెత ఉంది. అదే... ప్రివెన్షన్ ఈజ్ బెటర్ ద్యాన్ క్యూర్. అంటే చికిత్స కంటే నివారణ మేలు అని అర్థం. నిజమే... రోజూ ఆహారం తీసుకోక తప్పదు. అదే గనక ఆరోగ్యకరమైనది కావడంతోపాటు కేన్సర్ను నివారించేదైతే... అది కేవలం కేన్సర్నే కాదు... ఎంతో ఆత్మక్షోభనూ, మరెంతో వేదననూ నివారిస్తుంది. అంతేకాదు... భవిష్యత్తులో మందులకు పెట్టే బోలెడంత డబ్బునూ ఆదా చేస్తుంది. అన్నిటికంటే ముందుగా శారీరక బాధల నివారణతోపాటు మానసికమైన శాంతినీకాపాడుతుంది. అందుకే రోజూ ఎలాగూ తినే అవే ఆకుకూరలనూ, కాయగూరలనూ, పండ్లనూ మార్చి మార్చి తింటూ ఉంటే పై ప్రయోజనాలన్నీ కలుగుతాయి. ఏయే ఆహారపదార్థాలు ఏయే కేన్సర్లను నివారిస్తాయో, అలా నివారించడానికి వాటిల్లోని ఏ పోషకాలు తోడ్పడతాయో తెలుసుకుందాం. ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. తద్వారా కేన్సర్ను నివారించుకుందాం...పండ్లు... ఆకుకూరలు... ఆహారపదార్థాలు... ఇలా మనం రోజూ తినే పదార్థాలతోనే కేన్సర్లను నివారించుకోవడం సాధ్యమనే అనడం కాకుండా వాటిల్లోని ఏయే పోషక విలువలు అలా జరిగిందేందుకు దోహదపడతాయో తెలుపుతున్నారు కేన్సర్పై పరిశోధనలు సాగిస్తున్న శాస్త్రవేత్తలూ, ఆహారనిపుణులు. పైగా ఏయే ఆహారపదార్థాల్లోని ఏ నిర్దిష్టమైన పోషకం కేన్సర్ను ఎలా నివారిస్తుందో తెలుసుకునేందుకు యూకేకు చెందిన ‘వరల్డ్ క్యాన్సర్ రీసెర్చ్ ఫండ్’ ఆధ్వర్యంలో ఎప్పటికప్పుడు పరిశోధనలు కొనసాగుతున్నాయి. ఆ అధ్యయనాల ద్వారా కేవలం ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలు తినడం ద్వారానే చాలా సులువుగా కేన్సర్ను ఎలా నివారించగలమో తెలుసుకుందాం.పెదవులు, నోరు, ఫ్యారింగ్స్ కేన్సర్ నివారణకు... బాగా ముదురురంగులో ఉండే అన్ని రకాల పండ్లతోపాటు బాగా ముదురు ఆకుపచ్చరంగులో ఉండే ఆకుకూరలు పెదవులు, నోరు, ఫ్యారింగ్ కేన్సర్లను నివారిస్తాయి. అంతేకాదు... విటమిన్ ఏ ఎక్కువగా ఉండే పండ్లు కూడా నోరు, ఫ్యారింగ్స్ కేన్సర్లను నివారిస్తాయి. ఉదాహరణకు విటమిన్–ఏ ఎక్కువగా ఉండే బొప్పాయి, క్యారట్, మామిడి వంటి తాజా పండ్లు నోరు, ఫ్యారింగ్స్, క్యాన్సర్లను నివారణకు తోడ్పడతాయి. టొమాటోలోని లైకోపిన్ కూడా ఈ తరహా క్యాన్సర్ల నివారణకు ఉపయోగపడుతుంది. అంతేకాదు... ఈ లైకోపిన్తో మరో ఉపయోగం కూడా ఉంది. ఇందులో యాంటీ క్యాన్సర్ గుణాలతోపాటు గుండెజబ్బులను నివారించే గుణం కూడా ఉంది.కంటి కేన్సర్ నివారణకు... ఒమెగా 3–ఫ్యాటీ ఆసిడ్స్ ఎక్కువగా ఉండే సాల్మన్ చేపలు, వాల్నట్లతోపాటు గ్రీన్–టీ, బెర్రీ పండ్లు, పసుపు, విటమిన్–ఇ, విటమిన్–సి, విటమిన్–ఏ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలతో కంటి కేన్సర్లను సమర్థంగా నివారించవచ్చు. సెలీనియమ్, పీచుపదార్థాలు ఫైటోకెమికల్స్ ఎక్కువగా ఉండే బ్రెజిల్–నట్స్ కూడా కంటి క్యాన్సర్ నివారణకు తోడ్పతాయి.రొమ్ము కేన్సర్ నివారణకు... దానిమ్మ పండులోని ఎలాజిక్ యాసిడ్ అనే పోషకంలోని పాలీఫినాల్స్ రొమ్ముక్యాన్సర్ను సమర్థంగా నివారిస్తాయి. అలాగే కెరొటినాయిడ్ అనే పోషకం ఎక్కువగా ఉండే పాలకూర, క్యారట్, బ్రాకలీలు కూడా రొమ్ముక్యాన్సర్ నివారణకు గణనీయంగా తోడ్పడతాయి. ప్రైమరీ యాంటీ ఆక్సిడెంట్ ఎక్కువగా ఉండే గ్రీన్–టీ కూడా రొమ్ము క్యాన్సర్ నివారణకు చాలావరకు తోడ్పడుతుంది.గాల్బ్లాడర్ కేన్సర్ నివారణకు... ఊబకాయం / స్థూలకాయం రాకుండా ఆరోగ్యకరమైన పరిమితిలో బరువును నియంత్రించుకోవడమన్నది గాల్బ్లాడర్ క్యాన్సర్ నివారణకు బాగా తోడ్పడే అంశం. ఇలా బరువును నియంత్రించుకోవడం అన్నది కేవలం ఒక్క గాల్బ్లాడర్ కేన్సర్ నివారణకు మాత్రమే కాకుండా పెద్దపేగు, ప్రోస్టేట్, ఎండోమెట్రియమ్, మూత్రపిండాలు, రొమ్ము కేన్సర్ల నివారణకూ తోడ్పడుతుంది. ఇందుకోసం ఆరోగ్యకరంగా ఉండే కొవ్వులు తక్కువగా తీసుకుంటూ ఆకుకూరలు మాత్రం ఎక్కువ మోతాదులో తీసుకుంటూ ఉండాలి.మూత్రాశయ (బ్లాడర్) కేన్సర్ల నివారణకు... క్రూసిఫెరస్ వెజిటబుల్స్ జాతిగా పేరుపడ్డ క్యాబేజీ, బ్రాకలీ వంటి ఆహారాలతో మూత్రాశయ (బ్లాడర్) క్యాన్సర్ను సమర్థంగా నివారించవచ్చు. యూనివర్సిటీ ఆఫ్ టెక్సస్లోని యాండర్సన్ కేన్సర్ సెంటర్లో తేలిన అంశాలను బట్టి విటమిన్–ఇ లోని ఆల్ఫా టోకోఫెరాల్ అనే జీవరసాయనం బ్లాడర్ కేన్సర్ నివారణకు బాగా ఉపయోగపడుతుంది. పాలకూర, బాదాంలతోపాటు పొద్దుతిరుగుడునూనె, కుసుమ నూనెలోనూ విటమిన్–ఇ మోతాదులు ఎక్కువ. ఇక మిరియాలలో ఉండే పోషకాలు కూడా బ్లాడర్ క్యాన్సర్ నివారణకు ఉపయోగపడతాయి. మూత్రపిండాల (కిడ్నీ) కేన్సర్ నివారణకు... నారింజ రంగులో ఉండే కూరగాయలు (ఉదాహరణ క్యారట్)తో పాటు టొమాటో, అల్లం, ఆప్రికాట్ వంటివి... మూత్రపిండాల (కిడ్నీ) క్యాన్సర్ నివారణకు బాగా తోడ్పడతాయి. కిడ్నీల ఇన్ఫ్లమేషన్ను బెర్రీ పండ్లు గణనీయంగా తగ్గిస్తాయి. ఫలితంగా కిడ్నీ జబ్బుల ముప్పు కూడా బాగా తగ్గిపోతుంది. ఇక పొట్టు తీయని ధాన్యాలు, నట్స్, బఠాణీ, చిక్కుళ్ల వంటి ఫైటేట్ అనే పోషకం ఉన్న ఆహారాలు మూత్రపిండాల క్యాన్సర్ నివారణకు సమర్థంగా తోడ్పడతాయి.గర్భాశయ ముఖద్వార (సర్విక్స్) కేన్సర్ నివారణకు... ఆహారంలో విటమిన్–ఇ, విటమిన్–సి ఎక్కువగా ఉండేలా చూసుకోవడం అని చర్య సర్విక్స్ క్యాన్సర్ నివారణకు బాగా ఉపకరిస్తుంది. ఉదాహరణకు క్యారట్, చిలగడదుంప, గుమ్మడి వంటి ఆహారాలతో దీన్ని చాలాబాగా నివారించవచ్చు. ఎలాజిక్ ఆసిడ్స్ అనేవి క్యాన్సర్ పెరుగుదలను అరికడతాయి. ఈ పోషకం స్ట్రాబెర్రీ, రాస్ప్బెర్రీ, వాల్నట్, దానిమ్మ, ద్రాక్ష, ఆపిల్, కివీ పండ్లలో పుష్కలంగా ఉంటుంది కాబట్టి వాటిని తీసుకోవడం ద్వారా గర్భాశయ ముఖద్వారా (సర్విక్స్) కేన్సర్ను సమర్థంగా నివారించవచ్చు. అయితే ఇక్కడ ఓ చిన్న జాగ్రత్త పాటించడం మేలు చేస్తుంది. అదేమిటంటే... చక్కెర మోతాదులు తక్కువగా ఉండే (లో–గ్లైసీమిక్) పండ్లైన దానిమ్మ, ఆపిల్ వంటి పండ్లతో ఈ క్యాన్సర్ నివారణ మరింత తేలిక.తల, మెడ (హెడ్ అండ్ నెక్) క్యాన్సర్ల నివారణకు... పసుపు, నారింజ, ఎరుపు, ఆకుపచ్చ, తెల్లటి తొక్క కలిగి ఉండే పండ్లు తల, మెడ క్యాన్సర్లను నివారిస్తాయి. ఇందులో ఉండే ఫైటో కెమికల్స్ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ల నివారణకు తోడ్పడతాయి. అలాగే ఈ పండ్లలోనే మెరుపు కలిగి ఉండే (కొద్దిపాటి మెరుపుతో బ్రైట్గా ఉండే) తొక్కతో ఉండే పండ్లు ఈ హెడ్ అండ్ నెక్ కేన్సర్లను మరింత సమర్థంగా నివారిస్తాయి. ఉదాహరణకు... నారింజ, కివీ, జామ, పైనాపిల్ పండ్లు తల, మెడ క్యాన్సర్లను నివారణకు సమర్థంగా తోడ్పడతాయి.బ్రెయిన్ కేన్సర్ కణుతుల నివారణకు... ఉల్లి, వెల్లుల్లి జాతికి చెందిన రెబ్బలలో మెదడు (బ్రెయిన్) కేన్సర్ను నివారించే గుణం ఎక్కువ. (అన్నట్టు వీటిలోని యాంటీ క్యాన్సర్ ΄ోషకాలు కేవలం బ్రెయిన్ కేన్సర్నే కాదు... ఇతరత్రా చాలా రకాల క్యాన్సర్ల నివారణకూ ఉపయోగపడతాయి). ఇక ఒమెగా 3–ఫ్యాటీ ఆసిడ్స్ ఎక్కువగా ఉండే వాల్నట్, లిన్సీడ్ ఆయిల్తో మెదడు కేన్సర్లు తేలిగ్గా, సమర్థంగా నివారితమవుతాయి. ఇవి కేన్సర్ నివారణతోపాటు వ్యక్తుల్లో వ్యాధి నివారణ వ్యవస్థను (ఇమ్యూనిటీని) పటిష్టం చేసేందుకూ ఉపయోడపడతాయి.ఒవేరియన్ కేన్సర్ నివారణకు... క్యారట్ల వంటి వాటితో పాటు పసుపురంగూ, నారింజరంగుల్లో ఉండే వెజిటబుల్స్తో (ఉదాహరణకు బెల్పెప్పర్ వంటివాటితో) ఒవేరియన్ క్యాన్సర్ను సమర్థంగా నివారించవచ్చు. కెరటినాయిడ్స్ ఎక్కువగా ఉండే క్యారట్ వంటివి రోజూ అరకప్పు మోతాదులో రెండు సార్లు తీసుకోవడం వల్ల ఒవేరియన్ క్యాన్సర్ను సమర్థంగా నివారించవచ్చని అమెరికన్ కేన్సర్ సొసైటీ వంటి ప్రజోపయోగ, పరిశోధనల సంస్థల అధ్యయానాల్లో తేలింది.జీర్ణాశయ (స్టమక్) క్యాన్సర్ నివారణకు... జీర్ణాశయ (స్టమక్) కేన్సర్ నివారణకు కాప్సికమ్ (కూరగా వండటానికి ఉపయోగించే బెంగళూరు మిరప లేదా బెల్పెప్పర్)లో ఉండే ఫైటోకెమికల్స్ బాగా ఉపయోగపడతాయి. పరిమితంగా తీసుకునే మిరపకాయలు ’ మిర్చీ వంటి వాటితోపాటు మిరియాల పరిమిత వాడకం కూడా స్టమక్ క్యాన్సర్ను నివారిస్తాయి. ఆకుకూరలు, పొట్టుతో ఉండే ధాన్యాలు, తాజా పండ్లు అనేక కేన్సర్ల నివారణతో పాటు జీర్ణాశయ కేన్సర్ రిస్క్ను తగ్గిస్తాయి. జీర్ణాశయ క్యాన్సర్ నివారణకు ఉప్పు వాడకాన్ని గణనీయంగా తగ్గించడమూ అవసరమే.కాలేయ కేన్సర్ నివారణకు... పాలీఫీనాల్, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండే బ్లూబెర్రీ పండ్లు, విటమిన్–ఇ పుష్కలంగా ఉండే బెల్పెప్పర్, పాలకూర, బాదం వంటి ఆహార పదార్థాలు కాలేయ క్యాన్సర్ నివారణకు తోడ్పడతాయి. ఇక నూనెల్లో పొద్దుతిరుగుడు నూనె, కుసుమ నూనెలు కూడా కాలేయ కేన్సర్ నివారణకు దోహదపడతాయి. అయితే ఈ నూనెలను పరిమితంగా మాత్రమే తీసుకోవాలని గుర్తుంచుకోవాలి.ఎముక కేన్సర్ నివారణకు... యాంటీ ఆక్సిడెంట్స్ అనే పోషకాలు ఆక్సిడేషన్ ప్రక్రియతో వెలువడే విషయాలను (టాక్సిక్ మెటీరియల్స్ను) విరిచేస్తాయి. ఇలాంటి యాంటీఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండే పండ్లు, ఆకుకూరలు... ఉదాహరణకు బెర్రీలు, చెర్రీలు, టొమాటో, బ్రాకలీ వంటివి ఎముక కేన్సర్ను సమర్థంగా నివారిస్తాయి. అలాగే ఒమెగా 3–ఫ్యాటీ ఆసిడ్స్ అనేక పోషకాలు పుష్కలంగా ఉండే సాల్మన్ చేపలు, వాల్నట్లతోనూ ఎముక క్యాన్సర్లు బాగానే నివారితమవుతాయి. ఇక ప్రోటీన్లు ఎక్కువగా ఉండే మాంసాహారం, చేపలు, గుడ్లతోనూ ఎముక క్యాన్సర్ త్వరితంగా నివారితమవుతుంది.చివరగా... ఆహారం తీసుకోవడం అన్నది మన జీవక్రియల కోసం మనం రోజూ తప్పక చేసే పని అయినందున... ఆ ఆహారాన్నే తాజా ఆకుకూరలు, కూరగాయలు, తాజా పండ్ల రూపంలో మరింత ఆరోగ్యకరంగా తీసుకోవడం వల్ల ఒకే సమయంలో రెండు సౌకర్యాలు సమకూరతాయి. అవి ఆరోగ్యంగా ఉండటం, అలా ఆరోగ్యంగా ఉండటం వల్ల వ్యాధి నిరోధకత మన సొంతం కావడంతో ఈ ఇమ్యూనిటీ కూడా క్యాన్సర్ల నివారణకు తోడ్పడుతుందని గుర్తుంచుకోవాలి. ఇలా తీసుకున్న ఆహారం వల్ల ఒళ్లు పెరగకుండా తగినంత వ్యాయామమూ చేయడం వల్ల ఈ మార్గంలో క్యాన్సర్ నివారణ మరింత సమర్థంగా చేయడం సాధ్యమవుతుంది. డాక్టర్ రాజేష్ బొల్లం, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్నిర్వహణ యాసీన్ -
గర్భిణులకు ఫ్లూ వ్యాక్సిన్ తప్పనిసరా..?
నేను రెండు నెలల గర్భవతిని. కొంతమంది ‘ఫ్లూ వ్యాక్సిన్’ తప్పకుండా వేయించుకోవాలంటున్నారు. కాని, నేను గత సంవత్సరం వేయించుకున్నాను. ఇప్పుడు మళ్లీ అవసరమా? ఈ వ్యాక్సిన్ గర్భధారణలో మంచిదేనా?– రమ్య, చిత్తూరు. గర్భిణులకు ఫ్లూ వ్యాక్సిన్ చాలా అవసరం. గర్భధారణ సమయంలో రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది, అందుకే ఫ్లూ వంటి వైరల్ ఇన్ఫెక్షన్లు గర్భిణులపై ఎక్కువ ప్రభావం చూపుతాయి. ఫ్లూ వల్ల దగ్గు, జలుబు మాత్రమే కాకుండా కొన్నిసార్లు న్యూమోనియా, శ్వాసకోశ ఇన్ఫెక్షన్ వంటి తీవ్రమైన సమస్యలు కూడా రావచ్చు. ఫ్లూ వైరస్ ప్రతి సంవత్సరం మారుతూనే ఉంటుంది. కాబట్టి మీరు గత సంవత్సరం తీసుకున్నా, ఈ ఏడాది కూడా కొత్త స్ట్రెయిన్కి అనుగుణంగా వ్యాక్సిన్ మళ్లీ వేయించుకోవాలి. సాధారణంగా అక్టోబర్ నుంచి మే మధ్యకాలం వరకు ఫ్లూ వైరస్ ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది. అందుకే గర్భిణులు నవంబర్ సమయానికి ఫ్లూ షాట్ తీసుకోవడం మంచిది. ఇది పూర్తిగా సురక్షితమైన వ్యాక్సిన్. మీకు మాత్రమే కాకుండా మీ బిడ్డకూ ఈ వ్యాక్సిన్ రక్షణ కల్పిస్తుంది. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత మీ శరీరంలో ఏర్పడే యాంటీబాడీలు ప్లాసెంటా ద్వారా బిడ్డకు చేరతాయి. ఆ రక్షణ వల్ల పుట్టిన తరువాత కూడా ఆరు నెలల పాటు బిడ్డకు ఫ్లూ ఇన్ఫెక్షన్ నుంచి సహజమైన రక్షణ లభిస్తుంది. ఎందుకంటే ఆ వయసులో పిల్లలకు ఫ్లూ వ్యాక్సిన్ ఇవ్వడం సాధ్యమవదు. ఫ్లూ వ్యాక్సిన్ వల్ల ఫ్లూ రాదు, వైరస్ తీవ్రతను గణనీయంగా తగ్గిస్తుంది. వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత రెండు వారాల లోపే శరీరంలో యాంటీబాడీలు తయారవుతాయి. తేలికపాటి జ్వరం, చేతి నొప్పి, బలహీనత వంటి చిన్న దుష్ప్రభావాలు రావచ్చు కాని, అవి తాత్కాలికం. మొత్తం మీద, ప్రతి గర్భిణీ మహిళ ఫ్లూ వ్యాక్సిన్ తప్పకుండా వేయించుకోవాలి. ఇది తల్లీ బిడ్డలిద్దరికీ రక్షణ కలిగించే సురక్షితమైన, అవసరమైన టీకా. మీరు ఇప్పటికే వేసుకున్నా, ఈ సంవత్సరం మళ్లీ వేయించుకోవడం ఉత్తమం. డెలివరీ తర్వాత ఫ్లూ వ్యాక్సిన్ తీసుకోవచ్చు. ఇది సాధారణ జలుబు, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లను నివారించడానికి ఉపయోగపడుతుంది. కొందరికి తేలికపాటి తలనొప్పి, కండరాల నొప్పి ఒకటి రెండు రోజులు ఉండొచ్చు, కాని, అది సాధారణం. గర్భిణులు లేదా తాజాగా డెలివరీ అయిన తల్లులు కూడా ఈ వ్యాక్సిన్ తీసుకోవచ్చు. ఇది తల్లికి, పాలిచ్చే శిశువుకి ఎటువంటి హాని చేయదు.నాకు ఇది మూడవ ప్రెగ్నెన్సీ, మూడవనెల. ముందు రెండు నార్మల్ డెలివరీలు అయ్యాయి. ఈసారి కూడా నార్మల్ డెలివరీ అవుతుందనుకుంటున్నాను. కాని, డెలివరీ అయిన వెంటనే పిల్లలు కలగకుండా చేసే పద్ధతులు ఉన్నాయని విన్నాను. అవి నిజంగా పనిచేస్తాయా? ఎంతవరకు సేఫ్గా ఉంటాయి?– బింధు, హైదరాబాద్. ఇప్పుడున్న ‘ఎల్ఏఆర్సీ’ అంటే (లాంగ్ యాక్టింగ్ రివర్సబుల్ కాంట్రాసెప్షన్) అనే పద్ధతులు చాలా సురక్షితంగా, ప్రభావవంతంగా పనిచేస్తాయి. ఈ కాలంలో జీవితం బిజీగా ఉండటంతో, చాలా మంది మహిళలు డెలివరీ తర్వాత త్వరగా గర్భం రావడం వల్ల ఇబ్బంది పడుతున్నారు. అందుకే డెలివరీ సమయంలోనే ఈ పద్ధతుల గురించి మాట్లాడి, వాటిని అమలు చేయడం ఉత్తమం. మీరు ఇప్పటికే మూడో నెల దాటారు కాబట్టి, ఈసారి డెలివరీ రూమ్లోనే ఎల్ఏఆర్సీ ఆప్షన్ గురించి చర్చించుకోవచ్చు. నార్మల్ డెలివరీలో, ప్లాసెంటా బయటికి వచ్చిన పది నిమిషాల లోపలే ‘ఐయూసీడీ’ అంటే ‘ఇంట్రా యూటరైన్ కాంట్రాసెప్టివ్ డివైస్’ అనే పరికరాన్ని గర్భసంచిలో ఉంచవచ్చు. అది ఆ సమయానికే సులభంగా వేయవచ్చు. ఏదైనా కారణం వలన ఆ సమయంలో వేయలేకపోతే, వారం రోజుల్లో కూడా సులభంగా చేయవచ్చు. ఇది అనుభవజ్ఞులైన సీనియర్ డాక్టర్లు డెలివరీ రూమ్లోనే సురక్షితంగా చేస్తారు. ఇది పేషెంట్కి చాలా ఈజీగా, సౌకర్యంగా ఉంటుంది. డిశ్చార్జ్ అయ్యేలోపే చెక్ చేసి, సరిగా ఉన్నదని నిర్ధారిస్తారు. పైగా ఇది చాలా ఖర్చు తక్కువగా ఉంటుంది. తర్వాత వేరే సమయంలో మళ్లీ వచ్చి చేయాల్సిన అవసరం ఉండదు. డెలివరీ రూమ్లోనే ఇది పూర్తవడం వల్ల, మహిళకు భవిష్యత్తులో అవాంఛిత గర్భాలు రాకుండా నిరోధించవచ్చు. ఈ పద్ధతి సురక్షితమైనదే కాకుండా, చాలా ప్రభావవంతంగా ఉంటుంది. ఎటువంటి పెద్ద సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. అయితే, ప్రతి మెథడ్కి చిన్నచిన్న జాగ్రత్తలు ఉండేలా, కొన్ని చిన్న ప్రతికూలతలు కూడా ఉంటాయి. ఐయూసీడీ వేసిన తర్వాత కొందరికి కొంచెం ఎక్కువ బ్లీడింగ్ రావచ్చు, కొద్దిగా నొప్పి ఉండొచ్చు. అరుదుగా డివైస్ ఊడిపోవచ్చు లేదా దాని దారాలు లోపలికి ఎక్కువగా వెళ్లిపోవచ్చు. అప్పుడు చెక్ చేయడం కాస్త కష్టమవుతుంది. ఇవన్నీ చాలా అరుదుగా జరిగే పరిస్థితులు మాత్రమే. కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఐయూసీడీ వేసుకున్న తర్వాత ఆరు వారాల లోపు మళ్లీ డాక్టర్ చెకప్ తప్పనిసరిగా చేయించుకోవాలి. కొందరు ‘వేసుకున్నాం కదా’ అని నిర్లక్ష్యం చేస్తే, కొద్ది శాతం పేషెంట్లకు అవాంఛిత గర్భం రావచ్చును. దీని వల్ల మానసిక ఒత్తిడి, ఆందోళనలు వస్తాయి. అలా జరగకుండా ఉండేందుకు రెగ్యులర్ ఫాలోఅప్ చాలా అవసరం. ఇంకా, సిజేరియన్ ఆపరేషన్ సమయంలో కూడా ఐయూసీడీ లేదా బర్త్ కంట్రోల్ ఇంప్లాంట్ వేయించుకోవచ్చు. ఈ ఇంప్లాంట్ చాలా ప్రభావవంతంగా ఉంటుంది, దాని ఫెయిల్యూర్ ఛాన్స్ 1% కన్నా తక్కువ. ఈ పద్ధతులు పాలిచ్చే తల్లులకు కూడా సేఫ్గానే ఉంటాయి. మొత్తం మీద, ఐయూసీడీ లేదా ఇంప్లాంట్ రెండూ గర్భనిరోధంలో విశ్వసనీయమైన పద్ధతులు. కొద్ది తాత్కాలిక సైడ్ ఎఫెక్ట్స్ తప్పితే, ఇవి మహిళల ఆరోగ్యానికి సురక్షితం. కాబట్టి డెలివరీ సమయంలోనే మీ గైనకాలజిస్టుతో చర్చించి, మీకు సరిపోయే పద్ధతిని ఎంచుకోవడం ఉత్తమం. డాక్టర్ భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్,హైదరాబాద్ (చదవండి: 91 ఏళ్ల వ్యక్తి 12 గంటలు షిఫ్ట్! హీరో మాధవన్ సైతం..) -
పిల్లల్ని కనాలంటే ఆ మందులు వాడకూడదా?
దాంపత్య జీవితంలో ప్రతీ జంటకు తల్లిదండ్రులవ్వడం అనేది ఓ వరం. అయితే రకరకాల సమస్యలతో ఆ ప్రయత్నంలో ఇబ్బందులు పడే వాళ్లున్నారు. మరీ ముఖ్యంగా డయాబెటిస్ పెషేంట్లలో ఇది అధికంగా ఉంటోందనే ప్రచారం ఒకటి ఉంది. డయాబెటిక్ మహిళా పేషెంట్లు అసలు గర్భమే ధరించలేరని తరచూ కొందరు చెబుతుండడమూ చూస్తుంటాం. మరి అందులో నిజమెంత?.. ఇలాంటి ప్రచారాలపై వైద్య నిపుణులు ఏమంటున్నారు?.. ఓసారి పరిశీలిద్దాం.. ప్రచారం 1: డయాబెటీస్ ఉన్న మహిళలు సహజంగా గర్భం ధరించలేరు!!వాస్తవం: డయాబెటిస్ సహజంగా గర్భం ధరించడాన్ని ఆపదు. షుగర్ను కంట్రోల్లో ఉంచుకుంటూ.. ఆరోగ్యవంతమైన జీవనశైలి పాటిస్తూ చాలా మంది మహిళలు గర్భం దాల్చడమే కాదు.. ఆరోగ్యవంతమైన పిల్లల్నీ కనగలరు. షుగర్ నియంత్రణలో లేనప్పుడు మాత్రం అండం ఉత్పత్తిపై ప్రభావం పడే అవకాశం ఉంది. అప్పుడు గర్భం దాల్చడం కష్టతరమవుతుంది. ప్రచారం2: డయాబెటీస్ మహిళల ఫెర్టిలిటీని మాత్రమే ప్రభావితం చేస్తుందివాస్తవం: మహిళలకు మాత్రమే కాదు.. పురుషులకూ ఇది వర్తిస్తుంది. బ్లడ్ షుగర్ నియంత్రణలో లేకపోతే పురుషుల్లో శృంగార సామర్థ్యం తగ్గే అవకాశం ఉంది. పురుష హార్మోన్ (టెస్టోస్టిరాన్) లెవెల్స్ తగ్గుతుంది. స్పెర్మ్ నాణ్యతతో పాటు కౌంట్ కూడా తగ్గే ప్రమాదం ఉంది. ప్రచారం 3: ఆ టైంలో మందులు వాడకూడదు!వాస్తవం: గర్భధారణ ప్లాన్ చేస్తున్నప్పుడు షుగర్ పేషెంట్లు మందులు మావేస్తుంటారు. అలాంటి సమయంలో భాగస్వాములు ఆరోగ్యకరమైన గ్లూకోస్ లెవెల్స్ కలిగి ఉండడం అత్యంత అవసరం. అందుకే మధుమేహ మందులను అకస్మాత్తుగా ఆపడం సరైంది కాదు. రక్తంలో గ్లూకోజ్ సరైన మోతాదులో ఉంచుకునేందుకు.. కొన్ని మందులను సర్దుబాటు చేయాల్సి వస్తుంది. అయితే అది కేవలం వైద్యుల సూచనలతోనే జరగాలి. సొంత వైద్యం అస్సలు మంచిది కాదు. ప్రచారం 4: రక్తంలో అధిక గ్లూకోజ్ లెవల్స్తో ఏం కాదు వాస్తవం: ఇది చాలా తప్పు. గర్భంతో ఉన్న టైంలో షుగర్ పేషెంట్ల షుగర్ స్థాయిలు ఎక్కువగా ఉంటే.. అది బీపీ పెరగడం, ప్రీఎక్లాంప్షియా సమస్యలకు దారితీయొచ్చు ఇది తల్లీబిడ్డల ఆరోగ్యానికి ప్రమాదకరంగానూ మారొచ్చు. అందుకే ప్రెగ్నెన్సీ ప్లాన్ నుంచే షుగర్ లెవల్ను కంట్రోల్లో ఉంచుకోవాలి. ప్రచారం 5: డయాబెటిస్ ఉంటే ఫెర్టిలిటీ చికిత్సలు పనిచేయవువాస్తవం: డయాబెటిస్ పేషెంట్లు ఐవీఎఫ్, ఐసీఎస్ఐ లాంటి ఫెర్టిలిటీ చికిత్సల ద్వారా గర్భం దాల్చొచ్చు కూడా. డయాబెటిస్ ఉన్నదని ఈ చికిత్సలు పనిచేయవని భావించడం అపోహ మాత్రమే. అయితే ఈ చికిత్సలు విజయవంతంగా జరిగేందుకు బ్లడ్ షుగర్ స్థాయిలు నియంత్రణలో ఉండడం చాలా ముఖ్యం. -డా. ప్రశాంత కుమార్ నాయక్, ఎంబీబీఎస్, ఎండీ ఫెర్టిలిటీ స్పెషలిస్ట్. ఒయాసిస్ ఫెర్టిలిటీ -
HER2-పాజిటివ్ రొమ్ము కేన్సర్ అంటే..? ఎందువల్ల వస్తుందంటే..
సాధారణ రొమ్ము కేన్సర్ గురించి అందరికీ తెలిసింది. కానీ HER2-పాజిటివ్ రొమ్ము కేన్సర్ గురించి చాలామంది మహిళలకి తెలియదు. ఇది సాధారణ రొమ్ము కేన్సర్ కంటే ప్రమాదకరమైనది కూడా. ఎందుకంటే ఈ HER2-పాజిటివ్ రొమ్ము కేన్సర్ చాలా దూకుడుగా ఉంటుంది, పైగా శరీరంలోని ఇతర భాగాలకు చాలా సులభంగా వ్యాప్తి చెందుతుంది. ఇటీవల కాలంలో ఈ కేసులు చాలా వేగంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో దీనిపై అవగాహన తోపాటు ఎలాంటి చర్యలతో ఈ వ్యాధిని అదుపులో పెట్టుకోవచ్చు వంటి వాటి గురించి హైదరాబాద్కి చెందిన ఒమేగా హాస్పిటల్స్ మెడికల్ అంకాలజిస్ట్ డాక్టర్ వింధ్య వాసిని మాటల్లోనే సవివరంగా తెలుసుకుందాం.1 ప్రశ్న: హైదరాబాద్లో HER2-పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయా? ఎందుకు?డాక్టర్: దశాబ్దం క్రితం కంటే ఇప్పుడు మనం HER2-పాజిటివ్ నిర్ధారణలను ఎక్కువగా ఉన్నాయనే చెప్పారు. బహుశా దీనిపై అవగాహన పెరగడం, ఎక్కువమంది మహిళలు ముదుగానే స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవడం వంటివి అయ్యిండొచ్చని అన్నారు. అలాగే జీవనశైలి మార్పులు కూడా ఈ కేసులు అధికమవ్వడానికి కారణం కావొచ్చని ఆమె అన్నారు. 2 ప్రశ్న. HER2-పాజిటివ్ రొమ్ము క్యాన్సర్ ఇతర వాటికంటే ఎలా భిన్నంగా ఉంటుంది?డాక్టర్: HER2-పాజిటివ్ రొమ్ము కేన్స ర్అనేది కణాల ఉపరితలంపై కణ పెరుగుదల, విభజనను ప్రోత్సహించే గ్రాహకమైన HER2 (హ్యూమన్ ఎపిడెర్మల్ గ్రోత్ ఫ్యాక్టర్ రిసెప్టర్ 2 కి సంక్షిప్తంగా) ప్రోటీన్ అధికంగా ఉత్పత్తి అవ్వడం వల్ల వస్తుందని అన్నారు. అందువల్ల ఈ కేన్సర్ ఇతర రకాల కేన్సర్ల కంటే మరింత దూకుడు స్వభావం కలది. అయితే దీన్ని HER2ను లక్ష్యంగా చేసుకుని మందులతో రోగులకు చికిత్స అందించవచ్చు. గత రెండు దశాబ్దాలుగా ఈ చికిత్సలు HER2-పాజిటివ్ రొమ్ము కేన్సర్ దృక్పథాన్నే మార్చేశాయి. ఒకప్పడు ఈ కేన్సర్ అధిక ప్రమాదకరమైనదిగా పరిగణించేవారని, ఇప్పుడూ మందులతో నిర్వహించేలా చక్కటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు.3 ప్రశ్న. HER2-పాజిటివ్ రొమ్ము కేన్సర్పై హైదరాబాద్లో ఏవైనా శాస్త్రీయ ఆవిష్కరణలు జరుగుతున్నాయా?డాక్టర్: అవును. హైదరాబాద్లోని అనేక ఆసుపత్రులు ఇప్పుడు కొత్త చికిత్సా పద్ధతులను అందిస్తున్నాయి.ఉదాహరణకు సబ్కటానియస్ ఫార్ములేషన్స్ ఆఫ్ టార్గెటెడ్ థెరపీలు. ఇవి మందులతో వేగవంతంగా తగ్గించడమే కాకుండా రోగికి సౌకర్యవంతంగా కూడా ఉంటున్నాయి.4 ప్రశ్న: HER2-పాజిటివ్ రొమ్ము కేన్సర్కు ఏయే చికిత్సలు అందుబాటులో ఉన్నాయి?డాక్టర్: HER2-పాజిటివ్ రొమ్ము కేన్సర్కు అనేక చికిత్సా ఎంపికలు ఉన్నాయి - కేన్సర్ర్ ఎంత అభివృద్ధి చెందింది, అది వ్యాపించిందా, ఎంత వేగంగా పెరుగుతోంది వంటి వాటికి సంబంధించిన మొత్తం రోగి ఆరోగ్యంపై ఆధారపడి ఉంటుంది. అదృష్టం ఏంటంటే..HER2 ప్రమేయం ఉందని మనకు తెలుసు కాబట్టి, సాధారణమైన వాటికి అదనంగా ప్రభావవంతమైన "టార్గెటెడ్" చికిత్సలు ఉన్నాయి. అవేంటంటే..a. టార్గెటెడ్ థెరపీలు: ఈ మందులు ప్రత్యేకంగా కేన్సర్ కణాల పెరుగుదలను ఆపడానికి HER2 ప్రోటీన్ను నిరోధిస్తాయి.b. కీమోథెరపీ: ప్రభావాన్ని పెంచడానికి తరచుగా టార్గెటెడ్ థెరపీలతో కలిపి ఉపయోగిస్తారు.c. శస్త్రచికిత్స: కేసును బట్టి కణితి లేదా రొమ్ము కణజాలాన్ని తొలగించడం.d. రేడియేషన్ థెరపీ: పునరావృత ప్రమాదాన్ని తగ్గించడానికి అనేక సందర్భాల్లో శస్త్రచికిత్స తర్వాత ఉపయోగిస్తారు.e. హార్మోన్ల చికిత్స: కణితి కూడా హార్మోన్ రిసెప్టర్-పాజిటివ్ అయితే సిఫార్సు చేయవచ్చు.ఇప్పుడు లక్ష్యంగా చేసుకున్న చికిత్సలు చర్మం కింద ఇంజెక్ట్ చేసేలా సబ్కటానియస్ ఫార్ములేషన్లుగా అందుబాటులో ఉన్నాయి. అలాగే దీర్ఘ IV ఇన్ఫ్యూషన్లతో (సుమారు 4-6 గంటలు) పోలిస్తే వేగంగా (సుమారు 8 నిమిషాలు) చికిత్సను పూర్తి చేయొచ్చు. రోగి సౌకర్యంగా ఉండేలా చికిత్సా కేంద్రాల్లో గడిపే సమయం కూడా తగ్గేలా పలు చికిత్సా విధానాలు అందుబాటులో ఉన్నాయన్నారు. 5 ప్రశ్న: HER2-పాజిటివ్ రొమ్ము కేన్సర్ జర్నీలో రోగులు, సంరక్షకులు తప్పక తెలుసుకోవాల్సినవి ఏవి?డాక్టర్: a. HER2 స్థితిని నిర్ణయించడానికి తగిన చికిత్సను ప్లాన్ చేయడానికి ముందుగా సరైన సమయంలో రోగ నిర్ధారణ చేయడం అనేది ముఖ్యంb. చికిత్సకు కట్టుబడి ఉండటం కీలకం. మోతాదులను కోల్పోవడం లేదా చికిత్సను మధ్యలో ఆపడం వల్ల ప్రభావం తగ్గుతుంది.c. రోగులు,వారి సంరక్షకులకు భావోద్వేగ మద్దతు చాలా ముఖ్యమైనది. ఇది ఒకరకంగా మానసిక ఆరోగ్యాన్ని నిర్వహించడం, స్థితిస్థాపకతను పెంపొందించడంలో సహాయపడుతుంది.d. సంరక్షణ బృందంతో సకాలంలో కమ్యూనికేషన్ ద్వారా దుష్ప్రభావాలను నిర్వహించడం జీవిత నాణ్యతను మెరుగుపరుస్తుంది.e. భారతదేశంలో ప్రస్తుతం రోగి సౌకర్యార్థం మెరుగైనా సబ్కటానియస్ థెరపీలు అనే కొత్త చికిత్సా విధానం అందుబాటులో ఉంది. ఇవి రోగి చికిత్సా సమయాన్ని తగ్గించడమే కాకుండా ఆస్పత్రి సందర్శన కూడా తగ్గుతుంది. చివరగా రోగి సంరక్షకులు ఇలాంటి చికిత్సా విధానాలు, మంచి ప్రత్యామ్నాయాల గురించి వైద్యులతో సంభాషించి, సవివరంగా తెలుసుకోవాలి, సత్వరమే కోలుకునే చికిత్సా విధానాల గురించి క్షణ్ణంగా అవగాహన పెంపొందించుకోవాలని చెప్పారామె.ఒమేగా హాస్పిటల్స్ మెడికల్ అంకాలజిస్ట్ డాక్టర్ వింధ్య వాసిని -
చిన్నవయసులోనే మధుమేహం
హైదరాబాద్: ప్రపంచ మధుమేహ దినం సందర్భంగా ప్రస్తుతం మన సమాజంలో మధుమేహం తీరుతెన్నులు, దానివల్ల వచ్చే సమస్యలు, పరిష్కార మార్గాల గురించి నగరంలోని ప్రధాన ఆస్పత్రులలో ఒకటైన ఎల్బీనగర్ కామినేని ఆస్పత్రికి చెందిన కన్సల్టెంట్ ఎండోక్రెనాలజిస్ట్ డాక్టర్ బి.శ్రావ్య, కన్సల్టెంట్, కన్సల్టెంట్ డయాబెటాలజిస్ట్ డాక్టర్ భవాని వివరించారు. కొన్ని దశాబ్దాల క్రితం కనీసం 40-50 ఏళ్లు దాటినవారే మధుమేహం బారిన పడినట్లు గుర్తించేవారు. ఇప్పుడు ఇంకా బాగా చిన్నవయసులోనే, అంటే 15-20 ఏళ్ల వయసులోనే ఈ సమస్య కనిపిస్తోంది. ఇందుకు ప్రధాన కారణం జీవనశైలి మార్పులు. తగినంత నిద్ర లేకపోవడం, వ్యాయామం చేయకపోవడం, మారుతున్న ఆహారపు అలవాట్లు.. వీటన్నింటివల్ల అధిక బరువు, ఊబకాయం, దాంతోపాటే మధుమేహం కూడా వస్తున్నాయి.‘‘సాధారణంగా మధుమేహం అనేది రెండు రకాలు. మొదటిది టైప్-1. అంటే.. శరీరంలో ఏవో తెలియని మార్పుల వల్ల పాంక్రియాస్ ప్రభావితమై, తగినంత ఇన్సులిన్ ఉత్పత్తి కాక మధుమేహం వస్తుంది. వాళ్లకు జీవితాంతం ఇన్సులిన్ ఇవ్వాల్సిందే. కానీ రెండోది టైప్-2. ఇది ప్రధానంగా జీవనశైలి మార్పుల వల్ల వచ్చేది. మన జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారానే దాన్ని నియంత్రించుకోవచ్చు. గతంతో పోలిస్తే చాలా చిన్నవయసులోనే ఎక్కువమంది మధుమేహం బారిన పడుతున్నారు. మా ఆస్పత్రికి రోజూ ఔట్పేషెంట్ విభాగంలో 20-30 మంది మధుమేహ బాధితులు వస్తుంటే, వారిలో దాదాపు 30% మంది చిన్నవయసువారే ఉంటున్నారు. కొందరికి 20లు, 30లలోను ఇంకా కొందరికి 10-15 ఏళ్ల వయసులో కూడా వస్తోంది. ప్రధానంగా ఇలా చిన్నవయసులో వచ్చేవారిలో ఎక్కువమందికి ఊబకాయం ఉంటోంది. జీవనశైలి మార్పుల వల్ల బరువు పెరిగిపోతున్నారు. చిన్న పిల్లలకు కూడా ఊబకాయం కనిపిస్తోంది. అలాగే మొత్తమ్మీద మధుమేహం ఉన్నవారి సంఖ్య కూడా బాగా పెరుగుతోంది.పాశ్చాత్య దేశాలతో పోలిస్తే ఆసియా వాసుల్లో మధుమేహం వచ్చే అవకాశం ఎక్కువ. అందువల్ల 30ల నుంచి కూడా ఎప్పటికప్పుడు మధుమేహ పరీక్షలు చేయించుకోవాలి. అలాగే గర్భంతో ఉన్నప్పుడు కూడా మధ్యమధ్యలో మధుమేహం వచ్చిందేమో పరీక్షించుకోవాలి. ఊబకాయం, అధిక బరువు ఉన్నవాళ్లు కూడా తరచు చేయించుకోవాలి. రక్తపోటు, కొలెస్టరాల్ ఉన్నవాళ్లు అయితే దాదాపు ప్రతియేటా పరీక్షలు చేయించుకోవాలి.గతంలో కేవలం గ్లూకోజ్ నియంత్రిస్తే సరిపోతుంది అనుకునేవారు. తర్వాత గత పదేళ్ల నుంచి మధుమేహం ఉన్నవారికి కీలక అవయవాలు అంటే గుండె, కిడ్నీలు, కళ్లు, కాళ్లు.. ఇలా అన్నింటినీ కాపాడాలని గుర్తించారు. అదే ఇప్పుడైతే బరువు విషయాన్ని కూడా చూస్తున్నారు. మధుమేహాన్ని నియంత్రించే మందులతోనే బరువు కూడా తగ్గే అవకాశం ఇప్పుడు ఉంటోంది’’ అని డాక్టర్ బి.శ్రావ్య తెలిపారు. బరువును అదుపులో పెట్టాలికన్సల్టెంట్ డయాబెటాలజిస్ట్ డాక్టర్ భవాని మాట్లాడుతూ, ‘‘మధుమేహం వచ్చినవారు తప్పనిసరిగా తమ శరీర బరువును వీలైనంత వరకు అదుపులో పెట్టుకోవాలి. 5-10% బరువు తగ్గినా కూడా అది మధుమేహ నియంత్రణకు బాగా ఉపయోగ పడుతుంది. అలాగే నడక లాంటి వ్యాయామాలు ప్రతిరోజూ తప్పక ఉండాలి. దాంతోపాటు వైద్యులు సూచించిన మందులు క్రమం తప్పకుండా వాడాలి. వీటన్నింటిద్వారా మధుమేహాన్ని నియంత్రణలో పెట్టుకుని ఆరోగ్యవంతమైన జీవితం గడపొచ్చు. క్రమశిక్షణతో కూడిన జీవితం ద్వారానే మనం మధుమేహాన్నిఅదుపుచేయగలం. మధుమేహ పరీక్షలంటే కేవలం ఏదైనా తినడానికి ముందు, తిన్న తర్వాత చేయించుకునే రెండు రక్తపరీక్షలే కాదు. హెచ్బీఏ1సీ పరీక్ష కూడా చేయించుకోవాలి. దానివల్ల గత కొంతకాలంగా మధుమేహం స్థాయి ఎలా ఉందో అర్థమవుతుంది. దాన్ని బట్టే కచ్చితమైన డయాగ్నసిస్ ఉండి మందులు ఎలాంటివి వాడాలో సూచించగలం’’ అని చెప్పారు. -
యోగాతో డయాబెటిస్కు చెక్ చెప్పవచ్చా?
World Diabetes Day డయాబెటిస్ నియంత్రణకు యోగా పనికొస్తుందా అంటే కచ్చితంగా పనికొస్తుంది. నిజానికి చెప్పాలంటే చిన్న చిన్న వ్యాయామాలు, జీవన శైలి మార్పులతో మధుమేహాన్ని అదుపులో ఉంచు కోవచ్చు. కొన్ని ప్రత్యేకమైన యోగాసనాల ద్వారా షుగర్ నియంత్రణలో ఉండటంతోపాటు, అధిక బరువు సమస్యనుంచి కూడా బయట పడవచ్చు. అధిక బరువు, అధిక స్థాయిలో ఉన్న షుగర్ శరీర అవయవాల పని తీరును దెబ్బతీస్తుంది. తద్వారా అనేక అనారోగ్య సమస్యలొస్తాయి. ఈ నేపథ్యంలో డయాబెటిస్ నియంత్రణకు ఉపయోగపడే కొన్ని రకాల యోగాసనాల గురించి తెలుసుకుందాం.కొన్ని రకాలు యోగాసనాలు ఒత్తిడిని నిర్వహించడానికి, ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరచడానికి, విశ్రాంతికి, రక్త ప్రసరణను మెరుగు పర్చడానికి దోహదపడతాయి. ఎవరైనా చేయొచ్చా? ఎలా ప్రారంభించాలి?యోగా వశ్యత, బలం మరియు సమతుల్యతను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఇది ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది, మానసిక స్పష్టతను పెంచుతుంది మరియు మొత్తం శ్రేయస్సును ప్రోత్సహిస్తుంది.వారానికి 2-3 సెషన్లతో ప్రారంభించవచ్చు. అవాటైన కొద్దీ క్రమంగా, సౌలభ్యతను బట్టి ఫ్రీక్వెన్సీని పెంచుకోవచ్చు.యోగా సాధనకు కావలసిందల్లా యోగా మ్యాట్ ,సౌకర్యవంతమైన దుస్తులు. అదనపు సపోర్ట్ కోసం బ్లాక్స్, పట్టీలు , బోల్స్టర్ వంటివి ఉంచుకోవచ్చు. ఇవి ఆప్షనల్.యోగా జీవక్రియను పెంచడం, కండరాల స్థాయిని మెరుగుపరచడం ,ఒత్తిడికి సంబంధించిన ఆహారాన్ని తగ్గించడం ద్వారా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. షుగర్ - ముఖ్య యోగాసనాలు కాళ్ళు పైకి వంగి భంగిమ (విపరిత కరణి): హఠ యోగాలో ఒక భంగిమ విశ్రాంతినిస్తుంది, ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. రక్త ప్రసరణ , ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తుంది.సీటెడ్ ఫార్వర్డ్ బెండ్ (పశ్చిమోత్తనాసన): ఈ భంగిమ ఆందోళనను, అలసటను తగ్గిస్తుంది. బరువు తగ్గడంలో సహాయపడుతుంది.ధనురాసన: రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది.శ్వాసకోశ సమస్యలను కూడా తగ్గిస్తుంది. కోబ్రా భంగిమ (భుజంగాసన): కండరాలను బలపరుస్తుంది. ఇన్సులిన్ను ఉపయోగించుకునే శరీర సామర్థ్యాన్ని మెరుగుపరచడంలో సహాయ పడుతుంది.సుపైన్ స్పైనల్ ట్విస్ట్ (సుప్త మత్స్యేంద్రసన): ఉదర అవయవాలను ఉత్తేజపరుస్తుంది రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయ పడుతుంది. (రూ. 5 వేలతో మొదలై కోటి దాకా : సక్సెస్ స్టోరీ)ఒంటె భంగిమ (ఉస్ట్రాసనం): పక్కటెముకలకు చక్కటి బలాన్నిస్తుంది. వెన్నుముకను బలపరుస్తుంది. గుండెకు, శరీరానికి శక్తినిస్తుంది. మధుమేహం ఉన్నవారికి మేలు చేస్తుంది.పర్వత భంగిమ (తడాసనం): భంగిమను మెరుగుపరుస్తుంది, శరీరాన్ని బలపరుస్తుంది ఇన్సులిన్ సున్నితత్వాన్ని రక్త ప్రసరణను ప్రోత్సహిస్తుంది. ఈ యోగాసనాలన్నీ బరువు నియంత్రణలోనూ, మంచి నిద్రకు కూడా బాగా ఉపయోగపడతాయి. నోట్ : వివిధ ఆరోగ్య పరిస్థితులకు అనుగుణంగా అనేక యోగాసనాలను యోగా నిపుణుల ద్వారా నేర్చుకోవచ్చు. ముఖ్యంగా డయాబెటిస్ ఉన్నవారిలో ఈ భంగిమలు మందులు, ఆహారం , సాధారణ వైద్య పరీక్షలకు ప్రత్యామ్నాయం కాదనే విషయాన్ని గమనించాలి. ఒక వేళ ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే ఆరోగ్య నిపుణులను సంప్రదించాలి.ఇదీ చదవండి: జిమ్కే వెళ్లక్కరలేదు.. చిన్న మార్పులు చాలు, షుగర్ దిగొస్తుంది! -
జిమ్కే వెళ్లక్కరలేదు.. చిన్న మార్పులు చాలు, షుగర్ దిగొస్తుంది!
World Diabetes Day November 14th మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవాలంటే ఆహార నియమాలతోపాటు, తేలికపాటి వ్యాయామం కూడా అవసరం. క్రమం తప్పకుండా, ఎక్సర్సైజ్, వాకింగ్, యోగా లాంటి చేయడం వలన షుగర్ను అదుపులో ఉంచుకోవచ్చు. ఇందుకోసం జిమ్ సభ్యత్వం, ఫ్యాన్సీ గాడ్జెట్లపై ఆధారపడ వలసిన అవసరం లేదు. చిన్న చిన్న మార్పులే, చిన్న పాటి వ్యాయామాలే ఆరోగ్యంపై ఎంతో ప్రభావాన్ని చూపిస్తాయి. నడక, స్ట్రెచింగ్, స్క్వాట్లు లేదా వాల్ పుష్-అప్లు వంటి సాధారణ కదలికలు జీవక్రియకు అద్భుతాలు చేస్తాయని నిపుణులు అంటున్నారు.అంటే ఇన్సులిన్ సహాయం లేకుండానే, కండరాలు రక్తం నుండి నేరుగా గ్లూకోజ్ను గ్రహిం చేందుకు ఇవి ఉపయోగపడతాయి. వ్యాయామం చేసినప్పుడు, కండరాల్లోని మైటోకాండ్రియా పవర్హౌస్లను మేల్కొల్పుతాయి. ఇవి చక్కెర , కొవ్వు రెండింటినీ బర్న్ చేస్తాయి. తద్వారా అదనపు గ్లూకోజ్ను క్లియర్ చేయడంతోపాటు, ఇన్సులిన్ నిరోధకతను కలిగించే అదనపు కొవ్వును కరిగిస్తుంది.రెగ్యులర్ వ్యాయామం PGC-1 ఆల్ఫా అని పిలిచే ప్రత్యేక ప్రోటీన్ను పెంతుంది. ఇది మైటోకాండ్రియల్ పెరుగుదలను పెంచుతుంది. క్రమంగా ఈ ప్రక్రియ భోజనం తర్వాత రక్తంలో చక్కెర స్థాయిలను సమతుల్యం చేయడంలో సహాయ పడుతుంది. దీర్ఘకాలిక జీవక్రియ ఆరోగ్యానికి మద్దతు ఇస్తుంది.తేలికపాటి వ్యాయామాలుచురుకైన నడక (Brisk Walk): భోజనం తర్వాత పదిహేను నిమిషాలు కండరాలు చక్కెరను గ్రహించడంలో సహాయ పడతాయి.వాల్ పుష్-అప్లు: సున్నితమైనవేకాన ఎగువ శరీరం ,రక్త ప్రవాహానికి ప్రభావవంతంగా ఉంటాయి.స్క్వాట్లు అండ్ లంగెస్ (Squats and lunges) కాళ్లను బలోపేతం చేస్తాయి . గ్లూకోజ్ తీసుకోవడంలో మద్దతు ఇస్తాయి.లైట్ స్ట్రెచింగ్ అండ్ యోగా: మనస్సును ప్రశాంతపరుస్తాయి . ఒత్తిడి హార్మోన్లను సమతుల్యం చేస్తాయి.రెసిస్టెన్స్ బ్యాండ్ శిక్షణ: కండరాలను బలంగా చేస్తుందీ వ్యాయామం. ఇన్సులిన్ సున్నితత్వాన్ని మెరుగుపరుస్తుంది.సోలియస్ పుష్-అప్లు: కుర్చీలో కూర్చున్నప్పుడు పాదాలను పైకి కిందికి కదలించేలా చేసే వ్యాయామం.క్రమం తప్పకుండా చేసే వ్యాయామాలు అడ్రినలిన్, నోరాడ్రినలిన్,అడిపోనెక్టిన్ను పెంచుతుంది, ఇవన్నీ రక్తంలో చక్కెరను సమతుల్యం చేయడంలో సహాయపడతాయి. ఒత్తిడి హార్మోను కార్టిసాల్ను కూడా తగ్గిస్తాయి. అధికసుగర్స్థాయిలు అనారోగ్యానికి మూలం అని గమనించండి! మరింకెందుకు ఆలస్యం, హాయిగా ఆరోగ్యంగా ఉండాలన్నా, మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవాలంటే ఈ క్షణం నుంచే వ్యాయామ నియమాన్ని పాటించండి! -
10.1 కోట్ల మంది : ఒడుదొడుకులే అసలు కారణం
మధుమేహ బాధితుల పరంగా భారత దేశం ప్రపంచానికే రాజధాని అయితే, దక్షిణాది రాష్ట్రాలు భారతదేశానికి రాజధానులుగా మారాయని గణాంకాలు చెబుతున్నాయి. దేశంలో మధు మేహ బాధితుల సంఖ్య ఇప్పుడు 10.1 కోట్లకు చేరింది. భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలలో మధుమేహం (Diabetes) క్రమంగా వేగాన్ని పుంజుకుంటోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేస్తోంది. మధుమేహం నియంత్రణ, నిరోధం పట్ల అవగాహన కల్పించడానికి ఇన్సులిన్ను కనుగొన్న సర్ ఫ్రెడరిక్ బ్యాంటింగ్ పుట్టిన రోజైన నవంబర్ 14వ తేదీని ‘ప్రపంచ మధుమేహ నిరోధక దినం’గా ప్రతి ఏడాదీ జరుపుకోవడం ముదావహం.నేడు మనిషి జీవన విధానం, ఆహారంలో వచ్చిన విప్లవాత్మక మార్పులు... మధుమేహం వంటి జీవితకాల దీర్ఘ వ్యాధులకు ఆజ్యం పోస్తున్నాయి. అతి చిన్న వయసు నుండే ఏమాత్రం శారీరక శ్రమ లేక పోవడం, ఆహారంలో చోటు చేసు కున్న మార్పులు, కల్తీలు, పంట పొలాల్లో వేసే రసాయనిక ఎరువులు, క్రిమిసంహారక మందులు, విచ్చలవిడి ప్లాస్టిక్ వినియోగం, పర్యావరణ మార్పులు, కొత్త కొత్త వైరల్ వ్యాధులు, వృత్తిపర మానసిక ఒత్తిడి, జన్యువులలో ఉత్పరివర్తనలు... ఇలా ఎన్నో కారణాలు రక్తంలో షుగర్ను నియంత్రించే ఇన్సులిన్ను ఉత్పత్తి చేసే ప్యాంక్రియాస్ (క్లోమ గ్రంథి)ని అసాధారణ రీతిలో ప్రభావితం చేస్తున్నాయి. శరీర అవసరాలకు సరిపడా ఇన్సులిన్ (Insulin) ఉత్పత్తి కాకపోవటం, ఇన్సులిన్ పనితీరులోని లోపాలు (రెసిస్టెన్స్), శరీర కణాలు ఇన్సులిన్ను వినియోగించుకోలేకపోవడం... వెరసి రక్తంలో అసాధారణ స్థాయిలో చక్కెర శాతాన్ని పెంచేస్తున్నాయి. చదవండి: ఆంక్షలతోనా వేతన సంఘాన్ని నియమించేది?మనం నిత్య జీవితంలో వాడే ప్లాస్టిక్ల అవశేషాల ప్రభావం వల్ల ప్యాంక్రి యాస్ సహజసిద్ధంగా ఉత్పత్తి చేసే ఇన్సులిన్ను శరీర అవసరాలకు సరిపడా ఉత్పత్తి చేయలేకపోతోంది. ఇన్సులిన్ ఉత్పత్తి అయినా... శరీర కణజాలాలలో నిరోధకత వచ్చి అది ఉపయోగపడక పోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి (Sugar Level) అసాధారణ రీతిలో పెరిగిపోతోంది. మందుల వాడకం, ఆహార నియమాలు పాటించటం, క్రమం తప్పక వ్యాయామం చేయడం ద్వారా జీవితాంతం అప్రమత్తంగా ఉండాలి. – డాక్టర్ టి. సేవకుమార్ వ్యవస్థాపకులు, ఎస్.హెచ్.ఓ. హైపర్ టెన్షన్–డయాబెటిక్ క్లబ్, గుంటూరు(నవంబర్ 14 ప్రపంచ మధుమేహ నిరోధక దినం) -
ఇద్దరిలో ఒకరికి..!
మధుమేహం (డయాబెటిస్)..దీనికి సైలెంట్ కిల్లర్ అనే పేరుంది. ఈ వ్యాధి బారిన పడ్డవారి సంఖ్య ప్రపంచవ్యాప్తంగా 83 కోట్లు దాటిందని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెబుతోంది. అయితే మన దేశంలో అధికంగా మధుమేహ రోగులుండటం ఆందోళన కలిగించే అంశం. ఐసీఎంఆర్ నివేదిక ప్రకారం 20 ఏళ్లకు పైబడిన వారిలో 10 కోట్ల మందికి పైగా డయాబెటిస్ పేషెంట్లు ఉన్నట్టు అంచనా. మరో 13.6 కోట్ల మందికి మధుమేహం ముప్పు పొంచి ఉంది. అయితే చాలామందికి తమకు వచ్చే ప్రమాదం గురించి తెలియడం లేదు. అంతేకాదు డయాబెటిస్ ప్రాబల్యం విషయంలో భారతదేశం ప్రపంచ సగటు కంటే చాలా ముందుండడం ఆందోళన కలిగిస్తోంది. – సాక్షి, స్పెషల్ డెస్క్ప్రీ డయాబెటిస్కు దారి.. పరీక్షించినవారిలో 58% మందికి ఇన్సులిన్ నిరోధకత ఉందని హెచ్ఓఎంఏ–ఐఆర్ ఫలితాలు సూచిస్తున్నాయి. ఇది జీవక్రియ ప్రమాదానికి ముందస్తు గుర్తు. ఇన్సులిన్ నిరోధకత అనేది శరీర కణాలు ఇన్సులిన్ అనే హార్మోన్కు సరిగ్గా స్పందించని ఒక పరిస్థితి. దీంతో రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. పాంక్రియాస్ ఉత్పత్తి చేసే ఇన్సులిన్ సాధారణంగా ఆహారం నుండి లభించే గ్లూకోజ్ను శక్తి కోసం కణాలలోకి ప్రవేశించడానికి సహాయపడుతుంది. అయితే నిరోధకత ఏర్పడినప్పుడు గ్లూకోజ్ రక్త ప్రవాహంలోనే ఉంటుంది. దానిని భర్తీ చేయడానికి పాంక్రియాస్ ఎక్కువ ఇన్సులిన్ను విడుదల చేస్తుంది. తగినంత ఇన్సులిన్ ఉత్పత్తి కాకపోతే అది ప్రీ డయాబెటిస్కు దారితీస్తుంది. చివరికి టైప్–2 డయాబెటిస్కు కారణం అవుతుంది. డయాబెటిస్ ఉన్న వ్యక్తులలో.. » నలుగురిలో ఒకరికి అసాధారణ రీతిలో థైరాయిడ్ (హైపోౖథెరాయిడిజం) » ముగ్గురిలో ఒకరికి కాలేయ పనితీరులో సమస్యలు » దాదాపు సగం మందికి ఏదో ఒక రకమైన మూత్రపిండాల బలహీనత » సుమారు 90% మందికి అసాధారణ లిపిడ్ ప్రొఫైల్స్ ఉంటాయి. » 30 ఏళ్లలోపు వారిలోనూ రక్తంలో చక్కెర స్థాయిలు అధికంగా ఉన్నాయి. » 30–39 సంవత్సరాల మధ్య వయస్కుల్లో ప్రతి ముగ్గురిలో ఒకరికి ఇప్పటికే అధిక చక్కెర స్థాయిలు. » 60 ఏళ్లుపైబడ్డవారిలో ప్రతి 10లో 8 మంది రక్తంలో అధిక గ్లూకోజ్ స్థాయిలు ఉంటున్నాయి. చిన్న వయస్సు వారిపైనా ప్రభావం డిజిటల్ హెల్త్కేర్ ప్లాట్ఫామ్ ఫార్మ్ఈజీ అధ్యయనం ప్రకారం భారత్లో ఇద్దరిలో ఒకరికి రక్తంలో చక్కెర స్థాయిలు అధికంగా ఉన్నట్టు నిర్ధారణ అయింది. 29 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుండి 40 లక్షలకు పైగా రోగ నిర్ధారణ నివేదికలు, 1.9 కోట్ల ఔషధ ఆర్డర్లను కంపెనీ విశ్లేషించింది. ‘డయాబెటిస్: ది సైలెంట్ కిల్లర్ స్వీపింగ్ ఎక్రాస్ ఇండియా’పేరుతో రూపొందించిన ఈ నివేదిక ప్రకారం.. 28.4% మందికి మధుమేహం నిర్ధారణ అయింది. 27.5% మందికి ముప్పు పొంచి ఉంది. అంటే వీరు టైప్–2 డయాబెటిస్ బారిన పడే అవకాశం ఉంది. ఈ వ్యాధి వృద్ధులను మాత్రమే కాకుండా చిన్న వయస్సు వారిని కూడా ఎక్కువగా ప్రభావితం చేస్తోంది. రక్తంలో చక్కెర స్థాయిలు అధికంగా ఉండడం 90% మందిలో కాలేయం, లిపిడ్ (కొవ్వులు, నూనె, హార్మోన్లు), గుండె, థైరాయిడ్ సమస్యలకు దారితీసిందని నివేదిక తెలిపింది. సగం మందికి తెలియదు.. స్పష్టమైన లేదా ముందస్తు లక్షణాలు లేకుండానే జనం డయాబెటిస్ బారిన పడుతున్నారు. అందుకే దీనిని సైలెంట్ కిల్లర్ అని పిలుస్తున్నారు. వయస్సు, లింగం, జీవనశైలి, ప్రాంతంతో సంబంధం లేకుండా ఇది ఎవరినైనా ప్రభావితం చేస్తుంది. ఆందోళన కలిగించే ముఖ్య విషయం ఏమిటంటే 50% కంటే ఎక్కువ మందికి తాము ఈ వ్యాధిబారిన పడ్డ విషయం తెలియకపోవడం. గుండె జబ్బులు, మూత్రపిండాలు దెబ్బతినడం, దృష్టి కోల్పోవడం వంటి సమస్యలు వచ్చే వరకు ఈ వ్యాధి బయటపడడం లేదట. సాధారణ రక్త పరీక్ష ద్వారా ముందస్తుగా గుర్తించి సకాలంలో వైద్యం తీసుకోవడమే ఉత్తమ మార్గం అని నిపుణులు చెబుతున్నారు. -
చిన్న కారణాలు పెద్ద భయాలు
భయం అనేది ఒక స్వాభావికమైన ఉద్వేగం. అది ప్రతి జీవితో పాటు మానవులందరిలో ఉండేదే. మనకు ముప్పు తెచ్చిపెట్టే అంశాల పట్ల భయం ఉండటం వల్లనే ఆ ప్రమాదాల నుంచి దూరంగా వెళ్తారు. అందువల్లనే మనుగడ సాధ్యమవుతుంది. ఇలా చూసినప్పుడు అన్ని జీవులతో పాటు మానవ మనుగడను సుసాధ్యం చేసే సహజమైన ఉద్వేగం అది. అయితే కొందరిలో ఆ భయం మోతాదులు చాలా ఎక్కువగా ఉంటాయి. ఉదాహరణకు ఓ బొద్దింక వల్ల ఎలాంటి ప్రమాదం లేకపోయినా కొందరు దానికి భయపడతారు. ఇంకొందరు గోడ మీది బల్లని చూస్తే చాలు వణికిపోతారు. ఇలా ఉండాల్సినంత కాకుండా ఈ భయం అర్థం లేకుండా పెరిగిపోతూ, దాని వల్ల యాంగై్జటీ పెరిగిపోతూ... ఆ భయం మన రోజువారీ వ్యవహారాలకు సైతం అడ్డం పడేటంతగా పెరిగిపోయి ఏ పనీ చేయలేనంతగా ఆందోళన కలిగిస్తుంటే దాన్ని ‘ఫోబియా’గా అభివర్ణిస్తారు. గతంలో కంటే ఇప్పుడు ఫోబియాలకు మంచి చికిత్స ప్రక్రియలే అందుబాటులో ఉంది. ఈ ఫోబియాల గురించి అవగాహన కోసం ఈ కథనం.ఒక కేస్ స్టడీ : ఇటీవలే సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం అమీన్పూర్కు చెందిన మనీషా అనే గృహిణి చీమలంటే భయంతో ఆత్మహత్య చేసుకుంది. ఇక ఈ చీమలతో పాటు బతకడం నా వల్ల కాదంటూ సూసైడ్ నోట్ రాసి మరీ ఆమె ఈ ఘాతుకానికి ఒడిగట్టిందంటూ వార్తలు వచ్చాయి. ఇలా చీమల పట్ల ఉండకూడని భయానికి సైకియాట్రీలో ఉన్న పేరు ‘మిర్మెకోఫోబియా’ (myrmecophobia).ఏమిటీ ఫోబియాలు? ఒక్కమాటలో చెప్పాలంటే అంతగా భయపడకూడని అంశాల పట్ల కూడా తీవ్రమైన భయం ఉండటమే ‘ఫోబియా’ అని చెప్పవచ్చు. ఈ భయాల తీవ్రతలు చాలామందికి వేర్వేరుగా ఉంటాయి. ఉదాహరణకు కొందరికి ఎత్తైన ప్రదేశాలంటే భయం. మరికొందరికి అన్నివైపులా మూసి ఉండే ప్రదేశాలు... అంటే లిఫ్టుల వంటి చోట్ల భయంగా ఉంటుంది. ఇంకొందరికి హైవేల పై డ్రైవింగ్ అంటే విపరీతమైన ఆందోళన. ఇలా చాలామందిలో చాలారకాల భయాలుంటాయి. పాములూ, కీటకాలూ, సూదులూ అంటే అర్థం లేని భయాలుంటాయి. అంతెందుకు... ‘మన్మథుడు’ సినిమాలో హీరోకి నీళ్లపై నిర్మించిన వంతెనపై నడవడం కూడా తనకు భయమంటూ చెబుతాడు. ఇలా చాలామందికి చాలావాటి పట్ల అంటే... ఎరుగుతున్న కీటకాలంటే (ఉదా. గబ్బిలాలు), పాకుతుండే పాములంటే... ఆఖరికి సూది వాడాలన్నా అది గుచ్చుకుంటుందేమోనని కొందరికి భయమే. ఇలా ఏ అంశం గురించైనా అర్థం లేని భయాలు కలుగుతుండవచ్చు. కొందరిలో ఇవి చిన్నప్పట్నుంచీ ఉంటే... మరికొందరిలో పెద్దయ్యాక అభివృద్ధి చెందుతుంటాయి.నిర్హేతుకమైన ఈ భయాల ప్రభావాలు ఇలా... అకారణమైన ఈ భయాలు కొందరిలో వాళ్ల పనులను వాళ్లు చేసుకోనివ్వనంతగా దుష్ప్రభావాన్ని చూపుతాయి. చాలామంది తాము చేయాల్సిన పనిని వాయిదా వేయడం లేదా దాన్నుంచి తప్పుకుని తిరగడం చేస్తూ సమస్య నుంచి దూరంగా పారిపోతుంటారు. ఇది జీవితంలో ఎన్నో ఆనందాలను దూరం చేస్తుంది లేదా సులభంగా జరిగిపోయే పనులనూ జరగకుండా అడ్డుపడుతుంటుంది. ఉదాహరణకు ఓ ఆఫీసులో ఉద్యోగం చేసే వ్యక్తికి ఎత్తులంటే భయం. అతడు ఉద్యోగం చేసే ఆఫీసు ఏ పదో అంతస్తులోనో ఉంటే... మంచి వేతనం వచ్చే ఉద్యోగాన్ని కూడా తేలిగ్గా వదిలేసుకుంటాడు. అలాగే మరో వ్యక్తికి ఎత్తైన ఫ్లై ఓవర్ అంటే భయం. దాంతో ఫ్లై ఓవర్ ఎక్కితే కేవలం రెండు కిలోమీటర్లలో అధిగమించే దూరాన్ని... అదనంగా మరో పది కిలోమీటర్లు ప్రయాణించి చేరుతాడు. నిజానికి చూసేవారికి ఈ భయాలు అర్థం లేనివిగా కనిపిస్తాయి. పైగా ఇలాంటి చిన్నకారణాలతో పెద్ద పెద్ద ప్రయోజనాలు కోల్పోతారా అని ఆశ్చర్యం వేస్తుంది. కానీ ఫోబియాలతో బాధపడేవారికి అదే జీవన్మరణ సమస్య.ఈ ఫోబియాల (భయాల) విస్తృతి ఎంతంటే... ఈ లోకంలో పుట్టిన ప్రతి వ్యక్తిలోనూ అన్ని రకాల భయాలూ అంతో ఇంటో ఉండనే ఉంటాయి. నిజానికి ఈ భయాలకు ఏ వ్యక్తి కూడా అతీతుడు కాడు. ఉదాహరణక బల్లి మీద పడితే ఎవరైనా మొదట ఆందోళన చెందుతారు. కాకపోతే ఆ తర్వాత వెంటనే సర్దుకుంటారు. కానీ మనలోని 29% మందిలో ఏదో ఒక అంశంపైన ‘ఫోబియా’లు ఉండనే ఉంటాయి. అందునా పురుషులతో పోలిస్తే మహిళల్లో ఈ ఫోబియాలు రెట్టింపు మందిని బాధిస్తుంటాయని అంచనా. భయం, ఫోబియాల మధ్య తేడా... ఏదైనా ఆందోళన గొలిపే పరిస్థితుల్లో భయం కలగడమనేది చాలా సహజమైన ప్రక్రియ. ప్రమాదకరమైన ఆ పరిస్థితులనుంచి బయటపడటానికీ లేదా వాటి నుంచి దూరంగా పరుగెత్తడానికి భయం అవసరం కూడా. నిజానికి భయం కలగడం ఒక రక్షణాత్మకమైన చర్య. ఏవైనా ప్రాణాంతకమైన పరిస్థితుల్లో దాన్ని ఎదుర్కోడానికీ లేదా వీలుకాని పక్షంలో దాన్నుంచి దూరంగా పారిపోవడానికి ఈ భయం తోడ్పడుతుంది. దీన్నే ఫైట్ ఆర్ ఫ్లైట్ మెకానిజమ్గా చెబుతారు. జీవులన్నింటి మనుగడకూ ఇదే అంశం దోహదపడుతుంది. ఇదీ భయం వల్ల కలిగే ప్రయోజనం. కానీ ఫోబియాలో ఇలా జరగదు. అక్కడ వాస్తవంగా లేని ప్రమాదాన్ని సైతం బాధితులు ఊహిస్తూ ఉంటారు. ఉదాహరణకు చాలా భయంకరమైన కుక్క ఎదురైనప్పుడుఅది కరుస్తుందేమో అని భయపడటం సహజం. కానీ ఒకవేళ అది పెంపుడు కుక్క అయినప్పటికీ భయపడటంలో అర్థం ఉండదు. అలాగే పాము కనిపిస్తే భయం కలగడం సహజం. అయితే టీవీ స్క్రీన్ మీద పాము కనిపించినా లేదా పాము బొమ్మ చూసినా భయపడటం అంటే అది ‘ఫోబియా’కు సూచన అని అర్థం. ఇక్కడ డాగ్స్ వల్ల కలిగే అనవసర భయాలను ‘సైనో ఫోబియా’ (గ్రీక్ భాషలో సైనో అంటే కుక్క అని అర్థం) అనీ, పాముల వల్ల కలిగే భయాన్ని ‘ఒఫిడియో ఫోబియా’ లేదా ‘ఓఫియో ఫోబియా’ అంటారు. కొన్నిసార్లు దాన్నే ‘హెర్పెటో ఫోబియా’ అని కూడా అంటారు. అంటే ‘ఓఫిడియో ఫోబియా’లో పాములంటే భయమైతే ‘హెర్పెటో ఫోబియా’లో పాము జాతికే చెందిన బల్లులూ, బల్లిలాంటి ఇతర జీవుల భయాలను కలుపుకుని ‘హెర్పెటో ఫోబియా’ అంటారు. ఇక ఈ భయాలు ఎంత విచిత్రంగా ఉంటాయంటే అరుదుగా కొందరికి స్నానం చేయడమన్నా భయముంటుంది దీన్ని ‘ఆల్బుటోఫోబియా’ అనీ, పసుపురంగుకు భయపడటాన్ని ‘గ్జాంథోఫోబియా’ అనీ, చివరకు అద్దంలో చూసుకోడానికి బయపడటాన్ని ‘స్పెక్ట్రోఫోబియా’ (spectrophobia) అని అంటారు.భయాలు ఎలా మొదలవుతాయంటే... సాధారణంగా చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు వాళ్లలో చాలా అనవసరమైన భయాలు ఉంటాయి. వయసు పెరుగుతున్న కొద్దీ అవి తగ్గుతూ పోతుంటాయి. ఉదాహరణకు పిల్లలందరికీ చీకటి అంటే భయం. అయితే వయసు పెరుగుతున్నకొద్దీ ఆ భయాన్ని వారు క్రమంగా అధిగమిస్తారు. ఒకవేళ అధిగమించనంత దాన్ని పూర్తిగా ఫోబియా అనడానికి వీలు కాదు. అయితే ఏదైనా భయం వల్ల మనం తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కోవడం, దానివల్ల మన రోజువారీ పనులకూ, సామాజిక జీవనానికీ, పిల్లల్లోనైతే స్కూల్ జీవితానికీ, నిద్రకు ఆటంకం కలిగితే దాన్ని ఫోబియాగా గుర్తించి, దానికి అవసరమైన చికిత్స అందించాల్సి ఉంటుంది.ఏయే వయసు పిల్లల్లో ఎలాంటి భయాలు..?పిల్లల్లో సాధారణంగా కొన్ని కొన్ని వయసుల్లో కొన్ని విషయాలంటే భయం ఎక్కువగా ఉండవచ్చు. అవి... 0 – 2 ఏళ్ల పిల్లల్లో ... పెద్ద శబ్దాల పట్ల, అపరిచితులతో, తల్లిదండ్రులనుంచి విడిగా ఉండాల్సి రావడం వల్ల, పెద్ద పెద్ద వస్తువులంటే, కొన్ని జంతువుల పట్ల భయం ఉంటుంది. 3 – 6 ఏళ్ల పిల్లల్లో ... దెయ్యాలు, భూతాల వంటి అభూత కల్పనాత్మక పాత్రలంటే భయంతో పాటు ఒంటరిగా పడుకోవాల్సి రావడం, వింత శబ్దాలంటే భయం కలుగుతుంది. 7 – 16 ఏళ్ల పిల్లల్లో ... ఇలాంటి పిల్లల్లో అభూతకల్పనాత్మకమైన అంశాల కంటే వాస్తవ విషయాలపట్ల భయం కలుగుతుంది. అంటే ఆడుతున్నప్పుడు గాయాలవుతాయనే భయాలు, జబ్బు చేసినప్పుడు కలిగే భయాలు, స్కూల్లో పెర్ఫార్మెన్స్ తగ్గుతున్నప్పుడూ, ప్రకృతి విలయాలు, ఇతరత్రా ప్రకృతి విపత్తులు, ఉత్పాతాలంటే భయాలుంటాయి.ఫోబియాలు కలగడానికి కారణమయ్యే అంశాలు : ఫోబియాలను కలిగించడానికి కారణమయ్యే అంశాలు ఇవీ అంటూ నిర్దిష్టంగా చెప్పడానికి కుదరదు. అయితే చాలా సందర్భాల్లో కొన్ని భయాలు పెద్దల నుంచి పిల్లలకు వస్తుంటాయి. ఇలా కుటుంబాల్లో వంశపారంపర్యంగా వస్తుండవచ్చు. ఈ భయాలకు సాంస్కృతిక అంశాలూ కారణం కావచ్చు. తల్లిదండ్రులకు ఒక తరహా భయాలు ఉంటే అవి పిల్లలకు వచ్చే అవకాశాలు మూడింతలు ఎక్కువ. పిల్లల పట్ల మరీ ఎక్కువ రక్షణాత్మకంగా వ్యవహరించే తల్లిదండ్రుల పిల్లలతో పాటు... మరీ ఏమాత్రం పట్టించుకోకుండా వదిలేసిన తల్లిదండ్రుల పిల్లల్లోనూ ఫోబియాలు వచ్చే అవకాశాలు ఎక్కువ. ఏదైనా ఒక భయంకరమైన పరిస్థితిని ఎదుర్కొనలేక దాన్ని అధిగమించే ప్రయత్నంలో తీవ్రమైన ఒత్తిడి అనుభవించి, అప్పటికీ అధిగమించని వారిలో ఫోబియాలు అభివృద్ధి చెందే అవకాశాలు మరీ ఎక్కువ.సాధారణంగా మనలో ఉండే భయాలు, ఫోబియాలు : సాధారణంగా మనందరిలో భయాలూ, ఫోబియాలను నాలుగు రకాలుగా వర్గీకరించవచ్చు. అవి... జంతువుల పట్ల ఫోబియా... చాలామందికి పాములు, తేళ్ల వంటి విషజీవులన్నా, సాలెపురుగులూ లేదా ఇతర కీటకాలూ, ఎలుకలు, కుక్కలు, బొద్దింకలు, గబ్బిలాలంటే భయంగా ఉంటుంది. కొన్ని రకాల పరిసరాల కారణంగా వచ్చే ఫోబియా... ఉదాహరణకు ఎత్తుకు ఎక్కాక కిందికి చూడటం వల్ల, తుఫానుల్లో చిక్కుకోవడం, విశాలమైన జలరాశి మధ్యన ఉన్నప్పడు ఆ అనంతమైన నీటిని చూడటం వల్ల, చిమ్మచీకటిలో ఉండిపోవాల్సి రావడం పట్ల భయాలు కలుగుతాయి. కొన్ని పరిస్థితుల వల్ల కలిగే ఫోబియాలు: కొన్ని పరిస్థితుల్లో మనకు చాలా భయంగా ఉంటుంది. ఉదాహరణకు... అన్నివైపులా మూసుకుపోయి ఉన్నట్లుండే పరిసరాల పట్ల... అంటే ఉదాహరణకు ఊపిరానట్టుగా ఉండే ఇరుకు గదులు, లిఫ్టుల్లో చిక్కుకుపోవడాల పట్ల (క్లాస్ట్రోఫోబియా), వేగంగా డ్రైవింగ్ చేస్తున్న సమయాల్లో, గుహల్లోకి ప్రవేశించినప్పుడు, బ్రిడ్జ్పైకి వెళ్లినప్పుడు. గాయం, రక్తం, ఇంజెక్షన్ వంటి భయాలు : చాలామంది ఇంజెక్షన్ వంటి వాటికి భయపడుతుంటారు. లేదా ఎవరికైనా జబ్బుగా ఉండటం లేదా తాము చనిపోతామేమో లాంటి భయాల వంటివి ఉంటాయి.ఫోబియా లక్షణాలు... ఏదైనా భయం కాస్తా ఫోబియాగా రూపోందినప్పుడు మొదట తీవ్రమైన ఉద్విగ్నత (యాంగై్జటీ) కలిగి అది కాస్తా మరింత తీవ్రమైన (΄్యానిక్ అటాక్) రూపం తీసుకుంటుంది. దీన్ని ‘ఫుల్బ్లోన్ ప్యానిక్ ఎటాక్’గా చెప్పవచ్చు. మనం ఏదైనా విషయానికీ లేదా అంశానికీ భయపడుతుంటే... దానికి మనం ఎంత దగ్గరగా ఉంటే భయం అంతగా తీవ్రమవుతుంది. ఇక ఈ భయం తీవ్రత ఎంత ఎక్కువగా ఉంటే దాన్ని అధిగమించడం లేదా దాన్నుంచి బయటపడటం అంతే కష్టమవుతుంది. ఈ ఆందోళన / భయం / ఉద్విగ్నత (యాంగై్జటీ) తాలూకు లక్షణాలు రెండు రకాలుగా కనిపిస్తాయి. అవి... భౌతికంగా కనిపించే లక్షణాలు : ∙ఊపిరి పీల్చుకోవడం కష్టం కావడం ∙గుండె వేగం పెరగడం ∙చెమటలు పట్టడం ∙ఛాతీలో నొప్పి లేదా ఛాతీ బిగదీసుకుపోవడం ∙వణుకు ∙నిద్రవస్తున్నట్లు లేదా కళ్లు తిరుగుతున్నట్లు అనిపించడం ∙కడుపులో తిప్పినట్లుగా / దేవినట్లుగా ఉండటం. ∙ఒంట్లోంచి వేడి ఆవిరులు బయటకు వస్తున్న భావన. ఉద్వేగపూరితమైన లక్షణాలు : యాంగై్జటీ ఎక్కువ కావడం ఆ తర్వాత ప్యానిక్ అటాక్గా మారడం స్థలం లేదా పరిస్థితుల నుంచి పారిపోవాలన్న బలమైన కాంక్ష తనపై తాను అదుపు కోల్పోవడం కాసేపట్లో చచ్చిపోతామేమోన్న భావన మితిమీరి స్పందిస్తున్నామని తెలిసినా దాన్ని నియంత్రించుకోలేని శక్తిఫోబియా వర్గీకరణ ఇలా... సైకియాట్రిస్టులు ఫోబియాలను సాధారణంగా మూడు రకాలుగా వర్గీకరిస్తుంటారు. సామాజిక ఫోబియా (సోషల్ ఫోబియా): సాధారణంగా ఇవి అందరిలోనూ ఉండే సహజ భయాలే అయినా కొందరిలో మితిమీరి ఉంటాయి. ఉదాహరణకు కొందరు నలుగురిలో మాట్లాడటానికి చాలా ఎక్కువగా భయపడుతుండవచ్చు. అలాగే మరికొందరు బయట తినడం అనే విషయం పట్ల తీవ్రంగా ప్రతిస్పందిస్తూ దాని వల్ల కలిగే పరిణామాలను అతిగా ఊహించుకుంటారు. సాధారణంగా సోషల్ ఫోబియాలు చికిత్సకు ఒక పట్టాన తేలిగ్గా లొంగవు. సామాజిక ఫోబియాలు తమకు చిన్నప్పుడు ఎదురైన సామాజిక అవమానాల కారణంగా కలుగుతాయి. సాధారణంగా పదవ ఏటి కంటే ముందు ఎదురైన సామాజిక అవమానాల కారణంగా ఏర్పడ్డ భయాలు కొందరిలో కాలక్రమేణా తొలగిపోవచ్చు. కానీ యుక్తవయసులో తమ స్నేహితుల నిరాదరణకు గురైన కారణంగా ఏర్పడ్డ భయాలు అంత తేలిగ్గా తొలగిపోవు. కొందరిలో అవి వయసుతో పాటు పెరుగవచ్చు. నిర్దిష్ట ఫోబియాలు (స్పెసిఫిక్ ఫోబియాస్): ఈ ఫోబియాలు నిర్దిష్టంగా ఫలానా అంశం వల్ల కలుగుతుండే భయాలు అని చెప్పవచ్చు. ఉదాహరణకు పాములు, నీళ్లు, ఎత్తులు, లిఫ్ట్, విమానప్రయాణం, వ్యాధుల పట్ల భయం మొదలైనవి.అగారోఫోబియా : ఇది ఇంటికి దూరంగా ఉన్నప్పుడు లేదా మనకు సురక్షితంగా ఉన్న స్థలానికి దూరంగా ఉన్నప్పుడు కలిగే తీవ్రమైన భయాలు అని చెప్పవచ్చుప్యానిక్ అటాక్ అంటే...ఏదైనా ఫోబియాకు గురై భయపడటంలోని తీవ్రత తారస్థాయికి చేరినప్పుడు కలిగే మానసిక స్థితిని ప్యానిక్ అటాక్గా చెప్పవచ్చు. ఇది కలిగినప్పడు కనిపించే లక్షణాలివి... తమకు భయంగొలిపే ప్రదేశం / అంశం / పరిస్థితి నుంచి దూరంగా పారిపోవాలన్న బలమైన కాంక్ష తీవ్రమైన భయం గుండెవేగంలోని తీవ్రత చాలా ఎక్కువగా పెరగడం శ్వాస అందకపోవడం వణుకు ఒక్కోసారి స్పృహతప్పడం చనిపోయినట్లుగా అనుభూతి చెందడం. ఫోబియాల దుష్ప్రభావాలిలా : ఫోబియాలకు చికిత్స చేయించకుండా వదిలేస్తే అవి వ్యక్తిగత జీవితాన్ని దుర్భరం చేస్తాయి. వాటిని దాచిపెట్టినా సరే... దాని ఫలితాలు జీవితాన్ని చాలా తీవ్రంగా ప్రభావితం చేయవచ్చు. ఉదాహరణకు విమాన ప్రయాణం అంటే భయం ఉంటే దాన్ని దాచితే జీవితంలో చాలా కోల్పోవచ్చు. అలాగే కొన్ని ఫోబియాల వల్ల వ్యక్తిగత జీవితంలో స్నేహితులను, బంధువులకు దూరం కావడం, ఉద్యోగం కోల్పోవాల్సి రావడం వంటి తీవ్రపరిణామాలు సంభవించవచ్చు. ఫోబియా ఉన్నవారు వాటిని అధిగమించదలచినప్పుడు క్రమంగా మెరుగుదల కనిపిస్తుంది తప్ప... అకస్మాత్తుగా అంతా చక్కబడదు. మిగతా వారిలో పోలిస్తే ఆల్కహాల్ అలవాటు ఉన్నవారికి ఫోబియాలకు గురయ్యే అవకాశాలు పదింతలెక్కువ. ఇక అలాగే ఫోబియాలు ఉన్నవారు ఆల్కహాల్కు అలవాటు పడే అవకాశాలూ రెండింతలెక్కువ. ఒక్కోసారి ఫోబియా (Phobia) వల్ల కలిగే యాంగై్జటీ (ఉద్విగ్నత) ప్రమాదకరమైన పరిస్థితికి, కొన్నిసార్లు గుండెజబ్బులకు దారితీయవచ్చు.ఫోబియాలూ... చికిత్స : ఫోబియాకు సమర్థమైన చికిత్స సైకోథెరపీ (కౌన్సెలింగ్). దీనితో పాటు కొన్నిసార్లు కొన్ని మందులు కూడా ఉపయోగించాల్సి వస్తుంది. కొన్ని సందర్భాల్లో ఈ రెండూ అవసరమవుతాయి.మొదట స్వయంసహాయం... ఫోబియాల విషయానికి వస్తే స్వయంసహాయ పద్థతులు చాలా బాగా పనిచేస్తాయి. అయితే ఒకవేళ వాటి వల్ల రోగి యాంగై్జటీ తగ్గక ΄్యానిక్ అటాక్స్ వస్తూనే ఉంటే అప్పుడు నిపుణుల సహాయం కావాలి. ఇప్పుడు శుభవార్త ఏమిటంటే... గతంతో పోలిస్తే ఫోబియాల చికిత్సతో మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి.రిలాక్సేషన్ టెక్నిక్స్ అభ్యాసం చేయడం... మనకు ఏదైనా విషయంలో భయం వేయగానే ఉద్విగ్నత (యాంగ్జైటీ) కలుగుతుంది. దానివల్ల కొన్ని గుండెవేగం పెరగడం, ఊపిరి ఆడనట్లుగా ఉండటం (సఫొకేటింగ్) వంటి భౌతిక లక్షణాలు కనిపిస్తాయి. వీటి వల్ల మన భయం మరింతగా పెరిగినట్లయి, నిరాశలోకి కూరుకుపోతారు. అందుకే యాంగై్జటీని అధిగమించే ప్రయత్నంలో భాగంగా రిలాక్సేషన్ టెక్నిక్స్ను నేర్చుకుని, వాటిని అభ్యాసం చేయడం వల్ల క్రమంగా ఉద్విగ్నతను, ప్యానిక్ ఫీలింగ్స్ను ఎదుర్కోవచ్చు. రిలాక్సేషన్ టెక్నిక్స్లో బలంగా ఊపిరిపీల్చడం (డీప్ బ్రీతింగ్), ధ్యానం, యోగా వంటి వాటితో ఉద్విగ్న పరిస్థితుల్లోనూ స్థిమితంగా ఉండటం ప్రాక్టీస్ చేయవచ్చు.ప్రతికూల ఆలోచనలను అధిగమించడం... వాస్తవానికి ఒక ఫోబియా స్థితిలో అసలు భయం కంటే... దాని వల్ల కలిగే ప్రతికూల (నెగెటివ్) ఆలోచనల వల్లనే ఎక్కువగా భయం కలుగుతుంది. ఉదాహరణకు ఒక బ్రిడ్జ్పై వెళ్తుంటే... అది బాగానే ఉన్నా... ఒకవేళ కుప్పకూలితే అన్న ఆలోచన కలగగానే ఆ అనంతర పరిణామాలను ఊహించడం వల్ల కలిగే భయమే ఎక్కువ. కాబట్టి ఇలాంటి అనవసరమైన ప్రతికూల ఆలోచనలను దూరం చేసుకుంటే భయాలు కలగవు. కొన్ని సాధారణ ఆలోచనలనూ వదులుకోవాలి. ఏదైనా సంఘటన తర్వాత మనకూ అది జరుగుతుందనే ఆలోచన రావడం సహజమే అయినా అదేపనిగా వాటి గురించే ఆలోచించకూడదు. ఉదాహరణకు ఇటీవల బస్సు దహనం సంఘటనలూ, బస్సు ప్రమాదాలూ వరసగా చోటు చేసుకున్నాయి. దాంతో మనం ఎక్కే బస్సు కూడా ప్రమాదానికి లోనవుతుందేమో అన్న ఆలోచన రావడం సహజం. కానీ అదే నెగెటివ్ ఆలోచన మనను ఆవరించకుండా చూసుకోవాలి. అలాగే మనం విమాన ప్రయాణం చేస్తూ ఉంటే... ఇటీవల గుజరాత్లో కూలినట్టుగా అది కుప్పకూలిపోతోందేమోనని ఆలోచనను మనల్ని ఆవరించకుండా చూసుకోవాలి. కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ (సీబీటీ) : ఫోబియాలను గణనీయంగా తగ్గించేందుకు ఉపయోగపడే చికిత్స ప్రక్రియ కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ. సీబీటీ అంటే ఒకరకమైన కౌన్సెలింగ్. దీనితో పాటు మందులు కూడా వాడాల్సిన అవసరం ఉంటుంది. ఉదాహరణకు యాంటీ డిప్రెసెంట్స్, బీటా బ్లాకర్ మెడిసిన్స్, బెంజోడయాజిపైన్స్ వంటి మందులతో పాటూ సీబీటీ చేయాల్సి ఉంటుంది. చివరగా... కౌన్సెలింగ్, కాగ్నిటివ్ థెరపీ, రిలాక్సేషన్ టెక్నిక్స్లతో పాటు అవసరాన్ని బట్టి మందులు, ఇతర ప్రక్రియలన్నింటి సహాయంతో చేసే చికిత్సలు... వీటన్నింటి సహాయంతో ఇప్పుడు ఫోబియాలను దాదాపుగా పూర్తిగా తగ్గించడం సాధ్యమే.- డాక్టర్ పులి వనజారెడ్డి కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్ నిర్వహణ: యాసీన్ -
మ్యాడ్ హనీ: ఒక్క చుక్క సిప్ చేశారో..ప్రాణాలకే ముప్పు!
పూలమకరందాన్ని సేవించి తేనెటీగలు ఉత్పత్తి చేసే తియ్యటి తేనె ఎన్ని ఔషధ ప్రయోజనాలు కలిగి ఉందో తెలిసిందే. కానీ ఇప్పుడు చెప్పబోయే తేనె మాత్రం అత్యంత విషపూరితమైనది. అయితే దీన్ని కూడా పలు చికిత్సల్లో ఉపయోగిస్తారు. అలాగని నేరుగా సిప్ చేశారో అంతే పరిస్థితి. ఆ మధువే..మ్యాడ్ తేనే. ఇది మాదకద్రవ్య ప్రభావాలు కలిగిన తేనె అట. ఇది కేవలం నేపాల్, టర్కీలలో ఉత్పత్తి అవుతుందట. హిమాలయ ప్రాంతాలలో జెయింట్ అనే తేనెటీగలు రోడోడెండ్రాన్ అనే పువ్వుల నుంచి ఈ తేనెను ఉత్పత్తి చేస్తాయట. ఇందులో మాదక ద్రవ్య ప్రభావం తోపాటు, విషపూరితమైన గ్రేయానోటాక్సిన్లను కూడా కలిగి ఉంటుందట. ప్రాచీన గ్రీసులు ఈ మ్యాడ్ హానీని బయో వెపన్గా ఉపయోగించేవారట. పురాతన గ్రీకు గ్రంథాల్లో గ్రీకు సైనిక నాయకుడు జెనోఫోన్ దీని గురించి రాశాడని చెబుతున్నాయి. అంతేగాదు క్రీస్తూ పూర్వం జనరల్ పాంపే ఆధ్వర్యంలో రోమన్ సైనికులపై జరిగిన మూడవ మిథ్రిడాటిక్ యుద్ధంలో రాజు మిథ్రిడేట్స్ మ్యాడ్ హనీని బయో వెపన్గా ఉపయోగించినట్లు గ్రంథాలు చెబుతున్నాయి. ఈ తేనె కామోద్దీపన కోరికలను పెంచుతుందట కూడా.ఎలా సేకరిస్తారంటే..మధ్య నేపాల్, ఉత్తర భారతదేశంతో సహా హిందూ కుష్ హిమాలయ ప్రాంతంలో వసంతకాలంలో లోయలలో రోడోడెండ్రాన్లు వికసించినప్పుడు తేనెటీగగలు ఈ బంగారు రంగు తేనెను ఉత్పత్తి చేస్తాయట. చెట్టుకొమ్మలపై సుమారు 1200 నుంచి, 4 వేల మీటర్ల ఎత్తులో కనిపిస్తాయట. నేపాల్లోని గురుంగ్ అనే తెగ వారు ఈ మ్యాడ్ తేనెని సేకరిస్తారట. ఒకప్పడూ ఎక్కడపడితే అక్కడ దర్శనమిచ్చే ఈ తేనెతుట్టలు..ఇప్పుడు ఆనకట్ట నిర్మాణాల కారణంగా కనుమరుగవుతున్నాయని చెబుతున్నారు నిపుణులు.ప్రయోజనం, ప్రమాదం రెండూ ఉన్నాయి..దీన్ని కామోద్దీపనంగా, జీర్ణశయాంతర రుగ్మతలకు(పెప్టిక్ అల్సర్ వ్యాధి, డిస్స్పెప్సియా, గ్యాస్ట్రిటిస్, రక్తపోటు వంటి వ్యాధుల చికిత్సకు ఉపయోగిస్తారు. అంతేగాదు గొంతునొప్పి, ఫ్లూ, డయాబెటిస్, ఆర్థరైటిస్ వంటి చికిత్సలలో కూడా ఉపయోగిస్తారు. అలాగని ఆ తేనెని సిప్ చేశారో ఇక అంతే..టెక్సాస్ ఇన్స్టిట్యూట్ జర్నల్లో ప్రచురితమైన ఒక కేసులో.. ఓ భార్యభర్తలు తమ దాంపత్యం మరింత బాగుండాలని ఈ తేనెని ఒక వారం పాటు తీసుకున్నారు. ఫలితంగా రెండు గంటల్లోనే తీవ్రమైన ఇన్ఫీరియర్ మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్ (రక్త ప్రవాహంలో ఆకస్మిక అడ్డంకి వల్ల కలిగే గుండెపోటు)తో ఎమర్జెన్సీ వార్డులో చేరారు. ఇది రక్తపోటుని పడిపోయేలా చేసి, శాసకోశ సమస్యలు, తలతిరగడం, వంటి ఇబ్బందులను ఎదుర్కొనాల్సి ఉంటుందని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. ఒక్కోసారి కండరాల పక్షవాతం, అట్రియోవెంట్రిక్యులర్ బ్లాక్లు, స్పృహ కోల్పోవడం వంటివి సంభవిస్తాయి కూడా. అందువల్లే ఈ తేనెని టేస్ట్ చేయాలంటే మాత్రం డాక్టర్ పర్యవేక్షణలో, వారి సలహాలు సూచనల మేరకు ట్రై చేయాలే తప్ప..నేరుగా సిప్ చేసే సాహసం చేశారో.. ఆరోగ్యం డేంజర్లో పడ్డట్టే. View this post on Instagram A post shared by Medicinal Mad Honey® | Mad Honey Nepal (@medicinal.madhoney) (చదవండి: మా అమ్మ రష్యాలో సెలబ్రిటీ..! మురిసిపోతున్న కుమారుడు..) -
మూత్రం ఆపుకొంటే ముప్పే !
లబ్బీపేట(విజయవాడతూర్పు): వాష్రూమ్స్ కంపు కొడుతున్నాయని కొందరు, అందుబాటులో లేక ఇంకొందరూ, సమయం లేని మరికొందరూ యూరిన్ వస్తున్నా.. గంటల కొద్ది ఆపుకొంటున్న వారు అనేక మంది ఉంటున్నారు. అంతేకాదు ఇంటి నుంచి విధులకు, కళాశాలలకు వెళ్లే వారు తిరిగి ఇంటికి వచ్చే వరకూ మూత్ర విసర్జన చేయని వారు కూడా ఉంటున్నారు. నీళ్లు తాగితే వాష్రూమ్కి వెళ్లాల్సి వస్తుందని తక్కువగా తాగుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఇలాంటి వారిలో మూత్రాశయ, కిడ్నీ సమస్యలు తలెత్తుతుండటంతో ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు. నగరంలోని యూరాలజిస్టుల వద్దకు వస్తున్న వారిలో ఇలాంటి వారు అధికంగా ఉంటున్నారు. మూత్రం వస్తున్నట్లు సిగ్నల్ వచ్చిన తర్వాత ఆపుకోవడం కరెక్ట్ కాదంటున్నారు. అలా చేయడం ద్వారా అనేక అనారోగ్య సమస్యలకు దారితీసే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ఇవే నిదర్శనం.. గవర్నర్పేటకు చెందిన డిగ్రీ విద్యార్థిని మూత్రం వస్తే ఆపుకోలేక అర్జెంట్గా వెళ్లాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. తరగతి గదిలో ఉన్నప్పుడు కూడా తీవ్ర ఇబ్బంది పడుతుండటంతో యూరాలజిస్టును సంప్రదించారు. ఎక్కువ సేపు మూత్రానికి వెళ్లకుండా ఆపుకోవడం వలన ఇలాంటి సమస్య తలెత్తినట్లు వైద్యులు తెలిపారు. పటమటకు చెందిన ఓ ఉద్యోగిని 36 గంటల వరకూ యూరిన్ రాకపోవడంతో యూరాలజిస్టు వద్దకు వెళ్లారు. అక్కడ పరీక్ష చేస్తే యూరినరీ బ్లాడర్ పెరిగినట్లు ఉంది. అంటే ఎక్కువ సేపు మూత్రం ఆపుకోవడం వలన ఇలాంటి సమస్య తలెత్తినట్లు నిర్ధారించారు. ఇలా అనేక మంది మూత్ర సమస్యలు, కిడ్నీలో రాళ్లతో వైద్యులను సంప్రదిస్తున్నారు. సమస్యలివే.. యూరిన్ బ్లాడర్లో రెండు లీటర్ల వరకూ యూరిన్ నిల్వ ఉంటుందని, పెరిగితే యూరిన్కు వెళ్లాలనే సిగ్నల్ వస్తుంది. అలా వచ్చినప్పుడు మూత్ర విసర్జన చేయకుండా, బ్లాడర్లో యూరిన్ మూడు, నాలుగు లీటర్లకు చేరుతుంది. అలా యూరిన్ పెరగడం వలన యూరిన్ బ్లాడర్ ఎన్లార్జ్ అవుతుంది. కిడ్నీలపై ఒత్తిడి పెరిగి, వాటి పనితీరుపై ప్రభావం చూపుతుంది. ఇలాంటి వారిలో యూరినరీ ప్రాబ్లమ్స్ తలెత్తుతాయి. యూరిన్కు సిగ్నల్ వచ్చిన వెంటనే అర్జంట్గా వెళ్లాల్సి వస్తుంది. ఒక్కోసారి వాష్రూమ్కు వెళ్తుండగానే యూరిన్ పడిపోతుంది. కొందరిలో అసలు యూరిన్ రాకుండా ఆగిపోతుంది. ఇలాంటి సమస్యలతో టీనేజ్ పిల్లలతో పాటు పెద్ద వారు ఆస్పత్రులకు వస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు. నీళ్లు తాగడం లేదు.. నీళ్లు తాగితే మూత్ర విసర్జన చేయాల్సి వస్తుందని, విద్యార్థులే కాదు, ఉద్యోగుల్లో కూడా చాలా మంది తక్కువగా నీరు తాగుతున్నారు.ఇలాంటి వారిలో మూత్ర కోశ సమస్యలతో పాటు, కిడ్నీలో రాళ్లు కూడా వస్తున్నాయి. కిడ్నీలో రాళ్లు రావడానికి ఆహార అలవాట్లతో పాటు తక్కువగా నీళ్లు తాగడమే ప్రధాన కారణంగా వైద్యులు చెబుతున్నారు. ఇలాంటి వారిలో యూరినరీ ట్యూబ్ సన్నబడటం కూడా జరగవచ్చు. కిడ్నీల్లో రాళ్లు రాకుండా ఉండేందుకు రోజుకు 3 నుంచి 4 లీటర్లు నీటిని తాగాలని వైద్యులు సూచిస్తున్నారు. ్రప్రొస్టేట్ సమస్యలతో... ప్రస్తుతం 50 ఏళ్లు దాటిన వారిలో ప్రొస్టేట్ సమస్య కామన్గా మారినట్లు వైద్యులు చెబుతున్నారు. ప్రొస్టేట్ సమస్య కారణంగా అతిగా మూత్రం రావడం, అసలు రాకపోవడం, తక్కువగా రావడం వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. 50 ఏళ్లు దాటిన వారు ప్రొస్టేట్ పరీక్ష చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ప్రొస్టేట్ సమస్యలున్న 90 శాతం మందిలో మందులతోనే నయం చేయవచ్చునంటున్నారు. కేవలం 10 శాతం మందికి మాత్రమే సర్జరీ అవసరం అవుతుందంటున్నారు. మూత్రం వస్తున్న సిగ్నల్ వచ్చిన తర్వాత ఎక్కువ సేపు ఆపుకోవడం సరికాదు. అలా చేయడం ద్వారా మూత్రాశయ, కిడ్నీల సమస్యలు తలెత్తుతున్నాయి. మా వద్దకు వచ్చే వారిలో కిడ్నీలో రాళ్లు, ప్రొస్టేట్ సమస్యలు, యూరినరీ ట్యూబ్ సన్నబడటం, అర్జంట్గా యూరిన్ రావడం, అసలు రాకపోవడం వంటి వారు ఉంటున్నారు. కిడ్నీలో రాళ్లు, ప్రోస్టేట్ సమస్యలున్న వారికి అందరికీ సర్జరీ అవసరం లేదు. చాలా మందిలో మందులతో నయం చేయవచ్చు. యూరిన్ ట్యూబ్ సన్నబడటం వంటి సమస్య పుట్టుకతో పిల్లల్లో కూడా ఉంటుంది. అలాంటి వారికి మందులు, సర్జరీ ద్వారా సరిచేస్తున్నాం. 10 ఏళ్లలో 12,500 వరకూ యూరాలజీ సర్జరీలు చేశాం. – డాక్టర్ గుంటక అజయ్కుమార్, యూరాలజిస్ట్ -
అత్యంత అరుదైన వ్యాధి: కంటి రెప్పల్లో పేలు..!
తల్లో పేలు గురించి విన్నాం కానీ, కనురెప్పల్లో పేలు ఉండటం గురించి వినలేదు కదా..!. కనురెప్పల్లో చుండ్రు ఉంటుందని తెలుసగానీ ఇదేంటీ..పేలు ఉండటం అని విస్తుపోకండి. ఎందుకంటే..నిజంగానే ఓ మహిళ కంట్లో ఏకంగా 250 పేలను గుర్తించారు వైద్యులు. తొలుత వైద్యులు సైతం ఆశ్యర్యపోయారు. ఆ తర్వాత ఈ వ్యాధి గురించి క్షుణ్ణంగా తెలుసుకుని మరి చికిత్స అందించి ఆమెకు చక్కటి ఉపశమనం అందించారు. అసలేంటి ఈ సమస్య? ఎందుకు వస్తుంది వంటి వాటి గురించి సవివరంగా చూద్దామా..!గుజరాత్లోని ఆమ్రేలి జిల్లా సావర్ కుండ్ల ఆస్పత్రిలో ఈ ఘటన చోటు చేసుకుంది. 66 ఏల్ల గీతాబెన్ కంటిలో తీవ్రమైన దురద, నొప్పితో బాధపడుతూ ఆస్పత్రికి వచ్చింది. సూరత్కు చెందిన గీతాబెన్కు ఈ సమస్య గత రెండున్నర నెలలుగా వేధిస్తోంది. కళ్లు ఎర్రబారిపోవడం, సరిగా నిద్రపట్టకపోవడం వంటి సమస్యలతో సతమతమైంది. దీంతో కంటి డాక్టర్ మృగాంక్ పటేల్ ఆమె కళ్లను పరీక్షించగా.. రెప్పల్లో ఏకంగా పేలు ఉన్నట్లు గుర్తించారు. మొదట ఆయన కూడా ఇదేంటని విస్తుపోయారు. ఆ తర్వాత వివిధ అధ్యయన పత్రాలను శోధించి.. ఇలాంటి వింత కేసు గురించి తెలుసుకున్నట్లు తెలిపారు. దీన్ని వైద్య పరిభాషలో ఫిరాయసిస్ పాల్పిబ్రారమ్ అంటారని చెప్పారు. తాము మాగ్నిఫికేషన్ కింద కనురెప్పల్ని పరిశీలించినప్పుడు, పేలు కదులుతున్నట్లు గుర్తించామని అన్నారు. వాటి తోపాటు గుండ్రని పేను గుడ్లను కూడా కనిపించాయని వెల్లడించారు. వీటిని తొలగించాలంటే చాలా సమయం పడుతుందని ముందుగానే బాధిత మహిళకు తెలియజేసి మరి ఆపరేషన్కి సిద్ధం చేశారామెను. అయితే ఆమెకున్నవైద్య పరిస్థితుల రీత్యా ఎలాంటి ఇంజెక్షన్లు ఇవ్వకుండా ఒక్కొక్కపేనుని ఓపికగా తొలగించారు వైద్యులు. ఈ పరాన్న జీవి కంటి రెప్ప మూయగానే అమాంతం రక్తం తాగేస్తుందట. ఎందుకంటే అక్కడ కణజాలాం చాలా పల్చగా ఉండి, సులభంగా రక్తాన్ని పీల్చేయగలదని అన్నారు. పైగా అక్కడ కనురెప్పలకు అతుక్కుపోయి ఉంటాయట. దీని కారణంగా పేషెంట్కి దురద, మంట వస్తుందట. అదీగాక ఇవి తొలగించాలనుకున్నా..అంత తేలిగ్గా రావట కూడా. ప్రత్యేక పరికరంతో తొలగింపు ప్రక్రియ..ఈ పేలు వెలుతురు పడినప్పుడూ కదులుతుంటాయట. కాబట్టి వాటిని తొలగించడానికి మెక్ఫర్సన్ అనే ప్రత్యేక పరికరం ఉపయోగించి ప్రతీ పేనుని పట్టుకుని బయటకు తీసినట్లు వివరించారు. అలాగే ఆ మహిళకు నొప్పి తెలియకుండా అనస్థీషియా ఇచ్చాం అని వైద్యుడు మృగాంక్ వెల్లడించారు. తన 21 ఏళ్ల అనుభవంలో ఇలాంటి కేసు మొట్టమొదటిదని, అస్సలు ఎప్పుడూ ఇలాంటి కేసు ఎదురవ్వలేదని అన్నారు. బాధిత మహిళ కంటి రెప్పల్లోంచి ఏకంగా 250 పేలు, 85 గుడ్లు(లార్వా)లు తొలగించినట్లు తెలిపారు.ఫిరాయసిస్ పాల్పిబ్రారమ్ అంటే..యుఎస్ నేషనల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ ఇన్ఫర్మేషన్ ప్రకారం.. ఫిరాయసిస్ పాల్పిబ్రారమ్ అనేది అరుదైన వైద్య పరిస్థితి. దీనివల్ల పేలు, వాటి గుడ్లు కనురెప్పలలో చేరుతాయి. దాంతో తీవ్రమైన దురద, కళ్లు ఎర్రబారడం, నిద్రలేమి వంటి సమస్యలు ఉత్ఫన్నమవుతాయట. అయితే ఇది సాధారణ కంటి ఇన్ఫెక్షన్కానందున నిర్థారించడం కష్టమని అన్నారు. వీటి లార్వాలు అచ్చం దోమ లార్వాలనే ఉంటాయని చెప్పారు.ఈ పరిస్థితి ఎందుకొస్తుందంటే..ఇన్ఫెక్షన్ కారణంగా లేదా పరిశుభ్రత లోపించినప్పుడు ఈ పరిస్థితి తలెత్తుతుందని చెబుతున్నారు వైద్యులు. పేలు రావడానికి కొన్ని రకాల వాతావరణాలు, ఇంట్లోని దిండ్లు కారణం కావొచ్చని అన్నారు. ఈ వ్యాధి మనుషులతోపాటు పశువుల్లో కూడా కనిపిస్తుందని చెబుతున్నారు వైద్యులు. ముఖ్యంగా అడవుల్లో తిరిగే వాళ్లకు, పశువులకు దగ్గరగా ఉండేవాళ్లకు ఇవి వెంటనే అటాక్ అవుతాయట. వెంటనే కనురెప్పలకు చేరి అక్కడ తిష్టవేస్తాయని చెబుతున్నారు నిపుణులు. ఇవి కాంతి పడినప్పుడూ పారిపోతాయి కాబట్టి లైట్ లేకుండా తొలగించాలని చెబుతున్నారు వైద్యులు. పైగా ఈ పరాన్నజీవి లార్వాలను ఏ ఔషధం చంపలేదని అన్నారు. వాటిని ఒక్కొక్కటిగా పట్టుకుని కంటి నుంచి తొలగించడం ఒక్కటే మార్గం అని అన్నారు.'తలలో ఉండే పేలు కంటి పేలు భిన్నంగా ఉంటాయి. కంటి పేలు, కంట్లోని తెల్లటి భాగంలో తిరుగుతూ వెలుతురు నుంచి పారిపోతాయి. అవి కంటి రెప్ప లోపల, చీకటిగా ఉండే భాగంలో జీవిస్తాయి. అక్కడే ఉంటాయి' అని చెప్పుకొచ్చారు డాక్టర్ మృగాంక్. లక్షణాలు కంటి నొప్పి, కళ్ళలో ఎప్పుడూ దురద, నిద్రలేమి కనురెప్పల వాపు, నీరు కారడం వంటివి తీసుకోవాల్సిన జాగ్రత్తలు..పరిశుభ్రత పాటించడం చాలా ముఖ్యమని సూచించారు. చేతులను క్రమం తప్పకుండా శుభ్రంగా కడుక్కోవాలని అన్నారు. పిల్లలు, వృద్ధులు ఎక్కువగా ప్రభావితమయ్యే అవకాశం ఉందని, యువతలో ఈ పరిస్థితి వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుందని చెప్పారు.(చదవండి: కాలు మీద కాలు వేసుకుని కూర్చోవడం... అమర్యాద...అనారోగ్యకరం కూడానా?) -
కాలు మీద కాలు దర్జా కాదు ... అమర్యాద...అనారోగ్యకరం కూడానా?
‘‘ఇది నా కాలు ఈ కాలు కూడా నాదే. నా కాలు మీద నా కాలు వేసుకుంటే నీకేంటి?’’అని అడుగుతాడు పుష్ప సినిమాలో హీరో. ఈ డైలాగ్ ఎంత పాప్యులరో.. కాలు మీద కాలు వేసుకుని కూర్చోవడం అనే అంశం కూడా ఇప్పుడు అంతకు మించి పాప్యులర్గా మారింది. ఆ మధ్య టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ దగ్గర నుంచి తాజాగా ప్రధానితో మహిళా క్రికెటర్ల సమావేశం దాకా...అనేక సందర్భాల్లో కాలు మీద కాలు వేసుకుని కూర్చోవడం అనేది చర్చనీయాంశంగా మారుతోంది. మన సంప్రదాయాల ప్రకారం... ఎవరి ముందైనా మనం కాళ్ల మీద కాలు వేసుకుని కూర్చోవడం అంటే అవతలి వ్యక్తికి మర్యాద ఇవ్వాల్సిన అవసరం లేదని మనం భావిస్తున్నట్టు. తరాల నుంచీ కొనసాగుతున్న ఈ నమ్మకమే ఆధునిక సమాజంలో తరచుగా వివాదస్పదం అవుతోంది. ఆ వివాదాలు అలా ఉంచితే... అసలు కాలు మీద కాలు వేసుకుని కూర్చోవడం అనేది అనారోగ్యకరం కూడా అంటున్నాయి అధ్యయనాలు కొన్ని అభిప్రాయాలు. చాలా మందికి ఒక కాలు మీద మరొక కాలు వేసుకుని కూర్చోవడం చాలా సౌకర్యంగా ఉంటుంది. పాదం అప్పుడప్పుడు తిమ్మిరిగా అనిపించడం ఉన్నా అది సౌకర్యవంతంగా ఉంటుంది అని అదే ఫాలో అవుతారు. కానీ అది మీకు మంచి చేస్తుందా? హాని చేస్తుందా? చేస్తే ఎవరికి? ఎలా? ఎందుకు?గర్భిణీలకు...గర్భధారణ సమయంలో, శరీరం వివిధ రకాల మార్పులకు లోనవుతుంది. గర్భాశయం విస్తరించినప్పుడు, గురుత్వాకర్షణ కేంద్రం ముందుకు మారుతుంది. తద్వారా సాధారణానికి భిన్నంగా నడుస్తున్నట్లు, నిలబడి, కూర్చోవడం జరుగుతుంది. గర్భధారణ సమయంలో కండరాల ఒత్తిడి, వెన్నునొప్పి తిమ్మిర్లు అన్నీ సాధారణం. కాళ్ళు క్రాస్ చేసి కూర్చోవడం వల్ల బిడ్డకు ఎటువంటి హాని జరగకున్నా గర్భిణికి చీలమండ వాపు లేదా కాళ్ళ తిమ్మిరి కలిగేందుకు ఇది దోహదం చేస్తుంది.రక్తపోటు...ఎవరికైనా రక్తపోటును పరీక్షించే సమయంలో సాధారణంగా రెండు పాదాలను నేలపై ఉంచమని అడుగుతారు. ఎందుకంటే కాళ్లు ఒకదానిపై మరొకటి వేయడం వల్ల రక్తపోటు పెరుగుతుంది కాబట్టి. జర్నల్ ఆఫ్ క్లినికల్ నర్సింగ్ ట్రస్టెడ్ సోర్స్లో ప్రచురించిన ఒక అధ్యయనంలో కాళ్లను ఒకదానిపై ఒకటి వేసి కూర్చోవడం వల్ల రక్తపోటులో కలిగే మార్పులను స్పష్టంగా గమనించారు. అదే విధంగా జర్నల్ ఆఫ్ హైపర్టెన్షన్ లో ప్రచురించిన మరొక అధ్యయనంలో, తమ చీలమండను మోకాలిపై ఉంచడం ద్వారా రక్తపోటు పెరిగినట్లు కనుగొన్నారు.వెరికోస్వెయిన్స్...కాళ్ళ నుంచి బయటకు వచ్చే ఉబ్బిన, మెలితిరిగిన, త్రాడు లాంటి సిరలు యవెరికోస్ వెయిన్్స. సాధారణంగా తొడల వెనుక లోపలి కాలుపై ఎక్కువగా కనిపిస్తాయి. సిరల్లోని కవాటాల సమస్య కారణంగా వెరికోస్ వెయిన్ ్స ఏర్పడతాయి, ఇవి గుండె వైపు రక్తాన్ని పంప్ చేయడానికి చాలా కష్టపడి పనిచేస్తాయి. రక్తం పైకి కదులుతున్నప్పుడు, వన్–వే వాల్వ్లు తెరుచుకుంటాయి, మూసుకుపోతాయి, రక్తం తిరిగి క్రిందికి లీక్ అవ్వకుండా నిరోధిస్తాయి. అయితే, ఈ కవాటాలు బలహీనమైనప్పుడు లేదా దెబ్బతిన్నప్పుడు, గురుత్వాకర్షణ శక్తి రక్తాన్ని వెనక్కి లాగుతుంది. దీనిని సిరల లోపం అంటారు. ఆ రక్తం వెనక్కి వచ్చి, సేకరించి, ఉబ్బినప్పుడు సిరలు వెరికోస్ వెయిన్స్గా మారతాయి. చాలా సేపు నిలబడటం కూర్చోవడం వల్ల వెరికోస్ వెయిన్ ్స ప్రమాదం పెరుగుతుంది,అయితే కాలు మీద కాలు వేసుకోవడం వల్ల ఈ ప్రభావం ఉంటుందని ఒక అభిప్రాయం ఉన్నప్పటికీ శాస్త్రీయంగా నిర్ధారించే ఆధారాలు లేవు.భంగిమలో మార్పు...కాలు మోకాలిపై ఎక్కువసేపు ఉంచడం వల్ల కటి తిప్పడానికి వంగడానికి కారణమవుతుంది. ఇది దిగువ వీపులో నొప్పిని కలిగిస్తుంది. ఇది కాలక్రమేణా వెన్నెముక తప్పు అమరికకు కూడా దారితీస్తుంది. కూర్చోవడంలో సరైన భంగిమ లేనప్పుడు, ఆ పరిస్థితిని కండరాలు సరి చేయవలసి వస్తుంది. దీని అర్థం అవి అవసరమైన దానికంటే ఎక్కువగా పనిచేస్తాయి, ఇది నొప్పికి దారితీస్తుంది. అయితే కాలు మీద కాలు వేసుకుని కూర్చోవడం అనేది పూర్తిగా మానేయాలని దీని అర్థం కాదు. కొన్ని సమస్యలైతే ఉన్నాయి.. కాబట్టి వీలైనంత వరకూ ఎక్కువసేపు అదే భంగిమలో కూర్చోవడాన్ని నివారించడం మంచిది.(చదవండి: భారతీయుల వివాహ వేడుకను చూసి..కొరియన్ కోడియా ఫిదా!) -
చక్కెర బాధితులు తినదగ్గ దుంప... చిలగడదుంప!
భూమిలో పండే దుంపలు షుగర్ బాధితులకు మంచివి కావనీ, ఎందుకంటే అందులో కార్బోహైడ్రేట్లు ఎక్కువ కాబట్టి డయాబెటిస్ బాధితుల్లో చక్కెర మోతాదులను పెంచేస్తాయని నిపుణులు చెబుతుంటారు. అందుకే చాలామంది షుగర్ బాధితులు ఆలుగడ్డలు (బంగాళదుంపలు) తినడానికి వెనకాడుతుంటారు. అయితే మిగతా దుంపల విషయం ఎలా ఉన్నా... చిలగడదుంపలతో మాత్రం ఆ ప్రమాదం లేదంటున్నారు ఆహార నిపుణులు. దీని నుంచి విడుదల అయ్యే చక్కెర మోతాదులు చాలా తక్కువ. అంటే ఇవి తిన్నప్పుడు వీటిలోంచి వెలువడే చక్కెర తక్కువ గ్లైసిమిక్ ఇండెక్స్ (లో– గ్లైసిమిక్ ఇండెక్స్) ఉండటం వల్ల దీనితో అంతగా ప్రమాదం ఉండదనీ, పైగా ఇందులో విటమిన్–ఏ కూడా ఎక్కువగా ఉన్నందున చక్కెర వ్యాధి ఉన్నవారు ఈ దుంపను తినవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. అయితే దాన్ని పరిమితంగా తీసుకోవడమే మంచిది. (చదవండి: ‘బ్యాటర్డ్ ఉమన్ సిండ్రోమ్’: ఇంటి హింస ఇంతింతై..) -
‘బ్యాటర్డ్ ఉమన్ సిండ్రోమ్’: ఇంటి హింస ఇంతింతై..
బ్యాటర్డ్ ఉమన్ సిండ్రోమ్ అనేది మహిళలు తమ గృహహింస కారణంగా ఎదుర్కొనే మనోవేదన. ఒకరకంగా చూస్తే తీవ్రమైన వేదన కారణంగా అంటే రేప్కు గురైనవాళ్లూ, యుద్ధాల్లో సర్వం పోగొట్టుకున్నవాళ్లూ అనుభవించే అత్యంత వేదనాభరితమైన కండిషన్తో వచ్చే పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ (పీటీఎస్డీ)లో ఇదో రకం అని చెప్పవచ్చు. మహిళలు తమ పార్ట్నర్ చేతుల్లో అనుభవించిన గృహహింస కారణంగా ఇది తమ ఖర్మ అంటూ సమాధానపడుతూ నిత్యం అనుభవించే రంపపుకోత కారణంగా వాళ్లు అనుభవించే మానసిక సమస్యే ఈ ‘బ్యాటర్డ్ ఉమన్ సిండ్రోమ్’. ఈ మానసిక సమస్యపై అవగాహన కోసమే ఈ కథనం...పెళ్లి తర్వాత భర్త లేదా జీవిత భాగస్వామి పెట్టే వేదనలను అనుభవించే భార్యల్లో కొందరికి ఇది తమ ఖర్మ అనే ఫీలింగ్ తప్ప... దీన్ని ఎదుర్కోవాలనిపించడం, పోలీసులకు ఫిర్యాదు చేయాలనిపించడం కూడా ఉండదు. అలా మొదలయ్యే ‘బ్యాటర్డ్ ఉమన్ సిండ్రోమ్’లో ఆ మహిళ... తన భర్త అలా హింసిస్తుండటాన్ని కూడా తన తప్పుగానే అనుకుంటూ ‘అపరాధభావన’తో బాధపడుతుంటుంది.సిండ్రోమ్ తాలూకు నాలుగు దశలివి... బ్యాటర్డ్ ఉమన్ సిండ్రోమ్కు దారితీసే వాళ్ల వాళ్ల ఇంటి పరిస్థితులు ప్రతి మహిళకూ వేర్వేరుగా ఉన్నప్పటికీ... వారు అనుభవించే కొన్ని కామన్ దశలను బట్టి చూసినప్పుడు వారి మానసిక స్థితి ఈ కింద పేర్కొన్న నాలుగు దశల్లో కొనసాగుతుంది. మొదటి రెండు దశల్లో మహిళలు నిశ్శబ్దంగా తమ వేదనలు అనుభవించినప్పటికీ... ఈ వేదనల నుంచి బయటకు వచ్చేందుకు తాము చేసే ప్రయత్నాలు ఈ చివరి రెండు దశల్లో కొంతమేర జరుగుతాయి. 1. డీనియల్ : తాము వేదన అనుభవిస్తున్న సంగతి తెలియని పరిస్థితి ఇది. భర్త తమను వేధిస్తున్నారని కూడా వాళ్లు అంగీకరించరు. అదేదో ఈసారికి అలా జరిగింది తప్ప భర్త తమను హింసిస్తున్నట్టు గుర్తించడానికి నిరాకరించే దశే ఈ ‘డీనియల్’. 2. గిల్టీ (అపరాధభావన) : భర్త తనను హింసించడానికి లేదా కొట్టడానికి ఒక రకంగా తాను చేసిన తప్పే అని సర్దిచెప్పుకునే ధోరణే ఈ అపరాధభావనకు కారణం. 3. ఎన్లైట్మెంట్ : భర్త చేతుల్లో ఇలా తరచూ హింసకు గురికావడం తమకు తగదనీ, దాన్నుంచి బయటకు రావాలనే భావన కలగడం ఈ ఎన్లైట్మెంట్ దశలో జరుగుతుంది. 4. రెస్పాన్సిబిలిటీ : ఈ దశలో వారు తామీ హింస నుంచి బయటపడటం అన్నది తమ చేతుల్లోనే ఉందనీ, అది తమ బాధ్యత అని గ్రహిస్తారు. అవసరమైతే బంధం నుంచి బయటపడైనా ఈ హింసనుంచి విముక్తి పొందవచ్చని అనుకునే దశ ఇది. బ్యాటర్డ్ ఉమన్ సిండ్రోమ్ మొదలయ్యేదిలా... మొదట్లో ఏదో మనస్పర్థల కారణంగా భర్త ఆగ్రహానికి గురైనప్పుడు మహిళ అంతగా ప్రతిఘటించక΄ోవచ్చు. ఇది పెళ్లయిన కొత్తలో ఇలా జరగడానికి అవకాశముంది. భర్త తొలుత శారీరకంగానో లేదా మానసికంగానో బాధపెట్టాక ఎందుకో అలా జరిగి΄ోయిందనీ, ఇకపై అలా జరగదంటూ ఎమోషనల్గా మాట్లాడతాడు. ఆమె ఆమోదం పొందడం కోసం అవసరమైనదానికంటే ఎక్కువ రొమాంటిక్గా వ్యవహరిస్తూ ఆమెను నార్మల్ చేయడానికి ప్రయత్నిస్తాడు. కానీ ఈ హింస అక్కడితో ఆగకుండా అదేపనిగా మాటిమాటికీ కొనసాగుతూ ఉంటుంది. దాంతో తొలుత అతడు చెప్పే (కన్వీన్స్ చేసే) అంశాలకు లొంగి΄ోయిన మహిళ ఆ తర్వాత అదో రొటీన్ తంతు అని గ్రహించి, పెద్దగా స్పందించడమూ మానేస్తుంది. అలా గృహహింస వేదనలకు గురవుతూనే ఉంటుంది. ఇలా జరగడానికి ఆర్థిక సమస్యలూ, విడి΄ోతామేమోనన్న భయం, తనను తాను సముదాయించుకునే సర్దుబాటు ధోరణీ... ఇలాంటి కారణాలు చాలానే ఉండవచ్చు.నిర్వహణ: యాసీన్ప్రభావాలు... స్వల్పకాలిక ప్రభావాలివి... జీవితం వృథా అనుకోవడం, తీవ్రమైన కుంగుబాటు (డిప్రెషన్) ఆత్మవిశ్వాసం లోపించడం (లో సెల్ఫ్ ఎస్టీమ్) తీవ్రమైన ఉద్విగ్నత (సివియర్ యాంగ్జైటీ).దీర్ఘకాలిక ప్రభావాలివి... తరచూ గతకాలపు జ్ఞాపకాల్లోకి వెళ్లడం, తానేమిటో మరచి΄ోయి వేరేగా ప్రవర్తించడం (డిసోసియేటివ్ స్టేట్), తీవ్రంగా ప్రతిస్పందించడం (వయొలెంట్ ఔట్బరస్ట్... ఇది సుదీర్ఘకాలం తర్వాత వచ్చే పరిణామం) హైబీపీ, గుండెజబ్బుల వంటివి కనిపించడం, కీళ్లనొప్పులు, ఆర్థరైటిస్ దీర్ఘకాలికం (క్రానిక్)గా వచ్చే వెన్నునొప్పి, తలనొప్పి.బ్యాటర్డ్ ఉమన్ సిండ్రోమ్కు ఇవే గుర్తులు... హింసించే తన భర్తకు అన్నీ తెలుసు... తనకేమీ తెలియనందువల్ల తనవల్లనే తప్పు జరిగిందేమోననే అపరాధభావన ∙జరిగిందానికి తామే బాధ్యురాలినేమో అనే భావనతో కలిగే వేదన ∙జరిగిందీ, తాను అనుభవించిన వేదనను తమ ఇంటివాళ్లకూ, ఫ్రెండ్స్కూ చెప్పక΄ోవడం ∙పిల్లల జీవితం ఏమై΄ోతుందోనన్న తీవ్రమైన ఆందోళన. -
మీ టూత్ బ్రష్ మార్చి ఎంత కాలమైంది?
చాలా మంది ఎన్నో ఖర్చులు పెడతారు. ఎన్నో వస్తువులు వెంట వెంటనే మార్చి కొత్తవి కొంటూ ఉంటారు కానీ నెలల తరబడి ఒకే టూత్ బ్రష్ను ఉపయోగిస్తుంటారు. ఇది ప్రమాదకరమంటున్నారు దంతవైద్యులు. ఒకేటూత్ బ్రష్ను దీర్ఘకాలం పాటు ఉపయోగించడం వల్ల నోటి ఆరోగ్యం క్షీణించి, బ్యాక్టీరియా వ్యాప్తి చెందుతుంది. ఇంతకీ ఎంతకాలానికి ఒకసారి టూత్ బ్రష్ను మార్చాలి, బ్రష్ను ఎప్పుడెప్పుడు మార్చుతుండాలో తెలుసుకుందాం. దంతవైద్యులు ప్రతి 2 నుండి 3 నెలలకు ఒకసారి టూత్ బ్రష్ మార్చాలంటారు. ఎందుకంటే టూత్ బ్రష్ పాతదైతే, దాని బ్రిజిల్స్ దెబ్బతింటాయి. ఇది బ్రష్ చేసేటప్పుడు చిగుళ్ళకు హాని కలిగిస్తుంది. ఒకరకంగా చెప్పాలంటే మొత్తం ఆరోగ్యం కూడా మీ దంతాల ఆరోగ్యానికి సంబంధించినది. అందువల్ల, దంతాలను సరిగ్గా శుభ్రం చేయడం చాలా ముఖ్యం.చాలా మృదువుగా లేదా విప్పి ఉన్న బ్రిస్టల్స్ దంతాలను సరిగ్గా శుభ్రం చేయలేవు. దాంతో దంతాలపైన పాచి పేరుకుపోతుంది ఇది దంత క్షయం, చిగురువాపు ఇతర నోటి ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. నోటి ఆరోగ్యం బాగుండక΄ోతే అది క్రమేణా హృద్రోగానికి, నోటి క్యాన్సర్కు తలుపులు తెరుస్తుంది. దాంతోపాటు నోటి ఆరోగ్యం బాగుండకపోతే మొత్తం జీర్ణవ్యవస్థపైనే దాని ప్రభావం పడుతుందని, కాబట్టి కనీసం మూడు నెలలకోసారి అయినా బ్రష్ మార్చడం మంచిదని నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. అదేవిధంగా వైరల్ ఫీవర్, తీవ్రమైన జలుబు, దగ్గుతో బాధపడినప్పుడు, టైఫాయిడ్ వంటి వాటి నుంచి కోలుకున్న వెంటనే కూడా బ్రష్ మార్చడం మంచిదని నిపుణుల సలహా. (చదవండి: బాల స్టార్టప్... బ్రహ్మాండం!) -
జాతీయ క్యాన్సర్ అవగాహనదినం : అపోలో “చెక్ ఓ లేట్’’ కార్యక్రమం
హైదరాబాద్ : జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవం సందర్భంగా ముందస్తు క్యాన్సర్ గుర్తింపుపై అవగాహన కల్పించే అపోలో క్యాన్సర్ సెంటర్లు “చెక్ ఓ లేట్!” అనే ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించాయి. క్యాన్సర్ అనగానే ముందు ఆందోళన మొదలవుతుంది కానీ.అవగాహన ,ముందస్తు రోగ నిర్ధారణ ముఖ్యమనే సందేశాన్ని అందించడానికి ఈ చొరవ డార్క్ చాక్లెట్ సింబాలిక్గా ఉపయోగించుకుంది. విజయవంతమైన క్యాన్సర్ చికిత్సలో క్రమం తప్పకుండా స్క్రీనింగ్ ,కాలంలో జోక్యం చేసుకోవడం కీలక పాత్రను ఈ సమావేశం హైలైట్ చేసింది.ఈ కార్యక్రమం అపోలో క్యాన్సర్ సెంటర్స్ డైరెక్టర్ డాక్టర్ పి. విజయ్ ఆనంద్ రెడ్డి స్వాగత ప్రసంగం చేశారు. విజిలెన్స్ & ఎన్ఫోర్స్మెంట్ విభాగం డైరెక్టర్ జనరల్, శిఖా గోయెల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. “చెక్ ఓ లేట్” బాక్స్ను ఆవిష్కరించారు. క్యాన్సర్ను ముందస్తుగా గుర్తించడం గురించి అవగాహనలో అపోలో క్యాన్సర్ సెంటర్ల వినూత్న విధానాన్ని ఆమె ప్రశంసించారు.ఎలికో హెల్త్కేర్ సర్వీసెస్ లిమిటెడ్ వైస్ చైర్పర్సన్ & మేనేజింగ్ డైరెక్టర్ మరియు CII తెలంగాణ మాజీ చైర్పర్సన్ డాక్టర్ వనితా దాట్ల డాక్టర్ సాయి లక్ష్మీ దాయణ (సీనియర్ కన్సల్టెంట్ - గైనక్ ఆంకాలజీ), డాక్టర్ రేఖ బన్సాల్ (కన్సల్టెంట్ - మెడికల్ ఆంకాలజీ), మరియు డాక్టర్ రష్మి సుధీర్ (కన్సల్టెంట్ - బ్రెస్ట్ రేడియాలజీ) సహా అపోలో క్యాన్సర్ సెంటర్ల నుండి ప్రముఖ వైద్యులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. డార్క్ చాక్లెట్ను సింబాలిక్గా ఉపయోగించడం ప్రాముఖ్యతను డాక్టర్ శిల్పా రెడ్డి వివరించారు. -
గుండెలు పగిలేలా ఏడ్చారు.. పోరాడి గెలిచారు!
National Cancer Awareness Day :ఎన్నో భయాలు, ఎన్నో ప్రతికూలతలలో నుంచి బయటికి వచ్చి, ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్లిన స్టార్స్ వీరు. సోనాలి బింద్రే నుంచి హీనా ఖాన్ వరకు ఎంతోమంది స్టార్స్ క్యాన్సర్ సర్వైవర్స్ మాత్రమే కాదు వారియర్స్ కూడా. సదస్సులలో ప్రసంగించడం నుంచి స్వచ్ఛంద సంస్థలతో కలిసి పనిచేయడం వరకు క్యాన్సర్పై అవగాహన కోసం ఎంతో పనిచేస్తున్నారు...సోనాలి బింద్రేకు స్టేజ్ 4 మెటాస్టాటిక్ క్యాన్సర్ ఉన్నట్లు 2018లో నిర్ధారణ అయిన తరువాత ఆమె, ఆమె కుటుంబసభ్యులు, స్నేహితులు, అభిమానులు షాక్ అయ్యారు. న్యూయార్క్లో ఆరు నెలల చికిత్స తర్వాత సోనాలి బింద్రే ముంబైకి తిరిగి వచ్చింది. ఆమె క్యాన్సర్ చికిత్సలు అక్కడితో ముగియక΄ోయినా క్యాన్సర్ అవగాహన కోసం నడుం కట్టింది. క్యాన్సర్ ముందస్తు గుర్తింపు, క్యాన్సర్పై అవగాహన కోసం ప్రచారకర్తగా మారింది. ఆమె ఇన్స్టాగ్రామ్ పోస్ట్లు వివిధ రకాల క్యాన్సర్ చికిత్సలు పొందుతున్న వేలాది మందికి స్ఫూర్తిగా మారాయి. ఎంతో ధైర్యాన్నిచ్చాయి.తాను దిగులు పడిన కాలం, ఆ దిగులు, నిరాశ నీడల నుంచి బయటపడి ఆత్మస్థైర్యాన్ని కూడగట్టుకున్న కాలం గురించి మాటల రూపంలోనో, రచనల రూపంలోనో చెబుతూనే ఉంది సోనాలి. తనకు క్యాన్సర్ అని నిర్ధారణ అయిన క్షణం నుంచి అందులో నుంచి బయటపడే వరకు ఆమె ఏడ్చింది, నవ్వింది, గెలిచింది!(ప్రముఖ గాయని, నటి కన్నుమూత, సరిగ్గా అదే రోజు)మందులే కాదు మానసిక బలం కూడా...అది 2012 సంవత్సరం. గతంలో ఎన్నడూ లేనంతగా తరచుగా అలసి΄ోయేది మనీషా కోయిరాలా. కడుపు ఉబ్బిపోయేది. నొప్పిగా ఉండేది. చాలామంది మహిళలలాగే మనీషా కూడా తన ఇబ్బందిని సీరియస్గా తీసుకోలేదు. అయితే ఆరోగ్యం క్షీణించడం మొదలైన తరువాత డాక్టర్ దగ్గరకు వెళ్లింది.ఎన్నో పరీక్షల తరువాత వైద్యులు ఆమెకు షాకింగ్ న్యూస్ చెప్పారు. మనీషాకు అండాశయ క్యాన్సర్ అని నిర్ధారణ అయింది. ఆ సమయంలో ఆమె భయపడింది. గందరగోళంలో పడింది. గుండె పగిలిపోయినంతగా ఏడ్చింది.‘ఇలా ఏడుస్తూ కూర్చుంటే కుదరదు’ అని తనకు తాను చెప్పుకొని ధైర్యం తెచ్చుకుంది. ‘క్యాన్సర్తో పోరాటం అనేది మందులకు పరిమితమైన విషయం కాదు. మానసిక బలం ఉండాలి’ అంటున్న మనీషా చికిత్స కాలంలో తనలో ఆత్మవిశ్వాసాన్ని తిరిగి నిర్మించుకోవడానికి, మనశ్శాంతికి చేరువ కావడానికి మానసిక నిపుణులను సంప్రదించింది. క్యాన్సర్పై పోరాడే క్రమంలో కుటుంబసభ్యులు, స్నేహితులు, అభిమానులు అన్ని రకాలుగా అండగా ఉన్నారు. ఇప్పుడు మనీషాఎంతోమంది బాధితులకు అండగా నిలుస్తోంది. క్యాన్సర్ అని నిర్ధారణ అయిన వ్యక్తులకు ధైర్యం చెప్పి, అండగా నిలుస్తోంది. క్యాన్సర్పై అవగాహన కలిగించడానికి ఎన్నో సదస్సులలో ప్రసంగించింది. క్యాన్సర్ బాధితులకు అండగా ఉంటున్న ఎన్నో సంస్థలతో కలిసి పనిచేస్తోంది. క్యాన్సర్ను ముందస్తుగా గుర్తించడంలోని ప్రాముఖ్యత గురించి నొక్కి చెబుతోంది. అండాశయ క్యాన్సర్ గురించి అవగాహన పెంచడానికి ‘ఓవాకోమ్’లాంటి స్వచ్ఛంద సంస్థలతో కలిసి పనిచేస్తోంది. ర్యాలీలు, క్యాన్సర్ బాధితుల కోసం నిధుల సేకరణ కార్యక్రమాలలో పాల్గొంటుంది. ఒక మేలుకొలుపుతనకు బ్లడ్క్యాన్యర్ అని 2009లో నిర్ధారణ అయిన తరువాత మోడల్, నటి లిసా రేకు చికిత్స మొదలైంది. శారీరక మార్పులు మొదలయ్యాయి. అయినా ఎప్పుడూ అధైర్యపడలేదు. ఆత్మస్థైర్యం అనే ఆయుధాన్ని వదల్లేదు. ‘ఇది నాకు పునర్జన్మ’ అంటున్న రే క్యాన్సర్ను ఎదుర్కోవడంలో తన అనుభవాలను ‘ది ఎల్లో డైరీస్’ పేరుతో రాసింది.‘క్యాన్సర్ అనేది పెద్ద మేలుకొలుపులాంటిది. క్యాన్సర్పై మరింత అవగాహన పెరగాలని కోరుకుంటున్నాను. క్యాన్సర్పై అవగాహన పెంచే కార్యక్రమాల్లో పాల్గొంటాను. అది నా కెరీర్లో భాగం’ అంటుంది లిసా రే.ఆ సంకేతాలు పసిగట్టాలిరొమ్ము క్యాన్సర్ బారిన పడిన హీనా ఖాన్ భయంతో ఎప్పుడూ వెనకడుగు వేయలేదు. తన ధైర్యమే తనను ముందుకు నడిపించింది. క్యాన్సర్పై పోరాటం గురించి తన అనుభవాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేసేది. ఒకవైపు చికిత్స తీసుకుంటూనే సోషల్ మీడియా వేదికగా రొమ్ము క్యాన్సర్పై అవగాహన కలిగిస్తోంది.‘ముందస్తు సంకేతాల ద్వారా ఆరోగ్య సమస్యల గురించి మన శరీరం తెలియజేస్తుంది. రెగ్యులర్ చెకప్స్ తప్పనిసరిగా చేయించుకోవాలి. ఎప్పుడు ఇబ్బందిగా అనిపించినా, అనుమానం వచ్చినా వైద్యులను సంప్రదించాలి’ అంటుంది హీనా ఖాన్.(నటికి జర్నలిస్టు అవమానకర ప్రశ్న : చిన్మయి ఫైర్)అవగాహన కోసం అక్షరాలా...అండాశయ క్యాన్సర్పై తన అనుభవాలు, పోరాటం గురించి ‘హీల్డ్’ పేరుతో పుస్తకం రాసింది మనీషా కొయిరాలా. లిసా రే రాసిన ‘క్లోజ్ టు ది బోన్’ పుస్తకంలో ఆమె వ్యక్తిగత, కెరీర్ విషయాలతో పాటు క్యాన్సర్పై తన పోరాటానికి సంబంధించిన విషయాలు కూడా ఉన్నాయి. బ్లడ్ క్యాన్సర్ సర్వైవర్ల స్ఫూర్తిదాయకమైన జీవితకథలపై డా.సోనమ్ వర్మ రాసిన పుస్తకాన్ని బాలీవుడ్ నటి టిస్కా శర్మ ఆవిష్కరించింది. బ్రెస్ట్ క్యాన్సర్కు సంబంధించిన తన అనుభవాల గురించి స్టాండప్–కమేడియన్, నటి టిగ్ నొటరో ‘ఐయామ్ జస్ట్ ఏ పర్సన్’ పుస్తకం రాసింది. స్వయంగా రచయిత్రి అయిన సోనాలి బింద్రేకు కాన్యర్ చికిత్స సమయంలో కొన్ని పుస్తకాలు ఎంతో ధైర్యాన్ని ఇచ్చాయి. అందులో కొన్ని... ది లాస్ట్ బ్లాక్ యూనికార్న్–టిఫనీ హడిష్, ఇకిగై–హెక్టర్ గార్సియా, ఫ్రాన్సిస్క్ మిరల్లెస్, ది టావో ఆఫ్ బిల్ ముర్రే–గవిన్ ఎడ్వర్ట్స్. ఇదీ చదవండి: మమ్దానీ లవ్ స్టోరీ : ఎవరీ ‘మోడ్రన్ యువరాణి డయానా’ -
నాన్నలూ అమ్మలవుతారు... కుంగిపోతారు
బిడ్డ పుట్టిన తొలి రోజుల్లో తల్లికి డిప్రెషన్ రావడం సహజం. దాన్నే పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అంటారు. అయితే తల్లులతోపాటు తండ్రులూ ఆ డిప్రెషన్ను ఎదుర్కొంటున్నారని నిపుణులు అంటున్నారు. మైక్రో ఫ్యామిలీగా ఉండటం వల్ల పెంపకం బాధ్యత ఒత్తిడి కారణంగా డిప్రెషన్, యాంగ్జయిటీ ఎదుర్కొంటున్న తండ్రుల గురించి పట్టించుకోవాల్సి ఉంది.కుంగిపోతారు‘ఒక బిడ్డను పెంచడానికి ఓ ఊరంతా కావాలని’ సామెత. గతంలో ఉమ్మడి కుటుంబాల్లో బిడ్డల పెంపకానికి వెసులుబాటు ఉండేది. బాధ్యతను అందరూ పంచుకొని బిడ్డను కంటికి రెప్పలా కాపాడేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితి మారిపోయింది. బిడ్డల పెంపకమంతా తల్లిదండ్రుల మీదే పడింది. ఈ కారణం వల్ల కొంత, భౌతిక–మానసిక మార్పుల వల్ల కొంత బిడ్డ పుట్టిన తొలి రోజుల్లో తల్లి కుంగుబాటుకు గురవడం చాలామందికి తెలిసిందే! దాన్నే పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అంటారు. అయితే తల్లులతోపాటు తండ్రులూ ఆ డిప్రెషన్ ను ఎదుర్కొంటున్నారని వైద్యనిపుణులు అంటున్నారు.అసలేంటీ పోస్ట్పార్టమ్ డిప్రెషన్?స్త్రీ జీవితంలో మాతృత్వం మధురమైన అనుభవం. ఆ సమయంలో ఆమెలో అనేక శారీరక, మానసిక మార్పులు ఏర్పడతాయి. దాంతో ఒత్తిడి, చిరాకు, యాంక్సైటీ, కోపం, కుంగుబాటు ఆమెను చుట్టుముడతాయి. బిడ్డను రోజంతా చూసుకోవాల్సి రావడం, నిద్ర సరిగ్గా లేకపోవడం, ఒకేచోట గంటల తరబడి ఉండిపోవడం వల్ల పోస్ట్పార్టమ్ డిప్రెషన్ కి గురవుతారు. ఇది కొందరితో గర్భధారణ సమయం నుంచే మొదలవుతుందని వైద్యులు అంటున్నారు. ఇన్నాళ్లూ ఈ సమస్య అమ్మలకే వస్తుందనే ఆలోచన ఉండగా, ప్రస్తుతం నాన్నలు కూడా ఈ సమస్యతో ఇబ్బంది పడుతున్నారని తేలింది.నాన్నల్ని అర్థం చేసుకునేదెవరు?ప్రస్తుతం చాలామంది 27 దాటాక పెళ్లిళ్లు చేసుకొని 30 ఏళ్లకు తండ్రవుతున్నారు. అటు ఉద్యోగం, ఇటు కెరీర్, ఈఎంఐలు, బాధ్యతలు, ఖర్చులు, అవసరాలతో సతమతమైపోతున్నారు. ఇలాంటి నేపథ్యంలో బిడ్డ పుట్టిన ఆనందం ఉన్నా, మెల్లగా ఆ ఆనందం స్థానంలో కొత్తగా రాబోయే ఖర్చులు, బాధ్యతలు వారిని భయపెడుతున్నాయి. బిడ్డ పుట్టాక రాత్రుళ్లు నిద్ర సరిగ్గా లేకపోవడం, భార్యాబిడ్డల్ని చూసుకోవాల్సి రావడం వంటి కారణాలతో మగవారు సైతం పోస్ట్పార్టమ్ డిప్రెషన్ కు గురవుతన్నారు. ఉన్నట్టుండి కోపం రావడం, చిన్న విషయాలకు చిరాకు పడటం, అరవడం, ఇంటికి దూరంగా ఉండాలనుకోవడం వంటివి ఈ డిప్రెషన్ తాలూకు లక్షణాలు. తలనొప్పి, వాంతులు, అజీర్తి, కీళ్ల నొప్పులు సైతం వీరిని వేధిస్తాయి.మగవారికి అందాల్సిన చేయూత బిడ్డ పుట్టిన తర్వాత చాలామంది తల్లి ఆరోగ్యంపైనే దృష్టి నిలుపుతారు. ఆమెను జాగ్రత్త చూసుకోవాలని భావిస్తుంటారు. తండ్రి పరిస్థితి ఏమిటి... అతను పడుతున్న ఇబ్బందులేమిటన్న విషయాన్ని చాలామంది పరిగణనలోకి తీసుకోరు. మగవారు కూడా తమ సమస్యల్ని బయటకు చెప్పుకునేందుకు మొహమాట పడతారు. లోలోపలే దాచుకొని సతమతమవుతారు. దీంతో వారి సమస్య మరింత పెరిగి ఒక్కోసారి ఆత్మహత్యా ప్రేరేపిత ఆలోచనల వరకూ వెళ్తుందని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమయంలో తల్లితోపాటు తండ్రికీ కుటుంబ సభ్యుల చేయూత అవసరమని, వారితో మాట్లాడుతూ, వారి సమస్యల్ని విని ఓదార్పు అందించాలని అంటున్నారు. అవసరమైతే మానసిక వైద్యుల వద్దకు తీసుకెళ్లి కౌన్సిలింగ్ అందించాలంటున్నారు. -
టీ తాగుతూ.. పొగ తాగుతున్నారా?
చాలా మంది టీ తాగేటప్పుడు దానికి కాంబినేషన్గా పొగ త్రాగడానికి ఇష్టపడతారు, ముఖ్యంగా పని విరామ సమయంలో. కానీ చాలా మందిలో కనిపించే ఈ సాధారణ అలవాటు వారికి ఏ మాత్రం గమనించని విధంగా వారి శరీరానికి హాని కలిగించవచ్చు. ‘‘నికోటిన్ కెఫిన్ కలిసి మెదడులో తాత్కాలికంగా చురుకుదనాన్ని పెంచుతాయి,దాంతో ఆ డబుల్ స్టిమ్యులేషన్ కూడా ఈ కాంబోను మరింతగా అలవాటు చేసి వ్యసనంగా మారుస్తుంది అని ఫరీదాబాద్లోని మెట్రో హాస్పిటల్లోని గ్యాస్ట్రోఎంటరాలజీ డైరెక్టర్ డాక్టర్ విశాల్ ఖురానా తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఆయన చెబుతున్న ప్రకారం...వ్యసన ఫలం...నిద్రలేమి...నికోటిన్ డోపమైన్ రష్ను ప్రేరేపిస్తుంది, ఇది మెదడు కు ‘మంచి అనుభూతిని కలిగించే’ రసాయనం, అయితే కెఫిన్ నిద్రను ప్రేరేపించే రసాయనమైన అడెనోసి¯Œ ను అడ్డుకుంటుంది. ఈ రెండూ కలిసి పనిచేసినప్పుడు, అవి రెండూ స్వయంగా ఉద్దీపనను పెంచుతాయి అలా రెండింటినీ కలిపి తాగినప్పుడు ఆ కాసేపు మరింత చురుకుదనాన్ని అనుభవించవచ్చు, కానీ మనకు తెలీకుండా మన మెదడుకు ఆ రెండింటినీ కలిపి కోరుకునేలా శిక్షణ ఇస్తున్నామని అర్ధం.గ్రీన్ టీ తో ప్రభావం తగ్గించవచ్చు...టీలో కూడా నికోటిన్ ఉన్నప్పటికీ చాలా తక్కువ మొత్తంలో ఉంటుంది, అయితే అది ధూమపానంతో పోలిస్తే దాదాపు లేనట్టే. అంతేకాకుండా సిగరెట్తో జత చేసే టీ రకం ఏమిటి అనేది కూడా ముఖ్యమైనదే. గ్రీన్ టీలో బ్లాక్ టీ కంటే ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి, తద్వారా ఇది కొంత నికోటిన్ వల్ల కలిగే నష్టాన్ని ఎదుర్కోవడంలో శరీరానికి సహాయపడుతుంది కానీ ఒకటి మాత్రం నిజం ఏ రకమైన: టీ అయినా సిగరెట్ పొగ ప్రభావాలను పూర్తిగా దూరం చేయదు.సిగిరెట్టు మానే ఆలోచన వెనక్కి...ధూమపానం మానాలనుకునేవాళ్లని కూడా ఈ అలవాటు నిరుత్సాహపరుస్తుంది. టీ తాగితే ధూమపానం మానేయడం కష్టం. ‘‘ మెదడు టీ ఆనందాన్ని నికోటిన్ నుంచి వచ్చే కిక్తో అనుసంధానించడం ప్రారంభిస్తుంది. ఒకటి మరొకదానికి ట్రిగ్గర్ అవుతుంది, అందుకే టీ తాగిన ప్రతిసారీ సిగరెట్ తాగాలని కోరుకోవడం ఎక్కువ అవుతుంది.జీర్ణక్రియపై తీవ్ర ప్రభావం...కెఫిన్ నికోటిన్ రెండూ హృదయ స్పందన రేటు అలాగే రక్తపోటును కూడా పెంచుతాయి. రక్త నాళాలపై అదనపు ఒత్తిడిని కలిగిస్తాయి, కాబట్టి ఈ రెండింటినీ కలపడం గుండె జబ్బులు ఉన్నవారికి మరింత ప్రమాదకరంగా మారుతుంది. టీ కడుపు లో ఆమ్లాన్ని పెంచుతుంది మరోవైపు నికోటిన్ జీర్ణక్రియను నెమ్మదించేలా చేస్తుంది ఇవి రెండూ కలిసిన తర్వాత కడుపు ఉబ్బరం, ఆమ్లత్వం దీర్ఘకాలిక జీర్ణ సమస్యలను కూడా కలిగిస్తాయి, ముఖ్యంగా ఖాళీ కడుపుతో తీసుకోవడం పేగుల మీద కూడా ప్రభావం చూపిస్తుంది.గొంతుకీ ప్రమాదమే...అలాగే గొంతుపై కూడా దీని ప్రభావం పడుతుంది ‘ధూమపానం గొంతు పొరను చికాకుపెడుతుంది. దానికి వేడి టీ జోడిం^è డం అంటే వేడి మంటను మరింత తీవ్రతరం చేయడమే. కాలక్రమేణా, ఇది దీర్ఘకాలిక గొంతు సమస్యలతో పాటు అన్నవాహిక క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని కూడా పెంచుతుంది.టీ , సిగరెట్ల మేళశింపు నాడీ వ్యవస్థను అతిగా ప్రేరేపించే, గుండెను శ్రమపెట్టే ప్రేగులను కలవరపరిచే హానికరమైన జంట అనేది నిస్సందేహం కాబట్టి వీలైనంత వరకూ పొగతాగడాన్ని పూర్తిగా మానేయాలి, టీని పరిమితంగా తీసుకోవాలి రెండింటినీ మాత్రం కలిపి తీసుకోవడం మాత్రం పొరపాటున కూడా చేయవద్దు అని వైద్యులు సూచిస్తున్నారు. -
'వంట నూనె వాడకం తగ్గించండి': వరల్డ్కప్ విజేతలతో ప్రధాని మోదీ
భారత ఐసీసీ మహిళల ప్రపంచ కప్ విజేతలతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమావేశం అయ్యారు. చారిత్రాత్మక విజయం సాధించినందుకు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ నేతృత్వంలోని జట్టు సభ్యులను ప్రధాని అభినందించారు. వారితో సంభాషణ సందర్భంగా దేశంలో పెరుగుతున్న ఊబకాయ సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో దేశ పౌరులంతా తమవంతు సాయం అందించాలని కోరారు. జాతీయ ఆరోగ్య చొరవలో భాగంగా నూనె వినియోగాన్ని తగ్గించుకోవాలని ఆయన ప్రజలకు సూచించారు. ఫిట్ ఇండియ ఉద్యమం ప్రాముఖ్యతను నొక్కిచెప్పారు. నిజానికి మోదీ ప్రతి భారతీయుడు దైనందిన జీవితంలో ఫిట్నెస్ను అంతర్భాగం చేయడానికి 2019 నుంచి ఈ ప్రచారాన్ని ఆయన ప్రారంభించారు. మన దేశంలో ఊబకాయం పెద్ద సమస్యగా మారుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. అందుకు ఫిట్ ఇండియా ఒక్కటే పరిష్కారమని నొక్కి చెబుతున్నారు. దయచేసి అంతా వంట నూనె వినియోగాన్ని 10 శాతం తగ్గిస్తే, పైగా కొనుగోలు చేసే సమయం కూడా తగ్గుతుందని అన్నారు. అలాగే భారత మహిళా జట్టుని ఉద్దేశించి..తమ పాఠశాలలను సందర్శించి యువతరాలకు స్ఫూర్తినివ్వాలని సూచించారు. కాగా, గట్టి భద్రతా చర్యల మధ్య ప్రదానమంత్రితో సమావేశం కావడానికి భారత జట్టు మంగళవారమే న్యూఢిల్లీకి చేరుకుంది. అలాగే భాతర జట్టు అద్భుతమైన విజయ సాధించిన వెంటనే మోదీ సోషల్ మీడియా పోస్ట్లో "టోర్నమెంట్ అంతటా భారత జట్టు అసాధారణమైన కృషిని, పట్టుదలను ప్రదర్శించింది. మన క్రీడాకారులందరికి అభినందనలు. ఈ చారిత్రాత్మక విజయం భవిష్యత్తు చాంపియన్ క్రీడలను చేపట్టడానికి ప్రేరేపిస్తుంది." అని పోస్ట్లో పేర్కొన్నారు మోదీ.(చదవండి: అందాల బొమ్మలం కాదు..! వివాదంలో మిస్ యూనివర్స్ పోటీ..) -
హైపర్ సెన్సిటివిటీ న్యూమొనైటిస్ : కారణాలు, లక్షణాలు, జాగ్రత్తలు
నిమోనియా గురించి దాదాపు మనలో చాలామందికి తెలుసు. అయితే ‘హైపర్ సెన్సిటివిటీ నిమోనైటిస్’ అనే మాట అంతగా తెలియదు. కానీ... ఇటీవలి మోంథా తుఫానులా చాలాకాలం పాటు వాతావరణం చల్లగా మందంగా ఉండటం, ఆ తర్వాత మళ్లీ చలికాలం మొదటి రోజులు కావడంతో అదే తరహా చలి కంటిన్యూ కావడం లాంటి వాతావరణం కొనసాగుతున్న రోజుల్లో ఇది ‘హైపర్ సెన్సిటివిటీ న్యూమొనైటిస్’గా చెప్పే కొన్ని రకాల న్యుమోనియాలకు అనువైన కాలమిది. కాబట్టి దీనిపై అవగాహన పెంచుకోడానికీ, దీని నుంచి అప్రమత్తంగా ఉండటానికీ, దీని గురించి జాగ్రత్తలు తీసుకోవాల్సిన సమయమిది. అందుకే ‘హైపర్ సెన్సిటివిటీ న్యూమొనైటిస్’ అంటే ఏమిటో తెలుసుకుందాం. కొన్ని రకాల నిమోనియాలను కలగలపుకొని ‘హైపర్ సెన్సిటివిటీ న్యూమొనైటిస్’ అనవచ్చు. దీని గురించి తెలుసుకునే ముందర మన పల్లెల్లోని కొన్ని నిర్దిష్టమైన చోట్ల వస్తుండే రకరకాల వాసనల వివరాలను చూద్దాం. అసలు హైపర్ సెన్సిటివిటీ న్యూమొనైటిస్ (Hypersensitivity pneumonitis) అంటే ఏమిటి...?అవి గరిసెలూ, గాదాలైనా, గడ్డివాములైనా, పావురాలూ, పిట్టలుండే పక్షిగూళ్లైనా అక్కడి గాలుల్లో వ్యాపించే వాసనలతో వాతావరణం కలుషితం కావడం, వాటినుంచి గాల్లోకి వ్యాపించే మనుషులకు సరిపడని అనేక కాలుష్య రేణువుతోనూ వచ్చే ఊపిరితిత్తుల సమస్యనే ‘హైపర్ సెన్సిటివిటీ నిమోనైటిస్’గా చెప్పవచ్చు. పైగా ఇటీవల తుఫాను వాతావరణం, చలిగాలుల నేపథ్యంలో గడ్డీగాదం తడిసిపోవడంతో ఈ ముప్పు మరింత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో దీని గురించి తెలుసుకోవడం అవసరమే. ఒకరకంగా వృత్తిపరం...మరోరకంగా జన్యుపరం...చూడటానికి ఇదో వృత్తిపరమైన సమస్యగా అనిపించవచ్చు. రైతులు, పౌల్ట్రీ పనివారు, పక్షులు పెంచి జీవనోపాధి పొందేవారు తమ వృత్తులో భాగంగా ఈ సమస్యకు గురికావడంతో మనకు ఇదో వృత్తిపరమైన సమస్య (ప్రొఫెషనల్ హజార్డ్)గా కనిపిస్తుంది. అయితే మరోరకంగా చెప్పాలంటే ఇదో జన్యుపరమైన సమస్య కూడా. ఎందుకంటే... కొంతమందిలో కొన్ని అలర్జెన్స్ సరిపడకపోవడమన్న అంశం వంశపారంపర్యంగా తల్లిదండ్రుల నుంచి సంతానానికి వస్తుంటుంది. దాంతో కొన్ని అంశాలకు తీవ్రమైన అలర్జీ ఉన్నవారిలో ఈ సమస్య కనిపిస్తుంటుంది. అందుకే కొన్ని కుటుంబాల్లోని వారిలో (ఫెమీలియల్గా) ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుండటం చాలా సాధారణం. ఈ కోణంలో చూసినప్పుడు ఇది జన్యుపరమైన దుష్ప్రభావంగా కనిపించవచ్చు. అయితే సాధారణంగా వయసు పెరుగుతూ వారు 50, 60 ఏళ్ల వయసుకు చేరుతున్నప్పుడు ఈ సమస్య మనుషుల్లో తీవ్రతరమవుతుంటుంది. ఈ సమయంలో ఇమ్యూనిటీ కొంత తగ్గుతుండటం ఇలా జరుగుతుంది. కానీ వ్యాధినిరోధక శక్తి (ఇమ్యూనిటీ) తక్కువగా ఉండి, బాగా బలహీనంగా ఉన్న వాళ్లలో ‘హైపర్ సెన్సిటివిటీ న్యూమొనైటిస్’ సమస్య ఏ వయసు వారిలోనైనా కనిపించవచ్చు. పల్లెటూళ్లలో గరిసెల్లో వడ్లూ, ఇతర ధాన్యాలూ నిల్వ చేసేటప్పుడూ, వరిగడ్డితో గడ్డివాము / గడ్డివామి పేర్చే సమయంలో ఆ ప్రదేశంలో ఒక రకమైన వాసనలు వస్తుంటాయి. ఆ వాసనలు వచ్చే చోట వ్యాప్తిచెందే నిమోనియాను ‘ఫార్మర్స్ లంగ్’ అంటారు. అలాగే కోళ్ల గూళ్ల దగ్గర మరో రకం వాసన వస్తుంటుంది. అది సరిపడనివారికి ‘బర్డ్ ఫ్యాన్సియర్స్ లంగ్’ అనే మరో ఆరోగ్య సమస్య వస్తుంది. అంటే ఈ తరహా సమస్య పౌల్ట్రీల్లో పనిచేసేవారిలో ఎక్కువగా కనిపిస్తుంది. అంతేకాదు... ఇటీవల చాలామంది ఆరోగ్య నిపుణులూ, డాక్టర్లు ఒక మాట చెబుతుండటాన్ని చాలామంది వినే ఉంటారు. అదే పావురాళ్లకు ఆహారం వేయకండి. వాటి విసర్జకాలతో ప్రాణహాని సైతం కలగవచ్చంటూ హెచ్చరిస్తుండటం చాలామంది దృష్టికి వచ్చే ఉంటుంది. అలా పక్షులు పెంచుకునేవాళ్లలో, పావురాల రెట్టలతోనూ ఈ తరహా నిమోనియా రావచ్చు.హైపర్ సెన్సిటివిటీ నిమోనియా వ్యాప్తికి దోహదపడే అంశాలు... మన పరిసరాల్లో నిత్యం వ్యాపించి ఉండే దాదాపు 300 రకాల రేణువులూ, కాలుష్య పదార్థాలు ‘హైపర్ సెన్సిటివిటీ నిమోనియా’కు కారణమయ్యే అవకాశముంది. కొంతమందికి కొన్ని పదార్థాలూ, అంశాల వల్ల అలర్జీ కలగడం మనకు తెలిసిందే. ఏ అంశాల వల్ల అలర్జీ కలుగుతుందో వాటిని అలర్జెన్స్ అంటారు. ఆ అలర్జెన్స్ను వర్గీకరించినప్పుడు నాలుగు రకాల నిమోనియాలు వచ్చేందుకు అవకాశముంది. అవి...ఫార్మర్స్ లంగ్: ఇది చాలావరకు రైతుల్లో కనిపిస్తుంది. పంటకోతలు పూర్తయ్యాక ధాన్యాన్ని గరిసెల్లో నిల్వ చేయడం, వాటిల్లోకి దిగి ధాన్యాన్ని పైకి తోడాల్సి రావడం, గడ్డివాముల్లాంటివి పేర్చాల్సి వస్తుండటం వంటి అంశాలతో రైతుల్లో ప్రధానంగా కనిపిస్తుంది కాబట్టి దీన్ని ‘ఫార్మర్స్ లంగ్’ అంటారు.బర్డ్ ఫ్యాన్సియర్స్ లంగ్: జీవనోపాధి కోసం కొందరు పక్షుల్ని పెంచుతుంటారు. ప్రధానంగా పౌల్ట్రీ రంగంలోని వారూ, అలాగే హాబీగా మరికొందరు పెద్దసంఖ్యలో పక్షుల పెంపకం చేస్తుంటారు. ఇక మరికొందరు సరదాగా పక్షులకు ఆహారం వేసి ఆనందిస్తుంటారు. ఇలాంటి వాళ్లు ముఖ్యంగా పావురాళ్లకు ఆహారం వేస్తుంటారు. అలాంటి చోట్లలో పక్షుల వాసనా, వాటి వ్యర్థాల వాసనతోనూ, వాటి విసర్జకాలతో ఈ సమస్య వస్తుంది కాబట్టి దీన్ని ‘బర్డ్ ఫ్యాన్సియర్స్ లంగ్’గా చెబుతుంటారు. హ్యుమిడిఫయర్స్ లంగ్: కొందరు వృత్తిరీత్యా బాగా తేమతో కూడిన వాతావరణంలో పనిచేయాల్సి రావడమో లేదా నివాసం ఉండాల్సి రావడమో జరగవచ్చు. అక్కడి తేమ కారణంగా ఆ చోట్లలో పెరిగే ఫంగస్తో, వాటి స్పోరుల (అవి వ్యాప్తి చెందడానికి పండించే గింజలవంటివి) కారణంగా అవి తమ ఆరోగ్యానికి సరిపడనప్పుడు ‘హ్యుమిడిఫయర్స్ లంగ్’ అనే ఈ సమస్య వస్తుంది. నిత్యం ఎయిర్కండిషనర్లో ఉండేవారి కొందరికి ఆ చల్లటి వాతావరణం సరిపడకపోవడం వల్ల కూడా రావచ్చు. ఆ తేమ సరిపడదు కాబట్టి దీన్ని ‘హ్యుమిడిఫయర్స్ లంగ్’గా పేర్కొంటారు.హాట్ టబ్ లంగ్: కొందరు హాబీగానో, రిలాక్సింగ్ కోసమో లేదా తమ ఆరోగ్యం కోసమో ‘స్పా’ల వంటి చోట్ల ‘తొట్టి స్నానాలు’ వంటివి చేస్తుంటారు. మరికొందరు ఇన్హెలేషన్ థెరపీ పేరిట మంచి సువాసన ద్రవ్యాలతో కూడిన నీటిని పీలుస్తుంటారు. కొన్ని సందర్భాల్లో ఆ నీరు నిల్వ ఉండిపోవడం లేదా ఎప్పుడూ నీళ్లతో నిండి ఉండే ఆ పాత్రను సరిగా కడగక΄ోవడం, తొట్టిస్నానం చేసే ఆ తొట్లలో సరైన పారిశుద్ధ్య వసతులు లేకపోవడంతో అక్కడ పలు రకాల అలర్జెన్స్ పెరగవచ్చు. ఆ అలర్జెన్స్ సరిపడక వచ్చే ఈ సమస్యను ‘హాట్ టబ్ లంగ్’ అంటారు. మరీ ముఖ్యంగా గాలి సరిగా ప్రసరించని చోట్లలోని కలుషితమైన నీటి మీదుగా వచ్చే గాలినీ, ఆ నీటి తాలూకు ఆవిరులను పీల్చడం వల్ల ఈ సమస్య వస్తుంటుంది.లక్షణాలు... మనకు సరిపడని వాతావరణంలోకి వెళ్లినప్పుడు లక్షణాలు కనిపించవచ్చు. అవి అప్పటికప్పడు అక్యూట్గా కనిపించి బాధించవచ్చు. లేదా మరికొందరిలో దీర్ఘకాలంపాటు (క్రానిక్గా) వస్తూ వేధించవచ్చు. ఆ లక్షణాలేమిటంటే..ఒళ్లునొప్పులు, తలనొప్పి, ఊపిరి అందకపోవడం తీవ్రమైన ఆయాసం, జ్వరం, చలితో వణుకు రావడం కొందరిలో తీవ్రమైన దగ్గు వంటివి కనిపిస్తాయి. కఫం ఉండవచ్చు లేదా లేకపోవచ్చు. ఉంటే తెల్లగా, పసుపురంగులో ఒక్కోసారి రక్తపు చారికతోనూ కనిపించవచ్చు. గాలి పీలుస్తున్నా అది లోపలికి వెళ్లదు. కారణం... ఊపిరితిత్తుల్లో గాలి చేరే చివరి స్థానమైన గాలిసంచి (ఆల్వియోలై)లో వ్యర్థపదార్థాలు (ఎగ్జుడస్) నిల్వ ఉండిపోయి, అవి అడ్డంకిగా మారడంతో గాలి పీలుస్తున్నా లోపలికి వెళ్లదు. దాంతో శరీరానికి అవసరమైనంత ఆక్సిజన్ అందదు. ఫలితంగా ఊపిరితిత్తులు తమ పని తాము చేయలేని పరిస్థితికి వస్తాయి. ఇలాంటి కండిషన్ను ‘హైపాక్సిక్ రెస్పిరేటరీ ఫెయిల్యూర్’ అంటారు. ఊపిరి అందకపోవడంతో నుదుట చెమటలు పట్టడం, ముఖం నీలంగా మారిపోవడం, కంగారుగా ఉండటం, గుండె స్పందన వేగం పెరగడం, డీలా పడిపోవడం, బీపీ పడిపోవడం వంటి లక్షణాలు కనిపించవచ్చు.అలర్జెన్లకు కొద్దిగా ఎక్స్పోజ్ కాగానే ఈ లక్షణాలు తీవ్రమై 4 నుంచి 12 గంటలపాటు కనిపించవచ్చు. ఆ వాతావరణం నుంచి బయటకు రాగానే కొందరిలో లక్షణాలు తగ్గవచ్చు. లేదా జన్యుపరమైన సమస్యలున్నవారికి అలర్జెన్స్ కారణంగా లక్షణాలు ఎడతెరిపిలేకుండా బాధిస్తూ ఉండవచ్చు. ఊపిరితిత్తులకు జరిగే నష్టమిలా... ఈ సమస్యతో ఊపిరితిత్తులపై దుష్ప్రభావం పడుతుంది. దాంతో వాటి సామర్థ్యం తగ్గుతుంది. అంతేకాదు... పరిస్థితి తీవ్రమైనప్పుడు ఊపిరితిత్తులపై గాయమైనట్టుగా గాట్లవంటివి ఏర్పడవచ్చు. ఇలా జరగడాన్ని ‘స్కారింగ్’ అంటారు. అంతే కాదు... ఊపిరితిత్తులు తమ సాగే గుణాన్ని కోల్పోయే ప్రమాదమూ ఉంది. ఇలా జరగడాన్ని ‘పల్మునరీ ఫైబ్రోసిస్’గా చెబుతారు.ఏ ప్రశ్నలతో క్లినికల్గా డాక్టర్లు ఈ సమస్యను నిర్ధారణ చేస్తారంటే... లక్షణాలు కనిపించిన వెంటనే డాక్టర్లు తొలుత స్టెత్తో ఊపిరితిత్తులను పరీక్షిస్తారు. పల్స్ ఆక్సిమీటర్తో రక్తంలో ఆక్సిజన్ మోతాదులను, నాడీ స్పందనలను చూస్తారు. సమస్య నిర్ధారణ కోసం సాధారణంగా ఈ ప్రశ్నలు అడిగే అవకాశముంది. వృత్తిపరంగా ఏవైనా ఘాటైన వాసనలు, దుమ్ముధూళి రేణువులకు ఎక్స్పోజ్ అవుతున్నారా? ఇంట్లో ఎయిర్కండిషనర్ చాలా రోజుల్నుంచి శుభ్రం చేయలేదా? ఫిల్టర్లు మార్చి చాలాకాలమైందా? ఇంట్లో ఎక్కడైనా లీకేజీ ఉంటే, అక్కడి నిల్వ నీళ్ల వాసన పీల్చారా? తరచూ తొట్టిస్నానం (టబ్ బాత్) చేస్తారా? ఆ తొట్టి శుభ్రంగా ఉందా? పరిసరాల్లో పక్షులు ఉంటాయా? ఇంటి చుట్టూ పిట్టలు రెట్టలేస్తుంటాయా? డాక్టర్లు అడిగే ఈ ప్రశ్నలను తమకు తాముగా వేసుకున్నప్పుడు అవునని మీకే అనిపిస్తే వెంటనే డాక్టర్ను కలిసి, ఈ అంశాలను వివరించడం బాధితులకు ఎంతో మేలు చేస్తుంది. వీళ్లకు మరింత ముప్పు... ఆస్తమా లేదా తీవ్రమైన అలర్జిక్ రియాక్షన్ వచ్చేవారిలో సీఓపీడీ (క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మునరీ డిసీజ్ – బ్రాంకైటిస్, ఎంఫసీమా) ఉన్నవాళ్లలో / పొగతాగే అలవాటు ఉన్నవారిలో గుండెకు సంబంధించిన సమస్యలు ఉన్నవారిలో , స్పీలనెక్టమీ అనే ప్రక్రియ ద్వారా స్పీ›్లన్ తొలగించిన వాళ్లలో , పోస్ట్ కోవిడ్ సమస్యలతో పాటు ఇదివరకే ఊపిరితిత్తుల సమస్యలు, టీబీ ఉన్నవారిలో.నిర్ధారణ పరీక్షలు... తొలుత స్టెతస్కోప్తో సాధారణమైన శబ్దాలు కాకుండా ఏవైనా అసాధారణమైన శబ్దాలు వినిపిస్తున్నాయా అని పరీక్షించడం. ఛాతీ ఎక్స్–రే, అవసరమనుకుంటే సీటీ స్కాన్ వంటి ఇమేజింగ్ పరీక్షలతో.శ్వాస ప్రక్రియ సరిగా ఉందా అని తెలుసుకోడానికీ లేదా ఊపిరితిత్తుల పనితీరు తెలుసుకోడానికి చేసే ‘లంగ్ ఫంక్షన్ టెస్ట్’. ∙ఏవైనా అలర్జెన్స్తో అలర్జీ ఉందేమో తెలుసుకునే యాంటీబాడీస్ రక్తపరీక్ష. నోటి నుంచి లేదా ముక్కు నుంచి ఊపిరితిత్తులకు గాలి వెళ్లే దారులను పరీక్షించే బ్రాంకోస్కోప్ పరీక్ష. (దీంతో వోకల్ కార్డ్స్, విండ్పైప్ వంటి చోట్లలో ఏమైనా అసాధారణతలు ఉన్నాయా అని తెలుస్తుంది).మరీ అవసరమైనప్పుడు ఊపిరితిత్తులనుంచి చిన్నముక్క సేకరించి చేసే ‘సర్జికల్ లంగ్ బయాప్సీ’ లేదా... ‘క్రయో లంగ్ బయాప్సీ’ (దీన్ని ఇంటర్వెన్షనల్ పల్మునాలజిస్ట్ నిర్వహిస్తారు) లేదా ‘వాట్స్ గైడెడ్ లంగ్ బయాప్సీ (టీబీసీబీ) వంటి పరీక్షలు. చాలాకాలం పాటు మూసి ఉన్న ఇళ్లలోకి వెళ్లినప్పుడు... చాలాకాలంపాటు మూసి ఉన్న ఇళ్లలోకి ఏ వృత్తిపరమైన కారణం వల్లనో లేదా ఇల్లు మారడం వల్లనో వాసనతో కూడిన ఆ వాతావరణంలోకి వెళ్లినప్పుడు అకస్మాత్తుగా ఊపిరి అందక΄ోవడం, ఆయాసపడటం వంటి లక్షణాలు కనిపించవచ్చు. అక్కడ తమకు అలర్జీ కలిగించే రేణువులూ, వాసనలూ, అతి సన్నటి కాలుష్య పదార్థాలు ఉండటమే అందుకు కారణం. ఇది కొందరిలో తక్షణం సమస్యగా (అక్యూట్గా) కనిపించి... ఆ పరిసరాల నుంచి దూరంగా రాగానే తగ్గవచ్చు. హైపర్ సెన్సిటివిటీ న్యూమొనైటిస్ అనేది ఎంత సాధారణ సమస్య అంటే.. దీని వ్యాప్తి చాలా సాధారణం. మన సమాజంలోని ఐదు శాతం మందిలో ఈ సమస్య కనిపిస్తుండటమే దీనికి నిదర్శనం. చికిత్స... యాంటీ హిస్టమైన్ మందులతోమరీ అవసరమైనవారికి అవసరమైన మోతాదుల్లో కార్టికో స్టెరాయిడ్స్. ఊపిరితిత్తుల్లోని నాళాలను వెడల్పు చేసి, ఊపిరి అందేలా చేసే ‘బ్రాంకోడయలేటర్స్’ జన్యుపరమైన కారణాలతో సమస్య వస్తున్న వారిలో దేహంలో ఇమ్యూన్ వ్యవస్థ తీవ్రతను తగ్గించడానికి అవసరమైతే ‘ఇమ్యూనో సప్రెసివ్ మందులు’ రక్తంలో ఆక్సిజన్ మోతాదులు తగ్గితే, అవసరాన్ని బట్టి ఆక్సిజన్ పెట్టాల్సిరావడం. తీవ్రతను బట్టి మందుల్ని స్వల్పకాలం కోసం లేదా ఒక్కోసారి మూడు నెలలు, సమస్య మరింత తీవ్రంగానూ, జటిలంగానూ ఉన్నప్పుడు సుదీర్ఘకాలం పాటు మందులు వాడాల్సి రావచ్చు. ఒక్కోసారి ఊపిరితిత్తులపై స్కార్ వచ్చి, అవి పీచు (ఫైబ్రస్)గా అయిపోయినవాళ్లకు ఊపిరితిత్తుల మార్పిడి (లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్) మాత్రమే చివరి ఆప్షన్ కావచ్చు. డా. రమణ ప్రసాద్ సీనియర్ పల్మునాలజిస్ట్,– స్లీప్ స్పెషలిస్ట్ -
అందువల్లే టీనేజర్లలో పాప్కార్న్ బ్రెయిన్ సిండ్రోమ్..!
భారతీయ టీనేజర్లలో ఎక్కువ మంది "పాప్కార్న్ బ్రెయిన్ సిండ్రోమ్" బారినపడుతున్నారని మానసిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇటీవల కాలంలో చిన్నపిల్లల నుంచి యువకుల వరకు చాలామంది ఈ సమస్యను ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. అసలేంటి పాప్కార్న్ బ్రెయిన్ సిండ్రోమ్? ఎందువల్ల వస్తుందంటే..అధిక స్క్రీన్ సమయం, డిజిటల్ స్టిమ్యులేషన్తో ముడిపడి ఉన్న పరిస్థితినే పాప్కార్న్ బ్రెయిన్ సిండ్రోమ్గా వ్యవహరిస్తారు. సోషల్ మీడియాలో, ఆన్లైన్ కార్యకలాపాల్లో ఎక్కువ సేపు గడిపితే ఇలా వచ్చేస్తుందా అంటే..ఔనని చెబుతున్నారు వైద్యులు. దీనివల్ల శ్రద్ధ అనేది లోపిస్తుందట. ఒక పనిపై ఫోకస్ అనేది భారంగా మారిపోతుందట. ఇటీవల కాలంలో యువకులు, పెద్దలు స్కీన్ సమయాన్ని పెంచేస్తున్నారు. ముఖ్యంగా యాప్లు, గేమ్లు, వీడియోలు అంటూ తదేకంగా డిజిటల్ కార్యకలాపాల్లోనే టైం స్పెండ్ చేస్తున్నారు. దాంతో ఈ బ్రెయిన్ సిండ్రోమ్ బారినడుతున్నట్లు తెలిపారు. ఏదైన అతి అయితే ప్రమాదమే అన్నది జగమెరిగిన సత్యం. అలానే డిజిటల్ ఓవర్లోడ్ శారీరకంగానే కాకుండా మానసికంగా హాని అని, దీనివల్ల దృష్టి లోపం, జ్ఞాపకశక్తి సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు నిపుణులు. పాప్కార్న్ బ్రెయిన్ సిండ్రోమ్ అంటే..2011లో వాషింగ్టన్ విశ్వవిద్యాలయ పరిశోధకుడు డేవిడ్ లెవీ ఈ పేరుని సూచించారు. ఏ విషయంపైన శ్రద్ధ, ఫోకస్ లేకపోవడాన్ని పాప్కార్న్ గింజలు మాదిరిగా మెదడు తన అటెన్షన్ కోల్పోయింది అనే సూచగా పరిశోధకుడు లెవీ ఇలా వ్యవహరించారు. ఈ డిజిటల్ మీడియా వల్ల ఒక వ్యక్తి ఆలోచనలు ఒకదాని నుంచి మరొకదానికి వేగంగా మారిపోతుంటాయి. దాంతో శ్రద్ధ అనేది కరువవుతుంది. అంటే ఒకే కార్యచరణపై దృష్టి పెట్టడంలో ఇబ్బంది ఎదురవుతుంది. మానసికంగా అస్థిరత ఏర్పడుతుంది. ఇలాంటి స్థితినే పాప్కార్న్ బ్రెయిన్ సిండ్రోమ్ అంటారు. అధికారికంగా వైద్య నిర్థారణ కానప్పటికీ..ఈ పరిస్థితి చాలా తీవ్రమైనదని చెబుతున్నారు నిపుణులు. ఎందువల్ల వస్తుందంటే..? తరుచుగా మల్టీటాస్కింగ్, సోషల్ మీడియా, డిజిటల్ నోటిపికేషన్ తదితరాలే ఈ పరిస్థితికి కారణమని చెబుతున్నారు నిపుణులు.వాటిలో కొన్ని కారణాలు..అధిక స్క్రీన్ సమయంమొబైల్లో ఎక్కువ సమయంల గడపడం వల్ల డిజిటల్ కాని కార్యకలాపాలపై దృష్టి పెట్టడం కష్టమవుతుంతక్షణ సంతృప్తిఇంటర్నెట్, సోషల్ మీడియా త్వరిత రివార్డులను అందిస్తాయి. అది మెదడులో డోపమైన్ను పెంచి రోజువారీ పనులను నిస్తేజంగా, ఆసక్తికరంగా కానివిగా చేస్తుంది.నిరంతర నోటిఫికేషన్లుతరచుగా వచ్చే నోటిఫికేషన్లు మన దృష్టిని విచ్ఛిన్నం చేస్తాయి. ఇది చాలా మానసిక అంతరాయాలను కలిగిస్తుందట. ఒకే పనిపై దృష్టి పెట్టడం కష్టతరం అవుతుందట.మల్టీ టాస్కింగ్వేర్వేరు యాప్లు లేదా పనుల మధ్య త్వరితగతిన మారడం వల్ల శ్రద్ధ తగ్గిపోతుందటఎవరిని ఎక్కువగా ప్రభావితం చేస్తుందంటే?వైద్యుల అభిప్రాయం ప్రకారం, పాప్కార్న్ మెదడు ఎక్కువగా టీనేజర్లు, యువకులలో కనిపిస్తున్నప్పటికీ, ఈ పరిస్థితి ఇప్పుడు 30 నుంచి 45 సంవత్సరాల వయస్సు గల వారిలో కూడా సాధారణంగా కనిపిస్తోందని చెబుతున్నారు వైద్యులు. అయితే, ఇది ఇంటర్నెట్ వ్యసనం లాంటిది కాకపోయినా.. రోజువారీ జీవితంలో పని సంబంధంల మధ్య అంతరాయం కలిగించి, సోమరిగా నిలబెట్టేంత చెడ్డదిని చెబుతున్నారు నిపుణులు. కలిగించడంలో సమానంగా చెడ్డది. ఈ పాప్కార్న్ బ్రెయిన్ శ్రద్ధ, భావోద్వేగ శ్రేయస్సును ప్రభావితం చేస్తుంది. ఈ పరిస్థితి లక్షణాలు..చిరాకు, ఆందోళన పెరగడంనిద్రలేమి దృష్టిని కేంద్రీకరించడంలో లేదా శ్రద్ధ వహించడంలో ఇబ్బందిఅతిగా అప్రమత్తంగా లేదా ఒత్తిడికి లోనవుతున్నట్లు అనిపించడంఆఫ్లైన్ జీవితం నీరసంగా లేదా ఆసక్తిలేనిదిగా అనిపిస్తుంది.అధిక ఒత్తిడికి గురవ్వ్వడంఈ పరిస్థితిని అధిగమించాలంటే..శ్వాస వ్యాయామాలుప్రతిరోజూ కనీసం 10 నిమిషాలు ధ్యానం చేయండిఒకేసారి ఒక పనిపై దృష్టి పెట్టడం అనేది ప్రాక్టీస్ చేయడం అంటే సింగిల్ టాస్కింగ్కి ప్రాధాన్యత ఇవ్వడం లాంటిది. జ్ఞాపకశక్తిని పెంపొందించేలా యోగా ఆసనాలుస్క్రీన్ సమయాన్ని సర్దుబాటు చేయడంటెక్-ఫ్రీ జోన్ను నియమించుకోవడంస్వయంగా ఎవరికి వారుగా డిజిటల్ డిటాక్స్కు ప్రాధాన్యత ఇవ్వడంస్కీన్న సమయం, ఎలక్ట్రిక్ పరికరాలతో గడపడంలో సరిహద్దును ఏర్పాటు చేసుకోవడం వంటి వాటితో ఈ సమస్యను అధిగమించగలుగుతారనా చెబుతున్నారు నిపుణులు. లేదంటే అచ్చం పాప్కార్న్ మాదిరిగా బ్రెయిన్ ఏపని మీద ఫోకస్, శ్రద్ధని కనబర్చడంలో విఫలమై మానసికంగా స్ట్రగులవుతారని హెచ్చరిస్తున్నారు. ఆదిలోనే ఈ పరిస్థితిని గుర్తించి రికవరీ అయ్యే ప్రయత్నాలు చేయడం మంచిదని సూచిస్తున్నారు నిపుణులు.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం.(చదవండి: రుతుస్రావ బాధలు మరింత సుదీర్ఘంగా!) -
బరువుని నిర్వహించడానికి ఐదు వాక్లు..! జిమ్తో పనిలేదు..
వాకింగ్ చేయడాన్ని రోటీన్ పనిగా, తేలిగ్గా చూస్తాం. కానీ ఇది అద్భుతమైన ఫలితాలనిస్తుంది. ఆరోగ్యం మెరుగ్గా ఉండటంలో కీలకపాత్ర పోషిస్తుంది. అయితే చేసే తీరులో సరైన విధానం ఉంటే వాకింగ్కి మించిన వర్కౌట్ లేదంటున్నారు ఆరోగ్య నిపుణులు. దాంతో బరువుని సులభంగా నిర్వహించొచ్చు, అధిక బరువు అనే సమస్య రాదు అని నమ్మకంగా చెబుతున్నారు. అంతేగాదు భోపాల్కు చెందిన పోషకాహార నిపుణురాలు, ఆరోగ్యకోచ్ రేణు రఖేజా ఈజీగా చేసే ఐదు రకాల వాక్లను సోషల్ మీడియా వేదికగా పరిచయం చేశారు. ఇవి మొత్తం ఆరోగ్యాన్ని శరీర తీరుని మార్చగలవని చెబుతోందామె. పైగా జిమ్కి వెళ్లాల్సిన పని ఉండదు అని అంటున్నారు. మరి ఆ ఐదు వాక్లేంటో చూద్దామా..!.నడకకు మించిన అద్భుతమైన వ్యాయామం మరొకటి లేదని అంటోంది రేణు రఖేజా. శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుతుందని అంటున్నారు. జిమ్కి వెళ్లలేం. ఎక్కువ సమయం వ్యాయమాలకు కేటాయించలేం అనుకునేవాళ్లు సింపుల్గా ఈజీగా చేసే ఈ ఐదు వాక్లు చేస్తే చాలట. అద్భుతంగా బరువుని నిర్వహించడమే గాక హెల్దీగా ఉంటారని అంటోంది.కాలి నడక (తడసానా) - 1 నిమిషంఇది నడక భంగిమను మెరుగుపరుస్తుంది. ఆత్మవిశ్వాసాన్ని పెంచడంలో సహాయపడుతుంది. చేతులు నిటారు తలపైకి చాచి కాళ్ల మీద నడవండి.మడమ నడక - 1 నిమిషంమడమ నడకలు చీలమండలను బలోపేతం చేస్తాయి. మెరుగైన రక్త ప్రసరణ/ప్రసరణను నిర్ధారిస్తాయి, వాపును తగ్గిస్తాయి. ఈ వ్యాయామం చేస్తున్నప్పుడూ.. ఫోజ్ నిటారుగా ఉంచాలి.హిప్ రొటేషన్ నడక - 1 నిమిషంహిప్ రొటేషన్ నడక బిగుతుగా ఉన్న తుంటిని వదులు చేయడం ద్వారా హిప్ కదలికను మెరుగుపరుస్తుంది. ఇది వీపు దృఢత్వాన్ని తగ్గిస్తుంది, పునరుత్పత్తి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఈ వ్యాయామం చేయడానికి, కాలును పైకి లేపి మీ పాదాన్ని నేలపై ఉంచే ముందు తిప్పండి. మరొక కాలుతో కూడా ఇలానే రిపీట్ చేయండిసైడ్ బై సైబ్ వాక్..1 నిమిషంఈ వ్యాయామం టోన్డ్ తొడలను సాధించడానికి, తుంటి కండరాలను నిర్మించడానికి, సమతుల్యతను ప్రోత్సహించడానికి ఉపయోగపడుతుంది. ముందుగా చేతులను ముందు పట్టుకుని, మోకాళ్లను వంచి పక్కకు నడవండి. View this post on Instagram A post shared by Renu Rakheja | Nutritionist & Health Coach (@consciouslivingtips) రివర్స్ వాక్ (వెనుకకు నడవడం) - 2 నుంచి5 నిమిషాలురివర్స్ లేదా బ్యాక్ వాక్స్ మోకాలి నొప్పిని తగ్గిస్తాయి, స్థిరత్వాన్ని పెంచుతాయి, కీళ్ల నొప్పిని నివారిస్తాయి. ఇది చాలా సులభం కూడా. చేయాల్సిందల్లా వెనుకకు నడవడమే, దాదాపు చంద్రుని నడక లాగా కానీ నెమ్మదిగా.చివరిగా శరీరం చెప్పేది వినండి, కొత్త వ్యాయామం లేదా వర్కౌట్లను ప్రారంభించే ముందు సంబంధిత ఆరోగ్య నిపుణులు లేదా వ్యక్తిగత వైద్యులను సంప్రదించండి. అలాగే మీకు కీళ్ల నొప్పులు, లేదా ఇతర వైద్య పరిస్థితులు ఉంటే..నిపుణులు సలహాలు సూచనలతో ప్రారంభిస్తేనే చాలామటుకు మంచిది అని సూచించింది రేణు రఖేజా.గమనిక: ఈ కథనం కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: అలా ఉంటే..డయాబెటిస్ బోర్డర్లోకి వచ్చినట్లే..?) -
స్వస్థ్ నారీ ముచ్చటగా మూడు రికార్డులు
కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య సంరక్షణ ప్రచార కార్యక్రమం ‘స్వస్థ్ నారి, సశక్త్ పరివార్ అభియాన్’ (ఎస్ఎన్ఎస్పీఏ) మూడు గిన్నిస్ వరల్డ్ రికార్డ్లను సాధించింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం... ఈ ప్రచారం దేశంలోని ప్రతి జిల్లాకు చేరింది. 19.7 లక్షల ఆరోగ్య శిబిరాలు నిర్వహించారు. ఆరోగ్య వేదికలలో 11 కోట్ల మందికి పైగా పాల్గొన్నారు.ఒకే నెలలో 3.21 కోట్ల మందికి పైగా హెల్త్కేర్ ప్లాట్ఫామ్లో పేర్లు నమోదు చేసుకోవడం, రొమ్ము క్యాన్సర్ స్క్రీనింగ్ కోసం ఒకేవారంలో అత్యధికంగా 9.94 లక్షల మంది పేర్లు నమోదు చేసుకోవడం, హెల్త్ స్క్రీనింగ్ కోసం రాష్ట్ర స్థాయిలో ఒకే వారంలో 1.25 లక్షల మంది ఆన్లైన్లో పేర్లు నమోదు చేసుకోవడానికి సంబంధించి ‘ఎస్ఎన్ఎస్పీఏ’ గిన్నిస్ రికార్డ్లు సొంతం చేసుకుంది.‘ఎస్ఎన్ఎస్పీఏ’ ప్రచార కార్యక్రమాలలో భాగంగా 1.78 కోట్లమందికి పైగా రక్తపోటు, 1.73 కోట్ల మంది డయాబెటిస్, 69.5 లక్షల మందికి నోటి క్యాన్సర్ పరీక్షలు, 1.51 కోట్ల మందికి రక్తహీనత పరీక్షలు నిర్వహించారు. 1.43 కోట్ల వ్యాక్సిన్ డోసులు ఇవ్వబడ్డాయి. క్షయవ్యాధికి సంబంధించి 85.9 లక్షలకు పైగా మహిళలకు పరీక్షలు నిర్వహించారు.కౌన్సెలింగ్, వెల్నెస్ సెషన్లలో 2.14 కోట్ల మంది పాల్గొన్నారు. ‘మై భారత్’ వాలంటీర్ల క్రియాశీల భాగస్వామ్యంతో 2.68 లక్షల మందికి పైగా నిక్షయ్ మిత్ర ప్రచారం కోసం పేరు నమోదు చేసుకున్నారు. ప్రభుత్వ జాతీయ టీబీ నిర్మూలన క్యాక్రమం (ఎన్టిఇపి) కింద క్షయ రోగులకు అండగా ఉండే వ్యక్తులకు ‘నిక్షయ్ మిత్ర’ బిరుదు ప్రదానం చేస్తారు. -
ప్రపంచంలోనే తొలి రోబో షూస్..మార్నింగ్ వాక్ మజాగా!
‘మార్నింగ్ వాక్ మంచిది’ అనే విషయం తెలిసినా...‘మార్నింగ్ వాక్ చేయాలంటే బద్దకంగా ఉంది’ అని మీకు అనిపిస్తుందా? ‘కొంచెం దూరం కూడా పరుగెత్తలేను బాబోయ్’ అనేవారిలో మీరూ ఉన్నారా? అయితే ప్రాజెక్ట్ యాంప్లిఫై’ గురించి మీరు తెలుసుకోవాల్సిందే...ప్రాజెక్ట్ యాంప్లీఫై అనే రోబోటిక్ షూస్ను మార్కెట్లోకి తీసుకువచ్చింది నైక్ కంపెనీ. తక్కువ శ్రమతో, ఎక్కువ దూరం వేగంగా నడవడానికి ఈ సరికొత్త ఫుట్వేర్ ఉపయోగపడుతుంది. ‘నడక, పరుగు, జాగింగ్కు సంబంధించి ఇది సౌకర్యవంతమైన ఆవిష్కరణ’గా ప్రాజెక్ట్ యాంప్లీఫై గురించి తెలియజేసింది నైక్. తేలికైన మోటర్, డ్రైవ్బెల్ట్, రీచార్జబుల్ బ్యాటరీ ఈ రోబోటిక్ షూస్లో ఉంటాయి. నడక, రన్నింగ్, జాగింగ్ను సులభతరం చేయడమే కాదు... మైలుదూరాన్ని పది నుంచి పన్నెండు నిమిషాల వేగంతో అధిగమించే అథ్లెట్లకు ఈ ప్రాజెక్ట్ యాంప్లీఫై సౌకర్యంగా ఉంటుందని, ఎలక్ట్రిక్ బైక్లు సైక్లిస్ట్లకు ఎలా సహాయపడతాయో అదే విధంగా రోజువారీ కదలికలకు అదనపు శక్తిని అందించడానికిప్రాజెక్ట్ యాంప్లీఫై సహాయపడుతుందని తెలియజేసింది నైక్. చదవండి: Happy Birthday to Nita Ambani దాతగా, వ్యాపారవేత్తగా ఆమెకు ఆమే సాటి! -
లివర్ సమస్యలకు హెన్నాతో చెక్?
జుట్టు, చర్మం రంగును మార్చే గుణం హెన్నాకు (Henna dye) ఉంది. అయితే ఇది అందాన్ని పెంచడమే కాదు.. ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుందని చెప్తున్నారు నిపుణులు. తాజాగా జరిగిన అధ్యయనం ప్రకారం సహజమైన హెన్నా లివర్ సమస్యలను దూరం చేస్తుందని గుర్తించారు. ఇంతకీ ఇది ఎంతవరకు నిజం. హెన్నా ప్రభావం కాలేయంపై ఎలా ఉంటుందో చూద్దాం. ఒసాకా మెట్రోపాలిటన్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తల ప్రకారం.. హెన్నాలోని లాసోనియా ఇనర్మిస్ అనే రంగు.. లివర్ ఫైబ్రోసిస్కు చికిత్స చేయగలదని గుర్తించారు. అధిక మద్యపానం వల్ల, జీవనశైలి వల్ల వచ్చే దీర్ఘకాలిక కాలేయ సమస్యలను తగ్గించడంలో హెన్నా మంచి ఫలితాలు ఇస్తుందని అంటున్నారు శాస్త్రవేత్తలు. అధ్యయన ఫలితాలు ఇవే.. ఒసాకా మెట్రోపాలిటన్ విశ్వవిద్యాలయం ఒక రసాయన స్క్రీనింగ్ వ్యవస్థను అభివృద్ధి చేసింది. కాలేయ సమతుల్యతను కాపాడే యాక్టివేటెడ్ హెపాటిక్ స్టెలేట్ కణాలపై నేరుగా పనిచేసే పదార్థాలను గుర్తించడంలో ఇది సహాయపడుతుంది. ఈ వ్యవస్థను ఉపయోగించి.. లాసోన్ను హెపాటిక్ స్టెలేట్ కణాల యాక్టివేషన్ను ఇది నిరోధిస్తున్నట్లు గుర్తించారు. ఎలుకలపై చేసిన అధ్యయనంలో లివర్ ఫైబ్రోసిస్ తగ్గినట్లు తెలుసు కున్నారు. చదవండి: Happy Birthday to Nita Ambani దాతగా, వ్యాపారవేత్తగా ఆమెకు ఆమే సాటి!అధ్యయనంలో హెపాటిక్ స్టెలేట్ కణాల్లోని యాంటీ ఆక్సిడెంట్ ఫంక్షన్లతో సంబంధం ఉన్న అప్ రెగ్యులేటెడ్ సైటోగ్లోబిన్ను గుర్తించారు. అంటే ఈ కణాలు సాధారణ కణాలుగా మారుతున్నాయన్నమాట. హెన్నాలోని లాసోన్ ద్వారా ఔషధాలు తయారు చేస్తే.. లివర్ ఫైబ్రోసిస్ను నియంత్రించవచ్చని శాస్త్రవేత్తలు నమ్ము తున్నారు. హెపాటిక్ స్టెలేట్ కణాలను యాక్టివేట్ చేసి.. ఔషధాలను రవాణా చేయగల డ్రగ్ డెలివరీ సిస్టమ్ను అభివృద్ధి చేస్తున్నట్లు శాస్త్రవేత్తలు చెప్తున్నారు. దానిని లివర్ ఫైబ్రోసిస్ ఉన్న రోగులకు అందుబాటులో ఉంచేలా ప్లాన్ చేస్తున్నామని ఒసాకా మెట్రోపాలిటన్ విశ్వవిద్యాలయంలో గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ మెడిసన్ డాక్టర్ అట్సుకో డైకోకు తెలిపారు. చదవండి: Karthika masam 2025 దర్శించుకోవాల్సిన పవిత్ర శివాలయాలు -
బ్లాక్ ఫంగస్ ఉల్లి, తొక్కే కదా, అని తీసి వాడేస్తున్నారా?
మార్కెట్ నుంచి మన ఇంటికి ఉల్లిపాయలను తీసుకువచ్చినప్పుడు, చాలా సార్లు ఉల్లిపాయలో నల్లటి పొర కనిపిస్తుంది. సాధారణంగా ఈ పొర తొక్క లోపల కనిపిస్తుంది. మనం దీనిని ఏదో దుమ్ముగా భావించి, కడిగి వాడుకుంటాం. కానీ ఇది నల్లటి ఫంగస్. దీని కారణంగా అనేక వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి ఉల్లిపాయలు తినడం వల్ల కలిగే నష్టాలేంటో తెలుసుకుందాం.బ్లాక్ ఫంగస్ ఉన్న ఉల్లిపాయలు తినడం వల్ల అది మన రోగనిరోధక శక్తిపై ప్రభావం చూపిస్తుంది. దీంతో, అనేక వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉంది. ఇప్పటికే తక్కువ రోగనిరోధక శక్తి ఉన్నవారు ఈ ఉల్లిపాయల జోలికి పోకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.చదవండి: Happy Birthday to Nita Ambani దాతగా, వ్యాపారవేత్తగా ఆమెకు ఆమే సాటి!ఉల్లిపాయలపై నల్లటి మచ్చలు ఒక రకమైన ఫంగల్ ఇన్ఫెక్షన్. ఇలాంటి వాటిని తినడం వల్ల మ్యూకోర్మైకోసిస్ వచ్చే ప్రమాదం పెరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.ఈ ఇన్ఫెక్షన్ చాలా హాని కలిగిస్తుంది. వివిధ అనారోగ్యాల బారిన పడే అవకాశం ఉంది. అందుకే ఇలాంటి ఉల్లిపాయల్ని తినకపోవడమే మేలు.ఉల్లిపాయ నుంచి ఆ భాగాన్ని తీసివేసి తింటే అది ప్రాణాపాయం కలిగించదు. కానీ, ఇది కొంతమందిలో అలెర్జీని కలిగిస్తుంది. ముఖ్యంగా ఇప్పటికే అలెర్జీలు ఉన్నవారు ఇలాంటి ఉల్లిపాయల్ని తినకూడదు. అదేవిధంగా, ఉబ్బసం ఉన్నవారికి ఇది హానికరం. ఈ ఫంగస్ గాలిలో వ్యాపించి, ఉబ్బసం ఉన్న వ్యక్తి దానిని పీల్చినప్పుడు, అది హాని కలిగిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఉల్లిపాయను ఒకటి లేదా రెండు పొరలను తీసివేసిన తర్వాత మాత్రమే వాడండి లేదా ఉల్లిపాయలు కొనేటప్పుడు, తొక్క నల్లగా ఉండకుండా చూసుకోండి.మరో ముఖ్య విషయం... ఉల్లిపాయలను ఫ్రిజ్లో ఉంచకూడదు. ఒకవేళ మీరు ఉల్లిపాయలను ఫ్రిజ్లో ఉంచాలనుకుంటే దానిపై ఎటువంటి నల్లటి ఫంగస్ ఉండకూడదు. అలా ఉంటే అది ఇతర ఆహార పదార్థాలతో కలిసిపోయి విషంగా మారుతుంది. అందుకే ఇలాంటి తప్పులు చేయకండి.చదవండి: Karthika masam 2025 దర్శించుకోవాల్సిన పవిత్ర శివాలయాలు -
జిమ్ లేకున్నా హోమ్ చాలు
ఈ రోజుల్లో మహిళల బాధ్యతలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఇంట్లో గృహిణిగా, ఆఫీసుల్లో ఉద్యోగినిగా మల్టీ టాస్కింగ్గా పనులను చక్కబెట్టాల్సి వస్తోంది. ఇలాంటప్పుడు మైండ్ అండ్ బాడీ బ్యాలెన్స్డ్గా ఉండాలి. అందుకు రోజువారీ వ్యాయామాలు చేయాలి. జిమ్కు వెళ్లలేం అనుకునేవారు ఇంట్లోనే పాటించదగిన ఫిట్నెస్ కేర్ గురించి తెలుసుకుని ఆచరిస్తే ఎంతో మేలు జరుగుతుంది. బాలీవుడ్ సెలబ్రిటీ జిమ్ ట్రైనర్ యాస్మిన్ చెబుతున్న జిమ్ ఫిట్నెస్΄పాఠాలు ఇవి... దీపికా పదుకొనే, అలియాభట్ ఫిట్నెస్ ట్రైనర్ యాస్మిన్ మహిళల దినచర్యలకు తగిన విధంగా ఇంట్లోనే చేసుకోదగిన ఫిట్నెస్కు మార్గనిర్దేశం చేస్తుంది. పోషకాహారంపైనా దృష్టి పెడుతుంది. మహిళల ఫిట్నెస్ కోసం కోర్ స్ట్రెంత్, ఫ్లెక్సిబిలిటీ, స్ట్రెంగ్త్ ట్రైనింగ్తో కూడిన బ్యాలెన్స్ను గట్టిగా చెబుతుంది. అంతేకాదు, మెనోపాజ్ వంటి దశలలో మహిళలు ఆరోగ్యంగా ఉండటానికి సరైన సూచనలనూ అందిస్తుంది.స్థిరత్వం ముఖ్యంచాలా మందిలో ఫిట్నెస్ విషయంలో తీవ్రమైన నిర్ణయాలు ఉంటాయి. ఎక్కువ సమయం, వేగంగా వ్యాయామాలు చేయడం కంటే సరైన సమయంలో సరైన వ్యాయామాలు చేస్తూ ఫిట్నెస్ సాధించడం ముఖ్యం. సమతుల ఆహారం : ప్రాసెస్ చేసి, చక్కెర ఉన్న ఆహారాలను నివారించి ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం ఫిట్నెస్ లక్ష్యాలలో చాలా ముఖ్యమైనది.అనుకూలమైన వ్యాయామాలు: ఇంట్లో, జిమ్లో ఎక్కడైనా చేయడానికి ఎన్నో రకాల వ్యాయామాలు ఉన్నాయి. నిత్యం బిజీగా ఉండే వ్యక్తులు కూడా అనుకూలమైనవి ఎంచుకొని చేయవచ్చు.ఇంట్లోనే చేయదగిన కొన్ని వ్యాయామాలుట్రైసెప్ డిప్స్: మీ ట్రైసెప్స్ కోసం డిప్స్ చేయడానికి బలమైన కుర్చీని ఉపయోగించవచ్చు. అప్పర్కట్, పంచ్: చేతులను బలోపేతం చేసేలా బాక్సింగ్ విధానంలో కదలికలు ఉండాలి.∙డబుల్ లెగ్ స్ట్రెచ్: నేలపైన పడుకొని, మోకాళ్ళను ఛాతీ వద్దకు తీసుకురావడం, తిరిగి చేతులు, కాళ్లను యధాస్థానానికి తీసుకువెళ్లడం.. ఇలా పదే పదే చేయడం ద్వారా ఉదర కండరాలలో మార్పులు తీసుకురావచ్చు.స్ట్రెయిట్ లెగ్ లిఫ్ట్లు : నేలమీద వీపుపై పడుకుని, కాళ్లను సమాంతరంగా చాపుతూ పైకి ఎత్తాలి. తర్వాత తిరిగి కిందకు చేర్చాలి. మడమ స్పర్శ: నేలమీద పడుకొని, మోకాళ్ల దగ్గర కాళ్లను వంచి, చేతులతో మడమలను తాకడానికి ప్రయత్నం చేయాలి. వ్యాయామం చేసేటప్పుడు శ్వాస లయను కూడా ఒక రిథమ్గా నిర్వహించడం ముఖ్యం. ఎటువంటి గాయం కాకుండా మరొకరి పర్యవేక్షణలో సాధన చేయడం ఉత్తమం.నిటారుగా నిల్చొని, ఒక చేతిని తలకిందుగా పట్టుకుని, నెమ్మదిగా వంగిపాదాన్ని మరొక చేతితో తాకండి. అలాగే రెండో చేతితో చేయాలి. తక్కువ పరికరాలతో వ్యాయామాలుహాలో డంబెల్: పాదాలను, భుజాలను వెడల్పుగా ఉంచి భుజాలు, ట్రైసెప్స్, వీపును లక్ష్యంగా చేసుకోవడానికి రెండు చేతులతో డంబెల్ను పట్టుకొని, దానిని తల చుట్టూ తిప్పాలి. బ్యాండ్ ట్విస్ట్: మార్కెట్లో జిమ్ బ్యాండ్స్ లభిస్తాయి. కాళ్లు, చేతులతో ఈ బ్యాండ్ పట్టుకుంటూ ఎగువ, దిగువ వీపు కండరాలపై నిమగ్నం చేయాలి.కెటిల్బెల్ : ఇది సైడ్ బెండ్ చేయడానికి బాగా ఉపయోగపడే మరొక పరికరం. ఈ కెటిల్బెల్ తో మోచేయి నుండి మోకాలికి ఒక డైనమిక్ కదలిక ఉంటుంది. దీనివల్ల నడుము టోన్ అవ్వడమే కాకుండా, కోర్ కో ఆర్డినేషన్ కూడా మెరుగుపడుతుంది. చేతితో కెటిల్బెల్ తీసుకొని, బరువు ఉన్న వైపు పక్కకు వంగి, రెండో మోకాలిని మోచేయి కలిసే విధంగా పైకి ఎత్తాలి. ఇలా పది నుంచి పన్నెండు సార్లు చేయాలి.మెడిసిన్ బాల్ ట్విస్ట్ దీనితో వ్యాయామం చేస్తే పక్కలు బలోపేతం అవుతాయి. ఇందులో ఛాతీ స్థాయిలో మెడిసిన్ బాల్ పట్టుకుని, తల కింద నుంచి ఒక వైపు నుండి మరొక వైపుకు కదలించాల్సి ఉంటుంది.రోజులో ఖాళీ కడుపుతో కొంత సమయం ఈ వ్యాయామాలు చేస్తే మైండ్కు–బాడీకీ మధ్య సమతుల్యత ఏర్పడుతుంది. పనులకు తగినట్టు శక్తిని పుంజుకోవడానికి, శారీరక చురుకుదనం పెంపొందించుకోవడానికి, పోషకాహారంపై దృష్టి పెట్టడానికి ఈ పై వ్యాయమాలు పనిచేస్తాయి. చదవండి: Karthika masam 2025 దర్శించుకోవాల్సిన పవిత్ర శివాలయాలు -
నోటి ఆరోగ్యంతో కొన్ని రకాల క్యాన్సర్లకు చెక్!
నోటి ఆరోగ్యాన్ని చాలామంది నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. అదే పోతుందిలే అని ఉదాసీన వైఖరితో ఉంటారు. నిజానికి నోటి ఆరోగ్యం అంటే దంతాలు ,చిగుళ్ళు మాత్రమే కాదు. మొత్తం శరీర ఆరోగ్యానికి మూల స్థంభం లాంటిది. నోటి అరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తే గుండె జబ్బులు, ప్రమాదకర క్యాన్సర్లకు దారి తీస్తుంది. అందుకే దంతవైద్యులు, వైద్యులు ఇద్దరూ నోటి ఆరోగ్యం ముఖ్యమైనదని నొక్కి వక్కాణిస్తున్నారు. అదెలాగో చూద్దాం.డాక్టర్ సోనియా దత్తా, MDS, PhD, పబ్లిక్ హెల్త్ డెంటిస్ట్రీ ప్రొఫెసర్ ప్రకారం సరైన నోటి ఆరోగ్యం దైహిక ఆరోగ్యానికి మద్దతు ఇస్తుంది. గుండె జబ్బులు, మధుమేహం, కొన్ని క్యాన్సర్లు ప్రమాదాలను తగ్గిస్తుంది. అంతేకాదు క్యాన్సర్ నివారణలో ఇదొక కీలక అంశం.క్యాన్సర్ నివారణకు సరైన నోటి ఆరోగ్యంమంచి నోటి ఆరోగ్యం కేవలం శుభ్రమైన దంతాలను కలిగి ఉండటం కంటే ఎక్కువ.నోటి ఆరోగ్యం అందం సౌకర్యం మాత్రమే కాదు. తక్కువ రోగనిరోధక శక్తి ఉన్నవారికి, నోటి పరిశుభ్రతను పాటించడం అవసరం.ఇది జీవన నాణ్యతను నేరుగా ప్రభావితం చేస్తుంది. సరిగా శుభ్రం చేయని నోటిలో బ్యాక్టీరియా పెరిగి, దీర్ఘకాలిక వాపు (inflammation) ఏర్పడుతుంది, ఇది కణజాల క్షీణతకు దారితీయవచ్చు.డాబర్ రెడ్ పేస్ట్ వంటి ఆయుర్వేద పేస్ట్తో రోజుకు రెండుసార్లు బ్రష్ చేయడం, ఫ్లాసింగ్ చేయడం మరియు యాంటీ బాక్టీరియల్ మౌత్ వాష్ ఉపయోగించడం వంటి సాధారణ అలవాట్లు బ్యాక్టీరియా భారాన్ని తగ్గించడ , నోటి లోపలి వ్యవస్థను సమతుల్యంగా ఉంచడం ద్వారా ఈ ప్రమాదాలను గణనీయంగా తగ్గిస్తాయి.AIIMS (ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్) పరిశోధకుల అభిప్రాయం ప్రకారం, నోటి పరిశుభ్రతను ప్రామాణిక ఆంకాలజీ సంరక్షణలో విలీనం చేయాలి . INHANCE (ఇంటర్నేషనల్ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ ఎపిడెమియాలజీ) కన్సార్టియం, మంచి నోటి పరిశుభ్రత, (వార్షిక దంత పరీక్షలు, తక్కువ పళ్ళు తప్పిపోవడం, రోజువారీ బ్రషింగ్) తల , మెడ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుందని కనుగొంది.క్రమం తప్పకుండాచేసుకునే సాధారణ దంత పరీక్షలు చాలా ముఖ్యమైనవి. తద్వారా నోటి క్యాన్సర్ ముందస్తు సంకేతాలను గుర్తించవచ్చు. కనిపించకుండా ఉండే అనుమానాస్పద గాయాలు, నిరంతర పూతల లేదా కణజాల ఆకృతిలో మార్పులు ఈ పరీక్షల్లో వైద్యులు గుర్తిస్తారు. అలాగే పొగాకుకు నిషేధించడం, మద్యం పరిమితం చేయడం ద్వార క్యాన్సర్ ప్రమాదం మరింత తగ్గుతుంది. ఈ చర్యలు నోటి ఆరోగ్యాన్ని రక్షించడమే కాకుండా దీర్ఘకాలిక క్యాన్సర్ నివారణ వ్యూహాలలో శక్తివంతమైన సాధనాలుగా కూడా పనిచేస్తాయి, ముఖ్యంగా తల మరియు మెడ క్యాన్సర్లు ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో.నోటి ఆరోగ్యం - కొన్ని రకాల క్యాన్సర్లు తల, మెడ క్యాన్సర్లు: దీర్ఘకాలిక చిగుళ్ల వ్యాధి, పేలవమైన నోటి పరిశుభ్రత లాంటివి నోరు, గొంతు స్వరపేటికలో ప్రాణాంతంగా మారే వాపు మరియు సెల్యులార్ మార్పులను పెంచుతాయి.జీర్ణవ్యవస్థ క్యాన్సర్లు: పీరియాడోంటల్ వ్యాధి కడుపు, ప్యాంక్రియాటిక్ మరియు కొలొరెక్టల్ క్యాన్సర్ల ప్రమాదాలతో ముడిపడి ఉంది.ఊపిరితిత్తుల మరియు ప్రోస్టేట్ క్యాన్సర్లు: నోటి అపరిశుభ్రత, అనారోగ్యం ఈ క్యాన్సర్ల ముప్పును పెంచుతుంది. (స్వరోవ్స్కి ఈవెంట్లో రష్మిక స్టైలిష్ లుక్ : ఎంగేజ్మెంట్ రింగ్ స్పెషల్!)అయితే ఇది అన్ని క్యాన్సర్లను నిరోధించకపోయినా, మంచి నోటి సంరక్షణ కొన్ని రకాల క్యాన్సర్లు ముప్పును తగ్గిస్తుంది. మ్యూకోసిటిస్, ఇన్ఫెక్షన్ల వంటి సమస్యలను తగ్గించడం ద్వారా క్యాన్సర్ చికిత్స ఫలితాలను మెరుగు పడతాయి. రోగనిరోధక పనితీరు మెరుగుపడుతుంది. నోటి సంరక్షణ ఎలా?ఆయుర్వేద పేస్ట్తో ప్రతిరోజూ రెండుసార్లు బ్రష్ చేయడం, క్రమం తప్పకుండా ఫ్లాసింగ్ చేయించుకోవడం. యాంటీ బాక్టీరియల్ మౌత్ వాష్ పొగాకు, ఆల్కహాల్కు దూరంగా ఉండటం చక్కెర, యాసిడ్ ఫుడ్స్, పానీయాలకు దూరంగా ఉండాలి. లేదంటే ఇవి దంతాల ఎనామిల్ను పాడుచేస్తాయి, బ్యాక్టీరియా పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. కనీసం సంవత్సరానికి ఒకసారైనా దంతవైద్యుడిని సంప్రదించాలి.నోటిలో ఏదైనా అసాధారణ గడ్డలు, పుండ్లు లేదా ఇతర మార్పులను గమనించి నట్లయితే, వెంటనే దంతవైద్యుడిని సంప్రదించండి. -
యోగ కోచ్గా ఐఐటీయన్..!
ఐఐటియన్గా పెద్ద కలలు, ఖరీదైన కలలేవీ కనలేదు సౌరభ్. ‘మార్పు తెచ్చే శక్తి యోగాలో ఉంది’ అని గ్రహించిన ఈ కుర్రాడు దేశవ్యాప్తంగా యోగా తరగతులు నిర్వహిస్తున్నాడు. ‘హబిల్డ్’ గ్లోబల్ మూమెంట్ ప్లాట్ఫామ్ ప్రారంభించాడు. ఈ విశ్వవేదికలో 169 దేశాల నుంచి 1.2 కోట్ల మంది యోగాభ్యాసకులుఉన్నారు. ఇక వరల్డ్ రికార్డ్లు సరే సరి... ‘ఐఐటీ పూర్తి చేసి ఆరుసంవత్సరాలైనా సౌరభ్ ఏమీ సంపాదించలేదు’ అని కొద్దిమంది అనుకునేవారు. వారికి తెలియని విషయం ఏమిటంటే సౌరభ్ చాలా సంపాదించాడు. ఎంతో పేరు! ఎన్నో రికార్డ్లు!! మహారాష్ట్రలోని ధనజ్ అనే చిన్న గ్రామంలో పుట్టాడు సౌరభ్. అతడి పూర్వీకులు రాజస్థాన్కు చెందిన వారు. తాత లక్ష్మీచంద్ 1955లో యంబీబీయస్ పూర్తి చేశాడు. బాగా డబ్బులు సంపాదించాలి, లగ్జరీగా బతకాలి, పట్టణాలలో మాత్రమే ఉండాలి అనుకోలేదు. పేద ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో రోడ్లు కూడా సరిగ్గా లేని మారుమూల గ్రామంలో ప్రాక్టీస్ ప్రారంభించాడు. వైద్యుడిగా సేవలందించడమే కాకుండా గ్రామ అభివృద్ధి కోసం ఎంతో చేశాడు లక్ష్మీచంద్. చిన్నప్పటి నుంచి తాత గురించి ఎన్నో మంచి విషయాలు విన్నాడు సౌరభ్. అలా తనకు తెలియకుండానే తాత స్ఫూర్తిగా మారాడు. స్వామి వివేకానంద బోధనలు కూడా సౌరభ్ను ఎంతో ప్రభావితం చేశాయి. ఈ నేపథ్యంలోనే ‘ఉద్యోగం కాదు. సమాజం కోసం ఏదైనా చేయాలి’ అనుకున్నాడు. కాలేజి రోజుల్లో ఒకసారి బెనారస్ నుంచి నాగ్పూర్కు ప్రయాణిస్తున్న సౌరభ్కు ఒక ధ్యానకేంద్రానికి చెందిన సభ్యులతో పరిచయం ఏర్పడింది. వారితో పరిచయం తన జీవనగమనాన్ని మార్చింది. యోగాపై ఆసక్తి పెంచుకునేలా చేసింది. వారు నిర్వహించే ధ్యాన, యోగ తరగతులకు హాజరయ్యేవాడు. యోగ తరగతులకు హాజరుకావడం టర్నింగ్ పాయింట్గా మారింది. క్రమం తప్పకుండా ధ్యానం, యోగా చేసేవాడు. దీనివల్ల చిన్నప్పటి నుంచి ఉన్న ఆస్తమ సమస్య ఉపశమనం దొరికినట్లయింది.యోగాలో ప్రావీణ్యం సాధించిన సౌరభ్ ఆ విద్యను వీలైనంత ఎక్కువ మందికి నేర్పించాలనే లక్ష్యంతో ప్రయాణం ప్రారంభించాడు. దేశం నలుమూలలా తిరుగుతూ ఎంతోమందికి యోగా నేర్పించాడు. ‘యోగా బోధించడం కోసం ఎన్నో ప్రాంతాలు తిరిగాను. ఆ సమయంలో నా సంతోషం మాటలకు అందనిది. ప్రతిరోజూ కొత్తగా, ఉత్సాహంగా ఉండేది. రోజూ నిద్ర లేవగానే ఈరోజు క్లాస్లో ఎలా బోధించాలి అనేదాని గురించి ఆలోచించేవాడిని. ప్రతిరోజూ పండగ జరుపుకున్నంత ఉత్సాహంగా ఉండేది’ అని గతాన్ని గుర్తు తెచ్చుకున్నాడు సౌరభ్.కోవిడ్ లాక్డౌన్ సమయంలో ఒక్క రూపాయి కూడా ఆశించకుండా యోగా ఆన్లైన్ క్లాస్లు ప్రారంభించాడు. అయితే మొదట్లో కేవలం ముగ్గురు మాత్రమే ఈ ఆన్లైన్ క్లాస్లకు హాజరయ్యేవారు. తాను నిర్వహించే తరగతులు ఉచితం కాబట్టి వాటిని ఎవరూ సీరియస్గా తీసుకోవడం లేదని గ్రహించిన సౌరభ్ తన ఆన్లైన్ క్లాస్లకు నెలకు వంద రూపాయలు ఫీజుగా పెట్టాడు.ముగ్గురితో మొదలైన ఆన్లైన్ క్లాస్ విద్యార్థుల సంఖ్య వందకు చేరింది. ఆ తరువాత దేశదేశాలకు విస్తరించి, విద్యార్థుల సంఖ్య లక్షలు దాటింది. తాను నిర్వహించే ఆన్లైన్ తరతులకు ముగ్గురు మాత్రమే హాజరైనప్పుడు సౌరభ్ నిరాశకు గురికాలేదు. ఘనమైన రికార్డ్లు నెలకొల్పినప్పుడు అహంతో ప్రవర్తించడం లేదు. యోగా నేర్పిన సమ్యక్ దృష్టితోనే తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాడు.వావ్ అనిపించే వరల్డ్ రికార్డులుయూట్యూబ్లో యోగా లైవ్ స్ట్రీమ్ను అత్యధికంగా వీక్షించిన ప్లాట్ఫామ్గా హబిల్డ్ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ నెలకొల్పింది. అదే సంవత్సరం ఈ ప్లాట్ఫామ్ రెండు వరల్డ్ రికార్డ్స్ టైటిల్స్ సాధించింది. అందులో ఒకటి...ఒకేరోజులో చాలామంది లైవ్ వ్యూయర్స్కు సంబంధించింది, రెండోది లార్జెస్ట్ వర్చువల్ మెడిటేషన్ క్లాస్కు సంబంధించింది. మొదటి దానిలో 5,99,162 మంది, రెండో దానిలో 2,87,711 మంది పాల్గొన్నారు. ఈ సంవత్సరం 169 దేశాలకు చెందిన 7,52,074 మందితో వర్చువల్ యోగా సెషన్ నిర్వహించి మరో రికార్డ్ సొంతం చేసుకున్నాడు సౌరభ్. (చదవండి: ఇద్దరు పిల్లల తల్లి సాహసం..! మరో రికార్డు కోసం..) -
ధనాధన్..వాకథాన్..! ఊపందుకుంటున్న సుదీర్ఘ నడక ఈవెంట్లు..
నడిస్తే పోయేదేం లేదు.. అనారోగ్యం తప్ప.. అని వైద్యులు పదే పదే చెవిన ఇల్లు కట్టుకుని చెబుతున్నారు. మరోవైపు కోవిడ్ తర్వాత శారీరక శ్రమ, ఫిట్నెస్కు ప్రాధాన్యత ఇవ్వడానికి నగరవాసులు ఆసక్తి కనబరుస్తున్నారు. మహమ్మారి సమయంలో ఎదురైన అనుభవాల రీత్యా.. వాకథాన్లపై క్రమంగా ఆసక్తి పెరుగుతోంది. దీంతో పార్కుల్లో వాకర్స్ మాత్రమే కాదు సుదూర ప్రాంతాలకు నడిచే వాకథానర్లు కూడా పెరుగుతున్నారు. వీరి కోసం పలు కార్పొరేట్ సంస్థలు వాకథాన్ ఈవెంట్లను నిర్వహిస్తున్నాయి. ప్రజల నుంచి కూడా ఈ తరహా ఈవెంట్ల పట్ల ఆసక్తి పెరుగుతోంది. దీంతో పలు స్వచ్ఛంద సంస్థలు, కార్పొరేట్లు.. ఏదో ఒక ఈవెంట్కు అనుగుణంగానో, సామాజిక కార్యక్రమాలకు నిధుల సమీకరణ కోసమో హైదరాబాద్ నగరంలో ఇటువంటి వాకథాన్లు క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నారు. ‘వాకథాన్లు’ – ‘వాకింగ్ మారథాన్ల’ సంక్షిప్త రూపం దేశవ్యాప్తంగా ఆరోగ్య ప్రియుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. ఫిట్నెస్, ఆరోగ్యంపై పెరుగుతున్న అవగాహన రీత్యా ‘వాకథాన్లు’ బాగా ప్రాచుర్యం పొందుతున్నాయి. వాకథాన్లు నగర రోడ్లకే పరిమితం కాలేదు. చాముండి కొండలలోని అటవీ ట్రైల్స్, రాజస్థాన్లోని ఎడారి ప్రదేశాలతో సహా ప్రకృతి అందాల నడుమ ఇవి జరుగుతున్నాయి. సామాజిక ‘కారణాల’ కోసం నిధులను సమీకరించేందుకు నిర్వహించే వాకథాన్లు కూడా పెరిగాయి. ముంబైలో జరిగిన ‘చలో భారత్ వాకథాన్ 2025’లో 6,500 మందికి పైగా పాల్గొన్నారు. అవయవ దానం, రొమ్ము కేన్సర్ అవగాహన వన్యప్రాణుల సంరక్షణ వంటివి కూడా వాకథాన్లకు థీమ్స్గా మారుతున్నాయి. ప్రభుత్వం ఇటీవల చేపట్టిన ‘ఫిట్ ఇండియా‘ ఉద్యమం పెద్ద ఎత్తున వాకథాన్లను ప్రోత్సహించింది. గత 2020లో రాజస్థాన్లో 200కి.మీ ‘ఫిట్ ఇండియా వాకథాన్’ను నిర్వహించారు. వ్యవస్థలూ.. వ్యక్తిగతంగానూ.. వాకథాన్లు కార్పొరేట్ ప్రపంచాన్ని సైతం ఆకర్షించడం ప్రారంభించాయి. థ్రిల్ జోన్ వంటి ప్రత్యేక ఈవెంట్ నిర్వాహకులు టౌన్ స్క్రిప్ట్ వంటి ఈవెంట్–బుకింగ్ ప్లాట్ఫారమ్లు దేశవ్యాప్తంగా ఎండ్యూరెన్స్ వాకింగ్ ఈవెంట్లను సృష్టిస్తున్నాయి. ప్రతి సంవత్సరం భారతదేశంలోని నగరాల్లో డజనుకు పైగా వాకథాన్లు జరుగుతున్నాయి. ‘మేం 2011–12లో బెంగళూరులో మా మొదటి ‘ట్రైల్వాకర్’ నిర్వహించినప్పుడు 320 మంది పాల్గొన్నారు. ప్రస్తుతం రెండు నగరాల్లో నిర్వహిస్తుంటే ప్రతి సంవత్సరం 1600 మందికి పైగా పాల్గొంటున్నారు’ అని ఆక్స్ఫామ్ ఇండియా సీఈఓ అమితాబ్ బెహర్ చెప్పారు. మరోవైపు వ్యక్తిగతంగానూ రికార్డు స్థాయి నడకలతో గుర్తింపు పొందారు. కోయంబత్తూరుకు చెందిన నటరాజ్ 2021– 2023 మధ్య 798 రోజుల్లో 6,614 కి.మీ నడిచి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లోకి ఎక్కారు. 2024లో పర్యావరణ అవగాహన పెంచడానికి విరాగ్ మధుమాలతి నవీ ముంబై నుంచి రాజస్థాన్ వరకూ 1,305 కి.మీ. నడిచి ప్రపంచ రికార్డును నెలకొల్పారు. కొంకణ్ ట్రయల్ నిర్వహిస్తున్నాం.. ‘గతంలో పలు మార్లు వాకథాన్, మారథాన్లలో పాల్గొన్న అనుభవం ఉంది. ప్రస్తుతం పుణె సమీపంలోని అందమైన గ్రామాలు, చిన్న చిన్న పట్టణాలు, చెరువులు, వాగులు, వంకలు, ఘాట్లు.. ఇంకా అనేక ప్రకృతి సౌందర్యాల నడుమ కొంకణ్ ట్రయల్ వాకథాన్ నిర్వహిస్తున్నాం’ అని గ్రీన్ ట్రయిల్ ఫౌండేషన్ ప్రతినిధులు తెలిపారు. తమ వాకథాన్ను నగరానికి పరిచయం చేసిన సందర్భంగా వీరు తమ ఈవెంట్ వివరాలు వెల్లడించారు. విభిన్న రంగాల్లో సేవలు అందిస్తున్న వ్యాయామ, ఆరోగ్య ప్రియులమైన తామంతా కలిసి ఈ వేదికను స్థాపించామన్నారు. ఈ ఈవెంట్లో పాల్గొనేవారు 100 కి.మీ దూరాన్ని 50 గంటల్లో, 50 కి.మీ దూరాన్ని 25 గంటల్లో పూర్తి చేయాల్సి ఉంటుందన్నారు. కనీసం ఇద్దరు నుంచి నలుగురు టీమ్గా పాల్గొంటారు. తమ వాకథాన్లో పాల్గొనేందుకు హైదరాబాద్తో పాటు బెంగళూర్, ముంబై, పుణె తదితర నగరాల నుంచి వాకర్స్ ఉత్సాహం చూపిస్తున్నారన్నారు. బహుళ వాకథాన్లు.. బహుళ వాకథాన్లు చేసిన వారు 100 కి.మీ ట్రయల్ను పూర్తి చేయడానికి 32 గంటలకు పైగా సమయం గడుపుతారు. వారు ప్రతి 15–20 కి.మీ తర్వాత చిన్న విరామాలు తీసుకుంటూ నడుస్తారు. మొదటి 50 కి.మీలు పూర్తి చేసిన తర్వాత దాదాపు రెండు గంటల పాటు ఒక దీర్ఘ విరామం తీసుకుంటారు. ఒక వ్యక్తి 100 కిలోమీటర్లు పూర్తి చేయడానికి కనీసం 1.5 లక్షల అడుగులు వేస్తాడు. చివరి 100 అడుగులు అత్యంత కష్టతరమైనదని వాక్థానర్లు అంటున్నారు. ఓపికకు పరీక్ష.. ‘వాకథాన్లు స్టామినాను, ఓపికను పరీక్షిస్తాయి.. మొదటి 10 కి.మీ. సరదాగా ఉంటుంది. కానీ తర్వాత నుంచి కష్టం మొదలవుతుంది’ అని వాకథాన్ ప్రియుడు ఇష్మీత్ సింగ్ చెప్పారు. ‘మారథాన్ 2–3 గంటల్లో ముగుస్తుందని ముందే తెలుస్తుంది. దానికి అనుగుణంగా శిక్షణ పొందినట్లయితే, దానిని పూర్తి చేయగలం. కానీ వాకథాన్ల కోసం చాలా దృఢసంకల్పం అవసరం’ అని సింగ్ అంటున్నారు. ఆయన తన చివరి 100 కి.మీ వాకథాన్ను 32 గంటల్లో పూర్తి చేశారు. వాకథాన్ శిక్షణలో భాగంగా రోజువారీ సెషన్లు, పోషకాహారం వంటివి సూచిస్తారు.. అమెచ్యూర్ వాకథానర్లు ఒకేసారి 25–30 కి.మీ లను కవర్ చేసే వారాంతపు నడకలతో ప్రారంభిస్తారు. వీరు నగర రోడ్లు, గ్రామ దారులు, పగలు, రాత్రి వేళల్లో, అలాగే అన్ని రకాల భూభాగాల్లో నడవడానికి అవకాశం పొందుతారు. ఇది గొప్ప అనుభవం అని వాకథానర్లు అంటున్నారు. (చదవండి: అక్కాచెల్లెళ్లు నలుగురికి అరుదైన వ్యాధి..! విస్తుపోయిన వైద్యులు) -
అక్కాచెల్లెళ్లు నలుగురికి అరుదైన వ్యాధి..! విస్తుపోయిన వైద్యులు
ఒకే తల్లికి పుట్టిన పిల్లలకు ఒకే విధమైన సమస్య రావడం చూస్తుంటాం. అలా కాకుండా..ఆఖరి పిల్లవాడిలో చూసిన రుగ్మత పెద్దపిల్లల్లో ఒకరి తర్వాత ఒకరూ బారినపడితే..అదొక మెడికల్ మిస్టరీలా ఉంటుంది. అలాంటి ఘటనే ఇక్కడ ఆవిష్కృతమైంది. వైద్యులు సైతం ఇదెలా సాధ్యం అని విస్తుపోతున్నారు.అసలేం జరిగిందంటే..అమెరికాలోని వెస్ట్ వర్జినియాకు చెందిన ఒక కుటుంబంలో నలుగురు కుమార్తెలు ఒకరు తర్వాత ఒకరు ఒకే విధమైన మెదడు సంబంధిత రుగ్మత బారినపడ్డారు. తొలుత చిన్న కుమార్తెకు 18 నెలల వయసు ఉండగా ఈ సమస్యను గుర్తించారు. అదీగా తల్లిదండ్రులు కూడా చిన్నప్పటి నుంచి ప్రతిదీ నేర్చుకోవడం ఆలస్యం కావడంతో..ఆ చిన్నారి విషయంలోనే ఆందోళ చెందేవారు. ఇప్పుడూ పెద్దవాళ్లైన ముగ్గురు పిల్లలు అదే రుగ్మత బారినపడ్డారని తెలిసి తల్లడిల్లిపోయారు. ఏంటా వ్యాధి అంటే..మెదడుకి సంబంధించిన చియారీ వైకల్యం. వైద్యానికి సవాలు విసిరేలా నలుగురు ఒకేసారి ఈ వ్యాధిని ఎదుర్కొవడం అంతుచిక్కని మిస్టరీలా అనిపించింది వైద్యులకు. చియారీ వైకల్యం అంటే..పుర్రె వెనుకభాగం మెదడు కణజాలం వెన్నెముకలోకి ప్రవేశించే పరిస్థితి. ఫలితంగా ఇది మెదడుపై ఒత్తిడిని కలిగిస్తుంది. దాంతో తలనొప్పి, మైకము, మెడ నొప్పి, బ్యాలెన్సింగ్కి సంబంధించిన సమస్యలు ఎదుర్కొంటారు. సింపుల్గా చెప్పాలంటే మెదడు యొక్క దిగువ భాగం పుర్రె దాటి విస్తరించి, పుర్రె వెన్నుపాముతో కలిసే ద్వారం పొడుచుకు వచ్చే పరిస్థితి. ఇది సాధారణంగా పుట్టుకకు ముందు అభివృద్ధి చెందుతుందని వైద్యులు. ఈ సమస్యల ప్రతి 2,000 మందిలో ఒకరిని ప్రభావితం చేస్తుంది. అయితే ఈ పరిస్థితి ఎందువల్ల వస్తుందనేది ఖచ్చితమైన కారణం తెలియదు. అయితే పెద్దవాళ్లైన ముగ్గురు ఆడపిల్లలు అమేలియా, ఆబ్రే, అడాలీలకి పీడియాట్రిక్ న్యూరో సర్జన్ శస్త్ర చికిత్స చేసి సమస్య నుంచి మెరుగయ్యేలా చేశారు. ఇక్కడ వైద్యులు ఈ పరిస్థితికి..మెదడుతో కుదించి ముడిపడి ఉన్న వెన్నుపాములను కోసి సెరెబ్రోస్పానియల్ ద్రవ ప్రవాహాన్ని పునరుద్ధరించడమే లక్ష్యంగా శస్త్రచికిత్స చేస్తారు. ప్రస్తుతం ఆ ముగ్గురు ఈ సమస్య నుంచి విజయవంతంగా బయటపడ్డారు. కానీ ఇలా ఈ చియారీ వైకల్యం బారిన నలుగురు అక్కాచెల్లెళ్లు ఒకేసారిపడటం అనేది అత్యంత అసాధారణం, అరుదుగా పేర్కొన్నారు వైద్యులు. ఈ సమస్య సుమారు 10% వరకు వంశపారంపర్యంగా వస్తున్నట్లు భావిస్తున్నప్పటికీ..జన్యుపరమైన కారణాల వల్ల సంభవిస్తుందనేది మరికొందరు నిపుణులు వాదన. చివరగా.. ఈ సమస్యకు గనుక సకాలంలో చికిత్స తీసుకోకపోతే అవయవాల బలహీనత, శ్వాస సమస్యలు, పార్శ్వగూని, తలనొప్పి, నరాల నొప్పికి దారితీసి పక్షవాతానికి గురయ్యే ప్రమాదం లేకపోలేదని హెచ్చరిస్తున్నారు వైద్యులు. (చదవండి: రోబోటిక్తో..స్ట్రోక్ శరవేగంగా రికవరీ) -
ఈ తరం వైబ్స్.. దేశీ టూన్స్..
యానిమేషన్, వీఎఫ్ఎక్స్, గేమింగ్, కామిక్స్(ఏవీజీసీ) రంగాల సమ్మేళనంగా నిర్వహించే వినూత్న సృజనాత్మక వేడుక ‘దేశీ టూన్స్ 2025’కు భాగ్యనగరం వేదిక కానుంది. దేశంలో సృజనాత్మక ఆర్థిక వ్యవస్థకు రూపకల్పన చేస్తున్న అతిపెద్ద వేడుక ఇండియాజాయ్ 2025, ఈ ఏడాది తన 8వ ఎడిషన్తో మరింత వైభవంగా రాబోతోంది. ఇందులో భాగంగా దేశీ టూన్స్ ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. చోటా భీమ్ వంటి ప్రముఖ భారతీయ పాత్రలను సృష్టించిన గ్రీన్ గోల్డ్ యానిమేషన్ సంస్థ నిర్వహిస్తున్న ఈ యానిమేషన్ కాన్క్లేవ్వచ్చేనెల 1న హైదరాబాద్ నగరంలోని హెచ్ఐసీసీ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించనుంది. ఈ ఏడాది ఎడిషన్లో భారతీయ సాంస్కృతిక మూలాల నుంచి ప్రేరణ పొందిన కథలను అంతర్జాతీయ ప్రేక్షకుల మనసులను తాకేలా మలుస్తున్న సృజనకారుల విజయగాథలను ప్రదర్శించనున్నారు. మాస్టర్క్లాస్లు, ప్యానెల్ చర్చలు, ఇంటరాక్టివ్ సెషన్లు.. అన్నీ క్రియేటర్స్, నిర్మాతలు, పరిశ్రమ నిపుణుల కోసం ప్రేరణాత్మక అనుభవంగా ఉండబోతున్నాయి. గ్లోబల్ ప్లాట్ఫామ్.. ‘దేశీ టూన్స్’ భారతీయ కథన శక్తికి, సృజనాత్మక ప్రతిభకు ప్రతీకగా నిలుస్తోంది. భారతీయ యానిమేషన్ ప్రపంచానికి వేదికగా ఈ కాన్క్లేవ్ కొత్త ప్రతిభను వెలికితీయడంతో పాటు పాలసీ, పెట్టుబడి, సాంకేతికత వంటి రంగాల్లో సమన్వయం సృష్టించడంలో కీలకపాత్ర పోషిస్తోంది. ఈ వేదిక ద్వారా రాష్ట్రంలోనే కాకుండా జాతీయ స్థాయిలోనూ యానిమేషన్, విజువల్ మీడియా రంగాలకు ఉత్సాహం, అవకాశాలను కల్పించే నిర్ణయాలకు అద్భుత వేదికగా నిలవనుంది. అంతేగాకుండా ‘పవర్ ప్లేయర్స్ ఆఫ్ ఇండియన్ యానిమేషన్’, ‘క్వైట్ స్టోరీస్, పవర్ఫుల్ ఇంపాక్ట్’, ‘ది రోల్ ఆఫ్ గవర్నమెంట్ ఇన్ బూస్టింగ్ ఏవీజీసీ సెక్ట్సర్’ చర్చలు జరుగుతాయి. ఇందులో పాన్ ఇండియా హిట్ మూవీ ‘కల్కి 2898 ఏడీ’ దర్శకుడు నాగ్ అశి్వన్, ‘మహావతార్ నరసింహ’ (2025) దర్శకుడు అశి్వన్, వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ సౌత్ ఆసియా కిడ్స్ కంటెంట్ హెడ్ సాయి అభిõÙక్ వంటి ప్రముఖులు పాల్గొననున్నారు. యానిమేషన్ అభిమానులు, విద్యార్థులు, పరిశ్రమ నిపుణులు తదితరులు ఇందులో భాగం కానున్నారు. మన కథల గురించి చెప్పుకోవాలి.. ఈ నేపథ్యంలో గ్రీన్ గోల్డ్ యానిమేషన్ వ్యవస్థాపకులు రాజీవ్ చిలకా మాట్లాడుతూ.. భారతీయ కథలు ప్రపంచ వేదికపై వెలుగొందాలి. మన సంస్కృతికి చెందిన నిజమైన కథలు సాంకేతికత, ఊహాశక్తి, క్రియేటివిటీ ద్వారా ప్రపంచాన్ని ఆకట్టుకునేలా మలచవచ్చని తెలిపారు. ఇండియాజాయ్ ప్రతినిధి మాధవరెడ్డి యతం మాట్లాడుతూ.. దేశీ టూన్స్ భారతీయ సృజనాత్మకతకు ప్రతీక. గ్రీన్ గోల్డ్ భాగస్వామ్యంతో ఇండియాజాయ్ ఆవిష్కరిస్తున్న ఈ వేదిక భారతదేశం కేవలం సృజనాత్మక భాగస్వామి కాకుండా గ్లోబల్ లీడర్గా ఎదిగే క్రమాన్ని ప్రదర్శిస్తోందని అన్నారు. (చదవండి: రుచులదాత 'సుషీ'భవ..! భోజనప్రియులు ఇష్టపడే క్రేజీ వంటకం) -
యువతలో హార్ట్ స్ట్రోక్స్!
సాక్షి, హైదరాబాద్ : భారత యువతలో గుండెపోటు ప్రమాదం ఆందోళనకరమైన రీతిలో పెరుగుతోంది. గతంలో 50–60 ఏళ్లకు పైబడిన వారికే హార్ట్స్ట్రోక్స్ పరిమితమయ్యేవి. అందుకు భిన్నంగా ఇప్పుడు 45 ఏళ్లలోపు వారు 15–20 శాతం మంది గుండెపోటుకు గురవుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా చూస్తే మాత్రం 45 ఏళ్లలోపు వారిలో ఇంతకంటే తక్కువ స్ట్రోక్ కేసులు సంభవిస్తున్నాయి. నగరాల్లో ఐటీ ఉద్యోగులు, నిపుణులు, అధిక స్క్రీన్ సమయం గడుపుతున్న విద్యార్థులు ముందస్తు వాస్కులర్ ప్రమాదాలను ఎదుర్కొంటున్నారని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం 25–40 ఏళ్ల మధ్యలోని పురుషులు, మహిళలు గుండె సమస్యలకు గురవుతున్నారు. ఇవి కొన్నిసార్లు ప్రాణాంతకంగా కూడా మారుతున్నాయి. పాశ్చాత్య దేశాలతో పోలిస్తే భారతీయులు జన్యుపరంగా హృదయ సంబంధ వ్యాధులకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ పరిస్థితుల్లో 2023 లాన్సెట్ నివేదిక, ఇతర తాజా అధ్యయనాల ప్రకారం చూస్తే.. భారత్లో ఏటా 15–18 లక్షల స్ట్రోక్ కేసులు నమోదవుతున్నాయి. దేశంలో మరణాలకు రెండో ప్రధాన కారణం, వైకల్యానికి మూడో ప్రధాన కారణంగా గుండెపోట్లు నిలుస్తున్నాయి. ప్రమాదకారకాలపై నిపుణుల మాట » ఆధునిక జీవనశైలి మన శరీరం కంటే వేగంగా మన ధమనులను వృద్ధాప్యం బారిన పడేలా చేస్తోంది. » మధుమేహం, అధిక రక్తపోటు,ధూమపానం, వాయు కాలుష్యం, దీర్ఘకాలిక ఒత్తిడి వంటి అంశాలు దీని పెరుగుదలకు కారణమవుతున్నాయి. » స్లీప్ అప్నియా–స్ట్రోక్ మధ్య బలమైన సంబంధం ఉంది. స్ట్రోక్తో బాధపడుతున్న వారిలో దాదాపు 50–70 శాతం మందికి స్లీప్ అప్నియా కూడా ఉంటుంది. ఈ పరిస్థితి ఒక వ్యక్తి రాత్రిపూట గురక పెట్టడానికి, పదేపదే మేల్కొనడానికి కారణమవుతుంది. దీని వలన ఆక్సిజన్ స్థాయిలు పడిపోతాయి, రక్త నాళాలపై ఒత్తిడి వస్తుంది. » ప్రారంభ స్ట్రోక్ తర్వాత చికిత్స చేయకపోతే, రెండేళ్లలోపు పునరావృతమయ్యే అవకాశం 50 శాతం ఉంటుంది. ప్రతి నిమిషం విలువైనదియువ భారతీయుల జీవనశైలిలో మార్పులు, ఒత్తిడి వారిని మరింతప్రమాదంలో పడేస్తున్నాయని కార్డియాలజీ, న్యూరాలజీ నిపుణులు చెబుతున్నారు. స్ట్రోక్తో రక్త ప్రసరణకు అంతరాయం ఏర్పడిన తర్వాత దాదాపు రెండు మిలియన్ల మెదడు కణాలు వేగంగా చనిపోతాయి కాబట్టి ఈ లక్షణాలను త్వరగా గుర్తించడం చాలా ముఖ్యం. అందువల్ల స్ట్రోక్ తర్వాత ప్రతి నిమిషం చాలా విలువైనది. ఈ నేపథ్యంలో 2025లో ‘ఎవ్రీ మినిట్ కౌంట్స్’అనే ప్రచార అంశంతో గుండెపోట్ల నివారణ, లక్షణాల గుర్తింపు, సకాలంలో చికిత్స ప్రాముఖ్యతను వివరించేలా ప్రపంచవ్యాప్తంగా వివిధ కార్యక్రమాలను నిర్వహించారు. ఎలా గుర్తించాలి? ముఖం, చేయి లేదా కాలు యొక్క ఒకవైపుఆకస్మిక బలహీనత లేదా తిమ్మిరి, మాటల్లో అస్పష్టత, మసకబారిన దృష్టి, తలతిరగడం, అకస్మాత్తుగా తీవ్రమైన తలనొప్పి లాంటి ముందస్తుహెచ్చరికలను విస్మరించకూడదు. ఈ లక్షణాలున్న వారిని సీటీ/ఎమ్మారై స్కాన్ సౌకర్యాలున్నఆసుపత్రికి తీసుకెళ్లాలి ప్రమాదాన్ని ఇలా తగ్గించుకోవచ్చు.. » గుండె జబ్బులను పూర్తిగా నివారించలేరు కానీ జీవనశైలిలో మార్పులు, అవగాహనతో ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించవచ్చు. » ఫాస్ట్ ఫుడ్స్, ప్రాసెస్ చేసిన స్నాక్స్,అధిక చక్కెర పానీయాలు మానేయాలి. » ఆహారంలో పుష్కలంగా పండ్లు, కూరగాయలు,తృణధాన్యాలు, ప్రొటీన్లను చేర్చాలి. » ధూమపానం మానేయాలి. మద్యపానం పరిమితం చేయాలి. » క్రమం తప్పకుండా వ్యాయామం, జాగింగ్,యోగా చేయాలి. ధ్యానం, శ్వాస వ్యాయామాలు, ఇతర అభిరుచులను అలవరుచుకుంటేఆందోళన తగ్గుతుంది. » రోజూ మంచి నిద్ర (7–8 గంటలు) అవసరం. » ఏడాదికోసారి రక్తపోటు, కొలెస్ట్రాల్ ,రక్తంలో చక్కెర స్థాయిలు, ఈసీజీ లాంటి పరీక్షలు చేయించుకుంటే సమస్యలను ముందుగానేగుర్తించే అవకాశం ఉంటుంది. -
వర్షాలు, వణికించే చలిగాలులు : ఈ హెల్త్ టిప్స్ పాటించండి!
మోంథా తుఫాను ప్రభావం బాగా కనిపిస్తోంది. వర్షం, చల్లటి గాలులు కూడా వణికిస్తున్నాయి. మరోవైపు చలి తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. వర్షంలో తడవడం వల్ల జలువు, జ్వరం గొంతు నొప్పి లాంటి వ్యాధులు ముసిరే అవకాశం ఉంది. వ్యాధి నిరోధకశక్తి తగ్గుతుంది. అందుకే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇవాల్టీ టిప్ ఆఫ్ ది డేలో భాగంగా అలాంటి జాగ్రత్తలు కొన్ని చూద్దాం.చలికాలంలో ఫ్లూ, సైనసైటిస్, ఊపిరితిత్తుల్లో వైరల్ ఇన్ఫెక్షన్, దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధి(సీవోపీడీ), ఆస్తమా వంటి సమస్యలు తలెత్తుతాయి. హైపోథెర్మియా, చర్మం లోపలి కణజాలం గడ్డ కట్టి గాయాలు కావటం, పెర్నియో, ఇమ్మర్షన్ వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది.చలిగాలులు అనేక రకాల వ్యాధులను మోసుకొస్తాయి. వైరస్లు వృద్ధి చెందే ప్రమాదం ఉంది. దగ్గు, జలుబు, గొంతునొప్పి, తీవ్రత ఎక్కువగా ఉన్నవారికి ఆయాసం, న్యూమోనియా వంటి లక్షణాలు కనిపిస్తాయి. గొంతు ఇన్ఫెక్షన్స్, గతంలో కీళ్ల నొప్పులు ఉన్నవారిలో కీళ్ల నొప్పులు పెరుగుతాయి. కొందరిలో తలనొప్పి వస్తుంది. గుండెపోటు వచ్చే ప్రమాదం కూడా ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. కనీస జాగ్రత్తలువర్షంలో తడవకుండా జాగ్రత్త పడాలి. పూర్తిగా కప్పి ఉంచేలా వస్త్రాలను ధరించాలి. రెయిన్ కోట్లు, గొడుగులు, చలికి తట్టుకునేలా స్వెట్లర్లు, చెవులు కవర్ అయ్యేలా టోపీలు తప్పనిసరిగా వాడాలి. ఒకవేళ వర్షంలో తడిచినా, వెంటనే వేడినీటితో స్నానం చేయడం, జుట్టు తడిలేకుండా పూర్తిగా ఆరబెట్టుకోవడం తప్పనిగా పాటించాలి.చలి ఎక్కువగా ఉన్న సమయాల్లో మాస్కులు ధరించాలి. దీంతో వైరస్ సోకదు. వేరేవారికి సోకకుండా ఉంటుంది. చలితీవ్రత అధికంగా ఉంటే బయటకు రాకుండా ఉంటే మంచిది. ముఖ్యంగా శ్వాసకోశ సంబంధ వ్యాధులతో బాధపడేవారు బయటకు రాకుండా జాగ్రత్తగా ఉండాలి. అలాంటి వారు ఇన్హేలర్లను అందుబాటులోఉంచుకోవాలి. ఫ్రిజ్లో పెట్టిన చల్లటి ఆహారం కాకుండా, అప్పటికప్పుడు వండుకున్నది వేడి, వేడిగా భుజించాలి.చల్లని డ్రింక్స్, కూల్ డ్రింక్స్, ఐస్ క్రీంలకు పిల్లల్ని ఎంత దూరంగా పెడితే అంత మంచిది.నిల్వ పదార్థాలను జోలికి వెళ్లవద్దు. పిల్లలు, వృద్ధుల ఆరోగ్యం పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలి.వ్యాధి నిరోధకశక్తి పెంచుకునేలా చలికాలంలో వ్యాధి నిరోధకతను పెంచుకోవాలి పౌష్టికాహారం తీసుకోవడం చాలా మంచిది. ముఖ్యంగా సిట్రస్ జాతికి చెందిన ఉసిరి, నిమ్మకాయల రసం తీసుకోవాలి. ఎక్కువగా నీటిని తాగాలి. కాచి చల్లార్చిన నీటిని తాగడం మరింత మంచిది. శరీరంలో వేడి ఉత్పత్తి అయ్యేలా జీర్ణవ్యవస్థ నిరంతరం పనిచేస్తుండాలి. ప్రోటిన్లు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. గుడ్లు, పనీర్ లాంటివి తీసుకోవాలి. అలాగే ఈ చలిగాలులు చర్మాన్ని, జుట్టును కూడా ఇబ్బంది పెడతాయి. వాతావరణం చల్లగా ఉన్నా గాలిలో తేమశాతం తక్కువగా ఉంటుంది. శరీరంలోని తేమ బయటికి పోవడంతో చర్మం పొడిబారుతుంది. అందుకే వాటర్ ఎక్కువగా తీసుకుంటూ, చర్మంపైన ఉండే నూనె పొరను కాపాడుకునేలా మంచి మాయిశ్చరైజర్ను వాడాలి. ఇదీ చదవండి: గర్ల్ ఫ్రెండ్తో బ్రేకప్ సార్... లీవ్ ప్లీజ్! వైరల్ మెయిల్ -
పూజా బాత్రా ఫిట్నెస్ సీక్రెట్..! టోన్డ్ బాడీ కోసం..
బాలీవుడ్ నటి పూజా బాత్రా తన గ్లామర్తో సినీ ఇండస్ట్రీని ఓ ఊపు ఊపింది. తన అందం అభినయంతో కుర్రాళ్ల మదిని కొల్లగొట్టిన ఈ బ్యూటీ..నాలుగు పదుల వయసు దాటినా..ఇంకా అంతే అందం, ఫిట్నెస్తో అలరించడమే కాదు. ఇప్పటకీ ఆమెకు అంతే క్రేజ్ ఉంది. పూజ అంతలా ఫిట్గా యంగ్ లుక్లో కనిపించడానికి గల సీక్రెట్ ఏంటో ఓ ఇంటర్వ్యూలో ఆమెనే స్వయంగా బయటపెట్టింది. మరి అవేంటో చూద్దామా..!.ఈ నెల అక్టోబర్ 27తో 49 ఏళ్లు నిండాయి. అయినా ఇప్పటికీ అంతే అందంగా గ్లామర్గా కనిపిస్తుంది పూజ బాత్రా. అందుకోసం ఫిట్నెస్ విషయంలో చాలా కేర్ తీసుకుంటానని అంటోందామె. అంతేగాదు ఫిట్నెస్ అంటే కేవలం శారీరక ఆరోగ్యం మాత్రమే కాదు, మానసిక ఆరోగ్యం కూడా అని అంటోందామె. మన శరీరాన్ని మనం ఎలా చూసుకుంటున్నాం, మాననసిక ఆరోగ్యం పట్ల ఎలాంటి శ్రద్ధ తీసుకుంటున్నాం అనే దానిపైనే మన లుక్ ఆధారపడి ఉంటుందని పూజా నొక్కి చెబుతోంది. మానసికంగా స్ట్రాంగ్ ఉండటమే అసలైన గేమ్ ఛేంజర్ అని అంటోంది. తాను ఆరేళ్లుగా మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ చేస్తున్నానని, వారానికి మూడు రోజులు తప్పనిసరిగా చేస్తానని అంటోంది. పైగా దాంట్లో తాను రెండు బ్రౌన్ బెల్ట్లు గెలుచుకున్నట్లు కూడా వెల్లడించిందామె. ఇది తనను చురుకుగా ఉండేలా చేసి, బరువుని నిర్వహించడం సులభమయ్యేలా చేస్తుందని చెబుతోంది. అన్నిట్లకంటే సంతోషంగా ఉండేందుకు ఫిట్నెస్ అనేది అందరికి అవసరం అని పూజా పేర్కొంది. అంతేగాదు ఆమె మౌంట్ ఎవరెస్ట్ బేస్ క్యాంప్ హైకింగ్ కూడా చేసినట్లు తెలిపింది. హైకింగ్ పరంగా మౌంట్ ఎవరెస్ట్, మోంట్ బ్లాంక్,యోస్మైట్ బేస్ క్యాంప్లతో సహా పలు ఎత్తైన ప్రదేశాలను చుట్టొచ్చారామె. View this post on Instagram A post shared by Pooja Batra Shah (@poojabatra) లండన్లోని లాస్ ఏంజిల్స్లో ఉండే పూజా యోగా టీచర్ కూడా. మార్షల్ ఆర్ట్స్తోపాటు యోగా అంటే కూడా మహా ఇష్టమని పూజ చెప్పుకొచ్చింది. ఇది సమతుల్య జీవితాన్ని గడపడానికి హెల్ప్ అవుతుందని అంటోంది. చివరగా ఆమె మానవవులు అభివృద్ధి చెందాలంటే సత్వ అనే సంస్కృపదానికి ప్రాధాన్యత ఇవ్వాలంటుంది. అంటే సమతుల్యత అనే దానికి ఎంత ప్రాధాన్యత ఇస్తే అంతలా హాయిగా జీవితాన్ని గడిపేలా అవకాశం లభిస్తుందని అంటోంది పూజా బాత్రా.(చదవండి: Power Of Love: రోగాలతో ఒక్కటయ్యారు.. ఆ తర్వాత..) -
కిడ్నీ మార్పిడి కోసం కేన్సర్ రోగిని పెళ్లాడింది..కట్చేస్తే..!
ఎవ్వరినెప్పుడు తన వలలో బంధిస్తుందో ఈ ప్రేమ..ఏ మదినెప్పుడు మబ్బులలో ఎగరేస్తుందో ఈ ప్రేమ..అర్థం కాని పుస్తకమే అయినా గాని ఈ ప్రేమ ...అన్న పాట గుర్తుకొస్తుంది ఈ ఘటన. ఏదో వ్యాధుల కారణంగా.. అవసరార్థం పెళ్లి చేసుకున్నారు. వారి మధ్య ఎలాంటి ప్రేమ, ఇష్టం వంటివి లేదు. రోగాల కారణంగా ఒక్కటయ్యారు..కానీ వారి మధ్య విడదీయరానంత ప్రేమ చిగురించేలా చేసి..అద్భుతమే చేసింది ఆ దంపతుల మధ్య. ఎవరా ఆ జంట..? ఏమా కథ చూసేద్దామా..!2014లో చైనాలోని షాంగ్జీకి చెందిన 24 ళ్ల వాంగ్ జియావో అనే మహిళ యురేమియా అనే మూత్రపిండాల వ్యాధితో బాధపడుతోంది. పరిస్థితి ఎంతలా ఉందంటే..ఆమెకు మూత్రపిండాల మార్పిడి శస్త్ర చికిత్స జరగకపోతే.. ఒక్క ఏడాదికి మించి బతకదని తేల్చి చెప్పేశారు వైద్యులు. అయితే ఆమెకు కిడ్నీ దానం చేసేందుకు సన్నిహితులు, బంధువులు ముందుకొచ్చినా..వాళ్లెవ్వరిది ఆమెకు సరిపోలేదు. ఓ పక్క సమయం మించిపోతుంది. సరిగ్గా ఆ సమయంలో ఆమెకు కేన్సర్ పేషెంట్ అయిన జాంగ్ లియాంగ్ అనే వ్యక్తి ఓ విచిత్రమైనా ఆఫర్ ఇచ్చాడామెకు. "తాను కేన్సర్ వ్యాధితో బాధపడుతున్నానని, చనిపోయేంతవరకు చికిత్స సమయంలో తనను ప్రేమగా చూసుకునే తోడు కోసం ఆశిస్తున్నానని, అందుకు ప్రతిగా తను మరణించాక కిడ్నీని ఇస్తానని చెబుతాడు". ఇక్కడ వాంగ్కి మరో ఛాన్స్లేదు. పైగా తక్కువ వ్యవధి ఉంది. మరోవైపు జాంగ్కి సంరక్షణ, ఒక తోడు కావాలి. దాంతో బాగా ఆలోచించి వాంగ్ ఓ ఒప్పందం ప్రకారం..జాంగ్ని పెళ్లి చేసుకుంది. ఒకరు మనుగడ కోసం, మరొకరు సంరక్షణ ఆశిస్తూ చేసుకున్న ఈ వివాహం వారి జీవితాను ఊహించిన మలుపు తిప్పింది.అద్భుతం చేసిన ప్రేమ..మొదట్లో ఒప్పందాల పెళ్లి కాస్త. .బలమైన బంధంగా మారిపోయింది. అతడి కోసం వంట చేసి, కీమోథెరపీ చికిత్సలలో జాంగ్ కోరిన సంరక్షణను అందించింది. వైద్య సమస్యల కారణంగా పరిచయమైన ఈ అపరిచిత జంట వారాలు గడుస్తున్న కొద్ది.. ఇద్దరి మధ్య అనురాగం ఏర్పడి..విడిచి ఉండలేనంతగా ప్రేమ చిగురించింది. అచ్చం ప్రేమికులు మాదిరిగా అయిపోయారు ఆ దంపతులు. దూకుడుగా ఉన్న జాంగ్ కేన్సర్ వాంగ్ సహచర్యం ప్రేమ కారణంగా మెరుగవ్వుతూ..వైద్యులే విస్తుపోయేలా తగ్గిపోయింది. మొత్తానికి ఆ మహమ్మారి కేన్సర్ని జయించాడు జాంగ్. అతడు బాగుండటమే చాలు అన్నంత స్థితికి వాంగ్ వచ్చేసింది కూడా. మొదట్లో తాను బతకాలని ఆశించినా .. రాను రాను అతడు ఉంటేనే తన ప్రాణం ఉంటుంది అన్నంతగా ప్రేమను పెంచేసుకుంది. ఇక్కడ వాంగ్కి జాంగ్ కిడ్నీ రాలేదు, అయినా అలా వ్యాధితో పోరాడతూనే ఉండాలనే ఫిక్స్ అయ్యింది. విచిత్రం ఏంటంటే..ఆ వ్యాధులు ఇద్దరిని దంపతులుగా చేసి, వాటిని క్యూర్ అయ్యేలా చేశాయి. ఇక్కడ వాంగ్కి కూడా మూత్రపిండాల వ్యాధి సివియర్గా లేదని మెరుగవ్వుతుందని, మందులతో నిర్వహించొచ్చని వైద్యులు చెప్పడం విశేషం. ఇలా జరుగుతుందని ఊహించను కూడా లేదని ఉబ్బితబ్బిబవ్వుతోంది ఆ జంట. ఈ స్టోరీ ప్రేమ గొప్పతనం ఏంటో చెప్పకనే చెబుతోంది. పైగా జీవిత పరమార్థమే తానని చెప్పకనే చెప్పేసింది ఈ రెండక్షరాల ప్రేమ ..! మనం కోసం ఓ వ్యక్తి ఉన్నారు అంటే ఎంతటి అగాథాన్ని అయినా..సవాలునైనా అధిగమించి సునాయసంగా బటయపడగలం అనేందుకు ఈ దంపతులే ఉదాహరణ. ఇక్కడ ఆ జంట విషయంలో ప్రేమ అద్భుతమే చేసింది కదూ..!. (చదవండి: Delhi Police constable Sonika Yadav: వెయిట్లిప్టింగ్ ఛాంపియన్షిప్లో పాల్గొన్న ఏడు నెలల గర్భిణి..!) -
ఉత్సాహంగా బరాత్, తెల్లారితే పెళ్లి : అంతలోనే విషాదం
ఇటీవలికాలంలో చిన్న వయసులోనే గుండెపోటుతో సంభవిస్తున్నమరణాల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. తాజాగా పెళ్లి ఒక రోజు ముందు నవ వధువు గుండెపోటుతో కన్నుమూసింది. దీంతో పెళ్లి బాజాలతో కళకళ లాడాల్సిన వేదిక ఆత్మీయుల రోదనలతో విషాదంగా మారిపోయింది. పంజాబ్లోని ఫరీద్కోట్లో ఈ ఘటన జరిగింది.ఫరీద్కోట్ జిల్లాలోని బర్గారి గ్రామానికి చెందిన పూజకు సమీప గ్రామమైన రౌకేకు చెందిన వ్యక్తితో ఇటీవల నిశ్చితార్థం అయింది. వరుడుదుబాయ్లో ఉండటంతో పెళ్లికి ముందు వధూవరులిద్దరూ ఎప్పుడూ వ్యక్తిగతంగా కలవలేదు. వీడియో కాల్లోనే ఎంగేజ్మెంట్ జరిగింది. వివాహానికి కొన్ని రోజుల ముందు వరుడు దుబాయ్ నుండి తిరిగి వచ్చాడు. దీంతో ఇరు కుటుంబాలు పెళ్లికి సర్వం సిద్ధం చేసుకున్నాయి. వివాహానికి ఒక రోజు ముందు, జాగో వేడుక (బారాత్) సందర్భంగా, పూజ తన బంధువులతో సంతోషంగా జరుపుకుంది. అయితే, ఆ రాత్రి 2 గంటల ప్రాంతంలో, ఆమె ముక్కు నుండి అకస్మాత్తుగా రక్తం రావడం ప్రారంభమైంది. వెంటనే స్పందించిన బంధువులు ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ఆమె చనిపోయిందని వైద్యులు ప్రకటించాడు. దీంతో పెళ్లి ఇల్లు కాస్త విషాదంగా మారిపోయింది. పూజా అంత్యక్రియల ఊరేగింపు ఆమె పెళ్లి దుస్తులలో ఉండగానే జరిగింది. దీంతో వధూవరుల కుటుంబాలతోపాటు గ్రామం మొత్తం దుఃఖంలో మునిగిపోయింది. ఎంతో సంతోషంగా పెళ్లి చేసి, అత్తారింటికి పంపాలనుకున్నామని బరాత్ రాత్రి పూజకు గుండెపోటు రావడంతోచనిపోయిందని అమ్మాయి తండ్రి, వరుడి సోదరుడు వాపోయారు. -
ప్లేస్మెంట్లో ప్రతిసారి 'నో'..కట్చేస్తే..!
ఎన్నో స్ఫూర్తిని కలిగించే సక్సెస్ స్టోరీలను చూసుంటారు. అయితే వాటిలో..ఎన్నో వైఫల్యాల తర్వాత విజయాన్ని చవిచూసిన వారు కొందరైతే..తొలి ప్రయత్నంలోనే సక్సెస్ అందుకున్నవారు మరికొందరు. అలా కాకుండా మన స్నేహితులంతా సెటిల్ అవుతూ హ్యాపీగా ఉంటే..మనం మాత్రం ఓటమితో ఏం చేయాలో తోచని స్థితిలో ఉంటే..మళ్లీ ప్రయత్నించాలన్నా బాధకంటే..మనమే ఎందుకు ఓడిపోతున్నాం అనే బాధ ఎక్కువుగా ఉంటుంది. కానీ ఇతడు వాళ్లతో నార్మల్గా వ్యవహరిస్తూ..యథావిధిగా తన ప్రయత్నం సాగించి..వారికంటే స్పెషల్ అనిపించుకునేలా అందనంత స్థాయిలో సెటిల్ అయ్యాడు. వైఫల్యాలను హ్యాండిల్ చేయడం అంటే ఇది బ్రో అని చెబుతున్నాడు అతడు. నెట్టింట తెగ వైరల్గా మారింది అతడి సక్సెస్ స్టోరీ.అతడే ఫ్లట్టర్ యువర్ వే వ్యవస్థాపకుడు కార్తీకే సింగ్. తన స్టోరీని సోషల్ మీడియాలో ఎక్స్లో షేర్ చేసుకున్నాడు. వింటే కచ్చితంగా వాటే సక్సెస్ స్టోరీ అంటారు. 16 ఏళ్ల వయసులో ఐఐటీలో అడ్మిషన్ పొందాలనుకున్నాడు. అది మిస్. సర్తే 20 ఏళ్లకే మంచి జాబ్ కొట్టేద్దామనుకున్నాడు..అది కూడా ఫెయిల్. స్నేహితులంతా క్యాంపస్ ప్లేస్మెంట్లో సెలక్ట్ అయిపోతుంటే..కార్తీక్కి మాత్రం రిజెక్ట్లే ఎదురయ్యేవి. మెక్రోసాఫ్ట్ నుంచి ఆటోడెస్క్ వరకు అన్ని నో చెప్పాయి. హాస్టల్ రూమ్లో స్నేహితులంతా జాబ్ కొట్టేశామన్న ఆనందంతో పార్టీలు చేసుకుంటే..తాను మాత్రం బెడ్పై పడుకుని..వందోసారి జాబ్ పోర్టల్స్ రిఫ్రెష్ చేస్తున్నా అని పోస్ట్లో రాసుకొచ్చాడు కార్తీక్. అనుకోకుండా ఒక రాత్రి ఇన్స్టాగ్రామ్లోఒక ఫ్రీలాన్సర్ని చూశాడు. ఆన్లైన్లో పనిచేస్తూ..స్థిరమైన ఆదాయం అందుకుంటున్న ఒక సాధారణ వ్యక్తిని చూసి..అతడితో సంభాషించాడు. అదే అతడి జీవితాన్ని అనూహ్యమైన మలుపు తిప్పింది. కార్తీక్ అతడిలా ప్రతిరోజూ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ప్రారంభించాడు. కానీ ఎటువంటి ప్రతిస్పందన, లైక్లు, సందేశాలు రాలేదు. దాదాపు ఆరు వారాల తర్వాత నాకు సహాయం చేయగలరా అనే మెసేజ్ వచ్చింది. ఇది అతని తొలి ప్రాజెక్ట్. అందుకు అతనికి రూ. 3000 వేతనం పొందాడు. ఆ ప్రారంభ ప్రాజెక్ట్ క్రమంగా పెరిగింది. అలా క్లయింట్లురావడం ప్రారంభించారు, ప్రాజెక్టులు రేట్లు పెరిగాయి. చివిరకి ఒక ఐదుగురు వ్యక్తులతో కూడిన ఏజెన్సీని నడుపుతూ నెలకు దాదాపు రూ. 6 లక్షల మేర ఆదాయం అందుకుంటున్నాడు. ఇన్ని వైఫల్యాలు చూసిన తానే ఇంతలా సక్సెస్ని అందుకుంటే..మీరు కూడా కచ్చితంగా సాధించగలుగుతారు అని పోస్ట్ని ముగించాడు. ఈ పోస్ట్ నెటిజన్ల మనసులను తాకడమే కాదు..కార్తీక్ చేసిన ప్రయత్నాలకు ప్రశంసిస్తూ..ఏమి చేయలేని పరిస్థితిలో కూడా సానూకూల దృక్పథం, ఆశను వదులకోకూడదని చెబుతున్న మీ స్టోరీ చాలా స్ఫూర్తిని రగిలిస్తోందని అని పోస్టులు పెట్టారు.At 16, all I wanted was IIT.Didn't happen.At 20, all I wanted was a job offer.That didn't happen either.Microsoft said no.Autodesk said no.Everyone said no.Lying on my hostel bed, watching my friends celebrate placements while I refreshed job portals for the 100th time.…— kartikey singh (@askwhykartik) October 26, 2025 (చదవండి: ఆ దేశానికి ఎయిర్పోర్ట్, సొంత కరెన్సీ లేవు..కానీ వరల్డ్లోనే అత్యంత ధనిక దేశం..) -
Shreyas Iyer: పక్కటెముక గాయం అంటే..? వామ్మో.. మరీ అంత డేంజరా?
టీమిండియా వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ పక్కటెముక గాయంతో ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. తొలుత చిన్నగాయంలా అనిపించినా.. డ్రెస్సింగ్ రూమ్కు వెళ్లిన తర్వాత పరిస్థితి విషమంగా మారింది. ప్రస్తుతం శ్రేయస్ సిడ్నీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు బీసీసీఐ పేర్కొంది. సాధారణంగా ఆటగాళ్లు మైదానంలో గాయపడటం సహజమే. కానీ కొన్ని గాయాలు మాత్రం ఆటగాళ్లను చాలా ఇబ్బంది పెడుతుంటాయి. మరి ఇక్కడ శ్రేయస్ ఎదుర్కొంటున్న పక్కటెముక గాయం అంత తీవ్రతరమైనదా..? అసలేంటి గాయం వంటి వాటి గురించి సవివరంగా తెలుసుకుందామా.!.పక్కటెముక గాయం అంటే..ఈ గాయం ఎక్కువగా కారు ప్రమాదాలు, క్రీడల్లోనూ జరుగుతుంటాయని చెబుతున్నారు నిపుణులు. మరికొన్ని ఇతర గాయాల వల్ల కూడా ఈ పక్కటెముకల గాయం సంభవిస్తుందట. ఒక్కోసారి ఎలాంటి గాయం అవ్వకుండానే పక్కటెముకలు విరిగే అవకాశం కూడా ఉంటుందని చెబుతున్నారు వైద్యులు. అంతర్గత అవయవాలు దెబ్బతీస్తే తప్ప పక్కటెముక గాయం సివియర్ అవ్వదని చెబుతున్నారు. దీనికి ఆపరేషన్ చేయడం అనేది కూడా అరుదు అని. చెబుతున్నారు. పక్కెటెముకల మధ్య పగుళ్లు వస్తే..తగిన విశ్రాంతి, శ్వాస వ్యాయామాలు, చికిత్స అవసరం అవుతాయని, కోలుకోవడానికి కనీసం ఒక నెల పడుతుందటని చెబుతున్నారు వైద్యులు. పక్కటెముక విరిగితే..పక్కటెముక విరగడాన్ని వైద్య పరిభాషలో సాధారణంగా ఎముక తప్పిందని(స్థానభ్రంశం) చెబుతుంటారు. ఇలా ఎముక విరిగినప్పుడూ చుట్టు పగులు, ఖాళీ ఏర్పుడుతుంది. అలాంటప్పుడు విశ్రాంతి ఒక్కటే సరిపోదట. దాన్ని సరిచేసేందుకు శస్త్ర చికిత్స అవసరం అవుతుందని చెబుతున్నారు. అలాగే ఇవి విరగడం అనేది కూడా అత్యంత అరుదేనట. ఎందుకంటే పెద్దపెద్ద యాక్సిడెంట్లు, లేదా ఆటల్లోనే ఇలాంటి గాయాల బారినపడే అవకాశం ఉంటుందట. ఇవి మన శరీరంలోని బలమైన ఎముకల్లో ఒకటి కావడంతో అంత సులభంగా గాయలవ్వడం అత్యంత అరుదని చెబుతున్నారు నిపుణులు. లక్షణాలు..శ్వాస తీసుకున్న, దగ్గినా, ఛాతీ పైభాగాన్ని కదిలించిన త్రీమైన నొప్పిముట్టుకున్న తట్టుకోలేనంత నొప్పి, వాపుగాయం లేదా రంగు మారడంవామ్మో.. మరీ అంత డేంజరా? అంటే..పక్కటెముకలు గాయం ఒక్కోసారి ప్రాణాంతకంగా మారతాయట. అప్పుడు ఇతర అంతర్గత అవయవాలైనా.. గుండె, కాలేయం, కడుపు, మూత్రపిండాలు, ప్లీహాన్ని కూడా ప్రభావితం చేస్తుందట. దీనివలన రక్తస్రావం కూడా జరుగుతుందని చెబుతున్నారు.ఒక్కోసారి ఊపిరి ఆడకపోవడం, శ్వాస తీసుకోలేక ఇబ్బంది పడటం వంటి సమస్యలు ఉత్ఫన్నమవుతాయట. ఫలితంగా న్యుమోనియా వచ్చే ప్రమాదం కూడా లేకపోలేదని, ప్రత్యేక పరిస్థితుల్లో ఊపిరితిత్తులు వైఫల్యం చెందే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం.(చదవండి: Weight Loss Tips: సన్నజాజిలా స్లిమ్గా అవ్వాలంటే..సిమర్ టెక్నిక్స్ ఫాలో అవ్వాల్సిందే!) -
బెడ్ టైం యోగా : ప్రశాంతమైన నిద్రకోసం, చక్కటి ఆసనాలు
స్క్రీన్ టైమ్, ఒత్తిడితో కూడుకున్న జీవన శైలి కారణంగా ఈ రోజుల్లో చాలామంది నిద్రకు దూరం అవుతున్నవారు. నిద్ర సమస్యలనుంచి విముక్తి లభించి, మంచి నిద్ర పట్టాలంటే సులువైన యోగాసనాలు ఉన్నాయి. నిద్రకు ఉపక్రమించడానికి అరగంట ముందు ఈ ఆసనాలు సాధన చేయడం వల్ల మంచి ప్రయోజనాలను పొందవచ్చు. పశ్చిమోత్తనాసనంనేలపైన కాళ్లను ముందుకు చాపి, కూర్చోవాలి. శరీరాన్ని మోకాళ్ల వైపు వంచి, చేతులు పాదాలను తాకించాలి. ఈ భంగిమలో రెండు నిమిషాలు ఉండాలి. దీని వల్ల మానసిక ప్రశాంతత కలిగి మంచినిద్రకు సహాయపడుతుంది.అర్ధ శలభాసనంమ్యాట్పైన బోర్లా పడుకొని, ఒక కాలును పైకి లే΄ాలి. తలను నెమ్మదిగా వెనక్కి వంచాలి. ఐదు శ్వాసల తర్వాత, రెండో కాలితో ఇలాగే చేయాలి. దీనివల్ల రక్తప్రవాహం మెరుగై మానసిక శాంతి పెరుగుతుంది.శవాసనంమ్యాట్పైన పడుకొని, చేతులను రిలాక్స్గా ఉంచుతూ ఐదు నిమిషాలు ఉండాలి. సాధారణ శ్వాసలు తీసుకుంటూ ఉండాలి. దీని వల్ల మానసిక శాంతి పెరుగుతుంది. ఒత్తిడి తగ్గి, మంచి నిద్ర పడుతుంది.చదవండి: శివసేన నేతతో నటి ఎంగేజ్మెంట్ : ఫోటోలు వైరల్పరిపూర్ణ శ్వాస శ్వాస తీసుకొని, కొద్ది సెకన్లు ఆ శ్వాసను బిగబట్టి, తిరిగి నెమ్మదిగా వదలాలి. ముక్కు ద్వారా శ్వాస తీసుకుంటూ, ముక్కుద్వారానే వదలాలి. ఇలా 3 నుంచి 5 నిమిషాలు చేయాలి. ఒత్తిడి తగ్గి, శరీరానికి విశ్రాంతి లభించి, నిద్ర బాగా పడుతుంది. స్క్రీన్ టైమ్, ఒత్తిడితో కూడుకున్న జీవన శైలి కారణంగా ఈ రోజుల్లో చాలామంది నిద్రకు దూరం అవుతున్నవారు. నిద్ర సమస్యలనుంచి విముక్తి లభించి, మంచి నిద్ర పట్టాలంటే సులువైన యోగాసనాలు ఉన్నాయి. నిద్రకు ఉపక్రమించడానికి అరగంట ముందు ఈ ఆసనాలు సాధన చేయడం వల్ల మంచి ప్రయోజనాలను పొందవచ్చు. (ఎక్కడ చూసినా సీతాఫలాలే, ఇవిగో సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్)బలాసనముందుగా మ్యాట్పైన మోకాళ్ల పై కూర్చోవాలి. ముందుకు వంగి, తలను మోకాళ్ల మీదుగా తీసుకెళుతూ, నేలను తాకాలి. అదే సమయంలో చేతులు ముందుకు చాచి, మోకాళ్లపై విశ్రాంతి తీసుకోవాలి. ఈ భంగిమంలో రెండు నిమిషాలు ఉండాలి. దీంతో శరీరం రిలాక్స్ అయ్యి, ఒత్తిడి తగ్గుతుంది.రాత్రి నిద్రించడానికి ముందు చేసే కొన్ని యోగాసనాల వల్ల జీర్ణక్రియ పనితీరు మెరుగ్గా ఉంటుంది. గ్యాస్ట్రిక్, పొట్ట భాగంలో అధిక కొవ్వు సమస్యలకు సరైన పరిష్కారం లభిస్తుంది. భోజనం చేసిన రెండు గంటల తర్వాతనే ఈ ఆసనాలను సాధన చేయాలి. అప్పుడే నిద్ర, ఉదరకోశ సమస్యలకు సరైన ఫలితాలను పొందుదుతారు. -
సన్నజాజిలా స్లిమ్గా అవ్వాలంటే..!
బరువు తగ్గే టాస్క్ని చాలా సింపుల్గా స్మార్ట్గా చేయాలంటే నిపుణులు లేదా అనుభవజ్ఞుల సలహాలు సూచనలు పాటించాల్సిందే. ఏదో భారంగా కాకుండా చాలా తెలివిగా తింటూ..వేగంగా బరువు తగ్గితే ఆ ఫీలే వేరు. మన సన్నిహితులు, స్నేహితులు హేయ్..! అంతలా ఎలా సన్నగా మారిపోయావు అంటే..పట్టరాని ఆనందం వచ్చేస్తుంది. అందులో ఎలాంటి డౌట్ లేదు. మరి అందుకోసం ఈ ఫిట్నెస్ ఔత్సాహికురాలు సిమర్ టెక్నిక్స్ పాలో అయితే సరి..ఫిట్నెస్ ఔత్సాహికురాలు సిమర్ ఎంతలా బొద్దుగా ఉండేదో తెలిస్తే ఆశ్చర్యపోతారు. అలాంటి అమ్మాయి చాలా సన్నగా నాజుగ్గా అయిపోయింది. మాములు మార్పు కాదు..నమ్మశక్యం కానంత సన్నగా మారింది. అలాగని ఆమె ఏమి షార్ట్కట్స్ ఫాలో అవ్వలేదు. పైగా ఎలాంటి కఠినమైన డైట్, బరువు తగ్గిపోయే మందలు ఉపయోగించలేదు. కాస్త తెలివిగా స్మార్ట్గా తిని జస్ట్ ఆరు నెలల్లో 27 కిలోలు పైనే బరువు తగ్గిందామె. అందుకోసం డెడికేషన్తో దినచర్యను అనుసరిస్తే చాలంటోంది. దాంతోపాటు జంక్ఫుడ్ని పూర్తిగా మానేయకపోయినా..పరిమితం చేస్తే సరిపోతుందంటోంది. పోషకాహారాన్నితీసుకునేలా ప్లాన్ చేస్తే చాలట. అందుకోసం తాను ఎలాంటి టిప్స్ని ఫాలో అయ్యిందో సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది సిమర్. నేచురల్గా సన్నగా మారడం కోసం..సంపూర్ణ ఆహారాలు: ఆహారాలలో విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ మరియు యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే తాజా పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, నట్స్, చేపలు, గుడ్లు వంటి లీన్ ప్రోటీన్లు తీసుకోవాలట. ఇవి కడుపు నిండిన అనుభూతినిచ్చే అధికంగా తినాలనే కోరికను నివారిస్తాయట. మంచి నిద్ర: శరీరం బరువు తగ్గడంలో ప్రధాన పాత్ర పోషించేది ఏడు నుంచి ఎనిమిది గంటల నిద్ర అని నొక్కి చెప్పిందామె. భోజనం తర్వాత వాకింగ్: మెరుగైన జీర్ణక్రియ కోసం ప్రతి భోజనం తర్వాత కనీసం పదినిమిషాలు నడవాలని సూచించిందామె. చీట్ మీల్స్: ఆరోగ్యకరమైన ఆహారాన్ని పాటిస్తున్నప్పటికీ..వారాంతాల్లో చీట్మీల్స్ కూడా ఉంటాయని చెప్పింది సిమర్. అయితే దాన్ని సర్దుబాటు చేసుకునే భోజనాన్ని సిద్ధం చేసుకుంటానని అంటోంది. అన్నింట్లకంటే ఏర్పరుచుకున్న టార్గెట్ని బ్రేక్ చేయకుండా..స్థిరంగా సాగితే..సత్వరమే మంచి ఫలితాలు అందుకుంటారని చెబుతోంది. అలాగే కార్బో హైడ్రేట్స్ కోసం మైదా, బ్రెడ్, ఉడికించిన బియ్యానికి దూరంగా ఉండేదట. అలాగే బయటకు వెళ్తే..కేలరీలు ఉండే పానీయాలను తీసుకుంటుందట. ఎందుకంటే అవి కడుపు నిండిన అనుభూతిని అందిస్తాయట. అంతేగాదు బరువు తగ్గడంలో బాగా ఉపయోగపడే మరో నాలుగు టెక్నిక్ కూడా చెప్పారామె. View this post on Instagram A post shared by Simar 🍜 (@_lifeofsimar) అవేంటంటే..అధిక ప్రోటీన్, తక్కువ కార్బోహైడ్రేట్కృత్రిమ చక్కెరవారానికి మూడు నుంచి నాలుగుసార్లు కోర్ శిక్షణప్రతి రోజు 8 వేలకు పైగా అడుగులు తప్పనిసరి అంటోంది. ఇంకెందుకు ఆలస్యం ఇలాంటి స్మార్ట్ టెక్నిక్స్తో బరువు తగ్గించే జర్నీని తక్షణమే ప్రారంభించండి అంటోంది సిమర్. View this post on Instagram A post shared by Simar 🍜 (@_lifeofsimar) గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం.(చదవండి: ఆకుపచ్చని చీరలో ఇషా స్టన్నింగ్ లుక్:! హైలెట్గా రూబీ డైమండ్ నెక్లెస్..) -
కిడ్నీ మార్పిడి సురక్షితమేనా? అందువల్లే నటుడు సతీష్ షా కూడా..
ప్రముఖ బాలీవుడ్ నటుడు, టీవీ కళాకారుడు సతీశ్ షా అనారోగ్యంతో చనిపోయిన సంగతి తెలిసిందే. 76 ఏళ్ల సతీశ్ అల్జీమర్స్ వ్యాధితో బాధపడుతున్న భార్యను చూసుకునేందుకు ఇటీవలే కిడ్నీ మార్పిడి సర్జరీ చేయించుకున్నారని ఆయన సన్నిహితుడొకరు మీడియాకి వెల్లడించారు. అంతేగాదు ఆయన చాలా రోజుల నుంచి మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్నారని, డయాలసిస్ చేయించుకునేవారని, భార్య బాగోగులు నిమిత్తం మూడు నెలల క్రితం ఈ కిడ్నీ మార్పిడి సర్జరీ చేయించుకున్నట్లు తెలిపారు. ఆయన అనుకున్నట్లుగా ఆయన ఆరోగ్యం మెరగవ్వకపోక..త్వరితగతిన కానరాని లోకాలకు వెళ్లిపోయారు. ఈ ఘటన కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సపై పలు అనుమానాలు రేకెత్తించింది. అసలు మూత్రపిండాల వైఫల్యంతో బాధపడేవారికి ఈసర్జరీ? వరమా? లేక శాపమా అనే ఆందోళన కలిగించి. నిజానికి ఈ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఆపరేషన్ సురక్షితమైనదైనా..? దానికంటే డయాలసిస్ మంచిదా అంటే..నెఫ్రాలజిస్ట్లు ఏమంటున్నారంటే..డయాలసిస్ అనేది మూత్రపిండాలు పనిచేయలేనప్పుడూ..రక్తం నుంచి వ్యర్థాలను, అదనపు ద్రవాన్ని తొలగించే పనిని చేపడతాయట. ఈ డయాలసిస్ అనేది రెండు రకాలుగా ఉంటుందని వివరించారు. ఒకటి హిమోడయాలసిస్ ఈ పద్ధతిలో శరీరం వెలుప యంత్రం ఉంచి..రక్తం శుద్ధి చేయడం జరుగుతుంది. అలా కాకుండా ఉదర లైనింగ్ ఫిల్టర్గా ద్రవ మార్పిడి మానవీయంగా లేదా యంత్ర ఆధారితంగా జరుగుతుందట. నిజానికి మూత్రపిండాల వైఫల్యంతో బాధపడే వారికి ఈ కిడ్నీ మార్పిడి చికిత్స వరమే. వారికి ఈ శస్త్ర చికిత్స మెరుగైన ఫలితాలను అందిస్తుందని చెబుతున్నారు నిపుణులు. కిడ్నీ మార్పిడి వల్ల కలిగే లాభాలు..మెరుగైన జీవన నాణ్యత: తరుచుగా డయాలసిస్ చేయించుకోవాల్సిన పరిస్థితి నుంచి విముక్తిట్రాన్స్ప్టాంట్ చేయించుకున్న పేషెంట్లు డయాలసిస్ చేయించుకునే రోగులకంటే ఎక్కువ కాలం జీవిస్తారట.డయాలసిస్తో పోలిస్తే..తక్కువ ఆహార పరిమితులు ఉంటాయిమునపటి మీదు ఎక్కువ ఎనర్జిటిక్, తక్కువ సమస్యలు ఎదుర్కొంటారటనష్టాలు..అందరూ ఈ సర్జరీకీ అర్హులు కారట. ఎందుకంటే..కిడ్నీని తీసుకునే వ్యక్తి ఆరోగ్యం, ఇచ్చే దాత ఆరోగ్య అనుకూలత అత్యంత ప్రధానమట. అలాగే కిడ్నీ మార్పిడి సర్జరీ చేయించుకున్నాక..జీవితాంతం రోగనిరోధక శక్తిని తగ్గించే మందులు వాడాల్సిందేనట.కొందరిలో ఇన్ఫెక్షన్, రక్తస్రావం, కొత్త కిడ్నీని తిరస్కరించే అవకాశం వంటివి ఎక్కువగా ఉంటాయట. ఫలితంగా వారికి ఈ సర్జరీ ప్రాణాంతకంగా మారుతుందట. రెండిటిలో ఏది మంచిదంటే..డయాలసిస్లో పెద్ద శస్త్ర చికిత్స అంటూ ఏం ఉండదు. స్వల్పకాలంలో సురక్షితమైనది అంతే. అర్హత కలిగిన రోగులకు మూత్రపిండ మార్పిడి చికిత్స అనేది సరైన ఎంపిక, పైగా వారి జీవన నాణ్యత, దీర్ఘకాలిక మనుగడను ప్రసాదిస్తుంది. ఇలా ట్రాన్స్ప్లాంట్ సరిపడని రోగులకు డయాలసిస్ ప్రభావవంతమైన ప్రత్యామ్నాయమని వైద్యలు చెబుతున్నారు. దీంతో పాటు ప్రధానమైన అంశం, దాత లభ్యత, ఆరోగ్య అనుకూలత అనేవాటిని బట్టి ఏది బెస్ట్ అనేది ఆధారపడి ఉంటుందని చెబుతున్నారు నిపుణులు. సకాలంలో నెఫ్రాలజిస్ట్లను సంప్రదించి తగిన సలహాలు సూచనలు తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు నిపుణులు. (చదవండి: రూ 20 సమోసాతో రూ. 3 లక్షల యాంజియోప్లాస్టీ: వైద్యుల స్ట్రాంగ్ వార్నింగ్) -
ప్రతిరోజూ మిల్లెట్ భోజనం..
దేశవ్యాప్తంగా ప్రతి వ్యక్తీ రోజుకు ఒక మిల్లెట్ భోజనం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న ‘వన్ మిల్లెట్ మీల్ ఎవ్రీ డే ఫర్ ఎవ్రీ ఇండివీడ్యువల్’ అనే జాతీయ మిషన్లో భాగంగా మిల్లెట్స్ నేషనల్ మీడియా పోర్టల్ కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది. బేగంపేట ఎస్జే ఫారŠూచ్యన్ కమ్యూనిటీ హాల్లో నిర్వహించిన ఈ కార్యక్రమం ద్వారా హైదరాబాద్లోని వివిధ కార్పొరేట్ ఆఫీసులను శిక్షణ పొందిన ‘మిల్లెట్ మదర్స్’తో అనుసంధానం చేసి, ఉద్యోగులకు ఆరోగ్యకరమైన, పోషక విలువలతో కూడిన మిల్లెట్ భోజనాలను అందించనుంది. ఈ కార్యక్రమం మిల్లెట్స్ నేషనల్ మీడియా పోర్టల్, ఎంబీఎఫ్ (మిల్లెట్స్ ది బెస్ట్ ఫుడ్) సంయుక్తంగా నిర్వహించిన మిల్లెట్ మదర్స్ ప్రోగ్రాంకు కొనసాగింపుగా ప్రారంభించారు. ఈ ఉద్యమానికి బ్రాండ్ అంబాసిడర్గా నటి లయ వ్యవహరిస్తున్నారు. హైదరాబాద్ వ్యాప్తంగా 100 మంది మిల్లెట్ మదర్స్కు శిక్షణ ఇచ్చారు. వీరు అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం 20కి పైగా మిల్లెట్ వంటకాలు తయారు చేసే నైపుణ్యాన్ని సంపాదించారు. ఈ శిక్షణను నేషనల్ మిల్లెట్ కోచ్ పూజా లకోటియ ఆధ్వర్యంలో డాక్టర్ మోనికా శ్రవంతి, డాక్టర్ గిరిధర్, మిల్లెట్ మదర్స్ కో–ఆర్డినేటర్ మాధురి సహకారంతో నిర్వహించారు. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటే బాగా ఆలోచిస్తారు, పనిచేస్తారు, జీవిస్తారని ఎంబీఎఫ్ చైర్మన్ ప్రసన్న శ్రీనివాస్ సరకడం అన్నారు. మిల్లెట్ మదర్స్ కార్యక్రమం ద్వారా అందించే ప్రతి భోజనం మహిళలను శక్తివంతం చేస్తుందని తెలిపారు. (చదవండి: భారత్ 'ధర్మ యోగా' జపాన్ వ్యక్తి జీవితాన్నే మార్చేసింది..!) -
'కలిసి చేస్తే కలదు ఆరోగ్యం'..! క్రేజీగా పార్ట్నర్ యోగా
కలిసి చేస్తే కలదు ఆరోగ్యం అంటున్నారు యోగా శిక్షకులు. ఆసనాలు సాధన చేసేటప్పుడు మరొకరితో కలిసి చేసే పార్ట్నర్ యోగా వల్ల అదనపు ప్రయోజనాలు దక్కుతాయని చెబుతున్నారు. దీంతో ఇటీవల కాలంలో నగరంలో ఈ పార్ట్నర్ యోగా క్రేజీగా మారుతోంది. మరీ ముఖ్యంగా భాగస్వామితో కలిసి ఆసనాల సాధనపై ఆసక్తికనబరుస్తున్నారు. అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటూ నిపుణులు సూచిస్తున్నారు. దీంతో ఇటీవలి కాలంలో ఈ తరహా పార్ట్నర్ యోగా సాధన చేసే ఔత్సాహికులు హైదరాబాద్ సిటీలోని ఫిట్నెస్ స్టూడియోల్లో, యోగా సెంటర్లలో బాగా కనిపిస్తున్నారు. దీనిని కపుల్ యోగా అనే పేరుతో ప్రత్యేకంగా జంటల కోసం కూడా సాధన చేసే అవకాశం కల్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో నగరానికి చెందిన ప్రముఖ యోగా శిక్షకురాలు రీనా హిందోచా దీని గురించిన విశేషాలను ‘సాక్షి’తో ప్రత్యేకంగా పంచుకున్నారు. యోగా భంగిమలను సాధన చేసేటప్పుడు ఇద్దరు వ్యక్తులు ఒకరినొకరు మద్దతు అందించే శైలినే పార్ట్నర్ యోగా అని పేర్కొంటున్నారు. యోగాసనాలు వేసే సమయంలో పరస్పరం సహకరించుకునే క్రమంలో.. సమతుల్యతను కాపాడుకోవడం, శరీరం మరింత బాగా సాగేందుకు, భంగిమను సరిగ్గా అనుసరించేందుకు వీలు కలుగుతుంది. తద్వారా ఆసనాలు వేయడం సులభం అవుతుంది. ఇది ఫిట్నెస్తో పాటు నమ్మకం, పరస్పర విశ్వాసం కల్పించడంతో పాటు.. అనుబంధాలను బలోపేతం చేస్తుంది. భాగస్వామితో సాధన చేయడం వల్ల యోగా మరింత ఆహ్లాదకరంగా ప్రేరణ కలిగించేదిగా మారుతుంది. ప్రత్యేకించి కొన్ని భంగిమలు ఒంటరిగా కష్టంగా భావించే వ్యక్తులు కూడా భాగస్వామితో చేసినప్పుడు వాటిని సులభంగా వేయగలుగుతారు. తమ జీవిత భాగస్వామి, సహోద్యోగి లేదా అప్పుడే పరిచయం అయిన యోగా స్నేహితులతో కలిసి భాగస్వామి సాధన చేయవచ్చు. ఇది యోగాను కలిసి ఆస్వాదించడానికి ఒక అందమైన మార్గం. ప్రయోజనాలెన్నో.. ఈ తరహాలో యోగా సాధన శరీరంలోని ఫ్లెక్సిబులిటీని, అదే విధంగా బలాన్ని కూడా మెరుగుపరుస్తుంది. ఆసనాలను సరైన విధంగా సాధన చేసేందుకు సహాయపడుతుంది. ఆసనాలు వేసే సమయంలో ఉండే ఒత్తిడిని తగ్గిస్తుంది. అంతేకాకుండా దృష్టిని కూడా మెరుగుపరుస్తుంది. ముఖ్యంగా కమ్యూనికేషన్ నైపుణ్యంతో పాటు భావోద్వేగ బంధాన్ని కూడా పెంచుతుంది.ఆరోగ్యకరం..‘భాగ’స్వామ్యం.. ఒకరు బాగా అనుభవజ్ఞులై మరొకరు కొత్తగా యోగసాధన చేస్తున్నవారైతే.. ఆ వ్యత్యాసానికి తగ్గట్టుగా ప్లాన్ చేసుకోవాలి. ‘భాగస్వామి యోగా భంగిమలు శారీరక శ్రేయస్సును పెంచడమే కాకుండా నమ్మకాన్ని, కమ్యూనికేషన్ని కూడా పెంపొందిస్తాయి. ఇవి ఆయా వ్యక్తులు తమ భాగస్వామితో పరస్పర అవగాహన కలిగి ఉండడానికి, ఆ సమయంలో ఏకాగ్రతతో ఉండటానికి ప్రోత్సహిస్తాయి అని అక్షర యోగా కేంద్ర వ్యవస్థాపకురాలు హిమాలయన్ సిద్ధా అక్షర్ అంటున్నారు. నగరవాసులకు క్రేజీగా మారిన పార్ట్నర్ యోగా ఏ వ్యాయామం అయినా ప్రారంభించే ముందు తప్పనిసరిగా వార్మప్ వ్యాయామాలు చేయాలి. మీ భాగస్వామితో అనువుగా ఉండేలా జాగ్రత్తపడాలి. జీవిత భాగస్వామి లేదా సన్నిహిత మిత్రులనో ఎంచుకోవడం మంచిది. వ్యక్తుల శారీరక సామర్థ్యాలు, శరీర కదలికలు ఎవరికి వారికే ప్రత్యేకంగా ఉంటాయి. వీటిని అర్థం చేసుకుని పార్ట్నర్ని ఎంచుకోవాలి. అలాగే ఆసనాల సమయంలో కదలికలు నిదానంగా ఉండాలి. భాగస్వామి బలంతో పాటు పరిమితులను కూడా సరిగా అర్థం చేసుకోవాలి. అయితే ఎప్పుడూ బలవంతంగా లేదా అతిగా సాగదీయకూడదు. ఇద్దరికీ సౌకర్యవంతంగా ఉండాలని గుర్తుంచుకోవాలి. శ్వాస క్రియ కూడా ఒకే క్రమంలో ఉండేలా చూసుకోవాలి. (చదవండి: రూ 20 సమోసాతో రూ. 3 లక్షల యాంజియోప్లాస్టీ: వైద్యుల స్ట్రాంగ్ వార్నింగ్) -
రూ 20 సమోసాతో రూ. 3 లక్షల యాంజియోప్లాస్టీ: వైద్యుల స్ట్రాంగ్ వార్నింగ్
మనం సరదాగా తినే కొన్ని రకాల స్నాక్స్ అనారోగ్యం బారినపడేందుకు కారణమవుతుంటాయి. అలాంటి వాటిల్లో ఒకటి అందరూ ఇష్టంగా లాగించే సమోసా. నోరూరించే ఈ సమోసా కోసం ఆఫీసులకి వెళ్లేవాళ్ల దగ్గర నుంచి రోడ్డు మీద కూరగాయలు అమ్ముకునే చిన్న చితక వ్యాపారుల వరకు టీ టైంలో స్నాక్ ఐటెంగా తినే వంటకమే ఈ సమోసా. రూ.10 లేదా 20 వెచ్చించి కొనుక్కుని తినే దాంతో ఆస్పత్రిపాలై రూ. 3లక్షల అప్పు కొని తెచ్చుకుంటున్నామని హెచ్చరిస్తున్న గుండె వైద్యుడి పోస్ట్ నెట్టింట వైరల్గా మారింది. ఢిల్లీ కార్డియాలజిస్ట్ "అనారోగ్యకరమైన ఆఫీస్ స్నాక్స్ సమోసాతో సవంత్సరాలుగా ఎంత ఖర్చు పెడుతున్నాం. ఆ తర్వాత దాని కారణంగా ఎలాంటి అనారోగ్య సమస్య కొని తెచ్చుకుని ఎంత అప్పులపాలవ్వుతున్నాం. " కళ్లకు కట్టినట్లుగా వివరించారు. అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు తెచ్చే చేటు అంత ఇంత కాదంటూ మండిపడుతున్నారు వైద్యులు. ప్రతి సాయంత్రం చాలామంది తీసుకుని సమోసా ధర మహా అయితే రూ. 20 ఉంటుందనుకుంటే..క్రమం తప్పకుండా తినేవాడికి 15 ఏళ్లకు 300 సార్లు తింటాడనుకుంటే..మొత్తం ఖర్చు రూ. 90,000 అవుతుంది. అంటే అనారోగ్యకరమైన ఆహారం కోసం అంతమొత్తంలో డబ్బు ఖర్చు చేస్తున్నామే కానీ ఆదా చేయడం లేదు. ఇలా తినడం వల్ల గుండెల్లో కరోనరీ ధమనుల్లో సమస్య ఏర్పడి.. యాంజియోప్లాస్టీ చేయించుకునే పరిస్థితికి కొని తెచ్చుకుంటాం. అదేనండి స్టంట్ వేయించుకున్నాం అంటుంటారు కదా హార్ట్ పేషెంట్లు. అంటే సమోసాలు తిన్న ఫలితం హార్ట్ సర్జరీకి దారితీస్తుంది. దాని ఖర్చు రూ. 3 లక్షలు. అంటే అనారోగ్య ఆహారానికి ఖర్చు చేసే డబ్బుని ఆదా చేసినా ఆరోగ్యంగా ఉంటాం గానీ..తిని మరి యాంజియోప్లాస్టీ చికిత్స రూపంలో రూ. 3లక్షల అప్పుని కొని తెచ్చుకుంటున్నాం అంటూ ఆలోచింప చేసేలా..చాలా చక్కగా లెక్కలు వేసి వివిరించారు ఢిల్లీ కార్డియాలజిస్ట్. అంతేగాదు దాని ఫలితం ఎన్నో రోజులు భూమ్మీద ఉండే అవకాశం లేదనేలా పలు రకాల అనారోగ్య సమస్యల రూపంలో వార్నింగ్ ఇస్తుందట. సాధ్యమైనంత వరకు ఎంత తొందరగా ఇలాంటి ఆహారపు అలవాట్లను దూరం చేసుకుంటేనే మంచిదని సూచిస్తున్నారు. అలాగే ఆరోగ్యంగా ఉండేలి అంటూ ప్రణాళికల దగ్గర ఆగిపోతే.. జీవితం మన కోసం ఆగిపోదు అనేది గ్రహించండి అని నొక్కి చెబుతున్నారు గుండె వైద్యులు. Office canteen samosa: ₹20Angioplasty: ₹3 lakhsSamosas per year: 300Years of eating: 15Total samosa cost: ₹90,000You're not saving money on unhealthy food.You're taking a loan against your arteries at 400% interest.— Dr Shailesh Singh (@drShaileshSingh) October 23, 2025 వ్యాయామం చేయాల్సిన ప్రాధాన్యత..అనారోగ్యకరమైన అలవాట్లకు దూరంగా ఉంటూ..వ్యాయామం వంటి అలవాట్లను కష్టంగా అనిపించినా..అవి దైనందిన లైఫ్లో రోటీన్గా ఎలా మారుతాయో వివరించారు వైద్యులు. ఒక వారం వ్యాయమాల వల్ల శారీర కష్టాలు అనుభవించి ఉండొచ్చు. కానీ కంటిన్యూగా చేస్తూ ఉంటే..నెలాఖరికిగా అదొక అలవాటుగా మారిపోవడమే గాక, చేయకపోవడమే తప్పుగా లేదా లోటుగా అనేలా మారుతుందని అన్నారు. (చదవండి: నీటికి బదులు బీర్! స్పెషల్ హైడ్రేషన్ స్టయిల్..) -
డయాబెటిస్ని తిప్పికొట్టి.. 30 కిలోల బరువు తగ్గింది!
బరువు తగ్గడం అందరూ చాలా కష్టమనే భావిస్తారు. ఎందుకంటే అంత ఈజీగా కొలెస్ట్రాల్ని తగ్గించుకుని స్లిమ్గా మారడం సాధ్యం కాదు. కానీ ఈ అమ్మాయి అధిక బరువుతో మధుమేహం బారినపడ్డప్పటికీ అధైర్యపడకుండా బరువు తగ్గింది. డయాబెటిస్ నుంచి కూడా బయటపడింది. అలాగని కఠినమైన ఆహారనియమాలేం పాటించలేదు, చిన్ని చిన్న ఆహారపు అలవాట్లతోనే ఇదంతా సాధ్యం చేసిందామె. మరి అదెలాగో ఆమె మాటల్లో సవివరంగా తెలుసుకుందామా..!.డైటీషియన్ జాకీ(Dietitian Jackie) తన వెయిట్ లాస్ జర్నీ గురించి సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ఇలా రాశారు. తనకు 20 ఏళ్ల వయసులో ఉండగా ప్రీ డయాబెటిక్(pre-diabetic) నిర్థారణ అయ్యిందని తెలిపింది. దాంతో ఇక ఇప్పుడైనా ఆరోగ్యంపై దృష్టిసారించక తప్పదని ఫిక్స్ అయ్యానని చెప్పింది. అదీగాక పేరెంట్స్ కూడా బరువు తగ్గేలా ఆరోగ్యకరమైన ఆహారమే తీసుకోమని సూచించడంతో..తన ఆరోగ్యాన్ని కాపాడుకునేలా జీవనశైలిలో మార్పులు చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొంది. 30 కిలోలు ఎలా తగ్గిందంటే..సరైన ఆహారం: తన డైట్లో మంచి పుడ్ని తీసుకునేలా పోషకాహార నిపుణుడి సలహాలను తీసుకున్నట్లు తెలిపారు. నారింజ రసం వంటి చక్కెర పానీయాలను, శుద్ధి చేసిన పిండితో చేసే ఆహారాలను దూరంగా ఉంచి, గోధుమ రొట్టెలను ఆహారంలో భాగం చేసుకున్నట్లు చెప్పుకొచ్చింది. కేలరీలను తీసుకోవడాన్ని తగ్గించి, పోషకవంతమైన ఆహారాన్ని ఎక్కువగా తినేలా చూసుకునేదట.ఫుడ్ తయారైన విధానం: వ్యాయామాలు చేసినంత మాత్రమే బరువు తగ్గరు. తీసుకునే అల్పాహారం, ఆరోగ్యకరమైనదా లేదా అని నిర్థారించుకునేదట. ముఖ్యంగా పోషకాహారం ఎంత మేర ఉందో తెలసుకుని మరి తీసుకునేదట. అలానే సమతుల్య ఆహారానికి ప్రాముఖ్యత ఇచ్చేదాన్ని అని చెప్పుకొచ్చింది. వ్యాయామం..చిన్న వామ్-అప్ వ్యాయామాలతో మొదలు పెట్టి..ట్రెడ్మిల్, ఆరు నుంచి ఏడు మైళ్లు పరుగుపెట్టడం వంటి వ్యాయామాలని పట్టుదలతో చేసి లక్ష్యానికి చేరుకున్నట్లు తెలిపారామె. అలా బరువు తగ్గడమే కాదు, డయాబెటిస్ని క్యూర్ చేసుకున్నట్లు కూడా వివరించింది. అయితే తనకు వెయిట్లాస్ అవ్వడం కష్టమైన పని కాదని, అదొక నిర్వహణ దశ అని అంటోందామె. ఇప్పటికీ తాను ఆ అలవాట్లను కొనసాగిస్తున్నట్లు వివరించింది. తగ్గిన ఆ బరువుని నిర్వహిస్తే హెల్దీగా ఉంటామని..కేవలం జీవనశైలిలో మార్పులు చేసుకుంటే చాలని చెబుతోంది డైటీషియన్ జాకీ. (చదవండి: Idli For Breakfast: ప్రయోజనాలేమిటి? సాంబార్,చట్నీతో తింటే లాభమా? నష్టమా?) View this post on Instagram A post shared by Jackie, MS, RD | Weight Loss Coach & Mindful Eating Dietitian (@the.mindful.nutritionist) -
ఆపరేషన్ మధ్యలో క్లారినెట్ వాయించిన మహిళ..! ఆశ్చర్యపోయిన వైద్యులు
ఇటీవల బ్రెయిన్కి సర్జరీ మెలుకువగా ఉండగా చేసిన ఘటనలు చూశాం. కొందరూ పాటలు, సినిమాలు చూస్తూ చేయించుకున్నారు. అదంతా ఒక ఎత్తైతే. బ్రెయిన్ సర్జరీ చేస్తుండగా..మధ్యలో ఓ సంగీత వాయిద్యాన్ని వాయించింది ఒక మహిళ . వైద్యులు సైతం విస్తుపోయారు. దీని కారణంగా తమ సర్జరీ సక్సెస్ అనేది తక్షణమే నిర్థారించుకోగలిగామని ఆనందంగా చెబుతున్నారు వైద్యులు. మరి ఆ ఆసక్తికర కథేంటో చకచక చదివేద్దామా..!.లండన్లో చోటుచేసుకుంది ఈ అద్భుత ఘటన. లండన్లో క్రౌబేర్కు చెందిన 65 ఏళ్ల డెనిస్ బెకన్(Denise Bacon) గత కొన్నేళ్లుగా పార్కిన్సన్స్తో(Parkinsons disease) బాధపడుతోంది. రిటైర్డ్ స్పీచ్ అండ్ లాంగ్వేజ్ థెరపిస్ట్ అయినా ఆమె పార్కిన్సన్స్ నుంచి ఉపశమనం పొందేందుకు కింగ్స్ కాలేజ్ హాస్పిటల్లో డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ ఆపరేషన్ చేయించుకోవాలనుకున్నారు. ఆమెకు ఈ వ్యాధి 2014లో నిర్థారణ అయ్యింది. ఫలితంగా నడవడం, ఈత కొట్టడం, డ్యాన్స్ చేయడం వంటివి ఏమి చేయలేకపోయింది. ఐదేళ్ల నుంచి తను ఎంతో ఇష్టపడే గ్రిన్స్టెడ్ కచేరీ బ్యాండ్ ప్రదర్శనలో సైతం పాల్గొనడం మానేసిందామె. ఆ నేపథ్యంలో ఇలా బ్రెయిన్కి ఆపరేషన్ చేయించుకోవాలనుకుంది బేకన్. ఇది సుమారు నాలుగు గంటల ఆపరేషన్. అందులో భాగంగా ఆమె పుర్రెకి మత్తు ఇంజెక్షన్ ఇచ్చి శస్త్ర చికిత్స చేస్తున్నారు వైద్యులు. అంతలో మధ్యలో ఆమె చేతి వేళ్లను సునాయాసంగా కదిలించగలగడేమ కాదు, ఆపరేషన్ చేస్తుండగా మధ్యలోనే క్లారినెట్ను అద్భుతంగా వాయించింది. దాన్ని చూసి వైద్యుల సైతం విస్తుపోయారు. బ్రెయిన్ సర్జరీలో భాగంగా ఎలక్ట్రోడ్లు సక్రియం చేస్తుండగా చేతులు కదులుతున్నట్లు గమనించి.. ఇలా వాయిద్యాని వాయించాలని భావించానంటోంది. దీని కారణంగా తమ సర్జరీ విజయవంతమని, ఆమె సమస్య నుంచి బయటపడి మెరుగ్గా ఉందని తక్షణమే నిర్థారించగలిగామని ఆనందంగా చెబుతున్నారు వైద్యులు. అంతేగాదు ఆమె ఆ సాహసం చేయాలనుకోవడం చాలా ప్రశంసించదగ్గ విషయమని అన్నారు. అందుకు సంబంధించిన వీడియోని నెట్టింట షేర్ చేశారు వైద్యులు. నెటిజన్లు సైతం శస్త్రచికిత్స మధ్యలో క్లారినెట్ వాయించడం అంటే.. అది మాములు ధైర్యం కాదంటూ బెకాన్ని కొనియాడుతూ పోస్టులు పెట్టారు. Patient with Parkinson's disease plays clarinet during brain procedure at London hospital pic.twitter.com/en2vpRRfaA— The Associated Press (@AP) October 23, 2025 (చదవండి: కూతురి డ్రీమ్, తండ్రి సంకల్పం..! ఆ నాణేల సంచి వెనుక ఇంత భావోద్వేగ కథనా..) -
ప్రాజెక్టులు వస్తాయి కానీ... పోయిన ఆరోగ్యం తిరిగి రాదు!
నాకు 36 ఏళ్లు. నేను ఇటీ ఉద్యోగిని. ఒంగోలులో మా తల్లిదండ్రుల దగ్గర ఉంటూ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాను. ఈ మధ్య కాలంలో బయట లే– ఆఫ్ లు బాగా అవుతున్నాయి. మా కంపెనీలో కూడా కొంతమందిని తీసివేసి ఉన్న వాళ్ళతోనే పని నడిపిస్తున్నారు. దీనివల్ల ఆఫీసులో ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంటోంది. లాప్టాప్ ముందు 12–14 గంటలు కూచోవాల్సి వస్తోంది. ఒక్కోసారి అర్ధరాత్రి వరకు పని చేయాల్సి ఉంటుంది. దీని ఫలితంగా నిద్ర పట్టడం లేదు. తలనొప్పితోపాటు. చికాగ్గా ఉంటోంది. ఇంట్లో భార్య పిల్లల మీద కూడా సహనం కోల్పోతున్నాను. జాబ్ వదిలేయాలనిపిస్తుంది. కానీ నాకున్న కమిట్మెంట్స్ వల్ల అది సాధ్యం కాదు. నేను ఏ నిర్ణయమూ తీసుకోలేకపోతున్నాను. ఈ పరిస్థితుల్లో నేను ఏం చేయాలో సలహా చెప్పగలరు. – అశోక్, ఓంగోలు అశోక్ గారు! మీరు చెప్పిన పరిస్థితి ఈరోజుల్లో చాలా మంది ఉద్యోగులు ఎదుర్కొంటున్నదే. ‘వర్క్ ప్లేస్ స్ట్రెస్‘కు మీరే ఒక ఉదాహరణ. ఉద్యోగుల తీసివేత, టార్గెట్స్. డెడ్లైన్స్ వల్ల ఒత్తిడి పెరగడం సహజం, కానీ దీని ప్రభావం మీ ఆరోగ్యం పైనే కాకుండా, కుటుంబ సంబంధాలపైనా పడుతోందన్న విషయాన్ని గమనించి దిద్దుబాటు కోసం ‘సాక్షి’ని సంప్రదించడం అభినందనీయం. మొదటగా, ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఉద్యోగం మానెయ్యాలని ఎవరికైనా అనిపించడం సహజం. కానీ తమకున్న కమిట్మెంట్స్, బాధ్యతల వల్ల అలా మానివేయడం చాలా సందర్భాల్లో కుదరదు. కనుక ఉద్యోగం చేస్తూనే ఒత్తిడిని ఎదుర్కొనేలా సన్నద్ధం అవడం ఉత్తమం. పని, ఆరోగ్యం, కుటుంబం–ఈ మూడిటి మధ్య సమతౌల్యం పాటించాలి. పని సమయంలో చిన్న చిన్న విరామాలు తప్పనిసరిగా తీసుకోండి. ప్రతి 1–2 గంటలకు, ఐదు ఏమిషాలు నడవండి. లోతుగా శ్వాస తీసుకొని వదిలే ’డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయండి. ఇది ఏకాగ్రతని మెరుగుపరుస్తుంది. అర్ధరాత్రి వరకు లాప్టాప్ ముందు కూర్చోవడం శరీరానికి, నిద్రకి తీవ్ర నష్టం చేస్తుంది. కాబట్టి. మీ మేనేజర్తో మాట్లాడి రాత్రిపూట ఒక కటాఫ్ టైమ్ పెట్టుకోండి. ఇంటి వాతావరణం, కుటుంబ సభ్యులతో గడిపే సమయం ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. వారాంతాల్లో వారితో బయటకు వెళ్ళి సరదాగా గడపండి. ఇంట్లో ఉన్నప్పుడు కూడా కుటుంబంతో గడపడానికి ఫిక్స్డ్ టైమింగ్స్ పెట్టుకోండి. ఉదాహరణకు డిన్నర్ సమయంలో ఫోన్, లాప్టాప్ దూరంగా పెట్టేయండి. ఇది మీకు రిలీఫ్ ఇస్తుంది. మీ కుటుంబానికి కూడా మీరు ఎమోషనల్గా అందుబాటులో ఉన్నారు అన్న భరోసా ఇస్తుంది. అలాగే వ్యాయామం ధ్యానం, యోగా లాంటి పద్దతులు మీ రోజు వారీ షెడ్యుల్లో చేరిస్తే ‘స్ట్రెస్ హర్మోన్లు’ తగ్గుతాయి. దీనివల్ల నిద్ర మెరుగుపడుతుంది. చిరాకు తగ్గుతుంది. ఇవన్నీ చేసినా కూడా మీరు ఇంకా ఒత్తిడిగా ఫీల్ అవుతున్నట్లయితే, ఒక మానసిక వైద్య నిపుణుడిని కలిసి స్ట్రెస్ మేనేజ్ చేసే టెక్నిక్స్ నేర్చుకోవడం చాలా ఉపయోగపడుతుంది. ఒక్క విషయం గుర్తుంచుకోండి.. టార్గెట్స్, ప్రాజెక్ట్ మళ్ళీ వస్తాయి, కానీ పోయిన ఆరోగ్యం తిరిగి రాదు. కాబట్టి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడమే మీకు మీ కుటుంబానికి, మీ కెరీర్కి కూడా దీర్ఘకాలికంగా మేలు చేస్తుంది. ఆల్ ది బెస్ట్!డా. ఇండ్ల విశాల్ రెడ్డి,సీనియర్ సైకియాట్రిస్ట్, విజయవాడ. (మీ సమస్యలు, సందేహాలు పంపవలసిన మెయిల్ ఐడీ: sakshifamily3@gmail.com)(చదవండి: ఎంబిఏ చేసిన 80 ఏళ్ల సీఈవో..! ఏకంగా రెండుసార్లు కేన్సర్ బారినపడ్డప్పటికీ..) -
శతాధిక బాడీబిల్డర్..ఇప్పటికీ పోటీల్లో పాల్గొనడం, శిక్షణ..
వయసు సాహసోపేతమైన పోటీల్లో పాల్గొనేందుకు అడ్డంకి కాదని చాలామంది వృద్ధులు నిరూపించారు. అలా కాకుండా క్రమశిక్షణాయుతమైన జీవితాన్ని ప్రారంభించి..సెంచరీ వయసు వరకు అదే ఫిట్నెస్తో ఉండటం అంటే మాటలు కాదు కదా.!. కానీ ఈ శతాధిక వృద్ధుడు ఇప్పటికీ అదే ఫిట్నెస్తో ఉండటమే కాదు..వందేళ్ల వయసులో బాడీబిల్డింగ్ పోటీల్లో పాల్గొని అందర్నీ ఆశ్చర్యపరిచాడు. అంతేగాదు యువకుడిగా ఉండగా ఆర్మీలో చేరి రెండో ప్రపంచ యుద్ధంలో తన వంతు పాత్రను పోషించి అజేయమైన ధైర్య సాహాసాలు కనబర్చాడు. పైగా ఈ వయసులో కూడా హాలీవుడ్ దిగ్గజాలకు, యువ అథ్లెట్లకు శిక్షణ ఇస్తూ.. ఫిట్నెస్ టిప్స్ కూడా చెబుతున్నారు. చెప్పాలంటే తరతరాలకు ఆయనొక స్ఫూర్తి..ఆయనే అమెరికాకు చెందిన అత్యంత వృద్ధ బాడీబిల్డర్ ఆండీ బోస్టింటో. ఆయన బాడీబిల్డింగ్లో ప్రపంచ ఛాంపియన్ కూడా. అంతేగాదు ఆయన ప్రపంచవ్యాప్తంగా ఉన్న బాడీబిల్డింగ్ ఔత్సాహికులకు అంతర్జాతీయ రోల్ మోడల్. ఇటీవలే వందేళ్ల వయసులో బాడీ బిల్డింగ్ పోటీల్లో పాల్గొని అరుదైన ఘనతను సృష్టించాడు. ఈ వయసులో కాలు కదిపేందుకు ఇబ్బంది పడుతుంటారు. అలాంటిది ఆయన బాడీబిల్డింగ్ పోటీల్లో పాల్గొని సత్తా చాటారు. అంతేగాదు ఈ ఏడాది ప్రారంభంలో యునైటెడ్ స్టేట్స్ ఆర్మీ స్టాఫ్ సార్జెంట్ రెండో ప్రపంచ యుద్ధంలో 101వ రెజిమెంట్గా అసామాన్య పరాక్రమాన్ని చూపించినందుకు గానూ ఆండీని కాంస్య నక్షత్రంతో గౌరవించింది.బాల్యం మొదలైంది అలా..ప్రపంచ ప్రఖ్యాత బాడీబిల్డర్గా పేరుగాంచిన ఆండీ ప్రస్థానం న్యూయార్క్ నగరం నుంచి మొదలైంది. 1925 జనవరి 11న ఇటాలియన్ కుటుంబంలో జన్మించిన అతను తల్లి, సోదరడుతో కలిసి పెరిగాడు. క్రిస్మెస్ చెట్టు బహుమతులిస్తుందని అమాయకంగా నమ్మిన తన బాల్యాన్ని గుర్తుచేసుకుంటూ..తన ఆశను ఒమ్ము చేయకుండా విశాల హృదయంతో పొరుగింటివారు తనకందించిన బహుమతులను మర్చిపోనంటాడు. అదే తనకు దాతృత్వం విలువను నేర్పించిందని చెబుతుంటాడు. ఇక ఆండీకి చిన్నప్పటి నుంచి ఫిట్నెస్ పట్ల మక్కువ ఎక్కువ. 12 ఏళ్లకే అందులో కఠినమైన శిక్షణ తీసుకున్నాడు. 16 ఏళ్లకు బాడీబిల్డింగ్ మ్యాగ్జైన్ల కోసం ఫోటోలు తీయబడ్డాడు కూడా. ఆ తర్వాత ఆర్మీలో చేరాలని ఎన్నో ప్రయత్నాలు చేసి..తిరస్కరణకు గురయ్యాడు. చివరికి పట్టుదలతో తనకిష్టమైన రంగంలో చేరి అక్కడి అధికారులచే ప్రశంసలందుకున్నాడు. అయితే తనకిష్టమైన బాడీబిల్డింగ్ని మాత్రం వదులుకోలేదాయన. అలా 1977లో సీనియర్ మిస్టర్ అమెరికా టైటిల్ను అందుకున్నాడు. ఆ తర్వాత తన భార్య ఫ్రాన్సిస్తో కలిసి నేషనల్ జిమ్ అసోసియేషన్ను స్థాపించాడు. అక్కడ హాలీవుడ్ దిగ్గజాలకు, యువ అథ్లెట్లకు శిక్షణ ఇస్తుంటాడు ఆండీ. ఆండి యువతరానికి ఇచ్చే సలహా..దాదాపు తొమ్మిది దశాబ్దాలుగా ఫిట్నెస్ ఔత్సాహికులను తన అనుభవాన్ని షేర్ చేయడమే గాక సలహాలు సూచనలు షేర్ చేసుకుంటుంటారు. అందులో కొన్ని..శారీరక శిక్షణలాంటిది మానసికంగా సిద్ధంకావడం. ఇది మన లక్ష్యాలపై దృష్టి కేంద్రీకరించేలా చేయడమే కాదు మన సామర్ధ్యాన్ని కూడా పెంచుతుంది. అవసరం అనుకుంటే సర్దబాటుని కూడా స్వీకరించండిఇక్కడ ఆండీ రెండు ప్రపంచయుద్ధం కాలికి గాయం, స్ట్రోక్ వంటి పలు ఆరోగ్య సమస్యలను ఎదుర్కొన్నాడు. అయితే ఆండీ తన పరిమితులపై ఫోకస్ పెట్టకుండా కేవలం శిక్షణపైనే దృష్టి పెట్టి తన సామార్థ్యానికి అనుగుణంగా మార్చుకుంటానని చెబుతున్నాడు. అన్నింట్లకంటే అప్లికబుల్ లేదా పాటించటం అనేది అత్యంత కీలకం. ఇంట్లో లేదా జిమ్లో అయినా.. సరైన టెక్నీక్స్ పాటించాలి. అప్పుడే సత్ఫలితాలు అందుకోగలరని చెబుతున్నారు ఆండీ బోస్టింటో. (చదవండి: weight loss journey: 15 నెలల్లో 40 కిలోలు బరువు..! శిల్పంలాంటి శరీరాకృతి కోసం..) -
15 నెలల్లో 40 కిలోలు బరువు..! శిల్పంలాంటి శరీరాకృతి కోసం..
అధిక బరువు తగ్గడం అతిపెద్ద సమస్య కాదు అని నిరూపిస్తున్నారు పలువురు. మెరుగైన ఫలితాలు రావాలంటే సరైన విధంగా, మంచి నిపుణుల సలహాల సూచనలు పాటించాలి. ఈ అధిక బరువుకి చెక్పెట్టడంలో ప్రధాన పాత్ర పోషించేది కేవలం డైట్ మాత్రమే కాదు, వర్కౌట్లుదే అగ్రస్థానం. ఎందుకంటే శారీరక శ్రమతో ఫ్యాట్ని కరిగించడమే గాక బరువులో మార్పులు కూడా సంభవిస్తాయి. కొందరికి చేతులు, కాళ్లు, పిరుదులు బాగా లావుగా కనిపిస్తాయి. ఆ ప్రదేశాల్లోని కొలెస్ట్రాల్ తగ్గి..ఫ్లాట్గా అవ్వడమేగాక చెక్కిన శిల్పంలా ఆకృతి మారాలంటే ఈ వ్యాయామాలు తప్పనిసరి అంటోంది ఫిట్నెస్ కోచ్ సాచి పాయ్. అదెలాగో ఆమె మాటల్లోనే సవివరంగా చూద్దామా..!. టొరంటోకు చెందిన ఈ ఫిట్నెస్ కోచ్ సాచి పాయ్(Saachi Pai) జస్ట్ 15 నెలల్లో 40కిలోలు పైనే బరువు తగ్గింది. అంతలా బరువు తగ్గడంలో తనకు హెల్ప్ అయిన వ్యాయామాలు, ఆహారాలు గురించి సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంది. బరువు తగ్గడంలో మార్పులు బాహ్యంగా కనిపించాలంటే..కాళ్లు, చేతులు, పిరుదుల సైజ్ తగ్గితేనే..బరువు తగ్గినట్లు తెలుస్తుంది. అందుకోసం ఈ ఐదు వ్యాయామాలు క్రమం తప్పకుండా చేయలంటోంది సాచి పాయ్. సైడ్ రైజెస్ఈ వ్యాయామం కోసం నిటారుగా నిలబడి ప్రారంభించాలి. ఒక కాలును పక్కకు ఎత్తి, దానిని నిటారుగా ఉంచండి. కాలును నెమ్మదిగా క్రిందికి తీసుకురండి ..ఇలా పునరావృతం చేయాలి.ముందు, వెనుక కిక్స్ఎత్తుగా నిలబడి, ఒక కాలును ముందుకు తన్నండి, ప్రారంభానికి తిరిగి వెళ్లి, ఆపై దానిని వెనుకకు తన్నండి. ఆ తర్వాత యథాస్థానానికి వచ్చి..కదలికలను నియంత్రించాలి. ఇలా కొన్నిసార్లు రిపీట్ చేయండి. సింగిల్ ఇన్నర్ లెగ్ రైజెస్మీ దిగువ కాలును నిటారుగా ఉంచి, పై కాలును దానిపై వంచి సైడ్కు పడుకోండి. ఇది, లోపలి తొడలపై ఒత్తిడి కలుగుజేసేలా దిగువ కాలును పైకి ఎత్తండి. ఇలా మీ కాలును నెమ్మదిగా తగ్గించి.. పునరావృతం చేయండి. నిర్దిష్ట సంఖ్యలో ప్రాక్టీస్ అయ్యాక..మరోవైపకి తిరిగి ఇలానే పునరావృతం చేయాలి..ఫైర్ హైడ్రాంట్స్నాలుగు కాళ్లపై ప్రారంభించండి, ఒక మోకాలిని పక్కకు ఎత్తండి, దానిని వంచి ఉంచండి. వ్యాయామం చేస్తున్నప్పుడు మీ తుంటిని తిప్పవద్దు. ఇప్పుడు, వీపును క్రిందికి తగ్గించి రెండో కాలికి ఇలానే వ్యాయామం రిపీట్ చేయండి.డాంకీ కిక్స్నాలుగు కాళ్లపై నిలబడి, ఒక మోకాలిని వంచి, మడమను పైకప్పు వైపుకు ఎత్తాలి. ఈ వ్యాయామాలు కొవ్వును కాల్చడానికి, టోన్ చేయడానికి హెల్ప్ అవుతాయి. పలితంగా శిల్పంలా శరీరాకృతి మారేందుకు దోహదపడుతుంది. ఈ వ్యాయామాలు నిపుణుల పర్యవేక్షణలో సరిగా చేస్తే మంచి ఫలితాలు అందుకుంటారని, అదే తప్పుగా చేస్తే లేనిపోని శారీరక సమస్యలు తప్పవని చెప్పుకొచ్చారు. సాధ్యమైనంతవరకు నిపుణుడైన ఫిట్నోస్ పర్వవేక్షకుడి సమక్షంలో నేర్చుకోవడమే మంచిదని సూచిస్తున్నారు సాచిపాయ్. View this post on Instagram A post shared by Saachi | Pilates. Fat Loss. Real Talk. (@saachi.pai) (చదవండి: 44 కిలోల బరువు తగ్గిన ఫిట్నెస్ కోచ్..! సరికొత్తగా వెయిట్లాస్ పాఠాలు..) -
సమంత హైప్రోటీన్ డైట్..ఆ మూడింటితో ఫుల్ఫిల్..!
టాలీవుడ్ నటి సమంత రూత్ ప్రభు తన డైట్ గురించి ఒక ఇంటర్వూలో వెల్లడించారు. ప్రతి మహిళకు అవసరమైన ప్రోటీన్ విషయంలో తాను అస్సలు నిర్లక్ష్యం చేయనని చెప్పారామె. అందుకోసమే తాను తప్పనిసరిగా వందగ్రాముల ప్రోటీన్ని వినియోగిస్తానని చెప్పారామె. దాదాపు 50 కిలోలు ఉండే ఆమె ఈ రేంజ్లో ప్రోటీన్ తీసుకోవడం సరైనదేనా అంటే..భారతీయ మహిళలందరికీ సాధారణంగా 60 నుంచి 80 గ్రాముల ప్రోటీన్ తప్పనిసరి అని చెబుతున్నారు నిపుణులు. ఇక్కడ సమంత అంతకుమించి తీసుకోవడం అంటే..బహుశా కార్బోహైడ్రేట్కి బదులుగా లేదా వర్కౌట్ల రీత్యా అవసరం అయ్యి ఉండొచ్చని అన్నారు. అయితే ఇక్కడ అంత మోతాదులో ప్రోటీన్ ఎలా అని సందేహ పడాల్సిన పని కూడా లేదని అంటున్నారు నిపుణులు. అందుకోసం కేవలం ఈ మూడింటితో భర్తి చేస్తే చాలని చెబుతున్నారు. పెరుగు, పన్నీర్, పప్పు తీసుకుంటే చాలని చెబుతున్నారు. దీంతోపాటు పోషకాలతో నిండిన సమతుల్య ఆహారాన్ని తీసుకోవాలని సూచించారు. ప్రదానంగా గుర్తించుకోవాల్సినవి..వెజ్ ప్రోటీన్ ఒక్కోసారి కార్బోహైడ్రేట్లు, కొవ్వులతో కలిసి వస్తాయి. అందువల్ల ప్రతి ఒక్కరి హై ప్రోటీన్డైట్ సరిపడకపోవచ్చు. గట్ సమస్య ఉన్నవారికి అదనపు ప్రోటీన్ తీసుకోవడం ప్రమాదకరం అని చెబుతున్నారు నిపుణులు. అదీగాక అధిక ప్రోటీన్, తక్కువ ఫైబర్ ఉన్న ఆహారం మలబద్దకం, జీర్ణశయాంంతర సమస్యలకు దారితీస్తుందనేది గ్రహించాలని చెబుతున్నారు. ఇక్కడ గట్ఆరోగ్యంపై దృష్టిసారిస్తూ..క్రమంగా ప్రోటీన్ తీసుకోవడం పెంచడం మంచిదని చెబుతున్నారు. అదే సమయంలో ఇక్కడ సమంతా అంత మొత్తంలో ప్రోటీన్ తీసుకోవడం అనేది మొత్తం ఆరోగ్యం, ప్రోటీన్ ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది. అయితే సగటు వ్యక్తికి "సెలబ్రిటీ నియమావళి" వర్తించిందని, అనుసరించాల్సిన అవసరం లేదన్నారు. అందుకు బదులుగా స్మార్ట్గా ఎంపిక చేసుకుని తినడం మంచిదని సూచించారు నిపుణులు. గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: Hungover After Diwali: దీపావళి హ్యాంగోవర్ని తగ్గించే నేచురల్ డిటాక్స్..తక్షణ ఉపశమనం!) -
దీపావళి జోష్..తర్వాత రోజు తలెత్తే హ్యాంగోవర్ని హ్యాండిల్ చేద్దాం ఇలా..!
దీపావళి వేడుకలతో రాత్రంతా ఆహ్లాదంగా ఆడిపాడి గడుపుతారు అందరు. ముఖ్యంగా ఈ వేడుక పుణ్యామా అని రకరకాల స్వీట్లు, విందులతో పొట్టపగిలేలా ఆరగించేస్తాం. మరోవైపు బంధు మిత్రులతో కలిసి టపాసులు కాల్చి..ఆడిపాడి ఎప్పుడో పడుకుంటాం. పొద్దున లేచాక..ఏదో నిద్ర లేనట్లుగా పొట్టంతా ఉబ్బరంగా, ఒకటే తలనొప్పిగా భారంగా ఉంటుంది. శరీరమంతా ఏదో తెలియని బరువులా ఇబ్బందిగా ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే పండుగ హ్యాంగోవర్తో ఇబ్బంది పడుతుంటాం. నార్మల్ స్థితికి వచ్చి యథావిధిగా యాక్టివ్గా ఉండాలంటే ఈ నేచురల్ పానీయమే మేలంటున్నారు నిపుణులు. దీపావళి తర్వాత ఉత్సాహంగా ఉండటానికి ఇది అల్టిమేట్ రికవరీ పానీయంగా చెబుతున్నారు. మరి అదెంటో చూసేద్దామా..!.హ్యాంగోవర్ ఎందుకు వస్తుందంటే..దీపావలి పండుగ పేరుతో అతిగా తిని, బాగా ఎంజాయ్ చేస్తాం. పైగా శరీరం అలిసిపోతున్న బంధు మిత్రులను చూసి ఎక్కడలేని ఉత్సాహాన్ని కొనితెచ్చుకుంటాం. దాంతో మరుసటి రోజు డీహైడ్రేషన్కి గురయ్యే నీరసంతో విలవిలాడుతుంటాం. దీన్నే దీపావళి హ్యాంగోవర్ లేదా పండుగ హ్యాంగోవర్ అంటారు. దీన్నుంచి తక్షణమే రీలిఫ్ ఇచ్చే అద్భుత పానీయం నిమ్మ కొబ్బరి నీరు అని చెబుతున్నారు నిపుణులు. ఇది సహజసిద్ధమైన డిటాక్స్లా పనిచేస్తుందట. ఏవిధంగా అంటే..రీహైడ్రేట్ చేసి శరీరాన్ని యాక్టివ్ చేస్తుందట. అలాగే కొబ్బరి నీరులో 94% నీరు, పొటాషియం, సోడియం, మెగ్నీషియం, కాల్షియం సమృద్ధిగా ఉంటాయి. దీనికి నిమ్మకాయను జోడించడంతో రుచిపెరగడమే కాకుండా ఖనిజ శోషణ కూడా మెరుగుపడుతుందట. ముఖ్యంగా పొట్ట ఉబ్బరాన్ని తగ్గించి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.ప్రేగుకి ఉపశమనం అందించి, జీర్ణ ఎంజైమ్లను ప్రేరేపిస్తుంది. కొబ్బరినీళ్లల్లో ఉండే మెగ్నీషియం జీర్ణకండరాలను సడలించి.. ఆమ్లత్వం, మలబద్ధకం, అసౌకర్యాన్ని నివారిస్తుంది. అలాగే జలుబు, అలసట వంటి వాటిని నివారిస్తుంది. నిమ్మకాయలో ఉండే సీ విటమిన్ రోగనిరోధక శక్తిని అందించి..యాంటీ వైరల్, యాంటీ మైక్రోబయల్ వంటి వాటిని అందించి శరీరం తక్షణమే కోలుకునేలా చేస్తుంది. వేయించి పదార్థాలు తీసుకోవడం వల్ల వచ్చే పేగువాపుని తగ్గిస్తుందట. ఆక్సీకరణ ఒత్తిడిని దూరం చూస్తుందట. దీంతోపాటు చర్మాన్ని గ్లో అప్ చేసి, హైడ్రేటెడ్గా ఉండేలా చేస్తుందట. ఈ నిమ్మకాయ కొల్లాజెన్ ఉత్పత్తికి హెల్ప్ అవుతుందట. అలాగే కొబ్బరిలో ఉండే సహజ చక్కెరలు స్థిరమైన శక్తిని అందించి, ఆకస్మికంగా చక్కెర లెవల్స్ పడిపోవడాన్ని నివారిస్తుందని చెబుతున్నారు నిపుణులుతయారీ విధానం:ఇంట్లో దీన్ని ఎలా తయారు చేయాలంటే..కావలసినవి: 1 కప్పు తాజా కొబ్బరి నీరు (240 మి.లీ)2 టేబుల్ స్పూన్లు తాజా నిమ్మరసం 1 టీస్పూన్ తేనె లేదా బెల్లం సిరప్చిటికెడు నల్ల ఉప్పు లేదా కొన్ని పుదీనా ఆకులు తయారీ: కొబ్బరి నీటిలో నిమ్మరసం వేసి బాగా కలపండి. కావాలనుకుంటే తేనె లేదా బెల్లం కూడా కలుపుకోవచ్చు. చల్లగా కావాలనుకుంటే కొంచెం ఐస్, పుదీనా రెమ్మతో సర్వ్ చేసుకోవచ్చు. యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రయోజనాల కోసం 1/2 టీస్పూన్ తురిమిన అల్లం కూడా జోడించొచ్చు. గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తి గత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం.(చదవండి: మధుమేహ వ్యాధిగ్రస్తులకు దీపావళి ‘స్వీట్’ వార్నింగ్..!) -
ఈ తియ్యటి పండుతో షుగర్కి చెక్ : తాజా అధ్యయనం
అమ్మో యాపిల్, అమ్మో మామిడి పండా? అమ్మో సీతాఫలమా? మధురమైన అలాంటి పండ్లు మన చేత అమ్మో అనిపిస్తున్నాయి అంటే... నిస్సందేహంగా అది డయాబెటిస్ సమస్య వల్లే అని చెప్పొచ్చు. దాంతో చాలా కాలంగా తియ్యటి పండ్లు అనేవి షుగర్ వ్యాధి ఉన్నవారికి దూరంగా ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో గత కొంతకాలంగా జరుగుతున్న కొన్ని అధ్యయనాలు ఈ ఆలోచనలకు విరుద్ధమైన ఫలితాలను వెల్లడిస్తున్నాయి. అలాంటిదే ఆ తాజా అధ్యయన ఫలితం. ఇది పండ్లు తినడం వల్ల డయాబెటిస్ తగ్గుతుందని చెప్పడం మరింత విశేషం. ఆశ్చర్యంగా అనిపించవచ్చు, కానీ సహజమైన మధురమైన తీపికి పేరుగాంచిన మామిడి పండ్లు తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రించవచ్చునట. తాజా పరిశోధనలు దీనిని వెల్లడించాయి. జార్జ్ మాసన్ విశ్వవిద్యాలయ పరిశోధకులు నిర్వహించిన ఒక అధ్యయనంలో, తక్కువ చక్కెర ఉన్న స్నాక్స్ ఎంచుకున్న వారితో పోలిస్తే, వాటికి బదులుగా రోజూ మామిడి పండ్లు తినే వ్యక్తుల రక్తంలో చక్కెర నియంత్రణను మెరుగుపడింది. అంతేకాదు వారు శరీర కొవ్వును సైతం తగ్గించుకుంటారని తేలింది. గత ఆగస్టులో ‘‘డైలీ మ్యాంగో ఇంటెక్ ఇంప్రూవ్స్ గ్లైసెమిక్ అండ్ బాడీ కంపోజిషన్ అవుట్కమ్స్ ఇన్ అడల్ట్స్ విత్ ప్రిడియాబెటిస్: ఎ రాండమైజ్డ్ కంట్రోల్డ్ స్టడీ’’ అనే శీర్షికతో ఫుడ్స్లో ప్రచురితమైన ఈ అధ్యయనం ఫలితాలు, మొత్తం ఆహారాలలో చక్కెర పోషక సందర్భం చక్కెర కంటెంట్ కంటే చాలా కీలక పాత్ర పోషిస్తుందని నొక్కి చెబుతున్నాయి.మామిడి ప్రయోజనాల వెనుక సైన్స్ఈ సందర్భంగా సైన్స్ డైలీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో, జార్జ్ మాసన్ న్యూట్రిషన్ అండ్ ఫుడ్ స్టడీస్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ రైదే బసిరి మాట్లాడుతూ ఆహారంలో ఎంత చక్కెర ఉందో దాని గురించి మాత్రమే కాదు, మొత్తం పోషక సమతుల్యత గురించి వివరించారు. ఉదాహరణకు, మామిడి పండ్లు ఒక ప్రత్యేకమైన సమతుల్యతను అందిస్తాయి అవి సహజమైన చక్కెరలను కలిగి ఉన్నప్పటికీ, వీటితో పాటు ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు అవసరమైన విటమిన్లు ఉంటాయి. ఈ కలయిక నెమ్మదిగా చక్కెర శోషణకు సహాయపడుతుంది, రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను స్థిరంగా ఉంచుతుంది.అయితే దీనికి విరుద్ధంగా, ప్రాసెస్ చేసిన తృణæధాన్యాలు లేదా ప్యాక్ చేసిన తక్కువ చక్కెర కలిగిన స్నాక్స్ వంటివి ఈ సహజ సమతుల్యతను కలిగి ఉండవు తద్వారా మధుమేహం వచ్చే ప్రమాదాన్ని పెంచుతాయి. మామిడిలోని ఫైబర్ జీర్ణక్రియకు మద్దతు ఇస్తుంది సంతృప్తిని ప్రోత్సహిస్తుంది, ఆకలిని నియంత్రించడంలో సహాయపడుతూ అతిగా తినకుండా నిరోధిస్తుంది, ఇది బరువు నిర్వహణకు సహాయపడుతుంది.గ్లైసెమిక్ ఇండెక్స్, సురక్షిత వినియోగ చిట్కాలుమామిడి గ్లైసెమిక్ ఇండెక్స్ మితమైన పరిధిలోకి వచ్చేలా 51–56 మధ్య స్కోర్ చేస్తుంది, ఇది నారింజ రసంతో పోల్చదగిన పరిధి. అమెరికన్ డయాబెటిస్ అసోసియేషన్ (ఎడిఎ) చెబుతున్న ప్రకారం, ఇది మామిడి పండ్లను తక్కువ నుంచి మధ్యస్థ వర్గంలో ఉంచుతుంది, ఇది మితమైన వినియోగానికి అనుకూలంగా ఉంటుంది. చక్కెరలు జోడించకుండా తాజాగా, ఫ్రోజెన్ లేదా సరైన విధంగా నిల్వ చేసిన పండ్లను మాత్రమే ఎంచుకోవాలని ఎడిఎ సూచిస్తోంది. ఒక సాధారణ పండు ద్వారా దాదాపు 15 గ్రాముల కార్బోహైడ్రేట్లు లభిస్తాయి, ఇది ఒక కప్పు మామిడిలో మూడింట రెండు వంతులకు సమానం. అయితే ఎండిన పండ్ల పరిమాణం తక్కువగా ఉండటం వల్ల అవి చక్కెరలను అధికంగా ఉత్పత్తి చేస్తాయి, కాబట్టి తాజా పండ్లు ఎండిన రకాల కంటే ఎక్కువ లాభదాయకంగా ఉంటాయని ఏడిఎ పేర్కొంది.అదనపు ఆరోగ్య ప్రయోజనాలురక్తంలో చక్కెరను నియంత్రించడమే కాకుండా, మామిడి పండ్లు కొలెస్ట్రాల్ స్థాయిలను కూడా మెరుగుపరుస్తాయి. 2011లో బ్రిటిష్ జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్ లో ప్రచురితమైన ఒక అధ్యయనం దీన్ని వెల్లడించింది. ఫ్రీజ్–డ్రైడ్ మామిడితో కూడిన ఆహారం ఎలుకలకు తినిపించడం వల్ల లిపిడ్ లేదా ఫెనోఫైబ్రేట్ రోసిగ్లిటాజోన్ వంటి చక్కెర–తగ్గించే మందులతో చికిత్స పొందిన వాటితో పోలిస్తే తక్కువ శరీర కొవ్వు, తగ్గిన కొలెస్ట్రాల్ మెరుగైన గ్లూకోజ్ స్థాయిలు కనిపిస్తాయని గమనించారు. మామిడి వంటి పండ్లను ఒకరి ఆహారంలో చేర్చుకోవడం వల్ల సహజంగా తీపి కోరికలు తీరడమే కాకుండా జీవక్రియ ఆరోగ్యానికి కూడా మద్దతు లభిస్తుందని, ఈ ఉష్ణమండల పండును సమతుల్య జీవనానికి ఆశ్చర్యకరంగా స్మార్ట్ ఎంపికగా మారుస్తుందని పరిశోధన నొక్కి చెబుతుంది.అధిక రక్త చక్కెర సంకేతాలుక్లీవ్ల్యాండ్ క్లినిక్ నివేదిక ప్రకారం, అధిక రక్త చక్కెర, హైపర్ గ్లసీమియా అని పేర్కొనే ప్రారంభ సంకేతాలు క్రమ క్రమంగా కనిపిస్తాయి అధిక దాహం లేదా ఆకలి, తరచుగా మూత్రవిసర్జన, తలనొప్పి అస్పష్టమైన దృష్టి ఉండవచ్చు. పెరుగుతున్న గ్లూకోజ్ స్థాయిలను నిర్వహించడానికి శరీరం కష్టపడడం వల్లే ఈ లక్షణాలు సంభవిస్తాయి. ఎక్కువ కాలం పాటు అదుపు చేయకుండా వదిలేస్తే, దీర్ఘకాలిక హైపర్ గ్లసీమియా నిరంతర అలసట, అనూహ్యంగా బరువు తగ్గడం, చర్మ ఇన్ఫెక్షన్లు, త్వరగా నయం కాని కోతలు లేదా పుండ్లు వంటి తీవ్రమైన సమస్యలకు దారితీస్తుంది. ఈ హెచ్చరిక సంకేతాలను ముందుగానే గుర్తించడం చాలా ముఖ్యం, ఎందుకంటే సకాలంలో జీవనశైలి మార్పులు, వైద్య జోక్యం వల్ల నరాల దెబ్బతినడం వంటి మధుమేహ సంబంధిత తీవ్రమైన సమస్యలను నివారించడంలో సహాయపడుతుంది.రక్తంలో చక్కెరను ఎలా అదుపులో ఉంచుకోవాలి?ఆరోగ్యకరమైన రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి, ఫైబర్, తృణధాన్యాలు, లీన్ ప్రోటీన్లు పిండి లేని కూరగాయలు అధికంగా ఉండే సమతుల్య ఆహారంపై దృష్టి పెట్టండి. శుద్ధి చేసిన చక్కెరలు, ప్రాసెస్ చేసిన ఆహారాలు తీపి పానీయాలను బాగా పరిమితం చేయండి. గ్లూకోజ్లో హెచ్చుతగ్గులు తగ్గుదలను నివారించడానికి చిన్న, సాధారణ భోజనం తినండి. చురుకైన నడక లేదా యోగా వంటి రోజువారీ వ్యాయామంతో కనీసం 30 నిమిషాలు చేస్తూ చురుకుగా ఉండండి. ఒత్తిడి హార్మోన్లు రక్తంలో చక్కెరను పెంచుతాయి కాబట్టి ధ్యానం లేదా లోతైన శ్వాస ద్వారా ఒత్తిడిని నియంత్రించండి. తగినంత నిద్ర పొందండి హైడ్రేటెడ్గా ఉండండి. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను క్రమం తప్పకుండా పర్యవేక్షించండి చక్కెరను ఆరోగ్యకరమైన పరిధిలో ఉంచడానికి తరచు వైద్య సలహాను అనుసరించండి. -
పావురాలు Vs పౌరులు: ఎవరు ముఖ్యం? పెటాపై ప్రజాగ్రహం...
పావురాల విసర్జన ప్రాణాంతకంగా మారుతోందంటూ భారతీయ నగరాల్లో గత కొంతకాలంగా తీవ్రమైన ఆందోళన వ్యక్తం అవుతోంది. దీనిపై ముంబై వంటి మెట్రోలకు చెందిన కొందరు న్యాయస్థానాలను కూడా ఆశ్రయించారు. ఈ నేపధ్యంలో ఇటీవల పావురాలకు ఆహారం (దాణా) వేయడాన్ని నియంత్రించడానికి మహారాష్ట్ర ప్రభుత్వం నిషేధ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ ఆదేశాలను నిరసిస్తూ జంతు సంరక్షణ కార్యకర్తలు పెటా ఆధ్వర్యంలో ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు.‘‘ముంబైలోని మూడు అతిపెద్ద ఆసుపత్రుల డేటా ప్రకారం, గత ఏడాదిలో వచ్చిన శ్వాసకోశ అనారోగ్య కేసుల్లో కేవలం 0.3% మాత్రమే పావురాలతో ముడిపడి ఉన్నాయి. అంతర్జాతీయ పరిశోధన కూడా పావురాల నుంచి మానవులకు వ్యాధి వ్యాప్తి చెందే ప్రమాదం చాలా తక్కువగా ఉందని తేల్చింది. పావురాలు సహజంగా బర్డ్ ఫ్లూకు నిరోధకతను కలిగి ఉంటాయి’’ అని పెటా వాదిస్తోంది. అంతేకాకుండా ప్రభుత్వాలకు పలు సూచనలు కూడా చేస్తోంది. కబుతర్ ఖానా దగ్గర నిర్దిష్ట దాణా సమయాలు కేంద్రాలను నియమించడం, ఈ ప్రదేశాలను క్రమం తప్పకుండా శుభ్రపరచడం పారిశుధ్యాన్ని నిర్వహించడం సరైన దాణా పద్ధతులు పావురాల వల్ల కలిగే కనీస ఆరోగ్య ప్రమాదాలపై ప్రజలకు అవగాహన కల్పించే బహుభాషా సందేశాలను ఇన్స్టాల్ చేయడం వంటివి చేయాలని సూచిస్తోంది.‘పావురాలు లేకుండా ముంబై ఆకాశం ఎలా ఉంటుంది? దాణా నిషేధాలతో, ఈ సున్నితమైన పక్షులు ఆకలి బారిన పడతాయి. ‘ప్రతి ఒక్కరూ పావురాలు కూడా నగరవాసులే అంటూ గుర్తు చేస్తూ పలువురు ముంబైకర్లు ’పావురాలు’గా మారారు‘ భారీ పావురాల ముసుగులు ధరించి ప్రజలు తమ దైనందిన జీవితాన్ని గడుపుతున్నట్లు చూపించే వీడియోను పెటా షేర్ చేసింది.అయితే ఈ విషయంలో పెటాపై ప్రజల నుంచి ఆగ్రహం వ్యక్తం అయింది. గతంలో ఎన్నడూ ఏ అంశంపైనా రానంతగా ఈ విషయంలో ప్రజలు వ్యతిరేకంగా స్పందిస్తున్నారు. ‘‘ ‘పావురాలు వాటి విసర్జన ద్వారా క్రిప్టోకోకోసిస్, హిస్టోప్లాస్మోసిస్ సిట్టాకోసిస్ వంటి వ్యాధులను వ్యాపింపజేస్తాయి.‘ అంటూ ఒక వ్యక్తి ఆన్లైన్లో ద్వజమెత్తారు. ‘పావురాలు ఎగిరే ఎలుకలుగా అనొచ్చు. అవి తక్కువ సంఖ్యలో ఉంటే పెద్దగా ప్రభావం చూపకపోవచ్చు. కానీ సమూహాలుగా ఉంటే, నగర నివాసితుల ఆరోగ్యంపై (శ్వాసకోశ సమస్యలు, వ్యాధి వ్యాప్తి మొదలైనవి) చాలా హానికరమైన ప్రభావాన్ని చూపుతుంది. మీరు భారతీయుల ఆరోగ్యం గురించి పట్టించుకోండి అంటూ మరో వ్యక్తి సూచించాడు. ‘ఈ జంతు హక్కుల కార్యకర్తలు దేశం గురించి ఎప్పుడూ ఆలోచించరు. పావురాల మలం మానవ ఆరోగ్యానికి ప్రమాదకరం. కుక్కలు పావురాలు దేశానికి అతిపెద్ద ముప్పు. రాబోయే సంవత్సరాల్లో వాటి జనాభాను తగ్గించాలి అంటూ మరొకరు తీవ్రంగా దుయ్యబట్టారు. -
రుమటాయిడ్ ఆర్థరైటిస్ను ముందుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?
వయసు నలభై దాటితే చాలు..మనలో చాలామంది కీళ్లనొప్పులంటూ ఉంటారు. వీరిలో చాలామంది రుమటాయిడ్ ఆర్థరైటిస్ (Rheumatoid Arthritis) తో బాధపడుతూంటారు. వయసుతో సంబంధం లేకుండా వచ్చే సమస్య ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్. హానికారక సూక్ష్మజీవులేవీ శరీరంలోకి చొరబడకుండా కాపుకాసే రోగ నిరోధక వ్యవస్థే కొన్ని పరిస్థితుల్లో శరీర కణజాలంపైనే దాడులు చేయడం దీనికి కారణం. అందుకే రుమటాయిడ్ ఆర్థరైటిస్ను ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అని పిలుస్తూంటారు. ఇందులో రోగ నిరోధక వ్యవస్థ మీ కీళ్ల మృదువైన లైనింగ్ను సజావుగా కదిలేలా చేసే సైనోవియంపై కేంద్రీకృతమై ఉంటుంది. దేశంలో 2021 నాటికే దాదాపు కోటి ముప్ఫై లక్షల మంది ఈ సమస్యతో బాధపడుతున్నట్లు అంచనాలున్నాయి. అయితే చాలా వ్యాధుల మాదిరిగానే రుమటాయిడ్ ఆర్థరైటిస్ను కూడా వీలైనంత ముందుగా గుర్తిస్తే మెరుగైన చికిత్స అందించవచ్చునని, నొప్పి, ఇతరత్రా బాధలూ తక్కువగా ఉంటాయని అంటున్నారు నిపుణులు. రోగ నిరోధక వ్యవస్థ సైనోవియంపై దాడి చేయడం దీర్ఘకాలం కొనసాగితే కీళ్ల నొప్పి, వాపు, స్టిఫ్నెస్ పెరుగుతుంది. కాలక్రమేణా, ఇది మృదులాస్థిని, ఎముకలను దెబ్బ తీస్తుంది. చికిత్స చేయకపోతే ఇతర అవయవాలను కూడా ప్రభావితం చేస్తుంది. తొందరగా గుర్తించి ప్రభావవంతమైన చికిత్స కల్పించకపోతే కీళ్లకు శాశ్వతంగా నష్టం కలిగిస్తుంది. వైకల్యానికి కారణమవుతుంది. భారతదేశంలో, ముఖ్యంగా 30 - 60 ఏళ్ల మధ్య వయస్సు గల మహిళల్లో రుమటాయిడ్ ఆర్థరైటిస్ గురించి మరింత అవగాహన కల్పించాల్సిన అవసరముందని రుమటాలజిస్టులు నిపుణులు, స్పష్టం చేస్తున్నారు. ఈ వయసు మహిళల్లో ఈ వ్యాధి ప్రభావం వేర్వేరుగా ఉంటుంది. అయితే చాలామందికి ఈ విషయం తెలియదు. గుర్తించడం, చికిత్స అందించడం రెండూ తక్కువే. హైదరాబాద్లోని అడ్వాన్స్డ్ రుమటాలజీ సెంటర్లోని సీనియర్ కన్సల్టెంట్ రుమటాలజిస్ట్ డాక్టర్ సర్వ్జీత్ పాల్ మాట్లాడుతూ, ‘‘రుమటాయిడ్ ఆర్థరైటిస్ను వీలైంత ముందుగా గుర్తిస్తే సమస్య మరీ చేయిదాటిపోకుండా నెమ్మదింపజేయవచ్చు. నొప్పి నుంచి ఉపశమనం పొందడంలోనూ ఇది కీలకం. చాలామందిలో ఈ వ్యాధి చిన్నస్థాయిలోనే మొదలవుతుంది. ఉదయాన్నే మీ కీళ్లు 45 నిమిషాల కంటే ఎక్కువ సమయం బిగుసుకుపోయి ఉంటే, వాచిపోయినా, వివరించలేని తక్కువ-స్థాయి జ్వరం, బాగా అలసట వంటి లక్షణాలు కనిపిస్తే రుమటాయిడ్ ఆర్థరైటిస్ కావచ్చుని గుర్తించండి. తక్షణం వైద్య సాయం పొందే ప్రయత్నం చేయండి’’ అని అన్నారు.రుమటాయిడ్ ఆర్థరైటిస్లో శరీరం రెండువైపుల ఉన్న కీళ్లలో సమస్య ఒకేలా ఉంటుంది. ఉదాహరణకు ఒక మణికట్టు నొప్పిగా ఉంటే, రెండోది కూడా తరచూ బాధిస్తుంది. సాధారణంగా చేతులు, కాళ్లలోని చిన్న కీళ్లతో మొదలై కాలక్రమేణా పెద్దవాటికి వ్యాపిస్తుంది. రోజువారి పనులు చేసుకోవడంలోనూ కొంతమందికి కష్టతరం చేస్తుంది. కొంతమందిలో ఒకవైపు మాత్రమే సమస్యలున్నా ఆశ్చర్యపోనవసరం లేదు. ముఖ్యంగా ప్రారంభ దశలలో లేదా తక్కువ కీళ్లపై ప్రభావం ఉన్నప్పుడు... ఉదయం లేదా విశ్రాంతి సమయంలో పరిస్థితి అధ్వాన్నంగా అనిపిస్తుంది. కదలికలతో కొద్దిగా మెరుగుపడవచ్చు కానీ పనులు చేస్తూంటే నొప్పి తిరిగి రావచ్చు తీవ్రం కావచ్చు. అబాట్ ఇండియా మెడికల్ అఫైర్స్ అసోసియేట్ డైరెక్టర్ డాక్టర్ అంకిత్ రాయ్ మాట్లాడుతూ, “రుమటాయిడ్ ఆర్థరైటిస్ కేవలం ‘వృద్ధాప్యంలో వచ్చే’ సమస్య కాదు. రోగాన్ని వీలైనంత వేగంగా గుర్తించడంతోపాటు వ్యాధి పురరోగమనానికి అనుగుణంగా స్థిరమైన, వ్యక్తిగతీకరించిన సంరక్షణ కూడా అవసరం. అబాట్ వద్ద, సకాలంలో జోక్యం, దీర్ఘకాలిక నిర్వహణకు మద్దతు ఇచ్చే సాధనాలతో వైద్యులు, రోగులు ఇద్దరికీ సాధికారత కల్పించడంపై దృష్టి సారించాం’’ అన్నారు.రుమటాయిడ్ ఆర్థరైటిస్ నిర్వహణ సరైన చికిత్సా ప్రణాళికను గుర్తించడంతో ప్రారంభమవుతుంది. సాధారణంగా వైద్యులు బయోలాజిక్స్ను సిఫారసు చేస్తూంటారు. ఇది... కీళ్ల నొప్పి, వాపునకు కారణమయ్యే రోగనిరోధక వ్యవస్థ భాగాలను లక్ష్యంగా చేసుకునే ప్రత్యేక చికిత్స.బయోసిమిలర్లు అనేవి బయోలాజిక్స్ లాగానే పనిచేయడానికి రూపొందించబడిన మందులు. అవి అసలు బయోలాజిక్ లాగానే సురక్షిత, ప్రయోజనాలను అందిస్తాయి, పని చేసే విధానం కూడా అదే విధంగా ఉంటుంది, తక్కువ ఖర్చుతో ఉంటాయి. రుమటాయిడ్ ఆర్థరైటిస్ నిరోధానికి...క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి: ఈత, సైక్లింగ్, నడక లేదా యోగా వంటి క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం నొప్పి, ఉదయం పూట స్టిఫ్నెస్, అలసటను తగ్గించడంలో సహాయపడతాయి. సమతుల ఆహారం: ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు రుమటాయిడ్ ఆర్థరైటిస్తో వచ్చే సమస్యల పురోగతి, ప్రమాదాన్ని తగ్గించడంలో ఉపయోగపడతాయి.ఒత్తిడిని తగ్గించుకోండి: ధ్యానం, యోగా, మైండ్ఫుల్నెస్ వంటి వాటితో రుమటాయిడ్ ఆర్థరైటిస్ రోగులకు ఎంతో మేలు జరుగుతుంది. -
ఈ మూడింటితో పీరియడ్స్ బాధలకు చెక్ : తమన్నాసెలబ్రిటీ ఫిట్నెస్ ట్రైనర్
పీరియడ్స్ సమయంలో వచ్చే నొప్పులు బాధలు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇదొక హార్మోన్ల ఆట. హార్మోన్ల సునామీని తట్టుకోవడం చాలా కష్టం ఈ సమయంలో జరిగే రక్తస్రావం, వచ్చే కడుపునొప్పి, మానసిక ఆందోళన, మూడ్ స్వింగ్స్, అలసట ఒక్కో మహిళను ఒక్కో రీతిలో బాధిస్తుంటాయి. కొంతమంdray ఈ పీరియడ్స్ మేనేజ్మెంట్ చాలా బాధాకరంగా ఉంటుంది. అందుకే ఈసమయంలో కొన్ని రకాల ఆహారాలను తీసుకోవడం వల్ల ఉపశమనం లభిస్తుందంటున్నారు టాలీవుడ్ హీరోయిన్ తమన్నా భాటియా ట్రైనర్, సెలబ్రిటీ ఫిట్నెస్ ట్రైనర్ సిద్ధార్థ సింగ్తాజాగా ఆయన ఋతుస్రావం సమయంలో ప్రయోజనకరంగా ఉండే మూడు ఆహారాలను గురించి తెలియజేశారు. వాటి ప్రయోజనాల గురించి వెల్లడించారు. పీరియడ్స్కు ముందు వచ్చే నీరసాన్ని, మానసిక భావోద్వేగాలను తట్టుకోవాలంటే మూడు రకాల ఆహారాలను చేర్చుకోవాలన్నారు. పీరియడ్స్ తరచుగా స్త్రీలలో అలసట, అసౌకర్యాన్ని కలగజేస్తాయి. ఇందుకోసం ముదురు ఆకుకూరలు, గ్రీక్ యోగర్ట్, డార్క్ చాక్లెట్ తీసుకోవాలన్నారు. ఆకుకూరలుఆకుకూరలు బాడీలో ఐరన్ స్థాయిలను ప్రభావితం చేస్తాయి. శరీరంలో ఐరన్ లేకపోవడం వల్ల అలసట, తలతిరగడం లాంటి లక్షణాలు కన్పిస్తాయి. అందుకే పాలకూర, కాలే వంటి ఆకుకూరలు తీసుకోవాలి. వీటిల్లో ఐరన్, మెగ్నీషియం కాల్షియం సమృద్ధిగ ఉంటాయి.. ఈ పోషకాలు తిమ్మిరిని తగ్గించడంలో సహాయపడతాయి. శక్తిని పెంచుతాయి.చదవండి: వెయిట్ లాస్లో ఈ మూడింటిని నమ్మకండి : రణబీర్ ఫిట్నెస్ కోచ్ వార్నింగ్గ్రీకు యోగర్ట్పెరుగులో ప్రోబయోటిక్స్, కాల్షియం ఉంటాయి. ఇవి PMS లక్షణాలను( పీరియడ్స్కి ముందు బాధలను) తగ్గిస్తాయి. జీర్ణక్రియకు సహాయ పడతాయని సిద్ధార్థ సింగ్ చెప్పారు. వీటిని భోజనంలో చేర్చుకోవడం వల్ల పేగు ఆరోగ్యం,హార్మోన్ల సమతుల్యత రెండింటికీ ప్రయోజనకరంగా ఉంటుంది.డార్క్ చాక్లెట్పీరియడ్స్ సమయంలో డార్క్ చాక్లెట్ తీసుకుంటే ఉపశమనం లభిస్తుంది. డార్క్ చాక్లెట్లో మెగ్నీషియం, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కండరాలను సడలించి మానసిక స్థితిని మెరుగు పరచడానికి సహాయపడుతుంది. ఇది భోజనం తర్వాత గొప్ప డెజర్ట్ కూడా అయితే అతిగా తినకుండా కంట్రోల్లో ఉండాలని సిద్ధార్థ సింగ్ హెచ్చరించారు.ఇదీ చదవండి: 7 సీక్రెట్స్ : ప్రేమించే భార్య, కొంచెం లక్తో సెంచరీ కొట్టేశా! -
వెయిట్ లాస్లో ఈ మూడింటిని నమ్మకండి : రణబీర్ ఫిట్నెస్ కోచ్ వార్నింగ్
లవర్ బాయ్లా ఉండే బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ ఒక్కసారిగా కండలు తిరిగిన దేహంతో కనిపించి ఫ్యాన్స్ సర్ప్రైజ్ చేశాడు. ఫిట్నెస్ కోచ్ శిక్షణలో తీవ్రమైన కసరత్తు చేసి ఫిట్గా కనిపించాడు. అయితేతాజాగా రణబీర్ను తీర్చిదిద్దిన ఫిట్నెస్ కోచ్ శివోహం భట్ వెయిట్ లాస్ పై ఉన్న అపోహలు గురించి ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో వివరించారు. బరువు తగ్గాలంటే కొత్త డైటీమీ అవసరం లేదు... అశాస్త్రీయమైన వాటిని నమ్మకుండా ఉండే చాలు అని హితవు పలికారు. ఫిట్నెస్ ప్రియులను విపరీతంగా ఆకట్టుకుంటున్న ఆ మూడు మిత్స్ ఏంటో చూసేద్దామా మరి.శివోహం భట్ ప్రకారం కడుపు మాడ్చుకోవడం వల్ల బరువు తగ్గుతారు అనుకుంటే పొరపాటే. దీని వల్ల మజిల్స్ బర్స్ అవుతాయి,కానీ కరిగేది కొవ్వు కాదని తేల్చారు. అపోహలను గుర్తించి జాగ్రత్తగా ఉండాలని సూచించారు. దచాలా మంది తక్కువ తినడం, ఎక్కువ పని చేయడం అనేది కొవ్వు తగ్గడానికి కీలకమని భావిస్తారు. దీని వల్ల తీవ్రమైన కేలరీల లోటులోకి వెళ్లిపోతారని శివోహం హెచ్చరించారు.ఆకలి మెటబాలిజాన్ని తగ్గించేస్తుంది (Starving Slows Metabolism) దీనివల్ల వాస్తవానికి ఏమి జరుగుతుంది? బాడీ సర్వైవల్ మోడ్లోకి వెళుతుంది. కొవ్వును కరిగించడానికి బదులుగా శక్తి కోసం కండరాల కణజాలాన్ని విచ్ఛిన్నం చేస్తుంది. దీంతో మెటబాలిజం నెమ్మదిస్తుంది. మజిల్ అనేది మెటబాలిజాన్ని యాక్టివ్గా ఉంచే టిష్యూ. ఇది విశ్రాంతి సమయంలో కూడా కేలరీలను బర్న్ చేస్తుందన్నారు. కాబట్టి ఆకలితో ఉండటం వల్ల, స్కేల్ పడిపోతుంది. శరీరం నీరసించిపోతుంది. అంతిమంగా ఇది తిరిగి మళ్లీ కొవ్వు పేరుకుపోవడానికే దోహదపడుతుంది. అందువల్ల బరువు తగ్గడం అంటే తక్కువ తినడం కాదు సరిగ్గా తినడం అన్నారు.చదవండి: 7 సీక్రెట్స్ : ప్రేమించే భార్య, కొంచెం లక్తో సెంచరీ కొట్టేశా! కార్డియో కేలరీలను బర్న్ చేస్తుందా?కార్డియో చేస్తే ఎక్కువకేలరీలు బర్న్ అవుతాయనుకుంటారు. ఆపివేసిన మరుక్షణం, కేలరీల బర్న్ కూడా ఆగిపోతుందని శివోహామ్ భట్ గుర్తు చేశారు. వెయిట్ ట్రెయినింగ్ భిన్నంగా ఉండాలి. బరువులు ఎత్తినప్పుడు మజిల్స్ దృఢపడతాయి. ఇవి జీవక్రియ రేటును పెంచుతాయి, అంటే నిద్రపోతున్నప్పుడు కూడా. అందుకే అధిక కొవ్వును కరిగించుకోవాలన్నా, సన్నగా మారాలన్న, కార్డియో, వెయిట్ ట్రెయినింగ్ రెండూ ఉండాలని సూచించారు.డిసిప్లీన్ బెస్ట్: డిసిప్లీన్ పవర్ ఫుల్.. మోటివేష్, విల్వపర్ ఇవన్నీ ఒక ట్రాప్. ఇవి లేక చాలామంది ఇబ్బంది పడతారు. ప్రోటీన్-రిచ్ న్యూట్రిషన్, డీప్ రికవరీ (నిద్ర), స్థిరత్వం ఇదే బెస్ట్ ఫార్ములా. ఇవే గేమ్ చేంజర్స్ అన్నారు. అంతేకానీ ఫ్యాట్ బర్నర్స్, డీటాక్స్ టీలు, క్రాష్ డైట్ ఇవన్నీ తాత్కాలిక చిట్కాలు మాత్రమే అని శివోహామ్ భట్ పేర్కొన్నారు. లేనిపోని హైప్ ఇవ్వడం కాకుండా అలవాట్లను పెంపొందించేలా చూస్తాడు ఫిట్నెస్ కోచ్ . అన్ని సమస్యలకు నిబద్ధతే పరిష్కారమని శివోహామ్ తేల్చి చెప్పారు.ఇదీ చదవండి: మొరింగా సాగుతో.. రూ. 40 లక్షల టర్నోవర్ -
ఆయుష్మాన్ భవ.. ! కాలుష్యాన్ని జయిస్తున్న జీవన విధానం..
ఓ వైపు పెరుగుతున్న కాలుష్యం.. కల్తీ ఆహారం.. అనారోగ్య కారకాలు వంటివి మనిషి సగటు జీవన ప్రమాణాలను ఆయుర్దాయాన్ని దెబ్బతీస్తున్నాయి.. మరోవైపు ఆశ్చర్యకరమైన ఫలితాలను అధ్యయనాలు తేటతెల్లం చేస్తున్నాయి. అయితే దీనికీ ఓ లెక్కుందండోయ్..? అదే ఆరోగ్యకరమైన జీవన విధానం.. అందుకు కావాల్సిన సౌకర్యాలు.. ప్రామాణికాలు.. గతంతో పోలిస్తే మెట్రో నగరాల్లో పలు వనరులు కాలుష్యానికి గురైనా.. మరోవైపు ప్రజల్లో పెరిగిన అవగాహన, విజ్ఞానం, వైద్య సౌకర్యాలు వాటిని అధిగమిస్తూ కొత్త అడుగులు వేయిస్తున్నాయి. ఫలితంగా మానవుని ఆయుఃప్రమాణాలు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయని పలు అధ్యయనాలు చెబుతున్నాయి.. హైదరాబాద్తోపాటు దేశంలోని పదికి పైగా ప్రధాన నగరాల్లో వాయు కాలుష్యం, నీటి కాలుష్యం, కల్తీ ఆహారం వంటివి పెరుగుతూనే ఉన్నాయి. ఇది 3 నుంచి 4 శాతం సగటును నమోదు చేసుకుంటున్నాయి. అయితే అదే సమయంలో ఆరోగ్యంపై పెరుగుతున్న అవగాహన సగటున ఆయుర్దాయాన్ని(Life Expectancy)పెంచడానికి దోహదం చేస్తున్నాయని, దీని వల్ల నగరాల్లో జీవన కాలాన్ని సగటున 70 నుంచి 75 సంవత్సరాలకు పెంచిందని లాన్సెట్ ప్లానెటరీ హెల్త్ వంటి అధ్యయనాలు చెబుతున్నాయి. ఇది వాస్తవానికి పూర్తి భిన్నంగా ఉన్నప్పటికీ అధ్యయన ఫలితాలు మాత్రం ఇది వాస్తవమని చెబుతున్నాయి. పూర్తి భిన్నంగా.. మహానగరాలు గాలి, నీరు, ఆహారం, శబ్ద కాలుష్యంతో నిండిపోయాయి. అయినప్పటికీ, గ్రామీణ ప్రాంత ప్రజలతో పోలిస్తే నగర ప్రజల ఆయుః ప్రమాణాలు మెరుగ్గా ఉన్నాయని పరిశోధనలే చెప్పడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. తాజా అధ్యయనాలు పరిశోధకులను, ఆరోగ్య నిపుణులను విస్తుపోయేలా చేస్తున్నాయి. పట్టణాల కంటే మెరుగైన వాతావరణ పరిస్థితులు పల్లెల్లో ఉంటాయనేది అందరికీ తెలిసిన వాస్తవం.. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. అలాంటి ప్రతికూల పరిస్థితులను అధిగమిస్తూ.. ఈ ఫలితాలు ఉండడం నిజంగా ఆశ్చర్యకరమే.. అయితే ఫలితాలు చెప్పే వాస్తవాలను ఓ సారి పరిశీలించాలని నిపుణులు చెబుతున్నారు. దీనికి జీవన ప్రమాణాల్లో పెరుగుతున్న నాణ్యత అవగాహనే కారణమని తెలుస్తోంది. సర్వే చెబుతోన్నదేంటి!? గతేడాది ప్రచురితమైన బీఎమ్సీ పబ్లిక్ హెల్త్ నివేదిక ప్రకారం.. దేశంలో అధిక ఆదాయం ఉన్న నగర ప్రాంతాల ప్రజలు గ్రామీణ ప్రజలకంటే సగటున 7.5 సంవత్సరాలు ఎక్కువ జీవిస్తున్నారని తేలి్చంది. మెరుగైన ఆర్థిక స్థిరత్వం, ఆరోగ్యపై పెరుగుతున్న చైతన్యం, ఆరోగ్య బీమా, మెరుతైన ఆహారం, వ్యాయామం వంటి అంశాలే కారణాలు ఇందుకు కారణాలుగా పరిశోధనలు చెబుతున్నాయి. హైదరాబాద్లో ఐటీ, ఫార్మా, వంటి ఇతర సరీ్వస్ రంగాల ఉద్యోగాలు మధ్యతరగతి ప్రజల జీవన విధానం, ఆలోచనా ధోరణిలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. వీటితోపాటు నగరంలో ప్రభుత్వాలు చేపట్టే ‘క్లీన్ ఎయిర్ ప్లాన్’, ‘హరిత హైదరాబాద్’ వంటి ప్రాజెక్టులు కూడా ఓ ముఖ్య భూమికను పోషిస్తున్నాయని, దీంతో పాటు ప్రజల్లోనూ ఆరోగ్యంపై వ్యక్తిగత శ్రద్ధ పెరిగిందని, వ్యాయామం, నిద్ర, ఆహార నియమాలు మెరుగైన ఫలితాలకు దోహదం చేస్తున్నాయని తెలుస్తోంది. అవగాహన లేమి.. నగరాలతో పోలిస్తే గామీణ ప్రాంతాలు వెనుకబడడానికి అసలు కారణం అవగాహనా లేమి.. మెరుగైన సౌకర్యాలు లేకపోవడం, ఆదాయ వనరులు, వ్యక్తి శుభ్రత ప్రభావం చూపుతున్నాయని తెలిసింది. ఏదైనా అనారోగ్య సమస్య వస్తే.. సరైన అవగాహన లేక, సదుపాయాలు లేక, ఆయా సమస్యలను, ఆరోగ్య పరిస్థితులను సరైన సమయంలో గుర్తించక ప్రాణాపాయ స్థితికి చేరుతున్నారని, పల్లెతో పోలిస్తే వైద్యు సేవలు, డిజిటల్ కన్సల్టేషన్, టెక్నాలజీ, టెలీమెడిసిన్, ఫిట్నెస్ సెంటర్లు, యోగా వంటివి ప్రభావవంతంగా పనిచేస్తున్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి. ప్రజలకు తెలిసిన వాస్తవ కోణం.. పర్యావరణ, కాలుష్య నియంత్రణ బోర్డు తాజా గణాంకాల ప్రకారం హైదరాబద్ నగర గాలిలో నాణ్యత ‘మోస్తరు నుంచి హానికర స్థాయికి’ మధ్యలో ఊగిసలాడిందని తెలిపింది. జలాశయాలైన హిమాయత్సాగర్, ఉస్మాన్సాగర్, ముసీ నది కాలుష్యానికి గురవుతున్నాయని ఎమ్ఏఎన్యూయూ పరిశోధకులు వెల్లడించారు. పారిశ్రామిక వ్యర్థాలు, డ్రైనేజ్ నీరు, రసాయన అవశేషాల వల్ల భూగర్భజలాలు కూడా కలుషితమౌతున్న విషయం తెలిసిందే. ఆహార విషయంలోనూ హానికర రసాయనాలు నగర మార్కెట్లో మితిమీరిన స్థాయిలో ఉన్నాయని ఫుడ్ సేఫ్టీ విభాగం తెలిపింది. వ్యక్తిగత భద్రత ముఖ్యం.. విజ్ఞానం, సాంకేతికత ద్వారా అందే ఫలాలను అందరూ అందుకోగలగాలి. అప్పుడే జీవిత కాలం పెరగడంతో పాటు, ఒక మెరుగైన జీవితాన్ని అనుభవించగలరు. ఇందుకు విద్య, ఆరోగ్యం పట్ల అవగాహన, పరిసరాల–వ్యక్తిగత పరిశుభ్రత వంటివి చాలా ముఖ్యం.! అందుకే కాలుష్యం అధికంగా ఉన్న పట్టణాల కంటే గ్రామాల్లో ఆయుఃప్రమాణాలు తక్కువ.! పట్టణాల్లో కాలుష్యం తగ్గించే ప్రయత్నాలతో పాటు, గ్రామాల్లో కూడా మెరుగైన వైద్య సేవలు అందుబాటులో ఉండేలా చూసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటే, గ్రామ ప్రజల ఆయుర్దాయం ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది. – డా.ప్రతిభా లక్ష్మి, జనరల్ మెడిసిన్ – ప్రొఫెసర్ -
ప్రపంచ ఆరోగ్య వేదికపై ప్రసంగించిన తొలినటి...! ఏం మాట్లాడారంటే..
చలం, అంబేద్కర్ల నుంచి నటి, ఐక్యరాజ్యసమితి పాపులేషన్ ఫండ్ (యూఎన్ఎఫ్పీఏ) జెండర్ ఈక్వాలిటీకి ఈ దేశపు రాయబారి కృతిసనన్ దాకా అందరి మాటా ఒకటే స్త్రీ ఆరోగ్యమే దేశ భవిష్యత్ భాగ్యం అని!నిజానికి మహిళా ఆరోగ్యం, లింగ సమానత్వం గురించి మాట్లాడుకోవడానికి ప్రత్యేక సందర్భం అక్కర్లేదు.. అయినా ఈ ప్రస్తావనకు ప్రత్యేక సందర్భమూ ఉంది. అదే బెర్లిన్ (జర్మనీ)లో జరిగిన వరల్డ్ హెల్త్ సమ్మిట్ 2025. ఇందులో ఆమె మహిళల ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాల్సిన అవసరం గురించి మాట్లాడారు. ఇలా వరల్డ్ హెల్త్ సమ్మిట్లో ప్రసంగించిన తొలి భారతీయ నటిగా కీర్తి గడించారు. ఆ ప్రసంగంలో కీర్తి సనన్ ఏం మాట్లాడారంటే.. ‘మహిళల ఆరోగ్యం నిర్లక్ష్యం చేయాల్సిన లేదా పక్కన పెట్టాల్సిన విషయం కాదు. తక్షణమే దృష్టిపెట్టాల్సిన అత్యంత అవసరమైన అంశం. ఆమె ఆరోగ్యం.. మానవాళి ప్రగతికి, భవిష్యత్కు మూలస్తంభం. అందుకే మహిళా ఆరోగ్యానికి సంబంధించి సుస్థిరమైన పెట్టుబడులు కావాలి. ఆవిష్కరణలు జరగాలి. ఇందుకోసం చేసే ప్రతి ప్రయత్నం అద్భుతమైన ఆర్థిక, సామాజిక మార్పులుగా ప్రతిఫలిస్తుంది. ఏటా ముప్పై కోట్లు ఇన్వెస్ట్ చేస్తే పదమూడు వందల కోట్ల రాబడి కనిపిస్తోంది. అంటే దాదాపు తొమ్మిది రెట్ల లాభం. ఈ ఇన్వెస్ట్మెంట్ నైతికావసరమే కాదు మన మూకుమ్మడి భవిష్యత్కు భరోసా కూడా! ఎందుకంటే మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబాలు, సమాజం.. ఆరోగ్యంగా ఉంటాయి. ఆరోగ్యవంతమైన సమాజం ఆర్థికసుస్థిరతకు చిహ్నం. కానీ ప్రపంచ జనాభాలో సగంగా ఉన్న మహిళల ఆరోగ్యం ఏళ్లుగా నిర్లక్ష్యానికి గురవుతూనే ఉంది. యూఎన్ఎఫ్పీఏ జెండర్ ఈక్వాలిటీ అంబాసిడర్గా చాలా ప్రాంతాలు తిరిగాను. అవన్నీ కూడా బాల్యవివాహాలకు సాక్ష్యంగా కనపడ్డాయి. అమ్మాయిలకు మానసిక ఆరోగ్యం సంగతి అటుంచి కనీసం శారీరక ఆరోగ్య కేంద్రాలు కూడా అందుబాటులో లేని దుస్థితిలో ఉన్నాయి. వీళ్ల జీవితాలు మారాలంటే మహిళల ఆరోగ్యానికి సంబంధించి దృష్టి పెరగాలి. తక్షణమే ఆ దిశగా కార్యాచరణ నిర్ణయాలు జరగాలి’ అన్నారు కృతిసనన్. (చదవండి: 'జోంబీ' డ్రగ్ జిలాజైన్: అచ్చం 'జాంబీ రెడ్డి' మూవీ సీన్ని తలపించేలా..) -
'జోంబీ' డ్రగ్ జిలాజైన్: అచ్చం 'జాంబీ రెడ్డి' మూవీ సీన్ని తలపించేలా..
తేజ సజ్జా, ఆనంది కీలక పాత్రల్లో ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘జాంబిరెడ్డి’ మూవీలో ఎలాగైతే మనుషులు ప్రవర్తిస్తారో అలా బిహేవ్ చేస్తారట ఈ జిలాజిన్ డ్రగ్ తీసుకుంటే. దీన్ని కొందరు మత్తు పదార్థలతో కలపి తీసుకుంటారట. దాంతో మనుషులు అచ్చం జంతువుల మాదిరిగా ప్రవర్తిస్తారట. ఒక్కోసారి మోతాదు ఎక్కువైతే శరీరం కుళ్లిపోయి..ప్రాణాలు కూడా కోల్పోతారట. ఇంతకీ అసలేంటి డ్రగ్..?. అసలు దేని కోసం దీన్ని తయారు చేశారు?, ఏవిధంగా మత్తుపదార్థంగా వినియోగిస్తున్నారు అంటే..ప్రస్తుతం యూఎస్లో ఈ డ్రగ్ సంబంధిత మరణాలు అధికంగా ఉన్నాయి. అక్కడ ఫెంటానిల్ అనే మత్తు మందుని యువకులు సేవిస్తుంటారట. దానిలో 'జోంబీ' అనే జిలాజిన్ డ్రగ్ కలిపి ఇస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. ఇది శరీరంపై పలు దుష్ప్రభావాలు చూపిస్తుంది. ఒకరకంగా చెప్పాలంటే ప్రాణాంతకమైనది కూడా. నిజానికి ఇది జంతువులను సులభంగా అదుపులోకి తెచ్చే మత్తుమందు. దీన్ని పశువైద్య మందుగా ఉపయోగిస్తారు. అలాంటి డ్రగ్ని అక్రమ మాదకద్రవ్యాల్లో కలిపేస్తున్నట్లు నివేదికలు పేర్కొన్నాయి. ముఖ్యంగా ఫెంటానిల్ అనే మత్తు మందులో కలపడం వల్ల దాని దుష్ఫ్రభావం మరింత తీవ్రతరం అవుతుందట. ఇటీవల కాలంలో అందుకు సంబంధించిన మరణాలు అధికమవ్వడంతో వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతేగాదు ప్రస్తుతం దీనికి సంబంధించిన బాధితులను యూఎస్ ఫిలడెల్ఫియాలోని చుట్టుపక్కల ఉన్న ఆస్పత్రుల్లో వారానికి ఒకసారి చూడాల్సి వస్తోందని చెబుతున్నారు వైద్యులు.జిలాజిన్ అంటే ఏమిటి?జిలాజిన్ అనేది శక్తివంతమైన α-2 అడ్రినెర్జిక్ అగోనిస్ట్. దీనిని మొదట 1962లో బేయర్ అనే శాస్త్రవేత్త రక్తపోటు ఔషధంగా సంశ్లేషణ చేశారు. అయితే దీని తీవ్రమైన దుష్ప్రభావాల కారణంగా పశువైద్య కోసం ఉపయోగించడం మొదలుపెట్టారు. తరువాత ఇది 2000ల ప్రారంభంలో ప్యూర్టో రికోలో వీధి ఔషధంగా దుర్వినియోగం అవడం ప్రారంభించి..రాను రాను వ్యసనంగా మారింది. ఈ మందుని ఇంజెక్ట్ చేయగానే..కండరాలు సడలించి, నొప్పిని తగ్గించి వ్యక్తులను ఒక విధమైన మత్తులో జోగేలా చేస్తుందట. సింపుల్గా చెప్పాలంటే నోర్పైన్ ఫ్రైన్ విడుదలను తగ్గించి..ట్రాన్స్ లాంటి స్థితిని ప్రేరేపిస్తుంది. దీని ఫలితంగా జోంబీ లాంటి ప్రభావం ఏర్పడుతుంది. అదేనండి జాంబీ రెడ్డి మూవీలో విధంగా మనుషులు మారిపోతారని మాట. Welcome to Michigan 🥴🥴🥴🥴😂 pic.twitter.com/CfE1vE2fiM— 0HOUR (@0HOUR1__) September 6, 2025 ప్రమాదకరమైన ప్రభావాలు..ఈ డ్రగ్ నెమ్మదిగా హృదయ స్పందన రేటు పడిపోయేలా చేస్తుందట. తర్వాత తక్కువ రక్తపోటు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వంటి వాటిగి కలిగిస్తుంది. రక్తనాళాలను సంకోచించేలా చేసి తీవ్రమైన చర్మగాయాలకు దారితీస్తుందట. దీన్ని ఎక్కడ ఇంజెక్ట్ చేశామో ఆ ప్రాంతంలో రక్తసరఫరా, ఆక్సిజన్ సరఫరా తగ్గిపోతుందట. తద్వారా కణజాలం చనిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు వైద్యులు. ఇది అచ్చం మాంసం తినే బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లను పోలి ఉంటుందట. కొన్ని సందర్భాలలో కణజాల నెక్రోసిస్ కారణంగా అవయవాలు స్వయంచాలకంగా విచ్ఛిన్నమవడం, ఎముకలు బహిర్గతం అవ్వడం జరుగుతుందట. ఈ డ్రగ్ సంబంధిత గాయాలనేవి.. మోతాదు వినియోగం, వ్యక్తి స్థితిని బట్టి మారుతుంటుందట దాని ప్రభావం. ఆ డ్రగ్ ఇంజెక్ట్ అయిన ప్రాంతంలో నరాలకు కోలుకోలేనంత నష్టం ఏర్పుడతుంది కాబట్టి యథాస్థితి రావడం అసాధ్యమని చెబుతున్నారు నిపుణులు. కానీ ఈ వ్యసనం బారినుంచి బయటపడేలా చేసి, సాధారణ జీవితాన్ని అనుభవించేలా మాత్రం చికిత్స అందించగలమని నిపుణులు చెబుతున్నారు. అలా బయటపడి పూర్తి స్థాయిలో కోలుకున్నవాళ్లుకూడా ఉన్నారని చెబుతున్నారు.📍For informational purposes:These chilling scenes are coming out of Philadelphia, USA, linked to the widespread use of a drug called Xylazine.It’s so potent that it’s been described as a drug that “zombifies” humans 😳Could this be the beginning of an apocalypse? pic.twitter.com/r8Uiq2rYCz— ADTed✨ (@Eduo_Prince) September 6, 2025 (చదవండి: తెర వెనుక డాక్టర్ అనస్థీషియా..! వైద్య రంగంలో వారి సేవలు అద్భుతం..) -
చలి పులి వచ్చేస్తోంది..ఆరోగ్యం జాగ్రత్త!
దసరా అయిపోయింది..దీపావళి పండుగ సన్నాహాలు మొదలైపోయాయి. దీపాల పండుగ వచ్చేస్తుందటంట..వణికించే చలి మొదలైపోతుంది. సరదాగా అనిపించినా.. ఈ కాలంలో ఆహారం, ఆరోగ్యం రెండూ జాగ్రత్తగా చూసుకోవాల్సిందే. అంతేగాదు రైతులు కూడా ఈ అధిక చలికారణంగా నష్టాలను చవిచూస్తుంటారు. ఇలాంటి పరిస్థితుల నుంచి సేఫ్గా ఉండాలంటే..మరీ ఏడాది చలి ప్రభావం ఏ రేంజ్లో ఉందో ముందుగానే తెలుసుకుందామా..!.వాతావరణ శాస్త్రవేత్తలు ఈ ఏడాది భారత్ అత్యంత శీతల శీతకాలన్ని చవిచూడనుందని పేర్కొన్నారు. భారత వాతావరణ శాఖ సైతం ఈ ఏడాదిలో సాధారణం కంటే తక్కువ ఉష్ణోగ్రతలు, తరుచుగా చలి గాలులు, భారీ హిమపాతం వంటి ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది. ఈవిధమైన వాతావరణ మార్పు ప్రపంచ వాతావరణ వ్యవస్థలను దెబ్బతీస్తుందని చెబుతున్నారు వాతావరణ నిపుణులు. ఇప్పటికే జమ్ము కాశ్మీర్లోని సింథాన్ వంటి ప్రాంతాలన్నీ మంచుతో కప్పబడి ఉన్నాయి. ఇక ఇండో గంగా మైదానాల్లోకి చొచ్చుకుపోతున్న చల్లని గాలి పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ రాష్ట్రాలను ప్రభావితం చేస్తుందని నిపుణులు అంచనా వేశారు. అలాగే వాతావరణ ఉష్ణోగ్రతలు తరుచుగా మార్పులు చోటుచేసుకుంటాయని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటియోరాలజీలో సీనియర్ క్లైమాటాలజిస్ట్ డాక్టర్ రీతు శర్మ అన్నారు. ఈ ముందస్తు శీతాకాలపు సూచన ముఖ్యంగా వ్యవసాయం, ప్రజారోగ్యం వాటికి సంబంధించి మెరుగైన సంసిద్ధతకు మేల్కొలుపుగా పేర్కొన్నారు. ఈ ఏడాది రైతులకు అధిక శీతగాలుల కారణంగా గోధుమ, ఆవాలు వంటి రబీ పంటలు దెబ్బతినే అవకాశం ఉందన్నారు. అలాగే ఆరోగ్యపరంగా.. శ్వాసకోస వ్యాధులు, ఫ్లూ వ్యాధులు ప్రబలంగా ఉండే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. ప్రస్తుతం భారతదేశం ప్రపంచ ఆహార దినోత్సవాన్ని జరుపుకుంటున్నందున ఈ వాతావరణ మార్పు, ఆహార భద్రత ఒకదానిపై ఒకటి ఎలా ఆధారపుడుతున్నాయో హైలెట్ చేశారు. అలాగే ఈ ముదస్తు వాతావరణ హెచ్చరికతో ఎలాంటి వ్యవసాయానికి పెట్టుబడి పెడితే మంచిదనేది నిర్ణయించొచ్చని ఎఫ్ఏఓ ప్రతినిధి ప్రియామీనన్ అన్నారు. అలాగే చలికాలం సమీపిస్తున్నందున ప్రజలంతా తమ నిత్యావసరాలను అనువైన విధంగా నిల్వ చేసుకోవడం తోపాటు అనారోగ్యం బారినపడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు నిపుణులు.(చదవండి: Success Story: ఆఫీస్ బాయ్ నుంచి సీఈవో రేంజ్కి..! ఏకంగా డిజైన్ దిగ్గజం కాన్వాతో..)


