Health
-
సమ్మర్లో హైడ్రేషన్ కోసం..!
వైశాఖం రాకమునుపే సూర్యుడు భగ్గుమంటున్నాడు. ఎండలు మండిపోతున్నాయి. ఉక్కపోతలతో ప్రజలు అల్లాడి పోతున్నారు. భానుడి సెగ మాములుగా లేదు. ముఖ్యంగా పెద్దలు, చిన్నపిల్లలు, గర్భిణిలు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. ముఖ్యంగా డీ హైడ్రేషన్ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. అందరూ సమ్మర్లో హైడ్రేటెడ్గా ఉండటం కోసం.. నీళ్లు దగ్గర నుంచి పండ్లు, తీసుకునే ఆహారం వరకు ఈ పొరపాట్లు చేస్తుంటారని హెచ్చరిస్తున్నారు. దాంతో తీవ్ర డీహైడ్రేషన్ బారినపడి లేనిపోని సమస్యలు కొనితెచ్చుకుంటారుని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఎండకాలం హైడ్రేషన్గా ఉండటం కోసం చేయకూడని పొరపాట్లు ఏంటో ఆరోగ్య నిపుణుల మాటల్లోనే చూద్దామా..!.ఒకేసారి ఎక్కువగా నీరు త్రాగడందాహం వేసిందనో మరే కారణంగానో ఒకేసారి ఎక్కువ నీరు తీసుకోకూడదని చెబుతున్నారు నిపుణులు. దీనివల్ల ఎక్కువ పరిమాణాంలోని నీరు కణాలకు సమర్ధవంతంగా అందుకుండానే బయటకు వెళ్లిపోతుందట. అరలీటరు నీరు తాగితే నాడీ వ్యవస్థ కార్యచరణ మెరుగ్గా ఉంటుందట. అంతకుమించి తాగితే శరీరంలోని కణాలకు తేమ అందకుండా పోతుందని అధ్యయనాల్లో వెల్లడైందని చెబుతున్నారు.నీరు శాతం ఎక్కువగా ఉండే పండ్లను ఎంచుకోకపోవడం..శరీరానికి తేమను అందించడానికి కేవలం నీరు మాత్రమే కాకుండా ఆహారం కూడా తోడ్పడుతుంది. పుచ్చకాయ, దోసకాయ, నిమ్మజాతి పండ్ల వంటివి ద్రవాల శరీరానికి అవసరమైన ఖనిజాలను అందిస్తాయి. ఇవి వేడి వాతావరణంలో తేమను నిలుపుకోవడానికి, శక్తి స్థాయిలను కాపాడుకోవడానికి సహాయపడతాయి అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులుడీహైడ్రేషన్ను తీవ్రతరం చేసే పానీయాలు ..చాలామంది ఎంత ఎండకాలం అయినా.. కాఫీ, టీలు పడాల్సిందే లేదంటే కష్టం. వేసవిలో ఇవి శరీరానికి తగినంత నీరు సమర్థవంతంగా అందకుండా చేస్తుందట. అలాగే కూల్డ్రింక్లు, ఇతర పానీయాలు శరీరానికి నీరు అందుతుందన్న భావనను కలిగిస్తాయి గానీ ఇవన్నీ డీహైడ్రేషన్ను మరింత తీవ్రతరం చేస్తాయని అంటున్నారు.హైడ్రేషన్ స్థిరంగా ఉండదట..హైడ్రేషన్ అవసరాలు స్థిరంగా ఉండవని అంటున్నారు. శారీరక శ్రమ, వయస్సు, మొత్తం ఆరోగ్యం ఆధారంగా మారుతూ ఉంటాయి. ఇంట్లో ఉన్నప్పుడు కూడా, ముఖ్యంగా ఎయిర్ కండిషన్డ్ వాతావరణంలో శరీరం ద్రవాలను కోల్పోతూనే ఉంటుందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. మన యూరిన్ రంగు ఆధారంగా మన శరీరం హైడ్రేటెడ్గా ఉందా లేదా అని తెలుసుకోవచ్చని చెబుతున్నారు నిపుణులు. అదెలా అంటే..మూత్రం రంగు మరి చిక్కగా పసుపు రంగులో ఉంటే వేడి అధికంగా ఉందని, తక్కువ పసుపు రంగులో ఉంటే..తగినంతగా నీరు తీసుకోవాలని..అలా కాకుండా నీళ్లలా ప్యూర్గా ఉంటే..శరీర హైడ్రేటెడ్గా ఉందని అర్థమట.వేళకు తగిన నీరు అత్యంత ముఖ్యం..నీరు తాడం మాత్రమే చూస్తాం. ఎంత వ్యవధిలో తాగుతున్నాం అనేది ముఖ్యం. చాలా సమయం అయ్యాక తగితే..అంత ప్రభావవంతగా ఉండదు. పైగా దీని కారణంగా బయటకు వెళ్లిన వెంటనే వడదెబ్బ బారిన పడతామని అంటున్నారు. అలాగే భోజనంలో బాగా ఆయిల్తో చేసే పదార్థాలకు దూరంగా ఉండాలంటున్నారు. తేలికపాటి కాలనుగుణ భోజనమే మేలని చెబుతున్నారు.ఎండకు గురైన వెంటనే నీళ్లు తాగటం..తీవ్రమైన ఎండ నుంచి వచ్చిన వెంటనే చల్లటినీళ్లు అస్సలు తాగకూడదల. ఇది జీర్ణక్రియకు ఆటంకం కలిగించి, శరీర ద్రవాలు సమర్థవంతంగా శోషించబడటాన్ని నెమ్మదింపచేస్తుందట. అందుకుని నీళ్లు లేదా కొబ్బరి నీళ్లను తాగే ముందు ఎండకు గురైన శరీరం తగిన ఉష్ణోగ్రతకు స్థిరపడే వరకు ఆగి తీసుకోవాలని చెబుతున్నారు నిపుణులు.ఇళ్లలో, జర్నీ సమయాల్లో చేసే తప్పిదాలు..ఇంటి వద్ద, కార్యాలయాల్లో ఉన్నప్పుడూ అంతగా నీరు తీసుకోవడం మర్చిపోతుంటారట. రిలాక్స్ అయిపోయి నీడ పట్టునే ఉన్నాం కదా అని తగినంత నీరు తీసుకోరని అంటున్నారు. అందువల్ల ఇలా అస్సలు చెయ్యొదని హెచ్చరిస్తున్నారు.ఉప్పుని మరింత దూరంగా ఉంచడం..ఈ కాలంలో చెమటలు పట్టి..శరీరంలో ఎలక్ట్రోలైట్లు నష్టం ఎక్కువగా ఎదుర్కొనాల్సి ఉంటుందట. వేసవి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు ఉప్పును పూర్తిగా మానుకోవడం వల్ల, ఖనిజాలు కోల్పోయి కొన్నిసార్లు నీరసం, తలతిరగడం వంటి సమస్యలు ఎదురవ్వుతాయని అంటున్నారు.డీహైడ్రేషన్ పెద్ద సమస్య కాదనే అభిప్రాయం..నిజానికి డీ హైడ్రేషన్ మన మానసిక స్థితి, ఏకాగ్రతపై తీవ్ర ప్రభావం చూపిస్తుందట. అధిక వేడి పరిస్థితులు దేనిపై స్థిమ్మితంగా ఆలోచించేలా చేయనివ్వదట. అందుకే తగినంత నీరు తాగితేనే మన శరీరం యాక్టివ్గా ఉండి..ఏ పనైనా సులభంగా చేయగలుగులతామని చెబుతున్నారు నిపుణులు.(చదవండి: Weight loss: వ్యాయామాలు చేయకుండానే 13 కిలోలు..! ఆ అమ్మ ఫిట్నెస్ మంత్ర..) -
నో ఇంజెక్షన్, రోజుకో పిల్ : యూఏఈ సంచలనం
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) ఆరోగ్య రంగంలో ఒక కీలక మార్పు చోటుచేసుకుంది. ఊబకాయం (Obesity) తగ్గించుకోవడానికి ఇంజెక్షన్లతో పనిలేకుండా, రోజూ ఒక మాత్ర వేసుకుంటే సరిపోయే 'ఫౌండాయో' (Foundayo - orforglipron) అనే ఔషధానికి యూఏఈ ప్రభుత్వం ఆమోదం తెలిపింది.ప్రముఖ ఫార్మా కంపెనీ 'ఎలీ లిల్లీ' (Eli Lilly) దీనిని అభివృద్ధి చేసింది. ఎమిరేట్స్ డ్రగ్ ఎస్టాబ్లిష్మెంట్ తీసుకున్న ఈ నిర్ణయంతో, ఇంజెక్షన్ల ద్వారా బరువు తగ్గించే చికిత్సలకు సూది అవసరం లేని ప్రత్యామ్నాయాన్ని ప్రవేశపెట్టిన ప్రపంచంలోని మొదటి దేశాలలో యూఏఈ ఒకటిగా నిలిచింది.ఫౌండాయో ప్రత్యేకతలుటైప్ 2 మధుమేహం, గుండె జబ్బులు, కొన్ని రకాల క్యాన్సర్లతో సహా తీవ్రమైన దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో ఊబకాయం ముడిపడి ఉన్న తరుణంలో ఈ ఆమోదం లభించింది.ఇప్పటివరకు బరువును తగ్గించుకునే చికిత్సలో ఇంజెక్షన్లను తీసుకోవాల్సి వచ్చేది. ఇపుడిక సూదితో పనిలేకుండానే బరువు తగ్గవచ్చు. బరువు తగ్గడానికి వాడే 'GLP-1' మందులు ఇంజెక్షన్ల రూపంలో ఉండేది. కానీ ఫౌండాయో అనేది నోటి ద్వారా తీసుకునే మాత్ర. సులభమైన పద్ధతి కూడా. ఈ మాత్రను భోజనంతో సంబంధం లేకుండా రోజుకు ఒకసారి వేసుకోవచ్చు. ఇది రోగులకు చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. అలాగే ఈ మాత్రకు USFDA ఆమోధం లభించింది. ప్రయోగాల్లో ఇది 15శాతం వరకు బరువు తగ్గినట్టు తేలింది. ఎలా పని చేస్తుంది?ఇది శరీరంలోని ఆకలిని నియంత్రించే హార్మోన్లలా పనిచేస్తుంది. దీనివల్ల కడుపు నిండిన భావన కలుగుతుంది, ఆకలి తగ్గుతుంది, తద్వారా తక్కువ కేలరీలు తీసుకుంటారు. ఈ మాత్ర అందరికీ అందుబాటులో ఉండదు. ఇది సాధారణ లేదా సౌందర్య ఉపయోగం కోసం ఉద్దేశించినది కాదు. కేవలం వైద్యుని సిఫార్సుతో, కఠినమైన వైద్య పర్యవేక్షణలో మాత్రమే లభిస్తుంది. యూఏఈ వ్యాప్తంగా ఉన్న వైద్యులు ఈ మందును సిఫార్సు చేసే ముందు స్పష్టమైన అర్హత మార్గదర్శకాలను పాటించాల్సి ఉంటుంది.యూఏఈలోని ఫార్మసీలలో మే 2026 నుండి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఎవరు వాడకూడదు. చికిత్స ప్రారంభించే ముందు రక్త పరీక్షలు మరియు మెటబాలిక్ స్క్రీనింగ్ తప్పనిసరి. బాడీ మాస్ ఇండెక్స్ (BMI) 30 పైన ఉన్నవారు లేదా BMI 27 ఉండి రక్తపోటు, మధుమేహం వంటి సమస్యలు ఉన్నవారు దీనికి అర్హులు.ఇదీ చదవండి: ఒకప్పుడు స్టార్ లీడర్.. చివరికి భార్యను హత్య చేసి, ఆత్మహత్యఫలితాలు, సైడ్ ఎఫెక్ట్స్ క్లినికల్ ట్రయల్స్ ప్రకారం, ఈ మాత్ర వాడిన వారు 72 వారాల కాలంలో సగటున 12.4% బరువు (సుమారు 12 కిలోలు) తగ్గినట్లు తేలింది. బరువుతో పాటు కొలెస్ట్రాల్ , రక్తపోటు కూడా తగ్గుతాయి. ప్రారంభ దశలో వికారం, జీర్ణక్రియ సమస్యలు ఉండవచ్చు. అందుకే వైద్యుల పర్యవేక్షణ అవసరం.ఇదీ చదవండి: ఇన్స్టా లవ్ : 40 ఏళ్ల విడోతో 21 ఏళ్ల యువకుడి పెళ్లిధర ఎంత? యూఏఈలో దీని అధికారిక ధర ఇంకా ఖరారు కాలేదు. ఇన్సూరెన్స్ కంపెనీలు దీనిని కవర్ చేస్తాయనే దానిపై ధరను నియంత్రించవచ్చు. మరో బరువు తగ్గే ఔషం Novo Nordiskతో పోటీగా దీని ధర నెలకు సుమారు 149 డాలర్లుగా నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఇదీ చదవండి: LPG Gas రూ. 12 వేల కోట్లతో నాలుగు పైప్లైన్ల ప్లాన్నోట్ : బరువు తగ్గడం అనే ప్రక్రియ షార్ట్కట్లతో కాదు. కచ్చితమైన వ్యాయామం, ఆహార నియమాలు అవసరం. అలాగే వైద్యుల పర్యవేక్షణ తప్పనిసరి. గర్భిణీలు, పాలిచ్చే తల్లులు,కొన్ని రకాల థైరాయిడ్ సమస్యలు ఉన్నవారు ఇలాంటి మందులను వాడకూడదని గమనించాలి. -
వ్యాయామాలు చేయకుండానే 13 కిలోలు..! ఆ అమ్మ ఫిట్నెస్ మంత్ర..
ఇటీవల బరువు తగ్గడం ఆధునిక ట్రెండ్గా మారింది. అందరూ చక్కటి శరీరాకృతిలో యంగలుక్లో కనిపించడం కోసం రకరకాల డైటింగ్లు, వర్కౌట్లతో పాట్లుపడుతున్నారు. కానీ కొందరు సింపుల్ చిట్కాలతో అద్భుతంగా బరువు తగ్గి ఆశ్చర్యపరుస్తున్నారు. బరువు తగ్గిన చాలామంది ఎంతో కొంత వ్యాయామాలు, వాకింగ్ వంటివి చేశామని చెప్పగా ఈ పిల్లల తల్లి మాత్రం అవేమి చేయకుండానే బరువు తగ్గానంటోంది. పైగా ఆరోగ్యకరమైన రీతీలోనే తగ్గానని చెబుతుండటం విశేషం. మరి అదెలాగో ఆమె మాటల్లోనే చూద్దామా..!.ముంబైకి చెందిన పిల్లల తల్లి, కంటెంట్ క్రియేటర్ సురభి పిసల్ తన వెయిట్లాస్ జర్నీని ఇన్స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసుకున్నారు. తాను ప్రసవానంతరం గుర్తుపట్టలేనంతగా మారిపోయానని చెప్పుకొచ్చింది. మళ్లీ తనలా మార్పు కోసం నెమ్మదిగా బరువతగ్గే యత్నం చేశానని చెప్పుకొచ్చింది. అయితే తాను వ్యాయామాలు చేయలేదని చెబుతోంది. తన జీవనశైలికి సరిపోయే విధంగా చిన్న, చిన్న స్థిరమైన మార్పులు మాత్రమే చేశానని అంటోంది. అయితే డెలివరీ తర్వాత పరిస్థితులు కాస్త కష్టంగా ఉన్నాయని, ఏ డైట్చేసినా కడుపు ఉబ్బరం, బరువు పెరడం వంటి సమస్యలతో ఇబ్బందిపడ్డట్లు వివరించారామె. అప్పుడే తాను ఆపిల్ సైడ్ వెనిగర్ని ఉపయోగించటం ప్రారంభించానని అన్నారు. ఇది తన జీవక్రియను మెరుగుపరిచి, ఆకలి కోరికలను నియంత్రించడానికి సహాయపడిందని అంటోంది. అది క్రమంగా తన బరువులో మార్పులకు దారితీసింది. ఇంతకుమునుపు సరిపోని బట్టలు సరిపోవడంతో మానసికంగా కాస్తం స్థైర్యం రావడం మొదలైందని తెలిపింది. కేవలం బరువు తగ్గడం పైనే కాకుండా మొత్తం ఆరోగ్యంపై కూడా ఫోకస్ పెట్టానన్నారు. అందుకోసం ఏ చాశారో కూడా చెప్పారు.నల్ల జీలకర్ర నూనె (ఖాళీ కడుపుతో): జీవక్రియను పెంచడానికి, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానిక హెల్ప్ అవుతుందట.బుల్లెట్ప్రూఫ్ కాఫీ (బ్లాక్ కాఫీ + కొబ్బరి నూనె): ఇది తక్షణ శక్తిని అందిస్తుందట. పైగా కొబ్బరినూనెలోని ఆరోగ్యకరమైన కొవ్వులు శరీరంలోని కొలెస్ట్రాల్ని కరిగిస్తుందట.ఎల్డర్బెర్రీ పొడి: దీన్ని పెరుగుతో కలిపి తీసుకుంటే దీనిలోని యాంటీఆక్సిడెంట్లను మెరుగైన రోగనిరోధక శక్తికి, జీర్ణక్రియకు మద్దతిస్తుందని చెప్పుకొచ్చారామె.తాను తన ఆరోగ్యంపై దృష్టిపెట్టడంతో ఆటోమేటిగ్గా బరువు తగ్గిపోయానని అంటోంది. నిజం చెప్పాలంటే వెయిట్లాస్ దానంతట అది జరిపోయిందని చెబుతోంది ఈ న్యూ మామ్. View this post on Instagram A post shared by Surabhi Pisal (@surabhi_littlereviews) గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. అనుసరించే ముందు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం.(చదవండి: Weight Loss Tips: చూయింగ్ గమ్ నమలడం నుంచి 3-2-1 రూల్..! ఏకంగా 80 కిలోలు..) -
లిటిల్ డాక్టర్
పిల్లలు రోజులో ఎన్ని నీళ్లు తాగాలి, వ్యాయామం ఎందుకు అవసరం, కూల్ డ్రింక్స్ ఎందుకు తాగకూడదు, రోజులో విశ్రాంతి ఎంత అవసరం, సన్స్ట్రోక్ తగిలితే ఏం చేయాలి, చిన్న చిన్న గాయాలకు ఫస్ట్ ఎయిడ్ ఎలా చేయాలి... ఇలా ఈ వేసవిలో ఆరోగ్య అవగాహన వల్ల పిల్లల భవిష్యత్తుకు ఎంతో మేలు చేస్తుంది అంటున్నారు నిపుణులు. ఫన్గా, ఉపయుక్తంగా హెల్దీ కిట్ను అందిద్దాం..ఎండ వేడికి ఒంట్లోని నీరు ఆవిరైపోతుంటుంది. శరీరం అలసటగా మారిపోతుంటుంది. స్కూల్ లేదని రాత్రిళ్లు ఆలస్యంగా నిద్రపోవడం, ఉదయం లేటుగా లేవడం సాధారణమే. పెద్దలు కూడా సెలవులే కదా... అని వదిలేస్తుంటారు. అలాగే ఆహారం, శారీరక శ్రమ గురించి అంతగా శ్రద్ధ చూపరు. ఆ నిర్లక్ష్యం మిగతా వాటిపైనా ప్రభావం చూపుతుంది. ఎండ తీవ్రతకు డీహైడ్రేషన్ , స్కిన్ ర్యాషెస్, కడుపునొప్పి, తలనొప్పి.. వంటి సమస్యలూ తలెత్తవచ్చు. అవగాహన పాఠాన్ని ఆచరణలో చూపిస్తే మేలైన ప్రయోజనాలను సులువుగా పొందవచ్చు.→ సూపర్ హీరో ఛాలెంజ్→ నీళ్లు తాగడం బోర్ అని పిల్లలు అనకుండా ఉండాలంటే రోజుకు 6–8 గ్లాసుల ‘వాటర్ ఛాలెంజ్’ ఇవ్వచ్చు. ‘నీళ్లు తాగకుంటే శరీరం వేడెక్కుతుంది’ అని చెప్పి, ప్రతి గ్లాస్కు ఒక స్టార్, వారం రోజులు పూర్తయితే చిన్న రివార్డ్ ఇచ్చి ప్రోత్సహించవచ్చు. కూల్ డ్రింక్స్ కాకుండా కొబ్బరి నీళ్లు, నిమ్మరసం, బటర్మిల్క్... వంటి సహజ పానీయాల గురించి చెప్పి వాటిని తయారు చేయించవచ్చు. → ఉదయం పది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటలలోపు బయటకు వెళ్లాల్సి వస్తే ఎండ నుంచి రక్షణగా టోపీ, సన్ గ్లాసెస్, సన్స్క్రీన్, కాటన్ దుస్తులు, బ్యాగ్, వాటర్ బాటిల్.. ఇలా ఏయే వస్తువులు ఉపయోగించాలో ఒక పజిల్ టాస్క్గా ఇవ్వచ్చు. → ఐస్క్యూబ్స్ వేసిన పానీయాలు గొంతునొప్పి, జలుబు .. వంటి సమస్యలకు ఎలా కారణం అవుతాయో డిజిటల్ మీడియాలో వచ్చిన వీడియోలను చూపి తెలియజేయవచ్చు. → పొట్ట తేలికగా ఉండేలా పండ్లు, కూరగాయలు ఏ విధంగా ఉపకరిస్తాయో చెప్పి, జంక్ ఫుడ్, వేయించిన పదార్థాలకు ఎందుకు దూరంగా ఉండాలో వివరించవచ్చు. ∙చెమట వల్ల వచ్చే స్కిన్ ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణకు రోజూ స్నానం చేయడం, చేతులు శుభ్రం చేసుకోవడం వంటి వాటిని అలవాటు చేయాలి. → ఎండ తీవ్రత తక్కువ ఉన్నప్పుడు ఆరు బయట ఆటలను ప్రోత్సహించాలి.→ తలనొప్పి, తిమ్మిరి, వాంతులు, జ్వరం వంటి లక్షణాలు ఎవరికైనా ఉంటే పెద్దలకు తెలియజేయడం వల్ల సమస్యకు సత్వర పరిష్కారం ఉంటుందని చెప్పాలి.→ ఆటగా డాక్టర్ గేమ్...పిల్లలకు ఫస్ట్ ఎయిడ్ నేర్పడం అంటే కేవలం గాయాలకు ఎలా చికిత్స చేయాలో చెప్పడం మాత్రమే కాదు, అత్యవసర పరిస్థితుల్లో ధైర్యంగా, తెలివిగా స్పందించేలా తయారు చేయడం కూడా. → ఫస్ట్ ఎయిడ్ బాక్స్లో ఉండాల్సిన వస్తువుల గురించి అవగాహన కల్పిస్తూనే, గాయాలకు ప్రథమ చికిత్స ఎలా చేసుకోవాలో నేర్పించాలి. → ముక్కు నుండి రక్తస్రావం అయితే ఏం చేయాలి, ఏదైనా కారణం చేత పెద్ద గాయం అయినా, వాపు సంభవించినా పెద్దలను లేదా డాక్టర్ను సంప్రదించడం గురించి చెప్పాలి.→ అత్యవసర నంబర్లను పిల్లలకు నేర్పాలి. డాక్టర్–పేషంట్ గేమ్ను ఆడించవచ్చు. → హెల్త్ అవేర్నెస్ క్యాంపులకు తీసుకెళ్లవచ్చు. చొరవ తీసుకొని తమ కమ్యూనిటీలలో హెల్త్ అవేర్నెస్ వర్క్షాప్స్ నిర్వహించవచ్చు. → మార్కెట్లో లభించే డాక్టర్ కిట్ టాయ్, ఆర్గాన్ టాయ్స్తోనూ అవగాహన కలిగించవచ్చు.→ ప్లేటు నిండుగా ఆరోగ్యం..హెల్త్ టాపిక్ను ఒక క్లాస్లా చెబితే... దూరంగా వెళ్లిపోతారు. అలా కాకుండా ప్లేట్ మీద చూపించవచ్చు. పుచ్చకాయ ‘ఇది నీళ్లు ఎక్కువగా ఇస్తుంది. కీరా.. ఇది శరీరాన్ని కూల్ చేస్తుంది’ ఇలాంటి ఉదాహరణలు పరిచయం చేయవచ్చు. జంక్ ఫుడ్ ఎక్కువైతే బాడీ ఏ విధంగా అలసిపోతుందో చెప్పవచ్చు. వాస్తవానికి దగ్గరగా! వేసవిలో నిద్ర, ఆహారం విషయంలో క్రమశిక్షణ ఉండదు. దీని వల్ల శారీరక, మానసిక ఆరోగ్యంపైనా చెడు ప్రభావం చూపుతుంది. టీవీ, మొబైల్స్ను ఉపయోగించడం వల్ల కంటి సమస్యలు, మానసిక సమస్యలు ఎలా ఉత్పన్నం అవుతాయో చూపాలి. స్కూల్ టైమ్ పాఠాల మాదిరి ఆరోగ్య సందేశాలను ఇవ్వకూడదు. ప్రతీది ప్రాక్టికల్గా చూపుతూ, పిల్లలను ఇన్వాల్వ్ చేస్తూ ఆరోగ్య అవగాహన కలిగించాలి. – డా.పి.జ్యోతిరాజ, లైఫ్ స్కిల్ ట్రైనర్– నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
మజ్జిగ లేదా నిమ్మరసం చాలా.. డీహైడ్రేషన్కు అదే మేలా?
దేశంలో మునుపెన్నడూ లేని విధంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి, తీవ్రమైన వేసవికాలంతో పాటు అధిక తేమ కూడా తోడవుతోంది. వాస్తవానికి, రాబోయే కొన్నేళ్లు దేశ చరిత్రలోనే అత్యంత వేడిగా ఉండే కాలంగా ఉంటుందని ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది, దీనివల్ల ఎక్కువ మంది డీహైడ్రేషన్ కు గురయ్యే అవకాశం ఉంది. దీనిలో భాగంగా, దక్షిణ భారతదేశం, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలు వడగాలుల బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ నేపధ్యంలో సరైన హైడ్రేషన్ ఉత్పత్తులపై అవగాహన అవసరం అంటున్నారు వైద్య నిపుణులు.ఎలక్ట్రోలైట్ల లోపం కీలకం...అనారోగ్యం లేదా విరేచనాల సమయంలోనూ, అలాగే రోజువారీ సంరక్షణలోనూ, ఉన్నతమైన హైడ్రేషన్ ఉత్పత్తులతో శరీరానికి తగినంత నీరు అందించడంపై అవగాహనను పెరగాల్సి ఉంది. తెలుగు రాష్ట్రాలలోని అనేక ప్రాంతాలలో, డీహైడ్రేషన్ కు ఇప్పటికీ మజ్జిగ లేదా నిమ్మరసం వంటి ఇంటి చికిత్సలే మొదటి పరిష్కారంగా ఉన్నాయి. ఒక వ్యక్తి డీహైడ్రేషన్ కు గురైనప్పుడు, వారు కేవలం ద్రవాలను మాత్రమే కాకుండా సోడియం, క్లోరైడ్, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం మొదలైన ఎలక్ట్రోలైట్లను కూడా కోల్పోతారు. నిజానికి ఎలక్ట్రోలైట్లు శరీరంలోని సంకేత అణువులు. అవి నరాల ద్వారా ప్రయాణించి, కదలికలకు సహాయపడి, వ్యక్తులు చురుకుగా ఉండేలా చేస్తాయి అని అంటున్నారు హైదరాబాద్కు చెందిన వైద్యులు డా. అశుతోష్. మరి అలాంటి ఎలక్ట్రోలైట్ల లోపం కండరాల కదలికను తగ్గించి, అలసట నీరసానికి దారితీస్తుంది. మరి వీటిని పునరుద్ధరించుకోవడానికి ఏం చేయాలి?స్పోర్ట్స్ డ్రింక్స్, ఎనర్జీ పానీయాలు, గ్లూకోజ్ పౌడర్లు వివిధ ఎలక్ట్రోలైట్ ఉత్పత్తులు మార్కెట్లోకి ప్రవేశించడంతో, హైడ్రేషన్ ఎలక్ట్రోలైట్ విభాగం పోటాపోటీగా మారింది. పెరుగుతున్న ఆరోగ్య స్పృహ భారతదేశ వాతావరణ పరిస్థితులలో మార్పుల కారణంగా హైడ్రేషన్ విభాగం విపరీతమైన వృద్ధిని సాధించింది. ఈ నేపథ్యంలో, వినియోగదారులు అనారోగ్య సమస్యలకు అతీతంగా, శక్తి క్షీణించినప్పుడు లేదా అలసిపోయినప్పుడు వేగంగా కోలుకోవడానికి అనేక రకాల ఆరోగ్యకరమైన హైడ్రేషన్ సొల్యూషన్లను కోరుకుంటున్నారు. డీహైడ్రేషన్ ఒక ముఖ్యమైన ఆరోగ్య సమస్యగా మారుతున్నందున, విరేచనాలు రోజువారీ హైడ్రేషన్ అవసరాలను తీర్చడానికి కెన్ వ్యూ ఓఆర్ఎస్ఎల్, ఇఆర్జెఎల్ వంటి బ్రాండ్స్ అందుబాటులో ఉన్నాయి. వడదెబ్బ, కండరాల నొప్పులు మొదలైన రోజువారీ సందర్భాలలో నీరసంగా అనిపించినప్పుడు లేదా అలసట, బలహీనత కారణంగా నిస్సత్తువగా ఉన్నప్పుడు ఇవి సహాయకారిగా పనిచేస్తున్నాయి. రోజువారీ హైడ్రేషన్ కోసం రూపొందిన ఎలక్ట్రోలైట్ డ్రింక్, మూడు ముఖ్యమైన ఎలక్ట్రోలైట్లను (సోడియం, పొటాషియం, క్లోరైడ్) విటమిన్ సి లను వేగవంతమైన హైడ్రేషన్ ను అందిస్తూనే, పండ్ల రసాల తరహాలో రుచికరంగా ఉండేవి అందుబాటులో ఉన్నాయి.అయితే సరైన సందర్భాలకు సరైన హైడ్రేషన్ ద్రావణాలను ఎంచుకోవడంపై అవగాహన కల్పించడానికి కల్పించాలి. ఉదాహరణకు, విరేచనాల కోసం డబ్లు్యహెచ్ఓ ఆమోదించిన ఓఆర్ఎస్ ద్రావణాలు రోజువారీ హైడ్రేషన్ కోసం ఎలక్ట్రోలైట్ ద్రావణాలు వినియోగించాలి. ఇలాంటి అవగాహన పెంచేందుకు తెలుగు రాష్ట్రాలలో వైద్య నిపుణులు ఆరోగ్య సంరక్షణ సంస్థలతో కెన్ వ్యూ బ్రాండ్ కలిసి పనిచేస్తోంది అని చెప్పారు సంస్థ కు చెందిన ప్రశాంత్ షిండే.ఏడాది పొడవునా...డీహైడ్రేషన్పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వాతావరణంపై పెరిగిన అవగాహన మహమ్మారి అనంతర ఆరోగ్యం పై దృష్టి సారించడం వంటి అంశాలన్నీ కలిసి, క్రియాశీల నివారణ సంరక్షణ వైపు మార్పును వేగవంతం చేశాయి. చాలా మంది ప్రతిరోజూ తగినంత నీరు తాగడాన్ని ఒక ఆరోగ్యకర అలవాటుగా పరిగణిస్తున్నారు. అయితే నిలకడ లేని వాతావరణ పరిస్థితులతో పాటు తీరికలేని జీవనశైలిని గడుపుతున్నందున, డీహైడ్రేషన్ కేవలం వేసవి కాలానికే పరిమితం కావడం లేదు. ఎండలో , ఏసీ ఉన్న ప్రదేశాలలో ఉన్నప్పుడు, అలాగే జ్వరం, జలుబు, దగ్గు వంటి అనారోగ్యాల సమయంలో కూడా సంభవించవచ్చు. వడదెబ్బ లేదా నీరసం, బలహీనత కారణంగా నిస్సత్తువగా అనిపించినప్పుడు, రోజువారీ సందర్భాలలో ఎలక్ట్రోలైట్లు నీరు తగ్గిపోయినట్లు అనిపించినప్పుడు, వాటిని తిరిగి నింపడానికి ఇఆర్జెఎల్ వంటివి సహాయపడుతుందన్నాయి.డీహైడ్రేషన్ , పిల్లలు, వృద్ధులు శారీరకంగా శ్రమతో కూడిన జీవనశైలి కలిగినవారు ఎక్కువ సమయం ఆరుబయట గడిపేవారితో సహా కొన్ని వర్గాలు డీహైడ్రేషన్ కు ఎక్కువగా గురవుతాయి. చిన్న పిల్లలు తమ దాహాన్ని సరిగ్గా చెప్పలేరు, దీనివల్ల డీహైడ్రేషన్ కు సులువుగా లోనవుతారు. వృద్ధులలో దాహానికి గురి చేసే యంత్రాంగం బలహీనంగా ఉంటుంది, వారు అనారోగ్యం వేడి సంబంధిత డీహైడ్రేషన్ రెండింటికీ గురయ్యే అవకాశం ఉంది. మధుమేహం వంటి అనారోగ్య సమస్యలు ఉన్నవారు డీహైడ్రేషన్ కు ఎక్కువ గురయ్యే అవకాశం ఉంది వారి డీహైడ్రేషన్ ను జాగ్రత్తగా పరిష్కరించడం అవసరం. ఇలాంటి వినియోగదారుల సమూహాలకు, కోల్పోయిన వాటిని భర్తీ చేయడానికి నీటితో పాటు తగినంత ఎలక్ట్రోలైట్లను తీసుకుంటూ శరీరాన్ని హైడ్రేటెడ్గా ఉంచుకోవడం చాలా ముఖ్యం. అతిసారం అనేది ఒక ముఖ్యమైన ప్రజారోగ్య సమస్య, ఇది చిన్నపిల్లల మరణాలకు కారణమవుతుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫార్సు చేసిన ఓరల్ రీహైడ్రేషన్ సాల్ట్స్ అతిసారం చికిత్సలో ఉపకరిస్తుంది.అవగాహన కార్యక్రమాలు... నిర్వహిస్తున్నాం డీహైడ్రేషన్ గురించి అవగాహన చాలా తక్కువగా ఉంది. కోల్పోయిన ద్రవాలను తిరిగి నింపడానికి నీరు తాగితే సరిపోతుందని తరచుగా నమ్ముతారు. అయితే, శరీరంపై డీహైడ్రేషన్ మొత్తం శారీరక విధులపై ప్రభావం, ఎలక్ట్రోలైట్ పానీయాలు పోషించే కీలక పాత్రల గురించి పరిమిత అవగాహన మాత్రమే ఉంది. మా ప్రచారాల ద్వారా నీరు తాగే అలవాట్లను సరిదిద్దడం, దేశంలో డీహైడ్రేషన్ ఒక కీలకమైన ప్రజారోగ్య సమస్యగా అవగాహన కల్పించడంపై కృషి చేస్తున్నాం –ప్రశాంత్ షిండె, కెన్ వ్యూ -
చూయింగ్ గమ్ నమలడం నుంచి 3-2-1 రూల్..! ఏకంగా 80 కిలోలు..
ఆధునిక కాలంలో బరువు తగ్గడం అనేది చాలా సమస్యాత్మకంగా మారింది. చాలామంది వెయిట్లాస్ అయ్యేలా సర్జరీలు, మందుల వెంట పరిగెడుతున్నారు. మరికొందరు ఆరోగ్యకరంగా తగ్గేందుకు పాట్లు పడుతున్నారు. ఆ క్రమంలో కొందరు ఇతరులకు ప్రేరణ కలిగించేలా అద్భుతంగా ఆరోగ్యకరమైన రీతీలో బరువు తగ్గారు కూడా. కానీ వాళ్లందరూ చెప్పేది కొద్దికిద్దిగా తింటూ ఎక్కువసార్లు తినమని, మంచి ఆహారపు అలవాట్లు తదితర టిప్స్ ఇస్తే. ఈ వ్యక్తి మాత్రం అత్యంత వింత వెయిట్లాస్ చిట్కాలు ఇచ్చాడు. అవి చూస్తే ఇవేం చిట్కాలు అనిపించినా..అంతకుమునుపు, తదుపరి పరివర్తన చూస్తే నిజంగా అవే సరైనవా? అనే ఆశ్చర్యం కలుగకమానదు. మరి ఆ చిట్కాలేంటో చూద్దామాకువార్ కపూర్ అనే వ్యక్తి ఇన్స్టాగ్రామ్ వేదికగా తన వెయిట్లాస్ జర్నీని షేర్ చేశారు. తాను ఒకప్పుడు 142 కిలోల బరువు ఉండేవాడినని తెలిపాడు. పైగా కొన్ని రకాల వింత ఫిట్నెస్ టిప్స్, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, సరైన ఆహారం తదితరాలు తన వెయిట్లాస్ సీక్రెట్ అని చెబుతున్నాడు. వర్కౌట్లు, మంచి ఆహారపు అలవాట్లు వరకు ఓకే. కానీ ఈ వింత ఫిట్నెస్ టిప్స్ ఏంటి..?. బరువు తగ్గడానికి అవెలా ఉపయోగపడ్డాయ్?డైట్ సోడా తాగడంబరువు తగ్గే ప్రయాణంలో డైట్ కోక్, సోడా, శీతల పానీయాలు, ఇతర చక్కెర పానీయాలకు ఖచ్చితంగా దూరంగా ఉండాలి. కానీ భోజనంతో పాటు డైట్ సోడా తాగడం వల్ల ఎక్కువ సేపు కడుపు నిండుగా ఉంటుందని కువార్ నొక్కి చెప్పారు. కేలరీలు లేని, సాధారణ ఫిజీ డ్రింక్ లాగే రుచిగా ఉండే సోడాను ఎంచుకోవాలని ఆయన సూచిస్తున్నారు.చక్కెర లేని చూయింగ్ గమ్ నమలడంభోజనం తర్వాత చక్కెర లేని చూయింగ్ గమ్ నమలడం వల్ల అతిగా తినాలనే కోరికలను నివారిస్తుందట. కొలెస్ట్రాల్ తగ్గేలా ఎక్కువ కేలరీలు తీసుకోకుండా చేస్తుందట. ముందుగా ప్రోటీన్ప్రోటీన్కు ప్రాధాన్యత ఇవ్వడం వింతైన చిట్కా కాదు. బరువు తగ్గడానికి ప్రయత్నించే వాళ్లకు ఇది చాలా అవసరం. ప్లేట్లో ఎల్లప్పుడూ ముందుగాప్రోటీన్, తర్వాత కార్బోహైడ్రేట్లు చేర్చుకోవాలని కువార్ పేర్కొన్నారు.టీ మాక్సింగ్రోజంతా ఎక్కువగా కదలడం, ఉదాహరణకు ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు కాలు ఊపడం లేదా అటూ ఇటూ తిరగడం వంటివి, మనకు తెలియకుండానే అదనపు కేలరీలను ఖర్చు చేస్తాయంట. పైగా అనుకున్నదానికంటే వేగంగా కేలరీలు ఖర్చు అవుతాయట.ఎక్కువగా నిలబడటంకువార్ ప్రకారం, మీరు స్క్రీన్ చూసే సమయంలో సగం సేపు కేవలం నిలబడటం వల్ల ఎక్కువ శక్తిని ఖర్చు అవుతుందట. జువారీ కేలరీల ఖర్చులో ఇది కూడా చిన్నగా బరువు తగ్గడంలో హెల్ప్ అవుతుందట3-2-1 రూల్..3-2-1 రూల్ కువార్కు మరింత స్థిరంగా కొవ్వును తగ్గించుకోవడానికి సహాయపడింది. దీని ప్రకారం నిద్రపోయే మూడు గంటల ముందు చివరి భోజనం ముగించడం వల్ల జీర్ణవ్యవస్థ శుభ్రపడటానికి సమయం లభిస్తుంది. త్వరిత గతిన బరువు తగ్గడంలో హెల్ప్ అవుతుందట. ఇక రెండు గంటలు హైడ్రేటెడ్గా ఉండేలా చూసుకోవడం,ఇక ఒక గంట స్క్రీన్టైమ్ కోసం. ఇలా ప్లాన్చేస్తే అమాంతం చాలా బరువు తగ్గుతామని చెబుతున్నాడు.మంచి అరుగుదల కోసం నడకభోజనం చేసిన వెంటనే ఐదు నిమిషాల పాటు వేగంగా నడవడం వల్ల శరీరం కార్బోహైడ్రేట్లను నిల్వ చేయడానికి బదులుగా కండరాలకు చేరవేయడానికి సహాయపడుతుంది, అలాగే రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంటాయి. View this post on Instagram A post shared by Kuwar Kapur (@fitnessbykuwar) గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే. అందరికీ ఈ టిప్స్ వర్తించవు. అనుసరించే ముందు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: వీధి దీపాల కింద చదివి.. బోర్డు ఎగ్జామ్లో టాపర్గా..!) -
మామ్ వెయిట్లాస్ జర్నీ..! 82కేజీల నుంచి 60 కేజీలకు..
బరువు పెరడం ఆధునిక కాలంలో చాలామందిని వేధిస్తున్న తీవ్ర సమస్య. ముఖ్యంగా ముఖం, కాళ్లు చేతులలో ఫ్యాట్ పేరుకుపోయి..ఊబకాయంతో కనపించేలా చేస్తుంది ఈ అధిక బరువు. తగ్గాలన్నా ఆలోచన రావడం, దానిపై నిలకడతో సాగడంతోనే ఈ సమస్యకు చెక్పెట్టగలరు. లేదంటే తగ్గినట్లే తగ్గి..మళ్లీ యథాస్థితికి వచ్చేస్తుంటారు. అందులోనూ మహిళలు పెళ్లి ముందు వరకు సన్నజాజిలా అందంగా కనిపించనవాళ్లు..పిల్లలు పుట్టడంతోనే ఈ సమస్య బారినపడుతుంటారు. అందుకు మాతృత్వం, ఇంటి బాధ్యతలు నడుమ తన శరీరంపై కేర్ ఉండక ఈ అధిక బరువు బారిన సునాయాసంగా పడిపోతుంటారు. అలాంటి వాళ్లు కూడా కాస్త పిల్లలు తమ పనులు చేసుకునే స్థాయికి చేరుకున్నాక..తమ ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకుని వెయిట్లాస్ అయ్యి..స్ఫూర్తిగా నిలుస్తున్నారు. అలాంటి కోవకు చెందిందే ఈ మామ్ కూడా.ఆ తల్లే నూపుర్ కల్రా. చెన్నైకి చెందిన ఫ్యాషన్ బ్రాండ్ వ్యవస్థాపకురాలు, ప్రముఖ ఇన్ఫ్లుయెన్సర్ కూడా ఆమె. ఇటీవల తన ఇన్స్టాగ్రామ్ వేదిక తన వెయిట్లాస్ జర్నీ గురించి షేర్ చేసుకున్నారు. తాను 22 కేజీల వరకు అధిక బరువుని ఎలా తగ్గించుకుందో వెల్లడించారు. తాను ఎలాంటి క్రాష్ డైట్ పాటించలేదని అన్నారు.ప్రోటీన్ తప్పనిసరిగా..ఆహారం, ప్రోటీన్ సప్లిమెంట్లు తన లైఫ్లో పెద్ద గేమ్ ఛేంజర్ అని అంటోంది. ప్రోటీన్ తృప్తికి, శక్తికి, క్రమబద్ధతకు సహాయపడుతుందట. అయితే ఏ ప్రోటీన్ మీకు సరిపోతుందనేది పోషకహార నిపుణులను సంప్రదించే పాటించమని నొక్కి చెబుతోంది.ఇంటి భోజనంఆ ఇన్ఫ్లుయెన్సర్ స్విగ్గీ, జొమాటో, డెలివరీ ఫ్లాట్ఫాంల నుంచి ఆర్డర్ చేసిన భోజనాల కంటే ఇంట్లో వండిన ఆహారాన్నే ఎంచుకన్నట్లు తెలిపింది. ఎప్పుడైనా..బరువు తగ్గాలనుకునేవారు ఇంట్లో వండిన భోజనాన్నే ప్రిఫర్ చేయడం ముఖ్యం.ఎక్కువగా నీరు తాగడం..డీహైడ్రేషన్ బారినపడటం వల్లే తినాలనే కోరికలు ఎక్కువవుతాయట. అందుకే తగినంత నీరు తాగితే తీపి పదార్థాలు, వేయించిన ఆహారాల జోలికి పోరు అని అంటోంది.అలాగని స్వీట్లకు దూరం కాలేదట..ఇంట్లో వండిన ఆహారానికే ప్రాధాన్యత ఇస్తూ..నచ్చిన స్వీట్లు తినేదట. అయితే ఎంత మోతాదులో తినాలనేది నిర్ణయించుకుని మరి ప్లాన్ ప్రకారం తినేదాన్ని అంటోంది. గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ సూచనుల పాటించే ముందు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. View this post on Instagram A post shared by Noopur Kalra (@noopurkalra) (చదవండి: చలువ చేసే మారేడు పానకం..!) -
ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే..? ప్రాణాలకే ప్రమాదమా?
ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు నగరానికి చెందిన ఓ గర్భిణి తీవ్ర కడుపు నొప్పితో చిత్తూరు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో చేరింది. వెంటనే అడ్మిట్ చేయించిన వైద్యులు చికిత్స ప్రారంభించారు. ఎక్టోఫిక్ ప్రెగ్నెన్సీగా గుర్తించి ఆఫరేషన్ చేశారు. ఈ క్రమంలో ఆ తల్లి మృత్యువాత పడింది. ట్యూబ్ పగిలిపోవడంతోనే ఆమె చనిపోయినట్లు వైద్యులు చెప్పుకొచ్చారు. ఇలాంటి కేసులు ఇటీవల కాలంలో తరచూ నమోదవుతున్నట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు. తల్లి గర్భాణికి గండం తప్పనంటోంది. గర్భసంచిలో గర్భం దారి తప్పుతోంది. ఇందుకు ఇన్ఫెక్షన్లు, వరుస అబార్షన్లే ప్రధాన కారణమని తెలుస్తోంది. అండాశయం, గర్భాశయ నాళాల్లో గర్భం(ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ) ఏర్పడుతోంది. మాతృమరణానికి దారి తీస్తోంది. ఈ విషయంలో తల్లులు అప్రమత్తంగా వ్యవహరించకుంటే ముప్పు తప్పదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లాలో ఇలాంటి కేసులు తరచూ వెలుగు చూస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాణిపాకం జిల్లాలో ఎక్టోఫిక్ ప్రెగ్నెన్సీ కేసులు పెరుగుతున్నాయి. గర్భం సరైన స్థానమైన కాకుండా గర్భాశయ నాళాలు (ఫాలోపియన్ ట్యూబ్స్), అండాశయం లేదా పొత్తికడుపులో ఏర్పడుతోంది. దీన్ని గుర్తించడంలో ఆలస్యం చేస్తే తల్లి ప్రాణాలకే ముప్పు వాటిల్లుతోంది. జిల్లాలో ఒక జిల్లా ప్రభు త్వ ఆస్పత్రి, ఏరియా ఆస్పత్రులు 4, సీహెచ్సీలు 8, పీహెచ్సీలు 50, ప్రైవేటు ఆస్పత్రులు వెయ్యి వరకు ఉన్నాయి. వీటిలో ప్రతి నెలా 7వేలకు పైగా గర్భణులు గుర్తిస్తుండగా.. 5వేల ప్రసవ కేసులు నమోదవుతున్నాయి. అయితే ప్రతి 100 గర్భధారణల్లో కనీసం 1–2 కేసులు ఎక్టోఫిక్గా నమోదవుతున్నాయని అంచనా. గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన లేకపోవడం వల్ల ప్రమాదం మరింత తీవ్రమవుతోందని వైద్యనిపుణులు పేర్కొంటున్నారు. నిర్లక్ష్యం చేస్తే ప్రారంభంలో ఇది సాధారణ గర్భంలా కనిపిస్తుంది. కడుపులో ఒక వైపు తీవ్రమైన నొప్పి వస్తుంది. అసాధారణ రక్తస్రావం, తల తిరగడం, బలహీనత, భుజం లేదా వెన్ను నొప్పి, చికిత్స ఆలస్యం అయితే ట్యూబ్ పగిలిపోవడం, అంతర్గత రక్తస్రావం, అత్యవసర శస్త్రచికిత్స అవసరం, తల్లి ప్రాణానికి ప్రమాదం తప్పదు. పెరుగుదలకు ప్రధాన కారణాలు గర్భాశయ నాళాల్లో ఇన్ఫెక్షన్లు ఏర్పడడం.. వరుసగా అబార్షన్లు, సేఫ్టీ లేకుండా లైంగిక సంబంధాలు, గతంలో ట్యూబ్ సర్జరీలు, ఆలస్యంగా పెళ్లిళ్లు, గర్భధారణలో ఆలస్యం, ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ల పెరుగుదల తదితర కారణాలు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇన్ఫెక్షన్లను నిర్లక్ష్యం చేయకూడదు. సేఫ్ సెక్స్ పాటించాలి. వరుస అబార్షన్లను నివారించాలి. గర్భం అనుమానం వచ్చిన వెంటనే పరీక్ష చేయించుకోవాలి. రెగ్యులర్ చెకప్లు తప్పనిసరి. ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే! గర్భం దాల్చాల్సిన చోట కాకుండా వేరే చోట ఏర్పడితే దాన్ని ఎక్టోíపిక్ ప్రెగ్నెన్సీ అంటారు. అండం, వీర్యకణం అండవాహికలో ఫలదీకరణం చెంది గర్భ సంచిలో గర్భం ఏర్పడుతుంది. ఇలా కాకుండా అండవాహిక, పొట్టలో గర్భం ఏర్పడితే దాన్ని ఎక్టోపిక్ గర్భం అంటారు. వందలో ఒకరికి ఇలా జరుగుతుంది. ఇలా ఎందుకు అవుతుందో..అంతు చిక్కదు. అండవాహికకు ఇన్ఫెక్షన్, ఆఫరేషన్ అయినా, ఐవీఎఫ్, పొగతాగే అలవాటు ఉన్నా ఇలాంటి పరిస్థితి వస్తుందని వైద్యులు చెబుతున్నారు. ఇది కూడా స్కాన్ చేసినప్పుడే తెలుస్తుంది. అజాగ్రత్త వద్దు అండం, వీర్యకణం అండవాహికలో ఫలదీకరణం చెంది గర్భ సంచిలో గర్భం ఏర్పడుతుంది. ఇలా కాకుండా అండవాహిక, పొట్టలో గర్భం ఏర్పడితే దాని ఎక్టోఫిక్ గర్భం అంటాం. వందలో ఒకరికి జరుగుతుంది. అండవాహికకు ఇన్ఫెక్షన్, ఆఫరేషన్ అయినా, ఐవీఎఫ్, పొగతాగే అలవాటు ఉన్నా ఇలాంటి పరిస్థితులు వస్తాయి. ఈ విషయంలో అజాగ్రత్త వద్దు. వైద్యులను తక్షణమే సంప్రదించాలి. – షాలిని, గైనిక్ వైద్యురాలు, జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి (అపోలో), చిత్తూరు వైద్యులను సంప్రదించాలి నెలసరి రక్తస్రావం ఆగినా, తిరిగి అడపాదడపా రక్త స్రావం కనిపిస్తూ ఉన్నా.. పొత్తి కడుపులో ఒక పక్క భరించలేనంత నొప్పి బలహీనత, కళ్లు తిరగడం, గర్భధారణ అసౌకర్యంగా ఉండడం వంటి లక్షణాలుంటే వెంటనే వైద్యుల వద్దకు వెళ్లాలి. ప్రాణం మీదకు తెచ్చుకోవద్దు. జిల్లాలో ఇలాంటి కేసులు తరచూ చూస్తున్నాం. ఈ కేసుల్లో చాలా వరకు మాతృమరణాలకు దారితీస్తున్నాయి. – ఉషశ్రీ, సూపరింటెండెంట్, జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి, చిత్తూరు (చదవండి: తొలి అంధ-బధిర న్యాయవాది: చిమ్మచీకటి నుంచే సక్సెస్ అందుకుంది..!) -
చలువ చేసే మారేడు పానకం..!
మే నెల ఇంకా రాకమునుపే ఎండలు మండిపోతున్నాయి. చైత్రంలోనే చెమటలు పట్టేలా భానుడు భగభగలాడిస్తున్నాడు. ముఖ్యంగా ఈ వేడి గాల్పులకు పెద్దలు, చిన్నారులే అల్లాడిపోతుంటారు. ఉదయం ఏడింటి కల్లా చుర్రుమంటున్న సూర్యుడి తాపానికి చిన్నారులు తాళ్లలేక వాడిపోగా, పెద్దలు నిసత్తువతో ఇబ్బంది పడుతుంటారు. మరి ఈ వేసవి తాపం నుంచి బయటపడేందుకు మన పూర్వీకులు ఎన్నో గొప్ప సహజసిద్ధమైన ఔషధ పానకాలను అందించారు. ఇప్పుడు చెప్పబోయే పానకంలో అలాంటి గుణాలే ఉన్నాయి. దీని ముందు ఏ షెర్బత్లు, జ్యూస్లు నిలువలేవు. దీని ఔషధ గుణాలు, ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే విస్తుపోతారు. వేసవి తాపం నుంచి విముక్తినిచ్చే చలవ చేసే పానియమే ఈ మారేడు పానం. దీన్ని ఒడియా ప్రజలు తమ సంవత్సరాది రోజున చేసుకుని తింటారు. అచ్చం మన ఉగాది పచ్చడిలా వాళ్లు ఈ మారేడు పానకాన్ని తయారు చేసుకుంటారు. వాళ్ల సంవత్సరాది వైశాఖ మాసంలో వస్తుంది. వాళ్లకి అప్పుడు వసంతకాలం అన్నమాట. వాళ్లు కూడా మనలా ఈ రోజు నంచే చలివేంద్రాలు ఏర్పాటు చేసి లాంఛనంగా ఈ మారేడు పానం వితరణను ఆనవాయితీగా చేస్తుంటారు. వేసవి ప్రారంభానికి గుర్తుగా ఈ పానకం తయారు చేస్తారు ఒడియా ప్రజలు. ఇదెలా తయారు చేస్తారంటే..పండిన మారేడు పండును పగలగొట్టి, లోపలి గుజ్జును ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఈ గుజ్జులో తగినన్ని నీళ్లు పోసి, చేతితో బాగా పిసికి (లేదా మిక్సీ పట్టి) 15-20 నిమిషాలు నానబెట్టాలి. పిసికిన మిశ్రమాన్ని జల్లెడ (strainer) ద్వారా వడపోసి, పీచు, గింజలను వేరు చేసి స్వచ్ఛమైన రసాన్ని తీసుకోవాలి.ఈ రసంలో రుచికి సరిపడా బెల్లం తురుము లేదా పంచదార వేసి కరిగే వరకు కలపాలి. చివరగా చిటికెడు యాలకుల పొడి, కావాలంటే కొద్దిగా నిమ్మరసం కలిపి, చల్లటి నీరు లేదా ఐస్ క్యూబ్స్ వేసి సర్వ్ చేసుకోవచ్చ. ఈ చల్లని పానీయం వేసవి వేడి నుంచి శరీరాన్ని చల్లగా ఉంచడమే కాకుండా ఆరోగ్యప్రదం కూడా. ఆరోగ్య ప్రయోజనాలు..ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణశక్తిని పెంచుతుంది.వేసవి వేడి నుంచి ఉపశమనం కలిగిస్తుంది.యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కలిగి ఉంటుంది. మలబద్ధకాన్ని, ఎసిడిటీ సమస్యను దూరం చేస్తుంది. మొటిమలను నివారిస్తుంది. దీనిలోని యాంటీ ఆక్సిడెంట్ గుణాలు కేన్సర్ బారినపడకుండా రక్షిస్తుంది. బాడీని హైడ్రేటెడ్ ఉంచుతుందిబరువుని అదుపులో ఉంచుతుంది. అలాగే కంటి సమస్యలు, గుండె సమస్యలకు చెక్ పెడుతుంది.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. View this post on Instagram A post shared by Chef Kirti Bhoutika (@kirtibhoutika) (చదవండి: weight loss Tips: ఏడు వారాలకే జూనియర్ ఎన్టీఆర్ 9 కిలోలు..!) -
ఏడు వారాలకే జూనియర్ ఎన్టీఆర్ 9 కిలోలు..!
టాలీవుడ్ నటుడు జూనియర్ ఎన్టీఆర్ తన రాబోయే చిత్రం డ్రాగన్ కోసం తన ఫిజిక్ని ఎలా మార్చుకున్నారో అభిమానులతో షేర్ చేసుకున్నారు. అందుకు సంబంధించిన ఫోటోని షేర్ చేస్తూ అభిమానులను ఆశ్చర్యపర్చారు. ఆయన శరీర ఆకృతిని చూసి..వావ్! ఎంత స్మార్ట్గా ఫిట్గా ఉన్నారు అని సర్వత్రా చర్చలు మొదలయ్యాయి. అది కూడా తక్కవ వ్యవధిలోనే ఏకంగా 9.5 కిలోలు తగ్గారు. ఈ మొత్తం ప్రక్రియకు ఆయనకు జస్ట్ ఏడు వారాలే పట్టిందట. మరి అదెలా సాధ్యమైందో, బరువు తగ్గాలనుకునేవారికి ఆయన అనుసరించి టిప్స్ హెల్ప్ అవుతాయేమో చూద్దామా..!.జూనియర్ ఎన్టీఆర్ జిమ్ సెటప్ ముందు క్లాసిక్ డబుల్ బైసెప్స్ భంగిమలో ఉన్న ఫోటోని షేర్ చేశారు. మంచి ఫిట్గా స్మార్ట్గా మారిన తన రూపాన్ని షేర్ చేశారు. అంతేగాదు ఆ ఫోటోలకు ఇది కొని తెచ్చుకున్న కండలు కాదు, స్వయం నిర్మితం అని క్యాప్షన్ జోడించారు జూనియర్ ఎన్టీఆర్. అదెలా సాధ్యమైందో ఆయన ఫిట్నెస్ ట్రైనర్ కుమార్ మన్నవ సవివరంగా వెల్లడించారు. తాను కేవలం ఎన్టీఆర్ వెయిట్లాస్ జర్నీని బరువు తగ్గడమే లక్ష్యంగా ప్రారంభించలేదని, సన్నని చురుకైన శరీరాకృతిని సాధించడంపై ఫోకస్ పెడుతూ మొదలు పెట్టామన్నారు. దీని కోసం జూనియర్ ఎన్టీఆర్ తన ఫిట్నెస్ దినచర్యను గణనీయంగా మార్చారట. భారీ కండరాల నిర్మాణ వ్యాయమాలకే పరిమితం కాకుండా, తన శిక్షణను ఫంక్షనల్ కదలికలు, కార్డియో కేంద్రీకృత వ్యాయామాల తోపాటుగా, మోస్తారు రెసిస్టెన్స్ ట్రైనింగ్ వంటివి కూడా చేశారని చెప్పారు. రోజు కార్డియో లేదా స్ట్రెంగ్త్ వ్యాయామాలను మాత్రం సుమారు 45 నుంచి 90 నిమిషాలు చేసేవారట. ఆఖరికి ఫుడ్ కూడా చాలా ప్రణాళికగా తీసుకునేవారట. సాధారణంగా కండరాల పెరుగుదలతో ముడిపడి ఉన్న ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారానికి బదులుగా తక్కువ ప్రోటీన్ తీసుకునే పద్ధతిని ఎంచుకున్నారని ట్రైనర్ కుమార్ మన్నవ వెల్లడించారు. ఈ వ్యూహమే ఆయన పెంచుకున్న కండర ద్రవ్యరాశిని కోల్పోవడానికి, అలాగే తన మూవీ డ్రాగన్లోని పాత్రకు అనుగుణంగా సన్నటి రూపాన్ని సాధించడానికి హెల్ప్ అయ్యిందని అన్నారు. ఇలా అందరికీ సాధ్యం కాకపోవచ్చు. చాలామటుకు సెలబ్రిటీల మాదిరిగా వెయిట్లాస్ జర్నీని ప్రారంభించే ముందు వ్యక్తిగత నిపుణులు లేదా వైద్య నిపుణుల సలహాలు, సూచనలు తీసుకోవడం మంచిది. గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. అనుసరించే ముందు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. View this post on Instagram A post shared by Jr NTR (@jrntr) (చదవండి: జస్ట్ రూ.11 వేల లాటరీ టికెట్కి ఏకంగా రూ. 9.3 కోట్లు..!) -
ఫిట్నెస్పై ఇంత క్రేజా?!
పట్టణాల్లో, నగరాల్లో మారథాన్, అధిక ఫోర్స్తో చేసే వర్కౌట్లు వంటి ఫిట్నెస్ ఈవెంట్ల పట్ల ప్రజల ఆదరణ ఏ రేంజ్లో ఉందో తెలిస్తే షాకవ్వుతారు. వాటిపై పెడుతున్న ఖర్చులకు మాటలు రావ్. అందుకు ఉదాహరణ బెంగుళూరు ఫిట్నెస్ సెంటర్ ఈవెంటే. ఏం జరిగిందంటే..బెంగళూరులో హైరాక్స్ ఫిట్నెస్ ఈవెంట్ ధరలు చూస్తూ కళ్లు బైర్లుకమ్ముతాయ్. అందుకు సంబంధించిన పోస్ట్ని అంకిత్ కేడియా అనే యూజర్ సోషల్ మీడియా ఎక్స్లో పోస్ట్ చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఆ పోస్ట్ ప్రకారం..అక్కడ జరిగిన ఫిట్నెస్ ఈవెంట్లో దాదాపు తొమ్మిది వేల మంది దాక పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ రూ. 9 వేలు చొప్పున ప్రవేశ రుసుము చెల్లించారు. అంటే ఒక్క రోజుల్లోనే సుమారుగా రూ. 8.1 కోట్లు వచ్చాయ్. మారథాన్లో కూడా ఇదో ధోరణి కనిపిస్తోంది. కేవలం ఒక రోజు పరుగుతీయడానికే రూ. 3 వేలు నుంచి రూ. 5 వేలు ఛార్జ్ చేస్తున్నారంటూ తన పోస్ట్లో రాసుకొచ్చారు కేడియా. ఈ పోస్ట్ని చూసి నెటిజన్లు ఇదంతా ఫిట్నెస్ కోసం కాదని, కేవలం గుర్తింపు కోసం జరుగుతున్న ఆరాటం అని కామెంట్ చేస్తూ పోస్టులు పెట్టారు. ఫిట్నెస్ అనేది ఒకరోజు ప్రదర్శన కాదు, అది జీవితాంతం కొనసాగే ప్రయాణం అని అబివర్ణిస్తున్నారు కొందరు ఫిట్నెస్ ప్రియులు. HYROX fitness event in Bengaluru saw around 9,000 participants.They charged ₹9,000 per person to participate, which comes to roughly ₹8.1 crore made in a single day.Same trend is showing up in marathons. People are paying ₹3,000–₹5,000 just to run for a day.Being fit is…— Ankit Kedia (@Ankittskedia) April 13, 2026 (చదవండి: World Art Day: చిన్న పెన్సిల్ కూడా గొప్ప కథను చెప్పగలదు..!) -
వేసవిలో పిల్లలు హెల్దీగా ఉండాలంటే..!
అనాదిగా వేసవికీ బాల్యానికీ ఎనలేని సంబంధం ఉంది. పైగా పులి మీద పుట్రలా వేసవి సెలవులొకటి. తామూ ఒకప్పటి పిల్లలే అయినా తమ బాల్యాన్ని మరచిపోయి ఎండలో ఆడవద్దంటూ పిల్లలను గదమాయిస్తుంటారు పెద్దలు. కానీ... సూర్యుణ్ణి కంపాస్ బాక్స్లో ఉంచేసి, అది సరిపోనట్టు మళ్లీ దాన్ని స్కూల్ బ్యాగ్లో పెట్టిజిప్పు లాగేసినట్టుగా ఎండను లెక్కచేయకుండా పిల్లలంతా ఆడేస్తుంటారు. తరాలు గడుస్తున్నా ఇదో ఎప్పటికీ ఎడతెగని చైన్ రియాక్షన్. ఈ నేపథ్యంలో పిల్లలను వేసవి తీవ్రతతో వచ్చే ప్రమాదాలూ; తినిపించాల్సినవీ, తాగించాల్సినవీ, దూరం ఉంచాల్సినవీ అయిన ఆహారపదార్థాలూ; ఎండ నుంచి రక్షించుకోడానికి అనుసరించాల్సిన సూచనల వంటి అనేక అంశాలను తెలిపే కథనమిది.అప్పటివరకూ ఆరుబయట హాయిగా ఒళ్లెరగకుండా ఆడుతున్న చిన్నారి ఒళ్లు వెచ్చబడుతుంది. అకస్మాత్తుగా అమ్మాయి మేను నిప్పులు చెరుగుతోందేమో అనిపిస్తుంది. తల్లీదండ్రీ నుదురు తాకి చూసి, తటాలుమని చేయి వెనక్కు లాగేసుకుంటారు ఆ ఒంటి వేడి తట్టుకోలేక. ఇది దాదాపు ప్రతి చిన్నారి బాల్యంలో ఒక్కసారైనా ఎదుర్కొనే సంఘటన. ఇది ప్రతి తల్లిదండ్రుల జీవితంలో ఒక్కసారైనా చవిచూసే కాళరాత్రి. ఇలాంటి వేసవి తీవ్రత బారి నుంచి చిన్నపిల్లలను కాపాడుకోడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటో చూద్దాం.పిల్లలపై ఎండ దుష్ప్రభావం ఎందుకు ఎక్కువ? ఎండవేడిమి తీవ్రతకు పెద్దలూ, పిల్లలూ, వృద్ధులనే తేడా లేక΄ోయినప్పటికీ పెద్దలతో పోలిస్తే పిల్లల మీదే వేసవి ప్రతాపం ఎక్కువగా చూపిస్తుంటుంది. దీనికి కారణం ఉంది. పిల్లలంతా ఎండల్లో విపరీతంగా ఆటలాడుతూ ఉంటారు కాబట్టి పెద్దల కంటే వాళ్లకు చెమటలు పట్టడమూ, దాంతో వాళ్లు లవణాలు ఎక్కువగా కోల్పోతుండటం వల్ల ఎండతీవ్రతకు గురవుతుంటారనేది కొందరి అపోహ. కానీ అది వాస్తవం కాదు. విషయం ఏమిటంటే... పెద్దలతో పోలిస్తే పిల్లల్లో చెమట గ్రంథులు తక్కువ. అందుకే చెమటలు పట్టడం పెద్దవారిలోనే ఎక్కువ. అయితే పిల్లల చర్మంపైన వేసవి తీవ్రతను చల్లబరిచేందుకు అవసరమైన ప్రక్రియ... చెమట పట్టడమనేది తక్కువ. దాంతో ఎండ వేడిమి పిల్లలపై ఎక్కువ దుష్ప్రభావం చూపుతుంది. అందుకే పిల్లలెప్పుడూ చల్లగా ఉండే నీడపట్టునే ఉండేలా చూడాలి. ఎండా, వడగాడ్పులు తగ్గాకే వాళ్లను ఆరుబయటకు వెళ్లనివ్వాలి.ఎండ తీవ్రతతో ఎదుర్కొనే ఇబ్బందులివే...మజిల్ క్రాంప్స్ : పిల్లలెప్పుడూ ఎండను లెక్క చేయక ఆడుతూ ఉంటారు. ఇక సెలవుల్లో అయితే ఆటలే ఆటలు. దాంతో వారి దేహంలోని నీరు డీ–హైడ్రేషన్ కారణంగా బయటకు వెళ్లడమూ, ఆ నీటితో పాటు లవణాలూ తగ్గడం వల్ల... ఆ లవణాల అయాన్ల రూపంలో మెదడునుంచి కండరాలకు వచ్చే ఆదేశాలకు బ్రేక్ పడుతుంది. అందుకే ఒళ్లు డీ–హైడ్రేషన్కు గురి కాగానే... కండరాలు బిగుసుకు΄ోతుంటాయి. వీటినే మజిల్క్రాంప్స్ అంటారు. ఈ మజిల్క్రాంప్స్ పిల్లలతో పాటు పెద్దలకూ వస్తుంటాయి. ఇలా జరిగిన వెంటనే... వారికి చిటికెడు ఉప్పు, కాస్తంత చక్కెర వేసిన నీటిని వెంటనే తాగించాలి. కోల్పోయిన లవణాలను తిరిగి భర్తీ చేయడం వల్ల ఈ సమస్యను తేలిగ్గానే ఎదుర్కోవచ్చు.వడదెబ్బ : మనలో జీవక్రియలన్నీ సరిగా జరగడానికి దేహ ఉష్ణోగ్రత ఎప్పుడూ 98.4 డిగ్రీల ఫారెన్హీట్గా ఉంటుంది. అయితే వడదెబ్బకు గురైనవారి దేహ ఉష్ణోగ్రత చాలా ఎక్కువగా పెరుగుతుంది. దాంతో దేహంలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. వడదెబ్బ కారణంగా దేహ ఉష్ణోగ్రత క్రమంగా పెరుగుతూ ప్రమాదకరస్థాయి అయిన 104 డిగ్రీ ఫారెన్హీట్కు చేరినప్పుడు ఆ వేడి దగ్గర మెదడు, గుండె, మూత్రపిండాలు, కాలేయం వంటి కీలకమైన అవయవాల పనితీరు తీవ్రంగా దెబ్బతినే అవకాశాలెక్కువ. అందుకే శరీర ఉష్ణోగ్రతను మళ్లీ నార్మల్కు తీసుకురావడం అవసరం.ఒంటి ఉష్ణోగ్రత 100 డిగ్రీల ఫారెన్హీట్ దాటుతోందని తెలియగానే పిల్లలను చల్లటి గాలి సోకేలా ఫ్యాన్ కింద ఉంచాలి. (ఒకవేళ ఫ్యాన్ కింద వేడిగాలి వస్తుంటే అలాంటి చోటకు తీసుకెళ్లినా లాభం ఉండదు. చిన్నారుల దుస్తులు వదులు చేసి, ఒంటికి చల్లగాలిని బాగా తగలనివ్వాలి. ఈ జాగ్రత్తల తర్వాత కూడా శరీర ఉష్ణోగ్రత తగ్గకపోతే పిల్లల చంకల కింద / గజ్జల వద్ద ఐస్ గడ్డలను ఉంచాలి. దాంతో ఒళ్లు చల్లబడుతుంది. అప్పటికీ శరీర ఉష్ణోగ్రత తగ్గకపోతే, దాన్ని మెడికల్ ఎమర్జెన్సీగా గుర్తించి వెంటనే ఆసుపత్రికి తరలించాలి.వేసవిలో కొన్ని ఆహారాల పట్ల అపోహలుగుడ్డు : గుడ్లు తినడం వల్ల అవి వేడి చేస్తాయనే అ΄ోహ చాలామందిలో ఉంటుంది. అందుకే వేసవిలో గుడ్లను తినడానికీ, పిల్లలకు ఎక్కువగా ఇవ్వడానికి వెనకాడుతుంటారు. నిజానికి ఇది పూర్తిగా అ΄ోహ మాత్రమే. గుడ్లలో దాదాపు 75% నీళ్లే ఉంటాయి. పైగా ఇందులో ఖనిజలవణాలూ అన్నీ ఎక్కువే. అందుకే ఇవి చలవ చేయడంతో ΄ాటు ఒంటి నుంచి చెమట రూపంలో కోల్పోయే నీటినీ భర్తీ చేస్తాయి. అంతేకాదు... ఇందులోని లవణాల కారణంగా మజిల్క్రాంప్స్ వంటి సమస్యలూ నివారితమవుతాయి.పాలు : వేసవిలో పాలకు బదులుగా... పెరుగునూ... ఇక పెరుగుకు బదులుగా దాన్ని చిలికి మజ్జిగ రూపంలో తీసుకోవడమే మేలని చాలామంది అనుకుంటారు. నిజానికి వేసవిలో మజ్జిగ వాడటం చాలా మంచిదే అనడంలో సందేహం లేదు. అంతమాత్రాన వేసవిలో పాలు అంత మంచివి కావని అనుకోవడం ఓ దురభి్ర΄ాయం మాత్రమే. నిజానికి పాలలోనూ 90 శాతానికి పైగా ఉండేది నీళ్లే. ఈ నీటి మోతాదులతోసాటు దేహానికి శ్రమ కలగడం వల్ల కోల్పోయే ఖనిజలవణాలూ ఉంటాయి. అంటే పాలు తాగడం అంటే ఏకకాలంలో నీటినీ, ఖనిజలవణాలనూ భర్తీ చేయడం లాంటిది. అందుకే మధ్యమధ్యలో మజ్జిగ తాగిస్తున్నప్పటికీ... వేసవిలో చిన్నారులకు ప్రతి ఉదయం, రాత్రి వేళల్లో పాలు తాగిస్తుండటమూ మంచిదే.సూప్లు : వేసవిలో పిల్లలు ఆరుబయట ఎండల్లో చాలా ఎక్కువగా ఆడుకుంటూ ఉంటారు. దాంతో వారు చాలా వేగంగా నీళ్లనూ, లవణాలను కోల్పోతుంటారు. పైగా ఈ సీజన్లో ఘనాహారం తీసుకోవడం ఒకింత కష్టంగా ఉంటుంది. అందుకే పిల్లలు కోల్పోయే లవణాలను సూప్లూ, జావ రూపంలో తీసుకోవడం వల్ల అవి చాలా వేగంగా వారి దేహానికి అందుతుంటాయి.వెజిటబుల్ సూప్స్ : అన్ని రకాల సూప్లలోనూ దాదాపు 98 శాతం నీళ్లే ఉంటాయి. ఇక మిగతావి సూప్లలో ఉపయోగించే ఆకుకూరలు, కాయగూర (వెజిటబుల్స్)ల్లోంచి సూప్లోకి లవణాలు బాగా ఊరి, తేలిగ్గా ఒంటపడతాయి. అందుకే వేసవిలో అన్ని రకాల సూప్లు తీసుకోవడం మేలు చేసే అంశమే. టోమాటో, మొక్కజొన్న, దోసకాయ, ఆలూ (బంగాళదుంప), చిలగడదుంప (మోరంగడ్డ / గెణుసుగడ్డ), గ్రీన్పీస్, జ్యూషీనీ, అవకాడో, బీట్రూట్, పుదీనా, కొత్తిమీర, బ్రాకలీ, పుట్టగొడుగులు (మష్రూమ్స్)... ఇలా దాదాపు అన్ని రకాల ఆకుకూరలు/కాయగూరలతో సూప్లు తయారుచేసుకోవచ్చు. వేసవిలో ఈ సూపులన్నీ చిన్నారులకు ఖనిజలవణాలను చాలా వేగంగా ఒంటికి సమకూరేలా చేస్తాయి.పిల్లలకు జావ రూపంలో ఇచ్చేవి...జావ రూపంలోనూ లేదా పలచటి ఉప్మా (పారిజ్) రూపంలో రెసిపీలను తీసుకోవడం వల్ల ఒంటికి నీళ్లూ, లవణాలూ తక్షణం సమకూరతాయి. జావరూపంలో తీసుకునేందుకు రాగులు మేలైన ఆహారం. అందుకే వీటిల్లో రాగిజావ చాలా ఫేమస్. జావ/పారిజ్ రూపంలో తీసుకునేందుకు నూకలూ మంచివే. ఆర్గానిక్గా పండించిన పట్టుతీయని వరినూక, గోధమనూక చాలా మేలు చేస్తాయి. వీటిలో పీచుపదార్థాలు ఎక్కువగా ఉండటం వల్ల పిల్లలకు ఇవి తేలిగ్గా జీర్ణం అవుతాయి. దాంతో వేసవిలో ఒళ్లు చాలా తేలిగ్గా ఉంటుంది. అన్నట్టు పెద్దలకూ, వృద్ధులకూ మంచివే.రకరకాల పానీయాలు...అన్నిటికంటే ముఖ్యమైనది నీరు దాహాన్ని తీర్చడానికి మంచినీటికి మించిన పానియం మరొకటి లేదు. ఎండలో ఇంటికి వచ్చినప్పుడు ఒక్క గ్లాసుడు నీరు తీసుకుంటే ప్రాణం లేచివచ్చినట్టు అవుతుంది. మంచినీరు ఎక్కువగా తాగుతూంటే డీ హ్రైడ్రేషన్కు దూరంగా ఉండవచ్చు. ఇక నీటి తర్వాత ఇవ్వదగ్గ పానియాలివి...నిమ్మ : పిల్లలు వేసవిలో పానియాలను తాగేందుకు బాగా ఇష్టపడతారు. సాధారణంగా వేసవిలో నిమ్మకాయరసాన్ని తీసుకొని అందులో కొద్దిగా పంచదార వేసి చేసుకునే పానియం చాలా త్వరగా తయారవుతుంది. చాలా చవగ్గా కూడా. బత్తాయి : బత్తాయిరసం, ఆరెంజ్ జ్యూస్ వంటివి పిల్లలు ఇష్టంగా తాగుతారు. సర్సపారిల్లా : ఇది భూమి కింద పెరిగే ఒక రకం వేరు. దీన్నే చాలా చోట్ల వేర్వేరు పేర్లతో పిలుస్తుంటారు. కొందరు సుగంధ అనీ, మరికొందరు మారేడు అనీ, నన్నారి అని దీన్ని పిలుస్తారు. దీని వేర్లతో ఎసెన్స్లో లేదా ఆ వేర్ల పౌడర్లో నీళ్లు లేదా సోడా కలపాలి. ఒక టీస్పూన్ నిమ్మరసం, కాస్తంత చక్కెరతో చాలా పరిమళభరితమైన వేసవి పానీయం తయారవుతుంది. ఇది చలవచేస్తుందీ, ఆరోగ్యానికీ మేలూ చేస్తుంది. ఇవీ కాకుండా ఈ వేసవిలో మామిడిపండ్లు ఎక్కువగా దొరుకుతుంటాయి. దాంతో ఆమ్పన్నా అనే సీజనల్ డ్రింక్ను తయారు చేసుకోవచ్చు. ఇవేకాకుండా... ఖస్ షర్బత్, ద్రాక్షాజ్యూస్, వెలగపండు షర్బత్, రోజ్ షర్బత్లూ మంచివి. ఇక వేసవిలో చెరుకురసాన్ని తాగడానికి చాలామంది ఉవ్విళ్లూరుతుంటారు. అయితే ఇందులో కల్తీనీళ్లనుంచి తయారు చేసే ఐస్ కలవడమనే అంశం ఆరోగ్యాన్ని దెబ్బతీసే అవకాశమున్నందున... ఐస్ కలపకుండా తాగడమే మేలు.తీసుకోదగ్గ ఇతర పండ్లు, సలాడ్స్...పుచ్చకాయ...లో 80 శాతం కంటే ఎక్కువ నీరే ఉండటంతో డీహైడ్రేషన్ రాకుండా కాపాడుతుంది. వెజిటబుల్ చీజ్ సలాడ్స్... తక్కువ క్యాలరీలున్న చీజ్ను తరిగిన అనేక రకాల కూరలతో కలపటం వల్ల క్యాల్షియం, ప్రోటీన్ల పరిమాణాన్ని పెంచవచ్చు.కొవ్వులు తక్కువగా ఉండే పానీయాలు... పిల్లలు చల్లగా, తియ్యగా ఉండే కూల్డ్రింక్స్, సోడా, ఐస్క్రీమ్లను ఇష్టపడుతుంటారు. వీటికి బదులుగా మజ్జిగ, లస్సీ వంటివి ఇవ్వడం మంచిది. పండ్లతో తయారయిన డెజర్ట్స్... వేసవిలో ఆరోగ్యాన్నిచ్చే పండ్లతో తయారుచేసిన డెజర్ట్స్ని తీసుకోవడమే మంచిది. ఇవి ప్రోటీన్లు, క్యాల్షియంలను అందిస్తాయి. బెర్రీలు (స్ట్రాబెర్రీలు)... వేసవిలో ఈ బెర్రీ పళ్లను తినటం మంచిది. వీటిని పెరుగులోనూ, ఐస్క్రీంలాంటి వాటిలోనూ వాడవచ్చు. కుకుంబర్... పిల్లలు పెద్దగా ఇష్టంగా తిననప్పటికీ దోస వంటివి సహజంగానే చల్లగా ఉండి చలువ చేస్తాయి. అందుకే చల్లని తాజా దోసకాయ ముక్కలను సలాడ్స్లోనూ, కూరలలోనూ వాడుతూ పిల్లలకు ఇవ్వడం మంచిది. మామిడి... ఇవి వేసవిలోనే దొరుకుతాయి. ఇందులో బీటా కెరొటిన్, విటమిన్ సి, ఫైబర్లు ఉంటాయి. వాల్నట్స్... ఆక్రోట్ల (వాల్నట్)లో ఉండే ఒమేగా – 3 ఫ్యాటీయాసిడ్లు గుండె ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడతాయి.చేపలు... వేసవిలో వేటమాంసం కంటే చేపలు మంచి ఆహారం. అయితే వేయించిన చేపల కంటె ఉడకబెట్టిన లేదా గ్రిల్డ్ చేపలు ఇవ్వడం మేలు. ఎరుపు, ఆరంజ్, పసుపు రంగులలో ఉన్న కూరగాయలు... గుమ్మడి, బంగాళదుంప, చిలగడదుంప, బెల్పెప్పర్... వంటివాటిలో ఎ విటమిన్, సి విటమిన్, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. పాల ఉత్పత్తులు... లస్సీ, మజ్జిగ, ఫ్లేవర్డ్ మిల్క్, ఫ్రూట్ మిల్క్ షేక్లు (మ్యాంగో మిల్క్ షేక్) వంటివి పిల్లల శరీరానికి అవసరమయిన శక్తిని, ప్రోటీన్లను, క్యాల్షియమ్ను, ఫ్లూయిడ్లను అందిస్తాయి. పనీర్... ఇందులో ప్రోటీన్లు, క్యాల్షియం అధికంగా ఉంటాయి. గ్రిల్డ్ వెజిటబుల్స్ను పనీర్తో కలిపి ఇవ్వవచ్చు. లేదా పనీర్ రోల్స్ కూడా ఇవ్వవచ్చు. పిల్లల ఎదుగుదలకూ, ఎముకల పటిష్టతకు బాగా తోడ్పడతాయి.ఇంట్లో తయారుచేసిన ఐస్క్రీమ్లు, ఫ్రూట్ కస్టర్డ్స్, పుడింగ్స్, స్మూతీస్, ఐస్ గోల్స్... వంటివి పిల్లలకి పెట్టవచ్చు. ఎండ తాలూకు దుష్ప్రభావాల నివారణ ఇలా... ఎండవేళలల్లో పిల్లలు ఎండకు వెళ్లకుండా ఇంట్లోని చల్లటి జాగాల్లో ఆడుకునేలా ప్రోత్సహించాలి.ఎండవేళల్లో ఇన్డోర్ గేమ్స్కు మాత్రమే వారిని పరిమితం చేయాలి. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు వారిని ఇంట్లోనే ఉండేలా చూడాలి. పిల్లలు నీడలో ఉన్నా... ఒకవేళ ఆ నీడ ఉన్న గది ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటే నీడపట్టున ఉన్న పిల్లలకూ వడదెబ్బ తగలవచ్చు. అందుకే పిల్లలను ఒకింత చల్లగా ఉండే ప్రదేశంలోనే ఉంచాలి. ఆటల్లో పూర్తిగా నిమగ్నమైనొయిన పిల్లలు తరచూ మంచినీళ్లు తాగకపోవచ్చు. అందుకే తరచూ వారిని పిలుస్తూ కాస్త కాస్త మంచినీళ్లు పట్టిస్తూ ఉండాలి. ఓఆర్ఎస్ అందుబాటు లేక... ఒకవేళ కొబ్బరినీళ్లు అందుబాటులో ఉంటే అవి కూడా తాగించవచ్చు.కొన్ని జాగ్రత్తలు ఇవి... పిల్లలకు పల్చటి దుస్తులు వేయాలి. మందపాటి దుస్తులు తొడగకూడదు. ∙గొడుగు వాడటం మేలే అయినప్పటికీ పిల్లలు గొడుగువాడటాన్ని పెద్దగా ఇష్టపడరు. అందుకే పిల్లలకు నేరుగా ఎండ తగలకుండా క్యాప్ తొడిగిస్తుండాలి. పిల్లలకు వాడే క్యాప్ల కలర్ లేత రంగుల్లో ఉండటం మేలు. పిల్లలు ఆటల్లో పడి నీళ్లు తాగడం విస్మరిస్తుంటారు. అలా ఆడుతున్నప్పుడు వాళ్లకు గంటా, గంటన్నర వ్యవధిలో మాటిమాటికీ నీళ్లు తాగిస్తూ ఉండాలి.బయటకు వెళ్లే ముందే కనీసం రెండు మూడు గ్లాసుల మంచినీటిని తాగించాలి. ఎప్పుడూ వాటర్ బాటిల్ వెంట ఉంచుకునేలా ప్రోత్సహించాలి. నీళ్లను ప్లాస్టిక్ సీసాల్లో ఉంచడం అంత సరికాదు. బాటిల్ వేడెక్కి అందులోని నీళ్లు వేడెక్కడం వల్ల ప్లాస్టిక్ పదార్థాల నుంచి కొద్దికొద్ది మోతాదుల్లో ప్లాస్టిక్ వెలువడి నీటితోపాటు శరీరంలోకి వెళ్లే అవకాశాలెక్కువ. ఇలా ప్లాస్టిక్ అవశేషాలు శరీరంలోకి ఇంకిపోవడాన్ని ‘లీచింగ్’ అంటారు. దీనివల్ల ఆరోగ్యానికి ఎన్నో విధాల నష్టం చేకూరుతుంది. అందుకే ప్లాస్టిక్ బాటిల్కు బదులు మంచి గాజు బాటిల్ లేదా అంత త్వరగా వేడెక్కనివ్వని ఫ్లాస్క్లు, వాటర్బాటిల్స్నే మొదటినుంచీ పిల్లలకు అలవాటు చేయాలి. ∙ఆరుబయట తిరుగుతున్నప్పటికీ వారు చెట్టు నీడలాంటి దట్టమైన నీడ ఉండే ప్రదేశాలలోనే ఆడుకునేలా చూడటం మంచిది. ∙బయటకు అనుమతించడం అనేది ఉదయం 10 గంటలకు ముందూ... సాయంత్రం 5 తర్వాతనే జరిగేలా చూడాలి. ఎందుకంటే ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు ఎండ వల్ల ఆరుబయట రేడియేషన్ ప్రమాదం ఎక్కువగా ఉండి పిల్లల లేత శరీరాలకు నష్టం చేస్తుంది. పిల్లలు తప్పనిసరిగా ఎండకు వెళ్లాల్సి వచ్చినప్పుడు ఎండ నుంచి చర్మాన్ని కాపాడుకోడానికి కనీస సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్ 20 లేదా అంతకంటే ఎక్కువ ఉన్న ‘సన్ స్క్రీన్ లోషన్స్ / క్రీమ్స్’ను ఎండలోకి వెళ్లే కనీసం 20 నిమిషాల ముందర పిల్లల చర్మంపై రాయాలి. ఎండలో ఎక్కువసేపు ఉండాల్సి వస్తుంటే ప్రతి మూడు గంటలకోమారు మళ్లీ ఒకసారి ఈ క్రీమ్ రాస్తుండాలి. పిల్లలను కారులో ఉంచి షాపింగ్ చేయడం ప్రమాదకరం. అలా ఎప్పుడూ ఆగి ఉన్న కారులో పిల్లలను ఉంచి లాక్ చేయకూడదని తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి. పిల్లలకు ఇవ్వకూడనివి... దాహాన్ని పెంచడం, డీ–హైడ్రేషన్ కలిగించే గుణం ఉన్నందున వేసవిలో ఉప్పును సాధ్యమైనంత తక్కువగా తగ్గించాలి. అయితే నిమ్మ వంటి షర్బత్లలో చిటికెడు వేసుకోవచ్చు. పరిమితంగా తీసుకునే ఉప్పు మజిల్క్రాంప్స్ను తగ్గిస్తుంది. ఈ సీజన్లో కొవ్వులు ఎక్కువగా ఉండే ఆహారాన్ని సాధ్యమైనంతగా తగ్గించాలి. అలాగే ఆయిల్స్ కూడా వీలైనంతగా తగ్గించాలి. కాఫీ, టీ, కూల్డ్రింక్స్లో కెఫిన్ మోతాదులు ఎక్కువ. వాటిని పిల్లలకు ఇవ్వడం సరికాదు. ప్రాసెస్ చేసిన మాంసం, కేకులు, బిస్కెట్ల వంటి వాటికి దూరంగా ఉంచాలి. వాటికి బదులు తాజా పండ్లముక్కలూ, ఫ్రూట్సలాడ్స్ వంటివి ఇవ్వవచ్చు. డాక్టర్ కంచన్ ఎస్ చన్నావర్కన్సల్టెంట్ పీడియాట్రీషియన్, పీడియాట్రిక్ ఇంటెన్సివిస్ట్నిర్వహణ: యాసీన్ (చదవండి: World Art Day: చిన్న పెన్సిల్ కూడా గొప్ప కథను చెప్పగలదు..!) -
జస్ట్ ఆరు నెలల్లో 32 కిలోలు..! యంగ్లుక్లో 48 ఏళ్ల వ్యక్తి..
బరువు పెరగడం అనేది ముమ్మాటికి అధికంగా తినడం వల్ల మాత్రమే కాదు. ఉరుకుల పరుగుల జీవన విధానానికి తోడు విపరీతమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. దాన్ని అధిగమించే క్రమంలో చెడు ఆహారపు అలవాట్లకు బానిస అవ్వడంతో అధిక బరువుకి దారితీస్తుందని నిపుణులు చెబుతున్నారు. అలానే ఇక్కడొక వ్యక్తి ఊబకాయం బారినపడి రోజువారీ పనులు చేసుకోలేక పలు అవస్థలు పడ్డాడు. కనీసం ఫ్లైట్ జర్నీ సైతం కష్టంగా మారింది. అక్కడ చైర్లు తన భారీకాయాని సరిపోక ఇబ్బందులు, వార్డ్రోబ్లో బట్టలన్నీ డబుల్ఎక్స్ఎల్ సైజులే. కనీసం తనకు నచ్చిన డ్రెస్ తనసైజులో దొరకక పడే కష్టాలతో విసుగెత్తిపోయాడు. చివరికి బరువు తగ్గి స్మార్ట్గా మారాలని గట్టిగా నిశ్చయించుకుని మరి ఎవ్వరూ గుర్తుపట్టలేనంతగా తగ్గిపోయి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. అది కూడా ఆరు నెలల వ్యవధిలోనే ఆరోగ్యకరమైన రీతీలో బరువు తగ్గడం విశేషం. అదెలాగో ఆ వ్యక్తి మాటల్లోనే సవివరంగా చూద్దామా..!.ఆ వ్యక్తే 48 ఏళ్ల డేవిడ్. అతడు ఆరు నెలల క్రితం సుమారు 128 కిలోల బరువు ఉండేవాడు. 48 ఏళ్ల వయసులో చాలా చురుకుగా ఉండేవాడు, చక్కగా వ్యాపారాన్ని రన్ చేసేవాడు. తన పిల్లల బాస్కెట్బాల్, సాకర్ జట్లకు కోచ్గా వ్యవహరించాడు. కానీ అతడు తన ఆరోగ్యం పట్ల చాలా చాలా ఆసంతృప్తిగా ఉన్నాడు. రోజువారీ పరిస్థితులు ఒత్తిడితో కూడుకున్నవిగా మారాయి. ప్రయాణాలకు సామాన్లు సర్దుకోవడం ఒక పెద్ద పనిగా అనిపించేది. విమాన సీట్లు చాలా అసౌకర్యంగా ఉండేవి అతడికి. ఆఖరికి సరిగ్గా సరిపోయే బట్లలు దొరకడం ఓ సవాలుగా ఉండేది. దీనికి కారణం పని ఒత్తిడి. ఆ స్ట్రెస్ కారణంగా జంక్ఫుడ్కి బానిసయ్యాడు. అది కాస్తా అతడి రూపురేఖల్ని మార్చేసేలా అధిక బరువుకి దారితీసింది. ఇకలాభం లేదు ఇలా ఉంటే..రాను రాను తన కదలికలే భారంగా మారపోతాయేమో అనేంత భయం వేసింది. దాంతో బరువు తగ్గాలని స్ట్రాంగ్గా డిసైడ్ అయ్యి ఫిట్నెస్ కోచ్ కెవ్ని సంప్రదించాడు. అతడి మార్గదర్శంకలో సరైన జీవనశైలిని అవలంబించి కేవలం ఆరు నెలల్లోనే 32 కిలోలు తగ్గాడు. ఇంతకుముందు బట్టలు సర్దుకోవడం, జర్నీలకు వెళ్లడం ఎంత భారంగా ఫీలయ్యాడో..ఇప్పుడు చాలా ఆత్మవిశ్వాసంగా తేలిగ్గా చేసేస్తున్నాడు. అంతేగాదు కొలరాడోకు విమాన ప్రయాణంలో సౌకర్యవంతంగా వెళ్తున్నట్లు చెప్పుకొచ్చాడు డేవిడ్. అంత సులభంగా, వేగవంతంగా బరువు ఎలా తగ్గాడో..తన వెయిట్లాస్ జర్నీ ఎలా సాగిందో అతడి ఫిట్నెస్ కోచ్ కెవ్ సోషల్ మీడియా ఎక్స్ వేదికగా షేర్ చేసుకున్నాడు. పైగా అతడు ఎలాంటి ఫుడ్ తీసుకునేవాడో కూడా వివరించాడు.బరువు తగ్గేందుకు పాటించాల్సినవి..స్థిరంగా బరువు తగ్గాలంటే..ప్రోటీన్ల కోసం ఆహారంలో చికెన్ బ్రెస్ట్, సిర్లోయిన్ స్టీక్, సాల్మన్, గుడ్లు, టర్కీ బేకన్, రొయ్యలు, గ్రీక్ యోగర్ట్, కాటేజ్ చీజ్ తదితరాలు తీసుకోవాలి. కార్బోహైడ్రేట్ల కోసం తెల్లటి అన్నం, కెవ్ బ్రోకలీ, ఆస్పరాగస్, మిరపకాయలు, పాలకూర, పచ్చి బీన్స్ తదితరాలను సిఫార్సు చేస్తున్నారు. అంతేగాదు క్రియేటివ్ మెగ్నీషియం, ఎలక్ట్రోలైట్స్ వంటి సంప్లిమెంట్లను కూడా జోడించినట్లు తెలిపారు కోచ్ కెవ్.ఫుడ్ ప్లాన్..ప్రణాళికతో కూడిన భోజనం, అది కూడా సమతుల్యం ఉండేలా చూసుకోవాలని చెబుతున్నారు.భోజనం 1: ప్రోటీన్ షేక్తో గ్రీక్ యోగర్ట్, లేదా టర్కీ బేకన్తో 3 గుడ్లు, లేదా అధిక ప్రోటీన్ యోగర్ట్తో కాటేజ్ చీజ్.భోజనం 2: అన్నం, బ్రోకలీతో చికెన్, చిలగడదుంప, కూరగాయలతో మటన్, లేదా అన్నం, ఆకుకూరలతో సాల్మన్ ఉన్నాయి.భోజనం 3: బంగాళదుంపలు, ఆస్పరాగస్తో చికెన్ లేదా కాలీఫ్లవర్ రైస్ విత్ మిరపకాయలు, కూరగాయలతో రొయ్యలుతినమని కోచ్ కెవ్ సిఫార్సు చేసినట్లు తెలిపారు.మెరుగైన ఫలితాల కోసం..సత్వరమే మార్పులు పొందాలంటే సక్రమైన విధంగా దినచర్యను అనుసరించాల్సి ఉంటుంది.ఉదయం 5:30 గంటలకు నిద్రలేచి, రాత్రి 10 గంటలకల్లా పడుకోవాలి.మద్యపానానికి దూరంగా ఉండటం, రాత్రి 7 గంటల తర్వాత తినడం ఆపడంప్రతిరోజూ కనీసం 8 వేల అడుగులు నడవాలివారానికి 3–4 సార్లు 45 నిమిషాల పాటు తీవ్రమైన శక్తి శిక్షణ వ్యాయామాలు చేయడం.ఉదయం 30 నిమిషాలు సూర్యరశ్మిలో గడపడం, రెండుసార్లు బయట నడవడంప్రతిరోజూ కనీసం 150 గ్రాముల ప్రోటీన్ తీసుకోవడంనీరు, ఎలక్ట్రోలైట్లతో శరీరాన్ని హైడ్రేటెడ్గా ఉంచుకోండిప్రతిరోజూ 5 గ్రాముల క్రియేటిన్, నిద్రపోయే ముందు 400mg మెగ్నీషియం తీసుకోండిఈ విధమైన దినచర్యతో ఆరు నెలల్లో 129 కిలోల నుంచి 96 కిలోలుకు చేరుకుని యువకుడి మాదిరిగా తన శరీరాకృతిని మార్చుకున్నాడు. సంకల్పం ఎంత బలంగా ఉంటే అంత తొందరగా పరివర్తన వస్తుందనడానికి డేవిడ్ వెయిట్లాస్ స్టోరీనే ఉదాహరణ.గమనిక: ఈ కథనం కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. David lost 70lbs in 6 months at 48 years old.He came to us at 283 lbs.Active guy. Runs a business. Coaches his kids' basketball and soccer teams.But he wasn't where he wanted to be with his health and knew he needed to make a change.He knew what was wrong. He just… pic.twitter.com/zTiabcWAt7— Coach Kev - Belly Fat Pro (@AskCoachKev) April 10, 2026 (చదవండి: గొప్ప డాక్టర్ని అవ్వాలనుకున్నా..కానీ ఆ ఒక్క రీజన్..!) -
హెల్త్ ఇన్సూరెన్స్.. మీ ‘ప్లాన్’ ఏంటి?
చందన (38) ఒక ప్రైవేటు సంస్థలో పనిచేస్తోంది. ఆమె భర్త (44) ఓ చిన్న వ్యాపార సంస్థను నిర్వహిస్తున్నాడు. వారికి ఇద్దరు పిల్లలు. వీరి కుటుంబానికి రూ.5 లక్షల సమ్ ఇన్సూర్డ్తో హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజీ ఉంది. చందన ఆటో ఇమ్యూన్ (లూపస్) వ్యాధిని ఎదుర్కొంటోంది. ఆమె భర్తకు మధుమేహం, బీపీ, స్థూలకాయం సమస్యలున్నాయి. వివేక్ (40) ఓ బ్యాంకులో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్గా చేస్తున్నాడు. ఆయన భార్య (35) గృహిణి. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. వీరికి కూడా రూ.5 లక్షల కవరేజీతో బేసిక్ ఇండెమ్నిటీ హెల్త్ప్లాన్ ఉంది. చూడ్డానికి హెల్త్ కవరేజీ సమానమే. కానీ ఇక్కడి రెండు కుటుంబాల ఆరోగ్య చరిత్ర వేరు. కుటుంబ సభ్యుల సంఖ్య వేరు. మనలో చాలా మంది బీమా విషయంలో ఒకే ధోరణిని అనుసరిస్తుండడాన్ని గమనించొచ్చు. కానీ, అందరికీ ఒకే తరహా ప్లాన్, అందరికీ ఒకే విధమైన రక్షణ కవరేజీ అన్నది ఎంత మాత్రం సమంజసం కాదన్న విషయాన్ని గుర్తించాలి. 25 ఏళ్లు, 60 ఏళ్ల వయసులో హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునే వారి మధ్య ప్రాధాన్యతలు, ఆరోగ్య సమస్యలు, రిస్క్ ఒకే విధంగా ఉండవు. అందుకే ప్రతీ కుటుంబం కూడా తమ ఆరోగ్య చరిత్ర, వయసు, సభ్యుల సంఖ్య ఆధారంగా మెరుగైన కవరేజీతో హెల్త్ ఇన్సూరెన్స్ ఉండేలా చూసుకోవాలి. ఇందుకు ఏం చేయాలన్నది ఈ వెల్త్ స్టోరీలో చూద్దాం. వయసు కీలకం..→ ఒకే తరహా బీమా పాలసీ అందరికీ అనుకూలమని చెప్పలేం. → వైద్య విభాగంలో ద్రవ్యోల్బణం 10–12 శాతంగా ఉంటోంది. అంటే ఏటా చికిత్సలు, ఔషధాలు ఇలా మొత్తం మీద వాటి వ్యయాలు ఈ మేరకు పెరుగుతున్నాయి. → మారిన ఆహార నియమాలు, పని వేళలు, తక్కువ శ్రమ కారణంగా జీవనశైలి వ్యాధుల ముప్పు పెరిగిపోయింది. 30 ఏళ్ల నుంచే మధుమేహం, బీపీ, థైరాయిడ్ సమస్యలు సాధారణమయ్యాయి. కేన్సర్ల రిస్క్ మన దేశంలో వేగంగా పెరుగుతున్నట్టు నిపుణులు హెచ్చరిస్తున్నారు. → హెల్త్ ఇన్సూరెన్స్ రక్షణ సమగ్రంగా లేకపోతే పొదుపు, పెట్టుబడులన్నీ కరిగిపోయే రిస్క్ ఎదురవుతుంది. → కనుక హెల్త్ ఇన్సూరెన్స్ కేవలం రక్షణ సాధనమే కాదు. ఆర్థిక ప్రణాళికలో ఇదొక భాగం. ఆర్థిక సంక్షోభ నివారణ సాధనం.25–35 ఏళ్ల వారికి.. ప్రధాన లక్ష్యం→ తక్కువ ప్రీమియంపై అధిక కవరేజీ ఉండేలా చూసుకోవాలి. ఎంపిక → అవివాహితులు అయితే వ్యక్తిగత హెల్త్ ఇన్సూరెన్స్, వివాహితులు అయితే కుటుంబం అంతటికీ కలిపి ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్ ఎంపిక చేసుకోవచ్చు. → కనీసం రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల సమ్ ఇన్సూర్డ్తో బేసిక్ ఇండెమ్నిటీ ప్లాన్ తీసుకోవాలి. → బేసిక్ ప్లాన్ కవరేజీలో తీసుకున్నంత మేర (రూ.5–10 లక్షలు) డిడక్టబుల్ పెట్టుకుని, రూ.20–25 లక్షలకు సూపర్ టాపప్ ప్లాన్ కొనుగోలు చేయాలి. → ఇలా చేయడం వల్ల ఒక ఏడాదిలో ఆస్పత్రి బిల్లు బేసిక్ ప్లాన్ కవరేజీని మించినప్పుడు, సూపర్ టాపప్ ప్లాన్ నుంచి చెల్లింపులు లభిస్తాయి.వీటిపై దృష్టి పెట్టాలి→ నో క్లెయిమ్ బోనస్ (ఎన్సీబీ) ఉండేలా చూసుకోవాలి. → బీమా సంస్థ హాస్పిటల్ నెట్వర్క్ను పరిశీలించాలి. ఎన్ని ఎక్కువ ఆస్పత్రులు జాబితాలో ఉంటే అంత మంచిది. ముఖ్యంగా తాము నివసించే ప్రాంతంలోని ముఖ్యమైన ఆస్పత్రులు బీమా నెట్వర్క్ పరిధిలో ఉన్నాయేమో చూసుకోవాలి. దీనివల్ల వైద్యం అవసరమైనప్పుడు సులభంగా క్యాష్లెస్ క్లెయిమ్ పొందడం వీలు పడుతుంది. → చిన్న వయసు వల్ల తక్కువ ప్రీమియంతోపాటు ఎలాంటి వ్యాధుల్లేకపోవడం అనుకూలం. అన్ని వెయిటింగ్ పీరియడ్ (కొన్ని వ్యాధులకు కవరేజీ)లను ఈజీగా అధిగమించొచ్చు. ఈ తప్పులు వద్దు.. → నేను ఆరోగ్యవంతుడిని కదా, ఇంత చిన్న వయసులో నాకు ఆరోగ్య బీమా ఎందుకు? అన్న ఆలోచన తప్పు. ఆరోగ్య సమస్యలే రానక్కర్లేదు. ప్రమాదం కారణంగా ఆస్పత్రి పాలై క్లిష్టమైన చికిత్సలు అవసరమైతే బిల్లు వాచిపోవచ్చు. → పనిచేసే సంస్థ నుంచి గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది కదా చాలులే అనుకోవద్దు. ఉన్నట్టుండి ఉద్యోగం కోల్పోయినా లేదా సంస్థను వీడినా సొంతంగా బీమా రక్షణ ఉండదు.30–50 ఏళ్ల వయసు..ప్రధాన లక్ష్యం→ కుటుంబం అంతటికీ సరైన రక్షణ కల్పించుకోవడం ఈ వయసు వారికి ప్రధాన లక్ష్యంగా ఉండాలి. కవరేజీ–ప్రీమియం మధ్య సమతూకం ఉండాలి.ఏది అనుకూలం? → ఈ వయసులో దాదాపు అధిక శాతం వివాహం చేసుకుని కుటుంబాన్ని ఏర్పాటు చేసుకుంటారు. కనుక వీరికి ఫ్యామిలీ ఫ్లోటర్ సరైనది. అవివాహితులైతే ఇండివిడ్యువల్ హెల్త్ ప్లాన్ తీసుకోవచ్చు. → కుటుంబం మొత్తానికి కవరేజీ బేసిక్ ప్లాన్లో రూ.10–25 లక్షలు ఉండేలా చూసుకోవాలి. అదే ఇండివిడ్యువల్ ప్లాన్లో రూ.5–10 లక్షలు సరిపోతుంది. → రూ.25–50 లక్షలతో సూపర్ టాపప్ ప్లాన్ తీసుకోవచ్చు. బేసిక్ ప్లాన్లో కవరేజీ మేర డిడక్టబుల్ ఎంపిక చేసుకుంటే సరిపోతుంది. ఒక్కరికైనా, కుటుంబానికైనా సూపర్ టాపప్తో అదనపు రక్షణ అనేది ఈ రోజుల్లో ఎంతో అవసరం.కీలక ప్రాధాన్యతలు వీటికి.. → పెళ్లై పిల్లల కోసం ప్లాన్ చేసుకునే వారు తాము తీసుకునే హెల్త్ ఇన్సూరెన్స్లో మెటరి్నటీ (ప్రసవ సంబంధిత) కవరేజీ తప్పక ఉండేలా చూసుకోవాలి. → మధ్య వయసు దృష్ట్యా డే కేర్ ప్రొసీజర్స్కు ప్రాధాన్యం ఇవ్వాలి. → హాస్పిటల్లో చేరక ముందు, డిశ్చార్జ్ అయిన తర్వాత కూడా అదే సమస్యకు సంబంధించి తీసుకునే చికిత్సకు కవరేజీ ఉండాలి. ఇప్పుడు చాలా ప్లాన్లు 90–120 రోజుల వరకు చేరక ముందు, డిశ్చార్జ్ అయిన తర్వాత కవరేజీని ఇస్తున్నాయి. → రూమ్ రెంట్కు సంబంధించి ఎలాంటి పరిమితులు లేకపోతే మేలు. → వ్యాధులకు సంబంధించి ఉప పరిమితులు (చెల్లింపుల్లో) ఉండకూడదు. → కో–పేమెంట్ విషయంలో (ప్రతీ క్లెయిమ్లో పాలసీ దారు తన వంతు చెల్లించాల్సిన మొత్తం) దూరంగా ఉండాలి. → బేసిక్ ప్లాన్, సూపర్ టాపప్తో తక్కువ ప్రీమియానికి మెరుగైన కవరేజీ లభిస్తుంది. 50 ఏళ్లు దాటిన వారికి.. వీటికి ప్రాధాన్యం..→ అప్పటికే ఉన్న వ్యాధులతోపాటు అన్ని రకాల కవరేజీలు ఉన్న ప్లాన్ అవసరం. → ఈ వయసులో ఫ్యామిలీ ఫ్లోటర్ కంటే కూడా ఇండివిడ్యువల్ హెల్త్ ప్లాన్ మేలు. → బేసిక్ ప్లాన్స్లో రూ.10లక్షల కవరేజీకి అదనంగా 50 లక్షలతో సూపర్ టాపప్ తీసుకోవాలి.వీటిని చూడాలి..→ ముందు నుంచి ఉన్న వ్యాధులకు కవరేజీని ఆఫర్ చేసే ప్లాన్ తీసుకోవాలి. సాధారణంగా పాలసీ తీసుకునే నాటికి ఉన్న వ్యాధులకు సంబంధించి కవరేజీ పొందాలంటే కనీసం 3–4 ఏళ్లు ఆగాలి. అప్పటికే ఉన్న వ్యాధులకు సంబంధించి వ్యయాలకు పాలసీదారు సొంతంగా ఖర్చు చేసుకోవాలి. కొన్ని సంస్థలు కాస్త అదనపు ప్రీమియంతో వెయిటింగ్ పీరియడ్ను తగ్గించేందుకు/మాఫీ చేసేందుకు అనుమతిస్తున్నాయి. → ఒకవేళ వెయిటింగ్ పీరియడ్ క్లాజు ఉన్నా, సాధ్యమైనంత తక్కువ ప్లాన్కు ప్రాధాన్యం ఇవ్వాలి. → క్లెయిమ్ చెల్లింపుల రేషియో ఎక్కువ ఉన్న బీమా సంస్థ అయితే నయం. అదే సమయంలో ఆయా బీమా సంస్థ సేవలు బాగున్నాయేమో చూసుకోవాలి.రిస్క్లు..→ ఈ వయసులో పాలసీలకు కంపెనీలు అధిక ప్రీమియం నిర్ణయిస్తుంటాయి. → అప్పటికే ఉన్న ఆరోగ్య సమస్యల దృష్ట్యా కొన్ని బీమా సంస్థలు పాలసీ ఇవ్వడానికి నిరాకరించొచ్చు. ఇవి అందరికీ.. → వయసు ఏదైనప్పటికీ అధిక కవరేజీ ఉంటే ఎంతో మంచిది. కనీసం రూ.20 లక్షలు అంతకంటే అధికం (సూపర్ టాపప్) ఉండేలా చూసుకోవాలి. → ఆస్పత్రుల నెట్వర్క్ను ప్రధానంగా చూడాలి. ఎక్కువ ఆస్పత్రుల్లో, అందులోనూ పేరున్న ఆస్పత్రులు అన్నీ ఉంటే మంచిది. → రూమ్ రెంట్లకు సంబంధించి పరిమితులు, కో–పేమెంట్, వ్యాధుల వారీ పరిమితులు ఏవీ లేకుండా చూసుకోవాలి. → పాలసీ తీసుకునే ముందు పాలసీ వర్డింగ్స్ డాక్యుమెంట్ ఆసాంతం చదివి.. అందులో సదుపాయాలు, మినహాయింపుల గురించి పూర్తిగా తెలుసుకోవాలి. → గడువులోపు పాలసీని తప్పక రెన్యూ చేసుకోవాలి. దీనికి ఆటో డెబిట్ యాక్టివేట్ చేసుకోవాలి.– సాక్షి, వెల్త్ -
ఆశా భోంస్లే మృతి: ఛాతీ ఇన్ఫెక్షన్లు ఎందుకంత ప్రమాదకరం..
ప్రముఖ గాయని ఆశా భోంస్లే 92 ఏళ్ల వయసులో ఛాతీ ఇన్ఫెక్షన్తో కన్నుమూశారు. వృద్ధుల్లో శ్వాసకోశ వ్యాధులు ఎంత తీవ్రతరంగా ఉంటాయి, అలాగే సత్వరమే చికిత్స అందించడం ఎంత కీలకం అని చెప్పే ఘటన ఇది. నిజానికి గాయని ఆశా ఛాతీ ఇన్ఫెక్షన్ సంబంధిత సమస్యలతో ఆస్పత్రిలో చేరి..చికిత్స పొందుతూ మరణించారు. ఈ నేపథ్యంలో ఈ ఛాతీ ఇన్ఫెక్షన్ అంత ప్రమాదకరమైనదా..?, వయసు పైబడిన వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది వంటి వాటి గురించి సవివరంగా తెలుసుకుందాం.ఆశా భోంస్లేని తీవ్రమైన అలసట, శ్వాసకోశ సమస్యలతో బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చేర్చారు. ఈ సమస్యలకు ఛాతీ ఇన్ఫెక్షన్ కారణమని వైద్యులు పేర్కొన్నారు. ఎప్పటికప్పుడు పర్యవేక్షించినా..వయసు పైబడటంతో ఆ ఇన్ఫెక్షన్ శరీరంపై తీవ్రమైన ఒత్తిడిని కలిగించి చివరికి ఆశా భోంస్లే మరణానికి దారితీసిందని వెల్లడించారు వైద్యులు.ఛాతీ ఇన్ఫెక్షన్ అంటే..ఛాతీ ఇన్ఫెక్షన్ అనేది ఊపిరితిత్తులు లేదా శ్వాసనాళాలకు సోకే ఇన్ఫెక్షన్. వీటిలో సర్వసాధారణమైన రకాలు శ్వాసనాళాల ఇన్ఫెక్షన్ అయిన బ్రాంకైటిస్, ఊపిరితిత్తుల కణజాల ఇన్ఫెక్షన్ అయిన న్యుమోనియా. ఈ పరిస్థితులు శరీరంలో వాపు, శ్లేష్మం పేరుకుపోవడం, దగ్గు, ఆయాసం, ఆక్సిజన్ స్థాయిలు తగ్గడానికి కారణమవుతాయి. 90 ఏళ్లు పైబడిన వారిలో, ఒక 'సాధారణ' ఛాతీ ఇన్ఫెక్షన్ సైతం కూడా ప్రాణాంతకం కావచ్చు.ప్రభావం ఎలా ఉంటుందంటే..ఊపిరితిత్తుల పనితీరు తగ్గడం వల్ల శరీరానికి ఆక్సిజన్ అందించడం కష్టమవుతుందిబలహీనమైన కండరాలు దగ్గడం, యు శ్లేష్మాన్ని తొలగించే సామర్థ్యాన్ని తగ్గిస్తాయితక్కువ రోగనిరోధక శక్తి కోలుకోవడాన్ని నెమ్మదింపజేస్తుందిశరీరంలో ఆక్సిజన్ లెవల్స్ పడిపోవడంతో గుండెపై భారం పెరుగుతుందిఈ పరిస్థితుల్లో, శరీరం తరచుగా తన శక్తిలో ఎక్కువ భాగాన్ని కేవలం శ్వాస తీసుకోవడానికి, ఇన్ఫెక్షన్తో పోరాడటానికి మాత్రమే ఉపయోగించే స్థితిలోకి వెళుతుంది. దీనివల్ల ఇతర అవయవాలకు శక్తి నిల్వలు చాలా తక్కువగా ఉంటాయి. ఫలితంగా బహుళ అవయవాల ఫెయిల్యూర్కి దారితీస్తుంది. అందుకే తీవ్రమైన అలసట (నీరసం) వంటి లక్షణాలు కేవలం దుష్ప్రభావాలు మాత్రమే కావు, అవి శరీరం తీవ్రమైన ఒత్తిడికి గురవుతోందని చెప్పే సూచన అని అంటున్నారు ఆరోగ్య నిపుణలు.ఇక్కడ ఆశా భోంస్లే విషయంలో ఇన్ఫెక్షన్తో పాటు అప్పటికే తీవ్రమైన అలసటతో బాధపడుతున్నారని నివేదికలు సూచిస్తున్నాయి. ఈ రెండిటి కలయిక రోగి పరిస్థితిని క్రిటికల్ చేస్తుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. అలాగే ఈ ఛాతీ ఇన్ఫెక్షన్లు రాత్రికి రాత్రే తీవ్రం కావడం చాలా అరుదు. అవి తరచుగా తేలికపాటి, సులభంగా గుర్తించలేని లక్షణాలతో ప్రారంభమవుతాయి. వృద్ధులలో, దీర్ఘకాలిక దగ్గు, స్వల్ప శ్వాస ఇబ్బంది, తక్కువ స్థాయి జ్వరం, గందరగోళం లేదా అసాధారణమైన నిద్రమత్తు వంటి అనారోగ్య సంకేతాలను అందిస్తుంది. యువకులతో పోలిస్తే, వృద్ధుల్లో ఎల్లప్పుడూ వ్యాధికి సంబంధించిన సాధారణ, స్పష్టమైన లక్షణాలను చూపించకపోవచ్చని అందువల్లే దీన్ని ప్రాథమిక దశలోనే గుర్తించడం కష్టమవుతుందని చెబుతున్నారు వైద్యులు. సాధారణంగా అయితే ఆకలి తగ్గడం, నీరసం లేదా ఆకస్మిక అలసట వంటివి కొన్నిసార్లు వ్యాధికి సంబంధించిన తొలి హెచ్చరిక సంకేతాలుగా (red flags) ఉంటాయని వైద్యులు నొక్కి చెబుతున్నారు. అయితే చాలా సందర్భాల్లో, కుటుంబ సభ్యులు ఈ మార్పులను వృద్ధాప్య సహజ లక్షణాలుగా పొరబడి, వైద్య సహాయం తీసుకోవడంలో జాప్యం చేస్తుంటారని అన్నారు.నివారణ..ఫ్లూ, న్యుమోనియా టీకాలు వేయించుకోవడం, తగినంత నీరు తాగుతూ శరీరాన్ని హైడ్రేటెడ్గా ఉంచుకోవడం, సరైన సమయంలో చికిత్స పొందడం ద్వారా అనారోగ్య ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని చెబతున్నారు ఆరోగ్య నిపుణులు. అంతేగాక శ్వాసకోశ సంబంధిత లక్షణాలు స్వల్పంగా ఉన్నప్పటికీ వాటిని నిర్లక్ష్యం చేయకూడదనే విషయాన్ని ఆశా భోంస్లే గారి ఉదంతం స్పష్టంగా తెలియజేస్తోంది. ముఖ్యంగా వృద్ధాప్యం కారణంగా శరీరం ఇన్ఫెక్షన్లను తట్టుకునే శక్తిని కోల్పోతున్నప్పుడు ఈ జాగ్రత్త మరింత అవసరం అని అంటున్నారు. అలాగే అరుదుగా మాత్రమే ఈ ఛాతీ ఇన్ఫెక్షన్లు తీవ్రరూపం దాల్చుతాయని, పైగా తేలికపాటి లక్షణాలతో కొట్టిపారేసే విధంగా ఉంటాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.(చదవండి: రెండేళ్లుగా వ్యాన్లోనే బందీ..! పాపం చివరికి..) -
మంచి రక్తప్రసరణ కోసం..!
మంచి రక్త ప్రసరణకు, మానిసిక ప్రశాంతతకు యోగాలో చాలామంచి ఆసనాలు ఉన్నాయి. అవి క్రమం తప్పకుండా వేస్తుండటం వల్ల ఆరోగ్యం మెరుగ్గా ఉండటమే కాకుండా మానసికంగానూ బలోపేతం అవుతారని చెబుతున్నారు యోగా నిపుణులు. మరి అవేంటో చూద్దామా..!మరీచాసనం..చేయు విధానం.. మ్యాట్పై కూర్చొని రెండు కాళ్లను నిటారుగా చాచి దండాసనంలో ఉండాలి. ఎడమ కాలిని మడిచి, ఎడమపాదాన్ని కుడితొడపై ఉంచాలి. ∙ఎడమ మోకాలిని ఎడమచేతితో చుట్టి పట్టుకుని, రెండు చేతులను వెనుకకు తీసుకెళ్లి లాక్ చేయాలి. శ్వాస తీసుకుంటూ వెన్నెముకను నిటారుగా ఉంచాలి. శ్వాస వదులుతూ మెల్లగా కుడి వైపుకు తిరగాలి. ఈ స్థితిలో 10–15 సెకన్లు ఉండాలి. తర్వాత మామూలు స్థితికి వచ్చి, మరోవైపు చేయాలి.ఉపయోగాలు.. రక్త ప్రసరణ మెరుగవుతుంది. మనసు ప్రశాంతంగా ఉంటుంది. వెన్నెముక, నడుము బలపడతాయి. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. శరీరం ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది. ఒత్తిడి తగ్గుతుంది.జాగ్రత్తలు.. 1. వెన్ను నొప్పి లేదా డిస్క్ సమస్యలున్నవారు ఈ ఆసనం చేయకూడదు. 2. ప్రెగ్నెన్సీ సమయంలో కూడా ఈ ఆసనం చేయకూడదు.– అనిత పాతర్ల, యోగా ట్రైనర్ ఒత్తిడి పరార్నిత్యం ధ్యానం చేయడం వల్ల ఒత్తిడి పరారవుతుంది. ద్యానం ఒత్తిడిని తగ్గించి.. ఆలోచన సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఎంతటి క్లిష్టమైన సమస్య అయినా క్షణాల్లో దానికి పరిష్కారాన్ని వెతకగలిగే సామర్థ్యం మెరుగుపడుతుంది. కనుక ప్రతి రోజూ 15 నిమిషాల నుంచి 20 నిమిషాల వరకు ధ్యానం చేయాలన్నది నిపుణుల సూచన.(చదవండి: పుష్-అప్స్లో ఈ 75 ఏళ్ల బామ్మే స్ఫూర్తి..! జస్ట్ 12 వారాల్లో..) -
నీరు-మీరు కిడ్నీ-డీ–హైడ్రేషన్...బ్లడ్ రిలేషన్
ఇటీవల వేసవి ఉష్ణోగ్రతలు తీవ్రంగా ఉంటున్నాయి. ఉష్ణోగ్రతలను కొలిచే మెర్క్యూరీ స్కేలుపై ఎండ తీవ్రత పైపైకి ఎగబాకుతోంది. ఎండ తీవ్రత ఎక్కువవుతున్న కొద్దీ దేహంలోని కొన్ని కీలక అవయవాల మీద ‘డీ–హైడ్రేషన్ స్ట్రెస్’ కూడా పెరుగుతూ పోతుంది. అందులో మరింత కీలకమైనవి మన మూత్రపిండాలు. అందుకే మిగతా సీజన్లతో పోలిస్తే వేసవిలో కిడ్నీ సమస్యలతో హాస్పిటల్స్కు వచ్చే వారి సంఖ్య మరింత పెరుగుతుంటుంది. ఈ ఏడాది కూడా అందుకు మినహాయింపు కాదు. అయితే ఇక్కడ కాస్త సమస్య ఏమిటంటే... వేసవి తీవ్రతవల్ల... దాంతో కలిగే డీ–హైడ్రేషన్ కారణంగా కిడ్నీపై పడే ఒత్తిడి అంత త్వరగా గుర్తించడానికి కుదరదు. అందుకే ఎండ్ ఆర్గాన్ అయిన మూత్రపిండాలపై పడే దుష్ప్రభావాల గురించి తెలుసుకుని ప్రతి ఒక్కరూ వేసవిలో కిడ్నీ ఆరోగ్యం కోసం తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అందుకే చేయాల్సినవీ, తెలుసుకోవాల్సినవి ఏమిటో చూద్దాం.కిడ్నీలు దేహంలోని నీరు, అందులోని అనవసర లవణాలూ, విషాలూ (టాక్సిన్స్) వంటి వాటిని వడబోసి, వ్యర్థాలను బయటకు పంపుతాయన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే వాటితో ఖనిజ లవణాలను తిరిగి దేహానికే పంపించడం ద్వారా ఎలక్ట్రొలైట్ బ్యాలెన్స్ అనే కీలకమైన బాధ్యతలను నెరవేరుస్తుంటాయి. ప్రతికూల ప్రభావం చూపే ఎండ తీవ్రత... ఎవరైనా వ్యక్తి ఎండ తీవ్రత తాలూకు అధిక ఉష్ణోగ్రతలకు అదేపనిగా చాలాసేపు ఎక్స్పోజ్ అవుతూ ఉన్నప్పుడు అతడి దేహం నుంచి చెమట రూపంలో చాలా ఎక్కువ ద్రవాలను కోల్పోతుంటాడు. అలా అతడు కోల్పోయిన ద్రవాలను తిరిగి భర్తీ చేయకపోతే రక్తం కొంత చిక్కబడిపోవడంతో రక్తప్రవాహం అంత సాఫీగా ప్రవహించకపోవచ్చు. దాంతో కిడ్నీలకు తగినంత రక్తం అందక వాటిపై కొంత ఒత్తిడి పెరుగుతుంది. దీంతో కిడ్నీ పనితీరు కాస్తంత కుంటుపడే అవకాశముంటుంది. ఈ సమస్యను వైద్యపరిభాషలో ‘అక్యూట్ కిడ్నీ ఇంజ్యూరీ (ఏకేఐ) అంటారు.ఎండ తీవ్రత పెరుగుతున్న కొద్దీ... పెరిగే ఏకేఐ, కిడ్నీ స్టోన్స్ల ముప్పు... ఎండతీవ్రతకు ఎంతగా ఎక్స్పోజ్ అవుతుంటే... అక్యూట్ కిడ్నీ ఇంజ్యూరీ ముప్పు అంతగా పెరుగుతుంది. వాతావరణంలో వేడిమి పెరుగుతున్న కొద్దీ కిడ్నీపై దాని దుష్ప్రభావాలు కనీసం 20% నుంచి 30% వరకు పెరుగుతుంటుంది. అంతేకాదు... కిడ్నీలో రాళ్లు, మూత్రంలో ఇన్ఫెక్షన్లు (యురినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ – యూటీఐ)ల ముప్పు కూడా పెరుగుతుంది. అక్యూట్ కిడ్నీ ఇంజ్యూరీ సమస్య చాలాకాలం పాటు కొనసాగితే అది క్రానిక్ కిడ్నీ డిసీజ్–సీకేడీ వంటి తీవ్రమైన సమస్యకు దారితీసే ముప్పూ ఉంటుంది.రాళ్లు ఎందుకు పెరుగుతాయంటే... దేహంలో నీటి మోతాదులు తగ్గగానే లవణాల గాఢత పెరుగుతుంది. దాంతో లవణాలు రాళ్లలా మారతాయి. అందుకే దేహంలో నీటి మోతాదులు తగ్గుతున్న కొద్దీ కిడ్నీలో రాళ్లు వచ్చే ముప్పు పెరుగుతుంది.యూటీఐలు మహిళల్లో ఎక్కువ... కిడ్నీ ఇంజ్యూరీ కేసులు పురుషుల్లో ఎక్కువ... దేహ నిర్మాణపరంగా (అనటామికల్గా) చూసినప్పుడు పురుషులతో పోలిస్తే మహిళల్లో యూరినరీ ట్రాక్ట్ పొడవు కాస్త తక్కువగా ఉండటం వల్ల మూత్రంలో ఇన్ఫెక్షన్లు (యూటీఐలు) మహిళల్లో ఎక్కువగా కనిపిస్తుంటాయి. అయితే కిడ్నీ ఇంజ్యూరీ కేసులు మాత్రం పురుషుల్లోనే ఎక్కువ. (మొత్తం కేసుల్లో దాదాపు 65% నుంచి 75%వరకు పురుషులవే).ఈ లక్షణాలను గమనిస్తూ ఉండాలి... మునపటి కంటే మూత్రం తక్కువగా వస్తుండటం, మూత్రం చాలా చిక్కటి రంగు (డార్క్ కలర్)తో రావడం, ముఖం/కాళ్లలో వాపు, తీవ్రమైన అలసట (ఫెటీగ్), ఏదీ తినలేకపోవడం, మూత్రవిసర్జనలో నొప్పి / ఇబ్బంది వంటి లక్షణాలు తగ్గకుండా అదేపనిగా కొనసాగుతూ ఉన్నప్పుడు డాక్టర్ను కలవడం మంచిది.నివారణ కోసం... అది అక్యూట్ కిడ్నీ ఇంజ్యురీ (ఏకేఐ) సమస్య అయినా, కిడ్నీలో రాళ్లు లేదా మూత్రంలో ఇన్ఫెక్షన్ల సమస్య అయినా... దేహం కోల్పోయిన నీటి మోతాదును ఎప్పటికప్పుడు భర్తీ చేస్తూ ఉండటమే నివారణ. ఇందుకోసం తగినన్ని నీళ్లు తాగుతూ ఉండటంతో పాటు వీలును బట్టి కొబ్బరినీళ్లు, పండ్లరసాలు, కొద్దిగాఉప్పుతో నిమ్మరసాలు వంటి ద్రవాహారాలు తీసుకుంటూ ఉండాలి. డాక్టర్ సలహా లేకుండా నొప్పినివారణ మాత్రలు (పెయిన్ కిల్లర్స్) వాడకూడదు. ఇక కిడ్నీ సమస్య ఉన్నవారైతే ఎట్టిపరిస్థితుల్లో వాటిని వాడకపోవడమే మంచిది. తప్పనిసరిగా వాడాల్సివస్తే డాక్టర్ సలహా మేరకు మాత్రమే వాడాలి. డా‘‘ రవికుమార్ ఎ.వి.సీనియర్ కన్సల్టెంట్యూరాలజిస్ట్ –కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ సర్జన్∙తెలుసుకుందాం55% ప్లాస్మా... ఇందులో లవణాలు, ప్రోటీన్లు, ఇమ్యూనోగ్లోబ్యులిన్లు ఉండి ప్రాణాలను రక్షించే వ్యాధి నిరోధక వ్యవస్థ తాలూకు కణాలను కలిగి ఉంటాయి.కాంపోనెంట్లు... వాటి ఉపయోగాలు... 90% రక్తంలోని 90 శాతంలో నీరే ఉంటుంది.45% ఫార్మ్డ్ ఎలిమెంట్లు ఇందులో ఎర్రరక్తకణాలు (ఆర్బీసీ), తెల్లరక్తకణాలు (డబ్ల్యూబీసీ), ప్లేట్లెట్స్ ఉంటాయి. ఆ వేర్వేరు కాంపోనెంట్లలోని పదార్థాలూ విధులవి...1,50,000 నుంచి 4,00,000ప్లేట్లెట్లు శరీరానికి ఏదైనా గాయం తగిలి, రక్తస్రావం జరుగుతుంటే రక్తాన్ని గడ్డకట్టించడం ద్వారా ప్రాణరక్షణ కలిగించే కీలకమైన కణాలు. వీటి సంఖ్య ప్రతి క్యూబిక్ మిల్లీమీటర్కు (ఎమ్ఎమ్ క్యూబ్కు 1,50,000 నుంచి 4,00,000 ఉండాలి. వీటి సంఖ్య తగ్గుతున్న కొద్దీ అంతర్గత రక్తస్రావం జరగవచ్చు. లేదా గాయం తగిలినప్పుడు ఎంతకీ రక్తం గడ్డకట్టక అలా రక్తస్రావం జరుగుతూ పోయి ప్రాణాపాయం కలగవచ్చు.8% సాల్ట్స్, హార్మోన్లు, ప్రోటీన్లు, బైకార్బొనేట్ అయాన్లు ఉంటాయి. ఇందులో లవణాల అయాన్లతోనే మెదడునుంచి వచ్చే ఆదేశాలు వివిధ అవయవాలకు చేరుతుంటాయి. హార్మోన్లు కీలకమైన జీవక్రియలు నిర్వహిస్తుంటాయి. ఇక బైకార్బొనేట్ అయాన్లు వివిధ రకాల ఆమ్ల, క్షార పదార్థాలను విరిచేసి, మామూలుగా చేస్తాయి. (న్యూట్రలైజ్ చేస్తాయి).4.3 నుంచి 5.9 మిలియన్లు పురుషుల్లో ఉండాల్సిన నార్మల్ ఎర్రరక్తకణాలు 4.3 నుంచి 5.9 మిలియన్స్ పర్ ఎమ్ఎమ్ క్యూబ్... అలాగే మహిళల్లోనైతే 3.5 నుంచి 5.5 మిలియన్స్ పర్ ఎమ్ఎమ్ క్యూబ్ ఉండాలి. దీని కంటే ఎర్రరక్తకణాల్లో హీమోగ్లోబిన్ మోతాదులను తెలుసుకోవడం అవసరం అది పురుషుల్లో ప్రతి డెసీలీటర్కు 13.5 నుంచి 17.5 గ్రాములూ, ప్రతి డెసిలీటర్కు మహిళల్లో 12.0 నుంచి 16.0 గ్రాములు ఉండాలి. ఇదే రక్తాన్ని ఎర్రగా కనిపించేలా చేస్తూ, జీవకణాలన్నింటికీ ఆక్సిజన్ను చేరవేస్తుంటుంది. అలాగే వెలువడే వ్యర్థాలు, కాలుష్యాలను బయటకు చేరవేసేవి కూడా ఆర్బీసీనే.4,500 నుంచి 11,000తెల్లరక్తకణాలు ప్రతి క్యూబిక్ మిల్లీమీటర్ (ఎమ్ఎమ్)లో 4,500 నుంచి 11,000 ఉండాలి. మన శరీరాన్ని బయటి నుంచి దాడి చేసే సూక్ష్మక్రిములు, బ్యాక్టీరియా, వైరస్ల నుంచి కాపాడే రక్షణ కణాలు ఈ తెల్లరక్తకణాలే. ఇందులో మళ్లీ ఐదు రకాల కణాలుంటాయి. అవి... ∙న్యూట్రోఫిల్స్ : ఇవి శరీరాన్ని బ్యాక్టీరియా, ఫంగైలనుంచి రక్షిస్తాయి. ∙లింఫోసైట్స్ : ఇవి కొన్ని రకాల వైరస్ల నుంచి, క్యాన్సర్ల నుంచి శరీరాన్ని రక్షిస్తాయి. ∙మోనోసైట్స్ : చెడిపోయిన కణాలను నిర్మూలించి, ఇన్ఫెక్షన్ కలిగించే సూక్ష్మజీవులనుంచి ఇవి మన శరీరాన్ని కాపాడతాయి. ∙ఇజినోఫిల్స్ : ఇవి కొన్ని రకాల పరాన్న జీవుల నుంచి, కొన్ని రకాల క్యాన్సర్ల నుంచి మన శరీరానికి రక్షణ కల్పిస్తాయి. ∙బేసోఫిల్స్ : ఇవి అలర్జీల నుంచి రక్షణ కలిగిస్తాయి.రక్తం నిర్వహించే విధులివి...→ ఆహారం జీర్ణమై అది గ్లూకోజ్గా మారాక అన్ని కణాలకూ దాన్ని అందించడానికి రక్తం తోడ్పడుతుంది. గ్లూకోజ్తో పాటు అమైనోయాసిడ్స్, ఫాటీయాసిడ్స్నూ కణాలన్నింటికీ అందజేస్తుంది. → రక్తంలోని గ్లూకోజ్ వల్ల శరీరంలో శక్తిని ఇచ్చే జీవక్రియలు జరుగుతాయి. దీన్నే మెటబాలిజమ్ అంటారు. ఈ క్రమంలో కార్బన్–డై–ఆక్సైడ్, యూరియా, లాక్టిక్ యాసిడ్ వంటి కొన్ని కాలుష్యాలు, వ్యర్థాలు ఉత్పత్తి అవుతాయి. వాటిని శుభ్రపరిచేందుకు ఉద్దేశించిన మూత్రపిండాల వంటి అవయవాల వద్దకు ఆ వ్యర్థాలను చేరవేసేది కూడా రక్తమే. రక్తంలోని తెల్లరక్తకణాలు బయటి నుంచి శరీరంలోకి ప్రవేశించే రోగకారక క్రిములతో పోరాడి, మనకు వ్యాధినిరోధకతను కల్పిస్తాయి. ఈæ కీలకమైన కార్యకలాపాలన్నీ నిత్యం జరగాల్సి ఉంటుంది కాబట్టే... ఏదైనా ప్రమాదం జరిగి రక్తస్రావం అవుతుంటే, దాన్ని కట్టడి చేయడానికి మన శరీరం కృషి చేస్తుంది. రక్తస్రావం మొదలుకాగానే రక్తం చుట్టూ ఒక వల లాంటిది ఏర్పడి రక్తం గడ్డకట్టి, స్రావాన్ని ఆపేందుకు ప్లేట్లెట్స్ తోడ్పడతాయి.డాక్టర్ బోయెళ్ల పవన్ కుమార్సీనియర్ హెమటాలజిస్ట్ – మెడికల్ ఆంకాలజిస్ట్నిర్వహణ: యాసీన్ -
గర్భం దాలుస్తున్నాను... కానీ...
నాకు 30 సంవత్సరాలు. మా పెళ్లై ఐదు సంవత్సరాలు అయ్యింది. ప్రతిసారి నేను గర్భం దాల్చుతున్నాను, కానీ రెండు నుంచి మూడు నెలల్లోనే మిస్క్యారేజ్ అవుతోంది. ఇది మూడుసార్లకు పైగా జరిగింది. మాకు ఒక హెల్దీ బేబీ కావాలి. దీనికి కారణం ఏమిటి? ఎలా ట్రీట్ చేయాలి?– సుజాత, విజయవాడ.మూడుసార్లకు పైగా రిపీటెడ్గా మిస్క్యారేజ్ అవుతుంటే దాన్ని రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ అంటారు. అంటే ప్రతిసారి ఎందుకు మిస్క్యారేజ్ అవుతోంది అన్నది తెలుసుకోవడానికి కొన్ని పరీక్షలు చేసి కారణాన్ని గుర్తించాల్సి ఉంటుంది. ఈ పరిశీలనలో ముందుగా డీటెయిల్డ్ హిస్టరీ తీసుకోవాలి. అసలు స్కాన్ చేయించారా లేదా, ఎన్ని రోజులకు లేదా ఎన్ని వారాలకు మిస్క్యారేజ్ అవుతోంది అన్నది తెలుసుకోవాలి. రెండు నెలలు పూరై్తన తర్వాత జరుగుతుందా, లేక ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ అయిన వెంటనే జరుగుతుందా అన్నది కూడా అడగాలి. అలాగే స్కాన్ లో బేబీ హార్ట్బీట్ ఫార్మేషన్ ఉందా లేదా, ఒకసారి హార్ట్బీట్ వచ్చి పోయాక మిస్క్యారేజ్ అవుతోందా అన్నది కూడా డీటెయిల్డ్గా తెలుసుకోవాలి. ఇలా ఎందుకు జరుగుతోంది అన్నది పూర్తిగా పరిశీలించాలి. సాధారణంగా మొదటి మూడు నెలల్లో, అంటే 12 వారాల లోపల రిపీటెడ్గా మిస్క్యారేజ్ కావడానికి కారణాలు; అలాగే మూడు నెలల తర్వాత మిస్క్యారేజ్ కావడానికి కారణాలు వేర్వేరుగా ఉంటాయి. ఈ పేషెంట్కు మొదటి మూడు నెలల్లోనే జరుగుతోంది కాబట్టి ముఖ్యమైన కారణాలు ఏమిటంటే, ముందుగా తల్లికి, తండ్రికి జెనెటిక్ పరీక్షలు చేసి, జెనెటిక్ సమస్యలు ఉన్నాయా అని చెక్ చేయాలి. అలాగే మిస్క్యారేజ్ అయినప్పుడు బయటికి వచ్చిన టిష్యూ ఉంటే దానికి కూడా జెనెటిక్ పరీక్షలు చేసి, ఏదైనా జెనెటిక్ సమస్య ఉందా లేదా అనేది తెలుసుకోవచ్చు. అలా ఉంటే జెనెటిక్ కౌన్సెలింగ్ ద్వారా సరైన మార్గదర్శకాలు తీసుకోవచ్చు. వయస్సు కూడా చాలా ముఖ్యమైన అంశం. సాధారణంగా తల్లి వయస్సు 35 సంవత్సరాల కంటే ఎక్కువగా ఉండటం లేదా తండ్రి వయస్సు 40 సంవత్సరాల కంటే ఎక్కువగా ఉండటం వల్ల మిస్క్యారేజ్ వచ్చే ప్రమాదం కొంచెం పెరుగుతుంది. అలాగే మధుమేహం ఉందా, థైరాయిడ్ సమస్య ఉందా, లేదా ఇతర వ్యాధులు ఉన్నాయా అన్నది కూడా పరిశీలించాలి. ముఖ్యంగా రక్త సంబంధిత లేదా ఇతర శరీర వ్యవస్థల సమస్యలు ఉన్నా కూడా మిస్క్యారేజ్ వచ్చే అవకాశాలు ఉంటాయి. తర్వాత ఒక స్కాన్ ద్వారా గర్భసంచి ఆకారం ఎలా ఉంది అన్నది చూడాలి. గర్భసంచిలో ఏదైనా నిర్మాణ లోపం ఉందా లేదా గర్భసంచి ఆకారం సాధారణంగా ఉందా అన్నది చెక్ చేయాలి. మంచి స్కాన్ ద్వారా గర్భసంచిలో ఏదైనా పొర లాంటిది ఉండి, దాని వల్ల బ్లడ్ సప్లై సరిగ్గా అందకపోతుందా అన్నది తెలుసుకోవచ్చు. ఇలాంటి సమస్య ఉంటే కొన్ని సందర్భాల్లో చిన్న ప్రొసీజర్ ద్వారా దాన్ని సరిచేసే అవకాశం కూడా ఉంటుంది. ఇంకో ముఖ్యమైన కారణం రక్తం గడ్డకట్టే సమస్యలు. వీటిని థ్రాంబోఫీలియాస్ అని అంటారు. అంటే రక్తంలో ఉండే గడ్డకట్టే లక్షణాలు ఎక్కువగా ఉండటం వల్ల గర్భానికి సరైన రక్తప్రసరణ జరగక మిస్క్యారేజ్ కావచ్చు. ఇందులో కొన్ని ప్రత్యేక పరీక్షలు చేసి, ఏదైనా తేడా ఉంటే దానికి సరైన మందులు ఇవ్వవచ్చు. కొన్నిసార్లు అన్ని పరీక్షలు చేసినా కూడా కారణం స్పష్టంగా కనిపించకపోవచ్చు. అలాంటి సందర్భాలను అనెక్స్ప్లెయిన్ మిస్క్యారేజ్ అంటారు. అయినప్పటికీ, చిన్న చిన్న కారణాలు గుర్తించినా వాటిని ట్రీట్ చేయడానికి ప్రయత్నించి, భవిష్యత్తులో ఒక హెల్దీ బేబీ కోసం తల్లిదండ్రులు డాక్టర్ కలిసి ప్రయత్నించవచ్చు. ∙మేని మాటశరీరం ‘తనను తానే శుభ్రం’ చేసుకుంటుంది!రోజూ స్నానం చేస్తూ శరీరాన్ని మీరు శుభ్రంగా ఉంచుకుంటున్నారని అనుకుంటున్నారా? కానీ, అసలు క్లీనింగ్ మాత్రం లోపలే జరుగుతోంది! మన శరీరంలో ‘అటో ఫాగీ’ ప్రక్రియ నిరంతరాయంగా పనిచేస్తూ, పాడైన కణాలను తొలగించి కొత్త కణాలను సృష్టిస్తుంది. ముఖ్యంగా మనం నిద్రపోతున్నప్పుడు, ఉపవాసం చేస్తున్నప్పుడు ఈ ‘ఇన్నర్ క్లీనింగ్’ స్పీడ్ మరింత పెరుగుతుంది. డా. కె. అపర్ణ సీనియర్ గైనకాలజిస్ట్, అబ్స్టెట్రీషియన్, ల్యాపరోస్కోపిక్ సర్జన్, సికింద్రాబాద్ -
అందం పందెంలో పసిపిల్లలు
చిన్నారులు సైతం అందంపై మక్కువ పెంచుకుంటున్నారు. స్కిన్ కేర్ రొటీన్లలో మునిగిపోతున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు, ఆకర్షణీయమైన బ్యూటీ ఇన్ ఫ్లుయెన్సర్ల ప్రభావంతో చిన్నారులు కూడా తమ స్కూల్ బ్యాగ్లలో ఖరీదైన కాస్మెటిక్స్ని క్యారీ చేస్తున్నారు. వీరినే నిపుణులు ‘సెఫోరా కిడ్స్’గా పిలుస్తున్నారు.స్కిన్ కేర్ అవసరమా?కార్పొరేట్ కంపెనీలు తమ లాభాల కోసం పిల్లల బాల్యాన్ని పణంగా పెడుతున్నాయంటూ వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జెన్ ఆల్ఫా అంటే 2010–2020 మధ్య జన్మించిన పిల్లలు ఖరీదైన మాయిశ్చరైజర్లు, వృద్ధాప్య ఛాయలను తగ్గించే సీరమ్లను కొనుగోలు చేయడంలో బిజీగా ఉన్నారు. ఈ కొత్త ట్రెండ్ని అవకాశంగా మలచుకుంటోంది కాస్మెటిక్స్ రంగం. అసలు ఈ బేబీ–ఫేస్ బ్యూటీ ధోరణి గత ఏడాది ఒక కంపెనీ పసిబిడ్డల కోసం ప్రత్యేకంగా స్కిన్ కేర్ ఉత్పత్తులను తీసుకురావడంతో మొదలైంది. మూడేళ్ల పిల్లల నుంచి వాడవచ్చునంటూ పలు రకాల ఫేస్ మాస్క్లను తను మార్కెట్లోకి విడుదల చేసింది. అయితే ఈ బ్యూటీ ఉత్పత్తులపై ప్రపంచ వ్యాప్తంగా విమర్శలు వ్యక్తమయ్యాయి. ఆటపాటలతో గడపాల్సిన చిన్నారులకు స్కిన్ కేర్ అవసరమా అంటూ ప్రపంచ వ్యాప్త చర్చకు దారితీసింది. సోషల్ మీడియా వేదికగా!కంపెనీలు ఇప్పుడు పసిపిల్లల కోసం కూడా మేకప్, స్కిన్ కేర్ ఉత్పత్తులను లాంచ్ చేస్తున్నాయి. పెద్ద రిటైల్ స్టోర్లు తమ దుకాణాల మధ్యలో పిల్లలను ఆకర్షించేలా అందమైన బొమ్మలతో కూడిన సౌందర్య ఉత్పత్తులను పెడుతున్నాయి. ముఖ్యంగా మార్కెటింగ్కి సోషల్ మీడియాని వేదికగా చేసుకుంటున్నాయి. స్కిన్ ఫ్లుయెన్సర్లు అని పిలిచే చిన్నపిల్లలు ఈ ఉత్పత్తులను ఎలా వాడాలో చూపిస్తున్నారు. ముఖ్యంగా కరోనా తర్వాత పిల్లలు సోషల్ మీడియాలో ఎక్కువ సమయం గడపడం దీనికి కారణమైంది. పిల్లలు ఒకసారి శోధించగానే అధునాతన ఆల్గారిథమ్లు వారికి మరిన్ని బ్యూటీ టిప్స్, ఇన్ ఫ్లుయెన్సర్ల వీడియోలను చూపిస్తున్నాయి. ఈ వీడియోలు పిల్లలను ఆ అలవాట్లను అనుకరించేలా ప్రోత్సహిస్తున్నాయి. గణాంకాల ప్రకారం, పిల్లల స్కిన్ కేర్ మార్కెట్ 2028 నాటికి రూ. 380 మిలియన్లకు చేరుకుంటుందని అంచనా. కాస్మెటి కోరెక్సియాసౌందర్య ఉత్పత్తులు పిల్లలకు అందం అంటే ఏమిటో తెలియకముందే, రూపానికి ఏదో మెరుగుదల అవసరమనే సందేశాన్ని తెలియకుండానే పంపిస్తాయి. డిజిటల్ ప్రపంచంలో పదేళ్ల వయసున్న అమ్మాయిలు కూడా ఇతర పిల్లలను చూసి ప్రభావితమవుతున్నారు. దీనివల్ల కాస్మెటికోరెక్సియా అనే కొత్త మానసిక సమస్య పుట్టుకొచ్చింది. అంటే సౌందర్య ఉత్పత్తులు, చర్మ సంరక్షణ పట్ల అతిగా, పిచ్చిగా ఆసక్తి చూపడం. ఇలాంటి పద్ధతులకు చిన్నప్పుడే అలవాటు పడటం వల్ల పిల్లల్లో ఒత్తిడి, పోలికలు పెరుగుతాయి. ఈ ధోరణి వల్ల పిల్లలు తమ బాల్యాన్ని కోల్పోతూ, వర్చువల్ ప్రపంచంలో బందీలుగా మారుతున్నారు. గుడ్డిగా నమ్మొద్దుపసిబిడ్డలకు ΄ పౌష్టికాహారం, నిద్ర, ఆటలే ఉత్తమ స్కిన్ కేర్ అని సూచిస్తున్నారు స్కిన్కేర్ నిపుణులు. స్కిన్ కేర్ ట్రెండ్లను గుడ్డిగా అనుసరించకూడదంటున్నారు. సౌందర్య సాధనాల పరంగా పసిబిడ్డలకు స్కిన్ కేర్ అవసరం లేదంటున్నారు. ఫేస్ మాస్క్లు, స్క్రబ్లు, షీట్ మాస్క్ల వంటి బ్యూటీ ఉత్పత్తులను పరిచయం చేయడం వారి వయస్సుకి తగినది కాదని చెబుతున్నారు. అనవసరమైన ఉత్పత్తులు వాడటం వల్ల చికాకు, అలర్జీలు, దద్దుర్లు లేదా దీర్ఘకాలిక సమస్యలకు దారితీయవచ్చనంటున్నారు. రంగురంగుల ΄్యాకేజింగ్, సోషల్ మీడియా ఆల్గారిథమ్ల వెనుక, పిల్లలు కోలుకోలేని శారీరక చర్మసమస్యలు, కాస్మెటికోరెక్సియా వంటి తీవ్రమైన మానసిక ఆందోళనలు దాగి ఉన్నాయి. అందుకే అత్యంత హానికరమైన మార్కెటింగ్ వ్యూహంలో చిక్కుకోకుండా పిల్లలను కాపాడుకోవాలి. అందంపై ఉండే సామాజిక దృక్పథాన్ని మార్చాలి. కాస్మెటిక్స్కి దూరంగా ఉంచాలి.పిల్లలకు కాస్మొటిక్స్ వాడకూడదు...చాలామంది తల్లుల్లో ఒక ఆలోచన ఉంటుంది. పిల్లలు పుట్టినప్పుడు మంచి రంగులో ఉన్నారు. తర్వాత కలర్ తగ్గిందేమిటి అనుకుంటారు. దీంతో స్కిన్ కేర్ కోసం జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. చుండ్రు వస్తుందని, స్మెల్ బాగుంటుందని హెయిర్ ప్రొడక్ట్స్ ఉపయోగిస్తుంటారు. మేకప్ కోసం ఇతర ప్రొడక్ట్స్ వాడే వారుంటారు. పిల్లల చర్మం సున్నితంగా ఉంటుంది కాబట్టి ఎలాంటి సౌందర్య ఉత్పాదనలను ఉపయోగించకూడదు. రంగు తక్కువ ఉన్నారనో, ఇంకా బాగా కనిపిస్తారనో ఆలోచనతో వివిధ రకాల సబ్బులు, కాస్మొటిక్స్ ఉపయోగిస్తే వారి లేత చర్మంపైన దద్దుర్లు రావడం, ఇరిటేషన్ కలగడం.. వంటివి సంభవించవచ్చు. ఆరుబయట బాగా ఆడే పిల్లలకు మినరల్ బేస్డ్ సన్స్క్రీన్ మాత్రమే ఉపయోగించాలి.డా. స్వప్నప్రియసీనియర్ డర్మటాలజిస్ట్– జంబుల రమాదేవి, సాక్షి, ఫీచర్స్ ప్రతినిధి -
గర్భిణీలు చేపలు తినకూడదా?
గర్భం ధరించి మొదలు పండంటి పాపాయిని ప్రసవించే దాకా ఎన్నో అనుమానాలు మరెన్నో సందేహాలు. ముఖ్యంగా గర్భధారణ సమయంలో ఆహారం విషయంలో సమాజంలో అనేక అపోహలు ఉన్నాయి. శాస్త్రీయంగా నిరూపితమైన వాస్తవాలను తెలుసుకోవడం ద్వారా తల్లి, బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉండవచ్చు. గర్భిణీలు తీసుకోనే ఆహారం, అపోహలపై ఈవిషయాలను తెలుసుకోవాలి.గర్భిణులు ఇద్దరి కోసం తినాలలా? నిజం ఏమిటంటే అవసరం లేదు. మోతాదు కంటే పోషక విలువలపై దృష్టి ముఖ్యం.బొప్పాయి, పైనాపిల్ తింటే గర్భస్రావం అవుతుంది? నిజమేనా? నిజం లేదు. బాగా పండిన బొప్పాయి, పైనాపిల్ తక్కువ మోతాదులో తీసుకోవడం సురక్షితమే.కుంకుమపువ్వు తింటే బిడ్డ తెల్లగా పుడతారు. బిడ్డ చర్మం రంగు తల్లిదండ్రుల జీన్స్పైనే ఆధారపడి ఉంటుంది.చేపలు అస్సలు తినకూడదు. చేపలలో ఉండే ఒమేగా–3 ఫ్యాటీ యాసిడ్స్ బిడ్డ మెదడు అభివృద్ధికి మేలు చేస్తాయి.నెయ్యి ఎక్కువగా తింటే సుఖ ప్రసవం అవుతుంది : ఇందుకు శాస్త్రీయ ఆధారాలు ఏమీ లేవు. ఇదీ చదవండి: నో మెన్... ఓన్లీ విమెన్ : 300మంది వీడియో వైరల్ -
అమ్మ కడుపు చల్లగా...
గర్భధారణ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల నుంచి నవజాత శిశువుల ఆరోగ్యం వరకు తల్లీబిడ్డలు చల్లగా ఉండేలా కృషి చేస్తోంది డా.అపర్ణ హెగ్డే ఆధ్వర్యంలోని స్వచ్ఛంద సంస్థ... ఆర్మ్మాన్. ప్రతి ఇంటిలో చిన్నదో, పెద్దదో సెల్ఫోన్ ఉంటుంది. ఆ సెల్ఫోన్నే వేదికగా చేసుకొని పేదింటి గర్భిణి మహిళలకు వారం, వారం సలహాలు ఇవ్వడంతో పాటు హెల్త్ వర్కర్లకు శిక్షణ ఇస్తోంది ఆర్మ్మాన్...‘ప్రసూతి, నవజాత శిశు మరణాలు చాలా వరకు నివారించదగినవే అయినా నివారించలేకపోతున్నాం’ అంటున్న యూరోగైనకాలజిస్ట్ అపర్ణ హెగ్డే తల్లులు, నవజాత శిశువుల మరణాలను నివారించడానికి ‘అర్మ్మ్యాన్’ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించారు. ‘క్షేత్రస్థాయిలో తక్కువ వనరులతో ఎక్కువ బాధ్యతలు నిర్వహిస్తున్నారు హెల్త్ వర్కర్లు. దీనివల్ల గ్రామీణ ప్రాంతాలు, పట్టణ మురికివాడలలోని మహిళలకు సకాలంలో వైద్యసహాయం అందడం సవాలుగా మారింది. ఆరోగ్య వ్యవస్థలోని లోపాలను దగ్గరి నుంచి చూడడం వల్లే తగిన పరిష్కారాల కోసం ఆర్మ్మాన్కు శ్రీకారం చుట్టాను’ అంటున్నారు అపర్ణ హెగ్డే.వారే స్ఫూర్తి....ప్రజారోగ్య వ్యవస్థకు చోదకశక్తిగా ఉన్న ఆశా కార్యకర్తలు అనే హెల్త్ వర్కర్లు అపర్ణకు స్ఫూర్తి. ‘ఆశాకార్యకర్తలు శ్రమజీవులు. పనిభారాన్ని తమ భుజాలపై మోస్తున్నారు. ఒక గర్భిణి స్త్రీని లేదా నవజాత శిశువును చూడడానికి మండే ఎండలను, వర్షాలను వారు లెక్క చేయరు. తల్లీబిడ్డలు క్షేమంగా ఉండాలనే తపనతో కర్తవ్యదీక్షతో ముందుకు వెళతారు. వారు పొలాల గుండా, అడవుల గుండా మండే ఎండల్లో గంటల తరబడి నడిచిపోవడం చూశాను. గర్భిణులు, బాలింతలకు నిజంగా ఏమి అవసరమో వారు మాకు చెబుతుంటారు. మేము ఏదైనా మార్పు తెచ్చామంటే దానికి వారే మూలకారకులు’ అంటున్నారు అపర్ణ.మొబైల్ ఫోన్ వేదికగా...గర్భిణి స్త్రీలకు, మూడు సంవత్సరాలలోపు పిల్లల తల్లులకు తగిన సూచనలు, ముందుజాగ్రత్తలు చెప్పి వారు సమస్యల బారిన పడకుండా చూస్తోంది ఆర్మ్మాన్. దీని కోసం ప్రతి ఇంటిలో అందుబాటులో ఉండే మొబైల్ ఫోన్నే ఆసరాగా చేసుకుంటోంది. గర్భిణులు, బాలింతలు తమకు ఏమైనా సమస్యలు ఉంటే అందుబాటులో ఉన్న మొబైల్తో సమాచారాన్ని అందిస్తే చాలు ఆర్మ్మాన్ కార్యకర్తలు రంగంలోకి దిగుతారు. ప్రమాదకరమైన కేసులను ముందుగానే గుర్తించి తెలియజేసేలా హెల్త్వర్కర్లకు తగిన శిక్షణ ఇస్తోంది ఆర్మ్మాన్.మార్పు వస్తోంది...‘ఆర్మ్మాన్ వల్ల మార్పు వచ్చిందా?’ అనే ప్రశ్నకు ‘అవును’ అని ఆత్మవిశ్వాసం నిండిన గొంతుతో సమాధానం ఇస్తున్నారు అపర్ణ హెగ్డే. గర్భధారణ మధ్య విరామం అవసరం అని ‘ఆర్మ్మాన్’ విస్తృతంగా ప్రచారం చేసింది. ఈ ప్రభావంతో రేణుక అనే మహిళ తన భర్తను కుటుంబ నియంత్రణకు అంగీకరించేలా ఒప్పించింది. దిల్లీలోని కళ్యాన్పురి మురికివాడల్లో నివసించే భాటియ భార్య శిశువుకు జన్మనిచ్చి చనిపోయింది. నవజాత శిశువును ఎలా చూసుకోవాలి, ఆరోగ్యాన్ని ఎలా పర్యవేక్షించాలి, అనేదానిపై భాటియాకు బొత్తిగా అవగాహన లేదు. నవజాత శిశువుకు సంబంధించి ‘ఆర్మ్మాన్’ ఇచ్చిన సూచనలు, సలహాలు ఆయనకు ఎంతో ఉపకరించాయి.గర్భిణిగా ఉన్నప్పుడు ఖుష్బు శ్రీవాస్తవ, ఆరోగ్యకరమైన ప్రసవానికి సంబంధించి వారానికి ఒకసారి ‘ఆర్మ్మాన్’ నుంచి వచ్చే వాయిస్ కాల్స్ వినేది. మాత్రల వాడకం నుంచి తీసుకునే ఆహారం వరకు ఆ సలహాలు ఖుష్బుకు ఎన్నో రకాలుగా ఉపయోగపడ్డాయి. పోషకాహార ప్రాముఖ్యతను గట్టిగా చెప్పాయి. ఆమె ఆరోగ్యకరమైన బిడ్డకు జన్మనిచ్చింది. గతంలో ఖుష్బుకు గర్భస్రావం అయింది. ‘గతంలో నేను వాయిస్ కాల్స్ విని ఉంటే నాకు గర్భస్రావం కాకుండా ఉండేది’ అంటుది ఖుష్బు.‘ఆర్మ్మాన్’ ప్రభావం గురించి చెప్పడానికి ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. వైట్ రిబ్బన్ అలయెన్స్మన దేశంలో ప్రసూతి మరణాల నివారణ, నవజాత శిశువుల ఆరోగ్యం....మొదలైన లక్ష్యాలతో 1999లో ‘వైట్ రిబ్బన్ అలయెన్స్’ అనే స్వచ్ఛంద సంస్థ ఆవిర్భవించింది. కస్తుర్బా గాంధీ జయంతిని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం ‘సేఫ్ మదర్ హుడ్ డే’ నిర్వహించుకోవాలని ‘వైట్ రిబ్బన్ అలయెన్స్’ నిర్ణయించింది.సామాజిక హోదాతో సంబంధం లేకుండా...ప్రసవ సమయంలో ఏ స్త్రీ ప్రాణాలు కోల్పోకూడదు. ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ అందుబాటులో లేకపోవడం వల్ల ఏ బిడ్డా ప్రాణాలు కోల్పోకూడదు. తల్లులు, పిల్లల ఆరోగ్యం వారు ఎక్కడ పుట్టారు, వారి కుటుంబాలు ఎంత సంపాదిస్తున్నాయి, సమీపంలో క్లీనిక్ ఉందా, అనేదానిపై ఆధారపడకూడదు. ప్రతి స్త్రీ తన కులం, వర్గం, సామాజిక హోదాతో సంబంధం లేకుండా తన కోసం, తన బిడ్డ కోసం సరైన నిర్ణయం తీసుకునే సాధికారత ఉండాలి. ప్రభుత్వాలు మా సాంకేతికతను స్వీకరించడం మాత్రమే కాకుండా దానిని తమ సొంతం చేసుకొని, మెరుగు పరిచి జాతీయ ఆరోగ్య వ్యవస్థలకు అనుసంధానిస్తున్నాయి. తద్వారా మహిళల ఆరోగ్యం రాజకీయ, సామాజిక, సాంస్కృతిక ప్రాధాన్యతగా మారుతుంది.– అపర్ణ హెగ్డే -
చిన్నారి కిడ్నీలో పెద్ద రాయి.. శస్త్రచికిత్స లేకుండానే..
సాధారణంగా పెద్దవారిలో కనిపించే కిడ్నీ సంబంధిత సమస్యలు ఇప్పుడు పసిపిల్లల్లో కూడా కనిపిస్తున్నాయి. తాజాగా, కర్ణాటకలోని బీదర్కు చెందిన ఏడాది వయసున్న బాలుడికి శస్త్రచికిత్స లేకుండా, ఎటువంటి కోత లేకుండా కిడ్నీలోని 10 మిమీ రాయిని తొలగించి హైదరాబాద్ బంజారాహిల్స్లోని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ (AINU) వైద్యులు అద్భుత విజయాన్ని సాధించారు.బీదర్కు చెందిన ఒక ఏడాది బాలుడు విపరీతమైన ఏడుపు, మూత్రంలో రక్తం పడటం వంటి లక్షణాలతో బాధపడుతుండటంతో తల్లిదండ్రులు స్థానిక వైద్యులను సంప్రదించారు. పరీక్షల్లో బాలుడి ఎడమ కిడ్నీలో 10 మిమీ పరిమాణం ఉన్న రాయి ఉన్నట్లు తేలింది. తదుపరి చికిత్స కోసం బాలుడిని హైదరాబాద్లోని ఏఐఎన్యూ ఆసుపత్రికి తీసుకువచ్చారు.అధునాతన చికిత్స - 'ఈఎస్డబ్ల్యూఎల్' (ESWL):బాలుడు చాలా చిన్నవాడు కావడం, సాధారణ సర్జరీ వల్ల కలిగే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని, కన్సల్టెంట్ యూరాలజిస్ట్ డాక్టర్ గోపాల్ రాందాస్ తక్ నేతృత్వంలోని వైద్య బృందం అత్యాధునిక ఎక్స్ట్రాకార్పోరియల్ షాక్ వేవ్ లిథోట్రిప్సీ (ESWL) పద్ధతిని ఎంచుకుంది.కోత లేని వైద్యం: ఈ పద్ధతిలో ఎటువంటి సర్జరీ అవసరం లేదు. కేవలం 'లిథోట్రిప్టర్' యంత్రాన్ని ఉపయోగించి హై-ఎనర్జీ షాక్ వేవ్స్ ద్వారా రాయిని ఇసుక రేణువులంత చిన్న ముక్కలుగా పొడి చేశారు.సురక్షితం: అల్ట్రాసౌండ్ గైడెన్స్ ఉపయోగించడం వల్ల బాలుడికి రేడియేషన్ ముప్పు కలగకుండా జాగ్రత్త పడ్డారు.వేగవంతంగా కోలుకోవడం: చికిత్స జరిగిన కొద్ది గంటల్లోనే బాలుడు మామూలు స్థితికి వచ్చి పాలు తాగడం ప్రారంభించాడు. అదే రోజు డిశ్చార్జ్ కూడా చేశారు.ఈ సందర్భంగా డాక్టర్ గోపాల్ రాందాస్ తక్ మాట్లాడుతూ.. "పిల్లల విషయంలో సర్జరీ వల్ల కలిగే గాయాన్ని తగ్గించడమే మా ప్రాధాన్యత. ఈ ఆధునిక పద్ధతి వల్ల ఒక్క రక్తపు చుక్క కూడా చిందకుండా, అత్యంత సురక్షితంగా రాయిని తొలగించగలిగాము," అని తెలిపారు.ఏఐఎన్యూ మేనేజింగ్ డైరెక్టర్, ప్రముఖ రోబోటిక్ సర్జన్ డాక్టర్ మల్లికార్జున సి. మాట్లాడుతూ.. "ప్రస్తుత కాలంలో మారుతున్న ఆహారపు అలవాట్ల వల్ల చిన్నారుల్లో కూడా కిడ్నీ స్టోన్స్ పెరుగుతున్నాయి. చిన్నపిల్లల్లో ఎండోస్కోపీ, లేజర్ వంటి పద్ధతులు వారి శరీర నిర్మాణానికి ఇబ్బంది కలిగించవచ్చు. అటువంటి సమయాల్లో ఈఎస్డబ్ల్యూఎల్ అత్యంత ప్రభావవంతమైన మార్గం," అని పేర్కొన్నారు. కాగా, నెల రోజుల తర్వాత నిర్వహించిన వైద్య పరీక్షల్లో బాలుడి కిడ్నీలో రాయి పూర్తిగా తొలగిపోయిందని, అతను ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నాడని వైద్యులు ధృవీకరించారు. డాక్టర్ మల్లికార్జున సి, యూరాలజిస్ట్, రోబోటిక్ సర్జన్దేశ్పాండ్య హేమేష్, ESWL టెక్నీషియన్ (చదవండి: ఆ నటుడికి మోటార్ న్యూరాన్ వ్యాధి.. ఎందువల్ల వస్తుందంటే..?) -
ఆ నటుడికి మోటార్ న్యూరాన్ వ్యాధి.. ఎందువల్ల వస్తుందంటే..?
గేమ్ ఆఫ్ థ్రోన్స్ నటుడు మైఖేల్ పాట్రిక్ 35 ఏళ్ల వయసులో నాడీ సంబంధిత వ్యాధి మోటార్ న్యూరాన్ వ్యాధితో మృతి చెందారు. ఏప్రిల్ 9, 2026న, అతను మరణించినట్లు ఆయన భార్య నవోమి షీహాన్ ఇన్స్టాగ్రామ్లో వెల్లడించారు. ఆయన గత రాత్రి నార్తర్న్ ఐర్లాండ్ హాస్పిస్లో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలిపింది. ఆయనకు ఫిబ్రవరి 1, 2023న అతనికి మోటార్ న్యూరాన్ వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. ఆయన పది రోజుల క్రితం ఆస్పత్రిలో చేరారు, అక్కడ అద్భుతమైన వైద్యుల బృందం ఆయనకు చికిత్స అందించారు. నయం చేయలేని ఈ వ్యాధి కారణంగా ఆయన తన కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో తుదిశ్వాస విడిచారు. ఒక్కసారిగా అక్కడ విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ నేపథ్యంలో ఆ నటుడిని పొట్టనబెట్టుకున్న మోటార్ న్యూరాన్ వ్యాధి అంటే..?, ఎందువల్ల వస్తుంది తదితరాల గురించి సవివరంగా తెలుసుకుందామా.!.మోటార్ న్యూరాన్ వ్యాధి అంటే ..పేరు సూచించినట్లుగా, మోటార్ న్యూరాన్ వ్యాధి (MND) అనేది న్యూరాన్లు, చలనశీలతకు సంబంధించిన ఒక వ్యాధి. క్లీవ్ల్యాండ్ క్లినిక్ నివేదిక ప్రకారం, MND అనేది మోటార్ న్యూరాన్లను నాశనం చేసే నరాల సంబంధిత రుగ్మతల సమూహాన్ని సూచిస్తుంది. ఈ న్యూరాన్లు మింగడం, మాట్లాడటం, నడవడం, శ్వాస తీసుకోవడం వంటి కార్యకలాపాలలో పాల్గొంటాయి.సింపుల్గా చెప్పాలంటే.. మెదడులోని న్యూరాన్ల (ఎగువ మోటార్ న్యూరాన్లు) నుంచి వచ్చే సందేశాలు సాధారణంగా వెన్నుపాములోని న్యూరాన్లకు (దిగువ మోటార్ న్యూరాన్లు) ప్రసారం చేయబడతాయి. అక్కడి నుంచి, సందేశాలు శరీరంలోని కండరాలకు చేరి, అవి పనిచేయడానికి వీలు కల్పిస్తాయి. కండరాలు దిగువ మోటార్ న్యూరాన్ల నుంచి సందేశాలను అందుకోలేనప్పుడు, అవి బలహీనపడి కుంచించుకుపోవడం ప్రారంభిస్తాయి. అదేవిధంగా, దిగువ మోటార్ న్యూరాన్లు ఎగువ మోటార్ న్యూరాన్ల నుంచి సంకేతాలను అందుకోలేనప్పుడు, కండరాలు బిగుసుకుపోతాయి, దీనివల్ల స్వచ్ఛంద కదలికలు నెమ్మది నెమ్మదిగా కష్టంగా మారతాయి.కాలక్రమేణా, రోగి నడిచే సామర్థ్యాన్ని లేదా శరీర కదలికలను నియంత్రించే సామర్థ్యాన్ని కోల్పోవచ్చు. మోటార్ న్యూరాన్ వ్యాధులకు ప్రస్తుతం ఎలాంటి నివారణ లేదని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ఇది అంతకంతకు తీవ్రమయ్యే వ్యాధి కాబట్టి, కాలక్రమేణా దీని తీవ్రత పెరుగుతుంది.అయితే, కొన్ని చికిత్సలు ఒక వ్యక్తి జీవన నాణ్యతపై ప్రభావాన్ని తగ్గించగలవు, కానీ మోటార్ న్యూరాన్లు వారాలు, నెలల తరబడి క్షీణిస్తూనే ఉంటాయి, చివరికి రోగిని అంగవైకల్యానికి గురిచేసి, మరణానికి దారితీస్తాయి.మోటార్ న్యూరాన్ వ్యాధుల లక్షణాలుMND లక్షణాలు మొదట్లో స్పష్టంగా కనిపించకపోవచ్చు, కానీ అవి క్రమంగా పెరగవచ్చు. మాటలు తడబడటంకాళ్ళలో బలహీనతకండరాలు అదరడంబరువు తగ్గడంపట్టు బలహీనపడటంఅసంకల్పితంగా ఏడవడం లేదా నవ్వడం వంటి భావోద్వేగాలను నియంత్రించడంలో ఇబ్బందినిద్రకు భంగం కలగడంఊపిరి ఆడకపోవడంగందరగోళంపదేపదే ఛాతీ ఇన్ఫెక్షన్ రావడంఉదయం పూట తలనొప్పిఅలసటవాస్తవానికి ఈ వ్యాధికి కచ్చితమైన లక్షణం అంటూ ఉండదని చెబుతున్నారు నిపుణులు. కాలక్రమేణా మోటార్ న్యూరాన్లు క్రమంగా పనిచేయడం ఆపేస్తాయని పరిశోధనల్లో వెల్లడైందని చెబుతున్నారు నిపుణులు. MND వంశపారంపర్యంగా రావచ్చు, అంటే ఇది ఒక తరం నుంచి మరొక తరానికి సంక్రమించవచ్చు. ఒకే ఒక్క జన్యు మార్పు కూడా ఈ వ్యాధి వంశపారంపర్యంగా రావడానికి కారణం కావచ్చు.MND సాధారణంగా 60 మరియు 70 ఏళ్ల వయస్సు గల వారిని ప్రభావితం చేస్తుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఒక్కోసారి ఇది పెద్దలు పిల్లలను కూడా ప్రభావితం చేయగలదు. ఒక వ్యక్తికి దగ్గరి బంధువుకు ఈ వ్యాధి లేదా ఫ్రంటోటెంపోరల్ డిమెన్షియా అనే సంబంధిత రుగ్మత ఉంటే, ఆ వ్యక్తికి MND వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.(చదవండి: నటి ప్రియాంక చోప్రా తల్లి బ్యూటీ టిప్: మెరిసే చర్మం కోసం..) -
మధుమేహం, అధిక బరువు : బ్రయాన్ జాన్సన్ చిట్కా
యాంటీ-ఏజింగ్ ఇన్ఫ్లుయెన్సర్ బ్రయాన్ జాన్సన్ గుర్తున్నాడా? మరణాన్ని జయించాలని చూస్తున్న అమెరికా టెక్ వ్యాపారవేత్త బ్రయాన్ మరో సరికొత్త చిట్కాను పంచుకున్నాడు. భోజనం తర్వాత 30 నిమిషాల నడక కంటే 10 స్క్వాట్లు చేయడం మేలంటూ సోషల్ మీడియాలో షేర్ చేశాడు.గుండె ఆరోగ్యం, రక్తంలో చక్కెర నియంత్రణ కోసం భోజనం తర్వాత నడవడం చాలా మంచిదని పలువురు వైద్యులు, నిపుణులు చెబుతున్న మాట. అయితే అనేక ప్రయోగాలు, మందులు, ఆహార అలవాట్లతో యువకుడిగా మారిన బ్రయాన్ జాన్సన్ వాకింగ్ కంటే 10 స్క్వాట్లు ఉత్తమమని చెబుతున్నాడు. స్క్వాట్లతో చాలా తక్కువ టైంలోనే చక్కటి జీవక్రియ ప్రయోజనాలను అందిస్తుందని జాన్సన్ వాదన."30 నిమిషాల నడక కంటే రక్తంలో చక్కెర నియంత్రణ కోసం, ప్రతి 45 నిమిషాలకు 10 స్క్వాట్లు చేయడం అనేది, కేవలం 30 నిమిషాల నడక కంటే 14 శాతం ఎక్కువ ప్రయోజనాన్ని అందిస్తుంది," అని జాన్సన్ పేర్కొన్నాడు.. "అధిక బరువు మరియు ఊబకాయం ఉన్న పురుషులలో, మధ్యమధ్యలో కూర్చోవడం వల్ల కండరాల కదలిక పెరిగి గ్లైసెమిక్ నియంత్రణ మెరుగుపడుతుంది" అనే శీర్షికతో ఉన్న 2024 అధ్యయనాన్ని ఆయన ఉటంకించం గమనార్హం. శరీరంలో క్వాడ్స్ (తొడ కండరాలు), గ్లూట్స్ (పిరుదుల కండరాలు) అతిపెద్ద 'గ్లూకోజ్ స్పాంజ్లు' అని, స్క్వాట్లు చేయడం వల్ల అవి సమర్థవంతంగా ఉత్తేజితమవుతాయని జాన్సన్ వివరించారు. (నల్లగా ఉన్నాడని ప్రియుడితో కలిసి భర్త హత్య .. కట్ చేస్తే!)10 squats beats a 30 min walk.For blood sugar control after a meal, doing 10 squats every 45 minutes outperforms a dedicated 30 min walk by 14%.The mechanism: your quadriceps and glutes are the largest glucose sponge in your body. Activating them repeatedly clears more… pic.twitter.com/OMmfVGqRUY— Bryan Johnson (@bryan_johnson) April 9, 2026 క్వాడ్రిసెప్స్, గ్లూట్స్ శరీరంలో అతిపెద్ద గ్లూకోజ్ స్పాంజ్లు. వీటిని తరచుగా ఉత్తేజపరచడం ద్వారా ఒకేసారి చేసే ప్రయత్నంలో కంటే ఎక్కువ గ్లూకోజ్ తొలగించబడుతుంది. 30 నిమిషాల నడక తప్పు కాదు, కానీ అది అంత సమర్థవంతమైనది కాదని బ్రయాన్ తెలిపాడు. అంతేకాదులో పనిలో లేదా కార్యాలయంలో ఎక్కువ గంటలు కూర్చునే అలవాటును విడనాడటం వల్ల ఈ 14 శాతం ప్రయోజనం లభించిందని జాన్సన్ స్పష్టం చేశారు. ఇదీ చదవండి: షుగర్ పేషెంట్లు బొప్పాయి పచ్చిది తినాలా? పండుది తినాలా?ఖచ్చితంగా చెప్పాలంటే, ఎక్కువసేపు కూర్చున్న తర్వాత ఒకేసారి నడవడంతో పోలిస్తే, అధిక బరువు మరియు ఊబకాయం ఉన్న పురుషులలో చిన్నపాటి నడక లేదా స్క్వాటింగ్ విరామాలు గ్లైసెమిక్ నియంత్రణను సమర్థవంతంగా మెరుగుపరుస్తాయని 2024 అధ్యయనం వెల్లడించింది. ఆ 14 శాతం ప్రయోజనం ప్రతి 45 నిమిషాలకు కూర్చోవడాన్ని విరామం ఇవ్వడం వల్ల వచ్చింది, అంతేగానీ ప్రత్యేకంగా స్క్వాట్స్ చేయడం వల్ల కాదు. ప్రతి 45 నిమిషాలకు కొద్దిసేపు నడవడం కూడా స్క్వాట్స్తో సమానంగా పని చేస్తుందని ఈ స్టడీ తెలిపింది.నెటిజన్ల స్పందనఈ పోస్ట్ వైరల్ అవ్వడంతో, ఈ విధానంపై దాదాపు అందరూ సానుకూల అభిప్రాయాలను వ్యక్తం చేశారు. భోజనం తర్వాత నడవడానికి తగినంత సమయం లేని వారు ఇప్పుడు కేవలం స్క్వాట్స్ చేయడం ద్వారా ఆరోగ్యంగా ఉండవచ్చని సోషల్ మీడియా వినియోగదారులు సూచించారు."చాలా సులభం, అయినా అద్భుతంగా ప్రభావవంతమైనది," అని ఒకరు,"భోజనం చేసిన వెంటనే నడవడానికి సమయం లేకపోతే, ఇది మంచి పద్ధతు అని మరొకరు వ్యాఖ్యనించారు. "అవును, నిజమే. రోజుకు ఒకసారి 30 నిమిషాలు నడిచి, మిగిలిన 8 గంటలు కూర్చోవడం మీ జీవక్రియను పూర్తిగా కాపాడదు. దానికి బదులుగా, భోజనం తర్వాత ప్రతి గంటకు మీ కుర్చీలోంచి లేచి 10 స్క్వాట్స్ చేయడం రక్తంలో చక్కెర హెచ్చుతగ్గులను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుందని కమెంట్ చేశారు. -
ఆ వ్యాధి మళ్లీ తిరగబెడుతుందని ఊహించలేదు..! : దీపికా కక్కర్
దీపికా కక్కర్ టెలివిజన్ పరిశ్రమలో అత్యంత ప్రియమైన నటీమణులలో ఒకరు. ససురాల్ సిమర్ కా , కహాం హమ్ కహాం తుమ్లాంటి షోల పాత్రల్లోని నటనతో పాపులర్ అయింది. ఒకప్పుడు అత్యధిక పారితోషికం తీసుకునే టెలివిజన్ నటిగా నిలిచింది. ఆమె గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతోంది. గతేడాది వైద్యులు ఆమె కాలేయం దగ్గర టెన్నిస్ బంతి పరిమాణంలో కేన్సర్ గడ్డ ఉందని నిర్థారించినట్లు తెలిపారామె. వైద్యులు ఆమెకు శస్త్ర చికిత్స చేసి ఆ గడ్డతోపాటు కాలేయంలో 22 శాతం తొలగించారు. హమ్మయ్యా బయటపడ్డాను అనుకునేలోపే ఆ వ్యాధి మరోసారి తిరగబట్టి గట్టి షాకిచ్చింది. దీంతో ఆస్పత్రులు చుట్టూ తిరుగుతూ..కనీసం మాతృత్వాన్ని ఆస్వాదించలేకపోతున్నాననంటూ తన గోడును సోషల్ మీడియా వేదికగా వెళ్లబోసుకుంది. అంతేగాదు ఆరోగ్య సమస్యలు వ్యక్తిగత జీవితాన్ని ఎలా ఇరకాటంలో పడేస్తాయో ఆమె మాటల్లోనే తెలుసుకుందాం.నటి దీపికా కాకర్కు కాలేయం దగ్గర 1.3 సెం.మీ సిస్ట్ మళ్లీ రావడంతో మరో శస్త్ర చికిత్స జరిగింది. కాలేయ కేన్సర్కు చికిత్స పొందుతున్న దీపికాకు ఈ కేన్సర్ మళ్లీ తిరగబెట్టడం ఒక భావోద్వేగపరమైన ఎదురుదెబ్బగా మారిందామెకు. ఈ మేరకు పోస్ట్లో ఊహించన ఈ మలుపు తనను తీవ్ర ఒత్తిడికి గురి చేస్తోందని పంచుకున్నారు. తన ఆరోగ్య సమస్యలు వ్యక్తిగత జీవితాన్ని, ముఖ్యంగా మాతృత్వాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తోందని వాపోయారు. తన కొడుకు రుహాన్తో సమయం గడపలేకపోతున్నాన్న బాధ తనను కలిచివేస్తోందని అంటోంది. ఆస్పత్రి సందర్శనలే దినచర్యగా మారిపోవడంతో అలిసిపోతున్నానని అంటోంది. ఇక తన భర్త షోయబ్ తన కారణంగా పనులతో బిజీ అయిపోయాడని చెప్పుకొచ్చింది. ఆస్పత్రిలో ఉంటే రుహాన్ చూడలేను పోనీ ఇంటికి వస్తే చికిత్సతో అలిసిపోయి పడుకుంటాను అంతే ఇది తన దినచర్యను పూర్తిగా మార్చేసిందన్నారు. నిజానికి అనారోగ్యంతో ఉన్నప్పుడే మనం బలంగా ఉండాలి, సానుకూలంగా ఉండాలి. కానీ ఊహించని విధంగా మరోసారి ఈ కేన్సర్ తిరగబెట్టడం ఒకింత బాధ, భయం ఆవరించాయని కన్నీటి పర్యంతమైంది. ఒకరకంగా ఈ పరిస్థితి తన ఆరోగ్యం, జీవనశైలి పట్ల ఎంత అప్రమత్తంగా ఉండాలో తెలియజేసిందన్నారు. మన శరీరాలు చలా సంక్లిష్టమైనవి, బలమైనవి, ప్రతిరోజు వివిధ చికిత్సలు తట్టుకుంటున్నందుకు అవి నిజంగా గొప్పవి అని మెచ్చుకుంది. ఏ అనారోగ్యం వచ్చినా..మన శరీరంలో హార్మోన్లు ఎంతలా మార్పులు చెందినా..మన జీవితాలను సజావుగా గడుపుతామని అన్నారు. తనలా మళ్లీ మళ్లీ సిస్ట్ వచ్చినా కొందరితో మాట్లాడుతూ.. ఈ సమస్యను ఎదుర్కొనేలా తనను తాను బలోపేతం చేసుకుంటున్నట్లు తెలిపారు దీపికా. అలాగే అనారోగ్యం కారణంగా క్రమం తప్పకుండా వ్లాగ్లో పోస్ట్లు పెట్టలేకపోతున్నానని అన్నారు. తన చుట్టూ ఉన్నవారు నవ్వుతూనే ఉంటున్నారు కానీ, లోపల ఎంత ఆందోళన ఉందో గ్రహించగలను, ముఖ్యంగా అమ్మ, అత్తయ్య ఎంత బాధపడుతున్నారో ఊహించగలను అంటూ తన పోస్ట్ని ముగించింది.(చదవండి: పుష్-అప్స్లో ఈ 75 ఏళ్ల బామ్మే స్ఫూర్తి..! జస్ట్ 12 వారాల్లో..) -
షుగర్ పేషెంట్లు బొప్పాయి పచ్చిది తినాలా? పండుది తినాలా?
ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారంలో పళ్లను ఎక్కువగా తీసుకోవాలి. అలాగే రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవడానికి సరైన ఆహారపు అలవాట్లు చాలా ముఖ్యం. అయితే డయాబెటిస్ ఉన్నవారు పండ్లు తినడానికి కాస్త భయపడుతుంటారు. మరి షుగర్ వ్యాధితో బాదపడుతున్న వారు బొప్పాయి పండ్లను తీసుకోవచ్చా? పచ్చి బొప్పాయి తినాలా? పండిన బొప్పాయి తినాలా? బొప్పాయిలోని పోషక విలువలు, వాటిని తినేటప్పుడు పాటించాల్సిన నియంత్రణ ఎలా పాటించాలో ఇక్కడ తెలుసుకుందాం.బొప్పాయి, అది పచ్చిగా ఉన్నా లేదా పండినా, అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. ముఖ్యంగా రక్తంలో చక్కెరను నియంత్రించే విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్న విషయానికి వస్తే, రోమ్ జె డయాబెటిస్ న్యూట్రిషన్ మెటాబ్ డిస్ జర్నల్లో ప్రచురించబడిన పరిశోధన ప్రకారం, బొప్పాయిలోని లక్షణాలు రక్తంలో గ్లూకోజ్ను తగ్గిస్తాయి.ఇందులో విటమిన్ సి, ఫైబర్, ఫ్లేవనాయిడ్లు , సపోనిన్ లాంటివి ఉన్నాయి. అయితే పక్వానికి వచ్చిన పండు తింటే దానిని తిన్న తర్వాత రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడాన్ని ప్రభావితం చేస్తుంది. మధుమేహంతో జీవిస్తున్న 101 మిలియన్ల (10 కోట్ల) మంది పెద్దలు, తమ రక్తంలో చక్కెర స్థాయిలకు ఏ రకం బొప్పాయి మంచిదో అనే విషయంలో తరచుగా గందరగోళానికి గురవుతుంటారు. దీనిని కచ్చితంగా అర్థం చేసుకోవడానికి, వాటి ప్రత్యేక పోషక విలువలు, పీచుపదార్థం (ఫైబర్) శాతం, జీర్ణశక్తి మరియు గ్లైసెమిక్ ఇండెక్స్ వంటివి ముఖ్యమైనవి.ఇదీ చదవండి: 11 రోజుల్లో పెట్టుబడి రెట్టింపు : వైద్యుడికి దిమ్మదిరిగింది!పచ్చి బొప్పాయిలో సహజ చక్కెరలు తక్కువగా , సంక్లిష్ట కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. ఇది మధుమేహ వ్యాధిగ్రస్తులకు ప్రయోజనకరంగా ఉంటుంది. పచ్చి బొప్పాయిలో సహజ చక్కెరలు పండిన బొప్పాయి కంటే తక్కువగా ఉంటాయి, అందువల్ల ఇది ప్రీ-డయాబెటిక్ లేదా టైప్-1 లేదా టైప్-2 డయాబెటిస్ ఉన్నవారికి మంచి ఎంపిక. పచ్చి బొప్పాయిలో ఉండే పపైన్ అనే ఎంజైమ్ శరీరంలోని రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో ప్రభావవంతంగా ఉంటుంది.ఇదీ చదవండి: కాంగ్రెస్ విత్ డ్రా : ఆమె ఎన్నిక ఇక లాంఛనమే!మరోవైపు, పండిన బొప్పాయిలో ఫ్రక్టోజ్ శాతం ఎక్కువగా ఉంటుంది, ఇది రక్తంలో చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పెరగడానికి దారితీస్తుంది, కాబట్టి మధుమేహ వ్యాధిగ్రస్తులు దీనిని తినే పరిమాణాన్ని నియంత్రించుకోవాలి.100 గ్రాముల పచ్చి బొప్పాయిలో ఈ క్రింది పోషక విలువలు ఉంటాయిశక్తి: 32 కేలరీలుకార్బోహైడ్రేట్లు: 5.5 గ్రామొత్తం చక్కెరలు: 1.2 గ్రాపీచుపదార్థం: 2.6 గ్రాప్రోటీన్: 0.6 గ్రాకొవ్వు: 0.1 గ్రావిటమిన్ సి: 58 మి.గ్రావిటమిన్ ఎ: 225 మైక్రోగ్రాములుపొటాషియం: 190 మి.గ్రాకాల్షియం: 23 మి.గ్రాగ్లైసెమిక్ లోడ్: తక్కువపండిన బొప్పాయి ద్వారా పోషక విలువలు మీ శరీరానికి విటమిన్లు ,ఖనిజాలు లభిస్తాయిశక్తి: 43 కేలరీలుకార్బోహైడ్రేట్లు: 10.8 గ్రామొత్తం చక్కెరలు: 7.8 గ్రాపీచుపదార్థం: 1.7 గ్రాప్రోటీన్: 0.5 గ్రాకొవ్వు: 0.1 గ్రావిటమిన్ సి: 61 గ్రా మి.గ్రావిటమిన్ ఎ: 270 మైక్రోగ్రాములుపొటాషియం: 182 మి.గ్రాకాల్షియం: 20 మి.గ్రాగ్లైసీమిక్ లోడ్: మధ్యస్థం బొప్పాయితో ఇతర ప్రయోజనాలుబొప్పాయిలో ఉండే 'పపైన్' అనే ఎంజైమ్ ఆహారాన్ని సులభంగా జీర్ణం చేయడంలో సహాయపడుతుంది. ఫైబర్ పుష్కలంగా ఉండటం వల్ల మలబద్ధకం, అసిడిటీ, గ్యాస్ వంటి సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. అలాగే ఇందులో లభించే విటమిన్ సి, బీటా-కెరోటిన్, యాంటీ ఆక్సిడెంట్లు చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతాయి. ముఖంపై ముడతలు తగ్గించి సహజమైన మెరుపును ఇస్తాయి. తక్కువ క్యాలరీలు, ఎక్కువ పీచు పదార్థం ఉండటం వల్ల ఇది ఆకలిని నియంత్రించి బరువు తగ్గడానికి కూడా తోడ్పడుతుంది. పచ్చి బొప్పాయిలో లభించే అన్ని పోషకాలు పేగు ఆరోగ్యానికి కూడా చాలా ప్రయోజనకరం. పచ్చి బొప్పాయి ఆరోగ్యానికి, చర్మం, జుట్టుకు చాలా ప్రయోజనకరంగా చెప్పుకోవచ్చు.నోట్ : బొప్పాయితో చాలా ఆరోగ్య ప్రయోజనాలున్నప్పటికీ ఏదైనా మితంగా తీసుకోవడం మంచిది. మీరు ఇంతకు ముందు పచ్చి బొప్పాయిని ఎప్పుడూ తినకపోతే, రక్తంలో చక్కెర నియంత్రణకు సహాయపడటానికి దానిని సరిగ్గా ఎలా పరిచయం చేయాలో తెలుసుకోవడానికి మీరు పోషకాహార నిపుణుడిని లేదా డైటీషియన్ను సంప్రదించడం ఉత్తమం.ఇదీ చదవండి: వ్యాపారవేత్త హత్య: దుబాయ్లో భారతీయ గ్యాంగ్స్టర్ అరెస్ట్ -
కొబ్బరి నీళ్లు, సబ్జా గింజలు కలిపి తీసుకోవచ్చా..?
సమ్మర్ మొదలైపోయింది. బయట వేడి ఏ స్థాయిలో ఉందో చెప్పాల్సిన పనిలేదు. అదీగాక ఇండియన్ సొసైటీ ఆఫ్ నెఫ్రాలజీ సైతం ఉత్తర కర్ణాటక, ఒడిశా, ఉత్తరప్రదేశ్ వంటి ప్రాంతాల్లో ఎండలు మండిపోతాయని ముందుగానే హెచ్చరించింది కూడా. అప్పుడే మే నెల రాక మునుపే సూర్యడి భగభగలు మాములుగా లేవు. ఈ సమయంలో అధికంగా తీసుకోవాల్సింది నీరు. ముఖ్యంగా శరీరం హైడ్రేషన్గా ఉండేలా చూసుకోవాలి. అందుకోసం ఎక్కువ మంది కొబ్బరి నీళ్లపై ఎక్కువగా ఆధారపడుతుంటారు. అలాగే సబ్జా నీళ్లు కూడా తీసుకుంటుంటారు. అయితే కొందరు ఈ రెండిటిని కలిపి తీసుకుంటారు. అసలు ఇలా కలిపి తీసుకోవచ్చా..? ఆరోగ్యానికి మంచిదేనా..అంటే..వేసవిలో చాలామంది డీహైడ్రేషన్కి గురై మూత్రపిండాల్లో రాళ్ల సమస్యను ఎదుర్కొంటుంటారని అంటున్నారు నిపుణులు. అందుకు కొబ్బరి నీళ్లు, సబ్జా రెండూ సమర్ధవంతంగా పనిచేస్తాయి. అసలు వేసవిలోనే మూత్రపిండాల్లో రాళ్ల సమస్య ఎందుకు అధికంగా ఉంటుందంటే..రికార్డు స్థాయిలో నమోదయ్యే అధిక ఉష్ణోగ్రతలు శరీర సాధారణ పనితీరుపై అధిక ఒత్తిడిని కలిగిస్తాయి. దీనిని 'హీట్ స్ట్రెస్' లేదా వడదెబ్బ అంటారు. శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడానికి అధికంగా నీరు కోల్పోవడం వల్ల డీహైడ్రేషన్ సంభవించవచ్చు. మూత్రం కూడా చిక్కగా మారుతుంది, దాని రంగును బట్టి శరీరం ఎంత డీహైడ్రేషన్కు గురైందో తెలుస్తుంది. అలాంటి టైంలో మన తీసుకునే ఆహారం శరీరానికి వేడిచేసేవి అయితే మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. అందువల్ల ఈ సమయంలో తగినంత నీరు తీసుకోవడంపై చాలా కేర్ఫుల్గా ఉండాలి. అంతేగాదు శరీరంలో ఎలక్ట్రోలైట్లు, ఖనిజాలు, విటమిన్లు సమతుల్యంగా ఉండేలా చేసుకోవడానికి, వివిధ వనరుల ద్వారా నీటిని తీసుకోవడం అత్యంత అవసరం.కొబ్బరి నీరు: ప్రకృతి అందించే సహజసిద్ధమైన ఔషధం.. కొబ్బరి నీరు శరీరానికి ఎలక్ట్రోలైట్లు, యు పొటాషియంను అందించే ఒక సహజ జల వనరుగా పేర్కొంటారు. అంతేకాకుండా, దీనికి నిర్విషీకరణ, బాక్టీరియా నిరోధక, పునరుజ్జీవనం, జీర్ణక్రియ, మూత్రవిసర్జన వంటి ఔషధ గుణాలు కూడా ఉన్నాయి. మూత్రపిండాల నుంచి లవణాలను బయటకు పంపడానికి తగినంత నీరు అందనప్పుడు మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడతాయి, కాబట్టి ఇది వాటిని నివారించగలదు. తరుచుగా కొబ్బరి నీరు తీసుకోవడం వల్ల మూత్రం పలుచబడుతుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.కొబ్బరి నీరు జీర్ణాశయ సంబంధిత సమస్యలు, రక్త విరేచనాలపై సానుకూల చికిత్సా ప్రభావాలను కలిగి ఉంటుంది. పిల్లలలో పోషకాహార లోపాన్ని పరిష్కరించడంలో కూడా సహాయపడుతుంది. కాబట్టి కొద్ది పరిమాణంలో తీసుకోవడం వల్ల మూత్రపిండాల్లో రాళ్ల నుంచి మెరుగైన రక్షణ లభిస్తుంది.సబ్జా గింజలు:సబ్జా గింజల్లోని నీటిని శోషించుకునే లక్షణం మూత్రపిండాల్లో రాళ్లను నివారించడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఫార్మా ఇన్నోవేషన్ జర్నల్ ప్రకారం, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు ఖనిజాలను కలిగి ఉండే పోషక ప్రొఫైల్, మూత్ర సంబంధిత ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది, మూత్రపిండాల పనితీరుపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది.కొబ్బరి నీరు సబ్జా గింజల కలయికకొబ్బరి నీరు, సబ్జా గింజల సరైన కలయిక మూత్రపిండాల ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుతాయని ఆయర్వేదం చెబుతోంది. ఇంటర్నేషనల్ బ్రాజ్ జె యూరల్లో ప్రచురించిన పరిశోధన ప్రకారం, కొబ్బరి నీళ్ళు తాగడం వల్ల మీ మూత్రంలో ఉప్పు స్ఫటికాలు ఏర్పడటాన్ని తగ్గిస్తుంది కానీ సబ్జా గింజలు మూత్రపిండాల్లో రాళ్లను నివారిస్తాయనేందుకు ఆధారాలు లేవు అని పేర్కొంది.తీసుకోవాల్సిన జాగ్రత్తలు..కొబ్బరి నీళ్ళు లేదా తులసి గింజల వంటి సహజసిద్ధమైన హైడ్రేటింగ్ వనరులను సురక్షితంగా తీసుకోవడానికి వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించి అనుసరించడం ఉత్తమం అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. మన ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమకు అనుగుణంగా సురక్షితమైన విధంగా ఎలా తీసుకోవాలో సూచిస్తారని చెబుతున్నారు. అంతేగాదు లోబీపీతో బాధపడేవారు సబ్జాగింజలకు దూరంగా ఉండటమే మంచిదని చెబుతున్నారు.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: హెచ్పీవీ వ్యాక్సిన్ అంటే..? ఎప్పుడు ఇవ్వాలంటే..) -
హెచ్పీవీ వ్యాక్సిన్ అంటే..? ఎప్పుడు ఇవ్వాలంటే..
దేశవ్యాప్తంగా హెచ్పీవీ వ్యాక్సినేషన్ క్యాంపెయిన్ మొదలైంది. పద్నాలుగేళ్ల బాలికలు మొదలుకొని దేశంలో దాదాపు కోటీ పదిహేను లక్షల మంది యువతులకు ఈ వ్యాక్సిన్ ఉచితంగా అందజేయాలనే లక్ష్యంతో ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఒక్క సింగిల్డోస్ (మోతాదు)తో మహిళల్లో సర్వైకల్ కేన్సర్ను సమర్థంగా నివారించే (93% నుంచి 100% వరకు రక్షణ కల్పించే) ఈ వ్యాక్సిన్ను ఇవ్వడం మొదలుపెట్టారు. మన దేశంలో విస్తృతంగా మొదలైన ఈ మహిళా ఆరోగ్య సంరక్షణ చర్య ద్వారా అంతర్జాతీయంగా కేన్సర్ నివారణ చర్యలు తీసుకున్న 160 దేశాల్లో మన దేశం కూడా ఒకటి కానుంది. ఈ నేపథ్యంలో ఈ హెచ్పీవీ వ్యాక్సిన్ గురించి అవగాహన కోసం...హ్యూమన్ పాపిలోమా వైరస్ మహిళలను ప్రభావితం ఏలా చేస్తుందంటే... ఇది (హెచ్పీవీ) మహిళల్లో సర్వైకల్ కేన్సర్కు దారితీస్తుంది. సెక్స్ ద్వారా ఈ వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతుంది. దాదాపు సగం జనాభాలో వాళ్ల జీవితంలో ఏదో ఒక సమయంలో హెచ్పీవీ వైరస్ను కలిగి ఉంటారు. అయితే హెచ్పీవీ ఉండటం వల్లనే తప్పక అది సర్వైకల్ కేన్సర్కు దారితీయదు. దురదృష్టవశాత్తూ కేవలం కొంతమందిలోనే అది కేన్సర్ను కలగజేస్తుంది. మల్టిపుల్ పార్ట్నర్స్తో సెక్స్లో పాల్గొనేవారికీ హెచ్పీవీ వైరస్ సోకే అవకాశాలు ఎక్కువ. సాధారణంగా స్త్రీలలో అందునా గ్రామీణ మహిళల్లో ఇది ఎక్కువగా కనిపిస్తోంది. సర్విక్స్ అనే భాగం యోనిని, గర్భసంచితో కలుపుతుంది. ఈ భాగం మహిళ జీవితంలో ఎన్నో దశల్లో అనేక మార్పులకు లోనవుతూ ఉంటుంది. అలా అక్కడ అతి వేగంగా జరిగే కణవిభజన వల్ల కేన్సర్కు గురయ్యే అవకాశాలు ఎక్కువ.సర్వైకల్ కేన్సర్కు ఓ ప్రధాన రిస్క్ ఫాక్టర్ హెచ్పీవీ వైరస్... హెచ్పీవీ వైరస్ సోకడం సర్వైకల్ కేన్సర్కు ఓ ప్రధాన రిస్క్ ఫ్యాక్టర్ అని చెప్పవచ్చు. మామూలుగానైతే చాలామందిలో హెచ్పీవీ వైరస్ దానంతట అదే నశించిపోతుంది. అలా ఒకవేళ నశించకపోతే అది కొంతకాలానికి అది క్కేన్సర్కు దారితీసే అవకాశాలు పెరుగుతాయి. హెచ్పీవీ వైరస్తో పాటు పొగతాగే అలవాటు ఉండటం, ఎయిడ్స్, ఐదేళ్లు లేదా అంతకంటే ఎక్కువకాలం గర్భనిరోధక మాత్రలు వాడటం వంటి అంశాలు కూడా సర్వైకల్ కేన్సర్కు దారితీసే రిస్క్ఫ్యాక్టర్లలో కొన్ని.నివారణ ఎలా? నివారణకు తొలుత తోడ్పడే పరీక్ష పాప్స్మియర్ అనే వైద్యపరీక్ష. సర్వైకల్ కేన్సర్ నిర్ధారణలో పాప్స్మియర్ అనే వైద్యపరీక్షది చాలా కీలక భూమిక. ఇరవయొక్క ఏళ్లు నిండిన మహిళలు మొదలుకొని, తమ లైంగిక జీవితం ప్రారంభమయ్యాక మూడేళ్లు దాటిన ప్రతి మహిళా తప్పనిసరిగా క్రమంతప్పకుండా పాప్స్మియర్ పరీక్ష చేయించుకోవడం అవసరం. అంటే చిన్న వయసు బాలికలు తప్ప మహిళలందరూ క్రమం తప్పకుండా స్క్రీనింగ్ చేయించుకోవడం మంచిది. సర్వైకల్ కేన్సర్ రావడానికి దాదాపు పదేళ్లు ముందుగానే దాన్ని కనుగొనడానికి అవసరమైనంత ‘ప్రీ–కేన్సరస్ దశ’ ఉండటం మరో అడ్వాంటేజ్. అంటే అసలు కేన్సర్ రావడానికి పదేళ్ల ముందే దీన్ని కనుగొనే అవకాశమున్నందున... అది కేన్సర్గా పరిణమించకముందే అంటే ‘ప్రీ–కేన్సర్’ దశలోనే నయం చేసుకోవచ్చు. పూర్తిగా నయమయ్యేందుకు అవకాశం కూడా ఎక్కువే. హెచ్పీవీ వ్యాక్సిన్ ఎప్పుడు ఇవ్వాలంటే... గర్భాశయం ముఖద్వారం వద్ద వచ్చే కేన్సర్లను నివారించే ఈ వ్యాక్సిన్ను ఎప్పుడు ఇవ్వవచ్చనే విషయంలో అమెరికన్ కేన్సర్ ఇన్స్టిట్యూట్ వారి సిఫార్సు మేరకు.. పదకొండేళ్లు నిండిన ప్రతి ఆడపిల్లకు హెచ్పీవీ వ్యాక్సిన్ ఇప్పించాలి. తొమ్మిదేళ్లు నిండిన బాలికలు మొదలుకొని 26 ఏళ్ల వరకు మహిళలందరికీ వ్యాక్సిన్ ఇప్పించవచ్చు. అయితే మహిళలకు వాళ్ల వివాహానికి ముందే అంటే... వాళ్లు తమ లైంగిక జీవితాన్ని మొదలు పెట్టకమునుపే దీన్ని ఇప్పించడం అవసరం. వ్యాక్సిన్ తీసుకున్న మహిళల్లో 99% మందికి ఈ కేన్సర్ వచ్చే అవకాశమే ఉండదు కాబట్టి సర్వైకల్ కేన్సర్ ముప్పు తాలూకు ఆందోళన లేకుండా వారు జీవితాంతం నిశ్చింతగా ఉండే నిర్భయత ఈ వ్యాక్సిన్ తీసుకున్న మహిళలకు ఉంటుంది.హెచ్పీవీ వ్యాక్సిన్తో ఇతరత్రా ప్రయోజనాలివే... హెచ్పీవీ వ్యాప్తినిఅరికట్టడంయోని దగ్గర వచ్చే పులిపిరుల(జెనిటల్ వార్ట్స్) సమస్య నుంచి రక్షణ గర్భాశయ క్యాన్సర్ నుంచి రక్షణయోని క్యాన్సర్ వంటి మరికొన్ని క్యాన్సర్ల ముప్పు నుంచి నివారణ దీర్ఘకాలిక రక్షణను అందిస్తుందిమహిళా సమూహాలకు సంయుక్త రక్షణ (హెర్డ్ ఇమ్యూనిటీ) కలగడంచికిత్స తర్వాత మళ్లీ పునరావృతమయ్యే అవకాశాలు బాగా తగ్గడంతద్వారా జనాభాలోని అందరికీ / ప్రజారోగ్య సంరక్షణకు తోడ్పడటండాక్టర్ సాయిలక్ష్మి డయానా, సీనియర్ కన్సల్టెంట్, గైనిక్ ఆంకాలజిస్ట్ – యాసీన్చదవండి: ‘వజైనల్ వాల్ట్ ప్రోలాప్స్’కు కారణం..! ఎందుకొస్తుందంటే.. -
‘వజైనల్ వాల్ట్ ప్రోలాప్స్’కు కారణం..! ఎందుకొస్తుందంటే..
మెనోపాజ్ తర్వాత మహిళల్లో సాధారణంగా కనిపించే పెల్విక్ ఫ్లోర్ కండరాల బలహీనత కారణంగా కనిపించే ప్రోలాప్స్ సమస్యను చాలా మంది సహజంగా తీసుకుంటూ మౌనంగా భరిస్తుంటారు. కానీ ఈ సమస్యకు సరైన సమయంలో చికిత్స తీసుకుంటే పూర్తిగా ఉపశమనం పొందవచ్చని కిమ్స్ కడల్స్ సికింద్రబాద్కు చెందిన కన్సల్టెంట్ యూరో గైనకాలజిస్ట్ డా. బిందుప్రియ తెలిపారు. తాజాగా పలుమార్లు శస్త్రచికిత్సలు చేసినప్పటికీ మళ్లీ వచ్చిన వజైనల్ వాల్ట్ ప్రోలాప్స్ కేసును విజయవంతంగా చికిత్స చేశామని వివరించారు.65 ఏళ్ల మహిళకు గతంలో గర్భాశయ గడ్డల కారణంగా హిస్టరెక్టమీ చేయబడింది. అనంతరం కొన్ని సంవత్సరాల తర్వాత యోనిలో బయటకు బల్జ్లా కనిపించడం ప్రారంభమై, రోజువారీ జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేసింది. 2023లో ల్యాపరోస్కోపిక్ సర్జరీ చేయించుకున్నప్పటికీ ఫలితం లేకపోవడంతో, 2024లో మరోసారి మెష్తో అబ్డొమినల్ సర్జరీ చేశారు. అయినప్పటికీ నాలుగు నెలల్లోనే సమస్య మళ్లీ తలెత్తింది.ఈ నేపథ్యంలో ఆమె మమల్ని సంప్రదించగా కేసును సమగ్రంగా పరిశీలించి, మొదట వజైనల్ పెస్సరీ ద్వారా కన్సర్వేటివ్ చికిత్సను సూచించగా, రోగి ఏడాది పాటు ఆ విధానాన్ని అనుసరించారు.తరువాత శాశ్వత పరిష్కారం కోసం రోగి ముందుకు రావడంతో వజైనల్ రీకన్స్ట్రక్టివ్ సర్జరీ చేశాం. ఇందులో యాంటీరియర్ వజైనల్ వాల్ రిపేర్, యూటెరోసాక్రల్ లిగమెంట్ సస్పెన్షన్ ద్వారా బలమైన సపోర్ట్ ఇవ్వడంతో పాటు హై పెరినియోరాఫీ కూడా చేశాం. ఈ శస్త్రచికిత్సతో రోగి త్వరగా కోలుకుని, సమస్య నుంచి గణనీయమైన ఉపశమనం పొందింది. ఈ సందర్భంగా డా. బిందు ప్రియ మాట్లాడుతూ, ప్రతి రోగికి చికిత్సను వ్యక్తిగతంగా ప్రణాళిక చేయడం అత్యంత ముఖ్యమన్నారు. ప్రోలాప్స్ తీవ్రత, గత శస్త్రచికిత్సలు, ఇతర ఆరోగ్య సమస్యలు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని చికిత్స నిర్ణయిస్తామని తెలిపారు. పెల్విక్ ప్రోలాప్స్, మూత్రం అదుపు లేకపోవడం వంటి సమస్యలు వయస్సు కారణంగా రావడం సహజమే అయినప్పటికీ, అవి తప్పనిసరిగా భరించాల్సినవికాదు. సిగ్గు, అపోహల కారణంగా ఆలస్యం చేయకుండా, లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదిస్తే జీవన నాణ్యత మెరుగుపడుతుందని సూచించారు. మహిళలు నిర్భయంగా తమ ఆరోగ్య సమస్యలను వెల్లడించేలా అవగాహన పెంపొందించడం సమాజ బాధ్యత అని డా. బిందు ప్రియ, డా. సాయి స్నేహిత పేర్కొన్నారు.యూరో గైనకాలజిస్ట్ డా. బిందుప్రియ, సికింద్రాబాద్(చదవండి: 'పన్ను' వసూలు చేసే బ్యాడ్ హ్యాబిట్స్) -
ఆ రోడ్డు ప్రమాదమే ఆమెను రక్షించింది..!
ఒక్కోసారి రోడ్డు ప్రమాదాలు బాధనే కాదు త్రుటిలో పెను ప్రాణాంతక ప్రమాదాల నుంచి రక్షిస్తాయి కూడా. ఒక్కోసారి విత్కర పరిస్థితి కూడా వరంగా మారిపోతుంది. అందుకు నిదర్శనమే ఈ మహిళ కథ. ఆ రోజు ఆమెకు ఆ యాక్సిడెంట్ జరగకపోతే..ప్రాణాలతో ఉండేది కాదు. ఇదేంటి అనుకోకండి ఈ కథ వింటే ఏం జరిగినా మన మంచికే అనే పెద్దల మాట తలపుకు వస్తుంది. అమెరికాలోని ఓవెన్స్ క్రాస్ రోడ్స్కు చెందిన 31 ఏళ్ల మెలిస్సా ఆడమ్స్ తన పెళ్లికి ఒక రోజు ముందు రాత్రి రోడ్డు ప్రమాదానికి గురైంది. రిహార్సల్ డిన్నర్ నుంచి ఇంటికి వస్తుండగా సిగ్నల్ వద్ద ఉన్న ఆమె కారును ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఢీ కొట్టారు. దాంతో ఆమెను హుటాహుటినా ఆస్పత్రికి తరలించారు. ఆమెకు చికిత్సి చేసే నిమిత్తం వైద్యులు సీటీ స్కాన్ చేయగా..ఆమె ప్రాణాంతక కేన్సర్ వాధి బారిన పడినట్లు నిర్థారణ అయ్యింది. అది నాలుగో స్టేజ్లో ఉన్నట్లు వెల్లడించారు వైద్యులు. ఒక్క క్షణంలో జీవితం తలకిందులైనట్లు అనిపించిందామెకు. ఇంతటి విపత్కర పరిస్థితిలోనూ తమ పెళ్లిని వాయిదా వేసుకోకూడదని ఆమె, తన భాగస్వామి తీర్మానించుకున్నట్లు ఆడమ్స్ పేర్కొంది. ఈ దురదృష్టకర ఘటన మరుసటి రోజే పెళ్లి చేసుకున్నట్లు వెల్లడించింది. తన జీవితంలోని ముఖ్యమైన రోజుని దూరం చేసుకోవడం ఇష్టంలేక ఇలా చేసినట్లు తెలిపింది. తర్వాత వైద్యులు ఆమె శరీరంలోని మొత్తం 18 గడ్డలను గుర్తించి, ఆమెకు ఫోలిక్యులర్ డెండ్రిటిక్ సెల్ సార్కోమా (FDCS) అనే అత్యంత అరుదైన కేన్సర్ ఉన్నట్లు నిర్ధారించారు. అయితే ఆ గడ్డలు ఆమె శరీరంలోని గుండె దగ్గర నుంచి పొత్తికడుపు, ఛాతీతో సహా పలుచోట్ల ఉన్నట్లు తెలిపారు. అనేక ఆస్పత్రులు, ఆంకాలజీ క్లినిక్లను సందర్శించిన తర్వాత చివరకు ఏప్రిల్ 1, బుధవారం నాడు చికిత్సను ప్రారంభించారు. సుమారు 19-20 వారాలు వేచి ఉన్న తర్వాత కీమోథెరపీని ప్రారంభించడంతో తనకు ఉపశమనం, ఆశ కలిగిందని అన్నారు. ఆమె చికిత్సకు అయ్యే ఖర్చు కోసం గోఫండ్ సాయం తీసుకున్నట్లు తెలిపింది. నిజానికి తనకు అప్పటికే కొన్ని ఆటోఇమ్యూన్ సమస్యలు ఉన్నాయని, నడుము నొప్పితో బాధపడుతున్నానని చెప్పుకొచ్చింది. కానీ తనకు మొదటి నుంచి ఆసమస్యలు ఉండటంతో అందువల్ల ఇలా అనుకున్నాననే గానీ ఇలా ప్రాణాంతక కేన్సర్ బారిన పడతానని ఊహించలేదని కన్నీటిపర్యంతమైంది. తాను గత కొంతకాలంగా శరీరం అంతా పలు నొప్పులు ఎదుర్కొన్నట్లు గుర్తుచేసుకుంది. కణుతులు అవయవాలపై ఒత్తిడి తేవడం వల్లనేనని ఇప్పుడు అర్థమవుతోందని అంటోంది. వ్యాధి నిర్థారణ తర్వాత తక్షణమే వైద్య సహాయం తీసుకోవాలంటూ ఇతరులకు సూచనలందిస్తోంది. అస్సలు తనకు గనుక ఆ కారు ప్రమాదం జరిగి ఉండకపోతే..తన అనారోగ్యాన్ని గురించి ఎప్పటికీ తెలుసుకోలేకపోయేదాన్ని అని అంటోందామె.అలాగే తనలాంటి లక్షణాలు ఉన్నా లేక శరీరం ముందుగా ఇచ్చే సంకేతాలనుక్ క్షణ్ణంగా అర్థంచేసుకోమని సూచిస్తోంది. తనలా నిర్లక్ష్యంగా ఉండొద్దని హితవు పలుకుతోంది. ఇక ఆడమ్స్ పరిస్థితి ఇంకా క్రిటికల్గానే ఉందని, పూర్తి స్థాయిలో కోలుకోవడానికి ఇంకా సమయం పడుతుందని ఆమె సన్నిహిత వర్గాలు చెబుతుండటం గమనార్హం. (చదవండి: 'పన్ను' వసూలు చేసే బ్యాడ్ హ్యాబిట్స్) -
పంటి సంరక్షణే.. ఆరోగ్యానికి రక్ష..!
పంటి రక్ష ప్రాణాలకు రక్ష అన్నా పర్వాలేదు. ఎందుకంటే నోరు అనే సింహద్వారానికి పళ్లు ద్వార పాలకులు.వాటిని దాటి ఏదీ రాలేదు. కానీ నోటి ఆరోగ్యం దెబ్బతింటే అది గొంతు ఇన్ఫెక్షన్లనూ, దీర్ఘకాలంలో అక్కడి నుంచి గుండెనూ దెబ్బతీసే ముప్పు లేకపోలేదు. అందుకే నోటి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. నోటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అంటే పంటి ఆరోగ్యాన్ని పదిలంగా కాపాడుకోవడమే. మనకు తెలియకుండా...మన రోజువారీ అలవాట్లలో భాగంగా చాలా పనులు చేస్తుంటాం.ఉదాహరణకు పంటికి లుంగజుట్టుకు పోయే చాక్లెట్లు తింటుంటాం. కూల్ వాటర్ తాగుతూ పంటి కిందికి ‘ఐస్’వస్తే నమిలేస్తుంటాం. ఇలా మనం చాలా తేలిగ్గా తీసుకుని చేసే కొన్ని పనులు పంటి ఆరోగ్యాన్నీ... దీర్ఘకాలంలో ఒంటి ఆరోగ్యాన్నీ దెబ్బతీసే ప్రమాదం ఉంటుంది. కాబట్టి అలాంటి అలవాట్లు ఏమిటో తెలుసుకుని, వాటి నుంచి దూరంగా ఉండటం ఎలాగో, తద్వారా పంటి, ఒంటి ఆరోగ్యాలను కాపాడుకోవడం ఎలాగో తెలుసుకుందాం...ఇప్పటి తరం పిల్లల దూకుడు గురించి చెప్పడానికి చాలానే ఉంటుంది. నేటి యువతలో నలుగురు కలిసి ఎక్కడో పిక్నిక్కు అంటూ కూల్డ్రింక్ బాటిల్స్ తీసుకెళ్లారనుకోండి. అక్కడ ఓపెనర్ దొరకకపోతే పళ్లతోనే బాటిల్ మూతలను ఓపెన్ చేసే నైపుణ్యం ఇప్పటి యువకుల సొంతం. అలాగే చాలామంది తమకు తెలియకుండానే పంటిని దెబ్బతీసే పనులు చాలానే చేస్తుంటారు. ఉదాహరణకు రాస్తూ రాస్తూ ఏదో ఆలోచిస్తూ పెన్ను చివరను నోట్లో పెట్టుకుని తేలిగ్గా కొరుకుతూ ఉండవచ్చు. అలాగే పొద్దున్నే బ్రష్ నోట్లో వేసుకుని నలుగురు కలిసి మాట్లాడుకునే టైమ్లో బ్రషింగ్కు బదులు బ్రష్ను నములుతూ ఉండిపోయే పల్లెల్లోని రచ్చబండ బ్యాచ్కు కొదవే లేదు. చల్లటి నీళ్లనో లేదా ‘ఛిల్ల్’టి డ్రింక్స్ తాగుతూ ఆ నీళ్లకు పళ్లు అదేపనిగా తాకుతూ ఉండేలా తాగేవారికి లోటు లేదు. మనం అంతగా పట్టించుకోకుండా చేసే ఇలాంటి చాలా పనులు పళ్లకు హాని చేయవచ్చు. నోరు అనేది దేహానికి సింహద్వారం అని చెప్పుకున్నాం కదా. మరి ఆ నోట్లోకి హానికరమైన బ్యాక్టీరియా వచ్చి చేరాక అవి గొంతులోకి... అక్కడ్నుంచి దేహంలోకీ పోతూ... మొత్తం ఒంటికే చేటు తెచ్చే ముప్పు ఎప్పుడూ ΄పొంచే ఉంటుంది. అందుకే అలాంటి కొన్ని చెడ్డ అలవాట్లను చిన్నారులు, యువత దృష్టికి తెచ్చి... వాటిని మాన్పించేలా చేయడమే ఈ కథనం ఉద్దేశం. టైటానిక్కు ఐస్బర్గ్ లాంటిదే... పంటికి ‘ఐస్’ వాటర్...మంచి టేస్టీ బిర్యానీతో పాటు చల్లటి కూల్డ్రింక్ తాగుతుండటం చాలామందికి అలవాటు. అంతేకాదు... ఇటీవలి ఫాస్ట్ ఫుడ్స్ అయిన బర్గర్, పిజ్జాలతో పాటు కోలా క్రిండ్స్ తీసుకోవడం ఇంకొందరికి పరిపాటి. ఒకవేళ వాళ్లు తీసుకోకపోయినప్పటికీ... ఇలాంటి ఫాస్ట్ఫుడ్స్తో పాటు కాంప్లిమెంటరీ డ్రింక్గా కూల్డ్రింక్స్ చాలా మాల్స్లో దొరుకుతూ ఉండటం మామూలే. అందునా ఆ డ్రింక్స్లో ఐస్ క్యూబ్స్ వేసి మరీ ఇస్తుంటారు. కొందరు నోట్లోకి వచ్చిన ఆ ఐస్ ముక్కను ఉమ్మేస్తే బాగుండదనుకుని నుములుతూ ఉండటమూ మామూలే. ఇక రకరకాల ఫ్లేవర్స్లో దొరికే ‘ఐస్’ఫ్రూట్స్ తినే చిన్నారులు ఒక దశవరకూ వాటిని చప్పరించాక... ఇక ఓపిక తగ్గిపోయి... వాటిని నమిలి మింగేస్తుంటారు. మరికొందరు బాక్సింగ్, కిక్బాక్సింగ్, ఫుట్బాల్ ప్లేయర్స్ తమ పళ్ల రక్షణ కోసం ఐస్ ముక్కల్ని నోట్లో పెట్టుకుంటారు. అలాంటి ఐస్ ముక్కల కారణంగా చాలామంది పళ్లు దెబ్బతింటాయి. తొలిదశలో కాస్తంత భరించేలా ఉన్న అవే ఐస్ ముక్కలు... పంటి ఎనామిల్ దెబ్బతిన్న తర్వాత జిల్లంటూ బాధించేవరకూ పరిస్థితి వెళ్తుంది. ఐస్ క్యూబ్స్ లేదా ఐస్ నోట్లోకి తీసుకోవడం కారణంగా నోట్లోని ఉష్ణోగ్రత అకస్మాత్తుగా మారిపోవడం వల్ల ఎనామిల్లో పగుళ్లు (క్రాక్స్) వచ్చే ప్రమాదం ఉంటుంది. పరిష్కారం: పెద్దవాళ్లు ఐస్ ముక్కలతో కూడిన డ్రింక్స్ తీసుకుంటున్నా... లేదా చిన్నారులు ఐస్ఫ్రూట్లూ, ఐస్క్యాండీ తింటున్నా వీలైనంతవరకు ఐస్ను నమలకూడదు. అసలు పంటికి ఐస్ తగలకుండా జాగ్రత్త పడాలి. ఇక బాక్సింగ్, కిక్బాక్సింగ్ వంటి ఆటగాళ్లు ఐస్కు బదులు పళ్ల రక్షణ కోసం మౌత్గార్డ్నే వాడటం మేలు.పళ్లను ఓపెనర్గా వాడటం సరికాదు... పిక్నిక్లకు వెళ్లేప్పుడు ఆర్భాటంగా కూల్డ్రింక్స్ తీసుకెళ్లే యువకుల్లో చాలామంది ఓపెనర్ను తీసుకెళ్లడం మరచిపోయి, సీసా మూతలు తీయడానికి పళ్లను వాడుతుంటారు. బట్టలు కుట్టే టైలర్లలో కొందరు దారం ఎక్కించే ముందర సూదిని పంటితో పట్టుకోవడమూ అక్కడక్కడా కనిపించే దృశ్యమే. అంతేకాదు వాళ్లలో కొందరు దారాన్ని పంటితోనే తెంపుతుంటారు. షాంపూ షాచేలను చింపడానికి కొందరు పళ్లనే ఉపయోగిస్తుంటారు.పరిష్కారం: పంటి రక్షణ కోసం గుర్తుంచుకోవాల్సిందేమిటంటే... మన పళ్లు ఓపెనర్లు కాదు. అలాగే కత్తెరకు బదులుగా పళ్లను వాడటమూ సరికాదు. ఈ పనులు చేసే చాలామందిలో పళ్ల ఎనామిల్ దెబ్బతినే ప్రమాదముంది. పంటి తాలూకు చిన్న ముక్క ఊడిపోయే ముప్పు కూడా పొంచి ఉంటుంది. ఇలాంటి పనులతో పళ్లు త్వరగా దెబ్బతింటారు. అందుకే సీసా మూతలు తీయడానికి ఓపెనర్నే వాడాలి. షాంపూ షాచేలు చింపాలంటే కత్తెరనే వాడాలి. అంతేతప్ప పళ్లను వాడకూడదని గుర్తుంచుకోవాలి.పండ్లరసాల్లోని చక్కెర పళ్లకు ముప్పు... పండ్లరసాలు ఆరోగ్యానికి చాలామంచివంటూ చాలామంది వాటిని తాగేస్తూ ఉంటారు. అలాగే ఎనర్జీ డ్రింక్స్ అనీ, స్పోర్ట్స్ డ్రింక్స్ అనీ తాగేస్తూ తమకు ఆరోగ్యంతో కూడిన శక్తి సమకూరుతోందంటూ ఆనందిస్తుంటారు. నిజానికి ఫ్రూట్ జ్యూసుల్లో, స్పోర్ట్స్ డ్రింక్స్లో ఉండే చక్కెరతో పళ్లు పుచ్చిపోవడం, దంతక్షయానికి అవకాశాలు ఎక్కువ. అంతేకాదు... లైమ్జ్యూస్ల వంటి పుల్లటి పండ్లరసాల్లోనియాసిడ్ వల్ల పళ్లు దెబ్బతినే ముప్పు పెరుగుతుంది. పరిష్కారం: చక్కెర మోతాదు ఎక్కువగా ఉండే పండ్లరసాలను వీలైనంత తక్కువగా తీసుకోవాలి. అలాంటి పానీయాలు తాగేటప్పుడు ఆ ద్రవం వీలైనంతవరకు పంటికి తగలకుండా తాగడం మేలు. ఇక తీపి ఎక్కువగా ఉండే డ్రింక్స్ లేదా పండ్లరసాలు తాగాక నోరు శుభ్రంగా కడుక్కోవడం మరచిపోవద్దు.పండ్లూ... పళ్లు... ప్రాధాన్యం దేనికి... ఏ సీజన్లో దొరికే మంచి తాజాపండ్లను ఆయా సీజన్లలో తినడం మంచి అలవాటే. అది ఆరోగ్యానికి మేలు చేసే అంశమే. కాకపోతే మరీ చక్కెర మోతాదులు ఎక్కువగా ఉండే పండ్లనూ, పులుపు మోతాదు కాస్తంత ఎక్కువగా ఉండే బత్తాయి, ద్రాక్ష, ఆరెంజ్ జ్యూస్లను వీలైనంత మేరకు పళ్లకు తగలకుండా తీసుకోవడం మేలు. ఎందుకంటే పుల్లటి పండ్లలో ఉండే ఆ పులుపులో ఉండే ఆమ్ల గుణం పంటిని దెబ్బతీసే ముప్పు ఎప్పుడూ ఉంటుంది.పరిష్కారం: పండ్లను ఫ్రూట్జ్యూస్లుగా తాగడం కంటే వాటిని కొరికి తినడం మంచిది. ఒకవేళ జ్యూస్ రూపంలో తాగాలనుకుంటే... ఆ పానీయంలో చక్కెర కలుపుకోవడం తగదు. ఇక జ్యూస్ రూపంలో తాగినప్పటికీ... వెంటనే నోరు కడుక్కోవడం మరచిపోవద్దు.కరకరలాడే చిప్స్తో కిరికిరి... చిప్స్ కరకరలాడుతూ నాలుకకు రుచిగా ఉండవచ్చు. కానీ పళ్లకు అంత మంచివి కాదు. పైగా కరకరలాడే పదార్థాలు పళ్లకు ప్రమాదం తెచ్చిపెట్టే అవకాశాలెక్కువ. అంతేకాదు చిప్స్ లాంటి చిరుతిండ్లలో స్టార్చ్ కూడా ఎక్కువ. ఈ స్టార్చ్ లాలాజలం తగలగానే దాదాపు చక్కెరలా మారిపోయి పంటిని దెబ్బతీసే ముప్పు మరీ ఎక్కువ. అందుకే చిప్స్ లాంటివి తిన్న 20 నిమిషాల తర్వాత అవి పంటిని దెబ్బతీయడం మొదలు పెడతాయి. అంతేకాదు... పంటి మధ్యన చిక్కుకునే చిప్స్ తాలూకు చిన్న చిన్న ముక్కలతో దంత క్షయం ముప్పు మరింత పెరుగుతుంది. ఇక మరికొందరు పిల్లలూ, ఆ మాటకొస్తే కొందరు పెద్దలు కూడా ఎప్పుడూ ఏదో ఓ చిరుతిండిని నములుతూ ఉంటారు. దాంతో చిరుతిండిలో ఉండే పిండిపదార్థాలూ, చక్కెర వంటి పంటికి ముప్పు తెచ్చే అంశాలు పళ్లను దెబ్బతీస్తాయి.పరిష్కారం: వీలైతే తరచూ చిరుతిండ్లు తినే అలవాటుకు దూరంగా ఉండటం మేలు. లేదంటే చిరుతిండి తిన్న వెంటనే నోరు శుభ్రంగా కడుక్కోవాలి. చిరుతిండ్లకు బదులుగా క్యారట్ వంటిని నములుతూ ఉండటం మంచిది. ఇక చిప్స్ లాంటి చిరుతిండ్లను వీలైనంత తక్కువగా తినాలి. ఒకవేళ తప్పక తినాల్సివచ్చినప్పుడు తిన్నవెంటనే నోరు కడుక్కోవడం, వీలైతే ఫ్లాసింగ్ చేసుకోవడం (దారంతో పళ్ల మధ్య చేరే చిన్న చిన్న ముక్కలను శుభ్రపరచుకోవడం) తప్పనిసరి.కాఫ్ సిరప్తోనూ దంతక్షయం...చాలామంది కాఫ్ సిరప్ అనేది దగ్గు తగ్గేలా చేసే ఓ మందు అనుకుంటారు గానీ అందులో ఔషధంతో పాటు చక్కెర మోతాదులూ ఉంటాయి. ఆ చక్కెర పంటి ఆరోగ్యానికి ప్రమాదం తెచ్చిపెట్టే అవకాశాలుంటాయి. పరిష్కారం: దగ్గు మందును వీలైనంత మేరకు పలువరసకు తగలకుండా గొంతులో పోసుకోవడం మేలు. అలాగే దగ్గు మందు తాగిన వెంటనే నోరు కడుక్కోవడం మరచిసెవద్దు.తప్పుడు బ్రష్షింగ్ సరికాదు... చాలామంది బ్రష్ చేసుకోడానికి నోట్లో బ్రష్ పెట్టుకుంటారు గానీ... ఆ ప్రక్రియను వేగంగా ముగించకుండా అదేపనిగా నములుతుంటారు. ఇక కొందరు తప్పుడు పద్ధతుల్లో బ్రష్షింగ్ చేసుకుంటూ ఉంటారు. ఇంకొందరు నోరు శుభ్రంగా ఉండాలనే తపనతో విపరీతంగా బ్రష్ చేసుకుంటారు. ఈ అన్ని చర్యలతోనూ పళ్లు త్వరగా అరిగిపోయే ముప్పు ఉంటుంది.పరిష్కారం: మృదువైన బ్రిజిల్స్ ఉన్న టూత్బ్రష్ను ఎంచుకోవాలి. పంటి మీద ఎక్కువ ఒత్తిడితో బ్రష్షింగ్ చేయకూడదు. బ్రష్షింగ్ చేసే సమయంలో పంటికి అడ్డంగా కాకుండా నిలువుగా బ్రష్ చేసేలా టూత్బ్రష్ను కదిలించాలి. సున్నాలు చుడుతున్నట్లుగా (సర్క్యులర్గా) కదిలిస్తూ బ్రష్ చేసుకోవడం సరైన పద్ధతి. ఈ సమయంలో చిగుర్లకూ మాలిష్ జరుగుతుండేలా బ్రష్ కదలికలు (స్ట్రోక్స్) ఉండాలి. బ్రషింగ్ పూర్తయ్యాక వేలిచివరతో చిగుర్లను మాలిష్ చేస్తున్నట్లుగా సున్నాలు చుడుతున్నట్లుగా కదిలించాలి. కనీసం ప్రతి మూడు నెలలకు ఒకసారైనా బ్రష్ను మార్చడం మేలు. ఒకవేళ జ్వరం రావడం లేదా ఆరోగ్యం చెడిపోవడం జరిగితే... కోలుకున్న వెంటనే బ్రష్ను మార్చడం మంచి పద్ధతి. ఇలా ఆరోగ్యం చెడిపోయినప్పుడు బ్రష్ మార్చడానికి మూడు నెలలు ఆగడం అనే నిబంధన పనికిరాదు.ఆ జబ్బుతో పంటికి ముప్పు... కొందరు ‘బ్రక్సిజం’ అనే జబ్బు కారణంగా పదే పదే పళ్లు కొరుకుతూ ఉంటారు. ఇలాంటి వారు రోజువారీ ఒత్తిడుల కారణంగా తమకు తెలియకుండానే నిద్రలో పళ్లు కొరుక్కుంటూ ఉంటారు. ఇలా పళ్లు కొరుకుతూ ఉండేవారిలో పళ్లు త్వరగా అరిగిపోతాయి. ఇక మరీ గట్టి పదార్థాలను అదేపనిగా నమలడం కూడా పంటి అరుగుదలను వేగవంతం చేస్తుంది.పరిష్కారం: నిద్రలో పళ్లు కొరికే అలవాటు ఉన్నవారు కారణాన్ని తెలుసుకుని, ఆ అలవాటును మానుకోవాలి. బ్రక్సిజం ఉంటే చికిత్స తీసుకోవడం, ఒత్తిడి ఉన్నవారు దాన్ని తగ్గించుకునేందుకు ధ్యానం, రిలాక్సేషన్ టెక్నిక్స్ అనుసరించాలి.ఎంత తక్కువ అయినా ముప్పే... గుండెపోటు నివారణకు తోడ్పడుతుందంటూ కొందరు రెడ్వైన్ తాగుతుంటారు. మిగతా ఆల్కహాలిక్ డ్రింక్స్తో ΄ోలిస్తే రెడ్వైన్ ఆరోగ్యకరమనే అపోహ చాలామందిలో ఉంటుంది. నిజానికి రెడ్వైన్లో క్రోమోజెన్ ట్యానిన్స్ అనే రంగునిచ్చే పదార్థాలు ఉంటాయి. ఇవి పంటి ఎనామిల్ను దెబ్బతీస్తాయి. దాంతో పళ్లు మెరుపును కోల్పోతాయి. అంతేకాదు... ఎంత తక్కువ మోతాదులోనైనా ఆల్కహాల్ ఒంటికి ముప్పు తెచ్చే అంశమే!పరిష్కారం: అది ఎంతటి ఖరీదైన లేదా నాణ్యమైన రెడ్వైన్ అయినప్పటికీ అది మద్యమే తప్ప ఆరోగ్యప్రదాయిని కానే కాదు. అదీ ఒకరకమైన మద్యమే కాబట్టి ఆ అలవాటును మానుకోవడమే మేలు.గోళ్లు కొరికే అలవాటు... పళ్లకు చేటు... కొందరు అదేపనిగా గోళ్లు కొరుక్కుంటుంటారు. ఈ చెడ్డ అలవాటుతో పళ్లు దెబ్బతింటాయి. గోళ్ల ద్వారా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ నోటి ద్వారా కడుపులోకి వెళ్లి ఆరోగ్యం దెబ్బతినవచ్చు.పరిష్కారం: గోళ్లు కట్ చేసుకోవాలనుకుంటే నెయిల్ కట్టర్నే వాడాలి. టెన్షన్ వల్ల ఈ అలవాటు వస్తే... ధ్యానం, రిలాక్సేషన్ టెక్నిక్స్ వంటి వాటితో ఆ దురలవాటుకు దూరం కావాలి. పళ్లు కుట్టుకోవడం ఓ బ్యాడ్ హ్యాబిట్... చాలామంది ఏదైనా తినగానే టూత్పిక్స్తో పళ్లు కుట్టుకుంటారు. ఈ అలవాటు వల్ల పళ్ల మధ్య సందులు మరింత పెరిగే ముప్పు ఉంటుంది. ఫలితంగా పళ్ల మధ్య మరింత ఆహారం చిక్కుకుని, బ్యాక్టీరియా పెరగడం, దాంతో పళ్లు మరింత వదులు కావడం వంటి ముప్పు ఉంటుంది.పరిష్కారం: పళ్లు కుట్టుకునే అలవాటు మానేయాలి. వీలైతే ఫ్లాసింగ్ చేసుకోవాలి.చివరగా... ఇక్కడ పేర్కొన్న చెడు అలవాట్లను వదులుకుంటే అవి చాలావరకు నోటికీ, పలువరసకు, పంటి చిగుర్లకు మాత్రమే కాదు... మొత్తం దేహానికే మంచి చేస్తాయని, ఓవరాల్ ఆరోగ్యానికీ మంచిదని గుర్తుంచుకోవవడం మేలు.‘టీత్’కు ముప్పు తెచ్చిపెట్టే టీలు... కాఫీలుకొందరు కాఫీలు, టీలు చాలా ఎక్కువగా తాగుతుంటారు. ఇక తమ పనిలో ఒత్తిడిని అధిగమించడానికి టీ, కాఫీలను అలవాటు చేసుకుంటుంటారు. కొంతలో కొంత టీ వల్ల అంతగా ముప్పు ఉండదేమోగానీ... కాఫీలో ఉండే అసిడిక్ గుణం వల్ల పలువరస పచ్చగా మారే ముప్పు ఉంటుంది. టీ కూడా మరీ ఎక్కువగా తాగుతూ ఉంటే అదీ తెల్లటి పలువరస రంగుమారేలా చేస్తుంటుంది. అంతేకాదు... బాగా వేడివేడిగా ఉండే టీ, కాఫీలలోని ఉష్ణోగ్రత వల్ల పంటి ఎనామిల్ దెబ్బతీనే అవకాశమూ ఉంటుంది. అందుకే చాలాకాలం పాటు టీ, కాఫీలు మితిమీరి తాగుతుండే కొందరిలో పంటి మెరుపు తగ్గే ముప్పు కూడా ఉంటుంది. ఇక కాఫీ, టీలలో ఉండే చక్కెర పంటికి అంటుకుపోవడం వల్ల పళ్లమధ్య క్యావీటీలూ, పిప్పిపళ్లు వచ్చే ముప్పు కూడా ఎక్కువే. పరిష్కారం: కాఫీ, టీలు తాగే అలవాటు ఉన్నవారు వాటిని పరిమితంగానే తీసుకోవాలి. ఇప్పటికే ఈ అలవాట్ల కారణంగా పళ్లు పచ్చబారి ఉంటే బ్లీచింగ్ చేయించుకోవడం ద్వారా వాటిని మళ్లీ మెరిసేలా చేసుకోవచ్చు.పాన్లూ, జర్దా / ఖైనీలు వద్దు... చాలామంది అదేపనిగా పాన్ తింటూ ఉంటారు. అందులో వక్కలను నములుతూ ఉంటారు. ఇక అందులో జర్దా, ఖైనీ వంటి పొగాకు ఉత్పాదనలు నోటి ద్వారా తీసుకుంటూ ఉంటారు. ఇందులో పాన్లోని కఠినమైన వక్కలను తినడం ఒక ప్రమాదమైతే... ఇక నోటి ద్వారా పొగాకును తీసుకోవడం పంటికీ, ఒంటికీ... ఈ రెంటికీ చాలా ప్రమాదం. ఇక పాన్ తినేవారి నోట్లో పళ్లు ఎర్రగా, చాలాకాలం నుంచి అదే అలవాటు ఉన్నవారిలో నల్లబారి ఉండటం చూస్తుంటాం. పరిష్కారం: పాన్ తినే అలవాటు ఉన్నవారు తక్షణం ఆ అలవాటు మానివేయడం తప్పనిసరి. లేదంటే పళ్లకే కాదు మొత్తం దేహానికే ఈ అలవాటు చేటు తెచ్చిపెట్టవచ్చు. పాన్పరాగ్లూ, జర్దా వంటి పొగాకు ఉత్పాదనల వల్ల నోటి క్యాన్సర్ వచ్చే ముప్పు చాలా ఎక్కువ.సిగరెట్లతో వచ్చే ముప్పు ఎన్నో రెట్లు... సిగరెట్ అలవాటు అనేది కేవలం పళ్లను మాత్రమే దెబ్బతీయదు. అది పూర్తిగా ఊపిరితిత్తుల ఆరోగ్యాన్నీ, గుండెనూ... ఒక్కోసారి పూర్తిగా శరీర ఆరోగ్యానికి ముప్పుగ పరిణమించవచ్చు. సిగరెట్ అలవాటు ఉన్నప్పుడు అది కేవలం ఆరోగ్యం మాత్రమే కాదు... నోటి దుర్వాసనతో నలుగురిలో స్వేచ్ఛగా మాట్లాడగిగే సోషలైజింగ్కూ పరిమితులు విధిస్తుంది. పొగాకు వల్ల పంటి చిగుర్లకూ ఎన్నో రకాల వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. అంతేకాదు... నోటి క్యాన్సర్లూ, పెదవుల, నాలుక, గొంతు క్యాన్సర్ల (హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ల) ముప్పును తెచ్చిపెడుతుంది. పరిష్కారం: సిగరెట్లతో / పొగతాగడం వల్ల ఆరోగ్యానికి కలిగే ముప్పు తప్పాలంటే తప్పక పొగతాగే అలవాటును వదిలివేయాల్సిందే. అప్పటికీ ఆ అలవాటును వదలలేకపోతే డాక్టర్ సలహా మేరకు కొంతకాలం పాటు చ్యూయింగ్ గమ్స్ వంటి ప్రత్యామ్నాయాలు చూసుకోవాలి. ఇలాంటి ప్రత్యామ్నాయాలు కూడా కొద్దికాలం కోసమే.పెన్సిల్ను కొరకవద్దు... కొందరు ఏదైనా రాస్తూ రాస్తూ ఉండి మధ్యమధ్యన ఏదో ఆలోచిస్తూ పెన్సిల్ను గానీ లేదా పెన్ క్యాప్ను గానీ పళ్ల మధ్య పెట్టుకొని కొరుకుతుంటారు. పెన్సిల్ మధ్యన ఉండే లెడ్ చాలా ప్రమాదకారి. ఈ లెడ్పాయిజన్ చిగుర్ల రంగును నల్లగా మారుస్తుంది. పైగా లెడ్ పాయిజన్ మేనికి కూడా ప్రమాదకరమే. పరిష్కారం: రాస్తున్నప్పుడు, చదువుతున్నప్పుడు, ఆలోచిస్తున్నప్పుడు పళ్లమధ్యకు పెన్నూ, పెన్సిల్ పెట్టుకోవద్దు. మరీ తప్పనప్పుడు చ్యూయింగ్గమ్ వంటివి నములుతూ ఉండటం కాస్తంత బెటర్. అసలు నమిలే అలవాటును మానుకోవడమే ఆరోగ్యానికి మేలు.పళ్లకు చుట్టుకుపోయే చాక్లెట్లు... తియ్యటి చాక్లెట్లు అంటే పిల్లలందరికీ ఇష్టమే. పైగా కొందరు పెద్దవాళ్లు కూడా తమకు మంచి ఆరోగ్య సమకూరడానికి డార్క్ చాక్లెట్లు తీసుకుంటూ ఉంటారు. అయితే చాక్లెట్లలో చాలావరకు పళ్లకు చుట్టుకుపోతూ ఉంటాయి. అలా చుట్టుకుపోవడంతో అందులోని చక్కెరను చాలాసేపు పంటిని అంటిపెట్టుకునే ఉంటూ... దంతక్షయానికి దారి తీస్తుంది. అంతేకాదు.. అలా చాలాకాలం పాటు చాక్లెట్లు చుట్టుకుపోవడం, పళ్లపైన ఉండే గుంటవంటి ప్రదేశంలో ఇరుక్కుపోవడం వల్ల పళ్లమధ్య రంధ్రాలు (క్యావిటీలు) పడే అవకాశాలెక్కువ. చదవండి: మగవారిపై కేన్సర్ పడగ.. భయపెడుతున్న గణాంకాలు..ఈ రంధ్రం లోతు పెరుగుతున్న కొద్దీ... అందులో ఆహారపదార్థాలూ, చాక్లెట్ల వంటి చుట్టుకుపోయే పదార్థాలు మరింత ఎక్కువగా ఇరుక్కుపోతూ ఆ రంధ్రాలను మరింత లోతు ఎక్కువయ్యే ముప్పు ఉంటుంది. ఇలాంటి చర్యల వల్లనే పిల్లల్లో పిప్పిపళ్లు వస్తుంటాయి. పరిష్కారం: పంటిని చుట్టుకుపోయే చాక్లెట్లు, క్యాండీలు తీసుకున్న వెంటనే బ్రష్ చేసుకోవడం లేదా ఆ చుట్టుకుపోయిన పదార్థాలు పూర్తిగా తొలగిపోయేలా వేలిని ఉపయోగించి నోరు కడుక్కోవాలి.పాల బాటిల్ పళ్ల మధ్య పెట్టడం సరికాదు... కొందరు పిల్లలు రాత్రంతా పాలసీసా పళ్ల మధ్య పెట్టుకుని నిద్రపోతుంటారు. పిల్లలు అల్లరి చేయకుండా ఉండటానికి చాలామంది తల్లులు ఈ అలవాటును ప్రోత్సహిస్తుంటారు. నిజానికి ఈ దురలవాటు వల్ల పిల్లలకు ‘మిల్క్బాటిల్ కేరిస్’ అనే సమస్య వచ్చే అవకాశముంది. దాంతో చిన్నారుల్లో పిప్పిపళ్లు వచ్చి పళ్లన్నీ దెబ్బతినే ప్రమాదం ఉంది. పైగా పాలలో ఉండే చక్కెరవల్ల కూడా పళ్లు పుచ్చిపోతాయి.పరిష్కారం: రాత్రివేళల్లో పిల్లల నోటికి పాలసీసా ఇవ్వడం సరికాదు. మరీ తప్పనిసరై చిన్నారులకు పాలను పట్టించాల్సి వస్తే గ్లాసు / స్పూన్ / ఉగ్గుగిన్నెతో పాలు పట్టించాలి. పిల్లలు పాలు తాగాక పెద్దపిల్లలకు బ్రషింగ్ చేయించడమూ లేదా బ్రషింగ్కు వీలుకాకపోతే కనీసం ఒక గ్లాసు నీళ్లయినా తాగించడం అవసరం.- డాక్టర్ ప్రత్యూష, కన్సల్టెంట్, డెంటల్ – కాస్మెటిక్ సర్జన్ నిర్వహణ యాసీన్ -
జస్ట్ రెండు నెలల్లో 12 కేజీల బరువు..! నో స్ట్రిక్ట్ డైట్, నో చీట్మీల్స్
బరువు తగ్గడం అనేది కొందరికి సంక్లిష్టమైనది, అంత సులభంగా సాధ్యమయ్యేది కాదు. కానీ కొందరికి మాత్రం సాధారణ డైట్తోనే అద్భుతంగా మ్యాజిక్ చేస్తారు. కేవలం నిలకడ, క్రమశిక్షణతో తన ఆహార్యాన్నే మార్చుకుని..స్మార్ట్గా బరువు తగ్గడం ఎలాగో చూపిస్తారు. ఇక్కడ ఇషాన్ కర్దే అలానే బరువు తగ్గి ఆశ్చర్యపరిచాడు. అదికూడా కేవలం రెండు నెలల్లో ఏకంగా 12 కేజీలు తగ్గాడు. స్ట్రిక్ట్ డైట్, కఠినమైన వ్యాయామాలు లేవు. ఇషాన్ కర్దే బరువు తగ్గడం అనేది ప్రాథమికంగా నిలకడ, సమతుల్య పోషణ, స్థిరమైన ఆహారపు అలవాట్లపై ఆధారపడి ఉంటుందని చెబుతున్నాడు. క్రమబద్ధమైన రోజువారీ ఆహారంతో శక్తి స్థాయిలను కాపాడుకుంటూనే కొలెస్ట్రాల్ని తగ్గించుకోవచ్చని వెల్లడించాడు. వివిధ రకాల షార్ట్కట్ డైట్ల వైపుకి పరిగెట్టడం కంటే..సింపుల్గా, ఆరోగ్యప్రదంగా తేలికపాటి వాటితోనే స్మార్ట్గా బరువు తగ్గొచ్చని అంటున్నాడు. తాను నాలుగు పూటలా భోజనాన్ని ఆస్వాదిస్తూనే రెండు నెలల్లో 12 కేజీల దాక బరువు తగ్గానని చెబుతున్నాడు. ఇషాన్ కర్దే తనకు ఉపకరించిన డైట్ప్లాన్ గురించి ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో షేర్ చేసుకున్నాడు. తాను డైట్ని 90% క్రమం తప్పకుండా పాటించానని, తీరిక లేని రోజుల్లో మధ్యాహ్న భోజనానికి బదులుగా ప్రోటీన్ అధికంగా ఉండే చికెన్ ర్యాప్లు/రైస్ బౌల్స్ తీసుకున్నానని చెప్పారు. అయితే చీట్ మీల్స్, చక్కెర, చిప్స్, బిస్కెట్లు వంటివి అస్సలు తీసుకోలేదని వెల్లడించాడు.అల్పాహారంఈషాన్ తన రోజును ప్రోటీన్ ఓట్స్, 150 ml పాలు, 1 స్కూప్ వే ప్రోటీన్తో కూడిన అల్పాహారంతో ప్రారంభించేవాడు. తన భోజనంలో పోషక విలువలను విశ్లేషించి మరి తీసుకునేవాడు. దాని ప్రకారం మొత్తం 35 గ్రాముల ప్రోటీన్, 35 గ్రాముల కార్బోహైడ్రేట్లు, 8 గ్రాముల కొవ్వులు ఉండేలా కేర్ తీసుకున్నారు. ప్రోటీన్, ఫైబర్ ఆకలిని అదుపులో ఉంచి మధ్యాహ్నాం పూట నీరసించపోకుండా నివారించేవని అన్నారు.మధ్యాహ్న భోజనంఈషాన్ ప్రోటీన్, కార్బోహైడ్రేట్ల మిశ్రమానికే కట్టుబడి ఉంటూ, కొవ్వు శాతాన్ని కొద్దిగా పెంచాడు. అతని భోజనంలో 200 గ్రాముల చికెన్ బ్రెస్ట్ లేదా పనీర్, 2 రోటీలు, తేలికపాటి గ్రేవీ, సలాడ్లు ఉన్నాయి. ఈ భోజనం నుంచి 50 గ్రాముల ప్రోటీన్, 45 నుంచి 50 గ్రాముల కార్బోహైడ్రేట్లు, 10 నుంచి 12 గ్రాముల కొవ్వు అందుతుంది.సాయంత్రం స్నాక్స్..అతను సాయంత్రం ఒక పండు, గుప్పెడు నట్స్, 5 గుడ్డు తెల్లసొన తీసుకునేవాడట. ఇలా తింటే 22 నుంచి 24 గ్రాముల ప్రోటీన్, 25 గ్రాముల కార్బోహైడ్రేట్లు, 8 గ్రాముల కొవ్వు లభిస్తాయి.రాత్రి భోజనంరోజులో చివరి భోజనంగా, ఈషాన్ తేలికపాటి ఆహారాన్ని తీసుకున్నాడు. అతను 200 గ్రాముల చికెన్ లేదా పనీర్ సలాడ్ తీసుకున్నాడు, దీనిలో 45 గ్రాముల ప్రోటీన్, 5 గ్రాముల కార్బోహైడ్రేట్లు, 8 గ్రాముల కొవ్వు ఉంటాయి. అంతేగాదు బరువు తగ్గేందుకు ఎల్లప్పుడూ కష్టతరమైన ఆహారనియమాలు, తీవ్రమైన వ్యాయామాలు అవసరం లేదని ఈషాన్ వెయిట్లాస్ జర్నీ రుజువు చేస్తోంది. పైగా ఒక సాధారణ దినచర్యను క్రమంతప్పకుండా పాటించడం అనేది అత్యంత కీలకమని నొక్కి చెబుతోంది కూడా. View this post on Instagram A post shared by Eshaan Karde (@eshaankarde)గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే. మరిన్ని వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: స్క్రీన్ అలవాటు ఇంత ప్రమాదకరమైనదా..?! ఆయర్వేద చిట్కాలు) -
స్క్రీన్ అలవాటు ఇంత ప్రమాదకరమైనదా..?!
మొబైల్, లేదా బుల్లితెర వ్యసనం (స్క్రీన్ అడిక్షన్) మీ మెదడును కుంచించుకుపోయేలా చేస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ సందర్భంగా, పబ్జీ గేమ్ వ్యసనానికి గురై, తిరిగి బయటకు వచ్చిన ఒక యువకుడి స్ఫూర్తిగాధ మీకోసంస్క్రీన్ అడిక్షన్ ప్రమాదాలను ఎదుర్కోవడానికి ఆయుర్వేద సూచనలు"నేను 24 గంటలు నిరంతరాయంగా పబ్జీ గేమ్ ఆడేవాడిని. కాలేజీ చదువున మధ్యలో వదిలేశాను. ఐదు నిమిషాలు కూడా ప్రశాంతంగా కూర్చోలేకపోయేవాడిని," అని 25 ఏళ్ల చెన్నారెడ్డి చెబుతున్నాడు. ఇప్పుడు ఆయన పగలు సౌరశక్తి టెక్నీషియన్గా పని చేస్తూ, యోగా బోధిస్తున్నాడు. మరి ఆయనలో మార్పు ఎలా వచ్చింది?స్టాన్ఫర్డ్ లైఫ్స్టైల్ మెడిసిన్ చేసిన పరిశోధన ప్రకారం, రోజుకు రెండు గంటలకుపైగా కాలక్షేపం కోసం మొబైల్ చూసే 18–25 ఏళ్ల వయస్సు గల వ్యక్తుల్లో మెదడులోని సెరెబ్రల్ కార్టెక్స్ మందం తగ్గిపోతుంది. మెదడులోని ఈ భాగం నిర్ణయాలు తీసుకోవడం, జ్ఞాపకశక్తి, సమస్యల పరిష్కారం వంటి ముఖ్యమైన పనులకు బాధ్యత వహిస్తుందని మనం గుర్తించాలి.రోజుకు ఐదు గంటలకంటే ఎక్కువ స్క్రీన్ ముందు గడిపే పెద్దవారికి చిత్తభ్రమ, పక్షవాతం, పార్కిన్సన్స్ వ్యాధి వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. స్మార్ట్ఫోన్ వ్యసనం మెదడులోని గ్రే మ్యాటర్ పరిమాణాన్ని కూడా తగ్గిస్తుంది—ఇది కదలికల నుంచి భావోద్వేగాల వరకు అన్నింటిని నియంత్రిస్తుంది. స్క్రీన్ల నుంచి వచ్చే నీలి కాంతి మెలటోనిన్ ఉత్పత్తిని అణచి, సహజ నిద్ర చక్రాన్ని దెబ్బతీస్తుంది.ఇది మనసిక ఆరోగ్యంపైనా తీవ్ర ప్రభావం చూపుతుంది - ఆందోళన, నిరాశ, నలుగురితో కలవకపోవటం వంటివి పెరుగుతాయి. డా. మణికంటన్ చెప్పినట్లుగా, “ఇప్పుడైనా ఒక అడుగు వెనక్కి వేసి, మన స్క్రీన్ అలవాట్లను నిజాయితీగా పరిశీలించాల్సిన సమయం వచ్చింది.”స్క్రీన్ అలవాటును తగ్గించడానికి ఆయుర్వేద సూచనలుస్క్రీన్ వినియోగం ఎక్కువగా ఉందని గుర్తించినవారికి డా. మణికంటన్ కొన్ని ప్రాయోగిక సూచనలు అందిస్తున్నారు:మీ ఇంట్లో కొన్ని ప్రాంతాలను బుల్లితెరకు, ఫోన్లకు నిషేధిత ప్రాంతాలుగా ఏర్పరచండి: ఇంట్లో భోజనపు టేబుల్, పడకగది వంటి ప్రదేశాలలో ఇవి లేకుండా చేయటం అనేది మన మనస్సును వర్తమానంలోకి తెస్తుంది.ఫోన్ లేదా టీవీ ఎంతసేపు చూడాలనే టైమ్ టేబుల్ ముందే వేసుకోండి: అవసరమైనప్పుడు మాత్రమే ఫోన్ లేదా ల్యాప్టాప్ ఉపయోగించండి. ఇది అలవాటుపై నియంత్రణ పెంచుతుంది.ఎంతసేపు వాటిని వినియోగిస్తున్నారనేది గమనించుకోండి: దానికోసం మొబైల్లోనే అనేక యాప్లు అందుబాటులో ఉన్నాయి. వాటి ద్వారా మీరు ఎంతసేపు ఉపయోగిస్తున్నారో గమనించండి. ఇది మార్పుకు ప్రేరణ ఇస్తుంది.సరైన శ్వాసకు గల శక్తి: కేవలం గాలి పీల్చుకోవటం కాదు, ప్రాణశక్తిని పెంపొందించుకోవటంచెన్నా రెడ్డి కథ, స్క్రీన్ వ్యసనంలో చిక్కుకున్న యువతకు ఆశ చూపుతుంది. 24 గంటల పాటు గేమింగ్, కోపం, చదువు మధ్యలో ఆగిపోవడం—ఇలాంటి పరిస్థితుల్లో ఆయన 2023 జనవరిలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ నిర్వహించే యువనాయకత్వ శిక్షణ కార్యక్రమంలో చేరాడు.అక్కడ ఆయన సుదర్శన్ క్రియ అనే శక్తివంతమైన శ్వాసక్రియ సాధన నేర్చుకున్నాడు. ఈ సాధనాన్ని ప్రపంచ ప్రసిద్ధ ఆధ్యాత్మిక గురువు, మానవతా నాయకుడు గురుదేవ్ శ్రీ శ్రీ రవి శంకర్ పరిచయం చేశారు. ఇది శరీరంలోని ఒత్తిడిని తగ్గించి, మనస్సులోని పాత అలవాట్లను విడిపిస్తుంది.కొద్ది రోజుల్లోనే చెన్నా రెడ్డి కోపం తగ్గిపోయింది, స్క్రీన్పై ఉన్న ఆకర్షణ క్రమంగా తగ్గింది, మనస్సులో ప్రశాంతత ఏర్పడింది. తరువాత ఆయన తన చదువును 70% మార్కులతో పూర్తి చేసి, యోగా ఉపాధ్యాయుడిగా మారి, సౌరశక్తి రంగంలో కెరీర్ నిర్మించుకున్నాడు.అధికంగా స్క్రీన్ వినియోగిస్తే, దాని ఫలితంగా చాలా సార్లు ఒత్తిడి లేదా ఆందోళన కలుగుతాయి. సుదర్శన క్రియ మన నాడీ వ్యవస్థను సమతుల్యం చేసి, మనస్సును ప్రశాంతంగా ఉంచుతుంది. ఇది డోపమైన్ ఆధారిత అలవాట్లను కూడా నియంత్రిస్తుంది. స్క్రీన్ వ్యసనం కూడా ఇతర వ్యసనాల్లాగే ఉంటుంది; ఈ సాధన వాటిని తగ్గించడంలో సహాయపడుతుంది.ఆయుర్వేద సహాయంనస్య చికిత్స: ముక్కులో ఔషధ తైలాన్ని వేసే విధానం. ఉదయం కొన్ని చుక్కలు ‘అణు తైలం’ ఉపయోగించడం మెదడుకు పోషణనిచ్చి, డిజిటల్ అలసటను తగ్గిస్తుంది.మేధ్య రసాయన: బ్రాహ్మి, అశ్వగంధ, శంఖపుష్పి వంటి మూలికలతో చేసిన ఈ ఔషధం ఏకాగ్రతను పెంచి, ఒత్తిడిని తగ్గిస్తుంది.జీవనశైలిలో మార్పులుప్రతి ఉదయం 15 నిమిషాలు ధ్యానం చేయండి.స్క్రీన్కు బదులుగా పుస్తకాలు చదవడం, సంగీతం వినడం, పెయింటింగ్, నడక, ఇరుగుపొరుగువారితో మాట్లాడటాన్ని అలవాటు చేసుకోండి.ఇవి మెదడుకు సహజ ఆనందాన్ని ఇస్తాయి. క్రమంగా స్క్రీన్పై ఆధారపడటాన్ని తగ్గిస్తాయి.డా. నిషా మణికంటన్, BAMS, MD (AM)ఆయుర్వేద వైద్యురాలు రచయిత సీనియర్ ఆర్ట్ ఆఫ్ లివింగ్ టీచర్ అంతర్జాతీయ డైరెక్టర్, ఆర్ట్ ఆఫ్ లివింగ్ వెల్నెస్ ప్రోగ్రామ్స్(చదవండి: -
డిజైనర్ రైస్.. ఇక మధుమేహం, పోషకాహారలోపం గురించి దిగులొద్దు
భారతదేశంలో మధుమేహం బారిన పడుతున్న వారి సంఖ్య భారీగా పెరుగుతోంది. మన దేశంలో దాదాపు 10 కోట్ల మందికి పైగా మధుమేహం ఉంది. డయాబెటిస్కు భారత్ ప్రపంచ రాజధానిగా మారుతోంది.గ్లైసెమిక్ ఇండెక్స్ (జీఐ) అనేది ఆహారంలోని కార్బోహైడ్రేట్లు రక్తంలో చక్కెర స్థాయులను ఎంత వేగంగా పెంచుతాయో కొలిచే ప్రమాణం. ఇది ముఖ్యంగా మధుమేహం ఉన్నవారికి, బరువు తగ్గాలనుకునేవారికి, హృదయ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనుకునేవారికి చాలా ముఖ్యం. అలాగే, విటమిన్ B12 లోపం సమస్య కూడా దేశంలో చాలా మందికి ఉంది. దీని వల్ల అలసట, బలహీనత, ఆహారం తినాలనే ఆసక్తి తగ్గడం, బరువు తగ్గడం, నోరు, నాలుకలో గాయాలు లేదా నొప్పి, చర్మం పసుపు లేదా తెల్లగా కనిపించడం, నాడీ సంబంధిత సమస్యలు, చేతులు, కాళ్లలో ముల్లు గుచ్చినట్లు అనిపించడం లేదా నొప్పి, కంటి చూపు సమస్యలు, చికాకు, మూడ్ మార్పులు వంటివి వస్తాయి.ఈ పై అనారోగ్య సమస్యలన్నింటికీ బియ్యంతో పరిష్కారం దొరికితే ఎలా ఉంటుంది? మనం ప్రతిరోజు తినేది అన్నమే. అదే మన ఆరోగ్యం పాలిట వరంగా మారే రోజులు వచ్చాయి. మధుమేహం, పోషకాహార లోపాన్ని ఎదుర్కోవడానికి ఉపయోగపడే ‘డిజైనర్ రైస్’ను అభివృద్ధి చేశారు భారతీయ శాస్త్రవేత్తలు. ఇందుకు సంబంధించిన వివరాలను సీఎస్ఐఆర్, ఎన్ఐఐఎస్టీ డైరెక్టర్ డాక్టర్ సి.ఆనందరామకృష్ణన్ తెలిపారు.నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఇంటర్డిసిప్లినరీ సైన్స్ అండ్ టెక్నాలజీ (ఎన్ఐఐఎస్టీ) సంస్థ 22 శాతం ప్రోటీన్, సుమారు 54 గ్లైసెమిక్ ఇండెక్స్ జీఐ ఉండే డిజైనర్ బియ్యాన్ని అభివృద్ధి చేసింది. అంతేకాదు, ఈ బియ్యంలో ఇనుము (ఐరన్), ఫోలిక్ ఆమ్లం, విటమిన్ బీ12 కూడా ఉంటుంది.ఈ బియ్యం మధుమేహంతో బాధపడుతున్న వారికి సాయపడుతుంది. వారికి తక్కువ జీఐ ఉత్పత్తి అవసరమవుతుంది. ఈ బియ్యం దాన్ని నియంత్రించడంలో ఉపయోగపడుతుంది. ఎక్కువ ప్రోటీన్ కావాలనుకునే వారికి కూడా ఈ బియ్యం ఓ వరం. అంతేకాదు, దాదాపు 50 శాతం మంది ప్రజలు రక్తహీనతతో బాధపడుతున్నారు. ఈ బియ్యం అన్ని సమస్యలతో పాటు ప్రోటీన్ లోపాన్ని కూడా పరిష్కరించే అవకాశం ఉంది.ఈ బియ్యాన్ని త్వరలోనే మార్కెట్లో ప్రవేశపెట్టవచ్చు. డేటా ట్రాన్స్ఫర్మేషన్ ప్రాజెక్ట్ కింద ఇందుకు సంబంధించిన పనులు సీఎస్ఐఆర్ నెస్ట్లో జరిగాయి. ఈ బియ్యాన్ని ప్రయోగశాలలో పరీక్షించారు. ఇప్పుడు ఈ బియ్యాన్ని మార్కెట్లో ప్రవేశపెట్టే సమయం వచ్చింది.అందరికీ ఈ బియ్యం చేరేలా చర్యలు ఈ సాంకేతికతను టాటర్ కన్స్యూమర్ ప్రోడక్ట్ లిమిటెడ్ అలాగే సోల్ ఫుడ్స్ సంస్థలకు బదిలీ చేస్తున్నారు. ఇంకా ఇతర సంస్థలను కూడా ఆహ్వానిస్తున్నారు. అధిక మోతాదులో ఉత్పత్తి చేసి.. ప్రతి వ్యక్తికి ఈ బియ్యం చేరేలా చేయడానికి కృషి చేస్తాం. ఎక్కువ ప్రోటీన్ లేదా తక్కువ జీఐ.. అలాగే, ఇనుము, ఫోలిక్ ఆమ్లం, విటమిన్ బి12 పోషకాలు ఒకే దాంట్లో కావాలనుకునే వారికి ఈ బియ్యం అందుబాటులో ఉంచారు.🚨 Indian scientists develop ‘Designer Rice’ that could help fight diabetes and malnutrition. pic.twitter.com/mZ7L1DdLVg— Indian Tech & Infra (@IndianTechGuide) April 5, 2026 -
ప్రోస్టేట్ కేన్సర్ రోగుల్లో సరికొత్త ఆశాకిరణం
ఒక వ్యక్తికి ప్రోస్టేట్ కేన్సర్ వ్యాపించిందని చెప్పినప్పుడు, అతని మొదటి ప్రశ్న సాధారణంగా సమయం గురించి ఉంటుంది. “నేను ఇంకా ఎంతకాలం జీవిస్తాను?” అనేది. ఇన్నేళ్లుగా, అధునాతన ప్రోస్టేట్ కేన్సర్ చికిత్స ప్రధానంగా జీవన కాలాన్ని ఎంతవరకు పెంచగలదో అనే కోణంలో చర్చించలు జరిగాయి. కానీ ఇప్పుడు ఆ సంభాషణ విస్తరించింది, ఆశాజనకంగా మారింది. ఇప్పుడులక్ష్యం కేవలం జీవితం పొడిగించడం మాత్రమే కాదు, ఆ సమయంలో శక్తి, స్వతంత్రత, రోజువారీ జీవనవిధానాన్ని కాపాడడం కూడా.భారతదేశంలో ప్రోస్టేట్ కేన్సర్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ప్రతి ఏడాది దాదాపు 37,948 కొత్త కేసులు నమోదవుతున్నాయి. వీటిలో గణనీయమైన శాతం కేసులు అధునాతన దశలోనే గుర్తించబడుతున్నాయి, అంటే కేన్సర్ ఇప్పటికే శరీరంలోని ఇతర భాగాలకు వ్యాపించి ఉంటుంది. కాలక్రమేణా, చాలామందిలో “కాస్ట్రేషన్ రెసిస్టెంట్ ప్రోస్టేట్ కేన్సర్” అభివృద్ధి చెందుతుంది, అంటే సాధారణ హార్మోన్ చికిత్సకు స్పందించకుండా వ్యాధి ముందుకు సాగుతుంది.ప్రోస్టేట్ కేన్సర్ ఎలా పెరుగుతుందో అర్థం చేసుకోవడం ముఖ్యం. ఈ కేన్సర్ కణాలు ప్రధానంగా టెస్టోస్టెరోన్ అనే పురుష హార్మోన్పై ఆధారపడి పెరుగుతాయి. అందుకే, ఆండ్రోజెన్ డిప్రైవేషన్ థెరపీ (ADT) — అంటే శరీరంలో టెస్టోస్టెరోన్ స్థాయిని తగ్గించే చికిత్స — ఇప్పటివరకు ప్రధాన చికిత్సగా ఉపయోగించబడింది. ఇది కేన్సర్ పెరుగుదలను నెమ్మదింపజేస్తుంది, లక్షణాలను నియంత్రిస్తుంది.అయితే, కొన్ని సందర్భాల్లో టెస్టోస్టెరోన్ స్థాయులు తగ్గినా కూడా కేన్సర్ కణాలు “ఆండ్రోజెన్ రిసెప్టర్పాథ్వే”ను సక్రియం చేసి పెరుగుతూనే ఉంటాయి. ఆండ్రోజెన్ రిసెప్టర్ అనేది కణంలో ఉండే ఒక ప్రోటీన్, ఇది హార్మోన్ సంకేతాలను స్వీకరించి కణానికి పెరగమని సూచిస్తుంది. ఈ పరిస్థితిలో వ్యాధి కొనసాగితే దాన్ని కాస్ట్రేషన్ రెసిస్టెంట్ ప్రోస్టేట్ కేన్సర్ అంటారు.గత దశాబ్దంలో చికిత్సలో కీలకమైన మార్పులు చోటుచేసుకున్నాయి. కేవలం హార్మోన్ స్థాయులనుతగ్గించడం కాకుండా, ఇప్పుడు “ఆండ్రోజెన్ రిసెప్టర్ పాథ్వే ఇన్హిబిటర్స్” అనే కొత్త ఔషధాలు ఉపయోగిస్తున్నారు. ఇవి కేన్సర్ కణాల్లో జరిగే పెరుగుదల సంకేతాలను నేరుగా అడ్డుకుంటాయి. ఇవిADT తో కలిపి ఉపయోగించినప్పుడు మరింత ప్రభావవంతంగా పనిచేస్తాయి. మెటాస్టాటిక్ హార్మోన్ సెన్సిటివ్ ప్రోస్టేట్ కేన్సర్ పై నిర్వహించిన క్లినికల్ అధ్యయనాలు చూపుతున్నాయి.ఈ రెండు చికిత్సల కలయిక వ్యాధి పురోగతిని గణనీయంగా ఆలస్యం చేస్తుంది. అంతేకాకుండా, కాస్ట్రేషన్ రెసిస్టెంట్ దశకు చేరే సమయాన్ని కూడా వాయిదా వేస్తుంది. ముఖ్యంగా ఎముకలకు వ్యాపించినప్పుడు వచ్చే నొప్పి కూడా ఆలస్యంగా వస్తుంది.ఇవి చాలా ముఖ్యమైన ఫలితాలు. ఎందుకంటే వ్యాధి పురోగతిని ఆలస్యం చేయడం అంటే లక్షణాలను నియంత్రిస్తూ, రోజువారీ జీవనాన్ని సజావుగా కొనసాగించే సమయం ఎక్కువగా లభించడం. చాలామందికి ఇది చలనశీలతను కాపాడుకోవడం, కుటుంబంతో సమయం గడపడం, సాధారణ కార్యకలాపాలను కొనసాగించడం వంటి ప్రయోజనాలను అందిస్తుంది.ఈ కొత్త చికిత్సల మరొక ముఖ్యమైన అంశం వాటి సహన శక్తి (tolerability). అధునాతన కేన్సర్చికిత్సలో తరచుగా కనిపించే అలసట వంటి సమస్యలు తక్కువగా ఉంటాయి. వృద్ధాప్యంలో ఉన్న రోగులకు, ముఖ్యంగా డయాబెటిస్ లేదా గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారికి, ఈ సమతుల్యత చాలా ముఖ్యం. కెమోథెరపీ అవసరం లేకుండా మంచి ఫలితాలను ఇస్తున్న ఈ కలయిక చికిత్సలు, తీవ్రమైన చికిత్సలకు అనుకూలం కానీ రోగులకు ఒక మంచి ప్రత్యామ్నాయం.భారతదేశం గ్లోబల్ క్లినికల్ రీసెర్చ్లో పాల్గొనడం కూడా పెరుగుతోంది. అంతర్జాతీయ పరిశోధనల్లో భారతీయ రోగుల భాగస్వామ్యం, చికిత్సల ప్రభావాన్ని మరింత స్పష్టంగా అర్థం చేసుకోవడంలో సహాయపడుతోంది. ప్రాక్టీస్లో ఆధారిత చికిత్సలను అమలు చేయడానికి దోహదం చేస్తోంది.అధునాతన ప్రోస్టేట్ కేన్సర్ ఒక తీవ్రమైన నిర్ధారణ అయినప్పటికీ, ఇప్పుడు దీనిని ఒక దీర్ఘకాలిక వ్యాధిగా నిర్వహిస్తున్నారు. ఈరోజు చికిత్స లక్ష్యం—రోజువారీ జీవనంపై కనిష్ట ప్రభావంతో వ్యాధిని నియంత్రించడం. ఈ వ్యాధిని ఎదుర్కొంటున్న పురుషులు, వారి కుటుంబాల కోసం, వైద్యుడితో సమాచార ఆధారిత, ముందస్తు చర్చ చాలా ముఖ్యమైనది. అందుబాటులో ఉన్న చికిత్సలను అర్థం చేసుకోవడంద్వారా, వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా చికిత్సను రూపొందించుకోవచ్చు. చికిత్స క్లినికల్ ఆధారాలతో పాటు వ్యక్తిగత లక్ష్యాలకు అనుసంధానమైనప్పుడు, జీవితం కేవలం పొడిగించడమే కాకుండా, దాన్ని మెరుగైన విధంగా గడపడం కూడా సాధ్యమవుతుంది.డాక్టర్ పాలంకి సత్య దత్తాత్రేయ, సీనియర్ మెడికల్ ఆంకాలజిస్ట్రెనోవా సౌమ్య కేన్సర్ సెంటర్, కర్కాణా, హైదరాబాద్(చదవండి: ఈ తాత అందరికీ స్ఫూర్తి..! 90 ఏళ్ల వయసులో అంత ఫిట్గానా..) -
ఈ తాత అందరికీ స్ఫూర్తి..! 90 ఏళ్ల వయసులో అంత ఫిట్గానా..
20, 30 లేదా 40 ఏళ్ల వయసులో ఉండి వ్యాయామం చేయాలంటే రకరకాల సాకులు చెబుతూ స్కిప్ చేస్తుంటారు. కొన్ని రోజులు మొక్కుబడిగా చేసి..మళ్లీ యథావిధిగా మానేస్తుంటారు. అలాంటివాళ్లు ఈ 90 ఏళ్ల వృద్ధుడిని చూస్తే కచ్చితంగా కనువిప్పి కలుగుతుంది, దృక్పథం కూడా మార్చుకోవచ్చని చెబుతున్నారు ఆ తాతగారి వ్యక్తిగత ఫిట్నెస్ ట్రైనర్. తేలికపాటి వ్యాయామాలు చేసే వయసులో యువకులకు పోటీ ఇచ్చేలా ఆయన చేసే స్ట్రెంగ్త్ వ్యాయామాలు చూస్తే కచ్చితంగా విస్తుపోతారు. ఇంతకీ ఎవరా తాతగారు..?, అతని ఫిట్నెస్ సీక్రెట్ ఏంటో చూద్దామా..!.ఆ తాతగారి వ్యక్తిగత ఫిట్నెస్ ట్రైనర్ అయిన జెన్నిఫర్ మార్టిన్ ఇన్స్టాగ్రామ్ వేదికగా ఆయన గురించి చెప్పుకొచ్చింది. ఆ వీడియోలో చాలామంది మంచం నుంచి లేవడానికి ఇబ్బంది పడే తొమ్మిది పదుల వయసులో స్వతంత్రంగా బతకాలనే ఆశయం, కఠోర శ్రమ ఫలితమే అతడి స్ట్రాంగ్ ఫిట్నెస్ సీక్రెట్ అని చెబుతోందామె. ఆమె వయసు పైబడటం సమస్య కాదని అంటోంది, బలం కోల్పోవడమే సమస్య. దీర్ఘాయువుకి కండరాలే కీలకం. ఆ విషయంలోనే ఈ తాతాగారు చాలా కేర్ఫుల్గా ఉంటారు. సవంత్సరాల తరబడి చేసిని నిరంతర వర్కౌట్లు..ఆయన్ని ఇంతలా బలంగా ఫిట్గా ఉండేలా చేశాయి. నిజానికి ఆయనకు 90 ఏళ్లు అంటే ఎవ్వరు నమ్మలేరు.పైగా ఆయన ఫిట్నెస్ దినచర్యలో ఏ యువకుడికైన గట్టి పోటీ ఇచ్చేలా చేయగలరు కూడా. ఆయన ఒంటరిగానే జిమ్కి వెళ్తారని, వారంలో మూడు రోజులు జిమ్కి కేటాయిస్తారని చెబుతోంది. ఆయన ఫుల్లింగ్ వ్యాయామాల దగ్గర నుంచి ట్రెడ్మిల్పై పరుగెత్తడం, క్లైంబింగ్ వర్కౌట్లను ఆస్వాదించడం వరకు అన్నింటిని చేస్తారు. మెషీన్లు, డంబెల్స్ను ఉపయోగించి స్ట్రెంగ్త్ ట్రైనింగ్ వంటివి కూడా చేస్తారాయన. ఈ వ్యాయామ దినచర్య కేవలం దీర్ఘాయువు కోసం కాదని, తుంటి మార్పిడి శస్త్ర చికిత్స నుంచి కోలుకోవడానికి కూడా సహాయపడిందని చెప్పుకొచ్చింది. శస్త్రచికిత్సకు ముందే ఆ వ్యక్తి శారీరకంగా చురుకుగా ఉంటూ, వ్యాయామం చేస్తుండటం వల్ల, ఇతర రోగుల కంటే వేగంగా కోలుకోగలిగారని చెప్పుకొచ్చింది. నెటిజన్లు సైతం ఆయన వ్యాయామాలకు సంబంధించిన వీడియోలను చూసి..ఆ వయసుల పట్టుదలను అభినందించడమే గాక..ఇది నిజంగా అద్భుతం అని కొనియాడారు. View this post on Instagram A post shared by JEN | Personal Trainer | Functional Movement & Longevity (@jennifermartinnn) (చదవండి: నాడు జేఈఈ ఫెయిల్యూర్ ఇవాళ ఏకంగా యూట్యూబ్లో..!) -
మంచి జీర్ణక్రియకు మండూకాసనం
మండూకం అంటే కప్ప. ఈ ఆసనం వేసేటప్పుడు శరీరం కప్పలా కనిపిస్తుంది కాబట్టి దీనికి ఆ పేరు వచ్చింది. ఈ ఆసనంలో మోకాళ్లపై కూర్చొని, ముందుకు వంగి కడుపుపై ఒత్తిడి ఇస్తారు. ముఖ్యంగా జీర్ణక్రియ మెరుగుపరచడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. కప్పలా కూర్చుని, కడుపుకు మసాజ్ ఇచ్చే యోగానే మండుకాసనం.చేసే విధానం..ముందుగా మోకాళ్లపై వజ్రాసనంలో కూర్చోవాలి. ∙పిడికిళ్లను బిగించి నాభి దగ్గర పెట్టాలి. ∙శ్వాస విడిచేటప్పుడు ముందుకు వంగాలి. కడుపుపై ఒత్తిడి వచ్చేలా ఉంచాలి.15–20 సెకన్లు ఉండి నెమ్మదిగా పైకి రావాలి.జాగ్రత్తలు..కడుపు నొప్పి / అల్సర్ ఉంటే చేయకూడదు. గర్భిణులు చేయకూడదు. మోకాళ్ల నొప్పులు ఉన్నవారు తగిన జాగ్రత్తలు తీసుకొని చేయాలి.ఉపయోగాలు..జీర్ణక్రియ మెరుగుపడుతుంది.∙గ్యాస్, అజీర్ణం తగ్గుతుంది.కడుపు భాగం బలపడుతుంది.ఇది డైలీ 2–3 సార్లు చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది.అనిత పాతర్ల యోగా ట్రైనర్ -
ముఖంపై వెంట్రుకలు పెరుగుతున్నాయా?
నాకు పద్దెనిమిది సంవత్సరాలు. ఇటీవల పైపెదవి, గడ్డం కింద ఒత్తుగా, దట్టంగా వెంట్రుకలు వస్తున్నాయి. బరువు కూడా పెరుగుతోంది. ఇది ఏ సమస్యకు సంకేతం? ఎలాంటి పరీక్షలు చేయించుకోవాలి?– మమత, జమ్మలమడుగు. మీరు చెప్పిన లక్షణాలను బట్టి ఇది హిర్సూటిజం (అనవసరంగా వెంట్రుకలు పెరగడం) అనే సమస్య కావచ్చు. సాధారణంగా మహిళల్లో పై పెదవి, గడ్డం, ఛాతీ, వెన్ను వంటి ప్రాంతాల్లో మందంగా, నల్లగా వెంట్రుకలు పెరగడం ఈ సమస్య లక్షణం. ఇది ఎక్కువగా శరీరంలో పురుష హార్మోన్లు (ఆండ్రోజెన్స్) అధికంగా ఉండటం వల్ల జరుగుతుంది. ముఖ్యంగా పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (పీసీఓఎస్) ఉన్నవారిలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. కొన్నిసార్లు అడ్రినల్ గ్రంథుల సమస్యలు, అరుదుగా ట్యూమర్లు కూడా కారణం కావచ్చు. ఈ సమస్యను నిర్ధారించడానికి గైనకాలజిస్ట్ను సంప్రదించాలి. డాక్టర్ ముందుగా పూర్తి శరీర పరీక్ష చేస్తారు. అవసరమైతే కొన్ని రక్తపరీక్షలు, హార్మోన్ టెస్టులు, అలాగే అల్ట్రాసౌండ్ స్కాన్ ద్వారా ఓవరీల పరిస్థితిని పరిశీలిస్తారు. చికిత్స సమస్య తీవ్రతపై ఆధారపడి ఉంటుంది. హార్మోన్లను సరిచేసే మందులు, బరువు తగ్గించే చర్యలు. అవసరమైతే కాస్మెటిక్ ట్రీట్మెంట్స్, లేజర్ హెయిర్ రిమూవల్ వంటి జీవనశైలిలో మార్పులు చాలా ముఖ్యం. చక్కెర, స్వీట్స్, జంక్ ఫుడ్, ఆయిల్ ఫుడ్ తగ్గించడం, నియమిత వ్యాయామం చేయడం ద్వారా బరువు నియంత్రణలో ఉంచాలి. ఇది కేవలం శారీరక సమస్య మాత్రమే కాదు, మానసికంగా కూడా ప్రభావం చూపొచ్చు. కొంతమందిలో ఆత్మవిశ్వాసం తగ్గడం, ఆందోళన వంటి సమస్యలు రావచ్చు. కాబట్టి ఈ సమస్యను ప్రారంభ దశలోనే గుర్తించి చికిత్స తీసుకోవడం మంచిది. సరైన వైద్య చికిత్సతో పాటు అవసరమైతే లేజర్ వంటి పద్ధతుల ద్వారా వెంట్రుకలను తగ్గించుకోవచ్చు. దీంతో జీవన నాణ్యత మెరుగుపడుతుంది. డా‘‘ భావన కాసుగైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్హైదరాబాద్ ∙ -
పసి గుండెకు గురిపెట్టే ఫీవర్
చిన్నపిల్లల్లో జలుబు చేయడం చాలా మామూలు విషయం. జలుబు తర్వాత కాస్తంత గొంతునొప్పి రావడమూ మామూలే. వీటితో పాటు జ్వరం కనిపించడం చాలా సాధారణమే. అయితే ఇలా జ్వరమూ (హైఫీవర్), జలుబూ, గొంతునొప్పి కనిపించడమన్నది సాధారణమే కదా అంటూ మామూలుగా తీసుకోవడం సరికాదంటున్నారు వైద్య నిపుణులు. ఈ మామూలు లక్షణాలను నిర్లక్ష్యం చేయకూడదనీ, అదే చాలా తీవ్రమైన రుమాటిక్ ఫీవర్గా పరిణమించి చిన్నారుల ‘గుండె’నూ దెబ్బతీస్తుందంటే అది చాలామందికి ఆశ్చర్యంగా అనిపించవచ్చు. కానీ అది వాస్తవం. అందుకే ఒక్కోసారి ఈ చిన్న లక్షణాలనూ చాలా సీరియస్గా తీసుకోవాలని గుర్తుంచుకోవాలి. అదెప్పుడో తెలుసు కునేందుకు ఉపయోగపడేదే ఈ కథనం.చిన్న పిల్లల్లో వచ్చే ఈ జలుబు, గొంతునొప్పి, జ్వరాలను చాలామంది సాధారణ సమస్యగానే చూస్తారు. చిన్న పిల్లలకు జలుబు చేశాక వారు గొంతునొప్పితో బాధపడుతున్నప్పుడు దాన్ని కేవలం ఓ చిన్న సమస్యగానే చూడకూడదని తప్పక గుర్తుంచుకోవాలి. ఎందుకంటే... జలుబు, గొంతునొప్పి, జ్వరం లాంటి లక్షణాలు కనిపించినప్పుడు తొలుత అది టాన్సిల్స్కు ఇన్ఫెక్షన్ వచ్చే టాన్సిలైటిస్కు దారితీయవచ్చు. ఇక కొందరిలో గ్రూప్–ఏ స్ట్రె΄్టోకోకస్ అనే బ్యాక్టీరియా కారణంగా వచ్చినట్లయితే... దానికి డాక్టర్ సూచించే పూర్తి స్థాయి యాంటీబయాటిక్స్ కోర్సు వాడాలి. అలా వాడకపోతే... ఈ సమస్య వచ్చిన ఒకటి నుంచి ఐదు వారాలలోపు రుమాటిక్ ఫీవర్ అనే మరో సమస్యకు దారితీసే ప్రమాదం ఉందని తెలుసుకోవాలి. అలా జలుబు, జ్వరాల తర్వాత మళ్లీ మరోసారి జ్వరం... మునుపు డాక్టర్లు ఇచ్చిన అవే మందులు వాడుతూ నిర్లక్ష్యం చేయకుండా తప్పనిసరిగా డాక్టర్ను సంప్రదించాలి. ఎందుకంటే అది రుమాటిక్ ఫీవర్కు దారి తీసే ప్రమాదమూ ఉందని తల్లిదండ్రులకు ఏమాత్రం తెలిసే అవకాశం ఉండదు. అందుకే జ్వరం వచ్చి తగ్గి, మళ్లీ ఒకటి నుంచి ఐదు వారాలలోపు జ్వరం వస్తే గనక... అప్పుడు తల్లిదండ్రులు కాస్త అప్రమత్తంగా ఉండాలి.రుమాటిక్ ఫీవర్తో ఎలాంటి ప్రమాదం వస్తుందంటే... రుమాటిక్ ఫీవర్ అనేది సాధారణంగా 5 – 15 ఏళ్ల చిన్నారులపై తీవ్ర ప్రభావం చూపుతుంది. రుమాటిక్ ఫీవర్ వచ్చిన తర్వాత భవిష్యత్తులో అది గుండె కవాటాల (వాల్వ్స్)ను తీవ్రంగా ప్రభావితం చేసి గుండెకు తీవ్రమైన ముప్పు తెచ్చిపెడుతుంది.లక్షణాలు.. మొదట జలుబు, గొంతునొప్పి, తీవ్రమైన జ్వరం వచ్చి తగ్గాక ఒకటి నుంచి ఐదు వారాల లోపు మళ్లీ మరోమారు జ్వరం వస్తుంది. ఆ జ్వరంతో పాటు కీళ్లనొప్పులు, కీళ్లవాపులు, ఒంటి మీద ర్యాష్ రావడం వంటి లక్షణాలు కనిపిస్తే దాన్ని రుమాటిక్ ఫీవర్గా అనుమానించాలి. అలాగే తొలుత ఈ లక్షణాలు కనిపించిన పిల్లల్లో... తర్వాత శ్వాసతీసుకోవడం వంటి ఇబ్బంది కూడా కనిపిస్తుంది. తీవ్రమైన అలసట, నీరసం, నిస్సత్తువ వంటివీ కనిపిస్తాయి. ఇంకా మరికొన్ని లక్షణాలూ కనిపించే అవకాశం ఉంది. అయితే ఇక్కడ పేర్కొన్నవి మాత్రం రుమాటిక్ ఫీవర్ను గుర్తించేందుకు తోడ్పడే ప్రధాన లక్షణాలుగా పరిగణించి... ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు తప్పనిసరిగా డాక్టర్ను సంప్రదించాలి. ఇక్కడ పేర్కొన్న అంశాలను బట్టి ఇది ఎంతో పెద్ద సమస్యగా అనిపిస్తున్నప్పటికీ... కేవలం ఒక పూర్తి కోర్సు యాంటీబయాటిక్ మందులతో దీన్ని పూర్తిగా నివారించవచ్చనీ, దాంతో పిల్లల అద్భుతమైన భవిష్యత్తును కాపాడుకోవచ్చని తల్లిదండ్రులు అవగాహన పెంచుకుంటే చాలు... పేరెంట్స్ ఆ చిన్నారి గుండెకు తగిన రక్షణ కల్పించినవారవుతారు. చికిత్స / నివారణవాస్తవానికి తొలిదశలోనే పూర్తిగా తగ్గిపోయేలా తగిన చికిత్స అందిస్తే... కేవలం చాలా చిన్న కోర్సు యాంటీబయాటిక్స్తోనే సమస్య పూర్తిగా సమసిపోతుంది. కానీ తొలిదశల్లో ఆ చిన్న చికిత్సే అందించకపోతే అది గుండె వైఫల్యానికీ (హార్ట్ ఫెయిల్యూర్కూ) దారితీయవచ్చు. చికిత్స అందించాక కూడా కొంతమంది పిల్లల్లో అది వాల్వ్ రీప్లేస్మెంట్ ఆపరేషన్ అవసరం పడేవరకూ వెళ్లే అవకాశం ఉంది గానీ... చాలా కొద్దిమంది పిల్లల్లోనే ఇలా జరిగే అవకాశముంది. మరికొందరు చిన్నారుల్లో జీవితాంతమూ బ్లడ్థిన్నర్స్ (రక్తం పలుచబార్చే మందులు) కూడా వాడాల్సి రావచ్చు. ఇలాంటి చిన్నారుల్లో ఆడ పిల్లలు ఉండి, వారు పెద్దయ్యాక గర్భం దాల్చినప్పుడు... వారికి ఆ గర్బధారణ కూడా ఓ సమస్యగా పరిణమించవచ్చు. అందుకే పిల్లల్లో జబులు, గొంతునొప్పితో కూడిన తీవ్రమైన జ్వరం వస్తే దాన్ని చిన్న సమస్యగా పరిగణించకుండా ఒకసారి మీ పిల్లల డాక్టర్ను తప్పనిసరిగా సంప్రదించాలి. అంతేకాదు... ఇలా జలుబు, గొంతునొప్పి, జ్వరం వచ్చిన పిల్లల విషయంలో వారు తగినంత వ్యక్తిగత పరిశుభ్రత (పర్సనల్ హైజీన్) పాటించేలా చూడాల్సిన బాధ్యత కూడా తల్లిదండ్రులదే.డా‘‘ శివనారాయణ రెడ్డి వెన్నపూససీనియర్ నియోనేటాలజిస్ట్ – పీడియాట్రీషియన్నిర్వహణ: యాసీన్ -
గర్భసంచి జారడం అంటే...?
సాధారణంగా మహిళల్లో మధ్యవయసు దాటిన కొందరిలో ‘గర్భసంచి జారడం’ అనే మాట వినిపిస్తుంటుంది. మహిళల పొత్తికడుపులో గర్భసంచి అంటూ అందరూ సామాన్యంగా పిలిచే యుటెరస్తో పాటు పెద్దపేగు, మూత్రపు సంచి లాంటివి కూడా ఉంటాయి. ఇవి కాస్తంత జారిపోయి యోని పైభాగం మీద ఒత్తిడి కలిగిస్తూ మహిళల్లో తీవ్రమైన నొప్పినీ, ఇబ్బందినీ కలిగిస్తాయి. ఇలా పొత్తికడుపులోని యుటెరస్, పెద్దపేగు, మూత్రపు సంచి (బ్లాడర్) వంటి దేహ భాగాలు యోని పైభాగంలోకీ లేదా ఒక్కోసారి యోనిలోనికి జారిపోవడాన్నే వైద్యపరిభాషలో ‘పెల్విక్ ఆర్గాన్ ప్రొలాప్స్’ అని పేర్కొంటారు. అవి ఎందుకలా జారతాయో, అప్పుడు ఏం చేయాలో చూద్దాం. నిజానికి మహిళల్లో తమ పొత్తికడుపులోని అవయవాలన్నీ చాలా దగ్గర దగ్గరగా అమరి ఉంటాయి. పొత్తికడుపులోపల ఉండే గర్భసంచి వంటి అనేక అంతర్గత అవయవాలన్నీ ‘పెల్విక్ ఫ్లోర్’ అని పిలిచే ఓ పొర లాంటి కండరంపై ఉంటాయి. ఒకరకంగా చెప్పాలంటే ఆ ‘పెల్విక్ ఫ్లోర్’ ఆ అంతర్గత అవయవాలను మోస్తూ ఉంటుంది.ప్రొలాప్స్కు మరికొన్ని కారణాలు పొత్తికడుపు అవయవాలు ఇలా కిందికి జారడానికి చాలా అంశాలు కారణమవుతాయి. ఉదాహరణకు వయసు పెరగడం వల్ల పెల్విక్ఫ్లోర్ కండరం బలహీనపడటం అనే ముఖ్యకారణంతో పాటు...→ బిడ్డలకు జన్మనివ్వడం (ఛైల్డ్ బర్త్) → రుతుక్రమం ఆగిపోవడం (మెనోపాజ్) → బరువు పెరగడం (ఒబేసిటీ) → తీవ్రమైన మలబద్ధకం (క్రానిక్ కాన్స్టిపేషన్)తో ముక్కడం వల్ల కొందరిలో గర్భసంచి తొలగింపు ఆపరేషన్ (హిస్టరెక్టమీ) జరగడం... వంటి అంశాలు ప్రొలాప్స్కు కారణమవుతాయి. నివారణపెల్విక్ ప్రొలాప్స్ నివారణ చాలా పరిమితమైన మేరకే సాధ్యమవుతుంది. పెల్విక్ ఫ్లోర్ కండరాన్ని బలోపేతం చేసే ‘కెగెల్స్ ఎక్సర్సైజెస్’ అని పిలిచే పొత్తికడుపు వ్యాయామాలను చేయడం ద్వారా కొంతవరకు ఈ పరిస్థితిని నివారించవచ్చు. మలబద్ధకాన్ని నివారించేందుకు ఆహారంలో పీచు ఎక్కువగా ఉండే పదార్థాలు తీసుకోవడం, మంచి విసర్జక అలవాట్లు (గుడ్ టాయిలెట్ హ్యాబిట్స్... అంటే రోజూ ఒకేవేళకు మలవిసర్జనకు వెళ్లడం), స్థూలకాయాన్ని నివారించుకోవడం అంటే బరువు పెరగకుండా జాగ్రత్తపడటం, బరువైన వస్తువుల్ని అకస్మాత్తుగా ఎత్తకుండా జాగ్రత్తగా ఉండటం వంటి వాటితో పెల్విక్ ప్రొలాప్స్ను కొంతమేర నివారించవచ్చు. జారడం ( ప్రొలాప్స్) అంటే ఏమిటి, ఎందుకలా జరుగుతుందంటే...? మహిళల్లో వయసు పెరుగుతున్న కొద్దీ ఈ కండరం బలహీనపడుతుంది. ఆ క్రమంలో ఒక్కోసారి పొత్తికడుపులో ఉండే అంతర్గత అవయవాలు ‘బలహీనపడ్డ’ ఆ పెల్విక్ఫ్లోర్ నుంచి జారి... యోనిలోకి గానీ లేదా యోని పైభాగంలోకి వచ్చేస్తాయి. ఇలా జారి కిందకు రావడాన్నే ‘్రపొలాప్స్’అంటారు. ఏ అవయవం జారిందో దాన్ని బట్టి ఆ జారిన ప్రక్రియకు ( ప్రొలాప్స్కు) ఆ పేరు పెడతారు. ఉదాహరణకు గర్భసంచి జారితే దాన్ని ‘యుటిరైన్ ప్రొలాప్స్’ అనీ, పెద్దపేగు జారితే ‘బవెల్ ప్రొలాప్స్’ అనీ, మూత్రపు సంచి జారితే ‘బ్లాడర్ ప్రొలాప్స్’ అని చెబుతుంటారు. సాధారణంగా వీటన్నింటినీ కలిపి ‘పెల్విక్ ఆర్గాన్స్’గా పేర్కొంటారు కాబట్టి అవి జారినప్పుడు... అలా జరడాన్ని ‘పెల్విక్ ఆర్గాన్ ప్రొలాప్స్’ అనే ఒక్క మాటతో సూచిస్తుంటారు. నిజానికి ఇవేవీ ప్రాణాలకు ముప్పు తెచ్చిపెట్టే సమస్యలు కాదు. అయితే ఇలా జారడం వల్ల ఒక్కోసారి తీవ్రమైన ఇబ్బంది కలుగుతుంది. కొన్నిసార్లు తీవ్రంగా నొప్పి కూడా వస్తుంటుంది.చికిత్సకొన్ని జీవనశైలి మార్పులు అనుసరిస్తూ కొంతమందిలో హార్మోన్ చికిత్స ఇవ్వడం ద్వారా ఈ కండిషన్ను డాక్టర్లు చక్కదిద్దడం జరిగినప్పటికీ... ఇలాంటి చర్యలతో అంతగా ఫలితం లేనప్పుడు జారిన అవయవాన్ని / అవయవాలను తిరిగి వాటి వాటి స్థానాల్లో అమర్చేలా శస్త్రచికిత్స చేయాల్సి రావచ్చు. చాలా సందర్భాల్లో శస్త్రచికిత్సతో ఆయా అవయవాలను వాటి స్థానాల్లో తిరిగి అమర్చడం మాత్రమే ప్రొలాప్స్కు శాశ్వత చికిత్సగా చెప్పవచ్చు.డా‘‘ సరోజ బానోతు, కన్సల్టెంట్ ఆబ్స్టెట్రీషియన్ అండ్ గైనకాలజిస్ట్ -
ఊబకాయం నుంచి స్మార్ట్గా..! ఏకంగా 204 కిలోల నుంచి 92 కిలోలకు..
కొందరు సుమోలు మాదిరిగా భారీ శరీరంతో ఉంటారు. వాళ్లు వెయిట్లాస్ అవ్వడం చాలాకష్టం. బరువు తగ్గే సర్జరీలు, ఫిట్నెస్ నిపుణుల పర్యవేక్షణలో మాత్రమే కాస్త బరువు తగ్గగలిగే అవకాశం ఉంటుంది. సాధారణంగా ఊబకాయులు బరువు తగ్గడం అంత సులభం కాదు. పైగా ఆ క్రమంలో చాలా నరకం చవి చూడాల్సి ఉంటుంది. కానీ ఈ మహిళ బరువు తగ్గాలనే కోరిక బలంగా ఉంటే..పట్టుదలతో ఇట్టే ఆ సమస్యను జయించొచ్చు అని నిరూపించిందామె.ఆ మహిళ అమెరికాలోని కొలరాడోకు చెందిన కంటెంట్ క్రియేటర్ అనా అలోన్సో. తన శరీర బరువులో సగానికి పైగా బరువు తగ్గిన జర్నీని సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంది. నిజానికి ఆమె బరువు 204 కిలోలు. పట్టుదల, మానసిక స్థైర్యంతో బరువు తగ్గడానికి స్థిరంగా కట్టుబడి మరి స్మార్ట్గా మారింది ఆ పిల్లల తల్లి. ఒకప్పుడు అధిక బరువుతో..చిన్నపాటి కదలికలకే అల్లడిపోయే సవాళ్లను ఎదుర్కొంది. నిరంతర ఆయాసంతో బయటకు అడుగుపెట్టాలంటేనే ఇబ్బంది పడేది. ముఖ్యంగా తన రూపం కారణంగా నలుగురిలోకి రావడానికి చాలా ఇబ్బందిపడేది. తాను ఎలాగైన చురుకైన తల్లిగా ఆత్మవిశ్వాసంతో ఉండాలన్న ఆరాటం ఆమెను బరువు తగ్గేందుకు పురికొల్పొంది. ముఖ్యంగా బరువు తగ్గి మంచి శరీరాకృతితో ఆత్మగౌరవంతో ఉండాలనే ఆకాంక్షతో చాలా పట్టుదలతో నిలకడగా బరువు తగ్గేందుకు ఉపక్రమించానని చెప్పుకొచ్చింది అనా.శారీరక పరివర్తన ఎలా సాధించిందంటే..మొదట్లో చిన్న పాటి కదలికలు కూడా కష్టమైందామెకు. సాధార వ్యాయామాలకే అలిసిపోయేది. అయితే అసౌకర్యాన్ని భరిస్తూ ముందుకు సాగింది. అయితే నిలకడగా చేయడం ప్రతీది మార్చేసింది. కాలక్రమేణ బరువులు ఎత్తడం, స్క్వాట్స్ చేయడం, బహిరంగ పోటీల్లో పాల్గొనేంత వరకు పురోగతి సాధించింది. ఆమె పరివర్తన మొత్తం రాత్రికి రాత్రే జరగలేదు. మంచి జీవనశైలిని అవలంభిస్తూ..క్రమం తప్పకుండా వ్యాయామాలు చేస్తూ..తగ్గడం సాధ్యమే అని నిరూపించింది. ఎలా విజయవంతమైందంటే..ఆరోగ్యకరమైన బరువు తగ్గడం కోసం అనా అనుసరించిన ముఖ్యమైన సూత్రాలేంటంటే..క్రమం తప్పని వ్యాయామాలు కాలక్రమేణ బలాన్ని పెంచుకోవడానికి, కొవ్వును కరిగించుకోవడానికి, ఓర్పును మెరుగుపరుచుకోవడానికి సహయాపడ్డాయి. మొదట్లో ఎక్కువ దూరం వాకింగ్ చేసేది. ఆ తర్వాత రోజుకు రెండుసార్లు వ్యాయామాలు చేసేలా జిమ్లో చేరింది. అక్కడ బరువైన బార్బెల్స్, స్క్వాట్స్ వంటివి చేసింది.జీవనశైలిలో మార్పులుతీవ్రమైన డైటింగ్కు బదులుగాచ నిలకడైన అలవాట్లపై దృష్టి పెట్టింది.మానసిక స్థైర్యంఒక్కోసారి వద్దు అనుకునే టైంలో భావోద్వేగంగా బలంగా ఉండటం ఎలాగో తెలుసుకుంది. ఎందుకు ఈ లక్ష్యం అనేది మననం చేసుకుంటూ..నిలకడగా చేస్తుండేది. ఆ తర్వాత సమర్థవంతంగా బరువు తగ్గినా.. ఎక్సెస్ స్కిన్తో కొంచెం ఇబ్బంది పడింది. కానీ ప్రతిపని సునాయాసంగా చేసుకునే సామర్థ్యం పెంపొందించుకోగలిగానని ఆత్మవిశ్వాసంగా చెబుతోంది. ఇక్కడ అనా కథ ఎందరికో స్ఫూర్తి. ఆమె వెయిట్లాస్ స్టోరీ ఆరోగ్యం అనేది మనస్తత్వంతో గాఢంగా ముడిపడి ఉంటుందనే విషయాన్ని నొక్కి చెబుతోంది. నిరంతర కృషి, మానసిక బలం స్థిరమైన అలవాట్లతో, అత్యంత సవాలుతో కూడిన వెయిట్లాస్ జర్నీ అద్భుతమైన ఫలితాలకు దారితీస్తుంది అనేందుకు అనానే ఉదాహరణ. గమనిక: ఇదికేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. View this post on Instagram A post shared by Ana Alonso (@ana.fitness.vsg) (చదవండి: సూపర్ స్టార్ రజనీకాంత్ పేరెంటింగ్ టిప్స్..! తండ్రిగా, హీరోగా ఎలా బ్యాలెన్స్ చేశారంటే..) -
వ్యాయామాలు తప్పనిసరా..? చేయాల్సిందేనా..
వ్యాయామం అంటే కేవలం బరువు తగ్గడం కోసం మాత్రమే అని చాలా మంది అనుకుంటుంటారు. కానీ అది సరికాదు. వ్యాయామం గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది, టైప్–2 డయాబెటిస్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల ముప్పును తగ్గిస్తుంది. అన్నింటికంటే ముఖ్యంగా, వ్యాయామం వల్ల విడుదలయ్యే ఎండార్ఫిన్లు ఒత్తిడిని, ఆందోళనను తగ్గిస్తాయి. అందువల్ల బద్ధకించకుండా బాధ్యతగా చేసే పనిగా గుర్తించాలి.ముందుగా ప్లాన్ చేసుకోకపోతే వ్యాయామం అనేది ఎప్పటికీ చేయలేము. పిల్లలు నిద్రలేవక ముందే, లేదంటే వారి మధ్యాహ్నం నిద్ర సమయంలో ఒక 20 నుంచి 30 నిమిషాలు ప్లాన్చేసుకోవాలి. ఉదయాన్నే ‘ఏం బట్టలు వేసుకోవాలి? బాటిల్ ఎక్కడ ఉంది?’ అనే గందరగోళం లేకుండా, ముందు రోజే మీ వర్కవుట్ దుస్తులను, వాటర్ బాటిల్ను సిద్ధం చేసుకోండి. ఇది మీ మెదడుపై నిర్ణయాల భారాన్ని తగ్గిస్తుంది.చిన్నపాటి వర్కవుట్లు చాలు..జిమ్లో గంటల తరబడి గడపాల్సిన అవసరం లేదు. పుష్–అప్స్, స్క్వాట్స్, ప్లాంక్స్ వంటివి ఎక్కడైనా చేయవచ్చు. వారానికి కనీసం 150 నిమిషాల మోస్తరు వ్యాయామం ఉండేలా చూసుకోండి.పిల్లలతో కలిసి..పిల్లల పనులు చేయాలనే సాకుతో చాలామంది వ్యాయామాన్ని వాయిదా వేస్తుంటారు. నిజానికి పిల్లల పనులు కానీ, పిల్లలు కానీ మీ ఫిట్నెస్కు అడ్డంకి కానే కాదు, వారితో కలిసే వ్యాయామం చేయండి. వారితో కలిసి డ్యాన్స్ చేయడం లేదా పార్కులో ఆడుకోవడం ద్వారా వారికి కూడా ఆరోగ్యకరమైన అలవాట్లు అలవడతాయి. చురుకైన తల్లిదండ్రులను చూసి పెరిగే పిల్లలు భవిష్యత్తులో కూడా యాక్టివ్గా ఉంటారని పరిశోధనలు చెబుతున్నాయిక్రమం తప్పకుండా..ఒక్కోసారి చాలా బిజీగా ఉండవచ్చు. అటువంటప్పుడు కనీసం 10 నిమిషాల స్ట్రెచింగ్ లేదా యోగా చేయండి. అన్నీ చేయాలి లేదా ఏదీ చేయకూడదు అనే ధోరణి కంటే, కొద్దిగానైనా క్రమం తప్పకుండా చేయడం ముఖ్యం.వారానికి రెండుసార్లు..మహిళలకు కార్డియోతో పాటు స్ట్రెంత్ ట్రైనింగ్ చాలా ముఖ్యం. ఇది ఎముకల సాంద్రతను పెంచుతుంది, కండరాల పటుత్వాన్ని కాపాడుతుంది. వయసు పెరిగే కొద్దీ వచ్చే గాయాలను నివారించడానికి ఇది అవసరం. వారానికి కనీసం రెండుసార్లు దీనిని ప్రయత్నించండి.(చదవండి: -
తెల్లటివి కంటే గోధుమ రంగు గుడ్లు మంచివా..?
కోడిగుడ్డు ఒక సంపూర్ణ ఆహారం. తక్కువ ధరలో ఎక్కువ ప్రోటీన్ లభించే ఆహారం ఇదే. అయితే, కోడిగుడ్ల వినియోగంపై సమాజంలో ఎన్నో రకాల అ΄ోహలు ఉన్నాయి. అనవసరమైన భయాలను పెట్టుకోకుండా గుడ్లను ఆహారంలో చేర్చుకుందాం.. మెరుగైన ఆరోగ్యాన్ని పొందుదాం. అందుకోసం అపోహలను తొలగించుకుందాం.నమ్మకాలు కోడిగుడ్డులో తెల్లసొన మాత్రమే తినాలి, పచ్చసొనలో కొవ్వు ఎక్కువగా ఉంటుంది కాబట్టి దానిని వదిలేయాలి.తెల్లటి గుడ్ల కంటే గోధుమ రంగు గుడ్లు ఆరోగ్యానికి మంచివి.గుడ్లు తినడం వల్ల రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి, గుండె జబ్బులు వస్తాయి.నిజాలుపచ్చసొనలోనే శరీరానికి అవసరమైన ముఖ్యమైన విటమిన్లు, ఖనిజ లవణాలు నిండి ఉంటాయి. తెల్ల గుడ్లు, గోధుమ రంగు గుడ్లు రెండూ సమానమైన ΄ోషక విలువలను కలిగి ఉంటాయి.గుడ్లు తింటే కొలెస్ట్రాల్ పెరగదు పైగా ఇవి ఆరోగ్యకరమైన కొవ్వులను అందిస్తాయి.రోజుకు రెండు కంటే ఎక్కువ గుడ్లు తినడం ఆరోగ్యానికి హానికరం.ఆరోగ్యంగా ఉన్నవారు రెండు కన్నా ఎక్కువ గుడ్లను తిన్నా ఏమీ కాదు. అది వారి ఇష్టం. అంతే! .(చదవండి: జస్ట్ ఆ నాలుగు జీవనశైలి మార్పులతో.. 90 నుంచి 55 కేజీల బరువు!) -
సూపర్ స్టార్ రజనీకాంత్ పేరెంటింగ్ టిప్స్..!
తమిళ సూపర్ స్టార్, తలైవా రజినీకాంత్ అసలు పేరు శివాజీ రావు గైక్వాడ్. ఐదు దశాబ్దాలకుపైగా సుమారు 170 సినిమాల్లో నటించారు. ఇందులో కేవలం తమిళ సినిమాలు మాత్రమే కాకుండా తెలుగు, కన్నడ, మలయాళం మొదలైన భాషల సినిమాలు ఉన్నాయి. తన నటనతో, స్టైల్తో ఎంతోమంది అభిమానుల మనసుదోచుకున్న ఈయన ఏడు పదులు వయసుదాటినా..అభిమానులను అలరించేలా యంగ్ హీరోల మాదిరిగా స్టెప్పులు వేస్తూ నటిస్తుండటం విశేషం. సినీ పరిశ్రమలో నటుడుగా తనకంటూ మంచి గుర్తింపును తెచ్చుకోవడం తోపాటు అటు కుటుంబాన్ని బ్యాలెన్స్ చేస్తూ మంచి తండ్రిగా మన్నననలను అందుకున్నారు. రజనీకాంత్, భార్య లత దంపతులకు ఐశ్వర్య, సౌందర్య అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆయన కుమార్తెలు కూడా ఇప్పటికే చిత్ర పరిశ్రమలో దర్శకులుగా, నిర్మాతలుగా కళాకారిణులుగా స్థిరపడ్డారు. ఆయన ఆడిపిల్లలు అనే తారతమ్యం చూపకుండా నచ్చిన రంగంలోకి వచ్చే స్వేచ్ఛను ఇవ్వడమే కాకుండా తండ్రిగా అన్ని విధాలుగా సపోర్టు చేస్తూ..నాన్న అనే పదానికి గొప్ప అర్థం ఇచ్చారాయన. అలాంటి సూపర్స్టార్ నుంచి నేర్చుకోవాల్సిన పేరెంటింగ్ పాఠాలేంటో తెలుసుకుందామా..!పిల్లల వ్యక్తిత్వాన్ని గౌరవించడం..తల్లిదండ్రులు పిల్లల జీవితాన్ని నియంత్రించడానికి బదులుగా సొంత మార్గాన్ని ఎంచుకునేలా కుమార్తెలను ప్రోత్సహించారు రజనీ. ఇక్కడ పిల్లలను ఫలానా చేయమని డైరెక్షన్ ఇవ్వడం లేదా బలవంతం చేయడం వంటివి చేయకూడదు. వారి భావనలు, ఆలోచనలు, వ్యక్తిత్వాన్ని గౌరవించాలి. అందులో ఉండే సాధకబాధలు అర్థమయ్యేలా వివరించాలే తప్ప..నిర్బంధించకూడదు. ఇక్కడ మంచి తండ్రిగా రజనీ తన కుమార్తెల విషయంలో అదే చేశారు. ముఖ్యంగా పిల్లలను అర్థం చేసుకోవాలని నొక్కి చెబుతున్నారు రజనీ. పిల్లలతో సన్నిహితంగా ఉండటం..అతిముఖ్యమైన పేరెంటింగ్ పాఠం పిల్లలతో అత్యంత సాన్నిహిత్యంగా ఉండటం. ఇక్కడ నటుడు రజనీకాంత్ తన కుమార్తెలు, కుటుంబంతో చక్కటిన సత్సంబంధాలను నెరుపుతారు. తల్లిదండ్రులు పిల్లలతో మంచి కమ్యూనికేషన్ ఉంటేనే వాళ్లు తాము అత్యంత సురక్షితంగా ఉన్నామనే భావన ఏర్పడుతుంది. అలాగే తల్లిదండ్రులపై మంచి నమ్మకాన్ని ఏర్పరచుకుంటారు. స్ట్రిక్ట్గా ఉండటం కంటే..పిల్లలతో స్నేహపూర్వకంగా మెలిగే పెంపకమే మంచిదని చెబుతున్నారు మానసిక నిపుణులు.పిల్లల డ్రీమ్స్కి మద్దతివ్వండి..రజనీ కూతుళ్లు ఇద్దరు సినీ రంగాన్నే ఎంచుకున్నారు. చిత్రపరిశ్రమలో తమకంటూ మంచి కెరీర్ని నిర్మించుకున్నారు. రజనీకాంత్ తన పిల్లల కలలకు, ఆశయాలకు మద్దతిచ్చారు. పిల్లల కోసం అన్నీ చేయడం పెంపకం కాదు, కష్ట సమయాల్లో పిల్లలకు అండగా నిలవడం, వారి పక్కన ఉండటమే అసలైన పెంపకం. అంతేగదు పిల్లల కలలకు, ఆశయాలకు మద్దతిచ్చినప్పుడే పిల్లలు స్వతంత్రంగా, ఆత్మవిశ్వాసంతో ఎదుగుతారు. ఆధనిక తల్లిదండ్రులు నేర్చుకోవాల్సిన అతి ముఖ్యమైన పెంపక పాఠం.కుటుంబానికే తొలి ప్రాధాన్యత..అలాగే పేరెంట్స్ తమ తమ ఉద్యోగాల్లో ఎంత బిజీగా ఉన్నా..కుటుంబానికే తొలి ప్రాధాన్యత ఇవ్వాలి. ఇక్కడ సూపర్స్టార్ రజనీ నుంచి నేర్చుకోవాల్సిన అతి ముఖ్యమైన పేరెంటింగ్ పాఠం ఇది. ఆయన నటుడిగా బిజీగా ఉన్నా..కుటుంబంతో గడిపే సమయానికి ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఇస్తానని ఆయనే స్వయంగా పలుమార్లు చెప్పారు కూడా. కుటుంబమే లేకుంటే మనం లేం, అందువల్ల మొదటి ప్రాధాన్యత ఫ్యామిలీకే ఇవ్వండి అప్పుడే ఎందులోనైనా సక్సెస్ అవ్వగలం అని చెబుతున్నారు రజనీ. -
జస్ట్ ఆ నాలుగు జీవనశైలి మార్పులతో.. 90 నుంచి 55 కేజీల బరువు!
వెయిట్లాస్ అనగానే కఠినమైన ఆహారాలు, ఇష్టమైన ఫుడ్ని వదులుకోవడం, తీవ్రమైన వ్యాయామాలు గంటలు తరబడి చేయడం అని భావిస్తుంటారు చాలామంది. కానీ అవేమి కానేకాదు అని కొందరు అనుభవ పూర్వకంగా తెలుసుకోవడమే గాక, చాలా సింపుల్ లైఫ్స్టైల్స్తో కిలోల కొద్ది బరువు తగ్గి ఇతరులకు ప్రేరణగా నిలుస్తుంటారు. అలాంటి కోవకు చెందిందే ఈ ముంబైకి చెందిన ఇన్ఫ్లుయెన్సర్. ఇంతకీ ఆమె బరువు తగ్గడం కోసం ఎలాంటి మార్పులు జోడించిందంటే..కంటెంట్ క్రియేటర్ మల్లికా ఫతేపురియా తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా సరికొత్త వెయిట్లాస్ జర్నీని పంచుకున్నారు. ఒకప్పుడు తాను 90 కిలోల బరువు ఉండేదాన్ని అని , ప్రస్తుతం 55 కిలోలకు చేరి సుమారు 35 కేజీ బరువు తగ్గానని చెప్పుకొచ్చారు. అయితే తన వెయిట్లాస్ జర్నీలో ఏం చేసింది అనేదానికంటే..ఏం మానేశాను, వేటికి దూరంగా ఉన్నాను అనేదే ఎక్కువగా ఉంటుందని అంటోందామె.బరువు తగ్గడం కోసం..డైట్లు చేయడం:తాను కఠినమైన డైట్లు పాటించిన ప్రతిసారీ కొంత బరువు తగ్గినట్లు తగ్గి..మళ్ళీ యథావిధి బరువుకి వచ్చేసేదాన్ని అని కంటెంట్ క్రియేటర్ పంచుకున్నారు. బరువు తగ్గడాన్ని ఒక స్వల్పకాలిక లక్ష్యంగా చూడటం మానేసి, తాను పాటించగలిగే అలవాట్లపై దృష్టి పెట్టడంతో ఆమె జీవితంలో అనూహ్య మలుపు వచ్చింది.కార్బోహైడ్రేట్లను తగ్గించడంరొట్టె, అన్నం, లేదా పాస్తా వంటి ఆహారాలను పూర్తిగా మానేయడానికి బదులుగా, తక్కువ మొత్తంలో తీసుకునేలా కేర్ తీసుకున్నానని అంటోంది. ఆమె ప్రకారం, అసలు సమస్య ఈ ఆహారాలు కాదని.. సమతుల్యంగా తినడంలోనే సమస్య అంతా ఉందని అంటున్నారు.విసుగు పుట్టించే భోజనాన్ని బలవంతంగా తినడం..కఠినమైన ఆహార డైట్లు శిక్షలా మారాక..బరువు తగ్గడం కంటే..సమస్యే అధికంగా మారే అవకాశాలే ఎక్కువని అంటోంది. అందుకే ఆస్వాదించకలిగేలా భోజనాన్ని ఆరోగ్యమైన విధంగా తీసుకుంటే..ఏదో కోల్పోయానన్న భావన దరిచేరదు. హెల్దీగా, ఆనందంగా బరువు తగ్గుతాం అని అంటోంది.అతిగా వ్యాయామం చేయడంతీవ్రమైన రోజువారీ వ్యాయామాలు అవసరమని తాను భావించేదాన్ని అని మల్లిక చెప్పారు. కానీ కాలక్రమేణా, నడవడం, శక్తి శిక్షణ, క్రమం తప్పకుండా చురుకుగా ఉండటం వంటి సాధారణ విషయాలు చాలా బాగా పనిచేస్తాయని గ్రహించానని అంటున్నారామె. అంతేగాదు బరువు తగ్గడం అంటే మంచి ఆహారాన్ని వదులుకోవడం లేదా మిమ్మల్ని బాధకు గురిచేసుకోవడం వంటివి కానేకాదు అని అంటోంది. నిలకడతో సమతుల్యానికి పీటవేస్తే చాలు బరువు తగ్గడం సులభం అని అంటోంది మల్లికా.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. View this post on Instagram A post shared by Mallika Fatehpuria (@mallikafatehpuria) (చదవండి: 14 ఏళ్లకే స్కూల్ డ్రాపౌట్..కానీ ఆ ఆవిష్కరణ..!) -
అతి వ్యాయామంతో ప్రాణాపాయం : ‘కోలా యూరిన్’ గురించి తెలుసా?
హైదరాబాద్, మార్చి 26, 2026: ‘నో పెయిన్.. నో గెయిన్’ (కష్టం లేనిదే ఫలితం ఉండదు) అనే సూత్రాన్ని నమ్మి జిమ్లో మితిమీరిన కసరత్తులు చేయడం ప్రాణాల మీదకు తెస్తుందని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రోలజీ అండ్ యూరాలజీ (AINU) వైద్యులు హెచ్చరిస్తున్నారు. తక్కువ సమయంలోనే కండలుపెంచాలనే ఆరాటంతో చేసే కఠినమైన వ్యాయామాలు ‘రాబ్డోమయోలిసిస్’ (Rhabdomyolysis) అనే ప్రమాదకర పరిస్థితికి దారితీస్తాయని వారు స్పష్టం చేశారు.ఒక్క రోజే 90 నిమిషాల కసరత్తు.. కిడ్నీలు ఫెయిల్!ఇటీవల ఫిట్నెస్ కోసం మొదటి రోజే జిమ్కు వెళ్లిన 25 ఏళ్ల యువకుడు, త్వరగా ఫలితం రావాలనే ఉద్దేశంతో ఏకంగా 90 నిమిషాల పాటు స్క్వాట్స్, డెడ్ లిఫ్ట్స్ మరియు పుష్-అప్స్ వంటి అత్యంత కఠినమైన వ్యాయామాలు చేశాడు. రెండు రోజుల తర్వాత అతనికి కండరాల నొప్పులు తీవ్రమవ్వడమే కాకుండా, మూత్రం రంగు మారి ‘కోలా’ లేదా టీ డికాషన్ రంగులోకి మారింది. పరిస్థితి విషమించడంతో అతను ఎమర్జెన్సీ వార్డులో చేరాడు. పరీక్షల్లో అతని శరీరంలో కండరాల విచ్ఛిన్నం వల్ల విడుదలయ్యే ‘మయోగ్లోబిన్’ స్థాయిలు పెరిగి, కిడ్నీలు దెబ్బతిన్నట్లు వైద్యులు గుర్తించారు. దీనినే ‘ఎక్సర్సైజ్ ఇండ్యూస్డ్ రాబ్డోమయోలిసిస్’ అంటారు. ఏమిటీ రాబ్డోమయోలిసిస్?కండరాలు విపరీతంగా అలసిపోయినప్పుడు లేదా దెబ్బతిన్నప్పుడు వాటిలోని కణాలు విచ్ఛిన్నమై ‘మయోగ్లోబిన్’ అనే ప్రోటీన్ను రక్తంలోకి విడుదల చేస్తాయి. ఈ ప్రోటీన్ కిడ్నీలలోని సూక్ష్మ నాళాలను మూసివేస్తుంది (Clogging). దీనివల్ల కిడ్నీలు తాత్కాలికంగా లేదా శాశ్వతంగా దెబ్బతింటాయి. సకాలంలో గుర్తించకపోతే డయాలసిస్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.గుర్తించాల్సిన ప్రమాద సంకేతాలు: వ్యాయామం చేసే వారు ఈ క్రింది లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయకూడదుమూత్రం రంగు మారడం: మూత్రం కోలా లేదా టీ రంగులోకి మారడం అత్యంత ముఖ్యమైన సంకేతం.తీవ్రమైన కండరాల నొప్పి: సాధారణ నొప్పి కంటే భిన్నంగా, కండరాలు వాపు రావడం.నీరసం: విపరీతమైన అలసట లేదా కండరాల్లో శక్తి లేకపోవడం.తక్కువ మూత్ర విసర్జన: రోజువారీ కంటే మూత్రం రావడం తగ్గిపోవడం. వాంతులు: వికారం లేదా వాంతులు అవ్వడం.సకాలంలో చికిత్సతో ప్రాణాపాయం నుంచి విముక్తిఈ యువకుడి కేసులో ఏఐఎన్యూ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ డాక్టర్ దీపక్ రాగూరి, నెఫ్రాలజిస్ట్ డాక్టర్ క్రాంతి కుమార్ సమన్వయంతో చికిత్స అందించారు. రోగికి తగినంత ద్రవాలను అందిస్తూ (Aggressive Hydration),ఎలక్ట్రోలైట్ సమ తుల్యతను కాపాడటం ద్వారా కిడ్నీలు మళ్లీ సాధారణ స్థితికి చేరుకున్నట్టు హైటెక్ సిటీలోని ఏఐఎన్యూ ఆసుపత్రి వైద్యులు ప్రకటించారు. జిమ్కు వెళ్లే వారికి వైద్యుల సూచనలునెమ్మదిగా ప్రారంభించండి: మొదటి రోజే కఠినమైన వ్యాయామాలు వద్దు. క్రమక్రమంగా తీవ్రతను పెంచాలి.నీరు ఎక్కువగా తాగాలి: వ్యాయామానికి ముందు, తర్వాత శరీరంలో నీటి శాతం తగ్గకుండా చూసుకోవాలి.విశ్రాంతి అవసరం: కండరాలు కోలుకోవడానికి వారంలో కనీసం ఒక రోజైనా విశ్రాంతి ఇవ్వాలి. నొప్పిని భరించొద్దు: తీవ్రమైన నొప్పి ఉంటే వ్యాయామం ఆపేయాలి. పెయిన్ కిల్లర్స్ వేసుకుని మరీ జిమ్ చేయడం ప్రాణాంతకం."వ్యాయామం అనేది ఒక ఔషధం లాంటిది. అది సరైన మోతాదులో ఉన్నప్పుడే ఆరోగ్యం. శరీరం ఇచ్చే హెచ్చరికలను గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి," అని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఇదీ చదవండి: తండ్రితో గొడవ, నాలుగేళ్ల బాలుడిపై ఇంత ప్రతీకారమా? -
గాయనికి 'స్టిఫ్ పర్సన్ సిండ్రోమ్'..! ఎందువల్ల వస్తుందంటే..
ప్రపంచ ప్రఖ్యాత ఫ్రెంచ్ కెనడియన్ పాప్ గాయని సెలిన్ డియోన్ తన గాత్ర నైపుణ్యం, ఉద్వేగభరితమైన మ్యూజిక్ ప్రదర్శనలకు ప్రసిద్ధి చెందింది. 'టైటానిక్' చిత్రంలోని 'మై హార్ట్ విల్ గో ఆన్' పాటతో పాటు 90ల నాటి అనేక అంతర్జాతీయ హిట్లకు ప్రసిద్ధి చెందింది. అంత ప్రసిద్ధి గాంచిన గాయని 'స్టిఫ్ పర్సన్ సిండ్రోమ్' అనే అరుదైన వ్యాధి బారినపడింది. దాంతో సంగీతానికి గత కొంతకాలంగా పూర్తిగా విరామం ఇచ్చేశారామె. మళ్లీ ఇన్నేళ్లకు తన 58వ పుట్టిన రోజు నేపథ్యంలో మ్యూజిక్ లైవ్ షోలలో పాల్గొననుట్లు అభిమానులతో పంచుకుంది. సెలిన్ని కెరీర్కి దూరమయ్యేలా చేసిన అరుదైన 'స్టిఫ్ పర్సన్ సిండ్రోమ్' వ్యాధి అంటే ఏంటి? ఎందువల్ల వస్తుందంటే..గాయని సెలిన్ డియోన్కు డిసెంబర్ 2022లో స్టిఫ్ పర్సన్ సిండ్రోమ్ అనే అరుదైన ఆటోఇమ్యూన్ న్యూరోలాజికల్ డిజార్డర్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. దాంతో ఆమె గతకొలంగా లైవ్షోలకు బ్రేక్ ఇచ్చారు. ప్రస్తుతం ఆమె లైవ్షో వేదికపైకి తిరిగి రావడానికి సంసిద్ధంగా ఉంది. ఈ ఏడాది సెప్టెంబర్, అక్టోబర్ నెలలో లా డిఫెన్స్ ఎరీనాలో 10 రాత్రుల పాటు ప్రదర్శనలు ఇవ్వనుంది. ఇలా మళ్లీ పూర్తి స్థాయిలో కోలుకుని యథావిధిగా తన కెరీర్ని కొనసాగిచడాన్ని తన జీవితంలోని అత్యుత్తమమైన బహుమతిగా అభివర్ణించింది. మార్చి 2020లో అమెరికాలోని న్యూజెర్సీలో జరిగిన చివరి లైవ్ షో అనంతరం డియోన్ మళ్లీ తొలిసారిగా వేదికపైకి పునరాగమనం చేయనుండటం విశేషం. ఇక డియోన్ ఈ అరుదైన వ్యాది తన గొంతు కదలికలపై తీవ్ర ప్రభావం చూపిందని అన్నారు. తన అభిమానులు, శ్రేయాభిలాషుల మద్దతతులో పూర్తి స్థాయిలో కోలుకున్నానని, అందుకు అందరికి కృతజ్ఞతలు అని పేర్కొంది. ఇంతకీ ఆమె ఎదుర్కొన్న అరుదైన వ్యాధి 'స్టిఫ్-పర్సన్ సిండ్రోమ్'అంటే ఏంటి? ఎందువల్ల వస్తుందంటే..స్టిఫ్ పర్సన్ సిండ్రోమ్ అంటే ?స్టిఫ్ పర్సన్ సిండ్రోమ్ (SPS) అనేది ఒక అరుదైన ఆటోఇమ్యూన్ న్యూరోలాజికల్ రుగ్మత. ఇది మొండెం, పొత్తికడుపులో కండరాల బిగుతుకు కారణమవుతుంది. కాలక్రమేణ ఈ పరిస్థితి మరింత తీవ్రతరమయ్యే అవకాశాలు ఉన్నాయి కూడా. దీని కారణంగా సంబంధిత రోగులు కాళ్లు, ఇంతర కండరాల్లో బిగువు, ఒక విధమైన నొప్పులను అనుభవిస్తారని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. అంతేగాదు సాధారణ కదలికలు కష్టతరమవుతాయట. ముఖ్యంగా నడవడం కష్టంగా మారిపోతుందట.లక్షణాలు దీనిలో రెండు ప్రధాన లక్షణాలు ఉన్నాయి:కండరాల బిగుతుఈ వ్యాధిలో కనిపించే తొలి సంకేతం ఇదే. ముఖ్యంగా మొండెం భాగంలో - అంటే పొట్ట, ఛాతీ, వీపులో మొదలవుతుంది. ఇది నిరంతర బిగుతుగా లేదా నొప్పితో కూడిన బాధగా అనిపిస్తుందట. ఎటువంటి స్పష్టమైన కారణం లేకుండా ఈ బిగుతు రావచ్చు, పోవచ్చు. ఇది తీవ్రమవుతున్న కొద్దీ, చేతులు, కాళ్ళను కూడా ప్రభావితం చేయవచ్చు.కండరాల నొప్పులు (స్పాజమ్స్)ఇవి ఆకస్మికంగా, బాధాకరంగా ఉంటాయి. ఇవి శరీరంలోని ఒక భాగాన్ని లేదా మొత్తం శరీరాన్ని ప్రభావితం చేయవచ్చు. ఈ నొప్పులు కొన్ని సెకన్లు, నిమిషాలు లేదా కొన్నిసార్లు గంటల పాటు కూడా ఉండవచ్చు.లక్షణాలను ప్రేరేపించే అంశాలుబిగ్గరగా లేదా ఊహించని శబ్దాలుశారీరక స్పర్శఉష్ణోగ్రతలో మార్పులు (ముఖ్యంగా చలి)ఒత్తిడితో కూడిన పరిస్థితులుమొత్తం మీద, ఈ పరిస్థితి కాలక్రమేణా కదలికలను కష్టతరం చేస్తుంది, మంచానికే పరిమితమయ్యేలా చేస్తుంది కూడా.కారణాలు :ఇది ఒక స్వయం ప్రతిరక్షక వ్యాధి (Autoimmune disorder), అంటే శరీర రోగనిరోధక వ్యవస్థ పొరపాటున స్వంత నాడీ కణాలపై దాడి చేస్తుంది.చాలా మంది రోగులలో గ్లుటామిక్ యాసిడ్ డెకార్బాక్సిలేస్ (GAD) యాంటీబాడీస్ ఎక్కువగా ఉంటాయి.నిర్ధారణఈ వ్యాధి నిర్ధారణకు రక్త పరీక్షలు (GAD యాంటీబాడీ టెస్ట్), EMG (Electromyography) ఉపయోగిస్తారు. చికిత్స, నిర్వహణ:దీనికి కచ్చితమైన చికిత్స లేనప్పటికీ, లక్షణాలను నిర్వహించవచ్చు. ముందుగా కండరాలను సడలించడానికి డయాజెపామ్ (Valium) లేదా బాక్లోఫెన్ (Baclofen) వంటి మందులు ఉపయోగిస్తారు.ఇమ్యునోథెరపీ: IVIG (Intravenous Immunoglobulin) చికిత్స తరచుగా మొదటి ప్రాముఖ్యతగా చేస్తుంటారు వైద్యులు. వాటితోపాటు ఫిజియోథెరపీ, ఇతర వ్యాయామాలు కదలికను మెరుగుపరచడానికి సహాయపడతాయి. నిజానికి ఈ వ్యాధి స్త్రీలలో, ముఖ్యంగా 40-50 ఏళ్ల మధ్య వయస్సులో ఎక్కువగా కనిపిస్తుందని చెబుతున్నారు వైద్య నిపుణులు.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం.(చదవండి: పుచ్చకాయ తినే ముందు చిటికెడు ఉప్పు ఎందుకు చల్లుతారో తెలుసా..!) -
పుచ్చకాయ తినే ముందు చిటికెడు ఉప్పు ఎందుకు వేయాలంటే..?
సమ్మర్ అనగానే అందరికి గుర్తొచ్చేది పుచ్చకాయ. వేసవి దాహార్తిని చల్లార్చేది పుచ్చకాయ ఒక్కటే. అది తినగానే తక్షణ శక్తి, దాహం తీరుతుంది కూడా. అలాంచి పుచ్చకాయను తినేముందు చిటికెడు ఉప్పు ఎందుకు జల్లుతారో తెలుసా!. అలా తింటేనే మంచిదా అంటే..సాధారణంగా చాలామంది పుచ్చకాయను అలానే తినేస్తారు. కొందరు మాత్రం తప్పనిసరిగా చిటికెడు ఉప్పు జల్లుకునే తింటుంటారు. ఇలా తింటే ఏం జరుగుతుందో తెలుసా..!.సహజమైన తీపి..చిటికెడు ఉప్పు పుచ్చకాయ రుచిని మరింత తీపిగా చేస్తుంది. రుచి గ్రాహకాలు రుచిని గ్రహించే విధానాన్ని ఉప్పు ప్రభావితం చేస్తుంది కాబట్టి ఇలా మరింత తీపిగా అనిపిస్తుందట. అలాగే ఉప్పులో ఉండే క్లోరైడ్ అయాన్లు తీపి రుచి గ్రాహకాలతో చర్య జరిపి తక్కువ గాఢతలో తీపిని గ్రహించే శక్తినిపెంచి, చేదుని తగ్గిస్తాయి. అంటే ఉప్పు పండులోని సహజ చక్కెరలను ఉత్తేజపరిచి వాటి ప్రభావాన్ని పెంచుతుంది, మరింత రుచికరంగా ఉంటుంది కూడా.కోల్పోయిన ఎలక్ట్రోలైట్లను భర్తీ చేస్తుంది. .పుచకాయలో సహజంగా నీటి శాతం ఎక్కువ. ఇందులో సోడియం తక్కువగా ఉంటుంది. చిటికెడు ఉప్పు కలపడంతో శరీరానికి తగిని సోడియం అంది, ద్రవాలను నిలుపుకోవడానికి హైడ్రేషన్కు హెల్ప్ అవుతుంది. ఇది ప్లాస్మా పరిమాణాన్ని నిర్వహించడంలో అలాగే శరీరం తీసుకున్న నీటిని త్వరగా బయటకు పంపకుండా నిలుపుకోవడంలో కీలకపాత్ర పోషిస్తుంది. అందుకే వేడికి గురైన వెంటనే లేదా అధిక శ్రమ తర్వాత నీరు, సోడియం కలియిక నీరు రీహైడ్రేషన్కి ప్రభావవంతంగా ఉంటుందట.రుచి సమతుల్యతను మెరుగుపరుస్తుందికొన్నిసార్లు పుచ్చకాయ రుచి చప్పగా లేదా మరీ నీళ్ళగా అనిపించవచ్చు. చిటికెడు ఉప్పు రుచిని సమతుల్యం చేయడం తోపాటు ప్రతి ముక్కను మరింత రుచికరంగా మారుస్తుంది.జీర్ణక్రియకు సహాయపడుతుంది..తక్కువ పరిమాణంలో జీర్ణరసాలను ప్రేరేపించడంలో ఉప్పు సహాయపడుతుంది. ఇది ఆహారాన్ని జీర్ణం చేసుకోవడాన్ని సులభతరం చేస్తుంది. సాధారణంగా పుచ్చకాయ చాలా సులభంగా జీర్ణమవుతుంది, ఈ చిన్న చేర్పు మొత్తం తినే అనుభవాన్ని మెరుగుపరుస్తుంది, ముఖ్యంగా భోజనం తర్వాత లేదా స్నాక్గా తీసుకున్నప్పుడు.శ్రద్ధగా తినేలా చేస్తుంది.. పుచ్చకాయకు ఉప్పు కలపడం వల్ల తినే వేగాన్ని తగ్గిస్తుంది. ఒక గిన్నెను త్వరగా పూర్తి చేయడానికి బదులుగా, ప్రతి ముక్కను ఆస్వాదించడానికి ఆసక్తి చూపుతారు. ఇది పరిమాణ నియంత్రణకు సహాయపడటం తోపాటు సంతృప్తికరంగా అనిపించేలా చేస్తుంది. కాబట్టి, పుచ్చకాయకు చిటికెడు ఉప్పు కలపడం వల్ల పండు పోషక విలువలు పెద్దగా మారవు, కానీ అది తినే అనుభవాన్ని ఆనందదాయకంగా, సమతుల్యంగా చేస్తుంది. ఇక్కడ చిటికెడు ఉప్పు చాలు. ఎక్కువైతే పండు సహజ రుచిని డామినేట్ చేసి, సోడియం తీసుకోవడం అధికమయ్యే అవకాశం ఉంటుంది. అవసరమైతే అదనపు రుచి కోసం నల్ల ఉప్పు, కొద్దిగా నిమ్మరసం కూడా కలుపుకోవచ్చు.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపునులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: చాయ్వాలాగా 103 ఏళ్ల బామ్మ..!) -
క్యాన్సర్ చికిత్సలో సంచలనం
న్యూఢిల్లీ: వైద్య రంగంలో మరో అద్భుతం ఆవిష్కృతమైంది. ప్రాణాంతకమైన మెదడు క్యాన్సర్ను నయం చేసే దిశగా శాస్త్రవేత్తలు ఒక సంచలన విజయాన్ని సాధించారు. అమెరికాలోని మసాచుసెట్స్ జనరల్ క్యాన్సర్ సెంటర్ పరిశోధకులు అభివృద్ధి చేసిన సరికొత్త ‘కార్-టీ సెల్ థెరపీ’ చికిత్సతో, కేవలం ఐదు రోజుల్లోనే ఒక రోగి మెదడులోని కణితి దాదాపుగా మటుమాయమయ్యింది.ఏమిటీ ‘మ్యాజిక్’ థెరపీ?సాధారణంగా గ్లియోబ్లాస్టోమా (Glioblastoma) అనేది అత్యంత వేగంగా వ్యాపించే, ప్రమాదకరమైన బ్రెయిన్ క్యాన్సర్. దీనికి చికిత్స అందించడం వైద్యులకు పెద్ద సవాలుగా ఉండేది. అయితే ‘CARv3-TEAM-E’ అనే సరికొత్త ప్రయోగాత్మక మందు పరిష్కారంగా మారింది. ఈ పద్ధతిలో రోగిలోని రోగనిరోధక కణాలను సేకరించి, వాటికి జన్యుపరమైన మార్పులు చేస్తారు. ఈ మార్పు చెందిన కణాలు నేరుగా క్యాన్సర్ కణాలను గుర్తించి, వాటిని నాశనం చేస్తాయి.క్లినికల్ ట్రయల్స్లో అద్భుత ఫలితాలు‘ఇన్సిపియంట్’ (INCIPIENT) పేరుతో నిర్వహించిన మొదటి దశ క్లినికల్ ట్రయల్స్లో 57 నుండి 74 ఏళ్ల మధ్య వయసున్న ముగ్గురు రోగులకు ఈ థెరపీని అందించారు. వీరందరూ ఇప్పటికే రేడియేషన్, కీమోథెరపీ వంటి ప్రామాణిక చికిత్సలు పొంది, సరైన ఫలితాలను అందుకోలేకపోయారు. ఇప్పుడు ఒక రోగికి కేవలం ఒకే ఒక్క ఇంజెక్షన్ ఇవ్వగా, ఐదు రోజుల్లోనే కణితి దాదాపు పూర్తిగా కరిగిపోయింది. మరో రోగిలో.. ఆరు నెలల పాటు కణితి పరిమాణం 60 శాతం వరకు తగ్గింది. ఈ మందును నేరుగా మెదడులోకి ఇంజెక్ట్ చేయడం ద్వారా వైద్యులు గరిష్ట ఫలితాలను సాధించారు.సవాళ్లు.. భవిష్యత్తు ఆశలుఈ చికిత్స పొందిన రోగులకు జ్వరం లాంటి కొన్ని సాధారణ దుష్ప్రభావాలు మినహా పెద్దగా ఇబ్బందులు కలగలేదు. అయితే ఈ థెరపీ వల్ల లభించిన ఫలితాలు ప్రస్తుతం తాత్కాలికంగానే ఉన్నాయి. కణాలు ఎక్కువ కాలం మెదడులో మనుగడ సాగించలేకపోవడం వల్ల కొంతకాలం తర్వాత క్యాన్సర్ మళ్లీ తిరగబెట్టడాన్ని శాస్త్రవేత్తలు గమనించారు. దీంతో మరిన్ని పరిశోధనలు చేస్తున్నారు. ‘న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్’లో ప్రచురితమైన ఈ అధ్యయనం భవిష్యత్తులో క్యాన్సర్ రహిత ప్రపంచాన్ని నిర్మించే దిశగా ఒక కీలక మైలురాయిగా నిలుస్తుందని వైద్య నిపుణులు భావిస్తున్నారు.ఇది కూడా చదవండి: ‘జైషే’కు భారీ దెబ్బ.. తాహిర్ అనుమానాస్పద మృతి -
హీరో వరుణ్ ధావన్ కుమార్తెకు డీడీహెచ్..? ఎందువల్ల వస్తుందంటే..
బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన విలక్షణమైన నటనతో వేలాదిమంది అభిమానులను సంపాదించుకున్న క్రేజీ హీరో. ధావన్ ఇటీవల అనురాగ్ సింగ్ దర్శకత్వంలో వచ్చిన ‘బోర్డర్ 2’ చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్నారు. ఇటీవల ఆయన తన కుమార్తె లారాకు సంబంధించిన వ్యాధి గురించి ఓ ఇంటర్వ్యూలో షేర్ చేసుకున్నారు. అంతేగాదు ఆయన దీనిపై ఓ పుస్తకం కూడా రాయాలనకుంటున్నా అంటూ చాలా భావోద్వేగంగా ఆ వ్యాధి గురించి వివరించారిలా.హీరో వరుణ్ ధావన్ తన కుమార్తె లారాకు డెవలప్మెంటల్ డిస్ప్లాసియా ఆఫ్ ది హిప్(DDH) అనే చలన సంబంధిత సమస్య ఉన్నట్లు నిర్ధారణ అయిందని వెల్లడించారు. ఈ వ్యాధిని ముందుగానే గుర్తించడంతో లారా కోలుకోవడానికి సహాయపడిందని ధావన్ తెలిపారు. ఆమెకు ఒకటిన్నర సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు, DHH (డెవలప్మెంటల్ హిప్ డిస్ప్లాసియా) ఉన్నట్లు నిర్ధారణ అయిందని చెప్పారు. అంటే, తుంటి ఎముక సాకెట్ నుంచి జారిపోవడం. ఒక కాలు మరొక కాలు కంటే పొడవుగా పెరుగుతుంది, దీనివల్ల నడవడం చాలా కష్టమవుతుందని అన్నారు. అంటే వాళ్లు సరిగ్గా పరిగెత్తలేరు, నడవలేరు అని చెప్పుకొచ్చారు. దీన్ని పాశ్చాత్య దేశాలలో పుట్టినప్పుడే దీనిని సరిగ్గా నిర్ధారిస్తారు, కానీ భారతదేశంలో అలా కాదని అన్నారు. అయితే తన కూతురికి శస్త్ర చికిత్స చేయావలసిన అవసరం రాలేదన్నారు. ఒకే ప్రక్రియతో ఎముకను తిరిగి యథాస్థానంలోకి పెట్టగలిగారు. ఆమెకు స్పైకా కాస్ట్ వేయాల్సి వచ్చింది. దీనివల్ల ఆ చిన్నారి రెండున్నర నెలల పాటు ప్లాస్టర్ కట్టులో ఉండాలి. ఇది చాలా కష్టం. బిడ్డకు మత్తుమందు ఇచ్చి, ఆ తర్వాత ఆమె ప్లాస్టర్ కట్టుతోనే మేల్కొంటుందని చెప్పారు. అయితే ప్రస్తుతం ప్లాస్టర్ తీసేశారని అన్నారు. తాను దీనిపై పుస్తకం కూడా రాయాలని అనుకుంటున్నట్లు తెలిపారు. హిప్ డెవలప్మెంటల్ డిస్ప్లాసియా(DDH)అంటే..DDH అనేది శిశువులు,చిన్నపిల్లలలో తుంటిలోని 'బాల్ అండ్ సాకెట్' కీలు సరిగ్గా అమరని ఒక పరిస్థితి. సాధారణ పిల్లలలో, తుంటి కీలు తొడ ఎముకను కటి ఎముకకు కలుపుతుంది. తొడ ఎముక పైభాగం బంతిలా గుండ్రంగా ఉండి, గిన్నె ఆకారంలో ఉండే తుంటి సాకెట్ లోపల అమరి ఉంటుంది.అయితే, DDH ఉన్న పిల్లలలో, తుంటి సాకెట్ చాలా లోతు తక్కువగా ఉంటుంది మరియు తొడ ఎముక తల గట్టిగా పట్టుకోబడదు. అందువల్ల, తుంటి కీలు వదులుగా ఉంటుంది. కొన్ని పరిస్థితులలో తొడ ఎముక సాకెట్ నుంచి బయటకు కూడా రావచ్చు, దీనివల్ల కీలు తప్పిపోతుంది (డిస్లోకేషన్). శారీరక పరీక్ష సమయంలో ఎముకను సాకెట్లో కదిలించవచ్చు, కానీ అది స్థానభ్రంశం చెందదు.కారణాలుఈ పరిస్థితి ఒకటి లేదా రెండు తుంటి కీళ్లలో సంభవించవచ్చు.అయితే, ఇది సాధారణంగా ఎడమ తుంటి కీలులో ఎక్కువగా కనిపిస్తుంది. DDH వచ్చే ప్రమాదాన్ని పెంచే కొన్ని కారకాలు ఉన్నాయి.అమ్మాయిలుమొదటి సంతానంకుటుంబాలలో చిన్నతనంలో తుంటి సమస్యలు ఉన్నవారు (తల్లిదండ్రులు, సోదరులు లేదా సోదరీమణులు)గర్భధారణ 28 వారాల తర్వాత బ్రీచ్ పొజిషన్లో (పాదాలు లేదా పిరుదులు క్రిందికి) జన్మించిన శిశువులులక్షణాలుతుంటి కీలు తప్పిన కొంతమంది శిశువులలో బయటకు ఎటువంటి లక్షణాలు కనిపించవు. అయితే, శిశువుకు ఈ క్రింది లక్షణాలు ఉంటే తక్షణమే వైద్యుడిని సంప్రదించండి.కాళ్ళు వేర్వేరు పొడవులలో ఉండటంతొడపై అసమాన చర్మపు మడతలుఒక వైపు కదలిక లేదా వశ్యత తక్కువగా ఉండటంకుంటుతూ నడవడం, కాలి వేళ్ళపై నడవడం, లేదా తూలుతూ నడవడంనిర్ధారణNHS ప్రకారం, శిశువు పుట్టిన 72 గంటలలోపు లేదా 6 నుంచి 8 వారాల వయస్సులో గుర్తిస్తారు. సాధారణంగా నవజాత శిశువుల శారీరక పరీక్షలో భాగంగా వారి తుంటిని తనిఖీ చేస్తారు. ఈ పరీక్షలో, ఏవైనా సమస్యలు ఉన్నాయేమో చూడటానికి శిశువు తుంటి కీళ్ళను సున్నితంగా కదిలించడం కూడా ఉంటుంది.ఒకవేళ డాక్టర్, బిడ్డ తుంటి అస్థిరంగా ఉందని భావిస్తే, 4 నుంచి 6 వారాల వయస్సు మధ్యలో వారి తుంటికి అల్ట్రాసౌండ్ స్కాన్ చేయించాలి.కుటుంబ చరిత్రలో లేదా చిన్నతనంలో తుంటికి సంబంధించిన సమస్యలు ఉండి ఉంటేగర్భధారణ 28 వారాల తర్వాత బిడ్డ బ్రీచ్ పొజిషన్లో (కాళ్ళు లేదా పిరుదులు కిందికి ఉండేలా) జన్మించి ఉంటేకవలలు లేదా అంతకంటే ఎక్కువ మంది శిశువులు పుట్టి, వారిలో ఒక శిశువు బ్రీచ్ పొజిషన్లో ఉంటే, ప్రతి శిశువుకు 4 నుంచి6 వారాల వయస్సు వచ్చేసరికి వారి తుంటికి అల్ట్రాసౌండ్ స్కాన్ చేయించాలి.ఎదురయ్యే సమస్యలు..నడవడంలో ఇబ్బందులు, ఉదాహరణకు కుంటి నడకనొప్పితుంటి, వెన్నుపూసల ఆస్టియో ఆర్థరైటిస్సకాలంలో వ్యాధిని గుర్తించి చికిత్స అందిస్తే, పిల్లలకు శస్త్రచికిత్స అవసరం తక్కువగా ఉంటుందని, వారు సాధారణంగా ఎదిగే అవకాశం ఎక్కువగా ఉంటుందని వైద్య నిపుణుల చెబుతున్నారు. గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: ఆ వ్యాయామ మెషీన్తో 113 కిలోల నుంచి 90కిలోలు..! ఆ సర్జరీ సైతం..) -
ఆ వ్యాయామ మెషీన్తో 113 కిలోల నుంచి 90కిలోలు..!
కొందరికి బరువు తగ్గడం అంత సులభం కాదు. తగ్గినట్టు తగ్గి అమాంతం యథావిధిగా బరువు పెరిగిపోతుంటారు. సర్జరీలు వంటివి కూడా పెద్దగా ప్రయోజనం ఉండదు. శరీరాన్ని కష్టపెట్టడానికి, చక్కటి ఆరోగ్యకరమైన జీవనశైలిని అనురించడంలో విఫలమయ్యే వారి పరిస్థితి వెయిట్లాస్ విషయంలో దాదాపు ఇలానే ఉంటుంది. అందుకు ఉదాహరణ ఈ 68 ఏళ్ల అమెరికన్ వ్యక్తి. అతడి కథ వింటే..ఆరోగ్యం విషయంలో ఎలా ఉండకూడదో కనువిప్పు కలుగుతుంది.అమెరికాకు చెందిన అల్ ఎస్పోసిటో 46 ఏళ్ల వయసులో సుమారు 226 కిలోల బరువు ఉండేవాడు. తన రూపాన్ని చూసి ఆయనే ఇబ్బంది పడేవాడు. తగ్గాలని స్వల్పకాలిక ప్రయోజనాలిచ్చే డైట్లు ప్రయత్నిస్తుండేవాడు. అవేమి వర్కౌట్ అవ్వకపోయేసరికి గ్యాస్ట్రిక్ బైపాస్ సర్జరీని ఎంచుకున్నారు. ఆ శస్త్రచికిత్సకు ముందే పలువురు కోల్పోయిన బరువులో 20% మళ్లీ పెరుగుతావని చెప్పారు కూడా. అలాగే అల్ ఎస్పోసిటో గ్యాస్ట్రిక్ బైపాస్ సర్జరీ చేయించుకున్న తర్వాత సుమారు 91 కిలోలు తగ్గాడు. అయితే మళ్లీ ఇదివరకు చెడు ఆహారపు అలవాట్లతో మళ్లీ బరువు పెరిగిపోయాడు. కనీసం వ్యాయమం చేసేందుకు ప్రయత్నించకపోవడంతో సుమారు 154 కిలోలకు వచ్చేశాడు. అధిక బరువు కారణంగా కుడి మోకాలిలో తీవ్రమైన నొప్పి మొదలైంది. వైద్యులు మోకాలి మార్పిడి శస్త్ర చికిత్స సిఫార్సు చేశారు.అయితే ఆపరేషన్కు అతడి శరీరం సహకరించలేదు. దాంతో అల్ బరువు తగ్గక తప్పలేదు. ఆ నేపథ్యంలో మెడిటేరియన్ డైట్ని అనుసరించి రోజుల తరబడి వ్యాయామం చేయడం వంటి జీవనశైలి మార్పులను జీవితంలో చేర్చుకున్నాడు. అలా అల్ సుమారు 129 కిలోలకు చేరుకున్నాడు. ఆ తర్వాత కుడి మోకాలికి శస్త్ర చికిత్స చేయించుకున్నాడు. చివరగా, ఫిబ్రవరి 2025లో ఫిజికల్ థెరపీ పూర్తి చేసుకున్న తర్వాత, అతను తన బరువు తగ్గే ప్రయాణాన్ని తిరిగి ప్రారంభించాడు.అయితే బరువు తగ్గడంలో రోయింగ్ మెషీన్ బాగా హెల్ప్ అవుతుందని సన్నిహితులు సూచించడంతో ఆ మెషీన్ని కొని తెచ్చుకుని వర్కౌట్లు చేయడం ప్రారంభించాడు. రోయింగ్ మెషీన్పై వర్కౌట్లు చేసేటప్పటకీ అతడి బరువు 113 కిలోలు. ఇవాళ అనూహ్యంగా 90 కిలోల బరువు తగ్గడం విశేషం. మొదట్లో 20 నిమిషాల కంటే తక్కువ నిడివిగల చిన్న సెషన్లతో ప్రారంభించి క్రమంగా క్రమంగా ఎక్కువ సేపు చేసే వర్కౌట్లకు పెంచుకుంటూ, చివరికి రోజుకు 90 నిమిషాల వరకు రోయింగ్ చేశాడు. అంతేగాదు స్థిరమైన భోజన సమయాలను పాటిస్తూ..రాత్రి ఎనిమిది తర్వాత ఆహారానికి పూర్తిగా దూరంగా ఉంటున్నాడు. అలాగే చక్కెర పదార్థాలకు దూరంగా ఉంటూ ఫుడ్ విషయంలో మంచి కేర్ తీసుకుంటూ బరువుని అదుపులో ఉంచాడు అల్. గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను అనుసరించడం ఉత్తమం. (చదవండి: సద్గురు పేరెంటింగ్ సలహా..! నటి అలియా భట్ రియాక్షన్..) -
కాలులో ఆకస్మికంగా భరించలేని నొప్పి..క్షణాల్లో ప్రాణాంతకంగా మారి..
శరీరంలో రక్తప్రసరణ వ్యవస్థ ఎంత కీలకమైనది అని చెప్పేందుకు ఈ కేసు ఓ ఉదాహరణ. తీవ్రమైన అవయవ రక్తప్రసరణ అనేది అచ్చం గుండెపోటుని పోలి ఉంటుంది. దీని కారణంగా ఒక్కోసారి ఆయా అవయవం లేదా ప్రాణమే పోయే పరిస్థితి ఏర్పడుతుందట. ఇక్కడ కూడా ఓ మహిళ ఈ పరిస్థితితోనే దాదాపు అవయవాన్ని కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. సకాలంలో వైద్యులు చికిత్స అందించడంతో త్రుటిలో ఆ ప్రమాదం తప్పింది.అసలేం జరిగిందంటే..మహారాష్ట్రలో హింగోలికి చెందిన 57 ఏళ్ల ప్రయాగ్బాయి శంకరరావు షిండేకు ఎండమకాలులో ఆకస్మికంగా భరించలేని నొప్పి వచ్చింది. అది కాస్తా చూస్తుండగానే ప్రాణాతక అత్యవసర పరిస్థితిగా మారింది. గంటల వ్యవధిలో ఆమె పాదం నీలిరంగులోకి మారి, వాచి చల్లగా అయిపోయింది. పూర్తిగా రక్తసరఫరా నిలిచిపోయింది. ఆమె కాలు శాశ్వతంగా కోల్పోయే సంకేతాలు మొదలయ్యాయి. అయితే సకాలంలో సమీపంలోని ఆస్పత్రికి తరలించడంతో అక్కడ వైద్యులు ఆమె తీవ్రమైన అవయవ రక్తప్రసరణ లోపం(అక్యూట్ లింబ్ ఇస్కీమియా)తో బాధపడుతున్నట్లు నిర్థారించారు. ఇదొక తీవ్రమైన రక్తనాళాల అత్యవసర పరిస్థితి. దీనిలో గనుక చికిత్స ఆలస్యం అయితే ఆ కాలుని తీసివేయడం లేదా ఒక్కోసారి మరణం కూడా సంభవించవచ్చు. అధునాతన ఇమేజింగ్లో ఆమె కాలులోని ప్రధాన ధమనులలో పూర్తి అడ్డంకి ఉన్నట్లు నిర్థారణ అయ్యింది. అయితే అప్పటికే పాదంలో ప్రీ-గాంగ్రేనస్ మార్పులు కనిపించడం మొదలయ్యాయని వైద్యులు తెలిపారు. దాంతో తాము షిండేకు ఎడమ తొడ ధమని ఎంబోలెక్టమీ (left femoral embolectomy) కోసం హుటాహుటిన శస్త్రచికిత్స చేశారు. ఇది ప్లంబింగ్ లాంటిది. ధమని ఎక్కడ మూసుకుపోయినా, దానిని తెరిచి రక్తం గడ్డను తొలగిస్తారు వైద్యులు. ఫలితంగా రక్తప్రసరణ పునరుద్ధరింపబడి కాలును పూర్తిగా కోల్పోకుండా కాపడతారు. అయితే షిండే కాస్త ఆలస్యంగా రావడం వల్ల కొన్ని కాలివేళ్లు అప్పటికే గ్యాంగ్రీన్గా (gangreanes) మారిపోయాయి, అందువల్ల వాటిని తొలగించాల్సి ఉందని అన్నారు. అదీగాక సదరు రోగి షిండేకి అదుపులో లేని మధుమేహం, వయస్సు సంబంధిత అథెరోస్క్లెరోసిస్ ఉండటం ఈ కేసును ప్రత్యేకంగా సవాలుగా మార్చాయి. ఈ సహ-వ్యాధులు తీవ్రమైన అవయవ ఇస్కీమియా (acute limb ischemia) ప్రమాదాన్ని పెంచడమే కాకుండా కోలుకోవడాన్ని క్లిష్టతరం చేస్తాయని అన్నారు వైద్యులు.ఇదేలా గుండెపోటు లాంటిది అంటే..తీవ్రమైన అవయవ రక్తప్రసరణ లోపాన్ని గుండెపోటుతో పోలుస్తున్నారు వైద్యులు. గుండెపోటులో గుండె కండరాలకు రక్త సరఫరా ఎలా నిలిచిపోతుందో, అలాగే తీవ్రమైన అవయవ రక్తప్రసరణ లోపంలో కూడా రక్తప్రసరణ అకస్మాత్తుగా ఆగిపోతుంది. ఇది తీవ్రమైన నొప్పికి, కణజాల నష్టానికి దారితీస్తుంది. సాధారణంగా దీనిని తీవ్రమైన అవయవ దాడిగా కూడా పిలుస్తుంటారు. ప్రతి అవయవానికి పోషణ కోసం రక్త ప్రసరణ అవసరం. ధమని మూసుకుపోతే, నీరు లేని మొక్కలాగే అవయవం చనిపోతుంది. తీవ్రమైన అవయవ ఇస్కీమియా అంటే అవయవానికి రక్త సరఫరా అకస్మాత్తుగా ఆగిపోవడం. తక్షణ చికిత్స లేకుండా, ఆ అవయవం జీవించలేనిదిగా మారుతుంది. ఫలితంగా అవయవంలో తీవ్రమైన నొప్పి, తిమ్మిరి, చల్లదనం వంటి ప్రారంభ లక్షణాలను లైట్ తీసుకోవడంతో పరిస్థితి ప్రమాదకరంగా మారిపోతుందని చెబుతున్నారు వైద్యులు. కొందరు నరాల ఒత్తిడిగా భ్రమపడి న్యూరాలజిస్టులని సంప్రదించి విలువైన సమయాన్ని వృధా చేసుకుని ప్రాణాంతకంగా మార్చుకుంటారని తెలిపారు. ప్రమాదం ఎవరికి ఎక్కువ అంటే..వృద్ధ రోగులు, అదుపులో లేని మధుమేహం, అధిక రక్తపోటు, గుండెజబ్బులు, ధూమపానం చేసేవారికి ఈ ప్రమాదం మరింత ఎక్కువ. చికిత్స:సాధారణ చికిత్స ఎంబోలెక్టమీ, కానీ పెర్క్యుటేనియస్ మెకానికల్ థ్రాంబెక్టమీ వంటి అధునాతన పద్ధతులు . ఈ ప్రక్రియలో స్థానిక అనస్థీషియా ఇచ్చి, కాథెటర్ ఉపయోగించి రక్తం గడ్డను బయటకు తీస్తారు. శస్త్రచికిత్స విజయవంతమై, నష్టం తక్కువగా ఉంటే, రోగులు కేవలం రెండు లేదా మూడు రోజుల్లో నడవడం ప్రారంభించొచ్చు. సంక్లిష్టమైన కేసులలో, కోలుకోవడానికి ఎక్కువ సమయం పడుతుంది.అంతేగాదు అవయవంలో తీవ్రమైన నొప్పి, చల్లదనం వంటివి కనిపిస్తే, తక్షణమే సమీపంలోని ఆసుపత్రికి వెళ్ళమని సూచిస్తున్నారు వైద్యులు. సాధ్యమైనంత వరకు సమయం వృథా చేయకుండా సకాలంలో రోగ నిర్ధారణ చేయించుకుని తగిన చికిత్స పొందితే అవయవాన్ని కాపాడుకోగలమని చెబుతున్నారు వైద్యులు.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: పానీపూరీతో ఇంత ఆదాయం వస్తుందా..?! నెలకు ఏకంగా..) -
బరువు తగ్గి పీసీఓఎస్ని తిప్పికొట్టింది..! అలాగే ఆ సమస్యలు..
బరువు తగ్గడం వల్ల ఎన్ని ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టొచ్చొ తెలిస్తే విస్తుపోతారు. ముఖ్యంగా ఆరోగ్యకరమైన రీతీలో బరువు తగ్గితే ఎంత మెరుగైన మార్పులు సొంతం చేసుకోవచ్చో అనేందుకు ఈ మహిళే ఉదాహరణ. తాను వెయిట్లాస్తో ఎన్ని లాభాలు పొందిందో సోషల్ మీడియా వేదికగా పంచుకోవడమే కాదు..బాడీ మార్పుల తాలుకా ఫోటోలను కూడా షేర్ చేసుకుందామె.ఆ మహిళే దుబాయ్కు చెందిన వ్యాపారవేత్త నికితా ఫుల్వానీ. చాలామంది బరువు తగ్గడాన్ని రూపానికి సంబందించిదిగా భావిస్తారు.కానీ ఆరోగ్యకరమైన రీతీలో బరువు తగ్గితే హార్మోన్ల సమతుల్యత నుంచి చర్మ ఆరోగ్యం వరకు ప్రతిదానిపై ప్రభావం ఉంటుందని చెబుతుంది. తాను బరువు తగ్గడం వల్ల ముందుగా తన నెలసరి సమస్యలను పరిష్కారమయ్యాయని, ఆ తర్వాత తన చర్మం నిగారింపు సంతరించుకోవడం మొదలైందని చెబుతోంది. అలాగే ముఖంపై రోమాలు కూడా తగ్గాయని చెప్పుకొచ్చింది. తాను ఎక్కువగా నీరు తాగడం, మంచి ఆహారపు అలవాట్లతో అధిక బరువుని సునాయాసంగా తగ్గించుకున్నట్లు వెల్లడించింది. తన ఆరోగ్య సమస్యలు ఎలా తగ్గాయో కూడా వివరించింది. నీళ్లు ఎక్కువగా తాగడం వల్ల చర్మం నిగారింపు సంతరించకుందని, అలాగే శరీరం యాక్టివ్గా మారిందని అంటోంది. అలాగే చర్మంపై ఇదివరకు ఉన్న మచ్చలు కూడా తగ్గాయని, మేకప్ లేకుండా సౌకర్యవంతంగా ఉండగలుగుతున్నానని అంటోంది. అధిక చక్కెర తీసుకోవడంతో నోటి చుట్టూ, మెడ చుట్టూ నలుపు ఎక్కువగా ఉండేదని పేర్కొంది. అయితే ఎప్పుడైతే ప్రాసెస్ చేసిన పదార్థాలకు, చక్కెరకు దూరంగా ఉందో ఆ సమస్య చాలమటుకు తగ్గిందని అంటోంది. అలాగే పాదాల సైజు నుంచి మణికట్టు సైజు అన్నింటిలో శరీర మార్పుని చవిచూశానంటోంది. కానీ బరువు తగ్గితే శరీరం ఎంతగా రూపాంతరం చెందుతుందో, మనలో ఎంతటి అనూహ్య మార్పులు చోటుచేసుకుంటాయో స్పష్టంగా తెలిసిందని అంటోంది. ప్రస్తుతం తనను చూస్తే..జస్ట్ 25 లేదా 27 ఏళ్లు అని మాత్రమే అనుకుంటారని అంటోంది. కచ్చితంగా బరువు తగ్గితే అక్షరాల యవ్వనంగా మారిపోతామని, మన చర్మకాంతి పెరుగుతుందని చెబుతోంది ఫుల్వానీ. మన జీవనశైలి బాగుంటే అందం, ఆరోగ్యం రెండు మన సొంతం అవుతాయని చెబుతోంది. View this post on Instagram A post shared by Nikita Phulwani (@niggiphulwani) గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: తొలి ట్రాన్స్జెండర్ ఇంగ్లీష్ ప్రొఫెసర్..!) -
వృద్ధి బాటలో హెల్త్ ఇన్సూరెన్స్
న్యూఢిల్లీ: హెల్త్ ఇన్సూరెన్స్ రంగం విస్తరణ దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. ఈ రంగంలో ప్రీమియం ఆదాయం 2024–25 ఆర్థిక సంవత్సరంలో 9 శాతం వృద్ధితో రూ.1.2 లక్షల కోట్లు దాటింది. హెల్త్ ఇన్సూరెన్స్ పట్ల పెరుగుతున్న అవగాహన, వైద్య అత్యవసరాల్లో ఆర్థిక రక్షణ ఉండాలని కోరుకోవడం వృద్ధికి దారితీస్తున్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. సేవల్లో సామర్థ్యం పెరిగేందుకు, పాలసీదారులకు సకాలంలో సాయం అందించే లక్ష్యంతో బీమా రంగ నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్డీఏఐ) నగదు రహిత క్లెయిమ్ల పరిష్కారానికి నిర్దేశిత గడువులను విధించినట్టు పేర్కొంది. నగదు రహిత ముందస్తు అంగీకారం గంటలోపు తెలియజేయాలని.. క్లెయిమ్పై తుది ఆమోదాన్ని మూడు గంటల్లో తెలియజేయాలని నిర్దేశించినట్టు వెల్లడించింది. జాప్యాన్ని సాధ్యమైనంత మేర తగ్గించేందుకు, రోగులు సకాలంలో వైద్య సేవలు పొందేందుకు ఈ నిబంధనలు సాయపడతాయని తెలిపింది. వయసు మీద పడతుండడం, అధిక రక్షణ, అదనపు సదుపాయాలతో హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంలు పెరుగుతున్నట్టు ఆర్థిక శాఖ పేర్కొంది. అందుబాటు ధరల్లో ఉండాలి...బీమా ఉత్పత్తుల ప్రీమియంలు అన్ని రిస్క్లను పరిగణనలోకి తీసుకుని, సరైన ధరలపై అందుబాటులో ఉండాలంటూ 2024లో ఐఆర్డీఏఐ జారీ చేసిన మార్గదర్శకాలను ఆర్థిక శాఖ ప్రస్తావించింది. వీటిని నియమిత యాక్చువరీ ఎప్పటికప్పుడు సమీక్షిస్తుంటారని తెలిపింది. 2024–25లో బీమా భరోసా పోర్టల్పై జనరల్, హెల్త్ ఇన్సూరెన్స్కు సంబంధించి 1,37,361 ఫిర్యాదులు దాఖలయ్యాయని, ఇందులో 93 శాతం అంటే 1,27,755 ఫిర్యాదులు పరిష్కారమైనట్టు వెల్లడించింది. బీమా క్లెయిమ్ తిరస్కరణ, రద్దు అన్నవి పాలసీ నియమ, నిబంధనల పరిధిలోనివిగా పేర్కొంది. బీమా రక్షణను మించడం, కో–పేమెంట్ క్లాజ్, ఉప పరిమితులు, టాపప్ పాలసీల్లో డిడక్టబుల్, రూమ్ రెంట్ పరిమితి మించడం తదితర అంశాలూ క్లెయిమ్ తిరస్కరణ, రద్దుకు సంబంధించి ఉన్నట్టు తెలిపింది. -
హైరాక్స్ ఫిట్నెస్ రేసులో 72 ఏళ్ల బామ్మ రికార్డు..!
సాధారణంగా మారథాన్, ఫుల్ మారథాన్.. వంటి పలు రకాల ఫిట్నెస్ ఫార్మాట్లో వృద్ధులు సైతం పాల్గొని రికార్డులు తిరగరాశారు. వాటన్నింటకంటే ఇటీవల సరికొత్తగా హైరాక్స్ అనే ఫిట్నెస్ ట్రెండ్ బాగా ప్రాచుర్యం పొందుతోంది. చాలా మంది ఫిట్నెస్ ఔత్సాహికులు ఈ ట్రెండ్ని ఆదరిస్తున్నారు కూడా. అయితే ఇది సాధారణ మారథాన్ వలే జస్ట్ పరుగు కాదు..మల్టీటాస్కింగ్ వర్కౌట్లుగా చెప్పొచ్చు. కాస్త క్లిష్టతరమైనది కూడా. అలాంటి కఠినమైన హైరాక్స్ ఫంక్షనల్ రేసింగ్ పోటీలో ఓ 72 ఏళ్ల మహిళ అవలీలగా రికార్డు నెలకొల్పింది. పైగా ఆమె తుంటి మార్పిడి శస్త్రచికిత్స చేయించుకున్నప్పటికీ ఈ ఘనత సృష్టించడం విశేషం. ఎవరామె..? అంత ఏజ్లో ఆమెకు ఇదెలా సాధ్యమైందంటే..స్కాట్లాండ్కి చెందిన 72 ఏళ్ల కరోల్ మున్నో అనే మహిళ ఈ ఘనతను సృష్టించింది. ఏకంగా మూడుసార్లు తుంటి మార్పిడి శస్త్ర చికిత్స చేయించుకున్నప్పటికీ ఈ హైరాక్స్ ఫిట్నెస్ రేసులో రికార్డు నెలకొల్పిందామె. ప్రపంచంలోని అత్యంత కఠినమైన ఫిట్నెస్ రేసులలో ఒకటైన హైరాక్స్లో రికార్డులు బద్దలు కొట్టి అంచనాలకు మించి సత్తా చాటిందామె. ఈ హైరాక్స్ రేసులో పాల్గొన్న అత్యంత పైబడిన వారిలో ఒకరిగా..తన సహచర క్రీడాకారిణిలో పోటీపడి ఈ రికార్డుని సృష్టించింది. ఈ రేసు వ్యాయామం, ఓర్పుతో కూడిన పరుగు. చాలా ఓర్పుతో చేయాల్సి పోటీ ఇది. ఆమెకు మూడు హిప్ రీప్లేస్మెంట్లు జరిగాయి. అంటే అధిక శారీరక ప్రభావం చూపే కార్యకలాపాలను పరిమితం చేసే పరిస్థితి ఆమెది..అయినప్పటికీ డోంట్ కేర్ అంటూ అవలీలగా ఈ క్లిష్టమైన రేసులో సత్తా చాటి స్ఫూర్తిగా నిలిచింది ఈ బామ్మ. హైరాక్స్ అంటే..ఇదొక గ్లోబల్ ఇండోర్ ఫిట్నెస్ రేస్. ఇందులో ఎనిమిది.. ఒక కిలోమీటరు పరుగు తోపాటు స్లైడ్పుష్లు, రోయింగ్, బర్పీలు, వెయిటెడ్ లంజెస్ వంటి ఎనిమిది ఫంక్షనల్ వర్కౌట్లు కూడా పూర్తి చేయాల్సి ఉంటుంది. అంలే ఒకేసారి బలం, ఓర్పు, మానసిక స్థైర్యాన్ని పరీక్షించడానికి రూపొందించిన రేసింగ్ ఫార్మాట్ ఇది. సాంప్రదాయ మారథాన్లు లేదా జిమ్ పోటీల వలె కాకుండా, అత్యంత కఠినంగా, విభిన్నంగా ఉంటుంది. అలాంటి కఠినతరమైన ఈ రేసును వయసు పైబడి, అందులోనూ శస్త్ర చికిత్స నుంచి కోలుకుంటున్న వారికి పూర్తి చేయడం అత్యంత కష్టం. కానీ ఈ స్కాటిష్ బామ్మ అచంచలమైన పట్టుదల ఉంటే ఈ శారీరక ఇబ్బందులు పెద్ద అడ్డంకి కాదని ప్రూవ్ చేసింది. తుంటి మార్పిడి శస్త్ర చికిత్స తర్వాత పరిస్థితి..సాధారణంగా తుంటి మార్పిడి శస్త్ర చికిత్స తర్వాత జీవనశైలి నెమ్మదిగా మారిపోతుంది. ముఖ్యంగా వృద్ధులు ఇలాంటి ఆపరేషన్లు చేయించుకుంటే..వారిని అధిక ప్రభావం చూపే వ్యాయమాల విషయంలో కేర్ఫుల్గా ఉండమని సూచిస్తుంటారు వైద్యులు. అయితే ఈ 72 ఏళ్ల బామ్మ ఆ అభిప్రాయాన్నే అందరూ ఆశ్చర్యపోయేలా తిరగరాసింది. అయితే ఈ బామ్మ క్రమం తప్పకుండా వర్కౌట్ల శిక్షణ తీసుకోవడం తోపాలు పలు రకాల వ్యాయామాలు మార్చుతుండటం వల్ల హైరాక్స్లో సులభంగా రాణించగలిగేలా ఓర్పుతో కూడిన బలం సంపాదించుకుంది. అలాగే వృద్ధాప్యాన్ని పునర్నిర్వచించింది కూడా. కాగా ఈ సరికొత్త ఫిట్నెస్ ట్రెండ్ హైరాక్స్ ఢిల్లీ, ముంబై, బెంగళూరు వంటి ఇతర నగరాల్లో ఎక్కువగా జరుగుతాయి.(చదవండి: పర్యాటక అద్భుతం..'రివర్కేఫ్'గా వంతెన!) -
'ధురంధర్ 2' కోసం రణవీర్ సింగ్ ఆరు వారాల్లోనే ఏకంగా పదికిలోలు..!
రణ్వీర్ సింగ్ స్పై యాక్షన్ థ్రిల్లర్ 'ధురంధర్ 2' మూవీ రికార్డు రేంజ్ కలెక్షన్లతో బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. మార్చి 19న ప్రారంభమైన వసూళ్ల వేట ఐదురోజుల వరకు అలానే కొనసాగుతూ వెళ్తోందంటే ఆ సినిమా క్రేజ్ ఏ రేంజ్లో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా ఈ మూవీలో స్పై హంజా అలీ మజారిగా నటించిన రణవీర్ సింగ్ ఈ పాత్ర కోసం ఎంతలా కష్టపడ్డారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ పాత్రలో ఒదిగిపోయేలా క్రూరంగా కనిపించేందుకు చాలా తక్కువ టైంలోనే పదికిలోలు పైనే బరువు పెరిగారట. విలక్షణ పాత్రలతో అభిమానులను మెప్పించే రణవీర్ ఫిజిక్ పరంగా చాలా కేర్ తీసుకుంటారట. అది కూడా ఆరోగ్యకరమైన రీతీలోను ఉంటుందని, ఎలాంటి షార్టకట్లు ఫాలో అవ్వరని చెబుతున్నాడు అతని ఫిట్నెస్ కోచ్. అంత తక్కువ వ్యవధిలో రణవీర్ శరీరాన్ని అంతలా ఎలా మార్చగలిగాడో తెలుసుకుందామా..!.గత కొన్నేళ్లుగా, నటుడిగా రణవీర్ సింగ్ విలక్షణమైన పాత్రలతో ప్రేక్షకులను అలరించారు. ముఖ్యంగా 'ధురంధర్: ది రివెంజ్' చిత్రంలో ఆయన నటనకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. అంతలా అభిమానులను కట్టిపడేసేలా తెరపై ఆ పాత్రను పండించడం కోసం రణవీర్ ఎంతలా కష్టపడ్డారో వింటే నోటమాట రాదు. ఆ విషయాన్ని స్వయంగా ఆ మూవీలో నటించని సహనటుడు, సెలబ్రిటీ ఫిట్నెస్ కోచ్ ముస్తఫా అహ్మద్ వెల్లడించారు. ఆయన 'ధురంధర్: ది రివెంజ్'లో రిజ్వాన్ షా పాత్రలో ఒదిగిపోయారు. ఫిట్నెస్ కోచ్ ముస్తఫా రణవీర్ సింగ్ తెరపై క్రూరంగా కనిపంచడం కోసం కేవలం ఆరు వారాల్లోనే పదికిలోల బరువు పెరిగారట. నిజానికి షూటింగ్ చేసే సమయం తక్కవు ఉండటంతో చాలా తక్కువ వ్యవధిలోనే రణవీర్సింగ్ బరువు పెరగక తప్పని పరిస్థితని చెప్పుకొచ్చారు. రణవీర్ దాదాపు పదికిలోలు దాక పెరగాల్సి ఉంది. అయితే ఆ టైంకి రణవీర్ బరువు కేవలం 76 నుంచి 77 కిలోలు ఉన్నట్లు తెలిపారు. అయితే షూటింగ్ ప్రారంభమయ్యే సమయానికి రణవీర్ ఏకంగా 87-88 కిలోలకు చేరి అందర్నీ ఆశ్చర్యపరిచారు. అన్నింటికంటే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే రణవీర్కి ఏ పని అప్పగించినా ఓ యంత్రంలా చేసేస్తారని అంటున్నాడు కోచ్ ముస్తఫా. తాను రోజుకు 3,000-3,600 కేలరీలు తీసుకుంటుండగా, రణ్వీర్ తీసుకునేది రోజుకు 3,600 నుండి 4,000 కేలరీలు. అందులో ఎక్కువ భాగం 600-700 కేలరీలు ప్రోటీన్ షేక్ల నుంచే ఎక్కువగా తీసుకుంటున్నారు. అంటే రోజుకు రెండు ప్రోటీన్ షేక్లు, 240 గ్రాముల ప్రోటీన్ కోసం చికెన్, మటన్ ఎక్కువుగా తీసుకునేవాడట. View this post on Instagram A post shared by Mustafa Ahmed (@mustafa_thebull_ahmed) తాను ఆరువారాల్లో కేవలం రెండు నెలలు మాత్రమే ట్రైన్ చేశానని, మిగతా మొత్త ఆయన స్వయంగా కేర్ తీసుకున్నదేనని అంటున్నాడు. షూటింగ్ షెడ్యూల్ రీత్యా పూర్తి స్థాయిలో ఆయనకు శిక్షణ ఇవ్వకపోయినా రణవీర్ తన పాత్ర బాగా కనిపించాలనే ఉద్దేశ్యతో చాలా జాగ్రత్తతు తీసుకుంటారని, ఆ విషయంలో ఆయనకు సాటిరారెవ్వరూ అని ప్రశంసిస్తున్నాడు. శ్వాసను మెరుగుపరుచుకుంటూ..వెయిట్ ట్రైనింగ్ చేస్తాడు. చాలామంది శరీరం కండలు తిరిగిన దేహంలా కనిపించేలా చేస్తే..ఆయన మాత్రం బలంతో కూడిన కండరాల కోసం ప్రయత్నిస్తాడని అన్నారు. తెరపై అతడు చాలా సమర్థుడైన వ్యక్తిలా కనిపించేందుకు భోజన విరామ సమయంలో సైతం వెయిట్ ట్రైనింగ్ చేసేవాడని అన్నారు. అలా చేస్తే ఫిట్నెస్ కోచ్కి ట్రైనింగ్ సులభతరం అవుతుందని చెబుతున్నాడు. ఇక్కడ రణవీర్ ఫిట్నెస్ నిపుణుల పర్యవేక్షణలో చాలా ఆరోగ్యకరమైన రీతీలోనే బరువు పెరిగారనేది గ్రహించాల్సిన ముఖ్యమైన విషయం. కాగా, రణవీర్ సింగ్, ముస్తఫా ఈ మూవీ కోసం దాదాపు 16 నుంచి 18 గంటలు చిత్రీకరణలో పాల్గొన్నారట.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యలు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. View this post on Instagram A post shared by Mustafa Ahmed (@mustafa_thebull_ahmed) (చదవండి: కూరగాయలు అమ్ముతూ.. కోట్లకు పడగలెత్తిన యువకుడు!) -
ఐదుగురు పిల్లల తల్లి!.. ఏకంగా 67 కిలోల బరువు తగ్గి ఇలా..
కొన్ని వెయిట్లాస్ స్టోరీలు వెనుక ఎడతెగని ఎగతాళి, విమర్శలు, కంటిమీద కునుకు పట్టని బాధరకమైన వేదన ఉంటుంది. వాటిన్నంటి తట్టుకుని బరువు తగ్గి చూపించడమే కాకుండా ఆ క్రమంలో తామేంటో చూపించి విజేతలుగా, స్ఫూర్తిప్రదాతలుగా నిలుస్తారు. అలాంటి కోవకు చెందిందే ఈ అరుణాచల్ప్రదేశ్కు చెందిన మహిళ. ఎవరామె..? ఏమా కథ సవివరంగా చూద్దామా..!.అరుణాచల్ప్రదేశ్కి చెందిన ఐదుగురు పిల్లల తల్లి అయిన అమోమ్ సోకి యెకర్ ఒకప్పుడు అధిక బరువుతో ఉండేది. ఈ 39 ఏళ్ల వ్యాపారవేత్త 130 కిలోల అధిక బరువుతో ఇబ్బందిపడుతుండేది. ఆమె ఆకారం, బరువు చూసి సన్నిహితులే ఎగతాళి చేస్తూ ఇబ్బందిపెడుతుండేవారు. అంత బరువుతో కనీసం బయటకు అడుగుపెట్టడానికి కూడా ఇబ్బంది పడేది. సదా నిరాశనిస్ప్రుహలతో నిరుత్సాహంగా ఉండేదామె. కనీసం స్నేహితులను కూడా కలవలేకపోయేది. పైగా లోలోన అభద్రతా భావంతో కుమిలిపోతూ ఉండేది. కానీ ఏదో విధంగా ఈ అధిక బరువుని తగ్గించుకోవాలి, తానేంటోప్రూవ్ చేసుకోవాలన్న ఆరాటం మాత్రం యెకర్కి అపారంగా ఉండేది. అదే ఆమెను..స్లిమ్గా మారేందుకు ఉపక్రమించేలా చేసింది. అచంచలమైన దృఢసంకల్పంతో బరువు తగ్గే ప్రయత్రాలు చేసింది. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను చిన్నగా మొదలు పెట్టి ప్రభావవంతంగా ఉండేలా చేసుకుంది. అలా తగ్గుతూనే మోడల్గా ప్రయత్నిస్తుంటే..నువ్వా మోడల్గానా అంటూ ఛీత్కారాలు, అవమానాలు ఎక్కువయ్యాయి. బాగా నాజూకుగా మారితే ఒక్కసారైనా అరుణాచల్ అందాలపోటీల్లో పాల్గొనాలని ఆశిస్తున్నట్లు తన కోరికను వ్యక్తం చేయగా..ఒక్కసారిగా అందరూ నోఛాన్స్ అనేశారు. పైగా ఆమె కారణంగా ఆ అందాల పోటీలను సైతం తిట్టిపోశారు. ఇక ఈ మాటలు వింటూ డిప్రెషన్లోకి వెళ్లకూడదని, కేవలం వాళ్లు అనే మాటలు మూగబోయేలా తాను స్లిమ్గా మారాలన్నేదే లక్ష్యంగా పెట్టుకుని మరి ఏకంగా 130 కిలోల నుచి 67 కిలోలకు చేరుకుంది. అనుకున్నట్లుగానే అరుణాచల్ప్రదేశ్ అందాల పోటీల్లో పాల్గొని, మిసెస్ అరుణాచల్ 2026గా కిరీటాన్ని గెలుచుకుంది. ప్రస్తుతం మిసెస్ ఇండియాగా టైటిల్ దక్కించుకోవడమే తన లక్ష్యం అని చెబుతోంది యోకర్. ఫిట్నెస్ జర్నీ మొదలైందిలా..తాను స్వతహాగా బాగా తిండిబోతునని, అదే తన ఊబకాయానికి ప్రధాన కారణమని చెబుతోంది. తాను ఈ వెయిట్లాస్ జర్నీని..ప్రభావవంతమైన చిన్న అలవాట్లను జీవనశైలిలో జోడించి సన్నగా మారినట్లు పేర్కొన్నారు. ప్రతిరోజు యోగ, శుద్ధి చేసిన పిండితో చేసే ఆహారాలకు దూరంగా ఉంటూ బరువు తగ్గినట్లు తెలిపింది. తాను టీని పూర్తిగా మానేశానని, శుభ్రమైన ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లకు మారడంతోనే ఇంతలా స్లిమ్గా మారానని సంతోషంగా చెబుతోందామె. సత్వర ఫలితాల కోసం వెంపర్లాడకుండా..స్థిరమైన ఆరోగ్యకరమైన జీవినశైలిని అవర్చుకోవడంతో బరువు తగ్గానని అంటోంది. చిన్న అలవాట్లే చాలా ప్రభావవంతంగా ఉంటాయని చెబుతోంది. ఐదుగురు పిల్లల తల్లివి, బాగా ఏజ్డ్గా కనిపిస్తున్నావ్.. అన్న మాటలు చెవికెక్కించుకోలేదని..తనలాంటి వాళ్లు ఏం చేయగలరో చూపించడంపైనే ఫోకస్ పెట్టా, స్ఫూర్తిగా నిలిచానని సంతోషంగా చెబుతోంది. అంతేగాదు మన కథను మనమే తిరగరాయాలని,..అప్పుడే లైఫ్ అనుహ్యమైన టర్న్ తీసుకుని విజేతలుగా నిలుస్తామని ఆత్మవిశ్వాసంగా చెబుతోంది అమోమ్ సోకి యెకర్. View this post on Instagram A post shared by Leyu Abom Soki Yekar (@abomsokiyekar) (చదవండి: దంపతుల ఫిట్నెస్ కోసం..! మిలింద్ సోమన్ టిప్స్) -
పూనకాలకు కారణం ఏంటో తెలుసా..!
మొదట్లో ఒకప్పుడు కొందరు మహిళలకు దేవుళ్లు పూనడం లేదా శివమూగడం అంటూ జరుగుతుంటేది. ఒక ఆసక్తికరమైన అబ్జర్వేషన్ ఏమిటంటే... ఇది చాలావరకు ఆర్థికంగా దిగువ మధ్యతరగతి వారిలోనూ, పేద వర్గాల్లోనే కనిపిస్తుండటం చాలా సాధారణం. నిజానికి ఇదొక రకమైన మానసిక రుగ్మత. ఇలాంటి మానసిక రుగ్మతల్లో పేషెంట్... ‘నేను’ లేదా ‘తాను’ అనే భావన నుంచి విడిపోయి... మరేదో స్థితిని సంగ్రహిస్తాడు.అంటే మరో స్థితిని ΄పొందుతాడు కాబట్టి ఇంగ్లిష్లో దాన్ని పొజెసివ్ స్టేట్ అంటారు. అప్పట్లో అంటే... శాస్త్రీయ అవగాహన అంతగా లేని రోజుల్లో ఇలా జరగడాన్ని... అంటే తాను అన్న భావన నుంచి దూరం జరిగే వ్యాధులన్నింటినీ కలుపుకొని ‘హిస్టీరియా’గా వ్యవహరించారు. నిజానికి హిస్టెరస్ అంటే గర్భసంచి (యుటెరస్) అని అర్థం. యుటెరస్ శరీరంలోని ఇతర భాగాలకు తిరుగాడుతూ... పాకడం వల్ల వచ్చే వ్యాధిగా పరిగణించి అప్పట్లో దీన్ని ‘హిస్టీరియా’ అంటూ వ్యవహరించేవారు. మహిళల్లో ఈ తరహా జబ్బులు ఎక్కువ కాబట్టి హిస్టీరియా అనేవారు. అయితే వైద్య విజ్ఞానశాస్త్రం బాగా అభివృద్ధి చెంది కారణం తెలిసిన తర్వాత ఆ హిస్టీరియా అనే మాటను వాడకంలోంచి తొలగించారు. అయితే మానసిక విజ్ఞానశాస్త్రం బాగా పెరగడంతో పాటు తన స్థితి నుంచి తాను విడిపోయే పరిస్థితికి (డిసోసియేషన్కు) శాస్త్రీయమైన కారణాలు తెలిశాక... ఈ తరహా మానసిక రుగ్మతలను డిసోసియేషన్ / కన్వర్షన్ డిజార్డర్స్గా చెబుతున్నారు. వీటిల్లో అనేక రకాలుంటాయి. అవేమిటో చూద్దాం...ఓ ఊళ్లోని ఓ పేదింటి అందమైన అమ్మాయిని అక్కడి ఓ రాజకీయ నాయకుడూ... ఊరికి పెద్ద అయిన ఓ వ్యక్తి వేధిస్తున్నాడు. అతడేమో ఆర్థికంగా, సామాజికంగా చాలా పవర్ఫుల్. కానీ ఈ అమ్మాయి ఓ అమాయకపు దిగువ ఆర్థికస్థాయికి చెందిన పేద పిల్ల. ఆ పవర్ఫుల్ వ్యక్తిని ఎదిరించగలిగే బలంగాని, మానసిక స్థైర్యంగాని ఆ అమ్మాయికి లేవు. అయితే ఆ పవర్ఫుల్ వ్యక్తి వేధింపులను ఆమోదించి, అతడికి లొంగిపోవడం ఆ అమ్మాయికి ఇష్టం లేదు. ఇలాంటి పరిస్థితుల్లోనే మెదడు ఓ మాయ చేస్తుంది. తనను తాను రక్షించుకునేందుకు ఆ అమ్మాయికి తెలియకుండానే ఓ ఎత్తుగడ వేస్తుంది. అకస్మాత్తుగా ఆ అమ్మాయికి గ్రామదేవత పూనుతుంది. దాంతో ఆమె గొంతు (స్వరం), మాట, ప్రవర్తన అన్నీ మారిపోతాయి. మెదడు చేసే ఈ పనులు ‘సబ్–కాన్షియస్’ స్పృహతో జరగడం వల్ల బాహ్య స్పృహకు అవి జరుగుతున్న విషయమే తెలియదు. అయితే ఆ అమ్మాయి... తన చుట్టూ ఉన్న ప్రకృతి సంబంధమైన అంశాలను (నేచర్ను) అనుక్షణం పరిశీలిస్తూ ఉంటుంది కాబట్టి వాటిని ‘పొజెస్’ చేసుకుంటుంది. అలా తననుంచి తాను ‘విడిపోయి’ అంటే ‘డిసోసియేట్’ అయి... గ్రామదేవత తాలూకు స్థితిని ‘పొజెస్’ చేసుకుని... అత్యంత పవర్ఫుల్ వ్యక్తుల నుంచి వచ్చే వేధింపుల నుంచి తనను తాను కాపాడుకోడానికి తనకు తెలియకుండానే ఈ పనులు చేస్తుంది. ఇప్పుడు గ్రామదేవత పూనాక ఆ అమ్మాయి స్థితి చాలా బలంగా మారిపోతుంది. ఊరిపెద్ద ఎంత పెద్ద స్థాయిలో ఉన్నా... సామాజికంగా, ఆర్థికంగా బలమైన స్థితిలో ఉన్నప్పటికీ ఇప్పుడా అమ్మాయిని తాత్కాలికంగా ఏమీ చేయలేడు. ఎందుకంటే ఈ స్థితిలో ఆ అమ్మాయి అక్కడివారి పూజలందుకుంటూ ఉంది. ఆమెకు కావాల్సిన పనులను ఊరి ప్రజలద్వారా చేయించుకుంటూ ఉంది. ఆమె నుంచి వచ్చే మాటను గ్రామదేవత మాటలుగా ఎంచి, ఊరిజనమంతా వాటిని పాటిస్తుంటారు.నిజానికి ఆమె కోరని మరికొన్ని కోరికలనూ గ్రామస్తులు తీరుస్తుంటారు. దాంతో ఆమె మెదడుకు ఇదొక అలవాటుగా మారుతుంది. సమస్యలు కలిగినప్పుడల్లా ఆమె ఇతరులను పొసెస్ చేసుకుంటుంది. అంటే గ్రామదేవత తనను పూనడాన్ని ఆహ్వానిస్తుంది. పూనకం (పొసెషన్)లోకి వెళ్తుంది. ఇలా కేవలం గ్రామదేవతలే కాకుండా కొన్ని సందర్భాల్లో చనిపోయిన వేరే మనిషి గానీ, దెయ్యాలూ, భూతాలు కూడా పూనడం అనే ప్రక్రియ చోటు చేసుకుంటుంది. సామాన్య జనం దీన్ని పూనడం అంటారుగానీ మానసిక వైద్య శాస్త్రంలో దీన్ని డిసోసియేషన్ డిజార్డర్ అని చెప్పవచ్చు.డిసోసియేషన్ అంటే...? డిసోసియేషన్ (dissociation) అంటే ఏమిటో తెలుసుకునే ముందు అసలు ‘నేను’ అంటే ఏమిటో, ఆ ‘నేను’ అనే భావన ఎలా కలుగుతుందో తెలుసుకోవడం ముఖ్యం. ఒక వ్యక్తి తన మనసులో ఏర్పడే ఆలోచనలూ, భావోద్వేగాలూ... ఇవన్నీ తనవిగా గుర్తించడాన్ని ఇంగ్లిష్లో ‘ఐ’ అండ్ ‘మైన్’ అనీ, అదే తెలుగులో చె΄్పాలంటే ‘నేను’ / ‘నా ఆలోచనలు’’ అని చెప్పవచ్చు. అందరిలో ఉండే ఆ ‘నేను’ అనే ఫీలింగ్ కొంతమందిలో ఒక్కోసారి కొంత వ్యవధి పాటు తొలగిపోతుంది. ఆ సమయంలో ఆ నేను... నేను కానేమో అనే భావన కలుగుతుంది. అలా జరిగే మానసిక స్థితిని ‘డీ–పర్సనలైజేషన్’ అంటారు. కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో... అంటే... బాగా తీవ్రంగా, తాను తట్టుకోలేనంతగా మానసిక ఒత్తిడికి గురైనప్పుడు గానీ లేదా తన ప్రాణాలకే ముప్పు ఏర్పడినప్పుడు గానీ కొందరు తన సొంత భావోద్వేగాల నుంచి తామే విడిపోతారు. ఇలా తన సొంత ఫీలింగ్స్ను తనవి కావన్నంతగా విడివడే కండిషన్ను ‘డిసోసియేషన్ ఆఫ్ అఫెక్ట్స్’ అనవచ్చు. తన భావోద్వేగాల తీవ్రత కారణంగా అతడి మనసు ఏమాత్రం పనిచేయని పరిస్థితుల్లో ఇలా ఓ వ్యక్తి తననుంచి తాను విడిపోవడం జరుగుతుంది.డీసోసియేషన్ కలిగే పరిస్థితులివి... తట్టుకోలేనంత ఒత్తిడి తీవ్రమైన అలసట చాలా తీవ్రమైన డిప్రెషన్ పసితనంలో తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్న పరిస్థితుల్లో ఉండటం... వంటి పైన పేర్కొన్న పరిస్థితుల్లో ఓ వ్యక్తికి తనదైన దృఢమైన, సమన్వయంతో కూడిన ‘నేను’ అనే భావన బలంగా ఏర్పడదు. ఇంగ్లిష్లో చెప్పాలంటే స్టేబుల్, ఇంటిగ్రేటెడ్ ‘సెల్ఫ్ ఫీలింగ్’ ఏర్పడదు. అలాంటి పరిస్థితుల్లో ఓ వ్యక్తి తేలిగ్గా డిసోసియేషన్కు లోనవుతాడు. అప్పుడు ఒకే వ్యక్తిలో అనేక వ్యక్తిత్వాలు (మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్స్) కూడా ఏర్పడవచ్చు. ఉదాహరణకు ‘అపరిచితుడు’ సినిమాలోని మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్స్ కూడా ఓ వ్యక్తి తననుంచి విడివడి వేరే వ్యక్తిని లేదా వేరే వ్యక్తుల ప్రవర్తనలనూ, పర్సనాలిటీలను ΄పొజెస్ చేసుకోవడమే అని చెప్పవచ్చు.‘నేను’ లేదా ‘నా’ అనే భావన లేకపోవడం ఎలా జరుగుతుందంటే... ఒక వ్యక్తి తన శరీరాన్ని తనదిగా గుర్తించగలగడానికి చూపు, వినికిడి, స్పర్శ వంటి జ్ఞానేంద్రియాలూ ఉపయోగపడుతుంటాయి. తాను ఉన్న తన స్థితికి సంబంధించిన ఉనికి తెలుసుకునేందుకు ఒక నరాల వ్యవస్థ సక్రమంగా పనిచేయాలి. అది లేకపోతే ఒక వ్యక్తికి ‘నా’ అనే భావన ఉండదు. దీనికి సంబంధించి మరింత అర్థమయ్యేలా తెలుసుకోవడం కోసం ఒక ఉదాహరణ పరిశీలిద్దాం. మన దేహంలోని ఒక భాగానికి మత్తు (లోకల్ అనస్థీషియా) ఇచ్చామనుకోండి. అలా ఇచ్చాక అక్కడ చిన్నపాటి శస్త్రచికిత్స చేస్తున్నప్పటికీ... అక్కడేం జరుగుతోందో మనక తెలియదు. ఒకవేళ అలా శస్త్రచికిత్స చేస్తున్న విషయం గనక మనం మన కళ్లతో చూడకపోతే అది మన శరీరానికి సంబంధించిందన్న భావన కూడా మనకు కలగక΄ోవచ్చు. ఉదాహరణకు మన పంటికి ఏదైనా చికిత్స చేయించుకుంటున్నప్పుడు అక్కడ లోకల్ అనస్థీషియా ఇచ్చాక పన్నుకు డ్రిల్లింగ్ జరుగుతున్నప్పటికీ మనకు అక్కడ ఏమవుతోందో అన్నది తెలియనే తెలియదు.మరికొన్ని ఉదాహరణలివి... కొందరు పీర్ల గుండం దగ్గరా లేదా తమ మొక్కుబడులలో భాగంగా నిప్పులు తొక్కుతూ చేసే మరికొన్ని ప్రత్యేక ప్రార్థనల్లో నిప్పుల మీద బాధే తెలియకుండా నడుస్తుంటారు. తీవ్రమైన భక్తి ఆవేశాలకూ, భక్తిభావనలకు లోనైనప్పుడు ఆ తన్మయత్వం తారస్థాయిలో ఉన్నప్పుడు బాధ అనే భావనే రాదు. ఈ తరహా డిసోసియేషన్ను ‘సెన్సరీ డిసోసియేషన్’ అంటే జ్ఞానేంద్రియాలకు... ప్రధానంగా స్పర్శజ్ఞానానికి సంబంధించిన డిసోసియేషన్గా చెప్పవచ్చు. ఏదైనా తట్టుకోలేనంత తీవ్రమైన సంఘటన జరిగినప్పుడు అది మన మెదడుపై ఒక షాక్లాంటి ప్రభావం చూపవచ్చు. అంతటి ప్రభావం కారణంగా మెదడు మొద్దుబారిపోయిన ఫీలింగ్ కలుగుతుంది. అందుకే కొందరికి చాలా పెద్ద యాక్సిడెంట్ జరిగి తీవ్రమైన గాయాలు అయినప్పటికీ ఆ షాక్ కారణంగా చాలాసేపటి వరకు వానికి నొప్పి కలగకపోవడాన్ని చూస్తుంటాం. ఇది కూడా డిసోసియేషన్ కారణంగా జరిగే పరిణామమే. ఏదైనా ఒక సబ్జెక్ట్లో అత్యంత ఆసక్తితో అందులో మునిగిపోయినప్పుడు ఓ విద్యార్థిలోగానీ లేదా ఏదైనా అత్యంత ఆసక్తికరమైన పుస్తకం చదువుతున్నప్పుడూ ఎవరైనా వ్యక్తిగానీ చుట్టుపక్కల ఏం జరుగుతోందో తెలియనంతగా అందులో పూర్తిగా లీనమైపోయినపోవచ్చు. అది కూడా డిసోసియేషన్కు ఓ తార్కాణమే. మనసు నిండా తీవ్రమైన భక్తిభావనను నిండిపోయినప్పుడు తనలోకి దైవం వచ్చినట్లుగా కొందరు అనుభూతి చెందవచ్చు. ఇలాంటి భావనలకు లోనుకోవడం కూడా ఒక రకంగా ‘డిసోసియేషన్’యే అని చెప్పవచ్చు. ఈ స్థితినే ‘పొసెషన్’ అంటారు. కాకపోతే ఇది పూర్తిగా సంస్కృతి ఆమోదించిన అంశం కావడంతో... అంతటి భక్తి భావన అన్నది ఆ వ్యక్తికి గానీ, లేదా ఇతరులకు గానీ ఇబ్బంది కలగజేయనంతవరకు దాన్ని వ్యాధిగా పెద్దగా పరిగణించరు. డిసోసియేషన్ ఆమ్నీషియా : ఏదైనా షాకింగ్ సంఘటనతో లేదా బలమైన కారణంతో మనసుకు తీవ్రమైన గాయం కలిగినా లేదా అలాంటి గాయాల్ని కలిగిస్తున్న పరిస్థితులనూ / సంఘటనలనూ మరచిపోవడం జరుగుతుంది. ఇలా తమకు తీవ్రంగా ఇబ్బంది కలిగించే వాటిని మరచిపోవడాన్ని ‘డిసోసియేషన్ ఆమ్నీషియా’ అంటారు. ఈ కండిషన్లో కలిగే మరచిపోవడం అన్నది సాధారణ మరపు కంటే చాలా తీవ్రంగా ఉంటుంది. డిసోసియేటివ్ ఫ్యూగ్ (దేశ దిమ్మరి) : ఒక వ్యక్తి తన నివాస స్థలం నుంచి లేదా తాను పని ప్రదేశం నుంచి అకస్మాత్తుగా ప్రయాణం మొదలుపెట్టవచ్చు. అతడు ఈ ప్రయాణంలో తన సెల్ఫ్కేర్ (శుభ్రత, ఆహారం, నిద్ర వంటి) అంశాల విషయంలో మామూలుగా ఉన్నా... తాను తిరిగి వెనకకు వచ్చాక తాను ఎక్కడెక్కడికి వెళ్లిందీ, ఏం చేసిందీ పాక్షికంగానో లేదా మొత్తంగానో మరచిపోవచ్చు. ఇలాంటి డిసోసియేషన్లో కనిపించే లక్షణాలకు ఎలాంటి నరాల వ్యాధులూ కారణంగా కనిపించవు. ట్రాన్స్ అండ్ పొసెషన్ స్టేట్ మధ్య తేడా... ట్రాన్స్ : తాను అనే తన సొంత భావనను అంటే తానెవరు అనే ఫీలింగ్ను... ఇంగ్లిష్లో చెప్పాలంటే తన ఐడెంటిటీని కోల్పోయే లేదా పూర్తిగా మరచిపోయే స్థితిని ‘ట్రాన్స్’ అంటారు. తన చుట్టూ జరుగుతున్న వాటిని ఏమాత్రం గుర్తించలేకపోవడమో లేదా కొన్నింటిని మాత్రమే గుర్తించగలిగడం లాంటి స్థితిని ‘ట్రాన్స్’గా చెప్పవచ్చు. ఆ స్థితిలో తన భాష, కదలికలు, శారీరకంగా తాను కనబరిచే సాధారణ పోష్చర్స్... ఇవన్నీ చాలావరకు తగ్గిపోతాయి. ఈ స్థితిలో పొడిపొడిగా కేవలం రెండు మూడు మాటలు మాట్లాడుతుంటారు. పొసెషన్ కండిషన్: ఒక వ్యక్తి శరీరంలోకి మరొకరు చేరినట్లుగా ప్రవర్తించే కండిషన్ను ‘పొసెషన్’ అంటారనీ, దానికి అపరిచితుడు సినిమా లాంటి ఉదాహరణలను ప్రస్తావించిన సంగతి తెలిసిందే. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే కేవలం ఏ గ్రామదేవత మాత్రమే కాకుండా... ఒక వ్యక్తిలో మరొక వ్యక్తి ప్రవేశించినట్లుగా ఉండటం... అలాగే మరికొందరిలో దెయ్యం / భూతం / ఏదో శక్తి ఆవహించినట్లుగా భావించడం కూడా పొసెషన్ స్టేట్గానే చెప్పవచ్చు. ఈ పరిస్థితి కారణంగా తనకు గానీ... అతడి వల్ల ఇతరకులకు గానీ ఇబ్బందిగా లేనంతవరకు దాన్ని వ్యాధిగా పరిగణించరు. ఒకవేళ అలాంటి పొజెషన్ స్టేట్ వల్ల అది ప్రమాదకరంగా పరిణమించినప్పుడే దాన్ని వ్యాధిగా గుర్తిస్తారు. ఒక ప్రాంతంలో సెషన్ సంస్కృతిలో ఇమిడిపోయి ఉండవచ్చు. అలాంటి సందర్భాల్లో మాత్రం ఆ ప్రవర్తనను వ్యాధిగా గుర్తించడం అంతగా జరగదు. దానివల్ల ఎవరికైనా ఇబ్బంది కలిగినప్పుడు మాత్రం దాన్ని వ్యాధిగా భావించి తగిన చికిత్స అందించాలి. డిసోసియేషన్తో కలిగే సమస్యలు డిసోసియేటివ్ కన్వల్షన్స్ : శరీరంలో ఫిట్స్ వచ్చిప్పుడు దేహంలో ఎలాంటి కదలికలు సంభవిస్తాయో డిసోసియేటివ్ కన్వల్షన్లో అలాంటి కదలికలు కనిపిస్తాయి. ఈ కండిషన్లో ఉన్నవారు కిందపడిపోయినప్పటికీ సాధారణంగా ఎలాంటి గాయం కాకపోవచ్చు. అయితే మూర్ఛ వ్యాధి ఉన్నవారిలోలా నాలుక కొరకడం, మూత్రవిసర్జన చేయడం మాత్రం ఉండకపోవచ్చు లేదా చాలా అరుదుగా మాత్రమే ఇలా జరగవచ్చు. డిసోసియేటివ్ మోటార్ డిజార్డర్స్ : తనలో ఎలాంటి శారీరక సమస్యా లేకపోయినప్పటికీ... నరాలకు సంబంధించిన ఎలాంటి లోపాలూ లేకపోయినప్పటికీ... వీళ్లలో మాటపడిపోవడం (మ్యూటిజం), ఒళ్లు తూలడం, అడుగులు సరిగా పడకపోవడం, నడవలేకపోవడం, బ్యాలెన్స్ తప్పడం వంటి లక్షణాలు కనిపిస్తే అది ‘డిసోసియేటివ్ మోటార్ డిజార్డర్’ (dissociative motor disorder) కావచ్చు. డిసోసియేటివ్ అనస్థీషియా / సెన్సరీ లాస్: ఏ కారణమూ లేకుండా... ఒక వ్యక్తి శరీరంలోని ఒక భాగంగానీ లేదా మొత్తం శరీరంలోగానీ ఎలాంటి స్పర్శా లేకపోడంతో పాటు వారిని తాకినా, గిచ్చినా, మంటకు ఎక్స్పోజ్ చేసినా వారికి ఎలాంటి స్పర్శ జ్ఞానం కలగకపోవడాన్ని డిసోసియేటివ్ అనస్థీషియా / సెన్సరీ లాస్గా పేర్కొనవచ్చు. అయితే ఇలా కొందరిలో వారు తమ చూపు, వాసన చూసే శక్తి, వినికిడి శక్తిని కూడా కోల్పోవడం జరగవచ్చు. చదవండి: పసిపాపతో ఆటో నడుపుతున్న మహిళ..!యుద్ధఖైదీలకు చేసే ‘బ్రెయిన్ వాష్’ ప్రక్రియను కూడా ఒక రకమైన డిసోసియేషన్గా చెప్పవచ్చు. కొందరికి... వారు తమ శరీరం నుంచి విడిపోయి, తమ శరీరాన్ని బయటి నుంచి చూసుకున్న భావన కలుగుతుంది. ఇలాంటి అనుభూతి ‘నియర్డెత్’ అనుభవాల్లోనూ కలుగుతుంది. ఇవి కూడా డిసోసియేషన్ వల్ల కలిగే అనుభూతులే అని చెప్పవచ్చు. కన్వర్షన్ డిజార్డర్స్ :తీవ్రమైన మానసిక సంఘర్షన కలిగి, దాన్ని వ్యక్తీకరించలేనప్పుడు మన మెదడు మనకు తెలియకుడానే వాటిని శారీరక లక్షణాలుగా మార్చుకొని వ్యక్తీకరిస్తుంది. ఇలా మానసిక అంశాలను శారీరక లక్షణాలుగా మార్చుకుని బయటపెట్టడాన్ని ‘కన్వర్షన్ డిజార్డర్’ (conversion disorder) అంటారు.చికిత్సఏ కారణాల వల్ల డిసోసియేషన్ లేదా కన్వర్షన్స్ జరుగుతోందో గుర్తించి ఆ కారణాలను దూరం చేసి ఈ లక్షణాలు తమంతట తామే తగ్గిపోతాయి. అలాగే ఈ తరహా పేషెంట్స్లో వారు కోల్పోయిన లేదా ఛిద్రమైన వాళ్ల ‘సెల్ఫ్’ను పునరుద్ధరించడం ద్వారా ఈ జబ్బులకు సమర్థమైన చికిత్స అందించవచ్చు. వాళ్లలో ఆత్మవిశ్వాసం నింపడం ద్వారా, ఇగో స్ట్రెంగ్త్ను బలపరచడం / పెంచడం ద్వారా ఈ జబ్బులను పరిష్కరించవచ్చు. ఇందులో భాగంగా తమ సమస్యలను తామే పరిష్కరించుకోగలిగేలా వాళ్లలో కొన్ని నైపుణ్యాలనూ (స్కిల్స్), ఎమోషనల్ ఇంటెలిజెన్స్ను పెంచడం కూడా ఈ జబ్బులకు చికిత్సలో ఓ ప్రధానమైన భాగం. అవసరాన్ని బట్టి కొన్ని మందులు ఇవ్వాల్సి రావచ్చు. అలాగే కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ వంటివీ అందించాల్సి రావచ్చు.- డాక్టర్ శ్రీనివాస్ ఎస్ఆర్ఆర్వై హెచ్వోడీ ఆఫ్ సైకియాట్రీ –సీనియర్ సైకియాట్రిస్ట్ఎంజీఎం ప్రభుత్వ ఆసుపత్రి, వరంగల్ -
బ్లూటూత్ ఇయర్ఫోన్స్తో భయంకర వ్యాధి?
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో బ్లూటూత్ ఇయర్ఫోన్ల వాడకం ప్రతీ ఒక్కరికీ అవసరంగా మారింది. ఆఫీసు పనులైనా, ప్రయాణాలైనా ఇవి లేనిదే ఎవరూ ముందుకు నడవడం లేదు. అయితే వీటిని నిరంతరం వాడటం వల్ల రేడియేషన్ బారిన పడి ‘బ్రెయిన్ ట్యూమర్’ (మెదడు కణితి) వచ్చే ప్రమాదం ఉందంటూ, సోషల్ మీడియాలో తరచూ కథనాలు కనిపిస్తుంటాయి. ఇంతకీ ఇలాంటి భయాల్లో నిజమెంత? సైన్స్ ఏం చెబుతోంది? ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ రూపా జుతానీ దీనిపై సంచలన వివరణ ఇచ్చారు.అసలు నిజం ఏంటి?అమెరికాకు చెందిన ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ రూపా జుతానీ.. మెదడు, నాడీ వ్యవస్థకు సంబంధించిన ట్యూమర్ల చికిత్సలో నిపుణురాలు. ఆమె తాజాగా ఇన్స్టాగ్రామ్ వేదికగా ఈ అంశంపై నెలకొన్న అపోహలను శాస్త్రీయంగా తిప్పికొట్టారు. బ్లూటూత్ హెడ్ఫోన్ల వాడకానికి, బ్రెయిన్ ట్యూమర్లకు ఎటువంటి సంబంధం లేదని ఆమె స్పష్టం చేస్తూ.. ‘మెదడులో పెరిగే ట్యూమర్లు, వినికిడి నాడుల వద్ద వచ్చే గడ్డలు (వెస్టిబ్యులర్ స్క్వానోమాస్), క్యాన్సర్ గడ్డలకు సర్జరీ చేసే వైద్యురాలిగా, సైన్స్ ఏం చెబుతుందో వివరిస్తున్నాను. బ్లూటూత్ టెక్నాలజీ వల్ల క్యాన్సర్ వస్తుందనడానికి ఎలాంటి ఆధారాలు లేవు’ అని ఆమె స్పష్టం చేశారు.పరిశోధనలు ఏం చెబుతున్నాయి?డాక్టర్ జుతానీ తన వివరణకు తోడుగా 2022లో నిర్వహించిన పరిశోధనను ఉదాహరించారు. దాదాపు 10 లక్షల మంది మహిళలపై 14 ఏళ్ల పాటు సుదీర్ఘంగా నిర్వహించిన ఈ అధ్యయనంలో, బ్లూటూత్ లేదా సాధారణ హెడ్ఫోన్ల వాడకం వల్ల ఎలాంటి బ్రెయిన్ ట్యూమర్లు వచ్చే అవకాశం లేదని తేలింది. ఈ సుదీర్ఘ అధ్యయనం ఇయర్ ఫోన్ల వినియోగదారుల్లో ఉన్న భయాన్ని పటాపంచలు చేసింది.రేడియేషన్కు భయపడాలా?సాధారణంగా రేడియేషన్ అనగానే ఎవరికైనా సరే క్యాన్సర్ గుర్తుకు వస్తుంది. అయితే అన్ని రకాల రేడియేషన్లు ప్రమాదకరం కావు. డాక్టర్ జుతానీ వివరణ ప్రకారం బ్లూటూత్ పరికరాల నుండి ‘నాన్-అయోనైజింగ్ రేడియేషన్’ విడుదల అవుతుంది. ఇది ఎక్స్-రేలు లేదా ఇతర ప్రమాదకర కిరణాల మాదిరిగా మన శరీరంలోని డీఎన్ఏ (డీఎన్ఏ)ను దెబ్బతీయదు. డీఎన్ఏ దెబ్బతిననప్పుడు క్యాన్సర్ లేదా ట్యూమర్లు ఏర్పడే అవకాశం ఉండదు.ఫోన్ నేరుగా చెవి దగ్గర పెట్టుకుంటే..మనలో చాలామంది బ్లూటూత్ వాడటం వల్ల ప్రమాదం అనుకుంటారు కానీ, అసలు ముప్పు ఫోన్ నేరుగా వాడటంలోనే ఉందని డాక్టర్ జుతానీ హెచ్చరించారు. బ్లూటూత్ ఇయర్ఫోన్ల కంటే, మొబైల్ ఫోన్ను నేరుగా చెవి దగ్గర పెట్టుకుని మాట్లాడినప్పుడు రేడియేషన్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా కొన్ని సమయాల్లో ఫోన్ను తలకి దూరంగా ఉంచాలని ఆమె సూచించారు. ఫోన్ కాల్ వెళ్తున్న సమయంలో రేడియేషన్ స్థాయిలు గరిష్టంగా ఉంటాయని, అలాగే ఫోన్ ఛార్జింగ్ అవుతున్నప్పుడు కూడా రేడియేషన్ ఎక్కువగా వెలువడుతుందని ఆమె తెలిపారు. అటువంటి సమయంలో ఫోన్ నేరుగా చెవికి ఆనించి మాట్లాడటం కంటే ఇయర్ఫోన్స్ వాడటమే సురక్షితమని ఆమె తెలిపారు.తీసుకోవాల్సిన జాగ్రత్తలురేడియేషన్ ముప్పు లేకపోయినా, అతిగా హెడ్ఫోన్లు వాడటం వల్ల వినికిడి శక్తిపై ప్రభావం పడే అవకాశం ఉంది. దీన్ని అధిగమించడానికి డాక్టర్ జుతానీ కీలక సూచనలు చేశారు.స్పీకర్ మోడ్: వీలైనంత వరకు ఫోన్ను స్పీకర్ మోడ్లో పెట్టి మాట్లాడటం అన్నిటికంటే ఉత్తమం.సరైన వినియోగం: టెక్నాలజీని అవసరమైన మేరకే వాడాలి. పని పూర్తయిన వెంటనే ఇయర్ఫోన్లను చెవుల నుండి తొలగించి, దాచుకోవాలి.ఫోన్ దూరం: ఫోన్ను నేరుగా చెవికి ఆనించి మాట్లాడటం వల్ల వినికిడి నాడులపై ఒత్తిడి పెరుగుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. హెడ్ఫోన్లు వాడినప్పుడు ఈ ఒత్తిడి తక్కువగా ఉంటుంది.ఏదైనా అతిగా వాడితే..బ్లూటూత్ ఇయర్ఫోన్లు బ్రెయిన్ ట్యూమర్లకు కారణమవుతాయనేది కేవలం ఒక అపోహ మాత్రమేనని డాక్టర్ జుతానీ స్పష్టం చేశారు. అయితే, ఏదైనా అతిగా వాడటం ఆరోగ్యానికి హానికరం. వైర్లెస్ సాంకేతికతను వాడుతున్నప్పుడు తగిన జాగ్రత్తలు పాటిస్తూ, ఫోన్ను నేరుగా తలకు ఆనించి మాట్లాడకుండా ఉండటం శ్రేయస్కరం.గమనిక: ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఏదైనా అనారోగ్య సమస్యలు ఉన్నప్పుడు నిపుణులైన వైద్యులను సంప్రదించడం ఉత్తమం.ఇది కూడా చదవండి: ‘అది వివక్ష కాదు.. ఆచారం’ -
పక్షవాతానికి వార్నింగ్ బెల్..!
పక్షవాతం అనే సమస్య అకస్మాత్తుగా వైకల్యం తెచ్చిపెట్టి మరొకరిపై ఆధారపడేలా చేస్తుంది. ఒకసారి పక్షవాతానికి గురైతే చాలాకాలం మరొకరిపై ఆధారపడాల్సి రావచ్చు. లేదా కొన్ని సందర్భాల్లో జీవితాంతం ఆ బాధ తప్పకపోచ్చు. అయితే అంతటి తీవ్రమైన పక్షవాతం కూడా తాను వచ్చే ముందర కొన్ని వార్నింగ్ సిగ్నల్స్ పంపుతుంది. వాటిని తెలుసుకుని ముందే జాగ్రత్త పడితే ఆ ముప్పు తప్పుతుంది. ‘ట్రాన్సియెంట్ ఇస్కిమిక్ ఎటాక్’ (టీఐఏ) అనేవే ఆ వార్నింగ్ సిగ్నల్స్. ప్రమాద ఘంటికలను మోగించే ఆ హెచ్చరిక ఏమిటో చూద్దాం...ట్రాన్సియెంట్ ఇస్కిమిక్ ఎటాక్ (సంక్షిప్తంగా ‘టీఐఏ’)ను పక్షవాతానికి (బ్రెయిన్ స్ట్రోక్కు) ముందస్తు సూచనగా పరిగణించవచ్చు. పక్షవాతంలో ఉండే లక్షణాలే ‘టీఐఏ’లోనూ కనిపిస్తయి. కాకపోతే అవి తాత్కాలికంగా కనిపించి తగ్గిపోతాయి. కానీ పక్షవాతంలో అలా కాదు. ఆ లక్షణాలు అలాగే ఉండిపోతాయి. ఈ నేపథ్యంలో ‘టీఐఏ’ను ఓ ముందస్తు హెచ్చరికలా పరిగణించి, జాగ్రత్తపడితే భవిష్యత్తులో వచ్చే వైకల్యపు ముప్పు చాలావరకు నివారించవచ్చు. అయితే టీఐఏ ఒకసారి కనిపించిందంటే అది మళ్లీ వచ్చేందుకు (రికరెన్స్కు) అవకాశం ఎక్కువ. అందుకే దాన్ని తేలిగ్గా తీసుకోకుండా ఎందుకు వచ్చిందో తెలుసుకుని, పక్షవాతానికి వాడే మందుల్ని జీవితాంతం వాడాలి. పక్షవాతమే వచ్చినంత జాగ్రత్తగా ఉండాలి. టీఐఏ లక్షణాలు: ముఖంలోని ఓ పక్కభాగంలో అకస్మాత్తుగా బలహీనంగా అనిపించడం ఒకవైపు చేయి లేదా కాలూ బలహీనపడటం లేదా తాత్కాలికంగా పడిపోవడం మాట ముద్దముద్దగా రావడం లేదా మాట పడిపోవడం నిలకడగా నిలవలేకపోవడం (బ్యాలెన్స్ తప్పడం) అకస్మాత్తుగా ఒకటి లేదా రెండు కళ్లు కనిపించకపోవడం లేదా ఒకే వస్తువు రెండుగా కనిపించడం. ట్రాన్సియెంట్ ఇస్కిమిక్ అటాక్లో ఈ లక్షణాలన్నీ సాధారణంగా కాసేపే ఉండవచ్చు. ఇవన్నీ గంటలోపే తగ్గిపోతాయి. అయితే పక్షవాతం వచ్చినప్పుడు అవే లక్షణాలు చాలాకాలం పాటు లేదా జీవితాంతం ఉండిపోతాయి. అందుకే టీఐఏ హెచ్చరికలను సీరియస్గా తీసుకుని, డాక్టర్ను సంప్రదించి వారు సూచించిన మందులు, సలహాలు పాటించాలి. అంతేకాకుండా... తగిన జీవనశైలి మార్పులతో (లైఫ్స్టైల్ మాడిఫికేషన్స్తో) భవిష్యత్తులో రాబోయే పక్షవాతాన్ని నివారించుకోవచ్చు. ట్రాన్సియెంట్ ఇస్కిమిక్ అటాక్కు కారణాలు... 1) మెదడుకు రక్తాన్ని సప్లై చేసే రక్తనాళాలు లేదా మెదడులోని రక్తనాళాలు సన్నబడటం. 2) గుండెలో లేదా మెదడుకు సరఫరా చేసే రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టి, అవి రక్తప్రవాహంలో కొట్టుకు΄ోయి మెదడులోని రక్తసరఫరాకు అడ్డుపడటం. టీఐయే / పక్షవాతం ముప్పు ఎవరెవరిలో... రక్తంలో కొవ్వులు ఎక్కువగా ఉన్నవారిలో అధిక రక్తపోటు (హైబీపీ), డయాబెటిస్ ఉన్నవారిలో పొగతాగడం, మద్యపానం అలవాటు ఉన్నవారిలో నిద్రలో గురకపెట్టే వారిలో (స్లీప్ ఆప్నియా), నిర్ధారణ: టీఐఏ లక్షణాల ఆధారంగా దాన్ని నిర్ధారణ చేయడం తేలికే. సాధారణంగా ఎమ్మారై బ్రెయిన్, కెరోటిడ్ డాప్లర్ ఈసీజీ, 2డీ ఎకో, బ్లడ్ కోయాగ్యులేషన్ పారామీటర్స్ వంటి పరీక్షలతో టీఐఏని నిర్ధారణ చేస్తారు. చికిత్స: రక్తాన్ని పలుచబార్చే ఆస్పిరిన్, క్లోపిడోగ్రెల్, అసిట్రోమ్, స్టాటిన్స్ వంటి మందులను సూచిస్తారు. రక్తనాళాలు సన్నబారడం 70 శాతం కంటే ఎక్కువగా జరిగితే స్టెంటింగ్ లేదా ఎండరాక్టమీ వంటి ప్రక్రియలు చేయాల్సిరావచ్చు.డా. రంజిత్, సీనియర్ న్యూరాలజిస్ట్ (చదవండి: 'మత్తు'కు మందు ఇలా..!) -
'మత్తు'కు మందు ఇలా..!
ఇటీవల డ్రగ్స్ అనే మహమ్మారి సెలిబ్రిటీల వేడుకల్లో కనిపించడం పరిపాటిగా మారింది. ఇక చిన్నపిల్లలూ, టీనేజ్ బాలల్లో ఈ అలవాటు పెరుగుతుండటం చాలా ఆందోళన కలిగించే అంశంగా మారింది. గతంలో టీనేజ్ పిల్లలు కొంత పెద్దయ్యాక మద్యం అలవాటుకు దగ్గరవుతుంటేనే ఎంతో ఆందోళనగా ఉండేది. అలాంటిది ఇప్పుడు పెద్ద నగరాల్లోని కొన్ని పబ్స్లో, పార్టీలలో, న్యూ ఇయర్ వేడుకల్లాంటి సోషల్ ఈవెంట్స్లో డ్రగ్స్ కనిపించడం కలకలం రేపుతోంది. అంతేకాదు... పెద్ద పెద్ద హోదాల్లో, పదవుల్లో ఉన్నవాళ్ల పార్టీల్లోనూ డ్రగ్స్ కనిపించడం బెంబేలెత్తిస్తోంది. డ్రగ్స్ మహమ్మారి పొంచి ఉన్న ప్రస్తుత నేపథ్యంలో... తమ టీనేజ్ పిల్లలూ, కుటుంబ సభ్యుల్లోని యువత ఇలా డ్రగ్స్కు అలవాటు పడటాన్ని తల్లిదండ్రులు గుర్తించడం ఎంతో అవసరం. డ్రగ్స్ అలవాటు, దాని దుష్పరిణామాలు ఎలా ఉంటాయో తెలపడం, దానికి కావాల్సిన చికిత్స ప్రక్రియలను సూచించడం కోసమే ఈ కథనం...ఈమధ్య కాలంలో కొన్ని స్కూల్ ప్రాంగణాలలో హైస్కూల్ స్థాయికి వచ్చిన పిల్లలు సైతం డ్రగ్స్ తీసుకుంటున్నారన్న వార్తలు చాలా ఆందోళనకు గురిచేస్తున్నాయి. విశ్లేషకుల పరిశీలనల్లో డ్రగ్స్కు అలవాటు పడటం 14 నుంచి 18 ఏళ్ల పిల్లల్లో ఎక్కువని తెలుస్తోంది. అనేక అంశాలు ఇందుకు కారణమవుతున్నా ఈ కింది వాటిని ప్రధానమైనవిగా పరిగణించవచ్చు. అవి... పాశ్చాత్య ధోరణుల్లోని పెడపోకడలను మన పిల్లలూ అనుసరించడం / అనుకరించడం సెలిబ్రిటీలు కుటుంబాల్లో లేదా బాగా ధనవంతుల ఫ్యామిలీలలో పిల్లలపై పేరెంట్స్ పర్యవేక్షణ తక్కువగా ఉండటం స్నేహితులూ, తోటివారు చేస్తున్న పనులు చూసి... వాటిలో ఏదైనా ఆనందాన్ని తాము మిస్ అవుతున్నామన్న భావనతో వాళ్లను అనుకరించడం (పియర్ ప్రెషర్స్)ఆర్థికంగా మితిమీరిన స్వాతంత్య్రం ఉండటం తోపాటు కొత్తగా టీన్స్లో ఉండే సహజ ఉత్సాహంతో జీవితాన్ని ఎడ్వెంచరస్గా, ఎక్సయిటింగ్గా ఉండేలా చేసుకోవాలనే తాపత్రయంతో ఈ పెడదారులు తొక్కడం మానసిక ఒత్తిడులనుంచి చాలా త్వరితంగా బయటపడాలన్న ఆకాంక్ష. డ్రగ్స్ విషయంలో గుర్తుంచుకోవాల్సిన అంశాలు... ఈలోకంలోని చాలామందిలో ఒక అ΄ోహ ఉంటుంది. తమపై తమకు నియంత్రణ ఎక్కువ అనీ, తాము ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఓ అలవాటు మానుకోగలమనే అపోహ ఉండటం చాలా సహజం. కానీ డ్రగ్స్ విషయంలో అలా కాదు. అవి మనిషిని బానిసగా మార్చేస్తాయి. అందుకే డ్రగ్స్ను మొదలుపెట్టి వదిలించుకోడానికి ప్రయత్నించడం కంటే ముందునుంచే దూరంగా ఉండటం మేలుడ్రగ్స్ తాలూకు దుష్పరిణామాలు చాలా దీర్ఘకాలం ఉపయోగించాక కనిపిస్తాయని అనుకోవడం సాధారణం. కానీ చాలా సందర్భాల్లో ఆరోగ్యంపై చూపే ఆ దుష్ప్రభావాలు తొలిసారే కనిపించవచ్చు. పార్టీ స్పైకింగ్ అంటే... : కొత్త అమ్మాయిలకూ లేదా అప్పటివరకూ ఎప్పుడూ మత్తుమందుల జోలికి వెళ్లని అబ్బాయిలకు డ్రగ్స్ అలవాటు చేయడం కోసం... వాళ్లకు తెలియకుండానే మత్తు ఇవ్వడాన్ని ‘పార్టీ స్పైకింగ్’గా చెబుతారు.సహజంగా అలవాటుగా మారే డ్రగ్స్ ఇవి... యాంఫిటమైన్స్, మెటా యాంఫిటమైన్స్ కొకైన్ బార్బిట్యురేట్స్, మిథాజోలిన్, క్వినాజోలిన్ వంటి నిద్ర మాత్రలు (క్రాష్). కెన్నాబిస్ (గంజాయి)నల్లమందు వంటి మాదకద్రవ్యాలు, పొగాకులో ఉండే నికోటిన్ ఆల్కహాల్ (కాకపోతే నికోటిన్, ఆల్కహాల్ను పూర్తిగా డ్రగ్స్ కేటగిరీలో చెప్పలేకపోయినప్పటికీ... తమను బానిసగా మార్చుకునే సామర్థ్యం వీటికీ ఉంది).మళ్లీ మళ్లీ తీసుకోవాలని ఎందుకు అనిపిస్తుందంటే... సాధారణంగా మళ్లీ మళ్లీ తీసుకోవాలనే కోరికతో డ్రగ్స్కు, మాదక ద్రవ్యాలకు అలవాటు పడటం అన్నది రెండు రకాలుగా జరుగుతుంది. 1) శారీరక లక్షణాలతో : తొలుత అంతులేని ఉత్సహం, ఎక్సైట్మెంట్, ధైర్యం వంటి ఎన్నో రకాల భావోద్వేగాలనూ, హాయి భావనను కలగజేసే ఈ డ్రగ్స్... వాటిని తీసుకోనప్పుడు దేహంలో శారీరకంగా కొన్ని తీవ్రమైన మార్పులు జరుగుతున్న అనుభూతిని కలగజేస్తాయి. అవేమిటంటే... డ్రగ్స్కు అలవాటు పడ్డ శరీరం వాటిని తీసుకోనప్పుడు దేహమంతా వణుకు, విపరీతంగా చెమటలు పట్టడం, స్థిరంగా స్థిమితంగా ఉండలేక΄ోవడం, గుండె దడ, కడుపులో నొప్పి, నీళ్ల విరేచనాలు వంటి లక్షణాలు కనిపిస్తాయి. 2) మానసికమైన భ్రాంతులతో : డ్రగ్స్ తీసుకోవడం అలవాటయ్యాక ఎప్పుడైనా తీసుకోనప్పుడు... కొందరిలో కొన్ని రకాల భ్రాంతులు కనిపించవచ్చు. అంటే లేని శబ్దాలు వినిపించడం, వాస్తవం కాని దృశ్యాలు కనిపించడం వంటివి. ఒక్కోసారి డ్రగ్స్కు అలవాటు పడ్డవారు తమనెవరో బాధపెడుతున్నట్లు భ్రాంతి చెందడమూ జరగవచ్చు. దాంతో మానసికంగా డ్రగ్కోసం పరితపించడం జరుగుతుంది.సామాజికంగా జరిగే నష్టాలు డ్రగ్స్ తీసుకున్న వారు మితిమీరిన ఆత్మవిశ్వాసంతో వేగంగా వాహనాలు నడపటం, సెక్స్లో వికృతంగా ప్రవర్తించడం వంటి పనులకు పాల్పడవచ్చు. కొందరు దొంగతనాలూ, హత్యల వంటి నేరాలకూ పాల్పడవచ్చు. చదువు దెబ్బతినవచ్చు. గుర్తించడం ఎలా... పిల్లలు నలుగురితోనూ, కుటుంబసభ్యులతో కలవకుండా... తాము ఒంటరిగా ఉండటాన్ని ఇష్టపడటం గతంలో ఎన్నడూ చూడని విధంగా తీవ్రంగా ప్రవర్తించడంమాటలలో, చేతలలో నిర్లక్ష్యం, ఎవరినీ లెక్కచేయక΄ోవడం వ్యక్తిగత పరిశుభ్రత అంతగా పాటించక΄ోవడం ∙డ్రగ్స్కు అలవాటైన వారి చెమటనుంచి ఒక రకం వాసన వస్తుండటం స్కూల్లో, కాలేజీలో స్కోర్ తగ్గడం... వంటి మార్పులు కనిపిస్తుంటే తప్పనిసరిగా తల్లిదండ్రులు గుర్తించి పిల్లలను డాక్టర్కు లేదా సైకియాట్రిస్ట్కు చూపించాలి.డాక్టర్ శివ అనూప్ యెల్లా, సీనియర్ కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్ (చదవండి: కొండచిలువ రక్తంతో ఊబకాయానికి చెక్..!) -
కొండచిలువ రక్తంతో ఊబకాయానికి చెక్..!
ఇటీవలకాలంలో అందర్నీ వేధిస్తున్న సమస్య అధిక బరువు. దీని కోసం మార్కెట్లో ఇప్పటికే పలు రకాల డయాబెటిస్ మందులు కూడా సరసమైన ధరలో అందుబాటులో ఉన్నాయి. అయితే వాటితో ఎంతో కొంత దుష్ప్రభావాలు తప్పవనేది నమ్మకతప్పని నిజం. ఆ నేపథ్యంలోనే సహజసిద్ధంగానే సులభంగా అధిక బరువుకి చెక్పెట్టే మార్గాలపై పలు పరిశోధనలు చేస్తున్నారు శాస్త్రవేత్తలు. తాజాగా సైంటిస్టులు ఈ సమస్యకు కొండచిలువ రక్తంతో పరిష్కార మార్గం చూపి సరికొత్త ఆశను రేకెత్తించారు. వాట్ కొండచిలువ రక్తం అని వెన్నులో వణుకు పుట్టుకొస్తున్నా..అలా ఎందుకు చెప్పారో తెలిస్తే విస్తుపోతారు. అంతేగాదు శాస్త్రవేత్తలు దీని గురించి అధ్యయనంలో చాలా ఆసక్తికర విషయాలను సవివరంగా వెల్లడించారు కూడా. బరువు తగ్గించే ఒక అణువుని బర్మీస్ కొండచిలువ రక్తంలో గుర్తించారు. ఆకలిని భిన్నమైన రీతీలో లక్ష్యం చేసుకోవడం అనే పరిశోధనలో భాగంగా ఈ విషయాన్ని కనుగొన్నారు. ఊబకాయానికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో ఇది సరికొత్త ఆశను రేకెత్తించింది. సాధారణంగా కొండచిలువలు విపరీతమైన ఆహారపు అలవాట్లకు ప్రసిద్ధి చెందినవి. అవి తమ శరీర బరువుకి సమానమైన పరిమాణంలో ఉన్న ఆహారాన్ని స్వాహా చేస్తాయి. ఆ తర్వాత నెలల తరబడి ఆహారం లేకుండా జీవిస్తాయి. అలా.. ఎలా అన్నేళ్లు ఆహారం లేకుండా ఉంటాయని పరిశోధించగా..ఆ సమయంలో వాటి రక్తప్రవాహంలో కొన్ని అణువులు వేగంగా పెరుగుతాయిని గుర్తించారు వైద్యులు. ఇవి అసాధారణ జీవక్రియను నిర్వహించడానికి సహాపడతాయిని గుర్తించారు శాస్త్రవేత్తలు. ఈ మేరకు స్థాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయంలోని జోనాథన్ లాంగ్ నేతృత్వంలో జరిగిన పరిశోధనలో కొండచిలువలు ఆహారం తినడానికి, తర్వాత వాటి రక్తనమునాలను విశ్లేషించారు. వాటిలో గణనీయంగా పెరిగిన 200కు పైనే ఎక్కువ అణువులను గుర్తించారు. ఆ అణువుల్లో పీటీఓఎస్(pTOS)గా పిలిచే ఒక అణువు వెయిరెట్లకు పైగా పెరిగింది. పేగులలో బ్యాక్టీరియా ద్వారా ఉత్పత్తి అయ్యే ఈ అణువు మానవులలో కూడా తక్కువ పరిమాణంలో కనిపిస్తుంది. దాని సామర్థాన్ని పరీక్షించడానికి పరిశోధకులు ఊబకాయం ఉన్న ఎలుకలకు ఈ పీటీఓఎస్ ఇచ్చారు. ఆ ఫలితాల్లో ఆ ఎలుకలు తక్కువ ఆహారం తిని, 28 రోజుల వ్యవధిలో తమ శరీర బరువులో సుమారు 9% కోల్పోయాయని గుర్తించారు. కడుపు ఖాళీ అయ్యి..జీర్ణక్రియ నెమ్మదించే ప్రక్రియను తరుచుగా వికారం వంటి దుష్ప్రభావాలను కలిగించే వెగోవీ వంటి బరువు తగ్గించే మందుల్లా కాకుండా ఈ పీటీఓఎస్(pTOS) నేరుగా బ్రెయిన్పై పనిచేస్తోందట. ఇది ఆకలిని నియంత్రించే ప్రాంతమైన హైపోథాలమస్ను లక్ష్యంగా చేసుకుంటుందట. ఇది ఒకరకంగా ప్రస్తుత చికిత్సలలో ఉన్న సాధార దుష్ప్రభావాలు లేకుండా ఆకలిని నియంత్రించే కొత్త మార్గాన్ని అందించిందని చెబుతున్నారు పరిశోధకులు. ఈ పరిశోధన నేచరల్ మెటబాలిజంలో ప్రచురితమైంది. ఇది మానవులుకు ఎంతవరకు సురక్షితమైనది అనేది నిర్థారించడానికి ఇంకా పలు అధ్యయనాలు చేయాల్సి ఉంది. కానీ శాస్త్రవేత్తలు మాత్రం భవిష్యత్తులో ఊబకాయ భయానికి ఇదో గొప్ప ఆశకిరణంగా మారుతుందని ప్రగాఢం నమ్ముతుండటం విశేషం.(చదవండి: జస్ట్ 12 వారాల్లో 73 కిలోల నుంచి 66 కిలోల బరువు..!) -
జస్ట్ 12 వారాల్లో 73 కిలోల నుంచి 66 కిలోల బరువు..!
బరువు తగ్గడం అనేది అత్యంత కష్టమైన సవాలుగా భావిస్తుంటారు చాలామంది. అలాంటిది ఆరు పదుల వయసులో వెయిట్లాస్కు ఉపక్రమించి సక్సెస్ అందుకుంది ఈ మహిళ. అది కూడా మూడు నెలల్లో తగ్గి వయసు కేవలం సంఖ్య మాత్రమే అని ప్రూవ్ చేసింది. ఒత్తిడితో కూడిన వృత్తిజీవితాన్ని హ్యాండిల్ చేస్తూ..బరువు తగ్గడం విశేషం. మరి అంతలా స్లిమ్గా మారిన ఆ మహిళ ఫిట్నెస్ మంత్రా ఏంటో చూద్దామా..!.కెరీర్ కోచ్ అయిన క్రిస్ బోయెట్చెర్ తాను ఫిట్నెస్కి వయసు ఎప్పుడు అడ్డంకి కాదని నిరూపించడానికే ఈ వెయిట్లాస్ జర్నీకి ఉపక్రమించినట్లు తెలిపారు. ఇంతకుమునుపు పని నిమిత్తం జర్నీలు, ఎక్కువ గంటల పని, తదితరాలతో బిజీగా గడిపి, ఆరోగ్యాన్ని అస్సలు పట్టించుకోలేదని చెప్పుకొచ్చింది. అందుకే తన జీవితానికి అనుకూలమైన వ్యవస్థకు కట్టుబడి ఉండాలని డిసైడ్ అయ్యానని అంటోంది. అలా మూడు నెలల్లో తన శరీరాకృతిని మార్చుకోగలిగానని అంటోంది. ఆ క్రమంలో దశాబ్దాలుగా అనుభూతి చెందని బలాన్ని తిరిగి పొందగలిగానని చెబుతోంది. తనకు ఎంత తీరిక లేని దినచర్యతో ఉన్నప్పటికీ, క్రమబద్ధమైన ప్లాన్ని మిస్ చేయలేదట. ఇన్నాళ్లు ఆత్యానూన్యత భావంతో ఉన్న అధిక బరువుని..సక్రమమైన జీవనశైలితో చెక్పెట్టి స్లిమ్గా మారినిట్లు చెబుతోంది. అలా 73 కిలోల నుంచి 66 కిలోలకు అనూహ్యంగా తగ్గిపోయానని అంటోంది. అలాగే తానేమి కఠినమైన త్యాగాలు చేయలేదని, తన వాస్తవిక జీవితానికి అనుకూలమైన, నిర్వహించదగిన జీవనశైలిని ఏర్పాటు చేసుకున్నట్లు పేర్కొంది. అయితే ఆ ప్రణాళిక పక్కాగా ఫాలో అయ్యేలా కేర్ తీసుకున్నానని, దాంతో నాజూకుగా మారి ఆత్మవిశ్వాసంతో అందరి ముందుకు రాగలిగానని అంటోంది. నెటిజన్లు సైతం ఆమె రూపు రేఖల్ని చూసి ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఒక వ్యక్తి ఎన్ని దశాబ్దాలు జీవించినా సరైన జీవన విధానం, నిరంతర కృషి, బలం, ఆత్మవిశ్వాసంతో మొత్తం ఆరోగ్యాన్ని ఇట్టే మార్చుకోగలరని ప్రూవ్చేసింది, స్ఫూర్తిదాయకంగా నిలిచింది మేరీ అంటూ పోస్టులు పెడుతున్నారు. Mary is a 62 year old administrator.She thought she would never lose the belly fat and build strength at her age.Mary was beginning to believe "I'm too old for that." But she decided to try anyway.She was dealing with travel for work, long hours, and the belief that her… pic.twitter.com/atZvUZgTnO— Chris Boettcher (@chrisboettcher9) February 16, 2026 (చదవండి: మూడు వేల ఏళ్లనాటి పురాతన తైలం..! నలుపుదనాన్ని తొలగించి..) -
సెమాగ్లూటైడ్ జనరిక్స్ వెల్లువ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టైప్–2 మధుమేహం, ఊబకాయం నియంత్రణకు ఉపయోగించే సెమాగ్లూటైడ్ ఔషధం పేటెంట్ దేశీయంగా ముగియడంతో దేశీ ఫార్మా దిగ్గజాలు పెద్ద ఎత్తున చౌక జనరిక్ వెర్షన్లను మార్కెట్లో ప్రవేశపెట్టాయి. దీనితో వీటి ధరలు గణనీయంగా దిగి వచ్చాయి. జనరిక్ వెర్షన్ను ఆవిష్కరించిన దిగ్గజాల్లో డాక్టర్ రెడ్డీస్, నాట్కో, సన్ ఫార్మా, గ్లెన్మార్క్ మొదలైనవి ఉన్నాయి. ఇన్నోవేటర్ హోదాలో డెన్మార్క్కి చెందిన నోవో నార్డిస్క్ సంస్థ .. సెమాగ్లుటైడ్ మాలిక్యూల్తో తయారు చేసిన ఔషధాన్ని ఒజెంపిక్, వెగోవీ బ్రాండ్స్ పేరిట విక్రయిస్తోంది. నెలకు సరిపడే డోసేజీలకు సంబంధించి వీటి వ్యయాల పరిమాణం .. డోసేజీ, దశను బట్టి రూ. 8,800 నుంచి రూ. 11,175 వరకు ఉంటోంది. తాజాగా జనరిక్ వెర్షన్ల రాకతో ధరలు దాదాపు 80 శాతం వరకు దిగి వచి్చనట్లవుతుంది. మల్టీ–డోస్ వయల్స్, ప్రీ–ఫిల్డ్ పెన్ డివైజ్ల రూపంలో ఈ ఇంజెక్షన్లు అందుబాటులో ఉంటాయి. ఔషధం ఒకటే అయినప్పటికీ ప్యాకేజింగ్, తయారీ విధానం, సౌకర్యం కారణంగా ప్రీ–ఫిల్డ్ పెన్ల ధర వయల్స్ కన్నా ఎక్కువగా ఉంటుంది. → డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీస్ సంస్థ ఒబెదా బ్రాండ్ పేరిట వారానికి ఒకసారి తీసుకునే సెమాగ్లూటైడ్ ఇంజెక్షన్ని ప్రీ–ఫిల్డ్, డిస్పోజబుల్ పెన్ రూపంలో ప్రవేశపెట్టింది. కనీసం నాలుగు వారాలకు సరిపడేలా 2ఎంజీ, 4 ఎంజీ డోసుల్లో ఇది లభిస్తుంది. నెలవారీ వ్యయం రూ. 4,200గా ఉంటుందని సంస్థ సీఈవో ఎరెజ్ ఇజ్రేలీ తెలిపారు. దీన్ని ఇతర దేశాల్లో కూడా ప్రవేశపెట్టనున్నట్లు పేర్కొన్నారు. డాక్టర్ రెడ్డీస్ భాగస్వామ్యంతో యూఎస్వీ సంస్థ యుసెమా బ్రాండ్ పేరిట ఇంజెక్షన్ని ఆవిష్కరించింది. → మరోవైపు, నాట్కో ఫార్మా సంస్థ మల్టీ–డోస్ వయల్స్ని సెమానాట్, సెమాఫుల్ పేరిట ప్రవేశపెడుతున్నట్లు తెలిపింది. వీటి నెలవారీ వ్యయం రూ. 1,290–1,750 శ్రేణిలో ఉంటుంది. అలాగే రూ. 4,000 నుంచి రూ. 4,500 వరకు నెలవారీ వ్యయం ఉండే పెన్ డివైజ్ని వచ్చే నెలలో ప్రవేశపెట్టే అవకాశం ఉందని పేర్కొంది. ఇక సెమాగ్లుటైడ్ జనరిక్ వెర్షన్ని దేశవ్యాప్తంగా పంపిణీ చేసేందుకు నాట్కో ఫార్మాతో ఒప్పందం ఉన్న ఎరిస్ లైఫ్ సైన్సెస్.. దీన్ని ’సండే’ పేరిట ప్రవేశపెట్టింది. అటు టోరెంట్ ఫార్మా సంస్థ సెంబాలిక్, సెమాలిక్స్ బ్రాండ్స్ పేరిట ఆవిష్కరించింది. ఇతర సంస్థల వివరాలిలా.. సన్ ఫార్మా: నావెల్ట్రీట్, సెమాట్రినిటీ బ్రాండ్స్ కింద ఇంజెక్షన్లను ఆవిష్కరించింది. నావెల్ట్రీట్ 0.25 ఎంజీ నుంచి 2.4 ఎంజీ వరకు అయిదు డోసేజీల్లో లభిస్తుంది. వారంవారీ వ్యయం సుమారు రూ. 900 నుంచి రూ. 2,000 వరకు ఉంటుంది. ఇక సెమాట్రినిటీ వ్యయం రూ. 750 నుంచి రూ. 1,300 వరకు ఉంటుంది. గ్లెన్మార్క్: గ్లిపిక్ పేరిట ఇంజెక్షన్ని ప్రవేశపెట్టింది. వయల్స్ వ్యయం వారంవారీగా రూ. 325 నుంచి రూ. 440 వరకు ఉంటుంది. పెన్ల రూపంలో కూడా ఇది అందుబాటులో ఉంటుందని సంస్థ తెలిపింది. జైడస్ లైఫ్సైన్సెస్: సెమాగ్లిన్టీఎం, మాషెమాటీఎం, ఆల్టర్మెట్ బ్రాండ్స్ పేరిట ఇంజెక్షన్లను ఆవిష్కరించింది. సగటున నెలవారీ వ్యయం రూ. 2,200గా ఉంటుంది. ఆల్కెమ్ ల్యాబ్స్: సెమాసైజ్, ఒబీసిమా, హెపాగ్లైడ్ బ్రాండ్స్ పేరిట ఇంజెక్షన్లను ఆవిషఅకరించింది. ప్రీ–ఫిల్డ్ డిస్పోజబుల్ ఇంజెక్షన్ పెన్ నెలకు నాలుగు డోసుల కింద లభిస్తుంది. వారం వారీ వ్యయం సుమారు రూ. 450 నుంచి, నెలవారీ వ్యయం రూ. 1,800 నుంచి ప్రారంభమవుతుంది. రీయూజబుల్ పెన్ రూపంలో కూడా లభిస్తుంది. -
9-5 పనిచేసే ఉద్యోగులు బరువు తగ్గాలంటే..!
చాలామటుకు 9 టు 5 ఉద్యోగాల చేసే వాళ్ల పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందట. పగలు అంత ఆపీస్లోనే గడిచిపోవడంతో వ్యక్తిగతంగా సమయం కేటాయించుకునే వీలు అస్సలు ఉండు. అందులోనూ ఇక ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టేంత అవకాశం అస్సలు ఉండదు. అలాంటప్పుడు అధిక బరువు సంబంధిత అనారోగ్య సమస్యల బారిన ఇట్టే పడుతుంటారు. అలాంటివాళ్లు ఫిట్గా ఉండాలంటే ఈ ఫిట్నెస్ అండ్ మార్షల్ ఆర్ట్స్ నైపుణ్యాలకు ప్రసిద్ధిగాంచిన విద్యుత్ జమ్మాల్ టిప్స్ ఫాలో అయితే చాలు. మరి అవేంటో చూద్దామా..!.టాటాప్లే ఫిట్నెస్లో ‘ఫిట్ అండ్ ఫేమస్’తో జరిగిన సంభాషణలో ప్రముఖ ఫిట్నెస్ నిపుణుడు విద్యుత్ జమ్వాల్ ఇలా చెప్పుకొచ్చారు. సమయం దొరికినప్పుడు వ్యాయామం చేస్తానని, దొరకనప్పుడు అస్సలు బాధపడని అన్నారు. కానీ ఆఫీస్కి వెళ్లేవారు, క్రమబద్ధమైన జీవితం గడిపేవారు ముఖ్యంగా 9-5 ఉద్యోగాలు చేసేవారు నెలకు ఐదు కిలోలు తగ్గాలని లక్ష్యం పెట్టుకోవాలని సూచించారు. అందుకోసం కనీసం పదికిలోమీటర్లు లేదా కనీసం ఒక కిలోమీటరైనా నడవాలని చెప్పారు. వాళ్ల అవసరాలకు అనుగుణంగా టైమ్టైబుల్ పెట్టుకోవడం, దాన్ని అలవాటు చేసుకోవడం అత్యంత ముఖ్యమని అన్నారు. అలా చేస్తే కచ్చితంగా అనారోగ్యం బారిన పడరని అన్నారు.వాకింగ్ ఒక్కటి చాలా..!?దీర్ఘకాలిక ఆరోగ్యానికి నడక ఒక అద్బుతమైన పునాది. దీనివల్ల హృదయ సంబంధ ఆరోగ్యం, బరువు నియంత్రణ, మెరుగైన జీవనశైలి, వంటి అనేక ప్రయోజనాలు ఉన్నాయి. సంపూర్ణ ఫిట్నెస్ కోసం వాకింగ్ మాత్రమే సరిపోదు. బల శిక్షణ, ఫ్లెక్సిబిలిటీ వ్యాయమాలు కూడా తోడవ్వాలి అని చెబుతున్నారు. కేవలం నడకపైనే ఆధారపడితే కష్టమని అన్నారు. దీర్ఘకాలికా ఆరోగ్యం కోసం శరీరానికి తగినంత కదలిక ఉండాలని, నడవడంలో కూడా కొంగొత్త వాటిని జోడించి వాక్ చేయడం మరింత మంచిదని అన్నారు. కండరాలను పెంచుకోవడానికి వారానికి కనీసం రెండుసార్లు రెసిస్టెన్స్ వ్యాయామాలు తప్పకుండా చేయాలి. దినచర్యలో యోగా, స్ట్రెచింగ్ను నేర్చుకుంటే మరింత మంచిదని చెప్పుకొచ్చారు. View this post on Instagram A post shared by Vidyut Jammwal (@mevidyutjammwal) (చదవండి: మా మాష్టారే పేషెంట్గా..!) -
ఆహ్లాదం కోసం అమృతాసనం
మనసుకు, శరీరానికి విశ్రాంతి, శాంతిని ఇచ్చే అమృతాసన లేదా శవాసన. అమృతాసన లేదా సాధారణంగా శవాసన అని పిలిచే ఈ యోగాసనం యోగ సాధనలో అత్యంత ముఖ్యమైనది. “శవం” లా పూర్తిగా నిశ్చలంగా పడుకుని చేసే ఈ ఆసనం శరీరానికి విశ్రాంతి ఇచ్చే సాధన మాత్రమే కాదు - ఇది మనసును లోతుగా ప్రశాంతపరిచే ధ్యాన స్థితికి తీసుకెళ్తుంది. అందుకే దీనిని "అమృతాసన" అని కూడా అంటారు -అమృతం లాంటి పునరుజ్జీవనం ఇస్తుంది.చేసే విధానం...స్టెప్-1 సమతల ప్రదేశంలో యోగా మ్యాట్ మీద వెల్లకిలా (వెనుక భాగం నేలకు ఆనించి)ని టారుగా పడుకోండి.స్టెప్-2 కాళ్లను ఒకదానికొకటి దూరంగా ఉంచి, పాదా లను బయట వైపునకు ఉండేలా పెట్టాలి.చేతులను శరీరానికి కొద్దిగా దూరంగా, అరచే తులు ఆకాశం వైపు చూసేలా ఉంచాలి.స్టెప్-3 మెడ, తల నిటా రుగా ఉంచి, కళ్లను మృదువుగా మూసుకుని, ముఖ కండరా లను పూర్తిగా సడలించాలి.ఇప్పుడు శ్వాసను గమనించండి - లోపలికి వచ్చే శ్వాస, బయటకు వెళ్లే శ్వాసపై దృష్టి నిల పాలి.స్టెప్-4 తల నుంచి పాదాల వరకు ప్రతి భాగాన్ని మానసికంగా సడలిస్తూ, ఒత్తిడిని, ఆలోచ నలను విడిచిపెట్టాలి.స్టెప్-5 కనీసం 7-15 నిమిషాలు ఈ స్థితిలో ఉండాలి.ముగించేటప్పుడు కుడివైపు మెల్లగా తిరిగి, ఎడమ చేతి సాయంతో నెమ్మదిగా కూర్చోవాలి.ప్రయోజనాలు:⇒ యోగసాధనలో చేసిన అన్ని ఆసనాల తర్వాత ఈ ఆసనం శరీర కండరా లకు సంపూర్ణ విశ్రాంతి ఇస్తుంది హృదయ స్పందనలు సరిగ్గా ఉండటానికి, బీపీ తగ్గడానికి సహాయపడుతుంది. ఆందోళన, డిప్రెషన్ తగ్గడా నికి ఎంతో ఉపయోగపడుతుంది నిద్రలేమి⇒ సమస్యలకు ఉపశమనం కలిగిస్తుంది శవాసనను రోజూ చేస్తే నిద్ర గాఢంగా వస్తుంది నర్వస్ సిస్ట మను సమతుల్యం చేసి, మెదడుకు శాంతి కలిగి స్తుందిగర్భిణులు - మెనోపాజ్ మహిళలకు సహకరిస్తుంది. శరీర హార్మోన్ల సమతుల్యతకు మద్దతు ఇస్తుంది.జాగ్రత్తలు: నిద్రపోకూడదు - ఇది ధ్యాన⇒ స్థితి వెన్నునొప్పి ఉన్నవారు మోకాళ్ల కింద చిన్న దిండు పెట్టుకోవచ్చు గర్భిణులు ఎడమ పక్కగా పడుకోవాలి చల్లటి గాలి నేరుగా తగలకుండా చూసుకోవాలి. కనీసం 7 నిమిషాలు చేయాలి.పాతర్ల అనిత, యోగా ట్రైనర్ -
కొత్త ఆలోచనలను మనసులో ఎలా నాటాలి?
మనం మట్టిలో ఒక విత్తనాన్ని వేయగానే అది చెట్టు అవ్వదు కదా! దానికి నీరు, ఎరువు, సరైన సమయం కావాలి. అలాగే, మన మనసులో కొత్త ఆలోచనలను నాటడం (Planting Ideas) కూడా ఒక కళ. దీన్నే మనం 'The Build Stage' అంటాం.మనసు ఒక సారవంతమైన భూమి లాంటిది. మీరు అందులో ఏది నాటితే అదే పెరుగుతుంది. మీరు ఇప్పటివరకు మీ మనసులో 'నేను ఓడిపోతాను', 'నేను ఎవరికీ పనికిరాను' అనే కలుపు మొక్కలను నాటారు. ఇప్పుడు ఆ స్థానంలో 'విజయం', 'అద్భుతమైన వ్యక్తిత్వం' అనే విత్తనాలను నాటే సమయం ఆసన్నమైంది.1. The Germination of an Ideaఒక ఆలోచన మనసులో స్థిరపడాలంటే దానికి ఒక క్రమపద్ధతి ఉంటుంది.Exposure: ముందుగా మీరు కొత్త ఆలోచనలకు మీ మనసును తెరవాలి, గొప్ప వ్యక్తులను కలవడం, కొత్త పుస్తకాలు చదవడం లాంటివి చేయాలి. Acceptance: ‘‘ఆ ఆలోచన నా జీవితానికి ఉపయోగపడుతుంది" అని మీరు నమ్మాలి.Repetition (పునరావృతం): ఆ ఆలోచనను రోజుకు వందసార్లు మీ మెదడుకు గుర్తు చేయాలి.2. మెదడును ఎలా రీ-వైర్ చేయాలి? (Neuroplasticity)మనం చేసే పనులను బట్టి మన మెదడులోని నాడీ మార్గాలు (Neural Pathways) మారిపోతాయి. దీన్ని సైకాలజీలో 'Neuroplasticity' అంటారు. మీరు ఒకే నెగటివ్ ఆలోచనను పదే పదే చేస్తే, మీ మెదడు దానికి అలవాటు పడిపోతుంది. అలాగే, మీరు కొత్త ఆలోచనను పదే పదే ప్రాక్టీస్ చేస్తే, మెదడు దాన్ని ఒక కొత్త 'హైవే' లాగా మార్చేస్తుంది.3. నిజమైన 'బిల్డ్' పద్ధతిమోటివేషన్ "ఒకే రోజులో నీ లైఫ్ మార్చేయ్, రేపటి నుండే కొత్తగా ఉండు" అని చెప్తుంది. ఇది ఒక అబద్ధం, ఎందుకంటే 20 ఏళ్ల అలవాటు ఒక్క రోజులో పోదు. సైకాలజీ కొత్త ఆలోచనను చిన్న చిన్న పనుల ద్వారా ప్రాక్టీస్ చేయమంటుంది (Incremental Building). ఉదాహరణకు, మీరు 'కాన్ఫిడెంట్' అవ్వాలనుకుంటే, ఒకే రోజులో స్టేజ్ ఎక్కక్కర్లేదు. ముందు అద్దం ముందు మాట్లాడండి, ఆ తర్వాత స్నేహితుల ముందు మాట్లాడండి. ఇది నిజమైన 'బిల్డ్' పద్ధతి.4. మీ మనసులో కొత్త పంట!Genius Matrix ఫిలాసఫీ ప్రకారం, మీ కొత్త పర్సనాలిటీని ఎలా నిర్మించాలో చూద్దాం.Step 1: కలుపు మొక్కల తొలగింపు (Break)మీ పాత భయాలు, నమ్మకాలు ఒక 'కలుపు' లాంటివి. పాత పద్ధతిలో "నేను చేయలేను" అనే నెగటివ్ సెల్ఫ్-టాక్ ఎక్కడ మొదలవుతుందో అక్కడ 'బ్రేక్' చేయండి. అది రాగానే దాన్ని తుడిచేయండి.Step 2: నిర్మాణాత్మక ఆచరణ (Build)కొత్త ఆలోచనలకు మద్దతు ఇచ్చే వాతావరణాన్నిబిల్డ్ చేయండి. మీ లక్ష్యానికి సంబంధించిన వ్యక్తులతో తిరగండి, ఆ విషయాలపైనే వినండి. ఏ ఆలోచనను మీరు పదే పదే వింటారో, అదే మీ పర్సనాలిటీగా మారుతుంది. ఇది 'నిర్మాణం' (Build).Step 3: ఆటోమేషన్ (Beyond)ఒక్కసారి కొత్త ఆలోచన మీ సబ్-కాన్షియస్ మైండ్ లోకి వెళ్తే, ఇక మీరు కష్టపడక్కర్లేదు. అది మీ ప్రవర్తనలో, మీ మాటల్లో ఆటోమేటిక్గా కనిపిస్తుంది. మీరు మారుతారు, మీ జీవితం మారుతుంది. ఇదే 'Beyond' స్టేజ్.5. మీ మనసులో ఏముంది?ఈ రోజు ఒక చిన్న విశ్లేషణ చేయండి.ఈ వారం మీరు నాటాలనుకుంటున్న ఆ ఒక్క 'కొత్త ఆలోచన' ఏంటి?దాన్ని నాటడానికి మీరు వేస్తున్న మొదటి చిన్న అడుగు ఏంటి?మీరు నాటబోయే ఆ విత్తనం రేపు ఎలాంటి ఫలాలను (Results) ఇస్తుంది?మీరే మీ తోటమాలి!బ్రో, మనసు అనే తోటలో కలుపు మొక్కలు వాటంతట అవే వస్తాయి, కానీ మంచి మొక్కలు మనం నాటుకోవాలి. మీరు మీ మైండ్కి తోటమాలి లాంటివారు. ఏ ఆలోచనను పెరగనివ్వాలో, దేన్ని తీసేయాలో నిర్ణయం మీదే. మీ కొత్త వ్యక్తిత్వాన్ని ఒక అద్భుతమైన తోటలా నిర్మించుకోండి.గుర్తుంచుకోండి, "Your life is the harvest of your thoughts."సైకాలజిస్ట్ విశేష్ Genius Matrix Hub 8019 000066www.psyvisesh.com -
నీతా అంబానీకి మానవతా పురస్కారం..!
రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్పర్సన్ నీతా అంబానీకి అరుదైన గౌరవం లభించింది. ఒడిశాలోని భువనేశ్వర్లో ఉన్న కేఐఐటీ (KIIT) విశ్వవిద్యాలయంలో ప్రతిష్టాత్మక కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (కిస్) హ్యుమానిటేరియన్ అవార్డు 2025తో నీతా అంబానీని సత్కరించారు. ఈ సందర్భానికి అనుగుణంగా ఆమె అద్భుతమైన లుక్లో ఈ కార్యక్రమానికి హాజరయ్యారామె.ఈ ప్రత్యేక సందర్భం కోసం, నీతా అంబానీ ప్రకృతిని స్ఫూర్తిగా తీసుకుని తనచీరను ఎంచుకోవడం విశేషం. సాధారణ ముదురు మెరూన్ చీరకు కాంట్రాస్ట్గా ఆకుపచ్చ రంగు అంచుతో కూడిన చీరను ఎంచుకున్నారు. ఇది ఆమెకు మరింత అందాన్ని ఇచ్చింది. ముందు భాగంలో కుచ్చులు పెట్టి, కొంగును తన భుజం నుండి నేల వరకు సింగిల్ పైటతో జారవిడిచారు. ఆ చీరకు మ్యాచింగ్ మెరూన్ కలర్ విత్ ఆకుపచ్చ అంచు ఉన్న బ్లౌజ్ని ఎంచుకున్నారు. అంతేగాదు అమూల్యమైన ఆభరణాలకు బదులుగా పూల డిజైన్లో ఉన్న ఒక జత రూబీ, డైమండ్ చెవిపోగులు, ఒక స్టేమెంట్ ఉంగరం, ఆకుపచ్చ గాజులు, బంగారు పూసల నెక్లెస్ ధరించారు. జుట్టుని కూడా పెద్ద తరహాలో హుందాగా పాపిడి తీసి పువ్వులతో అలకరించిన జడకొప్పులా వేసుకున్నారు. చక్కగా సాధారణ స్త్రీలా కళ్లకు కాటుక, గుండ్రటి బొట్టుతో సరికొత్తగా కనిపించారామె.కిస్ ఫౌండేషన్ ప్రకారం, 'మానవతా సేవ. సమాజ సాధికారత పట్ల ఆమెకున్న అసాధారణ నిబద్ధత'కు గాను నీతా అంబానీకి ఈ అవార్డును ప్రదానం చేశారు. ఆ విషయాన్ని సోషల్ మీడియా పోస్ట్లో వెల్లడిస్తూ.. ఆమె దూరదృష్టి గల నాయకత్వం, పరోపకార కార్యక్రమాల ద్వారా, విద్య, ఆరోగ్య సంరక్షణ, క్రీడలు, గ్రామీణాభివృద్ధిపై ప్రగాఢమైన ప్రభావాన్ని చూపారు. భారతదేశం అంతటా లెక్కలేనన్ని జీవితాలను ప్రభావితం చేశారు అని పేర్కొంది. View this post on Instagram A post shared by KISS Foundation (KISS) (@kissfoundation) (చదవండి: వైట్ హౌస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ సూసీ వైల్స్కు రొమ్ము కేన్సర్..తొలిదశలో సురక్షితమేనా..?) -
అంకుర్ వారికూ ఫిట్నెస్ సీక్రెట్..! నో స్టెరాయిడ్లు, నో షార్ట్కట్
వ్యాపారవేత్త, కంటెంట్ క్రియేటర్ అంకుర్ వారికూ సోషల్ మీడియా వేదికగా 45 ఏళ్ల వయసులో 13% శరీర కొవ్వుని ఎలా తగ్గించుకున్నారో సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నారు. తాను ఎలాంటి స్టెరాయిడ్లు, షార్ట్కట్లు, ఏఐ సలహాలు తీసుకోలేదని చెప్పారు. నిజానికి వయసు పెరిగే కొద్దీ శరీర కొవ్వు సాధారణంగా పెరుగుతుంది. బరువు స్థిరంగా ఉన్నా కొలెస్టాల్ స్థాయిలు పెరుగుతాయట. పైగా వయసుతోపాటు కండర ద్రవ్యరాశిని కోల్పోతామట. దాంతో చర్మం కింద, పొత్తుకడుపు వంటి అంతర్గత అవయవాలలోకి కొవ్వు విసరల్ ఫ్యాట్గా స్టోర్ అవుతుందని చెబుతున్నారు. ఇది టైప్2, గుండెజబ్బుల ప్రమాదాన్ని పెంచుతుందట. పైగా రానురాను బరువు తగ్గడం కష్టంగా మారిపోతుందట. పురుషులలో సుమారు 40 ఏళ్ల వయసు వచ్చేటప్పటికీ..టెస్టోస్టెరాన్ క్రమంగా తగ్గడం జరుగుతుంది. దాంతో కండరాలను నిర్మించడం, కొవ్వు పంపిణీ చేయడంలో సామర్థ్యం తగ్గుతుందని చెబుతున్నారు అంకుర్ వారికూ. అందుకే తాను 3టీ ఫార్ములాతో ఆరోగ్యకరమైన రీతీలో కొలెస్ట్రాల్ని తగ్గించుకున్నట్లు వెల్లడించారు. ఏంటా ఫార్ములా..? ఎలా అనుసరించాలంటే..T3 ఫార్ములా:T1 - ట్రాక్ వారానికి సుమారు 0.5 కిలోల బరువు తగ్గడానికి, రోజుకు 300 నుండి 500 కేలరీల స్వల్ప లోటు ఆరోగ్యకరమైనదట. డైట ప్లాన్..ఉదయం 9:30 - 1 స్కూప్ వే ప్రోటీన్, క్రియేటిన్, 1 వాల్నట్, 4 బాదం పప్పులు, 4 జీడిపప్పులు, 5-6 ఎండుద్రాక్షలుఉదయం 11 గంటలకు - 200 గ్రాముల పనీర్/టోఫు/టెంపే, లేదా దాల్ చిల్లా, అప్పుడప్పుడు గుడ్లు.మధ్యాహ్నం 1 గంటకు - పండ్లుసాయంత్రం 4 గంటలకు - 2 రోటీలు (ఎమ్మర్ గోధుమ/జొన్న/సోయా బీన్) + కూర + పప్పు + తక్కువ కొవ్వు గల పెరుగుసాయంత్రం 6:30 గంటలకు - పెరుగుతో 1 స్కూప్ వే ప్రోటీన్అయితే తనకు ఇష్టమైన చోలే భటూరేని మాత్రం వదిలేయలేదట. అలాగే మిఠాయిని కూడా తిన్నట్లు తెలిపారు. అయితే కేలరీలు బ్యాలెన్స్గా ఉండేలా కేర్ తీసుకున్నారట.T2 - శిక్షణగుండె ఆరోగ్యానికి కార్డియో మంచిదే అయినప్పటికీ, వృద్ధులలో దీర్ఘకాలిక కొవ్వు తగ్గడానికి స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అత్యంత ప్రభావవంతమైన సాధనం.ఎందుకంటే ఇది జీవక్రియ రేటును పెంచుతుంది. ఒకేసారి ఎక్కువ కండర సమూహాలను ఉత్తేజపరచడానికి, సిట్-టు-స్టాండ్స్ లేదా మోడిఫైడ్ ప్లాంక్స్ వంటి బహుళ కీళ్లను ఉపయోగించే వ్యాయామాలపై దృష్టి పెట్టాలి.వ్యాయామ దినచర్య:టెన్నిస్ - వారానికి 6 రోజులు, 1 గంట (కార్డియో పూర్తయింది)వెయిట్స్ - వారానికి 6 రోజులు, 45 నిమిషాలుప్రతి రోజు: 2 వ్యాయామాలు x 3 శరీర భాగాలకు సంబంధించిన వర్కౌట్లు = 6 వ్యాయామాలు10-12 సార్లు పునరావృతం చేస్తూ మొత్త మూడు సెట్లు చేయాలి.T3 - రూపాంతరంమార్పులను నమోదు చేయడానికి రోజువారీ బరువును, వారపు కొలతలను ట్రాక్ చేసినట్లు తెలిపారు. అలాగే తన ఫోటోలను తన ట్రైనర్కు పంపిచినట్లు చెప్పారు.చాలామటుకు అదే డైట్ ప్లాన్ ఫాలో అయినట్లు తెలిపారు.సెలవులకు టూర్కి వెళ్లేముందు లేదా బ్రేక్ తీసుకోవాలనుకుంటే.. మరింతగా ఈ దినచర్యను వేగవంతం చేసినట్లు తెలిపారు. శరీరంలోని కొవ్వును తగ్గించడం అంటే మొత్తం బరువు తగ్గడానికి తోడ్పడటమే కాకుండా, దీర్ఘకాలిక వయస్సు సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుందట. ఇక్కడ కండర ద్రవ్యరాశిని పెంచుకుంటూ అదనపు శరీర కొవ్వుని తగ్గించుకుంటే..మొత్తం జీవన నాణ్యతనే మెరుగుపడుతుంది. ఆరోగ్యకరమైన వృద్ధాప్యాన్ని అనుభవించవచ్చు అని చెప్పుకొచ్చారు అంకుర్ వారికూ.మొత్తం బరువు తగ్గడానికి తోడ్పడటమే కాకుండా, దీర్ఘకాలిక, వయస్సు సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది మరియు శారీరక స్వాతంత్ర్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడుతుంది. అందువల్ల, కండర ద్రవ్యరాశిని పెంచుకుంటూ అదనపు శరీర కొవ్వును కోల్పోవడం మొత్తం జీవన నాణ్యతను మెరుగుపరుస్తుంది మరియు వృద్ధాప్య జీవసంబంధమైన సూచికలను నెమ్మదింపజేస్తుంది.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చిం. మరిన్ని వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను పంపించడం ఉత్తమం. (చదవండి: వెల్నెస్ కొత్త ట్రెండ్..ఒత్తిడిపై 'ఎత్తు') -
వెల్నెస్ కొత్త ట్రెండ్..ఒత్తిడిపై 'ఎత్తు'
ఒకప్పుడు ‘సక్సెస్’ అంటే మంచి జాబ్, భారీ ప్యాకేజ్, లగ్జరీ లైఫ్.. అని భావించిన నగర జీవనం క్రమంగా మారుతోంది. హైదరాబాద్ వంటి మెట్రో నగరాల్లో ప్రజలు ‘క్వాలిటీ ఆఫ్ లైఫ్’ వైపు మళ్లుతున్నారు. ఒత్తిడి, జీవనశైలి వ్యాధుల మధ్య ఇరుక్కున్న అర్బన్ జనరేషన్ ఇప్పుడు ఆరోగ్యం లేకపోతే సంపాదనకు అర్థం లేదనే ధోరణికి వచ్చేసింది. ఈ మార్పే వెల్నెస్ ఇండస్ట్రీకి కొత్త ఊపిరి పోస్తోంది. వెల్నెస్ అనగానే కేవలం యోగా క్లాస్/ డైట్ మాత్రమే కాదు.., మానసిక ప్రశాంతత, శారీరక చురుకుదనం, భావోద్వేగ సమతుల్యత.. ఇవన్నీ కలిసిన సమగ్ర జీవన విధానమే నేటి వెల్నెస్ అని లైఫ్స్టైల్ కోచ్ డా.శ్రీ సోహం చెబుతున్నారు. ఈ సందర్భంగా ‘సాక్షి’ పంచుకున్న ఆలోచనలు ఆయన మాటల్లోనే.. కాలుష్యంతో నిండిన నగర జీవితానికి కొద్దిసేపైనా బ్రేక్ ఇవ్వాలనే తపన యువతలో పెరుగుతోంది. ఆరోగ్యం కోసం ప్రజలు తిరిగి మూలాల వైపు అడుగేస్తున్నారు. వారాంతాల్లో కుటుంబ సభ్యులతో ప్రశాంతంగా గడపాలన్న ఆలోచన కూడా వెల్నెస్ ట్రెండ్గా మారింది. ఇప్పటికే హైదరాబాద్ అవుట్స్కర్ట్స్లో చిన్న గెస్ట్హౌస్లు, నేచర్ గార్డెన్లు, వీకెండ్ రిట్రీట్స్ పెరుగుతున్నాయి. ఈ ప్రయాణంలో సరైన గైడెన్స్ ఉంటే శరీరం–మనసు రెంటిలోనూ అద్భుతమైన మార్పులు వస్తాయి. కార్పొరేట్ కల్చర్లోనూ వెల్నెస్ కీలకాంశంగా మారుతోంది. ఉద్యోగులకు ఒత్తిడి తగ్గించేందుకు, ఉత్పాదకత పెంచేందుకు అనేక కంపెనీలు యోగా, మెడిటేషన్, మైండ్ఫుల్నెస్ ప్రోగ్రామ్స్ సీఎస్ఆర్ కార్యక్రమాల్లో భాగం చేస్తున్నాయి. ‘సమతుల ఆహారం, సరైన నిద్ర, విశ్రాంతి, ఆరోగ్యకరమైన వాతావరణం ఉంటే ఉద్యోగుల పనితీరు సహజంగానే పెరుగుతుంది. కొన్ని సంస్థల హెచ్ఆర్ విభాగం దీనిపై ఆలోచన చేయాల్సి ఉంది. కాన్షియస్.. మ్యాడ్ నెస్.. హైదరాబాద్ అంటే ఫుడ్ లవర్స్ సిటీ. రుచికరమైన ఆహారానికి తగ్గట్టుగా సరైన వ్యాయామం లేకపోవడం వల్ల ఇన్సోమ్నియా, పీసీఓడీ, థైరాయిడ్, షుగర్, బీపీ వంటి సమస్యలు సాధారణమయ్యాయి. ఇన్ఫెరి్టలిటీ సమస్యలు, ఐవీఎఫ్ క్లినిక్స్ పెరుగుతుండడమే దీనికి నిదర్శనం. తినడం తప్పు కాదు.. కానీ మనం ఏమి తింటున్నామో తెలుసుకుని తినాలి.. అప్పుడప్పుడు ఉపవాసం బాడీని డీటాక్స్ చేస్తుంది. యువతపై సోషల్ మీడియా ప్రభావం ఉన్నా.. ‘స్టాప్ లెర్నింగ్, స్టార్ట్ అన్లెర్నింగ్’ అనే భావన ఆకర్షణగా మారుతోంది. సమస్యల నుంచి పారిపోకుండా.. జీవితంలోని ప్రతి క్షణాన్ని అవగాహనతో అనుభవించాలనే ఆలోచన ‘కాన్సియస్ మ్యాడ్ నెస్’ కాన్సెప్ట్కు బలం ఇస్తోంది. ఈ ఆలోచనలతో ఈ నెల 21న గండిపేటలోని ఆయర్వన్ వాటర్ సైడ్లో యోగా, మెడిటేషన్, భజన్ జ్యూమింగ్ ఎక్స్పీరియన్స్ అందించనున్నాం. రానున్న ఐదేళ్లలో హైదరాబాద్ లైఫ్స్టైల్లో వెల్నెస్ కేవలం ట్రెండ్ కాదు.. అవసరంగా మారబోతోంది. సంపాదనతో పాటు ఆరోగ్యాన్ని కూడా సమానంగా చూసుకునే దిశగా యువత అడుగులు వేస్తోంది. స్ట్రెస్ నుంచి స్ట్రెంగ్త్కి ప్రయాణమే నేటి హైదరాబాద్ కొత్త లైఫ్స్టైల్. -
ఈ సర్జరీలతో గుండెకు బైపాస్..!
గుండెకు రక్తాన్ని అందించే రక్తనాళాల్లో కొవ్వు ఉండల వల్ల గానీ లేదా రక్తం గడ్డకట్టడంతో ఏర్పడిన క్లాట్స్ వల్లగానీ వల్ల రక్తప్రసరణకు అడ్డంకులు ఏర్పడి... గుండెకు అవసరమైన రక్తం అందకుండా పోయే ప్రమాదం ఉంటుంది. ఈ సమస్య తలెత్తాక... రక్తనాళాలు ఇంకా పూర్తిగా మూసుకుపోనప్పుడు స్టెంట్ వేయడమన్నది చాలామందికి తెలిసిన విషయమే. స్టెంట్ వేశాక రక్తాన్ని పలచబార్చే మందులు కూడా ఇస్తుంటారు. అయితే మరికొన్ని సందర్భాల్లో గుండెకు రకరకాల శస్త్రచికిత్సలు చేస్తుంటారు. ఈ క్రమంలో బైపాస్ సర్జరీ, ఓపెన్ హార్ట్ సర్జరీ, బీటింగ్ హార్ట్ సర్జరీ... అనే రకరకాల శస్త్రచికిత్సల పేర్లు వినిపిస్తుంటాయి. ఈ సర్జరీలు ఏమిటి, రకరకాల శస్త్రచికిత్సల తాలూకు ప్రయోజనాలేమిటి లాంటి అనేక విషయాలను తెలుసుకుందాం.గుండెకు రక్తం అందించే రక్తనాళాల్లో ఏదైనా అడ్డంకి వచ్చినప్పుడు... నిజానికి శస్త్రచికిత్స కంటే ముందుగా స్టెంట్ ద్వారా ఆ అడ్డంకిని తొలగించడానికి గుండె డాక్టర్లు ప్రయత్నిస్తారు. ముందుగా ఆ స్టెంట్ అంటే ఏమిటో చూద్దాం.స్టెంట్ అంటే ఏమిటి...? గుండె రక్తనాళాల్లో ఏర్పడిన అడ్డంకులను తొలగించడానికి రక్తనాళాల్లోకి వెళ్లాక అక్కడ మూసుకు΄ోయిన రక్తనాళాన్ని వెడల్పు చేసే ఉపకరణాన్ని స్టెంట్ అంటారు. ఇందులోనూ రకరకాలు ఉంటాయి. ఉదాహరణకు ఒక బెలూన్ వంటి ఉపకరనాన్ని పంపి, రక్తనాళం మూసుకుపోయిన చోట దాన్ని ఉబ్బేలా చేయడం ద్వారా అక్కడ ఏర్పడిన అడ్డంకిని తొలగించడాన్ని బెలూన్ యాంజియోప్లాస్టీ లేదా బెలూన్ స్టెంట్ అమర్చడంగా చెబుతారు.నిజానికి ఇలా స్టెంట్ వేయడమన్నది పూర్తి స్థాయి శస్త్రచికిత్స కాదు. మొదట్లో తొడ భాగం లోని రక్తనాళాల నుంచి గుండెలోని రక్తనాళాల వరకు వెళ్లి అక్కడ మూసుకు΄ోయిన చోట స్టెంట్ వేసేవారు. అయితే ఇటీవల మణికట్టు నుంచే స్టెంట్ను పంపడమూ జరుగుతోంది. గుండెకు ఏరకమైన చికిత్స అవసరమనే విషయాన్ని తెలుసుకోడానికి... తొలుత యాంజియోగ్రామ్ అనే పరీక్ష చేయించి, అటు తర్వాత గుండెకు రక్తాన్ని అందించే రక్తనాళాల్లో ఏదైనా సమస్య కనిపిస్తే... బైపాస్ చేయించాలా లేదా మందులతోనే సమస్యను పరిష్కరించవచ్చా లేదంటే స్టెంట్ వేయించాలా అని చాలా మంది అయోమయానికి గురయ్యే అవకాశం ఉంది. నిజానికి ఈ ఏయే సందర్భాల్లో చేస్తారో, అవి ఎలా ఉపయోగపడతాయో తెలుసుకుందాం.గుండెకు చేసే రకరకాల శస్త్రచికిత్సలేమిటి... వాటితో ప్రయోజనాలేమిటంటే... గుండెకు చేసే శస్త్రచికిత్సలు ప్రధానంగా రెండు రకాలు. మొదటిది బైపాస్ సర్జరీ. రెండోవి వాల్వ్ సర్జరీలు. వీటిల్లో... బైపాస్ సర్జరీలోనే... ఓపెన్ హార్ట్ సర్జరీ... దాంతోపాటు పలు సందర్భాల్లో నిర్వహించే రకరకాల సర్జరీలైన బీటింగ్ హార్ట్ సర్జరీ, మినిమల్లీ ఇన్వేజివ్ కార్డియాక్ సర్జరీ, టోటల్ ఆర్టీరియల్ రీవాస్క్యులైజేషన్, ఎండోస్కోప్క్ సర్జరీ, హైబ్రిడ్ సర్జరీ, రొబోటిక్ బైపాస్ సర్జరీ వంటి వాటినీ అనుసరిస్తుంటారు. వాటి గురించి వరసగా...బైపాస్ శస్త్రచికిత్స అంటే : ముందుగా బైపాస్ శస్త్రచికిత్స అంటే ఏమిటో చూద్దాం. గుండెకు రక్తాన్ని తీసుకెళ్లే రక్తనాళల్లో ఏవైనా అడ్డంకులు ఉంటే... వాటిని వెడల్పు చేయకుండా అలాగే వదిలేసి... వాటికి ప్రత్యామ్నాయంగా వేరే రక్తనాళాలను ఉపయోగించి, ఈ కొత్తమార్గం ద్వారా గుండెకు యథాతథంగా రక్తప్రసరణ జరిగేలా చేయడమే బైపాస్ శస్త్రచికిత్స. అంటే... ఇందులో అడ్డంకి ఉన్న రక్తనాళానికి పక్కగా... కరొనరీ ఆర్టరీ (బృహద్ధమని) నుంచి నేరుగా గుండెకండరానికి రక్తం అందేలా మరో రక్తనాళాన్ని ఏర్పాటు చేస్తారు. ఈ ప్రక్రియలో కరొనరీ ఆర్టరీ నుంచి గుండె కండరానికి రక్తం అందేలా చేయడానికి అవసరమైన అదనపు రక్తనాళాన్ని కాలి నుంచి తీసుకున్న రక్తనాళాన్నిగాని లేదా రొమ్ము ఎముక పక్కనే ఉన్న మ్యామరీ ధమనిని గాని ఉపయోగిస్తారు. ఇలా చేసే క్రమంలో ఒకవేళ సిరను ఉపయోగిస్తే దాన్ని వీనస్ గ్రాఫ్ట్ అని, ధమనిని ఉపయోగిస్తే ఆర్టీరియల్ గ్రాఫ్ట్ అంటారు.బైపాస్ ఎవరికి అవసరం, దాంతో ఒనగూరే ప్రయోజనాలేమిటంటే... గుండెకు రక్తసరఫరా చేసే ప్రధాన రక్తనాళమైన లెఫ్ట్ మెయిన్లో అడ్డంకులు ఏర్పడినప్పుడు గుండెలో ఎడమపక్క ఉండే ముఖ్య రక్తనాళంలోని మొదటిభాగంలోనే అడ్డంకి ఉన్నప్పుడు గుండె తాలూకు పంపింగ్ సామర్థ్యం తక్కువగా ఉన్నప్పుడు ∙గుండెకు రక్తాన్ని అందించే రక్తనాళంలో అనేకచోట్ల అడ్డంకులు ఏర్పడినప్పుడు ∙డయాబెటిస్ (మధుమేహ వ్యాధి) ఉన్న వారికి. ఓపెన్హార్ట్ సర్జరీ అంటే...? బైపాస్ శస్త్రచికిత్స సమయంలో రొమ్ముఎముకను చీల్చి సర్జన్ గుండె వరకు వెళ్తాడు. అయితే గండె అనుక్షణం కొట్టుకుంటూ ఉంటుందన్న విషయం తెలిసిందే. ఇలా గుండె నిత్యం స్పందిస్తూ ఉండగా ఆపరేషన్ చేయడం ఒకింత కష్టంగా, సంక్లిష్టంగా ఉంటుంది. అందుకే తాత్కాలికంగా గుండెను ఆపేసి (అచేతన స్థితిలో ఉంచి) ఈ ఆపరేషన్ నిర్వహిస్తారు. అలా గుండె అచేతన స్థితిలో ఉన్నప్పుడు శరీరానికి అవసరమైన రక్తప్రసరణ యథాతథంగా కొనసాగేందుకు హార్ట్లంగ్ మెషిన్ అనే పరికరాన్ని వాడతారు. ఏ శస్త్రచికిత్సలోనైతే ఈ హార్ట్లంగ్ మెషిన్ను వాడతారో... దాన్ని ‘ఓపెన్హార్ట్ సర్జరీ’ పరిగణించవచ్చు.బీటింగ్ హార్ట్ సర్జరీ అంటే...? దీన్ని ‘ఆఫ్ పంప్ సర్జరీ’ అని కూడా అంటారు. ఇందులో కూడా రొమ్ము ఎముకను చీలుస్తారు. అయితే ఈ ప్రక్రియలో గుండె స్పందనలను ఆపడం, మళ్లీ ్ర΄ారంభించడం గానీ జరగదు. ఓ పక్క గుండె స్పందనలు యథావిధిగా కొనసాగుతుండగానే బై΄ాస్ సర్జరీ నిర్వహిస్తారు. ఆక్టోపస్ అనే ఒక ప్రత్యేక పరికరం ద్వారా గుండెలో ఆపరేషన్ జరుగుతున్న భాగం వరకు కదలకుండా చేసి, ఈ శస్త్రచికిత్స చేస్తారు. సాధారణ బై΄ాస్ శస్త్రచికిత్స తర్వాత కొంతమందిలో పక్షవాతం, మతిమరపు వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే బీటింగ్ హార్ట్ సర్జరీ వల్ల అలాంటి ఆ దుష్ప్రభావాలు వచ్చే అవకాశాలు బాగా తగ్గి΄ోతాయి.మినిమల్లీ ఇన్వేజివ్ కార్డియాక్ సర్జరీ అంటే..? గత కొద్దికాలంగా గుండె శస్త్రచికిత్సలో అత్యంత ఆధునికమైన, చాలా అధునాతమైన వినూత్న వైద్య పురోగతి జరుగుతోంది. కేవలం చాలా చిన్న గాటు సహాయంతోనే బై΄ాస్ సర్జరీ నిర్వహించడం కూడా వీటిల్లో ఒకటి. ఇందులో ఎదుర్రొమ్ము ఎముకను చీల్చాల్సిన అవసరమే ఉండదు. అయితే పెద్ద శస్త్రచికిత్సల్లోలాగే మత్తు మందు ఇవ్వాల్సి ఉంటుంది. చర్మంపైన చాలా చిన్నవైన గాట్లు పెడుతూ వెంటనే తగ్గి΄ోయి మూసుకు΄ోయే రంధ్రాలు చేయడం ద్వారా ఈ లాపరోస్కోపిక్ ఆపరేషన్ చేస్తారు. గాటు, గాయం చాలా చిన్నవిగా ఉండటం వల్ల రోగులు చాలా త్వరగా కోలుకుంటారు. రక్తస్రావం, నొప్పి కూడా చాలా తక్కువే. శస్త్రచికిత్స తర్వాత ఆయాసం వంటి సమస్యలూ ఉత్పన్నం కావు. కానీ సర్జన్కు కేవలం గుండెలోని కొద్దిభాగం మాత్రమే కనిపిస్తుంటుంది కాబట్టి ఈ తరహా శస్త్రచికిత్స నిర్వహించడానికి అతడికి చాలా నైపుణ్యం కావాలి. పైగా పేషెంట్లదరికీ ఈ చికిత్స చేయడం సాధ్యం కాకపోవచ్చు.టీసీఆర్ఏటీ : ఈ ‘టీసీఆర్ఏటీ’ అనేది ‘టోటల్ కొరనరీ రీవాస్క్యులరైజేషన్ బై యాంటీరియర్ కొరకాటమీ’ అనే సర్జరీ ప్రక్రియ తాలూకు సంక్షిప్త రూపం. దీన్ని ఎదుర్రొమ్ముకు ఏమాత్రం కోత లేకుండా చేస్తారు. ఈ శస్త్రచికిత్సలో చిన్న గాటుతోనే (మినిమల్లీ ఇన్వేజివ్గానే) గుండె తాలూకు కీలకమైన ధమని అయిన ‘కొరనరీ ఆర్టరీకి సంబంధించిన అనేక రక్తనాళాలకు బై΄ాస్ దారులు ఏర్పాటు చేయడం సాధ్యమవుతుంది. దాంతో గుండె కండరాలకు రక్తం ఎలాంటి అంతరాయం లేకుండా అందుతుంది. కేవలం 6 నుంచి 10 సెంటీమీటర్ల చిన్నపాటి గాటుతోనే గుండెకు బైపాస్ (కార్డియోపల్మునరీ బైపాస్ –సీపీబీ) శస్త్రచికిత్స నిర్వహిస్తారు. మిగతా బైపాస్ ప్రక్రియలతో పోలిస్తే ఇదెంతో సురక్షితమైనదీ, నొప్పి చాలా చాలా తక్కువ. ఇందులో పేషెంట్ కోలుకోవడం చాలా వేగంగా జరుగుతుంది.కంప్లీట్ ఆర్టీరియల్ రీవాస్క్యులరైజేషన్ అంటే..? బైపాస్ శస్త్రచికిత్స చేసేప్పుడు జబ్బుపడ్డ ప్రతి ముఖ్యమైన రక్తనాళానికీ బైపాస్ గ్రాఫ్ట్ చేస్తారు. అంటే ఎన్ని రక్తనాళాల్లో అడ్డంకులు ఉంటే అన్ని చోట్లా బైపాస్ చేయడం కోసం అన్ని ప్రత్యామ్నాయ రక్తనాళాలను అతికిస్తారు... అంటే గ్రాఫ్ట్ చేస్తారని అర్థం. చాలామందిలో ఒక్కోసారి మూడు లేక నాలుగు గ్రాఫ్ట్లు కూడా వేయాల్సి వస్తుంది. ప్రస్తుతం ప్రతి బై΄ాస్ సర్జరీలోనూ కనీసం ఒక ధమనిని ఉపయోగించడం పరి΄ాటి అయ్యింది. సాధారణంగా రొమ్ము ఎముకకు రక్తసరఫరా చేసే రొమ్ముఎముక ధమని (ఇంటర్నల్ మ్యామరీ ఆర్టరీ)ని ఉపయోగించి ఎల్ఏడీ కరొనరీ ధమని అనే దానికి అనుసంధానం (గ్రాఫ్ట్) చేస్తారు. కాలి నుంచి తీసిన సిరలతో పోలిస్తే ఇలా రొమ్ముఎముక నుంచి తీసిన ధమని చాలా కాలం పాటు మన్నికతో ఉంటుంది. అయితే టోటల్ ఆర్టీరియల్ రీవాస్క్యులరైజేషన్లో కాలినుంచి సిరలను తీయకుండా మణికట్టులోని ధమనులను, ఎడమ, కుడి రొమ్ము ఎముక ధమనులను ఉపయోగించి సర్జరీ చేస్తారు.ఎండోస్కోపిక్ సర్జరీ అంటే...? ప్రస్తుతం చేస్తున్న సరికొత్త శస్త్రచికిత్సల్లో మణికట్టు నుంచి తీసే ధమని గానీ... లేదా కాలి నుంచి తీసే సిరల విషయంలోగానీ... పూర్తిగా గాటు పెట్టి తీయకుండా, చిన్న రంధ్రం మాత్రమే చేసి వాటిని సేకరిస్తారు. ఇలా చేయడం వల్ల చేసే గాయం చాలా చిన్నది కావడం వల్ల పేషెంట్ చాలా త్వరితంగా కోలుకోవడం సాధ్యమవుతుంది.హైబ్రీడ్ సర్జరీ అంటే...? కొన్నిసార్లు బై΄ాస్ శస్త్రచికిత్సలో పేషెంట్ చాలా సీరియస్గానూ అతడి పరిస్థితి అత్యంత సంక్లిష్టపరిస్థితిలో ఉన్నప్పుడు కొన్ని రక్తనాళాలకు యాంజియో΄్లాస్టీ ద్వారా, మరికొన్నింటికి బై΄ాస్ ద్వారా శస్త్రచికిత్స నిర్వహించడం వల్ల చాలా రిస్క్లు తగ్గుతాయి. ఇలా చేయడం ద్వారా పేషెంట్ను చాలా త్వరగా కోలుకునేలా చేయవచ్చు. ఇలా ఒకే సర్జరీలో పలు రకాల శస్త్రచికిత్స ప్రక్రియలను చేయడాన్ని ‘హైబ్రీడ్ బై΄ాస్ సర్జరీ’ అంటారు.రొబోటిక్ బైపాస్ సర్జరీ అంటే...?ఈ ప్రక్రియలో డాక్టర్లు తమ బై΄ాస్ శస్త్రచికిత్సను రోబో సహాయంతో చేస్తుంటారు. ఈ ప్రక్రియలో మొదట మినిమల్లీ ఇన్వేసివ్ సర్జరీ లేదా ఎండోస్కోపిక్ సర్జరీలో చాలా చిన్న రంధ్రం మాత్రమే చేసి, దాని ద్వారా మిగతా శస్త్రచికిత్స చేయాల్సి ఉంటుంది. అంత చిన్న రంధ్రం నుంచి డాక్టర్ వేళ్లు రోగి శరీరంలోకి ప్రవేశింపజేయడం కష్టం. అందుకే రోబో తాలూకు సన్నని వేళ్లని ఆ రంధ్రంలోకి ప్రవేశింపజేసి, డాక్టర్లు (శస్త్రచికిత్సకులు) లోపలి దృశ్యాన్ని తెరమీద చూస్తూ... రోబో వేళ్లను బయటి నుంచే యంత్రాల సహాయంతో నియంత్రిస్తూ శస్త్రచికిత్స పూర్తి చేస్తారు.బైపాస్ సర్జరీ తర్వాత... బైపాస్ శస్త్రచికిత్స తర్వాత పేషెంట్ కోలుకోడానికి 2–3 నెలలు పడుతుంది. మొదట్లో కొద్దిగా నీరసంగా ఉండటం చాలా సాధారణంగా జరిగే పరిణామమే. రొమ్ముఎముక చీల్చడం వల్ల ఛాతీకండరాల్లో, మెడ ఎముకల్లో, వెన్నుపూసల్లో, జబ్బల్లో నొప్పులు ఉండటాన్ని డాక్టర్లు సాధారణంగా చూస్తుంటారు. అదే సమయంలో కాలు లేదా చేతి నుంచి రక్తనాళం బయటకు తీస్తారు కాబట్టి అక్కడ కూడా కొంత నొప్పి, వాపు ఉండవచ్చు. కొందరు ఈ ఆపరేషన్ తర్వాత మనోనిబ్బరం కోల్పోతారు. మరికొందరికి జ్ఞాపకశక్తి, దృష్టికేంద్రీకరణ శక్తి కొద్దిగా తగ్గవచ్చు. కానీ ఆర్నెల్లో పేషెంట్ తన పూర్వస్థితికి చేరుకునే అవకాశం ఉంటుంది.త్వరగా కోలుకోవడం కోసం... పేషెంట్లు తమ జీవనోపాధి కోసం చేసే పనులు అంతగా బరువైనవి కాక΄ోతే రెండు నెలల తర్వాతి నుంచే తమ వృత్తులకు హాజరుకావచ్చు. అయితే కాస్తంత బరువు పనులు చేసేవారు కనీసం మూడు నెలలు ఆగడం మంచిది. ఇక ఈ ఆపరేషన్ తర్వాత రెండునెలల పాటు వాహనం నడపడం అంత మంచిది కాదు. శస్త్రచికిత్స తర్వాత పేషెంట్ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవి...పొగతాగడం పూర్తిగా మానేయడం. ∙మంచి పుష్టికరమైన పోషకాహారం తీసుకుంటూ, దేహానికి శ్రమ కలగని విధంగా తగినంత వ్యాయామం చేస్తూ ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించడం. ∙బరువును అదుపులో ఉంచుకోవడం. ∙మనోనిబ్బరంతో వ్యవహరించడం.చివరగా... పైన సూచించిన జాగ్రత్తలను పాటిస్తూ, వైద్యులు చేసే సూచనలను తప్పక అనుసరించడం ద్వారా గుండె శస్త్రచికిత్స తర్వాత కూడా సాధారణ జీవితాన్ని గడపడం ఇప్పుడు చాలావరకు సాధ్యమే.నిర్వహణ: యాసీన్డాక్టర్ ఎం.ఎస్.ఎస్. ముఖర్జీ, సీనియర్ కార్డియాలజిస్ట్డాక్టర్ టి. వంశీధర్, సీనియర్ కార్డియో థొరాసిక్ సర్జన్ (చదవండి: పైల్స్ నుంచి ఫ్రీ అవ్వండి ఇలా..!) -
ఏ పనీ చేయకున్నా.. నీరసం వేధిస్తోందా?
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో అలసిపోవడం అనేది ఒక సాధారణ అంశంగా మారిపోయింది. ఆఫీసు పని, ఇంటి బాధ్యతలు, ప్రయాణాలు.. ఇలా ఏదో ఒక కారణంతో మనం అలసటకు గురవుతున్నామని సరిపెట్టుకుంటాం. అయితే ఎలాంటి పని చేయకపోయినా, తగినంత నిద్ర ఉన్నా కూడా నిత్యం నీరసంగా అనిపిస్తుంటే, దాని వెనుక ప్రమాదకర కారణం ఉండవచ్చని బ్రిటన్కు చెందిన ప్రముఖ జనరల్ ప్రాక్టీషనర్ డాక్టర్ సెర్మెడ్ మెజర్ హెచ్చరిస్తున్నారు.దడ పుట్టించే ‘థయామిన్’ లోపంమనకు కలిగే అలసటకు కేవలం పని ఒత్తిడి మాత్రమే కారణం కాకపోవచ్చని, శరీరంలో ఒక కీలకమైన పోషకం తగ్గిందని చెప్పడానికి అది ఒక హెచ్చరిక కావచ్చని డాక్టర్ సెర్మెడ్ మెజర్ అంటున్నారు. ‘థయామిన్’ లేదా ‘విటమిన్ బి1’ లోపం పలు అనారోగ్య సమస్యలకు దారితీసుందని ఆయన హెచ్చరిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ‘థయామిన్’లోపంపై పలు కీలక విషయాలను పంచుకున్నారు. కారణం లేకుండా వేధించే అలసట వెనుక ఈ విటమిన్ లోపం ఎలా దాగి ఉంటుందో ఆయన వివరించారు.గుర్తించడం చాలా కష్టంచాలా మందిలో థయామిన్ లోపం ఉన్నప్పటికీ, సాధారణ రక్త పరీక్షల ద్వారా దీనిని త్వరగా గుర్తించలేమని డాక్టర్ మెజర్ పేర్కొన్నారు. దీనికి ప్రధాన కారణం ఈ లక్షణాలు ఇతర సాధారణ ఆరోగ్య సమస్యలను పోలి ఉండటమేనని ఆయన తెలిపారు. ‘ప్రారంభ దశలో థయామిన్ లోపం ఉంటే విపరీతమైన అలసట, చికాకు, మతిమరుపు లేదా నిద్రలేమి వంటి లక్షణాలు కనిపిస్తాయి. వీటిని బాధితులు మాత్రమే కాదు, వైద్యులు కూడా సాధారణ ఒత్తిడి లేదా వయసు పెరగడం వల్ల వచ్చే మార్పులుగా భావించి నిర్లక్ష్యం చేసే అవకాశం ఉందని ఆయన విశ్లేషించారు.థయామిన్ నిల్వలు తగ్గుతాయిలా..మన శరీరం విటమిన్ బి1ను ఎక్కువ కాలం నిల్వ చేసుకోలేదు. కేవలం 20 నుండి 30 రోజులకు సరిపడా నిల్వలు మాత్రమే మన శరీరంలో ఉంటాయి. కాబట్టి, మనం తీసుకునే ఆహారం సరిగ్గా లేకపోయినా లేదా అధిక చక్కెర పదార్థాలు తీసుకున్నా ఈ నిల్వలు చాలా వేగంగా తగ్గిపోతాయి. దీనిని డాక్టర్ మెజర్ ‘థయామిన్ డ్రైన్స్’గా పేర్కొన్నారు. శుద్ధి చేసిన పిండి పదార్థాలు మనం తీసుకునే మైదా, వైట్ రైస్ వంటి పదార్థాలను గ్లూకోజ్గా మార్చే ప్రక్రియలో థయామిన్ ఒక కీలకమైన కో-ఫ్యాక్టర్గా పనిచేస్తుంది. వీటిని అధికంగా తీసుకోవడం వల్ల శరీరంలో ఉన్న థయామిన్ వేగంగా ఖర్చవుతుంది.మద్యపానం ఆల్కహాల్ అలవాటు ఉన్నవారిలో థయామిన్ గ్రహించే శక్తి తగ్గిపోతుంది. దీనివల్ల ఈ లోపం ఏర్పడే ప్రమాదం ఎక్కువ.మందుల ప్రభావం రక్తపోటు (బీపీ) నియంత్రణ కోసం వాడే కొన్ని రకాల 'డైయూరిటిక్స్' మందులు, మూత్రపిండాల ద్వారా థయామిన్ శరీరం నుండి బయటకు వెళ్లిపోయేలా చేస్తాయి.శారీరక ఒత్తిడి విపరీతమైన శారీరక శ్రమ లేదా తీవ్రమైన అనారోగ్యం సమయంలో కూడా ఈ పోషక అవసరాలు పెరుగుతాయి.ఈ లక్షణాలను విస్మరించొద్దుథయామిన్ లోపం ప్రారంభంలో చాలా సాధారణంగా అనిపించినా, అది క్రమంగా తీవ్రరూపం దాలుస్తుంది. అందుకే శరీరంలో కలిగే కొన్ని ముఖ్య లక్షణాలను గుర్తించాలి.నిరంతర అలసట: రాత్రంతా నిద్రపోయినా ఉదయాన్నే లేవగానే నీరసంగా అనిపించడం.మెంటల్ ఫజ్జినెస్ : ఏదైనా విషయంపై దృష్టి పెట్టలేకపోవడం, ఆలోచనలు స్పష్టంగా లేకపోవడం.మూడ్ స్వింగ్స్: చిన్న చిన్న విషయాలకే విపరీతమైన చికాకు లేదా కోపం రావడం.మతిమరుపు: ఇటీవల జరిగిన విషయాలను కూడా గుర్తుంచుకోవడంలో ఇబ్బంది పడటం.నిర్లక్ష్యం చేస్తే ప్రాణాపాయమా?థయామిన్ లోపం తీవ్రమైతే అది 'బెరిబెరి' (Beriberi) అనే ప్రమాదకరమైన వ్యాధికి దారితీస్తుంది. ఇది నాడీ వ్యవస్థను, గుండె పనితీరును దెబ్బతీస్తుంది. దీనివల్ల కండరాలు క్షీణించడం, కాళ్లు చేతులు మొద్దుబారిపోవడం, చివరికి గుండె వైఫల్యం (Heart Failure) సంభవించే అవకాశం ఉందని డాక్టర్ మెజర్ హెచ్చరించారు.పరిష్కారం ఏమిటి?థయామిన్ లోపాన్ని చాలా సులభంగా సరిదిద్దవచ్చు. డాక్టర్ మెజర్ సూచనల ప్రకారం..ఆహార మార్పులు: పోషకాలు పుష్కలంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం ద్వారా ఈ లోపాన్ని భర్తీ చేయవచ్చు.సప్లిమెంట్లు: ముఖ్యంగా వృద్ధులు, సరైన పోషకాహారం తీసుకోలేని వారు లేదా ఆల్కహాల్ అలవాటు ఉన్నవారు వైద్యుల సలహాతో 'లిపిడ్-సోలబుల్ థయామిన్' సప్లిమెంట్లను వాడవచ్చు.కొన్నివారాల్లోనే మాయం: శరీరంలో థయామిన్ స్థాయిలు మళ్ళీ సాధారణ స్థితికి చేరగానే, ఆహారం శక్తిగా మారే ప్రక్రియ మెరుగుపడుతుంది. దీనివల్ల ఏళ్ల తరబడి వేధిస్తున్న అంతుచిక్కని అలసట కేవలం కొన్ని వారాల్లోనే మాయమవుతుంది.గమనిక: ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. మీకు ఇలాంటి లక్షణాలు ఉంటే, సొంతంగా నిర్ణయాలు తీసుకోకుండా వెంటనే అర్హత కలిగిన వైద్యులను సంప్రదించి అవసరమైన పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం.ఇది కూడా చదవండి: ఏఐ మేధావికి ఇలాంటి టెస్టా?.. ఇంత కన్నా ఘోరం ఉంటుందా? -
76 రోజుల్లో ఏడు కిలోల బరువు..!
బరువు తగ్గడంలో కొందరు అనుసరించే ఆరోగ్యకరమైన విధానాలు ఎందరికో ప్రేరణగా ఉంటాయి. అలాంటి వెయిట్లాస్ జర్నీ గురించి మహారాష్ట్ర వైద్యుడు చూసిన ఒక కేసు గురించి చెప్పుకొచ్చారు. ఒక రియల్ జంట అద్భుతంగా బరువు తగ్గినం విధానాన్ని షేర్చేసుకున్నారు. మొదట తన వద్దకు కాస్త తగ్గితే చాలని వచ్చిన వాళ్లు ఎంతలా అనూహ్యంగా బరువు తగ్గారో చెప్పారు. జస్ట్ రెండున్నర నెలలో ఇంతలా బరువు తగ్గుతారని అస్సలు ఊహించలేదని అంటున్నారు. మరి అదెలాగో చూద్దామా..!పిసిఒఎస్, డయాబెటిస్, ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్, ఊబకాయం తదితరాల హోపియోపతిక్ ప్రాక్టీషనర్ డాక్టర్ సయాజిరావ్ గైక్వాడ్ తన అనుభవంలో చూసిన ఒక జంట కేసు గురించి చెప్పుకొచ్చారు. ఆ దంపతులు సాధారణ వెయిట్లాస్ కోసం వచ్చారని అన్నారు. సూచించిన కొద్ది ఆహారపు మార్పులతో ఇద్దరూ జస్ట్ రెండున్నరనెలల్లోనే ఏకంగా ఏడు కిలోలు తగ్గారని చెప్పారు. భర్త 71 కిలోల నుంచి 64 కిలోలకు, భార్య 82 నుంచి 75 కిలోలకు తగ్గారని చెప్పుకొచ్చారు. ఇలా బరువు తగ్గడంతో ఇద్దరికి వాపు, ఎల్డీఎల్ స్థాయిలు, బొడ్డుకొవ్వు కూడా గణనీయంగా తగ్గిందని పేర్కొన్నారు. మలబద్దక సమస్య కూడా చాలావరకు తగ్గిందని అన్నారు. అయితే ఈ దంపతులు ఎలాంటి క్రాష్డైట్ అనుసరించలేదని, స్థిరమైన ఆహార విధానాన్ని అనుసరించారని చెప్పారు. ఈ ఇద్దరు ఉపకరించిన ఆ ఏడు ఆహారపు అలవాట్ల గురించి వెల్లడించారు.రెండుపూటలా తినడం..ప్రతి రోజు రెండు పూటలా తింటే చాలని అన్నారు. అలాగని అల్పాహారం ఎక్కువగా తీసుకోవద్దని సూచించారు.ప్రోటీన్కు ప్రాధాన్యత ఇవ్వండినిపుణుడి ప్రకారం, ప్రతి భోజనంలో ప్రోటీన్ను కీలకమైన భాగంగా చేసుకోవడం వల్ల సులభంగా బరువు తగ్గుతారని అన్నారు. ముఖ్యంగా గుడ్లు, పప్పులు, పెరుగు, పనీర్ను వారి ఆహారంలో చేర్చుకోవాలని ఆయన దంపతులకు సలహా ఇచ్చారు.శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లను తొలగించారుతరువాత, హోమియోపతి నిపుణుడు ఆహారం నుంచి శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లను తొలగించాలని సూచించారు. ఈ జంట స్వీట్లు, చక్కెర, బేకరీ ఆహారాలను తినకుండా ఉండాలని చెప్పానని అన్నారు.ఫైబర్ అధికంగా ఉండే కూరగాయలు చేర్చుకోవడం..నిపుణుడు దంపతులకు ప్రతిరోజూ వారి భోజనంలో ఫైబర్ అధికంగా ఉండే కూరగాయలను చేర్చుకోవాలని సలహా ఇచ్చారు. ఆ ఆహార ప్రణాళికలో ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పనిసరి అయిన అంశం. ఇది కడుపు నిండిన భావనను పెంచుతుంది. అలాగే రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది.ప్రాసెస్ చేసిన ఆహారాన్ని నివారించండిబర్గర్లు, పిజ్జాలు, సమోసాలు వంటి ప్రాసెస్ చేసిన ఆహారాలు దరిచేరనివ్వదని సూచించారు. బరువు తగ్గడానికి ప్రయత్నించే వాళ్లు సదా ఇలాంటి వాటికి దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. డాక్టర్ సాయాజీరావు గైక్వాడ్ దంపతులు ఇంట్లో వండిన భోజనం మాత్రమే తినాలని, అల్ట్రా-ప్రాసెస్ చేసిన ఆహారాన్ని నివారించాలని చెప్పారు.రోజుకు 30-40 నిమిషాలు నడవండినిపుణుడు దంపతులను రోజుకు 30-40 నిమిషాలు నడవమని సూచించారు. అది కూడా ముఖ్యంగా భోజనం తర్వాత.స్థిరంగా ఉండండిబరువు తగ్గడం అనేది ఒక్కసారిగా జరిపోయేది కాదు. క్రమంత తప్పకుండా బరువు తగ్గడానికి ఏర్పాటు చేసుకున్న నియమాలను ఉల్లంఘించకుండా చూసకోవడం అత్యంత కీలకం. ఇక్కడ బరువు తగ్గడం అంత తేలికై పని కాకపోవచ్చు. కానీ శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లకు దూరంగా ఉంటూ..ఆకలి కోరికలు తగ్గేలా ఫైబర్ సమృద్ధిగా ఉండే ఆహారం తీసుకుంటే..వెయిట్లాస్ అనేది అత్యంత ఈజీ. అన్నింట్లంకంటే ముఖ్యమైనది స్థిరత్వాన్ని మెయింటైన్ చేయడమే అన్ని నొక్కి చెబుతున్నారు డాక్టర్ సయాజిరావ్ గైక్వాడ్. 2.5 months.One couple.Simple home-cooked food.✅ Results:• Weight ↓ 7 kg (both)• HbA1c improved• LDL cholesterol ↓• Waist ↓ ~3 inches• Constipation resolved• Energy levels ↑No crash diets.No supplements.Just disciplined nutrition. pic.twitter.com/d2302h5Iti— Dr.Sayajirao Gaikwad (@DietDrsayajirao) March 9, 2026 (చదవండి: ధన్యవాదాలకు మించింది..!ఇలాంటి కూతుళ్లు ఉంటే..) -
‘ఉగ్గు’తో ఉసురు తీయకండి!
కొందరు పెద్దలు సంప్రదాయంలో భాగమంటూ ‘ఉగ్గు’ పేరుతో పసిపిల్లల నాలుకకు తేనె రాస్తుంటారు. ఈ కార్యాన్ని శుభసూచికగా చెబుతారు. అయితే ముద్దులొలికే పసిపాపలకు అందించే ఆ ఒక్క తేనె చుక్క వారి ప్రాణాలకు ముప్పు తెచ్చిపెడుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఐర్లాండ్లోని అట్లాంటిక్ టెక్నలాజికల్ యూనివర్సిటీకి చెందిన ప్రముఖ నిపుణులు డాక్టర్ సురేష్ సి పిళ్ళై చిన్నారులకు తేనె పెట్టడం వలన కలిగే ప్రాణంతక ముప్పును తెలియజెప్పారు.జపాన్ చిన్నారి మరణంతో వెలుగులోకి..గత కొంతకాలంగా పసిబిడ్డలకు తేనె పెట్టడంతో కలిగే ముప్పుపై ప్రపంచవ్యాప్తంగా చర్చ మొదలైంది. 2017లో టోక్యోలో జరిగిన ఒక విషాద ఘటన ఈ నాటికీ వెంటాడుతోంది. నాడు ఆరు నెలల వయసున్న చిన్నారికి తేనె కలిపిన ఆహారాన్ని ఇవ్వగా, ఆ పసిపాప ‘ఇన్ఫాంట్ బోటులిజం’ బారిన పడి మృతి చెందింది. తేనెలో ఉండే ప్రమాదకర బ్యాక్టీరియా కారణంగా ఈ వ్యాధి సంభవిస్తుందని వైద్య పరీక్షల్లో తేలింది.శరీరం మొద్దుబారిపోయేలా చేసి..అప్పటి నుంచి జపాన్ సహా పలు దేశాలు ఏడాదిలోపు పిల్లలకు తేనె ఇవ్వకూడదనే కఠిన నిబంధనను అమలు చేస్తున్నాయి. తేనెలో 'క్లోస్ట్రిడియం బోటులినమ్' అనే బ్యాక్టీరియా ఉంటుంది. ఇది అత్యంత కఠిన పరిస్థితుల్లోనూ ఏళ్ల తరబడి సజీవంగా ఉంటుంది. ఏడాదిలోపు చిన్నారుల జీర్ణవ్యవస్థ ఇంకా పూర్తిగా అభివృద్ధి చెందదు. వారి పేగుల్లో మంచి బ్యాక్టీరియా తక్కువగా ఉండటంతో, ఈ ప్రమాదకర బ్యాక్టీరియా సులభంగా లోపలికి ప్రవేశించి, విషతుల్యమైన 'బోటులినమ్ టాక్సిన్'ను విడుదల చేస్తుంది. ఇది నేరుగా బిడ్డ నరాల వ్యవస్థపై ప్రభావం చూపి, శరీరం మొద్దుబారిపోయేలా చేస్తుంది.పెద్దలకు లేని ముప్పు.. పిల్లలకే ఎందుకు?తేనెను పెద్దలు తీసుకున్నప్పుడు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే పెద్దవారి జీర్ణాశయంలో ఉండే శక్తివంతమైన ఆమ్లాలు, ఇతర బ్యాక్టీరియాలు ఈ బోటులినమ్ మూలాలను నిర్వీర్యం చేస్తాయి. అయితే పసిపిల్లల విషయంలో ఇలా జరగదు. అందుకే అమెరికాకు చెందిన ఎఫ్డీఏ (ఎఫ్డీఏ) వంటి సంస్థలు సైతం ఏడాది దాటే వరకు పిల్లలకు కనీసం ఒక్క తేనె చుక్క కూడా ఇవ్వకూడదని స్పష్టం చేస్తున్నాయి.పాత అలవాట్లకు స్వస్తి పలకాల్సిందే!సంప్రదాయం పేరిట గర్భవతులు, బాలింతలు లేదా పసిబిడ్డలకు తేనెను రుచి చూపించడం మానుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఆహార పదార్థాల నిల్వలో తేడా వచ్చినా లేదా కలుషితమైన క్యాన్డ్ ఫుడ్ తిన్నా పెద్దల్లో కూడా అప్పుడప్పుడు ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి. గత ఏడాది ఇటలీలో జరిగిన ఒక ఘటనలో ఇలాంటి విషతుల్యమైన ఆహారం తిని ఒకరు మరణించగా, మరో తొమ్మిది మంది ఆస్పత్రి పాలయ్యారు. అందుకే సహజసిద్ధమైన ఆహారమైనప్పటికీ పసిపిల్లల విషయంలో తేనె అత్యంత ప్రమాదకరమని గుర్తుంచుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.ఇది కూడా చదవండి: ట్రంప్ విధ్వంసం: ‘క్రౌన్ జ్యువెల్’పై భీకర దాడి -
ఫిట్నెస్లో సరికొత్త ట్రెండ్
నగరవాసులు శాకాహారులుగా మారుతున్నారు.. ఆహారంపై క్రమంగా పెరుగుతున్న అవగాహనతో అటువైపు అడుగులు వేస్తున్నారు. వేగవంతమైన లైఫ్స్టైల్కు కేంద్రమైన హైదరాబాద్లో.. ఓ వైపు మెట్రో పరుగులు, ఆఫీస్ డెడ్లైన్లు, పార్టీ కల్చర్, మరోవైపు వీకెండ్ హ్యాంగౌట్స్.. ఇవన్నీ కలిసి మన ఆహార అలవాట్లను పూర్తిగా మార్చేశాయి. ఎప్పుడు, ఏమి, ఎంత తింటున్నాం అన్న ఆలోచన లేకుండానే రోజులు గడిచిపోతున్నాయి. ఫలితం.. డైట్ బ్యాలెన్స్ తప్పుతోంది. ఫలితంగా ఆరోగ్య సమస్యలు, మానసిక ఒత్తిడి పెరుగుతున్నాయి. దీనికితోడు అడుగడుగునా రెస్టారెంట్లు, ఫుడ్ కోర్టులు, స్ట్రీట్ ఫుడ్ స్టాల్స్.. అంతేనా! మొబైల్ ఫోన్లో ఒక్క క్లిక్తో.. నిమిషాల్లో ఇంటికి వచ్చే ఆన్లైన్ ఫుడ్ డెలివరీ వంటివి మన అలవాట్లను దెబ్బతీస్తున్నాయి. దీన్ని మార్చేందుకు కొందరు కొత్త ట్రెండ్ ఫాలో అవుతున్నారు.. సిటీ ట్రెండ్స్ కారణంగా మన ఆహార అలవాట్లలో భారీ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. పని ఒత్తిడి కారణంగానో.. అలసట కారణంగానో.. ‘ఈ రోజు వండుకోకపోతే ఏమైంది?’ అనే భావన సాధారణం అయ్యింది. ఉదయం అల్పాహారాన్ని తప్పించి కాఫీతో సరిపెట్టడం, లంచ్కు బిర్యానీ/ బర్గర్తో ముగించడం, రాత్రి ఆలస్యంగా హెవీ డిన్నర్.. ఇవన్నీ నగర యువతలో సాధారణ అంశాలు. వీటన్నింటినీ సమత్యుల్యం చేయడంపై దృష్టి సారిస్తున్నారు కొందరు నగరవాసులు. ఇందులో భాగంగా వెజ్ వీక్, లంచ్ బాక్స్ మంథ్ అంటూ కొత్త ట్రెండ్కు నాంది పలుకుతున్నారు. నాన్ వెజ్ డామినేషన్? ఒకప్పుడు మాంసాహారం వారానికి ఒకటి, రెండు సార్లు మాత్రమే ఉండేది. ప్రస్తుతం చికెన్, మటన్, ఫిష్ పేర్లతో రోజుకో వెరైటీ మన ప్లేట్లో వచ్చి చేరుతోంది. ప్రొటీన్ పేరుతో మాంసాహారాన్ని అధికంగా తీసుకుంటున్నారు. ఫైబర్ తక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం, కూరగాయల నిర్లక్ష్యం.. వంటి కారణాలతో ఊబకాయం, కొలె్రస్టాల్, షుగర్ వంటి రోగాల భారిన పడుతున్నారు. ముఖ్యంగా 25–40 ఏళ్ల వయసులోనే లైఫ్స్టైల్ రోగాలు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. దీనిని అధిగమించేందుకు నిపుణుల సూచనల మేరకు కొందరు క్రమంగా శాకాహారంపై ఆసక్తి కనబరుస్తున్నారు.నో ఔట్సైడ్ ఫుడ్ చాలెంజ్.. ఇలాంటి పరిస్థితుల్లో నగరవాసుల్లో కొత్త అవేర్నెస్ కనిపిస్తోంది. పూర్తిగా డైట్ మార్చలేకపోయినా, కనీసం కొన్ని రోజులు నియంత్రణలో ఉండాలనే ప్రయత్నం పెరిగింది. ‘వెజ్ వీక్’, ‘వెజ్ మంథ్’ అంటూ కొన్ని రోజులు నాన్వెజ్కు బ్రేక్ పెట్టడం.. ఏడు రోజులు ‘నో ఔట్సైడ్ ఫుడ్’ చాలెంజ్, ఓన్లీ హోమ్ ఫుడ్’, రెగ్యులర్ లంచ్ బాక్స్.. వంటివి ట్రెండ్గా మారాయి. ఆఫీసులో సహోద్యోగులతో కలిసి ‘హోమ్ ఫుడ్ డేస్’ ప్లాన్ చేయడం.. ఒకప్పటి స్కూల్ డేస్ను గుర్తు చేస్తున్నాయి. స్వయంగా వంట చేసుకునే యువత కూడా పెరుగుతోంది. రైస్, కూర, పప్పు, పెరుగు వంటి సింపుల్ మీల్స్ ఎంత ఆరోగ్యకరమో మళ్లీ అర్థమవుతోంది. దీనికి తోడు మీల్ ప్రిప్ కల్చర్, వారం రోజులు వంట సిద్ధం చేసుకోవడం వంటి కాన్సెప్్ట్స హైదరాబాద్లో పాపులర్ అవుతున్నాయి.చిన్న ప్రయత్నం.. పెద్ద మార్పు.. అందరూ ఒక్కసారిగా ఫిట్ ఫుడ్కే మారాలి అనుకోవడం ఆచరణసాధ్యం కాకపోవచ్చు. కానీ వారానికి కొన్ని రోజులు కంట్రోల్డ్ డైట్, ఇంటి ఆహారానికి ప్రాధాన్యం, నాన్ వెజ్ను పరిమితంగా తీసుకోవడం, బయట ఆహారం తగ్గించడం.. ఇవే పెద్ద మార్పుకు పునాది. నగర జీవనశైలిలో ఫాస్ట్ ఫుడ్ తప్పదనిపించినా, ఆరోగ్యం కోసం తీసుకునే చిన్న నిర్ణయాలే భవిష్యత్తును కాపాడతాయనేది డైట్ నిపుణుల అభిప్రాయం. -
వెల్నెస్ డ్రింక్స్ మంచివేనా?
ఇటీవల కొన్ని పోషకాహార పదార్థాలూ, ఖనిజ లవణాలతో కూడిన పదార్థాలు చేర్చిన పానీయాలు చాలా ఎక్కువ ్రపాచుర్యం పొందుతున్నాయి . వీటినే వెల్నెస్ డ్రింక్స్గా పేర్కొంటున్నారు. మంచి ఆరోగ్యం కోసం వీటిని తీసుకోవాలంటూ కొంతమంది ఆహార నిపుణులు సిఫార్సు చేస్తున్నారు కూడా. అయితే కొందరు మాత్రం వీటితో చాలా ఆరోగ్య ప్రయోజనాలుంటాయంటూ పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో అసలు ఈ వెల్నెస్ డ్రింక్స్ తీసుకోవడం ఏ మేరకు ప్రయోజనం... ఎంత వరకు సహాయపడతాయనే అంశాలను పరిశీలిద్దాం...మాక్టెయిల్స్ పేరిట మంచి రుచికరమైన పానీయాలు ఎప్పటినుంచో ఉన్నవే. కాకపోతే ఇటీవల వెల్నెస్ డ్రింక్స్ ట్రెండింగ్ అవుతున్నాయి. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్స్లో ఈ వెల్నెస్ డ్రింక్స్ అవి తయారు చేసే పద్ధతులను పెడుతూ, వాటిని తీసుకుంటే ఆరోగ్యమూ, వ్యాధినిరోధక శక్తి సమకూరతాయంటూ చెబుతున్నారు. వాటి తాలూకు ఉపయోగాలూ, పరిమితులు చూద్దాం...వీటిల్లో ఏముంటాయంటే... మామూలు మాక్టెయిల్స్లో సాధారణ సోడా డ్రింక్స్తో పాటు అనేక రకాల రుచికరమైన ఎసెన్స్లను కలిపి తయారు చేస్తారు. ఒకటికంటే ఎక్కువ ఫ్లేవర్స్ ఉంటాయి కాబట్టే మాక్టెయిల్స్ అని పిలుస్తారు. అయితే వీటిల్లో ఆరోగ్యానికి తోడ్పడే విటమిన్లు, ఖనిజలవణాలూ, యాంటీ ఆక్సిడెంట్స్,ప్రోబయాటిక్స్, కొబ్బరినీళ్లు, గ్రీన్ టీ...లతో పాటు... పసుపు, అల్లం, కొలాజెన్, అడాప్టోజెన్స్ సమృద్ధిగా ఉండే పదార్థాలు వాడతారు. అడాప్టోజెన్స్ అంటే మొక్కల నుంచి లభ్యమయ్యే మెడిసినల్ విలువలుండే రకరకాల పదార్థాలు. వీటిని తీసుకోగానే ఒక ఆనందకరమైన భావన (యుఫోరియా ఫీలింగ్) కలుగుతుంది. ఉదాహరణకు... కొబ్బరినీరు తీసుకోగానే కలిగిన మంచి ఫీలింగ్స్ లాంటివి. అల్లం వాడగానే గొంతులోని శ్లేష్మం వదిలిపోయిన భావనల్లాంటివి.ప్రధానంగా మెగ్నీషియమ్ డ్రింక్స్... ఈ వెల్నెస్ డ్రింక్స్లో ప్రధానంగా మెగ్నీషియమ్తో చేసినవి ఎక్కువగా వాడుతుంటారు. ఎందుకంటే మెగ్నీషియమ్ లవణాలు మెదడును ప్రశాంతంగా ఉండే న్యూరో ట్రాన్స్మిటర్ అయిన ‘గాబా’ (గాబా అమైనో బ్యూటెరిక్ యాసిడ్కు సంక్షిప్త రూపం)ను క్రియాశీలం చేయడం ద్వారా మెదడును... తద్వారా మనసును ప్రశాంతంగా ఉండేలా చేస్తాయి. దాంతో దేహం ‘రెస్ట్ అండ్ రిపేర్’ మోడ్లోకి వెళ్తుందన్నది నిపుణుల మాట. ఇలా మెగ్నీషియమ్ ప్రధానంగా ఉండేవాటిల్లో కొన్ని...∙మెగ్నిషియమ్ గ్లైసినేట్ ప్రధానంగా ఉన్నవి మంచి నిద్రపట్టడానికీ, యంగై్జటీ తగ్గడానికీ ∙మెగ్నీషియమ్ టారేట్ ఉన్నవి నరాల వ్యవస్థను ఎగై్జట్ కాకుండా కామ్గా ఉంచడానికీ ∙మెగ్నీషియమ్ సిట్రేట్ ఉన్నవి బాగా నిద్రపట్టడంతో పాటు తేలిగ్గా విరేచనమయ్యేలా చేసి మలబద్ధకం తొలగించడానికి ఉపయోగపడతాయి.ఏయే పదార్థాలతో తయారు చేస్తారంటే... సాధారణంగా పింక్ రంగులో చాలా కలర్ఫుల్గా ఉండే ఈ డ్రింక్స్లో టార్ట్ చెర్రీ జ్యూస్, మాగ్నీషియం ΄÷డి, స్పార్క్లింగ్ వాటర్తో తయారు చేస్తారు. వీటిల్లో మెగ్నీషియమ్ ఖనిజాలే కాకుండా అరటిపండ్లు, కివీ పండ్లు, అవకాడో పండ్లు, ఆకుకూరలలో పాలకూర (స్పినాచ్) వంటివీ ఉపయోగిస్తారు. పాలు కూడా ఉపయోగిస్తారు. ఉదాహరణకు పాలలో ఉండే ‘ట్రి΄÷్టఫాన్’ అనే అమైనో యాసిడ్ నిద్రను ప్రేరేపించే మెలటోనిన్ అనే మెదడు రసాయనాన్ని స్రవింపజేసి హాయిగొలిపే నిద్రను ఇస్తుంది. అలాగే పండ్లతో కూడిన ఈ వెల్నెస్ డ్రింక్స్లో స్వాభావికంగా దొరికే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, ఫైబర్ ఉండటంతో ఆరోగ్య నిర్వహణకు బాగానే తోడ్పతాయి.ఆహార నిపుణులఅభిప్రాయాల మేరకు... ప్రయోజనాలేమిటంటే... మెగ్నీషియమ్ లవణాలూ, ఖనిజాలూ, విటమిన్ బి–12, ఐరన్ వంటి పోషకాలూ, ఆహారంలో లభ్యమయ్యే పీచు (ఫైబర్)లు స్వాభావికమైన పదార్థాలతోనే సమకూరడం వల్ల ఈ పోషకాలన్నీ సప్లిమెంట్లలా మనకు మామూలుగా దొరుకుతాయి. దాంతో ఆ ఆహార లోపాలేవైనా (విటమిన్ / మినరల్ డెఫిషియెన్సీస్) ఉంటే అవి నేచురల్గానే భర్తీ అవుతాయి. ఇకప్రోబయాటిక్స్ వంటి వాటివల్ల జీర్ణకోశ ఆరోగ్యం (గట్–హెల్త్) మెరుగుపడుతుంది. యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండే పానీయాలతో దేహంలోని సెల్ రిపేర్స్ జరుగుతుంటాయి. తీవ్రమైన ఒత్తిడిలో పనిచేసేవారికీ, సరైన నిద్రలేనివారికి ఇవి కొంతవరకు తోడ్పడతాయి.పరిమితులేమిటంటే... ఈ వెల్నెస్ డ్రింక్స్ అన్నవి మామూలుగా పోషకలోపాలు ఉన్నవారికి ఇచ్చే ‘న్యూట్రస్యూటికల్ మెడిసిన్స్’ లాంటివే. అంటే విటమిన్ సప్లిమెంట్ల మాదిరిగానే పనిచేస్తాయి. అయితే మంచి పోషకాహారం తీసుకుంటూ, కంటినిండా నిద్రపోతూ, సరైన వ్యాయామం చేస్తూ ఉన్నప్పుడు మాత్రమే ఇవి అదనంగా సమకూరుతూ దేహ ఆరోగ్యాన్ని కొంతమేరకు బూస్ట్ చేయడానికి పనికి వస్తాయి. అంతే తప్ప... మిగతా పోషకాహారాలకూ, వ్యాయామలేమికీ ఇవి ప్రత్యామ్నాయంగా గానీ లేదా కొన్ని ఆరోగ్య సమస్యలకు శాశ్వత పరిష్కారాలుగా పనిచేయవు. కాకపోతే వీటివల్ల నష్టమేదీ లేనందున అదనంగా తీసుకోవడంలో తప్పేమీ ఉండదు. వెల్నెస్ డ్రింక్స్ అనేవి ఆరోగ్యకరమైన జీవనశైలికి కొంతమేరకు తోడ్పడవచ్చు గానీ అవి మాత్రమే మన ఆరోగ్యాన్ని పూర్తిగా మార్చివేయలేవని గుర్తించాలం’’టూ ఆహార నిపుణులు పేర్కొంటున్నారు.నిర్వహణ: యాసీన్ -
స్ట్రోక్ బాధితురాలి ఘనత..! ఏకంగా రెండు ప్రపంచ రికార్డులు..
చాలామంది అప్పటి వరకు సామాన్యులుగా కనిపించినవాళ్లు..జీవితం పెట్టిన పరీక్షలతో ఒక్కసారిగా స్ఫూర్తిదాయకమైన వ్యక్తులుగా నిలుస్తారు. ప్రపంచమే జైజైలు పలికేలా ఆకామంత ఎత్తున నిలుస్తారు. అంతేగాదు కష్టం వస్తే కాళ్లు మునగదీసి ఏడుస్తూ కూర్చొవడం కాదు..కన్నెర్రజేసేలా హీరోలా బతికి చూపించాలి..మార్గదర్శకంగా ఉండాలని చేతలతో చూపిస్తారు. అలాంటి మాటలకు నిలువెత్తు అర్థం ఈ మహిళ. భయంకరమైన అనారోగ్య సమస్య ఆమెను భయపెట్టలేదు కదా..మరింత బలోపేతమై గొప్ప విజయాన్ని అందుకునేందుకు పురిగొల్పింది. ఆ మహిళే జయశ్రీ విజయ్ మోహన్. చెన్నైకి చెందిన జయశ్రీ కొన్ని నెలల క్రితం టాంజానియాలో ఉన్న ప్రపంచంలోనే ఎత్తైన స్వేచ్ఛా పర్వతం అయిన కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించారామె. ఇది అత్యంత కఠినమైన పర్వత శిఖరాగ్రం. ఎందుకంటే శిఖరాగ్రం సమీపం చేరుకునే రోజున అస్సలు విశ్రాంతి తీసుకోకుండా సుమారు వెయ్యి మీటర్లు దాక 15 గంటల పాటు ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ సముద్ర మట్టంలో సాధారణంగా లభించే ఆక్సిజన్ స్థాయిలో సగం మాత్రమే ఉంటుంది. అలాంటి దుర్భేద్యమైన పర్వతాన్ని కేవలం ఐదు రోజుల్లో అదికూడా 6.5 గంటల్లో అవలీలగా అధిరోహించింది. అలాగే వెనక్కి(అవరోహణ) 10.26 గంటల్లో ట్రెక్కింగ్ చేస్తూ వచ్చేశారామె. ఈ అరుదైన ఘనతతో జయశ్రీ ఒకటి కాదు ఏకంగా రెండు గిన్నిస్ రికార్డుల నెలకొల్పింది. ఇలా అతి తక్కువ సమయంలో మహిళల విభాగంలో కిలిమంజారోని అధిరోహించి.. వెనక్కి వచ్చేసిన తొలి మహిళగా నిలిచారామె. ఇంతటి ఘనతను సృష్టించిన జయశ్రీ నిజానికి ఆరోగ్యవంతమైన మహిళ కాదు. ఆమె ఒక స్ట్రోక్ బాధితురాలు. తన రికార్డు ఇతర మహిళలను ప్రేరేపించాలనే ఉద్దేశ్యంతో ఈ సాహసానికి పూనుకున్నట్లు తెలిపారామె. ఆమె ఒక తల్లిగా, విజయవంతమైన వ్యవస్థాపకురాలిగా హాయిగా సాగిపోతున్న జీవితాన్ని స్ట్రోక్ ఒక్క కుదుపుతో దబాలున కిందపడేసినట్లయ్యింది. జయశ్రీ ఎడమవైపు మొత్తం పక్షవాతానికి గురై ఆస్పత్రులు చుట్టూ తిరుగుతున్నా..తనకేమైందన్నది అర్థం గాక, తన శరీరం తనమాట వినక పడిన బాధ అంత ఇంత కాదు. పిల్లల కళ్లలో ఆందోళన ఒక్కటే తనకేదో అయ్యిందని అనిపిస్తోంది కానీ తన చుట్టూ ఏం జరుగుతోందో తెలియని పరిస్థితి. వివిధ ఆస్ప్రతులు తిప్పుతూ తన వాళ్లు పడుతున్న బాధ అర్థమవుతున్నా..ఏం చేయలేని ఆ నిస్సహాయత ఎప్పటికీ మర్చిపోలేనంటోంది జయశ్రీ. ఆ తర్వాత వైద్యులు తన వద్దకు వచ్చి..ఆమె గతంలోలా మాములు మనిషి అవ్వలేదని, నాడీ సంబంధిత పూర్తి నష్టాన్ని తిప్పికొట్టలేమని తేల్చి చెప్పేశారు. అప్పుడే తేలిసిందామెకు ఇలాంటి పరిస్థితిని ఎలా హ్యాండిల్ చేయాలనేది.. అయితే తన స్థితిని మార్చలేకపోవచ్చు గానీ, ధైర్యాన్ని పోగొట్టుకోనక్కర్లేదని అంటోంది జయశ్రీ. అంతేగాదు ఆ సమయంలోనే అసలైనవి "బలం", "సంయమనం" అని తెలసుకున్నానని చెబుతోంది. అప్పుడు అర్థం చేసుకున్నా.. శరీరం మాట వినడం, దాని పరిమితులు అర్థం చేసుకుంటూ ముందుకు సాగడం ఎలా అని పూర్తిగా తెలుసుకున్నానని చెప్పుకొచ్చింది. కోలుకోవడం మొదలయ్యాక..ఏదో అనారోగ్య బాధితురాలిలా ఉండిపోవడం నచ్చక ఏదో ఒకటి సాధించి చూపించాలి అలాగే తనలాంటి మహిళల్లో స్థైర్యం నింపాలన్న ఆకాంక్ష ఈ సాహసానికి పురిగొల్పిందని చెప్పుకొచ్చింది జయశ్రీ. నిజానికి ఈ పర్వత ట్రెక్కింగ్ కోసం ముందుగా ఆమె శారీరకంగా మానసికంగా ప్రిపేరయ్యేందుకు ఎంతగానో శిక్షణ, ట్రీట్మెంట్ల తీసుకోవాల్సి ఉంటుంది. అయితే వాటన్నింటిని భేఖాతరు చేయకపోగా..రికార్డులు మీద రికార్డులు నెలకొల్పడం అంటే మాటలు కాదుగదా..!. View this post on Instagram A post shared by Storyboard18 (@brandstoryboard) (చదవండి: ఫిట్నెస్ అంటే సిక్స్ ప్యాక్ కాదు..ఆ సామర్థ్యం పొందడమే!: మిలింద్ సోమన్) -
ఆపిల్ వాచ్ ధరిస్తున్నారా..? పోషకాహార నిపుణుల స్ట్రాంగ్ వార్నింగ్
యాపిల్ వాచ్లను ఇష్టపడని వారుండదరు. ఇవి మన ఆరోగ్యం, జిమ్కి సంబంధించి కేలరీల ఖర్చు, ఆరోగ్య సమాచారం వరకు అన్ని అందించే ఆధునిక పరికరం. చెప్పాలంటే గడియారానికి మించినది. మన బాడీలోని అతిముఖ్యమైన పార్ట్లా బాగమైపోయింది. కానీ ఈ యాపిల్ వాచ్లను ఆ విధంగా అస్సలు చూడొద్దని అంటున్నారు అమెరికా ఆరోగ్య నిపుణులు. మిమ్మల్ని ఆరోగ్యపరంగా అలర్ట్ చేసే గొప్ప సాధనమే అయినా..కేర్ఫుల్గా ఉండకపోతే ప్రమాదమని హెచ్చరిస్తున్నారు పోషకాహార నిపుణులు. ఎందువల్ల ఇలా అంటున్నారంటే..జేబులో ఉండే స్మార్ట్ఫోన్ లేదా డెస్క్పై ఉపయోగించే ల్యాప్టాప్లా కాకుండా..స్మార్ట్వాచ్ చాలా ప్రత్యేకమైనది. ఇది 24/7 మన సంరక్షణ కోసం రూపొందించిన సాధనంగా అందరికీ అత్యంత ప్రీతీపాత్రమైనది. ఈ వాచ్లపై ఉండే మక్కువతో దాని భద్రత గురించి పెద్దగా అస్సలు పట్టించుకోరు కూడా. కానీ ఈ పరికరం గంటల తరబడి రేడియోఫ్రీక్వెన్సీ(RF) సంకేతాలను నేరుగా మన కణజాలంలోకి పంపుతుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. అంతేగాదు ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం ఈ ఫ్రీక్వెన్సీలను గ్రేడ్ 2B కార్సినోజెన్లుగా పేర్కొంది. ఆయా సంస్థలు ఈ వాచ్లో ఉద్గారాలు పరిమితుల్లో ఉన్నాయని చెబుతున్నప్పటికీ.. దీని పరిమితులు మనం నిద్రిస్తున్నపుడూ కూడా చేతికే ధరించేంత సురక్షితంగా రూపొందించింది మాత్రం కాదని నొక్కి చెబుతున్నారు నిపుణులు. ఇది కేవలం రేడియేషన్ మాత్రమే కాదు..దాని చుట్టూ ఉండే హై-ఎండ్ 'ఫ్లోరోఎలాస్టోమర్' బ్యాండ్లు తరుచుగా PFAS లేదా ఎక్కువ మోతాదులో రసాయనాలు ఉంటాయని పలు అధ్యయనాల్లో తేలింది. అమెరికన్ కెమికల్ సొసైటీ ప్రకారం, ఫ్లోరినేటెడ్ సింథటిక్ రబ్బరుతో తయారు చేసిన ఖరీదైన రిస్ట్బ్యాండ్లు ముఖ్యంగా అధిక స్థాయిలో రసాయనాలు ఉంటాయని 2024 జరిపిన అధ్యయనాల్లో తేలింది. దీనిలో PFAS సమస్య ఉందనేది వాస్తవమే అని నిరూపితమైంది. అందువల్ల దీన్ని గనుక దీర్ఘకాలంపాటు మణికట్టు వద్ద ధరిస్తే..ఈ రసాయనాలు చర్మం, రక్తప్రవాహంలోకి చొచ్చుకుపోతాయని అంటున్నారు నిపుణులు. ఈ PFAS విచ్ఛిన్నం కానందున, అవి కాలక్రమేణా అవయవాలలో పేరుకుపోతాయి. అవి కాస్తా కాలేయం, మూత్రపిండాలపై ఒత్తిడిని కలుగజేసి అనారోగ్యానికి దారితీస్తుందని చెబుతున్నారు. అంతేగాదు హార్మోన్లు ఇన్బ్యాలెన్సింగ్కి కారణమవుతుందని హెచ్చరిస్తున్నారు. ఇప్పటివరకు పరీక్షించిన 22 ప్రముఖ బ్యాండ్లలో 15 ఈ విషపదార్థాలను కలిగి ఉన్నాయని, అందులోనూ అధిక ధర కలిగిన ప్రీమియం బ్యాండ్లలో ఈ సమస్య మరింత ఎక్కువని అంటున్నారు.ఇది అవగాహన..సంరక్షణ కోసమే..ఇది లేనిపోని భయాలు కలుగజేసందుకు కాదని అవగాహన కల్పించేందుకేనని నొక్కి చెబుతున్నారు నిపుణులు. ఆపిల్ వాచ్ శక్తిమంతమైన సాధనమే కానీ..దాన్ని మన శరీరంలోని సహజ భాగంగా పరిగణించొద్దని హెచ్చరిస్తున్నారు. సురక్షితంగా ఎలా ఉపయోగించాలంటే.. సాంకేతిక ప్రయోజనాలు పొందేలా సురక్షితంగా ఎలా ఉపయోగిస్తే మంచిదంటే..సింథటిక్ ఫ్లోరోఎలాస్టోమర్ బ్యాండ్లను సేంద్రీయ తోలు, స్టెయిన్లెస్ స్టీల్ లేదా జనపనార వంటి సహజ పదార్థాలతో ఉపయోగించేందుకు ప్రయత్నించండివర్కింగ్ టైంలో లేదా ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు వాచ్ను తీసివేయండిపడుకునే ముందు వాచ్ ధరించడం మానేయండి. నిద్ర అంటే శరీరం నిర్విషీకరణపై దృష్టి పెడుతుంది కాబట్టి ఈ సమయంలో ఇతర రసాయనాలకు గురికావడం వల్ల సహజమైన నిద్ర ప్రక్రియకు అంతరాయం ఏర్పడుతుందని చెబుతున్నారు నిపుణులు.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. View this post on Instagram A post shared by Zib - Ayus Wellness - Health Optimisation | Mindset | Longevity (@ayuswellnessuk) (చదవండి: జస్ట్ ఒక్క ఏడాదిలో 26 కిలోల బరువు..! నో డైట్ ప్లాన్, నో ఫిట్నెస్ మంత్ర) -
జస్ట్ ఒక్క ఏడాదిలో 26 కిలోల బరువు..! నో డైట్ ప్లాన్, నో ఫిట్నెస్ మంత్ర
దేశంలో ప్రధాన ఆరోగ్య సమస్య అధిక బరువు అందర్నీ వేధిస్తున్న సమస్యగా మారింది. గంటల తరబడి కూర్చొని చేసే డెస్క్ ఉద్యోగాలు, కదలికలు లేకపోవడం, వీటికి తోడు జంక్ ఫుడ్ ఇవన్నీ ఊబకాయానికి దారితీస్తున్నాయి. దీన్ని తగ్గించుకోవాలని ఎంతో ప్రయాసపడి కఠిన డైట్లు అనసరించినా ఫలితం శూన్యంగా ఉంటుంది. అలాంటి వాళ్లు తప్పనిసరిగా ఈ మిరాకిల్ పద్ధతిని అనుసరించి త్వరితగతిన బరువు తగ్గొచ్చని చెబుతున్నారు కంటెంట్ క్రియేటర్ జెసికా ఆర్ట్వానీ. అదెలాగో ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. తాను ఆ పద్ధతిలోనే దాదాపు 26 కిలోలు బరువు తగ్గినట్లు తెలిపారు కూడా. మరి ఆ మిరాకిల్ టెక్నిక్ గురించి సవివరంగా తెలుసుకుందామా..!.చాలామంది బరువు తగ్గేందుకు షార్ట్కట్లు, తీవ్రమైన దినచర్యలు అనుసరిస్తుంంటారు. నిజానికి బరువు తగ్గడం అనేది సాధారణంగా స్థిరంగా చేసే చిన్న అలవాట్ల వల్లే సాధ్యమవుతుందని అంటున్నారు. గతేడాది నుంచి తాను చిన్ని చిన్న సాధారణ అలవాట్లపై దృష్టిపెట్టి 26 కిలోల బరువు తగ్గినట్లు తెలిపారు. తనకు ఈ 26 కిలోలు బరువు తగ్గడానికి ఆ ఐదు సాధారణ అలవాట్లు హెల్ప్ అయ్యాయని చెబుతోంంది. త్వరితగతిన బరువు తగ్గాలనుకునేవారికి ఇది ఓ అద్భుతమైన పద్ధతని అభివర్ణిస్తోంది. తాను ఎలాంటి స్ట్రిక్ట్ డైట్లు, ఖరీదైన ఫిట్నెస్ ప్రోగ్రామ్లు పాటించలేదని చెబుతోంది జెసికా. తన వెయిట్లాస్ జర్నీ గురించి మాట్లాడుతూ..తాను బరువు తగ్గడానికి స్థిరంగా ఈ ఐదు పనులు చేశానని తెలిపింది. ఎలాంటి ఫ్యాన్సీ హ్యాక్స్, షార్ట్కట్లు లేవని అంటోంది. సహాయపడిన ఆ ఐదు అలవాట్లు..వీలైనంత ఎక్కువగా నడవడం: నడక తన దినచర్యలో అతిపెద్ద మార్పులలో ఒకటి. సాధ్యమైనప్పుడల్లా తన రోజులో కదలికను ఒక భాగంగా చేసుకున్నానని జెసికా చెప్పింది. ఆమె మార్నింగ్ వాకింగ్, భోజనం తర్వాత రాత్రి తప్పనిసరిగా కొద్దిసేపు నడక చేసినానని వివరించారామె.ప్రాసెస్ చేసిన చక్కెరను పూర్తిగా తగ్గించడం: ప్రాసెస్ చేసిన చక్కెరను పూర్తిగా తొలగించానని తెలిపింది. అంటే అప్పుడప్పుడూ కనీసం దాని జోలికి పోలేదని, పూర్తిగా దూరం పెట్టానని చెప్పుకొచ్చింది. ఎక్కువ నీరు త్రాగడం: ఆమె దృష్టి సారించిన మరో అలవాటు హైడ్రేషన్. కానీ తగినంత నీరు త్రాగడం చాలా పెద్ద తేడాను చూపిస్తుంది. ఇది చాలా శక్తిమంతమైన మార్పుకి నాంది అని అంటోంది. ప్రోటీన్కు ప్రాధాన్యత ఇవ్వడం: ప్రోటీన్ తన భోజనంలో కీలక పాత్ర పోషించిందని చెబుతోంది. ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాలు మిమ్మల్ని ఎక్కువసేపు కడుపు నిండి ఉండేలా చేస్తాయి పైగా అనవసరమైన చిరుతిండిని తగ్గిస్తాయి. ఇక్కడ ప్రోటీన్ ఎక్కువసేపు కడుపు నిండిన అనుభూతినందించి, ఆకలి కోరికలను నియంత్రిస్తుంది.ఒక సవాలు పెట్టుకోవడం: తాను అనుకున్నట్లుగా అన్ని పాటించానా లేదా అనే సెల్ఫ్ చెకింగ్ లేదా జవాబుదారితనం తనకు బరువు తగ్గాలనే ఆకాంక్షను రెట్టింపు చేసేదట. దాంతో చాలా కేర్ఫుల్గా ఉండటమే గాక తనను తాను ప్రశ్నించుకునేటప్పడూ..దోషిలా ఉండకూదన్న భయం సదా వెయిట్లాస్ అయ్యేందుకు ప్రేరేపించేదట.ఇక్కడ జెసికా వెయిట్లాస్ జర్నీలో ..బరువు తగ్గాలంటే తీవ్రమైన మార్పులు, అతి వర్కౌట్లు అవసరం లేదు. కేవలం చిన్న అలవాట్లే స్థిరంగా.. కంటిన్యూటీ మిస్ కాకుండా చేస్తే చాలు బరువు తగ్గడం చాలా సులభమని తెలుస్తోంది కదూ.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం(చదవండి: చిన్న అలవాట్లు.. పెద్ద మార్పులు) -
ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర అలవాటు?
మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే పోషకాలతో కూడిన ఆహారం, వ్యాయామం ఎంత అవసరమో.. కొన్ని చెడు అలవాట్లకు దూరంగా ఉండటం కూడా అంతే ముఖ్యం. మనకు తెలియకుండానే మనం చేసే కొన్ని పనులు మన శరీరంలోని అంతర్గత అవయవాలను దెబ్బతీస్తాయి. అయితే, వీటిలో అన్నింటికంటే ప్రమాదకరమైన అలవాటు ఏది? అనే ప్రశ్నకు దశాబ్దాల అనుభవం కలిగిన ప్రముఖ వైద్యుడు సమాధానమిచ్చారు. అమెరికాకు చెందిన బోర్డ్-సర్టిఫైడ్ కార్డియోవాస్కులర్ సర్జన్ డాక్టర్ జెరెమీ ప్రపంచంలోని చాలామందిని పట్టిపీడిస్తున్న ఆ అలవాటు గురించి హెచ్చరించారు.అవయవాల విధ్వంసకారిప్రముఖ పాడ్కాస్టర్ మెల్ రాబిన్స్తో నిర్వహించిన చర్చలో డాక్టర్ జెరెమీ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఒక హృద్రోగ నిపుణునిగా మనిషి తప్పనిసరిగా దూరంగా ఉంచాల్సిన అలవాటు ఏది? అని అడిగినప్పుడు ఆయన ఏమాత్రం తడుముకోకుండా ‘ధూమపానం’ అని సమాధానమిచ్చారు. ‘సిగరెట్ తాగడం వల్ల శరీరంలోని ప్రతి అవయవానికి జరిగే నష్టం అంతా ఇంతా కాదు. దీనికి మించిన ప్రమాదకరమైన అలవాటు మరొకటి లేదని స్పష్టంగా చెప్పగలను’ అని ఆయన పేర్కొన్నారు.ఎందుకు అంత ప్రమాదకరంధూమపానం అనేది కేవలం ఊపిరితిత్తులను మాత్రమే దెబ్బతీసే అనారోగ్య సమస్య కాదని, ఇది ఒక 'మల్టీ-ఆర్గాన్ కిల్లర్' అని డాక్టర్ జెరెమీ అభివర్ణించారు. ఆయన విశ్లేషణ ప్రకారం:రక్తనాళాలు దెబ్బతినడం: సిగరెట్లలోని రసాయనాలు రక్తనాళాల లోపలి పొరలను నాశనం చేస్తాయి.ఆక్సిజన్ కొరత: రక్తంలో ఆక్సిజన్ శాతాన్ని తగ్గించి, గుండెపై విపరీతమైన ఒత్తిడిని పెంచుతాయి.క్యాన్సర్ కారకం: ఊపిరితిత్తుల క్యాన్సర్కు ప్రధాన కారణం ధూమపానం. ఇది ఇతర రకాల క్యాన్సర్లకు కూడా పునాది వేస్తుంది.‘నా 25 ఏళ్ల కెరీర్లో ఎంతోమంది రోగులను చూశాను. నికోటిన్ వ్యసనం నుండి బయటపడటం ఎంత కష్టమో నాకు తెలుసు. ఇది ప్రాణాలను హరిస్తుందనే నిజాన్ని ఎవరూ ఎంతమాత్రం విస్మరించకూడదు. నా దృష్టిలో అత్యంత ప్రమాదకరమైన అలవాట్ల జాబితాలో మొదటి మూడు స్థానాలు ధూమపానానివే’ అని ఆయన హెచ్చరించారు.శాస్త్రీయ ఆధారాలుకేవలం డాక్టర్ జెరెమీ అనుభవమే కాకుండా, అంతర్జాతీయ పరిశోధనలు కూడా ఇదే విషయాన్ని ధ్రువీకరిస్తున్నాయి. ‘క్యురియస్’ (Cureus) జర్నల్లో 2023లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం.. ధూమపానం అనేది శరీరంలోని దాదాపు అన్ని వ్యవస్థలపై దుష్ప్రభావాన్ని చూపిస్తుంది. శ్వాసకోశ వ్యాధులు, గుండె సంబంధిత సమస్యలు, సంతానోత్పత్తి లోపాలు, మరెన్నో దీర్ఘకాలిక వ్యాధులకు ఇది మూలకారణంగా నిలుస్తుంది. ముఖ్యంగా 'ప్యాసివ్ స్మోకింగ్' (పక్కన ఉన్నవారు వదిలిన పొగను పీల్చడం) కూడా అంతే ప్రమాదకరమని ఈ నివేదిక వెల్లడించింది.ఆరోగ్యకరమైన భవిష్యత్తు..ఆరోగ్యకరమైన భవిష్యత్తు కోసం ధూమపానాన్ని వదిలిపెట్టడం అనేది తప్పనిసరి అని ఈ అలవాటు కలిగినవారు గుర్తించాలి. ఇటువంటి నిర్ణయం కేవలం గుండెను మాత్రమే కాకుండా, శరీరంలోని ప్రతి అణువును కాపాడుతుంది. డాక్టర్ జెరెమీ లాంటి నిపుణుల హెచ్చరికలను గమనించి, ధూమపానం అలవాటు కలిగినవారు తక్షణమే మేల్కొనడం అవసరం.గమనిక: ఈ కథనం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఏవైనా అనారోగ్య సమస్యలు ఉన్నట్లయితే వెంటనే నిపుణులైన వైద్యులను సంప్రదించాలి.ఇది కూడా చదవండి: బాస్ కుర్చీలో ‘బాట్’.. ‘ఏజెంట్’ చెప్పింది చేయాల్సిందే! -
ఆ నిర్ణయం ఆ జంటను హెల్దీగా మార్చింది..! ఏం చేశారంటే..
ఆరోగ్యం, వ్యాయామాలు సామాన్యుల వల్ల ఎక్కడవుతుంది అన్నమాటలు ఎన్నోసార్లు విని ఉంటారు. బాగా డబ్బున్నవాళ్లకు, యువతకు మాత్రమే సాధ్యం అనేది చాలామంది భావన. వాళ్లకు ఏ బాధ్యతలు, బరువులు అంతగా ఉండవు కాబట్టి హాయిగా చేయగలరని అనుకుంటుంటారు. కానీ ఈ మధ్యతరగతి జంట గురించి విన్నాక ఆ అభిప్రాయం కచ్చితంగా మారుతుంది. 50లలో ఆరోగ్యంపై దృష్టిపెట్టాలని.. మేల్కొని విజయం సాధించడమే గాక..ఇతరులకు స్వచ్ఛందంగా ఆరోగ్యస్పృహ కలిగిస్తున్నారు. మరి ఆ జంట ఫిట్నెస్ ప్రయాణం ఎలా సాగిందంటే..చాలామందికి ఫిట్నెస్ అనేది యువతకు చెందినదిగా అనిపిస్తుంది. పెద్దలకు సుదీర్ఘ పనిదినాలు, కుటుంబ బాధ్యతలు ఆరోగ్యాన్ని పక్కన పెట్టేలా చేస్తాయి. కనీసం శరీరం చెప్పే సంకేతాలను కూడా పట్టించుకోరు. తమ ఆరోగ్యం కంటే..కుటుంబ బరువు బాధ్యతలే ముఖ్యమన్నట్లుగా వ్యవహరిస్తుంటారు. అలానే భావించారు డెహ్రాడూన్కు చెందిన తారా థాపా ఆయన భార్య సుశీలా. తార ఎలక్ట్రానిక్స్ సేల్స్ అండ్ రిపేర్ షాపుని నడుపుతుండగా, సుశీల బీమా సలహాదారుగా పనిచేస్తోంది. ఈ ఇద్దరి ఫోకస్ కుటుంబ బాధ్యతలపైనే ఉంది. తమ ఇద్దరు కుమారులను పెంచడం, ఓ చక్కటి ఇంటిని నిర్మించుకోవడం ఇవే తమ ఆశయలు, జీవితం అన్నట్లుగా బతికారిద్దురు. అనుకున్నట్లుగా కుమారులు చక్కగా జీవితంలో స్థిరపడ్డారు. ఒకరు సోలార్ పర్మిట్ డిజైనర్గా, మరొకరు కంటెంట్ క్రియేటర్గా పనిచేస్తున్నారు. కానీ అప్పటికే ఆ జంటను అనారోగ్య సమస్యలు చుట్టుముట్టాయి. తారాకి తీవ్రమైన వెన్నునొప్పి, సుశీల నిరంతర అలసట, పునరావృతమయ్యే మోకాళ్ల నొప్పులతో ఇబ్బంది పడ్డారు ఇద్దరూ. అప్పుడే ఇరువురికి తమ శారీరక పరిమితులను అంగీకరిస్తూ ఆగిపోకూడదని అనిపించింది. ఆ అనారోగ్య సమస్యలను సవాలు చేసేలా.. ఫిట్నెస్పై ఫోకస్ పెట్టాలని స్ట్రాంగ్గా నిర్ణయించుకున్నారు. 2017లో, తార ఫిట్నెస్పై తీవ్రంగా దృష్టి పెట్టడం ప్రారంభించారు. దాన్ని చూసి భార్య సుశీల రెండేళ్ల తర్వాత 2019లో ఆయన బాటలోనే నడిచింది. అలా ఈ జంట రోజు సూర్యోదయానికి చాలా ముందుగానే ప్రారంభమవుతుంది. ఉదయం ఐదు గంటలకల్లా..వ్యాయామాలు చేయడానికి, వాకింగ్కి రెడి అయిపోతారు. కొండలలో నివసించడం వల్ల వారు ప్రకృతిని సద్వినియోగం చేసుకోవడానికి వీలుగా మారింది. తరచుగా డెహ్రాడూన్ చుట్టూ ఉన్న పర్వతాల గుండా ట్రెక్కింగ్ చేస్తూ సెలవులను ఆస్వాదిస్తుంటారు. భోజనంలో కూడా పప్పులు, కూరగాయలు, కాలనుగుణ పండ్లను భాగం చేసుకునేవారు. పండుగల సమయంలో కూడా, వారు అతిగా తినడం కంటే సమతుల్యతపే పాటిస్తూ.. మితంగా ఉండటానికి ప్రయత్నిస్తారు. వారి ప్రయాణం తమ సొంత ఇంటిని దాటి ప్రేరేపించడం మొదలైంది. మూడేళ్ల క్రితం సుశీల పింక్ పాంథర్ అనే మహిళా సమూహాన్ని ప్రారంభించారు. ఈ బృందంలో మహిళలు సౌకర్యవంతమైన ప్రాంతాల నుంచి బయటకు వెళ్లి ఫిట్నెస్ను స్వీకరించమని ప్రోత్సహిస్తుంది. ఒకప్పుడు తమ ఇళ్లను వదిలి వెళ్ళడానికి కూడా సంకోచించిన చాలా మంది సభ్యులు ఇప్పుడు ఐదు నుంచి పది కిలోమీటర్ల దూరం పరిగెత్తుతుండటం విశేషం. అంతేగాదు ఈ జంట తమ ఫిట్నెస్ ప్రయాణాన్ని ఆన్లైన్లో పంచుకోవాలని నిర్ణయించుకోవడంతో వారి కథ చాలమందికి కనెక్ట్ అయ్యి..ఎందరినో ప్రేరేపించింది. ఈ జంట వ్యక్తిగత వృద్ధి వాయిదాగా మారకూడదని, వయసు ఎప్పుడూ సాకుగా మారకూడదని తమ చేతలతో చెప్పకనే చెప్పారు కదూ. నెటిజన్లు సైతం చాలా స్ఫూర్తిదాయకం అని ఈ జంటపై ప్రశంసలు కురిపిస్తూ పోస్టులు పెడుతున్నారు. View this post on Instagram A post shared by Humans of Bombay (@officialhumansofbombay) గమనిక: ఈ కథనం కేవలం ఆరోగ్యంపై అవగాహన కలిగించడానికే. అనుసరించే ముందు వ్యక్తిగత సమస్యలను పరిగణనలోనికి తీసుకోవాలి, అలాగే వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: అక్కడ మహిళలను అవమానిస్తే అంతే..!) -
కడుపులో బుజ్జాయిలు ఎందుకు అడ్డం తిరుగుతారంటే..!
రోబో సినిమా చూశారా? అందులో రోబో చిట్టి ఓ మహిళకు ప్రసవం చేస్తుంటాడు. అడ్డం తిరిగిన బిడ్డను బయటకు తీసుకురావడానికి తాను ప్రయత్నిస్తానంటే లేడీ డాక్టర్ వద్దంటుంది. తానేదో చాలా పురాతన ప్రక్రియను అమలు చేస్తానంటూ బిడ్డను సరైన రీతిలో తిప్పడం కంప్యూటర్ మీద ప్రేక్షకులకు కనిపిస్తూ ఉంటుంది. దీన్ని బట్టి మనకు తెలిసేదేమిటంటే... ఓ చిన్నారి బుద్ధిగా ఈలోకంలోకి రావాలంటే... తల్లిలోంచి మొదట తలను బయటకు తేవాలి. కానీ కొంతమంది చిలిపి చిన్నారులు మొదటే లోకానికి ‘ఎదురు తిరుగుతారు’! ఈ ప్రపంచంలోకి వచ్చేటప్పుడు మొట్టమొదటి పనే పూర్తిగా భిన్నంగా చేస్తారు. అందుకే ఇలాంటి బిడ్డల్ని తల్లులూ, అత్తమ్మలూ, నానమ్మలూ, అమ్మమ్మలూ ‘ఎదురుకాళ్ల’తో పుట్టాడంటూ ముద్దుగా మురిపెంగా తిడుతుంటారు. వీళ్లనే ఇంగ్లిష్లో ‘బ్రీచ్’ బేబీస్ అంటారు. కడుపులోని బిడ్డ ఎందుకిలా అడ్డం తిరుగుతాడు. ఇలా తిరిగి΄ోయినప్పుడు డాక్టర్లు ఏం చేస్తారు... వంటి అనేక అంశాలపై అవగాహన కోసం ఈ కథనం.నిజానికి ఎదురుకాళ్లు అంటారుగానీ... తల ముందుకు రావాల్సిన చోట వాస్తవంగా బిడ్డ పిరుదులు ముందుకు వస్తాయి. అలా అడ్డం తిరిగినప్పుడు ప్రసవమూ సాఫీగా జరగదు. అలాంటప్పుడు ఆ చిన్నారిని ఈ లోకంలోకి తీసుకువచ్చేందుకు చాలాసార్లు శస్త్రచికిత్సలు చేయాల్సి ఉంటుంది. ప్రసవం వేళకు పిండం అడ్డం తిరిగి పుట్టేందుకు ప్రయత్నించే ఈ ‘బ్రీచ్’ బేబీ విషయంలో ఏయే ప్రత్యామ్నాయాలు అందుబాటులో ఉంటాయి. వాటి సంగతేమిటో చూద్దాం...బిడ్డ పుట్టేవరకూ గర్భసంచిలోని ఆమ్నియాటిక్ ఫ్లుయిడ్ అనే ద్రవంలో తేలియాడుతూ ఉంటుంది. మనం ఉమ్మనీరు అని పిలిచే ఆ ద్రవంలో అన్నివైపులకూ తిరుగుతూ... తనకు అందుబాటులో ఉన్న స్పేస్లో తలను ఎటువైపునకైనా తిప్పుతూ తిరిగే ఆ పిండం సరిగ్గా ప్రసవం వేళకు మాత్రం తలను బయటపెడుతూ ఈలోకంలోకి రావాలి. అలా శిరస్సు ముందుగా బయటకు రావడాన్ని సంప్రదాయ భాషలో ‘శీర్షోదయం’ అని అంటుంటారు. అయితే ఇలా శీర్షోదయం కాకుండా బిడ్డ అడ్డం తిరిగే కండిషన్స్ దాదాపు 3 శాతం నుంచి 4 శాతం ప్రసవాల్లో కనిపిస్తుంటాయి. ఇటీవల కొద్దిగా పెరిగాయి కూడా. గతంలోనైతే ఇలా బిడ్డ అడ్డం తిరిగే కండిషన్ కారణంగా దాదాపు 25 శాతం కేసుల్లో శిశుమరణాలు చోటుచేసుకుంటూ ఉండేవి. కానీ ఇటీవల దాదాపూ ప్రతి ప్రసవమూ ఆసుపత్రుల్లో (ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్) జరిగేలా ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ తరహా ప్రసవం ముప్పులు చాలావరకు తగ్గాయంటూ నిశ్చయంగా చెప్పవచ్చు. బిడ్డ అడ్డం తిరగడానికి కారణాలు... ప్రసవం వేళకు బిడ్డ పూర్తిగా ఎదగకపోవడం (ప్రీ–మెచ్యురిటీ). ఒక అండం మాత్రమే కాకుండా అనేక అండాల ఫలదీకరణ జరగడం (మల్టీఫీటల్ జెస్టేషన్) (సాధారణంగా ఇలాంటి కండిషన్స్లోనే కవలలు (ట్విన్స్) వంటి కేసుల్లోనూ సహజ ప్రసవం జరగకపోవచ్చు).పుట్టుకతో ఏర్పడే లోపాల వల్ల... బిడ్డ తలకు బాగా నీరు పట్టి ఉండటం (హైడ్రోసెఫాలస్), బిడ్డ మెదడు ఎదగాల్సిన చోట చాలా సందర్భాల్లో అది లోపించి, మెదడులోని అనేక భాగాలు ఎదగకపోవడం (అనెన్సెఫాలస్). కడుపులో బిడ్డకు పిండ దశలోనే అనేక రకాల లోపాలు ఏర్పడటం. ఎవరైనా తల్లికి వరసగా తన మూడు ప్రసవాల్లోనూ (లేదా అంతకంటే ఎక్కువగానూ) చిన్నారులు ఎదురుకాళ్లతో పుడితే... ఆ తల్లికి సాధారణంగా మరోసారి కూడా ఇలాంటి కండిషన్ ఏర్పడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. దీన్నే వైద్యపరిభాషలో ‘మల్టీపారా విత్ లాక్స్ అబ్డామిన్’గా చెబుతారు. బిడ్డను అంటిపెట్టుకుని ఉండే మాయ.. గర్భాశయ ముఖద్వారంలోకి ప్రవేశించడం.ఈసీవీ ఎవరిలో చేయవచ్చంటే... ప్రెగ్నెన్సీ 36 – 37 వారాల వ్యవధి తర్వాత ప్రయత్నించవచ్చు. కాబోయే తల్లికి ఎలాంటి కాంప్లికేషన్లూ లేనప్పుడు మాత్రమే ప్రయత్నించాలి. ఉమ్మనీరు తగినంతగా ఉండాలి. ఈసీవీ విజయవంతం అవడానికి కేవలం 50 % మాత్రమే అవకాశముంటుంది. (అయితే కొన్నిసార్లు ఈసీవీ ప్రక్రియ తర్వాత కూడా చిన్నారి తిరిగి మళ్లీ బ్రీచ్ కండిషన్కు వెళ్లవచ్చు... అంటే మళ్లీ చిన్నారి ఎదురు తిరిగేందుకు అవకాశముంది). ఒకవేళ ఆ టైమ్లో పురిటి నొప్పులు వచ్చినప్పుడు బేబీ బ్రీచ్డ్ కండిషన్లో ఉంటే... ఆ టైమ్లో ఈసీవీ చేయడం సరికాదు. నేరుగా సిజేరియన్కు వెళ్లాల్సి ఉంటుంది. బ్రీచ్ బేబీస్ విషయంలో ప్రత్యామ్నాయ మార్గాలుఒకవేళ కాబోయే తల్లిదండ్రులు సిజేరియన్ను కోరుకోకపోతే అప్పుడు ‘ఎక్స్టర్నల్ సెఫాలిక్ వర్షన్’ (ఈసీవీ) అనే ప్రత్యామ్నాయానికి వెళ్లవచ్చు. అయితే ఇలాంటి సందర్భాల్లో ఆ తల్లిదండ్రులు ఈప్రోసిజర్లో ఉన్న ముప్పు దీన్ని ఎప్పుడు చేస్తారన్న అంశాలు తప్పక తెలుసుకుని ఈప్రోసిజర్పై అవగాహన ఏర్పరచుకోవడం చాలా ముఖ్యం. ఎక్స్టర్నల్ సెఫాలిక్ వర్షన్ (ఈసీవీ) అంటే..బిడ్డ కడుపులోంచి బయటికి రావడానికి అనువైన రీతిలో తిరగకుండా... (తలను ముందుకు తీసుకురాకుండా) ఇతరత్రా పొజిషన్స్లో ఉన్నప్పుడు నేరుగా శస్త్రచికిత్సతో బిడ్డను బయటకు తీసుకురావడానికి బదులుగా ప్రసవం మొదట్నుంచీ కొద్దికొద్దిగా ప్రయత్నిస్తూ... చిన్నారి తల భాగాన్ని ముందుకు తీసుకొచ్చేలా చేయడాన్ని ‘ఎక్స్టర్నల్ సెఫాలిక్ వర్షన్–ఈసీవీ’ అంటారు. సాధారణంగా కడుపులోని బిడ్డ గర్భసంచిలోని ఉమ్మనీటిలో నిత్యం దొర్లుతున్నట్లుగా అటూఇటూ తిరుగుతూ ఉంటుందన్న సంగతి తెలిసిందే. గర్భసంచిలో బిడ్డ ఎదుగుతున్న కొద్దీ బిడ్డ సైజు పెరుగుతూ, అది ఎటుపడితే అటు తిరగడానికి వీలుకల్పించే ఉమ్మనీటి ద్రవం తగ్గుతూ పోతుంది. అయితే ప్రసవం సమయానికి బిడ్డ తల ఆటోమేటిగ్గా బయటకు రావడానికి వీలుగా కిందివైపునకు తిరుగుతుంది. కొందరిలో ఇలా తిరగకపోతే తల్లి కడుపుపై చేతులుంచి బయటినుంచే లోపలి పిండాన్ని తిరిగేలా చేస్తూ తలను కిందివైపునకు తిరిగేలా చేసే ప్రక్రియను ‘ఎక్స్టర్నల్ సెఫాలిక్ వర్షన్’ (ఈసీవీ) అంటారు.బిడ్డ అడ్డం తిరగడంలో రకాలు బిడ్డ కేవలం ఎదురు కాళ్లతోనే కాకుండా ఇంకా అనేక రకాలుగా బయటకు వచ్చేందుకు ప్రయత్నిస్తుంటాడు. ఇలా బిడ్డ అడ్డం తిరగడమన్నది ఎన్ని రకాలుగా జరుగుతుందో చూద్దాం...1) ఫ్రాంక్ / ఇన్కంప్లీట్ బ్రీచ్... ఇందులో బిడ్డ తన తలకు బదులుగా మొదట తన పిరుదులను బయటకు తేవడానికి ప్రయత్నిస్తుంటుంది. ఇలాంటి పొజిషన్లో బిడ్డ ఒక పాదం తన చెవుల దగ్గర ఉంటుంది.2) కంప్లీట్ బ్రీచ్ / ఫ్లెక్సెడ్ బ్రీచ్... ఈ కేస్లోనూ బిడ్డ తలకు బదులుగా పిరుదులను తొలుత బయటకు తేవడానికి ప్రయత్నిస్తుంటుంది. అయితే ఈ పొజిషన్లో ‘ఫ్రాంక్ / ఇన్కంప్లీట్ బ్రీచ్’లోలా ఒక పాదం మాత్రమే చెవి దగ్గర ఉండదు. బిడ్డ రెండు పాదాలూ ముడుచుకుని ఉంటాయి.3) ఫూట్లింగ్ ప్రజెంటేషన్... ఈ కండిషన్లో బిడ్డ పిరుదులు, మోకాళ్లు... ఇవన్నీ ముడుచుకునే ఉంటాయి. లేదా ఒక కాలు పూర్తిగా చాపి ఉంటుంది. అయితే పాదాలు పిరుదుల కంటే కింది భాగంలో ఉండి ప్రసవం కష్టమవుతుంది. బిడ్డ అడ్డం తిరిగిన సందర్భాల్లో తల్లిదండ్రులు ఎలాంటి రిస్క్ తీసుకోకూడదనుకుంటే మాత్రం సిజేరియన్ సెక్షన్కు వెళ్లడం చాలా సురక్షితమైన, మంచి ప్రత్యామ్నాయం. మొదటి ప్రెగ్నెన్సీ విషయంలో ఇది మరింత అవసరం కూడా. ఈసీవీ చేయడానికి సాధ్యం కాని పరిస్థితులు ఏమిటంటే...తలలో పుట్టుకతో వచ్చే లోపాలు హైడ్రోసెఫాలస్ / అనెన్సెఫాలీ వంటి పుట్టుకతోనే లోపాలున్న సందర్భాల్లో : కొందరు బిడ్డల్లో మెదడు ఎదగాల్సిన చోట కేవలం నీరు మాత్రమే ఉంటుంది. ఈ కండిషన్ను హైడ్రోసెఫాలస్ కండిషన్ అంటారు. ఇక మరికొందరు బిడ్డల్లో మెదడులోని అన్ని భాగాలూ పూర్తిగా ఎదగ కుండా ఉండిపోతాయి. ఈ కండిషన్స్ను అనెన్సెఫాలీ కండిషన్ అంటారు. ఈ రెండు సందర్భాల్లోనూ ఈసీవీ చేయడం ఏమాత్రం సాధ్యం కాదు. ఆలిగో హైడ్రామ్నియస్ (అంటే ఉమ్మనీరు చాలా తక్కువగా ఉండటం లేదా పాలీ హైడ్రామ్నియస్ (అంటే ఉమ్మనీరు అవసరమైనదాని కంటే ఎక్కువగా ఉండటం. యుటెరైన్ అనామలీస్ : యుటెరన్ లోపాలున్నప్పుడు. ఫూట్లింగ్ బ్రీచ్ : అంటే పుట్టే సమయంలో కడుపులోని బిడ్డ కాళ్లు మొదట బయటకు రావడం. ఎక్స్టెండెడ్ హెడ్ అండ్ కార్డ్ ఎరౌండ్ నెక్ : బిడ్డ పుట్టే సమయంలో తల బయటకు వచ్చేందుకు బర్త్ కెనాల్లో తగినంత స్థలం లేక΄ోవడంతో తలమీద చాలా ఒత్తిడి పడటం. ఇక కార్డ్ ఎరౌండ్ నెక్ అంటే బొడ్డుతాడు మెడ చుట్టూ బిగుసుకుపోయే కండిషన్. ప్రీవియస్ సిజేరియన్ : గతంలో జరిగిన ప్రసవంలో సిజేరియన్తో బిడ్డను బయటకు తీసుకువచ్చిన కేస్ అయి ఉండటం. ప్లాసెంటా ప్రివియా : ఈ కండిషన్లో గర్భధారణ జరిగినప్పుడు మాయ (ప్లాసెంటా) గర్భాశయం కింది భాగానికి అతుక్కుపోయి, గర్భాశయ ముఖద్వారాన్ని (సర్విక్స్ను) పాక్షికంగా గానీ, పూర్తిగాగానీ కప్పి ఉంచడం.యాంటీరియర్ ప్లాసెంటా : గర్భధారణ సమయంలో బిడ్డకు పోషకాలు అందించే బొడ్డుతాడు (మాయ) గర్భాశయం ముందువైపు గోడకు అతుక్కుపోయి ఉండటం (ఇది చాలా సాధారణం, ఆరోగ్యకరమైన గర్భధారణకు సంకేతం).ఈసీవీ చేయించుకోవాలని కోరేవారు అన్ని వసతులూ ఉండే మంచి ప్రసూతి ఆసుపత్రిని ఎంచుకుని అక్కడ బాగా అనుభవజ్ఞులైన ‘ఆబ్స్ట్రెట్రీషియన్స్’ (గర్భస్త పిండ వైద్యచికిత్స, ప్రసూతి నిపుణులు) ఉన్నారేమో ఎంక్వైరీ చేయాలి. అక్కడ ఈసీవీ జరుగుతున్నప్పుడు కడుపులోని బిడ్డను కంప్యూటర్ తెరపై ఎప్పుడూ చూసేందుకు వీలయ్యేలా ‘రియల్ టైమ్ అల్ట్రాసౌండ్ డాప్లర్’ సౌకర్యమూ ఉండాలి. చదవండి: ప్రసవానంతరం బరువు తగ్గాలంటే..! ఈ వర్కౌట్లు తప్పనిసరి..ఈ డాప్లర్ ఉండటం వల్ల ఈసీవీ చేస్తున్నప్పుడు బిడ్డ తాలూకు బొడ్డు తాడు అతడి మెడకు చుట్టుకుపోయి బిగుసుకుపోతుందా లేక మామూలుగానే ఉందా అని ఎప్పటికప్పుడు పరిశీలనగా చూడటానికి వీలవుతుంది. ఇలా చేస్తున్నప్పుడు ఒకవేళ తల్లికి తీవ్రమైన నొప్పి కలుగుతున్నా లేదా బిడ్డ తాలూకు గుండె స్పందనలు తగ్గుతున్నా లేదా ఈ గుండె స్పందనల్లోని లయ (రిథమ్) క్రమబద్ధంగా లేక΄ోయినా ఈ ప్రక్రియను నిలిపివేయాలి. వీలుకాకపోతే అప్పుడు శస్త్రచికిత్స (సిజేరియన్ సెక్షన్)కు తప్పక వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.చివరగా... శస్త్రచికిత్స వల్ల తమకు ఒనగూరే ప్రయోజనాలూ, ఆర్థిక అంశాల కారణంగా కొందరు డాక్టర్లు శస్త్రచికిత్స (సిజేరియన్)లను ప్రోత్సహిస్తున్నారనే వాదన చాలా సందర్భాల్లో వినిపిస్తూ ఉంటుంది. చాలామందిలోనూ ఈ అ΄ోహ ఉంటుంది. ఇందులో వృత్తిలో నైతికతకు సంబంధించిన అంశాలతోపాటు శస్త్రచికిత్స చేయడం తప్ప ఇతరత్రా అవకాశాలు లేని పరిస్థితులూ ఉంటాయి. దాంతో లోకంలో ఈ శస్త్రచికిత్సల విషయంలో చాలా వాదనలూ, భిన్నాభిప్రాయాలు వినిపిస్తూ ఉంటాయి. ఇక మరికొందరు తల్లులు తాము ప్రసవం తాలూకు నొప్పులను భరించడానికి ఇష్టపడకపోవడం అనే అంశమూ శస్త్రచికిత్సలను తప్పనిసరి చేస్తోంది. కాబట్టి ఈ అంశాలన్నింటిలోనూ డాక్టరుకూ, ప్రసవమవుతున్న తల్లికీ... ఈ ఇరువురికీ ఓ స్పష్టత ఉండాలి. తమ డాక్టరును నమ్మి, తనపై పూర్తిగా విశ్వాసం ఉంచినప్పుడే ప్రసవం విషయంలో అంతా సజావుగా జరిగిపోతుంది. అందుకే తాము నమ్మకం ఉంచిన డాక్టర్ దగ్గరే ప్రసవం జరిగేలా చూసుకోవడం ఇటు కాబోయే తల్లికీ, తన కుటుంబ సభ్యులకూ, అటు డాక్టరుకూ సౌకర్యంగా ఉంటుందని గుర్తుంచుకోవాలి. - నిర్వహణ: యాసీన్ -
ఇయర్ఫోన్ల వాడకంలో ఈ తప్పు చేస్తున్నారా?
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో స్మార్ట్ఫోన్ ఎంత అవసరమో, చెవుల్లో ఇయర్ఫోన్లు కూడా అంతే అనివార్యమయ్యాయి. ప్రయాణాల్లో పాటలు విన్నా, ఆఫీస్ కాల్స్ మాట్లాడినా.. ఇయర్ఫోన్లు లేనిదే రోజు గడవని పరిస్థితి ఏర్పడింది. అయితే ఈ అలవాటే శాశ్వత చెవిటితనంలోకి నెట్టేస్తుందనే సంగతి మీకు తెలుసా? గంటల తరబడి చెవిని హోరెత్తించే ఆ శబ్దం, వినికిడి శక్తిని మటాష్ చేస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.యువతపై ‘సౌండ్’ సర్జికల్ స్ట్రైక్!సాధారణంగా 60 ఏళ్లు దాటిన వారికి వచ్చే వినికిడి సమస్యలు ఇప్పుడు 20 ఏళ్ల యువకుల్లోనే కనిపిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. ఢిల్లీకి చెందిన ప్రముఖ ఈఎన్టీ నిపుణులు డాక్టర్ దీప్తి సిన్హా తెలిపిన వివరాల ప్రకారం 'నాయిస్ ఇండ్యూస్డ్ హియరింగ్ లాస్' (NIHL) కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. ఇయర్ఫోన్ల మితిమీరిన వాడకం వల్ల లోపలి చెవిలో జరిగే నష్టం వెంటనే తెలియదు. ఇది ఒక ‘స్లో పాయిజన్’ మాదిరిగా పనిచేసి, మనం గుర్తించే లోపే వినికిడి శక్తిని హరిస్తుంది.తిరిగి రాని ‘కేశ కణాలు’.. జాగ్రత్త!శరీరంలో ఏ భాగం దెబ్బతిన్నా నొప్పి వస్తుంది. కానీ చెవి లోపల వినికిడి దెబ్బతినేటప్పుడు ఎలాంటి నొప్పి ఉండదు. మనం 85 డెసిబుల్స్ కంటే ఎక్కువ శబ్దం విన్నప్పుడు, లోపలి చెవిలోని సున్నితమైన 'హెయిర్ సెల్స్' (కేశ కణాలు) శాశ్వతంగా చనిపోతాయి. మానవ శరీరంలోని ఈ కణాలు ఒక్కసారి నశిస్తే తిరిగి పుట్టవు. అంటే ఆ సెల్స్ పోయాయంటే వినికిడి శక్తిని మళ్లీ పొందడం అసాధ్యం.రక్షణ కవచం: ‘60/60’ మ్యాజిక్ ఫార్ములాఈ ప్రమాదం నుంచి తప్పించుకునేందుకు వైద్యులు ఒక అద్భుతమైన సూత్రాన్ని సూచిస్తున్నారు. అదే '60/60' రూల్. దీని ప్రకారం ఫోన్ వాల్యూమ్ను ఎప్పుడూ 60 శాతం కంటే పెంచకూడదు. రోజులో ఇయర్ఫోన్లు వాడే సమయాన్ని కేవలం 60 నిమిషాలకే పరిమితం చేయాలి. ప్రతి గంట వాడకం తర్వాత కనీసం ఐదు నిమిషాలు చెవులకు విశ్రాంతినివ్వడం వల్ల శ్రవణ వ్యవస్థపై ఒత్తిడి తగ్గుతుంది.నాయిస్ క్యాన్సిలేషన్: ఒక వరంబయట ట్రాఫిక్ లేదా రద్దీగా ఉన్నప్పుడు మనం వాల్యూమ్ పెంచుతుంటాం. ఇది చెవికి మరింత చేటు చేస్తుంది. అందుకే బయటి శబ్దాలను అడ్డుకునే 'ఆక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్' (ANC) ఫీచర్ ఉన్న ఇయర్ఫోన్లను వాడటం ఉత్తమం. దీనివల్ల తక్కువ వాల్యూమ్లో కూడా స్పష్టమైన శబ్దం వినిపిస్తుంది. తద్వారా చెవి లోపలి సున్నిత భాగాలకు రక్షణ లభిస్తుంది.ఈ లక్షణాలు ఉంటే..తరచుగా చెవుల్లో 'రింగు'మనే శబ్దం (Tinnitus) వస్తున్నా, ఎదుటివారు మాట్లాడుతున్నప్పుడు మాటలు అస్పష్టంగా అనిపిస్తున్నా వెంటనే మేల్కోవాలి. చెవులు మూసుకుపోయినట్లు ఉండటం లేదా శబ్దాలు మందకొడిగా వినిపించడం లాంటివాటిని ప్రమాద ఘంటికలుగా గుర్తించాలి. ముఖ్యంగా బీపీ, షుగర్ ఉన్నవారు ఏటా ఒకసారి వినికిడి పరీక్ష చేయించుకోవడం తప్పనిసరి అని వైద్యులు సూచిస్తున్నారు. ఇది కూడా చదవండి: రష్యాలో ఆఫ్రికన్ యువత మృత్యు ఘోష -
ప్రసవానంతరం బరువు తగ్గాలంటే..! ఈ వర్కౌట్లు తప్పనిసరి..
ప్రసవానంతరం బరువు తగ్గడం చాలా సవాలుగా ఉంటుంది. మాములుగా బరువు తగ్గడానికి గర్భధారణ అనంతరం తగ్గడానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. పైగా శరీరంలో వచ్చే మార్పులకు తోడు నవజాత శిశువుని హ్యాండిల్ చేస్తూ బరువు తగ్గడం తదితరాలన్ని చాలా సవాలుగా ఉంటాయి. ముందుగా శరీరం మునపటి పటుత్వం లేక..కొద్దిపాటి వ్యాయామాలను ఓర్చుకునే శక్తి స్వతహాగా కొత్త తల్లులకు ఉండదు. మరి అలాంటప్పుడు ఎలాంటి తేలిక పాటి వ్యాయామాలు చేయాలి..? కొత్త తల్లులు నిజంగానే తీవ్రమైన వ్యాయామాల జోలికి పోకపోవడమే మంచిదా..? తదితరాల గురించి కంటెంట్ క్రియేటర్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ నిధి త్యాగి చెప్పే సలహాలు సూచనలే గురించి సవివరంగా చూద్దామా..!.ప్రసవానంతరం బరువు తగ్గం అనేది సాధారణ విషయం కాదని అంటోంది నిధి త్యాగి. దీని గురించి ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో అమూల్యమైన సలహాలు సూచనలు షేర్ చేశారు. ఇక్కడ కొత్త తల్లులు కొలెస్ట్రాల్ తగ్గించుకోవడం కంటే..కేలరీలలోటు, కదలికలపై దృష్టిపెట్టాలని అంటోంది. చాలామంది డెలివరీ తర్వాత పాలిస్తారు కాబట్టి బరువు తగ్గిపోతారని అనుకుంటుంటారు. కానీ అది ముమ్మాటికీ అబద్ధమని అంటోంది. తాను ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు మామిడపండ్లు అధికంగా తినేదాన్ని అని ఆ టైంలో ఏకంగా 20 కిలోలకు పైగా అదనపు బరువు ఉన్నానని చెప్పుకొచ్చింది. ప్రసవం తర్వాత పదికిలోలు మాత్రమే తగ్గానని, మిగిలిని పదికిలోల బరువు అలాగే ఉందని తెలిపింది. ఏడాదికి పైగా బిడ్డకు పాలిచ్చానని, ఇంట్లో వండిన భోజనం మాత్రమే తీసుకున్నానని, అలాగే తేలికపాటి వాకింగ్ వంటివి చేసేదాన్ని అని వెల్లడించింది. కానీ అంతలా కేర్ తీసుకున్నా..బరువులో అంతగా మార్పులు కనిపించలేదని అంటోంది. పైగా డెలివరీ తర్వాత బరువు తగ్గడానికి తీవ్రమైన వ్యాయామాల జోలికి అస్సలు పోకూడదని అంటోంది. ఎందుకంటే కొత్త తల్లుల శరీరం సున్నితంగా మారిపోయి ఉంటుంది..దాంతో ఆ వర్కౌట్లు తట్టుకోవడం అంత సులభం కాదని చెబుతోంది. కనీసం 15 నిమిషాలు కూడా చేయలేమని అంటోంది. అలా అని బయటకు జిమ్ వెళ్లే పరిస్థితి కూడా లేకపోవడంతో హోమ్ ఇన్స్ట్రక్టర్ని నియమించుకున్నట్లు తెలిపింది. అతను సూచించిన కోర్ వ్యాయామాలు, కార్డియో, స్ట్రెంగ్త్ ట్రైనింగ్, వెయిట్ ట్రైనింగ్ వ్యాయామాలతో బలం పుంజుకోగలిగానని అంటోంది. వీటివల్ల కండరాలు బలోపేతం అవుతుతాయి. కొద్దిపాటి బరువులు ఎత్తి..బోడ్డులోపలికి కోర్ని స్ట్రాంగ్గా మార్చుకోగలిగానని అంటోంది. అలా తాను నాలుగు నెలల్లో నాలుగు నుంచి ఐదు కిలలోలు వరకు తగ్గగలిగానని అంటోంది. ప్రస్తుతం తాను ప్లాంక్లు కూడా వేయగలనని, వెన్నునొప్పి లేదని అంటోంది. కానీ ప్రసవానంతరం వేగవంతంగా బరువు తగ్గాలనుకోవడం తప్పులేదు గానీ..ఆ క్రమంలో తప్పుడు మార్గంలో వెళ్లొద్దని, ఆరోగ్యకరమైన మార్గాన్ని ఎంచుకోమని చెబుతోంది కంటెంట్ క్రియేటర్ నిధి త్యాగి. View this post on Instagram A post shared by Nidhi Tyagi (@thenidhityagi) (చదవండి: చీరకట్టులో స్నోబోర్డింగ్ స్టంట్..!) -
మీ ఆరోగ్యం మీ చెవుల్లోనే..
‘మీరు నలభై ఏళ్ల మైలురాయిని దాటేశారా? అయితే మీ శరీరం లోపల ఒక నిశ్శబ్ద మార్పు మొదలైందని గుర్తించండి. మనం కేవలం వినడానికి మాత్రమే చెవులను వాడుతామని అనుకుంటాం.. కానీ మనల్ని భూమి మీద నిలబెట్టే అసలైన ‘బ్యాలెన్సింగ్ రిమోట్’ మన లోపలి చెవిలోనే ఉంది. అది ఒక్కసారి రిపేరుకు వస్తే, సోఫాలో నుంచి లేచి నిలబడాలన్నా ప్రపంచమంతా గిర్రున తిరుగుతుంది. ఈ ముప్పు గురించి ఆరోగ్య నిపుణులు ఇస్తున్న హెచ్చరికలు ఇప్పుడు సోషల్ మీడియాలో కలకలం రేపుతున్నాయి.లోపలి చెవిలో ఏం జరుగుతోంది? మన లోపలి చెవిలో 'వెస్టిబ్యులర్ వ్యవస్థ' అనే ఒక అత్యంత సంక్లిష్టమైన నెట్వర్క్ ఉంటుంది. ఇది ఒక జీపీఎస్ (GPS) లాగా పనిచేస్తూ, మనం ఎటు తిరుగుతున్నాం, ఎలా నిలబడాలి అనే సమాచారాన్ని సెకనులో వందో వంతు కాలంలో మెదడుకు పంపిస్తుంది. అయితే, 40 ఏళ్లు దాటాక ఈ వ్యవస్థలోని సూక్ష్మమైన ‘హెయిర్ సెల్స్’ (Hair Cells) చనిపోవడం మొదలవుతాయి. అంటే మీ బాడీ బ్యాలెన్సింగ్ సిస్టమ్ తన పట్టును కోల్పోతోంది. ఫలితంగా నడుస్తున్నప్పుడు అకస్మాత్తుగా పక్కకు వాలిపోవడం లేదా కళ్లు బైర్లు కమ్మడం లాంటివి జరుగుతాయి.నడక కూడా కష్టమే!లోపలి చెవిలో రెండు విభాగాలు ఉంటాయి: ఒకటి శబ్దాలను వినే 'కోక్లియా', రెండోది బ్యాలెన్స్ను చూసే 'వెస్టిబ్యులర్'. విచిత్రమేమిటంటే ఈ రెండింటికీ మెదడుకు చేరే దారి (Nerve) ఒక్కటే.. అందుకే మీ చెవిలో ఏ చిన్న సమస్య వచ్చినా అది కేవలం వినికిడి లోపంతో ఆగదు. వినికిడి తగ్గడంతో పాటు తీవ్రమైన తల తిరగడం (Vertigo), చెవిలో జోరీగ రొద పెట్టినట్లు శబ్దాలు రావడం (Tinnitus) లాంటి లక్షణాలు కనిపిస్తాయి. దీనిని నిర్లక్ష్యం చేస్తే, భవిష్యత్తులో శాశ్వతంగా నడవలేని స్థితికి చేరుకునే పరిస్థతి ఏర్పడుతుంది.ఈ మూడు ‘సైలెంట్ కిల్లర్స్’ గురించి తెలుసా?బీపీపీవీ: మీరు పడుకుని అటు ఇటు తిరిగినా లేదా పైనున్న వస్తువు కోసం తల ఎత్తినా సెకన్ల పాటు ప్రపంచమంతా తిరుగుతున్నట్లు అనిపిస్తుంది. ఇది లోపలి చెవిలోని కాల్షియం కణాలు స్థానభ్రంశం చెందడం వల్ల వస్తుంది.మెనియర్స్ వ్యాధి: చెవిలో నీరు చేరినట్లు ఇబ్బందిగా అనిపించడం. వినికిడి మందగించడం దీని ప్రధాన లక్షణం.వెస్టిబ్యులర్ మైగ్రేన్: విపరీతమైన తలనొప్పితో పాటు కళ్లు తిరగడం. ఇది మీ దైనందిన జీవితాన్ని నరకప్రాయం చేస్తుంది.ఆందోళన కలిగించేలా..శరీర సమతుల్యత కోల్పోవడం అనేది కేవలం శారీరక సమస్య మాత్రమే కాదు. ఎక్కడ పడిపోతామో అన్న భయం మనిషిని మానసిక రోగిగా మారుస్తుంది. ఒంటరిగా బయటకు వెళ్లడానికి భయపడటం, మెట్లు ఎక్కాలంటే వణుకు రావడం వల్ల చాలామంది సామాజికంగా ఒంటరి అయిపోతారు. ఇది తీవ్రమైన ఆందోళన (Anxiety), కుంగుబాటు (Depression)కు దారితీస్తుంది. ఒకప్పుడు ధైర్యంగా నడిచిన వ్యక్తి, తన ఇంట్లోనే తాను నడవడానికి ఇతరుల సాయం కోరాల్సి రావడం అత్యంత బాధాకరంగా పరిణమిస్తుంది.ఇప్పటికైనా మించిపోయింది లేదు!మీకు తల తిరుగుతున్నట్లు అనిపించినా, వినికిడిలో మార్పు వచ్చినా అది వయసు రీత్యా వచ్చే నీరసం అని భ్రమపడకండి. వెస్టిబ్యులర్ రీహాబిలిటేషన్ వంటి ప్రత్యేక వ్యాయామాలు, ఆహార నియమాల ద్వారా ఈ ముప్పును తప్పించుకోవచ్చు. మీ లోపలి చెవి ఇచ్చే చిన్న చిన్న సంకేతాలను ఇప్పుడే గుర్తించండి. మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే (చెవుల్లోనే) ఉంది!గమనిక: ఈ సమాచారం కేవలం ప్రాథమిక అవగాహన కోసం మాత్రమే. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే తక్షణం నిపుణులైన ఈఎన్టీ వైద్యులను సంప్రదించండి.ఇది కూడా చదవండి: Women’s Day: ట్రావెలింగ్ నుంచి హోస్టింగ్ వరకూ.. -
మైండ్ ఫుల్నెస్.. బిజీ షెడ్యూల్లో ప్రశాంతతను వెతుక్కోవడం
నేటి ఆధునిక కార్పొరేట్ ఉద్యోగి జీవితం ఒక నిరంతర పరుగుపందెం. ఉదయం నిద్రలేచిన క్షణం నుండి రాత్రి పడుకునే వరకు టార్గెట్లు, డెడ్లైన్లు, ఈమెయిల్ నోటిఫికేషన్లు, ఫోన్ కాల్స్.. ఇలా ఒకదాని తర్వాత ఒకటిగా పనులు మిమ్మల్ని చుట్టుముడుతుంటాయి. ఈ ఉరుకుల పరుగుల మధ్య మీ మెదడు నిరంతరం భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతూ లేదా గతం గురించి అసహనంతో ఉంటుంది. మనం ఎక్కడ ఉన్నామో, ఏం చేస్తున్నామో తెలియని స్థితిలో యంత్రంలా మారిపోతాం. ఇలాంటి సందర్భంలో మైండ్ఫుల్నెస్ (Mindfulness) అనేది ఒక విలాసం కాదు, అది అత్యవసరమైన జీవన నైపుణ్యం.మైండ్ఫుల్నెస్ అంటే కేవలం ధ్యానం కాదు..చాలామంది మైండ్ఫుల్నెస్ అంటే కళ్లు మూసుకొని గంటల తరబడి ధ్యానం చేయడం అనుకుంటారు. అది తప్పు. మైండ్ఫుల్నెస్ అంటే 'ప్రస్తుత క్షణంలో పూర్తిగా నిమగ్నమై ఉండటం'. మీరు కాఫీ తాగుతున్నప్పుడు కేవలంకాఫీ రుచిని, దాని సువాసనను మాత్రమే అనుభవిస్తూ తాగడం. ఆఫీసులో మీటింగ్ జరుగుతున్నప్పుడు, పక్కాగా ఆ మీటింగ్ మీదే దృష్టి పెట్టడం. గతంలోని అపజయాల గురించి గానీ, భవిష్యత్తులోని భయాల గురించి గానీ ఆలోచించకుండా, ఆ క్షణంలో మీరు చేసే పనిని పూర్తిగా ఆస్వాదించడమే మైండ్ఫుల్నెస్.బిజీ షెడ్యూల్లో మైండ్ఫుల్నెస్ను ఎలా పాటించాలి?మీకు గంటల కొద్దీ సమయం లేకపోయినా, పద్ధతిగా ప్రయత్నిస్తే బిజీ షెడ్యూల్లోనే ప్రశాంతతను పొందవచ్చు.మైండ్ఫుల్ బ్రీతింగ్: ఆఫీసులో ప్రతి గంటకు ఒకసారి కేవలం ఒక నిమిషం పాటు పని ఆపేయండి. మీ కళ్లు మూసుకొని, మీ శ్వాస గాలి లోపలికి వెళ్లడం, బయటకు రావడం మీద దృష్టి పెట్టండి. అది మీ నాడీ వ్యవస్థకు ఒక 'రీసెట్ బటన్'లా పనిచేస్తుంది.ఏకకాలంలో ఒకటే పని: మల్టీ-టాస్కింగ్ అనేది మెదడును త్వరగా అలసిపోయేలా చేస్తుంది. ఒకే సమయంలో పది పనులు చేసే ప్రయత్నం చేయడం మానేసి, ప్రస్తుతం చేస్తున్న పని మీద మాత్రమే దృష్టి పెట్టండి. దీనివల్ల మీ ఉత్పాదకత పెరుగుతుంది, మానసిక అలసట తగ్గుతుంది.ఆహారపు అలవాట్లు: లంచ్ బ్రేక్ సమయంలో ఫోన్ చూస్తూ తినడం మానేయండి. మీరు తినే ఆహారం రుచి, రంగు, వాసనను గమనిస్తూ తినండి. ఇది మీ మనసును ఆఫీసు ఒత్తిడి నుండి ఆ క్షణానికి తీసుకువస్తుంది.నడకలో ధ్యానం (Walking Meditation): ఆఫీసు కారిడార్లో నడుస్తున్నప్పుడు లేదా పార్కింగ్ ఏరియాకు వెళ్తున్నప్పుడు, ప్రతి అడుగును గమనిస్తూ నడవండి. మీ పాదాలు నేలను తాకడం, మీ చుట్టూ ఉన్న గాలిని గమనించడం చేయండి. ఇది చాలా శక్తివంతమైన టెక్నిక్.నా దగ్గరికి వచ్చిన ఒక ప్రాజెక్ట్ మేనేజర్ ప్రవీణ్ (పేరు, వివరాలు మార్చాను) తన బిజీ షెడ్యూల్ వల్ల ప్రతిరోజూ పానిక్ అటాక్స్కు గురయ్యేవాడు. అతను ప్రతి రోజూ కనీసం 50 కాల్స్ అటెండ్ చేసేవాడు. మేము అతనికి '3-సెకన్ల రూల్' నేర్పించాం. ఫోన్ మోగగానే వెంటనే ఎత్తకుండా, 3 సెకన్లు ఆగి, రెండు సార్లు దీర్ఘ శ్వాస తీసుకున్న తర్వాతే ఫోన్ ఎత్తడం అలవాటు చేసుకున్నాడు. ఆ చిన్న మార్పు అతని మొత్తం రోజువారీ అనుభవాన్ని మార్చేసింది. ఆ మూడు సెకన్లు అతనికి ఎంతో ప్రశాంతతను ఇచ్చాయి.ఎందుకు మైండ్ఫుల్నెస్ అవసరం?👉ప్రశాంతంగా ఉన్న మెదడు సంక్లిష్టమైన నిర్ణయాలను తప్పులు లేకుండా తీసుకోగలదు.👉మీరు ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు పూర్తిగా వారి వైపు శ్రద్ధ చూపిస్తే, సంబంధాలు మెరుగుపడతాయి.👉కోపం, భయం వంటి భావోద్వేగాలను మీ మెదడు పసిగట్టి, వాటికి ప్రతిస్పందించేలా చేస్తుంది.మీ కోసం ఒక చిన్న టాస్క్...ఈ రోజు మీరు పని చేస్తున్నప్పుడు మీ చుట్టూ ఉన్న శబ్దాలను గమనించండి. ఏసీ శబ్దం, కీబోర్డ్ టైపింగ్ శబ్దం, పక్కవారి మాటలు.. కేవలం గమనించండి, వాటికి రియాక్ట్ అవ్వకండి. మీరు గమనించిన క్షణమే మీరు మైండ్ఫుల్గా ఉన్నట్టు లెక్క. జీవితం అంటే మీరు ఎక్కడికో వెళ్లడం కాదు, మీరు ఉన్న చోటే ఎలా జీవిస్తున్నారో అన్నదే ముఖ్యం. బిజీగా ఉండటం అంటే కష్టపడటం మాత్రమే కాదు, మీకంటూ ఒక ప్రశాంతమైన స్థానాన్ని మెదడులో నిర్మించుకోవడం. కాస్త ఆగి, శ్వాస తీసుకోండి.. ప్రపంచం ఎక్కడికీ పారిపోదు, కానీ మీ ప్రశాంతత మీతోనే ఉంటుంది.- సైకాలజిస్ట్ విశేష్ కెరీర్ & మైండ్సెట్ కోచ్8019 000066www.psyvisesh.com -
నడుము పెరిగిందా? ఆయుష్షు తగ్గినట్లే!
నడుము చుట్టూ కొంచెంగానైనా కొవ్వు పెరిగితే అది వయసుతో పాటు వచ్చేదేగా.. అని సరిపెట్టుకుంటున్నారా? అయితే నిలువునా ప్రమాదంలో పడినట్లే! పెరిగే పొట్ట కేవలం బట్టల సైజును మాత్రమే మార్చదు.. అది మనిషి ఆయుష్షును కూడా హరిస్తుందని గ్యాస్ట్రోఎంటరాలజీ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇంతకీ నడుము చుట్టూ కొవ్వు పేరుకుపోతే ఏం జరుగుతుంది?బీఎంఐ బాగున్నా.. కొవ్వు కాటేయవచ్చు!చాలామంది తమ బాడీ మాస్ ఇండెక్స్ (BMI) సరిగానే ఉందని, బరువు అదుపులోనే ఉందని ధీమా వ్యక్తం చేస్తుంటారు. అయితే ఢిల్లీలోని ఫోర్టిస్ ఎస్కార్ట్స్ హార్ట్ ఇన్స్టిట్యూట్ నిపుణులు డాక్టర్ పంకజ్ పూరి తెలిపిన వివరాల ప్రకారం.. బయటకు సన్నగా కనిపిస్తూ, కేవలం నడుము వద్ద కొవ్వు పేరుకుపోయిన వారు (Skinny Fat) మరింత జాగ్రత్తగా ఉండాలి. దీనివల్ల బాహ్యంగా ఆరోగ్యంగా ఉన్నట్లు కనిపించినా, లోపలి అవయవాలు ప్రమదకరమైన కొవ్వులో మునిగిపోయి ఉంటాయని ఆయన హెచ్చరించారు.ప్రాణాంతక ‘విసెరల్ ఫ్యాట్’ అంటే..చర్మం కింద కనిపించే మెత్తటి కొవ్వు కంటే, కంటికి కనిపించకుండా అంతర్గత అవయవాల చుట్టూ పేరుకుపోయే ‘విసెరల్ ఫ్యాట్’ అత్యంత ప్రమాదకరమైనది. ఇది కాలేయం, గుండె, క్లోమం తదితర కీలక అవయవాలను చుట్టుముట్టి వాటి పనితీరును దెబ్బతీస్తుంది. ఇది కేవలం కొవ్వు మాత్రమే కాదు, శరీరంలో ఇన్ఫ్లమేషన్ (మంట) కలిగించే హానికరమైన రసాయనాలను నిరంతరం విడుదల చేసే ఒక ‘టాక్సిక్ సెంటర్’.కాలేయంపై నిశ్శబ్ద దాడినడుము చుట్టూ చేరే ఈ కొవ్వు నేరుగా కాలేయ ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. దీనివల్ల ‘మెటబాలిక్ అసోసియేటెడ్ స్టెటోటిక్ లివర్ డిసీజ్’ (MASLD) లేదా ఫ్యాటీ లివర్ వచ్చే అవకాశం ఉంది. ఇది క్రమంగా కాలేయ వాపునకు, తద్వారా సిర్రోసిస్ వంటి ప్రాణాంతక స్థితికి దారితీస్తుంది. అందుకే నడుము చుట్టూ కొవ్వు పెరగడం అంటే కాలేయానికి ముప్పు మొదలైనట్టేనని వైద్యులు హెచ్చరిస్తున్నారు.గుండెకు గండం.. పెరిగిన నడుము చుట్టుకొలతకు, గుండె జబ్బులకు విడదీయలేని సంబంధం ఉంది. విసెరల్ ఫ్యాట్ వల్ల రక్తపోటు పెరగడం, చెడు కొలెస్ట్రాల్ అధికం కావడం, రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడటం జరుగుతుంది. ఇది మెటబాలిక్ సిండ్రోమ్కు దారితీసి, అకస్మాత్తుగా గుండెపోటు (Heart Attack) వచ్చే ప్రమాదాన్ని రెట్టింపు చేస్తుంది. గుండె కొట్టుకునే వేగాన్ని ఈ కొవ్వు నెమ్మదింపజేస్తుంది.ప్రమాదాన్ని ఇలా కొలుచుకోండిప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నిబంధనల ప్రకారం.. నడుము-తుంటి నిష్పత్తి (Waist-to-hip ratio) ఆరోగ్యాన్ని నిర్దేశిస్తుంది. మహిళల్లో ఈ నిష్పత్తి 0.85 దాటితే అది అధిక ముప్పుగా భావించాలి. పురుషుల్లో 1.0 దాటితే గుండె, కాలేయ సంబంధిత వ్యాధులు దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నాయని అర్థం. రిబ్స్ దిగువన, నడుము ఎముక పైభాగంలో టేపుతో కచ్చితమైన కొలత తీసుకోవడం ద్వారా నడుము స్థితిని తెలుసుకోవచ్చు.పరిష్కారం మీ చేతుల్లోనే!నడుము చుట్టూ కొవ్వు పెరుగుతున్నట్లు గమనిస్తే దానిని నిర్లక్ష్యం చేయకండి. ఆహార నియమాలు పాటించడం, ప్రతిరోజూ వ్యాయామం చేయడం ద్వారా ఈ విసెరల్ ఫ్యాట్ను కరిగించవచ్చు. బరువు తగ్గడం అనేది కేవలం అందం కోసం కాదు, మీ గుండె, కాలేయాన్ని కాపాడుకోవడానికి చేసే ప్రయత్నం అని గుర్తించండి.ఇది కూడా చదవండి: ‘నీలి విషం’ బారిన 61 శాతం భారతీయులు -
జస్ట్ మూడు నెలల్లో 14 కిలోలు బరువు తగ్గాలంటే..!
శీతాకాలం కంటే వేసవికాలంలో బరువు తగ్గడం చాలా సులభం. అందులోనూ ప్రస్తుతం చలికాలం ముగిసి.. వేసవికాలంలోకి ప్రవేశిస్తున్నాం. ఇన్నాళ్లు చలికి భయపడి ముసుగుతన్ని పడుకున్న వాళ్లంతా ఒక్కసారిగా ఈ మండే ఎండల్లో అయినా కొలెస్ట్రాల్ తగ్గించుకుని బరువు తగ్గాలని ప్రయత్నిస్తుంటారు. అలాంటివాళ్లు ప్రముఖ ఫిట్నెస్ కోచ్ డాన్ గో నెట్టింట షేర్ చేసిన పదహారు రూల్స్ తప్పక ఫాలో అవ్వాల్సిందే. ఎందుకంటే ఆయన వేసవి సమీపించగానే చాలామంది వెయిట్లాస్కు ప్లాన్ చేస్తుంటారు. అలాంటి వాళ్ల కోసం ఇన్స్టాగ్రామ్ వేదికగా వెయిట్లాస్ టిప్స్ షేర్ చేశారు ఫిట్నెస్ కోచ్ డాన్గో. ఆరోగ్యప్రదంగా తక్కువ టైంలో కిలోల కొద్ది బరువు తగ్గి.. మెరుగైన ఫలితాలు సత్వరమే అందుకోవాలంటే ఈ పదహారు రూల్స్ తప్పనిసరిగా పాటించాలని చెబుతున్నారు. మరి అవేంటో తెలుసుకుందామా..!.నిద్రకు కొన్ని గంటల ముందు తినకపోవడం..నిద్రవేళకు కనీసం మూడు నుంచి ఐదు గంటలు ముందు తినడం మానేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇది ఎక్కువగా ఆహారం తీసుకోవడాన్ని నిరోధిస్తుంది. నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుంది. ఆకలిని నియంత్రించడంలో సహాయపడుతుంది. కేలరీలు తీసుకోవడంలో కేర్.. శరీర బరువుని 12తో గుణించగా వచ్చిన మొత్తంని మీ రోజువారీ కేలరీలుగా కేటాయించండి. ఈ అసాధారణ సూత్రాన్ని తప్పక అనుసరించమని కోరారు ఫిట్నెస్ కోచ్.ప్రోటీన్కు ప్రాధాన్యత ఇవ్వడం..రోజువారీ ఆహారంలో తగినంత ప్రోటీన్ అవనసం. శరీర బరవుని ఏడుతో గుణిస్తే వచ్చిన మొత్తం మీర రోజువారిగా తీసుకోవాల్సిన ప్రోటీన్గా గుర్తించండి. ఈ విధానం వల్ల కొలెస్ట్రాల్ని తగ్గించుకుంటూ..కండరాలను నిర్మించడానికి, నిర్వహించొచ్చని చెబుతున్నారు. అందుకు ఈ మాత్రం ప్రోటీన్ తప్పనిసరి అని అన్నారు.ఆహారంలో జోడించాల్సిన ఆహారాలురోజువారీ ఆహారంలో ఏం చేర్చుకోవాలంటే..గ్రీకు పెరుగునీరు, కాఫీ, టీలీన్ గ్రౌండ్ బీఫ్ (వీలైతే అదనపు లీన్)చికెన్ బ్రెస్ట్ టర్కీ (గ్రౌండ్ లేదా బ్రెస్ట్)కొవ్వు చేపగుడ్లు, గుడ్డులోని తెల్లసొనకాటేజ్ చీజ్లీఫీ గ్రీన్స్బంగాళాదుంపలుషెల్ఫిష్బీన్స్, కాయధాన్యాలుబెర్రీలుఆపిల్, నారింజ, కివి, ద్రాక్షపండు వంటి అధిక ఫైబర్ పండ్లుఆకుపచ్చ క్రూసిఫెరస్ కూరగాయలుకాలీఫ్లవర్, గుమ్మడికాయ, పుట్టగొడుగులు, మిరియాలు, ఆస్పరాగస్, దోసకాయలు వంటి ఇతర అధిక-పరిమాణ కూరగాయలురోజుకు రెండు పూటల భోజనం..ఫిట్నెస్ కోచ్ రోజుకు రెండు పూటలా భోజనం తీసుకునేలా చూసుకోమని సూచించారు.భోజన షెడ్యూల్లో తీసుకోవాల్సిన కేర్..ఫిట్నెస్ నిపుణుల అభిప్రాయం ప్రకారం, సరైన భోజన షెడ్యూల్ ఈ క్రింది విధంగా ఉంటుంది:పడుకునే ముందు 3 నుంచి 5 గంటల ముందు చివరి భోజనంనిద్రలేచిన 1 నుంచి 2 గంటల ముందు మొదటి భోజనంరెండవ భోజనం మధ్యలో ఉండాలిఅల్పాహారంలో ఏమి చేర్చాలిఅల్పాహారంలో ఏమి చేర్చాలి అనేది ఇక్కడ ఉంది:గ్రీకు పెరుగు - ప్రేగులకు మంచిదిప్రోటీన్ పౌడర్ - ఆకలిని నియంత్రిస్తుంది, కండరాలను మెరుగుపరుస్తుందిబ్లూబెర్రీస్ - ఫైబర్, యాంటీఆక్సిడెంట్లను అందిస్తుంది. అలాగే వాపును తగ్గించడంలో సహాయపడుతుంది.హైడ్రేటెట్గా ఉండండిశరీరానికి తగిప హైడ్రేషన్ కూడా అవసరం. దీని కోసం, ఫిట్నెస్ కోచ్ ఉదయం 500 మి.లీ నీరు, అలాగే భోజనానికి ముందు తర్వాత త్రాగాలని సూచిస్తున్నారు. అయితే, పడుకునే రెండు గంటల ముందు నీరు త్రాగడం మానేయాలని చెబుతున్నారు.శక్తిమంతమైన వ్యాయామాలు..ఆహారంతో పాటు, ఒక రోజు విశ్రాంతితో వారానికి మూడు సార్లు కాస్త ఫోర్స్తో కూడిన వ్యాయామాలు చేయాలని సూచిస్తున్నారు. అవసరైమతే కాస్త అధిక ఫోర్స్తో చేసే వర్కౌట్లు మరింతగా చేసేలా ప్లాన్ చేయాలని సూచిస్తున్నారు.శరీరాన్ని కదిలిస్తూ ఉండండిశక్తి శిక్షణ తర్వాత, శరీరానికి సరైన కదలిక కూడా అవసరం. రోజుకు కనీసం 8 వేల నుంచి 10 వేల అడుగులు వేయండి" అని ఫిట్నెస్కోచ్ సిఫార్సు చేస్తున్నారు. డెస్క్ ఉద్యోగం చేస్తున్న వ్యక్తి తన ప్రణాలికకు అంతరాయం కలగకుండా..డెస్క్ కింద ట్రెడ్మిల్ తీసుకోవడం, వాక్ చేస్తూ మీటింగ్లు ప్లాన్ చేయడం వంటివి చేయాలి.నాణ్యమైన నిద్రకు ప్రాధాన్యత ఇవ్వండిచక్కటి సౌకర్యవంతమైన బెడ్రూమ్లో నిద్రపోవాలి. బెడ్రూమ్ చూడగానే నిద్ర వచ్చేలా ఆహ్లాదంగా ఉంచుకోవాలి.స్థిరమైన నిద్ర దినచర్య..మంచి నిద్ర తోపాటు ఇవి కూడా ఉండాలి.ఉదయం నిద్ర లేవగానే సూర్యరశ్మిని పొందండిముఖ్యంగా వారాంతాల్లో ఒకే సమయంలో నిద్రపోండి, మేల్కొనండిశరీరాన్ని చల్లబరచడానికి వేడి స్నానం లేదా స్నానం చేయండిమంచానికి ఒక గంట ముందు స్క్రీన్లను చూడటం మానుకోండిసూర్యుడు అస్తమించేటప్పుడు మసకబారిన లైట్లు లేదా ఎరుపు రంగు ప్రకాశించే బల్బులను ఉపయోగించండిపురోగతిని ట్రాక్ చేయండివార గడిచినప్పుడల్లా..బరువు, శరీరం కొలతల్లో వచ్చిన మార్పులు గమనించాలి. అందుకు తగ్గట్లుగా పోషకాహారం తీసుకుంటుండాలి. అలాగే ఆ మార్పులను ఫోటోలు తీస్తూ..గమనించుకోవాలన్నారు.పరివర్తనను గుర్తించి..మెయింటైయిన్ చేయాలి..కేవలం ట్రాక్ చేయడమే కాకుండా, బాడీలోని మార్పులను గమనిస్తూ..ఆ దిశగా ప్లాన్లో మార్పులు చేర్పులు చేసుకుంటుండాలి. ఈ సమయంలో ఆల్కహాల్ను నివారించండిమెరుగైన ఫలితాలు అందుకుంటున్నప్పుడు ఆల్కహాల్ జోలికి వెళ్లొద్దని సూచిస్తున్నారు.నిరాశను దరిచేరనివ్వకుండా యాక్టివ్గా ఉండటం..అద్దంలో మార్పులు చూస్తూ..మరింత ఆత్మవిశ్వాసంతో డైట్ని, రూల్స్నిన స్థిరత్వంతో పాటించాలి. ఇలా చేస్తే..ఈ సమ్మర్లో సత్వరమే బరువు తగ్గడం పెద్ద కష్టం కాదని చెబుతున్నారు డాన్గో. అంతేగాదు నియమానుసారంగా సూచించిన ఈ రూల్స్ అన్నింటిని క్రమం తప్పకుండా ఫాలో అయితే ఈజీగా 14 కిలోలు తగ్గుతారని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. View this post on Instagram A post shared by Dan Go | High Performance Health Coach (@coachdango)గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: Arjun-Saaniya Chandhok Wedding: అంజలి, సారా ఆ చీరలే ఎందుకు ఎంచుకున్నారంటే..) -
‘నీలి విషం’ బారిన 61 శాతం భారతీయులు
అది.. చీకటి గది.. నిశ్శబ్ద వాతావరణం.. కానీ మీ కళ్లపై స్మార్ట్ఫోన్ వెలుగు పడుతోంది. ఒక్క నిమిషం రీల్స్ చూసి పడుకుందాం అనుకుంటే, అది కాస్తా తెల్లవారుజామున రెండు గంటలవుతోంది. చేతిలో ఫోన్ ఉన్నంత సేపు సమయం తెలియదు.. అయితే మరుసటి రోజు ఉదయం నీరసం, తలనొప్పి, చిరాకు వెంటాడుతుంటాయి. దీనినే నిపుణులు ‘డూమ్ స్క్రోలింగ్’ వ్యసనం అంటున్నారు. ఈ మాయలో పడి కోట్లాది మంది తమ విలువైన నిద్రను, ఆరోగ్యాన్ని కోల్పోతున్నారు. అయితే, ఈ సమస్య నుంచి బయటపడటానికి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ‘డిజిటల్ సన్ సెట్’ మంత్రం వైరల్ అవుతోంది.‘డిజిటల్ సన్ సెట్’ అంటే?ప్రకృతిలో సూర్యుడు అస్తమించినట్లే, మన ఇంట్లో కూడా డిజిటల్ పరికరాలకు ‘సూర్యాస్తమయం’ ప్రకటించడమే ఈ పద్ధతి. అంటే రాత్రి పడుకోవడానికి కనీసం ఒకటి లేదా రెండు గంటల ముందే ఫోన్లు, ల్యాప్టాప్లు, టీవీలకు స్వస్తి పలకాలి. వినడానికి ఇది కొత్తగా అనిపించినా, దీని వెనుక ఒక బలమైన కథనం ఉంది. 2018లో అన్నా ఫిర్త్, లిండెన్ కెమ్కరాన్ అనే ఇద్దరు మహిళలు తమ పిల్లల్లో పెరుగుతున్న స్క్రీన్ అడిక్షన్ను తగ్గించడానికి ‘డిజిటల్ సన్ సెట్ ఛాలెంజ్’ ప్రారంభించారు. నేడు అది అందరికీ ఒక సంజీవనిలా మారింది.61 శాతం భారతీయుల నిద్ర గల్లంతుభారతదేశంలో నిద్రలేమి సమస్య భయంకరంగా ఉంది. గణాంకాల ప్రకారం సుమారు 61 శాతం మంది భారతీయులు కనీసం ఆరు గంటల ప్రశాంతమైన నిద్రకు కూడా దూరమవుతున్నారు. దీనికి ప్రధాన కారణం స్క్రీన్ల నుంచి వచ్చే ‘బ్లూ లైట్’ (నీలి కాంతి). మనం నిద్రపోయేందుకు మన మెదడు 'మెలటోనిన్' అనే హార్మోన్ను విడుదల చేయాలి. అయితే అర్ధరాత్రి ఫోన్ వెలుగును చూడగానే, మన మెదడు అది ఇంకా పగలే అనుకుని భ్రమపడుతుంది. ఫలితంగా మెలటోనిన్ ఉత్పత్తి ఆగిపోయి, నిద్ర కరువవుతుంది. నైట్ మోడ్ లేదా ఫిల్టర్లు వాడినా మెదడుపై ఒత్తిడి తగ్గదని, కంటి చూపు దెబ్బతినే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.పరిష్కార మిదే..కేవలం శారీరక ఆరోగ్యమే కాదు, మానసిక ప్రశాంతతను కాపాడుకోవడం ఎంతో ముఖ్యమని డాక్టర్లు సూచిస్తుంటారు. రాత్రివేళ అధిక సమయంపాటు ఫోన్ చూసే అలవాటు క్రమంగా డిప్రెషన్కు దారితీస్తుందని క్లినికల్ న్యూరో సైకాలజిస్ట్ నైనా శర్మ తెలిపారు. బెంగళూరులోని డాక్టర్ సుమలత వాసుదేవ పర్యవేక్షణలో.. ఆన్లైన్ షాపింగ్కు బానిసైన యువత నుంచి, టీవీ సీరియల్స్ చూస్తూ గడిపే వృద్ధుల వరకు ‘డిజిటల్ సన్ సెట్’ పాటించి అద్భుతమైన మార్పులు సాధించారు. వారిలో ఏకాగ్రత పెరగడమే కాకుండా చిరాకు కూడా తగ్గింది. ముఖ్యంగా నేటి తరం పిల్లల విద్యాబుద్ధులు మెరుగుపడాలంటే తల్లిదండ్రులే ముందుగా ఫోన్ పక్కన పెట్టి, ఆదర్శంగా నిలవాలని డాక్టర్ పూజా కపూర్ సూచిస్తున్నారు.ఇది కూడా చదవండి: ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం.. పెను విపత్తులో పాక్? -
మీ బాడీ ఇమేజ్... మీ పర్సనాలిటీ...
చాలామంది పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే కేవలం మాట తీరు, డ్రెస్సింగ్ అనుకుంటారు. కానీ మీ పర్సనాలిటీకి అసలైన పునాది "మీ శరీరం". మీరు అద్దంలో చూసుకున్నప్పుడు మీకు నచ్చని వ్యక్తి కనిపిస్తే, ఆ అసంతృప్తి మీ ప్రతి అడుగులో, ప్రతి మాటలో ప్రతిబింబిస్తుంది. దీన్నే Body Image అంటారు.సమాజం, మీడియా, మన ఆలోచనలు కలిసి మనల్ని మనం ఒక 'వస్తువు'గా చూసుకునేలా చేశాయి. మన పర్సనాలిటీలో ఆత్మవిశ్వాసం (Confidence) పుట్టాలంటే, ముందుగా మన శరీరంతో (Body) మనకు ఉన్న సంబంధం బాగుండాలి.1. బాడీ ఇమేజ్ vs బాడీ రియాలిటీబాడీ రియాలిటీ అంటే మీ శరీరం నిజానికి ఎలా ఉంది? (ఎత్తు, రంగు, బరువు). ఇది ఒక భౌతిక సత్యం.బాడీ ఇమేజ్ అంటే మీ శరీరం గురించి మీ మనసులో ఉన్న అభిప్రాయం.సమస్య ఏంటంటే, మనం బాడీ రియాలిటీతో కాకుండా, బాడీ ఇమేజ్ తో జీవిస్తాం. చాలామంది ఫిట్గా ఉన్నా కూడా, తమని తాము లావుగా భావించడం వల్ల ఆందోళన చెందుతారు. ఇది ఒక రకమైన Cognitive Distortion.2. సమాజం, మీడియా ప్రభావంమీడియా మనకు పర్ఫెక్ట్ బాడీ అంటే ఎలా ఉండాలో ఒక ప్రమాణాన్ని ఇచ్చింది."నువ్వు తెల్లగా ఉండాలి," "నువ్వు పక్కా ఫిజిక్ కలిగి ఉండాలి."ఈ ప్రమాణాలను అందుకోలేక, మెజారిటీ ప్రజలు తమ శరీరాన్ని తాము ద్వేషించడం మొదలుపెట్టారు. ఒక వ్యక్తి తన శరీరాన్ని అసహ్యించుకోవడం మొదలుపెడితే, అతను తనను తాను 'తక్కువ'గా చూసుకోవడం ప్రారంభించి, పర్సనాలిటీ పరంగా కుంచించుకుపోతాడు.3. పర్సనాలిటీపై ప్రభావంమీ బాడీ ఇమేజ్ బాగోలేకపోతే మీ పర్సనాలిటీ ఎలా మారుతుందో చూడండి.అభద్రతా భావం: ఎప్పుడూ ఇతరులు తనని చూసి ఏమనుకుంటున్నారో అని భయం (Social Anxiety).వాయిదా వేసే స్వభావం: "నేను బరువు తగ్గాక బయటకు వెళ్తాను, నేను అందంగా మారాక ఆ పని చేస్తాను"—ఇలా జీవితాన్ని వాయిదా వేస్తారు.ఎమోషనల్ అస్థిరత: చిన్న విమర్శ కూడా వారిని విపరీతంగా బాధపెడుతుంది.4. మీ శరీరంతో సంధి చేసుకోండిGenius Matrix ఫిలాసఫీ ప్రకారం, మీ శరీరానికి, మీకు మధ్య ఉన్న గొడవను ఎలా ఆపాలో చూద్దాం.Step 1: బాడీ షేమింగ్ ని ఆపండిమొదట మిమ్మల్ని మీరు విమర్శించుకోవడం ఆపండి. అద్దం ముందు నిలబడి మీ శరీరంలోని లోపాలను వెతకడం మానేసి, మీ శరీరం మీకు చేస్తున్న సహాయాన్ని గుర్తించండి. "నా కాళ్లు నన్ను నడిపిస్తున్నాయి, నా మెదడు నాకు ఆలోచనలను ఇస్తోంది" అని కృతజ్ఞతతో ఉండండి. సమాజం చెప్పిన 'పర్ఫెక్ట్' ప్రమాణాలను 'Break' చేయండి.Step 2: ఫంక్షనాలిటీ vs అప్పియరెన్స్మీరు మీ బాడీని చూడటానికి అందంగా ఉండాలని కాకుండా, ఆరోగ్యంగా ఉండాలని అనుకోండి. వ్యాయామం అంటే బరువు తగ్గడానికి మాత్రమే కాదు, అది ఒక Self-Respect. మీరు మీ బాడీని గౌరవించి, దానికి కావాల్సిన వ్యాయామం, ఆహారం ఇస్తే, మీ ఆత్మవిశ్వాసం ఆటోమేటిక్ గా 'Build' అవుతుంది.Step 3: బాడీ అక్సెప్టెన్స్మీరు పరిపూర్ణంగా ఉన్నారా లేదా అనేది కాదు ముఖ్యం, మీరు మీ శరీరంతో ఎంత Comfortable గా ఉన్నారు అనేది ముఖ్యం. ఎప్పుడైతే మీరు మీ శరీరాన్ని ఒక దేవాలయంలా గౌరవిస్తారో, అప్పుడు మీరు వేసే ప్రతి అడుగులోనూ ఒక 'గ్లో' కనిపిస్తుంది. ఇదే 'Beyond' స్టేజ్.5. మీ అద్దం ఏం చెప్తోంది?ఈ రోజు మీరు ఒక చిన్న పని చేయండి.అద్దం ముందు నిలబడి, మీకు నచ్చని మీ బాడీ పార్ట్ వైపు చూడండి.దాన్ని ద్వేషించడం మానేసి, "థాంక్యూ, నువ్వు నాకోసం ఇంత కష్టపడుతున్నావు" అని చెప్పండి.మీ దృష్టిని అప్పియరెన్స్ నుండి 'బాడీ ఫంక్షనాలిటీ' కి మార్చండి.మీ శరీరమే మీ మొదటి ఇల్లు!బ్రో, ఒక ఇల్లు పాతబడితే దాన్ని కూల్చేయరు కదా, పెయింటింగ్ వేసి బాగుచేసుకుంటారు. మీ శరీరం మీ మొదటి ఇల్లు. దాన్ని ప్రేమించండి, గౌరవించండి. అప్పుడే మీ పర్సనాలిటీ లోపలి నుండి బయటకు ప్రకాశిస్తుంది.గుర్తుంచుకోండి, "Your body is the vehicle for your soul; treat it with the respect it deserves."సైకాలజిస్ట్ విశేష్ Genius Matrix Hub 8019 000066www.psyvisesh.com(చదవండి: మీ కలలు చెప్పే నిజాలు) -
ఆరోగ్యం.. ఒక డైనమిక్ ప్రయాణం
స్త్రీల జీవితంలో నెలసరి మొదలైనప్పటి నుంచి, నెలసరి ఆగిపోయే వరకు, ఆ తరువాత తీసుకోవాల్సిన ఆరోగ్య రక్షణ చర్యలు, సమస్యలు, వాటి పరిష్కారాల గురించి...ప్రతి స్త్రీ జీవితంలో టీనేజ్, పునరుత్పాదక వయస్సు, మెనోపాజ్ అనే ముఖ్యమైన మూడు దశలుంటాయి. ఈ మూడు దశల్లో హార్మోన్ మార్పులు, శారీరక మార్పులు ఎక్కువ. అందుకే వీటిని ముందుగానే గుర్తించి జాగ్రత్తలు తీసుకోవాలి.టీనేజ్ దశలో...యుక్తవయస్సులో నెలసరి ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. ముఖ్యంగా మొదటి నెలసరి వచ్చినప్పుడే పరిశుభ్రత గురించి తెలియజెప్పాలి. శుభ్రమైన ప్యాడ్లు వాడాలి. ప్రతి నాలుగు గంటలకు మార్చాలి. వేడినీటితో శుభ్రంగా కడుక్కోవాలి. ఈ సమయంలో తల్లిదండ్రులు ధైర్యం చెప్పాలి. శరీరంలో జరిగే మార్పులను అంగీకరించేలా కౌన్సెలింగ్ అవసరం. అవసరమైతే వైద్యులను సంప్రదించాలి. పాఠశాలల్లో లైంగిక ఆరోగ్యంపై అవగాహన కల్పించాలి. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణకు హెచ్పీవీ టీకా వేయించాలి. సాధారణంగా 11 నుంచి 19 సంవత్సరాల మధ్య నెలసరి సరిగా రాకపోవడం సాధారణ విషయమే. ఆ తర్వాత హార్మోన్లు సర్దుబాటుతో 18 నుంచి 19 సంవత్సరాల నాటికి నెలసరి క్రమబద్ధంగా మారుతుంది. బరువు పెరగడం వల్ల కూడా ఇలాంటి సమస్యలు రావచ్చు. వ్యాయామం, సరైన ఆహారం, బరువు నియంత్రణ అవసరం. అవసరమైతే థైరాయిడ్ పరీక్ష చేస్తారు. అధిక రక్తస్రావం ఉన్నవారికి రక్తహీనత రాకుండా విటమిన్లు ఇస్తారు. అల్ట్రాసౌండ్ ద్వారా గడ్డలు లేదా సిస్టులు ఉన్నాయా పరిశీలిస్తారు. కొన్నిసార్లు విటమిన్లు మాత్రమే సరి΄ోతాయి.పునరుత్పాదక వయస్సులో...20 నుంచి 40 సంవత్సరాల మధ్య దశలో వివాహం, గర్భధారణ, ప్రసవం, ప్రసవానంతర సంరక్షణ ముఖ్యమైనవి. వివాహం ప్లాన్ చేసుకునే ముందు పూర్తి ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి. ముందుగా టీకాలు వేయించుకోక΄ోతే రుబెల్లా, చికెన్ఫాక్స్, హెచ్పీవీ టీకాలు వేయించుకోవాలి. పాప్ స్మియర్ పరీక్ష, లైంగిక వ్యాధుల రక్తపరీక్షలు చేయించుకోవాలి. గర్భధారణ ప్లానింగ్కు ముందు థైరాయిడ్, బీపీ, షుగర్, జన్యుపరమైన సమస్యలు, ఇన్ఫెక్షన్లు ఉన్నాయో లేవో చూసుకోవాలి. కుటుంబ నియంత్రణ పద్ధతుల గురించి తెలుసుకోవాలి. నెలసరి తరువాత స్తనాన్ని స్వయంగా పరీక్షించుకోవాలి. స్తనంలో గడ్డ, నొప్పి, నిపల్ నుంచి స్రావం, ఇతర మార్పులు ఉంటే వైద్యుని సంప్రదించాలి.40 సంవత్సరాల తరువాత చాలామందికి మూత్రంలో మంట, నొప్పి, జ్వరం కనిపిస్తాయి. రోజుకు 3 నుంచి 3.5 లీటర్లు నీరు తాగాలి. పరిశుభ్రత పాటించాలి. మలబద్ధకం లేకుండా పండ్లు, కూరగాయలు తినాలి. యోని లేదా మూత్రనాళ ఇన్ఫెక్షన్లకు సరిగా చికిత్స చేయక΄ోతే గర్భాశయానికి వ్యాపించి, పెల్విక్ ఇన్ఫ్లమేటరీ వ్యాధి వస్తుంది. దీనిని స్కాన్ , రక్తపరీక్షల ద్వారా గుర్తించి చికిత్స చేస్తారు.మెనోపాజ్ దశలో...నెలసరి ఒక సంవత్సరం పాటు రాకపోతే సహజ మెనోపాజ్ అంటారు. ఈ దశలో హార్మోన్ మార్పుల వల్ల వేడి ఆవిర్లు, చిరాకు, దిగులు, నిద్రలేమి వస్తాయి. కాఫీ, మసాలా పదార్థాలు తగ్గించాలి. ప్రాణాయామం, యోగా, ధ్యానం చేయాలి.ఈస్ట్రోజన్ తగ్గడం వల్ల ఎముకల బలహీనత పెరుగుతుంది. ΄ోషకాహారం తీసుకోవాలి. చర్మం, యోని పొడిబారడం ఉంటుంది. అవసరమైతే లూబ్రికెంట్లు, మాయిశ్చరైజర్లు వాడాలి. కొందరికి హార్మోన్ చికిత్స అవసరం పడుతుంది. బీపీ, షుగర్, గుండె ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి. పాప్ స్మియర్, మామోగ్రఫీని డాక్టర్ సూచన మేరకు కొనసాగించాలి.మహిళల ఆరోగ్యం వయస్సు మార్పులు, హార్మోన్ మార్పులు, జీవనశైలిపై ఆధారపడి ఉంటుంది. ముందస్తు పరీక్షలు, అవగాహన, సరైన జీవనశైలి ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. (చదవండి: 24 ఏళ్ల వయసులో 197 దేశాలు..!) -
అత్యంత విషపూరితమైన పాయిజన్తో..ప్రాణాంతక వ్యాధులకు చెక్..!
పాములను భయానకంగా మార్చేది ఏమిటంటే, కొన్ని విషాన్ని ఇంజెక్ట్ చేయడం ద్వారా చంపే సామర్థ్యం. కానీ విషపూరిత కాటుకు తెలిసిన ఏకైక విరుగుడు, యాంటీవెనమ్, అదే విషంతో తయారు చేయబడింది. శతాబ్దాలుగా,పాము విషంలోని ఎంజైమ్ల మిశ్రమంలో వివిధ రకాల ఔషధాలు కూడా ఉండొచ్చని మానవుడు ఏనాడో గుర్తించాడు.ఈ క్రమంలోనే విషం నుంచి తయారు చేసిన ఆధునిక చికిత్సా ఉత్పత్తులు నాడీ వ్యవస్థ, హృదయనాళ వ్యవస్థ, రక్తాన్ని ప్రభావితం చేసే వ్యాధులకు చికిత్సగా ఉపయోగించారు. ఈ పాముల విషాన్ని ఎన్నో రకాల వ్యాధులను నయం చేసేలా లక్ష్యంగా పెట్టుకుని మరి మందులు రూపొందించారు వైద్య నిపుణులు. అవేంటంటే రక్తపోటు , పుట్టుకతో వచ్చే గుండె జబ్బులకు చికిత్స చేసే కాప్టోప్రిల్ జరారాకా (దీన్ని దక్షిణ అమెరికా పిట్ వైపర్ అనే అత్యంత విషపూరిత పాము నుంచి తయారు చేస్తారట), అస్వస్థతకు చికిత్స చేయడానికి ఉపయోగించే ఎప్టిఫిబాటైడ్ (రాటిల్ స్నేక్ నుంచి తయారు చేస్తారు). ఇవేగాక కింగ్కోబ్రా విషంపై పరిశోధనలు జరుగుతున్నాయి కూడా. ఇందులో కూడా అద్భుతమైన సమ్మేళనాలు ఉన్నాయి. దీని విషాన్ని హృదయ స్పందన రేటు, రక్తపోటును తగ్గించే బీటా-కార్డియోటాక్సిన్ ఔషధ తయారీలో ఇనియోగిస్తారట. అలాగే పెప్టైడ్ను నోటి ద్వారా తీసుకునే మందుని కూడా తయారు చేస్తారట.కేవలం పాముల నుంచే కాదు అవి కూడా..విషాన్ని ఉత్పత్తి చేసే జీవులు పాములు మాత్రమే కాదు. గొంగళి పురుగులు,కందిరీగలు, కోన్ నత్తల నుంచి టోడ్లు, జెల్లీ ఫిష్ వరకు వివిధ రకాల జంతువులు విషాన్ని ఉత్పత్తి చేస్తాయి. అఖరికి కొన్ని బల్లులు కూడా విషపూరితమైనవేనని చెబుతున్నారు నిపుణులు. మనం తరుచుగా పిల్లలు మధ్యాహ్నం భోజన పథకం కింద అందించే భోజనం తిన్న తర్వాత అస్వస్థతకు గురయ్యారు అని వింటుంటాం. అందుకు కారణం అన్నం లేదా కూరలో బల్లి పడటంతో ఇది జరిగిందని చెబుతుంటారు. అంటే సాధారణంగా బల్లలు విషపూరితమైనవి కావు, కానీ మనం తినే పదార్థాల్లో పడినప్పుడు దానిలోని సాల్మొనెల్లా బ్యాక్టీరియా ప్రేగుల్లో చేరి పాయిజన్ అవుతుందట. అంతేకాదండోయ్ అమెరికా, మెక్సికో ఎడారులలో కనిపించే గిలా అనే బల్లి విషం నుంచి టైప్ 2 డయాబెటిస్ నివారణ మందును తయారు చేస్తారట. అంతేగాదు అంతకుమించి ప్రమాదకరమైన మరో చిన్నజీవి ఉంది. మనం తరుచుగా ఇళ్లల్లో చూసేదే. అదేనండి గొంగళి పురుగు. దక్షిణ అమెరికాలోని లోనోమియా గొంగళి పురుగు అత్యంత ప్రాణాంతకమైనదట. 1989లోబ్రెటిజల్లో వీటిని చూశారట. ఇవి సముహాలుగా గుత్తులగా ఉంటాయట. ఒక గుత్తిని తాకినా..అంతే ప్రాణాలే పోతాయట. అందుకు పెరూలోనే ఓ రోగి కేసు ఉదాహరణ అంటున్నారు వైద్య నిపుణులు. పెరూలో ఐదు గొంగళి పురుగులపై కాలు వేసిన ఒక యువ కెనడియన్ పర్యాటకుడి ప్రారంభంలో కొద్దిపాటి లక్షణాలు అనుభవించిన..రోజులు గడుస్తున్నకొద్ది బహుళ అవయవాల వైఫల్యంతో మరణించిన ఉదంతం అందర్నీ దిగ్బ్రాంతికి గురిచేసింది. ఈ గొంగళి పురుగు విషం శాస్త్రవేత్తల పరిశోధనలో అంతర్గత రక్తస్రావం, మూత్రపిండ వైఫల్యానికి దాదితీస్తుందని తర్వాత తెలిసింది. దీనికి విరుగుడు బ్రెజిల్లోని ఇన్స్టిట్యూటో బుటాంటన్ తయారు చేసిన యాంటీవినమ్ మాత్రమే చికిత్స. ఇక సాలీడు విషం సైతం మానవులకు ఉపయోగపడుతుందట. ప్రపంచంలోని నాలుగు ప్రాణాంతక సాలెపురుగులలో ఒకటైన ఆస్ట్రేలియాలోని గరాటు వెబ్ అనే సాలీడు విషం నుంచి సహజ పురుగుల మందు నివారిణిని తయారు చేస్తున్నారు. ఇది దోమలను నియంత్రించడంలో ఉపయోగపడుతుందట. అలాగే ఇది డీడీటీ వంటి ఇతర పురుగుమందుల నిరోధకతను కూడా కలిగి ఉందట. మల్టిపుల్ స్క్లెరోసిస్ చికిత్సలో పాము విషం వాడకాన్ని ప్రోత్సహిస్తోంది యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్. తేలు కుట్టిన తర్వాత కొన్ని నెలలు అనుభవించిన ఉపశమనం ఆధారంగా తేలు విషాన్ని చికిత్సలో ఉపయోగించారు. అంతేగాదు ఈ తేలు విషం ఒంటి నొప్పులకు నివారణగా కూడా ఉపయోగిస్తారట. అలాగే సముద్ర ఎనిమోన్ల ద్వారా ఉత్పత్తి చేసే టాక్సిన్లను ఆటో ఇమ్యూన్ రుగ్మతలకు చికిత్స చేయడానికి ఉపయోగిస్తారట. పురాత గ్రీకులు ఈ విషయాన్ని ముందుగానే కనిపెట్టారు. పైగా రాబోయే ఔషధాలన్నీ విషం నుంచే తయారవుతాయని ఆనాడే అంచనా వేసి ఉండొచ్చని భావిస్తున్నారు వైద్య నిపుణులు. ఆ నేపథ్యంలోనే ప్రపంచవ్యాప్తంగా ఉన్న వైద్య సంస్థలు చాలామటుకు తమ చిహ్నంగా సిబ్బంది చుట్టుతా చుట్టబడిన పాము నమునాని ఎంచుకోడానికి రీజనే ఇదే కావొచ్చు కూడా.జానికి లెనిన్(చదవండి: Frogs: నన్నుఇంటికి తీసుకువెళ్ళు) -
ట్రంప్ మెడపై ఎర్రటి మచ్చ..! స్కిన్ క్రీములతో జర భద్రం..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మెడపై ఎర్రటి మచ్చ కనిపించడంలో సర్వత్రా రకరకాల ఊహగానాలు మొదలయ్యాయి. ట్రంప్ అనారోగ్యం పాలయ్యారా? అని యూఎస్ ప్రజానీకం చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే వైట్హౌస్ వివరణ ఇచ్చింది కూడా. ట్రంప్ మెడపై ఎర్రటి మచ్చకు గల కారణాన్ని వైట్ హౌస్ వైద్యుడు సీన్ బార్బబెల్లా వెల్లడించారు. అది సాధారణ చర్మక్రీమ్ని ఉపయోగించడం వల్ల వచ్చిన అలెర్జీగా పేర్కొన్నారు. కొన్ని వారాలపాటు ఇలా ఉంటుందని కూడా అన్నారు. దీంతో ఒక్కసారిగా మనం సాధారణంగా వాడే స్కిన్ క్రీములు కూడా ఒక్కోసారి అలెర్జీకి దారితీస్తుందా అనే సందేహాలు వెల్లువెత్తాయి. అయితే దీని గురించి డెర్మటాలజిస్టులు ఏమంటున్నారంటే..మనం రెగ్యులర్గా వాడే స్కిన్ క్రీములు కూడా ఒక్కోసారి వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ఇబ్బందులు తలెత్తుతాయని అంటున్నారు నిపుణులు. అదిగాక డీ హైడ్రేషన్ వల్ల, చర్మం పైపొర దెబ్బతిని ఇలా సమస్యలు ఉత్పన్నమవుతాయట. మనం రెగ్యులర్ రాసే ఈ క్రీమ్ సున్నితత్వానికి అలవాటుపడి కూడా ఇలా దద్దుర్లతో కూడిన ఇరిటేషన్ వస్తుంటుందని చెబుతున్నారు. కొందరి సున్నితమైన వ్యక్తుల్లో ఈ అలెర్జీ మరింత తీవ్రంగా ఉండొచ్చని కూడా అన్నారు. ఒక్కోసారి ఏజ్ పైబడటం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి సన్నగిల్లినా..ఇలా ఎప్పుడూ రాసే స్కిన్ క్రీమ్ ప్రతిచర్య చూపించి చర్మ సంబంధిత సమస్యలు ఉత్పన్నమవుతాయని అంటున్నారు. కొందరికి వెంటనే ఈ సమస్య చూపించగా, మరికొందరికి కనీసం 24 నుంచి 72 గంటల్లో ప్రభావం చూపిస్తుందని చెబుతున్నారు. అందుకే మన శరీరానికి సరిపడే క్రీమ్ అయినా ప్రతిచర్య చూపిన వెంటనే కడిగేయాలని సూచిస్తున్నారు నిపుణులు. ఆ సమస్య తగ్గేంత వరకు ఆయా క్రీమ్లు వినియోగించకపోవడమే మేలు అని అంటున్నారు. ఇది అందరికీ ఒకేలా ఉండదు..కొందరికీ తక్కువ రియాక్టివ్ చర్మం ఉంటుంది.పదే పదే అదే క్రీమ్ వాడటం వల్ల ఆ సంరక్షణకు మించి చర్మానికి ఎఫెక్టివ్ క్రీమ్ అవసరమై ఇలా ప్రతిచర్య చూపించొచ్చు కూడా. అంతేగాదు కొందరికీ ఆ క్షణం అలెర్జీ వచ్చినా..ఆ తర్వాత కొద్ది నిమిషాల్లోనే సమస్య తగ్గుముఖం పడుతుంది. అందువల్ల మన శరీరాని పడిన క్రీమ్ అని గుడ్డిగా అదే పనిగా రాసేయొద్దు..ఒక్కోసారి మనం వేరే ప్రాంతంలో ఉంటే అక్కడి వాతావరణానికి తగ్గట్టుగా స్కిన్క్రీమ్ మార్చాల్సి ఉంటుందనే విషయం గుర్తెరగండి అని చెబుతున్నారు. అలాగే ఏ మాత్రం దురదగా..ఇబ్బందిగా అనిపించినా తక్షణమే ఆ ప్రదేశాన్ని నీళ్లతో శుభ్రపరుచుకుని ఆయా క్రీమ్లను కొద్దిరోజులపాటు వినియోగించకుండా ఉండటమే బెస్ట్ అని చెబుతున్నారు. ఒకరకంగా ఈ ఘటన స్కిన్క్రీమ్ల విషయంలో ఎంత జాగురకతతో వ్యవహరించాలో హైలెట్ చేసిందని చెబుతున్నారు చర్మ నిపుణులు.(చదవండి: బుల్లి ఫ్యాషన్ డిజైనర్..! జస్ట్ పదేళ్లకే..) -
‘ఆస్పత్రి మాఫియా’ ఇక లగెత్తాల్సిందే!
ప్రభుత్వ ఖజానాకు కన్నం వేసే అక్రమార్కుల ఆటలకు ఇక కాలం చెల్లింది! పేదల ఆరోగ్యం కోసం కేటాయించిన ఒక్క రూపాయి కూడా పక్కదారి పట్టకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం అత్యంత శక్తివంతమైన ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్’ (AI) అస్త్రాన్ని ప్రయోగించింది. ఆయుష్మాన్ భారత్లో చోటుచేసుకుంటున్న కోట్లాది రూపాయల క్లెయిమ్ల మోసాలను ‘ఏఐ టెక్నాలజీ’ చిటికెలో కనిపెట్టేస్తోంది. ఆస్పత్రుల అక్రమాలకు అడ్డుకట్ట వేయడమే కాకుండా, డాక్టర్లు ప్రిస్క్రిప్షన్లు టైప్ చేసే శ్రమ లేకుండా.. వారు మాట్లాడితే చాలు డిజిటల్ రిపోర్టులు తయారయ్యే విప్లవాత్మక మార్పునకు శ్రీకారం చుట్టింది. సామాన్యుడికి అందాల్సిన వైద్యం మరింత వేగంగా, నిజాయితీగా అందేందుకు ఈ డిజిటల్ మేధస్సు తోడ్పాటునందిస్తోంది.నకిలీ క్లెయిమ్లపై ఏఐ ‘సర్జరీ’దేశవ్యాప్తంగా అమలవుతున్న ఆయుష్మాన్ భారత్ పథకంలో పారదర్శకతను పెంచేందుకు నేషనల్ హెల్త్ అథారిటీ (NHA) నడుం బిగించింది. ‘నేషనల్ యాంటీ ఫ్రాడ్ యూనిట్’ (NAFU) ద్వారా రంగంలోకి దిగిన ఏఐ ఇంజిన్లు.. ఆస్పత్రులు పంపే ప్రతి క్లెయిమ్ను క్షుణ్ణంగా స్కాన్ చేస్తున్నాయి. అనవసరంగా రోగులను ఆస్పత్రులలో ఉంచుకోవడం, చికిత్స చేయకుండానే బిల్లులు వేయడం లాంటి మోసాలను ఈ వ్యవస్థ ఇట్టే పసిగడుతోంది. ఫలితంగా ప్రభుత్వం కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం కాకుండా కాపాడగలిగింది.గంటల్లోనే క్లెయిమ్ సెటిల్మెంట్గతంలో ఇన్సూరెన్స్ క్లెయిమ్ పరిష్కారానికి 15 నుండి 20 రోజుల సుదీర్ఘ సమయం పట్టేది. కానీ ఇప్పుడు టెక్నాలజీ పుణ్యమా అని కేవలం రెండు గంటల్లోనే క్లెయిమ్ ప్రక్రియ పూర్తవుతోంది. క్లౌడ్ డేటాను సెకన్లలో విశ్లేషించే ఏఐ, నిబంధనల ప్రకారం ఉన్న బిల్లులను వెంటనే ఆమోదిస్తుంది. అనుమానాస్పదంగా ఉన్న కేసులను మాత్రమే మానవ పర్యవేక్షణకు పంపి తనిఖీ చేయిస్తారు. దీనివల్ల ఆసుపత్రులకు చెల్లింపులు వేగంగా అందుతున్నాయి.డాక్టర్ల మాటతో ప్రిస్క్రిప్షన్లు రెడీ!ప్రభుత్వ ఆస్పత్రులలో ఉండే రద్దీ వల్ల డాక్టర్లు కంప్యూటర్ ముందు కూర్చుని ప్రిస్క్రిప్షన్లు టైప్ చేయడం ఒక పెద్ద సవాలుగా మారింది. దీనికి పరిష్కారంగా ‘వాయిస్-టు-టెక్స్ట్’ (VTT) సాంకేతికతను ప్రవేశపెట్టారు. డాక్టర్ పేషెంట్ను పరీక్షిస్తూ, ఏవైతే సూచనలు చేస్తారో, ఆ మాటలను ఏఐ నేరుగా డిజిటల్ టెక్స్ట్గా మారుస్తుంది. డాక్టర్లు టైప్ చేయాల్సిన అవసరం లేకుండానే, ప్రిస్క్రిప్షన్ ఆటోమేటిక్గా తయారై, హెల్త్ రికార్డుల్లో నిక్షిప్తమవుతుంది.మెరుగైన చికిత్సకు మార్గంఈ ఏఐ టూల్స్ వల్ల వైద్యులకు డాక్యుమెంటేషన్ భారం గణనీయంగా తగ్గనుంది. సాధారణంగా ఒక డాక్టర్ తన సమయాన్ని రిపోర్టులు రాయడానికే ఎక్కువ కేటాయించాల్సి వచ్చేది. అయితే వాయిస్-టు-టెక్స్ట్ విధానం వల్ల ఆ సమయం ఆదా అవుతుంది. ఫలితంగా డాక్టర్లు రోగుల సమస్యలను మరింత ఓపిగ్గా వినేందుకు, మెరుగైన చికిత్స అందించేందుకు అవకాశం కలుగుతుందని వైద్యశాఖ అధికారులు భావిస్తున్నారు.డేటా భద్రతతో కూడిన ప్లాట్ఫామ్ఈ వినూత్న మార్పులను నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ (NIC) అభివృద్ధి చేసిన ‘ఈ-హాస్పిటల్’ ప్లాట్ఫామ్లో అనుసంధానించారు. క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో సమాచారం అంతా భద్రంగా ఉండటమే కాకుండా, ఏ రాష్ట్రం నుంచైనా డేటాను విశ్లేషించే వీలుంటుంది. ఈ ఏడాది జనవరి 19 నుంచి పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చిన ఈ వ్యవస్థను ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాలకు విస్తరిస్తున్నారు.వైద్య రంగంలో డిజిటల్ భవిష్యత్తుఇటీవలి ‘ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026’లో ప్రదర్శించిన ఈ సాంకేతికతలు ఆరోగ్య రంగంలో ఒక కొత్త శకానికి నాంది పలికాయి. టెక్నాలజీ సాయంతో అక్రమాలను అరికట్టడమే కాకుండా, సామాన్యుడికి వేగవంతమైన వైద్య సేవలు అందించడమే ఈ ప్రాజెక్ట్ ప్రధాన ఉద్దేశ్యం. మానవ తప్పిదాలకు తావులేకుండా, యంత్రాల సాయంతో సాగుతున్న ఈ డిజిటల్ హెల్త్ విప్లవం భవిష్యత్తులో మరిన్ని అద్భుతాలు సృష్టించనున్నదనడంలో సందేహం లేదు.ఇది కూడా చదవండి: రాజ్యసభ బరిలో నితీష్ తనయుడు నిశాంత్? -
ఫిట్నెస్ ప్రపంచాన్ని షేక్ చేస్తున్న ‘జెఫింగ్’
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎవరికైనా సరే ఒక పెద్ద సవాలుగా మారింది. బరువు తగ్గాలని ఉత్సాహంగా పరుగు మొదలుపెట్టిన కొద్ది రోజుల్లోనే తీవ్రమైన అలసట, కండరాల నొప్పులు వచ్చేస్తుంటాయి. అటువంటి వారి కోసం ‘జెఫింగ్’ అనే సరికొత్త వ్యాయామ పద్ధతి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ట్రెండ్ అవుతోంది. ఇది కేవలం పరుగు మాత్రమే కాదు, అలాగని కేవలం నడక కూడా కాదు.. ఈ రెండింటి కలయికతో కూడిన ఒక అద్భుతమైన ఫిట్నెస్ సూత్రం... అద్భుత మంత్రం..ఎలా మొదలయ్యింది?ఒలింపిక్ రన్నర్ జెఫ్ గాల్లోవే ప్రాచుర్యంలోకి తెచ్చిన ఈ విధానానికి ఆయన పేరు మీదనే ‘జెఫింగ్’ అని పేరు వచ్చింది. ఇటీవలే తన 80 ఏళ్ల వయసులో కన్నుమూసిన గాల్లోవే.. ఫిట్నెస్ ప్రపంచానికి అందించిన అతిపెద్ద కానుక ఇది. నిర్ణీత సమయం పాటు పరిగెత్తడం, ఆ వెంటనే కొంత సమయం వేగంగా నడవడం అనే ప్రక్రియ ద్వారా శరీర సత్తువను పెంచడమే దీని ప్రధాన ఉద్దేశ్యం. బరువు తగ్గాలని ఉత్సాహంగా పరుగు మొదలుపెట్టిన కొద్ది రోజుల్లోనే తీవ్రమైన అలసట, కండరాల నొప్పులను చూసి నీరసించిపోయే వారి సంఖ్య తక్కువేమీ కాదు. అటువంటి వారి కోసం ‘జెఫింగ్’ అనే సరికొత్త వ్యాయామ పద్ధతి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ట్రెండ్ అవుతోంది.‘30-30’ మ్యాజిక్ ఫార్ములానిర్ణీత సమయం పాటు పరిగెత్తడం, ఆ వెంటనే కొంత సమయం వేగంగా నడవడం అనే ప్రక్రియ ద్వారా శరీర సత్తువను పెంచడమే ‘జెఫింగ్’ ప్రధాన ఉద్దేశ్యం. జెఫింగ్లో అత్యంత ప్రాచుర్యం పొందిన సూత్రం ‘30-30’ ఫార్ములా. అంటే 30 సెకన్ల పాటు పరుగు, ఆ వెంటనే 30 సెకన్ల పాటు చురుకైన నడక. ఇలా చేయడం వల్ల కండరాలు పూర్తిగా అలసిపోకముందే వాటికి స్వల్ప విశ్రాంతి లభిస్తుంది. దీనివల్ల సాధారణంగా పరిగెత్తే దూరం కంటే ఎక్కువ దూరం సులువుగా పరుగెత్తగలుగుతారు.సామర్థ్యం అనుసరించి మూడు స్థాయిలుఈ వ్యాయామాన్ని ప్రారంభించే వారు తమ శారీరక స్థితిని అనుసరించి మూడు స్థాయిలలో సాధన చేయవచ్చు. కొత్తగా మొదలుపెట్టే వారు 30 సెకన్ల పరుగు-నడక విరామాలను పాటించవచ్చు. మధ్యస్థ స్థాయి వారు 3 నిమిషాల పరుగుకు ఒక నిమిషం నడకను, నిష్ణాతులు 9 నిమిషాల పరుగుకు ఒక నిమిషం నడకను అనుసరించవచ్చు. అయితే ఇక్కడ గమనించాల్సిన ముఖ్య విషయం ఏంటంటే.. పూర్తిగా అలసిపోయేంత వరకు వేచి చూడకుండా, మొదటి నుంచే ఈ విరామాలను పాటించడం వల్ల కండరాల ఒత్తిడిని సమర్థవంతంగా నిర్వహించవచ్చు.నడక అంటే అదొక స్ట్రాటజీజెఫింగ్లో ‘నడక’ అంటే విశ్రాంతి అని భావించకూడదు. గుండె కొట్టుకునే వేగం తగ్గకుండా చురుకుగా సాగాలి. పరుగు తీసే సమయంలో వీపు, భుజాలు నిటారుగా ఉంచి, చేతులను 90 డిగ్రీల కోణంలో ఉంచుతూ పక్కవారిలో సులువుగా మాట్లాడగలిగే వేగంతో సాగాలి. ఒకవేళ ఊపిరి తీసుకోవడం కష్టంగా అనిపిస్తే ‘హఫ్ అండ్ పఫ్’ నిబంధన ప్రకారం పరుగు సమయాన్ని తగ్గించి, నడక సమయాన్ని పెంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.గాయాల ముప్పు తక్కువఈ క్రమబద్ధమైన విధానం వల్ల కీళ్ల మీద పడే ఒత్తిడి గణనీయంగా తగ్గుతుంది. బరువు తగ్గడమే కాకుండా, గుండె ఆరోగ్యానికి కూడా ఇది ఎంతో మేలు చేస్తుంది. సాధారణ పరుగులో ఎదురయ్యే గాయాల బారిన పడకుండా, ఎక్కువ కాలం ఫిట్నెస్ ప్రయాణాన్ని కొనసాగించేందుకు ‘జెఫింగ్’ తోడ్పడుతుంది.కండరాల నొప్పులను తగ్గించి..ఈ వ్యాయామ విధానం కండరాల నొప్పులను తగ్గించి, శరీరం త్వరగా కోలుకునేందుకు అద్భుతంగా పని చేస్తుంది. పరుగును ఒక శిక్షగా కాకుండా ఒక ఆహ్లాదకరమైన అనుభవంగా మార్చుకోవాలనుకునే వారికి ఇది ఒక సరైన మార్గం. అందుకే మీరు కూడా ఈరోజే మీ ‘జెఫింగ్’ ప్రయాణాన్ని మొదలుపెట్టి, ఆరోగ్యకరమైన జీవనశైలి వైపు అడుగులు వేయండి. ఇది కూడా చదవండి: చపాతీలు చేస్తూ చెత్త బుట్ట.. వంట మనిషిని పట్టుకున్న ఏఐ బాట్ -
జస్ట్ రెండేళ్లలో 17కిలోలు తగ్గిన టీనేజర్..!
ఇంతవరకు చూసిన వెయిట్లాస్ జర్నీలలో ఇది అత్యంత విభిన్నం. ఓ టీనేజర్ అధిక బరువు తగ్గేంచేందుకు ఎలా ప్రయత్నించాడో వివరించే వెయిట్లాస్ స్టోరీ ఇది. తన పదహారవ పుట్టిన రోజున తీసుకున్న నిర్ణయం..తనలో ఎంతలా పరివర్తనకు దారితీసిందో తెలిపాడు. అయితే జిమ్కి వెళ్లలేదని, అలాగే ఎలాంటి కఠినమైన డైట్లు పాటించలేదని అంటున్నాడు. కానీ రెండేళ్లలో 17 కిలోలు పైనే తగ్గానని అంటున్నాడు. జిమ్, డైట్ పాటించకుండా ఆ టీనేజర్ ఎలా బరువుతగ్గాడంటే..ఇంటి వ్యాయామాలతో అని చెబుతున్నాడు. అదేంటి అనుకోకండి. ఎందుకంటే తాను స్లిమ్గా ఆరోగ్యకరమైన బరువుతో ఉండాలనుకుంటున్నట్లు తల్లిదండ్రులకు చెప్పి..వారి సహాయసహకారాలతో బరువు తగ్గాడు. పేరెంట్స్ సాయంతోనే..ఇంటిలోనే చేసే వ్యాయామా పరికరాలను కొనుగోలు చేసి మరి..వర్కౌట్లకు ఉపక్రమించాడు. బరువులు ఎత్తే ప్లేట్ల తోపాటు బార్బెల్ వంటి పరకరాలతో మంచి పురోగతిని అందుకున్నాడు. మొదట్లో పుల్అప్బార్లతో వేలాడిదీసినట్లు ఉండటం దాదాపు అసాధ్యం అనిపించింది. ఒకపుల్అప్ని కూడా పూర్తి చేయలేకపోయేవాడు. అయితే క్రమం తప్పకుండా సాధన చేసి..మంచి మెరుగుదలను అందుకున్నాడు. సరైన టెక్నిక్తో ఇవాళ సుమారు 18 పుల్అప్లు దాక నిర్వహించి..కండరాల బలాన్ని పెంపొందించుకుంటున్నాడు. అలా రెండేళ్లలో చూస్తుండగానే దాదాపు 17 కిలోలు తగ్గి..చాలా స్మార్ట్గా మారిన తన పరివర్తన పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నాడు ఆ టీనేజర్. కేవలం క్రమశిక్షణ, నిబద్ధతత, క్రమం తప్పకుండా చేయడం వంటివి వెయిట్లాస్కి ప్రధానమైనవని అంటున్నాడు. బరువు తగ్గడం గురించి భయపడే వారికి తన వెయిట్లాస్ స్టోరీ ప్రేరణ అని చెప్పడమే గాక, స్లిమ్గా మారేలా ఇతరులను ప్రోత్సహిస్తానని కూడా చెబుతున్నాడు.(చదవండి: పదేపదే వైఫ్యల్యాలు, ఆర్థిక కష్టాలు..కానీ ఇవాళ సీఈవోగా విద్యార్థులకు..!) -
పగటి నిద్ర.. మరణ శాసనమే..!
‘నిద్ర తగ్గితే ఏమవుతుందిలే.. తరువాత పడుకోవచ్చు’ అని ఎవరైనా సరిపెట్టుకుంటుంటే, వారు వారి మరణ శాసనాన్ని స్వయంగా రాసుకుంటున్నారని వైద్యులు హెచ్చరిస్తున్నారు. నిద్ర అనేది కేవలం విశ్రాంతి మాత్రమే కాదు.. అది శరీర అంతర్గత వ్యవస్థలు చేసే 'రిపేర్ వర్క్'. నిద్రకు దూరమైన సమయంలో మెదడులోని ‘మాస్టర్ క్లాక్’ దిశానిర్దేశం కోల్పోయి, పిచ్చిగా ప్రవర్తించడం మొదలుపెడుతుంది. ఫలితంగా లోపల నిశ్శబ్ద యుద్ధం మొదలవుతుంది.నిద్రలేమి పరిస్థితిలో మనకు తెలియకుండానే మెలటోనిన్ ఉత్పత్తి ఆగిపోతుంది. రక్త ప్రసరణలో అసమతుల్యత ఏర్పడుతుంది. చివరికి ఊపిరితిత్తులు గాలిని పీల్చుకునేందుకు ఇబ్బంది పడతాయి. రాత్రి నిద్రను ఎగ్గొట్టి, పగలు పడుకుంటే సరిపోతుందిలే అనుకోవడం ఒక పెద్ద భ్రమ. కిటికీ తెరల నుంచి వచ్చే సన్నని వెలుతురు కూడా సరిగా నిద్ర పోనివ్వదు. ఫలితం.. పగలు ఎన్ని గంటలు పడుకున్నా తీరని అలసట, జ్ఞాపకశక్తి మందగించడం, బరువు పెరగడం లాంటి సమస్యలు తలెత్తుతాయి. ‘మాస్టర్ క్లాక్’ గందరగోళంమన మెదడులో ఉండే 'మాస్టర్ క్లాక్' ప్రకృతి వెలుతురును అనుసరించి పనిచేస్తుంది. రాత్రంతా మేల్కొని, పగలు పడుకుంటే ఈ క్లాక్ పూర్తిగా దెబ్బతింటుంది. కిటికీ రెక్కల నుంచి వచ్చే కొద్దిపాటి వెలుతురు కూడా మెలటోనిన్ ఉత్పత్తిని ఆపేస్తుంది. దీనివల్ల మీరు 10 గంటలు పడుకున్నా శరీరం మాత్రం విశ్రాంతి లేక అల్లాడిపోతూనే ఉంటుంది.మెదడు మొద్దుబారుతుందినిద్రలేమి వల్ల మొదట దెబ్బతినేది ఆలోచనా శక్తి, ఏకాగ్రత లోపించడం. చిన్న విషయాలకే విపరీతమైన చికాకు కలగడం, జ్ఞాపకశక్తి మందగించడం వంటివి దీని ప్రధాన సంకేతాలు. క్రమంగా ఇది డిప్రెషన్, యాంగ్జైటీ వంటి మానసిక సమస్యల సుడిగుండంలోకి నెట్టేస్తుంది. తరచుగా వచ్చే తలనొప్పిని కేవలం పని ఒత్తిడి అనుకుంటే పొరపాటే.. అది మీ నరాల వ్యవస్థ ఇస్తున్న హెచ్చరిక అని గుర్తుంచుకోవాలి.ఊపిరితిత్తులపై తీవ్ర ప్రభావంచాలామంది నిద్రలేమి సమమస్యను చిన్నదిగా తీసుకుంటారు. నోయిడా కైలాష్ హాస్పిటల్ నిపుణులు చెబుతున్న వివరాల ప్రకారం.. నిద్రలేమి అనేది శ్వాసకోస వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తుంది. శరీరంలోని 'సిర్కాడియన్ రిథమ్' దెబ్బతినడం వల్ల ఊపిరితిత్తుల సామర్థ్యం తగ్గిపోతుంది.రోగనిరోధక శక్తిపై..నిద్ర లేకపోతే శరీరంలోని రోగనిరోధక కణాలు పగటిపూట నిష్క్రియంగా మారిపోతాయి. ఫలితంగా సామాన్యమైన అంటువ్యాధులు కూడా శరీరంపై తీవ్రంగా దాడి చేస్తాయి. చర్మం, కళ్లు పొడిబారడం లాంటి లక్షణాలు కనిపిస్తున్నాయంటే, శరీర అంతర్గత వ్యవస్థ కుప్పకూలడానికి సిద్ధంగా ఉందని గుర్తించాలి.అకస్మాత్తుగా బరువు పెరగడంనిద్రలేమి వల్ల శరీరంలో హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటుంది. జీవక్రియ మందగించడం వల్ల.. తక్కువ తిన్నప్పటికీ శరీర బరువు అకస్మాత్తుగా పెరుగుతుంది. ఇది అధిక రక్తపోటు (BP), గుండె సంబంధిత సమస్యలకు దారితీస్తుంది.కోలుకోలేని నష్టం జరగకముందే..ఆటో ఇమ్యూన్ వ్యాధులు, దీర్ఘకాలిక అనారోగ్యాల బారిన పడకముందే అస్తవ్యస్తమైన నిద్ర అలవాట్లను మార్చుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. రాత్రిపూట మేల్కొని ఉండటాన్ని 'స్టైల్' గానో లేదా 'అలవాటు' గానో భావిస్తే, అది ఆరోగాన్ని తీవ్రంగా దెబ్బ తీస్తుంది. అందుకే ప్రకృతితో కలిసి నడవడమే ఆరోగ్యానికి ఏకైక మార్గమని వైద్యులు సూచిస్తున్నారు. ఇది కూడా చదవండి: రంగులే కాదు.. పండ్లు, బురదతోనూ రచ్చ -
హెల్త్కు సూపర్ టాపప్!
పదేళ్ల కిందట హెల్త్ ఇన్సూరెన్స్ అంటే... లక్ష రూపాయలు చాలు. ఆ మాత్రం కవరేజీ ఉంటే హ్యాపీ. ఇక రెండు లక్షలంటే లగ్జరీకిందే లెక్క. మరిప్పుడు? చాలామంది తమకు రూ.5 లక్షలు, రూ.10 లక్షలు కవరేజీ ఉన్నా సరే ధీమాగా ఉండలేని పరిస్థితి. ఎందుకంటే ఒక్కసారి ఆసుపత్రి మెట్లెక్కితే ఎన్ని పరీక్షలు ఎదుర్కోవాల్సి వస్తుందో తెలియదు. ఏ పరీక్షల్లో ఏం బయటపడుతుందో తెలియదు. దానికి ఎన్ని లక్షలవుతుందో తెలియదు. ఎందుకంటే జీవనశైలి మారిపోయింది. ఆహారపు అలవాట్లు మారిపోయాయి. అనారోగ్య సమస్యలు తీవ్రమవుతున్నాయి. దానికి తగ్గట్లే అత్యాధునిక హంగులతో కార్పొరేట్ ఆసుపత్రులు పుట్టుకొస్తున్నాయి. ఖర్చు ఏటా 14% చొప్పున పెరుగుతోందన్నది ఒక అంచనా. మరిప్పుడు ఏం చేయాలి? ఈ ప్రశ్నకు సమాధానమే టాపప్. ఆ వివరాలే ఈ ‘వెల్త్ స్టోరీ’అవసరానికి పనికిరాకుంటే హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నా లేనట్టే. ఎందుకంటే మన ఆరోగ్యానికి ఎంత బీమా కవరేజీ ఉన్నదనేది ఇప్పుడు ప్రధానం కాదు. అది ఎంతవరకూ అవసరానికి పనికొస్తుందన్నదే ప్రధానం. చాలామందికి రూ.5 లక్షలు లేదా రూ.10 లక్షల కవరేజీ ఉంటోంది. చాలా సందర్భాల్లో అది సరిపోతుంది. కానీ పెద్ద ప్రమాదం జరిగితేనో, కేన్సర్ వంటి మహమ్మారి చికిత్సలు అవసరమైతేనో అది ఎంతమాత్రం చాలదు. ఎందుకంటే కేన్సర్ చికిత్సకు దాని స్టేజ్ను బట్టి ఆరంభంలో రూ.15 లక్షల వరకు కూడా ఖర్చు అవుతుంటుంది. ఇక వైద్యం ఎప్పటికప్పుడు ఆధునికతను సంతరించుకుంటూ ఉండటంతో చికిత్సల వ్యయాలూ అదే స్థాయిలో పెరుగుతున్నాయి. 14 శాతంగా ఉంటున్న వైద్య ద్రవ్యోల్బణం మనకు తెలియకుండానే.. మన బీమా రక్షణ కవరేజీ సామర్థ్యాన్ని తినేస్తోంది. గతంలో రూ.3000 ఉన్న ఆసుపత్రి రూమ్ చార్జీ ఇపుడు రూ.6వేలు దాటిపోయింది. ఇపుడు తీసుకున్న రూ.5 లక్షల బీమా ఐదేళ్ల తర్వాత రూ.2.5 లక్షలకు సమానం. కనుక మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఆరోగ్య బీమానూ సమీక్షించుకోవాలి. ప్రీమియం భారం..? వైద్య చికిత్సల వ్యయాలు, క్లెయిమ్లకు అనుగుణంగా బీమా సంస్థలు ప్రీమియంను సవరిస్తుంటాయి. దీంతో కరోనా తర్వాతి కాలంలో హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంలు 50 శాతానికి పైనే పెరిగాయి. అధిక ఆయుర్దాయం, పెరిగిపోతున్న వ్యాధులు, కరోనా విపత్తు అనంతరం ఆరోగ్య సమస్యలతో కంపెనీలపై క్లెయిమ్ల భారం పడడం ఈ పరిస్థితికి కారణం. ఇక వయసును బట్టి ప్రీమియంల పెంపు సహజంగానే చూస్తుంటాం. 35– 40, 45–50, 60 తర్వాత ప్రీమియం ఎంతలేదన్నా 20 శాతం మేర పెరుగుతుంటుంది. కనుక చాలా మంది మధ్య తరగతి కుటుంబాలకు భారీ ప్రీమియంతో ప్రాథమిక హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ (బేసిక్ ఇండెమ్నిటీ ప్లాన్) తీసుకోవడం కష్టమే. ఈ పరిస్థితుల్లో తక్కువ ప్రీమియానికి అదనపు రక్షణనిచ్చే టాపప్, సూపర్ టాపప్ ప్లాన్ల గురించి, ఇవి ఏ రకంగా ఉపయోగపడతాయన్నది తప్పకుండా తెలుసుకోవాలి. టాపప్ ప్లాన్లు.. పరిమిత ప్రీమియానికి అదనపు ఆరోగ్య బీమా రక్షణను టాపప్, సూపర్ టాపప్లు అందిస్తుంటాయి. బేస్ పాలసీ కవరేజీని రూ.5 నుంచి రూ.15 లక్షలకు పెంచుకోవాలంటే ప్రీమియం చాలా ఎక్కువుంటుంది. కానీ రూ.15 లక్షల సూపర్ టాపప్ ప్రీమియం చాలా తక్కువ. ఇవి బేస్ పాలసీతో అనుసంధానమై పనిచేస్తాయి. ‘డిడక్టబుల్’ (తగ్గించడం) ఇక్కడ కీలకం. టాపప్ అయినా, సూపర్ టాపప్ అయినా కనీస డిడక్టబుల్తో వస్తాయి. ఉదాహరణకు రూ.5 లక్షల డిడక్టబుల్తో రూ.50 లక్షలకు టాపప్ లేదా సూపర్ టాపప్ తీసుకున్నారనుకుంటే.. హాస్పిటల్ బిల్లు రూ.5 లక్షల్లోపే ఉంటే టాపప్, సూపర్ టాపప్తో పని ఉండదు. బేస్ పాలసీలోనే క్లెయిమ్ పరిష్కారం అవుతుంది. బిల్లు రూ.5 లక్షలు దాటినప్పుడు ఈ ప్రత్యేక ప్లాన్లు యాక్టివ్గా మారతాయి. అదనపు మొత్తాన్ని అందిస్తాయి. బిల్లు రూ.8 లక్షలు వచి్చందనుకుందాం. అప్పుడు బేస్ పాలసీ రూ.5 లక్షలు, టాపప్ లేదా సూపర్ టాపప్ రూ.3 లక్షలు చెల్లిస్తాయి. రెండూ వేర్వేరు.. ఇక్కడ టాపప్, సూపర్ టాపప్ రెండూ డిడక్టబుల్తో వచ్చినప్పటికీ.. కొంత స్పష్టమైన వైరుధ్యం ఉంది. టాపప్, సూపర్ టాపప్ రెండూ ‘డిడక్టబుల్’ దాటిన సందర్భాల్లో అమల్లోకి వస్తాయి. ఇందులో టాపప్ ప్లాన్ అనేది ఒకసారి ఆసుపత్రిలో చేరినపుడు ఆ క్లెయిమ్ మొత్తం డిడక్టబుల్ మొత్తాన్ని మించినప్పుడే అమలవుతుంది. సూపర్ టాపప్ అలా కాదు. ఒక బిల్లు డిడక్టబుల్ను మించిన సందర్భాల్లోనూ చెల్లింపులు చేస్తుంది. అలాగే, ఒక పాలసీ సంవత్సరంలో విడిగా ఒక్కో బిల్లు డిడక్టబుల్ దాటకుండా.. అన్నీ కలసి డిడక్టబుల్ను మించిన సందర్భంలోనూ చెల్లింపులు చేస్తుంది. పాలసీ కవరేజీబేస్ ప్లాన్ రూ.10 లక్షలు టాపప్ రూ.20 లక్షలు సూపర్ టాపప్ రూ.20 లక్షలు డిడక్టబుల్ రూ.10 లక్షలుఒక ఏడాదిలో క్లెయిమ్లు మొదటి క్లెయిమ్ 4 లక్షలు రెండో క్లెయిమ్ 3.50 లక్షలు మూడో క్లెయిమ్ 4.50 లక్షలు మొత్తం రూ.12 లక్షలు → ఇందులో టాపప్ ప్లాన్ కింద ఎలాంటి చెల్లింపులు రావు. ఎందుకంటే విడిగా ప్రతీ క్లెయిమ్ డిడక్టబుల్ రూ.10 లక్షలుమించలేదు. → సూపర్ టాపప్ ప్లాన్ మాత్రం విడిగా ఒక క్లెయిమ్ అనే కాకుండా, ఒక ఏడాదిలో మొత్తం క్లెయిమ్లు రూ.10 లక్షలు మించినా యాక్టివేట్ అవుతుంది. కనుక రూ.10 లక్షలు డిడక్టబుల్ పోను మిగిలిన రూ.2 లక్షలు చెల్లిస్తుంది. ఒక ఏడాదిలో ఎన్ని సందర్భాలు ఆస్పత్రిలో చేరారన్న దానితో సంబంధం లేకుండా డిడక్టబుల్ దాటిన తర్వాత నుంచి ఆ పాలసీ సంవత్సరంలో అయ్యే వ్యయాలు అన్నింటికీ పాలసీ గరిష్ట పరిమితి మేరకు చెల్లింపులు లభిస్తాయి. రూ.10 లక్షల డిడక్టబుల్తో రూ.20 లక్షలకు సూపర్ టాపప్ తీసుకుంటే.. ఒక ఏడాదిలో రూ.10 లక్షలు మించి, రూ.20 లక్షల వరకు పాలసీ నిబంధనల మేరకు చెల్లింపులు అందుకోవచ్చు. → టాపప్లో ఈ ఫీచర్ లేదు. ఏ బిల్లు అయినా డిడక్టబుల్ దాటినప్పుడే యాక్టివేట్ అవుతుంది. → ఒక ఏడాదిలో ఎన్ని సందర్భాల్లో వైద్యం అవసరమవుతుందో తెలియదు. ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్ అన్నది కుటుంబం అంతటికీ ఉద్దేశించినది. ఒక ఏడాదిలో ఒకరు ఆస్పత్రి పాలై బేసిక్ కవరేజీ ఖర్చయిపోయితే, అదే ఏడాది అదే కుటుంబంలో మరొకరికి వైద్యం అవసరం పడొచ్చు. అటువంటప్పుడు సూపర్ టాపప్ ప్లాన్ ఆదుకుంటుంది. ముఖ్యంగా కరోనా వంటి విపత్తులు, వైరల్ ఇన్ఫెక్షన్లు, ప్రమాదాల కారణంగా ఒకే ఏడాది కుటుంబంలో ఒకరికి మించి వైద్యం అవసరం ఏర్పడొచ్చు. ఏది తీసుకోవాలి..? → వివాహం కాని వారు, ఇండివిడ్యువల్ హెల్త్ ఇన్సూరెన్స్తోపాటు టాపప్ ప్లాన్ తీసుకోవచ్చు. → కుటుంబం అంతటికీ ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్ తీసుకునే వారికి సూపర్ టాపప్ అనుకూలం. → బేసిక్ ఇండెమ్నిటీ హెల్త్ ప్లాన్ కంపెనీ నుంచే టాపప్ లేదా సూపర్ టాపప్ తీసుకోవాలని లేదు. ఐఆర్డీఏఐ నిబంధనల ప్రకారం ఇది తప్పనిసరి కాదు. పాలసీదారులు తమకు నచి్చన సంస్థ నుంచి ఈ రక్షణలను ఎంపిక చేసుకోవచ్చు. → ఒకే కంపెనీ నుంచి బేసిక్ ప్లాన్, టాపప్/సూపర్ టాపప్ ఉంటే క్లెయిమ్లు సాఫీగా పరిష్కారం అవుతాయి. టాపప్–సూపర్ టాపప్ క్లెయిమ్ కోసం పెద్దగా శ్రమ పడక్కర్లేదు. → టాపప్– సూపర్ టాపప్ ప్లాన్ ప్రీమియం తక్కువ కోరుకుంటే, వేర్వేరు కంపెనీల నుంచి ఎంపిక చేసుకోవాల్సి రావచ్చు. → బేసిక్ ప్లాన్, టాపప్/సూపర్ టాపప్ కవరేజీల్లో ఏకరూపత ఉంటే మంచిది.వీటిపై ఫోకస్ చేయండి.. → బీమా కంపెనీ ఆస్పత్రుల నెట్వర్క్ ఎంత బలంగా ఉందో చూడాలి. తాము నివసించే ప్రాంతంలో దాదాపు అన్ని ముఖ్యమైన ఆస్పత్రులు బీమా కంపెనీ నగదు రహిత ఆస్పత్రుల నెట్వర్క్లో ఉంటే నయం. → ఆస్పత్రిలో చేరాల్సిన అవసరం లేకుండా.. అదే రోజు చికిత్స తీసుకుని వెళ్లిపోయే (డే కేర్ ప్రొసీజర్స్) చికిత్సలకు (అన్నింటికీ) కవరేజీ ఉన్నాయేమో ధ్రువీకరించుకోవాలి. → ఆస్పత్రిలో చేరడానికి ముందు.. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత ఎక్కువ రోజులకు కవరేజీ ఉండాలి. → అత్యాధునిక రోబోటిక్, లేజర్ సర్జరీలకు పాలసీలో చెల్లింపుల ప్రయోజనాలు ఉంటే మెరుగు. → ముందస్తు వ్యాధులకు కవరేజీ ఎంత వెయిటింగ్ తర్వాత అమల్లోకి వస్తాయో తెలుసుకోవాలి. → ముఖ్యంగా రీసోర్టేషన్ ప్రయోజనం ఉంటే మంచిది. అంటే ఒక ఏడాదిలో కుటుంబంలో ఒకరు ఆస్పత్రిలో చేరడం వల్ల సమ్ అష్యూర్డ్ మొత్తం ఖర్చయిపోతే.. తిరిగి అంతే మొత్తాన్ని తదుపరి వైద్యానికి బీమా సంస్థ పునరుద్ధరిస్తుంది. → ఎంపిక చేసుకునే పాలసీల ప్రీమియం భరించగలిగే స్థాయిలోనే ఉండేలా చూసుకోవాలి. తగినంత కవరేజీ.. → చాలా కుటుంబాలు తమ అవసరాలకు సరిపడా రక్షణను (సమ్ అష్యూర్డ్) ఎంపిక చేసుకోవడం లేదని ఎన్నో సర్వేల్లో తేలింది. మెజారిటీ పాలసీదారుల రక్షణ అవసరానికంటే తక్కువే ఉంటోంది. → కుటుంబంలో ఎంత మంది సభ్యులు ఉన్నారు, వారికి అప్పటికే ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయా? తాము నివసించే ప్రాంతం, ఆ ప్రాంతంలో వైద్యానికి అయ్యే వ్యయాల ఆధారంగా కవరేజీని నిర్ణయించుకోవాలన్నది నిపుణుల సూచన. → కనీసం రూ.10 లక్షల సమ్ అష్యూర్డ్తో బేసిక్ ప్లాన్, రూ.10 లక్షల డిడక్టబుల్తో రూ.50 లక్షలు లేదా రూ.కోటికి సూపర్ టాపప్ ప్లాన్ తీసుకోవడం సముచితంగా ఉంటుంది. దీనివల్ల నేటి వ్యయాలకే కాకుండా, భవిష్యత్తు వ్యయాలకు సైతం రక్షణను ఏర్పాటు చేసుకున్నట్టు అవుతుంది. -
ఆఫీసులో పని ఒత్తిడి... కుటుంబ సభ్యులపై కోపం
రోజంతా ఆఫీసులో బాస్ మాటలు, డెడ్లైన్ల ఒత్తిడి.. ఈ కోపాన్నంతా లోపలే దాచుకుని సాయంత్రం ఇంటికి వస్తారు. తలుపు తీయగానే పిల్లలు ఏదో అడిగితేనో, భార్య చిన్న ప్రశ్న అడిగితేనో ఒక్కసారిగా పేలిపోతారు. మరుక్షణమే "ఎందుకు అంత కోప్పడ్డాను?" అని గిల్టీగా ఫీల్ అవుతారు. దీన్ని Displaced Aggression అంటారు. అంటే, ఆఫీసులో ఎవరినీ ఏమీ అనలేక, ఆ కోపాన్నిఇంట్లో చూపించడం. దీనివల్ల ఇంట్లో ప్రశాంతతే కాదు, కుటుంబ సంబంధాలు కూడా దెబ్బతింటాయి.కుటుంబం మీదే ఎందుకు?ఆఫీసులో మీకు కోపం తెప్పించిన బాస్ను మీరు తిరిగి ఏమీ అనలేరు. ఎందుకంటే అది మీ కెరీర్కు ప్రమాదం. కానీ, ఆ కోపం ఎక్కడో ఒకచోట బయటకు రావాలి. అందుకే, అత్యంత సురక్షితమైన ప్రదేశం.. అంటే మీ ఇల్లు, మీ కుటుంబ సభ్యులు ఆ కోపానికి బలవుతారు. ఇది బలహీనత కాదు, ఒక రకమైన 'ఎమోషనల్ బ్లీడింగ్'.నా దగ్గరికి వచ్చిన రమేష్ (పేరు, వివరాలు మార్చాను) ఒక కార్పొరేట్ కంపెనీలో మేనేజర్. ఆఫీసులో పాలిటిక్స్ వల్ల అతను తీవ్ర ఒత్తిడిలో ఉండేవాడు. ఇంటికి రాగానే అతని భార్య కబుర్లు చెప్పేది. కానీ అతను వినలేకపోయేవాడు. "నాకు ఆఫీసులో తలనొప్పి చాలదు అన్నట్టు, ఇంటికి రాగానే నీ నసేంటి" అని గట్టిగా అరిచేవాడు. ఆ మాటలు అతని భార్యను ఎంతగానో బాధించేవి. రమేష్ తన కోపాన్ని ఆఫీసులో వదిలేయకుండా, ఇంటికి కూడా తెచ్చుకోవడమే అసలైన సమస్య.కుటుంబానికి విముక్తి ఎలా? 1. Decompression Period: ఆఫీసు నుండి ఇంటికి వెళ్లిన వెంటనే కుటుంబంతో కలవకండి. ఒక 15-20 నిమిషాలు మీ కోసం కేటాయించండి. స్నానం చేయడం, కాసేపు ప్రశాంతంగా కూర్చోవడం, సంగీతం వినడం చేయండి. ఇది ఆఫీసు ఒత్తిడిని మీ మనసు నుండి తొలగిస్తుంది.2. Voice Out: మీ మనసులో ఆఫీసు పట్ల ఉన్న అసహనాన్ని ఇంట్లో చెప్పకండి. దానికి బదులు, ఇంటికి వచ్చే దారిలో ఒక మంచి ఫ్రెండ్తో మాట్లాడండి లేదా ఆఫీసులో జరిగిన కోపాన్ని ఒక డైరీలో రాసి పెట్టండి. అది మీలోని కోపాన్ని తగ్గించే 'వెంటిలేషన్' లా పనిచేస్తుంది.3. ఫోన్/మెయిల్ ఆఫ్ చేయండి: ఇంటి గుమ్మం తొక్కే ముందే మీ ఫోన్ లోని ఆఫీస్ యాప్స్ నోటిఫికేషన్లను ఆఫ్ చేయండి. ఇంటికి వచ్చాక కూడా ఆఫీస్ గురించి ఆలోచిస్తుంటే, మీరు ఫిజికల్ గా ఇంట్లో ఉన్నా, మెంటల్ గా ఆఫీసులోనే ఉంటారు.4. "ఐ యామ్ స్ట్రెస్డ్" అని చెప్పండి: "ఈరోజు ఆఫీసులో చాలా ఒత్తిడి ఉంది, నాకు కాసేపు ప్రశాంతంగా ఉండాలనిపిస్తోంది. కాసేపు నన్ను డిస్టర్బ్ చేయకండి" అని ఇంట్లో వాళ్లకు చెప్పడంలో తప్పులేదు. ఇది మీ కోపాన్ని అరిచే వరకు వెళ్ళకుండా ఆపుతుంది.5. కుటుంబమే మీ శక్తి: కోపం వస్తున్నప్పుడు ఒక్కసారి ఆలోచించండి.. "ఈరోజు నేను కష్టపడి పనిచేసింది ఎవరి కోసం? నా కుటుంబం కోసమే కదా!" అప్పుడు ఆ కుటుంబ సభ్యుల మీద కోపం రాదు, ఒక రకమైన కృతజ్ఞత కలుగుతుంది.మీ కోసం ఒక చిన్న పరీక్ష...ఈ సాయంత్రం ఇంటికి వెళ్లేటప్పుడు మిమ్మల్ని మీరు ఒక ప్రశ్న అడగండి: "నేను ఇప్పుడు నా ఆఫీసు కోపాన్ని నా వాళ్లకు బహుమతిగా ఇస్తున్నానా? లేక నా ప్రేమను ఇస్తున్నానా?"కెరీర్లో గెలవడం ఎంత ముఖ్యమో, మనసున్న మనుషుల ప్రేమను గెలుచుకోవడం అంతకంటే ముఖ్యం. గుర్తుంచుకోండి.. ఆఫీసు మీ శ్రమను అడుగుతుంది, కానీ కుటుంబం మీ చిరునవ్వును, మీ సమయాన్ని కోరుకుంటుంది. ఆఫీసు కోపాన్ని ఆఫీసులోనే వదిలేయండి, సంతోషాన్ని ఇంటికి తీసుకెళ్లండి.సైకాలజిస్ విశేష్కెరీర్ & మైండ్సెట్ కోచ్8019 000066www.psyvisesh.com -
హార్ట్బీట్ 120 దాటినప్పుడల్లా..14 సెకన్లపాటు ఆగిపోయే గుండెజబ్బు..!
పుట్టుకతో వచ్చే రెండు రకాల గుండె లోపాలతో జన్మించిన కార్షియాక్ స్పెషలిస్ట్ అయినా ఆ మహిళ అలుపెరగని పోరాటం చేసి మరి జీవిస్తోందామె. ఒకటి, రెండు కాదు ఏకంగా తొమ్మిది ఆపరేషన్లు చేయించుకున్నా ఆశా అనే జ్యోతిని వెలిగిస్తూ..తన ప్రాణాన్ని నిలబెట్టుకుంది. ప్రాణాంతకమైన ఆ గుండె పరిస్థితిని మందులతో నిర్వహిస్తూనే ఆరోగ్యకరంగా జీవిస్తూ..స్ఫూర్తిగా నిలుస్తున్నారు. చిన్నపాటి అనారోగ్య పరిస్థితికి కుంగిపోయే వారికి ఆమె కథ ఓ ప్రేరణపుట్టుకతో వచ్చే గుండె లోపాలతో జన్మించిన కార్డియాక్ స్పెషలిస్ట్ ఏంజెలికి అసిమాకి ఇంటర్మెటెంట్ ఏవీ బ్లాక కారణంగా 14 సెకన్లపాట్లు గుండె ఆగిపోయే పరిస్థితితో పోరాడుతోందామె. ప్రాణాంతకమైన పరిస్థితిలో పోరాడుతున్న ఆమెకు సరిగ్గా 36 ఏళ్ల వయసులో వచ్చిన స్ట్రోక్ మరోసారి కుప్పకూలిపోయేలా చేసింది. అప్పుడే తెలిసింది ఈ ప్రాణాంతక పరిస్థితికి తోడు గుండెలో "గ్యాపింగ్ హోల్" కూడా ఉందని నిర్థారణ అయ్యింది. ఆమెది ఆకస్మిక కార్డియాక్ మ సంబంధం ఉన్న పరిస్థితికి ఇది మరింత ప్రమాదకరమైన సంకట స్థితి.ఎప్పటి నుంచి పోరాడుతోందంటే..25 ఏళ్ల వయసులో ఏంజెలికీ తొలిసారిగా తనకు గుండెజబ్బుకి సంబంధించిన లక్షణాలు తొలిసారిగా కనిపించాయని చెప్పుకొచ్చింది. నెమ్మదిగా తలతిరడం నుంచి మొదలై నెలలుగా మూర్చపోయే వరకు దారితీసింది. గుండె జబ్బుల కుటుంబ చరిత్ర లేకపోయినా..ఆమె ప్రాణాంతక గుండెజబ్బు బారినపడింది. పలు వైద్య పరీక్షల అనంతరం ఆమె హృదయస్పందన నిమిషానికి 120 బీట్స్ దాటినప్పుడల్లా ఆమె గుండె 14 సెకన్ల వరకు ఆగిపోతుందని వైద్యులు నిర్ధారించారు. దీని కారణంగా గుండెలో "పై నుంచి దిగువ గదులకు విద్యుత్ ప్రవహించదు, కాబట్టి ఆమెకు పేస్మేకర్ అవసరం. ఈ తీవ్రమైన గుండె జబ్బు గురించి వినడంతోనే ఏంజెలి ఇక తన జీవితం ముగిసిపోయిందనుకుంది. ఎందుకంటే బెడరూమ్ నుంచి బాత్రూమ్ వరకు కూడా వెళ్లలేనంతగా స్ప్రుహతప్పి పడిపోయేది. ఆ తర్వాత ఏంజెలికి ఫేస్మేకర్ని అమర్చారు. 1990లలో ఈ యంత్రంలో అనేక సమస్యలతో రావడంతో మళ్లీ కష్టాలు మొదలయ్యాయి ఆమెకు. ముఖ్యంగా బ్యాటరీలను నిరంతరం మార్చాల్సి వచ్చేది. ఆ క్రమంలో మెదడులోని రక్తనాళం పగిలి రక్తస్రావం కావడంతో స్ట్రోక్ను ఎదుర్కొంది. దాంతో ఆమెకు ఓపెన్-హార్ట్ సర్జరీతో సహా ఐదు ఫేస్మేకర్లు, మూడు అబ్లేషన్ల, ఒక ఓపెన్-హార్ట్ సర్జరీతో సహ తొమ్మిది వైద్య చికిత్సలు తీసుకుంది. ఇలా ఆమె జీవితాంతం ఇన్ని అనారోగ్య సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ..లండన్ నుండి కార్డియోమయోపతిలో పిహెచ్డి పూర్తి చేసింది, తర్వాత హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో ఇంటర్న్ చేసింది, అక్కడ ఆమె ఫ్యాకల్టీ సభ్యురాలిగా పనిచేసింది,. అలాగే అమెరికాలో 11 ఏళ్లు గడిపింది. అంతేగాదు ఏంజెలి తనలాంటి గుండె సమస్యతో బాధపడుతున్న వారికోసం..ఆ వ్యాధి నిర్థారణ పర్యవేక్షణ కోసం..ఒక పద్ధతిని ఆవిష్కరించింది. ఇది ప్రమాదకరమైన గుండె బయాప్సీలకు సురక్షితమైన ప్రత్యామ్నాయాన్ని అందిస్తుంది. ఇక ఏంజెలికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అదీగాక ఏంజెలి పుట్టుకతో వచ్చే గుండెజబ్బు కారణంగా అనేక గర్భస్రావాలను ఎదుర్కొని మరి..ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చారామె. అయితే ఆ పిల్లలు ఇద్దరు పూర్తి స్థాయిలో ఆరోగ్యంగా ఉన్నారు. పుట్టుకతో వచ్చే గుండె సమస్యల లోపాన్ని అధిగమించడమే కాకుండా దాన్నే తన కెరీర్గా ఎంచుకుని..ఆ సమస్యకు చెక్పెట్టే దిశగా అడుగులు వేయడం నిజంగా ప్రశంసించదగ్గ విషయం.(చదవండి: ఆర్మీ ట్రైనింగ్ సెంటర్లో మెనింగోకాకల్ ఇన్ఫెక్షన్ కలకలం..! ఎందువల్ల వస్తుందంటే..) -
ఆర్మీ ట్రైనింగ్ సెంటర్లో మెనింగోకాకల్ ఇన్ఫెక్షన్ కలకలం..! ఎందువల్ల వస్తుందంటే..
షిల్లాంగ్లోని ఆర్మీ శిక్షణా కేంద్రంలో ఇద్దరు అగ్నివీర్ శిక్షణార్థులు అనుమానిత మెనింగోకాకల్ ఇన్ఫెక్షన్ బారినపడి గంటల వ్యవధిలోనే మరణించారు. ఒక్కసారిగా అస్సాం రెజిమెంటల్ సెంటర్ ఉలక్కిపడింది. సత్వరమై సైనిక సౌకర్యంలో చుట్టుపక్కల కాంటాక్ట్ ట్రేసింగ్, ఆయా వ్యక్తులతో టచ్లో ఉన్నవారిని ఐసోలేషన్లో ఉంచడం తదితరాలతో వ్యాధి వ్యాప్తి చెందకుండా నిరోధించేలా సత్వరమే అన్ని చర్యలు చేపట్టింది. కేవలం ఆర్మీ శిక్షణా కేంద్రంలోనే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాలపై కూడా గట్టి నిఘా ఉంచినట్లు స్థానిక ఆరోగ్య అధికారులు తెలిపారు. ఇంతకీ అసలేంటి మెనింగోకాకల్ వ్యాధి ..? ఎందువల్ల వస్తుందంటే..?మెనింగోకాకల్ వ్యాధి అంటే ..?మెనింజైటిస్ మెదడు, వెన్నుపాము చుట్టూ ఉన్న కణజాలాల వాపుకు కారణమవుతుంది. ఈ వ్యాధిని ప్రపంచ ఆరోగ్యానికి ఒక తీవ్రమైన ముప్పుగా అభివర్ణించింది ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ). ఇది అనేక రకాల బ్యాక్టీరియాలు, వైరస్లు, శిలీంధ్రాలు, పరాన్నజీవుల వల్ల సంభవిస్తుందని WHO పేర్కొంది. అయితే ఇది అంటువ్యాధి లాంటిదేనా..? కాదా అనేది కచ్చితంగా చెప్పలేమని అంటున్నారు వైద్యులు.బాక్టీరియల్ మెనింజైటిస్ అత్యంత తీవ్రమైన రకం మెనింజైటిస్ అని WHO చెబుతోంది. దీని కారణంగా రోగికి తీవ్రమైన, ప్రాణాంతక పరిస్థితి ఏర్పడుతుందని తెలిపింది. మెనింగోకోకస్ అనేది నీసేరియా మెనింగిటిడిస్ అనే బాక్టీరియా వల్ల కలిగే బాక్టీరియల్ మెనింజైటిస్.వ్యాధి లక్షణాలుక్లీవ్ల్యాండ్ క్లినిక్ ప్రకారం మెనింగోకాకల్ వ్యాధి యొక్క కొన్ని సాధారణ లక్షణాలు:ప్రకాశవంతమైన కాంతి వల్ల ఇబ్బంది పడటంవిరేచనాలుజ్వరంతలనొప్పివాంతులుముదురు రంగులోకి మారినట్లు కనిపించే చర్మ దద్దుర్లుగట్టి మెడగందరగోళం,చిరాకుచాలా నిద్రమత్తుగా అనిపించడంనడవడానికి లేదా నిటారుగా ఉండటానికి ఇబ్బందివిపరీతమైన మంటలు, నొప్పులుకీళ్లు, కండరాల నొప్పిఆకలి లేకపోవడంఎవరికీ ఈ ప్రమాదం అధికం అంటే..ఈ ఇన్ఫెక్షన్ ఏ వ్యక్తినైనా ప్రభావితం చేయవచ్చు, అయితే, కొంతమందికి ఎక్కువ ప్రమాదాలు ఉంటాయి. ఒక సంవత్సరం కంటే తక్కువ వయస్సు ఉన్నవారు, టీనేజర్ లేదా చిన్న వయస్సులో ఉన్నవారుప్లీహ గాయం లేదా ప్లీహము లేకపోవడంసికిల్ సెల్ వ్యాధి ఉన్నవాళ్లకుకాంప్లిమెంట్ ఇన్హిబిటర్ మందులు తీసుకునేవాళ్లుమెనింగోకాకల్ వ్యాధి సాధారణంగా ఉండే ప్రాంతాలను సందర్శించడం వల్లదీనికారణంగా ఎదురయ్యే అనారోగ్య సమస్యలు..బాధిత వ్యక్తులు వెంటనే వైద్య చికిత్స పొందకపోతే ప్రాణాంతకంగా మారే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు, చికిత్స పొందినప్పటికీ ప్రజలు చనిపోవచ్చు. ఈ వ్యాధి కారణంగా ఎదురయ్యే సమస్యలు..మెదడు దెబ్బతినడంమూత్రపిండాల నష్టంఅవయవాలు కోల్పోవడంనరాల దెబ్బతినడంపూర్తిగా వినికిడి లోపంనివారణ చర్యలువ్యాక్సిన్లు సాధారణ రకాల బాక్టీరియల్ మెనింజైటిస్ నుంచి ఉత్తమ రక్షణను అందిస్తాయని WHO చెబుతోంది. మెనింగోకాకస్, న్యుమోకాకస్, హేమోఫిలస్ ఇన్ఫ్లుఎంజా టైప్ బి (Hib) వల్ల కలిగే మెనింగోకాకల్ వ్యాధిని టీకాలు నిరోధించగలవు. ఇతర నివారణ చర్యలు..11-12 సంవత్సరాల వయస్సులో మెనింగోకాకల్ కంజుగేట్ (MenACWY) వంటి టీకాలు వేయించడం.16 ఏళ్ల లోపు వాళ్లకు బూస్టర్డోస్లు వేయించడం. అలాగే సెరోగ్రూప్ B నుంచి అదనపు రక్షణ కోసం సిఫార్సు చేసిన MenB టీకాలు వేయించడం. టీకాలు సాధారణ జాతులను (A, C, W, Y, B) లక్ష్యంగా చేసుకుంటాయి. టీనేజ్ పిల్లలు, టీనేజర్లు, HIV లేదా అస్ప్లెనియా వంటి ఆరోగ్య ప్రమాదాలు ఉన్నవారికి ఈ టీకాలు వేయించడం మంచిది.పరిశుభ్రత పద్ధతులు: ముఖ్యంగా బాత్రూమ్ ఉపయోగించిన తర్వాత లేదా తినడానికి ముందు సబ్బుతో తరచుగా చేతులు కడుక్కోండి. కడగని చేతులతో కళ్ళు, ముక్కు లేదా నోటిని తాకకుండా ఉండండి. పానీయాలు, ఆహారం, పాత్రలు, లిప్స్టిక్లు లేదా సిగరెట్లను పంచుకోవద్దు, దగ్గు/తుమ్ము వచ్చినప్పుడు చేతులు లేదా జేబురుమాల్ అడ్డుపెట్టుకోవడం. ఈ చర్యలు తీసుకుంటే శ్వాసకోశ బిందువుల ద్వారా వ్యాప్తి చెందే ఈ బ్యాక్టీరియాను కట్టడి చేయొచ్చు. ముఖ్యంగా దద్దుర్లు, మెడనొప్పి, జ్వరం వంటి లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యం సహాయం తీసుకోవడం ఉత్తమం. గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. మరిన్ని వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: రీల్స్ పిచ్చి వర్సెస్ చదువు..!) -
దేశవ్యాప్తంగా 14 ఏళ్ల బాలికలకు HPV టీకాలు : ప్రధాని మోదీ
రాజస్థాన్లోని అజ్మీర్లో శుక్రవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా హ్యూమన్ పాపిల్లోమావైరస్ (HPV vaccination) టీకా కార్యక్రమాన్ని ప్రారంభించారు. మహిళల్లో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్తోపాటు, నివారించదగిన మరికొన్ని రకాల క్యాన్సర్లను అరికట్టడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమం ప్రారంభించిన తర్వాత, రాష్ట్రంలో జరిగిన ర్యాలీలో ప్రధాని ప్రసంగించారు. NDA ప్రభుత్వం అన్ని స్థాయిలలో అభివృద్ధిని నిర్ధారించాలని నిశ్చయించుకుందని, HPV టీకా ప్రారంభం దానికి నిదర్శనమని పేర్కొన్నారు.అన్ని రాష్ట్రాలు .కేంద్రపాలిత ప్రాంతాలలో ప్రతీ ఏడాది 14 ఏళ్ల సుమారు 1.15 కోట్ల మంది బాలికలకు ‘గార్డాసిల్’ అనే టీకాను ఉచితంగా అందించాలనేది లక్ష్యం. ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలలో ఈ వ్యాక్సిన్ ఉచితంగా అందించబడుతుంది. ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు (ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు), కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాలు, ఉప-జిల్లా ,జిల్లా ఆసుపత్రులు, అలాగే ప్రభుత్వ వైద్య కళాశాలలు, ఆసుపత్రులలో ఈ టీకాలు అందుబాటులో ఉంటాయి.ఇదీ చదవండి: Liquor Policy: కేజ్రీవాల్కు క్లీన్ చిట్, అన్నా హజారే కీలక వ్యాఖ్యలుభారతదేశంలో 80 కంటే ఎక్కువ గర్భాశయ క్యాన్సర్ కేసులకు కారణమైన హై-రిస్క్ రకాల హ్యూమన్ పాపిల్లోమా వైరస్ (HPV), గర్భాశయ క్యాన్సర్, (ముఖ్యంగా హెచ్పీవీ టైప్ 16, 18) ప్రముఖ క్యాన్సర్లలో ఒకటిగా ఉంది. ఈ వ్యాక్సిన్ హెచ్పీవీ టైప్ 16, 18తోపాటు టైప్ 6, 11 రకాల నుంచి కూడా రక్షణ కల్పిస్తుందని కేంద్రం తెలిపింది. ఇదీ చదవండి: ప్రియుడి మోసం: ఇదే అదునుగా అగంతకుడి దారుణ హత్యాచారం -
ముప్పై ఏళ్లకే గుల్లబారుతున్నాయి
మహిళల ఆరోగ్యంలో ఎముకల క్షీణత (ఆస్టియో పోరోసిస్) ఒక ప్రధాన సంక్షోభంగా మారుతోంది. ఒకప్పుడు మెనోపాజ్ దాటిన మహిళల్లో మాత్రమే కనిపించే ఈ వ్యాధి నేడు 30 ఏళ్లకే ముంచుకొస్తుంది. ప్రీ–మెనోపాజల్ ఆస్టియో పోరోసిస్గా పిలిచే ఈ ఎముకల బలహీనత గత దశాబ్దంతో పోలిస్తే గణనీయంగా పెరిగిందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. 30 ఏళ్లకే...ఒక మహిళ తన జీవితంలో అత్యధిక ఎముక సాంద్రతను (బోన్ డెన్సిటీ) 25 నుంచి 30 ఏళ్ల మధ్యే సాధిస్తుంది. ఒకసారి 30 ఏళ్లు దాటాక, కొత్త ఎముక ఏర్పడే వేగం కంటే పాత ఎముక అరిగి పోయే వేగం పెరుగుతుంది.80%భారతదేశంలో సుమారు 6.1 కోట్ల మంది ఆస్టియో పోరోసిస్తో బాధపడుతున్నారు. వీరిలో సుమారు 80% మంది మహిళలే కావడం ఆందోళన కలిగించే అంశం.20–25%పట్టణ ప్రాంతాల్లో నివసించే 30 ఏళ్ల పైబడిన మహిళల్లో సుమారు 20% నుంచి 25% మందికి ఆస్టియో పీనియా (ఎముకలు పల్చబడటం – ఇది ఆస్టియో పోరోసిస్కు ముందు దశ) ఉన్నట్లు గుర్తించారు.70–80%∙భారతదేశంలోని మెట్రో నగరాల్లో 30 ఏళ్ల మహిళల్లో దాదాపు 70% నుంచి 80% మంది విటమిన్–డి లోపంతో బాధపడుతున్నారు. ఇది ఎముకలు కాల్షియంను గ్రహించకుండా అడ్డుకుంటుంది.50 ఏళ్లు∙50 ఏళ్లు దాటిన ప్రతి ముగ్గురు మహిళల్లో ఒకరు తమ జీవితకాలంలో ఒక్కసారైనా ఎముక విరుపునకు గురవుతున్నారు.15%∙ఒక మహిళ తన జీవితంలో అత్యధిక ఎముక సాంద్రతను 30 ఏళ్ల నాటికి చేరుకోవాల్సి ఉన్నా.. సరైన పోషకాహారం లేక పోవడం వల్ల 15% మంది మహిళలు అసలు గరిష్ట సాంద్రతను చేరుకోవడంలో విఫలమవుతున్నారు, దీనివల్ల వీరికి 45 ఏళ్లకే ఎముకలు విరిగే ప్రమాదం పెరుగుతోంది.20%∙మెనోపాజ్ ప్రారంభమైన మొదటి 5 నుంచి 7 ఏళ్లలోనే మహిళలు తమ శరీరంలోని మొత్తం ఎముక ద్రవ్యరాశిలో 20% వరకు కోల్పోతున్నారు.2040∙ప్రస్తు్తతం 30 ఏళ్ల వయసులో ఉన్న మహిళలు, తమ ఎముకల ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తే, 2040 నాటికి దేశంలో హిప్ ఫ్రాక్చర్ల సంఖ్య రెట్టింపు అయ్యే అవకాశం ఉందని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు.21.2%∙ప్రపంచవ్యాప్తంగా 50 ఏళ్లు పైబడిన మహిళల్లో సుమారు 21.2% మందికి ఆస్టియో పోరోసిస్ ఉందిముందు జాగ్రత్తలే ముఖ్యం∙ప్రతిరోజూ శరీరానికి కాల్షియం అందేలా చూసుకోవాలి. పాలు, పెరుగు, రాగులు వంటివి తీసుకోవాలి ∙రోజూ ఉదయం 10 నుంచి 15 నిమిషాల పాటు సహజమైన ఎండ తగిలేలా చూసుకోవాలి ∙కేవలం నడక సరి పోదు, ఎముకలపై ఒత్తిడి కలిగించే వెయిట్–బేరింగ్ వ్యాయామాలు, యోగా ఉండేట్లు చూసుకోవాలి ∙50 ఏళ్లు దాటిన మహిళలు, ప్రమాద సూచనలు ఉన్నవారు తప్పనిసరిగా బోన్ డెన్సిటీ టెస్ట్ చేయించుకోవాలి.ఎముకల ఆరోగ్యంపై అవగాహన పెంచుకోవడం కేవలం వృద్ధాప్యంలోనే కాదు, యవ్వనం నుంచే ప్రారంభమవడం ఎంతో ముఖ్యం. అందుకోసం తగిన పోషకాహారం తీసుకుంటూ, తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. -
ఆ కమెడియన్కి వెయిట్లాస్ మందులు ఎందుకు పనిచేయలేదంటే..!
ఇటీవల కాలంలో చాలామంది స్లిమ్గా మారేందుకు ప్రయత్నిస్తున్నారు. అందులోనూ కొందరు సహజపద్ధతిలో ఆరోగ్యంగా బరువు తగ్గితే..ఇంకొందరు ముఖ్యంగా సెలబ్రిటీలు, ప్రముఖులు మాత్రం బరువు తగ్గించే టైప్2 డయాబెటిస్ మందులపై ఆధారపడుతున్నారు. అది కూడా వైద్యుల పర్యవేక్షణలో.. ఆరోగ్యకరమైన రీతీలో బరువు తగ్గుతుండటం విశేషం. అయితే కొందరిలో ఈ డ్రగ్ పనిచేయడం లేదనే విషయం అందరిలోనూ తీవ్ర ఆందోళనలను లేవనెత్తింది. ఎందుకంటే యూట్యూబర్, హాస్యనటుడు, రచయిత తన్మయ్ భట్ విషయంలో కూడా ఇలానే జరిగింది. ఆ విషయాన్ని ఆయనే స్వయంగా సోషల్ మీడియా పోస్ట్లో తెలిపారు. నిజంగానే ఈ మెడిసిన్ అందరికి ప్రభావవంతంగా పనిచేయదా..? అందుకు గల కారణాల ఏంటి..? వంటి వాటి గురించి సవివరంగా తెలుసుకుందామా..!.హాస్యనటుడు తన్మయ్ భట్ టైప్2 డయాబెటస్ నిర్వహించడానికి ఎఫ్డీఏ ఆమోదించిన GLP-1 మందులతో బరువు తగ్గే ప్రయత్నం చేసినట్లు ఎక్స్ పోస్ట్లో తెలిపారు. ఈ సెమాగ్లుటైడ్, టిర్జెపటైడ్ వంటి GLP-1 మందులు టైప్ 2 డయాబెటిస్ను నిర్వహించడానికి FDA-ఆమోదించిన చికిత్సలు. వీటిని బరువు నిర్వహణకు కూడా వినియోగిస్తారు. తాను GLP-1 మందుల సాయంతో ఆకలి తగ్గించుకోవాలనుకున్నా..కానీ తనకు అంతగా పనిచేయలేదని అన్నారు. తనకు ఆ మందు వినియోగించడంవల్ల ఆకలికి సంబంధించి..బలహీన సంతృప్తి సంకేతాలనే అందించిందని అన్నారు. అంతేగాదు తన్మయ్ తాను ఈ మందులు వాడక మునుపే నేచురల్గా 75 కిలోలుల తగ్గానని అన్నారు. అయితే తనకు కొంగొత్త సాంకేతిక వైద్య విధానాన్ని తెలుసుకోవడం, ప్రయత్నించడం ఇష్టమని ఆ నేపథ్యంలోనే ఈ మెడిసిన్ని ప్రయత్నించినట్లు తెలిపారు. ఎందుకు తనకు ఈ మెడిసిన్ పనిచేయలేదు ఎవరైన వైద్యులు లేదా నిపుణులు వివరించాలని కూడా కోరారు పోస్ట్లో.నిపుణులు ఏమంటున్నారంటే..కొందిరిలో ఈ డయాబెటిస్ మెడిసిన్ బరువు తగ్గడానికి పనిచేయకపోవడానికి పలు విధాల కారణాలు ఉంటాయని అంటున్నారు. అవన్నీ బేరీజు వేసుకుని గానీ నిర్థారించలేమని చెబుతున్నారు నిపుణులు. తక్కువ మోతాదు..కొన్నిసార్లు వ్యక్తులు GLP-1 మందులతో ఆకలి నియంత్రణలో ఉన్నట్లు కనిపించదు. ఎందుకంటే ప్రారంభంలో తక్కువ మోతాదు ఉంటుంది కాబట్టి. ఈ మందులు పనిచేయడానికి కొంత సమయం అవసరం. ఒక్కోసారి నెలల సమయం కూడా పడుతుందని అన్నారు.ఒక్కోసారి శరీరం స్పందించదు..కొందరిలో అస్సలు ఈ మెడిసిన్ పనిచేయదట. ఎందుకుంటే వారి వారి జన్యు సంబంధిత పరిస్థితతులు, అంతర్లీన జీవక్రియ పరిస్థితులపై ఆధారపడి ఉంటుందట. అలాగే కొందరు హెల్త్ దృష్ట్యా వాడే ఇతర మందుల వల్ల కూడా ఈ మెడిసిన్ ప్రభావవంతంగా పనిచేయదని చెబుతున్నారు వైద్యులు.జీవనశైలి కారణంగా..అధికంగా ప్రాసెస్ చేయబడిన ఆహారాలు లేదా శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లు బాగా తీసుకునే వారిలో ఈ మందుల ప్రభావాన్ని అధిగమిస్తాయట. అలాంటి వారికి అధిక ప్రోటీన్, అధిక ఫైబర్తో కూడిన ఆహారాన్ని జత చేస్తేనే ఈ GLP-1 మందులు ప్రభావవంతంగా పనిచేస్తాయని చెబుతున్నారు వైద్యులు .ఇక్కడ తన్మయ్ భట్ అనుభవం బరువు తగ్గడానికి ఏ విధంగా ఆయన ఈ మెడిసిన్ని ఏవిధంగా విరియోగించారనేది అత్యంత ముఖ్యం అనే విషయాన్ని నొక్కిచెబుతోంది. అందువల్ల ఈ వెయిట్లాస్ మందులు వాడాలనుకునేవారు వైద్యులు లేదా నిపుణులు పర్యవేక్షణలో వారి సూచనలు సలహాల మేరకు ఉపయోగించటమే మేలని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.(చదవండి: అర్జున్ టెండూల్కర్ ప్రీ-వెడ్డింగ్ వేడుకలో హైలెట్గా నీతా అంబానీ స్పీచ్..!) -
మీకూ ప్రోటీన్ కావాలండోయ్!
ప్రోటీన్.. కణాల పునరుద్ధరణకు ఈ సూక్ష్మపోషకం ప్రధాన వనరు. శరీరంలో హార్మోన్ల సమతుల్యతను కాపాడుతుంది. వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. ఆక్సిజన్ సరఫరాలో (హిమోగ్లోబిన్ ద్వారా) కీలక పాత్ర పోషిస్తుంది. ఇంతటి ప్రాముఖ్యత ఉన్నప్పటికీ ప్రోటీన్ పోషించే పాత్ర గురించి చాలా మందికి తెలియకపోవడం గమనార్హం. ప్రోటీన్లపై అవగాహన, వినియోగంపై కంట్రీ డిలైట్ భాగస్వామ్యంతో ‘కమ్యూనిటీ ప్లాట్ఫామ్ లోకల్ సర్కిల్స్’దేశవ్యాప్తంగా సర్వే నిర్వహించింది. 25 మెట్రో, నగరాలకు చెందిన 2.07 లక్షల మంది ఇందులో పాలుపంచుకున్నారు. నగరాల్లో నివసించే భారతీయులలో దాదాపు 60 శాతం మంది ప్రతిరోజూ ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం లేదని ఈ సర్వేలో తేలింది. జనంలో ఆరోగ్యం పట్ల అవగాహన పెరుగుతున్నా, విభిన్న ఆహారోత్పత్తులు లభిస్తున్నా ఈ పరిస్థితి నెలకొంది. ధర అందుబాటులో లేకపోవడమే పెద్ద అడ్డంకి అన్నది అత్యధికుల మాట. చవక ప్రోటీన్ ప్రత్యామ్నాయాలు లభిస్తే వాటిని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నామని 71% మంది తెలిపారు.సమతుల ఆహారమని.. సర్వే ప్రకారం పట్టణ ప్రాంతాలలో 10 మందిలో నలుగురు మాత్రమే తమ రోజువారీ భోజనంలో కొవ్వు తక్కువగా ఉండే మాంసం, పప్పులు, గుడ్లు, పాలు, పనీర్, చేపలు, గింజలు వంటి ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాన్ని క్రమం తప్పకుండా తీసుకుంటున్నారు. ఫిట్నెస్, వెల్నెస్, ముందస్తు వ్యాధి నివారణ గురించి అవగాహన పెరుగుతున్నప్పటికీ ప్రోటీన్ తీసుకోవడంలో మాత్రం వెనుకబడి ఉన్నారు. దాదాపు నాలుగింట మూడొంతుల మందికి రోజూ ఎంత ప్రోటీన్ అవసరమో తెలియదు. 85% మంది రోజూ తమకు ఎంత ప్రోటీన్ అందుతుందో కొలవడం లేదు. ఎంత అవసరమో అన్న విషయం అవగాహన లేకపోవడంతో ప్రోటీన్ తక్కువగా తీసుకుంటున్నారు. అంతేకాదు చాలా మంది తాము సమతుల ఆహారం స్వీకరిస్తున్నామని నమ్ముతున్నారు. పొంచి ఉన్న ముప్పు.. సగం మందికి పైగా ప్రజలు తమకు ఎదురయ్యే నీరసం, జుట్టు రాలడం, తరచుగా అనారోగ్యానికి గురవ్వడం వంటి సమస్యలు ప్రోటీన్ లోపం వల్ల వస్తున్నాయని గుర్తించడం లేదు. ప్రోటీన్ లేమితో కండరాల క్షీణత మాత్రమే కాకుండా జీవక్రియ సమస్యలు, జ్ఞాపకశక్తి తగ్గడం వంటి ముప్పు కూడా పొంచి ఉందని నిపుణులు చెబుతున్నారు. ఆరోగ్యంగా ముసలితనాన్ని గడపడానికి, వ్యాధులను నిరోధించడానికి ప్రోటీన్ ఒక పునాది వంటిదని అంటున్నారు.ఐసీఎంఆర్ ప్రకారం.. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసర్చ్ (ఐసీఎంఆర్) అధ్యయనాల ప్రకారం భారత్లో దాదాపు అన్ని రకాల ఆదాయ వర్గాలు తగినంత ప్రోటీన్ తీసుకోవడం లేదు. ముఖ్యంగా పట్టణ భారత్లో ఈ సమస్య ఎక్కువగా ఉంది. ఆరోగ్యకరమైన పెద్దలకు రోజుకు కిలోగ్రాము శరీర బరువుకు 0.66–0.83 గ్రాముల ప్రోటీన్ తీసుకోవాలి.పోషక వనరు ఇలా.. ∙ప్రోటీన్ ఫుడ్ అనేది శరీరానికి అత్యవసరమైన పోషకాలు కలిగిన వనరులు. ∙కండరాలు, చర్మం, ఎముకల వంటి శరీర కణజాలాలను నిర్మించడానికి, మరమ్మతు చేయడానికి అవసరమైన అమైనో ఆమ్లాలను ప్రోటీన్స్ అందిస్తాయి. ∙జీవక్రియ పనితీరు, రోగనిరోధక శక్తి, హార్మోన్ల ఉత్పత్తి, ఆకలిని నియంత్రించడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. అవగాహన లోపం.. ప్రోటీన్ అంటే కేవలం బాడీ బిల్డింగ్ కోసమే అని చాలా మంది భావిస్తారు. కానీ రోగనిరోధక శక్తి, చర్మం, జుట్టు ఆరోగ్యం, వయసు పెరిగే కొద్దీ కండరాలు క్షీణించకుండా ఉండటానికి ప్రోటీన్ ఎంతో అవసరం. ఒక చిన్న కప్పు నిండా పప్పు లేదా ఒక గ్లాసు పాలు తాగితే సరిపోతుందని అనుకుంటారు. కిలో శరీర బరువుకు 0.83 గ్రాముల లక్ష్యాన్ని చేరుకోవడానికి ఇది ఏమాత్రం సరిపోదు. అన్నం, చపాతీలు తిన్నప్పుడు కడుపు నిండినట్లు అనిపిస్తుంది. శరీరానికి కావాల్సిన అమైనో ఆమ్లాలు అందక అంతర్గతంగా శరీరం బలహీనపడుతుంది. లోపిస్తే సమస్యలే.. రోగనిరోధక శక్తి బలహీనపడటం, తీవ్రమైన అలసట కలుగుతాయి. జుట్టు రాలడం, పెళుసుగా మారడం, గోర్లు విరిగిపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి. ప్రోటీన్ లోపం దీర్ఘకాలం కొనసాగితే శరీర కణజాలాలలో ద్రవాలు పేరుకుపోవడం వల్ల కలిగే వాపు (ఎడెమా) వస్తుంది. గాయాలు త్వరగా మానవు. మూడ్ స్వింగ్స్, మానసిక స్థితిలో మార్పులు రావొచ్చు. ఫ్యాటీ లివర్, పిల్లల్లో పెరుగుదల ఆగిపోవడం వంటి సమస్యలూ ఎదురుపడవచ్చు. -
జస్ట్ 11 నెలల్లో 52 కిలోలు బరువు తగ్గింది..! నో జిమ్, నో స్ట్రిక్ట్ డైట్..
బరువు తగ్గడం అందరికీ ఒకలా ఉండదు. కొందరికి చాలా కష్టమైనదిగా..మరికొందరికి చాలా తేలికైన వాటితో సులభంగా తగ్గే టాస్క్లా ఉంటుంది. అయితే ఇక్కడ స్థిరత్వాన్ని బ్రేక్ చేయకపోతేనే..లక్ష్యానికి చేరుకోగలం. ఇక్కడ ట్యునిషియాకు చెందిన హిబా అల్లా వెయిట్లాస్ స్టోరీ ఆ విధంగానే సాగింది. ఆమె ఓర్పుతో స్థిరత్వంతో బరువు తగ్గే ప్రయాణాన్ని మొదలు పెట్టి ఏకంగా 133 కిలోల బరువు నుంచి 52 కిలోలకు తగ్గి అందర్నీ ఆశ్చర్యపరిచింది. అదికూడా జస్ట్ 11 నెలల్లో ఈ ఫలితాన్ని అందుకుని స్ఫూర్తిగా నిలిచిందామె. ఇంతకీ ఆమె ఎలాంటి ట్రిక్స్ అనుసరించిందంటే..ట్యునీషియాలోని ట్యునీస్కు చెందని 22 ఏళ్ల హిబా అల్లా అయాది ఒక స్టూడెంట్. ఆమె ఎత్తు 5 అడుగులు 8 అంగుళాలు, బరువు ఏకంగా 133.3 కిలోలు ఉండేది. ఆమె రూపం భారీగా ఉండి..కనీసం నాలుగు అడుగులు వేయాలన్నా..ఆయాసంతో ఇబ్బందిపడేది. శ్వాస తీసుకోవడంలో నిరంతరం అలసటను ఎదుర్కొనేది. ఆరోగ్యం రోజు రోజుకి భారంగా మారిపోవడం మొదలైంది. ఇక తనకు తానుగా బరువు తగ్గేందుకు ఉపక్రమించకపోతే..ఉనికే కష్టమవుతుందని అర్థమైంది హిబాకు. దాంతో వెయిట్లాస్ అయ్యేందుకు రెడీ అయ్యింది. అయితే ఆమె అందరు అనుక్నుట్లుగా బరువు తగ్గడం అంటే..తినడం తగ్గించడం, నోరు కట్టేసుకోవడం కాదంటోంది. ఆమె తింటూనే బరువు తగ్గే ప్రయత్నం చేసిందంటే. అయితే తినే వాటిలో ఆరోగ్యకరమైనవి, ప్రోటీన్,ఫైబర్ ఉండేవి ఎంచుకున్నట్లు తెలిపింది. ముందుగా ఆకలి తీరి సంతృప్తిని కలిగించేలా భోజనం ఉండేలా చూసుకునేదాన్ని. అప్పుడు బరువు తగ్గడం భారంగా..భయానకంగా ఉండదట. పైగా తరుచుగా అద్దంలో చూసుకోవడం..స్లిమ్గా మారాలనే లక్ష్యాన్ని నిరంతరం గుర్తుచేస్తుంది. నోరు ఆటోమేటిగ్గా అదుపులో ఉండేలా ఆహారం తీసుకునేలా మైండ్సెట్ అవుతుందట. ఆమెకు అధిక బరువు కారణంగా జిమ్ సభ్యత్వం లభించలేదట. అందుకని హిబా వర్కౌట్లకు బదులుగా నడకను ఎంచుకుందట. నెమ్మదిగా చిన్న అడుగులతో మొదలు పెట్టి..కిలోమీటర్ల కొద్ది నడకను పెంచుకుంటూ పోయేదాన్ని అంటోంది. అధికంగా నీటిని తీసుకోవడం, తాజా పండ్లను తీసుకోవడం వంటివి చేసేదట. అలేగు ఉప్పు, చక్కెరలను మితంగా తీసుకునేదట. ఇక బరువు తగ్గడం శారీరకం భావోద్వేగ పోరాటంగా అభివర్ణించింది. మొదట్లో అంత తొందరగా తన బాడీలో మార్పులు సంతరించుకోలేదని, అయినా..ఎక్కడ అసహనం చెందకుండా ఓర్పుతో తన దినచర్యను కొనసాగించానని చెప్పుకొచ్చింది. ఏం తీసుకున్నా..ఆరోగ్యకరమైన విధంగా ఎంచుకోవడం, వాకింగ్ని స్కిప్ చేయకపోవడం వంటి అలవాట్లతో బరువు తగ్గడం ప్రారంభమవ్వడం మొదలైంది. అయితే తాను ఆ ఉత్సాహంతో అలసిపోతున్నప్పుడూ కూడా ఓపికతో తన డైలీ యాక్టివిటీని కొనసాగించేదాన్ని అంటోంది. అలా ఇవాళ 52.45 కిలోలు బరువుతగ్గి 52 కిలోల ఆరోగ్యకరమైన బరువుతో ఉన్నా అని నవ్వతూ చెప్పింది హిబా. అంతేగాదు బరువు తగ్గడం అనేది శిక్ష కాదని, శరీరం, జీవితానికి ఇచ్చే గౌరవప్రదమైన చర్యగా అభిర్ణించింది. ఈ రోజు తాను ఆరోగ్యంగా, హాయిగా శ్వాస తీసుకునే ఆహ్లాదభరితమైన జీవితాన్ని ఆస్వాదిస్తున్నానని ఆనందంగా చెబుతోంది. దయచేసి బరువు తగ్గడం అంటే..విపరీతమైన వర్కౌట్లు, కఠినమైన ఆహారంగా భావించొద్దు..సంతృప్తికరంగా తింటూ..ఎంజాయ్ చేస్తూ తగ్గాలి..అప్పుడే మంచి ఫలితాలు అందుకోగలం అని నమ్మకంగా చెబుతోంది హిబా.(చదవండి: బిడ్డలు పుట్టే అవకాశం లేదన్నారు..!కానీ ఆ మహిళ ..) -
బిడ్డలు పుట్టే అవకాశం లేదన్నారు..!కానీ ఆ మహిళ ..
వైద్యశాస్త్రం రోజు రోజుకి పురోగమిస్తు బాధిత రోగులకు కొత్త జీవితాన్ని ప్రసాదిస్తుంది. ముఖ్యంగా సంతానం విషయంలో ఇటీవల కాలంలో ఎన్ని జంటలు ఇబ్బందులు పడుతున్నారో తెలిసిందే. ఐవీఎఫ్, సరోగసీ ద్వారా కొంత ఉపశమనం లభించినప్పటికీ..కొందరు పుట్టుకతో గర్భాశయం లేని అమ్మాయిలకు మాత్రం సంతానం ఓ కలగానే మిగిలిపోతోంది. రూపం, ఆరోగ్యం.. పరంగా బాగుండి ఆ విషయంలో మాత్రం జీవితాంతం వారికో లోపం, శాపంగా ఉండిపోతోంది. ఇప్పుడు ఆ సమస్యకు చక్కటి ఉపశమనం అందించారు వైద్యులు. వైద్యశాస్త్రంలోనే సరికొత్త అద్భుతం చోటు చేసుకునేలా కొంగొత్త వైద్య ఆవిష్కరణలకు నాంది పలికి రోగుల్లో కొత్త ఆశలను నింపుతున్నారు. అందుకు ఈ జంట ఉదంతమే ఓ ఉదాహరణ. అసలేం జరిగిందంటే..యూకేకి చెందిన 30 ఏళ్ల గ్రేస్ బెల్ పుట్టుకతోనే గర్భం లేదామెకు. గర్భం లేదు కాబట్టి పీరియడ్స్ ఉండవు గానీ సాధారణ అండశయాలు ఉంటాయి. ఈ పరిస్థితిని ఎంఆర్కేహెచ్ సిండ్రోమ్గా పేర్కొంటారు. యూకేలో ప్రతి 5 వేల మంది మహిళల్లో ఒకరు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. బెల్కి పిల్లలు పుట్టాలంటే గర్భమార్పిడి లేదా సరోగసీ ఒక్కటే మార్గం. దాంతో బెల్ భర్త స్టీవ్ పావెల్ ఇద్దరూ గర్భశయాన్ని దానం చేసే దాత కోసం ఎదురు చూస్తుండేవారు. గర్భం దొరికిందని, మార్పిడికి సిద్ధంగా ఉండమని ఆస్పత్రి నుంచి వచ్చిన కాల్ వారిని ఉక్కిరిబిక్కిరి చేసింది. నమ్మశక్యం కానీ నిజంలా అనిపించింది ఆ జంటకు. అలా బెల్కి జూన్ 2024లో ఆక్స్ఫర్డ్లోని చర్చిల్ హాస్పిటల్లో దాదాపు 10 గంటలు శ్రమించి గర్భశయ మార్పిడి ఆపరేషన్ చేశారు వైద్యులు. ఆ తర్వాత కొన్ని నెలలకు ఐవీఎఫ్ని ఆశ్రయించి ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకున్నారు. ఆ విధంగా ఈ జంటకు 2025లో ఓ అద్భుత వరంలా 7 పౌండ్ల బరువుతో హ్యోగో అనే బిడ్డ జన్మించాడు. ప్రస్తుతం ఆ చిన్నారికి పదివారాల వయసు. ఆ దంపతులు ఇద్దరు తమకు సంతానభాగ్యాన్ని అందించిన ఆ మహిళకు, ఆమె కుటుంబానికి ఎంతో రుణపడి ఉంటామంటూ భావోద్వేగంగా చెప్పారు. మా బిడ్డను చూసిన ప్రతిసారి వాళ్లే మాకు గుర్తొస్తారంని అన్నారు. అయితే ఆ జంట మరో బిడ్డను కనాలనుకునేంత వరకు మార్పిడి చేసిన గర్భాశయాన్ని ఉంచి, ఆ తర్వాత తొలిగిస్తారట. ఎందుకంటే ఆ అవయవంపై శరీర రోగ నిరోధక వ్యవస్థ దాడి చేయకుండా నిరోధించడానికి, అలాగే ఆమె జీవతాంత మందులు తీసకోకుండా నివారించేందుకు ఇది తప్పదని చెబుతున్నారు వైద్యులు. కాగా, ఇలాంటి ఘటనే 2025 ప్రారంభంలో యూకేలో మొదటి సజీవ గర్భదానం ద్వారా అమీ అనే శిశువు జన్మించింది. ఈకేసులో అక్క గర్భాన్ని పొందింది సదరు మహిళ. ఆమెకు అప్పటికే ఇద్దరు పిల్లలు ఉండటంతో చెలెల్లికి తన గర్భాన్ని దానం చేసింది. వైద్యశాస్త్రంలో ఈ పురోగతి..పుట్టుకతో గర్భంలేని యువతుల పాలిట వరంగా మారుతుంది. పైగా అవయవ దానం పట్ల ప్రజల్లో అవగాహన పెరిగేందుకు నాంది పలకడమే గాక..మరణం తర్వాత ఇతరుల జీవితాల్లో వెలుగులు పంచేలా బతకడం ఈ దానం వల్లే సాధ్యమని తెలుసుకుంటారని వైద్యులు ఆశాభావం వ్యక్తం చేశారు. (చదవండి: అద్దంలో కనిపించని అసలు రూపం) -
నయనేంద్రియానం కార్నియా ప్రధానం..!
ఓ చిన్నారి పుట్టినప్పటి నుంచి అతడు / ఆమె నేర్చుకునే మొత్తం జీవన నైపుణ్యాల్లో దాదాపు 80 శాతానికి పైగా కంటిచూపు వల్లనే సాధ్యమవుతుంది. పైగా ఈ యుగంలోని చిత్రవిచిత్రాలన్నీ చూడాలంటే కన్నుంటేనే సాధ్యం. అందుకే ‘కన్నుంటేనే కలికాలం’ అన్న నానుడి స్థిరపడింది. జనసామాన్యంలోని ఈ మాటే ఈరోజుల్లో కంటికి ఉన్న ప్రాముఖ్యతనూ, ప్రాధాన్యాన్నీ నొక్కి చెబుతుంది. మరి ఇంతటి విలువైన కంటిచూపును ఏదైనా కారణాల వల్ల కోల్పోయినప్పుడు నేత్రదానం తర్వాత కంటి చూపు పొందడం సాధ్యమవుతుందనే అభిప్రాయం చాలామందిలో ఉంది. పైగా ఈ కంటిదానం సమయంలో మొత్తం కనుగుడ్డును స్వీకరిస్తారనే అపోహ కూడా చాలామందిలో ఉంటుంది. నిజానికి కార్నియా అనే పారదర్శకమైన పొర దెబ్బతినడం వల్ల వచ్చిన దృష్టిలోపాన్ని మాత్రమే నేత్రదానంతో సరిచేయడం సాధ్యమవుతుంది. పైగా ఇలా నేత్రదానం చేసిన కేసుల్లో కనుగుడ్డు మొత్తం కాకుండా కేవలం ‘కార్నియా’ అనే నల్లగుడ్డుపై ఉండే పోరనే స్వీకరిస్తారు. ఈ నేపథ్యంలో నేత్రదానమనేది ఎప్పుడెప్పుడు ఎంతమేరకు సాధ్యం? ట్రాన్స్ప్లాంటేషన్ ద్వారా కంటి చూపును పొందడం ఏయే సందర్భాల్లో సాధ్యమవుతుంది? ఏయే సందర్భాల్లో అది సాధ్యం కాదు... అలా సాధ్యం కాక΄ోవడానికి కారణాలేమిటి... వంటి అనేక అంశాలపై అవగాహన కోసం... ఈ కథనం. కంటితో చూడటాన్ని సాధ్యం చేసే కంటి నల్లగుడ్డుపై ఉండే పారదర్శకమైన పొరను ‘కార్నియా’ అంటారు. నిజానికి నేత్రదానం చేసిన వారి నుంచి కంటిని తీసుకునే సమయంలో కనుగుడ్డునంతా స్వీకరించరు. కేవలం కార్నియా అని పిలిచే ఈ నల్లగుడ్డుపై ఉండే పారదర్శకమైన పొరను మాత్రమే తీసుకుంటారు.కార్నియా అంటే..?ఇది కంట్లో ఉండే ఒక పారదర్శకమైన పొర. కంటిలోని నల్లగుడ్డుపై ఉండటం వల్ల... ఇది పారదర్శకమైన పొర కావడంతో ఇది కూడా నల్లగా కనిపిస్తుంది. ఇది కంట్లోని ఐరిస్ అనే భాగాన్ని, ప్యూపిల్నూ, యాంటీరియర్ ఛేంబర్ను కప్పి ఉంచుతుంది. ఇది బయటి నుంచి వచ్చే కాంతికిరణాలను కంటిపై పడేలా చూస్తూ... మొదట కంట్లోకి ప్రవేశించేలా... అటు పిమ్మట కంటి వెనక ఉండే పొర రెటీనాపై ప్రతిబింబించేలా చేస్తుంది. ఇది పారదర్శకంగా ఉంటేనే చూపు ఉంటుంది. ఇది పారదర్శకత కోల్పోవడం వల్ల చూపునూ కోల్పోవడం జరుగుతుంది. కార్నియా మార్పిడి చికిత్స అంటే..?కార్నియా గాయపడటం లేదా దెబ్బతినడం వల్ల కలిగిన అంధత్వాన్ని కార్నియల్ బ్లైండ్నెస్ అంటారు. కార్నియా దెబ్బతినడం వల్ల ఎవరైనా కంటి చూపు కోల్పోతే... అలాంటి వారికి దెబ్బతిన్న కార్నియా స్థానంలో మంచి కార్నియాను అమర్చడం ద్వారా వారు కోల్పోయిన చూపును తిరిగి తెప్పించడం సాధ్యమే. అంటే కార్నియా దెబ్బతినడం వల్ల వచ్చిన అంధత్వానికి మాత్రమే కార్నియా ద్వారా చూపు తెప్పించవచ్చు. ప్రస్తుతానికి కోల్పోయిన కంటి చూపును ΄పొందడానికి ఈ ప్రక్రియ ఒక్కటే అందుబాటులో ఉంది. ఇప్పటికి ఇది మాత్రమే సాధ్యం. ఇంకా ఇతరత్రా కారణాల వల్ల కోల్పోయిన కంటిచూపును ΄పొందేందుకు పెద్దగా అవకాశాలేమీ లేవు. అయితే కేవలం కార్నియల్ బ్లైండ్నెస్నే కాకుండా ఇతరత్రా కారణాల వల్ల కోల్పోయిన కంటి చూపును ΄పొందడానికి ప్రయత్నాలూ, పరిశోధనలు మాత్రం ముమ్మరంగా కొనసాగుతున్నాయి.తొలిసారి కార్నియా మార్పిడి చికిత్స నేపథ్యమిలా... తొలిసారిగా కార్నియా మార్పిడి శస్త్రచికిత్సను డాక్టర్ ఎడ్వర్డ్ జిమ్ అనే వైద్య నిపుణుడు 1905లో చేశారు. కార్నియా మార్పిడి శస్త్రచికిత్స విజయవంతమయ్యే అవకాశాలు దాదాపు 90 శాతానికి పైగా ఉంటాయి. అయితే ఎవరైనా కళ్లు దానం చేసిన వ్యక్తి మరణించాక ఆరుగంటలలోపే అతడి నుంచి కార్నియాను స్వీకరించి, ఐ–బ్యాంక్లో భద్రపరచాల్సి ఉంటుంది. అటు తర్వాత సేకరించినప్పటికీ అది కార్నియా మార్పిడికి ఉపయోగపడదు.కార్నియల్ బ్లైండ్నెస్కు దారితీసే పరిస్థితులు కంటికి అయ్యే గాయాల కారణంగా కార్నియా దెబ్బతినడం రసాయన ప్రమాదాలకు గురికావడంతో కార్నియా గాయపడటం లేదా కాలి΄ోవడం (కార్నియల్ బర్న్) పోషకాహార లోపం వల్ల కార్నియా దెబ్బతినడం (మరీ ముఖ్యంగా చిన్న వయసులో వైటమిన్ ఏ లోపం వల్ల) కంటికి... మరీ ముఖ్యంగా కార్నియాకు వచ్చే ఇన్ఫెక్షన్స్ (కార్నియల్ అల్సర్స్ – నిజానికి మిగతా కారణాల కంటే కార్నియల్ ఇన్ఫెక్షన్తోనే అంధత్వాలు వచ్చే అవకాశం ఎక్కువ) పుట్టుకతో లేదా జన్యుపరంగా వచ్చే కొన్ని రకాల సమస్యలు ఆపరేషన్ తర్వాత వచ్చే కాంప్లికేషన్లతో ఒకవేళ పైన పేర్కొన్న కారణాలతో కార్నియా దెబ్బతిని అంధత్వం వస్తే దాన్ని కార్నియా మార్పిడి (కార్నియల్ ట్రాన్స్ప్లాంటేషన్) చికిత్సతో బాధితులకు చూపు తెప్పించవచ్చు.కార్నియల్ ట్రాన్స్ప్లాంటేషన్ ఎప్పుడెప్పుడంటే... కంటి చూపునకు సంబంధించిన కొన్ని సమస్యలున్నప్పుడు (ఆప్టికల్) : సూడోఫేకిక్ బుల్లోస్ కెరటోపతి, కార్నియల్ డీజనరేషన్, కెరటోకోనస్, కెరటోగ్లోబస్, కార్నియల్ డిస్ట్రఫీ వంటి కొన్ని కంటి సమస్యలు ఉన్నప్పుడు కంటిచూపును మెరుగుపరచడానికి. కంటిలోని భాగాలను సమీకృతంగా (ఇంటెగ్రల్గా) ఉంచడానికి (టెక్టానిక్) : ‘స్ట్రోమల్ థిన్నింగ్ డెస్మాటోసీల్’ అనే సమస్యలున్నప్పుడు కంటిలోని భాగాలను బయటికి రాకుండా నియంత్రించి వాటిని ఏకీకృతంగా లోపలే కలిపి ఉంచడానికి. చికిత్సలో భాగంగా చేసే ట్రాన్స్ప్లాంట్స్లో (థెరటిక్) : ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు చికిత్సకు ఎంతమాత్రమూ సహకరించకుండా ఉండే కార్నియల్ భాగాన్ని తొలగించి, ఆ ప్రదేశంలో కొత్త కార్నియా ఉంచి చూపు తెప్పించడానికి. అందం కోసం (కాస్మటిక్): కంటి నల్లగుడ్డు భాగంలో తెల్లమచ్చలు ఉన్నప్పుడు...ఆ కార్నియల్ స్కార్స్ను తొలగించి, అందాన్ని ఇనుమడింపజేయడం కోసం.ఎవరెవరిలో కార్నియా ట్రాన్స్ప్లాంటేషన్ సాధ్యం కాదంటే... కొందరిలో కార్నియా ట్రాన్స్ప్లాంటేషన్ ద్వారా చూపు తెప్పించడం సాధ్యం కాదు. అది ఎవరిలోనంటే... ∙రెటీనా లోపం లేదా ఆప్టిక్ నర్వ్ లోపంతో అంధత్వం వచ్చినవారు రెటినైటిస్ పిగ్మెంటోజా అనే కండిషన్ కారణంగా చూపు కోల్పోయిన వారు వయసు పెరుగుతున్న కొద్దీ వచ్చిన మాక్యులార్ డీజనరేషన్ అనే సమస్య కారణంగా చూపు పోగొట్టుకున్నవారు ∙ఆప్టిక్ అట్రోఫీతో బాధపడుతున్నవారు రాడ్ అండ్ కోన్ డిస్ట్రఫీ అనే జబ్బుల కారణంగా చూపు కోల్పోయిన వారు ∙నీటికాసుల (అడ్వాన్స్డ్ గ్లకోమా)తో కంటిచూపు కోల్పోయినవారు, కాంతికి స్పందించని (లైట్ పర్సెప్షన్ లేని) కళ్లలో ఈ చికిత్స సాధ్యం కాదు. ఇక్కడ పేర్కొన్న అన్ని సందర్భాల్లోనూ కార్నియల్ ట్రాన్స్ప్లాంటేషన్తో ఏమాత్రం ప్రయోజనం చేకూరదు.నేత్రదానం ఎందుకు చేయాలి? భారతదేశంలో దాదాపు 12 లక్షల నుంచి 15 లక్షల మంది కార్నియల్ బ్లైండ్నెస్ కారణంగా అంధులుగా మారుతున్నారని గణాంకాలు చెబుతున్నాయి. పైగా ప్రతి సంవత్సరమూ ఈ కార్నియల్ బ్లైండ్నెస్ కారణంగా ఏడాదికి 25,000 నుంచి 30,000 వరకు కొత్త కేసులు ఈ అంధుల జాబితాకు జత అవుతున్నాయన్నది మరో అంచనా. నేత్రదానం అంటే కార్నియాను ఇవ్వడం వల్ల వీళ్లకు అంధత్వాన్ని దూరం చేసి, కంటిచూపు ప్రసాదించవచ్చు. నిజానికి మన దేహంలోని కొన్ని కణజాలాలను కృత్రిమంగా సృష్టించడం సాధ్యం కాదు. ఒకరి నుంచి దానంగా స్వీకరించిన కణజాలాన్ని వేరే చోట అమర్చగలగడం సాధ్యమవుతుంది. అందువల్ల అలాంటి కణజాలాలు అవసరమైనప్పుడు వాటిని దాత ఇచ్చినప్పుడే స్వీకరించడం సాధ్యమవుతుంది. అలాంటివాటిల్లో కార్నియా ఒకటి. ఒకవేళ పిల్లల్లో ఇలా కార్నియా లోపం వల్ల అంధత్వం వస్తే... ఆ పిల్లలకు తెలిసే ఒకే ఒక రంగు... నలుపు! ఈ రంగురంగుల ప్రపంచాన్ని వాళ్లు చూడటమే సాధ్యం కాదు. ఆ చిన్నారి జీవితాల్లోంచి ఆ నలుపును తొలగించి, వాళ్ల జీవితాలను రంగుల మయం చేయడానికి కార్నియాలు లభ్యం కావడమన్నది ఎంతగానో అవసరం. అందువల్ల వ్యక్తులంతా తమ మరణానంతరం కార్నియాను నిరుపయోగంగా మట్టిలో కలిసి΄ోయేలా చేయడానికి బదులు, వాటిని దానంగా ఇవ్వడం ద్వారా ప్రతి వ్యక్తీ మరో ఇద్దరికి చూపును తెప్పించే అవకాశం ఉంటుంది. అందుకే అలా కంటిచూపునకు దూరమైన వ్యక్తులకు ఈ లోకం చూపించడానికి నేత్రదానాలు పెరగడం ఎంతగానో అవసరం.నేత్రదానం చేయడానికి ఎవరెవరు అర్హులు ? ఏడాది వయసుకు పైగా ఉన్నవారెవరైనా తమ మరణానంతరం నేత్రదానం చేయడానికి అర్హులవుతారు. అలాంటి వారిలో ఈ కింద పేర్కొన్న సమస్యలునప్పటికీ వారు తమ మరణానంతరం నేత్రదానం చేయవచ్చు. అవి... పాక్షికంగానే కనుచూపు ఉన్నవారు (పూర్ సైట్), ∙కళ్లజోడు వాడేవారు డయాబెటిస్తో బాధపడేవారు రక్తపోటుతో బాధపడేవారు (చక్కెర వ్యాధి, హైబీపీ ఉన్నప్పటికీ నిరభ్యంతరంగా నేత్రదానం చేయవచ్చు. ఇలాంటి రుగ్మతలు ఉన్నప్పటికీ నేత్రదానానికి వారు పూర్తిగా అర్హులే) రెటీనా లేదా ఆప్టిక్ నర్వ్ లోపం వల్ల అంధత్వం వచ్చినవారూ... వీరంతా ఎంతగా వయసుపైబడ్డవారైనప్పటికీ నిరభ్యంతరంగా నేత్రదానం చేయవచ్చు.కార్నియాల లభ్యత అవసరమైన మేరకు ఎందుకు ఉండటం లేదంటే? నేత్రదానం అని చెప్పే ఈ కార్నియా దానాలు ఇంకా జరగాల్సినంత విస్తృతంగా జరగడం లేదనే చె΄్పాలి. దాంతో బాధితులకు అవసరమైనన్ని కార్నియాలు లభ్యం కావడం లేదు. చాలా అంశాలు ఇందుకు కారణమవుతున్నాయి. వాటిలో కొన్ని ఇవే... నేత్రదానం విషయంలో అవగాహనలోపం ∙నేత్రదానం తర్వాత కార్నియాలను నిలువ చేయడానికి అవసరమైననన్ని కేంద్రాలు (ఐ బ్యాంకులు) లేకపోవడం, నేత్రదానాన్ని ్ర΄ోత్సహించే వారి సంఖ్య అంతగా లేక΄ోవడం (మోటివేషన్ లేక΄ోవడం) సామాజిక, మతపరమైన కారణాలతో నేత్రదానానికి ముందుకు వచ్చేవారి సంఖ్య తక్కువగా ఉండటం.కార్నియా సేకరణ ఎలా జరుగుతుందంటే..? నేత్రదానం చేస్తానని వాగ్దానం చేసిన వ్యక్తి మరణించిన వెన్వెంటనే... బంధుమిత్రులు ‘ఐ బ్యాంక్’కు సమాచారమివ్వాలి. ఎందుకంటే... మరణించాక ఆరు గంటలలోపే దాత నుంచి కార్నియాను సేకరించాలి. లేకపోతే ఆ కార్నియా నిరుపయోగంగా మారిపోతుంది. ఈలోపు ఐ–బ్యాంక్ నుంచి సిబ్బంది వచ్చే లోపు మరణించిన వ్యక్తి కళ్లపైన తడి దూదిని ఉంచాలి. ఆ గదిలో ఉన్న ఫ్యాన్ను స్విచ్–ఆఫ్ చేయాలి. మరణించిన వ్యక్తి తల భాగం మిగతా శరీరానికి ఆరు అంగుళాల ఎత్తుండేలా మృతుడి తలకింద తలగడ అమర్చాలి. ఐ–బ్యాంక్ సిబ్బంది వచ్చాక... ఇక్కడ పేర్కొన్నట్లుగా ఉంచిన మృతుడి పార్థివ శరీరంలోని కళ్లలోని కార్నియాతోపాటు 10 సి.సి.ల రక్తపు నమూనానూ సేకరిస్తారు. కార్నియా తొలగింపు తర్వాత ఐ–బ్యాంక్ సిబ్బంది ఆ ప్రదేశంలో కృత్రిమ కార్నియాను అమర్చి కంటి ఆకృతిలో ఎలాంటి తేడా కనిపించకుండా చూస్తారు.చూపు పొందడానికే అవకాశాలెక్కువ... కార్నియా మార్పిడి శస్త్రచికిత్స విజయవంతం కాకసోవడానికి అవకాశాలు చాలా తక్కువ. శస్త్రచికిత్స విజయవంతమై చూపు పొందడానికే అవకాశాలెక్కువ. ఈ మాట చె΄్పాల్సిన అవసరమేమిటంటే... సాధారణంగా మిగతా అవయావాల మార్పిడి తాలూకు శస్త్రచికిత్స చేసినప్పుడు శరీరం ఆ అవయవాలను అంత తేలిగ్గా తనవిగా ఆమోదించదు. తనది కాని బయటి పదార్థం (ఫారిన్బాడీ) పరిగణించి, దాన్ని రిజెక్ట్ చేయడానికి ప్రయత్నిస్తుంది. కానీ కార్నియల్ ట్రాన్స్ప్లాంటేషన్లో అలాంటి అవకాశాలు చాలా తక్కువ. అందుకే దాదాపు 90 శాతం కేసులకు పైగా విజయవంతం అవుతాయి. పైగా పైన పేర్కొన్న రిస్క్ ఉన్నందున మిగతా అవయవ మార్పిడి శస్త్రచికిత్స కేసుల్లో శరీరానికి రోగనిరోధక శక్తిని (ఇమ్యూనిటీని) తగ్గించడానికి ఇమ్యూనోసప్రెసెంట్ ఔషధాలు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ కార్నియాకు అలాంటి ప్రమాదం లేదు కాబట్టి ఇమ్యూనో సప్రెసెంట్స్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. ఇది నేత్రదానం విషయంలో ఉన్న మంచి సౌకర్యం. కంటి ఆపరేషన్ అయినవాళ్లు కూడా నేత్రదానానికి అర్హులే.ఏయే సందర్భాల్లో రిస్క్ ఉంటుందంటే... కార్నియాను అమర్చే సమయంలో స్వీకర్త శరీరం దాన్ని స్వీకరించక΄ోవడం అన్న రిస్క్ చాలా తక్కువ. అయినప్పటికీ కొన్ని సందర్భాల్లో ఆ ప్రమాదం ఉండవచ్చు. అదెప్పుడంటే...అంటించిన గ్రాఫ్ట్ ఊడిపోవడం లేదా కదిలిపోవడం గ్రాఫ్ట్ తర్వాత కంటికి ఇన్ఫెక్షన్ రావడం కంటిలోని గుడ్డులో ఒత్తిడి పెరగడం వల్ల (గ్లకోమా) కుట్లు వేయడంలో కొన్ని సమస్యల కారణంగా కార్నియా వాపు వచ్చినప్పుడు.కార్నియా నిరుపయోగమని తేలితే...? కొందరు పెద్దమనసుతో నేత్రదానం చేయడానికి ముందుకు వచ్చినప్పటికీ వాళ్ల కార్నియా నిరుపయోగం అని తేలితే... అప్పుడూ దాతల వల్ల కొన్ని ప్రయోజనాలు కలుగుతాయి. ఉదాహరణకు ఎయిడ్స్ రోగులు, హెపటైటిస్ బీ లేదా సీ ఉన్నవారి కార్నియాలు దానంగా స్వీకరించడానికి ఉపయోగపడవు. అయితే కొన్ని సందర్భాల్లో వారి నుంచి స్ల్కెరా వంటి కొన్ని కంటి భాగాలను గ్రాఫ్టింగ్ కోసం వాడుకోవచ్చు. మరికొన్ని సందర్భాల్లో మానవాళికి ఉపయోగపడే కొన్ని పరిశోధనల కోసం కూడా ఆ కార్నియాలను ఉపయోగించుకోవచ్చు. అందుకే మరో బాధితుడికి అమర్చడానికి వీల్లేనంత మాత్రాన కార్నియా నిరుపయోగం అవుతుందనే అభి్ర΄ాయానికి రావద్దు. చివరగా... మరణానంతరం వృథాగా మట్టిలో కలసిపోవడం వల్లగానీ లేదా కట్టెపై కాలిపోవడం ద్వారాగానీ వృథాగా పోయే కార్నియాలను వీలైనంత ఎక్కవ మంది దానం చేస్తే... ఎంతోమంది చిన్నారులూ, పెద్దవారూ చూపు పొందేలా చేయవచ్చు. అందుకే కార్నియా దానాల ప్రాధాన్యాన్ని గుర్తించి ప్రతి ఒక్కరూ నేత్రదానంపై అవగాహనను పెంచుకోవడం ఎంతైనా అవసరమని గుర్తించాలి. ఎవరు నేత్రదానం చేయడానికి అర్హులు కారంటే... కొందరి నుంచి మరణానంతరం కార్నియా స్వీకరించడం కుదరకపోవచ్చు. వారు ఎవరంటే... నిర్దిష్టంగా ఏ కారణం వల్ల చనిపోయారో చెప్పలేని వారు రేబిస్, సిఫిలిస్, హెపటైటిస్, సెప్టిసీమియా, ఎయిడ్స్ వంటి జబ్బులతో చనిపోయిన వారి నుంచి కంటికి వచ్చే ఆక్యులార్ ఇన్ఫెక్షన్స్ ఉన్నవారు... ఈ అందరి నుంచి కార్నియా స్వీకరించడం కుదరదు. అంటే వీళ్లు నేత్రదానానికి అర్హులు కాదు. డాక్టర్ కె. రవికుమార్ రెడ్డిసీనియర్ కంటి వైద్య నిపుణులు నిర్వహణ: యాసీన్ (చదవండి: -
మందిరా బేడి ఫిట్నెస్ మంత్ర..! 30 ఏళ్ల వయసులో కంటే ఇప్పుడే..
ఫ్యాషన్ డిజైనర్, నటి, టీవీ వ్యాఖ్యాత మందిర బేడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాలీవుడ్లో ఆమె హవా మాములుగా లేదు. ఆమె స్వరం, నటనతో వేలాది అభిమానులను సంపాదించుకున్న ముద్దుగుమ్మ మందిరా బేడి. ఐదు పదుల వయసులోనూ యువ హీరోయిన్ మాదిరి ఆహార్యంతో..ఆకర్షణీయమైన లుక్తో అలరిస్తుంటుందామె. ఇంతలా హెల్దీగా, యంగ్గా ఉండటానికి గల రీజన్ గురించి హెర్బాలైఫ్ పాడ్కాస్ట్ వెల్లడిస్తూ..తన బ్యూటీసీక్రెట్ని షేర్ చేసుకున్నారామె.మరి అవేంటో తెలుసుకుందామా..!.మందిరా తన వయసు గురించి చెప్పడానికి అస్సలు భయపడనని, కానీ ఆహార్యం పరంగా యంగ్గానే కనిపిస్తానని అన్నారామె. అందరు కదలిక ఓ మెడిసిన్, వ్యాయామం ఓ ఔషధ అని అంటుండటం వినేదాన్ని. కానీ అది తన విషయంలో నిజమైందని అంటోందామె. వ్యాయామం ఒక్కటే ప్రజలను అనారోగ్యం బారినపడకుండా చేస్తుందని, అదొక సప్లిమెంట్గా అభివర్ణించింది. అన్ని సమస్యలకు వ్యాయామం అద్భుతమైన నివారిని అని నమ్మకంగా చెబుతోందామె. అంతేగాదు 50లలో అధిక బరువు శిక్షణ తప్పనిసరి అని అంటోందామె. ఎందుకంటే..ఆ సమయంలో వృద్ధాప్యం మనలోకి ఎంటర్ అవుతుంటుంది. కాబట్టి ఆ టైంలో ఫిట్నెస్ చాలా ముఖ్యం, అదీగాక శారీరక క్షీణతకు దారితీసే సమయం కూడా అదే. అందువల్ల బలశిక్షణ శరీరానికి ఎంతో అవసరమని అన్నారు. ఇది మనకు శక్తిమంతమైన మార్పుతో పాటు, మన కండరాలను బలోపేతం చేస్తాయని చెబుతోంది. అంతేగాదు వర్కౌట్లు శారీరక, మానసిక ఆరోగ్యానికి అత్యద్భుతమైనవని అన్నారు. దీర్ఘకాలిక ఆరోగ్యానికి ఎంతో హెల్ప్ అవుతాయని అన్నారు. అయితే దీన్ని తీవ్రంగా భయపెట్టేలా చెయ్యొద్దని చెప్పారామె. ఇష్టంతో..స్వాంతన చేకూరేలే చేయాలి. అప్పుడే వృద్ధాప్యాన్ని ధీమాగా తిప్పికొట్టగలమని అన్నారామె. అంతేగాదు ఈ ఏజ్లో నిరంతర సంరక్షణ, నిబద్దతతో చేసే రోజువారీ వ్యాయామాలు మన ఆయుష్షుకి శ్రీరామరక్ష అని చెబుతున్నారు మందిరా బేడి. View this post on Instagram A post shared by Herbalife India Official (@herbalifeindiaofficial)గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: పిల్లలకు నేర్పించాల్సింది ఇదే..! గుడ్ పేరెంటింగ్ స్టైల్) -
ఆరు నెలల్లో 12 కిలోలు బరువు తగ్గిన మహిళ..!
బరువు తగ్గడం అంత ఈజీ కాకపోయినా..అసాధ్యం మాత్రం కాదు. అదనపు బరువుని తగ్గించుకోవడానికి ఇక్కడొక మహిళ అనుసరించిన విధానం..అందర్నీ కదిలిస్తోంది, ప్రేరేపిస్తోంది కూడా. కేవలం ఆరు నెలల్లోనే మంచి ఫలితాన్ని అందుకుంది. పైగా అందుకోసం ఆమె ఎంతలా కష్టపడిందో తెలిస్తే..విస్తుపోతారు. మంచి శీరారకృతి, ఆరోగ్యకరమైన బరువు కోసం ఆ మాత్రం డెడికేషన్ ఉండాల్సిందే మరి. ఇక్కడ ఈ మహిళ బరువు తగ్గడం కోసం ఏం అనుసరించిందంటే..దుబాయ్కి చెందిన షెర్రీ పీటర్ అనే మహిళ తాను ఆరు నెలల్లో 12 కిలోలుకు పైగా బరువు తగ్గానని సోషల్ మీడియా ఎక్స్ వేదికగా పేర్కొంది. అంతేగాదు ఆగస్టు 2025 vs ఫిబ్రవరి 2026 కల్లా 12 కిలోలు తగ్గి..స్లిమ్గా మారాను అని పోస్ట్లో తెలిపింది. మంచి శరీరాకృతి కోసం అనుసరించిన వెయిట్లాస్ వ్యూహం గురించి పేర్కొన్నారామె.ప్రతిరోజూ పదివేల అడుగులురోజువారీగా పదివేల అడుగుల వాకింగ్. ఇది బరువు తగ్గడానికి ఒక ప్రభావవంతమైన వ్యూహం. దీనివల్ల రోజుకు దాదాపు 300–500 అదనపు కేలరీలను బర్న్ చేస్తుంది. తాను దీన్ని ఒక ఏడాది నుంచి పాటిస్తున్నానని చెప్పారు. జిమ్కి వెళ్లడానికంటే మందు నుంచి ప్రారంభించానని చెప్పారు. వారంలో నాలుగు రోజులు..బరువులు ఎత్తడం, పైలేట్స్ వెయిట్ లిఫ్టింగ్, పైలేట్స్ను వారానికి నాలుగు నుంచి ఐదు రోజులు కేటాయించానని తెలిపింది. వాటిలో స్ట్రెంగ్త్ ట్రైనింగ్ జీవక్రియను పెంచగా, పైలేట్స్ కోర్ బలాన్ని పెంపొందిస్తాయి. ఎమ్స్కల్ప్ట్ నియో వారానికి రెండుసార్లుఎమ్స్కల్ప్ట్ నియో అనే మిషన్ సాయంంతో శరీర ఆకృతి చికిత్స తీసుకున్నట్లు తెలిపారు. ఇది ఏకకాలంలో కొవ్వును కరిగింఇచ 30 నిమిషాల సెషన్లలో కండరాలను నిర్మిస్తుంది. ఇది ఉదరం, పిరుదులు, చేతులు, తొడలపై ప్రభావవంతంగా ఉంటుంది.ఆహారంసమర్థవంతమైన బరువు తగ్గడంలో అధిక ఫైబర్, పోషకాలు అధికంగా ఉండే ఆహారాలపై దృష్టి సారించడం అత్యంత కీలకం. అలాగే హైడ్రేటెడ్గా ఉంటూనే చక్కెర, శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్ వినియోగాన్ని కూడా పరిమితం చేయాలి. అదనంగా తినాలనిపించినప్పుడల్లా.. తీసుకున్న గ్రీన్ టీ కాస్త భావోద్వేగ మద్దతుగా మారిందని షెర్రీ చెప్పింది.మద్యం మానేయడంక్యాలరీ తీసుకోవడం తగ్గించడానికి ఆల్కహాల్ తగ్గించడం అనేది చాలా ప్రభావవంతమైన మార్గం. సాధారణంగా ప్రతి పెగ్ ఆల్కహాల్ వంద కేలరీనలు పెంచుతుంది. అందుకే పూర్తిగా మానేసి పైలేట్స్, జిమ్, వాకింగ్లపై ఫోకస్ పెట్టినట్లు తెలిపారామె.సింపుల్గా చెప్పాలంటే..ఎక్కువ నడవడం, తక్కువ తినడం బరువు తగ్గడానికి సరళమైన మార్గం అని అందరికీ తెలుసు. కానీ ఇలా షెర్రీ లాంటి మహిళల అనుభవపూర్వకమైన వెయిట్లస్ స్టోరీలు..ఇలాంటి వాటిని అనుసరించేలా చేయడంలో ప్రేరణటీ ఉంటాయి కదూ..!. ఇంకెందుకు ఆలస్యం ప్రయత్నించి చూడండి మరి..!.august 2025 vs february 202612kgs down and in the best shape of my life pic.twitter.com/ZLMHIIr4H3— deSherry (@Sherrypeter) February 20, 2026 (చదవండి: నాట్యమయూరి సుధా చంద్రన్ వెల్నెస్ సీక్రెట్..! ఆయిల్ మసాజ్లు, ఇంట్లో తయారు చేసే..) -
నాట్యమయూరి సుధా చంద్రన్ వెల్నెస్ సీక్రెట్..!
భారతీయ భరతనాట్య నృత్యకారిణి, నటి సుధాచంద్రన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నటిగానూ, నృత్యకారిణిగా మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుని, గుర్తింపు తెచ్చుకున్నారు. అలాగే బుల్లితెరపై విలక్షణమైన నటతో అశేష ప్రేక్షక ఆదరాభిమానాలు పొందారామె. అలాంటి సుధాచంద్రన్ ఆరు పదుల వయసులో కూడా అంతే అందం, ఫిట్నెస్తో యాక్టివ్గా ఉండే ఆమె..అందం, ఆరోగ్యపరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారో సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నారామె. ప్రస్తుతం ఉన్న హెల్త్ అండ్ బ్యూటీ ట్రెండ్లకు విరుద్ధంగా పూర్వకాల నాటి ఆయుర్వేద ఆచారాలే తన అందం, ఆరోగ్యం వెనుక సీక్రెట్ అంటోందామె. వాటి గొప్పతనం గురించి సుధా మాటల్లోనే సవివరంగా తెలుసుకుందామా..!. View this post on Instagram A post shared by Sudhaa Chandran (@sudhaachandran) ప్రస్తుతం బ్యూటీ అనగానే సీరమ్లు, షీట్ మాస్క్లు ట్రెండ్ల హవా ఎక్కువగా ఉంది. పైగా చాలామంది సీనియర్ సెలబ్రిటీలు ఈ ఆధునిక కాలానికి అనుగుణంగా ఉన్న ట్రెండ్లే అనుసరిస్తే..ఆమె పాతకాలం నాటి ఆయుర్వేదం, నాటి ఆచార సంప్రదాయలకే జై కొడుతోంది సుధాచంద్రన్. అంతేగాదు ఆరోగ్యం, చర్మ సంరక్షణ అనేవి దినచర్యలు కావని, అవి మన అమ్మమ్మల నాటి జ్ఞాపకాతో ముడిపడి ఉన్నావి, తరతరాలుగా ఒకరి నుంచి ఒకరికి సంక్రమించినవిగా పేర్కొన్నారామె. తాను దక్షిణి భారత్లోని కేరళ నుంచి వచ్చానని, అందువల్ల దేశీ ఆచారాలకే ప్రాముఖ్యత ఇస్తానని అన్నారామె. తనకు ఆయుర్వేదం ఒక ట్రెండ్ కాదని, అదొక జీవన విధానమని అన్నారు. చిన్ననాటి నుంచి చూసినవే ఈనాటికి తూ.చా తప్పకుండా ఆచరిస్తున్నానని అన్నారామె. దక్షిణ భారత దేశం నుంచి రావడంతో మంగళ, శుఖ్రవారాల్లో తలస్నానం తప్పనిసరి అని చెప్పారు. కొబ్బరి నూనె రాసుకుని మరి స్నానం చేయడం అలవాటని కూడా చెప్పారామె. తన అమ్మమ్మ జుట్టు అందంగా, ఒత్తుగా ఉండాలంటే కొబ్బరినూనె తప్పనిసరి అని చెబుతూ తాను పాఠశాలకి వెళ్తున్నప్పుడూ అమ్మమ్మ ఎంతలా తన జుట్టుకి శ్రద్ధగా నూనె రాసేవారో గుర్తు తెచ్చుకున్నారామె. అలాగే 15 రోజులకొకసారి కడుపుని శుభ్రపరుచుకోవడం అంటే..సాఫీగా విరేచనాలు అయ్యేలా కేటాయించడం. మన పురాతన భారతీయ వైద్య విధానమైన ఆయుర్వేదన్నే గట్టిగా విశ్వసిస్తానని చెప్పారామె. కనీసం జలుబు చేసినప్పుడు కూడా దశములారాష్టాన్ని క్రమం తప్పకుండా ఉపయోగిస్తానని చెప్పారామె. దశములారాష్టం అనేది సాంప్రదాయ ఆయుర్వేద టానిక్. ఇది పది వేర్లు, ఇతర మూలిక మిశ్రమాలతో తయారు చేస్తారని తెలిపారు. శ్వాసకోశ ఆరోగ్యానికి చాలామంచిదని చెప్పారు. అలాగే కళ్లకు పెట్టుకునే కాజల్ కూడా ఇంట్లో తయారుచేసినదే వాడతానని, ఇది తన అమ్మమ్మ నుంచి అమ్మకు..అలా తనకు సంక్రమించిన ఆచారమని. అదే తాను ఇప్పటికీ ఫాలో అవుతానని అన్నారామె. అలాగే జుట్టు ఆరోగ్యానికి ఆముదం కూడా ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారామె. అలాగే మాయిశ్చరైజింగ్ కొబ్బరి నూనెని ఉపయోగిస్తానని, ఆఖరికి మేకప్ని తొలగించేందుకు కూడా వెట్ వైప్స్ వాడనని, కొబ్బరినూనెతోనే తొలగిస్తానని అన్నారామె. తాను కేరళ నుంచి వచ్చి ముంబైలో స్థిరపడ్డా తన మూలాలను, ఇంటి ఆచారాలనే అనుసరిస్తానని చెప్పారామె. అంతేగాదు కేరళ మసాజ్లు తీసుకుంటానని కూడా అన్నారు. శరీరంలోని అదనపు నీటి నిలుపుదలను తొలగించేందు ఎంతగానో ఉపకరిస్తాయని అన్నారు. తాను కొత్తగా ఎలాంటి ప్రయోగాలు చేసేందుకు ఇష్టపడనని, తరతరాల సంప్రదాయాలు, ఆచారాలనే పాటిస్తానని చెప్పారామె. అప్పుడే జీవితం చాలా సులభంగా తేలికగా ఉంటుందన్నారామె. కానీ నేటితరం మార్కెట్లో వచ్చేప్రతి ట్రెండ్ ఫాలో అయ్యి జీవితాన్ని క్లిష్టతరంగా మార్చుకుని సమస్యలు కొనితెచ్చుకుంటున్నారంటూ..తన పోస్ట్ని ముగించారు సుధాచంద్రన్. View this post on Instagram A post shared by Sudhaa Chandran (@sudhaachandran) (చదవండి: The 'Ideal Self' Trap: ఎదుటివారిలా ఉండాలనుకోవడమే సమస్య!) -
డెంటల్ యాబ్సెస్ అంటే..? ఎందువల్ల వస్తుందంటే..
ఎప్పుడైనా మీ పంటిచిగురు దగ్గర తెల్లగా... చిన్న ఉండలాంటి సంచిలో కాస్త చీము నిండినట్టుగా చిన్న తిత్తి మాదిరిగా కనిపించిందా? కొద్దిగా వాచినట్టుగా, నొప్పిగా, బాధగా ఏదో చిగుర్లకు వచ్చిన సమస్యగా అనిపించిందా? దాన్ని ‘డెంటల్ యాబ్సెస్’ అంటారు. అంటే నోటి పుండు. ఒక్కసారి అది బాగా పొడుస్తున్నట్టుగా తీవ్రమైన నొప్పి రావచ్చు. జ్వరం కూడా కనిపించవచ్చు. కారణం అదో బ్యాక్టీరియల్ సమస్య. ఈ డెంటల్ యాబ్సెస్ అంటే ఏమిటీ, అదెందుకు వస్తుంది, చికిత్స ఏమిటన్న అనేక విషయాలను తెలుసుకుందాం...పంటి చిగురుకు ఏదైనా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చి దాన్నిండా చీము చేరడం వల్ల వచ్చే సమస్యే ‘పంటి యాబ్సెస్’. నిజానికి పంటిచిగురు దగ్గర చీము చేరడం వల్ల ఈ సమస్య వస్తుంది. ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు దాన్ని ఎదుర్కోడానికి తెల్లరక్తకణాలు రంగంలోకి దిగడం తెలిసిందే. ఇలా యుద్ధానికి సన్నద్ధమైన ఈ తెల్లరక్తకణాలు... బ్యాక్టీరియాతో జరిగిన పోరాటంలో నశించాక... ఆ తెల్లరక్తకణాల తాలూకు మృతకణాలన్నీ చీము రూపంలో అక్కడ ఓ తిత్తి (పాకెట్)లాగా ఉండి΄ోతాయి. దాంతో నోరు తెరచి చూసుకున్నప్పుడు ఓ తెల్లటి చీము ఉండ కనిపిస్తుంది.తగ్గినట్టు ఉన్నా ఉపేక్షించడం సరికాదు... పంటి చిగురు దగ్గర కనిపించిన ఆ ఇన్ఫెక్షన్ చిగురుకు పాకే అవకాశముంది. అంతేకాదు... అది పంటిని వదులు చేసేందుకూ ఛాన్స్ ఉంది. ఒక్కోసారి ఆ గడ్డ చిదిమినట్లవుతుంది. ఇది జరిగినప్పుడు నొప్పి కాస్తా అకస్మాత్తుగా చేత్తో తీసేసినట్లు అవుతుంది. మొదట ఉన్న తీవ్రమైన నొప్పి అకస్మాత్తుగా లేకుండా పోయి, నొప్పి లేదంటే సమస్య తగ్గిపోయిందని కాదు. సాధారణంగా డెంటల్ యాబ్సెస్ అన్నది దానంతట తగ్గి΄ోవడం కాస్త అరుదే. అందుకే అలా పంటి చిరుగురు ప్రాంతంలో తెల్లటి చీము ఉండ కనిపించిందంటే తప్పక చికిత్స తీసుకోవడం అవసరం. ఇతర అవయవాలకూ పాకవచ్చుడెంటల్ యాబ్సెస్కు తగిన చికిత్స తీసుకోకపోవడం వల్ల ఒక్కోసారి ఆ సూక్ష్మజీవులు రక్తప్రవాహంలో కలిసి ఇతరచోట్లకూ పాకే అవకాశముంది. ఒకవేళ ఇన్ఫెక్షన్ దవడకూ, తలకూ, మెడకు కూడా పాకితే ఆ ప్రాంతాల్లోనూ తీవ్రమైన నొప్పి రావచ్చు. ఒక్కోసారి భరించలేనంత నొప్పిగా కూడా ఉండవచ్చు. లక్షణాలుసాధారణంగా నోట్లో పేరుకు΄ోయే బ్యాక్టీరియా సంఖ్య చాలా ఎక్కువ. దీన్నే ఓరల్ బ్యాక్టీరియా, ఓరో–ఫ్యారింజియల్ బ్యాక్టీరియా అంటారు. వీటిలో చాలావరకు నిరపాయకరమైనవే ఎక్కువ. అయితే హానికరమైన బ్యాక్టీరియాతో ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు నోరు బ్యాక్టీరియా పెరుగుదలకు దోహదంచేసే భాగం అయినందున అవి వేగంగా పెరుగుతాయి. పలువరసలో ఏదైనా భాగం దెబ్బతిని ఉంటే అక్కడ బ్యాక్టీరియా విస్తరించేందుకు అవకాశాలు మరింతగా పెరుగుతాయి. దాంతో చీముగడ్డ (పస్ పాకెట్) ఏర్పడటంతో మరికొన్ని లక్షణాలూ కనిపిస్తుంటాయి. అవి... ∙ మాటిమాటికీ పొడిచినట్లుగా తీవ్రమైన నొప్పి ∙ చల్లటి లేదా వేడి ప్రదార్థాలు తీసుకున్నప్పుడు జిల్లుమనడం. ∙ఏదైనా వస్తువు నమలగానే పొడుచుకువచ్చినట్టుగా నొప్పి కలగడం. గొంతులోని గ్రంథులు వాచడం. నోటిలో దుర్వాసన వస్తున్న భావన లేదా దుర్వాసన రావడం. ఏదైనా తినేపదార్థం నోట్లోకి తీసుకుంటే దాని రుచి మారినట్లు అనిపించడం. (ఇలా అనిపిస్తుందంటే అది చీముగడ్డ పగిలినందుకు సూచన. అయితే అప్పటికీ ఇన్ఫెక్షన్ మాత్రం శరీరంలోనే ఉంటుంది. కాబట్టి అది శరీరంలోని ఇతర ప్రాంతాలకు పాకే అవకాశమున్నందున... అలా జరగడం మరింత ప్రమాదానికి దారితీసే ముప్పున్నందున... తప్పనిసరిగా డెంటల్ డాక్టర్ను కలిసి తగిన సూచనలూ, చికిత్స తీసుకోవాలి. నివారణప్రతిరోజూ క్రమంతప్పకుండా ఉదయం, రాత్రి బ్రషింగ్ చేసుకోవడం. ∙బ్రషింగ్ కోసం మృదువైన బ్రిజిల్స్ ఉన్న టూత్బ్రష్నే వాడంటం. పైన చిగుళ్లూ, పళ్లూ కలిసే చోటి నుంచి కింద మళ్లీ చిగుళ్లూ, పళ్లూ కలిసే చోటు వరకు గుండ్రంగా బ్రష్ చేసుకోవడం. పంటికి బయటివైపే కాకుండా లోపలి వైపునా బ్రష్ చేసుకోవడంతో పాటు నమిలే ప్రదేశాలల్లో... అంటే పంటిపైన వెడల్పుగా ఉంటే ప్రాంతంలోనూ చక్కగా బ్రష్ చేసుకోవడం. బ్రషింగ్ టైమ్ రెండు లేదా మూడు నిమిషాలకు మించకుండా చూసుకోవడం. నాలుకపైనున్న బక్టీరియాను తొలగించుకోడానికి కనీసం 30 సెకన్ల పాటు స్క్రబ్ చేసుకోవడం. చిగుర్ల ఆరోగ్యం కోసం బ్రషింగ్ తర్వాత చేత్తో చిగుళ్లపై మృదువుగా మసాజ్ చేసుకోవడం. ప్రతి ఆర్నెల్లకోసారి క్రమంతప్పకుండా దంత పరీక్షలు చేయించుకోవడం. చికిత్సపంటి యాబ్సెస్కు డాక్టర్లు సాధారణ యాంటీబయాటిక్స్తో చికిత్స అందిస్తారు. మరీఅవసరమైన వారికి ఆ చీముపాకెట్ను తొలగించడంతోటు రూట్కెనాల్ అవసరం పడవచ్చు. డాక్టర్ ప్రత్యూష, సీనియర్ కన్సల్టెంట్ డెంటల్ – కాస్మెటిక్ సర్జన్ (చదవండి: అరుదైన కేన్సర్లతో పోరాడిన యువ యోధురాలు..!) -
రాత్రి నిద్రలో కూడా ఆఫీస్ ఆలోచనలేనా?
పగలు ఆఫీసులో ఎనిమిది గంటలు పని చేస్తే.. రాత్రి నిద్రలో మరో ఎనిమిది గంటలు మెదడు అదే పనిని చేస్తూనే ఉందా?. బెడ్ మీద పడుకున్నాక కూడా రేపటి మీటింగ్, బాస్ అడిగే ప్రశ్నలు, పూర్తికాని రిపోర్టులు కళ్ళ ముందు సినిమా రీళ్లలా తిరుగుతున్నాయా? అయితే మీరు 'మెంటల్ స్విచ్ ఆఫ్' చేయడంలో విఫలమవుతున్నారు. ఫలితంగా నిద్రలేమి, ఉదయాన్నే విపరీతమైన నీరసం మీ జీవితంలో భాగమైపోతున్నాయి.ఆలోచనలు ఎందుకు వస్తాయి? (The Zeigarnik Effect)మానసిక శాస్త్రంలో 'జైగార్నిక్ ఎఫెక్ట్' అనే ఒక సిద్ధాంతం ఉంది. మన మెదడు పూర్తి చేసిన పనుల కంటే, అసంపూర్తిగా వదిలేసిన పనులను (Unfinished Tasks) పదే పదే గుర్తు చేస్తూ ఉంటుంది. అందుకే శుక్రవారం వదిలేసిన ఫైలు ఆదివారం రాత్రి వరకు మిమ్మల్ని వెంటాడుతుంది. దీనివల్ల శరీరం విశ్రాంతి తీసుకుంటున్నా, మెదడు మాత్రం 'ఓవర్ టైమ్' పని చేస్తూనే ఉంటుంది.నా వద్దకు వచ్చిన రాకేష్ అనే టీమ్ లీడర్ అనుభవమే అందుకు ఉదాహరణ. అతను రాత్రి 2 గంటలకు కూడా మేలుకుని ఈమెయిల్స్ చెక్ చేసేవాడు. "మెయిల్ చెక్ చేయకపోతే ఏదో అపరాధం చేస్తున్నట్టు అనిపిస్తుంది" అని చెప్పేవాడు. ఫలితంగా అతనికి 'క్రానిక్ ఇన్సోమ్నియా' (దీర్ఘకాలిక నిద్రలేమి) మొదలైంది. మేము అతనికి 'డిజిటల్ కర్ఫ్యూ' మరియు 'బ్రెయిన్ డంప్' టెక్నిక్స్ నేర్పించాం. పక్షం రోజుల్లోనే అతని నిద్ర నాణ్యత పెరిగింది, ఆఫీసులో పనితీరు కూడా మెరుగైంది.ఆఫీస్ ఆలోచనల నుండి విముక్తి పొందే 5 మార్గాలుబ్రెయిన్ డంప్ (Brain Dump): ఆఫీసు వదిలే ముందే లేదా పడుకోవడానికి గంట ముందు, మీ మెదడులో ఉన్న పనులన్నింటినీ ఒక పేపర్ మీద రాయండి. "ఇదిగో, ఈ పనులన్నీ ఇక్కడ రాసి ఉన్నాయి, రేపు చూసుకోవచ్చు" అని మీ మెదడుకు ఒక స్పష్టమైన సంకేతం ఇవ్వండి. అప్పుడు అది పదే పదే గుర్తు చేయడం ఆపుతుంది.వర్క్-హోమ్ రిచ్యువల్ (Work-Home Ritual): ఆఫీసు నుండి ఇంటికి వచ్చే దారిలో ఒక నిర్దిష్టమైన పనిని అలవాటు చేసుకోండి. ఉదాహరణకు, ఆఫీసు ఐడి కార్డు తీసి బ్యాగులో పెట్టడం లేదా ఆఫీసు బట్టలు మార్చుకుని స్నానం చేయడం. ఇది మీ మెదడుకు "ఆఫీసు పని అయిపోయింది, ఇప్పుడు వ్యక్తిగత సమయం మొదలైంది" అని చెప్పే ఒక 'సైకలాజికల్ స్విచ్'.డిజిటల్ బౌండరీస్: పడుకోవడానికి కనీసం ఒక గంట ముందు ఫోన్ను పక్కన పెట్టండి. ఆఫీసు వాట్సాప్ గ్రూపులను 'మ్యూట్' చేయండి. ఆ నీలి రంగు వెలుతురు (Blue light) మీ నిద్రకు అవసరమైన 'మెలటోనిన్' హార్మోన్ను దెబ్బతీస్తుంది.వర్రీ టైమ్ (Worry Time): మీకు ఆందోళన కలిగించే విషయాల గురించి ఆలోచించడానికి సాయంత్రం ఒక 15 నిమిషాల సమయాన్ని కేటాయించండి. ఆ సమయంలో మాత్రమే వాటి గురించి ఆలోచించండి. బెడ్ మీదకు వెళ్ళాక ఆలోచనలు వస్తే, "దీని గురించి ఆలోచించడానికి రేపు సాయంత్రం టైమ్ ఉంది కదా" అని వాయిదా వేయండి.మైండ్ఫుల్ బ్రీతింగ్: నిద్రపోయే ముందు 4-7-8 టెక్నిక్ (4 సెకన్లు శ్వాస తీసుకోవడం, 7 సెకన్లు ఆపడం, 8 సెకన్లు వదలడం) పాటించండి. ఇది మీ నాడీ వ్యవస్థను శాంతపరిచి, ఆలోచనల వేగాన్ని తగ్గిస్తుంది.Today's Taskఈ రాత్రి పడుకునే ముందు, రేపు చేయాల్సిన మూడు ముఖ్యమైన పనులను ఒక డైరీలో రాసి, ఆ డైరీని మూసి పక్కన పెట్టండి. మీ మెదడు ఎంత ప్రశాంతంగా ఉంటుందో గమనించండి.మీరు నిద్రపోవడం అంటే పనిని నిర్లక్ష్యం చేయడం కాదు.. రేపటి పనిని మరింత సమర్థవంతంగా చేయడానికి మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోవడం. గుర్రానికి విశ్రాంతి ఇస్తేనే అది రేపటి రేసులో పరిగెత్తగలదు. మీ మెదడు కూడా అంతే!- సైకాలజిస్ట్ విశేష్ కెరీర్ & మైండ్సెట్ కోచ్8019 000066www.psyvisesh.com -
పిల్లల్లో ‘డబ్ల్యూ’ సిట్టింగ్ను ప్రోత్సహించవద్దు!
పిల్లలు తమ కాళ్లను ఇంగ్లిషు అక్షరం ‘డబ్ల్యూ’ ఆకృతిలో ఉంచి కూర్చోవడం వాళ్ల కీళ్ల ఆరోగ్యానికీ, కండరాలకూ అంత మంచిదికాదంటూ సూచిస్తున్నారు పిల్లల డాక్టర్లు. పిల్లలు మోకాళ్లను ముందు పెట్టి... మిగతా కాళ్ల భాగాన్ని వెనకకు నెట్టి ఉంచడంతో చూడ్డానికి ఆ భంగిమ ‘డబ్ల్యూ’ లాగా ఉంటుంది కాబట్టి దాన్ని డబ్ల్యూ సిట్టింగ్ అంటారు. పిల్లలు ఈ భంగిమలో కూర్చోడానికి అలవాటైతే దాని వల్ల కలిగే అనేక అనర్థాలేమిటన్నది తెలుసుకుందాం...కూర్చునే వయసుకు వచ్చాక చిన్నారులు నేల మీద డబ్ల్యూ ఆకృతిలో కాళ్లుంచేలా కూర్చుండిపోయే భంగిమను ‘రివర్స్ టైలరింగ్ సిట్టింగ్’ అనీ లేదా ‘ఫ్రాగ్ సిట్టింగ్’ అని కూడా అంటారు. ఇలా క్యూట్గా కనిపించేలా మోకాళ్లను ముందువైపునకూ, అరికాళ్లు రెండూ వెనక్కు ఉంచుతూ కూర్చుండిపోవడం వల్ల మున్ముందు అనేక సమస్యలొస్తాయంటూ పేర్కొంటున్నారు.డబ్ల్యూ సిట్టింగ్తో అనర్థాలివే... → ఇలా కూర్చున్నప్పుడు తొడ ఎముక (ఫీమర్)తో పాటు, మోకాలి కిందివైపున ఉండే ప్రధాన ఎముక ‘టిబియా’పై ఒత్తిడి పడటం వల్ల చిన్నారుల పాదాలు ఉండాల్సినట్లుగా కాకుండా లోపలివైపునకు తిరగడం (ఇన్ టోయింగ్) జరగవచ్చు. → ఇలాగే కూర్చుండిపోవడం అలవాట్లయ్యాక వాళ్ల కాళ్ల కదలికలు... కదలాల్సినంతగా కాకుండా కాస్త పరిమితంగా కదిలే అవకాశముంది. ఆ తర్వాత వీళ్లు బాసిపట్లు (సక్లంముక్లం) వేసినట్లుగా కూర్చోవడమూ కష్టమవుతుంది. → కండరాలు బలహీనపడటం : ఈ డబ్ల్యూ సిట్టింగ్లో దీర్ఘకాలం కూర్చుండేవారి కాలి కండరాలు బలహీనంగా మారే అవకాశమూ ఉంటుంది. → బాలెన్స్ తప్పడం, మైల్స్స్టోన్స్ ఆలస్యం కావడం : కండరాలు బలహీనం కావడంతో నిలబడినప్పుడు వారు బ్యాలెన్స్ సరిగ్గా నిలపలేకపోవడం వంటి అనర్థాలూ ఉండవచ్చు. దీనివల్ల వారి వయసుకు తగ్గట్లుగా చోటుచేసుకోవాల్సిన క్రమబద్ధమైన అభివృద్ధి (డెవలప్మెంటల్ మైల్స్టోన్స్) ఆలస్యం కావచ్చు. → మోకాళ్లు, కీళ్ల నొప్పులు : డబ్ల్యూ సిట్టింగ్స్ బాగా అలవాటైన పిల్లల్లో మోకాళ్ల, కీళ్ల నొప్పులు చాలా త్వరగా వచ్చే అవకాశం ఉంది. అలాగే ఆర్థరైటిస్ సమస్య కూడా వచ్చే అవకాశాలు ఎక్కువ. → పోష్చర్ సరిగా లేకపోవడం : ఈ పిల్లల్లో భవిష్యత్తులో పాదాలు లోపలివైపునకు తిరిగే ‘ఇన్ టోయింగ్’తో పాటు వెన్ను సరైన భంగిమలో లేకపోవడంతో వాళ్ల దేహం పోష్చర్లో కూడా మార్పులు వచ్చే అవకాశముంది.సరిదిద్దడమిలా... → బాసిపట్లు వేసినట్లుగా (సక్లం ముక్లం) కూర్చోబెట్టడం : దీన్నే ఇంగ్లిష్లో క్రిస్క్రాస్ సిట్టింగ్ అని కూడా అంటారు. డబ్ల్యూ సిట్టింగ్లో ఉండే పిల్లలను ఆ భంగిమలో బదులు క్రిస్ క్రాస్ భంగిమలో కూర్చుబెడుతూ... క్రమంగా డబ్ల్యూ సిట్టింగ్కు దూరం చేయడం. → కాళ్లు రెండూ సాచినట్లుగా (లాంగ్ సిట్టింగ్) కూర్చోబెట్టడం : చిన్నారులు కాళ్లను డబ్ల్యూ ఆకృతిలో ముడిచి ఉన్నప్పుడు వాళ్లను రెండు కాళ్లూ సాచినట్లుగా లాంగ్ సిట్టింగ్లో కూర్చోబెట్టడం. → డబ్ల్యూ సిట్టింగ్ భంగిమలో కాకుండా కరెక్ట్ పోష్చర్లో కూర్చుండేలా సైడ్ సిట్టింగ్లాంటివీ ప్రోత్సహించడం. → డబ్ల్యూ సిట్టింగ్కు బదులు ఇతరత్రా పోష్చర్లలో కూర్చున్నప్పుడు వాళ్లను మెచ్చుకుంటూ ఉండటం. పై అలవాట్లను ప్రోత్సహించడం వల్ల డబ్ల్యూ సిట్టింగ్తో కలిగే అనర్థాలు తొలగిపోవడంతోపాటు భవిష్యత్తులో ఎముకలూ, కీళ్లు, కండరాలు ఆరోగ్యకరంగా ఉండేందుకు ఇది దోహదపడుతుంది. -
నెలసరి పోరాటం
నెలసరి... ప్రకృతి సిద్ధమైన ప్రక్రియే అయినప్పటికీ నేటి ఆధునిక జీవనశైలిలో అది లక్షలాది మంది మహిళలకు ఒక అగ్నిపరీక్షగా మారుతోంది. శారీరక పరమైన సమస్యలే కాకుండా, సామాజిక వివక్ష, మౌలిక సదుపాయాల లేమి, హార్మోన్ల అసమతుల్యత యువతులను ఇబ్బందులపాలు చేస్తున్నాయి. ఇటీవల వెలువడిన తాజా నివేదికలు ఈ సమస్య తీవ్రతను కళ్లకు కడుతున్నాయి.21వ అధికరణంనెలసరి ఆరోగ్యం అనేది కేవలం ఒక వ్యక్తిగత విషయం.. అనే దాని నుంచి ప్రాథమిక హక్కు స్థాయికి చేరింది. ఇటీవల సుప్రీంకోర్టు వెలువరించిన ఈ చారిత్రాత్మక తీర్పు కొత్త విప్లవానికి నాంది పలికింది. రాజ్యాంగంలోని 21వ అధికరణం ప్రకారం నెలసరి ఆరోగ్యం–పరిశుభ్రత మహిళల గౌరవప్రదమైన జీవన హక్కులో ఒక భాగమని కోర్టు స్పష్టం చేసింది.612 దేశంలోని అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో 6–12వ తరగతి చదువుతున్న బాలికలకు ఉచితంగా శానిటరీ ప్యాడ్స్ అందించాలని, విడిగా మరుగుదొడ్ల సౌకర్యం కల్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.33.4%25 ఏళ్లలోపు యువతుల్లో ప్రతి ముగ్గురిలో ఒకరికి అంటే 33.4% మందికి తమ గురించి సరైన అవగాహన లేదు.23 మిలియన్లు పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు లేకపోవడం వల్ల ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో 23 మిలియన్ల మంది బాలికలు పీరియడ్స్ ప్రారంభమైన తర్వాత చదువును మధ్యలోనే ఆపేస్తున్నారు.32% 15–24 ఏళ్ల యువతుల్లో సుమారు 77.3% మంది పరిశుభ్రమైన పద్ధతులు పాటిస్తున్నారు. అయితే బీహార్ వంటి రాష్ట్రాల్లో ఇది కేవలం 32% ఉండటం ఆందోళనకరం.1022% భారత్లో 10% నుంచి 22% మంది యువతులు పీసీఓఎస్ వంటి నిశ్శబ్ద శత్రువుతో బాధపడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా 10% నుంచి∙13% మంది మహిళలు ఇబ్బందిపడుతున్నారు. పీసీఓఎస్ వంటి హార్మోన్ల సమస్యలు ఉన్నవారిలో 70% మందికి అసలు తమకు ఆ సమస్య ఉందన్న విషయమే తెలియదు.50% పీసీఓఎస్ ఉన్న మహిళల్లో 50% కంటే ఎక్కువ మంది ఆందోళన, నిరాశ వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు.6584% పీరియడ్స్ సమయంలో సుమారు 65% నుంచి 84% మంది విద్యార్థినిలు తీవ్రమైన కడుపు నొప్పితో (డిస్మెనోరియా) బాధపడుతున్నారు. సగటున ఒక విద్యార్థిని ప్రతినెల 3 నుండి 5 రోజులు పాఠశాలకు దూరమవుతోంది.2.3 కోట్లు ఇప్పటికీ సరైన సౌకర్యాలు లేకపోవడం వల్ల దేశవ్యాప్తంగా సుమారు 2.3 కోట్ల మంది బాలికలు ప్రతి సంవత్సరం నెలసరి సమయంలో పాఠశాలకు వెళ్లడం మానేస్తున్నారు.79.7% రాజస్థాన్ లో జరిగిన ఒక అధ్యయనం ప్రకారం, కడుపునొప్పి కారణంగా 79.7% మంది విద్యార్థినులు క్లాసులకు హాజరు కాలేకపోతున్నారు.50% పీరియడ్స్ సమస్యలు ఉన్న మహిళల్లో 50% మంది మాత్రమే వైద్యుని సంప్రదిస్తున్నారు. చాలామంది దీనిని సాధారణం అని నిర్లక్ష్యం చేయడం వల్ల అది ఇతర ఆరోగ్య సమస్యలకు దారితీస్తోంది.68.9% తీవ్రమైన పీరియడ్ నొప్పితో బాధపడే వారిలో 68.9% మందికి నిద్ర సరిగ్గా పట్టడం లేదు.38% పీరియడ్స్ సమయంలో 38% మంది మహిళలు తమ రోజువారీ పనులను సరిగ్గా చేసుకోలేకపోతున్నారు.7885% జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే గణాంకాల ప్రకారం, 15–24 ఏళ్ల మధ్య వయస్సు గల మహిళల్లో దాదాపు 78% నుంచి 85% మంది పీరియడ్స్ సమయంలో ఆరోగ్యకరమైన ఉత్పత్తులను (శానిటరీ ప్యాడ్స్, కప్స్ మొదలైనవి) వాడుతున్నారు.12% సుమారుగా 12% మంది మహిళలకు ప్యాడ్లు కొనే స్తోమత లేకపోవడం, అపరిశుభ్రమైన బట్టలు వాడటం వల్ల వారిలో ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయి.ఐదుగురిలో 1 బాలికనెలసరి మొదలయ్యాక ప్రతి ఐదుగురిలో ఒక బాలిక చదువు మానేస్తుంది. మౌలిక సౌకర్యాల లేమి, బాల్య వివాహాలు, అవగాహన లోపం వల్ల పాఠశాల మానేస్తున్నారు. 1.13 భారతదేశం ఏటా సుమారు 1.13 లక్షల టన్నుల శానిటరీ ప్యాడ్స్ను ఉత్పత్తి చేస్తోంది. వీటిని పర్యావరణానికి హాని కలగకుండా నిర్వీర్యం చేయడం ఇప్పుడు పెద్ద సవాలుగా మారింది.సమాజంలో పీరియడ్స్ గురించి ఉన్న అపోహలు ఇంకా తొలగిపోవడం లేదు. ముఖ్యంగా విద్యార్థినిలు, యువతులలో ఈ సమస్యలు వారి చదువు, మానసిక స్థితి, దైనందిన జీవితంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. కేవలం శానిటరీ ప్యాడ్స్ పంపిణీ చేస్తే సరిపోదని, పాఠశాల స్థాయి నుంచే లింగ–సమగ్ర విద్య అందించాలని నిపుణులు సూచిస్తున్నారు. -
పెరుగుపై పేరుకునే నీరు పారబోస్తున్నారా..?
ప్రతిరోజూ మనం కిచెన్లో చేసే చిన్నచిన్న పొరపాట్లు మన ఆరోగ్యంపై ఎంతగానో ప్రభావం చూపిస్తాయి. సాధారణంగా మనం ఇంట్లో పెరుగు తోడుపెట్టినపుడు, దానిపై ఒక పలుచని నీరులాంటి పొర పేరుకుపోతుంది. చాలా మంది దీనిని పారబోస్తుంటారు. కానీ ఇందులోనే ఎంతో ముఖ్యమైన పోషక విలువలున్నాయని వైద్యులు చెబుతున్నారు. పాలు తోడు పెట్టినపుడు పెరుగుగా మారే ప్రక్రియలో పాలుగడ్డకట్టి, నీటి రూపంలో ఉండే ప్రోటీన్లు విడిపోయి పైకి చేరుతాయి. దీనినే చల్ల అని, వే ప్రోటీన్ అని, మజ్జిగతేట అని పలు రకాలుగా పిలుస్తుంటారు. ఇందులో కండరాల నిర్మాణానికి అవసరమైన ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. ఇంకా కాల్షియం, పొటాషియం వంటి గుండెకు, ఎముకలకు మేలుచేసే పోషకాలు కూడా ఉంటాయి. అలాగే ఇది పేగు ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది. సాధారణంగా జిమ్కు వెళ్లేవారు, లేదంటే కండరాల పుష్టికోసం వేల రూపాయలు ఖర్చు చేసి కొనే ప్రోటీన్ పౌడర్లు ఈ ద్రవం నుంచే తయారవుతాయి. పరిశ్రమలలో ఈ ద్రవాన్ని సేకరించి, ఫిల్టర్ చేసి, ఎండబెట్టి పౌడర్గా మారుస్తారు. ఇంట్లో అది సహజ రూపంలోనే లభిస్తోంది. కాబట్టి ఇకపై పెరుగుపై నీరు కనిపిస్తే దాన్ని పారబోయకుండా, తిరిగి ఆ పెరుగులోనే కలిపేయండి. దీనివల్ల పెరుగులోని పూర్తి పోషకాలు మన శరీరానికి అందుతాయి. చిన్న మార్పుతో పెద్ద ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. -
బెల్లీఫ్యాట్ తగ్గేందుకు 5:1:1 రూల్ అంటే..!
కార్బోహైడ్రేట్స్ తీసుకోవడం తగ్గిస్తే బరువు తగ్గి స్లిమ్గా అవుతామన్నది చాలామందిలో ఉండే అభిప్రాయం. అయితే మనం తీసుకునే కార్బోహైడ్రేట్లకు తగినట్లుగా పీచు, ప్రోటీన్లను చేర్చాలి. ఐదు గ్రాముల కార్బోహైడ్రేట్లు : 1 గ్రాము పీచు (ఫైబర్) : 1 గ్రాము ప్రోటీన్ అంటూ 5:1:1 నిష్పత్తిలో తీసుకుంటే కడుపు చుట్టూ కొవ్వు పేరుకోవడం తగ్గడంతో పొట్ట అలాగే దేహం బరువు పెరగక వ్యక్తులు స్లిమ్గా ఉంటారన్నది న్యూట్రిషనిస్టుల మాట.తెల్ల బ్రెడ్డు, పేస్ట్రీలు, మైదా, ఇన్స్టాంట్ నూడుల్స్ వంటి రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్లో కేవలం పిండిపదార్థాలు మాత్రమే ఉంటాయి. వాటిలో పీచుపదార్థాలుగానీ లేదా ప్రోటీన్గానీ ఉండక΄ోవడంతో అవి తిన్నవెంటనే రక్తంలోకి చక్కెర విడుదలవుతుంది. వినియోగం కాని చక్కెర కొవ్వుగా మారి బరువు పెరుగుతారన్నది చాలామందికి తెలిసిన విషయమే. 5:1:1 రూల్ అంటే... ఐదు (5 ) గ్రాముల కార్బోహైడ్రేట్ ఉండే ఆహారాన్ని తీసుకుంటే... దానికి అనుగుణంగా –1 గ్రాము పీచు పదార్థం అలాగే – 1 గ్రాము ప్రోటీన్ తీసుకోవాలి. దాంతో పిండిపదార్థంవల్ల పెరగాల్సిన కొవ్వు పెరగకుండా ఈ పీచు, అలాగే ప్రోటీన్లు అడ్డుపడతాయి. 5:1:1 నిష్పత్తికి అర్థమిదే. ఈ నిష్పత్తిలోని 1 గ్రాముల పీచు, 1 గ్రాము ప్రోటీన్తో ఏయే ప్రయోజనాలు చేకూరతాయో చూద్దాం. 1 గ్రాము పీచుతో... పీచు (ఫైబర్) జీర్ణక్రియను మెల్లగా జరిగేలా చూస్తుంది. దాంతో చక్కెరలు వెంటనే రక్తంలో పెరగకుండా మెల్లమెల్లగా ఇంకుతుంటాయి. ఫలితంగా రక్తంలోని చక్కెర మోతాదులు అకస్మాత్తుగా పెరగవు (స్పైక్ అవ్వవు). ఒకేసారి చక్కెరలు రక్తంలో విడుదల కావు కాబట్టి దాన్ని అదుపు చేయాల్సిన ఇన్సులిన్ కూడా అకస్మాత్తుగా విడుదల కావాల్సిన అవసరం లేదు. అందువల్ల అది నెమ్మదిగా తగిన మోతాదులోనే విడుదలవుతూ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఇక పీచు వల్ల కడుపు నిండుగా ఉన్న భావనతో వెంటనే ఆకలిగా అనిపించదు. అంతేకాదు జీర్ణవ్యవస్థ ఆరోగ్యమూ బాగుంటుంది. జీర్ణవ్యవస్థలో ఉండాల్సిన మేలు చేసే మంచి బ్యాక్టీరియా (గట్ బ్యాక్టీరియా) పెరగడంతో వ్యాధి నిరోధక వ్యవస్థ కూడా చురుగ్గా పనిచేస్తుంది. దాంతో అంత తేలిగ్గా వ్యాధుల బారిన పడకుండా ఆరోగ్యంగా ఉండటం సాధ్యమవుతుంది. ఇక పీచు (ఫైబర్) అన్నది కొవ్వులను సమీకరించి వ్యర్థాల రూపంలో వెళ్లకుండా మలం నుంచి వేరు చేస్తుంది. 1 గ్రాము ప్రోటీన్తో ప్రోటీన్ వల్ల కూడా చక్కెరలు తక్షణం పెరగక΄ోగా... కండరాల బలం కూడా సమంగా నిర్వహితమవుతుంది. ్ర΄ోటీన్ తిన్న తర్వాత వెంటనే ఆకలిగా అనిపించదవు. దాంతో మితిమీరు తినడం (ఓవర్ ఈటింగ్) తగ్గుతుంది. ఫలితంగా బరువు పెరిగే ప్రమాదం బాగా తగ్గుతుంది. ఇక ్ర΄ోటీన్ వల్ల కండరాల రిపేర్లు జరుగుతుండటం, దేహానికి అవసరమైన శక్తి అందుతుంది. మరి... ప్రోటీన్లూ, పీచు... ఈ రెండూ పుష్కలంగా ఉండే ఆహారాలేమిటంటే... దాదాపు చాలారకాల పప్పుదినుసులు / కాయధాన్యాలు (లెంటిల్స్) లోప్రోటీన్ తోపాటు పీచుపదార్థాలూ ఎక్కువగానే ఉంటాయి. ఉదాహరణకు కందులు, శనగలు, చిక్కుళ్లలో 40 నుంచి 50 శాతం కార్బోహైడ్రేట్లతోపాటు ప్రోటీన్, పీచు ఎక్కువగా ఉంటాయి. పొట్టుతీయని ధాన్యాలలో కార్బోహైడ్రేట్లతో పాటు కొంత ప్రోటీన్, పీచుపదార్థాలు పుష్కలంగా ఉంటాయి. ఉదాహరణకు ముడిబియ్యం, జొన్నలు, కొర్రలు, సజ్జలు, అరికలు, సామలు, ఊదలు, క్వినోవా. అన్నిరకాల తాజా పండ్లలో స్వాభావికమైన చక్కెరతో పాటు విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు, తేమ (మాయిశ్చర్) లకు అదనంగా పీచుపదార్థాలూ (ఫైబర్) ఉంటాయి. వీలైనంతవరకు పండ్ల రసాలను కాకుండా పండ్లు తీసుకోవడం మేలు. దూరం ఉంచాల్సినవి... బ్రెడ్, పేస్ట్రీలు, బిస్కెట్లు, కేకులు, డోనట్స్, పిజ్జా, బర్గర్, నూడుల్స్, బేకరీ పదార్థాలు, చిప్స్ వంటి కరకరలాడే (క్రిస్పీ) వేపుళ్లకు వీలైనంత దూరం ఉండాలి. అలాగే ప్యాకేజ్డ్ జ్యూస్లు, జామ్, స్వీట్లకు కూడా దూరంగా ఉండటం మేలు.5:1:1 అనే ఈ నిబంధనను వీలైనంతగా పాటిస్తూ ఉంటే... బరువు పెరగక΄ోవడం, కడుపు చుట్టూ అనవసరమైన కొవ్వు పేరుకుని పొట్టరావడం వీలైనంతగా తగ్గుతుంది. దాంతో ఊబకాయంతో వచ్చే అనేక అనర్థాలు అంటే... డయాబెటిస్, హైబీపీ, ఫ్యాటీలివర్ గుండెజబ్బులు... వీటన్నింటినీ నివారించుకుని ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపవచ్చు. డాక్టర్ శ్రీలత సీనియర్ క్లినికల్ డైటీషియన్ అండ్ న్యూట్రీషనిస్ట్ (చదవండి: Actress Sneha and Prasanna: మైండ్ఫుల్ పేరెంటింగ్ మంత్ర!) -
అరుదైన కేన్సర్లతో పోరాడిన యువ యోధురాలు..!
మహమ్మారి కేన్సర్ ఎంతటి బలవంతుడినైన బలహీనుడిగా మార్చేస్తుంది. అంతలా మానసికంగా, శారీరకంగా ఢీలా పడేలా చేసే వ్యాధిని..19 ఏళ్ల అమ్మాయి అలుపెరగని పోరాటం చేసి..మట్టికరిపించింది. ఎందరో కేన్సర్ బాధితులకు స్ఫూర్తిగా నిలవడమే గాక..ప్లీజ్ పోరాడండి అని ధైర్యం చెబుతోంది. యువ కేన్సర్ వారియర్ అని అందరిచేత ప్రశంసలందుకుంటోంది. ఆ అమ్మాయే 19 ఏళ్ల లకితా ఫిద్రా..కెన్యాకు చెందిన ఆమెకు ఐదేళ్ల వయసులో ఉండగా తండ్రి కేన్సర్తో మరణించాడు. ఒంటరి తల్లి పెంపకంలో సాగుతున్న ఆమె జీవితం సరిగ్గా పదేళ్ల వయసులో ఊహించని మలుపు తిరిగింది. ఒకరోజు ఆటలు ఆడుకుంటుండగా, సడెన్గా కుడిమోకాలులో విపరీతమైన నొప్పి..అల్లాడిపోతోంది. తీరా వైద్యుల వద్దకు తీసుకువెళ్తే..వాళ్లు నార్మల్ సమస్యగానే భావించి చికిత్స అందిస్తున్నారు. ఎప్పుడైతే ఆమె కుటుంబ చరిత్రలో తండ్రి అత్త సార్కోమా కేన్సర్ బాధితులని తెలిసిందో..వెంటనే అనుమానంతో డాక్లర్లు వైద్య పరీక్షలు చేయగా..తీవ్రమైన ఆస్టియోసార్కోమా కేన్సర్ నిర్థారణ అయ్యింది. స్కానింగ్లో ఆమె కుడి తొడ ఎముకలో ఈ కేన్సర్ కణితిని గుర్తించారు. దాంతో వైద్యులు కీమోథెరపీ చేయించి, లింబ్ సాల్వేజ్ సర్జరీ చేశారు. ఈ ప్రక్రియలో మోకాలి కీలును టైటానియం ఇంప్లాంట్తో భర్తీ చేశారు. ఆ తర్వాత రెండేళ్లకు హాయిగా స్కూల్కి వెళ్లి..యథావిధిగా చదువుకోడం ప్రారంభించింది. మళ్లీ ఆ మహమ్మారి 2020లో దాడి చేసింది. ఈసారి ఆమె కాలుని పూర్తిగా తొలగించక తప్పలేదు. అదే ఏడాది అదనపు కీమోథెరపీ, ఎముకమజ్జ మార్పిడి జరిగాయి. ఆమె సొంత స్టెమ్ సెల్స్ ఉపయోగించి మొట్టమొదిటి మార్పిడి చేశారు. దాదాపు వందరోజులపైనే ఆస్ప్రత్రిలో చికిత్స పొందింది. అక్కడితో ఆ కేన్సర్ విజృంభణ ఆగలేదు. ముచ్చటగా మూడోసారి 2022లో, ఆమెకు మైలోడిస్ప్లాస్టిక్ సిండ్రోమ్ అభివృద్ధి చెందింది. ఇది అతి తీవ్రమైన ఎముక మజ్జ రుగ్మత.ఇది మళ్లీ దాడిచేసే అరుదైన కేన్సర్వ్యాధి. అయితే ఈసారి ఆమెకు అండగా తల్లి నిలబడింది. తల్లి ఎముకమజ్జ మార్పిడితో లకితాకి చికిత్స అందించారు. ఈప్రక్రియ విజయవంతమైంది. ఇక్కడ లకితా మూడోసారి ఎదుర్కొన్న తీవ్రమైన ఎముకమజ్జ మార్పడి..బహుళ కేన్సర్లకు దారితీసే జీవితకాల ప్రమాదం. కానీ ఆమె జన్యువులు దూకుడు లేకుండా చికిత్సా వ్యూహానికి అనుమతించి..తగ్గుముఖం పట్టడం విశేషం. అయితే ఆమెకు సదా వైద్యు పర్యవేక్షణ తప్పనిసరి. కనీసం రెండు మూడేళ్ల కొకసారి కేన్సర్ పరీక్షలు చేయిచుకోక తప్పదు. ఇన్ని కష్టాల మధ్య చదువుని నిర్లక్ష్యం చేయలేదు. ఆమె ఇప్పుడు సైకాలజీ, సామాజిక శాస్త్రం, సాహిత్యం ఏ లెవెల్ను చదువుతోంది. పైగా విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించాలనే యోచనలో ఉంది. తాను పరుగెత్తలేకపోయినా, జిమ్నాస్టిక్స్ చేయలేకపోతేనేం..డ్యాన్స్ చేయగలను, పేయింటింగ్ వేయగలను అంటోంది. పునరావృతమయ్యే బోన్ కేన్సర్, లి-ఫ్రామిని సిండ్రోమ్పై ధైర్యంగా పోరాడిని ధీరురాలిగా గుర్తింపు తెచ్చుకుంది. అలాగే కేన్సర్ బాధితుల్లో స్థైర్యాన్ని నింపేలా గొప్ప సందేశాన్ని కూడా అందిస్తుంటుంది. మీరు కేన్సర్ రోగిగా ఆస్పత్రల్లో గడపడం కష్టమే అయినపపటికీ తెలియన ధైర్యంతో సాగుతారు. ఆ వ్యాధని చూసి భయపడినప్పటికీ స్ట్రాంగ్గా మారతారు. అప్పుడు తెలుస్తుంది మీరు రోగి కాదు..హీరో అనే సందేశాలతో వాళ్లను వీరోచితంగా కేన్సర్పై పోరాడేలా చేస్తుంది లకితా. (చదవండి: నిజమైన వ్యక్తిత్వ వికాసం మొదలయ్యేది అప్పుడే..!) -
ఆ తాతగారి లైఫ్స్టైల్కి ఫిదా అవ్వాల్సిందే..!
ఇటీవలకాలంలో అందరిలో ఆరోగ్య స్ప్రుహ ఎక్కువైంది. మంచి ఆహారపు అలవాట్లు,వర్కౌట్లతో హెల్దీగా ఉండే ప్రయత్నం చేస్తున్నారు. మరికొందరు ప్రోటీన్ పౌడర్లు, జిమ్లు వంటి వాటితో ఆరోగ్యకరమైన వృద్ధాప్య జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు. కానీ ఈ తాత అంతలా ఆరోగ్యం కోసం ఏమాత్రం ఖర్చు చేయకుండానే..చాలా చురుకుగా, దీర్ఘాయువుతో ఉండటం విశేషం. ఈ ఏజ్లో కూడా అన్ని పనులు తానే చాలా యాక్టివ్గా చేసుకుంటున్న తీరుకి ఫిదా అవ్వాల్సిందే. మరి అతడి ఆరోగ్య రహస్యం ఏంటో చూద్దామా..ఆ తాత గారి గురించి ఆయన మనవరాలు కంటెంట్ క్రియేటర్ 28 ఏళ్ల సింధూ ఇన్స్టాగ్రామ్లో వీడియో రూపంలో పోస్ట్ చేయడంతో అది నెట్టింట సంచలనంగా మారడమే కాదు, ప్రశంసలు వెల్లువెత్తాయి. తన తాతగారికి దగ్గర దగ్గర 95 ఏళ్ల ఉంటాయని, ఆయన రిటైర్డ్ అనస్థీషియాలజిస్ట్ అని వీడియోలో వివరిస్తోంది సింధు. ఆమె తన తాతగారి రోజు ఉదయం 5.30 గంటలకు యోగాతో ప్రారంభమవుతుందని, పదవీవిరమణ చేసి రెండు దశాబ్దాలకు పైనే అవుతున్నా..ల్యాప్టాప్లో వైద్య సాహిత్యం గురించి చదవడం, కొత్త సాంకేతిక నైపుణ్యాలను నేర్చుకోవడం వంటి వాటితో కాలక్షేపం చేస్తారు. వీటి అన్నింటి తోపాటు అప్పుడప్పుడు షాపింగ్ ట్రిప్పులు, రోజువారీ పూజ, ధ్యానం, యాప్లు లేకుండా సాధన చేయడం తదితరాలు ఉన్నాయి. ఇవేగాక తన వంటను తానే చేసుకుంటారని, "మినీ ఇడ్లీలు" వండటంలో మంచి నిపుణుడని చమత్కరిస్తోంది. ఆయన రిటైర్ అయ్యాక కూడా వైద్యవృత్తిపై ఆసక్తి ఏమాత్రం తగ్గలేదని, ఇప్పటికీ వాటికి సంబంధించినవి చదవడం, ఆర్టికల్స్ రాయడం వంటివి చేస్తుంటారని చెబుతోంది. ఆయన తమిళనాడులోని మధురైలో చాలా ఏళ్లుగా అనస్థీషియాలజిస్ట్గా పనిచేసినట్లు పేర్కొంది. తన తాతగారి రోజువారీ దినచర్య దీర్ఘకాల ఆరోగ్యానికి ఖరీదైన ధోరణులతో పనిలేదని నిరూపించింది. ఇప్పటికీ ఆయన హ్యాపీగా వాక్ చేస్తారు, వంటకూడా చేసుకుంటారు, కొత్తకొత్త నైపుణ్యాలను నేర్చుకుంటుంటారు. పైగా ఆయన ఎలాంటి జిమ్ సభ్యుత్వం లేకుండా, కనీసం సప్లిమెంట్లపై ఆధారపడకుండా.. జస్ట్ శ్రద్ధ అనే రెండు అక్షరాల పదంపై ఫోకస్ పెట్టి ఆరోగ్యకరమైన జీవితాన్ని ఆస్వాదిస్తున్నాడని సింధు చెపుకొచ్చింది. దక్షిణాసియా హిందూ సంప్రదాయల్లో వందల ఏళ్ల నుంచి రోజువారీ కదలికలు, భావోద్వేగాలపై నియంత్రణ, మానసిక స్పష్టత తదితరాలు ఉన్నాయి. అయితే వాటిని కంటిన్యూ చేసేలా జీవన విధానంలో భాగమైతే తన తాతలా సుదీర్ఘకాలం ఆరోగ్యంగా జీవితాన్ని గడపొచ్చని అంటోంది. చిన్న చిన్న వాటిల్లో కూడా ఆనందాన్ని వెతుక్కునే మనస్తత్వం ఉన్నవారికి ఎదురే ఉండదని, అది వారికి బలోపేతంగా ఉండేలా సామర్థ్యాన్ని అందిస్తుందని అంటోంది. View this post on Instagram A post shared by Sindhu 👩🏽🍳 (@sindhusfoodforthought) (చదవండి: అంబానీల ఆడపడుచు కోడలు.. లెహంగా ధర తెలిస్తే షాక్!) -
అలాంటి పిల్లలను వదిలించుకోవాలని చూస్తే జైలు శిక్ష..
నాకు పెళ్లయి 15 సంవత్సరాలు. పెళ్లి అయిన తర్వాత నా భర్త నన్ను అమెరికాకు తీసుకువెళ్లారు. ఇద్దరు పిల్లలు అక్కడే పుట్టారు. దురదృష్టవశాత్తూ ఇద్దరికీ తీవ్రమైన ఆటిజం.. అమెరికాలో ఉండగా కూడా నా భర్త పిల్లలను పట్టించుకోకపోగా కొట్టేవాడు. విషయం తెలుసుకున్న అక్కడి అధికారులు పిల్లలను తమ రక్షణలోకి తీసుకుని నా భర్తపై చర్యలు కూడా తీసుకున్నారు. ఇదే క్రమంలో తను ఇండియా పారిపోయి వచ్చాడు. చాలా కష్టాలు పడి నేను కూడా వచ్చాను. తీవ్రమైన లెవెల్ 3 ఆటిజంతో ఉన్న పిల్లలను పెంచడం చాలా కష్టంతో – ఖర్చుతో కూడుకున్న పని. అతను వాళ్లని వదిలించుకోవడమే కాదు, మేమిద్దరం కలిసి కొనుక్కున్న ఆస్తికి ఈఎంఐలు కట్టకుండా ఇబ్బంది పెడుతున్నాడు. నేను 24 గంటలు పిల్లల చుట్టే ఉండవలసిన పరిస్థితి కాబట్టి నేను పని కూడా చేయలేను. ఆటిజం బారిన పడిన పిల్లలకు మన దేశంలో సరైన చట్టాలు పెద్దగా లేవు – ప్రభుత్వ వసతులు కూడా లేవు అని అంటున్నారు. పరిష్కారం సూచించగలరు.– సుమతి, వరంగల్మీ బాధ వింటుంటే హృదయాన్ని కలచివేస్తుంది. మీరన్నది నిజమే! మన దేశంలో ఆటిజంపై పెద్దగా అవగాహన లేదు – బహుశా అందుకే ప్రభుత్వ వసతులు, పథకాలు కూడా పెద్దగా అందుబాటులో లేవు. దివ్యాంగుల హక్కుల చట్టం 2016 కింద ఆటిజంను మానసిక/మేధోవైకల్యంగా పరిగణిస్తారు. ఈ చట్టం కింద ఎటువంటి వైకల్యం కల్గిన వ్యక్తినైనా వివక్షకు గురిచేస్తే కఠిన శిక్షలు ఉన్నాయి. అలాగే జాతీయ ట్రస్ట్ చట్టం 1999 అనేది ఆటిజం, సెరిబ్రల్ పాల్సీ, మానసిక వికలాంగత, బహుళ వైకల్యాలున్న వ్యక్తుల సంరక్షణ, చట్టపరమైన సంరక్షకులను నియమించడం, స్వతంత్ర జీవనానికి మద్దతు ఇవ్వడం కోసం ఏర్పాటు చేసిన చట్టం/సంస్థ. అయినప్పటికీ ఆటిజం ఉన్నవారికి మిగతా వారిలా సరైన ఇన్సూరెన్స్ కూడా లేదు! అమెరికాలో ఉన్నట్టు పటిష్టమైన ప్రభుత్వ వసతులు, సంస్థలు లేనందున ఆర్థికంగా బలహీనమైన, మధ్యతరగతి తల్లిదండ్రులు చాలా కష్టాలు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వాలు వీటిపై బలమైన మార్పులు చేయాల్సిన అవసరం ఉంది. మీ విషయానికి వస్తే మీ భర్తపై ముందుగా క్రిమినల్ కేసులు పెట్టండి. మీ భర్త చేసినవి నేరాలు! బీ.ఎన్.ఎస్.లోని సెక్షన్ 93 (పూర్వం ఐ.పీ.సీ 317) ఇలా చెప్తుంది: ‘‘పన్నెండు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లల తండ్రి అయినా, తల్లి అయినా లేదా అలాంటి పిల్లల సంరక్షణ కలిగి ఉన్న ఎవరైనా, ఆ బిడ్డను పూర్తిగా విడిచిపెట్టాలనే ఉద్దేశ్యంతో – ఆ బిడ్డను వదిలించుకునే ఉద్దేశంతో బహిర్గతం చేసినా లేదా వదిలేసినా, ఏడు సంవత్సరాల వరకు జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ విధించబడతాయి.’’ అంతేకాదు. జువెనైల్ జస్టిస్ యాక్ట్ 2015, సెక్షన్ 75 ప్రకారం: పిల్లలను శారీరకంగా, మానసికంగా క్రూరత్వానికి గురి చేయడం లేదా నిర్లక్ష్యం చేయడంపై కఠిన చర్యలు ఉన్నాయి. పిల్లలపై బాధ్యత లేదా నియంత్రణ ఉన్న వ్యక్తి, వారి ఆరోగ్యం లేదా భద్రతకు హాని కలిగించేలా ప్రవర్తిస్తే 3 ఏళ్ల వరకు జైలుశిక్ష, లక్ష వరకు జరిమానా ఉంటుంది.కాబట్టి పై కేసులు పెట్టండి. పోలీసులకి గానీ, శిశు సంక్షేమ శాఖవారి ద్వారా కానీ పిర్యాదు చేయవచ్చు. అదనంగా మీ పిల్లల కోసం – మీకోసం కూడా మెయింటెనెన్స్ కోరుతూ కేసు వేయండి. డీ.వీ.సీ. చట్టం కింద భారీ పరిహారం, గృహ వసతి కూడా కోరవచ్చు. మీకు త్వరగా ఉపశమనం కావాలి అనుకుంటే అదనంగా హై కోర్టును ఆశ్రయించి త్వరితగతిన కేసులు తేల్చవలసిందిగా దరఖాస్తు చేసుకోవచ్చు.– శ్రీకాంత్ చింతల, హైకోర్టు న్యాయవాదిమీకున్న న్యాయపరమైన సమస్యలు, సందేహాల కోసం sakshifamily3@gmail.com కు మెయిల్ చేయవచ్చు. (చదవండి: కిరణ్ రావుకు చికున్గున్యా నిర్థారణ..! ఏకంగా కీళ్ల ఆరోగ్యాన్ని..) -
కిరణ్ రావుకు చికున్గున్యా నిర్థారణ..! ఏకంగా కీళ్ల ఆరోగ్యాన్ని..
బాలీవుడ్ చిత్ర నిర్మాత కిరణ్ రావు ఇటీవల సోషల్ మీడియా పోస్ట్లో తనకు చికున్గున్యా వచ్చినట్లు తెలిపారు. దాని కారణంగా కనీసం పుస్తకం కూడా పట్టుకోలేకపోతున్నట్లు పేర్కొన్నారు. ఆ వ్యాధి తన కీళ్లను ఎంతలా బలహీనపరిచిందో వివరించారామె. అసలు ఈ వ్యాధి అంతలా కీళ్ల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందా అంటే..ఆల్ఫావైరస్ అనే దోమ జాతి కారణంగా RNA వైరస్ అయిన చికున్గున్యా మానవ శరీరం లక్ష్యంగా తీవ్రమైన ప్రభావం చూపిస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. కొన్ని రోజుల్లో జ్వరం తగ్గుతుందేమో కానీ..దాని తాలుకా ఇబ్బందులు శరీరంలో స్పష్టంగా కనిపిస్తాయి, ఎదుర్కొంటాం కూడా అంటున్నారు నిపుణులు. అసలు 'చికున్గున్యా' అంటేనే వంగి ఉండే భంగిమ అని అర్థం. అంటే మన కీళ్లను, కండరాలపై ప్రభావం చూపి..కదపలేని పరిస్థితికి తీసుకువస్తాయి.కీళ్ల ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుందంటే..ఏడిస్ ఈజిప్టి లేదా ఏడిస్ ఆల్బోపిక్టస్ వంటి జాతి దోమలు కుట్టడం వల్ల ఈ వ్యాధి సంక్రమిస్తుందట. ఆ దోమకాటు కారణంగా ఈ చికున్గున్యా వైరస్ రక్తప్రవాహంలోకి ప్రవేశించి కీళ్లలోని బంధన కణజాలం సైనోవియల్ ఫైబ్రోబ్లాస్ట్లకు వ్యాపిస్తుంది. దాంతో మనకు శరీరమంతా విపరీతమైన నొప్పులు..నడవాలన్న వణుకు పుట్టడం వంటి సమస్యలు వస్తాయట. ఇది మన రోగ నిరోధక వ్యవస్థపై త్రీవంగా దాడి చేస్తుందట. ఫలితంగా శరీరంలో పలుచోట్ల వాపులు కూడా వస్తాయని చెబుతున్నారు నిపుణులు. ఈ వైరస్ చాలా దూకుడుగా ఉంటుందని, ఒక్కోసారి దీర్ఘకాలిక కీళ్ల వ్యాధిని ప్రేరేపిస్తుందని చెబుతున్నారు. కొందరిలో రుమటాయడ్ ఆర్థరైటిస్ బారిన పడేలా చేస్తుందట. అంతేగాదు కొంతమందికి కోలుకున్నాక కూడా పూర్తిస్థాయిలో కదలికలను తిరిగి పొందలేరట. అలాంటి వారికి ఫిజియోథెరపీ అవసరం ఏర్పడుతుందని చెబుతున్నారు. నిరంతర కీళ్లనొప్పి ఈ వ్యాధి ముఖ్య లక్షణంగా చెబుతున్నారు నిపుణులు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు..చుట్టుపక్కల నిల్వ నీరు లేకుండా చూసుకోవాలి. అంటే పూలకుండీలు, ఇంటి బయట ఉండే కంటైనర్లు లేదా డ్రమ్లో నిల్వ నీరు లేకుండా చూసుకోవాలనిపగటి పూట కుట్టే దోమల వల్ల వస్తుంది కాబట్టి..పొడవాటి చేతులు ఉన్న బట్టలు ధరించాలి. దోమల కుట్టకుండా లోషన్లు వంటివి రాసుకోవడం చేయాలి. అవసరమైతే దోమతెరలు తదితరాలను వాడటంఅలాగే ఇంట్లో ఎవ్వరికైనా చికున్గున్యా వస్తే..తక్షణమే దోమల రాకుండా తగిన చర్యలు తీసుకోవడం వంటివి చేయాలి.చివరగా ఈవ్యాధి నుంచి కోలుకోవడానికి చాలా సమయం పడుతుందని, ఓపికతో తగిన ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండాలని చెబుతున్నారు నిపుణులు. దీనికి నిర్ధిష్ట నివారిణి గానీ, టీకా వంటివి లేవని వైద్య నిపుణులు నొక్కి చెబుతున్నారు. త్వరితగతిన కోలుకోవాలంటే మాత్రం..జ్వరం తగ్గేలా మందులు తీసుకుంటూ..వ్యాధినిరోధక శక్తిని పెంచే ఆహారాలు పుష్కలంగా తీసుకోవాలి. అలాగే కీళ్లు మరి బిగిసుపోకుండా ఉండేలా సాగదీయడం, ఫిజియోథెరపీ వంటివి తీసుకోవడం వంటివి చేయాని చెబుతున్నారు నిపుణులు.(చదవండి: ఎవరీ సరితా యోల్మా..? 146 ఏళ్లకు..) -
రంజాన్.... ఆరోగ్యం రీసెట్కు అద్భుత అవకాశం!
ముస్లింల పవిత్ర మాసం రంజాన్ వచ్చేసింది. రోజంతా పచ్చినీళ్లు కూడా ముట్టకుండా నెల రోజులపాటు ఉపవాసం! మన జీర్ణ వ్యవస్థకు సుదీర్ఘమైన విశ్రాంతినిచ్చి...పునరుజ్జీవం కల్పించేందుకు అద్భుత అవకాశమిది. కానీ...ముస్లిం సోదరులు ఉపవాస దీక్షకు ముందు.. ఇలా ఆహారం తీసుకుంటే గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు పొందొచ్చని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. మరి అవేంటో తెలుసకుందామా..!.సమోసాలు, పకోడి, లస్సీ, చక్కెర దట్టించిన మసాలా టీ, బిర్యానీ, రోటీ, పరాటా.. హలీమ్ వంటివి రంజాన్ సమయంలో బాగా పాప్యులర్ అవుతూంటాయి. పండ్లు, ఖర్జురాలు తినేవాళ్లు ఉంటారు కానీ చాలామంది బిర్యానీల వంటివాటికి అదనంగా వీటిని స్వీకరిస్తూంటారు. ఫలితంగా రోజంతా ఉండే ఉపవాసంతో వచ్చే ఆరోగ్య ప్రయోజనాలు కాస్తా దెబ్బతింటాయని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఏడాది మొత్తమ్మీద పేరుకుపోయిన మలినాలను శరీరం పగలు మొత్తం శుభ్రం చేసుకుంటే... రాత్రికాగానే మళ్లీ అవే అనారోగ్య కారకాలను లోపలికి పంపిస్తున్నామన్నట. వీటన్నింటినీ జీర్ణం చేసేందుకు కాలేయం కాస్తా కష్టపడాలి. ఫలితంగా నిద్ర చెడిపోతుంది. నెలరోజులపాటు సాగే ఈ తంతు కారణంగా మలినాలను మొత్తం వదిలించుకునే బదులు కాలేయం మరింత ఎక్కువ శ్రమ పడుతుంది. రక్తంలో చక్కెర మోతాదులు తరచూ మారిపోతూండటం వల్ల నాడీ వ్యవస్థపై ఒత్తిడికి గురవుతుంది. ఉపవాసం పుణ్యమా అని పొట్ట తేలిక అయ్యే బదులు వేయించిన తిండి, చక్కెరలతో నిండిపోతూంటుంది.ఇలా చేస్తే మేలు...ఇఫ్తార్...ఖర్జూరం, నీళ్లళ్లతో మీ దీక్ష విరమణ చేపట్టండి. శరీరానికి అవసరమైన ఎలక్ట్రోలైట్లు ఖర్చూరాల్లో మెండు. డీహైడ్రైషన్ నుంచి కాపాడతాయి. వీటితోపాటు వేడి వేడి సూప్, ప్రొటీన్ కోసం కొంచెం మాంసం/చేప/కోడిగుడ్లు తీసుకోవడం మేలు. అలాగే.. ఉడికించిన కాయగూరలు, ఆరోగ్యకరమైన కొవ్వులు కొంత మోతాదులో తినడం శరీరంలో మంట/వాపులను తగ్గిస్తుంది. గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. మేలు చేస్తుంది. అవకాడో, ఆలివ్ ఆయిల్, బాదాం. జీడిపప్పు, వాల్నట్స్ వంటివి లేదంటే, గుమ్మడి/సూర్యకాంతి, అవిశ గింజల వంటి వాటిల్లో ఆరోగ్యకరమైన కొవ్వులు, ఖనిజాలు, ప్రొటీన్, ఫైబర్లు లభిస్తాయి.షుహూర్ (తెల్లవారుఝాము)ప్రొటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులకు ప్రాధాన్యమివ్వండి. రోజంతా శక్తిని అందించేందుకు సంక్లిష్టమైన కార్బోహైడ్రేట్లు తీసుకోవడం మేలు. బ్రౌన్ రైస్, ఓట్స్, చిరుధాన్యాలు, చిలగడదుంపలు, క్యారెట్స్లు మాత్రమే కాదు... ఆపిల్స్, ఆరటిపండ్లు, నారింజ వంటి పండ్లు మేలు. చిటికెడు ఉప్పు కలుపుకుని నీళ్లు తాగాలి. ఉప్పు ఎక్కువగా ఉన్న, బాగా శుద్ధి చేసిన ఆహారం తీసుకోవడం వల్ల దాహం ఎక్కువ అవుతుంది.రెండింటి మధ్య...నిద్రకు ప్రాధాన్యమివ్వండి. రాత్రి ఎక్కువ సేపు మేలుకుని ఉండటం వల్ల శరీరంపై ఒత్తిడి పెరిగిపోయి మంట/వాపులు పెచ్చరిల్లుతాయి. ఇఫ్తార్ విందు తరువాత కాసేపు అటు ఇటు కదలడం వల్ల జీర్ణక్రియ మెరుగవుతుంది. అద్భుతమైన అవకాశం...రంజాన్ మాసం... దైవిక సేవతోపాటు మీకు మీరు సేవ చేసుకునేందుకు ఉపయోగించుకునే అద్భుత అవకాశం. అయితే ఉపవాసం ఒక్కటే సరిపోదు. శరీర హీలింగ్కు అవసరమైన పరిస్థితులను కల్పిస్తుంది అంతే. ఇక్కడ ఉపవాసాన్ని మీరెలా చేస్తున్నారనే దానిపై శరీరానికి కలిగే ప్రయోజనాలు ఆధారపడి ఉంటాయి. ముస్లిం సోదరులు ఏటా ఒక నెల రోజులపాటు పైన చెప్పుకున్న ఆహార నియమాలను పాటిస్తే.. మిగిలిన 11 నెలలూ శరీరం మెరుగ్గా పనిచేస్తుంది. ముస్లిం సోదరులు ఒక్కరే కాదు... మిగిలిన వారు కూడా అప్పుడప్పుడు కొంత కాలం పాటు ఉపవాసం చేయడం ద్వారా అనేక ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు. - మైక్ ఎన్డీగ్వా, నేచురల్ హెల్త్ గైడ్ -
సింకోప్.. పడి లేచే ప్రమాదం
ఫెయింట్ అయిపోవడం అనే మాట చాలామంది వినే ఉంటారు. తెలుగులో చెప్పాలంటే స్వాధీనం తప్పిపోవడం. ఇది స్పహతప్పి అలాగే ఉండిపోవడం కాదు...కాసేపట్లో మళ్లీ మామూలైపోవడం. ఇలా స్వాధినం తప్పిపోయి... కొద్దిక్షణాల్లోనే మళ్లీ మామూలైపోవడాన్ని వైద్యపరిభాషలో ‘సింకోప్’ అంటారు. అయితే కొద్దిసేపట్లోనే మళ్లీ మామూలైపోయినప్పటికీ ఇలా జరగడం కొన్నిసార్లు ప్రమాదాలకూ దారితీయవచ్చు. ఉదాహరణకు ఏ వాహనం నడుపుతున్నప్పుడో ఇలా జరిగితే అది పెను ప్రమాదం తెచ్చిపెట్టవచ్చు. ఈ సమస్యకు చాలా కారణాలుంటాయి. సింపుల్గా దేహంలో నీళ్లు / ద్రవాలు తగ్గిపోవడం (డీహైడ్రేషన్) మొదలుకొని వేగస్ నరం అతిగా స్పందించడం వరకు అనేక కారణాలతో వచ్చే ఈ ‘సింకోప్’ సమస్యపై అవగాహనతో పాటు దీనికి పరిష్కారాలేమిటో తెలుసుకుందాం.కొందరు ఏదైనా తట్టుకోలేని దృశ్యం చూడగానే స్పృహ తప్పినట్లుగా అయిపోతారు. మరికొందరిలో వారి ఆందోళన స్థాయి మితిమీరిపోతే వెంటనే స్వాధీనం తప్పి పడిపోతారు. ఎందుకిలా అవుతుంది. ఎందుకంటే... గుండె స్పందనల లయ (రిథమ్)లో ఏమాత్రం తేడా రాకూడదు. స్పందన పెరిగినా, తగ్గినా అది ప్రమాదకరమే. గుండె స్పందనలు తగ్గడంతో... మన దేహంలో అత్యంత కీలక అవయవమైన మెదడుకు రక్తసరఫరా తగ్గిపోతుంది. అలా తగ్గినప్పుడు స్పృహ తప్పి పడిపోయే కండిషన్ను సింకోప్ అంటారు. ఇది సాధారణంగా చాలాసార్లు నిరపాయకరమే అయినప్పటికీ... కొన్నిసార్లు మాత్రం అది ప్రమాదకరంగా పరిణమించవచ్చు. సింకోప్ లక్షణాలు, నివారణ, చికిత్సలేమిటో చూద్దాం.సింకోప్లో రకాలున్యూరల్లీ మీడియేటెడ్ : బాగా తీవ్రమైన నొప్పి రావడం లేదా చాలా ఎక్కువగా భావోద్వేగాలకు గురికావడం, అత్యంత తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురికావడం వల్ల. సింకోప్ కండిషన్ రావచ్చు. ఆర్థోస్టాటిక్ హైపోటెన్షన్ : దేహంలో నీళ్లు / ద్రవాలు తగ్గడం వల్లగానీ లేదా ఏవైనా మందులు వాడుతున్నప్పుడు వాటి వల్ల అకస్మాత్తుగా ఒక్కసారిగా రక్తపోటు (బ్లడ్ప్రెషర్) తగ్గిపోవడం వల్ల. కార్డియాక్ సింకోప్ : గుండె రిథమ్లో తేడా రావడం వల్ల (అరిథ్మియా అనే కండిషన్లో) గుండెవేగం పెరగడమో లేదా తగ్గడమో జరిగినప్పుడు. సిచ్చువేషనల్ సింకోప్ : గట్టిగా దగ్గడం లేదా మింగడం లేదా మూత్రవిసర్జన చేస్తున్నప్పుడు అకస్మాత్తుగా స్వాధీనం తప్పిపోవడం.సింకోప్ కారణమయ్యే మెకానిజమ్ 1) మెదడుకు గుండెనుంచి తగినంత రక్తం అందకపోవడం / గుండె తగినంత రక్తాన్ని మెదడుకు అందించలేకపోవడం.2) గుండె పంపింగ్ సరిగా ఉన్నప్పటికీ మెదడుకు ఆ రక్తం అందడానికి అవసరమైన బ్లడ్ప్రెషర్ను మెయిన్టెయిన్ చేయడానికి సదరు రక్తనాళానికి తగినంత సామర్థ్యం లేకపోవడం.3) రక్తనాళానికి సామర్థ్యం ఉన్నప్పటికీ రక్తనాళంలో తగినంత రక్తం లేకపోవడం... ఈ మూడింటిలో ఏదో ఒకటిగానీ, లేదా ఒకటి కంటే ఎక్కువగా అంటే... ఏవైనా రెండు కారణాల వల్ల గానీ ఇలా జరగవచ్చు.ఎందుకిలా జరుగుతుందంటే... గుండె ఒక కండర నిర్మితమైన ఒక ఎలక్ట్రిక్ పంపు లాంటి అవయవం అన్న విషయం తెలిసిందే. ఎస్ఏ నోడ్ (సైనో ఏట్రియల్ నోడ్) అనే ఒక కీలకమైన చోటి నుంచి గుండె స్పందించడానికి అవసరమైన కరెంటు మన శరీరంలోనే నిత్యం ఉత్పత్తి అవుతూ ఉంటుంది. ఆ ఎలక్ట్రిసిటీ సరఫరాలో తేడాల వల్ల ఒక్కోసారి గుండె కండరాలు వేగంగానైనా కొట్టుకోవచ్చు లేదా ఒక్కోసారి అకస్మాత్తుగా స్పందనలు తగ్గవచ్చు. కార్డియాక్ సింకోప్లో ఇలా జరుగుతుంది.వేగం పెరిగితే... కొన్ని సార్లు గుండె స్పందనల్లో వేగం బాగా పెరిగిపోయి ‘టాకికార్డియా’ అనే కండిషన్ ఏర్పడుతుంది. దీని వల్ల గుండె పై గదుల్లోగాని, కింది గదుల్లోగాని వేగం పెరుగుతుంది. అంటే గుండెలో పంప్ చేయడానికి అవసరమైన రక్తం చేరుకోకముందే గుండె ముడుచుకోవడం... అంటే గుండె స్పందన జరుగుతుందన్నమాట. దాంతో గుండె నుంచి కీలకమైన అవయవాలకు అందాల్సినంత రక్తం రక్తనాళాల్లోకి వెలువడదు. ఈ టాకికార్డియా అనే కండిషన్ ఏ వయసు వారికైనా రావచ్చు.వేగం తగ్గితే... గుండె స్పందనల్లో వేగం తగ్గితే ఆ కండిషన్ను బ్రాడికార్డియా అంటారు. బ్రాడి... అంటే నెమ్మదించడం (స్లో కావడం). ఇక ‘కార్డియా’ అంటే గుండె అని అర్థం. గుండె స్పందనల వేగం తగ్గడం వల్ల కూడా కీలకమైన అవయవాలకు రక్తసరఫరా తగ్గుతుంది. మనుషుల్లో తమ వయసు పెరుగుతున్న కొద్దీ వారి గుండె స్పందనలకు అవసరమైన ఎలక్ట్రికల్ సరఫరాల్లో తేడాలు వస్తుండవచ్చు. లేదా కొందరిలో పుట్టుకతోనే గుండెలో బ్లాక్స్ ఉండవచ్చు. గుండెకు అవసరమైన ఎలక్ట్రిసిటీలో తేడాలు రావడం వల్ల వచ్చే సమస్య అన్నది గుండెలో బ్లాక్స్ ఉండటం వల్ల వచ్చే సమస్య కంటే వేరుగా ఉంటుంది.సింకోప్కు కారణాలుగుండె నిర్మాణపరమైనవి : కొన్నిసార్లు గుండెలో నిర్మాణపరంగా ఏవైనా తేడాలు ఉండటం వల్ల మెదడులాంటి కీలక అవయవాలకు తగినంత రక్తాన్ని పంప్ చేయలేకపోవచ్చు. ఉదాహరణకు గుండె కండరాలు బలహీనంగా మారడంవల్లనో, లేదా కార్డియోమయోపతి అన్న కండిషన్లో సింకోప్ రావచ్చు.గుండె కవాటాల్లో మార్పులు : గుండె కవాటాలు రక్తాన్ని నిర్దిష్టంగా ఒకే దిశలో ప్రవహించేలా చూస్తుంటాయి. కొన్నిసార్లు గుండె కవాటాలు సన్నబడవచ్చు. ఇలా జరగడాన్ని ‘స్టెనోసిస్’ అంటారు. కొన్నిసార్లు అవి లీక్ కావచ్చు. ఇలా జరగడాన్ని ‘ఇన్సఫిషియెన్సీ’ లేదా ‘రీ–గర్జిటేషన్’ అంటారు. ఈ కండిషన్స్లో దేనివల్లనైనా సింకోప్ రావచ్చు.మితిమీరిన వ్యాయామం : కొందరు వ్యక్తుల్లో... అంటే మరీ ముఖ్యంగా క్రీడాకారులు / అథ్లెట్లలో గుండె కండరాలు మందం కావడం వల్ల కూడా సింకోప్ రావచ్చు. అతి వ్యాయామంతో గుండెపై విపరీతమైన భారం పడేలా పనిచేయించడం వల్ల ఈ కండిషన్ ఏర్పడే అవకాశముంది.పోష్చురల్ హైపోటెన్షన్ : కొన్ని సందర్భాల్లో పక్క మీద పడుకున్న వ్యక్తి స్థిమితంగా కాకుండా హాడావుడిగా లేదా అకస్మాత్తుగా నిల్చునప్పుడు... అతడి కదలికలకు తగ్గట్లుగా గుండె తన స్పందనలను అంతే వేగంగా పెంచుకోలేదు. దాంతో వేగంగా జరిగే శరీర కదలికకు అనుగుణంగా గుండె స్పందనవేగం పెరగకపోవడంతో... కీలక అవయవాలకు రక్తప్రసరణ తగ్గుతుంది. ఇలా జరగడాన్ని పోష్చురల్ హైపోటెన్షన్’ అంటారు.వేసోవేగల్ సింకోప్ : నరాల పనితీరు వ్యవస్థలో మన సంకల్పం లేకుండా దానంతట అవే జరిగేపోయేవి, మన సంకల్పంతో జరిగేవి అని రెండు రకాలు ఉంటాయి. ఈ రెండిటికీ మధ్య సమన్వయం లేకపోవడం వల్ల కూడా కొన్నిసార్లు ‘సింకోప్’ కండిషన్ వస్తుంది. వేగస్ అనే నరం గుండె వేగాన్ని నెమ్మదించేలా చేస్తుంది. అది ఒక్కోసారి గుండె వేగాన్ని బాగా తగ్గిస్తుంది. ఇలా వేగస్ నరం వల్ల గుండె వేగం మందగిస్తే దాన్ని వేసోవేగల్ సింకోప్ అంటారు.తీవ్రమైన నొప్పి వచ్చినప్పుడు ఒక్కోసారి ఆ విపరీతమైన నొప్పి వేగస్ నరాన్ని ప్రేరేపిస్తుంది. ఒక్కోసారి తీవ్రమైన / విపరీతమైన ఒత్తిడులు (సివియర్ స్ట్రెస్) కూడా వేగస్ నరాన్ని ప్రేరేపిస్తాయి. ఏదైనా దుర్వార్త విన్నప్పుడు కొందరు స్పృహ తప్పడానికి కారణం కూడా ఈ సింకోపే. కొందరు రక్తం చూసినప్పుడు లేదా కత్తులు– కటార్ల వంటి మారణాయుధాలు చూసినప్పుడు కూడా ఇలా స్పృహ తప్పడం దీనివల్లనే.పేగుల కదలికలు తగ్గడం : కొందరిలో జీర్ణక్రియలో జరుగుతుండే పేగుల కదలికలు (బవెల్ మూవ్మెంట్స్), విపరీతంగా తగ్గడం కూడా వేగస్ నరం మీద ఒత్తిడి కలిగింవచ్చు. అప్పుడు కూడా సింకోప్ కండిషన్ వస్తుంది.అకస్మాత్తుగా తల తిప్పడం వల్ల...కొందరు అకస్మాత్తుగా తలతిప్పడం వల్ల వేగస్ సరం మీద ఒత్తిడి పెరుగుతుంది. ఆ వెంటనే అది మళ్లీ సింకోప్ కండిషన్కు దారితీస్తుంది.రక్తహీనత.. అనీమియా అనే రక్తహీనత కండిషన్ కూడా సింకోప్కు కారణం. అనిమియా కండిషన్లో రక్తంలో తగినన్ని ఎర్రరక్తకణాలు లేకపోవడంతో మెదడుకు తగినంత ఆక్సిజన్ అందకపోవడంతో కూడా సింకోప్ రావచ్చు. శరీరంలో నీరు / ద్రవాలు తగ్గడం : ఒక్కోసారి దేహంలో నీరు / ద్రవాలు తగ్గడం (డీ–హైడ్రేషన్) వల్ల కూడా సింకోప్ రావచ్చు. కొందరిలో చాలా ఎక్కువగా వాంతులు కావడం వల్లగానీ లేదా నీళ్ల విరేచనాల (డయేరియా) వల్ల గానీ లేదా విపరీతంగా చెమటలు పట్టడం వల్ల శరీరంలో దేహంలో నీటి / ద్రవాల మోతాదులు తగ్గవచ్చు. డయాబెటిస్ సమస్య ఉన్న కొందరిలో వారు మాటిమాటికీ మూత్రానికి వెళ్లాల్సిరావడం వల్ల కూడా వాళ్ల శరీరం డీ హైడ్రేషన్కు లోనుకావచ్చు. ఈ కండిషన్లు కొందరిలో సింకోప్కు దారితీసేందుకు అవకాశముంది. చికిత్ససింకోప్ అన్న కండిషన్ నిజానికి అంత సీరియస్ కాదు. కానీ ఇలా ఫెయింట్ కావడం తరచూ జరుగుతుంటే మాత్రం సింకోప్ను నిర్లక్ష్యం చేయడమన్నది ఏమాత్రం తగదు. ఏవైనా ఇతరత్రా ఆరోగ్య సమస్యల (అండర్లైయింగ్ కాజెస్) వల్ల ఇలా జరుగుతుందేమో చూసేందుకు అవసరమైన వైద్యపరీక్షలు జరపాలి. ఇందుకోసం తొలుత డాక్టర్ సలహా తీసుకుని, బాధితుడికి చికిత్స అవసరమా కాదా అన్నది నిర్ధారణ చేసుకోవాలి. ఇతరత్రా సమస్యలతో (అండర్లైయింగ్ కాజెస్తో) ఇలా జరుగుతుంటే మాత్రం బాధితుడికి అవసరమైన చికిత్స అందించాలి. సింకోప్ అన్నది ఒకసారి స్వల్పంగా వచ్చి, దాని వల్ల ఎలాంటి గాయాలు జరగకపోతే ప్రైమరీ మెడికల్ కేర్ సెంటర్లో డాక్టర్లు కూడా సాధారణ చికిత్స అందించవచ్చు. అయితే సరిగ్గా నాడిగానీ, శ్వాసగానీ అందని పరిస్థితిని మెడికల్ ఎమర్జెన్సీగా పరిగణించి పరిగణించి వెంటనే పెద్ద హాస్పిటల్స్కు (టెరిషియరీ హెల్త్ కేర్ సెంటర్కు) తరలించాల్సి ఉంటుంది.గుండె స్పందనల లయ (రిథమ్)లో మార్పులు వచ్చిన వారికి, గుండె స్పందనల వేగం తగ్గిన వారిలో కొందరికి పేస్ మేకర్ అమర్చాల్సి రావచ్చు. ఈ పేస్మేకర్ అనేది గుండె స్పందనల వేగం తగ్గడాన్ని... అంటే ‘బ్రాడీకార్డియా’ను ముందుగానే పసిగట్టి... గుండె స్పందనల వేగం తగ్గిపోకుండా చూస్తుంది. ఇలా పేస్ మేకర్ అన్నది తగ్గిపోయే గుండె స్పందనలను మళ్లీ మామూలయ్యేలా (నార్మల్గా స్పందించేలా) చేసేందుకు వాడే ఒక ఉపకరణం. అలాగే టాకీకార్డియా కండిషన్లో ఒక షాక్ ద్వారా గుండె స్పందనలు మళ్లీ నార్మల్ అయ్యేలా చూడటం; అలాగే ఇది గుండెలో పైన, కింద ఉండే గదులు కదలికలు సమన్వయంతో జరిగేలా చూడటం; గుండెలోని ఎడమ, కుడి భాగాలు స్పందనల్లో సమన్వయం ఉండేలా చూడటం వంటి పనులనూ చేస్తుంది.చదవండి: గుండె జబ్బుల రిస్క్ ఎవరికి ఎక్కువ?ఈ పనులన్నింటినీ పేస్ మేకర్ సహాయంతో జరిగేలా చూసే/ చేసే చికిత్సను ‘కార్డియాక్ రీ–సింక్రనైజేషన్ థెరపీ’ (సీఆర్టీ) అని అంటారు. గుండె లయలో వచ్చే మార్పుల వల్ల వచ్చే ప్రమాదాలను నివారించడానికి ఈ చికిత్స చేయాల్సి ఉంటుంది. ఈ పేస్ మేకర్లలో కూడా తాత్కాలికంగా అమర్చేవి, శాశ్వతంగా అమర్చేవి అని రెండు రకాలుగా ఉంటాయి. డాక్టర్ల సలహా మేరకు అవసరమైనవారు (సాధారణంగా ‘బ్రాడీ–కార్డియా’ సమస్య ఉన్నవారు) దీన్ని వాడాల్సి ఉంటుంది. పేస్మేకర్ అమర్చాక పేషెంట్స్ తాము అంతకుమునుపు చేసే రోజువారీ పనులన్నింటినీ నార్మల్గానే చేసుకోవచ్చు.తక్షణం అందించాల్సిన సపర్యలు∙సింకోప్కు గురైన వ్యక్తిని కాస్తంత చల్లగా ఉన్న ప్రదేశంలోకి తీసుకెళ్లి సౌకర్యంగా పడుకోబెట్టాలి. లేదా అతడి తల రెండు మోకాళ్ల మధ్య ఉండేలా చూస్తూ రిలాక్స్డ్గా కూర్చోబెట్టాలి.∙అలా పడుకోబెట్టడం / కూర్చోబెట్టడం జరిగాక... అతడు స్పృహలోకి వచ్చిన కొద్దిసేపటి తర్వాత కాస్తంత ఉప్పు కలిపిన ద్రవాన్నిగానీ లేదా ఓఆర్ఎస్ ద్రావణాన్ని గానీ నెమ్మదిగా తాగించాలి. ఒకవేళ రక్తపోటు పడిపోవడం (హైపోటెన్షన్) వల్ల సింకోప్ ఏర్పడితే... ఇలా చేయడం వల్ల బాధితుడు మామూలుగా మారిపోతాడు.నివారణ : నిజానికి సింకోప్కు దారితీసే అసలు కారణాలను కనుగొంటే అందుకు అవసరమైన తదుపరి చర్యలను తీసుకోవచ్చు. ఉదాహరణకు... వేసోవేగల్ నరం అతి స్పందన వల్ల ఈ సమస్య వస్తుంటే దానికి కారణాలు కనుగొని చికిత్స అందించడం వల్ల ఆ తర్వాత వచ్చే సింకోప్లను నివారించవచ్చు. అకస్మాత్తుగా లేవడం, అకస్మాత్తు కదలికల వల్ల వచ్చే పోష్చురల్ హైపోటెన్షన్ సింకోప్ను అకస్మాత్తు కదలికలు లేకుండా చూసుకోవడం ద్వారా నివారించవచ్చు. ఉదాహరణకు పక్క మీద నుంచి లేచేప్పుడు మెల్లగా లేవడం, వెంటనే నిలబడకుండా కొద్ది సేపు కూర్చోవడం.. ఇలా కదలికలు క్రమంగా ఉండేలా చూసుకోవడంతో ఈ తరహా సింకోప్ రాకుండా చూసుకోవచ్చు. ఇది డీ హైడ్రేషన్ సమస్య వల్ల వస్తే తగినన్ని ద్రవాలు అందేలా చూసుకోవడం వల్ల కూడా సింకోప్ను నివారించవచ్చు.చివరగా...ప్రతినిత్యం తగినన్ని నీళ్లు తాగుతూ, అన్ని రకాల పోషకాలనూ తీసుకుంటూ, మానసిక ఒత్తిడికి దూరంగా ఉన్నవారిలో సింకోప్ సమస్య చాలా అరుదు. అందుకే అందరూ ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరిస్తూ ఉండటం అన్నది కేవలం సింకోప్ నివారణకు మాత్రమే కాకుండా అన్నివిధాలా ఆరోగ్యంగా ఉండటానికీ దోహదపడుతుందని గుర్తుంచుకోవాలి.నిర్వహణ: యాసీన్ -
బేబీ కేర్పై పరిణీతి చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు..! జీవితంలోనే..
బాలీవుడ్ నటుడు పరిణీతి చోప్రా, రాజకీయ నాయకుడు రాఘవ్ చద్దా అక్టోబర్ 19, 2025లో పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కొత్తతల్లి పరిణీతి తన బిడ్డపై కేరింగ్ విషయంలో ఎలా టెన్షన్ పడుతోందో షేర్ చేసుకుంది. అంతేగాదు తన కుమారుడి కోసం ఇంటిని తీర్చిదిద్దిన విధం గురించి కూడా నెటిజన్లతో షేర్ చేసుకుంది. పాతకాలం నాటి వైబ్స్తో మన సంప్రదాయ బేబీ కేరింగ్ విధానం గురించి హైలెట్ చేసింది.ప్రస్తుతం తాను తల్లిగా చాలా బిజీ అని, అతడి సంరక్షణతోనే తలమునకలవుతున్నట్లు పేర్కొంది. ఇది చాలా అలసట, బాధ్యతతో కూడినది, పైగా జీవితంలో అత్యంత సంతోషభరితమైన దశ కూడా అని అభిర్ణించింది. మనిషి ఉపయోగించే కలర్లను బట్టి అతడి మనస్తత్వం ఎలా చెప్పేయొచ్చో..అలాగే ఇక్కడ నటి పరిణీతి తన కొడుకు కోసం రూమ్ అలకరణకు ఏ రంగులకు ప్రాధాన్యత ఇచ్చిందో చూస్తే..ఆమె ఏంటనేది ఇట్టే అర్థమైపోతుంది. తన కొడుకు నీర్ కోసం అన్ని లైట్ కలర్స్, తెలుపు, గోధమ రంగులకే ప్రాధాన్యత ఇచ్చారామె. "బ్రిటిష్-శైలి" ప్యానెలింగ్తో తీర్చిదిద్దారు. తనది, రాఘవా టేస్ట్ దగ్గర దగ్గరగా ఒకటేనని, అందువల్ల అందుకనుగుణంగా ఆ గదిని ఈ విధంగా డిజైన్ చేశానని చెబుతోంది. అక్కడ గోడలన్నీ వింటేజ్ కార్ ఆర్ట్వర్క్తో ఆకర్షించగా, అక్కడ రాఘవ్ తండ్రి గిఫ్ట్గా చెక్క ఫ్లోరింగ్ వింటేజ్ కార్పెట్తో అనుబంధంగా ఉంది. ఇవేగాక క్లాసిక్ రంగుల తెల్లటి తొట్టి, బొమ్లలు, కస్టమ్ మేడ్ లేత గోధమ రంగు వార్డ్రోబ్లు తదితరాలు ఉన్నాయి. నిజానికి ఇది తన రీడిండ్ రూమ్ అని చెప్పుకొచ్చాడు. ఈ గదిలోకి ఎవరు ప్రవేశించిన తమ ఇట్టే తమ సమస్యలన్నింటిని మరిచపోయేలా చేసే..అందమైన ప్రదేశం. ఇంత ప్రశాంతమైన ప్రదేశంగా మార్చినందుకు పరిణీతికి క్రెడిట్ ఇస్తూ..దీన్ని స్వర్గమపు అభయారణ్యంగా పిలిచారు రాఘవ చద్దా. కాగా, పరిణీతి, రాఘవ్లు మే 2023లో ఉదయపూర్లోని ది లీలా ప్యాలెస్లో అట్టహాసంగా పెళ్లిచేసుకున్నారు. వివాహం అయిన రెండేళ్లకు అక్టోబర్ 19, 2025న పండంటి మగబిడ్డ నీర్కు స్వాగతం పలికారు.(చదవండి: మసాలా దోస రుచి చూసిన అమెరికా రాయబారి..!) -
చిత్తూరు జిల్లాలో విపరీతంగా పెరుగుతున్న మానసిక వ్యాధిగ్రస్తుల సంఖ్య
చిత్తూరు నగరానికి చెందిన 53 ఏళ్ల వ్యక్తి ఒకప్పుడు ధనవంతుడు. కార్లల్లో షికారు చేసినవాడు. ఎప్పుడూ అతని చుట్టూ 10 మంది ఉండేవారు. అలా దర్జాగా బతికిన ఆ వ్యక్తి చివరకు అప్పుల పాలయ్యాడు. ఆర్థిక కష్టాలను అధిగమించలేక.. మత్తుకు బానిసయ్యాడు. మానసికంగా కుంగిపోయాడు. కుటుంబసభ్యులు వైద్యం చేయించినా నయం కాకపోవడంతో చివరకు ప్రాణాలు కోల్పోయాడు. చిత్తూరు జిల్లా బంగారుపాళెం మండలానికి చెందిన 30 ఏళ్ల యువకుడు మద్యానికి బానిసయ్యాడు. తాగి తాగి మతిపోగొట్టుకున్నాడు. ప్రవర్తనలో మార్పులు చూసిన కుటుంబసభ్యులు ఆ యువకుడిని చికిత్స కోసం చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తీసుకొచ్చారు. మూడు నెలలుగా చికిత్స తీసుకుంటున్నాడు. క్రమం తప్పకుండా మందులు, మాత్రలు వాడుతున్నారు. ప్రస్తుతం ఆ వ్యక్తి నిలకడగా ఉంటూ సొంత పనులు చేసుకుంటున్నాడని, మళ్లీ మద్యం జోలికెళితే, మానసిక సమస్యలు తప్పవని వైద్యులు చెబుతున్నారు.కాణిపాకం: ఆధునిక సమాజంలో మనిషి జీవితం ఉరుకులు పరుగులతో సాగుతోంది. ఉదయం నిద్రలేస్తే ఇంటి సరుకుల నుంచి ఈఎంఐలు, బ్యాంకు అప్పులు, డ్వాక్రా చీటీలు, వ్యాపారాలు, పిల్లల చదువులతో సతమతమవుతున్నారు. లక్ష్యాన్ని అందుకోవాలనే తపనతో విద్యార్థులు, ఉద్యోగులు, గృహిణులు, వ్యాపారులు ఇలా అందరూ మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. దీనికితోడు మత్తుకు బానిసవుతూ మానసిక రుగ్మతలకు గురవుతున్నారు.చిత్తూరు జిల్లాలో మానసిక వ్యాధిగ్రస్తుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ప్రతి వంద మందిలో 20 నుంచి 25 శాతం మంది మానసిక రుగ్మతల బారిన పడుతున్నట్లు వైద్యనిపుణులు చెబుతున్నారు. యువకుల నుంచి పెద్దల వరకు ఒత్తిళ్లకు గురై మానసిక జబ్బును కొని తెచ్చుకుంటున్నారని గుర్తించారు. మరోవైపు మద్యంతో చిత్తవుతున్నారని వెల్లడిస్తున్నారు. ఇక ఆర్థిక కష్టాలు, ప్రేమ, పెళ్లిలు, ఇతరత్రా సమస్యలతో కూడా మానసికంగా ఇబ్బందిపడుతున్నారు. ఈక్రమంలో చిత్తూరు నగరంలోని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి ప్రతిరోజూ 40 నుంచి 50 ఓపీలు వస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు. ఆర్థిక కష్టాలు చిదిమేస్తున్నాయి ఆర్థిక భారం తట్టుకోలేక అనేక మంది మానసికంగా పూర్తిగా కుంగిపోతున్నారు. వ్యవసాయం నుంచి వ్యాపారం వరకు, ఉద్యోగాల నుంచి పెట్టుబడుల వరకు ఎక్కడ చూసినా అనిశి్చతి. కుటుంబాన్ని పోషించలేని స్థితిలో పడిపోయిన వ్యక్తి మౌనంగా లోలోపలే ఆత్మహత్యే మార్గంగా ఎంచుకుంటున్నారు. ఇక ఉద్యోగాల్లో టార్గెట్లు, ఒత్తిడి, భద్రత లేమి మనుషులను యంత్రాల్లా మార్చేసింది. నిద్రలేని రాత్రులు, ఆందోళనతో గడిచే రోజులుం చివరకు డిప్రెషన్. కానీ మానసిక జబ్బు అన్న మాట బయటకు చెప్పడానికి చాలామంది భయపడుతున్నారు. ఆత్మహత్యలు... చివరి ఫలితం ఈ కారణాల ఫలితం ఒక్కటే ఆత్మహత్యలు. మానసిక జబ్బు చివరకు ప్రాణాంతక నిర్ణయానికి నెడుతోంది. ఇటీవల హైదరాబాద్తోపాటు పలు ప్రాంతాల్లో చోటుచేసుకున్న ఆత్మహత్యలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ఇవి కేవలం సంఖ్యలు కాదు.. చెదిరిపోయిన కుటుంబాల కథలు. తీవ్రమైన ఒత్తిళ్లకు గురయ్యే వారు అనేక రుగ్మతలకు గురవుతున్నారు. నిద్రలేమి సమస్యలు మనిíÙని తీవ్రంగా వేధిస్తున్నాయి. ముఖ్యంగా యువకులు తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నారు. మద్యానికి బానిసవుతున్నారు. సెల్ఫోన్ ప్రభావం కూడా ఎక్కువగా ఉంది . ఆర్థికంగా రాణించకపోవడం వంటి సమస్యలు మానసిక సమస్యలను తీవ్రతరం చేస్తున్నాయి. ఇవి మనిషిని చంపేసేంతగా పనిచేస్తున్నాయి. ఇటీవల కొన్ని ఘటనలను ఆధారంగా తీసుకుని ప్రజలు మేల్కొవాలి. మానసిక సమస్యలుంటే.. వెంటనే డాక్టర్లను కలిసి చికిత్స తీసుకోండి. – దినేష్, మానసిక వైద్య నిపుణులు, -
మనసే.. మరణశాసనం
చిత్తూరు నగరానికి చెందిన 53 ఏళ్ల వ్యక్తి ఒకప్పుడు ధనవంతుడు. కార్లల్లో షికారు చేసినవాడు. ఎప్పుడూ అతని చుట్టూ 10 మంది ఉండేవారు. అలా దర్జాగా బతికిన ఆ వ్యక్తి చివరకు అప్పుల పాలయ్యాడు. ఆర్థిక కష్టాలను అధిగమించలేక.. మత్తుకు బానిసయ్యాడు. మానసికంగా కుంగిపోయాడు. కుటుంబసభ్యులు వైద్యం చేయించినా నయం కాకపోవడంతో చివరకు ప్రాణాలు కోల్పోయాడు.చిత్తూరు జిల్లా బంగారుపాళెం మండలానికి చెందిన 30 ఏళ్ల యువకుడు మద్యానికి బానిసయ్యాడు. తాగి తాగి మతిపోగొట్టుకున్నాడు. ప్రవర్తనలో మార్పులు చూసిన కుటుంబసభ్యులు ఆ యువకుడిని చికిత్స కోసం చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తీసుకొచ్చారు. మూడు నెలలుగా చికిత్స తీసుకుంటున్నాడు. క్రమం తప్పకుండా మందులు, మాత్రలు వాడుతున్నారు. ప్రస్తుతం ఆ వ్యక్తి నిలకడగా ఉంటూ సొంత పనులు చేసుకుంటున్నాడని, మళ్లీ మద్యం జోలికెళితే, మానసిక సమస్యలు తప్పవని వైద్యులు చెబుతున్నారు.కాణిపాకం: ఆధునిక సమాజంలో మనిషి జీవితం ఉరుకులు పరుగులతో సాగుతోంది. ఉదయం నిద్రలేస్తే ఇంటి సరుకుల నుంచి ఈఎంఐలు, బ్యాంకు అప్పులు, డ్వాక్రా చీటీలు, వ్యాపారాలు, పిల్లల చదువులతో సతమతమవుతున్నారు. లక్ష్యాన్ని అందుకోవాలనే తపనతో విద్యార్థులు, ఉద్యోగులు, గృహిణులు, వ్యాపారులు ఇలా అందరూ మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. దీనికితోడు మత్తుకు బానిసవుతూ మానసిక రుగ్మతలకు గురవుతున్నారు. చిత్తూరు జిల్లాలో మానసిక వ్యాధిగ్రస్తుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ప్రతి వంద మందిలో 20 నుంచి 25 శాతం మంది మానసిక రుగ్మతల బారిన పడుతున్నట్లు వైద్యనిపుణులు చెబుతున్నారు. యువకుల నుంచి పెద్దల వరకు ఒత్తిళ్లకు గురై మానసిక జబ్బును కొని తెచ్చుకుంటున్నారని గుర్తించారు. మరోవైపు మద్యంతో చిత్తవుతున్నారని వెల్లడిస్తున్నారు. ఇక ఆర్థిక కష్టాలు, ప్రేమ, పెళ్లిలు, ఇతరత్రా సమస్యలతో కూడా మానసికంగా ఇబ్బందిపడుతున్నారు. ఈక్రమంలో చిత్తూరు నగరంలోని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి ప్రతిరోజూ 40 నుంచి 50 ఓపీలు వస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు. ఆర్థిక కష్టాలు చిదిమేస్తున్నాయి ఆర్థిక భారం తట్టుకోలేక అనేక మంది మానసికంగా పూర్తిగా కుంగిపోతున్నారు. వ్యవసాయం నుంచి వ్యాపారం వరకు, ఉద్యోగాల నుంచి పెట్టుబడుల వరకు ఎక్కడ చూసినా అనిశి్చతి. కుటుంబాన్ని పోషించలేని స్థితిలో పడిపోయిన వ్యక్తి మౌనంగా లోలోపలే ఆత్మహత్యే మార్గంగా ఎంచుకుంటున్నారు. ఇక ఉద్యోగాల్లో టార్గెట్లు, ఒత్తిడి, భద్రత లేమి మనుషులను యంత్రాల్లా మార్చేసింది. నిద్రలేని రాత్రులు, ఆందోళనతో గడిచే రోజులుం చివరకు డిప్రెషన్. కానీ మానసిక జబ్బు అన్న మాట బయటకు చెప్పడానికి చాలామంది భయపడుతున్నారు. ఆత్మహత్యలు... చివరి ఫలితం ఈ కారణాల ఫలితం ఒక్కటే ఆత్మహత్యలు. మానసిక జబ్బు చివరకు ప్రాణాంతక నిర్ణయానికి నెడుతోంది. ఇటీవల హైదరాబాద్తోపాటు పలు ప్రాంతాల్లో చోటుచేసుకున్న ఆత్మహత్యలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ఇవి కేవలం సంఖ్యలు కాదు.. చెదిరిపోయిన కుటుంబాల కథలు.ఒత్తిడికి లోనుకావొద్దు... తీవ్రమైన ఒత్తిళ్లకు గురయ్యే వారు అనేక రుగ్మతలకు గురవుతున్నారు. నిద్రలేమి సమస్యలు మనిíÙని తీవ్రంగా వేధిస్తున్నాయి. ముఖ్యంగా యువకులు తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నారు. మద్యానికి బానిసవుతున్నారు. సెల్ఫోన్ ప్రభావం కూడా ఎక్కువగా ఉంది . ఆర్థికంగా రాణించకపోవడం వంటి సమస్యలు మానసిక సమస్యలను తీవ్రతరం చేస్తున్నాయి. ఇవి మనిషిని చంపేసేంతగా పనిచేస్తున్నాయి. ఇటీవల కొన్ని ఘటనలను ఆధారంగా తీసుకుని ప్రజలు మేల్కొవాలి. మానసిక సమస్యలుంటే.. వెంటనే డాక్టర్లను కలిసి చికిత్స తీసుకోండి. – దినేష్, మానసిక వైద్య నిపుణులు, చిత్తూరుసెల్ఫోన్.. చేతిలో ఉన్న విషంసెల్ఫోన్లతో కాలక్షేపం చేస్తూ మనుషులు తెలియకుండానే మానసిక జబ్బులను కొనితెచ్చుకుంటున్నారు. వాస్తవ జీవితానికి దూరమై, వర్చువల్ ప్రపంచంలో మునిగిపోతూ ఒంటరితనాన్ని పెంచుకుంటున్నారు. సోషల్ మీడియా పోలికలు, అవమానాలు, నెగెటివ్ కంటెంట్ యువత మనస్సును చిదిమేస్తోంది. దీనికితోడు ఒంటరి జీవనం పెరిగిపోవడంతో కొందరు మద్యం, మత్తు పదార్థాలకు బానిసలవుతున్నారు. ఇవి సమస్యలకు పరిష్కారం కాదని తెలిసినా, తాత్కాలిక ఉపశమనానికి అలవాట్లలో చిక్కుకుపోతున్నారు. చివరకు మానసిక, శారీరక, ఆర్థికంగా పూర్తిగా కుమిలిపోతున్నారు. ఇక ఒకప్పుడు కుటుంబాలతో కలిసి మెలిసి జీవించిన సమాజం ఇప్పుడు విడిపోయింది. మాట్లాడే మనుషులు లేరు. వినే చెవులు లేవు. బాధను పంచుకునే వారు లేక అనేక మంది లోలోపలే కుంగిపోతున్నారు. పల్లె, పట్నం తేడా లేకుండా మానసిక రుగ్మతలు వ్యాపిస్తున్నాయి. -
91 ఏళ్ల వయసులో ఇంత ఫిట్గానా..!
ఏడుపదుల వయసుకు చేరుకోగానే ఎంతటి ఫిట్నెస్ కోచ్లు అయినా లేదా క్రమం తప్రకుండా వ్యాయామాలు చేస్తూ ఆరోగ్య స్ప్రుహ ఉన్నా కూడా..యువకుల మాదిరిగా చురుకుగా ఫిట్గా ఉండటం కష్టమే. కానీ ఈ బామ్మ తొమ్మిది పదుల వయసులో యువతే విస్తుపోయాలే యాక్టివ్గా ఉండటమే కాదు..ఫోర్స్తో కూడిన వ్యాయామాలు చేస్తూ భళా అనిపించుకుంటోంది. ఎవరా ఆ సూపర్ బామ్మ అంటే..ఆ బామ్మే ఆస్ట్రేలియాకు చెందిన 91 ఏళ్ల జిల్. ఆమె కఠినమైన క్రమశిక్షణ కలిగిన జీవనశైలికి పేరుగాంచింది. ఆమె రోజుకు సగటున 12 వేల అడుగులు నడుస్తుందట. అంతేగాదు తరుచుగా సిడ్నీ హార్బర్ వంతెన మీదుగా ఒపెరా హౌస్కు వెళ్లే ఐకానిక్ ట్రెక్కు వెళ్తుందట. ఇది నిటారుగా ఉన్న కొండలు, అంతులేని మెట్లకు ప్రసిద్ధి చెందిన మార్గం. అలాగే వారానికి రెండుసార్లు ఈత కొట్టడం, బలాన్ని కాపాడుకునేలా యోగ, పైలేట్స్ వంటి సెషన్లు తప్పనిసరిగా చేస్తానని చెబుతోంది. అలాగే అందరితోనూ సన్నిహితంగా ఉండేలా టచ్లో ఉంటానని, అది శారీరక వ్యాయామం వలే మనసుకోక ఆహ్లాదకరమైన వ్యాయామం అని అంటోంది. అంతేగాదు ఈ జిల్ బామ్మ దీర్ఘాయువు కోసం చురుగ్గా ఉండటమే మంచిదనేది తన అభిప్రాయామని అంటోంది. అందుకు సంబంధించిన వీడియోని ఫిట్నెస్ కోచ్ థెరిసా మోలోనీ షేర్ చేయడంతో నెట్టింట తెగ వైరల్గా మారింది. కాగా, శారీరక వ్యాయామం వలే దీర్ఘాయవు కోసం సామాజిక అనుసంధానం కూడా అంతే ముఖ్యమని చెబుతున్నాయి అధ్యయనాలు. పైగా చురుకైన జీవనశైలి మంచి మానసిక ఆనందాన్ని, శారీరక శ్రమను స్థిరంగా ఉంచుతుందని పలు పరిశోధనల్లో తేలింది కూడా. నిజంగా ఈ బామ్మ సూపరో సూపర్ కదూ..!. View this post on Instagram A post shared by Certified Nutritionist and Fitness Coach (@theresa_moloney) (చదవండి: ఏడేళ్ల చిచ్చర పిడుగు..సముద్రాన్ని ఈదేసింది..!) -
‘డ్రై ఐస్ సిండ్రోమ్’ అంటే..? ఎందువల్ల వస్తుందంటే..
కంటతడిపై ‘కన్నే’యండి!కొందరిలో కళ్లనిండా నీళ్లు ఉండటం... కళ్లు చెమ్మగిల్లినట్టుగా ఉండటం కనిపిస్తుండేదే. ఇందుకు చాలా అంశాలు కారణమవుతాయి. ఇలా కళ్లలో నీరు ఉన్నట్లు కనిపిస్తుండటం, చెమ్మగిల్లుతూ ఉండటానికికారణాలేమిటో తెలుసుకుందాం.కారణాలు...కళ్లలో ఏదైనా ఇన్ఫ్లమేషన్ లేదా ఇన్ఫెక్షన్తో కళ్లుమండుతూ ఉన్నప్పుడు దుమ్ము, ధూళి, పుప్పొడి వంటి అంశాలతో అలర్జీ వల్ల కళ్లకలక (కంజంక్టివైటిస్) వంటి ఇన్ఫెక్షన్లతో కళ్లలో నీళ్లూరేందుకు ఉండే డక్ట్స్ మూసుకుపోవడంతో కన్నీళ్లు బలవంతంగా రావడానికి ప్రయత్నించడం ‘డ్రై ఐస్ సిండ్రోమ్’ ఉన్నవాళ్లలో. ఇక్కడ ఒక సందేహం కలగడం సాధారణం. అంటే డ్రై ఐస్ సిండ్రోమ్లో కళ్లు పొడిబారాలి కదా అనే సందేహం చాలామందిలో ఉంటుంది. కానీ నిజానికి ఈ సిండ్రోమ్లో కళ్లుకు ఇన్ఫ్లమేషన్ వస్తుంది. దీన్నే ‘డ్రై ఐస్ సిండ్రోమ్’ అంటారు. ఈ ఇన్ఫ్లమేషన్ వల్ల కళ్లలో నీరు ఎక్కువగా ఊరుతుంది.నివారణ, చికిత్స...∙చిన్నపిల్లల కళ్లల్లో ఇలా నీరూరుతున్నప్పుడు లేదా కళ్లలోకి దుమ్మువెళ్లినప్పుడు పాతకాలపు పెద్దవాళ్లు ఓ మెత్తటి టవల్ లేదా మెత్తటి గుడ్డను ఉండగా చేసి, దానిపై నోటితో గాలి ఊది దాన్ని కొద్దిగా వెచ్చబడేలా చేసి కంటిపై అద్దడం అన్నది కాస్తంత మధ్యవయస్కులకూ, పెద్దవాళ్లకు తెలిసిందే. అలా కాస్తంత గోరువెచ్చని ఆవిరితో గుడ్డను ఉండగా చేసి కళ్లపై అద్దడం వల్ల మంచి రిలీఫ్ వస్తుంది అలర్జీ వల్ల ఇలా జరిగినప్పుడు డాక్టర్ల సూచన మేరకు యాంటిహిస్టమైన్చుక్కల మందు వాడాలి. అలాగే ఇన్ఫెక్షన్ వల్ల ఇలా జరిగితే డాక్టర్లు యాంటీబయాటిక్ చుక్కల మందును సూచిస్తారు మాటిమాటికీ కళ్లను తాకకుండా ఉండాలి ∙ఇంతకు మించి సమస్య తీవ్రత ఎక్కువగా ఉంటే వెంటనే కళ్ల డాక్టర్ను సంప్రదించాలి.ఉబ్బు కళ్లు...కొందరిలో ఉబ్బుకళ్లు కనిపిస్తుంటాయి. పొద్దున్నే నిద్రలేవగానే కొద్దిసేపటి వరకు ఉబ్బుకళ్లు కనిపించడం మామూలే. కానీ కొందరిలో ఇవి చాలాసేపు అలాగే ఉండి΄ోతాయి. ఈ సమస్యను ఇంగ్లిష్లో ‘పఫ్ఫీ ఐస్’ అంటుంటారు. సాధారణంగా చాలామందిలో ఇది తాత్కాలిక సమస్యే. కళ్లు బాగా అలసి΄ోవడం (ఫెటీగ్) వల్ల కూడా ఇలా జరగవచ్చు.కారణాలు...∙రాత్రి ఎక్కువసేపు నిద్ర΄ోకుండా ఉండటం లేదా నిద్రలేమి కారణంగా ∙క్రితం రాత్రి ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం కొందరిలో ఉప్పుకారాలు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకున్న తర్వాత ∙ఇక చాలామందిలో ఇలా కళ్లు ఉబ్బినట్టుగా ఉండటం లేదా కళ్ల కింద చర్మం జారినట్టుగా ఉండటమన్నది వయసు పెరుగుతుండటం (ఏజింగ్) వల్ల జరగవచ్చు ∙మూత్రపిండాల వ్యాధి ఉన్నవారిలోనూ, రక్తంలో ్ర΄ోటీన్ తక్కువగా ఉండటం వల్ల, అలాగే రక్తహీనత (అనిమియా) సమస్య తీవ్రంగా ఉన్నవాళ్లలోనూ ఇలా ఉబ్బుకళ్లు కనిపిస్తాయి.నివారణ / చికిత్స...మెత్తటి టవల్ లేదా మెత్తటి గుడ్డను చల్లటి నీటిలో ముంచి కళ్లపై అద్దడం (కోల్డ్ కంప్రెస్)ఆహారంలో ఉప్పుకారాల మోతాదును తగ్గించడం కంటినిండా గాఢంగా నిద్ర΄ోవడం.డాక్టర్ రవికుమార్ రెడ్డి సీనియర్ కంటి వైద్య నిపుణులు ఈ సూచనలు పాటించండికళ్ల జాగ్రత్తల్లో 20 – 20 – 20 అనేది ఓ మంచి సూచన. అంటే... ప్రతి 20 నిమిషాలకోసారి మనం దృష్టిని కేంద్రీకరించి ఉన్న అంశంపైనుంచి (కంప్యూటర్ / ఫోన్) దృష్టి మరల్చి 20 ఫీట్ల దూరంలో ఉన్న మరో వస్తువును 20 సెకన్ల పాటు చూస్తుండటం. ఏకాగ్రతతో ఏదైనా పనిచేస్తున్నా లేదా వృత్తిరీత్యా కంప్యూటర్ స్క్రీన్ గానీ, టీవీ స్క్రీన్నుగానీ తదేకంగా చూస్తున్నప్పుడు ఇలా చేయడం మంచిది. టీవీ, కంప్యూటర్ లేదా మొబైల్ ఇలా ఏదైనప్పటికీ ఆ స్క్రీన్ టైమ్ను గణనీయంగా తగ్గించడం ∙తరచూ కన్రెప్పలను కదిలిస్తూ / మూస్తూ ఉండాలి. (అంటే బ్లింకింగ్ చేస్తూ ఉండాలి). ఫలితంగా కన్నీరు కంటిపైన సమంగా అలముకుని కంటిని పొడిబారకుండా కాపాడుతుంది ఇంట్లో లేదా ఆఫీసులో ఏసీ చాలాసేపు నడుస్తుంటే అక్కడి వాతావరణంలోని గాలిలో తేమ శాతం తగ్గుతుంది. ఇలా చాలాసేపు ఏసీలో ఉన్నవారు కాసేపు మామూలు వాతావరణంలోనూ కిసేపు గడపాలి కళ్లజోడు తాలూకు గ్లాసెస్ లేదా కాంటాక్ట్ లెన్సులను తరచూ పరీక్షించుకుంటూ ఉండాలి. పవర్ మారిందని తెలుసుకోగానే తగిన పవర్ ఉన్న అద్దాలను మార్చుకోవాలి. ఈ కొద్ది΄ాటి జాగ్రత్తల తర్వాత కూడా కంటికి సంబంధించిన అసౌకర్యం తగ్గక΄ోతే వెంటనే కంటి డాక్టర్ను తప్పక సంప్రదించాలి. నిర్వహణ యాసీన్ (చదవండి: 14 కిలోల బరువు తగ్గిన డాక్టర్..! ఓపిక, స్థిరత్వంతోనే సాధ్యం..) -
14 కిలోల బరువు తగ్గిన డాక్టర్..! ఓపిక, స్థిరత్వంతోనే సాధ్యం..
వెయిట్లాస్ జర్నీలో అనేది శారీరక, భావోద్వేగ ఇబ్బందులతో ముడిపడి ఉన్న అంశం అని అంటోంది ఓ డాక్టర్. తాను ప్రెగ్నెన్సీ అనతరం ఎంతలా బరువు పెరిగిందో సవివరంగా తెలిపింది. ఆ తర్వాత బరువు తగ్గే క్రమంలో ఎంతలా శారీరకంగా, మానసికంగా సమస్యలు ఎదుర్కుందో తెలిపింది. ఆఖరికి వెయిట్లాస్ మందులు సైతం పెద్దగా ఫలితం ఇవ్వకపోగా..చివరికి దుష్ప్రభావాల బారినపడి ఎంతలా ఇబ్బందిపడిందో పేర్కొంది. అయితే బరువు తగ్గాలంటే అచంచలమైన ఓపిక, స్థిరత్వం అత్యంత ముఖ్యమని అంటున్నారామె. అలా అన్ని అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటూ..ఒకటిన్న ఏడాదిలోపు చాలా బరువు తగ్గగలిగానని అంటోంది. ఎవరా డాక్టర్..? ఆమె వెయిట్లాస్ జర్నీ ఎలా సాగిందంటే..చెన్నైకి చెందిన వైద్యురాలు ప్రీతి మృణాళిని తన వెయిట్లాస్ జర్నీ గురించి ఇన్స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసుకున్నారు. అత్యంత నైపుణ్యం కలిగిన లాపరోస్కోపిక్ బారియాట్రిక్ సర్జన్ డాక్టర్ ప్రీతి మృణాళినికి వైద్యురాలిగా 12 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఆమె ప్రసవం తర్వాత తన బాడీ ఎలా మారిపోయిందో వివరించారు. 2021లో గర్భందాల్చినప్పుడు తన బరువు 78 కిలోలని పేర్కొంది. అయితే 2022లో ప్రసవం అనంతరం 79 కిలోలకు చేరుకున్నట్లు వెల్లడించారు. అందులోనూ సీ సెక్షన్ కారణంగా ఒక నెలపాటు రెస్ట్ తీసుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత బిడ్డకు ఫీడింగ్ ఇవ్వడంతో విపరీతమైన ఆకలి విపరీతంగే వేసేదని, దాంతో 92 కిలోలు దాక పెరిగిపోయానని చెప్పుకొచ్చింది. ఆ తర్వాత ప్రతి ఉయం మేల్కొని వ్యాయామాలు చేస్తూ ఉండేదాన్ని..అయితే బరువులో మార్పు లేకపోగా..మరింత అధికమైంది. ఈ అధిక బరువు తన రూపంతోపాటు ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసిందని అంటోంది. అప్పుడే జీఎల్పీ 1 అనే బరువు తగ్గించే మందులను వాడినట్లు తెలిపారు. దాంతో మార్పు కనబడటం మొదలైది కానీ ఒక కిలోనే తగ్గానని అన్నారు. అయితే ఈ డ్రగ్ కారణంగా జుట్టు రాలిపోవడం, నోరు పొడిబారడం, వ్యాయమం సమయలో కండరాల అలసట తదితర సమస్యలను ఎదుర్కొన్నట్లు తెలిపారు. అయితే చాలా ఓపికతో తన జీవనశైలిని మార్చుకుని..బరువు తగ్గడంపై ఫోకస్ పెట్టి సుమారు 14 కిలోలు తగ్గినట్టు తెలిపారు. సమారు ఏడాదిన్నరకి మంచి ఫలితాన్ని అందుకోగలిగానని అన్నారు. డాక్టర్ మృణాలిని చెబుతోంది ఒకటే..బరువు తగ్గడంలో కావాల్సింది, ఓపిక, భావోద్వేగాన్ని నియంత్రించేలా స్థిరతత్వం అత్యంత ప్రధానమని అంటోంది. కాగా డబ్ల్యూహెచ్ఓ ప్రకారం..జీఎల్పీ 1 మందులు రక్తంలో చక్కెరను నియంత్రించడానికి, కడుపు నిండిపోయిన అనుభూతిని, జీర్ణక్రియను నెమ్మదింపచేసేలా సహజ హర్మోన్లా అనుకరించే మందు. కానీ ఈ మందులు వైద్యుల పర్యవేక్షణలో సలహాలు సూచనలతో వాడాల్సి ఉందనేది గ్రహించాలి. View this post on Instagram A post shared by Dr.Preethi Mrinalini | Laparoscopic & Bariatric Surgeon (@dr.preethimrinalini)గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం.(చదవండి: వెయిట్లాస్ మందులతో స్లిమ్గా ఐశ్వర్య మోహన్ రాజ్..! నిపుణులు ఏమంటున్నారంటే..) -
మీరు అలసిపోయారా? విసిగిపోయారా?
"ఉదయం నిద్ర లేవగానే ఒళ్లంతా భారంగా ఉంటుంది.. ఆఫీసుకి వెళ్లాలనే ఉత్సాహం అస్సలు ఉండదు.. చేసే పని మీద ఏకాగ్రత కుదరదు.." ఈ లక్షణాలు మీకు కనిపిస్తున్నాయా? అయితే మీరు కేవలం 'అలసిపోలేదు', మీరు 'బర్న్ అవుట్' (Burnout) కి గురవుతున్నారు. సాధారణ అలసట ఒక రాత్రి నిద్రతో పోతుంది, కానీ బర్న్ అవుట్ అనేది నిద్రపోయినా తగ్గని ఒక దీర్ఘకాలిక మానసిక నిస్సత్తువ.బర్న్ అవుట్ అంటే ఏమిటి?యంత్రం అతిగా వాడితే ఎలా వేడెక్కి ఆగిపోతుందో, మనిషి కూడా తన శక్తికి మించిన మానసిక ఒత్తిడిని నిరంతరం భరిస్తే 'బర్న్ అవుట్' అవుతాడు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) దీన్ని ఒక 'వృత్తిపరమైన రుగ్మత'గా గుర్తించింది. ఇది పని పట్ల విరక్తిని, అపనమ్మకాన్ని కలిగిస్తుంది.4 ముఖ్య సంకేతాలు...1. Emotional Exhaustion ( నిరంతర అలసట): రాత్రి 8 గంటలు పడుకున్నా, ఉదయం లేవగానే ఇంకా నిద్ర చాలలేదన్నట్టు, శక్తి లేనట్టు అనిపించడం. ఇది శారీరక అలసట కాదు, మానసిక శ్రమ వల్ల కలిగే నీరసం.2. Cynicism (నిరాశావాదం): ఒకప్పుడు ఇష్టంగా చేసిన పని ఇప్పుడు భారంగా అనిపించడం. సహోద్యోగుల మీద, క్లయింట్స్ మీద కారణం లేకుండా కోపం రావడం. "నేను ఇది ఎందుకు చేస్తున్నాను? దీనివల్ల ఉపయోగం ఏంటి?" అనే నైరాశ్యం.3. Reduced Productivity (తగ్గిన పనితీరు): ఎంత ప్రయత్నించినా పాత వేగంతో పని చేయలేకపోవడం. చిన్న చిన్న నిర్ణయాలు తీసుకోవడానికి కూడా గంటల తరబడి సమయం పట్టడం.4. శారీరక సమస్యలు: కారణం లేని తలనొప్పి, కడుపులో అసౌకర్యం, తరచూ అనారోగ్యానికి గురవ్వడం. మనసు పడే ఒత్తిడిని శరీరం ఇలా బయటపెడుతుంది.నా వద్దకు వచ్చిన ఒక సీనియర్ బ్యాంక్ మేనేజర్ రాధ (పేరు మార్చాను) కథ ఇక్కడ చెప్పుకోవాలి. ఆమె 15 ఏళ్లుగా అద్భుతంగా పని చేస్తోంది. కానీ గత కొన్ని నెలలుగా ఆమె ఆఫీసులో అందరితో గొడవ పడుతోంది. "నాకు ఈ జాబ్ వద్దు, నేను రాజీనామా చేస్తాను" అని ఏడుస్తూ చెప్పింది. వాస్తవానికి ఆమెకు పని చేతకాక కాదు, గత మూడేళ్లుగా సెలవు తీసుకోకుండా పని చేయడం వల్ల ఆమె మెదడు 'బర్న్ అవుట్' స్టేజ్ కి చేరుకుంది. ఆమెకు కావాల్సింది రాజీనామా కాదు, ఒక సుదీర్ఘమైన 'మెంటల్ బ్రేక్'.బయటపడటం ఇలా...* మీ శక్తికి మించిన బాధ్యతలను స్వీకరించడం ఆపండి. ప్రయారిటీలను సెట్ చేసుకోండి. 'నో' చెప్పడం నేర్చుకోండి.* ఆఫీస్ సమయం తర్వాత ల్యాప్టాప్, ఆఫీస్ వాట్సాప్ గ్రూపులకు దూరంగా ఉండండి. డిజిటల్ కనెక్షన్ కట్ చేయండి. మీ మెదడుకు 'ఆఫ్ టైమ్' ఇవ్వండి. * మీకు ఇష్టమైన పని (సంగీతం, పెయింటింగ్, లేదా నడక) కోసం రోజుకు కనీసం 30 నిమిషాలు కేటాయించండి. హాబీలను పునరుద్ధరించండి. ఇది మీ మెదడుకు రీఛార్జ్ లా పనిచేస్తుంది.* విశ్రాంతిని ప్లాన్ చేయండి. సెలవు తీసుకోవడం అంటే సోమరితనం కాదు. అది మీ పనితీరును మెరుగుపరుచుకోవడానికి తీసుకునే ఒక ఇన్వెస్ట్మెంట్.ఈ వారం మీ కోసం పరీక్ష...* మీకు ఇష్టమైన పనులు చేయడానికి కూడా ఇప్పుడు ఉత్సాహం ఉండటం లేదా?* ఆఫీసులో చిన్న పొరపాటు జరిగినా అతిగా స్పందిస్తున్నారా (Overreacting)?* ఒంటరిగా ఉండాలని, ఎవరితోనూ మాట్లాడకూడదని అనిపిస్తోందా?పై మూడింటికి 'అవును' అని సమాధానం వస్తే, మీరు బర్న్ అవుట్ వైపు వెళ్తున్నారని అర్థం చేసుకోండి.గుర్తుంచుకోండి.. కాలిపోయిన కొవ్వొత్తి వెలుగునివ్వలేదు. మీరు ఇతరులకు, మీ కంపెనీకి ఉపయోగపడాలి అంటే ముందు మీరు ఆరోగ్యంగా ఉండాలి. మీలోని ఉత్సాహం ఆవిరి కాకముందే మేల్కొనండి. బర్న్ అవుట్ లేదా కెరీర్ ఒత్తిడి నుండి బయటపడటానికి కౌన్సెలింగ్ లేదా కోచింగ్ తీసుకోండి.- సైకాలజిస్ట్ విశేష్ కెరీర్ & మైండ్సెట్ కోచ్8019 000066www.psyvisesh.com -
శతాయుష్షు బామ్మ.. ఇప్పటికీ ఆమె అమ్మ
నెల్లూరు జిల్లా: నాలుగడుగులు నడిస్తే ఆయాస పడే ఇప్పటి తరానికి ఆ బామ్మ మాటలు బంగారు బాటలు. కష్టపడి పనిచేస్తే ఎలాంటి జబ్బులు రావనేందుకు ఆమె జీవనశైలి పెద్దబాల శిక్ష. వందేళ్ల వయసు పైబడినా తన పని తానే చేసుకుంటూ ఇంట్లో వారికి సైతం సాయంగా ఉంది. టీవీలు, స్మార్ట్ ఫోన్ల మాయలో పడి పిల్లలకు కూడా వ్యాధులతోపాటు ఊబకాయం వస్తుంటే వారి పెద్దలు ఆందోళన పడుతున్నారు. 103 సంవత్సరాల వయస్సులో బామ్మ ఇప్పటికీ వంట చేస్తుంది. ఇంట్లో గేదెలకు గడ్డి తెచ్చి మేతగా వేస్తుంది.వంట చేస్తూ..పొదలకూరు మండలం, మొగళ్లూరు గ్రామానికి చెందిన అచ్చాల పెంచలమ్మ శతాధిక వృద్ధురాలు. గ్రామంలో ఆమెకంటే పెద్దవారు ఎవరూ జీవించి లేరు. నాలుగు తరాలకు ప్రతినిధిగా కుటుంబాన్ని నెట్టుకొచ్చిన పెంచలమ్మకు నలుగురు సంతానం. ఇద్దరు మగపిల్లలు, ఇద్దరు ఆడపిల్లలున్నారు. ఇప్పటికీ బామ్మ హుషారుగా ఉంది. ఆమెకు ఎలాంటి జబ్బులు లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. రాత్రివేళ అప్పుడప్పుడు కాళ్లునొప్పులు వస్తుంటాయని చెబుతోంది. వినికిడి, కంటిచూపు ఈ వయస్సులో కూడా పెంచలమ్మకు బాగున్నాయి. కట్టెల పొయ్యి వద్ద ఆమె ఇంట్లో అందరికీ వంట చేస్తుంది.మంచి ఆహారపు అలవాట్లుపెంచలమ్మ కాయ కష్టం చేసేవారు. మంచి ఆహారపు అలవాట్లు కలిగి ఉండటమే కాక జొన్న, రాగి సంగటి తినేవారు. అందువల్లే ఇప్పటికీ ఆమె ఎంత సమయమైనా కూర్చొని లేవగలుగుతున్నారు. వయోభారంతో కొంత ఆలసటగా కనిపించినా పనులు చేస్తూనే ఉంటారు. కుమారుడు మస్తాన్రెడ్డి, కోడలు సంపూర్ణమ్మ వ్యవసాయ పనులపై తోటకు వెళ్తే పెంచలమ్మ వంటి చేసి పెడుతుంది. వందేళ్లు పైబడినా బంధువులు, స్నేహితుల పేర్లు వెంటనే తడుముకోకుండా చెబుతుంది. షుగర్, బీపీ వ్యాధులు ఆమె దరిచేరలేదు. ఎలాంటి మందులు కూడా వాడటం లేదని పెంచలమ్మ చెప్పారు. ఇప్పటి తిండిలో శక్తి లేదని, తాను వయస్సులో ఉన్నప్పుడు కల్తీ లేని ఆహారం తినడం వల్లే ఇంతకాలం జీవించి ఉన్నానంటారు పెంచలమ్మ. కల్మషం లేని లేని జీవితం, కల్తీ లేని ఆహారం తింటే ఎవరైనా తనలా జీవించేందుకు అవకాశం ఉంటుందని బామ్మ వెల్లడిస్తున్నారు. -
గోధుమ/జొన్న/రాగులతో రోటీలు,దోసెలు.. లాభాలేమిటి? ఏ సీజన్లో ఏవి తినాలి?
పుల్కా కావచ్చు, చపాతీ కావచ్చు...ప్రస్తుతం ప్రతి రోజూ రోటీలను తినడం చాలా మంది ఆరోగ్యార్ధులకు అలవాటుగా మారింది. నిజానికి సంప్రదాయంగా వస్తున్న ఆహారపు అలవాట్ల స్థానంలో రోటీలు ఆరోగ్యకర ప్రత్యామ్నాయంగా స్థిరపడుతున్న పరిస్థితుల్లో గోధుమలతో పాటు మరికొన్ని కూడా రోటీలు, దోసెల తయారీలో వినియోగిస్తున్నారు. అలాంటి వాటిలో రాగులు, జొన్నలు, సజ్జలు వంటి తృణ ధాన్యాలను కూడా చేరుస్తున్నారు. సహజ ఆహారాన్ని ప్రోత్సహించే వైద్యులు కల్పిస్తున్న అవగాహన కూడా వీటి వినియోగాన్ని పెంచుతోంది.అయితే ఇప్పుడున్న అవగాహన ప్రకారం.. ఇవి కేవలం కేలరీలు లేదా ఫైబర్ గురించి మాత్రమే అనుకోకూడదు. నిజానికి శతాబ్దాల క్రితమే ఇవి మనకు ఆహారంలో భాగంగా ఉన్నాయి. ప్రపంచ వాణిజ్యానికి ముందు, వాతావరణానికి తగ్గట్టుగాస్థానికంగా భూమి ఏమి అందించింది? అనేదానిపైనా, శరీరానికి ఏమి అవసరమో దానిపైనా మాత్రమే ఆహారపు అలవాట్లు ఆధారపడి ఉండేవి. ఆ తర్వాత తర్వాత వాతావరణ మార్పులతో సంబంధం లేకుండా ఏడాది పొడవునా ఆహారం అందుబాటులోకి రావడంతో... కాలానుగుణంగా తినడం అనే అలవాటు తగ్గిపోయింది.మరోవైపు గోధుమలు చిరుధాన్యాలు (బజ్రా, రాగి, జొన్న, మక్కీ) వంటి తృణ ధాన్యాలు పోషకాలతో నిండి ఉంటాయి పరిశోధనల ప్రకారం ఈ ధాన్యాలు ఫైబర్, విటమిన్లు తదితర ఆరోగ్యకరమైన సమ్మేళనాలను అందిస్తాయి, ఇవి మధుమేహం, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. అయితే వీటిని వినియోగించడంలో సీజన్లను దృష్టిలో పెట్టుకుంటేనే సంపూర్ణ ప్రయోజనాలు సిద్ధిస్తాయని సంప్రదాయ ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. కాలానుగుణ మార్పులకు అనుగుణంగా ఈ ధాన్యాలను తీసుకుంటనే శరీరానికి మేలు చేస్తాయని అంటున్నారు.మన శరీరాలు వేడి సీజన్లో లేదా చలి కాలంలో ఆహారాన్ని వేర్వేరుగా జీర్ణం చేసుకుంటాయని ఆయుర్వేదం సహా సంప్రదాయ వైవ్య విధానాలు చెబుతున్నాయి. వేసవిలో వేగంగా, శీతాకాలంలో నెమ్మదిగా...ఇలా జీర్ణక్రియ మార్పు చేర్పులతో శరీరం ఎలా స్పందిస్తుందో గమనించడం ద్వారా, వాతావరణానికి సరిపోయే ధాన్యాలను మనం ఎంచుకోవచ్చు.గోధుమలు...మనం నిత్యం ఇష్టపడేవి గోధుమలతో చేసిన ఆహారం. ఇది వెచ్చదనం జీర్ణ ప్రక్రియలను సమతుల్యం చేస్తుంది. వసంతకాలంలో లేదా శీతాకాలం ప్రారంభంలో జీర్ణక్రియ నెమ్మదించినప్పుడు, గోధుమ రోటిలు కడుపుపై భారం పడకుండా శక్తిని, ఫైబర్, బి–విటమిన్లు సంక్లిష్ట కార్బోహైడ్రేట్లను అందిస్తాయి, బరువు పెంచకుండా రోజువారీ కార్యకలాపాలను కొనసాగించేలా చేస్తాయి.సజ్జలు...సజ్జలు ఆరోగ్యకరమైన ధాన్యరకమే కానీ దీనిది వేడెక్కించే స్వభావం దీని అధిక పోషక సాంద్రత, ఇనుము, మెగ్నీషియం, ప్రోటీన్ ఫైబర్ జీర్ణక్రియను ప్రభావితం చేస్తుంది. వెచ్చదనం శక్తిని అందిస్తాయి కాబట్టి చల్లని వాతావరణంలోనే వీటిని వినియోగిస్తారు.రాగులుప్రస్తుతం ఇడ్లీల నుంచి రోటీలు, దోసెల దాకా చేసేందుకు వాడే రాగులు (ఫింగర్ మిల్లెట్) కాల్షియం సూక్ష్మపోషకాలతో సమృద్ధికర ఆహారం. వేడి సీజన్లో ఉదరంలో తేలికగా ఉంటుంది. ఇది శరీరాన్ని చల్లబరుస్తుంది వేసవి సీజన్లలో జీర్ణ మందగమనాన్ని నివారిస్తుంది. అనేక దక్షిణ భారత ప్రాంతాలు రాగులను వేసవిలో ప్రధాన ఆహారంగా చేయడానికి కారణం దాని చల్లబరిచే గుణమే.జొన్నలు..మక్కీ లేదా మొక్కజోన్న, జొన్న (జోవర్) రోటీలు తక్కువ గ్లైసెమిక్ ప్రభావాలు చూపిస్తూ బలమైన ఫైబర్ లను కలిగి ఉంటాయి. అవి బలమైన జీర్ణక్రియ, అధిక శ్రమ కలిగిన జీవనశైలులకు సరిపోతాయి, కానీ వాటిని కొవ్వులు లేదా కూరగాయలతో జాగ్రత్తగా జతచేయడం అవసరం. వేసవిలో చల్లదనాన్ని అందించే జొన్నలు.. శీతాకాలంలో కూడా ఉపయుక్తమైనవే.సంవత్సరమంతా ఒకే ధాన్యాన్ని తినడానికి బదులుగా, రుతువులకు అనుగుణంగా ధాన్యాలను ఆరగించడం శరీరానికి మంచిదని సంప్రదాయ వైద్య విజ్ఞానం స్పష్టం చేస్తోంది. -
వెయిట్లాస్ మందులతో స్లిమ్గా ఐశ్వర్య మోహన్ రాజ్..! నిపుణులు ఏమంటున్నారంటే..
కంటెంట్ క్రియేటర్, కమెడియన్, బాలీవుడ్ నటి ఐశ్వర్య మోహన్ రాజ్ స్లిమ్గా మారిన సంగతి తెలిసిందే. అంతేగాదు తన వెయిట్లాస్ సీక్రెట్ని కూడా చాలా నిజాయితీగా బయటపెట్టారామె. తాను వెయిట్లాస్ డ్రగ్ మౌంజారోని వాడనని దానివల్ల 22 కిలోలు వరకు బరువు తగ్గానని నర్మగర్భంగా చెప్పారామె. అయితే అలా చెప్పినందుకు పలువురు విమర్శించారు కూడా. కానీ బాలీవుడ్ నటి సోహ అలీఖాన్ వంటి పలువురు ప్రముఖులు ఆమె నిజాయితీని ప్రశంసించారు. మరి ఇంతకీ ఇలాంటి బరువు తగ్గించే మందులు ఆరోగ్యానికి సురక్షితమేనా..? దీనిపై వైద్యులు ఏమంటున్నారంటే..అయితే కమెడియన్ ఐశ్వర్య మోహన్ రాజ్ బరువు తగ్గేందుకు మౌంజారోలాంటివి హెల్ప్ అవుతాయి గానీ వైద్యుల పర్యవేక్షణ అవసరమని తెలిపినప్పటికీ..చాలామంది ఆమెను ట్రోల్ చేస్తూనే ఉన్నారు. అలాంటి మందులు ఆరోగ్యంపై దుష్ప్రభావాలు చూపిస్తాయనేది వారందరి వాదన. ఈ నేపథ్యంలో సోహా అలీ ఖాన్ తన తాజా పాడ్కాస్ట్లో ఎండోక్రినాలజీ అండ్ డయాబెటాలజీ గ్రూప్ చైర్మన్ డాక్టర్ అంబ్రిష్ మిథల్, క్లినికల్ న్యూట్రిషనిస్ట్ డాక్టర్ జూహి అగర్వాల్తో చర్చించి మరి ఎలాంటి వాళ్లు బరువు తగ్గించే మందులు తీసుకోవచ్చు?ఎవరికి మంచిది కాదు తదితరాలను అడిగి అందరి అనుమానాలను పటాపంచలు చేశారామె. వాళ్లంతా ఏచెబుతున్నారంటే..ఒక వ్యక్తికి ఫ్యాటీ లివర్, డయాబెటిస్ లేదా ప్రీ-డయాబెటిక్ , ఊబకాయం వంటి ఆరోగ్య సమస్యలు ఉంటే వైద్యులు బరువు తగ్గించే మందులను సిఫారసు చేస్తారని చెప్పారు. వాటి సాయంతో బరువు తగ్గితే సదరు రోగి పరిస్థితి మెరుగుపడుతుంది..తదనుగుణంగా అప్పటి నుంచి జీవనశైలిలో మార్పులు తీసుకుంటూ తగిన జాగ్రత్తలు తీసుకుంటే చాలని చెప్పారు. View this post on Instagram A post shared by Soha (@sakpataudi) బాడీమాస్ ఇండెక్స్(బీఎంఐ) 27 లేదా 30 ఉంటే వాళ్లు వైద్యుల సూచన మేరకు నిరభ్యంతరంగా ఈ బరువు తగ్గించే మందులు వాడొచ్చని అన్నారు. ఇంతకుమునుపు వెయిట్లాస్ డ్రగ్స్ అత్యంత ఖరీదుగా ఉండేవి. ఇప్పుడు నెలకు తక్కువ మోతాదు అయితే రూ. 12000లని, అదే ఎక్కువ మోతాదు అయితే నెలకు రూ. 22,000 దాక ఖర్చు అవుతుందని వెల్లడించారు. ఎవరికి మంచిది కాదంటే..థైరాయిడ్ కేన్సర్ చరితర ఉన్న వ్యక్తులుప్యాంక్రియాటైటిస్ చరిత్రజీర్ణశయాంతర సమస్యలుమధుమేహం కారణంగా కంటివ్యాధితో బాధపడుతున్న వ్యక్తులు తదితరులకు ఈ మందులు సరిపడవని చెప్పారు. ఏమందులైనా..నిపుణలు పర్యవేక్షణలో సలహాలు సూచనలతో ఉపయోగిస్తే ఎలాంటి సమస్య ఉండదని అన్నారు. ప్రస్తుతం కాలంలో అధిక బరువు సమస్యతోనే అనారోగ్యం బారిన పడుతున్న వారెందరికో ఈ మందులు వరంగా మారాయని అంటున్నారు వైద్యనిపుణులు.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: నటి ఆలియా భట్ చెప్పే జీవిత పాఠాలు..!) -
ఆరోగ్యాన్నలా.. డీప్ ఫ్రై చేయొద్దు!
ఆహార పదార్థాలకు నూనె లేదా కొవ్వు తోడైతే రుచి ఇనుమడిస్తుంది. అయితే, ఈ వంట ప్రక్రియలో, ముఖ్యంగా అధిక ఉష్ణోగ్రతలో వేపుడు చేసినప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది. వేపుళ్లు, పిండి వంటలు, గారెలు, పూరీలు, బజ్జీలు, పునుగులు, అప్పడాలు, వడియాలు.. మనం ఇష్టంగా తినే ఇటువంటివి వండేటప్పుడు జాగ్రత్త తీసుకోకపోతే ఆ ఆహారమే విషతుల్యంగా మారి అనారోగ్యానికి దారితీస్తుంది. దీర్ఘకాలంలో ప్రాణాంతక జబ్బులకూ కారణం కావొచ్చు. వేపుళ్లకు లేదా డీప్ ఫ్రైలకు నూనెలు, కొవ్వు పదార్థాలను ఉపయోగించేటప్పుడు అప్రమత్తత అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. వేపుళ్లకు ఏయే నూనెలు విడిగా వాడొచ్చు? ఏయే నూనెలను కలిపి వాడొచ్చు? అనే విషయాలూ ముఖ్యమే.. అవేమిటో చూద్దాం.. గుండె జబ్బులు, కేన్సర్ ముప్పు?నూనెలు, కొవ్వుల్లో పాలీఅన్శాచురేటెడ్ కొవ్వు ఆమ్లాలు (పీయూఎఫ్ఏ– ‘పూఫా’లు) ఉంటాయి. ఒకసారి వేపుడుకు వాడితే ప్రమాదం లేదు. ఒక్కసారి వేపుడు లేదా డీప్ ఫ్రై చేయడానికి వాడిన నూనెను మళ్లీ వేపుళ్ల కోసం వాడితే అవి హానికరంగా మారిపోతాయని నిపుణులు చెబుతున్నారు. నూనెలు, కొవ్వుల్లోని ‘పూఫా’లు వేపుడు కోసం రెండు అంతకన్నా ఎక్కువసార్లు అధికంగా వేడి చేసినప్పుడు ఆక్సీకరణం చెందుతాయి. ఆక్సీకరణం చెందిన పూఫాలతో కూడిన ఆహారం తీసుకున్న వారు గుండె సంబంధ వ్యాధులు, కేన్సర్ బారిన పడే ప్రమాదం పెరుగుతుందని హైదరాబాద్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ) సెంటర్ ఫర్ లిపిడ్ రీసెర్చ్ మాజీ చీఫ్ సైంటిస్ట్ అండ్ హెడ్ డాక్టర్ ఆర్బీఎన్ ప్రసాద్ ‘సాక్షి’తో చెప్పారు.వేపుళ్లకు ఏయే నూనెలు మేలు?కరకరలాడే వంటకాల తయారీ కోసం వంట నూనెలను ఎక్కువ మంటపై పొగలు కక్కేలా వేడి చేయాల్సి ఉంటుంది. స్మోక్ పాయింట్ను మాత్రమే చూడకుండా రసాయన స్థిరత్వాన్ని బట్టి వేపుళ్లకు నూనెను ఎంచుకోవాలి. ఇందుకు ఉపయోగపడే నూనెలు ఏవంటే.. అధిక మొత్తంలో సంతృప్త కొవ్వు ఆమ్లాలు ఉండే కొబ్బరి నూనె, పామాయిల్ వంటివి లేదా వేరుశనగ నూనె, శుద్ధి చేసిన వరి తవుడు నూనె, అధిక ఓలిక్ పొద్దుతిరుగుడు (మోనోఅన్శాచురేటెడ్ కొవ్వు ఆమ్లం కలిగిన) నూనెలు ఆహారాన్ని వేయించడానికి మంచివని డాక్టర్ ప్రసాద్ వివరించారు.కలిపి వాడుకోదగినవిఇంట్లో రోజువారీ కూరల్లో లేదా డీప్ ఫ్రైలకు కూడా కనీసం రెండు రకాల వంట నూనెలు కలిపి వాడుకుంటే మేలని, నిలువ పచ్చళ్లకు నువ్వుల నూనె మంచిదని డా. ప్రసాద్ చెప్పారు. వాటిలో ఉండే పోషకాలను బట్టి కలిపి వాడుకోదగిన నూనెలు ఇవీ.. పామాయిల్ + సోయా నూనెపామాయిల్ + పొద్దుతిరుగుడు నూనె వరి తవుడు నూనె + నువ్వుల నూనెఆలివ్ నూనె + పొద్దుతిరుగుడు లేదా సోయా ఆయిల్మళ్లీ ఫ్రైలకు వాడొద్దు..మన ఇంట్లో వేపుళ్లకు ఒకసారి వాడిన నూనెను పారబోయాల్సిన అవసరం లేదు. ఆ నూనెను వడగట్టి కూరల తాలింపుల్లో వాడుకోవచ్చు. ఎక్కువ రోజులు నిల్వ ఉంచకుండా 3–4 రోజుల్లోనే (వేపుళ్లకు కాకుండా) కూరల్లో వాడుకోవాలి. నిల్వ ఉంచితే ఆ నూనె చెడిపోయే అవకాశం ఉంది. అయితే, డీప్ ఫ్రైలకు వాడిన నూనెనే మళ్లీ మళ్లీ వేపుళ్లకు వాడితే ప్రమాదం. అవి తిన్న వారు దీర్ఘకాలంలో హృదయ సంబంధ వ్యాధులు, కేన్సర్ వంటి తీవ్రమైన జబ్బుల పాలయ్యే ముప్పు ఉంది. –డాక్టర్ ఆర్బీఎన్ ప్రసాద్, మాజీ చీఫ్ సైంటిస్ట్ -
ఇంట్లోనే గర్భాశయ కేన్సర్ స్క్రీనింగ్ టెస్ట్..! సురక్షితమేనా..?
కొన్నికేన్సర్లు.. సులభంగా టెస్ట్లు చేయించుకోలేం. అలాంటి వాటిల్లో ఒకటి ఈ గర్భాశయ కేన్సర్. ఇది కాస్త గోపత్యకు సంబంధించినవి కావడంతో మహిళలు క్లినిక్లను సందర్శించడంలో జాప్యం చేస్తున్నారు. ఆ నేపథ్యంలో వైద్యశాస్త్రం సాంకేతిక సాయంతో మరింత పురోగతిని అందించేలా మహిళలే స్వీయంగా చేసుకునే వెసులబాటు అందించింది. అంటే ఇంట్లోనే సులభంగా గర్భాశయ కేన్సర్ స్క్రీనింగ్ టెస్ట్(HPV స్వీయ-నమూనా అని కూడా పిలుస్తారు) చేసుకోవచ్చు అన్నమాట. ఇది భవిష్యత్తు కాలంలో మంచి గేమ్ ఛేంజర్గా ఉద్భవించనుంది. అచ్చం ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్ మాదిరిగానే ఇంట్లోనే గర్భాశయం ఆరోగ్యం కోసం మనమే స్వయంగా చేసుకోవచ్చని చెబుతున్నారు వైద్య నిపుణులు. అసలేంటి టెస్ట్? ఎలా చేయాలి?, సురక్షితమేనా? తదితరాల గురించి సవివరంగా తెలుసుకుందామా..!.ఇంట్లోనే గర్భాశయ కేన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ అంటే..గర్భాశయం నుంచి కణాలను సేకరించడానికి వైద్యుడు స్పెక్యులమ్ను ఉపయోగించే సాంప్రదాయ పాప్ స్మియర్ మాదిరిగా కాకుండా, ఇంట్లోనే నిర్వహించే స్వీయ-నమూనా కిట్ ఇది. ఇందులో 95% కచ్చితత్వం ఉంటుందని చెబుతున్నారు నిపుణులుఎలా చేయాలంటే..కిట్: స్టెరైల్ స్వాబ్ (పొడవైన Q-టిప్ లాగా) లేదా ప్రత్యేకమైన బ్రష్ను కలిగి ఉన్న చిన్న ప్యాకేజీని అందుకుంటారు.బాత్రూమ్ లేదా గదిలో ఆ స్వాబ్ను యోనిలోకి చొప్పించి కొన్ని సెకన్ల పాటు తిప్పాలి. అది గర్భాశయాన్ని చేరుకోవాల్సిన అవసరం లేదు. అప్పుడు ఆ స్వాబ్ HPV DNA కలిగి ఉన్న యోని గోడల నుంచి కణాలు, ద్రవాలను తీసుకుంటుంది. ఆ స్వాబ్ను ప్రిజర్వేటివ్ ట్యూబ్లో ఉంచి, దానిని సమీపంలోని ల్యాబ్కు పంపించాలి. ఫలితం: పరీక్షలో నెగిటివ్ వస్తే..గర్భాశయ కేన్సర్వచ్చే ప్రమాదం చాలా తక్కువని, ఒకవేళ పాజిటివ్ అయితే ..ప్రమాదకర హెచ్పీవి శరీరంలో ఉందని అర్థం. అలాంటప్పుడు తదుపరి పాప్ స్మియర్ లేదా కోల్పోస్కోపీ కోసం గైనకాలజిస్ట్ను సందర్శించాలి.ఇక్కడ మహిళలకు ఓ వైద్యుడి మాదిరిగా చేసుకోగలమా అనే సందేహం రావడం సహజం. అయితే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR), జేసీఓ గ్లోబల్ ఆంకాలజీ ఈ స్వీయ నమునా చాలా ప్రభావవంతంగా ఉంటుందని పేర్కొంది. ముందుగా ఈ గర్భాశయ కేన్సర్ని గుర్తించడంలో సాంప్రదాయ పాప్ స్మియర్ల కంటే HPV DNA పరీక్షలు చాలా సులభంగా, ఎలాంటి అసౌకర్యం కలగకుండా నిర్వహించగలిగేవని పేర్కొంది. ఈ హెచ్పీవీ కిట్ల సాయంతో మహిళలు స్వయంగా సేకరించిన నమునాలు, వైద్యులు సేకరించిన వాటివలే ఉంటాయని హామి ఇచ్చింది కూడా. ఇది ప్రారంభ స్కీనింగ్ వైద్య పరీక్షగా ఉపయోగపడుతుంది. అయితే ఇది కేన్సర్ని మందస్తు దశలోనే గుర్తించడానికి హెల్ప్ అయ్యే సాధనమే తప్ప కేన్సర్ని నిర్థారించేది మాత్రం కాదు.ఎందుకు అత్యంత ముఖ్యమైనదంటే..భారతదేశంలో, గర్భాశయ కేన్సర్ మహిళల్లో రెండవ అత్యంత సాధారణ కేన్సర్గా మారింది. ప్రతి ఏడాది దాదాపు 75 వేల నుంచి 80 వేల మంది దాక మహిళలు ఈ వ్యాధి కారణాంగా ప్రాణాలు కోల్పోతున్నారు. వాటిని నివారించేందుకు ఇంట్లేనే నిర్వహించుకునే ఈ సులభమైన స్క్రీనింగ్ పరీక్ష అత్యంత ప్రధానమైనదిగా మారింది.ఏవిధంగా అంటే..?ఈ టెస్ట్ నిమిత్తం చాలామంది మహిళలు అసౌకర్యంగా ఫీలవుతారు. ఆ అసౌకర్యాన్ని ఈ పరీక్ష తొలగిస్తుంది. అదీగాక గ్రామీణ మహిళలకు, అత్యంత బిజీగా ఉండే పట్టణ మహిళలకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. పైగా వైద్య ఖర్చులను తగ్గిస్తుంది. పైగా ఈ పరీక్షలో ఎలాంటి నొప్పి ఉండదు, ఐదు నిమిషాల కంటే తక్కువ సమయమే పడుతుంది.నిజానికి ఈ కిట్లు ఆరోగ్యకరమైన భవిష్యత్తుగా వారధిగా పనిచేస్తాయి. పైగా 25 నుంచి 65 ఏళ్ల మధ్య వయసు వాళ్లు కనీసం మూడేళ్ల కొకసారైనా ఈ పరీక్షను చేసుకోవడం మంచిదని చెబుతున్నారు నిపుణులు.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: వారసత్వ వేడుక..'జుట్టు విప్పే ఆచారం'!: సోనమ్ కపూర్) -
గుండెజబ్బుల రిస్క్ ఎవరికి ఎక్కువ?
హార్ట్ఎటాక్ అంటే చాలామందికి ఆందోళన. కుటుంబంలో ఎవరికైనా లేదా చుట్టుపక్కల వాళ్లలో ఎవరికైనా హార్ట్ ఎటాక్ వచ్చి... నిన్నటి వరకూ తమతోనే ఉన్న వ్యక్తి అకస్మాత్తుగా మిస్ అయిపోవడం ఎందరికో విషాదంతో కూడిన ఆశ్చర్యకరమైన అంశం. అందుకే... గుండెపోటును నివారించే మందులేమైనా ఉంటే బాగుండు అనే భావన. మరికొందరిలో... రక్తాన్ని పలచబార్చేవీ, గుండెనొప్పి అనిపించగానే నాలుక కింద పెట్టుకోమ్మని డాక్టర్లు చెప్పేవాటి గురించి విని... అలాంటి ఏవైనా మందులున్నాయనే అభిప్రాయం కూడా ఉంటుంది. నిజంగా గుండెపోటును నివారించే మందులేమైనా ఉంటాయా అన్న విషయం గురించి అసలు వాస్తవాలేమిటో చూద్దాం.ఓ కేస్ స్టడీ... శ్రీధర్ వాళ్ల నాన్నగారు చాలా చిన్నప్పుడే హార్ట్ ఎటాక్తో పోయారు. ఇటీవలే వాళ్ల చిన్నాన్నకు కూడా అకస్మాత్తుగా హార్ట్ ఎటాక్ వచ్చింది. అయితే అదృష్టవశాత్తూ ఆయనకేమీ కాలేదుగానీ... ఒకటోసారీ, రెండోసారి హార్ట్ ఎటాక్ ఉపేక్షిస్తుందేమోగానీ మూడోసారి వచ్చిందంటే మాత్రం తప్పక ప్రాణాపాయం కలుగుతుందంటూ చుట్టుపక్కలవారు చెబుతుండటంతో అతడిలో ఆందోళన ఇంకా పెరిగిపోతోంది. అయితే శ్రీధర్కు ఇప్పటికైతే ఎలాంటి సమస్యా లేదు. కాకపోతే అతడి వయసు నలభై ప్లస్. కుటుంబంలో చాలామందికి హార్ట్ ఎటాక్ రావడం, పైగా నాన్నగారు హార్ట్ ఎటాక్తో పోవడంతో వంశపారంపర్యంగా తనకూ హార్ట్ ఎటాక్ వస్తుందేమోనన్న ఆందోళన అతడిని నిలువనీయడం లేదు. దాంతో తమకు తెలిసిన కార్డియాలజిస్ట్ను సంప్రదించి... ‘‘మా నాన్నకూ, చిన్నాన్నకూ వచ్చినట్టుగా నాకు హార్ట్ ఎటాక్ రాకుండా ఉండేందుకు మందులివ్వండం’’టూ డాక్టర్ను అడగసాగాడు.శ్రీధర్కు వచ్చిన సందేహమే చాలామందిలో ఉంటుంది. ‘‘గుండెపోటు వచ్చాక కొన్ని రకాల మందులు తీసుకోవడం తప్పదు కదా. అయితే... అసలది రాకుండానే నివారించుకునేందుకు మొదట్నుంచీ ఆ మందులు తీసుకోవచ్చా?... ఇలాంటి నివారణ మందులేమైనా ఉన్నాయా?’’ అనే సందేహం కొందరిలో మెదులుతుంటుంది. మరీ ముఖ్యంగా కుటుంబంలో గుండెపోటు వచ్చినవారుండటం... వారేవో కొన్ని రకాల మందులు వాడుతుండటంతో... అవే మందులు తామూ వాడితే గుండెపోటు రాదేమో అనే ఆలోచనా ఉంటుంది. ఎందుకంటే... ఒకసారి గుండెపోటుకు గురైనవారికి మళ్లీ అది రాకుండా ఉండేందుకు డాక్టర్లు కొన్ని మందులు సూచిస్తుంటారు. ఉదాహరణకు... అలాంటి పేషెంట్లు ఆస్పిరిన్, క్లోపిడోగ్రెల్, రామిప్రిల్ వంటి మందులతో పాటు, బీటాబ్లాకర్, స్టాటిన్స్ వంటి మందుల్ని వాడుతుంటారు. దాంతో అవే మందుల్ని మనమూ తీసుకుంటూ ఉంటుంటే గుండెపోటును నివారించవచ్చు కదా అనే సందేహం రావడం చాలా సాధారణం.గుండెపోటు / గుండెజబ్బులకు అవకాశమున్నది ఎవరికంటే... కొందరిలో స్వాభావికంగానే గుండెజబ్బులు వచ్చే అవకాశాలెక్కువ. కొన్ని అంశాలు గుండెజబ్బులు / గుండెపోటుకు ఆస్కారమిస్తాయి. వాటిని రిస్క్ఫ్యాక్టర్స్గా చెప్పవచ్చు. అవేమిటంటే... ఇవీ ఆ రిస్క్ఫ్యాక్టర్స్...వయసు : నలభై ఏళ్ల వయసు దాటాక గుండెజబ్బులు వచ్చే అవకాశం ఎక్కువ. డయాబెటిస్ : చక్కెర వ్యాధి (మధుమేహం) ఉన్నవారిలో గుండె జబ్బులకు అవకాశాలెక్కువ. రక్తపోటు : అధికరక్తపోటు (హై–బీపీ) ఎక్కువగా ఉన్నవారిలో... కొలెస్ట్రాల్ : రక్తంలో చెడు కొలెస్ట్రాల్ వంటి కొవ్వు పదార్థాలు నిర్ణీత మోతాదు కంటే ఎక్కువగా ఉన్నవారిలో. స్మోకింగ్ : పొగతాగే అలవాటు ఉన్నవారిలో. స్థూలకాయం : ఉండాల్సిన దాని కంటే ఎక్కువ బరువు ఉన్నవారిలో గుండెజబ్బులూ / గుండెపోటు వచ్చే అవకాశాలెక్కువ. మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉండటం, నిద్ర సరిగా పోకపోవడం, తల్లిదండ్రులు లేదా తోడబుట్టినవాళ్లులో తక్కువ వయసులో హార్ట్ ఎటాక్ రావడం వంటివి కూడా రిస్క్ ఫ్యాక్టర్లే.పురుషుల్లో గుండెజబ్బుల రిస్క్ ఎక్కువ... మహిళలతో పోలిస్తే పురుషుల్లో గుండెజబ్బులకు ముప్పు ఎక్కువ. మహిళల్లో రుతుస్రావం కొనసాగుతున్నంత వరకూ వారిలో స్రవించే ఈస్ట్రోజెన్ కారణంగా వాళ్లకు ఓ స్వాభావిక రక్షణ ఉంటుంది. అయితే మహిళల్లో రుతుస్రావం ఆగాక (మెనోపాజ్ తర్వాత) ఈస్ట్రోజెన్ స్రావాలు తగ్గుతాయి కాబట్టి.. ఆ దశ తర్వాత పురుషులకూ, మహిళలకూ గుండెపోటు వచ్చే అవకాశాలు సమానంగా ఉంటాయి.రామిప్రిల్ : ఈ మందు హైబీపీని (రక్తపోటును) తగ్గించి... తద్వారా గుండెపోటు వచ్చే అవకాశాలను తగ్గిస్తుంది కాబట్టి గుండెపోటు వచ్చిన తర్వాత రామిప్రిల్గానీ... అలాంటి మరికొన్ని మందులుగానీ డాక్టర్లు సూచిస్తుంటారు. అయితే ముందుజాగ్రత్తగా ఆహారంలో ఉప్పు మోతాదు, కొవ్వు పదార్థాలు తగ్గించడం, మద్యపానం మానివేయడం, నడక లాంటి వ్యాయామాలు చేయడం, పచ్చికూరలు తీసుకోవడం వంటి సూచనలనూ ఈ మందు తీసుకుంటూ పాటిస్తుండాలి. బీటాబ్లాకర్స్ : ఒకసారి గుండెపోటు (Heart attack) వచ్చిన తర్వాత గుండె పంపింగ్ తగ్గినవారికి మాత్రమే ఇవి ఉపయోగపడతాయి. అయితే బీటాబ్లాకర్స్ వాడేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయమేమిటంటే... ఇవి వాడినప్పుడు రక్తపోటు (బీపీ) తగ్గే అవకాశముంటుంది. కాబట్టి బీపీని జాగ్రత్తగా మానిటర్ చేసుకుంటూ ఉండాలి. ఈ మందులతో నివారణ ఎప్పడూ... ఎలాగంటే... హై రిస్క్ ఉన్నవారికి మాత్రమే : ఇవి సెకండరీ ప్రివెన్షన్ కోసం మాత్రమే. ఆస్పిరిన్ను సాధారణంగా... ఒకసారి గుండెజబ్బులు కనిపించిన వారికి మాత్రమే ఉపయోగిస్తారు. మునుపు డయాబెటిస్ ఉండి, గుండెజబ్బు లేనివారికి కూడా ప్రైమరీ ప్రివెన్షన్ కోసం ఆస్పిరిన్ను వాడేవారు. అయితే కొత్త పరిశోధనల ఆధారంగా ఇప్పుడు ఆస్పిరిన్ను కేవలం సెకండరీ ప్రివెన్షన్ కోసం మాత్రమే ఉపయోగిస్తున్నారు. పై అంశాలు లేకపోతే ఆస్పిరిన్ వాడటం వల్ల ప్రయోజనం కంటే రిస్కే ఎక్కువ.మందులెప్పుడూ సెకండరీ ప్రిపెన్షన్గానే... ఆరోగ్య సమస్య ఏదీ లేనప్పుడు... అది రాకుండా చూసుకునేందుకు పాటించే నివారణ చర్యలను ప్రాథమిక నివారణ’ (ప్రైమరీ ప్రివెన్షన్) అంటారు. అయితే గుండెపోటుగాని, బ్రెయిన్స్ట్రోక్గాని ఒకసారి వచ్చాక... అది మళ్లీ రాకుండా ఉండేందుకు కొన్ని రకాల మందులు తీసుకోవడం, అలాగే జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవడం చాలా సాధారణంగా జరిగే ప్రక్రియ. ఈ మందులు తీసుకోవడాన్ని, అలాగే ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించే పద్ధతిని ‘సెకండరీ ప్రివెన్షన్’గా చెబుతారు. సాధారణంగా మధుమేహం (డయాబెటిస్), రక్తపోటు (హైబీపీ) ఉందని బయటపడ్డ తర్వాత అది గుండెపోటుకు లేదా గుండెజబ్బులకు దారితీయకుండా కొన్ని రకాల మందులు వాడటం లేదా కొన్ని ఆరోగ్య నియమాలు పాటించడం, ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించడం చేస్తుంటారు. దీన్ని ప్రైమరీ ప్రివెన్షన్గా చెప్పవచ్చు. అసలు డయాబెటిస్గానీ లేదా రక్తపోటు (హైబీపీ)గానీ రాకుండా ముందుగానే జాగ్రత్త పడటం ‘ప్రైమార్డియల్ ప్రివెన్షన్’ అవుతుంది. ఈ ప్రివెన్షన్ ప్రైమరీ ప్రివెన్షన్ కంటే ఇంకా ముందు దశ. అంటే రిస్క్ ఫ్యాక్టర్లు కనిపించకముందే... నివారణ చర్యలు చేపట్టడం అన్నమాట. అంతేతప్ప... సెకండరీ ప్రివెన్షన్లో వాడే మందులను ముందునుంచే గుండెపోటు రాకుండా ఉండేందుకు వాడే మందులుగా పొరబడకూడదు.సెకండరీ ప్రివెన్షన్గా వాడే మందులివి... ఆస్పిరిన్: సాధారణంగా నొప్పుల నివారణకు వాడే ఆస్పిరిన్ మాత్ర రక్తాన్ని పలచబార్చడం కోసం కూడా సమర్థంగా ఉపయోగపడుతుంది. అలా పరచబార్చడం వల్ల రక్తనాళాల్లో రక్తం గడ్డలుగా పేరుకుపోయే అవకాశం తగ్గుతుంది. ఫలితంగా గుండెపోటు వచ్చే అవకాశాలూ తగ్గుతాయి. అందుకే ఒకసారి గుండె΄ోటు వచ్చినవారు జీవితాంతం ఆస్ప్రిన్ మాత్ర క్రమం తప్పకుండా వాడుతూనే ఉండాలి.అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే... గుండెజబ్బు లేకుండానే ఆస్పిరిన్ వాడటం వల్ల అంతగా ఫలితమేమీ కనిపించదు. పైగా ముందునుంచే మాత్రలు వేసుకోవడం వల్ల రక్తం పలచబారిపోవడం వల్ల ఏ చిన్నదెబ్బ లేదా చిన్నగాయానికైనా ఆగకుండా రక్తస్రావమై... ఆ కారణంగా పరిస్థితి ప్రమాదకరంగా మారే అవకాశం కూడా ఉంటుంది. అందుకే కొంతకాలం క్రితం డయాబెటిస్ ఉన్నవాళ్లకు గుండెజబ్బులు ఉన్నా లేకపోయినా ఆస్పిరిన్ ఇచ్చేవారు. కానీ... ఆ కారణంగా సమస్యలు తలెత్తే అవకాశాలు ఎక్కువని కొన్ని శాస్త్రపరిశోధనల్లో వెల్లడయ్యాక డయాబెటిస్ ఉన్న ప్రతి ఒక్కరికీ కాకుండా కేవలం హై రిస్క్ ఉన్నవారికి మాత్రమే ఆస్పిరిన్ సూచిస్తున్నారు.స్టాటిన్స్ : రక్తంలోని కొవ్వుల మోతాదులను తగ్గించే మందులివి. మరీ ముఖ్యంగా చెడు కొలెస్ట్రాల్ అయిన లో–డెన్సిటీ లైప్రొటీన్ (ఎల్డీఎల్) అనే కొవ్వులను తగ్గిస్తాయి. అందుకే గుండెపోటు వచ్చిన ప్రతివారికీ ఈ మందును జీవితాంతం సూచిస్తారు. అంతేకాదు... డయాబెటిస్ ఉన్నవారికి గుండెజబ్బుల ముప్పు కూడా పెరగడం వల్ల చక్కెర వ్యాధి ఉన్నవారు స్టాటిన్లు కూడా వాడాలంటూ డాక్టర్లు సూచిస్తారు. చదవండి: ఫిట్స్తో ఎవరైనా పడిపోతే ఇలా చేయకండిఇక్కడ గమనించాల్సిన విషయమేమిటంటే... కేవలం రిస్క్ ఎక్కువగా ఉన్నవారికి మాత్రమే గాక... తక్కువ రిస్క్ ఉన్నవారికి సైతం స్టాటిన్స్ వాడటం వల్ల గుండెపోటు వచ్చే అవకాశాలు తక్కువ అని తేలింది. దాంతో రక్త పరీక్షల్లో ‘హెచ్ఎస్ సిఆర్పీ’ విలువ – 2 ఎంజీ కంటే ఎక్కువగా ఉంటే గుండె΄ోటు లేనివాళ్లకూ గుండెజబ్బులను నివారించవచ్చని తేలింది. ‘సీటీ స్కాన్’తో చూసే ‘కరొనరీ క్యాల్షియమ్ స్కోర్’ ఎక్కువ ఉన్నప్పుడు కూడా డాక్టర్లు స్టాటిన్స్ను సూచిస్తారు. అందుకే స్టాటిన్స్ వాడాలంటే ముందుగా డాక్టర్ సూచనల మేరకు తగిన పరీక్షలు చేసి అవి తీసుకోవాలా లేదా అన్నది కేవలం డాక్టర్లు మాత్రమే నిర్ధారణ చేయాల్సి ఉంటుంది.వ్యాయామంతో గుండెజబ్బులు దూరం ప్రతిరోజూ ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వ్యాయామం చేయడం గుండెజబ్బులు / గుండెపోటుకు మంచి నివారణ అని అనేక అధ్యయనాల్లో తేలింది. అయితే ఈ వ్యాయామం కేవలం మొక్కుబడిగా కాకుండా... ప్రతిరోజూ కనీసం 30 నిమిషాలు వ్యాయామం చేయాలి. కాకపోతే మరీ ఎక్కువగా శ్రమ కలిగించేలా ఉండకూడదు. అలాగని మరీ విశ్రాంతిగా కూడా ఉండకూడదు. శరీరానికి మరీ ఎక్కువ శ్రమ కలగని రీతిలో ఉండే బ్రిస్క్వాకింగ్, ఈత లేదా ఏదైనా స్పోర్ట్ వంటి వ్యాయామాలు మంచివి. మరీ ఎక్కువగా శ్రమ కలిగించేవి అకస్మాత్తుగా మొదలుపెట్టకూడదు. తీవ్రతను క్రమంగా పెంచుకుంటూ పోవడం మంచి పద్ధతి.ఏయే కొలతలు ఎంతెంత ఉండాలంటే... గుండెజబ్బులు ఉన్నవారిలో రక్తపోటు విలువ 130/80 కంతే తక్కువగా ఉండాలి. కొలెస్ట్రాల్ మోతాదులు : రక్తంలో పూర్తి కొలెస్ట్రాల్ మోతాదులు... 200 కంటే తక్కువ ఉండాలి. చెడు కొలెస్ట్రాల్ (ఎల్డీఎల్) మోతాదులు... 100 కంటే తక్కువ ఉండాలి. గుండె జబ్బులు ఉన్నవారికి 70 కంటే తక్కువగా ఉండాలి. మంచి కొలెస్ట్రాల్ (హెచ్డీఎల్) మోతాదులు... 40 కంటే ఎక్కువగా ఉండాలి. ట్రైగ్లిజరైడ్స్ అనే రకం కొవ్వుల మోతాదులు... 200 కంటే తక్కువగా ఉండాలి. -
పక్షవాతంతో మంచానికే పరిమితం..కానీ ఆయుర్వేదం నడిచేలా చేసింది..!
అమ్మాయిల కలల రాకుమారుడిలా ఉండే తమిళ నటుడు అరవింద్ స్వామి నటన పరంగానే కాదు గ్లామరస్ పరంగా ఆయనకు సాటిలేరెవ్వరూ. బాంబే, రోజా మూవీలో వేలాది అభిమానులను సొంతం చేసుకున్న నటుడు అరవింద్స్వామి. అలాంటి ఆయన కెరీర్పీక్లో ఉండగానే సినిమాలకు దూరమయ్యారు. మళ్లీ ఇటీవలే ప్రధాన పాత్రలతో ప్రేక్షకులకు చేరవవుతున్నారు. ఈ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో ఇన్నాళ్లు తాను ఎందుకు సినీ ఫీల్డ్కి ఎందుకు దూరంగా ఉన్నారో వెల్లడించారు. అనారోగ్యం బారిన పడటం ఒక కారణమైతే, అధిక బరువు మరో కారణమంటూ..తాను ఎదుర్కొన్య ఆరోగ్య సమస్య గురించి కూడా వివరించారు. ఇంతకీ ఆయన ఏ అనారోగ్య సమస్యతో బాధపడ్డారంటే..అరవింద్ స్వామికి 2005లో పాక్షికంగా పక్షవాతం వచ్చింది. 18 నెలలు ఎంతగానో నొప్పితో విలవిలలాడాడు. చివరికి శస్త్ర చికిత్స చేయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఆయన అది వద్దనుకుని కేరళకు చెందని ఆయుర్వేద వైద్యుడిని ఆశ్రయించినట్లు తెలిపారు. ఒకటిన్నర ఏడాదిగా అనుభవించిన బాధ అంత ఇంత కాదని, ఆఖరికి స్పర్శను కూడా కోల్పోయానని అన్నారు. కానీ ఆయుర్వేదం తనను మూడు రోజుల్లో తిరిగి నడిచేలా చేసిందన్నారు. అది నాకు చాలా అద్భుతంగా పనిచేసిందని చెప్పుకొచ్చారు. అయితే ఆయన తనకు పనిచేసింది కాబట్టి ప్రజలను ఫాలో అవ్వమని సూచించడం లేదు. అలాగే గుడ్డిగా కూడా ఫాలో కావొద్దన్నారు. వైద్యుల సూచనల మేరకు, ఆరోగ్య పరిస్థితి రీత్యా సరైన నిర్ణయం తీసుకోండని అన్నారు. ఇక్క నొప్పి, కదలలేని పరిస్థితి కంటే..మానసికంగా స్థైర్యంగా ఉండటం అత్యంత ప్రధానమని అన్నారు. ఆ పరిస్థితిలో నాకే ఇలా అనే ఆలోచన దరిదాపుల్లోకి కూడా వెళ్లకూడదన్నారు. ఆ సమస్య నుంచి బయటపడ్డ వెంటనే..ఫజిల్స్, చదరంగం వంటి ఆటలతో బిజీ అయిపోయినట్లు తెలిపారు. అయితే ఆ అనారోగ్య సమస్య నుంచి బయటపడ్డాక మళ్లీ సినీ రంగంవైపుకి రావాలని అస్సలు అనుకోలేదు, సినిమా చేయాలని కూడా అనుకోలేదట. ఎందుకంటే ఆ టైంలో చాలా మందులు వాడటంతో విపరీతం బరువు పెరిగిపోయి, జుట్టు ఊడిపోయి అదోలా తయారయ్యానని, దాంతో సినిమాల ఆలోచన రాలేదని చెప్పుకొచ్చారు అరవింద్ స్వామి. ఎంత టెక్నాలజీ అభివృద్ది చెంది..ఆధునాత వైద్యం చెంతకు చేరినా..ఏళ్లనాటి పురాతన ఆయుర్వేదమే అత్యుతమమని పలు ఉదంతాల్లో నిరూపితమైంది కూడా.(చదవండి: అమెరికా కోడలు..ఇండియా అత్త..! అనుబంధం మాములుగా లేదుగా..) -
షుగర్ లెవల్స్ తెలుసుకోవాలంటే ఈ టెస్ట్ తప్పనిసరి
మధుమేహ రోగులకు HbA1c పరీక్ష ప్రామాణికం. రక్తంలో చక్కెర స్థాయుల సగటు ఎంత ఉందో ఈ పరీక్షలో కచ్చితంగా తెలుస్తుందని అందరూ భావిస్తారు. కానీ ఈ పరీక్ష ఫలితాలపై ప్రస్తుతం నమ్మకం సన్నగిల్లుతోంది. ఈ మాట చెబుతోంది ఎవరో కాదు... ప్రపంచవ్యాప్త వైద్యవిశేషాలతో ప్రచురితమయ్యే ప్రముఖ పత్రిక లాన్సెట్! భారతీయులు HbA1c పరీక్ష బదులుగా ఓరల్ గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ (ఓజీటీటీ) లేదా నిరంతర గ్లూకోజ్ మానిటరింగ్ (సీజీఎం) టెస్ట్ చేయించుకోవడమే ఉత్తమమని నిపుణులు అంటున్నారు. గత కొద్ది నెలలుగా గ్లూకోజ్ స్థాయులు నియంత్రణలో ఉన్న మధుమేహ రోగుల విషయంలో సాధారణంగా చేసే HbA1c పరీక్ష అత్యంత కచ్చితమైన పద్ధతి కాదనేది దేశంలోని పలువురు సుప్రసిద్ధ డయాబెటాలజిస్టుల తాజా వాదన. లాన్సెట్ పత్రికలో ‘ప్రాంతీయ ఆరోగ్యం: ఆగ్నేయాసియా (రీజినల్ హెల్త్: సౌత్ ఈస్ట్ ఆసియా) పేరిట ఈ అధ్యయన ఫలితాలు ఈ నెల 9న ప్రచురితమయ్యాయి. చక్కెర వ్యాధికి భారత్ రాజధాని. మన దేశంలో మధుమేహ రోగుల సంఖ్య దాదాపు 10.10 కోట్లు. వీరిలో చాలామంది తమ గ్లూకోజ్ స్థాయులు తెలుసుకోవడానికి HbA1c పరీక్ష చేయించుకుంటుంటారు. అయితే ఇండియాలో ఈ పరీక్ష స్పష్టమైన వాస్తవిక చిత్రాన్ని ప్రతిబింబించడం లేదనే మరో కథనం కూడా ఇటీవల ‘లాన్సెట్’లో వచ్చింది.HbA1c పరీక్ష ఎందుకు?ఎర్ర రక్తకణాలు సుమారు మూడు మాసాలు జీవిస్తాయి. కనుక HbA1c లేదా గ్లైకేటెడ్ హీమోగ్లోబిన్ పరీక్షను గత రెండు నెలలు లేదా మూడు నెలల కాలానికి రక్తంలోని చక్కెర నిల్వల స్థాయిని తెలుసుకోవడానికి చేస్తారు. హీమోగ్లోబిన్ అనేది రక్తంలో ఆక్సిజన్ ను మోసుకెళ్లే ప్రోటీన్. ఇది గ్లూకోజును అతుక్కుని ఉంటుంది. HbA1c టెస్టులో హీమోగ్లోబిన్ శాతాన్ని పరీక్షిస్తారు. HbA1c స్థాయి 5.7 శాతం కంటే తక్కువ ఉంటే డయాబెటిస్ లేనట్టు. అది 5.7-6.4 శాతం మధ్య ఉంటే ప్రీ-డయబెటిస్ కింద లెక్క. 6.5 శాతాన్ని మించితే సుగర్ వ్యాధి ఉన్నట్టు పరిగణిస్తారు. రక్తంలో చక్కెర నియంత్రణ, HbA1c లెవల్స్ మధ్య గల లింకు గురించి 1976లో తెలిసినప్పట్నుంచి ‘గ్లైసెమిక్ కంట్రోల్’ పరిశీలనకు సంబంధించి HbA1c అనేది ‘స్వర్ణ ప్రామాణిక పరీక్ష’ తరహాలో ఓ గీటురాయిగా మారింది. ఇది ఓ స్థిరమైన ముందస్తు విశ్లేషణతో కూడిన పరీక్ష. 2010లో దీన్ని ఓ డయాగ్నొస్టిక్ విధానంగా కూడా ప్రతిపాదించారు. పరగడుపున సేకరించే రక్త నమూనా కోసం సంప్రదాయ పద్ధతిలో మాదిరిగా HbA1c విధానంలో రోగి ఏమీ తినకుండా ‘ఉపవాసం’ పాటించాల్సిన అవసరం లేదు.HbA1cలో కచ్చితత్వం ఉండదా?పరిశోధకులు ఈ సందర్భంగా వివిధ పద్ధతుల ద్వారా రక్తంలో చక్కెర స్థాయులను కొలిచి, వాటిని పోల్చుతూ పలు అధ్యయనాలతో సమీక్షించారు. దక్షిణ భారత దేశంలో ఇటీవల 1,120 మందిపై నిర్వహించిన ఓ అధ్యయనంలో HbA1c పరీక్ష (45.4%)తో పోలిస్తే ఓరల్ గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ (87.8%) (OGTT)లో ఎక్కువ ప్రీ-డయాబెటిస్ కేసులు నమోదయ్యాయి. (ప్రీ-డయాబెటిస్ అంటే మధుమేహం త్వరలో రాబోతోందని తెలిపే ఓ ముందస్తు సూచిక. ఆహార అలవాట్లు మార్చుకోవడం, వ్యాయామం చేయడం, మద్యం- ధూమపానం మానివేయడం, జీవన శైలిని మార్చుకోవడం వంటివి పాటించకపోతే అనతి కాలంలోనే వారికి అతిదాహం-అతిమూత్ర వ్యాధి ఖాయం!). పుణెలో 116 మంది యువతపై నిర్వహించిన ఓ స్టడీలో 23.3% ప్రీ-డయాబెటిస్ కేసుల్ని HbA1c పరీక్ష గుర్తించగా, ఓరల్ గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ (OGTT) మాత్రం 7.8% కేసుల్లో మాత్రమే ప్రీ-డయాబెటిస్ ఉన్నట్టు తేల్చింది. ఆయా వ్యక్తుల్లో ఎర్ర రక్తకణాల స్థాయులు, వాటి జీవితకాలం, అవి గ్లూకోజుతో అంటిపెట్టుకొని ఉండే అంశాల కారణంగానే ఈ వ్యత్యాసాలు చోటుచేసుకున్నట్టు పరిశోధకులు వెల్లడించారు. “HbA1c స్థాయులపై వివిధ అంశాలు ప్రభావం చూపిస్తాయి. ఐరన్ (ఇనుము) కొరతతో తలెత్తే రక్తహీనత (అనీమియా) లేదా జీ6పీడీ (ఎర్ర రక్తకణం ఎంజైమ్) కొరత వల్ల రక్తకణాలు విచ్ఛిన్నమవుతాయి. ఇటువంటి పరిస్థితులు హీమోగ్లిబిన్ లెవల్స్ మీద ప్రభావం చూపిస్తాయి. ఫలితంగా HbA1c లెవల్స్ మారతాయి” అని ఫోర్టిస్ సి-డాక్ సెంటర్ ఫర్ డయాబెటిస్ ఛైర్మన్, పరిశోధన పత్రం రూపకల్పనలో పాలుపంచుకున్న రచయితల్లో ఒకరైన డాక్టర్ అనూప్ మిశ్రా వ్యాఖ్యానించారు.దేశంలో అనీమియా వ్యాప్తి అధికంగా ఉందని, దీంతోపాటు కొన్ని జన సమూహాల్లో తలసేమియా (దేహంలో హీమోగ్లోబిన్ తక్కువగా ఉత్పత్తయ్యే అనువంశిక రక్తసంబంధ రుగ్మత), సికిల్ సెల్ (హీమోగ్లోబిన్ సంబంధిత వంశపారంపర్య రుగ్మత) వంటి హీమోగ్లోబినోపతీస్ (జన్యుపరమైన అనువంశిక వ్యాధులు) ఉన్నాయని లీలావతి ఆస్పత్రి వైద్యుడు, అధ్యయనకర్తల్లో ఒకరైన శశాంక్ జోషి తెలిపారు. అలాగే మలేరియా కేసులు కూడా వ్యాప్తిలో ఉన్నాయని, ఇవన్నీ హీమోగ్లోబిన్ స్థాయులపై ప్రభావం చూపుతాయని చెప్పారు. ఇటువంటి స్థితిలో HbA1c లెవల్స్ కచ్చితమైన ఫలితాలు ఇవ్వలేదని అన్నారు. నిపుణుల సలహా ఏమిటంటే... మధుమేహ రోగులకు HbA1c పరీక్ష కంటే ఓరల్ గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ (ఓజీటీటీ) లేదా నిరంతర గ్లూకోజ్ మానిటరింగ్ (సీజీఎం) టెస్ట్ ఉత్తమం. HbA1c పరీక్ష అక్కర్లేదని, వారంలో రెండు లేదా మూడు సార్లు వంతున కొంతకాలం పాటు రక్తపరీక్ష చేయించుకుంటే షుగర్ లెవల్స్ సంగతి ఇట్టే తెలిసిపోతుందని డాక్టర్ అనూప్ మిశ్రా చెప్పారు. ప్రస్తుతం అన్ని కార్పొరేట్ ఆస్పత్రుల్లో HbA1c పరీక్ష రుసుము సుమారు రూ.600గా ఉంది. - జమ్ముల శ్రీకాంత్(Credits: The Lancet, The Indian Express, Hindustan Times, The Economic Times, ET Health World, NDTV) -
Weight Loss: తూచా తప్పకుండా ఈ ఏడు సూత్రాలు..!
బరువు తగ్గడం అన్నది చాలామందికి అతిపెద్ద సమస్య. కానీ కొందరికి చాలా సింపుల్. అదికూడా నచ్చిన ఆహారాన్ని వదులుకోకుండానే వెయిట్లాస్ అవుతారు. అలాగని, అధిక వర్కౌట్లు, వ్యాయామాలు కూడా చేయరు. సాధారణంగా రోజువారీగా చేసే సింపుల్ వ్యాయామాలు..కాస్త తెలిగా మంచి ఆహారం తీసుకుంటూ తగ్గుతారు. ఇక్కడ ఆరోగ్యానికి భంగం వాటిల్లకుండా..తగిన ప్రోటీన్లు, విటమిన్లు అందేలా జాగ్రత్త వహిస్తే..ఎలాంటి దుష్ప్రభావాల బారిన పడకుండా బరువు తగ్గేలా మంచి ఫలితాలు అందుకుంటారని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ఇక్కడొక ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ కూడా అదే నిరూపించాడు. రోజువారీ ఆహారాన్ని రుచికరంగా, ఆరోగ్యకరంగా మార్చుకుని..అవలీలగా 35 కిలోలు తగ్గి స్ఫూర్తిగా నిలిచాడు. అంతేగాదు బరువు తగ్గాలంటే ఈ ఏడు చిట్కాలు తప్పకుండా ఫాలో అవ్వాలని అంటున్నాడు. అవేంటో చూద్దామా..!ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ అన్ష్ త్రిపాఠి కొలెస్ట్రాల్ తగ్గించే వాస్తవిక ఆహార నియమాలను షేర్ చేసుకున్నాడు. తన పోస్ట్లో ఇలా రాసుకొచ్చారు. బరువు తగ్గడంలో కన్ఫ్యూజన్కి గురికావొద్దని అంటున్నాడు. మన స్వచ్ఛమైన భారతీయ ఆహారంతోనే కొవ్వుని కరిగించేలా తీసుకుంటే చాలని చెబుతున్నాడు. ప్రధాన నియమం..కొలెస్ట్రాల్ని తగ్గించే ఆహారాలే మన భోజనపు ప్లేట్లో ఉండేలా చూసుకోవాలి. ప్రోటీన్ వేటిలో ఉంది..? తగినన్ని కూరగాయలు తింటున్నామా?.. నూనె దగ్గర నుంచి కార్బోహైడ్రేట్స్ వరకు అన్ని నియంత్రణలో ఉన్నాయా..? అని గమనించాలి. ఇక్కడ ఏది మిస్ అవ్వకూడదు. ఆహారంలో ఉండాల్సినవి..తప్పనిసరిగా సగం కూరగాయల్లో 1/4 వంతు ప్రోటీన్, 1/4 కార్బోహైడ్రేట్లు ఉండేలా చూడాలి.ప్రోటీన్ తప్పనిసరి..ఆహారంలో కొవ్వు నష్టాన్ని ప్రోటీన్ నిర్ణయిస్తుంది. ఇక్కడ ప్రోటీన్ తక్కువగా ఉంటే ఆకలి కోరికలు పెరుగుతాయి. ఫలితంగా శరీరంలో కండరాలను కోల్పోవడం ప్రారంభమవుతుంది. .కూరగాయలు తప్పనిసరి..ఆరోగ్యకరమైన ఆహారంలో అతి ముఖ్యమైన భాగం. ప్లేట్లో వండిన లేదా పచ్చిగా ఉన్న భోజనానికి కనీసం రెండు వేర్వేరు కూరగాయలు ఉండాలి. అవి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి, తక్కువ కేలరీలను కలిగి ఉంటాయికార్బోహైడ్రేట్ నియంత్రణ నియమంమన ఆహారంలో కార్బోహైడ్రేట్లను జోడించాలి కానీ మితంగా ఉండాలి. భోజనంలో 1 రోటీ లేదా 1 కప్పు బియ్యం ఉండేలా కేర్ తీసుకోవాలి. అవసరం అనుకుంటే వాటి స్థానంలో పోహా లేదా ఉప్మాతో కూడా మార్చుకోవచ్చు. కొవ్వు/నూనె నియమండైట్ విషయంలో చాలామంది ఫెయిలైదే ఇక్కడే అని అంటున్నాడు. మన భోజనంలో రెండు నుంచి మూడు స్పూన్లకు మించి నూనె ఉండకుండా చూసుకోవాలి. అప్పుడు ఆహారం ఆరోగ్యకరంగా ఉంటుంది. కేలరీలు కూడా సమృద్ధిగా ఉంటాయి.గుర్తించుకోవాల్సిన విషయాలుశాఖాహారుల కోసం, కొవ్వు తగ్గింపు ప్లేట్లో సగం ప్లేట్ సబ్జీ, 1 కటోరి పప్పు/పనీర్/టోఫు, 1 రోటీ లేదా చిన్న మొత్తం రైస్ ఉండాలి. శాఖాహారులకు కొవ్వు నష్టం కష్టంగా అనిపించిందంటే..ప్రోటీన్ తీసుకోవడం చాలా తక్కువగా ఉందని అర్థం.అలాగే నాన్-వెజ్ ప్లేట్లో చికెన్/చేప/గుడ్లు ప్రధానంగా ఉంటాయి. ప్లేట్లో సగానికిపైగా కూరగాయలు ఉండాలి. సమతుల్యతను కాపాడుకోవడానికి కార్బ్ భాగం చిన్నగా ఉండాలి. భాగాలను నియంత్రించినప్పుడు మాత్రమే మాంసాహార ప్లేట్ కొవ్వు తగ్గడానికి సహాయపడుతుంది.అల్పాహారం ప్లేట్లలో తక్కువ కార్బోహైడ్రేట్లతో ప్రోటీన్ ఉండాలి, ద్రవ కేలరీలు ఉండకూడదు. అయితే డిన్నర్ లేదా లంచ్ ప్లేట్లో ప్రోటీన్ క్వాండిటీ తక్కువగా ఉంటే..ఎక్కువ కార్బోహైడ్రేట్లు ఉండవచ్చు.చక్కెర పానీయాలు నివారించండి. కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండే వంటకాలను ఇతరులతో షేర్ చేసుకోండి. ఇలా గనుక ఆహారంలో మార్పులు చేసుకుని తూచా తప్పకుండా ఫాలో అయితే..ఇట్టే బరువు తగ్గుతారంటూ తన పోస్ట్ని ముగించాడు ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ త్రిపాఠి.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: ఉబర్ సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని వదులుకుని మరి.. యూట్యూబ్లో కోడింగ్..!) -
'భారతీయ పేరెంటింగ్'పై మ్యాట్రిమోని యాప్ సీఈవో ఫైర్..!
భారతీయ పేరెంటింగ్పై గురుగ్రామ్ సీఈవో, నాట్ డేటింగ్ సహ వ్యవస్థాపకుడు పెద్ద ఎత్తున విరుచుకుపడ్డారు. చాలామంది భారతీయ తల్లిదండ్రుల పిల్లల పెంపకం సరైనది కాదన్నారు. తల్లిదండ్రులు మంచివాళ్లేనని, కానీ పెంపకంలో ఆలోచన తీరు సరిగా లేదన్నారు. పేరెంటింగ్పై ఎన్నో పుస్తకాలు వచ్చినా ఎందుకనో భారతీయ తల్లిదండ్రుల తీరు మారట్లేదని, వాళ్లు పిల్లలను పెంచడం లేదు, ఫలితాలను పెంచుతున్నారంటూ సోషల్మీడియా వేదికగా విమర్శించారు. ఇంతకీ ఆయన ఎందుకిలా అన్నారు. అసలు ఆ సీఈవో ఆంతర్యం ఏంటీ అంటే..భారతీయ కుటుంబ వ్యవస్థను యావత్తు ప్రపంచం మెచ్చుకుంటే..మన భారతీయుడు, గురుగ్రామ్కి చెందిన మ్యాట్రిమోని యాప్ సీఈవో జస్వీర్ సింగ్ భారత పేరెంటింగ్ని తప్పుపడుతున్నారు. భారత తల్లిదండ్రులు పిల్లలను పెంచే విధానం అత్యంత అధ్వాన్నమైనది అని తిట్టిపోశారు. వాళ్లు పిల్లలను తమ సొంత ఆస్తులుగా చూస్తారని అన్నారు. ప్రపంచంలో మిగిలిన ప్రాంతాల్లో చూసిన దానికంటే అత్యంత భిన్నంగా ఉంటుందన్నారు. సాంస్కృతికంగా భారతీయ పేరెంటింగ్ విధానంలో పెద్దలు ఎల్లప్పుడూ గొప్పవారు అని గుండెల్లో నాటుకుపోతుందన్నారు. అంతేగాదు జస్వీర్ సింగ్ సోషల్మీడియా ఎక్స్పోస్ట్లో భారత తల్లిదండ్రుల పిల్లలను పెంచే విధానం గురించి ఇలా రాసుకొచ్చారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పిల్లల పెంపక విధానాలలో కెల్లా అత్యంత చెత్త విధానంగా పేర్కొన్నారు. దీన్ని ప్రెషర్ కుక్కర్ పేరెంటింగా అభివర్ణించారు. ఇక్కడ భారత తల్లిదండ్రులు చెడ్డవారు కాదు గానీ ఆలోచన తీరు సరైనది కాదంటున్నారు. ముఖ్యంగా పిల్లలను ప్రశ్నించే విధంగా పెంచరన్నారు. తల్లిదండ్రులదే తుది నిర్ణయం..చాలామటుకు తల్లిదండ్రులు పిల్లలను పెంచరని, వాళ్ల ఫలితాలను పెంచుతారని రాసుకొచ్చారు. వాళ్లు వ్యక్తలుగా స్వతంత్రంగా ఉండాలని కోరుకోరు. ఎందుకంటే భారత్లో ఒక పిల్లవాడు ఏం చదువుకోవాలి, భవిష్యత్తులో ఏ వృత్తిలో కొనసాగించాలి, ఎలాంటి జీవితాన్ని గడపాలి...అన్ని తల్లిదండ్రులే ఆలోచిస్తారు, నిర్ణయిస్తారు. ఆఖరికి ఎవరిని పెళ్లి చేసుకోవాలన్నది కూడా తల్లిదండ్రలదే ఫైనల్ నిర్ణయం అన్నారు. ఇక్కడ భారత పేరెంట్స్ దృష్టిలో మానసిక ఆరోగ్యం, ఆసక్తి, ఉత్సుకత, ఆప్టిట్యూడ్, తదితరాలన్ని ఎందుకు పనికిరానివి, విలువలేనివి అన్నారు. కేవలం వాళ్ల మైండ్లో తల్లిదండ్రులుగా తమకే అన్ని తెలుసని, మేము చెప్పినట్లుగా చేయాలనే ధోరణే ఎక్కువగా ఉంటుందన్నారు. చెప్పాలంటే ఇదొక వస్తుమార్పిడిలా ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే తామే ఈ ప్రపంచంలోకి పిల్లల్ని తీసుకొచ్చాం కాబట్టి వాళ్లపై తమకే సర్వహక్కులు ఉంటాయన్నట్లుగా ఉంటుంది వారి తీరు. ప్రశ్నించడమే అతిపెద్ద నేరం..దాంతో పిల్లలు భావోద్వేగపరంగా చిక్కుకుపోతుంటారు. పైగా వైఫల్యాన్ని నేరంగా చూస్తారు. అదొక సిగ్గుచేటు, ఆందోళనగా పిల్లల మైండ్లోకి చొప్పిస్తారు. అంతేగాదు బంధువుల్లోనూ, సమాజంలోనూ తక్కువ అయినట్లుగా ప్రతిక్షణం పిల్లలకు నూరుపోస్తుంటారు. దీన్ని ఇక్కడ తల్లిదండ్రులుగా తాము పిల్లల భవిష్యత్తును కాపాడుతున్నట్లుగా ఫీలవుతుంటారు కానీ, సవాలుని స్వీకరించేలా కాకుండా వైఫల్యం నుంచి కాపాడుకుంటున్నట్లుగా పెంచుతున్నాం అని గ్రహించరని మండిపడ్డారు. అంతేగాదు ఇక్కడ పిల్లలు ప్రశ్నించడం అనేది అగౌరమైనది, ఒకవేళ ఏ పిల్లవాడైన ధైర్యంగా ప్రశ్నించడం మొదలుపెడితే..అతడని దూరంగా ఉంచాల్సిన వ్యక్తిగా నిలబెడతారు. కేవలం నిశబ్దాన్ని ప్రోత్సహిస్తారు. ముందు తల్లిదండ్రులుగా వాళ్లు ఇలానే పెరిగారు, నియంత్రించబడ్డారు, ప్రశ్నించలేదు, భావోద్వేగపరంగా అణిచివేయబడ్డారు..కాబట్టి అదే తర్వాతి తరాలకు పునరావృతం అవుతుందని అన్నారు. అలాగే కొంతమంది పిల్లలకు చిన్న వయసులోనే పెద్దలకు మించిన పరిణితి, అపారమైన మేధస్సు ఉంటుంది, అయినప్పటకీ అక్కడ కూడా ప్రశ్నించడం ద్రోహం, విబేధించడం, అపరాధం అనే భావన కిందకు రావడం దురదృష్టకరం అని అన్నారు. కొందరు తల్లిదండ్రలు ఇలా ప్రశ్నిస్తున్నందుకు పనిష్మెంట్తో నొరు నొక్కే ప్రయత్నం చేస్తుంటారు లేదా గర్విష్టులు, మొండోడు కింద ముద్రవేస్తారని అన్నారు. నో చెప్పడానికి జంకేలా..ఇక్కడ తల్లిదండ్రులు సమాజా అభిప్రాయానికి భయపడతారని అంటున్నారు. పిల్లలను తమను అనుసరించి, తమపై ఆధారపడేలా పెంచుతారని అన్నారు. అదీగాక తల్లిదండ్రలు మరో విషపూరి సంస్కృతికి ప్రాధాన్యత ఇస్తారు. అదేంటంటే పక్కంటి పిల్లవాడితో ప్రతిదానితో పోలుస్తూ..పెంచే ప్రయత్నం చేస్తుంటారు.. ఇది అన్నిట్లంకంటే దారుణైమనది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడ భారతీయ తల్లిదండ్రులు సమాజంపై పోరాడలేక తమ భయాలను పిల్లలపై వేస్తారు, ఆధిపత్యం చెలాయిస్తారని అన్నారు. సింపుల్గా చెప్పాలంటే పిరికితనంతో పెంచుతారని, అది పితృస్వామ్యం విధేయత నుంచి వచ్చిందని అన్నారు. తల్లిదండ్రులు 'నో' అని స్వతహాగా చెప్పడం నేర్చుకోలేదు..పిల్లలకు అది నేర్పించరు. చెప్పాలంటే భారత పేరెంటింగ్స్ తమ పిల్లలను బాగా పెంచామనే ముసుగులో వారికి తెలియని నష్టం చేకురుస్తున్నారు. పైగా వ్యక్తిగత వైఫల్యాన్ని తరతరాలు మోసేలా చేస్తున్నారని తిట్టిపోశారు జస్వీర్ సింగ్. ఆయన ఉద్దేశ్యం ప్రకారం భారత పేరెంటింగ్ టాలీవుడ్ మూవీ బొమ్మరిల్లు లాంటిదని తేల్చేశారు. అయితే గత దశాబ్ద కాలంలో పెంపకం గురించి మనస్తత్వవేత్తలు, అధ్యయనాలు, కౌన్సలర్లు తమ అభిప్రాయాలు పంచుకున్నారు. అలాగే నకుల్ మెహతా, జాన్కీ మెహతా వంటి మిలీనియల్ తల్లిదండ్రులు ఆధునిక అవగాహనతో పిల్లలను స్వతంత్రంగా ఆరోగ్యకరంగా ఎలా పెంచచ్చో అనుభవాలను షేర్ చేసుకున్నారు కూడా.Indian parenting is pressure cooker parenting. One of the worst models globally. Not because parents are evil. But because the system is broken and no one questions it.Most Indian parents didn’t raise children. They raised outcomes.Children are treated like owned assets -…— Jasveer Singh (@jasveer10) February 8, 2026 చదవండి: నీతా అంబానీ ధరించిన చానెల్ బ్లేజర్ ..అంత ఖరీదా!? -
ఫిట్స్ వస్తే.. ఏం చేయాలి?
ఫిట్స్, సీజర్స్, ఎపిలెప్సీ అంటూ పిలిచే ఈ వ్యాధిని చాలా సాధారణ సమస్యగా పరిగణించాలి. చికిత్సతో పూర్తిగా తగ్గే సమస్య ఇది. అయితే దీని గురించి ఇంకా ఇప్పటికీ చాలా అపోహలు ఉన్నాయి. నేడు (ఫిబ్రవరి 9) ఎపిలెప్సీ డే (International Epilepsy Day) సందర్భంగా ఫిట్స్పై అవగాహన కోసమే ఈ కథనం. 90 శాతంలో పూర్తి తగ్గుదల 10 శాతంలోనే మాటిమాటికీ... తీవ్రత ఆధారంగా మందును, మోతాదును నిర్ణయిస్తారు. దాదాపు 70 శాతం మందిలో కేవలం ఒకే ఒక మందుతో నియంత్రణలోకి వస్తాయి. కొద్దిమందిలో... అంటే మరో 10 శాతం బాధితులకు రెండు మందులు, ఇంకో 10 శాతం మందిలో మూడు మందులను వాడాల్సి రావచ్చు. దాదాపు 70 శాతం మంది బాధితులు రెండేళ్ల తర్వాత మందును ఆపేయవచ్చు. దీనికోసం డాక్టర్లు అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుని మందులు ఇక ఆపేయవచ్చనే నిర్ణయానికి వస్తారు. కానీ మరో 10 శాతం మందికి నాలుగు రకాల మందులు వాడినా కూడా ఫిట్స్ పదే పదే వస్తుండవచ్చు.6.5 కోట్ల మందిప్రపంచవ్యాప్తంగా 6.5 కోట్ల మంది ఫిట్స్తో బాధపడుతుండగా మనదేశంలో దాదాపు కోటి నుంచి 1.2 కోట్ల మంది బాధితులున్నారు. డబ్ల్యూహెచ్ఓ లెక్కల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏడాదీ 50 లక్షల మంది కొత్త పేషెంట్స్ ఈ జాబితాలో చేరుతున్నారు. 26 మందిలో ఒకరికి... చూడ్డానికి ఎంతో భయంకరంగా, ఆందోళన గొలిపేలా ఉండే లక్షణాలూ, అపోహల కారణంగానే ఈ పరిణామం చోటుచేసుకుంటోంది. దేశంలోని ప్రతి 26 మందిలో ఒకరికి ఫిట్స్ కనిపిస్తున్నాయి. ఇందులో 80% అల్పాదాయ, మధ్యతరగతివారే. ఇదేమీ భయంకరమైన వ్యాధి కాదు. మానసిక వ్యాధి అంతకంటే కాదు. అంటువ్యాధి కానే కాదు. చికిత్స తీసుకుంటే పూర్తిగా తగ్గిపోయే నిరపాయకరమైన వ్యాధి. అనేక అపోహల కారణంగా దేశంలోని 50% పైగా బాధితులు ఇంకా చికిత్సకు దూరంగా ఉన్నారు.70% మందిలో.. ఫిట్స్ / ఎపిలెప్సీ వచ్చినవాళ్లలో దాదాపు 70 శాతం మందిలో కారణాలు తెలియవు. మిగతా 30 శాతం మందిలో ఏవైనా నిర్దిష్టమైన కారణాలతో ఫిట్స్ వస్తుంటాయి. ఉదాహరణకు... కొందరిలో వంశపారంపర్యంగా, తలకు దెబ్బతగలడం, పక్షవాతం, మెదడులో గడ్డలుగానీ లేదా ఇన్ఫెక్షన్గానీ రావడం వల్ల అలాగే మరికొందరిలో పక్షవాతం (స్ట్రోక్) కారణంగా రావచ్చు.ప్రస్తుతం ఫిట్స్ కోసం దాదాపు 15 రకాల మందులు అందుబాటులో ఉన్నాయి. డాక్టర్లు బాధితుల బరువు ఆధారంగా వీటి మోతాదును నిర్ణయిస్తారు. ఫిట్స్ మళ్లీ మాటిమాటికీ రాకుండా ఉండాలంటే పూర్తి కోర్సు వాడాల్సిందే.మరికొన్ని మార్గాలు ఫిట్స్ తగ్గించేందుకు కొన్ని మార్గాలూ అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో... శస్త్రచికిత్స ప్రక్రియ ద్వారా ఫిట్స్ ఆవిర్భావ కేంద్రాన్ని గుర్తించినట్లయితే... దాన్ని శస్త్రచికిత్స ద్వారా తొలగించుకుని, శాశ్వత పరిష్కారం పొందవచ్చు. ఇక డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ ప్రక్రియ మరొకటి. ఇక కొందరు చిన్నపిల్లలకు కొవ్వులు ఎక్కువగా ఉండే ఆహారం (కీటోజెనిక్ డైట్) ఇవ్వడం ద్వారా ఫిట్స్ను అదుపు చేయవచ్చ. మరికొందరిలో ‘వేగస్ నర్వ్’ అనే నరాన్ని స్టిమ్యులేట్ చేయడం ద్వారా కూడా ఫిట్స్ను అదుపుచేయవచ్చు.ఫిట్స్ వచ్చినప్పుడు... ఫిట్స్ వచ్చినవారికి తాళం చేతులు అందించడం, ఏదైనా లోహపు వస్తువును చేతిలో పెట్టడం చేస్తుంటారు. వాస్తవానికి ఇవేవీ చేయకూడదు. ఫిట్స్రాగానే ఆ వ్యక్తిని.. ∙సురక్షితమైన ప్రదేశంలో ఉంచాలి. ఎక్కువగా కదిలించకూడదు. ∙నోటిలోగాని చేతిలోగాని బలమైన లోహపు వస్తువులను ఉంచకూడదు. ∙ఒక పక్కకు ఒరిగి ఉండేలా పడుకోబెట్టాలి. ∙కాళ్లూ, చేతులు కొట్టుకుంటుంటే దాన్ని ఆపడానికి ప్రయత్నించకూడదు. సాధారణంగా ఫిట్స్ వచ్చినప్పుడు ఐదు నిమిషాల్లో అతడు తనంతట తానే మామూలు స్థితికి వస్తాడు. ఒకవేళ అలా జరగకపోయినా లేదా మళ్లీ వెంటనే ఫిట్స్ రావడం ప్రారంభమైనా వీలైనంత త్వరగా అతడిని ఆసుపత్రికి తరలించాలి.చదవండి: అవాంఛిత రోమాలకు పరిష్కారంచివరగా... ఎపిలెప్సీ అనేది ఉన్నతికి ఏమాత్రం ప్రతిబంధకం కాదు.మహిళల్లో ఎపిలెప్సీ వచ్చినా అది సాధారణ జీవితానికి ఏమాత్రం అడ్డంకి కాదు. అందరిలానే వీళ్లూ పెళ్లిళ్లు చేసుకుని, పిల్లలను కనవచ్చు. -
సాంప్రదాయ తమిళ ఆహారం తింటూనే..22 కిలోలు ..!
వెయిట్లాస్ కోసం ఎన్నో రకాల డైట్లు ఫాలో అవుతుంటాం. కానీ కొందరు సంప్రదాయ ఆహారాన్ని తింటూనే స్లిమ్గా మారతారు. అలాంటి కోవకు చెందిన వాడే ఈ ఫిట్నెస్కోచ్ కాగివన్ ప్రభాహరణ్. అమ్మలాంటి సాంప్రదాయ వంట తింటూనే బరువు తగ్గొచ్చని అంటున్నారు. తాను ఒకప్పుడు అధిక బరువుతో బానలాంటి పొట్టతో ఉండేవాడినని..కానీ ఇప్పుడు సిక్స్ప్యాక్ శరీరంతో స్మార్ట్గా మారానని చెప్పుకొచ్చాడు. అయితే రైస్కి దూరంగా ఉండలేదని..సంప్రదాయ వంటను ఆస్వాదిస్తూనే వెయిట్లాస్ అయ్యినట్లు తెలిపాడు. అందుకోసం డైట్ ఎలా ఫాలో అవ్వాలో కూడా ఇన్స్టాగ్రామ్ వేదికగా వివరించాడు.తమిళులు చాలామంది సిక్స్ ప్యాక్ కోసం డైట్ వేరుగా ఉంటుందని భావిస్తారు. కానీ తాను తమిళ వారసత్వంలో పాతుకుపోయిన పప్పు వంటి వంటకాలను తింటూనే బరువు తగ్గానని అంటున్నాడు. వాటిని తీసుకుంటూనే సిక్స్ ప్యాక్ సాధించానని చెబుతున్నాడు. అమ్మలాంటి సంప్రదాయ వంటకాన్ని, రుచిని వదులుకుని వెయిట్లాస్ అవ్వాల్సిన పనిలేదని, కేవలం స్మార్ట్గా తింటే చాలట. వాస్తవానికి తమిళ భోజనాలలో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయని, ప్రోటీన్ చాలా తక్కువగా ఉంటుందని చెబుతున్నాడు. అందువల్ల అధిక కేలరీలు తీసుకోకుండానే శక్తిని ఇచ్చే వాటిని తీసుకునేవాడినని వీడియోలో తెలిపాడు. ఆ మూడు తప్పనిసరి..సంతృప్తికరమైన భోజనం ఆస్వాదిస్తూనే బరువు తగ్గేందుకు ఈ మూడు మార్పులు చాలా హెల్ప్ అయ్యాయని చెబుతున్నాడు. మొదటి ప్లేట్లో అన్నాన్ని తక్కువ పరిమాణంలో పెట్టుకోవడం. ఎందుకంటే కొలస్ట్రాల్ కరిగేలా..కండరాలను నిర్మించడానికి కార్మోహైడ్రేట్లు అవసరం అందువల్ల ఇలా తీసుకున్నట్లు తెలిపారు. రెండోది సాంప్రదాయ తమిళ ఆహారంలో ప్రోటీన్లు చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి ప్రోటీన్ల నిమిత్తం..చికెన్, చేపలు, గ్రీకు పెరుగు వంటి వాటికి ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలిపారు. ఇక మూడోది..వీటితోపాటు ఫైబర్ కోసం ఆకుకూరలను కూడా చేర్చుకున్నట్లు తెలిపారు. అలాగే ఫిట్నెస్ ప్రపంచంలో తెల్లబియ్యాన్ని దగ్గరకు రానీయరు, కానీ ఇది వెయిట్లాస్కి అడ్డంకి కాదని అన్నారు. ముఖ్యంగా వర్కౌట్ల సమయంలో కండరాలకు ఇంధనంలా ఉపయోగపడుతుందని చెబుతున్నారు. ఇక్కడ ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవడం వల్ల బియ్యం తక్కువగా ఉన్నా..కడుపు నిండిన అనుభూతి మిస్ చేసుకోవాల్సిన పని ఉండదని చెబుతున్నారు. ఎప్పుడైనా నచ్చిన ఆహారం ఆస్వాదిస్తూనే..తెలివిగా కేలరీలు తక్కువగా ఉండేలా చూసుకుంటే వెయిట్లాస్ అవుతామని చెబుతున్నాడు కాగివన్ View this post on Instagram A post shared by Kagivan Prabaharan | Tamil Transformation Coach (@kagsfit) (చదవండి: శ్రుతిమించిన పాజిటివిటీ వద్దు..!) -
ఎంత తక్కువ మోతాదైనా.. ఆ ముప్పు తప్పదు
ఆల్కహాల్ ఎంత తక్కువ మోతాదులో తీసుకున్నప్పటికీ...దాంతో ముప్పు తప్పదంటూ ఇటీవలి తాజా అధ్యయనాలు తెలుపుతున్నాయి. చాలా కొద్దిమోతాదులో ఆల్కహాల్ తీసుకున్నప్పటికీ నోటిలోని చర్మపు పొరల్లో (బక్కల్ మ్యూకోజల్) కేన్సర్ వచ్చేందుకు అవకాశాలు చాలా బలంగా ఉంటాయని ఇటీవలి పరిశోధనల తాలూకు ఫలితాలను ‘బీఎమ్జే గ్లోబల్ హెల్త్’ జర్నల్ ప్రచురించింది. ఆ జర్నల్లో ప్రచురితమైన వివరాల ప్రకారం రోజూ కేవలం తొమ్మిది గ్రాముల ఆల్కహాల్ తీసుకున్నా నోటి క్యాన్సర్ వచ్చే ముప్పు 50 శాతం పెరుగుతుందనీ, అయితే దీనికి తోడు పొగాకు నలమడం కూడా తోడైతే ఆ ముప్పు 62 శాతానికి చేరుకుంటుందని ఆ అధ్యయన వివరాలు తెలుపుతున్నాయి.అందరూ 25 నుంచి 45 ఏళ్ల మధ్యవారే...ఈ నోటి క్యాన్సర్లే వరకే తీసుకుంటే మన దేశంలో ప్రతి ఏడాదీ 1,43,759 కొత్త కేసులు నమోదువుతున్నాయి. అంతేకాదు... ప్రతి ఏడాది ఈ క్యాన్సర్లతో 80,000 మంది మృత్యువాత పడుతున్నారని తేలింది. ఈ క్యాన్సర్ బాధితులందరిలోనూ 45 శాతం మంది 25 నుంచి 45 ఏళ్ల మధ్యవారే ఉంటున్నారని తెలిసింది.ఇక విదేశీమద్యం నాణ్యమైనదనీ, అది తాగేవారిలో ఈ ముప్పు తక్కువని అనుకో డానికి వీల్లేదు. ఇంటర్నేషనల్ బ్రాండ్స్ తాగేవారికి దాదాపు 72 శాతం ముప్పు ఉంటే... అదే దేశీ మద్యం తాగేవారిలో క్యాన్సర్ ముప్పు 82 శాతానికి పెరుగుతుంది.(చదవండి: రూ.20 లంచం కేసులో 30 ఏళ్లు జైలు శిక్ష..! చివరికి..) -
వర్క్-లైఫ్ బ్యాలెన్స్: సాధ్యమేనా? లేక అపోహనా?
"ఆఫీసులో ఉన్నప్పుడు ఇంటి పనులు గుర్తుకొస్తాయి.. ఇంట్లో ఉన్నప్పుడు ఆఫీసు ఫైళ్లు కళ్లముందు కదులుతాయి." ఇదీ ఈ తరం ఉద్యోగి ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాలు. చాలామందికి 'వర్క్-లైఫ్ బ్యాలెన్స్' అనేది కేవలం పుస్తకాల్లో కనిపించే పదంలా, లేదా కార్పొరేట్ కంపెనీలు గోడల మీద తగిలించే పోస్టర్లా మాత్రమే మిగిలిపోయింది. అసలు ఈ బ్యాలెన్స్ సాధ్యమేనా? లేక అదో అందని ద్రాక్షా?బ్యాలెన్స్ అంటే 50-50 కాదు!చాలామంది 'బ్యాలెన్స్' అంటే 24 గంటలను సమానంగా ఆఫీసుకి, ఇంటికి పంచడం అనుకుంటారు. కానీ సైకాలజీ ప్రకారం, వర్క్-లైఫ్ బ్యాలెన్స్ అంటే సమయాన్ని పంచడం కాదు..'ప్రెజెన్స్' (ఉనికిని)పంచడం. అంటే ఆఫీసులో ఉన్నప్పుడు 100శాతంఅక్కడే ఉండటం, ఇంటికి వచ్చాక ఆఫీసు ఆలోచనల నుంచి 100శాతంబయటపడటం. అది లేనప్పుడే అసలైన ఒత్తిడి మొదలవుతుంది.నా దగ్గరికి వచ్చిన ఒక సాఫ్ట్వేర్ మేనేజర్ కిరణ్ (పేరు మార్చాను) అనుభవమే దీనికి నిదర్శనం. కిరణ్రోజూ 12 గంటలు పని చేస్తాడు. "నా భార్యాపిల్లల కోసమే కదా ఇంత కష్టపడుతున్నాను" అంటాడు. కానీ, ఇంట్లో ఉన్నప్పుడు కూడా అతని చేతిలో ఫోన్, మెదడులో ప్రాజెక్ట్ డెడ్ లైన్లు ఉంటాయి. పిల్లలు ఏదైనా అడిగితే చిరాకు పడతాడు. ఫలితంగా, అతను భౌతికంగా ఇంట్లోనే ఉన్నా, మానసికంగా ఎప్పుడో ఆఫీసుకి వెళ్ళిపోయాడు. ఇక్కడ సమస్య 'సమయం' కాదు.. 'మెంటల్ స్విచ్ ఆఫ్' చేయలేకపోవడం.బ్యాలెన్స్ ఎందుకు దెబ్బతింటోంది?• డిజిటల్ కనెక్షన్:వాట్సాప్ గ్రూపులు, ఈమెయిల్ నోటిఫికేషన్లు ఆఫీసుని మన బెడ్రూమ్ దాకా తీసుకొచ్చాయి.• గిల్ట్ (అపరాధ భావం): "నేను ఆన్ లైన్ లో లేకపోతే పని ఆగిపోతుందేమో" లేదా "నా బాస్ ఏమనుకుంటారో" అన్న భయం.• ‘నో’చెప్పలేకపోవడం:మన శక్తికి మించిన బాధ్యతలను మొహమాటానికి ఒప్పుకోవడం.'బ్యాలెన్స్' సాధించడానికి 5 ప్రాక్టికల్ టిప్స్1. Mental Gateway:ఆఫీసు నుంచి ఇంటికి వచ్చే దారిని ఒక వంతెనలా వాడుకోండి. ఆ ప్రయాణంలో సంగీతం వినడమో, లేదా ఆ రోజు జరిగిన పనుల గురించి ఆలోచనలను అక్కడే క్లోజ్ చేయడమో చేయండి. ఇంటి తలుపు తీసే ముందే ఆఫీసు టెన్షన్లను బయటే వదిలేయండి.2. Tech-Free Zone:రాత్రి భోజనం చేసేటప్పుడు లేదా పిల్లలతో ఆడుకునేటప్పుడు ఫోన్ ని పక్క గదిలో ఉంచండి. నోటిఫికేషన్ల శబ్దం మీ ప్రశాంతతను దోచుకోకుండా చూసుకోండి.3. Quality Vs Quantity:మీరు కుటుంబంతో ఎన్ని గంటలు ఉన్నారన్నది కాదు.. ఉన్న ఆ కాసేపు ఎంత quality time గడిపారన్నదే ముఖ్యం. రెండు గంటలు ఫోన్ పక్కన పెట్టుకుని కూర్చోవడం కంటే, ఫోన్ చూడకుండా 20 నిమిషాలు మీ భాగస్వామితో, పిల్లలతో మాట్లాడటం ఎంతో మేలు.4. Boundaries:పని వేళలు ముగిశాక, అత్యవసరమైతే తప్ప కాల్స్/మెయిల్స్ కి అటెండ్ అవ్వకూడదనే నియమాన్ని మీ బాస్ కి, కొలీగ్స్ కి సున్నితంగా చెప్పండి. మీ ప్రైవేట్ టైమ్ ని మీరు గౌరవిస్తేనే, ఇతరులు గౌరవిస్తారు.5. Self-Care:ఖాళీ గ్లాసుతో ఇతరుల దాహం తీర్చలేం. మీకు ఇష్టమైన హాబీని పాటించడం లేదా వ్యాయామం చేయడం వల్ల మీ 'ఎనర్జీ లెవల్స్' పెరుగుతాయి. అప్పుడు మీరు ఆఫీసులోనూ, ఇంట్లోనూ యాక్టివ్ గా ఉండగలరు.మీ కోసం ఒక సెల్ఫ్-చెక్గత వారం రోజుల్లో, మీరు ఏకాగ్రతతో మీ కుటుంబ సభ్యుల కళ్లలోకి చూస్తూ కనీసం 10 నిమిషాలు మాట్లాడారా? లేకపోతే, మీరు బ్యాలెన్స్ తప్పుతున్నారని అర్థం.గుర్తుంచుకోండి.. మీరు ఉద్యోగం మానేస్తే మీ సీటును భర్తీ చేయడానికి కంపెనీకి వారం రోజులు పట్టదు. కానీ మీ కుటుంబంలో మీ స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు. కెరీర్ లో ఎదగండి.. కానీ ఆ క్రమంలో మీ జీవితాన్ని కోల్పోకండి. అవసరమనిపిస్తే సైకాలజిస్ట్ లేదా కెరీర్ కోచ్ సహాయం తీసుకోండి.సైకాలజిస్ట్ విశేష్కెరీర్&మైండ్సెట్ కోచ్8019 000067www.psyvisesh.com -
50 తర్వాత ఇంట్లోనే చేసే వెయిట్లాస్ వ్యాయామాలు..!
50 ఏళ్లు దాటాక ఇదివరకటిలా అధిక ప్రభావ వ్యాయామాలు చేయడం కష్టం. మోకాలి నొప్పి, గాయం వంటి సమస్యలు ఎదురుకావొచ్చు. పైగా ఒంట్లో మునుపటి ఎనర్జీ ఉండదు. అందువల్ల ప్రజలు సులభమైన తక్కువ ప్రభావ వ్యాయామాలు ఎంచుకుంటే మంచిది. అలాగే ఓ వయసు వచ్చాక బరువు తగ్గించే వ్యాయామాలకు శరీరం కూడా సహకరించదు. అలాంటప్పుడు ఇంట్లో సులభంగా చేసే ఈ కొద్దిపాటి వ్యాయామాలు చేస్తే మంచిదని చెబుతున్నారు ఫిట్నెస్ నిపుణులు. అవేంటో చూద్దామా..!.మోకాళ్లపై ఒత్తిడి పడకుండా ఉపయోగకరంగా ఉండే ఈ వ్యాయామాలు 80,90 లేదా వంద కిలోలు బరువుతో ఉండే వాళ్లకు అత్యంత ఉపయుక్తమైనవి. చాలా తేలిగ్గా చేసుకునేవి.మడమ నుంచి తుంటి వరకు నిలబడటం..ఒక కాలు వంచి తుంటికి తాకే ప్రయత్నం చేయాలి. అలాగే చేతులు నిటారుగా ఉంచాలి. ఈ వ్యాయామం మోకాళ్లను సురక్షితంగా ఉంచుతూ తొడలు, పిరుదులను సక్రియం చేయడానికి హెల్ప్ అవుతుంది.తక్కువ-ప్రభావ జంపింగ్ జాక్ఇది మోకాలికి అనుకూలమైన వెర్షన్. పక్కపక్కలకు కాళ్లను కదుపుతూ చాలా తక్కువ మోతాదులో జంప్ చేయడం. ఇది హృదయ స్పందన రేటుని సున్నితంగా పెంచుతుంది. కేలరీలను బర్న్ చేస్తుంది. కీళ్లపై ఒత్తిడి పడకుండా సమన్వయాన్ని మెరుగుపరుస్తుంది.ఒక వైపు నుంచి ఒక వైపుకి..నియంత్రిత పద్ధతిలో ఒక వైపు నుంచి ఒక వైపు నడక. చాలా ఈజీగా చేసే వ్యాయామం. ఇది తుంటి కండరాలను బలోపేతం చేయడానికి, స్థిరత్వాన్నిఇ మెరుగుపరచడానికి సహాయపడుతుంది. ఈ మూడింటిని 20 సార్లు చేసి, ఐదు సెట్లు పునరావృతం చేస్తే చాలని అంటున్నారు ఫిట్నెస్ నిపుణులు. స్థిరత్వంపై దృష్టి పెడుతూ..తేలికైన ఈ కదలికలు బాడీని ఫిట్గా ఉంచడంలో చాలా హెల్ప్ అవుతాయి. ఇలా ప్రతీరోజు చేయడం వల్ల బరువు తగ్గడమే గాక, మోకాళ్ల గాయాలు గానీ, సమస్యలు ఎదురవ్వవని అంటున్నారు. View this post on Instagram A post shared by Nehafun&fitness🤸♂️🧘♀️ (@nehafunandfitness) (చదవండి: తస్మాత్ జాగ్రత్త..! ఎల్లప్పుడూ.."మంచి" ఆరోగ్యానికి ముప్పు..!) -
తస్మాత్ జాగ్రత్త..! అన్నివేళలా "మంచి" ఆరోగ్యానికి చేటు..!
కొందరు అమ్మాయిలు ఎవర్ని నొప్పించకుండా అందరి దృష్టిలో మంచి అనిపించుకునేలా ఉండేందుకు ఇష్టపడతారు. అందుకోసం తమను తాము మార్చుకోవడం, సర్దుబాటు చేసుకోవడం చేస్తుంటారు. అది ఓ మోస్తారు స్థాయిలో ఉంటే పర్లదు. తనను పూర్తిగా ఇబ్బందుల్లోకి నెట్టేలా పరిస్థితులు ఉన్నప్పుడూ కూడా..మంచి వ్యక్తిలా నూటికి నూరు మార్కులు తెచ్చుకోవాలనే ధోరణిలో ఉంటే మాత్రం అంతరంగికి ప్రశాంతత కనుమరుగవ్వుతుంది. అదికాస్త శారీరక, మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపి భారీ మూల్యం చెల్లించేలా చేస్తుందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. అందుకే సాధ్యమైనంత వరకు అన్నివేళలా మంచి అమ్మాయిలా ఉండటం సురక్షితం కాదని నొక్కి చెబుతున్నారు. ఎప్పుడు మంచిగా ఉండటం కోపానికి మించి ఆరోగ్యానికి హానికరమని అంటున్నారు సెలబ్రిటీ హార్మోన్ కోచ్ పూర్ణిమ. అంతేగాదు ఆమె దీన్ని "గుడ్ గర్ల్ సిండ్రోమ్"గా పిలిచారు. మంచి అమ్మాయిగా ఉండండి కానీ..మిమ్మల్ని ఇబ్బందుల్లోకి నెట్టేంతగా మాత్రం కాదు. లేదంటే అది ఒక విధమైన ఒత్తిడికి గురిచేసి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. అదెలాగంటే..దీర్ఘకాలిక ఒత్తిడి, అధిక కార్టిసాల్ఎప్పటికీ ఇతరులను సంతోషపెట్టాలని అనుకుంటే..సదా నాడీ వ్యవస్థ అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది. అది ఒక అలవాటులా మారి నో చెప్పడం, హద్దులు నిర్ణయించడం అసురక్షితంగా మారి..అభద్రతాభావంలోకి నెట్టేస్తుంది. దాంతో ఒత్తిడి బారినపడి శరీరంలో కార్టిసాల్ స్టాయిలను పెంచేస్తుంది. ఫలితంగా నిద్ర లేమి, అధిక బరువు వంటి సమస్యలను ఎదుర్కొంటారు.థైరాయిడ్ అసమతుల్యతఇలా మంచి అనిపించుకునే ధోరణి భావోద్వేగాలను అణిచేస్తుంది. అంటే కోపాన్ని అణిచేసి, గొతు పెగలనీయకుండా చేస్తుంది. దాంతో థైరాయిడ్ బారిన పడతామని అంటున్నారు.జీర్ణ సమస్యలుమన భావాలు ఎప్పుడైతే వ్యక్తీకరించలేకపోతే..జీర్ణక్రియపై ప్రభావం చూపి.. ఉబ్బరం, ఆమ్లత్వం IBS లాంటి లక్షణాలు సాధారణం. భావోద్వేగాలు ప్రాసెస్ చేయబడనప్పుడు శరీరం ప్రతిస్పందిస్తుందట. అదీగాక అధ్యయనం ప్రకారం, ఒత్తిడి శరీరం జీర్ణక్రియను నెమ్మదిస్తుంది లేదా పాజ్ చేయమని సూచిస్తుంది. ఫలితంగా జీర్ణక్రియ దెబ్బతిని..తిన్నది ఒంటబట్టలేని సమస్యను ఎదుర్కొంటారట.హార్మోన్ల అసమతుల్యత, అలసటఇక్కడ "మంచిగా" ఉండటం చాలా శక్తిని ఖర్చు చేస్తుంది. అంటే ఇక్కడ శరీరం ప్రతిసారి మనుగడ అనే మోడ్లోనే ఉండాలి. దాంతో హార్మోన్ల అసమతుల్యతకు దారితీసి..వ్యాధినిరోధక శక్తి సన్నగిల్లుతుంది. నిరంతరం అలసటకు గురవ్వుతారట.ఆందోళన, భావోద్వేగ అలసటఎల్లప్పుడూ మంచిగా ఉండటం వల్ల విశ్రాంతి లేదా ప్రామాణికతకు చోటు ఉండదు. ఆందోళన పెరుగుతుంది. భావోద్వేగ అలసట ఒక వ్యసనంగా మారుతుంది. నిజానికి బయటకు ప్రశాంతంగా కనిపించిన..లోలోపల కుంగిపోయి అలసిపోతారట.దీనికి వైద్యం మిమ్మల్ని మార్చుకోవాలనే సంకల్పానికి పునాది వేయడమే అని అంటున్నారు సెలబ్రిటీ హార్మోన్ కోచ్. ఇది నిజాయితీగా వ్యవహరించటంతో మొదలైన "మంచి" మిమిల్ని అన్నిరకాలుగా ముంచేయడం ప్రారంభిస్తుందన్నది గ్రహించాలి. అసురక్షితమైన స్థితికి తీసుకువచ్చే మంచిని వదులుకోవడమే అన్ని వేళల మంచిదని అంటోందామె. దాంతోపాటు శరీరం మాట వినాలి. మనకు అనుకూలంగా సాధ్యమైనదే అయితే.. దానికే సుముఖత వ్యక్తం చేయాలి. సాధ్యమైనంత వరకు కొన్నింటికి "నో" అని ఎంత మేర చెప్పగలుగుతామో అప్పుడు మనం మానసికంగా, శారీరకంగా సురక్షితంగా, స్ట్రాంగ్గా ఉండగలుగుతారని అన్నారు. అతి సర్వత్ర వజ్రయేత్ అనిపెద్దలు చెప్పిన నానుడిలా అతి మంచి పనికిరాదని గుర్తెరగండి అని సూచిస్తున్నారు నిపుణులు. గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత నిపుణులు లేదా వైద్యులను సంప్రదించడం ఉత్తమం. View this post on Instagram A post shared by Poornima Peri (@poorniimahormonecoach) (చదవండి: మెట్లపై నడుస్తూ ఫోన్ మాట్లాడుతున్నారా..? కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్..) -
మెట్లపై నడుస్తూ ఫోన్ మాట్లాడుతున్నారా..? కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్..
కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ శశి థరూర్ పార్లమెంట్ వెలుపల మెట్లపై పోన్లో మాట్లాడుతూ పడిపోయిన వీడియో నెట్టింట తెగ వైరల్ అయ్యింది. ఆ ఘటనలో శశి ధరూర్కి మడమ ఫ్యాక్చర్ అయ్యిందని ఆయనే స్వయంగా సోషల్ మీడియా పోస్ట్లో పేర్కొన్నారు కూడా. అలాగే ఆయన కోలుకున్నాని, ప్రస్తుతం బాగానే ఉన్నట్లు కూడా తెలిపారు. ఇలా మెట్లపై నడుస్తూ..ఫోన్ మాట్లాడటం మంచిది కాదని నూర్యాలజీ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒకేసారి మల్టీటాస్కింగ్ని బ్రెయిన్ నిర్వహించలేదని హితవు చెప్పారు. ముఖ్యంగా మెట్లపై ఫోన్ స్క్రోల్ చేస్తూ లేదా మాట్లాడుతూ నడవడం అత్యంత డేంజర్ అని హెచ్చరిస్తున్నారు నిపుణులు. ఇది అజాగ్రత్తగా వ్యవహరించడం గురించి కాదని, బ్రెయిన్ వర్కింగ్పై అవగాహన ఉండటం.. అత్యంత ముఖ్యమని అంటున్నారు న్యూరాలజిస్ట్లు. మానవ బ్రెయిన్ బహుళ పనులు చేయగలదు. కానీ ఒకేసారి అన్ని పనులు చేస్తున్నప్పుడు.. విభజింపబడతాయి. దాంతో మొదటి దానికి ప్రాముఖ్యత ఇచ్చి మరోకటిపై అటెన్షన్ పెట్టడంలో విఫలమవుతుంది ఫలితంగా ఆ ప్రభావం మనపై పడుతుందన్నారు. ఇక్కడ మెట్లపై నడుస్తూ ఫోన్ చూసినప్పడూ..చూడటంపైనే అంటే కళ్లమీద బ్రెయిన్ ఫోకస్ ఉండి..నడకపై అటెన్షన్ తప్పుతుంది. అందులోనూ నేలలా చదునుగా ఉండకుండా స్టెప్స్లా ఉంటుంది కాబట్టి పాదం సవ్యంగా పడాలి లేదంటే బ్యాలెన్స్ అవ్వలేం. దాంతో ఎప్పుడైత్ ఫోన్ మాట్లాడుతూ మెట్లు ఎక్కుతామో పడిపోవడం లేదా జారిపడటం జరుగుతంది. దాంతో మెదడు, లేదా శరీరానికి గాయాలయ్యే ప్రమాదం ఉంటుంది. ఒక్కోసారి ప్రాణాంతకంగా కూడా మారే అవకాశం ఉంటుందంటున్నారు నిపుణులు. అంతేగాదు నిపుణులు ఇలా ఎన్నో సార్లు చేశాను అని తేలిగ్గా కొట్టిపారేయొద్దని హెచ్చరిస్తున్నారు కూడా. సాధ్యమైనంత వరకు ఫోన్ మాట్లాడుతూ స్టెప్స్పై నడవాలనుకుంటే రైలింగ్ని పట్టుకోండి నడకపై దృష్టిపెట్టండని అంటున్నారు. సాధ్యమైనంత వరకు వచ్చిన కాల్ పాజ్లో పెట్టి..మెట్లపై నుంచి చదునైన నేలపైకి వచ్చేశాక ఫోన్ కాల్ మాట్లాడితే మంచిదని సూచిస్తున్నారు నిపుణులు.One phone call. One staircase. One misstep.This video of Mr. Shashi Tharoor tripping while talking on the phone and walking downstairs is not about clumsiness. It’s about the brain.(Glad to note that Mr Tharoor is doing well🙏)Your brain is terrible at “walking + phone”… pic.twitter.com/KgNE7XxOYU— Dr Sudhir Kumar MD DM (@hyderabaddoctor) February 5, 2026(చదవండి: బరువు తగ్గించే జైలు'..! ఏకంగా మిలటరీ రేంజ్ శిక్షణ..12 గంటల వ్యాయామాలు..) -
'కొలీగ్పై ఫీలింగ్స్ వస్తున్నాయి.. మా ఆయనకు చెబితే..'
డాక్టర్గారూ నాదొక చిత్రమైన సమస్య. అసలు ఇది సమస్య అవునో కాదో కూడా తెలియడం లేదు. మీరే దీనికి పరిష్కారం చెప్పాలి. నేను ఒక బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్గా పని చేస్తున్నాను. నాది చాలా కలివిడి స్వభావం. అందరితో స్నేహంగా ఉంటాను. ఎవరినీ నొప్పించను. నా మూలాన ఎవరూ బాధపడకూడదనుకునే స్వభావం వల్ల చాలాసార్లు నేను పరిస్థితులతో రాజీపడుతూ వచ్చాను. ఈ లక్షణాన్ని ఆసరాగా తీసుకుని చాలామంది నన్ను మోసం చేసిన సందర్భాలు ఉన్నాయి.కొన్ని సంవత్సరాలుగా నేను ఒకతన్ని ప్రేమిస్తున్నాను. మా మధ్య కూడా చిన్న చిన్న సమస్యలు వచ్చి బ్రేకప్ అవుతూ మళ్లీ కలిసిపోతూ ఉండటం కామన్. మేం ఒకరినొకరు ఇష్టపడి పెళ్లి కూడా చేసుకున్నాం. అతను కూడా బ్యాంక్ ఉద్యోగే. ప్రస్తుతం అతనికి వేరే రాష్ట్రంలో పోస్టింగ్ రావడం వల్ల నెలకు ఒకసారి మాత్రమే కలుసుకుంటున్నాం. ఆరునెలల క్రితం ఒకబ్బాయి నేను పని చేసే బ్యాంకులో ప్రొబేషన్ కోసం జాయిన్ అయ్యాడు. అనుకోకుండా అతనికీ నాకూ మధ్య మంచి స్నేహం ఏర్పడింది. కలిసి సినిమాలకు వెళ్లినా మేమెప్పుడూ హద్దులు దాటలేదు. అయితే నాకు ఇటీవల కొంతకాలంగా అతనిపై ఫీలింగ్స్ వస్తున్నాయి.ఈ విషయం గురించి నా భర్తకు చెబితే మేమిద్దరం దూరంగా ఉండటం వల్లే అలా వస్తూ ఉండి ఉండచ్చని, అందువల్ల నేను ఉద్యోగం మానేసి అతని దగ్గరకు వెళ్లడం గానీ లేదా తనే ఉద్యోగం మానేసి ఇక్కడకు వచ్చి వేరే ఏదైనా ఉద్యోగం చూసుకోవడం మంచిదనీ అన్నాడు. నాకు నా భర్తను వదిలేయాలన్న ఉద్దేశ్యం లేదు. అలాగని ఆ అబ్బాయి మీద ఫీలింగ్స్ను చంపుకోలేకపోతున్నాను. అతనికీ నేనంటే చాలా ఇష్టం. ఈ విషయం నా భర్తకు కూడా తెలిసింది. ఒకవేళ నాకు తనతో ఉండటం ఇష్టం లేకపోతే ఆ అబ్బాయితోనే ఉండమని కూడా అన్నాడు. దీంతో నేను చాలా గందరగోళంలో ఉన్నాను. దయచేసి నేను ఏం చేయాలో సలహా ఇవ్వగలరు. – ఓ సోదరి, విశాఖపట్నంమీ ఉత్తరం చదివాక నాకు అర్థం అయిందేమంటే మీరు చెడ్డవారు కానే కాదు, ఇతరుల కోసం మీ అవసరాలను కూడా వెనక్కినెట్టే మనిషని. ఇది చాలామంది మహిళల్లో కనిపించే గుడ్ గర్ల్ సిండ్రోమ్ (Good Girl Syndrome). చిన్న వయసులోనే ఎవరినీ బాధ పెట్టకూడదు, అందరినీ నచ్చాలి. మనవల్ల ఎవరికైనా కష్టం వస్తే అది మన తప్పే అనే భావనతో పెరిగారు. ఇలాంటివారు పెద్దయ్యాక కూడా ఇదే అలవాటును కొన సాగిస్తారు. అది రిలేషన్షిప్కు కూడా వర్తింపచేసుకోవడం వల్ల ఎప్పుడూ ఇతరుల కోసం అడ్జస్ట్ అవుతూ ఉండటంతోనే సరిపోతుంది. మీ గత రిలేషన్షిప్ అన్నింటిలోనూ ఒక ప్యాటర్న్ కనిపిస్తోంది. మీరు ఎదుటి వారికి నచ్చినట్టుగా ఉన్నంత కాలం మీ బంధం బాగుంటుంది. మీరు మీ అప్రాయం చెప్పినప్పుడో, మీరు అవసరాలు ఉన్నాయని గుర్తు చేసినప్పుడో ఆ బంధం కూలిపోతుంది. దీనివల్ల మీరు మరింత ఆత్మరక్షణ ధోరణిలో పడిపోయారు. నాలాగా నేను ఉంటే నన్ను వదిలేస్తారేమో... ఒంటరి అవుతాననే భయం మిమ్మల్ని పదే పదే కాంప్రమైజ్ అయ్యేలా నడిపించింది.ఇక మీ ప్రస్తుత సమస్య విషయానికొస్తే మీ ఎమోషనల్ సైకిల్ మీ వివాహ బంధంలో కూడా కొనసాగింది. అయితే మీ భర్త మెచ్యూరిటీ వల్ల మీ రిలేషన్షిప్లో ఒక స్థిరత్వం ఏర్పడింది. అదే సమయంలో తను మీకు దూరంగా ఉండటం మీలో ఒక శూన్యాన్ని తీసుకొచ్చింది. ఆ ఖాళీని పూడ్చుకోవడం కోసం మీకు ఆఫీసులో పరిచయం అయిన అబ్బాయికి దగ్గరయ్యారు. ఎప్పుడూ ఎవరో ఒకరిపై ఎమోషనల్గా ఆధారడపడటం అనే మీ గుణం వల్ల మీరు అతనికి ఆకర్షితులయ్యారు. కాని అది నిజమైన ప్రేమ (True Love) కాకపోవచ్చు. మీలో బార్డర్లైన్ పర్సనాలిటీ లక్షణాలు పుష్కలంగా కనపడుతున్నాయి. మీలో చిన్న వయసు నుంచి ఎప్పుడూ ఒక రకమైన ఎమోషనల్ ఎంప్టీనెస్ ఉంది. దీన్ని ఎవరోఒకరి తో భర్తీ చేస్తున్నారు. దీనికోసం ఎవరో ఒకర్ని ఎన్నుకుంటున్నారు. కానీ ఇప్పటివరకు ఎప్పుడైనా మిమ్మల్ని మీరు ఎన్నుకున్నారా అనేది ప్రశ్న! మీ మనసు ఇప్పుడు ఒక అల్లకల్లోలంగా ఉన్న సముద్రంలా ఉంది.చదవండి: నన్ను చూసి నా భార్య భయపడుతోంది.. ఇప్పుడేం చేయాలి?ఇలాంటి సమయంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నా, తర్వాత పశ్చాత్తాప పడాల్సి ఉంటుంది. సమస్య నుంచి బయటపడే మార్గం వెతకండి. వెంటనే ఒక మంచి సైకియాట్రిస్ట్ని, ఒక క్లినికల్ సైకాలజిస్టును కలిస్తే మీలోని ఇబ్బందుల్ని ఎలా అధిగమించాలో నేర్పిస్తారు. మీ జీవితం మీద ఒక స్పష్టత వచ్చేలా సహాయపడతారు. విష్ యు ఆల్ ది బెస్ట్!- డా. ఇండ్ల విశాల్ రెడ్డి, సీనియర్ సైకియాట్రిస్ట్, విజయవాడ. మీ సమస్యలు, సందేహాలు పంపవలసిన మెయిల్ ఐడీ: sakshifamily3@gmail.com -
పాలల్లో యూరియా.. ఐస్క్రీమ్లో డిటర్జెంట్!
ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నాయకుడు రాఘవ్ చద్దా రాజ్యసభలో ఆహారకల్తీపై ధ్వజమెత్తారు. భారతదేశంలో అతిపెద్ద అతిపెద్ద ఆరోగ్య సంక్షోభం: ఆహార కల్తీనే అంటూ మండిపడ్డారు. పాలు దగ్గర నుంచి సుగంధ ద్రవ్యాలు, వంట నూనెలు, ప్యాకేజ్డ్ ఆహారాలు, పానీయాల్లో హానికరమైన రసాయనాలు, అధిక స్థాయిలో సంతృప్త కొవ్వులు, చక్కెర లేదా ఉప్పు వంటివి ఉన్నాయని అన్నారు. అవి అనారోగ్య కారకాలని, పైగా ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయంటూ పెద్దఎత్తున విమర్శలు గుప్పించారు. పైగా దాన్ని స్వచ్ఛత ముసుగులో ఉన్న నకిలీగా అభివర్ణించారు. మార్కెట్లోకి విషాన్ని తీసుకొచ్చి అమ్ముతున్నారంటూ ఆందోళన వ్యక్తం చేశారు. అంతేగాదు సోషల్ మీడియా ఎక్స్ వేదికగా కల్తీకి సంబంధించిన వాటిని జాబితా చేశారు కూడా.పాలలో యూరియాకూరగాయలలో ఆక్సిటోసిన్పనీర్లో కాస్టిక్ సోడాసుగంధ ద్రవ్యాలలో ఇటుక పొడితేనెలో పసుపు రంగుపౌల్ట్రీలో స్టెరాయిడ్లుఐస్క్రీమ్లో డిటర్జెంట్పార్లమెంటులో పాలకల్తీ సమస్యను లేవనెత్తుతూ..చద్దా ఇలా అన్నారు. పరిశోధనల ప్రకారం పాల నమూనాలలో 71% యూరియా, 64 శాతం సోడియం బైకార్బోనేట్ వంటి న్యూట్రలైజర్లు ఉన్నాయి. ఈ దేశంలో అమ్ముడవుతున్నంత పరిమాణంలో పాలు ఉత్పత్తి కావడం లేదు.ఆక్సిటోసిన్ ఒక హానికరమైన రసాయనమని, ఇది తలతిరగడం, తలనొప్పి, గుండె వైఫల్యం, వంధ్యత్వం, క్యాన్సర్కు కారణమవుతుందని అన్నారు.పరీక్షించిన ప్రతి నాలుగు ఆహార నమూనాలలో ఒకటి కల్తీ అయినట్లు తేలింది2014-15 నుంచి 2026 వరకు, పరీక్షించిన అన్ని నమూనాల్లో 25 శాతం కల్తీ ఉన్నట్లు తేలిందని చెప్పారు . అంటే ప్రతి నాలుగు నమూనాలలో ఒకటి కల్తీకి గురవ్వుతుందని అర్థం. దీనివల్ల చాలా మంది అనారోగ్యానికి గురవ్వడమే కాదు ప్రాణాలు కూడా కోల్పోతున్నారంటూ ఆందోళన వ్యకం చేశారు చద్దా.అంతేగాదు చద్దా అంతర్జాతీయంగా నిషేధించిన భారతీయ ఆహార ఉత్పత్తుల గురించి ప్రస్తావిస్తూ.. ఈ దేశంలోని రెండు అతిపెద్ద గరం మసాలా కంపెనీలను అమెరికా, యూకే, యూరప్ అంతటా నిషేధించారు. ఎందుకంటే వాటిలో కేన్సర్కు కారణమయ్యే పురుగులమందులు ఉన్నాయి. కానీ అవే సుగంధ ద్రవ్యాలు భారతదేశంలో ఇప్పటికీ పెద్ద మొత్తంలో అమ్ముడవుతుండటం బాధకరం అని అన్నారు.రాఘవ్ చద్దా దిద్దుబాటు చర్యలను కూడా సూచించారుప్రభుత్వం తక్షణ చర్య తీసుకోవాలని కోరుతూ, ఆమ్ఆద్మీపార్టీ ఎంపీ ఈ చర్యలను సిఫార్సు చేశారు:1. మానవశక్తిని పెంచి..ప్రయోగశాల పరీక్షా సౌకర్యాలను అప్గ్రేడ్ చేయడం ద్వారా భారత ఆహార భద్రత, ప్రమాణాల అథారిటీ (FSSAI)ని బలోపేతం చేయడం.2. నేరస్థులను అరికట్టడానికి కఠినమైన జరిమానాలను ప్రవేశపెట్టడం.3. కల్తీ ఉత్పత్తుల పేర్లు, బహిరంగంగా వెల్లడించడం మార్కెట్ నుంచి తక్షణమే తొలగించేలా చర్చలు తీసుకోవడం వంటివి చేయాలి. Biggest Health Crisis in India 🚨FOOD ADULTERATION - खाने में मिलावट👉Urea in Milk👉Oxytocin in Vegetables👉Caustic Soda in Paneer👉Brick powder in Spices👉 Yellow dye in Honey 👉 Steroids in Poultry👉 Detergent in ice creamWe all are consuming slow poison!Raised… pic.twitter.com/LxWi1nIcP0— Raghav Chadha (@raghav_chadha) February 4, 2026 (చదవండి: 70 ఏళ్ల మహిళకు అంతుపట్టని సమస్య..! కంగుతిన్న వైద్యులు) -
70 ఏళ్ల మహిళకు అంతుపట్టని సమస్య..! కంగుతిన్న వైద్యులు
ఓ వృద్ధ మహిళ దీర్ఘకాలికంగా విపరీతమైన తలతిరగడం సమస్యతో బాధపడుతోంది. ఎన్నో ఆస్ప్రతులు, పలు స్కానింగ్ పరీక్షలు చేసినా..ఎందువల్ల ఈ సమస్య అనేది ఎవ్వరు చెప్పలేకపోయారు. వెద్యులకే అంతుపట్టని మిస్టరీ వైద్య సమస్యలా మారింది ఆమె బాధ. అయితే చివరికి న్యూరాలజిస్ట్లు ఎందువల్ల ఆమెకు ఈ సమస్య వచ్చిందో తెలిసి విస్తుపోయారు. పైగా ఆ వైద్యుడు ఈ ఘటన అందరికీ ఒక హెచ్చరిక అంటూ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. 70 ఏళ్ల మహిళకు విపరీతమైన తలతిరడం సమస్యతో బాధపడుతుంది. ఒంటిరిగా వెళ్లాలన్నా..కాసేపు నుంచొన్న పడిపోతానేమో అనే భయంతో విలవిలలాడింది. ఆ సమస్యతో తాళ్లలేక పలు ఆస్పత్రులు సందర్శించినా..ఎలాంటి సమస్యల లేదని తేల్చి చెప్పారు. ఎమ్మారై నుంచి ప్రతి స్కాన్లో రిపోర్టు నార్మల్గానే రావడంతో వైద్యలు సైతం ఇదొక అంతుపట్టని మిస్టరీ సమస్యగా పేర్కొన్నారు. బ్రెయిన్లో కణితి లేక స్ట్రోక్ వల్ల వస్తుందేమోనని బ్రెయిన్కి సంబంధించిన టెస్ట్లు చేసినా..ఫలితం శూన్యం. దాంతో చివరికి ఆమె న్యూరోలజిస్ట్ని సంప్రదించగా..ఆయన ఆమె సమస్యను క్షణ్ణంగా పరిశీలించారు. ఆయన ఆమె ఎదుర్కొంటుంది సాధారణ తలతిరుగుడు సమస్య కాదని గుర్తించారు. దాంతో ఆమెను లేచి నిలబడి ఉండమని చెప్పినప్పుడూ..కొంచెం సేపు నుంచోలేకపోవడం గమనించారు. ఆ తర్వాత ఆమె ఆహారపు అలవాట్లు గురించి విచారించగా..అసలు సమస్య ఎక్కడ ఉందో ఆయన గుర్తించి సవివరంగా చెప్పారు. పైగా ఇలాంటి సమస్యను చాలామది ఫేస్ చేస్తున్నారని. అయితే వాళ్లే తేలిగ్గా తీసుకోవడంతోనే వెలుగులోకి రాలేదన్నారు. ఎందువల్ల అంటే..ఆ మహిళ దీర్ఘకాలం పాటు పూర్తిగా శాకాహారం, పాల ఉత్పత్తులను నివారించడంతోనే పోషకాహారం లోపం ఏర్పడి.. నరాలు, కీళ్లపై ప్రభావం చూపిందన్నారు. ఆమె నుంచొన్నప్పుడు కాలి వేళ్ల స్పర్శను అనుభూతి పొందలేకపోయిందని చెప్పారు. కాలి చీలమండలం దాక ఎలాంటి సెన్సేషన్ లేకపోవడం గుర్తించారు వైద్యులు. నిలబడుతున్నప్పుడూ ఆ మహిళ బ్యాలెన్స్ చేసుకోలేనట్టుగా ఊగిపోవడం గమనించారు. అది సాధారణ తలతిరగడం సమస్య కిందకు రాదని అన్నారు న్యూరాలజిస్ట్ వైద్యులు. కఠిన శాకాహారిగా తక్కువ పాల ఉత్పత్తులు తీసుకోవడంతో వచ్చిన సమస్యగా వెల్లడించారు. అంతేగాదు దీన్ని బీ12 లోపంగా పేర్కొన్నారాయన. బీ12 లోపం అంటే..నరాలను రక్షించే మైలిన్ తొడుగును నిర్వహించడానికి బీ12 చాలా అవసరం. అది లేకపోతే మెదడుకి సంకేతాలు పంపే పెద్ద ఫైబర్ నరాలు పనిచేయడం మానేస్తాయి. సదరు మహిళకు శరీరంలో బీ12 స్థాయిలు 153 pg/mL ఉన్నాయి . అంటే సాధారణ మనిషికి ఉండాల్సిన దానికంటే అత్యంత తక్కువ. దాంతో వైద్యులు ఆమెకు కండరాల ద్వారా బీ12 ఇంజెక్షన్లు అందించినట్లు తెలిపారు. దాంతో ఆమెకు కొన్ని వారాల్లోనే నడక బ్యాలెన్స్ అయ్యిందని, అలాగే పడిపోతాననే భయం మాయమైందని చెప్పారు. ఆమెకు ఇదివరకటిలా గోడలను పట్టుకోవాల్సిన అవసరం లేకుండా పోయిందన్నారు. ఈ సమస్యను రోగ నిర్థారణ స్కాన్లతో గుర్తించలేమని చెప్పారు. అంతేగాదు పాల ఉత్పత్తులు, లేదా సప్లిమెంట్లు లేకుండా దీర్ఘకాలం పాటు శాకాహారం తీసుకుంటే బీ12 విటమిన్ లోపం వచ్చే ప్రమాదం గణనీయంగా ఎక్కువగా ఉంటుందని వెల్లడించారు. అలాగే ఇలాంటి సమస్యని(బీ12 లోపం) ముందుగా గుర్తిస్తేనే నయం చేయగలమని లేదంటే శాశ్వత వైకల్యాన్ని ఎదుర్కొనక తప్పదని అంటున్నారు న్యూరాలజిస్ట్లు.When the Brain Was Blamed; but the Nerves Told the TruthShe was 70, soft-spoken, and deeply worried.For six weeks, she had been feeling dizzy and unsteady, especially while walking. She described it as “the ground moving under my feet.” At times, she felt she might fall if… pic.twitter.com/do925kj2OZ— Dr Sudhir Kumar MD DM (@hyderabaddoctor) February 4, 2026 (చదవండి: 'బరువు తగ్గించే జైలు'..! ఏకంగా మిలటరీ రేంజ్ శిక్షణ..12 గంటల వ్యాయామాలు..)


