breaking news
Health
-
రుమటాయిడ్ ఆర్థరైటిస్ను ముందుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?
వయసు నలభై దాటితే చాలు..మనలో చాలామంది కీళ్లనొప్పులంటూ ఉంటారు. వీరిలో చాలామంది రుమటాయిడ్ ఆర్థరైటిస్ (Rheumatoid Arthritis) తో బాధపడుతూంటారు. వయసుతో సంబంధం లేకుండా వచ్చే సమస్య ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్. హానికారక సూక్ష్మజీవులేవీ శరీరంలోకి చొరబడకుండా కాపుకాసే రోగ నిరోధక వ్యవస్థే కొన్ని పరిస్థితుల్లో శరీర కణజాలంపైనే దాడులు చేయడం దీనికి కారణం. అందుకే రుమటాయిడ్ ఆర్థరైటిస్ను ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అని పిలుస్తూంటారు. ఇందులో రోగ నిరోధక వ్యవస్థ మీ కీళ్ల మృదువైన లైనింగ్ను సజావుగా కదిలేలా చేసే సైనోవియంపై కేంద్రీకృతమై ఉంటుంది. దేశంలో 2021 నాటికే దాదాపు కోటి ముప్ఫై లక్షల మంది ఈ సమస్యతో బాధపడుతున్నట్లు అంచనాలున్నాయి. అయితే చాలా వ్యాధుల మాదిరిగానే రుమటాయిడ్ ఆర్థరైటిస్ను కూడా వీలైనంత ముందుగా గుర్తిస్తే మెరుగైన చికిత్స అందించవచ్చునని, నొప్పి, ఇతరత్రా బాధలూ తక్కువగా ఉంటాయని అంటున్నారు నిపుణులు. రోగ నిరోధక వ్యవస్థ సైనోవియంపై దాడి చేయడం దీర్ఘకాలం కొనసాగితే కీళ్ల నొప్పి, వాపు, స్టిఫ్నెస్ పెరుగుతుంది. కాలక్రమేణా, ఇది మృదులాస్థిని, ఎముకలను దెబ్బ తీస్తుంది. చికిత్స చేయకపోతే ఇతర అవయవాలను కూడా ప్రభావితం చేస్తుంది. తొందరగా గుర్తించి ప్రభావవంతమైన చికిత్స కల్పించకపోతే కీళ్లకు శాశ్వతంగా నష్టం కలిగిస్తుంది. వైకల్యానికి కారణమవుతుంది. భారతదేశంలో, ముఖ్యంగా 30 - 60 ఏళ్ల మధ్య వయస్సు గల మహిళల్లో రుమటాయిడ్ ఆర్థరైటిస్ గురించి మరింత అవగాహన కల్పించాల్సిన అవసరముందని రుమటాలజిస్టులు నిపుణులు, స్పష్టం చేస్తున్నారు. ఈ వయసు మహిళల్లో ఈ వ్యాధి ప్రభావం వేర్వేరుగా ఉంటుంది. అయితే చాలామందికి ఈ విషయం తెలియదు. గుర్తించడం, చికిత్స అందించడం రెండూ తక్కువే. హైదరాబాద్లోని అడ్వాన్స్డ్ రుమటాలజీ సెంటర్లోని సీనియర్ కన్సల్టెంట్ రుమటాలజిస్ట్ డాక్టర్ సర్వ్జీత్ పాల్ మాట్లాడుతూ, ‘‘రుమటాయిడ్ ఆర్థరైటిస్ను వీలైంత ముందుగా గుర్తిస్తే సమస్య మరీ చేయిదాటిపోకుండా నెమ్మదింపజేయవచ్చు. నొప్పి నుంచి ఉపశమనం పొందడంలోనూ ఇది కీలకం. చాలామందిలో ఈ వ్యాధి చిన్నస్థాయిలోనే మొదలవుతుంది. ఉదయాన్నే మీ కీళ్లు 45 నిమిషాల కంటే ఎక్కువ సమయం బిగుసుకుపోయి ఉంటే, వాచిపోయినా, వివరించలేని తక్కువ-స్థాయి జ్వరం, బాగా అలసట వంటి లక్షణాలు కనిపిస్తే రుమటాయిడ్ ఆర్థరైటిస్ కావచ్చుని గుర్తించండి. తక్షణం వైద్య సాయం పొందే ప్రయత్నం చేయండి’’ అని అన్నారు.రుమటాయిడ్ ఆర్థరైటిస్లో శరీరం రెండువైపుల ఉన్న కీళ్లలో సమస్య ఒకేలా ఉంటుంది. ఉదాహరణకు ఒక మణికట్టు నొప్పిగా ఉంటే, రెండోది కూడా తరచూ బాధిస్తుంది. సాధారణంగా చేతులు, కాళ్లలోని చిన్న కీళ్లతో మొదలై కాలక్రమేణా పెద్దవాటికి వ్యాపిస్తుంది. రోజువారి పనులు చేసుకోవడంలోనూ కొంతమందికి కష్టతరం చేస్తుంది. కొంతమందిలో ఒకవైపు మాత్రమే సమస్యలున్నా ఆశ్చర్యపోనవసరం లేదు. ముఖ్యంగా ప్రారంభ దశలలో లేదా తక్కువ కీళ్లపై ప్రభావం ఉన్నప్పుడు... ఉదయం లేదా విశ్రాంతి సమయంలో పరిస్థితి అధ్వాన్నంగా అనిపిస్తుంది. కదలికలతో కొద్దిగా మెరుగుపడవచ్చు కానీ పనులు చేస్తూంటే నొప్పి తిరిగి రావచ్చు తీవ్రం కావచ్చు. అబాట్ ఇండియా మెడికల్ అఫైర్స్ అసోసియేట్ డైరెక్టర్ డాక్టర్ అంకిత్ రాయ్ మాట్లాడుతూ, “రుమటాయిడ్ ఆర్థరైటిస్ కేవలం ‘వృద్ధాప్యంలో వచ్చే’ సమస్య కాదు. రోగాన్ని వీలైనంత వేగంగా గుర్తించడంతోపాటు వ్యాధి పురరోగమనానికి అనుగుణంగా స్థిరమైన, వ్యక్తిగతీకరించిన సంరక్షణ కూడా అవసరం. అబాట్ వద్ద, సకాలంలో జోక్యం, దీర్ఘకాలిక నిర్వహణకు మద్దతు ఇచ్చే సాధనాలతో వైద్యులు, రోగులు ఇద్దరికీ సాధికారత కల్పించడంపై దృష్టి సారించాం’’ అన్నారు.రుమటాయిడ్ ఆర్థరైటిస్ నిర్వహణ సరైన చికిత్సా ప్రణాళికను గుర్తించడంతో ప్రారంభమవుతుంది. సాధారణంగా వైద్యులు బయోలాజిక్స్ను సిఫారసు చేస్తూంటారు. ఇది... కీళ్ల నొప్పి, వాపునకు కారణమయ్యే రోగనిరోధక వ్యవస్థ భాగాలను లక్ష్యంగా చేసుకునే ప్రత్యేక చికిత్స.బయోసిమిలర్లు అనేవి బయోలాజిక్స్ లాగానే పనిచేయడానికి రూపొందించబడిన మందులు. అవి అసలు బయోలాజిక్ లాగానే సురక్షిత, ప్రయోజనాలను అందిస్తాయి, పని చేసే విధానం కూడా అదే విధంగా ఉంటుంది, తక్కువ ఖర్చుతో ఉంటాయి. రుమటాయిడ్ ఆర్థరైటిస్ నిరోధానికి...క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి: ఈత, సైక్లింగ్, నడక లేదా యోగా వంటి క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం నొప్పి, ఉదయం పూట స్టిఫ్నెస్, అలసటను తగ్గించడంలో సహాయపడతాయి. సమతుల ఆహారం: ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు రుమటాయిడ్ ఆర్థరైటిస్తో వచ్చే సమస్యల పురోగతి, ప్రమాదాన్ని తగ్గించడంలో ఉపయోగపడతాయి.ఒత్తిడిని తగ్గించుకోండి: ధ్యానం, యోగా, మైండ్ఫుల్నెస్ వంటి వాటితో రుమటాయిడ్ ఆర్థరైటిస్ రోగులకు ఎంతో మేలు జరుగుతుంది. -
ఈ మూడింటితో పీరియడ్స్ బాధలకు చెక్ : తమన్నాసెలబ్రిటీ ఫిట్నెస్ ట్రైనర్
పీరియడ్స్ సమయంలో వచ్చే నొప్పులు బాధలు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇదొక హార్మోన్ల ఆట. హార్మోన్ల సునామీని తట్టుకోవడం చాలా కష్టం ఈ సమయంలో జరిగే రక్తస్రావం, వచ్చే కడుపునొప్పి, మానసిక ఆందోళన, మూడ్ స్వింగ్స్, అలసట ఒక్కో మహిళను ఒక్కో రీతిలో బాధిస్తుంటాయి. కొంతమంdray ఈ పీరియడ్స్ మేనేజ్మెంట్ చాలా బాధాకరంగా ఉంటుంది. అందుకే ఈసమయంలో కొన్ని రకాల ఆహారాలను తీసుకోవడం వల్ల ఉపశమనం లభిస్తుందంటున్నారు టాలీవుడ్ హీరోయిన్ తమన్నా భాటియా ట్రైనర్, సెలబ్రిటీ ఫిట్నెస్ ట్రైనర్ సిద్ధార్థ సింగ్తాజాగా ఆయన ఋతుస్రావం సమయంలో ప్రయోజనకరంగా ఉండే మూడు ఆహారాలను గురించి తెలియజేశారు. వాటి ప్రయోజనాల గురించి వెల్లడించారు. పీరియడ్స్కు ముందు వచ్చే నీరసాన్ని, మానసిక భావోద్వేగాలను తట్టుకోవాలంటే మూడు రకాల ఆహారాలను చేర్చుకోవాలన్నారు. పీరియడ్స్ తరచుగా స్త్రీలలో అలసట, అసౌకర్యాన్ని కలగజేస్తాయి. ఇందుకోసం ముదురు ఆకుకూరలు, గ్రీక్ యోగర్ట్, డార్క్ చాక్లెట్ తీసుకోవాలన్నారు. ఆకుకూరలుఆకుకూరలు బాడీలో ఐరన్ స్థాయిలను ప్రభావితం చేస్తాయి. శరీరంలో ఐరన్ లేకపోవడం వల్ల అలసట, తలతిరగడం లాంటి లక్షణాలు కన్పిస్తాయి. అందుకే పాలకూర, కాలే వంటి ఆకుకూరలు తీసుకోవాలి. వీటిల్లో ఐరన్, మెగ్నీషియం కాల్షియం సమృద్ధిగ ఉంటాయి.. ఈ పోషకాలు తిమ్మిరిని తగ్గించడంలో సహాయపడతాయి. శక్తిని పెంచుతాయి.చదవండి: వెయిట్ లాస్లో ఈ మూడింటిని నమ్మకండి : రణబీర్ ఫిట్నెస్ కోచ్ వార్నింగ్గ్రీకు యోగర్ట్పెరుగులో ప్రోబయోటిక్స్, కాల్షియం ఉంటాయి. ఇవి PMS లక్షణాలను( పీరియడ్స్కి ముందు బాధలను) తగ్గిస్తాయి. జీర్ణక్రియకు సహాయ పడతాయని సిద్ధార్థ సింగ్ చెప్పారు. వీటిని భోజనంలో చేర్చుకోవడం వల్ల పేగు ఆరోగ్యం,హార్మోన్ల సమతుల్యత రెండింటికీ ప్రయోజనకరంగా ఉంటుంది.డార్క్ చాక్లెట్పీరియడ్స్ సమయంలో డార్క్ చాక్లెట్ తీసుకుంటే ఉపశమనం లభిస్తుంది. డార్క్ చాక్లెట్లో మెగ్నీషియం, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కండరాలను సడలించి మానసిక స్థితిని మెరుగు పరచడానికి సహాయపడుతుంది. ఇది భోజనం తర్వాత గొప్ప డెజర్ట్ కూడా అయితే అతిగా తినకుండా కంట్రోల్లో ఉండాలని సిద్ధార్థ సింగ్ హెచ్చరించారు.ఇదీ చదవండి: 7 సీక్రెట్స్ : ప్రేమించే భార్య, కొంచెం లక్తో సెంచరీ కొట్టేశా! -
వెయిట్ లాస్లో ఈ మూడింటిని నమ్మకండి : రణబీర్ ఫిట్నెస్ కోచ్ వార్నింగ్
లవర్ బాయ్లా ఉండే బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ ఒక్కసారిగా కండలు తిరిగిన దేహంతో కనిపించి ఫ్యాన్స్ సర్ప్రైజ్ చేశాడు. ఫిట్నెస్ కోచ్ శిక్షణలో తీవ్రమైన కసరత్తు చేసి ఫిట్గా కనిపించాడు. అయితేతాజాగా రణబీర్ను తీర్చిదిద్దిన ఫిట్నెస్ కోచ్ శివోహం భట్ వెయిట్ లాస్ పై ఉన్న అపోహలు గురించి ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో వివరించారు. బరువు తగ్గాలంటే కొత్త డైటీమీ అవసరం లేదు... అశాస్త్రీయమైన వాటిని నమ్మకుండా ఉండే చాలు అని హితవు పలికారు. ఫిట్నెస్ ప్రియులను విపరీతంగా ఆకట్టుకుంటున్న ఆ మూడు మిత్స్ ఏంటో చూసేద్దామా మరి.శివోహం భట్ ప్రకారం కడుపు మాడ్చుకోవడం వల్ల బరువు తగ్గుతారు అనుకుంటే పొరపాటే. దీని వల్ల మజిల్స్ బర్స్ అవుతాయి,కానీ కరిగేది కొవ్వు కాదని తేల్చారు. అపోహలను గుర్తించి జాగ్రత్తగా ఉండాలని సూచించారు. దచాలా మంది తక్కువ తినడం, ఎక్కువ పని చేయడం అనేది కొవ్వు తగ్గడానికి కీలకమని భావిస్తారు. దీని వల్ల తీవ్రమైన కేలరీల లోటులోకి వెళ్లిపోతారని శివోహం హెచ్చరించారు.ఆకలి మెటబాలిజాన్ని తగ్గించేస్తుంది (Starving Slows Metabolism) దీనివల్ల వాస్తవానికి ఏమి జరుగుతుంది? బాడీ సర్వైవల్ మోడ్లోకి వెళుతుంది. కొవ్వును కరిగించడానికి బదులుగా శక్తి కోసం కండరాల కణజాలాన్ని విచ్ఛిన్నం చేస్తుంది. దీంతో మెటబాలిజం నెమ్మదిస్తుంది. మజిల్ అనేది మెటబాలిజాన్ని యాక్టివ్గా ఉంచే టిష్యూ. ఇది విశ్రాంతి సమయంలో కూడా కేలరీలను బర్న్ చేస్తుందన్నారు. కాబట్టి ఆకలితో ఉండటం వల్ల, స్కేల్ పడిపోతుంది. శరీరం నీరసించిపోతుంది. అంతిమంగా ఇది తిరిగి మళ్లీ కొవ్వు పేరుకుపోవడానికే దోహదపడుతుంది. అందువల్ల బరువు తగ్గడం అంటే తక్కువ తినడం కాదు సరిగ్గా తినడం అన్నారు.చదవండి: 7 సీక్రెట్స్ : ప్రేమించే భార్య, కొంచెం లక్తో సెంచరీ కొట్టేశా! కార్డియో కేలరీలను బర్న్ చేస్తుందా?కార్డియో చేస్తే ఎక్కువకేలరీలు బర్న్ అవుతాయనుకుంటారు. ఆపివేసిన మరుక్షణం, కేలరీల బర్న్ కూడా ఆగిపోతుందని శివోహామ్ భట్ గుర్తు చేశారు. వెయిట్ ట్రెయినింగ్ భిన్నంగా ఉండాలి. బరువులు ఎత్తినప్పుడు మజిల్స్ దృఢపడతాయి. ఇవి జీవక్రియ రేటును పెంచుతాయి, అంటే నిద్రపోతున్నప్పుడు కూడా. అందుకే అధిక కొవ్వును కరిగించుకోవాలన్నా, సన్నగా మారాలన్న, కార్డియో, వెయిట్ ట్రెయినింగ్ రెండూ ఉండాలని సూచించారు.డిసిప్లీన్ బెస్ట్: డిసిప్లీన్ పవర్ ఫుల్.. మోటివేష్, విల్వపర్ ఇవన్నీ ఒక ట్రాప్. ఇవి లేక చాలామంది ఇబ్బంది పడతారు. ప్రోటీన్-రిచ్ న్యూట్రిషన్, డీప్ రికవరీ (నిద్ర), స్థిరత్వం ఇదే బెస్ట్ ఫార్ములా. ఇవే గేమ్ చేంజర్స్ అన్నారు. అంతేకానీ ఫ్యాట్ బర్నర్స్, డీటాక్స్ టీలు, క్రాష్ డైట్ ఇవన్నీ తాత్కాలిక చిట్కాలు మాత్రమే అని శివోహామ్ భట్ పేర్కొన్నారు. లేనిపోని హైప్ ఇవ్వడం కాకుండా అలవాట్లను పెంపొందించేలా చూస్తాడు ఫిట్నెస్ కోచ్ . అన్ని సమస్యలకు నిబద్ధతే పరిష్కారమని శివోహామ్ తేల్చి చెప్పారు.ఇదీ చదవండి: మొరింగా సాగుతో.. రూ. 40 లక్షల టర్నోవర్ -
ఆయుష్మాన్ భవ.. ! కాలుష్యాన్ని జయిస్తున్న జీవన విధానం..
ఓ వైపు పెరుగుతున్న కాలుష్యం.. కల్తీ ఆహారం.. అనారోగ్య కారకాలు వంటివి మనిషి సగటు జీవన ప్రమాణాలను ఆయుర్దాయాన్ని దెబ్బతీస్తున్నాయి.. మరోవైపు ఆశ్చర్యకరమైన ఫలితాలను అధ్యయనాలు తేటతెల్లం చేస్తున్నాయి. అయితే దీనికీ ఓ లెక్కుందండోయ్..? అదే ఆరోగ్యకరమైన జీవన విధానం.. అందుకు కావాల్సిన సౌకర్యాలు.. ప్రామాణికాలు.. గతంతో పోలిస్తే మెట్రో నగరాల్లో పలు వనరులు కాలుష్యానికి గురైనా.. మరోవైపు ప్రజల్లో పెరిగిన అవగాహన, విజ్ఞానం, వైద్య సౌకర్యాలు వాటిని అధిగమిస్తూ కొత్త అడుగులు వేయిస్తున్నాయి. ఫలితంగా మానవుని ఆయుఃప్రమాణాలు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయని పలు అధ్యయనాలు చెబుతున్నాయి.. హైదరాబాద్తోపాటు దేశంలోని పదికి పైగా ప్రధాన నగరాల్లో వాయు కాలుష్యం, నీటి కాలుష్యం, కల్తీ ఆహారం వంటివి పెరుగుతూనే ఉన్నాయి. ఇది 3 నుంచి 4 శాతం సగటును నమోదు చేసుకుంటున్నాయి. అయితే అదే సమయంలో ఆరోగ్యంపై పెరుగుతున్న అవగాహన సగటున ఆయుర్దాయాన్ని(Life Expectancy)పెంచడానికి దోహదం చేస్తున్నాయని, దీని వల్ల నగరాల్లో జీవన కాలాన్ని సగటున 70 నుంచి 75 సంవత్సరాలకు పెంచిందని లాన్సెట్ ప్లానెటరీ హెల్త్ వంటి అధ్యయనాలు చెబుతున్నాయి. ఇది వాస్తవానికి పూర్తి భిన్నంగా ఉన్నప్పటికీ అధ్యయన ఫలితాలు మాత్రం ఇది వాస్తవమని చెబుతున్నాయి. పూర్తి భిన్నంగా.. మహానగరాలు గాలి, నీరు, ఆహారం, శబ్ద కాలుష్యంతో నిండిపోయాయి. అయినప్పటికీ, గ్రామీణ ప్రాంత ప్రజలతో పోలిస్తే నగర ప్రజల ఆయుః ప్రమాణాలు మెరుగ్గా ఉన్నాయని పరిశోధనలే చెప్పడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. తాజా అధ్యయనాలు పరిశోధకులను, ఆరోగ్య నిపుణులను విస్తుపోయేలా చేస్తున్నాయి. పట్టణాల కంటే మెరుగైన వాతావరణ పరిస్థితులు పల్లెల్లో ఉంటాయనేది అందరికీ తెలిసిన వాస్తవం.. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. అలాంటి ప్రతికూల పరిస్థితులను అధిగమిస్తూ.. ఈ ఫలితాలు ఉండడం నిజంగా ఆశ్చర్యకరమే.. అయితే ఫలితాలు చెప్పే వాస్తవాలను ఓ సారి పరిశీలించాలని నిపుణులు చెబుతున్నారు. దీనికి జీవన ప్రమాణాల్లో పెరుగుతున్న నాణ్యత అవగాహనే కారణమని తెలుస్తోంది. సర్వే చెబుతోన్నదేంటి!? గతేడాది ప్రచురితమైన బీఎమ్సీ పబ్లిక్ హెల్త్ నివేదిక ప్రకారం.. దేశంలో అధిక ఆదాయం ఉన్న నగర ప్రాంతాల ప్రజలు గ్రామీణ ప్రజలకంటే సగటున 7.5 సంవత్సరాలు ఎక్కువ జీవిస్తున్నారని తేలి్చంది. మెరుగైన ఆర్థిక స్థిరత్వం, ఆరోగ్యపై పెరుగుతున్న చైతన్యం, ఆరోగ్య బీమా, మెరుతైన ఆహారం, వ్యాయామం వంటి అంశాలే కారణాలు ఇందుకు కారణాలుగా పరిశోధనలు చెబుతున్నాయి. హైదరాబాద్లో ఐటీ, ఫార్మా, వంటి ఇతర సరీ్వస్ రంగాల ఉద్యోగాలు మధ్యతరగతి ప్రజల జీవన విధానం, ఆలోచనా ధోరణిలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. వీటితోపాటు నగరంలో ప్రభుత్వాలు చేపట్టే ‘క్లీన్ ఎయిర్ ప్లాన్’, ‘హరిత హైదరాబాద్’ వంటి ప్రాజెక్టులు కూడా ఓ ముఖ్య భూమికను పోషిస్తున్నాయని, దీంతో పాటు ప్రజల్లోనూ ఆరోగ్యంపై వ్యక్తిగత శ్రద్ధ పెరిగిందని, వ్యాయామం, నిద్ర, ఆహార నియమాలు మెరుగైన ఫలితాలకు దోహదం చేస్తున్నాయని తెలుస్తోంది. అవగాహన లేమి.. నగరాలతో పోలిస్తే గామీణ ప్రాంతాలు వెనుకబడడానికి అసలు కారణం అవగాహనా లేమి.. మెరుగైన సౌకర్యాలు లేకపోవడం, ఆదాయ వనరులు, వ్యక్తి శుభ్రత ప్రభావం చూపుతున్నాయని తెలిసింది. ఏదైనా అనారోగ్య సమస్య వస్తే.. సరైన అవగాహన లేక, సదుపాయాలు లేక, ఆయా సమస్యలను, ఆరోగ్య పరిస్థితులను సరైన సమయంలో గుర్తించక ప్రాణాపాయ స్థితికి చేరుతున్నారని, పల్లెతో పోలిస్తే వైద్యు సేవలు, డిజిటల్ కన్సల్టేషన్, టెక్నాలజీ, టెలీమెడిసిన్, ఫిట్నెస్ సెంటర్లు, యోగా వంటివి ప్రభావవంతంగా పనిచేస్తున్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి. ప్రజలకు తెలిసిన వాస్తవ కోణం.. పర్యావరణ, కాలుష్య నియంత్రణ బోర్డు తాజా గణాంకాల ప్రకారం హైదరాబద్ నగర గాలిలో నాణ్యత ‘మోస్తరు నుంచి హానికర స్థాయికి’ మధ్యలో ఊగిసలాడిందని తెలిపింది. జలాశయాలైన హిమాయత్సాగర్, ఉస్మాన్సాగర్, ముసీ నది కాలుష్యానికి గురవుతున్నాయని ఎమ్ఏఎన్యూయూ పరిశోధకులు వెల్లడించారు. పారిశ్రామిక వ్యర్థాలు, డ్రైనేజ్ నీరు, రసాయన అవశేషాల వల్ల భూగర్భజలాలు కూడా కలుషితమౌతున్న విషయం తెలిసిందే. ఆహార విషయంలోనూ హానికర రసాయనాలు నగర మార్కెట్లో మితిమీరిన స్థాయిలో ఉన్నాయని ఫుడ్ సేఫ్టీ విభాగం తెలిపింది. వ్యక్తిగత భద్రత ముఖ్యం.. విజ్ఞానం, సాంకేతికత ద్వారా అందే ఫలాలను అందరూ అందుకోగలగాలి. అప్పుడే జీవిత కాలం పెరగడంతో పాటు, ఒక మెరుగైన జీవితాన్ని అనుభవించగలరు. ఇందుకు విద్య, ఆరోగ్యం పట్ల అవగాహన, పరిసరాల–వ్యక్తిగత పరిశుభ్రత వంటివి చాలా ముఖ్యం.! అందుకే కాలుష్యం అధికంగా ఉన్న పట్టణాల కంటే గ్రామాల్లో ఆయుఃప్రమాణాలు తక్కువ.! పట్టణాల్లో కాలుష్యం తగ్గించే ప్రయత్నాలతో పాటు, గ్రామాల్లో కూడా మెరుగైన వైద్య సేవలు అందుబాటులో ఉండేలా చూసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటే, గ్రామ ప్రజల ఆయుర్దాయం ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది. – డా.ప్రతిభా లక్ష్మి, జనరల్ మెడిసిన్ – ప్రొఫెసర్ -
ప్రపంచ ఆరోగ్య వేదికపై ప్రసంగించిన తొలినటి...! ఏం మాట్లాడారంటే..
చలం, అంబేద్కర్ల నుంచి నటి, ఐక్యరాజ్యసమితి పాపులేషన్ ఫండ్ (యూఎన్ఎఫ్పీఏ) జెండర్ ఈక్వాలిటీకి ఈ దేశపు రాయబారి కృతిసనన్ దాకా అందరి మాటా ఒకటే స్త్రీ ఆరోగ్యమే దేశ భవిష్యత్ భాగ్యం అని!నిజానికి మహిళా ఆరోగ్యం, లింగ సమానత్వం గురించి మాట్లాడుకోవడానికి ప్రత్యేక సందర్భం అక్కర్లేదు.. అయినా ఈ ప్రస్తావనకు ప్రత్యేక సందర్భమూ ఉంది. అదే బెర్లిన్ (జర్మనీ)లో జరిగిన వరల్డ్ హెల్త్ సమ్మిట్ 2025. ఇందులో ఆమె మహిళల ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాల్సిన అవసరం గురించి మాట్లాడారు. ఇలా వరల్డ్ హెల్త్ సమ్మిట్లో ప్రసంగించిన తొలి భారతీయ నటిగా కీర్తి గడించారు. ఆ ప్రసంగంలో కీర్తి సనన్ ఏం మాట్లాడారంటే.. ‘మహిళల ఆరోగ్యం నిర్లక్ష్యం చేయాల్సిన లేదా పక్కన పెట్టాల్సిన విషయం కాదు. తక్షణమే దృష్టిపెట్టాల్సిన అత్యంత అవసరమైన అంశం. ఆమె ఆరోగ్యం.. మానవాళి ప్రగతికి, భవిష్యత్కు మూలస్తంభం. అందుకే మహిళా ఆరోగ్యానికి సంబంధించి సుస్థిరమైన పెట్టుబడులు కావాలి. ఆవిష్కరణలు జరగాలి. ఇందుకోసం చేసే ప్రతి ప్రయత్నం అద్భుతమైన ఆర్థిక, సామాజిక మార్పులుగా ప్రతిఫలిస్తుంది. ఏటా ముప్పై కోట్లు ఇన్వెస్ట్ చేస్తే పదమూడు వందల కోట్ల రాబడి కనిపిస్తోంది. అంటే దాదాపు తొమ్మిది రెట్ల లాభం. ఈ ఇన్వెస్ట్మెంట్ నైతికావసరమే కాదు మన మూకుమ్మడి భవిష్యత్కు భరోసా కూడా! ఎందుకంటే మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబాలు, సమాజం.. ఆరోగ్యంగా ఉంటాయి. ఆరోగ్యవంతమైన సమాజం ఆర్థికసుస్థిరతకు చిహ్నం. కానీ ప్రపంచ జనాభాలో సగంగా ఉన్న మహిళల ఆరోగ్యం ఏళ్లుగా నిర్లక్ష్యానికి గురవుతూనే ఉంది. యూఎన్ఎఫ్పీఏ జెండర్ ఈక్వాలిటీ అంబాసిడర్గా చాలా ప్రాంతాలు తిరిగాను. అవన్నీ కూడా బాల్యవివాహాలకు సాక్ష్యంగా కనపడ్డాయి. అమ్మాయిలకు మానసిక ఆరోగ్యం సంగతి అటుంచి కనీసం శారీరక ఆరోగ్య కేంద్రాలు కూడా అందుబాటులో లేని దుస్థితిలో ఉన్నాయి. వీళ్ల జీవితాలు మారాలంటే మహిళల ఆరోగ్యానికి సంబంధించి దృష్టి పెరగాలి. తక్షణమే ఆ దిశగా కార్యాచరణ నిర్ణయాలు జరగాలి’ అన్నారు కృతిసనన్. (చదవండి: 'జోంబీ' డ్రగ్ జిలాజైన్: అచ్చం 'జాంబీ రెడ్డి' మూవీ సీన్ని తలపించేలా..) -
'జోంబీ' డ్రగ్ జిలాజైన్: అచ్చం 'జాంబీ రెడ్డి' మూవీ సీన్ని తలపించేలా..
తేజ సజ్జా, ఆనంది కీలక పాత్రల్లో ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘జాంబిరెడ్డి’ మూవీలో ఎలాగైతే మనుషులు ప్రవర్తిస్తారో అలా బిహేవ్ చేస్తారట ఈ జిలాజిన్ డ్రగ్ తీసుకుంటే. దీన్ని కొందరు మత్తు పదార్థలతో కలపి తీసుకుంటారట. దాంతో మనుషులు అచ్చం జంతువుల మాదిరిగా ప్రవర్తిస్తారట. ఒక్కోసారి మోతాదు ఎక్కువైతే శరీరం కుళ్లిపోయి..ప్రాణాలు కూడా కోల్పోతారట. ఇంతకీ అసలేంటి డ్రగ్..?. అసలు దేని కోసం దీన్ని తయారు చేశారు?, ఏవిధంగా మత్తుపదార్థంగా వినియోగిస్తున్నారు అంటే..ప్రస్తుతం యూఎస్లో ఈ డ్రగ్ సంబంధిత మరణాలు అధికంగా ఉన్నాయి. అక్కడ ఫెంటానిల్ అనే మత్తు మందుని యువకులు సేవిస్తుంటారట. దానిలో 'జోంబీ' అనే జిలాజిన్ డ్రగ్ కలిపి ఇస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. ఇది శరీరంపై పలు దుష్ప్రభావాలు చూపిస్తుంది. ఒకరకంగా చెప్పాలంటే ప్రాణాంతకమైనది కూడా. నిజానికి ఇది జంతువులను సులభంగా అదుపులోకి తెచ్చే మత్తుమందు. దీన్ని పశువైద్య మందుగా ఉపయోగిస్తారు. అలాంటి డ్రగ్ని అక్రమ మాదకద్రవ్యాల్లో కలిపేస్తున్నట్లు నివేదికలు పేర్కొన్నాయి. ముఖ్యంగా ఫెంటానిల్ అనే మత్తు మందులో కలపడం వల్ల దాని దుష్ఫ్రభావం మరింత తీవ్రతరం అవుతుందట. ఇటీవల కాలంలో అందుకు సంబంధించిన మరణాలు అధికమవ్వడంతో వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతేగాదు ప్రస్తుతం దీనికి సంబంధించిన బాధితులను యూఎస్ ఫిలడెల్ఫియాలోని చుట్టుపక్కల ఉన్న ఆస్పత్రుల్లో వారానికి ఒకసారి చూడాల్సి వస్తోందని చెబుతున్నారు వైద్యులు.జిలాజిన్ అంటే ఏమిటి?జిలాజిన్ అనేది శక్తివంతమైన α-2 అడ్రినెర్జిక్ అగోనిస్ట్. దీనిని మొదట 1962లో బేయర్ అనే శాస్త్రవేత్త రక్తపోటు ఔషధంగా సంశ్లేషణ చేశారు. అయితే దీని తీవ్రమైన దుష్ప్రభావాల కారణంగా పశువైద్య కోసం ఉపయోగించడం మొదలుపెట్టారు. తరువాత ఇది 2000ల ప్రారంభంలో ప్యూర్టో రికోలో వీధి ఔషధంగా దుర్వినియోగం అవడం ప్రారంభించి..రాను రాను వ్యసనంగా మారింది. ఈ మందుని ఇంజెక్ట్ చేయగానే..కండరాలు సడలించి, నొప్పిని తగ్గించి వ్యక్తులను ఒక విధమైన మత్తులో జోగేలా చేస్తుందట. సింపుల్గా చెప్పాలంటే నోర్పైన్ ఫ్రైన్ విడుదలను తగ్గించి..ట్రాన్స్ లాంటి స్థితిని ప్రేరేపిస్తుంది. దీని ఫలితంగా జోంబీ లాంటి ప్రభావం ఏర్పడుతుంది. అదేనండి జాంబీ రెడ్డి మూవీలో విధంగా మనుషులు మారిపోతారని మాట. Welcome to Michigan 🥴🥴🥴🥴😂 pic.twitter.com/CfE1vE2fiM— 0HOUR (@0HOUR1__) September 6, 2025 ప్రమాదకరమైన ప్రభావాలు..ఈ డ్రగ్ నెమ్మదిగా హృదయ స్పందన రేటు పడిపోయేలా చేస్తుందట. తర్వాత తక్కువ రక్తపోటు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వంటి వాటిగి కలిగిస్తుంది. రక్తనాళాలను సంకోచించేలా చేసి తీవ్రమైన చర్మగాయాలకు దారితీస్తుందట. దీన్ని ఎక్కడ ఇంజెక్ట్ చేశామో ఆ ప్రాంతంలో రక్తసరఫరా, ఆక్సిజన్ సరఫరా తగ్గిపోతుందట. తద్వారా కణజాలం చనిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు వైద్యులు. ఇది అచ్చం మాంసం తినే బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లను పోలి ఉంటుందట. కొన్ని సందర్భాలలో కణజాల నెక్రోసిస్ కారణంగా అవయవాలు స్వయంచాలకంగా విచ్ఛిన్నమవడం, ఎముకలు బహిర్గతం అవ్వడం జరుగుతుందట. ఈ డ్రగ్ సంబంధిత గాయాలనేవి.. మోతాదు వినియోగం, వ్యక్తి స్థితిని బట్టి మారుతుంటుందట దాని ప్రభావం. ఆ డ్రగ్ ఇంజెక్ట్ అయిన ప్రాంతంలో నరాలకు కోలుకోలేనంత నష్టం ఏర్పుడతుంది కాబట్టి యథాస్థితి రావడం అసాధ్యమని చెబుతున్నారు నిపుణులు. కానీ ఈ వ్యసనం బారినుంచి బయటపడేలా చేసి, సాధారణ జీవితాన్ని అనుభవించేలా మాత్రం చికిత్స అందించగలమని నిపుణులు చెబుతున్నారు. అలా బయటపడి పూర్తి స్థాయిలో కోలుకున్నవాళ్లుకూడా ఉన్నారని చెబుతున్నారు.📍For informational purposes:These chilling scenes are coming out of Philadelphia, USA, linked to the widespread use of a drug called Xylazine.It’s so potent that it’s been described as a drug that “zombifies” humans 😳Could this be the beginning of an apocalypse? pic.twitter.com/r8Uiq2rYCz— ADTed✨ (@Eduo_Prince) September 6, 2025 (చదవండి: తెర వెనుక డాక్టర్ అనస్థీషియా..! వైద్య రంగంలో వారి సేవలు అద్భుతం..) -
చలి పులి వచ్చేస్తోంది..ఆరోగ్యం జాగ్రత్త!
దసరా అయిపోయింది..దీపావళి పండుగ సన్నాహాలు మొదలైపోయాయి. దీపాల పండుగ వచ్చేస్తుందటంట..వణికించే చలి మొదలైపోతుంది. సరదాగా అనిపించినా.. ఈ కాలంలో ఆహారం, ఆరోగ్యం రెండూ జాగ్రత్తగా చూసుకోవాల్సిందే. అంతేగాదు రైతులు కూడా ఈ అధిక చలికారణంగా నష్టాలను చవిచూస్తుంటారు. ఇలాంటి పరిస్థితుల నుంచి సేఫ్గా ఉండాలంటే..మరీ ఏడాది చలి ప్రభావం ఏ రేంజ్లో ఉందో ముందుగానే తెలుసుకుందామా..!.వాతావరణ శాస్త్రవేత్తలు ఈ ఏడాది భారత్ అత్యంత శీతల శీతకాలన్ని చవిచూడనుందని పేర్కొన్నారు. భారత వాతావరణ శాఖ సైతం ఈ ఏడాదిలో సాధారణం కంటే తక్కువ ఉష్ణోగ్రతలు, తరుచుగా చలి గాలులు, భారీ హిమపాతం వంటి ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది. ఈవిధమైన వాతావరణ మార్పు ప్రపంచ వాతావరణ వ్యవస్థలను దెబ్బతీస్తుందని చెబుతున్నారు వాతావరణ నిపుణులు. ఇప్పటికే జమ్ము కాశ్మీర్లోని సింథాన్ వంటి ప్రాంతాలన్నీ మంచుతో కప్పబడి ఉన్నాయి. ఇక ఇండో గంగా మైదానాల్లోకి చొచ్చుకుపోతున్న చల్లని గాలి పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ రాష్ట్రాలను ప్రభావితం చేస్తుందని నిపుణులు అంచనా వేశారు. అలాగే వాతావరణ ఉష్ణోగ్రతలు తరుచుగా మార్పులు చోటుచేసుకుంటాయని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటియోరాలజీలో సీనియర్ క్లైమాటాలజిస్ట్ డాక్టర్ రీతు శర్మ అన్నారు. ఈ ముందస్తు శీతాకాలపు సూచన ముఖ్యంగా వ్యవసాయం, ప్రజారోగ్యం వాటికి సంబంధించి మెరుగైన సంసిద్ధతకు మేల్కొలుపుగా పేర్కొన్నారు. ఈ ఏడాది రైతులకు అధిక శీతగాలుల కారణంగా గోధుమ, ఆవాలు వంటి రబీ పంటలు దెబ్బతినే అవకాశం ఉందన్నారు. అలాగే ఆరోగ్యపరంగా.. శ్వాసకోస వ్యాధులు, ఫ్లూ వ్యాధులు ప్రబలంగా ఉండే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. ప్రస్తుతం భారతదేశం ప్రపంచ ఆహార దినోత్సవాన్ని జరుపుకుంటున్నందున ఈ వాతావరణ మార్పు, ఆహార భద్రత ఒకదానిపై ఒకటి ఎలా ఆధారపుడుతున్నాయో హైలెట్ చేశారు. అలాగే ఈ ముదస్తు వాతావరణ హెచ్చరికతో ఎలాంటి వ్యవసాయానికి పెట్టుబడి పెడితే మంచిదనేది నిర్ణయించొచ్చని ఎఫ్ఏఓ ప్రతినిధి ప్రియామీనన్ అన్నారు. అలాగే చలికాలం సమీపిస్తున్నందున ప్రజలంతా తమ నిత్యావసరాలను అనువైన విధంగా నిల్వ చేసుకోవడం తోపాటు అనారోగ్యం బారినపడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు నిపుణులు.(చదవండి: Success Story: ఆఫీస్ బాయ్ నుంచి సీఈవో రేంజ్కి..! ఏకంగా డిజైన్ దిగ్గజం కాన్వాతో..) -
టీనేజర్ల మానసిక ఆరోగ్యం : స్పెషల్ టూల్స్ ప్రారంభించిన యూట్యూబ్
గూగుల్కు చెందిన వీడియో షేరింగ్ ప్లాట్ ఫాం యూ ట్యూబ్ (YouTube) దేశంలో టీనేజర్లకోసం ప్రత్యేకంగా విభాగాన్ని అక్టోబర్ 15న ప్రారంభించింది.మానసిక ఆరోగ్యం, శ్రేయస్సుపై దృష్టి సారించి ప్రత్యేకంగా రూపొందించిన ఆధారాల ఆధారిత కంటెంట్ను ప్రారంభించింది. టీనేజర్ల మానసిక ఆరోగ్యానికి మద్దతు ఇచ్చే లక్ష్యంతో YouTube ఈ ప్రత్యేక వీడియో షెల్ఫ్ను లాంచ్ చేసింది. యువ వినియోగదారుల కోసం సురక్షితమైన సమాచారం అందిచేందుకు చేస్తున్న ప్రయత్నంలో ఇది ఒక ప్రధాన అడుగు అని యూట్యూబ్ ప్రకటించింది.ఇందులో డిప్రెషన్, ఆందోళన, ADHD, ఈటింగ్ డిజార్డరలు, తదితర అంశాలపై సమాచారంతో వీడియోలు ఉంటాయి. ఈ కంటెంట్ను సంబంధిత రంగ నిపుణుల సూచనలతో రూపొందించారు. అమెరికా, యూకే, కెనడా, మెక్సికో, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో త్వరలో అందుబాటులోకి రానుంది. ఎదుగుతున్న దశలో వారికి విశ్వసనీయ సమాచారాన్ని సులభంగా అందించడమే లక్ష్యమని గూగుల్ పేర్కొంది. దీనికి సంబంధించిన సమాచారం ‘షెల్ఫ్ ఆఫ్ ఫిలింస్’ (shelf of films) అందుబాటులో ఉంటుంది. యువతకు మానసిక ఆరోగ్యం, ఆరోగ్యం గురించి సినిమాలు తీయడంలో నేర్పించడంలో ప్రత్యేకత కలిగిన అంతర్జాతీయ సంస్థలతో YouTube పనిచేస్తోంది. అలాగే ఒక వీడియోను ‘షెల్ఫ్ ఆఫ్ ఫిలింస్’లో పొందుపరచాలంటే కంటెంట్ టీనేజర్లను లక్ష్యంగా చేసుకుని, ఆకర్షణీయంగా ఉండాలి.భారతదేశంలో ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు చెందిన అగ్ర మానసిక ఆరోగ్య కేంద్రం, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరోసైన్సెస్ (NIMHANS), నమ్మకమైన మానసిక ఆరోగ్య సలహాల నిమిత్తం"మనోసందేశ్" వీడియో సిరీస్ను రూపొందించింది. ప్రముఖ పరిశోధకులు, పేషెంట్ న్యాయవాదులు మరియు మానసిక ఆరోగ్య నిపుణులు ఈ సిరీస్లో తరచుగా అడిగే సమస్యలకు ప్రతిస్పందిస్తారు. ఉదాహరణకు “నా టీనేజర్తో ఒత్తిడి, ఆందోళన గురించి నేను ఎలా మాట్లాడగలను?” లాంటివి ఉంటాయని తెలిపింది.కౌమారదశలో భావోద్వేగాలు, వాటి ముందస్తు గుర్తింపు , మానసిక ఆరోగ్య సమస్యలకు సకాలంలో మద్దతు ఇస్తే, ఇది వారి ఆరోగ్యంపై శాశ్వతంగా మెరుగైన ప్రభావం చూపుతుందని NIMHANSలో సైకియాట్రీ డైరెక్టర్, సీనియర్ ప్రొఫెసర్ డా. ప్రతిమ మూర్తి తెలిపారు. ఇది యువతకు జ్ఞానం, పోరాట నైపుణ్యాలు, అందుబాటులో ఉన్న సంరక్షణ విధానాల ద్వారా సవాళ్లను అధిగమించేలా,, స్థితిస్థాపకతను పెంపొందించడంలోవారి సామర్థ్యాన్ని బలపరుస్తుందన్నారు. వీటిని వారిలో అవగాహనపెంచిడమే, మానసిక ధైర్యాన్ని పెంచడం తోపాటు, పాఠశాలలు, కుటుంబాలు, సొసైటీలో సురక్షితమైన, సహాయవాతావరణాలను కూడా పెంపొందిస్తాయి. ఈ ప్రయత్నాల ద్వారా తదుపరి తరానికి మానసిక ఆరోగ్య ఫలితాలను మార్చడానికి కేంద్రంగా ఉండాలని భావిస్తున్నామని యూట్యూబ్ ప్రకటించింది. టీనేజర్లు అవసరమైనప్పుడు విశ్వసనీయ సమాచారాన్ని యాక్సెస్ చేస్తూ డిజిటల్ స్పేస్ను సురక్షితంగా, యువవినియోగదారులకు మరింత సహాయంగా మార్చాలనే నిబద్ధతలో ఇది భాగమని యూట్యూబ్ హెల్త్ డైరెక్టర్ మరియు గ్లోబల్ హెడ్ డాక్టర్ గార్త్ గ్రాహం తెలిపారు. -
మానసిక వ్యాధులను మందుల్లేకుండానే నయం చేయొచ్చా?
మా అబ్బాయికి చాలా కాలంగా స్కిజోఫ్రీనియా వ్యాధి ఉంది. హైదరాబాదులో చికిత్స ఇప్పిస్తున్నాము. చాలాసార్లు ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యి కరెంటు ట్రీట్మెంట్ (ఇ.సి.టి.) కూడా ఇప్పించాము. చాలా కాలం నుండి డాక్టర్ ఇచ్చిన క్లోజపిన్ మందులు వాడుతున్నాము. అయితే తను మన అందరి లాగా పూర్తిగా నార్మల్గా ఉండడు. కొన్ని లక్షణాలు అలాగే మిగిలి ఉన్నాయి. పని కూడా ఏమీ చేయడు. ఇలా ఉండగా యూ ట్యూబ్లో ఒక కౌన్సెలర్ ఇంటర్వ్యూ చూసి ఆయనను వ్యక్తిగతంగా కలిసి ఆయన సలహా మేరకు మందులు – ఆపేశాం. మందులు మానేస్తే 3–4 నెలల్లోనే జబ్బును పూర్తిగా నయం చేస్తానన్నాడాయన. అలా చేసిన తర్వాత లక్షణాలు తగ్గకపోగా, మరింత పెరిగాయి. మా అబ్బాయికి చెవిలో మాటలు వినపడుతుండడంతో వాటిని తట్టుకోలేక ఆత్మహత్యకి కూడా ప్రయత్నించాడు. ఇప్పుడు నాకు స్పష్టత రావట్లేదు – మళ్ళీ డాక్టర్ని కలిసి మందులు తీసుకోవాలా? లేక ఆ కౌన్సెలర్ చెప్పినట్టే ఇంకొంత కాలం మందులు లేకుండా కౌన్సిలింగ్ మాత్రమే చేయించాలా? ఏది నమ్మాలి? ఏం చేయాలో కన్ఫ్యూజన్ లో ఉన్నాను. అసలు మందులు లేకుండా మానసిక వ్యాధులను నయం చేయలేరా! – శ్రీనివాసరావు, హైదరాబాద్‘స్కిజోఫ్రీనియా’ అనేది ఒక దీర్ఘకాలిక మానసిక వ్యాధి, కొంతమందిలో లక్షణాలు తగ్గినా, చాలాసార్లు దాన్ని పూర్తిగా నయం చేయడం కష్టం. చాలా సందర్భాల్లో దీర్ఘకాలికంగా మందులు అవసరమవుతాయి. కొన్ని సందర్భాల్లో తీవ్ర లక్షణాలు ఉన్నప్పుడు రోగిని ఆసుపత్రిలో ఉంచి ఇ.సి.టి. థెరపీ వంటి చికిత్సలు కూడా ఇవ్వాల్సి వస్తుంది. తరువాత జబ్బు మళ్లీ పెరగ కుండా మందులను చాలాకాలం కొనసాగించడం అవసరం పడవచ్చు. ఇక మీ అబ్బాయికి వాడినట్లుగా మీరు చెబుతున్న క్లోజపిన్ అనే మందు స్కిజోఫ్రీనియా లక్షణాలు మొండిగా ఉన్నప్పుడు, ఇతర మందులు పని చేయని సందర్భాల్లో వాడే ఔషధం. దీనిని డాక్టర్ పర్యవేక్షణలో సరైన డోసుల్లో వాడితే మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఇది ఆత్మహత్య ఆలోచనలను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. మానసిక సమస్యలకు ఇచ్చే చికిత్సలో రెండు ప్రధాన భాగాలు ఉంటాయి. మెదడులో రసాయన అసమతుల్యతను సరిచేయడానికి కొన్ని మందులు వాడడం అలాగే రోగికి, వారి కుటుంబానికి జబ్బుపై అవగాహన పెంచడం (సైకోఎడ్యుకేషన్), లక్షణాలు తగ్గడం కోసం ‘కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ’ వంటి సైకలాజికల్ ట్రీట్మెంట్, ఈ రెండూ కలిపి తీసుకుంటే మంచి ఫలితాలు సాధ్యమవుతాయి. వైద్యుల సూచన లేకుండా మందులను ఇలా ఆపడం చాలా ప్రమాదం! మందులు ఆపిన తరువాత లక్షణాలు పెరిగి, ఆత్మహత్యా ప్రయత్నం జరగడం చాలా తీవ్రమైన విషయం. అందుకే మళ్లీ మీ సైకియాట్రిస్ట్ను కలిసి పరిస్థితిని వివరించి మందులను ప్రారంభించండి. అలాగే మందులతోపాటు, అవసరమైతే అర్హత కలిగిన (ఆర్.సి.ఐ. లైసెన్స్ పొందిన) క్లినికల్ సైకాలజిస్ట్ వద్ద నుండే సైకోథెరపీ కౌన్సెలింగ్ తీస్కోండి. నేటి కాలంలో యూట్యూబ్, సోషల్ ’మీడియా వేదికల్లో చాలా మంది వైద్యపరమైన అర్హత లేని వ్యక్తులు పెద్ద పెద్ద హామీలు ఇస్తూ కనిపిస్తున్నారు. దీర్ఘకాలిక వ్యాధుల విషయంలో ముఖ్యంగా స్కిజోఫ్రీనియా, బైపోలార్ డిసార్డర్. లాంటి మానసిక వ్యాధుల విషయంలో అలాగే ఆటిజం, ఎ.డి. హెచ్.డి. వంటి న్యూరో డెవలప్మెంట్ సమస్యల – విషయంలో అటువంటి అసంబద్ధమైన మోసపూరిత ప్రకటనలను నమ్మరాదని, వైద్యుల సూచన లేకుండా మందులు నిలిపివేయవద్దని మనవి. జబ్బు లక్షణాలు తగ్గేకొద్దీ, డాక్టర్లే మందుల డోసును క్రమేపీ తగ్గిస్తారు, తప్ప అర్హతలేని వారి సలహామేరకు మందులు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆపరాదు.. చిన్న చిన్న మానసిక వ్యాధుల విషయంలో ఒక్కోసారి మందులు లేకుండా కేవలం కౌన్సెలింగ్ తో సరిచేయవచ్చేమో కానీ, స్కిజోఫ్రీనియా లాంటి తీవ్రమైన మానసిక వ్యాధులకు మందులు తప్పనిసరి! చదవండి: మొరింగా సాగుతో.. రూ. 40 లక్షల టర్నోవర్డా. ఇండ్ల విశాల్ రెడ్డి, సీనియర్ సైకియాట్రిస్ట్, విజయవాడ.మీ సమస్యలు, సందేహాలు పంపవలసిన మెయిల్ ఐడీ: sakshifamily3@gmail.com -
హెయిర్కి బియ్యపిండి మాస్క్ మంచిదేనా..? నిపుణులు ఏమంటున్నారంటే..
ప్రముఖ టెలివిజన్ నటి, దీపికా కాకర్(Dipika Kakar) షోయబ్ ఇబ్రహీంల జంట బాలీవుడ్లో ఎంతో ఫేమస్ తెలిసింది. ఎప్పటికప్పడూ సోషల్ మీడియాలో తమ విషయాలను షేర్ చేస్తూ..తమ అభిమానులను సంతోషపరుస్తూ ఉంటారు. అలానే ఈసారి తమ హెయిర్ సీక్రెట్కి సంబంధించిన వీడియోని పోస్ట్ చేస్తూ..తమ అందమైన కురులు రహస్యం బియ్యపిండి మాస్క్ అని వెల్లడించారు. దీన్ని తమ రెండేళ్ల కుమారుడి జుట్టుకి కూడా అప్లై చేస్తామని, ఇది శిరోజాలకు ఎంతో మంచిదంటూ చెప్పుకొచ్చారు అంతేగాదు ఇందులో ఎలాంటి పదార్థాలు ఉపయోగిస్తారో కూడా వివరించాడు ఆమె భర్త షోయబ్ ఇబ్రహీం. అసలేంటి ఈ ప్యాక్..?, ఇది నిజంగానే హెయిర్కి మంచిదా అనే వాటి గురించి సవివరంగా తెలుసుకుందాం. బియ్యపిండి మాస్క్(Rice Flour mask)లో బియ్య పిండి, అవిసె గింజెలు, కొబ్బరి నూనెల మిశ్రమమే ఈ బియ్యపిండి మాస్క్. ఇది కురులను ఆరోగ్యంగా ఉండేలా చేస్తుందని చెబుతున్నారు దీపికా కకార్ దంపతులు. మరి ఇది హెయిర్కి మంచిదేనా..?, అంత చిన్నపిల్లలకు అప్లై చేయొచ్చా? అంటే..నిపుణులు ఏమంటున్నారంటే..ప్రముఖ నిపుణులు ఇందులో ఉపయోగించే బియ్యపిండి, అవిసె గింజలు, కొబ్బరి నూనె వంటి వన్నీ సహజ పదార్థాలని, వీటిలో పోషకాలు సమృద్ధిగా ఉంటాయని అన్నారు. అయితే పెద్దలకు మంచివైనవి ఎప్పుడూ చిన్నారులకు మంచివి కావనే విషయం గుర్తెరగాలని హెచ్చరిస్తున్నారు నిపుణులు. ఎందుకంటే వారి చర్మం చాలా సున్నితం..అందులోనూ వారి బుర్ర ఇంకా గట్టిపడదు..కాబట్టి అక్కడ చర్మం మరింత మృదువుగా ఉంటుందట. కాబట్టి ఇలాంటి వంటింటి చిట్కాలను అనుసరించే మందు కాస్త కేర్ఫుల్గా ఉండాలన్నారు. జుట్టుకి మంచిదేనా అంటే..బియ్యపిండి జుట్టుని సున్నితంగా ఎక్స్ఫోలియేట్ చేసి అదనపు నూనెలను తొలగిస్తుందట. అలాగే ఇక్కడ అవిసె గింజల్లో ఉండే ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు కురుల ఆకృతిని మెరుగుపరుస్తాయిట. ఇక కొబ్బరి నూనె జుట్టుని తేమగా ఉండేలా చేస్తుందట. కానీ శిశువు చర్మానికి ఇవి అస్సలు పనికిరావనిచెబుతున్నారు. అంతేగాదు బియ్యపిండిలో ఉండే అమైనో ఆమ్లాలు, స్టార్చ్ జుట్టుని బలోపేతం చేసి మెరిసేలా చేస్తాయట. అవిసెగింజల్లోని యాంటీ ఆక్సిడెండ్లు జుట్టుని ఉండలు కట్టకుండా చేస్తుందట. తలపై మంటను తగ్గించి, పెరుగుదలను ప్రేరేపింస్తుందట. పర్యావరణ హానికరమైన ప్రభావాన్ని నుంచి రక్షిస్తుందట. నిజానికి ఈ పదార్థాలన్నీ జుట్టు వేగవంతంగా పెరిగేలా చేయకపోయినా..ఆరోగ్యంగా..మెరుగ్గా ఉండేలా చేస్తాయట. తత్ఫలితంగా జుట్టు పెరుగుదల సులభతరం అవుతుందని చెబుతున్నారు నిపుణులు. అలాగే సహజసిద్ధమైనవన్ని సురక్షితం కాదనే విషయం గమనించాలని అంటున్నారు నిపుణులు. అవన్ని ఇంట్లో పరిశుభ్రమైన పద్ధతిలో తయారైనవే అని నిర్థారించుకోవాలని చెబుతున్నారు. అలాగే శిశువులకు ఉపయోగించాలనుకుంటే మందుగా డెర్మటాలజిస్టులను సంప్రదించాలని సూచించారు.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత నిపుణులు లేదా వైద్యులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: 44 కిలోల బరువు తగ్గిన ఫిట్నెస్ కోచ్..! సరికొత్తగా వెయిట్లాస్ పాఠాలు..) -
44 కిలోల బరువు తగ్గిన ఫిట్నెస్ కోచ్..! సరికొత్తగా వెయిట్లాస్ పాఠాలు..
ఆరోగ్యకరమైన జీవినశైలి బరువు తగ్గడానికి సంబంధించి..తప్పుదారి పట్టించే ఇన్ఫర్మేషన్ కారణంగానే చాలామంది వెయిట్లాస్ కాలేకపోతుంటారని చెబుతున్నాడు ప్రముఖ ఫిట్నెస్ ట్రైనర్ యష్ వర్ధన్ స్వామి. కొందరు విఫల ప్రయత్నం చేసి విసిగిపోయినవాళ్లు కూడా ఉన్నారని అంటున్నాడు. తాను ఒకప్పుడు అధిక బరువు ఉండేవాడనని, ఇప్పుడు వెయిట్లాస్ అయ్యి ఆరోగ్యకరమైన బరువుకి చేరుకున్నాని కూడా చెప్పారు.ఆ మార్పు కొన్ని పాఠాలను నేర్పించిందని, అవి శ్రేయోభిలాషులకు తప్పక ఉపయోగపడతాయాంటూ..తన అనుభవాలను షేర్ చేసుకున్నారు. అంతేగాదు బరువు తగ్గడం అనేది క్రమ శిక్షణ, మనసును కంట్రోల్ చేయడం వంటి అంశాలను తప్పక నేర్పిస్తుందని అంటన్నారు. వాటి కారణంగా బరువు తగడ్డం అనేది ఆధారపడి ఉంటుందట. మరి అదెలా అనేది ఆయన మాటల్లోనే సవివరంగా తెలుసుకుందామా.!.ఫిట్నెస్ ట్రైనర్(Fitness coach) యష్ వర్ధన్ స్వామి(Yash Vardhan Swami) 13ళ్ల క్రితం వరకు అధిక బరువుతో ఉండేవాడనని చెప్పారు. ఆ తర్వాత 44 కిలోలు మేర బరువు తగ్గి విజయవంతమయ్యాక..కొన్ని విషయాలు ప్రస్ఫుటంగా అర్థమయ్యాయన్నారు. తను క్రమంగా బరువు తగ్గుతున్నప్పుడూ సంతరించుకున్న మార్పుని గమనిస్తూ..నేర్చుకున్న వెయిట్లాస్ పాఠాలను గురించి సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. బరువు తగ్గడం అనే శారీరక సవాలు.. మానసిక భావోద్వేగాలను సంబంధించిన అంశమని నొక్కి చెప్పారు. ఇక్కడ ఊబకాయం(Obesity) అనేది కేవలం శరీర సమస్య కాదు, జీవిత సమస్య అని అన్నారు. దీని కారణంగా అన్ని సంబంధాలు కోల్పోతామట. ముఖ్యంగా ఆరోగ్యం, సంపద, సంబధాలపై ప్రభావం చూపి..పూర్తిగా సత్సంబంధాలు దెబ్బతింటాయని చెబుతున్నారు. అలాగే వెయిట్లాస్ జర్నీలో అతి ముఖ్యమైన సవాలు మనసుతో యుద్ధం చేయడమేనని అన్నారు. కొలస్ట్రాల్ తగ్గించుకుంటే బరువు తగ్గుతామని అందరికీ తెలుసు. అది కార్యరూపంలోకి రావాలంటే..మనసు కంట్రోల్లో ఉండాలన్నారు. అప్పుడే మనం వేసుకునే వెయిట్లాస్ ప్లాన్ సక్సెస్ అవ్వగలదు. అది నియమానుసారంగా సాగితే..క్రమశిక్షణ, నిబద్ధత అలవడుతుందట. ఎప్పుడైతే మనలో ఇలాంటి మార్పులు చోటుచేసుకుంటాయో అప్పుడూ కుటుంబసభ్యులు, స్నేహితుల నుంచి ఆటోమేటిగ్గా మద్దతు లభించడమే కాదు..మనకో ప్రాముఖ్యత ఏర్పడేలా మన రూపురేఖల్లో మార్పులు సంతరించుకుంటాయని చెప్పుకొచ్చారు. అలాగే ఇంకొక విషయం తప్పక గుర్తించుకోండి అంటూ..ఊబకాయం ఏమి రాత్రికి రాత్రికి మన జీవితాన్ని నాశనం చేయదని చెప్పారు. మన ఆహారపు అలవాట్లతో రోజువారిగా నెమ్మదిగా మన సౌందర్యాన్ని దెబ్బతీసేలా బరువు పెరుగుతుంటామని అన్నారు. అందుకే ఎదుట వ్యక్తులకు శారీరక పరంగా మనపట్ల ఉన్న అభిప్రాయాన్ని లైట్ తీసుకోవద్దని అని సూచిస్తున్నారు. అప్పుడే లోపాన్ని సరిచేసుకునే యత్నం చేసి..బరువు తగ్గేందుకు ట్రై చేస్తామని అన్నారు. అందుకు మనసు తోపాటు డెడికేషన్ అనేది అత్యంత ప్రధానమని గ్రహించమని సూచించారు ఫిట్నెస్ కోచ్ యష్ వర్ధన్ స్వామి. View this post on Instagram A post shared by Yash Vardhan Swami (@trainedbyyvs) (చదవండి: పేదరికాన్ని జయించేశా.. ఎట్టకేలకు అమ్మ కోసం ఇల్లు కట్టేశా..!) -
45 కిలోలకు పైగా వెయిట్లాస్..బెల్లీ ఫ్యాట్ దెబ్బకి కరిగింది!
బరువు తగ్గడం అనేది ఆరోగ్యకరమైన ఆహారం, వ్యాయామాల కలయికతోనే సాధ్యం.అందులోనూ గుట్టలా పేరుకుపోయిన బెల్లీ ఫ్యాట్ వదిలించుకోవడం అంత సులువు. కొంత సమయం దాటిన తరువాత అంది మొండిగా మారిపోతుంది. ఒక పట్టాన కరగదు. అందుకు ప్రత్యేక వ్యాయామాలు చేయాల్సిందే. ఒక మహిళ అయిదు కోర్ వ్యాయామాల ద్వారా బెల్లీ ఫ్యాట్ను తగ్గించుకుంది. దాదాపు 45 కిలోలకు పైగా తగ్గింది. ఈ విషయాన్ని ఇన్స్టాగ్రాంలో షేర్ చేసింది. వెయిట్ లాస్ జర్నీ గురించి తన ఫాలోయర్లతో నిరంతరం షేర్ చేసే ఫెర్నాండా ఇటీవల తన అదనపు కిలోలను తగ్గించుకోవడానికి సహాయపడిన కొన్ని ఉత్తమ వ్యాయామాల గురించి చెప్పు కొచ్చింది. అవేంటో చూద్దాండంబెల్ రష్యన్ ట్విస్ట్బెల్లీ ఫ్యాట్ తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తున్న వారికి రష్యన్ ట్విస్ట్ బెస్ట్ ఆప్షన్ అని తెలిపింది.దీనికి కోర్ కండరాలు ( వెన్నెముక, కటి, దర కండరాలు,దిగువ వీపు,డయాఫ్రాగమ్) భుజం బలాన్ని పెంచడంలో సహాయపడుతుంది. మంచి ఫలితాలకోసం 3 సెట్లు 25 సార్లు చేసిందిఫెర్నాండా .ఎలా చేయాలి? : నేలపై 'V' షేప్లో మోకాళ్లను వంచి, భుజాలు స్థిరంగా ఉండేలా కూర్చోండి. వీపును నిటారుగా ఉంచి రెండు చేతులతో మీ ఛాతీ వద్ద డంబెల్ను పట్టుకుని, నడుమును నెమ్మదిగా ఎడమ నుండి కుడికి తిప్పాలి. దీన్ని రెండు వైపులా రిపీట్ చేయాలి. లెగ్ రైజ్: పొత్తికడుపు, దిగువ ఉదర కండరాలను బలోపేతం చేయడానికి ఇది చాలా బాగ పనిచేస్తుంది లెగ్ రైజ్ ఎక్స్ర్సైజ్ 3 సెట్లు పది సార్లు చేసేదట. నేలపై సమాంతరంగా పడుకుని కాళ్లను పైకి లేపడం. ఇలా చేసేటపుడు, పొత్తికడుపుపై ఒత్తిడిపెంచుతు మోకాళ్లను వంచకుండా చేయాలి. దీని పొత్తికడుపు కొవ్వు కరుగుతుంది. దీన్ని చాలా రకాలుగా చేయవచ్చుఆల్టర్నేటింగ్ లెగ్ రైజెస్వెయిట్లాస్లో ఇది మరో మంచివ్యాయామం. ఇది పొట్ట కొవ్వును బాగా కరిగిస్తుంది. నేలపై పడుకుని, ఒక కాలు తరువాత మరో కాలు నిటారుగా పైకి లేపుతూ చేయాలి.బాడీని నిటారుగా నేలపై ఉంచి, ముంజేతులపై ప్లాంక్ పొజిషన్లో ఉండాలి.ఒక కాలును పైకి లేపి. ఒక సెకను పాటు పట్టుకుని, నెమ్మదిగా కిందకు దించాలి.మరొక కాలుతో దీన్ని రిపీట్ చేయాలి.లెగ్ రైజ్ హోల్డ్: వెల్లకిలా పడుకుని, కాళ్ళు నిటారుగా చాపి, చేతులు పక్కన ఉంచే వ్యాయామం.నేలపై పడుకుని కాళ్ళను నేల నుండి 45 డిగ్రీల కోణంలో పైకి లేపి, కొద్దిసేపు పట్టుకుని ఉండాలి, ఆపై నెమ్మదిగా కిందికి దించాలి.డంబెల్ హాఫ్ క్రంచ్ : నేల మీద పడుకొని, మోకాళ్లను వంచి, పాదాలను నేలపై ఉంచి రెండు చేతులతో సౌకర్యవంతంగా డంబెల్ పట్టుకోవాలి. డంబెల్తోపాటు బాడీని పైకి ఎత్తేటప్పుడు శ్వాస వదులుతూ, పైకి లేపి కొద్దిసేపు హోల్డ్ చేసి, నెమ్మదిగా యథాస్థానానికి రావాలి. ఇది పొట్ట దగ్గర కొవ్వును కరిగించి, కండరాలను దృడం చేస్తుంది. ఈ వ్యాయామాలతో పాటు, లోఫ్యాట్ డైట్ను పాటిస్తూ 45 కిలోలకు పైగా బరువు తగ్గింది. View this post on Instagram A post shared by Fernanda (@fernandadidit)నోట్ : ఫెర్నాండా విషయంలో వ్యాయామాలు,ఆహారం అద్భుతాలు చేసినప్పటికీ. మన బాడీకి ఏది కరెక్ట్ అది నిర్ధారించుకోవాలి. ఎలాంటి ఆహారం తీసుకోవాలి,ఎన్ని కేలరీలు అవసరం, ఎలాంటి వ్యాయామం చేయాలి అనే నిర్ణయం తీసుకునే ముందు నిపుణుల సలహా తీసుకోవాలి. -
ప్రాణాలు నిలిపే అదృష్టం ఊరికే రాదు!
World Anaesthesia Day 2025 అదృష్టం ఊరికే రాదు. ఎవరైనా దాన్ని అందుకోవడానికి సిద్ధంగా ఉంటేనే అంది వస్తుంది. ఒక ప్రాణం కాపాడటం అలాంటి అదృష్టమే. దానికి వైద్యుడే కానక్కర లేదు. కొద్దిపాటి అవగాహన, కొంచెం శిక్షణ దొరికితే ప్రతీ పౌరుడూ ప్రాణం నిలపగలడు. మొదట నా సొంత అనుభవానికి వద్దాం. వైద్యునిగా, ప్రత్యేకించి అనస్థీషియా (మత్తువైద్యం) నిపుణుడిగా ఎవరికైనా అరు దుగా దక్కే అదృష్టం నాకు దక్కింది. అదేమిటంటే నా చేతిలో నా తండ్రి ప్రాణం తిరిగి రావడం! నేను 2001లో ఎంపీగా ఉన్న రోజుల్లో ఒక అధికారిక పర్యటనలో ఉండగా మా పల్లెటూరు పాలికవలసనుండి ఫోన్ వచ్చింది... నాన్నకు బాగులేదని. పార్వతీపురం నుండి ఆ ఊరు నలభై కిలోమీటర్లు. అప్పటికే నాన్న బీపీ పేషెంట్ కనుక ఎందుకైనా మంచిదని అత్యవసర మందులు పట్టుకుని బయలుదేరాను. ఇంటికి చేరి మూడు నిమిషాలు అయిందో లేదో నాన్నకు గుండె, ఊపిరి ఆగి పోయాయి (కార్డియాక్ అరెస్ట్). వెంటనే ఆయన్ని సరైన పొజిషన్లో ఉంచి నోటితో శ్వాస అందిస్తూ, గుండెపై బలంగా నొక్కుతూ అత్యవసర ప్రక్రియ చేపట్టాను. కాసేపటికి ఆయన గుండె కొట్టుకోవడం, ఊపిరి తీసుకోవడం మళ్లీ మొదలైంది. గండం గట్టెక్కింది. మిగతా వైద్యం కోసం హాస్పిటల్కు తక్షణం పంపే ఏర్పాట్లు చేశాను. ఇదంతా ప్రత్యక్షంగా చూస్తున్న గ్రామీణులకే కాదు, బాగా చదువుకున్న అనుచరులకు, సెక్యూరిటీ సిబ్బందికి కూడా వింత. నాకు పట్టరాని ఆనందం. తలుచుకుంటే ఇప్పటికీ అంతే ఆనందం.చదవండి: ఫ్యామిలీ కోసం కార్పొరేట్ జీతాన్ని వదులుకుని రిస్క్ చేస్తే..!గుండె, ఊపిరి ఆగిపోయిన క్షణాల్లో అందించే ప్రాథమిక అత్యవసర ప్రక్రియ (కార్డియో పల్మనరీ రిససిటేషన్) క్లిష్టమైన ప్రక్రియ కాదు. ఎవరైనా నేర్చుకోగలరు. గతంలో అది వైద్యులకే పరిమితమైన విద్య. ఇప్పుడుఅందరూ నేర్చుకోవాల్సిన ప్రాథమిక నైపుణ్యం. ఎందుకంటే ఆ మొదటి క్షణాల్లో అందించే వైద్య సహాయం ద్వారా ఎన్నో ప్రాణాలు కాపాడగలం. రోగిని గట్టి బల్లపై లేదా రోడ్డుపై పడుకోబెట్టడం, ఛాతీపై తగు బలంతో నిమి షానికి 100 సార్లు చేతులతో ఒత్తిడి ఇవ్వడం, అభ్యంతరం లేకపోతే నోటికి నోటి ద్వారా శ్వాస అందించడం లాంటి వాటితో ఒక ప్రాణాన్ని తిరిగి తీసుకు రావచ్చు. ఈ నైపుణ్యాలపై విద్యార్థుల్లో, పౌరులందరిలో అవగాహన కల్పించాలి. ప్రస్తుతం ఈ దిశగా జరుగుతున్న కృషి ప్రాథమిక స్థాయిలో ఉంది. ప్రభుత్వం, పౌర సమాజం దృష్టి పెడితే ప్రజారోగ్య కోణంలో సమాజానికి చాలా మేలు జరుగుతుంది.– డా.డి.వి.జి. శంకరరావు మాజీ ఎంపీ(అక్టోబర్ 15.. ప్రపంచ అనస్థీషియా దినోత్సవం) -
‘అపోలో’ వేదికగా అంతర్జాతీయ ఆరోగ్య సంభాషణ 2026
హైదరాబాద్]: రోగుల భద్రత, ఆరోగ్య సంరక్షణలో కొత్త ఆవిష్కరణలు, వ్యవస్థల అభివృద్ధిని ప్రోత్సహించే ప్రపంచంలోని ప్రముఖమైన వేదికల్లో ఒకటైన అంతర్జాతీయ ఆరోగ్య సంభాషణ (International Health Dialogue - IHD) 2026 ఎడిషన్ను అపోలో హాస్పిటల్స్ నిర్వహించనుంది. ఈ సదస్సు 2026 జనవరి 30 మరియు 31 తేదీలలో హైదరాబాద్లో జరగనుంది. ఐహెచ్డీ 2026 థీమ్ 'గ్లోబల్ వాయిసెస్ వన్ విజన్’ ఈ థీమ్ ఒక ఉమ్మడి లక్ష్యం పట్ల ఉన్న నిబద్ధతను తెలియజేస్తుంది. ఆ లక్ష్యం ఏంటంటే.. పటిష్టంగా, రోగి-కేంద్రీకృతంగా, సాంకేతికతతో కూడిన ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలను నిర్మించడం. ఈ లక్ష్యాన్ని సాధించడానికి, ప్రపంచం నలుమూలల నుండి వచ్చే ఆలోచనలు, ఆవిష్కరణలు, నాయకత్వాన్ని ఒకే వేదికపైకి తీసుకురావాలని ఈ సదస్సు భావిస్తోంది. ఈ కార్యక్రమం ప్రధానంగా మూడు కీలక అంశాలపై దృష్టి సారిస్తుంది. అవి: నాయకత్వంతో నడిచే భద్రతా నమూనాలు; మానవ-కేంద్రీకృత రూపకల్పన, డిజిటల్ పరివర్తన; అలాగే ఆసుపత్రి కార్యకలాపాలు, రోగి అనుభవం, చికిత్స ఫలితాలు వంటి అన్ని రంగాలలో అత్యుత్తమ ప్రమాణాలు సాధించే అంశాలపై సదస్సు దృష్టి పెడుతోంది.అపోలో హాస్పిటల్స్ గ్రూప్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ డా. సంగీత రెడ్డి మాట్లాడుతూ, “ఎన్నో ఏళ్లుగా అంతర్జాతీయ ఆరోగ్య సంభాషణ (IHD) ఒక శక్తివంతమైన ప్రపంచ వేదికగా మారింది. ఇక్కడ వైద్యులు (క్లినిషియన్లు), కొత్త ఆవిష్కరణలు చేసేవారు (ఇన్నోవేటర్లు), విధానాలు రూపొందించేవారు, ఆరోగ్య సంరక్షణపై అవగాహన పెంచేవారు అంతా ఒకచోట చేరి, ఆరోగ్య సంరక్షణ భవిష్యత్తును రూపొందిస్తున్నారు. హైదరాబాద్లో జరిగే ఈ సమావేశం కూడా అదే లక్ష్యంతో ముందుకు సాగుతుంది’ అని అన్నారు. -
ఆ టైంలో హెల్ప్ అడగడం తప్పుకాదు, మీకోసం మీరు ఏడ్వండి : సారా
వృత్తి జీవితంలో ఆందోళన, ఒత్తిడి మానసిక ఆరోగ్యాన్ని (Mental Health) ప్రభావితం చేస్తుంది. ఇది మొత్తం ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. అందుకే మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి గతంలో అనేకసార్లు చెప్పిన బాలీవుడ్ నటి సారా అలీ ఖాన్ ( Sara Ali Khan) మరోసారి మానసిక ఆరోగ్య సమస్యల గురించి, ఒత్తిడి, చికిత్స లాంటి విషయాలను గురించి మాట్లాడింది. మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా సులభం. అని చెప్పిన సారా మానసికంగా ఒత్తిడిలో ఉన్నపుడు సాయం అడగడంలో తప్పు లేదనీ, అది బలహీనతగా భావించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. అంతేకాదు ఆ సమయంలో మీరు చేయాల్సిందల్లా ఒక క్షణం ఊపిరి పీల్చుకుని, మీకు మీరే భారం తీరే దాకా ఏడ్చేయాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.ట్రోలింగ్, మానసిక ఆరోగ్యంపై దాని ప్రభావంపై గతంలో తన అభిప్రాయాన్ని వెల్లడించిన సారా అలీ ఖాన్ వృత్తి జీవితంలో ఒత్తిళ్లపై తాజాగా మరో ఇంటర్వ్యూలోతన అభిప్రాయాలను అనుభవాన్ని షేర్ చేసింది. మానసిక ఒత్తిడికి లేదా చికిత్స తీసుకోవడం అంటే బలహీనత కాదు, అది వికాసానికి, స్వీయ అవగాహనకు దోహదపడుతుందని చెప్పింది. బలం అంటే భావోద్వేగాలను అణిచివేయడం కాదు, వాటిని అంగీకరించే ధైర్యం కలిగి ఉండటం అని తాను నమ్ముతానని తెలిపింది. తన కరియర్లో ఒత్తిళ్లు తీవ్రంగా ఉంటాయి బలంగా ఉండటానికి ప్రతీదాన్ని మేనేజ్ చేసుకోవాలని తెలిపింది. అంతేకాదు మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యతపై మాట్లాడుతూ మనస్సును జాగ్రత్తగా చూసుకోవడం ఎంత ముఖ్యమో శరీరాన్ని జాగ్రత్తగా చూసుకోవడం అంతే ముఖ్యమని తనకు అర్థమైందని తెలిపింది.కొన్నిసార్లు ఊపిరి పీల్చుకోవడానికి, మీ శరీరాన్ని కదిలించడానికి, అవసరమైతే ఏడవడానికి లేదా అపరాధ భావన లేకుండా విశ్రాంతి తీసుకోవడానికి సమయం కేటాయించడం అవసరమని సారా పేర్కొంది. నిజంగా ఆ క్షణాలు తన ఫీలింగ్ ఏంటో గ్రహించడంలో సాయపడ్డాయనీ, అనుకున్న దానికంటే బలంగా ఉన్నానని గుర్తు చేశాయని తెలిపింది. వేగాన్ని తగ్గించి, కాస్త నిదానించడం, సహాయం అడగడం అవసరం.. అన్నిసార్లు అన్నీ చేసేయ్యాలని ఏమీ లేదు.. మీరు మీరుగా ఉంటే సరిపోతుందని చెప్పుకొచ్చింది సారా.అలాగే నేటి తరం మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తున్నప్పటికీ, దాని చుట్టూ ఇప్పటికీ కొన్ని అపోహలున్నాయనీ. మానసిక ఆరోగ్యం గురించి మాట్లాడటం, చికిత్స తీసుకోవడం చాలా సాధారణంగా జరగాలని ఆమె అభిలషించారు. మరోవైపు సారా ఒత్తిడికి గురైనప్పుడు తక్షణమే తన ఉత్సాహాన్ని పెంచే మార్గం వైపు మొగ్గు చూపుతుంది. తన మూడ్-లిఫ్టర్లలో డ్యాన్సింగ్ ఒకటని చెప్పింది. అలాగే యోగా పైలేట్స్ కు ప్రాధాన్యత ఇస్తుంది. మరో విధంగా చెప్పాలంటే ఆమెకు నృత్యం కేవలం ఫిట్నెస్ కాదు, అదొక చికిత్స.2018లో కేదార్నాథ్తో తన కెరీర్ను ప్రారంభించిన సారాఅలీ ఖాన్, నట జీవితంలో తానేంటే నిరూపించు కుంటూ ముందుకు సాగుతోంది. బాలీవుడ్ నటులు సైఫ్ అలీ ఖాన్ , అమృతా సింగ్ల కుమార్తె సారా. -
డౌన్స్ సిండ్రోమ్లో ఇన్ని రకాలున్నాయా? చికిత్స ఎలా?
మనిషిలో ఉండాల్సిన 46 (అంటే ఇరవైమూడు జతల) క్రోమోజోములకు బదులుగా... ఒకవేళ ఏదైనా కారణాల వల్ల ఈ సంఖ్య కాస్తా 47కు చేరితే... అప్పుడు ఆ బిడ్డలో కనిపించే రుగ్మత పేరే ‘డౌన్స్ సిండ్రోమ్’. అంటే... ఇందులో 21వ క్రోమోజోము తాలూకు ‘కాపీ’ ఒకటి అదనంగా ఏర్పడుతుంది. ఫలితంగా 46 క్రోమోజోములు కాస్తా 47గా మారి΄ోతాయి. ఇలా జరిగినప్పుడు అలా పుట్టిన పిల్లలకు కొన్ని మానసికమైన లోపాలు కనిపిస్తుంటాయి. ఇంగ్లాండుకు చెందిన ఫిజీషియన్ జాన్ లాంగ్డన్ డౌన్ ఈ కండిషన్ను కనుగొన్నారు. దాంతో ఈ మెడికల్ కండిషన్కు ఆయన పేరిట ‘డౌన్స్’ సిండ్రోమ్గా పేరు పెట్టారు.ఇందులోనూ కొన్ని రకాలు ఉన్నాయి. ఉదాహరణకు డౌన్స్ సిండ్రోమ్లో రకాలు...ట్రైజోమీ: రెండు జతలుగా ఉండాల్సిన 21వ క్రోమోజోమ్కు మరొకటి అదనంగా చేరడం వల్ల కలిగే కండిషన్. డౌన్స్ సిండ్రోమ్తో బాధపడేవారిలో 94 శాతం మందిలో సాధారణంగా ఈ కండిషనే ఉంటుంది. దీన్ని ‘ట్రైజోమీ’ అంటారు. ట్రాన్స్లొకేషన్ : 21వ క్రోమోజోమ్ నుంచి ఒక ముక్క విడివడి అది వేరే క్రోమోజోమ్కు అంటుకోవడాన్ని ట్రాన్స్ లొకేషన్ అంటారు. ఈ తరహా కారణంతో డౌన్స్ సిండ్రోమ్ రావడం మరో 4 శాతం మందిలో కనిపిస్తుంది. మోసోయిజమ్ : ఇది కేవలం 2 శాతం మందిలోనే ఉండే అరుదైన పరిస్థితి. ఇది పై రెండు విధాల కంటే భిన్నంగా ఉంటుంది. డౌన్స్ సిండ్రోమ్ పిల్లల్లో కనిపించే లోపాలు...సాధారణంగా డౌన్స్ సిండ్రోమ్తో పుట్టిన పిల్లల్లో కొన్ని శారీరక, మానసిక లో΄ాలు కనిపిస్తాయి. వాటిలో ముఖ్యమైనవి ఇవి.. కండరాల పటుత్వం తగ్గి పుట్టడం. మెడ వెనక భాగంలో దళసరి చర్మం ఉండటంముక్కు చప్పిడిగా ఉండటం (ఫ్లాటెన్డ్ నోస్), పుర్రెలోని ఎముకల మధ్య ఖాళీలు కాస్త ఎక్కువగా ఉండటంసాధారణంగా మన అరచేతిలో పైన రెండు గీతలు ఉంటాయి. కానీ డౌన్స్ సిండ్రోమ్ ఉన్నవారి అరచేతిలో ఒకటే గీత ఉంటుంది (సిమియన్ క్రీస్)చెవి డొప్పలు (ఇయర్ పిన్నా) చిన్నవిగా ఉండటం నోరు చిన్నదిగా ఉండటం ∙కళ్లు పైవైపునకు తిరిగినట్టుగా ఉండటం చేయి వెడల్పుగా, చేతి వేళ్లు పొట్టిగా ఉండటం కంట్లోని నల్లగుడ్డులో తెల్లమచ్చలు (బ్రష్ఫీల్డ్ స్పాట్స్) ఉండటం. మిగతావారితో పోలిస్తే తల కాస్త తక్కువ సైజులో ఉండటం. చూడగానే తల ఆకృతిలో ఏదో మార్పు (అబ్నార్మాలిటీ) ఉన్నట్లు కనిపించడం. పిల్లలు పెద్దగా ఎత్తు పెరగకపోవడం మానసిక వికాసం కాస్త ఆలస్యంగా జరుగుతుండటం. వీటితో పాటు మరికొన్ని అదనపుఆరోగ్య సమస్యలూఉండవచ్చు. అవి...గుండెకు సంబంధించిన లోపాలు కనిపించవచ్చు. అంటే గుండె గదుల్లో పై గదుల మధ్య గోడలో లోపం (ఏట్రియల్ సెప్టల్ డిఫెక్ట్) గాని, కింది గదుల మధ్య గోడలో లోపం (వెంట్రిక్యులార్ సెప్టల్ డిఫెక్ట్)గాని ఉండేందుకు అవకాశాలెక్కువ. ఈ పిల్లల్లో మతిమరపు ఎక్కువగా కనిపించవచ్చు. కాటరాక్ట్ కంటి సమస్యలు రావడం. జీర్ణకోశ వ్యవస్థలో అడ్డంకులు/సమస్యలు (డియొడినల్ అట్రీసియా) తుంటి ఎముక తన స్థానం నుంచి తొలగిపోవడం (హిప్ డిస్లొకేషన్), మలబద్దకం హైపోథైరాయిడిజమ్ వంటి శారీరక సమస్యలు రావచ్చు. డౌన్స్ సిండ్రోమ్ ఉంటే క్రమం తప్పకుండా చేయించాల్సిన పరీక్షలు...డౌన్స్ సిండ్రోమ్ ఉన్న పిల్లలకు క్రమం తప్పకుండా కొన్ని వైద్య పరీక్షలు చేయిస్తూ ఉండాలి. అవి... చిన్నతనంలో ప్రతి ఏడాదిలో కనీసం ఒకసారి కంటి పరీక్షలు చేయించాలి ప్రతి 6 నుంచి 12 నెలలకు ఒకసారి చెవి పరీక్షలు చేయించాలి. (పిల్లవాడి వయసును బట్టి ఆరు నెలలకొకసారి చేయించాలా లేదా 12 నెలలకు ఒకసారా అన్న వ్యవధిని డాక్టర్లు నిర్ణయిస్తారు) ప్రతి ఆర్నెల్లకోసారి దంతాల పరీక్షలు ∙ప్రతి 3 నుంచి 5 ఏళ్లకు ఒకసారి ఛాతీ, మెడ భాగాన్ని ఎక్స్–రే పరీక్ష తీసి పరీక్షిస్తూ ఉండాలి అమ్మాయిల్లో యుక్త వయసు రాగానే లేదా 21 ఏళ్ల వయసులోగాని పాప్ స్మియర్ పరీక్ష చేయించాలి ప్రతి 12 నెలలకోసారి థైరాయిడ్ పరీక్ష చేయిస్తూ ఉండాలి. ఇదీ చదవండి: Down's syndrome పుట్టకముందే నిర్ధారణఎలా...?ఈ పరీక్షలన్నీ సంయుక్తంగా... డౌన్స్ సిండ్రోమ్ నిర్ధారణ కోసం పైన పేర్కొన్న రక్తపరీక్షలు, అల్ట్రా సౌండ్ పరీక్షలను ఒక పద్దతి ప్రకారం అన్నీ సంయుక్తంగా చేస్తుంటారు. రక్త పరీక్షల్లో రక్తనమూనాలను సేకరించి వాటిలో కొన్ని నిర్దిష్టమైన ప్రొటీన్లను, హార్మోన్లను పరిశీలిస్తారు. ఇలా కొన్ని రకాల ప్రోటీన్లు, హార్మోన్ల మోతాదులు సాధారణ విలువల కంటే ఎక్కువగా ఉంటే.. ఆ మార్కర్స్ను బట్టి అది డౌన్స్ సిండ్రోమ్స్కు సూచికలు కావచ్చంటూ అనుమానిస్తారు. ముందుగా చెప్పినట్లుగా ఇవన్నీ ముందస్తుగా అంచనా తెలిసిందేకు చేసే పరీక్షలు. ఈ పరీక్షలు చాలావరకు కరెక్ట్గానే విషయాన్ని ముందే తెలుపుతాయి. అయితే అతడికి డౌన్స్ సిండ్రోమ్ ఉందన్న విషయం బిడ్డ పుట్టాక మాత్రమే నూరు శాతం తెలుస్తుందని గుర్తుంచుకోవాలి. చికిత్సఇది క్రోమోజోముల తేడా వల్ల వచ్చిన కండిషన్ కావడంతో దీనికి చికిత్స లేదు. అయితే ఇలా పుట్టిన పిల్లలను మామూలు పిల్లల్ల పెంచడానికి ఫిజియోథెరపిస్ట్, భాషను చక్కదిద్దడం, చక్కగా వచ్చేల చేయడానికి సహాయపడే లాంగ్వేజ్/స్పీచ్ థెరపిస్ట్, పెద్దయ్యాక వారు స్వతంత్రంగా బతికేలా తోడ్పడేందుకు ఆక్యుపేషనల్ థెరపిస్ట్లూ, మంచి ఆహారాన్ని అందించేందుకు డైటీషియన్, వినికిడి సమస్యల పరిష్కారానికి ఆడియాలజిస్ట్, కంటి సమస్యలను చక్కదిద్దడానికి ఆఫ్తాల్మాలజిస్ట్, పిల్లల వైద్య నిపుణుడు, గుండె వైద్య నిపుణుల సహాయం... ఇలా ఇంతమంది నిపుణుల సహాయం అవసరమవుతూ ఉంటుంది. డా. శివనారాయణ రెడ్డి వెన్నపూససీనియర్ నియోనేటాలజిస్ట్ – పీడియాట్రీషియన్ నిర్వహణ : యాసీన్ -
లేట్ ప్రెగ్నెన్సీ.. డౌన్స్ సిండ్రోమ్, పుట్టకముందే నిర్ధారణఎలా...?
మహిళల్లో గర్భధారణ ఆలస్యమవుతున్న కొద్దీ పుట్టబోయే బిడ్డలో కొన్ని మానసిక, శారీరక సమస్యలు వచ్చే అవకాశాలూ పెరుగుతూ పోతాయి. ఆరోగ్యకరమైన బిడ్డ కావాలనుకునేవాళ్లు త్వరగా బిడ్డను కనేలా ప్లాన్ చేసుకోవాలి. ఒకవేళ ఉద్యోగరీత్యా లేదా లైఫ్లో సెటిల్ అవ్వడంలో ఆలస్యమైనవాళ్లు... లేట్గా బిడ్డను ప్లాన్ చేసుకోవాలనుకునేవారు... లేదా కారణాలు ఏవైనా లేటు వయసులో గర్భధారణ కోరుకునే పరిస్థితి వచ్చినవాళ్లు కొన్ని రకాల పరీక్షలు చేయించుకోవడం మేలు. లేట్ వయసులో గర్భధారణ జరిగితే ఆ బిడ్డ ‘డౌన్స్ సిండ్రోమ్’ (Down's syndrome)తో పుట్టేందుకు అవకాశాలు ఎక్కువ. అందుకే లేట్ వయసులో గర్భధారణను ప్లాన్ చేసుకున్నవారు... డౌన్స్ సిండ్రోమ్ ముప్పును నివారించుకునేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసే కథనం.ఈ భూమ్మీద పుట్టిన ప్రతి ప్రజాతి (స్పీసీస్)కి చెందిన ప్రతి జీవికీ నిర్దిష్టమైన క్రోమోజోముల సంఖ్య ఉంటుంది. ఆ సంఖ్యను బట్టే ఆ జీవి ఏమిటన్నది నిర్ణయమవుతుంది. మనిషిలోని క్రోమోజోముల సంఖ్య 46. అందుకే ప్రత్యుత్పత్తి జరగడానికి వీలుగా... పురుషుడి వీర్యకణంలో 23, మహిళలోని అండంలో 23 క్రోమోజోములుంటాయి. వీర్యకణం... అండంతో కలిసినప్పుడు ఈ 23 జతలు కలుసుకుని 46 క్రోమోజోములతో కొత్త బిడ్డ పుట్టేలా ప్రకృతి ఏర్పాటు చేస్తుంది. మనిషి విషయంలోలాగే... ప్రతి జీవిలోనూ ఇదే జరుగుతుంది. ఒకవేళ ఏవైనా కారణాల వల్ల ఈ క్రోమోజోముల సంఖ్యలో మార్పు వస్తే...? అది సహజమూ, స్వాభావికమూ కాదు. అలా ఉండవలసిన క్రోమోజోముల కంటే ఎక్కువగానో లేదా తక్కువగానో ఉంటే పుట్టిన బిడ్డలో కొన్ని అసాధారణమైన రుగ్మతలు కనిపిస్తాయి. గర్భధారణ లేట్ అయిన కొద్దీపెరుగుతుండే డౌన్స్ సిండ్రోమ్ రిస్క్! వివాహాన్ని ఆలస్యం చేస్తూ, దానివల్ల గర్భధారణ కూడా ఆలస్యంగా జరగడం వల్ల కలిగే దుష్పరిమాణం ఇది. మహిళ వయసు పెరుగుతూ ఎంత ఆలస్యంగా గర్భధారణ జరుగుతుంటే... డౌన్స్ సిండ్రోమ్ వచ్చే ముప్పు అంతగా పెరుగుతుంది. అందుకే మహిళలు తమ గర్భధారణను 35 ఏళ్లకు ముందుగానే జరిగేలా చూసుకోవడం మేలు. వివాహాన్ని ఆలస్యం చేస్తూ, దానివల్ల గర్భధారణ కూడా ఆలస్యంగా జరగడం వల్ల కలిగే దుష్పరిమాణం ఇది. మహిళ వయసు పెరుగుతూ ఎంత ఆలస్యంగా గర్భధారణ జరుగుతుంటే... డౌన్స్ సిండ్రోమ్ వచ్చే ముప్పు అంతగా పెరుగుతుంది. అందుకే మహిళలు తమ గర్భధారణను 35 ఏళ్లకు ముందుగానే జరిగేలా చూసుకోవడం మేలు. పుట్టకముందే నిర్ధారణఎలా...? వివాహం ఆలస్యంగా చేసుకోవడమో లేదా ఏదైనా కారణాల వల్ల ఆలస్యంగా పిల్లల్ని కనేలా ప్తిన్ చేసుకోవడమో జరిగితే ఆ దంపతులు... పుట్టబోయే చిన్నారిలో డౌన్స్ సిండ్రోమ్ కండిషన్ వచ్చేందుకు అవకాశాలెలా ఉన్నాయనే విషయాన్ని తెలుసుకునేందుకు కొన్ని రకాల పరీక్షలు అందుబాటులో ఉన్నాయి. ఆ పరీక్షల సహాయంతో ముప్పును చాలావరకు ముందుగానే తెలుసుకోవచ్చు. ఇందుకు కొన్ని రకాల పరీక్షలు అందుబాటులో ఉన్నాయి. (అయితే ఈ పరీక్షలు చాలావరకు ఖచ్చితమైన సమాచారాన్నే అందిస్తాయి. కానీ పూర్తి నిర్ధారణ బిడ్డ పుట్టిన తర్వాతే అవుతుందని కాబోయే తల్లిదండ్రులు గుర్తించాలి. స్క్రీనింగ్ పరీక్షలు ఆ పరీక్షలేమిటో చూద్దాం...∙ఈ పరీక్షల్లో చాలా ప్రాచుర్యం ఉన్నది ‘ట్రిపుల్ స్క్రీన్’ అనే పరీక్ష. ఇందులో మూడు రకాలైన పరీక్షలను కలగలిపి ట్రిపుల్ స్క్రీన్ అంటారు. ఈ పరీక్షల్లో రక్తంలోని కొన్ని అంశాల విలువలను మూడుసార్లు పరీక్షించి సరిపోల్చి డౌన్స్ సిండ్రోమ్ వచ్చే అవకాశాన్ని నిర్ధారణ చేస్తారు. ఈ పరీక్షను గర్భవతికి గర్భధారణ జరిగిన 15వ వారం నుంచి 20వ వారం మధ్యలో నిర్వహిస్తారు.∙అల్ట్రాసౌండ్ స్కానింగ్ పరీక్షలు : మిగతా పరీక్షలతో పాటు అల్ట్రా సౌండ్ స్కాన్ చేస్తూ... బిడ్డ ఎదుగుదలలో మార్పులను పరిశీలిస్తుంటారు. ఈ పరీక్ష వల్ల బిడ్డ తాలూకు భౌతికమైన అంశాలు (ఫిజికల్ ఫీచర్స్) ఎలా ఉన్నాయో తెలుస్తాయి. తరచూ స్కాన్ చేయిస్తూ... ఆ స్కాన్ ఫలితాలను డౌన్స్ సిండ్రోమ్ లక్షణాలతో సరి΄ోలుస్తూ తరచూ పరిశీలిస్తూ ఉంటారు. డయాగ్నస్టిక్ పరీక్షలు (నిర్ధారణకోసం) గర్భధారణ జరిగాక 12 నుంచి 20వ వారాల మధ్య సమయంలో గర్భసంచి నుంచి ఉమ్మనీరు తీసి ‘అమ్నియోసెంటైసిస్’ అనే పరీక్షనిర్వహిస్తారు ∙ గర్భధారణ సమయంలోని 8వ వారం నుంచి 12వ వారం వరకు ‘కోరియానిక్ విల్లస్ శాంప్లింగ్’ అనే పరీక్ష చేస్తారు గర్భధారణ సమయంలోని 20వ వారంలో ‘పర్క్యుటేనియస్ అంబిలికల్ బ్లడ్ శాంప్లింగ్’ అనే పరీక్ష చేస్తారు. అలాగే అల్ట్రాసౌండ్ స్కానింగ్లోనూ ఒక ప్రత్యేకమైన స్కానింగ్ పరీక్షను చేస్తారు. ఈ పరీక్షకే ‘న్యూకల్ ట్రాన్స్లుయెన్సీ’ (ఎన్టీ) పరీక్షగా అని పేరు. ఇందులో బిడ్డ మెడ వెనకభాగంలోని చర్మం వెనక ఉన్న ఉమ్మనీటిని పరీక్షిస్తారు. సాధారణంగా డౌన్స్ సిండ్రోమ్ ఉన్న బిడ్డలకు ఈ నీటి మందం ఎక్కువగా ఉంటుంది. దీన్ని బట్టి పుట్టబోయే బిడ్డకు డౌన్స్ సిండ్రోమ్ వచ్చే అవకాశాలను అంచనా వేస్తారు. ఇక కోరియానిక్ విల్లస్ శాంప్లింగ్ (సీవీఎస్) పరీక్ష లేదా ఉమ్మనీటిని తీసి చేసే పరీక్షల ద్వారా గర్భస్త శిశువు దశలోనే పుట్టబోయే బిడ్డకు ఏవైనా ఆరోగ్య సమస్యలున్నాయా అన్న విషయమూ తెలుస్తుంది. డౌన్స్ సిండ్రోమ్ నిర్ధారణ పరీక్షలివి... కోరియానిక్ విల్లస్ శాంప్లింగ్ (సీవీఎస్) : గర్భధారణ జరిగాక 10వ వారంలో బిడ్డ తాలూకు బొడ్డు తాడు నుంచి చిన్న ముక్కను సేకరించి చేసే అల్ట్రా సౌండ్ పరీక్ష ఇది.ఆమ్నియోసెంటైసిస్ : సాధారణంగా గర్భధారణ తర్వాత 15వ వారం నుంచి 22వ వారం వరకు ఈ పరీక్ష చేయవచ్చు. ఇందులో తల్లి గర్భంలోంచి ఇంజెక్షన్ నీడిల్ ద్వారా కొంత ఉమ్మనీటిని సేకరిస్తారు. ఇలా సేకరించడానికి అల్ట్రాసౌండ్ స్కానింగ్ సహాయం తీసుకుంటారు. స్కానించిన్నారిలో డౌన్స్ సిండ్రోమ్ నిర్ధారణ ఇలా... కారణాలు ఏవైనప్పటికీ ఒకవేళ డౌన్స్ సిండ్రోమ్తో పిల్లలు పుడితే ముందుగా వాళ్లలో డౌన్స్ సిండ్రోమ్ నిర్ధారణ కోసం కొన్ని పరీక్షలూ, అలాగే ఆ చిన్నారుల ఆరోగ్యాన్ని కాపాడటం కోసం కొన్ని వైద్య పరీక్షలను క్రమం తప్పకుండా చేయిస్తూ ఉండటం అవసరం. ఒకవేళ అప్పటికే చిన్నారి డౌన్స్ సిండ్రోమ్తో పుడితే : ఒక చిన్నారిలో డౌన్స్ సిండ్రోమ్ ఉందని నిర్ధారణ చేయడానికి క్రోమోజోముల పరీక్షను నిర్వహించాలి. దీనికోసం చిన్నారి నుంచి సేకరించిన రక్తంతో ‘కారియోటైపిక్ క్రోమోజోమల్ స్టడీ’ అనే రక్త పరీక్ష చేయాల్సి ఉంటుంది. ఈ ప్రధాన పరీక్షతో పాటు గుండెలో ఏవైనా లోపాలున్నాయేమొనని తెలుసుకోడానికి ఎకోకార్డియోగ్రామ్ చేయాలి. ఇక ఈసీజీ, ఛాతీ, జీర్ణకోశవ్యవస్థ తాలూకు పరిస్థితిని తెలుసుకోడానికి ఎక్స్–రే పరీక్షలూ చేయించాలి. మహిళల్లో వయసు పెరుగుతున్న కొద్దీ డౌన్స్ సిండ్రోమ్ ముప్పు కూడాఅదే క్రమంలో పెరుగు తుందని పక్కన ఉన్నపట్టిక వల్ల తెలుస్తుంది. డౌన్స్ సిండ్రోమ్ నిర్ధారణ కోసం పైన పేర్కొన్న రక్తపరీక్షలు, అల్ట్రా సౌండ్ పరీక్షలను ఒక పద్దతి ప్రకారం అన్నీ సంయుక్తంగా చేస్తుంటారు. రక్త పరీక్షల్లో రక్తనమూనాలను సేకరించి వాటిలో కొన్ని నిర్దిష్టమైన ప్రొటీన్లను, హార్మోన్లను పరిశీలిస్తారు. ఇలా కొన్ని రకాల ప్రొటీన్లు, హార్మోన్ల మోతాదులు సాధారణ విలువల కంటే ఎక్కువగా ఉంటే.. ఆ మార్కర్స్ను బట్టి అది డౌన్స్ సిండ్రోమ్స్కు సూచికలు కావచ్చంటూ అనుమానిస్తారు. ముందుగా చెప్పినట్లుగా ఇవన్నీ ముందస్తుగా అంచనా తెలిసిందేకు చేసే పరీక్షలు. ఈ పరీక్షలు చాలావరకు కరెక్ట్గానే విషయాన్ని ముందే తెలుపుతాయి. అయితే అతడికి డౌన్స్ సిండ్రోమ్ ఉందన్న విషయం బిడ్డ పుట్టాక మాత్రమే నూరు శాతం తెలుస్తుందని గుర్తుంచుకోవాలి. ఇది క్రోమోజోముల తేడా వల్ల వచ్చిన కండిషన్ కావడంతో దీనికి చికిత్స లేదు. అయితే ఇలా పుట్టిన పిల్లలను మామూలు పిల్లల్ల పెంచడానికి ఫిజియోథెరపిస్ట్, భాషను చక్కదిద్దడం, చక్కగా వచ్చేల చేయడానికి సహాయపడే లాంగ్వేజ్/స్పీచ్ థెరపిస్ట్, పెద్దయ్యాక వారు స్వతంత్రంగా బతికేలా తోడ్పడేందుకు ఆక్యుపేషనల్ థెరపిస్ట్లూ, మంచి ఆహారాన్ని అందించేందుకు డైటీషియన్, వినికిడి సమస్యల పరిష్కారానికి ఆడియాలజిస్ట్, కంటి సమస్యలను చక్కదిద్దడానికి ఆఫ్తాల్మాలజిస్ట్, పిల్లల వైద్య నిపుణుడు, గుండె వైద్య నిపుణుల సహాయం... ఇలా ఇంతమంది నిపుణుల సహాయం అవసరమవుతూ ఉంటుంది. బిడ్డ పుట్టిన తర్వాత బాధపడటం కంటే దంపతులు కొద్దిపాటి జాగ్రత్తలతో, కొన్ని వైద్య పరీక్షల సహాయంతో బిడ్డలో ఇది రాకుండా లేదా వచ్చేందుకు అవకాశమున్న విషయాన్ని తెలుసుకోవాలి. ఒకవేళ అలా డౌన్స్ సిండ్రోమ్తో బిడ్డ పుట్టే అవకాశముందని తెలుసుకున్నప్పుడు డాక్టర్లు, క్రోమోజోమల్ స్పెషలిస్టుల ఆధ్వర్యంలో తప్పక కౌన్సెలింగ్ తీసుకోవాలి. ఇలాంటి సమస్య రాకుండానే ఉండేందుకు వీలైనంతవరకు మహిళలో గర్భధారణ 35 ఏళ్ల కంటే ముందుగానే జరిగేలా ΄్లాన్ చేసుకోవడం, కుటుంబంలో ఎవరికైనా డౌన్స్ సిండ్రోమ్ ఉంటే ఆ విషయాన్ని గర్భధారణకు ముందుగానే డాక్టర్లకు చెప్పి తగిన కౌన్సెలింగ్ తీసుకోవడమన్నది దంపతులు తప్పనిసరిగా చేయాల్సిన పనులు. డా. శివనారాయణ రెడ్డి వెన్నపూససీనియర్ నియోనేటాలజిస్ట్ – పీడియాట్రీషియన్ నిర్వహణ : యాసీన్ -
ప్రెగ్నెన్సీ టైంలో నడుము నొప్పి సాధారణమా? తగ్గాలంటే..
నేను ఆరునెలల గర్భవతిని. కొన్నిరోజులుగా నడుమునొప్పి ఎక్కువగా వస్తోంది. ఎక్కువసేపు నడిచినా, కూర్చున్నా నొప్పి పెరుగుతోంది. ఇది గర్భధారణలో సాధారణమా? లేక ఏమైనా సమస్య ఉందా? దీన్ని తగ్గించడానికి ఏం చేయవచ్చు?– మాలిని, గుంటూరు. గర్భధారణలో నడుమునొప్పి చాలా సాధారణం. ఎక్కువమంది గర్భిణులు ఏదో ఒక దశలో దీనిని అనుభవిస్తారు. బరువు పెరగడం, గర్భాశయం పరిమాణం పెరగడం, హార్మోన్ల ప్రభావం, శరీర ధారణలో మార్పులు, లిగమెంట్లు సడలడం వంటివి దీనికి ప్రధాన కారణాలు. చాలాసేపు ఒకే స్థితిలో కూర్చోవడం లేదా నిలబడడం, వెన్నుకు సరైన ఊతం లేని కుర్చీలో కూర్చోవడం వల్ల నొప్పి మరింత పెరుగుతుంది. గర్భధారణ మొదటి నెలల నుంచే ఈ సమస్య రావచ్చు, అయితే గర్భధారణ కొనసాగుతున్న కొద్దీ ఇది మరింత ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. నడుమునొప్పి తగ్గించుకోవడానికి కొన్ని సాధారణ జాగ్రత్తలు పాటించడం మంచిది. ఎక్కువసేపు కూర్చోవడం లేదా నిలబడడం తగ్గించుకోవాలి. వెన్నుకు ఊతం ఇచ్చే కుర్చీని ఉపయోగించడం, పక్కకు తిరిగి పడుకోవడం, మోకాళ్ల మధ్య దిండు పెట్టుకుని నిద్రించడం ఉపశమనాన్ని ఇస్తాయి. హీల్స్ వాడకూడదు, సౌకర్యవంతమైన షూలు ధరించాలి. ఎక్కువ నీరు తాగడం, శరీరాన్ని హైడ్రేట్గా ఉంచుకోవడం, పాల ఉత్పత్తులు తీసుకోవడం, వైద్యులు సూచించిన కాల్షియం, విటమిన్ సప్లిమెంట్స్ వాడటం అవసరం. ఆకస్మిక నొప్పి ఉన్నప్పుడు వేడి నీటి బ్యాగ్తో మసాజ్ చేయడం, వేడినీటితో స్నానం చేయడం లేదా మృదువుగా తైలమర్దన చేయించుకోవడం ద్వారా ఉపశమనం పొందవచ్చు. పెయిన్ కిల్లర్ వైద్యుల సూచన లేకుండా వాడకూడదు. తగినంత విశ్రాంతితో పాటు నడక, వ్యాయామం, స్ట్రెచింగ్, ప్రెగ్నెన్సీ యోగా వంటి పద్ధతులు కూడా నడుమునొప్పిని తగ్గించడంలో సహాయపడతాయి. కొన్ని సందర్భాల్లో ఫిజియోథెరపిస్ట్ సలహా తీసుకోవడం కూడా మంచిది. ఈ విధంగా జాగ్రత్తలు తీసుకోవడం వల్ల నడుమునొప్పి తగ్గడమే కాకుండా, ప్రసవానికి శరీరం సిద్ధమవుతుంది, ప్రసవానంతర రికవరీ సులభతరం అవుతుంది, అలాగే గర్భిణికి మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది.నేను ఆరు నెలల గర్భిణిని. గర్భధారణ ప్రారంభంలో నా హీమోగ్లోబిన్ 12 గ్రాములు ఉండగా, ఇప్పుడు అది 8 గ్రాములకు పడిపోయింది. నేను ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటున్నప్పటికీ హీమోగ్లోబిన్ తగ్గిపోయింది. డాక్టర్ మరిన్ని పరీక్షలు చేయమని సూచించారు, అలాగే హీమోగ్లోబిన్ సరిచేయడానికి ఇంజెక్షన్లు అవసరం కావచ్చని చెప్పారు. నా బంధువులు చెబుతున్నది ఏమిటంటే, హీమోగ్లోబిన్ తక్కువగా ఉండటంవల్ల బిడ్డ పెరుగుదలపై ప్రభావం చూపవచ్చని, అలాగే డెలివరీ తర్వాత కోలుకోవడం కష్టమవుతుందని. ఇది నిజమేనా? – సుగుణ, మిరియాలగూడ. గర్భిణులు, ముఖ్యంగా భారతీయ మహిళల్లో రక్తహీనత లేదా హీమోగ్లోబిన్ తక్కువగా ఉండటం చాలా సాధారణమైన సమస్య. గర్భధారణ సమయంలో రక్తపరిమాణం పెరగడం వలన శరీరానికి ఐరన్ అవసరం ఎక్కువ అవుతుంది, కాని, ఆహారంతో మాత్రమే ఆ అవసరం తీరడం కష్టం. అందువల్ల హీమోగ్లోబిన్ స్థాయులు తగ్గిపోతాయి. కొందరిలో గర్భధారణకు ముందే రక్తహీనత ఉండి, అది గర్భధారణలో మరింత ఎక్కువ అవుతుంది. ఇది సాధారణంగా ఐరన్ లోపం వల్ల జరుగుతుంది, కానీ కొన్నిసార్లు విటమిన్ బీ12 లేదా ఫోలిక్ యాసిడ్ లోపం వల్ల కూడా రావచ్చు. అరుదుగా జన్యు సంబంధిత వ్యాధులు, ఉదాహరణకు థలసీమియా, సికిల్ సెల్ వ్యాధులు వంటి కారణాలు కూడా ఉండవచ్చు. హీమోగ్లోబిన్ తక్కువగా ఉండటం తల్లి, బిడ్డ ఇద్దరికీ సమస్యలు కలిగించే అవకాశం ఉంది. తల్లిలో అలసట, తలతిరగటం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, రోగనిరోధక శక్తి తగ్గిపోవడం వలన ఇన్ఫెక్షన్లు రావడం, ప్రసవ సమయంలో అధిక రక్తస్రావం జరగడం, రక్త మార్పిడి అవసరం కావడం, అలాగే ప్రసవానంతరం రికవరీ ఆలస్యమవడం వంటి సమస్యలు కనిపించవచ్చు. బిడ్డలో పెరుగుదలలో ఆలస్యం, తక్కువ బరువుతో పుట్టడం, కొన్ని సందర్భాల్లో ఐసీయూ అవసరం కావడం వంటి సమస్యలు రావచ్చు. అందువల్ల రక్తహీనతను త్వరగా గుర్తించి చికిత్స చేయడం అత్యంత ముఖ్యం. సాధారణంగా గర్భిణులకు ఐరన్ సప్లిమెంట్లు రెండవ త్రైమాసికం నుంచే ఇవ్వడం ప్రారంభిస్తారు, ఎందుకంటే మొదటి నెలల్లో వాంతులు, మలబద్ధకం వంటి సమస్యలు మరింత పెరగకుండా ఉండటానికి. మాత్రలను విటమిన్ సీ ఎక్కువగా ఉన్న ఆహారాలతో ఉదాహరణకు నిమ్మరసం, నారింజ లాంటివి ఖాళీ కడుపుతో తీసుకుంటే జీర్ణక్రియ మెరుగ్గా ఉంటుంది. మాత్రలు సరిగా పనిచేయకపోతే లేదా తట్టుకోలేకపోతే, ఐరన్ ఇంజెక్షన్లు అవసరం కావచ్చు. ఆహారంలో ఆకుకూరలు, శనగలు, బీన్స్, పప్పులు, కిస్మిస్, ఆప్రికాట్ వంటి డ్రై ఫ్రూట్స్, అలాగే గుడ్లు, చేపలు, కాలేయం, మాంసం వంటి నాన్వెజిటేరియన్ ఆహార పదార్థాలు ఉన్నాయి. వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం ద్వారా గర్భధారణలో ఐరన్ లోపాన్ని చక్కదిద్దుకోవచ్చు. సమయానికి పరీక్షలు చేయించుకోవడం, వైద్యులు సూచించిన జాగ్రత్తలను తీసుకోవడం ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చు. డెలివరీకి ముందే హీమోగ్లోబిన్ స్థాయులు మెరుగుపడితే, మీకూ, మీ బిడ్డకూ ఆరోగ్యకరమైన ఫలితాలు వస్తాయి. (చదవండి: సరైన ప్రశంసలతోనే... జీనియస్ మైండ్ సెట్!) -
చిన్నారులకు ఆస్తమా..! ఇన్హేలర్స్..నో వర్రీస్..
పిల్లల్లో ఆస్తమా వచ్చి వాళ్లు బాధపడుతుంటే చూసేవాళ్లకు ఆ దృశ్యం చాలా హృదయవిదారకంగా ఉంటుంది. అలా ఆయాసపడుతూ ఊపిరి అందని చిన్నారులను చూస్తే చాలా బాధగా ఉంటుంది. అయితే చిన్నవయసులో ఆస్తమా వచ్చిన చిన్నారుల విషయంలో అంతగా ఆందోళన పడాల్సిన అవసరం లేదంటూ డాక్టర్లు భరోసా ఇస్తున్నారు. నిజానికి పిల్లల్లో వచ్చే ఈ ఆరోగ్య సమస్యను ‘రియాక్టివ్ ఎయిర్ వే డిసీజ్’ అంటారు. కానీ సామాన్య జనవాడుకలో దీన్ని ఆస్తమాగా చెబుతుంటారు. చిన్నారుల ఆస్తమా చికిత్సలో అవసరాన్ని బట్టి కొన్ని మందులు నెబ్యులైజేషన్ తర్వాత వారిలో మున్ముందు ఆస్తమా రాకుండా చూసేందుకు డాక్టర్లు రెండు రకాల ఇన్హేలర్స్ సూచిస్తుంటారు. ఇందులో మొదటి రకం ఇన్హేలర్స్ను ‘రిలీవర్స్’ అంటారు. ఇవి తక్షణం ఊపిరి అందేందుకు మొట్టమొదటి చికిత్స (ఫస్ట్ లైన్ ట్రీటెమెంట్) కోసం వాడేవి. ఇవి అటాక్నుంచి రిలీవ్ చేస్తాయి కాబట్టి వీటిని ‘రిలీవర్స్’ అంటారు. ఇవి ఊపిరితిత్తుల్లోకి వెళ్లే గాలిగొట్టాలను వెడల్పుగా విప్పారేలా చేసి పిల్లలు హాయిగా గాలితీసుకునేందుకు ఉపయోగపడతాయి. ఇక ఆస్తమా అటాక్ వచ్చినప్పుడు ఊపిరితిత్తుల్లో కొన్ని ఇన్ఫ్లమేటరీ సెల్స్ పుడతాయి. వీటిని తొలగించడం రిలీవర్స్కు సాధ్యం కాదు. అలాంటి వాటిని తొలగిస్తూ మున్ముందుకు అటాక్ రాకుండా నివారించే ఇన్హేలర్స్ను ‘ప్రివెంటర్స్’ అంటారు. అవి నివారణకు ఉపయోగపడతాయి కాబట్టి వాటిని ప్రివెంటార్స్గా అభివర్ణిస్తారు. ఇలా ఈ రెండు రకాల ఇన్హేలర్స్తో చిన్నారుల ఊపిరితిత్తుల కార్యకలాపాలు వీలైనంత నార్మల్గా పనిచేసేలా డాక్టర్లు చూస్తారు. ఇవి వాడుతూపోతుంటే క్రమంగా ‘రిలీవర్స్’ వాడాల్సిన అవసరం దాదాపుగా పూర్తిగా తగ్గిపోతుంది. పిల్లల్లో వ్యాధి తీవ్రత ఎంతగా ఉందో, దాన్ని అదుపులో ఉంచేందుకు మందుల డోస్లు ఎంతెంత మార్చాలో తెలుసుకోవడం కోసం అవసరమైనప్పుడు డాక్టర్లు ‘పల్మునరీ ఫంక్షన్ టెస్ట్ – పీఎఫ్టీ’ అనే పరీక్ష చేస్తారు. పిల్లలు పెరుగుతున్నకొద్దీ చాలామందిలో అటాక్స్ దాదాపు పూర్తిగా తగ్గిపోవడానికి అవకాశాలు చాలా ఎక్కువ. చాలామంది పిల్లల్లో ఆర్నెల్లలోనే ఆస్తమా పూర్తిగా అదుపులోకి వచ్చేసే అవకాశాలుంటాయి. ఒకసారి ఆస్తమా అదుపులోకి వచ్చాక ఇన్హేలర్స్ దాదాపు నిలిపివేయవచ్చు కూడా. అయితే ఈ ఇన్హేలర్స్కు పిల్లలు అలవాటు పడిపోతారేమోనని కొంతమంది తల్లిదండ్రులు ఆందోళన పడుతుంటారు. ఇది కేవలం అ΄ోహ మాత్రమే. పైగా ఇన్హేలర్స్ ఎంత సురక్షితమంటే నోటి నుంచి తీసుకునే మందులతో పోలిస్తే వాటిలోంచి దేహంలోకి వెళ్లే మందు కేవలం సమస్య ఉన్న చోటికే పరిమితమవుతుంది. దేహమంతటా తన దుష్ప్రభావాలు చూపదు. అందుకే అవి పూర్తిగా సురక్షితమని పేరెంట్స్ నమ్మవచ్చు. (చదవండి: Dental Health: ఓపెన్ యువర్ మౌత్..! నోటి ఆరోగ్యాన్ని కాపాడుకుందాం ఇలా..) -
ఓపెన్ యువర్ మౌత్..! నోటి ఆరోగ్యం కోసం..
నోరు బాగుంటే ఊరు బాగుంటుందని సామెత. ఊరూ... ఊరి వ్యక్తులతో సంబంధాలే కాదు... నోటి పలువరస బాగుంటే, దంతాలకు సంబంధించిన వ్యాధులేమీ లేకపోతే వ్యక్తి చిరునవ్వు, ఇనుమడించిన ముఖపు అందం, మంచి పలువరస కారణంగా చక్కటి ఉచ్చారణ... ఇలా చాలా అంశాలు బాగుంటాయి. నోరూ లేదా దంతాలకు సంబంధించి ఏదైనా సమస్య వస్తే... అప్పటికప్పుడు ఆ సమస్యకు చికిత్స అందించడమన్నది కాకుండా... ఓ పూర్తి స్థాయి చికిత్సను ‘సమగ్రం’గా అందించడం ద్వారా నోటి ఆరోగ్యాన్ని అన్ని విధాలా కాపాడే చికిత్స ప్రక్రియే‘ఫుల్ మౌత్ రీ–హ్యాబిలిటేషన్’. సంక్షిప్తంగా ‘ఎఫ్ఎమ్ఆర్’ అని పిలిచే ఈ చికిత్స ప్రక్రియ గురించి తెలిపేదే ఈ కథనం. నోటిలోని పళ్లకూ, పలువరసకూ అనేక సమస్యలు వస్తూ ఉంటాయి. వయసు పెరుగుతున్న కొద్దీ పళ్లు అరిగి΄ోవడం, కొన్ని విరిగి΄ోవడం, కొన్ని చోట్ల సందులు రావడం వంటివి జరుగుతుండటం మామూలే. దీనికి తోడు కొందరిలో చిగుర్ల సమస్యలూ రావచ్చు. మరికొందరిలో ఒకటో రెండూ పళ్లు ఊడి΄ోవచ్చు. అయితే ఇవన్నీ జరుగుతున్నప్పటికీ తమకు సంబంధించినంతవరకూ ఏ సమస్యా లేక΄ోతే కొందరు దంతవైద్యుడి వద్దకు వెళ్లరు. చికిత్స తీసుకోరు. కారణం... పని నడుస్తోంది కాబట్టి అలా రోజులు వెళ్లదీయడమే పనిగా పెట్టుకుంటారు. కొన్ని సమస్యలు...అలా నోటిలో పళ్లు అరగడం, విరగడం, దంతాలూ ఊడిపోవడం వల్ల సందులు రావడాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల మరికొన్ని సమస్యలు రావచ్చు. ఉదాహరణకు... పలువరసలోని కొన్ని పళ్లు ఊడటం వల్ల దంతాల మధ్య సందులు (గ్యాప్) వచ్చి అక్కడ ఆహారం చిక్కుకుపోయి, అది కుళ్లుతుండటం వల్ల దంతక్షయం మరింత వేగంగా జరగడం. అలా పళ్లు ఊడిన చోట ఆహారం చిక్కుకు΄ోయి కుళ్లుతుండటంతో నోటి దుర్వాసన వస్తుండటం. పళ్లు ఊడిన కారణంగా ముఖం ఆకృతి చెడిపోయి మునపటి కంటే అందవిహీనంగా కనిపించడం. పళ్లు ఊడటం లేదా పలువరసలో సందుల కారణంగా మాట్లాడుతున్నప్పుడు పళ్లసందుల నుంచి గాలిపోతూ ఉచ్చారణ సరిగా లేకపోవడం, దాంతో సరైన కమ్యూనికేషన్ జరగక... ఎదుటివారికి మాట సరిగా అర్థం కాకపోవడం. ఊడినపళ్ల కారణంగా చిరునవ్వు నవ్వేందుకు ఇబ్బంది పడుతూ నలుగురిలో మనస్పూర్తిగా నవ్వలేకపోవడం.ఆరోగ్యపరంగానూ మరికొన్ని నష్టాలు... ఊడిన పళ్ల కారణంగా ఆహారాన్ని సరిగా / పూర్తిగా నమలలేకపోవడం. పలువరసలో వచ్చిన గ్యాప్ కారణంగా పళ్లు ఉన్నచోటి నుంచి పక్కకు కదిలిపోతూ ఉండటం. ఊడిన పళ్ల వల్ల వచ్చిన సందుల కారణంగా పలువరస చెడిపోయి కొరికినప్పుడు పైవరస, కింది వరస పళ్లు సరిగా అమరకపోఒవడం (అలైన్మెంట్ సరిగా జరగకపోవడం). (రెండు దవడలూ కలిసినప్పుడు అవి సరిగా అమరకపోవడం).నములుతున్నప్పుడు కింది దవడ కదిలినప్పుడల్లా క్లిక్ క్లిక్ మంటూ శబ్దం (క్లికింగ్ సౌండ్) రావడం.మానసిక సమస్యలకూ దారితీసే ప్రమాదం... ఇలా పలువరసకు వచ్చే సమస్యలతో కేవలం భౌతికంగా కొన్ని ఆరోగ్యపరమైన సమస్యలు రావడం లుక్స్పరంగా ఇబ్బంది కలగడం మాత్రమే కారణంగా... ఆత్మవిశ్వాసం లోపించడం, చిరునవ్వు నవ్వలేకపోవడంతో కొన్ని సందర్భాల్లో కొందరిలో ఈ సమస్య మానసికమైన రుగ్మతలకూ కారణమయ్యేందుకూ అవకాశాలు లేకపోలేదు. పై ప్రక్రియలన్నింటి సాయంతో కొన్ని కొన్ని సిట్టింగులలో నోటికి అవసరమైన పూర్తిస్థాయి సమగ్రమైన సంయుక్త చికిత్సను ఈ ‘ఫుల్ మౌత్ రీ–హ్యాబిలిటేషన్’లో అందిస్తారు. దాంతో పేషెంట్లకు దంతపరంగా లేదా నోటి ఆరోగ్యపరంగా అవసరమైన అనేక అవసరాలు ఒకే సమగ్రచికిత్సలో తీరి΄ోవడం సాధ్యమవుతుంది.అన్ని రకాల సమస్యలకూ కలిపి ఒక సమగ్ర చికిత్సే ‘ఎఫ్ఎమ్ఆర్’... దంతాల సమస్యలకు చికిత్సలు విడివిడిగా ఉంటాయి. ఉదాహరణకు పళ్లు అరిగినప్పుడు ఫిల్లింగ్ చేయడం లేదా క్యాప్ వేయడం, అలాగే చిగుర్లకు వచ్చే జింజివైటిస్, పెరియోడాంటైస్ వంటి సమస్యలకూ ఇవ్వాల్సిన చికిత్సలూ ఇలా రకరకాల సమస్యలకు నిర్దిష్టంగా చికిత్సలు ఇస్తుంటారు. అయితే అనేక రకాల సమస్యలు ఒకేసారి కనిపించినప్పుడు అనేక చికిత్సలను కలగలిపి ఒకే సమగ్ర చికిత్సగా ఇవ్వడమూ సాధ్యమవుతుంది. ఇందులో అరిగిన / విరిగిన పళ్లకు పైన దంతాన్ని పునర్నిర్మించడం (క్రౌన్స్), పన్నుకూ పన్నుకూ మధ్య మరో పన్ను పోయినప్పుడు బ్రిడ్జ్ చికిత్సలు, ఆర్థోడాంటిక్స్ (దవడ పళ్లు లేదా దవడల అమరిక సరిగా లేనప్పుడు ఇవ్వాల్సిన చికిత్సలూ), చిగుర్లకు చికిత్సలూ... వీటన్నింటినీ కలిపి సంయుక్తంగా చికిత్సలను అందించడాన్ని ‘ఫుల్ మౌత్ రీ–హ్యాబిలిటేషన్’ (ఎఫ్ఎమ్ఆర్)గా చెబుతారు.ఎఫ్ఎమ్ఆర్లో ఏం జరుగుతుంది... ఈ సమగ్ర చికిత్స ప్రక్రియలో కంప్యూటర్ సహాయంతో నోటి తాలూకు పూర్తి చిత్రీకరణ... ఉదాహరణకు... కంప్యూటర్ ఎయిడెడ్ డిజైనింగ్ (క్యాడ్) అలాగే కంప్యూటర్ ఎయిడెడ్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ (క్యామ్) లతో నోటి నిర్మాణాన్ని తొలుత రూపొందించుకుంటారు. అటు తర్వాత నోటిలో ఉన్న సమస్యలన్నింటినీ తెలుసుకుని, ఏయే రకాల సమస్యలకూ ఏయే చికిత్సలనే ఓ సమగ్ర ప్రణాళికను రచించుకుంటారు. అవసరాన్ని బట్టి ఎలాంటి కృత్రిమమైన ఇంప్లాంట్స్ అమర్చాలో నిర్ణయించుకుంటారు. ఇక అందానికీ, లుక్స్కు సంబంధించిన సమస్య అయితే దానికి తగ్గట్టుగా కాస్మటిక్ చికిత్స కోసం అవసరమైన వినీర్స్ (బాధితుల వ్యక్తిగత అవసరాల కోసం తగిన విధంగా రూపొందించిన పంటిపై అమర్చేందుకు ఆ పంటి రంగే కలిగిన పలుచటి పొరల్లాంటివి) సమకూర్చుకుంటారు. చిగుర్ల సమస్యలు ఉంటే దానికి ఇవ్వాల్సిన మందులను సూచిస్తారు. డాక్టర్ సుధీర్ చౌదరి కరణంఆర్థోడాంటిస్ట్ – ఇంప్లాంట్ స్పెషలిస్ట్ (చదవండి: Parenting Tips: పిల్లలు ప్రయోజకులు అవ్వాలంటే..? ఐఏఎస్ అధికారిణి పేరెంటింగ్ టిప్స్లు..!) -
ఇన్ బ్రెయిన్
మెదడు పనితీరుపై విశ్లేషణ, కార్యాచరణ సమాచారాన్ని అందించే సాఫ్ట్వేర్ను అభివృద్ధి చేసి, మానసిక వైద్యులకు ఆధునాతన బ్రెయిన్ ఇమేజింగ్–బేస్డ్ ఇన్సైట్స్ను అందించే న్యూరో–ఇన్ఫార్మటిక్స్ ప్లాట్ఫామ్ ‘బ్రెయిన్ సైట్ ఏఐ’ నిర్మించారు రింఝిమ్ అగర్వాల్, ఇమ్మాన్యుయేల్...గత సంవత్సరం ఇండియా సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్ట్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడిఎస్సీవో) నుంచి ‘సాఫ్ట్వేర్–యాజ్–ఎ మెడికల్ డివైజ్’ సర్టిఫికెట్ పొందడం ద్వారా ‘బ్రెయిన్సైట్ ఏఐ’ వాణిజ్యపరంగా కీలకమైన మైలురాయిని చేరింది. ఈ సంస్థకు ఇమ్మాన్యుయేల్ సీయివో, రింఝిమ్ అగర్వాల్ సీటీవో.నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరోసైన్సెస్ నుంచి రింజిమ్ అగర్వాల్ పీహెచ్డీ చేసింది. ఇమ్మాన్యుయల్ ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నుంచి ఎంబీఏ చేసింది. హెల్త్ కేర్ మేనేజ్మెంట్, టెక్నాలజీ అండ్ పాలసీలలో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 15 సంవత్సరాల అనుభవాన్ని సంపాదించింది. ఆపరేటింగ్ సిస్టమ్ డిజైన్, పబ్లిక్ హెల్త్ అండ్ హెల్త్ కేర్ బిజినెస్లో ఆమెకు అపార అనుభవం ఉంది.‘సీడిఎస్సీవో లైసెన్స్ మాకు వాణిజ్యపరంగా ఉపయోగపడుతుంది. ఈ సంవత్సరం మా ఆదాయాన్ని పెంచుకోవడంపై దృష్టి పెట్టాం. మా ప్రాడక్స్›్ట వంద ఆస్పత్రులకు చేరువ కావాలనేది మా లక్ష్యం’ అంటుంది ఇమ్మాన్యుయేల్.‘ఆసుపత్రులలో అత్యంత సాంకేతిక పరిజ్ఞానం ఉన్న వైద్యులలో న్యూరోసర్జన్లు ఒకరు. మా సాంకేతికత మెదడుకు సంబంధించిన నిర్మాణాత్మక అంశాలకు మాత్రమే కాకుండా లాంగ్వేజ్, కాగ్నిషన్లాంటి వివిధ విధులపై కూడా ఇన్సైట్స్ను అందించగలదు. మా బ్రెయిన్సైట్ ఏఐ సామర్థ్యం సర్జన్లలో ఆసక్తి రేకెత్తించింది’ అంటుంది అగర్వాల్.‘బ్రెయిన్సైట్ ఏఐ’ అందించే సమాచారం సర్జరీల సమయంలో వైద్యులకు ఉపయోగపడుతుంది. ఉదాహరణకు ఒక కణితి... దేహంలో ఏదైనా కీలక విధులు నిర్వహించే ప్రాంతానికి చాలా దగ్గరగా ఉంటే, వైద్యులు దానిని చేరుకోవడానికి వేరే ప్రత్యామ్నాయ మార్గంలో వెళ్లడానికి వీలవుతుంది.బ్రెయిన్ ఏఐ ప్రాడక్ట్ ‘వోక్సెల్బాక్స్’ వేగంగా అభివృద్ధి చెందనుంది. మెదడుకు సంబంధించిన నాడీ కణాల కనెక్షన్లను మ్యాప్ చేయడానికి ‘ఫంక్షనల్ మాగ్నెటిక్ రెసోసెన్స్ ఇమేజింగ్’ (ఎఫ్ఎంఆర్ఐ) ఉపయోగ పడుతుంది. ఆ డేటాను ప్రాసెస్ చేసేందుకు ఉపయోగపడేదే ఏఐ–పవర్డ్ ప్రాడక్ట్ వోక్సెల్బాక్స్. రోగ నిర్ధారణ, శస్త్ర చికిత్సలను ప్లాన్ చేయడంలోనూ, చికిత్సను పర్యవేక్షించడంలో సహాయపడేందుకు వీలైన బ్రెయిన్ మ్యాప్స్ను తయారు చేయడంలో ‘వోక్సెల్ బాక్స్’ ఉపయోగపడుతుంది.హెల్త్–టెక్ ఎంటర్ప్రెన్యూర్గా విజయం సాధించిన రింఝిమ్ అగర్వాల్, ఇమ్మాన్యుయేల్ ‘స్నోడ్రాప్’ అనే పేషెంట్ కేర్ యాప్ను కూడా అభివృద్ధి చేశారు. పేషెంట్ల ప్రొఫైల్స్ రూపొందించడంలో, వైద్యప్రకియను మెరుగుపరచడంలో ఇది ఉపయోగపడుతుంది. -
మీ బీ12 బాగుందా?
హైదరాబాద్లోని ఓ ఐటీ సంస్థలో పనిచేసే 33 ఏళ్ల యువకుడు దాదాపు నాలుగేళ్లుగా మతిమరుపు, చిరాకు, కాళ్లు, చేతుల తిమ్మిర్లతో బాధపడుతున్నాడు. ఇటీవల సమస్య తీవ్రత పెరగడంతో ఓ న్యూరాలజిస్ట్ను సంప్రదించాడు. అతని ఆహార అలవాట్ల గురించి డాక్టర్ అడగ్గా పూర్తి శాకాహారినని చెప్పాడు. దీంతో డాక్టర్ వెంటనే రోగి రక్తంలో విటమిన్ బీ12 స్థాయి ఎంత ఉందో పరీక్షించగా సాధారణంతో పోలిస్తే అతితక్కువగా ఉన్నట్లు తేలింది. వెంటనే విటమిన్ బీ12 ఇంజెక్షన్లతో చికిత్స ప్రారంభించడంతో పాటు పాల ఉత్పత్తులతో కూడిన ఆహారాలను అధికంగా తీసుకోవాలని సూచించడంతో కొన్ని వారాల్లోనే ఆ యువకుడి జ్ఞాపకశక్తి, ఏకాగ్రత మెరుగుపడింది. తిమ్మిర్ల సమస్య సైతం దూరమైంది.సాక్షి, హైదరాబాద్: చాలాసార్లు సాధారణ ఆరోగ్య సమస్యలుగా కనిపించేవే తీవ్ర అనారోగ్య లక్షణాలకు సూచికలుగా మారొచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. తరచూ మతిమరుపు, విసుగు, తిమ్మిర్ల వంటివి ఇబ్బంది పెడుతుంటే వాటిని పని ఒత్తిళ్ల వల్ల ఎదురవుతున్న సమస్యలుగా భావించొద్దని.. అవి శరీరంలో విటమిన్ బీ12 లోపానికి సంకేతం కావొచ్చని అంటున్నారు. ఈ తరహా లక్షణాలపట్ల అవగాహన పెంచుకొని అందుకు తగ్గట్లుగా వ్యవహరించాలని సూచిస్తున్నట్లు ముఖ్యంగా శాకాహారులు ఇలాంటి లక్షణాలతో సతమతమవుతుంటే తప్పనిసరిగా రక్తంలో విటమిన్ బీ12 స్థాయిలు తెలుసుకోవాలని చెబుతున్నారు. లక్షణాలను బట్టి వెంటనే మందులు వాడటం ద్వారా మెదడు, నరాలకు శాశ్వత నష్టం జరగకుండా నివారించవచ్చని పేర్కొంటున్నారు. ఇలాంటి స్థితిని అధిగమించేందుకు విటమిన్ బీ12 సమృద్ధిగా ఉండే లేదా బీ12ను జోడించిన ఆహారాలను తరచూ తీసుకోవడం లేదా వైద్యులు సూచించే సప్లిమెంట్లు తీసుకోవాలని సలహా ఇస్తున్నారు.ఏమిటీ బీ12?విటమిన్ బీ12 అనేది శరీరం తయారు చేసుకోలేని ఓ పోషకం. ఇది ప్రధానంగా మాంసాహారం, పాల ఉత్పత్తులు, గుడ్లు వంటి వాటి నుంచి లేదా వైద్యపరంగా సప్లిమెంట్ల రూపంలో లభిస్తుంది. మెదడు, నాడీ వ్యవస్థ చురుకుగా పనిచేసేలా చేయడంతోపాటు రక్త కణాలను ఆరోగ్యంగా ఉంచడంలో బీ12 కీలకపాత్ర పోషిస్తుంది. దీన్ని కాలేయం ఐదేళ్ల వరకు నిల్వ చేసుకోగలదు. కానీ శరీరంలో తగినంత బీ12 నిల్వలు లేకపోతే అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. ఈ విటమిన్లో కోబాల్ట్ అనే ఖనిజం ఉంటుంది కాబట్టి దీన్ని కోబాలమిన్ అని కూడా పిలుస్తారు. రక్త పరీక్ష ద్వారా బీ12 స్థాయిలు సాధారణంగా ఉన్నాయో లేదో తెలుసుకోవచ్చు. రక్తంలో విటమిన్ బీ12 స్థాయి 70 పీఎంవోఎల్/ఎల్ (పికోమోల్స్ పర్ లీటర్)గా ఉంటే సాధారణం కింద లెక్క.బీ12 లోపం వల్ల తలెత్తే లక్షణాలు...» జ్ఞాపకశక్తి తగ్గుదల, అయోమయ భావన» ఏకాగ్రత లోపం, స్పష్టమైన ఆలోచన కొరవడటం» కుంగుబాటు భావన, చికాకు, అలసట, బడలిక, బలహీనంగా ఉన్న అనుభూతి కలగడం» చేతులు, కాళ్లు మొద్దుబారినట్లు, తిమ్మిరిగా, దురదగా ఉండటం» కంటి నుంచి మెదడుకు దృశ్య సమాచారాన్ని ప్రసారం చేసే ఆప్టిక్ నాడి దెబ్బతినడం.బీ 12 ప్రయోజనాలు...» డీఎన్ఏ, ఎర్ర రక్త కణాల తయారీలో దోహదం.» జుట్టు, గోర్లు, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.» కేంద్ర నాడీ వ్యవస్థ (మెదడు, వెన్నెముక) అభివృద్ధికి కీలకం.» ఆరోగ్యకరమైన ఎర్ర, తెల్ల రక్త కణాలు, ప్లేట్లెట్ల తయారీకి బీ 12 అవసరం» కొత్త ఎర్రరక్త కణాల పెరుగుదల, అభివృద్ధికి అవసరం. -
డెలీ'వర్రీ' వద్దు..! మెడిటేషన్ మస్ట్..
మహానగరంలో సగటు గర్భిణి డిప్రెషన్కు గురవుతోంది. గర్భందాల్చిన విషయం తెలిసిన నాటి నుంచి ప్రసవం అయ్యే వరకూ యాంగ్జైటీకి గురవుతున్నారని వైద్యనిపుణులు పేర్కొంటున్నారు. ప్రసవ సమయంలో 15 నుంచి 20 శాతం మంది గర్భిణులు, ప్రసవానంతరం 25 శాతం మంది ఈ రకమైన డిప్రెషన్కు గురవుతున్నారని యూకే మెడికల్ రీసెర్చ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ప్రసవానంతర మానసిక ఆరోగ్య సమస్యలపై చేపట్టిన సర్వే నివేదిక స్పష్టం చేస్తోంది. ప్రసవానంతరం మూడు నెలల పాటు నెగిటివ్ థాట్స్ వేధిస్తున్నాయట. గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణాల్లోనూ లింగ వివక్ష కనిపిస్తోందని పేర్కొన్నారు. గత రెండు దశాబ్దాల్లో మాతృ మరణాల సంఖ్య 50 శాతానికి పైగా తగ్గినప్పటికీ ఆత్మహత్యల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. దీనికి ప్రధానంగా పేదరికం, ఆర్థిక అసమానతలు, గృహ హింస, సూటిపోటి మాటలు, కుటుంబ సభ్యుల మద్ధతు లేకపోవడం వంటి సమస్యలు కనిపిస్తున్నాయి. సామాజిక మాధ్యమాలే కారణం.. నగర జీవితంలో ఆలస్యంగా వివాహాలు చేసుకోవడం, దంపతులిద్దరూ ఉద్యోగాలు చేయడం సర్వసాధారణం. గర్భిణిగా ఉన్నప్పుడు విధి నిర్వహణలో ఒత్తిడి, ఇంట్లో ఒంటరి తనం వేధిస్తున్నాయి. ఉమ్మడి కుటుంబాల్లో ఎక్కువ సలహాలు, సూచనలతోనూ గర్భిణులు ఇబ్బందిపడుతున్నారట. పట్టణ జీవితంలో సోషల్ మీడియాకు ఆకర్షితులవుతున్నారు. ప్రతి చిన్న విషయాన్నీ అంతర్జాలంలో చూసి ఆందోళనకు గురవుతున్నారు. కొంత మంది గర్భిణుల్లో నాకు అన్నీ తెలుసు అనే ధోరణి కనిపిస్తోందని వైద్యులు పేర్కొంటున్నారు. లైఫ్ స్టైల్ ప్రభావం.. సుమారు 60 శాతం మంది గర్భిణులు సూర్యుడిని చూడటంలేదట. ఫలితంగా విటమిన్–డి లోపం కనిపిస్తోంది. కుటుంబం, ఉద్యోగాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఆహారపు అలవాట్లు, లైఫ్ స్టైయిల్లో మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మెడిటేషన్ మస్ట్..గర్భిణుల్లో వ్యాయామం, డెలివరీ కాన్సెప్ట్ తీసుకురావాలి. ఇంట్లో రోజువారీ పనులు చేసుకుంటూనే.. మెడిటేషన్కు సమయం కేటాయించాలి. రెండు నుంచి మూడు శాతం మందికి మాత్రమే బెడ్ రెస్ట్ అవసరం ఉంటుంది. మిగతావారు పనులు చేసుకోవచ్చు. ఈ మధ్య కాలంలో గర్భిణిగా గుర్తించిన తొలి రోజుల నుంచి యాంగ్జైటీ మొదలై చివరి వరకు కొనసాగుతోంది. సోషల్ మీడియాకు ప్రభావితం కావొద్దు. పోస్ట్ డెలివరీలో హార్మోన్ ఛేంజెస్ ఉంటాయి. తగినంత రెస్ట్ అవసరం. క్యాల్షియం డెఫిషియన్సీ, రోగ నిరోధక శక్తి సమస్యలు వేధిస్తున్నాయి. రోజు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట మధ్య కనీసం అర గంట ఎండలో ఉంటే డి–విటమిన్ లోపాన్ని అధిగమించొచ్చు. – డాక్టర్ పి.శృతిరెడ్డి, గైనకాలజిస్టు, ల్యాప్రోస్కోపిక్ సర్జన్ (చదవండి: Benefits of Barefoot: ఫుట్ వేర్కి బై.. 'బేర్ఫుట్ వాక్'కి సై..! అధ్యయనాలు సైతం..) -
ఫుట్ వేర్కి బై.. 'బేర్ఫుట్ వాక్'కి సై..! అధ్యయనాలు సైతం..
అప్పులేకుండా తన కాళ్ల మీద తాను నిలబడడం అంటే ఆర్థికంగా స్థిరపడినట్టే అనేవారు పెద్దలు. కానీ చెప్పుల్లేకుండా తన కాళ్లపై తాను నడవడం అంటే ఆరోగ్యం లభించినట్లే అంటున్నారు నేటి వైద్య నిపుణులు. ప్రస్తుతం గ్రౌండింగ్/ఎర్తింగ్ పేర్లతో మెట్రో నగరాల్లో పాదరక్ష రహిత నడక ఆరోగ్య సాధనంగా మారింది. దీనివల్ల ఆరోగ్యపరమైన లాభాలున్నాయని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే జాగ్రత్తలు మాత్రం తప్పనిసరి అంటున్నారు నిపుణులు. ఇప్పటికే వెల్నెస్ చికిత్సా కేంద్రాల్లో ఆదరణ పొందుతున్న ఈ బేర్ఫుట్ వాక్పై నగరవాసుల్లో క్రమంగా ఆకస్తి పెరుగుతోంది. ఆరోగ్య రక్షణపై పెరుగుతున్న అవగాహనే దీనికి కారణమని వైద్య నిపుణులు చెబుతున్నారు. కాలికి చెప్పుల్లేకుండా మైళ్ల దూరం నడిచేవాళ్లం అంటూ మొన్నటి తరం గొప్పగా చెప్పుకోవడం విన్నాం. అప్పట్లో చెప్పులూ లేవు.. ప్రయాణించడానికి సరైన రవాన సౌకర్యాలూ లేవు.. కాబట్టి వారి ఆరోగ్యానికి అవన్నీ దోహదం చేశాయని చెప్పొచ్చు. ఎటువంటి పాదరక్షలూ లేకుండా నడిచినప్పుడు కాళ్లకి మరింతగా స్టిమ్యులేషన్ జరుగుతుందని వైద్యులు అంటున్నారు. ప్రయోజనాలివే.. పాదాలకు చెప్పులు లేకుండా నడవడం వల్ల శరీరానికి, కాళ్లకూ మధ్య మెరుగైన సమన్వయం, రక్త ప్రసరణ వంటి ప్రయోజనాలు లభిస్తాయి. పాదరక్షలు లేకుండా నడవడం స్వేచ్ఛగా, కొంత సంతృప్తిగా కూడా అనిపిస్తుంది. ఇది బాల్యపు జ్ఞాపకాలను తిరిగి తీసుకువస్తుంది. ఈ నడక వల్ల నేలతో మరింత సమన్వయం ఏర్పడుతుంది. ఇది ప్రొప్రియోసెప్షన్ (శరీర కదలికల–అవగాహన)ను మెరుగుపరుస్తుంది. శరీరం కదలిక స్థానాన్ని గ్రహించే సామర్థ్యాన్ని పెంచి పాదాలపై పట్టు జారిపోకుండా ఉండటానికి సహాయపడుతుంది. మెరుగైన ప్రొప్రియోసెప్షన్తో మెరుగైన భంగిమ వస్తుంది. కొంతకాలం పాటు చెప్పులు లేకుండా నడవడం వల్ల వెన్నెముక, కీళ్లు బలోపేతమై మరింత స్థిరత్వంతో తక్కువ వంగి నడవడానికి కూడా సహాయపడుతుంది. పాదాలకు అసంఖ్యాక నరాలు, రక్త నాళాలు ఉంటాయి. చెప్పులు లేకుండా నడవడం వాటిని చురుకుగా మారుస్తుంది. రక్త ప్రసరణ పెంచుతుంది. ప్రసరణ సమస్యలు ఉన్నవారికి, చల్లని పాదాలకు లేదా రోజంతా కూర్చొని గడిపే వారికి ఇది చాలా మేలుచేస్తుంది. అంతేకాదు ఇది నాడీ వ్యవస్థను కూడా మేల్కొలుపుతుంది. భూ ఉపరితలంతో ప్రత్యక్ష సంబంధం ఫ్రీ రాడికల్స్ను తటస్థీకరించడానికి, వాపును తగ్గించడానికి సహాయపడుతుంది. పాదాలు నేలను నేరుగా తాకినప్పుడు చర్మంలో సంభవించే మార్పుల కారణంగా మెదడు చురుకుగా మారుతుందని స్పర్శాజ్ఞానం అత్యుత్తమం అవుతుందని, సెన్సరీ స్టిమ్యులేషన్, మోటార్ స్కిల్స్.. బాడీ బ్యాలెన్సింగ్ నైపుణ్యం వంటివి పెరుగుతాయని చెబుతున్నారు. షూస్, సాక్స్లలో చేరుకునే బాక్టీరియా, ఫంగస్ నుంచి తప్పించుకోవచ్చు. చెప్పులు లేకుండా నడవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఎక్కడ? దేనిపై అడుగు పెడుతున్నారు? పాదాలు ఏ స్థితిలో ఉన్నాయి అనే దానిపై ఆధారపడి ఉంటుంది. చదునైన పాదాలు, ప్లాంటార్ ఫాసిటిస్ లేదా పాదాల నొప్పి ఉన్నవారు దీన్ని ఎంచుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఫ్లాట్ ఆర్చ్లు, ప్లాంటార్ ఫాసిటిస్, లేదా దీర్ఘకాలిక నొప్పి వంటి కొన్ని ప్రత్యేక తరహా పాదాలు ఉంటే చెప్పులు లేకుండా నడవడం మరింత దిగజార్చుతుంది. అందరికీ కాదు.. అన్ని చోట్లా కాదు.. పాదరక్షలను వదిలే ముందు, పాడియాట్రిస్ట్ లేదా ఫిజియోథెరపిస్ట్ను ముందస్తుగా సంప్రదించడం అవసరం ఇది అందరికీ లేదా ప్రతి వాతావరణానికి తగినది కాదు. పట్టణ ప్రాంతాలు, విపరీతమైన ఉష్ణోగ్రతలు వంటి కొన్ని పరిస్థితులు ప్రమాదాన్ని కలిగిస్తాయి. గడ్డి, ఇసుక లేదా నేల వంటి సహజ ఉపరితలాలపై సహజమైన ప్రకృతిలో మాత్రమే పాదరక్ష రహితంగా నడవవచ్చు. పరిశుభ్రమైన పరిసరాలు కూడా తప్పనిసరి. వృద్ధులకు లేదా ఆర్థరైటిస్ ఉన్నవారికి ఇది సరైన ఎంపిక కాదు. ఫంగల్ ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని తెస్తుంది. పట్టణ ప్రాంతాల్లోని కఠిన ఉపరితలాలు, తీవ్రమైన ఉష్ణోగ్రతలు కొన్ని ఆరోగ్య పరిస్థితులు చెప్పులు లేకుండా నడవడాన్ని ప్రమాదకరంగా మారుస్తాయి. బేర్ ఫుట్ వాక్ పూర్తయ్యాక వైద్యులు సూచించిన యాంటిబయాటిక్ సోప్స్ లేదా లోషన్స్ ఉపయోగించి పాదాలను శుభ్రపరుచుకోవడం మంచిది. పచ్చని గడ్డి మీద, పరిశుభ్రంగా ఉండే కార్పెట్స్ మీద నడవవచ్చు. సముద్రపు ఇసుక మీద నగక కూడా మంచిదే. ఆరోగ్యకరం.. తగిన జాగ్రత్తలు తీసుకుని బేర్ఫుట్ వాక్ చేయడం ఆరోగ్యానికి మంచిదే. ముఖ్యంగా దీనివల్ల ఫుట్ పొజిషన్ (అడుగు పడే స్థితి) మీద నియంత్రణ వస్తుంది. నడకలో బ్యాలెన్స్ పెరగడానికి, నొప్పి నివారణ వేగంగా జరగడానికి ఉపయోగపడుతుంది. పిరుదులు, కీళ్లు, కోర్ మజిల్స్ మధ్య సమన్వయం మెరుగుపడుతుంది. సరిగా నప్పని పాదరక్షలు ధరించడం వల్ల వచ్చే ఇబ్బందులకు చెక్ పడుతుంది. లోయర్ బ్యాక్ ప్రాంతపు కండరాలను శక్తివంతం చేస్తుంది. – డా.కల్పన, ఫ్యామిలీ ఫిజీషియన్ (చదవండి: భారత్ పిలిచింది..! కష్టం అంటే కామ్ అయిపోమని కాదు..) -
భారత్ పిలిచింది..!
బ్రెయిన్ ట్యూమర్ బారిన పడిన యూకే అథ్లెట్ జాక్ ఫెంట్కు ప్రతికూల ఆలోచనలు వస్తుండేవి. ఆ సమయంలోనే తనకు ఇష్టమైన ఇండియా గుర్తుకు వచ్చింది. వెంటనే రంగంలో దిగాడు. ‘ఇండియా–80 రోజులు–4,000 కిలోమీటర్లు’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు.ఇండియాలోకి అడుగు పెట్టిన క్షణం నుంచి అతడిలో ఉత్సాహం మొదలైంది. ఇండియాలో తన ‘80–డే రన్’ తాలూకు వీడియోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నాడు. ‘ప్రొటెక్టర్’ కాప్షన్తో పోస్ట్ చేసిన వీడియోలో తనను ప్రమాదం నుంచి రక్షించిన వీధి శునకం గురించి చెప్పాడు.ఆ శునకంతో తనతో పాటు పదమూడు కిలోమీటర్లు నడిచింది. దానికి ‘మనాలి’ అని పేరు పెట్టాడు జాక్.‘80 రోజులలో రోజుకు 50 కిలోమీటర్ల దూరం పరుగెత్తడానికి ఇండియాకు ప్రయాణమవుతున్నాను. మంచుతో కప్పబడిన కొండల నుంచి కేరళ ప్రకృతి అందాల వరకు ఎన్నో చూడబోతున్నాను. బ్రెయిన్ ట్యూమర్ అని నాకు నిర్దారణ అయిన తరువాత నా మనసు భయం, గందరగోళం, దుఃఖంతో నిండిపోయింది. నాకే కాదు భూమి మీద ప్రతి ఒక్కరికీ కష్టాలు కూడా ఉంటాయి. దీంతో పాటు ఒక ఆప్షన్ కూడా ఉంటుంది. ఇండియాకు వెళ్లాలను కోవడం అనేది నా ఎంపిక. మళ్లీ పూర్వంలా ఉత్సాహంగా ఉండాలనుకుంటున్నాను’’ అని తన యాత్ర ప్రారంభానికి ముందు షేర్ చేసిన పోస్ట్లో రాశాడు జాక్ పెయింట్. (చదవండి: వెయిట్ లిఫ్టింగ్తో ఇంత మార్పు..? ఏకంగా 93 కిలోలు నుంచి 50కిలోలు తగ్గిన మహిళ..) -
మనసు మాట విందాం!
మన సమాజంలో దగ్గు, జలుబు, జ్వరం, షుగర్, బీపీ అంటే వెంటనే డాక్టర్ దగ్గరకు వెళ్తారు. కానీ డిప్రెషన్, ఆందోళన, పానిక్ అటాక్, డీ–పర్సనలైజేషన్ లాంటి వాటిని బలహీనతలు లేదా అలసత్వంగా చూస్తారు. అవేవో బాధితులు కావాలని తెచ్చిపెట్టుకున్నట్టు భావిస్తారు. కానీ నిజానికి మానసిక ఆరోగ్యం కూడా శారీరక ఆరోగ్యంతో సమానమే. ఇవి రెండూ పరస్పర ఆధారితాలు. తలనొప్పి, తల తిరుగుడు, వాంతులు, జీర్ణ సంబంధ ఇబ్బందులు, గుండె అత్యంత వేగంగా కొట్టుకోవడం, ముఖ కండరాలు అదరడం, చర్మం పాలిపోవడం లాంటి శారీరక లక్షణాల ద్వారా మానసిక వ్యాధులు వ్యక్తం అవుతాయి. అంటే, మనసు తాను అనుభవించే హింసను గుర్తించమని, త్వరగా ఈ బాధను తగ్గించే ఉపాయం చూడమని శరీరం ద్వారా వేడుకుంటుంది! కానీ పట్టించుకోం మనం. ఎందుకంటే, బాధితులు ఆ వ్యాధులకు సంబంధించిన మందులు తీసుకుంటే వాటికి బానిసలవుతారని, ఈ వ్యాధులు పూర్తిగా నయం కావనీ. నిజానికి ఇవన్నీ తప్పుడు భావనలు. మానసిక వ్యాధులు కూడా శారీరక వ్యాధుల్లానే అనేక కారణాల వల్ల రావచ్చు. మెదడు రసాయనాల అసమతుల్యత, వంశపారంపర్యం, ఒత్తిడి, పరిసరాలు వంటి అంశాలు దీనికి కారణం అవుతాయి. కనుగొనదగిన కారణాలు ఏమీ లేకుండా కూడా మానసిక వ్యాధులు రావచ్చు. తొలిదశలోనే వ్యాధిని గుర్తించి సరైన చికిత్స చేస్తే, బాధితులు సాధారణ జీవితం గడపవచ్చు. పిల్లలు, యువకులు, పెద్దలు ఎవరికి అయినా మానసిక సమస్యలు రావచ్చు. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం, 2021లో ప్రపంచంలో సుమారు 1.1 బిలియన్ మంది మానసిక వ్యాధుల బారినపడ్డారు (ప్రతి ఎనిమిది మందిలో ఒకరు) అసలు మీరు పని చేసేచోట, సంచరించే చోట మీకు తెలియకుండా ఇప్పటికే ఒకరిద్దరు డిప్రెషన్ తోనో, ఏంగ్జయిటీతోనో వుండి ఉండొచ్చు. రోజువారీ జీవితంలో అవరోధం కలగనంతవరకూ పరవాలేదు. సమస్య వస్తే మాత్రం, దాచుకోవడం కంటే కుటుంబ సభ్యుల, స్నేహితుల, సహకారం తీసుకోవడం, వైద్యుని సంప్రదించడం ఎంతో అవసరం. అన్నిటికన్నా ముఖ్యమైన సంగతి, మానసిక ఆరోగ్య సమస్యలు ‘‘నిజమైనవి’’ అనే విషయాన్ని గ్రహించడం, అంగీకరించడం. జ్వరం వస్తే విశ్రాంతి తీసుకుంటాం కదా! అలాగే, మనసు అలసిపోయినప్పుడు, అది బాధపడినప్పుడు కూడా సహాయం కోరడం సిగ్గుపడాల్సిన విషయం కాదు. ధైర్యం, అవగాహన అవసరమయ్యే విషయం. మనసుని ఖాళీగా ఉంచకుండా మంచి వ్యాపకాలు పెట్టుకోవాలి. గ్రౌండింగ్ టెక్నిక్స్, బ్రీతింగ్ వ్యాయామాలు నేర్చుకోవాలి.. సర్వమానవ సహోదరత్వం, సౌభ్రాతృత్వం గురించి ఉపన్యాసాలు దంచేస్తాం. మనలో అది నిజంగా వుందని నిరూపించుకునే చిన్న అవకాశం ఒకటి ఏమిటంటే, మానసిక వ్యాధులతో బాధపడేవారిని చూసి ఎగతాళిగా నవ్వకుండా, తప్పుగా మాట్లాడకుండా ఉండటం, వాళ్లకి చేతనైన సహాయం చెయ్యడం. ఆమాత్రం చేయలేమా?ప్రపంచ ప్రసిద్ధ వ్యక్తుల్లో అబ్రహాం లింకన్, ఐజాక్ న్యూటన్, విన్సెంట్ వ్యాన్గో, చార్లెస్ డికెన్స్ నుంచీ మన దీపికా పదుకొనే వరకూ ఎందరో గొప్ప వ్యక్తులు, సెలబ్రిటీలు మానసిక వ్యాధులతో పోరాడి, సాధారణ స్థాయిని మించి ఉన్నతంగా బతకడమే కాకుండా, తమ ప్రతిభతో లోకానికి ప్రేరణగా నిలిచారు. మానసిక రోగులు చాలావరకు ప్రమాదకారులు కాదు; మందులు వైద్యుని సూచన మేరకు తీసుకుంటే అడిక్షన్ రాదు.వైష్ణవి గద్దె, వైద్య విద్యార్థిని -
భార్యాబిడ్డల్ని విమానం ఎక్కించి వచ్చాడో లేదో తీవ్ర గుండెపోటు, విషాదం
ఇటీవలి కాలంలో వరుస ఎన్ఆర్ఐల మరణాలు ఆందోళన రేపుతున్నాయి. అబుదాబి అంతర్జాతీయ విమానాశ్రయంలో తన భార్య , కుమారుడికి వీడ్కోలు పలికిన కొన్ని గంటలకే UAEలో ఒక భారతీయ ప్రవాస ఇంజనీర్ గుండెపోటుతో ఆకస్మికంగా మరణించడం తీవ్ర విషాదాన్ని నింపింది. బాధితుడిని హరిరాజ్ సుదేవన్ (37) (Hariraj Sudevan) గుర్తించారు.కేరళలోని అలప్పు జిల్లాకు చెందిన 37 ఏళ్ల హరిరాజ్ సుదేవన్ హరిరాజ్ సుదేవన్ గత 12 ఏళ్లుగా యుఎఇలో నివసిస్తున్నాడు. అయితే తన భార్య డాక్టర్ అను అశోక్ , 10 ఏళ్ల కుమారుడు ఇషాన్ దేవ్ హరి కేరళ వెళ్లాలని నిర్ణయించుకున్నారు. వారిని విమానాశ్రయంలో దింపిన కొన్ని గంటలకే అబుదాబిలో గుండెపోటుతో మరణించాడు. అల్లుడు అకాల మరణంపై మామ అశోకన్ కేపీ తీవ్ర విచారాన్ని ప్రకటించారు. ఆయన ఇక లేరనే వాస్తవాన్ని జీర్ణించుకోలేకపోతున్నామనంటూ కంట తడిపెట్టారు.ఆదివారం సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చే ముందు తన కుమార్తె , మనవడు హరిరాజ్తో 10 రోజులు గడిపారని, అక్టోబర్ 27న తన కొడుకు పుట్టినరోజుకు హాజరు కావడానికి హరిరాజ్ ఈ నెల చివర్లో రావాల్సి ఉందని గుర్తు చేసుకున్నారు. ఐఐటీ మద్రాస్ పూర్వ విద్యార్థి అయిన సుదేవన్, యుఎఇలో 12 సంవత్సరాలకు పైగా సీనియర్ ఆఫ్షోర్ కన్స్ట్రక్షన్ ఇంజనీర్గా పనిచేస్తున్నారు. కుసాట్ నుండి బి.టెక్ ,ఐఐటీ మద్రాస్ నుండి ఎంటెక్ పట్టా పొందారు. హరిరాజ్, అబుదాబిలో సీనియర్ పనిచేస్తున్నారు. అంత్యక్రియల కోసం ఆయన మృతదేహాన్ని కేరళకు తరలించారు. థామస్ కుమార్తె పుట్టినరోజు వేడుకలను జరుపుకోవడానికి మా ఇంటికి వచ్చారని, ఎంతో సంతోషంగా గడిపామని సన్నిహిత స్నేహితుడు డిజిన్ థామస్ తెలిపారు. -
వెయిట్ లిఫ్టింగ్తో ఇంత మార్పు..? 43 కిలోల బరువు తగ్గిన మహిళ..
వెయిట్ లిఫ్టింగ్ అనగానే..మగవాళ్లు చేసేది అనే భావనే అందిరిలో ఉంటుంది. అయితే ఇటీవల కొందరు ఫిట్నెస్ ఔత్సాహిక మహిళలు ఆ మూసధోరణిని బద్ధలు కొట్టి మరి వెయిట్లిఫ్టింగ్లో సత్తా చాటారు. చాలామంది ప్రముఖ ఫిట్నెస్ నిపుణులు సైతం ఈ వెయిట్లిఫ్టింగ్లు మహిళలకు సరిపడవని, మగవాళ్ల ఫిజిక్లా కనిపించేలా చేస్తుందని చెప్పేవారు. అయితే ఆ అపోహను అబద్ధం అని కొట్టిపారేసేలా ఈ మహిళ అద్భుతం చేసి చూపింది. అంతేగాదు మహిళలకు ఈ వెయిట్లిఫ్టింగ్ ఎంత మేలు చేస్తుందో సవివరంగా వెల్లడించారామె. అదెలాగో ఆమె మాటల్లోనే తెలుసుకుందామా..!.ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్కు చెందిన సుష్మా పచౌరి ఖాడియా కంటెంట్ క్రియేటర్, ఫిట్నెస్ కోచ్. ఆమె ఒకప్పుడు స్వతహాగా 93 కిలోలు బరువు ఉండేది. వెయిట్లిప్టింగ్తో సుమారు 43 కిలోల మేర తగ్గి అందరినీ ఆశ్చర్యపోయేలా చేసింది. అంతలా సంతరించుకున్న తన శరీర మార్పు గురించి సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారామె. ప్రజలంతా అనుకున్నట్లు వెయిట్లిఫ్టింగ్లు ఆడవాళ్లను మగవాళ్లలా రఫ్గా మార్చదని, ఎంతో ప్రయోజనకరమైనదని అంటోంది. ఇది మహిళల్లోని ఫ్యాట్ని కరిగించి వెయిట్లాస్కు చెక్ పెడుతుందని చెబుతోంది. తాను శుభ్రంగా ఇంట్లో వండిన ఆహారం, క్రమ తప్పకుండా వ్యాయామాలు చేసి ఇంతలా బరువు తగ్గానని చెప్పుకొచ్చింది. సుష్మా పోస్ట్లో 'వెయిట్లిఫ్టింగ్ దుష్ప్రభావాలు' అనే క్యాప్షన్ జోడించి చేసిన ఈ పోస్ట్ నెట్టింట తెగ వైరల్గా మారింది. 18 ఏళ్ల వ్యక్తికి తల్లి అయిని సుష్మా పచైరి వెయిట్లిఫ్టింగ్ని తన దినచర్యలో భాగం చేసుకున్న తర్వాత నుంచి తన జీవితం ఇంతలా మారిందని తెలిపింది. View this post on Instagram A post shared by Sushma Pachouri Khadia (@sushma.pachouri) సంతరించే మార్పులు-ప్రయోజనాలు..ఆకాశాన్ని అంటేలా శక్తి స్థాయిలు పెరుగుతాయి. స్లిమ్గా మారుతున్నట్లు తెలుస్తుంది. దుస్తుల సరిపోతాయిఅందరి అటెన్షన్ మీపై ఉంటుంది. ఎలా బరువు తగ్గారు అని కచ్చితంగా ప్రశ్నించడం మొదలవుతుంది. సోమరితనం దరి చేరదుఒత్తిడి అనే మాటకు ఆస్కారం ఉండదుకిరాణ సామాగ్రి వంటి పలు రకాల లగేజ్లను సులభంగా ఎత్తేయగలుగుతారుమంచి నిద్ర పడుతుంది. ఇలాంటి మంచి ఫలితాల కోసం ఫిట్నెస్కోచ్ సూచించే సలహాలను తప్పక పాటించాలని చెబుతోంది. ఇక్కడ ఈ వెయిట్ లిఫ్టింగ్ మహిళల్లో లీన్ కండరాలను అభివృద్ధి చేయడానికి, శరీరాన్ని పెద్ద పరిమాణంలో కనిపించకుండా మెరుగుపరచడానికి సహాయపడుతుంది. నిజానికి ఇది మహిళలకు బలం, ఫిట్నెస్ తోపాటు మంచి ఆత్మవిశ్వాసాన్నికూడా అందిస్తుందని నమ్మకంగా చెబుతోంది ఫిట్నెస్ కోచ్ సుష్మా పచౌరి. View this post on Instagram A post shared by Sushma Pachouri Khadia (@sushma.pachouri)గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: స్వచ్ఛందంగా ఇలా ప్రయత్నిస్తే..స్వచ్ఛ భారత్ సక్సెస్ అయినట్లే..) -
మానసిక ఆరోగ్యానికి మనమేం చేస్తున్నాం?
ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 10న ‘మానసిక ఆరోగ్య దినోత్సవా’న్ని (World Mental Health Day 2025) జరుపు కొంటున్నాము. మానసిక ఆరోగ్య ప్రాము ఖ్యాన్ని గుర్తించి ‘వరల్డ్ ఫెడరేషన్ ఫర్ మెంటల్ హెల్త్’ (డబ్ల్యూఎఫ్ఎమ్హెచ్) 1992 నుండి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ప్రపంచ వ్యాప్తంగా 150 దేశా లలో మానసిక ఆరోగ్యంపై అపోహలు తొలగించి అవగాహన పెంచడానికి వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహిస్తారు. ‘విపత్తులు, ఆపత్కాలంలో మానసిక ఆరోగ్య సేవల లభ్యత’ అనేది ఈ ఏడాది నినాదం. ‘శారీరక ఆరోగ్యంతో పాటు మానసికంగా, సామాజికంగా కూడా దృఢంగా ఉండటం’ సంపూర్ణ ఆరోగ్యం అనేది ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) నిర్వచనం. మనిషి తన ఆలోచనలు, భావోద్వేగాలు నియంత్రించుకోగలిగి, సమస్యలను ధైర్యంగా ఎదు ర్కొని, సరైన నిర్ణయాలు తీసుకోగలగాలి. డబ్ల్యూహెచ్ఓ అంచనా ప్రకారం, ప్రపంచ వ్యాప్తంగా సుమారుగా 97 కోట్లకు పైగా ప్రజలు, రకరకాల మానసిక రుగ్మతలతో బాధ పడుతున్నారు. మన దేశంలో ప్రతి ఆరుగురిలో ఒకరు ఏదో ఒక మానసిక ఇబ్బందికి గురవుతున్న వారే! డిప్రెషన్, ఆందోళన, మద్యపానం, మాదక ద్రవ్యాల విని యోగం వల్ల ఎక్కువమంది మానసికంగా ఇబ్బంది పడుతున్నారు. ప్రకృతి వైపరీత్యాలు, యుద్ధాలు, తొక్కిసలాటల్లో వందలాది మరణాలు సంభవించడం, కోవిడ్ లాంటి సందర్భాలలో అచటి ప్రజలు మరింత మానసిక క్షోభకు గురవుతారని పరి శోధనల్లో తేలిన విషయం. కోవిడ్ ప్రపంచానికి ఒక పెద్దపాఠం నేర్పింది. చావు భయంతోపాటు, లాక్డౌన్ ప్రభావం, ఉద్యోగాలు పోయి ఆర్థిక ఇబ్బందులు, బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోయి ఒంటరిగా ఉండటం లాంటివన్నీ మానసిక ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపాయి. ఒక అంచనా ప్రకారం, కోవిడ్లో మానసిక రుగ్మతలు కనీసం 25 శాతం పెరిగాయి. యువతలో మొబైల్ అడిక్షన్, డిప్రెషన్, గ్యాంబ్లింగ్ సమస్యలు అధికమయ్యాయి. రష్యా, ఉక్రెయిన్, ఇజ్రాయిల్–గాజా యుద్ధాల వల్ల అక్కడి ప్రజలు తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురవుతున్నట్లు సర్వేలు తెల్పు తున్నాయి. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, కేరళ వంటి చోట్ల ఆ మధ్య సంభవించిన మేఘ విస్ఫోటనం వల్ల వచ్చిన వరదలు, ఆస్తి, ప్రాణనష్టంతో అనేకమంది మానసిక వేదనకు గురయ్యారు. దాదాపు 140 కోట్లకు పైగా జనాభా గల మన దేశంలో కనీసం 20 వేల మంది అర్హులైన మానసిక వైద్య నిపుణులు కూడా లేరంటే ఆశ్చర్యమే! మానసిక ఆరోగ్యానికి హెల్త్ బడ్జెట్లో కేటాయింపులు కేవలం ఒక శాతం కన్నా తక్కువే!చదవండి: Mounjaro వెయిట్లాస్ మందు దూకుడు, డిమాండ్ మామూలుగా లేదు!ఈ సమస్యల నుండి బయటపడాలంటే, ప్రాథమిక ఆరోగ్య వ్యవస్థతో, మానసిక ఆరోగ్య సేవలను అనుసంధానించాలి. కళాశా లల్లో మానసిక ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు తప్పనిసరి చేయాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మెంటల్ హెల్త్కు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. విపత్తులలో పనిచేసే సిబ్బందికి ‘సైకలాజికల్ ఫస్ట్ ఎయిడ్’లో శిక్షణ ఇప్పించాలి. హెల్ప్లైన్లు, టెలిమానస్ లాంటి సర్వీసులు మరింతగా పెంచాలి. ఆపద సమయాల్లో మన మిచ్చే ఓదార్పు, భరోసా, భవిష్యత్తులో వారు మరిన్ని మానసిక రుగ్మతలకు లోనుకాకుండా నివారిస్తుంది. మానసిక వైద్యుల కొరత ఉన్న మన దేశంలో, ఇలాంటివి ఎదుర్కొనేందుకు ఆశా, హెల్త్ వర్కర్లు; ఎన్ఎస్ఎస్, రెడ్క్రాస్ కార్యకర్తలు; టీచర్లు, మత ప్రతి నిధులు లాంటి వారికి, ‘సైకలాజికల్ ఫస్ట్ ఎయిడ్’లో తగిన శిక్షణ నివ్వాలి. అప్పుడే 2047 నాటికి మనం పరిపూర్ణ ‘వికసిత్ భారత్’ని సాధించగలుగుతాం. ఇదీ చదవండి: చిట్టిచేప.. చీరమీను... ఒక్కసారి తిన్నారంటే!వ్యాసకర్త డా.ఇండ్లరామసుబ్బా రెడ్డి మానసిక వైద్య నిపుణులు(అక్టోబర్ 11 ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం) -
'వాకింగ్' తినక ముందా? తిన్నతర్వాతా?
ప్రస్తుతం ఆరోగ్యం కోసం అత్యధికులకు అందుబాటులో ఉన్న మంచి వ్యాయామం వాకింగ్. ఏ సమయంలో అయినా ఎక్కడైనా చేయగలిగిన వ్యాయామం కావడంతో దీనిని అనేకమంది ఎంచుకుంటున్నారు. అయితే వాకింగ్కు సంబంధించి పూర్తి ప్రయోజనాలు లభించాలంటే ఎప్పుడు ఎలా వాక్ చేయాలి అనేదానిపై అవగాహణ ఉండాలి అంటున్నారు వైద్యులు. ముఖ్యంగా రోజూ మూడు లేదా నాలుగు పూటలా తినే అలవాటున్నవారు ఈ విషయంలో మరింత అవగాహన పెంచుకోవాలని సూచిస్తున్నారు. వైద్యులు చెబుతున్న ప్రకారం...భోజనం ముందు...అప్పటికి ఖాళీ కడుపుతో ఉన్నా లేదా తక్కువ కార్బోహైడ్రేట్స్, అధిక ప్రోటీన్ ఆహారం తీసుకుని ఉన్న స్థితిలో నడవడం వల్ల కొవ్వు ఆక్సీకరణ పెరుగుతుంది. అంటే ఫ్యాట్ కరుగుతుందన్నమాట. నడకకు ముందు అధిక కార్బోహైడ్రేట్స్ కలిగిన భోజనంతో పోలిస్తే ఇది ఎక్కువ సంతృప్తిని ఇస్తుంది, నడకకు అవసరమైన శక్తి ఖర్చు తగ్గుతుంది. అల్పాహారం లేదా భోజనానికి ముందు చిన్నపాటి నడక భోజన కాంక్షను పెంచేందుకు సహాయపడుతుంది. శరీరంపై గ్లూకోజ్ లోడ్ పడకుండా చురుకుదనాన్ని పెంచుతుంది. ఉదయం లేదా మధ్యాహ్న భోజనానికి ముందు ముందు 10–20 నిమిషాలు, తేలికపాటి నడక మేలు.భోజనం తర్వాత...భోజనం తర్వాత కూర్చోవడం కంటే 2–10 నిమిషాలు తేలికగా నడవడం వల్ల భోజనం తర్వాత రక్తంలో చోటు చేసుకునే చక్కెర స్థాయి తగ్గుతుందని అనేక అధ్యయనాలు నిర్ధారించాయి. భోజనం తర్వాత వెంటనే 10 నిమిషాల నడక కలిగించే లాభాలు మిగిలిన సమయాల్లో చేసే సుదీర్ఘ నడకతో ధీటుగా ఉంటాయని అవి తేల్చాయి. నడక జీర్ణవ్యవస్థకు రక్త ప్రవాహాన్ని ప్రోత్సహిస్తుంది, గ్లైసెమిక్ నియంత్రణ కోసం ప్రతి భోజనం తర్వాత చిన్న నడక అవసరం. భోజనం తర్వాత తేలికపాటి నడక గ్యాస్ట్రిక్ సమస్య నివారణకు సహాయపడుతుంది, కడుపు ఉబ్బరం లక్షణాలను తగ్గిస్తుంది యాసిడ్ ఎక్స్పోజర్ను తగ్గిస్తుంది; అయితే భోజనం తర్వాత తీవ్రమైన లేదా వేగవంతమైన నడక మాత్రం మంచిది కాదు. అలాగే భోజనం తర్వాత వెంటనే కాకుండా కనీసం 10–20 నిమిషాల వ్యవధిలో ప్రారంభించి 5–15 నిమిషాలు కొనసాగిస్తే జీర్ణ ప్రయోజనాలకు ఉపయుక్తం.లక్ష్యాన్ని బట్టి సమయ పాలన...ప్రాథమిక లక్ష్యం కొవ్వు తగ్గడం అయితే, ఖాళీ కడుపుతో నడవడం వల్ల తగిన ప్రయోజనం చేకూరుతుంది. ఏమీ తినకుండా శ్రమించినప్పుడు శరీరం గతంలో పేరుకున్న కొవ్వు నిల్వలను శక్తి కోసం ఉపయోగించుకునే అవకాశం ఉంది, ఈ ప్రక్రియను కొవ్వు ఆక్సీకరణం అంటారు. సరైన ఆహారం తీసుకుంటూ ఇలా చేస్తే ఇది బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. అయితే కొందరికి తినడానికి ముందు నడవడం వల్ల తల తిరుగుతుంది లేదా అలసట రావచ్చు, అలాంటి వారు నడకకు ముందు ఒక చిన్న బలవర్ధకమైన చిరుతిండి (ఉదాహరణకు బాదం వంటి నట్స్తో చేసినవి)తీసుకోవడం మంచి ఆలోచన.డయాబెటిస్ తగ్గాలంటే...రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించాలని లక్ష్యంగా పెట్టుకున్న వారికి, భోజనం తర్వాత నడవడం మంచిది. తిన్న 30 నిమిషాలలోపు 10–15 నిమిషాలు తేలికపాటి నడక ఇన్సులిన్ సున్నితత్వాన్ని మెరుగుపరచడం ద్వారా గ్లూకోజ్ ను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది టైప్ 2 డయాబెటిస్ లేదా ప్రీడయాబెటిస్ ఉన్నవారికి ప్రత్యేకంగా ప్రయోజనకరంగా ఉంటుంది.మనసు మాట వినాలి...కొంతమందికి ఖాళీ కడుపుతో నడవడం వల్ల బాగా శక్తివంతంగా అనిపిస్తుంది, ముఖ్యంగా ఉదయం. ఉపవాసం సమయంలో హార్మోన్ల మార్పుల కారణంగా వారు మానసికంగా పదునుగా మారి పనిపై మరింత ఎక్కువ దృష్టి కేంద్రీకరించినట్లు ఫీలవుతారు. మరికొందరికి భోజనం తర్వాత నడవడం వల్ల చురుకుగా అనిపించవచ్చు. అంతిమంగా, వ్యక్తిగత ప్రాధాన్యత ముఖ్యం, శరీరం ఎలా స్పందిస్తుంది అనేది కూడా గమనించాలి. ఉదయాన్నే నడుస్తున్నా లేదా రాత్రి భోజనం తర్వాత అయినా, క్రమం తప్పకుండా నడవడం మాత్రం చాలా అవసరం. గుండె, మెదడు, మానసిక స్థితి జీవక్రియకు దీర్ఘకాలిక ప్రయోజనాలను అందిస్తుంది.(చదవండి: మచ్చలేని చర్మం, నిగనిగలాడే జుట్టు కోసం డీఎన్ఏ డీకోడ్..!) -
వెయిట్లాస్ మందు దూకుడు, డిమాండ్ మామూలుగా లేదు!
వెయిట్లాస్ అనగానే ఈ మధ్య కాలంలో అందరికీ గుర్తొచ్చే ఔషధం ‘మౌంజారో’ (Mounjaro) అమెరికా ఫార్మా దిగ్గజమైన ఎలీ లిల్లీ కంపెనీకి చెందిన ఈ డ్రగ్ అమ్మకాల్లో దూసుకుపోతుంది. భారతదేశ ఔషధ మార్కెట్లో యాంటీ-ఒబెసిటీ, డయాబెటిస్ ఔషధం మౌంజారో రెండో అతిపెద్ద బ్రాండ్గా అవతరించింది. లాంచ్అయిన ఆరు నెలల్లోనే కోట్ల రూపాయల బిజినెస్ సాధించి మార్కెట్ను షేక్ చేస్తోంది.ఇండియన్ ఫార్మాస్యూటికల్ మార్కెట్ (IPM) తాజా డేటా ప్రకారం, సెప్టెంబర్లో మౌంజారో రూ. 80 కోట్ల అమ్మకాలను నమోదు చేసింది. రూ. 85 కోట్లు నమోదు చేసిన GSK యాంటీబయాటిక్ ఆగ్మెంటిన్ మొదటి స్థానంలో ఉంది. ఫార్మా మార్కెట్లో మౌంజారో ఇంజెక్షన్ మొత్తం ఆదాయం రూ. 233 కోట్లకు చేరడం గమనార్హం.మౌంజారో సాధారణంగా టిర్జెపటైడ్ అని పిలువబడే మౌంజారో, టైప్ 2 డయాబెటిస్ను నివారణలో వారానికి ఒకసారి ఇంజెక్ట్ చేయగల ఔషధం.ఇది రక్తంలో చక్కెర స్థాయిలు, ఆకలిని నియంత్రించడంల సహాయపడే రెండు గట్ హార్మోన్లు-GLP-1, GIP-లను నియంత్రిస్తుంది. తద్వారా గ్లూకోజ్ను అదుపులో ఉంచడమే కాదు, బరువు తగ్గడానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. దీని ద్వారా సగటున 20-22 శాతం బరువు తగ్గుతున్నట్టు క్లినికల్ అధ్యయనాల ద్వారా తెలుస్తోంది.ప్రపంచవ్యాప్తంగా కూడా ఇది మౌంజారో యాంటీ-ఒబెసిటీ , మెటబాలిక్ చికిత్సలలో ఎక్కువగా చర్చల్లో నిలుస్తున్న మందుగా మారిపోయింది. మౌంజారో ఇప్పటికే మధుమేహం ,ఊబకాయాన్ని తగ్గించుకోవడంలో లక్షలాదిమందికి ఉపయోగపడింది. ఈనేపథ్యంలోనే ముఖ్యంగా ఇండియాలో శరవేగంగా వినియోగంలోకి వస్తోంది. వెయిట్లాస్ చికిత్సలకు డిమాండ్ ఎంత బలంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ ఔషధం ఏప్రిల్ 2024లో భారతదేశంలో లాంచ్ అయింది. సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (CDSCO) వైద్యుల సలహా మీద మాత్రమే వాడే మాత్రమే ఇంజెక్షన్గా ఆమోదించింది. ఇది 2.5 mg , 5 mg మోతాదులలో లభిస్తుంది, వారానికి ఒక డోసు చొప్పున వాడే ఈ మదు ధర మోతాదును బట్టి. నెలకు రూ. 14,000 ,రూ. 17,500 మధ్య ఉంటుంది.చదవండి : చిట్టిచేప.. చీరమీను... ఒక్కసారి తిన్నారంటే!అధిక ధర ఉన్నప్పటికీ డిమాండ్మాత్రం అప్రతిహగంగా పెరుగుతూ వస్తోంది. దీఆగస్టు నుండి సెప్టెంబర్ వరకు బ్రాండ్ అమ్మకాలు 43 శాతం పెరిగాయి, రూ. 56 కోట్ల నుండి రూ. 80 కోట్లకు పెరిగాయి. ఫలితంగా మార్కెట్లో వేగంగా అభివృద్ధి చెందుతున్న మందులలో ఒకటిగా నిలిచింది. సెప్టెంబర్లో మొత్తం భారతీయ ఫార్మా మార్కెట్ 7.3 శాతం విస్తరించింది. దీనికి తోడు సెప్టెంబర్ 22 నుండి అమలులోకి వచ్చేలా 18 శాతం నుండి 5 శాతానికి జీఎస్టీ తగ్గింపు కూడా కలిసి వచ్చింది. ఈదూకుడు కేవలం ప్రారంభం మాత్రమే అంటున్నారు పరిశ్రమ నిపుణులు అంటున్నారు. -
ఆన్లైన్ ఒత్తిడికి విరుగుడుగా..
ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం(అక్టోబర్ 10)ని పురస్కరించుకుని యువజన మీడియా ప్లాట్ఫామ్ ‘యువ’ భాగస్వామ్యంతో ‘స్నాప్ ఇంక్’ ఆధ్వర్యంలో ‘కేర్ నాట్ కంట్రోల్’ పేరిట కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ విషయాన్ని సంస్థ ప్రతినిధులు తెలిపారు. సోషల్ మీడియా, అభద్రత, ఒత్తిళ్లను దృష్టిలో పెట్టుకుని ఆన్లైన్ ప్రపంచాన్ని సురక్షితంగా మార్చడం టీనేజర్ల మధ్య ఆరోగ్యకరమైన సంభాషణలను పెంపొందించడమే ప్రధానంగా దీని ఉద్ధేశ్యమన్నారు. భారతీయ స్నాప్చాటర్ల డిజిటల్ శ్రేయస్సుకు ఇది మద్దతు అందిస్తుందని వివరించారు. ఈ వీడియో ప్రచారం ఈ నెల 10 వరకూ కొనసాగుతుందన్నారు. చిన్నపాటి చిట్కాలు..అలాగే బాగా ఒత్తిడిలో ఉన్నప్పుడువెంటనే అమ్మకు ఫోన్ చేసి ఆమె గొంతు వినండి... చిన్నప్పుడు అమ్మ పాడే జోలపాట వింటూ హాయిగా నిద్దురలోకి జారినంత తేలిగ్గా మీరు ఒత్తిడి నుంచి బయట పడతారని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. (చదవండి: Custard Apple: సీజన్లో నిండుగా..సిటీలో పండు'గ'! జ్యూస్, ఐస్క్రీమ్స్, స్వీట్స్ నుంచి..) -
సీజన్లో నిండుగా..సిటీలో పండు'గ'
మామిడి, స్ట్రాబెర్రీ ఇలా ఏదైనా కావొచ్చు.. ప్రతి సీజనల్ పండుని పండుగలా ఎలా జరుపుకోవాలో నగరవాసులకు తెలుసు. ప్రస్తుతం సీతాఫల్(కస్టర్డ్ ఆపిల్) సీజన్ ప్రారంభమైంది. దాంతో ప్రతి సంవత్సరం మాదిరిగానే అక్టోబర్ నెలలో హైదరాబాద్ నగరంలోని రెస్టారెంట్ డెజర్ట్ మెనూలకు ఈ క్రీమీ ఫ్రూట్ కొత్త రుచులను అద్దుతోంది. సీతాఫలం సీజన్లో నేరుగా పండ్లను తీసుకోవడం మాత్రమే కాకుండా భాగ్యనగరవాసులు దానిని అనేక రూపాల్లో ఆస్వాదిస్తున్నారు. అన్ని పండ్ల మాదిరిగానే సీతాఫల్ జ్యూస్లు సరే.. అయితే.. కూలింగ్ మిల్క్షేక్ల నుంచి రుచికరమైన ఐస్క్రీముల వరకు, స్వీట్లు, పేస్ట్రీలు.. వివిధ రకాల వంటకాలలో ఇవి మేళవించడం విశేషం. వీలైనన్ని రూపాల్లో వెరైటీ డిష్లను తయారు చేసేందుకు ఉపయోగించ గల ఏకైక పండుగా సీతాఫలాన్ని చెప్పొచ్చు. ముఖ్యంగా సీతాఫల్ రబ్డీ అనేది సిటీ రెస్టారెంట్స్లో బాగా ఫేమస్. ఈ నేపథ్యంలో నగరంలో సీతాఫల్ రుచులు అందుబాటులో ఉన్న కొన్ని ప్రదేశాల గురించి.. అబిడ్స్లోని సుల్తాన్ బజార్లో ఉన్న మయూర్ జ్యూస్ సెంటర్ సీతాఫలం రుచులకు ఫేమస్. ముఖ్యంగా నిండుగా గుజ్జుతో ఉన్న సీతాఫల్ జ్యూస్ ఇక్కడ క్రీమీగా రుచికరంగా ఉంటుందనేది ఫ్రూట్ లవర్స్ మాట. సికింద్రాబాద్, బండ్లగూడ, టోలిచౌకిలలో ఉన్న నైస్ జ్యూస్ సెంటర్ కూడా సీతాఫల వెరైటీలకు పేరొందింది. భిన్న రకాల పండ్ల పేరిట మలాయ్లను అందించడంలో ప్రసిద్ధి చెందిన ఈ సెంటర్ సీతాఫల్ మలైని కూడా అందిస్తోంది.సీతాఫల్.. వైరల్.. ఇటీవలే సీతాఫలం రుచి, దాని ఆకారంలో రుచికరమైన వంటకాన్ని ప్రముఖ భారతీయ పేస్ట్రీ చెఫ్ తేజస్వి చందేలా రూపొందించారు. ఈ వంటకం తయారీ వీడియో ఇన్స్ట్రాగామ్ రీల్ ఆన్లైన్లో అద్భుతమైన ఆదరణ పొందింది. ఈ విషయంలో తనకు ఫ్రెంచ్ చెఫ్ సెడ్రిక్ గ్రోలెట్ ప్రేరణగా పేర్కొంది. అతడు పండ్లను పోలి ఉండే డెజర్ట్ల తయారీకి ప్రసిద్ధి చెందాడు. పలువురు హోమ్ మేడ్ సీతాఫల్ బర్ఫీ, హల్వా, ఖలాఖండ్ కూడా తయారు చేస్తున్నారు. ఆన్లైన్ ద్వారా ఆర్డర్లపై అందిస్తున్నారు. జూబ్లీహిల్స్తో పాటు పలు ప్రాంతాల్లో ఉన్న నేచురల్ ఐస్క్రీమ్స్ కూడా చవులూరించే కస్టర్డ్ యాపిల్ రుచులకు కేరాఫ్. సీజనల్ స్పెషల్ సీతాఫల్ ఐస్ క్రీం ఇక్కడ ఫేమస్. బంజారాహిల్స్లోని రోడ్ నెం.13లో ఉన్న లె టెసోరోలో ఓ ప్రత్యేక సీతాఫల్ రుచి అందుబాటులో ఉంది. సీతాఫల్ సోఫుల్ జార్ పేరిట అందించే ఈ డిసర్ట్.. వావ్ అనిపిస్తుంది. జూబ్లీహిల్స్లో రోడ్ నం.36లో ఉన్న కృష్ణపట్నం రెస్టారెంట్కి సీతాఫల్ లవర్స్ ఓ రౌండ్ కొట్టొచ్చు. ఇక్కడి కస్టర్డ్ యాపిల్ డిలైట్ కృష్ణపట్నం డిలైట్గా పేరొందింది. కొండాపూర్ లోని తారా– సౌత్ ఇండియన్ కిచెన్ కూడా ఈ సీజనల్ ఫ్రూట్ని వడ్డిస్తోంది. ఈ సీజన్లో తారాస్ సీతాఫల్ రబ్డీని రుచి చూడటం సిటీలోని ఫుడ్ లవర్స్కి ఓ అలవాటు. బంజారాహిల్స్లో ఉన్న సీతాఫల్ ఫ్రెష్ జ్యూస్ తన పేరులోనే ఈ ఫలాన్ని ఇముడ్చుకోవడంతో పాటు పలు రకాల మిల్క్ షేక్స్లోనూ మేళవిస్తోంది. సీతాఫలాన్ని ఇష్టపడేవారి కోసం మిల్క్ షేక్లతో సహా వివిధ రకాల కస్టర్డ్ యాపిల్ డెజర్ట్లను అందిస్తోంది. -
నడుం నొప్పి తట్టుకోలేక, ఎనిమిది కప్పల్ని మింగేసింది... కట్ చేస్తే
ఎవరో ఏదో చెప్పారని, అశాస్త్రీయమైన వైద్య విధానాల్ని, పద్ధతుల్ని అవలంబించేవారికి ఇది షాకింగ్ న్యూస్. ఎన్నాళ్లుగానో వేధిస్తున్న నడుం నొప్పిని తట్టుకోలేక చైనాకు చెందిన ఒక వృద్ధురాలు పాత ఆచారాన్ని పాటించి ప్రాణాల మీదకు తెచ్చుకుంది. విషయం ఏమిటంటే.. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ప్రకారం తూర్పు చైనాలోని 82 ఏళ్ల వృద్ధురాలు జాంగ్ హెర్నియేటెడ్ డిస్క్తో బాధపడుతోంది . ఈ బాధను భరించలేక బతికున్న కప్పలను మింగేసింది.ఒకటీ రెండూ కాదు ఏకంగా ఎనిమిందింటిని మింగింది. ఇలా సజీవ కప్పలను మింగడం వల్ల వెన్నునొప్పి తగ్గుతుందని స్థానికంగా ప్రచారంలో ఉన్న విషయాన్ని నమ్మి ఇలాచేసినట్టు తెలుస్తోంది.నడుం నొప్పి తగ్గలేదు సరికదా, తీవ్రమైన కడుపునొప్పితో ఆసుపత్రి పాలైంది. విషయం తెలిసి వైద్యులే నివ్వెర పోయారు. చాలాకాలంగా హెర్నియేటెడ్ డిస్క్తో బాధపడుతున్న జాంగ్, అసలు విషయం చెప్ప కుండానే తనకు కప్పలు కావాలని కుటుంబ సభ్యులను కోరింది. ఇలా మొదటి రోజు మూడు కప్పలను, మరుసటి రోజు ఐదు కప్పలను సజీవంగా మింగేసింది. దీంతో క్రమంగా పరిస్థితి క్షీణించడంతో అసలు విషయం కుటుంబ సభ్యులకు తెలిపింది. దీంతో వారు వైద్యులను సంప్రదించారు. వైద్యుల ప్రకారం ఆమె పొట్టలో పరాన్నజీవి సంక్రమణను కనుగొన్నారు. ఆక్సిఫిల్ కణాలు భారీగా పెరిగాయి. ముఖ్యంగా కప్పలలో సాధారణంగా కనిపించే టేప్వార్మ్ లార్వా స్పార్గానమ్తో సహా, ఇతర బాక్టీరియా ఉనికిని వైద్యులు నిర్ధారించారు. నడవలేని స్థితిలో రెండు వారాల పాటు చికిత్స తీసుకుని ఎట్టకేలకు ఇంటికి చేరింది సజీవంగా కప్పలను మింగడం వల్ల రోగి జీర్ణవ్యవస్థ దెబ్బతిని, పరాన్నజీవులు చేరాయి ఆసుపత్రి వైద్యుడు తెలిపారు.నోట్ : ఆరోగ్య చిట్కాలు చిట్కాలు మాత్రమే అని గమనించాలి.అవి పరిష్కారం ఎంతమాత్రం కావు. అందులోనూ సుదీర్ఘ కాలంలో బాధపడుతున్న వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకోవడం చాలా ఉత్తమం. లేదంటే మొదటికే మోసం రావచ్చు. -
84 ఏళ్ల వయసులో తల్లి, కూతురి వయసు మాత్రం అడక్కండి: గుర్తుపట్టారా!
ప్రముఖ యాంకర్ సుమ కనకాల గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఏళ్ల తరబడి టీవీ షోలలో తన యాంకరింగ్తో అలరిస్తోంది. ఒక్క చేత్తో టీవీ షోలు, మరో చేత్తో సినిమా ఈవెంట్లు, విదేశీ టూర్లతో నిరంతరం బిజీగానే ఉంటుంది. అందర్నీ మెప్పించే వాక్చాతుర్యం, ఛలోక్తులు, ఎక్కడలేని ఎనర్జీతో అభిమానుల విశేషాభిమానం, పాపులారిటీతో పాటు చేతి నిండా సంపాదనే. ఇది చాలదన్నట్టు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్గా ఉంటూ అభిమానులకు ప్రేరణగా నిలుస్తూ ఉంటుంది.తాజాగా 84 ఏళ్ల తన మాతృమూర్తి వీడియోను ఇన్స్టాలోప్టె్ చేసింది. దీంతో ఇది అభిమానుల మనసు దోచుకుంటోంది.నెట్టింట వైరల్ అవుతున్న ఈ వీడియోలో సుమ తల్లి 84 వయస్సులో కూడా ఎక్సర్సైజ్లు చేస్తూ ఉండటం విశేషం. ‘84 ఏళ్ల మదర్, వెర్సస్ డాటర్’ అనే క్యాప్షన్తో సమ వీడియో పోస్ట్ చేసింది. అయితే 84 ఏళ్ల వయసులో తల్లి అంటూ తల్లి వయసు చెప్పింది గానీ, తన వయసు మాత్రం చెప్ప లేదు. పైగా మీకు తోచినంత అని చమత్కరించింది. View this post on Instagram A post shared by Suma Kanakala (@kanakalasuma)ఈ ఏజ్లో కూడా అమ్మ ఫిట్నెస్ గ్రేట్ అని నెటిజన్లు కామెంట్స్ చేయగా, మీ ఏజ్ 62, 28 ..48? అంటూ మరికొందరు ఫన్నీగా కమెంట్స్ చేశారు. -
రెండేళ్ల శ్రమ ఒక మినిట్లో : భారీ కాయంనుంచి సన్నగా వైరల్వీడియో
అధిక బరువుతో బాధపడే వాళ్లు తీవ్రమైన క సరత్తు చేయాల్సిందే. గుట్టలకొద్దీ పేరుకు పోయిన కొవ్వు కరగాలంటే చెమట చిందించాల్సిందే. దీనికి కొందరికి రోజులు, నెలలు సరిపోవు. సంవత్సరాల తరబడి కృషి చేయాలి. ఏదో నాలుగు రోజులో, నెలలో చేసి నావల్ల కాదు చేతులెత్తేయకూడదు. ఓపిగ్గా ప్రయత్నించాలి. అప్పుడు అనుకున్న శరీరాకృతి సాధ్యమవుతుంది. ఇదే నిరూపించిందో యువతి. దీనికి సంబంధించిన వీడియో ట్విటర్లో వైరల్గా మారింది. ఈ వెయిట్ లాస్ జర్నీ వీడియో ఎక్స్లో సుమారు 60లక్షల వ్యూస్ను సాధించింది. అద్భుతం, అమోఘం అంటూ చాలా మంది ఆమెను అభినందించగా, అయితే దీనిపై కొంతమంది అనుమానాలు కూడా వ్యక్తం చేశారు. వీడియో చివర్లో ఆమె స్మార్ట్లుక్ చూసి అందరూ ఆశ్చర్యపోయారు. అంత భారీగా బరువు తగ్గినపుడు, చర్మం వేలాడుతూ ఉంటుంది.అలా లేదేమిటి? అని కొందరు, బహుశా శస్త్రచికిత్స చేయించుకొని ఉండవచ్చు అని కొందరు అభిప్రాయపడ్డారు. దాదాపు నేను కూడా సుమారు 200 పౌండ్లు బరుదు తగ్గాను. చర్మంఅలాగే ఉండిపోయింది. చాలా శస్త్రచికిత్సలు జరగకుండా ఆమె అలా అయ్యే అవకాశం లేదు. అది సాధ్యం కాదని నేను చెప్పడం లేదు, అది ఆమెదేనా అని అనుమానం అని మరో యూజర్ సందేహం వ్యక్తం చేయడం గమనార్హం. Two years of hard work in 1 minute.Impressive!!! pic.twitter.com/QP5QubvmwJ— MALEEK 1.0 (@Maleekoyibo) October 4, 2025 -
కేఎఫ్సీలో కంపుకొట్టే చికెన్ బర్గర్? వీడియో చూస్తే వాంతులే!
ప్రముఖ ఫాస్ట్ ఫుడ్ చెయిన్ కేఎప్సీ (KFC)మరోసారి చిక్కుల్లో పడింది. బెంగళూరు ఔట్లెట్లో కుళ్లిపోయినచికెన్ వడ్డించారనే ఆరోపణలు గుప్పుమన్నాయి. దీనికి సంబంధించి ఒక పోస్ట్ ఎక్స్లో వైరల్గా మారింది. వివరాలు ఇలా ఉన్నాయి..బెంగళూరుకు చెందిన ఒక కస్టమర్ కేఎఫ్సీపై విమర్శలు గుప్పిస్తూ పోస్ట్ చేసిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీని ప్రకారం బెంగళూరు(Bangalore) కోరమంగళ అవుట్లెట్లో ఉన్న KFCలో ఒక మహిళా కస్టమర్ హాట్ & స్పైసీ చికెన్ జింజిర్ బర్గర్ ఆర్డర్ చేశారు. దాంట్లోని మాంసం కుళ్లి భరించలేని వాసన వచ్చింది. దీంతో దాన్ని రీప్లేస్ చేయమని అడిగారు. కానీ రెండోసారి కూడా దుర్వాసనతో చెడిపోయిన బర్గర్ ఇవ్వడంతో షాక్ అవ్వడం ఆమె వంతైంది.దీంతో ఆమె సిబ్బందిని గట్టి నిలదీయంతో "ఇది కేవలం సాస్ వాసన" తోసిపుచ్చారని తన పోస్ట్లో పేర్కొన్నారు. అంతేకాదు ఈ సమస్యను పరిష్కరించడానికి బదులుగా, సిబ్బంది తన చికెన్ బర్గర్ను వెజిటేరియన్తో భర్తీ చేయడానికి ప్రయత్నించారని పేర్కొన్నారు. కోరమంగళ కేఎఫ్సీ అవుట్లెట్లో తాను క్రమం తప్పకుండా అదే బర్గర్ను ఆర్డర్ చేస్తానని , ఇంతకు ముందెపుడూ ఇలాంటి పరిస్థితి రాలేదని ఆమె వెల్లడించించింది. అంతేకాదు ఈ వివాదంతో కస్టమర్లు వంటగదిని చూడాలని డిమాండ్ చేశాడు. దీనికి మొదట అంగీకరించని సిబ్బంది, రాత్రి 10 గంటల తర్వాత ప్రవేశం లేదని, మేనేజర్ అందుబాటులో లేరని సిబ్బంది అనేక సాకులు చెప్పారు.చివరికి అనుమతించారు. దీంతో అక్కడి దృశ్యాల్నిచూసి జనం షాకయ్యారని తన పోస్ట్లో ఆరోపించింది.అంతా కలుషితం, మురికి వాసన, కోల్డ్ స్టోరేజ్ ప్రాంతంలో దుర్వాసన వెదజల్లే మాంసం, బూజు పట్టిన, తుప్పు పట్టిన షీట్లు, మరకలు ఉమ్మి గుర్తులు ఉన్నాయంటూ పేర్కొంది. (పబ్లిక్ టాయిలెట్స్లో హ్యాండ్ డ్రైయర్ వాడుతున్నారా?)🚨 WARNING: HSR KFC, Bangalore Extremely Unsafe Food 🚨One of our followers has shared a shocking and disturbing experience at the KFC outlet in HSR Layout, Bangalore. She had ordered a Hot & Spicy Chicken Zinger Burger, but the moment she opened it, the stench was unbearable.… pic.twitter.com/yFpIcblaAA— Karnataka Portfolio (@karnatakaportf) October 4, 2025దీనికి సంబంధించి పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు వచ్చిన తర్వాత సిబ్బంది దాదాపు అరగంట పాటు వంటగదిని తాళం వేసి ఉంచారని, ఆ సమయంలో స్విగ్గీ , జొమాటో ఆర్డర్లు పంపడం కొనసాగిందని పోస్ట్ పేర్కొంది. "30-40 డెలివరీలు ఒకే చెడిపోయిన మాంసాన్ని ఉపయోగించి పంపించారని కూడా ఆరోపించారు. మేనేజ్మెంట్ షాకింగ్ రియాక్షన్ఇదిలా ఉంటే మేనేజ్మెంట్ స్పందన అత్యంత షాకింగ్గా ఉంది. తన సొంత కుటుంబానికి అలాంటి ఆహారాన్ని అందిందని అని ఒప్పుకుంటూనే, ఈఫుడ్ ప్రమాణాలకు అనుగుణంగా ఉందని అవుట్లెట్ మేనేజర్ వాదించడం విడ్డూరంగా నిలిచింది.ఈ సంఘటన నెట్టింట విమర్శలకు తావిచ్చింది. పిల్లలతో సహా వెళ్లే కుటుంబాలకు ఇలాంటి ఆహారం వడ్డించడంపై చాలామంది ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘అక్కడ ఇలా జరగడం ఇదే మొదటిసారి కాదు. ఈ సమస్యను చాలాసార్లు ఎదుర్కొన్నా.. అందుకే ఆ అవుట్లెట్కు వెళ్లడం పూర్తిగా మానేశాను. వీలైతే, మీరు మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తే అక్కడి నుండి తినకండి" అని మరొకరు కామెంట్ చేశారు. "ప్రతి రెస్టారెంట్ ఏ సమయంలోనైనా కస్టమర్లు వంటగదిని సందర్శించడానికి అనుమతించాలి. సరైన పరిశుభ్రత పాటించని రెస్టారెంట్లను ఆహార లైసెన్స్ రద్దు చేయడంతో వెంటనే మూసివేయాలి. అని మరొకరు ఆగ్రహం వ్యక్తం చేశారు. పాపులర్ ఆహార డెలివరీ యాప్ల ద్వారా అందించే క్లౌడ్ కిచెన్ల పరిస్థితి ఏంటి ఒకయూజర్ ఆందోళనవ్యక్తం చేశారు.ఇదీ చదవండి: ఎంగేజ్మెంట్ : దేవ కన్యలా అన్షులా కపూర్, అమ్మకోసం అలా..!ఈ సంఘటన నిజమని నిరూపితమైతే, అవుట్లెట్లో పరిశుభ్రత ,ఆహార భద్రత ఆందోళన కలిగించే అంశమే. ఇలాంటి ఆహారం తీసుకుంటే ఫుడ్ పాయిజనింగ్, ఇన్ఫెక్షన్లతో సహా తీవ్రమైన ఆరోగ్య సమస్యలు రావడం ఖాయం. మరి ఈ వివాదం, వీడియోలోని ఆరోపణలపై కేఎఫ్సీ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. -
అవగాహనే ఆయుధం : ఇవిగో కొన్ని లైఫ్స్టైల్ టిప్స్
ప్రపంచవ్యాప్తంగా మహిళలను ఆందోళనకు గురి చేస్తున్న వ్యాధుల్లో రొమ్ముక్యాన్సర్ ఒకటి. మనదేశంలో మహిళల్లో వ్యాప్తి చెందుతున్న క్యాన్సర్లలో, అలాగే మహిళల మరణాలకు కారణమవుతున్న క్యాన్సర్లలోనూ దానిదే అగ్రస్థానం. ఈ క్యాన్సర్ను ఎంత త్వరగా కనుక్కుంటే మహిళల్లో సమర్థ చికిత్స ద్వారా దాన్నుంచి నూటికి నూరు పాళ్లూ పూర్తిగా విముక్తి పొందే అవకాశముంది. ఈ అక్టోబరు నెల ‘రొమ్ముక్యాన్సర్ అవగాహన మాసం’(Breast Cancer Awareness Month 2025). ఈ నేపథ్యంలో రొమ్ముక్యాన్సర్కు కారణాలూ, స్క్రీనింగ్ ప్రాధాన్యం, అందుబాటులో ఉన్న చికిత్స ప్రక్రియల వంటి అనేక అంశాలపై అవగాహన కోసం ఈ కథనం. రొమ్ముక్యాన్సర్ (Breast Cancer) ప్రధానంగా మహిళల రొమ్ముల్లో ఉండే పాలు ఉత్పత్తి చేసే ‘లోబ్యూల్స్’ అనే గ్రంథుల్లో లేదా ఆపాలను నిపుల్ వరకు తీసుకెళ్లేందుకు ఉపయోగపడే ట్యూబుల్లో గానీ పెరిగే అవకాశం ఎక్కువ. ఆ హానికరమైన ట్యూమర్ నుంచి క్యాన్సర్ కణాలు పక్కనే ఉండే లింఫ్ నోడ్స్లోకి ప్రవేశించేందుకు అవకాశముంటుంది. ఒకసారి క్యాన్సర్ కణం లింఫ్ నోడ్స్ లోకి గానీ ప్రవేశిస్తే... అక్కడి నుంచి అది దేహంలోని ఏ ్ర΄ాంతానికైనా విస్తరించే ముప్పు ఉంటుంది. అందుకే ఆలోపే దాన్ని కనుక్కోగలిగితే చికిత్సతో రొమ్ముక్యాన్సర్ను పూర్తిగా నయం చేసే అవకాశముంటుంది. అందుకే రొమ్ముక్యాన్సర్పై అవగాహన పెంచుకునే అవకాశం తప్పనిసరి.రొమ్ముక్యాన్సర్ విస్తృతి ఇది సాధారణంగా మహిళల్లోనే ఎక్కువగా వచ్చే ప్రధానమైన క్యాన్సర్. మహిళల్లోనే వస్తుందన్నంత మాత్రాన పురుషుల్లో దీని ముప్పు ఉండదని కాదు. అయితే పురుషుల్లో ఇది కాస్తంత అరుదు. స్త్రీ పురుష నిష్పత్తి ప్రకారం... ప్రతి 135 మంది మహిళలకు ఒక పురుషుడిలో ఇది కనిపిస్తుంది. పైగా గతంలో ΄ోలిస్తే ఇటీవల పురుషుల్లోనూ ఇది కాస్తంత ఎక్కువగానే కనిపిస్తోంది. దీన్ని బట్టి చూస్తే ఇది పూర్తిగా మహిళలకే పరిమితమని చెప్పడానికి వీల్లేదు.కారణాలూ... ముప్పును పెంచే అంశాలు ఇదమిత్థంగా ఇవే కారణాలంటూ స్పష్టంగా చెప్పలేకపోయినప్పటికీ... రొమ్ముక్యాన్సర్ను అనేక అంశాలు తెచ్చిపెడతాయి. వాటిల్లో కొన్ని... కుటుంబం చరిత్ర : కుటుంబంలో దగ్గరి వారికి రొమ్ము క్యాన్సర్ వచ్చిన దాఖలాలు ఉండటం, అందునా తల్లి, తల్లి సోదరి లాంటి మరీ దగ్గరి బంధువుల్లో రొమ్ముక్యాన్సర్ దాఖలా ఉన్నవాళ్లలో దీని ముప్పు మరింత ఎక్కువ.జన్యుపరమైన ముప్పు : జన్యుపరంగా బీఆర్సీఏ 1, బీఆర్సీఏ 2 అనే జన్యుపరమైన మ్యుటేషన్ జరిగినవాళ్లలో రొమ్ముక్యాన్సర్ తప్పక వచ్చే అవకాశం.త్వరగా రుతుస్రావం రావడం : బాలికలు చాలా త్వరగా రుతుస్రావం కావడం (అంటే 12 ఏళ్ల లోపే బాలికలు రుతుస్రావం మొదలుకావడం) అలాగే రుతుక్రమం ఆగడం చాలా ఆలస్యంగా జరిగినవాళ్లలో రొమ్ముక్యాన్సర్ ముప్పు (రిస్క్) ఎక్కువ. సంతానలేమి / ఆలస్యంగా సంతానం : సంతానం లేని మహిళలూ, అలాగే చాలా ఆలస్యంగా గర్భవతులైన వాళ్లలో. అస్తవ్యస్తమైన జీవనశైలి / దురలవాట్లు : అంతగా క్రమశిక్షణ లేకుండా అనారోగ్యకరమైన జీవనశైలితో ఉండేవాళ్లకూ, అలాగే పొగతాగడం, మద్యం వంటి అలవాట్లు ఉన్నవాళ్లలో (ప్రధానంగా విదేశీ మహిళల్లో ఈ తరహా అలవాట్లు ఎక్కువ). రేడియేషన్కు గురైన మహిళల్లో : తాము యువతులుగా ఉన్నప్పుడు ఏవైనా కారణాలతో రేడియేషన్కు చాలా ఎక్కువగా ఎక్స్పోజ్ అయిన మహిళల్లో.కుటుంబ చరిత్ర, ఇతర అంశాలూ పూర్తి కారణాలు కాదు... అయితే ఈ సందర్భంగా ఒక ప్రధానమైన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. పైన పేర్కొన్న అంశాలనే ప్రామాణికంగా తీసుకోవడమూ పూర్తిగా సాధ్యం కాదు. ఎందుకంటే వ్యాధి నిర్ధారణ జరిగిన కేసుల్లో దాదాపు 70శాతం మందిలో వాళ్ల కుటుంబంలో రొమ్ముక్యాన్సర్ ఉన్న దాఖలాలు లేకపోవడం ఒక వైరుధ్యం. అలాగే నిర్దిష్టంగా ఫలానా అంశమే రొమ్ముక్యాన్సర్కు కారణమవుతుందని లేదు. చాలా సందర్భాల్లో ఎలాంటి రిస్క్ఫ్యాక్టర్స్ లేనివాళ్లలోనూ ఇది కనిపించడమూ మామూలే. చివరగా... గత మూడు దశాబ్దాల్లో రొమ్ముక్యాన్సర్ చికిత్సల్లో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి. దాంతో త్వరగా కనుగొంటే రొమ్ముక్యాన్సర్ను పూర్తిగా నయం చేయడం ఇప్పుడు సాధ్యమవుతోంది. అయితే రొమ్ముక్యాన్సర్ చికిత్స వరకూ వెళ్లకుండానే తమ సొంత దేహంపై పూర్తి అవగాహనతోనూ, ఆరోగ్యకరమైన జీవనశైలిలోనూ దాన్ని నివారించుకోవడం చాలా మేలు అనేది వైద్య నిపుణుల సూచన.అపోహలూ ఎక్కువేరొమ్ముక్యాన్సర్ విషయంలో అపోహలూ ఎక్కువే. ఉదాహరణకు రొమ్ముల్లో గడ్డలు, నీటితిత్తులు ఉన్నప్పుడు అది క్యాన్సరే అని చాలామంది అ΄ోహ పడుతుంటారు. రొమ్ముల్లో గడ్డలూ, నీటితిత్తులూ కనిపించడం చాలా సాధారణం. ఇలాంటివారిలో 80 శాతం కేసుల్లో అది హానికరం కానివే. వాటినే ‘బినైన్’ గడ్డలుగా చెబుతారు. కేవలం 20 శాతం కేసుల్లోనే అవి హానికరమైన (మేలిగ్నెంట్) క్యాన్సర్గా బయటపడతాయి. అందుకే రొమ్ముల్లో గడ్డలు కనిపించగానే అది తప్పనిసరిగా క్యాన్సర్ అని ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అలా కనిపించేవాటిల్లో చాలావరకు అంటే దాదాపు 80 శాతం ఎలాంటి హానీ కలిగించనివే. కాకపోతే గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే... రొమ్ముల్లో అలాంటి గడ్డలు కనిపించగానే వీలైనంత త్వరగా ఒకసారి డాక్టర్కు చూపించి, అవి హానికరం కాదని వారు నిశ్చయంగా చె΄్పాక ఇక నిశ్చింతగా ఉండవచ్చు. అలాగే పెద్దసైజు రొమ్ములు ఉన్నవారికి ఈ ముప్పు ఎక్కువ అనేది మరో అపోహ. రొమ్ము పెద్దగా ఉండటానికీ, క్యాన్సర్కూ ఎలాంటి సంబంధమూ ఉండదు.చదవండి: స్వయం కృషితో ఎదిగి చరిత్ర సృష్టించారు : టాప్ టెన్ రిచెస్ట్ విమెన్ స్క్రీనింగ్ పరీక్షలు అన్నిటికంటే ప్రధానం...రొమ్ము క్యాన్సర్ను ఎంత త్వరగా కనుక్కుంటే దాన్నుంచి అంత పూర్తిగా విముక్తం కావడం సాధ్యమనే విషయాన్ని బట్టి బ్రెస్ట్క్యాన్సర్ విషయంలో స్క్రీనింగ్ పరీక్షలకు ఉన్న ప్రాధాన్యమేమిటన్నది వివరించవచ్చు. దాదాపు 35 ఏళ్లు దాటిన ప్రతి మహిళా, అలాగే కుటుంబంలో రొమ్ముక్యాన్సర్ ఉన్న మహిళలతో పాటు రిస్క్ఫ్యాక్టర్స్ ఉన్న స్త్రీలు ఏడాదికోమారు లేదా తమ డాక్టర్ చెప్పిన విధంగా స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవాలి. అలాగే ప్రతి మహిళా తమ రొమ్ములను పరీక్షించుకునే ‘సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్’ వివరాలు తెలుసుకుంటూ స్నానం సమయంలో వాటిని పరీక్షించుకుంటూ ఉండాలి. అందువల్ల తొలిదశలోనే రొమ్ముక్యాన్సర్ను కనుక్కోవడం సాధ్యం... తద్వారా దాన్నుంచి పూర్తిగా విముక్తం కావడమూ సాధ్యమే. ఈ లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం వద్దు... ఈ కింద పేర్కొన్న లక్షణాలు కనిపించినప్పుడు వాటిని అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. అవేమిటంటే... రొమ్ము లేదా చంకల్లో నొప్పిలేని గడ్డ (లంప్) కనిపించడం. రొమ్ము సైజు లేదా ఆకృతిలో మార్పు రావడం. నిపుల్ నుంచి ఏదైనా ద్రవం స్రవిస్తుండటం. రొమ్ము చర్మంపై ఏవైనా మార్పులు అంటే గుంటపడటం లేదా చర్మం మందంగా మారడం వంటివి. చాలా అరుదుగా రొమ్ముక్యాన్సర్ వచ్చినవాళ్లలో రొమ్ములో లంప్, ఒకవేళ లంప్ లేకుండానే రొమ్ముపై చర్మం పొరలు పొరలుగా ఊడుతూ ఉండటం, రొమ్ము ఎర్రబారడం, వాపు వంటి లక్షణాలు చాలా అరుదుగా కనిపించవచ్చు. నివారణ/చికిత్స...క్యాన్సర్కు కారణమయ్యే కొన్ని అంశాల్లో మానవ నియంత్రణ సాధ్యం కాదు. ఉదాహరణకు పెరుగుతుండే వయసు. అయితే మన ప్రమేయంతో రొమ్ముక్యాన్సర్ను చాలావరకు నివారించవచ్చు. ఉదాహరణకు అన్ని పోషకాలు ఉండే సమతులాహారాన్ని తీసుకోవడం; క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం; ప్రసవం తర్వాత పిల్లలకు చనుబాలు పట్టించడం; ఆల్కహాల్, పొగతాగడం వంటి దురలవాట్లకు దూరంగా ఉండటం, బరువును నియంత్రణలో ఉంచుకోవడం వంటి జాగ్రత్తలతో రొమ్ము క్యాన్సర్ను చాలావరకు నివారించవచ్చు. అయితే ఇప్పుడు కీమోథెరపీ, రేడియేషన్ థెరపీ, శస్త్రచికిత్సలతోపాటు అనేక ఇతరత్రా ప్రక్రియలతో రొమ్ముక్యాన్సర్కు సమర్థమైన చికిత్స సాధ్యం.నిర్వహణ: యాసీన్ -
బ్యాక్ పెయిన్ ఉంటే...స్వీట్ తిన్నా, టీ తాగినా తంటాలే!
ఇప్పుడు అత్యధికులను వేధిస్తున్న నొప్పుల్లో బ్యాక్ పెయిన్ ఒకటి. ఎక్కువ సేపు కూర్చుని చేసే పనుల వల్ల కావచ్చు వాహనాల డ్రైవింగ్ వల్ల కావచ్చు అనేక మంది బ్యాక్ పెయిన్తో బాధపడుతున్నారు. మాత్రలు, ఫిజియోథెరపీలతో కూడా ఫలితం కనిపించక ఆవేదన చెందుతున్నారు. ఈ నేపధ్యంలో ... తీసుకునే ఆహారం కూడా ఈ సమస్య ఎదుర్కుంటున్న వారి వెన్ను నొప్పిపై ప్రభావం చూపిస్తుంది అనే విషయం తెలుసుకోవాలి అంటున్నారు వైద్యులు. వారు చెబుతున్న ప్రకారం.. డిస్క్ అనే పదం ’ఇంటర్ వెర్టెబ్రే’ కు సంక్షిప్త రూపం. , ఈ డిస్క్లు వెన్నెముక (వెన్నుపూస) ఎముకలను వేరు చేసే స్పాంజి కుషన్లు అని చెప్పొచ్చు. ఈ డిస్క్లు షాక్, శోషణను అందిస్తాయి, వెన్నెముకను స్థిరంగా ఉంచుతాయి వెన్నుపూస కదలికను అనుమతించడానికి ’పివోట్ పాయింట్లు’ ఇస్తాయి. వీటిలో ఏర్పడే ఇబ్బందులే వెన్నునొప్పికి దారి తీస్తాయి. అయితే చక్కెరతో పాటు అసమతుల్య ఆహారం డిస్క్ రికవరీకి ఆటంకం కలిగిస్తాయి, వెన్నునొప్పిని మరింత తీవ్రతరం చేస్తాయి కాబట్టి పోషకాహారం తప్పనిసరి అంటున్నారు హైదరాబాద్కి చెంఇన ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ ఒబైదుర్ రెహమాన్, ఈ సందర్భంగా ఆహారం లో మార్పు చేర్పులు చేసుకోకపోతే వెన్నునొప్పి నుంచి కోలుకోవడం కష్టమని ఈ ఆర్థోపెడిక్ సర్జన్ విడుదల చేసిన ఓ వీడియోలో స్పష్టం చేశారు. ఈ అలవాట్లు వెన్నునొప్పిని ఎలా ప్రభావితం చేస్తాయో డిస్క్ సమస్య నయం కాకుండా చేసే ఆ 4 ఆహారపు అలవాట్లు... ఏమిటంటే...చక్కెర లేదా చక్కెరతో టీచక్కెర కలిపిన స్వీట్లు అధికంగా తీసుకోవడం బ్యాక్ పెయిన్ ఉన్నవారికి చేటు చేస్తుంది. అంతేకాదు చక్కెర కలిపిన టీ, కాఫీలు సైతం రోజువారీ పలు దఫాలుగా తాగడం వల్ల నడుము ప్రాంతం, శరీరంలో మంట వస్తుంది డిస్క్ సమస్య నయం కాకుండా నిరోధిస్తుంది.వేయించిన, ప్రాసెస్ చేసిన ఆహారాలువేపుళ్లు చాలా రకాలుగా ఆరోగ్యానికి హానికరం అని తెలిసిందే. అదే విధంగా వేయించిన లేదా ప్రాసెస్ చేసిన ఆహారాన్ని తీసుకున్నప్పుడు, అది కూడా నడుముకి దిగువ భాగంలో మంటను కలిగిస్తుంది, డిస్క్ సమస్య నయం కాకుండా నిరోధిస్తుంది,తక్కువ ప్రోటీన్ ఆహారంతక్కువ ప్రోటీన్ ఆహారం లేదా అధిక కార్బ్ లేదా అధిక కొవ్వులు ఉన్న ఆహారం తీసుకున్నప్పుడు, డిస్క్ కోలుకునే సమయంలో తగినంత పోషకాహారాన్ని పొందదు. అధిక ప్రోటీన్ ఆహారం డిస్క్ సమస్యల పరిష్కారంలో చికిత్సకు మేలు చేస్తుంది. అధిక బెడ్ రెస్ట్చివరగా, ఎక్కువ సేపు పడుకోవడం కూడా మంచిది కాదు. అధిక బెడ్ రెస్ట్లో ఉంటూ, రోజువారీ నడకలకు సమయం కేటాయించకపోతే కూడా, డిస్క్ కోలుకునేందుకు అవసరమైన పోషకాహారాన్ని పొందలేదు. నేషనల్ స్పైన్ హెల్త్ ఫౌండేషన్ ప్రకారం, కాల్షియం విటమిన్ డి వంటి ముఖ్యమైన పోషకాలతో కూడిన సమతుల్య ఆహారం వెన్నెముక ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ పోషకాలు ఎముక సాంద్రత, కండరాల పనితీరు మొత్తం కణజాల ఆరోగ్యానికి మద్దతు ఇస్తాయి బోలు ఎముకల వ్యాధి, క్షీణించిన డిస్క్ వ్యాధి దీర్ఘకాలిక వెన్నునొప్పి ప్రమాదాన్ని తగ్గిస్తాయి. -
పగలూరాత్రి తేడా లేకుండా బిర్యానీలు.. ఇలాగైతే కష్టమే!
ఒకప్పుడు వారంలో ఒకటి, రెండు రోజులు మాత్రమే మాంసాహారం తీసుకునే వాళ్లు. కొందరు ఏదైనా ప్రత్యేక సందర్భంగా మాత్రమే మాంసాహారం తినేవాళ్లు. ఇప్పుడు పరిస్థితి మారింది. ప్రతిరోజూ మాంసాహారం తీసుకుంటున్న వారిని చూస్తున్నాం. అంతేకాదు అర్ధరాత్రి 12 గంటలు దాటిన తర్వాత కూడా మాంసాహారం లాగించేస్తున్నారు. అలాంటి వాళ్లు జబ్బులను కూడా కొనితెచ్చుకుంటున్నట్లు వైద్యులు చెపుతున్నారు. మాంసాహారం అధికంగా తీసుకునే వారిలో జీర్ణకోశ వ్యాధులతో పాటు, గుండెజబ్బులు, అధిక కొల్రస్టాల్, ఒబెసిటీతో పాటు, కొన్ని రకాల క్యాన్సర్లు కూడా సోకుతున్నాయంటున్నారు. వారంలో ఒకటి, రెండుసార్లు మాత్రమే మాంసాహారం తీసుకోవాలని సూచిస్తున్నారు. ఇవే నిదర్శనం లబ్బీపేటకు చెందిన రాజేష్ వారంలో ఐదు రోజులు స్నేహితులతో కలిసి అర్ధరాత్రి ఫుడ్కోర్టుల్లో బిర్యానీలు లాగించేస్తుంటాడు. ఇటీవల అర్ధరాత్రి బిర్యానీ తిని ఇంటికి వెళ్లిన తర్వాత కడుపులో తీవ్రమైన మంట రావడంతో ఆస్పత్రికి వెళ్లాడు. ఎండోస్కోపీ చేయగా అల్సర్స్ వచ్చినట్లు నిర్ధారించారు. పటమటకు చెందిన అన్వర్ ఎక్కువగా మటన్ తీసుకుంటుంటాడు. ఇటీవల ఛాతీలో నొప్పి రావడంతో ఆస్పత్రిలో చేరాడు. గుండె రక్తనాళంలో పూడికలు ఉన్నట్లు నిర్ధారించారు. కొల్రస్టాల్ స్థాయిలు కూడా ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. ఇలా వీరిద్దరే కాదు కడుపు ఉబ్బరం, వాంతులు, విరోచనాలు, కడుపులో మంట వంటి జీర్ణకోశ సమస్యలతో వైద్యుల వద్దకు ప్రజలు పరుగులు పెడుతున్నారు. ఆరోగ్యకరమైన ఆహారమిలా.. మాంసాహారాన్ని మితంగా తీసుకోవాలి. వారానికి ఒకటీ, రెండు సార్లు మాత్రమే తీసుకోవడం మంచిది. కొవ్వు తక్కువగా ఉండే స్కిన్లెస్ చికెన్, చేపలు వంటివి ఎంచుకోవాలి. పండ్లు, కూరగాయలు, చిరుధాన్యాలు ఎక్కువగా తీసుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ద్వారా మాంసాహారం వల్ల కలిగే దు్రష్పభావాలను తగ్గించవచ్చు. వేపుడు కంటే ఉడికించిన కూరలు తినడం మేలు. జంక్ఫుడ్స్కు దూరంగా ఉండాలి, లేట్ నైట్ మాంసాహారం తీసుకోకూడదు. ఆహారం తీసుకోవడానికి సమయపాలన పాటించాలి. ప్రతిరోజూ ఒకే సమయానికి ఆహారం తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. సమస్యలు ఇలా... మటన్, బీఫ్, ఫోర్క్ వంటి రెడ్మీట్లో జీర్ణకోశ సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. రెడ్మీట్ తినేవారిలో జీర్ణం కావడానికి అధిక సమయం పట్టడంతో పాటు, పేగుపై వత్తిడి పెరుగుతుంది. నిల్వ ఆహారం తినడం వలన కడుపు ఉబ్బరం, వాంతులు, విరోచనాలు అయ్యే అవకాశం ఉంది. రంగు, రుచి కోసం మాంసాహారంలో కొన్ని రకాల రంగులు వాడుతుంటారు. వాటి కారణంగా క్యాన్సర్లు పెరుగుతున్నాయి. సమయ పాలన లేకుండా జంక్ఫుడ్స్ తీసుకోవడం వలన జీర్ణకోశ సమస్యలతో పాటు, క్యాన్సర్లకు దారి తీస్తున్నాయి. మధ్యాహ్నం 3 గంటలకు, రాత్రి 12 గంటలకు ఆహారం తీసుకోవడం మంచిది కాదు, ఆహారం తీసుకోవడంలో సమయపాలన పాటించాలి. మాంసాహారంలో సంతృప్త కొవ్వులు ఎక్కువగా ఉంటాయి. ఇవి రక్తంలో చెడు కొలె్రస్టాల్ స్థాయిలను పెంచుతాయి, దీనివల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. మాంసాహారంలో కేలరీలు ఎక్కువగా ఉండటం వల్ల, అధికంగా తింటే శరీర బరువు పెరుగుతుంది. జీర్ణకోశ సమస్యలు పెరిగాయి అధిక మాంసాహారం తీసుకునే వారిలో జీర్ణకోశ సమస్యలతో పాటు, గుండె జబ్బులు, ఒబెసిటీ సమస్యలు వస్తాయి. ముఖ్యంగా రెడ్మీట్ తినే వారిలో పేగులపై వత్తిడి పెరుగుతుంది. నిల్వ ఆహారం, జంక్ఫుడ్స్ తినే వారిలో అల్సర్స్, క్యాన్సర్లు సోకే అవకాశం ఉంది. కడుపు ఉబ్బరం, వాంతులు, విరోచనాలు, కడుపులో మంట వంటి సమస్యలతో మా వద్దకు ఎక్కువగా వస్తున్నారు. సమయపాలన లేని ఆహారపు అలవాట్లు జీర్ణ ప్రక్రియపై తీవ్ర ప్రభావం చూపుతాయి. పళ్లు, కూరగాయలు, చిరుధాన్యాలకు ఆహారంలో ప్రాధాన్యత ఇవ్వాలి. – డాక్టర్ వీర అభినవ్ చింతా, గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్, సెంటినీ విజయవాడ -
డైపర్.. సైజ్ గురించి పట్టించుకుంటున్నారా?
బిడ్డ పుట్టిన తర్వాత తల్లిదండ్రులు తీసుకుంటున్న జాగ్రత్తలలో చిన్నారికి ఎలాంటి ఆహారం ఇవ్వాలి, ఎలాంటి బట్టలు కొనాలి, వాళ్లని ఎలా చూసుకోవాలి.. వంటి వాటితోపాటు వారికి వాడవలసిన డైపర్ల గురించి కూడా ఆలోచించాల్సిన అవసరం వచ్చిందిప్పుడు. ఎందుకంటే పిల్లల సంరక్షణలో డైపర్ల సైజు కూడా చాలా ముఖ్యం.తల్లిదండ్రుల తమ పిల్లలకు వేసే డైపర్లను చాలా జాగ్రత్తగా ఎంచుకోవాలి. టేప్–స్టైల్ లేదా ప్యాంట్–స్టైల్లో తమ బిడ్డకు ఏ స్టైల్ డైపర్ సరైనదో అని తెలుసుకోవాలి. ఎందుకంటే, పిల్లలకు సరైన డైపర్ వేయక΄ోతే.. అది వారి కోమలమైన చర్మంపై ప్రభావం చూపిస్తుంది. డైపర్లలోనూ ఎన్నో రసాయనాలుంటాయి. ఇవి ఎక్కువ సేపు చర్మాన్ని అంటిపెట్టుకుని ఉండటం వల్ల బిడ్డకు హాని కలిగే ప్రమాదం ఉంది. ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని.. డైపర్ ఎంపికలో జాగ్రత్త వహించాలి.క్లాత్ న్యాపీలు పిల్లలకు చాలా సౌకర్యంగా ఉంటాయి, కానీ వాటిని పదే పదే ఉతకడం తల్లిదండ్రులకు లేదా వారి సంరక్షకులకు కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. అంతే కాకుండా క్లాత్ న్యాపీలను తyì సిన వెంటనే మార్చక΄ోతే పిల్లలకు అసౌకర్యంగా ఉంటుంది. సరైన డైపర్ ఎంపికఅన్ని విషయాల కంటే వారికి వేసే డైపర్ బ్రాండ్ ముఖ్యమైనది. సాధ్యమైనంత వరకు డైపర్ తయారీలో లోకల్ గా దొరికేవి, తెలియని బ్రాండ్ డైపర్లకు బదులు మెరుగైన ఫీచర్లతో తయారు చేసిన బ్రాండెడ్ డైపర్లు వాడటం చిన్నారికి కంఫర్ట్నిస్తుంది.తడి పీల్చుకునేలా... ఎక్కువ సేపుపొడిగా ఉండేలా...పిల్లల మూత్రం, మలం త్వరగా... ఎక్కువ శాతం పీల్చుకునే డైపర్లు ఎంచుకోవాలి. లీక్ అయ్యే డైపర్లకు దూరంగా ఉండండి. లీక్ అయ్యే డైపర్ల వల్ల.. పిల్లల శరీరానికి తేమ అంటుతుంది. పిల్లల చర్మానికి తడి అంటితే వారికి చికాకుగా ఉంటుంది. అంతేకాదు చిన్నారుల చర్మం సున్నితంగా ఉంటుంది. తడి కారణంగా త్వరగా దద్దుర్లు వచ్చే ప్రమాదం ఉంది. పిల్లలకు రాత్రి సమయంలోనూ ఎక్కువ సేపు పొడిగా ఉండే డైపర్లు వేస్తే.. హాయిగా నిద్రపోతారు. వారి చర్మానికి తడి తగిలితే మధ్య రాత్రి ఏడవటం ్ర΄ారంభిస్తారు. దీని దృష్టిలో ఉంచుకుని పొడిగా ఉండే డైపర్లు వేయండి.(Shoaib Malik సానియా మాజీ భర్త మూడో పెళ్లి పెటాకులే..?! వీడియో వైరల్)సరైన సైజ్పిల్లల బరువును బట్టి డైపర్ సైజులు వేర్వేరుగా ఉంటాయి. కాబట్టి డైపర్ కొనడానికి ముందు మీ బిడ్డ బరువు, సైజ్ ను చూసి కొనండి. వారి డైపర్ సైజ్ ప్రతి నెల మారుతుందని గుర్తు పెట్టుకోవడం అవసరం. అందుకే ఒకే సైజ్ డైపర్లు ఇంట్లో నిల్వ ఉంచుకోకండి. డైపర్ లూజ్గా ఉన్నా, బిగువుగా ఉన్న చిన్నారి ఇబ్బంది పడుతుంది. అవి వేసుకోవడానికి ఇష్టపడరు. పిల్లల కోమలమైన చర్మానికి సరిపోయేలా ఉండే సున్నితమైన ఉండే డైపర్లు మాత్రమే ఎంచుకోవాలి -
పబ్లిక్ టాయిలెట్స్లో హ్యాండ్ డ్రైయర్ వాడుతున్నారా?
చాలామంది రెస్టారెంట్లు లేదా సినిమాలకు వెళ్లినప్పుడు అక్కడి టాయిలెట్లలో చేతులు కడుకున్న తర్వాత హ్యాండ్ డ్రైయర్స్ వాడటం మామూలే. కానీ అలా పబ్లిక్ టాయిలెట్లలోని వాష్ బేసిన్లలో హ్యాండ్ వాష్ తర్వాత... అక్కడి డ్రైయర్లు ఉపయోగించి చేతుల్ని ΄పొడిగా చేసుకోవడం అంత మంచిది కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు. కొందరు వైద్యుల సలహా ఏమిటంటే... టాయిటెట్లలో హ్యాండ్వాష్ లేదా లిక్విడ్ సోప్తో చేతులు కడుక్కున్న తర్వాత అవి ఎంతోకొంత శుభ్రమవుతాయి. కానీ అలా శుభ్రమైన చేతుల్ని కాస్తా అక్కడ హ్యాండ్ డ్రైయర్ కింద పెట్టడం వల్ల మళ్లీ అవి కలుషితమయ్యే అవకాశాలు ఎక్కువన్నది ఆరోగ్యనిపుణుల మాట. ఎందుకంటే అది టాయిలెట్ కావడం వల్ల ఎంత లేదన్నా అక్కడి పరిసరాల్లో సూక్ష్మజీవులు, జెర్మ్స్ వంటివి ఉండనే ఉంటాయి. ఇలా మనం డ్రైయర్ కింద చేతులు పెట్టినప్పుడు ఆ డ్రైయర్ తాలూకు ఉష్ణోగ్రత పెద్ద ఎక్కువగా ఏమీ ఉండదు. కేవలం చేతుల్ని పొడిబార్చేందుకు ఉద్దేశించినంతే ఉంటుంది. అంతటి గోరువెచ్చటి ఉష్ణోగ్రతలో సూక్ష్మజీవులు అంతరించి΄ోవనీ, దానికి బదులు అక్కడి గాలిలో ఉండే సూక్ష్మక్రిములు, జెర్మ్స్ మళ్లీ చేతులకు అంటుకు΄ోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. డ్రైయర్కు బదులుగా వ్యక్తిగత హ్యాండ్కర్చిఫ్ వాడటం లేదా అలా స్వతహాగా అరి΄ోయేదాకా వేచిచూడటమే మంచిదని అంటున్నారు. అలాగే కొందరు నిపుణులు చెబుతున్నదేమిటంటే... టాయిలెట్లలోని వాష్బేసిన్ల దగ్గర ఒకసారి సబ్బుతో చేతులు కడుక్కున్న తర్వాత మళ్లీ అక్కడి ఏ ఉపరితలాన్నీ (సర్ఫేస్నూ) తాకకూడదని సూచిస్తున్నారు. చదవండి : ఈ తప్పు మీరూ చేస్తే.. మీ ఆయుష్షు మూడినట్టే! -
ఎడమ వైపు తిరిగి పడుకుంటున్నారా? ఈ విషయం తెలుసా?
ఎడమ వైపు తిరిగి నిద్రపోయే అలవాటు కొందరికి ఉంటుంది. అయితే..ఇప్పటికే గుండె జబ్బులు ఉన్న వారు ఎడమ వైపు తిరిగి అసలు నిద్రపోకూడదు.ఇలా నిద్రపోవడం వల్ల అసిడిటీ రిఫ్లక్స్ తగ్గిపోతుందని కొందరు చెబుతుంటారు. అయితే..హార్ట్ పేషెంట్స్ మాత్రం ఇలా పడుకోవడం మంచిది కాదని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. ఎటువైపు తిరిగి పడుకుంటే మంచిదో తెలుసుకుందాం...ఎప్పుడైతే ఎడమ వైపు తిరిగి నిద్రపోతారో అప్పుడు గుండెపైన ఒత్తిడిపడుతుంది. ఈ ఒత్తిడి కారణంగా గుండె కాస్తంత పక్కకు జరిగినట్టుగా అవుతుంది. అదే సమయంలో గ్రావిటీ కారణంగా కిందకు లాగినట్టుగా అవుతుంది. ఈ రెండింటి మధ్య రాపిడి కారణంగా హృదయ స్పందనలో మార్పు వస్తుంది. అందుకే..గుండె జబ్బులు ఉన్న వారు వీలైనంత వరకూ ఎడమ వైపు తిరిగి నిద్రపోవడాన్ని అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. లేదంటే గుండె జబ్బు లక్షణాలు ఇంకా తీవ్రమవుతాయి. ఇక కుడి వైపునకు తిరిగి నిద్రపోవడం వల్ల ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుందో కూడా తెలుసుకుందాం. ఎప్పుడైతే కుడి వైపు తిరిగి పడుకుంటారో అప్పుడు గుండెపైన ప్రెజర్ ఎక్కువగా పడదు. ఈసీజీలోనూ ఎలాంటి మార్పులు కనిపించవు. అంటే..హార్ట్ రేట్ నార్మల్ గానే ఉన్నట్టు లెక్క. అందుకే హార్ట్ పేషెంట్స్ కుడి వైపునకు తిరిగి నిద్రపోవడమే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. చదవండి: Shoaib Malik సానియా మాజీ భర్త మూడో పెళ్లి పెటాకులే..?! వీడియో వైరల్మీరు ఏ పొజిషన్ లో నిద్రపోతున్నారనే విషయంతో పాటు ఎన్ని గంటల పాటు క్వాలిటీ స్లీప్ ఉంటోందన్నదీ ముఖ్యమే. కుడి వైపు తిరిగి పడుకున్నంత మాత్రాన స్లీప్ క్వాలిటీ ఉన్నట్టే అని అనుకోడానికి వీలులేదు. చాలా మంది 5 గంటల పాటు మాత్రమే నిద్రపోతున్నారు. రాత్రంతా మొబైల్ చూసుకుంటూ కూర్చుంటున్నారు. ఉదమయే ఆఫీస్ హడావుడి కారణంగా త్వరగా నిద్రలేవాల్సి వస్తోంది. ఇలా చేయడం వల్ల మెటబాలిజం దెబ్బ తింటుంది. అప్పటి నుంచి సమస్యలన్నీ మొదలవుతాయి. అందుకే..సరైన విధంగా నిద్ర పట్టేందుకు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది. ఇదీ చదవండి: Nita Amabni క్వీన్ ఆఫ్ దాండియాతో గార్బా స్టెప్పులు : ఉర్రూతలూగిన వేదిక -
ఈ తప్పు మీరూ చేస్తే.. మీ ఆయుష్షు మూడినట్టే!
ఆరోగ్యంగా ఎక్కువ కాలం జీవించాలంటే అనేక అంశాలు పనిచేస్తాయి. సమతులం ఆహారం, ఒత్తిడి లేని జీవితం, సరియైన నిద్ర చాలా అవసరం. దీంతోపాటు మన శరీరంలో అస్సలు నిర్లక్ష్యం చేయకూడదని అవయవం ఒకటి ఉంది. ప్రముఖ మానసిక వైద్యుడు డాక్టర్ డేనియల్ అమెన్ దీనికి సంబంధించి కీలక విషయాలను వెల్లడించారు.మానసిక వైద్యుడు డాక్టర్ డేనియల్ అమెన్ ప్రకారం, ఆరోగ్యం విషయంలో చాలామంది చేసే అతి పెద్ద తప్పు వారి బ్రెయిన్ గురించి పట్టుకోకవడం. మెదడు ఆరోగ్యంపై అవగాహన లేకపోవడం, నిర్లక్ష్యంగా ఉండటం మనిషి ఆయుష్షుమీద ప్రభావం చూపుతుంది. జ్ఞాపకశక్తి, మానసిక స్థితి, నిర్ణయాలు , దీర్ఘాయువును కూడా నియంత్రించే అవయవం అయినా , మెదడు ఆరోగ్యం తరచుగా రోజువారీ జీవితంలో దాని గురించి విస్మరిస్తున్నారు అంటారాయన. తాజాగా దీర్ఘాయువు పరిశోధకుడు డాన్ బ్యూట్నర్తో ఇదే విషయాన్ని ధృవీకరిస్తూ పాడ్కాస్ట్ లైవ్ టు 100 లో మాట్లాడుతూ తన అనుభవాన్ని పంచుకున్నారు. తన కెరీర్లో 2 లక్షలకు పైగా మెదడు స్కాన్లను అధ్యయనం చేసిన డాక్టర్ అమెన్, మెదడుతో సంబంధాన్ని పెంచుకోవడం దాని కనుగుణంగా మలుచుకోవడం చాలా ముఖ్యం అన్నారు.తన సొంత మెదడు స్కాన్ నుండి మేల్కొలుపు కాల్డాక్టర్ అమెన్ ఒక అగ్రశ్రేణి న్యూరోసైన్స్ విద్యార్థిగా మరియు బోర్డు-సర్టిఫైడ్ మనోరోగ వైద్యుడిగా కూడా, 1990ల ప్రారంభం వరకు తాను మెదడు ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేశానని ఒప్పుకున్నారు. తన క్లినిక్లలో బ్రెయిన్ ఇమేజింగ్ను ప్రవేశపెట్టి, 1991లో తన సొంత మెదడును స్కాన్ చేసినప్పుడు, దిగ్భ్రాంతికర ఫలితాలు చూశానని చెప్పుకొచ్చారు.1990 కి ముందు తనకు అధిక బరువు రాత్రిపూట నాలుగు గంటలు మాత్రమే నిద్రపోవడం లాంటి చెడు అలవాట్లు ఉండేవని , తన బ్రెయన్ హెల్త్ గురించి ఎపుడూ ఆలోచించలేదని గుర్తు చేసుకున్నారు. కానీ పరిశోధనలకు ఒక మేల్కొలుపుగా పనిచేశాయని, తన జీవనశైలిని కరెక్ట్ నిద్ర, ఆహారం,రోజువారీ అలవాట్లను మార్చుకున్నట్టు వెల్లడించారు.మెదడు ఆరోగ్యం- దీర్ఘాయువు, "బ్లూ జోన్స్" (ప్రజలు అసాధారణంగా ఎక్కువ కాలం జీవించే ప్రాంతాలు) ఆలోచనను ప్రాచుర్యంలోకి తెచ్చిన డాన్ బ్యూట్నర్, మంచి జీవనశైలి అనేది గుండె, మొత్తం ఆరోగ్యాన్ని ప్రభావితం చేసినట్టుగానే, మెదడు ఆరోగ్యం అనేది దీర్ఘాయువులో ప్రధాన పాత్ర పోషిస్తుందన్నారు. రోజువారీ అలవాట్లు అభిజ్ఞా క్షీణత, చిత్తవైకల్యం,మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి, అలాగే మెదడును ముందుగానే రక్షించడం అనేది దీర్ఘకాలిక శ్రేయస్సులో చాలా కీలకమన్నారు. దీనికి సంబంధించి డాక్టర్ అమెన్ రాసిన "చేంజ్ యువర్ బ్రెయిన్, చేంజ్ యువర్ పెయిన్" అనే పుస్తకంలో మరిన్ని విషయాలను పొందుపర్చారు.మెదడు ఆరోగ్యం, డా. అమెన్ సలహాలుక్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. ఇది మెదడుకు రక్త ప్రవాహాన్ని, ఆక్సిజన్ను సరఫరాను పెంచుతుంది. వ్యాయామంలో పట్టిన చెమట హానికరమైన సమ్మేళనాలను తొలగించడంలో సహాయపడుతుందిమెదడు చురుగ్గా ఉండేలా, చాలెంజింగ్ ఫజిల్స్ పరిష్కరించాలి. కొత్త నైపుణ్యాలను నేర్చుకోవాలి.ఒమేగా-3 అధికంగా ఉండే ఆహారాలు, వాల్నట్లు, అవిసె గింజలు . కొవ్వు చేపలు మెదడు కణాలకు మేలు ఇస్తాయిచక్కెర , ప్రాసెస్ చేసిన ఆహారాలు మెదడు ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి. వీటికి దూరంగా ఉండాలి. కుటుంబంలో అల్జీమర్స్ వంటి పరిస్థితులు ఉంటే ముందుగానే అప్రమత్తం కావాలి.7–8 గంటలు ల నిద్రకు ప్రాధాన్యత ఇవ్వాలి. మెదడు తనను తాను శుభ్రపరుచుకునే సమయం నిద్ర.తల గాయాల నుండి రక్షించుకోవడం.మద్యం ,మాదకద్రవ్యాలకు దూరండా ఉండాలి.ఘీ టాక్సిన్స్ న్యూరాన్లను దెబ్బతీస్తాయినెగిటివ్ ఆలోచనలు మెడదుకు హాని చేస్తాయి. విటమిన్ డి , హార్మోన్ స్థాయిలను సరిగ్గా ఉండేలా చూసుకోవాలి. మెదడు పట్ల లవ్ అండ్ కేర్ గా ఉండాలి. దానికి కీడు చేసే పనులు మానుకోవాలి అంటారు డా. అమెన్. -
సౌందర్య సంరక్షణకు 'డీఎన్ఏ డీకోడ్'..!
అందం కోసం మగువలు ఎంతలా డబ్బుని వెచ్చిస్తారో తెలియంది కాదు. అందుకు తగ్గట్టుగానే మార్కెట్లో రకరకాల సౌందర్య ఉత్పత్తులు అతివలను ఆకర్షించేలా వస్తున్నాయి. అయితే అవి అందరికీ సరిపోడవు. కొందరు సరిపోయినట్లు మరికొందరిలో మంచి పలితాలు రావు. ఇలాంటి సమస్య లేకుండా..నిగనిగలాడే అందం కోసం మన డీఎన్ఏతోనే సరిచేసుకుందాం అంటున్నారు ఒలివా క్లినిక్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ టి.ఎన్.రేఖా సింగ్. మీ డీఎన్ఏలోని ప్రత్యేక అంశాల ఆధారంగా కూడా అందమైన చర్మం, కేశ సౌందర్యం పొందవచ్చునని చెప్పారు. అదెలాగో సవివరంగా తెలుసుకుందాం.అందం కోసం మార్కెట్లో దొరికే రకరకాల క్రీములు, ఫేస్వాష్లు వాడి ఇబ్బంది పడాల్సిన పనిలేదంటున్నారు శాస్త్రవేత్తలు. మన డీఎన్ఏని డీ కోడ్ చేస్తే చాలు..అపురూపమైన సౌందర్యాన్ని సొంత చేసుకోవచ్చని చెబుతున్నారు. మన డీఎన్ఏని డీకోడ్ చేస్తే..మన శరీరం, జుట్లు, బాడీ తత్వం ఎలా ఉంటుందన్నది ఇట్టే తెలిసుకోవచ్చు. మన శరీర డీఎన్ఏలో ముఖంపై పిగ్మెంటేషన్తోపాటు వెంట్రుకల కుదుళ్లు పోషకాలను సక్రమంగా అందుకుంటున్నాయా లేదా? చర్మం తనంతట తాను మరమ్మతు చేసుకునేందుకు ఎక్కువ సమయం తీసుకుంటుందా? అన్న అనేక విషయాలు తెలుసుకోవచ్చునని తెలిపారు. జీన్-ఐక్యూ వంటి ప్రోగ్రామ్స్లో కేవలం లాలాజల నమూనా ద్వారా ఈ డీఎన్ఏ వివరాలను తెలుసుకుని తదనుగుణంగా చికిత్స ప్రారంభిస్తామని వివరించారు. అత్యాధునిక మైక్రో అరే టెక్నాలజీ ద్వారా చర్మం, వెంట్రుకలు, జీవక్రియలు, జీవనశైలి వంటి విషయాలకు సంబంధించి130 జన్యువులు, 150 లక్షణాలను పరిశీలిస్తారు. ఇవన్నీ వెంట్రుకలు రాలిపోవడం, కొలెజన్కు జరుగుతున్న నష్టం, పోషకాలు వంటి వివరాలు అందిస్తాయి. పరిష్కార మార్గాలను గుర్తించడంలో సహాయపడతాయి. ఆక్నేనే తీసుకుంటే.. ఒత్తిడి, కాలుష్యం తదితరాలు కారణమని అనుకుంటాం కానీ.. డీఎన్ఏ పరీక్షల ద్వారా శరీరంలో మంట/వాపు వచ్చిన తరువాత మీకు హైపర్ పిగ్మెంటేషన్ వచ్చే అవకాశం ఉందా? లేదా? అన్నది తెలుస్తుంది. ఇంకోలా చెప్పాలంటే చిన్న చిన్న విషయాలకే మీ చర్మం వేగంగా స్పందిస్తుందా? అన్నది తెలుస్తుందన్నమాట. అలాగే.. అతినీల లోహిత కిరణాలు, కాలుష్యాలను తట్టుకునే సామర్థ్యం మీ చర్మానికి ఎక్కువగా లేదా? అన్న విషయం డీఎన్ఏ పరీక్షల ద్వారానే తెలుస్తుంది. వెంట్రుకల విషయంలోనూ ఇలాంటి వివరాలు బోలెడన్ని తెలుస్తాయని డాక్టర్ రేఖా సింగ్ తెలిపారు. ఈ వివరాల ద్వారా ఒకొక్కరికి ఒక్కో రకమైన, సమర్థ పరిష్కార మార్గాలు సూచించవచ్చునని వివరించారు. దాంతో ఎలాంటి సౌందర్య చికిత్సలు తీసుకుంటే చాలు అన్నది అర్థం అవుతుంది. తదనుగుణంగా అనుసరిస్తే..అందమైన చర్మం, నిగనిగలాడే జుట్టుని సులభంగా పొందవచ్చట. అంటే మన జన్యువుల ఆధారంగా చర్మాన్ని రిపేర్ చేసుకోవడం. సమస్య ఎక్కడుందన్నది తెలిస్తే..పరిష్కరించడం మరింత సులభవుతుంది. ఆ నేపథ్యంలోనే ఈ సరికొత్త విధానాన్ని తీసుకొచ్చమని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. డీఎన్ఏ డీకోడ్ అంటే..జన్యు సమాచారం (genetic information)ను అర్థం చేసుకోవడం అనే ప్రక్రియ. ఇది జీవుల శరీరంలో ఉన్న డియోక్సిరిబోన్యూక్లిక్ ఆమ్లం (DNA)లోని న్యూక్లియోటైడ్ క్రమాన్ని శాస్త్రవేత్తలు చదివి అర్థ చేసుకుంటారన్నమాట. దాంతో జీవి శరీర లక్షణాలను ఈజీగా అంచనా వేస్తారు పరిశోధకులు. అంటే ఉదాహరణకు, ఎత్తు, చర్మ రంగు, తెలివి, ఆరోగ్యం మొదలైనవి. డీఎన్ఏతో ముందుగా ఎలాంటి వ్యాధులు సంక్రమించే అవకాశం ఉందన్నది అంచనా వేయడమే కాదు, అందానికి మెరుగులు కూడా పెట్టుకోవచ్చని చెబుతున్నారు పరిశోధకులు.ఈ డీఓన్ఏ డీకోడ్తో శరీర లక్షణాలను అంచనా వేసి తగిన విధంగా డెర్మటాలజిస్టులకు సలహాలు సూచనలు ఇస్తారు. దీని సాయంతో వ్యద్ధాప్య ఛాయలను సైతం నివారించొచ్చుని కూడా చెబుతున్నారు. అంతేగాదు ఎలాంటి పోషకాహారం మన శరీరానికి అవసరం, ఎలాంటి జీవనశైలి మనకు సరిపోతుందనేది నిర్థారిస్తారట. ఫలితంగా అందరూ ఆశించే కలల సౌందర్యాన్ని చాలా ఈజీగా సొంత చేసుకోగలుగుతారని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. ముందు ముందు ఈ డీన్ఏ డీకోడ్ సౌందర్య సంరక్షణలో అద్భుతమైన పాత్ర పోషిస్తుందని నమ్మకంగా చెబుతున్నారు. (చదవండి: తాగునీరు అంత విలువైనదా..?) -
తాగునీరు అంత విలువైనదా..?
ఉదయం బ్రష్ చేయడం మొదలు రాత్రి వరకు ఒక్కొక్కరు ఎంతో నీటిని వృథా చేస్తున్నాం.. అవసరం ఉన్నంత వరకు మాత్రమే భోజనం చేసే మనం.. నీటి పొదుపునకు మాత్రం ఏ మాత్రం విలువనివ్వడం లేదు. నిత్యం లక్షల లీటర్ల నీటిని డ్రైనేజీలో కలిపేస్తున్నాం. సింగపూర్ దేశం పేరు చెబితే వావ్.. అనే మనం అక్కడి తాగునీటి పరిస్థితి గురించి తెలిస్తే మాత్రం వామ్మో.. అనాల్సిందే.. బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్కు చెందిన 6వ తరగతి చదువుతున్న చిన్నారి అక్కడి పరిస్థితులను వివరిస్తుంటే.. ఆలోచనలో పడాల్సిందే.. బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్(హెచ్పీఎస్)కు చెందిన 43 మంది విద్యార్థులు ఇటీవల సింగపూర్లో పర్యటించి వచ్చారు. ఆ బృందంలో ఆరో తరగతి చదువుతున్న అనమల నేహాశ్రిత కూడా ఉన్నారు. ఆ పర్యటన తనకు తాగునీటి విలువ తెలిసేలా చేసిందని, ఇకపై నీరు వృథా చేయకూడదని నిర్ణయించుకున్నానని చెబుతోంది. ఈ సందర్భంగా చిన్నారి నేహా బుధవారం ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడింది. ఆ వివరాలు ఇలా.. ‘నాలుగు రోజుల పర్యటనలో యూనివర్సల్ స్టూడియో, మెర్లైన్ పార్క్ సహా అనేక ప్రాంతాలు తిరిగాం. అన్నింటికంటే మరీనా బరాజ్ ఎన్నో విషయాలు నేర్పింది. సింగపూర్లో తాగునీటి సమస్య చాలా తీవ్రంగా ఉంది. నదులు లేకపోవడంతో పాటు భూగర్భ జలాలు చాలా తక్కువ. ఈ బరేజ్లో వర్షపు నీటిని నిల్వ చేయడంతో పాటు సముద్ర జలాలను తాగునీరుగా మారుస్తున్నారు. తాగునీటి సమస్యను అధిగమించడానికి సింగపూర్ ప్రభుత్వం మలేషియా నుంచి కొనుగోలు చేస్తోంది. సీవేజ్, వేస్ట్ వాటర్ను రీసైకిల్ చేసి వాడుకుంటోంది. ఈ నీరు తాగడం ఇష్టం లేక బాటిల్ కొనుక్కోవాలంటే 2.8 సింగపూర్ డాలర్లు(రూ.193) వెచి్చంచాలి. అక్కడ ఉన్న పరిస్థితులు, నీటి భద్రతను జాతీయ భద్రతగా భావిస్తున్న ఆ ప్రభుత్వం.. ఇలా అన్నీ చూసిన తర్వాత తాగునీటి విలువ ఏంటో తెలిసింది. మనకు ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే కాలుష్య, నీటి వృథా ఉండకూడదని తెలుసుకున్నా. ఇవి పాటించడంతో పాటు నాకు తెలిసిన వారికీ వివరిస్తూ పాటించాలని సూచిస్తా. దీనికోసం ఓ పవర్ పాయింట్ ప్రజెంటేషన్(పీపీటీ) తయారు చేస్తున్నా. నాలో మార్పు తీసుకువచ్చిన ఈ సింగపూర్ పర్యటనకు అవకాశం ఇచ్చిన స్కూల్, మాతో వచ్చి కొత్త విషయాలు నేర్పించిన టీచర్స్కు ధన్యవాదాలు’. -
నలభై ఏళ్ల తల్లి వెయిట్లాస్ స్టోరీ..! 136 కిలోలు నుంచి 68 కిలోలకు..
అందరు బరువు తగ్గడంపై ఫోకస్ పెడుతున్నారు. రకరకాల మార్గాల్లో తగ్గడంపై దృష్టిపెట్టి మరి ఆరోగ్య స్ప్రుహ పెంచుకుంటున్నారు. అయితే హాయిగా ఉన్నప్పుడే మన బాడీ మీద ఫోకస్ పెట్టడం, ఆరోగ్యంపై ధ్యాస వంటివి చేయగలం. కానీ ఈ తల్లికి కూతురు అనారోగ్యమే బరువు తగ్గేందుకు దారితీసింది. డైట్పై ఉన్న దృక్పథాన్ని పూర్తిగా మర్చేసింది. అలాంటి కష్ట సమయాల్లో ఎవ్వరైనా..తమ ఉనికిని కోల్పోయేంతగా బాధలో ఉండిపోతారు..కానీ అదే ఆమెకు ఆరోగ్యంపై అటెన్షన్ పెట్టేలా చేసింది. పైగా కిలోల కొద్ది బరువు తగ్గి, స్ఫూర్తిగా నిలిచింది. మరి ఆమె వెయిట్లాస్ స్టోరీ గురించి తన మాటల్లోనే సవివరంగా తెలుసుకుందామా..!.ఆ అమ్మే 40 ఏళ్ల కింబర్లీ పావెల్. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అయిన ఆమె పీసీఓఎస్తో ఇబ్బంది పడుతుండేది. బిజీ జీవితం, వ్యక్తిగత సవాళ్లను సమతుల్యం చేసుకుంటూ సూమారు 68 కిలోలు మేర బరువు తగ్గింది. వాస్తవానికి కింబర్లీ దాదాపు 136 కిలోల అధిక బరువుతో బాధపడుతుండేది. తన సోషల్ మీడియా ఫాలోవర్లను ప్రేరేపించేలా బరువు తగ్గేందుకు శ్రీకారం చుట్టింది. అంతలో అనుహ్యంగా ఆరేళ్ల కూతురు కేన్సర్ బారిన పడటంతో డైట్పై ఉన్న దృక్పథం పూర్తిగా మారిపోయింది కింబర్లీకి. తాను ఆరోగ్య విషయంలో చేసిన తప్పిదాలను విశ్లేషించుకుని..సరైన మార్గంలో బరువు తగ్గాలని భావించింది. ఆ నేపథ్యంలో ఎక్కువగా చేసే సాధారణ తప్పిదాలపై ఫోకస్ పెట్టింది. అంతేగాదు ఆహారాన్ని ఆరోగ్యకరంగా తీసుకోకపోతే ఎలా విషంగా మారుతుందో అర్థం చేసుకుంది. తనకెదురైన సవాళ్లే పూర్తిగా ఆరోగ్యంపై ధ్యాస పెట్టేలా చేశాయని చెబుతోంది. అయితే తాను 68 కిలోల మేర బరువు తగ్గేందుకు కఠిన ఆహార నియమాలేమి పాటించలేదని, సింపుల్ చిట్కాలనే అనుసరించానని చెప్పుకొచ్చింది. బరువు తగ్గిన విధానం..నిలకడగా ఉండాలి...బరువు తగ్గాలనే ఫోకస్ని మధ్యలో వదిలేయకుండా స్ట్రాంగ్ ఉండే మనస్సుని డెవలప్ చేసుకోవడం. ఈ రోజు కంటే మరింతగా భిన్నంగా కనిపించాలనే లక్ష్యం ఏర్పరచుకోవడం వంటివి చేయాలి.పోషకాహారంపై ఫోకస్..ప్రోటీన్, ఫైబర్ ఉండేవి తీసుకుంటున్నామో లేదో కేర్ తీసుకోవాలి. రోజువారీగా 130 నుంచి 150 గ్రాముల ప్రోటీన్, ఫైబర్ ఉంటుందో లేదో చూసుకోవాలి. చురుకుగా ఉండటం..ప్రతి రోజు వర్కౌట్లపై దృష్టి పెట్టడం. కనీసం 40 నిమిషాలు వాకింగ్, వ్యాయమాలు చేసేలా చూసుకోవడం. అవి భారంగా కాకుండా ఎంజాయ్ చేస్తూ చేయడం అలవాటు చేసుకోవాలి.అతి ఆకలిని నివారించటంఎక్కువ ఆకలి వేసేంత వరకు కాకుండా..బ్యాలెన్స్గా తినేలా చూసుకోవాలి. బాగా ఆకలి వేసేంత వరకు ఉంటే అతిగా తినే ప్రమాదం ఉంది. ఆకలి అనిపించిన వెంటనే..సంతృప్తి కలిగేలా మంచి ఆహారం తీసుకోవాలి. చక్కెరకు దూరం..స్వీట్స్ తినాలనిపించినప్పుడూ తెలివిగా తినాలి. ఎలాగంటే ఈ రోజు స్వీట్స్ ఎక్కువ తింటే మిగతా సమయంలో తీసుకునే ఫుడ్ ఐటెమ్స్ తగ్గించి, వర్కౌట్ల సమయం పెంచాలి. ఫైబర్, కార్బోహైడ్రేట్లను మిస్ చేయొద్దు..ప్రోటీన్తోపాటు ఫైబర్, కార్బోహైడ్రేట్లను మిస్ చేయొద్దు. ఇన్సులిన్ నిరోధకతను నిర్వహించడానికి, ఎక్కువసే కడుపు నిండిన అనుభూతిని అందివ్వడాని ఇది ఎంతగానో హెల్ప్ అవుతుంది. సమతుల్యంగా తినేందుకు ప్రాముఖ్యత నివ్వడం.కాఫీ అలవాట్లను మానుకోవడం..కాఫీ తాగే అలవాటుని తగ్గించుకునేలా..ప్రత్యామ్నాయంగా ప్రోటీన్ షేక్లకు ప్రాధాన్యత ఇవ్వడం వంటివి చేయాలి.మైండ్ఫుల్గా తినటం..మైండ్ఫుల్గా తినేలా చూసుకోవాలి. తగిన కేలరీలు, ప్రోటీన్లు శరీరానిక అందేలా చూసుకోవాలి. చివరగా మితిమీరిన వ్యాయామాలు, అతి కఠినమైన ఆహార నియమాలు మొదటికే ప్రమాదం తెచ్చిపెడతాయని, నిధానంగా ఆరోగ్యకరమైన విధానంలో బరువు తగ్గడమే అన్ని విధాల శ్రేయస్కరమని చెప్పుకొచ్చింది కింబర్లీ పావెల్. View this post on Instagram A post shared by Kimberly Powell (@loving_lessofme_more) గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం.(చదవండి: ఆమె ఆస్తికి అత్తింటి వారే మొదటి హక్కుదారులు) -
15 రోజుల్లో ఆరుగురు చిన్నారులు మృతి, రెండు కాఫ్ సిరప్లు బ్యాన్!
మధ్యప్రదేశ్లో 15 రోజుల్లో 6 మంది పిల్లలు కిడ్నీ వైఫల్యంతో మరణించడం కలకలం రేపింది. మొదట అందరూ సీజనల్ ఫీవర్స్ వేవ్ అనుకున్నారు. కానీ ఆ తరువాత షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో రెండు రకాల కాఫ్ సిరప్ను నిషేధించారు. ఏం జరిగిందంటే..మధ్యప్రదేశ్లోని చింద్వారా జిల్లాను కుదిపేసిన హృదయ విదారక విషాదంలో, గత 15 రోజుల్లో ఆరుగురు పిల్లలు మూత్రపిండాల వైఫల్యంతో మరణించారు. అనారోగ్యంతో ఆసుపత్రికి వచ్చిన వారికి సీజనల్ జ్వరాలు అనుకొని చికిత్ర చేశారు. కానీ పరిశోధకులు మరో విషయాన్ని గమనించి దిగ్భ్రాంతికి లోనయ్యారు. విషపూరిత డైథిలిన్ గ్లైకాల్తో కలిపిన కలుషితమైన దగ్గు సిరప్ మరణాలకు కారణమని అనుమానిస్తున్నారు. దీంతో రెండు రకాల దగ్గు మందులను బ్యాన్ చేశారు.ఐదేళ్ల లోపు వయసున్న పిల్లలు మొదట జలుబు, తేలికపాటి జ్వరంతో వైద్యులను సంప్రదించారు. స్థానిక వైద్యులు దగ్గు సిరప్లతో సహా సాధారణ మందులను సూచించారు. ఆ తర్వాత పిల్లలు కోలుకున్నట్లు అనిపించింది. కానీ కొద్ది రోజులకే పరిస్థితి మారిపోయింది. జ్వరం తిరగ బెట్టింది. మూత్ర బంద్ అయిపోయింది. ఆ తరువాత పరిస్థిత మరింత తీవ్రమై మూత్రపిండాల ఇన్ఫెక్షన్గా మారింది. మహారాష్ట్రలోని నాగ్పూర్కు తరలించి మెరుగైన చికిత్స అందించినప్పటికీ, ముగ్గురు పిల్లలు ప్రాణాలు కోల్పోయారు. దీంతో బాధిత కుటుంబాలు తీవ్ర విషాదంలో మునిగిపోయాయి."మా పిల్లలు ఇంతకుముందెప్పుడూ అనారోగ్యంతో బాధపడ లేదని, దగ్గు సిరప్ తీసుకున్న తరువాతే మూత్రం ఆగిపోయిందని’’ కన్నీరు మున్నీరుగా విలపించారు తల్లిదండ్రులు.(సెంటర్స్టోన్ డైమండ్రింగ్, లగ్జరీ గౌనులో ఇషా అంబానీ : ధర ఎంతో తెలుసా?)మృతుల కిడ్నీ బయాప్సీలలో విషపూరితమైన డైథిలిన్ గ్లైకాల్ కాలుష్యం ఉన్నట్లు వెల్లడైంది. చాలా మందికి బాధితులకు కోల్డ్రిఫ్ , నెక్స్ట్రో-డిఎస్ సిరప్లు ఇచ్చారు. చింద్వారా కలెక్టర్ షీలేంద్ర సింగ్ వెంటనే జిల్లా అంతటా రెండు సిరప్ల అమ్మకాలను నిషేధించారు. వైద్యులు, ఫార్మసీలు తల్లిదండ్రులకు అత్యవసరమైన కీలక సూచనలు జారీ చేశారు. మూత్రపిండాల వైఫల్యానికి కలుషితమైన ఔషధం కారణమని బయాప్సీ నివేదికలో తేలిందని ప్రభావిత గ్రామాల నుండి నీటి నమూనాలలో ఎటువంటి ఇన్ఫెక్షన్ కనిపించలేదని జిల్లా అధికారులు తెలిపారు. తీవ్రత దృష్ట్యా, జిల్లా యంత్రాంగం ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) నుండి ఒక బృందాన్ని పిలిపించి దర్యాప్తు చేస్తున్నామని సింగ్ అన్నారు. "సెప్టెంబర్ 20 నుండి, మూత్రం ఆగిపోవడం, మూత్రపిండాల సమస్యల కేసులు ఎక్కువగా వెలుగులోకి వచ్చాయి. కానీ చాలా మంది పిల్లలలో అకస్మాత్తుగా మూత్రపిండాల వైఫల్యం చాలా ప్రమాదకరమైందని చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ నరేష్ గోనారే వెల్లడించారు. ఆగస్టు 24న మొదటి అనుమానిత కేసు నమోదైందని, సెప్టెంబర్ 7న మొదటి మరణం సంభవించిందని తెలిపారు. -
మచుపిచ్చుపై..భాగ్యనగర వాసుల సాహసయాత్ర.!
తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ నగరానికి చెందిన 15 మంది బృందం పర్వతారోహణ చేసి విజయవంతంగా నగరానికి తిరిగొచ్చారు. 50 సంవత్సరాల పైబడ్డ వీరంతా రెండేళ్ల క్రితం ఎవరెస్టు బేస్ క్యాంప్ అధిరోహించి విజయవంతంగా తిరిగొచ్చారు. ఈ క్రమంలో రెండేళ్ల తర్వాత మచుపిచ్చు సాహసయాత్రకు శ్రీకారం చుట్టారు. సెప్టెంబర్ 4న ఈ యాత్రకు వెళ్లిన బృందం సెప్టెంబర్ 16న తిరిగొచ్చింది. మచుపిచ్చు అనేది ప్రపంచంలోని ప్రధాన పర్యాటక ప్రాంతాల్లో ఒకటి. ఇది దక్షిణ అమెరికా దేశం పెరూలో ఉంది. మచు పిచ్చు సముద్ర మట్టానికి 2,430 మీటర్ల ఎత్తునున్న 15వ శతాబ్దపు ఇంకా సామ్రాజ్యం. ఇది పెరూలోని మచుపిచ్చు జిల్లా, ఉరుబంబా ఫ్రావిన్స్, కుస్కో ప్రాంతంలో ఉంది. 80 కిలోమీటర్ల దూరంలోని (50 మైళ్లు) కుస్కోకు వాయువ్యంగా పవిత్రలోయపై ఒక పర్వత శిఖరంపై ఉంది. దీని ద్వారా ఉరుబంబా నది ప్రవహిస్తోంది. ఎక్కువ మంది పురాతత్వ శాస్త్రవేత్తలు మచుపిచ్చు ఇంకా చక్రవర్తి పాచాకుటి (1438–1472) కోసం నిర్మించిన ఒక ఎస్టేట్ అని నమ్ముతారు. ఫిట్నెస్ ప్రతీకగా..ఈ సాహసయాత్రలో ఇక్ఫాయ్ డైరెక్టర్ సుధాకర్రావు, డాక్టర్ ప్రవీణ్మారెడ్డి, డాక్టర్ శశికాంత్ గోడె, డాక్టర్ నిఖిల్ ఎస్ గడియాల్పాటి, డాక్టర్ గుమ్మి శ్రీకాంత్, డాక్టర్ సల్లేష్ విఠల, డాక్టర్ సంజయ్, ఐటీ ప్రొఫెషనల్స్ విజయభాస్కర్, శివశంకర్, పురుషోత్తం, కృష్ణమోహన్, ప్రసన్నకుమార్, రవి మేడిశెట్టి, అడ్వకేట్ రమేష్ విశ్వనాథ్, కాంట్రాక్టర్ పృద్వీధర్ పాల్గొన్నారు. సౌత్ అమెరికా–భారత్ (సాంబ) 20 డిగ్రీస్ పేరుతో వీరు ఈ సంస్థను ఏర్పాటుచేసుకున్నారు. ఇక్ఫాయ్ డైరెక్టర్ సుధాకర్రావు వీరికి కెపె్టన్గా వ్యవహరించారు. మచుపిచ్చు పర్వతం ఆండీస్ పర్వతశ్రేణిలో ఒక భాగం. 48 గంటల పాటు నడక మార్గంలో ఈ పర్వతాన్ని అతికష్టంతో అధిరోహించాల్సి ఉంటుంది. ఫిట్నెస్ ప్రతీకగా తాము ఈ పర్వతారోహణ చేపట్టినట్లు వీరు తెలిపారు. ఇదే ఉత్సాహంతో ప్రపంచంలోని మరిన్ని పర్వతాల సాహసయాత్ర చేయనున్నట్లు తెలిపారు. (చదవండి: క్యూట్ క్యాట్..ఒత్తిడి సెట్..! దేశంలోనే ప్రప్రథమం..) -
క్యూట్ క్యాట్..ఒత్తిడి సెట్..!
ఫిజియోథెరపీ.. లాఫింగ్ థెరపీ.. ఫిష్ థెరపీ గురించి వినే ఉంటారు.. కానీ ‘క్యాట్ థెరపీ’ గురించి ఎప్పుడైనా విన్నారా..!? ఔను ప్రస్తుతం హైదరాబాద్ నగరవాసులు వినడమే కాదు ప్రత్యక్షంగా చూడబోతున్నారు. ఆ క్యాట్ థెరపీని ఆస్వాదించనున్నారు. ఉరుకులు పరుగుల నగర జీవితం.. తీవ్ర ఒత్తిళ్లతో అలసిపోయిన మనసుకు కాసేపు మానసిక ప్రశాంతత కోరుకోని వారెవరూ ఉండరంటే అతశయోక్తి కాదేమో? అయితే మానసిక ప్రశాంతతకు పెంపుడు జంతువుల మధ్య గడపడం ఓ చక్కని పరిష్కారమని, ఎటువంటి మందులూ నయం చేయలేని నిరాశ నిస్పృహలు, ఒత్తిడి, ఆందోళన, మానసిక సమస్యలను జంతువులు దూరం చేస్తాయని చెబుతున్నారు నిపుణులు. క్యాట్ థెరపీ మానసిక, శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సులభమైన మార్గమని, దీనికోసం యజమానులు తమ పిల్లులకు శిక్షణ ఇచ్చి, పెట్ పార్ట్నర్స్ వంటి సంస్థల ద్వారా సేవలను అందిస్తారు. ఎన్నో జీవన వైవిధ్యాలకు వేదికైన మన నగరంలో క్యాట్ థెరపీలు సైతం హాయ్ చెప్పడం ఇక్కడి జీవనశైలికి నిదర్శనంగా నిలుస్తోంది. హైదరాబాద్లో రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇదే ఏడాది ప్రాయణీకుల ఒత్తిడిని తగ్గించేందుకు డాగ్ థెరపీ పేరుతో ప్యాసింజర్స్ లాంజ్లో క్యూట్ క్యూట్ పప్పీస్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇదే తరహాలో ప్రస్తుతం నగరంలో క్యాట్ థెరపీని అందుబాటులోకి తెస్తున్నారు క్యాట్స్ కంట్రీ నిర్వాహకులు. మానసిక సమస్యలకు జంతువుల థెరపీ చక్కని పరిష్కారమని పలు అధ్యయనాలు సైతం వెల్లడించాయి. ఈ నేపథ్యంలోనే వివిధ దేశాల్లో వినూత్నంగా క్యాట్ థెరపీ కేంద్రాలు ప్రారంభమవుతున్నాయి. మానసిక ప్రశాంతతకు దోహదం చేసే ఈ క్యాట్ థెరపీ కేంద్రాలు దేశంలో మొట్టమొదటి సెంటర్ హైదరాబాద్లో ఆవిష్కృతం కావడం విశేషం. క్యాట్స్ కంట్రీ.. దేశంలో ప్రథమం.. ఇప్పటివరకూ యుఎస్, జపాన్, కెనడా, థాయిలాండ్, ఇండోనేషియాలకే పరిమితమైన క్యాట్ థెరపీ సేవలు దేశంలో మొట్టమొదటిసారి హైదరాబాద్లో అందుబాటులోకి వచ్చాయి. కుతుబ్షాహీ 7 టూమ్స్ సమీపంలో ఏర్పాటు చేసిన ఈ కేంద్రం ఇటీవల్లే అంతర్జాతీయ పిల్లుల దినోత్సవం (ఇంటర్నేషనల్ క్యాట్స్ డే–ఆగస్టు–8) రోజున ప్రారంభమైంది. కుక్కలు, పిల్లులు లాంటి పెంపుడు జంతువుల మధ్య గడపడం, వాటితో ఆడుకోవడం ఎంతో సంతోషాన్ని, ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. తీవ్ర ఒత్తిడి, మానసిక సమస్యలతో బాధపడే వారికి ఇది ఉపశమనం కలిగిస్తుంది. అంతర్జాతీయంగా ప్రముఖ అధ్యయన సంస్థలు సైతం ఈ విషయాన్ని ధ్రువీకరించాయి. 50 రకాలకుపైగా పిల్లులు.. ప్రస్తుతం ఉరుకులు పరుగులతో కూడిన నగర జీవితంలో.. తమతో పాటు పెంపుడు జంతువులను పెంచుకునే వెసులుబాటు తక్కువే. అలాంటి వారు ఈ కేంద్రంలో సేవలు పొందవచ్చు. ఇక్కడ 50కి పైగా పర్షియన్ జాతికి చెందిన పిల్లులు ఉన్నాయి. ఇవన్నీ మానవులతో స్నేహంగా మెలుగుతాయి. మీతో ఆడుకుంటాయి.. గారాబం చేస్తాయి. వీటి మధ్య గడిపి నూతనోత్తేజాన్ని పొందవచ్చు. దీనినే క్యాట్ థెరపీ అంటారు. ఇవన్నీ వ్యాక్సినేషన్ చేసిన ఆరోగ్యవంతమైన పిల్లలు. కాబట్టి వీటితో ఎలాంటి ప్రమాదం ఉండదని నిర్వాహకులు చెబుతున్నారు. ఒక గంటకు అత్యధికంగా ఐదుగురికి మాత్రమే ప్రవేశం ఉండే ఈ సెంటర్లోకి వెళ్లాలంటే అధికారిక వెబ్సైట్లో ముందుగా.. స్లాట్ బుక్ చేసుకోవాలి. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు.. స్లాట్ బుక్ చేసి ఈ కేంద్రాన్ని ఎప్పుడైనా సందర్శించవచ్చు. వృత్తిలో సంతృప్తితో.. వినూత్నంగా.. స్వార్థపరుల ప్రపంచంలో నుంచి.. నిస్వార్థ జంతువుల ప్రపంచంలోకి రండి. కాసేపు మా ఆత్మీయమైన పిల్లులతో గడపండి. వయసును మర్చిపోయి కాసేపు బాల్యంలోకి వెళ్లండి. మిమ్మల్ని నిస్వార్థంగా ప్రేమించేందుకు, అలసిపోయిన మనసుకు కాస్త ప్రశాంతత కలిగించేందుకు, ఆటలు ఆడుకునేందుకు మా పిల్లులు సిద్ధంగా ఉన్నాయి. 35 సంవత్సరాల పాటు పశు సంవర్ధక శాఖలో వైద్యుడిగా పని చేసిన అనుభవంతో.. ఉద్యోగ విరమణ అనంతరం దీనిని ప్రారంభించాను. జంతువులతో మమేకమైన మనసు వాటితోనే సహవాసం, ఆతీ్మయతను కోరుకుంటోంది అనడానికి నా ప్రయాణం ఒక ఉదాహరణ. మా వెబ్సైట్ www. CatsCountry. in లో దీనికి సంబంధించిన వివరాలు తెలుసుకోవచ్చు. – ముహమ్మద్ యాకుబ్ షరీఫ్, క్యాట్స్ కంట్రీ వ్యవస్థాపకులు (చదవండి: ఇదేం పేరెంటింగ్..! వామ్మో ఈ రేంజ్లో డేరింగ్ పాఠాలా..? తిట్టిపోస్తున్న నెటిజన్లు) -
ప్లాస్టిక్లో ఇన్ని రకాలు... నిర్లక్ష్యం చేస్తే ముప్పే!
ప్రపంచ వ్యాప్తంగా ప్లాస్టిక్ వాడకం చాలా సాధారణంగా మారిపోయింది. దీని వల్ల కలిగే దుష్ర్పభావాలు అన్నీ ఇన్నీకావు. తాజా పరిశోధనల ప్రకారం రోజుకు రోజుకు ఇవి మరింత మానవుల ఆరోగ్యాన్ని, పర్యావరణానికి మరింత ప్రమాదకరంగా మారుతున్నాయి. మరికొన్ని రకాల ప్లాస్టిక్లు ఆరోగ్యంపై వాటి దుష్ప్రభావాల గురించి తెలుసుకుందాం. ప్లాస్టిక్లు ఆరోగ్యంపై వాటి దుష్ప్రభావాలు మనం అన్నింటినీ కలిపి (బ్రాడ్గా) ప్లాస్టిక్ అని పిలిచే వాటిల్లో ఎన్నో రకాలున్నాయి. ఉదాహరణకు... పాలీ ఇథిలీన్ టెరెథాలేట్ (పీఈటీ) ఈ పదార్థంతో తయారైన సీసాలను మనం ‘పెట్ బాటిల్స్’ అంటాం. వీటిల్లో సాఫ్ట్డ్రింక్స్, జ్యూస్లు, నీళ్లు, మౌత్వాష్లు వంటివి ప్యాక్ చేస్తుంటారు. దీనివల్ల దీర్ఘకాలంలో శ్వాస సమస్యలు, చర్మంపై ఇరిటేషన్, మహిళల్లో రుతుసంబంధ వ్యాధులు కనిపిస్తంటాయి. కొన్నిసార్లు గర్భస్రావాలూ జరగవచ్చు. వీటితో మనకు ఏర్పడే దుష్ప్రభావాలూ / సమస్యలపై పరిశోధనలింకా సాగుతూనే ఉన్నాయి. హై డెన్సిటీ పాలీ ఇథిలీన్ (హెచ్డీపీఈ) పాల సీసాలు, బ్లీచ్లు, షాంపూసీసాలు, వంటనూనెలు, కిటికీల్ని శుభ్రపరిచే ద్రవాలు (విండోక్లీనర్స్), కొన్ని రకాల మందులను ప్యాకింగ్ ట్యూబ్ల తయారీలో ‘హెచ్డీపీఈ’ ఉపయోగిస్తారు. వీటితో చాలామందిలో అలర్జీలు, ఆస్తమా సమస్యలు వస్తున్నట్లుగా గుర్తించారు. కొందరిలో కాలేయం, కిడ్నీలు, స్ల్పీన్, ఎముకలపై దుష్ప్రభావాన్ని చూపుతాయి. లో–డెన్సిటీ పాలీ ఇథిలీన్ (ఎల్డీపీఈ) చాలా రకాల కిరాణా వస్తువుల ప్యాకింగ్లలో, బ్రెడ్, ఫ్రోజెన్ ఫుడ్ ఐటమ్స్ నిల్వ కోసం ఈ పదార్థాన్ని ఉపయోగిస్తుంటారు. దీన్నే సాఫ్ట్ ప్లాస్టిక్’ అని కూడా అంటరు. దీంతో చేసిన ప్యాకింగ్లోని పదార్థాలను తొలగించగానే ఇవి తేలిగ్గా ముడుచుకు పోతాయి. పాలీస్టైరీన్ (పీఎస్) వీటిని గుడ్లను నిల్వచేసే కార్టన్లు, డిస్పోజబుల్ కప్పులు, ప్లాస్టిక్తో చేసే స్పూనులు, ఫోర్కులు (కట్లెరీ), కాంపాక్ట్ డిస్కుల వంటి వాటి తయారీలో వాడుతారు. వీటితో నాడీవ్యవస్థపై, ప్రత్యుత్పత్తి వ్యవస్థపై, ఎర్రరక్తకణాలపైన ప్రభావం పడుతుంది. పాలీ ప్రొపిలీన్ (పీపీ)కెచప్ సీసాలు, పెరుగు ప్యాకింగ్, మార్జరిన్ అనే వంటనూనెలు, మందులు, సిరప్లు, పరాదర్శకం కాని కొన్ని మందుల్ని నిల్వ చేసే సీసాల తయారీకి వీటిని ఉపయోగిస్తుంటారు. మిగతా ప్లాస్టిక్లతో పోలిస్తే దీన్ని చాలావరకు సురక్షితమని అంటారుగానీ... దీనివల్ల కలిగే దుష్ప్రభావాలపై ఇంకా పరిశోధనలు కొనసాగుతూనే ఉన్నాయి. అంతమాత్రాన ఇది పూర్తిగా సురక్షితమని చెప్పడానికి వీలు లేదు. చదవండి: బరువు తగ్గడం కష్టంగా ఉందా? షాకింగ్ రీజన్ ఇదే కావచ్చు!థాలేట్స్తో తయారయ్యే వాటిల్లో కొన్ని... ఆహారంలో కలిసేందుకు అవకాశం ఉన్న మరో ప్లాస్టిక్ ఉపకరణాలు థాలేట్స్. (ఇంగ్లిష్లో థాలేట్స్ స్పెల్లింగ్కు ముందర ఉండే ‘పీ’ అక్షరం సైలెంట్ కాగా... కొందరు దీన్నే ఫ్తాతలేట్స్’ అని కూడా ఉచ్చరిస్తుంటారు). ప్లాస్టిక్ను ఎటుపడితే అటు ఒంచేందుకు (ఫ్లెక్సిబిలిటీ కోసం) ఉపయోగించే ΄ పాలీ వినైల్ క్లోరైడ్ (పీవీసీ) ఆహారంలో కలిసి దుష్ప్రభావాలను చూపుతాయి.థాలేట్స్ను ఏయే తయారీల్లో ఉపయోగిస్తారంటే...? ఆహారాన్ని ΄ ప్యాక్ చేసేందుకు వాడే బాక్స్ల కోసం. కూల్డ్రింక్స్ లేదా మంచినీటి సీసాల తయారీలో. ∙వాటర్ప్రూఫ్ కోట్లు, జాకెట్స్ వంటి దుస్తుల తయారీలో నీళ్ల పైపుల తయారీలో. పైకి తోలులా కనిపించే కొన్ని రకాల దుస్తుల తయారీలో. విద్యుత్ వైర్లపై ఉండే ఇన్సులేటింగ్ పదార్థాలలోఎలక్ట్రానిక్ వస్తువుల్లో, వినైల్ ఫ్లోరింగ్స్లో వాటర్బెడ్స్, పిల్లల ఆటవస్తువుల్లోఆరోగ్యంపై థాలేట్స్ వల్ల కలిగే దుష్ప్రభావాలు బైస్ఫినాల్ ఏ (బీపీఏ) లాగే ధాలేట్స్ కూడా టెస్టోస్టెరాన్ వంటి పురుష సెక్స్ హార్మోన్పై దుష్ప్రభావం చూపుతాయి. వీటి వల్ల పురుషుల్లో వీర్యం నాణ్యత (స్పెర్మ్ క్వాలిటీ) కూడా దెబ్బతింటుంది. ప్లాస్టిక్తో కలిసిన ఆహారం వల్ల అలర్జీలు, ఆస్తమా, పిల్లికూతలు రావచ్చు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడానికి లేదా ఒకవేళ వాడుతున్నప్పటికీ... చాలావరకు వాటిని సురక్షితంగా మలచుకోడానికి కొన్ని సూచనలివే... ప్లాస్టిక్ వస్తువుల తయారీలో బైస్ఫినాల్ ఏ లేనివి (బీపీఏ ఫ్రీ) అని రాసి ఉన్న వాటిని మాత్రమే వాడాలి. ఇదీ చదవండి: ఈ టిప్స్ పాటిస్తే పండగ వేళ మెరిసిపోవడం ఖాయం!నిర్వహణ : యాసీన్ -
బరువు తగ్గడం కష్టంగా ఉందా? షాకింగ్ రీజన్ ఇదే కావచ్చు!
మనం ఉపయోగించే షాంపూ బాటిల్ సైతం మన బరువును పెంచే అవకాశం ఉందంటున్నారు పరిశోధకులు. కేవలం షాంపూ బాటిల్ మాత్రమే కాదు... షవర్ జెల్, హెయిర్ కండిషనింగ్ క్రీమ్ లాంటి వాటిని ΄్యాక్ చేసే కొన్ని సీసాలతో పాటు తిరిగి మాటిమాటికీ భర్తీ చేసుకోడానికి అవకాశమున్న డ్రింకింగ్ బాటిళ్లలో ఉండే ప్లాస్టిక్ కూడా బరువు పెరగడానికి కారణమవుతోందన్న విషయాన్ని గత కొద్దిరోజుల ముందర నార్వేలోని నార్వేజియన్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సంస్థ నిర్వహించిన ఓ పరిశోధనతో తెలిసింది. ఈ అధ్యయనంలో భాగంగా 629 రకాల వివిధ ప్లాస్టిక్ వస్తువుల్లో ఉంచిన దాదాపు 55,000 రకాల రసాయనాలను పరీక్షించారు. వీటిల్లో పదకొండు రకాల రసాయనాలు బరువు పెరగడానికి కారణ మవుతాయని తేలిందని పరిశోధనకు నేతృత్వం వహించిన, ఆ సంస్థకు చెందిన అసోసియేట్ ప్రొఫెసర్ మార్టిన్ వేజ్నర్ తెలిపారు. ఆ ప్లాస్టిక్ సీసాలను ఉపయోగించినప్పుడు మన దేహంలోకి ప్రవేశించే ఆ పదకొండు రకాల రసాయనాల వల్ల బరువు పెరుగుతుండటంతో వాటిని ‘ఒబిసోజెన్స్’ (Obesogens) అని పేర్కొంటున్నారు. మరీ ముఖ్యంగా బైస్ఫినాల్–ఏ వంటి ‘ఒబిసోజెన్స్’ మన దేహంలోని జీవరసాయన ప్రక్రియల్లో జోక్యం చేసుకోవడంతో పాటు కొవ్వు నిండి ఉండే ఫ్యాట్ సెల్స్ను పెరిగిపోయేలా చేయడం వల్ల దేహం బరువు అకస్మాత్తుగా పెరుగుతోందని ఈ అధ్యయనంలో పాల్గొన్న మరో పరిశోధకుడు జొహన్నేస్ వోకర్ తెలిపారు. అంటే ఇప్పటివరకూ ప్లాస్టిక్ పర్యావరణానికి హానికరమని, అలాగే బైస్ఫినాల్–ఏ, థ్యాలేట్స్ వంటి ప్లాస్టిక్స్ వల్ల అనేక నాడీ సంబంధమైనవి, వ్యాధినిరోధకతను తగ్గించేవి, ప్రత్యుత్పత్తి వ్యవస్థను దెబ్బతీసేలాంటి అనారోగ్యాలు కలగడమే కాదు... ఇప్పుడు తాజాగా బరువు పెరిగేలా చేయడం ద్వారా కూడా ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయని స్పష్టమైంది. బరువు పెరగడం వల్ల... స్థూలకాయం కారణంగా ఆరోగ్యపరంగా అనేక అనర్థాలు వస్తాయనే విషయం తెలిసిందే. ఈ అధ్యయన వివరాలన్నీ‘ఎన్విరాన్మెంటల్ సైన్స్ అండ్ టెక్నాలజీ’ అనే ప్రముఖ జర్నల్ లో ప్రచురితమయ్యాయి.బరువు పెంచి ఒబేసిటీని కలిగిస్తోంది కాబట్టి ఆ ప్లాస్టిక్ పదార్థాలకు ‘ఒబిసోజెన్స్’ అని పేరు! ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడానికి లేదా ఒకవేళ వాడుతున్నప్పటికీ... చాలావరకు వాటిని సురక్షితంగా మలచుకోడానికి కొన్ని సూచనలివే..ప్లాస్టిక్ వస్తువుల తయారీలో బైస్ఫినాల్ ఏ లేనివి (బీపీఏ ఫ్రీ) అని రాసి ఉన్న వాటిని మాత్రమే వాడాలి. ప్లాస్టిక్ వస్తువులను ఉపయోగించాల్సి వస్తే... వాటిపై ‘మైక్రోవేవ్ సేఫ్’ అని రాసి ఉన్నవే వాడాలి. అవి మైక్రోవేవ్ ఒవెన్లో పెట్టినా కరగవు. లేకపోతే ఆ ఉష్ణోగ్రత వద్ద ప్లాస్టిక్ ఎంతో కొంత కరిగి ఆహారంలో కలిసి ఆరోగ్యంపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని గుర్తుంచుకోవాలి. ప్లాస్టిక్ వస్తువులను కఠినమైన డిటర్జెంట్స్ మోతాదులు ఎక్కువగా ఉండే డిష్వాషర్స్లో ఎక్కువసేపు నానబెట్టి ఉంచడం సరికాదు. పిల్లల పాలకోసం గ్లాస్తో చేసిన ప్లాల సీసాలు ఉపయోగించడమే మంచిది. ప్లాస్టిక్ సీసాలు ఉపయోగించే ప్పుడు వాటిలో వేడి వేడి పాలు పోయకూడదు. ఆహారాన్ని ఉంచడం కోసం ప్లాస్టిక్ డబ్బాల కంటే స్టెయిన్లెస్ స్టీల్ పాత్రలు మంచివని గుర్తుంచుకోవాలి. కొన్ని లంచ్బాక్స్లు మూత సాగినట్లుగానూ, కింద ఉన్న కంటెయినర్ కాస్త సాగిపోయి షేప్ చెడిపోయినట్లు గానూ ఉంటాయి. ఇలా సాగి ఉన్నట్లుగా ఉన్న ఆహారపు డబ్బాలను ఏమాత్రం ఉపయోగించ కూడదు. చదవండి: ఈ టిప్స్ పాటిస్తే పండగ వేళ మెరిసిపోవడం ఖాయం!ఇక మనం రోజూ నీళ్లను నిల్వ చేసుకోడానికి ఉపయోగించే ప్లాస్టిక్ డ్రమ్ముల వంటి వాటిని కేవలం నీళ్ల నిల్వ కోసం తయారు చేసినవాటినే ఉపయోగించాలి. అయితే చాలామంది కొన్ని రకాల రసాయనాలను (కెమికల్స్) నిల్వ ఉంచడానికి వాడిన వాటిని కడిగి వాటిని నీళ్ల నిల్వ కోసం వాడుతుంటారు. ఇలాంటివి కూడా అంత మంచిది కాదు. -
ఐదేళ్ల వయసుకే చిన్నారి అవినా అరుదైన ఘనత..!
ఆ చిన్నారి వయసు ఐదేళ్లు.. అయితేనేం పనికిరాని వ్యర్థాలతో అద్భుతాలు సృష్టించింది.. బుజ్జి మెదడుకు పదునుపెట్టి అరుదైన ఘనతను సొంతం చేసుకుంది.. తల్లిదండ్రుల నుంచి వచ్చిన సేవాతత్పరత, సామాజిక బాధ్యతను ఒంటబట్టించుకుంది. అనాథ పిల్లల కోసం వారు చేస్తున్న సేవలో తన పాత్రను గుర్తించి వ్యర్థాలతో చిన్నారులకు బట్టలు తయారుచేసింది. ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు దక్కించుకుంది. కాప్రా సాకేత్కు చెందిన పొట్టపాటి ప్రవీణ్కుమార్ సాఫ్ట్వేర్ ఉద్యోగి. భార్య తేజస్విని సోషల్ వర్కర్గా పనిచేస్తున్నారు. వీరి ఐదేళ్ల కుమార్తె అవినా పొట్టపాటి బిల్లబాంగ్ ఇంటర్నేషనల్ స్కూల్లో యూకేజీ చదువుతోంది. సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనే తల్లిదండ్రులతో పాటుగా అవినా కూడ తరచూ వారితో కలిసి వెళ్లేది. ఈ క్రమంలో తన వయసున్న తోటి పిల్లలకు సరైన దుస్తులు లేకపోవడం, చెప్పులు లేకపోవడం గమనించింది. వారికి తనవంతుగా ఎమైనా సాయం చేయాలనే తలంపుతో వ్యర్థాలతో దుస్తులు తయారు చేయడం మొదలుపెట్టింది. మూడేళ్ల వయసు నుంచే ఇంట్లో ఫ్లాసిక్ బ్యాగులు, ఫ్లాస్టిక్ కవర్లు, పేపర్ బ్యాగులతో దుస్తులు, చెప్పులు వంటి వస్తువులను తయారు చేయడం ప్రారంభించింది. కుమార్తె ఆసక్తిని గమనించి.. చిన్నారి ఆసక్తిని గమనించిన తల్లిదండ్రులు అవినాను ప్రోత్సహించారు. ఆమె మేధస్సుకు పదును పెట్టి ఫ్లాస్టిక్ వ్యర్థాలతో పలు రకాల దుస్తులను తయారు చేసింది. తమ కూతురు ప్రతిభకు గుర్తింపు ఇవ్వాలనే కోరిక వ్యర్థాలతో తయారు చేసిన దుస్తులను ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్కి పంపించారు. పలుమార్లు చేసిన ప్రయత్నం ఫలించి ఎట్టకేలకు ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ నుంచి ఆహా్వనం పొందారు. చిన్నారి అవినా అందరి సమక్షంలో ఫ్లాస్టిక్, పేపర్ వ్యర్థాలతో 7 రకాల అందమైన దుస్తులను తయారు ఆశ్చర్యపరించింది. అవినా సృజనను ప్రశంసిస్తూ ఆమెకు ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం కల్పించారు. చాలా గర్వంగా ఉంది.. అతి చిన్న వయసులో మా కుమార్తె ఇలాంటి రికార్డు దక్కించుకోవడం సంతోషంగా ఉంది. మూడేళ్ల వయసు నుంచే వ్యర్థాలతో ఏదో ఒకటి తయారు చేస్తూ ఉండేది. ఆ ఆసక్తిని గమనించి ప్రోత్సహించాం. తన ప్రతిభను గుర్తించి ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్సులో స్థానం కల్పించారు. అవినా ప్రతిభ పర్యావరణ పరిరక్షణకు దోహదం చేయడం సంతోషం కలిగించింది. – పొట్టపాటి ప్రవీణ్కుమార్, తేజస్విని దంపతులు (తల్లిదండ్రులు) -
ఇకనైనా కళ్లు తెరవకపోతే....నిలువునా మింగేస్తుంది!
నిజం చెప్పాలంటే మనమిప్పుడు ప్లాస్టిక్ మహాసముద్రం మధ్యలో జీవిస్తున్నాం. ఇది అతిశయోక్తిగా అనిపించవచ్చుగానీ... మన రోజువారీ కార్యకలాపాల్లో చూసుకుంటే పొద్దున్నే బ్రష్, స్నానంలో మగ్, రుద్దుకునే సబ్బు తాలూకు సోప్కేస్ అన్నీ ప్లాస్టిక్వే. ఇక ఆఫీసుకు వచ్చాక తాగే మొదటిచాయ్ నుంచి బయటకువెళ్లినప్పుడు చాయ్ అమ్మే వ్యక్తి ఇచ్చే టీ వరకు చాలావరకు ప్లాస్టిక్కే. గతంలోని స్టీల్ క్యారియర్ స్థానంలో ఇప్పుడు చాలా లంచ్బాక్సులు ప్లాస్టిక్వే. ఇలా చూసుకుంటే మనం వాడే నిత్యజీవిత ఉపకరణాల్లో ప్రతి ఐదింటిలో కనీసం మూడైనా ప్లాస్టిక్వే ఉంటాయి. కానీ ఈ ప్లాస్టిక్ సముద్రమిప్పుడు సునామీగా మారి మన ఆరోగ్యాలను దెబ్బతీస్తోంది. అది ఏయే విధంగా మన ఆరోగ్యాలను కబళిస్తోందీ, ప్లాస్టిక్ను పూర్తిగా నిర్మూలించలేక పోయినా కనీసం దాన్ని రీ–సైకిల్ చేసేందుకు వీలుగా ఉండే వాటిని వాడాలనే అవగాహన కోసమే ఈ కథనం. మన ఇళ్లలో చెత్త ఊడ్చాక దాన్ని ఎత్తడానికీ ప్లాస్టిక్ చేటనే వాడతాం. అయితే ఇలాంటి ఉపకరణాలతో అప్పటికప్పుడు ఆరోగ్యానికి వచ్చే ప్రమాదమేమీ పెద్దగా లేకపోయినప్పటికీ... వేడి వేడి ఆహారాన్నినిల్వ చేయడానికి ఉపయోగించేప్లాస్టిక్ ఉపకరణాలతో మాత్రం ఆరోగ్యాలకు ఎంతో నష్టం చేకూరుతుంది. ఆ ప్లాస్టిక్ల కారణంగా ఆరోగ్యానికి జరిగే చేటు ఏమిటో, దాన్ని నివారించడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం.ప్లాస్టిక్ ప్రభావం ముఖ్యంగా హార్మోన్లపై... అందునా మరీ ముఖ్యంగా మహిళల్లోని ఈస్ట్రోజెన్స్రావంపై ఉంటుందనీ, దీనివల్ల ప్రత్యుత్పత్తికి తోడ్పడే హార్మోన్ల సమతౌల్యంతో తేడాలు వచ్చి గర్భధారణ సమస్యలు రావచ్చని అధ్యయనాల్లో తేలింది. పురుషుల్లో వీర్యకణాల సంఖ్య, కదలికలు తగ్గడం, పురుష సంబంధ హార్మోన్ల స్రావం తగ్గడం జరుగుతాయి. అందువల్ల వీలైనంత మేరకు ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించుకోవడం మంచిది.ప్లాస్టిక్తో ఆరోగ్యానికి హాని ఎందుకు..? ఇందుకు ఓ ఉదాహరణగా... ఆహారం పెట్టుకోడానికి గతంలో వాడే స్టీలుకు బదులు ప్లాస్టిక్ ఉపకరణాలను వాడుతున్నప్పుడు మన ఆరోగ్యానికి కలిగే హాని ఏమిటో తెలుసుకుందాం. ఆహారం ప్లాస్టిక్ బాక్స్లలో నిల్వ ఉంచి తీసుకుంటున్నప్పుడు మనం దాన్ని తిన్నప్పుడల్లా బాక్స్ తాలూకు ΄్లాస్టిక్ పదార్థాలూ కొద్దికొద్ది మోతాదుల్లో ఆహారంతోపాటు మన దేహంలోకి వెళ్తుంటాయి. ఆహారంతో పాటు ప్లాస్టిక్ మన శరీరంలోకి వెళ్లి, మన దేహంలోకి ఇంకిపోయే ప్రక్రియను ‘లీచింగ్’ అంటారు. చదవండి: పారిస్ ఫ్యాషన్ వీక్ : ఐశ్వర్యా డాజ్లింగ్ లుక్ వెనుకున్న సీక్రెట్ ఇదే!ఈ ప్రక్రియ ఎక్కువగా ఉండేదెప్పుడు..? లీచింగ్ ఎక్కువగా జరిగేందుకు ఆస్కారం ఉన్న పరిస్థితులివే... ఆహారం ఎంత వేడిగా ఉంటే... అంతగా ప్లాస్టిక్ మన కడుపులోకి ప్రవేశిస్తుంది. ∙అదే ఆహారంలో కొవ్వులు, ఉప్పు ఉన్నప్పుడు లీచింగ్ మరింత పెరుగుతుంది. మనం తీసుకునే ఆహారంలో అసిడిక్ వస్తువులు అంటే చింతపండు, సాంబార్ వంటి పులుపు వస్తువులు ఉంటే... మన ప్లాస్టిక్ కంటెయినర్ నుంచి మన దేహంలోకి ప్లాస్టిక్ ఎక్కువ మోతాదుల్లో కలుస్తుంటుంది.ప్లాస్టిక్ బౌల్లో ఆహారాలు ఎందుకు పెట్టకూడదంటే...?! ఈ మధ్యకాలంలో మనం అందంగా కనిపించే ప్లాస్టిక్ బౌల్స్లో కూరలూ, వేడి వేడి పులుసు వంటి ఆహారాలను ఉంచి, వాటిని డైనింగ్ టేబుల్ మీద అలంకరించి వాటిల్లోంచే అన్నం, కూరలు వడ్డించడాన్ని చూస్తున్నాం.సాధారణంగా ఈ కూరలు పెట్టుకునే బౌల్స్ను ‘మెలమెన్’ అనే ప్లాస్టిక్ వంటి పదార్థంతో తమారు చేస్తారు. వేడి వేడి కూరలు, పులుసులు ఇందులోకి తీయగానే ఆ వేడికి ఆ ప్లాస్టిక్లోని మెలమైన్... ఆహారంతో పాటు కలిసి నోటి ద్వారా శరీరంలోకి వెళ్తుంది. ఇలా దేహంలోకి వెళ్లిన ఈ పదార్థం వల్ల కిడ్నీలో రాళ్లు వచ్చే అవకాశం ఉందని ఒక అధ్యయనంలో తేలింది. ఈ విషయం ‘జామా ఇంటర్నల్ మెడిసిన్’ జర్నల్లోనూ ప్రచురిత మైంది. ఈ అధ్యయనంలో భాగంగా కొంతమందికి మెలమైన్ బౌల్స్లో నూడుల్స్ ఇచ్చారు. మరికొందరికి పింగాణీ బౌల్స్లో ఇచ్చారు. ఈ రెండు గ్రూపుల వారికి నిర్వహించిన మూత్ర పరీక్షల్లో మెలమైన్ బౌల్స్లో తిన్నవారి మూత్రంలో మెలమైన్ మోతాదులు దాదాపు ఎనిమిది రెట్లు ఉన్నాయని తేలింది. దీంతో వారిలో కిడ్నీ ఫెయిల్యూర్ వంటి ముప్పుతో పాటు... క్యాన్సర్ ప్రమాదమూ ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదికలు చెబుతున్నాయి. మెలమైన్ బౌల్లో పెట్టి ఏ ఆహారాన్నీ మైక్రోవేవ్ ఒవెన్లోఉంచి వేడిచేయకూడదని అమెరికన్ సంస్థ ఎఫ్డీఏ కూడా గట్టిగా సిఫార్సు చేస్తోంది. ఈ ప్లాస్టిక్ ప్రభావం ముఖ్యంగా హార్మోన్లపై... మరీ ముఖ్యంగా మహిళల్లోని ఈస్ట్రోజెన్ స్రావంపై ఉంటుందనీ, దీనివల్ల ప్రత్యుత్పత్తికి తోడ్పడే హార్మోన్ల సమతౌల్యంలో తేడాలు వచ్చి గర్భధారణ సమస్యలు రావచ్చని తేలింది. పురుషుల్లో వీర్యకణాల సంఖ్య, కదలికలు తగ్గడం, పురుష సంబంధ హార్మోన్ల స్రావం తగ్గడం వంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి. చాలామందిలో డయాబెటిస్ రిస్క్ పెరుగుతున్నట్లుగా ఇలాంటిదే మరో అధ్యయనంలోనూ తేలింది.స్థూలకాయం వస్తున్న వారి సంఖ్య బాగా పెరుగుతోంది. రొమ్ము క్యాన్సర్ వంటి క్యాన్సర్ రిస్క్లు చాలా ఎక్కువ. ప్లాస్టిక్ బౌల్స్లో వేడి వేడి ఆహారం పెట్టుకుని తీసుకునేవారిలో మెదడు కణాలు బలహీనమై జ్ఞాపకశక్తి తగ్గుతున్నట్లు, మూడ్స్ మారి΄ోవడం వంటి సమస్యలు వస్తున్నట్లు గుర్తించారు. అలై్జమర్స్ వంటివి కూడా ఎక్కువగా పెరుగుతున్నట్లు పలు అధ్యయనాలు తెలుపుతున్నాయి. ప్లాస్టిక్ ఉపయోగం కారణంగా ఇలా పలు రకాలుగా ఆరోగ్యంపై అనేక దుష్ప్రభావాలు పడుతున్నాయి. అందుకే కూరలు, పులుసులు నిల్వ చేసుకునేందుకు ప్లాస్టిక్ బౌల్స్లో కాకుండా పింగాణీ బౌల్స్ వాడటం మేలని నిపుణులు చెబుతున్నారు.మరో సరికొత్త అధ్యయన ఫలితమిలా... పిల్లలు పాలు తాగడానికి ఉపయోగించే పాలపీకలు మొదలుకొని, వాళ్లు ఆడుకునే ఆటవస్తువుల వరకు ప్లాస్టిక్తో తయారైనవి కాస్తా... చాలాకాలం తర్వాత... అంటే ఆ చిన్నారులే పెరిగి కాస్త పెద్దయ్యాక (అంటే పెద్దపిల్లలుగా ఉన్నప్పుడూ, వాళ్ల కౌమార ప్రాయంలో/అడాలసెంట్ వయసులో) వాళ్ల ఆరోగ్యంపై దుష్ప్రభావాలు చూపుతాయంటూ వేలాది తల్లులూ, పిల్లలపై నిర్వహించిన ఓ అధ్యయనం తెలుపుతోంది. అలా ఆ ప్లాస్టిక్ వస్తువులు వాడిన ఆ పిల్లల పాటు తల్లుల్లో సైతం మొదట స్థూలకాయం... దాని ప్రభావంతో గుండె జబ్బులు, ఆస్తమా, సంతానలేమి వంటి దుష్ప్రభావాలు కనిపిస్తాయంటూ ఆ అధ్యయనం పేర్కొంటోంది. ఈ ఫలితాలు ప్రముఖ హెల్త్ జర్నల్ ‘ల్యాన్సెట్’లో ప్రచురితమయ్యాయి.ప్లాస్టిక్ బాటిలో ఉంచిన నీళ్లు తాగచ్చా..?మరో పరిశోధన తాలూకు ఫలితాలివి. ఇటీవల చాలామంది నీళ్లబాటిల్ కొని దాన్ని వాడుతూ ఉంటారు. ఇలా ఓ బాటిల్లో వారం పాటు ఉంచిన నీళ్లు తాగవచ్చా అనే అంశంపై ఇటీవల కొందరు పరిశోధకులు ఓ అధ్యయనం నిర్వహించారు. ఈ అధ్యయనంలో తేలిన అంశమేమిటంటే... ఇలా నీళ్లు నిల్వ ఉంచినప్పుడు ప్లాస్టిక్ కొద్దికొద్ది మోతాదుల్లో కలవడం (లీచ్ కావడం) వల్ల ఆరోగ్యానికి హాని జరుగుతుందనీ, అలాగే వారం పాటు ఉంచి నీళ్లలో బ్యాక్టీరియా పెరగడంతో కడుపులో ఇబ్బందిగా ఉండటం, కడుపు నొప్పి, డయేరియా వంటి సమస్యలు రావడమేగాక...కాస్త అరుదుగా అలాంటి కొందరిలో అది ప్రాణాపాయానికీ దారి తీయవచ్చంటూ పరిశోధకులు పేర్కొంటున్నారు. ఇలా బ్యాక్టీరియా పెరగడమన్నది కేవలం నీళ్లలో జరిగినా, జరగకపోయినా... బాటిల్ తాలూకు మూతలో సైతం బ్యాక్టీరియా/మౌల్డ్ (నాచు వంటి పెరుగుదల) పెరగవచ్చంటూ వారు హెచ్చరిస్తున్నారు. అసలు ప్లాస్టిక్ అంటే ఏమిటంటే...? ప్లాస్టిక్ వస్తువులు, ఉపకరణాలు ప్రధానంగా బైస్ఫినాల్ ఏ (బీపీఏ) అనే పదార్థంతో తయారవుతాయి. ∙కొన్ని సందర్భాల్లో థాలేట్ అనే పదార్థంలోనూ ప్లాస్టిక్ ఉపకరణాలను తయారుచేస్తారు. మనం ఆహారం, తిను బండారాలూ, ఇతరత్రా ద్రవపదార్థాలను నిల్వ ఉంచేందుకు మనం రోజువారీ ఉపయోగించే ప్లాస్టిక్తో తయారైన ఉపకరణాలన్నీ (యుటెన్సిల్స్) ప్రధానంగా బైస్ఫినాల్ ఏ (బీపీఏ) లేదా థాలేట్తోనే తయారవుతాయి.చదవండి: ఈ టిప్స్ పాటిస్తే పండగ వేళ మెరిసిపోవడం ఖాయం!బీపీఏలతో ఆరోగ్యంపై దుష్ప్రభావాలు... ప్లాస్టిక్ బాక్స్లలో ఉంచే ఆహారం వల్ల మన ఆరోగ్యంపై చాలా రకాల దుష్ప్రభావాలు పడతాయి. వాటిలో కొన్ని... ప్లాస్టిక్ కలిసిన ఆహారంతో హార్మోన్లపై... మరీ ముఖ్యంగా మహిళల్లోని ఈస్ట్రోజెన్ హార్మోన్పై ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఫలితంగా మహిళల్లో ప్రత్యుత్పత్తికి తోడ్పడే హార్మోన్ల సమతౌల్యంలో తేడాలు వచ్చిగర్భధారణ సమస్యలు వచ్చే అవకాశాలెక్కువ. పురుషుల్లో వీర్యకణాల సంఖ్య, కదలికలు తగ్గడం, పురుష సంబంధ హార్మోన్ల స్రావం తగ్గడం.వైద్యపరీక్షల్లో మూత్రంలో ప్లాస్టిక్ పాళ్లు పెరిగినట్లుగా రిపోర్టులు వచ్చిన చాలామందిలో డయాబెటిస్ కేసులు పెరుగుతున్నట్లుగా ఒక అధ్యయనంలో తేలింది. ప్లాస్టిక్ యుటెన్సిల్స్లో ఆహారం తీసుకునేవారిలో స్థూలకాయం వస్తున్న వారి సంఖ్య బాగా పెరుగుతోంది. రొమ్ము క్యాన్సర్ వంటి క్యాన్సర్ ముప్పు చాలా ఎక్కువ. ప్లాస్టిక్ కంటెయినర్లలో వేడి వేడి ఆహారం పెట్టుకుని తీసుకునేవారిలో మెదడు కణాలు బలహీనమై జ్ఞాపకశక్తి తగ్గుతున్నట్లు, మూడ్స్ మారిపోవడం వంటి సమస్యలు వస్తున్నట్లు గుర్తించారు. అల్జైమర్స్ వ్యాధి వంటివి కూడా ఎక్కువగా పెరుగుతోంది.బీపీఏలతో తయారయ్యే ఉపకరణాలివి... పిల్లలకు ఉపయోగించే పాలపీకలు,వాటర్బాటిళ్లు, ∙లంచ్బాక్స్లు,సీడీలు, డీవీడీలు,కొన్ని ఎలక్ట్రానిక్ పరికరాలు.ప్లాస్టిక్తో అనర్థాల నివారణకు కొన్ని సూచనల గురించి తెలుసుకోవాలంటే చదవండి బరువు తగ్గడం కష్టంగా ఉందా? షాకింగ్ రీజన్ ఇదే కావచ్చు!డాక్టర్ శివరాజు సీనియర్ ఫిజీషియన్ నిర్వహణ: యాసీన్ -
భోజనం తిన్న వెంటనే 30 నిమిషాలు చాలు.. ఎన్ని ప్రయోజనాలో తెలుసా!
యుక్త వయసులోనే ఉన్నట్టుండి గుండెనొప్పితో కుప్పకూలి చనిపోతున్న ఘటనలు అనేకం చేస్తున్నాయి. ఆరోగ్యంగా, ఫిట్గా ఉన్నవారు కూడా ‘గుండె’ లయ తప్పుతున్న కారణంగా ఉన్న పళంగా ప్రాణాలు విడిస్తున్నారు. అయితే తిన్న వెంటనే వాకింగ్ చేస్తే గుండెపోటువచ్చే అవకాశాలు 40 శాతం వరకూ తగ్గుతాయని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. ప్రపంచ గుండె దినోత్సవం సందర్భంగా ఇవాల్టి టిప్ ఆఫ్ ది డేలో భాగంగా అన్నం తిన్న వెంటనే నడకతో వచ్చే లాభాల గురించి తెలుసుకుందాం.25నుంచి 30 ఏళ్ల యువత కూడా గుండెపోటుకు గురవుతున్నారు. ఫాస్ట్ ఫుడ్, కనీస వ్యాయామం లేకపోవడం, అనారోగ్యకర జీవనశైలి, తగినంత నిద్ర లేకపోవడం, ఊబకాయం, ఒత్తిడి వంటి అనేక కారణాలు గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. కానీ ఈ చిన్న అలవాటు గుండెపోటు ప్రమాదాన్ని గణనీయంగా తగ్గిస్తుంది.నిజానికి భోజనం చేసిన వెంటనే నడవడం వల్ల అలసట, కడుపు నొప్పి , ఇతర రకాల అసౌకర్యాలు కలుగుతాయని ఒక అపోహ ఉంది. కానీ భోజనం చేసిన తర్వాత నడవడం బరువు తగ్గడానికి తిన్న తర్వాత ఒక గంట తర్వాత నడన కంటే, వెంటనే చేసే వాకింగ్ ఎక్కువ ప్రభావ వంతంగా ఉంటుందని అధ్యయనంలో కనుగొన్నారు. భోజనం చేసిన తర్వాత ఒక గంట తర్వాత ప్రారంభించి 30 నిమిషాలు నడవడం కంటే భోజనం తర్వాత కనీసం 30 నిమిషాలు నడక అలవాటు చేసుకుంటే,కండరాలు గ్లూకోజ్ను వెంటనే ఉపయోగించు కోవడంతో రక్తంలో చక్కెర స్థాయిలు పెరగవు. దీంతో ఇన్సులిన్ ఉత్పత్తి కూడా నియంత్రణలో ఉంటుంది. అందుకే భోజనం తర్వాత వీలైనంతత్వరగా నడకను అలవాటు చేసుకోవాలి.జిమ్కి వెళ్లడం, కఠినమైన వ్యాయామాలు చేయడం సాధ్యంకాని వారికి ఇది నిజంగా వరం లాంటిదని చెప్పవచ్చు. ప్రతిరోజూ భోజనం తర్వాత ముఖ్యంగా రాత్రి భోజనం తర్వాత వీలైనంత త్వరగా 30 నిమిషాలు వేగంగా నడవడం వల్ల ఎక్కువ బరువు తగ్గే అవకాశాలున్నాయి. లేదంటే ప్రతి ఆహారం గ్లూకోజ్గా మారి రక్తంలోకి వెళ్తుంది. ఆ సమయంలో చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పెరగడం వల్ల రక్తనాళాల్లో వాపు, ఒత్తిడి వస్తుంది. ఇది దీర్ఘకాలంలో రక్తనాళాల లైనింగ్ను దెబ్బతీసి గుండె జబ్బులకు దారి తీస్తుంది.భోజనం చేసిన వెంటనే కూర్చుండిపోవడం, మొబైల్ చూస్తూ అలా ఉండిపోవడం, లేదంటే వెంటనే మంచంమీద వాలిపోవడం లాంటివిఆరోగ్యానికి చాలా చేటు చేస్తాయి. అలా కాకుండా కేవలం 30 నిమిషాల పాటు నడక ఎన్నో రకాల అనారోగ్యాలనుంచి తప్పించుకోవచ్చు. రక్త ప్రసరణ సజావుగా సాగుతుంది. శరీరంలో కొవ్వు పేరుకుపోకుండా, ఆహారం శక్తిగా మారుతుంది. కండరాలు బలపడటతాయి. బరువు కూడా అదుపులో ఉంటుంది. -
మూడేళ్లు, మూడు అలవాట్లు : 30 కిలోలు తగ్గిన డాక్టర్ భావన
బరువు తగ్గడం పెద్ద టాస్క్. షార్ట్కట్లో, చిటికె వేసినట్టు బరువు తగ్గడం సాధ్యం కాదు. ఒక వేళ తగ్గినా అది ఆరోగ్యకరం కాదు కూడా. ఇదే విషయాన్ని బెంగళూరుకు మహిళా డాక్టర్ నిరూపించారు. నో మ్యాజిక్, నో టిప్స్.. నో ట్రెండింగ్ ఫ్యాషన్ అంటూ ఇద్దరు కుమార్తెల తల్లి భావన బరువు తగ్గిన తీరు విశేషంగా నిలుస్తోంది. బెంగళూరు డాక్టర్ భావన ఆనంద్ నెమ్మదిగా, స్థిరమైన . ఆచరణాత్మక విధానాన్ని స్వీకరించారు. ప్రతి భోజనంలో ఒక ముఖ్యమైన పోషకాన్ని తినడం ద్వారా మూడు సంవత్సరాలలో 30 కిలోల బరువు తగ్గారు.మూడేళ్లలో 30 కిలోలు ఎలా?2022 డిసెంబరులో భావన బరువు దాదాపు 84 కిలోలు ఉండేవారు. తాను అనుసరించిన పద్ధతి ద్వారా క్రమంగా 2025 నాటికి 56.6 కిలోలకు చేరుకున్నారు. ప్రతిరోజూ తనను తాను చెక్ చేసుకోవడం, సరిగ్గా తినడం ,క్రమం తప్పని వ్యాయామం ఈ మూడు అలవాట్లు తన జీవితాన్ని మార్చాయి అంటే తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. భావన బరువు తగ్గడాన్ని జీవనశైలి మార్పుగా భావించింది.సుదీర్ఘ ప్రణాళికతో క్రాష్ డైట్స్ లేదా డిటాక్స్ లాంటివేవీలేకుండా ప్రతీరోజు చిన్నగా నడవండిఅంటారామె. బరువు తగ్గడం అనేది దానిని తగ్గించడం కంటే చాలా సవాలుతో కూడుకున్నదే.కానీ దృష్టి దీర్ఘకాలిక ఆరోగ్యకరమైన అలవాట్ల ద్వారా ఇది సాధ్యమే అనేది భావన సక్సెస్మంత్ర. View this post on Instagram A post shared by Dr Bhawana Anand (@dr.fitmum) గేమ్-ఛేంజర్: భావన ప్రకారం, ప్రతి భోజనంలో ప్రోటీన్ జోడించడమే పెద్ద మార్పు.ఈ ఒక్క అడుగు ఆమె ఫిట్నెస్ ప్రయాణానికి వెన్నెముకగా మారింది. "కండరాల బలానికి, పెరుగుదలకు భోజనాన్ని సమతుల్యంగా ఉంచడానికి చాలా కీలకం అని ఆమె పేర్కొంది. ప్రోటీన్ ఆమెకు ఎక్కువసేపు కడుపు నిండిన అనుభూతిని కలిగించింది, భోజనం మధ్య చిరుతిండి లేదా అతిగా తినాలనే కోరికను తగ్గించింది.ప్రోటీన్ ఎందుకు?బరువు తగ్గడానికి లేదా ఫిట్గా ఉండటానికి ప్రయత్నించే ఎవరికైనా ప్రోటీన్ అవసరమని పోషకాహార నిపుణులు అంగీకరిస్తున్నారు.కార్బోహైడ్రేట్లు, కొవ్వులతో పాటు శరీరంలోని మూడు ప్రధాన మాక్రో న్యూట్రియెంట్లలో ఒకటిది. ఆకలిని నియంత్రించడంలో సహాయపడుతుంది. కేలరీల ఇన్టేక్ను తగ్గిస్తుంది.ఎంత ప్రోటీన్ తినాలి? ప్రపంచ ఆహార మార్గదర్శకాల ప్రకారం, వయోజన మహిళలు రోజుకు కనీసం 46 గ్రాముల ప్రోటీన్ తీసుకోవాలి, పురుషులు కనీసం 56 గ్రాములు తీసుకోవాలి. అలాగే క్రమం తప్పకుండా వ్యాయామం చేసే వ్యక్తులు వారి ఫిట్నెస్ లక్ష్యాలను బట్టి అధిక మొత్తంలో ప్రయోజనం పొందవచ్చు.ఆరోగ్యకరమైన ప్రోటీన్ మూలాలుగుడ్లు, చికెన్, చేపలు , లీన్ మాంసాలు, కాయధాన్యాలు , చిక్కుళ్ళుగ్రీకు యోగర్ట్ పనీర్, గింజలు , విత్తనాలుప్రోటీన్ షేక్స్ లేదా సప్లిమెంట్లు (అవసరమైనప్పుడు)తన వెయిట్లాస్ జర్నీ, తన ఫిట్నెస్ రొటీన్, పలు రకాల కసరత్తుల వీడియోలు, తన ప్రొటీన్ ఆహారం డా. ఫిట్మమ్ ఇన్స్టాలో పోస్ట్ చేస్తూ, అభిమానులను ప్రేరేపించడం భావనకు అలవాటు. -
చూసుకో పదిలంగా.. ‘హృదయాన్ని అద్దంలా..!
యుక్త వయసులోనే ‘గుండె’ లయ తప్పుతోంది. ‘గుండె నొప్పి’ కారణంగా ఉన్న ఫలంగా కుప్ప కూలిపోతున్నారు.. ప్రాణాలు విడిస్తున్నారు. ముందస్తు జాగ్రత్తలతో గుండెను పదిలంగా చూసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. నేడు ప్రపంచ గుండె దినోత్సవం సందర్భంగా.. ప్రత్యేక కథనం.మానవ శరీరంలో అన్ని శరీర భాగాలు కీలకమే. ప్రధాన భాగమైన గుండె పోషించే పాత్ర ఎంతో ప్రత్యేకమెంది. ఏదైనా సంఘటనను తట్టుకొని నిలబడినప్పుడు వాడికి ‘గుండె నిబ్బరం’ ఎక్కువరా..! అంటారు. అంటే గుండె సంపూర్ణ ఆరోగ్యకంగా ఉందనడానికి నిదర్శనం. అది ఎప్పుడో 30ఏళ్ల మాట. ఇప్పుడు గుండె జబ్బులు సాధారణ వ్యాధుల్లా మారాయి. ఎప్పుడు ఏ గుండె ఆగిపోతుందో తెలియని విధంగా ఆరోగ్య పరిస్థితులు మారాయి. గుండె జబ్బులతో బాధపడుతున్న వారి సంఖ్య ప్రతియేటా గణనీయంగా పెరగడమే ఇందుకు కారణం. ఉచిత వైద్యసేవ ద్వారా యేటా వేలాది మంది బైపాస్సర్జరీలు చేయించుకున్నారు. స్టంట్లు వేయించుకుని, ఎన్సీడీ కార్యక్రమాల ద్వారా గుండె జబ్బుగల వారికి వైద్య సేవలంన్నారు. ఆరోగ్యశ్రీకి రెఫర్ చేశారు. ఇలా పలు పథకాలు, నివేదికల ద్వారా గుండె వ్యాధుల తీవ్రతను తెలియపరుస్తోంది. జాగ్రత్తలతో హృదయాన్ని కాపాడుకుంటే పదికాలాలపాటు జీవించవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.జీవనశైలి మార్పులతోనే35 ఏళ్లకు ముందు ఏదైనా ఆహారం తినాలంటే నువ్వుల ఉండలు, వేరుశనగ ఉండలు, బఠానీలు, సంప్రదాయ పదార్థాలు లభించేవి. హోటళ్లలో కల్తీలేని ఆహార పదార్థాలు లభించేవి. నేడు ఆహారం విచ్చలవిడిగా లభిస్తూ మనిషి ప్రాణాల మీదకు తెస్తోంది. నూడుల్స్, బర్గర్లు, పిజ్జాల వంటి కార్పొరేట్ ఆహార పదార్థాల కారణంగా అనారోగ్యకరమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. చిన్న వయస్సులోనే ఊబకాయం వస్తోంది. అందులో కీలకమైనది గుండె. ఈ భాగంలో మార్పులు సంభవించడం, రక్తనాళాలు గడ్డకట్టుకుపోవడంతో గుండె వ్యాధులు, హార్ట్ స్టోక్లు వస్తున్నాయి. (యంగ్ ఇండియా! ఒక్క బీట్ మిస్ అయినా.. బీ(ట్) కేర్ఫుల్)గుండె నొప్పి లక్షణాలుశ్వాస తీసుకోవడంలో ఇబ్బందులుఛాతీలో మంట.. కొద్దిగా నడిచినా అయాసంజీర్ణాశయం పైభాగాన నొప్పిఎడమచేయి, రెండు చేతుల్లో నొప్పితీసుకోవాల్సిన జాగ్రత్తలుమద్యపానం, ధూమపానానికి దూరంగా ఉండాలి.సాధ్యమైనంత వరకు ఆహారంలో పీచు పదార్థాలు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. బీపీ, షుగర్లను నియంత్రణలో ఉంచుకోవాలి.45 నిమిషాల పాటు వ్యాయామం చేయాలి.మంచి పౌష్ఠికాహారాన్ని తీసుకోవాలి. కొవ్వు, నూనె, మసాల పదార్థాలకు దూరంగా ఉండాలి.ఒత్తిడిని జయించడానికి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉండాలి.చదవండి: Karur stampede tragedy మొన్ననే ఎంగేజ్మెంట్..త్వరలో పెళ్లిగుండె వ్యాధులపై అవగాహన పెంచుకోవాలిప్రజలు గుండె వ్యాధులపై అవగాహన పెంచుకోవాలి. మంచి జీవనశైలి అలవాటు చేసుకోవాలి. ఏవైనా అనారోగ్య సమస్యలు వచ్చినపుడు తక్షణమే వైద్యులను సంప్రదించాలి. ఒత్తిడికి లోను కాకుండా ప్రశాంతంగా ఉండాలి. దీర్గకాలిక వ్యాధులైన షుగర్, బీపీలను నియంత్రణలో ఉంచుకోవాలి. ప్రస్తుతం గుండె వైద్యానికి సంబంధించి అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయి. – డాక్టర్ ఎన్.శ్రావణ్కుమార్రెడ్డి, కార్డియాలజీ వ్యాధి నిపుణులు, కడప -
ప్రతీ హృదయ స్పందనను కాపాడుకుందాం!
ప్రపంచ హృదయ దినోత్సవం (world heart day 2025) సందర్భంగా ఆలివ్ హాస్పటల్ ప్రజలకు ప్రత్యేక పిలుపునిచ్చింది. WHO ప్రపంచ హృదయ నివేదిక 2023 ప్రకారం 2021లో గుండె సంబంధిత వ్యాధులతో ప్రపంచ వ్యాప్తంగా 20.5 మిలియన్ల మంది మరణాలకు కారణమైందనీ, ఇది మొ త్తంమరణాలలో మూడో వంతుగా ఉందని వెల్లడించింది.ప్రతి హృదయ స్పందనను కాపాడుకోండి. వరల్డ్ హార్ట్ రిపోర్ట్ 2023 ప్రకారం, హృదయ సంబంధ వ్యాధులు (CVDలు) 2021లో ప్రపంచవ్యాప్తంగా 20.5 మిలియన్ల మరణాలకు కారణమయ్యాయని అంచనా వేయబడింది, ఇది ప్రపంచవ్యాప్తంగా జరిగే మరణాలలో దాదాపు మూడింట ఒక వంతు. గుండె వ్యాధులు, గుండె పోటు ప్రధాన కారణాలుగా ఉన్నాయని పేర్కొంది .“హృదయాన్ని ఉపయోగించు, హృదయాన్ని తెలుసుకో” అనే బ్యానర్ కింద, ఆలివ్ హాస్పిటల్ వ్యక్తులు, సంఘాలు, ప్రభుత్వ వాటాదారులను నిర్ణయాత్మకంగా వ్యవహరించాలని కోరుతోంది. గుండె సంబంధిత వ్యాధులపై పోరాటం, పరిస్థితి ముదరకముందే ప్రారంభం కావాలని పిలుపునిచ్చింది.కేవలం గణాంకాలు మాత్ర మే కాదనీ జాగ్రత్త పరిచే హెచ్చరికలనీ ఆలివ్ హాస్పిటల్ కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ జహీదుల్లా ఖాన్ తెలిపారు . ఈ వ్యాధి ఎక్కడో ఉండని, మన జీవనశైలి, ఆహార అలవాట్లు, ఒత్తిడి, సంరక్షణకు అందుబాటులో లేకపోవడం రూపంలోనే ఉంటాయన్నారు. ఈ ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా “Use Heart, Know Heart”అనే నినాదంతో, ఆసుపత్రులు, పౌర సమాజం, ప్రభుత్వ భాగస్వామ్యంతో తక్షణ చర్యలు తీ సుకోవాలని కోరింది . "ఈ డేటా కేవలం సంఖ్యలు మాత్రమే కాదు - ఇది ఒక మేల్కొలుపు పిలుపు. ప్రతి జీవిత దశలో నివారణ మరియు ముందస్తు గుర్తింపును సమగ్రపరచడానికి ఇది మనల్ని ప్రోత్సహించాలి." అని తెలిపింది.ఆలివ్ హాస్పిటల్ గుండె సంబంధిత ఆరోగ్య సంరక్షణకు తగిన కార్యక్రమాలను చేపట్టనుందని ఉచిత స్క్రీనింగ్ శిబిరాలు , అవగాహన కార్యక్రమాలు, మొబౖల్ యూనిట్లు, స్థానిక క్లినిక్లతో భాగస్వామ్యం లాంటి వంటి కార్యకలాపాలను ప్రకటించింది . ప్రజారోగ్య సంస్థలు ప్రాథమిక హృదయ సంరక్షణ కార్యకలాపాలను విస్తరించాలని, అందరికీ సులభంగా, చవకగా స్క్రీనింగ్ అందుబాటులో ఉండేలా చూడాలని సూచించింది . గుండెవ్యాధుల భారాన్ని భారాన్ని తగ్గిండచంలో నియంత్రణ చర్యలు, ఆరోగ్యకరమెన జీవనశైలి ప్రారంభ దశలో గుర్తింపు కీలకమని ఆసుపత్రి యాజమాన్యం స్పష్టం చేసింది. జీవనశైలి-మార్పు మద్దతు (పోషకాహారం, వ్యాయామం, ధూమపాన విరమణ) కొనసాగింపును నిర్ధారించాలని ఆసుపత్రి ప్రజారోగ్య అధికారులను కోరుతోంది. -
మెడిటరేనియన్ డైట్ అంటే...మెదడు చురుగ్గా!
మెడిటరేనియన్ డైట్ అంటే...పుష్కలంగా పండ్లు, కూరగాయలు, బ్రెడ్, ఇతర ధాన్యాలు, బంగాళదుంపలు, బీన్స్, గింజలు, ఆలివ్ నూనెనే ఎక్కువగా వాడతారు. పాల ఉత్పత్తులు, గుడ్లు, చేపలు వంటివి మెడిటరేనియన్ డైట్ లో మితంగా తీసుకుంటారు. ఈ ఆహారంలో రెడ్ మీట్ కంటే చేపలు, పౌల్ట్రీ ఉత్పత్తులు ఎక్కువగా ఉంటాయి. మొక్కల ఆధారిత ఆహారాలనే ఎక్కువగా తింటారు. మెదడుకు చురుకైన ఆహారం రోజువారీ ఆహారంలో కూరగాయలు, లీన్ ప్రొటీన్లు, మంచి కొవ్వు, మరిన్ని... దశాబ్దాలుగా, మెడిటేరియన్ డైట్ తీసుకోవడం వల్ల మెదడు వృద్ధాప్యాన్ని వాయిదా వేయవచ్చని నిపుణులు చెబుతున్నారు. గ్రీన్ టీ: ఇది మీ న్యూరాన్లకు శక్తినిస్తుంది: గ్రీన్ టీలో కాటెచిన్లు పుష్కలంగా ఉన్నాయి, ఇవి వాపులను, ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడానికి కావలసిన శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు, ఇవి న్యూరోడీజనరేషన్కు కీలకంగా పనిచేస్తాయి.మెదడు పనితీరును పెంచే మొక్క మన్కై: దీనిని ‘డక్ వీడ్‘ అని కూడా పిలుస్తారు, మన్కై అనేది పాలీఫెనాల్స్, బీ12, మొక్కల ఆధారిత ప్రోటీన్లతో నిండిన ఒక చిన్న వాటర్ ప్లాంట్. ఇది మెదడు వృద్ధాప్యంతో ముడిపడి ఉన్న కీలక ప్రొటీన్లను నియంత్రించడంలో సహాయ పడుతుంది. చెడును తొలగిస్తుంది, మంచిని జోడిస్తుంది: గ్రీన్–మెడ్ ప్రణాళిక ఆరోగ్యకరమైన పదార్థాలపై మాత్రమే కాదు, ఇది రెడ్ మీట్, శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లను కూడా తగ్గిస్తుంది, రెండూ వృద్ధాప్యంతో ముడిపడి ఉన్నాయి. -
యంగ్ ఇండియా! ఒక్క బీట్ మిస్ అయినా.. బీ(ట్) కేర్ఫుల్
ప్రపంచవ్యాప్తంగా గుండెజబ్బులు పెరుగుతున్న తీరు ఆందోళన కలిగిస్తోంది. అందునా ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ తన విశృంఖల ప్రతాపం చూపాక గుండెజబ్బుల కేసులు మరింత ఎక్కువయ్యాయి. అందుకే ప్రతి ఏడాదీ సెప్టెంబరు 29న నిర్వహించే వరల్డ్ హార్ట్ డే తాలూకు థీమ్ ఏమిటంటే... ‘‘ఒక్క స్పందననూ మిస్ కావద్దు’’ (డోంట్ మిస్ ఏ బీట్). దీని అర్థం ఏమిటంటే... ఒక్క గుండె కూడా తన స్పందనలను కోల్పోయే పరిస్థితి రాకూడదనే. గతంలో కనీసం 50, 40లలో కనిపించే ఈ గుండెజబ్బులు ఇప్పుడు ఎందుకిలా యుక్త వయసు లోనే వచ్చేస్తున్నాయో చెప్పే కారణాలూ, వాటిని నివారిస్తూ మన యువతను గుండెజబ్బుల నుంచి రక్షించుకునేందుకు తగిన అవగాహనను కల్పించేందుకే ఈ కథనం.గుండెజబ్బుల తీవ్రతనూ, విస్తృతినీ తెలిపే కొన్ని గణాంకాలను చూద్దాం. ఢీల్లీ, ముంబై, హైదరాబాద్లలోని కొన్ని పెద్ద హాస్పిటల్స్ తాలూకు ఎమర్జెన్సీ కేసులను పరిశీలిస్తే సగానికిపైగా కేసులు... అంటే 50% కేసుల్లో బాధితులు కేవలం 40 ఏళ్లలోపు వాళ్లే. మానసిక ఒత్తిడి, ఎటూ కదలకుండా (శారీరక శ్రమ లేకుండా) ఉండే వృత్తులూ పెరగడంతో గుండె జబ్బులతో బాధపడే యువత కూడా పెరుగుతోంది. అందుకే ఇటీవల కార్డియాలజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా సంస్థ 45 ఏళ్ల లోపే అక్యూట్ కరోనరీ సిండ్రోమ్తో బాధపడేవారిపై పరిశోధనల కోసం ఓ అధ్యయన కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇటీవలి పరిశీలనల ప్రకారం ప్రతి ఐదు గుండె΄ోటు కేసులను పరిశీలిస్తే అందులో ఒకరు తప్పనిసరిగా 40 ఏళ్లలోపు వారే ఉంటున్నారు. గుండెజబ్బుల పరంగా ప్రపంచవ్యాప్తంగా 20 – 30 ఏళ్ల యువతలో ఏడాదికి 2% పెరుగుదల ఉండగా... మన దేశంలో సైతం గుండెజబ్బులకు లోనైన వాళ్లలో 40 ఏళ్ల లోపు వారు కనీసం 25% వరకు ఉండటం మరింతగా బెంబేలెత్తిస్తున్న అంశం. హైబీపీ, హైకొలెస్ట్రాల్ వంటివి యువతలో పెరుగుతుండటమే దీనికి కారణం. దాంతో క్రమంగా, నిశ్శబ్దంగా చాపకింద నీరులా గుండెజబ్బుల కేసులు భారత్లోనూ పెరుగుతున్నాయి.లక్షణాలు... సాధారణంగా చాలామందిలో ఛాతీనొప్పితో గుండె పోటు కనిపిస్తుంది. ఈ లక్షణం కనిపించే వారు 97.3 శాతం మంది, చెమటలు పట్టడం 11 శాతం మందిలో, వాంతులు లేదా వికారం 8.2 శాతం కేసుల్లో, శ్వాస ఆడకపోవడం 6.8 శాతం మందిలో కనిపిస్తాయి. ఈ వయసులో చాలా మందిలో వచ్చే గుండెపోటుకు కారణమైన నొప్పిని గ్యాస్, అజీర్ణం, అసిడిటీ కారణంగా భావిస్తుంటారు. ఈ అంశం కూడా చికిత్స ప్రారంభించడాన్ని ఆలస్యం చేస్తోంది.గుండె జబ్బుల పెరుగుదలకు కారణాలు...వయసు పెరుగుతుండటం: ఇది నివారించలేని అంశం. సాధారణంగా వయసు పెరుగుతున్న కొద్దీ మృదువుగా ఉండాల్సిన రక్తనాళాలు గట్టిబారుతుంటాయి. దీన్నే అధెరో స్కి›్లరోసిస్ అంటారు. గతంలో సాధారణంగా 40 ఏళ్లకు పైబడ్డాక ఈ పరిణామం సంభవిస్తుండేది. ఇప్పుడు ఈ వయసు కంటే ముందే.. అంటే 20 నుంచి 30 ఏళ్లలోపే ఇలా రక్తనాళాలు గట్టిబారడం కనిపిస్తోంది.కొందరిలో కొలెస్ట్రాల్ నిల్వలు చాలా నెమ్మదిగా రక్తనాళాల్లోకి చేరుతుంటాయి. కానీ కొందరిలో చాలా వేగంగా ఈ ప్రక్రియ జరుగుతుంది. ఇలా పేరుకునే కొవ్వును ‘ప్లాక్’గా వ్యవహరి స్తుంటారు. ఈ ప్లాక్ రక్తనాళాల్లోకి ఎక్కువగా చేరడం వల్ల ధమనులు/రక్తనాళాలు సన్నబడి, గుండె కండరాలకు రక్తప్రసరణ తగ్గిపోతుంది. ఈ ప్లాక్ ఎక్కువగా చీలిపోయి క్లాట్స్ (అడ్డంకులు) గా మారి ఆకస్మికంగా గుండెకు రక్తసరఫరా తగ్గవచ్చు. ఫలితంగా గుండెపోటు రావచ్చు.ఆహారపు అలవాట్లు: హైలీ ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకోవడం వంటి మారుతున్న ఆహారపు అలవాట్లు, ఉప్పు, చక్కెర ఎక్కువగా ఉండే ఆహారాలు చిన్న వయసులోనే గుండెజబ్బులు / గుండెపోటుకు దారితీసే ముప్పును పెంచుతున్నాయి. మన దేశంలో దిగువ, మధ్యతరగతి వర్గాలు ఎక్కువగా ఉండే దేశాల్లో పెరుగుతున్న పట్టణీకరణ / నగరీకరణ కారణంగా అన్ని పోషకాలు ఉండే మంచి ఆహారంతో పోలిస్తే అధిక క్యాలరీలు ఉండే ఆహారం చవగ్గా దొరుకుతుండటంతో గుండెజబ్బుల ముప్పు పెరుగుతోంది.తగినంత వ్యాయామం లేకపోవడం : కుదురుగా కూర్చుని చేసే వృత్తులు పెరగడం ప్రపంచవ్యాప్తంగా చోటు చేసుకుంటున్న అంశమే అయినప్పటికీ... మన దేశ యువతలో కూడా వ్యాయామం లేక΄ోవడమూ, పైగా మన దేశ సాంస్కృతిక, సామాజిక నేపథ్యం కారణంగా మహిళలు, అమ్మాయిల్లో వ్యాయామ సంస్కృతి తక్కువగా ఉండటం కూడా గుండెజబ్బులు / గుండెపోటు ముప్పునకు కారణమవుతోంది.పొగతాగడం : ఇటీవల భారత్, రష్యా, కొన్ని మధ్య ఆసియా దేశాల్లో పొగాకు వినియోగం బాగా పెరుగుతుండటం అథెరోస్కిర్లోసిస్కూ, గుండెపోటుకు మరో ప్రధాన కారణం. 60 ఏళ్ల వ్యక్తులతో పోలిస్తే 40 ఏళ్లలోపు వారికి పొగ దుష్ప్రభావం మరింత ఎక్కువ. అయితే ఏ వయసులోనైనా పొగతాగడం అంతే ప్రమాదకరం అని గుర్తించాలి. స్థూలకాయం కారణంగా : మన దేశవాసుల్లో ఊబకాయం ఎక్కువగా పొట్ట దగ్గర వస్తుంది. దీన్నే అబ్డామినల్ ఒబేసిటీ అంటారు. మన జీవనశైలి (లైఫ్ స్టైల్) కారణంగా ఇలా స్థూలకాయం రావడం, పొట్ట దగ్గర కొవ్వు పెరగడం కూడా గుండెజబ్బుల ముప్పును మరింత పెరిగేలా చేస్తోంది. హైబీపీ, డయాబెటిస్ : లైఫ్స్టైల్ జబ్బులైన హైబీపీ, డయాబెటిస్ వంటి అనారోగ్యాల విషయంలో అవగాహన అంతగా లేని మనలాంటి దేశాలలో నియంత్రణలో లేని హైబీపీ, మధుమేహం వంటివి గుండెపోటుకు కారణమవు తున్నాయి.జెండర్ అంశం : ఒక వయసు వరకు మహిళలతో పోలిస్తే గుండెప్లాక్టు వచ్చే అవకాశాలు పురుషుల్లో ఎక్కువ. రుతుస్రావం ఆగి΄ోయే వరకు మహిళల్లోని ఈస్ట్రోజెన్ వారికి ఒక రక్షణ కవచంగా ఉంటుంది. అయితే రుతుక్రమం ఆగాక మహిళలతో పాటు... ఏ జెండర్ వారికైనా గుండెపోటు అవకాశాలు సమానం. సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక అంశాలు: పై అంశాలకు తోడుగా ఒక సమాజం లోని విద్య, ఆదాయ వనరులు, ఆరోగ్య సంరక్షణకు గల అవకాశాలు, సాంస్కృతిక నేపథ్యాల వంటి అంశాలు కూడా గుండెజబ్బుల కేసులను ప్రభావితం చేస్తుంటాయి. ఫ్యామిలీ హిస్టరీ : మిగతావారితో పోలిస్తే గుండెజబ్బులు / గుండెపోటు లాంటివి వచ్చిన వారి కుటుంబాల తాలూకు కుటుంబ ఆరోగ్య చరిత్ర (ఫ్యామిలీ హిస్టరీ) కూడా గుండెజబ్బుల ముప్పునకు ఒక ప్రధాన కారణం. మిగతావాళ్లతో పోలిస్తే దాదాపు 25 శాతం మంది రోగుల్లో గుంపోటుకు ఈ ఫ్యామిలీ హిస్టరీనే కీలకాంశ మవుతుంది. చదవండి: దుర్గాపూజలో భక్తిపారవశ్యం, నటీమణులు ఎమోషనల్, వీడియో వైరల్లబ్... డబ్...లయ తప్పొద్దు!నివారణ ఇలా... కార్డియో వాస్క్యులార్ హెల్త్ స్కోరుకు దగ్గరగా ఉండే జీవనశైలి: సాధారణంగా పాశ్చాత్యదేశాల్లో... మరీ ముఖ్యంగా అమెరికా వంటి చోట్ల అమెరికన్ హార్ట్ అసోసియేషన్ నిర్దేశించిన కొన్ని జీవనశైలి మార్గదర్శకాలు ఉన్నాయి. వాటినే ‘లైఫ్ ఎసెన్షియల్స్ 8 (ఎల్ఈ 8); లైఫ్ ఎసెన్షియల్స్ 7 (ఎల్ఈ 7) గా వ్యవహరిస్తుంటారు. అంటే... ఆరోగ్యకరమైన జీవనశైలిలో భాగంగా అనుసరించే మార్గదర్శకాలైన... రక్త΄ోటును (హైబీపీని) అదుపులో ఉంచుకోవడం; రక్తంలో చక్కెరమోతాదులనూ, కొలెస్ట్రాల్ను తగ్గించుకోవడం; ఆరోగ్యకరమైన ఆహారాన్ని,పోషకాహారాన్ని తీసుకోవడం; తగినంత వ్యాయామం చేయడం; ఎత్తుకు తగినంత బరువు ఉండేలా బాడీ మాస్ ఇండెక్స్– (బీఎమ్ఐ)ను మెయింటెయిన్ చేయడంస్మోకింగ్ / నికోటిన్కు దూరంగా ఉండటం; కంటినిండా నిద్రపోవడం... అలాంటి ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవరచుకోవడం ద్వారా ఈ లైఫ్ ఎసెన్షియల్ స్కోరును ఎంతగా పెంచుకుంటే గుండెజబ్బులను అంతగా నివారించుకోవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. అర్లీ వార్నింగ్ సిగ్నల్స్ ద్వారా : చాలామందిలో గుండెజబ్బులుగానీ లేదా గుండెపోటుగానీ ఆకస్మికంగా రాకముందే కొన్ని వార్నింగ్ సిగ్నల్స్ పంపుతాయి. ఉదాహరణకు ఛాతీలో ఇబ్బందిగా ఉండటం, తీవ్రమైన నీరసం, నిస్సత్తువ, అలసట, గుండెదడ (పాల్పిటేషన్) వంటివి. వాటిని నిర్లక్ష్యం చేయకుండా తగిన సమయంలో గుర్తించి డాక్టర్లను సంప్రదించడం వల్ల. స్క్రీనింగ్ పరీక్షలతో : హైబీపీ, అధిక కొలెస్ట్రాల్, మధుమేహంతో బాదపడేవారు తగిన పరీక్షలు చేయించు కోవడం, ఏవైనా లక్షణాలు కనిపిస్తే కరోనరీ సీటీ యాంజియోగ్రామ్ వంటి పరీక్షలు చేయించుకోవడం ద్వారా గుండెజబ్బులు నివారించవచ్చు. ఇదీ చదవండి:Karur stampede tragedy మొన్ననే ఎంగేజ్మెంట్..త్వరలో పెళ్లి-డాక్టర్ అంజని,ద్వారంపూడి, సీనియర్ కార్డియాలజిస్ట్ -
ప్రెగ్నెంట్ టైంలో సైనసైటిస్ మందులు వాడితే ప్రమాదమా..?
నేను మూడు నెలల గర్భవతిని. నాకు ఎప్పటినుంచో డస్ట్ అలెర్జీ, సైనసైటిస్ సమస్యలు ఉన్నాయి. గర్భం వచ్చిన తర్వాత తరచూ జలుబు, తుమ్ములు వస్తున్నాయి. ఇప్పటికే కొన్ని మందులు వాడాను. ఈ మందులు నా బిడ్డకు ఎలాంటి ప్రభావం చూపుతాయోనని ఆందోళనగా ఉంది. గర్భధారణ తొలి నెలల్లో మందులు వాడటం సురక్షితమా? నేను ఏవైనా జాగ్రత్తలు తీసుకోవచ్చా?– సుశీల, నాగర్కర్నూల్సుశీల గారు, గర్భధారణ తొలి నెలల్లో శరీరంలో రక్షణశక్తి, హార్మోన్లలో మార్పులు ఎక్కువగా జరుగుతాయి. అందుకే ఈ సమయంలో జలుబు, తుమ్ములు, ముక్కు దిబ్బడ వంటి సమస్యలు రావడం సాధారణం. కొన్నిసార్లు ఫ్లూ కూడా రావచ్చు. ఈ లక్షణాలు ఎప్పుడు వస్తే, వాటి కారణం ఏమిటో ముందుగా గుర్తించడం చాలా ముఖ్యం. ఎందుకంటే చికిత్స కారణాన్ని బట్టి మారుతుంది. ఇలాంటి సమయంలో ముందుజాగ్రత్తలు చాలా సహాయపడతాయి. ముఖ్యంగా ఫ్లూ సీజన్లో ఎక్కువ జనసమూహాలు ఉండే ప్రదేశాలకు దూరంగా ఉండడం, అలెర్జీ కలిగించే పదార్థాలను తీసుకోకపోవటం, అవసరమైతే మాస్క్ ధరించడం మంచిది. ఫ్లూ వ్యాక్సిన్ గర్భధారణలో ఎప్పుడైనా సురక్షితంగా తీసుకోవచ్చు. ఇది తల్లికి, బిడ్డకు రక్షణ ఇస్తుంది. తేలికపాటి జలుబు, సైనసైటిస్ ఉన్నప్పుడు ఎక్కువగా నీరు తాగడం, వేడి సూపులు తాగడం, ఇంట్లో ఆవిరి పీల్చడం లాంటి చిట్కాలు ఉపశమనాన్ని ఇస్తాయి. మీ శరీర ఉష్ణోగ్రత, పల్స్, ఆక్సిజన్ స్థాయిలను ఇంట్లోనే ఉంటూ గమనించడం మంచిది. లక్షణాలు ఎక్కువైనా లేదా ఏదైనా అసాధారణంగా అనిపించినా వెంటనే డాక్టర్ను సంప్రదించాలి. మొదటి మూడు నెలల్లో మందులు వాడడంపై మీరు ఆందోళన పడుతున్నా, నిపుణుల సూచనలో ఇచ్చే తేలికపాటి చికిత్సలు సాధారణంగా సురక్షితమే. ఇవి బిడ్డ అభివృద్ధిపై ప్రతికూల ప్రభావం చూపవు. సమయానికి వైద్య పర్యవేక్షణ, జాగ్రత్తలు పాటిస్తే గర్భధారణలో జలుబు, తుమ్ములు, ఫ్లూ వంటి సమస్యలు సులభంగా నియంత్రించుకోవచ్చు.నాకు ఈ మధ్యనే రెండవ ప్రెగ్నెన్సీ నిర్ధారణ అయింది. అయితే, నా మొదటి గర్భధారణలో నాకు తీవ్రమైన వాంతులు అయ్యాయి. పలుసార్లు ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. శారీరకంగా, భావోద్వేగపరంగా చాలా ఇబ్బంది పడ్డాను. అందుకే, ఇప్పుడు ఈ గర్భధారణను కొనసాగించడానికి భయం వేస్తోంది. ఈ గర్భధారణలో కూడా నాకు మళ్లీ అలాంటి వాంతులు వస్తాయా? వాంతులు తగ్గించుకోవడానికి నేను ఏమి చేయగలను?– కీర్తి, వరంగల్గర్భధారణ సమయంలో వాంతులు, వికారం సాధారణంగా కనిపించే సమస్య. దీనిని ‘మార్నింగ్ సిక్నెస్’ అంటారు. ఇది ఎక్కువగా మొదటి త్రైమాసికంలో కనిపిస్తుంది. సాధారణంగా ఆరు నుంచి ఏడవ వారంలో ప్రారంభమై, పదనాలుగు నుంచి పదహారు వారాల మధ్య తగ్గిపోతుంది. అయితే ఈ లక్షణాల తీవ్రత వ్యక్తికి వ్యక్తికి వేరుగా ఉంటుంది. కొందరికి స్వల్పంగా మాత్రమే ఉండగా, మరికొందరికి చాలా తీవ్రమైన, రోజువారీ జీవితాన్ని ఇబ్బందిపెట్టేంతగా వాంతులు రావచ్చు. మీరు చెప్పినట్టుగా కొన్ని సందర్భాల్లో ఆసుపత్రిలో చేరడం, ఇంజెక్షన్స్, మెడిసిన్స్ తీసుకోవడం కూడా అవసరమవుతుంది. ఒకే మహిళకు వేర్వేరు గర్భధారణల్లో వాంతుల తీవ్రత వేరుగా ఉండే అవకాశం ఉంటుంది. ఈ సమస్యకు ప్రధాన కారణం గర్భధారణ హార్మోన్ అయిన బీటా హెచ్సీజీ స్థాయి అకస్మాత్తుగా పెరగడం. అందుకే కవలలు గర్భంలో ఉన్నప్పుడు వాంతులు మరింతగా వస్తాయి. వాంతులు తగ్గించుకోవడానికి మీరు పాటించగల కొన్ని జాగ్రత్తలు ఉన్నాయి. రోజంతా కొద్దికొద్దిగా నీరు తాగుతూ ఉండాలి, ప్రతి రెండు నుంచి మూడు గంటలకు తక్కువ మోతాదులో అయినా తరచు ఆహారం తీసుకోవాలి. మృదువైన, సులభంగా జీర్ణమయ్యే పదార్థాలను తినడం మంచిది. మసాలా వంటకాలకు, బయట ఆహారానికి వీలైనంత దూరంగా ఉండాలి. ఎక్కువసేపు ఆకలితో ఉండకూడదు. వాంతులు ఎక్కువగా వస్తున్నప్పుడు తగినంత విశ్రాంతి తీసుకోవాలి. కొన్ని వాసనల వల్ల వాంతులు పెరిగే అవకాశం ఉన్నందువలన అలాంటి వాసనల నుంచి దూరంగా ఉండాలి. అల్లం, నిమ్మరసం వంటి పదార్థాలను ఆహారంలో చేర్చడం కూడా కొంత ఉపశమనం ఇస్తుంది. వాంతులు తీవ్ర స్థాయిలో ఉన్నప్పుడు కొన్ని మందులు సురక్షితంగా వాడవచ్చు. ఇవి మీ డాక్టర్ సూచనతో మాత్రమే తీసుకోవాలి. మీరు ఏమీ తినలేకపోతున్నా లేదా తాగలేకపోతున్నా, బరువు తగ్గడం లేదా డీహైడ్రేషన్ లక్షణాలు కనిపిస్తున్నా వెంటనే మీ వైద్యుడిని సంప్రదించాలి. సమయానికి చికిత్స తీసుకోవడం వల్ల మీకు, శిశువుకు కలిగే సంక్లిష్టతలను తగ్గించవచ్చు. డా. కడియాల రమ్య, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్ (చదవండి: కంటి ఆరోగ్యం కోసం 20:20:20 రూల్ వెబ్సైట్..!) -
గుండెకు అండగా ఉందాం
ఈ ఏడాది ‘వరల్డ్ హార్ డే’ థీమ్ ‘ఒక్క స్పందననూ మిస్ కాకండి’ (డోంట్ మిస్ ఏ బీట్) అని. అంటే... గుండెను రక్షించుకోవడంలో ఏ అవకాశాన్నీ వదులుకోవద్దనీ, గుండె ఇచ్చే వార్నింగ్ సిగ్నల్స్గానీ లేదా అదే చేసే హెచ్చరికలుగానీ ఏవీ మిస్ కాకుండా చూసుకోవాలనే సందేశాన్ని ఈ థీమ్ ఇస్తోంది. ఈ నేపథ్యంలో గుండె సంరక్షణ కోసం సీనియర్ కార్డియాలజిస్టులు... పాఠకులతో పంచుకుంటున్న అత్యంత కీలకమైన విషయాలివి.భారతదేశంలో గుండెజబ్బుల విస్తృతి కాస్తంత బెంబేలెత్తించేలాగే ఉంది. గతంలో అంటురోగాల శకం ముగిసి, ఇప్పుడు జీవనశైలితో వస్తున్న ‘నాన్ కమ్యూనికబుల్ జబ్బులు’ విస్తరిస్తున్న శకంలో... అన్ని జబ్బులతో పోలిస్తే గుండెజబ్బుల వాటా తక్కువేమీ కాదు. పైగా అన్ని నదులూ పరుగెత్తేది సముద్రం వైపే అన్నట్టుగా... అన్ని జబ్బులూ నడిచేది గుండెజబ్బులవైపే. ఉదాహరణకు అది డయాబెటిస్గానీ, హైబీపీగానీ, స్థూలకాయం, మెటబాలిక్ సిండ్రోమ్స్ ఇవన్నీ పెరుగుతూ పెరుగుతూ చివర్న గుండెజబ్బుల దిశగా పయనిస్తున్నాయి. ఇక్కడ పేర్కొన్న ప్రతి జబ్బూ అది హార్ట్ ఎటాక్గానో, బ్రెయిన్ స్ట్రోక్గానో పరిణమించేదే అనడంలో సందేహం లేదు. → హృద్రోగం వృద్ధాప్య రోగం కాదు... గతంలో గుండెజబ్బులనేవి కాస్తంత వయసు పెరిగాకే కనిపించేవి. ఇప్పుడు అవి కూడా చాలా త్వరితంగా వచ్చేస్తున్నాయి. ప్రత్యేకించి యువతలో సైతం కనిపిస్తున్నాయి. అందుకే చాలా సందర్భాల్లో వీటిని నిశ్శబ్ద ఉత్పాతాలు (సైలెంట్ ఎపిడెమిక్స్) అని కూడా నిపుణులు పేర్కొంటున్నారు. → ఆ తెలుగు వాడుక మాట అక్షరాలా నిజం... మన తెలుగు వాడుక మాటల్లో ‘గుండెల్ని పిండేసేలాగా...’ అన్నది ఓ జాతీయం. ఒత్తిడి విషయంలో ఆ నుడికారం అక్షరసత్యం. ఒత్తిడి పెరుగుతున్న కొద్దీ అది ‘గుండెలను పిండేస్తుంది’! మానసిక ఒత్తిడి అనేది ఓ భావోద్వేగపూరితమైన ఎమోషన్గా చెప్పడం సరికాదు. ఆ భావోద్వేగం కాస్తా తన భౌతిక లక్షణాలతో గుండెజబ్బుగానో, గుండెపోటుగానో కనిపించడం చాలా సాధారణం. ఎందుకంటే... మానసిక ఒత్తిడి పెరగగానే... రక్తనాళాల్లో రక్తపోటూ పెరుగుతుంది. రక్తపోటు కాస్తా గుండెపోటుగా పరిణమించడం మనకు తెలిసిన విషయమే. మనం సంప్రదాయంగా పాటించే కొన్ని అంశాల్లో దీనికి విరుగుడు దాగుంది. అవే... యోగా, ధ్యానం, శ్వాస వ్యాయామాలు. వీటి సాయంతో మన నరాలను హాయిపరచడం మొదలుపెట్టగానే... రక్తనాళాల్లో పోటెత్తే రక్తప్రవాహాన్నీ అది జోకొడుతుంది. దాంతో బీపీ తన నార్మల్ ఒత్తిడికి వచ్చేస్తుంది. ఫలితంగా గుండెజబ్బుల ముప్పూ తప్పుతుంది. అందుకే ఇప్పుడు డాక్టర్లు కూడా మందులతో పాటు... ఈ మార్గాలూ ప్రిస్క్రిప్షన్లో సూచిస్తున్నారు. → డాన్సులూ డేంజరస్గా మారిన డేస్ ఇవి! ఇప్పుడు న్యూస్ ఫాలో అవుతున్నవారికి తెలియని విషయాలేమీ కావివి. అవేమిటంటే... మంచి వయసులో ఉన్న యువత కూడా డాన్స్ చేస్తూనో, క్రికెట్ ఆడుతూ ఆడుతూనో, జిమ్లో వ్యాయమం చేస్తూనో యువతీ యువకులు కుప్పకూలిపోతున్నారు. దీన్ని నివారించదగిన అంశాలూ ఉన్నాయి. ఉదాహరణకు ఎక్కువ శక్తిని ఒకేసారి ఇచ్చే హై–ఎనర్జీ డ్రింకులూ, వ్యాయామంతో పాటు స్టెరాయిడ్స్ తీసుకుంటున్న ఉదంతాలూ, ఒకే చోట కూర్చుని చేసే వృత్తివ్యాపకాలూ, చురుగ్గా కదలడానికి అంతగా ఇష్టపడని జీవనశైలీ... ఇవన్నీ ఇలా ఆకస్మికంగా గుప్పెడంత గుండెను కుప్పకూల్చే ముప్పును పెంచుతున్నాయి. వీటి నివారణ చాలా సింపుల్. క్రమం తప్పకుండా చేసుకునే కొన్ని సాధారణ ప్రాథమిక స్క్రీనింగ్ పరీక్షలతో పెద్ద పెద్ద గుండె ముప్పులనూ నివారించుకోవచ్చు. అలా నిబ్బరంగా, నిశ్చింతగా ఉండవచ్చు. → నివారణ చాలా సింపుల్... అదే టైమ్లో బోలెడంత పవర్ఫుల్...నిజానికి గుండెజబ్బుల నివారణ చాలా చాలా సింపుల్. మనం సంకల్పంతో నిలిపేయగలిగే పొగతాగే అలవాటు, మద్యం అలవాట్లనుంచి దూరంగా ఉంటే చాలు. అదే సమయంలో అన్నంలో తగినన్ని ఆకుకూరలూ, కాయగూరలతో పాటు తాజా పండ్లు తీసుకోవడం వంటి మంచి రుచికరమైన మార్గంలో వెళ్లడం ద్వారా గుండెజబ్బుల్ని సమర్థంగా నివారించవచ్చు. అలాగే క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, మానసిక ఒత్తిడి తగ్గించుకోవడం, రెగ్యులర్గా చెకప్ చేయించుకోవడం, బరువు ఆరోగ్యకరమైన లిమిట్లోనే ఉండేలా చూసుకోవడం కూడా ముఖ్యమైనవి. ఇక్కడ కాస్తంత కష్టమైనదైనా కన్సిస్టెంట్గా అంటే క్రమం తప్పకుండా పై అలవాట్లను కొనసాగించడంతో గుండె ఆరోగ్యాన్ని పదికాలాల పాటు పదిలంగా పదిలపరచవచ్చు.→ గాలినీ, కలుషితాలనూ తేలిగ్గా తీసుకోకండి... మనం పీల్చే గాలి శుభ్రంగా ఉండేలా చూసుకోవడం కూడా ముఖ్యమే. అంటే... వాహనాల పొగతో లేదా కాలుష్యంతో కూడిన గాలిని పీల్చుకోవడాన్ని వీలైనంతగా తప్పించుకోవాలి. వాటిలో ఉండే కాలుష్యపదార్థాలు, ధూళిదూసరాలూ రక్తనాళాల్లో రక్తప్రవాహాన్ని వేగవంతం చేస్తాయి. అలా గుండెజబ్బులూ వేగంగా వచ్చేలా చేస్తాయి. కాలుష్యం పెరిగిన కొద్దీ రక్తం తాలూకు ఎరుపు రంగు డేంజర్ మార్క్లా కనిపిస్తుంది. అదే వీలైనంతగా పచ్చటి పరిసరాల్లోనే ఉండటం ప్రారంభిస్తే గుండె ఆరోగ్యమూ పదికాలాలు పచ్చగా ఉంటుంది. → మహిళల గుండెలకు మరింత ముప్పు... మహిళలు కుటుంబ ఆరోగ్యానికి ప్రాథమ్యం ఇచ్చి, చాలావరకు తమ ఆరోగ్యానికి రెండో ప్రాధాన్యమిస్తారు. వారు తమలో కలిగే అలసటను ఇంటి పనులతో వచ్చిన నీరసంగా అనుకుంటారు. తమ అజీర్ణ సమస్యను గ్యాస్ సమస్యగా భావిస్తారు. తమ గుండెనొప్పిని ఛాతీనొప్పిగానే తీసుకుంటారు. ఇల్లాలు బాగుంటేనే ఇల్లు బాగున్నట్టుగా వాళ్ల గుండె బాగుంటేనే మిగతా ఇంటి సభ్యుల గుండె సంస్పందనలూ బాగుంటాయి. ‘డోంట్ మిస్ ద బీట్’ అనే థీమ్ను తమకు అనువుగా ఆలోచిస్తే.. మహిళలకే అది ఎక్కువగా అనువర్తిస్తుంది. → అనుక్షణం... రక్షణకు అనువైన క్షణమే... ఆకస్మిక గుండె జబ్బు ముప్పు నుంచి కా పాడాలంటే అనుక్షణం అనువైన క్షణమే. అందుకే గుండెజబ్బు లక్షణాలు కనిపించినప్పుడు దాన్నుంచి రక్షించాలంటే ప్రతి ఒక్కరూ కార్డియాక్ పల్మునరీ రిససియేషన్ అనే సీపీఆర్ గురించి అవగాహన పెంచుకోవాలి. ఎవరైనా గుండె పట్టుకుని కుప్పకూలిపోతే ఒకచేతి వేళలలో మరో చేతివేళ్లు దూర్చి క్షణం కూడా ఆలస్యం చేయకుండా గుండెపై క్రమబద్దంగా, లయబద్ధంగా, నేర్పుగా కదిలిస్తూ ‘సీపీఆర్’ నిర్వహించే నైపుణ్యాలను నేర్చుకోవాలి. అది ఇల్లూ, వాకిలీ, పనిప్రదేశం ఇలా ఎక్కడైనా, ఎవరైనా అభ్యసించగల సింపుల్గా చేయగలిగే ఈ ప్రాణరక్షణ నైపుణ్యం చేతుల్లో దాగి ఉండే అభయహస్తాలవుతాయవి. → చివరగా... మనం పుట్టిన నాటి నుంచీ క్షణం కూడా ఆగకుండా... ఒక్క బీట్ కూడా మిస్ కాకుండా ఒక జీవితకాలం పాటు సంస్పదిస్తూ ఉండే ఆ గుండెను గౌరవిస్తూ... దాన్ని మాటువేసి కాటు వేసే అన్ని రకాల అవాంతరాల నుంచి కా పాడుకోడానికి బిక్కు బిక్కుమని భయపడకుండా ఉండటానికి గడియారంలో టిక్కు టిక్కుమనే ఏ బీట్నూ మిస్ కాకుడదంటూ లబ్డబ్ మంటూ స్పందించే ‘హార్ట్’ డే థీమ్కు భాష్యం చెప్పుకోవాలి.డా. ఎంఎస్ఎస్ ముఖర్జీసీనియర్ కార్డియాలజిస్ట్ నిర్వహణ:యాసీన్ -
గంటన్నర పాటు గుండెను ఆపి, యువకుడికి ప్రాణదానం
హైదరాబాద్, సెప్టెంబర్ 27, 2025: నగరానికి చెందిన 31 ఏళ్ల యువకుడికి అత్యంత అరుదైన, తీవ్రమైన గుండె సమస్యలు వచ్చాయి. గుండె కవాటంలో లీకేజిలు ఏర్పడడంతో పాటు బృహద్ధమని విపరీతంగా సాగిపోయింది. లీకేజి కారణంగా రక్తం శరీరంలోని ఇతర భాగాలకు వెళ్లకుండా తిరిగి గుండెలోకే వచ్చేస్తోంది. దీంతో అతడికి కాళ్లు వాపులు, ఊపిరి అందకపోవడం లాంటి పలు సమస్యలతో ఇబ్బంది పడుతూ, తన రోజువారీ పనులు కూడా చేసుకోలేని పరిస్థితికి వచ్చారు. వీటన్నింటికీ తోడు పుట్టుకతోనే గుండెలో రంధ్రం ఏర్పడే వీఎస్డీ అనే సమస్య కూడా ఆ యువకుడికి ఉంది. ఇన్ని సమస్యలున్న రోగికి ఒకే శస్త్రచికిత్సలో అన్నింటినీ నయం చేసి.. ఎల్బీనగర్ కామినేని ఆస్పత్రి వైద్యులు ప్రాణదానం చేశారు. అది కూడా ఏకంగా గంటన్నర పాటు గుండెను ఆపేసి, దాని బదులు మిషన్ సాయంతో గుండె పని కొనసాగిస్తూ శస్త్రచికిత్స చేశారు. అతడికి వచ్చిన సమస్య, చేసిన చికిత్స వివరాలను ఆస్పత్రికి చెందిన కన్సల్టెంట్ కార్డియోథొరాసిక్, వాస్క్యులర్ సర్జన్ డాక్టర్ రిషిత్ బత్తిని తెలిపారు.‘‘ఆ యువకుడికి గుండె కవాటంలో లీకేజీల కారణంగా రక్తం చాలావరకు మళ్లీ గుండెలోకి వచ్చేస్తుంది. దానికితోడు బృహద్ధమని కూడా సాగుతూ వచ్చింది. మామూలుగా అయితే 3 సెంటీమీటర్లు ఉండాల్సింది ఏకంగా 6 సెంటీమీటర్లు ఉంది. దాన్ని అలాగే వదిలేస్తే పగిలిపోవడం గానీ, లేదా చీలిపోవడం గానీ జరిగే అవకాశం ఉంటుంది. అప్పుడు రోగి బతికే అవకాశం చాలా తక్కువ. వీటన్నింటికీ తోడు అతడికి గుండెగోడల మధ్య పెద్ద రంధ్రం (వీఎస్డీ) ఉంది.ఇన్ని సమస్యలకు కలిపి ఒకే శస్త్రచికిత్స.. బెంటాల్స్ ప్రొసీజర్ చేయాలని నిర్ణయించాం. ఇందులో భాగంగా ముందు గుండెను ఆపేసి దానికి బదులు మిషన్ పెడతాం. మొత్తం శస్త్రచికిత్స పూర్తయిన తర్వాతే మళ్లీ గుండె కొట్టుకోవడం మొదలవుతుంది. ఇలా ప్రధానమైన శస్త్రచికిత్స జరగిన గంటన్నర సమయం పాటు అతడి గుండె ఆపేశాం. శస్త్రచికిత్సలో ముందుగా రోగి బృహద్ధమనిని పూర్తిగా తీసేసి కృత్రిమ వాల్వు అమర్చాం. దాంతోపాటు పైకివెళ్లే ధమనిని కూడా మార్చాం. అక్కడ కృత్రిమ వాల్వ్ ఏర్పాటుచేశాం. ఇంకా, బృహద్ధమని మూలాన్ని కూడా పునర్నిర్మించి, గుండెలో ఇతర లోపాలను కూడా సరిచేశాం. అవన్నీ చేసిన తర్వాత రక్తనాళాలను కూడా మళ్లీ రీప్లాంట్ చేశాం.ఇదంతా చాలా సంక్లిష్టమైన శస్త్రచికిత్స. ఎందుకంటే, బృహద్ధమని 6 సెంటీమీటర్లకు సాగిపోవడం వల్ల అది బాగా పల్చబడిపోతుంది. కుట్లు వేయడం కష్టం, రక్తస్రావం అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ. రక్తనాళాలు రీప్లాంట్ చేసేటప్పుడు కొంతమంది రోగులకు గుండె వైఫల్యం జరిగే అవకాశాలుంటాయి. అందుకే ఇది చాలా హైరిస్క్ శస్త్రచికిత్స. ఇక ఈయనకు వీఎస్డీ కూడా చాలా పెద్దదిగా ఉంది. ఇది మామూలుగా పుట్టుకతోనే ఉంటుంది. ముందే గమనించి శస్త్రచికిత్స చేస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు. గమనించకపోతే ఆ రంధ్రం పెరిగిపోతూ ఉంటుంది. అప్పుడు చెడురక్తం వెళ్లి మంచిరక్తంలో కలిసిపోయి శరీరం నీలంగా మారిపోతుంది. ఇంత పెద్ద వీఎస్డీ ఉన్నవాళ్లు ఇన్నాళ్లు ఉండరు. కానీ, ఇక్కడ బృహద్ధమని పెరగడంతో, అది ఆ రంధ్రాన్ని కొంతవరకు మూసేసింది.ఇలాంటి సమస్యలు 30-50 సంవత్సరాల మధ్య వయసులో వస్తుంటాయి. అది కూడా 10-15 వేల మందిలో ఒక్కరికి మాత్రమే వస్తుంది. సరైన సమయానికి గుర్తించి శస్త్రచికిత్స చేయకపోతే వాల్వు పగిలిపోయే ప్రమాదం ఉంటుంది. ఈ శస్త్రచికిత్స చేయకముందు అతడి గుండె పనితీరు 20-30% కు పడిపోయింది. చేసిన తర్వాత 90%కు చేరుకుంది. చాలామందికి ఇలాంటి శస్త్రచికిత్సలో రక్తస్రావం ఎక్కువగా ఉంటుంది. కానీ ఈ కేసులో కనీసం ఒక్క యూనిట్ రక్తం కూడా ఎక్కించాల్సిన అవసరం రాలేదు. అంత సురక్షితంగా చేయగలిగాం. రోగి చాలా త్వరగా కోలుకున్నారు. ఐసీయూ నుంచి వార్డుకు మూడోరోజే మార్చేశాం. శస్త్రచికిత్స జరిగిన ఐదోరోజే డిశ్చార్జి చేశాం. ఈ శస్త్రచికిత్సలో చీఫ్ కార్డియాక్ అనెస్థెటిస్ట్ డాక్టర్ సురేష్ కుమార్, అనెస్థెటిస్ట్ డాక్టర్ రవళి, పెర్ఫ్యూజనిస్టులు డాక్టర్ పవన్, డాక్టర్ దుర్గ పాల్గొన్నారు’’ అని డాక్టర్ రిషిత్ బత్తిని వివరించారు.వరల్డ్ హార్ట్ డే 29 సెప్టెంబర్ ను ఈ సందర్బంగా కామినేని హాస్పిటల్స్ లో హార్ట్ చెకప్ క్యాంపును నిర్వహిస్తుంది. ఈ శిబిరం లో డాక్టర్ కన్సల్టేషన్ పై 30శాతం, ఇన్వెస్టిగేషన్స్ పైన 20 శాతం రాయితీ అందిస్తోంది. ఈ సదుపాయం సెప్టెంబర్ 29 అక్టోబర్ 11 అందుబాటులో ఉంటుంది -
నో మెడిసిన్స్,నో ఫ్యాన్సీ సప్లిమెంట్స్.. నేహాధుపియా 21 డేస్ చాలెంజ్
బాలీవుడ్ నటి నేహా ధుపియా తన ఫిట్నెస్రహస్యాలను, పలు రకాల వంటకాలను సోషల్మీడియాలో పంచుకుంటూ ఉంటారు. ముఖ్యంగా ఆరోగ్యకరమైన జీవనశైలి, రెసిపీలను అభిమానులను ఆకట్టుకుంటూ ఉంటాయి. తాజగా 21 రోజుల చాలెంజ్ ప్లాన్ను షేర్ చేశారు. ఇద్దరు బిడ్డల తల్లి అయిన నేహా ధూపియా కొత్త వెల్నెస్ ఛాలెంజ్ నెటిజనులను బాగా ఆకర్షిస్తోంది.నో మెడిసిన్స్, నో ఫ్యాన్సీ సప్లిమెంట్స్.. కేవలం వంటగదిలో లభించే పదార్థాలతోనే మందులపై ఆధార పడకుండా సహజంగానే ఇన్ఫ్లమేషన్ దూరంఅంటూ ఆమె పోస్ట్ చేశారు. నేహా ధూపియా తాజా పోస్ట్లో, నేహా ఇన్ఫ్లమేషన్తో పోరాడటానికి 21-రోజుల ఛాలెంజ్ను చేపట్టినట్లు వెల్లడించింది. అంతర్గత వాపును తగ్గించడంలో సహాయపడటానికి డైటీషియన్ రిచా గంగాని 21 రోజుల పాటు రోజువారీ హల్ది-అల్లం-నిగెల్లా సీడ్స్ మిశ్రమాన్ని సిఫార్సు చేశారు. View this post on Instagram A post shared by Freedom To Feed (@freedomtofeed) "21 రోజులు.. వన్ కమిట్మెంట్.. ఆరోగ్యకరమైన మీరు’’ అంటూ నేహా ధూపియా , రిచా గంగాని 21-రోజుల ఛాలెంజ్లో పాలుపంచుకోవాలని తన ఫ్యాన్స్ను ఆహ్వానించారు. ఎందుకంటే మీ శ్రేయస్సు కు ప్రయత్నం అవసరం అంటూ ఒక పోస్ట్ను షేర్ చేశారు. 21 రోజుల పాటు ఈ డ్రింక్ తాగి తమ అభిప్రాయాలను, ఫలితాలను షేర్ చేయాలని కోరారు. ఈ డ్రింక్ కోసం కావాల్సినవిఒక చిన్న పచ్చి పసుపు ముక్క1 క్యూబ్ పచ్చి అల్లం5-7 నల్ల మిరియాలు1 స్పూన్ నిగెల్లా విత్తనాలు (కలోంజి)మీ దగ్గర MCT నూనె లేకపోతే1 స్పూన్ కొబ్బరి నూనె లేదా1 స్పూన్ నెయ్యి లేదా1 స్పూన్ ఆలివ్ నూనెవీటిన్నింటిని మెత్తగా గ్రైండ్ చేసి మిశ్రమాన్ని ఐస్ క్యూబ్లలో ఉంచి ఫ్రీజ్ చేయాలి. వీటిని రోజుఒకటి చొప్పున ప్రతీ రోజు ఉదయం వీటిని వేడినీటిలో వేసుకుని సేవించాలి. ఇది ట్రెండీ సప్లిమెంట్ కాదని, ఇది మంచి కొవ్వు ఆమ్లాల మూలం అని రిచా లైవ్ చాట్లో పేర్కొన్నారు.కాగా పసుపులో ఉండే కర్కుమిన్ , అల్లంలో ఉండే జింజెరోల్స్ వంటి సమ్మేళనాల కారణంగా పసుపు ,అల్లం చాలా కాలంగా సహజ మంట నివారణ మందులు పేరొందాయి. నల్ల మిరియాలు పసుపును బాగా గ్రహించడంలో సహాయపడతాయి. నిగెల్లా గింజలు యాంటీఆక్సిడెంట్ గా పనిచేస్తాయి. శరీరాన్ని ఒత్తిడి , నష్టం నుండి రక్షిస్తాయి. ఆరోగ్యకరమైన కొవ్వులైన నెయ్యి, కొబ్బరి నూనె లేదా ఆలివ్ నూనె శరీరం ఈ పోషకాలన్నింటినీ వృధాగా పోకుండా గ్రహిస్తుందంటున్నారు వైద్యులు.ఇన్ఫ్లమేషన్ కీళ్ల నొప్పులు, అలసట , దీర్ఘకాలిక వ్యాధుల వంటి సమస్యలకు దారితీస్తుంది. ఒత్తిడి, సరైన ఆహారం లేకపోవడం,వ్యాయామం లేకపోవడం లాంటి దీన్ని మరింత దిగజారుస్తాయి. అందుకే ఇప్పుడు చాలామంది నేహా లాగే దానిని నిర్వహించడానికి సహజ మార్గాల కోసం చూస్తున్నారు. ఇలాంటి వారి వారి శరీరం స్పందనల మీద ఆధారపడి ఉంటుందనేది గమనించాలి. -
Yoga ఐదుపదులైనా ఫిట్గా...అయ్యంగార్ యోగ!
48 సంవత్సరాల వయస్సులో కూడా చక్కటి సౌష్టవంతో యువ నటీమణులతో పోటీ పడుతున్న బాలీవుడ్ నటి మల్లికా షెరావత్(Mallika Sherawat). ఆమె తనను ఫిట్గా ఉంచే అయ్యంగార్ యోగా(Iyengar yoga) సాధన గురించి ఇటీవల ఇన్స్టాలో పోస్ట్ చేసింది. వేగంగా బరువు తగ్గాలని, తొందరగా ఫిట్నెస్ పెంచుకోవాలని ఇంచుమించు అందరూ అనుకుంటారు. అయితే అలాంటి క్విక్–ఫిక్స్ డైట్లు, ట్రెండింగ్ వర్కౌట్లు, సోషల్ మీడియా ట్రిక్స్ మూలంగా వచ్చిన ఫిట్నెస్ అంతే తొందరగా కరిగిపోతుందని తెలుసుకోలేక చాలామంది స్థిరమైన ఫిట్నెస్ మార్గాన్ని గాలికి వదిలేస్తుంటారు.నా ఫిట్నెస్ ఫిలాసఫీ‘‘నా ఆరోగ్యానికి, ఫిట్నెస్కు యోగా చేయడమే కారణం. అంతేగానీ ఫ్యాషన్ డైట్లు లేదా క్రాష్ ప్రోగ్రామ్ లు కాదు’ అని మల్లిక ఇన్స్టా సాక్షిగా తేల్చి చెప్పింది. ఆరోగ్యంగా ఉండాలన్న తపన.. క్రమశిక్షణ, స్థిరత్వం తన అతిపెద్ద సాధనాలని నొక్కి చెప్పింది. ట్రెండీ ఫిట్నెస్ హ్యాక్లను ఆమోదించే చాలా మంది సెలబ్రిటీల మాదిరిగా కాకుండా, మల్లికా దీర్ఘకాలిక అలవాట్లను పెంపొందించుకోవడం వైపే మొగ్గు చూపుతుంది. అందుకే అయ్యంగార్ యోగాను తన దినచర్యలో భాగంగా మార్చుకుంది. View this post on Instagram A post shared by Mallika Sherawat (@mallikasherawat) ఫిట్నెస్ను తాను తాత్కాలికంగా తీసుకోలేదని, దానిని తన జీవనశైలిలో భాగంగా చేసుకున్నానని చెబుతూనే, అయ్యంగార్ యోగా వల్ల తన శరీరాన్ని షేప్ కోల్పోకుండా ఉంచుకోవడమే కాకుండా, తన బిజీ జీవితంలో సమతుల్యతను కాపాడుకోవడానికి, ముఖ్య విషయాల మీద దృష్టి పెట్టడానికి సహాయపడిందని ఆమె ఈ సందర్భంగా గుర్తు చేసుకుంది. అయ్యంగార్ యోగకూ పతంజలి ఋషి యోగ సూత్రాలకూ అవినాభావ సంబంధం ఉంది. అష్టాంగ యోగా ఎనిమిది అంశాలను ఆచరణాత్మక వ్యవస్థలో మిళితం చేస్తుంది. అధికారిక అయ్యంగార్ యోగా వెబ్సైట్ ప్రకారం, దాని క్రమం, ఆధారాల ఉపయోగం, భద్రతపై ప్రాధాన్యత దీనిని ప్రపంచవ్యాప్తంగా అత్యంత విస్తృతంగా అభ్యసించే యోగా రూపాలలో ఒకటిగా మార్చాయి.చదవండి: బాలీవుడ్ని వదిలేసి, వ్యవసాయంలోకి..కట్ చేస్తేఅయ్యంగార్ యోగాలో కీలకమైన అంశం ఏమిటంటే పట్టీలు, బోల్ట్లర్లు, బ్లాక్స్, తాళ్లు వంటి ఆధారాలను ఉపయోగించడం. ఈ సాధనాలు ప్రారంభకులకు అధునాతన అభ్యాసకులకు సరైన భంగిమను సాధించడంలో సహాయపడతాయి, అదే సమయంలో గాయం ప్రమాదాలను తగ్గిస్తాయి. ఇది అభ్యాసాన్ని అత్యంత సమగ్రంగా చేస్తుంది, అన్ని వయసుల వారికి, ఫిట్నెస్ స్థాయులకు అనుకూలంగా ఉంటుంది. -
మటన్ Vs చికెన్ ఆరోగ్యానికి ఏది మంచిది..!
మాంసాహారం పట్ల మన ప్రేమకు హద్దే లేదని...ఏటా దేశవ్యాప్తంగా హాంఫట్ అనిపిస్తున్న టన్నుల కొద్దీ భిన్న రకాల మాంస విక్రయాలు నిరూపిస్తున్నాయి. ప్రాంతాలకు అతీతంగా నాన్ వెజ్ ప్రియత్వం అంతకంతకూ ఇనుమడిస్తోంది. ఆయా ప్రాంతాల్లో స్థానిక వండేశైలులు మేళవించే ముడి దినుసుల బట్టి రుచి ప్రాచుర్యాలు మారవచ్చేమో గానీ డిమాండ్ మాత్రం పెరుగుతూనే ఉంటోంది. ఈ మాంసాహారాల్లో మటన్ చికెన్ అత్యధిక శాతం మంది తీసుకునే ఆహారం అనేది తెలిసిందే.మాంసం పట్ల ప్రేమ ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి భిన్నంగా ఉంటుంది. భారతదేశంలోని తూర్పు పశ్చిమ ప్రాంతాలలో మేక మాంసం ప్రసిద్ధి చెందినప్పటికీ, దేశంలోని ఉత్తర ప్రాంతంలో చికెన్ ఆధిపత్యం చెలాయిస్తుంది. దక్షిణ భారతదేశంలోని కొన్ని ప్రాంతాలు మాత్రం కోడి, మేక మాంసం రెండూ ఇష్టపడతాయి.మటన్ వద్దు.. చికెన్ ముద్దు...అయితే గత కొంతకాలంగా వైద్యులు చెబుతున్న ప్రకారం గానీ, పోషకాహార నిపుణుల సూచనలను బట్టి గానీ చూస్తే మటన్ లేదా మేక/గొర్రె(mutton) మాంసంతో పోలిస్తే చికెన్ /కోడి(chicken) మాంసం అత్యంత ఆరోగ్యకరం. మేక మాంసం అనారోగ్యకరం. అయితే దీనికి భిన్నమైన వాదనలు వినిపిస్తోంది ఓ తాజా అధ్యయనం.అధ్యయనం ఏం చెబుతుంది?ముడి మేక కోడి మాంసం మధ్య పోలికను చూపించే ఇఎస్డిఎ ఫుడ్ డేటా సెంట్రల్కు చెందిన డిజిటల్ జర్నల్లో ప్రచురితమైన ఒక నివేదిక ప్రకారం, మటన్ చికెన్ రెండింటిలో ప్రోటీన్ స్థాయిలు దాదాపు సమానంగా ఉన్నాయని, కానీ మేక మాంసం ఇనుము, పొటాషియం రాగి వంటి ఖనిజాలను అలాగే శాట్యురేటెడ్ ఫ్యాట్ కొలెస్ట్రాల్ను గణనీయంగా తక్కువగా కలిగి ఉంటుందని పేర్కొంది. అది మేక మాంసాన్ని గుండెకు ఆరోగ్యకరమైన ఎంపికగా చేస్తుంది, ఇది కోడి మాంసంతో పోల్చదగిన ప్రోటీన్ ప్రయోజనాలను కలిగి ఉంటుంది. రెండు మాంసాలు ముఖ్యమైన అమైనో ఆమ్లాలతో నిండి ఉన్నాయని అధ్యయనం చెబుతుంది. ఇది కండరాల పెరుగుదలకు మెరుగైన బరువు నిర్వహణకు సహాయపడుతుంది.మేక మాంసం కోడి మాంసం రెండూ సహజంగా జంతు ప్రోటీన్తో సమృద్ధిగా ఉంటాయి. అయితే వాటి పోషక విలువలు ఆరోగ్యాన్ని పెంచే లక్షణాలలో మాత్రం చాలా తేడా ఉంది. ప్రోటీన్ విషయానికి వస్తే, కోడి మాంసం మేక మాంసం కంటే కొంత ఎక్కువ పరిమాణం కలిగి ఉంటుంది. ఒక 100 గ్రాముల కోడి మాంసంలో దాదాపు 21.4 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది, అయితే అదే ఒక 100 గ్రాముల మేక మాంసం దాదాపు 20.6 గ్రాముల ప్రోటీన్లను అందిస్తుంది. రెండు మాంసాలు అధిక నాణ్యత కలిగిన ప్రోటీన్ని కలిగి ఉంటాయి, ఇది కండరాల పెరుగుదలకు, మరమ్మత్తుకు కూడా అవసరం.ఎందులో ఎక్కువ కొవ్వు ఉంటుంది?మేక మాంసం చికెన్ కంటే తక్కువ మొత్తం కొవ్వు, శాట్యురేటెడ్ ఫ్యాట్ కలిగి ఉంటుంది. ఇది 3–ఔన్సులకు దాదాపు 2.6 గ్రాముల కొవ్వును కలిగి ఉంటుంది, తద్వారా గుండె ఆరోగ్యానికి ఆరోగ్యకరమైన ఎంపిక అవుతుంది. అంతేకాకుండా, మేక మాంసంలో ఇనుము జింక్ (Zinc) వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి, ఇది రోగనిరోధక శక్తికి మద్దతు ఇస్తుంది. మరోవైపు కోడి మాంసంలో బి5, బి6, డి, ఇ వంటి విటమిన్లు ఎక్కువగా ఉంటాయి, ఇవి శక్తి జీవక్రియతో పాటు ఎముక ఆరోగ్యానికి ఉపయుక్తం.ఏది మంచిది?క్లుప్తంగా చెప్పాలంటే, మేక మాంసం. కోడి మాంసం రెండూ అన్ని ముఖ్యమైన అమైనో ఆమ్లాలతో అధిక–నాణ్యత ప్రోటీన్ను అందిస్తాయని అధ్యయనం స్పష్టం చేస్తోంది. కాబట్టి ఒకటి మంచిది కాదు మరొకటి మంచిది అనే తీర్పులు సరైనవి కావని స్పష్టం చేస్తోది. ఈ రెండింటిలో ఒక ఎంపిక ప్రధానంగా వ్యక్తిగత పోషక ప్రాధాన్యతలపై ఆధారపడి ఉంటుంది. ఏదేమైనా, మెరుగైన ఆరోగ్యం కోసం నాన్ వెజ్ ఆహారాన్ని మితంగా తీసుకోవడం మాత్రమే ఉత్తమం.చదవండి: Devi Navratri: దాండియా, గర్భా నృత్యాలలో ఎలాంటి ప్రమాదం వాటిల్లకూడదంటే.. -
హెల్త్ కేర్ ఫ్రాడ్ : భారత సంతతి వైద్యుడికి 14 ఏళ్ల ఖైదు
అమెరికాలో హెల్త్కేర్ స్కామ్లో భారత సంతతి వైద్యుడికి శిక్షపడింది. హెల్త్ కేర్ ఫ్రాడ్ నియంత్రిత పదార్థాల చట్టవిరుద్ధ పంపిణీ నేరం భారత సంతతికి చెందిన వైద్యుడు 14 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. ఈ కేసులో ఏడాది ప్రారంభంలో ఆరోగ్య సంరక్షణ మోసానికి నీల్ కె ఆనంద్ దోషిగా తేలాడు. యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ విడుదల చేసిన ప్రకటన ప్రకారం, పెన్సిల్వేనియాకు చెందిన వైద్యుడు 48 ఏళ్ల డా. ఆనంద్ 2 మిలియన్ల డాలర్లకు పైగా పరిహారాన్ని, 2 మిలియన్లపై జరిమానా పైగా జప్తు చెల్లించాలని ఆదేశించింది.బీమా చెల్లింపులను క్లెయిమ్స్ కోసం తన రోగులను గూడీ బ్యాగులను అంగీకరించమని బలవంతం చేసి మరీ ఈ అక్రమాలకు పాల్పడ్డాడు. డాక్టర్ ఆనంద్ మెడికేర్, యుఎస్ ఆఫీస్ ఆఫ్ పర్సనల్ మేనేజ్మెంట్ (OPM), ఇండిపెండెన్స్ బ్లూ క్రాస్ (IBC) , ఆంథమ్ అందించిన ఆరోగ్య పథకాలకు తప్పుడు మరియు మోసపూరిత క్లెయిమ్లను సమర్పించడానికి కుట్ర పన్నాడు. వైద్యపరంగా అనవసరమైన ప్రిస్క్రిప్షన్ మందుల 'గూడీ బ్యాగులు' కోసం, వాటిని అతని యాజమాన్యంలోని ఇన్-హౌస్ ఫార్మసీలు రోగులకు పంపిణీ చేశాయి. ప్రిస్క్రిప్షన్లపై ముందే సంతకం చేయడం ద్వారా లైసెన్స్ కూడా లేని తన ఇంటర్న్లు మందులు సూచించడానికి అనుమతించాడు. ఆక్సికోడోన్ను పంపిణీ చేశాడు.ఓపియాయిడ్, నొప్పి నివారిణి అయిన ఆక్సికోడోన్ అమెరికాలో ముంచెత్తుతున్న మాదకద్రవ్యాల్లో ఒకటి.ఇదీ చదవండి: బాలీవుడ్ని వదిలేసి, వ్యవసాయంలోకి..కట్ చేస్తేఅలాగే ఆనంద్ ప్రిస్క్రిప్షన్లపై ముందస్తు సంతకం చేశాడు. లైసెన్స్ లేని మెడికల్ ఇంటర్న్లు డాక్టర్ ఆనంద్ ముందే సంతకం చేసిన ఖాళీ ఫారమ్లలో నియంత్రిత పదార్థాల కోసం ప్రిస్క్రిప్షన్లను పూరించారని దర్యాప్తులో వెల్లడైంది. ఈ పథకం కింద, డాక్టర్ అనేక మంది రోగులకు 20,850 ఆక్సికోడోన్ మాత్రలను ప్రిస్క్రైబ్ చేశాడు. మొత్తంగా, మెడికేర్, OPM, IBC,చ ఆంథమ్2.4 మిలియన్లకు పైగా మెడికల్ క్లెయిమ్లను చెల్లించాయి. జిల్లా న్యాయమూర్తి చాడ్ F కెన్నీ ప్రకారం, ఆనంద్ తన రోగుల అవసరాల కంటే దురాశ ,అక్రమ లాభాల ద్వారా ప్రేరేపించబడ్డాడు. రోగుల చిక్సత మీద దృష్టిపెట్టకుండా లాభాలకోసం చూసుకున్నారని కెన్నీ వ్యాఖ్యానించారు.ఏప్రిల్లో, డాక్టర్ ఆనంద్ ఆరోగ్య సంరక్షణ మోసం మరియు వైర్ మోసం, మూడు ఆరోగ్య సంరక్షణ మోసం, ఒక మనీలాండరింగ్, నాలుగు చట్టవిరుద్ధమైన ద్రవ్య లావాదేవీలు , నియంత్రిత పదార్థాలను పంపిణీ చేయడానికి కుట్ర పన్నినట్లు నిర్ధారించబడింది. భారతీయ సంతతికి చెందిన వైద్యుడు అమెరికాన నేవీలో వైద్యుడిగా కూడా పనిచేశాడు. కాగా ఈ అన్ని ఆరోపణలను ఖండిస్తూ, డా. ఆనంద్, తని కుటుంబం 2001లో న్యూయార్క్లో జరిగిన 9/11 దాడుల బాధితులతో తాను ఎలా వ్యవహరించాడో వర్ణిస్తూ వివరణ ఇచ్చారు. రోగుల పట్ల ఆయనకున్నకరుణను నేరంగా పరిగణించడం అన్యాయమని డాక్టర్ కుటుంబం వాదించింది. -
దాండియా, గర్భా నృత్యాలలో ఎలాంటి ప్రమాదం వాటిల్లకూడదంటే..
దసరా అంటేనే తొమ్మిది రోజుల పండుగ. రోజుకో విధంగా అమ్మవారిని అలంకరించుకుని.. జగన్మాత శరణు అంటూ ఉపవాసాలతో కొలుచుకుంటారు భక్తులు. కొన్ని ప్రాంతాల్లో నవరాత్రుల్లో రాత్రి సమయంలో దాండియా, గర్భా, కోలాటం వంటి డ్యాన్స్లతో అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. అయితే ఇలా మంచి మ్యూజిక్ లయబద్ధంగా డ్యాన్స్లు చేస్తూ చాలామంది ప్రాణాలను కోల్పోయారు. మరికొందరూ కాలి గాయాల బారినడ్డారు. ఇలాంటి ప్రమాదాల బారిన పడకుండా ఉత్సాహంగా..హెల్దీగా పండుగను జరుపుకోవాలంటే ఈ సింపుల్ టిప్స్ ఫాలోకండి అని చెబుతున్నారు వైద్య నిపుణులు.దసరా సరదా పదిలంగా ఉండాలంటే..సాయం సమయంలో చేసే నృత్యాల విషయంలో కాస్త కేర్ఫుల్గా ఉండమని చెబుతున్నారు సూరత్కి చెందిన ఆర్థోపెడిక్. రాత్రుళ్లు భక్తితో అమ్మవారి అనుగ్రహం పొందేలా గంటలతరబడి డ్యాన్స్లు చేస్తుంటారు. దాంతో కాలి గాయాలు బారిన పడటం లేదా, చీలమండలం, మోకాలు వంటి సమస్యలు తలెత్తేందుకు దారితీస్తాయి. మరికొందరికి..జనం సముహం ఎక్కువగా ఉండి శ్వాసకు అంతరాయం లేదా, స్ట్రోక్ వంటి అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. అలా జరగకుండా సంతోషభరితంగా, ఆరోగ్యప్రదంగా పండుగ వాతావరణం ఉండాలంటే..ఈ చిట్కాలను ఫాలోకండి అని చెబుతున్నారు వైద్యులు. హెల్దీగా ఉండేలా..హైడ్రేటెడ్గా ఉండేలా కేర్ తీసుకోవాలి. మనతోపాటు ప్రోటీన్ బార్లు కూడా తీసుకెళ్లాలి. అలాగే ఏడు నుంచి ఎనిమిది గంటలు నిద్ర ఉండేలా కేర్ తీసుకోండి. జిమ్కి వెళ్లడం, స్ట్రెచింగ్, ఫ్లెక్సిబిలిటీ వ్యాయామాలు, యోగా, బల శిక్షణకు సంబంధించిన వర్కౌట్లు వంటివి ప్రాక్టీస్ చేయండి. దీంతోపాటు పోషకాహారం కూడా చాలా ముఖ్యం అని సూచించారు. పెయిన్ కిల్లర్స్కి దూరం..ఇప్పటికే ఏదైనా గాయం లేదా కాలి సమస్య ఉంటే..నొప్పి నివారణ మంందులు తీసుకోవద్దని చెబుతున్నారు వైద్యులు. అన్ని నొప్పి నివారణ మందులు మూత్రపిండాలను ప్రభావితం చేస్తాయని అంటున్నారు. సుమారు 4 నుంచి 5 గంటలు గర్భా నృత్యం చేస్తున్నప్పుడూ డీ హైడ్రేషన్కి గురవ్వతారు ఫలితంగా మూత్రపిండాలు దెబ్బతింటాయని హెచ్చరిస్తున్నారు. అందువల్ల పెయిన్ కిల్లర్స్ తీసుకోకపోవడమే మేలు అని చెబుతున్నారు. శరీరం మాట వినండి..గర్భా సమయంలో శరీరంలో ఏ భాగం నుంచి అయినా నొప్పి వస్తే..ఆగిపోండి. కాస్త ఇబ్బందికరంగా ఉన్నా..డ్యాన్స్ చేసే సాహసం చెయ్యొద్దు అని సూచిస్తున్నారు. తక్షణమే సమీప వైద్యలును సంప్రదిస్తే..సురక్షితంగా ఉంటారని అన్నారు. View this post on Instagram A post shared by Krunal Shah (@dr.krunal_shah_) గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: Navratri celebrations : 'డిజిటల్ గర్భా': పండుగను మిస్ అవ్వకుండా ఇలా..!) -
రొమ్ము కేన్సర్ అవేర్నెస్ రన్.. ‘పింక్థాన్’
బ్రెస్ట్ కేన్సర్పై అవగాహన కల్పిండమే లక్ష్యంగా హైదరాబాద్తో పాటు ముంబై, బెంగళూరు, ఢిల్లీ, కోల్కతా, చెన్నై నగరాల్లో పింక్థాన్ రన్ నిర్వహించనున్నారు. జైడస్ లైఫ్సైన్సెస్ ఆధ్వర్యంలో డిసెంబరు 21న నిర్వహించనున్న ఈ రన్లో 30 వేల మందికి పైగా మహిళలు పాల్గోనున్నారని, ఇందులో అల్ట్రా రన్స్, రీలే రన్ ఉన్నాయని నిర్వాహకులు పేర్కొన్నారు. ప్రతి నెల మూడు నిమిషాల సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామ్ మహిళల ప్రాణాలను రొమ్ము కేన్సర్ నుంచి కాపాడగలదని జైడస్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ శరి్వల్ పటేల్ తెలిపారు. పింక్థాన్తో మరింత మందిని చైతన్యపరచడమే లక్ష్యమన్నారు. దేశంలో యేటా రెండు లక్షల మంది మహిళలు బ్రెస్ట్ కేన్సర్ బాధితులు అవుతున్నారని ఫిట్నెస్ ఐకాన్ పింక్థాన్ ఫౌండర్ మిలింద్ సోమన్ అన్నారు.27న నేచర్ క్యాంప్ ఫారెస్ట్ ట్రెక్పార్కులో నేచర్ క్యాంప్, బర్డ్స్ వాక్ నిర్వహిస్తున్నట్లు తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ ఎకో టూరిజం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ రంజిత్ నాయక్ తెలిపారు. మంచిరేవులలోని ఫారెస్ట్ ట్రెక్పార్కులో 27 శనివారం సాయంత్రం 5 గంటల నుంచి ఆదివారం ఉదయం పది గంటల వరకూ నేచర్ క్యాంప్ ఉంటుందని తెలిపారు. టీం బిల్డింగ్, టెంట్ పిచింగ్, నోక్టర్నల్ వాక్, నైట్æ క్యాంపింగ్, క్యాంప్ ఫైర్, ట్రెక్కింగ్, నేచర్ ట్రయల్, బర్డ్ వాచింగ్ ఉంటాయన్నారు. సాయంత్రం స్నాక్స్, రాత్రి భోజనం, ఉదయం టిఫిన్ అందిస్తామన్నారు. ఆదివారం ఉదయం 6 గంటల నుంచి 9.30 గంటల వరకు ఫారెస్ట్ ట్రెక్ పార్కులో బర్డ్ వాక్లో పిల్లలు, పెద్దలు పక్షుల జాతులను గుర్తించవచ్చని పేర్కొన్నారు. ఆసక్తి గల వారు 73823–07476, 94935–49399లను సంప్రదించాలని సూచించారు. (చదవండి: 'గోల్డెన్ కేర్': పెద్దలకు భరోసా..!) -
లిపోప్రొటీన్(ఎ)తో గుండెకు ప్రమాదం..!
గుండె జబ్బులకు ప్రధానంగా కారణమయ్యే జన్యు ఆధారిత సమస్య లిపోప్రొటీన్(ఎ) పై అవగాహన లోపం శాపమవుతోందని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రముఖ ఔషధ సంస్థ నవార్టిస్ బుధవారం నిర్వహించిన అంతర్జాతీయ వెబినార్లో నగరానికి చెందిన పలువురు వైద్యులు పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఏటా 1.8 కోట్ల మంది గుండె జబ్బులతో మరణిస్తుంటే అందులో 5వ వంతు భారతీయులే ఉండటానికి కారణం లిపోప్రొటీన్(ఎ) అని వీరు స్పష్టం చేశారు. మన దేశీయుల్లో 34% మందికి లిపోప్రొటీన్(ఎ) స్థాయి అధికం కాబట్టి ముందస్తు రక్తపరీక్షల ద్వారా దీన్ని గుర్తించడం కీలకమని అపోలో ఆస్పత్రి కార్డియాలజీ డైరెక్టర్ డాక్టర్ ఏ.శ్రీనివాస్ కుమార్ స్పష్టం చేశారు. ఈ లిపోప్రోటీన్ రక్త నాళాల గోడలలో పేరుకుపోయి, LDL కొలెస్ట్రాల్ మాదిరిగానే ఫలకాలను ఏర్పరుస్తుంది. ఈ ఫలకాలు గుండె, మెదడు, మూత్రపిండాలు, ఊపిరితిత్తులు శరీరంలోని ఇతర భాగాల వంటి ముఖ్యమైన అవయవాలకు రక్త ప్రవాహాన్ని నిరోధిస్తాయి. ఫలితంగా గుండెపోటు, స్ట్రోకులు, ఇతర హృదయ సంబంధ వ్యాధులు వస్తాయి.కేవలం రక్తపరీక్షతో పెను ప్రమాదాన్ని నివారించవచ్చనే విషయం చాలా మందికి తెలీదని హార్ట్ హెల్త్ ఇండియా ఫౌండేషన్ వ్యవస్థాపకులు రామ్ ఖండేల్వాల్ అన్నారు. ఈ సందర్భంగా సాధారణ ఆరోగ్య కార్యక్రమాల్లో లిపోప్రొటీన్(ఎ) పరీక్షను భాగం చేయాలని ప్రభుత్వాలను వైద్యులు కోరారు. (చదవండి: పేదల కళ్యాణ వేదిక..! 150 మంది దాక..) -
అమ్మ స్ఫూర్తి..
‘మనలో శక్తి ఎంత ఉందో నడిచి వచ్చిన మన మార్గమే చూపుతుంది’ అంటారు డాక్టర్ సాయిలత. కర్ణాటకలోని హోస్పేట్లో డాక్టర్గా పని చేస్తున్న సాయిలత కర్నూలు వాసి. ఒంటరిగా తల్లి పడుతున్న కష్టాన్ని అర్థం చేసుకుంటూ, ఆర్థిక స్థోమత లేక పోయినా పెద్ద కలను నెరవేర్చుకునే ప్రయత్నంలో పట్టుదలతో కృషి చేసి డాక్టర్గా ఎదిగారు. సేవామార్గాన్నీ వదలకుండా అమ్మాయిల ఆరోగ్య జీవన విధానానికి, విద్యార్థులకు చెప్పాల్సిన విషయాల్లో బోధకురాలిగా తన జీవన ప్రయాణాన్ని మెరుగ్గా మలుచుకున్నారు. ఆ వివరాలు సాయిలత మాటల్లోనే...‘‘ఈ రోజు గైనకాలజిస్ట్గా సేవలందించే స్థాయికి రావడం అంత సులువుగా కాలేదు. నేను పుట్టి పెరిగింది కర్నూలులో. సింగిల్ మదర్గా మా అమ్మ నన్నూ చెల్లెలిని పోషించడానికి చాలా కష్టపడేది. రిసెప్షనిస్ట్గా, గోడౌన్ ఇన్చార్జిగా.... చిన్న చిన్న ప్రైవేట్ జాబులు చేస్తూ ఉండేది. అమ్మ కష్టం చూస్తుంటే చాలా బాధ అనిపించేది. కానీ, నాకేమో డాక్టర్ అవాలని కల. అమ్మ నా ఆలోచనను నిరుత్సాహపరచలేదు. ‘అభయం’తో...టెన్త్లో మంచి మార్కులు వచ్చాయి. మేం పెద్దవుతుంటే ఖర్చులు కూడా పెరుగుతున్నాయి. కాలేజీ ఫీజులు కట్టే స్థోమత లేదు. ఇప్పుడెలా... అనుకుంటున్నప్పుడు హైదరాబాద్లో ఉన్న ‘అభయ’ స్వచ్ఛంద సంస్థ గురించి తెలిసింది. వాళ్లను కలిస్తే, ఫీజులకు సాయం చేశారు. ఆ తర్వాత ఎమ్సెట్ రాస్తే వచ్చిన ర్యాంకుకు రిజర్వేషన్లు లేక పోవడం వల్ల సీటు రాలేదు. దాంతో లాంగ్టర్మ్ కోచింగ్కి సాయం కోసం వెతుకుతుండగా ఈ విషయం తెలిసి, అభయ ఫౌండేషన్ వాళ్లే పిలిపించి మరీ లాంగ్ టర్మ్ కోచింగ్కు సాయం చేశారు. ఆ యేడాది మంచి ర్యాంకు తెచ్చుకున్నాను. అనంతపూర్ మెడికల్ కాలేజీలో ఫ్రీ సీటు వచ్చింది. ఎంబీబీఎస్ పూర్తి చేశాను. ఆ తర్వాత పీజీ కోర్సుకు ఏడాది కోచింగ్ తీసుకున్నాను. ఆలిండియా నీట్లో ర్యాంకు వచ్చింది. మహారాష్ట్ర అకోలా మెడికల్ కాలేజీలో పీజీ పూర్తి చేశాను. స్కాలర్షిప్స్ వచ్చాయి. సంస్థ నుంచి సాయం అందింది. నా క్లాస్మేట్, పీడియాట్రిషియన్ డాక్టర్ తిరుమలేశ్తో నా పెళ్లి జరిగింది. మా అత్తగారిది కర్ణాటకలోని హోస్పేట్. దాంతో మేమిద్దరం కలిసి, అక్కడే క్లినిక్ నడుపుతున్నాం. పండక్కి హైదరాబాద్లో ఉంటున్న అమ్మ లక్ష్మి, చెల్లెలు ధరణిల వద్దకు వచ్చాను. మాకోసం ఎంతో కష్టపడిన అమ్మకు విశ్రాంతి కల్పించాను.సేవా మార్గం...ఉంటున్న చోటనే డాక్టర్గా వృత్తిని కొనసాగిస్తూ, గర్ల్ సేఫ్టీ గురించి అవగాహనా తరగతులు తీసుకుంటున్నాను. నెలసరి సమయంలో ఎలా ఉండాలి, రక్తహీనత, థైరాయిడ్, అధికబరువు, గర్భధారణ.. ఇలా చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు మహిళల్లో ఉండే ఆరోగ్య సమస్యలు, వాటి పైన సెషన్స్ చెబుతూనే ఆన్లైన్ ద్వారా స్టూడెంట్స్కు ఆరోగ్యం, పరిశుభ్రత, ఆహారం మొదలైన విషయాలపైనా గైడెన్స్ ఇస్తుంటాను. ప్రైమరీ, ప్రాథమిక పాఠశాలలకు వెళ్లి, అమ్మాయిలకు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి వివరిస్తుంటాను. ఆత్మవిశ్వాసాన్ని ఎలా పెంచుకోవాలి, అమ్మాయిల రక్షణకు సంబంధించిన విషయాలు నృత్య, నాటకాల ద్వారా చెబుతుంటాను ‘అభయ’ వల్ల నా జీవితానికి మార్గం ఏర్పడింది. అందుకు నా వంతుగా తిరిగి ఆ సంస్థకు ఉన్న 30 సెంటర్లలోని టీచర్లకు గైడెన్స్ ఇస్తుంటాను. హెల్త్ క్యాంపుల్లో ఉచిత సేవలు అందిస్తుంటాను.నాలుగు గోడల మధ్య ఏమీ తెలియని ప్రపంచం నుంచి బయల్దేరిన నాకు ఈ రోజు కొన్ని వందలమందికి అవగాహన కలిగించే స్థాయి లభించింది. ఈ ప్రయాణంలో అమ్మ కష్టం, అభయ అందించిన సాయం నన్ను నిలబెట్టాయి. అవకాశాలు వచ్చినప్పుడు అందిపుచ్చుకోవడంతో పాటు, వాటిని సరిగ్గా సద్వినియోగం చేసుకోవాలన్నది నా జీవన ప్రయాణం నేర్పిన పాఠం. శక్తి మనలో ఉందని గుర్తిస్తే ఎదగడానికి మద్దతు కూడా లభిస్తుంది. ప్రయాణంలో మనకు శక్తిగా నిలిచినవారికి తిరిగి మన శక్తిని అందించినప్పడు ఆ ఆనందం గొప్పగా ఉంటుంది’’ అని వివరించారు ఈ డాక్టర్. – నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
ఆ టీనేజర్ స్థైర్యానికి హ్యాట్సాఫ్ అనాల్సిందే..! ఆమె కథ వింటే కన్నీళ్లు ఆగవు..
ఆమె అందరిలా ఆడుతూ పాడుతూ జీవించలేదు. తన వయసు పిల్లలతో సరదా ఆటలు ఆడలేపోయింది. అయినా జీవితాన్ని ఆస్వాదించడం ఎలాగే నేర్చుకుంది. తన జీవితాన్ని కబళించాలని చూసిన వ్యాధికే చుక్కులు చూపించేలా జీవించింది. బాధించే వ్యాధిని ఉన్నతంగా జీవించేందుకు మార్గంగా మలుచుకోవడం ఎలాగో తన సోషల్ మీడియా పోస్ట్లతో చెప్పి..అందరినీ కదిలించింది, ఆలోచించేలా చేసింది. ఆ మహ్మమ్మారిపై ఆ టీనేజర్ చేసిన పోరాటం వింటే కన్నీళ్లు ఆగవు. మరణమే శోకించేలా బతికి చూపించి..తనలా కేన్సర్తో పోరాడుతున్న వాళ్లకి ఆదర్శంగా నిలిచింది.ఆ అమ్మాయే అమెరికాలోని విస్కాన్సిన్కు చెందిన 14 ఏళ్ల జుజా బీన్. అందరిలా సరదాగా ఆడుతూ పాడుతూ ఉండాల్సిన మూడేళ్ల ప్రాయానికే కేన్సర్ బారిన పడింది. ఏదోలా చికిత్సలు తీసుకుని కోలుకుంది అనేలోపు మరోసారి అంటే ఎనిమిదేళ్ల ప్రాయంలో మరోసారి ఆ మహమ్మారి బారిన పడింది. ఇలా చిన్న పిల్లలో రావడం అత్యంత అరుదు. దీని కారణంగా బాల్యమంతా ఆస్పత్రుల చుట్టు, చికిత్సలు తీసుకోవడంతోనే సరిపోయింది ఆమెకు. అయితేనేం ఈ మహ్మమ్మారి పెడుతున్న ట్రబుల్స్కి ఆ టీనేజర్ జీవితం విలువ ఏంటో తెలుసుకోగలిగానూ, మంచి జీవితాన్ని ఆస్వాదించడం నేర్చుకున్నాని, సోషల్ మీడియా పోస్ట్లో రాసుకొచ్చి..అందర్నీ ఆశ్చర్యపోయాలా చేయడమే కాదు..జీవితం గొప్పదనం ఏంటో తెలుసుకునేలా చేసిది. అంతేగాదు జీవితం పరమార్థం అంటే ఏంటో తన కేన్సర్ పోరాటంతో ఎదుర్కొన్న వాటిని ప్రస్తావిస్తూ..నెటిజన్లే ఇంప్రెస్ అయ్యేలా చేసింది. అంతేగాదు ఆ పోస్టుల్లో ఆమె చికిత్సలు తీసుకునే విధానం, ఎదుర్కొంటున్న బాధలను వివరిస్తూ..స్ఫూర్తిదాయకంగా మాట్లాడే మాటలు ఎందరినో కదిలించాయి. ఆమె బతకాలని ఆకాంక్షించలా ఆశీర్వాదాలు వెల్లువెత్తాయి కూడా. కానీ అవేం ఆ విధి ముందు ఫలించలేదు. చివరికి కేన్సర్తో పోరాడుతూనే 14 ఏళ్లకే చనిపోయింది జూజూ. రెండు వారాల క్రితం ఆమె చేసిన పోస్ట్ ఇప్పటికీ నెటిజన్ల ముందు కదలాడుతుంది. ఆ పోస్ట్లో ఏ రాసిందంటే..తాను గనుక ఈ మహమ్మారి నుంచి బయటపడితే..ఈ సెప్టెంబర్ మాసం, బాల్య కేన్సర్ అవగాహన నెలగా పాటిస్తారు. కావున తాను ఈ వ్యాధిపై అవగాహన కల్పించేలా తన కథను పంచుకుంటానని రాసింది. కానీ ఆ అమ్మాయి ఆ కోరిక తీరకుండానే మృత్యు ఒడికి వెళ్లిపోవడం అందర్నీ కంటతడిపెట్టేలా చేసింది. అంతేగాదు ఆమె తన కేన్సర్ పోరాట సమయంలో పెట్టన ఓ ఆసక్తికర పోస్టు ఎంత భావోద్వేగంగా ఉందంటే..అందరూ పొందే సాధారణ సౌకర్యాలకు కూడా ఆమె కృతజ్ఞతలు చెప్పుకొచ్చింది. రుచికరమైన భోజనం, మంచి డ్రెస్సింగ్ స్టైల్, జంతువులతో గడపడం వంటి వాటిని ఆ వ్యాధి నుంచి బయటపడ్డ కొన్ని రోజుల్లోనైనా పొందగలిగా నేను గ్రేట్ అని చెప్పడం చూస్తుంటే మనసు చివుక్కుమంటుంది. కానీ జుజు ఉన్నన్నాళ్లు ఆరోగ్యంగా ఉండాలని కోరుకునేది, పైగా మరణ శాసనాన్నే మార్చేలా బతికేసాహసం చేసి అందరితచేత శెభాష్ అనిపించుకుంది కూడా. కాగా, జూజూ గత 11 ఏళ్లుగా అక్యూట్ మైలోయిడ్ లుకేమియా (AML) అనే రక్త క్యాన్సర్తో బాధపడుతోంది. ఏకంగా మూడు సార్లు ఎముక మజ్జ మార్పిడి చేయించుకుంది. ఇంత భారమైన బాధలో కూడా నెటిజన్లతో తన భావాలను పంచుకునేది. ఈ పరిస్థితిలో మీకు ఎలా అనిపిస్తుంటుందని ఒక నెటిజన్న అడిగిన ప్రశ్నకు..నా వయసు అమ్మాయిల మాదిరిగా లేకపోయాననే బాధ వెంటాడుతుంటుందని చెప్పి మారు మాట్లాడకుండా చేసింది. చిన్నగా ఉన్నప్పుడూ జుట్టు ఎందుకు రాలుతుందో తెలియలేదు. పెద్దఅయ్యాక లెక్కలేనన్ని సార్లు జుట్టు ఊడిపోవటంతో తాను సాధారణ అమ్మాయిని కాదని చమత్కరిస్తూ..కన్నీళ్లు వచ్చేలా చేసింది. ప్రస్తుతం జుజూ తల్లిదండ్రులు ఆమెలాంటి కేన్సర్ బాధితులకు చికిత్స అందేలా గో ఫండ్ వెబ్పేజ్లో సాయం అభ్యర్థిస్తుండటం విశేషం. మరో విశేషం ఏంటంటే ఆమె కేన్సర్ జర్నీ ఇన్స్టాగ్రామ్కి ఏకంగా ఒక మిలియన్కు పైగా ఫాలోవర్లు ఉన్నారు. (చదవండి: 'ధోలిడా' పాటకి అమెరికన్ ఇన్ఫ్లుయెన్సర్ స్టెప్పులు..!) -
వేదికపైనే గుండెపోటుతో కుప్పకూలిన పాపులర్ నటుడు
రాత్రి 8.30 గంటల ప్రాంతంలో రాంలీలా ప్రదర్శన జోరుగా సాగుతోంది. ఆధ్యాత్మిక పరవశంలో మునిగి వున్న చంబా చౌగన్ మైదానంలో చారిత్రాత్మక శ్రీరామలీలలో ఒక్కసారిగా కలకలం రేగింది. దశరథుడిగా నటిస్తున్న 73 ఏళ్ల వృద్ధ నటుడు ప్రదర్శన సమయంలో గుండెపోటుకు గురై వేదికపైనే కుప్పకూలిపోయాడు. ఆసుపత్రికి తరలించేలోపే ప్రాణాలొదిలేసిన వైనం తీవ్ర విషాదాన్ని నింపింది. హిమాచల్ ప్రదేశ్లో మంగళవారం రాత్రి ఈ దుర్ఘటన చోటు చేసుకుంది.స్థానిక పాపులర్ నటుడు అమ్రేష్ మహాజన్(శిబు) వేదికపైనే కుప్పకూలిపోయాడు. హిమాచల్ ప్రదేశ్లోని చంబాలోని శ్రీరాంలీలాలో దశరథుడిగా నటిస్తున్న అమ్రేష్ మహాజన్ సింహాసనంపై ఉండి డైలాగులూ చెబుతూనే ఋషి పాత్ర నటిస్తున్న సహనటుడి భుజంపై వాలిపోయాడు. అంత సీనియర్ నటుడు తనపై వాలిపోవడంతో సహనటుడికి తొలుత ఏమీ అర్థం కాలేదు. పదంటే పది సెకన్లలో ఏమి జరిగిందోగ్రహించి సహాయం కోసం అర్థించడం, అతడిని ఆసుపత్రికి తరలించడం జరిగింది. కానీ అప్పటికే ఆయన జీవిత నాటకానికి తెరపడిపోయింది. దీంతో సహ నటులు , ప్రేక్షకులు షాక్కు గురయ్యారు. A man playing the role of King Dashrath collapsed and died on stage during the Ramleela in Chamba district of Himachal Pradesh. pic.twitter.com/6bThTX2LIk— Piyush Rai (@Benarasiyaa) September 24, 2025 మొఘలా మొహల్లా నివాసి గత 40 సంవత్సరాలుగా చారిత్రాత్మక వేడుకల్లో పాల్గొంటున్నాడు. శ్రీరామలీలాలో సాధారణంగా ఆయన రాముడి తండ్రి దశరథుడిగా లేదా రామాయణంలో మరో కీలక కేరెక్టర్ రావణుడి పాత్రలను పోషించేవాడు. వయసు మీద పడినప్పటికీ, ప్రతీ ఏడాదిరిహార్సల్స్ చేసి మరి గొప్ప ప్రదర్శనలో ప్రదర్శన ఇచ్చేవాడు. ఈ ఏడాది కూడా అదే ఉత్సాహంలో ఉన్నారు. అయితే యాదృచ్చికంగా న చివరి రాంలీలా అవుతుందని, దీని తర్వాత తాను తప్పుకుంటానని నిర్వాహకులకు చెప్పినట్లు తెలుస్తోంది. దురదృష్టవశాత్తూ అదే చివరి ప్రదర్శన అయింది.మహాజన్ వేదికపైనే ఆకస్మికంగా మరణించడం తమకు దిగ్భ్రాంతి కలిగించిందని చంబాలోని శ్రీ రామ్ లీలా క్లబ్ అధ్యక్షుడు స్వపన్ మహాజన్ విచారం వ్యక్తం చేశారు. గత ఏడాది ఢిల్లీలోని షాదరాలో రామ్లీలా ప్రదర్శన సందర్భంగా రాముడి పాత్ర పోషించిన నటుడు సుశీల్ కౌశిక్ గుండెపోటుతో ఛాతీని గట్టిగా పట్టుకుని, వేదికపైనుంచి బయటకు వెళ్లి కుప్పకూలి మరణించిన సంగతి తెలిసిందే. -
ఔషధాలకు లొంగని అధిక రక్తపోటు..! సర్వేలో షాకింగ్ విషయాలు
ఇటీవలకాలంలో చాలామంది ఔషధాలకు లొంగని రక్తపోటుతో బాధపడుతున్నారు. అంతేగాదు ఇండియా హైపర్టెన్షన్ కంట్రోల్ ఇనిషియేటివ్ ప్రకారం..సుమారు 20 కోట్ల మందికి పైగా అధిక రకపోటుతో బాధపడుతున్నట్లు అంచనా. అందులో రెండు కోట్ల మంది ఈ సమస్యను నియంత్రణలో ఉంచుకున్నట్లు నివేదికల్లో తేలింది. ప్రస్తుతం ఇది అత్యంత అత్యవసర ప్రజారోగ్య సమస్యల్లో ఒకటిగా మారింది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ ఏఐజీ ఆస్పత్రి దీనిపై వర్క్షాష్ నిర్వహించింది. ఆ ఆస్పత్రి వైద్యులు దేశంలో క్రమంగా రెసిస్టెంట్ హైపర్టెన్షన్ క్రమంగా పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేయడమే అందుకు మంచి ఫలితాలనందిస్తున్న మూత్రపిండ నిర్మూలన చికిత్స(Renal Denervation - RDN) గురించి కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఈ మేరక సదరు ఆస్ప్రతి వైద్యులు ఈ రెసిస్టెంట్ హైపర్టెన్షన్(అధిక రక్తపోటు) కారణంగా తరచుగా తలనొప్పి, తలతిరగడం, ఊపిరి ఆడకపోవడం లేదా అప్పుడప్పుడు ఛాతీలో అసౌకర్యం వంటి లక్షణాలు కనిపిస్తాయని అన్నారు. అదీగాక కాలక్రమేణా, నిరంతరం పెరిగిన రక్తపోటు హృదయనాళ వ్యవస్థ, ఇతర ముఖ్యమైన అవయవాలపై ప్రభావం చూపి ప్రాణాంతక వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉందని హెచ్చిరించారు. అందువల్ల ముందుగా ఈ అధిక రక్తపోటుని 10 mmHg తగ్గించడం వల్ల గుండె జబ్బుల ప్రమాదాన్ని 20%, స్ట్రోక్ ప్రమాదాన్ని 27% మేర తగ్గించగలమని క్లినికల్ అద్యనాలు వెల్లడించాయని చెప్పారు. ఇప్పటి వరకు ఉపయోగిస్తున్న యాంటీహైపర్టెన్సివ్ మందులు చాలా మందికి ప్రభావవంతంగా ఉన్నప్పటికీ..గణనీయమైన సంఖ్యలో కొందరు రోగుల్లో ఈ నియంత్రణ కష్టంగా ఉందన్నారు. అలాంటి పేషెంట్లకు ఈ రీనల్ డెనర్వేషన్ (RDN) అనేది ఒక ఆశాజనకమైన చికిత్స అని చెప్పారు. అంతేగాదు ఆ చికిత్స పొంది.. మెరుగైన జీవితాన్ని అనుభవిస్తున్న రోగుల గురించి కూడా ఈ వర్క్షాప్లో వివరించారు.ఈ నియంత్రణలేని అధిక రక్తపోటు గుండెపోటు, స్ట్రోక్, మూత్రపిండాల వ్యాధి ప్రమాదాన్ని పెంచడమే కాకుండా అధిక ఆరోగ్య సంరక్షణ ఖర్చులు భారాన్ని మోపడమే గాక, ఆస్పత్రి పాలయ్యేలా చేస్తుందని నొక్కి చెప్పారు. అందువల్ల ముందుగానే ఈ అధిక రక్తపోటును ఆర్డీఎన్ వంటి చికిత్సలతో మెరుగుపరుచుకుంటే ఆరోగ్య సంరక్షణకు సంబంధించిన ఆర్థిక భారం తగ్గడమే కాకుండా ఆరోగ్యకరమైన జీవితాన్ని ఆస్వాదించగలుగుతామని అన్నారు వైద్యులు. (చదవండి: 'ఆ వయసులోనూ ఇంత అందంగానా'..? విస్తుపోయిన బరాక్ ఒబామా) -
'ఆ వయసులోనూ ఇంత అందంగానా'..? విస్తుపోయిన బరాక్ ఒబామా
సుదీర్ఘకాలం బతికి రికార్డులు సృష్టించి వృద్ధుల గురించి వార్తల్లో తెలసుకోవడమే గానీ నేరుగా చూసిన దాఖలాలు ఉండవు. కానీ అగ్రరాజ్యం మాజీ అధ్యక్షుడు అలాంటి వృద్ధురాలిని కలవడమే కాదు, ఆమెతో మాటలు కలిపారు. అయితే ఒబామా- బామ్మతో సంభాషించిన మాటలు నెట్టింట హాట్టాపిక్గా మారాయి. ఇంతకీ ఆయనేం మాట్లాడారంటే..102 ఏళ్ల సుసాన్ అనే బామ్మని కలిసి ఆమెతో మాటలు కలిపారు. ఆమెను చూడగానే ఒబామా మీరు ఈ వయసులో ఇంత అందంగా కనిపించడంలోని సీక్రేట్ ఏంటని నేరుగా ప్రశ్నించారు. అందుకు ఆమె చిరునవ్వే సమాధానంగా నవ్వి ఊరుకుంది. ఆ తర్వాత ఒబామా నేను మిమ్మల్ని కలిసి ఏ అడగాలనుకుంటున్నానో మీకు తెలుసు అని నవ్వేశారు. అయినప్పటికీ అడుగుతున్నా..ఇంతటి వృద్ధాప్యంలోనూ అందంగా ఉన్న మిమ్మల్ని కలవడం చాలా సంతోషంగా ఉంది . అయితే ఇంతలా ఆరోగ్యంగా ఉండేందుకు మీరు ఏం తింటారు. బహుశా మీ డీఎన్ఏ మంచిదేమో అంటూ చమత్కిరించారు. దానికి ఆ వృద్ధురాలు సుసాన్ నవ్వుతూ.. ఆకుకూరలు, కార్న్ బ్రెడ్ అని మెల్లిగా చెప్పింది. ఆ వృద్ధురాలని పర్యవేక్షించే ఆమె కూడా ఆ సంభాషణలో జోక్యం చేసుకుంటూ..ప్రతి ఉదయం బేకన్ అని చెప్పింది. అందుకు ఒబామా ఒక్కసారిగా నవ్వేశారు. బహుశా ఇది డాక్టర్లు సూచన కదూ అని చమత్కరించారు. చివరగా ఆ వృద్ధురాలు మీరు నన్ను చూడటానికి వచ్చినందుకు కృతజ్ఞుతురాలిని అని హృదరపూర్వకంగా అందామె. ఇక ఒబామా ఆమెకు వీడ్కోలు చెబుతూ..ఆమె చేతిని ముద్దుపెట్టుకున్నారు. అలాగే ఇలాంటి వ్యక్తులను కలవడం అస్సలు మిస్ అవ్వను అని ఆమెకు చెబుతూ నిష్క్రమించారు. అందుకు సంబంధించిన వీడియోకి ఒబామా "102 ఏళ్ల వయసులో నేను కూడా మీ అంత అందంగా ఉండాలని కోరుకుంటున్నా" అనే క్యాప్షన్ని జోడించి మరి పోస్ట్ చేశారు. Susan, I hope I look as good as you at 102! pic.twitter.com/01CSm85krS— Barack Obama (@BarackObama) September 22, 2025 (చదవండి: స్వచ్ఛమైన భక్తి' కోసం అలాంటి పాట..! ప్రదాని మోదీ ఆసక్తికర ట్వీట్) -
మెరిసిందని మురిసిపోవద్దు...ఈ జాగ్రత్తలు మస్ట్
చాలామంది హెయిర్–డై లను జుట్టు నలుపు చేసుకోడానికే ఉపయోగిస్తుంటారు. కానీ మరికొందరు మాత్రం జుట్టు నలుపు రంగులోనే ఉన్నప్పటికీ దాన్ని మరింత ఫ్యాషనబుల్గా తీర్చిదిద్దుకోవడం కోసం రంగులు వేసుకుంటారు. ఇలా ఫ్యాషనబుల్గా గ్రూమింగ్ చేసుకునే సమయంలో వారు వెంట్రుకల చివర్లను ఎర్రగా మార్చుకునేందుకూ, మరికొందరు మధ్యమధ్యన యూనిఫామ్గా కొన్ని పాయలు ఆకర్షణీయమైన రంగులూ, రకరకాల షేడ్స్లో కనిపించేలా... ఇలా హెయిర్–డైని వేర్వేరు ప్రయోజనాలకోసం వాడుతుంటారు.ఇటీవల చాలా చిన్నవయసులోనే హెయిర్ డై వాడాల్సిన అవసరం వస్తోంది. మరికొందరికైతే పాతికేళ్లు, ముప్ఫై ఏళ్లకే జుట్టు తెల్లబడుతోంది. ఇంకొందరి విషయంలో జుట్టు తెల్లబడకపోయినా... వెంట్రుకలను మరింత ఆకర్షణీయం చేసుకునేందుకు... వెంట్రుక చివర్లలోగానీ లేదా జుట్టు పాయల్లో అక్కడక్కడా ఎరుపు లేదా ఇతర రంగుల షేడ్స్ను పార్లర్లలోవాడటం జరుగుతోంది. హెయిర్ డై లు కొనేప్పుడు ఎలాంటి వాటిని ఎంపిక చేసుకోవాలి, వాటితో వచ్చే సాధారణ ప్రమాదాలు, ఆ ముప్పునుతప్పించుకోడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు,పాటించాల్సిన కొన్ని సాధారణసూచనలు... ఇలాంటి అనేక విషయాలపై అవగాహన కోసం ఈ కథనం...తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఎలర్జీలుసరిపడుతోందా అనే అంశాన్ని పరిశీలించుకోవడం : మొదటిసారి హెయిర్–డై వాడేవారు అది తమకు సరిపడుతుందా లేదా అన్నది పరీక్షించుకోవాలి. కొద్దిపాటి రంగు పూసుకుని, 48 గంటల పాటు వేచిచూశాక ఏ ముప్పూ లేదా ప్రతికూల పరిణామాలు కనిపించకపోతే దాన్ని సురక్షితంగా వాడుకోవచ్చు. ఒకవేళ ఆ బ్రాండ్ హెయిర్–డై కారణంగా ఏవైనా అలర్జిక్ లక్షణాలు కనిపిస్తుంటే మాత్రం దానికి దూరంగా ఉండటమే మేలు. ఎవరు ఎలాంటి హెయిర్–డై వాడుతున్నప్పటికీ, వీలైనంతలో మన బడ్జెట్లోనే కాస్తంత నాణ్యమైనది ఎంచుకోవడమే మేలురంగు వేసుకునే సమయంలో హెయిర్–డైను ఎట్టిపరిస్థితుల్లోనూ కళ్ల మీదికి జారనివ్వకూడదు. బాగా పలచగా ఉండే కొన్ని రకాల హెయిర్–డైలతో ఈ తరహా ముప్పు ఎక్కువగా ఉంటుంది. పలచగా ఉండే హెయిర్డైల విషయంలో అప్రమత్తంగా ఉంటూ ఈ జాగ్రత్తను తప్పక పాటించాలి. హెయిర్–డై తాలూకు ఘాటైన వాసన వల్ల శ్వాస సరిగా తీసుకోలేకపోవడం గానీ లేదా ఆయాసం రావడంగానీ జరుగుతుంటే... దాని వాసన తగలకుండా ముక్కుపై శుభ్రమైన గుడ్డతో కవర్ చేసుకోవాలి లేదా మందపాటి మాస్క్ ధరించడం మేలు. హెయిర్–డై పూయడాన్ని కేవలం తలకు మాత్రమే పరిమితం చేయాలి. కనుబొమలకూ ఎట్టిపరిస్థితుల్లోనూ హెయిర్డై వాడకూడదు, కనురెప్పల వరకు దాన్ని జారనివ్వకూడదు.గిన్నెలో కలుపుకున్న హెయిర్ డైలోకి మనం ఎంచుకున్న బ్రష్ను పైపైనే ముంచుతూ... కొద్ది కొద్ది మోతాదుల్లోనే బ్రష్కు రంగు అంటేలా హెయిర్డైను తీసుకుంటూ జుట్టుకు జాగ్రత్తగా రాయాలి. పెద్దమొత్తంలో హెయిర్డైను బ్రష్ మీదకు తీసుకోవడం అంత మంచిది కాదు. ఎందుకంటే పెద్దమొత్తంలో బ్రష్ మీదకు రంగును తీసుకోవడం వల్ల అది పక్కలకూ లేదా కంటిలోకి కారే ప్రమాదం ఉంది. పక్కలకు కారిన రంగు కాస్త ఇబ్బందికరంగా కనిపించవచ్చు. కానీ అది కంటిలోకి జారితే ప్రమాదం. కొన్ని రకాల హెయిర్ డై లోని రసాయనాలు కంటికి హాని చేసే అవకాశముంటుంది. హెయిర్డై కళ్లలోకి స్రవించినప్పుడు కళ్లు విపరీతంగా మండటం, కళ్లు ఎర్రబారడం, కళ్లకు ఇన్ఫెక్షన్ రావడమూ జరగవచ్చు. హెయిర్ డైలోని రసాయనాలు వెంట్రుకలోకి ఇంకిపోయి, వెంట్రుకతో ఒక రకమైన రసాయనిక చర్య జరపడం ద్వారా జుట్టును నల్లబారుస్తాయి. అవే రసాయనాలు వెంట్రుకను బిరుసెక్కేలాగా చేస్తాయి కూడా. అందుకే చాలాకాలంగా హెయిర్–డై వాడేవాళ్ల వెంట్రుకలు కాస్తంత రఫ్గానూ, తేలిగ్గా విరిగిపోయేలా (బ్రిటిల్గా) ఉండటం గమనించవచ్చు. కొందరు మహిళల్లో హెయిర్ స్ట్రెయిటెనింగ్ చేసుకుంటూ రంగు వేసుకునేవాళ్లుంటారు. అలాంటి వాళ్లలో ఈ తరహా ముప్పు మరింత స్పష్టంగా కనిపిస్తుంటుంది.కృత్రిమంగా తయారు చేసే ప్రతి హెయిర్ డైలోనూ తారు (కోల్తార్), పీపీడీ (పారాఫినైలీన్ డై అమైన్– ఇదే రంగును కల్పించే ప్రధాన రసాయనం) వంటి రసాయనాలు ఉంటాయి. ఆ రసాయనాల కారణంగా చాలా చాలా అరుదుగా కొన్ని రకాల క్యాన్సర్ల ముప్పునకు అవకాశం ఉంది. కాబట్టి రసాయనాలు కలిగి ఉండే హెయిర్–డై లకు బదులుగా వెజిటబుల్ హెయిర్ కలర్స్గానీ, మెడికేటెడ్ హెయిర్ కలర్స్ గానీ వాడుకోవడం సురక్షితం. హెయిర్ డైతో కనిపించే కొన్ని సాధారణ ముప్పులు... అలర్జీ కారణంగా: హెయిర్ డైలో ఉండే రసాయనాలల్లోని కొన్ని కెమికల్స్ కొందరి చర్మానికీ లేదా వాళ్ల జుట్టుకు సరిపడక పోవచ్చు. దాంతో ఆ హెయిర్ డై వాడకం వల్ల వాళ్లలో అలర్జీ వంటి దుష్పరిణామాలు కలగవచ్చు. ఫలితంగా చర్మం ఎర్రబారడం, దురదపెట్టడం, ఒంటి మీద ఎర్రటి దద్దుర్లు (ర్యాష్), డై తగిలిన చోట కొద్దిపాటి వాపు, మంట వంటివి కనిపించవచ్చు.కళ్లూ, పెదవులకూ లేదా దేహమంతటా వాపురావడం : కొన్ని సందర్భాల్లో రంగు తలకు మాత్రమే పెట్టుకున్నప్పటికీ కళ్లవాపు, పెదవులు ఉబ్బినట్లుగా వాచడం లేదా మొత్తం దేహమంతటికీ వాపు రావడం వంటి దుష్ప్రభావాలూ కనిపించవచ్చు. ఇలాంటి పరిణామాలు చోటుచేసుకుంటే బాధితులను వీలైనంత త్వరగా హాస్పిటల్కు తీసుకెళ్లి డర్మటాలజిస్ట్కు చూపించాలి.రసాయనాల కారణంగా కళ్లమంట : కొన్ని సందర్భాల్లో హెయిర్డైలో ఉండే రసాయనాల కారణంగా కళ్లు విపరీతంగా మండటం, కళ్ల నుంచి నీరుకారడం, గొంతులో గీరుతున్నట్లుగా ఇబ్బంది కలగడం, ముక్కు నుంచి నీళ్లు కారడం, విపరీతంగా తుమ్ములు రావడం వంటి ఇబ్బందులు కలగవచ్చు.చదవండి: కొత్తకోడలిపై అమానుషం, గదిలో బంధించి పామునువదిలారుశ్వాస తీసుకోవడంలో ఇబ్బంది / ఆస్తమా : పై లక్షణాలు కనిపించిన కొందరిలో ఆ సమస్యల తీవ్రత చాలా ఎక్కువగా ఉండి, శ్వాసతీసుకోవడంలో వాళ్లకు తీవ్రమైన ఇబ్బంది కలగవచ్చు. కొందరిలో ఇది ఒక్కోసారి ఆస్తమాకు సైతం దారితీయవచ్చు.అవే రసాయనాలుమరో సందర్భంలో ప్రతికూలంగా... మొదట్లో చాలాసార్లు సురక్షితంగా వాడిన ఆ రసాయనాలే, చాలా ఏళ్లు గడిచాక కూడా ఇతర సందర్భాల్లో చాలా ప్రమాదకరంగా, అలర్జిక్గా పరిణమించవచ్చు. అందుకే రంగు వేసుకునే ప్రతిసారీ అదే మొదటిసారి అయినట్లుగా జాగ్రత్తగా ఉండాలి.డై వేసుకునే సమయంలో గోళ్లకు అంటనివ్వవద్దుజుట్టుకు హెయిర్ డై వేసుకునే సమయంలో ఆ రంగు గోళ్లకు అంటకుండా వీలైనంతగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే అది వెంట్రుక అయినా, గోరు అయినా కెరొటిన్ అనే పదార్థంతోనే తయారవుతుంది. అంటే వెంట్రుక, గోరు... ఈ రెండూ హెయిర్–డైలోని కెమికల్తో ఒకేలా రసాయనిక చర్య జరుపుతాయి. అందువల్ల పొరబాటున గోళ్లకు రంగు అంటుకుంటే... జుట్టులాగే గోరు కూడా నల్లగా మారుతుంది. అంటుకున్న రంగు అలాగే ఉండిపోతుంది. ఇదీ చదవండి: ఏడేళ్ల బాలుడికి రెండు నెలలుగా ఆగని వాంతులు..కట్ చేస్తే.!అయితే పొరబాటున గోళ్లకు అంటుకున్నప్పటికీ అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పెరుగుతున్న వెంట్రుకలు తమ మొదళ్లనుంచి తెల్లగా కనిపిస్తున్నట్టే... గోరు పెరుగుతున్న కొద్దీ రంగు అంటని భాగం తెల్లగా పెరుగుతూ వస్తుంది. దాంతో పెరిగిన భాగాన్ని కట్ చేస్తున్న క్రమంలో దాదాపు మూడు నెలల వ్యవధిలో నల్లగా మారిన గోరు పూర్తిగా తొలగిపోతుంది. పై కారణాల వల్ల జుట్టుకు అంటుకున్న రంగు ఎప్పటికీ ఉన్నట్లే గోరుకూ అంటుకు΄ోయే ప్రమాదం ఉన్నందున గోళ్ల విషయంలో కాస్తంత జాగ్రత్తగా ఉండటం అవసరం.గర్భవతుల విషయంలో : మంచి పేరున్న, నాణ్యమైన హెయిర్–డైతో చాలావరకు కడుపులో ఉన్న పిండంపై గానీ లేదా తల్లికి గానీ చాలావరకు ఎలాంటి ప్రమాదమూ, ముప్పూ లేకపోయినప్పటికీ... వీలైనంతవరకు ప్రసవం వరకు హెయిర్ డై ఉపయోగించకపోవడమే మంచిది. చివరగా... హెయిర్ డైతో అందం ఇనుమడిస్తుంది. ఫ్యాషనబుల్ లుక్ వస్తుంది. అయితే వాటికోసం ఆరోగ్యానికీ, కళ్లకూ ముప్పు కలిగించేంత మూల్యం చెల్లించడం సరికాదని గుర్తించాలి. హెయిర్–డైని వీలైనంత ప్రమాదరహితంగా ఉపయోగించాలని గుర్తుంచుకోవాలి. డా. స్వప్నప్రియ, సీనియర్ డర్మటాలజిస్ట్, హైదరాబాద్.నిర్వహణ: యాసీన్ -
Sagubadi: మునగ మేలు!
సాంప్రదాయ పంటలు పండించే చాలా మంది రైతుల నికరాదాయం ఎకరానికి రూ.20 వేలకు మించటం లేదు. పత్తి, మొక్కజొన్నకు బదులుగా మునగ సాగు చేస్తే సన్న, చిన్నకారు రైతుల నికరాదాయం పెరుగుతుంది. 3 సంవత్సరాలలోపు ఆయిల్పామ్ తోటల్లో అంతర పంటగా కూడా మునగను సాగు చేసుకోవచ్చు. వాతావరణ ఒడిదుడుగులను తట్టుకోవటానికి మునగ దోహద పడుతుంది. నాటిన 7–8 నెలల్లో తొలి పంట కోతకు వస్తుంది. మూడేళ్లలో వరుసగా కనీసం 5 కార్శి పంటలు తీసుకోవచ్చు. మునగ ఆకుల పొడి, గింజల ద్వారా అదనపు ఆదాయం సమకూర్చుకోవచ్చు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డా. టి. భరత్, ఉద్యాన శాస్త్రవేత్త బి. శివ, విస్తరణ శాస్త్రవేత్త డా. ఎన్. హేమ శరత్ చంద్ర మునగ సాగుపై అందించిన పూర్తి వివరాలు.పోషకాల గనిగా పేరు తెచ్చుకున్న మునగ రైతుల పాలిట కల్పవృక్షంగా విరాజిల్లుతున్నది. తినే వారికి ఆరోగ్యం, పండించే వారికి లాభాలు అందిస్తోంది. తక్కువ పెట్టుబడితోనే అధిక దిగుబడులందిస్తూ.. అన్నదాతల ఇంట సిరులు కురిపిస్తున్నది. మునగ చెట్టులో ప్రతీ భాగం ఉపయోగకరమైనదే. ఆకులు, కాయలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటి విత్తనాలను ఔషధ పరిశ్రమలలో వాడతారు. అందుకే, వీటికి మార్కెట్లో భారీ డిమాండ్ ఉంటుంది. ఆరోగ్యపరంగానే కాకుండా, వ్యాపారపరంగానూ మునగను సాగు చేసేవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఏ నేలలైనా ఓకేఅన్ని రకాల నేలల్లో మునగను సాగు చేసుకోవచ్చు. ఉదజని సూచిక 6.5–8 శాతం ఉండే ఇసుక రేగడి నేలలు ఎక్కువ అనుకూలంగా ఉంటాయి. నీరు నిలవని ఎర్ర, ఇసుక, ఒండ్రు నేలలు అనుకూలమైనవి. నీటి వసతి గల సారవంతమైన భూముల్లో అధిక దిగుబడి సాధించవచ్చు. ఆరు నెలల్లోనే కాతకు వచ్చే ఏకవార్షిక రకాలు అందుబాటులోకి వచ్చాయి. చదవండి: ఏడేళ్ల బాలుడికి రెండు నెలలుగా ఆగని వాంతులు..కట్ చేస్తే.!అక్టోబర్ వరకు విత్తుకోవచ్చుమునగ విత్తనంతో మొక్కలు పెంచి, నాటుకోవాలి. జూలై నుంచి అక్టోబర్ వరకు విత్తుకోవచ్చు. ఏ సమయంలో విత్తినా వేసవిలోనే (జనవరి–ఏప్రిల్ మధ్యలో) పూతకు వస్తుంది. ఫిబ్రవరిలో ఎక్కువ పూత, కాత ఉంటుంది. ఒక ఎకరానికి వెయ్యి మొక్కలు నాటాలి. మొక్కలను ముందుగా నర్సరీల్లో పెంచాలి. పీకేఎం–1 మునగ రకం విత్తుకోవటం మేలు. పాలిథిన్ సంచుల్లో విత్తిన 15 రోజుల్లో మొలక వస్తుంది. మొక్కల మధ్య 1 మీ., వరుసల మధ్య 1.5 మీ. దూరంలో గుంతలు తీసుకోవాలి. అర ట్రక్కు పశువుల ఎరువుకు రెండు బస్తాల వేపపిండి, 10 కేజీల ట్రైకోడెర్మా కలపాలి. దీన్ని ప్రతి గుంతకు రెండు దోసెళ్ళు (ఒక కిలో), గుప్పెడు సూపర్ ఫాస్ఫేట్ వేయాలి. ప్రతి మొక్కకూ డ్రిప్ ద్వారా 135: 23: 45 గ్రాముల చొప్పున నత్రజని, భాస్వరం, పొటాష్ ఎరువులను అందిస్తే దిగుబడులు పెరుగుతాయి. నత్రజని, పొటాష్ ఎరువులను యూరియా, మ్యూరేట్ ఆఫ్ పొటాష్ రూపంలో డ్రిప్ ద్వారా అందించాలి. డ్రిప్ ద్వారా 10–15 లీ. నీరివ్వాలి. నాటిన తర్వాత 3, 6 నెలలకు నత్రజని ఎరువు వేయాలి. వాస్తవానికి మునగ మొక్కలకు ఎక్కువ ఎరువులు అవసరం ఉండదు. జీవన ఎరువులు కూడా వాడితే నేల సారం, నేల ఆరోగ్యం పెరిగి తెగుళ్ళు రాకుండా ఉంటాయి. బొంత పురుగులతో జాగ్రత్తమునగ కాండంపై బొంత పురుగులు గుంపులుగా చేరి, బెరడును తొలిచి తింటాయి. ఆకులను తొలిచేస్తాయి. దీంతో ఆకు విపరీతంగా రాలిపోతుంది. ఈ సమయంలో పురుగు గుడ్లను, లార్వాలను ఏరివేయాలి. వర్షాల తర్వాత పెద్ద పురుగులను నివారించడానికి హెక్టారుకు ఒక దీపపు ఎరను ఉంచాలి. వేపనూనె మందు ద్రావణం పిచికారీ చేస్తే మొక్కలపై పురుగులకు వికర్షకాలుగా పనిచేస్తాయి. ఈ పంటలతో మునగను కలపొద్దుఆయిల్ పామ్, పత్తి, కూరగాయ పంటల్లో అంతర పంటగా వేస్తే మునగ మొక్కలు ఎరువులు, నీరు ఎక్కువగా అంది చాలా ఏపుగా పెరుగుతాయి. కానీ, పూలు, కాయలు ఆలస్యంగా రావడం స్పష్టంగా గుర్తించాం. కాబట్టి, అంతర పంటగా వేసినప్పుడు మునగ మొక్కలకు ఎక్కువ నీరు, ఎరువులు అందకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కువ చీడపీడలు ఆశించే టమాటా, వంగ, మిర్చి పంటలను మునగలో అంతర పంటలుగా వేసుకోకూడదు. ఎరువులు, సస్యరక్షణ చర్యలు తక్కువ అవసరమయ్యే కూరగాయ పంటలను మాత్రమే వేసుకోవాలి. లేకపోతే మునగ దిగుబడి తగ్గిపోతుంది. పొలంలో మురుగు నీరు చేరకుండా చూసుకోవాలి.ఇదీ చదవండి: కొత్తకోడలిపై అమానుషం, గదిలో బంధించి పామునువదిలారుకత్తిరించిన 4–5 నెలల్లో మళ్లీ కాపుమునగ నాటిన మొదట్లో ప్రతి 2 నెలలకోసారి (6 నెలల్లో 3 సార్లు) విధిగా కొమ్మలు కత్తిరిస్తే.. కొమ్మలు గుబురుగా వచ్చి పూత, కాయల దిగుబడి ఎక్కువగా వస్తుంది. పక్క కొమ్మలు రాకుండా ఏపుగా బాగా ఎత్తు పెరిగితే పూత సరిగ్గా రాదు. భారీ వర్షాలు, ఈదురు గాలులకు మొక్కలు పక్కకు పడిపోయి విరిగిపోతాయి. మొదటి కాయ కోత తర్వాత భూమట్టం నుంచి 90 సెం.మీ. ఎత్తులో మొక్క కాండం, కొమ్మలను కత్తిరించాలి. దీంతో 4–5 నెలల్లో చెట్టు మళ్లీ కాపుకొస్తుంది. మూడు సంవత్సరాల వరకు ఇలా 4–5 నెలల కొకసారి కార్సి పంటలను తీసుకోవచ్చు. కత్తిరించిన వెంటనే మొక్కకు 45, 15,30గ్రాముల చొప్పున నత్రజని, భాస్వరం, పొటాష్ ఎరువులు వేయాలి. 30 గ్రాముల చొప్పున నత్రజని, భాస్వరం, పొటాష్ ఎరువులు వేయాలి. ఏటా 25 కిలోల చొప్పున బాగా చివికిన పశువుల ఎరువు వేయాలి. మొక్కకు 150 కాయలుఒక ఎకరానికి 1,000 మొక్కలు నాటితే ప్రతి మొక్కకు కనీసం 150 కాయల చొప్పున 1,50,000 కాయలు కాస్తాయి. రూపాయికి 2 కాయల చొప్పున (ఒక కేజీకి రూ.5) స్థానికంగా అమ్మితే.. ఎకరానికి ఏడాదికి రూ.75,000 ఆదాయం వస్తుంది. మునగ ఆకులను కోసి ఎండ బెట్టి పొడి చేసి అమ్మొచ్చు. మునగ గింజలు/నూనె ద్వారా అదనపు ఆదాయం వస్తుంది.మునగ ప్రకృతి సేద్యం ఇలా..మునగ పంటను ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో సాగు చేస్తే ఖర్చులు తగ్గి, నేల ఆరోగ్యం మెరుగుపడి, మంచి దిగుబడులు వస్తాయి. ప్రకృతి వ్యవసాయ పద్ధతి మునగ సాగుకు బాగా అనుకూలం. భూమిని లోతుగా దున్ని సూర్య కాంతికి ఎండబెట్టాలి. గోతులు తవ్వి, ఎండిన ఆకుల చెత్త, పశువుల ఎరువు, ఘనజీవామృతం లేదా వర్మీ కంపోస్ట్ కలిపి గోతులను నింపాలి. సేంద్రియంగా సాగు చేసిన విత్తనాలను మాత్రమే వాడాలి. విత్తనాలను బీజామృతంలో శుద్ధి చేసిన 24 గంటల తర్వాత విత్తాలి. మొక్కలకు జీవామృతం లేదా గోమూత్ర ద్రావణం వాడాలి. ద్రవ జీవామృతాన్ని 15 రోజులకు ఒకసారి ఇస్తూ ఉండాలి. డ్రిప్ ద్వారా నీరివ్వాలి. వర్షాకాలంలో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. వేపనూనె, అగ్ని అస్త్రం, బ్రహ్మాస్త్రం వంటి కషాయాలను తయారు చేసి పిచికారీ చేయాలి. పచ్చి రొట్ట పంటలను పెంచి, కత్తిరించి, మొక్కల మొదళ్ల చుట్టూ మల్చింగ్గా వెయ్యాలి. కలుపు సమస్య తగ్గుతుంది. ఉత్పత్తి ఖర్చు 30–40% తగ్గుతుంది. ప్రకృతి వ్యవసాయంలో పండించిన మునగ కాయలు రుచిగా, పోషకాలు అధికంగా ఉండి, ఎగుమతులకు అనుకూలంగా ఉంటాయి.ఇతర వివరాలకు.. డా. టి. భరత్ – 97005 49754 -
ఇద్దరు పిల్లల తల్లి వెయిట్ లాస్ సీక్రెట్: ఏకంగా 84 కిలోల నుంచి 56 కిలోలకు తగ్గి..
బరువు తగ్గడం అంత ఈజీ టాస్క్ కాదు. నిబద్ధత, స్థిరమైన మైండ్సెట్ ఉంటేనే అనకున్న లక్ష్యాన్ని చేధించి బరువు తగ్గగలం. లేదంటే కష్టమే. అందులోనూ పిల్లల్ని కన్న తల్లులకు బరువు తగ్గడం మరింత క్రిటికల్ టాస్క్. ఓపక్క ఇంటి బాధ్యతలు, మరోవైపు కెరీర్ చూసుకుంటూ..వ్యక్తిగతంగా సమయం కేటాయింటం అంటే మాములు విషయం కాదు. అయినప్పటికీ..అన్నింటిని అధిగమించి బరువు తగ్గడంలో మంచి సక్సెస్ అందుకుంది ఈ పిల్లల తల్లి. అందుకోసం తానేం ఏం చేసిందో, తనకు హెల్ప్ అయిన చిట్కాలను కూడా సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నారామె. అవేంటంటే..డాక్టర్, ఎంటర్ప్రెన్యూర్ భావన ఆనంద్ ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చిన అనంతరం అధిక బరువుతో బాధపడుతుండేది. ఆమె 2022 ఆ టైంలో ఏకంగా 84 కిలోల మేర అధిక బరువు ఉండేది. అలాంటి ఆమె ఈ ఏడాది కల్లా స్మార్ట్గా మారడమేగాక విజయవంతంగా 56 కిలోలకు చేరుకుంది. అంతలా మారిపోయిన ఆమె లుక్ని చూసి ఆమె స్నేహితులు, సన్నిహితులు విస్తుపోయారు. "ఆ మూడు అలవాట్లే తన జీవితాన్ని మార్చాయ్" అనే క్యాప్షన్ని జోడించి మరీ తన వెయిట్ లాస్ జర్నీని నెట్టింట షేర్ చేసుకున్నారామె. ప్రతిరోజు నెమ్మది నెమ్మదిగా అడుగులు వేయండి అదే మీ శరీరంలో పెనుమార్పు తీసుకొస్తుందని నమ్మకంగా చెబుతోందామె.27 కిలోలకు పైగా బరువు ఎలా తగ్గిందంటే..ఫిట్నెస్ ఔత్సాహికురాలు భావన ఆనంద్ వీడియోలో ఇలా చెప్పుకొచ్చింది. చాలామంది అలా ఎలా మారిపోయవని ప్రశ్నిస్తున్నారని, ఆ నేపథ్యంలోనే తాను ఫాలో అయ్యిన మూడు చిట్కాలను పంచుకుంటున్నా అంటూ చెప్పడం ప్రారంభించారామె. ఇదేం షార్ట్ కట్ కాదు. తన జీవనశైలిలో ఆ మూడు అలవాట్లను భాగం చేసుకోవడంతోనే తన జీవితం ఇంతలా మారిపోయిందని పేర్కొంది. వ్యాయామ దినచర్యలో రెసిస్టెన్స్ శిక్షణ..తాను చేసే వ్యాయామాలపై ఫోకస్ పెడతానంటోంది. కాలక్రమేణ అవి మంచి పురోగతిని సాధించడంలో హెల్ప్ అవుతాయని చెబుతోంది. ప్రోటీన్-రిచ్ మీల్స్కి ప్రాధాన్యత..ప్రతిరోజు ప్రోటీన్ ప్యాక్డ్ మీల్స్ తీసుకునేలా చూసుకుంటానంటోంది. ప్రోటీన్ రిచ్ వంటకాలు కండరాల పెరుగుదల, కోలుకోవడం, మొత్తం పోషకాహర సమతుల్యతకు అత్యంత ముఖ్యమైనవని నొక్కి చెబుతోంది. సరైన నిద్ర..తన వెయిట్ లాస్ జర్నీలో ఇది అసలైన గైమ్ ఛేంజర్ అని అంటోంది. రాత్రి త్వరగా భోజనం చేయడం, ఉదయాన్నే నిద్రలేవడం వల్ల శరీరానికి ఓ నిర్థిష్ట దినచర్యను అనుసరించేలా చేయగలుగుతాం. దాంతో అది సవ్యంగా పనిచేసేందుకు దారితీస్తుంది. బరువు తగ్గేందుకు హెల్ప్ అవుతుందని అంటోంది. తనకు ఈ వెయిట్లాస్ జర్నీలో ఆ మూడే బరువు తగ్గేందుకు ఉపకరించాయని వాటిని సక్రమంగా బ్యాలెన్స్ చేయగలిగితే ఎవ్వరైనా బరువు తగ్గడం సులభమేనని చెప్పుకొచ్చింది. కాగా, గతంలో భావన ఆనంద్ తన మహిళా అనుచరులకు 30 ఏళ్ల తర్వాత కండరాల నష్టం కారణంగా కోల్పోయిన శక్తిని ఎలా తిరిగి పొందాలో మార్గనిర్దేశం చేసింది. హార్మోన్ల మార్పు వల్ల 30 ఏళ్ల దాటిని ప్రతి స్త్రీకి శరీరంలోని శక్తి సన్నగిల్లుతుందని, జీవక్రియ నెమ్మదిస్తుందని చెప్పుకొచ్చారు. దీన్ని మనం బల శిక్షణ, అధిక ప్రోటీన్ భోజనం, మంచి నిద్ర వంటి అమేజింగ్ అలవాట్లను జోడించి.. మంచి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోండని పిలుపునిస్తోంది డాక్టర్ భావన ఆనంద్.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. View this post on Instagram A post shared by Dr Bhawana Anand (@dr.fitmum) (చదవండి: టెన్త్ ఫెయిల్యూర్ ఐపీఎస్ అధికారి స్టోరీ..! మూడుసార్లు ఫెయిల్.. పట్టువదలని విక్రమార్కుడులా..) -
ఏడేళ్ల బాలుడికి రెండు నెలలుగా ఆగని వాంతులు..కట్ చేస్తే.!
చిన్న పిల్లలు నోట్లో వేళ్లు పెట్టుకోవడం, ఏది కనిపిస్తే అది నోట్లో పెట్టుకోవడం చాలా కామన్గా చూస్తూ ఉంటాం. మరికొంతమంది మట్టి తినడం, సుద్దముక్కలు తినడం,మరికొంతమంది జుట్టుతినడం లాంటివాటిని తింటారు. పెద్దయ్యే కొద్దీ ఈ అలవాట్లను మానివేస్తారు. కానీ ఇలాంటి అలవాట్ల పట్ల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాల్సిందే. లేదంటే ఒక్కోసారి తీవ్ర అనారోగ్య సమస్యలకు దారి తీయవచ్చు. మధ్య ప్రదేశ్లోని జరిగిన ఉదంతం గురించి తెలిస్తే.. వామ్మో అనాల్సిందే. విషయం ఏమిటంటే..అహ్మదాబాద్ వైద్యులు 7 ఏళ్ల బాలుడి కడుపు నుండి భారీ మొత్తంలో ఉండగట్టిన వెంట్రెకలు, గడ్డి, షూలేస్ దారం లాంటి వాటిని తొలగించడం ఆశ్చర్యానికి గురిచేసింది. మధ్యప్రదేశ్లోని రత్లాం నివాసి శుభం నిమానా (7) గత రెండు నెలలుగా తీవ్రమైన కడుపు నొప్పి, వాంతులతో బాధపడుతున్నారు. ఎన్ని అసుపత్రులకు తిరిగినా, లక్షలు వెచ్చించినా ఫలితం కనిపించలేదు. పైగా రోజు రోజుకి బరువు తగ్గడం మొదలైంది. మధ్య ప్రదేశ్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో దాదాపు రూ. 2 లక్షల ఖర్చు చేసినప్పటికీ, అతని పరిస్థితి మెరుగుపడలేదు.దీంతో అనుమానం వచ్చిన తల్లిదండ్రులు అహ్మదాబాద్ సివిల్ హాస్పిటల్ వైద్యులను సంప్రదించారు. అక్కడి వైద్యులు CT స్కాన్, ఎండోస్కోపీ లాంటి పరీక్షల్లో అసలు విషయం బయటపడింది. అతని కడుపులో ఏవో కొన్ని వ్యర్థ పదార్థాలు పేరుకుపోయి గడ్డలాగా మారినట్టు గురించారు. బాలుడి కడుపులో హెయిర్ బాల్, గడ్డి షూలేస్ దారం పేరుకుపోయాయి. దీన్నే వైద్య భాషలో ట్రైకోబెజోవర్(trichobezoar)అని. దీంతో బాలుడ్నిని ఆరురోజులు నోటి ద్వారా ఎలాంటి ఆహారం ఇవ్వకుండా, ఏడో రోజున అతికష్టంమీద విజయవంతంగా తొలగించారు. ఈ ఆపరేషన్ తర్వాత బాలుడికి కౌన్సెలింగ్, చికిత్స అందించినట్టు వైద్యులు తెలిపారు. అహ్మదాబాద్ సివిల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ రాకేష్ జోషి మాట్లాడుతూ, "పిల్లలలో ట్రైకోబెజోర్లు చాలా అరుదు, కానీ తల్లిదండ్రులు పిల్లలలో ఇలాంటి అసాధారణమైన అలవాట్లను గమనించినపుడు, వైద్యులను సంప్రదించి ప్రాణాంతక పరిస్థితులను నివారించాలని సూచించారు.చదవండి: కొత్తకోడలిపై అమానుషం, గదిలో బంధించి పామునువదిలారుట్రైకోబెజోవర్ అంటే ఏమిటి?ట్రైకోబెజోవర్ అనేది ఒక రకమైన బెజోవర్ - జీర్ణశయాంతర వ్యవస్థలో పేరుకుపోయే ముద్ద - ప్రధానంగా జుట్టు లాంటివి తినడం వల్ల ఇది వస్తుంది. తరచుగా ట్రైకోటిల్లోమానియా (కంపల్సివ్ హెయిర్-పుల్లింగ్), ట్రైకోఫాగియా (జుట్టు తినడం) ఇంకా దారం లేదా గడ్డి వంటి జీర్ణం కాని ఇతర పదార్థాలను తినడం వల్ల ఇవి ఏర్పడతాయి. కడుపులో పేరుకుపోయిన వ్యర్థాలను బట్టి బెజోవర్లను నాలుగు ప్రధానరకాలుగా పేర్కొంటారు.లక్షణాలు: కడుపు నొప్పి, వాంతులు, ఉబ్బరం, బరువు తగ్గడం, మలబద్ధకం లాంటివి ఉంటాయి. తీవ్రమైన సందర్భాల్లో, పేగు అవరోధం. చిన్న మొత్తాలను ఎండోస్కోపికల్ ద్వారా తొలగించగలిగినప్పటికీ, పెద్ద వాటికి తరచుగా శస్త్రచికిత్స జోక్యం అవసరం. ముఖ్యంగా పిల్లలలో పునరావృతం కాకుండా నిరోధించడానికి మానసిక సలహా కూడా అవసరం. -
ఉద్యోగం కంటే ఆరోగ్యమే ముద్దు..!
ఆరోగ్యమే మహాభాగ్యం అని కొందరూ ఫిట్నెస్కి ఎంతగా ప్రాముఖ్యత ఇస్తున్నారో చెప్పాల్సిన పనిలేదు. డబ్బు ఎప్పుడైనా సంపాదించొచ్చు..ఆరోగ్యం పోతే అంత ఈజీ కాదు ఇదివరకటిలా ఉండటం. అలానే భావించి ఇక్కడొక అమ్మాయి ఏకంగా రూ. 60 వేల వేతనంతో కూడిన ఉద్యోగాన్ని తృణప్రాయంగా వదులుకుంది. ఆమె డేరింగ్కి నెటిజన్లు ఫిదా అవ్వడమే కాదు..మేడమ్ మీరు చాలా గ్రేట్ అంటూ ప్రసంశలు కురిపిస్తున్నారు. ఈ రోజుల్లో ఉద్యోగాల షిఫ్ట్లు ఏవిధంగా ఉంటాయో తెలిసిందే. కంఫర్ట్ జోన్లో ఉద్యోగం చేయడం అందరికీ సాధ్యం కాదు. అలా కుదిరే ఛాన్స్ లేదు. అందువల్ల యువత చిన్న వయసులోనే రకరకాల దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడుతున్నారు. ఇది అందరికీ తెలిసింది. ఇలానే ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్న ఉపాసన అనే భారత యువతి ఎంత పెద్ద నిర్ణయం తీసుకుందో వింటే విస్తుపోతారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ఫ్రెంచ్ అసోసీయేట్గా పనిచేస్తున్న ఆమె నెలకు రూ. 60 వేలు దాక సంపాదిస్తున్నట్లు పేర్కొంది. తన ఉద్యోగం చేయడం అత్యంత సులభమని, కాకపోతే నైట్ షిఫ్ట్ల్లో పనిచేయాల్సిన పరిస్థితి అని చెప్పుకొచ్చింది. అందువల్ల ప్రతి మూడో రోజు తలనొప్పి, ఎసిడిటీ, తక్కువ రక్తపోటు, ఒత్తిడి వంటి సమస్యలను ఎదుర్కొంటున్నట్లు వాపోయింది. ప్రస్తుతం ఆర్థిక పరంగా సేఫ్గానే ఉన్నా..అందువల్ల ధైర్యంగా అంత వేతనంతో కూడిన ఉద్యోగాన్ని ధీమాగా వదిలేశానని తెలిపింది. డబ్బు తాత్కాలికం, అదే ఆరోగ్యం పాడైతే మళ్లీ యథాస్థితికి తీసుకురావడం అంత ఈజీ కాదు. అందుకే తాను డబ్బు కంటే ఆరోగ్యానికే ప్రాధాన్యత ఇచ్చి ఉద్యోగాన్ని వదులుకున్నానని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం పూర్తిగా ఆరోగ్యంపై దృష్టిపెట్టా, మళ్లీ యథావిధిగా తన జీవితంలో సక్సెస్ని అందుకుంటానా లేదా అనేది తెలియదు. చూద్దాం ఏ జరుగుతోందో అంటూ ముగించింది తన పోస్ట్ని. అందుకు సంబంధించిన వీడియోని కూడా జత చేసి మరి పోస్ట్ చేసింది. అయితే నెటిజన్లంత ఆమె సాహసోపేతమైన నిర్ణయాన్ని మెచ్చుకోవడమే కాదు.. మీ అర్హతకు తగిన ప్రతిదీ మీరు అందుకోవాలని ఆశిస్తున్నాం అంటూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Upasana (@upasanaa._)(చదవండి: -
నో జిమ్.. హోమ్ వర్కౌట్లతో 8 నెలల్లో 20 కిలోలు తగ్గింది!
బరువు తగ్గాలంటే చాలా కష్టం అని భావిస్తున్నారా? అంత భయపడాల్సిన అవసరం లేదు అంటూ చాలా మంది ఇన్ఫ్లూయెన్సర్లు చాలా పకడ్బందీగా బరువుతగ్గి చూపిస్తున్నారు. ఖరీదైన జిమ్ సభ్యత్వం ఫ్యాన్సీడైటింగ్లేకుండా ప్రణాళికా బద్దంగా ప్రయత్నిస్తూ.. కాస్త ఓపిక పడితే వెయిట్ లాస్ అవ్వడం ఈజీనే అంటున్నారు. అలాంటి వారిలో ఒకరు మన తెలుసుకోబోతున్న కంటెంట్ క్రియేటర్. కఠినమైన ఆహార పద్ధతులు, తీవ్రమైన కసరత్తులు కాకుండా చక్కటి జీవనశైలి, మంచి ఆహార అలవాట్లతో బరువు తగ్గిన వైనాన్ని సోషల్మీడియా ద్వారా వెల్లడించింది.కంటెంట్ క్రియేటర్ యామిని అగర్వాల్ 8 నెలల్లో 20 కిలోలు తగ్గినట్టు తెలిపింది. యామిని తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో తన వెయిట్ లాస్ జర్నీ, వ్యాయామాలను కూడా వివరించింది: ఎక్కువ ఉపవాసాలు కఠినమైన వ్యాయామాలత ఫలితంగా స్వల్పకాలికంగా ఉండవచ్చు. కానీ నిజంగా పట్టుదలగా కొన్ని ఆహార అలవాట్లు, వెయిట్ ట్రెయినంగ్ స్థిరంగా బరువు తగ్గవచ్చని యామిని చెబుతోంది.ఆ క్రమంలో యామిని హోమ్ వర్కౌట్లనే ఎక్కువగా పాటించింది. అదీ క్రమం తప్పకుండా అనుసరించింది. 4 రోజుల బరువు శిక్షణ, 2 రోజుల కార్డియో ఒక రోజు రెస్ట్ అనేపద్ధతిని పాటించింది. అంతేకాదు ఈ రోజుల్లోఆర్మ్స్ డే, లెగ్స్ డే, అంటూ స్మార్ట్ స్ప్లిట్ను పాటించింది. సోమవారం కాళ్లకు,మంగళవారం యాబ్స్, బుధవారం చేతులకు వ్యాయామాలను కేటాయించింది. గురువారం వీపు , భుజాల కండరాలను బలోపేతం చేసేలా తన వ్యాయామాన్ని ప్లాన్ చేసింది. అలా స్థిరమైన ప్రణాళిక, సాధారణ వ్యాయామాలుచేస్తూ తన వెయిట్ లాస్ను ట్రాక్ చేసుకుంది. View this post on Instagram A post shared by Nihira Aggarwal (@nihiraaggarwal)యామిని చిట్కాయామిని పంచుకున్న ఒక ముఖ్యమైన చిట్కాను కూడా షేర్ చేసింది. వ్యాయామం చేస్తున్నప్పుడు తన వీడియోలను రికార్డ్ చేయడం ద్వారా తాను చేస్తున్న తప్పులను గమనించింది.ఎక్కడ తప్పు జరుగుతోందో గమనించి దాన్ని సరిదిద్దు కుంటూ ముందుకు సాగాననీ, ఇది తన వెయిట్ లాస్ జర్నీలో మరిన్ని కొలోల బరువు తగ్గేందుకు ఉపయోగపడిందని చెప్పుకొచ్చింది. -
వరల్డ్ రోజ్ డే ఎలా వచ్చింది... నేపథ్యం ఏంటి?
రాయవరం: క్యాన్సర్... ఈ వ్యాధి పేరు చెబితే చాలా మందికి ఒంట్లో వణుకు పుడుతోంది. ఈ వ్యాధి వస్తే చనిపోవడమే అనే అపోహ ప్రజల్లో ఉంది. గతంలో రాచపుండుగా పిలుచే ఈ క్యాన్సర్కు చికిత్స ఉండేది కాదు. వ్యాధిగ్రస్తులు మరణానికి రోజులు లెక్క బెట్టుకుంటూ గడిపేవారు. ప్రస్తుతం పరిస్థితి మారింది. ఆధునిక వైద్యం అందుబాటులోకి రావడంతో వ్యాధిని పూర్తిగా నయం చేయవచ్చు. క్యాన్సర్ ఉన్నవారిలో వ్యాధిపై ఉన్న భయాన్ని పోగొట్టి వారిలో మానసిక ధైర్యాన్ని నింపేందుకు ప్రతి ఏడాది ప్రపంచ వ్యాప్తంగా సెప్టెంబర్ 22న రోజ్ డే నిర్వహిస్తున్నారు.వ్యాధికి కారణాలెన్నో..ఓరల్ క్యాన్సర్కు ప్రధాన కారణం పొగాకు ఉత్పుత్తుల వినియోగమే. సిగరెట్, బీడీ, చుట్ట, పాన్ పరాగ్, ఖైనీ, గుట్కా ఇలా ఏ రూపంలో పొగాకు తీసుకున్నా క్యాన్సర్ వస్తుంది. మద్యం తాగడం, వ్యాయామం చేయకపోవడం, ఆకు కూరలు తినకపోవడం, ఊరగాయ పచ్చళ్లు, కొవ్వు ఎక్కువగా ఉన్న మాంసాహారం తినడం, అధిక బరువు ఉండటం వల్ల కొన్ని రకాల క్యాన్సర్లు వచ్చే అవకాశం ఉంది. సంతానం కలగని వారికి, అలాగే జీన్స్ వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశముంది. గర్భాశయ ముఖ క్యాన్సర్ వ్యాధి సుఖ వ్యాధుల వల్ల రావొచ్చని వైద్యులు చెబుతున్నారు. అయితే గర్భాశయ ముఖ వ్యాధి క్యాన్సర్కు వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది.రోగులకు భరోసా..ఎన్నడూ లేని విధంగా గత సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి క్యాన్సర్ రోగులకు భరోసా కల్పించేలా సంస్కరణలు చేపట్టారు. క్యాన్సర్ రోగులకు భరోసా కల్పిస్తూ క్యాన్సర్ ప్రొసీజర్లు పెంచారు. ఆరోగ్యశ్రీ పథకంలో 2019 వరకూ క్యాన్సర్ రోగులకు 223 ప్రొసీజర్లు మాత్రమే చికిత్స అందిస్తుండగా, గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం 648 క్యాన్సర్ ప్రొసీజర్లకు ఉచితంగా చికిత్స అందించడం ద్వారా రోగులకు ఊరట కల్పించింది.అందుబాటులో వైద్య సేవలు : క్యాన్సర్కు ఆధునిక వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయి. కుటుంబంలో ఒకరికి వ్యాధి ఉంటే ఇతర సభ్యులకు వ్యాధి వచ్చే అవకాశం ఉందా లేదా నిర్ధారించేందుకు బీఆర్ సీఏ–1, 2 పరీక్షలు ఉన్నాయి. క్యాన్సర్ చికిత్సకు కీమో థెరఫీ, రేడియేషన్ థెరఫీ వంటి వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయి. భయపడాల్సిన పనిలేదు. –పి.శ్రీనివాసన్, ప్రొఫెసర్ అండ్ హెచ్ఓడీ,రేడియేషన్ ఆంకాలజీ విభాగం,రంగరాయ వైద్య కళాశాల,కాకినాడస్క్రీనింగ్ పరీక్షలతో క్యాన్సర్కు చెక్స్క్రీనింగ్ పరీక్షల ద్వారా క్యాన్సర్కు చెక్ పెట్టవచ్చు. ముఖ్యంగా మహిళలు 45 ఏళ్లు దాటాక ప్రతి ఏడాది మెమో గ్రామ్ పరీక్ష చేయించుకోవాలి. 55 ఏళ్లు దాటిన వారు సీటీ స్కాన్, కొలనో స్కోపి చేయించుకోవాలి. తొమ్మిదేళ్ల నుంచి 11 ఏళ్లలోపు బాలికలకు, 45 ఏళ్లలోపు మహిళలకు హెచ్పీవీ వ్యాక్సిన్ వేయించడం ద్వారా క్యాన్సర్ను నివారించవచ్చు. –సుమలత,నాన్ కమ్యూనికల్ డిసీజెస్కోనసీమ జిల్లా కోఆర్డినేటర్వరల్డ్ రోజ్ డే నేపథ్యమిదీకెనడా దేశానికి చెందిన 12 ఏళ్ల మెలిండా రోజ్ అనే బాలిక 1994లో క్యాన్సర్ బారిన పడింది. అది కూడా చాలా అరుదైన బ్లడ్ క్యాన్సర్ కావడంతో, కొన్ని వారాల్లోనే బాలిక చనిపోతుందని వైద్యులు తెలిపారు. దీంతో రోజ్ తల్లిదండ్రులు చాలా బాధపడ్డారు. కానీ రోజ్ ఎటువంటి బాధ లేకుండా, భయపడకుండా ఆసుపత్రిలో ఉన్న రోగులకు గులాబీలు అందిస్తూ, వారికి కవితలు వినిపించి రోగుల్లో మానసిక ఉల్లాసాన్ని కలిగించింది. ఈ విధంగా ఆరు నెలల పాటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూనే రోగులను చిరునవ్వుతో పలుకరిస్తూ.. ఉత్తరాలు రాస్తూ వారిని ఆనందింపజేసి సెప్టెంబర్ 22న మరణించింది. రోజ్ జ్ఞాపకార్థం ఏటా రోజ్ డే నిర్వహిస్తున్నారు. -
కార్చే కన్నీరు సైతం... క్వాలిటీ కోల్పోతోంది...
నవ్వినా ఏడ్చినా కన్నీరే వస్తాయి ఏ కన్నీరెనకాల ఏముందో తెలుసుకో అన్నారో సినీకవి. అయితే నగరవాసుల కంట్లో నీరున్నా...ఆ కన్నీరెనకాల క్వాలిటీ సున్నా అంటున్నారు నేత్ర వైద్యులు. అదేంటీ నవ్వలేక ఏడుస్తుంటే అందులో నాణ్యత కూడా ఉండాలా? అంటే...అవును ఉండాల్సిందే అని వైద్యులు అంటున్నారు. నవ్వే మనిషిని చూసి శభాష్ అంటాం...ఏడ్చే మనిషిని చూసి పాపం అనుకుంటాం... మానవ శరీరంలో కలిగే ప్రతీ మార్పూ భావోద్వేగాల ప్రతిరూపమే. మనం మంచిదని, చెడ్డదని మరొకటని అనుకున్నా..అవన్నీ మనకు అవసరమైనవే... అప్రధానం కానివే... ఈ నేపధ్యంలోనే కొన్ని రకాల భావోద్వేగాల ఫలితంగా పుట్టే కన్నీరు కూడా చాలా ముఖ్యమైనదే. అంత ముఖ్యమైన కన్నీటిలో ఇప్పుడు నాణ్యత లోపిస్తోందని వైద్యులు చెబుతున్నారు. ఆధునిక జీవనశైలే దీనికి కారణమని స్పష్టం చేస్తున్నారు.టియర్స్...వండర్స్...ఆపుకోలేక ఏడుస్తామేమో గానీ ఎవరూ చూడకూడదనుకుని తుడిచేస్తాం...ఎవరైనా చూస్తే సిగ్గుపడతాం.. కానీ తేలిగ్గా తీసుకోవద్దు... కన్నీటి తయారీ వెనుక పెద్ద తతంగమే ఉంది. కన్నీళ్లు కంటిలోపలి మూడు పొరల నుంచి తయారవుతాయి. అందులో బయట ఉండేది ఆయిలీ పొర, మధ్యలో ఉండేది నీటి పొర, లోపల ఉండే మ్యూకస్ పొర...ఈ మూడింటిని కలిపి టియర్ ఫిల్మ్గా పేర్కొంటారు. కంట్లో ఉబికే కన్నీరు ఈ 3 పొరలు సక్రమంగా పనిచేసినప్పుడే ఆరోగ్యకరంగా ఉంటుంది. వీటిలో ఏ ఒక్కపొర దెబ్బతిన్నా కన్నీరు నాణ్యత కోల్పోతుంది.పొరను కాటేస్తున్న తెర...కంటి నీటి క్వాలిటిని దెబ్బతీస్తున్నవాటిలో స్క్రీన్ టైమ్ ప్రధానమైంది. కంప్యూటర్ కావచ్చు, ల్యాప్టాప్ లేదా మొబైల్... ఏదైనా సరే అతిగా అదే పనిగా చూడడం వల్ల కళ్లు పొడిబారుతాయి అనేది తెలిసిందే.. కళ్లు పొడిబారడం వల్ల వచ్చే సమస్యే కన్నీటి క్వాలిటీని దెబ్బ తీస్తోంది. అందుకే కళ్లు ఎర్రబారినా ఇంకే సమస్య వచ్చినా తొలుత కన్నీటి నాణ్యతను కూడా పరీక్షిస్తారు. స్కాన్ చేసి టియర్ క్వాలిటీని నిర్ధారిస్తారు. ఈ సమస్య పరిష్కారంగా లిపి ఫ్లో ట్రీట్మెంట్ వంటివి చేస్తారు తద్వారా కంటి నీటి క్వాలిటీ పెరుగుతుంది. కన్నీటి క్వాలిటీ తగ్గినప్పుడు నీటిలో ఉప్పు శాతం కూడా పెరిగే అవకాశం కూడా ఉంది. దాన్ని శరీరం అంగీకరించదు. దాని వల్ల కళ్లు మరింత ఎర్రబారడం...వంటి సమస్యలు వస్తాయి. లాక్రిమల్ గ్రంథి అనుబంధ గ్రంథుల పనిచేయకపోవడం వల్ల తగినంత కన్నీటి ఉత్పత్తి సైతం జరగదు.కన్నీటి క్వాలిటీ కోసం...టియర్ ఫిల్మ్ క్వాలిటీ తగ్గడం అనేది గతంలో పెద్ద వయసు లక్షణంగా భావంచేవాళ్లం. అయితే వయసులకు అతీతంగా ప్రస్తుతం సిటిజనుల్లో చాలా మందిలో కనపడుతున్న సమస్య. దీని చికిత్సలో భాగంగా స్నానం చేసేటప్పుడు తప్పనిసరిగా కళ్లు శుభ్రం చేసుకోవడం, గోరువెచ్చని నీటితో కంటిపై కాపడం పెట్టుకోవడం...వంటి చిట్కాలతో పాటు కొన్ని మందులు కూడా పనిచేస్తాయి. మరికొన్ని జాగ్రత్తలు...తగినంత నీరు తాగుతుండాలి..కంప్యూటర్స్, మొబైల్స్ తదితర డిజిటల్ స్క్రీన్స్ను చూస్తున్నప్పుడు తరచుగా కనురెప్పలు మూసి తెరుస్తుండాలి.ఎయిర్ కండిషనింగ్, హీటింగ్ మిషన్లులతో పాటు కంటిని పొడిబార్చే గాలులకు దూరంగా ఉండాలి.కన్నీటి ఉత్పత్తిని పెంచేందుకు తరచుగా సుతిమెత్తని వెచ్చని ఒత్తిడి వాటిపై కలిగిస్తుండాలి.ఒమెగా–3 పుష్కలంగా కలిగి ఉన్న వాల్నట్స్, సాల్మన్ చేప, ఫ్లాక్స్ సీడ్స్ ఆహారంలో జత చేయాలి.కళ్లను సున్నితంగా మాత్రమే తాకాలి..కార్నియాకు ఒత్తిడి కలిగించేలా రఫ్గా, తరచుగా నులమడం వంటివి చేయకూడదు.రోజుకి తగినంత అంటే 7 నుంచి 8 గంటల పాటు నిద్రపోవాలి.స్మోకింగ్, ఆల్కహాల్ వినియోగం కన్నీటి ఉత్పత్తిని దెబ్బతీయడంతో పాటు కంటి ఆరోగ్యానికి హాని చేస్తాయి.కృత్రిమ కన్నీళ్లను ఉపయోగించడం వల్ల పొడి కన్నీటి పొర ఉన్న రోగులలో దృష్టి నాణ్యత కాంట్రాస్ట్ సున్నితత్వం మెరుగుపడతాయి,అధునాతన నాన్–ఇన్వాసివ్ టియర్ ఫిల్మ్ ఇమేజర్స్ వంటి కొత్త సాంకేతికతలు, కన్నీటి పొర సబ్లేయర్ల వివరణాత్మక దృశ్యాన్ని అందిస్తాయి, నేత్ర వైద్యులు పరిస్థితిని నిర్ధారించడానికి పర్యవేక్షించడంలో సహాయపడతాయి.కన్నీరు కూడా విలువైనదే...తప్పకుండా ఉండాల్సిన శరీరధర్మాల్లో కన్నీరు కూడా ఒకటి. ఆ కన్నీరులో కూడా విభిన్న రకాలు మిళితమై ఉంటాయి. కంటి పనితీరు బాగుండడానికి అవన్నీ నాణ్యతతో ఉండాల్సిన అవసరం ఉంది. వాటి నాణ్యత లోపం ఏర్పడినప్పుడు తప్పకుండా కంటి పనితీరు కూడా దెబ్బతింటుంది. సో.. చాలా సార్లు కంటికి సంబంధించిన పరీక్షలు నిర్వహించడంలో భాగంగా కన్నీరు కూడా పరీక్షించాల్సిన అవసరం ఏర్పడుతుంది. అవసరాన్ని బట్టి కృత్రిమ మార్గాల ద్వారా కూడా కన్నీటిని రప్పించి మరీ నాణ్యతా పరీక్షలు జరుపుతాం. పరీక్ష ఫలితాన్ని బట్టి కంటి సమస్యల పరిష్కారానికి చికిత్స అందిస్తాం.–డా.రూపక్కుమార్ రెడ్డి, నేత్రవైద్య నిపుణులు(చదవండి: యాక్షన్ సినిమాని తలపించే యాక్సిడెంట్..! వెంట్రుకవాసిలో తప్పిన ప్రమాదం) -
హెల్త్ ప్రోడక్టుల మార్కెట్ @ రూ. 63,093 కోట్లు
న్యూఢిల్లీ: దేశీయంగా ఆరోగ్య సంరక్షణపై అవగాహన పెరుగుతున్న నేపథ్యంలో 12 కేటగిరీల ఆహార, పానీయాలకు సంబంధించి ఆరోగ్యకరమైన ఫుడ్, బెవరేజెస్కి డిమాండ్ పెరుగుతోంది. గత నాలుగేళ్లలో వీటి మార్కెట్ 11.7 శాతం పెరిగి రూ. 63,093 కోట్లకు చేరింది. నూడుల్స్, టీ, బాటిల్డ్ సాఫ్ట్ డ్రింక్స్, ఆటా, బిస్కట్లు/కుకీస్, నూనె/నెయ్యి/వనస్పతి, ఉప్పు, రెడీ టు కుక్ మిక్స్లు, ఐస్క్రీమ్లు మొదలైనవి వీటిలో ఉన్నాయి. వరల్డ్ప్యానెల్ ఇండియా నిర్వహించిన మెయిన్స్ట్రీమింగ్ హెల్త్ 2025 అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం 87.9 శాతం భారతీయ కుటుంబాలు గత ఏడాది వ్యవధిలో ఏదో ఒక హెల్త్ ప్రోడక్టును కొనుగోలు చేశాయి. పట్టణ ప్రాంతాల్లో ఇలాంటి కుటుంబాలు 96 శాతంగా ఉండగా, గ్రామీణ ప్రాంతాల్లోను ఈ ధోరణి వేగం పుంజుకుంటోంది. నివేదికలో మరిన్ని విశేషాలు.. → ఆటా (పిండి), ఉప్పు, వంటనూనె/నెయ్యి, టీ లాంటి ఉత్పత్తులకు సంబంధించి 80 శాతం కుటుంబాలు ఆరోగ్యకరమైన వేరియంట్ల వైపు మొగ్గు చూపుతున్నాయి. → కేటగిరీల వారీగా వార్షికంగా అధిక వృద్ధి సాధిస్తున్న ఉత్పత్తుల్లో రెడీ టు కుక్ మిక్స్లు (46 శాతం), సాల్టీ స్నాక్స్ (34 శాతం), బాటిల్డ్ సాఫ్ట్ డ్రింక్స్ (29 శాతం), బిస్కట్లు (19 శాతం) ఉన్నాయి. వినియోగదారులు ఒకసారి ఆరోగ్యకరమైన ఆహారోత్పత్తులకు అలవాటుపడితే వాటి వినియోగాన్ని క్రమం తప్పకుండా కొనసాగిస్తున్నారు. → ఆరోగ్యమనేది ఒక ట్రెండ్గా కన్నా వినియోగదారుల రోజువారీ అలవాట్లలో భాగంగా మారుతోంది. → ఆరోగ్యకరమైన ఉత్పత్తుల కోసం 22 శాతం అధికంగా చెల్లించేందుకు కూడా కొనుగోలుదారులు సిద్ధంగా ఉంటున్నారు. సామాజికంగా–ఆర్థికంగా వెనుకబడిన వారు కూడా 17 శాతం అధికంగా చెల్లించేందుకు సిద్ధంగా ఉంటున్నారు. → టీ, బాటిల్డ్ సాఫ్ట్ డ్రింకులకు అత్యధికంగా ప్రీమియం రేట్లు ఉంటున్నాయి. → మధుమేహం, కార్డియాక్ ..హైపర్టెన్షన్ సమస్యలు ఉన్న కుటుంబాలు మరింత ఎక్కువగా హెల్త్ ప్రోడక్టులను ఉపయోగిస్తున్నాయి. అయితే, వ్యాధులపరమైన సవాళ్లు లేని కుటుంబాల్లో కూడా క్రమంగా వీటి వినియోగం పెరుగుతోంది. -
నిర్లక్ష్యం వద్దు: కీలెంచి మేలెంచండి!
కీళ్ల దగ్గర నొప్పి సమస్యను మొదట్లోనే తుంచేయాలి. తగిన పరీక్షలు చేయించుకొని, వాటిల్లో వచ్చిన రి పోర్టులను బట్టి త్వరగా చికిత్స తీసుకుంటే చాలు. ‘ఆ... ఎప్పుడో ఓసారి నొప్పి రావడంగానీ లేదా కీళ్ల దగ్గర ఇబ్బందిగా (డిస్కంఫ్టర్ట్గా) ఉండటం మామూలే కదా’ అంటూ నిర్లక్ష్యం చేస్తే... కేవలం టాబ్లెట్ల వంటి మందులతో పోయేదానికి శస్త్రచికిత్స వరకూ వెళ్లే అవకాశముందని హెచ్చరిస్తున్నారు ఆర్థోపెడిక్ నిపుణులు. ఇలా మోకాలూ లేదా ఇతరత్రా కీళ్లలో (జాయింట్స్లో) నొప్పిగానీ ఇబ్బందిగానీ వచ్చేందుకు కారణాలూ, అలా సమస్య కనిపించినప్పుడు ఏం చేయాలన్న అంశంపై అవగాహన కలిగించేందుకు డాక్టర్లు చెబుతున్న అంశాలేమిటో చూద్దాం.మీరు ఎప్పుడైనా జాయింట్ నొప్పిని ‘‘అదే తగ్గి పోతుందని’’ అని నిర్లక్ష్యం చేశారా? చాలా మందికి ఇది సాధారణంగా అనిపించవచ్చు. కానీ జాయింట్ నొప్పిని నిర్లక్ష్యం చేయడం శరీరానికి మెల్లగా నష్టం కలిగిస్తూ, భవిష్యత్తులో తప్పనిసరిగా శస్త్రచికిత్స వరకు తీసుకెళ్లే ప్రమాదం ఉంది.మన దేశవాసుల్లో కీళ్లనొప్పులు వస్తుండటం చాలా సాధారణం. ఇలాంటి నొప్పులు దాదాపుగా విస్తృతంగా మధ్య వయసు దాటిన అందరిలోనూ కనిపిస్తుంటాయి. ఒక అంచనా ప్రకారం మన దేశజనాభాలో సుమారు 15% మందిలో అంటే... 21 కోట్ల మందిలో ఆర్థరైటిస్ తాలూకు బాధలు కనిపిస్తుంటాయి. మధుమేహం (డయాబెటిస్), ఎయిడ్స్, క్యాన్సర్ల కంటే కూడా ఆర్థరైటిస్ నొప్పులతో బాధపడేవారి సంఖ్యే ఎక్కువ. మరీ ముఖ్యంగా మహిళల్లో కీళ్లనొప్పులూ, ఆర్థరైటిస్ కారణంగా కనిపించే బాధలు ఇంకా ఎక్కువ. దాదాపు 45 ఏళ్లకు పైబడిన వయసు మహిళల్లో ఇలా ఈ తరహా బాధలు కనిపించడం చాలా సాధారణం. వీటికి వీలైనంత త్వరగా... అంటే తగిన సమయంలో చికిత్స అందించక పోతే అవి ఎలా పరిణమిస్తాయో తెలుసుకుందాం. కీళ్ల (జాయింట్) నొప్పులను నిర్లక్ష్యం చేస్తే... కీళ్ల నొప్పులు కనిపించినప్పుడు వెంటనే డాక్టర్కు చూపించుకోకుండా నిర్లక్ష్యం చేయడం వల్ల ఈ కింద పేర్కొన్న నష్టాలు జరిగే అవకాశముంది. అవి... → చిగురు ఎముకకు (కార్టిలేజ్) నష్టం: కీళ్లు కలిసే చోట ప్రతి ఎముకకూ చివరన ఉండే మెత్తటి చిగురు ఎముక (కార్టిలేజ్) స్వాభావికంగా కుషన్లా పనిచేసే గుణం తగ్గుతుంది. దాంతో అది స్టిఫ్గా మారి (గట్టిపడి పోయి) అది ఆస్టియోఆర్థరైటిస్ అనే కండిషన్కు దారితీస్తుంది. → కీలు ఉండాల్సిన తీరులో లేక పోతే (డిఫార్మిటీ) : నేచురల్గా ఉండాల్సిన విధంగా ఉండకుండా కీళ్లలో ఉండాల్సిన స్థిరత్వం తగ్గడంతో కీళ్ల కదలికలూ మందగిస్తాయి. → కండరాల బలహీనత (మజిల్ వీక్నెస్) : కీళ్ల దగ్గర నొప్పి కారణంగా మనం కీళ్లను కదిలించక పోవడంతో కీళ్లలో కదలికలు తగ్గుతాయి. ఫలితంగా కండరాలూ బలహీనమవుతాయి. → దీర్ఘకాలిక (క్రానిక్) ఇన్ఫ్లమైషన్ : కీళ్ల దగ్గర వచ్చే సమస్యతో అక్కడ ఎర్రబారడం, తీవ్రమైన వాపు, మంట, నొప్పి వంటి లక్షణాలు సుదీర్ఘకాలం పాటు కనిపించడాన్ని క్రానిక్ ఇన్ఫ్లమేషన్ అంటారు. ఇలా సుదీర్ఘంగా ఇన్ఫ్లమేషన్ రావడం వల్ల ఆ ప్రాంతంలోనూ, అలాగే ఆ చుట్టుపక్కల ఉండే కణజాలానికి (టిష్యూలకు) నష్టం జరుగుతుంది. → జీవన నాణ్యత (క్వాలిటీ ఆఫ్ లైఫ్) తగ్గి పోవడం: ప్రతిరోజూ కీళ్లనొప్పి కారణంగా మనం చేయాల్సిన పనులు చేయలేక పోవడం, నార్మల్గా ఉండలే పోవడంతో మన జీవన నాణ్యత (క్వాలిటీ ఆఫ్ ల్గైఈ) తగ్గుతుంది. డాక్టర్ను ఎప్పుడు సంప్రదించాలంటే...ఈ కింద పేర్కొన్న లక్షణాలు కనిపించినప్పుడు డాక్టర్ను తప్పనిసరిగా కలవాలి. → కీళ్లు లేదా ఆ ప్రాంతాల్లో కనిపించే నొప్పి దానంతట అదే తగ్గకుండా చాలాకాలం పాటు కొనసాగడం. (కొన్నిసందర్భాల్లో నెలల తరబడి లేదా ఏళ్ల తరబడి). → నడక, మెట్లు ఎక్కడం, చేతులు పైకి ఎత్తడానికి కష్టంగా ఉంటే. → కూర్చున్నవారు లేవడానికి ఇబ్బంది పడుతూ ఉంటే. → కర్ర లేదా వాకర్ సాయంతోనే నడవగలగడం. → నొప్పి తగ్గడానికి తరచూ నొప్పి నివారణ మందులపైనే ఆధారపడుతుంటే. → కీళ్ల ఆకృతి మారడం లేదా కీలు కలిసేచోట ఎముకలు కుదురుగా లేక పోతే (అలైన్మెంట్ మారితే). చికిత్స ఆలస్యం అయిన కొద్దీ... → నొప్పి, కీళ్ల దగ్గర గట్టితనం (స్టిఫ్నెస్) పెరగడం; కదలికలు మందగించడం. → కీళ్ల దగ్గర ఎముకల చివరన ఎముకలు అరగడంతో (ఆర్థరైటిస్ సమస్యతో) నొప్పులు లేదా జాయింట్ దగ్గర వ్యాధులు తీవ్రతరం కావడం. → పడి పోయి గాయపడే ముప్పు పెరగడం. → కోతపెట్టి చేయాల్సిన శస్త్రచికిత్స (ఇన్వేసివ్ సర్జరీ) చేయాల్సి రావడం. → కోలుకోవడానికి పట్టే సమయం పెరగడం. మీ కీళ్ల ఆరోగ్యాన్ని చిరకాలం కాపాడుకోవాలంటే... → తక్షణ వైద్య సలహా : వీలైనంత త్వరగా డాక్టర్ను కలిసి, తగిన నిర్ధారణ పరీక్షలు చేయించుకుని, దానికి తగినట్లుగా చికిత్స తీసుకోవడం. → బరువును అదుపులో పెట్టుకోవడం: బరువు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవడం. → వ్యాయామం: శరీర బరువు పెరుగుతున్న కొద్దీ జాయింట్స్పై పడే ఒత్తిడి పెరుగుతుంది కాబట్టి దాన్ని అదుపులో పెట్టుకోడానికి స్విమ్మింగ్, సైక్లింగ్ వంటి వ్యాయామాలను క్రమం తప్పకుండా చేయడం. → చురుగ్గా ఉండటం : కీళ్లకు తగినన్ని పోషకాలు అందడంతో పాటు కండరాల ఆరోగ్యం బాగా ఉండటానికి ఎప్పుడూ ఒకేచోట కూర్చుని ఉండకుండా నిత్యం చురుగ్గా కదులుతూ ఉండటం. → ఫిజియోథెరపీ వంటి చికిత్సలు : ఎడతెరిపి లేకుండా వచ్చే నొప్పి నివారణ కోసం అవసరాన్ని బట్టి ఫిజియో వంటి చికిత్సలు తీసుకోవడం. → సమస్య తగ్గడానికి అందుబాటులో ఉన్న ప్రత్యామ్నాయాలను తెలుసుకోవడం: ఈ సమస్య తగ్గడానికి అందుబాటులో ఉన్న చికిత్స ప్రక్రియలు... ఉదాహరణకు మందులూ, ఇంజెక్షన్లతో; జీవనశైలిలో మార్పులు చేసుకోవడం వంటి చర్యలతో శస్త్రచికిత్స నివారించుకోవడానికీ... ఇక తప్పదు అనుకున్నప్పుడు చేయాల్సిన శస్త్రచికిత్సను వీలైనంత ఆలస్యంగా జరిగేలా చూసుకోవడం. చివరగా... ఈ సమస్యపై తగినంత అవగాహన పెంచుకోవడం వల్ల... ఇవాళ్ల జీవనశైలిలో మార్పులు (లైఫ్స్టైల్ మాడిఫికేషన్స్)తోనే తగ్గేవీ; లేదా కొద్దిపాటి మందులతోనే తగ్గేలా తేలికపాటి చికిత్సలతోనే తగ్గే సమస్య... భవిష్యత్తులో శస్త్రచికిత్స వరకూ వెళ్లవచ్చు. అందుకే ఈ తరహా కీళ్లనొప్పుల విషయం వీలైనంతలో త్వరగా డాక్టర్ను కలవడం అవసరం. డా. నీలం వి. రమణారెడ్డి,సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్ -
కిడ్నీ ఇచ్చి ప్రాణంపోసిన అమ్మకు ‘బంగారు’ గిఫ్ట్ ఇచ్చాడు
వరుణ్ ఆనంద్ చిన్నప్పటినుంచి ఆటల్లో చురుగ్గా ఉంటాడు. తిండి, నిద్ర కన్నా ఆటలే ముఖ్యం అతనికి. అలాంటి వరుణ్ అనుకోకుండా దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధి బారినపడ్డాడు. దాంతో ఆటల మాట దేవుడెరుగు... కనీసం తన పనులు కూడా తాను చేసుకోలేనంతటి దుస్థితికి వచ్చాడు. ఆ పరిస్థితుల్లో వారికి అనికా అనే ఆర్గాన్ డొనేషన్ సంస్థ జీవితాన్నిచ్చింది. అంతేకాదు, అతను ఆ వ్యాధి మూలంగా ఏ ఆటల నుంచి అయితే దూరం అయ్యాడో, అవే ఆటల పోటీల్లో అతను మరింత ఉత్సాహంగా పాల్గొని మూడు స్వర్ణ పతకాలను గెలుచుకున్నాడు. ఈ విజయం వెనుక వరుణ్ ఆనంద్ తల్లి ప్రోత్సాహంతోపాటు ఆమె కొడుక్కు పంచి ఇచ్చిన కిడ్నీ కూడా ఓ కారణం. ఆరేళ్ల క్రితం ఓ రోజు.. బెంగళూరు అబ్బాయి వరుణ్ ఆనంద్ ఉన్నట్టుండి ఫుట్బాల్ గ్రౌండ్ నుంచి ఇంటికొచ్చేశాడు. ‘‘అదేంట్రా అప్పుడే వచ్చేశావ్?’’ అని తల్లి అడిగితే ‘‘బాగా అలసటగా ఉంది. ఆడాలనిపించడం లేదు. అందుకే వచ్చేశా’ అని నీరసంగా చెప్పాడు. ఆటలో పడితే తనను తానే మరిచిపోయే తన కొడుకు ఇలా చెప్పేసరికి అతని అమ్మ దీపకు జరగరానిదేదో జరగబోతోందన్న భయం, సందేహం అతలాకుతలం చేశాయి. తగ్గట్టే నెమ్మదిగా వరుణ్ ఆటకు దూరమయ్యాడు. కనీసం తన పనులు కూడా చేసుకోలేనంత బలహీనంగా తయారయ్యాడు. ఏ పనీ చేయకుండా ఊరికే తిని పడుకుంటున్నా సరే ఎప్పుడూ అలసటగా కనిపించేవాడు. దీనికి తోడు విడువని జ్వరం..కాళ్ల వాపులు...ఫుట్బాల్ గ్రౌండ్లో చిరుతలా కదిలే వరుణ్ ఎముకలు బలహీనంగా మారడం తో తప్పటడుగులకు కూడా కష్టపడేవాడు. ఇదంతా చూస్తున్న అమ్మానాన్నలు అతడి భవిష్యత్తు గురించి బెంగటిల్లుతుండేవారు. ఇంతలో జరగకూడదనుకున్నదే జరిగింది. ఓ రోజు మాటాపలుకూ లేకుండా పడిపోయాడు వరుణ్. వెంటనే హాస్పిటల్కు తీసుకెళ్లారు. అక్కడ డాక్టర్ పిల్లాడిని పరీక్షించారు. వరుణ్ బీపీ చాలా తక్కువగా చూపిస్తోంది. దాదాపు కోమాలో ఉన్నాడు. వెంటనే కొన్ని ఎమర్జెన్సీ టెస్టులు చేయించారు. వాటిలో అతడికి క్రానికల్ కిడ్నీ డిసీజ్ ఉన్నట్లు బయటపడింది. వరుణ్ కండిషన్ ను గురించి అతని తల్లిదండ్రులకు చె΄్పారు డాక్టర్. చివరకు వరుణ్ ఇప్పుడున్న స్థితికి అతడికి హీమో డయాలసిస్ చేసి కిడ్నీ మార్చడం తప్ప మరో దారి లేదని చెప్పారు. చెప్పిందే తడవుగా కిడ్నీ ట్రాన్స్ ΄్లాంటేషన్ కోసం సిద్ధమయ్యారు. దాతల గురించి వెతకసాగారు. ఈ క్రమంలో వారికి తెలిసిన విషయం... ఇంత బాధలోనూ అందరికీ ఆనందం కలిగించిన విషయం ఒకటే. వరుణ్కు తల్లి కిడ్నీ సరిగ్గా మ్యాచ్ కావడం. ఆపరేషన్ సక్సెస్ కావడం.. రెండేళ్ల క్రితం.. పెర్త్ వరల్డ్ ట్రాన్స్ప్లాంట్ గేమ్స్ ఎరీనా కొత్త వరుణ్ అప్పుడు ఫుట్బాల్ను మాత్రమే వదిలేశాడు. 12, 14 ఏళ్ల విభాగంలో మరి ఇప్పుడు మూడు క్రీడా విభాగాలు టేబుల్ టెన్నిస్, బ్యాడ్మింటన్, టెన్నిస్ల ప్రత్యర్థులను చిత్తు చేసి 3 స్వర్ణాలతో విన్నింగ్ స్మైల్తో డయాస్ మీద గర్వంగా నిలుచున్నాడు. ఇదతనికి మరో జీవితం. వీరందరి కన్నా ముందే అనికా ఈ పోటీల్లో పాల్గొంది. ఇది సాటిలేని అనుభవమని ఆమె చెబుతుంది. అనికా ఆర్గాన్ ఇండియా వ్యవస్థాపకురాలు. ఇది లాభాపేక్ష లేని సంస్థ. అనికా తల్లికి కూడా గుండెమార్పిడి ఆపరేషన్ జరిగింది. ఒక రకంగా దాని నుంచే ఆమె స్ఫూర్తి పొందింది. అనికా సంస్థ 2023లో ప్రపంచ ట్రాన్స్ప్లాంటేషన్ గేమ్స్లో టీం ఇండియాకు ప్రాతినిధ్యం వహించింది. ‘‘మా అమ్మ ఆపరేషన్ సమయంలో నాకు ఎలాంటి ఆసరా, ట్రాన్స్ ప్లాంటేషన్గురించిన సమాచారమూ అందుబాటులో లేదు. అందుకే నేను ఆర్గాన్ ఇండియాను స్థాపించాను. ఇప్పుడు నేను నాలా ఎవరూ సమస్యలతో సతమతం కాకుండా చూసుకుంటున్నాను. అందుకు ఎంతో సంతోషంగా ఉంది’’ అని చెబుతుందామె. ట్రాన్స్ప్లాంట్ గేమ్స్ 1978 నుంచి ఈ పోటీలు జరుగుతున్నాయి. ఈ ఏడాది జర్మనీలో 25వ ట్రాన్స్ప్లాంట్ గేమ్స్ జరిగాయి. 51 దేశాల నుంచి 17 క్రీడాంశాల్లో పోటీ పడ్డారు. ఈ పోటీలకు అర్హతలు ఒకటి అభ్యర్థులు నాలుగేళ్ల కంటే ఎక్కువ వయసున్న వారై ఉండాలి. అలాగే వారు ప్రాణాధార అల్లోగ్రాఫ్ట్లు (గుండె, పేగు, మూత్రపిండాలు, కాలేయం, ఊపిరితిత్తులు, ప్యాంక్రియాస్) అలాగే బోన్ మ్యారో మార్పిడి వంటి క్లిష్టమైన ఆరోగ్య సమస్యలనుంచి బయటపడి ప్రస్తుతం మామూలు జీవితం గడుపుతూ తాము పాల్గొనే ఈవెంట్లలో శిక్షణ పొంది ఉండాలి. ఆర్గాన్ ఇండియా ద్వారా వరుణ్ ఫ్యామిలీకి ఈ పోటీల గురించి తెలిసింది. అనికా తన ఆర్గాన్ ఇండియా సంస్థ ద్వారా వరుణ్ లాంటి ఎంతోమందికి జీవితంపై ఆశలు కల్పిస్తోంది. చికిత్స విషయంలో సహాయపడుతోంది. 2023లో ట్రాన్స్ ప్లాంటేషన్ గేమ్స్లో వరుణ్ ప్రతిభను చూసి అనికా ఆశ్చర్యపోయింది. ‘32 మంది సభ్యుల టీమ్ ఇండియా బృందంలో అతనే చిన్నవాడు. కానీ తన శక్తితో దానిని నడిపించాడు. -
బ్రాయిలర్ కోడి బోరింగ్.. అదే నాటుకోడి కూరయితే మహా టేస్టు!
విజయనగరం: కొంతకాలంగా బ్రాయిలర్ కోళ్ల వినియోగం విపరీతంగా పెరిగింది. నెలలో కనీసం నాలుగురోజులైనా బ్రాయిలర్ చికెన్ ఉండాల్సిందే. చుట్టాలు, బంధువులు వచ్చినా.. కథా కార్యక్రమం జరిగినా బ్రాయిలర్ కోళ్లు కోసి భోజనం పెట్టాల్సిందే. ప్రస్తుతం ఈ ట్రెండ్ మారుతోంది. బ్రాయిలర్ కోడి మాంసంపై మాంసాహారులకు అయిష్టత ఎక్కువైంది. బలవర్థక ఆహారం తీసుకోవాలనే ఆలోచనతో పాటు రుచికర వంటలపై దృష్టిపెడుతున్నారు. దీంతో 45 రోజుల్లో పెరిగే బ్రాయిలర్ కోడి మాంసానికి స్వస్తిపలికి ఎనిమిది నెలల నుంచి ఏడాది కాలం పాటు పెరుగుదలకు పట్టే నాటుకోడి మాంసంపై ఆసక్తిచూపుతున్నారు. గ్రామాల దగ్గర నుంచి పట్టణాల వరకూ అన్నిచోట్ల ఇప్పుడు హాట్టాపిక్గా మారింది.గతంలో మాదిరిగా..20వ దశకం వరకూ గ్రామాల్లో నాటుకోడి పెంపకాలు అధికంగా ఉండేవి. ప్రతి ఇంటి వద్ద నాటుకోళ్లు పెంచడం, వాటి గుడ్లు తినడం అమ్మకాలు చేయడం చేసేవారు. ఆ తరువాత కాలంలో బ్రాయిలర్ పౌల్ట్రీలు రావడం, మారుమూల గ్రామాల్లో సైతం చికెన్ సెంటర్లు అందుబాటులోఉండడం, కిలో చికెన్ ధర రూ.200 నుంచే లభించడంతో నాటుకోడి కొనుగోళ్లు పడిపోయాయి. గ్రామాల్లో ఇంటిపెరడు, ఖాళీ స్థలాలు కనుమరుగవడంతో వాటి పెంపకానికి చాలామంది స్వస్తి పలికారు. బ్రాయిలర్ కోడిమాంసం రుచి తగ్గడం, వాటిలో పలు కంపెనీలు రావడం, తరచూ రకరకాల వ్యాధులు వచ్చి బ్రాయిలర్ కోళ్లు చనిపోవడంతో మాంసాహారుల్లో ఆ మాంసంపై చులకన ఏర్పడింది. తింటే నాటుకోడి లేకుంటే గొర్రె మాంసం తినాలనే చందంగా ఇప్పుడంతా నాటుకోడి మాంసంపై పడ్డారు. దీంతో వాటి డిమాండ్ కారణంగా గ్రామాల్లో చిన్నచిన్న నాటుకోడి ఫామ్లు, పెద్ద పెద్ద కుటుంబాలు సైతం తమ పంటపొలాల్లో కొంత స్థలాన్ని నాటుకోడి పెంపకాలకు ఏర్పాటుచేయడం, పలుచోట్ల నాటుకోళ్ల ఫారాలు ఏర్పాటయ్యాయి.భలే డిమాండ్ప్రస్తుతం గ్రామల్లో గ్రామదేవత ఉత్సవాలు జరుగుతున్నాయి. వీటికి తోడు దసరా ఆయుధపూజకు అధికంగా నాటుకోళ్లు మొక్కుతారు. దీంతో ఇటీవల వీటికి డిమాండ్ ఎక్కువైంది. నాటుకోడి మాంసానికి మటన్ ధర మాదిరిగానే రేటు పలుకుతోంది. కిలో కోడి ధర రూ. 800 చొప్పున విక్రయాలు జరుగుతున్నాయి. కిలోన్నర కోడి చేస్తే కిలో చికెన్ వస్తుంది. ఇంత ధర ఉన్నా ఈ కోడి మాంసాన్నే అందరూ ఇష్టపడుతున్నారు. ఈ మాంసం తినడం ద్వారా ఎటువంటి ఇతర అనారోగ్య సమస్యలు ఉండవని, పలురకాల గాయాల బారిన పడినవారు, ఆపరేషన్లు జరిగినవారంతా ఈ నాటుకోడి మాంసాన్ని వినియోగిస్తే వేగంగా నయమౌతుందనే నమ్మకం ప్రజల్లో ఉంది. దీంతో ఈ కోళ్లకు డిమాండ్ వచ్చింది. వీటితో పాటు నాటుకోడి గుడ్డు ధర కూడా మార్కెట్లో అధికంగా పలుకుతోంది. ఒక గుడ్డు ధర రూ.20లు వరకూ విక్రయాలు జరుగుతున్నాయి.వ్యాపారం బాగుందిమా వద్ద నాటుకోళ్లు, సొనాయిలు నాటు, కథక్నాథ్ కోళ్లు లభిస్తాయి. గత ఏడెనిమిదేళ్లుగా నాటుకోళ్ల ఫారం నడుపుతున్నాం. ఓపికతో వాటి పెంపకంచేయాలి. మంచి ధర వస్తుంది. ఇప్పుడు వీటికి చాలా డిమాండ్ ఉంది. కిలోన్నర కోడి పెరగగానే కొనుక్కుని వెళ్లిపోతున్నారు.శాసపు చిన్నబాబు, నాటుకోళ్లఫారం యజమాని, పొనుగుటివలస, రాజాం. -
50 ఏళ్లు దాటినా ఫిట్గా మలైకా : అమేజింగ్ రెటినోల్ జ్యూస్
ఐదు పదులు దాటుతున్నా ఇంకా ఫిట్గా... ఆరోగ్యంగా కనిపించే మలైకా అరోరా అందానికి పడి΄ోని వారుండరంటే అతిశయోక్తి కాదు. చాలామందికి ఆమె ఆరోగ్య రహస్యం గురించి తెలుసుకోవాలని ఆసక్తి. అదే ప్రశ్న అడిగితే కొంటెగా నవ్వేసి ‘వెరీ సింపుల్... నేను నా దినచర్యను రెటినోల్ జ్యూస్తో ప్రారంభిస్తాను. అందుకే ఈ అందం’’ అని చెప్పింది. మెరుపులీనే పట్టులాంటి చర్మం, ఎప్పుడు చూసినా ఫ్రెష్గా కనిపించే చర్మసౌందర్యం కావాలంటే ముందుగా మెరుగైన జీర్ణక్రియ అవసరం. మంచి ఆరోగ్యం కోసం మలైకా లా మనం కూడా మన దినచర్యను రెటినోల్ జ్యూస్తో ప్రారంభిస్తే సరి. అదెలాగో చూద్దామా..రెటినోల్ జ్యూస్ అంటే ఏమిటి? ఇది రోజువారీ పండ్లు, కూరగాయల సహజ ప్రయోజనాలతో నిండిన పానీయం. దీనిని తాజా కూరగాయలు, పండ్లతో తయారు చేసుకోవచ్చు. రెటినోల్ జ్యూస్ కోసం ..2 క్యారెట్లు, సగం దోసకాయ, ఒక నారింజ, సగం నిమ్మకాయ, అల్లం ముక్క.. పై పదార్థాలను కడిగి, తొక్క తీసి, వాటిని కలిపి జ్యూస్ చేసుకుని ఒక గ్లాసులో పోసుకుని వెంటనే తాగేయాలి. ఈ జ్యూస్లో సమృద్ధిగా ఉండే విటమిన్ సి ఇతర విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు రోజంతా తాజాగా ఉండేందుకు తోడ్పడతాయి. -
Anxiety ఎక్కువగా మహిళల్లోనే..! ఎందుకో తెలుసా?
తీవ్రమైన కుంగుబాటు (డిప్రెషన్), ఉద్విగ్నతకు (యాంగ్జైటీ) లోను కావడం వంటివి పురుషులతో పోలిస్తే మహిళల్లోనే ఎక్కువగా కనిపిస్తుంటాయని డబ్ల్యూహెచ్ఓ గణాంకాలు పేర్కొంటున్నాయి. ఉదాహరణకు 2021 నాటి డబ్ల్యూహెచ్ఓ లెక్కల ప్రకారం మానసిక సమస్యలతో బాధపడేవారిలో పురుషుల సంఖ్య 13 శాతం కాగా... మహిళల్లో ఆ సంఖ్య 14.8 శాతం. అదే నివేదికలోని వివరాల ప్రకారం... యాంగై్జటీ సమస్యలు వయసుపరంగా చూస్తే బాలికల్లో చాలా త్వరగా బయటపడతాయనేది డబ్ల్యూహెచ్ఓ రిపోర్టులు చెబుతున్న మాట. ఉదాహరణకు యాంగ్జైటీ సమస్యలతో బాధపడేవారిలో 10 నుంచి 19 ఏళ్ల వయసున్న బాలికలు 5.8 శాతం మంది ఉండగా... 20 నుంచి 24 ఏళ్ల వయసున్న యువతులు 7.1 శాతం మంది ఉంటారు. ఇక యాంగై్జటీ బాధితుల్లోనే యుక్తవయసుకు వచ్చిన ఆడపిల్లలు 5.7 శాతం మంది ఉంటారు. అలాగే 50 నుంచి 69 ఏళ్ల మహిళల విషయానికి వస్తే ఇందులో డిప్రెషన్తో బాధపడేవారు 6 నుంచి 7 శాతం వరకు ఉంటారని డబ్ల్యూహెచ్ఓ నివేదికలు వెల్లడిస్తున్నాయి. చదవండి: నో ఫుడ్.. నోవాటర్.. రోజుకి 8 లీటర్ల ఇంజిన్ ఆయిల్ చాలు, వైరల్ వీడియో -
మళ్లీ కేన్సర్, స్టేజ్-4, ధైర్యంగా ఓడిస్తా : నటి పోస్ట్ వైరల్
బాలీవుడ్ సీనియర్ నటి నఫీసా అలీ మరోసారి కేన్సర్ బారిన పడ్డారు. ప్రస్తుతం ఆమెకు కేన్సర్ అడ్వాన్స్డ్ స్టేజ్-4లో ఉన్నట్టు వైద్యులు గుర్తించారు. ఈ విషయాన్ని స్వయంగా నఫీసా సోషల్మీడియా ద్వారా తన అభిమానులతో పంచుకున్నారు. దీంతో ఆమె ఆరోగ్యం త్వరగా కుదుట పడాలని,విజయం సాధించాలనే దృఢ సంకల్పంతో పోరాడాలని పలువురు అభిమానులు ప్రార్థిస్తున్నారు.2018లో స్టేజ్ 3 పెరిటోనియల్, అండాశయ క్యాన్సర్తో ధైర్యంగా పోరాడారు. కోలుకొని అప్పటినుంచి కేన్సర్ ఫ్రీగా ఉన్న ఆమెమళ్లీ కేన్సర్ బారిన పడ్డారు. కేన్సర్ తిరిగి వచ్చిందంటూ నటి , రాజకీయ నాయకురాలు నఫీసా అలీ సోధి ఒక పోస్ట్ను పంచుకున్నారు. ప్రస్తుతం ఆపరేషన్ సాధ్యం కాదుకాబట్టి, కీమోథెరపీని తిరిగి ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. "ఈరోజు నుండి నా ప్రయాణంలో కొత్త అధ్యాయం. నేను నిన్న PET స్కాన్ చేయించుకున్నాను... కాబట్టి శస్త్రచికిత్స సాధ్యం కానందున కీమోథెరపీ చేయించుకోబోతున్నాను. బిలీవ్ మీ.. నేను జీవితాన్ని ప్రేమిస్తున్నాను."అంటూ తన పోస్ట్లో ఎంతో ధైర్యంగా తన హెల్త్ అప్డేట్ గురించి తెలియజేశారు.దీంతోపాటు స్క్రీన్షాట్ను, వరుస ఫోటోలను షేర్ చేశారు. ఒక రోజు నా పిల్లలు, అమ్మా, నువ్వు వెళ్లిపోతే..మమ్మల్ని ఎవరు చూస్తారు అని అడిగారు? తోబుట్టువులైన మీరే ఒకరికొకరు తోడు. అదేనేను మీకిచ్చిన గొప్ప బహుమతి . సిబ్లింగ్స్మధ్య ప్రేమ, జ్ఞాపకాలు, జీవితంలో సోదర బంధం చాలా ధృఢమైంది అని చెప్పాను అని తెలిపారు. మరో ఫోటోలో ద పవర్ ఆఫ్ లవ్ అంటూ ఫ్యామిలీ ఫోటోను షేర్ చేశారు. View this post on Instagram A post shared by Nafisa Ali Sodhi (@nafisaalisodhi)అండాశయ మరియు పెరిటోనియల్ కేన్సర్ అంటే?ప్రతి రోగిలోను కేన్సర్ భిన్నంగా ఉన్నప్పటికీ, ఈ రకమైన కేన్సర్లో పునరావృతం కావడం చాలా సాధారణం. ప్రారంభ దశ వ్యాధితో పోలిస్తే .. అడ్వాన్స్డ్ స్టేజ్లో మళ్లీ వచ్చే అవకాశాలు ఎక్కువే. దశ-3 అండాశయ కేన్సర్ పునరావృత రేటు 70-90శాతం మధ్య ఉంటుంది. నఫీసాకు కేన్సర్ అండాశయాలను దాటి ఉదర కుహరం (పెరిటోనియం) లేదా సమీపంలోని శోషరస కణుపుల లైనింగ్లోకి వ్యాపించింది. చికిత్సలో భాగంగా కేన్సర్ కణాలను తొలగించడానికి శస్త్రచికిత్స,మిగిలిన కేన్సర్ కణాలను నాశనం చేసేందుకు కీమోథెరపీని చికిత్స అవసరం. కడుపు ఉబ్బరం, వాపు, నొప్పి లాంటి సాధారణ లక్షణాలు ప్రారంభదశలో ఉంటాయి. సాధారణంగా ఇవి అడ్వాన్స్డ్ స్టేజ్లోనే బయటపడతాయి. ప్రారంభ దశల్లో గుర్తిస్తే నయం చేయవచ్చు.అండాశయ కేన్సర్ను నివారణకు మహిళలు ఏమి చేయాలి?ఊబకాయం అతిపెద్ద ప్రమాద కారకం. కాబట్టి స్త్రీలు శరీర బరువును అదుపులో ఉంచుకోవాలి. పండ్లు, కూరగాయలు ,తృణధాన్యాలు అధికంగా ఉండే మంచి సమతుల్య ఆహారం తీసుకోవాలి. చక్కెరను తక్కువగా తీసుకోవాలి. ఇంకా మద్యం, ధూమపానం , ప్రాసెస్ చేసిన ఆహారాలకు దూరంగా ఉండాలి.క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం తోపాటు, కుటుంబ చరిత్ర ఉంటే జన్యు పరీక్ష చేయించుకోవడం చాలా అవసరం.నఫీసా అలీ ప్రముఖ గోల్ఫర్ , అర్జున్ అవార్డీ కల్నల్ సోధిని పెళ్లాడిన నఫీసాకు కుమార్తెలు అర్మానా , పియా,కుమారుడు అజిత్ ముగ్గురు సంతానం ఉన్నారు. 1979లో నఫీసా అలీ శశికపూర్ సరసన ‘జునూన్’ అనే బాలీవుడ్ చిత్రంలో హీరోయిన్గా కెరీర్ ప్రారంభించారు. ఆ తర్వాత పలు విజయవంతమైన చిత్రాల్లో నటించారు. 2005లో చిల్డ్రన్ ఫిల్మ్ సొసైటీ ఆఫ్ ఇండియాకు చైర్ పర్సన్గా వ్యవహరించారు. సినీ రంగంతోనే కాకుండా రాజకీయ రంగంతోనూ నఫీసాకు పరిచయం ఉంది. 2009లో సమాజ్ వాదీ టికెట్పై పోటీ చేశారు.నఫీసా అలీ అనేక రంగాలలో విజయాలు సాధించారు. 1972 నుండి 1974 వరకు జాతీయ స్విమ్మింగ్ ఛాంపియన్. 1976లోఈవ్స్ వీక్లీ మిస్ ఇండియా టైటిల్ను గెలుచుకున్నారు. మిస్ ఇంటర్నేషనల్ పోటీలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించి. 2వ రన్నరప్గా నిలిచారు. 1979లో అలీ కలకత్తా జింఖానాలో జాకీగా కూడా పనిచేశారు. -
సడెన్గా బరువు తగ్గడమే.. రోబో శంకర్ ప్రాణాలు తీసిందా?
ప్రముఖ తమిళ నటుడు-హాస్యనటుడు రోబో శంకర్ ఆకస్మిక మరణం సినీ అభిమానులను తీవ్ర దిగ్బ్రాంతికి గురి చేసింది. తన కామెడీ టైమింగ్, సిగ్నేచర్ 'రోబో-స్టైల్' డ్యాన్స్తో పాపులర్ అయ్యాడు. సినిమా సెట్లో స్పృహ కోల్పోవడంతో చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం తుదిశ్వాస విడిచారు. అయితే కేవలం 46 ఏళ్ల వయసులోనే ఆయన ఆకస్మిక మరణానికి గల కారణాలపై నెట్టింట తీవ్ర చర్చ నడుస్తోంది.రోబో శంకర్ మరణంపై వైద్యులు అందించిన వివరాల ప్రకారం, రోబోకు సంక్లిష్టమైన ఉదర వ్యాధి, తీవ్రమైన గాస్ట్రో ఇంటెస్టినల్ రక్తస్రావం కారణంగా ఆయన పరిస్థితి మరింత క్షీణించింది. వైద్య బృందం తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ చాలా అవయవాలు సరిగ్గా పనిచేయకపోవడంతో ప్రాణాలు కోల్పోయాడు.చదవండి: పెళ్లి చేసుకోవాలని అమెరికానుంచి వస్తే.. ఊపిరే తీసేశారు!ఆకస్మికంగా బరువు తగ్గిన రోబో శంకర్ అయితే అనేక నివేదికల ప్రకారం రోబోశంకర్ ఇటీవల కామెర్ల వ్యాధితో బాధపడ్డాడు. దీనికి అతను దీర్ఘకాలిక చికిత్స పొందాడు. చికిత్స తర్వాత గణనీయంగా బరువు తగ్గినట్లు గుర్తించారు.ఇది అతని స్నేహితులు కుటుంబ సభ్యులను ఆందోళనకు గురిచేసింది. నెమ్మదిగా కోలుకున్నప్పటికీ, పూర్తిగా కుదుటపడకముందే అప్పటికే ఒప్పుకున్న బుల్లి తెర కమిట్మెంట్లను నెరవేర్చడానికి యాక్టింగ్ షురూ చేశాడు. ఇంతలోనే ఆయన ఆరోగ్యం క్షీణించి కన్నుమూయడం అటు శంకర్ కుటుంబ సభ్యులను, ఇటు సినీ పరిశ్రమ వర్గాలను విషాదంలో ముంచింది. ఎక్కువగా మద్యం తాగే అలవాటు, కామెర్ల వ్యాధి, దీంతోపాటు ఉన్నట్టుండి గణనీయంగా బరువు తగ్గడం లాంటివి అతని ప్రాణాలకు చేటు తెచ్చాయని భావిస్తున్నారు.చివరి రోజుల్లో రోబో శంకర్ భార్య ప్రియా శంకర్ రోబో శంకర్ భార్య ప్రియాంక శంకర్ అతని పక్కనే ఉన్నారు. రోబోశంకర్ కుమార్తె ఇంద్రజ శంకర్ కూడా నటి. అలాగే రోబో శంకర్ భార్యగానే కాకుండా, నటి మరియు ప్లస్-సైజ్ మోడల్ గా ప్రియా శంకర్ గుర్తింపు పొందారు. ప్రియాంక 2020 లో కన్ని మాడంతో తన నటనా రంగ ప్రవేశం చేసింది , కుక్ విత్ కోమలి సీజన్ 1 ,కలక్క పోవతు యారు సీజన్ 8 వంటి ప్రముఖ రియాలిటీ షోలలో పాల్గొన్నారు."Miss You ROBO".. மிக பெரிய இழப்பு.. கலாய்த்தால் கூட கட்டிப்பிடித்து முத்தம் கொடுப்பார்.. அஞ்சலி செலுத்திய பின் நினைவுகளை பகிர்ந்த நடிகர் ராமர் , புகழ்#RoboShankar #RIPRoboShankar #TamilCinema #ActorMourning #RestInPeace #DeepCondolences #TamilNews #Newstamil #NewsTamil24x7 pic.twitter.com/lIWW5gZCan— News Tamil 24x7 (@NewsTamilTV24x7) September 19, 2025 -
చేతితో తినడం వల్ల వెయిట్లాస్ కూడా..
ఆహారాన్ని చేతితో నోటికి అందించడం అనేది తరతరాల సంప్రదాయం. అయితే ఆధునిక అలవాట్లు చేతితో ఆహారాన్ని తీసుకునే అలవాటును రానురాను తగ్గించేస్తున్నాయి. పురాతన, అనాగరిక జీవనశైలిగా దానిని పరిగణిస్తున్నాయి. అయితే చేతివేళ్లతో నేరుగా తీసుకుని ఆహారాన్ని ఆస్వాదించడం ఓ సంతృప్తి కరమైన విషయం. ఇది సంస్కృతీ, సంప్రదాయంకి మించిన ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుందని ప్రసిద్ధ వైద్య నిపుణుడు విద్యావేత్త అయిన డాక్టర్ కరణ్ రాజన్ చెబుతున్నారు. చేతులతో తినడం అనే పురాతనదేశీ ఆచారం అర్థవంతమైనది మాత్రమే కాకుండా మనం ఊహించలేని ఎన్నో ఆరోగ్యలాభాలను అందిస్తుంది అంటున్న ఆయన ఆ లాభాలను ఇలా వివరిస్తున్నారు. ఇదీ చదవండి: ఎయిరిండియా విమాన ప్రమాదం, కీలక పరిణామం : అమెరికా కోర్టులో జీర్ణక్రియకు మేలు...ఫోర్క్ లేదా స్పూన్కు బదులుగా వేళ్లను ఉపయోగించి భోజనం చేసినప్పుడు, సహజంగానే తినే వేగం మందగిస్తుంది. చేతుల ద్వారా అందుకున్న ఆహారం నమలడం ద్వారా జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఇది శ్రద్ధగా నమలడాన్ని ప్రోత్సహిస్తుంది, లాలాజలం నుంచి జీర్ణ ఎంజైమ్ల విడుదలను ప్రేరేపిస్తుంది. ఈ స్రావాలు జీర్ణవ్యవస్థను సమర్థవంతంగా నిర్వహించి పోషకాలను గ్రహించడానికి సిద్ధం చేస్తాయి, కడుపు ప్రేగులకు అవసరమైన సున్నితమైన ప్రక్రియను సృష్టిస్తాయి.అతిని నివారిస్తుంది..వెయిట్లాస్ కోసం డైట్లో ఉంటున్నవారు తక్కువ తినాలని అనుకుంటారు. అలా అతిగా తినడాన్ని నివారించడానికి కూడా సహజమైన మార్గం చేతులతో తినడం. దీని వల్ల మెదడు మరింత అవగాహనతో తినేందుకు సహాయపడుతుంది. ఆహారాన్ని తాకడం వల్ల కలిగే స్పర్శ అనుభూతి సంతృప్తి భావనను బలోపేతం చేసే సంకేతాలను చురుకుగా పంపుతుంది. త్వరిత, అధిక సంతృప్తి కలగడం తినే అవసరాన్ని తగ్గిస్తుంది.రోగ నిరోధక వ్యవస్థకు మేలు..మరో ఆకర్షణీయమైన ప్రయోజనం ఈ శరీరపు రోగనిరోధక వ్యవస్థ ప్రతిస్పందన. శుభ్రం చేసిన చేతులతో ఆహారం తిన్నప్పుడు, అది హానిచేయని సూక్ష్మజీవులను ప్రోత్సహిస్తుంది. ఈ జీవులు సురక్షితమైన, హానికరమైన బ్యాక్టీరియా మధ్య తేడాను గుర్తించడానికి రోగ నిరోధక వ్యవస్థకు శిక్షణ ఇస్తాయి. ఒక విధంగా, ఇది ప్రేవుల రోగనిరోధక రక్షణకు వ్యాయామం ఇస్తుంది, శరీరంలోని సహజ సమతుల్యతను బలోపేతం చేస్తుంది.ఉష్ణోగ్రత మార్గదర్శిగా వేళ్ల చిట్కాలుబుద్ధిపూర్వకంగా తినడంలో వేళ్ల పాత్ర ఎంతో ఉంటుంది. వేళ్ల కొనల వద్ద ఉన్న చర్మం నోటి లోపల సున్నితమైన లైనింగ్ కంటే థృఢంగా, నిరోధకతను కలిగి ఉంటుంది. ఇది వేళ్లను సహజ థర్మామీటర్గా చేస్తుంది. ఇది వ్యక్తులు తినడానికి ముందు ఆహార ఉష్ణోగ్రతను పరీక్షించడానికి వీలు కలిగిస్తుంది. ఇటువంటి అవగాహన అసౌకర్యాన్ని నివారించడమే కాకుండా మరింత ఆలోచనాత్మకంగా, ఏకాగ్రతతో తినే అనుభవాన్ని ప్రోత్సహిస్తుంది. మీ వేళ్లు డైజెషన్ జాయ్స్టిక్లు అంటూ డాక్టర్ కరణ్ రాజన్ అభివర్ణిస్తారు. అయితే ముందుగా మీ చేతులను కడుక్కోండి అని మాత్రం సూచిస్తున్నారు. డాక్టర్ కరణ్ రాజన్ గురించిడాక్టర్ కరణ్ రాజన్ ప్రముఖ వైద్యుడు, రచయిత ప్రముఖ ఆరోగ్య సంభాషణకర్త. ఆయన సండే టైమ్స్ నంబర్ 1 బెస్ట్ సెల్లర్గా నిలిచిన‘‘ దిస్ బుక్ మే సేవ్ యువర్ లైఫ్’’ను రాశారు. ఆరోగ్య–కేంద్రీకృత స్టార్టప్ అయిన లోమ్ సైన్స్ ను కూడా ఆయన స్థాపించారు. ఇన్ స్టాగ్రామ్ లో రెండు మిలియన్లకు పైగా ఫాలోయర్స్ను కలిగి ఉన్నారు.చదవండి: పెళ్లి చేసుకోవాలని అమెరికానుంచి వస్తే.. ఊపిరే తీసేశారు! -
బోన్ బ్రోత్ బ్రేక్ ఫాస్ట్..! నాజుకైన శరీరాకృతికి బెస్ట్ రెసిపీ..
బాలీవుడ్ నటి బానీ జె. కండలు తేలిన శరీరం, పోతపోసుకున్న టాటూల ఆకృతికి అభినయాన్ని జోడించి ఫాలోయింగ్ను సంపాదించుకుంది.. స్టీరియో టైప్ను బ్రేక్ చేసింది. చండీగఢ్కి చెందిన ఆమె ఎమ్టీవీ వీడియో జాకీగా పనిచేస్తున్నప్పుడు వీజే బానీగా పాపులర్ అయ్యింది. అంతేగాదు బాలీవుడ్ బుల్లి తెర షో బిగ్బాస్ పదవ సీజన్లో రన్నరప్గా నిలిచిందామె. 2007లో సినిమాలోకి ఎంట్రీ ఇచ్చి విమర్శకుల మెప్పు పొందింది. అంతేగాదు ఆమె ఫిట్నెస్ అంటే ప్రాణం పెడుతుంది. ఖాళీ సమయాల్లో ఆమె గడిపేది జిమ్లోనే. ఫిట్నెస్ మోడల్ కూడా. అలాంటి ఆమె అంత అందమైన శరీరాకృతి కోసం ఎలాంటి ఆహారం తీసుకుంటుందో బయటపెట్టింది. అది ఎవ్వరికైనా మంచి శరీరాకృతిని అందివ్వడమే కాదు, చర్మ సౌందర్యానికి మంచిదని చెబుతున్నారామె. ఇంతకీ అదెంటో తెలుసుకుందామా..!.37 ఏళ బానీ జె కండరాలు, సన్నని శరీరాకృతికి పేరుగాంచిన నటి. కఠిన వ్యాయామ నియమావళి, ఆరోగ్యకరమైన ఆహారానికి పేరుగాంచిన బ్యూటీ ఆమె. ఇటీవల ఓ ఇంటర్యూలో తన ఫిట్నెస్ సీక్రెట్ని పంచుకుంది. తన గ్లామర్ని ఇనుమడింప చేసే రెసిపీని గురించి వెల్లడించింది. తాను ఎక్కువగా ఇంట్లో వండిన భోజనమే తింటానని, ముఖ్యంగా బ్రేక్ఫాస్ట్గా బోన్ బ్రోత్ తీసుకుంటానని అంటోంది. ఇది చర్మానికి చాలా మంచిదని, కండరాలను బలోపేతం చేస్తుందని చెబుతోంది. బోన్ బ్రోత్ అంటే..ఏంటీ వింత వంటకం అనుకోకండి. అదేనండి బోన్సూప్. చికెన్ లేదా మటన్ బోన్లను సుగంద్రవ్యాలతో కలిపి బాగా ఉడికించిన రసం లాంటి సూప్నే బోన్ బ్రోత్ అనిపిలుస్తారు. బానీ జె ఉపవాసం విరమించడానికి, ప్రతి ఉదయం దీన్ని తప్పనిసరిగా తీసుకుంటానని, అదే తన చర్మాన్ని సంరక్షణలో తోడ్పడుతుందని అంటోంది. అదీగాక తన శరీరాన్ని స్లిమ్గా కనిపించేలా చూపించడంలో దోహదపడుతుందని కూడా అంటోంది. అతాగే రుచి కోసం ఈ సూప్లో కొన్ని ఇతర కూరగాయలు కూడా జోడిస్తామని అంటున్నారామె. ఫలితంగా ఆ సూప్లో వివిధ ఖనిజాలు, కొల్లెజెన్, అమెనో ఆమ్లాల వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయని చెబుతోంది. సేవించేటప్పుడూ పూర్తిగా వడకట్టి తీసుకుంటానని చెబుతోంది ఈ ఫిట్నెస్ ఔత్సాహికురాలు బానీ జె. అంతేగాదు ఆమె తరుచుగా తన వ్యాయామా వీడియోలను కూడా షేర్ చేస్తుంటారు. ఆమె దాదాపు 80 కిలల బరువులు ఎత్తడం నుంచి మొదలు పెట్టి 150 కిలోల బరువులు వరకు ఎత్తుతారామె. కొన్ని చిన్న చిన్న ఆరోగ్యకరమైన ఆహారాలు పెద్ద మార్పునే తీసుకొస్తాయనడానికి ఈ నటి తీసుకునే బ్రేక్ఫాస్ట్నే ఉదాహారణ. అందుకే శరీరానికి సరిపడేది ఆరోగ్యకరమైన ఆహారాలను డైట్లో భాగం చేసుకుని మరింత సురక్షితంగా ఉండండి అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించండి.(చదవండి: హ్యూమన్ వాచ్': చూపుతిప్పుకోనివ్వని అమేజింగ్ ఆర్ట్..) -
సర్.. నా భార్య చిలిపి దొంగతనాలు చేస్తోంది!
నా భార్య వయసు 45 ఏళ్ళు. మాకు ఒక సొంత సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది. మంచి ఉన్నతమైన కుటుంబం. మా ఆవిడకు మొదటి నుంచి ఒక వింత అలవాటు ఉంది. షాపింగ్కు వెళ్లినపుడు అవసరం లేకపోయినా, కొనగలిగిన స్థోమత ఉన్నా, ఏదో ఒక వస్తువు దొంగిలిస్తుంది. ఆమె దొంగిలించే వాటిలో కాస్మెటిక్స్ లాంటి చిన్న వస్తువుల నుంచి, ఒక్కోసారి చీరలు, చిన్న బంగారు వస్తువులు కూడా ఉన్నాయి. అలా దొంగిలించినవి కొన్ని ఇంట్లో దాచిపెడుతుంది. కొన్నేమో ఇతరులకు తాను గొప్ప అనిపించుకోవడానికి అన్నట్లు పంచిపెడుతుంది. ఆమెకు 300లకు పైగా చీరలు,కోట్లు విలువ చేసే బంగారు నగలు ఉన్నాయి. ఒక్కోసారి నా జేబులోంచి కూడా, నాకు చెప్పకుండా డబ్బులు తీసి దాస్తుంది. ఇన్ని చేసినా ఏమి తెలియనట్లు ఉంటుంది. ఏమాత్రం గిల్టీగా ఫీలవదు. ఇన్ని ఆస్తిపాస్తులుండి కూడా, ఆమె ఎందుకు ఇలా చీప్గా దొంగతనాలు చేస్తుందో అర్థం కావడం లేదు. ఇలా చేసి కొన్నిసార్లు షాప్స్లో పట్టుబడితే, పొరపాటయిందని సారీ చెప్పింది. ఆమె ప్రవర్తన వల్ల నాకు ఇబ్బందిగా ఉంది. బయట ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితి నాది. సాక్షిలో మీ కాలమ్ చూసి, మీరే ఏదైనా మంచి పరిష్కారం చూపిస్తారనే ఆశతో ఉన్నాను!– కామేశ్వరరావు, హైదరాబాద్రావుగారూ! మీరెంతో ఆవేదనతో మీ సమస్యను సాక్షి ద్వారా తెలియజేసినందుకు ధన్యవాదాలు. మీరన్నట్లుగా ఇది బయటకు చెప్పుకోలేని పరిస్థితి. అన్నీ ఉన్నా, అవసరం లేకున్నా ఇలా దొంగతనాలు చేయడాన్ని ‘క్లెప్టోమెనియా’ అంటారు. ఇది చాలా అరుదైన ఒక వింత మానసిక సమస్య. ఈ సమస్య ఉన్న వారికి, ఎలాగైనా ఏదో ఒకటి దొంగిలించాలనే ‘తహ తహ’ ఉంటుంది. వాస్తవానికి ఆ దొంగిలించిన వస్తువు వల్ల వారికి ఎలాంటి అవసరం ఉండదు. ఆ వస్తువు విలువ కూడా చాలా స్వల్పమై ఉండవచ్చు. మామూలు దొంగతనాల లాగా వీరు ఏదీ ప్లాన్ చేసుకుని, దొంగతనాలు చేయరు. ఏదైనా షాపింగ్కి అని వెళ్లినపుడు అలా సడన్గా చేతికందిన ఏదో ఒక వస్తువును వారికవసరం లేకపోయినా ఎత్తేస్తుంటారు. బాగా స్థోమత కలిగి, డబ్బులు పెట్టి కొనగలిగిన వారిలోనే ఈ అలవాటు ఎక్కువ. బహిష్టు సమయంలో ఇలాంటి కోరిక, కొందరిలో ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఆ సమయంలో కనబడిన వస్తువు ఎత్తేయకుంటే విపరీతమైన టెన్షన్కు గురయి, తీసిన తర్వాత చాలా మానసిక ప్రశాంతతకు లోనవుతారు. దీనిని ‘ఇంపల్స్ కంట్రోల్ డిజార్డర్’ అని కూడా అంటారు. ఈ అలవాటు యుక్తవయసులో మొదలై పెద్దయ్యే కొద్ది తగ్గిపోయే అవకాశం ఉంది. కానీ కొందరిలో మాత్రం శాశ్వతంగా ఉండి΄ోతుంది. ఈ సమస్య నుంచి బయటపడేయాలంటే ఆ వ్యక్తి సహకరించాలి. కొన్నిరకాల మందులతో పాటు ‘కాగ్నిటివ్ బిహేవియర్ మాడిఫికేషన్’ లాంటి ప్రత్యేక మానసిక చికిత్స పద్ధతుల ద్వారా ఇలాంటి వారిని ఈ అలవాటు నుండి బయటపడేసే అవకాశముంది. మొదట్లోనే ఈ అలవాటు గుర్తించి మానసిక వైద్యుడిని కలిస్తే ఫలితాలు మంచిగా ఉంటాయి. ఇప్పటికైనా మీ భార్యను మంచి నిపుణులైన సైకియాట్రిస్ట్ క్లినికల్ సైకాలజిస్టుల పర్యవేక్షణలో తగిన థెరపీ చేయించండి. ఆల్దిబెస్ట్!డాక్టర్ ఇండ్ల విశాల్ రెడ్డి, సీనియర్ సైకియాట్రిస్ట్, విజయవాడ.(మీ సమస్యలు, సందేహాలు పంపవలసిన మెయిల్ ఐడీ: sakshifamily3@gmail.com) -
బొద్దుగా ఉన్నోడు కాస్త స్లిమ్గా..! జస్ట్ మూడేళ్లలో 76 కిలోలు తగ్గాడు..
బొద్దుగా ఉన్న వ్యక్తులు బరువు తగ్గడం కష్టమేమో అనుకుంటారు. కొందరి అధిక బరువు.. వామ్మో! ఇంత లావు అనేలా ఉంటుంది. అంతలా లావుగా ఉండి కూడా చాలా స్మార్ట్ లుక్లోకి మారిపోవడమే కాదు వెయిట్లాస్ అవ్వాలనుకునే వాళ్లకు స్ఫూర్తిగా నిలుస్తున్నాడు ఈ యువకుడు. అప్పటికి ఇప్పటికీ ఎంత వ్యత్యాసం ఉందంటే..హీరోని తలపించేలా అతడి ఆహార్యం అత్యంత అందంగా మారిపోయింది. తనకు ఇదెలా సాధ్యమైందో కూడా ఇన్స్ట్రాగ్రామ్లో షేర్ చేసుకున్నాడు. మరి అంతలా బరువు తగ్గేందుకు అతడు ఏం ట్రిక్ ఫాలో అయ్యాడో సవివరంగా తెలుసుకుందాం..!ఇన్స్టాగ్రామ్లో సంచలనం సృష్టిస్తున్న అతడి స్ఫూర్తిదాయకమైన కథేంటంటే..ఆ యువకుడే ఫిట్నెస్ ఔత్సాహికుడు నమన్ చౌదరి. బరువు తగ్గడం బోరింగ్గా, క్లిష్టంగా ఉండకూడదని చెబుతున్నాడు. కేవలం తెలివిగా తినడం ఎలాగో తెలుసుకుంటే చాలు వెయిట్లాస్ అవ్వడం చాలా సులభమని చెబుతున్నాడు. అందుకోసం తాను ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాలను తీసుకుంటూ..నిబద్ధతో ఉండటం నేర్చుకోవాలని చెబుతున్నాడు. ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాలు కండరాలను బలంగా ఉంచి, ఆకలిని నియంత్రించడమే కాకుండా కొవ్వు తగ్గడానికి మద్దతిస్తుందని చెబుతున్నాడు. ఆ విధంగానే తాను మూడేళ్లలో 150 కిలోలు నుంచి 74 కిలోలకు చేరుకున్నాని, అలా మొత్తం 76 కిలోలు బరువు తగ్గానని చెప్పుకొచ్చాడు. అంతేగాదు బరువు తగ్గడానికి ఉపకరించిన తన ప్రోటీన్ భోజన ప్రణాళికను కూడా పంచుకున్నాడు.ప్రోటీన్ ఫుడ్ ప్లాన్..ఉదయం అల్పాహారం (400 కిలో కేలరీలు, 35 గ్రా ప్రోటీన్)ఎంపిక 1: 4 గుడ్డులోని తెల్లసొన + ఉల్లిపాయలు, టమోటాలతో గిలకొట్టిన ఆమ్లెట్, క్యాప్సికమ్ పాలకూరతో 50 గ్రా పనీర్ బుర్జీ, మల్టీగ్రెయిన్ టోస్ట్.ఎంపిక 2 (గుడ్లు లేకుండా): కూరగాయలతో 60 గ్రా సోయా ముక్కలు స్టైర్-ఫ్రై, 50 గ్రా తక్కువ కొవ్వు పనీర్ గ్రిల్, ఒక చిన్న మల్టీగ్రెయిన్ టోస్ట్.లంచ్ (350 కిలో కేలరీలు, 30 గ్రా ప్రోటీన్)లంచ్ కోసం, ఇది తేలికగా ఉంచడం గురించి కానీ భోజనంలో ప్రోటీన్ అధికంగా ఉండాలి. అతను 100 గ్రాముల సోయా ముక్కలు కర్రీ, 100 గ్రాముల ఉడికించిన బ్రోకలీ, ఒక చిన్న రోటీని ఎంచుకున్నాడు.సాయంత్రం స్నాక్ (200 కిలో కేలరీలు, 20 గ్రా ప్రోటీన్)చిప్స్ లేదా స్వీట్లకు బదులుగా, నామన్ 150 గ్రాముల తక్కువ కొవ్వు పనీర్ టిక్కాను ఎంచుకున్నాడు, పెరుగు, నిమ్మకాయ, సుగంధ ద్రవ్యాలతో మ్యారినేట్ చేసి, గ్రిల్ చేసిన లేదా వేయించినది.డిన్నర్ (350 కిలో కేలరీలు, 35 గ్రా ప్రోటీన్)నామన్ డిన్నర్ కోసం ఉడికించిన పప్పు (పప్పు), వేయించిన టోఫు లేదా పనీర్, కూరగాయలు దోసకాయ, టమోటా సలాడ్ ఒక చిన్న రోటీ తీసుకున్నట్లు తెలిపాడు.రోజువారీ మొత్తంకేలరీలు 1300–1400 కిలో కేలరీలు, దాదాపు 120 గ్రా ప్రోటీన్తో ఉంటాయి. ఇదే నమన్ కడుపు నిండి ఉండటానికి తోడ్పడింది. పైగా అతని వ్యాయామాలకు ఇంధనంగానూ, కండరాలను కోల్పోకుండా కొవ్వును కరిగించడానికి సహాయపడింది. నామన్ పంచుకున్న వాటిలాగే ప్రోటీన్ అధికంగా ఉండే తేలికైన భోజనం తినడం వల్ల కొవ్వు తగ్గడం వాస్తవికంగా స్థిరంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అందువల్ల ఫ్యాన్సీ ఫుడ్స్ లేదా విపరీతమైన డైట్స్ అవసరం లేదు. జస్ట్ ప్రోటీన్ అధికంగా, సమతుల్య పద్ధతిలో తింటే బరువు అదుపులో ఉంటుందని నమ్మకంగా చెబుతున్నారు నిపుణులు. View this post on Instagram A post shared by Naman Chaudhary (@sweat_with_nc) గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం(చదవండి: నానో బనానా ఏఐ చీర ట్రెండ్ ప్రకంపనం..! ప్లీజ్ సోమరిగా మారకు..) -
ఆంజినాని అర్థం చేసుకుంటే..అతివల గుండె పదిలం..!
గుండె వ్యాధులు ఎక్కువగా పురుషులనే ప్రభావితం చేస్తాయని, అందులోనూ కరోనరి ఆర్టరీ డిసీజ్ వంటి గుండె సమస్యలు పురుషులకే అత్యంత ప్రమాదమని అనుకుంటారు అంతా. కానీ మహిళలకూ అంతే స్థాయిలో ప్రమాదం ఉంటుందట. వాళ్లు కూడా తరుచుగా ఆంజినా(ఛాతీనొప్పి) వంటి లక్షణాలను ఎదుర్కొంటారట. అయితే ఈ ఛాతీనొప్పిని మహిళలు తేలిగ్గా కొట్టిపారేయడం, సకాలంలో చికిత్స తీసుకోకపోవడంతో ప్రాణాలపై కొనితెచ్చుకుంటున్నారని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ ఛాతీనొప్పిపై అవగాహన లేమి దీనంతటికి కారణమని అంటున్నారు. మరీ ఏంటి ఛాతీనొప్పి, దాని లక్షణాలు, ముందుస్తుగా ఎలా గుర్తించాలి తదితరాల గురించి వైద్యుల మాటల్లోనే సవివరంగా తెలుసుకుందామా..!.భారతదేశంలో చాలావరకు సంభవిస్తున్న మరణాల్లో కరోనరీ ఆర్టరీ డిసీజ్ (CAD)కి సంబంధించిన కేసులు కూడా ఉన్నాయని అన్నారు. అంతేగాదు డబ్ల్యూహెచ్ఓ ప్రకారం..2022లో భారతదేశంలో దాదాపు 4 మిలియన్లకు పైగా మరణాలు క్యాడ్ వల్లే సంభవించాయి. పైగా ఈ గణాంకాలు మహిళలకు ఈ వ్యాధిపై తక్షణ అవగాహన, సంరక్షణ చర్యలు తీసుకోవాల్సి అవసరం గురించి నొక్కి చెప్పాయి. అందువల్ల ఈ ఆంజినా పెక్టోరిస్ని(ఛాతీనొప్పి)ని ముందస్తుగా గుర్తించడం, సమర్థవంతంగా నిర్వహించడంపై మహిళలకి అవగాహన పెంచడం అనేది అత్యంత ప్రధానమని నిపుణులు సూచిస్తున్నారు.ఆంజినా (ఛాతీనొప్పి) ఎలా ఉంటుందంటే..ఆంజినా అనేది క్యాడ్(CAD)కి సంబంధించిన అత్యంత సాధారణ లక్షణం. మహిళలే ఎక్కువగా ఈ వ్యాధి లక్షణాలను ఎదుర్కొంటారట. ఇది రోగి జీవన నాణ్యతను గణనీయంగా దెబ్బతీస్తుంది. గుండె కండరాలకు తగినంత ఆక్సిజన్ ఉన్న రక్తం అందనప్పుడు వచ్చే ఛాతీ నొప్పి లేదా అసౌకర్యం. దీని వలన ధమనులు సంకోచించి, గుండెకు రక్త ప్రసరణ తగ్గుతుంది. ఆంజినా లక్షణాలు ఛాతీలో ఒత్తిడి లేదా బిగుతుగా అనిపించడం, చేతులు, భుజాలు, మెడ లేదా దవడలోకి వ్యాపించడం, శ్వాస ఆడకపోవడం, అలసట, వికారం, చెమటలు పట్టడం వంటివి ఉండవచ్చు. ఇది హార్ట్ ఎటాక్ కానప్పటికీ, గుండెపోటు వచ్చే ప్రమాదాన్ని సూచిస్తుంది. పైన పేర్కొన్న ఆ సమస్యల ఉత్పన్నమవ్వగానే సకాలంలో వైద్య సహాయం తీసుకోకపోవడంతోనే ఈ ఆంజినా సవాలుగా మారుతుందని చెబుతున్నారు వైద్యులు. మహిళల్లో ఈ సమస్య నిర్థారణలో చేస్తున్న జాప్యమే సమస్య తీవ్రతను పెంచి, అకాల మరణాలకు దారితీస్తుందని చెబుతున్నారు నిపుణులు. అంతేగాదు ఈ నిర్లక్ష్యమే ఒక్కోసారి నిపుణులు సైతం అంతర్లీనంగా ఉన్నీ ఆంజినా సమస్యను పరిష్కరించకుండా ఇతరత్ర ఉపశమన పరిష్కారాలు అందించేలా చేసి, మరింత ప్రమాదంలోకి నెట్టేస్తుందని హెచ్చరిస్తున్నారు. చికిత్స విధానం..OPTA(ఆప్టిమల్ ట్రీట్మెంట్ ఆఫ్ ఆంజినా) క్లినికల్ చెక్లిస్ట్, OPTA ప్రశ్నాపత్రం, OPTA విధానంతో సహా మూడు ప్రత్యేకమైన సాధనాలు వరుసగా ఆంజినా(ఛాతీనొప్పి) నిర్థారణకు కీలకమైనవి. ఇవి రోగ నిర్థారణకు, వైద్య నిర్వహణకు మద్దతిస్తాయి. పైగా వైద్యలకు సకాలంలో ఈ ఛాతీనొప్పిని నిర్థారించడంలో హెల్ప్ అవుతుంది. ఇది ఒకరకంగా ఆంజినా నిర్వహణపై తొలి అడుగుగా అభివర్ణించారు నిపుణులు.మహిళ్లలోనే ఈ వ్యాధిని గుర్తించలేకపోవడానికి రీజన్..మహిళల్లో గుండె జబ్బులను గుర్తించడంలో ఒక ప్రధాన సవాలు ఏంటంటే..సహజంగా తాము తక్కువ ప్రమాదంలో ఉన్న అపోహనే ప్రధాన కారణమని చెబుతున్నారు అపోలా ఆస్పత్రి కార్డియాలజిస్ట్ డాక్టర్ సరితా రావు. అదీగాక గుండెజబ్బులు వంటి సమస్యలు తరుచుగా పురుషులే బారిన పడతారనేది నిజమే అయినప్పటికీ, పూర్తిగా మహిళలకు ఈ వ్యాధుల రావు అని అర్థం కాదని అంటున్నారు. అందువల్లే ఈ గుండె జబ్బుల ప్రమాదాలపై మహిళలకు అవగాహన కలిగించడం అత్యంత ప్రధానమని నొక్కి చెబుతున్నారు. 75 ఏళ్లు పైబడిన హృదయ సంబంధ రోగుల్లో మహిళలే అధికమని చెప్పారు. ముఖ్యంగా ఆంజినా(ఛాతీనొప్పి)తో ముడిపడి ఉన్న గుండెజబ్బులు పురుషుల కంటే మహిళలనే ఎక్కువగా ప్రభావితం చేస్తాయని అన్నారు. అందువల్ల మహిళలు ఈ వ్యాధిని తిప్పికొట్టేలా రోగ నిర్థారణ, సకాలంలో చికిత్స, నిర్వహణపై ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించి మెరుగైన ఫలితాలు అందుకునేలా చర్యలు తీసుకోవడం అనేది అత్యంత కీలకమని అన్నారు.(చదవండి: Pain Relief Therapy: నొప్పిని పోగొట్టే ‘అయాన్’) -
స్పేస్లో వ్యోమగాములు ఫిట్నెస్ను ఎలా నిర్వహిస్తారంటే..!
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)లో కాలుమోపి చరిత్ర సృష్టించిన భారతీయ వ్యోమగామి శుభాంశు శుక్లా అంతరిక్ష వ్యాయామ పద్ధతుల గురించి ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. మెక్రోగ్రావిటీలో శారీరక శ్రమ ఎంత ప్రధానమైనదో వివరించారు. వాళ్లు ఫిట్నెస్పై ఉంచే దృష్టి మొత్తం మిషన్ సక్సెస్కి అత్యంత కీలకమని చెప్పారు. అయితే ఇక్కడ భూమ్మీద ఉన్నట్లుగా జిమ్ సభ్యత్వం ఉండదు. అక్కడ చేసిన సౌలభ్యకరమైన పరికరాలతో చేసే ఛాన్సే ఉండదు. మరి ఎలా చేస్తారంటే..అలాంటప్పుడూ ప్రత్యేక శిక్షణతో కూడిన వ్యాయామాలను వ్యోమగాములు అనుసరిస్తారని చెబుతున్నారు శుభాంశు. జీరో గ్రావిటీలో చాలా రకాల శారీరక మార్పులు ఉంటాయి. శరీరం జీరో గురుత్వాకర్షణ వద్ద మొత్తం బాడీ బద్ధకంగా ఉంటుందట. కండరాలు కుచించుకుపోయి, ఎముకలు బలహీనంగా అయిపోతాయట. దాంతోపాటు శరీరంలోని శక్తి కూడా సహకరించేందుకు ఇష్టపడదట. మన కార్డియో, బలం రెండూ దెబ్బతింటాయట. అందువల్ల అంతరిక్షంలో వ్యాయామం అనేది ఒక ఆప్షన్ కాదు. వ్యోమగాములకు అది తప్పనిసరిగా చేయాల్సిన శారీరక శ్రమ. స్పేస్ బైక్..అందుకోసం స్పేస్ స్టేషన్లోని వ్యోమగాములు CEVIS (వైబ్రేషన్ ఐసోలేషన్ సిస్టమ్తో సైకిల్ ఎర్గోమీటర్) వంటి పరికరాలను ఉపయోగిస్తారని చెప్పారు శుభాంశు. ఇది ప్రాథమికంగా షాక్ అబ్జార్బర్కు బోల్ట్ చేయబడిన స్పేస్ బైక్ లాంటిదని అన్నారు. CEVIS వ్యవస్థ వ్యాయామం ద్వారా ఉత్పన్నమయ్యే కంపనాలను గ్రహిస్తుంది. ఫలితంగా అంతరిక్ష కేంద్రం అనాలోచిత కదలికలను నిరోధిస్తుంది. ఈ స్పేస్ బైక్లో సీటు ఉండదు ఎందుకంటే తేలుతున్నట్లు ఉంటుంది ాకాబట్టి ీసీటుతో పని ఉండదట. దానిపై కూర్చొన్న భంగిమలో పాదాలను లాక్ చేసి పెడలింగ్ చేస్తారట. అంతేగాదు పాదాలను పట్టీల సాయంతో నియంత్రణలో సురక్షితంగా ఉంచుకుంటారట. ఈ వ్యాయామం సమగ్ర హృదయనాళ వ్యవస్థను మెరుగ్గా ఉంచి, కండరాల క్షీణత, ఎముక సాంద్రత నష్టాన్ని నివారిస్తుందని చెప్పుకొచ్చారు వ్యోమగామి జీపీ కెప్టెన్. ఇక్కడ స్పేస్ వాతావరణానికి తగ్గట్టుగా ఫిట్నెస్ పరంగా "జీరో గ్రావిటీ, జీరో సాకులు." అని చమత్కరించారు శుభాంశు. చివరగా అంతరిక్షంలో జీవిత సవాళ్లకు అనుగుణంగా ఆరోగ్యంగా ఉండేలా పనితీరును నిర్వహించడానికి అంకితభావంతో కూడిన నిబద్ధత అత్యంత ముఖ్యమని నొక్కి చెప్పారు. (చదవండి: హ్యాట్సాఫ్ గుత్తా జ్వాలా..! అమ్మతనానికి ఆదర్శంగా..) -
ఆరోగ్య సంరక్షణలో భారత్ బెస్ట్..!
భారతదేశంలో నివశిస్తున్న అమెరికన్ మహిళ క్రిస్టెన్ ఫిషర్ ఆరోగ్య సంరక్షణపై నెట్టంట షేర్ చేసిన పోస్ట్ నెటిజన్ల మనసును దోచుకోవడమే కాదు చర్చనీయాంశంగా మారింది. అంతేగాదు అక్కా మీరు చాలా బాగా చెప్పారంటూ ఆము ప్రశంసల వర్షం కురింపించారు నెటిజన్లు. అంతేగాదు అత్యంత నిజాయితీగా మాట్లాడిన తీరు కూడా చాలా బాగుందని మెచ్చుకున్నారు. ఇంతకీ ఆమె పోస్ట్లో ఏం రాసిందంటే..భారతదేశంలో గత కొన్నేళ్లుగా నివశిస్తున్న క్రిస్టెన్ ఫిషర్ భారతదేశం, అమెరికాలోని ఆరోగ్య సంరక్షణ వ్యవస్థల తీరు ఎలా ఉంటుందో సోష్ల మీడియా వేదికగా షేర్ చేసుకుంది. ఇరు దేశాల్లోని ఆస్పత్రులు, వైద్యులు, మందులు పరంగా ఆరోగ్య సంరక్షణ ఏ దేశంలో బాగుంటుందో వెల్లడించింది. ఖర్చు, ఔషధాల పరంగా భారతదేశం బెటర్ అని, అదే యూఎస్లో ఈ పరంగా రోగిపై అత్యధిక భారం పడుతుందని తెలిపింది. అలాగే అపాయింట్మెంట్ దొరకడం కూడా కష్టం అని అన్నారు. భారత్లో అపాయింట్మెంట్తో పనిలేకుండానే క్లినిక్కి వెళ్లగలం, పైగా సమయం కూడా ఎక్కువ పట్టదని అంటోంది. అలాగే డాక్టర్లు వైద్యుడిని పర్యవేక్షించే విషయంలో కూడా భారత్ బెటర్ అని, ఎందుకంటే క్షుణ్ణంగా అతడిని విచారించి..చికిత్స అందిస్తుందని, యూఎస్లో రోగితో డాక్టర్ స్పెండ్ చేసే టైం చాలా తక్కువ, పైగా అంత సమయం కేటాయించేందుకు ఇష్టపడరనికూడా పేర్కొంది. ఇక ఆస్ప్రతిలో అందించే భోజనం పరంగా అమెరికా బెటర్ అని, కానీ రోగికి ఇచ్చే మెనూ ఆధారంగా వారి పర్యవేక్షకులకు అదే ఆహారం ఉంటుందని, అంత మెరుగ్గా లేదని అన్నారామె. మొత్తంగా చూస్తే ఆరోగ్య సంరక్షణ భారత్లోనే బాగుంటుంది, ఇక్కడ వైద్య ఖర్చు తక్కువే, పైగా మందులు కూడా సులభంగా దొరుకుతాయంటూ పోస్ట్లో తన అభిప్రాయాన్ని రాసుకొచ్చిందామె. ఈ పోస్ట్ నెట్టింట చర్చకు దారితీయడమే గాక, నిజాయితీగా తన అభిప్రాయాన్ని వెల్లడించిన తీరుకు నెటిజన్లు ఫిదా అయ్యారు. అదీగాక మా దేశాన్ని అభినందిస్తుందన్నందుకు అక్కా మీపై రోజురోజుకి గౌరవం పెరిగిపోతుందోందటూ పోస్ట్లు పెట్టారు నెటిజన్లు. కాగా, ఆమె గతంలో కూడా పలు విషయంలో భారత్లోనే పిల్లలు మంచిగా పెరుగుతారని, ఈ నేల నివశించడానికి అనువైనదని, ఎవ్వరినైనా తనలో కలిపేసుకునే ఆకర్షణ ఈ ప్రదేశంలో ఉందంటూ భారత్పై పొగడ్తల వర్షం కురిపించింది కూడా. View this post on Instagram A post shared by Kristen Fischer (@kristenfischer3) (చదవండి: ఆర్మీ ఆఫీసర్గా అందాలరాణి..!) -
మధుమేహంతో బాధపడేవాళ్లు పాదాల సంరక్షణ కోసం..!
డయాబెటిస్ పేషెంట్లలో కాలికి దెబ్బతగిలి, అది సెప్టిక్ కావడంతో కాలు తొలగించాల్సి వచ్చిందని వింటుండటం మామూలే. ఇలా కాలు సెప్టిక్ కావడాన్ని వైద్య పరిభాషలో గ్యాంగ్రీన్ అంటారు. డయాబెటిస్ ఉన్నవారికి కాళ్లకూ, వేళ్లకూ చివర్లలో ఉన్న నరాలు మొద్దుబారుతుండటం సాధారణం. దాంతో వాళ్లకు చిన్న చిన్న దెబ్బలు తగిలినా నొప్పి తెలియదు. కొందరిలోనైతే చిన్న చిన్న గులకరాళ్లు గుచ్చుకున్నా కాలికి గ్యాంగ్రీన్ వచ్చే వరకు విషయం తెలియదు. తీరా పరిస్థితి విషమించాక వారు తమ ఫిజీషియన్ దగ్గరకు రావడం, వాళ్లు వ్యాస్క్యులార్ సర్జన్ దగ్గరికి పంపితే కాలు తొలగించాల్సిన పరిస్థితి అని చెప్పడం చాలామందికి ఎదురయ్యే పరిస్థితే! ఈ పరిస్థితి నివారించడానికి ఏం చేయాలో తెలిపే కథనమిది.డయాబెటిస్తో బాధపడే వ్యక్తుల్లో కాలికి ఏదైనా దెబ్బతగిలి అది గ్యాంగ్రీన్గా మారిన దాదాపు 80% మందిలో కాలు తొలగించాల్సిన పరిస్థితి తలెత్తవచ్చు. ఇలా కాలు తొలగించడాన్ని వైద్యపరిభాషలో ‘నాన్ట్రామాటిక్ లోయర్ లింబ్ యాంపుటేషన్’గా చెబుతారు. పల్లె వాసుల్లో కాలు తొలగింపు ముప్పు... నిజానికి పట్టణవాసులతో పోలిస్తే డయాబెటిస్ కారణంగా కాలు తొలగింపు ముప్పు పల్లెప్రజల్లోనే ఎక్కువగా ఉంటుంది. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. అవి... పల్లెల్లోని రక్కిస పొదలతో నిండి ఉండే డొంకదారుల్లో నడుస్తున్నప్పుడు కాలికి ముళ్లు గుచ్చుకోవడం లేదా ముళ్ల కంచెకు కాలు తగిలి చీరుకుపోవడంతో గాయాలు కావడం పట్టణ ప్రజలతో పోలిస్తే చెప్పుల్లేకుండా ఖాళీ పాదాలతో నడిచేవారు పల్లెల్లోనే ఎక్కువగా ఉండటం. దాంతో పాదం కింద చిన్న చిన్న గులకరాళ్లు గుచ్చుకోవడం లేదా కాలివేళ్లకు తాకుడు రాయి తలగడం ఎక్కువ పశువులను మేతకు విడుస్తున్నప్పుడు అవి పొరబాటున కాలు తొక్కడంతో గాయం కావడం వ్యవసాయ పనుల్లో కొడవలి వంటి పదునైన పనిముట్లు తగిలి గాయం కావడం ∙డొంకదారులను పశువులు నడవడానికి వీలుగా కంప కొడుతున్నప్పుడు... అది గీరుకుపోవడం... పత్తి పంట కోశాక... ఎండిన మొదళ్లపైన పొరబాటున కాలు పడ్డప్పుడు... అవి పాదాల్లో గుచ్చుకుపోవడం.ఇప్పుడు పట్టణ / నగరా ప్రాంతాల్లోనూ... ఇలాంటి ప్రమాదాలకు పల్లెల్లో అవకాశాలు ఎక్కువ. అయితే ఇటీవల పట్టణ ప్రాంతాల్లోనూ ఈ తరహా కేసులు పెరుగుతున్నాయి. డిజైనర్ వేర్ పాదరక్షలు ధరించేవారిలో, ఎప్పుడూ కదలకుండా పనిచేస్తూ ఉండే ఐటీ రంగాలకు చెందిన ఉద్యోగుల్లో, ఏదైనా ప్రత్యేక సందర్భాల్లో ఆరుబయట నిర్వహించే ప్రత్యేక పూజలూ / ప్రార్థనల్లో భాగంగా చెప్పులు లేకుండా నడవటం వంటి సందర్భాల్లో పాదాలకు గాయాలు కావడంతో ఇప్పుడు పట్టణ, నగరవాసుల్లో కూడా ఈ తరహా గాయాలు అవుతున్నాయి. అవి పల్లెవాసులకైనా లేదా పట్టణ ప్రాంతాలవారికైనా వాళ్ల కాళ్లకు అయ్యే గాయాలు ‘ఫుట్ అల్సర్’ అని పిలిచే పుండ్లుగా మారి కాలు దాదాపుగా గ్యాంగ్రీన్గా మారినప్పుడు కొందరిలో కాలిని తొలగించాల్సి వచ్చే ‘యాంపుటేషన్’ తప్పకపోవచ్చు. కాలు తొలగించాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుందంటే..? సాధారణంగా కాలికి గానీ ఇతరత్రా ఏ అవయవానికైనా గాయమైతే వెంటనే నొప్పి వస్తుంది. గాయమైనప్పుడు ఆ భాగం పూర్తిగా కోలుకోవడానికి వీలుగా మనలోని రక్షణ వ్యవస్థ ఆ భాగంలో ‘నొప్పి’ని కలిగిస్తుంది. దాంతో మనం కాలిని కదిలించకుండా దానికి తగినంత విశ్రాంతినిస్తాం. అయితే డయాబెటిస్తో బాధపడే వ్యక్తుల్లో నొప్పిని తెలిపే ‘నరాలు’ మొద్దుబారి ఉండటంతో నొప్పి పెద్దగా తెలియదు. దాంతో అదే కాలిని ఉపయోగిస్తున్నప్పుడు తగిలిన చోటే మళ్లీ మళ్లీ దెబ్బ తగులుతూ గాయం మాటిమాటికీ రేగుతుంది. అప్పుడా ఇన్ఫెక్షన్ దెబ్బతగిలిన చోటి నుంచి పైపైకి ΄ాకవచ్చు. ఇలా జరగడాన్ని వాడుక భాషలో మనం సెప్టిక్ కావడం అంటుంటాం.గాయం ఒక ముప్పు అయితే గ్యాంగ్రీన్ మరో ముప్పు... మన దేహంలోని ప్రతి అవయవానికీ, అందులోని ప్రతి కణానికీ నిత్యం రక్తసరఫరా జరుగుతూ ఉంటుంది. అలాగే దేహంలోని ప్రతి భాగానికీ స్పర్శ తెలిపే నరాలూ ఆవరించుకుని ఉంటాయి. వాటి వల్ల మనకు స్పర్శజ్ఞానంతో ΄ాటు దెబ్బతగిలినప్పుడు నొప్పి, బాధ తెలుస్తుంటాయి. కాలక్రమంలో డయాబెటిస్ వ్యాధి నరాల చివరలను మొద్దుబారేలా చేయడం వల్ల దేహంలోని కొన్ని భాగాలు... మరీ ముఖ్యంగా కాలివేలి చివర్లలో స్పర్శజ్ఞానం అంతగా తెలియదు. పైగా దేహంలోని చివరి భాగాలకు రక్తం సరఫరా చేసే అతి సన్నటి రక్తనాళాల్లో (క్యాపిల్లరీస్) అడ్డంకులు ఏర్పడటం వల్ల అక్కడికి అందాల్సిన షకాలు, ఆక్సిజన్ అందక΄ోవడంతో ఆ భాగం కుళ్లి΄ోవడం మొదలవుతుంది. ఇలా జరగడాన్ని ‘గ్యాంగ్రీన్’గా చెబుతారు. స్పర్శజ్ఞానం, నొప్పి తెలియక΄ోవడంతో గ్యాంగ్రీన్ మొదలైనప్పటికీ ఆ విషయమే డయాబెటిస్ బాధితులకు వెంటనే తెలియదు. అలా ఇన్ఫెక్షన్ పైపైకి పాకుతూ పోతుంటే మొత్తం ప్రాణానికే ప్రాణాపాయం జరిగే అవకాశముంటుంది కాబట్టి గ్యాంగ్రీన్ ఎంతవరకు పాకిందో అక్కడి వరకు ఆ కుళ్లిన భాగాన్ని తొలగించాలంటూ (యాంపూట్ చేయాలంటూ) డాక్టర్లు చె΄్పాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.ప్రమాదం కేవలం కాళ్లకేనా..? ఇలా యాంపూటేషన్ చేయాల్సిన పరిస్థితి కేవలం కాళ్లకు మాత్రమే కాకుండా చేతులకూ వచ్చే ప్రమాదముంది అయితే కాళ్లతో ΄ోలిస్తే చేతులూ, చేతి వేళ్లతో మనం ప్రతినిత్యం పనిచేస్తుంటాం కాబట్టి... చేతులకు అలాంటి కండిషన్ వస్తే కాళ్లతో ΄ోలిస్తే త్వరగా తెలిసి΄ోతుంది. అందుకే చేతులతో ΄ోలిస్తే కాళ్లు, కాలివేళ్లకే గ్యాంగ్రీన్ ముప్పు మరింత ఎక్కువ.మరో జాగ్రత్త ‘యాంకిల్ బ్రేకిల్ ఇండెక్స్’ పరీక్ష...ఏడాదికోసారి లేదా డాక్టర్లు చెప్పిన విధంగా పాదాల విషయంలో వైద్యులను కలిసి పాదాలకు పల్స్ చెక్ చేయించుకుంటూ ఉండాలి. చేతుల మణికట్టు దగ్గర చూసినట్టే... డాక్టర్లు కాలి దగ్గర కూడా పల్స్ చెక్ చేసి చూస్తారు. అక్కడ నాడీస్పందనలు ఎలా ఉన్నాయో పరిశీలిస్తారు. అలాగే యాంకిల్ బ్రేకిల్ ఇండెక్స్ అని మరో పరీక్ష ఉంటుంది. ఇందులో బీపీ పరిశీలించేటప్పుడు చేతికి చుట్టినట్టే కాలి దగ్గర కూడా బీపీ పరిశీలించేప్పుడు చుట్టే పట్టాచుట్టి ఈ పరీక్ష చేసి, కాలిలో బీపీ కొలత చూస్తారు. కొలత విలువ ‘ఒకటి (1)’ ఉంటే అంతగా ఆందోళన పడాల్సిందేమీ ఉండదు. కానీ ఈ కొలత 0.5 కంటే తగ్గుతూ ΄ోతూ ఉంటే (అంటే ఆ విలువలో సగానికంటే తక్కువగా ఉంటే... చేతితో ΄ోలిస్తే అందులో సగం కంటే తక్కువగా ఉంటే) కాలిలో రక్త ప్రసరణ తగ్గుతూ ఉందని అర్థం. ఇలాంటప్పుడు ‘సూపర్వైజ్డ్ ఎక్సర్సైజ్ థెరపీ’లాంటి వ్యాయామాల చికిత్స తప్పక అవసరమని గుర్తించాలి. చివరగా... డయాబెటిక్ ఫుట్ సమస్యలో సాదానికి పుండ్లు పడ్డప్పుడు అది కేవలం వాస్క్యులార్ సర్జన్ మాత్రమే కాకుండా ఒక సమగ్రమైన కార్యాచరణతో పలువురు నిపుణులు ఓ బృందంగా ఏర్పడి చికిత్స అందించాల్సి అవసరం ఉంటుంది. ఇందులో వాస్క్యులార్ సర్జన్లు, ΄ప్లాస్టిక్ సర్జన్లు, డయాబెటాలజిస్టులు, ఫుట్ యాంకిల్ సర్జన్లు, పాడియాట్రిక్ నిపుణులు, ఇంటర్నల్ మెడిసిన్ చికిత్సకులు, ఫిజియోథెరపిస్టులు ఇలా టీమ్వర్క్తో డయాబెటిక్ లింబ్ సాల్వేజ్ టీమ్గా ఏర్పడి పాదాన్ని రక్షించడానికి ప్రయత్నిస్తారు. ఆ తర్వాత ఆహారంలో చక్కెర మోతాదులను తగ్గించే విధంగా న్యూట్రిషనిస్టులు, రక్తంలో చక్కెరను అదుపు చేయడానికీ, రక్తంలో కొవ్వులు తగ్గించే మందులిచ్చే జనరల్ ఫిజీషియన్లు... ఇలా డాక్టర్ల బృందమంతా సమగ్రంగా పనిచేయాల్సి ఉంటుంది.ఎవరికి వారు కాళ్లను స్వయంగా పరీక్షించుకుంటూ ఉండాలి. ఇందుకోసం పాదాల కింద అద్దంపెట్టుకుని, పాదాల అడుగుభాగం ఎలా ఉందో చూసుకుంటూ ఉండాలి. అలాగే కాలి పైభాగాన్ని కూడా శ్రద్ధగా పరిశీంచుకోవాలి. కాలి వేళ్ల మధ్య భాగాలనూ జాగ్రత్తగా చూస్తూ... అక్కడ చిన్న పోక్కుల్లాంటివి ఏవైనా ఉన్నాయేమో చూడాలి. అలాంటివి ఉంటే వెంటనే డాక్టర్కు తెల΄ాలి. లేదంటే అవి పుండ్లుగా మారే ప్రమాదం ఉండవచ్చు.కాలిగోళ్లను ప్రతివారమూ కట్ చేసుకోవాలి. ఈ సమయంలో గోళ్లను మరీ లోపలికి కట్ చేసుకోకూడదు. అలాంటప్పుడు ఒక్కోసారి గోరు మూలల్లో రక్తం వచ్చేంతగా గోరు కట్ కావచ్చు. ఇది జరిగినప్పుడు కొందరిలో గోరు లోపలి వైపునకు పెరగవచ్చు. డయాబెటిస్ బాధితుల్లో ఇది చాలా ప్రమాదకరం.వేడి వస్తువులనుంచి కాళ్లను దూరంగా ఉంచుకోవాలి.పాదాలను మృదువుగా ఉంచుకోవాలి. ఇందుకోసం కాళ్లు కడుక్కున్న తర్వాత పొడిగా తుడుచుకొని, ఆ తర్వాత వాజిలైన్ రుద్దుకొని, మళ్లీ ఆ తర్వాత పొడిగా మారేంతవరకు తుడుచుకోవాలి.పాదాలను ప్రతినిత్యం పొడిగా ఉంచుకోవాలి. కాళ్లు కడుక్కున్న వెంటనే అవి పొడిబారే వరకు తుడుచుకోవాలి. కాలి వేళ్ల మధ్య పొడిగా ఉండటం కోసం పౌడర్ రాసుకోవాలి.కాలికి చెప్పులు, బూట్లు లేకుండా నడవకూడదు. అయితే ఈ చెప్పులు, బూట్లు కాలికి సౌకర్యంగా ఉండాలి. ఏమాత్రం అసౌకర్యం ఉన్నా అలాంటివి తొడగడం సరికాదు.కాళ్ల మీద పులిపిరి కాయల్లాంటివి ఏవైనా ఏర్పడితే డాక్టర్ను సంప్రదించి, వారి పర్యవేక్షణలోనే వాటిని తొలగించుకోవాలి. లేదంటే అవే భవిష్యత్తులో పుండ్లుగా మారే అవకాశం లేకపోలేదు.ఇంట్లో కూడా పాదరక్షలు లేకుండా నడవకూడదు. ప్రత్యేకంగా తడి, తేమలో పనిచేసే మహిళలు (పురుషులు కూడా) స్లిప్పర్స్ వంటివి తొడుక్కునే పనిచేసుకోవాలి.మానని పుండ్లకు చికిత్స ఇలా... కాలిపైన పుండుగానీ లేదా చాలాకాలం వరకు మానని గాయం గానీ ఉంటే వెంటనే డాక్టర్కు చూపించుకోవాలి. ఇలా ఎంత త్వరగా డాక్టర్కు చూపిస్తే కాలిని కాపాడుకునే అవకాశాలు అంత ఎక్కువని గుర్తుంచుకోవాలి. యాంకిల్ బ్రేకిల్ ఇండెక్స్ పరీక్షలో కాలి నాడీ స్పందనల కొలత 0.5 కు లేదా అంతకంటే తగ్గుతున్నప్పుడు ‘సూపర్వైజ్డ్ ఎక్సర్సైజ్ థెరపీ’ కింది రోజుకు అరగంటకు తగ్గకుండా, అది కూడా వారంలో ఐదు రోజులకు తగ్గకుండా బ్రిస్క్వాకింగ్ ఎక్సర్సైజ్ చేయాలి. దీనివల్ల యాంజియోగ్రామ్కు మించిన ఫలితం ఉంటుందని చాలా పరిశోధనల్లో నిర్ధారణ అయ్యింది ఇలా యాంకిల్ బ్రేకిల్ ఇండెక్స్ పరీక్షలో కొలత 0.5 కంటే తగ్గుతున్నవారిలో ప్రోటీన్తో కూడిన ఆహారాలూ, ద్రవాహారాలు ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. దీనివల్ల రక్తప్రసరణ వేగం పెరగడం వల్ల కాలికి జరగాల్సిన నష్టం నివారితమవుతుంది కాలిలో రక్తప్రసరణ వేగాలు తగ్గుతున్నాయని గుర్తించిన తొలి దశల్లో రక్తాన్ని పలచబార్చేవీ, కాలిలో రక్తప్రసరణవేగాన్ని మెరుగుపరిచేవి కొన్ని రకాల మందులతో మున్ముందు రాబోయే కాలి తొలగింపు ముప్పును నివారించవచ్చు అత్యాధునిక టీసీపీఓటూ (క్యూటేనియస్ ఆక్సిజన్ మెజర్మెంట్) పరీక్షతో అతి సన్నటి రక్తనాళాల (క్యాపిల్లరీస్) ద్వారా కాలి కొనగోరు చివరల వరకూ ఆక్సిజన్ అందుతున్న తీరును పరిశీలించి ఒకవేళ అందక΄ోతే ఇవ్వాల్సిన చికిత్సను డాక్టర్లు నిర్ణయిస్తారు. ఇలాంటి కొన్ని సందర్భాల్లో రక్తం అందడం లేదు / పుండు పడి మానడం లేదని తెలిస్తే మొదట ‘యాంజియోగ్రామ్’ ప్రక్రియ ద్వారా రక్తప్రసరణను మెరుగుపరచవచ్చు. అప్పటికీ రక్తప్రసరణ మెరుగుపడటక΄ోతే ‘బైపాస్’ వంటి కొన్ని ప్రత్యామ్నాయాలు అందుబాటులో ఉన్నాయి. అదీ కుదరకపోతే ‘వీనస్ ఆర్టీరియలైజేషన్’ ప్రక్రియ అనే మరో ప్రత్యామ్నాయం అందుబాటులో ఉంది. అంటే ఇందులో సిరలూ, ధమనులను కలిపి... కొనగోరు చివరి వరకూ రక్తప్రసరణ సరిగా జరిగేలా చూస్తారు ∙గాయానికి చికిత్సను ఎంత త్వరగా అందిస్తే అది అంత త్వరగా మానుతుంది. పుండు మానకుండా మరింత ఆలస్యమయ్యేకొద్దీ అది గ్యాంగ్రీన్గా మారే అవకాశాలెక్కువ. ఇలా డాక్టరుకు గాయాన్ని చూపించడం ఆలస్యమైనవాళ్లలో డాక్టర్లు ‘స్టెమ్ సెల్ థెరపీ’ వంటి అత్యాధునిక ప్రక్రియలతో కాలిని కాపాడే అవకాశం ఉంది.డాక్టర్ కార్తీక్ మిక్కినేని, సీనియర్ వాస్క్యులార్ సర్జన్ (చదవండి: ప్రెగ్నెన్సీ టైంలో ఆస్పిరన్ మందులు వాడొచ్చా..? బిడ్డకు సురక్షితమేనా?) -
ప్రెగ్నెన్సీ టైంలో ఆస్పిరిన్ మందులు వాడొచ్చా..? బిడ్డకు సురక్షితమేనా?
నేను ఐదు నెలల గర్భవతిని, వయసు ముప్పైఏడు. డాక్టర్ రక్తాన్ని పలుచగా చేసే మందులు ఆస్పిరిన్ టాబ్లెట్లు వాడమన్నారు. ఇవి బిడ్డకు సురక్షితమేనా? అలాగే ఈ వయస్సులో గర్భధారణలో సమస్యలు రాకుండా ఉండేందుకు నేను ఏ జాగ్రత్తలు తీసుకోవాలి?– సుజాత, విజయవాడమీ ఆందోళన సహజమే. ముప్పై ఐదు ఏళ్లకు పైబడిన గర్భిణులను మేము అధిక ప్రమాద గర్భిణులుగా పరిగణిస్తాం. ఎందుకంటే వయస్సు పెరిగేకొద్దీ తల్లి, శిశువుకు కొన్ని ప్రత్యేక సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువ. మీరు అడిగిన మందుల విషయం మొదట చెబుతాను. తక్కువ మోతాదులో ఇచ్చే ఆస్పిరిన్ టాబ్లెట్ చాలా సురక్షితం. ఇది రక్తం గడ్డకట్టకుండా కాపాడుతుంది. అలాగే గర్భధారణలో వచ్చే కొన్ని సమస్యలను తగ్గిస్తుంది. డాక్టర్ సూచించిన విధంగా తీసుకుంటే ఇది తల్లి, బిడ్డ ఇద్దరికీ మేలు చేస్తుంది. ఈ వయస్సులో గర్భధారణలో కొన్ని సమస్యలు ఎక్కువగా కనిపిస్తాయి. మొదటి మూడు నెలల్లో గర్భస్రావం వచ్చే అవకాశం పెరుగుతుంది. శిశువులో జన్యు సంబంధిత లోపాలు వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది. గర్భధారణ సమయంలో రక్తపోటు, షుగర్ వంటి సమస్యలు తల్లికి రావచ్చు. కొన్నిసార్లు సిజేరియన్ డెలివరీ అవసరం అవుతుంది. తల్లిలో ఉన్న ఆరోగ్య సమస్యల వలన శిశువు పెరుగుదలలో లోపం రావచ్చు, ముందుగా పుట్టే అవకాశం కూడా ఉంటుంది. అలా పుడితే ప్రత్యేక శిశు సంరక్షణ అవసరం అవుతుంది. ఈ సమస్యలను తగ్గించుకోవడం మీ చేతిలోనే ఉంది. క్రమం తప్పకుండా గర్భధారణ పరీక్షలు చేయించుకోవాలి. డాక్టర్ చెప్పినట్టుగా ఫాలో అప్ తప్పనిసరిగా చేయాలి. అల్ట్రాసౌండ్ స్కాన్లు చేయించుకోవడం ద్వారా శిశువు ఆరోగ్యాన్ని పర్యవేక్షించవచ్చు. అవసరమైతే జన్యు పరీక్షలు చేయించుకోవాలి. ముఖ్యంగా డాక్టర్ సూచించే ఔషధాలను సమయానికి తీసుకోవాలి. ఈ వయస్సులో గర్భధారణ కొంత రిస్క్ ఉన్నప్పటికీ, భయపడాల్సిన పనిలేదు.నా వయసు ఇరవైనాలుగు. ఇది నా రెండవ ప్రెగ్నెన్సీ, ప్రస్తుతం నాలుగో నెలలో ఉన్నాను. నా మొదటి కాన్పు, ముప్పై వారాల సమయంలో ప్రీటర్మ్ డెలివరీ జరిగింది. ఈ గర్భధారణలో మళ్లీ అలాంటి సమస్య రాకుండా సర్జరీ చేయాలని డాక్టర్ సూచించారు. గర్భధారణ సమయంలో శస్త్రచికిత్స చేయించుకోవాలంటే నాకు భయంగా ఉంది. ఇది నిజంగా అవసరమా? ఈసారి కూడా నాకు ముందుగా పుట్టిన బిడ్డ అవుతాడా? ఈ ప్రక్రియ తర్వాత నేను తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటి?– వనజ, నర్సాపురంమీ ప్రశ్న చాలా ముఖ్యమైనది. గతంలో ప్రీటర్మ్ డెలివరీ జరిగిన మహిళల్లో, మళ్లీ అదే పరిస్థితి ఎదురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకే మేము ముందుగానే జాగ్రత్తలు సూచిస్తాం. గర్భాశయానికి దిగువ భాగాన్ని ‘సర్విక్స్’ అంటారు. సాధారణంగా ఇది పొడవుగా, బిగుతుగా మూసి ఉండాలి. ప్రసవ సమయం దగ్గర పడే సరికి మాత్రమే ఇది చిన్నదవుతూ తెరుచుకోవాలి. కాని, కొంతమంది మహిళల్లో, ముఖ్యంగా మీరు చెప్పినట్లుగా నెలలు నిండక ముందే బిడ్డ పుట్టిన అనుభవం ఉన్నవారిలో, ఇది గర్భధారణ పూర్తయ్యే లోపే చిన్నదై తెరుచుకోవడం ప్రారంభమవుతుంది. దీనిని సర్వికల్ ఇన్సఫిషియెన్సీ అంటారు. ఈ పరిస్థితిని సకాలంలో గుర్తించకపోతే, మళ్లీ ప్రీటర్మ్ డెలివరీ జరగవచ్చు. ఈ పరిస్థితిని తెలుసుకోవడానికి సర్వికల్ లెంగ్త్ స్కాన్ అనే ఒక సాధారణ వజైనల్ అల్ట్రాసౌండ్ పరీక్ష చేస్తాం. ఇందులో సర్విక్స్ పొడవు, బిగుతు ఎలా ఉన్నాయో తెలుసుకోవచ్చు. అది తక్కువగా ఉంటే లేదా బలహీనంగా కనిపిస్తే, రెండు మార్గాలు ఉన్నాయి ఒకటి ప్రొజెస్టెరోన్ మందులు ఇవ్వడం, రెండోది సర్విక్స్ను బిగుతుగా కట్టే చిన్న శస్త్రచికిత్స చేయడం. ఇందులో సర్విక్స్ను ప్రత్యేకమైన దారంతో కట్టి, గర్భధారణ పూర్తయ్యేంత వరకు బిగుతుగా ఉంచుతాం. ఇది సురక్షితమైన పద్ధతి, అనేకమందికి మంచి ఫలితాలను ఇచ్చింది. ఈ చికిత్స చేసిన తర్వాత మీరు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. వీలైనంత వరకు బెడ్రెస్ట్ తీసుకోవాలి, భారమైన పనులు చేయకూడదు, బరువులు అస్సలు ఎత్తకూడదు. లైంగిక చర్యలు నివారించాలి. డాక్టర్ చెప్పినట్లుగా రెగ్యులర్గా ఫాలోఅప్ చేయాలి. తరచు స్కాన్లు చేయించుకోవాలి, బిడ్డ ఆరోగ్యంగా ఎదుగుతున్నదీ లేనిదీ చూడాలి. ఈ విధంగా ముందుగానే చర్యలు తీసుకుంటే, గర్భధారణను సురక్షితంగా కొనసాగించే అవకాశం చాలా పెరుగుతుంది. నిజానికి ఈ శస్త్ర చికిత్స లేదా ప్రొజెస్టెరోన్ వాడకం తర్వాత చాలామంది మహిళలు ముప్పై ఏడు వారాలు లేదా అంతకన్నా ఎక్కువ వరకు గర్భధారణ కొనసాగించి, ఆరోగ్యవంతమైన శిశువుకు జన్మనిస్తున్నారు. డా. కడియాల రమ్య, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్ (చదవండి: భావోద్వేగాలను అదుపు చేసుకోవాలంటే..!) -
నూడుల్స్ తినడమే ఒక గేమ్!
చాలా దేశాల్లో ఆడుతూ పాడుతూ ఆహారాన్ని ఆస్వాదించడం కూడా ఒక సంప్రదాయమే! తినేవారిలో గొప్ప అహ్లాదాన్నీ, అనుభూతినీ నింపే ఈ కళలకు ప్రజాదరణా ఎక్కువే! ఆయా దేశాల జీవనశైలికి తగినట్లుగా ప్రత్యేకమైన, ఆహ్లాదకరమైన ఆహారపు విధానాలు ప్రపంచదేశాల పర్యాటకుల్ని ఇట్టే ఆకట్టుకుంటాయి. అలాంటిదే జపాన్లోని ‘నాగాషి సోమెన్’ అనే అహ్లాదకర విధానం. ఈ విధానం అక్కడ వేసవి కాలంలో (జూన్ నుంచి సెప్టెంబర్ మొదటి వారం వరకూ) ఎక్కువగా కనిపిస్తుంది. ఈ సమయంలో జపాన్ వెళ్లిన పర్యాటకులు కూడా ఈ ‘నాగాషి సోమెన్’ నూడుల్స్ని రుచి చూస్తుంటారు. జపనీస్ భాషలో ‘నాగాషి’ అంటే ‘ప్రవహించేది’, ‘సోమెన్’ అంటే సన్నని నూడుల్స్ అని అర్థం. ఈ పద్ధతిలో, గోధుమతో చేసే సాఫ్ట్ నూడుల్స్ వెదురు గొట్టాల గుండా ప్రవహించే చల్లని నీటిలో వెళ్తుంటాయి. వాటిని ఇరువైపులా కూర్చున్న జనాలు చాప్స్టిక్లతో పట్టుకుని తినడం ఒక సరదా ఆటలా ఉంటుంది. ఇది ఒక సవాలుతో కూడిన సరదా ఆట. పట్టుకున్న నూడుల్స్ని ‘త్సుయు’ అనే సోయా డిప్పింగ్ సాస్లో ముంచుకుని తింటారు. ఈ సాస్ నూడుల్స్కు మంచి రుచిని ఇస్తుంది. వేసవిలో వేడి ధాటి నుంచి ఈ చల్లని నూడుల్స్ ఉపశమనం ఇస్తాయట. నాగాషి సోమెన్ అనేది స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా గడిపే ఒక సామాజిక కార్యక్రమం. చాలా నాగాషి సోమెన్ రెస్టరెంట్లు ప్రకృతి ఒడిలో, నదులు లేదా అడవుల పక్కన ఉంటాయి. ఇది ఆహారాన్ని ఆస్వాదించడంతో పాటు ప్రకృతి అందాలను చూసే అవకాశాన్ని కూడా కల్పిస్తుంది. ఒక ఆసక్తికరమైన అంశమేమిటంటే, మీరు ఒకసారి పట్టుకోవడంలో విఫలమైతే, ఆ నూడుల్స్ కిందకు వెళ్లిపోతాయి. అందుకే ఈ వెదురు బొంగుల పక్కన కూర్చున్నవారు చాలా జాగ్రత్తగా, చురుకుగా ఉండాలి. నూడుల్స్ మొత్తం అయిపోయాయని సూచించడానికి చివరగా షెఫ్స్ ఒక గులాబీ రంగు నూడుల్ను వదులుతారు. ఇది ముగింపుకు సంకేతం. (చదవండి: ఎకో ఫ్రెండ్లీ లైఫ్కి నిర్వచనం ఈ దంపతులు..!) -
కసివద్దు..'పంచ్'కోండి..! కోపాన్ని కక్కేయండిలా..
‘‘శిలలపై పిడిగుద్దు గుద్దినారూ... మనవాళ్లు మనసులో కోపాన్ని బయటికే తోసినారూ...!’’ అంటూ పాడుకుంటూ ప్రస్తుతం థాయిలాండ్ వాసులు తమలోని ఫ్రస్టేషన్ను బయటకు వెళ్లగక్కుతున్నారు. ‘‘అహో ఆఫీసు బాసూ... ఆ యముడంటి క్రూరిస్టు శాడిస్టు ఫేసూ... ఈ ఆఫీసు యజమానిగా మా పిడిగుద్దుల పాలబడ్డావయా...’’ అని ఆలాపన పాడిన తర్వాత... ‘‘ప్రతిమపై పిడిగుద్దు గుద్దినారూ... మనవాళ్లు కసితీర అక్కసును వెళ్లగక్కినారూ’’ అంటూ ఖూనీచేయాల్సినంత కసిని... కూనిరాగాలతో సరిపెట్టుకుని తమ కోపాల్నీ, ఫ్రస్టేషన్లనూ బయటకు తీసిపడేస్తున్నారు. దాంతో తమ ‘కోప్తాపాలూ డీప్ డిప్రెషన్ల’ నుంచి చప్పున బయటకు వచ్చేస్తున్న ఫీలింగ్ కలుగుతోందంటూ హ్యాపీగా చెబుతున్నారు. ఇలా కోపం వెళ్లగక్కేది విధిగా మన బాసు పైనే కానక్కర్లేదు... అది యథేచ్ఛగా మన ఎక్స్ గాళ్ఫ్రెండూ కావచ్చూ లేదా మన బాయ్ఫ్రెండూ కావచ్చు. ఇలా వాళ్లెవరైనప్పటికీ... వాళ్ల మీద ఉన్న కసినీ, అక్కసును కూడా హాయిగా... ‘‘వారెవా ఏమి ఎక్సు... నన్ను వదిలేసి దౌడు తీసూ’’ అంటూ మాజీ ప్రేమిక (కుడి) మీద ఉన్న కోపాన్ని వెళ్లగక్కుకోవచ్చు. అలా మన మనసులోని కోపాగ్రహబాధల నుంచి ఉపశమనం పొందవచ్చు. ఇది మరెక్కడో కాదు... మన పొరుగున ఉన్న థాయిలాండ్లోనే. అక్కడి వీధుల్లో ప్రతిమలు తయారు చేసే ఓ స్కల్ప్చర్ షాప్ ఉంది. మనం చేయాల్సిందల్లా మన ఆగ్రహానికి గురికాబోయే సదరు అభాగ్యుల ఫొటో తీసుకెళ్లి... జస్ట్ వాళ్లకు హ్యాండోవర్ చేసేయడమే. వాళ్లు శ్రద్ధగా జీవం ఉట్టిపడేలా మనక్కావాల్సిన ప్రతిమను తయారు చేసి పెడతారు. అంతే... ఆ తర్వాత మనం దాంట్లోని జీవకళంతా వెళ్లి΄ోయేలా, మన మనసులోని కోపమంతా పారిపోయేలా, మన మదిలోని అక్కసంతా తీరి΄ోయేలా బాదేయవచ్చు. ఇక మనలో కసి మరీ ఎక్కువగా ఉందనుకోండి... పుస్తకాల్లో సాదా ప్రతీ, మేలుప్రతిలాగానే... ఆ బంకమట్టిలోపలే కాస్తంత మెటల్ఫ్రేము గట్టిగా అమర్చి మరో పది దెబ్బలకు నిలిచేలా, ఇంకో నాలుగు దెబ్బలు కాసేలా మేలైన స్టాండర్డు మట్టిప్రతిమలు తయారు చేసిస్తారు. మనసాగలేక మనం అక్కడికక్కడే మనస్పూర్తిగా కొట్టేశాక కూడా మన కసి తీరలేదనుకోండి. పర్లేదు... మరో నాల్రోజులకోసం అద్దెకిస్తారు లేదా కాస్త డబ్బులెక్కువ పే చేస్తే మనక్కావల్సిన ప్రతిమను మనకే పర్మనెంటుగా అమ్మేస్తారు కూడా. ఈ ప్రతిమలూ దెబ్బల వ్యవహారమంతా చూస్తూ... ‘‘అద్దిరా కసితీరా కొట్టే దెబ్బలోని పవరు. అరెరె... భలే టెక్నిక్కు కదా... బహుమంచి క్రియేటివిటీ కదా’’ అంటూ కొందరంటూ ఉంటే.. ‘‘ఆ... ఆ టెక్నిక్కుదేవుందీ... ఈ టైపు క్రియేటివిటీ మనకెప్పట్నుంచో తెలుసు. దెబ్బకు దెయ్యం దిగొస్తుందనే సామెత మన దగ్గర లేదా’’ అంటూ కొందరు పెదవి విరుస్తున్నారు. ‘‘మన హాస్య దర్శకుడు జంధ్యాల ఇలాంటి టెక్నిక్కులనెప్పుడో కనిపెట్టేశారంటూ ‘అహ నా పెళ్లంట’ సినిమాల్లో బ్రహ్మానందం... వాళ్ల బాసూ, పరమ పిసినారి పీసు కోట శ్రీనివాసరావును షాట్ ఫ్రీజు చేసి మరీ ‘‘పోతావురా ఒరేయ్... మట్టిగొట్టుకుపోతావు రా... నాశనమైపోతావురా’’ అంటూ తిట్టే షాట్లూ... ‘‘బాబాయ్ అబ్బాయ్ సినిమాలో సుత్తివేలు తనకు కోపం వచ్చినప్పుడల్లా చిందులు తొక్కుతూ... రోజుకు ‘మూడు పూటల కోటా’ చొప్పున తాను కసితీరా బాదేయడానికి ఓ బానపొట్ట పహిల్వాన్ను పనిలో పెట్టుకున్న సీన్లూ ఉదాహరిస్తున్నారు. ఏతావాతా చెప్పొచ్చేదేమంటే ‘‘మనం ఎవరిపట్ల కోపం కలిగి ఉన్నామో వారికి ఏమాత్రం హాని కలగని విధంగా... కసితీరా మన కినుకను వెళ్లగక్కి హాయిగా కునుకు తీయగలుగుతున్నప్పుడు ఏమార్గమైతేనేమీ... ఈ మార్గమైతేనేమీ’’ అంటూ కొందరిప్పుడు సన్నాయినొక్కులు నొక్కి మరికొందరు... ప్రతిమ మీద దెబ్బలాగా ఢంకా బజాయించి ఇంకొందరూ కసి తీర్చుకునే మార్గానికి సపోర్టు చేస్తున్నారు.– యాసీన్ (చదవండి: చెట్లు ఒకదానితో ఒకటి మాట్లాడుకోగలవు) -
'18-10-8-4-1 రూల్'..! జస్ట్ 21 రోజుల్లో ఏడు కిలోల బరువు..
స్పూర్తిదాయకమైన వెయిట్లాస్ స్టోరీలు ఎన్నో చూశాం. వాటన్నింటిలో క్రమశిక్షణ, నిబద్ధతకు పీఠం వేస్తే బరువు తగ్గడం సాధ్యమని తేలింది. ఇది కాస్త కఠినమైనదే అయినా అసాధ్యం మాత్రం కాదు. అంతలా కష్టతరమైన నియమాలు ఫాలో అవ్వాల్సిన పని లేకుండానే ఈ చిన్న ట్రిక్స్తో సులభంగా బరువు తగ్గొచ్చని చెబుతోంది ఈ డైటిషియన్. జస్ట్ ఈ చిన్న రూల్తో సులభంగా వెయిట్లాస్ అవ్వోచ్చు అంటూ తన అనుభవాన్ని షేర్ చేసుకున్నారామె. మరి ఆ రూల్ ఏంటో చూద్దామా..!డైటీషియన్ రిచా గంగాని సోషల్ మీడియా పోస్ట్లో తాను 21 రోజుల్లోనే ఏడు కేజీల బరువు తగ్గినట్లు తెలిపారు. అంతేగాదు తన నడుము సైజు కూడా చాలా వరకు తగ్గిందని రాసుకొచ్చారామె. తాను 18-10-8-4-1 రూల్ని అనుసరించి జస్ట్ 21 రోజుల్లోనే దాదాపు 63 కిలోలు నుంచి 56 కిలోలకు తగ్గినట్లు తెలిపారు. గంటలతరబడి ఆకలితోనూ, కార్డియో వంటి వ్యాయమాల హెల్ప్ లేకుండా స్లిమ్గా మారానని అన్నారామె. తన వెయిట్లాస్ జర్నీలో ఉపవాసం, యాక్టివ్గా ఉండటం, తగినంత హైడ్రేషన్, సమతుల్య ఆహారం, తదితర ప్రధానాంశాలు ఉన్నాయని అన్నారు.18-10-8-4-1 రూల్ అంటే..ఇక్కడ 18 అంటే..18 గంటల అడపాదడపా ఉపవాసం. తాను ఉదయం 11 నుంచి సాయంత్రం 5/6 గంటల మధ్య తింటానని తెలిపింది. ఇది బరువు తగ్గేలా చేయడమే కాకుండా మైండ్ని కూడా క్లియర్గా ఉంచుతుంది.ఇక 10 అంటే..పదివేల అడుగులు..ప్రతి ఒక్కరూ ఇన్ని అడుగులు వేసేలా దశలా వారిగా ప్రారంభించాలని సూచించారామె. ఎందుకంటే ఇది 500 నుంచి 700 కేలరీల దాక సులభంగా బర్న చేయగలదని చెప్పారు.8- ఎనిమింది గంటల నిద్ర. తగినంత విశ్రాంతి కూడా అత్యంత ముఖ్యమైనది. ఈ సమయంలో శరీరంలోని కొవ్వు ఈజీగా కరిగిపోతుందట.4- నాలుగు లీటర్ల నీరు. హైడ్రేషన్ తోపాటు యాంటీ ఇన్ఫ్లమేటరీల అందిస్తుంది. ఇది పొట్ట ఉబ్బరాన్ని తగ్గించి చర్మం రంగుని మెరుగుపరుస్తుంది.చివరగా 1-- ఒక గ్రాము ప్రోటీన్ తీసుకోవడాన్ని హైలెట్ చేశారు రిచా. ఇది కండరాలను సురక్షితంగా ఉండేలా బలోపేతం చేస్తుంది. View this post on Instagram A post shared by Richa Gangani - Weightloss👉Thyroid👉PCOS Expert (@dieticianricha2095) అడపదడపా ఉపవాసం ఎలా ఉండాలంటే..రిచా వివిధ రకాల అడపదడపా ఉపవాసాలను పేర్కొన్నారు. 16:8 ఎనిమిదిగంటలు తిని, 16 గంటలు ఉపవాసం ఫ్లెక్సిబిలిటీ కావాలనుకునేవారికి ఇది బెస్ట్5:2 ఇది సాధారణంగా వారంలో ఐదు రోజులు తినడం, రెండు రోజులు ఉపవాసం ఉండటం14:10 ప్రారంభికులకు గొప్పది, పది గంటలు తిరడం, పదిగంటలు ఉపవాసం ఉండటం18:6 ఇది వ్యక్తిగతం కేవలం ఆరు గంటే తినడం, ఏకంగా 18 గంటలు ఉపవాసం ఉండటం. వ్యక్తిగత సామర్థ్యం అనుసరించి పాటించాల్సిన విధానం ఇది.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను అనుసరించడం ఉత్తమం.(చదవండి: వాట్ పబ్లిక్ టాయిలెట్ టూరిస్ట్ స్పాటా..?! రీజన్ ఇదే..) -
'నాన్ డైరియల్ డీహైడ్రేషన్'..! సాధారణ నీటితో భర్తీ చేయలేం..
అలసట, మానసిక మందకొడితనం (బ్రెయిన్ ఫాగ్), తలనొప్పి, లోబీపీ వంటి లక్షణాలతో క్లినిక్స్ను సందర్శిస్తున్న వారి సంఖ్య నగరంలో పెరుగుతోంది. గతంలో ఈ తరహా సమస్యలకు వేర్వేరు కారణాలు ఉండేవి.. కానీ ఇప్పుడు వీటన్నింటికీ శరీరంలో ద్రవాల కొరతే ప్రధానంగా కనిపిస్తోందని వైద్యులు అంటున్నారు. వాంతులు, విరేచనాలు లేకపోయినా శరీరం తీవ్ర ద్రవాల కొరతను ఎదుర్కొంటోంది. అందుకే ప్రస్తుతం వైద్యులు దీనిని ‘నాన్ డైరియల్ డీహైడ్రేషన్’ అని పేర్కొంటున్నారు. వైద్యులు చెబుతున్న ప్రకారం.. డీహైడ్రేషన్ అనేది ఇప్పుడు సర్వకాల సర్వావస్థలలోనూ కలిగే సమస్యగా మారింది. గతంలో వేసవి కాలంలో మాత్రమే సంభవించేదని చాలా మంది భావించేవారు. కానీ తాజాగా వైద్యుల క్లినికల్ అనుభవాల్లో కాలంతో పాటు లక్షణాలను కూడా ఇది మార్చుకుంటోందనే కొత్త మార్పు గుర్తిస్తున్నారు. ఇది హఠాత్తుగా సంభవించేది కాదని గుర్తించలేని విధంగా గుట్టుగా శరీరంలో ఉండి నిదానంగా పెరుగుతోంది. దీనికి కొన్ని కారణాల్లో.. నగరంలో ఎక్కువగా వేడి – తేమ వాతావరణం ఉంటోంది. ఇలా వాతావరణంలో తేమ అధికంగా ఉన్నప్పుడు చెమట ఆవిరి కాకుండా చర్మంపై ఆగిపోతుంది. దీని వల్ల ద్రవనష్టం జరుగుతూనే ఉంటుంది. కానీ దాహం వేయడానికి బదులు అలసట, మత్తు, శరీరం బరువు అనిపించడం ఉంటుంది. తరచూ మూత్రానికి వెళ్లడం, మూత్రనాళం దగ్గర నొప్పి వంటి సమస్యల వల్ల చాలామంది నీరు తాగడాన్ని తగ్గిస్తారు. దీని ఫలితంగా మూత్రనాళ ఇన్ఫెక్షన్ సమస్య వస్తుంది. నగరంలో దీర్ఘకాలిక ప్రయాణాలు చేసేవారు ఎక్కువయ్యారు. విమాన ప్రయాణాల్లో నీరు తీసుకోవడం బాగా తక్కువ. పైగా పొడి గాలి, సాల్టెడ్ స్నాక్స్, వేడి పానీయాల సేవనం.. వల్ల కూడా ద్రవనష్టం జరుగుతుంది. పరిష్కారం ఏమిటి? హైడ్రేషన్ అంటే కేవలం నీటి పరిమాణం మాత్రమే కాదు, దాని ఖచ్చితత్వం కూడా. కాబట్టి నీటి పరిమాణం తగ్గింది అని నీరు తీసుకుంటే మాత్రమే సరిపోదు.. తగిన పోషకాలున్న ద్రవాహారం అవసరం. సోడియం, పొటాషియం, క్లోరైడ్ వంటి ముఖ్య ఎలక్ట్రోలైట్ సొల్యూషన్స్ కలిగిన తక్కువ గ్లూకోజ్. క్యాలరీ, డయాబెటిక్ సేఫ్ ఫార్ములాతో తయారైన రెడీ టు డ్రింక్స్ కూడా ఈ లోటును భర్తీ చేయగలవు. పనిలో ఉండగా అలసట వచ్చినా లేదా ప్రయాణంలోనూ సరిపడా నీటితో పాటు ఎలక్ట్రోలైట్స్, గ్లూకోజ్, ఎనర్జీ సమతుల్యంగా తీసుకోవడం శరీరానికి అవసరం. ఊపిరి పీల్చడం నుంచి మొదలై ఆహారం జీర్ణం కావడం వరకు ప్రతీదీ ద్రవ ప్రమేయంతోనే జరుగుతుంది. వీటితో పాటు చెమట వల్ల రోజుకు కనీసం 2.5 లీటర్ల ద్రవ నష్టం జరుగుతుంది. కాఫీ, టీ వంటివి అతిగా తీసుకోవడం, భోజనాలు స్కిప్ చేయడం, ఒత్తిడి ఇవన్నీ కలిపితే ఆ నష్టం మరింత భారీగా ఉంటుంది. ద్రవాహారంతో.. అసమతుల్యత సరిచేయాలి.. డీహైడ్రేషన్ డయాబెటిస్, బీపీ ఉన్నవారికి ఇది ఎక్కువ ప్రమాదకరం. ఎప్పుడూ వాంతులు, విరేచనాలతోనే వస్తుందని కాదు. ఇది రోజువారీగా నిశ్శబ్దంగా ఏర్పడి, ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. దీనికి పరిష్కారాన్ని కేవలం నీటితో సరిపెట్టకూడదు. శరీరం కోల్పోతున్న అసలు మూలకాలు ఏవో తెలుసుకుని భర్తీ చేయాలి. ఎలక్ట్రోలైట్స్ లేకపోతే మెదడు, కండరాలు సరిగా పనిచేయవు. శరీరం కోల్పోయే సోడియం, పొటాషియం, గ్లూకోజ్ వంటి మూలకాల్ని భర్తీ చేయకపోతే కణాల పనితీరు దెబ్బతింటుంది. – డా.మోసిన్ అస్లం, కన్సల్టెంట్ ఫిజీషియన్, ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ, హైదరాబాద్ (చదవండి: అబుదాబిలో గంగా హారతి..! ఏకంగా రూ. 961 కోట్లు..) -
నైట్ ఈటింగ్ సిండ్రోమ్..!
ఈశ్వర్ తిండి అలవాట్లు ఇటీవల చాలా విచిత్రంగా మారాయి. ఈమధ్య రాత్రి భోజనం కాగానే వెంటనే నిద్రపట్టడం లేదు. కాసేపాగాక ఏదైనా తిందామంటూ మాటిమాటికీ ఫ్రిజ్ తెరచి చూస్తుంటాడు. రాత్రిపూట ఆకలేయడం గుర్తుకొచ్చి ప్రతిరోజూ రాత్రి తినడం కోసం చిప్స్ అనీ, కారా అనీ... ఏదో ఒక రకమైన శ్నాక్స్ తెచ్చుకుంటూ ఉంటాడు. కొన్నిసార్లు ముందుగానే స్వీట్స్ కూడా తెచ్చిపెట్టుకుంటాడు. రాత్రి రెండు గంటలయినప్పటికీ ఆ టైమ్లోనైనా తింటే తప్ప నిద్రపట్టదు. ఇలా రాత్రి తినేయడంతో పొద్దున్న బ్రేక్ఫాస్ట్ టైమ్కు అంతగా ఆకలేయదు. ఈ అలవాటు వల్ల ఇటు ఆహారపు అలవాట్లూ, అటు నిద్రవేళలూ ఈ రెండూ అస్తవ్యస్తంగా మారాయి. ఎట్టకేలకు డాక్టర్ను సంప్రదిస్తే ఇది ఒకరకమైన రుగ్మత అనీ దీని పేరే ‘నైట్ ఈటింగ్ సిండ్రోమ్–(ఎన్ఈఎస్)’ అనీ తెలిసింది. ఈ అనారోగ్య సమస్యపై అవగాహన కోసమే ఈ కథనం...ఈ కేస్ స్టడీలో ఈశ్వర్ అంతగా పట్టించుకోలేదుగానీ... ఈ అలవాటు అదేపనిగా కొనసాగుతుండటంతో కొన్ని ఇబ్బందులు వచ్చిపడుతుంటాయి. పెందరాళే నిద్రలేవలేకపోవడంతో ఆఫీసులో మందకొడిగా మారిపోవడం, అర్ధరాత్రి తినేసి ఉండటంతో బ్రేక్ఫాస్ట్ టైమ్కు ఆకలి లేకపోవడం... దాంతో పగలు భోజన వేళలు తప్పడం వంటి అనర్థాలు ఏర్పడతాయి. దాంతో దీర్ఘకాలంలో ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదమూ ఉంటుంది.గుర్తించడం ఎలా... రాత్రిళ్లు వారంలో కనీసం నాలుగు నుంచి ఐదు రాత్రులు నిద్రలేకపోవడం ఉదయం లేచాక ఆకలి లేకపోవడం రాత్రి భోజనం తర్వాత ఎంతకీ నిద్రపట్టకపోతే నిద్రపట్టాలంటే మళ్లీ ఏదోటి తినక తప్పదని అనుకుంటూ ఉండటం ఒకలాంటి డిప్రెషన్ మూడ్... సాయంత్రాలు ఈ ఫీలింగ్ మరింత ఎక్కువ.ఇలాంటిదే మరో సమస్య...బింజ్ ఈటింగ్ డిజార్డర్ అనే మరో సమస్య కూడా ఉంది. ‘నైట్ ఈటింగ్ సిండ్రోమ్’ కంటే ఇది కాస్త వేరుగా ఉంటుంది. బింజ్ ఈటింగ్ డిజార్డర్లో బాధితులు ఏమాత్రం గ్యాప్ లేకుండా అదేపనిగా తినేస్తుంటారు. కానీ నైట్ ఈటింగ్ సిండ్రోమ్లో బాధితులు అదేపనిగా కాకుండా కొద్ది కొద్ది మొత్తాల్లో తింటుంటారు.‘నైట్ ఈటింగ్ సిండ్రోమ్’కు కారణాలు... ఈ సమస్యకు కారణం ఇదమిత్థంగా తెలియదు. డాక్టర్ల అంచనా ప్రకారం నిద్ర΄ోవడానికి – నిద్రలేవడానికి తోడ్పడే నిద్ర సైకిల్లో అస్తవ్యస్తతతోపాటు కొన్ని హార్మోన్ల అసమతౌల్యత వల్ల ఇలా జరుగుతుంది. స్థూలకాయుల్లో ఇది కనిపించడంతోపాటు డిప్రెషన్, యాంగై్జటీతో బాధపడేవారిలో ఇది సాధారణంగా కనిపిస్తుంటుంది. సాధారణంగా నైట్ ఈటింగ్ సిండ్రోమ్ సమస్య ప్రతి వందమందిలో ఒకరి లో కనిపిస్తుంటుంది. ఒకవేళ స్థూలకాయుల్లోనైతే ప్రతి 10 మందికి ఒకరిలో కనిపిస్తుంది. ఇక ఈ సమస్యకూ జన్యుపరమైన అంశాలకూ సంబంధముందని వైద్యపరిశోధకులు చెబుతున్నారు. బాడీ క్లాక్ని నియంత్రించే ‘పీఈఆర్–1’ అనే జన్యువులోని లోపం కారణంగా ఈ సమస్య ఉత్పన్నమవుతుందన్నది శాస్త్రవేత్తల మాట.నిర్ధారణ పరీక్షలు: బాధితులు తిండి, నిద్ర అలవాట్ల గురించి డాక్టర్లు తెలుసుకోవడం పాలీసోమ్నోగ్రఫీ అనే పరీక్ష సహాయంతో మెదడులోని తరంగాలు, ఆక్సిజన్ మోతాదులు, గుండె స్పందనల, శ్వాస తీసుకునే రేటు వంటి పరీక్షల సహాయంతో డాక్టర్లు ఈ సమస్యను నిర్ధారణ చేస్తారు.ఆరోగ్యంపై ఎన్ఈఎస్ దుష్ప్రభావాలు... ఎన్ఈఎస్కూ స్థూలకాయానికీ సంబంధం ఉందని తెలుసుగానీ... స్థూలకాయం వల్లనే ఈ ఎన్ఈఎస్ వస్తుందా అన్న విషయం ఇంకా వైద్యనిపుణులకు తెలియరాలేదు. అయితే వీళ్లలో చాలామందికి స్థూలకాయం ఉంటుంది కాబట్టి ఒబేసిటీ వల్ల వచ్చే అన్ని రకాల దుష్ప్రభావాలూ ఎన్ఈఎస్లో కనిపించడానికి అవకాశముంది. ఇక కొందరిలోనైతే ఈ ఎన్ఈఎస్ వల్లనే తర్వాత్తర్వాత ఊబకాయం వచ్చే అవకాశమూ ఉంటుంది.చికిత్స... సైకియాట్రిస్టుల ఆధ్వర్యంలో కొన్ని రకాల యాంటీడిప్రెసెంట్లతో పాటు అవసరాన్ని బట్టి బిహేవియర్ థెరపీ ఇస్తారు. కొన్ని రకాల రిలాక్సేషన్ టెక్నిక్స్ అవలంబిస్తూ రాత్రి తిండిని క్రమంగా ఉదయం బ్రేక్ఫాస్ట్కి షిఫ్ట్ అయ్యేలా కౌన్సెలింగ్ చేయడం ద్వారా చికిత్స అందిస్తారు. (చదవండి: ఎవరీ టీనేజర్ తేజస్వి మనోజ్? వృద్ధుల రక్షణ కోసం..) -
చేతుల పరిశుభ్రత కోసం..!
విద్యార్థుల్లో మంచి ఆరోగ్య పద్ధతులను, పరిశుభ్రత అలవాట్లను ప్రోత్సహించే ఉద్దేశ్యంతో ఇల్నెస్ టు ఫౌండేషన్ సహకారంతో ఫిజికల్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా (PEFI) ‘స్వస్థ్ హాత్, స్వస్థ్ బచ్పన్’ (ఆరోగ్యకరమైన చేతులు, ఆరోగ్యకరమైన బాల్యం) అనే ప్రచారాన్ని ప్రారంబించింది. సుమారు వంద పాఠశాలలు కవర్ చేసేలా దాదాపు 40 వేల మంది విద్యార్థులను భాగస్వామ్యం అయ్యేలా చేయడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం. గతేడాది దాదాపు 35 పాఠశాలల్లో దగ్గర దగ్గర 30 వేల మందికి పైగా విద్యార్థులను విజయవంతంగా భాగస్వామ్యం అయ్యేలా చేసింది. ఈ ప్రచార కార్యక్రమం విద్యార్థులు ఆరోగ్యకరమైన అలవాట్లను అలవర్చుకోవడంలో సహాయపడటమే కాకుండా పాఠశాల వాతావరణం తోపాటు సమాజంలోని ప్రజారోగ్య అవగాహనను బలోపేతం చేస్తోంది. ఈ వెల్నెస్ పద్ధతులను విద్యార్థులు జీవితాంత అనుసరించేలా చేయడం తోపాటు నిజమైన స్వస్థ్ భారత్ మార్చే దిశగా అడుగులు వేస్తున్నట్లు ఈ ఇల్నెస్ టు వెల్నెస్ ఫౌండేషన్ సలహా మండలి చైర్పర్సన్ అనిల్ రాజ్పుత్ తెలిపారు. కేవలం సాంప్రదాయ ఉపన్యాసాలపై మాత్రమే ఆధారపడకుండా, వివిధ రకాల ఆకర్షణీయమైన, వినూత్న ఫార్మాట్ల ద్వారా హ్యాండ్వాషింగ్ టెక్నిక్లను ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించారు. ఇక ఈ 'స్వస్థ్ హాత్, స్వస్థ్ బచ్పన్' ప్రచారం ప్రారంభ కార్యక్రమం సెప్టెంబర్ 6,2025న న్యూఢిల్లీలోని గ్రేటర్ కైలాష్ - IIలోని బల్వంత్రాయ్ మెహతా విద్యా భవన్లో జరిగింది. ఈ కార్యక్రమంలో మొత్తం 300 మంది విద్యార్థులు పాల్గొన్నారు. వారికి డబ్ల్యూహెచ్ఓ మార్గదర్శకాలకు అనుగుణమైన హ్యాండ్వాషింగ్ టెక్నిక్లపై నిపుణుల సలహాలతో కూడిన ఇంటరాక్టివ్ ప్రెజెంటేషన్ను అందించారు కూడా.(చదవండి: Weight Loss Story: లైఫ్స్టైల్లో ఆ ఐదు మార్పులు తప్పనిసరి..! 59 కిలోలు తగ్గిన ఇన్ఫ్లుయెన్సర్) -
లైఫ్స్టైల్లో ఆ ఐదు మార్పులు తప్పనిసరి..! 59 కిలోలు తగ్గిన ఇన్ఫ్లుయెన్సర్
బరువు తగ్గడం అంటే సాధారణంగా అందరు అనుకునేది నోటిని కంట్రోల్ చేయడమే మార్గం అని. కానీ ఈ ఇన్ఫ్లుయెన్సర్ మాత్రం ముమ్మాటికి అది మాత్రం కాదని చెప్పేస్తోంది. అలాగే మాటిమాటికి బరువుని చెక్చేసుకుంటూ వర్కౌట్లు చేయడం కాదని అంటోంది. ఆహారంతో ఆరోగ్యకరమై, స్థిరమైన బంధాన్ని ఏర్పరుచుకుంటే బరువుకి చెక్పెట్టగలమని చెబుతోందామె. ఆ విధంగానే తాను బరువు తగ్గానంటూ తన వెయిట్లాస్ సీక్రెట్ని బయటపెట్టారామె. ఇంతకీ ఆమె ఎలాంటి చిట్కాను అనుసరించిందంటే..సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గురిష్క్ కౌర్ తన వెయిట్లాస్ సీక్రెట్ని ఇన్స్టాగ్రామ్ వేదికగా షేర్ చేశారామె. ప్రతి కేలరీలను లెక్కించడం కంటే సమతుల్యతకు పెద్దపీటను వేయమని చెబుతున్నారామె. దాంతోపాటు తాను అనుసరించిన ఈ సింపుల్ చిట్కాలను కూడా అనుసరించినట్లు తెలిపింది. సింపుల్ చిట్కాలు..నేచురల్ ఆహారం..ఆహారం పట్ల వ్యామోహాన్ని నియంత్నించేలా సహజమైన ఆహారానికే ప్రాధాన్యత ఇవ్వాలి. అంటే ప్రాసెస్ చేసిన ఆహారాల కంటే మొక్కల ఆధారిత ఆహారాలనే స్వీకరించాలి. ఆరోగ్య అవసరాలను, ఆకలి కోరికను తీర్చే ఆహారానికే ప్రాధాన్యత ఇవ్వాలంటోంది. ఆకలి సంకేతాల తోపాటు..సమతుల్యంగా తినడం మరవకూడదంటోంది. ఆకలి సంకేతాలు..సమతుల్య భోజనంపైనే ఫోకస్ పెట్టినట్లు నర్మగర్భంగా చెప్పింది.మైండ్ఫుల్గా తినడం..పోషకాహారాలను మనఃపూర్వకంగా తినాలి. ఏదో గబగబ ితినేయడం ాకాకుండా. వాటిని ఇష్టంగా, ఎలా తింటున్నాం అనే దానిపై అటెన్షన్ ఉండాలని చెబుతోందామె.ఆరోగ్యకరమైన ఆహారానికే ప్రాధాన్యత..చీట్మీల్ వంటి వాటికి చోటివ్వకుండా, స్థిరత్వానికి ప్రాధాన్యత ఇవ్వాలి. కొన్ని ఆహారాలు మరింత ోపోషకాలు ఉన్నా కూడా ఆరోగ్యానికి బెస్ట్ అయితేనే తీసుకోవాలి. ఒకవేళ జంక్ఫుడ్ని తినేసినా..దాన్ని కరిగించేలా వర్కౌట్లు బాగా చేయాలి. ఆహరం కంటే..లైఫ్స్టైల్ మారాలి..కేవలం డైట్కే ప్రాధాన్యత ఇవ్వొద్దు. సమతుల్యంగా తినడం, మంచి ఆహారపు అలవాట్లును భాగం చేసుకునే ప్రయత్నం చేయాలంటోంది.బ్రేక్ చేయకపోవడం..ఏర్పరచుకున్న లక్ష్యానికి అనుగుణంగా తినేలా ఉండాలి. ఏ మాత్రం ఆశయాన్ని బ్రేక్ చేయని స్ట్రాంగ్ మైండ్సెట్తో ఉండాలి. ఇక్కడ ఇన్ఫ్లుయెన్సర్ గురిష్క్ కౌర్ బరువు తగ్గడం అనేది ఎలాంటి ఆహారం ఎంచుకోవాలి అనేదాని కంటే..మనసుకి సంబంధించిన పని అని అంటోంది. అది మన నియంత్రణలో ఉంటే ప్రతీది అవలీలగా జయించగలమని చెబుతోంది. ఆ విధమైన జీవనశైలి మార్పులతోనే సుమారు 59 కిలోలు తగ్గినట్లు చెప్పుకొచ్చింది. View this post on Instagram A post shared by Gurishq Kaur (@gurishqkaur) (చదవండి: 'నో ఛాన్స్..జస్ట్ ఫోర్స్'..! వైరల్గా మహిళ భావోద్వేగ పోస్ట్) -
నింద, ఒత్తిడి, మౌనం..ఇంత పనిచేయిస్తాయా?
దేశవ్యాప్తంగా ఒత్తిడి, మానసిక ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయని, అవి ఆత్మహత్య ఆలోచనలకు దారితీస్తున్నాయని హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే ఆత్మహత్య నిరోధ హెల్ప్లైన్ (7893078930) అయిన 1 లైఫ్ సంస్థ (1life.org.in) తెలిపింది. తాజాగా విడుదల చేసిన నివేదికలో ఇందుకు సంబంధించి పలు అంశాలు వెల్లడించింది. తమకు ఫోన్ చేసేవారిలో చాలామంది తీవ్రమైన భావోద్వేగ, ఆర్థిక, సామాజిక ఒత్తిడిలో ఉంటున్నారని.. దానివల్ల వారిలో ఆత్మహత్యల ఆలోచనలు వస్తున్నాయని వెల్లడించింది.1 లైఫ్ హెల్ప్లైన్కు ఏడాదికి సగటున 23వేల కాల్స్ వస్తుంటాయి. వీటిని కౌన్సెలర్లు విశ్లేషించి, సమాజంలో మానసిక ఆరోగ్య సమస్యలు పెరిగిపోతున్నాయని తెలిపారు. ఈ కష్టాల నుంచి కోలుకోవడం చాలా ముఖ్యం. వాటిలో వ్యక్తిగత సంబంధాలు తెగిపోవడం, వ్యవస్థాపరమైన సమస్యలు, నిరాశావాదం లాంటివి చాలా ఉంటాయి. ప్రతి కాల్లోనూ తీవ్ర సంక్షోభంలో ఉన్న వ్యక్తులు ఎదురవుతారు. వాళ్లను బాగా అర్థం చేసుకోవడం, సానుభూతి చూపించడం, మద్దతు ఇవ్వడం లక్ష్యంగా కౌన్సెలర్లు మాట్లాడతారు.మానసిక ఆరోగ్యం మీద బహిరంగంగా జరగాల్సిన చర్చలను నింద, మౌనం ఎలా అడ్డుకుంటాయో కూడా ఈ డేటా చెబుతుంది. చాలా కుటుంబాల్లో వ్యక్తులు తమ సమస్యలను చెప్పడానికి అనుమతించరు. ఎవరైనా తమను తప్పుగా అనుకుంటారేమో, లేదా సమాజంలో చిన్నచూపు చూస్తారేమోనన్న భయంతో కూడా తమ లోపలి ఆలోచనలను బయటపెట్టకుండా లోలోపలే కుమిలిపోతుంటారు. తమ లోపలి భావాలను బయటపెట్టకపోవడం వల్ల సమస్య మరింత తీవ్రమవుతుంది. దాంతో వాళ్లు మరింత ఒంటరి అయిపోయినట్లు భావిస్తారు. ఈ తరహా ట్రెండ్లను బట్టి చూస్తే.. జాలి, సమయానికి జోక్యం చేసుకోవడం లాంటి వాటి ప్రాధాన్యం సమాజానికి తెలియజేయాల్సిన అవసరం ఉందని 1లైఫ్ భావిస్తోంది.హైరిస్క్ ఫోన్ కాల్స్ విషయంలో..రిలేషన్షిప్ సమస్యలు (సుమారు30%): గొడవలు, బ్రేకప్ లేదా వైవాహిక సమస్యలు చాలావరకు ఆత్మహత్య ఆలోచనలకు కారణమవుతున్నాయి. కాల్ చేసేవారిలో చాలామంది తమ మాట వినిపించుకోవడం లేదని, ఒంటరిగా అయిపోయామని చెబుతూ ఈ కష్టాల నుంచి తప్పించుకోవాలంటే ఆత్మహత్య ఒక్కటే మార్గమని భావిస్తారు. కుటుంబాల్లో సరిగా మాట్లాడుకోలేకపోవడం, యుక్త వయసులో భావోద్వేగాలను తట్టుకునే శిక్షణ లేకపోవడం వల్ల పరిస్థితి ఇంతవరకు వస్తుంది. సామాజికంగా చురుగ్గా ఉంటున్నా, విజయాలు సాధిస్తున్నా కూడా వ్యక్తిగత సంబంధాల విషయంలో బాగా ఇబ్బంది పడుతున్నవారు తమలో తామే కుమిలిపోతున్నారని కౌన్సెలర్లు గుర్తించారు.అప్పులు, ఆర్థికసమస్యలు (25%): నిరుద్యోగం, పెరిగిపోతున్న అప్పులు, బెట్టింగ్ యాప్లలో నష్టాలు, తిరిగి ఇవ్వని వ్యక్తిగత రుణాలు, ఆర్థిక మోసాలకు గురికావడం లాంటివి చాలామందిని నిరాశలోకి నెట్టేస్తాయి. ఆర్థికంగా విఫలమయ్యామన్న కుంగుబాటు, అప్పులవాళ్లు, కుటుంబసభ్యుల నుంచి పెరిగిపోయే ఒత్తిడి వల్ల ఇక నిస్సహాయంగా మిగిలిపోతారు. చాలామందికి తమ కుటుంబాలను పోషించలేకపోవడంతో సిగ్గుపడి, అది చివరకు తీవ్ర నిరాశలోకి దించేస్తుంది. ఆర్థిక అక్షరాస్యత, సమాజం నుంచి మద్దతు లాంటివి బలహీనంగా ఉండడంతో ఊరట కోసం సురక్షిత ప్రాంతాలకు వెళ్దామనుకున్నా అవి ఉండవు.విద్య/వృత్తిపరమైన ఒత్తిడి (సుమారు 22%): విద్యార్థులు, యువ వృత్తినిపుణులు తరచు తమకు పరీక్షలు, వృత్తిపరమైన సమస్యలు, పనివాతావరణం సరిగా ఉండకపోవడం లాంటి సమస్యలతో సతమతం అవుతున్నట్లు చెబుతారు. విఫలం అవుతామన్న భయం, అంచనాలను అందుకోలేకపోవడంతో తరచు తమమీద తమకే అనుమానం వచ్చి, ఆందోళనతో ఆత్మహత్య ఆలోచనలొస్తాయి. పక్కవాళ్లతో పోల్చిచూడడం, సోషల్ మీడియాలోనూ పోలికలు ఎక్కువ కావడంతో ఈ సమస్యలు ఎక్కువైపోయి తాము వెనకబడుతున్నామని అనుకుంటారు. మెంటార్లు లేదా మద్దతిచ్చే వృత్తివాతావరణం లేకపోవడంతో చాలామంది తమ పరిస్థితి డెడ్ ఎండ్ అని భావిస్తారు.మానసిక ఆరోగ్య సమస్యలు (సుమారు 10%): ఒంటరితనం, ఒత్తిడి, కుంగుబాటు, పనికిరామన్న భావనలు ఎక్కువమంది కాలర్స్లో కనిపిస్తున్నాయి. కుటుంబం నుంచి సమాజం నుంచి తగిన మద్దతు లేకపోతే చాలామంది మౌనంగా బాధపడుతూ, కనిపించని ఇబ్బందిలో మునిగిపోతారు. కొందరు సాయంకోసం ప్రయత్నించినా తమను ఎద్దేవా చేస్తున్నారని, కొట్టిపారేస్తున్నారని చెబుతూ మరింత ఒంటరితనంలో కూరుకుపోతున్నారు. అందుబాటులో మానసిక ఆరోగ్య సేవలు లేకపోవడంతో వారు సరైన సమయానికి సాయం అందుకోకవడం కష్టమవుతోంది.సామాజిక సమస్యలు (సుమారు 12%): ఎల్జీబీటీక్యూ లాంటి కొన్ని వర్గాలకు చెందినవారు బలవంతపు పెళ్లిళ్లు చేసుకోవాల్సి వస్తుంది, తరచు వీరిని వెలివేస్తారు, లేదా తాము అంగీకరించని గుర్తింపుతో జీవించాల్సి వస్తుంది. ఇలా తరచు ఉండే ఒత్తిడి వల్ల వారికి తప్పనిసరిగా ఆత్మహత్య ఆలోచనలొస్తాయి. చాలా సందర్భాల్లో కుటుంబం, సమాజం వెలివేయడంతో వాళ్లకు చాలా అవసరమైన మద్దతు దొరకదు. తమ గుర్తింపును నిరూపించుకోవడానికి పోరాడుతుంటే తరచు ఎదురయ్యే ఛీత్కారాలు వారికి తీవ్ర మానసిక సమస్యలను సృష్టించి, తప్పించుకోవడాన్ని అసాధ్యం చేస్తాయి.ఈ మేరకు 1 లైఫ్ ఆత్మహత్యల నిరోధ హెల్ప్లైన్లోని కన్సల్టెంట్ సైకాలజిస్ట్ మిస్ రెబెక్కా మాట్లాడుతూ, “ప్రతి కాల్ వెనుక భరించలేని బాధ, భయం, లేదా ఒంటరితనంతో పోరాడే ఒకవ్యక్తి ఉంటారు. నిజానికి వాళ్లు చనిపోవాలని అనుకోరు. కానీ తమ కష్టాలకు ముగింపు కోరుకుంటారు. వాళ్లను జడ్జ్ చేయకుండా, వారికి ఒక ఆశ కల్పించేలా వినడం ద్వారా జీవించడానికి తగిన కారణాలు కనుగొనడంలో వారికి సాయం చేయగలం. ఒకసమాజంగా, మనం తప్పనిసరిగా మానసిక ఆరోగ్యం గురించి చర్చించడం, సామాజిక సమస్యలు తగ్గించడం, బేషరతుగా మద్దతు ఇవ్వడం లాంటివి చేయాలి” అని వివరించారు.కష్టాల్లో ఉన్నవారు మౌనంగా బాధపడడం కంటే సహాయం పొందడాన్ని 1లైఫ్ ప్రోత్సహించింది. తగిన సమయానికి చేసే కౌన్సెలింగ్.. నిరాశను అనుకూలతగా మార్చగలదని సంస్థ పేర్కొంది. మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇచ్చే వ్యవస్థలను రూపొందించడానికి విధాన నిర్ణేతలు, విద్యావేత్తలు, ఉద్యోగ నియామక సంస్థలు, సమాజంలో నాయకులు కూడా ప్రోయాక్టివ్ చర్యలు తీసుకోవాలి. ఆత్మహత్యల నిరోధం అనేది కేవలం హెల్ప్లైన్ల బాధ్యత మాత్రమే కాదని 1లైఫ్ నొక్కిచెబుతోంది. కుటుంబాలు, కార్యాలయాలు, మొత్తం సమాజం కలిసికట్టుగా చేయాల్సిన పని అని పేర్కొంది. -
వయసు పెరిగినా..నోరు బోసి పోదు..!
వృద్ధులకు వయసు పరంగా వచ్చే అనేక సమస్యలతో పాటు పళ్ల సమస్యలూ తప్పవు. వృద్ధుల పళ్లకు సంబంధించిన వైద్యశాస్త్రాన్ని ‘జీరియాట్రిక్ డెంటిస్ట్రీ’ లేదా ‘జీరియోడాంటిక్స్’ అంటారు. ఇందులో వృద్ధుల పళ్లకు వచ్చే వైద్య, ఆరోగ్య సమస్యలు, వాటి నిర్ధారణ, చికిత్స వంటి అంశాలు ఉంటాయి. పళ్లు కోల్పోకుండా కేవలం వాటికి వచ్చే సమస్యలను మాత్రమే పోగొట్టుకోవడం ఎలాగో చెప్పే కథనమిది. ఇటీవలి వైద్యవిజ్ఞానం బాగా పురోగతమించింది. దాంతో గతం సగటుతో పోలిస్తే ప్రజల సగటు ఆయుర్దాయమూ బాగా పెరిగింది. ప్రజలు చాలాకాలం జీవిస్తున్నారు. దాంతో సమాజంలో వృద్ధుల సంఖ్య కూడా పెరుగుతోంది. ఒకనాడు ముసలితనానికి బోసినోరు ఒక ప్రతీక. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. జీవితంలో కష్టపడాల్సినంత పడి... తమ వృద్ధాప్యాన్ని ఒక సంతోషకరమైన మజిలీగా చేసుకుంటూ ఇకపై జీవితాన్ని అనుభవించాల్సిందంతా ఈ వయసునుంచే అనే భావన పెరగడంతో ఆ వయసునూ ఆనందమయం చేసుకుంటున్నారు. ఫలితంగా ఒకనాడు పళ్లూడిపోయే వృద్ధులకు బదులు మంచి పలువరస ఉన్నవారే ఎక్కువగా కనబడుతున్నారు. ఎందుకంటే... ఎంతగా వయసు పైబడినప్పటికీ పళ్లు, చిగుర్ల సమస్యలు రాకుండా చూసుకుంటే పళ్లు ఎన్నాళ్లైనా గట్టిగానే ఉంటాయి. ఇందుకోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటో చూద్దాం.వృద్ధాప్యంలో వచ్చే పంటి సమస్యలు/కారణాలు సాధారణంగా వయసు పెరుగుతున్నకొద్దీ పళ్లు కూడా వదులైపోతాయన్నది చాలామందిలో ఉండే ఓ అ΄ోహ. ఆ వయసులో బీపీ, షుగర్ లాంటి సమస్యలుంటే పళ్లు వాటంతట అవే ఊడి΄ోతాయని అనుకుంటారు. ఆ పరిస్థితి కోసం మానసికంగా సిద్ధపడుతుంటారు. కానీ ఇది వాస్తవం కాదు. పళ్లకు లేదా చిగుర్లకు సంబంధించన జబ్బులు వస్తేనే పళ్లు ఊడి΄ోవడమో లేదా వదులై΄ోవడమో లేదా తీసేయాల్సిన పరిస్థితి ఎదురుకావడమో జరుగుతుంది. నోటి జబ్బులు రానంతవరకు పళ్లు జీవితకాలం దృఢంగానే ఉంటాయి.వృద్ధాప్యంలో దంతాలకు వచ్చే సమస్యలు...సాధారణంగా వృద్ధాప్యంలో వచ్చే కొన్ని దంత సమస్యలు పంటిమూలంలో వచ్చే పిప్పిపళ్లు (రూట్కేరిస్), పళ్లు అరిగి΄ోవడం (అట్రిషన్), చిగుర్లవ్యాధులు (పెరియోడాంటల్ డిసీజ్), పళ్ల మధ్య అక్కడోపన్ను, ఇక్కడోపన్ను కోల్పోవడం కారణంగా వచ్చే సందులు (ఎడెంట్యులిజమ్), పైవరస పళ్లు, కిందివరస పళ్ల గట్టిదనంలో నాణ్యత లేకపోవడం (పూర్ క్వాలిటీ ఆఫ్ అల్వియొలార్ రిడ్జ్), కట్టుడుపళ్లు సరిగా అమర్చకపోవడం, దవడల పక్కన ఉండే మృదువైన మ్యూకోజాలో పుండ్లు, నోటిలో పుండ్లు, నోటిలో తడి తక్కువ కావడం (గ్జీరోస్టోమియా), నోటి క్యాన్సర్లు వంటివి.చేజేతులారా తెచ్చిపెట్టుకునే సమస్యలు...ఇక మరికొన్ని యౌవనంలో ఉన్నప్పుడు మనలో కొందరు వారంతట వారే చేజేతులారా తెచ్చిపెట్టుకునేవే ఎక్కువ. ఉదాహరణకు వయసులో ఉన్నప్పుడు పొగతాగడం, పొగాకు నమలడం, పాన్పరాగ్, గుట్కా, వక్కపొడి నమలడం వంటి పంటికి చేటు చేసే అలవాట్లు. ఈ అలవాట్లను మానకపోవడం, అలా నిర్లక్ష్యం చేస్తూ పోవడం వల్ల వృద్ధాప్యంలో పళ్లు తీవ్రంగా దెబ్బతింటాయి.వృద్ధాప్యంలో వ్యాధినిరోధక శక్తి తగ్గడంతో... యౌవనంతో పోలిస్తే వృద్ధాప్యదశలో వ్యాధినిరోధకశక్తి ఎంతోకొంత తగ్గుతుంది. కాబట్టి అప్పటివరకూ నిద్రాణంగా ఉన్న కొన్ని సమస్యలు పళ్లపై ప్రభావం చూపుతాయి.వృద్ధాప్యంలో వాడుతూ ఉండే మందుల కారణంగా...పెద్దవయసు వచ్చేనాటికి చాలామందిలో హై–బీపీ, షుగర్ సమస్యలు కనిపిస్తాయి కాబట్టి వాటికోసం మందులు వాడుతుంటారు. ఇలా... బీపీ, షుగర్లను అదుపులో పెట్టేందుకు వాడే మందులు, మానసిక సమస్యలకోసం వాడే యాంటీసైకోటిక్, యాంగ్జైటీని తగ్గించడం కోసం వాడే యాంగ్జియోలైటిక్స్... ఇలాంటి మందుల కారణంగా నోటిలో లాలాజల స్రావాలు తగ్గుతాయి. దాంతో అవి నోటిని పొడిబారిపోయేలా చేస్తాయి. ఈ అంశం కూడా దంతసమస్యలకు కారణమవుతుంది. వృద్ధాప్యంలో సంపాదన లేమితో : వృద్ధాప్యంలో చాలామందికి మునుపు ఉన్నంత సంపాదన ఉండదు. ఇలా తమకు ఉండే ఆదాయవనరులు తగ్గిపోవడం, దానికి తోడు కుటుంబసభ్యుల నుంచి అందాల్సినంత ప్రోత్సాహం ఉందక΄ోవడమనే అంశం కూడా దంత సమస్యలకు ఓ పరోక్ష కారణమవుతుంది. పైన పేర్కొన్న అనేక సమస్యల కారణంగా పళ్లు వదులైపోవడంతో వృద్ధాప్యంలో ఆహారం తీసుకోవడంలో తీవ్రమైన ఇబ్బందులు తలెత్తుతాయి. అంతేకాదు.. పళ్ల వల్లనే మానవుల్లో ఉచ్చారణ స్పష్టంగా ఉంటుంది. పళ్లలో సమస్యల కారణంగా భాషలో స్పష్టతా లోపించి కమ్యూనికేషన్కూ ఇబ్బందులు కలుగుతాయి.వృద్ధాప్యంలో ఆరోగ్య సమస్యలూ – పళ్లపై వాటి ప్రభావాలుడయాబెటిస్... పళ్ల సమస్యలు : ఈ రెండు అంశాలూ ఒకదాని కారణంగా మరొకటి కనిపిస్తూ ఉంటాయి. అంటే డయాబెటిస్ ఉన్నవారిలో పళ్లూ, చిగుళ్ల సమస్యలు ఎక్కువ. అలాగే పళ్లూ చిగుళ్ల సమస్యలు ఉన్నవారిలో... ఆ అంశాలు రక్తంలోని గ్లూకోజ్ పెరిగేలా చేసి, డయాబెటిస్కు కారణమవుతాయి. అందుకే డయాబెటిస్ ఉన్నవారూ పంటి జబ్బుల విషయంలో జాగ్రత్తపడాలి. లేనివారూ పళ్లను శుభ్రంగా ఉంచుకుని డయాబెటిస్ను రాకుండా నివారించుకోవాలి. డయాబెటిస్ ఉన్నవారికి సీరియస్ చిగుర్ల సమస్యలు, దంతక్షయం, లాలాజల గ్రంధులు సరిగా పనిచేయకపోవడం, ఫంగల్ ఇన్ఫెక్షన్స్, లైకెన్ప్లానస్, లైకెనాయిడ్ రియాక్షన్, నోటి ఇన్ఫెక్షన్లు అంత తేలిగ్గా తగ్గకపోవడం వంటి సమస్యలు వస్తుంటాయి.నివారణకు సూచనలివి : పళ్లను శుభ్రంగా ఉంచుకోవాలి. ప్రతి ఆర్నెల్లకోమారు దంతవైద్యుడిని కలిసి క్లీనింగ్ చేయించుకోవాలి. డయాబెటిస్ ఉన్నవారు రక్తంలో గ్లూకోజ్ ΄ాళ్లను సమర్థంగా నియంత్రించుకుంటూ ఉండేలా తగిన మందులు తీసుకోవాలి. ఒత్తిడి లేకుండా చూసుకోవలి. డయాబెటిస్ ఉన్నవారు డాక్టర్లు సూచించినవిధంగా తాము తీసుకోవాల్సిన ఆహారాన్ని తీసుకోవాలి.గుండెజబ్బులూ... చిగుర్ల వ్యాధులు...ఇటీవలి కొత్త పరిశోధనల వల్ల నోటి ఆరోగ్యానికీ, గుండెజబ్బులకూ దగ్గరి సంబంధం ఉందని తేలింది. సాధారణంగా చిగుర్ల వ్యాధి ఉన్నవాళ్లలో... తమకు పెద్దగా నొప్పి తెలియకుండానే పంటికింద ఉండే గులాబిరంగు చిగురుభాగం నెమ్మదిగా కిందికి కిందికి తగ్గుతూపోతుంది. కానీ పంటి కింది ఎముక భాగం కూడా నాశనమయ్యే దశకు చేరినప్పుడు, అక్కడ చేరిన బ్యాక్టీరియా రక్తప్రవాహంలో కలుస్తుంది. దాంతో అది గుండె కండరాన్ని దెబ్బతీసి, గుండెజబ్బులకూ దారితీసే ప్రమాదం ఉందని ఇటీవలి అనేక పరిశోధనల వల్ల తేలింది. ఇక పంటి మీద ఉండే పాచి/గారలో ఉండే సూక్ష్మక్రిములు రక్తనాళాలల్లోకి చేరడం వల్ల రక్తనాళాలు సన్నబడి కూడా రక్తప్రవాహ సంబంధమైన (వాస్క్యులార్ డిసీజెస్) రావచ్చు. పెద్దవయసువారంతా తెలుసుకోవాల్సిన మరో అంశం ఏమిటంటే దీర్ఘకాలంగా ఉండే చిగుర్ల వ్యాధుల వల్ల అకస్మాత్తుగా వచ్చే గుండెపోటు ముప్పు కూడా ఉంటుంది.నివారణకు సూచనలివి : ఈ సమస్య నివారణకు చేయాల్సిందల్లా సరైన రీతిలో బ్రషింగ్, మన ఆహారాన్ని బాగా నమిలి మింగడం. ఈ రెండూ శ్రద్ధగా చేస్తూ ఉంటే... పెద్దవయసు వారిలో చాలావరకు గుండెజబ్బులనూ, గుండెపోటునూ నివారించవచ్చు. పక్షవాతం – పంటి జబ్బులు: పక్షవాతానికి, పంటిజబ్బులకూ నేరుగా సంబంధం లేకపోయినా... గుండెజబ్బులకు ఉన్న సంబంధమే ఇక్కడా పనిచేస్తుంటుంది. ఉదాహరణకు పంటికి పట్టే గార/పాచి (ప్లాక్) వంటివి, పంటి జబ్బుల వల్ల రక్తప్రవాహంలో పేరుకుపోయే సూక్ష్మక్రిముల వల్ల రక్తనాళాలు సన్నబడటం, రక్తనాళాల్లో ప్లాక్ పేరుకుని అది రక్తం సాఫీగా ప్రవహించకుండా అడ్డుపడటం జరుగుతాయన్న విషయం తెలిసిందే. ఇదే ప్రమాదం గుండెకు సంబంధించిన ధమనుల విషయంలో జరిగితే అది గుండెపోటుకు దారితీస్తుంది. ఒకవేళ అదే మెదడుకు రక్తాన్ని చేరవేసే రక్తనాళాల (ధమనుల) విషయంలో జరిగితే అది పక్షవాతానికి దారితీసే ప్రమాదముంటుంది. నివారణకు సూచనలివి: పంటి జబ్బులను నివారించుకోవడం లేదా నిరోధించుకోవడం; పంటి సమస్యలను దూరం చేసుకోవడం; పంటి శుభ్రతను పాటించడం (డెంటల్ హైజీన్) వల్ల ఒకవైపు గుండెజబ్బులనూ మరోవైపున పక్షవాతాన్నీ నివారించుకోగలమని గుర్తుంచుకోవాలి.చివరగా... ఒకవేళ నివారణకు అవసరమైన జాగ్రత్తలు తీసుకోకపోయినవారు, దురదృష్టవశాత్తూ తమ పళ్లు కోల్పోయినప్పటికీ... వాళ్ల దవడ ఎముక ఎంత సన్నగా ఉన్నప్పటికీ, కృత్రిమ దంతాలు అమర్చడానికి ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఉన్నా మనకు అందుబాటులో ఉన్న నేటి డెంటిస్ట్రీలో అందుబాటులో అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కృత్రిమ దంతాలను అమర్చడం, ఎలాంటి దంతసమస్యలకైనా పరిష్కారాలను అందించడమూ పూర్తిగా సాధ్యమయ్యే విషయమే.ఆర్థరైటిస్... పంటి సమస్యలుదాదాపుగా 65 ఏళ్లుదాటిన 50 శాతం మందిలో ఎముకలకు సంబంధించిన జబ్బు అయిన ఆర్థరైటిస్ కనపడుతుంది. దీనివల్ల ఎముకల మధ్య రాపిడి, ఎముకల సాంద్రత తగ్గి, పెళుసుగా మారడం, ఫలితంగా అవి తేలిగ్గా విరిగి΄ోవడంలాంటివి తరచూ జరుగుతుంటాయి. ఈ జబ్బులో కూడా ఎముకలు, కీళ్ల మధ్య నొప్పిని నివారించడానికి నాన్ స్టెరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ (ఎన్ఎస్ఏఐడీ మందులు) వాడటం సాధారణం. ఈ ఆర్థరైటిస్ సమస్య ఉన్నవారికి సాధారణంగా మెథోట్రెక్సేట్ అనే మందులను ఉపయోగిస్తారు. ఇవన్నీ నోటి ఆరోగ్యాన్ని ప్రభావితం చేసేవే. ఉదాహరణకు మెథోట్రెక్సేట్ మందులు వాడేవాళ్ల నోళ్లలో పుండ్లు (అల్సర్స్) వస్తుంటాయి. ఇక రుమటాయిడ్ ఆర్థరైటిస్కు వాడే గోల్డ్ సోడియమ్ థయోమెలనేట్ అనే మందు వల్ల జింజివైటిస్ అనే చిగుర్లకు వచ్చే ఇన్ఫెక్షన్, గ్లాసైటిస్ అనే నాలుక ఇన్ఫెక్షన్, స్టొమటైటిస్ అనే నోటి ఇన్ఫెక్షన్లు వస్తాయి. ఇక పై మందుల వాడకం వల్ల రక్తంలోని తెల్లరక్తకణాలు తగ్గడం, ప్లేట్లెట్స్ కౌంట్ తగ్గడం వంటి దుష్పరిణామాలూ ఉంటాయి. కాబట్టి వాటి వల్ల రోగనిరోధకశక్తి తగ్గడం, పంటి చిగుర్ల నుంచి రక్తస్రావం వంటి పరిణామాలూ కనిపిస్తుంటాయి. లాలాజల గ్రంథులు...నోటి సమస్యలు నోటిలో ఉరుతూ ఉండే లాలాజలం (సలైవా) వల్ల నోరు ఎప్పుడూ తడిగా ఉంటుంది. ఇది నిత్యం నోటిలో ఉండే ఆహారపదార్థాలను కడిగేస్తూ ఉంటుంది. నోరు పొడిబారిపోవడం అనే లక్షణం డయాబెటిస్ బాధితులతో బాటు, కొన్ని వ్యాధుల్లో మందులు తీసుకునేవారికి, తల, గొంతు క్యాన్సర్ కారణంగా రేడియేషన్ చికిత్స తీసుకున్నవారికి లాలాజలం తగ్గుతుంది. నోటిలో తగినంత లాలాజలం లేకపోవడం వల్ల బ్యాక్టీరియా పెరిగిపోతుంది. నోరు పొడిబారిపోవడం దీర్ఘకాలంపాటు సాగితే నోటిలోని మృదుకణజాలం దెబ్బతిని, నొప్పి వస్తుంది. దాంతో దంతక్షయం (టూత్ డికే), చిగుర్ల వ్యాధులకు అవకాశాలు పెరుగుతాయి.కొన్ని సూచనలూ – మరికొన్ని చికిత్సలు... లాలాజల స్రావాలు తగ్గి తరచూ నోరు పొడిబారుతుంటే తక్షణం దంతవైద్యులను కలవాలి. వారు కొన్ని పుక్కిలించే ద్రావణాలు, పైపూత (టాపికల్)గా వాడదగ్గ ఫ్లోరైడ్ ద్రావణాలను సూచిస్తారు. కొన్ని చక్కెర లేని గమ్స్, మింట్స్ వంటివి నోటిలో తగినంత లాలాజలం ఊరేలా చేస్తాయి. దాంతోపాటు తరచూ కొద్దికొద్దిగా నీళ్లు తీసుకుని గుటక వేస్తుండటం, కరిగే ఐస్ను చప్పరించడం కూడా నోరు పొడిబారడాన్ని తగ్గిస్తాయి. ఇలా నోరు పొడిబారేవాళ్లు కెఫిన్ ఎక్కువగా ఉండే కాఫీలాంటి డ్రింక్స్ను చాలా తక్కువగా తీసుకోవడం, ఆల్కహాల్ను మానివేయడం మేలు.హైబీపీ – పంటిసమస్యలుఈ రెండు అంశాలకూ మధ్య సంబంధం ఉంది. హై–బీపీతో బాధపడేవారిలో వాళ్ల అధిక రక్తపోటు అనే అంశం గుండెజబ్బులకూ, గుండెపోటుకు దారితీయకుండా కొన్ని మందులు ఇస్తుంటారన్న విషయం తెలిసిందే. పంటి సమస్యలు ఉన్నవారికి ఇచ్చే నాన్స్టెరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ (ఎన్ఎన్ఏఐడి మందుల) వల్ల... హై–బీపీ ఉన్నవారు తాము తీసుకునే మందుల ప్రభావం తగ్గుతుంది. దీంతోపాటు మరో ప్రమాదమూ ఉంది. హై–బీపీ ఉన్నవారికి ఇచ్చే మందుల వల్ల నోటిలో తడి తగ్గి అది జీరోస్టోమియా అన్న కండిషన్కు దారితీస్తుంది. ఈ జీరోస్టోమియా కూడా పంటి సమస్యలను పెంచడమే కాకుండా... పలువరసలో అమర్చిన కృత్రిమ దంతాలకూ, స్క్రూల వంటి అనుబంధ అంశాలకూ నోటిలోని మృదుకండరాలకూ మధ్య ఘర్షణ (ఫ్రిక్షన్)ను పెంచి మరిన్ని పంటి సమస్యలకు దారితీసేలా చేస్తుంది. క్యాల్షియమ్ బీటా బ్లాకర్స్ అనే మందులు వాడే పది శాతం మందిలో దాని తాలూకు సైడ్ఎఫెక్ట్గా జింజివల్ హైపర్ప్లేసియా అనే చిగుర్లవ్యాధి కనిపిస్తుంది. ఈ వ్యాధి మందులు మొదలుపెట్టిన కొన్ని నెలల్లోనే ఇది కనిపిస్తుందని అనేక పరిశీలనల్లో తేలింది.నివారణకు సూచనలివి...హైబీపీకి మందులు వాడేవారు తమకు ఎదురైన అనుభవాన్ని తమ ఫిజీషియన్ను వివరించి, తరచూ తమ దంతవైద్యులను కూడా కలిసి తమ మందులను వారిచేత కూడా సమీక్షింపజేసుకుంటూ ఉండాలి. సరైన నోటి శుభ్రత పాటిస్తూ డయాబెటిస్ను సాధ్యమైనంతవరకు నివారించుకుంటూ ఉండటం మేలు. డాక్టర్ నరేంద్రనాథ్ రెడ్డి, సీనియర్ డెంటల్ స్పెషలిస్ట్ (చదవండి: వర్షం సైతం ఆ నృత్యాన్ని అడ్డుకోలేకపోయింది..!) -
గుండె జబ్బులే.. 'ప్రాణాంతకం'
మనదేశంలో 2021–23 మధ్య సంభవించిన మరణాలకు గుండె జబ్బులే ప్రధాన కారణమని.. ఆ తర్వాతి స్థానంలో శ్వాసకోశ సమస్యలు ఉన్నట్లు ‘రిజిస్ట్రార్ జనరల్ అండ్ సైన్సెస్ కమిషనర్ ఆఫ్ ఇండియా’ తన తాజా నివేదికలో వెల్లడించింది. మొత్తం మరణించిన వారిలో 40 శాతానికిపైగా.. 70 ఏళ్లకుపైబడిన వారే. భారతదేశ ప్రజారోగ్య వ్యూహాలను రూపొందించటానికి, పెరుగుతున్న అసాంక్రమిక వ్యాధుల భారాన్ని ఎదుర్కొనే ప్రణాళికల రూపకల్పనకు ఈ పరిశోధన ఫలితాలు కీలకమైనవని నివేదిక పేర్కొంది.‘మరణ కారణాలు: 2021–2023’ పేరిట రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా (ఆర్జీఐ) సెప్టెంబర్ 3న విడుదల చేసిన శాంపిల్ రిజిస్ట్రేషన్ సర్వే తాజా నివేదిక ప్రకారం దేశంలోని అనారోగ్య సంబంధ మరణాలకు దాదాపు 31 శాతం వరకు గుండె జబ్బులే ప్రధాన కారణం. మొత్తం మరణాల్లో 56.7 శాతం వరకు అసాంక్రమిక వ్యాధులు (గుండె జబ్బులతో సహా) ఉన్నట్లు నివేదిక తెలిపింది. గుండెజబ్బుల తర్వాత శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు, శ్వాసకోశ వ్యాధులు మరణాలకు ప్రధాన కారణాలుగా ఉన్నాయి. ఆ తర్వాతి స్థానంలో ప్రసూతికి సంబంధించిన మరణాలు, పౌష్టికాహార లోపాల మరణాలు 23.4 శాతం వరకు ఉన్నాయి. గుండెపై జీవనశైలి ఒత్తిళ్లు..అన్ని రకాల హృద్రోగాలు కలిపి మరణాలకు ప్రధాన కారణంగా నిలిచాయని, దాదాపు 31 శాతం మంది ప్రాణాలను అవి బలిగొన్నాయని నివేదిక తెలిపింది. యువతలో జీవనశైలి వల్ల తలెత్తుతున్న గుండె జబ్బుల తర్వాత, ఆత్మహత్యలు వారి మరణానికి రెండో ప్రధానం కారణంగా ఉన్నాయని నివేదిక తెలిపింది. 30 ఏళ్లు దాటిన వారిలో మరణాలకు గుండె జబ్బులు ప్రధాన కారణంగా ఉంటుండగా, 15–29 ఏళ్ల యువత పాలిట ఆత్మహత్యలు మరణ శాసనాలుగా మారుతున్నాయి.ప్రాంతాల వారీగా సర్వేఉత్తర, ఈశాన్య, తూర్పు, మధ్య, పశ్చిమ, దక్షిణ.. ఇలా ప్రాంతాల వారీగా రిజిస్ట్రార్ ఆఫ్ ఇండియా ‘మరణ కారణాలు: 2021–2023’ సర్వేను నిర్వహించింది. » దక్షిణాదిన హృద్రోగ మరణాల శాతం 32.8 శాతం ఉండగా, ఉత్తరాదిన 34.5 శాతంగా ఉంది. » శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల వల్ల మరణాలు పశ్చిమ ప్రాంతంలో అత్యధికంగా 12.7 శాతం ఉన్నాయి. తరవాతి స్థానంలో (12.3 శాతం) మధ్య భారతం ఉంది. ఇవి అత్యల్పంగా (7.1 శాతం) సంభవించింది ఉత్తరాదిలో.» మధుమేహం వల్ల అత్యధికంగా 4.6 శాతం మరణాలతో దక్షిణాది అగ్రస్థానంలో నిలిచింది. తరువాతి స్థానంలో (4.1 శాతం) ఉత్తరాది ఉంది. -
యోగాతో ఇంత మార్పు..! ఏడాదికే ఏకంగా 83 కిలోల బరువు మాయం
వెయిట్ లాస్ జర్నీలకు సంబంధించిన ఎన్నో స్ఫూర్తిదాయకమైన కథలను విన్నాం. ఎన్నో త్యాగాలు, కఠినమైన డైట్లు అవలంబించామనే చెబుతుంటారు చాలామంది. ముఖ్యంగా ఇన్ని గంటలు వర్కౌట్లు, డైట్ వంటివి క్రమంతప్పకుండా చేస్తేనే మంచి ఫలితం అని విన్నాం. కానీ ఈ బామ్మ యోగాతో అద్భుతం సృష్టించింది. ఏకంగా ఒక్క ఏడాదికే కిలోలుకొద్ది బరువు తగ్గి యోగా పవర్ ఏంటో చాటిచెప్పి.. అందరికి స్ఫూర్తిగా నిలిచింది. ఆ బామ్మనే అమృత్సర్కు చెందిన 87 ఏళ్ల శకుంతల దేవి. ఆమె యోగాతో ఒక ఏడాదిలోనే 83 కిలోలు పైనే బరువు తగ్గింది. వయస్సుని ధిక్కరించేలా అత్యంత చురుకుగా ఉందామె. వృద్ధురాలిలా కాకుండా ఒక వండర్ బామ్మని చూసిన అనుభూతిని కలిగిస్తోంది. బాలీవుడ్ బుల్లితెర షో లాఫ్టర్ చెఫ్స్ 2లో కనిపించి..అందరినీ ఆశ్చర్యపరించిందామె. ఆమె అసామాన్య ఎనర్జీని చూసి అక్కడ సెలబ్రిటీలే విస్తుపోయారు. ఆ షో హోస్ట్ భారతి సింగ్తో మాట్లాడుతూ తాను ఒకప్పుడు దగ్గర దగ్గర.. 123 కిలోలు పైనే బరువు ఉండేదాన్ని అని చెప్పింది. దాంతో ఒక్కసారిగా అక్కడున్నవారంతా విస్తుపోయారు. తాను యోగా మీద నమ్మకంతో వెయిట్లాస్ జర్నీని ప్రారంభించానని చెప్పుకొచ్చింది. "బరువు తగ్గడం అనేది ఒక స్థిరమైన ప్రయాణం. కేవలం క్రమశిక్షణతో కూడిన స్థిరత్వంతో శరీరం బరువు తగ్గించేలా మనసుని ప్రేరేపించగలం అని చెబుతోంది". ఆ షోలో శకుంతలా దేవి వేసిన యోగాసనాలను చూసి అంత షాకయ్యారు. ప్రతి ఒక్క ఆసనాన్నిచాలా అలవోకగా వేసిందామె.123 కిలోల నుండి 40 కిలోలకు ఎలా చేరుకుందంటే..2008 ఆ సమయంలో శకుంతల దేవి విపరీతమైన బరువు పెరిగి ఇబ్బందిపడింది. దాంతో ఆమె దైనందిన జీవితం భారంగా మారింది చిన్న చితక పనులు కూడా చేయలేని పరిస్థితికి వచ్చేసింది. భారతీయ గురువు బాబా రాందేవ్ ఆమెను యోగాకు పరిచయం చేసినప్పుడు తన పరిస్థితి పూర్తిగా మారిపోయిందని చెబుతోందామె. టెలివిజన్లో ఆయన యోగాసనాలు ప్రదర్శించడం చూసి తన వెల్నెస్ నియమావళిలో ఆరోగ్యకరమైన అలవాట్లను చేర్చుకోవాలని స్ట్రాంగ్గా డిసైడ్ అయ్యిందట. ఆమె చికిత్స కోసం మందులను ఆశ్రయించకూడదని ఇంట్లోనే సాధారణ ఆసనాలను అభ్యసించడం ప్రారంభించింది. ఒక ఏడాది తర్వాత 2009లో శకుంతలా దేవి యోగాను సరిగా నేర్చుకోవడానికి హరిద్వార్కు వెళ్లింది. రోజువారి దినచర్యలో భాగంగా 4 గంటలకు మేల్కొని ఆసనాలు వేయడం చేసేది. దాంతో కేవలం ఒక్క ఏడాదిలోనే బరువు తగ్గడమే కాకుండా యోగా ఆమె ఆరోగ్యాన్ని పూర్తిగా మార్చివేసింది. ఇది ఆమెకు కొత్త జీవితాన్ని ప్రసాదించింది. ఇప్పటికీ ఈ వయసులో కూడా ఆమె కఠినమైన ఫిట్నెస్ నియమాన్ని అనుసరిస్తుంది. అలాగే ఇతరులకు యోగాని నేర్పుతోంది. దృఢ సంకల్పం, నిబద్ధతలతో మెరుగైన ఆరోగ్యాన్ని సొంతం చేసుకోగలమని శకుంతల దేవి వెయిట్ లాస్స్టోరీనే చెబుతోంది. కాగా, హార్వర్డ్ హెల్త్ పబ్లిషింగ్ ప్రకారం, యోగా కేలరీలను బర్న్ చేయడమేగాక, అతిగా తినడాన్ని నివారించి బరువు తగ్గేలా చేస్తుందని జర్నల్లో పేర్కొంది.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. View this post on Instagram A post shared by 𝐀𝐍𝐀𝐘𝐀 ᥫ᭡. (@minexspace) (చదవండి: రక్తపరీక్షతో ప్రీఎక్లాంప్సియా గుర్తింపు!) -
హలో.. వినబడుతుందా?
‘కరీంనగర్కు చెందిన శ్రీనివాస్కు ఎక్కువ వాల్యూంతో ఇయర్ ఫోన్లు పెట్టుకొని పాటలు వినడం, సినిమాలు, రీల్స్ చూడడం ఇష్టం. బైక్పై వెళ్తున్నా.. బస్సుల్లో ప్రయాణిస్తున్నా.. ఆఫీసులో ఉన్నా.. రోడ్డుపై ఉన్నా ఇదే ధ్యాస. నిత్యం ఏడెనిమిది గంటలపాటు ఇదే పరిస్థితి. ఇటీవల అతనికి చెవిలో ఒకటే హోరు మొదలైంది. భరించలేక ఈఎన్టీ వైద్యుడిని సంప్రదిస్తే అసలు విషయం తెలిసింది. గంటల తరబడి ఎక్కువ సౌండ్తో ఇయర్ ఫోన్స్ వినడంతో చెవిలోపలి భాగంలో సమస్య తలెత్తినట్లు గుర్తించి చికిత్స చేశారు. అయినా పూర్థిస్థాయి ఫలితం రాలేదు.’హుజూరాబాద్/కరీంనగర్ టౌన్: ఇయర్, హెడ్ఫోన్లు విచ్చలవిడిగా వాడుతున్నారా... గంటల కొద్దీ వాటితోనే కాలం గడుపుతున్నారా? అయితే జాగ్రత్త ఎక్కువ శబ్ధంతో వీటిని వినియోగించడం వల్ల కొందరిలో దీర్ఘకాలంగా వినికిడి శక్తిపై తీవ్ర ప్రభావం చూపుతోందని ఈఎన్టీ డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా చెవి, వినికిడి సమస్యతో వారానికి వేయి నుంచి 1500 మంది సంప్రదిస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు. వీరిలో ఎక్కువ మంది 20 నుంచి 40 ఏళ్ల మధ్య వయసు్కలే ఉంటున్నారని పేర్కొంటున్నారు. సాధారణంగా ఇయర్ ఫోన్లు, హెడ్ఫోన్ల నుంచి వచ్చే ధ్వని తరంగాలు కర్ణభేరికి చేరుతాయి. తర్వాత అవి చెవిలోని చిన్న ఎముక ద్వారా లోపలి చెవిని(ఇన్నర్ ఇయర్) తాకుతాయి. అక్కడ ఉన్న కోక్లియా వాటిని గ్రహిస్తుంది. ఎక్కువ శబ్ధం వినడంతో మొత్తం చెవి ఆరోగ్యంపైనే ప్రభావం పడుతుంది. ముఖ్యంగా కోక్లియాలో అతి సూక్ష్మకణాలు, ద్రవం ఉంటాయి. అతి శబ్దం, దీర్ఘకాలిక, నిరంతర ధ్వనుల తాకిడి వల్ల అందులోని సున్నితమైన కణాలు దెబ్బతింటాయి. నిపుణుల సూచనల ప్రకారం ప్రతీ వ్యక్తి రోజుకు 8 గంటలపాటు 8,5 డెసిబుల్స్ శబ్దాల వరకు వింటే ఎలాంటి ఇబ్బంది ఉండదరు. అయితే చాలామంది 85–100 వరకు డెసిబుల్ సౌండ్స్తో ఇయర్ ఫోన్లు, హెడ్ఫోన్లు వైద్యనిపుణులు పేర్కొంటున్నారు.‘హుజూరాబాద్కు చెందిన శ్రావణికి (పేరు మార్చాం) ఫోన్లో రీల్స్ చూడడం.. పాటలు వినడం అలవాటు. ఎప్పుడు చూసినా ఇయర్ ఫోన్లు పెట్టుకొనే కనిపిస్తుంది. దీంతో ఆమె కర్ణభేరి దెబ్బతింది. రెండు చెవులు వినిపించడంలేదు. మెదడులో నరాలు దెబ్బతిన్నాయి. అప్పుడప్పుడు మతిస్థిమితం లేకుండా వ్యవహరిస్తోంది. డాక్టర్లను సంప్రదిస్తే అతిసీపం నుంచి శబ్ధం.. అంటే ఇయర్ ఫోన్స్ లాంటివి వాడితే ఇలాంటి ఇబ్బందులు వస్తాయని తెలిపారు. ఇప్పుడామెది ఏమీ వినలేని పరిస్థితి.’‘సిరిసిల్లకు చెందిన పరమేశ్కు(పేరు మార్చాం) ఇయర్ ఫోన్స్ పెట్టి సెల్ఫోన్లో పాటలు వినడం, సినిమాలు చూడడం అలవాటు. క్రమంగా ఆయన వినికిడి శక్తిని కోల్పోయాడు. చెవిలో అతిదగ్గరినుంచి శబ్దం వినడంతో కర్ణభేరికి ఇబ్బందిగా మారిందని వైద్యులు చెప్పారు. ఇప్పుడాయనా చెవికి వినికిడి పరికరం అమర్చుకున్నాడు. లేదంటే ఆయన ఎలాంటి శబ్ధం వినలేడు’.చెవికి తీవ్ర నష్టంసెల్ఫోన్ వచ్చాక చెవుడు సమస్యలు ఎక్కువయ్యాయి. 12–34 ఏళ్ల మధ్య 24శాతం మంది పర్సనల్ లిసెనింగ్ డివైజ్ (హెడ్ఫోన్స్, ఇయర్ బడ్స్) వాడుతూ, 48శాతం మంది 85 డిసెబుల్స్ కన్నా ఎక్కువ శబ్దాన్ని వింటూ వినికిడి సమస్యల బారిన పడుతున్నారు. తీవ్రమైన శబ్దం వినడం వల్ల శ్రవణ వ్యవస్థలో ఉండే సూక్ష్మమైన హెయిర్ సెల్స్ దెబ్బతిని చెవుడు ఏర్పడుతుంది. డీజే సౌండ్ లాంటి అధిక వాల్యూమ్తో శాశ్వత చెవుడు వచ్చే అవకాశముంది. మ్యూజిక్, వాయిస్కాల్స్ హెడ్ఫోన్స్, ఇయర్ బడ్స్తో ఎక్కువ సమయం వినడం వల్ల బ్రెయిన్ సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తుంది. ఇయర్ఫోన్స్, హెడ్ఫోన్స్, సెల్ఫోన్, డీజే సౌండ్ను ఎంత తక్కువగా ఉపయోగిస్తే అంత మేలు. – ప్రశాంత్, ఈఎన్టీ నిపుణుడుచెవి ఆరోగ్యం దెబ్బతిన్నప్పుడు కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. వాటిని నిర్లక్ష్యం చేస్తే దీర్ఘకాలంలో వినికిడి సమస్య తలెత్తుతుంది. అందుకే లక్షణాలు కనిపిస్తే వెంటనే అప్రమత్తం కావాలని వైద్యులు సూచిస్తున్నారు.చెవుల్లో శబ్దాల హోరుచిన్న శబ్దాలను కూడా వినలేకపోవడంచెవుల్లో తరచూ ఇన్ఫెక్షన్లు, నొప్పిఅధికంగా గులిమి ఏర్పడడంచెవిపై ఒత్తిడి పెరగడంతో వర్దిగో సమస్యఇయర్ ఫోన్స్ వాడొద్దు ప్రస్తుత సాంకేతిక ప్రపంచంలో ఫోన్ల వాడకం విపరీతంగా పెరిగింది. ప్రజలు మరింత సౌలభంగా ఉండేందుకు వీలుగా ఇయర్ ఫోన్స్ వాడుతున్నారు. ప్రస్తుతం వచ్చిన ఇయర్ ఫోన్స్లో శబ్ద తీవ్రత ఎక్కువగా ఉంటుంది. చెవి నొప్పితో బాధపడుతున్న వారి సంఖ్య పెరుగుతుంది. సంపూర్ణ ఆరోగ్యం కోసం ఇయర్ ఫో¯Œన్లను తక్కువ వాడటమే ఉత్తమం.– రాజు, ఈఎన్టీ వైద్యుడు, హుజూరాబాద్ -
ఏడాది తర్వాత రక్తస్రావం అవుతుంది..ఇది పెద్ద సమస్యనా?
డాక్టర్గారు, నాకు 45 ఏళ్లు. దాదాపు సంవత్సరం రోజులుగా రుతుస్రావం రాలేదు. ఇది మెనోపాజ్ అనుకున్నాను కాని, ఇప్పుడు మళ్లీ రక్తస్రావం వస్తోంది. ఇది ఏదైనా పెద్ద సమస్యనా అని చాలా భయపడుతున్నాను.– లావణ్య, తూప్రాన్ఒక మహిళకు 45 ఏళ్లు దాటాక వరుసగా 12 నెలలు రుతుస్రావం లేకపోతే మెనోపాజ్ దశలో ఉన్నట్లుగా పరిగణిస్తాం. అయితే ఆ తర్వాత రక్తస్రావం వస్తే దాన్ని పోస్టు మెనోపాజల్ బ్లీడింగ్ అంటారు. ఇది తరచు కనిపించే సమస్యలలో ఒకటి. అయినప్పటికీ ఎప్పుడూ నిర్లక్ష్యం చేయరాదు. సుమారు ఐదు శాతం మహిళల్లో ఈ సమస్య కనిపిస్తుంది. అందులో ఎక్కువగా కనిపించే కారణం అట్రోఫిక్ వెజైనిటిస్. ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గిపోవడం వల్ల యోని గోడలు పలచబడి చిన్న గాయాలు అవుతాయి. దాంతో రక్తస్రావం మాత్రమే కాకుండా, పదే పదే మూత్రపిండ ఇన్ఫెక్షన్లు కూడా రావచ్చు. మరికొంతమందిలో గర్భాశయం లోపల ఏర్పడే పాలిప్స్ వలన రక్తస్రావం ఉంటుంది. ఇవి గడ్డల్లా మారుతాయి. పోస్టు మెనోపాజల్ బ్లీడింగ్ ఉన్నవారిలో పదిహేను నుంచి ఇరవై శాతం వరకు ఇవే కారణం అవుతాయి. వీటిలో తొంభై శాతం ఫాల్స్ అయినప్పటికీ నిర్ధారణ అవసరమే! ఇంకా కొంతమందిలో ఎండోమెట్రియల్ హైపర్ప్లాసియా లేదా గర్భాశయ క్యాన్సర్కు కారణం అవుతుంది. దాదాపు పది శాతం కేసుల్లో ఈ సమస్య కనిపిస్తుంది. హైపర్ప్లాసియాలో కూడా ఏటిపికల్ అనే రకం ఉంటే కేన్సర్గా మారే ప్రమాదం ఎక్కువ. అరుదుగా యోని లేదా వల్వా కేన్సర్లు కూడా ఈ రక్తస్రావానికి కారణం కావచ్చు. మధుమేహం ఉన్నవారు, అధిక బరువు కలిగినవారు, గర్భాశయ కేన్సర్ కుటుంబ చరిత్ర ఉన్నవారు ఎక్కువగా జాగ్రత్తగా ఉండాలి. అలాగే మెనోపాజ్ లక్షణాలను తగ్గించుకోవడానికి ఈస్ట్రోజన్ మాత్రలు తీసుకునే కొంతమందికి కూడా రక్తస్రావం కలగవచ్చు. అందుకే మెనోపాజ్ తర్వాత రక్తస్రావం వస్తే అది పెద్ద విషయం కాదని ఊహించుకోవడం తప్పు. ఎక్కువసార్లు కారణం తేలికపాటిదే అయినా, కొన్నిసార్లు తీవ్రమైన సమస్యకు సంకేతం కావచ్చు. కాబట్టి ఒకసారి అయినా గైనకాలజిస్ట్ను సంప్రదించి అల్ట్రాసౌండ్, ఎండోమెట్రియల్ టెస్టులు చేయించుకోవడం చాలా అవసరం. డాక్టర్ ప్రమత శిరీష, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్ (చదవండి: జాతీయ పోషకాహార వారోత్సవాలు: అరవైల్లోనూ యవ్వనంగా!) -
ఉచిత పోషకాహార శిబిరం
నేషనల్ న్యూ ట్రిషన్ వీక్ సందర్భంగా ఆలివ్ ఆస్పత్రి ఆధ్వర్యంలో సెప్టెంబర్ 1 నుండి 10 వరకు ఉచిత పోషకాహార శిబిరాన్ని నిర్వహిస్తోంది. ఈ శిబిరంలో పాల్గొనే వారికి ఉచిత ఆరోగ్య పరీక్షలు, నిపుణుల సలహాలు, వ్యక్తిగత డైట్ ప్లాన్లు అందిచనున్నారు. సాధారణంగా నిర్లక్ష్యం చేస్తున్న విటమిన్ లోపాలు — అలసట, రోగనిరోధక శక్తి తగ్గడం, శక్తి లోపం వంటి సమస్యలపై వైద్యులు, పోషకాహార నిపుణులు దృష్టి సారించి సులభమైన ఆహార మార్పులపై మార్గదర్శనం ఇవ్వనున్నారు.ఈ సందర్భంగా డాక్టర్ సుగ్రా ఫాతిమా, కన్సల్టెంట్ డైటీషియన్ అండ్ న్యూ ట్రిషనిస్ట్ మాట్లాడుతూ...“ఆహారం మన ఆరోగ్యంలో కీలక పాత్ర పోషిస్తుంది. మన శరీరానికి ఏం కావాలో అర్థం చేసుకుంటే అనేక జీవనశైలి సమస్యలను నివారించవచ్చు. ఈ న్యూట్రిషన్ వీక్ ద్వారా ఆరోగ్యకరమైన జీవితం కోసం సరైన పోషకాహార ప్రాధాన్యతను నగర వాసులకు తెలీయజేయడమే" అని అన్నా రు. ఈ శిబిరంలో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని, ఉచిత పరీక్షలు, సలహాలను పొంది ఆరోగ్యకరమైన జీవనానికి తొలి అడుగు వేయాలని ఆలివ్ హాస్పి టల్ యాజమాన్యం కోరింది.(చదవండి: జాతీయ పోషకాహార వారోత్సవాలు: అరవైల్లోనూ యవ్వనంగా!) -
అరవైల్లోనూ యవ్వనంగా!
అరవై ఏళ్లు దాటిన కొందరు సెలబ్రిటీలను, వారి ఫిట్నెస్ చూసి చాలా మంది ‘వయసును ఆపేశారు’ అని మాట్లాడుకోవడం చూస్తుంటాం. వారు తీసుకునే పోషకాహారం, వ్యాయామం, చేసే పనుల నిర్వహణ ఇంకా యవ్వనంగా ఉండేలా చేస్తుంది. అరవై ఏళ్ల వయసు పై బడిన వారు ఇక జీవితం అయి΄ోయిందని అనుకోకుండా తమ రోజువారీ తీసుకునే ఆహారం పట్ల సరైన శ్రద్ధ వహిస్తే ఆరోగ్యంగానూ, పనుల నిర్వహణలోనూ ఉత్సాహంగా ఉంటారు.రోజువారీగా తీసుకోవాల్సిన...కేలరీలు: 1500–1700ప్రొటీన్లు: పురుషులు – రోజుకు 54 గ్రా‘‘ మహిళలు – రోజుకు 45గ్రా‘‘ నాణ్యమైన ప్రొటీన్ కోసం: ఉడికించిన గుడ్డు, పాలు, కోడి మాంసం, చేపలు, పప్పు దినుసులుకొవ్వులు: రోజుకు 25.గ్రా (ఆరోగ్యకరమైన కొవ్వులు – 1 టేబుల్ స్పూన్ నూనె, గింజలు, నువ్వులు)కార్బోహైడ్రేట్లు: మొత్తం కాలరీలలో 45–65% విటమిన్లు, ఖనిజాలువిటమిన్–ఎ: 840–1000 మైక్రోగ్రాములువిటమిన్– ఇ: రోజుకు 65 మి.గ్రా‘‘క్యాల్షియం: రోజుకు 1200 మి.గ్రా‘‘ఐరన్: రోజుకు 11–19 మి.గ్రా‘‘ఫుడ్ గ్రూఫ్స్ పండ్లు: రోజుకు 1–2 సర్వింగ్స్ (మీడియం సైజు ఉన్న పండు)కూరగాయలు: రోజుకు 3–4 సర్వింగ్స్ (వంట చేసినవి లేదా ఉడికించినవి)ధాన్యాలు: రోజుకు 6–8 సర్వింగ్స్ (1 కప్పు = 30గ్రా) అన్నం, సజ్జలు, లేదా గోధుమ నూకడైరీ ఉత్పత్తులు: రోజుకు 2–3 సర్వింగ్స్ (పాలు, పెరుగు, పనీర్)సాధారణంగా రోజూ ఈ కాంబినేషన్లో ఆహారం ఉండేలా చూసుకోవాలి.రోజువారీ భోజన ప్రణాళిక...బ్రేక్ఫాస్ట్ఇడ్లీ (60గ్రా.) + 1 కప్పు సాంబార్ లేదాఉప్మా (60గ్రా.) + 1 కప్పు సాంబార్ లేదాఓట్స్ / కిచిడీ (60గ్రా.) + ఉడికించిన గుడ్డు తెల్లసొనమధ్యాహ్న భోజనం1 కప్పు బియ్యం / బ్రౌన్ రైస్1 జొన్న/రాగి ఫుల్కా (25గ్రా‘‘)1 కప్పు తోటకూర పప్పు1 కప్పు కాకర కాయ కూర / ఇతర కూరస్నాక్స్ఆపిల్ / కివి / కమలపండుకొద్దిగా నానబెట్టిన గింజలు కొబ్బరి నీళ్లుఈవెనింగ్ స్నాక్స్1 కప్పు చికెన్ సూప్ / వెజిటబుల్ సూప్ / మజ్జిగరాత్రి భోజనం1 కప్పు అన్నం / బ్రౌన్ రైస్ / కిచిడీ లేదా 1 ఫుల్కా1 కప్పు పాలక్ పనీర్ కూర / పలుచని పప్పు/ ఏదైనా ఒక కూర (చదవండి: మనపై ‘గాండ్రు’మన్న పులులే మెత్తని గ్రాండ్ పేరెంట్స్ అయ్యారే!) -
వృద్ధాప్యంలో డిప్రెషన్: మెరుగు పడేది ప్రేమతో
గత కొంతకాలం కిందట రిటైర్ అయిన పరంధామయ్య మొదట్లో బాగానే ఉండేవారుగానీ ఈ మధ్య అంత చురుగ్గా లేకపోవడంతో పాటు ఎంతో విచారంగా కనిపిస్తున్నారు. పిల్లలిద్దరూ యూఎస్లో ఉండటంతో పరంధామయ్య దంపతులిద్దరూ ఒంటరిగానే ఉండాల్సి వస్తోంది. గతంలోలా ఎక్కడికీ వెళ్లడం లేదు. కాస్త మతిమరపు వచ్చినట్టుగా ఫీలవుతున్నారు కూడా. బాగా సన్నిహితులైన ఒకరిద్దరు కనిపించి సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్లమంటే... ‘తానేమైనా పిచ్చివాడిని అయిపోతున్నానా?’ అనే దిగులు ఆయన్ను మరింత కుంగదీస్తోంది. ఎట్టకేలకు కొందరు ఫ్రెండ్స్ ఆయనను సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకెళ్తే తేలిందేమిటంటే... ఆయన ‘వృద్ధాప్యం తాలూకు డిప్రెషన్’తో బాధపడుతున్నట్లు తేలింది. ఇంట్లో కనీసం మనవలూ, మనవరాళ్లూ ఉండి ఉంటే గ్రాండ్స్ పేరెంట్స్కు ఈ పరిస్థితి వచ్చేది కాదేమోనని చెప్పడంతో ఈ వృద్ధాప్యపు డిప్రెషన్ గురించి నలుగురికీ తెలియడం మంచిదని ఫీలయ్యారు పరంధామయ్య ఫ్రెండ్స్. వృద్ధాప్యంలో వచ్చే ఆ ‘ఓల్డ్ ఏజ్ డిప్రెషన్’ తాలూకు వివరాలివి...ఆల్కహాల్తోనూ డిప్రెషన్...కొందరు పెద్దవయసు వారు ఆ వయసులో బాగా నిద్రపట్టేందుకూ లేదా హాయిగా సాయంత్రాలు గడిపేందుకూ మద్యం ఒక సాధనమని అనుకుంటుంటారు. అయితే ఆ వయసులో అతిగా తాగే మద్యం వల్ల కూడా డిప్రెషన్ వస్తుంది. ఆల్కహాల్ వల్ల తేలిగ్గా కోపం, చిరాకు వంటి ఉద్వేగాలకు గురికావడం (ఇరిటబిలిటీ), యాంగై్జటీకి లోనుకావడం, మెదడులోని జీవక్రియలు అస్తవ్యస్తం కావడం జరగవచ్చు. ఆల్కహాల్ కారణంగా వృద్ధులకు ఇచ్చే యాంటీ డిప్రెసెంట్ మందులు అంత ప్రభావపూర్వకంగా పనిచేయకపోవడం వంటివీ జరగవచ్చు. మద్యం నిద్ర నాణ్యతను దెబ్బతీసే ముప్పు ఉంటుంది. పైగా మద్యం మత్తులో పడిపోవడం జరిగి, ఆ వయసులో పూర్తిగా మరొకరిపై ఆధారపడాల్సి రావడం కూడా ఒక నిస్సహాయతతో పాటు... అలా ఆధారపడాల్సి రావడమనే భావన కూడా డిప్రెషన్కు దారితీయవచ్చు.వయసు పైబడిన వారు ముందుగా గుర్తుంచుకోవాల్సిందేమిటంటే... తమ మనసుకు వచ్చిన సమస్యనూ లేదా సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్లాల్సిన పరిస్థితిని చాలా సహజమని గుర్తించాలి. తల్లిదండ్రులు కాస్తా గ్రాండ్ పేరెంట్స్గా మారే టైముకు పిల్లలు తమ పిల్లలతో (గ్రాండ్ చిల్డ్రెన్తో) కలిసి వాళ్ల కెరియర్ కోసం విదేశాలకు లేదా దూర్రపాంతాలకు వెళ్లడం చాలా సహజం. ఇటీవలి సామాజిక ధోరణి కారణంగా... తమ రిటైర్మెంట్ నాటికి పెద్దలు డిప్రెషన్కు లోనుకోవడం చాలా సాధారమవుతోంది. పైగా ఈ తరహా డిప్రెషన్ ఇటీవల చాలామందిలో విపరీతంగా విస్తరిస్తోంది. దురదృష్టవశాత్తు త వైద్యులను సంప్రదించేవారి సంఖ్య చాలా తక్కువగా ఉండటం ఆందోళన గొలిపే అంశం.వృద్ధాప్య డిప్రెషన్కు కారణాలు...నిజానికి డిప్రెషన్ ఏ వయసులోనైనా రావచ్చు. కానీ వృద్ధాప్యంలో డిప్రెషన్కు లోనయ్యేందుకు అవకాశాలు ఎక్కువ. అందుకు కారణాలివి... → ఒంటరితనం: ముందుగా చెప్పుకున్నట్టు తాము స్థిరపడటానికి పిల్లలు దూర్రపాంతాల్లో ఉంటారు. పెద్దలు తామంతట తాము కదల్లేని స్థితిలో ఉండి, ఇతరుల మీద ఆధారపడాల్సి రావడం డిప్రెషన్కు దారితీయవచ్చు. → ఆరోగ్య సమస్యలు: వృద్ధాప్యంలో అనారోగ్య సమస్యలు చాలా సాధారణం. దీర్ఘకాలిక వ్యాధులు, జ్ఞాపకశక్తి, శారీరక దృఢత్వం, వ్యాధి నిరోధకశక్తి తగ్గడం, శస్త్రచికిత్స చేయించాల్సిన జబ్బులకూ వృద్ధాప్యం కారణంగా చికిత్స తీసుకునే పరిస్థితి ఉండకపోవడం వంటి కారణాలతో డిప్రెస్ అవుతుంటారు. → అర్థం లేని భయాలు: ఎవరూ దగ్గరగా లేని సమయంలో తాము చనిపోతామేమో, అలాగైతే తాము చనిపోయిన విషయం పిల్లలకు ఎలా తెలుస్తుంది... లాంటి అర్థం లేని భయాలు వేధిస్తుంటాయి. → ఏ ప్రయోజనాల కోసం బతకాలనే భావన: ఇకపై ఎవరి ప్రయోజనాలకోసం, ఏం సాధించడానికి బతికి ఉండాలనే నిరాశాపూర్వకమైన భావనతో ప్రతికూల ఆలోచనలు వెంటాడటం. → ఇటీవల చూస్తున్న తమ తోటివారి మరణాలు: తమ బంధువుల్లో, తెలిసినవారిలో తమ వయసువారు చనిపోతుండటంతో కలిగే కుంగుబాటు. ఒకవేళ అలా మరణించిన వారిలో తమ జీవిత భాగస్వామి ఉండటం డిప్రెష¯Œ కు దారితీస్తుంది. వైద్య ఆరోగ్య అంశాలతో కలిగే డిప్రెషన్...వృద్ధాప్యంలో వచ్చే కొన్ని రకాల వ్యాధుల వల్ల అంటే ఉదాహరణకు... డయాబెటిస్తో పాటు దాని వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలు, హైబీపీ, గుండెజబ్బులు, పక్షవాతం, క్యాన్సర్, థైరాయిడ్ సమస్యలు, విటమిన్ బి–12 లోపం, మతిమరపు, అలై్జమర్స్ వ్యాధి, లూపస్, మల్టిపుల్ స్కి›్లరోసిస్ వంటి కారణంగా డిప్రెషన్కు లోనయ్యే అవకాశాలెక్కువ.కొన్ని రకాల మందులతోనూ డిప్రెషన్... కొన్ని సందర్భాల్లో ఆ వయసులో వాడే కొన్ని రకాల మందుల వల్ల కూడా డిప్రెషన్ రావచ్చు. ఉదాహరణకు మామూలుగా రక్తపోటుకు వాడే కొన్ని మందులు, బీటా బ్లాకర్లు, కొన్ని రకాల నిద్రమాత్రలు, క్యాల్షియమ్ ఛానెల్ బ్లాకర్లు, పార్కిన్సన్ డిసీజ్ తాలూకు మందులు, అల్సర్ మందులు, గుండెజబ్బుల మందులు, కొన్నిరకాల స్టెరాయిడ్స్, హైకొలెస్ట్రాల్ ఉన్నవారు వాడే మందులు, నొప్పినివారణ మందులు, ఆర్థరైటిస్ ఔషధాలు, ఈస్ట్రోజెన్ హార్మోన్ వంటివి పెద్దవయసు వారిలో డిప్రెషన్కు కారణం కావచ్చు.డిప్రెషన్ నుంచి దూరమవ్వాలంటే... తమ పట్ల తాము కాస్తంత శ్రద్ధ తీసుకోవడం ద్వారా ఎంతగా వయసు పైబడినప్పటికీ డిప్రెషన్ను దరిచేరనివ్వకుండా చూడవచ్చు. వృద్ధాప్యంలో డిప్రెషన్ను నివారించే చర్యలివే... → నలుగురినీ కలవడం : వృద్ధాప్యంలో కలిగే తీరికతో నలుగురినీ కలుస్తుండటం.(డిప్రెషన్ నివారణకూ లేదా అధిగమించడానికి ఇది బాగా పనిచేస్తుంది). → వ్యాయామం : తమకు శారీరక శ్రమ కలిగించని రీతిలో వాకింగ్ వంటి వ్యాయామల వల్ల డిప్రెషన్ దరిచేరదు. → కంటి నిండా నిద్ర: కంటినిండా నిద్రపోవడం డిప్రెషన్కు మంచి మందు. అయితే మితిమీర కూడదు. అంటే... నిద్రసమయం 7–9 గంటలు మించనివ్వవద్దు. → సమతుల ఆహారం : అన్ని పోషకాలు అందేలా తేలిగ్గా జీర్ణమయ్యే సమతులా ఆహారం తీసుకోవాలి. జంక్ఫుడ్ వద్దు. → హాబీలు : మనకు ఆసక్తి కలిగించే హాబీలను కొనసాగించవచ్చు. యుక్తవయసులో పనిఒత్తిడి, తీరిక లేని కారణంగా మానేసిన హాబీలను ఈ సమయంలో పునరుద్ధరించుకోవడం డిప్రెషన్ నివారణకు చాలా మేలు చేస్తుంది. → పెంపుడు జంతువులు : పెట్స్ ఆలనా–పాలనా డిప్రెషన్ను దరిచేరనివ్వవు.→ కొత్త విద్యలు/ నైపుణ్యాలు : వీటిని నేర్చుకోవడం డిప్రెషన్ను అధిగమించడానికి చాలా మేలు చేస్తుంది. ఆసక్తి ఉంటే ఏ వయసులోనైనా, ఏ విషయాన్నైనా నేర్చుకోవచ్చు. పైగా వృద్ధాప్యంలో వేరే వ్యాపకాలేవీ ఉండవు కాబట్టి ఆ టైమ్లో నేర్చుకోవడం సులభం కూడా.→ హాస్యం : ఎప్పుడూ నవ్వుతూ, నవ్విస్తూ, హాస్యప్రియత్వం కలిగి ఉండటం. వృద్ధాప్య డిప్రెషన్ లక్షణాలు → ఎప్పుడూ తీవ్రమైన నిరాశ, విచారం ∙నిత్యం అలసట ∙గతంతో తమకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిన హాబీలూ లేదా వ్యాపకాలపైనా ఆసక్తి కోల్పోవడం ∙ఒంటరిగా ఉండటానికి ఇష్టపడటం ∙్రఆకలి తగ్గడం ∙బరువు తగ్గం ∙తరచూ నిద్రాభంగం లేదా ఒక్కోసారి మితిమీరి నిద్రపోతుండటం ∙తనతో ఏ ప్రయోజనమూ లేదనీ, తాను సమాజానికి భారమనే భావన ∙మద్యం/డ్రగ్స్కు బానిస కావడం ∙త్వరగా మరణించాలనే భావన లేదా ఆత్మహత్యా ధోరణి/ ఆలోచనలూ/ యత్నాలు.చికిత్సపై నివారణ చర్యల తర్వాత కూడా డిప్రెషన్కు లోనైన వారికి సైకియాట్రిస్ట్ ఆధ్వర్యంలో ఎస్ఎస్ఆర్ మందులు, యాంటీడిప్రెసెంట్స్తో చికిత్స చేయాల్సి ఉంటుంది. కొందరిలో కేవలం కౌన్సెలింగ్తోనే సమస్య తీరవచ్చు. కొందరికి కౌన్సెలింగ్తో పాటు మందులూ అవసరం పడవచ్చు.అది బాధా... డిప్రెషనా?కొందరిలో డిప్రెషన్ కాకుండా తీవ్రమైన బాధ కూడా ఉండవచ్చు. కాస్త శ్రద్ధగా పరిశీలించుకుంటే అది డిప్రెషనా లేక బాధనా అన్నది గుర్తుపట్టడమూ కాస్తంత తేలికే. ఉదాహరణకు బాధలో ఉన్నవారికి అప్పుడప్పుడైనా సంతోష భావన కలుగుతుంది. అలాంటి సంతోష భావనలూ, ఆనందాలూ, ఇతరత్రా ఉద్వేగాలేవీ లేకుండా ఎప్పుడూ విచారం, బాధ, నిరాశ, నిస్పృహలతో ఉంటే అది డిప్రెషన్గా పరిగణించవచ్చు.వృద్ధుల్లో డిప్రెషన్ను గుర్తించడమిలా...→ తమలో అంతకు మునుపు లేని నొప్పులను ఏకరవు పెడుతుండటం ∙తాము ఏపనీ చేయలేకపోతున్న విషయాలను తరచూ ప్రస్తావిస్తూ ఉండటం ∙యాంగై్జటీకి గురికావడం / వేదన, బాధలను వ్యక్తపరుస్తుంటం ∙త్వరగా భావోద్వేగాలకు గురికావడం ∙వ్యక్తిగత విషయాలపై తగిన శ్రద్ధ చూపకపోవడం.విచారం/బాధలూ లేకున్నా డిప్రెషన్! సాధారణంగా డిప్రెషన్లో తీవ్రమైన విచారం, బాధ ఉండటం చాలా సాధారణం. కొందరిలో ఇలాంటి లక్షణాలేమీ కనిపించకుండానే డిప్రెషన్లోకి వెళ్లే అవకాశాలుంటాయి. ఏ పనిపైనా వాళ్లకు ఆసక్తిలేకపోవడం; ఏదైనా చేయాలంటే ఉత్సాహం లేకపోవడం (లో మోటివేషన్); ఏదైనా పని చేయడానికి తగిన శక్తి/సామర్థ్యం తమలో లేదనే భావన వంటి ఫీలింగ్స్తో ఈ డిప్రెషన్ కనిపిస్తుంది. కొందరిలో ఎప్పటికీ తగ్గని ఒంటి నొప్పులు, తలనొప్పి వంటి లక్షణాలతో కూడా వృద్ధాప్యపు డిప్రెషన్ వ్యక్తం కావచ్చు.డాక్టర్ శ్రీనివాస్ ఎస్ఆర్ఆర్వై హెచ్వోడీ ఆఫ్ సైకియాట్రీ –సీనియర్ సైకియాట్రిస్ట్ఎంజీఎం ప్రభుత్వ ఆసుపత్రి, వరంగల్– యాసీన్ -
మెరుగైన లివర్ పనితీరుకు
మన శరీరం నుంచి వ్యర్థాలను తొలగించే లివర్ను డిటాక్స్ చేయడం చాలా ముఖ్యం. అప్పుడే అనేక ఆరోగ్య సమస్యలు దూరం అవుతాయి. కాలేయ శుభ్రతకు ఉపయోగపడే యోగాసనాలు... ధనురాసనం.. ఎలా చేయాలి..?బోర్లా పడుకుని తలను కొంచె పైకి ఎత్తాలి. వెనుక నుంచి పాదాలను పట్టుకొని, విల్లు లాంటి ఆకారాన్ని ఏర్పాటు చేయాలి. 5 దీర్ఘ శ్వాసల వరకు ఈ పొజిషన్లోనే ఉండాలి. మెల్లగా యధాస్థితికి వచ్చి విశ్రాంతి తీసుకోవాలి.అర్థ మత్సే్యంద్రాసనం..ఈ ఆసనం లివర్ను క్లీన్ చేయడానికి, ఆరోగ్యంగా ఉంచడానికి శక్తిమంతంగా పనిచేస్తుంది. పద్మాసనంలో కూర్చోవాలి. తర్వాత ఒక పాదాన్ని హిప్ కిందకు తేవాలి. కుడి తొడను అలాగే ఉంచి, ఎడమ కాలిని నేలమీద ఆనించాలి. కుడి మోకాలును వంచి, ఎడమ మోకాలును కుడి మోకాలుకు దగ్గరగా ఉంచాలి. కుడి చేతి బొటనవేలు, చూపుడు వేలు, మధ్య వేలుతో ఎడమ కాలివేలును పట్టి ఉంచాలి. శరీరాన్ని ఎడమవైపుకు మెల్లగా తి΄్పాలి. అంటే ఒకే సమయంలో భుజాలు, మెడ, తలను ఎడమవైపుకు తి΄్పాలి. గడ్డాన్ని ఎడమ భుజం వద్దకు తి΄్పాలి. ఈ ఆసనంలో మీ తలను, వెన్నెముకను స్థిరంగా ఉంచాలి. మెల్లగా ప్రారంభ స్థితికి తిరిగి రావాలి. ఈ ఆసనాన్ని కుడివైపున కూడా చేయాలి.భుజంగాసనం..భుజంగాసనం సాధన చేయడం వల్ల లివర్ పనితీరు మెరుగుపడుతుంది. దీనిని కోబ్రా పోజ్ అని కూడా అంటారు. రోజూ 5 నిమిషాల పాటు భుజంగాసనం వేస్తే లివర్ సిర్రోసిస్, ఫ్యాటీ లివర్ రిస్క్ తగ్గుతుంది.ఎలా వేయాలంటే...బోర్లా పడుకొని శరీరాన్ని స్ట్రెచ్ చేయాలి. రెండు పాదాల వేళ్లు, మడమలు తాకేలా చూసుకోవాలి. అరచేతులను ఛాతీ పక్కలకు తీసుకొచ్చి, నేలకు ఆనించాలి. ఆ తర్వాత శ్వాసను తీసుకుంటూ నెమ్మదిగా తల, ఛాతీని పైకి లేపాలి. మోచేతులు నేలకు ఆనించి, ఉంచాలి. కొంచెం సేపు తర్వాత శ్వాసను వదులుతూ.. తిరిగి సాధారణ స్థితికి రావాలి. -
పాతిక సంవత్సరాల తరువాత.... సొంత గొంతు!
లండన్కు చెందిన ఆర్టిస్ట్ సారా పాతిక సంవత్సరాల క్రితం మోటర్ న్యూరాన్ డిసీజ్ (ఎంఎన్డీ) వల్ల మాట్లాడే శక్తిని కోల్పోయింది. గత కొన్ని సంవత్సరాలుగా ఇతరులతో కమ్యూనికేషన్ కోసం వాయిస్ జనరేటింగ్ టెక్నాలీజిని ఉపయోగిస్తూ ఆర్టిస్ట్గా తన కెరీర్ ను పునః్రపారంభించింది. ఈ టెక్నాలజీ ద్వారా వినిపించే గొంతు ఆమెది కాదు. దీనికి సంబంధించి ఆమె పిల్లల్లో చిన్న అసంతృప్తి ఉండేది. అమ్మ ఒరిజినల్ వాయిస్ వినాలనుకునేవారు. ఎందుకంటే వారు చిన్న వయసులో ఉన్నప్పుడే సారా మాట కోల్పోయింది. అమ్మ ఒరిజినల్ వాయిస్ వినడం కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఒక వ్యక్తి ఒరిజినల్ వాయిస్కు కంప్యూటరైజ్డ్ వెర్షన్ను క్రియేట్ చేయవచ్చు అని తెలుసుకున్నారు. దీనికి ఎక్కువ నిడివి, క్వాలిటీ రికార్డింగ్ ఉన్న వీడియో కావాలి.అయితే వారికి అమ్మ ఒరిజినల్ వాయిస్కు సంబం«ధించి ఒకే ఒక వీడియో క్లిప్ దొరికింది. అది కూడా తక్కువ నిడివి, శబ్ద నాణ్యత లేని వీడియో క్లిప్. ఈ నేపథ్యంలో సారా పిల్లలు న్యూయార్క్లోని ఏఐ వాయిస్కు ప్రసిద్ధి చెందిన ‘ఎలెవెన్ ల్యాబ్స్’ను సంప్రదించారు.సరికొత్త సాంకేతిక పరిజ్ఞానంతో ఈ ఏఐ ల్యాబ్ అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది. సారా ఒరిజినల్ వాయిస్ను సృష్టించింది. ఆ వాయిస్ను పిల్లలు సారాకు వినిపించినప్పుడు ఆమె ఆనందం తట్టుకోలేక ఏడ్చింది. ‘నా గొంతు నాకు తిరిగి వచ్చింది’ అని ఆ వాయిస్ క్లిప్ను తన స్నేహితులకు పంపింది. ఇప్పుడు సారా తన లండన్ యాక్సెంట్తో, ఒరిజినల్ వాయిస్తోనే కమ్యూనికేట్ చేస్తోంది. -
3డీ ప్రింట్ ఎముకలు వచ్చేస్తున్నాయ్
సాక్షి, హైదరాబాద్: కింద పడి కాలో, చెయ్యో విరిగిందని ఆసుపత్రికి వెళితే పిండి కట్టు వేయడం చూశాం. దెబ్బవాపు తగ్గిన తరువాత పిండి కట్టు సరిగా సెట్ కాకపోతే ఎముక అటు ఇటుగా వంకరయ్యే సందర్భాలు ఉంటాయి. కొన్ని సందర్భాల్లో విరిగిన ఎముకకు రాడ్లు పెట్టి స్క్రూలు బిగిస్తుంటారు. ఇవన్నీ పాత పద్ధతులు. ప్రస్తుతం 3డీ ఎముకలు (3D printing bones) అందుబాటులోకి వచ్చేస్తున్నాయి. ఎక్కడైనా ఎముక, కీళ్లు దెబ్బతింటే వాటిని తొలగించి కొత్త అవయవాన్ని రీప్లేస్ చేసేందుకు అత్యాధునిక టెక్నాలజీ వినియోగిస్తున్నారు. మోకీళ్లు, చీలమండ, తుంటి, వెన్నెముక, భుజం ఇలా ఏ స్థానంలోని ఎముక దెబ్బతిన్నా దాన్ని మార్చివేస్తున్నారు. ఫలితంగా చికిత్స అనంతరం రోగి అన్ని కార్యకలాపాల్లో పాల్గొనవచ్చు. 35 ఏళ్ల నుంచే మొదలు సాధారణంగా 35 ఏళ్ల నుంచే మహిళలలో కీళ్ల నొప్పులు మొదలైపోతున్నాయి. వాతావరణ పరిస్థితులు, జీవన విధానాలు దీనికి కారణంగా కనిపిస్తున్నాయి. ఎక్కువ మందిలో కీళ్ల వాతం కనిపిస్తోందని వైద్యులు చెబుతున్నారు. చేతి వేళ్లు వంగకపోవడం, మోచేయి, మణికట్టు తిప్పినప్పుడు నొప్పి అనిపించడం, తుంటి, మోకాలు, పాదం, భుజం ఇలాంటి భాగాల్లో భరించలేని నొప్పులు వేధిస్తున్నాయి. వీటిని అధిగమిచేందుకు తాజాగా ఏ భాగమైనా డిస్క్ రీప్లేస్మెంట్ (disc replacement) ఆప్షన్ వచ్చేసింది. గతంలో వైద్య పరికరాలు, కృత్రిమ అవయవాలు అమెరికా, ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వచ్చేది. దీంతో రవాణా, పన్నులు, ఇతరాలు కలిపి వైద్యం భారంగా మారేది. ప్రస్తుతం దేశీయంగా తయారు చేస్తుండటంతో తక్కువ ఖర్చులోనే మెరుగైన వైద్యం సాధ్యమైంది. చికిత్సల అనంతరం సాధారణ జీవితం కొనసాగించవచ్చని వైద్యులు చెబుతున్నారు. గతంలో రూ.2 లక్షలు అయ్యే చికిత్స ప్రస్తుతం సుమారుగా రూ.50 వేల నుంచి రూ.లక్షలో పూర్తవుతుంది. సీటీస్కాన్ సాయంతో.. సహజసిద్ధమైన ఎముక స్థానంలో కృత్రిమంగా తయారు చేసిన అవయవాన్ని నిక్షిప్తం చేయాలంటే ఎంతో కచ్చితత్వం అవసరం. అత్యాధునిక టెక్నాలజీని వినియోగిస్తున్నారు. ముందుగా బాధితుడి ఎముక, కీళ్లు దెబ్బతిన్న ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తారు. సిటీ స్కాన్ సాయంతో ఎంత మేరకు ఎముకను తొలగించాల్సి ఉంటుందనేది లెక్కిస్తారు. దీని ఆధారంగా 3డీ ప్రింటెడ్ టైటానియంతో తయారు చేసిన కృత్రిమ అవయవాన్ని ఆ స్థానంలో అమరుస్తారు. ఈ పరికరం వల్ల ఎంఆర్ఐ వంటి స్కానింగ్ల సందర్భంలోనూ ఎలాంటి ఇబ్బంది ఉండదని, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని వైద్యులు చెబుతున్నారు.చదవండి: స్కూళ్లలో షుగర్ బోర్డులు.. ఎందుకో తెలుసా? సాధారణ ప్రజలకు అందుబాటులో.. చికిత్స విధానాల్లో టెక్నాలజీ మారుతోంది. బోన్ ఫ్యాక్చర్ అయితే కట్టు కట్టేవాళ్లు. ఎముక అతుక్కోవడానికి కొంత సమయం పడుతుంది. ఈలోగా శరీరం వాపు తగ్గిపోవడంతో కట్టిన కట్టు లూజ్ అవుతుంది. కొన్ని దఫాలు ఎముకలు వంకర్లు తిరిగే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం విరిగిపోయిన, దెబ్బతిన్న, కుల్లిన ఎముకలు, కీళ్లను అవసరాల మేరకు ప్లేట్స్ స్క్రూ బిగించడం, 3డి ప్రింటెడ్ అవయవాలను మారుస్తున్నాం. డిస్క్ రీ ప్లేస్మెంట్ ఆప్సన్ వచ్చేసింది. టైటానియం వినియోగిస్తున్నాం. దీంతో సిటీస్కాన్, ఎమ్మారై చేసినా ఇబ్బంది ఉండదు. సాధారణ ప్రజలకు సైతం అందుబాటులో ఉండే ధరల్లోనే చికిత్సలు పూర్తవుతున్నాయి. – డా.సునీల్ దాచేపల్లి, ఆర్థోపెడిక్, రోబోటిక్ సర్జన్ -
యువత హెల్దీ డైట్ ప్లాన్..!
ఈ రోజుల్లో గ్రామీణ, పట్టణ ప్రాంతం అనే తేడా లేకుండా యువత ముఖ్యంగా అమ్మాయిలు వివిధ రకాల ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. వాటిలో ప్రధానంగా చెప్పుకోదగినది ఐరన్ లోపం. రుతుక్రమం కారణంగా రక్త నష్టం, సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల హిమోగ్లోబిన్ స్థాయి తగ్గిపోతుంది. ఫలితంగా బలహీనత, తలనొప్పి, చదువుపై దృష్టి కేంద్రీకరించ లేక΄ోవడం జరుగుతున్నాయి. కాల్షియం లోపం వల్ల ఎముకలు, దంతాల బలం తగ్గిపోతుంది. దీని కారణంగా భవిష్యత్తులో ఆస్టియో΄ోరోసిస్ వచ్చే ప్రమాదం ఉంటుంది. ప్రోటీన్ లోపం వల్ల కండరాల అభివృద్ధి సరిగా జరగదు. శరీరంలో శక్తి తగ్గి, బలహీనమైపోతుంది. విటమిన్ –ఎ, ఇ లోపం వల్ల కంటి సమస్యలు, రోగనిరోధక శక్తి తగ్గడం వంటివి జరుగుతాయి. తరచుగా జలుబు, ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఎక్కువ. హార్మోన్ల అసమతుల్యత, సరైన పోషకాలు అందక పీసీఓడీ, థైరాయిడ్ సమస్యలు రావచ్చు. పోషకాల లోపం వల్ల మెదడు పనితీరుపై ప్రభావం పడుతుంది. టెన్షన్, ఆందోళన, డిప్రెషన్ వచ్చే ప్రమాదం ఎక్కువ. చదువులు, ఉద్యోగం, దినసరి చర్యలలో ఇబ్బందులు కలుగుతాయి. అందుకని, యువత రోజువారీ ఆహారంలో ఐరన్, కాల్షియం, ప్రోటీన్లు, విటమిన్లు, పాలు – పండ్లు తప్పనిసరిగా చేర్చుకోవాలి.బ్రేక్ఫాస్ట్గోధుమ రవ్వ ఉప్మా – 1 కప్పు / దోశ – 2/ కిచిడి – 1 కప్పు/ రాగి దోశ – 2 సర్వింగ్స్/ ఇడ్లీ – 3 + సాంబారు – 1 కప్పు/ ఉడకబెట్టిన గుడ్డు, సలాడ్ స్నాక్స్ ఆపిల్/ కమలా/ కివి/ పుచ్చకాయ, కొబ్బరి నీళ్లు, ఉడికించిన మొక్కజొన్న/పుదీనా టీమధ్యాహ్న భోజనంఅన్నం (బ్రౌన్ రైస్) – 2 కప్పులు / మిల్లెట్స్ / చపాతీ కూరగాయలతో కూర – 2 కప్పులుచికెన్ / గుడ్డు / పనీర్ / చేప – 100 గ్రాములుసాయంత్రం స్నాక్స్మొలకలు – 1 కప్పు/ చియా గింజలు/ సన్ఫ్లవర్ సీడ్స్/ ఫ్లాక్స్ సీడ్స్/ హెర్బల్ టీ – 1 కప్పుజొన్న/ సజ్జ రోటీ – 1–2 సర్వింగ్స్రాత్రి భోజనంమధ్యాహ్న భోజనం మాదిరిగానే: చికెన్ / చేప / పనీర్ / గుడ్డు + సలాడ్పోషక అవసరాలు కేలరీలు యువకులు: 2400–3000 కిలోకేలరీలు/రోజుయువతులు:1800–2400 కిలోకేలరీలు/రోజుప్రోటీన్యువకులు: 56 గ్రాములు/రోజుయువతులు: 46 గ్రాములు/రోజుకూరగాయలు: రోజూ 4–5 సర్వింగ్స్ఫ్యాట్స్ యువకులు – యువతులు:రోజువారీ బరువు ప్రకారం 20–25%అన్ని రకాల గిజ ధాన్యాలలో ఏవైనా.. రోజుకు 6–7 సర్వింగ్స్(1/2–1 కప్పు ఉడికించిన బియ్యం లేదా గోధుమ)కార్బోహైడ్రేట్లుయువకులు – యువతులు: రోజువారీ బరువు ప్రకారం 45–65%పాలు – పాల ఉత్పత్తులురోజుకు 1–2 సర్వింగ్స్ (పెరుగు లేదా టోన్డ్ మిల్క్ రూపంలో)విటమిన్ – ఎయువకులు: 1900 మి.గ్రా/రోజుయువతులు: 700 మి.గ్రా/రోజువిటమిన్ – ఇయువకులు: 90 మి.గ్రా/రోజుయువతులు: 75 మి.గ్రా/రోజుకాల్షియం: 1000 మి.గ్రా/రోజుఐరన్యువకులు: 10 మి.గ్రా/రోజుయువతులు: 18 మి.గ్రా/రోజుఆరోగ్యకరమైన కొవ్వులు (Healthy fats):నట్స్, గింజలు – 1 టీ స్పూన్ప్రోటీన్ ఫుడ్స్చికెన్/మాంసం/చేప/గుడ్డు – 1 సర్వింగ్పప్పులు, బఠానీలు – 1/4 కప్పు(చదవండి: రాగి జావ, అంబలి ఆహారం...వెయిట్ లిఫ్టింగ్లో విజయం) -
మానవ రక్తం కంటే అత్యంత ఖరీదైనది ఏదో తెలుసా..!
ఎన్నో విలాసంవంతమైన వస్తువులు, భవనాలు గురించి విన్నాం. కానీ ఇలాంటి అత్యంత ఖరీదైన ద్రవాలు గురించి మాత్రం విని ఉండరు. ఎందుకంటే ఇప్పుడు చెప్పుకోబోయే ద్రవాలు ఉత్పత్తి చేయడం సాధ్యం కానివి. పైగా వాటి ఉపయోగాలు గురించి వింటే మాత్రం నోట మాట రాదు. ఇవి మనం చుట్టూ చూసే చిన్న చిన్న జీవుల్లోనే ఉన్నాయా..అని విస్తుపోతారు. అది కూడా మానవ రక్తం కంటే కూడా ఆ ద్రవాలే అంత విలువైనవా అని ఆశ్చర్యంకలుగక మానదు. మరి అవేంటో చూసేద్దామా.తేలు విషం (రూ. 343 కోట్లు)అన్నింటకంటే అత్యం ఖరీదైన ద్రవం తేలు విషం. వైద్య పరిశోధనలో ఎన్నో వ్యాధులకు అమూల్యమైన ఔషధం ఇది. ఇందులో మెడదడు కేన్సర్, ఆటో ఇమ్యూన్ వ్యాధుల చికిత్సకు ఉపయోగపడే ప్రోటీన్లు ఉంటాయట. దీన్ని అత్యంత జాగురకతతో చుక్కల వారీగా తీయాలట. అందువల్ల దీన్ని సేకరించడం అనేది అత్యంత శ్రమతో కూడుకున్న టాస్క్. అందువల్లే ఇంతల కోట్లలో ధరలో పలుకుతుందని నిపుణులు చెబుతున్నారు. కింగ్ కోబ్రా విషం (రూ. 13 కోట్లు)దీన్ని కూడా వైద్య పరంగా వినియోగిస్తారు. దీర్ఘకాలిక నొప్పిని నిర్వహణలో అద్భుతంగా పనిచేస్తుంది. తేలు విషం మాదిరిగానే సేకరిస్తారు. పైగా చుక్క కూడా అత్యంత ఖరీదైనది. ఇందులో ఓహానిన్ ప్రోటీన్ ఉంటుంది. నొప్పి నివారణ మందులలో ఉపయోగిస్తారు. గుర్రపుడెక్క పీత రక్తం(రూ. 52 లక్షలు)ఈ పీత రక్తాన్ని టీకాలు, IV ఔషధాలలో బ్యాక్టీరియా కాలుష్యాన్ని గుర్తించడానికి ఉపయోగిస్తారట. దీని నీలి రంగు రక్తం గడ్డకట్టే లక్షణాలు వైద్యానకి అత్యంత అమూల్యమైనదట. దీనికున్న డిమాండ్, పరిమిత సంఖ్యలో వీటి లభ్యత తదితర కారణాల రీత్యా దీని రక్తం అత్యంత ఖరీదని చెబుతున్నారు.ఇన్సులిన్:(రూ. 11లక్షలు)డయాబెటిస్ నిర్వహణకు అత్యంత కీలకమైన హార్మోనో ఇది. ఇది కూడా ఔషధ ధర రీత్యా అత్యంత ఖరీదైన ద్రవంగా నిలిచింది. ఇది లక్షలాది ప్రాణాలను కాపాడే దివ్యౌషధమైన ఈ ఇన్సులిన్ దాని ధర, లభ్యతపై ప్రపంచవ్యాప్తంగా తీవ్రస్థాయిలో ఆందోళనలు పెంచుతోంది. చానెల్ నెంబర్ 5: (రూ. 22 లక్షలు)ఈ ఐకానిక్ ఫెర్ఫ్యూమ్ దాని సంక్లిష్ట ఫార్ములా, బ్రాండ్ కారణంగా అత్యంత ఖరీదైన ద్రవాలలో ఒకటిగా స్థానం దక్కించుకుంది. దీన్ని అత్యంత అరుదైన పూల నూనెల నుంచి తయారు చేస్తారట.ప్రింటర్ ఇంక్:(రూ. 10 లక్షలు)అనేక లగ్జరీ పెర్ఫ్యూమ్ల కంటే ఒక సాధారణ ప్రింటర్ ఇంక్ చాలా ఖరీదైనదట. రోజువారి జీవితాల్లో దీని పాత్ర ప్రధానంగా ఉన్నప్పటికీ ఈ సిరా ధర కూడా అత్యంత ఖరీదైనదేనని చెబుతున్నారు నిపుణులు.మానవ రక్తం (రూ. 1లక్ష)అపాయకరమైన పరిస్థితుల్లో ఉన్న వ్యక్తికి లేదా శస్త్ర చికిత్సలలో ఇది అత్యంత అవసరం. అయితే దీని ధర పరీక్ష, ప్రాసెసింగ్, సురక్షితమై నిల్వ కారణంగానే ఇది కూడా ఖరీదైన ద్రవాల్లో ఒకటిగా నిలిచింది. దీన్ని సేకరించగలమే గానీ ఉత్పత్తి చేయలేం. అలాగే దీన్ని స్వచ్ఛందంగా దానం చేస్తున్నప్పటికీ.... జాగ్రత్తగా పరిరక్షించడం అనేది గణనీయమైన ఖర్చులతో కూడుకున్నది కావడంతోనే ఇంతలా ధర పలుకుతోందని చెబుతున్నారు నిపుణులు.(చదవండి: కన్నీళ్లు పెట్టించే 'ది వాయిస్ ఆఫ్ హింద్ రజబ్' డ్రామా..!) -
ఫోన్ ‘అక్కడి’ దాకా తీసుకెళ్తున్నారా?
ఇంట్లో.. వీధుల్లో, క్లాసుల్లో.. ఆఫీసుల్లో కూడా.. మన చేతుల్లో స్మార్ట్ఫోన్ లేని సందర్భమంటూ ఉండదు. కానీ మనలో కొందరు ఇక్కడికే పరిమితం కావడం లేదు. ఉదయాన్నే బాత్రూమ్ల్లోకి వెంట తీసుకెళ్తున్నారు. రీల్స్ తిరగేస్తూ కాల కృత్యాలు తీర్చుకునే ఈ పద్ధతి కాస్తా డేంజర్గా మారుతోందంటున్నారు శాస్త్రవేత్తలు. ఇలా బాత్రూమ్లలో స్మార్ట్ఫోన్లతో కాలక్షేపం చేసే వారిలో కనీసం సగం మందికి ‘హెమరాయిడ్స్’ వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ఎందుకు? ఎలా? ఏమిటి? అని అనుకుంటున్నారా?...మలద్వారంలో ఒత్తిడి పెరిగిపోవడం, మంట/వాపులకు గురవడం వల్ల అక్కడి నరాలు వాచిపోతుంటాయి. వీటినే హెమరాయిడ్లు లేదా పైల్స్ అని పిలుస్తుంటారు. రోజంతా కూర్చొనే ఉండటం, పీచు పదార్థాలు ఎక్కువగా తీసుకోకపోవడం, మలబద్ధకం, మహిళలైతే గర్భధారణ సమయంలో ఈ హెమరాయిడ్లకు కారణాలని వైద్యశాస్త్రం చెబుతోంది. బాత్రూమ్లలో స్మార్ట్ఫోన్ వినియోగం అన్నది తాజాగా ఈ జాబితాలోకి చేరింది. బోస్టన్ (అమెరికా)లోని బెత్ ఇజ్రాయెల్ డెకోనెస్ మెడికల్ సెంటర్ శాస్త్రవేత్తల పరిశోధనల ప్రకారం మల విసర్జన సమయంలో స్మార్ట్ఫోన్లను వాడితే హెమరాయిడ్లు వచ్చే అవకాశం 46 శాతం వరకూ ఎక్కువ అని తేలింది. స్మార్ట్ఫోన్లు మన జీవితాలపై ఎలాంటి ప్రభావాలు చూపుతాయన్న దానిపై ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నామని.. ఎప్పుడు? ఎక్కడ? ఎలా వాడతామన్నది అనూహ్యమైన పరిణామాలకు దారితీయవచ్చును అనేందుకు తాజా పరిశోధన ఒక నిదర్శనమని ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన డాక్టర్ త్రిషా పశ్రీచా అంటున్నారు.సంబంధం ఏమిటి? స్మార్ట్ఫోన్లను బాత్రూమ్లలో వాడితే హెమరాయిడ్లు ఎందుకు వస్తాయన్న ప్రశ్నకు డాక్టర్ పశ్రీచా బదులిస్తూ.. ‘స్మార్ట్ఫోన్లల వాడకం వల్ల సమయం గుర్తుండకపోవడం చాలా సహజం. ఫలితంగా ఆ సమయంలో మలద్వారం వద్ద ఉన్న కండరాలు, నరాలపై ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ కాలం కొనసాగుతుంది. ఫలితంగా కాలం గడుస్తున్న కొద్దీ హెమరాయిడ్లు వచ్చే అవకాశాలు ఎక్కువ అవుతాయి’ అన్నారు. ఈ విషయాన్ని తెలుసుకునేందుకు డాక్టర్ పశ్రీచా బృందం 45 ఏళ్లు పైబడ్డ వారు 125 మందిని పరిశీలించింది. వీరందరూ పేగుల పరీక్ష (కొలనోస్కోపీ)కి సిద్ధంగా ఉన్న వారు. ఆహార అలవాట్లు, ఉండేచోటు, బాత్రూమ్లలో స్మార్ట్ఫోన్లు వాడతారా? లేదా? వంటి పలు వివరాలను వీరి నుంచి సేకరించారు.అలాగే మల విసర్జన అలవాట్లు కూడా అడిగి తెలుసుకున్నారు. కొలనోస్కోపీ సమయంలో వీరికి హెమరాయిడ్లు ఉన్నదీ లేనిది స్పష్టం కాగా.. స్మార్ట్ఫోన్లు వాడని వారితో పోల్చి చూసినప్పుడు వాడే వారిలో హెమరాయిడ్స్ ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు స్పష్టమైంది. పరిశీలించిన ఈ 125 మందిలో 66 శాతం మంది బాత్రూమ్లలో స్మార్ట్ఫోన్ను వినియోగిస్తున్నారు. మిగిలిన వారితో పోలిస్తే వీరు ఐదు నిమిషాలు ఎక్కువ సమయం బాత్రూమ్లలో గడుపుతున్నారు.స్మార్ట్ఫోన్లను బాత్రూమ్ల వరకూ తీసుకెళ్లకూడదన్న సాధారణ సలహాకు ఈ అధ్యయనం బలం చేకూరుస్తోందని, మలవిసర్జనకు ఎక్కువ సమయం పడుతూంటే ఎందుకు అన్న ప్రశ్న వేసుకుని అలవాట్ల సరిచేసుకోవాలని డాక్టర్ పశ్రీచా సూచించారు. అయితే కొంతమంది గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్లు మాత్రం స్మార్ట్ఫోన్ వాడినా, వాడకపోయినా బాత్రూమ్లో ఐదు నిమిషాల కంటే ఎక్కువ సమయం గడపడం అంత ఆరోగ్యకరమైన అంశం కాదని స్పష్టం చేస్తున్నారు.-గిళియారు గోపాలకృష్ణ మయ్యా. -
ఫుడ్ ఫర్ టీన్స్
పిల్లల విషయంలో పెద్దవారికి ఒక రకమైన ఆందోళన ఉంటే... కాస్త పెద్ద పిల్లల విషయంలో ఇంకో రకమైన ఇబ్బందులు ఉంటాయి. అంటే పదేళ్లు దాటి టీనేజ్లో ఉండే పిల్లల్లో మరికొన్ని సమస్యలు చూస్తుంటాం. ఈ రోజుల్లో అయితే టీనేజ్ పిల్లల్లో ఆందోళన, మానసిక ఒత్తిడి, అధికంగా కోపం, డిప్రెషన్ వంటివి తరచూ వింటున్నాం. వారు తినే ఆహారపు ప్రభావం మానసిక, శారీరక స్థితిపైన చూపుతుంది. అందుకని, టీనేజ్ పిల్లలున్న ఇంట్లో పోషకాహారం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి. 13–19 ఏళ్ల మధ్య ఫిజికల్, మెంటల్ గ్రోత్ వేగంగా మార్పు చెందుతుంటుంది. ఇలాంటప్పుడు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చి (ఐసిఎమ్ఆర్) కొన్ని సాధారణ సూచనలు చేసింది. వాటి ఆధారంగా పోషకాహారాన్ని ఈ వయసు పిల్లలకు సరైన మొత్తంలో ఇవ్వాలి. అలాగే, ఆ ఆహారం మనసుకు సంతృపినిచ్చేలా ఉండాలి.టీనేజ్ పిల్లల బరువు, ఎత్తు, చేసే పనులు.. ఇవన్నీ దృష్టిలో నిపుణుల సలహాతో సమతుల ఆహారాన్ని ΄్లాన్ చేసుకోవచ్చు. ఎక్కువ మొత్తంలో కాకుండా రోజులో 5–6 సార్లు సమయాన్ని బట్టి పైన టేబుల్లో ఇచ్చిన హెల్తీ ప్లేట్ను తయారుచేసుకోవచ్చు.బ్రేక్ఫాస్ట్కప్పు గోధుమ ఉ΄్మా /దోసె – 2 / కిచిడీ – కప్పు / రాగి రొట్టె – 2 –3 / ఇడ్లీ – 2–3 + కప్పు సాంబార్ + ఉడికించిన గుడ్డు లేదా ఆమ్లేట్ + కొద్దిపాటి గింజలు.ఉదయం స్నాక్స్పండు (ఆపిల్ లేదా అరటి లేదా నారింజ) + కొద్దిగా డ్రైఫ్రూట్స్ / పల్లీ చిక్కీ / వేపిన శనగలు / వేయించిన అవిసెగింజలు / డ్రై ఫ్రూట్ బార్ / ఉడికించిన వేరుశెనగమధ్యాహ్న భోజనం అన్నం – 1 కప్పు లేదా గోధుమ రొట్టె – 2–3 / తృణ ధాన్యాలు – 1 కప్పు + ఆకుకూరలు – 1 కప్పు + మిక్స్డ్ వెజిటబుల్స్ – 1 కప్పు + చికెన్ బ్రెస్ట్ – 100 గ్రా / గుడ్డు – 1 / పనీర్ – 100 గ్రా / చేప – 100–120 గ్రా. + పెరుగు – 1 కప్పురాత్రి భోజనం మధ్యాహ్న భోజనం మాదిరిగానే + గ్రిల్ చేసిన చికెన్ బ్రెస్ట్ అన్నంతో లేదా రొట్టెతో + కూరగాయలు + ఉడికించిన బ్రొకోలీసాయంత్రం స్నాక్స్మొలకెత్తిన గింజలు, విత్తనాలు – 30 గ్రా + చియా సీడ్స్ + నిమ్మరసం/ పాలు/ పండు జ్యూస్ లేదా సూప్.ఫుడ్ గ్రూప్స్, పరిమాణంఏదైనా పండు – 1 రోజుకు 2–3 సర్వింగ్స్కూరగాయలు – రోజుకు 3–5 సర్వింగ్స్ (ఉడికించినవి లేదా వండినవి)ధాన్యంతో వండినవి – రోజుకు 6 – 8 సర్వింగ్స్ (1 సర్వింగ్ బీ కప్పు ఉడికిన అన్నం/సిరిధాన్యం/గోధుమ)డెయిరీ ఉత్పత్తులు – రోజుకు 2 – 3 కప్పులు (పాలు, పెరుగు, చీజ్ రూపంలో)ఆరోగ్యకరమైన కొవ్వులు – రోజుకు 1 టేబుల్ స్పూన్ (నూనె, గింజలు, విత్తనాలు మొదలైనవి)ప్రోటీన్ ఆహారం – మాంసం, గుడ్డు మొదలైనవి (1 సర్వింగ్) కిలో కేలరీలు : అబ్బాయిలకు 2200–3200 ; అమ్మాయిలకు 1800 – 2500ప్రోటీన్లు : అబ్బాయిలకు – 52 గ్రా. ; అమ్మాయిలకు – 46 గ్రా.కొవ్వులు (ఊ్చ్ట) : 25–35% కార్బోహైడ్రేట్స్ : 45–65%విటమిన్–ఎ : 600–900 మైక్రోగ్రాములువిటమిన్ – సి : 45–75 మి.గ్రాకాల్షియం : 1300 మి.గ్రా నీళ్లు – 8 నుంచి 12 గ్లాసులు -
ప్రైవేటు ఆసుపత్రుల్లో ‘పీఈ’ పాగా
గత ఐదేళ్లుగా దేశ ఆరోగ్య పరిరక్షణ (హెల్త్కేర్) రంగంలో భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ప్రధానంగా గ్లోబల్ పీఈ సంస్థలు దేశీ ఆసుపత్రుల చైన్లో భారీ పెట్టుబడులకు తెరతీస్తున్నాయి. ఫలితంగా ప్రయివేట్ రంగంలోని పలు ఆసుపత్రుల పగ్గాలు టెమాసెక్, బ్లాక్స్టోన్ తదితర పీఈ దిగ్గజాల చేతికి చిక్కుతున్నాయి. వివరాలు చూద్దాం..దేశీయంగా ప్రయివేట్ ఆసుపత్రుల రంగంలో ప్రపంచ ప్రయివేట్ ఈక్విటీ (పీఈ) దిగ్గజాల ఆధిపత్యానికి తెరలేచింది. గత కొన్నేళ్లుగా టెమాసెక్ హోల్డింగ్స్, బ్లాక్స్టోన్, సీవీసీ క్యాపిటల్, కేకేఆర్ తదితర గ్లోబల్ దిగ్గజాలు పలు ప్రయివేట్ ఆసుపత్రుల చైన్లను దేశీయంగా సొంతం చేసుకుంటూ వస్తున్నాయి. మరికొన్నింటిలో మైనారిటీ వాటాలను కొనుగోలు చేస్తున్నాయి. ఇందుకు భారీ స్థాయిలో పెట్టుబడులు వెచ్చిస్తున్నాయి. ఫలితంగా సహ్యాద్రి, మణిపాల్, కేర్, స్టెర్లింగ్ తదితర సుప్రసిద్ధ ఆసుపత్రులు పీఈ సంస్థల పరమవుతున్నాయి. వెరసి 80 బిలియన్ డాలర్ల విలువైన దేశీ హెల్త్కేర్ రంగంలో కన్సాలిడేషన్కు దారి చూపుతున్నాయి. గతంలో పబ్లిక్ సంస్థలు, కుటుంబ ట్రస్ట్ల నిర్వహణలో కార్యకలాపాలు కొనసాగించిన పలు ఆసుపత్రులు ప్రస్తుతం పీఈ దిగ్గజాల కనుసన్నలలో సర్వీసులు అందిస్తున్నాయి. తద్వారా దేశీయంగా ప్రయివేట్ ఆసుపత్రులు కుటుంబ యాజమాన్య పరిస్థితుల నుంచి పీఈ సంస్థల నిర్వహణలోకి చేరుతున్నాయి. కోవిడ్–19 తదుపరి కరోనా మహమ్మారి తదుపరి దేశీ హెల్త్కేర్ రంగంపై గ్లోబల్ పీఈ దిగ్గజాలకు ఆసక్తి పెరిగినట్లు పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. దీంతో సింగపూర్ సంస్థ టెమాసెక్, యూఎస్ సంస్థ టీపీజీ, కేకేఆర్ భారీ పెట్టుబడులకు తెరతీశాయి. మణిపాల్, మ్యాక్స్ హాస్పిటల్ చైన్లో వాటాలు కొనుగోలు చేశాయి. నిజానికి 2007లోనే హైదరాబాద్ దిగ్గజం అపోలో హాస్పిటల్స్లో యూకే సంస్థ ఎపాక్స్ పార్ట్నర్స్ పెట్టుబడులు చేపట్టింది. అయితే సాధారణంగా హెల్త్కేర్ రంగంలో మూడు నుంచి ఐదేళ్ల కాలపరిమితితో పీఈ సంస్థలు పెట్టుబడులకు ఆసక్తి చూపుతాయని మ్యాక్స్ హెల్త్కేర్ సీఎండీ అభయ్ సోయి పేర్కొన్నారు. ఈ కాలంలో పెట్టుబడుల ద్వారా ఆర్థిక చేయూతను అందిస్తాయని, మౌలిక సదుపాయాల వృద్ధికి వీలుంటుందని తెలియజేశారు. తదుపరి కార్పొరేట్స్ లేదా యాజమాన్య వ్యక్తులకు నిర్వహణను అప్పగిస్తాయని వివరించారు. 2019లో కేకేఆర్తో కలిసి మ్యాక్స్ హెల్త్కేర్లో నియంత్రిత వాటాను కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. పెట్టుబడుల దన్ను పీఈ సంస్థల కారణంగా వృద్ధికి అవసరమైన పెట్టుబడులు, సుపరిపాలన, నిర్వహణ సామర్థ్యం, సర్వీసులలో నాణ్యత మెరుగుపడతాయని గ్రాంట్ థార్న్టన్ భారత్ నిపుణులు భానుప్రకాష్ కల్మాత్ ఎస్జే పేర్కొన్నారు. ఆసుపత్రుల విస్తరణకూ వీలు చిక్కుతుందని తెలియజేశారు. ప్రస్తుతం దేశీ హెల్త్కేర్ రంగంలో సుమారు 20 పీఈ దిగ్గజాలు యాక్టివ్గా ఉన్నట్లు తెలియజేశారు. ఏ ఇతర రంగంతో పోల్చినా ఇది అధికమని వెల్లడించారు. ఈ నేపథ్యంలో దేశీయంగా గత దశాబ్ద కాలంలో కార్పొరేట్ హాస్పిటల్ చైన్ల రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్(ఆర్వోఐ) మెరుగుపడినట్లు క్వాడ్రా క్యాపిటల్ పార్ట్నర్ సునీల్ ఠాకూర్ పేర్కొన్నారు. సమర్ధ వినియోగం, బెడ్లపై పెరిగిన ఆదాయం, ఉత్తమ వ్యయ నియంత్రణ ఇందుకు దోహదపడినట్లు వివరించారు. విస్తరణకు వీలు తొలి దశలో దేశీయంగా ఆసుపత్రులను ప్రభుత్వాలు లేదా కుటుంబ యాజమాన్య నిర్వహణలో సేవలు అందిస్తుండేవి. తదుపరి దశలో ప్రయివేట్ కార్పొరేట్ ఆసుపత్రులు ఊపిరిపోసుకుంటూ వచ్చినట్లు పరిశ్రమ వర్గాలు తెలియజేశాయి. ప్రస్తుతం యూఎస్ తరహాలో పీఈ దిగ్గజాల హవా కనిపిస్తున్నట్లు పేర్కొన్నాయి. యూఎస్లో ప్రయివేట్గా లేదా సంస్థాగత నిర్వహణలో హెల్త్ సర్వీసులు సమకూర్చుతుంటాయని తెలియజేశాయి. అయితే యూకేలో నేషనల్ హెల్త్ సర్వీస్ పేరుతో ప్రభుత్వ అజమాయిషీలోనే హెల్త్కేర్ రంగ నిర్వహణ ఉంటుందని వెల్లడించాయి. కాగా.. గత కొన్నేళ్లలో దేశీయంగా ప్రయివేట్ ఆసుపత్రులను పీఈ దిగ్గజాలు హస్తగతం చేసుకుంటూ వచ్చినట్లు పీడబ్ల్యూసీ ఇండియా అడ్వయిజరీ నిపుణులు సుజయ్ శెట్టి పేర్కొన్నారు. దీంతో మరింత మందికి ఆరోగ్య పరిరక్షణా సేవలు అందుబాటులోకి వచ్చే వీలున్నట్లు తెలియజేశారు. అంతేకాకుండా తగిన పెట్టుబడులు, మౌలిక సదుపాయాలు, వృత్తి నైపుణ్యం వంటి సానుకూలతలకు దారి ఏర్పడనున్నట్లు వివరించారు. దేశీయంగా ఆదాయాలతోపాటు.. లైఫ్స్టైల్తరహా వ్యాధులు పెరగడం, ఆరోగ్య పరిరక్షణపట్ల మెరుగైన అవగాహన వంటి అంశాలు హెల్త్కేర్ సర్వీసులకు డిమాండును పెంచుతున్నట్లు తెలియజేశారు. నిజానికి దేశీయంగా ఆసుపత్రులలో తగినన్ని పడకలు, క్రిటికల్ కేర్ సేవల కొరత ఉన్నట్లు వెల్లడించారు.– సాక్షి, బిజినెస్ డెస్క్ -
నిమ్స్లో చిన్నారులకు ఉచితంగా గుండె ఆపరేషన్లు
హైదరాబాద్: కొందరు చిన్నారులు పిల్లలు పుట్టుకతోనే వ్యాధులతో బాధపడుతుంటారు. వాటిలో గుండె సంబంధిత వ్యాధులు ఎక్కువగా కనిపిస్తాయి. ఆర్థికంగా స్థోమత ఉన్నవారు పెద్ద పెద్ద ఆసుపత్రుల్లో చికిత్స చేయించుకోగలుగుతారు. కానీ పేద , మధ్యతరగతి కుటుంబాల పరిస్థితి మాత్రం చాలా కష్టంగా ఉంటుంది. అలాంటి వారికి నిజాం ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్(నిమ్స్) ఉచితంగా ఆపరేషన్లు చేయనున్నది. అప్పుడే పుట్టిన శిశువుల మొదలు 14 ఏళ్ల చిన్నారులకు ఉచితంగా గుండె ఆపరేషన్లు చేయనున్నారు. ఇందుకు గాను బ్రిటన్ వైద్యులు నిమ్స్కు రానున్నారు.ప్రముఖ వైద్యులు, తెలంగాణకు చెందిన డాక్టర్ రమణ దన్నపనేని నేతృత్వంలోని ఈ బృందం ఏటా సెప్టెంబర్లో వారం రోజుల పాటు ఉచిత గుండె ఆపరేషన్ల శిబిరాన్ని నిర్వహిస్తుంది. కార్డియోథొరాసిక్ వైద్యుల సమన్వయంతో నిర్వహించే శిబిరాన్ని ఈ నెల 14 నుంచి 20 వరకు నిమ్స్లో నిర్వహించనున్నట్టు నిమ్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ నగరి బీరప్ప (Bheerappa Nagari) తెలిపారు. కొన్ని క్లిష్టమైన సర్జరీలను సైతం యూకే డాక్టర్ల చేత నిర్వహిస్తున్నామన్నారు. ఇందులో భాగంగా చిన్నారులకు ఉచితంగా 2డి ఎకోకార్డియోగ్రామ్ స్క్రీనింగ్లు చేస్తున్నట్లు తెలిపారు.నిమ్స్ పీడియాట్రిక్ విభాగంలో నెలకు 25 సర్జరీలు పీడియాట్రిక్ కార్డియాలజీ ఐసీయూ (Paediatric Cardiac ICU) ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు వెయ్యికి పైగా గుండె ఆపరేషన్లు చేశామని డైరెక్టర్ బీరప్ప తెలిపారు. రెండేళ్ల నుంచి నెలకు 20 నుంచి 25 సర్జరీలు చేయగా ప్రస్తుతం నెలకు 35 సర్జరీలు చేస్తున్నామన్నారు. శిశువు పుట్టిన వెంటనే చేసే సర్జరీల నుంచి, ఏడాదికి, రెండేళ్లు, ఐదేళ్లకు ఇలా పరిమిత సమయంలోపే చేసే సర్జరీలు కూడా ఉంటాయన్నారు. ఆ సమయంలోగా చేయకపోతే ఆ సమస్యలు ముదిరి తీవ్ర అనారోగ్యానికి దారితీస్తాయన్నారు. నిమ్స్కు వచ్చే కేసులు ఎక్కువగా క్రిటికల్లో ఉన్నవే వస్తుంటాయన్నారు. ఆరోగ్యశ్రీ ద్వారా గుండె మార్పిడి చికిత్సల నుంచి రోబోటిక్ చికిత్సలను చేస్తున్నామన్నారు.రిజిస్ట్రేషన్ ఇలా చేసుకోండి.. నిమ్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ నగరి బీరప్ప గుండె సంబంధిత సమస్యలున్న చిన్నారుల తల్లిదండ్రులు 040– 23489025లో సంప్రదింవచ్చని డైరెక్టర్ బీరప్ప తెలిపారు. నిమ్స్ పాత భవనంలోని సీటీవీఎస్ కార్యాలయంలో కార్డియోథోరాసిక్ సర్జన్ డాక్టర్ అరమేశ్వరరావు, డాక్టర్ ప్రవీణ్ డాక్టర్ గోపాల్లను మంగళ, గురు, శుక్రవారాల్లో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు సంప్రదించాలని, పూర్వపు రిపోర్టులు తమ వెంట తీసుకురావాలని సూచించారు. చదవండి: ఆరాటం ముందు ఆటంకం ఎంత!రికార్డు అందుబాటులో లేకుంటే.. ఆస్పత్రిలోనే అవసరమైన స్కీన్రింగ్ నిర్వహిస్తామన్నారు. వారం రోజుల పాటు జరిగే ఈ శిబిరంలో 25 మంది చిన్నారులకు మాత్రమే శస్త్ర చికిత్సలు చేసినా.. ఆ తర్వాత కూడా దశల వారీగా నిమ్స్ వైద్యులు ఆపరేషన్లు కొనసాగిస్తారని చెప్పారు. ఈ క్రమంలో ఈ ఏడాది దాదాపు 350 మంది చిన్నారులకు గుండె ఆపరేషన్లు చేశామన్నారు. ఈ చికిత్సలకు అయ్యే ఖర్చును ఆరోగ్యశ్రీ, సీఎం సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) ద్వారా రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందన్నారు. -
పిల్లలకు జ్వరం రాగనే పారాసెటమాల్ ఇచ్చేస్తున్నారా..?
ఈ వర్షాకాలం అనంగానే వ్యాధుల భయం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా చిన్నారులకు జలుబు, జ్వరం వంటి అనారోగ్యాలు తక్షణమే అటాక్ అవుతాయి. ఓ పట్టాన తగ్గవు. దాంతో సాధారణంగా తల్లిదండ్రులు సమీపంలో ఉన్న మెడికల్ షాఫుకో లేక ఇంట్లోనే ఎప్పటిదో పారాసెటమాల్ సిరప్ ఉంటే వెంటనే వేసేస్తాం. తగ్గిపోతే సరే లేదంటే ఇక తప్పని పరిస్థితుల్లో డాక్టర్ వద్దకు వెళ్తుంటారు. చాలామటుకు తల్లిదండ్రులు ఇలానే చేస్తారు. కానీ ఇలా పారాసెటమాల్ ఉపయోగించేటప్పుడూ ఈ విషయాలు తప్పక తెలుసుకోవాలంటున్నారు వైద్య నిపుణులు.ప్రీడియాట్రిక్ నిపుణులు పిలల్లకు జ్వరం రాగానే పారాసెటమాల్ వేయడం వరకు కరెక్టే అయినా..అది వైద్యుల సిఫార్సు మేరకు వేయడమే ఉత్తమం అని చెబుతున్నారు. ఎందుకంటే..డాక్టర్లు కూడా పారాసెటమాలే సూచిస్తారు. కానీ ఎంత మోతాదు ఉపయోగించాలనేది బాటిల్పై ఉండే ఇన్ఫర్మేషన్ని అనుసరించి ఉంటుందని నొక్కి చెబుతున్నారు. నెలల పిల్లలకు సాధారణంగా చుక్కల మోతాదుని సూచించడం జరుగుతుంది. దాన్ని ఒక నిడిల్ సాయంతో డ్రాప్స్ మాదిరిగా ఇస్తాం అందులో గాఢత పరిమాణం ఎక్కువ. అలా కాకుండా 2 నుంచి 5 ఎంఎల్ మాదిరిగా అయితే మాత్రం కాస్త గాఢత తక్కువ ఉంటుంది. అది గమనించి ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే వయసుల వారిగా చిన్నారులకు ఇవ్వాల్సిన మోతాదులో వ్యత్సాసం కూడా చాలా వేరుగా ఉంటుందని చెబుతున్నారు వైద్యులు. అలాగే ఇంట్లో ఒకసారి సీల్ తీసిన పారాసెటమాల్ సీసాలను మరొసారి వినియోగించేటప్పుడూ ఈ అంశాలను దృష్టిలో ఉంచుకోవాలని చెబుతున్నారు. ఎందుకంటే..పారాసెటమాల్ని ఒక్కసారి వినియోగించిన బాటిల్ని మహా అయితే ఆ తర్వాత నెల వరకు వినియోగించ్చొచ్చట. అదే నెలల తరబడి వాడితే ఆ మందులోని గాఢత తగ్గిపోతుందట. అదీ సరిగా పనిచేయకపోవచ్చు లేదా ఒక్కోసారి దుష్ప్రభావాలు చూపించే ప్రమాదం లేకపోలేదని హెచ్చరిస్తున్నారు. సాధ్యమైనంత వరకు తల్లిందండ్రులు పిల్లలకు జ్వరం అనంగానే పారాసెటమాల్ ఇవ్వొద్దనే అంటున్నారు. చిన్నారి పరిస్థితి అనుసరించి ముందుగా వైద్యులను సంప్రదించి, వాళ్ల సూచనల మేరకు వాడితేనే శ్రేయస్కరమని అంటున్నారు. కాబట్టి తల్లిదండ్రలూ..జ్వరం అనగానే పారాసెటమాల్ కాదు..ఎంత వరకు ఉపయోగించాలి, అవసరమా కాదా అన్నది బేరీజు వేసుకుని ఉపయోగించండి మరి..!.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: అందువల్లే భారత్కి తిరిగి రావాలనుకుంటున్నా..? రూ. 1.2 కోట్లు శాలరీ చాలా..) -
మైండ్ఫుల్నెస్గా తినడం, ఒక యోగా భంగిమ అద్భుతం చేశాయ్..!
అధికి బరువు సమస్యకు చెక్పెట్టేందుకు ఒక్కొక్కరు ఒక్కో విధానాన్ని ఎంచుకుని సత్ఫలితాలు పొంది మార్గదర్శకులుగా నిలుస్తున్నారు. భారంగా ఉండే సమస్యకు చాలామంది ఆరోగ్యకరమైన విధానానికే మద్దతిస్తుండటం విశేషం. షార్ట్కట్లు, ఔషధాలతో కాకుండా శారీరక శ్రమ, ఓపిక, క్రమశిక్షణ అనే ఆయుధాలతో బరువుని కరిగిస్తున్నారు..స్లిమ్గా మారుతున్నారు. అలాంటి కోవలోకి అక్షయ్ కక్కర్ అనే ఇన్ఫ్లుయెన్సర్ కూడా చేరిపోయాడు. పైగా గతేడాది గణేష్ చుతర్థికి ఈ ఏడాది గణేష్ చతుర్థికి తనలో భారీగా సంతరించుకున్న మార్పుని సోషల్మీడియా వేదికగా షేర్ చేయడమే గాక అంతలా బరువు తగ్గేందుకు ఉపకరించిన ట్రిక్స్ని కూడా చేసుకున్నారు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అక్షయ్ కక్కర్(Akshay Kakkar) వెయిట్లాస్(Weight loss) జర్నీ ఏవిధంగా నెటిజన్లతో షేర్ చేసుకున్నారు. అసాధారణమైన తన అధిక బరువుని తగ్గించేందుకు ఎంతలా కష్టపడింది వివరించారు. ఏకంగా 179 కిలోలు పైనే బరువు ఉండే అక్షయ్ కేవలం ఒక్క ఏడాదికే ఊహించనంతంగా బరువు తగ్గి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అంటే సుమారు 44 కిలోలు పైనే బరువు తగ్గాడు. శారీరకంగానే కాకుండా మానసికంగానూ ఆరోగ్యవంతమైన మార్పుని అందుకున్నాడు. అందుకోసం తనకు క్రమశిక్షణ, సహనం, అచంచలమైన నమ్మకమే ఉపకరించాయని చెబుతున్నాడు అక్షయ్. "అంతేగాదు తన వెయిట్ లాస్ జర్నీకి గతేడాది వినాయక చవితికి..ఈ ఏడాది పండుగకి ఎంతో వ్యత్సాసం ఉంది. ఈ మార్పు నా జీవితంలో అదిపెద్ద బహుమతి. దీని వెనుక ఎంతో శ్రమ, చిందించిన చెమట, పోరాటం ఉన్నాయి. ఈ మార్పుకి ఎంతో సంతోషంగా ఉంది. గణపతి బప్పా నిజంగా అందరికి మంచి చేస్తాడు." అనే క్యాప్షన్ జోడించి మరి తన వెయిట్ లాస్ జర్నీ గురించి వివరించాడు. View this post on Instagram A post shared by Akshay Kakkar (@shezaadakakkar) ఎలాంటి డైట్, వ్యాయామాలు చేశాడంటే..తాను ఎలాంటి షార్ట్ కర్ట్లు అనుకరించలేదని అన్నారు. మైండ్ఫుల్నెస్గా తినడం, సముతుల్యంగా తినేలా జాగ్రత్త తీసుకోవడం, వంటి వాటి తోపాటు రుచికరమైన ఆహారాన్ని వదులుకోలేదని చెబుతున్నాడు. తన ప్లేట్లో సలాడ్, ప్రోటీన్ ప్యాక్, కూరగాయలు, పిండి పదార్థాల కోసం పప్పు, రోటీ, కరకరలాడే పాపడ్ వంటి ఉన్నాయని చెప్పారు. బరువు తగ్గడం నచ్చిన ఆహారం వదిలిపెట్టడం కాదు సరిగ్గా తినడం, సమతుల్యతకు ప్రాధాన్యత ఇవ్వడం అని చెబుతున్నాడు. దాంతోపాటు కార్డియో వ్యాయామాలు..ముచ్చెమటలు పట్టేలా చేసి త్వరితగతిన బరువు తగ్గేందుకు ఉపయోగపడ్డాయని చెప్పారు. అలాగే యోగా కూడా బరువు తగ్గడంలో సమర్థవంతంగా పనిచేస్తుందని అంటున్నాడు. ఇది మానసికంగా బరువు తగ్గేలా బలోపేతం చేస్తుందని చెబుతున్నాడు. కేలరీలు తగ్గేందుకు కార్డియో అద్భుతమైన మ్యాజిక్ చేస్తుందని చెబుతున్నాడు. View this post on Instagram A post shared by Akshay Kakkar (@shezaadakakkar) వర్కౌట్లను మన శరీరాన్ని మంచిగా మార్చే వైద్య ప్రక్రియగా భావిస్తే..భారంగా అనిపించిందని అంటున్నాడు. అలా తను ఒక్క ఏడాదిలోనే 179 కిలోలు నుంచి 139 కిలోలకు వచ్చినట్లు తెలిపాడు. ఇక్కడ కేవలం బరువు తగ్గేందుకు ధైర్యంగా ముందడుగు వేయడం, మైండ్ఫుల్నెస్గా తినడం, ఓపిక, ఒక యోగా భంగిమ..అద్భుతమే చేస్తాయని నమ్మకంగా చెబుతున్నాడు అక్షయ్ కక్కర్.(చదవండి: ఆహారంలో వాపుని ఆపుదాం..! ఫుడ్ ఫర్ ఇన్ఫ్లమేషన్..) -
ఆహారంలో వాపుని ఆపుదాం..! ఫుడ్ ఫర్ ఇన్ఫ్లమేషన్..
ఎవరికైనా శరీరంలోని ఏ భాగంలోనైనా దెబ్బతగిలినప్పుడు అక్కడ ఎర్రగా మారి, వాపు వచ్చి మంట వస్తుంది. ఇలా జరగడాన్నే ఇంగ్లిష్లో ఇన్ఫ్లమేషన్ అంటారు. ఇది చర్మం పై వచ్చినప్పుడు స్పష్టంగా కనిపిస్తుంది. అయితే కొన్నిసార్లు దేహభాగాల్లో లోపలి దెబ్బలకూ, గాయాలకు ఇన్ఫ్లమేషన్ రావచ్చు. ఇలా కేవలం దెబ్బలు తగిలినప్పుడు మాత్రమే కాకుండా... సాధారణంగా ఏదైనా ఇన్ఫెక్షన్ దేహంలోని ఆ భాగంలోనైనా వస్తే అక్కడ కూడా ఇన్ఫ్లమేషన్ రావచ్చు. ఆర్థరైటిస్ వంటి సమస్యలు వచ్చినప్పుడు కీళ్ల వద్ద, కీళ్ల మధ్య కూడా ఇన్ఫ్లమేషన్ రావడం జరగవచ్చు. దెబ్బలూ, గాయాలూ, ఇన్ఫెక్షన్లు, ఆర్థరైటిస్ వంటి కేసుల్లో గాయాలూ, కీళ్లలోనే కాకుండా అనేక సందర్భాల్లో అనేక అవయవాల్లోనూ ఇన్ఫ్లమేషన్లు రావచ్చు. ఉదాహరణకు... గుండెకు సంబంధించిన కార్డియోవాస్క్యులార్ జబ్బుల్లోనూ ఇన్ఫ్లమేషన్ కనిపించవచ్చు. ఈ ఇన్ఫ్లమేషన్ను తగ్గించి, గాయాలూ, ఇన్ఫెక్షన్లను నయం చేయడానికి మందుల్ని వాడినప్పటికీ... కొన్ని రకాల ఆహారాలు సైతం ఇన్ఫ్లమేషన్ను వేగంగా తగ్గించేందుకు ఉపయోగపడతాయి. ఆ ఆహారాలేమిటో చూద్దాం...సాధారణంగా ఇన్ఫ్లమేషన్ వచ్చినప్పుడు అది వేగంగా తగ్గడానికి, గాయంగానీ లేదా ఇన్ఫెక్షన్గానీ నయం కావడానికి కొన్ని మందులు ఇస్తారు. వీటినే ‘యాంటీ ఇన్ఫ్లమేటరీ’ మందులుగా చెబుతారు. అయితే యాంటీఇన్ఫ్లమేటరీ మందులు, ఎన్ఎస్ఏఐడీ (నాన్ స్టెరాయిడ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్) వంటి ఔషధాలతోపాటు... దేహంలో ఇన్ఫెక్షన్, ఇన్ఫ్లమేషన్తో ప్రభావితమైన చోట అది తగ్గడానికీ, అలాగే అక్కడ వచ్చే నొప్పి తగ్గడానికి ఇచ్చే నొప్పి నివారణ (పెయిన్ కిల్లర్స్) మందులు... వీటన్నింటి కారణంగా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు. ఉదాహరణకు సుదీర్ఘకాలం పెయిన్ కిల్లర్స్ వాడటం వల్ల కిడ్నీలు దెబ్బతినడం జరగవచ్చు. అలాగే ఇన్ఫ్లమేషన్ తగ్గించే మందులను సైతం సుదీర్ఘకాలం పాటు వాడటమూ అంత మంచిది కాదు. అలా ఆ మందుల్ని దీర్ఘకాలం పాటు వాడటం వల్ల దేహంలో వ్యాధి నిరోధకశక్తి తగ్గడం, దేహం ఆ మందుల పట్ల నిరోధకత (రెసిస్టెన్స్) పెంచుకోవడం లాంటి పరిణామాలు జరగవచ్చు.చేపలు : చేపల్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు సమృద్ధిగా ఉంటాయి. మరీముఖ్యంగా సాల్మన్ చేపల్లోని ఒమెగా 3–ఫ్యాటీ యాసిడ్స్ స్వాభావికమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ స్వభావాన్ని కలిగి ఉండి, మంచి ప్రయోజనాన్ని ఇస్తుంది. కెల్ప్ : ఇది ఆల్గే ప్రజాతికి చెందిన ఒక రకం ఆహారం. ప్రస్తుతం మన దగ్గర (మనదేశంలో) అంత విస్తృతంగా దొరకదు. అయితే యాంటీ ఇన్ఫ్లమేటరీ ఆహారాల్లో ఇది చేపల తర్వాత అంత సమర్థమైనది. పైగా ఇది కేవలం యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలను కలిగి ఉండటం మాత్రమే కాకుండా... కాలేయ క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్ను తగ్గించే నేచురల్ యాంటీ ట్యూమర్, యాంటీ ఆక్సిడేటివ్ గుణాలున్న ఆహారం కావడంతో దీన్ని వాడటం వల్ల మంచి ప్రయోజనాలు కలుగుతాయి. ఆలివ్ ఆయిల్ : మధ్యధరా (మెడిటెరేనియన్ సీ) ప్రాంతపు వాసులు చాలా ఆరోగ్యంగా సుదీర్ఘకాలం జీవించడానికి వాళ్ల వంటకాల్లో ఆలివ్ ఆయిల్ను విస్తృతంగా వాడటం అని మనలో చాలామందికి తెలిసిన విషయమే. ఇక వాళ్ల సంస్కృతిలో తాజా పండ్లతోపాటు ఆలివ్ నూనెను వారి సంప్రదాయ వంటకాల్లో వాడటం వల్ల ఆ ప్రాంత వాసులు మరింత ఆరోగ్యంగా జీవిస్తున్నారని అనేక అధ్యయనాల్లో వెల్లడైంది. ఇందుకు కారణమేమిటంటే... ఈ ఆలివ్ నూనెలో కొవ్వులు ఎంత మోతాదులో ఉండాలో అంతే మోతాదులో ఉంటాయి. దాంతో పాటు ఆలివ్ ఆయిల్లో కేవలం ఇన్ఫ్లమేషన్ను తగ్గించే గుణం మాత్రమే కాకుండా... ఆస్థమానూ, ఆర్థరైటిస్నూ తగ్గించే గుణమూ ఉంది. గుండెకూ, రక్తనాళాలకూ మేలు చేసే స్వభావం కూడా ఈ ఆలివ్ ఆయిల్లో ఉండటం విశేషం. క్రూసిఫెరస్ వెజిటబుల్స్ : కాలీఫ్లవర్, క్యాబేజీ, బ్రాకలీలను క్రూసిఫెరల్ వెజిటబుల్స్గా పేర్కొంటారు. మొదట్లో మన దగ్గర కేవలం కాలీఫ్లవర్, క్యాబేజీ మాత్రమే లభ్యమవుతూ ఉండగా... ఇటీవల బ్రాకలీ లభ్యత కూడా బాగా పెరిగింది. ఈ క్రూసిఫెరస్ వెజిటిబుల్స్లో యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉండటంతో పాటు... మన శరీరంలోని విషాలను (టాక్సిన్స్ను) స్వాభావికంగానే హరించే శక్తి ఉంది. ఇలా శరీరం నుంచి స్వాభావికంగా విషాలను తొలగించే శక్తి కారణంగానే ఇవి ప్రభావవంతమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ ఆహారంగా గణుతికెక్కాయి. బ్లూ బెర్రీస్ : ఇవి ఇన్ఫ్లమేషన్ను స్వాభావికంగానే పూర్తిగా ప్రభావవంతంతో తగ్గించడమే కాదు... వయసు పెరుగుతున్న కొద్దీ మెదడుతోపాటు దేహంలోని అన్ని అవయవాల్లో కలిగే నష్టాలూ / అనర్థాలను తగ్గించే గుణాలూ ఉన్నాయి. వయసు పెరిగాక వచ్చే మతిమరపు (డిమెన్షియా)ను ఇవి సమర్థంగా అరికడతాయి. ఇక బ్లూబెర్రీస్లో యాంటీ క్యాన్సర్ గుణాలూ ఎక్కువే. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే... ఎరువులు వాడి పండించిన బ్లూ బెర్రీస్తో ΄ోలిస్తే... స్వాభావికంగా పండించిన బ్లూ బెర్రీస్ మంచివి. పసుపు : పసుపుకు ఔషధ గుణాలు (మెడిసినల్ ప్రోపర్టీస్) ఉన్నాయన్న విషయం మనకు చాలా కాలం కిందటి నుంచే తెలుసు. పసుపులో ఉండే కర్క్యుమిన్ అనే పోషకం / పదార్థం యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాన్ని కలిగి ఉంటుంది. అందువల్లనే ఆహారంలో పసుపు వాడినప్పుడు అది యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రయోజనాలతోపాటు సమర్థమైన నొప్పి నివారణిగా కూడా పనిచేస్తుంది. మనం మెడికల్ షాపుకు వెళ్లి ఆన్ కౌంటర్ మెడిసిన్గా కొనుగోలు చేసే కొన్ని మందులు కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ చూపవచ్చు. కానీ పసుపు వేసి వండిన ఆహారాలు ఎలాంటి దుష్ప్రభావాలూ చూపకుండానే మంచి ప్రయోజనాన్ని ఇస్తూ మెడిసిన్ ఇచ్చే ప్రభావాన్ని చూపుతాయి. అల్లం : అల్లానికి కూడా ఔషధ గుణాలూ, వైద్య ప్రయోజనాలు చాలానే ఉన్నాయి. వాటిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణం కూడా ఒకటి. ఒక్క యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణం మాత్రమే కాకుండా అల్లానికి... రక్తంలో చక్కెర మోతాదులను తగ్గించే గుణం కూడా ఉంది. వెల్లుల్లి : వెల్లుల్లిలో ఎన్నో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నట్టు ఇప్పటికే అనేక పరిశోధనల్లో వెల్లడైంది. అంతేకాదు... ఇందులోని యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలూ, దీనితో కలిగే ప్రయోజనాలపై ఇంకా పరిశోధన జరుగుతూనే ఉన్నాయి. ఇది సమర్థమైన నొప్పి నివారిణి మాత్రమే కాదు... ఇది చాలా రకాల క్యాన్సర్లనూ నివారిస్తుంది. అంతేకాదు... శరీరంలో ఇన్ఫెక్షన్లతోనూ ΄ోరాడుతుంది. రక్తంలోని చక్కెరనూ సమర్థంగా నియంత్రిస్తుంది. చిలగడదుంప : తెలుగు రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో మోరంగడ్డ, గెణుసుగడ్డ అని పిలిచే ఈ దుంపలో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్, పీచుపదార్థాలు, బీటా కెరోటిన్, మాంగనీసు, విటమిన్ బి6, విటమిన్– సి వంటి అనేక కీలకమైన పోషకాలు ఉంటాయి. వీటి కారణంగా చిలగడదుంపకు ఇన్ఫ్లమేషన్ను త్వరగా మానేలా చేసే గుణం ఉంది. గ్రీన్ టీ : గ్రీన్ టీలోని ఫ్లేవనాయిడ్స్ అనే పోషకాలు గ్రీన్–టీ కి యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలను ఇస్తాయి. చాలా రకాల క్యాన్సర్లకు గ్రీన్–టీ మంచి విరుగుడుగా పనిచేస్తుంది. ఇవన్నీ ఇన్ఫ్లమేషన్ను తగ్గించేందుకు ఉపయోగపడే ఆహారాలు కాగా... కొన్ని రకాల ఆహారాలు ఇన్ఫ్లమేషన్ పెంచుతాయి కూడా.ఇన్ఫ్లమేషన్ తగ్గించే పని ఆహారమే చేస్తే...ఒకవేళ మందుల్ని కేవలం పరిమితంగానే తీసుకుంటూ ఇన్ఫ్లమేషన్ను తగ్గించే కొన్ని రకాల ఆహారాలను తీసుకోవడం వల్ల సదరు ఆహారాలలోని పోషకాల వల్ల ఇన్ఫ్లమేషన్ తగ్గించడం సాధ్యమవుతుందా అన్న ప్రశ్నకు అది సాధ్యపడుతుందనే అంటున్నారు డాక్టర్లు, ఆహార నిపుణులు. ఈ నేపథ్యంలో ఇన్ఫ్లమేషన్ తగ్గించే ఆహారాల గురించి తెలుసుకుందాం.ఇన్ఫ్లమేషన్ తగ్గించే ఆహారాలతో ప్రయోజనాలివి...ఒకవేళ ఇన్ఫ్లమేషన్ను తగ్గించడానికి ఆహారాల మీదే ఆధారపడటం వల్ల నొప్పి నివారణ మందుల తాలూకు దుష్ప్రభావాన్ని తగ్గించడమే కాదు... వాటి వల్ల కోల్పోయే రోగనిరోధక శక్తినీ పెంపొందించుకోవచ్చు. అనవసరంగా వాడే మందుల మోతాదులు తగ్గించడంతోపాటు... వ్యాధినిరోధక వ్యవస్థను పరిపుష్టం చేసేలా దేహానికి అవసరమైన స్వాభావికమైన పోషకాలనే తీసుకోవడంతో శరీరానికి అవసరమైన విటమిన్లు, లవణాలు సమకూరతాయి. దాంతో నేచురల్ పదార్థాల వల్ల స్వాభావికంగానే ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది. రిఫైన్డ్ ధాన్యాలు : ధాన్యంపై ఉండే పొట్టును తొలగించి తీసుకునే ఆహారాలు ఇన్ఫ్లమేషన్ను పెంచుతాయి. కొన్ని రకాల ఆహారంపై పెంచే జంతువుల మాంసం: ఆహారంగా ఉపయోగపడే జంతువులను పెంచే క్రమంలో కొన్నిచోట్ల వాటికి సోయా, కార్న్ వంటివి తినిపిస్తుంటారు. ఇలా సోయా, కార్న్ వంటివి తింటూ పెరిగిన ఆ జంతువుల మాంసం తిన్నప్పుడు దేహంలోని ఇన్ఫ్లమేషన్ ఒక పట్టాన తగ్గదు. అలాగే... ఇంకొన్ని జంతువులు త్వరగా లావెక్కి, వేగంగా కొవ్వు పట్టడానికి హార్మోన్, యాంటీబయాటిక్ ఇంజెక్షన్లు చేస్తారు. ఇలాంటి జంతువుల మాంసం కూడా ఇన్ఫ్లమేషన్ను పెంచుతుంది. రెడ్మీట్, ప్రాసెస్డ్ మీట్ : కొవ్వు ఎక్కువగా ఉండే గొడ్డు మాంసంలో ఎన్ఈయూ5జీసీ అనే పదార్థం ఉంటుంది. ఇది శరీరంలోకి చేరగానే ఇన్ఫ్లమేటరీ గుణానికి పెం΄÷ందిస్తుంది. అందుకే ఏదైనా ఇన్ఫ్లమేషన్ ఉన్నవారు రెడ్మీట్ను తీసుకోవాల్సి వస్తే దాన్ని చాలా పరిమిత మోతాదుల్లో మాత్రమే తినాలి. ఒకవేళ రెడ్మీట్కు బదులు కోడిమాంసం, చేపలు తీసుకోవడం వల్ల ఇన్ఫ్లమేషన్ను పెంచుకోకుండా... తగ్గించుకునే అవకాశాలూ పెరుగుతాయి. చక్కెరలు : చక్కెరతోపాటు చక్కెరను వాడి తయారు చేసే అన్నిరకాల తీపి పదార్థాలూ ఇన్ఫ్లమేషన్ను పెంచుతాయి.వంటనూనెలు : ఒక్క ఆలివ్ నూనె మినహాయించి... కుసుమ, సోయా, పొద్దుతిరుగుడు, కార్న్ నూనెలతోపాటు, పత్తినూనె సహా అన్ని రకాల వంట నూనెలూ ఇన్ఫ్లమేషన్ను పెంచుతాయి. ట్రాన్స్ఫ్యాట్స్ (కొవ్వులు): స్వాభావికంగా పాల నుంచి వచ్చిన నెయ్యి కాకుండా... కృత్రిమంగా తయారు చేసే నెయ్యి లాంటి డాల్డా వంటి వాటిని ట్రాన్స్ఫ్యాట్స్గా పేర్కొంటారు. ఇక కొన్ని ఆహారాల్లో నూనెలు, నెయ్యి వంటివి వాడితే త్వరగా పాడవుతాయనీ, అలా పాడు కాకుండా ఉంచేందుకు దీర్ఘకాలం నిల్వ ఉంచేందుకూ (షెల్ఫ్ లైఫ్ పెంచేందుకు) మార్జరిన్ వంటి నూనెలు వాడతారు. ఈ ట్రాన్స్ఫ్యాట్స్ అన్నీ దేహంలొ చెడు కొవ్వులనూ, చెడు కొలెస్ట్రాల్ను పెంచుతాయి. దాంతో అన్ని రకాల కొవ్వులూ, వేపుళ్లు, ఫాస్ట్ఫుడ్స్, బేకరీ ఐటమ్స్ మాత్రమే కాకుండా మార్జరిన్ వంటి నూనెను ఉపయోగించిన అన్ని ఆహారాలూ దేహంలో ఇన్ఫ్లమేషన్ను పెంచేందుకు కారణమవుతాయి. పాలలో అలర్జీని తెచ్చిపెట్టే కారకాలు / పోషకాలు : పాలలోని అలర్జీ కలిగించే పదార్థాలు దేహంలో ఇన్ఫ్లమేషన్ను పెంచతారు. ఉదాహరణకు పాలు సరిపడని కొందరిలో వాటిని తాగినప్పుడు వాళ్ల ఒంటిపై ర్యాష్ వస్తుంది. దేహంలో ఇన్ఫ్లమేషన్ రావడం వల్లనే ఇలా జరుగుతుంది. (అయితే పాల అలర్జీ కారణంగా అవి సరిపడనివారికి మినహా మిగతా వారందరికీ పాలు మంచి ఆహారం). ఆహారానికి కలిపే కృత్రిమ పదార్థాలు : కొన్ని రకాల ఆహారాలకు ఆస్పార్టమ్, ఎమ్ఎస్జీ అనే అడెటివ్స్ కలుపుతారు. ఇవి కలిపిన ఆహారం ఇన్ఫ్లమేషన్ను పెంచుతుంది. మనకు సరిపడని అన్ని రకాల ఆహారాలు : కొందరిలో కొన్ని రకాల ఆహారాలు అలర్జీని కలిగిస్తాయి. ఇలా సరిపడని ఆహారాల వల్ల కూడా ఇన్ఫ్లమేషన్ పెరుగుతుంది. ఆల్కహాల్ : ఆల్కహాల్ దేహంలోని చాలా భాగాల్లో ఉండే ఇన్ఫ్లమేషన్ను మరింత పెరిగేలా చేస్తుంది. దేహంలో ఇన్ఫ్లమేషన్ ఉండి, క్రమం తప్పకుండా ఆల్కహాల్ తీసుకుంటుంటే ఆ ఇన్ఫ్లమేషన్నే కాలక్రమంలో కేన్సర్గా మారే ప్రమాదమూ ఉంటుంది. అందుకే ఇన్ఫ్లమేషన్ ఉన్నవారు ఆల్కహాల్కు దూరంగా ఉండాలి. ఆ మాటకొస్తే ఇన్ఫ్లమేషన్ లేనప్పుడూ ఆల్కహాల్ ముట్టుకోకపోవడమే మంచిది. డాక్టర్ రాజీబ్ పాల్, సీనియర్ కన్సల్టెంట్, ఇంటర్నల్ మెడిసిన్నిర్వహణ: యాసిన్(చదవండి: బాధించిన శారీరక ఎత్తునే చిత్తుచేసి.. ఐఏఎస్ స్థాయికి..) -
తూకం కాదు... సమతూకం ఉండాలి
పోషకాహారం అంటే అత్యంత ఖరీదైన ఆహారం అని కాదు. అలాగని కేవలం ఆకలి తీర్చుకోవడానికి తీసుకునే ఆహారమూ కాదు. రుచితో పాటు పోషక విలువలు ఉండాలి. అంతకు ముందు మన శరీరానికి ఎలాంటి ఆహారం కావాలో అర్థం చేసుకోవడం ముఖ్యం. శరీరానికి అవసరమైన అన్ని పోషకాలను సరైన ప్రమాణంలో అందిస్తే అవి ఆరోగ్యంగా పనిచేయడానికి సహాయపడతాయి. అందుకే సమతుల ఆహారంపై దృష్టి పెట్టమని నిపుణులు చెబుతుంటారు. మనం తీసుకునే ఆహారం రోజంతా పనిచేయడానికి అవసరమైన శక్తిని అందిస్తుంది. శరీర ఎదుగుదలకు ముఖ్యంగా పిల్లలు, యుక్తవయసులో ఉన్నవారికి సరైన పోషకాలు ఎముకలు, కండరాలు, ఇతర కణజాలాల పెరుగుదలకు సహాయపడతాయి. మన రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. వివిధ రకాల వ్యాధుల నుండి రక్షిస్తుంది. మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. కొన్ని పోషకాలు మన మెదడు పనితీరును, మానసిక స్థితిని మెరుగు పరచటంలో ముఖ్యపాత్రను పోషిస్తాయి. దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదం తోపాటు గుండె జబ్బులు, మధుమేహం, కొన్ని రకాల క్యాన్సర్లను తగ్గిస్తాయి.కార్బోహైడ్రేట్లు మన శరీరానికి తప్పక కావాల్సిందే. అవి తృణధాన్యాలు, కూరగాయలలో లభిస్తాయి. శక్తికి, హార్మోన్ల ఉత్పత్తికి ఐరన్ తప్పక అవసరం. ఆరోగ్యకరమైన కొవ్వులు మేలు చేస్తాయి.ప్రోటీన్లు కండరాలకు, హార్మోన్ల ఉత్పత్తికి అవసరం. మాంసం, గుడ్లు, పాల ఉత్పత్తులు, పప్పుధాన్యాలలో లభిస్తాయి. విటమిన్లు శరీరంలోని రసాయన చర్యలకు సహాయపడతాయి. వివిధ రకాల పండ్లు, కూరగాయలలో లభిస్తాయి. మినరల్స్ ద్వారా ఎముకల నిర్మాణం జరుగుతుంది. అదేవిధంగా నరాల పనితీరుకు క్యాల్షియం, ఐరన్, పొటాషియం వంటి ఖనిజాలు ముఖ్యమైనవి. రక్తంలో ఐరన్ శాతం తగ్గితే బలహీనంగా అవుతారు. త్వరగా నీరసం వస్తుంది. తలనొప్పి, జుట్టు రాలడం వంటి సమస్యలు తలెత్తుతాయి. బచ్చలి, పాలకూర, గోంగూర వంటి ఆకుపచ్చ కూరలు, బీట్రూట్, చిక్కుళ్ళు, శెనగ, మటన్, పెసలు, నట్స్, ఎండు ఖర్జూరాలు, ఎండుద్రాక్ష, తృణధాన్యాలు, గుడ్డు.. వంటివి శరీరం లో ఐరన్ శాతం పెరగడానికి సహాయపడతాయి. పిల్లలకు వారి వయసు, యాక్టివిటీని బట్టి 1000 నుంచి 1400 కిలో క్యాలరీలు అవసరం అవుతాయి. పెద్ద పిల్లలైతే 1800 కిలో క్యాలరీల వరకు తీసుకోవచ్చు. ఎదిగే వయసు కాబట్టి జంక్ఫుడ్ కాకుండా రోజువారీ భోజనంలో మొలకెత్తిన గింజలు, చేపలు, గుడ్లు, తాజా ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు ఇవ్వాలి. చిన్నపిల్లలైతే రోజుకు 4 గ్లాసులు, పెద్దపిల్లలైతే 12 గ్లాసుల వరకు నీళ్లు తాగేలా చూడాలి. వాతావరణం బట్టి నీటి మోతాదులో మార్పులు ఉండవచ్చు. ప్రతి అరగంటలకు ఒకసారి నీళ్లు కొద్దిగానైనా తాగేలా సూచనలు ఇవ్వాలి. -
సంపదలోనే కాదు ఆరోగ్యంగానూ బిలియనీరే..! ఆ ఒక్క సూత్రంతో..
ప్రపంచంలో అత్యధిక ధనవంతుల్లో 5వ వ్యక్తి అయిన వారెన్ బఫెట్ 94 వయస్సులోనూ అత్యంత తెలివిగా స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెడుతూ లాభాలను ఆర్జిస్తున్నారు. సంపదను అర్జించడంతో పాటు దానిని రక్షించుకోవడం, దాని విలువను పెంచుకోవడం వంటి విషయాల్లో ఆయనకు ఆయనే సాటి. ఆయనచెప్పే ఆర్థిక సూత్రాలు ఆర్ధిక నిరక్షరాస్యులకు గొప్పపాఠాలే కాదు శ్రీమంతులుగా మార్చే గొప్ప సూత్రాలు కూడా. ఆయన సంపదర పరంగానే కాదండోయ్ ఆరోగ్యపరంగానే బిలియనీరే. ఆయనేమి ఆరోగ్యానికి సంబంధించిన వాటిల్లోపెట్టుబడులు పెట్టలేదు గానీ వెల్నెస్ పరంగా ఆయన అలవాట్లు చూస్తే విస్తుపోతారు. అలాంటి ఆహారపు అలవాట్లు ఆయన దీర్ఘాయువు రహస్యమా అని విస్తుపోతారు. వైద్యులు, పరిశోధకులు నో అంటూ..మొత్తుకుని హెచ్చిరించి మరి చెప్పే వాటినే ఆయన ఇష్టంగా తింటాడట. అందరికీ అనారోగ్యకారకమైనవి మరి ఆయనకు ఎలా ఆరోగ్యకరంగా మారాయ్ అంటే..తొంభైఐదు వసంతాలకు చేరువైన బఫెట్ 2015లో ఫార్చ్యూన్ మ్యాగజైన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆరేళ్ల పిల్లవాడిలా తింటానని ఎందుకంటే వాళ్లల్లో అత్యల్ప మరణ రేటు ఉంటుంది కాబట్టి అని చెప్పారు. ఈ డైలాగ్ నెట్టింట వైరల్గా మరి చాలామందిని ఆలోచింప చేసేలా చేసింది. అంతేగాదు ఆయన కేలరీలను లెక్కించడట. తాను అచ్చం చిన్నపిల్లవాడి మాదిరిగా తింటాను, నిద్రపోతానని అన్నారు. కోకాకోలా అంటే బఫేట్కి మహాప్రీతి. ప్రతిరోజూ ఐదు నుంచి 12 ఔన్స్ డబ్బాలు అయిపోవాల్సిందేనట. తాను రోజుకి సుమారు 2,700 కేలరీలు తింటే..దానిలో పావువంతు కోకాకోలా ఉంటుందని ఇంటర్వ్యూలో ఆయనే స్వయంగా చెప్పారు. అలాగే ఉదయం ఆరోగ్యానికి సంబంధించిన హెల్త్ డ్రింక్లు, సూపర్ ఫుడ్లు వంటివి ఏమి తీసుకోరు. ఆయన ప్రతిరోజూ మెక్డొనాల్డ్స్ మీల్స్ తింటాడు. ఫాస్ట్ఫుడ్నే అత్యంత ఇష్టంగా తింటారట. అంటే ఆయన తీసుకునే ఆహారంలో దాదాపు జంక్ ఫుడ్ అధికం. నిజానికి వెల్నెస్ ప్రియులు దూరంగా ఉండే ఫుడ్నే ఆయన అత్యంత ఇష్టంగా తినడం విశేషం. తప్పనిసరిగా ఒక ఆదివారం ఐస్క్రీం తినాల్సిందేనట. అయితే బఫెట్ ఆరోగ్యపు అలవాట్లు ఆరోగ్యకరమైనవి కాకపోయినా..ఎంతటి బిజీ లైప్లో కూడా ఆయన ఎనిమిదింటికే నిద్రించడం, తెల్లవారుజామున నాలుగు గంటలకు వెళ్లడం, ఆనందానికి ప్రాధాన్యత ఇవ్వడమే ఇన్నేళ్లు ఆరోగ్యవంతంగా ఉండేందుకు కారణమని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. అంతేగాదు బఫెట్ తరుచుగా తనకు గాఢంగా నిద్రపోవడం అంటే అత్యంత ఇష్టమని పలుమార్లు ఇంటర్వ్యూలో చెప్పాడు కూడా. అలాగే అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీ కూడా ఇలాంటి మంచి నిద్ర అలవాటు అనేది దీర్గాయువు సీక్రెట్కి సంబంధించిన వాటిల్లో ఒకటని పేర్కొంది. అంతేగాదు వయసు పెరుగుతున్న..అంతరంగంలో పసిబిడ్డలాంటి ఉత్సుకత కలిగిన మనసుని మర్చిపోవద్దని చెబుతుంటారు. అంటే మనకు ఇష్టమైన వాటిని వెంటనే ఆస్వాదించే చిన్నపిల్లల మనస్తత్వాన్ని వదులుకోవద్దని చెబుతుంటారు. ఇప్పటికీ ఆయన తన స్నేహితులతో బ్రిడ్జ్ వంటి ఆటలను ఆస్వాదిస్తారట. అది తన మెదడుకు మేధోపరమైన వ్యాయామం అని చెబుతున్నారాయన. అలాగే తన షెడ్యూల్లో ఖాళీ అనే పదానికి అస్సలు అవకాశం ఉండదట. అలా తన సమయాన్ని వృద్ధా చేయకుండా సద్వినియోగం చేసుకోగలనని అన్నారు. ఇక తనకు రోజులో కనీసం ఐదు నుంచి ఆరుగంటలు చదవడం, ఆలోచించడం వంటి వాటితో గుడుపుతాడట. ముఖ్యంగా వ్యాపారం లేదా పెట్టుబడి గురించి ఆలోచించడం వంటి వాటిపట్ల మిక్కిలి ఆనందదాయకంగా ఉంటుందట. అంటే మనం చేస్తున్న పనిని ప్రేమించడం, ఇష్టపూర్వకంగా పనిచేయంలోని ఆనందాన్ని ఆస్వాదిస్తే..భారం అనే పదకు ఆస్కారం ఉండదంటారు బఫేట్. అలాగే వారంలో మూడు రోజులు వ్యాయమాలు చేస్తానని చెప్పారు. ఇక ధూమపానం, మద్యపానం వంటి వాటి జోలికి అస్సలు పోనని చెబుతున్నారు. అంతేగాదు బఫేట్ ఎలాంటి కఠినమైన డైట్లు అనుసరించనని..నచ్చిన ఫుడ్ని సంతోషభరితంగా ఆస్వాదించడం..తన శరీరం ఇష్టపడే వాటిని మితంగా ఆస్వాదించేలా నియంత్రించుకోగల సామర్థ్యం వంటివే తన ఆరోగ్య రహస్యమని నవ్వుతూ చెబుతున్నారు బఫెట్. పోషకాహార నిపుణులు చెప్పే చెడు ఆహారపు అలవాట్లే బఫేట్వి అయినా..ఆయన మంచి నిద్రకు, శారీరక శ్రమకు మద్దతిస్తూ..చెడు అలవాట్లకు దూరంగా ఉండటమే ఆయన సుదీర్ఘకాలం ఆరోగ్యంగా ఉండేందుకు దోహదపడిందని చెబుతున్నారు పోషకాహార నిపుణులు.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం.(చదవండి: హృదయం విరిగితే అతికించలేం గానీ నయం చేయొచ్చు..!) -
హృదయం విరిగితే అతికించలేం గానీ నయం చేయొచ్చు..!
ప్రేమ విఫలం లేదా మనం ఎంతగానో ఆరాధించే వ్యక్తి దూరమవ్వడం, లేదా నమ్మకద్రోహం వంటి వాటి వల్ల హృదయం ముక్కలైపోతుంది. అది సర్వసాధారణంగా అందరికీ ఎదురయ్యే సమస్యే. అయితే కొందరు గుండెను రాయి చేసుకుని ధైర్యంగా లైఫ్ని లీడ్ చేస్తే..మరికొందరు అంత తేలిగ్గా ఆ సమస్య నుంచి బయటపడరు. పైగా గుండె బలహీనమైపోయి..తాత్కాలికి గుండె సంబంధిత అనారోగ్య సమస్యల బారిన పడతారు. దీన్ని వైద్య పరిభాషలో టాకోట్సుబో కార్డియోమయోపతి లేదా "బ్రోకెన్ హార్ట్ సిండ్రోమ్"గా వ్యవహరిస్తారు. అయితే అలా ముక్కలైన హృదయాన్ని బాగు చేసుకుని, ఆరోగ్యవంతంగా మార్చుకోవచ్చట. పరిశోధకులు జరిపిన తాజా అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. అసలేం జరిగిందంటే..ప్రపంచంలో లక్షలాది మంది ఈ టాకోట్సుబో కార్డియోమయోపతి సమస్యతో బాధపడుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. దీని కారణంగా అకస్మాత్తుగా గుండె కండరాలు బహీనపడిపోయి గుండెపోటు లక్షణాలు తలెత్తుతాయట. చెప్పాలంటే మరణ ప్రమాదానికి చేరవయ్యే ప్రమాదం ఎక్కువ అవ్వుతుందట. ఇలాంటి తాత్కాలిక గుండెపోటు ప్రమాదాల నుంచి కోలుకోవడం అంత ఈజీ కాదంటున్నారు మాడ్రిడ్ పరిశోధకులు. ఒక్కోసారి ఏళ్లకు ఏళ్ల సమయం పడుతుందని చెబుతున్నారు. ఆ నేపథ్యంలోనే ఇలాంటి గుండెపోటు సిండ్రోమ్ని నివారించే దిశగా అధ్యయనాలు చేయగా, వ్యాయామమే చక్కటి నివారణ అని తేలిందన్నారు. గుండె ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచే వ్యాయామలు, థెరపీలు ఆయా రోగులకు అందివ్వగా మెరుగైన ఫలితాలు వచ్చాయని పేర్కొన్నారు. అందుకోసం దాదాపు 76 మంది రోగులపై అధ్యయనం చేసినట్లు వెల్లడించారు. వారిలో 66 ఏళ్లు పైబడ్డ మహిళలు కూడా ఉన్నారని తెలిపారు. వారందరిని రెండు సముహాలుగా విభజించారు. ఒక సముహం సాధారణ వ్యాయామాలు, వాకింగ్ చేయగా, మరొక సముహానికి కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ ఇచ్చారు. ఈ థెరపీలో భాగంగా ఆయా వ్యక్తులకు 12 టు 1 సెషన్లో జీవితంలో ఎదురయ్యే ఒడిదుడుకులను ఎలాహ్యాండిల్ చేయాలి, అవన్నీ జీవితంలో ఏ విధంగాభాగం తదితరాలపై శిక్షణ ఇస్తారు. ఇలా మొత్తం 12 వారాలు శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. ఇక వ్యాయామాల్లో భాగంగా, స్విమ్మింగ్, సైక్లింగ్, ఏరోబిక్స్తో కూడిన వ్యాయామాలను 12 వారాలు తర్ఫీదుని మిగతా సగంమందికి ఇచ్చామని చెప్పారు. ఫలితంగా వారందరీ గుండె పనితీరు మెరుగ్గా ఉండటమే గాక గుండె సంబంధిత ప్రమాదాలు తగ్గినట్లు గుర్తించామని అన్నారు. అంతేగాదు వారందరిలోనూ ఆక్సిజన్ వినియోగించే సామర్థ్యాన్ని మెరుగుపరచారని చెప్పారు. ఇలాంటి తాత్కాలిక గుండె సంబంధిత సమస్యలను కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ లేదా వ్యాయామాలతో నయం చేయగలవని అన్నారు. లక్షల్లో డబ్బులు ఖర్చు పెట్టకుండా కొద్దిపాటి జీవన శైలి మార్పులు, శారీరక శ్రమతో కామన్ మ్యాన్ కూడా ఇలాంటి అనారోగ్య సమస్యల నుంచి సులభంగా బయటపడగలరని అన్నారు. ఈ పరిశోధన మరిన్ని వ్యాధులకు సంబంధించిన అధ్యయనంలో మార్గదర్శకంగా ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు కార్డియాలజీ పరిశోధకులు.(చదవండి: తమిళ పాకానికి అమెరికా వణక్కం!) -
ఇది నాకూ బిడ్డకూ ప్రమాదమా?
నేను ఐదు నెలల గర్భవతిని. డాక్టర్ చెప్పడంతో ఓజీటీటీ పరీక్ష చేయించుకున్నాను. దీంతో రక్తంలో చక్కెర స్థాయి ఎక్కువగా ఉన్నట్లు తెలిసింది. ఇది నాకు, నా బిడ్డకు ప్రమాదమా? ఇందుకోసం ప్రత్యేక ఆహార నియమాలు పాటించాల్సి వస్తుందా?– శైలజ, గుంటూరుగర్భధారణ సమయంలో చాలామంది మహిళల్లో మధుమేహం వచ్చే అవకాశం ఉంటుంది. దీనిని గర్భస్థ మధుమేహం (జెస్టేషనల్ డయాబెటిస్) అంటారు. ఇది గర్భధారణ సమయంలో విడుదలయ్యే హార్మోన్ల ప్రభావంతో శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గిపోవడం వలన వస్తుంది. ఎక్కువగా ఇది ఇరవై నాలుగు నుంచి ఇరవై ఎనిమిది వారాల మధ్య కనిపిస్తుంది. అందుకే ఆ సమయంలో ఓజీటీటీ పరీక్షను చేయాలని ప్రతి గర్భిణీకి సూచిస్తారు. ఇప్పుడు మీలో గర్భస్థ మధుమేహం నిర్ధారణ కావడంతో, కొంచెం ఆందోళన కలగడం సహజమే! దీనిని సరైన సమయంలో గుర్తించడం, నియంత్రణలో ఉంచడం చాలా ముఖ్యం. గర్భస్థ మధుమేహం నియంత్రణలో లేకపోతే తల్లికి ప్రసవ సమయంలో ఇబ్బందులు, ఇన్ఫెక్షన్లు లేదా రక్తస్రావం ఎక్కువయ్యే ప్రమాదం ఉంటుంది. అలాగే శిశువు గర్భంలోనే బరువు ఎక్కువ కావచ్చు, ఉమ్మనీరు పెరిగే అవకాశం ఉంటుంది. పుట్టిన తర్వాత కొన్నిసార్లు బిడ్డకు రక్తంలో తక్కువ చక్కెర స్థాయి లేదా స్వల్ప శ్వాస ఇబ్బందులు రావచ్చు. అయితే ఇవన్నీ సాధారణంగా సులభంగా చికిత్స చేయగలిగినవే. గర్భస్థ మధుమేహం నిర్ధారణ అయిన వెంటనే మీరు కొన్ని ప్రత్యేక ఆహార నియమాలు పాటించాలి. తక్కువ కార్బోహైడ్రేట్లు, తక్కువ కొవ్వులు, అధిక ప్రొటీన్లు కలిగిన ఆహారం తీసుకోవాలి. అలాగే రక్తంలో చక్కెర స్థాయిలను క్రమం తప్పకుండా తనిఖీ చేసుకోవటం చాలా ముఖ్యం. ఆహారం, వ్యాయామాలతో ఈ మధుమేహం నియంత్రణ కాకపోతే, డాక్టర్లు సురక్షితమైన మాత్రలు లేదా ఇన్సులిన్ ఇంజెక్షన్లు సూచిస్తారు. ఇవి తల్లికీ, బిడ్డకీ పూర్తిగా హానికరం కాదు. సరైన నియంత్రణతో గర్భస్థ మధుమేహం సాధారణంగా ప్రసవం జరిగిన వెంటనే తగ్గిపోతుంది. కాని, కొన్నిసార్లు ప్రసవం తర్వాత కూడా మందులు, ఆహార నియమాలు కొంతకాలం కొనసాగించాల్సి రావచ్చు. భవిష్యత్తులో మధుమేహం వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది కాబట్టి, ప్రసవం తర్వాత కూడా ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఫాలోఅప్ తప్పనిసరిగా చేయించుకోవాలి.నాకు గతంలో ఏడు వారాలలో గర్భస్రావం అయింది. ఇప్పుడు గర్భవతిని. ఈ గర్భధారణలోనూ ఇప్పటివరకు రెండుసార్లు బ్లీడింగ్ వచ్చింది. డాక్టర్ నాకు విశ్రాంతి తీసుకోవాలని, కొన్ని మందులు వాడాలని చెప్పారు. ఈ బిడ్డను కూడా కోల్పోతానేమో అన్న భయం నన్ను చాలా బాధిస్తోంది. ఇది నా ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తోంది. దయచేసి మార్గనిర్దేశం చేయండి.– రూప, కర్నూలుగర్భధారణలో తొలి పన్నెండు వారాలను ఫస్ట్ ట్రైమెస్టర్ అంటారు. ఈ దశలో బిడ్డ ముఖ్యమైన అవయవాలు అభివృద్ధి చెందుతాయి. అదే సమయంలో గర్భస్రావం వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. అందుకే ఈ దశలో రక్తస్రావం, కడుపు నొప్పి వంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయకూడదు. అయితే ప్రతి రక్తస్రావం గర్భస్రావానికే సంకేతం కాదు. ఇంప్లాంటేషన్ బ్లీడింగ్, హార్మోన్ల మార్పులు, గర్భాశయంలో చిన్న మార్పుల వలన కూడా రక్తస్రావం రావచ్చు. ఇవి సాధారణంగా హానికరం కావు. కాని, రక్తస్రావం వచ్చిన ప్రతిసారీ డాక్టర్ను సంప్రదించాలి. డాక్టర్ మీ వైద్య చరిత్ర తెలుసుకొని, శరీరపరీక్ష చేసి, అల్ట్రాసౌండ్ స్కాన్ చేస్తారు. బిడ్డ ఆరోగ్యంగా ఉంటే ఎక్కువగా ఆందోళన అవసరం ఉండదు. చికిత్సలో భాగంగా విశ్రాంతి తీసుకోవడం, ఒత్తిడిని తగ్గించుకోవడం ముఖ్యమైనవి. కొన్నిసార్లు ప్రొజెస్టరాన్ మందులు ఇస్తారు. రక్తస్రావం అధికంగా ఉంటే ఆసుపత్రి పర్యవేక్షణ అవసరం కావచ్చు. గతంలో గర్భస్రావం అనుభవించారని, ఇప్పుడు కూడా మళ్లీ అదే జరుగుతుందని భావించాల్సిన అవసరం లేదు. ప్రతి గర్భస్రావం తర్వాత మళ్లీ అదే జరుగుతుందన్న నిబంధన లేదు. సమయానికి వైద్యుల సహాయం తీసుకుంటే చాలామంది మహిళలు సురక్షితంగా గర్భధారణను కొనసాగించి, ఆరోగ్యవంతమైన బిడ్డలకు జన్మనిస్తున్నారు. కాబట్టి ప్రశాంతంగా ఉండి వైద్యుల సూచనలు పాటించడం అత్యంత ముఖ్యం. డా. కడియాల రమ్య, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్ -
ఈ సబ్బు క్యాన్సర్కు ఆన్సర్!
అందం కోసం వాడే సబ్బును ఒక బాలుడు క్యాన్సర్ వ్యాధి మీద ప్రయోగించే ఆయుధంగా మార్చాడు. ఆశ్చర్యంగా ఉంది కదూ? కాని, ఇది నిజం. అమెరికాకు చెందిన పదిహేనేళ్ల హీమన్ బెకెలె తయారు చేసిన ఈ సబ్బు ప్రస్తుతం స్కిన్ క్యాన్సర్ రోగులకు వరంగా మారింది. ఈ ప్రత్యేకమైన సబ్బు చర్మంలోని రోగనిరోధక వ్యవస్థను ఉత్తేజపరచి, క్యాన్సర్ కణాలను ఎదుర్కొనేలా చేస్తుంది. సింపుల్గా చెప్పాలంటే, ఈ సబ్బు వాడితే చర్మంపై ఉన్న మలినాలకే కాదు, చర్మం లోపల చాపకింద నీరులా దాగి ఉన్న క్యాన్సర్ కణాలకు కూడా గుడ్బై చెప్పొచ్చు! కీమోథెరపీ, వేల కొద్దీ మాత్రలు అవసరం లేకుండా, ఒక చిన్న సబ్బుతోనే క్యాన్సర్కు చెక్ పెట్టొచ్చు. ప్రస్తుతానికి ఇది ఇంకా పరిశోధనల దశలో ఉన్నప్పటికీ, శాస్త్రవేత్తలు దీని పనితీరుపై విశ్వాసంతో ఉన్నారు. ఇది కచ్చితంగా ఉపయోగకరమైన ఫలితాలను ఇస్తుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ అద్భుత ఆవిష్కరణకు గుర్తింపుగా హీమన్ బెకెలెకు టైమ్ మ్యాగజైన్ ‘2024 కిడ్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు లభించింది. అంతేకాదు, ‘త్రీ ఎమ్ యంగ్ సైంటిస్టు’ చాలెంజ్లో పాల్గొని, పాతికవేల డాలర్లు (అంటే రూ. 21,82,600) నగదు బహుమతిని కూడా గెలుచుకున్నాడు. ఇంత డబ్బు వచ్చిందని పుస్తకాలకు గుడ్బై చెప్పలేదీ హీమ¯Œ . స్కూల్లో క్లాసులు, హోమ్వర్క్ల మధ్యలో కూడా ఫార్ములాలను కలిపి ఈ క్యాన్సర్ కిల్లింగ్ సబ్బు మీద తన పరిశోధనను కొనసాగిస్తున్నాడు. దీనిని త్వరలోనే పెద్దస్థాయిలో ఉత్పత్తి చేసి, అవసరమున్నవారికి ఉచితంగా అందించాలన్న ఆశయంతో ఒక స్వచ్ఛంద సంస్థను స్థాపించాలని కలలు కంటున్నాడు.అలా మొదలైంది!ఇంత చిన్న వయసులోనే ఇలాంటి గొప్ప ఆలోచన రావడానికి ఓ గట్టి కారణం ఉంది. హీమన్ పుట్టిన ఇథియోపియాలో ప్రజలకు తగినన్ని వైద్య సౌకర్యాలు లేకపోవడాన్ని చిన్నప్పుడే గమనించాడు. అందుకే, ‘అందరికీ వైద్య సౌకర్యాలు అందాలంటే ఎలా?’అనే ప్రశ్నతో మొదలుపెట్టి, అందరికీ చౌకగా, సులభంగా చికిత్స అందించే మార్గాన్ని వెతికాడు. ఆ వెతుకులాట చివరకు బాత్రూమ్ షెల్ఫ్పై ఉన్న సాధారణ సబ్బు దగ్గర ఆగింది. అలా రోజూ వాడే సబ్బులో శాస్త్ర విజ్ఞానాన్ని, రసాయనాలను కలిపి, ఒక మహాశక్తిమంతమైన ఆయుధంగా మార్చేశాడు. -
జస్ట్ నాలుగు నెలల్లో 25 కిలోలు తగ్గింది..! అమూల్యమైన ఆ ఏడు పాఠాలివే..
బరువు తగ్గడం అనేది అదిపెద్ద క్లిష్టమైన టాస్క్. తగ్గడం అంత ఈజీ కాదు. ఆ క్రమంలో ఒక్కోసారి తగ్గినట్లు తగ్గి..మళ్లీ యథాస్థితికి వచ్చినవాళ్లు కూడా ఉన్నారు. అయితే అందరు ఈ వెయిట్ లాస్ జర్నీలో కొన్ని పొరపాట్లు చేస్తుంటారని, వాటిని సర్దుబాటు చేసుకుంటే కిలోలు కొద్ది బరువు సులభంగా తగ్గిపోగలమని అంటోంది ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ అమకా. తనకు స్లిమ్గా మారడంలో హెల్ప్ అయిన ఏడు జీవనశైలి పాఠాలను కూడా సోషల్మీడియా వేదికగా షేర్ చేసుకుంది. అవేంటో చూద్దామా..!.బరువు తగ్గాలంటే కచ్చితంగా మన జీవనశైలిలో అతిపెద్ద మార్పులు చేయక తప్పదని అంటోంది. దాంతోపాటు ఓర్పు, క్రమంతప్పకుండా వ్యాయామం చేయడం, ఆరోగ్యకరమైన ఆహారం అత్యంత కీలకమని అంటోందామె. తాను ఆక్రమంలో ఏడు అద్భుతమైన పాఠాలను నేర్చుకున్నట్లు వివరించింది. ప్రస్తుతం తాను నాలుగు నెలల్లో అద్భుతంగా 25 కిలోలు అమాంతం తగ్గిపోయినట్లు ఇన్స్టా పోస్ట్లో తెలిపింది. నిజానికి ఎందువల్ల త్వరగా బరువు తగ్గలేకపోతున్నామనే దాని గురించి ఓపెన్గా మాట్లాడరని అంటెంది. అన్ని చేస్తున్న కొండలాంటి మన శరీరం ఏ మాత్రం మార్పు చెందని ఫీల్ కలుగుతుంటుంది. అలాంటి బరువుని తగ్గించాలంటే ఈ మార్పులు స్వాగతించండి, డైలీలైఫ్లో భాగం చేసుకోండని అంటోంది. అవేంటంటే..ఆకలి అనేది చిరుతండి లేదా మరొక ఎక్స్ట్రా ప్లేట్ ఆహారం కాదని నమ్మండి, ఆకలిగా అనిపించిన ప్రతిసారి తినేందుకు త్వరపడొద్దు. నిద్ర కూడా అత్యంత ముఖ్యమైనదని గ్రహించండని హెచ్చరిస్తోంది. నిద్ర కూడా మన బాడీకి ఒక ఆహారం లాంటిదేనని తెలుసుకోండని చెబుతోంది. తగినంత నిద్ర లేకపోతే తినాలనే కోరికలు ఎక్కువవుతాయట. స్థిరత్వం పరిపూర్ణమైన మార్పులకు మచ్చు తునక అట. దానికి ప్రాధాన్యత ఇస్తే..సకాలంలో మెరుగైన ఫలితాలు పొందడమే గాక చాలామటుకు లిమిటెడ్గా తినడాన్ని బ్యాలెన్స్ చేయగలుగుతారు. స్ట్రెంగ్స్ ట్రైనింగ్ కార్డియో వ్యాయామాల కంటే మెరుగ్గా పనిచేశాయాని చెబుతోంది. బరువులు ఎత్తడం, తన శరీర ఆకృతిని మార్చడంలో హెల్ప్ అయ్యిందని అంటోంది.అలాగే చక్కెర తగ్గించడం అనేది బరువు తగ్గడంలో చక్కటి గేమ ఛేంజర్ అని అంటోంది. సోడాలు, స్వీట్లు, పేస్ట్రీలకు దూరంగా ఉండటంతో.. వెంటనే బొడ్డు కొవ్వు తగ్గడం ప్రారంభించిందని అంటోంది. ఇవేగాక రాత్రిపూట తాగే హెర్బల్ పానీయాలు బరువు తగ్గడంలో కీలక పాత్ర పోషిస్తాయని అంటోంది. అవి ఆకలి కోరికలను నియంత్రిస్తాయని చెబుతోంది. ఉదా: లెమెన్ టీ, అల్లం టీ, యాపిల్ సైడ్ వెనిగర్, దాల్చిన చెక్క టీ వంటివి. వీటన్నింటి తోపాటు నియామానుసారంగా ఈ అలవాట్లను పాటించడం అనే క్రమశిక్షణ తనకు మరింత బాగా హెల్ప్ అయ్యిందని అంటోంది. అన్నింట్లకంటే బరువు తగ్గాలనే ఇంటెన్షన్తో కూడిన స్థిరత్వం కలిగిన మనసు అత్యంత ప్రధానమని, అప్పుడే సత్ఫలితాలను సులభంగా అందుకోగలమని అంటోంది ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ అమాక. కాగా, నెటిజన్లు ఈ పోస్ట్ని చూసి..బరువు తగ్గడంలో సత్ఫలితాలు అందాక దాదాపు ఆశను వదిలేసుకున్నాం. మీరిచ్చిన ఉత్తమ సలహాలతో కొంగొత్త ఆశ రెకెత్తించిందంటూ పోస్టు పెట్టారు. అయితే అమాక మాత్రం మన నిర్దేశిత లక్ష్య బరుని చేరుకోవడం అనేది అంత సులభం కాదని గుర్తెరగండి. కేవలం అటెన్షన్ అనే, స్థిరత్వం అనేవే టార్గెట్ని రీచ్ అయ్యేలా బరువు తగ్గుతామని గ్రహించండని సూచిస్తోంది.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: పారాగ్లైడింగ్ చేస్తూ లైవ్ మ్యూజిక్ ప్లే చేసిన మహిళ..!) -
పోషకాల బ్రేక్ఫాస్ట్..!
ఒక రోజంతా శక్తిమంతంగా, ఉత్సాహంగా గడిచిందంటే వారిపై ఆ రోజు ఉదయాన్నే తీసుకునే అల్పాహారం ప్రభావం తప్పక ఉంటుంది. పిల్లల జ్ఞాపకశక్తికీ పోషకాలు గల ఆహారం ఎంతో మేలు చేస్తుంది. ఉదయాన్నే పిల్లలు, పెద్దలు తీసుకునే బలవర్ధకమైన, సులువుగా తయారు చేసుకునే వంటకాలు ఇవి.. హెల్తీ మిక్స్ హల్వాకావల్సిన పదార్థాలుహెల్త్ మిక్స్ – కప్పు (క్యారెట్ లేదా బీట్రూట్ లేదా గుమ్మడి తురుము లేదా గోధుమ నూక); నెయ్యి – 2 టేబుల్ స్పూన్లు; బెల్లం లేదా కొబ్బరి చక్కెర – 1/4 కప్పు; పాలు – కప్పు; బాదం, జీడిపప్పు, చియా సీడ్స్ – టేబుల్ స్పూన్;తయారీ విధానంపాన్లో నెయ్యి వేడి చేసి, హెల్తీ మిక్స్ వేసి, బాగా వేయించాలి. పాలు పోసి, కలుపుతూ ఉండాలి.. మిశ్రమం చిక్కగా అయ్యాక, తురిమిన బెల్లం, కొబ్బరి చక్కెర ’కోకో షుగర్) వేసి బాగా కలపాలి. అన్నీ పూర్తిగా కలిసే వరకు మరో 2–3 నిమిషాలు ఉడికించాలి.తరిగిన డ్రై ఫ్రూట్స్ అలంకరించి, సర్వ్ చేయాలి. పోషకాలు: పిల్లలకు, పెద్దలకు ఇష్టమైనదే కాదు... మంచి పోషకాలు కూడా ఉండే స్వీట్ ఇది. బెల్లం లేదా కొబ్బరి చక్కెర వాడటం వల్ల ఐరన్ సమృద్ధిగా లభిస్తుంది. బీట్రూట్, క్యారట్, గుమ్మడిలో పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు లభిస్తాయి. పాల మిశ్రమం కాబట్టి క్యాల్షియమూ అందుతుంది. చిల్లాకావల్సిన పదార్థాలు: పెసరపప్పు – కప్పు (తగినన్ని నీళ్లు ΄ోసి, రెండు గంటలసేపు నానబెట్టాలి); నీళ్లు – అర కప్పు (తగినన్ని); ఉల్లిపాయ – చిన్నది (సన్నగా తరగాలి); పచ్చి మిర్చి – సన్నగా తరగాలి; కొత్తిమీర తరుగు – టేబుల్ స్పూన్; ఉప్పు – రుచికి తగినంత; నూనె – తగినంత.తయారీ విధానంపెసరపప్పును వడకట్టి, నీళ్లు కలిపి, మెత్తగా రుబ్బుకోవాలి. పిండిని గిన్నెలోకి తీసుకొని (క్యారెట్ తురుము, పాలకూర తరుగు, నానబెట్టిన ఓట్స్ కూడా కలుపుకోవచ్చు) తరిగిన ఉల్లిపాయలు, పచ్చి మిర్చి తరుగు, కొత్తిమీర, ఉప్పు వేసి కలపాలి. పెనం వేడి చేసి, ఒక గరిటెతో పెనం పైన పిండి పోసి, దోసెలా వెడల్పు చేయాలి. మీడియం మంట మీద రెండు వైపులా గోధుమ రంగు వచ్చేవరకు ఉంచాలి. కొత్తిమీర, పుదీనా చట్నీతో వేడిగా సర్వ్ చేయాలి.పోషకాలుక్యాలరీలు తక్కువగా ప్రోటీన్లు, క్యాల్షియం, ఐరన్, జింక్ సమృద్ధిగా లభించే ఈ చిల్లా ఉదయం, సాయంత్రం స్నాక్గా తీసుకోవచ్చు. పిల్లలకు లంచ్ బాక్స్లోకీ బాగుంటుంది. దీనిని రోల్ చేసి, ఉడికించిన కూరగాయలతో స్టఫ్ చేసి కూడా అందివ్వవచ్చు. హెల్తీ మిక్స్ పరాఠాకావల్సిన పదార్థాలుహెల్తీ మిక్స్ (రాగులు, జొన్న, సజ్జలు, కొర్రలు మొలకెత్తిన గింజలు, గుమ్మడి, అవిసెగింజలతో చేసిన పిండి) – కప్పు; నెయ్యి లేదా నూనె – టీ స్పూన్; ఉప్పు – తగినంత; గోరువెచ్చని నీళ్లు (తగినన్ని); తయారీ విధానంఒక గిన్నెలో, మిల్లెట్ మిక్స్, ఉప్పు వేయాలి. గోరువెచ్చని నీటిని క్రమంగా వేస్తూ, పిండిని మెత్తని ముద్దలా అయ్యేలా బాగా కలపాలి. చేతులకు నూనె లేదా నెయ్యి రాసుకొని, చిన్న చిన్న ముద్దలుగా తీసుకోవాలి. రెండు బటర్ పేపర్ షీట్ల మధ్య పిండి బాల్ ఉంచి, చపాతీ కర్రతో మెల్లగా, తేలికపాటి ఒత్తిడితో, రోల్ చేయాలి. పెనం వేడి చేసి, ప్రతి పరాఠాను సన్నని మంట మీద కొద్దిగా నెయ్యి/నూనెతో బంగారు గోధుమ రంగు వచ్చే వరకు రెండు వైపులా కాల్చాలి. చట్నీ లేదా పెరుగుతో వేడిగా వడ్డించాలి. పోషకాలు: పరాటాకు కూరగాయలను ఉడికించి, వాడుకోవచ్చు. ఏమేం దినుసులు, కూరగాయలు వాడుతున్నామో దానిని బట్టి కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్లు, క్యాల్షియం, ఐరన్ సమృద్ధిగా లభిస్తాయి. (చదవండి: కూల్ మాన్సూన్లో..స్పెషల్ హాట్ ట్రీట్స్..!) -
ఆరుపదులు దాటినా ఫిట్గా కనిపించాలంటే..! నాగార్జున ఫిట్నెస్ మంత్ర.
టాలీవుడ్ కింగ్, హీరోయిన్ల మన్మథుడు హీరో నాగార్జున ఇవాళ 67వ వసంతంలోకి అడుగుపెడుతున్నారు. అయితే ఆయన ఇప్పటికీ అంతే గ్లామర్గా టోన్డ్ బాడీతో ఆకర్షణగా కనిపిస్తారు. ఆగస్టు 29 ఆయన పుట్టిన రోజు సందర్భంగా అంతలా ఫిట్గా ఉండేందుకు నాగార్జున ఎలాంటి వ్యాయామాలు చేస్తుంటారు, ఆరుపదులు వయసులో కూడా అంతలా యంగ్గా కనిపించేందుకు ఎలాంటి చిట్కాలు అనుసరిస్తారు వంటి వాటి గురించి సవివరంగా తెలుసుకుందామా..!.నాగార్జున ఇంచుమించుగా గత 30 లేదా 35 సంవత్సరాలుగా వర్కౌట్లు చేస్తూనే ఉన్నారు. ఎన్నడు స్కిప్ చేయలేదని ఆయన ఫిట్నెస్ ట్రైనర్ చెబుతున్నారు. ఒక ఇంటర్వ్యూలో కూడా క్రమంతప్పకుండా వ్యాయామం చేస్తానని ఆయనే స్వయంగా చెప్పారు. వాటిలో కార్డియో, స్ట్రెంగ్త్ ట్రైనింగ్ వంటి వ్యాయామాలు తప్పనిసరి. అయితే అవన్ని ప్రతి ఉదయం జస్ట్ 45 నిమిషాల నుంచి ఒక గంట వరకే చేస్తారట. అంతలా ఫిట్గా ఉండటానికి రీజన్..క్రమంతప్పకుండా వ్యాయామం చేయడం అనేది తప్పనిసరి అని చెబుతున్నారు నాగార్జున. అంతేగాదు పనిచేయకుండానైనా ఉంటాను గానీ వ్యాయామం చేయకుండా అస్సలు ఉండనని చెబుతున్నారు. మేల్కొన్న వెంటనే వ్యాయామం తన తొలి ప్రాధాన్యతని చెబుతున్నారు. కచ్చితంగా వారానికి ఐదు నుంచి ఆరు రోజులు వర్కౌట్లనేవి తన దినచర్యలో భాగమని చెబుతున్నారు. అయితే అవి చాలా తీవ్రంగా ఉంటాయట.ఆ ఏజ్లో కూడా యంగ్గా కనిపించాలంటే..వర్కౌట్ల సమయంలో తన హృదయ స్పందన రేటును గరిష్ట రేటు 70 శాతం కంటే ఎక్కువగా ఉంచుకోవడం ఎలాగై తన ట్రైనర్ నేర్పించాడని తెలిపారు నాగార్జున. అధిక జీవక్రియను నిర్వహించడానికి వర్కౌట్ల సమయంలో విశ్రాంతి , పరధ్యానం అనేవి అస్సలు పనికిరావని, పైగా మెరుగైన ఫలితాలు అందుకోలేమని చెప్పారు. చేసేపని చిన్నదైన, పెద్దదైనా ఫోకస్, స్కిప్ చేయని అంకిత భావం అంత్యంత ముఖ్యమని, అప్పుడే ఎప్పటికీ యవ్వనంగా ఉండగలమని పరోక్షంగా చెప్పకనే చెప్పారు హీరో నాగార్జున. View this post on Instagram A post shared by Aalim Hakim (@aalimhakim) (చదవండి: ఫుడ్ డెలివరికి వెళ్లి కస్టమర్కి ప్రపోజ్ చేశాడు ..కట్చేస్తే..!) -
స్ట్రెంగ్త్ ట్రైనింగ్తో ఆ అమ్మ లైఫే మారిపోయింది..! బీపీ, షుగర్ మాయం..
ఓ వయసు వచ్చాక రోగాల బారినపడటం అనేది సహజం. అయితే అప్పటికైనా తేరుకుని జీవనశైలిలో మార్పులు, ఫిట్నెస్పై దృష్టిసారించి కేర్ తీసుకుంటే చాలు. చాలామటుకు వ్యాధులు తగ్గుముఖం పడతాయి. ఇక్కడ ఆలస్యం అనే పదం గాక..ఆశావాహ దృక్పథానికి చోటిస్తే..కచ్చితంగా అద్భుతాలు తప్పక జరుగుతాయి. అందుకు నిదర్శంన ఈ అమ్మే..!. పాపం నడవలేక ఇబ్బంది పడింది. ఓ పక్క మధుమేహం, బీపీతో నరకం చూసింది. అలాంటామె కొడుకు సపోర్టుతో ఎంతలా ఆమె జీవితం మలుపు తిరిగిందంటే..ఈమె ఆమేనా అనే సందేహం కలిగేంతలా చురుగ్గా మారిపోయింది. ఓ అథ్లెటిక్ మాదిరిగా తయారైంది. అంతేగాదు చుట్టుముట్టిన అనారోగ్య సమస్యలన్ని ఒక్కొక్కటిగా మాయమైపోయాయి. ఎలా అంటే..ఫిట్నెస్ నిపుణుడు కుల్విందర్ సింగ్ ఆరోగ్యవంతంగా మారిన తన 59 ఏళ్ల తల్లి కథను ఇన్స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసుకున్నారు. తన తల్లి ఒకప్పుడు డయాబెటిస్ , రక్తపోటు సమస్యలతో బాధపడుతుండేదని తెలిపారు. వాటికి తోడు ఆర్థరైటిస్ సమస్య కూడా జత అవ్వడంతో కనీసం బాత్రూమ్కి కూడా వెళ్లలేని పరిస్థితికి చేరుకుందని చెప్పుకొచ్చారు. తన పరిస్థితి చూసి తనకే బాధగా అనిపించేదని అన్నారు. కనీసం కాలు కదిపేందుకు చాలా బాధపడిపోయేదన్నారు. శరీరంలో యూరిక్ యాసిడ్స్ పెరిగిపోయి ఆమెకు కనీసం మోకాలిని వంచలేని పరిస్థితికి వచ్చేసింది. ఫలితంగా ఆమె 90 కిలోల అధిక బరువు కూడా చేరుకున్నట్లు తెలిపారు. ఇక ఇలానే ఉంటే ఆమె పరిస్థితి క్రిటికల్గా మారిపోతుందని తానే ఆమెను జిమ్కు తీసుకువెళ్లి బల శిక్షణ తీసుకోవాల్సిందిగా బలవంతం చేశారట.అద్భుతమైన పరివర్తన..దాంతో ఆమె పరిస్థితి రెండు నెలల్లోనూ పూర్తిగా మారిపోయిందిచి. పైగా మెరుగైన ఫలితాలు కనిపించాయని అన్నారు. చెప్పాలంటే శరీరంలో కొవ్వు చాలామటుకు తగ్గిపోయిందని చెప్పారు. రక్తపోటు, మధుమేహం సాధారణ స్థితికి వచ్చేశాయి. అలాగే ఆమె మోకాలి నొప్పి 50% మెరుగ్గా ఉండటమేగాక, చాలా అద్భుతమైన మార్పులు చోటుచేసుకున్నాయని అన్నారు.స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అంటే..బరువులు ఎత్తడం వంటి శిక్షణతో కండరాలను బలోపేతం చేయడం. ఇక్కడ కుల్విందర్ సింగ్ తల్లి ఒక గంటపాటు నిరంతరాయంగా నడవడం, రెండు గంటల వ్యాయామం, 40 కిలోలు వరకు బరువులు ఎత్తడం వంటివి చేసేది. ఒక నిమిషం పైనే ప్లాంక్ పొజిషన్లో ఉండటం వంటివి చేసి అద్భుతమైన మార్పులు చవిచూశారామె. అంతేగాదు జస్ట్ ఆరు నెలలకే చలాకీగా పరిగెత్తగలిగింది. వృద్ధాప్యంలో ఇలాంటివి చేయడం గురించి ఆలస్యంగా పరిగణించొద్దు..ఆరోగ్యవంతమైన మార్పుకి గ్రాండ్ వెల్కమ్ చెప్పడమని భావించండి అని చెబుతున్నారు ఫిట్నెస్ నిపుణులుడు కుల్విందర్ సింగ్స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ప్రాముఖ్యత..కార్డియో, యోగా, పైలేట్స్ వంటి ఇతర రకాల వ్యాయామాలు మానసిక ఆరోగ్యానికి మంచివైతే ఈ బల శిక్షణ అనేది జీవన నాణ్యతను మెరుగుపరుస్తుందట. అంతేగాదు రోజువారీ కార్యకలాపాలను చేసేలా సామర్థ్యాన్ని పెంపొందించుకునేలా చేస్తుందని పరిశోధనలో తేలింది. అంతేగాదు ప్రపంచవ్యాప్తంగా జరిగిన 16 అధ్యయనాల్లో కండరాలను బలోపేతం చేసే వ్యాయామాలు ఆయుర్ధాయాన్ని పెంచుతాయని నిరూపితమైంది కూడా. ఇది కండర ద్రవ్యరాశిని సంరక్షించడమే కాదు పెంచేందుకు సహాయపడుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) ప్రకారం, ఇది కండరాలు, ఎముకల పెరుగుదలను ప్రేరేపించి బోలు ఎముకల వ్యాధి, బలహీనతలను నివారించి, తద్వారా ఆరోగ్యవంతంగా ఉండేలా చేస్తుందట. View this post on Instagram A post shared by Kulwinder Singh (@freebird.sodhi)గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వ్యైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: కూలీ కుమార్తె సక్సెస్ స్టోరీ..! టీసీఎస్ నుంచి ఐఏఎస్ రేంజ్కి..) -
లైవ్ ఈవెంట్లో కుప్పకూలిన నటుడు, వెంటిలేటర్పై చికిత్స
ప్రముఖ నటుడు, టెలివిజన్ ప్రెజెంటర్ రాజేష్ కేశవ్ (47), అలియాస్ RK ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. ఒక లైవ్ ఈవెంట్లో కుప్పకూలి, కొచ్చిలోని ఒక ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో ఆయన త్వరగా కోలుకోవాలంటూ అభిమానులు, పరిశ్రమపెద్దలు సోషల్ మీడియా ద్వారా కోరుకుంటున్నారు.ఆసుపత్రి వర్గాల సమాచారం ప్రకారం, ఆయనకు గుండెపోటు రావడంతో యాంజియోప్లాస్టీ చేయించుకున్నారు. ఇంటెన్సివ్ కేర్ యూనిట్లోవెంటిలేటర్ సహాయంతో చికిత్స పొందుతున్నారు. అయితే మెదడు ప్రభావితమైందని, ప్రస్తుతం పరిస్థితి విషమంగా ఉందని, రాబోయే 72 గంటలు చాలి క్లిష్టమైనవని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి .దీంతో కేశవ్ త్వరగా కోలుకోవాలంటూ సన్నిహితులు, స్నేహితులు, సహచరులు కన్నీరుమున్నీరవుతున్నారు.ఆదివారం (ఆగస్టు 24) రాత్రి ఆదివారం రాత్రి కొచ్చిలో ఒక పబ్లిక్ ప్రోగ్రాం నిర్వహిస్తూ అకస్మాత్తుగా వేదికపై కుప్పకూలిపోయారు. నిర్వాహకులు, వైద్య సిబ్బంది వెంటనే స్పందించి అత్యవసర చికిత్స కోసం వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు రాజేష్కు అత్యవసర యాంజియోప్లాస్టీ చేశారు. ప్రస్తుతం ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో వెంటిలేటర్పై ఉన్నారని, వైద్యులు అతని పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నారంటూ,ఈ ఘటన సందర్బంగా, అక్కడే ఉన్న చిత్రనిర్మాత ప్రతాప్ జయలక్ష్మి సోషల్ మీడియా ద్వారా అప్డేట్ను పంచుకున్నారు.ఎవరీ రాజేష్ కేశవ్?కేరళలో టెలివిజన్ యాంకర్గా రాజేష్ కేశవ్ చాలా పాపులర్. అనేక హిట్ రియాలిటీ, టాక్ షోల ద్వారా అపారమైన ప్రజాదరణను సంపాదించుకున్నారు. ఈ క్రమంలోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి తనదైన నటనతో విమర్శకుల ప్రశంసలను దక్కించుకున్నాడు.ఇదీ చదవండి: ఈ గుడిలో ఎలుక రాజా చెవిలో చెబితే చాలు.. అన్ని శుభాలే!కార్డియాక్ అరెస్ట్ అంటే?గుండె అకస్మాత్తుగా సరిగ్గా కొట్టుకోవడం ఆగిపోయి, మెదడు, ఇతర ముఖ్య అవయవాలకు రక్త ప్రవాహం నిలిచిపోవడం.గుండెపోటులాగా కాకుండా ఈ షాక్ వల్ల ఒక్కోసారి గుండె ఆగిపోయే ప్రమాదం ఉంది.ఆకస్మికంగా కుప్పకూలడం, స్పృహ కోల్పోవడం , పల్స్ లేకపోవడం వంటివి తక్షణ లక్షణాలు.CPR (కార్డియోపల్మోనరీ రిససిటేషన్) వంటి తక్షణ చర్యలు , డీఫిబ్రిలేటర్ వాడకం కీలకం.చికిత్సకు స్పందించకపోతే, రాజేష్ విషయంలో లాగా, రోగులకు తరచుగా ఇంటెన్సివ్ కేర్ చికిత్స అవసరం.లక్షణాలు: తీవ్రమైన తలనొప్పి, ఆందోళన ,గందరగోళం, తలతిరగడం , వాంతులు రావడం, రెండు లేదా ఒక కన్ను చూడటంలో ఇబ్బంది చేతులు, కాళ్ళు ,ఇతర శరీరంభాగాల్లో తిమ్మిరి లేదా బలహీనత లాంటి లక్షణాలుంటే వెంటనే అప్రమత్తం కావాలి. నివారణ ఎలా?ఆరోగ్యకరమైన జీవనశైలిని, కొన్ని ముందు జాగ్రత్త చర్యల ద్వారా కార్డియాక్ అరెస్ట్ ముప్పునుంచి తప్పించుకోవచ్చు.క్రమం తప్పకుండా వ్యాయామం, ధూమపానం, మద్యపానానికి దూరంగా ఉండాలి.కొలెస్ట్రాల్ , రక్తపోటు స్థాయిలను క్రమం తప్పకుండా చెక్ చేసుకోవడం. కుటుంబంలో గుండె జబ్బుల చరిత్ర ఉంటే మరీ జాగ్రత్తగా ఉండాలి. క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకోవాలి.ఆరోగ్యకరమైన, సమతులం ఆహారం తీసుకోవాలి. ఎత్తుకు తగిన బరువు ఉండేలా చూసుకోవాలి.. బరువును అదుపులో ఉంచుకోవడం వల్ల చాలా అనారోగ్యాలనుంచి దూరంగా ఉండవచ్చు. చదవండి : దేశంలోనే రిచెస్ట్ గణపతిగా రికార్డు, భారీ బీమా -
విటమిన్ డి లోపం... ఎన్నో ఆరోగ్య సమస్యలు
స్వాభావికంగానే విటమిన్ ‘డి’ని పొందాలంటే... ముఖం, చేతులు, భుజాలు వంటి శరీర భాగాలను సాధ్యమైనంత వరకు లేత ఎండకూ లేదా హాని చేయనంత సూర్యకాంతికి ఎక్స్΄ోజ్ అయ్యేలా సూర్యోదయ వేళల్లో ఆరుబయట నడవడం మేలు. ఒకవేళ మాత్రలు సరిపడనివారు నేచురల్గానే విటమిన్–డి ని పొందాలని అనుకుంటే తీసుకోవాల్సిన ఆహారాలివి...విటమిన్ ‘డి’లో అనేక రకాలు... ‘విటమిన్ డి’లో విటమిన్ డి1, డి2, డి3...డి7... ఇలా చాలా రకాలు (దాదాపు పది వరకు) ఉన్నాయి. కానీ వాటిల్లో విటమిన్ డి2 (ఎర్గో క్యాల్సిఫెరాల్), విటమిన్ డి3 (కోలీ క్యాల్సిఫెరాల్) చాలా ముఖ్యమైనవి, కీలక మైనవి. విటమిన్–డి లోపాలతో వచ్చే సమస్యలు... విటమిన్–డి లోపాలతో వచ్చే ఆరోగ్య సమస్యల జాబితా చాలా పెద్దదే. అందుకే ఇటీవల సాధారణ ఆరోగ్య సమస్యలతో ఆసుపత్రులకు వెళ్లే బాధితుల్లో విటమిన్‘డి’ లోపాన్ని డాక్టర్లు ఎక్కువగా కనుగొంటున్నారు.శరీరంలో ఖనిజలవణాల అసమతౌల్యత (ముఖ్యంగా జింక్, ఐరన్, ఫాస్ఫరస్ వంటివి) హార్మోన్ల అసమతౌల్యత అత్యంత వేగంతో భావోద్వేగాలు మారిపోవడం (మూడ్స్ స్వింగింగ్) మానసిక ఆరోగ్యం దెబ్బతినడం గర్భవతుల్లో పిండం ఎదుగుదలలో లోపాలు ∙మెదడు కణాలైన న్యూరాన్లు (నరాల కనెక్షన్లలో) లోపాలు కండరాల కదలికల్లో సమన్వయ లోపాలు రక్తపోటు ధమనుల్లో రక్తప్రసరణ లోపాలుచక్కెర నియంత్రణలో లోపాలు దంతసంబంధమైన సమస్యలు కణ విభజనలో లోపాలు ఎముకల బలం లోపించడం వ్యాధి నిరోధక శక్తి తగ్గడం రికెట్స్ వ్యాధి ఆస్టియో పోరోసిస్ ఆస్టియోమలేసియా ఒక్కోసారి ఫిట్స్ రావడం మొదలైనవి. వాస్తవానికి ఆహారపదార్థాల ద్వారా లభ్యమయ్యేదాని కంటే సూర్యరశ్మికి తాకినప్పుడు చర్మం కింది పొరలో దీని ఉత్పత్తి ఎక్కువ. అయినప్పటికీ కొద్ది మోతాదుల్లో కొన్ని రకాల ఆహారపదార్థాల నుంచి అది లభిస్తుంది. అవి... ఏయే పదార్థాలలో ఎంతెంత...? ఆహార పదార్థం పరిమాణం (మైక్రోగ్రాముల్లో) కాడ్లివర్ ఆయిల్ 175 షార్క్ లివర్ ఆయిల్ 50 గుడ్లు (పచ్చసొనతో) 1.5 నెయ్యి 2.5 వెన్న 1.0(ఇవన్నీ 100 గ్రాముల ఎడిబుల్ పోర్షన్లో లభించే మోతాదులు)చేపల్లో... చేపల కాలేయాల్లో లభ్యమయ్యే నూనెల్లో విటమిన్ డి సమృద్ధిగా లభ్యమవుతుంది. మరీ ముఖ్యంగా కాడ్, మాక్రెల్, సొరచేప (షార్క్), సార్డైన్, ట్యూనా వంటి చేపల కాలేయాలలో విటమిన్–డి ఎక్కువ. మాంసాహారాల వంటి యానిమల్ సోర్స్ నుంచి... వేటమాసం, అందులోనూ ప్రత్యేకంగా కాలేయం మాంసంలో; అలాగే వెన్న, నెయ్యి, గుడ్డులోని పచ్చసొనలో ‘విటమిన్–డి’ ఎక్కువ. ఇటీవల చాలామంది పచ్చసొన ఆరోగ్యానికి మంచిది కాదంటూ దాన్ని తీసుకోవడం లేదు. కానీ గుడ్డు తాలూకు పచ్చసొనలో కొలెస్ట్రాల్తోపాటు క్యాల్సిటరాల్ అని పిలిచే విటమిన్–డి ఉంటుంది. కాబట్టి విటమిన్–డి పొందాలనుకునే వాళ్లు గుడ్డులోని పచ్చసొన తీసుకోవడం చాలా మంచిది. పచ్చసొన తీసుకోకపోవడం వల్ల ఆరోగ్యానికి కలిగే మేలు కంటే క్యాల్సిటరాల్ వంటి ఎన్నో పోషకాలను పోగొట్టుకోవడం ద్వారా పొందే నష్టమే ఎక్కువ. అందుకే పరిమిత స్థాయిలో పచ్చసొన తీసుకోవడం ఆరోగ్యానికి మంచి చేస్తుందని గుర్తించాలి.మష్రూమ్స్లో... పుట్టగొడుగుల్లో (మష్రూమ్స్లో) విటమిన్–డి2 సమృద్ధిగా దొరుకుతుంది. విటమిన్–డి లోపం ఉన్నవారు పుట్టగొడుగులతో చేసిన రకరకాల ఆహార పదార్థాలు తీసుకోవడంతో పాటు ఎండలో నడవటం వల్ల స్వాభావికంగానే విటమిన్–డి2 లభ్యమవుతుంది.ఫోర్టిఫైడ్ ఆహారాల్లో... పాలు, జ్యూస్ వంటి కొన్ని రకాల ఆహారపదార్థాల్లో ఇతర పోషకాలతో మరింత సంతృప్తమయ్యేలా చేస్తారు. ఇలాంటి ఆహారాలను ఫోర్టిఫైడ్ ఆహారాలుగా పేర్కొంటారు. మామూలుగా అయితే పాలలో విటమిన్–డిపాళ్లు తక్కువే. కానీ ఫోర్టిఫైడ్ మిల్క్, ఫోర్టిఫైడ్ సోయామిల్క్, ఫోర్టిఫైడ్ ఆరెంజ్, ఫోర్టిఫైడ్ ఓట్మీల్, ఫోర్టిఫైడ్ సిరేల్స్ (తృణధాన్యాల) వంటి సంతృప్తం చేసిన ఆహార పదార్థాల్లో విటమిన్–డి మోతాదులు ఎక్కువ. విటమిన్ ‘డి’ తాలూకు కొన్ని విశేషాలు... ఎండవేళలోనే విటమిన్–డి తయారవుతుంది. పైగా చర్మాన్ని తాకాక అది కాలేయాన్ని చేరుతుంది. ఇలా విటమిన్–డి తయారీలోనూ, నిక్షిప్తం చేయడంలోనూ కాలేయం కీలక పాత్ర వహిస్తుంది కాబట్టి... ఎండ తక్కువగా ఉండే చలికాలం నాలుగు నెలల కోసం అవసరమైన విటమిన్–డిని కాలేయం నిల్వ చేసుకుని పెట్టుకుంటుంది. ( నీడ పట్టున వద్దండి. ఇది పెద్ద లోపమం‘డి’)గర్భిణులకు తగినంత విటమిన్ –డి ఇవ్వడం వల్ల వాళ్లకు పుట్టే పిల్లలు భవిష్యత్తులో ఆరోగ్యంగా ఎదుగుతారు. అన్ని రకాలుగా వాళ్ల వికాసానికి (మైల్ స్టోన్స్కు) విటమిన్–డి ఎంతగానో తోడ్పడుతుంది. ఇదీ చదవండి: Yoga మైగ్రేన్తో భరించలేని బాధా? బెస్ట్ యోగాసనాలు జుట్టు ఒత్తుగా పెరగడం కోసంకూడా విటమిన్–డి సహాయపడుతుంది.ప్రపంచంలోని చాలా పాశ్చాత్య దేశాలు ఉత్తరార్ధ గోళంలోని భూమధ్య రేఖ నుంచి దూరంగా ఉండే అక్షాంశాల్లో ఉండటంతో ఆయా దేశాల్లో సూర్యకాంతి అంతగా ప్రసరించదు. కాబట్టి... అలాంటి దేశాల్లో విటమిన్ ‘డి’ లోపం చాలా సాధారణం. అందుకే ప్రపంచ వ్యాప్తంగా ఒక బిలియన్ మంది అంటే నూరు కోట్ల మంది, (వారిలో పాశ్చాత్యులే ఎక్కువ) విటమిన్–డి లోపంతో బాధపడుతున్నారని ఒక అంచనా. అందుకే వారు అక్కడి బీచ్లలో సన్బాత్ల వంటి ప్రక్రియలను ఆశ్రయిస్తూ సూర్యకాంతికి తమ దేహం ఎక్స్పోజ్ అయ్యేలా చేసుకుంటూ విటమిన్–డి పొందడానికి ప్రయత్నిస్తుంటారు. అయితే ఇటీవల సూర్యకాంతి, ఎండ పుష్కలంగా ఉండే మన భారతదేశంలాంటి చోట్ల కూడా చాలామందిలో విటమిన్ ‘డి’ లోపం విస్తృతంగా కనిపిస్తోంది. మన సమాజంలో చాలావేగంగా చోటు చేసుకున్న మార్పుల కారణంగా ఎండలోకి వెళ్లి చేసే పనుల కంటే నీడపట్టునే ఉండి చేసే పనులు పెరిగిపోవడం, ఎండకు ఎక్స్΄ోజ్ అయ్యే అవసరాలు తగ్గడం అన్న అంశమే విటమిన్–డి లోపం పెరగడానికి ప్రధాన కారణం. దాంతో విటమిన్–డి లోపం వల్ల కనిపించే అనర్థాలు చాలామందిలో కనిపిస్తున్నాయి. అందుకే చాలామంది ఫిజీషియన్లు ఈ విటమిన్ను ప్రిస్క్రయిబ్ చేయడం ద్వారా ఈ లోపాన్ని అధిగమించడానికి ప్రయత్నిస్తున్నారు.విటమిన్ డి లోపం నిర్ధారణ ఇలా... ఒక రకమైన రక్తపరీక్ష ద్వారా విటమిన్–డి ఉండాల్సిన మోతాదులో ఉన్నదా, లేదా అనే విషయాన్ని తెలుసుకుంటారు. ఇందుకోసం 25 (ఓహెచ్)డీ అనే పరీక్షనూ లేదా 1,25 (ఓహెచ్) డీ3 అనే పరీక్షను చేస్తారు. విటమిన్–డి ఉండాల్సిన మోతాదును తెలుసుకునేందుకు పైన పేర్కొన్న మొదటి పరీక్ష అయిన 25 (ఓహెచ్)డీ బాగా ఉపయోగపడుతుంది. ఇక 25 (ఓహెచ్)డీ పరీక్షనే 25–హైడ్రాక్సీక్యాల్సిఫెరాల్ లేదా 25–హైడ్రాక్సీ విటమిన్– డి అనే మాటకు సంక్షిప్త రూపం. సాధారణంగా ఆరోగ్యవంతుడి రక్తంలో విటమిన్ డి మోతాదు 50–65 ఎన్జీ/ఎమ్ఎల్ ఉండాలి. దాని కంటే తక్కువగా ఉంటే డాక్టర్లు విటమిన్–డి టాబ్లెట్స్ ప్రిస్క్రయిబ్ చేస్తారు.క్యాల్షియమ్ సక్రమంగా ఎముకల్లోకి ఇంకిపోవవడంతో పాటు ఎముకల్ని మరింత బలంగా, పటిష్టంగా రూ పొందేలా చేసేందుకు విటమిన్–డి చాలా అవసరం. ఆహారంలోని క్యాల్షియమ్ను శరీరం గ్రహించే ప్రక్రియ మన పేగుల్లోనే జరిగేందుకు విటమిన్–డి సహాయపడుతుంది. -డాక్టర్ శ్రీకృష్ణ ఆర్. బొడ్డుసీనియర్ కన్సల్టెంట్ఫిజీషియన్ నిర్వహణ: యాసీన్ -
నీడ పట్టున వద్దండి. ఇది పెద్ద లోపమం‘డి’
ఇటీవల చాలామందిలో విటమిన్ – డి లోపం చాలా ఎక్కువగా కనిపిస్తోంది. ఇలాంటి ధోరణి గతంలో అంతగా కనిపించేది కాదు. మన దేశం సూర్యరశ్మి సమృద్ధిగా లభ్యమయ్యే దేశమైనందువల్లా, అలాగే మూడు నాలుగు దశాబ్దాల కిందటి వరకూ మనలో చాలామంది వ్యవసాయ వృత్తుల్లో ఉండేవారు కావడంతో విటమిన్–డి లోపం చాలా అరుదుగానే కనిపించేది. కానీ ఈమధ్య మన వృత్తులు చాలావరకు మారిపోవడం, ఇన్డోర్స్లోనే ఉంటూ పనులు చేసుకునేవారి సంఖ్య పెరగడంతో విటమిన్–డి లోపం చాలామందిలోతరచూ కనిపిస్తూనే ఉంది. పైగా వ్యాధి నిరోధకతకు తోడ్పడటంతో పాటు అనేక జీవక్రియల్లో ఇదెంతో కీలకమైనందున... విటమిన్ డి నిర్వహించే వివిధ కార్యకలాపాలతోపాటు ఆ లోపం కలిగినప్పుడు దాన్ని ఎలా భర్తీ చేసుకోవాలి, తద్వారా వ్యాధి నిరోధక శక్తిని ఎలా పెంపొందించుకోవాలన్న అనేక అంశాల అవగాహన కోసం విపులమైన కథనం. ప్రపంచంలోని చాలా పాశ్చాత్య దేశాలు ఉత్తరార్ధ గోళంలోని భూమధ్య రేఖ నుంచి దూరంగా ఉండే అక్షాంశాల్లో ఉండటంతో ఆయా దేశాల్లో సూర్యకాంతి అంతగా ప్రసరించదు. కాబట్టి... అలాంటి దేశాల్లో విటమిన్ ‘డి’ లోపం చాలా సాధారణం. అందుకే ప్రపంచ వ్యాప్తంగా ఒక బిలియన్ మంది అంటే నూరు కోట్ల మంది, (వారిలో పాశ్చాత్యులే ఎక్కువ) విటమిన్–డి లోపంతో బాధపడుతున్నారని ఒక అంచనా. అందుకే వారు అక్కడి బీచ్లలో సన్బాత్ వంటి ప్రక్రియలను ఆశ్రయిస్తూ సూర్యకాంతికి తమ దేహం ఎక్స్పోజ్ అయ్యేలా చేసుకుంటూ విటమిన్–డి పొందడానికి ప్రయత్నిస్తుంటారు. అయితే ఇటీవల సూర్యకాంతి, ఎండ పుష్కలంగా ఉండే మన భారతదేశంలాంటి చోట్ల కూడా చాలామందిలో విటమిన్ ‘డి’ లోపం విస్తృతంగా కనిపిస్తోంది. మన సమాజంలో చాలావేగంగా చోటు చేసుకున్న మార్పుల కారణంగా ఎండలోకి వెళ్లి చేసే పనుల కంటే నీడపట్టునే ఉండి చేసే పనులు పెరిగిపోవడం, ఎండకు ఎక్స్పోజ్ అయ్యే అవసరాలు తగ్గడం అన్న అంశమే విటమిన్–డి లోపం పెరగడానికి ప్రధాన కారణం. దాంతో విటమిన్–డి లోపం వల్ల కనిపించే అనర్థాలు చాలామందిలో కనిపిస్తున్నాయి. అందుకే చాలామంది ఫిజీషియన్లు ఈ విటమిన్ను ప్రిస్క్రయిబ్ చేయడం ద్వారా ఈ లోపాన్ని అధిగమించడానికి ప్రయత్నిస్తున్నారు.(Yoga మైగ్రేన్తో భరించలేని బాధా? బెస్ట్ యోగాసనాలు)వాస్తవానికి ఏమిటీ విటమిన్ ‘డి’..? ఎముకల బలం మొదలుకొని అనేక జబ్బుల నుంచి రక్షణ కల్పించే వ్యాధి నిరోధక శక్తి వరకు దేహానికి అవసరమైన పోషకాల్లో అతి ముఖ్యమైనది విటమిన్ డి. నిజానికి ఈ పోషకం ఆహారం కంటే సూర్మరశ్మి నుంచే ఎక్కువగా దొరుకుతుంది. వాస్తవానికి సూర్యకాంతి వల్ల దొరికేది 80 శాతమైతే... మిగతా 20 శాతం మాత్రమే ఆహార పదార్థాల నుంచి లభ్యమవుతుంటుంది. ఇది కొవ్వులో కరిగే (ఫ్యాట్ సొల్యుబుల్) విటమిన్. సాంకేతిక పరిభాషల చెప్పాలంటే దీన్ని ‘సెకో స్టెరాయిడ్’ అంటారు. అంటే దీని మాలెక్యూల్స్ నిర్మాణాన్ని పరిశీలిస్తే ఇందులో... పరమాణు వలయాలు తెగినట్లుగా ఉంటాయి. (సెకో అంటే బ్రోకెన్ అని అర్థం). పైగా స్టెరాయిడ్ వంటి పదార్థాల నుంచి ఆవిర్భవించిందనే మరో అర్థం కూడా ఉంది. కాబట్టి ఇది సహజ స్వాభావికమైన స్టెరాయిడ్ గుణాలతో పాటు విటమిన్ (వైటల్ ఎమైన్)గా కూడా పనిచేస్తుండటంతో దీంతో దేహానికి ఒనగూరే ఎన్నో ప్రయోజనాలెన్నో ఉన్నాయి.విటమిన్ డి ఎలా తయారవుతుందంటే..? సూర్యరశ్మిలోని అల్ట్రావయొలెట్ కిరణాలు చర్మాన్ని తాకినప్పుడు కొన్ని రకాల జీవరసాయనాలూ ఉత్పత్తి అవుతాయి. వాటిని ‘క్యాల్సిఫెరాల్స్’ అంటారు. ఒకరకంగా ఈ క్యాల్సిఫెరాల్స్ విటమిన్ డి తయారీకి కారణమవుతాయని చెప్పవచ్చు. కాల్సిఫెరాల్... రక్తంలో కలిసి ఎట్టకేలకు కాలేయాన్ని చేరుతుంది. కాలేయంలో అది ‘క్యాల్సీడియల్’ అనే ఒక పూర్తిస్థాయి హార్మోన్ తాలూకు తొలిరూపాన్ని తీసుకుంటుంది. మళ్లీ అది రక్తప్రవాహంలో కలిసి ‘క్యాల్సీడియల్’ నుంచి ‘క్యాల్సిట్రియల్’గా మారుతుంది. ఈ క్యాల్సిట్రియాల్నే దాదాపుగా ‘విటమిన్–డి’ అనుకోవచ్చు. రక్తప్రవాహం ద్వారా ఇది మూత్రపిండాల్లోకి చేరినప్పుడు పూర్తిస్థాయి ‘విటమిన్–డి’గా రూపొందుతుంది. అంతేకాదు... వ్యాధి నిరోధకత కలిగించే కణాల్లోనూ ఈ విటమిన్ తయారవుతుంటుంది. అందుకే ఈ విటమిన్ అంతటి ప్రభావవంతమైన ‘సహజమైన వ్యాధినిరోధత కల్పించే కీలక జీవరసాయనం’గా పనిచేస్తుంది. ఇదీ చదవండి: Vinayaka Chavithi 2025 : ప్రపంచంలో కొలువైన ఈ గణపయ్యల గురించి తెలుసా?కనుగొన్న తీరు ఆద్యంతం ఆసక్తికరం... విటమిన్–డి ని కనుగొన్న తీరు ఒక థ్రిల్లర్ను తలపింపజేస్తుంది. కొన్ని శతాబ్దాల కిందట... ముఖ్యంగా నావికులు (సెయిలర్స్) ప్రపంచం (గ్లోబు)లోని కొత్త కొత్త ప్రాంతాలను కనుగొనడానికి నావికా ప్రయాణాలు చేసే రోజుల్లో రికెట్స్ అనే ఎముకల వ్యాధి చాలా ఎక్కువగా ఉండేది. మామూలు ప్రజల్లోనూ కనిపించే ఈ రికెట్స్ వ్యాధి నిల్వ ఉండే ఆహారాలు ఎక్కువగా తీసుకునే నావికుల్లో మరింత ఎక్కువగా కనిపిస్తుండేది.రికెట్స్ వ్యాధి వచ్చిన వాళ్లలో ఎముకలు తమ సహజ ఆకృతిని కోల్పోయి వంకర తిరగడం, కాళ్లు దొడ్డికాళ్లలా మారడం వంటి పరిణామాలు చోటుచేసుకునేవి. పిల్లల్లో వచ్చే రికెట్స్ను ‘ఆస్టోమలేసియా’ అనేవారు. దాదాపు వంద ఏళ్ల కిందట హాలెండ్, ఫ్రాన్స్, జర్మనీ వంటి దేశాల్లో ఈ రికెట్స్కు విరుగుడుగా వైద్యులు ‘కాడ్ లివర్ ఆయిల్’ అనే నూనెను ఉపయోగించేవారు. దీన్ని కాడ్ అనే రకం చేప కాలేయం నుంచి తయారు చేయడం వల్ల దాన్ని ‘కాడ్ లివర్ ఆయిల్’ అనే పిలిచేవారు. 1918లో ఎడ్వర్డ్ మెలాన్బీ అనే శాస్త్రవేత్త – కాడ్లివర్ ఆయిల్లోని కొవ్వులో కరిగే ఒకానొక పోషకం రికెట్స్ వ్యాధికి మంచి విరుగుడు అని తెలుసుకున్నాడు. ఆ తర్వాత 1924లో హెచ్. స్టీన్బాక్, ఆల్ఫ్రెడ్ ఫేబియన్ హెస్ అనే శాస్త్రవేత్తల పరిశోధనల్లో ఓ కొత్త విషయం తెలిసింది. అదేమిటంటే... సూర్యరశ్మిలోని అల్ట్రా వయొలెట్ కిరణాలు కొన్ని జీవులను తాకినప్పుడు... ఆ జీవుల్లో కొవ్వులాంటి ఓ పోషకం ఉత్పత్తి అవుతోందని కనుగొన్నారు. ఆ పోషకాన్ని తొలుత వాళ్లు ‘వయొస్టెరాల్’ అని పిలిచేవారు. ఇక 1935లో దీన్ని ల్యాబ్లో ఐసోలేట్ చేసి, దానికి ‘క్యాల్సిఫెరాల్’ అని పేరుపెట్టారు. ఆ తర్వాత అందులో కొద్దికొద్ది నిర్మాణపరమైన మార్పులతో ఉండే... అనేక రకాల విటమిన్ డి (డి1, డి2, డి3, డి4, డి5, డి6, డి7, డి8)లను కనుగొన్నారుఇతరత్రా అనేక ఆరోగ్య సమస్యల్లోనూ చికిత్స కోసం... ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడేవారికీ విటమిన్ ‘డి’ని వైద్యులు ప్రిస్క్రయిబ్ చేస్తారు. హై కొలెస్ట్రాల్తో బాధపడేవారికి, డయాబెటిస్, స్థూలకాయం ఉన్నవారికి, మల్టిపుల్ స్క్లెరోసిస్ రుమటాయిడ్ ఆర్థరైటిస్, క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మునరీ డిసీజ్ (సీఓపీడీ) ఉన్నవారికి, ఆస్తమా, బ్రాంకైటిస్ బాధితులకు, మహిళల్లో ప్రీ–మెన్స్ట్రువల్ సిండ్రోమ్తో బాధపడేవారికి, పంటి, చిగుళ్ల వ్యాధుల నివారణకు, అనేక రకాల చర్మం వ్యాధుల చికిత్సలో అంటే ఉదాహరణకు... విటిలిగో (బొల్లి), స్కిరోడెర్మా, సోరియాసిస్ వంటి చర్మరోగాలు ఉన్నవారికి డాక్టర్లు విటమిన్–డిని సూచిస్తారు. సోరియాసిస్ చికిత్సలో ‘క్యాల్సిట్రియల్’ లేదా ‘క్యాల్సిపోట్రియాల్ / క్యాల్సి ప్రొట్రిన్’ అనే రూపంలో విటమిన్–డిని పైపూతమందుగా పూస్తారు. ఇక విటమిన్–డి ఎన్నో రకాల క్యాన్సర్లను సమర్థంగా నివారిస్తుంది. క్యాన్సర్ కణాలను నాశనం చేస్తుంది. అందుకే అనేక రకాల క్యాన్సర్ల చికిత్సల్లో ‘విటమిన్–డి’ని ఒక మందులా డాక్టర్లు తమ ప్రిస్క్రిప్షన్లో సూచిస్తారు.విటమిన్ డి టాక్సిసిటీ అంటే.... ఇంతటి ఉపయోగకరమైన విటమిన్–డి ఉండాల్సిన మోతాదు కంటే మించితే... అది ప్రతికూల ఫలితాలకు దారి తీస్తుంది. ఉదాహరణకు సొంతంగా విటమిన్–డి మాత్రలు వాడటం, కాడ్లివర్ ఆయిల్ క్యాప్సూల్స్ తీసుకోవడం వల్ల రోజుకు 125 మైక్రో గ్రాముల మోతాదు దాటితే ఒక్కోసారి విపరీతంగా దాహం, కంట్లో కురుపులు, చర్మంపై దురదలు రావడం సాధారణం. దాంతోపాటు వాంతులు, నీళ్లవిరేచనాలు వంటివి కూడా కనిపించవచ్చు. ఒక్కోసారి రక్తనాళాల్లోని గోడలపైనా, మూత్రపిండాలలో క్యాల్షియమ్ పెచ్చులు (క్యాల్సిఫికేషన్) రావచ్చు. రక్తనాళాలతో పాటు కాలేయంలో, ఊపిరితిత్తుల్లో, మూత్రపిండాల్లో, కడుపులో క్యాల్షియమ్ మోతాదులు పెరిగే ప్రమాదం ఉంటుంది. అందుకే ఎండలో తిరగడం లేదా స్వాభావికమైన ఆహారం ద్వారా కాకుండా... ఇతరత్రా రూపాల్లో విటమిన్–డి తీసుకోవాల్సి వచ్చినప్పుడు కేవలం నిపుణుల సూచనల మేరకే, దేహానికి అవసరమైనప్పుడు మాత్రమే దాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. -డాక్టర్ శ్రీకృష్ణ ఆర్. బొడ్డుసీనియర్ కన్సల్టెంట్, ఫిజీషియన్ -నిర్వహణ: యాసీన్ -
99 కిలోలు నుంచి 59 కిలోలుకు..! నో స్ట్రిక్ట్ డైట్ కానీ
ఎన్నో వెయిట్ లాస్ స్టోరీల్లో డైట్, జిమ్ వంటి వాటితో బరువు తగ్గడం చూశాం. కానీ ఈ మహిళ చివరి వరకు స్థిరంగా ఉంటూ..తినే ఆహారంలో ఎలాంటి మార్పులు చేయకుండానే తగ్గింది. తాను రెగ్యులర్గా తీసుకునే డైట్నే తీసుకుంటూ వెయిట్ లాస్ అయ్యింది. అది తనకు ఏవిధంగా సాధ్యమైందో ఇన్స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసుకుంది. కొందరు క్రమశిక్షణతో కూడిన జీవనశైలి, మరికొందరు ఓపికకు పెద్దపీటవేసి బరువు తగ్గడం జరుగుతుంది. కానీ ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ సాచిపై నెమ్మదిగా, స్థిరమైన ప్రయత్నంతో అసాధారణ ఫలితాలను అందుకుంది. ఎలాంటి షార్ట్కట్లు, తీవ్రమైన డైట్లు అనుసరించలేదు. కేవలం క్వాండిటీలో మార్పు చేసింది. తాను రోజు తినే ఆహారంలో మార్పులేమి లేవు. కేవలం తీసుకునే క్వాండిటీనే తగ్గించి తీసుకునేది. అలగే మొదట 20 నిమిషాల నడక నుంచి మొదలు పెట్టి 60 నిమిషాల వరకు నడిచేలా ప్లాన్ చేసింది. అలా పదివేల అడుగులు పైనే తీసుకుంది. ప్రోటీన్ జోడించడమే గాక అల్పాహారం తప్పనిసరి చేసుకుంది డైట్లో. అలాగే తరుచుగా బరువు తగ్గానా లేదా అని అద్దంలో చూసుకోవడం నివారించాల్సిందేనంటా. అప్పుడే బరువు తగ్గడంలో గణనీయమైన మార్పులు సంభవిస్తాయట. తీసుకునే ఆహారం..సాధారణంగా మొదట డబల్ఎక్స్ఎల్లో ఉన వ్యక్తి తన సైజుని ఎక్స్ఎస్ సైజుకి మార్చుకునేలా వ్యాయమాలు కూడా హెల్ప్ అయ్యాయి. మొదటి ఐదు నుంచి ఆరు నెలలు ఇంట్లో చేసే సాధారణ వ్యాయామాలు చేయగా, ఆమె స్టామినా పెరిగే కొద్దీ..భారీగా బరువులు ఎత్తేలా జిమ్కి వెళ్లటం, పైలేట్స్ వంటివి జోడించినట్లు పేర్కొంది. మార్షల్ ఆర్ట్స్తో కలగలసిన ఈత వ్యాయామాలు తన మెరుగైన శరీరాకృతి మార్పుకి దోహదపడిందని చెప్పుకొచ్చింది. అలాగే తినే ఆహారంలో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండకుండా చూసుకునేదట. ముఖ్యంగా బ్రేక్ఫాస్ట్లో గుడ్డులోని తెల్లసొనతో అవకాడో, లెట్యూసక్ష, టమాటాలు, చికెన్ రోల్ చేసుకుని తినేదట. స్పైసీ రొయ్యల న్యూడిల్స్, హైడ్రేటెడ్గా ఉండేలా చూసుకోవడం, ఉల్లిపాయలు, క్యారెట్లు, బెల్పిప్పర్, క్యాబేజీ వంటి రంగురంగు కూరగాయలతో చేసిన స్పైసి రైస్ లేదా న్యూడిల్స్ తీసుకునేదట. వీటి తోపాటు ఫిష్ ఫ్రై, సలాడ్, పప్పు అన్నం, తదితరాలు తీసుకునేదట. ఇవి తనకు ఆకలిని నియంత్రించేలా చేసి, ఎక్కువగా ఆకలి వేయకుండా కపాడేదని పేర్కొంది. తాను స్థిరత్వం, సమతుల్యమైన ఆహారంతో ఇంతలా విజయవంతంగా బరువు తగ్గాగలిగానంటోందామె.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. View this post on Instagram A post shared by Saachi | Pilates. Fat Loss. Real Talk. (@saachi.pai) (చదవండి: నటి తనిష్టా ఛటర్జీ ఎదుర్కొంటున్న ఒలిగోమెటాస్టాటిక్ కేన్సర్ అంటే..! ఎందువల్ల వస్తుందంటే..) -
నటి తనిష్టా ఛటర్జీ ఎదుర్కొంటున్న ఒలిగోమెటాస్టాటిక్ కేన్సర్ అంటే..! ఎందువల్ల వస్తుందంటే..
అంతర్జాతీయ నటి తనిష్ట ఛటర్జీ దర్శకురాలు, మంచి యాక్టర్ కూడా. ఆమె ఎన్నో అంతర్జాతీయ అవార్డులు దక్కించుకుని..విమర్శకుల ప్రశంసలందుకున్న ప్రముఖ నటి. ఆమె ఇటీవల స్టేజ్ 4 ఒలిగోమెటాస్టాటిక్ కేన్సర్ బారిన పడినట్లు ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో పేర్కొంది. ఈ మహమ్మారితోనే తన తండ్రిని కోల్పోయింది. ఇప్పుడు అదే ప్రాణాంతక వ్యాధిబారిన పడి పోరాడుతోంది. తాను ప్రస్తుతం చికిత్స తీసుకునే కష్టతరమైన జర్నీలో ఉన్నానని వెల్లడించింది. ఇంతకీ అసలు ఏంటి ఈ కేన్సర్..? ఎందువల్ల వస్తుందంటే..ఒలిగోమెటాస్టాటిక్ కేన్సర్ అంటే..ఒలిగోమెటాస్టాటిక్ స్థితి అనేది కేన్సర్ వ్యాప్తి పరిమితంగా ఉన్న దశ. కేన్సర్ ఈ దశలో కొన్నిప్రాంతాలకు మాత్రమే వ్యాపించి ఉంటుంది. చెప్పాలంటే ఒకటి నుంచి ఐదు ప్రాంతాలకే వ్యాపింస్తుంది. అంటే ఇది పూర్తిగా ముందుగా కేన్సర్ని గుర్తించే పరిస్థితిగా పేర్కొనవచ్చని చెబుతున్నారు నిపుణులు. ఈ స్థితిలో చికిత్సకు మంచి అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. శస్త్రచికిత్స, రేడియేషన్, థెరపీ వంటి వాటితో నయం చేసే అవకాశం ఉంటుంది. చాలామటుకు బతికే ఛాన్స్లు ఉంటాయి. ఈ మెటాస్టాసిస్ అనే పదం గ్రీకు నుంచి ఉద్భవించింది. ఒలిగో అంటే మెటాస్టాసిస్. దీని అర్థం వలస. సాంప్రదాయకంగా మూడు కంటే తక్కువ సుదూర అవయవాలలో ఐదు కంటే తక్కువ కణితి గాయాలుగా పేర్కొంటారు వైద్యులు. సాంకేతిక సాయంతో త్వరితగతిని నయం చేయగల కేన్సర్గా పరిగణిస్తారు. ఎలా గుర్తిస్తారంటే..శరీరం పూర్తిగా స్కాన్ చేస్తారు, కాలి నుంచి తల వరకు ప్రతి చోట క్షుణ్ణంగా స్కాన్ చేసి..ఎక్కడైన కణితి గాయాలు ఉన్నాయా అని పరీక్షిస్తారు. ఒక వేళ FDG PET స్కాన్లో ఈ కణుతులు గుర్తించలేకపోతే పెట్ స్కాన్, కాంట్రాస్ట్ సీటీ స్కాన్ల సాయంతో గుర్తిస్తారు.మనుగడ రేటు అనేది స్కాన్లో మెటాస్టేజ్ల సంఖ్య, ఒలిగోమెటాస్టాసిస్ ప్రదేశం, స్థానిక చికిత్సలకు ప్రతిస్పందన, కణితి జీవశాస్త్రం, ఇమ్యునోథెరపీ, రోగి స్థితి ఆధారంగా నిర్ణయిస్తారని వైద్యులు చెబుతున్నారు. దీంతో భవిష్యత్తులో ఈ కణితి వచ్చే ప్రమాదం ఎంత ఉందనేది కూడా అంచనా వేయడం వంటివి కూడా ఉంటాయన్నారు. అయితే ఈ దశలో రోగి భయాందోళనలకు గురవ్వకుండా త్వరితగతిన నయం అయి బయటపడగలరని చెబుతున్నారు. ఎలా చికిత్స చేస్తారంటే..కణితి వ్యాపించిన పరిస్థితి ఆధారంగా శస్త్రచికిత్స, రేడియేషన్, ఎంబోలైజేషన్ వంటి చికిత్సలు అందిస్తారని చెబుతున్నారు. ఈ స్టేజ్ 4 ఒలిగోమెటాస్టాటిక్ దశ అనేది విజయవంతంగా వ్యాధికి చికిత్స అందించగల స్టేజ్ అని చెబుతున్నారు నిపుణులు. View this post on Instagram A post shared by Tannishtha Chatterjee (@tannishtha_c) (చదవండి: -
మైగ్రేన్తో బాధపడుతున్నారా? ఇవిగో బెస్ట్ యోగాసనాలు
తరచుగా తలనొప్పి , మైగ్రేన్ బాధపడుతున్నారా? మందులతో విసిగిపోయారా? ఆగండాగండి యోగా మీకు తప్పకుండా సాయపడుతుంది.. లోతైన శ్వాస వ్యాయామాలతో కలిపి మైండ్ఫుల్ ఆసనాలు, ఒత్తిడి, ఆందోళనను తగ్గించుకోవడం, మనస్సు ప్రశాంతంగా ఉంచుకోవడం, రక్త ప్రసరణను మెరుగు పర్చుకోవడం ఉపశమనం పొందవచ్చు. ఇవాల్టీ టిప్ ఆప్ ది డేలో భాగంగా మైగ్రేన్ తలనొప్పిని తగ్గించుకునేందుకు ఉపయోగపడే కొన్నియోగాసనాల గురించి తెలుసుకుందాం.దీర్ఘకాలిక తలనొప్పిని తగ్గించడానికి నెమ్మదిగా కదిలే, విశ్రాంతినిచ్చే యోగా ఉత్తమం. తలనొప్పి లేదా మైగ్రేన్తో బాధపడే ఎవరైనా వయస్సు లేదా ఫిట్నెస్ స్థాయితో సంబంధం లేకుండా ఈ యోగాసనాలను ప్రయత్నించవచ్చు. మైగ్రేన్ నుండి ఉపశమనం పొందడానికి సున్నితమైన, నెమ్మదిగా చేసే యోగా, ప్రాణాయామం, ధ్యానం చేయాలి. మైగ్రేన్ నొప్పిని ప్రేరేపించని లేదా తీవ్రతరం చేయని సున్నితమైన, విశ్రాంతినిచ్చే యోగా పద్ధతులను ఎంచుకోవాలి. ముఖ్యంగా బాలాసనం, సేతు బంధాసనం, శవాసనం వంటివి మేలు చేస్తాయి. వేగవంతమైన, శక్తివంతమైన యోగా, చేయకూడదు. ఎందుకంటే అవి మైగ్రేన్లను ప్రేరేపించగలవు. ప్రాణాయామం (శ్వాస వ్యాయామాలు):అనులోమ విలోమ (ముక్కు రంధ్రాలు మార్చి చేసే శ్వాస), బ్రహ్మరి (తేనెటీగ శబ్దం చేసే శ్వాస) వంటివి మనస్సును ప్రశాంతపరుస్తాయి .ఒత్తిడిని తగ్గిస్తాయి. ధ్యానం ద్వారా మనస్సును శాంతపర్చి, ఒత్తిడిని తగ్గిస్తుంది. మెడ, భుజాలు ,వెన్నెముకలో ఉద్రిక్తత తరచుగా తలనొప్పికి దోహదం చేస్తుంది. కనుక వీటిని “సున్నితంగా సాగదీయడం ఈ కండరాలను సడలిస్తుంది, లోతైన శ్వాస మెదడుకు ఆక్సిజన్ ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది. ఒత్తిడి, హార్మోన్లను తగ్గిస్తుంది. అతి చురుకైన నరాలను శాంతపరుస్తుంది. మైండ్ఫుల్ అభ్యాసాలుబాలాసనం: యోగా మ్యాట్మీద మోకాళ్లపై కూర్చోవాలి. తరువాత పాదాలపై పిరుదులు ఆనేలా కూర్చోవాలి. తరువాత నుదురు భాగం మ్యాట్కు తగిలేలా మెల్లిగా ముందుకు వంగాలి. తర్వాత రెండు చేతులను ముందుకు పూర్తిగా చాపాలి. అలా ఉండి నెమ్మదిగా శ్వాస తీసుకోవడం, వదలడం చేయాలి. శరీరం పూర్తిగా విశ్రాంతి తీసుకోనివ్వాలి. 30 సెకన్ల పాటు ఈ ఆసనం వేసినా చాలు. బాలాసనంతో ఒత్తిడిని తగ్గించి, శారీరకంగా మరియు మానసికంగా ఆరోగ్యంగా ఉండటానికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది మోకరిల్లి, ముందుకు మడిచి, మీ నుదిటిని నేలపై లేదా కుషన్పై ఉంచండి. ఇది భుజం, మెడ మరియు నుదిటి ఉద్రిక్తతను తక్షణమే తగ్గిస్తుంది.అధో ముఖ స్వనాసన: అధో ముఖ స్వనాసన అరచేతులు , పాదాలను నేలపై ఉంచి తుంటి భాగాన్ని (సూర్య నమస్కారంలో చేసినట్టుగా)పైకి లేపడం. వెన్నెముకను బలాన్నిస్తుంది. నడుము నొప్పిని తగ్గిస్తుంది. మెదడులో రక్త ప్రసరణను మెరుగుపరిచి దాని పనితీరును మెరుగుపరుస్తుంది. తలకు రక్త ప్రసరణను అందించి రిఫ్రెష్ చేస్తుంది.విపరీత కరణి: విపరీత కరణి అంటే "ప్రవాహానికి వ్యతిరేకం" అనే సంస్కృత అర్థాన్ని సూచించే యోగా భంగిమ. దీనిని "లెగ్స్ అప్ ది వాల్ పోజ్" అని కూడా పిలుస్తారు. వెల్లకిలా పడుకుని , కాళ్ళు , పాదాలను గోడకు ఆనించాలి. అరచేతులు క్రిందికి ఎదురుగా ఉండేలా చేతులను శరీరానికి దగ్గరగా ఉంచండి.ఆలోచనకు కళ్లెం వేసి, తలనొప్పి ఒత్తిడిని తగ్గిస్తుంది.సుప్త బద్ధ కోణాసన : ఇది పడుకుని చేసే సీతాకోకచిలుక భంగిమ. మనస్సును ప్రశాంతపరుస్తుంది. నేలపై వెల్లకిలా పడుకుని, పాదాల అరికాళ్ళను ఒకదానికొకటి తాకించి, మోకాళ్ళను పక్కలకు వంచండి. కావాలంటే వెన్నెముక కింద కుషన్ పెట్టుకోవచ్చు. ఈ భంగిమలో కొంత సమయం పాటు విశ్రాంతి తీసుకోండి. ఇది ఒత్తిడిని తగ్గిస్తుంది. హార్మోన్లను సమతుల్యం చేయడంలో, నిద్రను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఆందోళనతోవచ్చిన తలనొప్పిని తగ్గిస్తుంది.సేతు బంధాసనం: ఈ భంగిమ నొప్పి నుండి ఉపశమనం కలిగించడంలో సహాయపడుతుంది.శవాసన (శవ భంగిమ): రిలాక్స్డ్, ఫ్లాట్గా పడుకోండి. ఈ అంతిమ విశ్రాంతి భంగిమ మీ నాడీ వ్యవస్థను రీసెట్ చేస్తుంది. విశ్రాంతి కోసం ఈ ఆసనం చాలా ముఖ్యమైనది. ఒత్తిడిని తగ్గిస్తుంది. మనసుకు ప్రశాతంతనిచ్చి, నొప్పులను తగ్గిస్తుంది.నోట్ : అవగాహనకోసం, తాత్కాలిక ఉపశమనం కోసం అందించిన చిట్కాలుమాత్రమే. మైగ్రేన్ మరింతగా బాధిస్తోంటే వైద్యుడిని సంప్రదించం మేలు, అలాగే యోగా నిపుణుని సలమా మేరకు యోగాను ప్రారంభించడం చాలా ముఖ్యం. -
భర్తను కాపాడుకునేందుకు భార్య లివర్ దానం.. కానీ ఇద్దరూ!
శరీరంలో కీలకమైన ఏదైనా అవయవం పాడైపోయి.. ప్రాణాపాయస్థితిలో ఉన్నపుడు అవయవ మార్పిడి ఒక్కటే మార్గం. అలా దానం చేసే అవకాశం ఉన్న ఆవయవాల్లో ముఖ్యమైనవిగా కిడ్నీలు, లివర్. ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులు తమ అవయవాలను దానం చేయడంమంటే అవతలివ్యక్తికి ప్రాణ దానం చేయడమే. కానీ భర్తను కాపాడుకునేందుకు తన అవయవాన్ని దానం చేసిన సంతోషం.. అంతలోనే విషాదంగా మారింది. మహారాష్ట్ర ఆరోగ్య శాఖ పూణేలోనిఒక ప్రయివేటు ఆస్పత్రిలో జరిగిన ఈ ఘటన కలకలం రేపింది.భర్తకు తన కాలేయంలో కొంత భాగాన్ని దానం చేసిన ఒక మహిళ మార్పిడి శస్త్రచికిత్స తర్వాత కొన్ని రోజులకే మరణించింది. దీనితో మహారాష్ట్ర ఆరోగ్య శాఖ పూణేలోని సహ్యాద్రి ఆసుపత్రికి నోటీసు జారీ చేసింది. మార్పిడి ప్రక్రియకు సంబంధించిన అన్ని వివరాలను సమర్పించాలని ఆదేశించినట్లు ఆరోగ్య సేవల డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ నాగనాథ్ యెంపల్లె ఆదివారం తెలిపారు. గ్రహీత, దాత వివరాలు, వారి వీడియో రికార్డింగ్లు, చికిత్స విధానం అన్నింటి వివరాలను అందించాలని ఆసుపత్రిని కోరామని చెప్పారు.ఈ కేసులో భర్త, రోగి బాపు కోమ్కర్, అతనికి లివర్ దానం చేసిన భార్య కామిని ఆగస్టు 15న ఆసుపత్రిలో శస్త్రచికిత్సలు చేయించుకున్నారు. మార్పిడి శస్త్రచికిత్స తర్వాత బాపు కోమ్కర్ ఆరోగ్యం క్షీణించి, ఆగస్టు 17న మరణించాడు. మరోవైపు ఇన్ఫెక్షన్ కారణంగా కామిని ఆగస్టు 21న కన్నుమూసింది. దీనికి ఆస్పత్రి నిర్లక్ష్యమే కారణమని బంధువులు, కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. తమ బంధువులిద్దరి మరణాలపై విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నారు.అయితే ప్రామాణిక వైద్య ప్రోటోకాల్ల ప్రకారం శస్త్రచికిత్సలు జరిగాయని ఆసుపత్రి పేర్కొంది. దర్యాప్తులో అధికారులతో పూర్తిగా సహకరిస్తున్నామని వివరించింది. అనేక సమస్యలతో బాపు కోమ్కర్ చాలా తీవ్రమైన పరిస్థితిలో తమ వద్దకు వచ్చాడని, లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చాలా క్లిష్టమైన ఆపరేషన్అని పేర్కొన్నారు. ఈ విషంలోవారికి పూర్తిగా అన్ని విషయాలు వివరించి కౌన్సెలింగ్ అందించామని ఆసుపత్రి పేర్కొంది. దురదృష్ట వశాత్తు, మార్పిడి తర్వాత గ్రహీతకు కార్డియోజెనిక్ షాక్ వచ్చిందని తెలిపింది. అలాగే కామిని తొలుత బాగా కోలుకున్నప్పటికీ, సెప్టిక్షాక్ కారణంగా చనిపోయిందని వెల్లడించింది. కానీ ఈ కష్టకాలంలో బాధిత కుటుంబంపై తమకు సానుభూతి ఉందని తెలిపింది. నోట్ : ప్రస్తుత సమాజంలో అవయవ దానం ఆవశ్యకత బాగా పెరుగుతోంది. ఎలాంటి భయాలు, ఆందోళనలు లేకుండా పూర్తి అవగాహనతో అవయదానం చేయాల్సిన అవసరం ఉంది. ఇందులోకు కుటుంబ సభ్యులు, ఇతర అర్హులైన వారు ముందుకు రావాలి. దాని కంటే ముందు అనారోగ్య పరిస్థితి మరింత ముదరకుండా జాగ్రత్త పడటం, చక్కటి జీవనశైలి అలవర్చుకోవడం చాలా ముఖ్యం. ఇదీ చదవండి: అందమైన హారాన్ని షేర్ చేసిన సుధామూర్తి , విశేషం ఏంటంటే! -
బొజ్జలు కాదు.. కండలు పెంచగలం..!
‘మనం బొజ్జలనే కాదు.. అందమైన ఆకృతితో కూడిన కండలను పెంచగలం.. అయితే దీనికి సరైన సమయంలో సరైన మార్గనిర్దేశం అవసరం. అప్పుడే సాధన ఫలితాలనిస్తుంది.. కండలు పెంచేందుకు జెనిటిక్స్తో ఎలాంటి సంబంధం లేదు. బాడీ బిల్డింగ్పై ఉన్న అపోహలు, తెరలు తొలగిపోవాలి. అప్పుడే అంతర్జాతీయ స్థాయిలో మనం సత్తా చూపించగలం’ అని సినీనటుడు అల్లు శిరీష్ అన అభిప్రాయాన్ని వెల్లడించారు. శంషాబాద్ క్లాసిక్ కన్వెన్షన్లో ‘డెక్కన్ అప్రైజింగ్–2025 పేరిట ఐసీఎన్ (ఐ కాంపీట్ నేచురల్) సంస్థ నిర్వహించిన సహజసిద్ధ శరీర దృఢత్వ పోటీలు ఆదివారం ముగిశాయి. ఈ సందర్భంగా అవార్డు గ్రహీతలను, నిర్వాహకులను ఆయన అభినందించారు. అనంతరం ఫిట్నెస్పై తన అభిప్రాయాలను పంచుకున్నారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. గుర్తింపు అవసరం.. ప్రపంచస్థాయిలో బాడీ బిల్డింగ్కి మంచి గుర్తింపు ఉంది. ఇందులో రాణించిన అథ్లెట్లు కోట్ల రూపాయలు సంపాదిస్తారు. మన దేశంలో మాత్రం బాడీ బిల్డర్లు కోచ్లుగా మాత్రమే మిగిలిపోతున్నారు. క్రికెట్, టేబుల్ టెన్నిస్ తదితర క్రీడలకు మన దేశంలో ఇచ్చిన ప్రాధాన్యత బాడీబిల్డింగ్కు కూడా దక్కేలా చర్యలు తీసుకోవాలి. అనేక అపోహలు.. శరీర దారుఢ్యానికి మందులు, స్టిరాయిడ్లు వాడతారనే అపోహల కారణంగా చాలా మంది దీనికి దూరంగా ఉంటున్నారు. అవేవీ అవసరం లేకుండా కూడా సరైన సమయంలో సరైన కోచ్ ద్వారా శిక్షణ తీసుకుని సాధన చేస్తే అంతర్జాతీయ అథ్లెట్లను తయారు చేసుకోవచ్చు.. ఐసీఎన్ లాంటి సంస్థలు ఆ దిశగానే కృషి చేస్తున్నాయి.. అందుకే ఎంతో ఇష్టంతో గత రెండేళ్లుగా ఇక్కడికి వచ్చి అథ్లెట్లను ప్రొత్సహిస్తున్నాను. రెండు రాష్ట్రాలకు చెందిన నాలుగు వందల మంది యువత ఈ పోటీల్లో పాల్గొన్న తీరు చూస్తుంటే మన వద్ద కూడా ఫిట్నెస్పై అవగాహన పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. నాకు తగ్గ కథ వస్తే..కండలు పెంచేందుకు జన్యుపరమైన సంబంధాలేవీ లేవు. ఫిట్నెస్కు రాంగ్రూట్, షార్ట్కట్స్ ఎంత మాత్రం సరైంది కాదు. శరీర తత్వం బట్టి బొజ్జలు వస్తాయనే ప్రచారం సరికాదు. సహజంగానే ఫిట్నెస్ అంటే నాకు ఎంతో ఇష్టం. నా ఎత్తు, బరువు, ఆకృతికి అనువైన మంచి స్పోర్ట్స్ కథ వస్తే అలాంటి సినీమా చేయడానికి ఉత్సాహంగా ఉన్నాను. ఇప్పటి వరకూ వచ్చిన క్రికెట్, రన్నింగ్, ఫుట్బాల్ వంటి కథలు కాకుండా కొత్తగా ఉంటే బాగుంటుంది. (చదవండి: ఉత్తర భారత్ హెరిటేజ్ టూర్..!) -
వాన వెలిసినా... ముసిరే వ్యాధులు
ఇటు తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్లలో ఇటీవల కురినిన భారీ భారీ వర్షాల తర్వాత ఇరు రాష్ట్రాలు జలమయం కావడం, రోడ్లు మునిగిపోవడంతోపాటు అవి ప్రజల ఆరోగ్యానికీ ముప్పు తెచ్చిపెడుతున్నాయి. ఈ వర్షాల తర్వాత చాలా ఆసుపత్రులూ, క్లినిక్స్లో నిమోనియా, ఫ్లూ కేసులు పెరుగుతున్నాయి. సాధారణంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసేటప్పుడు, కురిశాక ఉండే తేమతో కూడిన వాతావరణంలో ఈ కేసులు పెరగడం సాధారణం. ఇలాంటి సందర్భాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చేయించాల్సిన చికిత్స వంటి అనేక అంశాలపై అవగాహన కోసం ఈ కథనం. వర్షాల అనంతరం నిమోనియా, ఇన్ఫ్లూయెంజా (ఫ్లూ) కేసులు విపరీతంగా పెరుగుతుండటంతో అంతటా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇవి అన్నిరకాలుగా ఆరోగ్యంగా ఉండే యువతతో పోలిస్తే... వ్యాధి నిరోధక శక్తి కాస్త తక్కువగా ఉండే వయోవృద్ధులు, చిన్నపిల్లలు, గర్భిణుల్లో ఎక్కువగా కనిపిస్తుంటాయి. అలాగే అప్పటికే అనారోగ్యాలతో బాధపడేవారిలో రోగనిరోధకత తక్కువగా ఉండటంతో వాళ్లు నిమోనియా, ఫ్లూ వంటి వర్షాకాలపు సమస్య ల బారిన వేగంగా పడే అవకాశముంది. అంతేకాదు... వ్యాధి నిరోధకత తక్కువ గా ఉండే ఇమ్యూనో కాంప్రమైజ్డ్ వ్యక్తుల్లో ఇది ఒక్కోసారి ప్రాణాపాయం లాంటి తీవ్రమైన ముప్పునకూ దారితీసే ప్రమాదం లేకపోలేదు.వర్షాకాలంలో ముప్పుఎందుకు ఎక్కువంటే... వర్షాకాలంలో ఉండే అధిక తేమ, తడి వాతావరణం వంటివి ఫంగస్ పెరుగుదలకు తోడ్పడతాయి. దాంతో ఆ పెరుగుదల వల్ల అవి శ్వాసనాళాల్లోకి ప్రవేశించినప్పుడు ఆస్తమా వంటి శ్వాసకోశ వ్యాధులకు అవకాశం పెరుగుతుంది. క్రౌడింగ్ : వర్షాల కారణంగా ప్రజలు గుంపులు గుంపులుగా చాలా దగ్గరి దగ్గరిగా ఉంటారు. అదీగాక ఇక లోతట్టు ప్రాంతాల వాళ్లనందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించి ఒకేచోట గుంపులుగా ఉంచడంతో ప్రజలు మరింత దగ్గరిదగ్గరిగా ఉండాల్సి వస్తుంది. పైగా మూసినట్టుగా ఉన్న గదుల్లో (క్లోజ్డ్ ఇన్–డోర్స్ మధ్యన, వెంటిలేషన్ సరిగా లేని చోట్లలో) ఉండటం వల్ల వైరస్లు ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే అవకాశాలెక్కువ. ఉపరితలాలను తాకడం వల్ల : తలుపులు తీసేటప్పుడు డోర్స్ హ్యాండిల్స్ను తప్పక తాకుతూ తీయాల్సి వస్తుంది. ఒకరి చేతులనుంచి డోర్స్ నాబ్స్, డోర్ హ్యాండిల్స్పై చేరుకున్న వైరస్లు మరొకరు వాటిని ముట్టుకోగానే వారికీ అంటుతాయి. పైగా వర్షాకాలం లాంటి చల్లటి తడి వాతావరణంలో డోర్నాబ్స్పై ఉండే సూక్ష్మజీవులు మరింత ఎక్కువ కాలం జీవించి ఉంటాయి. ఇలా ఈ మార్గంలో వైరస్లూ, బ్యాక్టీరియా వ్యాపించడాన్ని ‘ఫొమైట్ ట్రాన్స్మిషన్’ అని కూడా అంటారు. రొటీన్ దెబ్బతినడం వల్ల (డిస్రప్టెడ్ రొటీన్): బయట వర్షం కురుస్తుండటం వల్ల తాము వెళ్లాల్సిన పనులకు వెళ్లలేకపోవడంతో రొటీన్ దెబ్బతింటుంది. దీనివల్ల రోజులో తినేవేళలూ, నిద్రవేళలూ ఇవన్నీ క్రమం తప్పుతాయి. దాంతో కొత్త వైరస్లు రూపొందే ముప్పు: వానాకాలం లాంటి సీజన్లలో ప్రజలు దగ్గర దగ్గరగా ఉన్నప్పుడు వైరస్ల తాలూకు కొత్త స్టెయిన్లూ, బ్యాక్టీరియల్, ఫంగల్ తాలూకు దుష్ప్రభావాలు పెరుగుతాయి. సాధారణంగా వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉండే పెద్దవయసు వారిలో, చిన్న పిల్లల్లో ఈ స్ట్రెయిన్స్ వ్యాపించాక... వారి నుంచి ఇంకొన్ని స్టెయిన్స్ రూపొందడం... ఇలా సరికొత్తగా రూపొందిన వైరస్లు చాలా చురుగ్గా (విరులెంట్గా) ఉండటం వల్ల అవి వేగంగా వ్యాపిస్తూ మరింత నష్టం కలగజేస్తాయి.ఎవరెవరిలో ముప్పు ఎక్కువంటే... వయోవృద్ధులు (65+), చిన్నపిల్లలు, గర్భిణులు. గుండె, ఊపిరితిత్తుల వ్యాధులు, డయాబెటిస్, హైబీపీ లేదా వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు తడి వాతావరణంలో, గదుల్లో గుంపులుగా ఉండేవాళ్లూ / తాత్కాలిక ఆశ్రయాల్లో ఉన్నవారు ∙వ్యాక్సిన్ తీసుకోని పెద్దవయసు వాళ్లలో... ఈ సీజన్ అనంతర వ్యాధుల ముప్పు ఎక్కువ. ఫ్లూ/న్యుమోనియాలను గుర్తించడమెలా? ఫ్లూ లక్షణాలు: ఇది వైరస్లో వచ్చే సమస్య కాబట్టి ఆకస్మికంగా తీవ్ర జ్వరం (హైఫీవర్); ఒళ్లు నొప్పులు; గొంతు నొప్పి; తీవ్రమైన అలసట / నీరసం / నిస్సత్తువ; ఎడతెరిపి లేకుండా దగ్గు. అయితే కొన్ని కేసుల్లో ఇది నిమోనియా వంటి సెకండరీ ఇన్ఫెక్షన్కు దారితీసే అవకాశం. నిమోనియా లక్షణాలు: విపరీతంగా దగ్గు వస్తూ కళ్లె (మ్యూకస్) పడుతూ ఉండటం; ఛాతీలో నొప్పి, ఆయాసంతో ఎగ శ్వాస తీసుకుంటూ ఉండటం; తీవ్రమైన అలసట, నీరసం, నిస్సత్తువ; పెద్దవయసు వారిలో పరిస్థితులు మరింత తీవ్రమవుతుండటం; అయోమయానికి గురికావడం; ఆకలిలేకపోవడంతక్షణం వైద్యుడిని సంప్రదించాల్సిన పరిస్థితులు..శ్వాస తీసుకోవడంలో తీవ్రమైన ఇబ్బంది; పెదవులు నీలంగా మారడం, ఛాతీ లేదా కడుపులో తీవ్రమైన నొప్పి, అయోమయం, నీళ్లు తాగలేక΄ోవడం / ద్రవపదార్థాలు తీసుకోలేక΄ోవడం. ∙కొన్ని వైద్య పరీక్షలు : వ్యక్తిగతంగా పరీక్షించడం (క్లినికల్ ఎగ్జామినేషన్స్), కొన్ని రక్తపరీక్షలు, ఛాతీ ఎక్స్రే లేదా అవసరమైతే కొన్ని ఇమేజింగ్ పరీక్షలు.వానాకాలపు జాగ్రత్తలు / నివారణలు...వ్యాక్సిన్: ప్రతి ఏడాదీ ఫ్లూ వ్యాక్సిన్ తప్పనిసరిగా తీసుకోవడం; వయోవృద్ధులు, వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు తప్పనిసరిగా న్యుమోకోకల్ వ్యాక్సిన్ తీసుకోవడం. హైజీన్ : వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం, ఇల్లు, ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవడం, కిటికీలు, తలుపులు తెరచి గదులు తేమ లేకుండా పొడిగా ఉంచుకోవడం, ఇళ్లలో (ఆ మాటకొస్తే బయట కూడా) పొగతాగకుండా/ ఇల్లు ΄÷గచూరకుండా చూసుకోవడం ∙తరచూ చేతులు కడుక్కోవడం, ఇంట్లో ఎవరు అనారోగ్యంగా ఉన్నా అందరూ మాస్కులు వాడటం.చికిత్స...వయోవృద్ధులు, పెద్దవాళ్లు, గర్భిణులు, చిన్నారులు... వీళ్లు ఎవరైనా జబ్బుపడితే వెంటనే డాక్టర్ను సంప్రదించడం. పోషకాహారం తీసుకోవడం; తగినంత నీరు తాగుతూ ఒంటిని హైడ్రేటెడ్గా ఉంచుకోవడం; తగినంత విశ్రాంతి; కంటినిండా నిద్ర, డాక్టరు సూచించిన మందుల్ని (యాంటీ వైరల్, యాంటీ బయాటిక్స్ వంటివి) క్రమం తప్పకుండా వాడటం. అవసరాన్ని బట్టి ఆక్సిజన్ మాస్క్ లేదా నెబ్యులైజేషన్ పెట్టడం. పై జాగ్రత్తలతో ఈ వానాకాలంలో ఫ్లూ, నిమోనియా, సెకండరీ నిమోనియా రిస్కులను విజయవంతంగా ఎదుర్కోవడమే కాకుండా, నివారణ పద్ధతులు అనుసరిస్తూ, ముందుజాగ్రత్తలు తీసుకుంటూ ఇంటిల్లిపాదీ వ్యాధులకు దూరంగా కూడా ఉండవచ్చు. డాక్టర్లను ప్రజలు ఎక్కువగా అడుగుతుండే ప్రశ్నలు...ప్రశ్న : మా అబ్బాయికి జలుబు చేసి (ఫ్లూ వచ్చి) తగ్గినప్పటికీ దగ్గు ఎందుకిలా వారాల తరబడి ఉంటోంది? డాక్టర్ జవాబు : వైరస్ వచ్చి తగ్గాయ (పోస్ట్–వైరల్ సెన్సిటివిటీ) లేదా నిమోనియాలాంటి ఇన్ఫెక్షన్ వల్ల ఇలా జరుగుతుండవచ్చు.ప్రశ్న : అల్లం కలిపిన గోరువెచ్చని నీళ్లు తాగడం లాంటి చిట్కాల వల్ల ప్రయోజనం ఉంటుందా? డాక్టర్ జవాబు : ఇలాంటి ఇంటి చిట్కాలు లక్షణాలను కొంతవరకు తగ్గించవచ్చు. కానీ వ్యాక్సిన్ వేయించుకోవడం / వైద్య చికిత్స తీసుకోవడమే పూర్తి రక్షణ ఇస్తాయి.ప్రశ్న : మాస్కులు తొడగడం తప్పనిసరా? డాక్టర్ జవాబు మాస్కులు తొడుక్కోవడం, చేతులు కడుక్కోవడం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం వంటి జాగ్రత్తలు తప్పనిసరిగా అనుసరించాలి.డాక్టర్ గంగాధర్ రెడ్డి మల్లు, సీనియర్ పల్మనాలజిస్ట్, స్లీప్ మెడిసిన్ స్పెషలిస్ట్ (చదవండి: మేని కాంతికి మెరుగైన చికిత్స..!) -
రుతుక్రమం వాయిదా వేసే మాత్రలు వాడొచ్చా..?
నా వయసు ఇరవై ఐదు సంవత్సరాలు. పెళ్లి నిశ్చయమైంది. త్వరలో ఒక కుటుంబ కార్యక్రమం ఉంది. ఆ సమయానికి రుతుక్రమం రాకుండా వాయిదా వేసే మాత్రలు వాడాలని మా ఇంట్లో అందరూ చెబుతున్నారు. కాని, వాటి వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు వస్తాయో, భవిష్యత్తులో గర్భధారణకు ఇబ్బందులు కలుగుతాయో తెలుసుకోవాలని ఉంది.– ప్రియాంక, హైదరాబాద్మీ వయసు, శరీర పరిస్థితి, రుతుక్రమం సక్రమంగా జరుగుతుందా లేదా అన్న విషయాలను ముందుగా పరిశీలించడం అవసరం. రుతుక్రమం వాయిదా వేసే మాత్రలు సాధారణంగా అధిక మోతాదు ప్రొజెస్టెరాన్ హార్మోన్లు కలిగి ఉంటాయి. ఇవి శరీరంలో సహజంగా ఏర్పడే హార్మోన్ల సమతుల్యాన్ని మార్చి, గర్భాశయంలో ఏర్పడిన పొర ఊడిపోకుండా అడ్డుకుంటాయి. మాత్రలు వాడుతున్నంత కాలం రుతుక్రమం రాదు. కాని, ఆపిన తరువాత గర్భాశయ పొర ఒకేసారి ఊడిపోవడం వల్ల ఎక్కువ రక్తస్రావం జరగవచ్చు. తరచుగా వాడితే రుతుక్రమం అసాధారణంగా మారడం, గర్భసంబంధిత సమస్యలు రావచ్చు. గతంలో ఇలాంటి మాత్రలు వాడిన మహిళల్లో అండాల ఉత్పత్తి తగ్గిపోవడం, ఆరోగ్యకరమైన అండాల లభ్యత తగ్గడం వలన గర్భధారణలో ఇబ్బందులు ఎదురైన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఈ సమస్య సర్దుకోవడానికి కొంతమందికి నెలల తరబడి లేదా సంవత్సరాల పాటు సమయం పడుతుంది. తాత్కాలిక దుష్ప్రభావాలలో మానసిక భావప్రకటన మార్పులు, అజీర్ణం, వాంతులు, మైగ్రేన్ తలనొప్పి, స్తనాల నొప్పి, బరువు పెరగడం ఉంటాయి. అధిక బరువున్నవారు వాడితే రక్తం గడ్డకట్టడం, గుండె సంబంధిత వ్యాధులు, ఊపిరితిత్తుల సమస్యలు, మెదడులో రక్తనాళాలు మూసుకుపోయే ప్రమాదం ఎక్కువ. కుటుంబంలో క్యాన్సర్, అధిక రక్తపోటు, గుండె సమస్యల చరిత్ర ఉన్నవారు లేదా ఇప్పటికే రక్తపోటు ఉన్నవారు ఈ మాత్రలు వాడకూడదు. దీర్ఘకాలంగా వాడితే శాశ్వత ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంది. కాబట్టి రుతుక్రమం వాయిదా వేసే ముందు తప్పనిసరిగా డాక్టర్ని కలసి, శరీర పరిస్థితి అంచనా వేయించు కోవాలి. తక్కువ మోతాదులో ఉండే మాత్రలను, కార్యక్రమానికి ఒకటి రెండు నెలల ముందు ప్రారంభిస్తే కొంత సురక్షితంగా వాడవచ్చు. భవిష్యత్తులో గర్భధారణకు సిద్ధమవుతున్న వారు అనవసరంగా ఈ మాత్రలను వాడకూడదు. ఎందుకంటే ఇవి గర్భంలో శిశువు అభివృద్ధికి అవసరమైన హార్మోన్లపై ప్రభావం చూపవచ్చు. కాబట్టి మీ వయసు, ఆరోగ్య చరిత్ర, ప్రస్తుత రుతుక్రమ స్థితి ఇవన్నీ పరిశీలించి, వైద్యుని సలహా తీసుకుని మాత్రమే నిర్ణయం తీసుకోవాలి.నా వయసు పద్దెనిమిదేళ్లు. మొదటి నుంచే నాకు పీరియడ్స్ రెగ్యులర్గా రావు. ఈ అక్టోబర్ నెలలో దసరా పండుగకు మేము ఇంట్లో దేవుడికి పెద్దగా పూజ చేద్దామని అనుకుంటున్నాం. కాబట్టి, ఆ సమయంలో పీరియడ్స్ రాకుండా పోస్ట్పోన్ లేదా ప్రీపోన్ టాబ్లెట్లు వాడవచ్చా?– స్వాతి, విజయవాడమీ పీరియడ్స్ రెగ్యులర్గా లేనందున, వచ్చే నెలలో పీరియడ్స్ ఏ తేదీన వస్తాయో ముందుగా చెప్పడం కష్టం. అందుకే ఆ తేదీని ముందుకు తేవడం లేదా వెనక్కు మార్చడం ఈ పరిస్థితిలో కష్టమైన పని. సాధారణంగా, పీరియడ్స్ సరిగ్గా వచ్చే వాళ్లకి, తేదీకి కొన్ని రోజులు ముందు హైడోస్ హార్మోన్ మాత్రలు ఇస్తే పీరియడ్స్ వాయిదా వేయవచ్చు. కాని, మీలా నెలసరి క్రమం తప్పి ఉన్నవాళ్లకి ఇది సురక్షితం కాదు. ఈ మాత్రలు వాడితే వికారం, వాంతులు, తలనొప్పి, పొత్తికడుపు నొప్పి, మూడ్ స్వింగ్స్ వంటి సమస్యలు రావచ్చు. కొన్ని సందర్భాల్లో రక్తం గడ్డకట్టడం, కాలేయానికి నష్టం వంటి తీవ్రమైన సమస్యలు కూడా రావచ్చు. వీటిని తరచుగా వాడితే పీరియడ్స్ ఇంకా అస్తవ్యస్తంగా మారే అవకాశం ఉంది. మీ వయసులో పీరియడ్స్ రెగ్యులర్గా కాకపోవడం సహజం. ఎందుకంటే ఈ వయసులో శరీరం ఇంకా మార్పులు పొందుతూ ఉంటుంది. చాలా అమ్మాయిల్లో ఇది ఇరవై ఏళ్ల వరకు క్రమంగా సర్దుకుంటుంది. కాని, పీరియడ్స్ ఎప్పుడూ రెగ్యులర్ కాకపోతే, పీసీఓఎస్ (పాలీసిస్టిక్ ఓవరీస్ సిండ్రోమ్), థైరాయిడ్ సమస్యలు, అధిక బరువు, తక్కువ బరువు, ఒత్తిడి, నిద్రలేమి, సరైన ఆహారం తీసుకోకపోవడం వంటి కారణాలు కూడా ఉండవచ్చు. నా సలహా ఏమిటంటే, కేవలం పూజల కోసమే హార్మోన్ మందులు వాడడం కంటే, ముందుగా మీ సమస్యకు గల అసలు కారణాన్ని గుర్తించి చికిత్స చేయించుకోవడం ఉత్తమం. ఇలా చేస్తే మీ సైకిల్ సరిగా వచ్చి, భవిష్యత్తులో గర్భధారణ సామర్థ్యం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. ముఖ్యంగా ఫార్మసీ నుంచి ఇలాంటి మందులను స్వయంగా అసలు కొనకండి.డాక్టర్ భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్ (చదవండి: అనాథశ్రమంలో పెరిగి ఐఏఎస్ అయ్యాడు..! ట్విస్ట్ ఏంటంటే..)