breaking news
Health
-
ఆందోళనతో కంటికి కునుకే కరువైంది!
నా వయస్సు 72 సంవత్సరాలు. ఉద్యోగం నుంచి రిటైరై దాదాపు 14 ఏళ్లయింది. నేను చాలా సంవత్సరాల నుండి ఒక సమస్యతో బాధపడుతున్నాను. అదేమిటంటే ప్రతి చిన్న విషయం గురించి ఎక్కువగా ఆలోచించటం. ఎప్పుడూ మనసులో గందరగోళంగా ఉంటుంది. ఈ ఆలోచన వలన చేసే పనిలో ధ్యాస ఉండదు. రాత్రి పడుకున్న తర్వాత విపరీతంగా కలలు వస్తుంటాయి. దీనివల్ల ప్రశాంతంగా నిద్ర కూడా ఉండడం లేదు. ఈ సమస్య ఎప్పుడు మొదలైందో గుర్తు లేదు కానీ, రిటైర్మెంట్ తర్వాత నన్ను మరింతగా బాధిస్తోంది. నాకు షుగర్, బీపీ కూడా ఉన్నాయి. నా సమస్యకు పరిష్కారం చూడగలరు. –కె.ఎల్.వి ప్రసాద్, హైదరాబాద్మీరు రాసిన లక్షణాలను బట్టి మీకున్న సమస్యను ‘యాంక్సైటీ డిజార్డర్‘ (నిరంతర ఆందోళన రుగ్మత) అంటారు. యాంగై్జటీ లేదా భయం అనేవి ప్రమాదాలనుండి మనల్ని మనం కాపాడుకోవడానికి ప్రకృతి ఏర్పరచిన, ఒక ర క్షణ వ్యవస్థ. మనుషులతో పాటు జంతువుల్లో కూడా ఈ వ్యవస్థ ఉంటుంది. అయితే కొన్ని సార్లు మెదడు రసాయనాల్లో మార్పులు, చిన్న వయసులో ఎదుర్కొన్న ఇబ్బందుల వల్ల, ఈ రక్షణ వ్యవస్థలో లోపం ఏర్పడుతుంది. ఆ కారణంగానే మెదడు ఆందోళనకు గురవుతూ ఉంటుంది. రోజూవారి వ్యవహారాలు, చిన్నచిన్న సమస్యలని కూడా మెదడు భూతద్దంలో చూస్తూ ఎప్పుడూ వాటి గురించే ఆలోచిస్తూ ఉంటుంది. దీని వల్ల ప్రశాంతత ఉండదు. చేసే పని మీద ధ్యాస ఉండదు. ఎప్పుడూ కంగారు కంగారుగా భయంగా ఉంటుంది. రాత్రిపూట కూడా మెదడు ఇలా ఆతిగా ఆలోచనలు చేయడం వల్ల నిద్ర కూడా పట్టదు. ఇది యుక్తవయసులోనే మొదలైతే చాలా సంవత్సరాలు ఇబ్బంది పడవలసి ఉంటుంది. తర్వాతి కాలంలో ఇది తీవ్రమైన డిప్రెషన్కు దారి తీయొచ్చు. దీనికి ఆధునిక వైద్య విధానంలో చక్కని పరిష్కారం ఉంది. కొన్ని ప్రత్యేకమైన మందులు, చికిత్స పద్ధతులను మానసిక వైద్యుల సూచన మేరకు కొంతకాలం వాడాల్సి ఉంటుంది. అలాగే కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ, సైకోడైనమిక్ థెరపీ, ఎక్స్΄ోజర్ థెరపీ వంటి కౌన్సెలింగ్ పద్దతుల ద్వారా క్లినికల్ సైకాలజిస్టులు ఈ సమస్య తీవ్రతని తగ్గించగలరు. మీరు దగ్గరలోని మానసిక వైద్యుని కలిసి ఖచ్చితంగా ఈ సమస్య నుండి పూర్తిగా విముక్తి పొందగలరు. ఆల్ ది బెస్ట్!డా. ఇండ్ల విశాల్ రెడ్డి, సీనియర్ సైకియాట్రిస్ట్, విజయవాడ. మీ సమస్యలు, సందేహాలు పంపవలసిన మెయిల్ ఐడీ: sakshifamily3@gmail.com -
దేశంలోనే తొలిసారి ఎనిమిదేళ్ల పాపకు పాంక్రియాస్ శస్త్రచికిత్స
మన శరీరంలో క్లోమం (పాంక్రియాస్) అత్యంత కీలకం, అదే సమయంలో బాగా సున్నితం. అలాంటి పాంక్రియస్లో కణితి ఏర్పడితే చాలా ప్రమాదకరం. కేవలం ఎనిమిదేళ్ల వయసులో అలాంటి ఇబ్బంది వచ్చిన ఒక పాపకు.. సీతమ్మధారలోని కిమ్స్ ఆస్పత్రి వైద్యులు అత్యంత అధునాతన పద్ధతిలో శస్త్రచికిత్స చేసి, ఊరట కల్పించారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఆస్పత్రికి చెందిన చీఫ్ కన్సల్టెంట్ గ్యాస్ట్రో ఇంటెస్టినల్, హెపటో-బైలియరీ, పాంక్రియాటిక్ సర్జన్ డాక్టర్ మురళీధర్ నంబాడ తెలిపారు."విశాఖ నగరానికి చెందిన ఎనిమిదేళ్ల బాలిక తీవ్రమైన కడుపునొప్పితో ఆస్పత్రికి వచ్చింది. ఈ చిన్న పాపను గ్యాస్ట్రోఎంటరాలజీ డాక్టర్ ఆచంట చలపతి రావు ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్ పరీక్షల ద్వారా అరుదైన సాలిడ్ సూడోపాపిలరీ ఎపితెలియల్ నియోప్లాజమ్ (స్పెన్) అనే పాంక్రియాటిక్ కణితి ఉన్నట్లు గుర్తించారు. భారత దేశంలో ఈ తరహా సమస్యకు శస్త్రచికిత్స జరిగిన అత్యంత చిన్నవయసు రోగిగా ఈ పాప చరిత్ర సృష్టించింది. పాపకు పాంక్రియాస్లో కణితి ఉండడం, అది అత్యంత అరుదైనది కావడంతో దాంట్లో క్యాన్సర్ లక్షణాలు చాలా తక్కువగానే ఉన్నా, తర్వాత ఎలాంటి సంక్లిష్ట సమస్యలు రాకూడదంటే శస్త్రచికిత్స చేసి దాన్ని తొలగించాలని నిర్ణయించాం.మూడు గంటల పాటు అత్యంత కచ్చితత్వంతో కీహోల్ సర్జరీ (లాప్రోస్కోపిక్ సెంట్రల్ ప్యాంక్రియాటెక్టమీ)మొదలుపెట్టాం వీలైనంత వరకు రక్తస్రావం లేకుండా చూడడంతో పాటు, పాంక్రియస్ కణజాలాన్ని కూడా వీలైనంత వరకు కాపాడుకుంటూ కణితి మొత్తాన్ని తొలగించగలిగాం. ఈ శస్త్రచికిత్స తర్వాత బాలిక చాలా త్వరగా కోలుకుంది. ఎలాంటి సమస్యలు లేకపోవడంతో ఐదు రోజుల్లోనే పాపను ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశాం. ఇప్పుడు ఆమె స్కూలుకు కూడా వెళ్తూ చదువులో, ఆట లో చక్కగా రాణిస్తోంది. ఇలాంటి అత్యంత అరుదైన పాంక్రియాటిక్ కణితులను తొలగించడంలో ఉన్న నైపుణ్యాలకు ఈ శస్త్రచికిత్సే నిదర్శనం. ఇలాంటి కణుతులు చాలా అరుదైనప్పటికీ, తమ అనుభవంలో గత పదేళ్ళలో 12 గుర్తించి వైద్యం చేశాం". అని శస్త్ర చికిత్స నిపుణులు డా. మురళీధర్ నంబాడ వివరించారు. (చదవండి: అక్కడ కాన్పు కోసం గర్భిణిని అంగడికి తీసుకువెళ్తారట..?) -
అసలు నిజమేంటి?.. ఎందుకిలా జరుగుతుంది?
నిద్రలో కాళ్లు చేతుల ఆడవు.. మెడను నొక్కస్తున్నట్లు ఉంటుంది అది దెయ్యం పనేనా..??? అర్ధరాత్రి..! గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఉన్నట్లుండి ఎవరో మంచం పక్కన కూర్చున్నట్లు అనిపిస్తుంది..! క్రమంగా గుండెలపైకెక్కి కూర్చున్నట్లు.. గొంతు నులుముతున్నట్లు అనిపిస్తుంది..! మనం అసంకల్పిత ప్రతీకార చర్యలో భాగంగా ఒక్క తోపు తోసేయాలనుకుంటాం.కానీ, చేతులు కదలవు..! కాళ్లను కదపలేం..! ఇలాంటి అనుభవం దాదాపుగా ప్రతిఒక్కరూ ఎదుర్కొనే ఉంటారు..! కొందరికి ఈ స్థితి ఒకరెండ్రుసార్లు ఎదురైతే.. మరికొందరికి నిద్రలో ఇదో నిత్యకృత్యం..! ఇందుకు కారణాలేంటి? కొందరైతే దెయ్యమే ఆ పని చేస్తోందంటారు. మరికొందరైతే.. గిట్టనివారు చేతబడి చేయడం వల్ల ఇలా జరిగిందంటారు..! అసలు నిజం ఏమిటో తెలుసుకోవాలని ఉందా..!ఏ సమయంలో ఇలా జరుగుతుంది??అర్ధరాత్రి సరిగ్గా 12.30 గంటలు దాటాకే చాలా మంది ఇలాంటి ఫీలింగ్ను ఎదుర్కొన్నట్లు పలు పరిశోధనలు చెబుతున్నాయి. తెల్లవారుజామున 3.30 వరకు ఎప్పుడైనా ఈ పరిస్థితి రావొచ్చని పేర్కొంటున్నాయి. ఎవరో గుండెలమీద కూర్చుని, పీక నొక్కుతున్నట్లు.. గుండెలపై బరువు అంతకంతకూ పెరుగుతున్నట్లు అనిపిస్తుంది. కాళ్లు, చేతులను కదిలించలేని స్థితిలో.. ఏమీ చేయలేని దుస్థితి ఎదురవుతుంది. అంతేకాదు.. గట్టిగా అరవాలనిపించినా.. అరవలేరు. కళ్లు కూడా తెరవలేరు. దాంతో.. గుండెలో దడ మొదలవుతుంది. మదినిండా ఆందోళనలతోకూడిన ఆలోచనలు వస్తుంటాయి. కళ్లు మూసుకుని ఉన్నా.. బెడ్రూంలో పరిసరాలు కనిపిస్తుంటాయి. ఒక్కోసారి ఎదురుగా వింతవింత ఆకారాలు ఉన్నట్లు అనిపిస్తుంది.అంతా ట్రాష్ అంటున్న సైంటిస్టులుఈ పరిస్థితి కలలాంటిదే అని చాలా మందికి తెలియదు. కాస్త మెలకువ వచ్చేముందు.. భయంతో దేవుడి నామస్మరణ చేసుకుంటారు. ఆ తర్వాత నిద్ర లేస్తారు. దాంతో.. దేవుడి పేరు చెప్పగానే దెయ్యం పారిపోయిందనుకుంటారు. కానీ.. ఇదంతా దెయ్యం పనో.. చేతబడుల ఫలితమో కాదని, అవన్నీ ట్రాష్ అని అంటున్నారు శాస్త్రవేత్తలు. ఇలాంటి పరిస్థితులకు శాస్త్రీయ కారణాలున్నాయని చెబుతున్నారు. నిద్రకు సంబంధించిన మానసిక రుగ్మతలైన స్లీప్ టెర్రర్, నైట్ మేర్ డిజార్డర్, స్లీప్ వాకింగ్ మాదిరిగానే.. స్లీప్ పెరాలసీస్ అనే రుగ్మత కారణంగా ఇలా జరుగుతుందని వివరిస్తున్నారు. అంటే.. ఈ పరిస్థితిని నిద్రలో పక్షవాతం అని అనవచ్చు. ఇలా అందరికీ జరుగుతందా? అంటే.. చెప్పలేం..! స్లీప్ పెరాలసిస్ అనేది కొన్ని క్షణాలు మాత్రమే ఉంటుంది. ఆ కొద్ది క్షణాలు శరీరమంతా లాక్ అవుతుంది.స్లీప్ పెరాలసిస్ అంటే..అసలు స్లీప్ పెరాలసిస్ అంటే ఏమిటో తెలుసుకుందాం. సాధారణంగా పెరాలసిస్.. అదే పక్షవాతం వస్తే.. పూర్తిగానో.. పాక్షికంగానో కాలు, చేయి చచ్చుబడిపోయి.. నోరు ఓవైపునకు జారిపోతుంది. స్లీప్ పెరాలసిస్ మాత్రం కొన్ని క్షణాలే ఉంటుంది. అయితే.. పక్షవాతానికి మెదడుకు సంబంధం ఉన్నట్లుగానే.. స్లీప్ పెరాలసిస్కు కూడా మెదడు నుంచి విడుదలయ్యే కమాండ్స్ కారణమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంటే.. అంతకు ముందు విన్న విషయాలో.. హారర్ స్టోరీలో మెదడులో స్టోర్ అయిపోతాయి. నిద్రలో జాగ్రత్, స్వప్న, సుశుప్త దశలుంటాయి. వీటినే.. ర్యాపిడ్ ఐ మూవ్మెంట్, స్లీప్, డీప్ స్లీప్ అంటారు.స్లీప్ క్వాలిటీ కోసం స్మార్ట్ వాచ్లు పెట్టుకుని, నిద్రపోయేవారికి ఈ విషయాలు బాగా తెలుసు. మనం నిద్రిస్తున్నప్పుడు మెదడు కూడా రెస్ట్ తీసుకుంటుంది. అప్పుడు వెన్నెపూస మెదడులా పనిచేస్తుంది. అందుకే.. నిద్రలో దోమలు కుట్టినప్పుడు మనం అది కుట్టిన చోట తెలియకుండానే గట్టిగా చరుస్తాం. దీన్నే అసంకల్పిత ప్రతీకార చర్య అంటాం.ర్యాపిడ్ ఐ మూవ్మెంట్ దశలో మెదడులో నిక్షిప్తమైన పాత జ్ఞాపకాలు స్లీప్ పెరాలసిస్కు కారణాలవుతాయని క్లినికల్ సైకాలజిస్టులు చెబుతున్నారు. ఎవరైనా నిద్రిస్తున్నప్పుడు.. ఎప్పుడైతే ఎవరో పక్కన కూర్చున్నారనే భావన వస్తుందో.. గుండె దడ పెరగడం వల్ల ఛాతీపై ఎవరో కూర్చున్నారనే ఫీలింగ్ కలుగుతుంది. దానికి పాత జ్ఞాపకాలు కలిసి.. భయం పెరుగుతుంది. అంతే.. కొన్ని సెకన్లపాటు స్లీప్ పెరాలసిస్ వస్తుంది. ఇది కనీసం 30 సెకన్లు ఉంటుంది. గరిష్ఠంగా ఇంత సమయం అని చెప్పలేం.కంటినిండా నిద్ర లేకపోవడమే కారణం..స్లీప్ పెరాలసిస్ అంటే తెలుసుకున్నారు కదా? నిద్ర నుంచి మెలకువ రాగానే స్లీప్ పెరాలసిస్ దశ నుంచి బయట పడతారు. కాసేపు ఆందోళన చెందుతారు. అంతా భ్రాంతి అని అర్థం చేసుకుని, మళ్లీ నిద్రకు ఉపక్రమిస్తారు. ఇలా స్లీప్ పెరాలసిస్ రావడానికి దెయ్యాలో, చేతబడులో కారణం కాదు. కంటి నిండా నిద్ర లేకపోవడం, సరైన సమయంలో నిద్రకు ఉపక్రమించకపోవడం, నిద్ర షెడ్యూల్ డిస్టర్బ్ అవ్వడం ప్రధాన కారణాలు. ఒత్తిడి, నిరాశ, అతిగా ఆలోచించడం, ప్రతికూల ఆలోచనలు, కలత వంటివి ఇతర కారణాలు అని క్లినికల్ సైకాలజిస్టులు చెబుతున్నారు. ముఖ్యంగా పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ ఉన్నవారు ఎక్కువగా స్లీప్ పెరాలసిస్కు గురవుతుంటారు. రోజులో ఎనిమిది గంటల నిద్ర మాత్రమే స్లీప్ పెరాలసిస్కు చెక్ పెట్టగలదని పేర్కొంటున్నారు. -
చలి... చర్మ సమస్యలూ, జాగ్రత్తలు..!
శీతకాలంలోని చల్లటి వాతావరణంలో చలి ప్రభావం నేరుగా చర్మం మీదే పడుతుంది. అందుకే ఆ చలి బాధను మొదట అనుభవించేది చర్మమే. పైగా ఈ సీజన్లో వాతావరణంలో తేమ బాగా తగ్గి΄ోవడంతో... దాన్ని మళ్లీ భర్తీ చేయడానికి మన చర్మం నుంచే తేమను అప్పుడున్న వాతావరణం లాగేస్తుంటుంది. ఈ కారణంగానే ఈ సీజన్లో చర్మం పొడిబారిపోయి కనిపిస్తుంటుంది. ఫలితంగా ఈ సీజన్లో చర్మంపై గోటితో గీరగానే గీతలు పడుతుంటాయి. అంతేకాదు.. ఈ సీజన్లో ఇతర అలర్జీలతో పాటు చర్మ–అలర్జీలూ పెరుగుతాయి. ఫలితంగా చర్మం పగలడం, కాళ్లు పగుళ్లు ప్రస్ఫుటంగా కనిపించే ఎగ్జిమా వంటి కేసులు పెరుగుతాయి. అందువల్ల మరీ ముఖ్యంగా మడమలు పగలడం కూడా ఈ సీజన్లోనే చాలా ఎక్కువ. ఇలా మడమల పగుళ్లు కనిపించడమన్నది యువతులు, మహిళల్లో మరికాస్త ఎక్కువ.ఎగ్జిమా : కాళ్లూ, చేతులు పగుళ్లబారి కనిపించడం ఎగ్జిమా తాలూకు ప్రధాన లక్షణం. ఈ సీజన్లో చలి కారణంగా పెరిగి΄ోయి కనిపించే కేసుల్లో ఎగ్జిమానే ఎక్కువ. అందుకే దాని నివారణ, చికిత్సల గురించి తెలుసుకుందాం.నివారణ, చికిత్స : ఎగ్జిమా నివారణ/చికిత్సలు ఇవి... ∙దురద అంతగా లేనివారు సువాసన లేని, మామూలు హై΄ో అలర్జిక్ మాయిశ్చరైజర్స్ రాసుకుంటూ చర్మాన్ని సంరక్షించుకోవాలి. ∙ఒకవేళ దురద ఎక్కువగా ఉంటే డాక్టర్ సలహా మేరకు వాటిని తగ్గించే పూత మందులు (టాపికల్ మెడిసిన్స్) వాడాలి.హౌజ్వైఫ్ డర్మటైటిస్ : పేరునుబట్టి ఇది గృహిణులకు మాత్రమే వచ్చే సమస్యగా అనిపించవచ్చు గానీ అది నిజం కాదు. కొన్నిసార్లు మధ్యవయస్కులతో ΄ాటు, యువతుల్లోనూ కనిపిస్తుంది. అంటే ఇరవై నుంచి నలభై ఏళ్ల వయసులో ఉన్న మహిళలకు ‘హౌజ్వైఫ్ డర్మటైటిస్’ ముప్పు ఎక్కువ. ఈ వయసు మహిళలు... తాము ముఖం కడుక్కోవడానికి వాడే సబ్బులు, బట్టలు ఉతకడం కోసం వాడే డిటర్జెంటు సబ్బులు, ΄ûడర్లు; అలాగే కొన్ని సందర్భాల్లో వారు ముఖానికి పసుపు, కుంకుమ రాసుకోవడం కారణంగా ముఖం బాగా ΄÷డిబారి΄ోవడం వంటి సమస్యలు కనిపిస్తాయి. ఫలితంగా చర్మంపై పగుళ్లు, దురదలు వస్తాయి. ఈ సమస్యనే ‘హౌజ్వైఫ్ డర్మటైటిస్’ అంటారు. నివారణ : ∙తమకు అలర్జీ కలిగించే అన్ని రకాల పదార్థాలను గుర్తించి, వాటి నుంచి దూరంగా ఉండటం. ∙మడమలు పగలినవారు శాల్సిలిక్ యాసిడ్ ఉండే కాంబినేషన్ క్రీములు వాడటం వల్ల ఉపశమనం కలుగుతుంది. కాళ్లు పగిలిన వారు రాత్రి వేళ సాక్స్ ధరించి పడుకోవడం వల్ల మడమల పగుళ్లు చాలావరకు తగ్గుతాయి.చలికాలంలో పూర్తిస్థాయి చర్మ సంరక్షణ కోసం... చలికాలంలో బాగా పొగలుగక్కే వేణ్ణీళ్లు మంచివి అని కొందరు పొరబడుతుంటారు. ఇది కేవలం అ΄ోహ మాత్రమే. నిజానికి ఈ సీజన్లోని వాతావరణం మన చర్మం నుంచి తేమను లాగేస్తుంటుంది. ఫలితంగా వేడినీళ్లతో స్నానం చర్మాన్ని మరింత పొడిబార్చే ప్రమాదం ఉంది. అందుకే స్నానానికి గోరువెచ్చని నీళ్లు వాడటమే మేలు స్నానానికి అరగంట ముందు ఒంటికి ఆలివ్ లేదా కొబ్బరి నూనె పట్టించాలి. స్నానానికి మాయిశ్చరైజింగ్ సబ్బు వాడటం కూడా మంచిదే చల్లటి వాతావరణంలో దాహం వేయక΄ోవడంతో నీరు తాగడం తగ్గించడం సరికాదు. రోజూ కనీసం రెండు లీటర్ల నీటిని తాగడమే మంచిది అరచేతులు, పాదాలు పగిలినవాళ్లు పాదాలకూ సాక్స్, చేతులకూ కాటన్ గ్లౌజ్ ధరించడం మంచిది పెదవులు పగలకుండా పెట్రోలియమ్ జెల్లీగానీ లేదా లిప్ బామ్గానీ పెదవులపై తరచూ రాసుకుంటూ ఉండటం మంచిది చలికాలమే అయినప్పటికీ తగినంత ఎస్పీఎఫ్ ఉండే సన్స్క్రీన్ లోషన్ను రాసుకుంటూ ఉండటం మంచిది. (చదవండి: -
వివక్ష తొలగిపోతేనే ఎయిడ్స్ నియంత్రణ
హైదరాబాద్: ఎయిడ్స్ అనేది చాపకింద నీరులా విస్తరిస్తున్న ప్రమాదకరమన వ్యాధి. అయితే, తగిన అవగాహన ఉంటే దాన్ని నియంత్రించడం సాధ్యమవుతుందని డా. అనురాధ జాయింట్ డైరెక్టర్ తెలంగాణ సార్క్ (సైంటిఫిక్ అండ్ అప్లైడ్ రీసెర్చ్ సెంటర్) తెలిపారు. ప్రపంచ ఎయిడ్స్ డే సందర్భంగా సోమవారం కామినేని ఆస్పత్రి ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహనా నడక కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొని కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. పలువురు వైద్యులు, వైద్యవిద్యార్థులు, నర్సింగ్ సిబ్బంది, సామాన్య ప్రజలు.. మొత్తం 300 మందితో అవగాహన నడక కార్యక్రమం నిర్వహించారు. ఇందులో అందరూ ప్లకార్డులు పట్టుకుని, హెచ్ఐవీ/ఎయిడ్స్ గురించి అందరికీ అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు.ఈ సందర్బంగా ఆస్పత్రికి చెందిన కన్సల్టెంట్ ఫిజిషియన్ డాక్టర్ శ్రీకృష్ణ రాఘవేంద్ర మాట్లాడుతూ, ‘‘దేశంలో 24 లక్షల మందికి హెచ్ఐవీ ఉంది. తెలంగాణలో 1.4 లక్షల మందికి హెచ్ఐవీ ఉంది. వీరిలో సగం మంది పురుషులు, సగం మంది మహిళలు ఉన్నారు. చాలామంది పరీక్షలు చేయించుకోవడంతో పిల్లల్లో కూడా పాజిటివ్ కనపడుతోంది. ఇలాంటి కేసులు చాలావరకు తల్లిదండ్రుల నుంచి సంక్రమిస్తాయి. ఏమాత్రం లక్షణాలు కనిపించినా, తరచు జ్వరం వస్తున్నా, ఆహారం తీసుకున్నా సరే నీరసంగా ఉంటున్నా వైద్యుల వద్దకు వెళ్లి అవసరమైన పరీక్షలు చేయించుకోవాలి. హెచ్ఐవీ సోకిందన్నంత మాత్రాన భయపడాల్సిన అవసరం లేదు. గుర్తించిన కేసులను ముందుగా ఐసీటీసీ సెంటర్లో రిజిస్టర్ చేయించుకోవాలి. ఎల్బీనగర్ పరిసర ప్రాంత వాసులకు సమీపంలో వనస్థలిపురంలో ఒక ఐసీటీసీ సెంటర్ ఉంది. పీపీపీ పద్ధతిలో ఏఆర్టీ సెంటర్ కామినేనిలో ఉంది. ఇది 2022లో స్థాపించారు. ఇది ఫంక్షనల్ ఐసీటీసీ సెంటర్. ఇందులో యాంటీ రెట్రోవైరల్ మందులను ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉచితంగా పంపిణీ చేస్తారు. ఇక్కడ కాకుండా ఇంకా నగర పరిధిలో గాంధీ, ఉస్మానియా, చెస్ట్ ఆస్పత్రిలో కూడా ఉన్నాయి. కామినేని ఎఫ్ఐసీటీసీలో ఇప్పటివరకు 1200 మంది రిజిస్టర్ అయి ఉన్నారు. దాదాపు రోజుకు 35-40 మంది వరకు వచ్చి ప్రభుత్వం ఉచితంగా ఇస్తున్న మందులు తీసుకుంటారు. నిజానికి రాష్ట్రంలోని ప్రతి వైద్య కళాశాలలో ఒక ఏఆర్టీ సెంటర్ ఉండాలి. అప్పుడు అందరికీ చికిత్స అందుబాటులో ఉంటుంది. ప్రస్తుతానికి హైదరాబాద్లో పెద్దసంఖ్యలో రోగులను చూస్తూ, ఎప్పటికప్పుడు తగిన పరీక్షలు చేస్తూ, ప్రతినెలా ఫాలో అప్ చేసుకుంటూ, వారికి మందులు ఇస్తున్నది కామినేని పీపీపీ ఏఆర్టీ సెంటర్ మాత్రమే. ఇక్కడ కేవలం మందులు ఇవ్వడమే కాక.. మహిళలు, ట్రాన్స్జెండర్లు, ఇతరులకు అవగాహన తెప్పించి హెచ్ఐవీ రాకుండా జాగ్రత్తలు చెబుతున్నాం. నిపుణుల కన్సల్టేషన్ కావాలి’’ అని తెలిపారు.సీనియర్ కన్సల్టెంట్ ఫిజిషియన్ డాక్టర్ ఎం.స్వామి మాట్లాడుతూ, ‘‘హెచ్ఐవీ రోగుల విషయంలో ఇప్పటికీ మన సమాజంలో వివక్ష కొనసాగుతోంది. దీన్ని అరికట్టాలంటే విస్తృత ప్రచారం అవసరం. ఇంకా చెప్పాలంటే అసలు హెచ్ఐవీ రోగులను తాము చూడబోమని, చికిత్స అందించేది లేదనే వైద్యులూ కొంతమంది ఉన్నారు. అలా కాకుండా అందరూ అందరినీ చూడాలనే అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది’’ అని చెప్పారు. మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ అంజయ్య కనుసాలి మాట్లాడుతూ, ‘‘హెచ్ఐవీ రకరకాలుగా వ్యాపిస్తుంది. అరక్షిత శృంగారం ద్వారాను, రక్తమార్పిడి చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోకపోయినా.. ఇలా ఎలాగైనా సోకే అవకాశం ఉంటుంది. మనకు తెలిసినంత మేర జాగ్రత్తలు తీసుకుంటే దాని బారిన పడకుండా ఉండచ్చు. ఒకవేళ హెచ్ఐవీ సోకినట్లు పరీక్షల్లో తేలినా భయపడాల్సిన అవసరం లేదు. యాంటీ రెట్రోవైరల్ మందులను ప్రభుత్వం అందిస్తోంది. మా ఏఆర్టీ సెంటర్లో నమోదుచేసుకుని, ఎప్పటికప్పుడు ఆ మందులు తీసుకుంటే సరిపోతుంది’’ అని వివరించారు.ఈ అవగాహన కార్యక్రమంలో ఆర్గనైజింగ్ ఛైర్పర్సన్, జనరల్ మెడిసిన్ విభాగాధిపతి, ప్రొఫెసర్ డాక్టర్ శ్యాంసుందర్, ప్రిన్సిపాల్ డా. సుధీర్ బాబు పడుగుల్, సీనియర్ కన్సల్టెంట్ ఫిజిషియన్ డాక్టర్ జె.హరికృష్ణ, కన్సల్టెంట్ ఫిజిషియన్ డాక్టర్ ప్రదీప్ కుమార్ పటేల్, ఏఆర్టీ సెంటర్ సీఎంఓ డాక్టర్ పెద్ది రామకృష్ణ, ప్రొఫెసర్ డాక్టర్ పి. రత్నాచారి, డాక్టర్ ఐ. సురేష్, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ దాక్షాయని తదితరులు పాల్గొన్నారు. -
ముందుగానే డెలివరీ జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి..?
నేను ప్రస్తుతం 30 వారాల గర్భిణిని. ఇది నా మొదటి బిడ్డ. నా గ్రోత్ స్కాన్ లో బిడ్డ పెరుగుదల కొంచెం తక్కువగా ఉందని. తరచుగా స్కాన్లు చేయించుకోవాలని, మెరుగుదల లేకపోతే ముందుగానే డెలివరీ చేయాల్సి రావచ్చని చెప్పారు. నేను చాలా ఆందోళనగా ఉన్నాను. ఇది ఎందుకు జరిగిందో అర్థం కావడం లేదు. బిడ్డ పెరుగుదల మెరుగుపడటానికి, ముందుగానే డెలివరీ జరగకుండా ఉండటానికి నేను ఏమి చేయాలి?– సుశీల, రాజమండ్రి. మీ ఆందోళన అర్థమవుతోంది. చాలామంది గర్భిణులకీ ఇలాంటి పరిస్థితి ఎదురవుతుంది. గర్భధారణలో బిడ్డ ఎదుగుదల గర్భకాలానికి తగినంతగా లేకపోతే దానిని ‘ఫీటల్ గ్రోత్ రిస్ట్రిక్షన్ ’ లేదా ‘ఇంట్రా యూటరైన్ గ్రోత్ రిస్ట్రిక్షన్ ’ అంటారు. ఇది సుమారు పది శాతం గర్భధారణల్లో కనిపించే పరిస్థితి. అంటే ఇది అరుదు కాదు, కానీ జాగ్రత్తగా పర్యవేక్షించాల్సినది. ఈ పరిస్థితి రావడానికి పలు కారణాలు ఉంటాయి. గర్భిణి మహిళకు అధిక రక్తపోటు ఉండటం, మధుమేహం, అధిక బరువు, వయస్సు ముప్పై ఐదు ఏళ్లు దాటడం, జంట గర్భం లేదా మల్టిపుల్ గర్భధారణ, గతంలో చనిపోయిన బిడ్డ పుట్టిన చరిత్ర, రక్తహీనత, గుండె సంబంధిత వ్యాధులు లేదా ఆటో ఇమ్యూన్ సమస్యలు. కొన్నిసార్లు ఎటువంటి కారణం లేకపోయినా సహజంగానే బిడ్డ ఎదుగుదల కొంచెం మందగించవచ్చు. అయితే మంచి విషయం ఏమిటంటే, చాలామంది ఇలాంటి బిడ్డలు పుట్టిన తరువాత పూర్తిగా ఆరోగ్యంగా ఎదుగుతారు. కాబట్టి ముందుగా భయపడకుండా వైద్యుల సూచనలను జాగ్రత్తగా పాటించాలి. ముందుగా మీరు చేయాల్సింది ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడం.ప్రోటీన్లు, పండ్లు, కూరగాయలు సమృద్ధిగా ఉండే ఆహారం తీసుకోవాలి. తగినంత నీరు తాగాలి. డాక్టర్ సూచించినంత వరకే తేలికపాటి వ్యాయామాలు చేయాలి. ధూమపానం, మద్యం అలవాట్లు ఉంటే వెంటనే వాటిని పూర్తిగా మానేయాలి. ఇవి బిడ్డకు ఆక్సిజన్ సరఫరా తగ్గించి ఎదుగుదలపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. నియమితంగా వైద్య పర్యవేక్షణలో ఉండటం చాలా ముఖ్యం. బిడ్డ ఎదుగుదలలో తేడా ఉన్నప్పుడు, డాక్టర్ తరచుగా గ్రోత్ స్కాన్లు సూచిస్తారు. ఈ స్కాన్లలో బిడ్డ బరువు, రక్తప్రవాహం, యామ్నియోటిక్ ద్రవం పరిమాణం వంటి అంశాలు చూస్తారు. డాప్లర్ పరీక్షల ద్వారా బిడ్డకు తల్లి నుంచి రక్తప్రవాహం ఎలా జరుగుతోందో అంచనా వేస్తారు. ఈ వివరాల ఆధారంగా డాక్టర్ తదుపరి చర్యలను నిర్ణయిస్తారు. కొన్ని సందర్భాల్లో తల్లి రక్తంలో చక్కెర స్థాయులు లేదా రక్తపోటు నియంత్రణలో లేకపోతే బిడ్డ ఎదుగుదలపై ప్రభావం చూపుతుంది. కాబట్టి ఆ విలువలను ఎప్పటికప్పుడు చెక్ చేయించుకోవాలి. ప్రోటీన్ లోపం ఉంటే ఆహారంతో దాన్ని పూడ్చుకోవాలి. చాలామంది తరచుగా స్కాన్ చేయించుకోవడమే బిడ్డకు హానికరమని అనుకుంటారు. కానీ అది పూర్తిగా తప్పు. అల్ట్రాసౌండ్ పరీక్ష గర్భంలోని బిడ్డను అంచనా వేయడానికి అత్యంత సురక్షితమైన విధానం. బిడ్డ ఎదుగుదల పూర్తిగా ఆగిపోతే లేదా స్కాన్లో రక్తప్రవాహం తగ్గిపోతే, బిడ్డలో ఒత్తిడి లక్షణాలు కనిపిస్తే, అప్పుడే ముందుగా డెలివరీ చేయడం అవసరం అవుతుంది. అలాంటి సందర్భాల్లో బిడ్డ ఊపిరితిత్తులు పక్కాగా పనిచేయేందుకు ముందుగానే స్టెరాయిడ్ ఇంజెక్షన్లు ఇస్తారు. డెలివరీ విధానం సాధారణమా లేదా సిజేరియన్ చేయాలా అనేది బిడ్డ ఆరోగ్యం, తల్లి పరిస్థితి, గర్భధారణ వయస్సు లాంటి అంశాలపై ఆధారపడి నిర్ణయిస్తారు. ఇప్పుడున్న ఆధునిక పరీక్షలు, ముఖ్యంగా స్కాన్లు, బిడ్డ ఎదుగుదల మందగించే ప్రమాదం ఉన్న మహిళలను ముందుగానే గుర్తించడానికి సహాయ పడుతున్నాయి. కొన్ని బయోకెమికల్ పరీక్షలతో పాటు, ప్రమాదం ఎక్కువగా ఉన్నవారికి తక్కువ మోతాదులో ఆస్పిరిన్ మందు ఇవ్వడం ద్వారా ఫీటల్ గ్రోత్ రెస్ట్రిక్షన్ తగ్గించవచ్చు. అందుకే, మీరు మీ వైద్యుడి దగ్గర క్రమం తప్పకుండా ఫాలోఅప్ చేయించుకోవాలి. భయపడకండి. జాగ్రత్తగా వైద్యుల సూచనలను పాటిస్తే, మీ బిడ్డ సురక్షితంగా, ఆరోగ్యంగా పుడతారు. డాక్టర్ కడియాల రమ్య, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్హైదరాబాద్ (చదవండి: ‘ఎగ్’సలెంట్ లుక్, గోళ్ల ఆరోగ్యం కోసం!) -
రేపు వరల్డ్ ఎయిడ్స్ డే.. కొత్త తరానికి చెప్పాలి..
మొదట్లో అభివృద్ధి చెందిన సంపన్న దేశాల్లో మాత్రమే విస్తరించిన ఎయిడ్స్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తమయ్యింది. ఆ సంపన్న దేశాల్లోని మత్తు ఇంజెక్షన్ల సంస్కృతి, హోమో సెక్సువల్ ధోరణులతో ఇలా జరిగింది. ఇవేవీ లేని మనలాంటి దేశాల్లో దీని విస్తృతి మొదట్లో దాదాపుగా లేనేలేదు. కానీ తర్వాత్తర్వాత ఇది మనలాంటి అభివృద్ధి చెందుతున్న దేశాలతో పాటు... పేద దేశాల్లో కూడా విపరీతంగా వ్యాపించిందని తేలింది. ఈ వ్యాధిపై మొదట్లో ఉన్నంత బజ్ ఇప్పుడు లేకపోవడంతో చాపకింది నీరులా ఇది వ్యాపిస్తోంది. అందుకే మరోసారి ఈ వ్యాధి గురించి మాట్లాడాల్సిన సమయం ఇది. ఈ సందర్భంగా ఎయిడ్స్వ్యాధి విషయంలో సమాజంలో చైతన్యం తేవడం కోసం ఏం చేయాలో, అలాగే అనుసరించాల్సిన మార్గాలేమిటన్నది నిపుణులైన డాక్టర్లు సూచిస్తున్న అంశాలివి.ఎయిడ్స్ వ్యాప్తిని అరికట్టడానికి వేర్వేరు దేశాల్లో వేర్వేరు అంశాలు అడ్డంకులుగా నిలుస్తున్నాయి. హోమో సెక్సువాలిటీకి సామాజిక ఆమోదం లేనిచోట్ల, ఇంజెక్షన్ డ్రగ్స్ వాడకం నేరంగా ఉన్న దేశాల్లో వారు తీవ్రమైన వివక్షకు లోనవుతుండటంతో తమ గుర్తింపులను దాచుకోడానికి చేసే ప్రయత్నంలో వారికి చికిత్స అందడం లేదు. దాంతో ఈ తాజా ధోరణులతో హెచ్.ఐ.వి. వ్యాప్తి తీరు మారుతున్నది. సెక్స్ వర్కర్స్, హోమోసెక్సువల్స్, డ్రగ్స్ ఇంజెక్షన్లు తీసుకునేవారూ, ట్రాన్స్జెండర్ వ్యక్తులు, ఖైదీల వంటి సమూహాలలో ఈ వైరస్ తీవ్రమైన వేగంతో వ్యాపిస్తోంది. ఇక ఆఫ్రికాలాంటి వెనకబడిన దేశాల్లో అవగాహన లేమితో ఈ వ్యాధి విస్తృతంగా వ్యాప్తిచెందుతోంది. ప్రస్తుతం కొత్తగా సోకుతున్న హెచ్.ఐ.వి. ఇన్ఫెక్షన్లలో ఆఫ్రికాలో 25 శాతం, మిగతా ప్రపంచంలో 80 శాతం ప్రజల్లో ఎయిడ్స్ అన్నది పైన పేర్కొన్న హోమో సెక్సువల్, ట్రాన్స్జెండర్, డ్రగ్స్ బాధితులు, ఖైదీల వంటి రిస్క్ గ్రూపులలోనే ఎక్కువ. భారతదేశంలోనూ మిగతా జనాభాతో పోలిస్తే ఇలాంటి సమూహాల్లోనే హెచ్.ఐ.వి. వ్యాప్తి సాధారణ జనాభా కంటే 15–17 రెట్లు ఎక్కువ.భారతదేశం, తెలుగు రాష్ట్రాల పరిస్థితి జాతీయ ఎయిడ్స్ నివారణ సంస్థ 2023 అంచనాల ప్రకారం, భారతదేశంలో 25 లక్షల 44 వేల మంది హెచ్ఐవితో జీవిస్తున్నారు. 15–49 సంవత్సరాల మధ్య వయసు ఉన్నవారిలో ప్రతి వెయ్యి మందిలో ఇద్దరిలో (0.20%) హెచ్.ఐ.వి. వ్యాపించింది. మహారాష్ట్రలో అత్యధికంగా 3.90 లక్షల మంది హెచ్ఐవి తో జీవిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో 3 లక్షల 14 వేల మంది. తెలంగాణలో 1 లక్షా 58 వేల మంది వ్యాధిగ్రస్తులు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో 15–49 ఏళ్ల మధ్య వయసు వారిలో హెచ్ఐవి సోకినవారు జాతీయ సగటు కంటే చాలా ఎక్కువ ఉన్నారు. అంటే ప్రతి వెయ్యిలో ఆరుగురు పైగా (0.62%); తెలంగాణలో ప్రతి వెయ్యికి దాదాపు ఐదుగురు (0.47%) ఉన్నారు. 2019లో ఆంధ్రప్రదేశ్లో దేశంలోనే అత్యధిక ఎయిడ్స్ మరణాలు నమోదయ్యాయి. అంటే ఇక్కడ 11,430 మంది చనిపోయారు. 2010తో పోల్చినప్పుడు 2023లో కొత్త ఇన్ఫెక్షన్లలో అత్యధిక తగ్గుదల ఆంధ్రప్రదేశ్లోనే కావడం (తగ్గుదల శాతం 76.19%) కొంత ఊరట.2025లో హెచ్.ఐ.వి. మళ్లీ పెచ్చరిల్లడానికి ఇవీ కారణాలు... ఈ ఏడాది 2025లో ప్రపంచవ్యాప్తంగా సంభవించిన అనేక చారిత్రక పరిణామాల వల్ల హెచ్.ఐ.వి. కార్యక్రమాలకు నిధుల సంక్షోభం ఎదురైంది. ఈ ఏడాది అమెరికా ప్రభుత్వం 430 కోట్ల డాలర్ల నిధుల కేటాయింపును ఆకస్మికంగా, ఏకపక్షంగా నిలిపివేయడం వల్ల... దిగువ ఆదాయ, అలాగే మధ్యస్థ ఆదాయ దేశాల్లో హెచ్ఐవి / ఎయిడ్స్ సేవలకు తీవ్రమైన అంతరాయం కలిగింది. అంతర్జాతీయ సంస్థ యుఎన్ ఎయిడ్స్ అంచనా ప్రకారం ఈ నిధులు శాశ్వతంగా నిలిచిపోతే 2029 నాటికి అదనంగా మరో 60 లక్షల కొత్త హెచ్ఐవి కొత్తకేసులు వచ్చే అవకాశముంది. ప్రపంచవ్యాప్తంగా 40 లక్షల మంది ఎయిడ్స్ సంబంధిత జబ్బులతో మరణించే ప్రమాదం ఉంది. అంతేకాదు... హెచ్.ఐ.వి. రిస్క్ ఉన్న ప్రత్యేక సమూహాలకు చికిత్స అందిస్తూ ఎయిడ్స్ పై పోరాడే వారిని నేరస్తులుగా చూసే దేశాల సంఖ్య పెరిగింది. పురుష స్వలింగ సంబంధాలు, ట్రాన్స్ జెండర్లకు సామాజిక ఆమోదం లేకపోవడం, డ్రగ్స్ వాడకాన్ని తీవ్రమైన నేరంగా పరిగణిస్తూ కొన్ని దేశాల్లో కొత్తగా చేసిన కఠిన చట్టాల కారణంగా వారు తమ వ్యాధిని దాచుకోవడం, చికిత్స కోసం ముందుకు రాకపోవడంతో ఎయిడ్స్ సంక్షోభం మరింత ముదిరే ప్రమాదం ఉంది. దీనివల్ల ఈ వ్యాధి పీడితులకు ఆరోగ్య, వైద్య సేవలు అందించడమూ కష్టసాధ్యమవుతుంది. ఇదీ ఈ ఏడాది (2025) ప్రపంచ ఎయిడ్స్ డే నినాదం ‘సంక్షోభాన్ని అధిగమిస్తూ... కొత్త మార్గంలో పయనిస్తూ’ అన్నది (ఓవర్కమింగ్ డిజ్రప్షన్ – ట్రాన్స్ఫార్మింగ్ ద ఎయిడ్స్ రెస్పాన్స్) ఈ ఏడాది నినాదం. అంతర్జాతీయ వితరణ సంస్థలు తగినన్ని నిధులను ఇవ్వడం, ఈ వ్యాధి నివారణ కోసం కృషి చేస్తున్న కమ్యూనిటీలు కలిసి పనిచేయడం, మానవ సహజమైన లైంగిక ప్రవృత్తులను సానుభూతితో అర్థం చేసుకోవడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా మానవులందరి హక్కులను పరిరక్షించడం, దేశాల నాయకత్వాలు నిబద్ధతతో వ్యవహరించడం, ఈ వ్యాధి తాలూకు మందులను అందరికీ అందుబాటులోకి తేవడం వంటి చర్యలతో ఈ వ్యాధిని వీలైనంతగా నివారించవచ్చు. అలాగే యౌవన ప్రాంగణంలోకి ఇప్పుడిప్పుడే ప్రవేశిస్తున్న కొత్త తరాల వారికి ఈ వ్యాధిపై అవగాహన కల్పిస్తూ... అందుబాటులో ఉన్న అన్ని సామాజిక మాధ్యమాల ద్వారా సురక్షిత శృంగారం, కండోమ్ వాడకం గురించి విస్తృత ప్రచారం చేస్తే ఈ వ్యాధిని దాదాపుగా పూర్తిగా తుదముట్టించినంతగా నివారించవచ్చునన్నది ప్రముఖమైన వైద్య నిపుణులందరి మాట.కొత్త ఆవిష్కరణలతో పరిస్థితి కొంత ఆశాజనకంలెనాకపావిర్, కాబోటెగ్రావిర్ వంటి దీర్ఘకాలం పనిచేసే కొత్త ఇంజెక్షన్ మందులతో హెచ్.ఐ.వి. నివారణలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావచ్చు. ఏడాదిలో కేవలం రెండు సార్లు ఇంజెక్షన్లు తీసుకోవడంతోనే హెచ్ఐవి నివారణ సాధ్యమవుతుంది. దీంతో ప్రస్తుతం అత్యధిక కొత్త ఇన్ఫెక్షన్స్ వెలుగు చూస్తున్న రిస్క్ గ్రూపుల్లో నివారణ సులభతరమవుతుంది. అయితే వాటి ధరలు ప్రస్తుతం కాస్త ఎక్కువగా ఉన్నందున ఆ ధరలు తగ్గించి ప్రతి దేశంలోని ఆ సమూహాలకు ఈ ఇంజెక్షన్లను అందుబాటులోకి తేవడం అత్యవసరం.డాక్టర్ యనమదల మురళీకృష్ణ, ఎండి, ఎయిడ్స్ వ్యాధి నిపుణులు, కాకినాడ -
మేకప్ ఆర్టిస్ట్ అంబికా పిళ్ళై వెయిట్లాస్ కష్టాలు..!
బరువు తగ్గడం కొందరికి అతి పెద్ద సవాలు. పైగా అదొక భారమైన సమస్యగా మారిపోతుంటుంది. ఎందుకంటే వారికి సాధారణ ఆహార మార్పులు ఓ పట్టాన పనిచేయవు. అలా.. బరువు తగ్గినట్టే తగ్గి ..ఇట్టే పెరిగిపోతుంటా. దాంతో విసుగు పుట్టుకొచ్చేస్తుంటుంది కూడా. అలానే ఇబ్బంది పడింది మేకప్ ఆర్టిస్ట్ అంబికా పిళ్ళై. ఆమెకు బరువు తగ్గడం శారీరకంగా, మాససికంగా పెను సమస్యగా మారింది. ఏ డైట్ ఫాలో అయిన ఫలితం శూన్యం. తగ్గినట్టు తగ్గి పెరిగిపోతోంది. చివరికి ఆమె ఏం చేసి బరువు తగ్గగలిగిందంటే..రక్తపోటు సమస్యల కారణంగా అంబికాను కార్డియాలజిస్ట్లు బరువు తగ్గేందుకు ప్రయత్నించమని సూచించారు. బరువు తగ్గితే ఆమె వాడే అన్ని మందులు ఆపేయొచ్చట. అందుకే తాను చాలామందిని వెయిట్లాస్ జర్నీలో తనతో కలిసి జాయిన్ అవ్వమని పిలునిస్తుందట కూడా. ఈ బరువుని నిర్లక్ష్యం చేస్తే భారీకాయంతో మూల్యం చెల్లించుకుంటామంటోంది. అధిక బరువు.. అన్ని అనారోగ్య సమస్యలకు మూలం కాబట్టి పట్టుదలతో దానిపై యుద్ధం చేయాలని అంటోంది. డైట్ మార్పులు.. తగ్గినట్టు తగ్గి..కొన్ని నెలలో బరువు పెరిగిపోవడంతో విసిగిపోయి..డైట్లోనే మార్పులు చేసింది. నో బ్రెడ్, చపాతీ, రైస్, పరాఠా, మాల్వా పరాఠా అని స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యింది. అందుకు బదులుగా కూరగాయలు, చికెన్, చేపలు ఎక్కువగా తీసుకునేదాన్ని అని అంటోంది. చాలామటుకు ఆవిరిలో లేదా రోస్ట్ చేసినవి తీసుకునేదాన్ని అని చెప్పుకొచ్చింది. అప్పుడే తన బరువులో స్వల్ప మార్పులు సంభవించాయని అంటోంది. పిండి పదార్థాలకు దూరంగా ఉండటం తోపాటు డీప్ ఫ్రై చేసిన ఆహారాలను కూడా దరిచేరనిచ్చేదికాదు. సాధ్యమైనంతవరకు ఆవిరిలో ఉడికించిన వాటికి ప్రాధాన్యత ఇచ్చి..సుమారు ఐదు కిలోల బరువు తగ్గిందట. అంతేగాదు బరువు తగ్గడంలో తనలా హెచ్చు తగ్గులతో ఇబ్బంది పడుతుంటే గనుక అనారోగ్యకరమైన కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండే ఆహారాలను తగ్గించడానికి ప్రయత్నిస్తే..సత్వర మార్పుల తోపాటు బరువు తగ్గడం కూడా తథ్యం అని నమ్మకంగా చెబుతోంది. అందుకు సంబంధంచిన వీడియో కూడా నెట్టింట తెగ వైరల్ అవుతోంది. గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. View this post on Instagram A post shared by Ambika Pillai (@ambika_pillai) (చదవండి: పొలాల నుంచి డిజిటల్ ప్రపంచంలోకి..ఇవాళ 400 మందికి పైగా యువతకు..!) -
వణికించే చలి...వేడినీటితో స్నానం... ఎవరు చేయవచ్చు? ఎవరు చేయకూడదు?
శీతాకాలంలో, చాలా మంది వెచ్చని నీటితో స్నానం చేయడానికి ఇష్టపడతారు,ఎందుకంటే ఇది వెచ్చగా హాయిగా అనిపిస్తుంది. కానీ వేడి నీటితో స్నానం చేయడం ఆరోగ్యానికి హానికరం అని వారికి తెలీదు. నీటి ఉష్ణోగ్రత ఆరోగ్యంలో పాత్ర పోషిస్తుంది. కొన్ని లాభాలు ఉన్నప్పటికీ... నష్టాలు మరింత ఎక్కువ ఉన్నాయి. ఈ నేపథ్యంలో వైద్యులు చెబుతున్న ప్రకారం... వేడి నీటి స్నానం వల్ల కలిగే లాభాలు, నష్టాలను ఒకసారి పరిశీలిద్దాం...ప్రయోజనాలున్నాయి...వేడీ నీటి స్నానం వల్ల నష్టాలు అనేకం ఉన్నప్పటికీ... కొన్ని ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా వేడి నీరు బిగుతుగా ఉన్న కండరాలు విశ్రాంతి తీసుకోవడానికి వాటికి ఉపశమనం అందించేందుకు ఉపకరిస్తుంది. అంతేకాకుండా అది రక్తనాళాలను విస్తరించి తద్వారా శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరచడానికి సహాయపడుతుంది. రోజు మొత్తం ఏర్పడిన పని ఒత్తిడిని తగ్గించడానికి ఒక మార్గంగా కూడా పనిచేస్తుంది. సీజనల్ సమస్యలు ఎదుర్కునే వారు, శీతాకాలపు నొప్పులు లేదా అలసటను అనుభవించే వ్యక్తులకు అవి దూరం చేసేందుకు అనువైనది అలాగే శ్వాసకోశ ఆరోగ్యం సరిగా లేని లేదా తక్కువ ఉష్ణోగ్రతలను తట్టుకోలేని వారికి మేలు చేస్తుంది. వేడి నీటి నుంచి వచ్చే ఆవిరి నాసికా భాగాలను క్లియర్ చేయడంలో, స్రవించే ముక్కును నియంత్రించడంలో సహాయపడుతుందిదుష్ప్రభావాలెన్నో...చాలా మందికి ఈ సీజన్లో అసౌకర్యంగా ఉండవచ్చు గానీ నిజానికి చల్లటి నీటి స్నానం రోగనిరోధక శక్తిని పెంచుతుంది. వేడి నీరు అలవాటు అయితే ఆ లాభాన్ని కోల్పోతాం. అంతేకాదు వేడి నీటికి ఎక్కువసేపు గురికావడం వల్ల చర్మం నుంచి సహజ నూనెలు కోల్పోతుంది. ఇది శీతాకాలంలో చర్మం పొడిబారడాన్ని మరింత తీవ్రతరం చేసి దురదకు దారితీస్తుంది. వేడి నీరు చర్మం బయటి పొరను కూడా దెబ్బతీస్తుంది తేమను నిలుపుకునే సామర్ధ్యాన్ని, పర్యావరణ సమస్యల నుంచి కాపాడుకునే సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. అలాగే తామర లేదా సోరియాసిస్ వంటి కొన్ని పరిస్థితులను మరింత దిగజార్చవచ్చు రక్తపోటు పెరిగేకొద్దీ వెచ్చని నీటితో స్నానం చేయడం గుండెపై ఒత్తిడి పెంచుతుంది. వెచ్చని నీటితో స్నానం వల్ల్ల ఊపిరితిత్తులలో వాపు వచ్చే అవకాశం ఉంది. తద్వారా శ్వాస తీసుకోవడం కష్టమై అది తీవ్రమైన సమస్యలకు దారితీస్తుంది. వేడి నీటితో స్నానం తలపై కేశాల మూలాలను బలహీనపరుస్తుంది, జుట్టు విరిగిపోవడానికి రాలడానికి దారితీస్తుంది.అంతేకాదు గుండె జబ్బులు, ఆర్థరైటిస్ లేదా కండరాల సంబంధిత సమస్యలు ఉండే వారికి మంచిది కాదు. నష్టాలు ఉన్నప్పటికీ.. కఠినమైన చలిని నివారించడానికి ప్రతిరోజూ వెచ్చని నీటితో స్నానం చేయకుండా ఉండడం అంత సులభం కాదు.. మరి ఈ పరిస్థితుల్లో ఎలాంటి జాగ్రత్తలు అవసరం?ఏం చేయాలి?నీటి ఉష్ణోగ్రత వీలైనంత తక్కువగా ఉంచడం. అలాగే వేడినీటిలో ఎక్కువ సేపు ఉండకపోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి.శీతాకాలంలో వెచ్చని నీటిలో స్నానం గోరువెచ్చని నీటితో మాత్రమే చేయాలి. జుట్టు రాలడాన్ని నివారించడానికి మాయిశ్చరైజింగ్ హెయిర్ కండిషనర్ను అప్లై చేయాలి.పనిని బట్టి చేసే శారీరక శ్రమని బట్టి 2 పూటలా కాకుండా ఒక్క పూటకు పరిమితం చేయడాలి. -
రుతుక్రమ సమస్యలకు సీడ్ సైకిల్
ఈ రోజుల్లో మహిళల రుతుక్రమంలో సమస్యలు తలెత్తడం ఎక్కువ కనిపిస్తోంది.. హార్మోన్ల హెచ్చుతగ్గులు వీటికి ప్రధాన కారణంగా ఉంటుంటాయి. ఈ సమస్యను సరిదిద్దడానికి మన ప్రాంతీయ సంప్రదాయ ఆహారం ఎంతో మేలు చేస్తుంది. సమతుల ఆహారంతో పాటు సీడ్ సైక్లింగ్ థెరపీ పీసీఓఎస్ సమస్యలో ప్రధాన పాత్ర పోషిస్తుంది అంటున్నారు పోషకాహార నిపుణులు. 30 నుంచి 50 ఏళ్లు పైబడిన మహిళలు ... పీసీఓఎస్, థైరాయిడ్, మెనోపాజ్ సమస్యలు ఎదుర్కొంటున్నప్పుడు రోజువారీ తీసుకునే ఆహారంలో మార్పులు చేసుకుంటే ఆరోగ్యమూ మెరుగ్గా ఉంటుంది. → మెటబాలిజంను బ్యాలెన్స్ చేసే క్యాలీఫ్లవర్, క్యాబేజీ, బ్రోకలీలను ఆహారంలో చేర్చాలి. ఇవి ఈస్ట్రోజెన్ హార్మోన్లను వృద్ధి చేస్తాయి. క్యాన్సర్ కారక రిస్క్ను కూడా తగ్గిస్తాయి.→ సాల్మన్ ఫిష్, చియా, అవిశ గింజలలో ఆరోగ్యానికి మేలు చేసే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ సమృద్ధిగా లభిస్తాయి. చియా, అవిశ గింజలను ఉదయం అల్పాహారంలో చేర్చుకోవచ్చు. చియా సీడ్స్ మజ్జిగ, నీళ్లలో నానబెట్టి తీసుకోవచ్చు. → హోల్ గ్రెయిన్స్లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది. కూరగాయలు, శనగలు, చిరుధాన్యాలు, మిల్లెట్స్, బ్రౌన్ రైస్ తీసుకోవాలి. ఇవి రక్తంలో చక్కెర, ఇన్సులిన్ స్థాయులను సమం చేస్తాయి. ఈస్ట్రోజెన్ హార్మోన్ సరిగ్గా పనిచేస్తే ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గి, బ్లడ్ షుగర్ లెవల్స్ బ్యాలెన్స్ అవుతాయి. → పప్పులు, శనగలు, బొబ్బర్లు.. వంటి వాటిలో బి12 ఎక్కువ ఉంటుంది. ఈ రోజుల్లో బి12 లోపం చాలా మందిలో కనిపిస్తుంది. ఈ పప్పులను చేర్చడం వల్ల బి12తో పాటు హార్మోన్ల సమతుల్యత దెబ్బతినదు. పప్పులను ఉడికించి రోజూ ఒక కప్పు రోజువారీ ఆహారంలో ఉండేలా చూసుకోవాలి. → బాదంపప్పు, వాల్ నట్స్లలో మెగ్నిషియం లభిస్తుంది. నట్స్ అండ్ సీడ్స్ రోజూ మూడు నెలల పాటు రోజూ తీసుకుంటే హార్మోన్ల హెచ్చుతగ్గులు బ్యాలెన్స్ అవుతాయి. → గట్ హెల్త్ని సపోర్ట్ చేసే పెరుగు, యోగర్ట్, మజ్జిగ.. వంటివి ఆహారంలో చేర్చాలి. హార్మోన్ల అసమతుల్యత వల్ల బరువు పెరగడం తగ్గడం సమస్య కూడా ఉంటుంది. థైరాయిడ్, హార్మోన్లకు సపోర్ట్ చేసే ఎగ్ లేదా టోఫూ వంటివి ఉపయోగించాలి. → కల్తీ నూనెలు కాకుండా ఫ్లాక్స్ సీడ్, అవకాడో, ఆలివ్ ఆయిల్స్, స్వచ్ఛమైన నెయ్యి వాడాలి. ఆకుకూరలు, చిలకడ దుంప, నట్స్ .. మెగ్నిషియం ఉండే పదార్థాలను చేర్చుకుంటే పిఎమ్ఎస్ లక్షణాలు తగ్గుతాయి. గింజలను పొడులు చేసి, నేరుగా తీసుకోవచ్చు. లేదంటే పెరుగు, ఓట్స్లో కలుపుకోవడం ద్వారా లేదంటే చిన్న చిన్న లడ్డూలు కట్టి కూడా తీసుకోవచ్చు. ఇతర జంక్ఫుడ్ తిని సీడ్ సైక్లింగ్ పాటించడం వల్ల ఉపయోగం ఉండదు. ఆరోగ్యకరమైన ఆహారంతో పాటు సీడ్ సైక్లింగ్ పాటిస్తూ, వ్యాయామాలు చేస్తూ, రోజువారి జీవనశైలి బాగుండేలా చేసుకుంటే ఇవి సాయపడతాయి. ప్రభావం వెంటనే కనిపించలేదు అనుకోకుండా 2–3 నెలల పాటు ప్రతిరోజూ వాడితే మంచి ఫలితాలు వస్తాయి. నిల్వ ఉండే పదార్థాలు, జంక్ ఫుడ్ కాకుండా మన సంప్రదాయ ఆహారం ద్వారానే హార్మోన్లు బ్యాలెన్స్ అవుతాయి. నెలసరి సమస్యలు దరిచేరవు.సీడ్ సైక్లింగ్పీసీఓఎస్ ఫేజెస్ను బట్టి సీడ్ సైక్లింగ్ విధానం ఎంతో మేలు చేస్తుంది. హార్మోన్ల సపోర్ట్ కోసం ఈ విధానాన్ని అనుసరిస్తారు. రుతుక్రమం సరిగా రాని వాళ్లకు ఈ విధానాన్ని ఆవలంబించమని నిపుణులు చెబుతుంటారు. సీడ్ సైక్లింగ్ మెథడ్ను రుతుక్రమం ఆగిపోయిన మొదటి రోజు నుంచి తిరిగి రుతుక్రమం ప్రారంభమయ్యే రోజు వరకు పాటించాలి.పారిక్యులర్ ఫేజ్ఇది సీడ్ సైక్లింగ్లో మొదటి ఫేజ్. రుతుక్రమం ఆగిపోయిన మొదటి రోజు నుంచి 14వ రోజు వరకు ఒక దశ. దీనిలో గుమ్మడి గింజల పొడి 1–2 టీ స్పూన్లు, అవిశ గింజల పొడి 1–2 టీ స్పూన్లు రోజూ తీసుకోవాలి. దీనివల్ల ఈస్ట్రోజెన్, ప్రొజెస్టిరాన్ హార్మోన్ల పనితీరు బాగుంటుంది. నెలసరి సమస్యలు తగ్గుతాయి.లూటియల్ ఫేజ్ రుతుక్రమం ఆగిపోయిన 15వ రోజు నుంచి 28వ రోజు వరకు సన్ఫ్లవర్ గింజలు, నువ్వులు ఉపయోగించాలి. సన్ఫ్లవర్, నువ్వులలో విటమిన్–ఇ ఉంటుంది కాబట్టి హార్మోన్ బ్యాలెన్స్ చేయడానికి ఉపయోగపడతాయి. హార్మోన్ల అసమతుల్యత కారణంగా వచ్చే క్రాంప్స్, యాక్నె, నొప్పి, మూడ్ స్వింగ్స్ .. వంటివి కూడా తగ్గుతాయి. మెనోపాజ్, థైరాయిడ్ సమస్యలకు ఈ విధానం సరైన పరిష్కారం.డా. సుజాతా స్టీఫెన్, న్యూట్రిషియనిస్ట్ -
జంక్ఫుడ్ ఇంత ప్రమాదకరమా..? పాపం ఆ ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్..
జంక్ఫుడ్ ప్రమాదకరమని నిపుణులు హెచ్చిరిస్తుంటే..పెడచెవిన పెట్టిన వాళ్లెందరో. అంతెందుకు చీట్మీల్ పేరుతో బర్గర్లు, పీజాలు లాగించేసేవాళ్లు కోకొల్లలు. అలాంటి వాళ్లందరికీ ఈ ఘటన ఓ కనువిప్పు. మారథాన్ ఛాలెంజ్లో భాగంగా తిన్న జంకఫుడ్ ఓ ఇన్ఫ్లుయెన్సర్ ప్రాణాలనే హరించేసింది. ఎవ్వరూ ఇలాంటి ఛాలెంజ్స్లో పాల్గొనేందుకు జంకేలా చేసింది కూడా.అసలేం జరిగిందంటే..రష్యన్ ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ 30 ఏళ్ల డిమిత్రి నుయాన్జిన్, బరువు తగ్గించే కార్యక్రమాన్ని ప్రోత్సహించే నిమిత్తం ఈటింగ్ ఛాలెంజ్లో పాల్గొన్నాడు. ఆయన సదుద్దేశ్యంతో చేస్తే..ఆ ప్రయోగం అతడి ప్రాణమే పోయింది. అదికూడా నిద్దురలోనే ప్రాణం పోవడం బాధకరం. అధిక బరువు ఎంత పెద్ద సమస్య అని అవగాహన కల్పించే నిమిత్తం డిమిత్రి 25 కిలోలు బరువు పెరగాలన్న లక్ష్యం పెట్టుకున్నాడు. ఈ మేరకు మారథాన్లొ భాగంగా అతిగా తినే ఛాలెంజ్లో పాల్గొన్నాడు. తన క్లయింట్లు తనలా బరువు తగ్గేలా ప్రేరణనివ్వాలని ఈ ఛాలెంజ్ పాల్గొన్నాడు. ఆ నేఫథ్యంలోనే రోజుకు దాదాపు 10 వేల కేలరీలకు పైగా జంక్ఫుడ్ తిన్నాడు. అనుకున్నట్లుగా బరువు పెరిగాడు..తన ఫాలోవర్స్కి కూడా తనలోని ఆ ఛేంజ్ని బహిర్గతం చేయడమే కాకుండా ఆ అధిక బరువుని తగ్గించుకునేలా కూడా ప్లాన్ చేస్తున్నట్లు వెల్లడించాడు కూడా. అయితే అనూహ్యంగా చనిపోవడానికి ఒక రోజు ముందు తను చేసే వర్కౌట్ల సెషన్ను రద్దు చేసుకున్నాడు కూడా. తాను ఆరోగ్యంగా ఉన్నానని, వైద్యుడుని సంప్రదించాలను చూస్తున్నట్లు నెటిజన్లతో షేర్ చేసుకున్నాడు కూడా. అయితే అదే చివరి మాట అవుతుందని అనుకోలేదు అతడి అభిమానులు, ఫాలోవర్లు. అతడి సన్నిహిత వర్గాల సమాచారం ప్రకారం అతడి గుండె నిద్దురలోనే ఆగిపోయిందని, అవే అతడి చివరి మాటలయ్యాయనని బాధగా చెబుతున్నారు. అంతేగాదు డిమిత్రి గత నవంబర్ 18న చివరి ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో లేస్ ప్యాక్ తినడం తోపాటు తాను 105 కిలోలు బరువు పెరిగినట్లు కూడా వెల్లడించాడు. అంతేగాదు నెలలో కనీసం 13 కిలోలు పెరిగినట్లు తెలిపాడు. నెటిజన్లు డిమిత్రి మృతికి స్పందిస్తూ..అతడి కుటుంబానికి సంతాపం తెలియజేశారు. అలాగే ఇలాంటి ఈటింగ్ ఛాలెంజ్ల్లో పాల్గొనేవాళ్లకు ఈ సంఘటన ఓ గొప్ప పాఠం అంటూ పోస్టులు పెట్టారు. కాగా, డిమిత్రీ ఈ ఈటింగ్ ఛాలెంజ్లో భాగంగా రోజు వారీ ఆహారంలో పేస్ట్రీలు, కేక్లు, మయోన్నెస్లో ఉడికించిన డంపింగ్స్, రాత్రి భోజనంలో రెండు పిజ్జాలు తప్పనిసరిగా తిన్నట్లు తెలిపాడు. అధిక బరువుని తగ్గించడం ఎలా అనేదానిపై ప్రేరణ కలిగించేలా బరువు పెరగాలనుకుంటే..అది అతడి ఉసురే తీసేసింది. డిమిత్రీ సెయింట్ పీటర్స్బర్గ్లోని ఓరెన్బర్గ్ ఒలింపిక్ రిజర్వ్ స్కూల్ అండ్ నేషనల్ ఫిట్నెస్ యూనివర్సిటీ గ్రాడ్యుయేట్, పైగా ఒక దశాబ్దం పాటు ఉన్నత రష్యన్లకు వ్యక్తిగత కోచ్ కూడా ఆయన. అలాంటి వ్యక్తి జంక్ ఫుడ్ ఎంత ప్రమాదకరం అనేది చూపిద్దామనుకుంటే అతడి ప్రాణాల్లో గాల్లో కలిసిపోయాయి. నిజంగానే ఇంత ప్రమాదమా అంటే..జంక్ఫుడ్ ఆరోగ్యానికి మంచిది కాదు.ఎందుకంటే ఇందులో చక్కెర, అనారోగ్యకరమైన కొవ్వులు, సోడియం ఎక్కువగా ఉంటాయి. ఇందులో మనకు అవసరమైన పోషకాలు తక్కువగా ఉంటాయి. దీనిని తరచుగా తినడం వల్ల ఊబకాయం, మధుమేహం, గుండె జబ్బులు, రక్తపోటు వంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి.(చదవండి: ఇంజనీర్ కమ్ డాక్టర్..! విజయవంతమైన స్టార్టప్ ఇంజనీర్ కానీ..) -
కొత్త వస్తువులు చూస్తే కొనకుండా ఉండలేకపోతున్నాను!
నాకు చిన్నప్పటి నుంచి ఏ కొత్త వస్తువు చూసినా, కొనాలన్న ఆశ ఎక్కువ. స్కూలు రోజుల్లో రకరకాల పెన్నులు, ప్రతీ సంవత్సరం రెండు మూడు స్కూల్ బ్యాగులు, చెప్పులు, షూస్ కొనేవాడిని. తర్వాత నా ఆసక్తి బట్టలు మీదకు మళ్ళింది. మార్కెట్లోకి కొత్త రకం డ్రెస్లు వచ్చినప్పుడల్లా కొనమని పట్టుబట్టేవాణ్ణి. కొనక΄ోతే అలిగి అన్నం తినడం మానేసేవాడిని. తర్వాత నా మోజు సైకిళ్ళ మీకికి తిరిగింది. టీవీలో కొత్త మోడల్ సైకిల్ కనిపించగానే పాత సైకిల్ అమ్మేసి కొత్తదాన్ని కొనేవాడిని. కాలేజి రోజుల్లో ప్రతి నెలా ఫోన్ మార్చేవాడిని, డిగ్రీ పూర్తయ్యాక బైకులు నాకొత్త వ్యసనం అయ్యాయి. మార్కెట్ లో కొత్త బైక్ విడుదలయితే నా పాత బైక్ తక్కువ ధరకే అమ్మేసి అప్పు తీసుకొని మరీ కొత్త బైక్ కొనేవాడిని. ప్రస్తుతం ఆన్లైన్లో ఆఫర్స్, డీల్స్ కోసం వెతకడం, నియంత్రణ లేకుండా ఖర్చు చేయడం చేస్తున్నాను. ఇలా కొన్న వాటిని తక్కువ ధరకు అమ్మి మళ్లీ కొత్త వస్తువులు కౌంటున్నాను. దీనివలన డబ్బులు కోల్పోతున్నాను. ఇంట్లో భార్యతో గొడవలు, మనశ్శాంతి కూడా ఉండడం లేదు. ఈ అలవాటుని ఎలా మార్చుకోవాలి? – శ్యామ్ సుందర్, గోదావరిఖనిమీరు చెప్పిన లక్షణాలన్నీ ‘కంపల్సివ్ బైయింగ్ డిజార్డర్’ అనే మానసిక సమస్యకు దగ్గరలో ఉన్నాయి. ఇది ‘ఇంపల్సివ్ కంట్రోల్ డిజార్డర్’అనే మానసిక వ్యాధుల కేటగిరీలోకి వస్తుంది. దీనిలో ఏదో ఒక విషయం మీద విపరీతమైన తపన ఉంటుంది. ఆ పని చేసేదాకా మనసులో నిలకడ ఉండదు. ఎప్పుడూ అనే ఆలోచనలే ఉంటాయి. ఆ పని చేయగానే ఎంతో హాయిగా, ప్రశాంతంగా ఉంటుంది. దీనివలన నష్టం జరిగినప్పుడు తర్వాత బాధపడుతూ ఉంటాము. అది షాపింగ్ అవ్వొచ్చు, జూదం అనొచ్చు, ఎక్కువగా సెక్స్ ఆలోచనలు రావడం కావచ్చు లేదా అతిగాని తినాలనే ఆరాటం కావచ్చు. వీటన్నింటిలో ‘డోపమైన్‘ అనే రసాయనం స్థాయి పెరుగుతుంది. దానివలన తాత్కాలికంగా చాలా ఆనందం కలుగుతుంది. ఒక్కసారి డోపమైన్ స్థాయి తగ్గితే మళ్ళీ ఆ పని చేస్తేనే ఆ రసాయనం పెరిగి ఆనందం కలుగుతుంది. క్రమేణా ఇదొక వ్యసనం లాగా మారుతుంది. చాలా మంది ఆల్కహాల్, ఇతర డ్రగ్స్ కి బానిసలా అవడం వెనుక కూడా ఇదే మెకానిజం ఉంటుంది. ఇక మీ సమస్య విషయానికి వస్తే ‘కంపల్సివ్ బైయింగ్ డిజార్డర్కు ఖచ్చిత మైన మందులు లేనప్పటికీ ‘యాంటీ డిప్రెసెంట్‘ ‘యాంటీ క్రేవింగ్’ మందులు వాడి కొంత వరకు మీ ప్రవర్తనని అదుపు చేయవచ్చు. దానితోపాటు సైకోథెరపీ, మారైటల్ థెరపీ కూడా ఉపయోగ పడుతుంది. ఎవరో చెప్పినట్లు ఆఫర్లో కొంటే 50 శాతం డబ్బులు మిగులుతాయి. అసలు ఆఫర్లకి దూరంగా ఉంటే 100 శాతం మన డబ్బులు మన దగ్గరే ఉంటాయి కదా... మీరు దిగులు చెందకుండా వెంటనే మంచి సైకియాట్రిస్టుని కలవండి. అన్నీ కుదుట పడతాయి.(డా. ఇండ్ల విశాల్ రెడ్డి, సీనియర్ సైకియాట్రిస్ట్, విజయవాడ. మీ సమస్యలు, సందేహాలు పంపవలసిన మెయిల్ ఐడీ: sakshifamily3@gmail.com)(చదవండి: సమయం ఆసన్నమైంది మిత్రమా..) -
ఎనిమిదేళ్ల బాలుడికి కిడ్నీ నిండా రాళ్లు
ఇటీవలి కాలంలో చిన్న పిల్లల్లో, ఇంకా చెప్పాలంటే చివరకు నవజాత శిశువుల్లో కూడా కిడ్నీ రాళ్ల సమస్య కనిపిస్తోంది. ప్రధానంగా కొంత పెద్ద పిల్లలు తగినంత నీళ్లు తాగకపోవడం, అల్ట్రా ప్రాసెస్డ్ ఆహారాలు తీసుకోవడం లాంటివి ఇందుకు కారణాలవుతున్నాయి. మరీ చిన్నపిల్లల్లో అయితే మెటబాలిక్ కారణాల వల్ల కిడ్నీల్లో రాళ్లు ఏర్పడుతున్నాయి. ఆహారపు అలవాట్లలో మార్పులు, ఊబకాయం, పర్యావరణ కారణాల వల్ల కూడా ఇవి ఏర్పడుతున్నాయి. ఆహారంలో ఉప్పు వాడకం, తీపి పానీయాలు తగ్గించాలి. తాజాగా వరంగల్ ప్రాంతానికి చెందిన ఎనిమిదేళ్ల బాలుడికి ఎడమవైపు కిడ్నీ నిండా రాళ్లు ఏర్పడడంతో అతడిని హైదరాబాద్ బంజారాహిల్స్లోని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ (ఏఐఎన్యూ)కు ఆ బాలుడిని తీసుకొచ్చారు. ఇక్కడ వైద్యులు విజయవంతంగా మొత్తం రాళ్లన్నింటినీ తొలగించి, బాలుడికి ఊరట కల్పించారు. తొలుత ఆ అబ్బాయికి విపరీతమైన కడుపునొప్పి, జ్వరం ఉండడంతో అది కిడ్నీలో రాళ్ల సమస్యేనని గుర్తించి ఈ చికిత్స చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలు, పిల్లల్లో కిడ్నీ రాళ్ల సమస్యల గురించి ఏఐఎన్యూకు చెందిన కన్సల్టెంట్ పీడియాట్రిక్, ట్రాన్సిషనల్ యూరాలజిస్ట్ డాక్టర్ పి.అశ్విన్ శేఖర్ ఇందుకు సంబంధించిన వివరాలు తెలిపారు. “బాలుడిని ఇక్కడకు తీసుకురాగానే సమస్యను గుర్తించి, పెర్క్యుటేనియస్ నెఫ్రో లితోటమీ (పీసీఎన్ఎల్) చేయాలని నిర్ణయించాం. ఇందులోభాగంగా వీపు భాగంలో చిన్న రంధ్రం చేసి, నెఫ్రోస్కోప్ ద్వారా కిడ్నీలోకి వెళ్లి ఎక్కువ నొప్పి లేకుండా రాళ్లను తొలగించాం. సంప్రదాయ శస్త్రచికిత్సల కంటే ఇందులో త్వరగా కోలుకుంటారు. దీనివల్ల ఆస్పత్రిలో ఉండాల్సిన సమయం తగ్గుతుంది.కిడ్నీలో రాళ్ల సమస్య ఇంతకుముందు పెద్దవారిలోనే కనిపించేది. ఇప్పుడు పిల్లల్లో కూడా ఎక్కువగా వస్తోంది. ఎవరైనా సరే రోజూ తగినంత నీళ్లు తాగాలి. ఎన్ని తాగాం అన్నదాని కంటే, ఎంత మూత్రం వస్తోందన్నది ముఖ్యం. రోజుకు కనీసం లీటరున్నర మూత్రం పోయేలా నీళ్లు తాగాలి. అలా తాగకపోతే మూత్రం చిక్కబడుతుంది. అదే కిడ్నీలో రాళ్లు ఏర్పడడానికి సూచిక. పిల్లల్లో కిడ్నీరాళ్ల తొలగింపు చాలా జాగ్రత్తగా, కచ్చితత్వంతో చేయాలి. అత్యాధునిక టెక్నిక్లు ఉపయోగించడం ద్వారా ఈ కేసులో విజయం సాధించాం. ఇందులో ఒక పెద్దరాయి, మరికొన్ని చిన్నరాళ్లు అన్నింటినీ ఒకే సిటింగ్లో తొలగించాం. సాధారణంగా పెద్దరాళ్ల తొలగింపునకు 2-3 సిటింగ్లు అవసరం అవుతాయి. కానీ పీసీఎన్ఎల్ తరహాలో అయితే పెద్ద, సంక్లిష్టమైన రాళ్లనూ తొలగించగలం.తెలంగాణలో కిడ్నీ రాళ్లు, కిడ్నీ వ్యాధులు ఎక్కువవుతున్నాయి. ఇది ప్రమాదకరంగా పెరుగుతోంది. ముఖ్యంగా వేసవిలో ఉష్ణోగ్రతలు పెరగడం, నీళ్లు తాగినా చెమటరూపంలో పోవడంతో తగినంత మూత్రం విడుదల కాక ఈ సమస్య వస్తోంది. మన దేశంలోనే అత్యధికంగా క్రానిక్ కిడ్నీ డిసీజ్ (సీకేడీ) కేసులు తెలంగాణలో 6.2% ఉన్నాయి. గడిచిన 15-20 ఏళ్లలో పిల్లలకు కిడ్నీల్లో రాళ్ల సమస్య రెట్టింపు నుంచి నాలుగు రెట్లు అయ్యింది. పిల్లల్లో కిడ్నీ రాళ్లు ఏర్పడినప్పుడు.. నెల, రెండు నెలల తర్వాత మెటబాలిక్ సమస్యలేమైనా ఉన్నాయేమో పరీక్షించాలి. ఇందుకు 24 గంటల యూరిన్ మెటబాలిక్ పరీక్షలు, సీరం కెమిస్ట్రీలు చూసుకోవాలి. కొన్ని కేసుల్లో జన్యుపరమైన సమస్యల వల్ల ఇవి వస్తున్నాయి. చాలా వరకు మాత్రం నివారించదగ్గ కారణాలే ఉంటున్నందున మన జాగ్రత్తలు చాలాముఖ్యం” అని డాక్టర్ అశ్విన్ శేఖర్ వివరించారు.(చదవండి: తక్కువ వ్యర్థాలతో హెల్దీ లైఫ్ ..! మాజీ ఇస్రో శాస్త్రవేత్త జీరో వేస్ట్ పాఠాలు) -
ప్రకృతి వైద్యమే మంచిదా..! నటి సోనాలి బింద్రే సైతం..
ఆధునిక వైద్యం కొంత పుంతలు తొక్కుతున్న వేళ..చాలామంది ప్రకృతి వైద్యం వైపుకే మగ్గు చూపుతున్నారు. ఆఖరికి సెలబ్రిటీలు, ప్రముఖులు కూడా వాటినే ప్రమోట్ చేస్తుండటం విశేషం. అయితే పూర్తిగా ప్రకృతి వైద్య మీద ఆధారపడితే కష్టం అని..ఆధునిక చికిత్సల తోపాటు దీన్ని తీసుకుంటే బెటర్ అనేది కొందరి నిపుణులు వాదన. అయితే తాజాగా టాలీవుడ్ నటి సోనాలి బింద్రే ఈ ప్రకృతి వైద్యంపై ఆమె పెట్టిన పోస్ట్ హాట్టాపికగ్ మారింది. పైగా ఆమెకు పిచ్చి పట్టిందా అంటూ తిట్టిపోస్తున్నారు కూడా. కానీ సోనాలి మాత్రం తన వాదనను సమర్థించడమే కాదు అది తన అనుభవం అని నొక్కి చెబుతూ మరోసారి పోస్ట్ పెట్టారామె. అసలు ఇంతకీ ఆమె ఏం అన్నారు? అన్నింట్లకంటే ప్రకృతి వైద్యమే మంచిదా అంటే..గతవారం సోషల్ మీడియ ఎక్స్లో ఆటోఫాగి గురించి రాసుకొచ్చింది. తనకు 2018లో కేన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయ్యిందని, అప్పుడే తన ప్రకృతి వైద్యుడు ఈ సహజ చికిత్సను పరిచయం చేసినట్లు తెలిపింది. దానిగురించి పరిశోధించి మరీ అనుసరించినట్లు పేర్కొంది. ఆ ఆటోఫాగిని ఇప్పటికీ అనుసరిస్తున్నట్లు తెలిపింది. ఆటోఫాగి అంటే..ఒక కణం తనను తాను శుభ్రం చేసుకునే సహజ ప్రక్రియ, దీని ద్వారా అది పాత, దెబ్బతిన్న కణ భాగాలను విచ్ఛిన్నం చేసి, వాటిని తిరిగి ఉపయోగించుకుంటుంది. ఇది కణ ఆరోగ్యాన్ని నిర్వహించడానికి, కణాలలో శక్తిని పునరుత్పత్తి చేయడానికి సహాయపడుతుంది, ముఖ్యంగా ఉపవాసం లేదా ఒత్తిడి వంటి పరిస్థితులలో ఇది చాలా కీలకం. అందుకు ది లివర్ డాక్ ఆన్గా ప్రసిద్ధి చెందిన హెపాటాలజిస్ట్ సిరియాక్ అబ్బి ఫిలిప్స్ స్పందించి పోస్ట్లో ఇలా రాసుకొచ్చారు. సోనాలి తన కేన్సర్ చికిత్స కోసం ఆధునిక వైద్యం వైపు మొగ్గు చూపారని గుర్తు చేశారు. "కీమోథెరపీ, రేడియేషన్, శస్త్రచికిత్సతో సహా తీవ్రమైన కేన్సర్ చికిత్సల కోసం న్యూయార్క్కు వెళ్లారని చెప్పుకొచ్చాడు. 2019లో ఆ వ్యాధి నుంచి ఉపశమనం పొంది అధికారికంగా కేన్సర్ రహితంగా భారతదేశానికి తిరిగి వచ్చారని గుర్తు చేశాడు. అంతేగాదు అధునాతన క్యాన్సర్ చికిత్స ఆసుపత్రిలో కీమోథెరపీ, రేడియేషన్,శస్త్రచికిత్స వల్లే మీకు ఉపశమనం లభించిందని పేర్కొన్నాడు. ముమ్మాటికి ఇది ప్రకృతి వైద్యం కాదని, శాస్త్రీయ చికిత్సే మీకు హెల్ప్ అయ్యిందంటూ పోస్ట్లో రాసుకొచ్చారు.దాంతో సోనాలి తాజాగా తన ఎక్స్ పోస్ట్లో అతడు పెట్టిన ఫోటోని స్క్రీన్షాట్ తీసి మరీ పోస్ట్లో ఇలా స్పష్టం చేసింది. ఆ కేన్సర్ వ్యాధి తెచ్చే భయం అంతా ఇంత కాదు. నొప్పి, అనిశ్చతి వంటి వాటిని తట్టుకోవాలి. అందుకు అభ్యాసం, అనుభవం అత్యంత ముఖ్యం. ఇప్పటివరకు తాను చెప్పిన వన్ని తన అనుభవం ఆధారంగా చెప్పాను.తాను పదే పదే చెప్పినట్లుగా.. ఏ రెండు కేన్సర్లు ఒకేలా ఉండవు. అలాగే చికిత్సా విధానాలు కూడా వేరుగా ఉంటుంది. చాలా సమగ్రంగా పరిశోధన, వైద్య మార్గదర్శకత్వం తర్వాత వ్యక్తగతంలో తెలుసకున్నది ఈ ఆటోఫాగి. అప్పట్లో దీని ప్రభావం, తేడాను గమనించానని, పైగా అది నేటికి కొనసాగుతుందని పేర్కొంది. అయినా అందరూ నాతో ఏకభవించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే..వేర్వేరు విధానాల వైపు మొగ్గు చూపుతున్నందున..తన మాటలను తోసిపుచ్చాల్సిన పనిలేదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది సోనాలి. తన అనుభవాన్ని చాలా నిజాయితీగా పంచుకున్నానే తప్ప తప్పుదోవ పట్టేంచే ఉద్దేశ్యమే లేదని,ప్రకృతి వైద్యాన్ని సమర్థిస్తు పోస్టు ట్టారు.అందుకుగాను ది లివర్ డాక్ ఇలా పోస్ట్ పెట్టింది.సోనాలి బింద్రే ఒక పిచ్చిది కాదు. ఆమె సలహా తీసుకుంటున్న ప్రకృతి వైద్యుడు ఒక పిచ్చివాడు. సోనాలి బింద్రే, ఆమెకు ముందు తర్వాత చాలా మంది ఇలాగే అనుసరించి, బాధతులుగా మారారని ఫైర్ అయ్యింది. అయినా విద్య తెలివి తేటలకు, హేతుబద్ధతకు సమానం కాదు అనే విషయంపై దృష్టి పెట్టండి అని పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం నెట్టింట ఈ అంశం హాట్టాపిక్గా మారి, చర్చనీయాంశం గామారింది. ప్రకృతి వైద్యం అంటే..ప్రకృతి వైద్యం అనేది ఒక ప్రత్యామ్నాయ వైద్య విధానం. ఇది ఆహారం, నీరు, ఉపవాసం, వ్యాయామం, యోగా వంటి సహజ పద్ధతుల ద్వారా ఆరోగ్యాన్ని మెరుగుపరచడం, వ్యాధులను దరిచేరకుండా చేస్తుంది. ఇది శరీరానికి సహజంగా ఉండే స్వస్థత శక్తిని ఉపయోగించుకుంటుంది. ఈ విధానంలో హోమియోపతి, ఆక్యుపంక్చర్, హెర్బల్ మెడిసిన్ వంటి సంప్రదాయ పద్ధతులతో పాటు, కొన్ని ఆధునిక పద్ధతులను కూడా మిళితం చేసి అందిస్తుంటారు ప్రకృతి వైద్య నిపుణులు. గమనిక: ఇది కేవలం అవగహనం కోసం మాత్రమే ఇచ్చింది. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యలు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం(చదవండి: ఇష్టారాజ్యంగా యాంటీబయాటిక్స్ వాడొద్దు !) -
హై రిస్క్ ప్రెగ్నెన్సీస్..ఇవీ జాగ్రత్తలు..!
ఒక్కమాటలో చెప్పాలంటే కాబోయే ప్రతి మాతృమూర్తి తాలూకు గర్భధారణా అలాగే ప్రసవంలో ఎంతోకొంత రిస్క్ ఉండనే ఉండవచ్చు.అయితే కొందరి గర్భధారణలు (ప్రెగ్నెన్సీలు) చాలా రిస్క్తో కూడుకున్నవే అవుతాయి. ఉదాహరణ ఒక మహిళకు హైబీపీ, డయాబెటిస్ లేదా గుండెజబ్బులు ఉండటం... ఒకవేళ ఆమె 35 ఏళ్లు దాటాక లేట్గా గర్భవతి కావడం... ఇలాంటి సందర్భాల్లో ఆమె గర్భధారణ అన్నది ప్రసవం వరకూ చాలా జాగ్రత్తగా పర్యవేక్షించాల్సిన సందర్భం అవుతుంది. ఇటీవల దాదాపు ప్రతి ప్రసవమూ ఆసుపత్రుల్లో ప్రసవాలు జరుగుతుండటంతో (ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ అవుతుండటంతో) రిస్క్ అనేది చాలావరకు తగ్గినప్పటికీ... కొన్ని గర్భధారణల్లో ఏ సందర్భంలో ఎటుపోయి ఎటువస్తుందో చెప్పలేని పరిస్థితీ, ఎలాంటి ఆకస్మిక పరిణామాలు ఎదురవుతాయో తెలియని అనిశ్చితి ఉండనే ఉంటుంది. ఇలాంటివాటినే హై రిస్క్ ప్రెగ్నెన్సీలుగా చెప్పవచ్చు. ఏయే సందర్భాలను ‘హై రిస్క్ ప్రెగ్నెన్సీలు’గా పరిగణిస్తారో, ఆ సందర్భాల్లో చేయించాల్సిన వైద్యపరీక్షలు, స్కాన్లతో సాటు తీసుకోవాల్సిన జాగ్రత్తల వంటి అనేక అంశాలను తెలిపే కథనమిది.ఇటీవల వైద్యవిజ్ఞానశాస్త్రాల్లో చాలా అభివృద్ధి చోటుచేసుకుంది. ఇంత పురోభివృద్ధి తర్వాత కూడా కొన్ని సందర్భాల్లో మాత్రం గర్భం ఎంత మేర నిలుస్తుందో చెప్పలేని సందర్భాలు ఎప్పుడూ ఉంటాయి. అది తల్లీ బిడ్డా ఇద్దరికీ కాస్తంత ప్రమాదకరంగా మారే అవకాశాలూ పొంచి ఉంటాయి. అలా తల్లికి గానీ లేదా కడుపులోని బిడ్డకుగానీ... ఒక్కోసారి ఈ ఇద్దరికీ సురక్షితమని చెప్పలేని పరిస్థితి ఉంటుంది. ఎన్నో రకాల కాంప్లికేషన్లు ఎదురయ్యే పరిస్థితి ఉంటుంది. అలాంటి గర్భధారణను ‘హైరిస్క్ ప్రెగ్నెన్సీ’గా చెప్పవచ్చు.ఎవరెవరిలో హైరిస్క్ ముప్పు ఉంటుందంటే... ప్రధానంగా ఈ కింద పేర్కొన్న మహిళలు ‘హై–రిస్క్ ప్రెగ్నెన్సీ’ కిందికి వస్తారని చెప్పవచ్చుదాదాపు 35 ఏళ్లు దాటాక (35 – 40 ఏళ్ల మధ్య వయసులో) గర్భవతులైనవారు.ఇప్పుడు గర్భవతిగా ఉన్న ఆ మహిళకు గతంలో వరసగా అబార్షన్లు కావడం లేదా పుట్టిన వెంటనే బిడ్డ చనిపోవడం వంటి వైద్యచరిత్ర (మెడికల్ హిస్టరీ) ఉండటం. మహిళలకు తాము గర్భందాల్చక ముందే అధిక రక్త΄ోటు(హైబీపీ), మధుమేహం (డయాబెటిస్), గుండెజబ్బులు, ధైరాయిడ్ సమస్య, ఆటోఇమ్యూన్ డిజార్డర్స్, మూర్ఛ (ఎపిలెప్సీ) వంటి ఆరోగ్య సవస్యలు ఉన్నవారు. ముందుగా డయాబెటిస్ లేనప్పటికీ గర్భధారణ తర్వాత మధుమేహం (జెస్టేషనల్ డయాబెటిస్), హైబీపీ కనిపించిన మహిళలు.గర్భధారణకు సంబంధించిన సమస్యలు... అంటే... గర్భంలో కవలలు లేదా ట్రిప్లెట్స్ ఉండటం, స్కాన్ చేసినప్పుడు బిడ్డకు ఆరోగ్యపరమైన సమస్యలుగానీ లేదా లోపాలుగానీ ఉన్నట్లు తెలిసిన సందర్భాల్లో, కడుపులో బిడ్డకు ఎదుగుదల సమస్యలు ఉండటం, బిడ్డలో జన్యుపరమైన లోపాలుండటం... వంటి సందర్భాల్లో. సాధారణ మహిళలతో పోలిస్తే... ఈ తరహా వైద్య చరిత్ర (మెడికల్ హిస్టరీలు) ఉన్నవాళ్లను ‘హైరిస్క్ ప్రెగ్నెన్సీ’ కేటగిరీలోకి వస్తారని చెప్పవచ్చు.హై రిస్క్ ప్రెగ్నెన్సీ...తెలుసుకోవడం ఇలా...ఒక మహిళ హైరిస్క్ గ్రూప్ కిందికి వచ్చే వస్తుందా అన్న విషయం నిర్ధారణ చేసుకోడానికి ఈ కింద పేర్కొన్న అంశాలు సహాయపడతాయి. వీటి సహాయంతో ఒక మహిళ తాను హైరిస్క్ ప్రెగ్నెన్సీ జాబితాలోకి వస్తుందా రాదా అన్నది తనకు తానే తెలుసుకోవచ్చు. గర్భధారణ నాటికి 35 ఏళ్ల వయసు మించి ఉండటం. దీనివల్ల సాధారణ మహిళలతో ΄ోలిస్తే... ఇలా లేట్గా గర్భధారణ జరగడంతో పుట్టే పిల్లల్లో క్రోమోజోమ్స్కు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. కేవలం బాగా ఆలస్యంగా జరిగిన గర్భధారణలోనే కాకుండా... ఒకవేళ ఓ అమ్మాయి 18 ఏళ్ల లోపు చిన్నవయసు బాలిక కావడం, చిన్న వయసులోనే ఆమెకు గర్భధారణ జరిగినప్పుడు కూడా పుట్టబోయే పిల్లల్లో ఎదుగుదల లోపాలు కనిపించే అవకాశాలుండటంతో దీన్నీ హైరిస్క్గానే పరిగణించాలి. ఒకవేళ గర్భంలో ఒకరికంటే మించి (అంటే... కవలలు లేదా ట్రిప్లెట్స్) ఉండటం వల్ల హైబీపీ రావడం లేదా నెలలు నిండకముందే ప్రసవం లాంటి సమస్యలు వచ్చే అవకాశాలుంటాయి. గర్భంలోని బిడ్డకు ఎదుగుదల లోపాలు ఉన్నప్పుడు. గర్భధారణ జరిగిన మహిళలకు హైబీపీ, చక్కెరవ్యాధి (డయాబెటిస్), గుండె జబ్బులు, థైరాయిడ్ సమస్య, ఆటోఇమ్యూన్ సమస్యలు, మూర్ఛ వంటి ఆరోగ్య సమస్యలున్నప్పుడు. ఇప్పటికే ఓసారి ఒక మహిళకు జన్యుపరమైన సమస్యలున్న బిడ్డ ఉండటం లేదా... ఆ బిడ్డకు గుండెజబ్బుగానీ, లోపంతో కూడిన ఎముకల కారణంగా బిడ్డకు వైకల్యం రావడం వంటి ఆరోగ్య చరిత్ర (మెడికల్ హిస్టరీ) ఉండటం. మహిళకు గర్భధారణ వ్యవస్థలో పెద్ద గడ్డలు (ఫైబ్రాయిడ్స్) వంటివి వచ్చిన వైద్య చరిత్ర (మెడికల్ హిస్టరీ) ఉండటం. గతంలో తరచూ అబార్షన్లు కావడం, మునుపు పిండం గర్భసంచిలో కాక... బయట ట్యూబుల్లోనే పెరగడం, గతంలో నెలలు పూర్తిగా నిండకముందే ప్రసవం జరగడం (ప్రీవియస్ హిస్టరీ ఆఫ్ ప్రిమెచ్యూర్ బర్త్), గతంలో బిడ్డ లోపలే చనిపోవడం వంటి మెడికల్ హిస్టరీ ఉంటే... హెచ్ఐవీ వంటి ఇన్ఫెక్షన్లు ఉండటం వల్ల అవి బిడ్డకు సోకే అవకాశాలున్నప్పుడు. పిల్లలు కలగడానికి చాలాకాలం చికిత్స తీసుకున్న తర్వాత గర్భం రావడం... ఇక్కడ పేర్కొన్న సందర్భాల్లో ఒక మహిళ గర్భందాల్చితే దాన్ని ‘హైరిస్క్ ప్రెగ్నెన్సీ’గా చెప్పవచ్చు. ఇలాంటి మహిళలకు గర్భధారణ సమయంలోనూ లేదా ప్రసవం సమయంలోనూ అనేక రకాల కాంప్లికేషన్లు కనిపించే అవకాశాలు ఎక్కువ. ఈ కాంప్లికేషన్లను రెండు రకాలుగా నివారించవచ్చు. మొదటిది మహిళ తానంతట తానే కొన్ని జాగ్రత్తలూ, సూచనలు పాటించి కాంప్లికేషన్లను నివారించుకోవడం, రెండోది వైద్యనిపుణుల సహాయంతో కాంప్లికేషన్లు నివారించుకోవడం. మహిళలు తమకు తాముగా ప్రెగ్నెన్సీ రిస్క్ల తాలూకు కాంప్లికేషన్ల నివారించుకోవడమిలా...హైరిస్క్ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ముందుగానే ఒకసారి ‘ప్రీ– కన్సెప్షనల్ కౌన్సెలింగ్’ కోసం డాక్టర్ను సంప్రదించాలి. ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలనుకున్నప్పుడు... దాదాపు మూడు నెలల ముందునుంచే కనీసం రోజుకు 400 మైక్రోగ్రాముల ఫోలిక్ యాసిడ్ తీసుకోవడం... (ఈ ఫోలిక్ యాసిడ్ మాత్రను గర్భం దాల్చాక కూడా పూర్తి గర్భధారణ టైమ్ మొత్తం వాడాలి. గర్భం ధరించిన సమయంలో వీలైనంతవరకు ఎలాంటి మందులూ తీసుకోకూడదు. ఒకవేళ తీసుకోవాల్సి వస్తే... ప్రతి మందునూ తప్పనిసరిగా డాక్టర్ సలహా మేరకు వాళ్లకు తెలిసి మాత్రమే తీసుకోవాలి. కొందరు మహిళలకు మూర్ఛ (ఎపిలెప్సీ), హైబీపీ, డయాబెటిస్ వంటి ఆరోగ్య సమస్యలు ఉంటే... గర్భం వచ్చినట్లు తెలియగానే కొందరు మహిళలు తాము వాడే మందుల్ని తమంతట తామే ఆపేస్తారు. అది తల్లీ, బిడ్డా ఇద్దరికీ ప్రమాదకరం. కాబట్టి తామేవైనా మందులు వాడాలన్నా లేదా అంతకుముందునుంచి వాడుతున్న మందులు ఆపేయాలన్నీ డాక్టర్ను సంప్రదించాకే ఆ పని చేయాలి. ఎందుకంటే హైబీపీ, మూర్చ (ఎపిలెప్సీ) వంటి వ్యాధులున్న మహిళలకు డాక్టర్లు వారి గర్భధారణ తసమయంలో వాడుతున్న మందులను గానీ లేదా వాటి మోతాదులనుగానీ మారుస్తారు. గర్భం దాల్చినట్లు నిర్ధారణ అయినప్పటి నుంచి క్రమం తప్పకుండా డాక్టర్తో నిత్యం డాక్టర్లు సూచించిన పరీక్షలు చేయిస్తూ ఉండాలి. కనీసం నెలలో ఒకసారైనా లేదా పరిస్థితి తీవ్రతను బట్టి డాక్టర్లు సూచించిన వ్యవధిలో డాక్టర్ను కలిసి అవసరమైన పరీక్షలు చేయిస్తుండాలి. ఏడో నెల దాటాక ఈ పరీక్షలు మరింత తరచుగా చేయించాల్సి రావచ్చు. సరైన టైముల్లో సరైన టీకాలు (ప్రాపర్ ఇమ్యూనైజేషన్) తీసుకోవాలి. మహిళలు తమ ఎత్తుకు తగినట్లుగా తమ ఆరోగ్య నిర్వహణకు తగిన బరువు ఉండేలా చూసుకోవడం, ఇందుకు సరైన ఆహార నియమాలు పాటించడం, అవసరమైన శారీరక వ్యాయామాలను చేయడం అవసరం. ఈ వ్యాయామాలు మరింత శ్రమ కలిగించేలా ఉండకూడదు. కొన్నిరకాల హైరిస్క్ ప్రెగ్నెన్సీల్లో డాక్టర్ బెడ్రెస్ట్ తీసుకోమని అంటే... దాన్ని తప్పనిసరిగా పాటించాలి. అయితే బెడ్రెస్ట్ అంటే పూర్తిగా మంచానికే పరిమితం కావడం కాదు. డాక్టర్ సలహా మేరకు కాబోయే తల్లి ఏమేరకు శారీరక శ్రమ చేయాలో... అలాగే ఏ మేరకు విశ్రాంతి తీసుకోవాలో చెబుతారు. దాన్ని అక్షరాలా పాటించాలి.వైద్యనిపుణులూ, సిబ్బంది సహాయంతో కాంప్లికేషన్ల నివారణ ఇలా... హై రిస్క్ ప్రెగ్నెన్సీ వల్ల ప్రసవ సమయంలో కలిగే దుష్పరిణామాలు, ప్రమాదకర పరిస్థితుల (కాంప్లికేషన్స్)ను నివారించడమన్నది ఈ రోజుల్లో చాలావరకు సాధ్యమే. ఇలాంటి రిస్క్లు ఉన్న మహిళలు... ఫిజీషియన్, ఎండోక్రినాలజిస్ట్, గుండెజబ్బుల నిపుణుడు, రుమటాలజిస్ట్, నరాల నిపుణుడు అందుబాటులో ఉండే హయ్యర్ మెడికల్ సెంటర్లలో తమ ప్రసవం జరిగేలా చూసుకోవడం మంచిది. ఫలితంగా ఆ మహిళకు అవసరం ఉన్న వైద్య చికిత్సలను బట్టి ఆ ప్రసవాన్నీ ఎలా ΄్లాన్ చేయాలో అన్నది వైద్యనిపుణులు చర్చించుకుని ఆ మేరకు సురక్షిత ప్రసవం జరగడానికి అవసరమైన నిర్ణయాలు తీసుకోడానికి, వాటిని అమలు చేయడానికి వీలవుతుంది. గర్భిణుల్లో రొటీన్ రక్తపరీక్షలకు తోడుగా... ఆమెకు తన రెండో నెలలోనే రక్తంలో చక్కెర మోతాదులను నిర్ధారణ చేసే పరీక్ష, థైరాయిడ్ పరీక్ష వంటివి నిర్వహిస్తే... పుట్టబోయే బిడ్డ, కాబోయే తల్లి తాలూకు ఆరోగ్య పరిస్థితిని ముందునుంచే తెలుసుకుంటూ ముందస్తు చికిత్స చేయడం... తద్వారా తర్వాతి కాంప్లికేషన్లను నిరోధించడమన్నది చాలావరకు సాధ్యమవుతుంది. ఇక మూత్రపిండాల (కిడ్నీ) సమస్య ఉన్న మహిళలు, హైబీపీ ఉన్నవాళ్లు, థైరాయిడ్ సమస్యతో బాధపడేవారు, తరచూ అబార్షన్లు అయినవారు గర్భధారణకు ముందే కొన్ని రక్త పరీక్షలు చేయించడం అవసరం, ప్రెగ్నెన్సీ సమయంలో 7–8 వారాలప్పుడే కొన్ని ఇంజెక్షన్లు వాడటం ద్వారా మున్ముందు చోటుచేసుకోబోయే చాలా రకాల ప్రమాదాలను (కాంప్లికేషన్లను) నివారించవచ్చు. స్కాన్ల సహాయంతో... అల్ట్రాసౌండ్ స్కాన్ సహాయంతో ముందుగానే గర్భంలోపల ఉన్న పరిస్థితిని తెలుసుకుని తగిన చికిత్స చేయడంతో టు... లోపాలు సరిదిద్దడానికీ ఆ స్కాన్లు ఉపయోగపడతాయి. బిడ్డలోని వైకల్యాలను, అసా«ధారణ పరిస్థితులనూ, లో΄ాలను తెలుసుకునేందుకు స్కాన్స్ ఎంతగానో ఉపయోగపడతాయి.అల్ట్రాసౌండ్ స్కాన్తో 11–14 వారాల సమయంతో గర్భధారణ నిర్దిష్టంగా ఎప్పుడు జరిగింది, గర్భంలోపల ఉన్న బిడ్డ ఒకరా, కవలలా, ఒకవేళ కవలలైతే ఒక వాళ్లు ఒకే అండం నుంచా లేక రెండు వేర్వేరు అండాల నుంచా అన్నది తెలుస్తుంది. న్యూకల్ ట్రాన్సు్యలెన్సీ స్కాన్ వల్ల చిన్నారిలో క్రోమోజోమ్కు సంబంధించిన లోపాలు ఏవైనా ఉంటే అవి పిండ దశలోనే తెలిసి΄ోతాయి. బిడ్డ స్వరూపం (స్ట్రక్చర్) ఎలా ఉందో కూడా కొంతవరకు తెలుస్తుంది. ఇది ఒక రకమైన స్క్రీనింగ్ పరీక్ష. ఇక 20–22 వారాలప్పుడు చేసే రొటీన్ స్కాన్ వల్ల చిన్నారి పూర్తి స్వరూపం (స్ట్రక్చర్) తెలుస్తుంది. అన్ని అవయవాలూ సక్రమంగా రూ΄÷ందాయో లేదో కూడా తెలిసిపోతుంది. క్రమం తప్పకుండా చేయించే స్కాన్ల వల్ల బిడ్డ మెదడు వంటి అత్యంత ప్రధాన అవయవాల్లో రక్తప్రసరణ వంటి కీలక అంశాలు తెలుస్తాయి. ఫలితంగా పిండదశలోనే ఏవైనా లో΄ాలు ఉంటే వాటిని చక్కదిద్దే అవకాశాలుంటాయి. ఇలాంటి పలు రకాల స్కాన్ల కాంబినేషన్లతో ఒక ప్రెగ్నెన్సీలో రిస్క్ మోతాదు ఎంత అన్నది నిర్థారణ చేస్తారు. దాన్ని బట్టి ఆ ప్రెగ్నెన్సీది హైరిస్కా, తక్కువ రిస్కా, లేదా రిస్కేమీ లేదా అన్నది దాదాపు 90 శాతం వరకు చెప్పగలుగుతారు. ఇప్పుడు అడ్వాన్స్డ్ చికిత్సలూ అందుబాటులో... గర్భధారణ సమయంలో ఎదురయ్యే రిస్క్లకు ఇప్పుడు చాలా రకాల చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. ఇటీవలి కాలంలో నియోనేటల్ చికిత్స ప్రక్రియలు చాలా అడ్వాన్స్ అవ్వడం వల్ల ఇలాంటి బేబీస్కు ఇప్పుడు అన్ని రకాల చికిత్సలు అందిస్తూ వాళ్లు మామూలుగానే మనుగడ సాధించేలా చేయవచ్చు. గతంలో వాళ్లకు న్యూరలాజికల్ సమస్యలు వస్తాయనే భావన ఉండేది. ఇప్పుడున్న వైద్యపరిజ్ఞానంతో అలాంటి సమస్యలనూ చాలావరకు అధిగమించవచ్చు. అలాంటి పిల్లల్లో కొన్ని అవయవాలు అంటే ఉదాహరణకు ఊపిరితిత్తులు అభివృద్ధి కావు. అప్పుడు కొన్ని ఇంజెక్షన్లను ఇవ్వడం ద్వారా ఊపిరితిత్తులను పూర్తిగా అభివృద్ధి చెందేలా చేయవచ్చు. అయితే ఇలాంటి చికిత్సలు– అన్ని అధునాతన సదు΄ాయాలు ఉన్న చికిత్స కేంద్రాల్లో ఉంచి తగిన పరిచర్యలు చేయడం ద్వారా బిడ్డనూ, తల్లినీ సంరక్షించవచ్చు. అలాగే బిడ్డ మానసిక ఎదుగుదలకు, తెలివితేటలకూ థైరాయిడ్ హార్మోన్లు అవసరం. అలాంటప్పుడు తల్లిలో థైరాయిడ్ లోపాలుంటే వాటిని సరైన సమయంలో పసిగట్టి చికిత్స అందించడం ద్వారా మంచి మానసిక ఆరోగ్యం, తెలివితేటలు ఉండే బిడ్డను కనేలా చేయవచ్చు. కాబోయే తల్లికి బీపీ, షుగర్ వంటివి ఉన్నట్లయితే వాటిని సమర్థంగా నియంత్రణలో పెట్టి తల్లినీ, బిడ్డనూ సంరక్షించవచ్చు. అందుకే... హైరిస్క్ ప్రెగ్నెన్సీలలో తల్లినీ, బిడ్డనూ సురక్షితంగా ఉంచాలంటే... ముందునుంచే మంచి వైద్యపర్యవేక్షణతో పాటు... కాబోయే తల్లికీ కొంత ప్రాథమిక పరిజ్ఞానం, కొన్ని అంశాలపై అవగాహన, పరిజ్ఞానం ఉండటం అవసరం. అలాంటివి వైద్య నిపుణులు తమ కౌన్సెలింగ్ సమయంలో చెబుతూ ఆమెకూ పలు అంశాలపై అవగాహన కల్పిస్తారు. డాక్టర్ శ్రుతి రెడ్డి పొద్దుటూరు కన్సల్టెంట్ ఆబ్స్టెట్రీషియన్, గైనకాలజిస్ట్ – లాపరోస్కోపిక్ సర్జన్ (చదవండి: Farah Khan: వెయిట్ లాస్ జర్నీ కోసం ఫరా ఖాన్ పాట్లు..! ఏకంగా సర్జరీ, జుట్టు కోసం..) -
వెయిట్ లాస్ జర్నీ కోసం ఫరా ఖాన్ పాట్లు..! ఏకంగా సర్జరీ, జుట్టు కోసం..
బరువు తగ్గడం సాధారణ వ్యక్తులుకే కాదు సెలబ్రిటీలకు సైతం కష్టమే. బాగా లగ్జరీ ఉంటారు కాబట్టి ఏవేవో షార్ట్కట్లతో అమాంతం బరువు తగ్గిపోతారని అనుకుంటుంటారు, కానీ అది అపోహే అని బాలీవుడ్ చిత్రనిర్మాత, కొరియోగ్రాఫర్ ఫరా ఖాన్ని చూస్తే ఇట్టే అర్థమవుతుంది. సోహా అలీఖాన్తో జరిగిన సంభాషణలో చాలా ఓపెన్గా నిజాయితీగా తన వెయిట్ లాస్ జర్నీ గురించి చెప్పిన విధానం వింటే..అబ్బా బరువు తగ్గడానికి ఇంత కష్టపడిందా అనిపిస్తుంది. ఇంతకీ ఆమెకు స్లిమ్ మారడానికి ఎంత టైం పట్టిందంటే..ఫరాఖాన్ సోహా అలీఖాన్తో జరిగిన పాడ్కాస్ట్ ఆల్ అబౌట్ హర్ సంభాషణలో 60 ఏళ్ల వయసులో తన బరువు తగ్గే జర్నీ గురించి మాట్లాడింది. అంతేగాదు ఆ క్రమంలో తాను ఎదుర్కొన్న చర్మం, జుట్టు సమస్యల గురించి కూడా చెప్పుకొచ్చింది. ఆ సంభాషణలో సోహా అలీ ఖాన్ ..మీరు ఎంతో అద్భుతంగా కనిపిస్తునన్నారని ఫరాని ప్రశంసిస్తుంది. అయితే ఎల్లప్పుడూ ఇలానే ఉండిపోలేం అని నవ్వుతూ కౌంటర్ ఇచ్చేసింది ఫరా. తాను పిల్లలు పుట్టే వరకు చాలా సన్నగా ఉండేదాన్ని అని, అయితే చర్మం చాలా భయంకరంగా ఉండేదని తెలిపింది. అందులోనూ తాను డే అండ్ నైట్ షిప్ట్లో నిరంతరం పనిచేస్తూ ఉండటంతో మరిన్ని ఆరోగ్య సమస్యలు ఫేస్ చేసినట్లు వెల్లడించింది. ఒకసారి తన భర్త, పిల్లలను తీసుకుని వెకేషన్కి వెళ్లామని, అప్పుడు తాను చాలా అధిక బరువుతో ఉన్నట్లు గుర్తు చేసుకున్నారామె. అయితే తాము అక్కడ ఒక రూమ్ తీసుకుని ఉన్నప్పుడూ ఒక మహిళా క్లీనర్ వచ్చి..తన భర్తను చూసి మీ అబ్బాయిని బయటకు వెళ్లమనిండి ఇల్లు తుడుస్తాను అంటుంది. దాంతో ఫరా కంగుతింటుంది. ఆ ఘటన తనను చాలా కలవరపాటుకు గురి చేసిందని తెలిపింది. అలా తాను 60 ఏళ్ల వయసులో బరువు తగ్గే జర్నీని ప్రారంభించానని, అదనపు బరువు కోల్పోవడానికి తనకు ఏడేళ్లే పైనే పట్టిందని తెలిపింది.తనకు పుట్టుకతో అదనపు చర్మం ఉండటం వల్ల బరువు తగ్గడంలో మార్పులు సత్వరం కనిపించలేదని, అందుకోసం టమ్మీ టక్ సర్జరీ చేయించుకోవాల్సి వచ్చిందని పేర్కొంది. అంతేగాదు 50 ఏళ్ల వయసులో చర్మ వ్యాధి నిపుణుడిని క్రమం తప్పకుండా సంప్రదించడం, దాంతోపాటు వెల్నెస్ స్పాలో విటమిన్ డ్రిప్స్, లింఫాటిక్ మసాజ్లు వంటివి తీసుకున్నట్లు వివరించింది. ఇక తన జుట్టు కోసం కూడా క్రమం తప్పకుండా విటమిన్లు తీసుకుంటున్నట్లు తెలిపింది. అంతలా కేర్ తీసుకుంటే గానీ ఫరా అంతలా స్లిమ్గా మారలేదన్నమాట. (చదవండి: కిరీటం గెలుపొందితే సరిపోదు..ఆ బాధ్యతలు కూడా చేపట్టాలి!) -
పిల్లల్లోనూ డిప్రెషన్? అందుకు అనేక రీజన్లు..
‘పిల్లలకు ఎలాంటి కష్టాలు ఉంటాయి? వారు రోజంతా ఆడుకుంటూ సంతోషంగా ఉంటారు’’ అని చాలామంది అనుకుంటారు. కానీ ఇది సరైన అభిప్రాయం కాదు. డిప్రెషన్ అనేది పెద్దవారికే కాదు... అది చిన్న పిల్లల్లో కూడా కనిపించే ఓ భావోద్వేగ సమస్య. అనేక పరిశోధనలు క్లినికల్ అనుభవాలు చిన్నపిల్లల్లో కూడా డిప్రెషన్ కనిపిస్తుందని నిర్ధారణ చేస్తున్నాయి. చిన్నపిల్లల్లో డిప్రెషన్ రావడానికి అనేక అంశాలు కారణమవుతాయి. అవి... పిల్లల్లో డిప్రెషన్ ఎందుకు వస్తుందంటే... 1. బయోలాజికల్ / శారీరక కారణాలుకుటుంబంలో డిప్రెషన్ లేదా యాంగై్జటీలతో కూడిన మెడికల్ హిస్టరీ ఉండటం మెదడులోని రసాయనాల (కెమికల్స్) అసమతుల్యత కారణంగా నిద్ర–ఆహార శైలిలో గందరగోళం 2. సైకాలజికల్ / భావోద్వేగ కారణాలు పిల్లల సున్నితమైన స్వభావం భయం, ఆత్మవిశ్వాసం లేకపోవడం చదువులో ఒత్తిడి 3. సామాజిక కారణాలు ఇంట్లో కలహాలు స్కూల్లో బుల్లీయింగ్కు గురికావడం స్నేహితుల లేమి, ఒంటరితనం ఎక్కువ సమయం టీవీ లేదా మొబైల్ స్క్రీన్కు అంటిపెట్టుకుని ఉండటం డిప్రెషన్ పిల్లల్లో ఎలా బయటపడుతుందంటే... చిరాకు, చిన్న విషయానికే ఏడవడం ఒంటరిగా ఉండాలనిపించడం స్కూల్కు వెళ్లడంలో నిరాసక్తత ఆటల్లో ఆసక్తి తగ్గిపోవడం ఆకలి తగ్గడం లేదా ఎక్కువగా తినడం నిద్రలో మార్పులు (ఎక్కువ నిద్ర / నిద్రలేమి) అలసట, నీరసం, నిస్సత్తువ ఆత్మవిశ్వాసం తగ్గుదల ∙తరచూ ‘‘పొత్తికడుపు నొప్పి, తలనొప్పి’’ వంటి ఫిర్యాదులుఈ లక్షణాలు 2–3 వారాలు కొనసాగితే నిపుణుడిని సంప్రదించడం మంచిది.ప్రతి బాధ డిప్రెషన్ కాకపోవచ్చు కానీ పిల్లల విషయంలో జాగ్రత్త అవసరం. ఎందుకంటే చిన్న పిల్లలు తమ భావాలను మాటల్లో చెప్పలేరు. వారు తమ ప్రవర్తన ద్వారానే తమ బాధల్ని వ్యక్తం చేస్తారు. అందుకే పిల్లల్లో ఆకస్మికంగా వచ్చిన మార్పులను తల్లిదండ్రులు, టీచర్లు గమనించాలి.తల్లిదండ్రులకు కొన్ని ముఖ్యమైన సూచనలు1. పెద్దలు తీర్పులు ఇవ్వకుండా పిల్లల మాట వినాలి (నాన్ జడ్జిమెంటల్ ఆటిట్యూడ్) ∙‘‘ఇంత చిన్న విషయానికే ఎందుకు బాధపడుతున్నావు?’’ వంటి మాటలను అనకూడదు. ∙పిల్లల అభిప్రాయాలనూ, భావాలనూ తగ్గించే మాటలు అనకుండా, ఠక్కున ఓ అభిప్రాయానికి వచ్చి దాన్ని వెల్లడించకుండా వారు చెప్పే మాటల్ని శ్రద్ధగా వినాలి. ఇది పిల్లల్లో భద్రతా భావాన్ని, నమ్మకాన్ని పెంచుతుంది.2. పిల్లలతో ఎక్కువ సమయం గడపడం (స్పెండింగ్ మోర్ అండ్ క్వాలిటీ టైమ్) ప్రతిరోజూ కొంత సమయం పూర్తిగా పిల్లలకోసమే కేటాయించాలి.∙కథలు చెప్పడం, బయట ఆటలు, కలిసి చేసే చిన్న పనులే అయినప్పటికీ ఇవన్నీ పిల్లల్లో వాళ్ల భావోద్వేగ బలాన్ని పెంచుతాయి. ∙నాణ్యమైన సమయం ఇవ్వడమన్నది పిల్లలను డిప్రెషన్కు గురికాకుండా చేసే ఒక సహజ రక్షణలాంటిది. చికిత్స ఇలా... కౌన్సిలింగ్ / ప్లే థెరపీ బిహేవియర్ థెరపీ అవసరమైనప్పుడు మాత్రమే అది కూడా సైకియాట్రిస్ట్ పర్యవేక్షణలోనే మందులు వాడటం. ఎంత త్వరగా చికిత్స చేస్తే ఫలితాలు అంతగా బాగుంటాయి. చివరగా... డిప్రెషన్ చిన్న పిల్లల్లోనూ కనిపించేందుకు అవకాశమున్న ఒక భావోద్వేగ సమస్య. దీన్ని వైద్య నిపుణుల సహాయంతో నయం చేయవచ్చు. సమయానికి గుర్తించడం, వారి ప్రవర్తనపై తీర్పులు ఇవ్వకుండా ప్రేమ, ఆప్యాయతలతో వారితో పెద్దలు ఎక్కువ సమయం గడపడం ద్వారా, అలాగే నిపుణుల సహాయం తీసుకుంటే వారిని డిప్రెషన్ను నుంచి దూరం చేయగలిగితే చిన్నారులు పూర్తిగా ఆరోగ్యంగా కోలుకుని, ఆనందంగా ఎదుగుతారు. డాక్టర్ గౌతమి నాగభైరవ, సీనియర్ సైకియాట్రిస్ట్ (చదవండి: ఎకాంథోసిస్ నైగ్రికాన్స్! చక్కెర చారలు..!) -
పీరియడ్స్ సమయంలో వ్యాయామం చేయొచ్చా?
స్త్రీలు తమ పీరియడ్స్ సమయంలో వ్యాయామాలు చేయకూడదని కొందరు అభిప్రాయపడుతుంటారుగానీ... నిజానికి మహిళలు తమ రుతు సమయంలో ఎలాంటి సంకోచాలూ లేకుండా వ్యాయామాలు చేయవచ్చు. ఆ టైమ్లో చేయకూడదన్నది కేవలం అపోహ మాత్రమే. చాలామంది క్రీడాకారిణులు తమ రెగ్యులర్ ప్రాక్టీస్లో భాగంగా రుతుసమయంలోనూ వ్యాయామం చేస్తుంటారు. దాంతో ఎలాంటి నష్టమూ జరగదు. అయితే మహిళలు తమ రుతు సమయంలో ఒక విషయంలో కొంత అప్రమత్తతతో ఉండాలి. అదేమిటంటే... రుతు సమయంలో వాళ్లు రక్తం కోల్పోతూ ఉండటం వల్ల వాళ్ల దేహంలో ఐరన్ మోతాదులు తగ్గే అవకాశం ఉన్నందున... ఐరన్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకుంటూ ఉండటం చాలా మేలు చేస్తుంది. ఐరన్ మోతాదులు ఎక్కువగా ఉండే ఆహారాలు... మాంసాహారాల్లో వేటవూంసం, చికెన్, చేపలు, లివర్, శాకాహారులైతే తాజా ఆకుకూరలు (పాలకూర వంటివి), ఎండుఖర్జూరం, గసగసాలు, చిక్కీ వంటి పదార్థాల్లో ఐరన్ మోతాదులు ఎక్కువ. ఇవి కేవలం పీరియడ్స్ సమయంలోనే కాకుండా మామూలు టైమ్లోనూ తీసుకుంటుంటే వారిలో ఐరన్ ఎప్పటికప్పుడు భర్తీ అవుతుంది.దూరంగా ఉండాల్సిన పదార్థాలివే... రుతు సవుయంలో వారు నువ్వులు, ఉప్పు, కొవ్వులు ఎక్కువగా ఉన్న ఆహారాన్ని ఎక్కువగా తీసుకుంటే దేహం కాస్తంత మందకొడిగా మారడంతో వ్యాయామాలు చురుగ్గా చేయలేక΄ోవచ్చు. కేవలం రుతు సమయంలోనే కాకుండా మిగతా టైమ్లో కూడా వీటితో చురుకుదనం తగ్గవచ్చు. కాబట్టి చురుగ్గా ఉండాలంటే... మహిళలు తమ ఆహారంలో ఉప్పు, కొవ్వులు తగ్గించాలి. రుతు సవుయంలో సాధారణ రోజుల కంటే నీళ్లు, పండ్లరసాల వంటి ద్రవాహారాలు ఎక్కువగా తీసుకోవడం మేలు చేస్తుంది. అంతేకాదు... వేళకు పడుకుని, కంటినిండా నిద్రపోవడం వల్ల పూర్తి ఆరోగ్యమూ బాగుంటుంది. వ్యాధినిరోధక వ్యవస్థ (ఇమ్యూనిటీ) మెరుగుపడుతుంది. (చదవండి: పార్కిన్సన్ రోగులకు హెల్ప్ అయ్యే 'ఆన్క్యూ') -
డ్రైఫ్రూట్స్ తెగ తినేస్తున్నారా? ఈ విషయం తెలుసుకోండి!
డ్రై ఫ్రూట్స్ సరైన మోతాదులో తీసుకోవడం వలన ఇందులో ఉండే పోషకాలు శరీరానికి చాలా మేలు చేస్తాయి. కానీ కొందరు వీటిని ఆరోగ్యానికి మంచిదని అతిగా తింటుంటారు. కానీ వీటిలో అధిక చకకెర ఉండటం వలన ఎక్కువ మోతాదులో తీసుకోవడం వలన ఇది ఆరోగ్య సమస్యలను కలిగించే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎంత వరకు తీసుకోవచ్చు?డ్రై ఫ్రూట్స్ సాధారణంగా, ప్రతి రోజు 20 నుండి 30 గ్రాముల తీసుకోవడం చాలా మంచిది. ఈ మోతాదులో తీసుకోవడం వలన శరీరానికి మంచి ΄ోషకాలు అందుతాయి. కానీ డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకుంటే ఇందులోని అధిక చక్కెర, ఫ్యాట్ అధికంగా ఉండి ఇవి అధికబరువుకు కారణం అవుతాయి.ఇదీ చదవండి: 17 ఏళ్ల తరువాత ఇండియాకు ఎన్ఆర్ఐ జంట, వీడియో వైరల్ -
సెలబ్రిటీల ఫిట్నెస్ సీక్రెట్..ఇలా చేస్తే..!
ఫిట్ నెస్, ఆరోగ్యకరమైన జీవనశైలి ప్రతి ఒక్కరికి చాలా ముఖ్యం. అయితే రకరకాల కారణాల వల్ల ఈ రోజుల్లో చాలామంది ఫిట్ నెస్, ఆరోగ్యంపై తగినంత శ్రద్ధ చూపలేకపోతున్నారు. కొంతమంది సినిమా సెలబ్రిటీలు మాత్రం తమ ఫిట్ నెస్, ఆరోగ్యకరమైన జీవనశైలితో ఎంతోమందికి స్ఫూర్తినిస్తున్నారు. వారెవరో, వారి ఆరోగ్య రహస్యాలేమిటో తెలుసుకుందాం. దీపికా పదుకోన్, అక్షయ్ కుమార్, శిల్పా శెట్టి వంటి సినీ తారలు తమ ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, వ్యాయామాలతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఈ సెలబ్రిటీలు శరీరాన్ని ఫిట్ గా ఉంచుకోడానికి, ఆరోగ్యాన్ని కా΄ాడుకోడానికి అసలు ఏం తింటారు, ఏం చేస్తారో తెలుసుకుందాం. శిల్పాశెట్టి.. ఒకప్పుడు భారత సినీ ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసిన నటి శిల్పాశెట్టి. ఈ మంగుళూరు భామ తరచు తన ఫిట్ నెస్ వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది. శిల్పా శెట్టి ఆహారపు అలవాట్లు, వ్యాయామ నియమాలు చాలా మందికి స్ఫూర్తినిస్తున్నాయి. దాదాపుగా ఐదుపదుల వయస్సులో కూడా శిల్పాశెట్టి ఫిట్ గా ఉండటానికి ఆమె ఆహారపుటలవాట్లే కారణం. ఉదయాన్నే నిమ్మరసం, తేనె కలిపిన గోరువెచ్చని నీరు తాగే శిల్పాశెట్టి.. బ్రేక్ ఫాస్ట్ గా ఓట్స్, పోహా, పప్పు చీలా వంటి ప్రొటీన్ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకుంటుంది. లంచ్లో బ్రౌన్ రైస్, కూరగాయలు, పండ్లు, చికెన్, చేపలు వంటివి తీసుకుంటుంది. చక్కెర, ప్రాసెస్ చేసిన ఆహారాలకు దూరంగా ఉంటానంటుంది శిల్పాశెట్టి.శిల్పాశెట్టి ఆరోగ్య యోగం: రెగ్యులర్గా యోగా చేయడంతోపాటు వెయిట్ ట్రైనింగ్, కార్డియో వ్యాయామాలు కూడా చేస్తూ చురుగ్గా ఉండటమే ఆమె ఆరోగ్య రహస్యం. అక్షయ్ కుమార్.. ఆరుపదల వయస్సుకు చేరువ అవుతున్నా కూడా ఫిట్ నెస్ విషయంలో ఈ బాలీవుడ్ హీరోని మించినవాళ్లు లేరంటే అతిశయోక్తి లేదు. క్రమశిక్షణకు మారుపేరైన అక్షయ్ కుమార్వ్యాయామం, యోగా, కార్డియోలకు ప్రాధాన్యతనిస్తారు. ఇవి ఆయన శరీరాన్ని ఎప్పుడూ ఫిట్గా, టోన్గా ఉంచుతాయి. ఆహారం విషయానికొస్తే అక్షయ్ కుమార్.. శరీరానికి కావాల్సిన ప్రొటీన్లను, శక్తిని అందించేలా ఉదయాన్నే పాలు, పరాటాలు తీసుకుంటారు. దీపికా పదుకోన్.. భారత సినీ పరిశ్రమలోనే కాకుండా విదేశాల్లో కూగా తన నటనతో అద్భుతమైన ప్రశంసలు,ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన దీపికా పదుకొణె ఫిట్ నెస్ విషయంలో అసలేమాత్రం రాజీపడదు. త్వరలోనే నాలుగవ పదిలోకి అడుగు పెట్టనున్న దీపికా పదుకోన్ ఫిట్ నెస్, అందం వెనుక ఆరోగ్యకరమైన ఆహారమే అసలు రహస్యం.దీపికా పదుకొణె ఉదయం ఆహారంలో గ్రీన్ టీ, ఓట్ మీల్ తీసుకుంటుంది. దీపికాకి సౌత్ ఇండియన్ ఫుడ్ అంటే బాగా ఇష్టపడే దీపికా బ్రేక్ ఫాస్ట్ లోకి దక్షిణ భారతీయ వంటకాలైన ఇడ్లీ, దోసెలను తీసుకుంటుంటుంది. క్రమం తప్పకుండా యోగా, వ్యాయామం చేస్తుంది. రణ్వీర్ సింగ్.. తన డిఫరెంట్ లుక్స్, స్టైల్, స్మైల్తో అందరినీ ఆకట్టుకునే బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్.. తన రోజును వ్యాయామం, కార్డియోతో ప్రారంభిస్తాడు, ఇది అతని శరీరాన్ని ఎల్లప్పుడూ చురుగ్గా, ఫిట్గా ఉంచడంలో తోడ్పడతాయి. ఉదయాన్నే ఎనర్జీ డ్రింక్స్ తాగుతాడు. ఆ తర్వాత అల్ఫాహారంలోకి ఓట్స్, డ్రై ఫ్రూట్స్, స్మూతీలు తీసుకుంటానంటున్నాడు. నిజానికి వీరు అనుసరించేవన్నీ చాలా చిన్న చిన్న ఆరోగ్య నియమాలే. అయితే వాటినే మనం ఫాలో కాము అసలు. ఇక్కడే వచ్చింది అసలు తేడా. -
పిల్లలను ఏ వయసులో కంటే మంచిది?!
ఏ వయసుకు ఆ ముచ్చట అంటుంటారు పెద్దలు. పెళ్లి, పిల్లల విషయంలోనే ఈ ప్రస్తావనను తీసుకు వస్తుంటారు. కానీ, మారిన రోజులు స్త్రీని తన కెరీర్ వైపు మొగ్గు చూపేలా చేస్తున్నాయి. ఉన్నత చదువులు, ఉద్యోగం, ఆర్థిక స్థిరత్వం, సరైన భాగస్వామి.. ఈ ఎంపికలతో పెళ్లి, పిల్లలను కనడం సాధారణంగానే ఆలస్యం అవుతోంది. ఇవి అమ్మాయిల ఆరోగ్యరీత్యా, సామాజిక రీత్యా ఇబ్బందులకు లోనయ్యే అంశం అని సర్వత్రా వినిపిస్తున్న మాటలు. ఇటీవల ఐఐటి హైదరాబాద్ విద్యార్థులతో ముచ్చటించిన ఉ΄ాసన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.‘పెళ్లి చేసుకుంటున్నారా...?!’ అని అడిగిన ప్రశ్నకు అమ్మాయిల కంటే అబ్బాయిలే ఎక్కువగా చేతులు పైకెత్తారని, మహిళలు కెరీర్ను నిర్మించుకోవడంపై దృష్టి పెట్టారని దీనిని బట్టి అర్ధమైంది. ఇది సరికొత్త భారత్’ అని పోస్ట్లో ఉ΄ాసన పేర్కొన్నారు. అమ్మాయిలు తమ అండాలను మెడికల్ పద్ధతిలో ఫ్రీజ్ చేసుకోవచ్చని, ఆర్థికంగా స్థిరపడిన తర్వాతే పెళ్లి చేసుకోవడం మంచిదని తన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. దీనిపై ఎంతోమంది నెటిజన్లు తమ భిన్నాభి్ర΄ాయాలను వెలిబుచ్చారు. దీనిపై ఉపాసన రియాక్ట్ అవుతూ మరో పోస్టు పెట్టారు. ‘నా దృష్టిలో పెళ్లి, కెరీర్ ఒకదానితో మరొకటి పోటీ కాదు. కానీ, ప్రతిదానికీ ప్రత్యేక సమయం ఉంటుందని భావిస్తున్నా. సరైన భాగస్వామి ఎదురయ్యే వరకు అమ్మాయి వేచి చూడటం తప్పా? పిల్లలకు ఎప్పుడు జన్మనివ్వాలన్నది పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవడం తప్పా ?’ అంటూ కొన్ని ప్రశ్నలు సంధించారు. ఈ సందర్భంగా ఏ వయసులో పిల్లలకు జన్మనివ్వడం మంచిది, దీనిపైన నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం.. – నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధిఒక అవకాశం మాత్రమే! దేనికుండే అవకాశాలు దానికి ఉన్నాయి. 30 ఏళ్లు దాటక ముందే పిల్లలను కనడం మంచిదే. 35 ఏళ్ల తర్వాత అంటే కష్టం. ఈ వయసులో అండాల విడుదల వేగం తగ్గిపోతుంటుంది. ప్రీ మెనోపాజ్ సమస్యలు తలెత్తుతుంటాయి. కెరీర్ను దృష్టిలో పెట్టుకొని... పెళ్లి, పిల్లల సంగతి తర్వాత చూద్దాం అనుకున్న అమ్మాయిలు వయసులో ఉన్నప్పుడే ఎగ్ ఫ్రీజ్ చేసుకోవచ్చు. క్యాన్సర్ వంటి ఆరోగ్య సమస్యలకు చికిత్సలు తీసుకుంటున్నవారూ ఈ పద్ధతిని అనుసరించవచ్చు. అందరూ చేయించుకోవాలనేం లేదు. అండాన్ని నిల్వ చేయడానికి ముందు చేసే మెడికల్ ప్రాసీజర్ కాస్ట్, ఎగ్ ఫ్రీజింగ్కి ఫీజు చెల్లించి, ప్రతియేడూ రెన్యువల్ చేసుకోవచ్చు. అయితే, ఇది ఒక ఆప్షన్ మాత్రమే. బయలాజికల్గా పిల్లలను కనడమే సరైన పద్ధతి. ఏదైనా సమస్యను అధిగమించేంతవరకే ఆలోచించాలి. కొంతమంది అమ్మాయిలు పై చదువులకు, ఉద్యోగాలకు విదేశాలకు వెళ్లాలి అనే ఆలోచనలో ఉంటారు. ఇలాంటప్పుడు పెళ్లి, పిల్లలను కనడంలో ఆలస్యం అవుతుంటుంది. తమ లక్ష్యంపై ఫోకస్ చేసుకోవడానికి ఎగ్ ఫ్రీజ్ చేసుకోవడంలో తప్పేమీ లేదు. కానీ, ఎక్కువ సమయం తీసుకోకూడదు. ఎందుకంటే ఫ్రీజింగ్ టెక్నాలజీ ఉన్నప్పటికీ సక్సెస్ రేట్ వంద శాతం ఎప్పుడూ ఉండదు. వందమందికి ఐవిఎఫ్ చేస్తే పది శాతం సక్సెస్ కావచ్చు. ప్రభుత్వ రూల్స్ ప్రకారం అమ్మాయిలు 21 ఏళ్ల నుంచి ఎగ్ ఫ్రీజ్ చేసుకోవచ్చు. 35 ఏళ్ల తర్వాత ఎగ్ ఫ్రీజింగ్ అంటే దాని సక్సెస్ రేట్ ఊహించలేం. విదేశాలలో కొన్ని ఆఫీసులలో తమ మహిళా సిబ్బందికి కంపెనీలే ఎగ్ ఫ్రీజింగ్ వెసులుబాటు కల్పిస్తున్నాయి. దీర్ఘకాలం కాకుండా నిర్ణీత సమయంలో తమ లక్ష్యాన్ని పూర్తి చేసుకోవాలనేవారికి ఇదొక అవకాశం మాత్రమే. – డాక్టర్ సుధారాణి బైర్రాజు, ఇన్ఫెర్టిలిటీ (ఐవిఎఫ్) స్పెషలిస్ట్, -
బ్యాక్టీరియా ఫ్యాక్టరీతో అంతా క్లీన్!
మీకు తెలుసా? తాగే నీరు స్వచ్ఛంగా ఉంటే చాలా రోగాలు మీ దగ్గరకు రావని? దురదృష్టం ఏమిటంటే.. దేశం ఎంతో పురోగమించింది కానీ.. ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణలతోపాటు పలు రాష్ట్రాల్లో కలుషితమైన నీరు ప్రజల ఆరోగ్యాన్ని దారుణంగా దెబ్బతీస్తోంది. మరీ ముఖ్యంగా సీసం (లెడ్). హైదరాబాద్, విశాఖపట్నాల్లో పారిశ్రామిక వ్యర్థాలను యథేచ్ఛగా కాలువల్లోకి కలిపేస్తూండటంతో తాగునీటిలో సీసం మొతాదు పెరిగిపోతోంది. ఫలితంగా పిల్లల్లో నాడీ సంబంధిత, ఎదుగుదల సమస్యలు, పెద్దల్లో గుండె, కిడ్నీ సమస్యలు వస్తున్నాయి. వ్యవసాయంలో వాడే రసాయనిక ఎరువులు నీటిలో కలిసినప్పుడు కూడా లెడ్ మోతాదు ఎక్కువైపోతుంది. యునిసెఫ్ అంచనా ప్రకారం ప్రపంచం మొత్తమ్మీద 80 కోట్ల మంది, భారత్లో సుమారు 27 కోట్ల మంది పిల్లలు లెడ్తో కలుషితమైన నీటి కారణంగా ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. అయితే... గౌహతిలోని ఐఐటీ శాస్త్రవేత్తలు ఇప్పుడు దీనికో వినూత్నమైన పరిష్కారం కనుక్కున్నారు. అది కూడా అతి తక్కువ ఖర్చుతో. వివరాలు ఇలా ఉన్నాయి....బ్యాక్టీరియా. పేరు చెప్పగానే వ్యాధులే గుర్తుకొస్తాయి కానీ కొన్ని బ్యాక్టీరియా మనకు ఎంతో మేలూ చేస్తాయి. గౌహతిలోని ఐఐటీ శాస్త్రవేత్తలు కూడా సీసం కాలుష్యాన్ని తొలగించేందుకు బ్యాక్టీరియా ఏదైనా ఉపయోగపడుతుందా? అని పరిశోధించినప్పుడు వారికి ఓ అద్భుతం కనిపించింది. సయనో బ్యాక్టీరియాలోని ఒకానొక రసాయనానికి నీటిలోని లెడ్ను 92.5 శాతం వరకూ తొలగించగలదని తెలిసింది. ఇది పేరుకు బ్యాక్టీరియా కానీ.... చెట్ల మాదిరి సూర్యుడి వెలుతురును వాడుకుని శక్తిని తయారు చేసుకోగలదు. ఇంకేముంది. ఈ బ్యాక్టీరియా సాయంతో శాస్త్రవేత్తలు నీటిని సీసం నుంచి శుద్ధి చేసేందుకు ఒక పద్ధతిని అభివృద్ధి చేశారు. ఈ పరిశోధన వివరాలు ప్రఖ్యాత ‘జర్నల్ ఆఫ్ హజార్డస్ మెటీరియల్స్’లో ప్రచురితమైంది. లెడ్ ఒకసారి నీటిలో కలిసిందంటే కొన్ని దశాబ్దాలపాటు అక్కడే ఉండిపోతుంది. ఈ నీరు తాగిన వారి శరీరాల్లో పోగుబడుతూ ఉంటుంది. ఇప్పటివరకూ ఈ కాలుష్యాన్ని తొలగించేందుకు రసాయనాలు లేదంటే కృత్రిమ పదార్థాలను ఉపయోగిస్తున్నారు. రెండూ ఖరీదెక్కువ. పైగా వీటి తయారీతోనూ కాలుష్యం ఎక్కువ అవుతుంది. ఈ నేపథ్యంలో గౌహతిలోని ఐఐటీ శాస్త్రవేత్తలు సహజ పద్ధతుల ద్వారా నీటిలోని లెడ్ను తొలగించే ప్రయత్నాలు ప్రారంభించారు. నేలలో సహజసిద్ధంగా ఉండే సయనో బ్యాక్టీరియా రకాలను వెతికి లెడ్కు అతుక్కుపోయే ఒక జాతిని గుర్తించారు. ‘ఫోమ్మిడియం కోరియం, ఎన్ఆర్ఎంసీ-50 అని పిలిచే ఈ జాతి బ్యాక్టీరియాను క్షుణ్ణంగా అధ్యయనం చేసినప్పుడు దీని సామర్థ్యం గురించి తెలిసిందని ఈ పరిశోధనలకు నేతృత్వం వహించిన బయోసైన్సెస్ అండ్ బయో ఇంజినీరింగ్ విభాగపు శాస్త్రవేత్త దెబాశీష్ దాస్ తెలిపారు. ఫ్యాక్టరీల్లాంటివి ఏవీ కట్టే అవసరం లేకుండా.. అతితక్కువ ఖర్చుతో ఈ బ్యాక్టీరియా నీటిని శుద్ధి చేస్తుందని తెలిపారు. ప్రస్తుతం ఉపయోగిస్తున్న పద్ధతులతో పోలిస్తే సగం ఖర్చుతోనే పని పూర్తిచేయవచ్చునన్నారు. మున్సిపాలిటీ, కార్పొరేషన్లు ఈ పద్ధతిని వాడుకోవడం ద్వారా పారిశ్రామిక ప్రాంతాల నుంచి వెలువడే లెడ్ వ్యర్థాలను నియంత్రించవచ్చునని తెలిపారు. ఎన్నో ప్రయోజనాలు..సయనో బ్యాక్టీరియా ద్వారా నీటిలో కలిసిన లెడ్ మాత్రమే కాకుండా.. క్రిమి సంహారకాలు, కలుపు నాశినిలు, పెట్రోలు, డీజిల్ వంటి హైడ్రోకార్బన్లు, కృత్రిమ రంగులను కూడా తొలగించవచ్చునని గౌహతి ఐఐటీ శాస్త్రవేత్తలు తెలిపారు. అంతేకాకుండా... బ్యాక్టీరియా తొలగించిన రసాయనాలను వేరు చేసి మళ్లీ వాడుకునేందుకూ అవకాశం ఉందని చెప్పారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉపయోగిస్తున్న రసాయనాల స్థానంలో వీటిని వాడటం వల్ల పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతుంది. ప్రస్తుతం తాము ఈ ప్రయోగాలను చిన్న స్థాయిలో జరిపామని, పెద్ద ఎత్తున జరిపేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశామని వివరించారు. -
జరగబోయేవన్నీ చెప్పగలనంటాడు!
నమస్తే డాక్టర్ గారు! నాకు 3 నెలల క్రితమే వివాహం అయింది. నా భర్త ఒక ప్రైవేట్ కంపెనీలో పని చేస్తాడు. ఆయన ప్రవర్తన, మాటలు చాలా విచిత్రంగా ఉంటాయి. ఎవరితోనూ పెద్దగా మాట్లాడడు. ఎప్పుడూ తన ఆలోచనల్లోనే మునిగిపోయి ఉంటాడు. ఎవరినీ నమ్మకూడదు అంటాడు. బయటకు వెళ్ళడానికి ఇష్టపడడు, ఇంట్లో కూడా వింతగా మాట్లాడుతుంటాడు. మొక్కలు, జంతువులు, పక్షుల భాషలు తనకు తెలుసని వాటితో ఏవేవో శబ్దాలతో మాట్లాడుతుంటాడు. ఇంటికి ఎవరైనా వస్తే వారి మొహం చూసి, కళ్ళు మూసుకొని, మీకిలా జరుగుతుంది అని అందరికీ భవిష్యత్తు గురించి చెబుతున్నాడు. నన్ను బాగానే చూసుకుంటాడు. డాక్టర్ దగ్గరికి వెళదామంటే ‘నీకేమైనా పిచ్చా’ అని అందరినీ దబాయిస్తున్నాడు. మాకేం చేయాలో అర్థం కావడం లేదు. మీరే ఏదైనా మంచి సలహా ఇస్తారని ఆశిస్తున్నాను! మీరు వివరించిన లక్షణాల ప్రకారం మీ భర్తకు కనిపిస్తున్న ప్రవర్తన ‘స్కిజో టైపల్ పర్సనాలిటీ డిజార్డర్ ‘ అనే ఒక మానసిక భ్రాంతికి దగ్గరగా ఉంది. ఈ సమస్యతో బాధపడే వ్యక్తుల ఆలోచనలు, నమ్మకాలు, ప్రవర్తన ఇతరులకు చాలా విచిత్రంగా, అసాధారణంగా కనిపిస్తాయి. ఉదాహరణకు, విపరీతమైన మూఢనమ్మకాలు, వాళ్ళకి ప్రత్యేక శక్తులు ఉన్నాయనుకోవడం, అందరిపై అనుమానం, మీరు చెప్పినట్లు, జంతువులు, మొక్కలతో మాట్లాడటం లాంటివి చేస్తుంటారు. మిగిలిన వారికి సాధారణంగా అనిపించే విషయాలలో కూడా వీళ్ళు నిగూఢ అర్థాలు వెతుకుతారు. వీరు ప్రపంచాన్ని చూసే విధానమే వేరుగా ఉంటుంది. ఎక్కువగా ఊహా ప్రపంచంలో బ్రతుకుతారు. అయితే వీరు తమ పనిని చేసుకోగలరు. లిమిటెడ్గా కుటుంబం వరకు బాగానే ఉన్నా బయట సామాజిక సంబంధాలు మాత్రం కలిగి ఉండలేరు. తమకి ఉన్నది ఒక సమస్య అని వారు గుర్తించలేరు. ఇది స్కిజోఫ్రీనియా అనే తీవ్రమైన మానసిక జబ్బు కాదు, కానీ దాని తేలికపాటి రూపం ఇది అని చెప్పవచ్చు. అనేక పరిశోధనల ప్రకారం స్కిజోఫ్రీనియా ఉన్న వారి కుటుంబ సభ్యులలో ఈ సమస్య ఎక్కువగా కనపడినట్లు నిరూపణలు ఉన్నాయి. కొన్నిసార్లు ఈ సమస్య తరువాతి కాలంలో పూర్తిస్థాయి ‘స్కిజోఫ్రేనియా’ లేదా ‘ఓసీడీ’ జబ్బు లాగా రూపాంతరం చెందవచ్చు కూడా. ఇదొక అరుదైన సమస్య కాబట్టి పూర్తిగా మార్చడం కూడా కష్టం, అయినా, సహనంతో, ప్రేమతో, మానసిక నిపుణుల సహాయంతో అతని ప్రవర్తనను చాలా వరకు మెరుగు పరచవచ్చు. మీరు మీకు దగ్గర్లో ఉన్న సైకియాట్రిస్ట్ని సంప్రదించండి. కొన్ని లక్షణాలు మందులతో తగ్గించవచ్చు, అతని ఆలోచనలు మార్చడం కోసం, సామాజిక వైపుణ్యాల అభివృద్ధి కోసం ‘సైకో థెరపీ’ చాలావరకు ఉపయోగపడుతుంది. అన్నింటికీ మించి కుటుంబ సభ్యులు అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం.డా. ఇండ్ల విశాల్ రెడ్డి, సీనియర్ సైకియాట్రిస్ట్(విజయవాడ. మీ సమస్యలు, సందేహాలు పంపవలసిన మెయిల్ ఐడీ: sakshifamily3@gmail.com)(చదవండి: PM Narendra Modi's Watch: రూపాయి నాణెంతో కూడిన ప్రధాని మోదీ వాచ్..! ధర ఎంత ఉంటుందంటే..) -
చలికాలం మూడ్ భద్రం
చలికాలం పని చేయబుద్ధి కాదు. హుషారుగా అనిపించదు. అదో వెలితిగా అనిపించే భావన. నిరాశ. ఆకలి లేకపోవడం. ఎండ, వెలుతురు లేక చిరాకు. ఇదంతా ఏదో మామూలు విషయం కాదని ‘సీజనల్ ఎఫెక్టివ్ డిజార్డర్’ (శాడ్) అనే ఒక విధమైన డిప్రెషన్ అని మనస్తత్వ నిపుణులు హెచ్చరిస్తున్నారు. చలికాలం వస్తే మూడ్ను చెక్ చేసుకుంటూ జాగ్రత్తలు తీసుకోడవం చాలా అవసరం అంటున్నారు. అసలు ఈ ‘శాడ్’ ఏమిటి?ఉదయాన్నే సూర్యుడి ముఖం చూసి పనిలో పడితే అదోతృప్తి. సూర్యకిరణాలు ఒంటిని తాకితే లోలోపల ఉత్తేజం. కాసింత ఎండ పొడ తగిలితే మనసంతా ఉత్సాహం. కాని చలికాలంలో వణికించే చలి ఆ అవకాశాన్ని అరుదుగా ఇస్తుంది. పొద్దున లేవగానే మంచు స్వాగతం పలుకుతుంది. రోజంతా పలుచటి వెలుతురు తప్ప సూర్యుడు అందించే ఉత్తేజం మనకు చేరదు. దాంతో ఒళ్లంతా బద్దకంగా, మనసంతా గజిబిజిగా అనిపిస్తుంది. ఇలాంటి స్థితిని ‘వింటర్ బ్లూస్’ అంటుంటారు. ఇంత వరకూ మామూలే. కాని కొందరికి ఈ సమయం చాలా నిరాశ, నిర్లిప్తతలు ఆవరిస్తాయి. ఏదో కోల్పోయినట్టు, అంతా ముగిసిపోయినట్టు అనిపిస్తుంది. కొందరికి ఆకలి మందగిస్తుంది. తెలియని డిప్రెషన్ కి కొందరు లోనవుతారు. దీన్నే ‘సీజనల్ ఎఫెక్టివ్ డిజార్డర్’ (శాడ్) అంటున్నారు వైద్యులు. ఇలాంటి పరిస్థితిని గమనించుకుంటూ ఉండాలని హెచ్చరిస్తున్నారు.ఎండకు– మెదడుకు...చలికాలం తొందరగా నిద్ర లేవాలనిపించదు. చలిలో లేచి ఏదైనా చేయాలనిపించదు. ఎనిమిది గంటలు దాటితే తప్ప సూర్యుడు తేటగా కనిపించడు. కాసింత వేడి ఒంటికి తగిలాక కొంచెం ఉత్సాహం వచ్చి పనులు మొదలుపెడతారు చాలామంది. ఇదంతా ఎందుకు? వాతావరణానికీ, మన మనసుకు మధ్య ఉండే సంబంధమే ఇందుకు కారణం అంటున్నారు మానసిక శాస్త్ర నిపుణులు. ‘సూర్యుడి వెలుగు కారణంగా మెదడులో కొన్ని రసాయనాలు విడుదలవుతాయి. అవి మనలో ఉత్సాహాన్ని నింపుతాయి. చలికాలంలో ఆ చర్యలు జరగకపోవడం వల్ల నిస్సారంగా, బద్దకంగా అనిపిస్తుంది’ అని వివరిస్తున్నారు.చలికాలమే మేలు అనుకుంటారా?ఎండాకాలం తట్టుకోలేనంత వేడి ఉంటుంది. చలికాలం వస్తే బాగుండని ఆ వేడి తట్టుకోలేక కొందరు అనుకుంటారు. కానీ కొందరికి మాత్రం చలికాలం నచ్చదు. రోజంతా ఉత్సాహం లేని పనులు చేస్తూ, గంటల కొద్దీ ఒకేచోట గడుపుతూ ఉంటారు. ఈ సమయంలో ఒంట్లో సెరటోనిన్, మెలటోనిన్ రసాయనాలు విడుదల కాకపోవడమే ఇందుకు కారణమంటున్నారు వైద్యులు. సూర్యరశ్మి తక్కువగా ఉండటం కూడా దీనికి తోడై డిప్రెషన్ లోకి నెట్టేస్తుందని అంటున్నారు. అందుకే చలికాలం అనగానే కొందరిలో ఆనందం మాయమైపోతుంది. సంతోషం దూరమవుతుంది. ఏ పనీ చేసేందుకు ఆసక్తి రాక మిన్నకుండిపోతుంటారు.దీన్ని గుర్తించేదెలా?‘సీజనల్ ఎఫెక్టివ్ డిజార్డర్’ అందరిలో ఉంటుందని చెప్పలేం. ఒకవేళ ఉన్నా, దాన్ని గుర్తించడం కష్టం. అత్యల్ప ఉష్ణోగ్రతలు కలిగిన దేశాల్లో చాలామంది దీని బారిన పడుతున్నారు. ఇటువంటి వారు తొందరగా డిప్రెషన్ లోకి వెళ్లిపోతున్నారు. తమకున్నది ‘సీజనల్ ఎఫెక్టివ్ డిజార్డర్’ అన్న విషయం కూడా వారికి తెలియడం లేదు. కొందరు ఈ డిప్రెషన్ నుంచి బయటపడేందుకు అధికంగా తినడం, దురలవాట్లకు లోనవడం వంటివి చేస్తున్నారు. దీంతో ఆ ప్రభావం అంతా వారి ఆరోగ్యం మీద పడి తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారు.శాడ్ లక్షణాలు...→ రోజువారి పనుల్లో ఆసక్తి కోల్పోవడం → నిరాశ ∙ఏకాగ్రత కోల్పోవడం→ ఒంటరితనం, ఏకాంతం ఇష్టపడటం→ నిద్రలేమి, అలసట (లేదా) అధిక నిద్ర, అధిక తిండి → నలుగురిలో కలవకపోవడంఏమిటి పరిష్కారం?→ చలికాలంలో రోజూ పొద్దున్నే లేచి వ్యాయామం, యోగా చేయడం ఉత్తమమైన మార్గం. దీని వల్ల శరీరానికి ఉల్లాసంగా అనిపించడంతోపాటు మానసికంగా ఏదో ఒక పని చేయాలన్న సంసిద్ధత ఏర్పడుతుంది.→ ఎక్కువసేపు ఒకే చోట కూర్చుని పనిచేయకుండా రకరకాల పనులపై దృష్టి నిలపడం మరో పరిష్కారం. → డిప్రెషన్ భావన వచ్చినప్పుడు ఆత్మీయులతో మాట్లాడటం, సంగీతం వినడం, డ్యాన్స్ చేయడం వంటివి మనసును తేలికపరుస్తాయని అంటున్నారు. → చలికాలాన్ని ప్రకృతి సహజమైన విషయంగా భావించి, మనసు దృఢ పరుచుకుంటే మానసికంగా బలవంతులు అవుతారని వైద్యులు సూచిస్తున్నారు. -
జస్ట్ నాలుగు నెలల్లో..24 కిలోల బరువు..! ఈ సింపుల్ డైట్ ప్లాన్తో..
వెయిట్లాస్ జర్నీలో కొందరు అద్భుతాలు సృష్టిస్తుంటారు. ఎంతలా అంటే.. ఎలాంటి క్రాష్ డైట్లు పాటించకుండా ఆరోగ్యకరమైన రీతీలో ఏదో మాయ చేసినట్లుగా అమాంతం స్లిమ్గా మారిపోయి అందర్నీ ఆశ్చర్యపరుస్తారు. ఇక్కడ అలానే జాహ్నవి అనే మహిళ ఎంత అద్భుతంగా బరువు తగ్గిందంటే..చాలా తక్కువ సమయంలోనే అధిక బరువుని కోల్పోయింది. అదికూడా ఆరోగ్యకరమైన పద్ధతిలోనే తగ్గడం విశేషం. అదెలాగో ఆమె మాటల్లోనూ సవివరంగా తెలుసుకుందామా..!.జాహ్నవి అనే మహిళ వెయిట్ లాస్ జర్నీలో అందరికీ స్ఫూర్తి అంటూ ఫిట్నెస్ నిపుణుడు మాక్ సింగ్ ఇన్స్టాగ్రామ్లో అందుకు సంబంధించిన వీడియోని షేర్ చేశారు. అంతేగాదు త్వరిగతిన ఫలితాలు పొందాలనుకునేవారికి ఆమె ప్రేరణ అని పోస్ట్లో పేర్కొన్నారు. బరువు తగ్గడం అనేది కాస్త కఠినమైన టాస్క్ అయినా..క్రమశిక్షణ, డెడికేషన్ ఉంటే..ఈజీగా బరువు తగ్గిపోవచ్చట. ముందుగా ఈ వెయిట్లాస్ జర్నీలో ప్రతిఒక్కరికి స్థిరత్వంతో కూడిన అంకితభావం ప్రధానమని..నొక్కి చెబుతోంది జాహ్నవి. తాను 94 కిలోల మేర అధిక బరువు ఉండేదాన్ని..జస్ట్ నాలుగు నెలల్లోనే 24 కిలోలు వరకు తగ్గిపోయానని పేర్కొంది. పైగా తన డైట్ ఎలా ప్లాన్ ఎలా ఉండేదో కూడా వివరించింది. ఉదయం నిద్ర లేచిన వెంటనే ఉసిరి కాయ రసం, ఐదు బాదం పప్పులు, అజ్వైన్(క్యారమ్ గింజలు), దాల్చిన చెక్క నీరు, నానబెట్టిన వాల్నెట్స్, మెంతినీరు తప్పనిసరిగా తీసుకుంటానని అంటోంది. బ్రేక్ఫాస్ట్ రొటీన్ (ఉదయం 8)అల్పాహారం కోసం, జాహ్నవి మిల్లెట్ దోస, చియా సీడ్ స్మూతీ, పెసరపప్పుతో చేసే ఇడ్లీ తింటానంటోంది.మిడ్-మార్నింగ్ రొటీన్ (ఉదయం 11)ఈ సమయంలో, ఫిట్నెస్ ప్రియురాలు సీజనల్ పండ్లు, ఫ్రూట్ స్మూతీ, రాగి (ఫింగర్ మిల్లెట్) మాల్ట్ను ఆశ్రయించింది.లంచ్ రొటీన్ (మధ్యాహ్నం 2)ఆమె లంచ్ మెనూలో బియ్యం, కూరగాయల కూర, పెరుగు, లేదా మిల్లెట్ పులావ్, మిశ్రమ కూరగాయలు, రైతా వంటి సరళమైన వంటకాలు ఉన్నాయి.స్నాక్ రొటీన్ (సాయంత్రం 4)స్నాక్స్ కోసం, జాహ్నవి తనకు తానుగా ఉడికించిన గుడ్డు, భెల్(మరమరాలు), నల్ల చన్నా (సెనగలు) చాట్ తీసుకున్నట్లు తెలిపింది.డిన్నర్ రొటీన్ (రాత్రి 7)ఆమె తన విందును ముందుగానే ముగించేదాన్ని అంటోంది. ఆమె ఆహారంలో కూరగాయలతో ఉడికించిన చికెన్, గుడ్డు ఆమ్లెట్, కూరగాయల కూరతో మిల్లెట్ రోటీ ఉన్నాయి.పడుకునే ముందు (రాత్రి 9)పడుకునే ముందు, జాహ్నవి హెర్బల్ టీ లేదా పుదీనా, కొత్తిమీర నీరు వంటి ఆరోగ్యకరమైన పానీయాలను తీసుకున్నట్లు తెలిపింది. ఇలా కేర్ఫుల్గా తీసుకునే డైట్పై ఫోకస్ పెడితే.. హెల్దీగా బరువు తగ్గడం ఏమంత కష్టం కాదని అంటోంది జాహ్నవి. గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం(చదవండి: అత్యుత్తమ చికెన్ రెసిపీ జాబితాలో బటర్ చికెన్కి చోటు..! ఎన్నో స్థానంలో ఉందంటే..) View this post on Instagram A post shared by Fitelo | Customised Diet Plans (@fitelo_tamil) -
కేన్సర్కు ఆహారం ఆన్సర్..!
ఇంగ్లిష్లోనూ తెలుగులోనూ కామన్గా ఓ సామెత ఉంది. అదే... ప్రివెన్షన్ ఈజ్ బెటర్ ద్యాన్ క్యూర్. అంటే చికిత్స కంటే నివారణ మేలు అని అర్థం. నిజమే... రోజూ ఆహారం తీసుకోక తప్పదు. అదే గనక ఆరోగ్యకరమైనది కావడంతోపాటు కేన్సర్ను నివారించేదైతే... అది కేవలం కేన్సర్నే కాదు... ఎంతో ఆత్మక్షోభనూ, మరెంతో వేదననూ నివారిస్తుంది. అంతేకాదు... భవిష్యత్తులో మందులకు పెట్టే బోలెడంత డబ్బునూ ఆదా చేస్తుంది. అన్నిటికంటే ముందుగా శారీరక బాధల నివారణతోపాటు మానసికమైన శాంతినీకాపాడుతుంది. అందుకే రోజూ ఎలాగూ తినే అవే ఆకుకూరలనూ, కాయగూరలనూ, పండ్లనూ మార్చి మార్చి తింటూ ఉంటే పై ప్రయోజనాలన్నీ కలుగుతాయి. ఏయే ఆహారపదార్థాలు ఏయే కేన్సర్లను నివారిస్తాయో, అలా నివారించడానికి వాటిల్లోని ఏ పోషకాలు తోడ్పడతాయో తెలుసుకుందాం. ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. తద్వారా కేన్సర్ను నివారించుకుందాం...పండ్లు... ఆకుకూరలు... ఆహారపదార్థాలు... ఇలా మనం రోజూ తినే పదార్థాలతోనే కేన్సర్లను నివారించుకోవడం సాధ్యమనే అనడం కాకుండా వాటిల్లోని ఏయే పోషక విలువలు అలా జరిగిందేందుకు దోహదపడతాయో తెలుపుతున్నారు కేన్సర్పై పరిశోధనలు సాగిస్తున్న శాస్త్రవేత్తలూ, ఆహారనిపుణులు. పైగా ఏయే ఆహారపదార్థాల్లోని ఏ నిర్దిష్టమైన పోషకం కేన్సర్ను ఎలా నివారిస్తుందో తెలుసుకునేందుకు యూకేకు చెందిన ‘వరల్డ్ క్యాన్సర్ రీసెర్చ్ ఫండ్’ ఆధ్వర్యంలో ఎప్పటికప్పుడు పరిశోధనలు కొనసాగుతున్నాయి. ఆ అధ్యయనాల ద్వారా కేవలం ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలు తినడం ద్వారానే చాలా సులువుగా కేన్సర్ను ఎలా నివారించగలమో తెలుసుకుందాం.పెదవులు, నోరు, ఫ్యారింగ్స్ కేన్సర్ నివారణకు... బాగా ముదురురంగులో ఉండే అన్ని రకాల పండ్లతోపాటు బాగా ముదురు ఆకుపచ్చరంగులో ఉండే ఆకుకూరలు పెదవులు, నోరు, ఫ్యారింగ్ కేన్సర్లను నివారిస్తాయి. అంతేకాదు... విటమిన్ ఏ ఎక్కువగా ఉండే పండ్లు కూడా నోరు, ఫ్యారింగ్స్ కేన్సర్లను నివారిస్తాయి. ఉదాహరణకు విటమిన్–ఏ ఎక్కువగా ఉండే బొప్పాయి, క్యారట్, మామిడి వంటి తాజా పండ్లు నోరు, ఫ్యారింగ్స్, క్యాన్సర్లను నివారణకు తోడ్పడతాయి. టొమాటోలోని లైకోపిన్ కూడా ఈ తరహా క్యాన్సర్ల నివారణకు ఉపయోగపడుతుంది. అంతేకాదు... ఈ లైకోపిన్తో మరో ఉపయోగం కూడా ఉంది. ఇందులో యాంటీ క్యాన్సర్ గుణాలతోపాటు గుండెజబ్బులను నివారించే గుణం కూడా ఉంది.కంటి కేన్సర్ నివారణకు... ఒమెగా 3–ఫ్యాటీ ఆసిడ్స్ ఎక్కువగా ఉండే సాల్మన్ చేపలు, వాల్నట్లతోపాటు గ్రీన్–టీ, బెర్రీ పండ్లు, పసుపు, విటమిన్–ఇ, విటమిన్–సి, విటమిన్–ఏ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలతో కంటి కేన్సర్లను సమర్థంగా నివారించవచ్చు. సెలీనియమ్, పీచుపదార్థాలు ఫైటోకెమికల్స్ ఎక్కువగా ఉండే బ్రెజిల్–నట్స్ కూడా కంటి క్యాన్సర్ నివారణకు తోడ్పతాయి.రొమ్ము కేన్సర్ నివారణకు... దానిమ్మ పండులోని ఎలాజిక్ యాసిడ్ అనే పోషకంలోని పాలీఫినాల్స్ రొమ్ముక్యాన్సర్ను సమర్థంగా నివారిస్తాయి. అలాగే కెరొటినాయిడ్ అనే పోషకం ఎక్కువగా ఉండే పాలకూర, క్యారట్, బ్రాకలీలు కూడా రొమ్ముక్యాన్సర్ నివారణకు గణనీయంగా తోడ్పడతాయి. ప్రైమరీ యాంటీ ఆక్సిడెంట్ ఎక్కువగా ఉండే గ్రీన్–టీ కూడా రొమ్ము క్యాన్సర్ నివారణకు చాలావరకు తోడ్పడుతుంది.గాల్బ్లాడర్ కేన్సర్ నివారణకు... ఊబకాయం / స్థూలకాయం రాకుండా ఆరోగ్యకరమైన పరిమితిలో బరువును నియంత్రించుకోవడమన్నది గాల్బ్లాడర్ క్యాన్సర్ నివారణకు బాగా తోడ్పడే అంశం. ఇలా బరువును నియంత్రించుకోవడం అన్నది కేవలం ఒక్క గాల్బ్లాడర్ కేన్సర్ నివారణకు మాత్రమే కాకుండా పెద్దపేగు, ప్రోస్టేట్, ఎండోమెట్రియమ్, మూత్రపిండాలు, రొమ్ము కేన్సర్ల నివారణకూ తోడ్పడుతుంది. ఇందుకోసం ఆరోగ్యకరంగా ఉండే కొవ్వులు తక్కువగా తీసుకుంటూ ఆకుకూరలు మాత్రం ఎక్కువ మోతాదులో తీసుకుంటూ ఉండాలి.మూత్రాశయ (బ్లాడర్) కేన్సర్ల నివారణకు... క్రూసిఫెరస్ వెజిటబుల్స్ జాతిగా పేరుపడ్డ క్యాబేజీ, బ్రాకలీ వంటి ఆహారాలతో మూత్రాశయ (బ్లాడర్) క్యాన్సర్ను సమర్థంగా నివారించవచ్చు. యూనివర్సిటీ ఆఫ్ టెక్సస్లోని యాండర్సన్ కేన్సర్ సెంటర్లో తేలిన అంశాలను బట్టి విటమిన్–ఇ లోని ఆల్ఫా టోకోఫెరాల్ అనే జీవరసాయనం బ్లాడర్ కేన్సర్ నివారణకు బాగా ఉపయోగపడుతుంది. పాలకూర, బాదాంలతోపాటు పొద్దుతిరుగుడునూనె, కుసుమ నూనెలోనూ విటమిన్–ఇ మోతాదులు ఎక్కువ. ఇక మిరియాలలో ఉండే పోషకాలు కూడా బ్లాడర్ క్యాన్సర్ నివారణకు ఉపయోగపడతాయి. మూత్రపిండాల (కిడ్నీ) కేన్సర్ నివారణకు... నారింజ రంగులో ఉండే కూరగాయలు (ఉదాహరణ క్యారట్)తో పాటు టొమాటో, అల్లం, ఆప్రికాట్ వంటివి... మూత్రపిండాల (కిడ్నీ) క్యాన్సర్ నివారణకు బాగా తోడ్పడతాయి. కిడ్నీల ఇన్ఫ్లమేషన్ను బెర్రీ పండ్లు గణనీయంగా తగ్గిస్తాయి. ఫలితంగా కిడ్నీ జబ్బుల ముప్పు కూడా బాగా తగ్గిపోతుంది. ఇక పొట్టు తీయని ధాన్యాలు, నట్స్, బఠాణీ, చిక్కుళ్ల వంటి ఫైటేట్ అనే పోషకం ఉన్న ఆహారాలు మూత్రపిండాల క్యాన్సర్ నివారణకు సమర్థంగా తోడ్పడతాయి.గర్భాశయ ముఖద్వార (సర్విక్స్) కేన్సర్ నివారణకు... ఆహారంలో విటమిన్–ఇ, విటమిన్–సి ఎక్కువగా ఉండేలా చూసుకోవడం అని చర్య సర్విక్స్ క్యాన్సర్ నివారణకు బాగా ఉపకరిస్తుంది. ఉదాహరణకు క్యారట్, చిలగడదుంప, గుమ్మడి వంటి ఆహారాలతో దీన్ని చాలాబాగా నివారించవచ్చు. ఎలాజిక్ ఆసిడ్స్ అనేవి క్యాన్సర్ పెరుగుదలను అరికడతాయి. ఈ పోషకం స్ట్రాబెర్రీ, రాస్ప్బెర్రీ, వాల్నట్, దానిమ్మ, ద్రాక్ష, ఆపిల్, కివీ పండ్లలో పుష్కలంగా ఉంటుంది కాబట్టి వాటిని తీసుకోవడం ద్వారా గర్భాశయ ముఖద్వారా (సర్విక్స్) కేన్సర్ను సమర్థంగా నివారించవచ్చు. అయితే ఇక్కడ ఓ చిన్న జాగ్రత్త పాటించడం మేలు చేస్తుంది. అదేమిటంటే... చక్కెర మోతాదులు తక్కువగా ఉండే (లో–గ్లైసీమిక్) పండ్లైన దానిమ్మ, ఆపిల్ వంటి పండ్లతో ఈ క్యాన్సర్ నివారణ మరింత తేలిక.తల, మెడ (హెడ్ అండ్ నెక్) క్యాన్సర్ల నివారణకు... పసుపు, నారింజ, ఎరుపు, ఆకుపచ్చ, తెల్లటి తొక్క కలిగి ఉండే పండ్లు తల, మెడ క్యాన్సర్లను నివారిస్తాయి. ఇందులో ఉండే ఫైటో కెమికల్స్ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ల నివారణకు తోడ్పడతాయి. అలాగే ఈ పండ్లలోనే మెరుపు కలిగి ఉండే (కొద్దిపాటి మెరుపుతో బ్రైట్గా ఉండే) తొక్కతో ఉండే పండ్లు ఈ హెడ్ అండ్ నెక్ కేన్సర్లను మరింత సమర్థంగా నివారిస్తాయి. ఉదాహరణకు... నారింజ, కివీ, జామ, పైనాపిల్ పండ్లు తల, మెడ క్యాన్సర్లను నివారణకు సమర్థంగా తోడ్పడతాయి.బ్రెయిన్ కేన్సర్ కణుతుల నివారణకు... ఉల్లి, వెల్లుల్లి జాతికి చెందిన రెబ్బలలో మెదడు (బ్రెయిన్) కేన్సర్ను నివారించే గుణం ఎక్కువ. (అన్నట్టు వీటిలోని యాంటీ క్యాన్సర్ ΄ోషకాలు కేవలం బ్రెయిన్ కేన్సర్నే కాదు... ఇతరత్రా చాలా రకాల క్యాన్సర్ల నివారణకూ ఉపయోగపడతాయి). ఇక ఒమెగా 3–ఫ్యాటీ ఆసిడ్స్ ఎక్కువగా ఉండే వాల్నట్, లిన్సీడ్ ఆయిల్తో మెదడు కేన్సర్లు తేలిగ్గా, సమర్థంగా నివారితమవుతాయి. ఇవి కేన్సర్ నివారణతోపాటు వ్యక్తుల్లో వ్యాధి నివారణ వ్యవస్థను (ఇమ్యూనిటీని) పటిష్టం చేసేందుకూ ఉపయోడపడతాయి.ఒవేరియన్ కేన్సర్ నివారణకు... క్యారట్ల వంటి వాటితో పాటు పసుపురంగూ, నారింజరంగుల్లో ఉండే వెజిటబుల్స్తో (ఉదాహరణకు బెల్పెప్పర్ వంటివాటితో) ఒవేరియన్ క్యాన్సర్ను సమర్థంగా నివారించవచ్చు. కెరటినాయిడ్స్ ఎక్కువగా ఉండే క్యారట్ వంటివి రోజూ అరకప్పు మోతాదులో రెండు సార్లు తీసుకోవడం వల్ల ఒవేరియన్ క్యాన్సర్ను సమర్థంగా నివారించవచ్చని అమెరికన్ కేన్సర్ సొసైటీ వంటి ప్రజోపయోగ, పరిశోధనల సంస్థల అధ్యయానాల్లో తేలింది.జీర్ణాశయ (స్టమక్) క్యాన్సర్ నివారణకు... జీర్ణాశయ (స్టమక్) కేన్సర్ నివారణకు కాప్సికమ్ (కూరగా వండటానికి ఉపయోగించే బెంగళూరు మిరప లేదా బెల్పెప్పర్)లో ఉండే ఫైటోకెమికల్స్ బాగా ఉపయోగపడతాయి. పరిమితంగా తీసుకునే మిరపకాయలు ’ మిర్చీ వంటి వాటితోపాటు మిరియాల పరిమిత వాడకం కూడా స్టమక్ క్యాన్సర్ను నివారిస్తాయి. ఆకుకూరలు, పొట్టుతో ఉండే ధాన్యాలు, తాజా పండ్లు అనేక కేన్సర్ల నివారణతో పాటు జీర్ణాశయ కేన్సర్ రిస్క్ను తగ్గిస్తాయి. జీర్ణాశయ క్యాన్సర్ నివారణకు ఉప్పు వాడకాన్ని గణనీయంగా తగ్గించడమూ అవసరమే.కాలేయ కేన్సర్ నివారణకు... పాలీఫీనాల్, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండే బ్లూబెర్రీ పండ్లు, విటమిన్–ఇ పుష్కలంగా ఉండే బెల్పెప్పర్, పాలకూర, బాదం వంటి ఆహార పదార్థాలు కాలేయ క్యాన్సర్ నివారణకు తోడ్పడతాయి. ఇక నూనెల్లో పొద్దుతిరుగుడు నూనె, కుసుమ నూనెలు కూడా కాలేయ కేన్సర్ నివారణకు దోహదపడతాయి. అయితే ఈ నూనెలను పరిమితంగా మాత్రమే తీసుకోవాలని గుర్తుంచుకోవాలి.ఎముక కేన్సర్ నివారణకు... యాంటీ ఆక్సిడెంట్స్ అనే పోషకాలు ఆక్సిడేషన్ ప్రక్రియతో వెలువడే విషయాలను (టాక్సిక్ మెటీరియల్స్ను) విరిచేస్తాయి. ఇలాంటి యాంటీఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండే పండ్లు, ఆకుకూరలు... ఉదాహరణకు బెర్రీలు, చెర్రీలు, టొమాటో, బ్రాకలీ వంటివి ఎముక కేన్సర్ను సమర్థంగా నివారిస్తాయి. అలాగే ఒమెగా 3–ఫ్యాటీ ఆసిడ్స్ అనేక పోషకాలు పుష్కలంగా ఉండే సాల్మన్ చేపలు, వాల్నట్లతోనూ ఎముక క్యాన్సర్లు బాగానే నివారితమవుతాయి. ఇక ప్రోటీన్లు ఎక్కువగా ఉండే మాంసాహారం, చేపలు, గుడ్లతోనూ ఎముక క్యాన్సర్ త్వరితంగా నివారితమవుతుంది.చివరగా... ఆహారం తీసుకోవడం అన్నది మన జీవక్రియల కోసం మనం రోజూ తప్పక చేసే పని అయినందున... ఆ ఆహారాన్నే తాజా ఆకుకూరలు, కూరగాయలు, తాజా పండ్ల రూపంలో మరింత ఆరోగ్యకరంగా తీసుకోవడం వల్ల ఒకే సమయంలో రెండు సౌకర్యాలు సమకూరతాయి. అవి ఆరోగ్యంగా ఉండటం, అలా ఆరోగ్యంగా ఉండటం వల్ల వ్యాధి నిరోధకత మన సొంతం కావడంతో ఈ ఇమ్యూనిటీ కూడా క్యాన్సర్ల నివారణకు తోడ్పడుతుందని గుర్తుంచుకోవాలి. ఇలా తీసుకున్న ఆహారం వల్ల ఒళ్లు పెరగకుండా తగినంత వ్యాయామమూ చేయడం వల్ల ఈ మార్గంలో క్యాన్సర్ నివారణ మరింత సమర్థంగా చేయడం సాధ్యమవుతుంది. డాక్టర్ రాజేష్ బొల్లం, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్నిర్వహణ యాసీన్ -
గర్భిణులకు ఫ్లూ వ్యాక్సిన్ తప్పనిసరా..?
నేను రెండు నెలల గర్భవతిని. కొంతమంది ‘ఫ్లూ వ్యాక్సిన్’ తప్పకుండా వేయించుకోవాలంటున్నారు. కాని, నేను గత సంవత్సరం వేయించుకున్నాను. ఇప్పుడు మళ్లీ అవసరమా? ఈ వ్యాక్సిన్ గర్భధారణలో మంచిదేనా?– రమ్య, చిత్తూరు. గర్భిణులకు ఫ్లూ వ్యాక్సిన్ చాలా అవసరం. గర్భధారణ సమయంలో రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది, అందుకే ఫ్లూ వంటి వైరల్ ఇన్ఫెక్షన్లు గర్భిణులపై ఎక్కువ ప్రభావం చూపుతాయి. ఫ్లూ వల్ల దగ్గు, జలుబు మాత్రమే కాకుండా కొన్నిసార్లు న్యూమోనియా, శ్వాసకోశ ఇన్ఫెక్షన్ వంటి తీవ్రమైన సమస్యలు కూడా రావచ్చు. ఫ్లూ వైరస్ ప్రతి సంవత్సరం మారుతూనే ఉంటుంది. కాబట్టి మీరు గత సంవత్సరం తీసుకున్నా, ఈ ఏడాది కూడా కొత్త స్ట్రెయిన్కి అనుగుణంగా వ్యాక్సిన్ మళ్లీ వేయించుకోవాలి. సాధారణంగా అక్టోబర్ నుంచి మే మధ్యకాలం వరకు ఫ్లూ వైరస్ ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది. అందుకే గర్భిణులు నవంబర్ సమయానికి ఫ్లూ షాట్ తీసుకోవడం మంచిది. ఇది పూర్తిగా సురక్షితమైన వ్యాక్సిన్. మీకు మాత్రమే కాకుండా మీ బిడ్డకూ ఈ వ్యాక్సిన్ రక్షణ కల్పిస్తుంది. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత మీ శరీరంలో ఏర్పడే యాంటీబాడీలు ప్లాసెంటా ద్వారా బిడ్డకు చేరతాయి. ఆ రక్షణ వల్ల పుట్టిన తరువాత కూడా ఆరు నెలల పాటు బిడ్డకు ఫ్లూ ఇన్ఫెక్షన్ నుంచి సహజమైన రక్షణ లభిస్తుంది. ఎందుకంటే ఆ వయసులో పిల్లలకు ఫ్లూ వ్యాక్సిన్ ఇవ్వడం సాధ్యమవదు. ఫ్లూ వ్యాక్సిన్ వల్ల ఫ్లూ రాదు, వైరస్ తీవ్రతను గణనీయంగా తగ్గిస్తుంది. వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత రెండు వారాల లోపే శరీరంలో యాంటీబాడీలు తయారవుతాయి. తేలికపాటి జ్వరం, చేతి నొప్పి, బలహీనత వంటి చిన్న దుష్ప్రభావాలు రావచ్చు కాని, అవి తాత్కాలికం. మొత్తం మీద, ప్రతి గర్భిణీ మహిళ ఫ్లూ వ్యాక్సిన్ తప్పకుండా వేయించుకోవాలి. ఇది తల్లీ బిడ్డలిద్దరికీ రక్షణ కలిగించే సురక్షితమైన, అవసరమైన టీకా. మీరు ఇప్పటికే వేసుకున్నా, ఈ సంవత్సరం మళ్లీ వేయించుకోవడం ఉత్తమం. డెలివరీ తర్వాత ఫ్లూ వ్యాక్సిన్ తీసుకోవచ్చు. ఇది సాధారణ జలుబు, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లను నివారించడానికి ఉపయోగపడుతుంది. కొందరికి తేలికపాటి తలనొప్పి, కండరాల నొప్పి ఒకటి రెండు రోజులు ఉండొచ్చు, కాని, అది సాధారణం. గర్భిణులు లేదా తాజాగా డెలివరీ అయిన తల్లులు కూడా ఈ వ్యాక్సిన్ తీసుకోవచ్చు. ఇది తల్లికి, పాలిచ్చే శిశువుకి ఎటువంటి హాని చేయదు.నాకు ఇది మూడవ ప్రెగ్నెన్సీ, మూడవనెల. ముందు రెండు నార్మల్ డెలివరీలు అయ్యాయి. ఈసారి కూడా నార్మల్ డెలివరీ అవుతుందనుకుంటున్నాను. కాని, డెలివరీ అయిన వెంటనే పిల్లలు కలగకుండా చేసే పద్ధతులు ఉన్నాయని విన్నాను. అవి నిజంగా పనిచేస్తాయా? ఎంతవరకు సేఫ్గా ఉంటాయి?– బింధు, హైదరాబాద్. ఇప్పుడున్న ‘ఎల్ఏఆర్సీ’ అంటే (లాంగ్ యాక్టింగ్ రివర్సబుల్ కాంట్రాసెప్షన్) అనే పద్ధతులు చాలా సురక్షితంగా, ప్రభావవంతంగా పనిచేస్తాయి. ఈ కాలంలో జీవితం బిజీగా ఉండటంతో, చాలా మంది మహిళలు డెలివరీ తర్వాత త్వరగా గర్భం రావడం వల్ల ఇబ్బంది పడుతున్నారు. అందుకే డెలివరీ సమయంలోనే ఈ పద్ధతుల గురించి మాట్లాడి, వాటిని అమలు చేయడం ఉత్తమం. మీరు ఇప్పటికే మూడో నెల దాటారు కాబట్టి, ఈసారి డెలివరీ రూమ్లోనే ఎల్ఏఆర్సీ ఆప్షన్ గురించి చర్చించుకోవచ్చు. నార్మల్ డెలివరీలో, ప్లాసెంటా బయటికి వచ్చిన పది నిమిషాల లోపలే ‘ఐయూసీడీ’ అంటే ‘ఇంట్రా యూటరైన్ కాంట్రాసెప్టివ్ డివైస్’ అనే పరికరాన్ని గర్భసంచిలో ఉంచవచ్చు. అది ఆ సమయానికే సులభంగా వేయవచ్చు. ఏదైనా కారణం వలన ఆ సమయంలో వేయలేకపోతే, వారం రోజుల్లో కూడా సులభంగా చేయవచ్చు. ఇది అనుభవజ్ఞులైన సీనియర్ డాక్టర్లు డెలివరీ రూమ్లోనే సురక్షితంగా చేస్తారు. ఇది పేషెంట్కి చాలా ఈజీగా, సౌకర్యంగా ఉంటుంది. డిశ్చార్జ్ అయ్యేలోపే చెక్ చేసి, సరిగా ఉన్నదని నిర్ధారిస్తారు. పైగా ఇది చాలా ఖర్చు తక్కువగా ఉంటుంది. తర్వాత వేరే సమయంలో మళ్లీ వచ్చి చేయాల్సిన అవసరం ఉండదు. డెలివరీ రూమ్లోనే ఇది పూర్తవడం వల్ల, మహిళకు భవిష్యత్తులో అవాంఛిత గర్భాలు రాకుండా నిరోధించవచ్చు. ఈ పద్ధతి సురక్షితమైనదే కాకుండా, చాలా ప్రభావవంతంగా ఉంటుంది. ఎటువంటి పెద్ద సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. అయితే, ప్రతి మెథడ్కి చిన్నచిన్న జాగ్రత్తలు ఉండేలా, కొన్ని చిన్న ప్రతికూలతలు కూడా ఉంటాయి. ఐయూసీడీ వేసిన తర్వాత కొందరికి కొంచెం ఎక్కువ బ్లీడింగ్ రావచ్చు, కొద్దిగా నొప్పి ఉండొచ్చు. అరుదుగా డివైస్ ఊడిపోవచ్చు లేదా దాని దారాలు లోపలికి ఎక్కువగా వెళ్లిపోవచ్చు. అప్పుడు చెక్ చేయడం కాస్త కష్టమవుతుంది. ఇవన్నీ చాలా అరుదుగా జరిగే పరిస్థితులు మాత్రమే. కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఐయూసీడీ వేసుకున్న తర్వాత ఆరు వారాల లోపు మళ్లీ డాక్టర్ చెకప్ తప్పనిసరిగా చేయించుకోవాలి. కొందరు ‘వేసుకున్నాం కదా’ అని నిర్లక్ష్యం చేస్తే, కొద్ది శాతం పేషెంట్లకు అవాంఛిత గర్భం రావచ్చును. దీని వల్ల మానసిక ఒత్తిడి, ఆందోళనలు వస్తాయి. అలా జరగకుండా ఉండేందుకు రెగ్యులర్ ఫాలోఅప్ చాలా అవసరం. ఇంకా, సిజేరియన్ ఆపరేషన్ సమయంలో కూడా ఐయూసీడీ లేదా బర్త్ కంట్రోల్ ఇంప్లాంట్ వేయించుకోవచ్చు. ఈ ఇంప్లాంట్ చాలా ప్రభావవంతంగా ఉంటుంది, దాని ఫెయిల్యూర్ ఛాన్స్ 1% కన్నా తక్కువ. ఈ పద్ధతులు పాలిచ్చే తల్లులకు కూడా సేఫ్గానే ఉంటాయి. మొత్తం మీద, ఐయూసీడీ లేదా ఇంప్లాంట్ రెండూ గర్భనిరోధంలో విశ్వసనీయమైన పద్ధతులు. కొద్ది తాత్కాలిక సైడ్ ఎఫెక్ట్స్ తప్పితే, ఇవి మహిళల ఆరోగ్యానికి సురక్షితం. కాబట్టి డెలివరీ సమయంలోనే మీ గైనకాలజిస్టుతో చర్చించి, మీకు సరిపోయే పద్ధతిని ఎంచుకోవడం ఉత్తమం. డాక్టర్ భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్,హైదరాబాద్ (చదవండి: 91 ఏళ్ల వ్యక్తి 12 గంటలు షిఫ్ట్! హీరో మాధవన్ సైతం..) -
పిల్లల్ని కనాలంటే ఆ మందులు వాడకూడదా?
దాంపత్య జీవితంలో ప్రతీ జంటకు తల్లిదండ్రులవ్వడం అనేది ఓ వరం. అయితే రకరకాల సమస్యలతో ఆ ప్రయత్నంలో ఇబ్బందులు పడే వాళ్లున్నారు. మరీ ముఖ్యంగా డయాబెటిస్ పెషేంట్లలో ఇది అధికంగా ఉంటోందనే ప్రచారం ఒకటి ఉంది. డయాబెటిక్ మహిళా పేషెంట్లు అసలు గర్భమే ధరించలేరని తరచూ కొందరు చెబుతుండడమూ చూస్తుంటాం. మరి అందులో నిజమెంత?.. ఇలాంటి ప్రచారాలపై వైద్య నిపుణులు ఏమంటున్నారు?.. ఓసారి పరిశీలిద్దాం.. ప్రచారం 1: డయాబెటీస్ ఉన్న మహిళలు సహజంగా గర్భం ధరించలేరు!!వాస్తవం: డయాబెటిస్ సహజంగా గర్భం ధరించడాన్ని ఆపదు. షుగర్ను కంట్రోల్లో ఉంచుకుంటూ.. ఆరోగ్యవంతమైన జీవనశైలి పాటిస్తూ చాలా మంది మహిళలు గర్భం దాల్చడమే కాదు.. ఆరోగ్యవంతమైన పిల్లల్నీ కనగలరు. షుగర్ నియంత్రణలో లేనప్పుడు మాత్రం అండం ఉత్పత్తిపై ప్రభావం పడే అవకాశం ఉంది. అప్పుడు గర్భం దాల్చడం కష్టతరమవుతుంది. ప్రచారం2: డయాబెటీస్ మహిళల ఫెర్టిలిటీని మాత్రమే ప్రభావితం చేస్తుందివాస్తవం: మహిళలకు మాత్రమే కాదు.. పురుషులకూ ఇది వర్తిస్తుంది. బ్లడ్ షుగర్ నియంత్రణలో లేకపోతే పురుషుల్లో శృంగార సామర్థ్యం తగ్గే అవకాశం ఉంది. పురుష హార్మోన్ (టెస్టోస్టిరాన్) లెవెల్స్ తగ్గుతుంది. స్పెర్మ్ నాణ్యతతో పాటు కౌంట్ కూడా తగ్గే ప్రమాదం ఉంది. ప్రచారం 3: ఆ టైంలో మందులు వాడకూడదు!వాస్తవం: గర్భధారణ ప్లాన్ చేస్తున్నప్పుడు షుగర్ పేషెంట్లు మందులు మావేస్తుంటారు. అలాంటి సమయంలో భాగస్వాములు ఆరోగ్యకరమైన గ్లూకోస్ లెవెల్స్ కలిగి ఉండడం అత్యంత అవసరం. అందుకే మధుమేహ మందులను అకస్మాత్తుగా ఆపడం సరైంది కాదు. రక్తంలో గ్లూకోజ్ సరైన మోతాదులో ఉంచుకునేందుకు.. కొన్ని మందులను సర్దుబాటు చేయాల్సి వస్తుంది. అయితే అది కేవలం వైద్యుల సూచనలతోనే జరగాలి. సొంత వైద్యం అస్సలు మంచిది కాదు. ప్రచారం 4: రక్తంలో అధిక గ్లూకోజ్ లెవల్స్తో ఏం కాదు వాస్తవం: ఇది చాలా తప్పు. గర్భంతో ఉన్న టైంలో షుగర్ పేషెంట్ల షుగర్ స్థాయిలు ఎక్కువగా ఉంటే.. అది బీపీ పెరగడం, ప్రీఎక్లాంప్షియా సమస్యలకు దారితీయొచ్చు ఇది తల్లీబిడ్డల ఆరోగ్యానికి ప్రమాదకరంగానూ మారొచ్చు. అందుకే ప్రెగ్నెన్సీ ప్లాన్ నుంచే షుగర్ లెవల్ను కంట్రోల్లో ఉంచుకోవాలి. ప్రచారం 5: డయాబెటిస్ ఉంటే ఫెర్టిలిటీ చికిత్సలు పనిచేయవువాస్తవం: డయాబెటిస్ పేషెంట్లు ఐవీఎఫ్, ఐసీఎస్ఐ లాంటి ఫెర్టిలిటీ చికిత్సల ద్వారా గర్భం దాల్చొచ్చు కూడా. డయాబెటిస్ ఉన్నదని ఈ చికిత్సలు పనిచేయవని భావించడం అపోహ మాత్రమే. అయితే ఈ చికిత్సలు విజయవంతంగా జరిగేందుకు బ్లడ్ షుగర్ స్థాయిలు నియంత్రణలో ఉండడం చాలా ముఖ్యం. -డా. ప్రశాంత కుమార్ నాయక్, ఎంబీబీఎస్, ఎండీ ఫెర్టిలిటీ స్పెషలిస్ట్. ఒయాసిస్ ఫెర్టిలిటీ -
HER2-పాజిటివ్ రొమ్ము కేన్సర్ అంటే..? ఎందువల్ల వస్తుందంటే..
సాధారణ రొమ్ము కేన్సర్ గురించి అందరికీ తెలిసింది. కానీ HER2-పాజిటివ్ రొమ్ము కేన్సర్ గురించి చాలామంది మహిళలకి తెలియదు. ఇది సాధారణ రొమ్ము కేన్సర్ కంటే ప్రమాదకరమైనది కూడా. ఎందుకంటే ఈ HER2-పాజిటివ్ రొమ్ము కేన్సర్ చాలా దూకుడుగా ఉంటుంది, పైగా శరీరంలోని ఇతర భాగాలకు చాలా సులభంగా వ్యాప్తి చెందుతుంది. ఇటీవల కాలంలో ఈ కేసులు చాలా వేగంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో దీనిపై అవగాహన తోపాటు ఎలాంటి చర్యలతో ఈ వ్యాధిని అదుపులో పెట్టుకోవచ్చు వంటి వాటి గురించి హైదరాబాద్కి చెందిన ఒమేగా హాస్పిటల్స్ మెడికల్ అంకాలజిస్ట్ డాక్టర్ వింధ్య వాసిని మాటల్లోనే సవివరంగా తెలుసుకుందాం.1 ప్రశ్న: హైదరాబాద్లో HER2-పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయా? ఎందుకు?డాక్టర్: దశాబ్దం క్రితం కంటే ఇప్పుడు మనం HER2-పాజిటివ్ నిర్ధారణలను ఎక్కువగా ఉన్నాయనే చెప్పారు. బహుశా దీనిపై అవగాహన పెరగడం, ఎక్కువమంది మహిళలు ముదుగానే స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవడం వంటివి అయ్యిండొచ్చని అన్నారు. అలాగే జీవనశైలి మార్పులు కూడా ఈ కేసులు అధికమవ్వడానికి కారణం కావొచ్చని ఆమె అన్నారు. 2 ప్రశ్న. HER2-పాజిటివ్ రొమ్ము క్యాన్సర్ ఇతర వాటికంటే ఎలా భిన్నంగా ఉంటుంది?డాక్టర్: HER2-పాజిటివ్ రొమ్ము కేన్స ర్అనేది కణాల ఉపరితలంపై కణ పెరుగుదల, విభజనను ప్రోత్సహించే గ్రాహకమైన HER2 (హ్యూమన్ ఎపిడెర్మల్ గ్రోత్ ఫ్యాక్టర్ రిసెప్టర్ 2 కి సంక్షిప్తంగా) ప్రోటీన్ అధికంగా ఉత్పత్తి అవ్వడం వల్ల వస్తుందని అన్నారు. అందువల్ల ఈ కేన్సర్ ఇతర రకాల కేన్సర్ల కంటే మరింత దూకుడు స్వభావం కలది. అయితే దీన్ని HER2ను లక్ష్యంగా చేసుకుని మందులతో రోగులకు చికిత్స అందించవచ్చు. గత రెండు దశాబ్దాలుగా ఈ చికిత్సలు HER2-పాజిటివ్ రొమ్ము కేన్సర్ దృక్పథాన్నే మార్చేశాయి. ఒకప్పడు ఈ కేన్సర్ అధిక ప్రమాదకరమైనదిగా పరిగణించేవారని, ఇప్పుడూ మందులతో నిర్వహించేలా చక్కటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు.3 ప్రశ్న. HER2-పాజిటివ్ రొమ్ము కేన్సర్పై హైదరాబాద్లో ఏవైనా శాస్త్రీయ ఆవిష్కరణలు జరుగుతున్నాయా?డాక్టర్: అవును. హైదరాబాద్లోని అనేక ఆసుపత్రులు ఇప్పుడు కొత్త చికిత్సా పద్ధతులను అందిస్తున్నాయి.ఉదాహరణకు సబ్కటానియస్ ఫార్ములేషన్స్ ఆఫ్ టార్గెటెడ్ థెరపీలు. ఇవి మందులతో వేగవంతంగా తగ్గించడమే కాకుండా రోగికి సౌకర్యవంతంగా కూడా ఉంటున్నాయి.4 ప్రశ్న: HER2-పాజిటివ్ రొమ్ము కేన్సర్కు ఏయే చికిత్సలు అందుబాటులో ఉన్నాయి?డాక్టర్: HER2-పాజిటివ్ రొమ్ము కేన్సర్కు అనేక చికిత్సా ఎంపికలు ఉన్నాయి - కేన్సర్ర్ ఎంత అభివృద్ధి చెందింది, అది వ్యాపించిందా, ఎంత వేగంగా పెరుగుతోంది వంటి వాటికి సంబంధించిన మొత్తం రోగి ఆరోగ్యంపై ఆధారపడి ఉంటుంది. అదృష్టం ఏంటంటే..HER2 ప్రమేయం ఉందని మనకు తెలుసు కాబట్టి, సాధారణమైన వాటికి అదనంగా ప్రభావవంతమైన "టార్గెటెడ్" చికిత్సలు ఉన్నాయి. అవేంటంటే..a. టార్గెటెడ్ థెరపీలు: ఈ మందులు ప్రత్యేకంగా కేన్సర్ కణాల పెరుగుదలను ఆపడానికి HER2 ప్రోటీన్ను నిరోధిస్తాయి.b. కీమోథెరపీ: ప్రభావాన్ని పెంచడానికి తరచుగా టార్గెటెడ్ థెరపీలతో కలిపి ఉపయోగిస్తారు.c. శస్త్రచికిత్స: కేసును బట్టి కణితి లేదా రొమ్ము కణజాలాన్ని తొలగించడం.d. రేడియేషన్ థెరపీ: పునరావృత ప్రమాదాన్ని తగ్గించడానికి అనేక సందర్భాల్లో శస్త్రచికిత్స తర్వాత ఉపయోగిస్తారు.e. హార్మోన్ల చికిత్స: కణితి కూడా హార్మోన్ రిసెప్టర్-పాజిటివ్ అయితే సిఫార్సు చేయవచ్చు.ఇప్పుడు లక్ష్యంగా చేసుకున్న చికిత్సలు చర్మం కింద ఇంజెక్ట్ చేసేలా సబ్కటానియస్ ఫార్ములేషన్లుగా అందుబాటులో ఉన్నాయి. అలాగే దీర్ఘ IV ఇన్ఫ్యూషన్లతో (సుమారు 4-6 గంటలు) పోలిస్తే వేగంగా (సుమారు 8 నిమిషాలు) చికిత్సను పూర్తి చేయొచ్చు. రోగి సౌకర్యంగా ఉండేలా చికిత్సా కేంద్రాల్లో గడిపే సమయం కూడా తగ్గేలా పలు చికిత్సా విధానాలు అందుబాటులో ఉన్నాయన్నారు. 5 ప్రశ్న: HER2-పాజిటివ్ రొమ్ము కేన్సర్ జర్నీలో రోగులు, సంరక్షకులు తప్పక తెలుసుకోవాల్సినవి ఏవి?డాక్టర్: a. HER2 స్థితిని నిర్ణయించడానికి తగిన చికిత్సను ప్లాన్ చేయడానికి ముందుగా సరైన సమయంలో రోగ నిర్ధారణ చేయడం అనేది ముఖ్యంb. చికిత్సకు కట్టుబడి ఉండటం కీలకం. మోతాదులను కోల్పోవడం లేదా చికిత్సను మధ్యలో ఆపడం వల్ల ప్రభావం తగ్గుతుంది.c. రోగులు,వారి సంరక్షకులకు భావోద్వేగ మద్దతు చాలా ముఖ్యమైనది. ఇది ఒకరకంగా మానసిక ఆరోగ్యాన్ని నిర్వహించడం, స్థితిస్థాపకతను పెంపొందించడంలో సహాయపడుతుంది.d. సంరక్షణ బృందంతో సకాలంలో కమ్యూనికేషన్ ద్వారా దుష్ప్రభావాలను నిర్వహించడం జీవిత నాణ్యతను మెరుగుపరుస్తుంది.e. భారతదేశంలో ప్రస్తుతం రోగి సౌకర్యార్థం మెరుగైనా సబ్కటానియస్ థెరపీలు అనే కొత్త చికిత్సా విధానం అందుబాటులో ఉంది. ఇవి రోగి చికిత్సా సమయాన్ని తగ్గించడమే కాకుండా ఆస్పత్రి సందర్శన కూడా తగ్గుతుంది. చివరగా రోగి సంరక్షకులు ఇలాంటి చికిత్సా విధానాలు, మంచి ప్రత్యామ్నాయాల గురించి వైద్యులతో సంభాషించి, సవివరంగా తెలుసుకోవాలి, సత్వరమే కోలుకునే చికిత్సా విధానాల గురించి క్షణ్ణంగా అవగాహన పెంపొందించుకోవాలని చెప్పారామె.ఒమేగా హాస్పిటల్స్ మెడికల్ అంకాలజిస్ట్ డాక్టర్ వింధ్య వాసిని -
చిన్నవయసులోనే మధుమేహం
హైదరాబాద్: ప్రపంచ మధుమేహ దినం సందర్భంగా ప్రస్తుతం మన సమాజంలో మధుమేహం తీరుతెన్నులు, దానివల్ల వచ్చే సమస్యలు, పరిష్కార మార్గాల గురించి నగరంలోని ప్రధాన ఆస్పత్రులలో ఒకటైన ఎల్బీనగర్ కామినేని ఆస్పత్రికి చెందిన కన్సల్టెంట్ ఎండోక్రెనాలజిస్ట్ డాక్టర్ బి.శ్రావ్య, కన్సల్టెంట్, కన్సల్టెంట్ డయాబెటాలజిస్ట్ డాక్టర్ భవాని వివరించారు. కొన్ని దశాబ్దాల క్రితం కనీసం 40-50 ఏళ్లు దాటినవారే మధుమేహం బారిన పడినట్లు గుర్తించేవారు. ఇప్పుడు ఇంకా బాగా చిన్నవయసులోనే, అంటే 15-20 ఏళ్ల వయసులోనే ఈ సమస్య కనిపిస్తోంది. ఇందుకు ప్రధాన కారణం జీవనశైలి మార్పులు. తగినంత నిద్ర లేకపోవడం, వ్యాయామం చేయకపోవడం, మారుతున్న ఆహారపు అలవాట్లు.. వీటన్నింటివల్ల అధిక బరువు, ఊబకాయం, దాంతోపాటే మధుమేహం కూడా వస్తున్నాయి.‘‘సాధారణంగా మధుమేహం అనేది రెండు రకాలు. మొదటిది టైప్-1. అంటే.. శరీరంలో ఏవో తెలియని మార్పుల వల్ల పాంక్రియాస్ ప్రభావితమై, తగినంత ఇన్సులిన్ ఉత్పత్తి కాక మధుమేహం వస్తుంది. వాళ్లకు జీవితాంతం ఇన్సులిన్ ఇవ్వాల్సిందే. కానీ రెండోది టైప్-2. ఇది ప్రధానంగా జీవనశైలి మార్పుల వల్ల వచ్చేది. మన జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారానే దాన్ని నియంత్రించుకోవచ్చు. గతంతో పోలిస్తే చాలా చిన్నవయసులోనే ఎక్కువమంది మధుమేహం బారిన పడుతున్నారు. మా ఆస్పత్రికి రోజూ ఔట్పేషెంట్ విభాగంలో 20-30 మంది మధుమేహ బాధితులు వస్తుంటే, వారిలో దాదాపు 30% మంది చిన్నవయసువారే ఉంటున్నారు. కొందరికి 20లు, 30లలోను ఇంకా కొందరికి 10-15 ఏళ్ల వయసులో కూడా వస్తోంది. ప్రధానంగా ఇలా చిన్నవయసులో వచ్చేవారిలో ఎక్కువమందికి ఊబకాయం ఉంటోంది. జీవనశైలి మార్పుల వల్ల బరువు పెరిగిపోతున్నారు. చిన్న పిల్లలకు కూడా ఊబకాయం కనిపిస్తోంది. అలాగే మొత్తమ్మీద మధుమేహం ఉన్నవారి సంఖ్య కూడా బాగా పెరుగుతోంది.పాశ్చాత్య దేశాలతో పోలిస్తే ఆసియా వాసుల్లో మధుమేహం వచ్చే అవకాశం ఎక్కువ. అందువల్ల 30ల నుంచి కూడా ఎప్పటికప్పుడు మధుమేహ పరీక్షలు చేయించుకోవాలి. అలాగే గర్భంతో ఉన్నప్పుడు కూడా మధ్యమధ్యలో మధుమేహం వచ్చిందేమో పరీక్షించుకోవాలి. ఊబకాయం, అధిక బరువు ఉన్నవాళ్లు కూడా తరచు చేయించుకోవాలి. రక్తపోటు, కొలెస్టరాల్ ఉన్నవాళ్లు అయితే దాదాపు ప్రతియేటా పరీక్షలు చేయించుకోవాలి.గతంలో కేవలం గ్లూకోజ్ నియంత్రిస్తే సరిపోతుంది అనుకునేవారు. తర్వాత గత పదేళ్ల నుంచి మధుమేహం ఉన్నవారికి కీలక అవయవాలు అంటే గుండె, కిడ్నీలు, కళ్లు, కాళ్లు.. ఇలా అన్నింటినీ కాపాడాలని గుర్తించారు. అదే ఇప్పుడైతే బరువు విషయాన్ని కూడా చూస్తున్నారు. మధుమేహాన్ని నియంత్రించే మందులతోనే బరువు కూడా తగ్గే అవకాశం ఇప్పుడు ఉంటోంది’’ అని డాక్టర్ బి.శ్రావ్య తెలిపారు. బరువును అదుపులో పెట్టాలికన్సల్టెంట్ డయాబెటాలజిస్ట్ డాక్టర్ భవాని మాట్లాడుతూ, ‘‘మధుమేహం వచ్చినవారు తప్పనిసరిగా తమ శరీర బరువును వీలైనంత వరకు అదుపులో పెట్టుకోవాలి. 5-10% బరువు తగ్గినా కూడా అది మధుమేహ నియంత్రణకు బాగా ఉపయోగ పడుతుంది. అలాగే నడక లాంటి వ్యాయామాలు ప్రతిరోజూ తప్పక ఉండాలి. దాంతోపాటు వైద్యులు సూచించిన మందులు క్రమం తప్పకుండా వాడాలి. వీటన్నింటిద్వారా మధుమేహాన్ని నియంత్రణలో పెట్టుకుని ఆరోగ్యవంతమైన జీవితం గడపొచ్చు. క్రమశిక్షణతో కూడిన జీవితం ద్వారానే మనం మధుమేహాన్నిఅదుపుచేయగలం. మధుమేహ పరీక్షలంటే కేవలం ఏదైనా తినడానికి ముందు, తిన్న తర్వాత చేయించుకునే రెండు రక్తపరీక్షలే కాదు. హెచ్బీఏ1సీ పరీక్ష కూడా చేయించుకోవాలి. దానివల్ల గత కొంతకాలంగా మధుమేహం స్థాయి ఎలా ఉందో అర్థమవుతుంది. దాన్ని బట్టే కచ్చితమైన డయాగ్నసిస్ ఉండి మందులు ఎలాంటివి వాడాలో సూచించగలం’’ అని చెప్పారు. -
యోగాతో డయాబెటిస్కు చెక్ చెప్పవచ్చా?
World Diabetes Day డయాబెటిస్ నియంత్రణకు యోగా పనికొస్తుందా అంటే కచ్చితంగా పనికొస్తుంది. నిజానికి చెప్పాలంటే చిన్న చిన్న వ్యాయామాలు, జీవన శైలి మార్పులతో మధుమేహాన్ని అదుపులో ఉంచు కోవచ్చు. కొన్ని ప్రత్యేకమైన యోగాసనాల ద్వారా షుగర్ నియంత్రణలో ఉండటంతోపాటు, అధిక బరువు సమస్యనుంచి కూడా బయట పడవచ్చు. అధిక బరువు, అధిక స్థాయిలో ఉన్న షుగర్ శరీర అవయవాల పని తీరును దెబ్బతీస్తుంది. తద్వారా అనేక అనారోగ్య సమస్యలొస్తాయి. ఈ నేపథ్యంలో డయాబెటిస్ నియంత్రణకు ఉపయోగపడే కొన్ని రకాల యోగాసనాల గురించి తెలుసుకుందాం.కొన్ని రకాలు యోగాసనాలు ఒత్తిడిని నిర్వహించడానికి, ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరచడానికి, విశ్రాంతికి, రక్త ప్రసరణను మెరుగు పర్చడానికి దోహదపడతాయి. ఎవరైనా చేయొచ్చా? ఎలా ప్రారంభించాలి?యోగా వశ్యత, బలం మరియు సమతుల్యతను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఇది ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది, మానసిక స్పష్టతను పెంచుతుంది మరియు మొత్తం శ్రేయస్సును ప్రోత్సహిస్తుంది.వారానికి 2-3 సెషన్లతో ప్రారంభించవచ్చు. అవాటైన కొద్దీ క్రమంగా, సౌలభ్యతను బట్టి ఫ్రీక్వెన్సీని పెంచుకోవచ్చు.యోగా సాధనకు కావలసిందల్లా యోగా మ్యాట్ ,సౌకర్యవంతమైన దుస్తులు. అదనపు సపోర్ట్ కోసం బ్లాక్స్, పట్టీలు , బోల్స్టర్ వంటివి ఉంచుకోవచ్చు. ఇవి ఆప్షనల్.యోగా జీవక్రియను పెంచడం, కండరాల స్థాయిని మెరుగుపరచడం ,ఒత్తిడికి సంబంధించిన ఆహారాన్ని తగ్గించడం ద్వారా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. షుగర్ - ముఖ్య యోగాసనాలు కాళ్ళు పైకి వంగి భంగిమ (విపరిత కరణి): హఠ యోగాలో ఒక భంగిమ విశ్రాంతినిస్తుంది, ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. రక్త ప్రసరణ , ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తుంది.సీటెడ్ ఫార్వర్డ్ బెండ్ (పశ్చిమోత్తనాసన): ఈ భంగిమ ఆందోళనను, అలసటను తగ్గిస్తుంది. బరువు తగ్గడంలో సహాయపడుతుంది.ధనురాసన: రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది.శ్వాసకోశ సమస్యలను కూడా తగ్గిస్తుంది. కోబ్రా భంగిమ (భుజంగాసన): కండరాలను బలపరుస్తుంది. ఇన్సులిన్ను ఉపయోగించుకునే శరీర సామర్థ్యాన్ని మెరుగుపరచడంలో సహాయ పడుతుంది.సుపైన్ స్పైనల్ ట్విస్ట్ (సుప్త మత్స్యేంద్రసన): ఉదర అవయవాలను ఉత్తేజపరుస్తుంది రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయ పడుతుంది. (రూ. 5 వేలతో మొదలై కోటి దాకా : సక్సెస్ స్టోరీ)ఒంటె భంగిమ (ఉస్ట్రాసనం): పక్కటెముకలకు చక్కటి బలాన్నిస్తుంది. వెన్నుముకను బలపరుస్తుంది. గుండెకు, శరీరానికి శక్తినిస్తుంది. మధుమేహం ఉన్నవారికి మేలు చేస్తుంది.పర్వత భంగిమ (తడాసనం): భంగిమను మెరుగుపరుస్తుంది, శరీరాన్ని బలపరుస్తుంది ఇన్సులిన్ సున్నితత్వాన్ని రక్త ప్రసరణను ప్రోత్సహిస్తుంది. ఈ యోగాసనాలన్నీ బరువు నియంత్రణలోనూ, మంచి నిద్రకు కూడా బాగా ఉపయోగపడతాయి. నోట్ : వివిధ ఆరోగ్య పరిస్థితులకు అనుగుణంగా అనేక యోగాసనాలను యోగా నిపుణుల ద్వారా నేర్చుకోవచ్చు. ముఖ్యంగా డయాబెటిస్ ఉన్నవారిలో ఈ భంగిమలు మందులు, ఆహారం , సాధారణ వైద్య పరీక్షలకు ప్రత్యామ్నాయం కాదనే విషయాన్ని గమనించాలి. ఒక వేళ ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే ఆరోగ్య నిపుణులను సంప్రదించాలి.ఇదీ చదవండి: జిమ్కే వెళ్లక్కరలేదు.. చిన్న మార్పులు చాలు, షుగర్ దిగొస్తుంది! -
జిమ్కే వెళ్లక్కరలేదు.. చిన్న మార్పులు చాలు, షుగర్ దిగొస్తుంది!
World Diabetes Day November 14th మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవాలంటే ఆహార నియమాలతోపాటు, తేలికపాటి వ్యాయామం కూడా అవసరం. క్రమం తప్పకుండా, ఎక్సర్సైజ్, వాకింగ్, యోగా లాంటి చేయడం వలన షుగర్ను అదుపులో ఉంచుకోవచ్చు. ఇందుకోసం జిమ్ సభ్యత్వం, ఫ్యాన్సీ గాడ్జెట్లపై ఆధారపడ వలసిన అవసరం లేదు. చిన్న చిన్న మార్పులే, చిన్న పాటి వ్యాయామాలే ఆరోగ్యంపై ఎంతో ప్రభావాన్ని చూపిస్తాయి. నడక, స్ట్రెచింగ్, స్క్వాట్లు లేదా వాల్ పుష్-అప్లు వంటి సాధారణ కదలికలు జీవక్రియకు అద్భుతాలు చేస్తాయని నిపుణులు అంటున్నారు.అంటే ఇన్సులిన్ సహాయం లేకుండానే, కండరాలు రక్తం నుండి నేరుగా గ్లూకోజ్ను గ్రహిం చేందుకు ఇవి ఉపయోగపడతాయి. వ్యాయామం చేసినప్పుడు, కండరాల్లోని మైటోకాండ్రియా పవర్హౌస్లను మేల్కొల్పుతాయి. ఇవి చక్కెర , కొవ్వు రెండింటినీ బర్న్ చేస్తాయి. తద్వారా అదనపు గ్లూకోజ్ను క్లియర్ చేయడంతోపాటు, ఇన్సులిన్ నిరోధకతను కలిగించే అదనపు కొవ్వును కరిగిస్తుంది.రెగ్యులర్ వ్యాయామం PGC-1 ఆల్ఫా అని పిలిచే ప్రత్యేక ప్రోటీన్ను పెంతుంది. ఇది మైటోకాండ్రియల్ పెరుగుదలను పెంచుతుంది. క్రమంగా ఈ ప్రక్రియ భోజనం తర్వాత రక్తంలో చక్కెర స్థాయిలను సమతుల్యం చేయడంలో సహాయ పడుతుంది. దీర్ఘకాలిక జీవక్రియ ఆరోగ్యానికి మద్దతు ఇస్తుంది.తేలికపాటి వ్యాయామాలుచురుకైన నడక (Brisk Walk): భోజనం తర్వాత పదిహేను నిమిషాలు కండరాలు చక్కెరను గ్రహించడంలో సహాయ పడతాయి.వాల్ పుష్-అప్లు: సున్నితమైనవేకాన ఎగువ శరీరం ,రక్త ప్రవాహానికి ప్రభావవంతంగా ఉంటాయి.స్క్వాట్లు అండ్ లంగెస్ (Squats and lunges) కాళ్లను బలోపేతం చేస్తాయి . గ్లూకోజ్ తీసుకోవడంలో మద్దతు ఇస్తాయి.లైట్ స్ట్రెచింగ్ అండ్ యోగా: మనస్సును ప్రశాంతపరుస్తాయి . ఒత్తిడి హార్మోన్లను సమతుల్యం చేస్తాయి.రెసిస్టెన్స్ బ్యాండ్ శిక్షణ: కండరాలను బలంగా చేస్తుందీ వ్యాయామం. ఇన్సులిన్ సున్నితత్వాన్ని మెరుగుపరుస్తుంది.సోలియస్ పుష్-అప్లు: కుర్చీలో కూర్చున్నప్పుడు పాదాలను పైకి కిందికి కదలించేలా చేసే వ్యాయామం.క్రమం తప్పకుండా చేసే వ్యాయామాలు అడ్రినలిన్, నోరాడ్రినలిన్,అడిపోనెక్టిన్ను పెంచుతుంది, ఇవన్నీ రక్తంలో చక్కెరను సమతుల్యం చేయడంలో సహాయపడతాయి. ఒత్తిడి హార్మోను కార్టిసాల్ను కూడా తగ్గిస్తాయి. అధికసుగర్స్థాయిలు అనారోగ్యానికి మూలం అని గమనించండి! మరింకెందుకు ఆలస్యం, హాయిగా ఆరోగ్యంగా ఉండాలన్నా, మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవాలంటే ఈ క్షణం నుంచే వ్యాయామ నియమాన్ని పాటించండి! -
10.1 కోట్ల మంది : ఒడుదొడుకులే అసలు కారణం
మధుమేహ బాధితుల పరంగా భారత దేశం ప్రపంచానికే రాజధాని అయితే, దక్షిణాది రాష్ట్రాలు భారతదేశానికి రాజధానులుగా మారాయని గణాంకాలు చెబుతున్నాయి. దేశంలో మధు మేహ బాధితుల సంఖ్య ఇప్పుడు 10.1 కోట్లకు చేరింది. భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలలో మధుమేహం (Diabetes) క్రమంగా వేగాన్ని పుంజుకుంటోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేస్తోంది. మధుమేహం నియంత్రణ, నిరోధం పట్ల అవగాహన కల్పించడానికి ఇన్సులిన్ను కనుగొన్న సర్ ఫ్రెడరిక్ బ్యాంటింగ్ పుట్టిన రోజైన నవంబర్ 14వ తేదీని ‘ప్రపంచ మధుమేహ నిరోధక దినం’గా ప్రతి ఏడాదీ జరుపుకోవడం ముదావహం.నేడు మనిషి జీవన విధానం, ఆహారంలో వచ్చిన విప్లవాత్మక మార్పులు... మధుమేహం వంటి జీవితకాల దీర్ఘ వ్యాధులకు ఆజ్యం పోస్తున్నాయి. అతి చిన్న వయసు నుండే ఏమాత్రం శారీరక శ్రమ లేక పోవడం, ఆహారంలో చోటు చేసు కున్న మార్పులు, కల్తీలు, పంట పొలాల్లో వేసే రసాయనిక ఎరువులు, క్రిమిసంహారక మందులు, విచ్చలవిడి ప్లాస్టిక్ వినియోగం, పర్యావరణ మార్పులు, కొత్త కొత్త వైరల్ వ్యాధులు, వృత్తిపర మానసిక ఒత్తిడి, జన్యువులలో ఉత్పరివర్తనలు... ఇలా ఎన్నో కారణాలు రక్తంలో షుగర్ను నియంత్రించే ఇన్సులిన్ను ఉత్పత్తి చేసే ప్యాంక్రియాస్ (క్లోమ గ్రంథి)ని అసాధారణ రీతిలో ప్రభావితం చేస్తున్నాయి. శరీర అవసరాలకు సరిపడా ఇన్సులిన్ (Insulin) ఉత్పత్తి కాకపోవటం, ఇన్సులిన్ పనితీరులోని లోపాలు (రెసిస్టెన్స్), శరీర కణాలు ఇన్సులిన్ను వినియోగించుకోలేకపోవడం... వెరసి రక్తంలో అసాధారణ స్థాయిలో చక్కెర శాతాన్ని పెంచేస్తున్నాయి. చదవండి: ఆంక్షలతోనా వేతన సంఘాన్ని నియమించేది?మనం నిత్య జీవితంలో వాడే ప్లాస్టిక్ల అవశేషాల ప్రభావం వల్ల ప్యాంక్రి యాస్ సహజసిద్ధంగా ఉత్పత్తి చేసే ఇన్సులిన్ను శరీర అవసరాలకు సరిపడా ఉత్పత్తి చేయలేకపోతోంది. ఇన్సులిన్ ఉత్పత్తి అయినా... శరీర కణజాలాలలో నిరోధకత వచ్చి అది ఉపయోగపడక పోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి (Sugar Level) అసాధారణ రీతిలో పెరిగిపోతోంది. మందుల వాడకం, ఆహార నియమాలు పాటించటం, క్రమం తప్పక వ్యాయామం చేయడం ద్వారా జీవితాంతం అప్రమత్తంగా ఉండాలి. – డాక్టర్ టి. సేవకుమార్ వ్యవస్థాపకులు, ఎస్.హెచ్.ఓ. హైపర్ టెన్షన్–డయాబెటిక్ క్లబ్, గుంటూరు(నవంబర్ 14 ప్రపంచ మధుమేహ నిరోధక దినం) -
ఇద్దరిలో ఒకరికి..!
మధుమేహం (డయాబెటిస్)..దీనికి సైలెంట్ కిల్లర్ అనే పేరుంది. ఈ వ్యాధి బారిన పడ్డవారి సంఖ్య ప్రపంచవ్యాప్తంగా 83 కోట్లు దాటిందని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెబుతోంది. అయితే మన దేశంలో అధికంగా మధుమేహ రోగులుండటం ఆందోళన కలిగించే అంశం. ఐసీఎంఆర్ నివేదిక ప్రకారం 20 ఏళ్లకు పైబడిన వారిలో 10 కోట్ల మందికి పైగా డయాబెటిస్ పేషెంట్లు ఉన్నట్టు అంచనా. మరో 13.6 కోట్ల మందికి మధుమేహం ముప్పు పొంచి ఉంది. అయితే చాలామందికి తమకు వచ్చే ప్రమాదం గురించి తెలియడం లేదు. అంతేకాదు డయాబెటిస్ ప్రాబల్యం విషయంలో భారతదేశం ప్రపంచ సగటు కంటే చాలా ముందుండడం ఆందోళన కలిగిస్తోంది. – సాక్షి, స్పెషల్ డెస్క్ప్రీ డయాబెటిస్కు దారి.. పరీక్షించినవారిలో 58% మందికి ఇన్సులిన్ నిరోధకత ఉందని హెచ్ఓఎంఏ–ఐఆర్ ఫలితాలు సూచిస్తున్నాయి. ఇది జీవక్రియ ప్రమాదానికి ముందస్తు గుర్తు. ఇన్సులిన్ నిరోధకత అనేది శరీర కణాలు ఇన్సులిన్ అనే హార్మోన్కు సరిగ్గా స్పందించని ఒక పరిస్థితి. దీంతో రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. పాంక్రియాస్ ఉత్పత్తి చేసే ఇన్సులిన్ సాధారణంగా ఆహారం నుండి లభించే గ్లూకోజ్ను శక్తి కోసం కణాలలోకి ప్రవేశించడానికి సహాయపడుతుంది. అయితే నిరోధకత ఏర్పడినప్పుడు గ్లూకోజ్ రక్త ప్రవాహంలోనే ఉంటుంది. దానిని భర్తీ చేయడానికి పాంక్రియాస్ ఎక్కువ ఇన్సులిన్ను విడుదల చేస్తుంది. తగినంత ఇన్సులిన్ ఉత్పత్తి కాకపోతే అది ప్రీ డయాబెటిస్కు దారితీస్తుంది. చివరికి టైప్–2 డయాబెటిస్కు కారణం అవుతుంది. డయాబెటిస్ ఉన్న వ్యక్తులలో.. » నలుగురిలో ఒకరికి అసాధారణ రీతిలో థైరాయిడ్ (హైపోౖథెరాయిడిజం) » ముగ్గురిలో ఒకరికి కాలేయ పనితీరులో సమస్యలు » దాదాపు సగం మందికి ఏదో ఒక రకమైన మూత్రపిండాల బలహీనత » సుమారు 90% మందికి అసాధారణ లిపిడ్ ప్రొఫైల్స్ ఉంటాయి. » 30 ఏళ్లలోపు వారిలోనూ రక్తంలో చక్కెర స్థాయిలు అధికంగా ఉన్నాయి. » 30–39 సంవత్సరాల మధ్య వయస్కుల్లో ప్రతి ముగ్గురిలో ఒకరికి ఇప్పటికే అధిక చక్కెర స్థాయిలు. » 60 ఏళ్లుపైబడ్డవారిలో ప్రతి 10లో 8 మంది రక్తంలో అధిక గ్లూకోజ్ స్థాయిలు ఉంటున్నాయి. చిన్న వయస్సు వారిపైనా ప్రభావం డిజిటల్ హెల్త్కేర్ ప్లాట్ఫామ్ ఫార్మ్ఈజీ అధ్యయనం ప్రకారం భారత్లో ఇద్దరిలో ఒకరికి రక్తంలో చక్కెర స్థాయిలు అధికంగా ఉన్నట్టు నిర్ధారణ అయింది. 29 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుండి 40 లక్షలకు పైగా రోగ నిర్ధారణ నివేదికలు, 1.9 కోట్ల ఔషధ ఆర్డర్లను కంపెనీ విశ్లేషించింది. ‘డయాబెటిస్: ది సైలెంట్ కిల్లర్ స్వీపింగ్ ఎక్రాస్ ఇండియా’పేరుతో రూపొందించిన ఈ నివేదిక ప్రకారం.. 28.4% మందికి మధుమేహం నిర్ధారణ అయింది. 27.5% మందికి ముప్పు పొంచి ఉంది. అంటే వీరు టైప్–2 డయాబెటిస్ బారిన పడే అవకాశం ఉంది. ఈ వ్యాధి వృద్ధులను మాత్రమే కాకుండా చిన్న వయస్సు వారిని కూడా ఎక్కువగా ప్రభావితం చేస్తోంది. రక్తంలో చక్కెర స్థాయిలు అధికంగా ఉండడం 90% మందిలో కాలేయం, లిపిడ్ (కొవ్వులు, నూనె, హార్మోన్లు), గుండె, థైరాయిడ్ సమస్యలకు దారితీసిందని నివేదిక తెలిపింది. సగం మందికి తెలియదు.. స్పష్టమైన లేదా ముందస్తు లక్షణాలు లేకుండానే జనం డయాబెటిస్ బారిన పడుతున్నారు. అందుకే దీనిని సైలెంట్ కిల్లర్ అని పిలుస్తున్నారు. వయస్సు, లింగం, జీవనశైలి, ప్రాంతంతో సంబంధం లేకుండా ఇది ఎవరినైనా ప్రభావితం చేస్తుంది. ఆందోళన కలిగించే ముఖ్య విషయం ఏమిటంటే 50% కంటే ఎక్కువ మందికి తాము ఈ వ్యాధిబారిన పడ్డ విషయం తెలియకపోవడం. గుండె జబ్బులు, మూత్రపిండాలు దెబ్బతినడం, దృష్టి కోల్పోవడం వంటి సమస్యలు వచ్చే వరకు ఈ వ్యాధి బయటపడడం లేదట. సాధారణ రక్త పరీక్ష ద్వారా ముందస్తుగా గుర్తించి సకాలంలో వైద్యం తీసుకోవడమే ఉత్తమ మార్గం అని నిపుణులు చెబుతున్నారు. -
చిన్న కారణాలు పెద్ద భయాలు
భయం అనేది ఒక స్వాభావికమైన ఉద్వేగం. అది ప్రతి జీవితో పాటు మానవులందరిలో ఉండేదే. మనకు ముప్పు తెచ్చిపెట్టే అంశాల పట్ల భయం ఉండటం వల్లనే ఆ ప్రమాదాల నుంచి దూరంగా వెళ్తారు. అందువల్లనే మనుగడ సాధ్యమవుతుంది. ఇలా చూసినప్పుడు అన్ని జీవులతో పాటు మానవ మనుగడను సుసాధ్యం చేసే సహజమైన ఉద్వేగం అది. అయితే కొందరిలో ఆ భయం మోతాదులు చాలా ఎక్కువగా ఉంటాయి. ఉదాహరణకు ఓ బొద్దింక వల్ల ఎలాంటి ప్రమాదం లేకపోయినా కొందరు దానికి భయపడతారు. ఇంకొందరు గోడ మీది బల్లని చూస్తే చాలు వణికిపోతారు. ఇలా ఉండాల్సినంత కాకుండా ఈ భయం అర్థం లేకుండా పెరిగిపోతూ, దాని వల్ల యాంగై్జటీ పెరిగిపోతూ... ఆ భయం మన రోజువారీ వ్యవహారాలకు సైతం అడ్డం పడేటంతగా పెరిగిపోయి ఏ పనీ చేయలేనంతగా ఆందోళన కలిగిస్తుంటే దాన్ని ‘ఫోబియా’గా అభివర్ణిస్తారు. గతంలో కంటే ఇప్పుడు ఫోబియాలకు మంచి చికిత్స ప్రక్రియలే అందుబాటులో ఉంది. ఈ ఫోబియాల గురించి అవగాహన కోసం ఈ కథనం.ఒక కేస్ స్టడీ : ఇటీవలే సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం అమీన్పూర్కు చెందిన మనీషా అనే గృహిణి చీమలంటే భయంతో ఆత్మహత్య చేసుకుంది. ఇక ఈ చీమలతో పాటు బతకడం నా వల్ల కాదంటూ సూసైడ్ నోట్ రాసి మరీ ఆమె ఈ ఘాతుకానికి ఒడిగట్టిందంటూ వార్తలు వచ్చాయి. ఇలా చీమల పట్ల ఉండకూడని భయానికి సైకియాట్రీలో ఉన్న పేరు ‘మిర్మెకోఫోబియా’ (myrmecophobia).ఏమిటీ ఫోబియాలు? ఒక్కమాటలో చెప్పాలంటే అంతగా భయపడకూడని అంశాల పట్ల కూడా తీవ్రమైన భయం ఉండటమే ‘ఫోబియా’ అని చెప్పవచ్చు. ఈ భయాల తీవ్రతలు చాలామందికి వేర్వేరుగా ఉంటాయి. ఉదాహరణకు కొందరికి ఎత్తైన ప్రదేశాలంటే భయం. మరికొందరికి అన్నివైపులా మూసి ఉండే ప్రదేశాలు... అంటే లిఫ్టుల వంటి చోట్ల భయంగా ఉంటుంది. ఇంకొందరికి హైవేల పై డ్రైవింగ్ అంటే విపరీతమైన ఆందోళన. ఇలా చాలామందిలో చాలారకాల భయాలుంటాయి. పాములూ, కీటకాలూ, సూదులూ అంటే అర్థం లేని భయాలుంటాయి. అంతెందుకు... ‘మన్మథుడు’ సినిమాలో హీరోకి నీళ్లపై నిర్మించిన వంతెనపై నడవడం కూడా తనకు భయమంటూ చెబుతాడు. ఇలా చాలామందికి చాలావాటి పట్ల అంటే... ఎరుగుతున్న కీటకాలంటే (ఉదా. గబ్బిలాలు), పాకుతుండే పాములంటే... ఆఖరికి సూది వాడాలన్నా అది గుచ్చుకుంటుందేమోనని కొందరికి భయమే. ఇలా ఏ అంశం గురించైనా అర్థం లేని భయాలు కలుగుతుండవచ్చు. కొందరిలో ఇవి చిన్నప్పట్నుంచీ ఉంటే... మరికొందరిలో పెద్దయ్యాక అభివృద్ధి చెందుతుంటాయి.నిర్హేతుకమైన ఈ భయాల ప్రభావాలు ఇలా... అకారణమైన ఈ భయాలు కొందరిలో వాళ్ల పనులను వాళ్లు చేసుకోనివ్వనంతగా దుష్ప్రభావాన్ని చూపుతాయి. చాలామంది తాము చేయాల్సిన పనిని వాయిదా వేయడం లేదా దాన్నుంచి తప్పుకుని తిరగడం చేస్తూ సమస్య నుంచి దూరంగా పారిపోతుంటారు. ఇది జీవితంలో ఎన్నో ఆనందాలను దూరం చేస్తుంది లేదా సులభంగా జరిగిపోయే పనులనూ జరగకుండా అడ్డుపడుతుంటుంది. ఉదాహరణకు ఓ ఆఫీసులో ఉద్యోగం చేసే వ్యక్తికి ఎత్తులంటే భయం. అతడు ఉద్యోగం చేసే ఆఫీసు ఏ పదో అంతస్తులోనో ఉంటే... మంచి వేతనం వచ్చే ఉద్యోగాన్ని కూడా తేలిగ్గా వదిలేసుకుంటాడు. అలాగే మరో వ్యక్తికి ఎత్తైన ఫ్లై ఓవర్ అంటే భయం. దాంతో ఫ్లై ఓవర్ ఎక్కితే కేవలం రెండు కిలోమీటర్లలో అధిగమించే దూరాన్ని... అదనంగా మరో పది కిలోమీటర్లు ప్రయాణించి చేరుతాడు. నిజానికి చూసేవారికి ఈ భయాలు అర్థం లేనివిగా కనిపిస్తాయి. పైగా ఇలాంటి చిన్నకారణాలతో పెద్ద పెద్ద ప్రయోజనాలు కోల్పోతారా అని ఆశ్చర్యం వేస్తుంది. కానీ ఫోబియాలతో బాధపడేవారికి అదే జీవన్మరణ సమస్య.ఈ ఫోబియాల (భయాల) విస్తృతి ఎంతంటే... ఈ లోకంలో పుట్టిన ప్రతి వ్యక్తిలోనూ అన్ని రకాల భయాలూ అంతో ఇంటో ఉండనే ఉంటాయి. నిజానికి ఈ భయాలకు ఏ వ్యక్తి కూడా అతీతుడు కాడు. ఉదాహరణక బల్లి మీద పడితే ఎవరైనా మొదట ఆందోళన చెందుతారు. కాకపోతే ఆ తర్వాత వెంటనే సర్దుకుంటారు. కానీ మనలోని 29% మందిలో ఏదో ఒక అంశంపైన ‘ఫోబియా’లు ఉండనే ఉంటాయి. అందునా పురుషులతో పోలిస్తే మహిళల్లో ఈ ఫోబియాలు రెట్టింపు మందిని బాధిస్తుంటాయని అంచనా. భయం, ఫోబియాల మధ్య తేడా... ఏదైనా ఆందోళన గొలిపే పరిస్థితుల్లో భయం కలగడమనేది చాలా సహజమైన ప్రక్రియ. ప్రమాదకరమైన ఆ పరిస్థితులనుంచి బయటపడటానికీ లేదా వాటి నుంచి దూరంగా పరుగెత్తడానికి భయం అవసరం కూడా. నిజానికి భయం కలగడం ఒక రక్షణాత్మకమైన చర్య. ఏవైనా ప్రాణాంతకమైన పరిస్థితుల్లో దాన్ని ఎదుర్కోడానికీ లేదా వీలుకాని పక్షంలో దాన్నుంచి దూరంగా పారిపోవడానికి ఈ భయం తోడ్పడుతుంది. దీన్నే ఫైట్ ఆర్ ఫ్లైట్ మెకానిజమ్గా చెబుతారు. జీవులన్నింటి మనుగడకూ ఇదే అంశం దోహదపడుతుంది. ఇదీ భయం వల్ల కలిగే ప్రయోజనం. కానీ ఫోబియాలో ఇలా జరగదు. అక్కడ వాస్తవంగా లేని ప్రమాదాన్ని సైతం బాధితులు ఊహిస్తూ ఉంటారు. ఉదాహరణకు చాలా భయంకరమైన కుక్క ఎదురైనప్పుడుఅది కరుస్తుందేమో అని భయపడటం సహజం. కానీ ఒకవేళ అది పెంపుడు కుక్క అయినప్పటికీ భయపడటంలో అర్థం ఉండదు. అలాగే పాము కనిపిస్తే భయం కలగడం సహజం. అయితే టీవీ స్క్రీన్ మీద పాము కనిపించినా లేదా పాము బొమ్మ చూసినా భయపడటం అంటే అది ‘ఫోబియా’కు సూచన అని అర్థం. ఇక్కడ డాగ్స్ వల్ల కలిగే అనవసర భయాలను ‘సైనో ఫోబియా’ (గ్రీక్ భాషలో సైనో అంటే కుక్క అని అర్థం) అనీ, పాముల వల్ల కలిగే భయాన్ని ‘ఒఫిడియో ఫోబియా’ లేదా ‘ఓఫియో ఫోబియా’ అంటారు. కొన్నిసార్లు దాన్నే ‘హెర్పెటో ఫోబియా’ అని కూడా అంటారు. అంటే ‘ఓఫిడియో ఫోబియా’లో పాములంటే భయమైతే ‘హెర్పెటో ఫోబియా’లో పాము జాతికే చెందిన బల్లులూ, బల్లిలాంటి ఇతర జీవుల భయాలను కలుపుకుని ‘హెర్పెటో ఫోబియా’ అంటారు. ఇక ఈ భయాలు ఎంత విచిత్రంగా ఉంటాయంటే అరుదుగా కొందరికి స్నానం చేయడమన్నా భయముంటుంది దీన్ని ‘ఆల్బుటోఫోబియా’ అనీ, పసుపురంగుకు భయపడటాన్ని ‘గ్జాంథోఫోబియా’ అనీ, చివరకు అద్దంలో చూసుకోడానికి బయపడటాన్ని ‘స్పెక్ట్రోఫోబియా’ (spectrophobia) అని అంటారు.భయాలు ఎలా మొదలవుతాయంటే... సాధారణంగా చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు వాళ్లలో చాలా అనవసరమైన భయాలు ఉంటాయి. వయసు పెరుగుతున్న కొద్దీ అవి తగ్గుతూ పోతుంటాయి. ఉదాహరణకు పిల్లలందరికీ చీకటి అంటే భయం. అయితే వయసు పెరుగుతున్నకొద్దీ ఆ భయాన్ని వారు క్రమంగా అధిగమిస్తారు. ఒకవేళ అధిగమించనంత దాన్ని పూర్తిగా ఫోబియా అనడానికి వీలు కాదు. అయితే ఏదైనా భయం వల్ల మనం తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కోవడం, దానివల్ల మన రోజువారీ పనులకూ, సామాజిక జీవనానికీ, పిల్లల్లోనైతే స్కూల్ జీవితానికీ, నిద్రకు ఆటంకం కలిగితే దాన్ని ఫోబియాగా గుర్తించి, దానికి అవసరమైన చికిత్స అందించాల్సి ఉంటుంది.ఏయే వయసు పిల్లల్లో ఎలాంటి భయాలు..?పిల్లల్లో సాధారణంగా కొన్ని కొన్ని వయసుల్లో కొన్ని విషయాలంటే భయం ఎక్కువగా ఉండవచ్చు. అవి... 0 – 2 ఏళ్ల పిల్లల్లో ... పెద్ద శబ్దాల పట్ల, అపరిచితులతో, తల్లిదండ్రులనుంచి విడిగా ఉండాల్సి రావడం వల్ల, పెద్ద పెద్ద వస్తువులంటే, కొన్ని జంతువుల పట్ల భయం ఉంటుంది. 3 – 6 ఏళ్ల పిల్లల్లో ... దెయ్యాలు, భూతాల వంటి అభూత కల్పనాత్మక పాత్రలంటే భయంతో పాటు ఒంటరిగా పడుకోవాల్సి రావడం, వింత శబ్దాలంటే భయం కలుగుతుంది. 7 – 16 ఏళ్ల పిల్లల్లో ... ఇలాంటి పిల్లల్లో అభూతకల్పనాత్మకమైన అంశాల కంటే వాస్తవ విషయాలపట్ల భయం కలుగుతుంది. అంటే ఆడుతున్నప్పుడు గాయాలవుతాయనే భయాలు, జబ్బు చేసినప్పుడు కలిగే భయాలు, స్కూల్లో పెర్ఫార్మెన్స్ తగ్గుతున్నప్పుడూ, ప్రకృతి విలయాలు, ఇతరత్రా ప్రకృతి విపత్తులు, ఉత్పాతాలంటే భయాలుంటాయి.ఫోబియాలు కలగడానికి కారణమయ్యే అంశాలు : ఫోబియాలను కలిగించడానికి కారణమయ్యే అంశాలు ఇవీ అంటూ నిర్దిష్టంగా చెప్పడానికి కుదరదు. అయితే చాలా సందర్భాల్లో కొన్ని భయాలు పెద్దల నుంచి పిల్లలకు వస్తుంటాయి. ఇలా కుటుంబాల్లో వంశపారంపర్యంగా వస్తుండవచ్చు. ఈ భయాలకు సాంస్కృతిక అంశాలూ కారణం కావచ్చు. తల్లిదండ్రులకు ఒక తరహా భయాలు ఉంటే అవి పిల్లలకు వచ్చే అవకాశాలు మూడింతలు ఎక్కువ. పిల్లల పట్ల మరీ ఎక్కువ రక్షణాత్మకంగా వ్యవహరించే తల్లిదండ్రుల పిల్లలతో పాటు... మరీ ఏమాత్రం పట్టించుకోకుండా వదిలేసిన తల్లిదండ్రుల పిల్లల్లోనూ ఫోబియాలు వచ్చే అవకాశాలు ఎక్కువ. ఏదైనా ఒక భయంకరమైన పరిస్థితిని ఎదుర్కొనలేక దాన్ని అధిగమించే ప్రయత్నంలో తీవ్రమైన ఒత్తిడి అనుభవించి, అప్పటికీ అధిగమించని వారిలో ఫోబియాలు అభివృద్ధి చెందే అవకాశాలు మరీ ఎక్కువ.సాధారణంగా మనలో ఉండే భయాలు, ఫోబియాలు : సాధారణంగా మనందరిలో భయాలూ, ఫోబియాలను నాలుగు రకాలుగా వర్గీకరించవచ్చు. అవి... జంతువుల పట్ల ఫోబియా... చాలామందికి పాములు, తేళ్ల వంటి విషజీవులన్నా, సాలెపురుగులూ లేదా ఇతర కీటకాలూ, ఎలుకలు, కుక్కలు, బొద్దింకలు, గబ్బిలాలంటే భయంగా ఉంటుంది. కొన్ని రకాల పరిసరాల కారణంగా వచ్చే ఫోబియా... ఉదాహరణకు ఎత్తుకు ఎక్కాక కిందికి చూడటం వల్ల, తుఫానుల్లో చిక్కుకోవడం, విశాలమైన జలరాశి మధ్యన ఉన్నప్పడు ఆ అనంతమైన నీటిని చూడటం వల్ల, చిమ్మచీకటిలో ఉండిపోవాల్సి రావడం పట్ల భయాలు కలుగుతాయి. కొన్ని పరిస్థితుల వల్ల కలిగే ఫోబియాలు: కొన్ని పరిస్థితుల్లో మనకు చాలా భయంగా ఉంటుంది. ఉదాహరణకు... అన్నివైపులా మూసుకుపోయి ఉన్నట్లుండే పరిసరాల పట్ల... అంటే ఉదాహరణకు ఊపిరానట్టుగా ఉండే ఇరుకు గదులు, లిఫ్టుల్లో చిక్కుకుపోవడాల పట్ల (క్లాస్ట్రోఫోబియా), వేగంగా డ్రైవింగ్ చేస్తున్న సమయాల్లో, గుహల్లోకి ప్రవేశించినప్పుడు, బ్రిడ్జ్పైకి వెళ్లినప్పుడు. గాయం, రక్తం, ఇంజెక్షన్ వంటి భయాలు : చాలామంది ఇంజెక్షన్ వంటి వాటికి భయపడుతుంటారు. లేదా ఎవరికైనా జబ్బుగా ఉండటం లేదా తాము చనిపోతామేమో లాంటి భయాల వంటివి ఉంటాయి.ఫోబియా లక్షణాలు... ఏదైనా భయం కాస్తా ఫోబియాగా రూపోందినప్పుడు మొదట తీవ్రమైన ఉద్విగ్నత (యాంగై్జటీ) కలిగి అది కాస్తా మరింత తీవ్రమైన (΄్యానిక్ అటాక్) రూపం తీసుకుంటుంది. దీన్ని ‘ఫుల్బ్లోన్ ప్యానిక్ ఎటాక్’గా చెప్పవచ్చు. మనం ఏదైనా విషయానికీ లేదా అంశానికీ భయపడుతుంటే... దానికి మనం ఎంత దగ్గరగా ఉంటే భయం అంతగా తీవ్రమవుతుంది. ఇక ఈ భయం తీవ్రత ఎంత ఎక్కువగా ఉంటే దాన్ని అధిగమించడం లేదా దాన్నుంచి బయటపడటం అంతే కష్టమవుతుంది. ఈ ఆందోళన / భయం / ఉద్విగ్నత (యాంగై్జటీ) తాలూకు లక్షణాలు రెండు రకాలుగా కనిపిస్తాయి. అవి... భౌతికంగా కనిపించే లక్షణాలు : ∙ఊపిరి పీల్చుకోవడం కష్టం కావడం ∙గుండె వేగం పెరగడం ∙చెమటలు పట్టడం ∙ఛాతీలో నొప్పి లేదా ఛాతీ బిగదీసుకుపోవడం ∙వణుకు ∙నిద్రవస్తున్నట్లు లేదా కళ్లు తిరుగుతున్నట్లు అనిపించడం ∙కడుపులో తిప్పినట్లుగా / దేవినట్లుగా ఉండటం. ∙ఒంట్లోంచి వేడి ఆవిరులు బయటకు వస్తున్న భావన. ఉద్వేగపూరితమైన లక్షణాలు : యాంగై్జటీ ఎక్కువ కావడం ఆ తర్వాత ప్యానిక్ అటాక్గా మారడం స్థలం లేదా పరిస్థితుల నుంచి పారిపోవాలన్న బలమైన కాంక్ష తనపై తాను అదుపు కోల్పోవడం కాసేపట్లో చచ్చిపోతామేమోన్న భావన మితిమీరి స్పందిస్తున్నామని తెలిసినా దాన్ని నియంత్రించుకోలేని శక్తిఫోబియా వర్గీకరణ ఇలా... సైకియాట్రిస్టులు ఫోబియాలను సాధారణంగా మూడు రకాలుగా వర్గీకరిస్తుంటారు. సామాజిక ఫోబియా (సోషల్ ఫోబియా): సాధారణంగా ఇవి అందరిలోనూ ఉండే సహజ భయాలే అయినా కొందరిలో మితిమీరి ఉంటాయి. ఉదాహరణకు కొందరు నలుగురిలో మాట్లాడటానికి చాలా ఎక్కువగా భయపడుతుండవచ్చు. అలాగే మరికొందరు బయట తినడం అనే విషయం పట్ల తీవ్రంగా ప్రతిస్పందిస్తూ దాని వల్ల కలిగే పరిణామాలను అతిగా ఊహించుకుంటారు. సాధారణంగా సోషల్ ఫోబియాలు చికిత్సకు ఒక పట్టాన తేలిగ్గా లొంగవు. సామాజిక ఫోబియాలు తమకు చిన్నప్పుడు ఎదురైన సామాజిక అవమానాల కారణంగా కలుగుతాయి. సాధారణంగా పదవ ఏటి కంటే ముందు ఎదురైన సామాజిక అవమానాల కారణంగా ఏర్పడ్డ భయాలు కొందరిలో కాలక్రమేణా తొలగిపోవచ్చు. కానీ యుక్తవయసులో తమ స్నేహితుల నిరాదరణకు గురైన కారణంగా ఏర్పడ్డ భయాలు అంత తేలిగ్గా తొలగిపోవు. కొందరిలో అవి వయసుతో పాటు పెరుగవచ్చు. నిర్దిష్ట ఫోబియాలు (స్పెసిఫిక్ ఫోబియాస్): ఈ ఫోబియాలు నిర్దిష్టంగా ఫలానా అంశం వల్ల కలుగుతుండే భయాలు అని చెప్పవచ్చు. ఉదాహరణకు పాములు, నీళ్లు, ఎత్తులు, లిఫ్ట్, విమానప్రయాణం, వ్యాధుల పట్ల భయం మొదలైనవి.అగారోఫోబియా : ఇది ఇంటికి దూరంగా ఉన్నప్పుడు లేదా మనకు సురక్షితంగా ఉన్న స్థలానికి దూరంగా ఉన్నప్పుడు కలిగే తీవ్రమైన భయాలు అని చెప్పవచ్చుప్యానిక్ అటాక్ అంటే...ఏదైనా ఫోబియాకు గురై భయపడటంలోని తీవ్రత తారస్థాయికి చేరినప్పుడు కలిగే మానసిక స్థితిని ప్యానిక్ అటాక్గా చెప్పవచ్చు. ఇది కలిగినప్పడు కనిపించే లక్షణాలివి... తమకు భయంగొలిపే ప్రదేశం / అంశం / పరిస్థితి నుంచి దూరంగా పారిపోవాలన్న బలమైన కాంక్ష తీవ్రమైన భయం గుండెవేగంలోని తీవ్రత చాలా ఎక్కువగా పెరగడం శ్వాస అందకపోవడం వణుకు ఒక్కోసారి స్పృహతప్పడం చనిపోయినట్లుగా అనుభూతి చెందడం. ఫోబియాల దుష్ప్రభావాలిలా : ఫోబియాలకు చికిత్స చేయించకుండా వదిలేస్తే అవి వ్యక్తిగత జీవితాన్ని దుర్భరం చేస్తాయి. వాటిని దాచిపెట్టినా సరే... దాని ఫలితాలు జీవితాన్ని చాలా తీవ్రంగా ప్రభావితం చేయవచ్చు. ఉదాహరణకు విమాన ప్రయాణం అంటే భయం ఉంటే దాన్ని దాచితే జీవితంలో చాలా కోల్పోవచ్చు. అలాగే కొన్ని ఫోబియాల వల్ల వ్యక్తిగత జీవితంలో స్నేహితులను, బంధువులకు దూరం కావడం, ఉద్యోగం కోల్పోవాల్సి రావడం వంటి తీవ్రపరిణామాలు సంభవించవచ్చు. ఫోబియా ఉన్నవారు వాటిని అధిగమించదలచినప్పుడు క్రమంగా మెరుగుదల కనిపిస్తుంది తప్ప... అకస్మాత్తుగా అంతా చక్కబడదు. మిగతా వారిలో పోలిస్తే ఆల్కహాల్ అలవాటు ఉన్నవారికి ఫోబియాలకు గురయ్యే అవకాశాలు పదింతలెక్కువ. ఇక అలాగే ఫోబియాలు ఉన్నవారు ఆల్కహాల్కు అలవాటు పడే అవకాశాలూ రెండింతలెక్కువ. ఒక్కోసారి ఫోబియా (Phobia) వల్ల కలిగే యాంగై్జటీ (ఉద్విగ్నత) ప్రమాదకరమైన పరిస్థితికి, కొన్నిసార్లు గుండెజబ్బులకు దారితీయవచ్చు.ఫోబియాలూ... చికిత్స : ఫోబియాకు సమర్థమైన చికిత్స సైకోథెరపీ (కౌన్సెలింగ్). దీనితో పాటు కొన్నిసార్లు కొన్ని మందులు కూడా ఉపయోగించాల్సి వస్తుంది. కొన్ని సందర్భాల్లో ఈ రెండూ అవసరమవుతాయి.మొదట స్వయంసహాయం... ఫోబియాల విషయానికి వస్తే స్వయంసహాయ పద్థతులు చాలా బాగా పనిచేస్తాయి. అయితే ఒకవేళ వాటి వల్ల రోగి యాంగై్జటీ తగ్గక ΄్యానిక్ అటాక్స్ వస్తూనే ఉంటే అప్పుడు నిపుణుల సహాయం కావాలి. ఇప్పుడు శుభవార్త ఏమిటంటే... గతంతో పోలిస్తే ఫోబియాల చికిత్సతో మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి.రిలాక్సేషన్ టెక్నిక్స్ అభ్యాసం చేయడం... మనకు ఏదైనా విషయంలో భయం వేయగానే ఉద్విగ్నత (యాంగ్జైటీ) కలుగుతుంది. దానివల్ల కొన్ని గుండెవేగం పెరగడం, ఊపిరి ఆడనట్లుగా ఉండటం (సఫొకేటింగ్) వంటి భౌతిక లక్షణాలు కనిపిస్తాయి. వీటి వల్ల మన భయం మరింతగా పెరిగినట్లయి, నిరాశలోకి కూరుకుపోతారు. అందుకే యాంగై్జటీని అధిగమించే ప్రయత్నంలో భాగంగా రిలాక్సేషన్ టెక్నిక్స్ను నేర్చుకుని, వాటిని అభ్యాసం చేయడం వల్ల క్రమంగా ఉద్విగ్నతను, ప్యానిక్ ఫీలింగ్స్ను ఎదుర్కోవచ్చు. రిలాక్సేషన్ టెక్నిక్స్లో బలంగా ఊపిరిపీల్చడం (డీప్ బ్రీతింగ్), ధ్యానం, యోగా వంటి వాటితో ఉద్విగ్న పరిస్థితుల్లోనూ స్థిమితంగా ఉండటం ప్రాక్టీస్ చేయవచ్చు.ప్రతికూల ఆలోచనలను అధిగమించడం... వాస్తవానికి ఒక ఫోబియా స్థితిలో అసలు భయం కంటే... దాని వల్ల కలిగే ప్రతికూల (నెగెటివ్) ఆలోచనల వల్లనే ఎక్కువగా భయం కలుగుతుంది. ఉదాహరణకు ఒక బ్రిడ్జ్పై వెళ్తుంటే... అది బాగానే ఉన్నా... ఒకవేళ కుప్పకూలితే అన్న ఆలోచన కలగగానే ఆ అనంతర పరిణామాలను ఊహించడం వల్ల కలిగే భయమే ఎక్కువ. కాబట్టి ఇలాంటి అనవసరమైన ప్రతికూల ఆలోచనలను దూరం చేసుకుంటే భయాలు కలగవు. కొన్ని సాధారణ ఆలోచనలనూ వదులుకోవాలి. ఏదైనా సంఘటన తర్వాత మనకూ అది జరుగుతుందనే ఆలోచన రావడం సహజమే అయినా అదేపనిగా వాటి గురించే ఆలోచించకూడదు. ఉదాహరణకు ఇటీవల బస్సు దహనం సంఘటనలూ, బస్సు ప్రమాదాలూ వరసగా చోటు చేసుకున్నాయి. దాంతో మనం ఎక్కే బస్సు కూడా ప్రమాదానికి లోనవుతుందేమో అన్న ఆలోచన రావడం సహజం. కానీ అదే నెగెటివ్ ఆలోచన మనను ఆవరించకుండా చూసుకోవాలి. అలాగే మనం విమాన ప్రయాణం చేస్తూ ఉంటే... ఇటీవల గుజరాత్లో కూలినట్టుగా అది కుప్పకూలిపోతోందేమోనని ఆలోచనను మనల్ని ఆవరించకుండా చూసుకోవాలి. కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ (సీబీటీ) : ఫోబియాలను గణనీయంగా తగ్గించేందుకు ఉపయోగపడే చికిత్స ప్రక్రియ కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ. సీబీటీ అంటే ఒకరకమైన కౌన్సెలింగ్. దీనితో పాటు మందులు కూడా వాడాల్సిన అవసరం ఉంటుంది. ఉదాహరణకు యాంటీ డిప్రెసెంట్స్, బీటా బ్లాకర్ మెడిసిన్స్, బెంజోడయాజిపైన్స్ వంటి మందులతో పాటూ సీబీటీ చేయాల్సి ఉంటుంది. చివరగా... కౌన్సెలింగ్, కాగ్నిటివ్ థెరపీ, రిలాక్సేషన్ టెక్నిక్స్లతో పాటు అవసరాన్ని బట్టి మందులు, ఇతర ప్రక్రియలన్నింటి సహాయంతో చేసే చికిత్సలు... వీటన్నింటి సహాయంతో ఇప్పుడు ఫోబియాలను దాదాపుగా పూర్తిగా తగ్గించడం సాధ్యమే.- డాక్టర్ పులి వనజారెడ్డి కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్ నిర్వహణ: యాసీన్ -
మ్యాడ్ హనీ: ఒక్క చుక్క సిప్ చేశారో..ప్రాణాలకే ముప్పు!
పూలమకరందాన్ని సేవించి తేనెటీగలు ఉత్పత్తి చేసే తియ్యటి తేనె ఎన్ని ఔషధ ప్రయోజనాలు కలిగి ఉందో తెలిసిందే. కానీ ఇప్పుడు చెప్పబోయే తేనె మాత్రం అత్యంత విషపూరితమైనది. అయితే దీన్ని కూడా పలు చికిత్సల్లో ఉపయోగిస్తారు. అలాగని నేరుగా సిప్ చేశారో అంతే పరిస్థితి. ఆ మధువే..మ్యాడ్ తేనే. ఇది మాదకద్రవ్య ప్రభావాలు కలిగిన తేనె అట. ఇది కేవలం నేపాల్, టర్కీలలో ఉత్పత్తి అవుతుందట. హిమాలయ ప్రాంతాలలో జెయింట్ అనే తేనెటీగలు రోడోడెండ్రాన్ అనే పువ్వుల నుంచి ఈ తేనెను ఉత్పత్తి చేస్తాయట. ఇందులో మాదక ద్రవ్య ప్రభావం తోపాటు, విషపూరితమైన గ్రేయానోటాక్సిన్లను కూడా కలిగి ఉంటుందట. ప్రాచీన గ్రీసులు ఈ మ్యాడ్ హానీని బయో వెపన్గా ఉపయోగించేవారట. పురాతన గ్రీకు గ్రంథాల్లో గ్రీకు సైనిక నాయకుడు జెనోఫోన్ దీని గురించి రాశాడని చెబుతున్నాయి. అంతేగాదు క్రీస్తూ పూర్వం జనరల్ పాంపే ఆధ్వర్యంలో రోమన్ సైనికులపై జరిగిన మూడవ మిథ్రిడాటిక్ యుద్ధంలో రాజు మిథ్రిడేట్స్ మ్యాడ్ హనీని బయో వెపన్గా ఉపయోగించినట్లు గ్రంథాలు చెబుతున్నాయి. ఈ తేనె కామోద్దీపన కోరికలను పెంచుతుందట కూడా.ఎలా సేకరిస్తారంటే..మధ్య నేపాల్, ఉత్తర భారతదేశంతో సహా హిందూ కుష్ హిమాలయ ప్రాంతంలో వసంతకాలంలో లోయలలో రోడోడెండ్రాన్లు వికసించినప్పుడు తేనెటీగగలు ఈ బంగారు రంగు తేనెను ఉత్పత్తి చేస్తాయట. చెట్టుకొమ్మలపై సుమారు 1200 నుంచి, 4 వేల మీటర్ల ఎత్తులో కనిపిస్తాయట. నేపాల్లోని గురుంగ్ అనే తెగ వారు ఈ మ్యాడ్ తేనెని సేకరిస్తారట. ఒకప్పడూ ఎక్కడపడితే అక్కడ దర్శనమిచ్చే ఈ తేనెతుట్టలు..ఇప్పుడు ఆనకట్ట నిర్మాణాల కారణంగా కనుమరుగవుతున్నాయని చెబుతున్నారు నిపుణులు.ప్రయోజనం, ప్రమాదం రెండూ ఉన్నాయి..దీన్ని కామోద్దీపనంగా, జీర్ణశయాంతర రుగ్మతలకు(పెప్టిక్ అల్సర్ వ్యాధి, డిస్స్పెప్సియా, గ్యాస్ట్రిటిస్, రక్తపోటు వంటి వ్యాధుల చికిత్సకు ఉపయోగిస్తారు. అంతేగాదు గొంతునొప్పి, ఫ్లూ, డయాబెటిస్, ఆర్థరైటిస్ వంటి చికిత్సలలో కూడా ఉపయోగిస్తారు. అలాగని ఆ తేనెని సిప్ చేశారో ఇక అంతే..టెక్సాస్ ఇన్స్టిట్యూట్ జర్నల్లో ప్రచురితమైన ఒక కేసులో.. ఓ భార్యభర్తలు తమ దాంపత్యం మరింత బాగుండాలని ఈ తేనెని ఒక వారం పాటు తీసుకున్నారు. ఫలితంగా రెండు గంటల్లోనే తీవ్రమైన ఇన్ఫీరియర్ మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్ (రక్త ప్రవాహంలో ఆకస్మిక అడ్డంకి వల్ల కలిగే గుండెపోటు)తో ఎమర్జెన్సీ వార్డులో చేరారు. ఇది రక్తపోటుని పడిపోయేలా చేసి, శాసకోశ సమస్యలు, తలతిరగడం, వంటి ఇబ్బందులను ఎదుర్కొనాల్సి ఉంటుందని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. ఒక్కోసారి కండరాల పక్షవాతం, అట్రియోవెంట్రిక్యులర్ బ్లాక్లు, స్పృహ కోల్పోవడం వంటివి సంభవిస్తాయి కూడా. అందువల్లే ఈ తేనెని టేస్ట్ చేయాలంటే మాత్రం డాక్టర్ పర్యవేక్షణలో, వారి సలహాలు సూచనల మేరకు ట్రై చేయాలే తప్ప..నేరుగా సిప్ చేసే సాహసం చేశారో.. ఆరోగ్యం డేంజర్లో పడ్డట్టే. View this post on Instagram A post shared by Medicinal Mad Honey® | Mad Honey Nepal (@medicinal.madhoney) (చదవండి: మా అమ్మ రష్యాలో సెలబ్రిటీ..! మురిసిపోతున్న కుమారుడు..) -
మూత్రం ఆపుకొంటే ముప్పే !
లబ్బీపేట(విజయవాడతూర్పు): వాష్రూమ్స్ కంపు కొడుతున్నాయని కొందరు, అందుబాటులో లేక ఇంకొందరూ, సమయం లేని మరికొందరూ యూరిన్ వస్తున్నా.. గంటల కొద్ది ఆపుకొంటున్న వారు అనేక మంది ఉంటున్నారు. అంతేకాదు ఇంటి నుంచి విధులకు, కళాశాలలకు వెళ్లే వారు తిరిగి ఇంటికి వచ్చే వరకూ మూత్ర విసర్జన చేయని వారు కూడా ఉంటున్నారు. నీళ్లు తాగితే వాష్రూమ్కి వెళ్లాల్సి వస్తుందని తక్కువగా తాగుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఇలాంటి వారిలో మూత్రాశయ, కిడ్నీ సమస్యలు తలెత్తుతుండటంతో ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు. నగరంలోని యూరాలజిస్టుల వద్దకు వస్తున్న వారిలో ఇలాంటి వారు అధికంగా ఉంటున్నారు. మూత్రం వస్తున్నట్లు సిగ్నల్ వచ్చిన తర్వాత ఆపుకోవడం కరెక్ట్ కాదంటున్నారు. అలా చేయడం ద్వారా అనేక అనారోగ్య సమస్యలకు దారితీసే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ఇవే నిదర్శనం.. గవర్నర్పేటకు చెందిన డిగ్రీ విద్యార్థిని మూత్రం వస్తే ఆపుకోలేక అర్జెంట్గా వెళ్లాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. తరగతి గదిలో ఉన్నప్పుడు కూడా తీవ్ర ఇబ్బంది పడుతుండటంతో యూరాలజిస్టును సంప్రదించారు. ఎక్కువ సేపు మూత్రానికి వెళ్లకుండా ఆపుకోవడం వలన ఇలాంటి సమస్య తలెత్తినట్లు వైద్యులు తెలిపారు. పటమటకు చెందిన ఓ ఉద్యోగిని 36 గంటల వరకూ యూరిన్ రాకపోవడంతో యూరాలజిస్టు వద్దకు వెళ్లారు. అక్కడ పరీక్ష చేస్తే యూరినరీ బ్లాడర్ పెరిగినట్లు ఉంది. అంటే ఎక్కువ సేపు మూత్రం ఆపుకోవడం వలన ఇలాంటి సమస్య తలెత్తినట్లు నిర్ధారించారు. ఇలా అనేక మంది మూత్ర సమస్యలు, కిడ్నీలో రాళ్లతో వైద్యులను సంప్రదిస్తున్నారు. సమస్యలివే.. యూరిన్ బ్లాడర్లో రెండు లీటర్ల వరకూ యూరిన్ నిల్వ ఉంటుందని, పెరిగితే యూరిన్కు వెళ్లాలనే సిగ్నల్ వస్తుంది. అలా వచ్చినప్పుడు మూత్ర విసర్జన చేయకుండా, బ్లాడర్లో యూరిన్ మూడు, నాలుగు లీటర్లకు చేరుతుంది. అలా యూరిన్ పెరగడం వలన యూరిన్ బ్లాడర్ ఎన్లార్జ్ అవుతుంది. కిడ్నీలపై ఒత్తిడి పెరిగి, వాటి పనితీరుపై ప్రభావం చూపుతుంది. ఇలాంటి వారిలో యూరినరీ ప్రాబ్లమ్స్ తలెత్తుతాయి. యూరిన్కు సిగ్నల్ వచ్చిన వెంటనే అర్జంట్గా వెళ్లాల్సి వస్తుంది. ఒక్కోసారి వాష్రూమ్కు వెళ్తుండగానే యూరిన్ పడిపోతుంది. కొందరిలో అసలు యూరిన్ రాకుండా ఆగిపోతుంది. ఇలాంటి సమస్యలతో టీనేజ్ పిల్లలతో పాటు పెద్ద వారు ఆస్పత్రులకు వస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు. నీళ్లు తాగడం లేదు.. నీళ్లు తాగితే మూత్ర విసర్జన చేయాల్సి వస్తుందని, విద్యార్థులే కాదు, ఉద్యోగుల్లో కూడా చాలా మంది తక్కువగా నీరు తాగుతున్నారు.ఇలాంటి వారిలో మూత్ర కోశ సమస్యలతో పాటు, కిడ్నీలో రాళ్లు కూడా వస్తున్నాయి. కిడ్నీలో రాళ్లు రావడానికి ఆహార అలవాట్లతో పాటు తక్కువగా నీళ్లు తాగడమే ప్రధాన కారణంగా వైద్యులు చెబుతున్నారు. ఇలాంటి వారిలో యూరినరీ ట్యూబ్ సన్నబడటం కూడా జరగవచ్చు. కిడ్నీల్లో రాళ్లు రాకుండా ఉండేందుకు రోజుకు 3 నుంచి 4 లీటర్లు నీటిని తాగాలని వైద్యులు సూచిస్తున్నారు. ్రప్రొస్టేట్ సమస్యలతో... ప్రస్తుతం 50 ఏళ్లు దాటిన వారిలో ప్రొస్టేట్ సమస్య కామన్గా మారినట్లు వైద్యులు చెబుతున్నారు. ప్రొస్టేట్ సమస్య కారణంగా అతిగా మూత్రం రావడం, అసలు రాకపోవడం, తక్కువగా రావడం వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. 50 ఏళ్లు దాటిన వారు ప్రొస్టేట్ పరీక్ష చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ప్రొస్టేట్ సమస్యలున్న 90 శాతం మందిలో మందులతోనే నయం చేయవచ్చునంటున్నారు. కేవలం 10 శాతం మందికి మాత్రమే సర్జరీ అవసరం అవుతుందంటున్నారు. మూత్రం వస్తున్న సిగ్నల్ వచ్చిన తర్వాత ఎక్కువ సేపు ఆపుకోవడం సరికాదు. అలా చేయడం ద్వారా మూత్రాశయ, కిడ్నీల సమస్యలు తలెత్తుతున్నాయి. మా వద్దకు వచ్చే వారిలో కిడ్నీలో రాళ్లు, ప్రొస్టేట్ సమస్యలు, యూరినరీ ట్యూబ్ సన్నబడటం, అర్జంట్గా యూరిన్ రావడం, అసలు రాకపోవడం వంటి వారు ఉంటున్నారు. కిడ్నీలో రాళ్లు, ప్రోస్టేట్ సమస్యలున్న వారికి అందరికీ సర్జరీ అవసరం లేదు. చాలా మందిలో మందులతో నయం చేయవచ్చు. యూరిన్ ట్యూబ్ సన్నబడటం వంటి సమస్య పుట్టుకతో పిల్లల్లో కూడా ఉంటుంది. అలాంటి వారికి మందులు, సర్జరీ ద్వారా సరిచేస్తున్నాం. 10 ఏళ్లలో 12,500 వరకూ యూరాలజీ సర్జరీలు చేశాం. – డాక్టర్ గుంటక అజయ్కుమార్, యూరాలజిస్ట్ -
అత్యంత అరుదైన వ్యాధి: కంటి రెప్పల్లో పేలు..!
తల్లో పేలు గురించి విన్నాం కానీ, కనురెప్పల్లో పేలు ఉండటం గురించి వినలేదు కదా..!. కనురెప్పల్లో చుండ్రు ఉంటుందని తెలుసగానీ ఇదేంటీ..పేలు ఉండటం అని విస్తుపోకండి. ఎందుకంటే..నిజంగానే ఓ మహిళ కంట్లో ఏకంగా 250 పేలను గుర్తించారు వైద్యులు. తొలుత వైద్యులు సైతం ఆశ్యర్యపోయారు. ఆ తర్వాత ఈ వ్యాధి గురించి క్షుణ్ణంగా తెలుసుకుని మరి చికిత్స అందించి ఆమెకు చక్కటి ఉపశమనం అందించారు. అసలేంటి ఈ సమస్య? ఎందుకు వస్తుంది వంటి వాటి గురించి సవివరంగా చూద్దామా..!గుజరాత్లోని ఆమ్రేలి జిల్లా సావర్ కుండ్ల ఆస్పత్రిలో ఈ ఘటన చోటు చేసుకుంది. 66 ఏల్ల గీతాబెన్ కంటిలో తీవ్రమైన దురద, నొప్పితో బాధపడుతూ ఆస్పత్రికి వచ్చింది. సూరత్కు చెందిన గీతాబెన్కు ఈ సమస్య గత రెండున్నర నెలలుగా వేధిస్తోంది. కళ్లు ఎర్రబారిపోవడం, సరిగా నిద్రపట్టకపోవడం వంటి సమస్యలతో సతమతమైంది. దీంతో కంటి డాక్టర్ మృగాంక్ పటేల్ ఆమె కళ్లను పరీక్షించగా.. రెప్పల్లో ఏకంగా పేలు ఉన్నట్లు గుర్తించారు. మొదట ఆయన కూడా ఇదేంటని విస్తుపోయారు. ఆ తర్వాత వివిధ అధ్యయన పత్రాలను శోధించి.. ఇలాంటి వింత కేసు గురించి తెలుసుకున్నట్లు తెలిపారు. దీన్ని వైద్య పరిభాషలో ఫిరాయసిస్ పాల్పిబ్రారమ్ అంటారని చెప్పారు. తాము మాగ్నిఫికేషన్ కింద కనురెప్పల్ని పరిశీలించినప్పుడు, పేలు కదులుతున్నట్లు గుర్తించామని అన్నారు. వాటి తోపాటు గుండ్రని పేను గుడ్లను కూడా కనిపించాయని వెల్లడించారు. వీటిని తొలగించాలంటే చాలా సమయం పడుతుందని ముందుగానే బాధిత మహిళకు తెలియజేసి మరి ఆపరేషన్కి సిద్ధం చేశారామెను. అయితే ఆమెకున్నవైద్య పరిస్థితుల రీత్యా ఎలాంటి ఇంజెక్షన్లు ఇవ్వకుండా ఒక్కొక్కపేనుని ఓపికగా తొలగించారు వైద్యులు. ఈ పరాన్న జీవి కంటి రెప్ప మూయగానే అమాంతం రక్తం తాగేస్తుందట. ఎందుకంటే అక్కడ కణజాలాం చాలా పల్చగా ఉండి, సులభంగా రక్తాన్ని పీల్చేయగలదని అన్నారు. పైగా అక్కడ కనురెప్పలకు అతుక్కుపోయి ఉంటాయట. దీని కారణంగా పేషెంట్కి దురద, మంట వస్తుందట. అదీగాక ఇవి తొలగించాలనుకున్నా..అంత తేలిగ్గా రావట కూడా. ప్రత్యేక పరికరంతో తొలగింపు ప్రక్రియ..ఈ పేలు వెలుతురు పడినప్పుడూ కదులుతుంటాయట. కాబట్టి వాటిని తొలగించడానికి మెక్ఫర్సన్ అనే ప్రత్యేక పరికరం ఉపయోగించి ప్రతీ పేనుని పట్టుకుని బయటకు తీసినట్లు వివరించారు. అలాగే ఆ మహిళకు నొప్పి తెలియకుండా అనస్థీషియా ఇచ్చాం అని వైద్యుడు మృగాంక్ వెల్లడించారు. తన 21 ఏళ్ల అనుభవంలో ఇలాంటి కేసు మొట్టమొదటిదని, అస్సలు ఎప్పుడూ ఇలాంటి కేసు ఎదురవ్వలేదని అన్నారు. బాధిత మహిళ కంటి రెప్పల్లోంచి ఏకంగా 250 పేలు, 85 గుడ్లు(లార్వా)లు తొలగించినట్లు తెలిపారు.ఫిరాయసిస్ పాల్పిబ్రారమ్ అంటే..యుఎస్ నేషనల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ ఇన్ఫర్మేషన్ ప్రకారం.. ఫిరాయసిస్ పాల్పిబ్రారమ్ అనేది అరుదైన వైద్య పరిస్థితి. దీనివల్ల పేలు, వాటి గుడ్లు కనురెప్పలలో చేరుతాయి. దాంతో తీవ్రమైన దురద, కళ్లు ఎర్రబారడం, నిద్రలేమి వంటి సమస్యలు ఉత్ఫన్నమవుతాయట. అయితే ఇది సాధారణ కంటి ఇన్ఫెక్షన్కానందున నిర్థారించడం కష్టమని అన్నారు. వీటి లార్వాలు అచ్చం దోమ లార్వాలనే ఉంటాయని చెప్పారు.ఈ పరిస్థితి ఎందుకొస్తుందంటే..ఇన్ఫెక్షన్ కారణంగా లేదా పరిశుభ్రత లోపించినప్పుడు ఈ పరిస్థితి తలెత్తుతుందని చెబుతున్నారు వైద్యులు. పేలు రావడానికి కొన్ని రకాల వాతావరణాలు, ఇంట్లోని దిండ్లు కారణం కావొచ్చని అన్నారు. ఈ వ్యాధి మనుషులతోపాటు పశువుల్లో కూడా కనిపిస్తుందని చెబుతున్నారు వైద్యులు. ముఖ్యంగా అడవుల్లో తిరిగే వాళ్లకు, పశువులకు దగ్గరగా ఉండేవాళ్లకు ఇవి వెంటనే అటాక్ అవుతాయట. వెంటనే కనురెప్పలకు చేరి అక్కడ తిష్టవేస్తాయని చెబుతున్నారు నిపుణులు. ఇవి కాంతి పడినప్పుడూ పారిపోతాయి కాబట్టి లైట్ లేకుండా తొలగించాలని చెబుతున్నారు వైద్యులు. పైగా ఈ పరాన్నజీవి లార్వాలను ఏ ఔషధం చంపలేదని అన్నారు. వాటిని ఒక్కొక్కటిగా పట్టుకుని కంటి నుంచి తొలగించడం ఒక్కటే మార్గం అని అన్నారు.'తలలో ఉండే పేలు కంటి పేలు భిన్నంగా ఉంటాయి. కంటి పేలు, కంట్లోని తెల్లటి భాగంలో తిరుగుతూ వెలుతురు నుంచి పారిపోతాయి. అవి కంటి రెప్ప లోపల, చీకటిగా ఉండే భాగంలో జీవిస్తాయి. అక్కడే ఉంటాయి' అని చెప్పుకొచ్చారు డాక్టర్ మృగాంక్. లక్షణాలు కంటి నొప్పి, కళ్ళలో ఎప్పుడూ దురద, నిద్రలేమి కనురెప్పల వాపు, నీరు కారడం వంటివి తీసుకోవాల్సిన జాగ్రత్తలు..పరిశుభ్రత పాటించడం చాలా ముఖ్యమని సూచించారు. చేతులను క్రమం తప్పకుండా శుభ్రంగా కడుక్కోవాలని అన్నారు. పిల్లలు, వృద్ధులు ఎక్కువగా ప్రభావితమయ్యే అవకాశం ఉందని, యువతలో ఈ పరిస్థితి వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుందని చెప్పారు.(చదవండి: కాలు మీద కాలు వేసుకుని కూర్చోవడం... అమర్యాద...అనారోగ్యకరం కూడానా?) -
కాలు మీద కాలు దర్జా కాదు ... అమర్యాద...అనారోగ్యకరం కూడానా?
‘‘ఇది నా కాలు ఈ కాలు కూడా నాదే. నా కాలు మీద నా కాలు వేసుకుంటే నీకేంటి?’’అని అడుగుతాడు పుష్ప సినిమాలో హీరో. ఈ డైలాగ్ ఎంత పాప్యులరో.. కాలు మీద కాలు వేసుకుని కూర్చోవడం అనే అంశం కూడా ఇప్పుడు అంతకు మించి పాప్యులర్గా మారింది. ఆ మధ్య టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ దగ్గర నుంచి తాజాగా ప్రధానితో మహిళా క్రికెటర్ల సమావేశం దాకా...అనేక సందర్భాల్లో కాలు మీద కాలు వేసుకుని కూర్చోవడం అనేది చర్చనీయాంశంగా మారుతోంది. మన సంప్రదాయాల ప్రకారం... ఎవరి ముందైనా మనం కాళ్ల మీద కాలు వేసుకుని కూర్చోవడం అంటే అవతలి వ్యక్తికి మర్యాద ఇవ్వాల్సిన అవసరం లేదని మనం భావిస్తున్నట్టు. తరాల నుంచీ కొనసాగుతున్న ఈ నమ్మకమే ఆధునిక సమాజంలో తరచుగా వివాదస్పదం అవుతోంది. ఆ వివాదాలు అలా ఉంచితే... అసలు కాలు మీద కాలు వేసుకుని కూర్చోవడం అనేది అనారోగ్యకరం కూడా అంటున్నాయి అధ్యయనాలు కొన్ని అభిప్రాయాలు. చాలా మందికి ఒక కాలు మీద మరొక కాలు వేసుకుని కూర్చోవడం చాలా సౌకర్యంగా ఉంటుంది. పాదం అప్పుడప్పుడు తిమ్మిరిగా అనిపించడం ఉన్నా అది సౌకర్యవంతంగా ఉంటుంది అని అదే ఫాలో అవుతారు. కానీ అది మీకు మంచి చేస్తుందా? హాని చేస్తుందా? చేస్తే ఎవరికి? ఎలా? ఎందుకు?గర్భిణీలకు...గర్భధారణ సమయంలో, శరీరం వివిధ రకాల మార్పులకు లోనవుతుంది. గర్భాశయం విస్తరించినప్పుడు, గురుత్వాకర్షణ కేంద్రం ముందుకు మారుతుంది. తద్వారా సాధారణానికి భిన్నంగా నడుస్తున్నట్లు, నిలబడి, కూర్చోవడం జరుగుతుంది. గర్భధారణ సమయంలో కండరాల ఒత్తిడి, వెన్నునొప్పి తిమ్మిర్లు అన్నీ సాధారణం. కాళ్ళు క్రాస్ చేసి కూర్చోవడం వల్ల బిడ్డకు ఎటువంటి హాని జరగకున్నా గర్భిణికి చీలమండ వాపు లేదా కాళ్ళ తిమ్మిరి కలిగేందుకు ఇది దోహదం చేస్తుంది.రక్తపోటు...ఎవరికైనా రక్తపోటును పరీక్షించే సమయంలో సాధారణంగా రెండు పాదాలను నేలపై ఉంచమని అడుగుతారు. ఎందుకంటే కాళ్లు ఒకదానిపై మరొకటి వేయడం వల్ల రక్తపోటు పెరుగుతుంది కాబట్టి. జర్నల్ ఆఫ్ క్లినికల్ నర్సింగ్ ట్రస్టెడ్ సోర్స్లో ప్రచురించిన ఒక అధ్యయనంలో కాళ్లను ఒకదానిపై ఒకటి వేసి కూర్చోవడం వల్ల రక్తపోటులో కలిగే మార్పులను స్పష్టంగా గమనించారు. అదే విధంగా జర్నల్ ఆఫ్ హైపర్టెన్షన్ లో ప్రచురించిన మరొక అధ్యయనంలో, తమ చీలమండను మోకాలిపై ఉంచడం ద్వారా రక్తపోటు పెరిగినట్లు కనుగొన్నారు.వెరికోస్వెయిన్స్...కాళ్ళ నుంచి బయటకు వచ్చే ఉబ్బిన, మెలితిరిగిన, త్రాడు లాంటి సిరలు యవెరికోస్ వెయిన్్స. సాధారణంగా తొడల వెనుక లోపలి కాలుపై ఎక్కువగా కనిపిస్తాయి. సిరల్లోని కవాటాల సమస్య కారణంగా వెరికోస్ వెయిన్ ్స ఏర్పడతాయి, ఇవి గుండె వైపు రక్తాన్ని పంప్ చేయడానికి చాలా కష్టపడి పనిచేస్తాయి. రక్తం పైకి కదులుతున్నప్పుడు, వన్–వే వాల్వ్లు తెరుచుకుంటాయి, మూసుకుపోతాయి, రక్తం తిరిగి క్రిందికి లీక్ అవ్వకుండా నిరోధిస్తాయి. అయితే, ఈ కవాటాలు బలహీనమైనప్పుడు లేదా దెబ్బతిన్నప్పుడు, గురుత్వాకర్షణ శక్తి రక్తాన్ని వెనక్కి లాగుతుంది. దీనిని సిరల లోపం అంటారు. ఆ రక్తం వెనక్కి వచ్చి, సేకరించి, ఉబ్బినప్పుడు సిరలు వెరికోస్ వెయిన్స్గా మారతాయి. చాలా సేపు నిలబడటం కూర్చోవడం వల్ల వెరికోస్ వెయిన్ ్స ప్రమాదం పెరుగుతుంది,అయితే కాలు మీద కాలు వేసుకోవడం వల్ల ఈ ప్రభావం ఉంటుందని ఒక అభిప్రాయం ఉన్నప్పటికీ శాస్త్రీయంగా నిర్ధారించే ఆధారాలు లేవు.భంగిమలో మార్పు...కాలు మోకాలిపై ఎక్కువసేపు ఉంచడం వల్ల కటి తిప్పడానికి వంగడానికి కారణమవుతుంది. ఇది దిగువ వీపులో నొప్పిని కలిగిస్తుంది. ఇది కాలక్రమేణా వెన్నెముక తప్పు అమరికకు కూడా దారితీస్తుంది. కూర్చోవడంలో సరైన భంగిమ లేనప్పుడు, ఆ పరిస్థితిని కండరాలు సరి చేయవలసి వస్తుంది. దీని అర్థం అవి అవసరమైన దానికంటే ఎక్కువగా పనిచేస్తాయి, ఇది నొప్పికి దారితీస్తుంది. అయితే కాలు మీద కాలు వేసుకుని కూర్చోవడం అనేది పూర్తిగా మానేయాలని దీని అర్థం కాదు. కొన్ని సమస్యలైతే ఉన్నాయి.. కాబట్టి వీలైనంత వరకూ ఎక్కువసేపు అదే భంగిమలో కూర్చోవడాన్ని నివారించడం మంచిది.(చదవండి: భారతీయుల వివాహ వేడుకను చూసి..కొరియన్ కోడియా ఫిదా!) -
చక్కెర బాధితులు తినదగ్గ దుంప... చిలగడదుంప!
భూమిలో పండే దుంపలు షుగర్ బాధితులకు మంచివి కావనీ, ఎందుకంటే అందులో కార్బోహైడ్రేట్లు ఎక్కువ కాబట్టి డయాబెటిస్ బాధితుల్లో చక్కెర మోతాదులను పెంచేస్తాయని నిపుణులు చెబుతుంటారు. అందుకే చాలామంది షుగర్ బాధితులు ఆలుగడ్డలు (బంగాళదుంపలు) తినడానికి వెనకాడుతుంటారు. అయితే మిగతా దుంపల విషయం ఎలా ఉన్నా... చిలగడదుంపలతో మాత్రం ఆ ప్రమాదం లేదంటున్నారు ఆహార నిపుణులు. దీని నుంచి విడుదల అయ్యే చక్కెర మోతాదులు చాలా తక్కువ. అంటే ఇవి తిన్నప్పుడు వీటిలోంచి వెలువడే చక్కెర తక్కువ గ్లైసిమిక్ ఇండెక్స్ (లో– గ్లైసిమిక్ ఇండెక్స్) ఉండటం వల్ల దీనితో అంతగా ప్రమాదం ఉండదనీ, పైగా ఇందులో విటమిన్–ఏ కూడా ఎక్కువగా ఉన్నందున చక్కెర వ్యాధి ఉన్నవారు ఈ దుంపను తినవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. అయితే దాన్ని పరిమితంగా తీసుకోవడమే మంచిది. (చదవండి: ‘బ్యాటర్డ్ ఉమన్ సిండ్రోమ్’: ఇంటి హింస ఇంతింతై..) -
‘బ్యాటర్డ్ ఉమన్ సిండ్రోమ్’: ఇంటి హింస ఇంతింతై..
బ్యాటర్డ్ ఉమన్ సిండ్రోమ్ అనేది మహిళలు తమ గృహహింస కారణంగా ఎదుర్కొనే మనోవేదన. ఒకరకంగా చూస్తే తీవ్రమైన వేదన కారణంగా అంటే రేప్కు గురైనవాళ్లూ, యుద్ధాల్లో సర్వం పోగొట్టుకున్నవాళ్లూ అనుభవించే అత్యంత వేదనాభరితమైన కండిషన్తో వచ్చే పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ (పీటీఎస్డీ)లో ఇదో రకం అని చెప్పవచ్చు. మహిళలు తమ పార్ట్నర్ చేతుల్లో అనుభవించిన గృహహింస కారణంగా ఇది తమ ఖర్మ అంటూ సమాధానపడుతూ నిత్యం అనుభవించే రంపపుకోత కారణంగా వాళ్లు అనుభవించే మానసిక సమస్యే ఈ ‘బ్యాటర్డ్ ఉమన్ సిండ్రోమ్’. ఈ మానసిక సమస్యపై అవగాహన కోసమే ఈ కథనం...పెళ్లి తర్వాత భర్త లేదా జీవిత భాగస్వామి పెట్టే వేదనలను అనుభవించే భార్యల్లో కొందరికి ఇది తమ ఖర్మ అనే ఫీలింగ్ తప్ప... దీన్ని ఎదుర్కోవాలనిపించడం, పోలీసులకు ఫిర్యాదు చేయాలనిపించడం కూడా ఉండదు. అలా మొదలయ్యే ‘బ్యాటర్డ్ ఉమన్ సిండ్రోమ్’లో ఆ మహిళ... తన భర్త అలా హింసిస్తుండటాన్ని కూడా తన తప్పుగానే అనుకుంటూ ‘అపరాధభావన’తో బాధపడుతుంటుంది.సిండ్రోమ్ తాలూకు నాలుగు దశలివి... బ్యాటర్డ్ ఉమన్ సిండ్రోమ్కు దారితీసే వాళ్ల వాళ్ల ఇంటి పరిస్థితులు ప్రతి మహిళకూ వేర్వేరుగా ఉన్నప్పటికీ... వారు అనుభవించే కొన్ని కామన్ దశలను బట్టి చూసినప్పుడు వారి మానసిక స్థితి ఈ కింద పేర్కొన్న నాలుగు దశల్లో కొనసాగుతుంది. మొదటి రెండు దశల్లో మహిళలు నిశ్శబ్దంగా తమ వేదనలు అనుభవించినప్పటికీ... ఈ వేదనల నుంచి బయటకు వచ్చేందుకు తాము చేసే ప్రయత్నాలు ఈ చివరి రెండు దశల్లో కొంతమేర జరుగుతాయి. 1. డీనియల్ : తాము వేదన అనుభవిస్తున్న సంగతి తెలియని పరిస్థితి ఇది. భర్త తమను వేధిస్తున్నారని కూడా వాళ్లు అంగీకరించరు. అదేదో ఈసారికి అలా జరిగింది తప్ప భర్త తమను హింసిస్తున్నట్టు గుర్తించడానికి నిరాకరించే దశే ఈ ‘డీనియల్’. 2. గిల్టీ (అపరాధభావన) : భర్త తనను హింసించడానికి లేదా కొట్టడానికి ఒక రకంగా తాను చేసిన తప్పే అని సర్దిచెప్పుకునే ధోరణే ఈ అపరాధభావనకు కారణం. 3. ఎన్లైట్మెంట్ : భర్త చేతుల్లో ఇలా తరచూ హింసకు గురికావడం తమకు తగదనీ, దాన్నుంచి బయటకు రావాలనే భావన కలగడం ఈ ఎన్లైట్మెంట్ దశలో జరుగుతుంది. 4. రెస్పాన్సిబిలిటీ : ఈ దశలో వారు తామీ హింస నుంచి బయటపడటం అన్నది తమ చేతుల్లోనే ఉందనీ, అది తమ బాధ్యత అని గ్రహిస్తారు. అవసరమైతే బంధం నుంచి బయటపడైనా ఈ హింసనుంచి విముక్తి పొందవచ్చని అనుకునే దశ ఇది. బ్యాటర్డ్ ఉమన్ సిండ్రోమ్ మొదలయ్యేదిలా... మొదట్లో ఏదో మనస్పర్థల కారణంగా భర్త ఆగ్రహానికి గురైనప్పుడు మహిళ అంతగా ప్రతిఘటించక΄ోవచ్చు. ఇది పెళ్లయిన కొత్తలో ఇలా జరగడానికి అవకాశముంది. భర్త తొలుత శారీరకంగానో లేదా మానసికంగానో బాధపెట్టాక ఎందుకో అలా జరిగి΄ోయిందనీ, ఇకపై అలా జరగదంటూ ఎమోషనల్గా మాట్లాడతాడు. ఆమె ఆమోదం పొందడం కోసం అవసరమైనదానికంటే ఎక్కువ రొమాంటిక్గా వ్యవహరిస్తూ ఆమెను నార్మల్ చేయడానికి ప్రయత్నిస్తాడు. కానీ ఈ హింస అక్కడితో ఆగకుండా అదేపనిగా మాటిమాటికీ కొనసాగుతూ ఉంటుంది. దాంతో తొలుత అతడు చెప్పే (కన్వీన్స్ చేసే) అంశాలకు లొంగి΄ోయిన మహిళ ఆ తర్వాత అదో రొటీన్ తంతు అని గ్రహించి, పెద్దగా స్పందించడమూ మానేస్తుంది. అలా గృహహింస వేదనలకు గురవుతూనే ఉంటుంది. ఇలా జరగడానికి ఆర్థిక సమస్యలూ, విడి΄ోతామేమోనన్న భయం, తనను తాను సముదాయించుకునే సర్దుబాటు ధోరణీ... ఇలాంటి కారణాలు చాలానే ఉండవచ్చు.నిర్వహణ: యాసీన్ప్రభావాలు... స్వల్పకాలిక ప్రభావాలివి... జీవితం వృథా అనుకోవడం, తీవ్రమైన కుంగుబాటు (డిప్రెషన్) ఆత్మవిశ్వాసం లోపించడం (లో సెల్ఫ్ ఎస్టీమ్) తీవ్రమైన ఉద్విగ్నత (సివియర్ యాంగ్జైటీ).దీర్ఘకాలిక ప్రభావాలివి... తరచూ గతకాలపు జ్ఞాపకాల్లోకి వెళ్లడం, తానేమిటో మరచి΄ోయి వేరేగా ప్రవర్తించడం (డిసోసియేటివ్ స్టేట్), తీవ్రంగా ప్రతిస్పందించడం (వయొలెంట్ ఔట్బరస్ట్... ఇది సుదీర్ఘకాలం తర్వాత వచ్చే పరిణామం) హైబీపీ, గుండెజబ్బుల వంటివి కనిపించడం, కీళ్లనొప్పులు, ఆర్థరైటిస్ దీర్ఘకాలికం (క్రానిక్)గా వచ్చే వెన్నునొప్పి, తలనొప్పి.బ్యాటర్డ్ ఉమన్ సిండ్రోమ్కు ఇవే గుర్తులు... హింసించే తన భర్తకు అన్నీ తెలుసు... తనకేమీ తెలియనందువల్ల తనవల్లనే తప్పు జరిగిందేమోననే అపరాధభావన ∙జరిగిందానికి తామే బాధ్యురాలినేమో అనే భావనతో కలిగే వేదన ∙జరిగిందీ, తాను అనుభవించిన వేదనను తమ ఇంటివాళ్లకూ, ఫ్రెండ్స్కూ చెప్పక΄ోవడం ∙పిల్లల జీవితం ఏమై΄ోతుందోనన్న తీవ్రమైన ఆందోళన. -
మీ టూత్ బ్రష్ మార్చి ఎంత కాలమైంది?
చాలా మంది ఎన్నో ఖర్చులు పెడతారు. ఎన్నో వస్తువులు వెంట వెంటనే మార్చి కొత్తవి కొంటూ ఉంటారు కానీ నెలల తరబడి ఒకే టూత్ బ్రష్ను ఉపయోగిస్తుంటారు. ఇది ప్రమాదకరమంటున్నారు దంతవైద్యులు. ఒకేటూత్ బ్రష్ను దీర్ఘకాలం పాటు ఉపయోగించడం వల్ల నోటి ఆరోగ్యం క్షీణించి, బ్యాక్టీరియా వ్యాప్తి చెందుతుంది. ఇంతకీ ఎంతకాలానికి ఒకసారి టూత్ బ్రష్ను మార్చాలి, బ్రష్ను ఎప్పుడెప్పుడు మార్చుతుండాలో తెలుసుకుందాం. దంతవైద్యులు ప్రతి 2 నుండి 3 నెలలకు ఒకసారి టూత్ బ్రష్ మార్చాలంటారు. ఎందుకంటే టూత్ బ్రష్ పాతదైతే, దాని బ్రిజిల్స్ దెబ్బతింటాయి. ఇది బ్రష్ చేసేటప్పుడు చిగుళ్ళకు హాని కలిగిస్తుంది. ఒకరకంగా చెప్పాలంటే మొత్తం ఆరోగ్యం కూడా మీ దంతాల ఆరోగ్యానికి సంబంధించినది. అందువల్ల, దంతాలను సరిగ్గా శుభ్రం చేయడం చాలా ముఖ్యం.చాలా మృదువుగా లేదా విప్పి ఉన్న బ్రిస్టల్స్ దంతాలను సరిగ్గా శుభ్రం చేయలేవు. దాంతో దంతాలపైన పాచి పేరుకుపోతుంది ఇది దంత క్షయం, చిగురువాపు ఇతర నోటి ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. నోటి ఆరోగ్యం బాగుండక΄ోతే అది క్రమేణా హృద్రోగానికి, నోటి క్యాన్సర్కు తలుపులు తెరుస్తుంది. దాంతోపాటు నోటి ఆరోగ్యం బాగుండకపోతే మొత్తం జీర్ణవ్యవస్థపైనే దాని ప్రభావం పడుతుందని, కాబట్టి కనీసం మూడు నెలలకోసారి అయినా బ్రష్ మార్చడం మంచిదని నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. అదేవిధంగా వైరల్ ఫీవర్, తీవ్రమైన జలుబు, దగ్గుతో బాధపడినప్పుడు, టైఫాయిడ్ వంటి వాటి నుంచి కోలుకున్న వెంటనే కూడా బ్రష్ మార్చడం మంచిదని నిపుణుల సలహా. (చదవండి: బాల స్టార్టప్... బ్రహ్మాండం!) -
జాతీయ క్యాన్సర్ అవగాహనదినం : అపోలో “చెక్ ఓ లేట్’’ కార్యక్రమం
హైదరాబాద్ : జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవం సందర్భంగా ముందస్తు క్యాన్సర్ గుర్తింపుపై అవగాహన కల్పించే అపోలో క్యాన్సర్ సెంటర్లు “చెక్ ఓ లేట్!” అనే ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించాయి. క్యాన్సర్ అనగానే ముందు ఆందోళన మొదలవుతుంది కానీ.అవగాహన ,ముందస్తు రోగ నిర్ధారణ ముఖ్యమనే సందేశాన్ని అందించడానికి ఈ చొరవ డార్క్ చాక్లెట్ సింబాలిక్గా ఉపయోగించుకుంది. విజయవంతమైన క్యాన్సర్ చికిత్సలో క్రమం తప్పకుండా స్క్రీనింగ్ ,కాలంలో జోక్యం చేసుకోవడం కీలక పాత్రను ఈ సమావేశం హైలైట్ చేసింది.ఈ కార్యక్రమం అపోలో క్యాన్సర్ సెంటర్స్ డైరెక్టర్ డాక్టర్ పి. విజయ్ ఆనంద్ రెడ్డి స్వాగత ప్రసంగం చేశారు. విజిలెన్స్ & ఎన్ఫోర్స్మెంట్ విభాగం డైరెక్టర్ జనరల్, శిఖా గోయెల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. “చెక్ ఓ లేట్” బాక్స్ను ఆవిష్కరించారు. క్యాన్సర్ను ముందస్తుగా గుర్తించడం గురించి అవగాహనలో అపోలో క్యాన్సర్ సెంటర్ల వినూత్న విధానాన్ని ఆమె ప్రశంసించారు.ఎలికో హెల్త్కేర్ సర్వీసెస్ లిమిటెడ్ వైస్ చైర్పర్సన్ & మేనేజింగ్ డైరెక్టర్ మరియు CII తెలంగాణ మాజీ చైర్పర్సన్ డాక్టర్ వనితా దాట్ల డాక్టర్ సాయి లక్ష్మీ దాయణ (సీనియర్ కన్సల్టెంట్ - గైనక్ ఆంకాలజీ), డాక్టర్ రేఖ బన్సాల్ (కన్సల్టెంట్ - మెడికల్ ఆంకాలజీ), మరియు డాక్టర్ రష్మి సుధీర్ (కన్సల్టెంట్ - బ్రెస్ట్ రేడియాలజీ) సహా అపోలో క్యాన్సర్ సెంటర్ల నుండి ప్రముఖ వైద్యులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. డార్క్ చాక్లెట్ను సింబాలిక్గా ఉపయోగించడం ప్రాముఖ్యతను డాక్టర్ శిల్పా రెడ్డి వివరించారు. -
గుండెలు పగిలేలా ఏడ్చారు.. పోరాడి గెలిచారు!
National Cancer Awareness Day :ఎన్నో భయాలు, ఎన్నో ప్రతికూలతలలో నుంచి బయటికి వచ్చి, ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్లిన స్టార్స్ వీరు. సోనాలి బింద్రే నుంచి హీనా ఖాన్ వరకు ఎంతోమంది స్టార్స్ క్యాన్సర్ సర్వైవర్స్ మాత్రమే కాదు వారియర్స్ కూడా. సదస్సులలో ప్రసంగించడం నుంచి స్వచ్ఛంద సంస్థలతో కలిసి పనిచేయడం వరకు క్యాన్సర్పై అవగాహన కోసం ఎంతో పనిచేస్తున్నారు...సోనాలి బింద్రేకు స్టేజ్ 4 మెటాస్టాటిక్ క్యాన్సర్ ఉన్నట్లు 2018లో నిర్ధారణ అయిన తరువాత ఆమె, ఆమె కుటుంబసభ్యులు, స్నేహితులు, అభిమానులు షాక్ అయ్యారు. న్యూయార్క్లో ఆరు నెలల చికిత్స తర్వాత సోనాలి బింద్రే ముంబైకి తిరిగి వచ్చింది. ఆమె క్యాన్సర్ చికిత్సలు అక్కడితో ముగియక΄ోయినా క్యాన్సర్ అవగాహన కోసం నడుం కట్టింది. క్యాన్సర్ ముందస్తు గుర్తింపు, క్యాన్సర్పై అవగాహన కోసం ప్రచారకర్తగా మారింది. ఆమె ఇన్స్టాగ్రామ్ పోస్ట్లు వివిధ రకాల క్యాన్సర్ చికిత్సలు పొందుతున్న వేలాది మందికి స్ఫూర్తిగా మారాయి. ఎంతో ధైర్యాన్నిచ్చాయి.తాను దిగులు పడిన కాలం, ఆ దిగులు, నిరాశ నీడల నుంచి బయటపడి ఆత్మస్థైర్యాన్ని కూడగట్టుకున్న కాలం గురించి మాటల రూపంలోనో, రచనల రూపంలోనో చెబుతూనే ఉంది సోనాలి. తనకు క్యాన్సర్ అని నిర్ధారణ అయిన క్షణం నుంచి అందులో నుంచి బయటపడే వరకు ఆమె ఏడ్చింది, నవ్వింది, గెలిచింది!(ప్రముఖ గాయని, నటి కన్నుమూత, సరిగ్గా అదే రోజు)మందులే కాదు మానసిక బలం కూడా...అది 2012 సంవత్సరం. గతంలో ఎన్నడూ లేనంతగా తరచుగా అలసి΄ోయేది మనీషా కోయిరాలా. కడుపు ఉబ్బిపోయేది. నొప్పిగా ఉండేది. చాలామంది మహిళలలాగే మనీషా కూడా తన ఇబ్బందిని సీరియస్గా తీసుకోలేదు. అయితే ఆరోగ్యం క్షీణించడం మొదలైన తరువాత డాక్టర్ దగ్గరకు వెళ్లింది.ఎన్నో పరీక్షల తరువాత వైద్యులు ఆమెకు షాకింగ్ న్యూస్ చెప్పారు. మనీషాకు అండాశయ క్యాన్సర్ అని నిర్ధారణ అయింది. ఆ సమయంలో ఆమె భయపడింది. గందరగోళంలో పడింది. గుండె పగిలిపోయినంతగా ఏడ్చింది.‘ఇలా ఏడుస్తూ కూర్చుంటే కుదరదు’ అని తనకు తాను చెప్పుకొని ధైర్యం తెచ్చుకుంది. ‘క్యాన్సర్తో పోరాటం అనేది మందులకు పరిమితమైన విషయం కాదు. మానసిక బలం ఉండాలి’ అంటున్న మనీషా చికిత్స కాలంలో తనలో ఆత్మవిశ్వాసాన్ని తిరిగి నిర్మించుకోవడానికి, మనశ్శాంతికి చేరువ కావడానికి మానసిక నిపుణులను సంప్రదించింది. క్యాన్సర్పై పోరాడే క్రమంలో కుటుంబసభ్యులు, స్నేహితులు, అభిమానులు అన్ని రకాలుగా అండగా ఉన్నారు. ఇప్పుడు మనీషాఎంతోమంది బాధితులకు అండగా నిలుస్తోంది. క్యాన్సర్ అని నిర్ధారణ అయిన వ్యక్తులకు ధైర్యం చెప్పి, అండగా నిలుస్తోంది. క్యాన్సర్పై అవగాహన కలిగించడానికి ఎన్నో సదస్సులలో ప్రసంగించింది. క్యాన్సర్ బాధితులకు అండగా ఉంటున్న ఎన్నో సంస్థలతో కలిసి పనిచేస్తోంది. క్యాన్సర్ను ముందస్తుగా గుర్తించడంలోని ప్రాముఖ్యత గురించి నొక్కి చెబుతోంది. అండాశయ క్యాన్సర్ గురించి అవగాహన పెంచడానికి ‘ఓవాకోమ్’లాంటి స్వచ్ఛంద సంస్థలతో కలిసి పనిచేస్తోంది. ర్యాలీలు, క్యాన్సర్ బాధితుల కోసం నిధుల సేకరణ కార్యక్రమాలలో పాల్గొంటుంది. ఒక మేలుకొలుపుతనకు బ్లడ్క్యాన్యర్ అని 2009లో నిర్ధారణ అయిన తరువాత మోడల్, నటి లిసా రేకు చికిత్స మొదలైంది. శారీరక మార్పులు మొదలయ్యాయి. అయినా ఎప్పుడూ అధైర్యపడలేదు. ఆత్మస్థైర్యం అనే ఆయుధాన్ని వదల్లేదు. ‘ఇది నాకు పునర్జన్మ’ అంటున్న రే క్యాన్సర్ను ఎదుర్కోవడంలో తన అనుభవాలను ‘ది ఎల్లో డైరీస్’ పేరుతో రాసింది.‘క్యాన్సర్ అనేది పెద్ద మేలుకొలుపులాంటిది. క్యాన్సర్పై మరింత అవగాహన పెరగాలని కోరుకుంటున్నాను. క్యాన్సర్పై అవగాహన పెంచే కార్యక్రమాల్లో పాల్గొంటాను. అది నా కెరీర్లో భాగం’ అంటుంది లిసా రే.ఆ సంకేతాలు పసిగట్టాలిరొమ్ము క్యాన్సర్ బారిన పడిన హీనా ఖాన్ భయంతో ఎప్పుడూ వెనకడుగు వేయలేదు. తన ధైర్యమే తనను ముందుకు నడిపించింది. క్యాన్సర్పై పోరాటం గురించి తన అనుభవాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేసేది. ఒకవైపు చికిత్స తీసుకుంటూనే సోషల్ మీడియా వేదికగా రొమ్ము క్యాన్సర్పై అవగాహన కలిగిస్తోంది.‘ముందస్తు సంకేతాల ద్వారా ఆరోగ్య సమస్యల గురించి మన శరీరం తెలియజేస్తుంది. రెగ్యులర్ చెకప్స్ తప్పనిసరిగా చేయించుకోవాలి. ఎప్పుడు ఇబ్బందిగా అనిపించినా, అనుమానం వచ్చినా వైద్యులను సంప్రదించాలి’ అంటుంది హీనా ఖాన్.(నటికి జర్నలిస్టు అవమానకర ప్రశ్న : చిన్మయి ఫైర్)అవగాహన కోసం అక్షరాలా...అండాశయ క్యాన్సర్పై తన అనుభవాలు, పోరాటం గురించి ‘హీల్డ్’ పేరుతో పుస్తకం రాసింది మనీషా కొయిరాలా. లిసా రే రాసిన ‘క్లోజ్ టు ది బోన్’ పుస్తకంలో ఆమె వ్యక్తిగత, కెరీర్ విషయాలతో పాటు క్యాన్సర్పై తన పోరాటానికి సంబంధించిన విషయాలు కూడా ఉన్నాయి. బ్లడ్ క్యాన్సర్ సర్వైవర్ల స్ఫూర్తిదాయకమైన జీవితకథలపై డా.సోనమ్ వర్మ రాసిన పుస్తకాన్ని బాలీవుడ్ నటి టిస్కా శర్మ ఆవిష్కరించింది. బ్రెస్ట్ క్యాన్సర్కు సంబంధించిన తన అనుభవాల గురించి స్టాండప్–కమేడియన్, నటి టిగ్ నొటరో ‘ఐయామ్ జస్ట్ ఏ పర్సన్’ పుస్తకం రాసింది. స్వయంగా రచయిత్రి అయిన సోనాలి బింద్రేకు కాన్యర్ చికిత్స సమయంలో కొన్ని పుస్తకాలు ఎంతో ధైర్యాన్ని ఇచ్చాయి. అందులో కొన్ని... ది లాస్ట్ బ్లాక్ యూనికార్న్–టిఫనీ హడిష్, ఇకిగై–హెక్టర్ గార్సియా, ఫ్రాన్సిస్క్ మిరల్లెస్, ది టావో ఆఫ్ బిల్ ముర్రే–గవిన్ ఎడ్వర్ట్స్. ఇదీ చదవండి: మమ్దానీ లవ్ స్టోరీ : ఎవరీ ‘మోడ్రన్ యువరాణి డయానా’ -
నాన్నలూ అమ్మలవుతారు... కుంగిపోతారు
బిడ్డ పుట్టిన తొలి రోజుల్లో తల్లికి డిప్రెషన్ రావడం సహజం. దాన్నే పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అంటారు. అయితే తల్లులతోపాటు తండ్రులూ ఆ డిప్రెషన్ను ఎదుర్కొంటున్నారని నిపుణులు అంటున్నారు. మైక్రో ఫ్యామిలీగా ఉండటం వల్ల పెంపకం బాధ్యత ఒత్తిడి కారణంగా డిప్రెషన్, యాంగ్జయిటీ ఎదుర్కొంటున్న తండ్రుల గురించి పట్టించుకోవాల్సి ఉంది.కుంగిపోతారు‘ఒక బిడ్డను పెంచడానికి ఓ ఊరంతా కావాలని’ సామెత. గతంలో ఉమ్మడి కుటుంబాల్లో బిడ్డల పెంపకానికి వెసులుబాటు ఉండేది. బాధ్యతను అందరూ పంచుకొని బిడ్డను కంటికి రెప్పలా కాపాడేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితి మారిపోయింది. బిడ్డల పెంపకమంతా తల్లిదండ్రుల మీదే పడింది. ఈ కారణం వల్ల కొంత, భౌతిక–మానసిక మార్పుల వల్ల కొంత బిడ్డ పుట్టిన తొలి రోజుల్లో తల్లి కుంగుబాటుకు గురవడం చాలామందికి తెలిసిందే! దాన్నే పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అంటారు. అయితే తల్లులతోపాటు తండ్రులూ ఆ డిప్రెషన్ ను ఎదుర్కొంటున్నారని వైద్యనిపుణులు అంటున్నారు.అసలేంటీ పోస్ట్పార్టమ్ డిప్రెషన్?స్త్రీ జీవితంలో మాతృత్వం మధురమైన అనుభవం. ఆ సమయంలో ఆమెలో అనేక శారీరక, మానసిక మార్పులు ఏర్పడతాయి. దాంతో ఒత్తిడి, చిరాకు, యాంక్సైటీ, కోపం, కుంగుబాటు ఆమెను చుట్టుముడతాయి. బిడ్డను రోజంతా చూసుకోవాల్సి రావడం, నిద్ర సరిగ్గా లేకపోవడం, ఒకేచోట గంటల తరబడి ఉండిపోవడం వల్ల పోస్ట్పార్టమ్ డిప్రెషన్ కి గురవుతారు. ఇది కొందరితో గర్భధారణ సమయం నుంచే మొదలవుతుందని వైద్యులు అంటున్నారు. ఇన్నాళ్లూ ఈ సమస్య అమ్మలకే వస్తుందనే ఆలోచన ఉండగా, ప్రస్తుతం నాన్నలు కూడా ఈ సమస్యతో ఇబ్బంది పడుతున్నారని తేలింది.నాన్నల్ని అర్థం చేసుకునేదెవరు?ప్రస్తుతం చాలామంది 27 దాటాక పెళ్లిళ్లు చేసుకొని 30 ఏళ్లకు తండ్రవుతున్నారు. అటు ఉద్యోగం, ఇటు కెరీర్, ఈఎంఐలు, బాధ్యతలు, ఖర్చులు, అవసరాలతో సతమతమైపోతున్నారు. ఇలాంటి నేపథ్యంలో బిడ్డ పుట్టిన ఆనందం ఉన్నా, మెల్లగా ఆ ఆనందం స్థానంలో కొత్తగా రాబోయే ఖర్చులు, బాధ్యతలు వారిని భయపెడుతున్నాయి. బిడ్డ పుట్టాక రాత్రుళ్లు నిద్ర సరిగ్గా లేకపోవడం, భార్యాబిడ్డల్ని చూసుకోవాల్సి రావడం వంటి కారణాలతో మగవారు సైతం పోస్ట్పార్టమ్ డిప్రెషన్ కు గురవుతన్నారు. ఉన్నట్టుండి కోపం రావడం, చిన్న విషయాలకు చిరాకు పడటం, అరవడం, ఇంటికి దూరంగా ఉండాలనుకోవడం వంటివి ఈ డిప్రెషన్ తాలూకు లక్షణాలు. తలనొప్పి, వాంతులు, అజీర్తి, కీళ్ల నొప్పులు సైతం వీరిని వేధిస్తాయి.మగవారికి అందాల్సిన చేయూత బిడ్డ పుట్టిన తర్వాత చాలామంది తల్లి ఆరోగ్యంపైనే దృష్టి నిలుపుతారు. ఆమెను జాగ్రత్త చూసుకోవాలని భావిస్తుంటారు. తండ్రి పరిస్థితి ఏమిటి... అతను పడుతున్న ఇబ్బందులేమిటన్న విషయాన్ని చాలామంది పరిగణనలోకి తీసుకోరు. మగవారు కూడా తమ సమస్యల్ని బయటకు చెప్పుకునేందుకు మొహమాట పడతారు. లోలోపలే దాచుకొని సతమతమవుతారు. దీంతో వారి సమస్య మరింత పెరిగి ఒక్కోసారి ఆత్మహత్యా ప్రేరేపిత ఆలోచనల వరకూ వెళ్తుందని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమయంలో తల్లితోపాటు తండ్రికీ కుటుంబ సభ్యుల చేయూత అవసరమని, వారితో మాట్లాడుతూ, వారి సమస్యల్ని విని ఓదార్పు అందించాలని అంటున్నారు. అవసరమైతే మానసిక వైద్యుల వద్దకు తీసుకెళ్లి కౌన్సిలింగ్ అందించాలంటున్నారు. -
టీ తాగుతూ.. పొగ తాగుతున్నారా?
చాలా మంది టీ తాగేటప్పుడు దానికి కాంబినేషన్గా పొగ త్రాగడానికి ఇష్టపడతారు, ముఖ్యంగా పని విరామ సమయంలో. కానీ చాలా మందిలో కనిపించే ఈ సాధారణ అలవాటు వారికి ఏ మాత్రం గమనించని విధంగా వారి శరీరానికి హాని కలిగించవచ్చు. ‘‘నికోటిన్ కెఫిన్ కలిసి మెదడులో తాత్కాలికంగా చురుకుదనాన్ని పెంచుతాయి,దాంతో ఆ డబుల్ స్టిమ్యులేషన్ కూడా ఈ కాంబోను మరింతగా అలవాటు చేసి వ్యసనంగా మారుస్తుంది అని ఫరీదాబాద్లోని మెట్రో హాస్పిటల్లోని గ్యాస్ట్రోఎంటరాలజీ డైరెక్టర్ డాక్టర్ విశాల్ ఖురానా తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఆయన చెబుతున్న ప్రకారం...వ్యసన ఫలం...నిద్రలేమి...నికోటిన్ డోపమైన్ రష్ను ప్రేరేపిస్తుంది, ఇది మెదడు కు ‘మంచి అనుభూతిని కలిగించే’ రసాయనం, అయితే కెఫిన్ నిద్రను ప్రేరేపించే రసాయనమైన అడెనోసి¯Œ ను అడ్డుకుంటుంది. ఈ రెండూ కలిసి పనిచేసినప్పుడు, అవి రెండూ స్వయంగా ఉద్దీపనను పెంచుతాయి అలా రెండింటినీ కలిపి తాగినప్పుడు ఆ కాసేపు మరింత చురుకుదనాన్ని అనుభవించవచ్చు, కానీ మనకు తెలీకుండా మన మెదడుకు ఆ రెండింటినీ కలిపి కోరుకునేలా శిక్షణ ఇస్తున్నామని అర్ధం.గ్రీన్ టీ తో ప్రభావం తగ్గించవచ్చు...టీలో కూడా నికోటిన్ ఉన్నప్పటికీ చాలా తక్కువ మొత్తంలో ఉంటుంది, అయితే అది ధూమపానంతో పోలిస్తే దాదాపు లేనట్టే. అంతేకాకుండా సిగరెట్తో జత చేసే టీ రకం ఏమిటి అనేది కూడా ముఖ్యమైనదే. గ్రీన్ టీలో బ్లాక్ టీ కంటే ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి, తద్వారా ఇది కొంత నికోటిన్ వల్ల కలిగే నష్టాన్ని ఎదుర్కోవడంలో శరీరానికి సహాయపడుతుంది కానీ ఒకటి మాత్రం నిజం ఏ రకమైన: టీ అయినా సిగరెట్ పొగ ప్రభావాలను పూర్తిగా దూరం చేయదు.సిగిరెట్టు మానే ఆలోచన వెనక్కి...ధూమపానం మానాలనుకునేవాళ్లని కూడా ఈ అలవాటు నిరుత్సాహపరుస్తుంది. టీ తాగితే ధూమపానం మానేయడం కష్టం. ‘‘ మెదడు టీ ఆనందాన్ని నికోటిన్ నుంచి వచ్చే కిక్తో అనుసంధానించడం ప్రారంభిస్తుంది. ఒకటి మరొకదానికి ట్రిగ్గర్ అవుతుంది, అందుకే టీ తాగిన ప్రతిసారీ సిగరెట్ తాగాలని కోరుకోవడం ఎక్కువ అవుతుంది.జీర్ణక్రియపై తీవ్ర ప్రభావం...కెఫిన్ నికోటిన్ రెండూ హృదయ స్పందన రేటు అలాగే రక్తపోటును కూడా పెంచుతాయి. రక్త నాళాలపై అదనపు ఒత్తిడిని కలిగిస్తాయి, కాబట్టి ఈ రెండింటినీ కలపడం గుండె జబ్బులు ఉన్నవారికి మరింత ప్రమాదకరంగా మారుతుంది. టీ కడుపు లో ఆమ్లాన్ని పెంచుతుంది మరోవైపు నికోటిన్ జీర్ణక్రియను నెమ్మదించేలా చేస్తుంది ఇవి రెండూ కలిసిన తర్వాత కడుపు ఉబ్బరం, ఆమ్లత్వం దీర్ఘకాలిక జీర్ణ సమస్యలను కూడా కలిగిస్తాయి, ముఖ్యంగా ఖాళీ కడుపుతో తీసుకోవడం పేగుల మీద కూడా ప్రభావం చూపిస్తుంది.గొంతుకీ ప్రమాదమే...అలాగే గొంతుపై కూడా దీని ప్రభావం పడుతుంది ‘ధూమపానం గొంతు పొరను చికాకుపెడుతుంది. దానికి వేడి టీ జోడిం^è డం అంటే వేడి మంటను మరింత తీవ్రతరం చేయడమే. కాలక్రమేణా, ఇది దీర్ఘకాలిక గొంతు సమస్యలతో పాటు అన్నవాహిక క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని కూడా పెంచుతుంది.టీ , సిగరెట్ల మేళశింపు నాడీ వ్యవస్థను అతిగా ప్రేరేపించే, గుండెను శ్రమపెట్టే ప్రేగులను కలవరపరిచే హానికరమైన జంట అనేది నిస్సందేహం కాబట్టి వీలైనంత వరకూ పొగతాగడాన్ని పూర్తిగా మానేయాలి, టీని పరిమితంగా తీసుకోవాలి రెండింటినీ మాత్రం కలిపి తీసుకోవడం మాత్రం పొరపాటున కూడా చేయవద్దు అని వైద్యులు సూచిస్తున్నారు. -
'వంట నూనె వాడకం తగ్గించండి': వరల్డ్కప్ విజేతలతో ప్రధాని మోదీ
భారత ఐసీసీ మహిళల ప్రపంచ కప్ విజేతలతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమావేశం అయ్యారు. చారిత్రాత్మక విజయం సాధించినందుకు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ నేతృత్వంలోని జట్టు సభ్యులను ప్రధాని అభినందించారు. వారితో సంభాషణ సందర్భంగా దేశంలో పెరుగుతున్న ఊబకాయ సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో దేశ పౌరులంతా తమవంతు సాయం అందించాలని కోరారు. జాతీయ ఆరోగ్య చొరవలో భాగంగా నూనె వినియోగాన్ని తగ్గించుకోవాలని ఆయన ప్రజలకు సూచించారు. ఫిట్ ఇండియ ఉద్యమం ప్రాముఖ్యతను నొక్కిచెప్పారు. నిజానికి మోదీ ప్రతి భారతీయుడు దైనందిన జీవితంలో ఫిట్నెస్ను అంతర్భాగం చేయడానికి 2019 నుంచి ఈ ప్రచారాన్ని ఆయన ప్రారంభించారు. మన దేశంలో ఊబకాయం పెద్ద సమస్యగా మారుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. అందుకు ఫిట్ ఇండియా ఒక్కటే పరిష్కారమని నొక్కి చెబుతున్నారు. దయచేసి అంతా వంట నూనె వినియోగాన్ని 10 శాతం తగ్గిస్తే, పైగా కొనుగోలు చేసే సమయం కూడా తగ్గుతుందని అన్నారు. అలాగే భారత మహిళా జట్టుని ఉద్దేశించి..తమ పాఠశాలలను సందర్శించి యువతరాలకు స్ఫూర్తినివ్వాలని సూచించారు. కాగా, గట్టి భద్రతా చర్యల మధ్య ప్రదానమంత్రితో సమావేశం కావడానికి భారత జట్టు మంగళవారమే న్యూఢిల్లీకి చేరుకుంది. అలాగే భాతర జట్టు అద్భుతమైన విజయ సాధించిన వెంటనే మోదీ సోషల్ మీడియా పోస్ట్లో "టోర్నమెంట్ అంతటా భారత జట్టు అసాధారణమైన కృషిని, పట్టుదలను ప్రదర్శించింది. మన క్రీడాకారులందరికి అభినందనలు. ఈ చారిత్రాత్మక విజయం భవిష్యత్తు చాంపియన్ క్రీడలను చేపట్టడానికి ప్రేరేపిస్తుంది." అని పోస్ట్లో పేర్కొన్నారు మోదీ.(చదవండి: అందాల బొమ్మలం కాదు..! వివాదంలో మిస్ యూనివర్స్ పోటీ..) -
హైపర్ సెన్సిటివిటీ న్యూమొనైటిస్ : కారణాలు, లక్షణాలు, జాగ్రత్తలు
నిమోనియా గురించి దాదాపు మనలో చాలామందికి తెలుసు. అయితే ‘హైపర్ సెన్సిటివిటీ నిమోనైటిస్’ అనే మాట అంతగా తెలియదు. కానీ... ఇటీవలి మోంథా తుఫానులా చాలాకాలం పాటు వాతావరణం చల్లగా మందంగా ఉండటం, ఆ తర్వాత మళ్లీ చలికాలం మొదటి రోజులు కావడంతో అదే తరహా చలి కంటిన్యూ కావడం లాంటి వాతావరణం కొనసాగుతున్న రోజుల్లో ఇది ‘హైపర్ సెన్సిటివిటీ న్యూమొనైటిస్’గా చెప్పే కొన్ని రకాల న్యుమోనియాలకు అనువైన కాలమిది. కాబట్టి దీనిపై అవగాహన పెంచుకోడానికీ, దీని నుంచి అప్రమత్తంగా ఉండటానికీ, దీని గురించి జాగ్రత్తలు తీసుకోవాల్సిన సమయమిది. అందుకే ‘హైపర్ సెన్సిటివిటీ న్యూమొనైటిస్’ అంటే ఏమిటో తెలుసుకుందాం. కొన్ని రకాల నిమోనియాలను కలగలపుకొని ‘హైపర్ సెన్సిటివిటీ న్యూమొనైటిస్’ అనవచ్చు. దీని గురించి తెలుసుకునే ముందర మన పల్లెల్లోని కొన్ని నిర్దిష్టమైన చోట్ల వస్తుండే రకరకాల వాసనల వివరాలను చూద్దాం. అసలు హైపర్ సెన్సిటివిటీ న్యూమొనైటిస్ (Hypersensitivity pneumonitis) అంటే ఏమిటి...?అవి గరిసెలూ, గాదాలైనా, గడ్డివాములైనా, పావురాలూ, పిట్టలుండే పక్షిగూళ్లైనా అక్కడి గాలుల్లో వ్యాపించే వాసనలతో వాతావరణం కలుషితం కావడం, వాటినుంచి గాల్లోకి వ్యాపించే మనుషులకు సరిపడని అనేక కాలుష్య రేణువుతోనూ వచ్చే ఊపిరితిత్తుల సమస్యనే ‘హైపర్ సెన్సిటివిటీ నిమోనైటిస్’గా చెప్పవచ్చు. పైగా ఇటీవల తుఫాను వాతావరణం, చలిగాలుల నేపథ్యంలో గడ్డీగాదం తడిసిపోవడంతో ఈ ముప్పు మరింత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో దీని గురించి తెలుసుకోవడం అవసరమే. ఒకరకంగా వృత్తిపరం...మరోరకంగా జన్యుపరం...చూడటానికి ఇదో వృత్తిపరమైన సమస్యగా అనిపించవచ్చు. రైతులు, పౌల్ట్రీ పనివారు, పక్షులు పెంచి జీవనోపాధి పొందేవారు తమ వృత్తులో భాగంగా ఈ సమస్యకు గురికావడంతో మనకు ఇదో వృత్తిపరమైన సమస్య (ప్రొఫెషనల్ హజార్డ్)గా కనిపిస్తుంది. అయితే మరోరకంగా చెప్పాలంటే ఇదో జన్యుపరమైన సమస్య కూడా. ఎందుకంటే... కొంతమందిలో కొన్ని అలర్జెన్స్ సరిపడకపోవడమన్న అంశం వంశపారంపర్యంగా తల్లిదండ్రుల నుంచి సంతానానికి వస్తుంటుంది. దాంతో కొన్ని అంశాలకు తీవ్రమైన అలర్జీ ఉన్నవారిలో ఈ సమస్య కనిపిస్తుంటుంది. అందుకే కొన్ని కుటుంబాల్లోని వారిలో (ఫెమీలియల్గా) ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుండటం చాలా సాధారణం. ఈ కోణంలో చూసినప్పుడు ఇది జన్యుపరమైన దుష్ప్రభావంగా కనిపించవచ్చు. అయితే సాధారణంగా వయసు పెరుగుతూ వారు 50, 60 ఏళ్ల వయసుకు చేరుతున్నప్పుడు ఈ సమస్య మనుషుల్లో తీవ్రతరమవుతుంటుంది. ఈ సమయంలో ఇమ్యూనిటీ కొంత తగ్గుతుండటం ఇలా జరుగుతుంది. కానీ వ్యాధినిరోధక శక్తి (ఇమ్యూనిటీ) తక్కువగా ఉండి, బాగా బలహీనంగా ఉన్న వాళ్లలో ‘హైపర్ సెన్సిటివిటీ న్యూమొనైటిస్’ సమస్య ఏ వయసు వారిలోనైనా కనిపించవచ్చు. పల్లెటూళ్లలో గరిసెల్లో వడ్లూ, ఇతర ధాన్యాలూ నిల్వ చేసేటప్పుడూ, వరిగడ్డితో గడ్డివాము / గడ్డివామి పేర్చే సమయంలో ఆ ప్రదేశంలో ఒక రకమైన వాసనలు వస్తుంటాయి. ఆ వాసనలు వచ్చే చోట వ్యాప్తిచెందే నిమోనియాను ‘ఫార్మర్స్ లంగ్’ అంటారు. అలాగే కోళ్ల గూళ్ల దగ్గర మరో రకం వాసన వస్తుంటుంది. అది సరిపడనివారికి ‘బర్డ్ ఫ్యాన్సియర్స్ లంగ్’ అనే మరో ఆరోగ్య సమస్య వస్తుంది. అంటే ఈ తరహా సమస్య పౌల్ట్రీల్లో పనిచేసేవారిలో ఎక్కువగా కనిపిస్తుంది. అంతేకాదు... ఇటీవల చాలామంది ఆరోగ్య నిపుణులూ, డాక్టర్లు ఒక మాట చెబుతుండటాన్ని చాలామంది వినే ఉంటారు. అదే పావురాళ్లకు ఆహారం వేయకండి. వాటి విసర్జకాలతో ప్రాణహాని సైతం కలగవచ్చంటూ హెచ్చరిస్తుండటం చాలామంది దృష్టికి వచ్చే ఉంటుంది. అలా పక్షులు పెంచుకునేవాళ్లలో, పావురాల రెట్టలతోనూ ఈ తరహా నిమోనియా రావచ్చు.హైపర్ సెన్సిటివిటీ నిమోనియా వ్యాప్తికి దోహదపడే అంశాలు... మన పరిసరాల్లో నిత్యం వ్యాపించి ఉండే దాదాపు 300 రకాల రేణువులూ, కాలుష్య పదార్థాలు ‘హైపర్ సెన్సిటివిటీ నిమోనియా’కు కారణమయ్యే అవకాశముంది. కొంతమందికి కొన్ని పదార్థాలూ, అంశాల వల్ల అలర్జీ కలగడం మనకు తెలిసిందే. ఏ అంశాల వల్ల అలర్జీ కలుగుతుందో వాటిని అలర్జెన్స్ అంటారు. ఆ అలర్జెన్స్ను వర్గీకరించినప్పుడు నాలుగు రకాల నిమోనియాలు వచ్చేందుకు అవకాశముంది. అవి...ఫార్మర్స్ లంగ్: ఇది చాలావరకు రైతుల్లో కనిపిస్తుంది. పంటకోతలు పూర్తయ్యాక ధాన్యాన్ని గరిసెల్లో నిల్వ చేయడం, వాటిల్లోకి దిగి ధాన్యాన్ని పైకి తోడాల్సి రావడం, గడ్డివాముల్లాంటివి పేర్చాల్సి వస్తుండటం వంటి అంశాలతో రైతుల్లో ప్రధానంగా కనిపిస్తుంది కాబట్టి దీన్ని ‘ఫార్మర్స్ లంగ్’ అంటారు.బర్డ్ ఫ్యాన్సియర్స్ లంగ్: జీవనోపాధి కోసం కొందరు పక్షుల్ని పెంచుతుంటారు. ప్రధానంగా పౌల్ట్రీ రంగంలోని వారూ, అలాగే హాబీగా మరికొందరు పెద్దసంఖ్యలో పక్షుల పెంపకం చేస్తుంటారు. ఇక మరికొందరు సరదాగా పక్షులకు ఆహారం వేసి ఆనందిస్తుంటారు. ఇలాంటి వాళ్లు ముఖ్యంగా పావురాళ్లకు ఆహారం వేస్తుంటారు. అలాంటి చోట్లలో పక్షుల వాసనా, వాటి వ్యర్థాల వాసనతోనూ, వాటి విసర్జకాలతో ఈ సమస్య వస్తుంది కాబట్టి దీన్ని ‘బర్డ్ ఫ్యాన్సియర్స్ లంగ్’గా చెబుతుంటారు. హ్యుమిడిఫయర్స్ లంగ్: కొందరు వృత్తిరీత్యా బాగా తేమతో కూడిన వాతావరణంలో పనిచేయాల్సి రావడమో లేదా నివాసం ఉండాల్సి రావడమో జరగవచ్చు. అక్కడి తేమ కారణంగా ఆ చోట్లలో పెరిగే ఫంగస్తో, వాటి స్పోరుల (అవి వ్యాప్తి చెందడానికి పండించే గింజలవంటివి) కారణంగా అవి తమ ఆరోగ్యానికి సరిపడనప్పుడు ‘హ్యుమిడిఫయర్స్ లంగ్’ అనే ఈ సమస్య వస్తుంది. నిత్యం ఎయిర్కండిషనర్లో ఉండేవారి కొందరికి ఆ చల్లటి వాతావరణం సరిపడకపోవడం వల్ల కూడా రావచ్చు. ఆ తేమ సరిపడదు కాబట్టి దీన్ని ‘హ్యుమిడిఫయర్స్ లంగ్’గా పేర్కొంటారు.హాట్ టబ్ లంగ్: కొందరు హాబీగానో, రిలాక్సింగ్ కోసమో లేదా తమ ఆరోగ్యం కోసమో ‘స్పా’ల వంటి చోట్ల ‘తొట్టి స్నానాలు’ వంటివి చేస్తుంటారు. మరికొందరు ఇన్హెలేషన్ థెరపీ పేరిట మంచి సువాసన ద్రవ్యాలతో కూడిన నీటిని పీలుస్తుంటారు. కొన్ని సందర్భాల్లో ఆ నీరు నిల్వ ఉండిపోవడం లేదా ఎప్పుడూ నీళ్లతో నిండి ఉండే ఆ పాత్రను సరిగా కడగక΄ోవడం, తొట్టిస్నానం చేసే ఆ తొట్లలో సరైన పారిశుద్ధ్య వసతులు లేకపోవడంతో అక్కడ పలు రకాల అలర్జెన్స్ పెరగవచ్చు. ఆ అలర్జెన్స్ సరిపడక వచ్చే ఈ సమస్యను ‘హాట్ టబ్ లంగ్’ అంటారు. మరీ ముఖ్యంగా గాలి సరిగా ప్రసరించని చోట్లలోని కలుషితమైన నీటి మీదుగా వచ్చే గాలినీ, ఆ నీటి తాలూకు ఆవిరులను పీల్చడం వల్ల ఈ సమస్య వస్తుంటుంది.లక్షణాలు... మనకు సరిపడని వాతావరణంలోకి వెళ్లినప్పుడు లక్షణాలు కనిపించవచ్చు. అవి అప్పటికప్పడు అక్యూట్గా కనిపించి బాధించవచ్చు. లేదా మరికొందరిలో దీర్ఘకాలంపాటు (క్రానిక్గా) వస్తూ వేధించవచ్చు. ఆ లక్షణాలేమిటంటే..ఒళ్లునొప్పులు, తలనొప్పి, ఊపిరి అందకపోవడం తీవ్రమైన ఆయాసం, జ్వరం, చలితో వణుకు రావడం కొందరిలో తీవ్రమైన దగ్గు వంటివి కనిపిస్తాయి. కఫం ఉండవచ్చు లేదా లేకపోవచ్చు. ఉంటే తెల్లగా, పసుపురంగులో ఒక్కోసారి రక్తపు చారికతోనూ కనిపించవచ్చు. గాలి పీలుస్తున్నా అది లోపలికి వెళ్లదు. కారణం... ఊపిరితిత్తుల్లో గాలి చేరే చివరి స్థానమైన గాలిసంచి (ఆల్వియోలై)లో వ్యర్థపదార్థాలు (ఎగ్జుడస్) నిల్వ ఉండిపోయి, అవి అడ్డంకిగా మారడంతో గాలి పీలుస్తున్నా లోపలికి వెళ్లదు. దాంతో శరీరానికి అవసరమైనంత ఆక్సిజన్ అందదు. ఫలితంగా ఊపిరితిత్తులు తమ పని తాము చేయలేని పరిస్థితికి వస్తాయి. ఇలాంటి కండిషన్ను ‘హైపాక్సిక్ రెస్పిరేటరీ ఫెయిల్యూర్’ అంటారు. ఊపిరి అందకపోవడంతో నుదుట చెమటలు పట్టడం, ముఖం నీలంగా మారిపోవడం, కంగారుగా ఉండటం, గుండె స్పందన వేగం పెరగడం, డీలా పడిపోవడం, బీపీ పడిపోవడం వంటి లక్షణాలు కనిపించవచ్చు.అలర్జెన్లకు కొద్దిగా ఎక్స్పోజ్ కాగానే ఈ లక్షణాలు తీవ్రమై 4 నుంచి 12 గంటలపాటు కనిపించవచ్చు. ఆ వాతావరణం నుంచి బయటకు రాగానే కొందరిలో లక్షణాలు తగ్గవచ్చు. లేదా జన్యుపరమైన సమస్యలున్నవారికి అలర్జెన్స్ కారణంగా లక్షణాలు ఎడతెరిపిలేకుండా బాధిస్తూ ఉండవచ్చు. ఊపిరితిత్తులకు జరిగే నష్టమిలా... ఈ సమస్యతో ఊపిరితిత్తులపై దుష్ప్రభావం పడుతుంది. దాంతో వాటి సామర్థ్యం తగ్గుతుంది. అంతేకాదు... పరిస్థితి తీవ్రమైనప్పుడు ఊపిరితిత్తులపై గాయమైనట్టుగా గాట్లవంటివి ఏర్పడవచ్చు. ఇలా జరగడాన్ని ‘స్కారింగ్’ అంటారు. అంతే కాదు... ఊపిరితిత్తులు తమ సాగే గుణాన్ని కోల్పోయే ప్రమాదమూ ఉంది. ఇలా జరగడాన్ని ‘పల్మునరీ ఫైబ్రోసిస్’గా చెబుతారు.ఏ ప్రశ్నలతో క్లినికల్గా డాక్టర్లు ఈ సమస్యను నిర్ధారణ చేస్తారంటే... లక్షణాలు కనిపించిన వెంటనే డాక్టర్లు తొలుత స్టెత్తో ఊపిరితిత్తులను పరీక్షిస్తారు. పల్స్ ఆక్సిమీటర్తో రక్తంలో ఆక్సిజన్ మోతాదులను, నాడీ స్పందనలను చూస్తారు. సమస్య నిర్ధారణ కోసం సాధారణంగా ఈ ప్రశ్నలు అడిగే అవకాశముంది. వృత్తిపరంగా ఏవైనా ఘాటైన వాసనలు, దుమ్ముధూళి రేణువులకు ఎక్స్పోజ్ అవుతున్నారా? ఇంట్లో ఎయిర్కండిషనర్ చాలా రోజుల్నుంచి శుభ్రం చేయలేదా? ఫిల్టర్లు మార్చి చాలాకాలమైందా? ఇంట్లో ఎక్కడైనా లీకేజీ ఉంటే, అక్కడి నిల్వ నీళ్ల వాసన పీల్చారా? తరచూ తొట్టిస్నానం (టబ్ బాత్) చేస్తారా? ఆ తొట్టి శుభ్రంగా ఉందా? పరిసరాల్లో పక్షులు ఉంటాయా? ఇంటి చుట్టూ పిట్టలు రెట్టలేస్తుంటాయా? డాక్టర్లు అడిగే ఈ ప్రశ్నలను తమకు తాముగా వేసుకున్నప్పుడు అవునని మీకే అనిపిస్తే వెంటనే డాక్టర్ను కలిసి, ఈ అంశాలను వివరించడం బాధితులకు ఎంతో మేలు చేస్తుంది. వీళ్లకు మరింత ముప్పు... ఆస్తమా లేదా తీవ్రమైన అలర్జిక్ రియాక్షన్ వచ్చేవారిలో సీఓపీడీ (క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మునరీ డిసీజ్ – బ్రాంకైటిస్, ఎంఫసీమా) ఉన్నవాళ్లలో / పొగతాగే అలవాటు ఉన్నవారిలో గుండెకు సంబంధించిన సమస్యలు ఉన్నవారిలో , స్పీలనెక్టమీ అనే ప్రక్రియ ద్వారా స్పీ›్లన్ తొలగించిన వాళ్లలో , పోస్ట్ కోవిడ్ సమస్యలతో పాటు ఇదివరకే ఊపిరితిత్తుల సమస్యలు, టీబీ ఉన్నవారిలో.నిర్ధారణ పరీక్షలు... తొలుత స్టెతస్కోప్తో సాధారణమైన శబ్దాలు కాకుండా ఏవైనా అసాధారణమైన శబ్దాలు వినిపిస్తున్నాయా అని పరీక్షించడం. ఛాతీ ఎక్స్–రే, అవసరమనుకుంటే సీటీ స్కాన్ వంటి ఇమేజింగ్ పరీక్షలతో.శ్వాస ప్రక్రియ సరిగా ఉందా అని తెలుసుకోడానికీ లేదా ఊపిరితిత్తుల పనితీరు తెలుసుకోడానికి చేసే ‘లంగ్ ఫంక్షన్ టెస్ట్’. ∙ఏవైనా అలర్జెన్స్తో అలర్జీ ఉందేమో తెలుసుకునే యాంటీబాడీస్ రక్తపరీక్ష. నోటి నుంచి లేదా ముక్కు నుంచి ఊపిరితిత్తులకు గాలి వెళ్లే దారులను పరీక్షించే బ్రాంకోస్కోప్ పరీక్ష. (దీంతో వోకల్ కార్డ్స్, విండ్పైప్ వంటి చోట్లలో ఏమైనా అసాధారణతలు ఉన్నాయా అని తెలుస్తుంది).మరీ అవసరమైనప్పుడు ఊపిరితిత్తులనుంచి చిన్నముక్క సేకరించి చేసే ‘సర్జికల్ లంగ్ బయాప్సీ’ లేదా... ‘క్రయో లంగ్ బయాప్సీ’ (దీన్ని ఇంటర్వెన్షనల్ పల్మునాలజిస్ట్ నిర్వహిస్తారు) లేదా ‘వాట్స్ గైడెడ్ లంగ్ బయాప్సీ (టీబీసీబీ) వంటి పరీక్షలు. చాలాకాలం పాటు మూసి ఉన్న ఇళ్లలోకి వెళ్లినప్పుడు... చాలాకాలంపాటు మూసి ఉన్న ఇళ్లలోకి ఏ వృత్తిపరమైన కారణం వల్లనో లేదా ఇల్లు మారడం వల్లనో వాసనతో కూడిన ఆ వాతావరణంలోకి వెళ్లినప్పుడు అకస్మాత్తుగా ఊపిరి అందక΄ోవడం, ఆయాసపడటం వంటి లక్షణాలు కనిపించవచ్చు. అక్కడ తమకు అలర్జీ కలిగించే రేణువులూ, వాసనలూ, అతి సన్నటి కాలుష్య పదార్థాలు ఉండటమే అందుకు కారణం. ఇది కొందరిలో తక్షణం సమస్యగా (అక్యూట్గా) కనిపించి... ఆ పరిసరాల నుంచి దూరంగా రాగానే తగ్గవచ్చు. హైపర్ సెన్సిటివిటీ న్యూమొనైటిస్ అనేది ఎంత సాధారణ సమస్య అంటే.. దీని వ్యాప్తి చాలా సాధారణం. మన సమాజంలోని ఐదు శాతం మందిలో ఈ సమస్య కనిపిస్తుండటమే దీనికి నిదర్శనం. చికిత్స... యాంటీ హిస్టమైన్ మందులతోమరీ అవసరమైనవారికి అవసరమైన మోతాదుల్లో కార్టికో స్టెరాయిడ్స్. ఊపిరితిత్తుల్లోని నాళాలను వెడల్పు చేసి, ఊపిరి అందేలా చేసే ‘బ్రాంకోడయలేటర్స్’ జన్యుపరమైన కారణాలతో సమస్య వస్తున్న వారిలో దేహంలో ఇమ్యూన్ వ్యవస్థ తీవ్రతను తగ్గించడానికి అవసరమైతే ‘ఇమ్యూనో సప్రెసివ్ మందులు’ రక్తంలో ఆక్సిజన్ మోతాదులు తగ్గితే, అవసరాన్ని బట్టి ఆక్సిజన్ పెట్టాల్సిరావడం. తీవ్రతను బట్టి మందుల్ని స్వల్పకాలం కోసం లేదా ఒక్కోసారి మూడు నెలలు, సమస్య మరింత తీవ్రంగానూ, జటిలంగానూ ఉన్నప్పుడు సుదీర్ఘకాలం పాటు మందులు వాడాల్సి రావచ్చు. ఒక్కోసారి ఊపిరితిత్తులపై స్కార్ వచ్చి, అవి పీచు (ఫైబ్రస్)గా అయిపోయినవాళ్లకు ఊపిరితిత్తుల మార్పిడి (లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్) మాత్రమే చివరి ఆప్షన్ కావచ్చు. డా. రమణ ప్రసాద్ సీనియర్ పల్మునాలజిస్ట్,– స్లీప్ స్పెషలిస్ట్ -
అందువల్లే టీనేజర్లలో పాప్కార్న్ బ్రెయిన్ సిండ్రోమ్..!
భారతీయ టీనేజర్లలో ఎక్కువ మంది "పాప్కార్న్ బ్రెయిన్ సిండ్రోమ్" బారినపడుతున్నారని మానసిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇటీవల కాలంలో చిన్నపిల్లల నుంచి యువకుల వరకు చాలామంది ఈ సమస్యను ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. అసలేంటి పాప్కార్న్ బ్రెయిన్ సిండ్రోమ్? ఎందువల్ల వస్తుందంటే..అధిక స్క్రీన్ సమయం, డిజిటల్ స్టిమ్యులేషన్తో ముడిపడి ఉన్న పరిస్థితినే పాప్కార్న్ బ్రెయిన్ సిండ్రోమ్గా వ్యవహరిస్తారు. సోషల్ మీడియాలో, ఆన్లైన్ కార్యకలాపాల్లో ఎక్కువ సేపు గడిపితే ఇలా వచ్చేస్తుందా అంటే..ఔనని చెబుతున్నారు వైద్యులు. దీనివల్ల శ్రద్ధ అనేది లోపిస్తుందట. ఒక పనిపై ఫోకస్ అనేది భారంగా మారిపోతుందట. ఇటీవల కాలంలో యువకులు, పెద్దలు స్కీన్ సమయాన్ని పెంచేస్తున్నారు. ముఖ్యంగా యాప్లు, గేమ్లు, వీడియోలు అంటూ తదేకంగా డిజిటల్ కార్యకలాపాల్లోనే టైం స్పెండ్ చేస్తున్నారు. దాంతో ఈ బ్రెయిన్ సిండ్రోమ్ బారినడుతున్నట్లు తెలిపారు. ఏదైన అతి అయితే ప్రమాదమే అన్నది జగమెరిగిన సత్యం. అలానే డిజిటల్ ఓవర్లోడ్ శారీరకంగానే కాకుండా మానసికంగా హాని అని, దీనివల్ల దృష్టి లోపం, జ్ఞాపకశక్తి సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు నిపుణులు. పాప్కార్న్ బ్రెయిన్ సిండ్రోమ్ అంటే..2011లో వాషింగ్టన్ విశ్వవిద్యాలయ పరిశోధకుడు డేవిడ్ లెవీ ఈ పేరుని సూచించారు. ఏ విషయంపైన శ్రద్ధ, ఫోకస్ లేకపోవడాన్ని పాప్కార్న్ గింజలు మాదిరిగా మెదడు తన అటెన్షన్ కోల్పోయింది అనే సూచగా పరిశోధకుడు లెవీ ఇలా వ్యవహరించారు. ఈ డిజిటల్ మీడియా వల్ల ఒక వ్యక్తి ఆలోచనలు ఒకదాని నుంచి మరొకదానికి వేగంగా మారిపోతుంటాయి. దాంతో శ్రద్ధ అనేది కరువవుతుంది. అంటే ఒకే కార్యచరణపై దృష్టి పెట్టడంలో ఇబ్బంది ఎదురవుతుంది. మానసికంగా అస్థిరత ఏర్పడుతుంది. ఇలాంటి స్థితినే పాప్కార్న్ బ్రెయిన్ సిండ్రోమ్ అంటారు. అధికారికంగా వైద్య నిర్థారణ కానప్పటికీ..ఈ పరిస్థితి చాలా తీవ్రమైనదని చెబుతున్నారు నిపుణులు. ఎందువల్ల వస్తుందంటే..? తరుచుగా మల్టీటాస్కింగ్, సోషల్ మీడియా, డిజిటల్ నోటిపికేషన్ తదితరాలే ఈ పరిస్థితికి కారణమని చెబుతున్నారు నిపుణులు.వాటిలో కొన్ని కారణాలు..అధిక స్క్రీన్ సమయంమొబైల్లో ఎక్కువ సమయంల గడపడం వల్ల డిజిటల్ కాని కార్యకలాపాలపై దృష్టి పెట్టడం కష్టమవుతుంతక్షణ సంతృప్తిఇంటర్నెట్, సోషల్ మీడియా త్వరిత రివార్డులను అందిస్తాయి. అది మెదడులో డోపమైన్ను పెంచి రోజువారీ పనులను నిస్తేజంగా, ఆసక్తికరంగా కానివిగా చేస్తుంది.నిరంతర నోటిఫికేషన్లుతరచుగా వచ్చే నోటిఫికేషన్లు మన దృష్టిని విచ్ఛిన్నం చేస్తాయి. ఇది చాలా మానసిక అంతరాయాలను కలిగిస్తుందట. ఒకే పనిపై దృష్టి పెట్టడం కష్టతరం అవుతుందట.మల్టీ టాస్కింగ్వేర్వేరు యాప్లు లేదా పనుల మధ్య త్వరితగతిన మారడం వల్ల శ్రద్ధ తగ్గిపోతుందటఎవరిని ఎక్కువగా ప్రభావితం చేస్తుందంటే?వైద్యుల అభిప్రాయం ప్రకారం, పాప్కార్న్ మెదడు ఎక్కువగా టీనేజర్లు, యువకులలో కనిపిస్తున్నప్పటికీ, ఈ పరిస్థితి ఇప్పుడు 30 నుంచి 45 సంవత్సరాల వయస్సు గల వారిలో కూడా సాధారణంగా కనిపిస్తోందని చెబుతున్నారు వైద్యులు. అయితే, ఇది ఇంటర్నెట్ వ్యసనం లాంటిది కాకపోయినా.. రోజువారీ జీవితంలో పని సంబంధంల మధ్య అంతరాయం కలిగించి, సోమరిగా నిలబెట్టేంత చెడ్డదిని చెబుతున్నారు నిపుణులు. కలిగించడంలో సమానంగా చెడ్డది. ఈ పాప్కార్న్ బ్రెయిన్ శ్రద్ధ, భావోద్వేగ శ్రేయస్సును ప్రభావితం చేస్తుంది. ఈ పరిస్థితి లక్షణాలు..చిరాకు, ఆందోళన పెరగడంనిద్రలేమి దృష్టిని కేంద్రీకరించడంలో లేదా శ్రద్ధ వహించడంలో ఇబ్బందిఅతిగా అప్రమత్తంగా లేదా ఒత్తిడికి లోనవుతున్నట్లు అనిపించడంఆఫ్లైన్ జీవితం నీరసంగా లేదా ఆసక్తిలేనిదిగా అనిపిస్తుంది.అధిక ఒత్తిడికి గురవ్వ్వడంఈ పరిస్థితిని అధిగమించాలంటే..శ్వాస వ్యాయామాలుప్రతిరోజూ కనీసం 10 నిమిషాలు ధ్యానం చేయండిఒకేసారి ఒక పనిపై దృష్టి పెట్టడం అనేది ప్రాక్టీస్ చేయడం అంటే సింగిల్ టాస్కింగ్కి ప్రాధాన్యత ఇవ్వడం లాంటిది. జ్ఞాపకశక్తిని పెంపొందించేలా యోగా ఆసనాలుస్క్రీన్ సమయాన్ని సర్దుబాటు చేయడంటెక్-ఫ్రీ జోన్ను నియమించుకోవడంస్వయంగా ఎవరికి వారుగా డిజిటల్ డిటాక్స్కు ప్రాధాన్యత ఇవ్వడంస్కీన్న సమయం, ఎలక్ట్రిక్ పరికరాలతో గడపడంలో సరిహద్దును ఏర్పాటు చేసుకోవడం వంటి వాటితో ఈ సమస్యను అధిగమించగలుగుతారనా చెబుతున్నారు నిపుణులు. లేదంటే అచ్చం పాప్కార్న్ మాదిరిగా బ్రెయిన్ ఏపని మీద ఫోకస్, శ్రద్ధని కనబర్చడంలో విఫలమై మానసికంగా స్ట్రగులవుతారని హెచ్చరిస్తున్నారు. ఆదిలోనే ఈ పరిస్థితిని గుర్తించి రికవరీ అయ్యే ప్రయత్నాలు చేయడం మంచిదని సూచిస్తున్నారు నిపుణులు.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం.(చదవండి: రుతుస్రావ బాధలు మరింత సుదీర్ఘంగా!) -
బరువుని నిర్వహించడానికి ఐదు వాక్లు..! జిమ్తో పనిలేదు..
వాకింగ్ చేయడాన్ని రోటీన్ పనిగా, తేలిగ్గా చూస్తాం. కానీ ఇది అద్భుతమైన ఫలితాలనిస్తుంది. ఆరోగ్యం మెరుగ్గా ఉండటంలో కీలకపాత్ర పోషిస్తుంది. అయితే చేసే తీరులో సరైన విధానం ఉంటే వాకింగ్కి మించిన వర్కౌట్ లేదంటున్నారు ఆరోగ్య నిపుణులు. దాంతో బరువుని సులభంగా నిర్వహించొచ్చు, అధిక బరువు అనే సమస్య రాదు అని నమ్మకంగా చెబుతున్నారు. అంతేగాదు భోపాల్కు చెందిన పోషకాహార నిపుణురాలు, ఆరోగ్యకోచ్ రేణు రఖేజా ఈజీగా చేసే ఐదు రకాల వాక్లను సోషల్ మీడియా వేదికగా పరిచయం చేశారు. ఇవి మొత్తం ఆరోగ్యాన్ని శరీర తీరుని మార్చగలవని చెబుతోందామె. పైగా జిమ్కి వెళ్లాల్సిన పని ఉండదు అని అంటున్నారు. మరి ఆ ఐదు వాక్లేంటో చూద్దామా..!.నడకకు మించిన అద్భుతమైన వ్యాయామం మరొకటి లేదని అంటోంది రేణు రఖేజా. శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుతుందని అంటున్నారు. జిమ్కి వెళ్లలేం. ఎక్కువ సమయం వ్యాయమాలకు కేటాయించలేం అనుకునేవాళ్లు సింపుల్గా ఈజీగా చేసే ఈ ఐదు వాక్లు చేస్తే చాలట. అద్భుతంగా బరువుని నిర్వహించడమే గాక హెల్దీగా ఉంటారని అంటోంది.కాలి నడక (తడసానా) - 1 నిమిషంఇది నడక భంగిమను మెరుగుపరుస్తుంది. ఆత్మవిశ్వాసాన్ని పెంచడంలో సహాయపడుతుంది. చేతులు నిటారు తలపైకి చాచి కాళ్ల మీద నడవండి.మడమ నడక - 1 నిమిషంమడమ నడకలు చీలమండలను బలోపేతం చేస్తాయి. మెరుగైన రక్త ప్రసరణ/ప్రసరణను నిర్ధారిస్తాయి, వాపును తగ్గిస్తాయి. ఈ వ్యాయామం చేస్తున్నప్పుడూ.. ఫోజ్ నిటారుగా ఉంచాలి.హిప్ రొటేషన్ నడక - 1 నిమిషంహిప్ రొటేషన్ నడక బిగుతుగా ఉన్న తుంటిని వదులు చేయడం ద్వారా హిప్ కదలికను మెరుగుపరుస్తుంది. ఇది వీపు దృఢత్వాన్ని తగ్గిస్తుంది, పునరుత్పత్తి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఈ వ్యాయామం చేయడానికి, కాలును పైకి లేపి మీ పాదాన్ని నేలపై ఉంచే ముందు తిప్పండి. మరొక కాలుతో కూడా ఇలానే రిపీట్ చేయండిసైడ్ బై సైబ్ వాక్..1 నిమిషంఈ వ్యాయామం టోన్డ్ తొడలను సాధించడానికి, తుంటి కండరాలను నిర్మించడానికి, సమతుల్యతను ప్రోత్సహించడానికి ఉపయోగపడుతుంది. ముందుగా చేతులను ముందు పట్టుకుని, మోకాళ్లను వంచి పక్కకు నడవండి. View this post on Instagram A post shared by Renu Rakheja | Nutritionist & Health Coach (@consciouslivingtips) రివర్స్ వాక్ (వెనుకకు నడవడం) - 2 నుంచి5 నిమిషాలురివర్స్ లేదా బ్యాక్ వాక్స్ మోకాలి నొప్పిని తగ్గిస్తాయి, స్థిరత్వాన్ని పెంచుతాయి, కీళ్ల నొప్పిని నివారిస్తాయి. ఇది చాలా సులభం కూడా. చేయాల్సిందల్లా వెనుకకు నడవడమే, దాదాపు చంద్రుని నడక లాగా కానీ నెమ్మదిగా.చివరిగా శరీరం చెప్పేది వినండి, కొత్త వ్యాయామం లేదా వర్కౌట్లను ప్రారంభించే ముందు సంబంధిత ఆరోగ్య నిపుణులు లేదా వ్యక్తిగత వైద్యులను సంప్రదించండి. అలాగే మీకు కీళ్ల నొప్పులు, లేదా ఇతర వైద్య పరిస్థితులు ఉంటే..నిపుణులు సలహాలు సూచనలతో ప్రారంభిస్తేనే చాలామటుకు మంచిది అని సూచించింది రేణు రఖేజా.గమనిక: ఈ కథనం కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: అలా ఉంటే..డయాబెటిస్ బోర్డర్లోకి వచ్చినట్లే..?) -
స్వస్థ్ నారీ ముచ్చటగా మూడు రికార్డులు
కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య సంరక్షణ ప్రచార కార్యక్రమం ‘స్వస్థ్ నారి, సశక్త్ పరివార్ అభియాన్’ (ఎస్ఎన్ఎస్పీఏ) మూడు గిన్నిస్ వరల్డ్ రికార్డ్లను సాధించింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం... ఈ ప్రచారం దేశంలోని ప్రతి జిల్లాకు చేరింది. 19.7 లక్షల ఆరోగ్య శిబిరాలు నిర్వహించారు. ఆరోగ్య వేదికలలో 11 కోట్ల మందికి పైగా పాల్గొన్నారు.ఒకే నెలలో 3.21 కోట్ల మందికి పైగా హెల్త్కేర్ ప్లాట్ఫామ్లో పేర్లు నమోదు చేసుకోవడం, రొమ్ము క్యాన్సర్ స్క్రీనింగ్ కోసం ఒకేవారంలో అత్యధికంగా 9.94 లక్షల మంది పేర్లు నమోదు చేసుకోవడం, హెల్త్ స్క్రీనింగ్ కోసం రాష్ట్ర స్థాయిలో ఒకే వారంలో 1.25 లక్షల మంది ఆన్లైన్లో పేర్లు నమోదు చేసుకోవడానికి సంబంధించి ‘ఎస్ఎన్ఎస్పీఏ’ గిన్నిస్ రికార్డ్లు సొంతం చేసుకుంది.‘ఎస్ఎన్ఎస్పీఏ’ ప్రచార కార్యక్రమాలలో భాగంగా 1.78 కోట్లమందికి పైగా రక్తపోటు, 1.73 కోట్ల మంది డయాబెటిస్, 69.5 లక్షల మందికి నోటి క్యాన్సర్ పరీక్షలు, 1.51 కోట్ల మందికి రక్తహీనత పరీక్షలు నిర్వహించారు. 1.43 కోట్ల వ్యాక్సిన్ డోసులు ఇవ్వబడ్డాయి. క్షయవ్యాధికి సంబంధించి 85.9 లక్షలకు పైగా మహిళలకు పరీక్షలు నిర్వహించారు.కౌన్సెలింగ్, వెల్నెస్ సెషన్లలో 2.14 కోట్ల మంది పాల్గొన్నారు. ‘మై భారత్’ వాలంటీర్ల క్రియాశీల భాగస్వామ్యంతో 2.68 లక్షల మందికి పైగా నిక్షయ్ మిత్ర ప్రచారం కోసం పేరు నమోదు చేసుకున్నారు. ప్రభుత్వ జాతీయ టీబీ నిర్మూలన క్యాక్రమం (ఎన్టిఇపి) కింద క్షయ రోగులకు అండగా ఉండే వ్యక్తులకు ‘నిక్షయ్ మిత్ర’ బిరుదు ప్రదానం చేస్తారు. -
ప్రపంచంలోనే తొలి రోబో షూస్..మార్నింగ్ వాక్ మజాగా!
‘మార్నింగ్ వాక్ మంచిది’ అనే విషయం తెలిసినా...‘మార్నింగ్ వాక్ చేయాలంటే బద్దకంగా ఉంది’ అని మీకు అనిపిస్తుందా? ‘కొంచెం దూరం కూడా పరుగెత్తలేను బాబోయ్’ అనేవారిలో మీరూ ఉన్నారా? అయితే ప్రాజెక్ట్ యాంప్లిఫై’ గురించి మీరు తెలుసుకోవాల్సిందే...ప్రాజెక్ట్ యాంప్లీఫై అనే రోబోటిక్ షూస్ను మార్కెట్లోకి తీసుకువచ్చింది నైక్ కంపెనీ. తక్కువ శ్రమతో, ఎక్కువ దూరం వేగంగా నడవడానికి ఈ సరికొత్త ఫుట్వేర్ ఉపయోగపడుతుంది. ‘నడక, పరుగు, జాగింగ్కు సంబంధించి ఇది సౌకర్యవంతమైన ఆవిష్కరణ’గా ప్రాజెక్ట్ యాంప్లీఫై గురించి తెలియజేసింది నైక్. తేలికైన మోటర్, డ్రైవ్బెల్ట్, రీచార్జబుల్ బ్యాటరీ ఈ రోబోటిక్ షూస్లో ఉంటాయి. నడక, రన్నింగ్, జాగింగ్ను సులభతరం చేయడమే కాదు... మైలుదూరాన్ని పది నుంచి పన్నెండు నిమిషాల వేగంతో అధిగమించే అథ్లెట్లకు ఈ ప్రాజెక్ట్ యాంప్లీఫై సౌకర్యంగా ఉంటుందని, ఎలక్ట్రిక్ బైక్లు సైక్లిస్ట్లకు ఎలా సహాయపడతాయో అదే విధంగా రోజువారీ కదలికలకు అదనపు శక్తిని అందించడానికిప్రాజెక్ట్ యాంప్లీఫై సహాయపడుతుందని తెలియజేసింది నైక్. చదవండి: Happy Birthday to Nita Ambani దాతగా, వ్యాపారవేత్తగా ఆమెకు ఆమే సాటి! -
లివర్ సమస్యలకు హెన్నాతో చెక్?
జుట్టు, చర్మం రంగును మార్చే గుణం హెన్నాకు (Henna dye) ఉంది. అయితే ఇది అందాన్ని పెంచడమే కాదు.. ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుందని చెప్తున్నారు నిపుణులు. తాజాగా జరిగిన అధ్యయనం ప్రకారం సహజమైన హెన్నా లివర్ సమస్యలను దూరం చేస్తుందని గుర్తించారు. ఇంతకీ ఇది ఎంతవరకు నిజం. హెన్నా ప్రభావం కాలేయంపై ఎలా ఉంటుందో చూద్దాం. ఒసాకా మెట్రోపాలిటన్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తల ప్రకారం.. హెన్నాలోని లాసోనియా ఇనర్మిస్ అనే రంగు.. లివర్ ఫైబ్రోసిస్కు చికిత్స చేయగలదని గుర్తించారు. అధిక మద్యపానం వల్ల, జీవనశైలి వల్ల వచ్చే దీర్ఘకాలిక కాలేయ సమస్యలను తగ్గించడంలో హెన్నా మంచి ఫలితాలు ఇస్తుందని అంటున్నారు శాస్త్రవేత్తలు. అధ్యయన ఫలితాలు ఇవే.. ఒసాకా మెట్రోపాలిటన్ విశ్వవిద్యాలయం ఒక రసాయన స్క్రీనింగ్ వ్యవస్థను అభివృద్ధి చేసింది. కాలేయ సమతుల్యతను కాపాడే యాక్టివేటెడ్ హెపాటిక్ స్టెలేట్ కణాలపై నేరుగా పనిచేసే పదార్థాలను గుర్తించడంలో ఇది సహాయపడుతుంది. ఈ వ్యవస్థను ఉపయోగించి.. లాసోన్ను హెపాటిక్ స్టెలేట్ కణాల యాక్టివేషన్ను ఇది నిరోధిస్తున్నట్లు గుర్తించారు. ఎలుకలపై చేసిన అధ్యయనంలో లివర్ ఫైబ్రోసిస్ తగ్గినట్లు తెలుసు కున్నారు. చదవండి: Happy Birthday to Nita Ambani దాతగా, వ్యాపారవేత్తగా ఆమెకు ఆమే సాటి!అధ్యయనంలో హెపాటిక్ స్టెలేట్ కణాల్లోని యాంటీ ఆక్సిడెంట్ ఫంక్షన్లతో సంబంధం ఉన్న అప్ రెగ్యులేటెడ్ సైటోగ్లోబిన్ను గుర్తించారు. అంటే ఈ కణాలు సాధారణ కణాలుగా మారుతున్నాయన్నమాట. హెన్నాలోని లాసోన్ ద్వారా ఔషధాలు తయారు చేస్తే.. లివర్ ఫైబ్రోసిస్ను నియంత్రించవచ్చని శాస్త్రవేత్తలు నమ్ము తున్నారు. హెపాటిక్ స్టెలేట్ కణాలను యాక్టివేట్ చేసి.. ఔషధాలను రవాణా చేయగల డ్రగ్ డెలివరీ సిస్టమ్ను అభివృద్ధి చేస్తున్నట్లు శాస్త్రవేత్తలు చెప్తున్నారు. దానిని లివర్ ఫైబ్రోసిస్ ఉన్న రోగులకు అందుబాటులో ఉంచేలా ప్లాన్ చేస్తున్నామని ఒసాకా మెట్రోపాలిటన్ విశ్వవిద్యాలయంలో గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ మెడిసన్ డాక్టర్ అట్సుకో డైకోకు తెలిపారు. చదవండి: Karthika masam 2025 దర్శించుకోవాల్సిన పవిత్ర శివాలయాలు -
బ్లాక్ ఫంగస్ ఉల్లి, తొక్కే కదా, అని తీసి వాడేస్తున్నారా?
మార్కెట్ నుంచి మన ఇంటికి ఉల్లిపాయలను తీసుకువచ్చినప్పుడు, చాలా సార్లు ఉల్లిపాయలో నల్లటి పొర కనిపిస్తుంది. సాధారణంగా ఈ పొర తొక్క లోపల కనిపిస్తుంది. మనం దీనిని ఏదో దుమ్ముగా భావించి, కడిగి వాడుకుంటాం. కానీ ఇది నల్లటి ఫంగస్. దీని కారణంగా అనేక వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి ఉల్లిపాయలు తినడం వల్ల కలిగే నష్టాలేంటో తెలుసుకుందాం.బ్లాక్ ఫంగస్ ఉన్న ఉల్లిపాయలు తినడం వల్ల అది మన రోగనిరోధక శక్తిపై ప్రభావం చూపిస్తుంది. దీంతో, అనేక వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉంది. ఇప్పటికే తక్కువ రోగనిరోధక శక్తి ఉన్నవారు ఈ ఉల్లిపాయల జోలికి పోకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.చదవండి: Happy Birthday to Nita Ambani దాతగా, వ్యాపారవేత్తగా ఆమెకు ఆమే సాటి!ఉల్లిపాయలపై నల్లటి మచ్చలు ఒక రకమైన ఫంగల్ ఇన్ఫెక్షన్. ఇలాంటి వాటిని తినడం వల్ల మ్యూకోర్మైకోసిస్ వచ్చే ప్రమాదం పెరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.ఈ ఇన్ఫెక్షన్ చాలా హాని కలిగిస్తుంది. వివిధ అనారోగ్యాల బారిన పడే అవకాశం ఉంది. అందుకే ఇలాంటి ఉల్లిపాయల్ని తినకపోవడమే మేలు.ఉల్లిపాయ నుంచి ఆ భాగాన్ని తీసివేసి తింటే అది ప్రాణాపాయం కలిగించదు. కానీ, ఇది కొంతమందిలో అలెర్జీని కలిగిస్తుంది. ముఖ్యంగా ఇప్పటికే అలెర్జీలు ఉన్నవారు ఇలాంటి ఉల్లిపాయల్ని తినకూడదు. అదేవిధంగా, ఉబ్బసం ఉన్నవారికి ఇది హానికరం. ఈ ఫంగస్ గాలిలో వ్యాపించి, ఉబ్బసం ఉన్న వ్యక్తి దానిని పీల్చినప్పుడు, అది హాని కలిగిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఉల్లిపాయను ఒకటి లేదా రెండు పొరలను తీసివేసిన తర్వాత మాత్రమే వాడండి లేదా ఉల్లిపాయలు కొనేటప్పుడు, తొక్క నల్లగా ఉండకుండా చూసుకోండి.మరో ముఖ్య విషయం... ఉల్లిపాయలను ఫ్రిజ్లో ఉంచకూడదు. ఒకవేళ మీరు ఉల్లిపాయలను ఫ్రిజ్లో ఉంచాలనుకుంటే దానిపై ఎటువంటి నల్లటి ఫంగస్ ఉండకూడదు. అలా ఉంటే అది ఇతర ఆహార పదార్థాలతో కలిసిపోయి విషంగా మారుతుంది. అందుకే ఇలాంటి తప్పులు చేయకండి.చదవండి: Karthika masam 2025 దర్శించుకోవాల్సిన పవిత్ర శివాలయాలు -
జిమ్ లేకున్నా హోమ్ చాలు
ఈ రోజుల్లో మహిళల బాధ్యతలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఇంట్లో గృహిణిగా, ఆఫీసుల్లో ఉద్యోగినిగా మల్టీ టాస్కింగ్గా పనులను చక్కబెట్టాల్సి వస్తోంది. ఇలాంటప్పుడు మైండ్ అండ్ బాడీ బ్యాలెన్స్డ్గా ఉండాలి. అందుకు రోజువారీ వ్యాయామాలు చేయాలి. జిమ్కు వెళ్లలేం అనుకునేవారు ఇంట్లోనే పాటించదగిన ఫిట్నెస్ కేర్ గురించి తెలుసుకుని ఆచరిస్తే ఎంతో మేలు జరుగుతుంది. బాలీవుడ్ సెలబ్రిటీ జిమ్ ట్రైనర్ యాస్మిన్ చెబుతున్న జిమ్ ఫిట్నెస్΄పాఠాలు ఇవి... దీపికా పదుకొనే, అలియాభట్ ఫిట్నెస్ ట్రైనర్ యాస్మిన్ మహిళల దినచర్యలకు తగిన విధంగా ఇంట్లోనే చేసుకోదగిన ఫిట్నెస్కు మార్గనిర్దేశం చేస్తుంది. పోషకాహారంపైనా దృష్టి పెడుతుంది. మహిళల ఫిట్నెస్ కోసం కోర్ స్ట్రెంత్, ఫ్లెక్సిబిలిటీ, స్ట్రెంగ్త్ ట్రైనింగ్తో కూడిన బ్యాలెన్స్ను గట్టిగా చెబుతుంది. అంతేకాదు, మెనోపాజ్ వంటి దశలలో మహిళలు ఆరోగ్యంగా ఉండటానికి సరైన సూచనలనూ అందిస్తుంది.స్థిరత్వం ముఖ్యంచాలా మందిలో ఫిట్నెస్ విషయంలో తీవ్రమైన నిర్ణయాలు ఉంటాయి. ఎక్కువ సమయం, వేగంగా వ్యాయామాలు చేయడం కంటే సరైన సమయంలో సరైన వ్యాయామాలు చేస్తూ ఫిట్నెస్ సాధించడం ముఖ్యం. సమతుల ఆహారం : ప్రాసెస్ చేసి, చక్కెర ఉన్న ఆహారాలను నివారించి ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం ఫిట్నెస్ లక్ష్యాలలో చాలా ముఖ్యమైనది.అనుకూలమైన వ్యాయామాలు: ఇంట్లో, జిమ్లో ఎక్కడైనా చేయడానికి ఎన్నో రకాల వ్యాయామాలు ఉన్నాయి. నిత్యం బిజీగా ఉండే వ్యక్తులు కూడా అనుకూలమైనవి ఎంచుకొని చేయవచ్చు.ఇంట్లోనే చేయదగిన కొన్ని వ్యాయామాలుట్రైసెప్ డిప్స్: మీ ట్రైసెప్స్ కోసం డిప్స్ చేయడానికి బలమైన కుర్చీని ఉపయోగించవచ్చు. అప్పర్కట్, పంచ్: చేతులను బలోపేతం చేసేలా బాక్సింగ్ విధానంలో కదలికలు ఉండాలి.∙డబుల్ లెగ్ స్ట్రెచ్: నేలపైన పడుకొని, మోకాళ్ళను ఛాతీ వద్దకు తీసుకురావడం, తిరిగి చేతులు, కాళ్లను యధాస్థానానికి తీసుకువెళ్లడం.. ఇలా పదే పదే చేయడం ద్వారా ఉదర కండరాలలో మార్పులు తీసుకురావచ్చు.స్ట్రెయిట్ లెగ్ లిఫ్ట్లు : నేలమీద వీపుపై పడుకుని, కాళ్లను సమాంతరంగా చాపుతూ పైకి ఎత్తాలి. తర్వాత తిరిగి కిందకు చేర్చాలి. మడమ స్పర్శ: నేలమీద పడుకొని, మోకాళ్ల దగ్గర కాళ్లను వంచి, చేతులతో మడమలను తాకడానికి ప్రయత్నం చేయాలి. వ్యాయామం చేసేటప్పుడు శ్వాస లయను కూడా ఒక రిథమ్గా నిర్వహించడం ముఖ్యం. ఎటువంటి గాయం కాకుండా మరొకరి పర్యవేక్షణలో సాధన చేయడం ఉత్తమం.నిటారుగా నిల్చొని, ఒక చేతిని తలకిందుగా పట్టుకుని, నెమ్మదిగా వంగిపాదాన్ని మరొక చేతితో తాకండి. అలాగే రెండో చేతితో చేయాలి. తక్కువ పరికరాలతో వ్యాయామాలుహాలో డంబెల్: పాదాలను, భుజాలను వెడల్పుగా ఉంచి భుజాలు, ట్రైసెప్స్, వీపును లక్ష్యంగా చేసుకోవడానికి రెండు చేతులతో డంబెల్ను పట్టుకొని, దానిని తల చుట్టూ తిప్పాలి. బ్యాండ్ ట్విస్ట్: మార్కెట్లో జిమ్ బ్యాండ్స్ లభిస్తాయి. కాళ్లు, చేతులతో ఈ బ్యాండ్ పట్టుకుంటూ ఎగువ, దిగువ వీపు కండరాలపై నిమగ్నం చేయాలి.కెటిల్బెల్ : ఇది సైడ్ బెండ్ చేయడానికి బాగా ఉపయోగపడే మరొక పరికరం. ఈ కెటిల్బెల్ తో మోచేయి నుండి మోకాలికి ఒక డైనమిక్ కదలిక ఉంటుంది. దీనివల్ల నడుము టోన్ అవ్వడమే కాకుండా, కోర్ కో ఆర్డినేషన్ కూడా మెరుగుపడుతుంది. చేతితో కెటిల్బెల్ తీసుకొని, బరువు ఉన్న వైపు పక్కకు వంగి, రెండో మోకాలిని మోచేయి కలిసే విధంగా పైకి ఎత్తాలి. ఇలా పది నుంచి పన్నెండు సార్లు చేయాలి.మెడిసిన్ బాల్ ట్విస్ట్ దీనితో వ్యాయామం చేస్తే పక్కలు బలోపేతం అవుతాయి. ఇందులో ఛాతీ స్థాయిలో మెడిసిన్ బాల్ పట్టుకుని, తల కింద నుంచి ఒక వైపు నుండి మరొక వైపుకు కదలించాల్సి ఉంటుంది.రోజులో ఖాళీ కడుపుతో కొంత సమయం ఈ వ్యాయామాలు చేస్తే మైండ్కు–బాడీకీ మధ్య సమతుల్యత ఏర్పడుతుంది. పనులకు తగినట్టు శక్తిని పుంజుకోవడానికి, శారీరక చురుకుదనం పెంపొందించుకోవడానికి, పోషకాహారంపై దృష్టి పెట్టడానికి ఈ పై వ్యాయమాలు పనిచేస్తాయి. చదవండి: Karthika masam 2025 దర్శించుకోవాల్సిన పవిత్ర శివాలయాలు -
నోటి ఆరోగ్యంతో కొన్ని రకాల క్యాన్సర్లకు చెక్!
నోటి ఆరోగ్యాన్ని చాలామంది నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. అదే పోతుందిలే అని ఉదాసీన వైఖరితో ఉంటారు. నిజానికి నోటి ఆరోగ్యం అంటే దంతాలు ,చిగుళ్ళు మాత్రమే కాదు. మొత్తం శరీర ఆరోగ్యానికి మూల స్థంభం లాంటిది. నోటి అరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తే గుండె జబ్బులు, ప్రమాదకర క్యాన్సర్లకు దారి తీస్తుంది. అందుకే దంతవైద్యులు, వైద్యులు ఇద్దరూ నోటి ఆరోగ్యం ముఖ్యమైనదని నొక్కి వక్కాణిస్తున్నారు. అదెలాగో చూద్దాం.డాక్టర్ సోనియా దత్తా, MDS, PhD, పబ్లిక్ హెల్త్ డెంటిస్ట్రీ ప్రొఫెసర్ ప్రకారం సరైన నోటి ఆరోగ్యం దైహిక ఆరోగ్యానికి మద్దతు ఇస్తుంది. గుండె జబ్బులు, మధుమేహం, కొన్ని క్యాన్సర్లు ప్రమాదాలను తగ్గిస్తుంది. అంతేకాదు క్యాన్సర్ నివారణలో ఇదొక కీలక అంశం.క్యాన్సర్ నివారణకు సరైన నోటి ఆరోగ్యంమంచి నోటి ఆరోగ్యం కేవలం శుభ్రమైన దంతాలను కలిగి ఉండటం కంటే ఎక్కువ.నోటి ఆరోగ్యం అందం సౌకర్యం మాత్రమే కాదు. తక్కువ రోగనిరోధక శక్తి ఉన్నవారికి, నోటి పరిశుభ్రతను పాటించడం అవసరం.ఇది జీవన నాణ్యతను నేరుగా ప్రభావితం చేస్తుంది. సరిగా శుభ్రం చేయని నోటిలో బ్యాక్టీరియా పెరిగి, దీర్ఘకాలిక వాపు (inflammation) ఏర్పడుతుంది, ఇది కణజాల క్షీణతకు దారితీయవచ్చు.డాబర్ రెడ్ పేస్ట్ వంటి ఆయుర్వేద పేస్ట్తో రోజుకు రెండుసార్లు బ్రష్ చేయడం, ఫ్లాసింగ్ చేయడం మరియు యాంటీ బాక్టీరియల్ మౌత్ వాష్ ఉపయోగించడం వంటి సాధారణ అలవాట్లు బ్యాక్టీరియా భారాన్ని తగ్గించడ , నోటి లోపలి వ్యవస్థను సమతుల్యంగా ఉంచడం ద్వారా ఈ ప్రమాదాలను గణనీయంగా తగ్గిస్తాయి.AIIMS (ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్) పరిశోధకుల అభిప్రాయం ప్రకారం, నోటి పరిశుభ్రతను ప్రామాణిక ఆంకాలజీ సంరక్షణలో విలీనం చేయాలి . INHANCE (ఇంటర్నేషనల్ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ ఎపిడెమియాలజీ) కన్సార్టియం, మంచి నోటి పరిశుభ్రత, (వార్షిక దంత పరీక్షలు, తక్కువ పళ్ళు తప్పిపోవడం, రోజువారీ బ్రషింగ్) తల , మెడ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుందని కనుగొంది.క్రమం తప్పకుండాచేసుకునే సాధారణ దంత పరీక్షలు చాలా ముఖ్యమైనవి. తద్వారా నోటి క్యాన్సర్ ముందస్తు సంకేతాలను గుర్తించవచ్చు. కనిపించకుండా ఉండే అనుమానాస్పద గాయాలు, నిరంతర పూతల లేదా కణజాల ఆకృతిలో మార్పులు ఈ పరీక్షల్లో వైద్యులు గుర్తిస్తారు. అలాగే పొగాకుకు నిషేధించడం, మద్యం పరిమితం చేయడం ద్వార క్యాన్సర్ ప్రమాదం మరింత తగ్గుతుంది. ఈ చర్యలు నోటి ఆరోగ్యాన్ని రక్షించడమే కాకుండా దీర్ఘకాలిక క్యాన్సర్ నివారణ వ్యూహాలలో శక్తివంతమైన సాధనాలుగా కూడా పనిచేస్తాయి, ముఖ్యంగా తల మరియు మెడ క్యాన్సర్లు ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో.నోటి ఆరోగ్యం - కొన్ని రకాల క్యాన్సర్లు తల, మెడ క్యాన్సర్లు: దీర్ఘకాలిక చిగుళ్ల వ్యాధి, పేలవమైన నోటి పరిశుభ్రత లాంటివి నోరు, గొంతు స్వరపేటికలో ప్రాణాంతంగా మారే వాపు మరియు సెల్యులార్ మార్పులను పెంచుతాయి.జీర్ణవ్యవస్థ క్యాన్సర్లు: పీరియాడోంటల్ వ్యాధి కడుపు, ప్యాంక్రియాటిక్ మరియు కొలొరెక్టల్ క్యాన్సర్ల ప్రమాదాలతో ముడిపడి ఉంది.ఊపిరితిత్తుల మరియు ప్రోస్టేట్ క్యాన్సర్లు: నోటి అపరిశుభ్రత, అనారోగ్యం ఈ క్యాన్సర్ల ముప్పును పెంచుతుంది. (స్వరోవ్స్కి ఈవెంట్లో రష్మిక స్టైలిష్ లుక్ : ఎంగేజ్మెంట్ రింగ్ స్పెషల్!)అయితే ఇది అన్ని క్యాన్సర్లను నిరోధించకపోయినా, మంచి నోటి సంరక్షణ కొన్ని రకాల క్యాన్సర్లు ముప్పును తగ్గిస్తుంది. మ్యూకోసిటిస్, ఇన్ఫెక్షన్ల వంటి సమస్యలను తగ్గించడం ద్వారా క్యాన్సర్ చికిత్స ఫలితాలను మెరుగు పడతాయి. రోగనిరోధక పనితీరు మెరుగుపడుతుంది. నోటి సంరక్షణ ఎలా?ఆయుర్వేద పేస్ట్తో ప్రతిరోజూ రెండుసార్లు బ్రష్ చేయడం, క్రమం తప్పకుండా ఫ్లాసింగ్ చేయించుకోవడం. యాంటీ బాక్టీరియల్ మౌత్ వాష్ పొగాకు, ఆల్కహాల్కు దూరంగా ఉండటం చక్కెర, యాసిడ్ ఫుడ్స్, పానీయాలకు దూరంగా ఉండాలి. లేదంటే ఇవి దంతాల ఎనామిల్ను పాడుచేస్తాయి, బ్యాక్టీరియా పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. కనీసం సంవత్సరానికి ఒకసారైనా దంతవైద్యుడిని సంప్రదించాలి.నోటిలో ఏదైనా అసాధారణ గడ్డలు, పుండ్లు లేదా ఇతర మార్పులను గమనించి నట్లయితే, వెంటనే దంతవైద్యుడిని సంప్రదించండి. -
యోగ కోచ్గా ఐఐటీయన్..!
ఐఐటియన్గా పెద్ద కలలు, ఖరీదైన కలలేవీ కనలేదు సౌరభ్. ‘మార్పు తెచ్చే శక్తి యోగాలో ఉంది’ అని గ్రహించిన ఈ కుర్రాడు దేశవ్యాప్తంగా యోగా తరగతులు నిర్వహిస్తున్నాడు. ‘హబిల్డ్’ గ్లోబల్ మూమెంట్ ప్లాట్ఫామ్ ప్రారంభించాడు. ఈ విశ్వవేదికలో 169 దేశాల నుంచి 1.2 కోట్ల మంది యోగాభ్యాసకులుఉన్నారు. ఇక వరల్డ్ రికార్డ్లు సరే సరి... ‘ఐఐటీ పూర్తి చేసి ఆరుసంవత్సరాలైనా సౌరభ్ ఏమీ సంపాదించలేదు’ అని కొద్దిమంది అనుకునేవారు. వారికి తెలియని విషయం ఏమిటంటే సౌరభ్ చాలా సంపాదించాడు. ఎంతో పేరు! ఎన్నో రికార్డ్లు!! మహారాష్ట్రలోని ధనజ్ అనే చిన్న గ్రామంలో పుట్టాడు సౌరభ్. అతడి పూర్వీకులు రాజస్థాన్కు చెందిన వారు. తాత లక్ష్మీచంద్ 1955లో యంబీబీయస్ పూర్తి చేశాడు. బాగా డబ్బులు సంపాదించాలి, లగ్జరీగా బతకాలి, పట్టణాలలో మాత్రమే ఉండాలి అనుకోలేదు. పేద ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో రోడ్లు కూడా సరిగ్గా లేని మారుమూల గ్రామంలో ప్రాక్టీస్ ప్రారంభించాడు. వైద్యుడిగా సేవలందించడమే కాకుండా గ్రామ అభివృద్ధి కోసం ఎంతో చేశాడు లక్ష్మీచంద్. చిన్నప్పటి నుంచి తాత గురించి ఎన్నో మంచి విషయాలు విన్నాడు సౌరభ్. అలా తనకు తెలియకుండానే తాత స్ఫూర్తిగా మారాడు. స్వామి వివేకానంద బోధనలు కూడా సౌరభ్ను ఎంతో ప్రభావితం చేశాయి. ఈ నేపథ్యంలోనే ‘ఉద్యోగం కాదు. సమాజం కోసం ఏదైనా చేయాలి’ అనుకున్నాడు. కాలేజి రోజుల్లో ఒకసారి బెనారస్ నుంచి నాగ్పూర్కు ప్రయాణిస్తున్న సౌరభ్కు ఒక ధ్యానకేంద్రానికి చెందిన సభ్యులతో పరిచయం ఏర్పడింది. వారితో పరిచయం తన జీవనగమనాన్ని మార్చింది. యోగాపై ఆసక్తి పెంచుకునేలా చేసింది. వారు నిర్వహించే ధ్యాన, యోగ తరగతులకు హాజరయ్యేవాడు. యోగ తరగతులకు హాజరుకావడం టర్నింగ్ పాయింట్గా మారింది. క్రమం తప్పకుండా ధ్యానం, యోగా చేసేవాడు. దీనివల్ల చిన్నప్పటి నుంచి ఉన్న ఆస్తమ సమస్య ఉపశమనం దొరికినట్లయింది.యోగాలో ప్రావీణ్యం సాధించిన సౌరభ్ ఆ విద్యను వీలైనంత ఎక్కువ మందికి నేర్పించాలనే లక్ష్యంతో ప్రయాణం ప్రారంభించాడు. దేశం నలుమూలలా తిరుగుతూ ఎంతోమందికి యోగా నేర్పించాడు. ‘యోగా బోధించడం కోసం ఎన్నో ప్రాంతాలు తిరిగాను. ఆ సమయంలో నా సంతోషం మాటలకు అందనిది. ప్రతిరోజూ కొత్తగా, ఉత్సాహంగా ఉండేది. రోజూ నిద్ర లేవగానే ఈరోజు క్లాస్లో ఎలా బోధించాలి అనేదాని గురించి ఆలోచించేవాడిని. ప్రతిరోజూ పండగ జరుపుకున్నంత ఉత్సాహంగా ఉండేది’ అని గతాన్ని గుర్తు తెచ్చుకున్నాడు సౌరభ్.కోవిడ్ లాక్డౌన్ సమయంలో ఒక్క రూపాయి కూడా ఆశించకుండా యోగా ఆన్లైన్ క్లాస్లు ప్రారంభించాడు. అయితే మొదట్లో కేవలం ముగ్గురు మాత్రమే ఈ ఆన్లైన్ క్లాస్లకు హాజరయ్యేవారు. తాను నిర్వహించే తరగతులు ఉచితం కాబట్టి వాటిని ఎవరూ సీరియస్గా తీసుకోవడం లేదని గ్రహించిన సౌరభ్ తన ఆన్లైన్ క్లాస్లకు నెలకు వంద రూపాయలు ఫీజుగా పెట్టాడు.ముగ్గురితో మొదలైన ఆన్లైన్ క్లాస్ విద్యార్థుల సంఖ్య వందకు చేరింది. ఆ తరువాత దేశదేశాలకు విస్తరించి, విద్యార్థుల సంఖ్య లక్షలు దాటింది. తాను నిర్వహించే ఆన్లైన్ తరతులకు ముగ్గురు మాత్రమే హాజరైనప్పుడు సౌరభ్ నిరాశకు గురికాలేదు. ఘనమైన రికార్డ్లు నెలకొల్పినప్పుడు అహంతో ప్రవర్తించడం లేదు. యోగా నేర్పిన సమ్యక్ దృష్టితోనే తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాడు.వావ్ అనిపించే వరల్డ్ రికార్డులుయూట్యూబ్లో యోగా లైవ్ స్ట్రీమ్ను అత్యధికంగా వీక్షించిన ప్లాట్ఫామ్గా హబిల్డ్ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ నెలకొల్పింది. అదే సంవత్సరం ఈ ప్లాట్ఫామ్ రెండు వరల్డ్ రికార్డ్స్ టైటిల్స్ సాధించింది. అందులో ఒకటి...ఒకేరోజులో చాలామంది లైవ్ వ్యూయర్స్కు సంబంధించింది, రెండోది లార్జెస్ట్ వర్చువల్ మెడిటేషన్ క్లాస్కు సంబంధించింది. మొదటి దానిలో 5,99,162 మంది, రెండో దానిలో 2,87,711 మంది పాల్గొన్నారు. ఈ సంవత్సరం 169 దేశాలకు చెందిన 7,52,074 మందితో వర్చువల్ యోగా సెషన్ నిర్వహించి మరో రికార్డ్ సొంతం చేసుకున్నాడు సౌరభ్. (చదవండి: ఇద్దరు పిల్లల తల్లి సాహసం..! మరో రికార్డు కోసం..) -
ధనాధన్..వాకథాన్..! ఊపందుకుంటున్న సుదీర్ఘ నడక ఈవెంట్లు..
నడిస్తే పోయేదేం లేదు.. అనారోగ్యం తప్ప.. అని వైద్యులు పదే పదే చెవిన ఇల్లు కట్టుకుని చెబుతున్నారు. మరోవైపు కోవిడ్ తర్వాత శారీరక శ్రమ, ఫిట్నెస్కు ప్రాధాన్యత ఇవ్వడానికి నగరవాసులు ఆసక్తి కనబరుస్తున్నారు. మహమ్మారి సమయంలో ఎదురైన అనుభవాల రీత్యా.. వాకథాన్లపై క్రమంగా ఆసక్తి పెరుగుతోంది. దీంతో పార్కుల్లో వాకర్స్ మాత్రమే కాదు సుదూర ప్రాంతాలకు నడిచే వాకథానర్లు కూడా పెరుగుతున్నారు. వీరి కోసం పలు కార్పొరేట్ సంస్థలు వాకథాన్ ఈవెంట్లను నిర్వహిస్తున్నాయి. ప్రజల నుంచి కూడా ఈ తరహా ఈవెంట్ల పట్ల ఆసక్తి పెరుగుతోంది. దీంతో పలు స్వచ్ఛంద సంస్థలు, కార్పొరేట్లు.. ఏదో ఒక ఈవెంట్కు అనుగుణంగానో, సామాజిక కార్యక్రమాలకు నిధుల సమీకరణ కోసమో హైదరాబాద్ నగరంలో ఇటువంటి వాకథాన్లు క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నారు. ‘వాకథాన్లు’ – ‘వాకింగ్ మారథాన్ల’ సంక్షిప్త రూపం దేశవ్యాప్తంగా ఆరోగ్య ప్రియుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. ఫిట్నెస్, ఆరోగ్యంపై పెరుగుతున్న అవగాహన రీత్యా ‘వాకథాన్లు’ బాగా ప్రాచుర్యం పొందుతున్నాయి. వాకథాన్లు నగర రోడ్లకే పరిమితం కాలేదు. చాముండి కొండలలోని అటవీ ట్రైల్స్, రాజస్థాన్లోని ఎడారి ప్రదేశాలతో సహా ప్రకృతి అందాల నడుమ ఇవి జరుగుతున్నాయి. సామాజిక ‘కారణాల’ కోసం నిధులను సమీకరించేందుకు నిర్వహించే వాకథాన్లు కూడా పెరిగాయి. ముంబైలో జరిగిన ‘చలో భారత్ వాకథాన్ 2025’లో 6,500 మందికి పైగా పాల్గొన్నారు. అవయవ దానం, రొమ్ము కేన్సర్ అవగాహన వన్యప్రాణుల సంరక్షణ వంటివి కూడా వాకథాన్లకు థీమ్స్గా మారుతున్నాయి. ప్రభుత్వం ఇటీవల చేపట్టిన ‘ఫిట్ ఇండియా‘ ఉద్యమం పెద్ద ఎత్తున వాకథాన్లను ప్రోత్సహించింది. గత 2020లో రాజస్థాన్లో 200కి.మీ ‘ఫిట్ ఇండియా వాకథాన్’ను నిర్వహించారు. వ్యవస్థలూ.. వ్యక్తిగతంగానూ.. వాకథాన్లు కార్పొరేట్ ప్రపంచాన్ని సైతం ఆకర్షించడం ప్రారంభించాయి. థ్రిల్ జోన్ వంటి ప్రత్యేక ఈవెంట్ నిర్వాహకులు టౌన్ స్క్రిప్ట్ వంటి ఈవెంట్–బుకింగ్ ప్లాట్ఫారమ్లు దేశవ్యాప్తంగా ఎండ్యూరెన్స్ వాకింగ్ ఈవెంట్లను సృష్టిస్తున్నాయి. ప్రతి సంవత్సరం భారతదేశంలోని నగరాల్లో డజనుకు పైగా వాకథాన్లు జరుగుతున్నాయి. ‘మేం 2011–12లో బెంగళూరులో మా మొదటి ‘ట్రైల్వాకర్’ నిర్వహించినప్పుడు 320 మంది పాల్గొన్నారు. ప్రస్తుతం రెండు నగరాల్లో నిర్వహిస్తుంటే ప్రతి సంవత్సరం 1600 మందికి పైగా పాల్గొంటున్నారు’ అని ఆక్స్ఫామ్ ఇండియా సీఈఓ అమితాబ్ బెహర్ చెప్పారు. మరోవైపు వ్యక్తిగతంగానూ రికార్డు స్థాయి నడకలతో గుర్తింపు పొందారు. కోయంబత్తూరుకు చెందిన నటరాజ్ 2021– 2023 మధ్య 798 రోజుల్లో 6,614 కి.మీ నడిచి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లోకి ఎక్కారు. 2024లో పర్యావరణ అవగాహన పెంచడానికి విరాగ్ మధుమాలతి నవీ ముంబై నుంచి రాజస్థాన్ వరకూ 1,305 కి.మీ. నడిచి ప్రపంచ రికార్డును నెలకొల్పారు. కొంకణ్ ట్రయల్ నిర్వహిస్తున్నాం.. ‘గతంలో పలు మార్లు వాకథాన్, మారథాన్లలో పాల్గొన్న అనుభవం ఉంది. ప్రస్తుతం పుణె సమీపంలోని అందమైన గ్రామాలు, చిన్న చిన్న పట్టణాలు, చెరువులు, వాగులు, వంకలు, ఘాట్లు.. ఇంకా అనేక ప్రకృతి సౌందర్యాల నడుమ కొంకణ్ ట్రయల్ వాకథాన్ నిర్వహిస్తున్నాం’ అని గ్రీన్ ట్రయిల్ ఫౌండేషన్ ప్రతినిధులు తెలిపారు. తమ వాకథాన్ను నగరానికి పరిచయం చేసిన సందర్భంగా వీరు తమ ఈవెంట్ వివరాలు వెల్లడించారు. విభిన్న రంగాల్లో సేవలు అందిస్తున్న వ్యాయామ, ఆరోగ్య ప్రియులమైన తామంతా కలిసి ఈ వేదికను స్థాపించామన్నారు. ఈ ఈవెంట్లో పాల్గొనేవారు 100 కి.మీ దూరాన్ని 50 గంటల్లో, 50 కి.మీ దూరాన్ని 25 గంటల్లో పూర్తి చేయాల్సి ఉంటుందన్నారు. కనీసం ఇద్దరు నుంచి నలుగురు టీమ్గా పాల్గొంటారు. తమ వాకథాన్లో పాల్గొనేందుకు హైదరాబాద్తో పాటు బెంగళూర్, ముంబై, పుణె తదితర నగరాల నుంచి వాకర్స్ ఉత్సాహం చూపిస్తున్నారన్నారు. బహుళ వాకథాన్లు.. బహుళ వాకథాన్లు చేసిన వారు 100 కి.మీ ట్రయల్ను పూర్తి చేయడానికి 32 గంటలకు పైగా సమయం గడుపుతారు. వారు ప్రతి 15–20 కి.మీ తర్వాత చిన్న విరామాలు తీసుకుంటూ నడుస్తారు. మొదటి 50 కి.మీలు పూర్తి చేసిన తర్వాత దాదాపు రెండు గంటల పాటు ఒక దీర్ఘ విరామం తీసుకుంటారు. ఒక వ్యక్తి 100 కిలోమీటర్లు పూర్తి చేయడానికి కనీసం 1.5 లక్షల అడుగులు వేస్తాడు. చివరి 100 అడుగులు అత్యంత కష్టతరమైనదని వాక్థానర్లు అంటున్నారు. ఓపికకు పరీక్ష.. ‘వాకథాన్లు స్టామినాను, ఓపికను పరీక్షిస్తాయి.. మొదటి 10 కి.మీ. సరదాగా ఉంటుంది. కానీ తర్వాత నుంచి కష్టం మొదలవుతుంది’ అని వాకథాన్ ప్రియుడు ఇష్మీత్ సింగ్ చెప్పారు. ‘మారథాన్ 2–3 గంటల్లో ముగుస్తుందని ముందే తెలుస్తుంది. దానికి అనుగుణంగా శిక్షణ పొందినట్లయితే, దానిని పూర్తి చేయగలం. కానీ వాకథాన్ల కోసం చాలా దృఢసంకల్పం అవసరం’ అని సింగ్ అంటున్నారు. ఆయన తన చివరి 100 కి.మీ వాకథాన్ను 32 గంటల్లో పూర్తి చేశారు. వాకథాన్ శిక్షణలో భాగంగా రోజువారీ సెషన్లు, పోషకాహారం వంటివి సూచిస్తారు.. అమెచ్యూర్ వాకథానర్లు ఒకేసారి 25–30 కి.మీ లను కవర్ చేసే వారాంతపు నడకలతో ప్రారంభిస్తారు. వీరు నగర రోడ్లు, గ్రామ దారులు, పగలు, రాత్రి వేళల్లో, అలాగే అన్ని రకాల భూభాగాల్లో నడవడానికి అవకాశం పొందుతారు. ఇది గొప్ప అనుభవం అని వాకథానర్లు అంటున్నారు. (చదవండి: అక్కాచెల్లెళ్లు నలుగురికి అరుదైన వ్యాధి..! విస్తుపోయిన వైద్యులు) -
అక్కాచెల్లెళ్లు నలుగురికి అరుదైన వ్యాధి..! విస్తుపోయిన వైద్యులు
ఒకే తల్లికి పుట్టిన పిల్లలకు ఒకే విధమైన సమస్య రావడం చూస్తుంటాం. అలా కాకుండా..ఆఖరి పిల్లవాడిలో చూసిన రుగ్మత పెద్దపిల్లల్లో ఒకరి తర్వాత ఒకరూ బారినపడితే..అదొక మెడికల్ మిస్టరీలా ఉంటుంది. అలాంటి ఘటనే ఇక్కడ ఆవిష్కృతమైంది. వైద్యులు సైతం ఇదెలా సాధ్యం అని విస్తుపోతున్నారు.అసలేం జరిగిందంటే..అమెరికాలోని వెస్ట్ వర్జినియాకు చెందిన ఒక కుటుంబంలో నలుగురు కుమార్తెలు ఒకరు తర్వాత ఒకరు ఒకే విధమైన మెదడు సంబంధిత రుగ్మత బారినపడ్డారు. తొలుత చిన్న కుమార్తెకు 18 నెలల వయసు ఉండగా ఈ సమస్యను గుర్తించారు. అదీగా తల్లిదండ్రులు కూడా చిన్నప్పటి నుంచి ప్రతిదీ నేర్చుకోవడం ఆలస్యం కావడంతో..ఆ చిన్నారి విషయంలోనే ఆందోళ చెందేవారు. ఇప్పుడూ పెద్దవాళ్లైన ముగ్గురు పిల్లలు అదే రుగ్మత బారినపడ్డారని తెలిసి తల్లడిల్లిపోయారు. ఏంటా వ్యాధి అంటే..మెదడుకి సంబంధించిన చియారీ వైకల్యం. వైద్యానికి సవాలు విసిరేలా నలుగురు ఒకేసారి ఈ వ్యాధిని ఎదుర్కొవడం అంతుచిక్కని మిస్టరీలా అనిపించింది వైద్యులకు. చియారీ వైకల్యం అంటే..పుర్రె వెనుకభాగం మెదడు కణజాలం వెన్నెముకలోకి ప్రవేశించే పరిస్థితి. ఫలితంగా ఇది మెదడుపై ఒత్తిడిని కలిగిస్తుంది. దాంతో తలనొప్పి, మైకము, మెడ నొప్పి, బ్యాలెన్సింగ్కి సంబంధించిన సమస్యలు ఎదుర్కొంటారు. సింపుల్గా చెప్పాలంటే మెదడు యొక్క దిగువ భాగం పుర్రె దాటి విస్తరించి, పుర్రె వెన్నుపాముతో కలిసే ద్వారం పొడుచుకు వచ్చే పరిస్థితి. ఇది సాధారణంగా పుట్టుకకు ముందు అభివృద్ధి చెందుతుందని వైద్యులు. ఈ సమస్యల ప్రతి 2,000 మందిలో ఒకరిని ప్రభావితం చేస్తుంది. అయితే ఈ పరిస్థితి ఎందువల్ల వస్తుందనేది ఖచ్చితమైన కారణం తెలియదు. అయితే పెద్దవాళ్లైన ముగ్గురు ఆడపిల్లలు అమేలియా, ఆబ్రే, అడాలీలకి పీడియాట్రిక్ న్యూరో సర్జన్ శస్త్ర చికిత్స చేసి సమస్య నుంచి మెరుగయ్యేలా చేశారు. ఇక్కడ వైద్యులు ఈ పరిస్థితికి..మెదడుతో కుదించి ముడిపడి ఉన్న వెన్నుపాములను కోసి సెరెబ్రోస్పానియల్ ద్రవ ప్రవాహాన్ని పునరుద్ధరించడమే లక్ష్యంగా శస్త్రచికిత్స చేస్తారు. ప్రస్తుతం ఆ ముగ్గురు ఈ సమస్య నుంచి విజయవంతంగా బయటపడ్డారు. కానీ ఇలా ఈ చియారీ వైకల్యం బారిన నలుగురు అక్కాచెల్లెళ్లు ఒకేసారిపడటం అనేది అత్యంత అసాధారణం, అరుదుగా పేర్కొన్నారు వైద్యులు. ఈ సమస్య సుమారు 10% వరకు వంశపారంపర్యంగా వస్తున్నట్లు భావిస్తున్నప్పటికీ..జన్యుపరమైన కారణాల వల్ల సంభవిస్తుందనేది మరికొందరు నిపుణులు వాదన. చివరగా.. ఈ సమస్యకు గనుక సకాలంలో చికిత్స తీసుకోకపోతే అవయవాల బలహీనత, శ్వాస సమస్యలు, పార్శ్వగూని, తలనొప్పి, నరాల నొప్పికి దారితీసి పక్షవాతానికి గురయ్యే ప్రమాదం లేకపోలేదని హెచ్చరిస్తున్నారు వైద్యులు. (చదవండి: రోబోటిక్తో..స్ట్రోక్ శరవేగంగా రికవరీ) -
ఈ తరం వైబ్స్.. దేశీ టూన్స్..
యానిమేషన్, వీఎఫ్ఎక్స్, గేమింగ్, కామిక్స్(ఏవీజీసీ) రంగాల సమ్మేళనంగా నిర్వహించే వినూత్న సృజనాత్మక వేడుక ‘దేశీ టూన్స్ 2025’కు భాగ్యనగరం వేదిక కానుంది. దేశంలో సృజనాత్మక ఆర్థిక వ్యవస్థకు రూపకల్పన చేస్తున్న అతిపెద్ద వేడుక ఇండియాజాయ్ 2025, ఈ ఏడాది తన 8వ ఎడిషన్తో మరింత వైభవంగా రాబోతోంది. ఇందులో భాగంగా దేశీ టూన్స్ ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. చోటా భీమ్ వంటి ప్రముఖ భారతీయ పాత్రలను సృష్టించిన గ్రీన్ గోల్డ్ యానిమేషన్ సంస్థ నిర్వహిస్తున్న ఈ యానిమేషన్ కాన్క్లేవ్వచ్చేనెల 1న హైదరాబాద్ నగరంలోని హెచ్ఐసీసీ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించనుంది. ఈ ఏడాది ఎడిషన్లో భారతీయ సాంస్కృతిక మూలాల నుంచి ప్రేరణ పొందిన కథలను అంతర్జాతీయ ప్రేక్షకుల మనసులను తాకేలా మలుస్తున్న సృజనకారుల విజయగాథలను ప్రదర్శించనున్నారు. మాస్టర్క్లాస్లు, ప్యానెల్ చర్చలు, ఇంటరాక్టివ్ సెషన్లు.. అన్నీ క్రియేటర్స్, నిర్మాతలు, పరిశ్రమ నిపుణుల కోసం ప్రేరణాత్మక అనుభవంగా ఉండబోతున్నాయి. గ్లోబల్ ప్లాట్ఫామ్.. ‘దేశీ టూన్స్’ భారతీయ కథన శక్తికి, సృజనాత్మక ప్రతిభకు ప్రతీకగా నిలుస్తోంది. భారతీయ యానిమేషన్ ప్రపంచానికి వేదికగా ఈ కాన్క్లేవ్ కొత్త ప్రతిభను వెలికితీయడంతో పాటు పాలసీ, పెట్టుబడి, సాంకేతికత వంటి రంగాల్లో సమన్వయం సృష్టించడంలో కీలకపాత్ర పోషిస్తోంది. ఈ వేదిక ద్వారా రాష్ట్రంలోనే కాకుండా జాతీయ స్థాయిలోనూ యానిమేషన్, విజువల్ మీడియా రంగాలకు ఉత్సాహం, అవకాశాలను కల్పించే నిర్ణయాలకు అద్భుత వేదికగా నిలవనుంది. అంతేగాకుండా ‘పవర్ ప్లేయర్స్ ఆఫ్ ఇండియన్ యానిమేషన్’, ‘క్వైట్ స్టోరీస్, పవర్ఫుల్ ఇంపాక్ట్’, ‘ది రోల్ ఆఫ్ గవర్నమెంట్ ఇన్ బూస్టింగ్ ఏవీజీసీ సెక్ట్సర్’ చర్చలు జరుగుతాయి. ఇందులో పాన్ ఇండియా హిట్ మూవీ ‘కల్కి 2898 ఏడీ’ దర్శకుడు నాగ్ అశి్వన్, ‘మహావతార్ నరసింహ’ (2025) దర్శకుడు అశి్వన్, వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ సౌత్ ఆసియా కిడ్స్ కంటెంట్ హెడ్ సాయి అభిõÙక్ వంటి ప్రముఖులు పాల్గొననున్నారు. యానిమేషన్ అభిమానులు, విద్యార్థులు, పరిశ్రమ నిపుణులు తదితరులు ఇందులో భాగం కానున్నారు. మన కథల గురించి చెప్పుకోవాలి.. ఈ నేపథ్యంలో గ్రీన్ గోల్డ్ యానిమేషన్ వ్యవస్థాపకులు రాజీవ్ చిలకా మాట్లాడుతూ.. భారతీయ కథలు ప్రపంచ వేదికపై వెలుగొందాలి. మన సంస్కృతికి చెందిన నిజమైన కథలు సాంకేతికత, ఊహాశక్తి, క్రియేటివిటీ ద్వారా ప్రపంచాన్ని ఆకట్టుకునేలా మలచవచ్చని తెలిపారు. ఇండియాజాయ్ ప్రతినిధి మాధవరెడ్డి యతం మాట్లాడుతూ.. దేశీ టూన్స్ భారతీయ సృజనాత్మకతకు ప్రతీక. గ్రీన్ గోల్డ్ భాగస్వామ్యంతో ఇండియాజాయ్ ఆవిష్కరిస్తున్న ఈ వేదిక భారతదేశం కేవలం సృజనాత్మక భాగస్వామి కాకుండా గ్లోబల్ లీడర్గా ఎదిగే క్రమాన్ని ప్రదర్శిస్తోందని అన్నారు. (చదవండి: రుచులదాత 'సుషీ'భవ..! భోజనప్రియులు ఇష్టపడే క్రేజీ వంటకం) -
యువతలో హార్ట్ స్ట్రోక్స్!
సాక్షి, హైదరాబాద్ : భారత యువతలో గుండెపోటు ప్రమాదం ఆందోళనకరమైన రీతిలో పెరుగుతోంది. గతంలో 50–60 ఏళ్లకు పైబడిన వారికే హార్ట్స్ట్రోక్స్ పరిమితమయ్యేవి. అందుకు భిన్నంగా ఇప్పుడు 45 ఏళ్లలోపు వారు 15–20 శాతం మంది గుండెపోటుకు గురవుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా చూస్తే మాత్రం 45 ఏళ్లలోపు వారిలో ఇంతకంటే తక్కువ స్ట్రోక్ కేసులు సంభవిస్తున్నాయి. నగరాల్లో ఐటీ ఉద్యోగులు, నిపుణులు, అధిక స్క్రీన్ సమయం గడుపుతున్న విద్యార్థులు ముందస్తు వాస్కులర్ ప్రమాదాలను ఎదుర్కొంటున్నారని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం 25–40 ఏళ్ల మధ్యలోని పురుషులు, మహిళలు గుండె సమస్యలకు గురవుతున్నారు. ఇవి కొన్నిసార్లు ప్రాణాంతకంగా కూడా మారుతున్నాయి. పాశ్చాత్య దేశాలతో పోలిస్తే భారతీయులు జన్యుపరంగా హృదయ సంబంధ వ్యాధులకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ పరిస్థితుల్లో 2023 లాన్సెట్ నివేదిక, ఇతర తాజా అధ్యయనాల ప్రకారం చూస్తే.. భారత్లో ఏటా 15–18 లక్షల స్ట్రోక్ కేసులు నమోదవుతున్నాయి. దేశంలో మరణాలకు రెండో ప్రధాన కారణం, వైకల్యానికి మూడో ప్రధాన కారణంగా గుండెపోట్లు నిలుస్తున్నాయి. ప్రమాదకారకాలపై నిపుణుల మాట » ఆధునిక జీవనశైలి మన శరీరం కంటే వేగంగా మన ధమనులను వృద్ధాప్యం బారిన పడేలా చేస్తోంది. » మధుమేహం, అధిక రక్తపోటు,ధూమపానం, వాయు కాలుష్యం, దీర్ఘకాలిక ఒత్తిడి వంటి అంశాలు దీని పెరుగుదలకు కారణమవుతున్నాయి. » స్లీప్ అప్నియా–స్ట్రోక్ మధ్య బలమైన సంబంధం ఉంది. స్ట్రోక్తో బాధపడుతున్న వారిలో దాదాపు 50–70 శాతం మందికి స్లీప్ అప్నియా కూడా ఉంటుంది. ఈ పరిస్థితి ఒక వ్యక్తి రాత్రిపూట గురక పెట్టడానికి, పదేపదే మేల్కొనడానికి కారణమవుతుంది. దీని వలన ఆక్సిజన్ స్థాయిలు పడిపోతాయి, రక్త నాళాలపై ఒత్తిడి వస్తుంది. » ప్రారంభ స్ట్రోక్ తర్వాత చికిత్స చేయకపోతే, రెండేళ్లలోపు పునరావృతమయ్యే అవకాశం 50 శాతం ఉంటుంది. ప్రతి నిమిషం విలువైనదియువ భారతీయుల జీవనశైలిలో మార్పులు, ఒత్తిడి వారిని మరింతప్రమాదంలో పడేస్తున్నాయని కార్డియాలజీ, న్యూరాలజీ నిపుణులు చెబుతున్నారు. స్ట్రోక్తో రక్త ప్రసరణకు అంతరాయం ఏర్పడిన తర్వాత దాదాపు రెండు మిలియన్ల మెదడు కణాలు వేగంగా చనిపోతాయి కాబట్టి ఈ లక్షణాలను త్వరగా గుర్తించడం చాలా ముఖ్యం. అందువల్ల స్ట్రోక్ తర్వాత ప్రతి నిమిషం చాలా విలువైనది. ఈ నేపథ్యంలో 2025లో ‘ఎవ్రీ మినిట్ కౌంట్స్’అనే ప్రచార అంశంతో గుండెపోట్ల నివారణ, లక్షణాల గుర్తింపు, సకాలంలో చికిత్స ప్రాముఖ్యతను వివరించేలా ప్రపంచవ్యాప్తంగా వివిధ కార్యక్రమాలను నిర్వహించారు. ఎలా గుర్తించాలి? ముఖం, చేయి లేదా కాలు యొక్క ఒకవైపుఆకస్మిక బలహీనత లేదా తిమ్మిరి, మాటల్లో అస్పష్టత, మసకబారిన దృష్టి, తలతిరగడం, అకస్మాత్తుగా తీవ్రమైన తలనొప్పి లాంటి ముందస్తుహెచ్చరికలను విస్మరించకూడదు. ఈ లక్షణాలున్న వారిని సీటీ/ఎమ్మారై స్కాన్ సౌకర్యాలున్నఆసుపత్రికి తీసుకెళ్లాలి ప్రమాదాన్ని ఇలా తగ్గించుకోవచ్చు.. » గుండె జబ్బులను పూర్తిగా నివారించలేరు కానీ జీవనశైలిలో మార్పులు, అవగాహనతో ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించవచ్చు. » ఫాస్ట్ ఫుడ్స్, ప్రాసెస్ చేసిన స్నాక్స్,అధిక చక్కెర పానీయాలు మానేయాలి. » ఆహారంలో పుష్కలంగా పండ్లు, కూరగాయలు,తృణధాన్యాలు, ప్రొటీన్లను చేర్చాలి. » ధూమపానం మానేయాలి. మద్యపానం పరిమితం చేయాలి. » క్రమం తప్పకుండా వ్యాయామం, జాగింగ్,యోగా చేయాలి. ధ్యానం, శ్వాస వ్యాయామాలు, ఇతర అభిరుచులను అలవరుచుకుంటేఆందోళన తగ్గుతుంది. » రోజూ మంచి నిద్ర (7–8 గంటలు) అవసరం. » ఏడాదికోసారి రక్తపోటు, కొలెస్ట్రాల్ ,రక్తంలో చక్కెర స్థాయిలు, ఈసీజీ లాంటి పరీక్షలు చేయించుకుంటే సమస్యలను ముందుగానేగుర్తించే అవకాశం ఉంటుంది. -
వర్షాలు, వణికించే చలిగాలులు : ఈ హెల్త్ టిప్స్ పాటించండి!
మోంథా తుఫాను ప్రభావం బాగా కనిపిస్తోంది. వర్షం, చల్లటి గాలులు కూడా వణికిస్తున్నాయి. మరోవైపు చలి తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. వర్షంలో తడవడం వల్ల జలువు, జ్వరం గొంతు నొప్పి లాంటి వ్యాధులు ముసిరే అవకాశం ఉంది. వ్యాధి నిరోధకశక్తి తగ్గుతుంది. అందుకే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇవాల్టీ టిప్ ఆఫ్ ది డేలో భాగంగా అలాంటి జాగ్రత్తలు కొన్ని చూద్దాం.చలికాలంలో ఫ్లూ, సైనసైటిస్, ఊపిరితిత్తుల్లో వైరల్ ఇన్ఫెక్షన్, దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధి(సీవోపీడీ), ఆస్తమా వంటి సమస్యలు తలెత్తుతాయి. హైపోథెర్మియా, చర్మం లోపలి కణజాలం గడ్డ కట్టి గాయాలు కావటం, పెర్నియో, ఇమ్మర్షన్ వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది.చలిగాలులు అనేక రకాల వ్యాధులను మోసుకొస్తాయి. వైరస్లు వృద్ధి చెందే ప్రమాదం ఉంది. దగ్గు, జలుబు, గొంతునొప్పి, తీవ్రత ఎక్కువగా ఉన్నవారికి ఆయాసం, న్యూమోనియా వంటి లక్షణాలు కనిపిస్తాయి. గొంతు ఇన్ఫెక్షన్స్, గతంలో కీళ్ల నొప్పులు ఉన్నవారిలో కీళ్ల నొప్పులు పెరుగుతాయి. కొందరిలో తలనొప్పి వస్తుంది. గుండెపోటు వచ్చే ప్రమాదం కూడా ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. కనీస జాగ్రత్తలువర్షంలో తడవకుండా జాగ్రత్త పడాలి. పూర్తిగా కప్పి ఉంచేలా వస్త్రాలను ధరించాలి. రెయిన్ కోట్లు, గొడుగులు, చలికి తట్టుకునేలా స్వెట్లర్లు, చెవులు కవర్ అయ్యేలా టోపీలు తప్పనిసరిగా వాడాలి. ఒకవేళ వర్షంలో తడిచినా, వెంటనే వేడినీటితో స్నానం చేయడం, జుట్టు తడిలేకుండా పూర్తిగా ఆరబెట్టుకోవడం తప్పనిగా పాటించాలి.చలి ఎక్కువగా ఉన్న సమయాల్లో మాస్కులు ధరించాలి. దీంతో వైరస్ సోకదు. వేరేవారికి సోకకుండా ఉంటుంది. చలితీవ్రత అధికంగా ఉంటే బయటకు రాకుండా ఉంటే మంచిది. ముఖ్యంగా శ్వాసకోశ సంబంధ వ్యాధులతో బాధపడేవారు బయటకు రాకుండా జాగ్రత్తగా ఉండాలి. అలాంటి వారు ఇన్హేలర్లను అందుబాటులోఉంచుకోవాలి. ఫ్రిజ్లో పెట్టిన చల్లటి ఆహారం కాకుండా, అప్పటికప్పుడు వండుకున్నది వేడి, వేడిగా భుజించాలి.చల్లని డ్రింక్స్, కూల్ డ్రింక్స్, ఐస్ క్రీంలకు పిల్లల్ని ఎంత దూరంగా పెడితే అంత మంచిది.నిల్వ పదార్థాలను జోలికి వెళ్లవద్దు. పిల్లలు, వృద్ధుల ఆరోగ్యం పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలి.వ్యాధి నిరోధకశక్తి పెంచుకునేలా చలికాలంలో వ్యాధి నిరోధకతను పెంచుకోవాలి పౌష్టికాహారం తీసుకోవడం చాలా మంచిది. ముఖ్యంగా సిట్రస్ జాతికి చెందిన ఉసిరి, నిమ్మకాయల రసం తీసుకోవాలి. ఎక్కువగా నీటిని తాగాలి. కాచి చల్లార్చిన నీటిని తాగడం మరింత మంచిది. శరీరంలో వేడి ఉత్పత్తి అయ్యేలా జీర్ణవ్యవస్థ నిరంతరం పనిచేస్తుండాలి. ప్రోటిన్లు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. గుడ్లు, పనీర్ లాంటివి తీసుకోవాలి. అలాగే ఈ చలిగాలులు చర్మాన్ని, జుట్టును కూడా ఇబ్బంది పెడతాయి. వాతావరణం చల్లగా ఉన్నా గాలిలో తేమశాతం తక్కువగా ఉంటుంది. శరీరంలోని తేమ బయటికి పోవడంతో చర్మం పొడిబారుతుంది. అందుకే వాటర్ ఎక్కువగా తీసుకుంటూ, చర్మంపైన ఉండే నూనె పొరను కాపాడుకునేలా మంచి మాయిశ్చరైజర్ను వాడాలి. ఇదీ చదవండి: గర్ల్ ఫ్రెండ్తో బ్రేకప్ సార్... లీవ్ ప్లీజ్! వైరల్ మెయిల్ -
పూజా బాత్రా ఫిట్నెస్ సీక్రెట్..! టోన్డ్ బాడీ కోసం..
బాలీవుడ్ నటి పూజా బాత్రా తన గ్లామర్తో సినీ ఇండస్ట్రీని ఓ ఊపు ఊపింది. తన అందం అభినయంతో కుర్రాళ్ల మదిని కొల్లగొట్టిన ఈ బ్యూటీ..నాలుగు పదుల వయసు దాటినా..ఇంకా అంతే అందం, ఫిట్నెస్తో అలరించడమే కాదు. ఇప్పటకీ ఆమెకు అంతే క్రేజ్ ఉంది. పూజ అంతలా ఫిట్గా యంగ్ లుక్లో కనిపించడానికి గల సీక్రెట్ ఏంటో ఓ ఇంటర్వ్యూలో ఆమెనే స్వయంగా బయటపెట్టింది. మరి అవేంటో చూద్దామా..!.ఈ నెల అక్టోబర్ 27తో 49 ఏళ్లు నిండాయి. అయినా ఇప్పటికీ అంతే అందంగా గ్లామర్గా కనిపిస్తుంది పూజ బాత్రా. అందుకోసం ఫిట్నెస్ విషయంలో చాలా కేర్ తీసుకుంటానని అంటోందామె. అంతేగాదు ఫిట్నెస్ అంటే కేవలం శారీరక ఆరోగ్యం మాత్రమే కాదు, మానసిక ఆరోగ్యం కూడా అని అంటోందామె. మన శరీరాన్ని మనం ఎలా చూసుకుంటున్నాం, మాననసిక ఆరోగ్యం పట్ల ఎలాంటి శ్రద్ధ తీసుకుంటున్నాం అనే దానిపైనే మన లుక్ ఆధారపడి ఉంటుందని పూజా నొక్కి చెబుతోంది. మానసికంగా స్ట్రాంగ్ ఉండటమే అసలైన గేమ్ ఛేంజర్ అని అంటోంది. తాను ఆరేళ్లుగా మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ చేస్తున్నానని, వారానికి మూడు రోజులు తప్పనిసరిగా చేస్తానని అంటోంది. పైగా దాంట్లో తాను రెండు బ్రౌన్ బెల్ట్లు గెలుచుకున్నట్లు కూడా వెల్లడించిందామె. ఇది తనను చురుకుగా ఉండేలా చేసి, బరువుని నిర్వహించడం సులభమయ్యేలా చేస్తుందని చెబుతోంది. అన్నిట్లకంటే సంతోషంగా ఉండేందుకు ఫిట్నెస్ అనేది అందరికి అవసరం అని పూజా పేర్కొంది. అంతేగాదు ఆమె మౌంట్ ఎవరెస్ట్ బేస్ క్యాంప్ హైకింగ్ కూడా చేసినట్లు తెలిపింది. హైకింగ్ పరంగా మౌంట్ ఎవరెస్ట్, మోంట్ బ్లాంక్,యోస్మైట్ బేస్ క్యాంప్లతో సహా పలు ఎత్తైన ప్రదేశాలను చుట్టొచ్చారామె. View this post on Instagram A post shared by Pooja Batra Shah (@poojabatra) లండన్లోని లాస్ ఏంజిల్స్లో ఉండే పూజా యోగా టీచర్ కూడా. మార్షల్ ఆర్ట్స్తోపాటు యోగా అంటే కూడా మహా ఇష్టమని పూజ చెప్పుకొచ్చింది. ఇది సమతుల్య జీవితాన్ని గడపడానికి హెల్ప్ అవుతుందని అంటోంది. చివరగా ఆమె మానవవులు అభివృద్ధి చెందాలంటే సత్వ అనే సంస్కృపదానికి ప్రాధాన్యత ఇవ్వాలంటుంది. అంటే సమతుల్యత అనే దానికి ఎంత ప్రాధాన్యత ఇస్తే అంతలా హాయిగా జీవితాన్ని గడిపేలా అవకాశం లభిస్తుందని అంటోంది పూజా బాత్రా.(చదవండి: Power Of Love: రోగాలతో ఒక్కటయ్యారు.. ఆ తర్వాత..) -
కిడ్నీ మార్పిడి కోసం కేన్సర్ రోగిని పెళ్లాడింది..కట్చేస్తే..!
ఎవ్వరినెప్పుడు తన వలలో బంధిస్తుందో ఈ ప్రేమ..ఏ మదినెప్పుడు మబ్బులలో ఎగరేస్తుందో ఈ ప్రేమ..అర్థం కాని పుస్తకమే అయినా గాని ఈ ప్రేమ ...అన్న పాట గుర్తుకొస్తుంది ఈ ఘటన. ఏదో వ్యాధుల కారణంగా.. అవసరార్థం పెళ్లి చేసుకున్నారు. వారి మధ్య ఎలాంటి ప్రేమ, ఇష్టం వంటివి లేదు. రోగాల కారణంగా ఒక్కటయ్యారు..కానీ వారి మధ్య విడదీయరానంత ప్రేమ చిగురించేలా చేసి..అద్భుతమే చేసింది ఆ దంపతుల మధ్య. ఎవరా ఆ జంట..? ఏమా కథ చూసేద్దామా..!2014లో చైనాలోని షాంగ్జీకి చెందిన 24 ళ్ల వాంగ్ జియావో అనే మహిళ యురేమియా అనే మూత్రపిండాల వ్యాధితో బాధపడుతోంది. పరిస్థితి ఎంతలా ఉందంటే..ఆమెకు మూత్రపిండాల మార్పిడి శస్త్ర చికిత్స జరగకపోతే.. ఒక్క ఏడాదికి మించి బతకదని తేల్చి చెప్పేశారు వైద్యులు. అయితే ఆమెకు కిడ్నీ దానం చేసేందుకు సన్నిహితులు, బంధువులు ముందుకొచ్చినా..వాళ్లెవ్వరిది ఆమెకు సరిపోలేదు. ఓ పక్క సమయం మించిపోతుంది. సరిగ్గా ఆ సమయంలో ఆమెకు కేన్సర్ పేషెంట్ అయిన జాంగ్ లియాంగ్ అనే వ్యక్తి ఓ విచిత్రమైనా ఆఫర్ ఇచ్చాడామెకు. "తాను కేన్సర్ వ్యాధితో బాధపడుతున్నానని, చనిపోయేంతవరకు చికిత్స సమయంలో తనను ప్రేమగా చూసుకునే తోడు కోసం ఆశిస్తున్నానని, అందుకు ప్రతిగా తను మరణించాక కిడ్నీని ఇస్తానని చెబుతాడు". ఇక్కడ వాంగ్కి మరో ఛాన్స్లేదు. పైగా తక్కువ వ్యవధి ఉంది. మరోవైపు జాంగ్కి సంరక్షణ, ఒక తోడు కావాలి. దాంతో బాగా ఆలోచించి వాంగ్ ఓ ఒప్పందం ప్రకారం..జాంగ్ని పెళ్లి చేసుకుంది. ఒకరు మనుగడ కోసం, మరొకరు సంరక్షణ ఆశిస్తూ చేసుకున్న ఈ వివాహం వారి జీవితాను ఊహించిన మలుపు తిప్పింది.అద్భుతం చేసిన ప్రేమ..మొదట్లో ఒప్పందాల పెళ్లి కాస్త. .బలమైన బంధంగా మారిపోయింది. అతడి కోసం వంట చేసి, కీమోథెరపీ చికిత్సలలో జాంగ్ కోరిన సంరక్షణను అందించింది. వైద్య సమస్యల కారణంగా పరిచయమైన ఈ అపరిచిత జంట వారాలు గడుస్తున్న కొద్ది.. ఇద్దరి మధ్య అనురాగం ఏర్పడి..విడిచి ఉండలేనంతగా ప్రేమ చిగురించింది. అచ్చం ప్రేమికులు మాదిరిగా అయిపోయారు ఆ దంపతులు. దూకుడుగా ఉన్న జాంగ్ కేన్సర్ వాంగ్ సహచర్యం ప్రేమ కారణంగా మెరుగవ్వుతూ..వైద్యులే విస్తుపోయేలా తగ్గిపోయింది. మొత్తానికి ఆ మహమ్మారి కేన్సర్ని జయించాడు జాంగ్. అతడు బాగుండటమే చాలు అన్నంత స్థితికి వాంగ్ వచ్చేసింది కూడా. మొదట్లో తాను బతకాలని ఆశించినా .. రాను రాను అతడు ఉంటేనే తన ప్రాణం ఉంటుంది అన్నంతగా ప్రేమను పెంచేసుకుంది. ఇక్కడ వాంగ్కి జాంగ్ కిడ్నీ రాలేదు, అయినా అలా వ్యాధితో పోరాడతూనే ఉండాలనే ఫిక్స్ అయ్యింది. విచిత్రం ఏంటంటే..ఆ వ్యాధులు ఇద్దరిని దంపతులుగా చేసి, వాటిని క్యూర్ అయ్యేలా చేశాయి. ఇక్కడ వాంగ్కి కూడా మూత్రపిండాల వ్యాధి సివియర్గా లేదని మెరుగవ్వుతుందని, మందులతో నిర్వహించొచ్చని వైద్యులు చెప్పడం విశేషం. ఇలా జరుగుతుందని ఊహించను కూడా లేదని ఉబ్బితబ్బిబవ్వుతోంది ఆ జంట. ఈ స్టోరీ ప్రేమ గొప్పతనం ఏంటో చెప్పకనే చెబుతోంది. పైగా జీవిత పరమార్థమే తానని చెప్పకనే చెప్పేసింది ఈ రెండక్షరాల ప్రేమ ..! మనం కోసం ఓ వ్యక్తి ఉన్నారు అంటే ఎంతటి అగాథాన్ని అయినా..సవాలునైనా అధిగమించి సునాయసంగా బటయపడగలం అనేందుకు ఈ దంపతులే ఉదాహరణ. ఇక్కడ ఆ జంట విషయంలో ప్రేమ అద్భుతమే చేసింది కదూ..!. (చదవండి: Delhi Police constable Sonika Yadav: వెయిట్లిప్టింగ్ ఛాంపియన్షిప్లో పాల్గొన్న ఏడు నెలల గర్భిణి..!) -
ఉత్సాహంగా బరాత్, తెల్లారితే పెళ్లి : అంతలోనే విషాదం
ఇటీవలికాలంలో చిన్న వయసులోనే గుండెపోటుతో సంభవిస్తున్నమరణాల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. తాజాగా పెళ్లి ఒక రోజు ముందు నవ వధువు గుండెపోటుతో కన్నుమూసింది. దీంతో పెళ్లి బాజాలతో కళకళ లాడాల్సిన వేదిక ఆత్మీయుల రోదనలతో విషాదంగా మారిపోయింది. పంజాబ్లోని ఫరీద్కోట్లో ఈ ఘటన జరిగింది.ఫరీద్కోట్ జిల్లాలోని బర్గారి గ్రామానికి చెందిన పూజకు సమీప గ్రామమైన రౌకేకు చెందిన వ్యక్తితో ఇటీవల నిశ్చితార్థం అయింది. వరుడుదుబాయ్లో ఉండటంతో పెళ్లికి ముందు వధూవరులిద్దరూ ఎప్పుడూ వ్యక్తిగతంగా కలవలేదు. వీడియో కాల్లోనే ఎంగేజ్మెంట్ జరిగింది. వివాహానికి కొన్ని రోజుల ముందు వరుడు దుబాయ్ నుండి తిరిగి వచ్చాడు. దీంతో ఇరు కుటుంబాలు పెళ్లికి సర్వం సిద్ధం చేసుకున్నాయి. వివాహానికి ఒక రోజు ముందు, జాగో వేడుక (బారాత్) సందర్భంగా, పూజ తన బంధువులతో సంతోషంగా జరుపుకుంది. అయితే, ఆ రాత్రి 2 గంటల ప్రాంతంలో, ఆమె ముక్కు నుండి అకస్మాత్తుగా రక్తం రావడం ప్రారంభమైంది. వెంటనే స్పందించిన బంధువులు ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ఆమె చనిపోయిందని వైద్యులు ప్రకటించాడు. దీంతో పెళ్లి ఇల్లు కాస్త విషాదంగా మారిపోయింది. పూజా అంత్యక్రియల ఊరేగింపు ఆమె పెళ్లి దుస్తులలో ఉండగానే జరిగింది. దీంతో వధూవరుల కుటుంబాలతోపాటు గ్రామం మొత్తం దుఃఖంలో మునిగిపోయింది. ఎంతో సంతోషంగా పెళ్లి చేసి, అత్తారింటికి పంపాలనుకున్నామని బరాత్ రాత్రి పూజకు గుండెపోటు రావడంతోచనిపోయిందని అమ్మాయి తండ్రి, వరుడి సోదరుడు వాపోయారు. -
ప్లేస్మెంట్లో ప్రతిసారి 'నో'..కట్చేస్తే..!
ఎన్నో స్ఫూర్తిని కలిగించే సక్సెస్ స్టోరీలను చూసుంటారు. అయితే వాటిలో..ఎన్నో వైఫల్యాల తర్వాత విజయాన్ని చవిచూసిన వారు కొందరైతే..తొలి ప్రయత్నంలోనే సక్సెస్ అందుకున్నవారు మరికొందరు. అలా కాకుండా మన స్నేహితులంతా సెటిల్ అవుతూ హ్యాపీగా ఉంటే..మనం మాత్రం ఓటమితో ఏం చేయాలో తోచని స్థితిలో ఉంటే..మళ్లీ ప్రయత్నించాలన్నా బాధకంటే..మనమే ఎందుకు ఓడిపోతున్నాం అనే బాధ ఎక్కువుగా ఉంటుంది. కానీ ఇతడు వాళ్లతో నార్మల్గా వ్యవహరిస్తూ..యథావిధిగా తన ప్రయత్నం సాగించి..వారికంటే స్పెషల్ అనిపించుకునేలా అందనంత స్థాయిలో సెటిల్ అయ్యాడు. వైఫల్యాలను హ్యాండిల్ చేయడం అంటే ఇది బ్రో అని చెబుతున్నాడు అతడు. నెట్టింట తెగ వైరల్గా మారింది అతడి సక్సెస్ స్టోరీ.అతడే ఫ్లట్టర్ యువర్ వే వ్యవస్థాపకుడు కార్తీకే సింగ్. తన స్టోరీని సోషల్ మీడియాలో ఎక్స్లో షేర్ చేసుకున్నాడు. వింటే కచ్చితంగా వాటే సక్సెస్ స్టోరీ అంటారు. 16 ఏళ్ల వయసులో ఐఐటీలో అడ్మిషన్ పొందాలనుకున్నాడు. అది మిస్. సర్తే 20 ఏళ్లకే మంచి జాబ్ కొట్టేద్దామనుకున్నాడు..అది కూడా ఫెయిల్. స్నేహితులంతా క్యాంపస్ ప్లేస్మెంట్లో సెలక్ట్ అయిపోతుంటే..కార్తీక్కి మాత్రం రిజెక్ట్లే ఎదురయ్యేవి. మెక్రోసాఫ్ట్ నుంచి ఆటోడెస్క్ వరకు అన్ని నో చెప్పాయి. హాస్టల్ రూమ్లో స్నేహితులంతా జాబ్ కొట్టేశామన్న ఆనందంతో పార్టీలు చేసుకుంటే..తాను మాత్రం బెడ్పై పడుకుని..వందోసారి జాబ్ పోర్టల్స్ రిఫ్రెష్ చేస్తున్నా అని పోస్ట్లో రాసుకొచ్చాడు కార్తీక్. అనుకోకుండా ఒక రాత్రి ఇన్స్టాగ్రామ్లోఒక ఫ్రీలాన్సర్ని చూశాడు. ఆన్లైన్లో పనిచేస్తూ..స్థిరమైన ఆదాయం అందుకుంటున్న ఒక సాధారణ వ్యక్తిని చూసి..అతడితో సంభాషించాడు. అదే అతడి జీవితాన్ని అనూహ్యమైన మలుపు తిప్పింది. కార్తీక్ అతడిలా ప్రతిరోజూ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ప్రారంభించాడు. కానీ ఎటువంటి ప్రతిస్పందన, లైక్లు, సందేశాలు రాలేదు. దాదాపు ఆరు వారాల తర్వాత నాకు సహాయం చేయగలరా అనే మెసేజ్ వచ్చింది. ఇది అతని తొలి ప్రాజెక్ట్. అందుకు అతనికి రూ. 3000 వేతనం పొందాడు. ఆ ప్రారంభ ప్రాజెక్ట్ క్రమంగా పెరిగింది. అలా క్లయింట్లురావడం ప్రారంభించారు, ప్రాజెక్టులు రేట్లు పెరిగాయి. చివిరకి ఒక ఐదుగురు వ్యక్తులతో కూడిన ఏజెన్సీని నడుపుతూ నెలకు దాదాపు రూ. 6 లక్షల మేర ఆదాయం అందుకుంటున్నాడు. ఇన్ని వైఫల్యాలు చూసిన తానే ఇంతలా సక్సెస్ని అందుకుంటే..మీరు కూడా కచ్చితంగా సాధించగలుగుతారు అని పోస్ట్ని ముగించాడు. ఈ పోస్ట్ నెటిజన్ల మనసులను తాకడమే కాదు..కార్తీక్ చేసిన ప్రయత్నాలకు ప్రశంసిస్తూ..ఏమి చేయలేని పరిస్థితిలో కూడా సానూకూల దృక్పథం, ఆశను వదులకోకూడదని చెబుతున్న మీ స్టోరీ చాలా స్ఫూర్తిని రగిలిస్తోందని అని పోస్టులు పెట్టారు.At 16, all I wanted was IIT.Didn't happen.At 20, all I wanted was a job offer.That didn't happen either.Microsoft said no.Autodesk said no.Everyone said no.Lying on my hostel bed, watching my friends celebrate placements while I refreshed job portals for the 100th time.…— kartikey singh (@askwhykartik) October 26, 2025 (చదవండి: ఆ దేశానికి ఎయిర్పోర్ట్, సొంత కరెన్సీ లేవు..కానీ వరల్డ్లోనే అత్యంత ధనిక దేశం..) -
Shreyas Iyer: పక్కటెముక గాయం అంటే..? వామ్మో.. మరీ అంత డేంజరా?
టీమిండియా వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ పక్కటెముక గాయంతో ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. తొలుత చిన్నగాయంలా అనిపించినా.. డ్రెస్సింగ్ రూమ్కు వెళ్లిన తర్వాత పరిస్థితి విషమంగా మారింది. ప్రస్తుతం శ్రేయస్ సిడ్నీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు బీసీసీఐ పేర్కొంది. సాధారణంగా ఆటగాళ్లు మైదానంలో గాయపడటం సహజమే. కానీ కొన్ని గాయాలు మాత్రం ఆటగాళ్లను చాలా ఇబ్బంది పెడుతుంటాయి. మరి ఇక్కడ శ్రేయస్ ఎదుర్కొంటున్న పక్కటెముక గాయం అంత తీవ్రతరమైనదా..? అసలేంటి గాయం వంటి వాటి గురించి సవివరంగా తెలుసుకుందామా.!.పక్కటెముక గాయం అంటే..ఈ గాయం ఎక్కువగా కారు ప్రమాదాలు, క్రీడల్లోనూ జరుగుతుంటాయని చెబుతున్నారు నిపుణులు. మరికొన్ని ఇతర గాయాల వల్ల కూడా ఈ పక్కటెముకల గాయం సంభవిస్తుందట. ఒక్కోసారి ఎలాంటి గాయం అవ్వకుండానే పక్కటెముకలు విరిగే అవకాశం కూడా ఉంటుందని చెబుతున్నారు వైద్యులు. అంతర్గత అవయవాలు దెబ్బతీస్తే తప్ప పక్కటెముక గాయం సివియర్ అవ్వదని చెబుతున్నారు. దీనికి ఆపరేషన్ చేయడం అనేది కూడా అరుదు అని. చెబుతున్నారు. పక్కెటెముకల మధ్య పగుళ్లు వస్తే..తగిన విశ్రాంతి, శ్వాస వ్యాయామాలు, చికిత్స అవసరం అవుతాయని, కోలుకోవడానికి కనీసం ఒక నెల పడుతుందటని చెబుతున్నారు వైద్యులు. పక్కటెముక విరిగితే..పక్కటెముక విరగడాన్ని వైద్య పరిభాషలో సాధారణంగా ఎముక తప్పిందని(స్థానభ్రంశం) చెబుతుంటారు. ఇలా ఎముక విరిగినప్పుడూ చుట్టు పగులు, ఖాళీ ఏర్పుడుతుంది. అలాంటప్పుడు విశ్రాంతి ఒక్కటే సరిపోదట. దాన్ని సరిచేసేందుకు శస్త్ర చికిత్స అవసరం అవుతుందని చెబుతున్నారు. అలాగే ఇవి విరగడం అనేది కూడా అత్యంత అరుదేనట. ఎందుకంటే పెద్దపెద్ద యాక్సిడెంట్లు, లేదా ఆటల్లోనే ఇలాంటి గాయాల బారినపడే అవకాశం ఉంటుందట. ఇవి మన శరీరంలోని బలమైన ఎముకల్లో ఒకటి కావడంతో అంత సులభంగా గాయలవ్వడం అత్యంత అరుదని చెబుతున్నారు నిపుణులు. లక్షణాలు..శ్వాస తీసుకున్న, దగ్గినా, ఛాతీ పైభాగాన్ని కదిలించిన త్రీమైన నొప్పిముట్టుకున్న తట్టుకోలేనంత నొప్పి, వాపుగాయం లేదా రంగు మారడంవామ్మో.. మరీ అంత డేంజరా? అంటే..పక్కటెముకలు గాయం ఒక్కోసారి ప్రాణాంతకంగా మారతాయట. అప్పుడు ఇతర అంతర్గత అవయవాలైనా.. గుండె, కాలేయం, కడుపు, మూత్రపిండాలు, ప్లీహాన్ని కూడా ప్రభావితం చేస్తుందట. దీనివలన రక్తస్రావం కూడా జరుగుతుందని చెబుతున్నారు.ఒక్కోసారి ఊపిరి ఆడకపోవడం, శ్వాస తీసుకోలేక ఇబ్బంది పడటం వంటి సమస్యలు ఉత్ఫన్నమవుతాయట. ఫలితంగా న్యుమోనియా వచ్చే ప్రమాదం కూడా లేకపోలేదని, ప్రత్యేక పరిస్థితుల్లో ఊపిరితిత్తులు వైఫల్యం చెందే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం.(చదవండి: Weight Loss Tips: సన్నజాజిలా స్లిమ్గా అవ్వాలంటే..సిమర్ టెక్నిక్స్ ఫాలో అవ్వాల్సిందే!) -
బెడ్ టైం యోగా : ప్రశాంతమైన నిద్రకోసం, చక్కటి ఆసనాలు
స్క్రీన్ టైమ్, ఒత్తిడితో కూడుకున్న జీవన శైలి కారణంగా ఈ రోజుల్లో చాలామంది నిద్రకు దూరం అవుతున్నవారు. నిద్ర సమస్యలనుంచి విముక్తి లభించి, మంచి నిద్ర పట్టాలంటే సులువైన యోగాసనాలు ఉన్నాయి. నిద్రకు ఉపక్రమించడానికి అరగంట ముందు ఈ ఆసనాలు సాధన చేయడం వల్ల మంచి ప్రయోజనాలను పొందవచ్చు. పశ్చిమోత్తనాసనంనేలపైన కాళ్లను ముందుకు చాపి, కూర్చోవాలి. శరీరాన్ని మోకాళ్ల వైపు వంచి, చేతులు పాదాలను తాకించాలి. ఈ భంగిమలో రెండు నిమిషాలు ఉండాలి. దీని వల్ల మానసిక ప్రశాంతత కలిగి మంచినిద్రకు సహాయపడుతుంది.అర్ధ శలభాసనంమ్యాట్పైన బోర్లా పడుకొని, ఒక కాలును పైకి లే΄ాలి. తలను నెమ్మదిగా వెనక్కి వంచాలి. ఐదు శ్వాసల తర్వాత, రెండో కాలితో ఇలాగే చేయాలి. దీనివల్ల రక్తప్రవాహం మెరుగై మానసిక శాంతి పెరుగుతుంది.శవాసనంమ్యాట్పైన పడుకొని, చేతులను రిలాక్స్గా ఉంచుతూ ఐదు నిమిషాలు ఉండాలి. సాధారణ శ్వాసలు తీసుకుంటూ ఉండాలి. దీని వల్ల మానసిక శాంతి పెరుగుతుంది. ఒత్తిడి తగ్గి, మంచి నిద్ర పడుతుంది.చదవండి: శివసేన నేతతో నటి ఎంగేజ్మెంట్ : ఫోటోలు వైరల్పరిపూర్ణ శ్వాస శ్వాస తీసుకొని, కొద్ది సెకన్లు ఆ శ్వాసను బిగబట్టి, తిరిగి నెమ్మదిగా వదలాలి. ముక్కు ద్వారా శ్వాస తీసుకుంటూ, ముక్కుద్వారానే వదలాలి. ఇలా 3 నుంచి 5 నిమిషాలు చేయాలి. ఒత్తిడి తగ్గి, శరీరానికి విశ్రాంతి లభించి, నిద్ర బాగా పడుతుంది. స్క్రీన్ టైమ్, ఒత్తిడితో కూడుకున్న జీవన శైలి కారణంగా ఈ రోజుల్లో చాలామంది నిద్రకు దూరం అవుతున్నవారు. నిద్ర సమస్యలనుంచి విముక్తి లభించి, మంచి నిద్ర పట్టాలంటే సులువైన యోగాసనాలు ఉన్నాయి. నిద్రకు ఉపక్రమించడానికి అరగంట ముందు ఈ ఆసనాలు సాధన చేయడం వల్ల మంచి ప్రయోజనాలను పొందవచ్చు. (ఎక్కడ చూసినా సీతాఫలాలే, ఇవిగో సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్)బలాసనముందుగా మ్యాట్పైన మోకాళ్ల పై కూర్చోవాలి. ముందుకు వంగి, తలను మోకాళ్ల మీదుగా తీసుకెళుతూ, నేలను తాకాలి. అదే సమయంలో చేతులు ముందుకు చాచి, మోకాళ్లపై విశ్రాంతి తీసుకోవాలి. ఈ భంగిమంలో రెండు నిమిషాలు ఉండాలి. దీంతో శరీరం రిలాక్స్ అయ్యి, ఒత్తిడి తగ్గుతుంది.రాత్రి నిద్రించడానికి ముందు చేసే కొన్ని యోగాసనాల వల్ల జీర్ణక్రియ పనితీరు మెరుగ్గా ఉంటుంది. గ్యాస్ట్రిక్, పొట్ట భాగంలో అధిక కొవ్వు సమస్యలకు సరైన పరిష్కారం లభిస్తుంది. భోజనం చేసిన రెండు గంటల తర్వాతనే ఈ ఆసనాలను సాధన చేయాలి. అప్పుడే నిద్ర, ఉదరకోశ సమస్యలకు సరైన ఫలితాలను పొందుదుతారు. -
సన్నజాజిలా స్లిమ్గా అవ్వాలంటే..!
బరువు తగ్గే టాస్క్ని చాలా సింపుల్గా స్మార్ట్గా చేయాలంటే నిపుణులు లేదా అనుభవజ్ఞుల సలహాలు సూచనలు పాటించాల్సిందే. ఏదో భారంగా కాకుండా చాలా తెలివిగా తింటూ..వేగంగా బరువు తగ్గితే ఆ ఫీలే వేరు. మన సన్నిహితులు, స్నేహితులు హేయ్..! అంతలా ఎలా సన్నగా మారిపోయావు అంటే..పట్టరాని ఆనందం వచ్చేస్తుంది. అందులో ఎలాంటి డౌట్ లేదు. మరి అందుకోసం ఈ ఫిట్నెస్ ఔత్సాహికురాలు సిమర్ టెక్నిక్స్ పాలో అయితే సరి..ఫిట్నెస్ ఔత్సాహికురాలు సిమర్ ఎంతలా బొద్దుగా ఉండేదో తెలిస్తే ఆశ్చర్యపోతారు. అలాంటి అమ్మాయి చాలా సన్నగా నాజుగ్గా అయిపోయింది. మాములు మార్పు కాదు..నమ్మశక్యం కానంత సన్నగా మారింది. అలాగని ఆమె ఏమి షార్ట్కట్స్ ఫాలో అవ్వలేదు. పైగా ఎలాంటి కఠినమైన డైట్, బరువు తగ్గిపోయే మందలు ఉపయోగించలేదు. కాస్త తెలివిగా స్మార్ట్గా తిని జస్ట్ ఆరు నెలల్లో 27 కిలోలు పైనే బరువు తగ్గిందామె. అందుకోసం డెడికేషన్తో దినచర్యను అనుసరిస్తే చాలంటోంది. దాంతోపాటు జంక్ఫుడ్ని పూర్తిగా మానేయకపోయినా..పరిమితం చేస్తే సరిపోతుందంటోంది. పోషకాహారాన్నితీసుకునేలా ప్లాన్ చేస్తే చాలట. అందుకోసం తాను ఎలాంటి టిప్స్ని ఫాలో అయ్యిందో సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది సిమర్. నేచురల్గా సన్నగా మారడం కోసం..సంపూర్ణ ఆహారాలు: ఆహారాలలో విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ మరియు యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే తాజా పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, నట్స్, చేపలు, గుడ్లు వంటి లీన్ ప్రోటీన్లు తీసుకోవాలట. ఇవి కడుపు నిండిన అనుభూతినిచ్చే అధికంగా తినాలనే కోరికను నివారిస్తాయట. మంచి నిద్ర: శరీరం బరువు తగ్గడంలో ప్రధాన పాత్ర పోషించేది ఏడు నుంచి ఎనిమిది గంటల నిద్ర అని నొక్కి చెప్పిందామె. భోజనం తర్వాత వాకింగ్: మెరుగైన జీర్ణక్రియ కోసం ప్రతి భోజనం తర్వాత కనీసం పదినిమిషాలు నడవాలని సూచించిందామె. చీట్ మీల్స్: ఆరోగ్యకరమైన ఆహారాన్ని పాటిస్తున్నప్పటికీ..వారాంతాల్లో చీట్మీల్స్ కూడా ఉంటాయని చెప్పింది సిమర్. అయితే దాన్ని సర్దుబాటు చేసుకునే భోజనాన్ని సిద్ధం చేసుకుంటానని అంటోంది. అన్నింట్లకంటే ఏర్పరుచుకున్న టార్గెట్ని బ్రేక్ చేయకుండా..స్థిరంగా సాగితే..సత్వరమే మంచి ఫలితాలు అందుకుంటారని చెబుతోంది. అలాగే కార్బో హైడ్రేట్స్ కోసం మైదా, బ్రెడ్, ఉడికించిన బియ్యానికి దూరంగా ఉండేదట. అలాగే బయటకు వెళ్తే..కేలరీలు ఉండే పానీయాలను తీసుకుంటుందట. ఎందుకంటే అవి కడుపు నిండిన అనుభూతిని అందిస్తాయట. అంతేగాదు బరువు తగ్గడంలో బాగా ఉపయోగపడే మరో నాలుగు టెక్నిక్ కూడా చెప్పారామె. View this post on Instagram A post shared by Simar 🍜 (@_lifeofsimar) అవేంటంటే..అధిక ప్రోటీన్, తక్కువ కార్బోహైడ్రేట్కృత్రిమ చక్కెరవారానికి మూడు నుంచి నాలుగుసార్లు కోర్ శిక్షణప్రతి రోజు 8 వేలకు పైగా అడుగులు తప్పనిసరి అంటోంది. ఇంకెందుకు ఆలస్యం ఇలాంటి స్మార్ట్ టెక్నిక్స్తో బరువు తగ్గించే జర్నీని తక్షణమే ప్రారంభించండి అంటోంది సిమర్. View this post on Instagram A post shared by Simar 🍜 (@_lifeofsimar) గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం.(చదవండి: ఆకుపచ్చని చీరలో ఇషా స్టన్నింగ్ లుక్:! హైలెట్గా రూబీ డైమండ్ నెక్లెస్..) -
కిడ్నీ మార్పిడి సురక్షితమేనా? అందువల్లే నటుడు సతీష్ షా కూడా..
ప్రముఖ బాలీవుడ్ నటుడు, టీవీ కళాకారుడు సతీశ్ షా అనారోగ్యంతో చనిపోయిన సంగతి తెలిసిందే. 76 ఏళ్ల సతీశ్ అల్జీమర్స్ వ్యాధితో బాధపడుతున్న భార్యను చూసుకునేందుకు ఇటీవలే కిడ్నీ మార్పిడి సర్జరీ చేయించుకున్నారని ఆయన సన్నిహితుడొకరు మీడియాకి వెల్లడించారు. అంతేగాదు ఆయన చాలా రోజుల నుంచి మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్నారని, డయాలసిస్ చేయించుకునేవారని, భార్య బాగోగులు నిమిత్తం మూడు నెలల క్రితం ఈ కిడ్నీ మార్పిడి సర్జరీ చేయించుకున్నట్లు తెలిపారు. ఆయన అనుకున్నట్లుగా ఆయన ఆరోగ్యం మెరగవ్వకపోక..త్వరితగతిన కానరాని లోకాలకు వెళ్లిపోయారు. ఈ ఘటన కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సపై పలు అనుమానాలు రేకెత్తించింది. అసలు మూత్రపిండాల వైఫల్యంతో బాధపడేవారికి ఈసర్జరీ? వరమా? లేక శాపమా అనే ఆందోళన కలిగించి. నిజానికి ఈ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఆపరేషన్ సురక్షితమైనదైనా..? దానికంటే డయాలసిస్ మంచిదా అంటే..నెఫ్రాలజిస్ట్లు ఏమంటున్నారంటే..డయాలసిస్ అనేది మూత్రపిండాలు పనిచేయలేనప్పుడూ..రక్తం నుంచి వ్యర్థాలను, అదనపు ద్రవాన్ని తొలగించే పనిని చేపడతాయట. ఈ డయాలసిస్ అనేది రెండు రకాలుగా ఉంటుందని వివరించారు. ఒకటి హిమోడయాలసిస్ ఈ పద్ధతిలో శరీరం వెలుప యంత్రం ఉంచి..రక్తం శుద్ధి చేయడం జరుగుతుంది. అలా కాకుండా ఉదర లైనింగ్ ఫిల్టర్గా ద్రవ మార్పిడి మానవీయంగా లేదా యంత్ర ఆధారితంగా జరుగుతుందట. నిజానికి మూత్రపిండాల వైఫల్యంతో బాధపడే వారికి ఈ కిడ్నీ మార్పిడి చికిత్స వరమే. వారికి ఈ శస్త్ర చికిత్స మెరుగైన ఫలితాలను అందిస్తుందని చెబుతున్నారు నిపుణులు. కిడ్నీ మార్పిడి వల్ల కలిగే లాభాలు..మెరుగైన జీవన నాణ్యత: తరుచుగా డయాలసిస్ చేయించుకోవాల్సిన పరిస్థితి నుంచి విముక్తిట్రాన్స్ప్టాంట్ చేయించుకున్న పేషెంట్లు డయాలసిస్ చేయించుకునే రోగులకంటే ఎక్కువ కాలం జీవిస్తారట.డయాలసిస్తో పోలిస్తే..తక్కువ ఆహార పరిమితులు ఉంటాయిమునపటి మీదు ఎక్కువ ఎనర్జిటిక్, తక్కువ సమస్యలు ఎదుర్కొంటారటనష్టాలు..అందరూ ఈ సర్జరీకీ అర్హులు కారట. ఎందుకంటే..కిడ్నీని తీసుకునే వ్యక్తి ఆరోగ్యం, ఇచ్చే దాత ఆరోగ్య అనుకూలత అత్యంత ప్రధానమట. అలాగే కిడ్నీ మార్పిడి సర్జరీ చేయించుకున్నాక..జీవితాంతం రోగనిరోధక శక్తిని తగ్గించే మందులు వాడాల్సిందేనట.కొందరిలో ఇన్ఫెక్షన్, రక్తస్రావం, కొత్త కిడ్నీని తిరస్కరించే అవకాశం వంటివి ఎక్కువగా ఉంటాయట. ఫలితంగా వారికి ఈ సర్జరీ ప్రాణాంతకంగా మారుతుందట. రెండిటిలో ఏది మంచిదంటే..డయాలసిస్లో పెద్ద శస్త్ర చికిత్స అంటూ ఏం ఉండదు. స్వల్పకాలంలో సురక్షితమైనది అంతే. అర్హత కలిగిన రోగులకు మూత్రపిండ మార్పిడి చికిత్స అనేది సరైన ఎంపిక, పైగా వారి జీవన నాణ్యత, దీర్ఘకాలిక మనుగడను ప్రసాదిస్తుంది. ఇలా ట్రాన్స్ప్లాంట్ సరిపడని రోగులకు డయాలసిస్ ప్రభావవంతమైన ప్రత్యామ్నాయమని వైద్యలు చెబుతున్నారు. దీంతో పాటు ప్రధానమైన అంశం, దాత లభ్యత, ఆరోగ్య అనుకూలత అనేవాటిని బట్టి ఏది బెస్ట్ అనేది ఆధారపడి ఉంటుందని చెబుతున్నారు నిపుణులు. సకాలంలో నెఫ్రాలజిస్ట్లను సంప్రదించి తగిన సలహాలు సూచనలు తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు నిపుణులు. (చదవండి: రూ 20 సమోసాతో రూ. 3 లక్షల యాంజియోప్లాస్టీ: వైద్యుల స్ట్రాంగ్ వార్నింగ్) -
ప్రతిరోజూ మిల్లెట్ భోజనం..
దేశవ్యాప్తంగా ప్రతి వ్యక్తీ రోజుకు ఒక మిల్లెట్ భోజనం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న ‘వన్ మిల్లెట్ మీల్ ఎవ్రీ డే ఫర్ ఎవ్రీ ఇండివీడ్యువల్’ అనే జాతీయ మిషన్లో భాగంగా మిల్లెట్స్ నేషనల్ మీడియా పోర్టల్ కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది. బేగంపేట ఎస్జే ఫారŠూచ్యన్ కమ్యూనిటీ హాల్లో నిర్వహించిన ఈ కార్యక్రమం ద్వారా హైదరాబాద్లోని వివిధ కార్పొరేట్ ఆఫీసులను శిక్షణ పొందిన ‘మిల్లెట్ మదర్స్’తో అనుసంధానం చేసి, ఉద్యోగులకు ఆరోగ్యకరమైన, పోషక విలువలతో కూడిన మిల్లెట్ భోజనాలను అందించనుంది. ఈ కార్యక్రమం మిల్లెట్స్ నేషనల్ మీడియా పోర్టల్, ఎంబీఎఫ్ (మిల్లెట్స్ ది బెస్ట్ ఫుడ్) సంయుక్తంగా నిర్వహించిన మిల్లెట్ మదర్స్ ప్రోగ్రాంకు కొనసాగింపుగా ప్రారంభించారు. ఈ ఉద్యమానికి బ్రాండ్ అంబాసిడర్గా నటి లయ వ్యవహరిస్తున్నారు. హైదరాబాద్ వ్యాప్తంగా 100 మంది మిల్లెట్ మదర్స్కు శిక్షణ ఇచ్చారు. వీరు అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం 20కి పైగా మిల్లెట్ వంటకాలు తయారు చేసే నైపుణ్యాన్ని సంపాదించారు. ఈ శిక్షణను నేషనల్ మిల్లెట్ కోచ్ పూజా లకోటియ ఆధ్వర్యంలో డాక్టర్ మోనికా శ్రవంతి, డాక్టర్ గిరిధర్, మిల్లెట్ మదర్స్ కో–ఆర్డినేటర్ మాధురి సహకారంతో నిర్వహించారు. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటే బాగా ఆలోచిస్తారు, పనిచేస్తారు, జీవిస్తారని ఎంబీఎఫ్ చైర్మన్ ప్రసన్న శ్రీనివాస్ సరకడం అన్నారు. మిల్లెట్ మదర్స్ కార్యక్రమం ద్వారా అందించే ప్రతి భోజనం మహిళలను శక్తివంతం చేస్తుందని తెలిపారు. (చదవండి: భారత్ 'ధర్మ యోగా' జపాన్ వ్యక్తి జీవితాన్నే మార్చేసింది..!) -
'కలిసి చేస్తే కలదు ఆరోగ్యం'..! క్రేజీగా పార్ట్నర్ యోగా
కలిసి చేస్తే కలదు ఆరోగ్యం అంటున్నారు యోగా శిక్షకులు. ఆసనాలు సాధన చేసేటప్పుడు మరొకరితో కలిసి చేసే పార్ట్నర్ యోగా వల్ల అదనపు ప్రయోజనాలు దక్కుతాయని చెబుతున్నారు. దీంతో ఇటీవల కాలంలో నగరంలో ఈ పార్ట్నర్ యోగా క్రేజీగా మారుతోంది. మరీ ముఖ్యంగా భాగస్వామితో కలిసి ఆసనాల సాధనపై ఆసక్తికనబరుస్తున్నారు. అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటూ నిపుణులు సూచిస్తున్నారు. దీంతో ఇటీవలి కాలంలో ఈ తరహా పార్ట్నర్ యోగా సాధన చేసే ఔత్సాహికులు హైదరాబాద్ సిటీలోని ఫిట్నెస్ స్టూడియోల్లో, యోగా సెంటర్లలో బాగా కనిపిస్తున్నారు. దీనిని కపుల్ యోగా అనే పేరుతో ప్రత్యేకంగా జంటల కోసం కూడా సాధన చేసే అవకాశం కల్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో నగరానికి చెందిన ప్రముఖ యోగా శిక్షకురాలు రీనా హిందోచా దీని గురించిన విశేషాలను ‘సాక్షి’తో ప్రత్యేకంగా పంచుకున్నారు. యోగా భంగిమలను సాధన చేసేటప్పుడు ఇద్దరు వ్యక్తులు ఒకరినొకరు మద్దతు అందించే శైలినే పార్ట్నర్ యోగా అని పేర్కొంటున్నారు. యోగాసనాలు వేసే సమయంలో పరస్పరం సహకరించుకునే క్రమంలో.. సమతుల్యతను కాపాడుకోవడం, శరీరం మరింత బాగా సాగేందుకు, భంగిమను సరిగ్గా అనుసరించేందుకు వీలు కలుగుతుంది. తద్వారా ఆసనాలు వేయడం సులభం అవుతుంది. ఇది ఫిట్నెస్తో పాటు నమ్మకం, పరస్పర విశ్వాసం కల్పించడంతో పాటు.. అనుబంధాలను బలోపేతం చేస్తుంది. భాగస్వామితో సాధన చేయడం వల్ల యోగా మరింత ఆహ్లాదకరంగా ప్రేరణ కలిగించేదిగా మారుతుంది. ప్రత్యేకించి కొన్ని భంగిమలు ఒంటరిగా కష్టంగా భావించే వ్యక్తులు కూడా భాగస్వామితో చేసినప్పుడు వాటిని సులభంగా వేయగలుగుతారు. తమ జీవిత భాగస్వామి, సహోద్యోగి లేదా అప్పుడే పరిచయం అయిన యోగా స్నేహితులతో కలిసి భాగస్వామి సాధన చేయవచ్చు. ఇది యోగాను కలిసి ఆస్వాదించడానికి ఒక అందమైన మార్గం. ప్రయోజనాలెన్నో.. ఈ తరహాలో యోగా సాధన శరీరంలోని ఫ్లెక్సిబులిటీని, అదే విధంగా బలాన్ని కూడా మెరుగుపరుస్తుంది. ఆసనాలను సరైన విధంగా సాధన చేసేందుకు సహాయపడుతుంది. ఆసనాలు వేసే సమయంలో ఉండే ఒత్తిడిని తగ్గిస్తుంది. అంతేకాకుండా దృష్టిని కూడా మెరుగుపరుస్తుంది. ముఖ్యంగా కమ్యూనికేషన్ నైపుణ్యంతో పాటు భావోద్వేగ బంధాన్ని కూడా పెంచుతుంది.ఆరోగ్యకరం..‘భాగ’స్వామ్యం.. ఒకరు బాగా అనుభవజ్ఞులై మరొకరు కొత్తగా యోగసాధన చేస్తున్నవారైతే.. ఆ వ్యత్యాసానికి తగ్గట్టుగా ప్లాన్ చేసుకోవాలి. ‘భాగస్వామి యోగా భంగిమలు శారీరక శ్రేయస్సును పెంచడమే కాకుండా నమ్మకాన్ని, కమ్యూనికేషన్ని కూడా పెంపొందిస్తాయి. ఇవి ఆయా వ్యక్తులు తమ భాగస్వామితో పరస్పర అవగాహన కలిగి ఉండడానికి, ఆ సమయంలో ఏకాగ్రతతో ఉండటానికి ప్రోత్సహిస్తాయి అని అక్షర యోగా కేంద్ర వ్యవస్థాపకురాలు హిమాలయన్ సిద్ధా అక్షర్ అంటున్నారు. నగరవాసులకు క్రేజీగా మారిన పార్ట్నర్ యోగా ఏ వ్యాయామం అయినా ప్రారంభించే ముందు తప్పనిసరిగా వార్మప్ వ్యాయామాలు చేయాలి. మీ భాగస్వామితో అనువుగా ఉండేలా జాగ్రత్తపడాలి. జీవిత భాగస్వామి లేదా సన్నిహిత మిత్రులనో ఎంచుకోవడం మంచిది. వ్యక్తుల శారీరక సామర్థ్యాలు, శరీర కదలికలు ఎవరికి వారికే ప్రత్యేకంగా ఉంటాయి. వీటిని అర్థం చేసుకుని పార్ట్నర్ని ఎంచుకోవాలి. అలాగే ఆసనాల సమయంలో కదలికలు నిదానంగా ఉండాలి. భాగస్వామి బలంతో పాటు పరిమితులను కూడా సరిగా అర్థం చేసుకోవాలి. అయితే ఎప్పుడూ బలవంతంగా లేదా అతిగా సాగదీయకూడదు. ఇద్దరికీ సౌకర్యవంతంగా ఉండాలని గుర్తుంచుకోవాలి. శ్వాస క్రియ కూడా ఒకే క్రమంలో ఉండేలా చూసుకోవాలి. (చదవండి: రూ 20 సమోసాతో రూ. 3 లక్షల యాంజియోప్లాస్టీ: వైద్యుల స్ట్రాంగ్ వార్నింగ్) -
రూ 20 సమోసాతో రూ. 3 లక్షల యాంజియోప్లాస్టీ: వైద్యుల స్ట్రాంగ్ వార్నింగ్
మనం సరదాగా తినే కొన్ని రకాల స్నాక్స్ అనారోగ్యం బారినపడేందుకు కారణమవుతుంటాయి. అలాంటి వాటిల్లో ఒకటి అందరూ ఇష్టంగా లాగించే సమోసా. నోరూరించే ఈ సమోసా కోసం ఆఫీసులకి వెళ్లేవాళ్ల దగ్గర నుంచి రోడ్డు మీద కూరగాయలు అమ్ముకునే చిన్న చితక వ్యాపారుల వరకు టీ టైంలో స్నాక్ ఐటెంగా తినే వంటకమే ఈ సమోసా. రూ.10 లేదా 20 వెచ్చించి కొనుక్కుని తినే దాంతో ఆస్పత్రిపాలై రూ. 3లక్షల అప్పు కొని తెచ్చుకుంటున్నామని హెచ్చరిస్తున్న గుండె వైద్యుడి పోస్ట్ నెట్టింట వైరల్గా మారింది. ఢిల్లీ కార్డియాలజిస్ట్ "అనారోగ్యకరమైన ఆఫీస్ స్నాక్స్ సమోసాతో సవంత్సరాలుగా ఎంత ఖర్చు పెడుతున్నాం. ఆ తర్వాత దాని కారణంగా ఎలాంటి అనారోగ్య సమస్య కొని తెచ్చుకుని ఎంత అప్పులపాలవ్వుతున్నాం. " కళ్లకు కట్టినట్లుగా వివరించారు. అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు తెచ్చే చేటు అంత ఇంత కాదంటూ మండిపడుతున్నారు వైద్యులు. ప్రతి సాయంత్రం చాలామంది తీసుకుని సమోసా ధర మహా అయితే రూ. 20 ఉంటుందనుకుంటే..క్రమం తప్పకుండా తినేవాడికి 15 ఏళ్లకు 300 సార్లు తింటాడనుకుంటే..మొత్తం ఖర్చు రూ. 90,000 అవుతుంది. అంటే అనారోగ్యకరమైన ఆహారం కోసం అంతమొత్తంలో డబ్బు ఖర్చు చేస్తున్నామే కానీ ఆదా చేయడం లేదు. ఇలా తినడం వల్ల గుండెల్లో కరోనరీ ధమనుల్లో సమస్య ఏర్పడి.. యాంజియోప్లాస్టీ చేయించుకునే పరిస్థితికి కొని తెచ్చుకుంటాం. అదేనండి స్టంట్ వేయించుకున్నాం అంటుంటారు కదా హార్ట్ పేషెంట్లు. అంటే సమోసాలు తిన్న ఫలితం హార్ట్ సర్జరీకి దారితీస్తుంది. దాని ఖర్చు రూ. 3 లక్షలు. అంటే అనారోగ్య ఆహారానికి ఖర్చు చేసే డబ్బుని ఆదా చేసినా ఆరోగ్యంగా ఉంటాం గానీ..తిని మరి యాంజియోప్లాస్టీ చికిత్స రూపంలో రూ. 3లక్షల అప్పుని కొని తెచ్చుకుంటున్నాం అంటూ ఆలోచింప చేసేలా..చాలా చక్కగా లెక్కలు వేసి వివిరించారు ఢిల్లీ కార్డియాలజిస్ట్. అంతేగాదు దాని ఫలితం ఎన్నో రోజులు భూమ్మీద ఉండే అవకాశం లేదనేలా పలు రకాల అనారోగ్య సమస్యల రూపంలో వార్నింగ్ ఇస్తుందట. సాధ్యమైనంత వరకు ఎంత తొందరగా ఇలాంటి ఆహారపు అలవాట్లను దూరం చేసుకుంటేనే మంచిదని సూచిస్తున్నారు. అలాగే ఆరోగ్యంగా ఉండేలి అంటూ ప్రణాళికల దగ్గర ఆగిపోతే.. జీవితం మన కోసం ఆగిపోదు అనేది గ్రహించండి అని నొక్కి చెబుతున్నారు గుండె వైద్యులు. Office canteen samosa: ₹20Angioplasty: ₹3 lakhsSamosas per year: 300Years of eating: 15Total samosa cost: ₹90,000You're not saving money on unhealthy food.You're taking a loan against your arteries at 400% interest.— Dr Shailesh Singh (@drShaileshSingh) October 23, 2025 వ్యాయామం చేయాల్సిన ప్రాధాన్యత..అనారోగ్యకరమైన అలవాట్లకు దూరంగా ఉంటూ..వ్యాయామం వంటి అలవాట్లను కష్టంగా అనిపించినా..అవి దైనందిన లైఫ్లో రోటీన్గా ఎలా మారుతాయో వివరించారు వైద్యులు. ఒక వారం వ్యాయమాల వల్ల శారీర కష్టాలు అనుభవించి ఉండొచ్చు. కానీ కంటిన్యూగా చేస్తూ ఉంటే..నెలాఖరికిగా అదొక అలవాటుగా మారిపోవడమే గాక, చేయకపోవడమే తప్పుగా లేదా లోటుగా అనేలా మారుతుందని అన్నారు. (చదవండి: నీటికి బదులు బీర్! స్పెషల్ హైడ్రేషన్ స్టయిల్..) -
డయాబెటిస్ని తిప్పికొట్టి.. 30 కిలోల బరువు తగ్గింది!
బరువు తగ్గడం అందరూ చాలా కష్టమనే భావిస్తారు. ఎందుకంటే అంత ఈజీగా కొలెస్ట్రాల్ని తగ్గించుకుని స్లిమ్గా మారడం సాధ్యం కాదు. కానీ ఈ అమ్మాయి అధిక బరువుతో మధుమేహం బారినపడ్డప్పటికీ అధైర్యపడకుండా బరువు తగ్గింది. డయాబెటిస్ నుంచి కూడా బయటపడింది. అలాగని కఠినమైన ఆహారనియమాలేం పాటించలేదు, చిన్ని చిన్న ఆహారపు అలవాట్లతోనే ఇదంతా సాధ్యం చేసిందామె. మరి అదెలాగో ఆమె మాటల్లో సవివరంగా తెలుసుకుందామా..!.డైటీషియన్ జాకీ(Dietitian Jackie) తన వెయిట్ లాస్ జర్నీ గురించి సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ఇలా రాశారు. తనకు 20 ఏళ్ల వయసులో ఉండగా ప్రీ డయాబెటిక్(pre-diabetic) నిర్థారణ అయ్యిందని తెలిపింది. దాంతో ఇక ఇప్పుడైనా ఆరోగ్యంపై దృష్టిసారించక తప్పదని ఫిక్స్ అయ్యానని చెప్పింది. అదీగాక పేరెంట్స్ కూడా బరువు తగ్గేలా ఆరోగ్యకరమైన ఆహారమే తీసుకోమని సూచించడంతో..తన ఆరోగ్యాన్ని కాపాడుకునేలా జీవనశైలిలో మార్పులు చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొంది. 30 కిలోలు ఎలా తగ్గిందంటే..సరైన ఆహారం: తన డైట్లో మంచి పుడ్ని తీసుకునేలా పోషకాహార నిపుణుడి సలహాలను తీసుకున్నట్లు తెలిపారు. నారింజ రసం వంటి చక్కెర పానీయాలను, శుద్ధి చేసిన పిండితో చేసే ఆహారాలను దూరంగా ఉంచి, గోధుమ రొట్టెలను ఆహారంలో భాగం చేసుకున్నట్లు చెప్పుకొచ్చింది. కేలరీలను తీసుకోవడాన్ని తగ్గించి, పోషకవంతమైన ఆహారాన్ని ఎక్కువగా తినేలా చూసుకునేదట.ఫుడ్ తయారైన విధానం: వ్యాయామాలు చేసినంత మాత్రమే బరువు తగ్గరు. తీసుకునే అల్పాహారం, ఆరోగ్యకరమైనదా లేదా అని నిర్థారించుకునేదట. ముఖ్యంగా పోషకాహారం ఎంత మేర ఉందో తెలసుకుని మరి తీసుకునేదట. అలానే సమతుల్య ఆహారానికి ప్రాముఖ్యత ఇచ్చేదాన్ని అని చెప్పుకొచ్చింది. వ్యాయామం..చిన్న వామ్-అప్ వ్యాయామాలతో మొదలు పెట్టి..ట్రెడ్మిల్, ఆరు నుంచి ఏడు మైళ్లు పరుగుపెట్టడం వంటి వ్యాయామాలని పట్టుదలతో చేసి లక్ష్యానికి చేరుకున్నట్లు తెలిపారామె. అలా బరువు తగ్గడమే కాదు, డయాబెటిస్ని క్యూర్ చేసుకున్నట్లు కూడా వివరించింది. అయితే తనకు వెయిట్లాస్ అవ్వడం కష్టమైన పని కాదని, అదొక నిర్వహణ దశ అని అంటోందామె. ఇప్పటికీ తాను ఆ అలవాట్లను కొనసాగిస్తున్నట్లు వివరించింది. తగ్గిన ఆ బరువుని నిర్వహిస్తే హెల్దీగా ఉంటామని..కేవలం జీవనశైలిలో మార్పులు చేసుకుంటే చాలని చెబుతోంది డైటీషియన్ జాకీ. (చదవండి: Idli For Breakfast: ప్రయోజనాలేమిటి? సాంబార్,చట్నీతో తింటే లాభమా? నష్టమా?) View this post on Instagram A post shared by Jackie, MS, RD | Weight Loss Coach & Mindful Eating Dietitian (@the.mindful.nutritionist) -
ఆపరేషన్ మధ్యలో క్లారినెట్ వాయించిన మహిళ..! ఆశ్చర్యపోయిన వైద్యులు
ఇటీవల బ్రెయిన్కి సర్జరీ మెలుకువగా ఉండగా చేసిన ఘటనలు చూశాం. కొందరూ పాటలు, సినిమాలు చూస్తూ చేయించుకున్నారు. అదంతా ఒక ఎత్తైతే. బ్రెయిన్ సర్జరీ చేస్తుండగా..మధ్యలో ఓ సంగీత వాయిద్యాన్ని వాయించింది ఒక మహిళ . వైద్యులు సైతం విస్తుపోయారు. దీని కారణంగా తమ సర్జరీ సక్సెస్ అనేది తక్షణమే నిర్థారించుకోగలిగామని ఆనందంగా చెబుతున్నారు వైద్యులు. మరి ఆ ఆసక్తికర కథేంటో చకచక చదివేద్దామా..!.లండన్లో చోటుచేసుకుంది ఈ అద్భుత ఘటన. లండన్లో క్రౌబేర్కు చెందిన 65 ఏళ్ల డెనిస్ బెకన్(Denise Bacon) గత కొన్నేళ్లుగా పార్కిన్సన్స్తో(Parkinsons disease) బాధపడుతోంది. రిటైర్డ్ స్పీచ్ అండ్ లాంగ్వేజ్ థెరపిస్ట్ అయినా ఆమె పార్కిన్సన్స్ నుంచి ఉపశమనం పొందేందుకు కింగ్స్ కాలేజ్ హాస్పిటల్లో డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ ఆపరేషన్ చేయించుకోవాలనుకున్నారు. ఆమెకు ఈ వ్యాధి 2014లో నిర్థారణ అయ్యింది. ఫలితంగా నడవడం, ఈత కొట్టడం, డ్యాన్స్ చేయడం వంటివి ఏమి చేయలేకపోయింది. ఐదేళ్ల నుంచి తను ఎంతో ఇష్టపడే గ్రిన్స్టెడ్ కచేరీ బ్యాండ్ ప్రదర్శనలో సైతం పాల్గొనడం మానేసిందామె. ఆ నేపథ్యంలో ఇలా బ్రెయిన్కి ఆపరేషన్ చేయించుకోవాలనుకుంది బేకన్. ఇది సుమారు నాలుగు గంటల ఆపరేషన్. అందులో భాగంగా ఆమె పుర్రెకి మత్తు ఇంజెక్షన్ ఇచ్చి శస్త్ర చికిత్స చేస్తున్నారు వైద్యులు. అంతలో మధ్యలో ఆమె చేతి వేళ్లను సునాయాసంగా కదిలించగలగడేమ కాదు, ఆపరేషన్ చేస్తుండగా మధ్యలోనే క్లారినెట్ను అద్భుతంగా వాయించింది. దాన్ని చూసి వైద్యుల సైతం విస్తుపోయారు. బ్రెయిన్ సర్జరీలో భాగంగా ఎలక్ట్రోడ్లు సక్రియం చేస్తుండగా చేతులు కదులుతున్నట్లు గమనించి.. ఇలా వాయిద్యాని వాయించాలని భావించానంటోంది. దీని కారణంగా తమ సర్జరీ విజయవంతమని, ఆమె సమస్య నుంచి బయటపడి మెరుగ్గా ఉందని తక్షణమే నిర్థారించగలిగామని ఆనందంగా చెబుతున్నారు వైద్యులు. అంతేగాదు ఆమె ఆ సాహసం చేయాలనుకోవడం చాలా ప్రశంసించదగ్గ విషయమని అన్నారు. అందుకు సంబంధించిన వీడియోని నెట్టింట షేర్ చేశారు వైద్యులు. నెటిజన్లు సైతం శస్త్రచికిత్స మధ్యలో క్లారినెట్ వాయించడం అంటే.. అది మాములు ధైర్యం కాదంటూ బెకాన్ని కొనియాడుతూ పోస్టులు పెట్టారు. Patient with Parkinson's disease plays clarinet during brain procedure at London hospital pic.twitter.com/en2vpRRfaA— The Associated Press (@AP) October 23, 2025 (చదవండి: కూతురి డ్రీమ్, తండ్రి సంకల్పం..! ఆ నాణేల సంచి వెనుక ఇంత భావోద్వేగ కథనా..) -
ప్రాజెక్టులు వస్తాయి కానీ... పోయిన ఆరోగ్యం తిరిగి రాదు!
నాకు 36 ఏళ్లు. నేను ఇటీ ఉద్యోగిని. ఒంగోలులో మా తల్లిదండ్రుల దగ్గర ఉంటూ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాను. ఈ మధ్య కాలంలో బయట లే– ఆఫ్ లు బాగా అవుతున్నాయి. మా కంపెనీలో కూడా కొంతమందిని తీసివేసి ఉన్న వాళ్ళతోనే పని నడిపిస్తున్నారు. దీనివల్ల ఆఫీసులో ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంటోంది. లాప్టాప్ ముందు 12–14 గంటలు కూచోవాల్సి వస్తోంది. ఒక్కోసారి అర్ధరాత్రి వరకు పని చేయాల్సి ఉంటుంది. దీని ఫలితంగా నిద్ర పట్టడం లేదు. తలనొప్పితోపాటు. చికాగ్గా ఉంటోంది. ఇంట్లో భార్య పిల్లల మీద కూడా సహనం కోల్పోతున్నాను. జాబ్ వదిలేయాలనిపిస్తుంది. కానీ నాకున్న కమిట్మెంట్స్ వల్ల అది సాధ్యం కాదు. నేను ఏ నిర్ణయమూ తీసుకోలేకపోతున్నాను. ఈ పరిస్థితుల్లో నేను ఏం చేయాలో సలహా చెప్పగలరు. – అశోక్, ఓంగోలు అశోక్ గారు! మీరు చెప్పిన పరిస్థితి ఈరోజుల్లో చాలా మంది ఉద్యోగులు ఎదుర్కొంటున్నదే. ‘వర్క్ ప్లేస్ స్ట్రెస్‘కు మీరే ఒక ఉదాహరణ. ఉద్యోగుల తీసివేత, టార్గెట్స్. డెడ్లైన్స్ వల్ల ఒత్తిడి పెరగడం సహజం, కానీ దీని ప్రభావం మీ ఆరోగ్యం పైనే కాకుండా, కుటుంబ సంబంధాలపైనా పడుతోందన్న విషయాన్ని గమనించి దిద్దుబాటు కోసం ‘సాక్షి’ని సంప్రదించడం అభినందనీయం. మొదటగా, ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఉద్యోగం మానెయ్యాలని ఎవరికైనా అనిపించడం సహజం. కానీ తమకున్న కమిట్మెంట్స్, బాధ్యతల వల్ల అలా మానివేయడం చాలా సందర్భాల్లో కుదరదు. కనుక ఉద్యోగం చేస్తూనే ఒత్తిడిని ఎదుర్కొనేలా సన్నద్ధం అవడం ఉత్తమం. పని, ఆరోగ్యం, కుటుంబం–ఈ మూడిటి మధ్య సమతౌల్యం పాటించాలి. పని సమయంలో చిన్న చిన్న విరామాలు తప్పనిసరిగా తీసుకోండి. ప్రతి 1–2 గంటలకు, ఐదు ఏమిషాలు నడవండి. లోతుగా శ్వాస తీసుకొని వదిలే ’డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయండి. ఇది ఏకాగ్రతని మెరుగుపరుస్తుంది. అర్ధరాత్రి వరకు లాప్టాప్ ముందు కూర్చోవడం శరీరానికి, నిద్రకి తీవ్ర నష్టం చేస్తుంది. కాబట్టి. మీ మేనేజర్తో మాట్లాడి రాత్రిపూట ఒక కటాఫ్ టైమ్ పెట్టుకోండి. ఇంటి వాతావరణం, కుటుంబ సభ్యులతో గడిపే సమయం ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. వారాంతాల్లో వారితో బయటకు వెళ్ళి సరదాగా గడపండి. ఇంట్లో ఉన్నప్పుడు కూడా కుటుంబంతో గడపడానికి ఫిక్స్డ్ టైమింగ్స్ పెట్టుకోండి. ఉదాహరణకు డిన్నర్ సమయంలో ఫోన్, లాప్టాప్ దూరంగా పెట్టేయండి. ఇది మీకు రిలీఫ్ ఇస్తుంది. మీ కుటుంబానికి కూడా మీరు ఎమోషనల్గా అందుబాటులో ఉన్నారు అన్న భరోసా ఇస్తుంది. అలాగే వ్యాయామం ధ్యానం, యోగా లాంటి పద్దతులు మీ రోజు వారీ షెడ్యుల్లో చేరిస్తే ‘స్ట్రెస్ హర్మోన్లు’ తగ్గుతాయి. దీనివల్ల నిద్ర మెరుగుపడుతుంది. చిరాకు తగ్గుతుంది. ఇవన్నీ చేసినా కూడా మీరు ఇంకా ఒత్తిడిగా ఫీల్ అవుతున్నట్లయితే, ఒక మానసిక వైద్య నిపుణుడిని కలిసి స్ట్రెస్ మేనేజ్ చేసే టెక్నిక్స్ నేర్చుకోవడం చాలా ఉపయోగపడుతుంది. ఒక్క విషయం గుర్తుంచుకోండి.. టార్గెట్స్, ప్రాజెక్ట్ మళ్ళీ వస్తాయి, కానీ పోయిన ఆరోగ్యం తిరిగి రాదు. కాబట్టి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడమే మీకు మీ కుటుంబానికి, మీ కెరీర్కి కూడా దీర్ఘకాలికంగా మేలు చేస్తుంది. ఆల్ ది బెస్ట్!డా. ఇండ్ల విశాల్ రెడ్డి,సీనియర్ సైకియాట్రిస్ట్, విజయవాడ. (మీ సమస్యలు, సందేహాలు పంపవలసిన మెయిల్ ఐడీ: sakshifamily3@gmail.com)(చదవండి: ఎంబిఏ చేసిన 80 ఏళ్ల సీఈవో..! ఏకంగా రెండుసార్లు కేన్సర్ బారినపడ్డప్పటికీ..) -
శతాధిక బాడీబిల్డర్..ఇప్పటికీ పోటీల్లో పాల్గొనడం, శిక్షణ..
వయసు సాహసోపేతమైన పోటీల్లో పాల్గొనేందుకు అడ్డంకి కాదని చాలామంది వృద్ధులు నిరూపించారు. అలా కాకుండా క్రమశిక్షణాయుతమైన జీవితాన్ని ప్రారంభించి..సెంచరీ వయసు వరకు అదే ఫిట్నెస్తో ఉండటం అంటే మాటలు కాదు కదా.!. కానీ ఈ శతాధిక వృద్ధుడు ఇప్పటికీ అదే ఫిట్నెస్తో ఉండటమే కాదు..వందేళ్ల వయసులో బాడీబిల్డింగ్ పోటీల్లో పాల్గొని అందర్నీ ఆశ్చర్యపరిచాడు. అంతేగాదు యువకుడిగా ఉండగా ఆర్మీలో చేరి రెండో ప్రపంచ యుద్ధంలో తన వంతు పాత్రను పోషించి అజేయమైన ధైర్య సాహాసాలు కనబర్చాడు. పైగా ఈ వయసులో కూడా హాలీవుడ్ దిగ్గజాలకు, యువ అథ్లెట్లకు శిక్షణ ఇస్తూ.. ఫిట్నెస్ టిప్స్ కూడా చెబుతున్నారు. చెప్పాలంటే తరతరాలకు ఆయనొక స్ఫూర్తి..ఆయనే అమెరికాకు చెందిన అత్యంత వృద్ధ బాడీబిల్డర్ ఆండీ బోస్టింటో. ఆయన బాడీబిల్డింగ్లో ప్రపంచ ఛాంపియన్ కూడా. అంతేగాదు ఆయన ప్రపంచవ్యాప్తంగా ఉన్న బాడీబిల్డింగ్ ఔత్సాహికులకు అంతర్జాతీయ రోల్ మోడల్. ఇటీవలే వందేళ్ల వయసులో బాడీ బిల్డింగ్ పోటీల్లో పాల్గొని అరుదైన ఘనతను సృష్టించాడు. ఈ వయసులో కాలు కదిపేందుకు ఇబ్బంది పడుతుంటారు. అలాంటిది ఆయన బాడీబిల్డింగ్ పోటీల్లో పాల్గొని సత్తా చాటారు. అంతేగాదు ఈ ఏడాది ప్రారంభంలో యునైటెడ్ స్టేట్స్ ఆర్మీ స్టాఫ్ సార్జెంట్ రెండో ప్రపంచ యుద్ధంలో 101వ రెజిమెంట్గా అసామాన్య పరాక్రమాన్ని చూపించినందుకు గానూ ఆండీని కాంస్య నక్షత్రంతో గౌరవించింది.బాల్యం మొదలైంది అలా..ప్రపంచ ప్రఖ్యాత బాడీబిల్డర్గా పేరుగాంచిన ఆండీ ప్రస్థానం న్యూయార్క్ నగరం నుంచి మొదలైంది. 1925 జనవరి 11న ఇటాలియన్ కుటుంబంలో జన్మించిన అతను తల్లి, సోదరడుతో కలిసి పెరిగాడు. క్రిస్మెస్ చెట్టు బహుమతులిస్తుందని అమాయకంగా నమ్మిన తన బాల్యాన్ని గుర్తుచేసుకుంటూ..తన ఆశను ఒమ్ము చేయకుండా విశాల హృదయంతో పొరుగింటివారు తనకందించిన బహుమతులను మర్చిపోనంటాడు. అదే తనకు దాతృత్వం విలువను నేర్పించిందని చెబుతుంటాడు. ఇక ఆండీకి చిన్నప్పటి నుంచి ఫిట్నెస్ పట్ల మక్కువ ఎక్కువ. 12 ఏళ్లకే అందులో కఠినమైన శిక్షణ తీసుకున్నాడు. 16 ఏళ్లకు బాడీబిల్డింగ్ మ్యాగ్జైన్ల కోసం ఫోటోలు తీయబడ్డాడు కూడా. ఆ తర్వాత ఆర్మీలో చేరాలని ఎన్నో ప్రయత్నాలు చేసి..తిరస్కరణకు గురయ్యాడు. చివరికి పట్టుదలతో తనకిష్టమైన రంగంలో చేరి అక్కడి అధికారులచే ప్రశంసలందుకున్నాడు. అయితే తనకిష్టమైన బాడీబిల్డింగ్ని మాత్రం వదులుకోలేదాయన. అలా 1977లో సీనియర్ మిస్టర్ అమెరికా టైటిల్ను అందుకున్నాడు. ఆ తర్వాత తన భార్య ఫ్రాన్సిస్తో కలిసి నేషనల్ జిమ్ అసోసియేషన్ను స్థాపించాడు. అక్కడ హాలీవుడ్ దిగ్గజాలకు, యువ అథ్లెట్లకు శిక్షణ ఇస్తుంటాడు ఆండీ. ఆండి యువతరానికి ఇచ్చే సలహా..దాదాపు తొమ్మిది దశాబ్దాలుగా ఫిట్నెస్ ఔత్సాహికులను తన అనుభవాన్ని షేర్ చేయడమే గాక సలహాలు సూచనలు షేర్ చేసుకుంటుంటారు. అందులో కొన్ని..శారీరక శిక్షణలాంటిది మానసికంగా సిద్ధంకావడం. ఇది మన లక్ష్యాలపై దృష్టి కేంద్రీకరించేలా చేయడమే కాదు మన సామర్ధ్యాన్ని కూడా పెంచుతుంది. అవసరం అనుకుంటే సర్దబాటుని కూడా స్వీకరించండిఇక్కడ ఆండీ రెండు ప్రపంచయుద్ధం కాలికి గాయం, స్ట్రోక్ వంటి పలు ఆరోగ్య సమస్యలను ఎదుర్కొన్నాడు. అయితే ఆండీ తన పరిమితులపై ఫోకస్ పెట్టకుండా కేవలం శిక్షణపైనే దృష్టి పెట్టి తన సామార్థ్యానికి అనుగుణంగా మార్చుకుంటానని చెబుతున్నాడు. అన్నింట్లకంటే అప్లికబుల్ లేదా పాటించటం అనేది అత్యంత కీలకం. ఇంట్లో లేదా జిమ్లో అయినా.. సరైన టెక్నీక్స్ పాటించాలి. అప్పుడే సత్ఫలితాలు అందుకోగలరని చెబుతున్నారు ఆండీ బోస్టింటో. (చదవండి: weight loss journey: 15 నెలల్లో 40 కిలోలు బరువు..! శిల్పంలాంటి శరీరాకృతి కోసం..) -
15 నెలల్లో 40 కిలోలు బరువు..! శిల్పంలాంటి శరీరాకృతి కోసం..
అధిక బరువు తగ్గడం అతిపెద్ద సమస్య కాదు అని నిరూపిస్తున్నారు పలువురు. మెరుగైన ఫలితాలు రావాలంటే సరైన విధంగా, మంచి నిపుణుల సలహాల సూచనలు పాటించాలి. ఈ అధిక బరువుకి చెక్పెట్టడంలో ప్రధాన పాత్ర పోషించేది కేవలం డైట్ మాత్రమే కాదు, వర్కౌట్లుదే అగ్రస్థానం. ఎందుకంటే శారీరక శ్రమతో ఫ్యాట్ని కరిగించడమే గాక బరువులో మార్పులు కూడా సంభవిస్తాయి. కొందరికి చేతులు, కాళ్లు, పిరుదులు బాగా లావుగా కనిపిస్తాయి. ఆ ప్రదేశాల్లోని కొలెస్ట్రాల్ తగ్గి..ఫ్లాట్గా అవ్వడమేగాక చెక్కిన శిల్పంలా ఆకృతి మారాలంటే ఈ వ్యాయామాలు తప్పనిసరి అంటోంది ఫిట్నెస్ కోచ్ సాచి పాయ్. అదెలాగో ఆమె మాటల్లోనే సవివరంగా చూద్దామా..!. టొరంటోకు చెందిన ఈ ఫిట్నెస్ కోచ్ సాచి పాయ్(Saachi Pai) జస్ట్ 15 నెలల్లో 40కిలోలు పైనే బరువు తగ్గింది. అంతలా బరువు తగ్గడంలో తనకు హెల్ప్ అయిన వ్యాయామాలు, ఆహారాలు గురించి సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంది. బరువు తగ్గడంలో మార్పులు బాహ్యంగా కనిపించాలంటే..కాళ్లు, చేతులు, పిరుదుల సైజ్ తగ్గితేనే..బరువు తగ్గినట్లు తెలుస్తుంది. అందుకోసం ఈ ఐదు వ్యాయామాలు క్రమం తప్పకుండా చేయలంటోంది సాచి పాయ్. సైడ్ రైజెస్ఈ వ్యాయామం కోసం నిటారుగా నిలబడి ప్రారంభించాలి. ఒక కాలును పక్కకు ఎత్తి, దానిని నిటారుగా ఉంచండి. కాలును నెమ్మదిగా క్రిందికి తీసుకురండి ..ఇలా పునరావృతం చేయాలి.ముందు, వెనుక కిక్స్ఎత్తుగా నిలబడి, ఒక కాలును ముందుకు తన్నండి, ప్రారంభానికి తిరిగి వెళ్లి, ఆపై దానిని వెనుకకు తన్నండి. ఆ తర్వాత యథాస్థానానికి వచ్చి..కదలికలను నియంత్రించాలి. ఇలా కొన్నిసార్లు రిపీట్ చేయండి. సింగిల్ ఇన్నర్ లెగ్ రైజెస్మీ దిగువ కాలును నిటారుగా ఉంచి, పై కాలును దానిపై వంచి సైడ్కు పడుకోండి. ఇది, లోపలి తొడలపై ఒత్తిడి కలుగుజేసేలా దిగువ కాలును పైకి ఎత్తండి. ఇలా మీ కాలును నెమ్మదిగా తగ్గించి.. పునరావృతం చేయండి. నిర్దిష్ట సంఖ్యలో ప్రాక్టీస్ అయ్యాక..మరోవైపకి తిరిగి ఇలానే పునరావృతం చేయాలి..ఫైర్ హైడ్రాంట్స్నాలుగు కాళ్లపై ప్రారంభించండి, ఒక మోకాలిని పక్కకు ఎత్తండి, దానిని వంచి ఉంచండి. వ్యాయామం చేస్తున్నప్పుడు మీ తుంటిని తిప్పవద్దు. ఇప్పుడు, వీపును క్రిందికి తగ్గించి రెండో కాలికి ఇలానే వ్యాయామం రిపీట్ చేయండి.డాంకీ కిక్స్నాలుగు కాళ్లపై నిలబడి, ఒక మోకాలిని వంచి, మడమను పైకప్పు వైపుకు ఎత్తాలి. ఈ వ్యాయామాలు కొవ్వును కాల్చడానికి, టోన్ చేయడానికి హెల్ప్ అవుతాయి. పలితంగా శిల్పంలా శరీరాకృతి మారేందుకు దోహదపడుతుంది. ఈ వ్యాయామాలు నిపుణుల పర్యవేక్షణలో సరిగా చేస్తే మంచి ఫలితాలు అందుకుంటారని, అదే తప్పుగా చేస్తే లేనిపోని శారీరక సమస్యలు తప్పవని చెప్పుకొచ్చారు. సాధ్యమైనంతవరకు నిపుణుడైన ఫిట్నోస్ పర్వవేక్షకుడి సమక్షంలో నేర్చుకోవడమే మంచిదని సూచిస్తున్నారు సాచిపాయ్. View this post on Instagram A post shared by Saachi | Pilates. Fat Loss. Real Talk. (@saachi.pai) (చదవండి: 44 కిలోల బరువు తగ్గిన ఫిట్నెస్ కోచ్..! సరికొత్తగా వెయిట్లాస్ పాఠాలు..) -
సమంత హైప్రోటీన్ డైట్..ఆ మూడింటితో ఫుల్ఫిల్..!
టాలీవుడ్ నటి సమంత రూత్ ప్రభు తన డైట్ గురించి ఒక ఇంటర్వూలో వెల్లడించారు. ప్రతి మహిళకు అవసరమైన ప్రోటీన్ విషయంలో తాను అస్సలు నిర్లక్ష్యం చేయనని చెప్పారామె. అందుకోసమే తాను తప్పనిసరిగా వందగ్రాముల ప్రోటీన్ని వినియోగిస్తానని చెప్పారామె. దాదాపు 50 కిలోలు ఉండే ఆమె ఈ రేంజ్లో ప్రోటీన్ తీసుకోవడం సరైనదేనా అంటే..భారతీయ మహిళలందరికీ సాధారణంగా 60 నుంచి 80 గ్రాముల ప్రోటీన్ తప్పనిసరి అని చెబుతున్నారు నిపుణులు. ఇక్కడ సమంత అంతకుమించి తీసుకోవడం అంటే..బహుశా కార్బోహైడ్రేట్కి బదులుగా లేదా వర్కౌట్ల రీత్యా అవసరం అయ్యి ఉండొచ్చని అన్నారు. అయితే ఇక్కడ అంత మోతాదులో ప్రోటీన్ ఎలా అని సందేహ పడాల్సిన పని కూడా లేదని అంటున్నారు నిపుణులు. అందుకోసం కేవలం ఈ మూడింటితో భర్తి చేస్తే చాలని చెబుతున్నారు. పెరుగు, పన్నీర్, పప్పు తీసుకుంటే చాలని చెబుతున్నారు. దీంతోపాటు పోషకాలతో నిండిన సమతుల్య ఆహారాన్ని తీసుకోవాలని సూచించారు. ప్రదానంగా గుర్తించుకోవాల్సినవి..వెజ్ ప్రోటీన్ ఒక్కోసారి కార్బోహైడ్రేట్లు, కొవ్వులతో కలిసి వస్తాయి. అందువల్ల ప్రతి ఒక్కరి హై ప్రోటీన్డైట్ సరిపడకపోవచ్చు. గట్ సమస్య ఉన్నవారికి అదనపు ప్రోటీన్ తీసుకోవడం ప్రమాదకరం అని చెబుతున్నారు నిపుణులు. అదీగాక అధిక ప్రోటీన్, తక్కువ ఫైబర్ ఉన్న ఆహారం మలబద్దకం, జీర్ణశయాంంతర సమస్యలకు దారితీస్తుందనేది గ్రహించాలని చెబుతున్నారు. ఇక్కడ గట్ఆరోగ్యంపై దృష్టిసారిస్తూ..క్రమంగా ప్రోటీన్ తీసుకోవడం పెంచడం మంచిదని చెబుతున్నారు. అదే సమయంలో ఇక్కడ సమంతా అంత మొత్తంలో ప్రోటీన్ తీసుకోవడం అనేది మొత్తం ఆరోగ్యం, ప్రోటీన్ ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది. అయితే సగటు వ్యక్తికి "సెలబ్రిటీ నియమావళి" వర్తించిందని, అనుసరించాల్సిన అవసరం లేదన్నారు. అందుకు బదులుగా స్మార్ట్గా ఎంపిక చేసుకుని తినడం మంచిదని సూచించారు నిపుణులు. గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: Hungover After Diwali: దీపావళి హ్యాంగోవర్ని తగ్గించే నేచురల్ డిటాక్స్..తక్షణ ఉపశమనం!) -
దీపావళి జోష్..తర్వాత రోజు తలెత్తే హ్యాంగోవర్ని హ్యాండిల్ చేద్దాం ఇలా..!
దీపావళి వేడుకలతో రాత్రంతా ఆహ్లాదంగా ఆడిపాడి గడుపుతారు అందరు. ముఖ్యంగా ఈ వేడుక పుణ్యామా అని రకరకాల స్వీట్లు, విందులతో పొట్టపగిలేలా ఆరగించేస్తాం. మరోవైపు బంధు మిత్రులతో కలిసి టపాసులు కాల్చి..ఆడిపాడి ఎప్పుడో పడుకుంటాం. పొద్దున లేచాక..ఏదో నిద్ర లేనట్లుగా పొట్టంతా ఉబ్బరంగా, ఒకటే తలనొప్పిగా భారంగా ఉంటుంది. శరీరమంతా ఏదో తెలియని బరువులా ఇబ్బందిగా ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే పండుగ హ్యాంగోవర్తో ఇబ్బంది పడుతుంటాం. నార్మల్ స్థితికి వచ్చి యథావిధిగా యాక్టివ్గా ఉండాలంటే ఈ నేచురల్ పానీయమే మేలంటున్నారు నిపుణులు. దీపావళి తర్వాత ఉత్సాహంగా ఉండటానికి ఇది అల్టిమేట్ రికవరీ పానీయంగా చెబుతున్నారు. మరి అదెంటో చూసేద్దామా..!.హ్యాంగోవర్ ఎందుకు వస్తుందంటే..దీపావలి పండుగ పేరుతో అతిగా తిని, బాగా ఎంజాయ్ చేస్తాం. పైగా శరీరం అలిసిపోతున్న బంధు మిత్రులను చూసి ఎక్కడలేని ఉత్సాహాన్ని కొనితెచ్చుకుంటాం. దాంతో మరుసటి రోజు డీహైడ్రేషన్కి గురయ్యే నీరసంతో విలవిలాడుతుంటాం. దీన్నే దీపావళి హ్యాంగోవర్ లేదా పండుగ హ్యాంగోవర్ అంటారు. దీన్నుంచి తక్షణమే రీలిఫ్ ఇచ్చే అద్భుత పానీయం నిమ్మ కొబ్బరి నీరు అని చెబుతున్నారు నిపుణులు. ఇది సహజసిద్ధమైన డిటాక్స్లా పనిచేస్తుందట. ఏవిధంగా అంటే..రీహైడ్రేట్ చేసి శరీరాన్ని యాక్టివ్ చేస్తుందట. అలాగే కొబ్బరి నీరులో 94% నీరు, పొటాషియం, సోడియం, మెగ్నీషియం, కాల్షియం సమృద్ధిగా ఉంటాయి. దీనికి నిమ్మకాయను జోడించడంతో రుచిపెరగడమే కాకుండా ఖనిజ శోషణ కూడా మెరుగుపడుతుందట. ముఖ్యంగా పొట్ట ఉబ్బరాన్ని తగ్గించి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.ప్రేగుకి ఉపశమనం అందించి, జీర్ణ ఎంజైమ్లను ప్రేరేపిస్తుంది. కొబ్బరినీళ్లల్లో ఉండే మెగ్నీషియం జీర్ణకండరాలను సడలించి.. ఆమ్లత్వం, మలబద్ధకం, అసౌకర్యాన్ని నివారిస్తుంది. అలాగే జలుబు, అలసట వంటి వాటిని నివారిస్తుంది. నిమ్మకాయలో ఉండే సీ విటమిన్ రోగనిరోధక శక్తిని అందించి..యాంటీ వైరల్, యాంటీ మైక్రోబయల్ వంటి వాటిని అందించి శరీరం తక్షణమే కోలుకునేలా చేస్తుంది. వేయించి పదార్థాలు తీసుకోవడం వల్ల వచ్చే పేగువాపుని తగ్గిస్తుందట. ఆక్సీకరణ ఒత్తిడిని దూరం చూస్తుందట. దీంతోపాటు చర్మాన్ని గ్లో అప్ చేసి, హైడ్రేటెడ్గా ఉండేలా చేస్తుందట. ఈ నిమ్మకాయ కొల్లాజెన్ ఉత్పత్తికి హెల్ప్ అవుతుందట. అలాగే కొబ్బరిలో ఉండే సహజ చక్కెరలు స్థిరమైన శక్తిని అందించి, ఆకస్మికంగా చక్కెర లెవల్స్ పడిపోవడాన్ని నివారిస్తుందని చెబుతున్నారు నిపుణులుతయారీ విధానం:ఇంట్లో దీన్ని ఎలా తయారు చేయాలంటే..కావలసినవి: 1 కప్పు తాజా కొబ్బరి నీరు (240 మి.లీ)2 టేబుల్ స్పూన్లు తాజా నిమ్మరసం 1 టీస్పూన్ తేనె లేదా బెల్లం సిరప్చిటికెడు నల్ల ఉప్పు లేదా కొన్ని పుదీనా ఆకులు తయారీ: కొబ్బరి నీటిలో నిమ్మరసం వేసి బాగా కలపండి. కావాలనుకుంటే తేనె లేదా బెల్లం కూడా కలుపుకోవచ్చు. చల్లగా కావాలనుకుంటే కొంచెం ఐస్, పుదీనా రెమ్మతో సర్వ్ చేసుకోవచ్చు. యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రయోజనాల కోసం 1/2 టీస్పూన్ తురిమిన అల్లం కూడా జోడించొచ్చు. గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తి గత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం.(చదవండి: మధుమేహ వ్యాధిగ్రస్తులకు దీపావళి ‘స్వీట్’ వార్నింగ్..!) -
ఈ తియ్యటి పండుతో షుగర్కి చెక్ : తాజా అధ్యయనం
అమ్మో యాపిల్, అమ్మో మామిడి పండా? అమ్మో సీతాఫలమా? మధురమైన అలాంటి పండ్లు మన చేత అమ్మో అనిపిస్తున్నాయి అంటే... నిస్సందేహంగా అది డయాబెటిస్ సమస్య వల్లే అని చెప్పొచ్చు. దాంతో చాలా కాలంగా తియ్యటి పండ్లు అనేవి షుగర్ వ్యాధి ఉన్నవారికి దూరంగా ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో గత కొంతకాలంగా జరుగుతున్న కొన్ని అధ్యయనాలు ఈ ఆలోచనలకు విరుద్ధమైన ఫలితాలను వెల్లడిస్తున్నాయి. అలాంటిదే ఆ తాజా అధ్యయన ఫలితం. ఇది పండ్లు తినడం వల్ల డయాబెటిస్ తగ్గుతుందని చెప్పడం మరింత విశేషం. ఆశ్చర్యంగా అనిపించవచ్చు, కానీ సహజమైన మధురమైన తీపికి పేరుగాంచిన మామిడి పండ్లు తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రించవచ్చునట. తాజా పరిశోధనలు దీనిని వెల్లడించాయి. జార్జ్ మాసన్ విశ్వవిద్యాలయ పరిశోధకులు నిర్వహించిన ఒక అధ్యయనంలో, తక్కువ చక్కెర ఉన్న స్నాక్స్ ఎంచుకున్న వారితో పోలిస్తే, వాటికి బదులుగా రోజూ మామిడి పండ్లు తినే వ్యక్తుల రక్తంలో చక్కెర నియంత్రణను మెరుగుపడింది. అంతేకాదు వారు శరీర కొవ్వును సైతం తగ్గించుకుంటారని తేలింది. గత ఆగస్టులో ‘‘డైలీ మ్యాంగో ఇంటెక్ ఇంప్రూవ్స్ గ్లైసెమిక్ అండ్ బాడీ కంపోజిషన్ అవుట్కమ్స్ ఇన్ అడల్ట్స్ విత్ ప్రిడియాబెటిస్: ఎ రాండమైజ్డ్ కంట్రోల్డ్ స్టడీ’’ అనే శీర్షికతో ఫుడ్స్లో ప్రచురితమైన ఈ అధ్యయనం ఫలితాలు, మొత్తం ఆహారాలలో చక్కెర పోషక సందర్భం చక్కెర కంటెంట్ కంటే చాలా కీలక పాత్ర పోషిస్తుందని నొక్కి చెబుతున్నాయి.మామిడి ప్రయోజనాల వెనుక సైన్స్ఈ సందర్భంగా సైన్స్ డైలీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో, జార్జ్ మాసన్ న్యూట్రిషన్ అండ్ ఫుడ్ స్టడీస్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ రైదే బసిరి మాట్లాడుతూ ఆహారంలో ఎంత చక్కెర ఉందో దాని గురించి మాత్రమే కాదు, మొత్తం పోషక సమతుల్యత గురించి వివరించారు. ఉదాహరణకు, మామిడి పండ్లు ఒక ప్రత్యేకమైన సమతుల్యతను అందిస్తాయి అవి సహజమైన చక్కెరలను కలిగి ఉన్నప్పటికీ, వీటితో పాటు ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు అవసరమైన విటమిన్లు ఉంటాయి. ఈ కలయిక నెమ్మదిగా చక్కెర శోషణకు సహాయపడుతుంది, రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను స్థిరంగా ఉంచుతుంది.అయితే దీనికి విరుద్ధంగా, ప్రాసెస్ చేసిన తృణæధాన్యాలు లేదా ప్యాక్ చేసిన తక్కువ చక్కెర కలిగిన స్నాక్స్ వంటివి ఈ సహజ సమతుల్యతను కలిగి ఉండవు తద్వారా మధుమేహం వచ్చే ప్రమాదాన్ని పెంచుతాయి. మామిడిలోని ఫైబర్ జీర్ణక్రియకు మద్దతు ఇస్తుంది సంతృప్తిని ప్రోత్సహిస్తుంది, ఆకలిని నియంత్రించడంలో సహాయపడుతూ అతిగా తినకుండా నిరోధిస్తుంది, ఇది బరువు నిర్వహణకు సహాయపడుతుంది.గ్లైసెమిక్ ఇండెక్స్, సురక్షిత వినియోగ చిట్కాలుమామిడి గ్లైసెమిక్ ఇండెక్స్ మితమైన పరిధిలోకి వచ్చేలా 51–56 మధ్య స్కోర్ చేస్తుంది, ఇది నారింజ రసంతో పోల్చదగిన పరిధి. అమెరికన్ డయాబెటిస్ అసోసియేషన్ (ఎడిఎ) చెబుతున్న ప్రకారం, ఇది మామిడి పండ్లను తక్కువ నుంచి మధ్యస్థ వర్గంలో ఉంచుతుంది, ఇది మితమైన వినియోగానికి అనుకూలంగా ఉంటుంది. చక్కెరలు జోడించకుండా తాజాగా, ఫ్రోజెన్ లేదా సరైన విధంగా నిల్వ చేసిన పండ్లను మాత్రమే ఎంచుకోవాలని ఎడిఎ సూచిస్తోంది. ఒక సాధారణ పండు ద్వారా దాదాపు 15 గ్రాముల కార్బోహైడ్రేట్లు లభిస్తాయి, ఇది ఒక కప్పు మామిడిలో మూడింట రెండు వంతులకు సమానం. అయితే ఎండిన పండ్ల పరిమాణం తక్కువగా ఉండటం వల్ల అవి చక్కెరలను అధికంగా ఉత్పత్తి చేస్తాయి, కాబట్టి తాజా పండ్లు ఎండిన రకాల కంటే ఎక్కువ లాభదాయకంగా ఉంటాయని ఏడిఎ పేర్కొంది.అదనపు ఆరోగ్య ప్రయోజనాలురక్తంలో చక్కెరను నియంత్రించడమే కాకుండా, మామిడి పండ్లు కొలెస్ట్రాల్ స్థాయిలను కూడా మెరుగుపరుస్తాయి. 2011లో బ్రిటిష్ జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్ లో ప్రచురితమైన ఒక అధ్యయనం దీన్ని వెల్లడించింది. ఫ్రీజ్–డ్రైడ్ మామిడితో కూడిన ఆహారం ఎలుకలకు తినిపించడం వల్ల లిపిడ్ లేదా ఫెనోఫైబ్రేట్ రోసిగ్లిటాజోన్ వంటి చక్కెర–తగ్గించే మందులతో చికిత్స పొందిన వాటితో పోలిస్తే తక్కువ శరీర కొవ్వు, తగ్గిన కొలెస్ట్రాల్ మెరుగైన గ్లూకోజ్ స్థాయిలు కనిపిస్తాయని గమనించారు. మామిడి వంటి పండ్లను ఒకరి ఆహారంలో చేర్చుకోవడం వల్ల సహజంగా తీపి కోరికలు తీరడమే కాకుండా జీవక్రియ ఆరోగ్యానికి కూడా మద్దతు లభిస్తుందని, ఈ ఉష్ణమండల పండును సమతుల్య జీవనానికి ఆశ్చర్యకరంగా స్మార్ట్ ఎంపికగా మారుస్తుందని పరిశోధన నొక్కి చెబుతుంది.అధిక రక్త చక్కెర సంకేతాలుక్లీవ్ల్యాండ్ క్లినిక్ నివేదిక ప్రకారం, అధిక రక్త చక్కెర, హైపర్ గ్లసీమియా అని పేర్కొనే ప్రారంభ సంకేతాలు క్రమ క్రమంగా కనిపిస్తాయి అధిక దాహం లేదా ఆకలి, తరచుగా మూత్రవిసర్జన, తలనొప్పి అస్పష్టమైన దృష్టి ఉండవచ్చు. పెరుగుతున్న గ్లూకోజ్ స్థాయిలను నిర్వహించడానికి శరీరం కష్టపడడం వల్లే ఈ లక్షణాలు సంభవిస్తాయి. ఎక్కువ కాలం పాటు అదుపు చేయకుండా వదిలేస్తే, దీర్ఘకాలిక హైపర్ గ్లసీమియా నిరంతర అలసట, అనూహ్యంగా బరువు తగ్గడం, చర్మ ఇన్ఫెక్షన్లు, త్వరగా నయం కాని కోతలు లేదా పుండ్లు వంటి తీవ్రమైన సమస్యలకు దారితీస్తుంది. ఈ హెచ్చరిక సంకేతాలను ముందుగానే గుర్తించడం చాలా ముఖ్యం, ఎందుకంటే సకాలంలో జీవనశైలి మార్పులు, వైద్య జోక్యం వల్ల నరాల దెబ్బతినడం వంటి మధుమేహ సంబంధిత తీవ్రమైన సమస్యలను నివారించడంలో సహాయపడుతుంది.రక్తంలో చక్కెరను ఎలా అదుపులో ఉంచుకోవాలి?ఆరోగ్యకరమైన రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి, ఫైబర్, తృణధాన్యాలు, లీన్ ప్రోటీన్లు పిండి లేని కూరగాయలు అధికంగా ఉండే సమతుల్య ఆహారంపై దృష్టి పెట్టండి. శుద్ధి చేసిన చక్కెరలు, ప్రాసెస్ చేసిన ఆహారాలు తీపి పానీయాలను బాగా పరిమితం చేయండి. గ్లూకోజ్లో హెచ్చుతగ్గులు తగ్గుదలను నివారించడానికి చిన్న, సాధారణ భోజనం తినండి. చురుకైన నడక లేదా యోగా వంటి రోజువారీ వ్యాయామంతో కనీసం 30 నిమిషాలు చేస్తూ చురుకుగా ఉండండి. ఒత్తిడి హార్మోన్లు రక్తంలో చక్కెరను పెంచుతాయి కాబట్టి ధ్యానం లేదా లోతైన శ్వాస ద్వారా ఒత్తిడిని నియంత్రించండి. తగినంత నిద్ర పొందండి హైడ్రేటెడ్గా ఉండండి. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను క్రమం తప్పకుండా పర్యవేక్షించండి చక్కెరను ఆరోగ్యకరమైన పరిధిలో ఉంచడానికి తరచు వైద్య సలహాను అనుసరించండి. -
పావురాలు Vs పౌరులు: ఎవరు ముఖ్యం? పెటాపై ప్రజాగ్రహం...
పావురాల విసర్జన ప్రాణాంతకంగా మారుతోందంటూ భారతీయ నగరాల్లో గత కొంతకాలంగా తీవ్రమైన ఆందోళన వ్యక్తం అవుతోంది. దీనిపై ముంబై వంటి మెట్రోలకు చెందిన కొందరు న్యాయస్థానాలను కూడా ఆశ్రయించారు. ఈ నేపధ్యంలో ఇటీవల పావురాలకు ఆహారం (దాణా) వేయడాన్ని నియంత్రించడానికి మహారాష్ట్ర ప్రభుత్వం నిషేధ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ ఆదేశాలను నిరసిస్తూ జంతు సంరక్షణ కార్యకర్తలు పెటా ఆధ్వర్యంలో ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు.‘‘ముంబైలోని మూడు అతిపెద్ద ఆసుపత్రుల డేటా ప్రకారం, గత ఏడాదిలో వచ్చిన శ్వాసకోశ అనారోగ్య కేసుల్లో కేవలం 0.3% మాత్రమే పావురాలతో ముడిపడి ఉన్నాయి. అంతర్జాతీయ పరిశోధన కూడా పావురాల నుంచి మానవులకు వ్యాధి వ్యాప్తి చెందే ప్రమాదం చాలా తక్కువగా ఉందని తేల్చింది. పావురాలు సహజంగా బర్డ్ ఫ్లూకు నిరోధకతను కలిగి ఉంటాయి’’ అని పెటా వాదిస్తోంది. అంతేకాకుండా ప్రభుత్వాలకు పలు సూచనలు కూడా చేస్తోంది. కబుతర్ ఖానా దగ్గర నిర్దిష్ట దాణా సమయాలు కేంద్రాలను నియమించడం, ఈ ప్రదేశాలను క్రమం తప్పకుండా శుభ్రపరచడం పారిశుధ్యాన్ని నిర్వహించడం సరైన దాణా పద్ధతులు పావురాల వల్ల కలిగే కనీస ఆరోగ్య ప్రమాదాలపై ప్రజలకు అవగాహన కల్పించే బహుభాషా సందేశాలను ఇన్స్టాల్ చేయడం వంటివి చేయాలని సూచిస్తోంది.‘పావురాలు లేకుండా ముంబై ఆకాశం ఎలా ఉంటుంది? దాణా నిషేధాలతో, ఈ సున్నితమైన పక్షులు ఆకలి బారిన పడతాయి. ‘ప్రతి ఒక్కరూ పావురాలు కూడా నగరవాసులే అంటూ గుర్తు చేస్తూ పలువురు ముంబైకర్లు ’పావురాలు’గా మారారు‘ భారీ పావురాల ముసుగులు ధరించి ప్రజలు తమ దైనందిన జీవితాన్ని గడుపుతున్నట్లు చూపించే వీడియోను పెటా షేర్ చేసింది.అయితే ఈ విషయంలో పెటాపై ప్రజల నుంచి ఆగ్రహం వ్యక్తం అయింది. గతంలో ఎన్నడూ ఏ అంశంపైనా రానంతగా ఈ విషయంలో ప్రజలు వ్యతిరేకంగా స్పందిస్తున్నారు. ‘‘ ‘పావురాలు వాటి విసర్జన ద్వారా క్రిప్టోకోకోసిస్, హిస్టోప్లాస్మోసిస్ సిట్టాకోసిస్ వంటి వ్యాధులను వ్యాపింపజేస్తాయి.‘ అంటూ ఒక వ్యక్తి ఆన్లైన్లో ద్వజమెత్తారు. ‘పావురాలు ఎగిరే ఎలుకలుగా అనొచ్చు. అవి తక్కువ సంఖ్యలో ఉంటే పెద్దగా ప్రభావం చూపకపోవచ్చు. కానీ సమూహాలుగా ఉంటే, నగర నివాసితుల ఆరోగ్యంపై (శ్వాసకోశ సమస్యలు, వ్యాధి వ్యాప్తి మొదలైనవి) చాలా హానికరమైన ప్రభావాన్ని చూపుతుంది. మీరు భారతీయుల ఆరోగ్యం గురించి పట్టించుకోండి అంటూ మరో వ్యక్తి సూచించాడు. ‘ఈ జంతు హక్కుల కార్యకర్తలు దేశం గురించి ఎప్పుడూ ఆలోచించరు. పావురాల మలం మానవ ఆరోగ్యానికి ప్రమాదకరం. కుక్కలు పావురాలు దేశానికి అతిపెద్ద ముప్పు. రాబోయే సంవత్సరాల్లో వాటి జనాభాను తగ్గించాలి అంటూ మరొకరు తీవ్రంగా దుయ్యబట్టారు. -
రుమటాయిడ్ ఆర్థరైటిస్ను ముందుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?
వయసు నలభై దాటితే చాలు..మనలో చాలామంది కీళ్లనొప్పులంటూ ఉంటారు. వీరిలో చాలామంది రుమటాయిడ్ ఆర్థరైటిస్ (Rheumatoid Arthritis) తో బాధపడుతూంటారు. వయసుతో సంబంధం లేకుండా వచ్చే సమస్య ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్. హానికారక సూక్ష్మజీవులేవీ శరీరంలోకి చొరబడకుండా కాపుకాసే రోగ నిరోధక వ్యవస్థే కొన్ని పరిస్థితుల్లో శరీర కణజాలంపైనే దాడులు చేయడం దీనికి కారణం. అందుకే రుమటాయిడ్ ఆర్థరైటిస్ను ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అని పిలుస్తూంటారు. ఇందులో రోగ నిరోధక వ్యవస్థ మీ కీళ్ల మృదువైన లైనింగ్ను సజావుగా కదిలేలా చేసే సైనోవియంపై కేంద్రీకృతమై ఉంటుంది. దేశంలో 2021 నాటికే దాదాపు కోటి ముప్ఫై లక్షల మంది ఈ సమస్యతో బాధపడుతున్నట్లు అంచనాలున్నాయి. అయితే చాలా వ్యాధుల మాదిరిగానే రుమటాయిడ్ ఆర్థరైటిస్ను కూడా వీలైనంత ముందుగా గుర్తిస్తే మెరుగైన చికిత్స అందించవచ్చునని, నొప్పి, ఇతరత్రా బాధలూ తక్కువగా ఉంటాయని అంటున్నారు నిపుణులు. రోగ నిరోధక వ్యవస్థ సైనోవియంపై దాడి చేయడం దీర్ఘకాలం కొనసాగితే కీళ్ల నొప్పి, వాపు, స్టిఫ్నెస్ పెరుగుతుంది. కాలక్రమేణా, ఇది మృదులాస్థిని, ఎముకలను దెబ్బ తీస్తుంది. చికిత్స చేయకపోతే ఇతర అవయవాలను కూడా ప్రభావితం చేస్తుంది. తొందరగా గుర్తించి ప్రభావవంతమైన చికిత్స కల్పించకపోతే కీళ్లకు శాశ్వతంగా నష్టం కలిగిస్తుంది. వైకల్యానికి కారణమవుతుంది. భారతదేశంలో, ముఖ్యంగా 30 - 60 ఏళ్ల మధ్య వయస్సు గల మహిళల్లో రుమటాయిడ్ ఆర్థరైటిస్ గురించి మరింత అవగాహన కల్పించాల్సిన అవసరముందని రుమటాలజిస్టులు నిపుణులు, స్పష్టం చేస్తున్నారు. ఈ వయసు మహిళల్లో ఈ వ్యాధి ప్రభావం వేర్వేరుగా ఉంటుంది. అయితే చాలామందికి ఈ విషయం తెలియదు. గుర్తించడం, చికిత్స అందించడం రెండూ తక్కువే. హైదరాబాద్లోని అడ్వాన్స్డ్ రుమటాలజీ సెంటర్లోని సీనియర్ కన్సల్టెంట్ రుమటాలజిస్ట్ డాక్టర్ సర్వ్జీత్ పాల్ మాట్లాడుతూ, ‘‘రుమటాయిడ్ ఆర్థరైటిస్ను వీలైంత ముందుగా గుర్తిస్తే సమస్య మరీ చేయిదాటిపోకుండా నెమ్మదింపజేయవచ్చు. నొప్పి నుంచి ఉపశమనం పొందడంలోనూ ఇది కీలకం. చాలామందిలో ఈ వ్యాధి చిన్నస్థాయిలోనే మొదలవుతుంది. ఉదయాన్నే మీ కీళ్లు 45 నిమిషాల కంటే ఎక్కువ సమయం బిగుసుకుపోయి ఉంటే, వాచిపోయినా, వివరించలేని తక్కువ-స్థాయి జ్వరం, బాగా అలసట వంటి లక్షణాలు కనిపిస్తే రుమటాయిడ్ ఆర్థరైటిస్ కావచ్చుని గుర్తించండి. తక్షణం వైద్య సాయం పొందే ప్రయత్నం చేయండి’’ అని అన్నారు.రుమటాయిడ్ ఆర్థరైటిస్లో శరీరం రెండువైపుల ఉన్న కీళ్లలో సమస్య ఒకేలా ఉంటుంది. ఉదాహరణకు ఒక మణికట్టు నొప్పిగా ఉంటే, రెండోది కూడా తరచూ బాధిస్తుంది. సాధారణంగా చేతులు, కాళ్లలోని చిన్న కీళ్లతో మొదలై కాలక్రమేణా పెద్దవాటికి వ్యాపిస్తుంది. రోజువారి పనులు చేసుకోవడంలోనూ కొంతమందికి కష్టతరం చేస్తుంది. కొంతమందిలో ఒకవైపు మాత్రమే సమస్యలున్నా ఆశ్చర్యపోనవసరం లేదు. ముఖ్యంగా ప్రారంభ దశలలో లేదా తక్కువ కీళ్లపై ప్రభావం ఉన్నప్పుడు... ఉదయం లేదా విశ్రాంతి సమయంలో పరిస్థితి అధ్వాన్నంగా అనిపిస్తుంది. కదలికలతో కొద్దిగా మెరుగుపడవచ్చు కానీ పనులు చేస్తూంటే నొప్పి తిరిగి రావచ్చు తీవ్రం కావచ్చు. అబాట్ ఇండియా మెడికల్ అఫైర్స్ అసోసియేట్ డైరెక్టర్ డాక్టర్ అంకిత్ రాయ్ మాట్లాడుతూ, “రుమటాయిడ్ ఆర్థరైటిస్ కేవలం ‘వృద్ధాప్యంలో వచ్చే’ సమస్య కాదు. రోగాన్ని వీలైనంత వేగంగా గుర్తించడంతోపాటు వ్యాధి పురరోగమనానికి అనుగుణంగా స్థిరమైన, వ్యక్తిగతీకరించిన సంరక్షణ కూడా అవసరం. అబాట్ వద్ద, సకాలంలో జోక్యం, దీర్ఘకాలిక నిర్వహణకు మద్దతు ఇచ్చే సాధనాలతో వైద్యులు, రోగులు ఇద్దరికీ సాధికారత కల్పించడంపై దృష్టి సారించాం’’ అన్నారు.రుమటాయిడ్ ఆర్థరైటిస్ నిర్వహణ సరైన చికిత్సా ప్రణాళికను గుర్తించడంతో ప్రారంభమవుతుంది. సాధారణంగా వైద్యులు బయోలాజిక్స్ను సిఫారసు చేస్తూంటారు. ఇది... కీళ్ల నొప్పి, వాపునకు కారణమయ్యే రోగనిరోధక వ్యవస్థ భాగాలను లక్ష్యంగా చేసుకునే ప్రత్యేక చికిత్స.బయోసిమిలర్లు అనేవి బయోలాజిక్స్ లాగానే పనిచేయడానికి రూపొందించబడిన మందులు. అవి అసలు బయోలాజిక్ లాగానే సురక్షిత, ప్రయోజనాలను అందిస్తాయి, పని చేసే విధానం కూడా అదే విధంగా ఉంటుంది, తక్కువ ఖర్చుతో ఉంటాయి. రుమటాయిడ్ ఆర్థరైటిస్ నిరోధానికి...క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి: ఈత, సైక్లింగ్, నడక లేదా యోగా వంటి క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం నొప్పి, ఉదయం పూట స్టిఫ్నెస్, అలసటను తగ్గించడంలో సహాయపడతాయి. సమతుల ఆహారం: ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు రుమటాయిడ్ ఆర్థరైటిస్తో వచ్చే సమస్యల పురోగతి, ప్రమాదాన్ని తగ్గించడంలో ఉపయోగపడతాయి.ఒత్తిడిని తగ్గించుకోండి: ధ్యానం, యోగా, మైండ్ఫుల్నెస్ వంటి వాటితో రుమటాయిడ్ ఆర్థరైటిస్ రోగులకు ఎంతో మేలు జరుగుతుంది. -
ఈ మూడింటితో పీరియడ్స్ బాధలకు చెక్ : తమన్నాసెలబ్రిటీ ఫిట్నెస్ ట్రైనర్
పీరియడ్స్ సమయంలో వచ్చే నొప్పులు బాధలు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇదొక హార్మోన్ల ఆట. హార్మోన్ల సునామీని తట్టుకోవడం చాలా కష్టం ఈ సమయంలో జరిగే రక్తస్రావం, వచ్చే కడుపునొప్పి, మానసిక ఆందోళన, మూడ్ స్వింగ్స్, అలసట ఒక్కో మహిళను ఒక్కో రీతిలో బాధిస్తుంటాయి. కొంతమంdray ఈ పీరియడ్స్ మేనేజ్మెంట్ చాలా బాధాకరంగా ఉంటుంది. అందుకే ఈసమయంలో కొన్ని రకాల ఆహారాలను తీసుకోవడం వల్ల ఉపశమనం లభిస్తుందంటున్నారు టాలీవుడ్ హీరోయిన్ తమన్నా భాటియా ట్రైనర్, సెలబ్రిటీ ఫిట్నెస్ ట్రైనర్ సిద్ధార్థ సింగ్తాజాగా ఆయన ఋతుస్రావం సమయంలో ప్రయోజనకరంగా ఉండే మూడు ఆహారాలను గురించి తెలియజేశారు. వాటి ప్రయోజనాల గురించి వెల్లడించారు. పీరియడ్స్కు ముందు వచ్చే నీరసాన్ని, మానసిక భావోద్వేగాలను తట్టుకోవాలంటే మూడు రకాల ఆహారాలను చేర్చుకోవాలన్నారు. పీరియడ్స్ తరచుగా స్త్రీలలో అలసట, అసౌకర్యాన్ని కలగజేస్తాయి. ఇందుకోసం ముదురు ఆకుకూరలు, గ్రీక్ యోగర్ట్, డార్క్ చాక్లెట్ తీసుకోవాలన్నారు. ఆకుకూరలుఆకుకూరలు బాడీలో ఐరన్ స్థాయిలను ప్రభావితం చేస్తాయి. శరీరంలో ఐరన్ లేకపోవడం వల్ల అలసట, తలతిరగడం లాంటి లక్షణాలు కన్పిస్తాయి. అందుకే పాలకూర, కాలే వంటి ఆకుకూరలు తీసుకోవాలి. వీటిల్లో ఐరన్, మెగ్నీషియం కాల్షియం సమృద్ధిగ ఉంటాయి.. ఈ పోషకాలు తిమ్మిరిని తగ్గించడంలో సహాయపడతాయి. శక్తిని పెంచుతాయి.చదవండి: వెయిట్ లాస్లో ఈ మూడింటిని నమ్మకండి : రణబీర్ ఫిట్నెస్ కోచ్ వార్నింగ్గ్రీకు యోగర్ట్పెరుగులో ప్రోబయోటిక్స్, కాల్షియం ఉంటాయి. ఇవి PMS లక్షణాలను( పీరియడ్స్కి ముందు బాధలను) తగ్గిస్తాయి. జీర్ణక్రియకు సహాయ పడతాయని సిద్ధార్థ సింగ్ చెప్పారు. వీటిని భోజనంలో చేర్చుకోవడం వల్ల పేగు ఆరోగ్యం,హార్మోన్ల సమతుల్యత రెండింటికీ ప్రయోజనకరంగా ఉంటుంది.డార్క్ చాక్లెట్పీరియడ్స్ సమయంలో డార్క్ చాక్లెట్ తీసుకుంటే ఉపశమనం లభిస్తుంది. డార్క్ చాక్లెట్లో మెగ్నీషియం, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కండరాలను సడలించి మానసిక స్థితిని మెరుగు పరచడానికి సహాయపడుతుంది. ఇది భోజనం తర్వాత గొప్ప డెజర్ట్ కూడా అయితే అతిగా తినకుండా కంట్రోల్లో ఉండాలని సిద్ధార్థ సింగ్ హెచ్చరించారు.ఇదీ చదవండి: 7 సీక్రెట్స్ : ప్రేమించే భార్య, కొంచెం లక్తో సెంచరీ కొట్టేశా! -
వెయిట్ లాస్లో ఈ మూడింటిని నమ్మకండి : రణబీర్ ఫిట్నెస్ కోచ్ వార్నింగ్
లవర్ బాయ్లా ఉండే బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ ఒక్కసారిగా కండలు తిరిగిన దేహంతో కనిపించి ఫ్యాన్స్ సర్ప్రైజ్ చేశాడు. ఫిట్నెస్ కోచ్ శిక్షణలో తీవ్రమైన కసరత్తు చేసి ఫిట్గా కనిపించాడు. అయితేతాజాగా రణబీర్ను తీర్చిదిద్దిన ఫిట్నెస్ కోచ్ శివోహం భట్ వెయిట్ లాస్ పై ఉన్న అపోహలు గురించి ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో వివరించారు. బరువు తగ్గాలంటే కొత్త డైటీమీ అవసరం లేదు... అశాస్త్రీయమైన వాటిని నమ్మకుండా ఉండే చాలు అని హితవు పలికారు. ఫిట్నెస్ ప్రియులను విపరీతంగా ఆకట్టుకుంటున్న ఆ మూడు మిత్స్ ఏంటో చూసేద్దామా మరి.శివోహం భట్ ప్రకారం కడుపు మాడ్చుకోవడం వల్ల బరువు తగ్గుతారు అనుకుంటే పొరపాటే. దీని వల్ల మజిల్స్ బర్స్ అవుతాయి,కానీ కరిగేది కొవ్వు కాదని తేల్చారు. అపోహలను గుర్తించి జాగ్రత్తగా ఉండాలని సూచించారు. దచాలా మంది తక్కువ తినడం, ఎక్కువ పని చేయడం అనేది కొవ్వు తగ్గడానికి కీలకమని భావిస్తారు. దీని వల్ల తీవ్రమైన కేలరీల లోటులోకి వెళ్లిపోతారని శివోహం హెచ్చరించారు.ఆకలి మెటబాలిజాన్ని తగ్గించేస్తుంది (Starving Slows Metabolism) దీనివల్ల వాస్తవానికి ఏమి జరుగుతుంది? బాడీ సర్వైవల్ మోడ్లోకి వెళుతుంది. కొవ్వును కరిగించడానికి బదులుగా శక్తి కోసం కండరాల కణజాలాన్ని విచ్ఛిన్నం చేస్తుంది. దీంతో మెటబాలిజం నెమ్మదిస్తుంది. మజిల్ అనేది మెటబాలిజాన్ని యాక్టివ్గా ఉంచే టిష్యూ. ఇది విశ్రాంతి సమయంలో కూడా కేలరీలను బర్న్ చేస్తుందన్నారు. కాబట్టి ఆకలితో ఉండటం వల్ల, స్కేల్ పడిపోతుంది. శరీరం నీరసించిపోతుంది. అంతిమంగా ఇది తిరిగి మళ్లీ కొవ్వు పేరుకుపోవడానికే దోహదపడుతుంది. అందువల్ల బరువు తగ్గడం అంటే తక్కువ తినడం కాదు సరిగ్గా తినడం అన్నారు.చదవండి: 7 సీక్రెట్స్ : ప్రేమించే భార్య, కొంచెం లక్తో సెంచరీ కొట్టేశా! కార్డియో కేలరీలను బర్న్ చేస్తుందా?కార్డియో చేస్తే ఎక్కువకేలరీలు బర్న్ అవుతాయనుకుంటారు. ఆపివేసిన మరుక్షణం, కేలరీల బర్న్ కూడా ఆగిపోతుందని శివోహామ్ భట్ గుర్తు చేశారు. వెయిట్ ట్రెయినింగ్ భిన్నంగా ఉండాలి. బరువులు ఎత్తినప్పుడు మజిల్స్ దృఢపడతాయి. ఇవి జీవక్రియ రేటును పెంచుతాయి, అంటే నిద్రపోతున్నప్పుడు కూడా. అందుకే అధిక కొవ్వును కరిగించుకోవాలన్నా, సన్నగా మారాలన్న, కార్డియో, వెయిట్ ట్రెయినింగ్ రెండూ ఉండాలని సూచించారు.డిసిప్లీన్ బెస్ట్: డిసిప్లీన్ పవర్ ఫుల్.. మోటివేష్, విల్వపర్ ఇవన్నీ ఒక ట్రాప్. ఇవి లేక చాలామంది ఇబ్బంది పడతారు. ప్రోటీన్-రిచ్ న్యూట్రిషన్, డీప్ రికవరీ (నిద్ర), స్థిరత్వం ఇదే బెస్ట్ ఫార్ములా. ఇవే గేమ్ చేంజర్స్ అన్నారు. అంతేకానీ ఫ్యాట్ బర్నర్స్, డీటాక్స్ టీలు, క్రాష్ డైట్ ఇవన్నీ తాత్కాలిక చిట్కాలు మాత్రమే అని శివోహామ్ భట్ పేర్కొన్నారు. లేనిపోని హైప్ ఇవ్వడం కాకుండా అలవాట్లను పెంపొందించేలా చూస్తాడు ఫిట్నెస్ కోచ్ . అన్ని సమస్యలకు నిబద్ధతే పరిష్కారమని శివోహామ్ తేల్చి చెప్పారు.ఇదీ చదవండి: మొరింగా సాగుతో.. రూ. 40 లక్షల టర్నోవర్ -
ఆయుష్మాన్ భవ.. ! కాలుష్యాన్ని జయిస్తున్న జీవన విధానం..
ఓ వైపు పెరుగుతున్న కాలుష్యం.. కల్తీ ఆహారం.. అనారోగ్య కారకాలు వంటివి మనిషి సగటు జీవన ప్రమాణాలను ఆయుర్దాయాన్ని దెబ్బతీస్తున్నాయి.. మరోవైపు ఆశ్చర్యకరమైన ఫలితాలను అధ్యయనాలు తేటతెల్లం చేస్తున్నాయి. అయితే దీనికీ ఓ లెక్కుందండోయ్..? అదే ఆరోగ్యకరమైన జీవన విధానం.. అందుకు కావాల్సిన సౌకర్యాలు.. ప్రామాణికాలు.. గతంతో పోలిస్తే మెట్రో నగరాల్లో పలు వనరులు కాలుష్యానికి గురైనా.. మరోవైపు ప్రజల్లో పెరిగిన అవగాహన, విజ్ఞానం, వైద్య సౌకర్యాలు వాటిని అధిగమిస్తూ కొత్త అడుగులు వేయిస్తున్నాయి. ఫలితంగా మానవుని ఆయుఃప్రమాణాలు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయని పలు అధ్యయనాలు చెబుతున్నాయి.. హైదరాబాద్తోపాటు దేశంలోని పదికి పైగా ప్రధాన నగరాల్లో వాయు కాలుష్యం, నీటి కాలుష్యం, కల్తీ ఆహారం వంటివి పెరుగుతూనే ఉన్నాయి. ఇది 3 నుంచి 4 శాతం సగటును నమోదు చేసుకుంటున్నాయి. అయితే అదే సమయంలో ఆరోగ్యంపై పెరుగుతున్న అవగాహన సగటున ఆయుర్దాయాన్ని(Life Expectancy)పెంచడానికి దోహదం చేస్తున్నాయని, దీని వల్ల నగరాల్లో జీవన కాలాన్ని సగటున 70 నుంచి 75 సంవత్సరాలకు పెంచిందని లాన్సెట్ ప్లానెటరీ హెల్త్ వంటి అధ్యయనాలు చెబుతున్నాయి. ఇది వాస్తవానికి పూర్తి భిన్నంగా ఉన్నప్పటికీ అధ్యయన ఫలితాలు మాత్రం ఇది వాస్తవమని చెబుతున్నాయి. పూర్తి భిన్నంగా.. మహానగరాలు గాలి, నీరు, ఆహారం, శబ్ద కాలుష్యంతో నిండిపోయాయి. అయినప్పటికీ, గ్రామీణ ప్రాంత ప్రజలతో పోలిస్తే నగర ప్రజల ఆయుః ప్రమాణాలు మెరుగ్గా ఉన్నాయని పరిశోధనలే చెప్పడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. తాజా అధ్యయనాలు పరిశోధకులను, ఆరోగ్య నిపుణులను విస్తుపోయేలా చేస్తున్నాయి. పట్టణాల కంటే మెరుగైన వాతావరణ పరిస్థితులు పల్లెల్లో ఉంటాయనేది అందరికీ తెలిసిన వాస్తవం.. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. అలాంటి ప్రతికూల పరిస్థితులను అధిగమిస్తూ.. ఈ ఫలితాలు ఉండడం నిజంగా ఆశ్చర్యకరమే.. అయితే ఫలితాలు చెప్పే వాస్తవాలను ఓ సారి పరిశీలించాలని నిపుణులు చెబుతున్నారు. దీనికి జీవన ప్రమాణాల్లో పెరుగుతున్న నాణ్యత అవగాహనే కారణమని తెలుస్తోంది. సర్వే చెబుతోన్నదేంటి!? గతేడాది ప్రచురితమైన బీఎమ్సీ పబ్లిక్ హెల్త్ నివేదిక ప్రకారం.. దేశంలో అధిక ఆదాయం ఉన్న నగర ప్రాంతాల ప్రజలు గ్రామీణ ప్రజలకంటే సగటున 7.5 సంవత్సరాలు ఎక్కువ జీవిస్తున్నారని తేలి్చంది. మెరుగైన ఆర్థిక స్థిరత్వం, ఆరోగ్యపై పెరుగుతున్న చైతన్యం, ఆరోగ్య బీమా, మెరుతైన ఆహారం, వ్యాయామం వంటి అంశాలే కారణాలు ఇందుకు కారణాలుగా పరిశోధనలు చెబుతున్నాయి. హైదరాబాద్లో ఐటీ, ఫార్మా, వంటి ఇతర సరీ్వస్ రంగాల ఉద్యోగాలు మధ్యతరగతి ప్రజల జీవన విధానం, ఆలోచనా ధోరణిలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. వీటితోపాటు నగరంలో ప్రభుత్వాలు చేపట్టే ‘క్లీన్ ఎయిర్ ప్లాన్’, ‘హరిత హైదరాబాద్’ వంటి ప్రాజెక్టులు కూడా ఓ ముఖ్య భూమికను పోషిస్తున్నాయని, దీంతో పాటు ప్రజల్లోనూ ఆరోగ్యంపై వ్యక్తిగత శ్రద్ధ పెరిగిందని, వ్యాయామం, నిద్ర, ఆహార నియమాలు మెరుగైన ఫలితాలకు దోహదం చేస్తున్నాయని తెలుస్తోంది. అవగాహన లేమి.. నగరాలతో పోలిస్తే గామీణ ప్రాంతాలు వెనుకబడడానికి అసలు కారణం అవగాహనా లేమి.. మెరుగైన సౌకర్యాలు లేకపోవడం, ఆదాయ వనరులు, వ్యక్తి శుభ్రత ప్రభావం చూపుతున్నాయని తెలిసింది. ఏదైనా అనారోగ్య సమస్య వస్తే.. సరైన అవగాహన లేక, సదుపాయాలు లేక, ఆయా సమస్యలను, ఆరోగ్య పరిస్థితులను సరైన సమయంలో గుర్తించక ప్రాణాపాయ స్థితికి చేరుతున్నారని, పల్లెతో పోలిస్తే వైద్యు సేవలు, డిజిటల్ కన్సల్టేషన్, టెక్నాలజీ, టెలీమెడిసిన్, ఫిట్నెస్ సెంటర్లు, యోగా వంటివి ప్రభావవంతంగా పనిచేస్తున్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి. ప్రజలకు తెలిసిన వాస్తవ కోణం.. పర్యావరణ, కాలుష్య నియంత్రణ బోర్డు తాజా గణాంకాల ప్రకారం హైదరాబద్ నగర గాలిలో నాణ్యత ‘మోస్తరు నుంచి హానికర స్థాయికి’ మధ్యలో ఊగిసలాడిందని తెలిపింది. జలాశయాలైన హిమాయత్సాగర్, ఉస్మాన్సాగర్, ముసీ నది కాలుష్యానికి గురవుతున్నాయని ఎమ్ఏఎన్యూయూ పరిశోధకులు వెల్లడించారు. పారిశ్రామిక వ్యర్థాలు, డ్రైనేజ్ నీరు, రసాయన అవశేషాల వల్ల భూగర్భజలాలు కూడా కలుషితమౌతున్న విషయం తెలిసిందే. ఆహార విషయంలోనూ హానికర రసాయనాలు నగర మార్కెట్లో మితిమీరిన స్థాయిలో ఉన్నాయని ఫుడ్ సేఫ్టీ విభాగం తెలిపింది. వ్యక్తిగత భద్రత ముఖ్యం.. విజ్ఞానం, సాంకేతికత ద్వారా అందే ఫలాలను అందరూ అందుకోగలగాలి. అప్పుడే జీవిత కాలం పెరగడంతో పాటు, ఒక మెరుగైన జీవితాన్ని అనుభవించగలరు. ఇందుకు విద్య, ఆరోగ్యం పట్ల అవగాహన, పరిసరాల–వ్యక్తిగత పరిశుభ్రత వంటివి చాలా ముఖ్యం.! అందుకే కాలుష్యం అధికంగా ఉన్న పట్టణాల కంటే గ్రామాల్లో ఆయుఃప్రమాణాలు తక్కువ.! పట్టణాల్లో కాలుష్యం తగ్గించే ప్రయత్నాలతో పాటు, గ్రామాల్లో కూడా మెరుగైన వైద్య సేవలు అందుబాటులో ఉండేలా చూసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటే, గ్రామ ప్రజల ఆయుర్దాయం ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది. – డా.ప్రతిభా లక్ష్మి, జనరల్ మెడిసిన్ – ప్రొఫెసర్ -
ప్రపంచ ఆరోగ్య వేదికపై ప్రసంగించిన తొలినటి...! ఏం మాట్లాడారంటే..
చలం, అంబేద్కర్ల నుంచి నటి, ఐక్యరాజ్యసమితి పాపులేషన్ ఫండ్ (యూఎన్ఎఫ్పీఏ) జెండర్ ఈక్వాలిటీకి ఈ దేశపు రాయబారి కృతిసనన్ దాకా అందరి మాటా ఒకటే స్త్రీ ఆరోగ్యమే దేశ భవిష్యత్ భాగ్యం అని!నిజానికి మహిళా ఆరోగ్యం, లింగ సమానత్వం గురించి మాట్లాడుకోవడానికి ప్రత్యేక సందర్భం అక్కర్లేదు.. అయినా ఈ ప్రస్తావనకు ప్రత్యేక సందర్భమూ ఉంది. అదే బెర్లిన్ (జర్మనీ)లో జరిగిన వరల్డ్ హెల్త్ సమ్మిట్ 2025. ఇందులో ఆమె మహిళల ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాల్సిన అవసరం గురించి మాట్లాడారు. ఇలా వరల్డ్ హెల్త్ సమ్మిట్లో ప్రసంగించిన తొలి భారతీయ నటిగా కీర్తి గడించారు. ఆ ప్రసంగంలో కీర్తి సనన్ ఏం మాట్లాడారంటే.. ‘మహిళల ఆరోగ్యం నిర్లక్ష్యం చేయాల్సిన లేదా పక్కన పెట్టాల్సిన విషయం కాదు. తక్షణమే దృష్టిపెట్టాల్సిన అత్యంత అవసరమైన అంశం. ఆమె ఆరోగ్యం.. మానవాళి ప్రగతికి, భవిష్యత్కు మూలస్తంభం. అందుకే మహిళా ఆరోగ్యానికి సంబంధించి సుస్థిరమైన పెట్టుబడులు కావాలి. ఆవిష్కరణలు జరగాలి. ఇందుకోసం చేసే ప్రతి ప్రయత్నం అద్భుతమైన ఆర్థిక, సామాజిక మార్పులుగా ప్రతిఫలిస్తుంది. ఏటా ముప్పై కోట్లు ఇన్వెస్ట్ చేస్తే పదమూడు వందల కోట్ల రాబడి కనిపిస్తోంది. అంటే దాదాపు తొమ్మిది రెట్ల లాభం. ఈ ఇన్వెస్ట్మెంట్ నైతికావసరమే కాదు మన మూకుమ్మడి భవిష్యత్కు భరోసా కూడా! ఎందుకంటే మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబాలు, సమాజం.. ఆరోగ్యంగా ఉంటాయి. ఆరోగ్యవంతమైన సమాజం ఆర్థికసుస్థిరతకు చిహ్నం. కానీ ప్రపంచ జనాభాలో సగంగా ఉన్న మహిళల ఆరోగ్యం ఏళ్లుగా నిర్లక్ష్యానికి గురవుతూనే ఉంది. యూఎన్ఎఫ్పీఏ జెండర్ ఈక్వాలిటీ అంబాసిడర్గా చాలా ప్రాంతాలు తిరిగాను. అవన్నీ కూడా బాల్యవివాహాలకు సాక్ష్యంగా కనపడ్డాయి. అమ్మాయిలకు మానసిక ఆరోగ్యం సంగతి అటుంచి కనీసం శారీరక ఆరోగ్య కేంద్రాలు కూడా అందుబాటులో లేని దుస్థితిలో ఉన్నాయి. వీళ్ల జీవితాలు మారాలంటే మహిళల ఆరోగ్యానికి సంబంధించి దృష్టి పెరగాలి. తక్షణమే ఆ దిశగా కార్యాచరణ నిర్ణయాలు జరగాలి’ అన్నారు కృతిసనన్. (చదవండి: 'జోంబీ' డ్రగ్ జిలాజైన్: అచ్చం 'జాంబీ రెడ్డి' మూవీ సీన్ని తలపించేలా..) -
'జోంబీ' డ్రగ్ జిలాజైన్: అచ్చం 'జాంబీ రెడ్డి' మూవీ సీన్ని తలపించేలా..
తేజ సజ్జా, ఆనంది కీలక పాత్రల్లో ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘జాంబిరెడ్డి’ మూవీలో ఎలాగైతే మనుషులు ప్రవర్తిస్తారో అలా బిహేవ్ చేస్తారట ఈ జిలాజిన్ డ్రగ్ తీసుకుంటే. దీన్ని కొందరు మత్తు పదార్థలతో కలపి తీసుకుంటారట. దాంతో మనుషులు అచ్చం జంతువుల మాదిరిగా ప్రవర్తిస్తారట. ఒక్కోసారి మోతాదు ఎక్కువైతే శరీరం కుళ్లిపోయి..ప్రాణాలు కూడా కోల్పోతారట. ఇంతకీ అసలేంటి డ్రగ్..?. అసలు దేని కోసం దీన్ని తయారు చేశారు?, ఏవిధంగా మత్తుపదార్థంగా వినియోగిస్తున్నారు అంటే..ప్రస్తుతం యూఎస్లో ఈ డ్రగ్ సంబంధిత మరణాలు అధికంగా ఉన్నాయి. అక్కడ ఫెంటానిల్ అనే మత్తు మందుని యువకులు సేవిస్తుంటారట. దానిలో 'జోంబీ' అనే జిలాజిన్ డ్రగ్ కలిపి ఇస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. ఇది శరీరంపై పలు దుష్ప్రభావాలు చూపిస్తుంది. ఒకరకంగా చెప్పాలంటే ప్రాణాంతకమైనది కూడా. నిజానికి ఇది జంతువులను సులభంగా అదుపులోకి తెచ్చే మత్తుమందు. దీన్ని పశువైద్య మందుగా ఉపయోగిస్తారు. అలాంటి డ్రగ్ని అక్రమ మాదకద్రవ్యాల్లో కలిపేస్తున్నట్లు నివేదికలు పేర్కొన్నాయి. ముఖ్యంగా ఫెంటానిల్ అనే మత్తు మందులో కలపడం వల్ల దాని దుష్ఫ్రభావం మరింత తీవ్రతరం అవుతుందట. ఇటీవల కాలంలో అందుకు సంబంధించిన మరణాలు అధికమవ్వడంతో వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతేగాదు ప్రస్తుతం దీనికి సంబంధించిన బాధితులను యూఎస్ ఫిలడెల్ఫియాలోని చుట్టుపక్కల ఉన్న ఆస్పత్రుల్లో వారానికి ఒకసారి చూడాల్సి వస్తోందని చెబుతున్నారు వైద్యులు.జిలాజిన్ అంటే ఏమిటి?జిలాజిన్ అనేది శక్తివంతమైన α-2 అడ్రినెర్జిక్ అగోనిస్ట్. దీనిని మొదట 1962లో బేయర్ అనే శాస్త్రవేత్త రక్తపోటు ఔషధంగా సంశ్లేషణ చేశారు. అయితే దీని తీవ్రమైన దుష్ప్రభావాల కారణంగా పశువైద్య కోసం ఉపయోగించడం మొదలుపెట్టారు. తరువాత ఇది 2000ల ప్రారంభంలో ప్యూర్టో రికోలో వీధి ఔషధంగా దుర్వినియోగం అవడం ప్రారంభించి..రాను రాను వ్యసనంగా మారింది. ఈ మందుని ఇంజెక్ట్ చేయగానే..కండరాలు సడలించి, నొప్పిని తగ్గించి వ్యక్తులను ఒక విధమైన మత్తులో జోగేలా చేస్తుందట. సింపుల్గా చెప్పాలంటే నోర్పైన్ ఫ్రైన్ విడుదలను తగ్గించి..ట్రాన్స్ లాంటి స్థితిని ప్రేరేపిస్తుంది. దీని ఫలితంగా జోంబీ లాంటి ప్రభావం ఏర్పడుతుంది. అదేనండి జాంబీ రెడ్డి మూవీలో విధంగా మనుషులు మారిపోతారని మాట. Welcome to Michigan 🥴🥴🥴🥴😂 pic.twitter.com/CfE1vE2fiM— 0HOUR (@0HOUR1__) September 6, 2025 ప్రమాదకరమైన ప్రభావాలు..ఈ డ్రగ్ నెమ్మదిగా హృదయ స్పందన రేటు పడిపోయేలా చేస్తుందట. తర్వాత తక్కువ రక్తపోటు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వంటి వాటిగి కలిగిస్తుంది. రక్తనాళాలను సంకోచించేలా చేసి తీవ్రమైన చర్మగాయాలకు దారితీస్తుందట. దీన్ని ఎక్కడ ఇంజెక్ట్ చేశామో ఆ ప్రాంతంలో రక్తసరఫరా, ఆక్సిజన్ సరఫరా తగ్గిపోతుందట. తద్వారా కణజాలం చనిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు వైద్యులు. ఇది అచ్చం మాంసం తినే బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లను పోలి ఉంటుందట. కొన్ని సందర్భాలలో కణజాల నెక్రోసిస్ కారణంగా అవయవాలు స్వయంచాలకంగా విచ్ఛిన్నమవడం, ఎముకలు బహిర్గతం అవ్వడం జరుగుతుందట. ఈ డ్రగ్ సంబంధిత గాయాలనేవి.. మోతాదు వినియోగం, వ్యక్తి స్థితిని బట్టి మారుతుంటుందట దాని ప్రభావం. ఆ డ్రగ్ ఇంజెక్ట్ అయిన ప్రాంతంలో నరాలకు కోలుకోలేనంత నష్టం ఏర్పుడతుంది కాబట్టి యథాస్థితి రావడం అసాధ్యమని చెబుతున్నారు నిపుణులు. కానీ ఈ వ్యసనం బారినుంచి బయటపడేలా చేసి, సాధారణ జీవితాన్ని అనుభవించేలా మాత్రం చికిత్స అందించగలమని నిపుణులు చెబుతున్నారు. అలా బయటపడి పూర్తి స్థాయిలో కోలుకున్నవాళ్లుకూడా ఉన్నారని చెబుతున్నారు.📍For informational purposes:These chilling scenes are coming out of Philadelphia, USA, linked to the widespread use of a drug called Xylazine.It’s so potent that it’s been described as a drug that “zombifies” humans 😳Could this be the beginning of an apocalypse? pic.twitter.com/r8Uiq2rYCz— ADTed✨ (@Eduo_Prince) September 6, 2025 (చదవండి: తెర వెనుక డాక్టర్ అనస్థీషియా..! వైద్య రంగంలో వారి సేవలు అద్భుతం..) -
చలి పులి వచ్చేస్తోంది..ఆరోగ్యం జాగ్రత్త!
దసరా అయిపోయింది..దీపావళి పండుగ సన్నాహాలు మొదలైపోయాయి. దీపాల పండుగ వచ్చేస్తుందటంట..వణికించే చలి మొదలైపోతుంది. సరదాగా అనిపించినా.. ఈ కాలంలో ఆహారం, ఆరోగ్యం రెండూ జాగ్రత్తగా చూసుకోవాల్సిందే. అంతేగాదు రైతులు కూడా ఈ అధిక చలికారణంగా నష్టాలను చవిచూస్తుంటారు. ఇలాంటి పరిస్థితుల నుంచి సేఫ్గా ఉండాలంటే..మరీ ఏడాది చలి ప్రభావం ఏ రేంజ్లో ఉందో ముందుగానే తెలుసుకుందామా..!.వాతావరణ శాస్త్రవేత్తలు ఈ ఏడాది భారత్ అత్యంత శీతల శీతకాలన్ని చవిచూడనుందని పేర్కొన్నారు. భారత వాతావరణ శాఖ సైతం ఈ ఏడాదిలో సాధారణం కంటే తక్కువ ఉష్ణోగ్రతలు, తరుచుగా చలి గాలులు, భారీ హిమపాతం వంటి ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది. ఈవిధమైన వాతావరణ మార్పు ప్రపంచ వాతావరణ వ్యవస్థలను దెబ్బతీస్తుందని చెబుతున్నారు వాతావరణ నిపుణులు. ఇప్పటికే జమ్ము కాశ్మీర్లోని సింథాన్ వంటి ప్రాంతాలన్నీ మంచుతో కప్పబడి ఉన్నాయి. ఇక ఇండో గంగా మైదానాల్లోకి చొచ్చుకుపోతున్న చల్లని గాలి పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ రాష్ట్రాలను ప్రభావితం చేస్తుందని నిపుణులు అంచనా వేశారు. అలాగే వాతావరణ ఉష్ణోగ్రతలు తరుచుగా మార్పులు చోటుచేసుకుంటాయని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటియోరాలజీలో సీనియర్ క్లైమాటాలజిస్ట్ డాక్టర్ రీతు శర్మ అన్నారు. ఈ ముందస్తు శీతాకాలపు సూచన ముఖ్యంగా వ్యవసాయం, ప్రజారోగ్యం వాటికి సంబంధించి మెరుగైన సంసిద్ధతకు మేల్కొలుపుగా పేర్కొన్నారు. ఈ ఏడాది రైతులకు అధిక శీతగాలుల కారణంగా గోధుమ, ఆవాలు వంటి రబీ పంటలు దెబ్బతినే అవకాశం ఉందన్నారు. అలాగే ఆరోగ్యపరంగా.. శ్వాసకోస వ్యాధులు, ఫ్లూ వ్యాధులు ప్రబలంగా ఉండే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. ప్రస్తుతం భారతదేశం ప్రపంచ ఆహార దినోత్సవాన్ని జరుపుకుంటున్నందున ఈ వాతావరణ మార్పు, ఆహార భద్రత ఒకదానిపై ఒకటి ఎలా ఆధారపుడుతున్నాయో హైలెట్ చేశారు. అలాగే ఈ ముదస్తు వాతావరణ హెచ్చరికతో ఎలాంటి వ్యవసాయానికి పెట్టుబడి పెడితే మంచిదనేది నిర్ణయించొచ్చని ఎఫ్ఏఓ ప్రతినిధి ప్రియామీనన్ అన్నారు. అలాగే చలికాలం సమీపిస్తున్నందున ప్రజలంతా తమ నిత్యావసరాలను అనువైన విధంగా నిల్వ చేసుకోవడం తోపాటు అనారోగ్యం బారినపడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు నిపుణులు.(చదవండి: Success Story: ఆఫీస్ బాయ్ నుంచి సీఈవో రేంజ్కి..! ఏకంగా డిజైన్ దిగ్గజం కాన్వాతో..) -
టీనేజర్ల మానసిక ఆరోగ్యం : స్పెషల్ టూల్స్ ప్రారంభించిన యూట్యూబ్
గూగుల్కు చెందిన వీడియో షేరింగ్ ప్లాట్ ఫాం యూ ట్యూబ్ (YouTube) దేశంలో టీనేజర్లకోసం ప్రత్యేకంగా విభాగాన్ని అక్టోబర్ 15న ప్రారంభించింది.మానసిక ఆరోగ్యం, శ్రేయస్సుపై దృష్టి సారించి ప్రత్యేకంగా రూపొందించిన ఆధారాల ఆధారిత కంటెంట్ను ప్రారంభించింది. టీనేజర్ల మానసిక ఆరోగ్యానికి మద్దతు ఇచ్చే లక్ష్యంతో YouTube ఈ ప్రత్యేక వీడియో షెల్ఫ్ను లాంచ్ చేసింది. యువ వినియోగదారుల కోసం సురక్షితమైన సమాచారం అందిచేందుకు చేస్తున్న ప్రయత్నంలో ఇది ఒక ప్రధాన అడుగు అని యూట్యూబ్ ప్రకటించింది.ఇందులో డిప్రెషన్, ఆందోళన, ADHD, ఈటింగ్ డిజార్డరలు, తదితర అంశాలపై సమాచారంతో వీడియోలు ఉంటాయి. ఈ కంటెంట్ను సంబంధిత రంగ నిపుణుల సూచనలతో రూపొందించారు. అమెరికా, యూకే, కెనడా, మెక్సికో, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో త్వరలో అందుబాటులోకి రానుంది. ఎదుగుతున్న దశలో వారికి విశ్వసనీయ సమాచారాన్ని సులభంగా అందించడమే లక్ష్యమని గూగుల్ పేర్కొంది. దీనికి సంబంధించిన సమాచారం ‘షెల్ఫ్ ఆఫ్ ఫిలింస్’ (shelf of films) అందుబాటులో ఉంటుంది. యువతకు మానసిక ఆరోగ్యం, ఆరోగ్యం గురించి సినిమాలు తీయడంలో నేర్పించడంలో ప్రత్యేకత కలిగిన అంతర్జాతీయ సంస్థలతో YouTube పనిచేస్తోంది. అలాగే ఒక వీడియోను ‘షెల్ఫ్ ఆఫ్ ఫిలింస్’లో పొందుపరచాలంటే కంటెంట్ టీనేజర్లను లక్ష్యంగా చేసుకుని, ఆకర్షణీయంగా ఉండాలి.భారతదేశంలో ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు చెందిన అగ్ర మానసిక ఆరోగ్య కేంద్రం, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరోసైన్సెస్ (NIMHANS), నమ్మకమైన మానసిక ఆరోగ్య సలహాల నిమిత్తం"మనోసందేశ్" వీడియో సిరీస్ను రూపొందించింది. ప్రముఖ పరిశోధకులు, పేషెంట్ న్యాయవాదులు మరియు మానసిక ఆరోగ్య నిపుణులు ఈ సిరీస్లో తరచుగా అడిగే సమస్యలకు ప్రతిస్పందిస్తారు. ఉదాహరణకు “నా టీనేజర్తో ఒత్తిడి, ఆందోళన గురించి నేను ఎలా మాట్లాడగలను?” లాంటివి ఉంటాయని తెలిపింది.కౌమారదశలో భావోద్వేగాలు, వాటి ముందస్తు గుర్తింపు , మానసిక ఆరోగ్య సమస్యలకు సకాలంలో మద్దతు ఇస్తే, ఇది వారి ఆరోగ్యంపై శాశ్వతంగా మెరుగైన ప్రభావం చూపుతుందని NIMHANSలో సైకియాట్రీ డైరెక్టర్, సీనియర్ ప్రొఫెసర్ డా. ప్రతిమ మూర్తి తెలిపారు. ఇది యువతకు జ్ఞానం, పోరాట నైపుణ్యాలు, అందుబాటులో ఉన్న సంరక్షణ విధానాల ద్వారా సవాళ్లను అధిగమించేలా,, స్థితిస్థాపకతను పెంపొందించడంలోవారి సామర్థ్యాన్ని బలపరుస్తుందన్నారు. వీటిని వారిలో అవగాహనపెంచిడమే, మానసిక ధైర్యాన్ని పెంచడం తోపాటు, పాఠశాలలు, కుటుంబాలు, సొసైటీలో సురక్షితమైన, సహాయవాతావరణాలను కూడా పెంపొందిస్తాయి. ఈ ప్రయత్నాల ద్వారా తదుపరి తరానికి మానసిక ఆరోగ్య ఫలితాలను మార్చడానికి కేంద్రంగా ఉండాలని భావిస్తున్నామని యూట్యూబ్ ప్రకటించింది. టీనేజర్లు అవసరమైనప్పుడు విశ్వసనీయ సమాచారాన్ని యాక్సెస్ చేస్తూ డిజిటల్ స్పేస్ను సురక్షితంగా, యువవినియోగదారులకు మరింత సహాయంగా మార్చాలనే నిబద్ధతలో ఇది భాగమని యూట్యూబ్ హెల్త్ డైరెక్టర్ మరియు గ్లోబల్ హెడ్ డాక్టర్ గార్త్ గ్రాహం తెలిపారు. -
మానసిక వ్యాధులను మందుల్లేకుండానే నయం చేయొచ్చా?
మా అబ్బాయికి చాలా కాలంగా స్కిజోఫ్రీనియా వ్యాధి ఉంది. హైదరాబాదులో చికిత్స ఇప్పిస్తున్నాము. చాలాసార్లు ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యి కరెంటు ట్రీట్మెంట్ (ఇ.సి.టి.) కూడా ఇప్పించాము. చాలా కాలం నుండి డాక్టర్ ఇచ్చిన క్లోజపిన్ మందులు వాడుతున్నాము. అయితే తను మన అందరి లాగా పూర్తిగా నార్మల్గా ఉండడు. కొన్ని లక్షణాలు అలాగే మిగిలి ఉన్నాయి. పని కూడా ఏమీ చేయడు. ఇలా ఉండగా యూ ట్యూబ్లో ఒక కౌన్సెలర్ ఇంటర్వ్యూ చూసి ఆయనను వ్యక్తిగతంగా కలిసి ఆయన సలహా మేరకు మందులు – ఆపేశాం. మందులు మానేస్తే 3–4 నెలల్లోనే జబ్బును పూర్తిగా నయం చేస్తానన్నాడాయన. అలా చేసిన తర్వాత లక్షణాలు తగ్గకపోగా, మరింత పెరిగాయి. మా అబ్బాయికి చెవిలో మాటలు వినపడుతుండడంతో వాటిని తట్టుకోలేక ఆత్మహత్యకి కూడా ప్రయత్నించాడు. ఇప్పుడు నాకు స్పష్టత రావట్లేదు – మళ్ళీ డాక్టర్ని కలిసి మందులు తీసుకోవాలా? లేక ఆ కౌన్సెలర్ చెప్పినట్టే ఇంకొంత కాలం మందులు లేకుండా కౌన్సిలింగ్ మాత్రమే చేయించాలా? ఏది నమ్మాలి? ఏం చేయాలో కన్ఫ్యూజన్ లో ఉన్నాను. అసలు మందులు లేకుండా మానసిక వ్యాధులను నయం చేయలేరా! – శ్రీనివాసరావు, హైదరాబాద్‘స్కిజోఫ్రీనియా’ అనేది ఒక దీర్ఘకాలిక మానసిక వ్యాధి, కొంతమందిలో లక్షణాలు తగ్గినా, చాలాసార్లు దాన్ని పూర్తిగా నయం చేయడం కష్టం. చాలా సందర్భాల్లో దీర్ఘకాలికంగా మందులు అవసరమవుతాయి. కొన్ని సందర్భాల్లో తీవ్ర లక్షణాలు ఉన్నప్పుడు రోగిని ఆసుపత్రిలో ఉంచి ఇ.సి.టి. థెరపీ వంటి చికిత్సలు కూడా ఇవ్వాల్సి వస్తుంది. తరువాత జబ్బు మళ్లీ పెరగ కుండా మందులను చాలాకాలం కొనసాగించడం అవసరం పడవచ్చు. ఇక మీ అబ్బాయికి వాడినట్లుగా మీరు చెబుతున్న క్లోజపిన్ అనే మందు స్కిజోఫ్రీనియా లక్షణాలు మొండిగా ఉన్నప్పుడు, ఇతర మందులు పని చేయని సందర్భాల్లో వాడే ఔషధం. దీనిని డాక్టర్ పర్యవేక్షణలో సరైన డోసుల్లో వాడితే మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఇది ఆత్మహత్య ఆలోచనలను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. మానసిక సమస్యలకు ఇచ్చే చికిత్సలో రెండు ప్రధాన భాగాలు ఉంటాయి. మెదడులో రసాయన అసమతుల్యతను సరిచేయడానికి కొన్ని మందులు వాడడం అలాగే రోగికి, వారి కుటుంబానికి జబ్బుపై అవగాహన పెంచడం (సైకోఎడ్యుకేషన్), లక్షణాలు తగ్గడం కోసం ‘కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ’ వంటి సైకలాజికల్ ట్రీట్మెంట్, ఈ రెండూ కలిపి తీసుకుంటే మంచి ఫలితాలు సాధ్యమవుతాయి. వైద్యుల సూచన లేకుండా మందులను ఇలా ఆపడం చాలా ప్రమాదం! మందులు ఆపిన తరువాత లక్షణాలు పెరిగి, ఆత్మహత్యా ప్రయత్నం జరగడం చాలా తీవ్రమైన విషయం. అందుకే మళ్లీ మీ సైకియాట్రిస్ట్ను కలిసి పరిస్థితిని వివరించి మందులను ప్రారంభించండి. అలాగే మందులతోపాటు, అవసరమైతే అర్హత కలిగిన (ఆర్.సి.ఐ. లైసెన్స్ పొందిన) క్లినికల్ సైకాలజిస్ట్ వద్ద నుండే సైకోథెరపీ కౌన్సెలింగ్ తీస్కోండి. నేటి కాలంలో యూట్యూబ్, సోషల్ ’మీడియా వేదికల్లో చాలా మంది వైద్యపరమైన అర్హత లేని వ్యక్తులు పెద్ద పెద్ద హామీలు ఇస్తూ కనిపిస్తున్నారు. దీర్ఘకాలిక వ్యాధుల విషయంలో ముఖ్యంగా స్కిజోఫ్రీనియా, బైపోలార్ డిసార్డర్. లాంటి మానసిక వ్యాధుల విషయంలో అలాగే ఆటిజం, ఎ.డి. హెచ్.డి. వంటి న్యూరో డెవలప్మెంట్ సమస్యల – విషయంలో అటువంటి అసంబద్ధమైన మోసపూరిత ప్రకటనలను నమ్మరాదని, వైద్యుల సూచన లేకుండా మందులు నిలిపివేయవద్దని మనవి. జబ్బు లక్షణాలు తగ్గేకొద్దీ, డాక్టర్లే మందుల డోసును క్రమేపీ తగ్గిస్తారు, తప్ప అర్హతలేని వారి సలహామేరకు మందులు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆపరాదు.. చిన్న చిన్న మానసిక వ్యాధుల విషయంలో ఒక్కోసారి మందులు లేకుండా కేవలం కౌన్సెలింగ్ తో సరిచేయవచ్చేమో కానీ, స్కిజోఫ్రీనియా లాంటి తీవ్రమైన మానసిక వ్యాధులకు మందులు తప్పనిసరి! చదవండి: మొరింగా సాగుతో.. రూ. 40 లక్షల టర్నోవర్డా. ఇండ్ల విశాల్ రెడ్డి, సీనియర్ సైకియాట్రిస్ట్, విజయవాడ.మీ సమస్యలు, సందేహాలు పంపవలసిన మెయిల్ ఐడీ: sakshifamily3@gmail.com -
హెయిర్కి బియ్యపిండి మాస్క్ మంచిదేనా..? నిపుణులు ఏమంటున్నారంటే..
ప్రముఖ టెలివిజన్ నటి, దీపికా కాకర్(Dipika Kakar) షోయబ్ ఇబ్రహీంల జంట బాలీవుడ్లో ఎంతో ఫేమస్ తెలిసింది. ఎప్పటికప్పడూ సోషల్ మీడియాలో తమ విషయాలను షేర్ చేస్తూ..తమ అభిమానులను సంతోషపరుస్తూ ఉంటారు. అలానే ఈసారి తమ హెయిర్ సీక్రెట్కి సంబంధించిన వీడియోని పోస్ట్ చేస్తూ..తమ అందమైన కురులు రహస్యం బియ్యపిండి మాస్క్ అని వెల్లడించారు. దీన్ని తమ రెండేళ్ల కుమారుడి జుట్టుకి కూడా అప్లై చేస్తామని, ఇది శిరోజాలకు ఎంతో మంచిదంటూ చెప్పుకొచ్చారు అంతేగాదు ఇందులో ఎలాంటి పదార్థాలు ఉపయోగిస్తారో కూడా వివరించాడు ఆమె భర్త షోయబ్ ఇబ్రహీం. అసలేంటి ఈ ప్యాక్..?, ఇది నిజంగానే హెయిర్కి మంచిదా అనే వాటి గురించి సవివరంగా తెలుసుకుందాం. బియ్యపిండి మాస్క్(Rice Flour mask)లో బియ్య పిండి, అవిసె గింజెలు, కొబ్బరి నూనెల మిశ్రమమే ఈ బియ్యపిండి మాస్క్. ఇది కురులను ఆరోగ్యంగా ఉండేలా చేస్తుందని చెబుతున్నారు దీపికా కకార్ దంపతులు. మరి ఇది హెయిర్కి మంచిదేనా..?, అంత చిన్నపిల్లలకు అప్లై చేయొచ్చా? అంటే..నిపుణులు ఏమంటున్నారంటే..ప్రముఖ నిపుణులు ఇందులో ఉపయోగించే బియ్యపిండి, అవిసె గింజలు, కొబ్బరి నూనె వంటి వన్నీ సహజ పదార్థాలని, వీటిలో పోషకాలు సమృద్ధిగా ఉంటాయని అన్నారు. అయితే పెద్దలకు మంచివైనవి ఎప్పుడూ చిన్నారులకు మంచివి కావనే విషయం గుర్తెరగాలని హెచ్చరిస్తున్నారు నిపుణులు. ఎందుకంటే వారి చర్మం చాలా సున్నితం..అందులోనూ వారి బుర్ర ఇంకా గట్టిపడదు..కాబట్టి అక్కడ చర్మం మరింత మృదువుగా ఉంటుందట. కాబట్టి ఇలాంటి వంటింటి చిట్కాలను అనుసరించే మందు కాస్త కేర్ఫుల్గా ఉండాలన్నారు. జుట్టుకి మంచిదేనా అంటే..బియ్యపిండి జుట్టుని సున్నితంగా ఎక్స్ఫోలియేట్ చేసి అదనపు నూనెలను తొలగిస్తుందట. అలాగే ఇక్కడ అవిసె గింజల్లో ఉండే ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు కురుల ఆకృతిని మెరుగుపరుస్తాయిట. ఇక కొబ్బరి నూనె జుట్టుని తేమగా ఉండేలా చేస్తుందట. కానీ శిశువు చర్మానికి ఇవి అస్సలు పనికిరావనిచెబుతున్నారు. అంతేగాదు బియ్యపిండిలో ఉండే అమైనో ఆమ్లాలు, స్టార్చ్ జుట్టుని బలోపేతం చేసి మెరిసేలా చేస్తాయట. అవిసెగింజల్లోని యాంటీ ఆక్సిడెండ్లు జుట్టుని ఉండలు కట్టకుండా చేస్తుందట. తలపై మంటను తగ్గించి, పెరుగుదలను ప్రేరేపింస్తుందట. పర్యావరణ హానికరమైన ప్రభావాన్ని నుంచి రక్షిస్తుందట. నిజానికి ఈ పదార్థాలన్నీ జుట్టు వేగవంతంగా పెరిగేలా చేయకపోయినా..ఆరోగ్యంగా..మెరుగ్గా ఉండేలా చేస్తాయట. తత్ఫలితంగా జుట్టు పెరుగుదల సులభతరం అవుతుందని చెబుతున్నారు నిపుణులు. అలాగే సహజసిద్ధమైనవన్ని సురక్షితం కాదనే విషయం గమనించాలని అంటున్నారు నిపుణులు. అవన్ని ఇంట్లో పరిశుభ్రమైన పద్ధతిలో తయారైనవే అని నిర్థారించుకోవాలని చెబుతున్నారు. అలాగే శిశువులకు ఉపయోగించాలనుకుంటే మందుగా డెర్మటాలజిస్టులను సంప్రదించాలని సూచించారు.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత నిపుణులు లేదా వైద్యులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: 44 కిలోల బరువు తగ్గిన ఫిట్నెస్ కోచ్..! సరికొత్తగా వెయిట్లాస్ పాఠాలు..) -
44 కిలోల బరువు తగ్గిన ఫిట్నెస్ కోచ్..! సరికొత్తగా వెయిట్లాస్ పాఠాలు..
ఆరోగ్యకరమైన జీవినశైలి బరువు తగ్గడానికి సంబంధించి..తప్పుదారి పట్టించే ఇన్ఫర్మేషన్ కారణంగానే చాలామంది వెయిట్లాస్ కాలేకపోతుంటారని చెబుతున్నాడు ప్రముఖ ఫిట్నెస్ ట్రైనర్ యష్ వర్ధన్ స్వామి. కొందరు విఫల ప్రయత్నం చేసి విసిగిపోయినవాళ్లు కూడా ఉన్నారని అంటున్నాడు. తాను ఒకప్పుడు అధిక బరువు ఉండేవాడనని, ఇప్పుడు వెయిట్లాస్ అయ్యి ఆరోగ్యకరమైన బరువుకి చేరుకున్నాని కూడా చెప్పారు.ఆ మార్పు కొన్ని పాఠాలను నేర్పించిందని, అవి శ్రేయోభిలాషులకు తప్పక ఉపయోగపడతాయాంటూ..తన అనుభవాలను షేర్ చేసుకున్నారు. అంతేగాదు బరువు తగ్గడం అనేది క్రమ శిక్షణ, మనసును కంట్రోల్ చేయడం వంటి అంశాలను తప్పక నేర్పిస్తుందని అంటన్నారు. వాటి కారణంగా బరువు తగడ్డం అనేది ఆధారపడి ఉంటుందట. మరి అదెలా అనేది ఆయన మాటల్లోనే సవివరంగా తెలుసుకుందామా.!.ఫిట్నెస్ ట్రైనర్(Fitness coach) యష్ వర్ధన్ స్వామి(Yash Vardhan Swami) 13ళ్ల క్రితం వరకు అధిక బరువుతో ఉండేవాడనని చెప్పారు. ఆ తర్వాత 44 కిలోలు మేర బరువు తగ్గి విజయవంతమయ్యాక..కొన్ని విషయాలు ప్రస్ఫుటంగా అర్థమయ్యాయన్నారు. తను క్రమంగా బరువు తగ్గుతున్నప్పుడూ సంతరించుకున్న మార్పుని గమనిస్తూ..నేర్చుకున్న వెయిట్లాస్ పాఠాలను గురించి సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. బరువు తగ్గడం అనే శారీరక సవాలు.. మానసిక భావోద్వేగాలను సంబంధించిన అంశమని నొక్కి చెప్పారు. ఇక్కడ ఊబకాయం(Obesity) అనేది కేవలం శరీర సమస్య కాదు, జీవిత సమస్య అని అన్నారు. దీని కారణంగా అన్ని సంబంధాలు కోల్పోతామట. ముఖ్యంగా ఆరోగ్యం, సంపద, సంబధాలపై ప్రభావం చూపి..పూర్తిగా సత్సంబంధాలు దెబ్బతింటాయని చెబుతున్నారు. అలాగే వెయిట్లాస్ జర్నీలో అతి ముఖ్యమైన సవాలు మనసుతో యుద్ధం చేయడమేనని అన్నారు. కొలస్ట్రాల్ తగ్గించుకుంటే బరువు తగ్గుతామని అందరికీ తెలుసు. అది కార్యరూపంలోకి రావాలంటే..మనసు కంట్రోల్లో ఉండాలన్నారు. అప్పుడే మనం వేసుకునే వెయిట్లాస్ ప్లాన్ సక్సెస్ అవ్వగలదు. అది నియమానుసారంగా సాగితే..క్రమశిక్షణ, నిబద్ధత అలవడుతుందట. ఎప్పుడైతే మనలో ఇలాంటి మార్పులు చోటుచేసుకుంటాయో అప్పుడూ కుటుంబసభ్యులు, స్నేహితుల నుంచి ఆటోమేటిగ్గా మద్దతు లభించడమే కాదు..మనకో ప్రాముఖ్యత ఏర్పడేలా మన రూపురేఖల్లో మార్పులు సంతరించుకుంటాయని చెప్పుకొచ్చారు. అలాగే ఇంకొక విషయం తప్పక గుర్తించుకోండి అంటూ..ఊబకాయం ఏమి రాత్రికి రాత్రికి మన జీవితాన్ని నాశనం చేయదని చెప్పారు. మన ఆహారపు అలవాట్లతో రోజువారిగా నెమ్మదిగా మన సౌందర్యాన్ని దెబ్బతీసేలా బరువు పెరుగుతుంటామని అన్నారు. అందుకే ఎదుట వ్యక్తులకు శారీరక పరంగా మనపట్ల ఉన్న అభిప్రాయాన్ని లైట్ తీసుకోవద్దని అని సూచిస్తున్నారు. అప్పుడే లోపాన్ని సరిచేసుకునే యత్నం చేసి..బరువు తగ్గేందుకు ట్రై చేస్తామని అన్నారు. అందుకు మనసు తోపాటు డెడికేషన్ అనేది అత్యంత ప్రధానమని గ్రహించమని సూచించారు ఫిట్నెస్ కోచ్ యష్ వర్ధన్ స్వామి. View this post on Instagram A post shared by Yash Vardhan Swami (@trainedbyyvs) (చదవండి: పేదరికాన్ని జయించేశా.. ఎట్టకేలకు అమ్మ కోసం ఇల్లు కట్టేశా..!) -
45 కిలోలకు పైగా వెయిట్లాస్..బెల్లీ ఫ్యాట్ దెబ్బకి కరిగింది!
బరువు తగ్గడం అనేది ఆరోగ్యకరమైన ఆహారం, వ్యాయామాల కలయికతోనే సాధ్యం.అందులోనూ గుట్టలా పేరుకుపోయిన బెల్లీ ఫ్యాట్ వదిలించుకోవడం అంత సులువు. కొంత సమయం దాటిన తరువాత అంది మొండిగా మారిపోతుంది. ఒక పట్టాన కరగదు. అందుకు ప్రత్యేక వ్యాయామాలు చేయాల్సిందే. ఒక మహిళ అయిదు కోర్ వ్యాయామాల ద్వారా బెల్లీ ఫ్యాట్ను తగ్గించుకుంది. దాదాపు 45 కిలోలకు పైగా తగ్గింది. ఈ విషయాన్ని ఇన్స్టాగ్రాంలో షేర్ చేసింది. వెయిట్ లాస్ జర్నీ గురించి తన ఫాలోయర్లతో నిరంతరం షేర్ చేసే ఫెర్నాండా ఇటీవల తన అదనపు కిలోలను తగ్గించుకోవడానికి సహాయపడిన కొన్ని ఉత్తమ వ్యాయామాల గురించి చెప్పు కొచ్చింది. అవేంటో చూద్దాండంబెల్ రష్యన్ ట్విస్ట్బెల్లీ ఫ్యాట్ తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తున్న వారికి రష్యన్ ట్విస్ట్ బెస్ట్ ఆప్షన్ అని తెలిపింది.దీనికి కోర్ కండరాలు ( వెన్నెముక, కటి, దర కండరాలు,దిగువ వీపు,డయాఫ్రాగమ్) భుజం బలాన్ని పెంచడంలో సహాయపడుతుంది. మంచి ఫలితాలకోసం 3 సెట్లు 25 సార్లు చేసిందిఫెర్నాండా .ఎలా చేయాలి? : నేలపై 'V' షేప్లో మోకాళ్లను వంచి, భుజాలు స్థిరంగా ఉండేలా కూర్చోండి. వీపును నిటారుగా ఉంచి రెండు చేతులతో మీ ఛాతీ వద్ద డంబెల్ను పట్టుకుని, నడుమును నెమ్మదిగా ఎడమ నుండి కుడికి తిప్పాలి. దీన్ని రెండు వైపులా రిపీట్ చేయాలి. లెగ్ రైజ్: పొత్తికడుపు, దిగువ ఉదర కండరాలను బలోపేతం చేయడానికి ఇది చాలా బాగ పనిచేస్తుంది లెగ్ రైజ్ ఎక్స్ర్సైజ్ 3 సెట్లు పది సార్లు చేసేదట. నేలపై సమాంతరంగా పడుకుని కాళ్లను పైకి లేపడం. ఇలా చేసేటపుడు, పొత్తికడుపుపై ఒత్తిడిపెంచుతు మోకాళ్లను వంచకుండా చేయాలి. దీని పొత్తికడుపు కొవ్వు కరుగుతుంది. దీన్ని చాలా రకాలుగా చేయవచ్చుఆల్టర్నేటింగ్ లెగ్ రైజెస్వెయిట్లాస్లో ఇది మరో మంచివ్యాయామం. ఇది పొట్ట కొవ్వును బాగా కరిగిస్తుంది. నేలపై పడుకుని, ఒక కాలు తరువాత మరో కాలు నిటారుగా పైకి లేపుతూ చేయాలి.బాడీని నిటారుగా నేలపై ఉంచి, ముంజేతులపై ప్లాంక్ పొజిషన్లో ఉండాలి.ఒక కాలును పైకి లేపి. ఒక సెకను పాటు పట్టుకుని, నెమ్మదిగా కిందకు దించాలి.మరొక కాలుతో దీన్ని రిపీట్ చేయాలి.లెగ్ రైజ్ హోల్డ్: వెల్లకిలా పడుకుని, కాళ్ళు నిటారుగా చాపి, చేతులు పక్కన ఉంచే వ్యాయామం.నేలపై పడుకుని కాళ్ళను నేల నుండి 45 డిగ్రీల కోణంలో పైకి లేపి, కొద్దిసేపు పట్టుకుని ఉండాలి, ఆపై నెమ్మదిగా కిందికి దించాలి.డంబెల్ హాఫ్ క్రంచ్ : నేల మీద పడుకొని, మోకాళ్లను వంచి, పాదాలను నేలపై ఉంచి రెండు చేతులతో సౌకర్యవంతంగా డంబెల్ పట్టుకోవాలి. డంబెల్తోపాటు బాడీని పైకి ఎత్తేటప్పుడు శ్వాస వదులుతూ, పైకి లేపి కొద్దిసేపు హోల్డ్ చేసి, నెమ్మదిగా యథాస్థానానికి రావాలి. ఇది పొట్ట దగ్గర కొవ్వును కరిగించి, కండరాలను దృడం చేస్తుంది. ఈ వ్యాయామాలతో పాటు, లోఫ్యాట్ డైట్ను పాటిస్తూ 45 కిలోలకు పైగా బరువు తగ్గింది. View this post on Instagram A post shared by Fernanda (@fernandadidit)నోట్ : ఫెర్నాండా విషయంలో వ్యాయామాలు,ఆహారం అద్భుతాలు చేసినప్పటికీ. మన బాడీకి ఏది కరెక్ట్ అది నిర్ధారించుకోవాలి. ఎలాంటి ఆహారం తీసుకోవాలి,ఎన్ని కేలరీలు అవసరం, ఎలాంటి వ్యాయామం చేయాలి అనే నిర్ణయం తీసుకునే ముందు నిపుణుల సలహా తీసుకోవాలి. -
ప్రాణాలు నిలిపే అదృష్టం ఊరికే రాదు!
World Anaesthesia Day 2025 అదృష్టం ఊరికే రాదు. ఎవరైనా దాన్ని అందుకోవడానికి సిద్ధంగా ఉంటేనే అంది వస్తుంది. ఒక ప్రాణం కాపాడటం అలాంటి అదృష్టమే. దానికి వైద్యుడే కానక్కర లేదు. కొద్దిపాటి అవగాహన, కొంచెం శిక్షణ దొరికితే ప్రతీ పౌరుడూ ప్రాణం నిలపగలడు. మొదట నా సొంత అనుభవానికి వద్దాం. వైద్యునిగా, ప్రత్యేకించి అనస్థీషియా (మత్తువైద్యం) నిపుణుడిగా ఎవరికైనా అరు దుగా దక్కే అదృష్టం నాకు దక్కింది. అదేమిటంటే నా చేతిలో నా తండ్రి ప్రాణం తిరిగి రావడం! నేను 2001లో ఎంపీగా ఉన్న రోజుల్లో ఒక అధికారిక పర్యటనలో ఉండగా మా పల్లెటూరు పాలికవలసనుండి ఫోన్ వచ్చింది... నాన్నకు బాగులేదని. పార్వతీపురం నుండి ఆ ఊరు నలభై కిలోమీటర్లు. అప్పటికే నాన్న బీపీ పేషెంట్ కనుక ఎందుకైనా మంచిదని అత్యవసర మందులు పట్టుకుని బయలుదేరాను. ఇంటికి చేరి మూడు నిమిషాలు అయిందో లేదో నాన్నకు గుండె, ఊపిరి ఆగి పోయాయి (కార్డియాక్ అరెస్ట్). వెంటనే ఆయన్ని సరైన పొజిషన్లో ఉంచి నోటితో శ్వాస అందిస్తూ, గుండెపై బలంగా నొక్కుతూ అత్యవసర ప్రక్రియ చేపట్టాను. కాసేపటికి ఆయన గుండె కొట్టుకోవడం, ఊపిరి తీసుకోవడం మళ్లీ మొదలైంది. గండం గట్టెక్కింది. మిగతా వైద్యం కోసం హాస్పిటల్కు తక్షణం పంపే ఏర్పాట్లు చేశాను. ఇదంతా ప్రత్యక్షంగా చూస్తున్న గ్రామీణులకే కాదు, బాగా చదువుకున్న అనుచరులకు, సెక్యూరిటీ సిబ్బందికి కూడా వింత. నాకు పట్టరాని ఆనందం. తలుచుకుంటే ఇప్పటికీ అంతే ఆనందం.చదవండి: ఫ్యామిలీ కోసం కార్పొరేట్ జీతాన్ని వదులుకుని రిస్క్ చేస్తే..!గుండె, ఊపిరి ఆగిపోయిన క్షణాల్లో అందించే ప్రాథమిక అత్యవసర ప్రక్రియ (కార్డియో పల్మనరీ రిససిటేషన్) క్లిష్టమైన ప్రక్రియ కాదు. ఎవరైనా నేర్చుకోగలరు. గతంలో అది వైద్యులకే పరిమితమైన విద్య. ఇప్పుడుఅందరూ నేర్చుకోవాల్సిన ప్రాథమిక నైపుణ్యం. ఎందుకంటే ఆ మొదటి క్షణాల్లో అందించే వైద్య సహాయం ద్వారా ఎన్నో ప్రాణాలు కాపాడగలం. రోగిని గట్టి బల్లపై లేదా రోడ్డుపై పడుకోబెట్టడం, ఛాతీపై తగు బలంతో నిమి షానికి 100 సార్లు చేతులతో ఒత్తిడి ఇవ్వడం, అభ్యంతరం లేకపోతే నోటికి నోటి ద్వారా శ్వాస అందించడం లాంటి వాటితో ఒక ప్రాణాన్ని తిరిగి తీసుకు రావచ్చు. ఈ నైపుణ్యాలపై విద్యార్థుల్లో, పౌరులందరిలో అవగాహన కల్పించాలి. ప్రస్తుతం ఈ దిశగా జరుగుతున్న కృషి ప్రాథమిక స్థాయిలో ఉంది. ప్రభుత్వం, పౌర సమాజం దృష్టి పెడితే ప్రజారోగ్య కోణంలో సమాజానికి చాలా మేలు జరుగుతుంది.– డా.డి.వి.జి. శంకరరావు మాజీ ఎంపీ(అక్టోబర్ 15.. ప్రపంచ అనస్థీషియా దినోత్సవం) -
‘అపోలో’ వేదికగా అంతర్జాతీయ ఆరోగ్య సంభాషణ 2026
హైదరాబాద్]: రోగుల భద్రత, ఆరోగ్య సంరక్షణలో కొత్త ఆవిష్కరణలు, వ్యవస్థల అభివృద్ధిని ప్రోత్సహించే ప్రపంచంలోని ప్రముఖమైన వేదికల్లో ఒకటైన అంతర్జాతీయ ఆరోగ్య సంభాషణ (International Health Dialogue - IHD) 2026 ఎడిషన్ను అపోలో హాస్పిటల్స్ నిర్వహించనుంది. ఈ సదస్సు 2026 జనవరి 30 మరియు 31 తేదీలలో హైదరాబాద్లో జరగనుంది. ఐహెచ్డీ 2026 థీమ్ 'గ్లోబల్ వాయిసెస్ వన్ విజన్’ ఈ థీమ్ ఒక ఉమ్మడి లక్ష్యం పట్ల ఉన్న నిబద్ధతను తెలియజేస్తుంది. ఆ లక్ష్యం ఏంటంటే.. పటిష్టంగా, రోగి-కేంద్రీకృతంగా, సాంకేతికతతో కూడిన ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలను నిర్మించడం. ఈ లక్ష్యాన్ని సాధించడానికి, ప్రపంచం నలుమూలల నుండి వచ్చే ఆలోచనలు, ఆవిష్కరణలు, నాయకత్వాన్ని ఒకే వేదికపైకి తీసుకురావాలని ఈ సదస్సు భావిస్తోంది. ఈ కార్యక్రమం ప్రధానంగా మూడు కీలక అంశాలపై దృష్టి సారిస్తుంది. అవి: నాయకత్వంతో నడిచే భద్రతా నమూనాలు; మానవ-కేంద్రీకృత రూపకల్పన, డిజిటల్ పరివర్తన; అలాగే ఆసుపత్రి కార్యకలాపాలు, రోగి అనుభవం, చికిత్స ఫలితాలు వంటి అన్ని రంగాలలో అత్యుత్తమ ప్రమాణాలు సాధించే అంశాలపై సదస్సు దృష్టి పెడుతోంది.అపోలో హాస్పిటల్స్ గ్రూప్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ డా. సంగీత రెడ్డి మాట్లాడుతూ, “ఎన్నో ఏళ్లుగా అంతర్జాతీయ ఆరోగ్య సంభాషణ (IHD) ఒక శక్తివంతమైన ప్రపంచ వేదికగా మారింది. ఇక్కడ వైద్యులు (క్లినిషియన్లు), కొత్త ఆవిష్కరణలు చేసేవారు (ఇన్నోవేటర్లు), విధానాలు రూపొందించేవారు, ఆరోగ్య సంరక్షణపై అవగాహన పెంచేవారు అంతా ఒకచోట చేరి, ఆరోగ్య సంరక్షణ భవిష్యత్తును రూపొందిస్తున్నారు. హైదరాబాద్లో జరిగే ఈ సమావేశం కూడా అదే లక్ష్యంతో ముందుకు సాగుతుంది’ అని అన్నారు. -
ఆ టైంలో హెల్ప్ అడగడం తప్పుకాదు, మీకోసం మీరు ఏడ్వండి : సారా
వృత్తి జీవితంలో ఆందోళన, ఒత్తిడి మానసిక ఆరోగ్యాన్ని (Mental Health) ప్రభావితం చేస్తుంది. ఇది మొత్తం ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. అందుకే మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి గతంలో అనేకసార్లు చెప్పిన బాలీవుడ్ నటి సారా అలీ ఖాన్ ( Sara Ali Khan) మరోసారి మానసిక ఆరోగ్య సమస్యల గురించి, ఒత్తిడి, చికిత్స లాంటి విషయాలను గురించి మాట్లాడింది. మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా సులభం. అని చెప్పిన సారా మానసికంగా ఒత్తిడిలో ఉన్నపుడు సాయం అడగడంలో తప్పు లేదనీ, అది బలహీనతగా భావించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. అంతేకాదు ఆ సమయంలో మీరు చేయాల్సిందల్లా ఒక క్షణం ఊపిరి పీల్చుకుని, మీకు మీరే భారం తీరే దాకా ఏడ్చేయాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.ట్రోలింగ్, మానసిక ఆరోగ్యంపై దాని ప్రభావంపై గతంలో తన అభిప్రాయాన్ని వెల్లడించిన సారా అలీ ఖాన్ వృత్తి జీవితంలో ఒత్తిళ్లపై తాజాగా మరో ఇంటర్వ్యూలోతన అభిప్రాయాలను అనుభవాన్ని షేర్ చేసింది. మానసిక ఒత్తిడికి లేదా చికిత్స తీసుకోవడం అంటే బలహీనత కాదు, అది వికాసానికి, స్వీయ అవగాహనకు దోహదపడుతుందని చెప్పింది. బలం అంటే భావోద్వేగాలను అణిచివేయడం కాదు, వాటిని అంగీకరించే ధైర్యం కలిగి ఉండటం అని తాను నమ్ముతానని తెలిపింది. తన కరియర్లో ఒత్తిళ్లు తీవ్రంగా ఉంటాయి బలంగా ఉండటానికి ప్రతీదాన్ని మేనేజ్ చేసుకోవాలని తెలిపింది. అంతేకాదు మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యతపై మాట్లాడుతూ మనస్సును జాగ్రత్తగా చూసుకోవడం ఎంత ముఖ్యమో శరీరాన్ని జాగ్రత్తగా చూసుకోవడం అంతే ముఖ్యమని తనకు అర్థమైందని తెలిపింది.కొన్నిసార్లు ఊపిరి పీల్చుకోవడానికి, మీ శరీరాన్ని కదిలించడానికి, అవసరమైతే ఏడవడానికి లేదా అపరాధ భావన లేకుండా విశ్రాంతి తీసుకోవడానికి సమయం కేటాయించడం అవసరమని సారా పేర్కొంది. నిజంగా ఆ క్షణాలు తన ఫీలింగ్ ఏంటో గ్రహించడంలో సాయపడ్డాయనీ, అనుకున్న దానికంటే బలంగా ఉన్నానని గుర్తు చేశాయని తెలిపింది. వేగాన్ని తగ్గించి, కాస్త నిదానించడం, సహాయం అడగడం అవసరం.. అన్నిసార్లు అన్నీ చేసేయ్యాలని ఏమీ లేదు.. మీరు మీరుగా ఉంటే సరిపోతుందని చెప్పుకొచ్చింది సారా.అలాగే నేటి తరం మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తున్నప్పటికీ, దాని చుట్టూ ఇప్పటికీ కొన్ని అపోహలున్నాయనీ. మానసిక ఆరోగ్యం గురించి మాట్లాడటం, చికిత్స తీసుకోవడం చాలా సాధారణంగా జరగాలని ఆమె అభిలషించారు. మరోవైపు సారా ఒత్తిడికి గురైనప్పుడు తక్షణమే తన ఉత్సాహాన్ని పెంచే మార్గం వైపు మొగ్గు చూపుతుంది. తన మూడ్-లిఫ్టర్లలో డ్యాన్సింగ్ ఒకటని చెప్పింది. అలాగే యోగా పైలేట్స్ కు ప్రాధాన్యత ఇస్తుంది. మరో విధంగా చెప్పాలంటే ఆమెకు నృత్యం కేవలం ఫిట్నెస్ కాదు, అదొక చికిత్స.2018లో కేదార్నాథ్తో తన కెరీర్ను ప్రారంభించిన సారాఅలీ ఖాన్, నట జీవితంలో తానేంటే నిరూపించు కుంటూ ముందుకు సాగుతోంది. బాలీవుడ్ నటులు సైఫ్ అలీ ఖాన్ , అమృతా సింగ్ల కుమార్తె సారా. -
డౌన్స్ సిండ్రోమ్లో ఇన్ని రకాలున్నాయా? చికిత్స ఎలా?
మనిషిలో ఉండాల్సిన 46 (అంటే ఇరవైమూడు జతల) క్రోమోజోములకు బదులుగా... ఒకవేళ ఏదైనా కారణాల వల్ల ఈ సంఖ్య కాస్తా 47కు చేరితే... అప్పుడు ఆ బిడ్డలో కనిపించే రుగ్మత పేరే ‘డౌన్స్ సిండ్రోమ్’. అంటే... ఇందులో 21వ క్రోమోజోము తాలూకు ‘కాపీ’ ఒకటి అదనంగా ఏర్పడుతుంది. ఫలితంగా 46 క్రోమోజోములు కాస్తా 47గా మారి΄ోతాయి. ఇలా జరిగినప్పుడు అలా పుట్టిన పిల్లలకు కొన్ని మానసికమైన లోపాలు కనిపిస్తుంటాయి. ఇంగ్లాండుకు చెందిన ఫిజీషియన్ జాన్ లాంగ్డన్ డౌన్ ఈ కండిషన్ను కనుగొన్నారు. దాంతో ఈ మెడికల్ కండిషన్కు ఆయన పేరిట ‘డౌన్స్’ సిండ్రోమ్గా పేరు పెట్టారు.ఇందులోనూ కొన్ని రకాలు ఉన్నాయి. ఉదాహరణకు డౌన్స్ సిండ్రోమ్లో రకాలు...ట్రైజోమీ: రెండు జతలుగా ఉండాల్సిన 21వ క్రోమోజోమ్కు మరొకటి అదనంగా చేరడం వల్ల కలిగే కండిషన్. డౌన్స్ సిండ్రోమ్తో బాధపడేవారిలో 94 శాతం మందిలో సాధారణంగా ఈ కండిషనే ఉంటుంది. దీన్ని ‘ట్రైజోమీ’ అంటారు. ట్రాన్స్లొకేషన్ : 21వ క్రోమోజోమ్ నుంచి ఒక ముక్క విడివడి అది వేరే క్రోమోజోమ్కు అంటుకోవడాన్ని ట్రాన్స్ లొకేషన్ అంటారు. ఈ తరహా కారణంతో డౌన్స్ సిండ్రోమ్ రావడం మరో 4 శాతం మందిలో కనిపిస్తుంది. మోసోయిజమ్ : ఇది కేవలం 2 శాతం మందిలోనే ఉండే అరుదైన పరిస్థితి. ఇది పై రెండు విధాల కంటే భిన్నంగా ఉంటుంది. డౌన్స్ సిండ్రోమ్ పిల్లల్లో కనిపించే లోపాలు...సాధారణంగా డౌన్స్ సిండ్రోమ్తో పుట్టిన పిల్లల్లో కొన్ని శారీరక, మానసిక లో΄ాలు కనిపిస్తాయి. వాటిలో ముఖ్యమైనవి ఇవి.. కండరాల పటుత్వం తగ్గి పుట్టడం. మెడ వెనక భాగంలో దళసరి చర్మం ఉండటంముక్కు చప్పిడిగా ఉండటం (ఫ్లాటెన్డ్ నోస్), పుర్రెలోని ఎముకల మధ్య ఖాళీలు కాస్త ఎక్కువగా ఉండటంసాధారణంగా మన అరచేతిలో పైన రెండు గీతలు ఉంటాయి. కానీ డౌన్స్ సిండ్రోమ్ ఉన్నవారి అరచేతిలో ఒకటే గీత ఉంటుంది (సిమియన్ క్రీస్)చెవి డొప్పలు (ఇయర్ పిన్నా) చిన్నవిగా ఉండటం నోరు చిన్నదిగా ఉండటం ∙కళ్లు పైవైపునకు తిరిగినట్టుగా ఉండటం చేయి వెడల్పుగా, చేతి వేళ్లు పొట్టిగా ఉండటం కంట్లోని నల్లగుడ్డులో తెల్లమచ్చలు (బ్రష్ఫీల్డ్ స్పాట్స్) ఉండటం. మిగతావారితో పోలిస్తే తల కాస్త తక్కువ సైజులో ఉండటం. చూడగానే తల ఆకృతిలో ఏదో మార్పు (అబ్నార్మాలిటీ) ఉన్నట్లు కనిపించడం. పిల్లలు పెద్దగా ఎత్తు పెరగకపోవడం మానసిక వికాసం కాస్త ఆలస్యంగా జరుగుతుండటం. వీటితో పాటు మరికొన్ని అదనపుఆరోగ్య సమస్యలూఉండవచ్చు. అవి...గుండెకు సంబంధించిన లోపాలు కనిపించవచ్చు. అంటే గుండె గదుల్లో పై గదుల మధ్య గోడలో లోపం (ఏట్రియల్ సెప్టల్ డిఫెక్ట్) గాని, కింది గదుల మధ్య గోడలో లోపం (వెంట్రిక్యులార్ సెప్టల్ డిఫెక్ట్)గాని ఉండేందుకు అవకాశాలెక్కువ. ఈ పిల్లల్లో మతిమరపు ఎక్కువగా కనిపించవచ్చు. కాటరాక్ట్ కంటి సమస్యలు రావడం. జీర్ణకోశ వ్యవస్థలో అడ్డంకులు/సమస్యలు (డియొడినల్ అట్రీసియా) తుంటి ఎముక తన స్థానం నుంచి తొలగిపోవడం (హిప్ డిస్లొకేషన్), మలబద్దకం హైపోథైరాయిడిజమ్ వంటి శారీరక సమస్యలు రావచ్చు. డౌన్స్ సిండ్రోమ్ ఉంటే క్రమం తప్పకుండా చేయించాల్సిన పరీక్షలు...డౌన్స్ సిండ్రోమ్ ఉన్న పిల్లలకు క్రమం తప్పకుండా కొన్ని వైద్య పరీక్షలు చేయిస్తూ ఉండాలి. అవి... చిన్నతనంలో ప్రతి ఏడాదిలో కనీసం ఒకసారి కంటి పరీక్షలు చేయించాలి ప్రతి 6 నుంచి 12 నెలలకు ఒకసారి చెవి పరీక్షలు చేయించాలి. (పిల్లవాడి వయసును బట్టి ఆరు నెలలకొకసారి చేయించాలా లేదా 12 నెలలకు ఒకసారా అన్న వ్యవధిని డాక్టర్లు నిర్ణయిస్తారు) ప్రతి ఆర్నెల్లకోసారి దంతాల పరీక్షలు ∙ప్రతి 3 నుంచి 5 ఏళ్లకు ఒకసారి ఛాతీ, మెడ భాగాన్ని ఎక్స్–రే పరీక్ష తీసి పరీక్షిస్తూ ఉండాలి అమ్మాయిల్లో యుక్త వయసు రాగానే లేదా 21 ఏళ్ల వయసులోగాని పాప్ స్మియర్ పరీక్ష చేయించాలి ప్రతి 12 నెలలకోసారి థైరాయిడ్ పరీక్ష చేయిస్తూ ఉండాలి. ఇదీ చదవండి: Down's syndrome పుట్టకముందే నిర్ధారణఎలా...?ఈ పరీక్షలన్నీ సంయుక్తంగా... డౌన్స్ సిండ్రోమ్ నిర్ధారణ కోసం పైన పేర్కొన్న రక్తపరీక్షలు, అల్ట్రా సౌండ్ పరీక్షలను ఒక పద్దతి ప్రకారం అన్నీ సంయుక్తంగా చేస్తుంటారు. రక్త పరీక్షల్లో రక్తనమూనాలను సేకరించి వాటిలో కొన్ని నిర్దిష్టమైన ప్రొటీన్లను, హార్మోన్లను పరిశీలిస్తారు. ఇలా కొన్ని రకాల ప్రోటీన్లు, హార్మోన్ల మోతాదులు సాధారణ విలువల కంటే ఎక్కువగా ఉంటే.. ఆ మార్కర్స్ను బట్టి అది డౌన్స్ సిండ్రోమ్స్కు సూచికలు కావచ్చంటూ అనుమానిస్తారు. ముందుగా చెప్పినట్లుగా ఇవన్నీ ముందస్తుగా అంచనా తెలిసిందేకు చేసే పరీక్షలు. ఈ పరీక్షలు చాలావరకు కరెక్ట్గానే విషయాన్ని ముందే తెలుపుతాయి. అయితే అతడికి డౌన్స్ సిండ్రోమ్ ఉందన్న విషయం బిడ్డ పుట్టాక మాత్రమే నూరు శాతం తెలుస్తుందని గుర్తుంచుకోవాలి. చికిత్సఇది క్రోమోజోముల తేడా వల్ల వచ్చిన కండిషన్ కావడంతో దీనికి చికిత్స లేదు. అయితే ఇలా పుట్టిన పిల్లలను మామూలు పిల్లల్ల పెంచడానికి ఫిజియోథెరపిస్ట్, భాషను చక్కదిద్దడం, చక్కగా వచ్చేల చేయడానికి సహాయపడే లాంగ్వేజ్/స్పీచ్ థెరపిస్ట్, పెద్దయ్యాక వారు స్వతంత్రంగా బతికేలా తోడ్పడేందుకు ఆక్యుపేషనల్ థెరపిస్ట్లూ, మంచి ఆహారాన్ని అందించేందుకు డైటీషియన్, వినికిడి సమస్యల పరిష్కారానికి ఆడియాలజిస్ట్, కంటి సమస్యలను చక్కదిద్దడానికి ఆఫ్తాల్మాలజిస్ట్, పిల్లల వైద్య నిపుణుడు, గుండె వైద్య నిపుణుల సహాయం... ఇలా ఇంతమంది నిపుణుల సహాయం అవసరమవుతూ ఉంటుంది. డా. శివనారాయణ రెడ్డి వెన్నపూససీనియర్ నియోనేటాలజిస్ట్ – పీడియాట్రీషియన్ నిర్వహణ : యాసీన్ -
లేట్ ప్రెగ్నెన్సీ.. డౌన్స్ సిండ్రోమ్, పుట్టకముందే నిర్ధారణఎలా...?
మహిళల్లో గర్భధారణ ఆలస్యమవుతున్న కొద్దీ పుట్టబోయే బిడ్డలో కొన్ని మానసిక, శారీరక సమస్యలు వచ్చే అవకాశాలూ పెరుగుతూ పోతాయి. ఆరోగ్యకరమైన బిడ్డ కావాలనుకునేవాళ్లు త్వరగా బిడ్డను కనేలా ప్లాన్ చేసుకోవాలి. ఒకవేళ ఉద్యోగరీత్యా లేదా లైఫ్లో సెటిల్ అవ్వడంలో ఆలస్యమైనవాళ్లు... లేట్గా బిడ్డను ప్లాన్ చేసుకోవాలనుకునేవారు... లేదా కారణాలు ఏవైనా లేటు వయసులో గర్భధారణ కోరుకునే పరిస్థితి వచ్చినవాళ్లు కొన్ని రకాల పరీక్షలు చేయించుకోవడం మేలు. లేట్ వయసులో గర్భధారణ జరిగితే ఆ బిడ్డ ‘డౌన్స్ సిండ్రోమ్’ (Down's syndrome)తో పుట్టేందుకు అవకాశాలు ఎక్కువ. అందుకే లేట్ వయసులో గర్భధారణను ప్లాన్ చేసుకున్నవారు... డౌన్స్ సిండ్రోమ్ ముప్పును నివారించుకునేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసే కథనం.ఈ భూమ్మీద పుట్టిన ప్రతి ప్రజాతి (స్పీసీస్)కి చెందిన ప్రతి జీవికీ నిర్దిష్టమైన క్రోమోజోముల సంఖ్య ఉంటుంది. ఆ సంఖ్యను బట్టే ఆ జీవి ఏమిటన్నది నిర్ణయమవుతుంది. మనిషిలోని క్రోమోజోముల సంఖ్య 46. అందుకే ప్రత్యుత్పత్తి జరగడానికి వీలుగా... పురుషుడి వీర్యకణంలో 23, మహిళలోని అండంలో 23 క్రోమోజోములుంటాయి. వీర్యకణం... అండంతో కలిసినప్పుడు ఈ 23 జతలు కలుసుకుని 46 క్రోమోజోములతో కొత్త బిడ్డ పుట్టేలా ప్రకృతి ఏర్పాటు చేస్తుంది. మనిషి విషయంలోలాగే... ప్రతి జీవిలోనూ ఇదే జరుగుతుంది. ఒకవేళ ఏవైనా కారణాల వల్ల ఈ క్రోమోజోముల సంఖ్యలో మార్పు వస్తే...? అది సహజమూ, స్వాభావికమూ కాదు. అలా ఉండవలసిన క్రోమోజోముల కంటే ఎక్కువగానో లేదా తక్కువగానో ఉంటే పుట్టిన బిడ్డలో కొన్ని అసాధారణమైన రుగ్మతలు కనిపిస్తాయి. గర్భధారణ లేట్ అయిన కొద్దీపెరుగుతుండే డౌన్స్ సిండ్రోమ్ రిస్క్! వివాహాన్ని ఆలస్యం చేస్తూ, దానివల్ల గర్భధారణ కూడా ఆలస్యంగా జరగడం వల్ల కలిగే దుష్పరిమాణం ఇది. మహిళ వయసు పెరుగుతూ ఎంత ఆలస్యంగా గర్భధారణ జరుగుతుంటే... డౌన్స్ సిండ్రోమ్ వచ్చే ముప్పు అంతగా పెరుగుతుంది. అందుకే మహిళలు తమ గర్భధారణను 35 ఏళ్లకు ముందుగానే జరిగేలా చూసుకోవడం మేలు. వివాహాన్ని ఆలస్యం చేస్తూ, దానివల్ల గర్భధారణ కూడా ఆలస్యంగా జరగడం వల్ల కలిగే దుష్పరిమాణం ఇది. మహిళ వయసు పెరుగుతూ ఎంత ఆలస్యంగా గర్భధారణ జరుగుతుంటే... డౌన్స్ సిండ్రోమ్ వచ్చే ముప్పు అంతగా పెరుగుతుంది. అందుకే మహిళలు తమ గర్భధారణను 35 ఏళ్లకు ముందుగానే జరిగేలా చూసుకోవడం మేలు. పుట్టకముందే నిర్ధారణఎలా...? వివాహం ఆలస్యంగా చేసుకోవడమో లేదా ఏదైనా కారణాల వల్ల ఆలస్యంగా పిల్లల్ని కనేలా ప్తిన్ చేసుకోవడమో జరిగితే ఆ దంపతులు... పుట్టబోయే చిన్నారిలో డౌన్స్ సిండ్రోమ్ కండిషన్ వచ్చేందుకు అవకాశాలెలా ఉన్నాయనే విషయాన్ని తెలుసుకునేందుకు కొన్ని రకాల పరీక్షలు అందుబాటులో ఉన్నాయి. ఆ పరీక్షల సహాయంతో ముప్పును చాలావరకు ముందుగానే తెలుసుకోవచ్చు. ఇందుకు కొన్ని రకాల పరీక్షలు అందుబాటులో ఉన్నాయి. (అయితే ఈ పరీక్షలు చాలావరకు ఖచ్చితమైన సమాచారాన్నే అందిస్తాయి. కానీ పూర్తి నిర్ధారణ బిడ్డ పుట్టిన తర్వాతే అవుతుందని కాబోయే తల్లిదండ్రులు గుర్తించాలి. స్క్రీనింగ్ పరీక్షలు ఆ పరీక్షలేమిటో చూద్దాం...∙ఈ పరీక్షల్లో చాలా ప్రాచుర్యం ఉన్నది ‘ట్రిపుల్ స్క్రీన్’ అనే పరీక్ష. ఇందులో మూడు రకాలైన పరీక్షలను కలగలిపి ట్రిపుల్ స్క్రీన్ అంటారు. ఈ పరీక్షల్లో రక్తంలోని కొన్ని అంశాల విలువలను మూడుసార్లు పరీక్షించి సరిపోల్చి డౌన్స్ సిండ్రోమ్ వచ్చే అవకాశాన్ని నిర్ధారణ చేస్తారు. ఈ పరీక్షను గర్భవతికి గర్భధారణ జరిగిన 15వ వారం నుంచి 20వ వారం మధ్యలో నిర్వహిస్తారు.∙అల్ట్రాసౌండ్ స్కానింగ్ పరీక్షలు : మిగతా పరీక్షలతో పాటు అల్ట్రా సౌండ్ స్కాన్ చేస్తూ... బిడ్డ ఎదుగుదలలో మార్పులను పరిశీలిస్తుంటారు. ఈ పరీక్ష వల్ల బిడ్డ తాలూకు భౌతికమైన అంశాలు (ఫిజికల్ ఫీచర్స్) ఎలా ఉన్నాయో తెలుస్తాయి. తరచూ స్కాన్ చేయిస్తూ... ఆ స్కాన్ ఫలితాలను డౌన్స్ సిండ్రోమ్ లక్షణాలతో సరి΄ోలుస్తూ తరచూ పరిశీలిస్తూ ఉంటారు. డయాగ్నస్టిక్ పరీక్షలు (నిర్ధారణకోసం) గర్భధారణ జరిగాక 12 నుంచి 20వ వారాల మధ్య సమయంలో గర్భసంచి నుంచి ఉమ్మనీరు తీసి ‘అమ్నియోసెంటైసిస్’ అనే పరీక్షనిర్వహిస్తారు ∙ గర్భధారణ సమయంలోని 8వ వారం నుంచి 12వ వారం వరకు ‘కోరియానిక్ విల్లస్ శాంప్లింగ్’ అనే పరీక్ష చేస్తారు గర్భధారణ సమయంలోని 20వ వారంలో ‘పర్క్యుటేనియస్ అంబిలికల్ బ్లడ్ శాంప్లింగ్’ అనే పరీక్ష చేస్తారు. అలాగే అల్ట్రాసౌండ్ స్కానింగ్లోనూ ఒక ప్రత్యేకమైన స్కానింగ్ పరీక్షను చేస్తారు. ఈ పరీక్షకే ‘న్యూకల్ ట్రాన్స్లుయెన్సీ’ (ఎన్టీ) పరీక్షగా అని పేరు. ఇందులో బిడ్డ మెడ వెనకభాగంలోని చర్మం వెనక ఉన్న ఉమ్మనీటిని పరీక్షిస్తారు. సాధారణంగా డౌన్స్ సిండ్రోమ్ ఉన్న బిడ్డలకు ఈ నీటి మందం ఎక్కువగా ఉంటుంది. దీన్ని బట్టి పుట్టబోయే బిడ్డకు డౌన్స్ సిండ్రోమ్ వచ్చే అవకాశాలను అంచనా వేస్తారు. ఇక కోరియానిక్ విల్లస్ శాంప్లింగ్ (సీవీఎస్) పరీక్ష లేదా ఉమ్మనీటిని తీసి చేసే పరీక్షల ద్వారా గర్భస్త శిశువు దశలోనే పుట్టబోయే బిడ్డకు ఏవైనా ఆరోగ్య సమస్యలున్నాయా అన్న విషయమూ తెలుస్తుంది. డౌన్స్ సిండ్రోమ్ నిర్ధారణ పరీక్షలివి... కోరియానిక్ విల్లస్ శాంప్లింగ్ (సీవీఎస్) : గర్భధారణ జరిగాక 10వ వారంలో బిడ్డ తాలూకు బొడ్డు తాడు నుంచి చిన్న ముక్కను సేకరించి చేసే అల్ట్రా సౌండ్ పరీక్ష ఇది.ఆమ్నియోసెంటైసిస్ : సాధారణంగా గర్భధారణ తర్వాత 15వ వారం నుంచి 22వ వారం వరకు ఈ పరీక్ష చేయవచ్చు. ఇందులో తల్లి గర్భంలోంచి ఇంజెక్షన్ నీడిల్ ద్వారా కొంత ఉమ్మనీటిని సేకరిస్తారు. ఇలా సేకరించడానికి అల్ట్రాసౌండ్ స్కానింగ్ సహాయం తీసుకుంటారు. స్కానించిన్నారిలో డౌన్స్ సిండ్రోమ్ నిర్ధారణ ఇలా... కారణాలు ఏవైనప్పటికీ ఒకవేళ డౌన్స్ సిండ్రోమ్తో పిల్లలు పుడితే ముందుగా వాళ్లలో డౌన్స్ సిండ్రోమ్ నిర్ధారణ కోసం కొన్ని పరీక్షలూ, అలాగే ఆ చిన్నారుల ఆరోగ్యాన్ని కాపాడటం కోసం కొన్ని వైద్య పరీక్షలను క్రమం తప్పకుండా చేయిస్తూ ఉండటం అవసరం. ఒకవేళ అప్పటికే చిన్నారి డౌన్స్ సిండ్రోమ్తో పుడితే : ఒక చిన్నారిలో డౌన్స్ సిండ్రోమ్ ఉందని నిర్ధారణ చేయడానికి క్రోమోజోముల పరీక్షను నిర్వహించాలి. దీనికోసం చిన్నారి నుంచి సేకరించిన రక్తంతో ‘కారియోటైపిక్ క్రోమోజోమల్ స్టడీ’ అనే రక్త పరీక్ష చేయాల్సి ఉంటుంది. ఈ ప్రధాన పరీక్షతో పాటు గుండెలో ఏవైనా లోపాలున్నాయేమొనని తెలుసుకోడానికి ఎకోకార్డియోగ్రామ్ చేయాలి. ఇక ఈసీజీ, ఛాతీ, జీర్ణకోశవ్యవస్థ తాలూకు పరిస్థితిని తెలుసుకోడానికి ఎక్స్–రే పరీక్షలూ చేయించాలి. మహిళల్లో వయసు పెరుగుతున్న కొద్దీ డౌన్స్ సిండ్రోమ్ ముప్పు కూడాఅదే క్రమంలో పెరుగు తుందని పక్కన ఉన్నపట్టిక వల్ల తెలుస్తుంది. డౌన్స్ సిండ్రోమ్ నిర్ధారణ కోసం పైన పేర్కొన్న రక్తపరీక్షలు, అల్ట్రా సౌండ్ పరీక్షలను ఒక పద్దతి ప్రకారం అన్నీ సంయుక్తంగా చేస్తుంటారు. రక్త పరీక్షల్లో రక్తనమూనాలను సేకరించి వాటిలో కొన్ని నిర్దిష్టమైన ప్రొటీన్లను, హార్మోన్లను పరిశీలిస్తారు. ఇలా కొన్ని రకాల ప్రొటీన్లు, హార్మోన్ల మోతాదులు సాధారణ విలువల కంటే ఎక్కువగా ఉంటే.. ఆ మార్కర్స్ను బట్టి అది డౌన్స్ సిండ్రోమ్స్కు సూచికలు కావచ్చంటూ అనుమానిస్తారు. ముందుగా చెప్పినట్లుగా ఇవన్నీ ముందస్తుగా అంచనా తెలిసిందేకు చేసే పరీక్షలు. ఈ పరీక్షలు చాలావరకు కరెక్ట్గానే విషయాన్ని ముందే తెలుపుతాయి. అయితే అతడికి డౌన్స్ సిండ్రోమ్ ఉందన్న విషయం బిడ్డ పుట్టాక మాత్రమే నూరు శాతం తెలుస్తుందని గుర్తుంచుకోవాలి. ఇది క్రోమోజోముల తేడా వల్ల వచ్చిన కండిషన్ కావడంతో దీనికి చికిత్స లేదు. అయితే ఇలా పుట్టిన పిల్లలను మామూలు పిల్లల్ల పెంచడానికి ఫిజియోథెరపిస్ట్, భాషను చక్కదిద్దడం, చక్కగా వచ్చేల చేయడానికి సహాయపడే లాంగ్వేజ్/స్పీచ్ థెరపిస్ట్, పెద్దయ్యాక వారు స్వతంత్రంగా బతికేలా తోడ్పడేందుకు ఆక్యుపేషనల్ థెరపిస్ట్లూ, మంచి ఆహారాన్ని అందించేందుకు డైటీషియన్, వినికిడి సమస్యల పరిష్కారానికి ఆడియాలజిస్ట్, కంటి సమస్యలను చక్కదిద్దడానికి ఆఫ్తాల్మాలజిస్ట్, పిల్లల వైద్య నిపుణుడు, గుండె వైద్య నిపుణుల సహాయం... ఇలా ఇంతమంది నిపుణుల సహాయం అవసరమవుతూ ఉంటుంది. బిడ్డ పుట్టిన తర్వాత బాధపడటం కంటే దంపతులు కొద్దిపాటి జాగ్రత్తలతో, కొన్ని వైద్య పరీక్షల సహాయంతో బిడ్డలో ఇది రాకుండా లేదా వచ్చేందుకు అవకాశమున్న విషయాన్ని తెలుసుకోవాలి. ఒకవేళ అలా డౌన్స్ సిండ్రోమ్తో బిడ్డ పుట్టే అవకాశముందని తెలుసుకున్నప్పుడు డాక్టర్లు, క్రోమోజోమల్ స్పెషలిస్టుల ఆధ్వర్యంలో తప్పక కౌన్సెలింగ్ తీసుకోవాలి. ఇలాంటి సమస్య రాకుండానే ఉండేందుకు వీలైనంతవరకు మహిళలో గర్భధారణ 35 ఏళ్ల కంటే ముందుగానే జరిగేలా ΄్లాన్ చేసుకోవడం, కుటుంబంలో ఎవరికైనా డౌన్స్ సిండ్రోమ్ ఉంటే ఆ విషయాన్ని గర్భధారణకు ముందుగానే డాక్టర్లకు చెప్పి తగిన కౌన్సెలింగ్ తీసుకోవడమన్నది దంపతులు తప్పనిసరిగా చేయాల్సిన పనులు. డా. శివనారాయణ రెడ్డి వెన్నపూససీనియర్ నియోనేటాలజిస్ట్ – పీడియాట్రీషియన్ నిర్వహణ : యాసీన్ -
ప్రెగ్నెన్సీ టైంలో నడుము నొప్పి సాధారణమా? తగ్గాలంటే..
నేను ఆరునెలల గర్భవతిని. కొన్నిరోజులుగా నడుమునొప్పి ఎక్కువగా వస్తోంది. ఎక్కువసేపు నడిచినా, కూర్చున్నా నొప్పి పెరుగుతోంది. ఇది గర్భధారణలో సాధారణమా? లేక ఏమైనా సమస్య ఉందా? దీన్ని తగ్గించడానికి ఏం చేయవచ్చు?– మాలిని, గుంటూరు. గర్భధారణలో నడుమునొప్పి చాలా సాధారణం. ఎక్కువమంది గర్భిణులు ఏదో ఒక దశలో దీనిని అనుభవిస్తారు. బరువు పెరగడం, గర్భాశయం పరిమాణం పెరగడం, హార్మోన్ల ప్రభావం, శరీర ధారణలో మార్పులు, లిగమెంట్లు సడలడం వంటివి దీనికి ప్రధాన కారణాలు. చాలాసేపు ఒకే స్థితిలో కూర్చోవడం లేదా నిలబడడం, వెన్నుకు సరైన ఊతం లేని కుర్చీలో కూర్చోవడం వల్ల నొప్పి మరింత పెరుగుతుంది. గర్భధారణ మొదటి నెలల నుంచే ఈ సమస్య రావచ్చు, అయితే గర్భధారణ కొనసాగుతున్న కొద్దీ ఇది మరింత ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. నడుమునొప్పి తగ్గించుకోవడానికి కొన్ని సాధారణ జాగ్రత్తలు పాటించడం మంచిది. ఎక్కువసేపు కూర్చోవడం లేదా నిలబడడం తగ్గించుకోవాలి. వెన్నుకు ఊతం ఇచ్చే కుర్చీని ఉపయోగించడం, పక్కకు తిరిగి పడుకోవడం, మోకాళ్ల మధ్య దిండు పెట్టుకుని నిద్రించడం ఉపశమనాన్ని ఇస్తాయి. హీల్స్ వాడకూడదు, సౌకర్యవంతమైన షూలు ధరించాలి. ఎక్కువ నీరు తాగడం, శరీరాన్ని హైడ్రేట్గా ఉంచుకోవడం, పాల ఉత్పత్తులు తీసుకోవడం, వైద్యులు సూచించిన కాల్షియం, విటమిన్ సప్లిమెంట్స్ వాడటం అవసరం. ఆకస్మిక నొప్పి ఉన్నప్పుడు వేడి నీటి బ్యాగ్తో మసాజ్ చేయడం, వేడినీటితో స్నానం చేయడం లేదా మృదువుగా తైలమర్దన చేయించుకోవడం ద్వారా ఉపశమనం పొందవచ్చు. పెయిన్ కిల్లర్ వైద్యుల సూచన లేకుండా వాడకూడదు. తగినంత విశ్రాంతితో పాటు నడక, వ్యాయామం, స్ట్రెచింగ్, ప్రెగ్నెన్సీ యోగా వంటి పద్ధతులు కూడా నడుమునొప్పిని తగ్గించడంలో సహాయపడతాయి. కొన్ని సందర్భాల్లో ఫిజియోథెరపిస్ట్ సలహా తీసుకోవడం కూడా మంచిది. ఈ విధంగా జాగ్రత్తలు తీసుకోవడం వల్ల నడుమునొప్పి తగ్గడమే కాకుండా, ప్రసవానికి శరీరం సిద్ధమవుతుంది, ప్రసవానంతర రికవరీ సులభతరం అవుతుంది, అలాగే గర్భిణికి మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది.నేను ఆరు నెలల గర్భిణిని. గర్భధారణ ప్రారంభంలో నా హీమోగ్లోబిన్ 12 గ్రాములు ఉండగా, ఇప్పుడు అది 8 గ్రాములకు పడిపోయింది. నేను ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటున్నప్పటికీ హీమోగ్లోబిన్ తగ్గిపోయింది. డాక్టర్ మరిన్ని పరీక్షలు చేయమని సూచించారు, అలాగే హీమోగ్లోబిన్ సరిచేయడానికి ఇంజెక్షన్లు అవసరం కావచ్చని చెప్పారు. నా బంధువులు చెబుతున్నది ఏమిటంటే, హీమోగ్లోబిన్ తక్కువగా ఉండటంవల్ల బిడ్డ పెరుగుదలపై ప్రభావం చూపవచ్చని, అలాగే డెలివరీ తర్వాత కోలుకోవడం కష్టమవుతుందని. ఇది నిజమేనా? – సుగుణ, మిరియాలగూడ. గర్భిణులు, ముఖ్యంగా భారతీయ మహిళల్లో రక్తహీనత లేదా హీమోగ్లోబిన్ తక్కువగా ఉండటం చాలా సాధారణమైన సమస్య. గర్భధారణ సమయంలో రక్తపరిమాణం పెరగడం వలన శరీరానికి ఐరన్ అవసరం ఎక్కువ అవుతుంది, కాని, ఆహారంతో మాత్రమే ఆ అవసరం తీరడం కష్టం. అందువల్ల హీమోగ్లోబిన్ స్థాయులు తగ్గిపోతాయి. కొందరిలో గర్భధారణకు ముందే రక్తహీనత ఉండి, అది గర్భధారణలో మరింత ఎక్కువ అవుతుంది. ఇది సాధారణంగా ఐరన్ లోపం వల్ల జరుగుతుంది, కానీ కొన్నిసార్లు విటమిన్ బీ12 లేదా ఫోలిక్ యాసిడ్ లోపం వల్ల కూడా రావచ్చు. అరుదుగా జన్యు సంబంధిత వ్యాధులు, ఉదాహరణకు థలసీమియా, సికిల్ సెల్ వ్యాధులు వంటి కారణాలు కూడా ఉండవచ్చు. హీమోగ్లోబిన్ తక్కువగా ఉండటం తల్లి, బిడ్డ ఇద్దరికీ సమస్యలు కలిగించే అవకాశం ఉంది. తల్లిలో అలసట, తలతిరగటం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, రోగనిరోధక శక్తి తగ్గిపోవడం వలన ఇన్ఫెక్షన్లు రావడం, ప్రసవ సమయంలో అధిక రక్తస్రావం జరగడం, రక్త మార్పిడి అవసరం కావడం, అలాగే ప్రసవానంతరం రికవరీ ఆలస్యమవడం వంటి సమస్యలు కనిపించవచ్చు. బిడ్డలో పెరుగుదలలో ఆలస్యం, తక్కువ బరువుతో పుట్టడం, కొన్ని సందర్భాల్లో ఐసీయూ అవసరం కావడం వంటి సమస్యలు రావచ్చు. అందువల్ల రక్తహీనతను త్వరగా గుర్తించి చికిత్స చేయడం అత్యంత ముఖ్యం. సాధారణంగా గర్భిణులకు ఐరన్ సప్లిమెంట్లు రెండవ త్రైమాసికం నుంచే ఇవ్వడం ప్రారంభిస్తారు, ఎందుకంటే మొదటి నెలల్లో వాంతులు, మలబద్ధకం వంటి సమస్యలు మరింత పెరగకుండా ఉండటానికి. మాత్రలను విటమిన్ సీ ఎక్కువగా ఉన్న ఆహారాలతో ఉదాహరణకు నిమ్మరసం, నారింజ లాంటివి ఖాళీ కడుపుతో తీసుకుంటే జీర్ణక్రియ మెరుగ్గా ఉంటుంది. మాత్రలు సరిగా పనిచేయకపోతే లేదా తట్టుకోలేకపోతే, ఐరన్ ఇంజెక్షన్లు అవసరం కావచ్చు. ఆహారంలో ఆకుకూరలు, శనగలు, బీన్స్, పప్పులు, కిస్మిస్, ఆప్రికాట్ వంటి డ్రై ఫ్రూట్స్, అలాగే గుడ్లు, చేపలు, కాలేయం, మాంసం వంటి నాన్వెజిటేరియన్ ఆహార పదార్థాలు ఉన్నాయి. వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం ద్వారా గర్భధారణలో ఐరన్ లోపాన్ని చక్కదిద్దుకోవచ్చు. సమయానికి పరీక్షలు చేయించుకోవడం, వైద్యులు సూచించిన జాగ్రత్తలను తీసుకోవడం ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చు. డెలివరీకి ముందే హీమోగ్లోబిన్ స్థాయులు మెరుగుపడితే, మీకూ, మీ బిడ్డకూ ఆరోగ్యకరమైన ఫలితాలు వస్తాయి. (చదవండి: సరైన ప్రశంసలతోనే... జీనియస్ మైండ్ సెట్!) -
చిన్నారులకు ఆస్తమా..! ఇన్హేలర్స్..నో వర్రీస్..
పిల్లల్లో ఆస్తమా వచ్చి వాళ్లు బాధపడుతుంటే చూసేవాళ్లకు ఆ దృశ్యం చాలా హృదయవిదారకంగా ఉంటుంది. అలా ఆయాసపడుతూ ఊపిరి అందని చిన్నారులను చూస్తే చాలా బాధగా ఉంటుంది. అయితే చిన్నవయసులో ఆస్తమా వచ్చిన చిన్నారుల విషయంలో అంతగా ఆందోళన పడాల్సిన అవసరం లేదంటూ డాక్టర్లు భరోసా ఇస్తున్నారు. నిజానికి పిల్లల్లో వచ్చే ఈ ఆరోగ్య సమస్యను ‘రియాక్టివ్ ఎయిర్ వే డిసీజ్’ అంటారు. కానీ సామాన్య జనవాడుకలో దీన్ని ఆస్తమాగా చెబుతుంటారు. చిన్నారుల ఆస్తమా చికిత్సలో అవసరాన్ని బట్టి కొన్ని మందులు నెబ్యులైజేషన్ తర్వాత వారిలో మున్ముందు ఆస్తమా రాకుండా చూసేందుకు డాక్టర్లు రెండు రకాల ఇన్హేలర్స్ సూచిస్తుంటారు. ఇందులో మొదటి రకం ఇన్హేలర్స్ను ‘రిలీవర్స్’ అంటారు. ఇవి తక్షణం ఊపిరి అందేందుకు మొట్టమొదటి చికిత్స (ఫస్ట్ లైన్ ట్రీటెమెంట్) కోసం వాడేవి. ఇవి అటాక్నుంచి రిలీవ్ చేస్తాయి కాబట్టి వీటిని ‘రిలీవర్స్’ అంటారు. ఇవి ఊపిరితిత్తుల్లోకి వెళ్లే గాలిగొట్టాలను వెడల్పుగా విప్పారేలా చేసి పిల్లలు హాయిగా గాలితీసుకునేందుకు ఉపయోగపడతాయి. ఇక ఆస్తమా అటాక్ వచ్చినప్పుడు ఊపిరితిత్తుల్లో కొన్ని ఇన్ఫ్లమేటరీ సెల్స్ పుడతాయి. వీటిని తొలగించడం రిలీవర్స్కు సాధ్యం కాదు. అలాంటి వాటిని తొలగిస్తూ మున్ముందుకు అటాక్ రాకుండా నివారించే ఇన్హేలర్స్ను ‘ప్రివెంటర్స్’ అంటారు. అవి నివారణకు ఉపయోగపడతాయి కాబట్టి వాటిని ప్రివెంటార్స్గా అభివర్ణిస్తారు. ఇలా ఈ రెండు రకాల ఇన్హేలర్స్తో చిన్నారుల ఊపిరితిత్తుల కార్యకలాపాలు వీలైనంత నార్మల్గా పనిచేసేలా డాక్టర్లు చూస్తారు. ఇవి వాడుతూపోతుంటే క్రమంగా ‘రిలీవర్స్’ వాడాల్సిన అవసరం దాదాపుగా పూర్తిగా తగ్గిపోతుంది. పిల్లల్లో వ్యాధి తీవ్రత ఎంతగా ఉందో, దాన్ని అదుపులో ఉంచేందుకు మందుల డోస్లు ఎంతెంత మార్చాలో తెలుసుకోవడం కోసం అవసరమైనప్పుడు డాక్టర్లు ‘పల్మునరీ ఫంక్షన్ టెస్ట్ – పీఎఫ్టీ’ అనే పరీక్ష చేస్తారు. పిల్లలు పెరుగుతున్నకొద్దీ చాలామందిలో అటాక్స్ దాదాపు పూర్తిగా తగ్గిపోవడానికి అవకాశాలు చాలా ఎక్కువ. చాలామంది పిల్లల్లో ఆర్నెల్లలోనే ఆస్తమా పూర్తిగా అదుపులోకి వచ్చేసే అవకాశాలుంటాయి. ఒకసారి ఆస్తమా అదుపులోకి వచ్చాక ఇన్హేలర్స్ దాదాపు నిలిపివేయవచ్చు కూడా. అయితే ఈ ఇన్హేలర్స్కు పిల్లలు అలవాటు పడిపోతారేమోనని కొంతమంది తల్లిదండ్రులు ఆందోళన పడుతుంటారు. ఇది కేవలం అ΄ోహ మాత్రమే. పైగా ఇన్హేలర్స్ ఎంత సురక్షితమంటే నోటి నుంచి తీసుకునే మందులతో పోలిస్తే వాటిలోంచి దేహంలోకి వెళ్లే మందు కేవలం సమస్య ఉన్న చోటికే పరిమితమవుతుంది. దేహమంతటా తన దుష్ప్రభావాలు చూపదు. అందుకే అవి పూర్తిగా సురక్షితమని పేరెంట్స్ నమ్మవచ్చు. (చదవండి: Dental Health: ఓపెన్ యువర్ మౌత్..! నోటి ఆరోగ్యాన్ని కాపాడుకుందాం ఇలా..) -
ఓపెన్ యువర్ మౌత్..! నోటి ఆరోగ్యం కోసం..
నోరు బాగుంటే ఊరు బాగుంటుందని సామెత. ఊరూ... ఊరి వ్యక్తులతో సంబంధాలే కాదు... నోటి పలువరస బాగుంటే, దంతాలకు సంబంధించిన వ్యాధులేమీ లేకపోతే వ్యక్తి చిరునవ్వు, ఇనుమడించిన ముఖపు అందం, మంచి పలువరస కారణంగా చక్కటి ఉచ్చారణ... ఇలా చాలా అంశాలు బాగుంటాయి. నోరూ లేదా దంతాలకు సంబంధించి ఏదైనా సమస్య వస్తే... అప్పటికప్పుడు ఆ సమస్యకు చికిత్స అందించడమన్నది కాకుండా... ఓ పూర్తి స్థాయి చికిత్సను ‘సమగ్రం’గా అందించడం ద్వారా నోటి ఆరోగ్యాన్ని అన్ని విధాలా కాపాడే చికిత్స ప్రక్రియే‘ఫుల్ మౌత్ రీ–హ్యాబిలిటేషన్’. సంక్షిప్తంగా ‘ఎఫ్ఎమ్ఆర్’ అని పిలిచే ఈ చికిత్స ప్రక్రియ గురించి తెలిపేదే ఈ కథనం. నోటిలోని పళ్లకూ, పలువరసకూ అనేక సమస్యలు వస్తూ ఉంటాయి. వయసు పెరుగుతున్న కొద్దీ పళ్లు అరిగి΄ోవడం, కొన్ని విరిగి΄ోవడం, కొన్ని చోట్ల సందులు రావడం వంటివి జరుగుతుండటం మామూలే. దీనికి తోడు కొందరిలో చిగుర్ల సమస్యలూ రావచ్చు. మరికొందరిలో ఒకటో రెండూ పళ్లు ఊడి΄ోవచ్చు. అయితే ఇవన్నీ జరుగుతున్నప్పటికీ తమకు సంబంధించినంతవరకూ ఏ సమస్యా లేక΄ోతే కొందరు దంతవైద్యుడి వద్దకు వెళ్లరు. చికిత్స తీసుకోరు. కారణం... పని నడుస్తోంది కాబట్టి అలా రోజులు వెళ్లదీయడమే పనిగా పెట్టుకుంటారు. కొన్ని సమస్యలు...అలా నోటిలో పళ్లు అరగడం, విరగడం, దంతాలూ ఊడిపోవడం వల్ల సందులు రావడాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల మరికొన్ని సమస్యలు రావచ్చు. ఉదాహరణకు... పలువరసలోని కొన్ని పళ్లు ఊడటం వల్ల దంతాల మధ్య సందులు (గ్యాప్) వచ్చి అక్కడ ఆహారం చిక్కుకుపోయి, అది కుళ్లుతుండటం వల్ల దంతక్షయం మరింత వేగంగా జరగడం. అలా పళ్లు ఊడిన చోట ఆహారం చిక్కుకు΄ోయి కుళ్లుతుండటంతో నోటి దుర్వాసన వస్తుండటం. పళ్లు ఊడిన కారణంగా ముఖం ఆకృతి చెడిపోయి మునపటి కంటే అందవిహీనంగా కనిపించడం. పళ్లు ఊడటం లేదా పలువరసలో సందుల కారణంగా మాట్లాడుతున్నప్పుడు పళ్లసందుల నుంచి గాలిపోతూ ఉచ్చారణ సరిగా లేకపోవడం, దాంతో సరైన కమ్యూనికేషన్ జరగక... ఎదుటివారికి మాట సరిగా అర్థం కాకపోవడం. ఊడినపళ్ల కారణంగా చిరునవ్వు నవ్వేందుకు ఇబ్బంది పడుతూ నలుగురిలో మనస్పూర్తిగా నవ్వలేకపోవడం.ఆరోగ్యపరంగానూ మరికొన్ని నష్టాలు... ఊడిన పళ్ల కారణంగా ఆహారాన్ని సరిగా / పూర్తిగా నమలలేకపోవడం. పలువరసలో వచ్చిన గ్యాప్ కారణంగా పళ్లు ఉన్నచోటి నుంచి పక్కకు కదిలిపోతూ ఉండటం. ఊడిన పళ్ల వల్ల వచ్చిన సందుల కారణంగా పలువరస చెడిపోయి కొరికినప్పుడు పైవరస, కింది వరస పళ్లు సరిగా అమరకపోఒవడం (అలైన్మెంట్ సరిగా జరగకపోవడం). (రెండు దవడలూ కలిసినప్పుడు అవి సరిగా అమరకపోవడం).నములుతున్నప్పుడు కింది దవడ కదిలినప్పుడల్లా క్లిక్ క్లిక్ మంటూ శబ్దం (క్లికింగ్ సౌండ్) రావడం.మానసిక సమస్యలకూ దారితీసే ప్రమాదం... ఇలా పలువరసకు వచ్చే సమస్యలతో కేవలం భౌతికంగా కొన్ని ఆరోగ్యపరమైన సమస్యలు రావడం లుక్స్పరంగా ఇబ్బంది కలగడం మాత్రమే కారణంగా... ఆత్మవిశ్వాసం లోపించడం, చిరునవ్వు నవ్వలేకపోవడంతో కొన్ని సందర్భాల్లో కొందరిలో ఈ సమస్య మానసికమైన రుగ్మతలకూ కారణమయ్యేందుకూ అవకాశాలు లేకపోలేదు. పై ప్రక్రియలన్నింటి సాయంతో కొన్ని కొన్ని సిట్టింగులలో నోటికి అవసరమైన పూర్తిస్థాయి సమగ్రమైన సంయుక్త చికిత్సను ఈ ‘ఫుల్ మౌత్ రీ–హ్యాబిలిటేషన్’లో అందిస్తారు. దాంతో పేషెంట్లకు దంతపరంగా లేదా నోటి ఆరోగ్యపరంగా అవసరమైన అనేక అవసరాలు ఒకే సమగ్రచికిత్సలో తీరి΄ోవడం సాధ్యమవుతుంది.అన్ని రకాల సమస్యలకూ కలిపి ఒక సమగ్ర చికిత్సే ‘ఎఫ్ఎమ్ఆర్’... దంతాల సమస్యలకు చికిత్సలు విడివిడిగా ఉంటాయి. ఉదాహరణకు పళ్లు అరిగినప్పుడు ఫిల్లింగ్ చేయడం లేదా క్యాప్ వేయడం, అలాగే చిగుర్లకు వచ్చే జింజివైటిస్, పెరియోడాంటైస్ వంటి సమస్యలకూ ఇవ్వాల్సిన చికిత్సలూ ఇలా రకరకాల సమస్యలకు నిర్దిష్టంగా చికిత్సలు ఇస్తుంటారు. అయితే అనేక రకాల సమస్యలు ఒకేసారి కనిపించినప్పుడు అనేక చికిత్సలను కలగలిపి ఒకే సమగ్ర చికిత్సగా ఇవ్వడమూ సాధ్యమవుతుంది. ఇందులో అరిగిన / విరిగిన పళ్లకు పైన దంతాన్ని పునర్నిర్మించడం (క్రౌన్స్), పన్నుకూ పన్నుకూ మధ్య మరో పన్ను పోయినప్పుడు బ్రిడ్జ్ చికిత్సలు, ఆర్థోడాంటిక్స్ (దవడ పళ్లు లేదా దవడల అమరిక సరిగా లేనప్పుడు ఇవ్వాల్సిన చికిత్సలూ), చిగుర్లకు చికిత్సలూ... వీటన్నింటినీ కలిపి సంయుక్తంగా చికిత్సలను అందించడాన్ని ‘ఫుల్ మౌత్ రీ–హ్యాబిలిటేషన్’ (ఎఫ్ఎమ్ఆర్)గా చెబుతారు.ఎఫ్ఎమ్ఆర్లో ఏం జరుగుతుంది... ఈ సమగ్ర చికిత్స ప్రక్రియలో కంప్యూటర్ సహాయంతో నోటి తాలూకు పూర్తి చిత్రీకరణ... ఉదాహరణకు... కంప్యూటర్ ఎయిడెడ్ డిజైనింగ్ (క్యాడ్) అలాగే కంప్యూటర్ ఎయిడెడ్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ (క్యామ్) లతో నోటి నిర్మాణాన్ని తొలుత రూపొందించుకుంటారు. అటు తర్వాత నోటిలో ఉన్న సమస్యలన్నింటినీ తెలుసుకుని, ఏయే రకాల సమస్యలకూ ఏయే చికిత్సలనే ఓ సమగ్ర ప్రణాళికను రచించుకుంటారు. అవసరాన్ని బట్టి ఎలాంటి కృత్రిమమైన ఇంప్లాంట్స్ అమర్చాలో నిర్ణయించుకుంటారు. ఇక అందానికీ, లుక్స్కు సంబంధించిన సమస్య అయితే దానికి తగ్గట్టుగా కాస్మటిక్ చికిత్స కోసం అవసరమైన వినీర్స్ (బాధితుల వ్యక్తిగత అవసరాల కోసం తగిన విధంగా రూపొందించిన పంటిపై అమర్చేందుకు ఆ పంటి రంగే కలిగిన పలుచటి పొరల్లాంటివి) సమకూర్చుకుంటారు. చిగుర్ల సమస్యలు ఉంటే దానికి ఇవ్వాల్సిన మందులను సూచిస్తారు. డాక్టర్ సుధీర్ చౌదరి కరణంఆర్థోడాంటిస్ట్ – ఇంప్లాంట్ స్పెషలిస్ట్ (చదవండి: Parenting Tips: పిల్లలు ప్రయోజకులు అవ్వాలంటే..? ఐఏఎస్ అధికారిణి పేరెంటింగ్ టిప్స్లు..!) -
ఇన్ బ్రెయిన్
మెదడు పనితీరుపై విశ్లేషణ, కార్యాచరణ సమాచారాన్ని అందించే సాఫ్ట్వేర్ను అభివృద్ధి చేసి, మానసిక వైద్యులకు ఆధునాతన బ్రెయిన్ ఇమేజింగ్–బేస్డ్ ఇన్సైట్స్ను అందించే న్యూరో–ఇన్ఫార్మటిక్స్ ప్లాట్ఫామ్ ‘బ్రెయిన్ సైట్ ఏఐ’ నిర్మించారు రింఝిమ్ అగర్వాల్, ఇమ్మాన్యుయేల్...గత సంవత్సరం ఇండియా సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్ట్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడిఎస్సీవో) నుంచి ‘సాఫ్ట్వేర్–యాజ్–ఎ మెడికల్ డివైజ్’ సర్టిఫికెట్ పొందడం ద్వారా ‘బ్రెయిన్సైట్ ఏఐ’ వాణిజ్యపరంగా కీలకమైన మైలురాయిని చేరింది. ఈ సంస్థకు ఇమ్మాన్యుయేల్ సీయివో, రింఝిమ్ అగర్వాల్ సీటీవో.నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరోసైన్సెస్ నుంచి రింజిమ్ అగర్వాల్ పీహెచ్డీ చేసింది. ఇమ్మాన్యుయల్ ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నుంచి ఎంబీఏ చేసింది. హెల్త్ కేర్ మేనేజ్మెంట్, టెక్నాలజీ అండ్ పాలసీలలో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 15 సంవత్సరాల అనుభవాన్ని సంపాదించింది. ఆపరేటింగ్ సిస్టమ్ డిజైన్, పబ్లిక్ హెల్త్ అండ్ హెల్త్ కేర్ బిజినెస్లో ఆమెకు అపార అనుభవం ఉంది.‘సీడిఎస్సీవో లైసెన్స్ మాకు వాణిజ్యపరంగా ఉపయోగపడుతుంది. ఈ సంవత్సరం మా ఆదాయాన్ని పెంచుకోవడంపై దృష్టి పెట్టాం. మా ప్రాడక్స్›్ట వంద ఆస్పత్రులకు చేరువ కావాలనేది మా లక్ష్యం’ అంటుంది ఇమ్మాన్యుయేల్.‘ఆసుపత్రులలో అత్యంత సాంకేతిక పరిజ్ఞానం ఉన్న వైద్యులలో న్యూరోసర్జన్లు ఒకరు. మా సాంకేతికత మెదడుకు సంబంధించిన నిర్మాణాత్మక అంశాలకు మాత్రమే కాకుండా లాంగ్వేజ్, కాగ్నిషన్లాంటి వివిధ విధులపై కూడా ఇన్సైట్స్ను అందించగలదు. మా బ్రెయిన్సైట్ ఏఐ సామర్థ్యం సర్జన్లలో ఆసక్తి రేకెత్తించింది’ అంటుంది అగర్వాల్.‘బ్రెయిన్సైట్ ఏఐ’ అందించే సమాచారం సర్జరీల సమయంలో వైద్యులకు ఉపయోగపడుతుంది. ఉదాహరణకు ఒక కణితి... దేహంలో ఏదైనా కీలక విధులు నిర్వహించే ప్రాంతానికి చాలా దగ్గరగా ఉంటే, వైద్యులు దానిని చేరుకోవడానికి వేరే ప్రత్యామ్నాయ మార్గంలో వెళ్లడానికి వీలవుతుంది.బ్రెయిన్ ఏఐ ప్రాడక్ట్ ‘వోక్సెల్బాక్స్’ వేగంగా అభివృద్ధి చెందనుంది. మెదడుకు సంబంధించిన నాడీ కణాల కనెక్షన్లను మ్యాప్ చేయడానికి ‘ఫంక్షనల్ మాగ్నెటిక్ రెసోసెన్స్ ఇమేజింగ్’ (ఎఫ్ఎంఆర్ఐ) ఉపయోగ పడుతుంది. ఆ డేటాను ప్రాసెస్ చేసేందుకు ఉపయోగపడేదే ఏఐ–పవర్డ్ ప్రాడక్ట్ వోక్సెల్బాక్స్. రోగ నిర్ధారణ, శస్త్ర చికిత్సలను ప్లాన్ చేయడంలోనూ, చికిత్సను పర్యవేక్షించడంలో సహాయపడేందుకు వీలైన బ్రెయిన్ మ్యాప్స్ను తయారు చేయడంలో ‘వోక్సెల్ బాక్స్’ ఉపయోగపడుతుంది.హెల్త్–టెక్ ఎంటర్ప్రెన్యూర్గా విజయం సాధించిన రింఝిమ్ అగర్వాల్, ఇమ్మాన్యుయేల్ ‘స్నోడ్రాప్’ అనే పేషెంట్ కేర్ యాప్ను కూడా అభివృద్ధి చేశారు. పేషెంట్ల ప్రొఫైల్స్ రూపొందించడంలో, వైద్యప్రకియను మెరుగుపరచడంలో ఇది ఉపయోగపడుతుంది. -
మీ బీ12 బాగుందా?
హైదరాబాద్లోని ఓ ఐటీ సంస్థలో పనిచేసే 33 ఏళ్ల యువకుడు దాదాపు నాలుగేళ్లుగా మతిమరుపు, చిరాకు, కాళ్లు, చేతుల తిమ్మిర్లతో బాధపడుతున్నాడు. ఇటీవల సమస్య తీవ్రత పెరగడంతో ఓ న్యూరాలజిస్ట్ను సంప్రదించాడు. అతని ఆహార అలవాట్ల గురించి డాక్టర్ అడగ్గా పూర్తి శాకాహారినని చెప్పాడు. దీంతో డాక్టర్ వెంటనే రోగి రక్తంలో విటమిన్ బీ12 స్థాయి ఎంత ఉందో పరీక్షించగా సాధారణంతో పోలిస్తే అతితక్కువగా ఉన్నట్లు తేలింది. వెంటనే విటమిన్ బీ12 ఇంజెక్షన్లతో చికిత్స ప్రారంభించడంతో పాటు పాల ఉత్పత్తులతో కూడిన ఆహారాలను అధికంగా తీసుకోవాలని సూచించడంతో కొన్ని వారాల్లోనే ఆ యువకుడి జ్ఞాపకశక్తి, ఏకాగ్రత మెరుగుపడింది. తిమ్మిర్ల సమస్య సైతం దూరమైంది.సాక్షి, హైదరాబాద్: చాలాసార్లు సాధారణ ఆరోగ్య సమస్యలుగా కనిపించేవే తీవ్ర అనారోగ్య లక్షణాలకు సూచికలుగా మారొచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. తరచూ మతిమరుపు, విసుగు, తిమ్మిర్ల వంటివి ఇబ్బంది పెడుతుంటే వాటిని పని ఒత్తిళ్ల వల్ల ఎదురవుతున్న సమస్యలుగా భావించొద్దని.. అవి శరీరంలో విటమిన్ బీ12 లోపానికి సంకేతం కావొచ్చని అంటున్నారు. ఈ తరహా లక్షణాలపట్ల అవగాహన పెంచుకొని అందుకు తగ్గట్లుగా వ్యవహరించాలని సూచిస్తున్నట్లు ముఖ్యంగా శాకాహారులు ఇలాంటి లక్షణాలతో సతమతమవుతుంటే తప్పనిసరిగా రక్తంలో విటమిన్ బీ12 స్థాయిలు తెలుసుకోవాలని చెబుతున్నారు. లక్షణాలను బట్టి వెంటనే మందులు వాడటం ద్వారా మెదడు, నరాలకు శాశ్వత నష్టం జరగకుండా నివారించవచ్చని పేర్కొంటున్నారు. ఇలాంటి స్థితిని అధిగమించేందుకు విటమిన్ బీ12 సమృద్ధిగా ఉండే లేదా బీ12ను జోడించిన ఆహారాలను తరచూ తీసుకోవడం లేదా వైద్యులు సూచించే సప్లిమెంట్లు తీసుకోవాలని సలహా ఇస్తున్నారు.ఏమిటీ బీ12?విటమిన్ బీ12 అనేది శరీరం తయారు చేసుకోలేని ఓ పోషకం. ఇది ప్రధానంగా మాంసాహారం, పాల ఉత్పత్తులు, గుడ్లు వంటి వాటి నుంచి లేదా వైద్యపరంగా సప్లిమెంట్ల రూపంలో లభిస్తుంది. మెదడు, నాడీ వ్యవస్థ చురుకుగా పనిచేసేలా చేయడంతోపాటు రక్త కణాలను ఆరోగ్యంగా ఉంచడంలో బీ12 కీలకపాత్ర పోషిస్తుంది. దీన్ని కాలేయం ఐదేళ్ల వరకు నిల్వ చేసుకోగలదు. కానీ శరీరంలో తగినంత బీ12 నిల్వలు లేకపోతే అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. ఈ విటమిన్లో కోబాల్ట్ అనే ఖనిజం ఉంటుంది కాబట్టి దీన్ని కోబాలమిన్ అని కూడా పిలుస్తారు. రక్త పరీక్ష ద్వారా బీ12 స్థాయిలు సాధారణంగా ఉన్నాయో లేదో తెలుసుకోవచ్చు. రక్తంలో విటమిన్ బీ12 స్థాయి 70 పీఎంవోఎల్/ఎల్ (పికోమోల్స్ పర్ లీటర్)గా ఉంటే సాధారణం కింద లెక్క.బీ12 లోపం వల్ల తలెత్తే లక్షణాలు...» జ్ఞాపకశక్తి తగ్గుదల, అయోమయ భావన» ఏకాగ్రత లోపం, స్పష్టమైన ఆలోచన కొరవడటం» కుంగుబాటు భావన, చికాకు, అలసట, బడలిక, బలహీనంగా ఉన్న అనుభూతి కలగడం» చేతులు, కాళ్లు మొద్దుబారినట్లు, తిమ్మిరిగా, దురదగా ఉండటం» కంటి నుంచి మెదడుకు దృశ్య సమాచారాన్ని ప్రసారం చేసే ఆప్టిక్ నాడి దెబ్బతినడం.బీ 12 ప్రయోజనాలు...» డీఎన్ఏ, ఎర్ర రక్త కణాల తయారీలో దోహదం.» జుట్టు, గోర్లు, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.» కేంద్ర నాడీ వ్యవస్థ (మెదడు, వెన్నెముక) అభివృద్ధికి కీలకం.» ఆరోగ్యకరమైన ఎర్ర, తెల్ల రక్త కణాలు, ప్లేట్లెట్ల తయారీకి బీ 12 అవసరం» కొత్త ఎర్రరక్త కణాల పెరుగుదల, అభివృద్ధికి అవసరం. -
డెలీ'వర్రీ' వద్దు..! మెడిటేషన్ మస్ట్..
మహానగరంలో సగటు గర్భిణి డిప్రెషన్కు గురవుతోంది. గర్భందాల్చిన విషయం తెలిసిన నాటి నుంచి ప్రసవం అయ్యే వరకూ యాంగ్జైటీకి గురవుతున్నారని వైద్యనిపుణులు పేర్కొంటున్నారు. ప్రసవ సమయంలో 15 నుంచి 20 శాతం మంది గర్భిణులు, ప్రసవానంతరం 25 శాతం మంది ఈ రకమైన డిప్రెషన్కు గురవుతున్నారని యూకే మెడికల్ రీసెర్చ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ప్రసవానంతర మానసిక ఆరోగ్య సమస్యలపై చేపట్టిన సర్వే నివేదిక స్పష్టం చేస్తోంది. ప్రసవానంతరం మూడు నెలల పాటు నెగిటివ్ థాట్స్ వేధిస్తున్నాయట. గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణాల్లోనూ లింగ వివక్ష కనిపిస్తోందని పేర్కొన్నారు. గత రెండు దశాబ్దాల్లో మాతృ మరణాల సంఖ్య 50 శాతానికి పైగా తగ్గినప్పటికీ ఆత్మహత్యల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. దీనికి ప్రధానంగా పేదరికం, ఆర్థిక అసమానతలు, గృహ హింస, సూటిపోటి మాటలు, కుటుంబ సభ్యుల మద్ధతు లేకపోవడం వంటి సమస్యలు కనిపిస్తున్నాయి. సామాజిక మాధ్యమాలే కారణం.. నగర జీవితంలో ఆలస్యంగా వివాహాలు చేసుకోవడం, దంపతులిద్దరూ ఉద్యోగాలు చేయడం సర్వసాధారణం. గర్భిణిగా ఉన్నప్పుడు విధి నిర్వహణలో ఒత్తిడి, ఇంట్లో ఒంటరి తనం వేధిస్తున్నాయి. ఉమ్మడి కుటుంబాల్లో ఎక్కువ సలహాలు, సూచనలతోనూ గర్భిణులు ఇబ్బందిపడుతున్నారట. పట్టణ జీవితంలో సోషల్ మీడియాకు ఆకర్షితులవుతున్నారు. ప్రతి చిన్న విషయాన్నీ అంతర్జాలంలో చూసి ఆందోళనకు గురవుతున్నారు. కొంత మంది గర్భిణుల్లో నాకు అన్నీ తెలుసు అనే ధోరణి కనిపిస్తోందని వైద్యులు పేర్కొంటున్నారు. లైఫ్ స్టైల్ ప్రభావం.. సుమారు 60 శాతం మంది గర్భిణులు సూర్యుడిని చూడటంలేదట. ఫలితంగా విటమిన్–డి లోపం కనిపిస్తోంది. కుటుంబం, ఉద్యోగాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఆహారపు అలవాట్లు, లైఫ్ స్టైయిల్లో మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మెడిటేషన్ మస్ట్..గర్భిణుల్లో వ్యాయామం, డెలివరీ కాన్సెప్ట్ తీసుకురావాలి. ఇంట్లో రోజువారీ పనులు చేసుకుంటూనే.. మెడిటేషన్కు సమయం కేటాయించాలి. రెండు నుంచి మూడు శాతం మందికి మాత్రమే బెడ్ రెస్ట్ అవసరం ఉంటుంది. మిగతావారు పనులు చేసుకోవచ్చు. ఈ మధ్య కాలంలో గర్భిణిగా గుర్తించిన తొలి రోజుల నుంచి యాంగ్జైటీ మొదలై చివరి వరకు కొనసాగుతోంది. సోషల్ మీడియాకు ప్రభావితం కావొద్దు. పోస్ట్ డెలివరీలో హార్మోన్ ఛేంజెస్ ఉంటాయి. తగినంత రెస్ట్ అవసరం. క్యాల్షియం డెఫిషియన్సీ, రోగ నిరోధక శక్తి సమస్యలు వేధిస్తున్నాయి. రోజు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట మధ్య కనీసం అర గంట ఎండలో ఉంటే డి–విటమిన్ లోపాన్ని అధిగమించొచ్చు. – డాక్టర్ పి.శృతిరెడ్డి, గైనకాలజిస్టు, ల్యాప్రోస్కోపిక్ సర్జన్ (చదవండి: Benefits of Barefoot: ఫుట్ వేర్కి బై.. 'బేర్ఫుట్ వాక్'కి సై..! అధ్యయనాలు సైతం..) -
ఫుట్ వేర్కి బై.. 'బేర్ఫుట్ వాక్'కి సై..! అధ్యయనాలు సైతం..
అప్పులేకుండా తన కాళ్ల మీద తాను నిలబడడం అంటే ఆర్థికంగా స్థిరపడినట్టే అనేవారు పెద్దలు. కానీ చెప్పుల్లేకుండా తన కాళ్లపై తాను నడవడం అంటే ఆరోగ్యం లభించినట్లే అంటున్నారు నేటి వైద్య నిపుణులు. ప్రస్తుతం గ్రౌండింగ్/ఎర్తింగ్ పేర్లతో మెట్రో నగరాల్లో పాదరక్ష రహిత నడక ఆరోగ్య సాధనంగా మారింది. దీనివల్ల ఆరోగ్యపరమైన లాభాలున్నాయని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే జాగ్రత్తలు మాత్రం తప్పనిసరి అంటున్నారు నిపుణులు. ఇప్పటికే వెల్నెస్ చికిత్సా కేంద్రాల్లో ఆదరణ పొందుతున్న ఈ బేర్ఫుట్ వాక్పై నగరవాసుల్లో క్రమంగా ఆకస్తి పెరుగుతోంది. ఆరోగ్య రక్షణపై పెరుగుతున్న అవగాహనే దీనికి కారణమని వైద్య నిపుణులు చెబుతున్నారు. కాలికి చెప్పుల్లేకుండా మైళ్ల దూరం నడిచేవాళ్లం అంటూ మొన్నటి తరం గొప్పగా చెప్పుకోవడం విన్నాం. అప్పట్లో చెప్పులూ లేవు.. ప్రయాణించడానికి సరైన రవాన సౌకర్యాలూ లేవు.. కాబట్టి వారి ఆరోగ్యానికి అవన్నీ దోహదం చేశాయని చెప్పొచ్చు. ఎటువంటి పాదరక్షలూ లేకుండా నడిచినప్పుడు కాళ్లకి మరింతగా స్టిమ్యులేషన్ జరుగుతుందని వైద్యులు అంటున్నారు. ప్రయోజనాలివే.. పాదాలకు చెప్పులు లేకుండా నడవడం వల్ల శరీరానికి, కాళ్లకూ మధ్య మెరుగైన సమన్వయం, రక్త ప్రసరణ వంటి ప్రయోజనాలు లభిస్తాయి. పాదరక్షలు లేకుండా నడవడం స్వేచ్ఛగా, కొంత సంతృప్తిగా కూడా అనిపిస్తుంది. ఇది బాల్యపు జ్ఞాపకాలను తిరిగి తీసుకువస్తుంది. ఈ నడక వల్ల నేలతో మరింత సమన్వయం ఏర్పడుతుంది. ఇది ప్రొప్రియోసెప్షన్ (శరీర కదలికల–అవగాహన)ను మెరుగుపరుస్తుంది. శరీరం కదలిక స్థానాన్ని గ్రహించే సామర్థ్యాన్ని పెంచి పాదాలపై పట్టు జారిపోకుండా ఉండటానికి సహాయపడుతుంది. మెరుగైన ప్రొప్రియోసెప్షన్తో మెరుగైన భంగిమ వస్తుంది. కొంతకాలం పాటు చెప్పులు లేకుండా నడవడం వల్ల వెన్నెముక, కీళ్లు బలోపేతమై మరింత స్థిరత్వంతో తక్కువ వంగి నడవడానికి కూడా సహాయపడుతుంది. పాదాలకు అసంఖ్యాక నరాలు, రక్త నాళాలు ఉంటాయి. చెప్పులు లేకుండా నడవడం వాటిని చురుకుగా మారుస్తుంది. రక్త ప్రసరణ పెంచుతుంది. ప్రసరణ సమస్యలు ఉన్నవారికి, చల్లని పాదాలకు లేదా రోజంతా కూర్చొని గడిపే వారికి ఇది చాలా మేలుచేస్తుంది. అంతేకాదు ఇది నాడీ వ్యవస్థను కూడా మేల్కొలుపుతుంది. భూ ఉపరితలంతో ప్రత్యక్ష సంబంధం ఫ్రీ రాడికల్స్ను తటస్థీకరించడానికి, వాపును తగ్గించడానికి సహాయపడుతుంది. పాదాలు నేలను నేరుగా తాకినప్పుడు చర్మంలో సంభవించే మార్పుల కారణంగా మెదడు చురుకుగా మారుతుందని స్పర్శాజ్ఞానం అత్యుత్తమం అవుతుందని, సెన్సరీ స్టిమ్యులేషన్, మోటార్ స్కిల్స్.. బాడీ బ్యాలెన్సింగ్ నైపుణ్యం వంటివి పెరుగుతాయని చెబుతున్నారు. షూస్, సాక్స్లలో చేరుకునే బాక్టీరియా, ఫంగస్ నుంచి తప్పించుకోవచ్చు. చెప్పులు లేకుండా నడవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఎక్కడ? దేనిపై అడుగు పెడుతున్నారు? పాదాలు ఏ స్థితిలో ఉన్నాయి అనే దానిపై ఆధారపడి ఉంటుంది. చదునైన పాదాలు, ప్లాంటార్ ఫాసిటిస్ లేదా పాదాల నొప్పి ఉన్నవారు దీన్ని ఎంచుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఫ్లాట్ ఆర్చ్లు, ప్లాంటార్ ఫాసిటిస్, లేదా దీర్ఘకాలిక నొప్పి వంటి కొన్ని ప్రత్యేక తరహా పాదాలు ఉంటే చెప్పులు లేకుండా నడవడం మరింత దిగజార్చుతుంది. అందరికీ కాదు.. అన్ని చోట్లా కాదు.. పాదరక్షలను వదిలే ముందు, పాడియాట్రిస్ట్ లేదా ఫిజియోథెరపిస్ట్ను ముందస్తుగా సంప్రదించడం అవసరం ఇది అందరికీ లేదా ప్రతి వాతావరణానికి తగినది కాదు. పట్టణ ప్రాంతాలు, విపరీతమైన ఉష్ణోగ్రతలు వంటి కొన్ని పరిస్థితులు ప్రమాదాన్ని కలిగిస్తాయి. గడ్డి, ఇసుక లేదా నేల వంటి సహజ ఉపరితలాలపై సహజమైన ప్రకృతిలో మాత్రమే పాదరక్ష రహితంగా నడవవచ్చు. పరిశుభ్రమైన పరిసరాలు కూడా తప్పనిసరి. వృద్ధులకు లేదా ఆర్థరైటిస్ ఉన్నవారికి ఇది సరైన ఎంపిక కాదు. ఫంగల్ ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని తెస్తుంది. పట్టణ ప్రాంతాల్లోని కఠిన ఉపరితలాలు, తీవ్రమైన ఉష్ణోగ్రతలు కొన్ని ఆరోగ్య పరిస్థితులు చెప్పులు లేకుండా నడవడాన్ని ప్రమాదకరంగా మారుస్తాయి. బేర్ ఫుట్ వాక్ పూర్తయ్యాక వైద్యులు సూచించిన యాంటిబయాటిక్ సోప్స్ లేదా లోషన్స్ ఉపయోగించి పాదాలను శుభ్రపరుచుకోవడం మంచిది. పచ్చని గడ్డి మీద, పరిశుభ్రంగా ఉండే కార్పెట్స్ మీద నడవవచ్చు. సముద్రపు ఇసుక మీద నగక కూడా మంచిదే. ఆరోగ్యకరం.. తగిన జాగ్రత్తలు తీసుకుని బేర్ఫుట్ వాక్ చేయడం ఆరోగ్యానికి మంచిదే. ముఖ్యంగా దీనివల్ల ఫుట్ పొజిషన్ (అడుగు పడే స్థితి) మీద నియంత్రణ వస్తుంది. నడకలో బ్యాలెన్స్ పెరగడానికి, నొప్పి నివారణ వేగంగా జరగడానికి ఉపయోగపడుతుంది. పిరుదులు, కీళ్లు, కోర్ మజిల్స్ మధ్య సమన్వయం మెరుగుపడుతుంది. సరిగా నప్పని పాదరక్షలు ధరించడం వల్ల వచ్చే ఇబ్బందులకు చెక్ పడుతుంది. లోయర్ బ్యాక్ ప్రాంతపు కండరాలను శక్తివంతం చేస్తుంది. – డా.కల్పన, ఫ్యామిలీ ఫిజీషియన్ (చదవండి: భారత్ పిలిచింది..! కష్టం అంటే కామ్ అయిపోమని కాదు..) -
భారత్ పిలిచింది..!
బ్రెయిన్ ట్యూమర్ బారిన పడిన యూకే అథ్లెట్ జాక్ ఫెంట్కు ప్రతికూల ఆలోచనలు వస్తుండేవి. ఆ సమయంలోనే తనకు ఇష్టమైన ఇండియా గుర్తుకు వచ్చింది. వెంటనే రంగంలో దిగాడు. ‘ఇండియా–80 రోజులు–4,000 కిలోమీటర్లు’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు.ఇండియాలోకి అడుగు పెట్టిన క్షణం నుంచి అతడిలో ఉత్సాహం మొదలైంది. ఇండియాలో తన ‘80–డే రన్’ తాలూకు వీడియోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నాడు. ‘ప్రొటెక్టర్’ కాప్షన్తో పోస్ట్ చేసిన వీడియోలో తనను ప్రమాదం నుంచి రక్షించిన వీధి శునకం గురించి చెప్పాడు.ఆ శునకంతో తనతో పాటు పదమూడు కిలోమీటర్లు నడిచింది. దానికి ‘మనాలి’ అని పేరు పెట్టాడు జాక్.‘80 రోజులలో రోజుకు 50 కిలోమీటర్ల దూరం పరుగెత్తడానికి ఇండియాకు ప్రయాణమవుతున్నాను. మంచుతో కప్పబడిన కొండల నుంచి కేరళ ప్రకృతి అందాల వరకు ఎన్నో చూడబోతున్నాను. బ్రెయిన్ ట్యూమర్ అని నాకు నిర్దారణ అయిన తరువాత నా మనసు భయం, గందరగోళం, దుఃఖంతో నిండిపోయింది. నాకే కాదు భూమి మీద ప్రతి ఒక్కరికీ కష్టాలు కూడా ఉంటాయి. దీంతో పాటు ఒక ఆప్షన్ కూడా ఉంటుంది. ఇండియాకు వెళ్లాలను కోవడం అనేది నా ఎంపిక. మళ్లీ పూర్వంలా ఉత్సాహంగా ఉండాలనుకుంటున్నాను’’ అని తన యాత్ర ప్రారంభానికి ముందు షేర్ చేసిన పోస్ట్లో రాశాడు జాక్ పెయింట్. (చదవండి: వెయిట్ లిఫ్టింగ్తో ఇంత మార్పు..? ఏకంగా 93 కిలోలు నుంచి 50కిలోలు తగ్గిన మహిళ..) -
మనసు మాట విందాం!
మన సమాజంలో దగ్గు, జలుబు, జ్వరం, షుగర్, బీపీ అంటే వెంటనే డాక్టర్ దగ్గరకు వెళ్తారు. కానీ డిప్రెషన్, ఆందోళన, పానిక్ అటాక్, డీ–పర్సనలైజేషన్ లాంటి వాటిని బలహీనతలు లేదా అలసత్వంగా చూస్తారు. అవేవో బాధితులు కావాలని తెచ్చిపెట్టుకున్నట్టు భావిస్తారు. కానీ నిజానికి మానసిక ఆరోగ్యం కూడా శారీరక ఆరోగ్యంతో సమానమే. ఇవి రెండూ పరస్పర ఆధారితాలు. తలనొప్పి, తల తిరుగుడు, వాంతులు, జీర్ణ సంబంధ ఇబ్బందులు, గుండె అత్యంత వేగంగా కొట్టుకోవడం, ముఖ కండరాలు అదరడం, చర్మం పాలిపోవడం లాంటి శారీరక లక్షణాల ద్వారా మానసిక వ్యాధులు వ్యక్తం అవుతాయి. అంటే, మనసు తాను అనుభవించే హింసను గుర్తించమని, త్వరగా ఈ బాధను తగ్గించే ఉపాయం చూడమని శరీరం ద్వారా వేడుకుంటుంది! కానీ పట్టించుకోం మనం. ఎందుకంటే, బాధితులు ఆ వ్యాధులకు సంబంధించిన మందులు తీసుకుంటే వాటికి బానిసలవుతారని, ఈ వ్యాధులు పూర్తిగా నయం కావనీ. నిజానికి ఇవన్నీ తప్పుడు భావనలు. మానసిక వ్యాధులు కూడా శారీరక వ్యాధుల్లానే అనేక కారణాల వల్ల రావచ్చు. మెదడు రసాయనాల అసమతుల్యత, వంశపారంపర్యం, ఒత్తిడి, పరిసరాలు వంటి అంశాలు దీనికి కారణం అవుతాయి. కనుగొనదగిన కారణాలు ఏమీ లేకుండా కూడా మానసిక వ్యాధులు రావచ్చు. తొలిదశలోనే వ్యాధిని గుర్తించి సరైన చికిత్స చేస్తే, బాధితులు సాధారణ జీవితం గడపవచ్చు. పిల్లలు, యువకులు, పెద్దలు ఎవరికి అయినా మానసిక సమస్యలు రావచ్చు. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం, 2021లో ప్రపంచంలో సుమారు 1.1 బిలియన్ మంది మానసిక వ్యాధుల బారినపడ్డారు (ప్రతి ఎనిమిది మందిలో ఒకరు) అసలు మీరు పని చేసేచోట, సంచరించే చోట మీకు తెలియకుండా ఇప్పటికే ఒకరిద్దరు డిప్రెషన్ తోనో, ఏంగ్జయిటీతోనో వుండి ఉండొచ్చు. రోజువారీ జీవితంలో అవరోధం కలగనంతవరకూ పరవాలేదు. సమస్య వస్తే మాత్రం, దాచుకోవడం కంటే కుటుంబ సభ్యుల, స్నేహితుల, సహకారం తీసుకోవడం, వైద్యుని సంప్రదించడం ఎంతో అవసరం. అన్నిటికన్నా ముఖ్యమైన సంగతి, మానసిక ఆరోగ్య సమస్యలు ‘‘నిజమైనవి’’ అనే విషయాన్ని గ్రహించడం, అంగీకరించడం. జ్వరం వస్తే విశ్రాంతి తీసుకుంటాం కదా! అలాగే, మనసు అలసిపోయినప్పుడు, అది బాధపడినప్పుడు కూడా సహాయం కోరడం సిగ్గుపడాల్సిన విషయం కాదు. ధైర్యం, అవగాహన అవసరమయ్యే విషయం. మనసుని ఖాళీగా ఉంచకుండా మంచి వ్యాపకాలు పెట్టుకోవాలి. గ్రౌండింగ్ టెక్నిక్స్, బ్రీతింగ్ వ్యాయామాలు నేర్చుకోవాలి.. సర్వమానవ సహోదరత్వం, సౌభ్రాతృత్వం గురించి ఉపన్యాసాలు దంచేస్తాం. మనలో అది నిజంగా వుందని నిరూపించుకునే చిన్న అవకాశం ఒకటి ఏమిటంటే, మానసిక వ్యాధులతో బాధపడేవారిని చూసి ఎగతాళిగా నవ్వకుండా, తప్పుగా మాట్లాడకుండా ఉండటం, వాళ్లకి చేతనైన సహాయం చెయ్యడం. ఆమాత్రం చేయలేమా?ప్రపంచ ప్రసిద్ధ వ్యక్తుల్లో అబ్రహాం లింకన్, ఐజాక్ న్యూటన్, విన్సెంట్ వ్యాన్గో, చార్లెస్ డికెన్స్ నుంచీ మన దీపికా పదుకొనే వరకూ ఎందరో గొప్ప వ్యక్తులు, సెలబ్రిటీలు మానసిక వ్యాధులతో పోరాడి, సాధారణ స్థాయిని మించి ఉన్నతంగా బతకడమే కాకుండా, తమ ప్రతిభతో లోకానికి ప్రేరణగా నిలిచారు. మానసిక రోగులు చాలావరకు ప్రమాదకారులు కాదు; మందులు వైద్యుని సూచన మేరకు తీసుకుంటే అడిక్షన్ రాదు.వైష్ణవి గద్దె, వైద్య విద్యార్థిని -
భార్యాబిడ్డల్ని విమానం ఎక్కించి వచ్చాడో లేదో తీవ్ర గుండెపోటు, విషాదం
ఇటీవలి కాలంలో వరుస ఎన్ఆర్ఐల మరణాలు ఆందోళన రేపుతున్నాయి. అబుదాబి అంతర్జాతీయ విమానాశ్రయంలో తన భార్య , కుమారుడికి వీడ్కోలు పలికిన కొన్ని గంటలకే UAEలో ఒక భారతీయ ప్రవాస ఇంజనీర్ గుండెపోటుతో ఆకస్మికంగా మరణించడం తీవ్ర విషాదాన్ని నింపింది. బాధితుడిని హరిరాజ్ సుదేవన్ (37) (Hariraj Sudevan) గుర్తించారు.కేరళలోని అలప్పు జిల్లాకు చెందిన 37 ఏళ్ల హరిరాజ్ సుదేవన్ హరిరాజ్ సుదేవన్ గత 12 ఏళ్లుగా యుఎఇలో నివసిస్తున్నాడు. అయితే తన భార్య డాక్టర్ అను అశోక్ , 10 ఏళ్ల కుమారుడు ఇషాన్ దేవ్ హరి కేరళ వెళ్లాలని నిర్ణయించుకున్నారు. వారిని విమానాశ్రయంలో దింపిన కొన్ని గంటలకే అబుదాబిలో గుండెపోటుతో మరణించాడు. అల్లుడు అకాల మరణంపై మామ అశోకన్ కేపీ తీవ్ర విచారాన్ని ప్రకటించారు. ఆయన ఇక లేరనే వాస్తవాన్ని జీర్ణించుకోలేకపోతున్నామనంటూ కంట తడిపెట్టారు.ఆదివారం సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చే ముందు తన కుమార్తె , మనవడు హరిరాజ్తో 10 రోజులు గడిపారని, అక్టోబర్ 27న తన కొడుకు పుట్టినరోజుకు హాజరు కావడానికి హరిరాజ్ ఈ నెల చివర్లో రావాల్సి ఉందని గుర్తు చేసుకున్నారు. ఐఐటీ మద్రాస్ పూర్వ విద్యార్థి అయిన సుదేవన్, యుఎఇలో 12 సంవత్సరాలకు పైగా సీనియర్ ఆఫ్షోర్ కన్స్ట్రక్షన్ ఇంజనీర్గా పనిచేస్తున్నారు. కుసాట్ నుండి బి.టెక్ ,ఐఐటీ మద్రాస్ నుండి ఎంటెక్ పట్టా పొందారు. హరిరాజ్, అబుదాబిలో సీనియర్ పనిచేస్తున్నారు. అంత్యక్రియల కోసం ఆయన మృతదేహాన్ని కేరళకు తరలించారు. థామస్ కుమార్తె పుట్టినరోజు వేడుకలను జరుపుకోవడానికి మా ఇంటికి వచ్చారని, ఎంతో సంతోషంగా గడిపామని సన్నిహిత స్నేహితుడు డిజిన్ థామస్ తెలిపారు. -
వెయిట్ లిఫ్టింగ్తో ఇంత మార్పు..? 43 కిలోల బరువు తగ్గిన మహిళ..
వెయిట్ లిఫ్టింగ్ అనగానే..మగవాళ్లు చేసేది అనే భావనే అందిరిలో ఉంటుంది. అయితే ఇటీవల కొందరు ఫిట్నెస్ ఔత్సాహిక మహిళలు ఆ మూసధోరణిని బద్ధలు కొట్టి మరి వెయిట్లిఫ్టింగ్లో సత్తా చాటారు. చాలామంది ప్రముఖ ఫిట్నెస్ నిపుణులు సైతం ఈ వెయిట్లిఫ్టింగ్లు మహిళలకు సరిపడవని, మగవాళ్ల ఫిజిక్లా కనిపించేలా చేస్తుందని చెప్పేవారు. అయితే ఆ అపోహను అబద్ధం అని కొట్టిపారేసేలా ఈ మహిళ అద్భుతం చేసి చూపింది. అంతేగాదు మహిళలకు ఈ వెయిట్లిఫ్టింగ్ ఎంత మేలు చేస్తుందో సవివరంగా వెల్లడించారామె. అదెలాగో ఆమె మాటల్లోనే తెలుసుకుందామా..!.ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్కు చెందిన సుష్మా పచౌరి ఖాడియా కంటెంట్ క్రియేటర్, ఫిట్నెస్ కోచ్. ఆమె ఒకప్పుడు స్వతహాగా 93 కిలోలు బరువు ఉండేది. వెయిట్లిప్టింగ్తో సుమారు 43 కిలోల మేర తగ్గి అందరినీ ఆశ్చర్యపోయేలా చేసింది. అంతలా సంతరించుకున్న తన శరీర మార్పు గురించి సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారామె. ప్రజలంతా అనుకున్నట్లు వెయిట్లిఫ్టింగ్లు ఆడవాళ్లను మగవాళ్లలా రఫ్గా మార్చదని, ఎంతో ప్రయోజనకరమైనదని అంటోంది. ఇది మహిళల్లోని ఫ్యాట్ని కరిగించి వెయిట్లాస్కు చెక్ పెడుతుందని చెబుతోంది. తాను శుభ్రంగా ఇంట్లో వండిన ఆహారం, క్రమ తప్పకుండా వ్యాయామాలు చేసి ఇంతలా బరువు తగ్గానని చెప్పుకొచ్చింది. సుష్మా పోస్ట్లో 'వెయిట్లిఫ్టింగ్ దుష్ప్రభావాలు' అనే క్యాప్షన్ జోడించి చేసిన ఈ పోస్ట్ నెట్టింట తెగ వైరల్గా మారింది. 18 ఏళ్ల వ్యక్తికి తల్లి అయిని సుష్మా పచైరి వెయిట్లిఫ్టింగ్ని తన దినచర్యలో భాగం చేసుకున్న తర్వాత నుంచి తన జీవితం ఇంతలా మారిందని తెలిపింది. View this post on Instagram A post shared by Sushma Pachouri Khadia (@sushma.pachouri) సంతరించే మార్పులు-ప్రయోజనాలు..ఆకాశాన్ని అంటేలా శక్తి స్థాయిలు పెరుగుతాయి. స్లిమ్గా మారుతున్నట్లు తెలుస్తుంది. దుస్తుల సరిపోతాయిఅందరి అటెన్షన్ మీపై ఉంటుంది. ఎలా బరువు తగ్గారు అని కచ్చితంగా ప్రశ్నించడం మొదలవుతుంది. సోమరితనం దరి చేరదుఒత్తిడి అనే మాటకు ఆస్కారం ఉండదుకిరాణ సామాగ్రి వంటి పలు రకాల లగేజ్లను సులభంగా ఎత్తేయగలుగుతారుమంచి నిద్ర పడుతుంది. ఇలాంటి మంచి ఫలితాల కోసం ఫిట్నెస్కోచ్ సూచించే సలహాలను తప్పక పాటించాలని చెబుతోంది. ఇక్కడ ఈ వెయిట్ లిఫ్టింగ్ మహిళల్లో లీన్ కండరాలను అభివృద్ధి చేయడానికి, శరీరాన్ని పెద్ద పరిమాణంలో కనిపించకుండా మెరుగుపరచడానికి సహాయపడుతుంది. నిజానికి ఇది మహిళలకు బలం, ఫిట్నెస్ తోపాటు మంచి ఆత్మవిశ్వాసాన్నికూడా అందిస్తుందని నమ్మకంగా చెబుతోంది ఫిట్నెస్ కోచ్ సుష్మా పచౌరి. View this post on Instagram A post shared by Sushma Pachouri Khadia (@sushma.pachouri)గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: స్వచ్ఛందంగా ఇలా ప్రయత్నిస్తే..స్వచ్ఛ భారత్ సక్సెస్ అయినట్లే..) -
మానసిక ఆరోగ్యానికి మనమేం చేస్తున్నాం?
ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 10న ‘మానసిక ఆరోగ్య దినోత్సవా’న్ని (World Mental Health Day 2025) జరుపు కొంటున్నాము. మానసిక ఆరోగ్య ప్రాము ఖ్యాన్ని గుర్తించి ‘వరల్డ్ ఫెడరేషన్ ఫర్ మెంటల్ హెల్త్’ (డబ్ల్యూఎఫ్ఎమ్హెచ్) 1992 నుండి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ప్రపంచ వ్యాప్తంగా 150 దేశా లలో మానసిక ఆరోగ్యంపై అపోహలు తొలగించి అవగాహన పెంచడానికి వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహిస్తారు. ‘విపత్తులు, ఆపత్కాలంలో మానసిక ఆరోగ్య సేవల లభ్యత’ అనేది ఈ ఏడాది నినాదం. ‘శారీరక ఆరోగ్యంతో పాటు మానసికంగా, సామాజికంగా కూడా దృఢంగా ఉండటం’ సంపూర్ణ ఆరోగ్యం అనేది ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) నిర్వచనం. మనిషి తన ఆలోచనలు, భావోద్వేగాలు నియంత్రించుకోగలిగి, సమస్యలను ధైర్యంగా ఎదు ర్కొని, సరైన నిర్ణయాలు తీసుకోగలగాలి. డబ్ల్యూహెచ్ఓ అంచనా ప్రకారం, ప్రపంచ వ్యాప్తంగా సుమారుగా 97 కోట్లకు పైగా ప్రజలు, రకరకాల మానసిక రుగ్మతలతో బాధ పడుతున్నారు. మన దేశంలో ప్రతి ఆరుగురిలో ఒకరు ఏదో ఒక మానసిక ఇబ్బందికి గురవుతున్న వారే! డిప్రెషన్, ఆందోళన, మద్యపానం, మాదక ద్రవ్యాల విని యోగం వల్ల ఎక్కువమంది మానసికంగా ఇబ్బంది పడుతున్నారు. ప్రకృతి వైపరీత్యాలు, యుద్ధాలు, తొక్కిసలాటల్లో వందలాది మరణాలు సంభవించడం, కోవిడ్ లాంటి సందర్భాలలో అచటి ప్రజలు మరింత మానసిక క్షోభకు గురవుతారని పరి శోధనల్లో తేలిన విషయం. కోవిడ్ ప్రపంచానికి ఒక పెద్దపాఠం నేర్పింది. చావు భయంతోపాటు, లాక్డౌన్ ప్రభావం, ఉద్యోగాలు పోయి ఆర్థిక ఇబ్బందులు, బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోయి ఒంటరిగా ఉండటం లాంటివన్నీ మానసిక ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపాయి. ఒక అంచనా ప్రకారం, కోవిడ్లో మానసిక రుగ్మతలు కనీసం 25 శాతం పెరిగాయి. యువతలో మొబైల్ అడిక్షన్, డిప్రెషన్, గ్యాంబ్లింగ్ సమస్యలు అధికమయ్యాయి. రష్యా, ఉక్రెయిన్, ఇజ్రాయిల్–గాజా యుద్ధాల వల్ల అక్కడి ప్రజలు తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురవుతున్నట్లు సర్వేలు తెల్పు తున్నాయి. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, కేరళ వంటి చోట్ల ఆ మధ్య సంభవించిన మేఘ విస్ఫోటనం వల్ల వచ్చిన వరదలు, ఆస్తి, ప్రాణనష్టంతో అనేకమంది మానసిక వేదనకు గురయ్యారు. దాదాపు 140 కోట్లకు పైగా జనాభా గల మన దేశంలో కనీసం 20 వేల మంది అర్హులైన మానసిక వైద్య నిపుణులు కూడా లేరంటే ఆశ్చర్యమే! మానసిక ఆరోగ్యానికి హెల్త్ బడ్జెట్లో కేటాయింపులు కేవలం ఒక శాతం కన్నా తక్కువే!చదవండి: Mounjaro వెయిట్లాస్ మందు దూకుడు, డిమాండ్ మామూలుగా లేదు!ఈ సమస్యల నుండి బయటపడాలంటే, ప్రాథమిక ఆరోగ్య వ్యవస్థతో, మానసిక ఆరోగ్య సేవలను అనుసంధానించాలి. కళాశా లల్లో మానసిక ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు తప్పనిసరి చేయాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మెంటల్ హెల్త్కు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. విపత్తులలో పనిచేసే సిబ్బందికి ‘సైకలాజికల్ ఫస్ట్ ఎయిడ్’లో శిక్షణ ఇప్పించాలి. హెల్ప్లైన్లు, టెలిమానస్ లాంటి సర్వీసులు మరింతగా పెంచాలి. ఆపద సమయాల్లో మన మిచ్చే ఓదార్పు, భరోసా, భవిష్యత్తులో వారు మరిన్ని మానసిక రుగ్మతలకు లోనుకాకుండా నివారిస్తుంది. మానసిక వైద్యుల కొరత ఉన్న మన దేశంలో, ఇలాంటివి ఎదుర్కొనేందుకు ఆశా, హెల్త్ వర్కర్లు; ఎన్ఎస్ఎస్, రెడ్క్రాస్ కార్యకర్తలు; టీచర్లు, మత ప్రతి నిధులు లాంటి వారికి, ‘సైకలాజికల్ ఫస్ట్ ఎయిడ్’లో తగిన శిక్షణ నివ్వాలి. అప్పుడే 2047 నాటికి మనం పరిపూర్ణ ‘వికసిత్ భారత్’ని సాధించగలుగుతాం. ఇదీ చదవండి: చిట్టిచేప.. చీరమీను... ఒక్కసారి తిన్నారంటే!వ్యాసకర్త డా.ఇండ్లరామసుబ్బా రెడ్డి మానసిక వైద్య నిపుణులు(అక్టోబర్ 11 ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం) -
'వాకింగ్' తినక ముందా? తిన్నతర్వాతా?
ప్రస్తుతం ఆరోగ్యం కోసం అత్యధికులకు అందుబాటులో ఉన్న మంచి వ్యాయామం వాకింగ్. ఏ సమయంలో అయినా ఎక్కడైనా చేయగలిగిన వ్యాయామం కావడంతో దీనిని అనేకమంది ఎంచుకుంటున్నారు. అయితే వాకింగ్కు సంబంధించి పూర్తి ప్రయోజనాలు లభించాలంటే ఎప్పుడు ఎలా వాక్ చేయాలి అనేదానిపై అవగాహణ ఉండాలి అంటున్నారు వైద్యులు. ముఖ్యంగా రోజూ మూడు లేదా నాలుగు పూటలా తినే అలవాటున్నవారు ఈ విషయంలో మరింత అవగాహన పెంచుకోవాలని సూచిస్తున్నారు. వైద్యులు చెబుతున్న ప్రకారం...భోజనం ముందు...అప్పటికి ఖాళీ కడుపుతో ఉన్నా లేదా తక్కువ కార్బోహైడ్రేట్స్, అధిక ప్రోటీన్ ఆహారం తీసుకుని ఉన్న స్థితిలో నడవడం వల్ల కొవ్వు ఆక్సీకరణ పెరుగుతుంది. అంటే ఫ్యాట్ కరుగుతుందన్నమాట. నడకకు ముందు అధిక కార్బోహైడ్రేట్స్ కలిగిన భోజనంతో పోలిస్తే ఇది ఎక్కువ సంతృప్తిని ఇస్తుంది, నడకకు అవసరమైన శక్తి ఖర్చు తగ్గుతుంది. అల్పాహారం లేదా భోజనానికి ముందు చిన్నపాటి నడక భోజన కాంక్షను పెంచేందుకు సహాయపడుతుంది. శరీరంపై గ్లూకోజ్ లోడ్ పడకుండా చురుకుదనాన్ని పెంచుతుంది. ఉదయం లేదా మధ్యాహ్న భోజనానికి ముందు ముందు 10–20 నిమిషాలు, తేలికపాటి నడక మేలు.భోజనం తర్వాత...భోజనం తర్వాత కూర్చోవడం కంటే 2–10 నిమిషాలు తేలికగా నడవడం వల్ల భోజనం తర్వాత రక్తంలో చోటు చేసుకునే చక్కెర స్థాయి తగ్గుతుందని అనేక అధ్యయనాలు నిర్ధారించాయి. భోజనం తర్వాత వెంటనే 10 నిమిషాల నడక కలిగించే లాభాలు మిగిలిన సమయాల్లో చేసే సుదీర్ఘ నడకతో ధీటుగా ఉంటాయని అవి తేల్చాయి. నడక జీర్ణవ్యవస్థకు రక్త ప్రవాహాన్ని ప్రోత్సహిస్తుంది, గ్లైసెమిక్ నియంత్రణ కోసం ప్రతి భోజనం తర్వాత చిన్న నడక అవసరం. భోజనం తర్వాత తేలికపాటి నడక గ్యాస్ట్రిక్ సమస్య నివారణకు సహాయపడుతుంది, కడుపు ఉబ్బరం లక్షణాలను తగ్గిస్తుంది యాసిడ్ ఎక్స్పోజర్ను తగ్గిస్తుంది; అయితే భోజనం తర్వాత తీవ్రమైన లేదా వేగవంతమైన నడక మాత్రం మంచిది కాదు. అలాగే భోజనం తర్వాత వెంటనే కాకుండా కనీసం 10–20 నిమిషాల వ్యవధిలో ప్రారంభించి 5–15 నిమిషాలు కొనసాగిస్తే జీర్ణ ప్రయోజనాలకు ఉపయుక్తం.లక్ష్యాన్ని బట్టి సమయ పాలన...ప్రాథమిక లక్ష్యం కొవ్వు తగ్గడం అయితే, ఖాళీ కడుపుతో నడవడం వల్ల తగిన ప్రయోజనం చేకూరుతుంది. ఏమీ తినకుండా శ్రమించినప్పుడు శరీరం గతంలో పేరుకున్న కొవ్వు నిల్వలను శక్తి కోసం ఉపయోగించుకునే అవకాశం ఉంది, ఈ ప్రక్రియను కొవ్వు ఆక్సీకరణం అంటారు. సరైన ఆహారం తీసుకుంటూ ఇలా చేస్తే ఇది బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. అయితే కొందరికి తినడానికి ముందు నడవడం వల్ల తల తిరుగుతుంది లేదా అలసట రావచ్చు, అలాంటి వారు నడకకు ముందు ఒక చిన్న బలవర్ధకమైన చిరుతిండి (ఉదాహరణకు బాదం వంటి నట్స్తో చేసినవి)తీసుకోవడం మంచి ఆలోచన.డయాబెటిస్ తగ్గాలంటే...రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించాలని లక్ష్యంగా పెట్టుకున్న వారికి, భోజనం తర్వాత నడవడం మంచిది. తిన్న 30 నిమిషాలలోపు 10–15 నిమిషాలు తేలికపాటి నడక ఇన్సులిన్ సున్నితత్వాన్ని మెరుగుపరచడం ద్వారా గ్లూకోజ్ ను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది టైప్ 2 డయాబెటిస్ లేదా ప్రీడయాబెటిస్ ఉన్నవారికి ప్రత్యేకంగా ప్రయోజనకరంగా ఉంటుంది.మనసు మాట వినాలి...కొంతమందికి ఖాళీ కడుపుతో నడవడం వల్ల బాగా శక్తివంతంగా అనిపిస్తుంది, ముఖ్యంగా ఉదయం. ఉపవాసం సమయంలో హార్మోన్ల మార్పుల కారణంగా వారు మానసికంగా పదునుగా మారి పనిపై మరింత ఎక్కువ దృష్టి కేంద్రీకరించినట్లు ఫీలవుతారు. మరికొందరికి భోజనం తర్వాత నడవడం వల్ల చురుకుగా అనిపించవచ్చు. అంతిమంగా, వ్యక్తిగత ప్రాధాన్యత ముఖ్యం, శరీరం ఎలా స్పందిస్తుంది అనేది కూడా గమనించాలి. ఉదయాన్నే నడుస్తున్నా లేదా రాత్రి భోజనం తర్వాత అయినా, క్రమం తప్పకుండా నడవడం మాత్రం చాలా అవసరం. గుండె, మెదడు, మానసిక స్థితి జీవక్రియకు దీర్ఘకాలిక ప్రయోజనాలను అందిస్తుంది.(చదవండి: మచ్చలేని చర్మం, నిగనిగలాడే జుట్టు కోసం డీఎన్ఏ డీకోడ్..!) -
వెయిట్లాస్ మందు దూకుడు, డిమాండ్ మామూలుగా లేదు!
వెయిట్లాస్ అనగానే ఈ మధ్య కాలంలో అందరికీ గుర్తొచ్చే ఔషధం ‘మౌంజారో’ (Mounjaro) అమెరికా ఫార్మా దిగ్గజమైన ఎలీ లిల్లీ కంపెనీకి చెందిన ఈ డ్రగ్ అమ్మకాల్లో దూసుకుపోతుంది. భారతదేశ ఔషధ మార్కెట్లో యాంటీ-ఒబెసిటీ, డయాబెటిస్ ఔషధం మౌంజారో రెండో అతిపెద్ద బ్రాండ్గా అవతరించింది. లాంచ్అయిన ఆరు నెలల్లోనే కోట్ల రూపాయల బిజినెస్ సాధించి మార్కెట్ను షేక్ చేస్తోంది.ఇండియన్ ఫార్మాస్యూటికల్ మార్కెట్ (IPM) తాజా డేటా ప్రకారం, సెప్టెంబర్లో మౌంజారో రూ. 80 కోట్ల అమ్మకాలను నమోదు చేసింది. రూ. 85 కోట్లు నమోదు చేసిన GSK యాంటీబయాటిక్ ఆగ్మెంటిన్ మొదటి స్థానంలో ఉంది. ఫార్మా మార్కెట్లో మౌంజారో ఇంజెక్షన్ మొత్తం ఆదాయం రూ. 233 కోట్లకు చేరడం గమనార్హం.మౌంజారో సాధారణంగా టిర్జెపటైడ్ అని పిలువబడే మౌంజారో, టైప్ 2 డయాబెటిస్ను నివారణలో వారానికి ఒకసారి ఇంజెక్ట్ చేయగల ఔషధం.ఇది రక్తంలో చక్కెర స్థాయిలు, ఆకలిని నియంత్రించడంల సహాయపడే రెండు గట్ హార్మోన్లు-GLP-1, GIP-లను నియంత్రిస్తుంది. తద్వారా గ్లూకోజ్ను అదుపులో ఉంచడమే కాదు, బరువు తగ్గడానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. దీని ద్వారా సగటున 20-22 శాతం బరువు తగ్గుతున్నట్టు క్లినికల్ అధ్యయనాల ద్వారా తెలుస్తోంది.ప్రపంచవ్యాప్తంగా కూడా ఇది మౌంజారో యాంటీ-ఒబెసిటీ , మెటబాలిక్ చికిత్సలలో ఎక్కువగా చర్చల్లో నిలుస్తున్న మందుగా మారిపోయింది. మౌంజారో ఇప్పటికే మధుమేహం ,ఊబకాయాన్ని తగ్గించుకోవడంలో లక్షలాదిమందికి ఉపయోగపడింది. ఈనేపథ్యంలోనే ముఖ్యంగా ఇండియాలో శరవేగంగా వినియోగంలోకి వస్తోంది. వెయిట్లాస్ చికిత్సలకు డిమాండ్ ఎంత బలంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ ఔషధం ఏప్రిల్ 2024లో భారతదేశంలో లాంచ్ అయింది. సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (CDSCO) వైద్యుల సలహా మీద మాత్రమే వాడే మాత్రమే ఇంజెక్షన్గా ఆమోదించింది. ఇది 2.5 mg , 5 mg మోతాదులలో లభిస్తుంది, వారానికి ఒక డోసు చొప్పున వాడే ఈ మదు ధర మోతాదును బట్టి. నెలకు రూ. 14,000 ,రూ. 17,500 మధ్య ఉంటుంది.చదవండి : చిట్టిచేప.. చీరమీను... ఒక్కసారి తిన్నారంటే!అధిక ధర ఉన్నప్పటికీ డిమాండ్మాత్రం అప్రతిహగంగా పెరుగుతూ వస్తోంది. దీఆగస్టు నుండి సెప్టెంబర్ వరకు బ్రాండ్ అమ్మకాలు 43 శాతం పెరిగాయి, రూ. 56 కోట్ల నుండి రూ. 80 కోట్లకు పెరిగాయి. ఫలితంగా మార్కెట్లో వేగంగా అభివృద్ధి చెందుతున్న మందులలో ఒకటిగా నిలిచింది. సెప్టెంబర్లో మొత్తం భారతీయ ఫార్మా మార్కెట్ 7.3 శాతం విస్తరించింది. దీనికి తోడు సెప్టెంబర్ 22 నుండి అమలులోకి వచ్చేలా 18 శాతం నుండి 5 శాతానికి జీఎస్టీ తగ్గింపు కూడా కలిసి వచ్చింది. ఈదూకుడు కేవలం ప్రారంభం మాత్రమే అంటున్నారు పరిశ్రమ నిపుణులు అంటున్నారు. -
ఆన్లైన్ ఒత్తిడికి విరుగుడుగా..
ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం(అక్టోబర్ 10)ని పురస్కరించుకుని యువజన మీడియా ప్లాట్ఫామ్ ‘యువ’ భాగస్వామ్యంతో ‘స్నాప్ ఇంక్’ ఆధ్వర్యంలో ‘కేర్ నాట్ కంట్రోల్’ పేరిట కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ విషయాన్ని సంస్థ ప్రతినిధులు తెలిపారు. సోషల్ మీడియా, అభద్రత, ఒత్తిళ్లను దృష్టిలో పెట్టుకుని ఆన్లైన్ ప్రపంచాన్ని సురక్షితంగా మార్చడం టీనేజర్ల మధ్య ఆరోగ్యకరమైన సంభాషణలను పెంపొందించడమే ప్రధానంగా దీని ఉద్ధేశ్యమన్నారు. భారతీయ స్నాప్చాటర్ల డిజిటల్ శ్రేయస్సుకు ఇది మద్దతు అందిస్తుందని వివరించారు. ఈ వీడియో ప్రచారం ఈ నెల 10 వరకూ కొనసాగుతుందన్నారు. చిన్నపాటి చిట్కాలు..అలాగే బాగా ఒత్తిడిలో ఉన్నప్పుడువెంటనే అమ్మకు ఫోన్ చేసి ఆమె గొంతు వినండి... చిన్నప్పుడు అమ్మ పాడే జోలపాట వింటూ హాయిగా నిద్దురలోకి జారినంత తేలిగ్గా మీరు ఒత్తిడి నుంచి బయట పడతారని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. (చదవండి: Custard Apple: సీజన్లో నిండుగా..సిటీలో పండు'గ'! జ్యూస్, ఐస్క్రీమ్స్, స్వీట్స్ నుంచి..) -
సీజన్లో నిండుగా..సిటీలో పండు'గ'
మామిడి, స్ట్రాబెర్రీ ఇలా ఏదైనా కావొచ్చు.. ప్రతి సీజనల్ పండుని పండుగలా ఎలా జరుపుకోవాలో నగరవాసులకు తెలుసు. ప్రస్తుతం సీతాఫల్(కస్టర్డ్ ఆపిల్) సీజన్ ప్రారంభమైంది. దాంతో ప్రతి సంవత్సరం మాదిరిగానే అక్టోబర్ నెలలో హైదరాబాద్ నగరంలోని రెస్టారెంట్ డెజర్ట్ మెనూలకు ఈ క్రీమీ ఫ్రూట్ కొత్త రుచులను అద్దుతోంది. సీతాఫలం సీజన్లో నేరుగా పండ్లను తీసుకోవడం మాత్రమే కాకుండా భాగ్యనగరవాసులు దానిని అనేక రూపాల్లో ఆస్వాదిస్తున్నారు. అన్ని పండ్ల మాదిరిగానే సీతాఫల్ జ్యూస్లు సరే.. అయితే.. కూలింగ్ మిల్క్షేక్ల నుంచి రుచికరమైన ఐస్క్రీముల వరకు, స్వీట్లు, పేస్ట్రీలు.. వివిధ రకాల వంటకాలలో ఇవి మేళవించడం విశేషం. వీలైనన్ని రూపాల్లో వెరైటీ డిష్లను తయారు చేసేందుకు ఉపయోగించ గల ఏకైక పండుగా సీతాఫలాన్ని చెప్పొచ్చు. ముఖ్యంగా సీతాఫల్ రబ్డీ అనేది సిటీ రెస్టారెంట్స్లో బాగా ఫేమస్. ఈ నేపథ్యంలో నగరంలో సీతాఫల్ రుచులు అందుబాటులో ఉన్న కొన్ని ప్రదేశాల గురించి.. అబిడ్స్లోని సుల్తాన్ బజార్లో ఉన్న మయూర్ జ్యూస్ సెంటర్ సీతాఫలం రుచులకు ఫేమస్. ముఖ్యంగా నిండుగా గుజ్జుతో ఉన్న సీతాఫల్ జ్యూస్ ఇక్కడ క్రీమీగా రుచికరంగా ఉంటుందనేది ఫ్రూట్ లవర్స్ మాట. సికింద్రాబాద్, బండ్లగూడ, టోలిచౌకిలలో ఉన్న నైస్ జ్యూస్ సెంటర్ కూడా సీతాఫల వెరైటీలకు పేరొందింది. భిన్న రకాల పండ్ల పేరిట మలాయ్లను అందించడంలో ప్రసిద్ధి చెందిన ఈ సెంటర్ సీతాఫల్ మలైని కూడా అందిస్తోంది.సీతాఫల్.. వైరల్.. ఇటీవలే సీతాఫలం రుచి, దాని ఆకారంలో రుచికరమైన వంటకాన్ని ప్రముఖ భారతీయ పేస్ట్రీ చెఫ్ తేజస్వి చందేలా రూపొందించారు. ఈ వంటకం తయారీ వీడియో ఇన్స్ట్రాగామ్ రీల్ ఆన్లైన్లో అద్భుతమైన ఆదరణ పొందింది. ఈ విషయంలో తనకు ఫ్రెంచ్ చెఫ్ సెడ్రిక్ గ్రోలెట్ ప్రేరణగా పేర్కొంది. అతడు పండ్లను పోలి ఉండే డెజర్ట్ల తయారీకి ప్రసిద్ధి చెందాడు. పలువురు హోమ్ మేడ్ సీతాఫల్ బర్ఫీ, హల్వా, ఖలాఖండ్ కూడా తయారు చేస్తున్నారు. ఆన్లైన్ ద్వారా ఆర్డర్లపై అందిస్తున్నారు. జూబ్లీహిల్స్తో పాటు పలు ప్రాంతాల్లో ఉన్న నేచురల్ ఐస్క్రీమ్స్ కూడా చవులూరించే కస్టర్డ్ యాపిల్ రుచులకు కేరాఫ్. సీజనల్ స్పెషల్ సీతాఫల్ ఐస్ క్రీం ఇక్కడ ఫేమస్. బంజారాహిల్స్లోని రోడ్ నెం.13లో ఉన్న లె టెసోరోలో ఓ ప్రత్యేక సీతాఫల్ రుచి అందుబాటులో ఉంది. సీతాఫల్ సోఫుల్ జార్ పేరిట అందించే ఈ డిసర్ట్.. వావ్ అనిపిస్తుంది. జూబ్లీహిల్స్లో రోడ్ నం.36లో ఉన్న కృష్ణపట్నం రెస్టారెంట్కి సీతాఫల్ లవర్స్ ఓ రౌండ్ కొట్టొచ్చు. ఇక్కడి కస్టర్డ్ యాపిల్ డిలైట్ కృష్ణపట్నం డిలైట్గా పేరొందింది. కొండాపూర్ లోని తారా– సౌత్ ఇండియన్ కిచెన్ కూడా ఈ సీజనల్ ఫ్రూట్ని వడ్డిస్తోంది. ఈ సీజన్లో తారాస్ సీతాఫల్ రబ్డీని రుచి చూడటం సిటీలోని ఫుడ్ లవర్స్కి ఓ అలవాటు. బంజారాహిల్స్లో ఉన్న సీతాఫల్ ఫ్రెష్ జ్యూస్ తన పేరులోనే ఈ ఫలాన్ని ఇముడ్చుకోవడంతో పాటు పలు రకాల మిల్క్ షేక్స్లోనూ మేళవిస్తోంది. సీతాఫలాన్ని ఇష్టపడేవారి కోసం మిల్క్ షేక్లతో సహా వివిధ రకాల కస్టర్డ్ యాపిల్ డెజర్ట్లను అందిస్తోంది. -
నడుం నొప్పి తట్టుకోలేక, ఎనిమిది కప్పల్ని మింగేసింది... కట్ చేస్తే
ఎవరో ఏదో చెప్పారని, అశాస్త్రీయమైన వైద్య విధానాల్ని, పద్ధతుల్ని అవలంబించేవారికి ఇది షాకింగ్ న్యూస్. ఎన్నాళ్లుగానో వేధిస్తున్న నడుం నొప్పిని తట్టుకోలేక చైనాకు చెందిన ఒక వృద్ధురాలు పాత ఆచారాన్ని పాటించి ప్రాణాల మీదకు తెచ్చుకుంది. విషయం ఏమిటంటే.. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ప్రకారం తూర్పు చైనాలోని 82 ఏళ్ల వృద్ధురాలు జాంగ్ హెర్నియేటెడ్ డిస్క్తో బాధపడుతోంది . ఈ బాధను భరించలేక బతికున్న కప్పలను మింగేసింది.ఒకటీ రెండూ కాదు ఏకంగా ఎనిమిందింటిని మింగింది. ఇలా సజీవ కప్పలను మింగడం వల్ల వెన్నునొప్పి తగ్గుతుందని స్థానికంగా ప్రచారంలో ఉన్న విషయాన్ని నమ్మి ఇలాచేసినట్టు తెలుస్తోంది.నడుం నొప్పి తగ్గలేదు సరికదా, తీవ్రమైన కడుపునొప్పితో ఆసుపత్రి పాలైంది. విషయం తెలిసి వైద్యులే నివ్వెర పోయారు. చాలాకాలంగా హెర్నియేటెడ్ డిస్క్తో బాధపడుతున్న జాంగ్, అసలు విషయం చెప్ప కుండానే తనకు కప్పలు కావాలని కుటుంబ సభ్యులను కోరింది. ఇలా మొదటి రోజు మూడు కప్పలను, మరుసటి రోజు ఐదు కప్పలను సజీవంగా మింగేసింది. దీంతో క్రమంగా పరిస్థితి క్షీణించడంతో అసలు విషయం కుటుంబ సభ్యులకు తెలిపింది. దీంతో వారు వైద్యులను సంప్రదించారు. వైద్యుల ప్రకారం ఆమె పొట్టలో పరాన్నజీవి సంక్రమణను కనుగొన్నారు. ఆక్సిఫిల్ కణాలు భారీగా పెరిగాయి. ముఖ్యంగా కప్పలలో సాధారణంగా కనిపించే టేప్వార్మ్ లార్వా స్పార్గానమ్తో సహా, ఇతర బాక్టీరియా ఉనికిని వైద్యులు నిర్ధారించారు. నడవలేని స్థితిలో రెండు వారాల పాటు చికిత్స తీసుకుని ఎట్టకేలకు ఇంటికి చేరింది సజీవంగా కప్పలను మింగడం వల్ల రోగి జీర్ణవ్యవస్థ దెబ్బతిని, పరాన్నజీవులు చేరాయి ఆసుపత్రి వైద్యుడు తెలిపారు.నోట్ : ఆరోగ్య చిట్కాలు చిట్కాలు మాత్రమే అని గమనించాలి.అవి పరిష్కారం ఎంతమాత్రం కావు. అందులోనూ సుదీర్ఘ కాలంలో బాధపడుతున్న వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకోవడం చాలా ఉత్తమం. లేదంటే మొదటికే మోసం రావచ్చు. -
84 ఏళ్ల వయసులో తల్లి, కూతురి వయసు మాత్రం అడక్కండి: గుర్తుపట్టారా!
ప్రముఖ యాంకర్ సుమ కనకాల గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఏళ్ల తరబడి టీవీ షోలలో తన యాంకరింగ్తో అలరిస్తోంది. ఒక్క చేత్తో టీవీ షోలు, మరో చేత్తో సినిమా ఈవెంట్లు, విదేశీ టూర్లతో నిరంతరం బిజీగానే ఉంటుంది. అందర్నీ మెప్పించే వాక్చాతుర్యం, ఛలోక్తులు, ఎక్కడలేని ఎనర్జీతో అభిమానుల విశేషాభిమానం, పాపులారిటీతో పాటు చేతి నిండా సంపాదనే. ఇది చాలదన్నట్టు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్గా ఉంటూ అభిమానులకు ప్రేరణగా నిలుస్తూ ఉంటుంది.తాజాగా 84 ఏళ్ల తన మాతృమూర్తి వీడియోను ఇన్స్టాలోప్టె్ చేసింది. దీంతో ఇది అభిమానుల మనసు దోచుకుంటోంది.నెట్టింట వైరల్ అవుతున్న ఈ వీడియోలో సుమ తల్లి 84 వయస్సులో కూడా ఎక్సర్సైజ్లు చేస్తూ ఉండటం విశేషం. ‘84 ఏళ్ల మదర్, వెర్సస్ డాటర్’ అనే క్యాప్షన్తో సమ వీడియో పోస్ట్ చేసింది. అయితే 84 ఏళ్ల వయసులో తల్లి అంటూ తల్లి వయసు చెప్పింది గానీ, తన వయసు మాత్రం చెప్ప లేదు. పైగా మీకు తోచినంత అని చమత్కరించింది. View this post on Instagram A post shared by Suma Kanakala (@kanakalasuma)ఈ ఏజ్లో కూడా అమ్మ ఫిట్నెస్ గ్రేట్ అని నెటిజన్లు కామెంట్స్ చేయగా, మీ ఏజ్ 62, 28 ..48? అంటూ మరికొందరు ఫన్నీగా కమెంట్స్ చేశారు. -
రెండేళ్ల శ్రమ ఒక మినిట్లో : భారీ కాయంనుంచి సన్నగా వైరల్వీడియో
అధిక బరువుతో బాధపడే వాళ్లు తీవ్రమైన క సరత్తు చేయాల్సిందే. గుట్టలకొద్దీ పేరుకు పోయిన కొవ్వు కరగాలంటే చెమట చిందించాల్సిందే. దీనికి కొందరికి రోజులు, నెలలు సరిపోవు. సంవత్సరాల తరబడి కృషి చేయాలి. ఏదో నాలుగు రోజులో, నెలలో చేసి నావల్ల కాదు చేతులెత్తేయకూడదు. ఓపిగ్గా ప్రయత్నించాలి. అప్పుడు అనుకున్న శరీరాకృతి సాధ్యమవుతుంది. ఇదే నిరూపించిందో యువతి. దీనికి సంబంధించిన వీడియో ట్విటర్లో వైరల్గా మారింది. ఈ వెయిట్ లాస్ జర్నీ వీడియో ఎక్స్లో సుమారు 60లక్షల వ్యూస్ను సాధించింది. అద్భుతం, అమోఘం అంటూ చాలా మంది ఆమెను అభినందించగా, అయితే దీనిపై కొంతమంది అనుమానాలు కూడా వ్యక్తం చేశారు. వీడియో చివర్లో ఆమె స్మార్ట్లుక్ చూసి అందరూ ఆశ్చర్యపోయారు. అంత భారీగా బరువు తగ్గినపుడు, చర్మం వేలాడుతూ ఉంటుంది.అలా లేదేమిటి? అని కొందరు, బహుశా శస్త్రచికిత్స చేయించుకొని ఉండవచ్చు అని కొందరు అభిప్రాయపడ్డారు. దాదాపు నేను కూడా సుమారు 200 పౌండ్లు బరుదు తగ్గాను. చర్మంఅలాగే ఉండిపోయింది. చాలా శస్త్రచికిత్సలు జరగకుండా ఆమె అలా అయ్యే అవకాశం లేదు. అది సాధ్యం కాదని నేను చెప్పడం లేదు, అది ఆమెదేనా అని అనుమానం అని మరో యూజర్ సందేహం వ్యక్తం చేయడం గమనార్హం. Two years of hard work in 1 minute.Impressive!!! pic.twitter.com/QP5QubvmwJ— MALEEK 1.0 (@Maleekoyibo) October 4, 2025 -
కేఎఫ్సీలో కంపుకొట్టే చికెన్ బర్గర్? వీడియో చూస్తే వాంతులే!
ప్రముఖ ఫాస్ట్ ఫుడ్ చెయిన్ కేఎప్సీ (KFC)మరోసారి చిక్కుల్లో పడింది. బెంగళూరు ఔట్లెట్లో కుళ్లిపోయినచికెన్ వడ్డించారనే ఆరోపణలు గుప్పుమన్నాయి. దీనికి సంబంధించి ఒక పోస్ట్ ఎక్స్లో వైరల్గా మారింది. వివరాలు ఇలా ఉన్నాయి..బెంగళూరుకు చెందిన ఒక కస్టమర్ కేఎఫ్సీపై విమర్శలు గుప్పిస్తూ పోస్ట్ చేసిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీని ప్రకారం బెంగళూరు(Bangalore) కోరమంగళ అవుట్లెట్లో ఉన్న KFCలో ఒక మహిళా కస్టమర్ హాట్ & స్పైసీ చికెన్ జింజిర్ బర్గర్ ఆర్డర్ చేశారు. దాంట్లోని మాంసం కుళ్లి భరించలేని వాసన వచ్చింది. దీంతో దాన్ని రీప్లేస్ చేయమని అడిగారు. కానీ రెండోసారి కూడా దుర్వాసనతో చెడిపోయిన బర్గర్ ఇవ్వడంతో షాక్ అవ్వడం ఆమె వంతైంది.దీంతో ఆమె సిబ్బందిని గట్టి నిలదీయంతో "ఇది కేవలం సాస్ వాసన" తోసిపుచ్చారని తన పోస్ట్లో పేర్కొన్నారు. అంతేకాదు ఈ సమస్యను పరిష్కరించడానికి బదులుగా, సిబ్బంది తన చికెన్ బర్గర్ను వెజిటేరియన్తో భర్తీ చేయడానికి ప్రయత్నించారని పేర్కొన్నారు. కోరమంగళ కేఎఫ్సీ అవుట్లెట్లో తాను క్రమం తప్పకుండా అదే బర్గర్ను ఆర్డర్ చేస్తానని , ఇంతకు ముందెపుడూ ఇలాంటి పరిస్థితి రాలేదని ఆమె వెల్లడించించింది. అంతేకాదు ఈ వివాదంతో కస్టమర్లు వంటగదిని చూడాలని డిమాండ్ చేశాడు. దీనికి మొదట అంగీకరించని సిబ్బంది, రాత్రి 10 గంటల తర్వాత ప్రవేశం లేదని, మేనేజర్ అందుబాటులో లేరని సిబ్బంది అనేక సాకులు చెప్పారు.చివరికి అనుమతించారు. దీంతో అక్కడి దృశ్యాల్నిచూసి జనం షాకయ్యారని తన పోస్ట్లో ఆరోపించింది.అంతా కలుషితం, మురికి వాసన, కోల్డ్ స్టోరేజ్ ప్రాంతంలో దుర్వాసన వెదజల్లే మాంసం, బూజు పట్టిన, తుప్పు పట్టిన షీట్లు, మరకలు ఉమ్మి గుర్తులు ఉన్నాయంటూ పేర్కొంది. (పబ్లిక్ టాయిలెట్స్లో హ్యాండ్ డ్రైయర్ వాడుతున్నారా?)🚨 WARNING: HSR KFC, Bangalore Extremely Unsafe Food 🚨One of our followers has shared a shocking and disturbing experience at the KFC outlet in HSR Layout, Bangalore. She had ordered a Hot & Spicy Chicken Zinger Burger, but the moment she opened it, the stench was unbearable.… pic.twitter.com/yFpIcblaAA— Karnataka Portfolio (@karnatakaportf) October 4, 2025దీనికి సంబంధించి పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు వచ్చిన తర్వాత సిబ్బంది దాదాపు అరగంట పాటు వంటగదిని తాళం వేసి ఉంచారని, ఆ సమయంలో స్విగ్గీ , జొమాటో ఆర్డర్లు పంపడం కొనసాగిందని పోస్ట్ పేర్కొంది. "30-40 డెలివరీలు ఒకే చెడిపోయిన మాంసాన్ని ఉపయోగించి పంపించారని కూడా ఆరోపించారు. మేనేజ్మెంట్ షాకింగ్ రియాక్షన్ఇదిలా ఉంటే మేనేజ్మెంట్ స్పందన అత్యంత షాకింగ్గా ఉంది. తన సొంత కుటుంబానికి అలాంటి ఆహారాన్ని అందిందని అని ఒప్పుకుంటూనే, ఈఫుడ్ ప్రమాణాలకు అనుగుణంగా ఉందని అవుట్లెట్ మేనేజర్ వాదించడం విడ్డూరంగా నిలిచింది.ఈ సంఘటన నెట్టింట విమర్శలకు తావిచ్చింది. పిల్లలతో సహా వెళ్లే కుటుంబాలకు ఇలాంటి ఆహారం వడ్డించడంపై చాలామంది ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘అక్కడ ఇలా జరగడం ఇదే మొదటిసారి కాదు. ఈ సమస్యను చాలాసార్లు ఎదుర్కొన్నా.. అందుకే ఆ అవుట్లెట్కు వెళ్లడం పూర్తిగా మానేశాను. వీలైతే, మీరు మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తే అక్కడి నుండి తినకండి" అని మరొకరు కామెంట్ చేశారు. "ప్రతి రెస్టారెంట్ ఏ సమయంలోనైనా కస్టమర్లు వంటగదిని సందర్శించడానికి అనుమతించాలి. సరైన పరిశుభ్రత పాటించని రెస్టారెంట్లను ఆహార లైసెన్స్ రద్దు చేయడంతో వెంటనే మూసివేయాలి. అని మరొకరు ఆగ్రహం వ్యక్తం చేశారు. పాపులర్ ఆహార డెలివరీ యాప్ల ద్వారా అందించే క్లౌడ్ కిచెన్ల పరిస్థితి ఏంటి ఒకయూజర్ ఆందోళనవ్యక్తం చేశారు.ఇదీ చదవండి: ఎంగేజ్మెంట్ : దేవ కన్యలా అన్షులా కపూర్, అమ్మకోసం అలా..!ఈ సంఘటన నిజమని నిరూపితమైతే, అవుట్లెట్లో పరిశుభ్రత ,ఆహార భద్రత ఆందోళన కలిగించే అంశమే. ఇలాంటి ఆహారం తీసుకుంటే ఫుడ్ పాయిజనింగ్, ఇన్ఫెక్షన్లతో సహా తీవ్రమైన ఆరోగ్య సమస్యలు రావడం ఖాయం. మరి ఈ వివాదం, వీడియోలోని ఆరోపణలపై కేఎఫ్సీ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. -
అవగాహనే ఆయుధం : ఇవిగో కొన్ని లైఫ్స్టైల్ టిప్స్
ప్రపంచవ్యాప్తంగా మహిళలను ఆందోళనకు గురి చేస్తున్న వ్యాధుల్లో రొమ్ముక్యాన్సర్ ఒకటి. మనదేశంలో మహిళల్లో వ్యాప్తి చెందుతున్న క్యాన్సర్లలో, అలాగే మహిళల మరణాలకు కారణమవుతున్న క్యాన్సర్లలోనూ దానిదే అగ్రస్థానం. ఈ క్యాన్సర్ను ఎంత త్వరగా కనుక్కుంటే మహిళల్లో సమర్థ చికిత్స ద్వారా దాన్నుంచి నూటికి నూరు పాళ్లూ పూర్తిగా విముక్తి పొందే అవకాశముంది. ఈ అక్టోబరు నెల ‘రొమ్ముక్యాన్సర్ అవగాహన మాసం’(Breast Cancer Awareness Month 2025). ఈ నేపథ్యంలో రొమ్ముక్యాన్సర్కు కారణాలూ, స్క్రీనింగ్ ప్రాధాన్యం, అందుబాటులో ఉన్న చికిత్స ప్రక్రియల వంటి అనేక అంశాలపై అవగాహన కోసం ఈ కథనం. రొమ్ముక్యాన్సర్ (Breast Cancer) ప్రధానంగా మహిళల రొమ్ముల్లో ఉండే పాలు ఉత్పత్తి చేసే ‘లోబ్యూల్స్’ అనే గ్రంథుల్లో లేదా ఆపాలను నిపుల్ వరకు తీసుకెళ్లేందుకు ఉపయోగపడే ట్యూబుల్లో గానీ పెరిగే అవకాశం ఎక్కువ. ఆ హానికరమైన ట్యూమర్ నుంచి క్యాన్సర్ కణాలు పక్కనే ఉండే లింఫ్ నోడ్స్లోకి ప్రవేశించేందుకు అవకాశముంటుంది. ఒకసారి క్యాన్సర్ కణం లింఫ్ నోడ్స్ లోకి గానీ ప్రవేశిస్తే... అక్కడి నుంచి అది దేహంలోని ఏ ్ర΄ాంతానికైనా విస్తరించే ముప్పు ఉంటుంది. అందుకే ఆలోపే దాన్ని కనుక్కోగలిగితే చికిత్సతో రొమ్ముక్యాన్సర్ను పూర్తిగా నయం చేసే అవకాశముంటుంది. అందుకే రొమ్ముక్యాన్సర్పై అవగాహన పెంచుకునే అవకాశం తప్పనిసరి.రొమ్ముక్యాన్సర్ విస్తృతి ఇది సాధారణంగా మహిళల్లోనే ఎక్కువగా వచ్చే ప్రధానమైన క్యాన్సర్. మహిళల్లోనే వస్తుందన్నంత మాత్రాన పురుషుల్లో దీని ముప్పు ఉండదని కాదు. అయితే పురుషుల్లో ఇది కాస్తంత అరుదు. స్త్రీ పురుష నిష్పత్తి ప్రకారం... ప్రతి 135 మంది మహిళలకు ఒక పురుషుడిలో ఇది కనిపిస్తుంది. పైగా గతంలో ΄ోలిస్తే ఇటీవల పురుషుల్లోనూ ఇది కాస్తంత ఎక్కువగానే కనిపిస్తోంది. దీన్ని బట్టి చూస్తే ఇది పూర్తిగా మహిళలకే పరిమితమని చెప్పడానికి వీల్లేదు.కారణాలూ... ముప్పును పెంచే అంశాలు ఇదమిత్థంగా ఇవే కారణాలంటూ స్పష్టంగా చెప్పలేకపోయినప్పటికీ... రొమ్ముక్యాన్సర్ను అనేక అంశాలు తెచ్చిపెడతాయి. వాటిల్లో కొన్ని... కుటుంబం చరిత్ర : కుటుంబంలో దగ్గరి వారికి రొమ్ము క్యాన్సర్ వచ్చిన దాఖలాలు ఉండటం, అందునా తల్లి, తల్లి సోదరి లాంటి మరీ దగ్గరి బంధువుల్లో రొమ్ముక్యాన్సర్ దాఖలా ఉన్నవాళ్లలో దీని ముప్పు మరింత ఎక్కువ.జన్యుపరమైన ముప్పు : జన్యుపరంగా బీఆర్సీఏ 1, బీఆర్సీఏ 2 అనే జన్యుపరమైన మ్యుటేషన్ జరిగినవాళ్లలో రొమ్ముక్యాన్సర్ తప్పక వచ్చే అవకాశం.త్వరగా రుతుస్రావం రావడం : బాలికలు చాలా త్వరగా రుతుస్రావం కావడం (అంటే 12 ఏళ్ల లోపే బాలికలు రుతుస్రావం మొదలుకావడం) అలాగే రుతుక్రమం ఆగడం చాలా ఆలస్యంగా జరిగినవాళ్లలో రొమ్ముక్యాన్సర్ ముప్పు (రిస్క్) ఎక్కువ. సంతానలేమి / ఆలస్యంగా సంతానం : సంతానం లేని మహిళలూ, అలాగే చాలా ఆలస్యంగా గర్భవతులైన వాళ్లలో. అస్తవ్యస్తమైన జీవనశైలి / దురలవాట్లు : అంతగా క్రమశిక్షణ లేకుండా అనారోగ్యకరమైన జీవనశైలితో ఉండేవాళ్లకూ, అలాగే పొగతాగడం, మద్యం వంటి అలవాట్లు ఉన్నవాళ్లలో (ప్రధానంగా విదేశీ మహిళల్లో ఈ తరహా అలవాట్లు ఎక్కువ). రేడియేషన్కు గురైన మహిళల్లో : తాము యువతులుగా ఉన్నప్పుడు ఏవైనా కారణాలతో రేడియేషన్కు చాలా ఎక్కువగా ఎక్స్పోజ్ అయిన మహిళల్లో.కుటుంబ చరిత్ర, ఇతర అంశాలూ పూర్తి కారణాలు కాదు... అయితే ఈ సందర్భంగా ఒక ప్రధానమైన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. పైన పేర్కొన్న అంశాలనే ప్రామాణికంగా తీసుకోవడమూ పూర్తిగా సాధ్యం కాదు. ఎందుకంటే వ్యాధి నిర్ధారణ జరిగిన కేసుల్లో దాదాపు 70శాతం మందిలో వాళ్ల కుటుంబంలో రొమ్ముక్యాన్సర్ ఉన్న దాఖలాలు లేకపోవడం ఒక వైరుధ్యం. అలాగే నిర్దిష్టంగా ఫలానా అంశమే రొమ్ముక్యాన్సర్కు కారణమవుతుందని లేదు. చాలా సందర్భాల్లో ఎలాంటి రిస్క్ఫ్యాక్టర్స్ లేనివాళ్లలోనూ ఇది కనిపించడమూ మామూలే. చివరగా... గత మూడు దశాబ్దాల్లో రొమ్ముక్యాన్సర్ చికిత్సల్లో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి. దాంతో త్వరగా కనుగొంటే రొమ్ముక్యాన్సర్ను పూర్తిగా నయం చేయడం ఇప్పుడు సాధ్యమవుతోంది. అయితే రొమ్ముక్యాన్సర్ చికిత్స వరకూ వెళ్లకుండానే తమ సొంత దేహంపై పూర్తి అవగాహనతోనూ, ఆరోగ్యకరమైన జీవనశైలిలోనూ దాన్ని నివారించుకోవడం చాలా మేలు అనేది వైద్య నిపుణుల సూచన.అపోహలూ ఎక్కువేరొమ్ముక్యాన్సర్ విషయంలో అపోహలూ ఎక్కువే. ఉదాహరణకు రొమ్ముల్లో గడ్డలు, నీటితిత్తులు ఉన్నప్పుడు అది క్యాన్సరే అని చాలామంది అ΄ోహ పడుతుంటారు. రొమ్ముల్లో గడ్డలూ, నీటితిత్తులూ కనిపించడం చాలా సాధారణం. ఇలాంటివారిలో 80 శాతం కేసుల్లో అది హానికరం కానివే. వాటినే ‘బినైన్’ గడ్డలుగా చెబుతారు. కేవలం 20 శాతం కేసుల్లోనే అవి హానికరమైన (మేలిగ్నెంట్) క్యాన్సర్గా బయటపడతాయి. అందుకే రొమ్ముల్లో గడ్డలు కనిపించగానే అది తప్పనిసరిగా క్యాన్సర్ అని ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అలా కనిపించేవాటిల్లో చాలావరకు అంటే దాదాపు 80 శాతం ఎలాంటి హానీ కలిగించనివే. కాకపోతే గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే... రొమ్ముల్లో అలాంటి గడ్డలు కనిపించగానే వీలైనంత త్వరగా ఒకసారి డాక్టర్కు చూపించి, అవి హానికరం కాదని వారు నిశ్చయంగా చె΄్పాక ఇక నిశ్చింతగా ఉండవచ్చు. అలాగే పెద్దసైజు రొమ్ములు ఉన్నవారికి ఈ ముప్పు ఎక్కువ అనేది మరో అపోహ. రొమ్ము పెద్దగా ఉండటానికీ, క్యాన్సర్కూ ఎలాంటి సంబంధమూ ఉండదు.చదవండి: స్వయం కృషితో ఎదిగి చరిత్ర సృష్టించారు : టాప్ టెన్ రిచెస్ట్ విమెన్ స్క్రీనింగ్ పరీక్షలు అన్నిటికంటే ప్రధానం...రొమ్ము క్యాన్సర్ను ఎంత త్వరగా కనుక్కుంటే దాన్నుంచి అంత పూర్తిగా విముక్తం కావడం సాధ్యమనే విషయాన్ని బట్టి బ్రెస్ట్క్యాన్సర్ విషయంలో స్క్రీనింగ్ పరీక్షలకు ఉన్న ప్రాధాన్యమేమిటన్నది వివరించవచ్చు. దాదాపు 35 ఏళ్లు దాటిన ప్రతి మహిళా, అలాగే కుటుంబంలో రొమ్ముక్యాన్సర్ ఉన్న మహిళలతో పాటు రిస్క్ఫ్యాక్టర్స్ ఉన్న స్త్రీలు ఏడాదికోమారు లేదా తమ డాక్టర్ చెప్పిన విధంగా స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవాలి. అలాగే ప్రతి మహిళా తమ రొమ్ములను పరీక్షించుకునే ‘సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్’ వివరాలు తెలుసుకుంటూ స్నానం సమయంలో వాటిని పరీక్షించుకుంటూ ఉండాలి. అందువల్ల తొలిదశలోనే రొమ్ముక్యాన్సర్ను కనుక్కోవడం సాధ్యం... తద్వారా దాన్నుంచి పూర్తిగా విముక్తం కావడమూ సాధ్యమే. ఈ లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం వద్దు... ఈ కింద పేర్కొన్న లక్షణాలు కనిపించినప్పుడు వాటిని అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. అవేమిటంటే... రొమ్ము లేదా చంకల్లో నొప్పిలేని గడ్డ (లంప్) కనిపించడం. రొమ్ము సైజు లేదా ఆకృతిలో మార్పు రావడం. నిపుల్ నుంచి ఏదైనా ద్రవం స్రవిస్తుండటం. రొమ్ము చర్మంపై ఏవైనా మార్పులు అంటే గుంటపడటం లేదా చర్మం మందంగా మారడం వంటివి. చాలా అరుదుగా రొమ్ముక్యాన్సర్ వచ్చినవాళ్లలో రొమ్ములో లంప్, ఒకవేళ లంప్ లేకుండానే రొమ్ముపై చర్మం పొరలు పొరలుగా ఊడుతూ ఉండటం, రొమ్ము ఎర్రబారడం, వాపు వంటి లక్షణాలు చాలా అరుదుగా కనిపించవచ్చు. నివారణ/చికిత్స...క్యాన్సర్కు కారణమయ్యే కొన్ని అంశాల్లో మానవ నియంత్రణ సాధ్యం కాదు. ఉదాహరణకు పెరుగుతుండే వయసు. అయితే మన ప్రమేయంతో రొమ్ముక్యాన్సర్ను చాలావరకు నివారించవచ్చు. ఉదాహరణకు అన్ని పోషకాలు ఉండే సమతులాహారాన్ని తీసుకోవడం; క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం; ప్రసవం తర్వాత పిల్లలకు చనుబాలు పట్టించడం; ఆల్కహాల్, పొగతాగడం వంటి దురలవాట్లకు దూరంగా ఉండటం, బరువును నియంత్రణలో ఉంచుకోవడం వంటి జాగ్రత్తలతో రొమ్ము క్యాన్సర్ను చాలావరకు నివారించవచ్చు. అయితే ఇప్పుడు కీమోథెరపీ, రేడియేషన్ థెరపీ, శస్త్రచికిత్సలతోపాటు అనేక ఇతరత్రా ప్రక్రియలతో రొమ్ముక్యాన్సర్కు సమర్థమైన చికిత్స సాధ్యం.నిర్వహణ: యాసీన్ -
బ్యాక్ పెయిన్ ఉంటే...స్వీట్ తిన్నా, టీ తాగినా తంటాలే!
ఇప్పుడు అత్యధికులను వేధిస్తున్న నొప్పుల్లో బ్యాక్ పెయిన్ ఒకటి. ఎక్కువ సేపు కూర్చుని చేసే పనుల వల్ల కావచ్చు వాహనాల డ్రైవింగ్ వల్ల కావచ్చు అనేక మంది బ్యాక్ పెయిన్తో బాధపడుతున్నారు. మాత్రలు, ఫిజియోథెరపీలతో కూడా ఫలితం కనిపించక ఆవేదన చెందుతున్నారు. ఈ నేపధ్యంలో ... తీసుకునే ఆహారం కూడా ఈ సమస్య ఎదుర్కుంటున్న వారి వెన్ను నొప్పిపై ప్రభావం చూపిస్తుంది అనే విషయం తెలుసుకోవాలి అంటున్నారు వైద్యులు. వారు చెబుతున్న ప్రకారం.. డిస్క్ అనే పదం ’ఇంటర్ వెర్టెబ్రే’ కు సంక్షిప్త రూపం. , ఈ డిస్క్లు వెన్నెముక (వెన్నుపూస) ఎముకలను వేరు చేసే స్పాంజి కుషన్లు అని చెప్పొచ్చు. ఈ డిస్క్లు షాక్, శోషణను అందిస్తాయి, వెన్నెముకను స్థిరంగా ఉంచుతాయి వెన్నుపూస కదలికను అనుమతించడానికి ’పివోట్ పాయింట్లు’ ఇస్తాయి. వీటిలో ఏర్పడే ఇబ్బందులే వెన్నునొప్పికి దారి తీస్తాయి. అయితే చక్కెరతో పాటు అసమతుల్య ఆహారం డిస్క్ రికవరీకి ఆటంకం కలిగిస్తాయి, వెన్నునొప్పిని మరింత తీవ్రతరం చేస్తాయి కాబట్టి పోషకాహారం తప్పనిసరి అంటున్నారు హైదరాబాద్కి చెంఇన ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ ఒబైదుర్ రెహమాన్, ఈ సందర్భంగా ఆహారం లో మార్పు చేర్పులు చేసుకోకపోతే వెన్నునొప్పి నుంచి కోలుకోవడం కష్టమని ఈ ఆర్థోపెడిక్ సర్జన్ విడుదల చేసిన ఓ వీడియోలో స్పష్టం చేశారు. ఈ అలవాట్లు వెన్నునొప్పిని ఎలా ప్రభావితం చేస్తాయో డిస్క్ సమస్య నయం కాకుండా చేసే ఆ 4 ఆహారపు అలవాట్లు... ఏమిటంటే...చక్కెర లేదా చక్కెరతో టీచక్కెర కలిపిన స్వీట్లు అధికంగా తీసుకోవడం బ్యాక్ పెయిన్ ఉన్నవారికి చేటు చేస్తుంది. అంతేకాదు చక్కెర కలిపిన టీ, కాఫీలు సైతం రోజువారీ పలు దఫాలుగా తాగడం వల్ల నడుము ప్రాంతం, శరీరంలో మంట వస్తుంది డిస్క్ సమస్య నయం కాకుండా నిరోధిస్తుంది.వేయించిన, ప్రాసెస్ చేసిన ఆహారాలువేపుళ్లు చాలా రకాలుగా ఆరోగ్యానికి హానికరం అని తెలిసిందే. అదే విధంగా వేయించిన లేదా ప్రాసెస్ చేసిన ఆహారాన్ని తీసుకున్నప్పుడు, అది కూడా నడుముకి దిగువ భాగంలో మంటను కలిగిస్తుంది, డిస్క్ సమస్య నయం కాకుండా నిరోధిస్తుంది,తక్కువ ప్రోటీన్ ఆహారంతక్కువ ప్రోటీన్ ఆహారం లేదా అధిక కార్బ్ లేదా అధిక కొవ్వులు ఉన్న ఆహారం తీసుకున్నప్పుడు, డిస్క్ కోలుకునే సమయంలో తగినంత పోషకాహారాన్ని పొందదు. అధిక ప్రోటీన్ ఆహారం డిస్క్ సమస్యల పరిష్కారంలో చికిత్సకు మేలు చేస్తుంది. అధిక బెడ్ రెస్ట్చివరగా, ఎక్కువ సేపు పడుకోవడం కూడా మంచిది కాదు. అధిక బెడ్ రెస్ట్లో ఉంటూ, రోజువారీ నడకలకు సమయం కేటాయించకపోతే కూడా, డిస్క్ కోలుకునేందుకు అవసరమైన పోషకాహారాన్ని పొందలేదు. నేషనల్ స్పైన్ హెల్త్ ఫౌండేషన్ ప్రకారం, కాల్షియం విటమిన్ డి వంటి ముఖ్యమైన పోషకాలతో కూడిన సమతుల్య ఆహారం వెన్నెముక ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ పోషకాలు ఎముక సాంద్రత, కండరాల పనితీరు మొత్తం కణజాల ఆరోగ్యానికి మద్దతు ఇస్తాయి బోలు ఎముకల వ్యాధి, క్షీణించిన డిస్క్ వ్యాధి దీర్ఘకాలిక వెన్నునొప్పి ప్రమాదాన్ని తగ్గిస్తాయి. -
పగలూరాత్రి తేడా లేకుండా బిర్యానీలు.. ఇలాగైతే కష్టమే!
ఒకప్పుడు వారంలో ఒకటి, రెండు రోజులు మాత్రమే మాంసాహారం తీసుకునే వాళ్లు. కొందరు ఏదైనా ప్రత్యేక సందర్భంగా మాత్రమే మాంసాహారం తినేవాళ్లు. ఇప్పుడు పరిస్థితి మారింది. ప్రతిరోజూ మాంసాహారం తీసుకుంటున్న వారిని చూస్తున్నాం. అంతేకాదు అర్ధరాత్రి 12 గంటలు దాటిన తర్వాత కూడా మాంసాహారం లాగించేస్తున్నారు. అలాంటి వాళ్లు జబ్బులను కూడా కొనితెచ్చుకుంటున్నట్లు వైద్యులు చెపుతున్నారు. మాంసాహారం అధికంగా తీసుకునే వారిలో జీర్ణకోశ వ్యాధులతో పాటు, గుండెజబ్బులు, అధిక కొల్రస్టాల్, ఒబెసిటీతో పాటు, కొన్ని రకాల క్యాన్సర్లు కూడా సోకుతున్నాయంటున్నారు. వారంలో ఒకటి, రెండుసార్లు మాత్రమే మాంసాహారం తీసుకోవాలని సూచిస్తున్నారు. ఇవే నిదర్శనం లబ్బీపేటకు చెందిన రాజేష్ వారంలో ఐదు రోజులు స్నేహితులతో కలిసి అర్ధరాత్రి ఫుడ్కోర్టుల్లో బిర్యానీలు లాగించేస్తుంటాడు. ఇటీవల అర్ధరాత్రి బిర్యానీ తిని ఇంటికి వెళ్లిన తర్వాత కడుపులో తీవ్రమైన మంట రావడంతో ఆస్పత్రికి వెళ్లాడు. ఎండోస్కోపీ చేయగా అల్సర్స్ వచ్చినట్లు నిర్ధారించారు. పటమటకు చెందిన అన్వర్ ఎక్కువగా మటన్ తీసుకుంటుంటాడు. ఇటీవల ఛాతీలో నొప్పి రావడంతో ఆస్పత్రిలో చేరాడు. గుండె రక్తనాళంలో పూడికలు ఉన్నట్లు నిర్ధారించారు. కొల్రస్టాల్ స్థాయిలు కూడా ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. ఇలా వీరిద్దరే కాదు కడుపు ఉబ్బరం, వాంతులు, విరోచనాలు, కడుపులో మంట వంటి జీర్ణకోశ సమస్యలతో వైద్యుల వద్దకు ప్రజలు పరుగులు పెడుతున్నారు. ఆరోగ్యకరమైన ఆహారమిలా.. మాంసాహారాన్ని మితంగా తీసుకోవాలి. వారానికి ఒకటీ, రెండు సార్లు మాత్రమే తీసుకోవడం మంచిది. కొవ్వు తక్కువగా ఉండే స్కిన్లెస్ చికెన్, చేపలు వంటివి ఎంచుకోవాలి. పండ్లు, కూరగాయలు, చిరుధాన్యాలు ఎక్కువగా తీసుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ద్వారా మాంసాహారం వల్ల కలిగే దు్రష్పభావాలను తగ్గించవచ్చు. వేపుడు కంటే ఉడికించిన కూరలు తినడం మేలు. జంక్ఫుడ్స్కు దూరంగా ఉండాలి, లేట్ నైట్ మాంసాహారం తీసుకోకూడదు. ఆహారం తీసుకోవడానికి సమయపాలన పాటించాలి. ప్రతిరోజూ ఒకే సమయానికి ఆహారం తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. సమస్యలు ఇలా... మటన్, బీఫ్, ఫోర్క్ వంటి రెడ్మీట్లో జీర్ణకోశ సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. రెడ్మీట్ తినేవారిలో జీర్ణం కావడానికి అధిక సమయం పట్టడంతో పాటు, పేగుపై వత్తిడి పెరుగుతుంది. నిల్వ ఆహారం తినడం వలన కడుపు ఉబ్బరం, వాంతులు, విరోచనాలు అయ్యే అవకాశం ఉంది. రంగు, రుచి కోసం మాంసాహారంలో కొన్ని రకాల రంగులు వాడుతుంటారు. వాటి కారణంగా క్యాన్సర్లు పెరుగుతున్నాయి. సమయ పాలన లేకుండా జంక్ఫుడ్స్ తీసుకోవడం వలన జీర్ణకోశ సమస్యలతో పాటు, క్యాన్సర్లకు దారి తీస్తున్నాయి. మధ్యాహ్నం 3 గంటలకు, రాత్రి 12 గంటలకు ఆహారం తీసుకోవడం మంచిది కాదు, ఆహారం తీసుకోవడంలో సమయపాలన పాటించాలి. మాంసాహారంలో సంతృప్త కొవ్వులు ఎక్కువగా ఉంటాయి. ఇవి రక్తంలో చెడు కొలె్రస్టాల్ స్థాయిలను పెంచుతాయి, దీనివల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. మాంసాహారంలో కేలరీలు ఎక్కువగా ఉండటం వల్ల, అధికంగా తింటే శరీర బరువు పెరుగుతుంది. జీర్ణకోశ సమస్యలు పెరిగాయి అధిక మాంసాహారం తీసుకునే వారిలో జీర్ణకోశ సమస్యలతో పాటు, గుండె జబ్బులు, ఒబెసిటీ సమస్యలు వస్తాయి. ముఖ్యంగా రెడ్మీట్ తినే వారిలో పేగులపై వత్తిడి పెరుగుతుంది. నిల్వ ఆహారం, జంక్ఫుడ్స్ తినే వారిలో అల్సర్స్, క్యాన్సర్లు సోకే అవకాశం ఉంది. కడుపు ఉబ్బరం, వాంతులు, విరోచనాలు, కడుపులో మంట వంటి సమస్యలతో మా వద్దకు ఎక్కువగా వస్తున్నారు. సమయపాలన లేని ఆహారపు అలవాట్లు జీర్ణ ప్రక్రియపై తీవ్ర ప్రభావం చూపుతాయి. పళ్లు, కూరగాయలు, చిరుధాన్యాలకు ఆహారంలో ప్రాధాన్యత ఇవ్వాలి. – డాక్టర్ వీర అభినవ్ చింతా, గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్, సెంటినీ విజయవాడ -
డైపర్.. సైజ్ గురించి పట్టించుకుంటున్నారా?
బిడ్డ పుట్టిన తర్వాత తల్లిదండ్రులు తీసుకుంటున్న జాగ్రత్తలలో చిన్నారికి ఎలాంటి ఆహారం ఇవ్వాలి, ఎలాంటి బట్టలు కొనాలి, వాళ్లని ఎలా చూసుకోవాలి.. వంటి వాటితోపాటు వారికి వాడవలసిన డైపర్ల గురించి కూడా ఆలోచించాల్సిన అవసరం వచ్చిందిప్పుడు. ఎందుకంటే పిల్లల సంరక్షణలో డైపర్ల సైజు కూడా చాలా ముఖ్యం.తల్లిదండ్రుల తమ పిల్లలకు వేసే డైపర్లను చాలా జాగ్రత్తగా ఎంచుకోవాలి. టేప్–స్టైల్ లేదా ప్యాంట్–స్టైల్లో తమ బిడ్డకు ఏ స్టైల్ డైపర్ సరైనదో అని తెలుసుకోవాలి. ఎందుకంటే, పిల్లలకు సరైన డైపర్ వేయక΄ోతే.. అది వారి కోమలమైన చర్మంపై ప్రభావం చూపిస్తుంది. డైపర్లలోనూ ఎన్నో రసాయనాలుంటాయి. ఇవి ఎక్కువ సేపు చర్మాన్ని అంటిపెట్టుకుని ఉండటం వల్ల బిడ్డకు హాని కలిగే ప్రమాదం ఉంది. ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని.. డైపర్ ఎంపికలో జాగ్రత్త వహించాలి.క్లాత్ న్యాపీలు పిల్లలకు చాలా సౌకర్యంగా ఉంటాయి, కానీ వాటిని పదే పదే ఉతకడం తల్లిదండ్రులకు లేదా వారి సంరక్షకులకు కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. అంతే కాకుండా క్లాత్ న్యాపీలను తyì సిన వెంటనే మార్చక΄ోతే పిల్లలకు అసౌకర్యంగా ఉంటుంది. సరైన డైపర్ ఎంపికఅన్ని విషయాల కంటే వారికి వేసే డైపర్ బ్రాండ్ ముఖ్యమైనది. సాధ్యమైనంత వరకు డైపర్ తయారీలో లోకల్ గా దొరికేవి, తెలియని బ్రాండ్ డైపర్లకు బదులు మెరుగైన ఫీచర్లతో తయారు చేసిన బ్రాండెడ్ డైపర్లు వాడటం చిన్నారికి కంఫర్ట్నిస్తుంది.తడి పీల్చుకునేలా... ఎక్కువ సేపుపొడిగా ఉండేలా...పిల్లల మూత్రం, మలం త్వరగా... ఎక్కువ శాతం పీల్చుకునే డైపర్లు ఎంచుకోవాలి. లీక్ అయ్యే డైపర్లకు దూరంగా ఉండండి. లీక్ అయ్యే డైపర్ల వల్ల.. పిల్లల శరీరానికి తేమ అంటుతుంది. పిల్లల చర్మానికి తడి అంటితే వారికి చికాకుగా ఉంటుంది. అంతేకాదు చిన్నారుల చర్మం సున్నితంగా ఉంటుంది. తడి కారణంగా త్వరగా దద్దుర్లు వచ్చే ప్రమాదం ఉంది. పిల్లలకు రాత్రి సమయంలోనూ ఎక్కువ సేపు పొడిగా ఉండే డైపర్లు వేస్తే.. హాయిగా నిద్రపోతారు. వారి చర్మానికి తడి తగిలితే మధ్య రాత్రి ఏడవటం ్ర΄ారంభిస్తారు. దీని దృష్టిలో ఉంచుకుని పొడిగా ఉండే డైపర్లు వేయండి.(Shoaib Malik సానియా మాజీ భర్త మూడో పెళ్లి పెటాకులే..?! వీడియో వైరల్)సరైన సైజ్పిల్లల బరువును బట్టి డైపర్ సైజులు వేర్వేరుగా ఉంటాయి. కాబట్టి డైపర్ కొనడానికి ముందు మీ బిడ్డ బరువు, సైజ్ ను చూసి కొనండి. వారి డైపర్ సైజ్ ప్రతి నెల మారుతుందని గుర్తు పెట్టుకోవడం అవసరం. అందుకే ఒకే సైజ్ డైపర్లు ఇంట్లో నిల్వ ఉంచుకోకండి. డైపర్ లూజ్గా ఉన్నా, బిగువుగా ఉన్న చిన్నారి ఇబ్బంది పడుతుంది. అవి వేసుకోవడానికి ఇష్టపడరు. పిల్లల కోమలమైన చర్మానికి సరిపోయేలా ఉండే సున్నితమైన ఉండే డైపర్లు మాత్రమే ఎంచుకోవాలి -
పబ్లిక్ టాయిలెట్స్లో హ్యాండ్ డ్రైయర్ వాడుతున్నారా?
చాలామంది రెస్టారెంట్లు లేదా సినిమాలకు వెళ్లినప్పుడు అక్కడి టాయిలెట్లలో చేతులు కడుకున్న తర్వాత హ్యాండ్ డ్రైయర్స్ వాడటం మామూలే. కానీ అలా పబ్లిక్ టాయిలెట్లలోని వాష్ బేసిన్లలో హ్యాండ్ వాష్ తర్వాత... అక్కడి డ్రైయర్లు ఉపయోగించి చేతుల్ని ΄పొడిగా చేసుకోవడం అంత మంచిది కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు. కొందరు వైద్యుల సలహా ఏమిటంటే... టాయిటెట్లలో హ్యాండ్వాష్ లేదా లిక్విడ్ సోప్తో చేతులు కడుక్కున్న తర్వాత అవి ఎంతోకొంత శుభ్రమవుతాయి. కానీ అలా శుభ్రమైన చేతుల్ని కాస్తా అక్కడ హ్యాండ్ డ్రైయర్ కింద పెట్టడం వల్ల మళ్లీ అవి కలుషితమయ్యే అవకాశాలు ఎక్కువన్నది ఆరోగ్యనిపుణుల మాట. ఎందుకంటే అది టాయిలెట్ కావడం వల్ల ఎంత లేదన్నా అక్కడి పరిసరాల్లో సూక్ష్మజీవులు, జెర్మ్స్ వంటివి ఉండనే ఉంటాయి. ఇలా మనం డ్రైయర్ కింద చేతులు పెట్టినప్పుడు ఆ డ్రైయర్ తాలూకు ఉష్ణోగ్రత పెద్ద ఎక్కువగా ఏమీ ఉండదు. కేవలం చేతుల్ని పొడిబార్చేందుకు ఉద్దేశించినంతే ఉంటుంది. అంతటి గోరువెచ్చటి ఉష్ణోగ్రతలో సూక్ష్మజీవులు అంతరించి΄ోవనీ, దానికి బదులు అక్కడి గాలిలో ఉండే సూక్ష్మక్రిములు, జెర్మ్స్ మళ్లీ చేతులకు అంటుకు΄ోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. డ్రైయర్కు బదులుగా వ్యక్తిగత హ్యాండ్కర్చిఫ్ వాడటం లేదా అలా స్వతహాగా అరి΄ోయేదాకా వేచిచూడటమే మంచిదని అంటున్నారు. అలాగే కొందరు నిపుణులు చెబుతున్నదేమిటంటే... టాయిలెట్లలోని వాష్బేసిన్ల దగ్గర ఒకసారి సబ్బుతో చేతులు కడుక్కున్న తర్వాత మళ్లీ అక్కడి ఏ ఉపరితలాన్నీ (సర్ఫేస్నూ) తాకకూడదని సూచిస్తున్నారు. చదవండి : ఈ తప్పు మీరూ చేస్తే.. మీ ఆయుష్షు మూడినట్టే! -
ఎడమ వైపు తిరిగి పడుకుంటున్నారా? ఈ విషయం తెలుసా?
ఎడమ వైపు తిరిగి నిద్రపోయే అలవాటు కొందరికి ఉంటుంది. అయితే..ఇప్పటికే గుండె జబ్బులు ఉన్న వారు ఎడమ వైపు తిరిగి అసలు నిద్రపోకూడదు.ఇలా నిద్రపోవడం వల్ల అసిడిటీ రిఫ్లక్స్ తగ్గిపోతుందని కొందరు చెబుతుంటారు. అయితే..హార్ట్ పేషెంట్స్ మాత్రం ఇలా పడుకోవడం మంచిది కాదని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. ఎటువైపు తిరిగి పడుకుంటే మంచిదో తెలుసుకుందాం...ఎప్పుడైతే ఎడమ వైపు తిరిగి నిద్రపోతారో అప్పుడు గుండెపైన ఒత్తిడిపడుతుంది. ఈ ఒత్తిడి కారణంగా గుండె కాస్తంత పక్కకు జరిగినట్టుగా అవుతుంది. అదే సమయంలో గ్రావిటీ కారణంగా కిందకు లాగినట్టుగా అవుతుంది. ఈ రెండింటి మధ్య రాపిడి కారణంగా హృదయ స్పందనలో మార్పు వస్తుంది. అందుకే..గుండె జబ్బులు ఉన్న వారు వీలైనంత వరకూ ఎడమ వైపు తిరిగి నిద్రపోవడాన్ని అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. లేదంటే గుండె జబ్బు లక్షణాలు ఇంకా తీవ్రమవుతాయి. ఇక కుడి వైపునకు తిరిగి నిద్రపోవడం వల్ల ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుందో కూడా తెలుసుకుందాం. ఎప్పుడైతే కుడి వైపు తిరిగి పడుకుంటారో అప్పుడు గుండెపైన ప్రెజర్ ఎక్కువగా పడదు. ఈసీజీలోనూ ఎలాంటి మార్పులు కనిపించవు. అంటే..హార్ట్ రేట్ నార్మల్ గానే ఉన్నట్టు లెక్క. అందుకే హార్ట్ పేషెంట్స్ కుడి వైపునకు తిరిగి నిద్రపోవడమే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. చదవండి: Shoaib Malik సానియా మాజీ భర్త మూడో పెళ్లి పెటాకులే..?! వీడియో వైరల్మీరు ఏ పొజిషన్ లో నిద్రపోతున్నారనే విషయంతో పాటు ఎన్ని గంటల పాటు క్వాలిటీ స్లీప్ ఉంటోందన్నదీ ముఖ్యమే. కుడి వైపు తిరిగి పడుకున్నంత మాత్రాన స్లీప్ క్వాలిటీ ఉన్నట్టే అని అనుకోడానికి వీలులేదు. చాలా మంది 5 గంటల పాటు మాత్రమే నిద్రపోతున్నారు. రాత్రంతా మొబైల్ చూసుకుంటూ కూర్చుంటున్నారు. ఉదమయే ఆఫీస్ హడావుడి కారణంగా త్వరగా నిద్రలేవాల్సి వస్తోంది. ఇలా చేయడం వల్ల మెటబాలిజం దెబ్బ తింటుంది. అప్పటి నుంచి సమస్యలన్నీ మొదలవుతాయి. అందుకే..సరైన విధంగా నిద్ర పట్టేందుకు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది. ఇదీ చదవండి: Nita Amabni క్వీన్ ఆఫ్ దాండియాతో గార్బా స్టెప్పులు : ఉర్రూతలూగిన వేదిక -
ఈ తప్పు మీరూ చేస్తే.. మీ ఆయుష్షు మూడినట్టే!
ఆరోగ్యంగా ఎక్కువ కాలం జీవించాలంటే అనేక అంశాలు పనిచేస్తాయి. సమతులం ఆహారం, ఒత్తిడి లేని జీవితం, సరియైన నిద్ర చాలా అవసరం. దీంతోపాటు మన శరీరంలో అస్సలు నిర్లక్ష్యం చేయకూడదని అవయవం ఒకటి ఉంది. ప్రముఖ మానసిక వైద్యుడు డాక్టర్ డేనియల్ అమెన్ దీనికి సంబంధించి కీలక విషయాలను వెల్లడించారు.మానసిక వైద్యుడు డాక్టర్ డేనియల్ అమెన్ ప్రకారం, ఆరోగ్యం విషయంలో చాలామంది చేసే అతి పెద్ద తప్పు వారి బ్రెయిన్ గురించి పట్టుకోకవడం. మెదడు ఆరోగ్యంపై అవగాహన లేకపోవడం, నిర్లక్ష్యంగా ఉండటం మనిషి ఆయుష్షుమీద ప్రభావం చూపుతుంది. జ్ఞాపకశక్తి, మానసిక స్థితి, నిర్ణయాలు , దీర్ఘాయువును కూడా నియంత్రించే అవయవం అయినా , మెదడు ఆరోగ్యం తరచుగా రోజువారీ జీవితంలో దాని గురించి విస్మరిస్తున్నారు అంటారాయన. తాజాగా దీర్ఘాయువు పరిశోధకుడు డాన్ బ్యూట్నర్తో ఇదే విషయాన్ని ధృవీకరిస్తూ పాడ్కాస్ట్ లైవ్ టు 100 లో మాట్లాడుతూ తన అనుభవాన్ని పంచుకున్నారు. తన కెరీర్లో 2 లక్షలకు పైగా మెదడు స్కాన్లను అధ్యయనం చేసిన డాక్టర్ అమెన్, మెదడుతో సంబంధాన్ని పెంచుకోవడం దాని కనుగుణంగా మలుచుకోవడం చాలా ముఖ్యం అన్నారు.తన సొంత మెదడు స్కాన్ నుండి మేల్కొలుపు కాల్డాక్టర్ అమెన్ ఒక అగ్రశ్రేణి న్యూరోసైన్స్ విద్యార్థిగా మరియు బోర్డు-సర్టిఫైడ్ మనోరోగ వైద్యుడిగా కూడా, 1990ల ప్రారంభం వరకు తాను మెదడు ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేశానని ఒప్పుకున్నారు. తన క్లినిక్లలో బ్రెయిన్ ఇమేజింగ్ను ప్రవేశపెట్టి, 1991లో తన సొంత మెదడును స్కాన్ చేసినప్పుడు, దిగ్భ్రాంతికర ఫలితాలు చూశానని చెప్పుకొచ్చారు.1990 కి ముందు తనకు అధిక బరువు రాత్రిపూట నాలుగు గంటలు మాత్రమే నిద్రపోవడం లాంటి చెడు అలవాట్లు ఉండేవని , తన బ్రెయన్ హెల్త్ గురించి ఎపుడూ ఆలోచించలేదని గుర్తు చేసుకున్నారు. కానీ పరిశోధనలకు ఒక మేల్కొలుపుగా పనిచేశాయని, తన జీవనశైలిని కరెక్ట్ నిద్ర, ఆహారం,రోజువారీ అలవాట్లను మార్చుకున్నట్టు వెల్లడించారు.మెదడు ఆరోగ్యం- దీర్ఘాయువు, "బ్లూ జోన్స్" (ప్రజలు అసాధారణంగా ఎక్కువ కాలం జీవించే ప్రాంతాలు) ఆలోచనను ప్రాచుర్యంలోకి తెచ్చిన డాన్ బ్యూట్నర్, మంచి జీవనశైలి అనేది గుండె, మొత్తం ఆరోగ్యాన్ని ప్రభావితం చేసినట్టుగానే, మెదడు ఆరోగ్యం అనేది దీర్ఘాయువులో ప్రధాన పాత్ర పోషిస్తుందన్నారు. రోజువారీ అలవాట్లు అభిజ్ఞా క్షీణత, చిత్తవైకల్యం,మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి, అలాగే మెదడును ముందుగానే రక్షించడం అనేది దీర్ఘకాలిక శ్రేయస్సులో చాలా కీలకమన్నారు. దీనికి సంబంధించి డాక్టర్ అమెన్ రాసిన "చేంజ్ యువర్ బ్రెయిన్, చేంజ్ యువర్ పెయిన్" అనే పుస్తకంలో మరిన్ని విషయాలను పొందుపర్చారు.మెదడు ఆరోగ్యం, డా. అమెన్ సలహాలుక్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. ఇది మెదడుకు రక్త ప్రవాహాన్ని, ఆక్సిజన్ను సరఫరాను పెంచుతుంది. వ్యాయామంలో పట్టిన చెమట హానికరమైన సమ్మేళనాలను తొలగించడంలో సహాయపడుతుందిమెదడు చురుగ్గా ఉండేలా, చాలెంజింగ్ ఫజిల్స్ పరిష్కరించాలి. కొత్త నైపుణ్యాలను నేర్చుకోవాలి.ఒమేగా-3 అధికంగా ఉండే ఆహారాలు, వాల్నట్లు, అవిసె గింజలు . కొవ్వు చేపలు మెదడు కణాలకు మేలు ఇస్తాయిచక్కెర , ప్రాసెస్ చేసిన ఆహారాలు మెదడు ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి. వీటికి దూరంగా ఉండాలి. కుటుంబంలో అల్జీమర్స్ వంటి పరిస్థితులు ఉంటే ముందుగానే అప్రమత్తం కావాలి.7–8 గంటలు ల నిద్రకు ప్రాధాన్యత ఇవ్వాలి. మెదడు తనను తాను శుభ్రపరుచుకునే సమయం నిద్ర.తల గాయాల నుండి రక్షించుకోవడం.మద్యం ,మాదకద్రవ్యాలకు దూరండా ఉండాలి.ఘీ టాక్సిన్స్ న్యూరాన్లను దెబ్బతీస్తాయినెగిటివ్ ఆలోచనలు మెడదుకు హాని చేస్తాయి. విటమిన్ డి , హార్మోన్ స్థాయిలను సరిగ్గా ఉండేలా చూసుకోవాలి. మెదడు పట్ల లవ్ అండ్ కేర్ గా ఉండాలి. దానికి కీడు చేసే పనులు మానుకోవాలి అంటారు డా. అమెన్. -
సౌందర్య సంరక్షణకు 'డీఎన్ఏ డీకోడ్'..!
అందం కోసం మగువలు ఎంతలా డబ్బుని వెచ్చిస్తారో తెలియంది కాదు. అందుకు తగ్గట్టుగానే మార్కెట్లో రకరకాల సౌందర్య ఉత్పత్తులు అతివలను ఆకర్షించేలా వస్తున్నాయి. అయితే అవి అందరికీ సరిపోడవు. కొందరు సరిపోయినట్లు మరికొందరిలో మంచి పలితాలు రావు. ఇలాంటి సమస్య లేకుండా..నిగనిగలాడే అందం కోసం మన డీఎన్ఏతోనే సరిచేసుకుందాం అంటున్నారు ఒలివా క్లినిక్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ టి.ఎన్.రేఖా సింగ్. మీ డీఎన్ఏలోని ప్రత్యేక అంశాల ఆధారంగా కూడా అందమైన చర్మం, కేశ సౌందర్యం పొందవచ్చునని చెప్పారు. అదెలాగో సవివరంగా తెలుసుకుందాం.అందం కోసం మార్కెట్లో దొరికే రకరకాల క్రీములు, ఫేస్వాష్లు వాడి ఇబ్బంది పడాల్సిన పనిలేదంటున్నారు శాస్త్రవేత్తలు. మన డీఎన్ఏని డీ కోడ్ చేస్తే చాలు..అపురూపమైన సౌందర్యాన్ని సొంత చేసుకోవచ్చని చెబుతున్నారు. మన డీఎన్ఏని డీకోడ్ చేస్తే..మన శరీరం, జుట్లు, బాడీ తత్వం ఎలా ఉంటుందన్నది ఇట్టే తెలిసుకోవచ్చు. మన శరీర డీఎన్ఏలో ముఖంపై పిగ్మెంటేషన్తోపాటు వెంట్రుకల కుదుళ్లు పోషకాలను సక్రమంగా అందుకుంటున్నాయా లేదా? చర్మం తనంతట తాను మరమ్మతు చేసుకునేందుకు ఎక్కువ సమయం తీసుకుంటుందా? అన్న అనేక విషయాలు తెలుసుకోవచ్చునని తెలిపారు. జీన్-ఐక్యూ వంటి ప్రోగ్రామ్స్లో కేవలం లాలాజల నమూనా ద్వారా ఈ డీఎన్ఏ వివరాలను తెలుసుకుని తదనుగుణంగా చికిత్స ప్రారంభిస్తామని వివరించారు. అత్యాధునిక మైక్రో అరే టెక్నాలజీ ద్వారా చర్మం, వెంట్రుకలు, జీవక్రియలు, జీవనశైలి వంటి విషయాలకు సంబంధించి130 జన్యువులు, 150 లక్షణాలను పరిశీలిస్తారు. ఇవన్నీ వెంట్రుకలు రాలిపోవడం, కొలెజన్కు జరుగుతున్న నష్టం, పోషకాలు వంటి వివరాలు అందిస్తాయి. పరిష్కార మార్గాలను గుర్తించడంలో సహాయపడతాయి. ఆక్నేనే తీసుకుంటే.. ఒత్తిడి, కాలుష్యం తదితరాలు కారణమని అనుకుంటాం కానీ.. డీఎన్ఏ పరీక్షల ద్వారా శరీరంలో మంట/వాపు వచ్చిన తరువాత మీకు హైపర్ పిగ్మెంటేషన్ వచ్చే అవకాశం ఉందా? లేదా? అన్నది తెలుస్తుంది. ఇంకోలా చెప్పాలంటే చిన్న చిన్న విషయాలకే మీ చర్మం వేగంగా స్పందిస్తుందా? అన్నది తెలుస్తుందన్నమాట. అలాగే.. అతినీల లోహిత కిరణాలు, కాలుష్యాలను తట్టుకునే సామర్థ్యం మీ చర్మానికి ఎక్కువగా లేదా? అన్న విషయం డీఎన్ఏ పరీక్షల ద్వారానే తెలుస్తుంది. వెంట్రుకల విషయంలోనూ ఇలాంటి వివరాలు బోలెడన్ని తెలుస్తాయని డాక్టర్ రేఖా సింగ్ తెలిపారు. ఈ వివరాల ద్వారా ఒకొక్కరికి ఒక్కో రకమైన, సమర్థ పరిష్కార మార్గాలు సూచించవచ్చునని వివరించారు. దాంతో ఎలాంటి సౌందర్య చికిత్సలు తీసుకుంటే చాలు అన్నది అర్థం అవుతుంది. తదనుగుణంగా అనుసరిస్తే..అందమైన చర్మం, నిగనిగలాడే జుట్టుని సులభంగా పొందవచ్చట. అంటే మన జన్యువుల ఆధారంగా చర్మాన్ని రిపేర్ చేసుకోవడం. సమస్య ఎక్కడుందన్నది తెలిస్తే..పరిష్కరించడం మరింత సులభవుతుంది. ఆ నేపథ్యంలోనే ఈ సరికొత్త విధానాన్ని తీసుకొచ్చమని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. డీఎన్ఏ డీకోడ్ అంటే..జన్యు సమాచారం (genetic information)ను అర్థం చేసుకోవడం అనే ప్రక్రియ. ఇది జీవుల శరీరంలో ఉన్న డియోక్సిరిబోన్యూక్లిక్ ఆమ్లం (DNA)లోని న్యూక్లియోటైడ్ క్రమాన్ని శాస్త్రవేత్తలు చదివి అర్థ చేసుకుంటారన్నమాట. దాంతో జీవి శరీర లక్షణాలను ఈజీగా అంచనా వేస్తారు పరిశోధకులు. అంటే ఉదాహరణకు, ఎత్తు, చర్మ రంగు, తెలివి, ఆరోగ్యం మొదలైనవి. డీఎన్ఏతో ముందుగా ఎలాంటి వ్యాధులు సంక్రమించే అవకాశం ఉందన్నది అంచనా వేయడమే కాదు, అందానికి మెరుగులు కూడా పెట్టుకోవచ్చని చెబుతున్నారు పరిశోధకులు.ఈ డీఓన్ఏ డీకోడ్తో శరీర లక్షణాలను అంచనా వేసి తగిన విధంగా డెర్మటాలజిస్టులకు సలహాలు సూచనలు ఇస్తారు. దీని సాయంతో వ్యద్ధాప్య ఛాయలను సైతం నివారించొచ్చుని కూడా చెబుతున్నారు. అంతేగాదు ఎలాంటి పోషకాహారం మన శరీరానికి అవసరం, ఎలాంటి జీవనశైలి మనకు సరిపోతుందనేది నిర్థారిస్తారట. ఫలితంగా అందరూ ఆశించే కలల సౌందర్యాన్ని చాలా ఈజీగా సొంత చేసుకోగలుగుతారని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. ముందు ముందు ఈ డీన్ఏ డీకోడ్ సౌందర్య సంరక్షణలో అద్భుతమైన పాత్ర పోషిస్తుందని నమ్మకంగా చెబుతున్నారు. (చదవండి: తాగునీరు అంత విలువైనదా..?) -
తాగునీరు అంత విలువైనదా..?
ఉదయం బ్రష్ చేయడం మొదలు రాత్రి వరకు ఒక్కొక్కరు ఎంతో నీటిని వృథా చేస్తున్నాం.. అవసరం ఉన్నంత వరకు మాత్రమే భోజనం చేసే మనం.. నీటి పొదుపునకు మాత్రం ఏ మాత్రం విలువనివ్వడం లేదు. నిత్యం లక్షల లీటర్ల నీటిని డ్రైనేజీలో కలిపేస్తున్నాం. సింగపూర్ దేశం పేరు చెబితే వావ్.. అనే మనం అక్కడి తాగునీటి పరిస్థితి గురించి తెలిస్తే మాత్రం వామ్మో.. అనాల్సిందే.. బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్కు చెందిన 6వ తరగతి చదువుతున్న చిన్నారి అక్కడి పరిస్థితులను వివరిస్తుంటే.. ఆలోచనలో పడాల్సిందే.. బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్(హెచ్పీఎస్)కు చెందిన 43 మంది విద్యార్థులు ఇటీవల సింగపూర్లో పర్యటించి వచ్చారు. ఆ బృందంలో ఆరో తరగతి చదువుతున్న అనమల నేహాశ్రిత కూడా ఉన్నారు. ఆ పర్యటన తనకు తాగునీటి విలువ తెలిసేలా చేసిందని, ఇకపై నీరు వృథా చేయకూడదని నిర్ణయించుకున్నానని చెబుతోంది. ఈ సందర్భంగా చిన్నారి నేహా బుధవారం ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడింది. ఆ వివరాలు ఇలా.. ‘నాలుగు రోజుల పర్యటనలో యూనివర్సల్ స్టూడియో, మెర్లైన్ పార్క్ సహా అనేక ప్రాంతాలు తిరిగాం. అన్నింటికంటే మరీనా బరాజ్ ఎన్నో విషయాలు నేర్పింది. సింగపూర్లో తాగునీటి సమస్య చాలా తీవ్రంగా ఉంది. నదులు లేకపోవడంతో పాటు భూగర్భ జలాలు చాలా తక్కువ. ఈ బరేజ్లో వర్షపు నీటిని నిల్వ చేయడంతో పాటు సముద్ర జలాలను తాగునీరుగా మారుస్తున్నారు. తాగునీటి సమస్యను అధిగమించడానికి సింగపూర్ ప్రభుత్వం మలేషియా నుంచి కొనుగోలు చేస్తోంది. సీవేజ్, వేస్ట్ వాటర్ను రీసైకిల్ చేసి వాడుకుంటోంది. ఈ నీరు తాగడం ఇష్టం లేక బాటిల్ కొనుక్కోవాలంటే 2.8 సింగపూర్ డాలర్లు(రూ.193) వెచి్చంచాలి. అక్కడ ఉన్న పరిస్థితులు, నీటి భద్రతను జాతీయ భద్రతగా భావిస్తున్న ఆ ప్రభుత్వం.. ఇలా అన్నీ చూసిన తర్వాత తాగునీటి విలువ ఏంటో తెలిసింది. మనకు ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే కాలుష్య, నీటి వృథా ఉండకూడదని తెలుసుకున్నా. ఇవి పాటించడంతో పాటు నాకు తెలిసిన వారికీ వివరిస్తూ పాటించాలని సూచిస్తా. దీనికోసం ఓ పవర్ పాయింట్ ప్రజెంటేషన్(పీపీటీ) తయారు చేస్తున్నా. నాలో మార్పు తీసుకువచ్చిన ఈ సింగపూర్ పర్యటనకు అవకాశం ఇచ్చిన స్కూల్, మాతో వచ్చి కొత్త విషయాలు నేర్పించిన టీచర్స్కు ధన్యవాదాలు’. -
నలభై ఏళ్ల తల్లి వెయిట్లాస్ స్టోరీ..! 136 కిలోలు నుంచి 68 కిలోలకు..
అందరు బరువు తగ్గడంపై ఫోకస్ పెడుతున్నారు. రకరకాల మార్గాల్లో తగ్గడంపై దృష్టిపెట్టి మరి ఆరోగ్య స్ప్రుహ పెంచుకుంటున్నారు. అయితే హాయిగా ఉన్నప్పుడే మన బాడీ మీద ఫోకస్ పెట్టడం, ఆరోగ్యంపై ధ్యాస వంటివి చేయగలం. కానీ ఈ తల్లికి కూతురు అనారోగ్యమే బరువు తగ్గేందుకు దారితీసింది. డైట్పై ఉన్న దృక్పథాన్ని పూర్తిగా మర్చేసింది. అలాంటి కష్ట సమయాల్లో ఎవ్వరైనా..తమ ఉనికిని కోల్పోయేంతగా బాధలో ఉండిపోతారు..కానీ అదే ఆమెకు ఆరోగ్యంపై అటెన్షన్ పెట్టేలా చేసింది. పైగా కిలోల కొద్ది బరువు తగ్గి, స్ఫూర్తిగా నిలిచింది. మరి ఆమె వెయిట్లాస్ స్టోరీ గురించి తన మాటల్లోనే సవివరంగా తెలుసుకుందామా..!.ఆ అమ్మే 40 ఏళ్ల కింబర్లీ పావెల్. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అయిన ఆమె పీసీఓఎస్తో ఇబ్బంది పడుతుండేది. బిజీ జీవితం, వ్యక్తిగత సవాళ్లను సమతుల్యం చేసుకుంటూ సూమారు 68 కిలోలు మేర బరువు తగ్గింది. వాస్తవానికి కింబర్లీ దాదాపు 136 కిలోల అధిక బరువుతో బాధపడుతుండేది. తన సోషల్ మీడియా ఫాలోవర్లను ప్రేరేపించేలా బరువు తగ్గేందుకు శ్రీకారం చుట్టింది. అంతలో అనుహ్యంగా ఆరేళ్ల కూతురు కేన్సర్ బారిన పడటంతో డైట్పై ఉన్న దృక్పథం పూర్తిగా మారిపోయింది కింబర్లీకి. తాను ఆరోగ్య విషయంలో చేసిన తప్పిదాలను విశ్లేషించుకుని..సరైన మార్గంలో బరువు తగ్గాలని భావించింది. ఆ నేపథ్యంలో ఎక్కువగా చేసే సాధారణ తప్పిదాలపై ఫోకస్ పెట్టింది. అంతేగాదు ఆహారాన్ని ఆరోగ్యకరంగా తీసుకోకపోతే ఎలా విషంగా మారుతుందో అర్థం చేసుకుంది. తనకెదురైన సవాళ్లే పూర్తిగా ఆరోగ్యంపై ధ్యాస పెట్టేలా చేశాయని చెబుతోంది. అయితే తాను 68 కిలోల మేర బరువు తగ్గేందుకు కఠిన ఆహార నియమాలేమి పాటించలేదని, సింపుల్ చిట్కాలనే అనుసరించానని చెప్పుకొచ్చింది. బరువు తగ్గిన విధానం..నిలకడగా ఉండాలి...బరువు తగ్గాలనే ఫోకస్ని మధ్యలో వదిలేయకుండా స్ట్రాంగ్ ఉండే మనస్సుని డెవలప్ చేసుకోవడం. ఈ రోజు కంటే మరింతగా భిన్నంగా కనిపించాలనే లక్ష్యం ఏర్పరచుకోవడం వంటివి చేయాలి.పోషకాహారంపై ఫోకస్..ప్రోటీన్, ఫైబర్ ఉండేవి తీసుకుంటున్నామో లేదో కేర్ తీసుకోవాలి. రోజువారీగా 130 నుంచి 150 గ్రాముల ప్రోటీన్, ఫైబర్ ఉంటుందో లేదో చూసుకోవాలి. చురుకుగా ఉండటం..ప్రతి రోజు వర్కౌట్లపై దృష్టి పెట్టడం. కనీసం 40 నిమిషాలు వాకింగ్, వ్యాయమాలు చేసేలా చూసుకోవడం. అవి భారంగా కాకుండా ఎంజాయ్ చేస్తూ చేయడం అలవాటు చేసుకోవాలి.అతి ఆకలిని నివారించటంఎక్కువ ఆకలి వేసేంత వరకు కాకుండా..బ్యాలెన్స్గా తినేలా చూసుకోవాలి. బాగా ఆకలి వేసేంత వరకు ఉంటే అతిగా తినే ప్రమాదం ఉంది. ఆకలి అనిపించిన వెంటనే..సంతృప్తి కలిగేలా మంచి ఆహారం తీసుకోవాలి. చక్కెరకు దూరం..స్వీట్స్ తినాలనిపించినప్పుడూ తెలివిగా తినాలి. ఎలాగంటే ఈ రోజు స్వీట్స్ ఎక్కువ తింటే మిగతా సమయంలో తీసుకునే ఫుడ్ ఐటెమ్స్ తగ్గించి, వర్కౌట్ల సమయం పెంచాలి. ఫైబర్, కార్బోహైడ్రేట్లను మిస్ చేయొద్దు..ప్రోటీన్తోపాటు ఫైబర్, కార్బోహైడ్రేట్లను మిస్ చేయొద్దు. ఇన్సులిన్ నిరోధకతను నిర్వహించడానికి, ఎక్కువసే కడుపు నిండిన అనుభూతిని అందివ్వడాని ఇది ఎంతగానో హెల్ప్ అవుతుంది. సమతుల్యంగా తినేందుకు ప్రాముఖ్యత నివ్వడం.కాఫీ అలవాట్లను మానుకోవడం..కాఫీ తాగే అలవాటుని తగ్గించుకునేలా..ప్రత్యామ్నాయంగా ప్రోటీన్ షేక్లకు ప్రాధాన్యత ఇవ్వడం వంటివి చేయాలి.మైండ్ఫుల్గా తినటం..మైండ్ఫుల్గా తినేలా చూసుకోవాలి. తగిన కేలరీలు, ప్రోటీన్లు శరీరానిక అందేలా చూసుకోవాలి. చివరగా మితిమీరిన వ్యాయామాలు, అతి కఠినమైన ఆహార నియమాలు మొదటికే ప్రమాదం తెచ్చిపెడతాయని, నిధానంగా ఆరోగ్యకరమైన విధానంలో బరువు తగ్గడమే అన్ని విధాల శ్రేయస్కరమని చెప్పుకొచ్చింది కింబర్లీ పావెల్. View this post on Instagram A post shared by Kimberly Powell (@loving_lessofme_more) గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం.(చదవండి: ఆమె ఆస్తికి అత్తింటి వారే మొదటి హక్కుదారులు) -
15 రోజుల్లో ఆరుగురు చిన్నారులు మృతి, రెండు కాఫ్ సిరప్లు బ్యాన్!
మధ్యప్రదేశ్లో 15 రోజుల్లో 6 మంది పిల్లలు కిడ్నీ వైఫల్యంతో మరణించడం కలకలం రేపింది. మొదట అందరూ సీజనల్ ఫీవర్స్ వేవ్ అనుకున్నారు. కానీ ఆ తరువాత షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో రెండు రకాల కాఫ్ సిరప్ను నిషేధించారు. ఏం జరిగిందంటే..మధ్యప్రదేశ్లోని చింద్వారా జిల్లాను కుదిపేసిన హృదయ విదారక విషాదంలో, గత 15 రోజుల్లో ఆరుగురు పిల్లలు మూత్రపిండాల వైఫల్యంతో మరణించారు. అనారోగ్యంతో ఆసుపత్రికి వచ్చిన వారికి సీజనల్ జ్వరాలు అనుకొని చికిత్ర చేశారు. కానీ పరిశోధకులు మరో విషయాన్ని గమనించి దిగ్భ్రాంతికి లోనయ్యారు. విషపూరిత డైథిలిన్ గ్లైకాల్తో కలిపిన కలుషితమైన దగ్గు సిరప్ మరణాలకు కారణమని అనుమానిస్తున్నారు. దీంతో రెండు రకాల దగ్గు మందులను బ్యాన్ చేశారు.ఐదేళ్ల లోపు వయసున్న పిల్లలు మొదట జలుబు, తేలికపాటి జ్వరంతో వైద్యులను సంప్రదించారు. స్థానిక వైద్యులు దగ్గు సిరప్లతో సహా సాధారణ మందులను సూచించారు. ఆ తర్వాత పిల్లలు కోలుకున్నట్లు అనిపించింది. కానీ కొద్ది రోజులకే పరిస్థితి మారిపోయింది. జ్వరం తిరగ బెట్టింది. మూత్ర బంద్ అయిపోయింది. ఆ తరువాత పరిస్థిత మరింత తీవ్రమై మూత్రపిండాల ఇన్ఫెక్షన్గా మారింది. మహారాష్ట్రలోని నాగ్పూర్కు తరలించి మెరుగైన చికిత్స అందించినప్పటికీ, ముగ్గురు పిల్లలు ప్రాణాలు కోల్పోయారు. దీంతో బాధిత కుటుంబాలు తీవ్ర విషాదంలో మునిగిపోయాయి."మా పిల్లలు ఇంతకుముందెప్పుడూ అనారోగ్యంతో బాధపడ లేదని, దగ్గు సిరప్ తీసుకున్న తరువాతే మూత్రం ఆగిపోయిందని’’ కన్నీరు మున్నీరుగా విలపించారు తల్లిదండ్రులు.(సెంటర్స్టోన్ డైమండ్రింగ్, లగ్జరీ గౌనులో ఇషా అంబానీ : ధర ఎంతో తెలుసా?)మృతుల కిడ్నీ బయాప్సీలలో విషపూరితమైన డైథిలిన్ గ్లైకాల్ కాలుష్యం ఉన్నట్లు వెల్లడైంది. చాలా మందికి బాధితులకు కోల్డ్రిఫ్ , నెక్స్ట్రో-డిఎస్ సిరప్లు ఇచ్చారు. చింద్వారా కలెక్టర్ షీలేంద్ర సింగ్ వెంటనే జిల్లా అంతటా రెండు సిరప్ల అమ్మకాలను నిషేధించారు. వైద్యులు, ఫార్మసీలు తల్లిదండ్రులకు అత్యవసరమైన కీలక సూచనలు జారీ చేశారు. మూత్రపిండాల వైఫల్యానికి కలుషితమైన ఔషధం కారణమని బయాప్సీ నివేదికలో తేలిందని ప్రభావిత గ్రామాల నుండి నీటి నమూనాలలో ఎటువంటి ఇన్ఫెక్షన్ కనిపించలేదని జిల్లా అధికారులు తెలిపారు. తీవ్రత దృష్ట్యా, జిల్లా యంత్రాంగం ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) నుండి ఒక బృందాన్ని పిలిపించి దర్యాప్తు చేస్తున్నామని సింగ్ అన్నారు. "సెప్టెంబర్ 20 నుండి, మూత్రం ఆగిపోవడం, మూత్రపిండాల సమస్యల కేసులు ఎక్కువగా వెలుగులోకి వచ్చాయి. కానీ చాలా మంది పిల్లలలో అకస్మాత్తుగా మూత్రపిండాల వైఫల్యం చాలా ప్రమాదకరమైందని చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ నరేష్ గోనారే వెల్లడించారు. ఆగస్టు 24న మొదటి అనుమానిత కేసు నమోదైందని, సెప్టెంబర్ 7న మొదటి మరణం సంభవించిందని తెలిపారు. -
మచుపిచ్చుపై..భాగ్యనగర వాసుల సాహసయాత్ర.!
తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ నగరానికి చెందిన 15 మంది బృందం పర్వతారోహణ చేసి విజయవంతంగా నగరానికి తిరిగొచ్చారు. 50 సంవత్సరాల పైబడ్డ వీరంతా రెండేళ్ల క్రితం ఎవరెస్టు బేస్ క్యాంప్ అధిరోహించి విజయవంతంగా తిరిగొచ్చారు. ఈ క్రమంలో రెండేళ్ల తర్వాత మచుపిచ్చు సాహసయాత్రకు శ్రీకారం చుట్టారు. సెప్టెంబర్ 4న ఈ యాత్రకు వెళ్లిన బృందం సెప్టెంబర్ 16న తిరిగొచ్చింది. మచుపిచ్చు అనేది ప్రపంచంలోని ప్రధాన పర్యాటక ప్రాంతాల్లో ఒకటి. ఇది దక్షిణ అమెరికా దేశం పెరూలో ఉంది. మచు పిచ్చు సముద్ర మట్టానికి 2,430 మీటర్ల ఎత్తునున్న 15వ శతాబ్దపు ఇంకా సామ్రాజ్యం. ఇది పెరూలోని మచుపిచ్చు జిల్లా, ఉరుబంబా ఫ్రావిన్స్, కుస్కో ప్రాంతంలో ఉంది. 80 కిలోమీటర్ల దూరంలోని (50 మైళ్లు) కుస్కోకు వాయువ్యంగా పవిత్రలోయపై ఒక పర్వత శిఖరంపై ఉంది. దీని ద్వారా ఉరుబంబా నది ప్రవహిస్తోంది. ఎక్కువ మంది పురాతత్వ శాస్త్రవేత్తలు మచుపిచ్చు ఇంకా చక్రవర్తి పాచాకుటి (1438–1472) కోసం నిర్మించిన ఒక ఎస్టేట్ అని నమ్ముతారు. ఫిట్నెస్ ప్రతీకగా..ఈ సాహసయాత్రలో ఇక్ఫాయ్ డైరెక్టర్ సుధాకర్రావు, డాక్టర్ ప్రవీణ్మారెడ్డి, డాక్టర్ శశికాంత్ గోడె, డాక్టర్ నిఖిల్ ఎస్ గడియాల్పాటి, డాక్టర్ గుమ్మి శ్రీకాంత్, డాక్టర్ సల్లేష్ విఠల, డాక్టర్ సంజయ్, ఐటీ ప్రొఫెషనల్స్ విజయభాస్కర్, శివశంకర్, పురుషోత్తం, కృష్ణమోహన్, ప్రసన్నకుమార్, రవి మేడిశెట్టి, అడ్వకేట్ రమేష్ విశ్వనాథ్, కాంట్రాక్టర్ పృద్వీధర్ పాల్గొన్నారు. సౌత్ అమెరికా–భారత్ (సాంబ) 20 డిగ్రీస్ పేరుతో వీరు ఈ సంస్థను ఏర్పాటుచేసుకున్నారు. ఇక్ఫాయ్ డైరెక్టర్ సుధాకర్రావు వీరికి కెపె్టన్గా వ్యవహరించారు. మచుపిచ్చు పర్వతం ఆండీస్ పర్వతశ్రేణిలో ఒక భాగం. 48 గంటల పాటు నడక మార్గంలో ఈ పర్వతాన్ని అతికష్టంతో అధిరోహించాల్సి ఉంటుంది. ఫిట్నెస్ ప్రతీకగా తాము ఈ పర్వతారోహణ చేపట్టినట్లు వీరు తెలిపారు. ఇదే ఉత్సాహంతో ప్రపంచంలోని మరిన్ని పర్వతాల సాహసయాత్ర చేయనున్నట్లు తెలిపారు. (చదవండి: క్యూట్ క్యాట్..ఒత్తిడి సెట్..! దేశంలోనే ప్రప్రథమం..) -
క్యూట్ క్యాట్..ఒత్తిడి సెట్..!
ఫిజియోథెరపీ.. లాఫింగ్ థెరపీ.. ఫిష్ థెరపీ గురించి వినే ఉంటారు.. కానీ ‘క్యాట్ థెరపీ’ గురించి ఎప్పుడైనా విన్నారా..!? ఔను ప్రస్తుతం హైదరాబాద్ నగరవాసులు వినడమే కాదు ప్రత్యక్షంగా చూడబోతున్నారు. ఆ క్యాట్ థెరపీని ఆస్వాదించనున్నారు. ఉరుకులు పరుగుల నగర జీవితం.. తీవ్ర ఒత్తిళ్లతో అలసిపోయిన మనసుకు కాసేపు మానసిక ప్రశాంతత కోరుకోని వారెవరూ ఉండరంటే అతశయోక్తి కాదేమో? అయితే మానసిక ప్రశాంతతకు పెంపుడు జంతువుల మధ్య గడపడం ఓ చక్కని పరిష్కారమని, ఎటువంటి మందులూ నయం చేయలేని నిరాశ నిస్పృహలు, ఒత్తిడి, ఆందోళన, మానసిక సమస్యలను జంతువులు దూరం చేస్తాయని చెబుతున్నారు నిపుణులు. క్యాట్ థెరపీ మానసిక, శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సులభమైన మార్గమని, దీనికోసం యజమానులు తమ పిల్లులకు శిక్షణ ఇచ్చి, పెట్ పార్ట్నర్స్ వంటి సంస్థల ద్వారా సేవలను అందిస్తారు. ఎన్నో జీవన వైవిధ్యాలకు వేదికైన మన నగరంలో క్యాట్ థెరపీలు సైతం హాయ్ చెప్పడం ఇక్కడి జీవనశైలికి నిదర్శనంగా నిలుస్తోంది. హైదరాబాద్లో రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇదే ఏడాది ప్రాయణీకుల ఒత్తిడిని తగ్గించేందుకు డాగ్ థెరపీ పేరుతో ప్యాసింజర్స్ లాంజ్లో క్యూట్ క్యూట్ పప్పీస్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇదే తరహాలో ప్రస్తుతం నగరంలో క్యాట్ థెరపీని అందుబాటులోకి తెస్తున్నారు క్యాట్స్ కంట్రీ నిర్వాహకులు. మానసిక సమస్యలకు జంతువుల థెరపీ చక్కని పరిష్కారమని పలు అధ్యయనాలు సైతం వెల్లడించాయి. ఈ నేపథ్యంలోనే వివిధ దేశాల్లో వినూత్నంగా క్యాట్ థెరపీ కేంద్రాలు ప్రారంభమవుతున్నాయి. మానసిక ప్రశాంతతకు దోహదం చేసే ఈ క్యాట్ థెరపీ కేంద్రాలు దేశంలో మొట్టమొదటి సెంటర్ హైదరాబాద్లో ఆవిష్కృతం కావడం విశేషం. క్యాట్స్ కంట్రీ.. దేశంలో ప్రథమం.. ఇప్పటివరకూ యుఎస్, జపాన్, కెనడా, థాయిలాండ్, ఇండోనేషియాలకే పరిమితమైన క్యాట్ థెరపీ సేవలు దేశంలో మొట్టమొదటిసారి హైదరాబాద్లో అందుబాటులోకి వచ్చాయి. కుతుబ్షాహీ 7 టూమ్స్ సమీపంలో ఏర్పాటు చేసిన ఈ కేంద్రం ఇటీవల్లే అంతర్జాతీయ పిల్లుల దినోత్సవం (ఇంటర్నేషనల్ క్యాట్స్ డే–ఆగస్టు–8) రోజున ప్రారంభమైంది. కుక్కలు, పిల్లులు లాంటి పెంపుడు జంతువుల మధ్య గడపడం, వాటితో ఆడుకోవడం ఎంతో సంతోషాన్ని, ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. తీవ్ర ఒత్తిడి, మానసిక సమస్యలతో బాధపడే వారికి ఇది ఉపశమనం కలిగిస్తుంది. అంతర్జాతీయంగా ప్రముఖ అధ్యయన సంస్థలు సైతం ఈ విషయాన్ని ధ్రువీకరించాయి. 50 రకాలకుపైగా పిల్లులు.. ప్రస్తుతం ఉరుకులు పరుగులతో కూడిన నగర జీవితంలో.. తమతో పాటు పెంపుడు జంతువులను పెంచుకునే వెసులుబాటు తక్కువే. అలాంటి వారు ఈ కేంద్రంలో సేవలు పొందవచ్చు. ఇక్కడ 50కి పైగా పర్షియన్ జాతికి చెందిన పిల్లులు ఉన్నాయి. ఇవన్నీ మానవులతో స్నేహంగా మెలుగుతాయి. మీతో ఆడుకుంటాయి.. గారాబం చేస్తాయి. వీటి మధ్య గడిపి నూతనోత్తేజాన్ని పొందవచ్చు. దీనినే క్యాట్ థెరపీ అంటారు. ఇవన్నీ వ్యాక్సినేషన్ చేసిన ఆరోగ్యవంతమైన పిల్లలు. కాబట్టి వీటితో ఎలాంటి ప్రమాదం ఉండదని నిర్వాహకులు చెబుతున్నారు. ఒక గంటకు అత్యధికంగా ఐదుగురికి మాత్రమే ప్రవేశం ఉండే ఈ సెంటర్లోకి వెళ్లాలంటే అధికారిక వెబ్సైట్లో ముందుగా.. స్లాట్ బుక్ చేసుకోవాలి. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు.. స్లాట్ బుక్ చేసి ఈ కేంద్రాన్ని ఎప్పుడైనా సందర్శించవచ్చు. వృత్తిలో సంతృప్తితో.. వినూత్నంగా.. స్వార్థపరుల ప్రపంచంలో నుంచి.. నిస్వార్థ జంతువుల ప్రపంచంలోకి రండి. కాసేపు మా ఆత్మీయమైన పిల్లులతో గడపండి. వయసును మర్చిపోయి కాసేపు బాల్యంలోకి వెళ్లండి. మిమ్మల్ని నిస్వార్థంగా ప్రేమించేందుకు, అలసిపోయిన మనసుకు కాస్త ప్రశాంతత కలిగించేందుకు, ఆటలు ఆడుకునేందుకు మా పిల్లులు సిద్ధంగా ఉన్నాయి. 35 సంవత్సరాల పాటు పశు సంవర్ధక శాఖలో వైద్యుడిగా పని చేసిన అనుభవంతో.. ఉద్యోగ విరమణ అనంతరం దీనిని ప్రారంభించాను. జంతువులతో మమేకమైన మనసు వాటితోనే సహవాసం, ఆతీ్మయతను కోరుకుంటోంది అనడానికి నా ప్రయాణం ఒక ఉదాహరణ. మా వెబ్సైట్ www. CatsCountry. in లో దీనికి సంబంధించిన వివరాలు తెలుసుకోవచ్చు. – ముహమ్మద్ యాకుబ్ షరీఫ్, క్యాట్స్ కంట్రీ వ్యవస్థాపకులు (చదవండి: ఇదేం పేరెంటింగ్..! వామ్మో ఈ రేంజ్లో డేరింగ్ పాఠాలా..? తిట్టిపోస్తున్న నెటిజన్లు) -
ప్లాస్టిక్లో ఇన్ని రకాలు... నిర్లక్ష్యం చేస్తే ముప్పే!
ప్రపంచ వ్యాప్తంగా ప్లాస్టిక్ వాడకం చాలా సాధారణంగా మారిపోయింది. దీని వల్ల కలిగే దుష్ర్పభావాలు అన్నీ ఇన్నీకావు. తాజా పరిశోధనల ప్రకారం రోజుకు రోజుకు ఇవి మరింత మానవుల ఆరోగ్యాన్ని, పర్యావరణానికి మరింత ప్రమాదకరంగా మారుతున్నాయి. మరికొన్ని రకాల ప్లాస్టిక్లు ఆరోగ్యంపై వాటి దుష్ప్రభావాల గురించి తెలుసుకుందాం. ప్లాస్టిక్లు ఆరోగ్యంపై వాటి దుష్ప్రభావాలు మనం అన్నింటినీ కలిపి (బ్రాడ్గా) ప్లాస్టిక్ అని పిలిచే వాటిల్లో ఎన్నో రకాలున్నాయి. ఉదాహరణకు... పాలీ ఇథిలీన్ టెరెథాలేట్ (పీఈటీ) ఈ పదార్థంతో తయారైన సీసాలను మనం ‘పెట్ బాటిల్స్’ అంటాం. వీటిల్లో సాఫ్ట్డ్రింక్స్, జ్యూస్లు, నీళ్లు, మౌత్వాష్లు వంటివి ప్యాక్ చేస్తుంటారు. దీనివల్ల దీర్ఘకాలంలో శ్వాస సమస్యలు, చర్మంపై ఇరిటేషన్, మహిళల్లో రుతుసంబంధ వ్యాధులు కనిపిస్తంటాయి. కొన్నిసార్లు గర్భస్రావాలూ జరగవచ్చు. వీటితో మనకు ఏర్పడే దుష్ప్రభావాలూ / సమస్యలపై పరిశోధనలింకా సాగుతూనే ఉన్నాయి. హై డెన్సిటీ పాలీ ఇథిలీన్ (హెచ్డీపీఈ) పాల సీసాలు, బ్లీచ్లు, షాంపూసీసాలు, వంటనూనెలు, కిటికీల్ని శుభ్రపరిచే ద్రవాలు (విండోక్లీనర్స్), కొన్ని రకాల మందులను ప్యాకింగ్ ట్యూబ్ల తయారీలో ‘హెచ్డీపీఈ’ ఉపయోగిస్తారు. వీటితో చాలామందిలో అలర్జీలు, ఆస్తమా సమస్యలు వస్తున్నట్లుగా గుర్తించారు. కొందరిలో కాలేయం, కిడ్నీలు, స్ల్పీన్, ఎముకలపై దుష్ప్రభావాన్ని చూపుతాయి. లో–డెన్సిటీ పాలీ ఇథిలీన్ (ఎల్డీపీఈ) చాలా రకాల కిరాణా వస్తువుల ప్యాకింగ్లలో, బ్రెడ్, ఫ్రోజెన్ ఫుడ్ ఐటమ్స్ నిల్వ కోసం ఈ పదార్థాన్ని ఉపయోగిస్తుంటారు. దీన్నే సాఫ్ట్ ప్లాస్టిక్’ అని కూడా అంటరు. దీంతో చేసిన ప్యాకింగ్లోని పదార్థాలను తొలగించగానే ఇవి తేలిగ్గా ముడుచుకు పోతాయి. పాలీస్టైరీన్ (పీఎస్) వీటిని గుడ్లను నిల్వచేసే కార్టన్లు, డిస్పోజబుల్ కప్పులు, ప్లాస్టిక్తో చేసే స్పూనులు, ఫోర్కులు (కట్లెరీ), కాంపాక్ట్ డిస్కుల వంటి వాటి తయారీలో వాడుతారు. వీటితో నాడీవ్యవస్థపై, ప్రత్యుత్పత్తి వ్యవస్థపై, ఎర్రరక్తకణాలపైన ప్రభావం పడుతుంది. పాలీ ప్రొపిలీన్ (పీపీ)కెచప్ సీసాలు, పెరుగు ప్యాకింగ్, మార్జరిన్ అనే వంటనూనెలు, మందులు, సిరప్లు, పరాదర్శకం కాని కొన్ని మందుల్ని నిల్వ చేసే సీసాల తయారీకి వీటిని ఉపయోగిస్తుంటారు. మిగతా ప్లాస్టిక్లతో పోలిస్తే దీన్ని చాలావరకు సురక్షితమని అంటారుగానీ... దీనివల్ల కలిగే దుష్ప్రభావాలపై ఇంకా పరిశోధనలు కొనసాగుతూనే ఉన్నాయి. అంతమాత్రాన ఇది పూర్తిగా సురక్షితమని చెప్పడానికి వీలు లేదు. చదవండి: బరువు తగ్గడం కష్టంగా ఉందా? షాకింగ్ రీజన్ ఇదే కావచ్చు!థాలేట్స్తో తయారయ్యే వాటిల్లో కొన్ని... ఆహారంలో కలిసేందుకు అవకాశం ఉన్న మరో ప్లాస్టిక్ ఉపకరణాలు థాలేట్స్. (ఇంగ్లిష్లో థాలేట్స్ స్పెల్లింగ్కు ముందర ఉండే ‘పీ’ అక్షరం సైలెంట్ కాగా... కొందరు దీన్నే ఫ్తాతలేట్స్’ అని కూడా ఉచ్చరిస్తుంటారు). ప్లాస్టిక్ను ఎటుపడితే అటు ఒంచేందుకు (ఫ్లెక్సిబిలిటీ కోసం) ఉపయోగించే ΄ పాలీ వినైల్ క్లోరైడ్ (పీవీసీ) ఆహారంలో కలిసి దుష్ప్రభావాలను చూపుతాయి.థాలేట్స్ను ఏయే తయారీల్లో ఉపయోగిస్తారంటే...? ఆహారాన్ని ΄ ప్యాక్ చేసేందుకు వాడే బాక్స్ల కోసం. కూల్డ్రింక్స్ లేదా మంచినీటి సీసాల తయారీలో. ∙వాటర్ప్రూఫ్ కోట్లు, జాకెట్స్ వంటి దుస్తుల తయారీలో నీళ్ల పైపుల తయారీలో. పైకి తోలులా కనిపించే కొన్ని రకాల దుస్తుల తయారీలో. విద్యుత్ వైర్లపై ఉండే ఇన్సులేటింగ్ పదార్థాలలోఎలక్ట్రానిక్ వస్తువుల్లో, వినైల్ ఫ్లోరింగ్స్లో వాటర్బెడ్స్, పిల్లల ఆటవస్తువుల్లోఆరోగ్యంపై థాలేట్స్ వల్ల కలిగే దుష్ప్రభావాలు బైస్ఫినాల్ ఏ (బీపీఏ) లాగే ధాలేట్స్ కూడా టెస్టోస్టెరాన్ వంటి పురుష సెక్స్ హార్మోన్పై దుష్ప్రభావం చూపుతాయి. వీటి వల్ల పురుషుల్లో వీర్యం నాణ్యత (స్పెర్మ్ క్వాలిటీ) కూడా దెబ్బతింటుంది. ప్లాస్టిక్తో కలిసిన ఆహారం వల్ల అలర్జీలు, ఆస్తమా, పిల్లికూతలు రావచ్చు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడానికి లేదా ఒకవేళ వాడుతున్నప్పటికీ... చాలావరకు వాటిని సురక్షితంగా మలచుకోడానికి కొన్ని సూచనలివే... ప్లాస్టిక్ వస్తువుల తయారీలో బైస్ఫినాల్ ఏ లేనివి (బీపీఏ ఫ్రీ) అని రాసి ఉన్న వాటిని మాత్రమే వాడాలి. ఇదీ చదవండి: ఈ టిప్స్ పాటిస్తే పండగ వేళ మెరిసిపోవడం ఖాయం!నిర్వహణ : యాసీన్ -
బరువు తగ్గడం కష్టంగా ఉందా? షాకింగ్ రీజన్ ఇదే కావచ్చు!
మనం ఉపయోగించే షాంపూ బాటిల్ సైతం మన బరువును పెంచే అవకాశం ఉందంటున్నారు పరిశోధకులు. కేవలం షాంపూ బాటిల్ మాత్రమే కాదు... షవర్ జెల్, హెయిర్ కండిషనింగ్ క్రీమ్ లాంటి వాటిని ΄్యాక్ చేసే కొన్ని సీసాలతో పాటు తిరిగి మాటిమాటికీ భర్తీ చేసుకోడానికి అవకాశమున్న డ్రింకింగ్ బాటిళ్లలో ఉండే ప్లాస్టిక్ కూడా బరువు పెరగడానికి కారణమవుతోందన్న విషయాన్ని గత కొద్దిరోజుల ముందర నార్వేలోని నార్వేజియన్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సంస్థ నిర్వహించిన ఓ పరిశోధనతో తెలిసింది. ఈ అధ్యయనంలో భాగంగా 629 రకాల వివిధ ప్లాస్టిక్ వస్తువుల్లో ఉంచిన దాదాపు 55,000 రకాల రసాయనాలను పరీక్షించారు. వీటిల్లో పదకొండు రకాల రసాయనాలు బరువు పెరగడానికి కారణ మవుతాయని తేలిందని పరిశోధనకు నేతృత్వం వహించిన, ఆ సంస్థకు చెందిన అసోసియేట్ ప్రొఫెసర్ మార్టిన్ వేజ్నర్ తెలిపారు. ఆ ప్లాస్టిక్ సీసాలను ఉపయోగించినప్పుడు మన దేహంలోకి ప్రవేశించే ఆ పదకొండు రకాల రసాయనాల వల్ల బరువు పెరుగుతుండటంతో వాటిని ‘ఒబిసోజెన్స్’ (Obesogens) అని పేర్కొంటున్నారు. మరీ ముఖ్యంగా బైస్ఫినాల్–ఏ వంటి ‘ఒబిసోజెన్స్’ మన దేహంలోని జీవరసాయన ప్రక్రియల్లో జోక్యం చేసుకోవడంతో పాటు కొవ్వు నిండి ఉండే ఫ్యాట్ సెల్స్ను పెరిగిపోయేలా చేయడం వల్ల దేహం బరువు అకస్మాత్తుగా పెరుగుతోందని ఈ అధ్యయనంలో పాల్గొన్న మరో పరిశోధకుడు జొహన్నేస్ వోకర్ తెలిపారు. అంటే ఇప్పటివరకూ ప్లాస్టిక్ పర్యావరణానికి హానికరమని, అలాగే బైస్ఫినాల్–ఏ, థ్యాలేట్స్ వంటి ప్లాస్టిక్స్ వల్ల అనేక నాడీ సంబంధమైనవి, వ్యాధినిరోధకతను తగ్గించేవి, ప్రత్యుత్పత్తి వ్యవస్థను దెబ్బతీసేలాంటి అనారోగ్యాలు కలగడమే కాదు... ఇప్పుడు తాజాగా బరువు పెరిగేలా చేయడం ద్వారా కూడా ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయని స్పష్టమైంది. బరువు పెరగడం వల్ల... స్థూలకాయం కారణంగా ఆరోగ్యపరంగా అనేక అనర్థాలు వస్తాయనే విషయం తెలిసిందే. ఈ అధ్యయన వివరాలన్నీ‘ఎన్విరాన్మెంటల్ సైన్స్ అండ్ టెక్నాలజీ’ అనే ప్రముఖ జర్నల్ లో ప్రచురితమయ్యాయి.బరువు పెంచి ఒబేసిటీని కలిగిస్తోంది కాబట్టి ఆ ప్లాస్టిక్ పదార్థాలకు ‘ఒబిసోజెన్స్’ అని పేరు! ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడానికి లేదా ఒకవేళ వాడుతున్నప్పటికీ... చాలావరకు వాటిని సురక్షితంగా మలచుకోడానికి కొన్ని సూచనలివే..ప్లాస్టిక్ వస్తువుల తయారీలో బైస్ఫినాల్ ఏ లేనివి (బీపీఏ ఫ్రీ) అని రాసి ఉన్న వాటిని మాత్రమే వాడాలి. ప్లాస్టిక్ వస్తువులను ఉపయోగించాల్సి వస్తే... వాటిపై ‘మైక్రోవేవ్ సేఫ్’ అని రాసి ఉన్నవే వాడాలి. అవి మైక్రోవేవ్ ఒవెన్లో పెట్టినా కరగవు. లేకపోతే ఆ ఉష్ణోగ్రత వద్ద ప్లాస్టిక్ ఎంతో కొంత కరిగి ఆహారంలో కలిసి ఆరోగ్యంపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని గుర్తుంచుకోవాలి. ప్లాస్టిక్ వస్తువులను కఠినమైన డిటర్జెంట్స్ మోతాదులు ఎక్కువగా ఉండే డిష్వాషర్స్లో ఎక్కువసేపు నానబెట్టి ఉంచడం సరికాదు. పిల్లల పాలకోసం గ్లాస్తో చేసిన ప్లాల సీసాలు ఉపయోగించడమే మంచిది. ప్లాస్టిక్ సీసాలు ఉపయోగించే ప్పుడు వాటిలో వేడి వేడి పాలు పోయకూడదు. ఆహారాన్ని ఉంచడం కోసం ప్లాస్టిక్ డబ్బాల కంటే స్టెయిన్లెస్ స్టీల్ పాత్రలు మంచివని గుర్తుంచుకోవాలి. కొన్ని లంచ్బాక్స్లు మూత సాగినట్లుగానూ, కింద ఉన్న కంటెయినర్ కాస్త సాగిపోయి షేప్ చెడిపోయినట్లు గానూ ఉంటాయి. ఇలా సాగి ఉన్నట్లుగా ఉన్న ఆహారపు డబ్బాలను ఏమాత్రం ఉపయోగించ కూడదు. చదవండి: ఈ టిప్స్ పాటిస్తే పండగ వేళ మెరిసిపోవడం ఖాయం!ఇక మనం రోజూ నీళ్లను నిల్వ చేసుకోడానికి ఉపయోగించే ప్లాస్టిక్ డ్రమ్ముల వంటి వాటిని కేవలం నీళ్ల నిల్వ కోసం తయారు చేసినవాటినే ఉపయోగించాలి. అయితే చాలామంది కొన్ని రకాల రసాయనాలను (కెమికల్స్) నిల్వ ఉంచడానికి వాడిన వాటిని కడిగి వాటిని నీళ్ల నిల్వ కోసం వాడుతుంటారు. ఇలాంటివి కూడా అంత మంచిది కాదు. -
ఐదేళ్ల వయసుకే చిన్నారి అవినా అరుదైన ఘనత..!
ఆ చిన్నారి వయసు ఐదేళ్లు.. అయితేనేం పనికిరాని వ్యర్థాలతో అద్భుతాలు సృష్టించింది.. బుజ్జి మెదడుకు పదునుపెట్టి అరుదైన ఘనతను సొంతం చేసుకుంది.. తల్లిదండ్రుల నుంచి వచ్చిన సేవాతత్పరత, సామాజిక బాధ్యతను ఒంటబట్టించుకుంది. అనాథ పిల్లల కోసం వారు చేస్తున్న సేవలో తన పాత్రను గుర్తించి వ్యర్థాలతో చిన్నారులకు బట్టలు తయారుచేసింది. ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు దక్కించుకుంది. కాప్రా సాకేత్కు చెందిన పొట్టపాటి ప్రవీణ్కుమార్ సాఫ్ట్వేర్ ఉద్యోగి. భార్య తేజస్విని సోషల్ వర్కర్గా పనిచేస్తున్నారు. వీరి ఐదేళ్ల కుమార్తె అవినా పొట్టపాటి బిల్లబాంగ్ ఇంటర్నేషనల్ స్కూల్లో యూకేజీ చదువుతోంది. సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనే తల్లిదండ్రులతో పాటుగా అవినా కూడ తరచూ వారితో కలిసి వెళ్లేది. ఈ క్రమంలో తన వయసున్న తోటి పిల్లలకు సరైన దుస్తులు లేకపోవడం, చెప్పులు లేకపోవడం గమనించింది. వారికి తనవంతుగా ఎమైనా సాయం చేయాలనే తలంపుతో వ్యర్థాలతో దుస్తులు తయారు చేయడం మొదలుపెట్టింది. మూడేళ్ల వయసు నుంచే ఇంట్లో ఫ్లాసిక్ బ్యాగులు, ఫ్లాస్టిక్ కవర్లు, పేపర్ బ్యాగులతో దుస్తులు, చెప్పులు వంటి వస్తువులను తయారు చేయడం ప్రారంభించింది. కుమార్తె ఆసక్తిని గమనించి.. చిన్నారి ఆసక్తిని గమనించిన తల్లిదండ్రులు అవినాను ప్రోత్సహించారు. ఆమె మేధస్సుకు పదును పెట్టి ఫ్లాస్టిక్ వ్యర్థాలతో పలు రకాల దుస్తులను తయారు చేసింది. తమ కూతురు ప్రతిభకు గుర్తింపు ఇవ్వాలనే కోరిక వ్యర్థాలతో తయారు చేసిన దుస్తులను ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్కి పంపించారు. పలుమార్లు చేసిన ప్రయత్నం ఫలించి ఎట్టకేలకు ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ నుంచి ఆహా్వనం పొందారు. చిన్నారి అవినా అందరి సమక్షంలో ఫ్లాస్టిక్, పేపర్ వ్యర్థాలతో 7 రకాల అందమైన దుస్తులను తయారు ఆశ్చర్యపరించింది. అవినా సృజనను ప్రశంసిస్తూ ఆమెకు ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం కల్పించారు. చాలా గర్వంగా ఉంది.. అతి చిన్న వయసులో మా కుమార్తె ఇలాంటి రికార్డు దక్కించుకోవడం సంతోషంగా ఉంది. మూడేళ్ల వయసు నుంచే వ్యర్థాలతో ఏదో ఒకటి తయారు చేస్తూ ఉండేది. ఆ ఆసక్తిని గమనించి ప్రోత్సహించాం. తన ప్రతిభను గుర్తించి ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్సులో స్థానం కల్పించారు. అవినా ప్రతిభ పర్యావరణ పరిరక్షణకు దోహదం చేయడం సంతోషం కలిగించింది. – పొట్టపాటి ప్రవీణ్కుమార్, తేజస్విని దంపతులు (తల్లిదండ్రులు) -
ఇకనైనా కళ్లు తెరవకపోతే....నిలువునా మింగేస్తుంది!
నిజం చెప్పాలంటే మనమిప్పుడు ప్లాస్టిక్ మహాసముద్రం మధ్యలో జీవిస్తున్నాం. ఇది అతిశయోక్తిగా అనిపించవచ్చుగానీ... మన రోజువారీ కార్యకలాపాల్లో చూసుకుంటే పొద్దున్నే బ్రష్, స్నానంలో మగ్, రుద్దుకునే సబ్బు తాలూకు సోప్కేస్ అన్నీ ప్లాస్టిక్వే. ఇక ఆఫీసుకు వచ్చాక తాగే మొదటిచాయ్ నుంచి బయటకువెళ్లినప్పుడు చాయ్ అమ్మే వ్యక్తి ఇచ్చే టీ వరకు చాలావరకు ప్లాస్టిక్కే. గతంలోని స్టీల్ క్యారియర్ స్థానంలో ఇప్పుడు చాలా లంచ్బాక్సులు ప్లాస్టిక్వే. ఇలా చూసుకుంటే మనం వాడే నిత్యజీవిత ఉపకరణాల్లో ప్రతి ఐదింటిలో కనీసం మూడైనా ప్లాస్టిక్వే ఉంటాయి. కానీ ఈ ప్లాస్టిక్ సముద్రమిప్పుడు సునామీగా మారి మన ఆరోగ్యాలను దెబ్బతీస్తోంది. అది ఏయే విధంగా మన ఆరోగ్యాలను కబళిస్తోందీ, ప్లాస్టిక్ను పూర్తిగా నిర్మూలించలేక పోయినా కనీసం దాన్ని రీ–సైకిల్ చేసేందుకు వీలుగా ఉండే వాటిని వాడాలనే అవగాహన కోసమే ఈ కథనం. మన ఇళ్లలో చెత్త ఊడ్చాక దాన్ని ఎత్తడానికీ ప్లాస్టిక్ చేటనే వాడతాం. అయితే ఇలాంటి ఉపకరణాలతో అప్పటికప్పుడు ఆరోగ్యానికి వచ్చే ప్రమాదమేమీ పెద్దగా లేకపోయినప్పటికీ... వేడి వేడి ఆహారాన్నినిల్వ చేయడానికి ఉపయోగించేప్లాస్టిక్ ఉపకరణాలతో మాత్రం ఆరోగ్యాలకు ఎంతో నష్టం చేకూరుతుంది. ఆ ప్లాస్టిక్ల కారణంగా ఆరోగ్యానికి జరిగే చేటు ఏమిటో, దాన్ని నివారించడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం.ప్లాస్టిక్ ప్రభావం ముఖ్యంగా హార్మోన్లపై... అందునా మరీ ముఖ్యంగా మహిళల్లోని ఈస్ట్రోజెన్స్రావంపై ఉంటుందనీ, దీనివల్ల ప్రత్యుత్పత్తికి తోడ్పడే హార్మోన్ల సమతౌల్యంతో తేడాలు వచ్చి గర్భధారణ సమస్యలు రావచ్చని అధ్యయనాల్లో తేలింది. పురుషుల్లో వీర్యకణాల సంఖ్య, కదలికలు తగ్గడం, పురుష సంబంధ హార్మోన్ల స్రావం తగ్గడం జరుగుతాయి. అందువల్ల వీలైనంత మేరకు ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించుకోవడం మంచిది.ప్లాస్టిక్తో ఆరోగ్యానికి హాని ఎందుకు..? ఇందుకు ఓ ఉదాహరణగా... ఆహారం పెట్టుకోడానికి గతంలో వాడే స్టీలుకు బదులు ప్లాస్టిక్ ఉపకరణాలను వాడుతున్నప్పుడు మన ఆరోగ్యానికి కలిగే హాని ఏమిటో తెలుసుకుందాం. ఆహారం ప్లాస్టిక్ బాక్స్లలో నిల్వ ఉంచి తీసుకుంటున్నప్పుడు మనం దాన్ని తిన్నప్పుడల్లా బాక్స్ తాలూకు ΄్లాస్టిక్ పదార్థాలూ కొద్దికొద్ది మోతాదుల్లో ఆహారంతోపాటు మన దేహంలోకి వెళ్తుంటాయి. ఆహారంతో పాటు ప్లాస్టిక్ మన శరీరంలోకి వెళ్లి, మన దేహంలోకి ఇంకిపోయే ప్రక్రియను ‘లీచింగ్’ అంటారు. చదవండి: పారిస్ ఫ్యాషన్ వీక్ : ఐశ్వర్యా డాజ్లింగ్ లుక్ వెనుకున్న సీక్రెట్ ఇదే!ఈ ప్రక్రియ ఎక్కువగా ఉండేదెప్పుడు..? లీచింగ్ ఎక్కువగా జరిగేందుకు ఆస్కారం ఉన్న పరిస్థితులివే... ఆహారం ఎంత వేడిగా ఉంటే... అంతగా ప్లాస్టిక్ మన కడుపులోకి ప్రవేశిస్తుంది. ∙అదే ఆహారంలో కొవ్వులు, ఉప్పు ఉన్నప్పుడు లీచింగ్ మరింత పెరుగుతుంది. మనం తీసుకునే ఆహారంలో అసిడిక్ వస్తువులు అంటే చింతపండు, సాంబార్ వంటి పులుపు వస్తువులు ఉంటే... మన ప్లాస్టిక్ కంటెయినర్ నుంచి మన దేహంలోకి ప్లాస్టిక్ ఎక్కువ మోతాదుల్లో కలుస్తుంటుంది.ప్లాస్టిక్ బౌల్లో ఆహారాలు ఎందుకు పెట్టకూడదంటే...?! ఈ మధ్యకాలంలో మనం అందంగా కనిపించే ప్లాస్టిక్ బౌల్స్లో కూరలూ, వేడి వేడి పులుసు వంటి ఆహారాలను ఉంచి, వాటిని డైనింగ్ టేబుల్ మీద అలంకరించి వాటిల్లోంచే అన్నం, కూరలు వడ్డించడాన్ని చూస్తున్నాం.సాధారణంగా ఈ కూరలు పెట్టుకునే బౌల్స్ను ‘మెలమెన్’ అనే ప్లాస్టిక్ వంటి పదార్థంతో తమారు చేస్తారు. వేడి వేడి కూరలు, పులుసులు ఇందులోకి తీయగానే ఆ వేడికి ఆ ప్లాస్టిక్లోని మెలమైన్... ఆహారంతో పాటు కలిసి నోటి ద్వారా శరీరంలోకి వెళ్తుంది. ఇలా దేహంలోకి వెళ్లిన ఈ పదార్థం వల్ల కిడ్నీలో రాళ్లు వచ్చే అవకాశం ఉందని ఒక అధ్యయనంలో తేలింది. ఈ విషయం ‘జామా ఇంటర్నల్ మెడిసిన్’ జర్నల్లోనూ ప్రచురిత మైంది. ఈ అధ్యయనంలో భాగంగా కొంతమందికి మెలమైన్ బౌల్స్లో నూడుల్స్ ఇచ్చారు. మరికొందరికి పింగాణీ బౌల్స్లో ఇచ్చారు. ఈ రెండు గ్రూపుల వారికి నిర్వహించిన మూత్ర పరీక్షల్లో మెలమైన్ బౌల్స్లో తిన్నవారి మూత్రంలో మెలమైన్ మోతాదులు దాదాపు ఎనిమిది రెట్లు ఉన్నాయని తేలింది. దీంతో వారిలో కిడ్నీ ఫెయిల్యూర్ వంటి ముప్పుతో పాటు... క్యాన్సర్ ప్రమాదమూ ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదికలు చెబుతున్నాయి. మెలమైన్ బౌల్లో పెట్టి ఏ ఆహారాన్నీ మైక్రోవేవ్ ఒవెన్లోఉంచి వేడిచేయకూడదని అమెరికన్ సంస్థ ఎఫ్డీఏ కూడా గట్టిగా సిఫార్సు చేస్తోంది. ఈ ప్లాస్టిక్ ప్రభావం ముఖ్యంగా హార్మోన్లపై... మరీ ముఖ్యంగా మహిళల్లోని ఈస్ట్రోజెన్ స్రావంపై ఉంటుందనీ, దీనివల్ల ప్రత్యుత్పత్తికి తోడ్పడే హార్మోన్ల సమతౌల్యంలో తేడాలు వచ్చి గర్భధారణ సమస్యలు రావచ్చని తేలింది. పురుషుల్లో వీర్యకణాల సంఖ్య, కదలికలు తగ్గడం, పురుష సంబంధ హార్మోన్ల స్రావం తగ్గడం వంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి. చాలామందిలో డయాబెటిస్ రిస్క్ పెరుగుతున్నట్లుగా ఇలాంటిదే మరో అధ్యయనంలోనూ తేలింది.స్థూలకాయం వస్తున్న వారి సంఖ్య బాగా పెరుగుతోంది. రొమ్ము క్యాన్సర్ వంటి క్యాన్సర్ రిస్క్లు చాలా ఎక్కువ. ప్లాస్టిక్ బౌల్స్లో వేడి వేడి ఆహారం పెట్టుకుని తీసుకునేవారిలో మెదడు కణాలు బలహీనమై జ్ఞాపకశక్తి తగ్గుతున్నట్లు, మూడ్స్ మారి΄ోవడం వంటి సమస్యలు వస్తున్నట్లు గుర్తించారు. అలై్జమర్స్ వంటివి కూడా ఎక్కువగా పెరుగుతున్నట్లు పలు అధ్యయనాలు తెలుపుతున్నాయి. ప్లాస్టిక్ ఉపయోగం కారణంగా ఇలా పలు రకాలుగా ఆరోగ్యంపై అనేక దుష్ప్రభావాలు పడుతున్నాయి. అందుకే కూరలు, పులుసులు నిల్వ చేసుకునేందుకు ప్లాస్టిక్ బౌల్స్లో కాకుండా పింగాణీ బౌల్స్ వాడటం మేలని నిపుణులు చెబుతున్నారు.మరో సరికొత్త అధ్యయన ఫలితమిలా... పిల్లలు పాలు తాగడానికి ఉపయోగించే పాలపీకలు మొదలుకొని, వాళ్లు ఆడుకునే ఆటవస్తువుల వరకు ప్లాస్టిక్తో తయారైనవి కాస్తా... చాలాకాలం తర్వాత... అంటే ఆ చిన్నారులే పెరిగి కాస్త పెద్దయ్యాక (అంటే పెద్దపిల్లలుగా ఉన్నప్పుడూ, వాళ్ల కౌమార ప్రాయంలో/అడాలసెంట్ వయసులో) వాళ్ల ఆరోగ్యంపై దుష్ప్రభావాలు చూపుతాయంటూ వేలాది తల్లులూ, పిల్లలపై నిర్వహించిన ఓ అధ్యయనం తెలుపుతోంది. అలా ఆ ప్లాస్టిక్ వస్తువులు వాడిన ఆ పిల్లల పాటు తల్లుల్లో సైతం మొదట స్థూలకాయం... దాని ప్రభావంతో గుండె జబ్బులు, ఆస్తమా, సంతానలేమి వంటి దుష్ప్రభావాలు కనిపిస్తాయంటూ ఆ అధ్యయనం పేర్కొంటోంది. ఈ ఫలితాలు ప్రముఖ హెల్త్ జర్నల్ ‘ల్యాన్సెట్’లో ప్రచురితమయ్యాయి.ప్లాస్టిక్ బాటిలో ఉంచిన నీళ్లు తాగచ్చా..?మరో పరిశోధన తాలూకు ఫలితాలివి. ఇటీవల చాలామంది నీళ్లబాటిల్ కొని దాన్ని వాడుతూ ఉంటారు. ఇలా ఓ బాటిల్లో వారం పాటు ఉంచిన నీళ్లు తాగవచ్చా అనే అంశంపై ఇటీవల కొందరు పరిశోధకులు ఓ అధ్యయనం నిర్వహించారు. ఈ అధ్యయనంలో తేలిన అంశమేమిటంటే... ఇలా నీళ్లు నిల్వ ఉంచినప్పుడు ప్లాస్టిక్ కొద్దికొద్ది మోతాదుల్లో కలవడం (లీచ్ కావడం) వల్ల ఆరోగ్యానికి హాని జరుగుతుందనీ, అలాగే వారం పాటు ఉంచి నీళ్లలో బ్యాక్టీరియా పెరగడంతో కడుపులో ఇబ్బందిగా ఉండటం, కడుపు నొప్పి, డయేరియా వంటి సమస్యలు రావడమేగాక...కాస్త అరుదుగా అలాంటి కొందరిలో అది ప్రాణాపాయానికీ దారి తీయవచ్చంటూ పరిశోధకులు పేర్కొంటున్నారు. ఇలా బ్యాక్టీరియా పెరగడమన్నది కేవలం నీళ్లలో జరిగినా, జరగకపోయినా... బాటిల్ తాలూకు మూతలో సైతం బ్యాక్టీరియా/మౌల్డ్ (నాచు వంటి పెరుగుదల) పెరగవచ్చంటూ వారు హెచ్చరిస్తున్నారు. అసలు ప్లాస్టిక్ అంటే ఏమిటంటే...? ప్లాస్టిక్ వస్తువులు, ఉపకరణాలు ప్రధానంగా బైస్ఫినాల్ ఏ (బీపీఏ) అనే పదార్థంతో తయారవుతాయి. ∙కొన్ని సందర్భాల్లో థాలేట్ అనే పదార్థంలోనూ ప్లాస్టిక్ ఉపకరణాలను తయారుచేస్తారు. మనం ఆహారం, తిను బండారాలూ, ఇతరత్రా ద్రవపదార్థాలను నిల్వ ఉంచేందుకు మనం రోజువారీ ఉపయోగించే ప్లాస్టిక్తో తయారైన ఉపకరణాలన్నీ (యుటెన్సిల్స్) ప్రధానంగా బైస్ఫినాల్ ఏ (బీపీఏ) లేదా థాలేట్తోనే తయారవుతాయి.చదవండి: ఈ టిప్స్ పాటిస్తే పండగ వేళ మెరిసిపోవడం ఖాయం!బీపీఏలతో ఆరోగ్యంపై దుష్ప్రభావాలు... ప్లాస్టిక్ బాక్స్లలో ఉంచే ఆహారం వల్ల మన ఆరోగ్యంపై చాలా రకాల దుష్ప్రభావాలు పడతాయి. వాటిలో కొన్ని... ప్లాస్టిక్ కలిసిన ఆహారంతో హార్మోన్లపై... మరీ ముఖ్యంగా మహిళల్లోని ఈస్ట్రోజెన్ హార్మోన్పై ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఫలితంగా మహిళల్లో ప్రత్యుత్పత్తికి తోడ్పడే హార్మోన్ల సమతౌల్యంలో తేడాలు వచ్చిగర్భధారణ సమస్యలు వచ్చే అవకాశాలెక్కువ. పురుషుల్లో వీర్యకణాల సంఖ్య, కదలికలు తగ్గడం, పురుష సంబంధ హార్మోన్ల స్రావం తగ్గడం.వైద్యపరీక్షల్లో మూత్రంలో ప్లాస్టిక్ పాళ్లు పెరిగినట్లుగా రిపోర్టులు వచ్చిన చాలామందిలో డయాబెటిస్ కేసులు పెరుగుతున్నట్లుగా ఒక అధ్యయనంలో తేలింది. ప్లాస్టిక్ యుటెన్సిల్స్లో ఆహారం తీసుకునేవారిలో స్థూలకాయం వస్తున్న వారి సంఖ్య బాగా పెరుగుతోంది. రొమ్ము క్యాన్సర్ వంటి క్యాన్సర్ ముప్పు చాలా ఎక్కువ. ప్లాస్టిక్ కంటెయినర్లలో వేడి వేడి ఆహారం పెట్టుకుని తీసుకునేవారిలో మెదడు కణాలు బలహీనమై జ్ఞాపకశక్తి తగ్గుతున్నట్లు, మూడ్స్ మారిపోవడం వంటి సమస్యలు వస్తున్నట్లు గుర్తించారు. అల్జైమర్స్ వ్యాధి వంటివి కూడా ఎక్కువగా పెరుగుతోంది.బీపీఏలతో తయారయ్యే ఉపకరణాలివి... పిల్లలకు ఉపయోగించే పాలపీకలు,వాటర్బాటిళ్లు, ∙లంచ్బాక్స్లు,సీడీలు, డీవీడీలు,కొన్ని ఎలక్ట్రానిక్ పరికరాలు.ప్లాస్టిక్తో అనర్థాల నివారణకు కొన్ని సూచనల గురించి తెలుసుకోవాలంటే చదవండి బరువు తగ్గడం కష్టంగా ఉందా? షాకింగ్ రీజన్ ఇదే కావచ్చు!డాక్టర్ శివరాజు సీనియర్ ఫిజీషియన్ నిర్వహణ: యాసీన్ -
భోజనం తిన్న వెంటనే 30 నిమిషాలు చాలు.. ఎన్ని ప్రయోజనాలో తెలుసా!
యుక్త వయసులోనే ఉన్నట్టుండి గుండెనొప్పితో కుప్పకూలి చనిపోతున్న ఘటనలు అనేకం చేస్తున్నాయి. ఆరోగ్యంగా, ఫిట్గా ఉన్నవారు కూడా ‘గుండె’ లయ తప్పుతున్న కారణంగా ఉన్న పళంగా ప్రాణాలు విడిస్తున్నారు. అయితే తిన్న వెంటనే వాకింగ్ చేస్తే గుండెపోటువచ్చే అవకాశాలు 40 శాతం వరకూ తగ్గుతాయని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. ప్రపంచ గుండె దినోత్సవం సందర్భంగా ఇవాల్టి టిప్ ఆఫ్ ది డేలో భాగంగా అన్నం తిన్న వెంటనే నడకతో వచ్చే లాభాల గురించి తెలుసుకుందాం.25నుంచి 30 ఏళ్ల యువత కూడా గుండెపోటుకు గురవుతున్నారు. ఫాస్ట్ ఫుడ్, కనీస వ్యాయామం లేకపోవడం, అనారోగ్యకర జీవనశైలి, తగినంత నిద్ర లేకపోవడం, ఊబకాయం, ఒత్తిడి వంటి అనేక కారణాలు గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. కానీ ఈ చిన్న అలవాటు గుండెపోటు ప్రమాదాన్ని గణనీయంగా తగ్గిస్తుంది.నిజానికి భోజనం చేసిన వెంటనే నడవడం వల్ల అలసట, కడుపు నొప్పి , ఇతర రకాల అసౌకర్యాలు కలుగుతాయని ఒక అపోహ ఉంది. కానీ భోజనం చేసిన తర్వాత నడవడం బరువు తగ్గడానికి తిన్న తర్వాత ఒక గంట తర్వాత నడన కంటే, వెంటనే చేసే వాకింగ్ ఎక్కువ ప్రభావ వంతంగా ఉంటుందని అధ్యయనంలో కనుగొన్నారు. భోజనం చేసిన తర్వాత ఒక గంట తర్వాత ప్రారంభించి 30 నిమిషాలు నడవడం కంటే భోజనం తర్వాత కనీసం 30 నిమిషాలు నడక అలవాటు చేసుకుంటే,కండరాలు గ్లూకోజ్ను వెంటనే ఉపయోగించు కోవడంతో రక్తంలో చక్కెర స్థాయిలు పెరగవు. దీంతో ఇన్సులిన్ ఉత్పత్తి కూడా నియంత్రణలో ఉంటుంది. అందుకే భోజనం తర్వాత వీలైనంతత్వరగా నడకను అలవాటు చేసుకోవాలి.జిమ్కి వెళ్లడం, కఠినమైన వ్యాయామాలు చేయడం సాధ్యంకాని వారికి ఇది నిజంగా వరం లాంటిదని చెప్పవచ్చు. ప్రతిరోజూ భోజనం తర్వాత ముఖ్యంగా రాత్రి భోజనం తర్వాత వీలైనంత త్వరగా 30 నిమిషాలు వేగంగా నడవడం వల్ల ఎక్కువ బరువు తగ్గే అవకాశాలున్నాయి. లేదంటే ప్రతి ఆహారం గ్లూకోజ్గా మారి రక్తంలోకి వెళ్తుంది. ఆ సమయంలో చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పెరగడం వల్ల రక్తనాళాల్లో వాపు, ఒత్తిడి వస్తుంది. ఇది దీర్ఘకాలంలో రక్తనాళాల లైనింగ్ను దెబ్బతీసి గుండె జబ్బులకు దారి తీస్తుంది.భోజనం చేసిన వెంటనే కూర్చుండిపోవడం, మొబైల్ చూస్తూ అలా ఉండిపోవడం, లేదంటే వెంటనే మంచంమీద వాలిపోవడం లాంటివిఆరోగ్యానికి చాలా చేటు చేస్తాయి. అలా కాకుండా కేవలం 30 నిమిషాల పాటు నడక ఎన్నో రకాల అనారోగ్యాలనుంచి తప్పించుకోవచ్చు. రక్త ప్రసరణ సజావుగా సాగుతుంది. శరీరంలో కొవ్వు పేరుకుపోకుండా, ఆహారం శక్తిగా మారుతుంది. కండరాలు బలపడటతాయి. బరువు కూడా అదుపులో ఉంటుంది. -
మూడేళ్లు, మూడు అలవాట్లు : 30 కిలోలు తగ్గిన డాక్టర్ భావన
బరువు తగ్గడం పెద్ద టాస్క్. షార్ట్కట్లో, చిటికె వేసినట్టు బరువు తగ్గడం సాధ్యం కాదు. ఒక వేళ తగ్గినా అది ఆరోగ్యకరం కాదు కూడా. ఇదే విషయాన్ని బెంగళూరుకు మహిళా డాక్టర్ నిరూపించారు. నో మ్యాజిక్, నో టిప్స్.. నో ట్రెండింగ్ ఫ్యాషన్ అంటూ ఇద్దరు కుమార్తెల తల్లి భావన బరువు తగ్గిన తీరు విశేషంగా నిలుస్తోంది. బెంగళూరు డాక్టర్ భావన ఆనంద్ నెమ్మదిగా, స్థిరమైన . ఆచరణాత్మక విధానాన్ని స్వీకరించారు. ప్రతి భోజనంలో ఒక ముఖ్యమైన పోషకాన్ని తినడం ద్వారా మూడు సంవత్సరాలలో 30 కిలోల బరువు తగ్గారు.మూడేళ్లలో 30 కిలోలు ఎలా?2022 డిసెంబరులో భావన బరువు దాదాపు 84 కిలోలు ఉండేవారు. తాను అనుసరించిన పద్ధతి ద్వారా క్రమంగా 2025 నాటికి 56.6 కిలోలకు చేరుకున్నారు. ప్రతిరోజూ తనను తాను చెక్ చేసుకోవడం, సరిగ్గా తినడం ,క్రమం తప్పని వ్యాయామం ఈ మూడు అలవాట్లు తన జీవితాన్ని మార్చాయి అంటే తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. భావన బరువు తగ్గడాన్ని జీవనశైలి మార్పుగా భావించింది.సుదీర్ఘ ప్రణాళికతో క్రాష్ డైట్స్ లేదా డిటాక్స్ లాంటివేవీలేకుండా ప్రతీరోజు చిన్నగా నడవండిఅంటారామె. బరువు తగ్గడం అనేది దానిని తగ్గించడం కంటే చాలా సవాలుతో కూడుకున్నదే.కానీ దృష్టి దీర్ఘకాలిక ఆరోగ్యకరమైన అలవాట్ల ద్వారా ఇది సాధ్యమే అనేది భావన సక్సెస్మంత్ర. View this post on Instagram A post shared by Dr Bhawana Anand (@dr.fitmum) గేమ్-ఛేంజర్: భావన ప్రకారం, ప్రతి భోజనంలో ప్రోటీన్ జోడించడమే పెద్ద మార్పు.ఈ ఒక్క అడుగు ఆమె ఫిట్నెస్ ప్రయాణానికి వెన్నెముకగా మారింది. "కండరాల బలానికి, పెరుగుదలకు భోజనాన్ని సమతుల్యంగా ఉంచడానికి చాలా కీలకం అని ఆమె పేర్కొంది. ప్రోటీన్ ఆమెకు ఎక్కువసేపు కడుపు నిండిన అనుభూతిని కలిగించింది, భోజనం మధ్య చిరుతిండి లేదా అతిగా తినాలనే కోరికను తగ్గించింది.ప్రోటీన్ ఎందుకు?బరువు తగ్గడానికి లేదా ఫిట్గా ఉండటానికి ప్రయత్నించే ఎవరికైనా ప్రోటీన్ అవసరమని పోషకాహార నిపుణులు అంగీకరిస్తున్నారు.కార్బోహైడ్రేట్లు, కొవ్వులతో పాటు శరీరంలోని మూడు ప్రధాన మాక్రో న్యూట్రియెంట్లలో ఒకటిది. ఆకలిని నియంత్రించడంలో సహాయపడుతుంది. కేలరీల ఇన్టేక్ను తగ్గిస్తుంది.ఎంత ప్రోటీన్ తినాలి? ప్రపంచ ఆహార మార్గదర్శకాల ప్రకారం, వయోజన మహిళలు రోజుకు కనీసం 46 గ్రాముల ప్రోటీన్ తీసుకోవాలి, పురుషులు కనీసం 56 గ్రాములు తీసుకోవాలి. అలాగే క్రమం తప్పకుండా వ్యాయామం చేసే వ్యక్తులు వారి ఫిట్నెస్ లక్ష్యాలను బట్టి అధిక మొత్తంలో ప్రయోజనం పొందవచ్చు.ఆరోగ్యకరమైన ప్రోటీన్ మూలాలుగుడ్లు, చికెన్, చేపలు , లీన్ మాంసాలు, కాయధాన్యాలు , చిక్కుళ్ళుగ్రీకు యోగర్ట్ పనీర్, గింజలు , విత్తనాలుప్రోటీన్ షేక్స్ లేదా సప్లిమెంట్లు (అవసరమైనప్పుడు)తన వెయిట్లాస్ జర్నీ, తన ఫిట్నెస్ రొటీన్, పలు రకాల కసరత్తుల వీడియోలు, తన ప్రొటీన్ ఆహారం డా. ఫిట్మమ్ ఇన్స్టాలో పోస్ట్ చేస్తూ, అభిమానులను ప్రేరేపించడం భావనకు అలవాటు. -
చూసుకో పదిలంగా.. ‘హృదయాన్ని అద్దంలా..!
యుక్త వయసులోనే ‘గుండె’ లయ తప్పుతోంది. ‘గుండె నొప్పి’ కారణంగా ఉన్న ఫలంగా కుప్ప కూలిపోతున్నారు.. ప్రాణాలు విడిస్తున్నారు. ముందస్తు జాగ్రత్తలతో గుండెను పదిలంగా చూసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. నేడు ప్రపంచ గుండె దినోత్సవం సందర్భంగా.. ప్రత్యేక కథనం.మానవ శరీరంలో అన్ని శరీర భాగాలు కీలకమే. ప్రధాన భాగమైన గుండె పోషించే పాత్ర ఎంతో ప్రత్యేకమెంది. ఏదైనా సంఘటనను తట్టుకొని నిలబడినప్పుడు వాడికి ‘గుండె నిబ్బరం’ ఎక్కువరా..! అంటారు. అంటే గుండె సంపూర్ణ ఆరోగ్యకంగా ఉందనడానికి నిదర్శనం. అది ఎప్పుడో 30ఏళ్ల మాట. ఇప్పుడు గుండె జబ్బులు సాధారణ వ్యాధుల్లా మారాయి. ఎప్పుడు ఏ గుండె ఆగిపోతుందో తెలియని విధంగా ఆరోగ్య పరిస్థితులు మారాయి. గుండె జబ్బులతో బాధపడుతున్న వారి సంఖ్య ప్రతియేటా గణనీయంగా పెరగడమే ఇందుకు కారణం. ఉచిత వైద్యసేవ ద్వారా యేటా వేలాది మంది బైపాస్సర్జరీలు చేయించుకున్నారు. స్టంట్లు వేయించుకుని, ఎన్సీడీ కార్యక్రమాల ద్వారా గుండె జబ్బుగల వారికి వైద్య సేవలంన్నారు. ఆరోగ్యశ్రీకి రెఫర్ చేశారు. ఇలా పలు పథకాలు, నివేదికల ద్వారా గుండె వ్యాధుల తీవ్రతను తెలియపరుస్తోంది. జాగ్రత్తలతో హృదయాన్ని కాపాడుకుంటే పదికాలాలపాటు జీవించవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.జీవనశైలి మార్పులతోనే35 ఏళ్లకు ముందు ఏదైనా ఆహారం తినాలంటే నువ్వుల ఉండలు, వేరుశనగ ఉండలు, బఠానీలు, సంప్రదాయ పదార్థాలు లభించేవి. హోటళ్లలో కల్తీలేని ఆహార పదార్థాలు లభించేవి. నేడు ఆహారం విచ్చలవిడిగా లభిస్తూ మనిషి ప్రాణాల మీదకు తెస్తోంది. నూడుల్స్, బర్గర్లు, పిజ్జాల వంటి కార్పొరేట్ ఆహార పదార్థాల కారణంగా అనారోగ్యకరమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. చిన్న వయస్సులోనే ఊబకాయం వస్తోంది. అందులో కీలకమైనది గుండె. ఈ భాగంలో మార్పులు సంభవించడం, రక్తనాళాలు గడ్డకట్టుకుపోవడంతో గుండె వ్యాధులు, హార్ట్ స్టోక్లు వస్తున్నాయి. (యంగ్ ఇండియా! ఒక్క బీట్ మిస్ అయినా.. బీ(ట్) కేర్ఫుల్)గుండె నొప్పి లక్షణాలుశ్వాస తీసుకోవడంలో ఇబ్బందులుఛాతీలో మంట.. కొద్దిగా నడిచినా అయాసంజీర్ణాశయం పైభాగాన నొప్పిఎడమచేయి, రెండు చేతుల్లో నొప్పితీసుకోవాల్సిన జాగ్రత్తలుమద్యపానం, ధూమపానానికి దూరంగా ఉండాలి.సాధ్యమైనంత వరకు ఆహారంలో పీచు పదార్థాలు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. బీపీ, షుగర్లను నియంత్రణలో ఉంచుకోవాలి.45 నిమిషాల పాటు వ్యాయామం చేయాలి.మంచి పౌష్ఠికాహారాన్ని తీసుకోవాలి. కొవ్వు, నూనె, మసాల పదార్థాలకు దూరంగా ఉండాలి.ఒత్తిడిని జయించడానికి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉండాలి.చదవండి: Karur stampede tragedy మొన్ననే ఎంగేజ్మెంట్..త్వరలో పెళ్లిగుండె వ్యాధులపై అవగాహన పెంచుకోవాలిప్రజలు గుండె వ్యాధులపై అవగాహన పెంచుకోవాలి. మంచి జీవనశైలి అలవాటు చేసుకోవాలి. ఏవైనా అనారోగ్య సమస్యలు వచ్చినపుడు తక్షణమే వైద్యులను సంప్రదించాలి. ఒత్తిడికి లోను కాకుండా ప్రశాంతంగా ఉండాలి. దీర్గకాలిక వ్యాధులైన షుగర్, బీపీలను నియంత్రణలో ఉంచుకోవాలి. ప్రస్తుతం గుండె వైద్యానికి సంబంధించి అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయి. – డాక్టర్ ఎన్.శ్రావణ్కుమార్రెడ్డి, కార్డియాలజీ వ్యాధి నిపుణులు, కడప -
ప్రతీ హృదయ స్పందనను కాపాడుకుందాం!
ప్రపంచ హృదయ దినోత్సవం (world heart day 2025) సందర్భంగా ఆలివ్ హాస్పటల్ ప్రజలకు ప్రత్యేక పిలుపునిచ్చింది. WHO ప్రపంచ హృదయ నివేదిక 2023 ప్రకారం 2021లో గుండె సంబంధిత వ్యాధులతో ప్రపంచ వ్యాప్తంగా 20.5 మిలియన్ల మంది మరణాలకు కారణమైందనీ, ఇది మొ త్తంమరణాలలో మూడో వంతుగా ఉందని వెల్లడించింది.ప్రతి హృదయ స్పందనను కాపాడుకోండి. వరల్డ్ హార్ట్ రిపోర్ట్ 2023 ప్రకారం, హృదయ సంబంధ వ్యాధులు (CVDలు) 2021లో ప్రపంచవ్యాప్తంగా 20.5 మిలియన్ల మరణాలకు కారణమయ్యాయని అంచనా వేయబడింది, ఇది ప్రపంచవ్యాప్తంగా జరిగే మరణాలలో దాదాపు మూడింట ఒక వంతు. గుండె వ్యాధులు, గుండె పోటు ప్రధాన కారణాలుగా ఉన్నాయని పేర్కొంది .“హృదయాన్ని ఉపయోగించు, హృదయాన్ని తెలుసుకో” అనే బ్యానర్ కింద, ఆలివ్ హాస్పిటల్ వ్యక్తులు, సంఘాలు, ప్రభుత్వ వాటాదారులను నిర్ణయాత్మకంగా వ్యవహరించాలని కోరుతోంది. గుండె సంబంధిత వ్యాధులపై పోరాటం, పరిస్థితి ముదరకముందే ప్రారంభం కావాలని పిలుపునిచ్చింది.కేవలం గణాంకాలు మాత్ర మే కాదనీ జాగ్రత్త పరిచే హెచ్చరికలనీ ఆలివ్ హాస్పిటల్ కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ జహీదుల్లా ఖాన్ తెలిపారు . ఈ వ్యాధి ఎక్కడో ఉండని, మన జీవనశైలి, ఆహార అలవాట్లు, ఒత్తిడి, సంరక్షణకు అందుబాటులో లేకపోవడం రూపంలోనే ఉంటాయన్నారు. ఈ ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా “Use Heart, Know Heart”అనే నినాదంతో, ఆసుపత్రులు, పౌర సమాజం, ప్రభుత్వ భాగస్వామ్యంతో తక్షణ చర్యలు తీ సుకోవాలని కోరింది . "ఈ డేటా కేవలం సంఖ్యలు మాత్రమే కాదు - ఇది ఒక మేల్కొలుపు పిలుపు. ప్రతి జీవిత దశలో నివారణ మరియు ముందస్తు గుర్తింపును సమగ్రపరచడానికి ఇది మనల్ని ప్రోత్సహించాలి." అని తెలిపింది.ఆలివ్ హాస్పిటల్ గుండె సంబంధిత ఆరోగ్య సంరక్షణకు తగిన కార్యక్రమాలను చేపట్టనుందని ఉచిత స్క్రీనింగ్ శిబిరాలు , అవగాహన కార్యక్రమాలు, మొబౖల్ యూనిట్లు, స్థానిక క్లినిక్లతో భాగస్వామ్యం లాంటి వంటి కార్యకలాపాలను ప్రకటించింది . ప్రజారోగ్య సంస్థలు ప్రాథమిక హృదయ సంరక్షణ కార్యకలాపాలను విస్తరించాలని, అందరికీ సులభంగా, చవకగా స్క్రీనింగ్ అందుబాటులో ఉండేలా చూడాలని సూచించింది . గుండెవ్యాధుల భారాన్ని భారాన్ని తగ్గిండచంలో నియంత్రణ చర్యలు, ఆరోగ్యకరమెన జీవనశైలి ప్రారంభ దశలో గుర్తింపు కీలకమని ఆసుపత్రి యాజమాన్యం స్పష్టం చేసింది. జీవనశైలి-మార్పు మద్దతు (పోషకాహారం, వ్యాయామం, ధూమపాన విరమణ) కొనసాగింపును నిర్ధారించాలని ఆసుపత్రి ప్రజారోగ్య అధికారులను కోరుతోంది. -
మెడిటరేనియన్ డైట్ అంటే...మెదడు చురుగ్గా!
మెడిటరేనియన్ డైట్ అంటే...పుష్కలంగా పండ్లు, కూరగాయలు, బ్రెడ్, ఇతర ధాన్యాలు, బంగాళదుంపలు, బీన్స్, గింజలు, ఆలివ్ నూనెనే ఎక్కువగా వాడతారు. పాల ఉత్పత్తులు, గుడ్లు, చేపలు వంటివి మెడిటరేనియన్ డైట్ లో మితంగా తీసుకుంటారు. ఈ ఆహారంలో రెడ్ మీట్ కంటే చేపలు, పౌల్ట్రీ ఉత్పత్తులు ఎక్కువగా ఉంటాయి. మొక్కల ఆధారిత ఆహారాలనే ఎక్కువగా తింటారు. మెదడుకు చురుకైన ఆహారం రోజువారీ ఆహారంలో కూరగాయలు, లీన్ ప్రొటీన్లు, మంచి కొవ్వు, మరిన్ని... దశాబ్దాలుగా, మెడిటేరియన్ డైట్ తీసుకోవడం వల్ల మెదడు వృద్ధాప్యాన్ని వాయిదా వేయవచ్చని నిపుణులు చెబుతున్నారు. గ్రీన్ టీ: ఇది మీ న్యూరాన్లకు శక్తినిస్తుంది: గ్రీన్ టీలో కాటెచిన్లు పుష్కలంగా ఉన్నాయి, ఇవి వాపులను, ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడానికి కావలసిన శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు, ఇవి న్యూరోడీజనరేషన్కు కీలకంగా పనిచేస్తాయి.మెదడు పనితీరును పెంచే మొక్క మన్కై: దీనిని ‘డక్ వీడ్‘ అని కూడా పిలుస్తారు, మన్కై అనేది పాలీఫెనాల్స్, బీ12, మొక్కల ఆధారిత ప్రోటీన్లతో నిండిన ఒక చిన్న వాటర్ ప్లాంట్. ఇది మెదడు వృద్ధాప్యంతో ముడిపడి ఉన్న కీలక ప్రొటీన్లను నియంత్రించడంలో సహాయ పడుతుంది. చెడును తొలగిస్తుంది, మంచిని జోడిస్తుంది: గ్రీన్–మెడ్ ప్రణాళిక ఆరోగ్యకరమైన పదార్థాలపై మాత్రమే కాదు, ఇది రెడ్ మీట్, శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లను కూడా తగ్గిస్తుంది, రెండూ వృద్ధాప్యంతో ముడిపడి ఉన్నాయి. -
యంగ్ ఇండియా! ఒక్క బీట్ మిస్ అయినా.. బీ(ట్) కేర్ఫుల్
ప్రపంచవ్యాప్తంగా గుండెజబ్బులు పెరుగుతున్న తీరు ఆందోళన కలిగిస్తోంది. అందునా ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ తన విశృంఖల ప్రతాపం చూపాక గుండెజబ్బుల కేసులు మరింత ఎక్కువయ్యాయి. అందుకే ప్రతి ఏడాదీ సెప్టెంబరు 29న నిర్వహించే వరల్డ్ హార్ట్ డే తాలూకు థీమ్ ఏమిటంటే... ‘‘ఒక్క స్పందననూ మిస్ కావద్దు’’ (డోంట్ మిస్ ఏ బీట్). దీని అర్థం ఏమిటంటే... ఒక్క గుండె కూడా తన స్పందనలను కోల్పోయే పరిస్థితి రాకూడదనే. గతంలో కనీసం 50, 40లలో కనిపించే ఈ గుండెజబ్బులు ఇప్పుడు ఎందుకిలా యుక్త వయసు లోనే వచ్చేస్తున్నాయో చెప్పే కారణాలూ, వాటిని నివారిస్తూ మన యువతను గుండెజబ్బుల నుంచి రక్షించుకునేందుకు తగిన అవగాహనను కల్పించేందుకే ఈ కథనం.గుండెజబ్బుల తీవ్రతనూ, విస్తృతినీ తెలిపే కొన్ని గణాంకాలను చూద్దాం. ఢీల్లీ, ముంబై, హైదరాబాద్లలోని కొన్ని పెద్ద హాస్పిటల్స్ తాలూకు ఎమర్జెన్సీ కేసులను పరిశీలిస్తే సగానికిపైగా కేసులు... అంటే 50% కేసుల్లో బాధితులు కేవలం 40 ఏళ్లలోపు వాళ్లే. మానసిక ఒత్తిడి, ఎటూ కదలకుండా (శారీరక శ్రమ లేకుండా) ఉండే వృత్తులూ పెరగడంతో గుండె జబ్బులతో బాధపడే యువత కూడా పెరుగుతోంది. అందుకే ఇటీవల కార్డియాలజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా సంస్థ 45 ఏళ్ల లోపే అక్యూట్ కరోనరీ సిండ్రోమ్తో బాధపడేవారిపై పరిశోధనల కోసం ఓ అధ్యయన కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇటీవలి పరిశీలనల ప్రకారం ప్రతి ఐదు గుండె΄ోటు కేసులను పరిశీలిస్తే అందులో ఒకరు తప్పనిసరిగా 40 ఏళ్లలోపు వారే ఉంటున్నారు. గుండెజబ్బుల పరంగా ప్రపంచవ్యాప్తంగా 20 – 30 ఏళ్ల యువతలో ఏడాదికి 2% పెరుగుదల ఉండగా... మన దేశంలో సైతం గుండెజబ్బులకు లోనైన వాళ్లలో 40 ఏళ్ల లోపు వారు కనీసం 25% వరకు ఉండటం మరింతగా బెంబేలెత్తిస్తున్న అంశం. హైబీపీ, హైకొలెస్ట్రాల్ వంటివి యువతలో పెరుగుతుండటమే దీనికి కారణం. దాంతో క్రమంగా, నిశ్శబ్దంగా చాపకింద నీరులా గుండెజబ్బుల కేసులు భారత్లోనూ పెరుగుతున్నాయి.లక్షణాలు... సాధారణంగా చాలామందిలో ఛాతీనొప్పితో గుండె పోటు కనిపిస్తుంది. ఈ లక్షణం కనిపించే వారు 97.3 శాతం మంది, చెమటలు పట్టడం 11 శాతం మందిలో, వాంతులు లేదా వికారం 8.2 శాతం కేసుల్లో, శ్వాస ఆడకపోవడం 6.8 శాతం మందిలో కనిపిస్తాయి. ఈ వయసులో చాలా మందిలో వచ్చే గుండెపోటుకు కారణమైన నొప్పిని గ్యాస్, అజీర్ణం, అసిడిటీ కారణంగా భావిస్తుంటారు. ఈ అంశం కూడా చికిత్స ప్రారంభించడాన్ని ఆలస్యం చేస్తోంది.గుండె జబ్బుల పెరుగుదలకు కారణాలు...వయసు పెరుగుతుండటం: ఇది నివారించలేని అంశం. సాధారణంగా వయసు పెరుగుతున్న కొద్దీ మృదువుగా ఉండాల్సిన రక్తనాళాలు గట్టిబారుతుంటాయి. దీన్నే అధెరో స్కి›్లరోసిస్ అంటారు. గతంలో సాధారణంగా 40 ఏళ్లకు పైబడ్డాక ఈ పరిణామం సంభవిస్తుండేది. ఇప్పుడు ఈ వయసు కంటే ముందే.. అంటే 20 నుంచి 30 ఏళ్లలోపే ఇలా రక్తనాళాలు గట్టిబారడం కనిపిస్తోంది.కొందరిలో కొలెస్ట్రాల్ నిల్వలు చాలా నెమ్మదిగా రక్తనాళాల్లోకి చేరుతుంటాయి. కానీ కొందరిలో చాలా వేగంగా ఈ ప్రక్రియ జరుగుతుంది. ఇలా పేరుకునే కొవ్వును ‘ప్లాక్’గా వ్యవహరి స్తుంటారు. ఈ ప్లాక్ రక్తనాళాల్లోకి ఎక్కువగా చేరడం వల్ల ధమనులు/రక్తనాళాలు సన్నబడి, గుండె కండరాలకు రక్తప్రసరణ తగ్గిపోతుంది. ఈ ప్లాక్ ఎక్కువగా చీలిపోయి క్లాట్స్ (అడ్డంకులు) గా మారి ఆకస్మికంగా గుండెకు రక్తసరఫరా తగ్గవచ్చు. ఫలితంగా గుండెపోటు రావచ్చు.ఆహారపు అలవాట్లు: హైలీ ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకోవడం వంటి మారుతున్న ఆహారపు అలవాట్లు, ఉప్పు, చక్కెర ఎక్కువగా ఉండే ఆహారాలు చిన్న వయసులోనే గుండెజబ్బులు / గుండెపోటుకు దారితీసే ముప్పును పెంచుతున్నాయి. మన దేశంలో దిగువ, మధ్యతరగతి వర్గాలు ఎక్కువగా ఉండే దేశాల్లో పెరుగుతున్న పట్టణీకరణ / నగరీకరణ కారణంగా అన్ని పోషకాలు ఉండే మంచి ఆహారంతో పోలిస్తే అధిక క్యాలరీలు ఉండే ఆహారం చవగ్గా దొరుకుతుండటంతో గుండెజబ్బుల ముప్పు పెరుగుతోంది.తగినంత వ్యాయామం లేకపోవడం : కుదురుగా కూర్చుని చేసే వృత్తులు పెరగడం ప్రపంచవ్యాప్తంగా చోటు చేసుకుంటున్న అంశమే అయినప్పటికీ... మన దేశ యువతలో కూడా వ్యాయామం లేక΄ోవడమూ, పైగా మన దేశ సాంస్కృతిక, సామాజిక నేపథ్యం కారణంగా మహిళలు, అమ్మాయిల్లో వ్యాయామ సంస్కృతి తక్కువగా ఉండటం కూడా గుండెజబ్బులు / గుండెపోటు ముప్పునకు కారణమవుతోంది.పొగతాగడం : ఇటీవల భారత్, రష్యా, కొన్ని మధ్య ఆసియా దేశాల్లో పొగాకు వినియోగం బాగా పెరుగుతుండటం అథెరోస్కిర్లోసిస్కూ, గుండెపోటుకు మరో ప్రధాన కారణం. 60 ఏళ్ల వ్యక్తులతో పోలిస్తే 40 ఏళ్లలోపు వారికి పొగ దుష్ప్రభావం మరింత ఎక్కువ. అయితే ఏ వయసులోనైనా పొగతాగడం అంతే ప్రమాదకరం అని గుర్తించాలి. స్థూలకాయం కారణంగా : మన దేశవాసుల్లో ఊబకాయం ఎక్కువగా పొట్ట దగ్గర వస్తుంది. దీన్నే అబ్డామినల్ ఒబేసిటీ అంటారు. మన జీవనశైలి (లైఫ్ స్టైల్) కారణంగా ఇలా స్థూలకాయం రావడం, పొట్ట దగ్గర కొవ్వు పెరగడం కూడా గుండెజబ్బుల ముప్పును మరింత పెరిగేలా చేస్తోంది. హైబీపీ, డయాబెటిస్ : లైఫ్స్టైల్ జబ్బులైన హైబీపీ, డయాబెటిస్ వంటి అనారోగ్యాల విషయంలో అవగాహన అంతగా లేని మనలాంటి దేశాలలో నియంత్రణలో లేని హైబీపీ, మధుమేహం వంటివి గుండెపోటుకు కారణమవు తున్నాయి.జెండర్ అంశం : ఒక వయసు వరకు మహిళలతో పోలిస్తే గుండెప్లాక్టు వచ్చే అవకాశాలు పురుషుల్లో ఎక్కువ. రుతుస్రావం ఆగి΄ోయే వరకు మహిళల్లోని ఈస్ట్రోజెన్ వారికి ఒక రక్షణ కవచంగా ఉంటుంది. అయితే రుతుక్రమం ఆగాక మహిళలతో పాటు... ఏ జెండర్ వారికైనా గుండెపోటు అవకాశాలు సమానం. సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక అంశాలు: పై అంశాలకు తోడుగా ఒక సమాజం లోని విద్య, ఆదాయ వనరులు, ఆరోగ్య సంరక్షణకు గల అవకాశాలు, సాంస్కృతిక నేపథ్యాల వంటి అంశాలు కూడా గుండెజబ్బుల కేసులను ప్రభావితం చేస్తుంటాయి. ఫ్యామిలీ హిస్టరీ : మిగతావారితో పోలిస్తే గుండెజబ్బులు / గుండెపోటు లాంటివి వచ్చిన వారి కుటుంబాల తాలూకు కుటుంబ ఆరోగ్య చరిత్ర (ఫ్యామిలీ హిస్టరీ) కూడా గుండెజబ్బుల ముప్పునకు ఒక ప్రధాన కారణం. మిగతావాళ్లతో పోలిస్తే దాదాపు 25 శాతం మంది రోగుల్లో గుంపోటుకు ఈ ఫ్యామిలీ హిస్టరీనే కీలకాంశ మవుతుంది. చదవండి: దుర్గాపూజలో భక్తిపారవశ్యం, నటీమణులు ఎమోషనల్, వీడియో వైరల్లబ్... డబ్...లయ తప్పొద్దు!నివారణ ఇలా... కార్డియో వాస్క్యులార్ హెల్త్ స్కోరుకు దగ్గరగా ఉండే జీవనశైలి: సాధారణంగా పాశ్చాత్యదేశాల్లో... మరీ ముఖ్యంగా అమెరికా వంటి చోట్ల అమెరికన్ హార్ట్ అసోసియేషన్ నిర్దేశించిన కొన్ని జీవనశైలి మార్గదర్శకాలు ఉన్నాయి. వాటినే ‘లైఫ్ ఎసెన్షియల్స్ 8 (ఎల్ఈ 8); లైఫ్ ఎసెన్షియల్స్ 7 (ఎల్ఈ 7) గా వ్యవహరిస్తుంటారు. అంటే... ఆరోగ్యకరమైన జీవనశైలిలో భాగంగా అనుసరించే మార్గదర్శకాలైన... రక్త΄ోటును (హైబీపీని) అదుపులో ఉంచుకోవడం; రక్తంలో చక్కెరమోతాదులనూ, కొలెస్ట్రాల్ను తగ్గించుకోవడం; ఆరోగ్యకరమైన ఆహారాన్ని,పోషకాహారాన్ని తీసుకోవడం; తగినంత వ్యాయామం చేయడం; ఎత్తుకు తగినంత బరువు ఉండేలా బాడీ మాస్ ఇండెక్స్– (బీఎమ్ఐ)ను మెయింటెయిన్ చేయడంస్మోకింగ్ / నికోటిన్కు దూరంగా ఉండటం; కంటినిండా నిద్రపోవడం... అలాంటి ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవరచుకోవడం ద్వారా ఈ లైఫ్ ఎసెన్షియల్ స్కోరును ఎంతగా పెంచుకుంటే గుండెజబ్బులను అంతగా నివారించుకోవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. అర్లీ వార్నింగ్ సిగ్నల్స్ ద్వారా : చాలామందిలో గుండెజబ్బులుగానీ లేదా గుండెపోటుగానీ ఆకస్మికంగా రాకముందే కొన్ని వార్నింగ్ సిగ్నల్స్ పంపుతాయి. ఉదాహరణకు ఛాతీలో ఇబ్బందిగా ఉండటం, తీవ్రమైన నీరసం, నిస్సత్తువ, అలసట, గుండెదడ (పాల్పిటేషన్) వంటివి. వాటిని నిర్లక్ష్యం చేయకుండా తగిన సమయంలో గుర్తించి డాక్టర్లను సంప్రదించడం వల్ల. స్క్రీనింగ్ పరీక్షలతో : హైబీపీ, అధిక కొలెస్ట్రాల్, మధుమేహంతో బాదపడేవారు తగిన పరీక్షలు చేయించు కోవడం, ఏవైనా లక్షణాలు కనిపిస్తే కరోనరీ సీటీ యాంజియోగ్రామ్ వంటి పరీక్షలు చేయించుకోవడం ద్వారా గుండెజబ్బులు నివారించవచ్చు. ఇదీ చదవండి:Karur stampede tragedy మొన్ననే ఎంగేజ్మెంట్..త్వరలో పెళ్లి-డాక్టర్ అంజని,ద్వారంపూడి, సీనియర్ కార్డియాలజిస్ట్ -
ప్రెగ్నెంట్ టైంలో సైనసైటిస్ మందులు వాడితే ప్రమాదమా..?
నేను మూడు నెలల గర్భవతిని. నాకు ఎప్పటినుంచో డస్ట్ అలెర్జీ, సైనసైటిస్ సమస్యలు ఉన్నాయి. గర్భం వచ్చిన తర్వాత తరచూ జలుబు, తుమ్ములు వస్తున్నాయి. ఇప్పటికే కొన్ని మందులు వాడాను. ఈ మందులు నా బిడ్డకు ఎలాంటి ప్రభావం చూపుతాయోనని ఆందోళనగా ఉంది. గర్భధారణ తొలి నెలల్లో మందులు వాడటం సురక్షితమా? నేను ఏవైనా జాగ్రత్తలు తీసుకోవచ్చా?– సుశీల, నాగర్కర్నూల్సుశీల గారు, గర్భధారణ తొలి నెలల్లో శరీరంలో రక్షణశక్తి, హార్మోన్లలో మార్పులు ఎక్కువగా జరుగుతాయి. అందుకే ఈ సమయంలో జలుబు, తుమ్ములు, ముక్కు దిబ్బడ వంటి సమస్యలు రావడం సాధారణం. కొన్నిసార్లు ఫ్లూ కూడా రావచ్చు. ఈ లక్షణాలు ఎప్పుడు వస్తే, వాటి కారణం ఏమిటో ముందుగా గుర్తించడం చాలా ముఖ్యం. ఎందుకంటే చికిత్స కారణాన్ని బట్టి మారుతుంది. ఇలాంటి సమయంలో ముందుజాగ్రత్తలు చాలా సహాయపడతాయి. ముఖ్యంగా ఫ్లూ సీజన్లో ఎక్కువ జనసమూహాలు ఉండే ప్రదేశాలకు దూరంగా ఉండడం, అలెర్జీ కలిగించే పదార్థాలను తీసుకోకపోవటం, అవసరమైతే మాస్క్ ధరించడం మంచిది. ఫ్లూ వ్యాక్సిన్ గర్భధారణలో ఎప్పుడైనా సురక్షితంగా తీసుకోవచ్చు. ఇది తల్లికి, బిడ్డకు రక్షణ ఇస్తుంది. తేలికపాటి జలుబు, సైనసైటిస్ ఉన్నప్పుడు ఎక్కువగా నీరు తాగడం, వేడి సూపులు తాగడం, ఇంట్లో ఆవిరి పీల్చడం లాంటి చిట్కాలు ఉపశమనాన్ని ఇస్తాయి. మీ శరీర ఉష్ణోగ్రత, పల్స్, ఆక్సిజన్ స్థాయిలను ఇంట్లోనే ఉంటూ గమనించడం మంచిది. లక్షణాలు ఎక్కువైనా లేదా ఏదైనా అసాధారణంగా అనిపించినా వెంటనే డాక్టర్ను సంప్రదించాలి. మొదటి మూడు నెలల్లో మందులు వాడడంపై మీరు ఆందోళన పడుతున్నా, నిపుణుల సూచనలో ఇచ్చే తేలికపాటి చికిత్సలు సాధారణంగా సురక్షితమే. ఇవి బిడ్డ అభివృద్ధిపై ప్రతికూల ప్రభావం చూపవు. సమయానికి వైద్య పర్యవేక్షణ, జాగ్రత్తలు పాటిస్తే గర్భధారణలో జలుబు, తుమ్ములు, ఫ్లూ వంటి సమస్యలు సులభంగా నియంత్రించుకోవచ్చు.నాకు ఈ మధ్యనే రెండవ ప్రెగ్నెన్సీ నిర్ధారణ అయింది. అయితే, నా మొదటి గర్భధారణలో నాకు తీవ్రమైన వాంతులు అయ్యాయి. పలుసార్లు ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. శారీరకంగా, భావోద్వేగపరంగా చాలా ఇబ్బంది పడ్డాను. అందుకే, ఇప్పుడు ఈ గర్భధారణను కొనసాగించడానికి భయం వేస్తోంది. ఈ గర్భధారణలో కూడా నాకు మళ్లీ అలాంటి వాంతులు వస్తాయా? వాంతులు తగ్గించుకోవడానికి నేను ఏమి చేయగలను?– కీర్తి, వరంగల్గర్భధారణ సమయంలో వాంతులు, వికారం సాధారణంగా కనిపించే సమస్య. దీనిని ‘మార్నింగ్ సిక్నెస్’ అంటారు. ఇది ఎక్కువగా మొదటి త్రైమాసికంలో కనిపిస్తుంది. సాధారణంగా ఆరు నుంచి ఏడవ వారంలో ప్రారంభమై, పదనాలుగు నుంచి పదహారు వారాల మధ్య తగ్గిపోతుంది. అయితే ఈ లక్షణాల తీవ్రత వ్యక్తికి వ్యక్తికి వేరుగా ఉంటుంది. కొందరికి స్వల్పంగా మాత్రమే ఉండగా, మరికొందరికి చాలా తీవ్రమైన, రోజువారీ జీవితాన్ని ఇబ్బందిపెట్టేంతగా వాంతులు రావచ్చు. మీరు చెప్పినట్టుగా కొన్ని సందర్భాల్లో ఆసుపత్రిలో చేరడం, ఇంజెక్షన్స్, మెడిసిన్స్ తీసుకోవడం కూడా అవసరమవుతుంది. ఒకే మహిళకు వేర్వేరు గర్భధారణల్లో వాంతుల తీవ్రత వేరుగా ఉండే అవకాశం ఉంటుంది. ఈ సమస్యకు ప్రధాన కారణం గర్భధారణ హార్మోన్ అయిన బీటా హెచ్సీజీ స్థాయి అకస్మాత్తుగా పెరగడం. అందుకే కవలలు గర్భంలో ఉన్నప్పుడు వాంతులు మరింతగా వస్తాయి. వాంతులు తగ్గించుకోవడానికి మీరు పాటించగల కొన్ని జాగ్రత్తలు ఉన్నాయి. రోజంతా కొద్దికొద్దిగా నీరు తాగుతూ ఉండాలి, ప్రతి రెండు నుంచి మూడు గంటలకు తక్కువ మోతాదులో అయినా తరచు ఆహారం తీసుకోవాలి. మృదువైన, సులభంగా జీర్ణమయ్యే పదార్థాలను తినడం మంచిది. మసాలా వంటకాలకు, బయట ఆహారానికి వీలైనంత దూరంగా ఉండాలి. ఎక్కువసేపు ఆకలితో ఉండకూడదు. వాంతులు ఎక్కువగా వస్తున్నప్పుడు తగినంత విశ్రాంతి తీసుకోవాలి. కొన్ని వాసనల వల్ల వాంతులు పెరిగే అవకాశం ఉన్నందువలన అలాంటి వాసనల నుంచి దూరంగా ఉండాలి. అల్లం, నిమ్మరసం వంటి పదార్థాలను ఆహారంలో చేర్చడం కూడా కొంత ఉపశమనం ఇస్తుంది. వాంతులు తీవ్ర స్థాయిలో ఉన్నప్పుడు కొన్ని మందులు సురక్షితంగా వాడవచ్చు. ఇవి మీ డాక్టర్ సూచనతో మాత్రమే తీసుకోవాలి. మీరు ఏమీ తినలేకపోతున్నా లేదా తాగలేకపోతున్నా, బరువు తగ్గడం లేదా డీహైడ్రేషన్ లక్షణాలు కనిపిస్తున్నా వెంటనే మీ వైద్యుడిని సంప్రదించాలి. సమయానికి చికిత్స తీసుకోవడం వల్ల మీకు, శిశువుకు కలిగే సంక్లిష్టతలను తగ్గించవచ్చు. డా. కడియాల రమ్య, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్ (చదవండి: కంటి ఆరోగ్యం కోసం 20:20:20 రూల్ వెబ్సైట్..!) -
గుండెకు అండగా ఉందాం
ఈ ఏడాది ‘వరల్డ్ హార్ డే’ థీమ్ ‘ఒక్క స్పందననూ మిస్ కాకండి’ (డోంట్ మిస్ ఏ బీట్) అని. అంటే... గుండెను రక్షించుకోవడంలో ఏ అవకాశాన్నీ వదులుకోవద్దనీ, గుండె ఇచ్చే వార్నింగ్ సిగ్నల్స్గానీ లేదా అదే చేసే హెచ్చరికలుగానీ ఏవీ మిస్ కాకుండా చూసుకోవాలనే సందేశాన్ని ఈ థీమ్ ఇస్తోంది. ఈ నేపథ్యంలో గుండె సంరక్షణ కోసం సీనియర్ కార్డియాలజిస్టులు... పాఠకులతో పంచుకుంటున్న అత్యంత కీలకమైన విషయాలివి.భారతదేశంలో గుండెజబ్బుల విస్తృతి కాస్తంత బెంబేలెత్తించేలాగే ఉంది. గతంలో అంటురోగాల శకం ముగిసి, ఇప్పుడు జీవనశైలితో వస్తున్న ‘నాన్ కమ్యూనికబుల్ జబ్బులు’ విస్తరిస్తున్న శకంలో... అన్ని జబ్బులతో పోలిస్తే గుండెజబ్బుల వాటా తక్కువేమీ కాదు. పైగా అన్ని నదులూ పరుగెత్తేది సముద్రం వైపే అన్నట్టుగా... అన్ని జబ్బులూ నడిచేది గుండెజబ్బులవైపే. ఉదాహరణకు అది డయాబెటిస్గానీ, హైబీపీగానీ, స్థూలకాయం, మెటబాలిక్ సిండ్రోమ్స్ ఇవన్నీ పెరుగుతూ పెరుగుతూ చివర్న గుండెజబ్బుల దిశగా పయనిస్తున్నాయి. ఇక్కడ పేర్కొన్న ప్రతి జబ్బూ అది హార్ట్ ఎటాక్గానో, బ్రెయిన్ స్ట్రోక్గానో పరిణమించేదే అనడంలో సందేహం లేదు. → హృద్రోగం వృద్ధాప్య రోగం కాదు... గతంలో గుండెజబ్బులనేవి కాస్తంత వయసు పెరిగాకే కనిపించేవి. ఇప్పుడు అవి కూడా చాలా త్వరితంగా వచ్చేస్తున్నాయి. ప్రత్యేకించి యువతలో సైతం కనిపిస్తున్నాయి. అందుకే చాలా సందర్భాల్లో వీటిని నిశ్శబ్ద ఉత్పాతాలు (సైలెంట్ ఎపిడెమిక్స్) అని కూడా నిపుణులు పేర్కొంటున్నారు. → ఆ తెలుగు వాడుక మాట అక్షరాలా నిజం... మన తెలుగు వాడుక మాటల్లో ‘గుండెల్ని పిండేసేలాగా...’ అన్నది ఓ జాతీయం. ఒత్తిడి విషయంలో ఆ నుడికారం అక్షరసత్యం. ఒత్తిడి పెరుగుతున్న కొద్దీ అది ‘గుండెలను పిండేస్తుంది’! మానసిక ఒత్తిడి అనేది ఓ భావోద్వేగపూరితమైన ఎమోషన్గా చెప్పడం సరికాదు. ఆ భావోద్వేగం కాస్తా తన భౌతిక లక్షణాలతో గుండెజబ్బుగానో, గుండెపోటుగానో కనిపించడం చాలా సాధారణం. ఎందుకంటే... మానసిక ఒత్తిడి పెరగగానే... రక్తనాళాల్లో రక్తపోటూ పెరుగుతుంది. రక్తపోటు కాస్తా గుండెపోటుగా పరిణమించడం మనకు తెలిసిన విషయమే. మనం సంప్రదాయంగా పాటించే కొన్ని అంశాల్లో దీనికి విరుగుడు దాగుంది. అవే... యోగా, ధ్యానం, శ్వాస వ్యాయామాలు. వీటి సాయంతో మన నరాలను హాయిపరచడం మొదలుపెట్టగానే... రక్తనాళాల్లో పోటెత్తే రక్తప్రవాహాన్నీ అది జోకొడుతుంది. దాంతో బీపీ తన నార్మల్ ఒత్తిడికి వచ్చేస్తుంది. ఫలితంగా గుండెజబ్బుల ముప్పూ తప్పుతుంది. అందుకే ఇప్పుడు డాక్టర్లు కూడా మందులతో పాటు... ఈ మార్గాలూ ప్రిస్క్రిప్షన్లో సూచిస్తున్నారు. → డాన్సులూ డేంజరస్గా మారిన డేస్ ఇవి! ఇప్పుడు న్యూస్ ఫాలో అవుతున్నవారికి తెలియని విషయాలేమీ కావివి. అవేమిటంటే... మంచి వయసులో ఉన్న యువత కూడా డాన్స్ చేస్తూనో, క్రికెట్ ఆడుతూ ఆడుతూనో, జిమ్లో వ్యాయమం చేస్తూనో యువతీ యువకులు కుప్పకూలిపోతున్నారు. దీన్ని నివారించదగిన అంశాలూ ఉన్నాయి. ఉదాహరణకు ఎక్కువ శక్తిని ఒకేసారి ఇచ్చే హై–ఎనర్జీ డ్రింకులూ, వ్యాయామంతో పాటు స్టెరాయిడ్స్ తీసుకుంటున్న ఉదంతాలూ, ఒకే చోట కూర్చుని చేసే వృత్తివ్యాపకాలూ, చురుగ్గా కదలడానికి అంతగా ఇష్టపడని జీవనశైలీ... ఇవన్నీ ఇలా ఆకస్మికంగా గుప్పెడంత గుండెను కుప్పకూల్చే ముప్పును పెంచుతున్నాయి. వీటి నివారణ చాలా సింపుల్. క్రమం తప్పకుండా చేసుకునే కొన్ని సాధారణ ప్రాథమిక స్క్రీనింగ్ పరీక్షలతో పెద్ద పెద్ద గుండె ముప్పులనూ నివారించుకోవచ్చు. అలా నిబ్బరంగా, నిశ్చింతగా ఉండవచ్చు. → నివారణ చాలా సింపుల్... అదే టైమ్లో బోలెడంత పవర్ఫుల్...నిజానికి గుండెజబ్బుల నివారణ చాలా చాలా సింపుల్. మనం సంకల్పంతో నిలిపేయగలిగే పొగతాగే అలవాటు, మద్యం అలవాట్లనుంచి దూరంగా ఉంటే చాలు. అదే సమయంలో అన్నంలో తగినన్ని ఆకుకూరలూ, కాయగూరలతో పాటు తాజా పండ్లు తీసుకోవడం వంటి మంచి రుచికరమైన మార్గంలో వెళ్లడం ద్వారా గుండెజబ్బుల్ని సమర్థంగా నివారించవచ్చు. అలాగే క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, మానసిక ఒత్తిడి తగ్గించుకోవడం, రెగ్యులర్గా చెకప్ చేయించుకోవడం, బరువు ఆరోగ్యకరమైన లిమిట్లోనే ఉండేలా చూసుకోవడం కూడా ముఖ్యమైనవి. ఇక్కడ కాస్తంత కష్టమైనదైనా కన్సిస్టెంట్గా అంటే క్రమం తప్పకుండా పై అలవాట్లను కొనసాగించడంతో గుండె ఆరోగ్యాన్ని పదికాలాల పాటు పదిలంగా పదిలపరచవచ్చు.→ గాలినీ, కలుషితాలనూ తేలిగ్గా తీసుకోకండి... మనం పీల్చే గాలి శుభ్రంగా ఉండేలా చూసుకోవడం కూడా ముఖ్యమే. అంటే... వాహనాల పొగతో లేదా కాలుష్యంతో కూడిన గాలిని పీల్చుకోవడాన్ని వీలైనంతగా తప్పించుకోవాలి. వాటిలో ఉండే కాలుష్యపదార్థాలు, ధూళిదూసరాలూ రక్తనాళాల్లో రక్తప్రవాహాన్ని వేగవంతం చేస్తాయి. అలా గుండెజబ్బులూ వేగంగా వచ్చేలా చేస్తాయి. కాలుష్యం పెరిగిన కొద్దీ రక్తం తాలూకు ఎరుపు రంగు డేంజర్ మార్క్లా కనిపిస్తుంది. అదే వీలైనంతగా పచ్చటి పరిసరాల్లోనే ఉండటం ప్రారంభిస్తే గుండె ఆరోగ్యమూ పదికాలాలు పచ్చగా ఉంటుంది. → మహిళల గుండెలకు మరింత ముప్పు... మహిళలు కుటుంబ ఆరోగ్యానికి ప్రాథమ్యం ఇచ్చి, చాలావరకు తమ ఆరోగ్యానికి రెండో ప్రాధాన్యమిస్తారు. వారు తమలో కలిగే అలసటను ఇంటి పనులతో వచ్చిన నీరసంగా అనుకుంటారు. తమ అజీర్ణ సమస్యను గ్యాస్ సమస్యగా భావిస్తారు. తమ గుండెనొప్పిని ఛాతీనొప్పిగానే తీసుకుంటారు. ఇల్లాలు బాగుంటేనే ఇల్లు బాగున్నట్టుగా వాళ్ల గుండె బాగుంటేనే మిగతా ఇంటి సభ్యుల గుండె సంస్పందనలూ బాగుంటాయి. ‘డోంట్ మిస్ ద బీట్’ అనే థీమ్ను తమకు అనువుగా ఆలోచిస్తే.. మహిళలకే అది ఎక్కువగా అనువర్తిస్తుంది. → అనుక్షణం... రక్షణకు అనువైన క్షణమే... ఆకస్మిక గుండె జబ్బు ముప్పు నుంచి కా పాడాలంటే అనుక్షణం అనువైన క్షణమే. అందుకే గుండెజబ్బు లక్షణాలు కనిపించినప్పుడు దాన్నుంచి రక్షించాలంటే ప్రతి ఒక్కరూ కార్డియాక్ పల్మునరీ రిససియేషన్ అనే సీపీఆర్ గురించి అవగాహన పెంచుకోవాలి. ఎవరైనా గుండె పట్టుకుని కుప్పకూలిపోతే ఒకచేతి వేళలలో మరో చేతివేళ్లు దూర్చి క్షణం కూడా ఆలస్యం చేయకుండా గుండెపై క్రమబద్దంగా, లయబద్ధంగా, నేర్పుగా కదిలిస్తూ ‘సీపీఆర్’ నిర్వహించే నైపుణ్యాలను నేర్చుకోవాలి. అది ఇల్లూ, వాకిలీ, పనిప్రదేశం ఇలా ఎక్కడైనా, ఎవరైనా అభ్యసించగల సింపుల్గా చేయగలిగే ఈ ప్రాణరక్షణ నైపుణ్యం చేతుల్లో దాగి ఉండే అభయహస్తాలవుతాయవి. → చివరగా... మనం పుట్టిన నాటి నుంచీ క్షణం కూడా ఆగకుండా... ఒక్క బీట్ కూడా మిస్ కాకుండా ఒక జీవితకాలం పాటు సంస్పదిస్తూ ఉండే ఆ గుండెను గౌరవిస్తూ... దాన్ని మాటువేసి కాటు వేసే అన్ని రకాల అవాంతరాల నుంచి కా పాడుకోడానికి బిక్కు బిక్కుమని భయపడకుండా ఉండటానికి గడియారంలో టిక్కు టిక్కుమనే ఏ బీట్నూ మిస్ కాకుడదంటూ లబ్డబ్ మంటూ స్పందించే ‘హార్ట్’ డే థీమ్కు భాష్యం చెప్పుకోవాలి.డా. ఎంఎస్ఎస్ ముఖర్జీసీనియర్ కార్డియాలజిస్ట్ నిర్వహణ:యాసీన్ -
గంటన్నర పాటు గుండెను ఆపి, యువకుడికి ప్రాణదానం
హైదరాబాద్, సెప్టెంబర్ 27, 2025: నగరానికి చెందిన 31 ఏళ్ల యువకుడికి అత్యంత అరుదైన, తీవ్రమైన గుండె సమస్యలు వచ్చాయి. గుండె కవాటంలో లీకేజిలు ఏర్పడడంతో పాటు బృహద్ధమని విపరీతంగా సాగిపోయింది. లీకేజి కారణంగా రక్తం శరీరంలోని ఇతర భాగాలకు వెళ్లకుండా తిరిగి గుండెలోకే వచ్చేస్తోంది. దీంతో అతడికి కాళ్లు వాపులు, ఊపిరి అందకపోవడం లాంటి పలు సమస్యలతో ఇబ్బంది పడుతూ, తన రోజువారీ పనులు కూడా చేసుకోలేని పరిస్థితికి వచ్చారు. వీటన్నింటికీ తోడు పుట్టుకతోనే గుండెలో రంధ్రం ఏర్పడే వీఎస్డీ అనే సమస్య కూడా ఆ యువకుడికి ఉంది. ఇన్ని సమస్యలున్న రోగికి ఒకే శస్త్రచికిత్సలో అన్నింటినీ నయం చేసి.. ఎల్బీనగర్ కామినేని ఆస్పత్రి వైద్యులు ప్రాణదానం చేశారు. అది కూడా ఏకంగా గంటన్నర పాటు గుండెను ఆపేసి, దాని బదులు మిషన్ సాయంతో గుండె పని కొనసాగిస్తూ శస్త్రచికిత్స చేశారు. అతడికి వచ్చిన సమస్య, చేసిన చికిత్స వివరాలను ఆస్పత్రికి చెందిన కన్సల్టెంట్ కార్డియోథొరాసిక్, వాస్క్యులర్ సర్జన్ డాక్టర్ రిషిత్ బత్తిని తెలిపారు.‘‘ఆ యువకుడికి గుండె కవాటంలో లీకేజీల కారణంగా రక్తం చాలావరకు మళ్లీ గుండెలోకి వచ్చేస్తుంది. దానికితోడు బృహద్ధమని కూడా సాగుతూ వచ్చింది. మామూలుగా అయితే 3 సెంటీమీటర్లు ఉండాల్సింది ఏకంగా 6 సెంటీమీటర్లు ఉంది. దాన్ని అలాగే వదిలేస్తే పగిలిపోవడం గానీ, లేదా చీలిపోవడం గానీ జరిగే అవకాశం ఉంటుంది. అప్పుడు రోగి బతికే అవకాశం చాలా తక్కువ. వీటన్నింటికీ తోడు అతడికి గుండెగోడల మధ్య పెద్ద రంధ్రం (వీఎస్డీ) ఉంది.ఇన్ని సమస్యలకు కలిపి ఒకే శస్త్రచికిత్స.. బెంటాల్స్ ప్రొసీజర్ చేయాలని నిర్ణయించాం. ఇందులో భాగంగా ముందు గుండెను ఆపేసి దానికి బదులు మిషన్ పెడతాం. మొత్తం శస్త్రచికిత్స పూర్తయిన తర్వాతే మళ్లీ గుండె కొట్టుకోవడం మొదలవుతుంది. ఇలా ప్రధానమైన శస్త్రచికిత్స జరగిన గంటన్నర సమయం పాటు అతడి గుండె ఆపేశాం. శస్త్రచికిత్సలో ముందుగా రోగి బృహద్ధమనిని పూర్తిగా తీసేసి కృత్రిమ వాల్వు అమర్చాం. దాంతోపాటు పైకివెళ్లే ధమనిని కూడా మార్చాం. అక్కడ కృత్రిమ వాల్వ్ ఏర్పాటుచేశాం. ఇంకా, బృహద్ధమని మూలాన్ని కూడా పునర్నిర్మించి, గుండెలో ఇతర లోపాలను కూడా సరిచేశాం. అవన్నీ చేసిన తర్వాత రక్తనాళాలను కూడా మళ్లీ రీప్లాంట్ చేశాం.ఇదంతా చాలా సంక్లిష్టమైన శస్త్రచికిత్స. ఎందుకంటే, బృహద్ధమని 6 సెంటీమీటర్లకు సాగిపోవడం వల్ల అది బాగా పల్చబడిపోతుంది. కుట్లు వేయడం కష్టం, రక్తస్రావం అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ. రక్తనాళాలు రీప్లాంట్ చేసేటప్పుడు కొంతమంది రోగులకు గుండె వైఫల్యం జరిగే అవకాశాలుంటాయి. అందుకే ఇది చాలా హైరిస్క్ శస్త్రచికిత్స. ఇక ఈయనకు వీఎస్డీ కూడా చాలా పెద్దదిగా ఉంది. ఇది మామూలుగా పుట్టుకతోనే ఉంటుంది. ముందే గమనించి శస్త్రచికిత్స చేస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు. గమనించకపోతే ఆ రంధ్రం పెరిగిపోతూ ఉంటుంది. అప్పుడు చెడురక్తం వెళ్లి మంచిరక్తంలో కలిసిపోయి శరీరం నీలంగా మారిపోతుంది. ఇంత పెద్ద వీఎస్డీ ఉన్నవాళ్లు ఇన్నాళ్లు ఉండరు. కానీ, ఇక్కడ బృహద్ధమని పెరగడంతో, అది ఆ రంధ్రాన్ని కొంతవరకు మూసేసింది.ఇలాంటి సమస్యలు 30-50 సంవత్సరాల మధ్య వయసులో వస్తుంటాయి. అది కూడా 10-15 వేల మందిలో ఒక్కరికి మాత్రమే వస్తుంది. సరైన సమయానికి గుర్తించి శస్త్రచికిత్స చేయకపోతే వాల్వు పగిలిపోయే ప్రమాదం ఉంటుంది. ఈ శస్త్రచికిత్స చేయకముందు అతడి గుండె పనితీరు 20-30% కు పడిపోయింది. చేసిన తర్వాత 90%కు చేరుకుంది. చాలామందికి ఇలాంటి శస్త్రచికిత్సలో రక్తస్రావం ఎక్కువగా ఉంటుంది. కానీ ఈ కేసులో కనీసం ఒక్క యూనిట్ రక్తం కూడా ఎక్కించాల్సిన అవసరం రాలేదు. అంత సురక్షితంగా చేయగలిగాం. రోగి చాలా త్వరగా కోలుకున్నారు. ఐసీయూ నుంచి వార్డుకు మూడోరోజే మార్చేశాం. శస్త్రచికిత్స జరిగిన ఐదోరోజే డిశ్చార్జి చేశాం. ఈ శస్త్రచికిత్సలో చీఫ్ కార్డియాక్ అనెస్థెటిస్ట్ డాక్టర్ సురేష్ కుమార్, అనెస్థెటిస్ట్ డాక్టర్ రవళి, పెర్ఫ్యూజనిస్టులు డాక్టర్ పవన్, డాక్టర్ దుర్గ పాల్గొన్నారు’’ అని డాక్టర్ రిషిత్ బత్తిని వివరించారు.వరల్డ్ హార్ట్ డే 29 సెప్టెంబర్ ను ఈ సందర్బంగా కామినేని హాస్పిటల్స్ లో హార్ట్ చెకప్ క్యాంపును నిర్వహిస్తుంది. ఈ శిబిరం లో డాక్టర్ కన్సల్టేషన్ పై 30శాతం, ఇన్వెస్టిగేషన్స్ పైన 20 శాతం రాయితీ అందిస్తోంది. ఈ సదుపాయం సెప్టెంబర్ 29 అక్టోబర్ 11 అందుబాటులో ఉంటుంది -
నో మెడిసిన్స్,నో ఫ్యాన్సీ సప్లిమెంట్స్.. నేహాధుపియా 21 డేస్ చాలెంజ్
బాలీవుడ్ నటి నేహా ధుపియా తన ఫిట్నెస్రహస్యాలను, పలు రకాల వంటకాలను సోషల్మీడియాలో పంచుకుంటూ ఉంటారు. ముఖ్యంగా ఆరోగ్యకరమైన జీవనశైలి, రెసిపీలను అభిమానులను ఆకట్టుకుంటూ ఉంటాయి. తాజగా 21 రోజుల చాలెంజ్ ప్లాన్ను షేర్ చేశారు. ఇద్దరు బిడ్డల తల్లి అయిన నేహా ధూపియా కొత్త వెల్నెస్ ఛాలెంజ్ నెటిజనులను బాగా ఆకర్షిస్తోంది.నో మెడిసిన్స్, నో ఫ్యాన్సీ సప్లిమెంట్స్.. కేవలం వంటగదిలో లభించే పదార్థాలతోనే మందులపై ఆధార పడకుండా సహజంగానే ఇన్ఫ్లమేషన్ దూరంఅంటూ ఆమె పోస్ట్ చేశారు. నేహా ధూపియా తాజా పోస్ట్లో, నేహా ఇన్ఫ్లమేషన్తో పోరాడటానికి 21-రోజుల ఛాలెంజ్ను చేపట్టినట్లు వెల్లడించింది. అంతర్గత వాపును తగ్గించడంలో సహాయపడటానికి డైటీషియన్ రిచా గంగాని 21 రోజుల పాటు రోజువారీ హల్ది-అల్లం-నిగెల్లా సీడ్స్ మిశ్రమాన్ని సిఫార్సు చేశారు. View this post on Instagram A post shared by Freedom To Feed (@freedomtofeed) "21 రోజులు.. వన్ కమిట్మెంట్.. ఆరోగ్యకరమైన మీరు’’ అంటూ నేహా ధూపియా , రిచా గంగాని 21-రోజుల ఛాలెంజ్లో పాలుపంచుకోవాలని తన ఫ్యాన్స్ను ఆహ్వానించారు. ఎందుకంటే మీ శ్రేయస్సు కు ప్రయత్నం అవసరం అంటూ ఒక పోస్ట్ను షేర్ చేశారు. 21 రోజుల పాటు ఈ డ్రింక్ తాగి తమ అభిప్రాయాలను, ఫలితాలను షేర్ చేయాలని కోరారు. ఈ డ్రింక్ కోసం కావాల్సినవిఒక చిన్న పచ్చి పసుపు ముక్క1 క్యూబ్ పచ్చి అల్లం5-7 నల్ల మిరియాలు1 స్పూన్ నిగెల్లా విత్తనాలు (కలోంజి)మీ దగ్గర MCT నూనె లేకపోతే1 స్పూన్ కొబ్బరి నూనె లేదా1 స్పూన్ నెయ్యి లేదా1 స్పూన్ ఆలివ్ నూనెవీటిన్నింటిని మెత్తగా గ్రైండ్ చేసి మిశ్రమాన్ని ఐస్ క్యూబ్లలో ఉంచి ఫ్రీజ్ చేయాలి. వీటిని రోజుఒకటి చొప్పున ప్రతీ రోజు ఉదయం వీటిని వేడినీటిలో వేసుకుని సేవించాలి. ఇది ట్రెండీ సప్లిమెంట్ కాదని, ఇది మంచి కొవ్వు ఆమ్లాల మూలం అని రిచా లైవ్ చాట్లో పేర్కొన్నారు.కాగా పసుపులో ఉండే కర్కుమిన్ , అల్లంలో ఉండే జింజెరోల్స్ వంటి సమ్మేళనాల కారణంగా పసుపు ,అల్లం చాలా కాలంగా సహజ మంట నివారణ మందులు పేరొందాయి. నల్ల మిరియాలు పసుపును బాగా గ్రహించడంలో సహాయపడతాయి. నిగెల్లా గింజలు యాంటీఆక్సిడెంట్ గా పనిచేస్తాయి. శరీరాన్ని ఒత్తిడి , నష్టం నుండి రక్షిస్తాయి. ఆరోగ్యకరమైన కొవ్వులైన నెయ్యి, కొబ్బరి నూనె లేదా ఆలివ్ నూనె శరీరం ఈ పోషకాలన్నింటినీ వృధాగా పోకుండా గ్రహిస్తుందంటున్నారు వైద్యులు.ఇన్ఫ్లమేషన్ కీళ్ల నొప్పులు, అలసట , దీర్ఘకాలిక వ్యాధుల వంటి సమస్యలకు దారితీస్తుంది. ఒత్తిడి, సరైన ఆహారం లేకపోవడం,వ్యాయామం లేకపోవడం లాంటి దీన్ని మరింత దిగజారుస్తాయి. అందుకే ఇప్పుడు చాలామంది నేహా లాగే దానిని నిర్వహించడానికి సహజ మార్గాల కోసం చూస్తున్నారు. ఇలాంటి వారి వారి శరీరం స్పందనల మీద ఆధారపడి ఉంటుందనేది గమనించాలి.


