breaking news
Health
-
శ్వాసకోశ ఆరోగ్యం కోసం ఆయుర్వేద ధూమపానం..!
పూర్వకాలం నాటి ఆరోగ్యకరమైన పద్ధతులు సదా ఆసక్తిని రేకెత్తిస్తుంటాయి. అవి సాధారణ మందులు, ఆధునిక చికిత్సలకు మించి ప్రభావవంతంగా ఉంటాయి. అందుకు నిదర్శనమే ఈ ఆయుర్వేద ధూమపానం. ఇది సాధరణ స్మోకింగ్ లాంటిది కాదు. ఆరోగ్యాన్ని చేకూర్చే మూలికల ధూమపానం. దీన్ని నటి, కంటెంట్ క్రియేటర్ షెనాజ్ ట్రెజరీ ప్రయత్నించి మరి ఆ అనుభవాన్ని ఇన్స్టాగ్రామ్లో వీడియో రూపంలో షేర్ చేసుకున్నారు. ఇలాంటి ఆయుర్వేద చికిత్స ఒకటి ఉందని తనకు తెలియదని చాలా అద్భుతంగా ఉందంటూ నాటి చికిత్స విధానంపై ప్రశంసల జల్లు కురిపించింది. వైద్యపరమైన ధూమపానానికి స్వాగతం అంటూ..ఇది మన ఇంద్రియాలను, ముఖ్యంగా నాసికా మార్గాల్లోని అడ్డంకులను తొలగించి మనస్సుని ప్రశాంతంగా ఉంచుతుందని అంటోంది. ఇది నిర్థిష్ట ఔషధ మూలికల నుంచి వచ్చే పొగను పీల్చే పద్ధతి, చూడటానికి అచ్చం ధూమపానం మాదిరిగా ఉంటుంది. దెబ్బతో తల, ముక్కు, గొంతు సమస్యలు దెబ్బకు పరార్ అని అంటోంది షెనాజ్ . పూర్వకాలంలో శ్వాసకోశ ఆరోగ్యాన్ని కాపాడేందుకు, వాత, కఫ దోషాలను సమతుల్యం చేయడానికి ఔషధ గుణాలున్న మూలికల పొగలను పీల్చే ఒక ప్రాచీన పద్ధతిని ఉపయోగించేవారట. ఈ విధానంలో పసుపు, గుగ్గులు, వేప, నెయ్యి వంటి స్వస్థత చేకూర్చే పదార్థాలతో నింపిన ప్రత్యేకంగా తయారు చేసిన మూలికల వత్తిని కాలుస్తారు. దాన్ని ముక్కు రంధ్రాల ద్వారా పీల్చి, నోటి ద్వారా మాత్రమే బయటకు వదులుతారు. దీని వల్ల శ్లేష్మం తొలిగి ముక్కు, గొంతులోని చికాకు తగ్గి అత్యంత రిలీఫ్గా ఉంటుందట. ముఖ్యంగా జ్ఞానేంద్రియాలు చురుగ్గా ఉండేందుకు ఉపకరిస్తుందట. View this post on Instagram A post shared by Travel, Romance, Smiles (@shenaztreasury) (చదవండి: ఆ చీరే మా ప్రాణాలను రక్షించింది..! నేపాల్ జలప్రళయంలో ఓ అద్భుతం..) -
అల్పాహారం, మధ్యాహ్న భోజనం మానేస్తే..బరువు తగ్గగలమా? నటుడు రాజ్కుమార్..
బరువు తగ్గడం కోసం ఒక్కోక్కరూ ఒక్కో విధానాన్ని అనుసరిస్తూ ఉంటారు. వాళ్ల శారీరక ఆరోగ్యం, వ్యాధి నిరోధక శక్తి అనుగుణంగా డైట్, వ్యాయామాలు ఉంటాయి. అయితే బాలీవుడ్ ప్రముఖ నటుడు రాజ్కుమార్ రావు మాత్రం కావాలనుకుంటే బరువు పెరగగలడు, స్లిమ్గా మారిపోగలడు. ఒక పాత్ర కోసం శారీరక మార్పులతో సహా తనను తాను పూర్తిగా మార్చుకోగల నటుడు. ఆయన సుభాష్చద్రబోస్ జీవితం ఆధారంగా తెరకెక్కిన 2017 నాటి వెబ్ సిరీస్ 'బోస్: డెడ్/అలైవ్' (Bose: Dead/Alive) కోసం ఈ నటుడు 13 కిలోల బరువు పెరిగాడు, ఆ తర్వాత ఏడాదే 2018లో విడుదలైన 'ఫన్నీ ఖాన్' (Fanney Khan) చిత్రం కోసం ఒక్కనెలలో ఏకంగా పది కిలోల బరువు తగ్గారు. తాను బోస్ వెబ్ సిరీస్ తర్వాత బరువు తగ్గించుకోవాల్సి ఉంటుందని తనకు ముందే తెలుసని, అందుకేనే అల్పాహార, మధ్యాహ్న భోజనం మానేశానని అన్నారు. ఇలా చేస్తే బరువు తగ్గగలమా అంటే..ఇది అత్యంత కష్టమైన విధానం. ఎందుకంటే ఉదయాన్నే అల్పాహారం, మధ్యాహ్న భోజనం మానేసి, ఉండటం అంటే..శరీరాన్ని చాలా కష్టబెట్టడమే కాకుండా బలహీన పడే అవకాశాలు ఎక్కువ. కానీ రాజ్ కుమార్ మాత్రం తాను నేరుగా రాత్రి భోజనం మాత్రమే చేస్తానని, అది కూడా ప్రోటీన్ కలిగిన ఆహారం తీసుకుంటానని అన్నారు. మరి ఉదయం ఎలాంటి ఆహారం లేకుండా ఎలా ఉండగలరంటే..నిరంతరం పనిలో ఉంటాను కాబట్టి ఆకలి బాధ అంతగా అనిపించదని చెబుతున్నారు. అలాగే వ్యాయామాలు విషయానికొస్తే..ప్రతిరోజూ కనీసం మూడు గంటల పాటు కార్డియో, స్ట్రెంత్ ట్రైనింగ్ చేస్తానని అన్నారు. దీపావలి వంటి పండుగ సమయాల్లో నోరు చాలా కట్టడి చేసుకుంటానని, ఎందుకంటే ఫిట్గా ఉండటమే తన ప్రధాన లక్ష్యం కాబట్టి అని చెబుతున్నారు రాజ్కుమార్. ప్రస్తుతం భారత మాజీ క్రికెట్ కెప్టెన్ సౌరవ్ గంగూలీ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న 'దాదా' (Dada) మూవీలో కనిపించనున్నారు రాజ్కుమార్. ఈ మూవీ ఫస్ట్ లుక్ని గంగూలీ 54వ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేశారు.మైదానంలోకి పరిగెత్తే ముందు షర్ట్ లేకుండా తన ఇండియా జెర్సీని ఊపుతూ గంగూలీ కనిపించడం క్రికెట్ చరిత్రలోనే అత్యంత చిరస్మరణీయమైన క్షణాలలో ఒకటి. అలాంటి క్షణాన్ని పోస్టర్ ఫస్ట్లుక్గా విడుదల చేసింది చిత్ర బృందం. కాగా, రాజ్ కుమార్ అనుసరించే డైట్ విధానం సరైనదేనా అంటే..అల్పాహార, మధ్యాహ్న భోజనం మానేస్తే..దీర్ఘకాలంలో ఇది శరీరంపై తీవ్రమైన ప్రతికూల ప్రభావాలను చూపిస్తుంది. పైగా, బరువు తగ్గడానికి బదులు మరింత బరువు పెరిగే ప్రమాదం ఉందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ఎందుకంటే భోజనం అన్నేసి గంటలు తీసుకోకపోతే శరీరం "సర్వైవల్ మోడ్" (ఆకలి మోడ్) లోకి వెళ్తుంది. శక్తిని ఆదా చేయడానికి శరీరం కేలరీలను ఖర్చు చేయడం తగ్గించి, ఫ్యాట్ను ఎక్కువగా నిల్వ ఉంచుకుంటుంది. దీనివల్ల మెటబాలిజం రేటు దారుణంగా పడిపోతుందని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. పైగా ఆకలి ఎక్కువ వేసి..నియంత్రణ కోల్పోయేలా ఎక్కువగా తినేసే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. దీని వల్ల బరువు పెరిగే అవకాశాలే ఎక్కువగా ఉంటాయని అంటున్నారు. అలాగే శరీరం ఆహారం లభించనప్పుడు కొవ్వుని మాత్రమే గాక శక్తి కోసం కండరాలను కూడా కరిగించేలా చేస్తుంది. కండరాలు తగ్గితే శరీరం బలహీనపడి ఇతర ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని చెబుతున్నారు వైద్యులు. అదీగాక రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గడం వల్ల నీరసం, తలతిరగడం, మూడ్ స్వింగ్స్, ఏకాగ్రత లోపించడం వంటివి జరుగుతాయి. ఒక్కోసారి పోషకాహార లోపం, గ్యాస్ట్రిక్ సమస్యలకు దారితీసే ప్రమాదం కూడా లేకపోలేదని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. దానికి బదులుగా కేలరీలు తక్కువగా ఉండే పోషకాహారం, ఫైబర్ ఉండే పదార్థాలు తీసుకునేలా కేర్ తీసుకుంటే ఆకలిని నియంత్రించ గలుగుతాం. ఆ తర్వాత ఫైబర్ అధికంగా ఉండే ఫుడ్కి ప్రాధాన్యతి స్తే కడుపునిండిన అనుభూతిని పొందడమే కాకుండా ఇతర ఆహారాల జోలికి వెళ్లరని చెబుతున్నారు. దీంతోపాటు వ్యాయామాలు, వాకింగ్ వంటివి క్రమం తప్పకుండా చేస్తే ఆరోగ్యకరంగా బరువు తగ్గడమే కాకుండా మళ్లీ యథావిధిగా పెరిగే అవకాశాలు తగ్గుతాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: 67 నుంచి 57 కిలోలకు..! ఆ అలవాట్లకు గుడ్బై..) -
67 నుంచి 57 కిలోలకు..! ఆ అలవాట్లకు గుడ్బై..
బరువు తగ్గడం అనేది ఎల్లప్పుడు కాస్త క్లిష్టమైనదే. కాకపోతే దాన్ని ఆస్వాదించేలా ఎంజాయ్ చేసేలా ప్లానే చేసుకుంటేనే తేలికగా బరువు తగ్గగలుగుతారనేది నిపుణుల మాట. ఎప్పుడు కఠికన ఆహార నియమాలు, వర్కౌట్లు మాత్రమే కాదు. సాధారణ అలవాట్లతో కూడా బరువు తగ్గడం సులభమే అని అంటోంది ఈ డైటీషియన్. తన బరువు తగ్గేందుకు ఆ అలవాట్లను దరిచేరనీయకపోవడం వల్లే సాధ్యమైందంటూ..అవేంటో సవివరంగా సోషల్ మీడియా వేదికగా పంచుకుంది.వార్దా అనే డైటీషియన్ తన వెయిట్లాస్ జర్నీని ఇన్స్టాగ్రామ్లో పంచుకున్నారు. తాను 67 కిలోల నుంచి 57 కిలోలకు తగ్గినట్లు వెల్లడించారు. అందుకోసం ఎనిమి అలవాట్లకు దూరంగా ఉన్నట్లు తెలిపారు. దూరంగా ఉన్న ఆ అలవాట్లు..చాలా వేగంగా తినడంతాను ఐదు నిమిషాల్లో భోజనం ముగించడం మానేసి, తినడానికి సుమారు 15-20 నిమిషాలు తీసుకోవడం ప్రారంభించానని వార్దా చెప్పారు. దీనివల్ల తక్కువ ఆహారంతోనే కడుపు నిండిన అనుభూతి కలిగిందన్నారు.రోటీ, అన్నం మానేయడంకార్బోహైడ్రేట్లను తొలగించడానికి బదులుగా, ఆమె ఆహార పరిమాణాన్ని నియంత్రించడంపై దృష్టి పెట్టినట్లు తెలిపారు. కొవ్వు తగ్గడం అంటే కేలరీల లోటు, అంతేగానీ కార్బోహైడ్రేట్లను పూర్తిగా తొలగించడం కాదని అంటోంది“పరిపూర్ణమైన ఆరోగ్యకరమైన ఆహారం” పాటించడంతాను ఎల్లప్పుడూ పరిపూర్ణంగా తినడానికి ప్రయత్నించలేదని అంటున్నారు. అతిగా తినడానికి దారితీసే స్టిక్ట్గా అనుసరించే డైట్ని ఫాలో అవ్వలేదని అన్నారు.ప్రతిరోజూ బరువును తనిఖీ చేసుకోవడంశరీర బరువులో నీరు, సోడియం, హార్మోన్ల కారణంగా మార్పులు రావచ్చని వార్దా పేర్కొన్నారు. రోజువారీ బరువు సంఖ్యలపై దృష్టి పెట్టడానికి బదులుగా, వారంతమే చెక్చేసేదాన్ని అని చెప్పారు.అంతులేని కార్డియో వ్యాయామాలు చేయడంఆమె ఎక్కువసేపు చేసే కార్డియో వ్యాయామాలపై ఆధారపడలేదు. దానికి బదులుగా,నడవడం, ఎక్కువ అడుగులు వేయడం, చురుకుగా ఉండటంతో సహా రోజువారీ కదలికలపై ఫోకస్ పెట్టినట్లు తెలిపారు.ఫ్యాట్ బర్నర్లు, డిటాక్స్ డ్రింక్స్ వాడటం..అలాంటి వాటికి దూరంగా ఉంటూ..ఎక్కువ సేపు కడుపు నిండుగా ఉండటానికి అవసరమైన ప్రోటీన్, సంపూర్ణ ఆహారాలపై దృష్టి పెట్టినట్లు తెలిపారు.అపరాధ భావంకి చోటు ఇవ్వకుండా..ఒకసారి అనారోగ్యకరమైన ఆహారం తీసుకున్నంత మాత్రాన మొత్తం వెయిట్లాస్ జర్నీ వేస్ట్ అయిందని భావించాల్సిన అవసరం లేదని అంటోంది. ఒక పూట తీసుకునే జంక్ఫుడ్ మీ ఆరోగ్య పురోగతికి అంతరాయం కాదని అంటున్నారామె.ఆకలి వేసేంత వరకు ఉండకుండా..రోజులో ముందుగా ఆకలితో ఉండటం కంటే..ముందుగానే కొద్దిగా కొద్దిగా తినేలా కేర్ తీసుకున్నట్లు తెలిపింది. ఎందుకుంటే విపరీతమైన ఆకలిలో తినే పరిమాణంపై నియంత్రణ ఉండదని అంటోంది. అలాగే సమతుల్య ఆహారమే తీసుకుంటానని పేర్కొంది. ఇంకెందుకు ఆలస్యం బరువు తగ్గే ప్రయత్నంలో ఉన్నట్లయితే, ఈ సాధారణ చిట్కాలను పాటించి చూడండి మరి..గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యలు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: బరువు తగ్గడం ఇంత కష్టమా? నటి నిమిష సజయన్ వెయిట్లాస్ జర్నీ) -
బరువు తగ్గడం ఇంత కష్టమా? నటి నిమిష సజయన్ వెయిట్లాస్ జర్నీ
కిలోల కొద్దీ బరువు తగ్గి స్లిమ్గా మారిన వారిని చూసి..వాళ్లలా తగ్గిపోదాం అనుకుంటాం. కానీ ఆ క్రమంలో వాళ్లు ఎదుర్కొన్న ఇబ్బందులు చాలానే ఉంటాయి. ముఖ్యంగా నిలకడ అనేది మాటల్లో చెప్పినంత ఈజీ కాదు ఆచరణలో పెట్టడం. ఇక్కడ అలాంటి సమస్యలే ఎదుర్కొని, ఎంతో నిజాయితీగా తన వెయిట్లాస్ జర్నీ గురించి చెప్పి..ఆలోచింప చేసింది మళయాళం నటి నిమిషా సజయన్. తను ఒక పాత్ర కోసం బరువు పెరిగి మళ్లీ తగ్గాడానికి ఎంతలా కష్టపడాల్సి వచ్చింది, అలాగే ఆ క్రమంలో కన్నీళ్లు కూడా వచ్చేశాయంటూ తన వెయిట్లాస్ జర్నీ గురించి చెప్పుకొచ్చారు. మరి అవేంటో చూద్దామా..!.నటి నిమిషా సజయన్ సోషల్ మీడియా వేదికగా 'బబితా సింగ్ రిపోర్టింగ్' అఏ మూవీ కోసం ఏకంగా 14 కిలోలు బరు పెరిగానని తెలిపారు. అయితే ఆ తర్వాత తగ్గడానికి చేసిన ప్రయత్నాలు, ఆ క్రమంలో ఎదుర్కొన్న స్ట్రగుల్స్ గురించి సవివరంగా వెల్లడించారు. అంతేగాదు బరువు తగ్గక ముందు, ఆ తర్వాత పోటోలను పంచుకుంటూ పోస్ట్లో ఇలా రాసుకొచ్చారు. తాను బబితా సింగ్ రిపోర్టింగ్ మూవీలో బబితా పాత్ర కోస ఏకంగా 58 నుంచి 72 కిలోలు పెరిగినట్లు తెలిపారు. ఆ తర్వాత బరువు తగ్గడానికి ఎన్ని తంటాలు పడాల్సి వచ్చిందో చెప్పుకొచ్చారు. తొలి పది రోజులు సైన నిద్ర లేక తీవ్రమైన మానసిక సమస్యలు, అలసట, అసహనం వంటి సమస్యలు ఎదుర్కొన్నానని అన్నారు. ఒకానొక సమయంలో ఇక తన వల్ల కాదు అని చేతులెత్తేశానని కూడా అన్నారు. బరువు తగ్గడం కోసం చేస్తున్న వర్కౌట్లు, డైటింగ్ విషయంలో కళ్లల్లో నీళ్లు తిరిగేవని చాలా నిజాయితీగా చెప్పుకొచ్చారు. అయితే దీన్ని ట్రైనర్ సాయంతో జయించి ముందుకు సాగానని, అందుకు అతనికి చాలా కృతజ్ఞతలు అని కూడా చెప్పారామె. నిజంగానే వెయిట్లాస్ జర్నీలో ఒక్కోసారి పూర్తి స్థాయిలో అనుకున్నట్లుగా చేయలేకపోయినా.. తర్వాత నుంచి కొనసాగి ముందుకుపోవాలని అంటున్నారామె. ఒక్కోసారి స్కిప్ అయితే లైట్ తీసుకుంటూ పోవాలే గానీ, ఆపేద్దాం అనుకున్నారో అధిక బరువుని తగ్గించుకోవడంలో ఢమాల్ అని పడిపోయినట్లే లెక్క అని అంటోంది. అపరాధ భావనకు తావు లేకుండా మధ్య మధ్యలో తప్పడం అనేది సహజం అని సానుకూలంగా తీసుకుంటూ సాగితే ఆటోమేటిగ్గా బరువు తగ్గడమే కాకుండా మీరు ఏర్పరుచుకున్న వెయిట్ లాస్ నియమాలు దైనందిన జీవితంలో తెలియకుండా భాగమవుతాయని అంటోంది. అలాగే మంచి నిపుణులు లేదా వైద్యుల పర్యవేక్షణలో, వారి సూచనలు సలహాలతో బరువు తగ్గే యత్నం చేస్తే..ఎలాంటి మానసిక, అనారోగ్య సమస్యలనైనా తట్టుకుని బరువు తగ్గగలమని నమ్మకంగా చెబుతోందామె. View this post on Instagram A post shared by NIMISHA BINDU SAJAYAN (@nimisha_sajayan) (చదవండి: ఒక్కసారి సిజేరియన్..మళ్లీ అదేనా?) -
కిడ్నీలపై దాడి చేసే తోడేలు వ్యాధి
తన సొంత కణాలను తానే దెబ్బతీసే ఆటోఇమ్యూన్ వ్యాధుల్లో లూపస్ అనేది కూడా ఒకటి. నిజానికి లాటిన్ భాషలో లూపస్ అంటే తోడేలు అని అర్థం. ఈ వ్యాధి వచ్చిన వాళ్లలో ముక్కు చుట్టూ సీతాకోకచిలుక ఆకృతిలో కనిపించే ర్యాష్ వల్ల ముఖం తోడేలులా కనిపించడం ఒక అంశమైతే... చాలా క్రూరంగా తన ఎరను వేటాడి ఆకలిగా తినేసే జంతువుల్లో తోడేలు ఒకటి. ఈ రెండు కారణాలతో ఈ జబ్బుకు ‘లూపస్’ అని పేరొచ్చింది. సిస్టమిక్ లూపస్ ఎరిథమెటోసిస్ అనే జబ్బు పేరుకు సంక్షిప్త రూపమే ఈ ‘లూపస్’. ముందుగా చెప్పినట్టుగా... ఈ జబ్బు తన సొంత కణాలను దెబ్బతీసే క్రమంలో కీళ్లూ, చర్మం ఇతరత్రా అవయవాల లాగానే మూత్రపిండాల (కిడ్నీల) పైనా తన దుష్ప్రభావం చూపవచ్చు. అదెలా జరుగుతుంది, ఆ జబ్బును ఏమంటారు, వాటి లక్షణాలూ, అప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలూ, చికిత్సలపై అవగాహన కోసం ఈ కథనం. లూపస్ కారణంగా కిడ్నీపై దుష్ప్రభావం పడి అవి దెబ్బతినే కండిషన్కు ‘లూపస్ నెఫ్రైటిస్’ అని పేరు. తొలిదశలోనే గుర్తించకపోతే ‘లూపస్ నెఫ్రైటిస్’... మూత్రపిండాల (కిడ్నీల) వైఫల్యానికి దారితీసే ముప్పు ఉంటుంది. లూపస్ కారణంగా కిడ్నీల్లో వాపు, వడపోత (ఫిల్టరింగ్) వ్యవస్థ దెబ్బతినడాన్ని లూపస్ నెఫ్రైటిస్ అంటారు. సకాలంలో గుర్తించి చికిత్స తీసుకోకపోతే ఇది... దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధి (క్రానిక్ కిడ్నీ డిజీస్ –సీకేడీ) మొదలుకొని... చివరకు కిడ్నీ వైఫల్యానికి (కిడ్నీ ఫెయిల్యూర్కు) దారితీసే ప్రమాదం ఉంది.కిడ్నీని ఎలా దెబ్బతీస్తుందంటే...తొలుత చెప్పుకున్నట్లుగానే... ఆటో ఇమ్యూన్ వ్యాధుల్లో... తమ సొంత వ్యాధినిరోధక వ్యవస్ధ అనేది... తన సొంత కణాలనూ, కణజాలాన్ని పరాయివి భావించి... వాటిని దెబ్బతీసినట్టే... లూపస్ అనే ఆటోఇమ్యూన్ వ్యాధిలోనూ అదే జరుగుతుంది. లూపస్ వ్యాధిగ్రస్తుల్లోని ఇమ్యూన్ వ్యవస్థ తాను ఉత్పత్తి చేసే యాంటీబాడీస్, ఇమ్యూన్ కాంప్లెక్స్లన్నవి కిడ్నీలోని అత్యంత సూక్ష్మమైన, సంక్లిష్టమైన వడపోత కేంద్రాలైన గ్లోమెరూలైపై దాడి చేసి, వాటిని దెబ్బతీస్తాయి. అలా గ్లోమెరూలై దెబ్బతినడంతో కిడ్నీలు తమ ‘వడపోత’ సామర్థ్యాన్ని క్రమంగా కోల్పోతుంటాయి. వ్యాధి తీవ్రత పెరుగుతున్న కొద్దీ కిడ్నీ పనితీరు క్రమంగా తగ్గుతూ పోతుంది. ఇలా క్రమక్రమంగా తొలుత దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధి మొదలుకొని, చివరకు కిడ్నీ ఫెయిల్యూర్కు అది దారితీయవచ్చు. ఇవీ లక్షణాలు... మన దేహంలో కాలేయం, కిడ్నీ వంటి అవయవాలకు అద్భుతమైన సామర్థ్యం ఉంటుంది. దాదాపు 90 శాతం చెడిపోయేవరకూ అవి తమ జీవక్రియలను చాలా సమర్థంగా నిర్వహిస్తూ ఉంటాయి. ఈ అంశమే లక్షణాలను చాలా ఆలస్యంగా బయటపడేలా చేస్తుంది. అందుకే లూపస్ నెఫ్రైటిస్ మొదటి దశలో చాలాసార్లు స్పష్టమైన లక్షణాలేవీ కనిపించకపోవచ్చు. అయితే లూపస్ ఉన్నవారు క్రమం తప్పకుండా కిడ్నీ పరీక్షలు చేయించుకోవడం కీలకం. ఫలితంగా మూత్రంలో ప్రోటీన్ , రక్తం కనిపించి వ్యాధి బయటపడే అవకాశాలెక్కువ. సాధారణంగా లూపస్ నెఫ్రైటిస్లో కనిపించే లక్షణాలివి... → మూత్రంలో నురుగు లేదా ఎక్కువగా బుడగలు రావడం→ మూత్రంలో రక్తం కనిపించడం లేదా మూత్రం గోధుమరంగులోకి మారడం. → కాళ్లు, పాదాలు, ముఖం లేదా కళ్ల చుట్టూ వాపు. → అకస్మాత్తుగా బరువు పెరగడం. → మూత్రం పరిమాణం తగ్గడం. → అధిక రక్తపోటు → తీవ్రమైన అలసట... ఇలాంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వీలైనంత త్వరగా వైద్యులను సంప్రదించాలి.నిర్ధారణ ఇలా... లూపస్ నెఫ్రైటిస్ను గుర్తించడానికి బాధితుల లక్షణాలు, వైద్య చరిత్రను పరిగణనలోకి తీసుకోవడంతో పాటు వైద్యులు మరికొన్ని పరీక్షలనూ సూచిస్తారు. ఉదాహరణకు మూత్ర పరీక్ష ద్వారా ప్రోటీన్ , రక్తం వంటివి గుర్తిస్తారు. మరికొన్నిæ రక్తపరీక్షల ద్వారా కిడ్నీ పనితీరుతోపాటు లూపస్కు సంబంధించిన కొన్ని ఇమ్యూన్ సూచికలను పరిశీలిస్తారు. అవసరాన్ని బట్టి కిడ్నీ బయాప్సీ చేసి వ్యాధి ఏ స్థాయిలో ఉందో, కిడ్నీకి ఏ మేరకు ఏ రకం నష్టం జరిగిందో నిర్ధారణ చేస్తారు. పూర్తి నివారణ సాధ్యమేనా? లూపస్ అనేది ఆటో ఇమ్యూన్ వ్యాధి కారణంతో దీని నివారణ పూర్తిగా సాధ్యం కాదు. అంతేకాదు... చికిత్సతో ఇది పూర్తిగా తగ్గుతుందని చెప్పడానికీ లేదు. అయితే వ్యాధిని నియంత్రణలో ఉంచడం ద్వారా కిడ్నీపై పడే దుష్ప్రభావాన్నీ, కిడ్నీకి జరిగే నష్టాన్ని నివారించడం సాధ్యమే. వైద్యులు సూచించిన మందులను క్రమం తప్పకుండా తీసుకోవడం, మెడికల్షాపు నుంచి తామే స్వయంగా తీసుకునే మందుల్ని (ఆన్ కౌంటర్ మెడిసిన్ను) తీసుకోకపోవడం, రక్తపోటును నియంత్రణలో ఉంచుకోవడంతో పాటు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్ల వంటి మంచి జీవనశైలి (లైఫ్స్టైల్) పాటించడం, అవసరమైన ఫాలోఅప్ పరీక్షలు చేయించుకోవడం వంటి చర్యలతో దీన్ని అదుపులో పెట్టడం చాలావరకు సాధ్యమే. చివరగా... లూపస్ ఉన్న ప్రతి ఒక్కరిలోనూ కిడ్నీ వ్యాధి లక్షణాలు స్పష్టంగా కనిపించకపోవచ్చు. అందువల్ల పైకి లక్షణాలు కనిపించకపోయినప్పటికీ వైద్యుల సూచన మేరకు క్రమం తప్పకుండా తగిన పరీక్షలు చేయించుకోవాలి. కిడ్నీ పనితీరు, మూత్రంలో ప్రోటీన్ పోవడం వంటి వాటిని చూసుకుంటూ ఉండాలి. తాజా మార్గదర్శకాల ప్రకారం లూపస్తో బాధపడేవారు క్రమం తప్పకుండా మూత్ర పరీక్షలు చేయించుకోవాలి. ఒకవేళ లూపస్ నెఫ్రైౖ టిస్ నిర్ధారణ అయితే మాత్రం ఈ తరహా పరీక్షలూ, పర్యవేక్షణ మరింత తరచూ అవసరం కావచ్చు. మరీ ముఖ్యంగా లూపస్ ఉన్న బాధితుల్లో... మూత్రంలో నురుగు, రక్తం, దేహంలో వాపు లేదా రక్తపోటు పెరగడం వంటివి కనిపిస్తే వెంటనే నెఫ్రాలజిస్ట్ లేదా రుమటాలజిస్ట్ను సంప్రదించడం అవసరం. ఈ వ్యాధిలో సమస్యను ఎంత త్వరగా గుర్తించి, సరైన చికిత్స తీసుకుంటే... కిడ్నీపై దుష్ప్రభావాన్ని అంతగా తగ్గించే అవకాశం ఉంటుందని గుర్తుంచుకోవాలి.చికిత్సఈ వ్యాధికి చికిత్స అన్నది వ్యాధి తీవ్రత, కిడ్నీ బయాప్సీ ఫలితాలు, ఇతర ఆరోగ్య పరిస్థితులు లాంటి అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. వ్యాధినిరోధక వ్యవస్థ తాలూకు ‘అతి చురుకుదనా’న్ని తగ్గించేందుకు ఇమ్యూనోసప్రెసివ్ మందులు, స్టెరాయిడ్లు వాడటం వంటి చికిత్స ప్రక్రియలను వైద్యులు అనుసరిస్తారు. కొన్ని సందర్భాల్లో మైకోఫెనోలేట్, సైక్లోఫాస్ఫమైడ్, బయోలాజిక్స్ లేదా ఈవ్యాధి తీవ్రతను తగ్గించడానికి ఉపయోగపడే ఇతరత్రా మందులనూ డాక్టర్లు సూచించవచ్చు. లూపస్ చికిత్సలో ‘హైడ్రాక్సీక్లోరోక్విన్ ’ను కూడా ఓ ముఖ్యమైన మందుగా చెప్పవచ్చు. అధిక రక్తపోటు, మూత్రంలో అధిక ప్రోటీన్ వంటి సమస్యలను నియంత్రించేందుకు ప్రత్యేకమైన మందుల్నీ ఇవ్వవచ్చు. కిడ్నీలు తీవ్రంగా దెబ్బతిని వైఫల్యానికి చేరితే డయాలసిస్ లేదా కిడ్నీ మార్పిడి చికిత్స అవసరం కావచ్చు.డాక్టర్ సీరపాణి గోపాలుని సీనియర్ కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ అండ్ ట్రాన్స్ప్లాంట్ ఫిజీషియన్ -
ఆహారం తీసుకోగానే గర్భిణులకు కడుపులో ఇబ్బందా?
కొందరు గర్భవతుల్లో ఆహారం తీసుకోగానే కడుపులో ఇబ్బందిగా ఉండవచ్చు. మరీ ముఖ్యంగా 28 వారాల ప్రెగ్నెన్సీ టైమ్లో ఇది కాస్త ఎక్కువగానే ఉండే అవకాశం ఉంది. అలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలో తెలిపే కథనమిది. కొందరు గర్భిణుల్లో తినగానే ఛాతీలో ఇబ్బంది, ఆహారం గొంతుకు అంటుకుపోయినట్టుగా ఉండటం, ఛాతీలో / గుండెల్లో మంట, కడుపులోని ఆహారం పైకి ఎగజిమ్ముతున్న భావన, అజీర్తి, తేన్పులు వంటి బాధలు కనిపిస్తుంటాయి.ఇదీ కారణం... ఆహారాన్ని జీర్ణం చేయడానికి ఉపయోగపడే గ్యాస్ట్రిక్ జ్యూస్... జీర్ణాశయం నుంచి పై వైపునకు అంటే గొంతువైపు ఎగజిమ్మడమే ఇలా జరగడానికి కారణం. ఇక గర్భవతుల్లో కండరాలు వదులుగా అయ్యేలా చేసేందుకు ప్రోజెస్టెరాన్ అనే హార్మోన్ ఉత్పత్తి అవుతుంటుంది. గర్భసంచిలోని పిండం పెరుగుతున్న కొద్దీ దానికి చోటు కల్పించడం కోసం... గర్భసంచి కండరాలు వదులయ్యేలా చేసేందుకు ఇలా జరుగుతుంటుంది. అయితే ఈ హార్మోన్ కేవలం గర్భసంచిని మాత్రమే వదులు చేయకుండా ఇతర కండరాలు అంటే... పక్కనే ఉన్న జీర్ణాశయం–అన్నవాహిక మధ్యన ఉండే స్ఫింక్టర్ (లోవర్ ఈసోఫేజియల్ స్ఫింక్టర్ – లెస్ అనే కవాటం వంటిది) మీద కూడా తన ప్రభావం చూపడంతో అది కాస్త వదులైపోవడమన్నది సాధారణంగా జరుగుతుంది. దాని ఫలితంగా ఈ గ్యాస్ట్రిక్ జూసెస్ జీర్ణాశయం నుంచి అన్నవాహిక వైపునకు పైకి ఎగజిమ్ముతాయి.నివారణ ఇలా..: అందుకే గర్భవతులు ఒకేసారి పెద్దమొత్తంలో కాకుండా ఎక్కువసార్లు చిన్న చిన్న మోతాదుల్లో తినడం, తినగానే పక్కకు ఒరగకుండా కాస్త వాకింగ్ చేయడం, పడుకున్నప్పుడు తలగడ పెట్టుకోవడం, తినే ఆహారంలో కారం, వేపుళ్లు, మసాలాలు చాలా పరిమితంగా తీసుకుంటూ మజ్జిగలాంటివి తాగుతూ ఉండటం వల్ల ఈ సమస్యను చాలావరకు నివారించవచ్చు. అప్పటికీ సమస్య తగ్గకపోతే ఒకసారి డాక్టర్ను సంప్రదించి వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే వారు సూచించిన యాంటాసిడ్స్ వాడాల్సి ఉంటుంది. ఇది మినహా గర్భవతులు డాక్టర్ల సూచన లేకుండా తమంతట తాము ఎలాంటి ట్యాబ్లెట్స్ వేసుకోకపోవడమే మంచిది. -
సంకేతం అందిందా?
మెదడులోని ‘సప్లిమెంటరీ మోటార్ ఏరియా’ అనే భాగం ఉంటుంది. ఇది మెదడులోని ఫ్రంటల్ లోబ్ లోపలి ఉపరితలంలో ఉండే చిన్న ప్రాంతం. దీని గురించి చాలామందికి పెద్దగా తెలియదుగానీ... మానవ దేహంలో మాత్రం ఓ అద్భుతమైన పని చేస్తుంది. అదేమిటంటే... ‘‘ఏదైనా పని చేయాలన్న ఆ ఉద్దేశాన్ని... చేతల్లోకి తీసుకురావడంలో ఈ సప్లిమెంటరీ మోటార్ ఏరియా (ఎస్ఎమ్ఏ)ది కీలక భూమిక పోషిస్తుంది. అంటే... మెదడు విషయానికి వస్తే... ‘చేయాలనుకోవడాన్ని’ ‘చేయడంగా’ మార్చే ప్రాంతాల్లో ఎస్ఎమ్ఏ ఒకటి.ఎస్ఎమ్ఏ ఏం చేస్తుందంటే...కదలికలు జరగాల్సిన తీరుతెన్నుల్ని ముందుగానే సిద్ధం చేస్తుంది. కదలాలనుకున్న ఆ సంకల్పం మెదడులోకి రాగానే... ‘ఎస్ఎమ్ఏ’ ఆ పనిని మొదలుపెట్టేస్తుంది. దీనికి ఓ తార్కాణమే కీబోర్డు వైపు చూడకుండానే మనం టైప్ చేయగలగడం. మన వేళ్లు కదిలేలోపే అవి కదలాల్సిన క్రమాన్ని ‘ఎస్ఎమ్ఏ’ సిద్ధం చేసేస్తుంది. అందుకే మనం టకటకా టైప్ చేసేయగలుగుతాం. రెండు చేతుల కదలికల సమన్వయానికీ...చప్పట్లు కొట్టేటప్పుడూ, షూలేసులు కట్టుకునేటప్పుడూ మన చెతులు రెండూ ఒక సమన్వయంతో, ఒకే లయలో పనిచేయాలి. ఆ సమన్వయానికి ‘ఎస్ఎమ్ఏ’ది కీలక భూమిక. మధ్యలోనే పని ఆపేయడానికి కూడా... అంతేకాదు... ఒక క్రమబద్ధమైన కదలికను మధ్యలో ఆపేయడమూ ‘ఎస్ఎమ్ఏ’ పనే. రోడ్డు దాటుతూ ఉంటాం. అకస్మాత్తుగా ఓ కారు వేగంగా వస్తూ కనిపించగానే... అప్పటివరకూ కొనసాగుతున్న నడక అకస్మాత్తుగా ఆగిపోతుంది. ఇందుకు దోహదపడేదీ ‘ఎస్ఎమ్ఏ’నే. అలవాటైన కదలికల్లో ఆటోపైలట్లాగా... రోజూ వెళ్లే దారిలో కారు నడుపుతున్నప్పుడు... ఎక్కడ ఎప్పుడు ఎలా మలుపులు తి΄్పాలో మనకు పెద్దగా గుర్తుండకపోయినప్పటికీ... ఆ కదలికలను గుర్తుంచుకొని స్వతహాగా అవి జరిగిలే ఎస్ఎమ్ఏ చూస్తుంది. ఎస్ఎమ్ఏ కండరాలకు బలం ఇవ్వదు. ఆ పని ప్రధాన మోటార్ కార్టెక్స్ది. ఎస్ఎమ్ఏ మనకు కావాలనుకున్న కదలికను ప్లాన్ చేయడం. దాని వరసను సిద్ధం చేయడం, దాన్ని మొదలుపెట్టడం. శస్త్రచికిత్స తర్వాత కొంతకాలం ఎస్ఎమ్ఏ తాత్కాలికంగా స్తబ్ధంగా మారితే ఆ కండిషన్ను ఎస్ఎమ్ఏ సిండ్రోమ్ అంటారు. దీని బాధితులు పూర్తిగా స్పృహలోనే ఉంటారు. అన్నీ అర్థం చేసుకుంటారు. కదలాలనే బలమైన కోరికా ఉంటుంది. అయినా... కదలిక ప్రక్రియను తాము మొదలుపెట్టలేరు. ఎందుకంటే... మెదడు ‘సరే... మొదలుపెట్టు’ అనే ఆదేశాన్ని ఎక్కడో పోగొట్టుకున్నట్టుంటుంది.వైద్య శిక్షణలో ఉన్న డాక్టర్లు తొలిసారి ఎస్ఎమ్ఏ సిండ్రోమ్ను చూసినప్పుడు వారికి అదో మాయలా అనిపించవచ్చు. బాధితులు తమ ఆలోచనకూ, చేతలకూ మధ్యన ఎక్కడో చిక్కుకుపోయినట్టు ఉంటారు. నిన్న చేయలేని పనిని ఈ రోజు మెదడు మళ్లీ ప్రయత్నిస్తుంది.ప్రతిరోజూ... మెదడులో కనిపించని నాడీ మార్గాలు కాస్త మరింత సమర్థంగా పనిచేయడం నేర్చుకుంటాయి. దాంతో సప్లిమెంటరీ మోటార్ ఏరియా మళ్లీ క్రియాశీలమవుతుంది.ఓ పనిలో ఉండగానే మరో పనిలోనూ... ఫ్రెండ్స్తో మాటల్లో ఉంటూనే టేబుల్పై ఉన్న నీళ్ల గ్లాసు అందుకోవడం; కారు హారన్ వినగానే ఉలిక్కిపడి వెనక్కి జరగడం, చాలాసేపు కూర్చున్న తర్వాత కొంత సంభాషణ చివరి దశలో ఉండగానే కూర్చీ చేతులు పట్టుకుని పాక్షికంగా లేవడానికి సిద్ధం కావడం... ఇలాంటి పనులన్నీ ‘ఎస్ఎమ్ఏ’ వల్లనే. -
వెన్నెముకకు మేలు చేసే ఈ ఆసనం గురించి తెలుసా?
శరీరాన్ని నిటారుగా, సమతుల్యంగా ఉంచేందుకు యోగా ఆసనాలు ఎంతో ఉపయోగపడతాయి. అందులో సులభంగా చేయగల ఆసనాల్లో తాడాసనం ఒకటి. క్రమం తప్పకుండా సాధన చేస్తే శరీర భంగిమ, బ్యాలెన్స్తో పాటు కండరాల టోన్ను మెరుగుపరచడంలో ఇది సహాయపడుతుంది.ఎలా చేయాలి?రెండు పాదాలను కలిపి లేదా కొద్దిగా దూరంగా ఉంచి నిటారుగా నిలబడాలి.చేతులను శరీరం పక్కన ఉంచాలి.శ్వాస తీసుకుంటూ రెండు చేతులను ముందుకు, పైకి తీసుకెళ్లి తలపైకి పెట్టాలి.అరచేతులను కలిపి లేదా ఒకదానికొకటి ఎదురుగా ఉంచి, కాళ్లపై సమంగా బరువు ఉంచి, వెన్నెముకను పైకి పొడిగించాలి.సౌకర్యంగా ఉంటే మడమలను పైకి లేపి పాదాల వేళ్లపై నిలబడాలి.చూపును ఒక స్థిరమైన బిందువుపై ఉంచి, సాధారణంగా శ్వాస తీసుకుంటూ 10–20 సెకండ్లు ఉంచాలి.శ్వాస వదులుతూ మడమలను దించి, చేతులను కిందకు తీసుకురావాలి.ప్రయోజనాలు...శరీర భంగిమను (Post-ure) సరిచేయడంలో సహాయపడుతుంది.బ్యాలెన్స్ను మెరుగుపరుస్తుంది.మొత్తం శరీరంలోని కండరాల టోన్ను మెరుగుపరుస్తుంది.వెన్నెముకను పొడవుగా చేసి, దానిపై ఉన్న ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది.ముందు మూడు లైన్ల స్టార్టింగ్ కథనంతో పాటు అన్నీ ఇవ్వండి– అనిత పాతర్ల, యోగా ట్రైనర్ఇవి చదవండి: పైసా ఖర్చు లేకుండా చర్మానికి మెరుపు.. ఈ 3 అలవాట్లు చాలు! -
చక్కెర ధరలు పెరిగినా.. తీపి తగ్గొద్దు!
పండుగ సీజన్ వచ్చిందంటే ఇంట్లో స్వీట్లు, పాయసం, పిండి వంటలు తప్పనిసరి. కానీ చక్కెర సంక్షోభం.. ధరలు పెరగడంతో సామాన్యులకు వంటింటి బడ్జెట్ కాస్త భారమవుతోంది. పండుగ వేళ తీపి తగ్గించుకోవాల్సిన అవసరం లేకుండా.. వంటల్లో చక్కెరకు బదులుగా కొన్ని సహజ తీపి పదార్థాలను ఉపయోగించుకోవచ్చు. అయితే ప్రతి ప్రత్యామ్నాయం ప్రతి వంటకానికి సరిపోదు. ఏ వంటలో దేనిని ఉపయోగిస్తే రుచి బాగుంటుందో తెలుసుకుంటే ఖర్చును కొంత తగ్గించుకోవచ్చు.చక్కెరకు సులభమైన ప్రత్యామ్నాయాల్లో బెల్లం ముందుంటుంది. పాయసం, పరమాన్నం, పొంగలి, కొన్ని రకాల లడ్డూలు, హల్వా వంటి వంటకాల్లో చక్కెరకు బదులుగా బెల్లం ఉపయోగించవచ్చు. అయితే బెల్లం రంగు, రుచి వంటకంపై ప్రభావం చూపుతాయి. ముఖ్యంగా తెల్లగా ఉండే స్వీట్లకు బెల్లం వాడితే రంగు మారే అవకాశం ఉంటుంది.ఖర్జూరంతో సహజ తీపిఖర్జూరాలు కూడా మంచి ప్రత్యామ్నాయం. గింజలు తీసి కొద్దిసేపు నీటిలో నానబెట్టి మెత్తగా చేసి పేస్ట్గా ఉపయోగించవచ్చు. షేక్స్, స్మూతీలు, ఓట్స్, హల్వా, కొన్ని డెజర్ట్లలో ఇది బాగా సరిపోతుంది. ఖర్జూరాల్లో సహజంగా చక్కెరలు ఉంటాయి కాబట్టి పరిమాణాన్ని కూడా గమనించాలి.అరటిపండుతో స్వీటెనర్బాగా పండిన అరటిపండు సహజంగా తీపిగా ఉంటుంది. కేకులు, పాన్కేక్లు, స్మూతీలు వంటి వాటిలో చక్కెర పరిమాణాన్ని తగ్గించేందుకు మెదిపిన అరటిపండును ఉపయోగించవచ్చు. అయితే అరటి రుచి కూడా వంటకంలో కనిపిస్తుంది. అందువల్ల ప్రతి వంటకానికి ఇది సరైన ఎంపిక కాకపోవచ్చు.ఎండు ద్రాక్షతో తీపిఎండు ద్రాక్షను నానబెట్టి పేస్ట్ చేసి పాయసం, హల్వా, కొన్ని స్వీట్లలో కలపవచ్చు. లేదా తరిగి నేరుగా వంటకాల్లో వేసినా సహజమైన తీపి వస్తుంది. దీంతో అదనంగా చక్కెర వేసే పరిమాణాన్ని కొంత తగ్గించవచ్చు.కొబ్బరి బెల్లం కూడా..మార్కెట్లో లభించే కొబ్బరి బెల్లం కూడా కొన్ని పండుగ వంటకాల్లో ఉపయోగించవచ్చు. ముఖ్యంగా పాయసం, స్వీట్లు, కొన్ని పిండి వంటల్లో ఇది మంచి రుచిని ఇస్తుంది. అయితే దీనిని కూడా చక్కెరకు పూర్తిగా ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయం అని భావించకుండా.. తీపి పదార్థంగానే పరిమితంగా తీసుకోవాలి.తేనె ఎప్పుడు?టీ, నిమ్మరసం, పెరుగు, స్మూతీలు, కొన్ని చల్లటి డెజర్ట్లలో తేనెను చక్కెరకు బదులుగా ఉపయోగించవచ్చు. తేనె కూడా ప్రధానంగా చక్కెరలనే కలిగి ఉంటుంది కాబట్టి ఎక్కువగా తీసుకోవడం మంచిది కాదు. ముఖ్యంగా చిన్నపిల్లలకు తేనె ఇచ్చే విషయంలో వయసుకు సంబంధించిన జాగ్రత్తలు పాటించాలి.ఏ వంటకు ఏది?పాయసం, పరమాన్నం: బెల్లంహల్వా: బెల్లం, ఖర్జూర పేస్ట్షేక్స్, స్మూతీలు: ఖర్జూరం, అరటిపండుకేకులు, పాన్కేక్లు: పండిన అరటిపండుడెజర్ట్లు: ఖర్జూరం, ఎండు ద్రాక్షటీ, నిమ్మరసం: తేనెమన దేశంలో టీ, కాఫీల్లోనూ చక్కెర వినియోగం ఎక్కువగా ఉంటుంది. అందుకే రోజువారీగా తాగే టీకి స్టీవియా వంటి తక్కువ క్యాలరీ స్వీటెనర్లను ప్రత్యామ్నాయంగా ఉపయోగించవచ్చు. బెల్లం, తేనెతోనూ టీకి తీపి తెచ్చుకోవచ్చు కానీ అవి కూడా చక్కెరలనే కలిగి ఉంటాయి కాబట్టి పరిమితంగా వాడాలి. అలాగే ఏలకులు, అల్లం, దాల్చిన చెక్క వంటి వాటిని కలపడం ద్వారా చక్కెరను తగ్గించినా టీ రుచిగా ఉండేలా చేసుకోవచ్చు. అయితే క్రమంగా చక్కెర లేని టీకి అలవాటు పడటమే ఆరోగ్యపరంగా మెరుగైన ఎంపిక.షుగర్ పూర్తిగా తగ్గించొద్దు.. ఎందుకంటే?చక్కెరను పూర్తిగా మానేయాల్సిన అవసరం ప్రతి ఒక్కరికీ ఉండదు. శరీరానికి శక్తి కోసం కార్బోహైడ్రేట్లు అవసరం.. అయితే అదనంగా కలిపే చక్కెరను పరిమితంగా తీసుకోవడం ముఖ్యం. చక్కెర ఎక్కువగా తీసుకుంటే బరువు పెరగడం, దంత సమస్యలు, రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం వంటి సమస్యలకు దారితీయొచ్చు. అందుకే చక్కెరను పూర్తిగా తొలగించడం కంటే.. టీ, కాఫీ, స్వీట్లు వంటి వాటిలో మోతాదును క్రమంగా తగ్గించడం ఆరోగ్యకరమైన మార్గం.అయితే ఒక విషయం గుర్తుంచుకోవాలి. బెల్లం, తేనె, ఖర్జూరం, ఎండు ద్రాక్ష వంటి వాటిలోనూ సహజ చక్కెరలు ఉంటాయి. కాబట్టి ఇవి చక్కెరకు ‘షుగర్-ఫ్రీ’ ప్రత్యామ్నాయాలు కావు. కేవలం రుచి, వంట విధానం లేదా తక్కువగా ప్రాసెస్ చేసిన పదార్థాల ఎంపిక కోసమే వీటిని ఉపయోగించాలి. పండుగ వేళ తీపి వంటకాలు చేసుకునేటప్పుడు పరిమాణాన్ని నియంత్రించడం కూడా అంతే ముఖ్యం. చక్కెర ధరలు పెరిగినా.. పండుగ తీపిని మాత్రం తగ్గించాల్సిన అవసరం లేదు. వంటకానికి సరిపోయే ప్రత్యామ్నాయాన్ని ఎంచుకుని, తీపిని పరిమితంగా ఆస్వాదిస్తే సరిపోతుంది. -
ఒంటరిగా భోజనం చేస్తున్నారా?
కుటుంబంతో కలిసి రాత్రి భోజనం చేయడం, సహోద్యోగులతో మధ్యాహ్న భోజనం చేయడం, స్నేహితులతో కలిసి తినడం.. భోజనం పంచుకోవడం సాధారణ సామాజిక కార్యకలాపంగా కనిపిస్తుంది. అయితే కలిసి భోజనం చేయడం వల్ల సామాజిక అనుబంధానికి మించిన ప్రయోజనాలు ఉంటాయా అనే అంశంపై పరిశోధకులు అధ్యయనం చేస్తున్నారు. తరచుగా కలిసి భోజనం చేయడం మెరుగైన భావోద్వేగ శ్రేయస్సుతో సంబంధం కలిగి ఉండొచ్చని పలు అధ్యయనాలు సూచిస్తున్నాయి. తరచూ ఒంటరిగా భోజనం చేయడం డిప్రెషన్, మెదడు ఆరోగ్యంలో మార్పులతో సంబంధం కలిగి ఉన్నట్లు గుర్తించారు.ఈ భావనను కమెన్సాలిటీ అంటారు. అంటే ఇతరులతో కలిసి ఆహారం తింటూ పంచుకోవడం. ఇతరులతో కలిసి కూర్చొని భోజనం చేస్తూ మాట్లాడటం, సంబంధాలను పెంపొందించుకోవడం, ఒంటరితనాన్ని తగ్గించుకోవడం. పరిశోధకులు తెలిపిన వివరాల ప్రకారం.. భోజనం చేసే టేబుల్ చుట్టూ కూర్చోవడం వల్ల మాట్లాడుకోవడానికి, పరస్పరం అనుబంధం పెంచుకోవడానికి, సంబంధాలను బలపరచుకోవడానికి, ఒంటరితనం తగ్గించుకోవడానికి అవకాశం లభిస్తుంది. అయితే ఇప్పటివరకు ఉన్న చాలా ఆధారాలు కేవలం సంబంధాన్ని మాత్రమే చూపిస్తున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంటే ఒంటరిగా భోజనం చేయడం వల్లే డిప్రెషన్, డిమెన్షియా లేదా మెదడులో మార్పులు నేరుగా వస్తాయని నిరూపించలేదు.కలిసి భోజనం చేస్తే మానసిక ఆరోగ్యం కలిసి భోజనం చేయడం మానసిక ఆరోగ్యానికి తోడ్పడవచ్చు. ముఖ్యంగా వృద్ధుల్లో కలిసి భోజనం చేయడం, భావోద్వేగ శ్రేయస్సు మధ్య సంబంధం ఉన్నట్లు పరిశోధనలు గుర్తించాయి. 60 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయసున్న 9,361 మంది మహిళలపై జరిగిన ఒక అధ్యయనంలో, భోజనం సమయంలో టేబుల్ చుట్టూ కూర్చునే వ్యక్తుల సంఖ్యకు డిప్రెషన్ వచ్చే ప్రమాదానికి మధ్య సంబంధం ఉన్నట్లు గుర్తించారు. ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితి, వారు ఒంటరిగా నివసిస్తున్నారా అనే అంశాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత కూడా పరిశోధకులు ఈ సంబంధాన్ని గుర్తించారు.జపాన్లో జరిగిన మరో అధ్యయనం 65 నుంచి 74 ఏళ్ల వయసున్న వ్యక్తులను పరిశీలించింది. కుటుంబంతో కలిసి నివసిస్తున్నా తరచూ ఒంటరిగా భోజనం చేసే వృద్ధుల్లో, ఇతరులతో కలిసి భోజనం చేసే వారితో పోలిస్తే డిప్రెషన్ లక్షణాలు కనిపించే అవకాశం గణనీయంగా ఎక్కువగా ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. కేవలం ఒకరితో కలిసి నివసించడం వల్ల లభించే సామాజిక ప్రయోజనం, నిజంగా కలిసి సమయం గడపడం వల్ల లభించే ప్రయోజనంతో సమానం కాకపోవచ్చని ఈ ఫలితాలు సూచిస్తున్నాయి.మెదడులో ఏం జరుగుతుంది?ఒంటరిగా భోజనం చేయడం దీర్ఘకాలిక మెదడు ఆరోగ్యంతో సంబంధం కలిగి ఉందా అనే అంశాన్ని కూడా శాస్త్రవేత్తలు పరిశీలిస్తున్నారు. 2025లో జపాన్ పరిశోధకులు నిర్వహించిన అధ్యయనంలో, తరచూ ఒంటరిగా భోజనం చేసే వ్యక్తుల్లో జ్ఞానపరమైన విధులకు సంబంధించిన కొన్ని మెదడు ప్రాంతాల్లో తక్కువ మెదడు పరిమాణం ఉన్నట్లు గుర్తించారు. ఇందులో హిప్పోకాంపస్, మధ్య టెంపోరల్ లోబ్ ఉన్నాయి. హిప్పోకాంపస్ అంటే జ్ఞాపకశక్తి, నేర్చుకోవడం వంటి విధుల్లో ముఖ్యమైన మెదడు భాగం.మధ్య టెంపోరల్ లోబ్ అంటే జ్ఞాపకశక్తి, సమాచారాన్ని అర్థం చేసుకోవడం వంటి మెదడు విధుల్లో కీలకంగా పనిచేసే ప్రాంతం.ఆహారం కారణంగా ఈ తేడాల్లో కొంత భాగం వివరించవచ్చని పరిశోధకులు తెలిపారు. ఎందుకంటే ఒంటరిగా భోజనం చేసే వ్యక్తులు తక్కువ పోషక విలువలున్న ఆహారాన్ని తీసుకునే అవకాశం ఎక్కువగా ఉండవచ్చు. అయితే ఆహారం ఈ మొత్తం సంబంధాన్ని వివరించలేకపోయింది.ఇదీ చదవండి: జెన్ ఆల్ఫాతో మోదీ రాఖీ వేడుక.. హై-ఫైవ్లు ఇస్తూ -
నటి సమంత స్ట్రెంగ్త్ ట్రైనింగ్ వర్కౌట్లు..! ఆ టైంలో చేయొచ్చా?
మా ఇంటి బంగారం మూవీతో మంచి హిట్ అందుకున్న నటి సమంత ప్రెగ్నెన్సీ సమయంలో కూడా క్రమం తప్పకుండా జిమ్కి వెళ్తూ అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. అలాగే అనేకమంది సెలబ్రిటీలు గర్భధారణ అనేది రెస్ట్ తీసుకునే అనారోగ్యం లాంటిది కాదని, ఈ దశలో కూడా చురుగ్గా ఉండొచ్చని నిరూపిస్తున్నారు. ఆ కోవలోకి తాజాగా సమంత కూడా చేరిపోయారు. ఆమె జిమ్కి వెళ్లడం వరకు మాత్రమే కాదు, వెయిట్లిఫ్టింగ్, స్ట్రెంగ్త్ ట్రైనింగ్ వంటి వర్కౌట్లు చేసేస్తోంది. పైగా అందుకు సంబంధించిన వీడియోలు కూడా అభిమానులతో పంచుకున్నారామె. మొదటి వీడియోలో కేబుల్ రో వ్యాయామం చేసింది సమంత. దానికి క్యాప్షన్గా ఈ రోజు భిన్నమైన వర్కౌట్ చేశా. అయితే ఎక్కువగా కష్టపడకుండా, శ్రద్ధగా వినడం నేర్చుకున్నా అంటూ రాసింది. రెండొవ వీడియోలు బరువులు ఎత్తుతూ కనపించింది సమంత. ఈ సమయంలో ఎంత మేర ఎంతగలరో అంతే పైకి ఎత్తండి అని క్యాప్షన్ పెట్టింది. అలాగే తదుపరి పోస్ట్ల్లో కొన్ని రోజులు బలంగా ఉన్నట్లు భావిస్తా, అందుకే వ్యాయామాలు సవరించుకుంటానని పేర్కొంది. పైగా యోగా మ్యాట్పై పడుకుని చేసే వర్కౌట్లే కొన్ని రోజులు హాయిగా అనిపిస్తాయని సరదాగా వ్యాఖ్యానించింది. తన జీవితాంతం జిమ్లో మరింతగా చేయడానికి తన పరిమితులను అధిగమించడానికి శిక్షణ తీసుకున్నానని చెప్పుకొచ్చింది వీడియోలో. అయితే ప్రెగ్నెన్సీ దశలో శరీరాన్ని గౌరవించడం. శరీరం మాట వినడం వంటివి నేర్చుకున్నానని పోస్ట్లో వెల్లడించింది. అలాగే ఈ సమయంలో లక్ష్యాలు భిన్నంగా ఉంటాయి. ఎందుకంటే ఇప్పటి వరకు చేసే అత్యంత బలమైన పని అమ్మ అవ్వడమేనని భావిస్తున్నానంటూ పోస్ట్ని ముంగించింది. అలాగే తన శక్తి శిక్షణా వ్యాయామాలు గురించి మాట్లాడుతూ..ఇవన్నీ తాను చాలా ఏళ్లుగా నిపుణుల పర్యవేక్షణలో శిక్షణ తీసుకుని మరి చేస్తున్నవని, అలాగే గర్భధారణకు అనుగుణంగా సవరించినవేనని కూడా ఆమె వెల్లడించింది. View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) అలాగే తన ట్రైనర్స్ ప్రతిష్టాత్మక సంస్థల్లో సర్టిఫికేట్ పొందినవారని, పైగా తన ఆరోగ్యానికి, గర్భధారణకు అనుగుణంగా నిర్ణయించిన వ్యాయామాలని కూడా పేర్కోంది. ఈ క్రమంలో అందరూ తప్పక తెలుసుకోవాల్సింది ఏంటంటే.. ప్రతి గర్భం భిన్నంగా ఉంటుందని, అందువల్ల ఇతర ప్రెగ్నెంట్ మహిళలెవ్వరూ తన వర్కౌట్లను అనుకరించొద్దని హెచ్చరించింది సమంత. తనలా వ్యాయామాలు చేయాలనుకుంటే వైద్యుడి సలహా సూచనల మేరకు చేయాలని విజ్ఞప్తి చేసిందామె. కాగా, సమంత రూత్ ప్రభు ఈ ఏడాది జూన్ మా ఇంటి బంగారం సక్సెస్ మీట్లో తన గర్భధారణ విషయాన్ని ప్రకటించారు. అందుకోసమే కొంతకాలం షూటింగ్లకు విరామం ఇస్తున్నానని కూడా పేర్కొంది. View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) (చదవండి: ఒకప్పుడు బాలీవుడ్ పనిచేసేదామె..సడెన్గా 29 ఏళ్లకే రిటైర్మెంట్! ఎందుకో తెలుసా..) -
63 కేజీల నుంచి 55 కేజీల బరువుకు..!నిలకడగా ఆ ఎనిమిది అలవాట్లు..
బరువు తగ్గాలంటే స్ట్రిక్ట్ డైట్, కఠినమైన వర్కౌట్లుతోనే సాధ్యం అనే అభిప్రాయాన్ని తుడిచిపెట్టేయండని అంటోంది ఈ కంటెంట్ క్రియేటర్ శివాని అగర్వాల్. రోజువారి అలవాటల్లో జస్ట్ చిన్న చిన్ని స్థిరమైన మార్పులతో ఈజీగా బరువు తగ్గొచ్చని నమ్మకంగా చెబుతోంది. తాను ఎనిమిది కేజీల బరువుని ఎనిమిది అలవాట్లతో తగ్గించానంటూ తన అనుభవాన్ని పంచుకున్నారామె. అదేంటో చూద్దామా..!.కంటెంట్ క్రియేటర్ శివాని అగర్వాల్ తన జీవనశైలిని పూర్తిగా మార్చుకోకుండానే బరువు తగ్గేందుకు ఉపయోగపడిన ఎనిమిది అవాట్ల గురించి మాట్లాడారు. తాను కేవలం ఆహారం, వ్యాయామాల పట్ల ఉన్న దృక్పథాన్నే మార్చుకున్నట్లు వెల్లడించారు. అయితే మార్పులు చేసిన వాటిని నిలకడగా అనుసరించానని అన్నారు. మరి ఆమె వెయిట్లాస్ జర్నీలో ఎనిమిది కేజీల బరువుకి చెక్పెట్టేందుకు హెల్ప్ అయిన ఎనిమిది అలవాట్లు లేక మార్పులు ఏంటో చూద్దామా..!జంక్ ఫుడ్ను పూర్తిగా మానేయవద్దుఏదైనా సరే పూర్తిగా మానేయొద్దని అంటోంది. నియంత్రించడం వల్ల తెలియకుండానే ఎక్కువ తినేస్తామని అన్నారు. తినాలి అనిపించినప్పుడూ జాగురకతతో హాయిగా ఆస్వాదించేదాన్ని అని అంటోంది. వాస్తవికంగా సాధ్యమయ్యే అవాట్లతోనే బరువు తగ్గడం అనేది జరగుతుందని చెబుతోంది ఈ ఇన్ఫ్లుయెన్సర్.ప్రతిరోజూ వాకింగ్..ఎల్లప్పుడూ పదివేల అడుగులు నడవాలనే ఒత్తిడి పెట్టుకోకూడదని, ప్రతి రోజు నడిచేలా చూస్తే చాలని అంటోంది. ఎందుకంటే తాను కొన్ని రోజులు తక్కువగానూ మరికొన్ని రోజులు మెరుగ్గా నడిచినట్లు వెల్లడించింది. అది క్రమంగా కొవ్వు తగ్గడానికి ఉపకరించిందని అంటోంది.రాత్రి భోజనంలో కార్బోహైడ్రేట్లు తగ్గించడంరాత్రిపూట అన్నం, రోటీ తీసుకోవడం తగ్గించి..గుడ్లు, పనీర్, పప్పు, చికెన్ వంటి ఆహారాల ద్వారా ప్రోటీన్ చేర్చుకున్నట్లు తెలిపింది.నెమ్మదిగా తినడం ప్రారంభించానుగతంలో తాను నిమిషాల్లోనే ఆహారం ముగించేసేదాన్ని అని చెప్పింది. అయితే నిధానంగా నెమ్మదిగా తినడం వల్ల కడుపు నిండిన అనుభూతిని ఆస్వాదించొచ్చని అంటోంది. ఎందుకంటే..కడుపు నిండిన సంకేతాలను మెదడుకు పంపడానికి సుమారు 20 నిమిషాలపైనే పడుతుంది.ప్రతి భోజనానికి ముందు నీళ్ళుఆమె భోజనానికి ముందు ఒక గ్లాసు నీళ్ళు తాగడాన్ని అలవాటు చేసుకుంది. ఈ చిన్న మార్పు, తినే ఆహార పరిమాణాన్ని సమర్థవంతంగా నియంత్రించుకోవడానికి సహాయపడుతుందని చెబుతోంది. ప్రతిరోజూ బరువు చూడొద్దు..శివాని ప్రతిరోజూ బరువు చూసుకోవడం మానేసినట్లు తెలిపింది. ఎందుకంటే అది మన మానసిక స్థితిపై ప్రతికూల ప్రభావం చూపుతుందని అంటోంది.నిద్రవేళలను సరిచేసుకోవడంబరువు తగ్గాలనుకునే వారికి తగిన నిద్ర అత్యంత ముఖ్యమని నొక్కి చెబుతోంది. సరిగ్గా నిద్రపోకపోవడం వల్ల మన జీర్ణవ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపి ఆకలి కోరికలపై నియంత్రణ కోల్పోయే ప్రమాదం ఉందని అంటోందివాయిదాకు అవకాశం ఇవ్వకుండా..అయితే తినాలనిపించిన వాటిని దూరం పెట్టేలా వాయిదా వేయకుండా..ఒకవేళ్ల స్వీట్స్, లేదా జంక్ఫుడ్ లాంటి అనారోగ్యకరమైన అలవాట్లపై మనసు లాగితే..అయ్యే దూరం చేసుకున్నాననే భావం మనుసులో రాకుండా..ధైర్యంగా తినేసి..ముందుకు సాగిపోవడం నేర్చుకోవడం మంచిదని చెబుతోంది. ఎందుకంటే అది బాధకరమైన వెయిట్లాస్ జర్నీగా మారదని అంటోంది. ఇక్కడ శివాని చెప్పేది ఆరోగ్యకరమైన అలవాట్లనే హాయిగా తెలివిగా చేస్తే.. బరువు తగ్గడం కూడా ఒక ఎంజాయ్మెంట్గా మారుతుందని చెబుతోందామె. ఇంకెందుకు ఆలస్యం ప్రయత్నించి చూడండి మరి..!.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: Weight Loss Tips: జస్ట్ మూడు నెలల్లో 20 కేజీల బరువు..! ఐతే ఆహారంలో..) -
ఆస్బెస్టాస్తో ఇంత ప్రమాదమా? నిపుణులు ఏం చెబుతున్నారంటే?
ఆస్బెస్టాస్.. ఒకప్పుడు నిర్మాణ రంగంలో విస్తృతంగా ఉపయోగించిన పదార్థం. అయితే దీని సూక్ష్మ నారకణాలను పీల్చడం ఆరోగ్యానికి తీవ్ర ప్రమాదకరమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అసలు ఆస్బెస్టాస్ అంటే ఏమిటి? అది మన శరీరంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? తెలుసుకుందాం..ఆస్బెస్టాస్ అనేది సహజంగా లభించే ఖనిజ సన్నని నారల సమూహం. ఇవి బలంగా ఉండటంతో పాటు వేడిని, మంటను తట్టుకోగలవు. అందుకే గతంలో సిమెంట్ షీట్లు, పైకప్పులు, సీలింగ్ టైల్స్, గోడలు, పైపులు, ఇన్సులేషన్ వంటి నిర్మాణాల్లో వీటిని విస్తృతంగా ఉపయోగించారు.అయితే భవనాలు, కట్టడాలు నిర్మించే లేదా కూల్చివేసే సమయంలో ఆస్బెస్టాస్ పదార్థాలు పగిలినా, రాపిడికి గురైనా.. వాటిలోని సూక్ష్మ నారకణాలు గాలిలో కలిసే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో మనుషులు వాటిని పీల్చితే అవి ఊపిరితిత్తుల్లోకి చేరి అక్కడే ఉండిపోవచ్చు. దీంతో దీర్ఘకాలంలో ఆస్బెస్టోసిస్, ఊపిరితిత్తుల క్యాన్సర్, మెసోథెలియోమా వంటి తీవ్రమైన వ్యాధుల ముప్పు పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.మెసోథెలియోమా అనేది ఆస్బెస్టాస్తో ముడిపడి ఉన్న అరుదైన క్యాన్సర్. ముఖ్యంగా ఊపిరితిత్తులను కప్పి ఉండే సన్నని పొరల్లో ఇది ఏర్పడుతుంది. దీని ప్రమాదం ఏమిటంటే.. ఒక వ్యక్తి ఆస్బెస్టాస్కు గురైన వెంటనే ఈ వ్యాధి లక్షణాలు బయటపడకపోవచ్చు. అయితే సంవత్సరాలు గడుస్తున్నాకొద్ది ఈ వ్యాధి తీవ్రత పెరిగి, ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బందులు వంటి సమస్యలు ఏర్పడవచ్చు. ఆస్బెస్టాస్ను గతంలో సిమెంట్ నిర్మాణ సామగ్రి, రూఫింగ్ షీట్లు వంటి వాటిలో విస్తృతంగా ఉపయోగించేవారు. ప్రస్తుతం అనేక దేశాల్లో దీని వినియోగంపై నిషేధాలు, కఠినమైన ఆంక్షలు ఉన్నాయి. అన్ని రకాల ఆస్బెస్టాస్లు క్యాన్సర్కు కారణమయ్యే పదార్థాలేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) హెచ్చరిస్తోంది.అయితే ఆస్బెస్టాస్ ఖనిజ సూక్ష్మకణాలు ఎక్కువగా పాత పాఠశాలలు, పాడుబడ్డ ఇళ్లు, కార్యాలయాలు, ఫ్యాక్టరీలు వంటి పాత నిర్మాణాల్లో ఉండే అవకాశం ఉంది. ఆస్బెస్టాస్ పదార్థాలు దెబ్బతినకుండా ఉన్నంతవరకు వెంటనే ప్రమాదం ఉండకపోవచ్చని నిపుణులు చెబుతున్నారు. అయితే పాడుబడ్డ పాత నిర్మాణాల్లోని అనుమానాస్పద పదార్థాలను స్వయంగా పగలగొట్టడం, డ్రిల్ చేయడం లేదా తొలగించడం చేయకూడదు.ముఖ్యంగా ఆస్బెస్టాస్ ఉందని చూసి గుర్తించడం సాధ్యం కాకపోవచ్చు. అయితే అలాంటి పదార్థాలు కనిపిస్తే వాటిని తాకకుండా సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. -
జస్ట్ మూడు నెలల్లో 20 కేజీల బరువు..! ఐతే ఆహారంలో..
బరువు తగ్గడం అంటే అత్యంత కష్టమైన పని కాదని..సునాయాసం ఎంజాయ్ చేస్తే తగ్గొచ్చని చూపిస్తున్నారు పలువురు. అందుకు క్రమశిక్షణ, నిలకడ తోపాటు ఆహారంపై మంచి స్పృహ కూడా కలిగి ఉండటం అత్యంత ప్రధానం. అచ్చం అలానే తూచా తప్పకుండా అనుసరించి జస్ట్ మూడు నెలల్లో కిలోలు కొద్దీ బరువు తగ్గి అందర్నీ ఆశ్చర్యపర్చింది ఈ ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్. ఆమె బరువుని తగ్గించుకోవడంలో హెల్ప్ అయిన ఫిట్నెస్ మంత్ర ఏంటో సవివరంగా చూద్దామా..!.ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ జ్యోతి ఉపాధ్యాయ్ ఒక సాధారణ ఫిట్నెస్ మంత్రాని అనుసరించినట్లు వెల్లడించింది. అదే ఆమెకు మూడు నెలల్లో 20 కిలోలు పైనే తగ్గడానికి సహాయపడినట్లు పేర్కొంది. తాను క్రమం తప్పని వ్యాయామం, ఇంట్లో చేసిన సాధారణ భోజనం తదితరాలన్నింటిని నిలకడగా చేయడం వంటి వాటిపై దృష్టిపెట్టినట్లు తెలిపింది. అంతేగాదు భారతీయ ఆహారంలో సులభంగా లభించే, అత్యంత సుపరిచితమైన పదార్థాలనే తన డైట్లో చేర్చుకున్నట్లు వెల్లడించింది. అలాగే తాను వ్యాయామం చేసేముందు తప్పనిసరిగా స్వెట్ బెల్ట్ ధరిస్తానని తెలిపింది. అలాగే తన తాజా వర్కౌట్లలో 95 కేజీల డెడ్లిఫ్ట్ను కూడా పూర్తి చేసినట్లు పేర్కొంది. క్రమం తప్పని శిక్షణతో తన బలం నెమ్మదిగా మెరుగుపడుతోందని అంటోంది. ఇక ఆహారం విషయానికొస్తే..ఎండుద్రాక్ష, ఓట్స్, ఇంట్లోనే తయారుచేసే పనీర్ తీసుకుంటానని చెప్పుకొచ్చింది. అలాగే మధ్యాహ్న భోజనంలో రోటీలు, పెరుగు, కూరగాయలు, సలాడ్, పనీర్ కూర, రాత్రి భోజనంలో తేలికగా ఉండేలా బొప్పాయి మాత్రమే తీసుకుంటానని పేర్కొంది.ఇక్కడ తనకు 20 కేజీల బరువు తగ్గడం అనేది క్రమం తప్పని వ్యాయామాలు, నియంత్రిత ఆహారం, నిలకడగా పాటించే దినచర్యల వల్లే సాధ్యమైందని అంటోంది. తక్కువ కేలరీలు తీసుకుంటూ..శారీరకంగా చురుకుగా ఉన్నప్పుడే బరువు తగ్గడం సులభమవుతుందని నొక్కి చెబుతోంది. ముఖ్యంగా తగినంత నీరు తాగడం, పీచుపదార్థాలు అధికంగా ఉండే ఆహారాలు ఎక్కువగా తీసుకోవడం వంటివి బరువు తగ్గడానికి ఎంతగానో ఉపకరిస్తాయని చెబుతోందామె. చివరగా వెయిట్లాస్ జర్నీలో సమతుల్య ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామాలు, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లే సరైనవని నొక్కి చెప్పింది ఇన్ఫ్లుయెన్సర్ జ్యోతి. View this post on Instagram A post shared by ज्योति🖤 (@jyotii_upadhyay9)గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: తొలి అడుగుల నుంచి.. ఫస్ట్ ఫ్లైట్ జర్నీ వరకు..! కుమార్తె భావోద్వేగ పోస్ట్ -
కళ్లలోంచి తొంగిచూస్తే గుండె కనిపిస్తుందా?
గుండెల్లో ఏముందో కళ్లలో తెలుస్తుంది.... అంటూ ఏదో తెలుగు సినిమా పాట ఉంది. కవుల ఊహలు ఎలా నిజమవుతాయో ఈ పాట పల్లవితో తెలుస్తుంది. ఎందుకంటే... కళ్లతో అన్నీ చూడవచ్చు. అంతేకాదు... కళ్ల సహాయంతో గుండెనీ చూడవచ్చని కొన్ని తాజా పరిశోధన ఫలితాలూ చెబుతున్నాయి.అమెరికాలోని నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ హెల్త్ (ఎన్ఐహెచ్)కు చెందిన నేషనల్ హార్ట్, లంగ్ అండ్ బ్లడ్ ఇన్స్టిట్యూట్ (ఎన్హెచ్ఎల్బీఐ) వర్క్షాప్కు చెందిన ‘నేచర్ రివ్యూస్ కార్డియాలజీ రోడ్మ్యాప్’ ప్రకారం రెటీనాలో కనిపించే బయోమార్కర్స్ సహాయంతో కరోనరీ హార్ట్ డిసీజ్, హార్ట్ ఫెయిల్యూర్స్ వంటి పరిస్థితులు, స్ట్రోక్ వంటి వాటి విషయంలో ఒక అంచనాకు రావడం సాధ్యమని తెలుస్తోంది. కానీ ఈ ప్రక్రియ ఇంకా పూర్తిగా గుండె పరీక్షలకు ఓ రొటీన్ ప్రత్యామ్నాయంగా మాత్రం లేదు. అయితే భవిష్యత్తులో కంటి సహాయంతో గుండె ఆరోగ్యాన్ని అంచనా వేయడానికి కన్ను ఓ గవాక్షంగా మరే అవకాశం ఉంటుందంటున్నారు పరిశోధకులు.ఒక్కసారి ఓ సీన్ ఊహిద్దాం. ఒక వ్యక్తి తన గుండె పరీక్ష కోసం గుండె వైద్య నిపుణుడి (కార్డియాలజిస్ట్) దగ్గరికి వెళ్తాడు. ఆ కార్డియాలజిస్ట్ మాత్రం ముందుగా ఒకసారి కంటివైద్య నిపుణుడి (ఆఫ్తాల్మాలజిస్ట్) దగ్గరికి వెళ్లి సంప్రదించమని అంటాడు. అలాగే ఒక వ్యక్తి కంటి పరీక్ష కోసం ఆఫ్తాల్మాలజిస్ట్ దగ్గరికి వెళ్లినప్పుడు... రెటీనాలోని రక్తనాళాల్లో కొన్ని మార్పులు చూసి ఆ కంటి వైద్యనిపుణుడు కూడా ఒకసారి కార్డియాలజిస్ట్ను కలవమంటూ సూచించవచ్చు కూడా. ఊహకు అందే విషయమేనా? ఎందుకంటే... కంటి పరీక్ష కూడా గుండె ఆరోగ్య అంచనాల్లో ఒక భాగమయ్యే రోజు రావచ్చంటూ చెబుతున్నాయి వైద్య వర్గాలు. అది ఎందుకు, ఎలా జరుగుతుందో ఇప్పుడు చూద్దాం.కంటి వెనుక భాగంలో ఉండే రెటీనా మన శరీరంలోని అత్యంత సూక్ష్మమైన రక్తనాళాలను ప్రత్యక్షంగా చూడగలిగే కీలకమైన ప్రదేశం. అదీ పెద్ద కోత లేకుండా, ఇంజెక్షన్ వంటి పరికరాలతో రక్తాన్ని లాగకుండా, దేహంలోకి ఎలాంటి పరికరాన్నీ పంపకుండానే ఈ పరీక్షలు సాధ్యం. అందుకే రెటీనాను కొందరు పరిశోధకులు ‘గుండె తాలూకు కిటికీ’గా చూస్తున్నారు. ఇంగ్లిష్లో చె΄్పాలంటే ‘ఎ విండో టు ద బాడీస్ వాస్క్యులార్ హెల్త్’ అంటూ చెబుతున్నారు.కంట్లో డాక్టర్ ఏం చూస్తారంటే...రెటీనాను పరిశీలించే డాక్టర్లు కేవలం ‘చూపు బాగుందా?’ అని మాత్రమే కాకుండా చాలా అంశాలు పరిశీలిస్తారు. ఉదాహరణకు... రక్తనాళాలకు సంబంధించి...- వాటి వెడల్పు / వ్యాసం- ఏ మేరకు సన్నబడ్డాయి- మెలికలు- శాఖలుగా విడిపోయిన తీరు (బ్రాచింగ్ ప్యాటర్న్)- ధమని – సిరల (ఆర్టరీ వీన్) సంబంధం- కనీకనిపంచకుండా సూక్ష్మస్థాయిలో అయ్యే రక్తస్రావాలు- రెటీనాకు సంబంధించిన ఇతర మార్పులేవైనా ఉన్నాయా... లాంటి అనేక విషయాలను పరిశీలిస్తారు. ప్రస్తుతం జరిగిన పరిశోధనల్లో బాధితుల్లో అంటే... డయాబెటిస్, హైబీపీ, కరొనరీ ఆర్టరీ డిసీజ్, హార్ట్ ఫెయిల్యూర్, పక్షవాతం వంటి జబ్బులు వచ్చినవారిలో రెటినాకు సంబంధించిన రక్తనాళాల్లోనూ మార్పులు కనిపించాయి. అంటే... దీన్ని బట్టి తెలిసేదేమిటంటే... కంటి వెనకాల ఉండే అతి చిన్న రక్తనాళాలు దేహంలో ఉన్న గుండె తదితర రక్తనాళాల్లో వచ్చిన మార్పులను సూచిస్తూ ఒక ‘రివ్యూ’ లాంటివి ఇవ్వగలవని తెలుస్తోంది.అసలు కంటికీ గుండెకీ సంబంధం ఏమిటి?గుండె రక్తాన్ని పంపుతుంది. ఆ రక్తం శరీరమంతా ప్రయాణిస్తుంది. మెదడు, మూత్రపిండాలు, గుండె, కాళ్లు... ఇలా దేహంలోని అన్ని చోట్లా రక్తనాళాలు ఓ నెట్వర్క్లా అల్లుకుపోయి ఉంటాయి. అలాగే కంటి వెనుక ఉండే రెటీనాలోనూ కూడా అతి సూక్ష్మమైన ధమనులూ, సిరలూ, వెంట్రుకలంత సన్నగా ఉండే క్యాపిల్లరీస్ ఉంటాయి. దేహంలోని రక్తనాళ వ్యవస్థలో జరిగే కొన్ని మార్పుల ప్రభావం రెటీనాలోని అతి సన్నటి రక్తనాళాల్లో ప్రతిబింబించే అవకాశముందన్నది పరిశీలకుల భావన.అంటే... బ్రాడ్గా చె΄్పాలంటే... గుండెలోని పెద్ద రక్తనాళాల్లో ఏం జరుగుతుందనేది... రెటీనాలో ఉండే అతి సన్నటి ధమనులూ, సిరలూ, క్యాపిల్లరీలలో తెలియవచ్చన్నది వైద్యపరిశోధకుల మాట. గుండె పెద్ద రక్తనాళాల్లో ఏం జరుగుతుందన్న విషయాలు కంట్లోని చిన్న రక్తనాళాల్లో ఓ మినియేచర్లా కనిపించే అవకాశముంటుందన్నమాట. మరీ ముఖ్యంగా డయాబెటిస్, హైపర్టెన్షన్ లాంటి వ్యాధులున్నవాళ్లలో గుండెకు జరిగే నష్టాలూ, ఒనగూరే అనర్థాలను వైద్యపరిశోధకులు చాలాకాలంగానే గమనిస్తున్నారు.మరి... అధిక రక్తపోటు కంట్లో ఎలా కనిపిస్తుంది?ఓ వ్యక్తిలో రక్తపోటు (బీపీ) చాలా ఎక్కువగా ఉందని అనుకుందాం. దాంతో అతడి రక్తనాళాల గోడలపై నిరంతరం ఎక్కువ ఒత్తిడి పడుతుంటుంది. ఫలితంగా అతడి రెటీనాకు సంబంధించిన రక్తనాళాల్లో (రెటినల్ వెసెల్స్లో) మార్పులు రావచ్చు. ఇలా జరగడంతో వచ్చిన మార్పుల తాలూకు దుష్ప్రభావాలను ‘హైపర్టెన్సివ్ రెటినోపతి’ అంటారు. అందుకే కొన్నిసార్లు కంటి పరీక్షలో కనిపించే రెటినల్ మార్పుల ద్వారా ఒక వ్యక్తికి హైబీపీ ఉండవచ్చనే ఆధారం దొరకవచ్చు.ఇక్కడ బాగా నైపుణ్యం ఉన్న ఓ కంటి డాక్టర్... తన పేషెంట్కు హైబీపీ ఉందనే విషయాన్ని కంట్లోకి చూసి చెప్పగలడు. అంటే... ‘బీపీ మెషిన్ను చేతికి కడితేగానీ బీపీ తెలియదు... కానీ... ఏ మెషిన్నూ కట్టకుండానే... కంట్లోకి తొంగిచూసేసి డాక్టర్లు బీపీని కనిపెట్టవచ్చు’. కాకపోతే... ఇలా చూసినంతమాత్రానే ఓ పేషెంట్కు హైబీపీ ఉందని కంటి డాక్టర్ నిర్ధారణ చేయడు. ఆ అంశాన్ని ఒక క్లూ గా పరిగణించి, మళ్లీ తగిన పరీక్షలు చేశాకే పేషెంట్కు హైబీపీ ఉందని డాక్టర్లు నిర్ధారణ చేస్తారు.గుండె జబ్బు ఉన్నవాళ్ల కంట్లో ఏమి కనిపించవచ్చు?ఇప్పటికి కంట్లోకి చూడటం ద్వారా...- రెటినల్ వాస్క్యులార్ మార్పులతో – హైబీపీ నీ - డయాబెటిక్ రెటినల్ మార్పులతో – డయాబెటిస్నూ - కొన్ని రెటినల్ మైక్రో వ్యాస్క్యులార్ ప్యాటర్న్స్తో – కరోనరీ ఆర్టరీ డిసీజ్నూ- రెటినల్ వాస్క్యులార్ మార్పులతో – హార్ట్ ఫెయిల్యూర్నూ- రెటినల్ మైక్రో వాస్క్యులార్ అబ్నార్మాలిటీస్తో – పక్షవాతం (స్ట్రోక్)... వంటి అంశాలను గుర్తుపట్టినంత మాత్రాన ‘మీ కంట్లో ఈ తరహా మార్పు ఉంటే మీకు గుండెజబ్బు ఉన్నట్టే’ అని చెప్పడం మాత్రం సరికాదు. కాకపోతే ‘కొన్ని రకాల రెటినల్ మార్పులు కొన్ని అంశాలను సూచిస్తాయి’ అనే క్లూస్ ఆధారంగా భవిష్యత్తులో రాబోయే అనేక గుండె తాలూకు ముప్పులను ముందుగానే పసిగట్టడానికీ లేదా అంచనా వేయడానికి కన్ను ఓ హై–వే అవుతుందని మాత్రం చెప్పవచ్చు.మరి డయాబెటిస్ విషయమో...?మధుమేహం (డయాబెటిస్) విషయంలో కన్ను చెప్పే కథ ఇంకా ఆసక్తికరంగా, బలంగానూ ఉంటుంది. మధుమేహం వల్ల రెటీనాలోని అతి సూక్ష్మమైన రక్తనాళాలు దెబ్బతినడం వల్ల ‘డయాబెటిక్ రెటినోపతి’ అనే వైద్యసమస్య వస్తుందన్న విషయం కొంతమందికి తెలిసినప్పటికీ... చాలామందికి... ముఖ్యంగా పెద్దగా చదువుకోని పల్లెవాసులకూ, అంతగా వైద్యపరిజ్ఞానం లేనివారికి తెలియదు. కాబట్టి ఇలాంటి డయాబెటిస్ బాధితులకు చేసే కంటి పరీక్షల్లో కేవలం ‘కంటి చూపు ఎంత ఉంది?’ అని కాకుండా రక్తనాళాల్లో దీర్ఘకాలంగా ఉన్న అధిక చక్కెర స్థాయులు... కంటిలోని అతి చిన్న సూక్ష్మమైన రక్తనాళాలపై ఏ మేరకు దుష్ప్రభావం చూపాయి అన్న పరీక్ష కూడా! అలా డయాబెటిస్ ప్రభావాన్నీ కంటిలోకి చూసి అంచనా వేస్తారు.శరీరంలో ఎక్కువకాలంగా ఉన్న అధిక రక్తచక్కెర చిన్న రక్తనాళాలను ఎంత ప్రభావితం చేసిందో తెలుసుకునే ఒక ముఖ్యమైన మార్గం కూడా. డయాబెటిస్ అన్నది అతి చిన్న రక్తనాళాలపై ఎలాంటి ప్రభావం చూపిందో తెలుసుకోవడం ద్వారా దేహంలోని పెద్ద రక్తనాళాల ఆరోగ్యం గురించి కూడా మనకు కొన్ని సంకేతాలు ఇస్తుందంటూ గ్రహించగలరు. అందుకే ‘డయాబెటిక్ రెటినోపతీ తాలూకు తీవ్రతకూ... కార్డియోవాస్క్యులార్ సమస్యల తీవ్రతకూ ఉన్న సంబంధంపై కూడా కొందరు అధ్యయనవేత్తలు సునిశితంగా పరిశోధనలు చేస్తున్నారు.ఇప్పుడు... కృత్రిమ మేధ తోడ్పాటు కూడా... ఇప్పటివరకూ రెటీనా తాలూకు రక్తనాళాల చిత్రాలను చూసి డాక్టర్లు విశ్లేషిస్తూ వచ్చారు. అయితే ఇటీవల కృత్రిమ మేధ (ఏఐ) రంగంలోకి వచ్చాక.. అవే ఫోటోలను ఏఐ చేత కూడా విశ్లేషణ చేయిస్తున్నారు. సాధారణ మనుషులుగా డాక్టర్లు కొంత ఓ మేరకు విశ్లేషించగలిగితే... ఏఐకి అప్పటికే లక్షల సంఖ్యలో ఇచ్చిన డేటా అధారంగా అది... వేలాది అతి చిన్న ప్యాటర్న్లను కూడా విశ్లేషించగలదు. ఉదాహరణకు ఏఐ ఆధారంగా...రక్తనాళాలు ఏ మేరకు వెడల్పు అయ్యాయి.అవి ఎంతగా శాఖోపశాఖలుగా విస్తరించాయి (బ్రాంచింగ్ జరిగింది)ఎంతగా మెలికలు /ముడతలు/ఒంపులు తిరిగాయి (టార్టస్ అయ్యాయి)రక్తనాళాల్లోని ఏ ్రపాంతంలో వాటి మందం బాగా పలుచబడింది (వెసెల్ డెన్సిటీ తగ్గింది)... ఇలాంటి అనేక ఫీచర్లను ఏఐ తాలూకు మెషిన్ లెర్నింగ్ మోడల్స్ ద్వారా అవి విశ్లేషించడం మొదలు పెట్టేలా అనేక ఏఐ మోడల్స్ను అభివృద్ధిపరచే పనుల్లో ఇప్పుడు పరిశోధకులు ఉన్నారు.అబ్బురపరిచే విషయాలు అనేకం...2025లో ప్రచురితమైన ఒక వైద్యపరమైన సమీక్ష (స్కోపింగ్ రివ్యూ)లో 21 రెటినల్ అధ్యయనాలను పరిశోధకులు పరిశీలించారు. ఆ పరిశోధనల్లో కొన్ని ఏఐ తాలూకు అధ్యయనాలు చెప్పిన అంశాలివి...పదేళ్లలో ‘అథెరో స్కి›్లరోటిక్ కార్డియోవాస్క్యులార్ డిసీజ్’ అనే గుండెజబ్బు ముప్పు ఎంత ఉండవచ్చో తెలుసుకోవడం.కరొనరీ ఆర్టరీ డిసీజ్ (సీఏడీ) అనే గుండెజబ్బును కనిపెట్టడంభవిష్యత్తులో రాబోయే పెద్ద పెద్ద గుండెజబ్బులను (మేజర్ కార్డియోవాస్క్యులార్)ను ముందుగానే పసిగట్టడం వంటి అంశాలు చాలా ఆశాజనకమైన ఫలితాలు ఇచ్చాయి.ఈ పనిలో చాలా మెరుగైన ఖచ్చితత్వాన్ని చూపించాయి. దాంతో మున్ముందు గుండెజబ్బులను ఇంకా త్వరగా, ఇంకా సమర్థంగా, చాలా ముందుగానే పసిగట్టవచ్చనే ఆశాభావం పెరుగుతోంది. ఈ మేరకు ఇంకా క్లినికల్ ట్రయల్స్, ప్రమాణికాల రూపకల్పన అవసరం. అయితే ఇప్పటికి మాత్రం డాక్టర్లు.. ఆ ఏఐ విశ్లేషణను పూర్తిగా నమ్మకుండా, వాటిపైనే పూర్తిగా ఆధారపడకుండా... మళ్లీ తమవైన పరీక్షలూ, విశ్లేషణల ఆధారంగా అప్పుడు మాత్రమే తుది నిర్ధారణకు వస్తారు/వస్తున్నారు. ఓసీటీఏ అనేది మరో అద్భుతమైన సాంకేతికత...ఓసీటీఏ అనేది... ‘ఆప్టికల్ కొహెరెన్స్ టోమోగ్రఫీ యాంజియోగ్రపీ’ అనే ఇంగ్లిష్ పదాల తాలూకు సంక్షిప్త రూపం. సాధారణంగా ఫండస్ అనే కంటి పరీక్షలో వచ్చే ఫండస్ ఫొటోగ్రాఫ్లో రెటీనా కనిపిస్తుంది. ‘ఆప్టికల కొహెరెన్స్ టోమోగ్రఫీ’లో రెటీనా తాలూకు ΄÷రలను చాలా సూక్ష్మస్థాయిలో చూడటం సాధ్యమవుతుంది. అయితే ‘ఓసీటీఏ’లో రెటీనాలోని అత్యంత సన్నటి రక్తనాళాల్లో జరిగే రక్తప్రసరణ గురించి చాలా సునిశితమైన వివరాలు ఉంటాయి. 2025లోని ఓ అధ్యయనంలో రెటీనాలోని అత్యంత సూక్ష్మ రక్తనాళాలకూ, గుండెజబ్బులకూ (కార్డియో వాస్క్యులార్ డిసీజ్)కూ ఉన్న సంబంధాలను విశ్లేషించడం, సమీక్షించడం చేశారు. ఆ సమీక్షలో తెలిసినదేమిటంటే... భవిష్యత్తులో కంట్లోని అతి సూక్ష్మ రక్తనాళాల మ్యాపింగ్ను బట్టి అవి దేహంలోని గుండె ఆరోగ్యానికి క్లూస్ ఇస్తాయనే కాన్సెప్ట్కు మరింత బలం చేకూరుతుందని అధ్యయనవేత్తలు అంచనా వేస్తున్నారు.గుండె పరీక్షలు వర్సెస్ కంటి సూక్ష్మరక్తనాళాల పరిశీలన...- ఈసీజీ - ఎకో కార్డియోగ్రామ్ - టీఎమ్టీ - సీటీ కరోనరీ యాంజియోగ్రఫీ - కార్డియాక్ ఎమ్మారై - కొన్ని రకాల రక్త పరీక్షలు...ఇలాంటి గుండె తాలూకు వైద్యపరీక్షలన్నీ గుండెను లేదా కార్డియోవాస్క్యులార్ సిస్టమ్ను వేర్వేరు కోణాల్లో పరిశీలించి వేర్వేరు అంశాలను తెలుసుకుంటాయి లేదా గుండె ఆరోగ్యాన్ని అంచనా వేస్తాయి. అయితే రెటీనా మాత్రం తనలోని అత్యంత సూక్ష్మమైన రక్తనాళాల్లో జరిగే రక్తప్రసరణ (మైక్రోసర్క్యులేషన్) ఆధారంగా గుండె తాలూకు అనేక అంశాలను డాక్టర్లకు తెలియపరుస్తుందని చెప్పవచ్చు.దీన్ని బట్టి తెలిసేదేమిటంటే... భవిష్యత్తులో ఎవరైనా ఓ పేషెంట్ తన కళ్లను పరీక్షించుకోడానికి ఓ కంటి డాక్టర్ దగ్గరికి వెళ్తే... ఆయన కంటిని పరీక్షించి, దానికి తగిన చికిత్స ఇవ్వడంతో పాటు... ఆ డాక్టర్ మరో అదనపు సేవనూ అందించడానికి అవకాశముంది. అదేమిటంటే... ‘మీరొకసారి కార్డియాలజిస్ట్ను కలిసి... ఆయన సూచనల మేరకు కొన్ని గుండె పరీక్షలూ చేయించుకొని కార్డియాక్ ఎవాల్యూయేషన్ చేయించుకోండి’’ అని సూచించవచ్చు.చివరగా... ఇప్పటికి ఈ కంటి పరీక్షలన్నవి గుండె పరీక్షకు ప్రత్యామ్నాయం కాదు గానీ... మన కన్ను అనేది గుండె–రక్తనాళా వ్యవస్థలో దాగి ఉన్న కొన్ని సంకేతాలను ముందుగానే చూపించే ‘కిటికీ’ అని మాత్రం చెప్పవచ్చు. అంటే ఒకనాటికి కంటి పరీక్ష అంటే కేవలం చూపును పరీక్షించడం మాత్రమే కాకుండా... మన మొత్తం రక్తనాళాలతో పాటు గుండెనూ, దాన్ని ఆరోగ్యాన్ని అంచనా వేసేందుకూ ఉపయోగపడే అంశమని మాత్రం చెప్పవచ్చు.- డాక్టర్ ఎం.ఎస్.ఎస్. ముఖర్జీ, సీనియర్ కార్డియాలజిస్ట్నిర్వహణ: యాసీన్ -
అది మలబద్ధకమేనా? పిల్లలు ఎందుకు ఆపుకుంటారు ?
మా ఐదేళ్ల బాబుకు రోజూ మలవిసర్జన కావడం లేదు. రెండు మూడు రోజులకు ఒకసారి వెళతాడు. మలవిసర్జనకి వెళ్ళేటప్పుడు చాలా ఇబ్బంది పడుతూ, నొప్పిగా ఉందని ఏడుస్తాడు. ఇంట్లో వాళ్లు పిల్లాడు మొండిగా చేస్తున్నాడంటున్నారు. ఇంకొందరు ఇది మలబద్ధకమే అంటున్నారు. ఏం చేయాలి? – లక్ష్మి, గుంటూరుమీ సందేహం చాలా సహజం. పిల్లలకు మలవిసర్జన సరిగ్గా రాకపోతే తల్లిదండ్రులు ముందుగా ఆందోళన పడేది ఇదే. అయితే ఒక విషయం గుర్తుంచుకోవాలి. రోజూ మలవిసర్జన రాకపోవడం ఒక్కటే మలబద్ధకం కాదు. కొంతమంది పిల్లలకు రోజూ రావచ్చు; మరికొందరికి రెండు రోజులకు ఒకసారి రావచ్చు. మలం మెత్తగా ఉండి, పిల్ల ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తుంటే పెద్దగా ఆందోళన అవసరం లేదు. కానీ మలం చాలా గట్టిగా ఉండటం, మలవిసర్జన చేసేటప్పుడు నొప్పి రావడం, బాగా ఒత్తిడి చేయాల్సి రావడం, మలం పూర్తిగా బయటకు రాకపోవడం, పిల్లలు కావాలనే మలవిసర్జన ఆపుకోవడం వంటి లక్షణాలు ఉంటే మాత్రం మలబద్ధకం గురించి ఆలోచించాలి.పిల్లలుఎందుకు ఆపుకుంటారు?ఇక్కడే చాలామంది తల్లిదండ్రులు పిల్లలను తప్పుగా అర్థం చేసుకుంటారు. పిల్లాడు కావాలనే మలవిసర్జన ఆపుకుంటున్నాడని, మొండితనం చేస్తున్నాడని అనుకుంటారు. కానీ చాలా సందర్భాల్లో అసలు కారణం నొప్పి భయం. ఒకసారి మలం చాలా గట్టిగా వచ్చి నొప్పి కలిగితే, మళ్లీ విసర్జన చేస్తే అదే నొప్పి వస్తుందని పిల్లలు భయపడతారు. అందుకే మలవిసర్జన వచ్చినా ఆపుకుంటాడు. అలా ఆపుకోవడంతో మలం మరింత గట్టిగా మారుతుంది. తర్వాత విసర్జన చేసేటప్పుడు ఇంకా ఎక్కువ నొప్పి వస్తుంది. దీంతో మళ్లీ ఆపుకుంటాడు. ఇలా నొప్పి, భయం, విసర్జన ఆపుకోవడం ఒక చక్రంలా మారుతుంది. అందుకే పిల్లలను తిట్టడం లేదా బలవంతంగా మరుగుదొడ్డిపై కూర్చోబెట్టడం సమస్యను మరింత పెంచవచ్చు. ముందుగా పిల్లవాడు ఎందుకు మలవిసర్జన ఆపుకుంటున్నాడో అర్థం చేసుకోవాలి.పండ్లు పెడితే తగ్గిపోతుందా?పండ్లు, కూరగాయలు, పీచు ఎక్కువగా ఉండే ఆహారం మలబద్ధకం తగ్గడానికి సహాయపడుతుంది. కానీ కేవలం పండ్లు పెట్టడంతోనే సమస్య వెంటనే పూర్తిగా తగ్గిపోతుందని అనుకోకండి. పిల్లల ఆహారంలో పండ్లు, కూరగాయలు, పప్పులు, సంపూర్ణ ధాన్యాలు వంటి పీచు పదార్థాలు ఉండేలా చూడాలి. అలాగే పిల్లలకు సరిపడా నీరు అందాలి. రోజూ కొంతసేపు ఆడుకోవడం, నడవడం వంటి శారీరక కదలికలు కూడా అవసరం.పాలు ఇస్తే బలంగా పెరుగుతారా?పాలు పిల్లల ఎదుగుదలకు అవసరమే. కానీ అవసరానికి మించి పాలు మాత్రమే ఇస్తూ, ఇతర ఆహారాన్ని తగ్గించడం మంచిది కాదు. అలా చేస్తే పీచు పదార్థాలు తక్కువగా తీసుకునే అవకాశం ఉంటుంది. అందుకే పాలు మాత్రమే కాకుండా పండ్లు, కూరగాయలు, పప్పులు, ధాన్యాలతో కూడిన సమతుల ఆహారం ఇవ్వాలి.అలవాటు కూడా ముఖ్యమే?ముఖ్యంగా ఉదయం అల్పాహారం తర్వాత పిల్లలను కొంతసేపు ప్రశాంతంగా మరుగుదొడ్డిపై కూర్చోబెట్టే అలవాటు చేయవచ్చు. తొందరపెట్టకుండా, భయపెట్టకుండా ప్రశాంతంగా ఉండేలా చూడాలి. మరుగుదొడ్డిపై కూర్చున్నప్పుడు పిల్లల కాళ్లు వేలాడకుండా కింద చిన్న పీట ఉంచితే మంచిది. కాళ్లకు సరైన ఆధారం ఉండటం వల్ల మలం సులభంగా బయటకు రావడానికి సహాయపడుతుంది.మలవిసర్జన చేయకపోతే తిట్టాలా? అసలు వద్దు. మలబద్ధకంలో పిల్లలను తిట్టడం, అవమానించడం, బలవంతం చేయడం వల్ల వాళ్లలో మలవిసర్జన చేయడంపై భయం మరింత పెరగవచ్చు. బదులుగా పిల్లలను ప్రోత్సహించాలి. విసర్జన చేయడానికి ప్రయత్నించినా ప్రశంసించాలి. సమస్య గురించి పిల్లలతో ఓపికగా మాట్లాడాలి.మందులు ఇవ్వొచ్చా?అవసర మైనప్పుడు వైద్యుల సూచనతో మందులు ఇవ్వవచ్చు. ముఖ్యంగా మలం చాలా గట్టిగా ఉండి పిల్లలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నప్పుడు లేదా సమస్య పదేపదే వస్తున్నప్పుడు వైద్యుడు తగిన చికిత్స సూచించవచ్చు. అయితే ఇంట్లో పెద్దలకు ఉపయోగించిన మందులను పిల్లలకు స్వయంగా ఇవ్వకండి. అలాగే ఎవరో చెప్పారని మలబద్ధకం మందులు మొదలుపెట్టి, సమస్య తగ్గగానే మీకు మీరే ఆపేయడం కూడా మంచిది కాదు. పిల్లల వయసు, బరువు, సమస్య తీవ్రతను బట్టి చికిత్స మారుతుంది.వైద్యుడిని ఎప్పుడు సంప్రదించాలి?పుట్టినప్పటి నుంచే తీవ్రమైన మలబద్ధకం ఉండటం, పుట్టిన తర్వాత మొదటి రెండు రోజుల్లో మలం రాకపోవడం, పొట్ట ఎక్కువగా ఉబ్బడం, తీవ్రమైన పొట్ట నొప్పి, పదేపదే వాంతులు, మలంలో రక్తం కనిపించడం, బరువు సరిగా పెరగకపోవడం, జ్వరం, పిల్ల చాలా నీరసంగా కనిపించడం లేదా ఇంట్లో తీసుకున్న జాగ్రత్తలతో సమస్య తగ్గకుండా పదేపదే వస్తుండటం వంటి లక్షణాలు ఉంటే పిల్లల వైద్యుడిని సంప్రదించాలి.చివరగా ఒక మాట... పిల్లవాడు విసర్జన ఆపుకుంటున్నాడంటే ముందుగా అతను ఎందుకు అలా చేస్తున్నాడో తెలుసుకోండి. చాలాసార్లు దాని వెనుక మొండితనం కాదు. నొప్పి, ఆ నొప్పిపై భయం ఉంటాయి. ఆ భయాన్ని అర్థం చేసుకోండి. మలబద్ధకాన్ని చిన్న సమస్యగా కాకుండా.. పిల్లల మాట వినండి, కారణాన్ని అర్థం చేసుకోండి, సరైన సమయంలో పరిష్కరించండి.- డా. కె. పవన్ కుమార్, సీనియర్, పీడియాట్రిషియన్, పీడియాట్రిక్ అలర్జిస్ట్, ప్రొఫెసర్ ఆఫ్ పీడియాట్రిక్స్ -
ఆమె అందరిలాంటి బామ్మ కాదు..! 44 ఏళ్ల వయసులో ఎంటెక్, పీహెచ్డీ..
కొందరు వృద్ధాప్యానికి వ్యతిరేకంగా చురుకుగా యువతలా ఉండేలా ప్రయత్నం చేయడం కాదు..ఆ వయసులో చేసే సాహాసాలను చేస్తుంటారు. యువతలా యాక్టివ్గా ఉంటూ అందర్నీ ఆశ్చర్యపరుస్తుంటారు. పైగా భావితరాలకు ఓ గొప్ప స్ఫూర్తిగా నిలుస్తారు. అలాంటి కోవకు చెందిందే ఈ బామ్మ. ఈమె అలాంటి ఇలాంటి బామ్మ కాదు.!.ఆషు జైన్ అనే బామ్మ అందరిలాంటి బామ్మ కాదామె. డెహ్రాడూన్కు చెందిన ముగ్గురు పిల్లల తల్లి. ఆమె ఒకప్పుడు అల్లికలు అల్లుతూ మనవళ్లను చూసుకుంటూ గడిపింది. కానీ ఇప్పుడామె జిమ్లో డెడ్లిఫ్ట్, జుంబా, హైరాక్స్ రేసుల వంటివి సునాయాసంగా చేస్తుంటుందామె. జీవిత చరమాంకంలో ఎలా ఫిట్నెస్తో ఉండొచ్చో చూపిస్తూ..తనలాంటి వాళ్లకు ఆదర్శంగా నిలుస్తోందామె.సాధారణ బామ్మలా కాదు..ఆమె పిల్లలు చదువుకోమని ప్రోత్సహించడంతో 44 ఏళ్ల వయసులో తిరిగి చదువుని ప్రారంబించింది. అలా ఆమె ఎంటెక్, ఐఐటీ ఢిల్లీ నుంచి పీహెచ్డీ పూర్తి చేసింది. అదే క్రమశిక్షణ ఫిట్నెస్లో కూడా సాగింది. ఫిట్నెస్ అంటే కేవలం అందంగా కనిపించడం మాత్రమే కాదు, నొప్పి లేకుండా ట్రెక్కింగ్, నృత్యం చేయడం, మనవరాలిని ఎత్తుకోగలగడం తదితరాలని అంటోంది ఈ బామ్మ. ఇది కేవలం స్వేచ్ఛకు సంబంధించినది కాదని అంటోంది. అంతేగాదు తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో తన నాలుగేళ్ల జిమ్ అలవాట్లను కూడా ఆమె షేర్ చేసుకున్నారు. అందుకు తనకు ఉపకరించిన టిప్స్ను కూడా పంచుకున్నారు. అవేంటంటే..కొత్తగా ఫిట్నెస్ మొదలుపెడితో చిన్నగా ప్రారంభించమని అంటోంది. చిన్నపాటి లక్ష్యాలతో సాగితే..ఆ తర్వాత పునరావృతం చేసే సంఖ్య పెంచుకుంటూ పోవచ్చని అంటోంది. ఇప్పటికే ఉన్న అలవాట్లకు రోజువారీ అలవాట్లను అనుసంధానించండి. ముందుగా ఏ రోజుకారోజు సన్నద్ధమవ్వడం వంటివి చేయాలి. రేపుచేసే వ్యాయామాలకు కావాల్సిన విధంగా రెడీ అయ్యి ఉండటం. నిలకడగా చేసేలా చూసుకోండి ఒక్కోసారి ఆటంకాలు రావడం, క్రమశిక్షణాయుతంగా చేయలేకపోవడం జరిగినా..నిలకడగా కొనసాగేలా కేర్ తీసుకోవాలిపరిపూర్ణంగా చేయడం కంటే నిలకడగా..సాగిపోవడమే అసలైన ఫిట్నెస్ మంత్ర.అలాగే ఆమె హైరాక్స్ కోసం ఎలా సన్నహామవుతుందో కూడా ఇన్స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నారు. ఓర్పుతో కూడిన ఫంక్షనల్ వ్యాయామాలతో కూడిన గ్లోబల్ ఫిట్నెస్ రేస్. ఈ ఏడాది ప్రారంభంలోనే రెండో హైరాక్స్ను పూర్తి చేశారామె. ఆమె రోజు ఉదయం నాలుగు గంటలకు నీరు, ప్రార్థన, నానబెట్టిన నట్స్తో ప్రారంభమవుతుంది. ఆమె శిక్షణలో ప్రత్యేకమైన స్ట్రెంగ్త్, డెడ్లిఫ్ట్, రన్నింగ్, జుంబా, బాల్కనీ వాక్లు ఉంటాయి. కాగా డబ్ల్యూహెచ్ఓ కూడా 18 నుంచి 64 ఏళ్ల వయసుల పెద్దలు 150–300 నిమిషాల మధ్యస్థ-తీవ్రతతో కూడిన ఏరోబిక్ కార్యకలాపాలు లేదా 75–150 నిమిషాల అధిక-తీవ్రతతో కూడిన ఏరోబిక్ కార్యకలాపాలు చేయాలని సూచిస్తోంది. అలాగే వారానికి కనీసం రెండు రోజులు కండరాలను బలోపేతం చేసే ప్రధాన కార్యకలాపాలు చేయాలని సిఫార్సు చేస్తోంది. ఇక్కడ ఆషు బామ్మ దినచర్య కనీస ప్రమాణాలకు మించి పోయింది. నిజంగా ఆమె ‘హైబ్రిడ్ అథ్లెట్ బామ్మ’. View this post on Instagram A post shared by Ashu Jain (@not.just.a.grandma) (చదవండి: మూడుగంటల ట్యాక్సీ ప్రయాణం..ప్రేమకథగా ఎలా మారిందంటే..!) -
విటమిన్ డి సీక్రెట్ బయటపెట్టిన న్యూరాలజిస్ట్
న్యూఢిల్లీ: ఎముకల దృఢత్వానికి, కాల్షియం శోషణకు(గ్రహించే ప్రక్రియకు), రోగనిరోధక శక్తిని పెంచడానికి శరీరానికి విటమిన్-డి ఎంతో అవసరం. శరీరానికి సూర్యరశ్మి తగిలినప్పుడు ఇది సహజంగా ఉత్పత్తి అయినప్పటికీ, ప్రస్తుత రోజుల్లో చాలామందిలో విటమిన్-డి లోపం కనిపిస్తున్నది. దీంతో వైద్యులు సప్లిమెంట్లను సూచిస్తున్నారు.అయితే కేవలం విటమిన్-డి తీసుకోవడమే కాకుండా, శరీరం దానిని సమర్థవంతంగా గ్రహించేలా సరైన సమయంలో తీసుకోవడం కూడా అంతే ముఖ్యం. ఢిల్లీ ఎయిమ్స్ పూర్వ విద్యార్థిని గురుగ్రామ్లోని ‘ది న్యూరోమెడ్ క్లినిక్’ న్యూరాలజిస్ట్ డాక్టర్ ప్రియాంక సెహ్రావత్ విటమిన్-డి సప్లిమెంట్ల శోషణపై కీలక సూచనలు చేశారు. విటమిన్-డి కొవ్వులో కరిగే (ఫ్యాట్-సాల్యుబుల్) విటమిన్ అని డాక్టర్ ప్రియాంక వివరించారు. మన పేగుల్లో కొవ్వు ఉన్నప్పుడే ఇది శరీరానికి గరిష్ఠ స్థాయిలో అందుతుంది. మార్కెట్లో ఇవి క్యాప్సూల్స్, సిరప్స్, డ్రాప్స్, పౌడర్ రూపంలో (సాచెట్స్) లభిస్తాయి.తీసుకోవాల్సిన సరైన సమయంరోజులో ఎక్కువ ఆహారం తీసుకునే సమయంలోనే విటమిన్-డి సప్లిమెంట్లను తీసుకోవాలని డాక్టర్ సూచిస్తున్నారు. అది ఉదయం అల్పాహారం కావొచ్చు లేదా మధ్యాహ్న భోజనం కావొచ్చు. భోజనంలో ఆరోగ్యకరమైన కొవ్వులు, పిండిపదార్థాలు, ప్రోటీన్లు పుష్కలంగా ఉండేలా చూసుకోవాలి.నీళ్లతో కాకుండా పాలతో..పౌడర్ రూపంలో ఉండే విటమిన్-డి సాచెట్లను నీటిలో కలుపుకొని తాగడం మంచిది కాదని ఆమె స్పష్టం చేశారు. పౌడర్ను ఒక గ్లాసు పాలతో కలిపి తీసుకోవాలని సూచించారు. పాలలో ఆరోగ్యకరమైన కొవ్వుతో పాటు కాల్షియం కూడా ఉంటుంది. శరీరంలో తగినంత విటమిన్-డి ఉంటే ఎముకలు కాల్షియాన్ని గ్రహిస్తాయి. అదేవిధంగా కాల్షియం సమృద్ధిగా ఉంటే విటమిన్-డి శోషణ కూడా మెరుగవుతుంది. అందుకే సాచెట్లను పాలతో తీసుకోవడం, భోజనం తర్వాత సప్లిమెంట్లను వేసుకోవడం అత్యుత్తమమని డాక్టర్ వెల్లడించారు.ఇది కూడా చదవండి: కష్టాల్లో కుంభమేళా మోనాలిసా.. ఇప్పుడు ఏం చేస్తున్నదంటే.. -
గర్భిణులూ.. గంటల తరబడి కూర్చోవద్దు! ఎందుకంటే?
గర్భవతులు తాము కూర్చుని ఉండే సమయాన్ని తగ్గించుకుని, శారీరకంగా చురుగ్గా ఉండటం వాళ్ల ఆరోగ్యకరమైన గర్భధారణకు (హెల్దీ ప్రెగ్నెన్సీకి) తోడ్పడుతుందని ఒక అమెరికన్ అధ్యయనంలో తేలింది. ప్రముఖ మెడికల్ జర్నల్ ‘జామా’లో ఈ పరిశోధనల వివరాలు ప్రచురితమయ్యాయి.రోజులో 10 గంటలకు పైగా కూర్చునే గర్భిణులను... అంతకంటే తక్కువగా కూర్చునే గర్భవతులతో పోల్చినప్పుడు.. ఎక్కువ సేపు కూర్చుండేవాళ్లలో ప్రతికూలతలూ, అనర్థాలూ దాదాపు రెండు రెట్లు ఎక్కువగా ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. అవేమిటంటే... గర్భధారణ సమయంలో వచ్చే హైబీపీ, గర్భవతుల్లో వచ్చే మధుమేహం (జెస్టేషనల్ డయాబెటిస్), అధిక రక్తపోటుతో కిడ్నీలు, కాలేయం వంటి కీలక అవయవాలపై ప్రభావం చూపే ప్రీ–ఎక్లాంప్సియా అనే కండిషన్, నెలలు నిండకుండానే ప్రసవం జరిగే ముప్పుతో పాటు తక్కువ బరువుతో బిడ్డ పుట్టడం వంటి ప్రతికూలతలు కనిపించే అవకాశాలున్నట్టు తేలింది.ఇలా చాలాసేపు మందకొడిగా ఉండటం అన్నది తల్లీబిడ్డల ఆరోగ్యానికి ప్రమాదం. అంతేకాదు... భవిష్యత్తులో తల్లీబిడ్డలకు గుండెజబ్బులూ, మధుమేహం, ఊబకాయం వచ్చే ముప్పూ ఎక్కువే. ‘‘గర్భధారణలో ఎక్కువసేపు కూర్చోవడం అంత ఆరోగ్యకరం కాకపోవచ్చని మేం ముందుగానే ఊహించాం. అయితే ఆ ప్రమాదం మేము అనుకున్నదానికంటే ఎక్కువగా ఉండటం ఆశ్చర్యకరం’’ అంటూ ఈ అధ్యయనంలో పాల్గొన్న ప్రధాన పరిశోధకుడొకరు తెలిపారు.శారీరకంగా చురుగ్గా ఉండటానికీ, గర్భధారణ ఫలితాలకూ ఉన్న సంబంధాన్ని తెలుసుకునేందుకు నిర్వహించిన ఈ అధ్యయనం కోసం గర్భం... మొదటి మూడు నెలల్లో ఉన్న 470 మంది మహిళలను పరిశోధకులు ఎంపిక చేశారు. వారి సగటు వయసు 30.7 ఏళ్లు. ఈ అధ్యయనంలో భాగంగా ప్రతి త్రైమాసికంలోనూ మహిళలకు ప్రత్యేక యాక్టివిటీ మానిటర్లను అమర్చారు. అవి... వారు ఎంతసేపు కూర్చుంటున్నారు, ఏ మేరకు చురుగ్గా ఉంటున్నారనే వివరాలను నమోదు చేశాయి.మొత్తమ్మీద వీళ్లలో 174 మంది మహిళలు (37 శాతం) గర్భధారణలో ప్రతికూల ఫలితాలను ఎదుర్కొన్నారు. వీరిలో 86 మందికి (18.3 శాతం) గర్భధారణకు సంబంధించిన అధిక రక్తపోటు సమస్యలు తలెత్తాయి.రోజుకు 10 గంటలు లేదా అంతకంటే ఎక్కువసేపు కూర్చున్న ప్రతి ఐదుగురు మహిళల్లో ఇద్దరికి గర్భధారణలో ప్రతికూల ఫలితాలు కనిపించాయి. అదే రోజుకు సుమారు ఏడు గంటలు కూర్చున్న మహిళల్లో మాత్రం... ప్రతి ఐదుగురిలో ఒకరికే ఇలాంటి సమస్యలు కనిపించాయి.గర్భధారణలో ప్రతికూల ఫలితాల ముప్పును బాగా తగ్గించేందుకు మితంగా వ్యాయామం చేయాలంటూ సాధారణంగా చెబుతున్నప్పటికీ చాలామంది గర్భిణులకు ఇలా వ్యాయామం చేయడం సాధ్యపడకపోవచ్చు.‘‘మా పరిశోధన సూచిస్తున్న విషయం ఏమిటంటే... తప్పనిసరిగా వ్యాయామం చేయాల్సిన అవసరం ఉండకపోవచ్చు. కానీ... తరచూ లేచి, కాసేపు అటూ ఇటూ తిరగడం, కాస్తంత చురుగ్గా కదులుతూ ఉండటమూ గర్భధారణ సమస్యలను నివారించడంలో సహాయపడవచ్చు’’ అంటూ ఓ పరిశోధకుడు తెలిపారు.నిర్వహణ: యాసీన్ -
చేతికి గాయం.. అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు! లేదంటే?
మానవ నాగరికతా వికాసంలో చేతిది చాలా కీలక భూమిక. చెయ్యి, కన్ను ఈ రెండింటి సమన్వయంతోనే అద్భుతాలన్నీ సాకాఅవుతున్నాయి. ఇంతటి కీలకమైన చెయ్యి గురించి అవగాహన అవసరం. నేడు (ఆగష్టు 23న) ‘నేషనల్ హ్యాండ్ సర్జరీ డే’ సందర్భంగా చేతికి అయ్యే గాయాలూ, తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటో చూద్దాం...చేతికి అయ్యే గాయాల్లో... కోసుకుపోవడం, విరగడం (ఫ్రాక్చర్స్), డిస్లొకేషన్స్, సాఫ్ట్ టిష్యూ ఇంజరీస్, తెగిపోవడం, ఇన్ఫెక్షన్స్, కాలడం, పడిపోవడం వల్ల చేతిపై తీవ్ర ఒత్తిడి పడి అయ్యే హై–ప్రెజర్ ఇంజరీస్ ప్రధానమైనవి.చేయి కోసుకుపోయినప్పుడు...పదునైన వస్తువులతో చెయ్యి లోతుగా కోసుకోవడం వల్ల చర్మంతో ΄ాటు టెండన్లు, నరాలు, ధమనులు, సిరలు దెబ్బతినవచ్చు. నొప్పి, రక్తస్రావం, తిమ్మిరి, స్పర్శ తగ్గడం, వేళ్ల కదలిక తగ్గడం, చేతి బలం తగ్గడం, చర్మం ΄ాలిపోయినట్లు కనిపించడం వంటి లక్షణాలు ఉంటే గాయం లోతుగా అయినట్లు భావించాలి. పైపైన కోసుకుపోయినప్పుడు ఆ గాయానికి కుట్లు వేయడం సరిపోవచ్చు. అయితే.. నర్వ్ ఇంజరీ, రక్తనాళం ఇంజరీ లేదా టెండన్ ప్రభావితమైనప్పుడు ప్రత్యేక శస్త్రచికిత్స అవసరం.ఫ్రాక్చర్.. డిస్లొకేషన్లో... చేతి ఎముకలు విరగడం లేదా చేతి ఎముకలూ, జాయింట్స్ డిస్లోకేషన్స్ వల్ల తీవ్రమైన నొప్పి, వాపు, రంగు మారడం, చేతి ఆకృతిలో మార్పు, కదలిక తగ్గడం, తిమ్మిరి ఏర్పడవచ్చు. ఎక్స్రే ద్వారా ఫ్రాక్చర్, డిస్లోకేష¯Œ ను నిర్ధారణ చేస్తారు. గాయాన్ని బట్టి ΄్లాస్టర్ వేయడం, కట్టు కట్టడం స్పి›్లంటింగ్, ఇంటర్నల్ ఫిక్సేషన్ వంటి చికిత్సలు అవసరమవుతాయి.వేళ్లు తెగిపోతే... ఏవైనా ప్రమాదాల్లో చేతివేళ్లు పూర్తిగా తెగిపోవడాన్ని యాంప్యుటేషన్ అంటారు. కొన్ని కేసుల్లో రీ΄్లాంటేషన్ మైక్రోసర్జరీ ద్వారా తెగిపోయిన భాగాన్ని తిరిగి అతికించే అవకాశముంటుంది. ఇలా తెగినప్పుడు పూర్తిగా విడివడిన ఆ భాగాన్ని నేరుగా మంచు (ఐస్)పై ఉంచకూడదు. ఆ భాగాన్ని శుభ్రమైన గాజుగుడ్డలో చుట్టి, నీరుగానీ, మంచుగానీ లేదా తడిగానీ నేరుగా తగలకుండా ΄్లాస్టిక్ కవర్లో ఉంచి, దాన్ని ఆసుపత్రికి తరలించాలి.ఇన్ఫెక్షన్.. చిన్న గాయంతోనూ ముప్పేచిన్న కోత లేదా గాయం ద్వారా బ్యాక్టీరియా ప్రవేశించి చేతిలో ఇన్ఫెక్షన్ ఏర్పడవచ్చు. నొప్పి, గాయం చుట్టూ వేడి, ఎర్రదనం, వాపు, చీము, చేతి కదలిక తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.తీవ్రతను బట్టి చికిత్సవేడిపదార్థాలూ, ఏవైనా రసాయనాలు లేదా విద్యుదాఘాతం వల్ల చేతికి కాలిన గాయాలు (బర్న్స్) కావచ్చు. కాలిన గాయాన్ని చల్లటి నీటితో కలగాలి. నేరుగా ఐస్ పెట్టకూడదు. రసాయనాలతో కాలిన గాయాల్లో ఎక్కువ నీటితో కడగాలి.ముఖ్యంగా ఐదు పరీక్షలు... చేతికైన గాయాన్ని ఐదు అంశాల్లో పరీక్ష చేస్తారు. అవి... 1. బటయకు కనిపించే గాయం పరీక్ష2. నరాల పరీక్ష3. వాస్క్యులర్ పరీక్ష4. కండరాలు–టెండన్ల పరీక్ష5. ఎముకలు–జాయింట్ల పరీక్ష. ఈ అంశాల్లోతేడాలేమైనా ఉన్నాయేమో చూస్తారు.ఎక్స్రే... ఇతర పరీక్షలుముందుగా గాయాన్నినేరుగా పరిశీలించాక అవసరాన్ని బట్టి ఎక్స్రే తీస్తారు. రక్తనాళాలకు గాయాలయ్యాయా వాటి పరిస్థితి ఏమిటన్నది తెలుసుకోడానికి డాప్లర్ లేదా ఇతర వాస్క్యులర్ ఇమేజింగ్ పరీక్షలు అవసరం కావచ్చు.ప్రథమ చికిత్సలో ఇవీ జాగ్రత్తలు...చేతికి గాయమైనప్పుడు శుభ్రమైన గాజుగుడ్డ లేదా మెత్తటి బట్టతో మెల్లగా కొద్ది΄ాటి ఒత్తిడి పెడుతూ రక్తస్రావాన్ని అరికట్టాలి. లోపలికి చొచ్చుకుపోయిన పెద్ద వస్తువులను ఎవరికి వారు తొలగించకూడదు. ఎముక విరగడం లేదా ఎముక /కీలు పక్కకు తొలగడం వంటి కేసుల్లో చేతిని కదలకుండా గుడ్డతోగానీ లేదా స్క్రేప్బ్యాండ్తో చుట్టాలి.ఎముక బయటకు కనిపించే ఓపెన్ ఫ్రాక్చర్లో ఇలా బయటకు కనిపించే ఎముకను తిరిగి లోపలికి నెట్టకుండా శుభ్రమైన గాజుగుడ్డను కప్పి బాధితుడిని ఆసుపత్రికి తరలించాలి. చెయ్యి తాలూకు అవయవమేదైనా పూర్తిగా తెగిపోయినప్పుడు రక్తస్రావాన్ని ఆపేందుకు చేతిని పైకి తిప్పి ఉంచాలి. తెగిపోయిన భాగాన్ని శుభ్రమైన గాజుగుడ్డలో చుట్టి చల్లని పరిస్థితుల్లో భద్రపరచాలి. నేరుగా మంచు తగలకుండా జాగ్రత్త తీసుకోవాలి.చివరగా...తీవ్రమైన రక్తస్రావం, తిమ్మిరి లేదా స్పర్శ కోల్పోవడం, వేళ్లు కదలకపోవడం, బలం తగ్గడం, నొప్పి, వేళ్లు లేదా చేతి భాగం తెగిపోవడం, ఇన్ఫెక్షన్ లక్షణాలు ఉన్నప్పుడు ఆలస్యం చేయకుండా అత్యవసరంగా డాక్టర్ లేదా హ్యాండ్ సర్జన్కు చూపించి తక్షణం వైద్యచికిత్స తీసుకోవడం ముఖ్యం.- డాక్టర్ గోపీనాథ్ భండారి, సీనియర్ కన్సల్టెంట్, మైక్రో హ్యాండ్ సర్జన్నిర్వహణ: యాసీన్ -
మూడేళ్ల నుంచే వేధింపులు, చివరికి 70 కిలోలు తగ్గింది, కానీ నరకం!
అధిక బరువుతో ఆరోగ్య కష్టాలు మాత్రమే కాదు, సామాజికంగా నిందలు అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక అమ్మాయిలైతే ఇక చెప్పేదేముంది. సన్నబడితే జీవితం అన్నంతగా పరిస్థితి మారిపోతుంది. ఇవి చాలదన్నట్టు ఈ పరిస్థితి నుంచి ఎలా బయటపడాలో తెలియక, అనేక మానసిక ఆరోగ్య సమస్యలు కూడా చేరతాయి. అవమానాలు, శారీరక, మానసిక సంఘర్షణను తట్టుకోలేక బేరియాట్రిక్ శస్త్రచికిత్స (Bariatric Surgery) తో శారీరకంగా ఎంతో చిత్రవధ అనుభవించినప్పటికీ, అంత తీవ్ర ఒత్తిడి నుంచి బయట పడి ఒక యువతి ఆసక్తికరమైన వెయిట్ లాస్ జర్నీ గురించి తెలుసుకుందాం.1996లో పుట్టిన నిధి చిన్నతనం నుంబే బొద్దుగా ఉండటంతో మూడేళ్ల వయసు నుంచే వేధింపులు, హింస మొదలయ్యాయి. ఆమెను బాడీనే మొదటగా అందరూ గమనించి కామెంట్స్ చేసేవారు. గేలి చేసేవారు. చివరికి ఆమె ఆత్మవిశ్వాసం దెబ్బతింది. టీనేజ్లో ఎంతో ఉత్సాహంగా ధృడంగా, కల్చరల్గా యాక్టివ్గా ఉండే అమ్మాయి కాస్తా, మౌనంగా, బేలగా మారిపోయింది. 2018లో ఒక క్లినికల్ న్యూట్రిషనిస్ట్ సహాయంతో, సుమారు 35 కిలోల బరువు తగ్గినా, మళ్లీ పాత అలవాట్లతో తగ్గిన బరువంతా మళ్లీ వచ్చేసింది. 2019లో కాలేజీ తరువాత వ్యాపారాన్ని ప్రారంభించినా అది సక్సెస్ కాకపోవడంతో తీవ్రమైన డిప్రెషన్, ఆందోళన చుట్టుముట్టింది. చివరికి ఊరిలోని ఒక సైకియాట్రిస్ట్ను కలిసినపుడు ఆమెకు బోర్డర్లైన్ పర్సనాలిటీ డిజార్డర్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. అటు ఉద్యోగం లేక, ఇటు అనారోగ్యంతో తీవ్రమైన భావోద్వేగాల మధ్య రెండేళ్ల పాటు చికిత్స తీసుకుంది.2022 నాటి, 26 ఏళ్లకే, బరువు 120 కిలోలకు చేరింది. అందరూ సోమరి అని గేలి చేసేవారు తప్పితే ఆ బరువు వెనుకున్న విషయం గురించి ఆలోంచేవారు కాదు. ఇలా ఏళ్ల తరబడి శారీరక, మానసిక వేధింపులు, తీవ్రమైన డిప్రెషన్, ఆందోళన, చికిత్స చేయని మానసిక ఆరోగ్య సమస్యతో జీవిస్తూ, వీటిన నుంచి ఎలా తప్పించుకోవాలో తెలియని అనేక అస్తవ్యస్తమైన ఆహారపు అలవాట్లతో జీవితం దుర్భరంగా మారింది. మానసిక అనారోగ్యం, ఈటింగ్ డిజార్డర్స్తో తిండే ఒక ఆసరాగా (Coping mechanism) మారి పోయింది.ఇదీ చదవండి: 16 ఏళ్లకే 275 కిలోలు బరువు : రెండు నెలల్లో 50 కిలోలు తగ్గాడుబేరియాట్రిక్ సర్జరీ- నరకంసాంప్రదాయ మార్వాడీ కుటుంబానికి చెందిన ఆమె, సన్నబడితేనే వివాహం, ఉద్యోగం, సమాజంలో గుర్తింపు లభిస్తాయని నమ్మింది. బంధువుల్లో ఒకరు సర్జరీ చేయించుకుని పెళ్లి చేసుకోవడం చూసి ఆమె కూడా ఆ దారి ఎంచుకోవాల్సి వచ్చింది. పెళ్లి అవ్వాలంటే బరువు తగ్గాలనే ఒత్తిడి మధ్య బేరియాటిక్ సర్జరీ ద్వారా బరువు తగ్గాలని నిర్ణయించుకుంది.ఎందుకుంటే కఠినమైన డైట్ చేసి, పోషకాహార సహాయంతో అప్పటికే 35 కిలోలు తగ్గినా మళ్లీ 120 కిలోలకు చేరింది. ఇక డైట్లతో పనికాదని అర్థం చేసుకుంది. సర్జరీ తరువాత బరువు తగ్గినప్పటికీ నరకం చూసింది.బేరియాట్రిక్ శస్త్రచికిత్స తర్వాత నిధి అగర్వాల్ ఎదుర్కొన్న తీవ్రమైన శారీరక, మానసిక సవాళ్లు ఎదుర్కొంది. అలాగే సర్జరీకి ముందు తాను వాడుతున్న మానసిక ఆరోగ్య మందులను ఒక్కసారిగా ఆపేయడంతో ఆమె తీవ్ర ఆందోళన, భయానికి గురయ్యారు. సర్జరీ గురించి ఎవరికీ చెప్పకూడదని, వ్యాయామం, ఆహార నియమాల వల్లే బరువు తగ్గినట్లు చెప్పాలని కుటుంబం ఒత్తిడి తీసుకొచ్చింది. 120 కిలోల నుండి 50 కిలోలకు తగ్గిన క్రమంలో ముప్పావు వంతు జుట్టు రాలిపోయింది. నీరసం, కండరాల క్షీణత, ఎసిడిటీ, అల్సర్లు, డంపింగ్ సిండ్రోమ్ లాంటి సమస్యలు. 2025లో గాల్ బ్లాడర్ తొలగింపు సర్జరీ కూడా చేయించు కోవాల్సి వచ్చింది.ఇదీ చదవండి: పెళ్లై మూడేళ్లు, ముత్యాల్లాంటి కవలలు : అల్లుడ్ని కొట్టి చంపేశారుఎట్టకేలకు సానుకూల మార్పులు:120 కిలోల బరువు ఉన్నప్పుడు ఆయాసపడే ఆమె, ఇప్పుడు ఆయాసం లేకుండా సులభంగా మూడు అంతస్తులు ఎక్క కలుగుతోంది. ఆహారంపై నియంత్రణ సాధించి, ఆరోగ్యకర ఆహార అలవాట్లను పెంపొందించు కుంది. 2023లో థెరపిస్ట్ సహాయంతో, 2026 నాటికి న్యూట్రిషనిస్ట్ మార్గదర్శకత్వంలో శారీరక దృఢత్వాన్ని తిరిగి నిర్మించుకుంటూ, తనను తాను ప్రేమించుకుంటూ తన జీవితాన్ని తన చేతుల్లోకి తెచ్చుకుంది.నోట్: మనిషి విలువ, లభించే గౌరవం అనేది శరీరం బరువుపై ఆధారపడి ఉండదు. అయితే అధిక బరువును తగ్గించుకోవడం అనేది నిపుణుల సాయంతో, ఆరోగ్య అంచనాలతో స్థిరంగా సాగాల్సిన ప్రక్రియ. కానీ విపరీతంగా పెరిగిన శారీరక బరువు, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారికి బారియాట్రిక్ సర్జరీ జీవితాన్ని మారుస్తుంది, కానీ అది మానసిక ఆరోగ్య సమస్యలను లేదా ఆలోచనా విధానాన్ని దానంతట అదే మార్చలేదు. దీనికి ఎంతో నిబ్బరం, సహనం, కుటుంబ సభ్యులు తోడ్పాటు ఎంతో అవసరం. సర్జరీ అనేది నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో చివరి మార్గం మాత్రమే అనేది గమనించాలి. -
16 ఏళ్లకే 275 కిలోలు బరువు : రెండు నెలల్లో 50 కిలోలు తగ్గాడు
సాక్షి, న్యూఢిల్లీ: న్యూఢిల్లీకి చెందిన బాలుడు 16 ఏళ్లకే సుమారు 275 కిలోల తీవ్రమైన బరువు పెరిగాడు. అతడి బాడీ మాస్ ఇండెక్ (BMI) దాదాపు 100. దీంతో అనేక ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టాయి. దీంతో ఢిల్లీలోని 'సర్ గంగారామ్ ఆస్పత్రి' వైద్యులు ఆయనకు విజయవంతంగా బేరియాట్రిక్ శస్త్రచికిత్స (ల్యాప్రోస్కోపిక్ స్లీవ్ గ్యాస్ట్రెక్టోమీ) నిర్వహించి ప్రాణం పోశారు.సాధారణ పిల్లలు అటూ ఇటూ పరుగెత్తుతూ, నవ్వుతూ, చదువుకోవాల్సిన వయసులో, ఈ పదహారేళ్ల బాలుడు తన సొంత ఇంటి నాలుగు గోడలకే పరిమితమయ్యాడు. అధిక బరువు కారణంగా అతను తన కదలికలన్నింటినీ కోల్పోయాడు. తీవ్రమైన ఆయాసం ,చర్మ ఇన్ఫెక్షన్ కారణంగా చివరకు అతడిని ఆసుపత్రికి తరలించడం ఒక సవాలుగా మారింది. సాధారణ కారులో గానీ, అంబులెన్స్లో గానీ తరలించడం సాధ్యపడలేదు. చివరకు, అతడిని ఢిల్లీలోని సర్ గంగా రామ్ ఆసుపత్రికి 'మెటాడోర్' అనే సరుకు రవాణా వాహనంలో తీసుకువెళ్లారంటేనే అతని పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.దీనికి తోడు బాలుడు శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు, నిద్రలో శ్వాస ఆడకపోవడం (స్లీప్ ఆప్నియా), తీవ్రమైన చర్మ ఇన్ఫెక్షన్లతో అతని ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. అతడిని వెంటనే పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్కు తరలించారు.రెండు వారాల కఠోర శ్రమ తర్వాత, అనేక పరీక్షలు 20 మంది వైద్య నిపుణులు తర్జన భర్జనలు సిబ్బంది అతడిని శస్త్రచికిత్సకు రెడీ అయ్యారు.50 కిలోలు తగ్గాడు బాలుడి వయస్సు, విపరీతమైన బరువును దృష్టిలో ఉంచుకుని వివిధ విభాగాలకు చెందిన 20 మంది వైద్య నిపుణులు కేసును పరిశీలించారు. ప్రాణాపాయం నుంచి కాపాడేందుకు బారియాట్రిక్ సర్జరీ ఒక్కటే మార్గమని తేల్చారు. డాక్టర్ దక్ష్ సేథీ, డాక్టర్ సుధీర్ కలహన్ బృందం ఈ అరుదైన శస్త్రచికిత్సను నిర్వహించింది. ఈ ప్రక్రియలో కడుపులో ఎక్కువ భాగాన్ని తొలగించి, దాని పరిమాణాన్ని తగ్గిస్తారు. దీనివల్ల అతను తినే ఆహారంపై నియంత్రణ సాధ్యమవుతుంది. సర్జరీ అనంతరం బాలుడు రెండు వారాల పాటు పీడియాట్రిక్ ఐసియు (PICU)లో చికిత్స పొందాడు. ఆశ్చర్యకరంగా, ఈ క్లిష్టమైన శస్త్రచికిత్స జరిగిన కేవలం మూడు రోజుల తర్వాత అతన్ని ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ చేశారు. ఆ తర్వాతి రెండు నెలల్లో అతను సాధించిన పురోగతి వైద్యులను, కుటుంబాన్ని ఎంతగానో సంతోషపరిచింది. కేవలం 60 రోజుల్లో, అతని బరువు 275 కేజీల నుండి 223 కేజీలకు తగ్గింది! అంటే దాదాపు 50 కేజీల బరువు తగ్గింది. కేవలం బరువు తగ్గించడమే కాకుండా, బాలుడికి మెరుగైన జీవన నాణ్యతను అందించడమే ఈ శస్త్రచికిత్స ప్రధాన లక్ష్యమని వైద్యులు తెలిపారు.ఇదీ చదవండి: కొడుకు ఎంత చెప్పినా వినలేదు, చివరికి తల్లి కూడా !మంచి డైట్, వ్యాయామంతో కూడిన నిరంతర వైద్య పర్యవేక్షణలో ఒకపుడు నిస్సహాయంగా , సొంతంగా నడవలేని స్థితి నుంచి నెమ్మదిగా కోలుకున్నాడు. అతని వెయిల్లాస్, ఆరోగ్య ప్రయాణం వైద్య ప్రపంచానికి ఒక గొప్ప విజయ గాథ ఇలా అనూహ్యమైన బరువుతో పోరాడుతున్న వేలాది మందికి ఒక గొప్ప ఆశాకిరణం.ఇదీ చదవండి: పెళ్లై మూడేళ్లు, ముత్యాల్లాంటి కవలలు : అల్లుడ్ని కొట్టి చంపేశారు -
హైదరాబాద్ వాసులకు నిద్ర కరువు.. కారణం ఇవే!
కునుకుపడితే మనసు కాస్త కుదుటపడతది. కుదుటపడ్డ మనసు తీపి కలలు కంటది.. అన్నచందంగా మనిషి జీవితంలో నిద్రకు ఎంతో ప్రాముఖ్యముంది. వ్యక్తిగత సమస్యలు.. మానసిక రుగ్మతలు.. అనారోగ్యం.. సాధారణంగా ఇలాంటి వాటితో నిద్ర కోల్పోవడం చూస్తూనే ఉంటాం. కానీ.. ప్రస్తుతం మెట్రో నగరవాసుల్ని పట్టిపీడిస్తూ నిద్రను దూరం చేస్తున్న సమస్యలు మరో రెండు ఉన్నాయి. అవేమిటంటే.. పీక్ అవర్స్లో ట్రాఫిక్, రాత్రి వేళల్లో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు. హైదరాబాద్ విషయాన్నే తీసుకుంటే ఈ రెండు కారణాలతో ఏటా 198 గంటల నిద్రను నగరజీవులు కోల్పోతున్నారు. తాజాగా విడుదలైన టామ్టామ్ ట్రాఫిక్ ఇండెక్స్, అమెరికాకు చెందిన క్లైమేట్ సెంట్రల్ సంస్థల సర్వేలు ఈ విషయాలను వెల్లడించాయి. హైదరాబాద్: నగరంలోని రహదారులపై మిగిలిన సమయాల్లో కంటే ఉదయం, సాయంత్రం ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది. అందుకే వీటిని పీక్ అవర్స్ అని పిలుస్తుంటారు. ఉదయం కంటే సాయంత్రం వేళ రద్దీ ఎక్కువగా ఉంటోందని టామ్టామ్ నివేదిక తేల్చింది. ఆ సమయంలో ఉండే ట్రాఫిక్ రద్దీ కారణంగా నగర వాసి ఏటా సుమారు 123 గంటలు కోల్పోతున్నాడు. అంటే.. దాదాపు ఐదు రోజులు అదనంగా ట్రాఫిక్లోనే గడిపేస్తున్నాడు. టామ్టామ్ నివేదిక ప్రకారం నగరంలో ట్రాఫిక్ రద్దీ స్థాయి 55.5 శాతంగా తేలింది. నెదర్లాండ్స్కు చెందిన ఈ టెక్నాలజీ సంస్థ స్లో మూవింగ్ ట్రాఫిక్ ఇండెక్స్ పేరుతో ప్రతి ఏడాదీ నివేదిక విడుదల చేస్తోంది. ఆసియా, యూరప్, సౌత్ అమెరికా, నార్త్ అమెరికా, ఆ్రస్టేలియా ఖండాల్లోని 62 దేశాల్లో 500 నగరాల్లో టామ్ టామ్ సంస్థ సర్వే చేసింది.సాయంత్రం దయనీయం.. సాధారణ సమయంలో 10 కి.మీ దూరం ప్రయాణించడానికి సగటున 32.37 నిమిషాలు పడుతోంది. అదే సాయంత్రం రద్దీ వేళల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంటోంది. ఈ సమయంలో వాహనాల సగటు వేగం గణనీయంగా తగ్గిపోయి 10 కిమీ దూరం ప్రయాణించడానికి సగటున 39.5 నిమిషాలు పడుతోంది. హైదరాబాద్లో వాహనాల సంఖ్య 80 లక్షలు దాటింది. అదే సమయంలో ప్రజా రవాణాకు ప్రాధాన్యం లభించట్లేదు. నగరంలో వాహనాల సగటు వేగం గంటకు 25–30 కిమీ ఉండాలి. కానీ.. సగటు వేగం కేవలం 15 కి.మీ పరిమితమవుతోంది. సాయంత్రం రద్దీ వేళల్లో ఇది గంటకు 10 కి.మీలకు పడిపోతోంది. ఇలా ప్రయాణ సమయం పెరిగి... సగటు జీవి రాత్రి వేళల్లో నిద్రపోయే సమయం తగ్గిపోతోంది. ఇంటికి చేరాకా నరకమే.. ట్రాఫిక్ సుడిగుండాన్ని దాటుకుని ఇంటికి చేరిన నగరవాసికీ నిద్ర పట్టట్లేదు. వాతావరణ మార్పుల కారణంగా వేడెక్కుతున్న రాత్రులతో ఏటా 75 గంటల నిద్రకు దూరం అవ్వాల్సి వస్తోంది. అమెరికాకు చెందిన క్లైమేట్ సెంట్రల్ సంస్థ ప్రపంచవ్యాప్తంగా 1,338 నగరాల్లో నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం తేలింది. ముఖ్యంగా కాంక్రీట్ నిర్మాణాలు, తారు రోడ్లు పగటిపూట వేడిని నిల్వ చేసుకుని.. సూర్యాస్తమయం తర్వాత కూడా ఆ వేడి త్వరగా తగ్గకుండా చేస్తున్నాయని స్పష్టం చేసింది. ఈ అంశంలో హైదరాబాద్ కంటే ఎక్కువగా వరంగల్లో 82 గంటల నిద్రను కోల్పోతుండటం గమనార్హం. -
తల్లిపాలు బిడ్డ ఎదుగుదలకు ఎంత ముఖ్యమో తెలుసా?
బిడ్డ పుట్టిన తర్వాత తల్లి ఇచ్చే తొలి కానుక తల్లిపాలే. శిశువు ఆరోగ్యానికి అవసరమైన పోషకాలు, రక్షణను అందించే తల్లిపాలు ఎంతో విలువైనవి.పసిపాప ఆరోగ్యానికి అమృతంతల్లిపాలలోని యాంటీబాడీలు చిన్నతనంలో వచ్చే సాధారణ వ్యాధుల నుంచి బిడ్డను రక్షిస్తాయి.పుట్టిన మొదటి గంటలోనే శిశువుకు తల్లిపాలు పట్టడం ఎంతో శ్రేయస్కరం.బిడ్డ పుట్టిన మొదటి ఆరు నెలల పాటు కేవలం తల్లిపాలు మాత్రమే పట్టాలి.తల్లి సరైన పోషకాహారం, సహజమైన ఆహారాన్ని తీసుకోవడం ఎంతో అవసరం.అవసరమైనప్పుడు ప్రత్యేక పంప్ సహాయంతో పాలను తీసి భద్రపరచుకోవచ్చు.పాలు ఇచ్చే సమయంలో తల్లి, బిడ్డ మధ్యఉండే స్పర్శ వల్ల మానసిక బంధం మరింత బలపడుతుంది.వీలైనంత వరకు పాలు తాగించే సీసాలు, పాసిఫైయర్స్ వాడకపోవడమే మంచిది.ప్రతి మూడు గంటలకు ఒకసారి సీసాలోకి పాలు పోసి పాలు ఇవ్వవచ్చు. -
దోమా! ఇది నీకు తగునా!!
‘సాయంత్రానికి ఇంటిలోకి చేరతావు, ఏదో ఒక మూలనుంటావు. నేను ప్రేమించే వెలుతురుని ద్వేషిస్తావు, నేను ద్వేషించే చీకటిని ప్రేమిస్తావు. రాత్రంతా నాకోసం మేల్కొని ఉంటావు, టైము దొరికితే కాటేస్తావు. మనది మనది ఒకటే రక్తం అంటావు, నా రక్తాన్నే తాగుతావు. కొన్ని రోజులే బతుకుతావు, కానీ నన్ను రోజూ చంపుతావు. రోగక్రిమి లేకపోతే మిత్రుడు, ఉంటే శత్రువు.’సంవత్సరానికి పదిలక్షల పైచిలుకు మరణాలతో, మానవ మరణాలకు కారణమయ్యే జీవుల్లో దోమ మొదటిస్థానం ఆక్రమిస్తుంది. 1897 ఆగస్టు 20న సర్ రోనాల్డ్ రాస్ మలేరియా క్రిముల్ని దోమలో చూసి, మలే రియా వ్యాధి వ్యాప్తికి కారణం దోమ అని నిర్ధారించారు. అందుకే ప్రతి సంవత్సరం ఆగస్టు 20న ‘ప్రపంచ దోమ రోజు’ జరుపుతున్నారు. ఈ సందర్భంగా దోమల గురించిన కొన్ని వాస్తవాలు:దోమలు 112 జాతులతో 3,541 తెగలతో భూగోళమంతా వ్యాపించి ఉన్నాయి. వాటిలో 50 జాతులు, 404 తెగలు భారతదేశంలో ఉన్నాయి. 4 జాతులకు చెందిన దోమలు మాత్రమే మన దేశంలో మనుషులకు వ్యాధులను కలిగిస్తాయి. అనాఫిలస్ జాతి మలేరియా వ్యాధిని; క్యూలెక్స్ జాతి ఫైలేరియా, మెదడువాపు వ్యాధులను; ఏడిస్ జాతి డెంగీ, చికున్ గన్యా, జికా వ్యాధులను; మాన్సోనియా జాతి బోదకాలు వ్యాధిని వ్యాప్తిచేస్తాయి.దోమ జీవితంలోని 4 దశల్లో, 3 దశలు (గుడ్డు, లార్వా, ప్యూపా) నీటిలోనూ, ఒక దశ (పెద్ద దోమ) భూమిమీద నివసిస్తాయి. సాధారణంగా మగదోమలు వారం రోజులు, ఆడదోమలు నెల రోజులు మాత్రమే జీవిస్తాయి. జీవించడానికి ఆడ, మగ దోమలు మొక్కల రసాలు తాగుతాయి, గుడ్లుపెట్టడానికి మాత్రమే ఆడదోమలు రక్తం తాగుతాయి. దోమకాటు దగ్గర ఏర్పడే ఎర్రని బొబ్బ దోమకాటు వల్ల కాకుండా, మనిషి వ్యాధినిరోధక వ్యవస్థ స్పందన వలన ఏర్పడుతుంది.దోమలు భూమికి 25 మీటర్లకంటే తక్కువ ఎత్తులో ఎగరడానికి ఇష్టపడతాయి. అవి మనుషులు, జంతువులు విడిచే వాయువులను 75 మీటర్ల దూరంనుండి కూడా గుర్తించ గలవు. గర్భిణీ స్త్రీలను, ‘ఓ’ రక్తగ్రూపు వాళ్లను, శరీరం వేడిగా ఉండేవాళ్ళను దోమలు సులభంగా గుర్తించగలవు. కదిలేవాటిని, తెలుపు, నలుపు రంగులను, ఉష్ణోగ్రతలను, గాలిలోని తేమను పసిగట్టగలవు.దోమ రెక్కల ద్వారా చేసే శబ్దాలు వాటి తెగకు చెందిన, ఇతర దోమలు గుర్తించడానికి చేసేవే. పెద్ద దోమలను తినేవాటిలో తూనీగలు, దోమ పిల్లలను తినేవాటిలో చేపలు ముందుంటాయి. దోమ కిలోమీటరు దూరం మాత్రమే వ్యాధిని వ్యాప్తిచేయగలదు. అయితే వ్యాధికారకం కలిగిన మనుషులు మాత్రం వేలకిలో మీటర్ల మేరకు వ్యాధిని వ్యాప్తిచేయగలరు. అందుకే దోమలు పుట్టకుండా, కుట్టకుండా చూసుకోండి – దోమకాటు వ్యాధులనుండి రక్షణ పొందండి.– తలతోటి రత్న జోసఫ్, రిటైర్డ్ డిప్యూటీ డైరెక్టర్, ఏపీ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ -
Health: దోమ చిన్నదే..! కుట్టిందో ఖతమ్..!
మనుషులపై మలేరియా ప్రభావం తీవ్రంగా ఉంటుంది. ఈ వ్యాధికి దోమలే కారణం. దోమలు వృద్ధి చెందడం వల్ల మలేరియా వ్యాధి వ్యాప్తి చెందుతుంది. ఈ అనారోగ్య పరిస్థితులకు ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని ప్రజలు ఆరోపిస్తున్నారు. గ్రామాల్లో డంపింగ్ యార్డులు లేకపోవడం, తగినంత మంది పారిశుధ్య కారి్మకులు లేకపోవడంతో చెత్త, మురుగు ఎక్కడికక్కడే పెరిగిపోయి దోమలు ప్రభావం తీవ్రంగా ఉంది. ‘వరల్డ్ మస్కిటో డే’ సందర్భంగా ఈ కథనం..దోమలు కలిగించే వ్యాధులివీఅనాఫెలస్ దోమ: ఈ దోమ వల్ల మలేరియా వ్యాధి సోకుతుంది. ఇది శుభ్రమైన నీటిలో సంచరిస్తుంది. ఇది వంద మీటర్లు మేర మాత్రమే సంచరించగలవు. క్యూలెక్స్: ఈ దోమ వల్ల ఫైలేరియా, మెదడుకు సంబంధించిన వ్యాధి సోకుతుంది. ఇది మురుగు నీటిలో మసులుతుంది. ఇది 11 కిలోమీటర్లు మేర సంచరిస్తూ ఉంటుంది. ఏడిస్: ఈ దోమ వల్ల డెంగీ, చికెన్గున్యా వ్యాధులు సోకుతాయి. ఇది చెట్టు తొర్రలు, నివాస ప్రాంతాల్లోని వస్తువుల్లో నిల్వ ఉంచిన నీటిలోనూ, కొబ్బరి డిప్పలు, పశువల పాకలవు వద్ద అపరిశుభ్రత పరిస్థితులమధ్య సంచరిస్తుంది.ఇది వంద మీటర్లు మేర మాత్రమే సంచరించగలవు. మేన్సోనియా: ఈ దోమ వల్ల ఫైలేరియా, చికెన్గున్యా వ్యా«ధులు సోకుతాయి. దీని ప్రభావం ఇండియాలో తక్కువగా ఉంది. ఇది చెరువులు, కాల్వల్లో ఉండే గుర్రపుడెక్క, మొక్కలో ఉంటుంది. ఇది వంద మీటర్లు మేర మాత్రమే సంచరించగలవు.వ్యాధుల లక్షణాలు ఇలా..మలేరియా: వణుకుతో కూడిన చలి జ్వరం వస్తుంది. రెండు రోజులకోసారి జ్వరం కనిపిస్తుంది. ప్రాథమిక దశలోనే చికిత్సను ప్రారంభించాలి. తీవ్రత పెరిగతే మెదడు ప్రభావితమై రోగి చనిపోయే పరిస్థితులుంటాయి.ఫైలేరియా: సాధారణంగా కాలు వాస్తుంది. గజ్జలో బిల్లలు వేస్తాయి. సాయంత్రం వేళ తక్కువ స్థాయిలో జ్వరం కనిపిస్తుంది.డెంగీ జ్వరం: జ్వరం తీవ్ర స్థాయిలో ఉంటుంది. తలనొప్పి, రొంప, కీళ్ల నొప్పులు, గొంతునొప్పి, కళ్ళు ఎర్రబారడం జరుగుతుంది. ప్లేట్లెట్స్ కౌంట్ పడిపోకుండా జాగ్రత్తపడాలి. శరీలంలో మచ్చలు వస్తే ప్లేట్లెట్స్ కౌంట్ పడిపోయినట్టుగా భావించవచ్చు. చికెన్గున్యా: ఈ వ్యాధి దీర్ఘకాలంపాటు ఉండొచ్చు. కీళ్ల నొప్పులు అధికంగా ఉంటాయి. రెండు నెలలు నుంచి ఏడాది పాటు ఈ నొప్పులు బాధించవచ్చు.వరల్డ్ మస్కిటో డే ప్రాధాన్యం ఇదీ..బ్రిటీషు దేశానికి చెందిన రొనాల్డ్ రాస్ అనే సైంటిస్ట్ ప్రజలను పట్టిపీడిస్తున్న జ్వరాలపై పరిశోధన చేశాడు. అనాఫెలస్ అనే ఆడ దోమ వల్ల మలేరియా అనే వ్యాధి సోకుతుందన్న విషయాన్ని 1897 ఆగస్టు 20న ప్రపంచానికి తన పరిశోధన ద్వారా తెలియపర్చాడు. ఆయన సేవలకు గుర్తింపుగా ఆగస్టు 20ను అంతర్జాతీయ దోమల నివారణ దినంగా ప్రకటించారు.- రొనాల్డ్ రాస్, సైంటిస్ట్ -
దోమ దండుపై డ్రోనాస్త్రం!
ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల ప్రకారం ప్రతి సంవత్సరం ఏడు నుంచి పది లక్షల మంది దోమల కారణంగా చనిపోతున్నారు. మనల్ని ముప్పు తిప్పలు పెట్టి, మూడు చెరువుల నీళ్లు తాగించి, రోగాల బారిన పడేలా చేసే దోమలను గాలిలోనే ఎన్కౌంటర్ చేయడానికి ‘కిల్లర్ డ్రోన్స్’ రాబోతున్నాయి!దోమల నివారణ పద్దతులో ప్రధానమైనవి దోమ తెరలు, కీటకనాశినులు. అయితే వీటిలో ప్రతిదానికి ఏదో ఒక పరిమితి ఉంది. ఉదాహరణకు, పురుగు మందుల వలన పర్యావరణానికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో దోమలను నిర్మూలించడానికి పరిశోధకులు అత్యాధునికమైన పరిష్కార మార్గాలను అన్వేషిస్తున్నారు.సోనార్–గైడెడ్ డ్రోన్ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రియల్ టైమ్ ఫ్లైట్ కంట్రోల్ సాంకేతికతను ఉపయోగించి దోమల పనిపట్టే అత్యాధునిక యంత్రం... సోనార్–గైడెడ్ డ్రోన్. పురుగు మందులు, లేజర్లు, విద్యుత్ గ్రిడ్లను ఉపయోగించడానికి బదులుగా వేగంగా తిరిగే ప్రొఫెల్లర్లను ఉపయోగించి దోమలను నిర్మూలిస్తుంది సోనార్–గైడెడ్ డ్రోన్. గాలిలో ఎగురుతున్న దోమలను ఒక్కటొక్కటిగా గుర్తించి వాటిని నిర్మూలిస్తుంది. ఆప్టికల్ కెమెరాలపై ఆధారపడే సంప్రదాయ డ్రోన్లలా కాకుండా డ్రోన్ అల్ట్రా సోనిక్ ఫేజ్డ్–సోనార్ సాంకేతికత (ఒకే పరికరంలో అనేక చిన్న సౌండ్–వేవ్ పార్ట్స్ ఉపయోగించడం) ఆధారంగా ఈ దోమ నిర్మూలన డ్రోన్ను నిర్మించారు. తక్కువ కాంతిలో, చీకటిలో కూడా దోమలను గుర్తించే డ్రోన్ ఇది. కీటకాలను వాటి రూపాన్ని బట్టి ఈ డ్రోన్ గుర్తించదు. ప్రతి దోమ జాతికి ఉండే ప్రత్యేకమైన వింగ్బీట్ ‘ఫింగర్ ప్రింట్’ ద్వారా గుర్తిస్తుంది. ఇతర కీటకాలకు ముప్పు వాటిల్లకుండా కేవలం దోమలనే లక్ష్యంగా చేసుకునేలా ఈ డ్రోన్ను డిజైన్ చేశారు.లెసోనార్ 2దోమల సమస్యకు పరిష్కార మార్గంగా ఫ్రెంచ్ స్టార్టప్ టోర్నియోల్ 40 గ్రాముల బరువు ఉన్న ఒక డ్రోన్ను రూపొందించింది. ఈ డ్రోన్ నిర్దిష్ట ప్రాంతంలో గస్తీ కాస్తూ, అవసరమైనప్పుడు ఛార్జింగ్ కోసం తిరిగి వస్తుంది. గాలిలో దోమలను గుర్తించిన వెంటనే వాటిపై దూసుకెళ్లి తన ప్రొపెల్లర్స్తో వాటిని గాలిలోనే నిర్మూలిస్తుంది. టోర్నియోల్ తాజా మోడల్ లెసోనార్ 2. ఇందులో 32 అల్ట్రా సోనిక్ ఎమిటర్స్ ఉంటాయి. ఈ ఎమిటర్స్ మనుషులకు వినబడని అల్ట్రాసోనిక్ పల్స్ను ఉత్పత్తి చేస్తాయి. ఇవి సమీపంలోని వస్తువులు లేదా కీటకాలపై పరావర్తనం చెందుతాయి. పరావర్తనం చెందిన పల్స్ను గ్రహించే 380 మైక్రోఫోన్లు సౌండ్ను ప్రాసెస్ చేసి, పరిసరాల రియల్– టైమ్ 3డీ మ్యాప్ను రూపొందిస్తాయి. కెమెరాకు బదులుగా సోనార్ ను ఉపయోగించడం వల్ల డ్రోన్ కాంపాక్ట్ (చిన్నగా)గా ఉండగలుగుతుంది. రాత్రిపూట కూడా చూడగలుగుతుంది.సెక్యూరిటీ ఫీచర్స్తో...కవరేజ్ ప్రాంతాన్ని గుర్తించడం, ఫర్మ్వేర్ను అప్డేట్ చేయడం, ఫైట్ షెడ్యూల్స్ రూపొందించడం.. మొదలైన పనుల కోసం ఈ డ్రోన్కు ప్రత్యేక యాప్, వెబ్ ఇంటర్ఫేస్లు ఉంటాయి.‘భద్రతా ఫీచర్స్ ఉండేలా మా డ్రోన్ను రూపొందించాం. మనుషులు, పెంపుడు జంతువులకు సురక్షిత దూరాలను పాటిస్తుంది. చిన్న పరిమాణం, తక్కువ బరువు వలన అనుకోకుండా తాకినా ఎలాంటి ప్రమాదం ఉండదు’ అని తెలియజేస్తుంది కంపెనీ వెబ్సైట్. సబ్స్క్రిప్షన్ ఆప్షన్తో ఈ కిల్లర్ డ్రోన్ వినియోగదారులకు అందుబాటులోకి రానుంది.‘ఫోటాన్ మ్యాట్రిక్స్ ల్యాబ్’ అనే సంస్థ దోమల పని పట్టడానికి ఒక కొత్తరకం పరికరాన్ని రూపొందించింది. ఈ పరికరం నుంచి వచ్చే నీలం, ఊదారంగు కాంతి దోమ కనిపించగానే ఎటాక్ చేస్తుంది. తొలి అడుగులలో ఏ పరికరానికైనా పరిమితులు ఉంటాయి. ఈ కిల్లర్ డ్రోన్లకు కూడా అలాంటి పరిమితులు ఉండి ఉండవచ్చు. అయితే కాలక్రమంలో ఆ పరిమితులకు పరిష్కారాలు తప్పకుండా వస్తాయి అంటున్నారు నిపుణులు.అందుకే... దోమల దినోత్సవంఆడ అనోఫెలెస్ దోమలు మలేరియాను వ్యాపింపజేస్తాయని సర్ రోనాల్డ్ రాస్ 1897లో చేసిన చారిత్రక ఆవిష్కరణకు గుర్తుగా ప్రతి సంవత్సరం ఆగస్ట్ 20న ‘దోమల దినోత్సవం’ జరుపుతారు. ఈ ఆవిష్కరణ వైద్యశాస్త్రంలో పెద్ద ముందడుగు.దోమలపై మైక్రోసాఫ్ట్ గురి!దోమల నివారణకు అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించడంపై టెక్ కంపెనీలు ఆటోమేషన్, రోబోటిక్స్పై దృష్టి పెట్టాయి. మైక్రోసాఫ్ట్తో సహా పలు సంస్థలు దోమల నిర్మూలన కోసం కొత్త హైటెక్ సాధనాలను పరీక్షిస్తున్నాయి. జికా వ్యాధిని వ్యాప్తి చేసేవిగా పేరుగాంచిన ఈడిస్ ఈజిప్టి దోమలను పట్టుకోవడానికి మైక్రోసాఫ్ట్ సంస్థ ఒక స్మార్ట్ట్రాప్ను పరీక్షిస్తోంది. కాలిఫోర్నియాలో ‘అల్ఫాబెట్’కు చెందిన లైఫ్ సైన్సెస్ విభాగం దోమల జనన నియంత్రణకు సాంకేతిక పరిష్కారాలు అన్వేషిస్తోంది. -
‘నేచర్స్ ఓజెంపిక్’ అంటే..?నిజంగానే బరువు తగ్గిస్తుందా?
ప్రాచీన ఆయుర్వేద మూలిక నెట్టింట హాట్టాపిక్గా మారింది. ఆయుర్వేదంలో దారుహరిద్ర అని పిలిచే బెర్బెరిన్ బరువు నిర్వహణ, రక్తంలోని చక్కెర నియంత్రణకు సంబంధించిన ప్రయోజనాల కారణంగా ఒక్కసారిగా సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. దీని గురించి వైద్యులు ఏమంటున్నారంటే..బెర్బెరిన్ అనేది బెర్బెరిస్ కుటుంబానికి చెందిన మొక్కలలో సహజంగా లభించే ఒక సమ్మేళనం. దీన్ని ఇండియన్ బార్బెర్రీ, దారుహరిద్ర లేదా ట్రీ టర్మరిక్ అని పిలుస్తారు. ఈ మొక్క భారతదేశం పాకిస్తాన్, నేపాల్లోని హిమాలయాలకు చెందినది. ఇది దక్షిణ భారతదేశం, శ్రీలంకలోని కొన్ని ప్రాంతాలలో సహజంగా కనిపిస్తుంది. బెర్బెరిన్ ఒక కొత్త ఆరోగ్య ఆవిష్కరణలా అనిపించినప్పటికీ, దాని చరిత్ర శతాబ్దాల నాటిది. మూడువేల ఏళ్ల క్రితం నుంచి చైనీస్ వైద్యలో దీన్ని ఉపయోగిస్తున్నారు. అలాగే భారత ఆయుర్వేదంలో కూడా దీనికి ప్రత్యేక స్థానం ఉంది. ముఖ్యంగా బరువు నిర్వహణపై ఆసక్తి ఉన్నవారిలో బెర్బెరిన్కు ఆదరణ పెరుగుతోందని చెబుతున్నారు వైద్యులు. ఇది బరువు నిర్వహణ, కొలెస్ట్రాల్, చక్కెర నియంత్రణ వంటి వాటిలో దీని పాత్ర రీత్యా క్రేజ్ పెరిగిందని అంటున్నారు. ఇది జీర్ణవ్యవస్థ ఆరోగ్యం నుంచి గుండె సంబంధిత సమస్యలకు సైతం మద్దతిస్తుందట. ముఖ్యంగా ఆడవాళ్లలో వచ్చే పీసీఓఎస్ సమస్యలకు కూడా చెక్పెట్టగలదట. అందువల్లే దీన్ని నేచర్స్ ఓజెంపిక్ అని పిలుస్తారట. దీన్ని సాంప్రదాయకంగా జ్వరాలు, విరేచనాలు, చర్మవ్యాధులు, కంటివ్యాధుల కోసం కూడా ఉపయోగిస్తారని చెబుతున్నారు వైద్యులు. ఆ ప్రయోజనాల రీత్యా ఇటీవలకాలంలో దీన్ని క్యాప్సూలస్, టాబ్లెట్లు, సప్లిమెంట్లు రూపాల్లో విరివిగా ఉపయోగించడంతో.. ఈ పురాతన ఆయుర్వేద మూలిక నెట్టింట ట్రెండీగా మారింది. View this post on Instagram A post shared by Sarthak Ahuja (@casarthakahuja) గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: మేయర్-రోకిటాన్స్కీ-కస్టర్-హౌజర్ సిండ్రోమ్ అంటే..! పాపం ఆ మహిళ 20 ఏళ్లుగా..) -
మేయర్-రోకిటాన్స్కీ-కస్టర్-హౌజర్ సిండ్రోమ్ అంటే..! పాపం ఆ మహిళ 20 ఏళ్లుగా..
కొన్ని అరుదైన వ్యాధులు శాపంగా మారతాయి. వైవాహిక జీవితాన్ని ఇబ్బందుల్లో పెట్టి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మార్చేస్తాయి. అలాంటి వాటిని కూడా ఆధునిక వైద్యం సరికొత్త ఆశను అందించి ఊపిరిపోస్తున్నాయి. ప్రస్తుతం అలాంటి సమస్యనే ఎదుర్కొంటున్న మహిళకు అక్క ఉదారత, ఆధునిక వైద్య ఆమె జీవితంలో నవ్వులు విరబూసేలా చేశాయి. అసలేం జరిగిందంటే..యూకేకు చెందిన 36 ఏళ్ల లారెన్ ఫౌలర్ అనే మహిళ 20 ఏళ్లుగా మాతృత్వం కోసం ఎదురుచూస్తోంది. ఎందుకంటే ఆమెకు 'మేయర్-రోకిటాన్స్కీ-కస్టర్-హౌజర్ సిండ్రోమ్' అనే అరుదైన జన్యుపరమైన వ్యాధి కారణంగా గర్భశయమే లేకుండా పుట్టింది. ఆ కారణంగా ఆమెకు పీరియడ్స్ లాంటివి ఉండవు. అందువల్ల సహజపద్ధతిలో పిల్లల్లను కనే సామర్థ్యం ఉండదామెకు. నిజానికి ఆ అరుదైన జన్యుపరమైన వ్యాధిలో గర్భాశయం అభివృద్ధి చెందదు కానీ ఆరోగ్యకరమైన అండాశయాలు ఉంటాయి. అలాగే అందరి అమ్మాయిల్లా..మిగతా అవయవాలన్నీ అభివృద్ధి చెందుతాయి తప్ప రుతక్రమం అనేది ఉండదు. అనేపథ్యంలోనే లారెన్కు గర్భం దాల్చే అవకాశం లేకుండా పోయింది. అలాగే ఆమెకు టైప్1 డయాబెటిస్ పేషెంట్ కూడా. దాంతో ఆమె 40 ఏళ్ల అక్క కెల్లీ తన సోదరి లారెన్కి గర్భశయాన్ని దానం చేసేందుకు ముందుకు వచ్చింది. ఎందుకంటే అప్పటికే ఆమెకు ముగ్గురుపిల్లలకు కూడా ఉండటంతో సోదరి కోసం ఈ త్యాగం చేసేందుకు ముందుకొచ్చిందామె. ఇక లారెన్ తన ఆరోగ్య పరిస్థితి గురించి సోషల్ మీడియాలో పంచుకోవడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఆ పోస్ట్లో గర్భశయ మార్పిడకి సంబంధించిన శస్త్ర చికిత్స గురించి కూడా ఇలా రాసుకొచ్చింది లారెన్. ఇది తన జీవితంలో ఎదుర్కోబోయే అతిపెద్ద అత్యంత కఠినమైన కోలుకునే ప్రక్రియగా పేర్కొంది. దీనికోసం శారీరకంగా మానసికంగా భావోద్వేగపరంగా సిద్ధంగా ఉండాలనే ముందే నిర్ణయించుకున్నట్లు తెలిపింది. ఈ శస్త్ర చికిత్స ఎలం క్లిష్టమైనదో అందరూ ముందుగానే హెచ్చరించారని, వాళ్లు అన్నట్లుగానే ఇది తనకు చాలా ఛాలెంజ్లు విసిరిందని చెప్పుకొచ్చింది. తన ప్రతి భావోద్వేగాన్ని, తన శరీరంలోని ప్రతి అణువు బలాన్ని గట్టిగానే పరీక్షించిందని ఆవేదనగా రాసుకొచ్చింది పోస్ట్లో. నిజంగానే ఇది తనను పరీక్షించి, ప్రతి కణాన్ని హరించేసి, తనలో ఎంత బలం ఉందో పరీక్ష పెట్టిందని అంటోంది. అయితే తాను 20 ఏళ్లుగా మాతృత్వం కోస పడుతున్న తపన ముందు ఈ బాధ ఎంత అని వెనక్కి తగ్గకుండా ముందుక సాగానని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం తల్లిబిడ్డ ఇద్దరు వైద్య పర్యవేక్షణలో ఉన్నారని, అక్టోబర్లో సిజేరియన్చేసి బిడ్డను బయటకు తీయాలని వైద్యులు ప్లాన్ చేస్తున్నట్లు వెల్లడిస్తూ పోస్ట్ని ముగించింది. ఇక ఆమె సోదరి కూడా తన పిల్లలు కూడా తన చెల్లెలు కనబోయే బిడ్డ కోసం ఆత్రుతుగా ఎదురుచూస్తున్నట్లు వెల్లడించారు. ఒకే గర్భం నుంచి పుట్టిన పిల్లలు కాబట్టి వీరందరి మధ్య విడదీయరాని బంధమే ఉంటుందని ఆశిస్తున్నానని పేర్కొంది ఆమె అక్క కెల్లీ. Source: పీపుల్స్ డాట్ కామ్ ఆంగ్ల వెబ్సైట్ ఆధారంగా ఇచ్చిన కథనం ఇది. (చదవండి: ఆ బుడ్డోడు పాటపాడిన తీరుకి..పర్యాటక ప్రేమికులంతా..!) -
ఏ రకమైన దోమ కుడితే ఎలాంటి వ్యాధి వస్తుందో తెలుసా?
World Mosquito Day 2026 అసలే వర్షాకాలం సీజన్.. సరైన పారిశుధ్య చర్యలు చేపట్టక దోమలు విజృంభిస్తున్నాయి. దీంతో అంటువ్యాధుల వ్యాప్తి పెరుగుతోంది. దోమల ద్వారా సంభవించే వ్యాధులపై నిర్లక్ష్యం వహిస్తే ప్రాణానికే ప్రమాదంగా మారుతుంది. జిల్లా వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో నిధుల లేమి, ఇతరత్రా కారణాల వల్ల పారిశుధ్య చర్యలు చేపట్టడం లేదు. దీనివల్ల దోమల వ్యాప్తి విపరీతంగా పెరిగిపోతోంది. దోమలు కుట్టడం ద్వారా మలేరియా, డెంగీ, చికున్గున్యా, జికా వైరస్ వంటి ప్రమాదకర వ్యాధులు సంభవించే అవకాశం ఉంది. దీంతో పాటు కొన్ని ఏరియాల్లో ఎల్లో ఫీవర్, ఎలిఫెంటియాసిస్, వెస్ట్ నైల్ వైరస్ వ్యాధులు కూడా అరుదుగా సంభవిస్తున్నాయి. ఈ వ్యాధుల నివారణకు తీసుకోవలసిన చర్యలను వివరిస్తూ ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ఏటా ఆగస్టు 20న ప్రపంచ దోమల దినోత్సవం జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ఆడ ఎనాఫిలిస్ దోమ కుట్టడం వల్ల మలేరియా వ్యాధి సంభవిస్తుందనే విషయాన్ని బ్రిటన్ వైద్యుడు సర్ రోనాల్డ్ రాస్ 1897 ఆగస్టు 20న కనుగొనడంతో అప్పటి నుంచి క్రమం తప్పకుండా ప్రపంచ వ్యాప్తంగా దోమల దినోత్సవం జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని 56 ప్రాథమిక, పట్టణ ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. దోమకాటుపై అలసత్వం వద్దు చిన్న దోమ కుట్టడం వల్ల పెద్ద వ్యాధి సోకే అవకాశముంది. దోమల ద్వారా వ్యాధి సోకిన వ్యక్తి సకాలంలో చికిత్స తీసుకోకుండా అలసత్వం వహిస్తే ఒక్కోసారి ప్రాణాంతకంగా మారుతుంది. దోమల నివారణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వైద్య ఆరోగ్యశాఖ ద్వారా ప్రతి శుక్రవారం డ్రైడేను పాటిస్తున్నా దోమల ఉధృతి మాత్రం తగ్గడం లేదు. అయితే వ్యక్తిగత శుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రత పాటించడం ద్వారా దోమలను సులభంగా నియంత్రించే అవకాశ«ం ఉంది. సంపూర్ణ పారిశుధ్య చర్యలు పాటించడం ద్వారా దోమల వ్యాప్తిని అరికట్టి అంటువ్యాధులను నివారించవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా సుమారు 2500 రకాల దోమలు ఉండగా అందులో ఏడు జాతులు ఎక్కువ వ్యాధులను వ్యాప్తి చేస్తాయి. అయితే దేశంలో ప్రధానంగా అనాఫిలిస్, ఏడీఎస్, క్యూలెక్స్ దోమల వల్ల దేశంలో విస్తృతంగా వ్యాధులు వ్యాప్తి చెందుతున్నాయి. మిగతా రకాలైన కులిసేట, మాన్సోనియా, సోరోఫోరా, టోక్సోరిన్కైట్స్ జాతి దోమలు స్థానిక వాతావరణ పరిస్థితుల వల్ల అంతగా ప్రభావం చూపలేవు.దోమల నివారణకు తీసుకోవలసిన జాగ్రత్తలు ఇంటి పరిసరాల్లో అపరిశుభ్రత ఉండకూడదు ఇంటిచుట్టూ మురుగునీరు నిల్వ ఉండకూడదు సాయంకాలం తరువాత ఇంటి కిటీకీలు, తలుపులు మూసి ఉంచాలి నిద్రించే సమయంలో దోమలు తెరలు ఏర్పాటు చేసుకోవాలి. శరీరం పూర్తిగా కప్పి ఉంచేలా పొడవైన దుస్తులు ధరించాలి. తగినంత నీరు తాగాలి. ఆహార సమతుల్యతను పాటించాలి. కూలర్లు, కుండీల్లో వారినికోసారి నీటిని మార్చాలి.ఏ రకమైన దోమ కుడితే ఏం వస్తుందంటే.. ఆడ అనాఫిలిస్ దోమ కుట్టడం ద్వారా మలేరియా సోకుతుంది సూక్ష్మజీవి ద్వారా డెంగీ వ్యాప్తి చెందుతుంది. చికున్గున్యా ఏడీఎస్ దోమ కుట్టడం వల్ల చికున్గున్యా వస్తుంది. ఏడీఎస్ ఈజిప్టు దోమ కుడితే జికా వైరస్ సోకుతుంది. ఇది లైంగిక సంపర్కం ద్వారా మరొకరికి కూడా సోకుతుంది. క్యూలెక్స్ దోమ రాత్రి వేళల్లో కుడుతుంది. దీని వలన బోదకాలు వ్యాధి సంభవిస్తుంది.ఇదీ చదవండి: త్విషా శర్మ : నన్ను ప్రశాంతంగా చావనివ్వండి : ఆ 90నిమిషాల్లో ఏం జరిగింది? -
గుండె ఆరోగ్యం కోసం... ఈ రంగులోని పండ్లు భేష్..
ఎరుపు, నీలం, ఊదా రంగుల్లో ఉండే పండ్లు, కూరగాయల్లో సహజంగా లభించే ‘ఆంథోసయానిన్’ అనే జీవక్రియాత్మక సమ్మేళనాలు గుండె ఆరోగ్యానికి, జీవక్రియల మెరుగుదలకు తోడ్పడతాయని తాజా అధ్యయనం వెల్లడించింది. ముఖ్యంగా బ్లూబెర్రీలు వంటి పండ్లలో ఈ సమ్మేళనాలు సమృద్ధిగా ఉండటంతో, అవి గుండె ఆరోగ్యానికి తొడ్పడతాయని పరిశోధకులు పేర్కొన్నారు. అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్లో ప్రచురితమైన ఈ సమగ్ర విశ్లేషణలో 27 ప్రచురణల్లో వెల్లడైన 18 దీర్ఘకాలిక అధ్యయనాలు, అలాగే ఎలాంటి వ్యాధులు లేని పెద్దలపై నిర్వహించిన 65 ర్యాండమైజ్డ్ కంట్రోల్డ్ ట్రయల్స్ను పరిశీలించారు. తక్కువ స్థాయిలో ఆంథోసయానిన్లు తీసుకునే వారితో పోలిస్తే, ఎక్కువగా తీసుకునే వారిలో పలు ఆరోగ్య ప్రయోజనాలు కనిపించినట్లు అధ్యయనం తెలిపింది. కలిగే ప్రయోజనాలు..గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదం 26 శాతం తగ్గింది.గుండెపోటు (మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్) ప్రమాదం 18 శాతం తగ్గింది.టైప్-2 మధుమేహం వచ్చే అవకాశం 11 శాతం తగ్గింది.గుండె సంబంధిత కారణాలతో మరణాల ప్రమాదం 9 శాతం తగ్గింది.అధిక రక్తపోటు ప్రమాదం 8 శాతం తగ్గింది.రోజుకు కనీసం 50 మిల్లీగ్రాముల ఆంథోసయానిన్లు తీసుకున్న వారిలో రక్తనాళాల పనితీరు మెరుగుపడటంతో పాటు, ఇన్సులిన్ స్థాయిల్లో సానుకూల మార్పులు కనిపించినట్లు పరిశోధకులు తెలిపారు. ఈ స్థాయిని సహజంగా రంగులున్న పండ్లు, కూరగాయలు తీసుకోవడం ద్వారా పొందవచ్చని వారు పేర్కొన్నారు.భారతదేశంలో గుండె జబ్బులు, మధుమేహం, అధిక రక్తపోటు వంటి జీవనశైలి సంబంధిత సమస్యలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ పరిశోధన ఫలితాలు మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ప్రతిరోజూ ఆహారంలో వివిధ రంగుల పండ్లు, కూరగాయలను చేర్చడం వంటి సమతుల ఆహారపు అలవాట్లు పెంపొందించుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.ఈ సందర్బంగా అమెరికా హైబుష్ బ్లూబెర్రీ కౌన్సిల్ భారత ప్రతినిధి రాజ్ కపూర్ మాట్లాడుతూ, “సహజ రంగులతో కూడిన ఆహార పదార్థాలను రోజువారీ భోజనంలో భాగం చేసుకోవడం ఎంతో ముఖ్యమని ఈ అధ్యయనం మరోసారి నిరూపించింది. ఆంథోసయానిన్లు సమృద్ధిగా ఉండే అమెరికన్ బ్లూబెర్రీల వంటివి కూడా భారతీయ ఆహార అలవాట్లలో సులభంగా చేర్చుకోవచ్చు” అని తెలిపారు.అయితే ఒక్క ఆహార పదార్థం మాత్రమే వ్యాధులను నివారిస్తుందని లేదా చికిత్స చేస్తుందని ఈ పరిశోధన చెప్పడం లేదని పరిశోధకులు స్పష్టం చేశారు. సమతుల ఆహారం, క్రమమైన శారీరక వ్యాయామం, సరిపడ నిద్ర, వైద్యుల సూచనలు పాటించడం వంటి ఆరోగ్యకరమైన జీవనశైలిలో భాగంగా ఆంథోసయానిన్ అధికంగా ఉండే ఆహారాలను చేర్చుకోవడం వల్ల దీర్ఘకాలిక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని పేర్కొన్నారు. ఈ అధ్యయన ప్రధాన పరిశోధకురాలు ప్రొఫెసర్ ఏడిన్ క్యాసిడీ మాట్లాడుతూ, చిన్న చిన్న ఆహారపు మార్పులు కూడా గుండె జబ్బులు, అధిక రక్తపోటు, టైప్-2 మధుమేహం ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయని అధ్యయనం తేల్చిందన్నారు.(చదవండి: ఆంథోసయనిన్ గుండె, జీవక్రియ ఆరోగ్యానికి ఎలా తోడ్పడుతుందంటే..!) -
Health: నిమోనియా హానియా? ఎవరికి ఎక్కువ ముప్పు?
మన ఊపిరితిత్తులు అనునిత్యం శ్వాస తీసుకుంటూ నిరంతరాయం పనిచేస్తూనే ఉంటాయి. అలా అవి ఏమాత్రం విశ్రాంతి లేకుండా శ్వాస తీసుకుంటూనే ఉండాలి. అప్పుడే ్రపాణాలు నిలుస్తాయి. ఈ ప్రక్రియలో ముక్కు నుంచి తీసుకున్న గాలి... ఊపిరితిత్తుల్లోని అతి చివరి అంచె అయిన ‘ఆల్వియోలై’ అనే గాలి గది (ఎయిర్ శ్యాక్)ని చేరాలి. ఈ ఆల్వియోలై నుంచే బయటి నుంచి మనం తీసుకున్న ఆక్సిజన్ మన దేహంలోని అన్ని అవయవాల్లోని కణాలకు అందడమూ, అలాగే లోపలి కలుషితమైన గాలి అక్కడి నుంచే బయటికి రావడం వంటి ‘గ్యాసెస్ ఎక్స్ఛేంజ్’ ప్రక్రియ చోటుచేసుకుంటుంది. ఏదైనా కారణం వల్ల ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్ రావడం వంటి కారణాలతో... గాలి గదిలో (ఆల్వియోలైలో) ఇన్ఫ్లమేషన్ కారణంగా అందులోకి చీము లేదా తెమడ / ఫ్లెమ్ వంటి ద్రవాలు నిండటంతో శ్వాసకు అంతరాయం కలిగితే అది నిమోనియా సమస్యకు దారితీస్తుంది. ఈ నేపథ్యంలో నిమోనియా అంటే ఏమిటో చూద్దాం.నిమోనియా సమస్య ప్రధానంగా బ్యాక్టీరియా (ఉదా: స్ట్రెప్టోకోకస్), వైరస్లూ (ఉదా: ఫ్లూ అలాగే రెస్పిరేటరీ సిన్సీషియల్ వైరస్), ఫంగైలతో పాటు ఏవైనా ఆహార పదార్థాలూ, ద్రవాలు (ఉదా: ఆహారం, నీళ్లు వంటివి) ఊపిరితిత్తులోకి చేరడం వల్ల వచ్చే అవకాశాలెక్కువ.కారణాలు..బాక్టీరియా వల్ల – స్టెఫలోకాకస్ బ్యాక్టీరియా (ఇది పెద్దల్లో సాధారణంగా వచ్చేందుకు కారణమవుతుంది), హీమోఫీలస్ (పిల్లల్లో సాధారణంగా దీనివల్ల వస్తుంది), గ్రామ్నెగెటివ్, అనరోబిక్, టీబీ బ్యాక్టీరియా మొదలైన బ్యాక్టీరియాల వల్ల.వైరస్ వల్ల – ఇన్ఫ్లుయెంజా, రెస్పిరేటరీ సిన్సీషియల్ వైరస్... వంటి వైరస్లతో పాటు తరచూ వచ్చే కొత్త వైరస్ల వల్ల కూడా నిమోనియా రావచ్చు. ఏదైనా వైరస్ విజృంభించి ఒక చోట ఎపిడమిక్లా వచ్చి, తన ప్రభావం చూపిన తర్వాత నిమోనియాకు దారితీసే అవకాశాలు ఎక్కువ. ఆ వైరస్ సోకిన తర్వాత బాధితుల్లో రోగనిరోధక శక్తిని బట్టి నిమోనియా వచ్చే అవకాశాలు ఆధారపడి ఉంటాయి.ఫంగస్ వల్ల కూడా.కొద్ది ప్రదేశంలోనే ఎక్కువమంది ఉండటం (ఓవర్ క్రౌడింగ్)ఆల్కహాల్ అలవాటుతో– (దీని వల్ల వ్యక్తుల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగానూ రోగనిరోధక శక్తి (డిఫెన్స్ మెకానిజం) తగ్గుతుంది. మత్తులో దగ్గడం కూడా తక్కువే. దాంతో లోన ఉన్న పడని పదార్థాలు అక్కడే ఉండిపోవడంతో నిమోనియా రావచ్చు.మైక్రో యాస్పిరేషన్ – మనకు తెలియకుండానే ద్రవాలు గొంతునుంచి శ్వాసనాళంలోకి జారిపోతుంటాయి. ఆ ప్రక్రియనే మైక్రోయాస్పిరేషన్ అంటారు. ప్రతివ్యక్తి గొంతులో బ్యాక్టీరియా ఉంటుంది. దీన్నే ఓరోఫ్యారింజియల్ ఫ్లోరా అంటారు. ఆ బ్యాక్టీరియా గొంతు నుంచి శ్వాసనాళాల ద్వారా గాలిగదుల వరకు పోవడం వల్ల కూడా నిమోనియా రావచ్చు.లక్షణాలివే...నిమోనియాలో...జ్వరం, దగ్గు, ఒళ్లునొప్పులు, చలిగా ఉండటం, ఒక్కోసారి ఆకలి లేకపోవడంతెమడ / కఫం (ఫ్లెమ్) ఉండవచ్చు లేదా లేకపోవచ్చు. ఉంటే తెల్లగా / పసుపురంగులో ఒక్కోసారి రక్తపు చారికతోనూ కనిపించవచ్చు.నిమోనియా ఇన్ఫ్లమేషన్ ఊపిరితిత్తి తాలూకు పొర (ప్లూరా)కు చేరినప్పుడు ఛాతినొప్పి కూడా రావచ్చు.నిమోనియా మరీ తీవ్రంగా ఉంటే ఆయాసం కూగా రావచ్చు. ఇక ఇంటస్టిషియల్ నిమోనియాలో దగ్గు ఉండదు. కాని ఆయాసం మాత్రం ఉంటుంది. ఇది ఎంతటి విషమ పరిస్థితికి దారితీస్తుందంటే... ఒక్కోసారి శ్వాసప్రక్రియ ఆగిపోవచ్చు కూడా.ఆస్తమాలో పిల్లికూతలు ఉంటాయి. గాని నిమోనియాలో ఉండవు. గాలి పీలుస్తున్నా అది లోపలికి వెళ్లదు. కారణం... గాలి చేరాల్సిన ప్రదేశమైన గాలిసంచిలోని చీము వంటి ద్రవాలు లేదా తెమడ (ఫ్లెమ్) వంటివి అడ్డంకిగా ఉండవచ్చు. ఇలా గాలిగదిలో పేరుకునే పదార్థాన్ని ‘ఎగ్జుడస్’ అంటారు. ఈ ఎగ్జుడస్ కారణంగా గాలిగదిలోకి ఆక్సిజన్ చేరదు. దాంతో దేహానికీ / దేహంలోని కణాలకూ అవసరమైనంత ఆక్సిజన్ అందదు. ఫలితంగా ఊపిరితిత్తులు పని చేయలేని పరిస్థితి వస్తుంది. దీన్నే ‘హైపాక్సిక్ రెస్పిరేటరీ ఫెయిల్యూర్’ అంటారు.ఊపిరి అందకపోవడంతో నుదుటిపై చెమటలు పట్టడం, కంగారుగా ఉండటం, గుండె స్పందన వేగం పెరగడం, అయోమయం కారణంగా డీలా పడిపోవడం, బీపీ పడిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే దాన్ని ‘సివియర్ నిమోనియా’ అంటారు.కొందరు బాధితుల్లో ఛాతీలో తీక్షణమైన / తీవ్రమైన నొప్పి (షార్ప్ పెయిన్) కూడా రావచ్చు.సమయానికి చికిత్స తీసుకోకపోతే ప్రమాదమే...నిమోనియాకు సమయానికి తగిన చికిత్స తీసుకోకపోతే జబ్బు మరిన్ని కాంప్లికేషన్లకు దారితీయవచ్చు. అంటే... సెప్టిసీమియా (రక్తానికంతా ఇన్ఫెక్షన్ సోకడం, దీన్నే మామూలు భాషలో రక్తం విషపూరితంగా మారడం), రక్తపోటు పడిపోవడం, పక్షవాతం, మూత్రపిండాలు దెబ్బతినడం, మెదడుపై దుష్ప్రభావం పడటం కాంప్లికేషన్లు రావచ్చు. కొందరిలో మరణం కూడా సంభవించవచ్చు.నిమోనియా ఎవరెవరిలో... నిమోనియా ఏ వయసు వారిలోనైనా రావచ్చు. చాలా చిన్న పిల్లలు మొదలుకొని, అరవై ఏళ్లు దాటిన వృద్ధుల వరకు అందరిలోనూ కనిపించవచ్చు. సాధారణంగా ఈ వయసు వారిలో వ్యాధి నిరోధకశక్తి / వ్యాధి నిరోధక వ్యవస్థ పనితీరు తక్కువ కాబట్టి నిమోనియా చిన్నపిల్లల్లోనూ, వయస్సు పైబడ్డవారిలోనూ చాలా ఎక్కువగా కనిపిస్తుంటుంది.ఆహారంలో తగినన్ని పోషకాలు తీసుకోని వాళ్లలో రోగనిరోధక శక్తి తగ్గడంతో.సీఓపీడీ (క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మునరీ డిసీజ్ – బ్రాంకైటిస్, ఎంఫసీమా) వంటి వ్యాధులు ఉన్నవాళ్లలోగుండె సమస్యలు ఉన్నవారిలోస్పీ›్లనెక్టమీ అనే ప్రక్రియ ద్వారా స్పీ›్లన్ తొలగించిన వాళ్లలోపొగతాగేవారిలో... వీళ్లందరిలోనూ నిమోనియా వచ్చే అవకాశాలెక్కువ.మరికొన్ని జబ్బులతో కలసి...మరికొన్ని ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడేవారిలో నిమోనియా సోకడం మామూలే. ఉదాహరణకు... సాధారణంగా డయాబెటిస్ ఉన్న వారు, క్యాన్సర్ కారణంగా కీమోథెరపీ తీసుకుంటున్నావారు, ఎయిడ్స్ బాధితులు, ఆస్తమా ఉన్నవారు, ఆల్కహాల్ ఎక్కువగా తాగేవారిలో నిమోనియా రావడం చాలా సాధారణం. ఇక గర్భవతుల్లో నిమోనియాను గుర్తించి, సరిగా వైద్య చికిత్స ఇవ్వకపోవడం వల్ల అదెన్నో కాంప్లికేషన్లకు దారితీసే ముప్పు ఉంటుంది.వ్యాధి నిర్ధారణబాధితుల్లో కనిపించే లక్షణాలను బట్టి క్లినికల్గా.సీబీపీ, సీఎక్స్ఆర్ వంటి చాలా సాధారణ పరీక్షలతో దీన్ని నిర్ధారణ చేయవచ్చు.ఒక్కోసారి అవసరాన్ని బట్టి ఛాతీ సీటీ స్కాన్, కళ్లె పరీక్ష వంటి ఇతర పరీక్షలు కూడా చేయాల్సి రావచ్చు.వీరిలో మరింత జాగ్రత్త అవసరం...బాధితుల్లో రెండు మూడు రోజుల నుంచి జ్వరం, దగ్గు, ఊపిరి అందకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తుంటే నిమోనియా ఉందేమోనని పరీక్షించాలి. డయాబెటిస్, పక్షవాతం, ఆస్తమా, గర్భిణుల్లో వ్యాధి సోకే అవకాశాలు ఎక్కువ కాబట్టి వారిని చాలా జాగ్రత్తగా పరీక్షించాలి. ఇక ఆసుపత్రుల్లో నిమోనియా సోకే అవకాశాలు ఎక్కువ.నివారణ...పొగతాగే అలవాటు ఉంటే జ్వరం, దగ్గు, ఊపిరి అందకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తుంటే తక్షణం ఆ అలవాటును ఆపేయాలి.బయటి వాతావారణంలో పొగ ఉంటే దానికి ఎక్స్పోజ్ కాకుండా జాగ్రత్త పడాలి.ఆస్తమా రోగులు, బ్రాంకైటిస్ ఉన్నవారు తప్పనసరిగా అది నియంత్రణలోకి వచ్చేలా చికిత్స తీసుకోవాలి.క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల రోగనిరోధక శక్తి పెంపొందుతుంది. ఫలితంగా నిమోనియా వంటి ఇన్ఫెక్షన్లు తేలిగ్గా సంక్రమించవు.అన్ని పోషకాలూ ఉండే సమతులాహారం తీసుకోవడం వల్ల రోగనిరోధకశక్తి పెరిగి, నిమోనియాతో పాటు అనేక ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ కలుగుతుంది.చికిత్సనిమోనియాకు తగిన యాంటీబయాటిక్స్తో చికిత్స చేయాల్సి ఉంటుంది. బాధితులను చాలా నిశితంగా పరిశీలించి యాంటీబయాటిక్స్ మోతాదును డాక్టర్లు చాలా జాగ్రత్తగా నిర్ణయిస్తారు. అందుకే నిమోనియాకు చికిత్స తప్పనిసరిగా డాక్టర్ల పర్యవేక్షణలోనే జరగాలి. సొంతవైద్యం ఎట్టిపరిస్థితుల్లోనూ పనికిరాదు.ఎవరికైనా మూడు రోజులకు పైబడి జ్వరం, ఛాతీనొప్పి, ఊపిరి సరిగా తీసుకోకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆసుపత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకోవడం తప్పనిసరి.చిన్నాపిల్లల్లో నిమోనియా!చిన్నపిల్లలందరిలోనూ కనిపించినప్పటికీ... మరీ ముఖ్యంగా ఐదేళ్ల కంటే ఇంకా చిన్నారుల్లో ఇది చాలా ఎక్కువ. పెద్దల్లో వ్యాధి నిరోధక వ్యవస్థ బాగా పనిచేస్తుంటుంది కాబట్టి కాస్త తట్టుకుంటారు. కానీ చిన్నారుల్లో ఇమ్యూనిటీ అంతే బలంగా ఉండకపోవడం వల్ల ఒక్కోసారి ఇది ్రపాణాంతకమూ అయ్యే అవకాశముంది. అయితే ఇప్పుడున్న వైద్యపరిజ్ఞానంతో దీన్ని చాలావరకు సమర్థంగా తగ్గించవచ్చు.స్ట్రెప్టోకాకస్ నిమోనే, గ్రూప్–బి స్ట్రెప్టోకాకస్, స్టెఫలోకాకస్ ఆరియస్ వంటి బ్యాక్టీరియాతో పాటు ఐదేళ్ల కంటే మరీ చిన్న పిల్లల్లో ఇది రెస్పిరేటరీ సిన్సీషియల్ వైరస్, పారా ఇన్ఫ్లుయెంజా వైరస్, అడినోవైరస్ వంటి వైరస్లతోనూ వచ్చే అవకాశం ఉంది. పెద్దల్లోలాగే కొన్ని సందర్భాల్లో ఫంగైలతోనూ నిమోనియా రావచ్చు.లక్షణాలునిమోనియా వల్ల పిల్లలందరిలోనూ ఒకేలాంటి లక్షణాలు కనిపించకపోవచ్చు. ఏ కారణంగా నిమోనియా వచ్చిందనే అంశాన్ని బట్టి లక్షణాలు మారుతుంటాయి. అయితే సాధారణంగా కనిపించే లక్షణాలివి...దగ్గు వస్తుంటుంది. ఇది తెమడ/ఫ్లెమ్ను ఉత్పత్తి చేస్తుండటం వల్ల తడిదగ్గు.తీవ్రమైన జ్వరం.ఆకలి తగ్గడం.తీవ్రమైన అలసట, నీరసం, నిస్సత్తువ.కొందరు పిల్లల్లో వాంతులు, విరేచనాలూ కావచ్చు.వైరస్ లేదా బ్యాక్టీరియా కారణంగా నిమోనియా వచ్చినా మొదట్లో లక్షణాలన్నీ దాదాపు ఒకేలా ఉంటాయి. అయితే వైరల్ నిమోనియాలో ఊపిరి తీసుకోవడం కష్టం కావడం, ఆయాసం, ఊపిరి తీసుకుంటున్నప్పుడు శబ్దం రావడం (వీజింగ్) వంటివీ కనిపించవచ్చు. బ్యాక్టీరియా కారణంగా వచ్చే నిమోనియా కంటే వైరల్ నిమోనియా కాస్త ప్రమాదకరం. పిల్లల్లో వణుకు, ఆయాసం, తలనొప్పి, అయోమయం వంటివి కనిపిస్తే అది ఒకింత ప్రమాదకరమని గుర్తించి వెంటనే డాక్టర్ను సంప్రదించాలి.నిర్ధారణఛాతీ ఎక్స్రే.కొన్ని రక్తపరీక్షలు (రక్తంలో ఆక్సిజన్ మోతాదును తెలుసుకునే ఆర్టీరియల్ బ్లడ్గ్యాస్ వంటివి)కళ్లె పరీక్ష (స్ఫుటమ్ కల్చర్) : ఈ పరీక్ష వల్లనే నిమోనియాకు అసలు కారణం తెలుస్తుంది.సీటీ స్కాన్ (ఛాతీది)అవసరాన్ని బట్టి అరుదుగా బ్రాంకోస్కోపీ, ఊపిరితిత్తుల్లో నీరు చేరితే దాని పరీక్ష వంటివి చేస్తారు.చికిత్స బ్యాక్టీరియా వల్ల వచ్చే నిమోనియా మంచి యాంటీబయాటిక్స్తో తేలిగ్గా తగ్గిపోతుంది. అయితే వైరల్ ఇన్ఫెక్షన్తో నిమోనియా వస్తే దానికి నిర్దిష్టంగా మందులు లేకపోయినా కొన్నిసార్లు యాంటీవైరల్ మందులు ఇస్తారు. ఇలాంటి పిల్లలకు తగినన్ని నీళ్లు తాగించడం, గది బాగా సౌకర్యంగా ఉండటంతో పాటు అందులో తగినంత తేమ ఉండేలా చూడటం, జ్వరం, దగ్గు వంటివి తగ్గడానికి లక్షణాలను బట్టి (సింప్టమాటిక్) చికిత్స ఇవ్వడం వంటివి చేస్తారు.సెకండరీ నిమోనియాపిల్లల్లో ఇంకేదైనా వ్యాధి (ముఖ్యంగా వైరల్ జ్వరాలు) వచ్చాక, అది నిమోనియాకు దారితీస్తే దాన్ని సెకండరీ నిమోనియాగా పరిగణిస్తారు. దీనికి కాస్తంత ప్రమాదకరమైన కండిషన్. అందుకే హాస్పిటల్లో ఉంచి చికిత్స అందించాలి. ఇందులో తీవ్రతను బట్టి రక్తనాళం ద్వారా లేదా నోటి ద్వారా యాంటీబయాటిక్స్ ఇవ్వడం, వాళ్లలో నీరు, లవణాల మోతాదుల నిర్వహణ కోసం సెలైన్ వంటి ఫ్లుయిడ్స్ ఎక్కించడం, ఆక్సిజన్ ఇవ్వడం, పిల్లలు తమంతట తాము కళ్లె / గల్ల / ఫ్లెమ్ తీయలేరు కాబట్టి వారు దాన్ని ఊసేలా వివరించి చెప్పడం, బాగా ఊపిరితీసుకోగలుగుతున్నారా అని చూడాలి. అందుకే చిన్నారుల్లో సెకండరీ నిమోనియా కనిపిప్తే వారిని తప్పనిసరిగా హాస్పిటల్లో ఉంచే చికిత్స అందించడం మంచిది. నివారణపిల్లలకు చిన్నతనంలో ఇచ్చే బీసీజీ, పెర్టుసస్లతో పాటు నిమోకోకల్ వ్యాక్సిన్ ఇవ్వడం ద్వారా దీన్ని నివారించవచ్చు. ఇప్పుడు 13 రకాల నిమోనియాలకు తగిన వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. పిల్లలకు రెండు నెలల వయసప్పుడు నిమోనియా వ్యాక్సిన్స్ మొదటి డోసు, రెండేళ్ల పైబడ్డ పిల్లలకు సైతం వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి.అందరు పిల్లలకు ప్రతి ఏడాదీ ఫ్లూ వ్యాక్సిన్ వేయించాలి. వర్షాకాలానికి ముందు (ప్రీ–మాన్సూన్ పీరియడ్లో) ప్రతి ఏడాదీ ఫ్లూ వ్యాక్సిన్ తీసుకోవాలి. ఇలా తీసుకుంటే వైరల్ ఫ్లూని నియంత్రించవచ్చు.వ్యక్తిగత పరిశుభ్రత పాటించడాన్ని పిల్లలకు నేర్పడం, బాగా దగ్గుతున్న పెద్దలు, వ్యాధిగ్రస్తుల దగ్గరికి వెళ్లకుండా చూస్తూ... పిల్లలను అలాంటివారి నుంచి దూరంగా ఉంచడం, చాలాకాలం పాటు ధాన్యం నిల్వ ఉంచే గరిసెలు, అలాగే కోళ్ల వంటి పెంపుడు పక్షులకు పిల్లలను దూరంగా వంటి కొద్దిపాటి జాగ్రత్తలతో నిమోనియాను చాలావరకు నివారించవచ్చు.చివరిగా... నిమోనియాను యాంటీబయాటిక్స్తో చాలావరకు నయం చేయడం సాధ్యమే అయినప్పటికీ... పెద్దల్లోనైనా, పిల్లల్లో జ్వరం, ఆగకుండా దగ్గు వస్తూ, ఆయాసం వంటి లక్షణాలు కనిపిస్తున్నప్పుడు అంత తేలిగ్గా తీసుకోకుండా ఒకసారి డాక్టర్ను సంప్రదించి చికిత్స తీసుకోవడమే మంచిదని గుర్తుంచుకోవాలి.- డా. రమణ ప్రసాద్, సీనియర్ పల్మునాలజిస్ట్ అండ్ స్లీప్ స్పెషలిస్ట్నిర్వహణ : యాసీన్ -
విటమిన్లు తగ్గితే మతిమరుపే?
వయసు పైబడు తున్న కొద్దీ వచ్చే జ్ఞాపకశక్తి సమస్యలకు, శరీరంలో ఉండే కొన్ని ముఖ్యమైన విటమిన్ల స్థాయిలకు మధ్య అత్యంత బలమైన లంకె ఉందా? అవుననే చెబుతోంది ఐసీఎంఆర్–జాతీయ పోషకాహార సంస్థ (ఎన్ఐఎన్) తాజా అధ్యయనం. వృద్ధుల్లో రక్తంలోని విటమిన్ స్థాయిలు తగ్గడం వల్ల మెదడు పని తీరు మందగించి మతిమరుపు లేదా జ్ఞాపకశక్తి తగ్గే తొలి దశ వచ్చే ప్రమాదం ఉందని తేలింది.అంత ర్జాతీయ మెడికల్ జర్నల్ ’న్యూట్రియెంట్స్’లో ప్రచురితమైన ఈ ప్రత్యేక అధ్యయనంలో భాగంగా హైదరాబాద్కు చెందిన 55–85సంవత్సరాల మధ్య వయసు గల 184 మంది వృద్ధులపై క్షేత్ర స్థాయిలో పరిశోధనలు జరిపారు. ఇందులో తేలిన షాకింగ్ నిజం ఏమిటంటే.. వీరిలో 36.4% మంది అప్పటికే జ్ఞాపకశక్తి తగ్గే ఈ తొలి దశ బారిన పడినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు.విటమిన్ల లోపమే శాపమా?జ్ఞాపకశక్తి సమస్యలతో బాధపడుతున్న వృద్ధుల రక్త నమూనాలను పరీక్షించినప్పుడు వారిలో డీ, బీ1, బీ2, బీ6, బీ9, బీ12 విటమిన్ స్థాయిలు చాలా తక్కువగా ఉన్నట్లు తేలింది. ముఖ్యంగా డీ, బీ2, బీ9 విటమిన్లలో లోపాలు వీరిలో అత్యధికంగా కనిపించాయి. శరీరంలో విటమిన్–డీ, బీ6 స్థాయిలు సమృద్ధిగా ఉన్నవారిలో ఆలోచనా శక్తి, మానసిక పనితీరు, మెదడు చురుకుదనం చాలా మెరుగ్గా ఉన్నట్లు పరిశోధకులు కనుగొన్నారు. అలాగే, జ్ఞాపకశక్తి సమస్యలు ఉన్న వృద్ధుల్లో కేవలం విటమిన్ల లోపమే కాకుండా, రక్తంలో చక్కెర స్థాయిలు, బీపీ కూడా చాలా ఎక్కువగా ఉన్నట్లు గమనించారు. అందువల్ల మధుమేహం, రక్తపోటు ఉన్నవారు మరింత అప్రమత్తంగా ఉండాలని ఈ అధ్యయనం సూచిస్తోంది.ముందస్తు జాగ్రత్తలువృద్ధాప్యంలో కేవలం వ్యాధుల నియంత్రణపైనే కాకుండా పోషకాహార భద్రతపై కూడా సమానంగా దృష్టి పెట్టాలని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. శరీరంలో తగినంత మొత్తంలో సూక్ష్మపోషకాలు ఉండేలా చూసుకోవడం, వయసు పైబడుతున్న వారిలో ప్రారంభ దశలోనే పోషకాహార లోపాలను గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని ఎన్ఐఎన్ బయోకెమిస్ట్రీ విభాగం అధిపతి, పరిశోధనకు నేతృత్వం వహించిన శాస్త్రవేత్త డాక్టర్ జి.భానుప్రకాశ్ రెడ్డి తెలిపారు. మెదడు చురుకుదనాన్ని నిలుపుకుంటూ ఆరోగ్యకర వృద్ధాప్యాన్ని ఆస్వాదించడానికి ముందస్తు పోషకాహార పరీక్షలు, సకాలంలో తీసుకునే సమతుల్య ఆహారం ఎంతగానో దోహదపడతాయని చెప్పారు. -
147 కేజీల నుంచి 109 కేజీలకు..! ఆ డైట్తో 38 కేజీలు..
బరువు తగ్గడానికి ఆహారం, వ్యాయామం పట్ల క్రమశిక్షణతో కూడిన విధానం అవసరం. కేలరీల లెక్కింపు వ్యాయామం వంటివి బరువు తగ్గేందుకు ఉపకరించేవే. అయితే ఈ కంటెంట్ క్రియేటర్ బరువు తగ్గడానికి ఒక వెరైట్ డైట్ విధానం అనుసరించి ఏకంగా 38 కేజీల బరవు తగ్గాడు. అందుకు సంబంధించిన విషయాన్ని ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసుకున్నాడు. తాను భవిష్యత్తులో పుట్టబోయే బిడ్డ కోసం ఆరోగ్యకరమైన తండ్రిగా ఉండాలనే ఉద్దేశ్యంతో బరువు తగ్గానని వెల్లడించారు. మరి ఆయన అనుసరించిన డైట్ విధానం గురించి సవివరంగా తెలుసుకుందామా..!.కంటెంట్ క్రియేటర్ జెఫిన్ స్వతహాగా పెద్ద ఫుడ్డీనని అన్నారు. అనారోగ్యకరమైన స్నాక్స్ పట్ల ఉన్న ఇష్టం గురించి కూడా మాట్లాడారు. అలాగు తాను ఏళ్ల తరబడి అధిక బరువుతో పోరాడినట్లు తెలిపారు. తాను 2018లో 35 కిలోలు తగ్గానని, కానీ ప్రతి గ్రాము తిరిగి పెరిగిపోవడాన్ని చూశానని అన్నారు. అయితే 2022లో పెళ్లి కోసం మళ్లా బరువు తగ్గానని చెప్పారు. కానీ హైదరాబాద్కు మారిన తర్వాత ఒత్తిడి పెరిగి మళ్లీ యథావిధిగా బరువు పెరిగిపోయానని పోస్ట్లో రాసుకుకొచ్చారు. తన అధిక బరువు తనకు బాధకరమైన అంశంగా మారిందని అన్నారు. ఇతరులకు ఇచ్చే స్నేహపూర్వక సలహాలు కూడా ఒత్తిడిని పెంచాయని చెప్పారు. గతేడాది ఏకంగా 147 కిలోల అధిక బరువుకి చేరిపోయానని అన్నారు. పైగా టైప్ 2 డయాబెటిస్ ఉన్నట్లు నిర్థారణ అయ్యిందని చెప్పుకొచ్చారు. ఎప్పటికైనా.. తన జీవనశైలి కారణంగా తక్షణ స్ట్రోక్ ప్రమాదం వచ్చే అవకాశం ఉందని అన్నారు. పైగా తన భార్య రిన్సీ తను కలిసి ఒక బిడ్డను కనాలనే ఆలోచనలో ఉన్నామని చెప్పారు. ఆ నేపథ్యంలోనే తాము ఆరోగ్యంగా ఉండాలని నిర్ణయించుకుని..ఇలా వెయిట్లాస్ జర్నీకి ఉపక్రమించామని అన్నారు. అయితే తమ ఫిట్నెస్ ప్రయాణం ఎలా ప్రారంభమైందో ఇలా పంచుకుంది ఆ జంట. తాము ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్(అడపాదడపా ఉపవాసం)ని ఉపయోగించనట్లు తెలిపారు. ఆ నేపథ్యంలో సోమవారం నుంచి శుక్రవారం వరకు చిరుతిళ్లకు దూరంగా ఉండాలనే నియమం పెట్టుకున్నామని అన్నారు. అలాగే డైట్లో తన భార్య రోజుకు రెండు పూటల భోజనానికి మారగా, తాను ఒక్క పూట భోజనానికి కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. అలా ఇప్పుడు తాను 109కిలోలకు చేరానని, ఇప్పటికీ ఆ ఆహార నియమాన్ని, వ్యాయామాలను అనుసరిస్తున్నట్లు చెప్పారు. ఇప్పుడిక మరింతగా ఆరోగ్యకరమైన బరువు చేరుకోవడమే లక్ష్యంగా తామిద్దరం కలిసి పనిచేస్తున్నామని అన్నారు. ఒమాడ్ డైట్..ఒమాడ్ అంటే ఒకరకమైన ఇంటర్మిటెంట్ పాస్టింగ్. ఇది ఒక వ్యక్తి తీసుకునే కేలరీలను ఒకే భోజనానికి లేదా ఒక గంట వంటి తక్కువ సమయానికి పరిమితం చేస్తారు. అంటే రోజంతా ఒక భోజనం చేసి, ఇతర ఆహార పదార్థాలను తీసుకోకపోవడం లేదా ఒకే భోజనం చేసి, ఉపవాస సమయంలో పరిమిత పరిమాణాంలో ఆహారం తీసుకోవడం వంటివి ఉంటాయి. ఈ ఆహార పద్ధతి కేలరీల లోటుకి దారితీస్తుంది. అంటే శరీరం ఖర్చు చేసే కేలరీల కంటే తక్కువ కేలరీలను తీసుకుంటుంది. దీనివల్ల సునాయాసంగా బరువు తగ్గొచ్చు అని చెప్పారు. ఈ విధానం వల్ల ఇతర ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. అవేంటంటే.. రక్తంలో చక్కెర, వాపు స్థాయిలు తగ్గడం తోపాటు గుండె జబ్బుల ప్రమాద కారకాలు తగ్గుతాయని అన్నారు. కానీ ఈ ఆహార పద్ధతి పిల్లలు కౌమారదశలో ఉన్నవారికి, వృద్ధులకు, ఆహార సంబంధిత రుగ్మతలు ఉన్నవారికి, గర్భిణీ లేదా పాలిచ్చే మహిళలకు తగినది కాదని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. View this post on Instagram A post shared by Humans of Bombay (@officialhumansofbombay) గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: అంట్లు తోమే స్థాయి నుంచి..రూ. 160 కోట్ల కంపెనీ నిర్మించే రేంజ్కు..!) -
దంపతులు అలా నిద్రిస్తేనే మంచిది..!: బ్రయాన్ జాన్సన్
టెక్ వ్యవస్థాపకుడు, దీర్ఘాయువు నిపుణుడు బ్రయాన్ జాన్సన్ ఆరోగ్యకరమైన జీవితానికి సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలను ఎప్పటికప్పుడు పంచుకుంటుంటారు. ఈసారి మాత్రం ఆయన చెప్పిన విషయం అందర్నీ విస్తుపోయేలా చేసింది. పైగా అవి కాస్త సర్వత్రా వివాదాస్పదంగా, చర్చనీయాంశంగా మారాయి. ఇంతకీ ఆయన ఏం అన్నారంటే..బ్రయాన్ జాన్సన్ మంచి నిద్ర కోసం దంపతులకు కొన్ని ఆసక్తికరమైన సూచనలు, సలహాలు ఇచ్చారు. అయితే ఇక్కడ దంపతులు ఎలా బెడ్ షేర్ చేసుకుంటే మంచిదో చెప్పడమే కాస్త చర్చలకు దారితీసింది. వేర్వేరు పడకలు అనేవి భార్యభర్త మధ్య దూరానికి సంకేతంగా చెబుతారు పెద్దలు. కానీ బ్రయాన్ మాత్రం ఆరోగ్యకరమైన నిద్ర కోసం భాగస్వామ్యులు వేర్వేరుగా పడుకుంటేనే మంచిదని బాంబు పేల్చాడు. అంతేగాదు తాను సైతం తన గర్ల్ఫ్రెండ్తో కలిసి నిద్రించనని తేల్చి చెప్పేశాడు. అది నిద్రనాణ్యతను ప్రభావితం చేస్తుందని చెబుతున్నాడు. నిజంగా జంటలు కలిసి నిద్రిస్తే..నిద్ర నాణ్యతపై ఎలాంటి ప్రభావవం చూపుతుంది అనే పరిశోధనను కూడా పంచుకున్నారు. మొత్తం 52 జంటలపై జరిపిన అధ్యయనంలో భాగస్వామి ప్రేరేపితంగా ఒక రాత్రికి సుమారు ఆరుసార్లుకు పైగా పలువురు మెలుకువగా ఉన్నట్ల జాన్సన్ చెబుతున్నారు. అయితే ఈ విషయంపై శాస్త్రవేత్తల మధ్య భిన్నాబిప్రాయాలు ఉన్నట్లు కూడా వెల్లడించారు. పరిశోధన ప్రకారం..కలిసి నిద్రపోవడం వల్ల సుమారు 10% ఎక్కువ REM (ర్యాపిడ్ ఐ మూవ్మెంట్) నిద్ర సరిగా లేదని తేలింది. ముఖ్యంగా భాగస్వామితో కలిసి పడుకుంటే మహిళల నిద్ర గణనీయంగా క్షీణిస్తున్నట్లు గమనించారు. అయితే పురుషులు బాగా నిద్రపోతున్నట్లు తెలిపారు జాన్సన్. అదే సమయంలో కలిసి నిద్రపోతున్న వెయ్యి వయోజన జంటలపై జరిపిన సర్వేలో చాలామంది బాగా నిద్రపోవడమే గాక, వారి మానసిక ఆరోగ్యం కూడా మెరుగ్గా ఉన్నట్లు తెలిపారు. ఈ నివేదిక ఆధారంగా సంతోషంగా, ఆరోగ్యంగా ఉన్న జంటలు బెడ్ షేర్ చేసుకోవడంలో సమస్య ఉండదని వెల్లడైందని అన్నారు. చివరగా ఆయన జంటలు కలిసి నిద్రపోవాలా లేక వేర్వేరుగా నిద్రపోవాలా అనేది ఆయా జంటల వ్యక్తిగత అభిప్రాయమని అన్నారు. అయితే ఆయన వివరణ సోషల్ మీడియాలో విపరీతమైన చర్చకు దారితీసింది. కొందరు ఆయన మాటలకు మద్దతించగా, మరికొందరు మంచి నిద్ర మిమ్మల్ని మంచి భాగస్వాములుగా చేస్తుందని కామెంట్ చేస్తూ పోస్టులు పెట్టారు.(చదవండి: ఆంథోసయనిన్ గుండె, జీవక్రియ ఆరోగ్యానికి ఎలా తోడ్పడుతుందంటే..!) -
ఆంథోసయనిన్ గుండె, జీవక్రియ ఆరోగ్యానికి ఎలా తోడ్పడుతుందంటే..!
ఎరుపు, నీలం, ఊదా రంగు ఆహారాలలో లభించే సహజ జీవక్రియాశీల సమ్మేళనాలైన ఆంథోసయనిన్లను అధికంగా తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉన్న పెద్దలలో గుండె, జీవక్రియల ఆరోగ్యానికి మద్దతు ఇస్తుందని పరిశోధకులు చేసిన తాజా అధ్యయనంలో వెల్లడైంది. అందుకు సంబంధించిన కొత్త అధ్యయనం 'ది అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్'లో ప్రచురితమైంది.ఆంథోసయనిన్లు అనేవి మొక్కలలో సహజంగా లభించే సమ్మేళనాలు. ఇవి అనేక పండ్లు, కూరగాయలకు ఎరుపు, ఊదా, నీలం రంగులను అందిస్తాయి. బెర్రీలలో ఇది అత్యధికంగా ఉంటుంది. అమెరికా బ్లూబెర్రీలు గుండె ఆరోగ్యానికి తోడ్పడే ఆంథోసయనిన్లను అందిస్తాయి.కలిగే లాభాలు..సాధారణంగా తక్కువ ఆంథోసయనిన్ తీసుకునేవారితో పోలిస్తే, దానిని ఎక్కువగా తీసుకోవడం వల్ల ఈ క్రింది ప్రయోజనాలు కనిపించాయి:గుండె జబ్బుల ప్రమాదం 26% తగ్గింది.సాధారణంగా గుండెపోటు అని పిలిచే మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్ ప్రమాదం 18% తక్కువగా వుంది.టైప్ 2 మధుమేహం ప్రమాదం 11% తక్కువగా కనిపించింది.గుండె సంబంధిత మరణాల ప్రమాదం 9% తక్కువఅధిక రక్తపోటు ప్రమాదం 8% తక్కువరోజుకు 50 మిల్లీగ్రాముల నుంచి ఆహారంలో ఆంథోసయనిన్ తీసుకోవడం ప్రారంభించినప్పుడు, రక్తనాళాల పనితీరు, ఇన్సులిన్ సాంద్రతలలో మెరుగుదలలు కనిపించాయని యాదృచ్ఛిక నియంత్రిత పరీక్షలు నివేదించాయి. ఆంథోసయనిన్ అధికంగా ఉండే ఆహారాల ద్వారా ఈ స్థాయిని సాధించవచ్చని పరిశోధకులు పేర్కొన్నారు.రోజువారీ భోజనంలో సహజంగా రంగురంగుల పండ్లు , కూరగాయలను విస్తృత శ్రేణిలో చేర్చడం మొత్తం ఆహార నాణ్యతకు మద్దతు ఇస్తుంది. అమెరికా బ్లూబెర్రీలను తాజాగా, గడ్డకట్టించి లేదా ఎండబెట్టి ఆస్వాదించవచ్చు. వాటిని పెరుగు, ఓట్స్, స్మూతీలు, అల్పాహార వంటకాలు, సలాడ్లు, డెజర్ట్లు వంటి వంటకాల్లో సులభంగా చేర్చుకోవచ్చు.అంతేగాదు సులభమైన, ఆచరణీయమైన ఆహారపు మార్పులు గుండె జబ్బులు, అధిక రక్తపోటు మరియు టైప్ 2 మధుమేహం వంటి వాటి దీర్ఘకాలిక ప్రమాదాన్ని తగ్గించడానికి దోహదపడతాయని ఈ కొత్త పరిశోధన ఫలితాలు సూచిస్తున్నాయి. -
తల్లిపాలే.. తొలి పెట్టుబడి!
నాకు బిడ్డ పుట్టి, పది రోజులు అవుతుంది. బిడ్డ పుట్టిన వెంటనే తల్లిపాలు ఇవ్వాలని, మొదట వచ్చే పసుపురంగు పాలను కొందరు పారేయమంటున్నారు. ఆరు నెలల వరకు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలా? తల్లిపాలు బిడ్డ ఆకలి తీర్చడంతో పాటు మెదడు ఎదుగుదలకు కూడా నిజంగా అంత ఉపయోగపడతాయా?– సరస్వతి, నెల్లూరు. తల్లిపాలు కేవలం బిడ్డ ఆకలి తీర్చే ఆహారం మాత్రమే కాదు. బిడ్డ జీవితంలో ఆరోగ్యానికి వేసే తొలి అడుగు. ముఖ్యంగా మెదడు వికాసానికి అవసరమైన ఎన్నో పోషకాలను అందించే సహజ సంపద. అందుకే తల్లిపాలను వీలైనంత త్వరగా ప్రారంభించడం ఎంతో ముఖ్యం. ఈ రోజుల్లో పిల్లల మెదడు వికాసం, జ్ఞాపకశక్తి, నేర్చుకునే సామర్థ్యం, సృజనాత్మకత గురించి ఎన్నో చర్చలు జరుగుతున్నాయి. నిజానికి వీటికి పునాది పడేది బిడ్డ జీవితంలోని తొలి వెయ్యి రోజుల్లోనే. అందుకే ఆ సమయంలో సరైన పోషణ ఎంతో కీలకం. అందులో తల్లిపాలదే మొదటి స్థానం. అందుకే, తల్లిపాల గురించి, ప్రతి తల్లి గుర్తుంచుకోవాల్సిన ఐదు విషయాలు ఇవే.. పుట్టిన వెంటనే... మెదడు నిర్మాణం మొదలు!శిశువు పుట్టినప్పుడు మెదడు పూర్తిగా అభివృద్ధి చెందదు. తొలి రెండు సంవత్సరాల్లోనే మెదడు దాదాపు 80 శాతం వరకు ఎదుగుతుంది. ప్రతి సెకనుకు లక్షలాది నాడీ సంబంధాలు ఏర్పడతాయి. ఈ అద్భుతమైన ప్రక్రియకు అవసరమైన పోషకాలు, జీవకణాలు, హార్మోన్లు, ఎదుగుదల కారకాలు... అన్నీ తల్లిపాలలో సహజంగానే లభిస్తాయి.సహజమైన మెదడు బూస్టర్!తల్లిపాలలో ఉండే డీహెచ్ఏ, ఏఆర్ఏ, కోలిన్, టారిన్, లాక్టోజ్, వివిధ ఎదుగుదల కారకాలు శిశువు మెదడు కణాల నిర్మాణానికి, నాడీ సంబంధాల ఏర్పాటుకు, జ్ఞాపకశక్తి పెరుగుదలకు దోహదపడతాయి. అనేక అంతర్జాతీయ అధ్యయనాలు కూడా ఇదే విషయాన్ని సూచిస్తున్నాయి. తల్లిపాలు తాగిన పిల్లల్లో సగటు మేధస్సు మెరుగ్గా ఉండే అవకాశం ఉంది. భాషా నైపుణ్యాలు, సమస్య పరిష్కార సామర్థ్యం కూడా మెరుగవుతుంది. పాఠశాలలో విద్యా ప్రదర్శనపైనా ప్రభావం ఉండొచ్చు. కొన్ని నాడీ వికాస సంబంధిత సమస్యల ప్రమాదం కూడా తగ్గే అవకాశం ఉందని పరిశోధనలు సూచిస్తున్నాయి.ప్రేమతో పాలు... మెదడుకు శక్తి!తల్లిపాలు ఇస్తున్నప్పుడు తల్లి బిడ్డను హత్తుకోవడం, కళ్లల్లోకి చూస్తూ మాట్లాడటం, చిరునవ్వులు పంచుకోవడం... ఇవన్నీ తల్లి– శిశువు బంధాన్ని మరింత బలపరుస్తాయి. ఈ సమయంలో విడుదలయ్యే ఆక్సిటోసిన్ వంటి హార్మోన్లు తల్లి– బిడ్డ అనుబంధాన్ని బలపరచడమే కాకుండా, శిశువు భావోద్వేగ, సామాజిక అభివృద్ధికి కూడా పునాది వేస్తాయి. అందుకే తల్లిపాలు కేవలం పోషకాహారం కాదు... ప్రేమ, భద్రత, మెదడు వికాసం అనే మూడు వరాల కలయిక.తొలి బంగారు చుక్కలు!పుట్టిన తర్వాత వచ్చే పసుపు రంగు గాఢమైన పాలను చాలామంది పారేస్తారు. కానీ అది పెద్ద తప్పు. ఈ కోలస్ట్రం శిశువుకు తొలి టీకా లాంటిది. ఇందులో రోగనిరోధక శక్తిని పెంచే యాంటీబాడీలు, శిశువు ఎదుగుదలకు అవసరమైన అనేక జీవపదార్థాలు ఉంటాయి. అందుకే మొదట వచ్చే ఆ కొద్దిపాటి పాలను కూడా వృథా చేయకండి.ఆరు నెలలు... తల్లిపాలు మాత్రమే!ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచన ప్రకారం పుట్టిన ఒక గంటలోపు తల్లిపాలు ప్రారంభించడం మంచిది. మొదటి ఆరు నెలలు పూర్తిగా తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. ఆ తరువాత సరైన అనుబంధ ఆహారంతో పాటు కనీసం రెండేళ్లు లేదా అంతకంటే ఎక్కువ కాలం తల్లిపాలను కొనసాగించడం మంచిది. తల్లికి అండగా... సమాజం కూడా!పని చేసే తల్లులకు పాలివ్వడానికి అనుకూలమైన వాతావరణం కల్పించడం కుటుంబం, కార్యాలయాలు, సమాజం అందరి బాధ్యత. తల్లిపాలను ప్రోత్సహించడం అంటే కేవలం ఒక బిడ్డ ఆరోగ్యాన్ని కాపాడటం కాదు... భవిష్యత్ తరాల ఆరోగ్యానికి, ఎదుగుదలకు బలమైన పునాది వేయడం. పిల్లల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు మంచి పాఠశాల, మంచి కోచింగ్, మంచి గాడ్జెట్లు ఇవ్వాలని ఎంతో ఆలోచిస్తారు. అవన్నీ వాటి స్థానంలో ముఖ్యమే. కానీ బిడ్డ జీవితంలో తొలి పెట్టుబడి మాత్రం పుట్టిన రోజునే మొదలవుతుంది. అది తల్లిపాలు. ప్రతి చుక్క తల్లిపాలు... ప్రతి బిడ్డ మెదడులో ఒక కొత్త భవిష్యత్తుకు పునాది!డా. కె.పవన్ కుమార్, సీనియర్ పీడియాట్రిషియన్, పీడియాట్రిక్ అలర్జిస్ట్, ప్రొఫెసర్ ఆఫ్ పీడియాట్రిక్స్ -
93 ఏళ్ల వయసులో అథ్లెటిక్గా బామ్మ..!
చాలామంది వృద్ధాప్యం అంటే రెస్ట్ తీసుకునే వయసుగా భావిస్తారు. వాస్తవంగా ఆ వయసులో ఏదో దేవుడి నామ జపం చేసుకుంటూ కాలం వెళ్లదీస్తుంటారు. కానీ ఈ బామ్మ మాత్రం తొమ్మిది పదుల వయసులో అథ్లెట్గా మారింది. పైగా ఎన్నో రికార్డులు పతకాలు గెలుచుకుని ప్రపంచవ్యాప్తంగా గుర్తింపుని తెచ్చుకోవడమే కాదు..సాధించాలనే కోరిక ఉంటే వయసు పెద్ద అడ్డంకి కాదని నిరూపించింది. పైగా పట్టుదల, శక్తి వయసుతోపాటు సన్నగిల్వవు అని చాటిచెప్పి..యువతకు స్ఫూర్తిగా నిలిచింది ఈ సూపర్ బామ్మ.ఆ బామ్మే చండీగఢ్కి చెందిన మన్కౌర్. ఆమె 1916లో పంజాబ్లో జన్మించారు. ఆమె తన జీవితంలో ఎక్కువ భాగం క్రీడలకు దూరంగానే పెరిగారు. ఆమె కుమారుడు గుర్దేవ్సింగ్ మాస్టర్స్ అథ్లెటిక్స్లో పాల్గొనడం చూసి 93 ఏళ్ల వయసులో అథ్లెటిక్స్లోకి ప్రవేశించారు. కేవలం అతను పోటీపడటాన్ని చూసి ఈ బామ్ తాను కూడా పరుగును ప్రయత్నించాలని నిర్ణయించుకుంది. ఆ నిర్ణయం ఆమె జీవితాన్నే మార్చేసింది. అలా ఆమె 93వ ఏట అథ్లెటిక్ కెరీర్ని ప్రారంభించి ఎన్నో పతకాలు కైవసం చేసుకుంది. ఆమె విజయాలు భారతదేశం దాటి విస్తరించాయి. పోలాండ్లో జరిగిన వరల్డ్ మాస్టర్స్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్లో ట్రాక్ అండ్ ఫీల్డ్లో నాలుగు బంగారు పతకాలను గెలుచుకున్నారు. దాంతో ఆమెను అంతా చండీగఢ్ అద్భుతంగా పిలుచుకునేవారు. ఆ తర్వాత 2013లో అమెరికాలో జరిగిన వరల్డ్ మాస్టర్స్ ఛాంపియన్షిప్లో 100మీ, 200మీ ఈవెంట్లలో బంగారు పతకాలను గెలుచుకున్నారు. అవేగాక జాతీయ, అంతర్జాతీయ మాస్టర్స్ పోటీలలో కూడా పతకాలను సాధించారు. 2016లో, అమెరికన్ మాస్టర్స్ గేమ్స్లో, ఆమె ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన శతాధిక వయస్కురాలిగా గుర్తింపు పొందారు. విచిత్రం ఏంటంటే.. 100 ఏళ్లు దాటిన తర్వాత కూడా ఆమె ప్రదర్శనలు కొనసాగాయి. 2017లో న్యూజిలాండ్లో జరిగిన వరల్డ్ మాస్టర్స్ గేమ్స్లో, 100మీ ఈవెంట్లో బంగారు పతకాన్ని గెలుచుకున్నారు. అలాగే అలాగే వరల్డ్ మాస్టర్స్, అమెరికన్ మాస్టర్స్ గేమ్స్లో 20కి పైగా పతకాలు సాధించింది. వీటితోపాటు ఆ బామ్మకు మార్చి 08, 2020లో రామ్నాథ్ కోవింద్ చేతుల మీదుగా నారీశక్తి పూరస్కారాన్ని అందుకుంది. ఇక్కడ కౌర్ కథ ఒక ప్రొఫెషనల్ కెరీర్ను నిర్మించుకోవాలనే ఆశతో యువ అథ్లెట్గా పరుగు ప్రారంభించలేదు. కొత్తగా ఏదైనా ప్రయత్నించడం ఇకపై సాధ్యం కాదని చాలా మంది నమ్మే వయస్సులో, అథ్లెటిక్గా ట్రాక్పై అడుగుపెట్టి పోటీలలో పాల్గొని సరికొత్త రికార్డుని రాసి స్ఫూర్తిగా నిలిచించారామె. నిజానికి ఆ వయసులో ఆ ప్రయత్నం చేయడానికి ఎంతో ధైర్యం కావాలి. అది కౌర్ బామ్మ సొంతం. చెప్పాలంటే పట్టుదల, అపారమైన శక్తి, స్థైర్యానికి ప్రతీకగా నిలిచింది. కాగా, జూలై 31, 2021న 105 ఏళ్ల వయసులో మరణించారామె.(చదవండి: వాటితో ఫేషియల్..'గ్లో' మాములుగా లేదు..! వీడియో వైరల్) -
నొప్పి లేకున్నా... నిర్లక్ష్యం వద్దు!!
కొందరిలో ఒక్కోసారి తమ కాళ్లలో లేదా చేతుల్లో గడ్డ కనిపించవచ్చు. అది నొప్పి లేని గడ్డ కావడంతో పాటు క్రమంగా పెరుగుతూపోవచ్చు. కారణం లేకుండా ఎముకల్లో నొప్పి కనిపించడంతో రాత్రివేళల్లో ఆ నొప్పి పెరుగుతూ పోవచ్చు. ఆటల్లో గాయపడటమో లేదా తమకు తెలియకుండా ఏదైనా చిన్నపాటి దెబ్బతగలడం వల్లనో ఇలా జరుగుతుండవచ్చని చాలామంది నిర్లక్ష్యం చేస్తుంటారు. అయితే ఈ లక్షణాలు కొన్నిసార్లు ‘సార్కోమా’ అనే క్యాన్సర్కు సూచనలు కావచ్చు. ఈ సార్కోమా తరహా క్యాన్సర్పై అవగాహన కోసం ఈ కథనం.సార్కోమా అనేది అరుదైన క్యాన్సర్లలో ఒకటి. సార్కోమా అంటే ఏమిటో చూద్దాం...మన దేశంలో సార్కోమా విస్తృతి... భారతదేశంలో ప్రతి ఏడాది సుమారు 20 వేల కొత్త సార్కోమా కేసులు నమోదవుతున్నట్లు అంచనా. అయితే అవగాహన లోపం, లక్షణాలను నిర్లక్ష్యం చేయడం వల్ల చాలామంది వ్యాధి ముదిరిన తర్వాతే ఆసుపత్రికి వస్తున్నారు. తొలిదశలోనే గుర్తించి తగిన చికిత్స అందిస్తే మంచి ఫలితాలు కనిపించడంతో పాటు బాధితుల్లో మంచి మెరుగుదల కనిపిస్తుందని గుర్తుంచుకోవడం ముఖ్యం. సార్కోమా అంటే..? సార్కోమా అనేది దేహంలోని ఎముకలు, కండరాలు, కొవ్వు, రక్తనాళాలు, నరాలు, కార్టిలేజ్, టెండన్లు వంటి మృదుకణజాలా (సాఫ్ట్ టిష్యూస్)లో వచ్చే అరుదైన క్యాన్సర్. సాధారంగా కనిపించే మిగతా క్యాన్సర్లతో పోలిస్తే ఇది కాస్త అరుదుగా కనిపించినప్పటికీ, చిన్నపిల్లలు, యువత, మధ్యవయస్కుల్లోనూ ఇటీవల కొంత ఎక్కువగానే కనిపిస్తోంది. ఇది శరీరంలో ఎక్కడైనా రావచ్చు. ముఖ్యంగా చేతులు, కాళ్లు, తొడలు, భుజాలు, పొత్తికడుపు ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తుంటుంది.లక్షణాలు... తొలి దశల్లో ‘సార్కోమా’లో పెద్దగా నొప్పి ఉండకపోవడంతో చాలామంది నిర్లక్ష్యం చేస్తుంటారు. సార్కోమాలో కనిపించే సాధారణ లక్షణాలవి... ∙నొప్పి లేకుండా క్రమంగా పెరుగుతున్న గడ్డ ∙చేతులు లేదా కాళ్లలో అసాధారణ వాపు ∙రాత్రివేళల్లో ఎక్కువయ్యే ఎముకల నొప్పి ∙కారణం లేకుండా నెలల తరబడి నొప్పి కొనసాగడం ∙గడ్డ పరిమాణం వేగంగా పెరుగుతుండటం ∙కదలికల్లో ఇబ్బంది లేదా గడ్డ వచ్చిన అవయవం పనితీరు తగ్గడం ∙ఐదు సెంటీమీటర్లకు మించిన గడ్డలు రావడం, కొన్ని వారాలుగా ఆ గడ్డల్లో వాపు తగ్గకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే వాటిని నిర్లక్ష్యం చేయడం సరికాదు. పైన పేర్కొన్న లక్షణాలు కనిపించిన వెంటనే డాక్టర్లను సంప్రదించడం మంచిది.నిర్ధారణ ఇలా... సార్కోమా నిర్ధారణ కోసం చేసే పరీక్షల్లో కొన్ని... ∙ఎంఆర్ఐ స్కాన్ ∙పీఈటీ–సీటీ స్కాన్ ∙బయాప్సీ. ఈ పరీక్షలతో కణితి రకం, సైజు, వ్యాప్తితో పాటు అది ఏ దశలో ఉందన్న విషయాలను నిర్ధారణ చేశాక... దాన్ని బట్టి చికిత్సను ΄్లాన్ చేస్తారు. చికిత్స ... బాధితుల పరిస్థితిని బట్టి శస్త్రచికిత్సతో పాటు కీమోథెరపీ, రేడియేషన్ థెరపీనిలలో పేషెంట్కు అవసరమైనదాన్ని నిర్ణయిస్తారు. ఒక్కోసారి ఈ చికిత్సలన్నింటినీ సమన్వయంతో అందించాల్సి రావచ్చు. అయితే తొలిదశల్లోనే చికిత్స మొదలుపెట్టడం వల్ల చాలా మంది జీవితం తిరిగి సాధారణంగా అయ్యేందకు అవకాశాలెక్కువ.ఆధునిక చికిత్సలతో అవయవాన్ని కాపాడే అవకాశం... గతంలో సార్కోమా చికిత్సలో చాలాసార్లు చెయ్యి లేదా కాలిని తొలగించాల్సి వచ్చేది. కానీ ఇటీవల వైద్యరంగంలోని అధునాత సాంకేతిక పురోగతితో లింబ్ సాల్వేజ్ సర్జరీలు, అత్యాధునిక ఇం΄్లాంట్లు, రీకన్ స్ట్రక్షన్ పద్ధతుల ద్వారా గడ్డను పూర్తిగా తొలగించడంతో పాటు అవయవాన్ని కాపాడే అవకాశాలూ గణనీయంగా పెరిగాయి.చికిత్స తర్వాత కూడా జాగ్రత్తలు అవసరం... శస్త్రచికిత్సతో లేదా ఇతరత్రా అవసరమైన చికిత్సల తర్వాత పరిస్థితి అంతా తిరిగి సాధారణ స్థితి చేరుకుందని అనుకోవడం సరికాదు. నిజానికి పేషెంట్లు తమ చికిత్స తర్వాత కూడా ఫిజియోథెరపీ, పునరావాస చికిత్స (రీ–హ్యాబిలిటేషన్ థెరపీ) వంటివి చేస్తూ ఉండటంతో పాటు క్రమం తప్పకుండా ఫాలోఅప్కు రావడమూ తప్పనిసరి. అలాగే కుటుంబ సభ్యుల సహకారమూ పేషెంట్లు పూర్తిగా కోలుకోవడంలో కీలక భూమిక పోషిస్తుందని గుర్తుంచుకోవాలి. డాక్టర్ రాజీవ్ రెడ్డిఆర్థోపెడిక్ ఆంకోసర్జన్– సార్కోమా స్పెషలిస్ట్ -
పిల్లలు ఫిట్స్ (మూర్ఛ)తో బాధపడుతుంటే డాక్టర్ను అడగాల్సిన మూడు ప్రశ్నలు!
భారతదేశంలో లక్షలాది మంది పిల్లలు ఫిట్స్ / ఎపిలెప్సీతో బాధపడుతున్నారు. 2025లో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఏఐఐఎమ్ఎస్) నిర్వహించిన ఒక సర్వే ప్రకారం... చిన్నారుల్లో ఈ ఎపిలెప్సీ వ్యాధి విస్తృతి 0.8% ఉంది. నిజానికి ఈ సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉండవచ్చు. ఎందుకంటే పిల్లల్లో ఎక్కడ వివక్షకు గురవుతారో అనే ఆందోళనతో ఈ వ్యాధి ఉందని తెలపడానికి తల్లిదండ్రులు ఇష్టపడరు. అందుకే పిల్లలు ఫిట్స్ / మూర్ఛ (ఎపిలెప్సీ)తో బాధపడుతూ... రెండు రకాల మందులు వాడుతున్నప్పటికీ ఫిట్స్ ఆగకుండా వస్తూనే ఉంటే... డాక్టర్ను మూడు ప్రశ్నలు అడగటం మంచిది. ఈ మూడు ప్రశ్నలూ పిల్లల జీవితాన్నే మార్చేయవచ్చు. ఇంతకీ ఆ మూడు ప్రశ్నలేమిటో చూద్దాం...→ మొదటి ప్రశ్న: రెండు మందులు వాడుతున్నప్పటికీ పిల్లలకు ఫిట్స్ వస్తూనే ఉన్నాయి. అవి ఆగడానికి శస్త్రచికిత్స (సర్జికల్) అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలా? డాక్టర్ జవాబు : ఫిట్స్తో బాధపడే చిన్నారుల్లో మూడింట ఒక వంతు మందికి మందులతో తగ్గని ఎపిలెప్సీ (డ్రగ్–రెసిస్టెంట్ ఎపిలెప్సీ) వచ్చే అవకాశం ఉంటుంది. ఈ అంశంపై చాలామంది తల్లిదండ్రులకు పెద్దగా అవగాహన ఉండదు. అంటే... ఈ పిల్లల్లో ఎలాంటి మందులు వాడినా దాదాపుగా ఫిట్స్ అదుపులోకి రాకపోవచ్చు. అప్పుడు ఆ పిల్లలకు శస్త్రచికిత్స చివరి ప్రయత్నం మాత్రమే కాదు... వైద్యపరంగా అది ఆ తర్వాతి చికిత్సాప్రక్రియను తెలుసుకునే అంశం కూడా. శస్త్రచికిత్స ద్వారా 50 నుంచి 86 శాతం కేసుల్లో ఫిట్స్ పూర్తిగా ఆగిపోయే అవకాశం ఉంది. అందుకే ఎంతకీ ఫిట్స్ తగ్గని కేసుల్లో ఒకసారి ఈ ప్రశ్న డాక్టర్ను అడగటం మంచిది. → రెండో ప్రశ్న: సాధారణ బ్రెయిన్ స్కాన్ మాత్రమే కాకుండా, ఎపిలెప్సీ-ప్రోటోకాల్ ఎమ్మారై చేయించారా?డాక్టర్ జవాబు : మందులకు లొంగని ఫిట్స్కు కారణమయ్యే కొన్ని లోపాలు సాధారణ మెదడు స్కాన్లలో తరచుగా కనిపించకపోవచ్చు. ఇలాంటి పిల్లలకు ఎపిలెప్సీ-ప్రోటోకాల్ అనేది ఓ ప్రత్యేకమైన ఎమ్మారై పరీక్ష. అంతేకాదు... దీని రెజల్యూషన్ కూడా చాలా ఎక్కువ. ఇది మెదడులోని ఫిట్స్ ఆవిర్భవిస్తున్న ప్రాంతాన్ని (సీజర్ ఫోకస్ను) గుర్తిస్తుంది. ఈ పరీక్ష లేకుండా శస్త్రచికిత్సకు సంబంధించిన చికిత్స ప్రణాళికను మొదలుపెట్టడం సాధ్యం కాదు. అందుకే ఇలాంటి చిన్నారులు చాలామందికి చేసిన ఎమ్మారై నార్మల్గానే ఉందంటూ డాక్టర్లు ఆ పిల్లల పేరెంట్స్కు చెప్పవచ్చుగానీ... నిజానికి అది ఎపిలెప్సీ-ప్రోటోకాల్ ఎమ్మారై కాకపోవచ్చు.→ మూడో ప్రశ్న: వీడియో–ఈఈజీ మానిటరింగ్ గురించి మీ డాక్టర్ను అడిగారా? డాక్టర్ జవాబు : ఫిట్స్ వచ్చినప్పుడు పిల్లల మెదడులోని విద్యుత్ తరంగాలను ‘వీడియో ఈఈజీ’ (వీడియో ఎలక్ట్రో ఎన్సెఫలోగ్రామ్) పరీక్ష గుర్తిస్తుంది. ఆటైమ్లో వారి ప్రవర్తనలో కనిపించే మార్పులనూ ఇది రికార్డు చేస్తుంది. ఫలితంగా మెదడులోని ఏ ప్రాంతం నుంచి ఫిట్స్ వస్తున్నాయో మరింత కచ్చితంగా / నిశితంగా గుర్తించవచ్చు. శస్త్రచికిత్స అవసరమా లేదా అని అంచనా వేయడానికి ఇది అత్యంత కీలకమైన పరీక్ష. పిల్లలకు మందులతో అదుపులోకి రాని ఎపిలెప్సీ ఉంటే, వీడియో–ఈఈజీ గురించి తల్లిదండ్రులే ఒకసారి అడగవచ్చు. చాలా కుటుంబాలు ఫిట్స్ వ్యాధిని మౌనంగా భరిస్తుంటాయి. సమాజంలో ఎదురయ్యే వివక్ష నుంచి పిల్లలను కాపాడటానికి సమస్యను దాచిపెడుతుంటారు. కానీ అలా చేయడం వైద్యపరీక్షలూ, చికిత్సలూ ఆలస్యం అవడం వల్ల ఫిట్స్ను పూర్తిగా తగ్గించే అవకాశాలు సన్నగిల్లే ముప్పు ఎక్కువ. అందుకే పిల్లల చికిత్స మరింత ఆలస్యం కాకుండా ఉండేందుకు ఈ మూడు ప్రశ్నలను పేరెంట్లే అడగవచ్చు. ఒకవేళ తమ డాక్టర్ను అడగటం మొహమాటంగా ఉంటే సెకండ్ ఒపీనియన్ అయినా తీసుకోవచ్చు. ఆ సమాధానాలు చిన్నారిని ఫిట్స్ నుంచి పూర్తిగా విముక్తులను చేసే అవకాశాలెక్కువ. డాక్టర్ రమేష్ శిఘకొల్లిసీనియర్ కన్సల్టెంట్ న్యూరోసర్జన్ -
పైల్స్ నివారణకు అశ్విని ముద్ర
అశ్విని ముద్ర అనేది యోగాలో పెల్విక్ ఫ్లోర్/మలద్వార ప్రాంతంలోని కండరాలను సంకోచించి–వదిలే సాధన. ‘‘అశ్విని’’ అంటే గుర్రం. గుర్రం మలవిసర్జన తర్వాత ఆ ప్రాంతాన్ని సంకోచించి, సడలించే కదలికను పోలి ఉండటం వల్ల ఈ పేరు వచ్చింది.చేసే విధానంముందుగా మలాసనంలో కూర్చోవాలి.కళ్లను మూసుకుని శ్వాసను సహజంగా తీసుకోవాలి.మలవిసర్జన ఆపుతున్నట్లుగా మలద్వార/పెల్విక్ ఫ్లోర్ కండరాలను మెల్లగా బిగించండి.2–3 సెకన్లు హోల్డ్ చేసి, పూర్తిగా రిలాక్స్ చేయండి.ఇలా 15–20 సార్లు చేయవచ్చు.చివర్లో కొన్ని క్షణాలు పూర్తిగా రిలాక్స్ అవ్వండి.ముఖ్యంగా: పొట్ట, తొడలు, పిరుదులు బిగించకుండా పెల్విక్ ఫ్లోర్ కండరాలనే కదిలించేలా ప్రయత్నించాలి. శ్వాసను బిగపట్టకండి.ప్రయోజనాలుకటి ప్రాంతంలోని కండరాలను దృఢంగా మారుస్తుంది.మలబద్ధకం, అజీర్ణం వంటి పొట్ట సమస్యలను తగ్గిస్తుంది.ఆసన ప్రాంతంలో రక్త ప్రసరణను పెంచి మొలలు తగ్గడానికి సహాయపడుతుంది.మూత్రం లీకయ్యే సమస్యను అరికట్టి బ్లాడర్ నియంత్రణను మెరుగుపరుస్తుంది.జాగ్రత్తలునొప్పి వస్తే వెంటనే ఆపాలి.పైల్స్, ఆనల్ ఫిషర్, రీసెంట్ రెక్టల్ సర్జరీ, తీవ్రమైన పెల్విక్ పెయిన్ ఉన్నవారు వైద్యుడి సలహాతోనే చేయాలి.మలవిసర్జన సమయంలో బలవంతంగా ఈ ముద్ర చేయకండి.ఎక్కువసేపు కండరాలను బిగించి ఉంచొద్దు.గర్భిణీలు లేదా ప్రసవం తర్వాత ఉన్నవారు వ్యక్తిగత పరిస్థితిని బట్టి యోగా ప్రొఫెషనల్ /డాక్టర్ గైడెన్స్ తో చేయాలి.– అనిత పాతర్ల, యోగా ట్రైనర్ మరిన్ని వివరాలకు ఈ వీడియోపై క్లిక్ చేయండి (చదవండి: వర్షాకాలంలోనే పంటి సమస్యలు ఎందుకంటే..?) -
వర్షాకాలంలోనే పంటి సమస్యలు ఎందుకంటే..?
వర్షాకాలం రాగానే చల్లటి వాతావరణం వల్ల వేడివేడి టీలు తాగాలని, పకోడీలు, సమోసాలు తినాలని మన మనస్సు లాగేస్తుంటుంది. అయితే, ఇవన్నీ మన దంతాల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయని చాలా మందికి తెలియదు.. చిగుళ్లవాపు, పంటినొప్పి, నోటి దుర్వాసన వంటివి వేధిస్తుంటాయి. అందువల్ల చిన్నచిన్న జాగ్రత్తలు తీసుకుంటే ఈ సమస్యల నుంచి దూరంగా ఉండవచ్చు.రాత్రివేళల్లో బ్రషింగ్ను అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. చల్లటి వాతావరణంలో బద్ధకం వల్ల బ్రష్ చేయడం మానేయడమో, హడావిడిగా ముగించడమో చేస్తుంటారు. దీనివల్ల దంతాల మధ్య మిగిలి΄ోయిన ఆహార వ్యర్థాలపై బాక్టీరియా చేరి యాసిడ్లను విడుదల చేస్తుంది. ఇది ఎనామిల్ను దెబ్బతీసి కేవిటీలకు దారితీస్తుంది.సాయంత్రం వేళల్లో టీ, కాఫీలతోపాటు తియ్యటి బిస్కెట్లు, వేపుళ్లు, స్వీట్లు తినడం సహజం. అయితే జిగటగా ఉండే తీపి పదార్థాలు దంతాల సందుల్లో పేరుకుపోయి బాక్టీరియాకు ప్రధాన ఆహారంగా మారతాయి. అందువల్ల ఆహారం, స్నాక్స్ తిన్న వెంటనే స్వచ్ఛమైన నీటితో నోటిని బాగా పుక్కిలించాలి. దాహం వేయకపోవడం వల్ల వర్షాకాలంలో చాలామంది నీళ్లు తక్కువగా తాగుతుంటారు. దీనివల్ల నోటిలో లాలాజలం ఊరడం తగ్గుతుంది. లాలాజలం నోటిని సహజ సిద్ధంగా శుభ్రం చేయడానికి సహాయపడుతుంది. లాలాజలం తగ్గితే నోటి దుర్వాసన, పంటి సమస్యలు పెరుగుతాయి. అందువల్ల దాహం వేయక΄ోయినా రోజంతా తగినంత కాచి చల్లార్చిన నీటిని తాగుతూ శరీరాన్ని, నోటిని హైడ్రేటెడ్గా ఉంచుకోవాలి.వర్షాకాలంలో ఇమ్యూనిటీ కాస్త తగ్గడం వల్ల చిగుళ్ల ఇన్ఫెక్షన్లు ఎక్కువవుతాయి. బ్రష్ చేస్తున్నప్పుడు చిగుళ్ల నుంచి రక్తం రావడం లేదా వాపు రావడం గమనిస్తే చాలామంది దాన్ని సాధారణ విషయంగా వదిలేస్తారు. చిగుళ్ల రక్తస్రావం అనేది ఇన్ఫెక్షన్కు ప్రారంభ సంకేతం. అందువల్ల నిర్లక్ష్యం చేయకుండా వెంటనే డెంటిస్ట్ను సంప్రదించాలి.వర్షాకాలంలో బాత్రూమ్లలో తేమ ఎక్కువగా ఉంటుంది. బ్రషింగ్ పూర్తయ్యాక టూత్బ్రష్ను బాత్రూమ్లోనే వదిలేస్తే, దానిపై బాక్టీరియా చేరే ప్రమాదం ఉంది. అందువల్ల బ్రష్ చేసిన తర్వాత దాన్ని శుభ్రంగా కడిగి, గాలి తగిలే పొడి ప్రదేశంలో నిలువుగా ఉంచాలి. (చదవండి: ముప్పైల్లో మెదడుకు మోయలేని ఒత్తిడి! ఎందుకంటే?) -
విపరీతంగా భయపడితే పొట్ట గందరగోళం! ఎందుకంటే?
మనం ఏదైనా ఎగ్జామ్కి వెళ్లేముందు గానీ, లేదా ఇంటర్వ్యూకి అటెండ్ అయేపుడు గానీ మనసులోనే కాకుండా పొట్టలోనూ గాబరాగా అనిపిస్తుంటుంది. అయితే ఇది వట్టి ముచ్చట కాదని.. మన జీర్ణవ్యవస్థ, మెదడు నిరంతరం ఒకదానితో ఒకటి మాట్లాడుకుంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మన పొట్టలో ఉండే బాక్టీరియా ఇచ్చే సంకేతాలే మన భావోద్వేగాలను, ఒత్తిడిని, మూడ్ను ప్రభావితం చేస్తాయని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి.హార్వర్డ్ మెడికల్ స్కూల్ పరిశోధకుల ప్రకారం, మన జీర్ణ వ్యవస్థకు, మెదడుకు మధ్య నిరంతరం సమాచార మార్పిడి జరుగుతుంది. దీనినే ‘గట్–బ్రెయిన్ ఆక్సిస్’ అని పిలుస్తారు. బ్రెయిన్ను, జీర్ణ వ్యవస్థను కలిపే వేగస్ అనే ఒక ముఖ్యమైన నరాల వ్యవస్థ ద్వారా సంకేతాలు మార్పిడి చెందుతుంటాయి. అలాగే మన మనసును సంతోషంగా ఉంచే ‘సెరోటోనిన్’ అనే రసాయనం మెదడులో కాకుండా ఎక్కువగా జీర్ణ వ్యవస్థలోనే తయారుకావడం విశేషం.మనసు ఎందుకు మారుతుంది?మన జీర్ణవ్యవస్థలో ట్రిలియన్ల కొద్దీ సూక్ష్మజీవులు ఉంటాయి. ఆహారం, ఒత్తిడి, ఆల్కహాల్, లేదా ఇతర వ్యాధుల వల్ల పొట్టలో వాపు లేదా సూక్ష్మజీవుల సమతుల్యత దెబ్బతిన్నప్పుడు, జీర్ణవ్యవస్థ నుంచి మెదడుకు వెళ్లే సంకేతాలలో మార్పులు వస్తాయి.ఇది ఆందోళన, ఒత్తిడి, నీరసానికి కారణమవుతుంది. అందుకే మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు కడుపులో అసౌకర్యంగా అనిపిస్తుంది. మన శారీరక, మానసిక ఆరోగ్యం ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయని ఈ పరిశోధనలు నిరూపిస్తున్నాయి. సరైన ఆహారం తీసుకుంటూ పొట్ట ఆరోగ్యాన్ని కా΄ాడుకుంటే మానసిక ప్రశాంతతను కూడా కా΄ాడుకోవచ్చునని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. -
బంధం బలపడాలంటే.. ఆధిపత్యం కాదు అనురాగం ముఖ్యం!
భార్యాభర్తల మధ్య అనుబంధం అనేది రెండు విభిన్న మనస్తత్వాల కలయిక. ఇద్దరి మధ్య ప్రేమతో పాటు చిన్నపాటి విభేదాలు ఉంటుంటాయి. ఇలాంటివి ఎన్ని ఉన్నా.. అవతలి వ్యక్తి ఆలోచనలను, అభిప్రాయాలను తక్కువ చేసి చూడటం మొదలుపెడితే మాత్రం బంధంలో చీలికలు రావొచ్చని నిపుణులు చెబుతున్నారు. అలా కాకూడదంటే.. ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం!కొంతమంది ’నేను నీ కంటే ఎక్కువ సంపాదిస్తున్నాను’, ’అన్ని విషయాల్లోనూ నీకన్నా నాకే ఎక్కువ తెలుసు’ అనే భావనతో భాగస్వామిని చిన్నచూపు చూస్తుంటారు. ఇలాంటప్పుడు ఎదుటి వారు చెప్పేది ఎంత ముఖ్యమైనదైనా, అది వినడానికి మనసు అంగీకరించదు. ఈ క్రమంలో ఒక బంధం బలంగా ఉండాలంటే, ఆధిపత్యం చూపించడానికన్నా అనురాగంతో ఉండడం అవసరం. ఒకరి విషయాల్లో మరొకరు అనవసరంగా జోక్యం చేసుకోకూడదనే ఉద్దేశంతోనో లేదా ఎదుటివారికి అవగాహన లేదన్న భ్రమతోనో ‘నీకేం తెలియదు’ అని అంటుంటారు. అయితే, ఇది తరచూ సాగుతుంటే మాత్రం భాగస్వామి ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తుందని హెచ్చరిస్తున్నారు.సున్నితంగా చెప్పడంఒక సమస్య వచ్చినప్పుడు లేదా ఏదైనా నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు ’నేను చూసుకుంటాను’ అని చెప్పడం కంటే, దీని గురించి నీ అభిప్రాయం ఏంటి? అని అడగడం మంచిది. దీనివల్ల భాగస్వామికి తాము కూడా ఈ బంధంలో ఒక ముఖ్యమైన భాగమనే నమ్మకం కలుగుతుంది. ఒకవేళ వారికి ఆ విషయంపై అవగాహన లేకపోతే, విసుక్కోకుండా సున్నితంగా వివరించాలని తెలియజేస్తున్నారు.దంపతులిద్దరూ చర్చించుకోవడంభార్యాభర్తల అనుబంధం అంటే ఒకరి భావాలను మరొకరు పంచుకోవడం. ఒకరికి తెలిసిన విద్య మరొకరికి తెలియకపోవచ్చు. అంతమాత్రాన అవతలి వారిని తక్కువ అంచనా వేయకూడదు. ఇంట్లో పనులైనా, ఆర్థిక నిర్ణయాలైనా ఇద్దరూ కలిసి చర్చించు కున్నప్పుడే కదా వారి మధ్య సామరస్యత ఏర్పడేది!బంధం బలపడడానికి...భాగస్వామి ఏదైనా తప్పు చేసినప్పుడు అందరి ముందూ లేదా కఠినంగా విమర్శించడానికి బదులుగా.. వారు చేసే చిన్న పనులను కూడా అభినందించడం వల్ల వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని అంటున్నారు. ప్రతి విషయంలోనూ మీదే పై చేయి కావాలని అనుకోవద్దని సలహా ఇస్తున్నారు. ఒక్కోసారి వెనక్కి తగ్గడం వల్ల బంధం మరింత బలపడుతుందని తెలియజేస్తున్నారు. ఏబంధమైనా నిలబడాలంటే ఒకరిపై ఒకరికి గౌరవం, అర్థం చేసుకునే స్వభావం, నమ్మకం ఉండాలి. అప్పుడే వైవాహిక జీవితం హ్యాపీగా సాగుతుంది. హ్యాపీ మ్యారీడ్ లైఫ్! -
ముప్పైల్లో మెదడుకు మోయలేని ఒత్తిడి! ఎందుకంటే?
ఇరవైల్లో వచ్చే ఒత్తిడికి, ముప్పైల్లో అనుభవించే ‘బర్నౌట్’కు చాలా తేడా ఉంటుంది. 20 ఏళ్ల వయసులో వచ్చే అలసట, నిస్సత్తువ కాస్త నిద్రపోతేనో లేదా ఒక వీకెండ్ ట్రిప్ వెళ్తేనో తగ్గిపోతుంది. 30 ఏళ్ల వయసు వచ్చేసరికి ఇదే లక్షణం తీవ్రమైన, దీర్ఘకాలిక మానసిక సమస్యగా మారుతోంది. అసలు ఈ బర్నౌట్కు కారణాలేంటి?బాధ్యతల ఒత్తిడి30 ఏళ్ల వయసులో జీవితంలో ఒకేసారి అనేక బాధ్యతలు వచ్చిపడతాయి. కెరీర్ కోసం పాకులాట, కుటుంబ బాధ్యతలు, సామాజిక సంబంధాలు, ఆరోగ్యం కాపాడుకోవడం వంటి వాటితో మనుషులు నలిగిపోతుంటారు. దీనివల్ల ఒత్తిడికి గురవుతుంటారు. అందువల్ల ప్రతిరోజూ కాసేపు నడక, ధ్యానం లేదా నచ్చిన పని చేస్తూ శరీరానికి, మెదడుకు కాస్త సమయం ఇవ్వాలి.దొరకని విశ్రాంతి..20ల్లో ఏదైనాప్రాజెక్ట్ కోసం రాత్రుళ్లు జాగారం చేసినా శరీరం త్వరగా కోలుకుంటుంది. కానీ ముప్పైల్లోకి అడుగుపెట్టాక దశాబ్ద కాలంగా పడుతున్న కష్టం, ఒత్తిడి ఒకేసారి బయటపడతాయి. తగినంత విశ్రాంతి దొరక్కపోవడం వల్ల శరీరం, మనస్సు నిరంతరం నిస్సత్తువలోనే ఉండిపోతాయి.ఆర్థిక ఆందోళనలు‘30 ఏళ్లు వచ్చాయంటే జీవితంలో సెటిల్ అయిపోవాలి’ అనే సామాజిక ఆలోచన పెద్ద భారంగా మారుతోంది. సొంత ఇల్లు కొన్నానా? రిటైర్మెంట్ సేవింగ్స్ ఉన్నాయా? పిల్లల చదువుల సంగతి ఏంటి? అనే ప్రశ్నలు వెంటాడుతుంటాయి. సోషల్ మీడియాలో తోటి వారి ప్రగతిని చూసి ‘నేను ఇంకా వెనుకబడే ఉన్నానా?’ అనే అభద్రతా భావం మానసిక ప్రశాంతతను దూరం చేస్తోంది. అందువల్ల సమాజం నిర్ణయించిన మైలురాళ్లతో మిమ్మల్ని మీరు పోల్చుకోవద్దు.జీవక్రియల్లో మార్పులువయసు పెరుగుతున్న కొద్దీ శారీరక శక్తి, కోలుకునే సామర్థ్యం తగ్గుతాయి. ఇరవైల్లో లాగా తక్కువ నిద్రతో సరిపెట్టుకోవడం లేదా ఆహారం సరిగా తీసుకోకపోవడం వంటివి శరీరానికి తీవ్ర నష్టం కలిగిస్తాయి. అందువల్ల ఆరోగ్యానికిప్రాధాన్యతనివ్వాలి.విశ్రాంతి తీసుకున్నా తగ్గని విపరీతమైన అలసట... ఏ పనిపైనా ఆసక్తి లేకపోవడం... నలుగురిలో ఉన్నా ఏదో తెలియని నిరాశ, ఒంటరితనం... ఈ లక్షణాలు ఈ మధ్య మీలో ఎక్కువగా కనిపిస్తున్నాయా? మీరు ముప్పైలో ఉన్నారా? అయితే మీరు ‘బర్నౌట్’బారిన పడి ఉండవచ్చు.విరామం లేని ‘వర్క్ కల్చర్’స్మార్ట్ఫోన్లు, మెయిల్స్, వర్క్–ఫ్రమ్–హోమ్ సంస్కృతి వల్ల ఆఫీసు పనికి, వ్యక్తిగత జీవితానికి మధ్య సరిహద్దులు చెరిగిపోయాయి. పని వేళలు ముగిసిన తర్వాత కూడా మెయిల్స్కు, మెసేజ్లకు అందుబాటులో ఉండాల్సి రావడం వల్ల మెదడు ఎప్పుడూ విశ్రాంతి పొందే స్థితిలోకి వెళ్లలేకపోతోంది. అందువల్ల పని వేళలు ముగిశాక వర్క్ మెయిల్స్, మెసేజ్లకు దూరంగా ఉండటం అలవాటు చేసుకోవాలి. -
135 రోజుల్లో 45 కేజీలు: నో స్ట్రిక్ట్ డైట్, జస్ట్ నడకతో..
బరువు తగ్గడం అనేది చాలామందికి ఒక అసాధారణమైన లక్ష్యంగా ఉండిపోతుంటుంది. తీవ్రమైన డైట్లు, డిటాక్స్ క్లెన్సింగ్లు, అధిక తీవ్రత గల వర్కౌట్లు వంటి ఎన్నో ట్రెండ్లతో చాలామంది బరువు తగ్గొచ్చని నిరూపిస్తుంటారు. కానీ అవి కూడా మళ్లీ యథావిధికి వచ్చేలా అమాంతం బరువుని పెంచేస్తాయి. దాంతో స్థిరమైన ఆరోగ్యకరమైన బరువుని మెయింటైన్ చేయలేక చతికిలపడుతుంటారు. కానీ ఈ వ్యక్తి అలాంటి ట్రెండ్లు ఏం పాటించకుండా కేవలం వాకింగ్తోనే ప్రభావవంతంగా బరువు తగ్గొచ్చని నిరూపించి అందర్నీ ఆశ్చర్యపరిచేలా ఏకంగా 45 కేజీలు తగ్గాడు. మరి అతడికి ఇదెలా సాధ్యమైందంటే.. వివేక్ సిద్ధా అనే ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ కేవలం వాకింగ్తో జస్ట్ 135 రోజుల్లో 45 కేజీలు తగ్గినట్లు పేర్కొన్నాడు. ప్రత్యేకమైన డైట్లు, ఖరీదైన సప్లిమెంట్లు గానీ, షార్ట్కట్లు లేవు అంటూ సోషల్ మీడియా వేదికగా తన వెయిట్లాస్ జర్నీ గురించి షేర్ చేసుకున్నాడు. గురుగావ్లో పనిచేసే సిద్ధా, ప్రతిరోజూ ఢిల్లీలోని తన ఇంటికి నడిచి వెళ్తానని చెబుతున్నాడు. అతడు పదివేల అడుగులతో ప్రారంభించి..క్రమంగా 20 వేల దాక అడుగులు పెంచుకుంటూ వాక్ చేశానని తెలిపాడు.ఆహారం కూడా అంతే ముఖ్యంఒకప్పుడు సిద్దా 128 కేజీల బరువుతో ఉండేవాడు. అలాంటి ఆయన నడకతో కిలోల కొద్దీ బరువు తగ్గడం విశేషం. ఆయన వాకింగ్ తోపాటు అధిక ప్రోటీన్ కలిగిన ఆహారంపై దృష్టి పెట్టానని చెప్పారు. అందుకోసమే రెండుపూటల భోజనంతో ప్రారంభించి..ఓమాడ్ శైలి దినచర్యకు మారినట్లు తెలిపారు.బరువు తగ్గడానికి నడక ఎంత ప్రభావవంతమైనదంటే..బరువు తగ్గడానికి నడక చాలా ప్రభావవంతమైనది, ఇది అందుబాటులో ఉంటుంది, నిలకడగా చేస్తే..కొవ్వును కరిగించి, లీన్ కండరాలను కాపాడటంలో శక్తిమంతంగా ఉంటుంది. రోజువారీ దినచర్యలో కేవలం 30 నిమిషాల వేగవంతమైన నడకను జోడించడం ద్వారా రోజుకు సుమారుగా 150 అదనపు కేలరీలను కరిగించవచ్చు. అయితే, దీని నిజమైన ప్రభావం వేగం, నిలకడ, మొత్తం ఆహారపు అలవాట్లపై ఆధారపడి ఉంటుందని చెబుతున్నాడు వివేక్.నడక నాడీ వ్యవస్థను ప్రశాంతపరుస్తుంది, ఒత్తిడిని తగ్గిస్తుంది.నడక కోరికలను విపరీతంగా పెంచకుండా కేలరీలను దహిస్తుంది.ఇది సురక్షితమేనా?135 రోజుల్లో 45 కిలోలు తగ్గాలంటే, మీరు ప్రతిరోజూ సుమారు 2,567 కేలరీల శక్తి లోటును కొనసాగించాల్సి ఉంటుంది. చాలా మందికి, వారి మొత్తం జీవక్రియ ఒక రోజులో అన్ని కేలరీలను దహించదు. దీనిని సాధించడానికి దాదాపు పూర్తి ఉపవాసంతో పాటు గంటల తరబడి తీవ్రమైన రోజువారీ వ్యాయామం చేయాల్సి ఉంటుంది. ఇలా చేస్తే..వేగంగా బరువు తగ్గడం వల్ల... పిత్తాశయ రాళ్లు, కండరాల క్షీణత, జీవక్రియ పతనం, జుట్టు రాలడం, ఎలక్ట్రోలైట్ అసమతుల్యతలతో సహా అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది.సురక్షితమైన 45 కిలోల బరువు తగ్గాలంటే,వాస్తవికంగా 11 నుంచి 22 నెలల సమయాన్ని కేటాయించుకోవాలి. ఈ నెమ్మదైన కాలవ్యవధికి సహనం అవసరమైనప్పటికీ, ఇది కండరాలకు బదులుగా స్వచ్ఛమైన కొవ్వును కోల్పోవడానికి, చర్మం వదులుగా మారడాన్ని నివారించడానికి, అలాగే జీవితాంతం పాటించగలిగే ఆహారపు అలవాట్లను పెంపొందించుకోవడానికి వీలు కల్పిస్తుంది. View this post on Instagram A post shared by Vivek siddhaa (@the_vivek_siddhaa)గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే. పూర్తి వివరాలకు వైద్యులు లేదా వ్యక్తిగత నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: తండ్రి చెంత జైలులోనే ఆ చిన్నారి..!ఆ ఐఏఎస్ అధికారి అడిగిన ప్రశ్న..) -
ప్రోస్టేట్ కేన్సర్ ఎముకలకు వ్యాపిస్తుందా..? అమెరికా మాజీ అధ్యక్షుడు జోబైడెన్ కూడా..
అమెరికా మాజీ అధ్యక్షుడు జోబైడెన్కి గతేడాది మే నెలలో తీవ్రమైన ప్రోస్టేట్ కేన్సర్ ఉన్నట్లు నిర్థారణ అయ్యింది. ఆ కేనర్స్కు గ్లీసన్ స్కోర్ 9 (గ్రేడ్ గ్రూప్ 5)" ఉన్నట్లు వెల్లడిచారు అమెరికా వైద్యులు. అమెరికన్ కేన్సర్ సొసైటీ ప్రకారం..కేన్సర్ చాలా అసాధారణంగా కనిపిస్తే..గ్రేడ్ 5 కేటాయిస్తారు. ఇక్కడ గ్లీసన్ స్కోర్, గ్రేడ్ గ్రూప్ అనేవి కేన్సర్ ఎంత వేగంగా పెరుగుతుందో తెలియజేసే సంఖ్యలు. గ్లీసన్ స్కోర్ 8-10 ఉంటే..కేన్సర్ ప్రోస్టేట్ నుంచి శరీరంలోని ఇతర భాగాలకు వ్యాపించే అవకాశాలు అధికం. ప్రస్తుతం జోబైడెన్ పరిస్థితి కూడా ఇలానే ఉంది. ఆయనకు కూడా కేన్సర్ మరింత విస్తరించిందని, చికిత్సలో తీవ్ర నొప్పితో బాధపడుతున్నారని ఆయన కుమారుడు హంటర్ బైడెన్ స్వయంగా వెల్లడించారు. అది ఎముకలను దాటి ఇతర ప్రాంతాలకు కూడా వ్యాపించిందని ఆయన తెలిపారు.ప్రోస్టేట్కు ఆ స్వభావం ఉంది..ఈ కేన్సర్ వెన్నుముక, కటి, తుంటి, పక్కటెముకలను ప్రభావితం చేస్తంఉది. దాదాపు అన్ని రకాల కేన్సర్లు ఎముకలకు వ్యాపించగలవు. కానీ కొన్ని రకాల కేన్సరలు ఎముకలకు వ్యాపించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వాటిలో రొమ్ము కేన్సర్, ప్రోస్టేట్ కేన్సర్ ఉన్నాయి. ప్రోస్టేట్ కేన్సర్ కణాలు ప్రాథమిక కణితి నుంచి విడిపోయి, రక్తప్రవాహం లేదా శోషరస వ్యవస్థ ద్వారా ప్రయాణించి..ఎముకల లోపల చేరి పెరుగుతాయి. ఫలితంగా కలిగే పరిణామాలు..ఎముకలకు కేన్సర్ వ్యాప్తి చెందడంతో అనేక తీవ్రమైన సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. వాటిలో కొన్ని..1. తీవ్రమైన ఎముక నొప్పిరాత్రిపూట లేదా కదలికల సమయంలో తీవ్రమయ్యే నిరంతర, మందమైన లేదా కొట్టుకుంటున్నట్లు ఉండే నొప్పి అత్యంత సాధారణ లక్షణాలలో ఒకటి. ఎందుకంటే కేన్సర్ సాధారణ ఎముక నిర్మాణాన్ని దెబ్బతీసి, గణనీయమైన అసౌకర్యాన్ని కలిగిస్తుంది.2. ఎముకలు విరగడంఅత్యంత బలహీనమైన నిర్మాణం కారణంగా, చిన్నపాటి కదలికలు లేదా జస్ట్ కిందపడటంతోనే ఎముకలు విరిగిపోతాయి.3. హైపర్కాల్షిమియాఎముకలకు కేన్సర్ వ్యాపించడం వల్ల రక్తంలో కాల్షియం స్థాయిలు పెరిగి, వికారం, డీహైడ్రేషన్, గందరగోళం, ఇతర తీవ్రమైన ఆరోగ్య సమస్యలు కలుగుతాయి.4. వెన్నుపాముపై ఒత్తిడివెన్నుపూసకు సమీపంలో మెటాస్టేసిస్ సంభవిస్తే, అవి వెన్నుపామును ఒత్తిడికి గురిచేసి, బలహీనత, స్పర్శజ్ఞానం కోల్పోవడం లేదా పక్షవాతానికి దారితీయవచ్చు.5. కదలిక తగ్గడంనొప్పి, ఎముకలు విరగడం వల్ల రోగి కదలడం పరిమితం కావచ్చు, ఇది వారి జీవన నాణ్యత, స్వాతంత్ర్యంపై ప్రభావం చూపుతుంది.6. ఎముక మజ్జపై ప్రభావంఎముక మజ్జలో చేరిన కేన్సర్, శరీరం ఎర్ర, తెల్ల రక్త కణాలను ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని దెబ్బతీస్తుంది, దీనివల్ల అలసట తోపాటు తరచుగా ఇన్ఫెక్షన్లు వస్తాయి.చికిత్సా పద్ధతులుసాధారణంగా ఎముకలకు వ్యాపించిన కేన్సర్ను నయం చేయలేనప్పటికీ, ఈ వ్యాధిని నియంత్రించడానికి, లక్షణాలను తగ్గించడానికి అనేక చికిత్సా పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. వీటిలో హార్మోన్ థెరపీ, రేడియేషన్ థెరపీ, బిస్ఫాస్ఫోనేట్లు, కీమోథెరపీ, టార్గెటెడ్ థెరపీలు, శస్త్రచికిత్స వంటి ఉపశమన చికిత్సలు ఉన్నాయి.ఎముకలకు వ్యాపించిన కేన్సర్ అనేది ముదిరిన దశకు ఒక సంకేతం. దీనిని అధికారికంగా స్టేజ్ IV ముదిరిన వ్యాధిగా వర్గీకరించారు. అంటే కేన్సర్ ఇకపై ప్రోస్టేట్ గ్రంథికి మాత్రమే పరిమితం కాకుండా, శరీరమంతటా వ్యాపించి వ్యాధిగా మారిందని అన్నారు. దీనికి కేవలం ఒక నిర్దిష్ట ప్రదేశంలోనే చికిత్స కాకుండా, పూర్తి శరీర చికిత్స అవసరం అని వైద్యులు చెబుతున్నారు.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాకలు వ్యక్తిగత వైద్యలు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: నో జిమ్, నో సప్లిమెంట్లు..! 75 ఏళ్ల వయసులోనూ ఆ అమ్మమ్మ..) -
స్టెమ్సెల్స్ మిరాకిల్స్.. ఇకపై బట్టతల ఉండకపోవచ్చు!
ఒక కొత్తజీవి పుడుతున్నప్పుడు ఏర్పడే మొదటి కణంలాగే మూలకణాలూ తొలుత ఒకటిలాగే కనిపిస్తాయి. కానీ అవి భవిష్యత్తులో ఏర్పడబోయే దేహ భాగాలను బట్టి, దేహంలోని వ్యవస్థలను బట్టి వివిధ రకాల కణాలుగా రూపుదిద్దుకుంటాయి. ఆ కణాలు మరింత విభజన చెందాక టిష్యూస్గా ఏర్పడతాయి. అలా చర్మం, రక్తకణాలు, కడుపులోని లోపలి పొరల తాలూకు కణాలు, కాలేయం, మెదడు, వెంట్రుకలు వంటి రకరకాల శరీర భాగాలు ఏర్పడతాయి. మౌలికంగా అవన్నీ కణాలే అయినా అవి చేసే పనిని బట్టి కొద్ది వైవిధ్యంతో ఉంటాయి. అయితే ఇలాంటి వేర్వేరు కణాల్లో ఏ భాగానికి చెందిన లేదా ఏ వ్యవస్థకు చెందిన కణంగానైనా రూపొందే శక్తి ఒక్క మూలకణాలకు మాత్రమే ఉంటుంది.అలా మారగలిగే మౌలిక కణాన్నే మూలకణం (ఇంగ్లిష్లో స్టెమ్సెల్) అంటారు. ఈ స్టెమ్సెల్స్ సహాయంతో ఎన్నో అద్భుతాలు చేయవచ్చని ఆధునిక వైద్యశాస్త్ర పరిశోధనల ఫలితాలు చెబుతున్నాయి. ఇప్పటికే కొన్ని వ్యాధులకు చికిత్సలూ జరుగుతున్నాయి. స్టెమ్సెల్స్పై అవగాహనతో పాటు వేర్వేరు కణాలుగా రూపొందడం ద్వారా అవి ఇచ్చే ప్రయోజనాలను తెలుసుకుందాం.మూలకణం అంటేనే ఏ రకమైన కణంగానైనా మారిపోగల మౌలిక కణం కదా! మరి అలాంటి ఆ మూలకణాల్లోనూ రకాలుంటాయి. పురుషుడి వీర్యకణం... మహిళలోని అండంతో ఫలదీకరణం చెందిన తర్వాత తొలుత ఏర్పడేదే... పిండం. తొలుత ఇది ఒకే కణంగా ఉంటుంది. దీన్నే ‘ఎంబ్రియోనిక్ సెల్’ (ఫెర్టిలైజ్డ్ ఓవమ్) అంటారు. ఆ తర్వాత భవిష్యత్తులో ఏర్పడాల్సిన వేర్వేరు కణజాలాలకు అనుగుణంగా ఈ కణం (ఫెర్టిలైజ్డ్ ఓవమ్) విభజన చెందుతూ రకరకాల మూలకణాలు ఏర్పడుతాయి. అటు తర్వాత అవి విభజితమవుతూ తాము భవిష్యత్తులో నిర్వహించాల్సిన వేర్వేరు అవయవాలూ, వ్యవస్థలకు అనుగుణంగా వేర్వేరు కణాలుగా రూపొందుతాయి. వీటి తొలిదశ కణాలనే మూలకణాలుగా పేర్కొనవచ్చు.ఇది శాస్త్రవేత్తల ప్రతిభ... ఈ నేపథ్యంలో ప్రతి సందర్భంలోనూ ప్రతివారికీ అవసరమైన మూలకణాలు దొరకకపోవడంతో శాస్త్రజ్ఞులు ప్రత్యామ్నాయ మార్గాలను శోధించి, కొంతమేరకు విజయం సాధించారు. పరిశోధనశాలల్లో మూలకణాలను రూపొందించారు. వీటినే ‘ఇండ్యూస్డ్ ప్లూరిపొటెంట్ స్టెమ్సెల్స్’ (ఐపీఎస్) అని చెబుతారు. నిజానికి ఇవి మూలకణాల్లాగే పనిచేసినా... పుట్టినప్పుడుగానీ లేదా జీవితకాలంలో గానీ దేహంలో ఎక్కడా ఉండవు. శాస్త్రజ్ఞులు చర్మం కణాల నుంచి కొన్నింటిని సేకరించి అచ్చం పిండం ఏర్పడినప్పుడు కనిపించే తొలి కణం (ఎంబ్రియోనిక్ స్టెమ్సెల్స్) లాంటివాటిని సృష్టించగలిగారు.మూలకణాలను కనుగొన్న తీరిది... దాదాపు మూడు దశాబ్దాల కిందట... అంటే 1998 ప్రాంతాల్లో... తమ పరిశోధనల్లో శాస్త్రజ్ఞులకు ఎలుకల పిండాలలో తొలిసారిగా మూలకణాలన గుర్తించారు. దాదాపు అదే టైములోనే తమ పరిశోధనల ద్వారా మానవ మూలకణాలను ల్యాబ్లో వేరు చేయడంలోనూ శాస్త్రజ్ఞులు విజయం సాధించారు. తొలిదశలో ఈ కణాలను ఉపయోగించి ఇన్విట్రో ఫెర్టిలైజేషన్ వంటి ప్రక్రియల ద్వారా సంతానం లేనివారికి పిల్లలు కలిగేలా చేయడం వరకే వారి కృషి పరిమితమైంది. ఆ తర్వాత వాటిని ఉపయోగించడంపై అనేక నైతికపరమైన అభ్యంతరాలు, ప్రశ్నలు వెలువడ్డాయి.ఇండ్యూస్డ్ ప్లూరిపొటెంట్ స్టెమ్స్టెల్స్వైద్యరంగంలో ప్రయోజనాలు అటు తర్వాత జరిగిన పరిశోధనల్లో మానవ చర్మం నుంచి కొన్ని కణాలను సేకరించి వాటిని అచ్చం మూలకణాల్లాగే ఉండే కణాలను ఇండ్యూస్డ్ ప్లూరిపొటెంట్ స్టెమ్సెల్స్ (ఐపీఎస్)గా రూపొందించడంలో కృతకృత్యులయ్యారు. ఈ ప్రక్రియపైనా కొన్ని అభ్యంతరాలు వెలువడ్డాయి. అయినప్పటికీ వీటితో రకరకాల చికిత్స చేయడం ద్వారా ఒనగూరుతున్న ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని... వివిధ రకాల ఆరోగ్య సమస్యలకు వాటిని చికిత్సల్లో ఉపయోగిస్తున్నారు. ఎముక మజ్జ (బోన్ మ్యారో) నుంచి సేకరించిన కణాలతో కూడా మూలకణాలను రూపొందించి వివిధ రకాల వ్యాధులకు చికిత్స చేస్తున్నారు. అలా చికిత్స చేయడాన్ని మూలకణం చికిత్స లేదా స్టెమ్సెల్ థెరపీగా పేర్కొంటున్నారు.మూలకణ చికిత్స (స్టెమ్సెల్ థెరపీ) అంటే...? శరీరంలోని కొన్ని కణాలు పూర్తిగా దెబ్బతింటే అవి మళ్లీ పుట్టవు. దాంతో ఆ దెబ్బతిన్న అవయవంలో గానీ, ఆ వ్యవస్థలో గానీ శాశ్వత లోపం ఏర్పడుతుంది. అయితే స్టెమ్సెల్స్ థెరపీ ద్వారా ఆ దెబ్బతిన్న / చనిపోయిన కణాల స్థానాన్ని ఈ మూలకణాలు భర్తీ చేయవచ్చు. అప్పుడవి అచ్చం ఆ అవయవానికి సంబంధించిన మునపటి కణాల్లాగే మారిపోతాయి. దాంతో ఆ అవయవం కూడా మునుపటిలాగే పని చేయడం ్రపారంభిస్తుంది. ఫలితంగా ఆ వ్యవస్థ (సిస్టమ్) కూడా ఎలాంటి లోపం లేకుండా తన పనితీరును కొనసాగిస్తుంది.స్టెమ్సెల్ థెరపీ ఎప్పుడంటే...? సాధారణంగా ఇతర సంప్రదాయ వైద్య చికిత్సలైన మందులు ఇవ్వడం లేదా శస్త్రచికిత్స వంటివి ఫలితాలివ్వని సందర్భాల్లో మూలకణాలను సేకరించి ఒక అవయవానికి అందేలా చేస్తారు. అందుకే మూలకణాలతో చేసే చికిత్స ప్రక్రియను ‘రీజెనరేటివ్ మెడిసిన్’ అని కూడా అంటారు. మూలకణ చికిత్సకు ప్రత్యేకమైన చికిత్స ప్రక్రియలుంటాయి. ఈ చికిత్సకులకు జాతీయ ఆరోగ్య అధికారుల నుంచి ప్రత్యేకమైన అనుమతి ఉంటుంది. ఆ చికిత్స విధానంలో నైపుణ్యం పొందిన చికిత్సకులే ఈ తరహా చికిత్సలు చేయాల్సి ఉంటుంది.మూలకణ చికిత్సలో ఆధునిక ప్రక్రియలు... మూలకణాలతో చేసే చికిత్స తొలి దశల్లో అంత వేగంగా సాగకపోయినప్పటికీ... ఇటీవల ఈ ప్రక్రియలో మంచి పురోగతి ఉంది. గత పదేళ్ల వ్యవధిలో ఈ అభివృద్ధి... పరిశోధనశాలల నుంచి ఆసుపత్రులకూ చేరింది. అయినా ఇప్పటికీ దీన్ని ఇంకా ఆవిర్భావ దశలో ఉన్న తొలిదశగానే చెప్పవచ్చు. అంటే ఇంకా ఈ రంగంలో అభివృద్ధి సాధించాల్సింది ఎంతో ఉందని అర్థం.మూలకణ చికిత్సల్లో ఆశారేఖ ఏమిటంటే... తొలిదశల్లోనూ, పరిశోధనాత్మకదశల్లో చేసిన పరీశీలనల్లో అత్యంత సునిశితమైన ఈప్రక్రియ చాలా సురక్షితమైనదని తెలియడంతో పాటు ఇందులో పూర్తిగా నమ్మదగిన ఫలితాలే వచ్చాయి. గతంలో ఏదైనా అవయవం దెబ్బతింటే దాన్ని పూర్తిగా మార్చాల్సిన అవసరం వచ్చేది. అయితే ఇప్పుడీ ఈ మూల కణాల ద్వారా అవయవంలో దెబ్బతిన్న మేరకు మూలకణాలను ప్రవేశపెట్టి, కొత్త కణాలను సృష్టించి అదే దెబ్బతిన్నదాన్ని పూర్తి ఆరోగ్యవంతమైన అవయవంగా మార్చగలిగే అవకాశాలున్నట్లుగా తేలింది. అందుకే దీన్ని ‘రీజనరేటివ్ మెడిసిన్’గా పేర్కొంటున్నారు. ప్రస్తుతం మనం ఈ రీజనరేటివ్ మెడిసిన్లోని తొలిగడప మీద ఉన్నామని చెప్పవచ్చు.మూలకణాలతో ఏయే వ్యాధులకు చికిత్స అంటే? ప్రస్తుతానికి మనకు మూలకణ చికిత్సలో ఉన్న పరిజ్ఞానంతో క్యాన్సర్లలోని కొన్ని రకాలైన లుకేమియా (బ్లడ్క్యాన్సర్), లింఫోమా, అ΄్లాస్టిక్ అనీమియా, థలసీమియా, సికిల్సెల్ అనీమియా వంటి వ్యాధులకు చికిత్స చేయడం సాధ్యమవుతోంది. సాధారణ చికిత్సకు లొంగని క్రిటికల్ లింబ్ ఇస్కిమియా, డయాబెటిక్ ఫుట్ (మధుమేహం వల్ల కాలికి పుండుపడి కుళ్లిపోవడం), డయాబెటిక్ న్యూరోపతి (మధుమేహం వల్ల కాలి లేదా చేతి వేళ్ల చివరలలో మంటలు, తిమ్మిర్లు రావడం, స్పర్శ తగ్గడం), స్కీ›్లరోడెర్మా, సిస్టమిక్ ల్యూపస్ ఎరిథమెటోసిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్, స్ట్రోక్ (పక్షవాతం), హార్ట్ఫెయిల్యూర్ (గుండెజబ్బులు), కాలేయ వ్యాధులు, డయాబెటిస్ (మధుమేహం), ఆర్థోపెడిక్ కాంప్లికేషన్స్ (ఎముక సంబంధమైన వ్యాధులు), ఫ్రాక్చర్లు, కార్నియల్ డ్యామేజ్ (కంటిలోని నల్లగుడ్డు దెబ్బతినడం), బట్టతల, బొల్లి (విటిలిగో) వంటి వ్యాధులకు మూలకణాలతో చికిత్స చేయవచ్చు.సైంటిస్టులు రూపొందించిన మూలకణాలు!మూలకణాలు శరీరమంతా అక్కడో ఇక్కడో ఉన్నప్పటికీ పెద్దసంఖ్యలో దొరకాలంటే మాత్రం అవి బొడ్డు తాడులోని రక్తంలోనే ఎక్కువగా ఉంటాయి. అయితే... ఇప్పటి తరాలతో పోలిస్తే... ఇంతకు ముందున్న తరాల వారిలో బొడ్డు తాడు నుంచి మూలకణాలను వేరు చేసి భద్రపరచడం అనే అంశంపై పెద్దగాఆసక్తి లేదు. ఎందుకంటే... అప్పట్లో మూలకణాలతో రకరకాల చికిత్సలు సాధ్యమవుతాయనే విషయమే పెద్దగా తెలియదు.క్రిటికల్ లింబ్ ఇస్కిమియా ఈ వ్యాధి ఉన్నవారిలో కాళ్లలోని కింది భాగాలు గుండె నుంచి చాలాదూరంగా ఉన్నందువల్ల, అలాగే రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడటం వల్ల చివరి భాగాలకు తగిన మోతాదులో రక్తం అందదు. ఫలితంగా కాలిలోని ఒక ప్రాంతం మొత్తం పనికిరాకుండా పోతుంది. ఇలాంటప్పుడు శస్త్రచికిత్స చేసి, ఆ అడ్డంకులు తొలగించలేని పరిస్థితి ఏర్పడితే... బాధితుడు తన కాలిని కోల్పోవాల్సి వస్తుంది. ఇక ఎలాంటి ప్రత్యామ్నాయమూ లేని పరిస్థితుల్లో రోగికి మూలకణాలతో చికిత్స చేస్తారు. ఇలాంటి రోగులకు ప్రయోగాత్మకంగా చికిత్స చేసిన చాలా సందర్భాల్లో రోగి కాలును తొలగించకుండానే, దాన్ని ఆరోగ్యవంతంగా చేయడంలో పరిశోధకులు, డాక్టర్లు విజయం సాధించారు.స్క్లీ రోడెర్మా, ల్యూపస్ అండ్ రుమాటాయిడ్ ఆర్థరైటిస్ మన సొంత వ్యాధి నిరోధక కణాలు సొంత వ్యవస్థలను పరాయివారిగా గుర్తించి దాడి చేయడం వల్ల వచ్చే వ్యాధుల్ని ‘ఆటో ఇమ్యూన్ వ్యాధులు’గా పేర్కొంటారు. ఈ వ్యాధుల్లో మన సొంత వ్యాధి నిరోధక శక్తిని కావాలనే తగ్గించాల్సి వస్తుంది. ఇలా చేయడం వల్ల శరీరం తేలిగ్గా ఇతర ఇన్ఫెక్షన్ల బారిన పడే అవకాశాలు పెరుగుతాయి. ఒక్కోసారి ఇది ్రపాణాలకే ముప్పుగా మారవచ్చు. అయితే... మూలకణ చికిత్సతో ఇలా ఆరోగ్యకరమైన కణాలపై దాడి చేసే వ్యాధినిరోధక కణాల ఆగడాలను అరికట్టవచ్చు. వ్యాధి నిరోధక శక్తిని సాధారణంగా పనిచేసేలాగానూ చేయవచ్చు.బొల్లి (విటిలిగో)కి చికిత్స... చర్మానికి రంగునిచ్చే మెలనోసైట్స్ అనే కణాలు దెబ్బతినడం వల్ల చర్మం తన స్వాభావికమైన రంగును కోల్పోయి తెల్లగా మారుతుంది. దీని వల్ల చర్మంపై తెల్లటి మచ్చలు, పొడలు కనిపిస్తూ... కాస్మెటిక్గా ఇబ్బంది పెడుతుంటాయి. అయితే స్టెమ్సెల్స్ను ఆ ప్రాంతంలో ప్రవేశపెట్టి... ఆ ప్రదేశంలో మామూలు రంగునిచ్చే (పిగ్మెంట్ ఉన్న) కణాల్ని పెరిగేలా చేయడంతో కొద్దిరోజుల్లోనే చర్మమంతా ఒకే రంగు ఉన్నట్లుగా మారిపోతుంది. ఇలా విటిలిగోకు చికిత్స చేయవచ్చని స్టెమ్సెల్ బయాలజిస్టుల అభి్రపాయం.ఇకపై బట్టతల ఉండకపోవచ్చు!వెంట్రుక పుట్టే రోమమూలంలోకి ఈ స్టెమ్సెల్స్ ప్రవేశపెట్టడం వల్ల హెయిర్ ఫాలికిల్ పునరుజ్జీవమవుతుంది. ఫలితంగా హెయిర్ ఫాలికిల్ నుంచి వెంట్రుక మొలిచి, అది మామూలుగా పెరగడం మొదలవుతుంది. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో జరిగిన పరిశోధనల వల్ల ఈ విషయంలో మంచి ఫలితాలే కనిపించాయి. దీంతో మున్ముందు బట్టతల అనే సమస్య పూర్తిగా పరిష్కృతమవుతుందన్నది వైద్యవర్గాల ఆశాభావం.బ్లడ్ క్యాన్సర్లు, రక్తసంబంధమైన వ్యాధులకు చికిత్స ఇలా... రక్తసంబంధమైన క్యాన్సర్లు, రక్తానికి సంబంధించిన ఇతర వ్యాధులలో రక్తకణాలు పుట్టే మూల కేంద్రమైన ఎముక మజ్జను (బోన్ మ్యారో)ను బాధితుల నుంచి పూర్తిగా తొలగించి... అక్కడ మరో దాత నుంచి స్వీకరించిన ఆరోగ్యవంతమైన మూలకణాలను ప్రవేశపెడతారు. దాంతో ఈ కొత్త ఆరోగ్యకరమైన మజ్జ కారణంగా... ఇకపై పుట్టే కణాలన్నీ ఆరోగ్యకరమైనవిగా ఉంటాయి. ఇలా చేసే ఈ చికిత్సతో బ్లడ్క్యాన్సర్లూ, రక్తసంబంధమైన వ్యాధులలోనూ చికిత్స సాధ్యమవుతోంది. ఈ రకమైన చికిత్స అనేది ఇప్పటికి... లుకేమియా, మల్టిపుల్ మైలోమా, లింఫోమా, రక్తసంబంధమైన ఇతర వ్యాధులైన అ΄్లాస్టిక్ అనీమియా, థలసీమియా, సికిల్సెల్ అనీమియాలో సాధ్యమవుతుంది.వ్యాధిగ్రస్తుల దగ్గరి సంబంధీకుల నుంచి కొన్ని మూలకణాలను సేకరించి... వాటిని రక్తమార్పిడి తరహాలోనే వ్యాధిగ్రస్తులలో ప్రవేశపెట్టి చికిత్స చేస్తారు. అప్పటికే వ్యాధిగ్రస్తమై ఉన్న కణాలను నిర్మూలించడానికి కీమోథెరపీ లేదా రేడియేషన్ థెరపీ ఇస్తారు. ఒకసారి వ్యాధిగ్రస్త కణాలన్నీ శరీరం నుంచి తొలగిపోయాక... మూలకణాలతో మార్పిడి చేసిన మజ్జ నుంచి ఇకపై పూర్తిగా ఆరోగ్యకరమైన రక్తకణాలే పుడుతుంటాయి. అయితే సంప్రదాయ చికిత్స ద్వారా సదరు వ్యాధి లొంగని సందర్భాల్లో మాత్రమే ఈ చికిత్సను ఆశ్రయిస్తారు. ఎందుకంటే ఈ చికిత్సలో కీమోథెరపీ మోతాదు ఎక్కువైతే ఒక్కోసారి అది ఇన్ఫెక్షన్లకో లేదా కొన్నిసార్లు రక్తస్రావానికో దారితీసే ముప్పు (రిస్క్) ఉంటుంది. ప్రస్తుతం ఈ రిస్క్ తగ్గించేందుకు అవసరమైన పరిశోధనలు జరుగుతున్నాయి.డయాబెటిక్ ఫుట్ అండ్ డయాబెటిక్ న్యూరోపతి మధుమేహం ఉన్నవారిలో ఈ దుష్ప్రభావం చాలా సాధారణం. చాలా సందర్భాల్లో మధుమేహం ఉన్న వ్యక్తుల కాళ్లకు పుండ్లు పడతాయి. అవి ఎప్పటికీ మానని దశకు చేరుకుని కుళ్లడం మొదలవుతుంది. గ్యాంగ్రీన్గా పేర్కొనే ఈ దశకు చేరుకున్న కాలిని తొలగించడం తప్ప మరో ప్రత్యామ్నాయం లేని దశకు బాధితులు చేరుకుంటారు. అయితే ఇటీవలి పరిశోధనల వల్ల ఈ తరహా సమస్యలను ఎదుర్కొనే వారిలో స్టెమ్సెల్స్ వల్ల డయాబెటిక్ ఫుట్నూ, డయాబెటిక్ న్యూరోపతిని తగ్గించే అవకాశాలు ఎక్కువేనని తెలిసింది.ఎముక సంబంధ వ్యాధులు (ఆర్థోపెడిక్ కాంప్లికేషన్స్) ఎముక సంబంధ వ్యాధుల్లోనూ అనేక రకాలు ఉంటాయి. ఉదాహరణకు పాదం, చీలమండ, తుంటిభాగం, మోకాలు నుంచి మొదలుకొని కీలకమైన వెన్నెముక వరకూ అనేక రకాల ఎముకలు ఉంటాయి. ఇవి రకరకాల సమస్యలకు గురవుతుంటాయి. విరిగిన ఎముకలు సరిగా అతుక్కోకపోవడం, వీటిపై ఉండే చిగురు ఎముక (కార్టిలేజ్) దెబ్బతినడం, ఎముకకు రక్తప్రసరణ లేక ఎముకలోని కొంతభాగం మృతిచెందడం (ఎవాస్క్యులార్ నెక్రోసిస్) వంటివి ఇందులో కొన్ని. ఇలాంటి ఎన్నో వ్యాధులకు గతంలో అంతగా ఫలితాలివ్వని వాటిల్లో కూడా... ఇప్పుడు మూలకణ చికిత్సలతో మంచి ఫలితాలే వస్తున్నాయి. ఎముకలోని కొంత భాగం పూర్తిగా మృతిచెందిన 3–4 ఏళ్ల తర్వాత కూడా ఆ భాగం మళ్లీ పునరుజ్జీవంతో మామూలుగానే పనిచేసిన దాఖలాలు ఉన్నాయి.గుండె, కాలేయ సంబంధ వ్యాధుల్లో... ఇప్పటికే గుండె, కాలేయ సంబంధిత వ్యాధుల్లో స్టెమ్సెల్ థెరపీ ద్వారా అనేక ప్రయోజనాలు కనిపిస్తున్నాయి. మున్ముందు మరిన్ని ప్రయోజనాలు పొందవచ్చన్నది వైద్య వర్గాల మాట. గుండె కండరాలు దెబ్బతిన్న ప్రాంతంలో... చనిపోయిన ఆ కణాలను పునరుజ్జీవించేలా చేసి, హార్ట్ ఫెయిల్యూర్ను రివర్స్ చేయవచ్చన్నది పరిశోధనలతో తెలిసివస్తున్న మాట.అలాగే కాలేయం విషయానికి వస్తే... మద్యం తాగడం వల్ల కాలేయం దెబ్బతిని, అది పూర్తిగా చెడిపోయిన వారికి, స్టెమ్సెల్స్ను ఆ ప్రాంతంలో ప్రవేశపెట్టి... దెబ్బతిన్న భాగాన్ని మళ్లీ పునరుజ్జీవింపజేయవచ్చని తేలింది. అయితే ఈ పరిశోధనలు ఇంకా ్రపాథమిక పరిశోధన దశల్లో ఉన్నప్పటికీ... కొన్నాళ్లలోనే ఆ చికిత్స ప్రక్రియలుగా అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.కార్నియా, రెటీనా సమస్యలకు... గతంలో కంటి నల్లగుడ్డు కార్నియాలోని కణాలు దెబ్బతిన్నప్పుడు గానీ... లేదా దృశ్యాన్ని తన తెరపై పట్టివేసే... రెటీనా కణాలు గాని దెబ్బతిన్నప్పుడు అవి మళ్లీ పునరుజ్జీవించేందుకు ఆస్కారమే ఉండేది కాదు. అయితే స్టెమ్సెల్స్ వల్ల ఇలా క్రమంగా క్షీణిస్తూ మృతిచెందిన కార్నియా, రెటీనా కణాలను పునరుజ్జీవింపజేసేందుకు మూలకణాలు తోడ్పడతాయని అనేక పరిశోధనల్లో వెల్లడైంది. వాటి ఆధారంగా కొద్దిరోజుల్లోనే ఈ మూలకణాలతో కార్నియా, రెటీనా భాగాలను పునరుజ్జీవింపజేసి... అనేక మంది అంధులకు మళ్లీ కంటివెలుగు తెప్పించే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నది సైంటిస్టులు, డాక్టర్లకు కనిపిస్తున్న ఆశారేఖ.చివరగా... మూలకణ పరిశోధకులు (స్టెమ్సెల్ స్పెషలిస్ట్స్), క్లినీషియన్స్ (డాక్టర్లు), కొన్ని సందర్భాల్లో సర్జన్లు (శస్త్రచికిత్సకులు) కలిసి సంయుక్తంగా ఒక బృందంగా ఏర్పడి ఈ చికిత్సలను నిర్వహిస్తుంటారు. మున్ముందు ఈ రంగంలో కనుగొనబోయే చికిత్సలతో వైద్యరంగంలోనే విప్లవాత్మకమైన మార్పులు రావచ్చన్నది పలువురు పరిశోధకులు, వైద్యవర్గాల భావన.- డాక్టర్ సాదత్ అల్ అలీ, ప్రొఫెసర్ ఆఫ్ రీ జెనరేటివ్ మెడిసిన్ అండ్ ఆర్థోపెడిక్ సర్జరీనిర్వహణ: యాసీన్ -
పెళ్లైన మహిళల్లో ఆ సమస్య ఎందుకు వస్తుంది?
నా వయసు ఇరవై ఆరు సంవత్సరాలు. పెళ్లై మూడేళ్లు అయింది. నాకు ప్రతి నెలా యోనిలో దురద వస్తోంది. కొన్నిసార్లు ఆ భాగం ఎర్రగా కూడా మారుతోంది. మందులు వాడినా మళ్లీ మళ్లీ వస్తోంది. అసలు ఎందుకు ఇలా జరుగుతోంది?– రాజేశ్వరి, నంద్యాలమీరు చెప్పిన లక్షణాలను బట్టి చూస్తే, మీకు యోని ఈస్ట్ ఇన్ఫెక్షన్ ఉండే అవకాశం ఉంది. ఇది మహిళల్లో చాలా సాధారణంగా కనిపించే సమస్య. ముఖ్యంగా పెళ్లైన మహిళల్లో, ప్రసవ వయసులో ఉన్నవారిలో ఈ సమస్య అప్పుడప్పుడు లేదా తరచుగా మళ్లీ మళ్లీ రావచ్చు. సాధారణంగా యోనిలో కొన్ని మేలు చేసే సూక్ష్మజీవులు సహజంగానే ఉంటాయి. ఇవి ఆ ప్రాంతాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. అయితే కొన్ని కారణాల వల్ల శిలీంద్రాల పెరుగుదల అధికమైతే ఈ సమతుల్యత దెబ్బతిని ఇన్ఫెక్షన్ వస్తుంది. ఈ సమస్య ఉన్నప్పుడు యోని లోపల, బయట తీవ్రమైన దురద ఉంటుంది. ఆ భాగం ఎర్రగా మారుతుంది. మంటగా అనిపిస్తుంది. మూత్రం విసర్జించే సమయంలో మంట కలగవచ్చు. ఎక్కువగా గోకడం వల్ల గీతలు పడే అవకాశం ఉంటుంది. అలాగే చిక్కగా, తెల్లగా ఉండే స్రావం కూడా రావచ్చు.ఈ ఇన్ఫెక్షన్ రాకుండా ఉండాలంటే...బిగుతుగా ఉండే దుస్తులు ధరించకండి.గాలి సులభంగా ఆడే కాటన్ లోదుస్తులు వాడండి. ∙లోదుస్తులు ఉతికేటప్పుడు బలమైన సువాసన కలిగిన ద్రావకాలు ఉపయోగించకండి.యోని భాగంలో సువాసన క్రీములు, సుగంధ ద్రవ్యాలు, స్నాన ద్రావకాలు వాడకండి.మృదువైన సబ్బులు మాత్రమే ఉపయోగించండి.వైద్యుల సలహా లేకుండా యాంటీబయోటిక్ మందులు తీసుకోవద్దు.ఆ భాగాన్ని ఎప్పుడూ శుభ్రంగా, పొడిగా ఉంచుకోండి.కొంతమందిలో ఈ ఇన్ఫెక్షన్ దానంతట అదే తగ్గిపోవచ్చు. అయితే చాలామందికి మాత్రం సరైన చికిత్స అవసరమవుతుంది. తరచుగా మళ్లీ మళ్లీ వస్తుంటే దానిని నిర్లక్ష్యం చేయకూడదు. అలాంటి సందర్భాల్లో కారణాన్ని తెలుసుకోవడానికి కొన్ని పరీక్షలు అవసరమవుతాయి. యోని నుంచి నమూనా తీసి పరీక్ష చేయడం ద్వారా ఏ రకమైన ఇన్ఫెక్షన్ ఉందో, ఏ శిలీంద్రం కారణమైందో, దానికి ఏ మందు ప్రభావవంతంగా పనిచేస్తుందో తెలుసుకోవచ్చు. అలాగే మూత్ర పరీక్షలు, రక్తంలో చక్కెర స్థాయులు, శరీర రోగనిరోధక శక్తికి సంబంధించిన పరీక్షలు కూడా అవసరమవుతాయి. మధుమేహం ఉన్నవారిలో లేదా రక్తంలో చక్కెర స్థాయులు అధికంగా ఉన్నవారిలో ఇలాంటి ఇన్ఫెక్షన్లు తరచు కనిపిస్తాయి.కొన్నిసార్లు ఇతర వైరస్ ఇన్ఫెక్షన్లు లేదా రోగనిరోధక శక్తి తగ్గడం కూడా దీనికి కారణం కావచ్చు. అందుకే, తరచుగా వచ్చే యోని ఈస్ట్ ఇన్ఫెక్షన్ చికిత్సను చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. సాధారణంగా ఫ్లుకోనాజోల్ 150 మిల్లీగ్రాముల మాత్రను మూడు రోజులకోసారి చొప్పున మొత్తం మూడు మోతాదులు ఇవ్వవచ్చు. ఆ తర్వాత ఇన్ఫెక్షన్ మళ్లీ రాకుండా ఉండేందుకు నిర్వహణ చికిత్సలో భాగంగా వారానికి ఒక మాత్ర చొప్పున ఆరు నెలల పాటు వాడాలని వైద్యులు సూచిస్తారు. లేదా క్లోట్రిమాజోల్ 500 మిల్లీగ్రాముల మాత్రలను రెండు వారాల పాటు వాడమని చెప్తారు. అనంతరం ఆరు నెలల పాటు వారానికి ఒకసారి చొప్పున వాటిని ఉపయోగించాల్సి ఉంటుంది. అలాగే యోని నుంచి నమూనా సేకరించి పరీక్ష చేయించడం ద్వారా ఏ రకమైన శిలీంద్రం కారణమైందో గుర్తించి, దానికి తగిన చికిత్స అందిస్తారు. ఇలా పూర్తి చికిత్స తీసుకోవడం వల్ల ఇన్ఫెక్షన్ పూర్తిగా తగ్గడమే కాకుండా, మళ్లీ మళ్లీ వచ్చే అవకాశాన్ని కూడా గణనీయంగా తగ్గించవచ్చు.మేనిమాట! మెదడులో చెత్తబండి!మనం దుప్పటి కప్పుకుని రాత్రిళ్లు ‘ఆఫ్’లో ఉంటే.. మెదడు మాత్రం ‘క్లీనింగ్ మోడ్ ఆన్ !’ చేసి, వ్యర్థాలను బయటకు పంపే పనిలో బిజీగా ఉంటుంది. అవును.. నిద్రలో ‘గ్లింపాటిక్ సిస్టమ్’ చురుగ్గా పనిచేసి, మెదడులో పేరుకునే కొన్ని వ్యర్థ పదార్థాలను ‘సెరెబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ ’ ప్రవాహం ద్వారా తొలగించడంలో సహాయపడుతుంది. ముఖ్యంగా స్లో వేవ్ స్లీప్ సమయంలో ఈ ప్రక్రియ మరింత చురుగ్గా సాగుతుంది.- డా, భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్ -
లెమనేడింగ్ ఏడో రుచి.. కష్టాలను తట్టుకునే శక్తి!
మానవాళికి ప్రకృతి షడ్రుచులను ప్రసాదించింది. శాస్త్రవేత్తలు ఇప్పుడు ఏడో రుచిని కనిపెట్టారు. ఆ ఏడో రుచి పేరే... ‘లెమనేడింగ్’! నిజానికి ఇది రుచి కాదు. కష్టాలు వచ్చినప్పుడు వాటిని సరదాగా తీసుకుని... చేదు అనుభవాల నుండి తీపి అనుభూతులను పొందే జీవన విధానం. ఈ స్వభావం మానవుల్లో మునుపు లేదని కాదు. దాన్నిప్పుడు పరిశోధకులు ఉందని రూఢీగా వెల్లడించారు. చెడు కాలంలోనూ చెదరని గుండెతో ఉండటమే లెమనేడింగ్.‘‘జీవితం మీకు నిమ్మకాయలను ప్రసాదిస్తే, నిమ్మరసమే చేసుకుని తాగండి’’ : 20వ శతాబ్దపు ప్రముఖ అమెరికన్ రచయిత, తత్త్వవేత్త, వ్యాపారవేత్త ఎల్బర్ట్ హబ్బర్డ్ చెప్పిన మాట ఇది. 1909లో ‘లిటరరీ డైజెస్ట్’ అనే పత్రికలో ఎల్బర్ట్ ఇలా రాశారు : ‘విధి తనకిచ్చిన నిమ్మకాయలను తీసుకుని, వాటితో నిమ్మరసం వ్యాపారం మొదలుపెట్టేవాడే అసలైన మేధావి’ – అని. అప్పట్నుంచీ ఈ మాట పర్సనాలిటీ డెవలప్మెంట్ కోర్సులలో వాడుకగా వినిపిస్తోంది. నిమ్మరసాన్ని ‘లెమనేడ్’ అంటారు. కనుక ఇది ‘లెమనేడ్ ఫిలాసఫీ’ అయింది. తాజాగా అమెరికన్ శాస్త్రవేత్తలు జరిపిన పరిశీలనలో లెమనేడ్ ఫిలాసఫీ మానవ జీవితానికి ప్రశాంతతను చేకూర్చే మాట నిజమే అని నిర్థారణ అవటం విశేషం!నవ్వుతూ బతకాలిరా..!జీవితాన్ని సరదాగా తీసుకునే అలవాటు వల్ల కష్టాలను తట్టుకునే శక్తి పెరుగుతుందట! కష్టాలు, అడ్డంకులు ఎదురైనప్పుడు మనుషులు ఆ పరిస్థితులకు ఎలా స్పందిస్తారో తెలుసుకోవడానికి ఇటీవల శాస్త్రవేత్తలు జరిపిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. అధ్యయనం కోసం వారు కోవిడ్–19 సమయంలోని 503 మంది అమెరికన్ల ప్రవర్తన, వారి భావోద్వేగాలను పరిశీలించారు.ఈ పరిశీలనలో శాస్త్రవేత్తలు ఒక ఆసక్తికరమైన విషయాన్ని గమనించారు. జీవితాన్ని కాస్త సరదాగా, ప్రశాంతంగా తీసుకునే మనస్తత్వం ఉన్నవారు, ప్రస్తుతం ఉన్న పరిస్థితులను నిజాయితీగా అంగీకరిస్తూనే, భవిష్యత్తు పట్ల సానుకూల దృక్పథంతో ఉన్నారని తేలింది. వీరు తమకు ఎదురయ్యే సవాళ్లకు త్వరగా అలవాటు పడటమే కాకుండా, రోజువారీ పనులను ఆనందంగా, ఆ పనుల్లో లీనమై మరీ చేయగలిగారు. ఎలాంటి కష్టాలనైనా తట్టుకునే శక్తిని (రెజిలియన్స్) కనబరచారు.ఆలోచనా విధానాన్ని, ప్రవర్తనను మార్చుకుంటూ, సృజనాత్మకంగా ఆలోచిస్తూ, అనుకూలమైన ఫలితాల కోసం ప్రయత్నించే ఈ అలవాటుకు శాస్త్రవేత్తలు ‘లెమనేడింగ్’ అని పేరు పెట్టారు. అంటే ‘చేదు’ లాంటి కష్టాలను కూడా నిమ్మరసంలా తీపిగా/సానుకూలంగా మార్చుకోవడం. దీనినే ఇంకోలా చెప్పాలంటే – జీవితంలో మనకు ఏది ఎదురైతే దానినే, దాని కోసమే ఎదురు చూస్తున్నట్లుగా స్వీకరించటం.చేదులోనే తియ్యని రుచి!జీవితాన్ని కాస్త సరదాగా తీసుకోవడం అంటే, మనం ఉన్న పరిస్థితిని తేలికగా తీసుకుంటున్నామని కాదు, ఆ పరిస్థితిని ఎదుర్కొనే శక్తి మనలో పెరుగుతోందని అర్థం అని పరిశోధకులు చెబుతున్నారు. కోవిడ్–19 లాక్డౌన్ సమయంలో ప్రజల అనుభవాలను వీరు అధ్యయనం చేసినప్పుడు ఓ నిజం వెల్లడైంది. సరదా మనస్తత్వం ఉన్నవారు భవిష్యత్తు పట్ల సానుకూలంగా ఉంటూ, సమస్యలను చాలా చురుగ్గా, సృజనాత్మకంగా ఎదుర్కొన్నారు. అంటే, జీవితం వారికి చేదు వాస్తవాలను (నిమ్మకాయలు) ఇచ్చినప్పుడు, వారు వాటిని తీపి అనుభవాలుగా (నిమ్మరసం) మార్చుకున్నారు!దీనికి సంబంధించిన పరిశోధనా వ్యాసం ‘ఫ్రంటియర్స్ ఇన్ సైకాలజీ’ పత్రిక తాజా సంచికలో అచ్చయింది. ‘‘మా పరిశోధనలో తేలిందేమిటంటే సరదా మనస్తత్త్వం, మానసిక స్థైర్యం అనేవి ‘లెమనేడింగ్’ అనే భావన ద్వారా ఒకదానికొకటి చాలా బలంగా ముడిపడి ఉన్నాయి. కష్ట సమయాల్లో కూడా సానుకూల అనుభవాలను సృష్టించుకునే సామర్థ్యమే ఈ లెమనేడింగ్’’ అని వ్యాసకర్త, ఒరెగాన్ స్టేట్ యూనివర్సిటీకి చెందిన డాక్టర్ షియాంగ్యూ ‘షారన్’ షెన్ అంటున్నారు.‘‘పాండమిక్ (మహమ్మారి) సమయంలో సరదా మనస్తత్వం ఉన్నవారు, లేనివారు ఇద్దరూ ఒకే రకమైన భయాన్ని, ఒంటరితనాన్ని అనుభవించారు. కానీ సరదాగా ఉండే వ్యక్తులు ఆ కష్టతరమైన పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకున్నారు. పోగొట్టుకున్న వాటికి ప్రత్యామ్నాయాలను వెతుక్కున్నారు, అడ్డంకులను ఎదిగే అవకాశాలుగా చూశారు. అన్నిటికంటే ముఖ్యంగా, ఆ పరిస్థితికి ఎలా స్పందించాలన్న విషయాన్ని తమ నియంత్రణలోనే ఉంచుకున్నారు’’ అని షెన్ తెలిపారు.‘లెమనేడింగ్’ పరిశోధన వెనుకడాక్టర్ షెన్, ఆమె సహచర శాస్త్రవేత్తలు మనుషుల సరదా మనస్తత్త్వం (ప్లేఫుల్నెస్) అనేది కష్ట సమయాల్లో జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసుకోవడానికి చాలా కాలంగా ఆసక్తితో చూస్తున్నారు. కోవిడ్ మహమ్మారి వారికి ఆ విషయాన్ని పెద్ద ఎత్తున పరిశోధించడానికి ఒక మంచి అవకాశాన్ని ఇచ్చింది. ఇందుకోసం వారు అమెరికాలో నివసిస్తున్న 503 మంది వయోజనులను ఎంచుకుని, 2021 ఫిబ్రవరి (కోవిడ్ రెండవ వేవ్, వ్యాక్సిన్ ప్రారంభ సమయం) ఒక సర్వే నిర్వహించారు.ఈ సర్వేలో పాల్గొన్నవారిని – కరోనా సోకుతుందేమో అనే భయం ఎంతవరకు ఉంది? పరిస్థితులు బాగుపడతాయని నమ్ముతున్నారా? వారికి ఇతరుల మద్దతు ఉందా? వారి భావోద్వేగాలు ఎలా ఉన్నాయి? అనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. దాంతో పాటు, వారు ఎంత సరదాగా ఉంటారు? ఎంత స్పాంటేనియస్గా (సహజంగా / వెంటనే) స్పందిస్తారు? ఆనందంగా ఉండటానికి ఎంతవరకు ప్రయత్నిస్తారు? అనే అంశాల ఆధారంగా వారి సరదా మనస్తత్వాన్ని కొలిచారు.ఈ వివరాల ఆధారంగా శాస్త్రవేత్తలు, సర్వేలో పాల్గొన్న వారిని వారి సరదా మనస్తత్వ స్థాయిని బట్టి నాలుగు భాగాలుగా విభజించారు. సరదా మనస్తత్వం అనేది మనుషుల ఆలోచనలను, ప్రవర్తనను ఎలా మారుస్తుందో స్పష్టంగా అర్థం చేసుకోవడానికి అత్యంత సరదాగా ఉండే మొదటి 126 మందిని, అసలు సరదా లేని చివరి 126 మందితో పోల్చి చూశారు.సానుకూల అవకాశాలపై దృష్టిఅత్యంత సరదాగా ఉండే వ్యక్తులు భవిష్యత్తు పట్ల చాలా ఆశావాదంతో ఉన్నారని, వ్యాక్సిన్ విజయవంతంగా అందుబాటులోకి వస్తుందని; జీవితం మళ్లీ సాధారణ స్థితికి చేరుకుంటుందని నమ్మారని ఈ పరిశోధన వివరాలు స్పష్టం చేశాయి. అయితే దీని అర్థం వారు అప్పటి పరిస్థితిని పట్టించుకోకుండా, ఊహల్లో బతికారనడం కాదు!‘‘అతిగా ఆశావాదంతో ఉన్నవారు వాస్తవాలను గుర్తించకుండా ప్రతిదీ బాగుందని భ్రమిస్తుంటారు. కానీ మేము గమనించిన ‘స్పాట్లైట్’ (దృష్టి) ప్రభావం అలా కాకుండా చాలా స్పష్టంగా ఉంది’’ అని డాక్టర్ షెన్ వివరించారు. ‘‘సరదా మనస్తత్వం ఉన్నవారు కోవిడ్–19 ప్రమాదాలను తేలికగా తీసుకోలేదు, అలాగని రక్షణ చర్యల ప్రభావంపై అతిగా అంచనాలూ వేసుకోలేదు. వారు తమ ‘స్పాట్లైట్’ ని కేవలం సానుకూల మార్పులు, మెరుగవటానికి ఉండే అవకాశాలపైకి మళ్లించారు. చీకటి లాంటి కష్టసమయాల్లో కూడా ముందుకు సాగే మార్గాలను వెలుగులోకి తెచ్చుకున్నారు’’ అంటారు షెన్.అధిక సరదా మనస్తత్త్వం కలిగినవారు ఆనందాన్ని వెతుక్కోవడానికి ఎక్కువ ఉత్సాహపడ్డారు, సంకోచించకుండా ఆలోచించారు. ఇది అనిశ్చిత పరిస్థితుల్లో కూడా అనేక సానుకూల అవకాశాలను ఊహించడానికి వారికి సహాయపడింది. దీనికి తోడు వారి ప్రవర్తనలో ఉన్న సరళత, పనుల్లో వారు చూపించే శ్రద్ధ.. కష్టాలను తట్టుకునే మానసిక స్థైర్యాన్ని అందించాయి.చిన్న చిన్న మార్పులు చేసుకున్నారుపాండమిక్ సమయంలో ఇరు వర్గాల వ్యక్తులూ సమానంగానే ఒంటరితనాన్ని, భయాన్ని అనుభవించారు. కానీ సరదాగా ఉన్నవారు ఆ పరిస్థితులను తట్టుకోవడానికి సృజనాత్మక, క్రియాశీలక అడుగులు వేశారు. వారు వేరే ఏవో కొత్త వినోద కార్యక్రమాలలో పాల్గొనలేదు, కానీ తాము చేసే పనుల్లోనే సమయాలను మార్చుకోవడం, కొత్త ప్రదేశాలను అన్వేషించడం లేదా చురుగ్గా ఉండటానికి కొత్త మార్గాలు వెతకడం ద్వారా పరిస్థితులకు అనుగుణంగా మారారు. వారు తమ రోజువారీ జీవితంలో మరింత చురుగ్గా, ఆనందంగా, లీనమై గడిపారు.‘‘మా పరిశోధన సరదా మనస్తత్త్వాన్ని కొలవడంపైనే దృష్టి పెట్టినప్పటికీ, ఈ గుణాన్ని పెంపొందించుకోవడానికి కొన్ని మార్గాలను పరిశోధనలు సూచిస్తున్నాయి. ఉదాహరణకు, మీకు ఆనందాన్నిచ్చే పనుల్లో పాల్గొనండి, కొత్త అనుభవాలకు సిద్ధంగా ఉండండి, మిమ్మల్ని నవ్వించే వ్యక్తులతో సమయం గడపండి. సరదాగా ఉండటానికి ఆటలే ఆడాల్సిన పనిలేదు. మన రోజువారీ క్షణాల్లో కాస్త ఆనందం, స్వేచ్ఛ, అనుకూలమైన ఆలోచనా విధానాన్ని తెచ్చుకుంటే చాలు’’ అని షెన్ చెబుతున్నారు. జీవితంలో సరదాలు ఉండాలి‘‘ముఖ్యంగా కష్టకాలంలో మన మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సరదా మనస్తత్వం అనేది చాలా కీలకమైనది. కానీ చాలామంది దీని ప్రాముఖ్యతను గుర్తించరు’’ అని అంటారు షెన్. ‘‘సరదాగా ఉండే వ్యక్తులు.. కష్టాలను ఎంత సమర్థవంతంగా ఎదుర్కొంటారో అర్థం చేసుకోవడం వల్ల, ఇతరులు కూడా ఒత్తిడిని, అనిశ్చితిని జయించే వ్యూహాలను రూపొందించవచ్చు. మనం ప్రస్తుతం ఎదుర్కొంటున్న ప్రపంచ స్థాయి సవాళ్లకు వాస్తవిక అంచనా, సృజనాత్మకమైన సర్దుబాటు రెండూ అవసరం కాబట్టి, ఈ విషయం చాలా ప్రాధాన్యత సంతరించుకుంది’’ అని ఆమె అభిప్రాయపడ్డారు.అయితే, ఈ పరిశోధన ఫలితాలను ప్రతి పరిస్థితికీ లేదా అందరికీ ఒకేలా వర్తింపజేయలేమని షెన్, ఆమె సహచరులు హెచ్చరిస్తున్నారు. వేర్వేరు పరిస్థితుల్లో ఈ సరదా మనస్తత్త్వం వేర్వేరు వ్యక్తులపై భిన్నమైన ప్రభావం చూపవచ్చు. అలాగే, అత్యంత సరదాగా ఉండేవారికి, లేనివారికి మధ్య ఉన్న తేడాలన్నీ కేవలం ఈ ఒక్క గుణం వల్లే వచ్చాయని చెప్పలేము. ‘‘మనుషుల మధ్య ఉన్న ముఖ్యమైన తేడాలను మేము గుర్తించినప్పటికీ, రోజువారీ సంఘటనలకు వారు ఎలా స్పందిస్తారనే దానిపై ప్రభావం చూపే ఈ సరదా మనస్తత్త్వం ఇతర పరిస్థితులకు కూడా (రోజువారీ కానివీ, వివిధ రంగాలకు చెందినవీ) వర్తిస్తుందని చెప్పలేం అని షెన్ పేర్కొన్నారు. ‘‘ఈ ‘సరదా ఆలోచనా విధానం’ ఎలాంటి మార్పులు తీసుకువస్తుందో మరింత పూర్తిగా అర్థం చేసుకోవడానికి, భవిష్యత్తులో జీవితంలోని ఇతర అంశాలను కూడా పరిగణనలోకి తీసుకుని పరిశోధనలు జరపవలసి ఉంది’’ అని షెన్ అంటున్నారు. – సాక్షి స్పెషల్ డెస్క్- షియాంగ్యూ ‘షారన్’ షెన్, ఒరెగాన్ స్టేట్ యూనివర్సిటీ ప్రొఫెసర్ -
మధుమేహం వల్ల వినికిడి శక్తి తగ్గుతుందా?
ప్రపంచం లో అత్యంత వేగంగా పెరుగుతున్న వ్యాధుల్లో మధుమేహం (డయాబెటిస్) ఒకటి. ప్రపంచవ్యాప్తంగా 50 కోట్లమందికిపైగా ఈ వ్యాధితో బాధపడుతున్నారని అంచనా. డయాబెటిస్తో బాధపడేవారిలో వినికిడి శక్తి కూడా తగ్గుతుందా అనే అంశంపై జరిగిన కొన్ని పరిశోధనల్లో ఆసక్తికరమైన ఫలితాలు వెల్లడయ్యాయి. ఇందులో... డయాబెటిస్ లేని వారితో పోలిస్తే ఆ సమస్య ఉన్నవారికి వినికిడి లో΄ాలు వచ్చే అవకాశం రెండు రెట్లకు పైనే ఉన్నట్లు తెలిసింది. ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా డయాబెటిస్తో బాధపడుతున్న యుక్తవయస్కుల్లో (అడల్ట్స్)లో నాలుగోవంతు మంది (అంటే దాదాపు 25% మంది)లో వినికిడి లోపాలు ఉన్నట్లు గుర్తించారు. ‘డయాబెటిస్ మెటబాలిజమ్ రీసెర్చ్ రివ్యూ’ అనే జర్నల్లో ప్రచురితమైన అంశాలను బట్టి ప్రపంచవ్యాప్తంగా ఉన్న డయాబెటిస్ బాధితుల్లో దాదాపు 13 కోట్ల మందిలో తీవ్రమైన వినికిడి సమస్యలున్నాయని తేలింది. సాధారణంగా డయాబెటిస్తో బాధపడే వ్యక్తుల్లో వారికి ఉన్న ఆ సమస్య కళ్లు, మూత్రపిండాలు, నరాలకు ఏదైనా నష్టం చేసిందా అన్నకోణంలో ఎప్పటికప్పుడు పరీక్షలు నిర్వహిస్తుంటారు. ఈ పరిశోధనల నేపథ్యం లో ఇకపైపై పరీక్షల్లాగే వినికిడి పరీక్షలూ చేయాలంటూ పరిశోధకులు వైద్యవర్గాలకు ఓ సూచన చేస్తున్నారు. ‘‘ఈ వినికిడి సమస్యను తేలిగ్గా తీసుకోకూడదు. డయాబెటిస్తో వచ్చే వినికిడి లోపం చాలాసార్లు 40–50 ఏళ్ల మధ్య వయసులోనే మొదలువుతుంది. దాంతో సంభాషణలు వినడం, ఎదుటివారితో కమ్యూనికేషన్ నెరపడం కష్టమై క్రమంగా ఒంటరితనం పెరుగుతుంది. జ్ఞాపకశక్తి తగ్గడమూ వేగవంతమవుతుంది. అందుకే డయాబెటిస్ అన్నది నెమ్మదిగా దెబ్బతీసే పెద్దసమస్య. అందుకే ఇకపై డయాబెటిస్ వ్యాధిగ్రస్తులకు చేసే పరీక్షల్లో వినికిడి పరీక్షనూ చేర్చాల్సిన సమయం వచ్చింద’’నేది ఈ అధ్యయనం తాలూకు ప్రధాన పరిశోధకుల మాట. తక్కువ ఖర్చుతో చేసే వినికిడి పరీక్షల ద్వారా సమస్యను మొదటే గుర్తిస్తే సత్వర చికిత్స సాధ్యమని పరిశోధకులు తెలిపారు. అవసరమైనప్పుడు హియరింగ్ ఎయిడ్స్ ఉపయోగించడం లాంటి సకాలంలో చేసే చికిత్సతో సంభాషణ సామర్థ్యం, జీవననాణ్యత మెరుగుపడే అవకాశం ఉందనీ, అలాగే రక్తంలో చక్కెర మోతాదులను నియంత్రించడం ద్వారా వినికిడి మరింత దెబ్బతినకుండా కొంతవరకు నిరోధించవచ్చనీ పేర్కొన్నారు. డయాబెటిస్ వ్యాధిగ్రస్తులకు అన్ని పరీక్షల్లాగే వినికిడి పరీక్షలూ చేయడం మంచిదని వారి సూచన. (చదవండి: -
అలర్జీస్... అలెర్ట్ ప్లీజ్!
ఇవి వానల కాలం. వాతావరణంలో కాస్త తేమ ఎక్కువగా ఉండే సమయం. అందుకే మామూలుగా వచ్చే అలర్జీలతో పోలిస్తే ఈ సీజన్లో అవి మరింత ఎక్కువ. వర్షాకాలం మొదలు కాగానే సీజనల్ సైనసైటిస్, అలర్జీ వంటి ఆరోగ్య సమస్యలు బాగా పెరిగిపోతాయి. ఈ సీజన్లో గాలిలో దుమ్ము, పుప్పొడి కణాలు, ఫంగస్ (బూజు) ఎక్కువగా వ్యాపించడం వల్ల ముక్కు, సైనస్లలో వాపు, ఇన్ ఫెక్షన్లు, అలర్జీలు వస్తుంటాయి. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు, ఆస్తమా లేదా అలర్జీ వంటి ఆరోగ్య చరిత్ర ఉన్నవాళ్లలోనూ, వ్యాధినిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిలో ఈ సమస్యలు ఎక్కువగా కనిపిస్తుంటాయన్నది వైద్యవర్గాల మాట. ఈ నేపథ్యంలో ఈ సీజన్లో కనిపించే సాధారణ అలర్జీలపై అవగాహన కోసం ఈ కథనం...ఈ సీజన్లో ఉండే కాస్తంత తేమ వాతావరణంలో గాలిలోని కాలుష్యం త్వరగా చెదిరిపోకుండా చాలాసేపు ఉండటం, పరాగరేణువుల (పోలెన్) వ్యాప్తి, దుమ్ము, ఫంగస్ స్పోరుల కారణంగా సీజనల్ అలర్జీలు పెరుగుతాయి. దాంతో ముఖ్యంగా వర్షాకాలం మొదలు కాగానే ముక్కు, చెవి, గొంతుకు సంబంధించిన (ఈఎన్ టీ) సమస్యలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. సాధారణంగా అలర్జీలను కూడా మామూలు జలుబుగా భావించి నిర్లక్ష్యం చేస్తే సైనసైటిస్, చెవిలో ఇన్ ఫెక్షన్లు, దీర్ఘకాలిక ముక్కుదిబ్బడ వంటి సమస్యలకు దారితీయవచ్చన్నది నిపుణుల మాట. అందుకే ఈ సీజన్లో అప్రమత్తంగా ఉండాలి. ఏయే రకాల ఆరోగ్య సమస్యలు ఎలా వస్తాయంటే... మానవుల స్కల్ భాగంలో ముక్కు చుట్టూ గాలి నిండిన చిన్న గదులుంటాయి. వీటిని సైనస్లు అంటారు. వైరల్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు లేదా అలర్జీల కారణంగా వీటిలో వాపు ఏర్పడి శ్లేష్మం (మ్యూకస్) బయటకు వెళ్లకుండా పేరుకుపోయి బాధించే సమస్యను సైనసైటిస్గా పిలుస్తారు. మరోవైపు దుమ్ము, పుప్పొడి, ఫంగస్, పెంపుడు జంతువుల వెంట్రుకలు (డాండర్) వంటి అలర్జీ కారకాల ప్రభావంతో ముక్కు లోపలి పొరల్లో వాపు రావడాన్ని అలర్జిక్ రైనైటిస్గా పేర్కొంటారు.లక్షణాలు సైనసైటిస్ ఉన్నవారిలో సాధారణం గా... ∙దగ్గు, ∙జ్వరం ∙అలసట ∙ముక్కు బిగుసుకుపోవడం, ∙పసుపు లేదా ఆకుపచ్చ రంగులో శ్లేష్మం / తెమడ (మ్యూకస్) వస్తుండటం, ∙నుదురు, చెంపలు, కళ్ల చుట్టూ నొప్పి లేదా ఒత్తిడి ఉన్నట్లు అనిపిస్తుండటం,∙తీవ్రమైన తలనొప్పి, ∙గొంతులోకి కఫం దిగుతుండటం, రుచి–వాసనలు గుర్తించే శక్తి తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అలర్జీతో బాధపడుతున్నవారిలో సాధారణంగా...∙వరుసగా తుమ్ములు రావడం, ∙ముక్కు నుంచి నీరు కారడం, ∙ముక్కు, కళ్లలో దురద, ∙కళ్లు ఎర్రబడి నీరు కారడం, ∙గొంతులో దురద, ∙ముక్కు మూసుకుపోవడం వంటివి ప్రధాన లక్షణాలుగా ఉంటాయి. కొందరిలో∙శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ∙పిల్లికూతలు (వీజింగ్) కూడా కనిపించవచ్చు.మామూలు జలుబుకూ సైనసైటిస్కు తేడా... సాధారణ జలుబుతో పోలిస్తే సైనసైటిస్ లక్షణాలు పది రోజులకుపైగా కొనసాగడం, ముఖంలో ఒత్తిడి, తలనొప్పి ఎక్కువగా ఉండడం, దట్టమైన కఫం రావడం వంటి లక్షణాలు ప్రత్యేకంగా కనిపిస్తుంటాయి. సైనసైటిస్ను, అలర్జీలను నిర్లక్ష్యం చేస్తే చెవి ఇన్ఫెక్షన్లు, ఆస్తమా తీవ్రత పెరగడం, దీర్ఘకాలిక సైనసైటిస్ వంటి సమస్యలు వచ్చే ముప్పు ఉంటుంది. అందుకే పై లక్షణాలు కనిపిస్తున్నప్పుడు మామూలు జలుబుగా భావించి వాటిని నిర్లక్ష్యం చేయకూడదు. నిర్ధారణ పరీక్షలు .. బాధితుల వైద్య చరిత్రను పరిశీలించాక డాక్టర్లు అవసరాన్ని బట్టి... ∙కొన్ని రకాల రక్త పరీక్షలు ∙నాసల్ ఎండోస్కోపీ ∙సీటీ స్కాన్ ∙అలర్జీ స్కిన్ ప్రిక్ టెస్ట్ వంటి వైద్యపరీక్షలను సూచిస్తారు. సమస్య తీవ్రతను బట్టి చికిత్స అందిస్తారు.నివారణ ఇలా... బయట నుంచి ఇంట్లోకి రాగానే ∙ముఖం, చేతులు కడుక్కోవడం, ∙అవసరమైతే స్నానం చేయడం, ∙దుమ్ము ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో మాస్క్ ధరించడం, ∙ఇండ్లలో, పరిసరాల్లో దుమ్ము, బూజు పేరుకుపోకుండా చూడడం, ∙ఇంటినీ, పరిసరాలనూ పరిశుభ్రంగా ఉంచడం, ∙బెడ్షీట్లు, ∙దిండ్ల కవర్లును తరచూ ఉతకడం, ∙తగినంత నీరు తాగడం, ∙వర్షంలో తడిస్తే వెంటనే పొడి దుస్తులు ధరించడం, ∙పొగతాగడం వంటి దురలవాట్లకు దూరంగా ఉండటం ∙వైద్యుల సూచన లేకుండా మందులు వాడకపోవడం వంటి సాధారణ అలవాట్లు సీజనల్ అలర్జీలనూ, సైనసైటిస్ వంటి సమస్యలను నివారిస్తాయి. చికిత్స ఇలా... చికిత్సలో అలర్జీని కలిగించే కారకాలకు వీలైనంత దూరంగా ఉండటం మొట్టమొదటి జాగ్రత్తగా / చికిత్సగా పరిగణించవచ్చు. డాక్టర్లు అవసరాన్ని బట్టి యాంటీహిస్టమిన్ మందులు, స్టెరాయిడ్ నాసల్ స్ప్రేలు, సెలైన్ నాసల్ వాష్లు, డీకంజెస్టెంట్ల వంటి మందులను సూచిస్తారు. తరచూ తీవ్రమైన అలర్జీలతో బాధపడుతుండేవారికి ఏయే అంశాల కారణంగా వారికి ఆ అలర్జీ ఏర్పడుతుందో తెలుసుకునే పరీక్షల తర్వాత ఇమ్యునోథెరపీ (అలర్జీ షాట్స్) కూడా వాడుతుంటారు. అయితే గుర్తుంచుకోవాల్సిన అంశం ఏమిటంటే... యాంటీబయాటిక్స్నూ, స్టెరాయిడ్ మందులను ఎవరికి వారు ఆన్ కౌంటర్ మెడిసిన్గా వాడటం సరికాదు. చివరగా... బాధితుల్లో అధిక జ్వరం (హై ఫీవర్), ∙ముక్కు బిగుసుకుపోవడం, ∙ముఖంలో తీవ్రమైన నొప్పి, ∙కళ్ల చుట్టూ వాపు... ఈ లక్షణాలు పది రోజులకుపైగా కొనసాగితే దాన్ని మామూలు జలుబుగా భావించి నిర్లక్ష్యం వహించకుండా, ఆలస్యం చేయకుండా డాక్టర్లు / ఈఎన్ టీ నిపుణులను తప్పక సంప్రదించాలి. డాక్టర్ మహమ్మద్ నసీరుద్దీన్సీనియర్ కన్సల్టెంట్ ఈ ఎన్ టీ – హెడ్ – నెక్ సర్జన్ -
ప్రాణాయామంతో... ఆస్తమాకు చెక్
1 అనులోమ–విలోమ (నాడీ శోధన్రపాణాయామం)చేసే విధానం...పద్మాసనం లేదా సుఖాసనంలో నిటారుగా కూర్చోండి. ∙ఎడమ చేతిని మోకాలిపై ఉంచండి. కుడి చేతి బొటనవేలితో కుడి ముక్కు రంధ్రం మూసి, ఎడమ ముక్కు ద్వారా నెమ్మదిగా శ్వాస పీల్చండి. ఇప్పుడు ఉంగరం వేలితో ఎడమ రంధ్రం మూసి, కుడి రంధ్రం ద్వారా శ్వాసను నెమ్మదిగా వదలాలి. అదే కుడి రంధ్రం ద్వారా శ్వాస పీల్చి, ఎడమ రంధ్రం ద్వారా వదలాలి. ఇలా 5–10 నిమిషాలు చేయాలి.ప్రయోజనాలు...ఊపిరితిత్తుల పనితీరు మెరుగుపడటానికి తోడ్పడుతుంది. ∙ఒత్తిడి, ఆందోళన తగ్గుతుంది. ∙శ్వాసపై నియంత్రణ పెరుగుతుంది.2. భ్రమరిప్రాణాయామం... చేసే విధానం...సుఖంగా కూర్చోండి. కళ్లు మూసుకుని లోతుగా శ్వాస పీల్చండి. ∙శ్వాసను నెమ్మదిగా వదులుతూ ‘మ్...మ్... అనే తుమ్మెద శబ్దంలా చేయాలి. ∙5–10 సార్లు చేయాలి.ప్రయోజనాలు... ∙మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ∙ఒత్తిడి తగ్గి శ్వాస సులభంగా అనిపిస్తుంది.నిద్ర నాణ్యత మెరుగుపడుతుంది.3. దీర్ఘ శ్వాస... చేసే విధానం..ముక్కు ద్వారా నెమ్మదిగా లోతుగా శ్వాస పీల్చండి. ∙΄÷ట్ట స్వల్పంగా బయటకు రావాలి. ∙నెమ్మదిగా శ్వాసను పూర్తిగా వదలండి. ∙5–10 నిమిషాలు చేయండి.ప్రయోజనాలు...ఊపిరితిత్తులకు గాలి బాగా చేరడంలో సహాయపడుతుంది. ∙శ్వాసకోశ కండరాలకు విశ్రాంతి లభిస్తుంది.జాగ్రత్తలు...ఆస్తమా అటాక్ వచ్చినప్పుడుప్రాణాయామం చేయవద్దు. శ్వాసను బలవంతంగా ఆపడం (కుంభకం) చేయకండి. కపాలభాతి, భస్త్రిక వంటి వేగంగా చేసేప్రాణాయామాలను వైద్యుడు లేదా అనుభవజ్ఞుడైన యోగా గురువు ఆధ్వర్యంలోనే చేయాలి. ఖాళీ కడుపుతో లేదా భోజనం చేసిన 3 గంటల తర్వాత చేయడం మంచిది. తల తిరగడం, ఛాతీ బిగుసుకు΄ోవడం, శ్వాస ఇబ్బంది పెరగడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆపి వైద్యుడిని సంప్రదించండి.అనిత పాతర్ల, యోగా ట్రైనర్ -
12 గంటల ప్రసవ వేదన..చివరకు స్వీయంగా సీ సెక్షన్! ఐతే..
ప్రసవ వేదన అంటేనే భరించలేని నరకం అంటారు. ఇంకో జన్మఎత్తడం లాంటిది అని అంటుంటారు పెద్దలు. అలాంటిది అంతటి ఉద్విగ్న స్థితిలో ఓ తల్లి తన బిడ్డ ప్రాణాలను రక్షించడం కోసం తనకు తానుగా సిజేరియన్ చేసుకుని ప్రసవించింది. వైద్యలు సైతం విస్తుపోయారు. ఒకవేళ అలా చేసినా తల్లీబిడ్డ బతకడం అసాధ్యమని అన్నారు.ఈ మిరాకిల్ ఘటన మెక్సికోలో చోటు చేసుకుంది. మెక్సికోలోని ఓక్సాకాలో ఒక మారుమూల పర్వత గ్రామంలో ఇనెస్ రామిరేజ్ పెరెజ్ అనే మహిళ ఈ సాహసానికి ఒడిగట్టింది. అందుకు కారణం ఆమె ఉన్న పరిస్థితులనే చెప్పాలి. నిజానికి ఆమె నిండు గర్భిణీ. ప్రసవించే సమయం దగ్గరపడుతున్న తరుణం. కానీ ఇంట్లో కనీసం కరెంట్ లేదు, ఫోన్ లేదు, నీటి సరఫరా కూడా లేదు. సమీపంలోని ఆస్పత్రికి వెళ్లడానికి కనీసం రోడ్డు సదుపాయం లేని ఓ మారమూల పర్వత గ్రామంలో ఉంటుందామె. ఆ టైంలో ఇంట్లో ఆమె భర్త కూడా లేడు. సరిగ్గా ఆ సమయంలోనే ఆమెకు పురిటినొప్పులు మొదలయ్యాయి. అలా ఆమె మొత్తం 12 గంటలు నొప్పులతో నరకం చూసింది. ఇక చూస్తుండగానే తనకు, తన బిడ్డకు ప్రాణాలు గాల్లో కలిసిపోతాయని గ్రహించి తనకు తానుగా సీజేరియన్ చేసుకునేందుకు సిద్దమైంది. ఎందుకంటే అంతకుమునుపు కూడా ఇలానే ప్రసవవేదన పడి పురిటిలోనే బిడ్డను కోల్పోయింది. ఆ వేదన ఆమెకు తెలుసు ఆ నేపథ్యంలోనే ఇలాంటి సాహసానికి పూనుకుందామె. అందుకోసం ముందుగా తనకు ఎలాంటి నొప్పి తెలియకుండా ఉండేలా కాస్త మద్యం సేవించింది. ఆ తర్వాత తన గర్భాశయం వద్ద ఇంట్లో ఉండే కత్తితో కోసి బిడ్డను బయటకు తీసింది. బొడ్డు తాడుని కత్తెరతో కట్చేసి స్పృహ తప్పి పడిపోయింది. ఆ తర్వాత కొద్దిసేపటికే మెలుకువ వచ్చాక..తనకు అందుబాటులో ఉన్న వాటితో గాయానికి చక్కగా కట్టు కట్టుకుంది. ఆ తర్వాత తన కొడుకుని పిలిచి గ్రామంలోని డాక్టర్కి విషయం చెప్పమని పంపింది. ఆ తర్వాత ఆ గ్రామ వైద్యుడు వచ్చి ఆమెను హుటాహుటినా క్లినిక్కి తీసుకువెళ్లి..కట్లు వేశాడు. అలాగే తల్లీబిడ్డలకు ఎలాంటి ఇన్ఫెక్షన్ కలగకుండా తగిన చికిత్స కూడా అందించాడు. అయితే ఇక్కడ వైద్యులు ఆమెకు ఇదంతా ఎలా సాధ్యమైందని విస్తుపోయారు. అసలు స్వీయంగా సీజేరియన్ అంటే మాటలు కాదు..ఒకవేళ అలా చేసినా, బతికే అవకాశాలు చాలా తక్కువని అన్నారు. ఇది వైద్య చరిత్రలోనే అత్యంత అరుదైన కేసుగా అభివర్ణించారు. ఎందుకంటే తగిన పనిముట్లు, అనుభవం గానీ లేని మహిళ తనకు అందుబాటులో ఉన్నవాటితో ప్రసవం చేసుకోవడం, బతికి బట్టగట్టగలగడం అంటే ఇదోక మిరాకిల్ అని అన్నారు వైద్యులు. ఈ అద్భుతమైన ఘటన మార్చి 05, 2000లలో చోటు చేసుకుంది. అలాగే ఇలాంటి దాన్ని ఎవ్వరు ప్రయత్నించే సాహసం చేయొద్దని హెచ్చరించారు వైద్యులు . ఇక్కడ ఆ మహిళకు మరో గత్యంతర లేక, బిడ్డను కాపాడుకోవడానికి మాతృమూర్తి చేసిన సాహస కృత్యంగా పరిగణించాలని అన్నారు గైనకాలజిస్ట్లు. అయినా ఇంకా కరెంట్ రోడ్డు సదుపాయం లేని ప్రాంతాలు ఉన్నాయా అనే అంశాన్ని లేవనెత్తడమే గాక, అలాంటి చోట్ల ఉండే గర్భిణుల సంరక్షణ ప్రాముఖ్యతను హైలెట్ చేసింది. అలాగే వ్యవస్థలోనే లోపాలను ఎత్తి చూపిన ఘటనగా అభివర్ణిస్తున్నారు విశ్లేషకులు.(చదవండి: బీఎండబ్ల్యూ బైక్పై వచ్చిన రైడర్ని చూసి విస్తుపోయిన వ్యాపారవేత్త..!) -
92 కేజీల నుంచి 60 కేజీలకు..!ఆ ఆహారాలకు 'నో' చెప్పాల్సిందే..
బరువు తగ్గడం అనేది రోజువారీ తీసుకునే ఆహారంలో చిన్న చిన్న మార్పులు చేసుకుంటూ స్లిమ్ అవుతారు చాలామంది. అంతేగాదు కేవలం తీసుకునే ఆహారాన్ని చాలా తెలివిగా, ఆరోగ్యకరమైన పౌష్టికాహారం తీసుకుంటే..బరువు తగ్గడం అసాధ్యమైంది కాదు అని నిరూపించారు పలువురు. చక్కెర, ఉప్పు, శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తగ్గించడం వల్ల బరువుని అదుపులో ఉంచుకోవడం తోపాటు ఉబ్బరాన్ని కూడా తగ్గించుకోవచ్చు అని అంటోంది కంటెంట్ క్రియేటర్ దీప్తి. ఈ మార్పుల తోపాటు క్రమం తప్పని వ్యాయామం, మంచి నిద్ర, కేలరీల లోటుని పాటిస్తే..అద్భతమైన ఫలితాలు సాధించొచ్చని అంటోంది. అదెలాగో సవివరంగా తెలుసుకుందామా..!.కంటెంట్ క్రియేటర్ దీప్తి ఒకప్పుడు 92 కేజీల దాక అధిక బరువుతో ఉండేది. అలాంటి ఆమె అద్భతంగా సుమారు 32 కేజీల బరువు తగ్గారు. తాను ఆ ఐదు ఆహారాలకు దూరంగా ఉండటంతోనే ఇంతలా స్లిమ్గా మారినట్లు ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో వెల్లడించింది. కేలరీలు లోటు ఉండాలనేది గుర్తించుకుంటే బరవు తగ్గడం ఏమంత కష్టం కాదని చెబుతోంది. చక్కెర పానీయాలుదీప్తి మొదటగా మానేసింది చక్కెర పానీయాలనే. ఇవి కొవ్వు పేరుకుపోవడానికి, నీరు నిలిచిపోవడానికి దారితీసి, ముఖం ఉబ్బినట్లుగా కనిపించేలా చేస్తాయి. వాటికి ప్రత్యామ్నాయంగా నిమ్మరసం, కొబ్బరి నీరు, గ్రీన్ టీ వంటి తీసుకోవాలని సూచించింది.వైట్ బ్రెడ్తాను వైట్ బ్రెడ్కి దూరంగా ఉన్నట్లు తెలిపింది. ఎందుకంటే శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లు ఇన్సులిన్ స్థాయిలను పెంచుతాయి. పైగా ఇది కొవ్వు సులభంగా పేరుకుపోవడానికి కారణమవుతుందని అన్నారు. వాటికి బదులుగా మల్టీగ్రెయిన్ బ్రెడ్, హోల్ వీట్ బ్రెడ్, సోర్డౌ, ఓట్స్ను ఎంచుకుంది.ప్యాక్ చేసిన స్నాక్స్చిప్స్, ఇతర ప్యాక్ చేసిన స్నాక్స్ను కూడా ఆమె మానుకుంది. వాటిలో తరచుగా ఉప్పు ఎక్కువగా ఉంటుందని, ఇది కడుపు ఉబ్బరాన్ని పెంచి, అనవసరమైన ఆకలి కోరికలను ప్రేరేపిస్తుందని అన్నారు. బదులుగా వేయించిన శనగలు, నట్స్, మఖానా వంటి ఆరోగ్యకరమైన స్నాక్స్గా తీసుకోవాలని అన్నారువేయించిన ఫాస్ట్ ఫుడ్వేయించిన బర్గర్లు, ఫ్రైస్, ఇలాంటి ఫాస్ట్ ఫుడ్ కూడా మానుకున్న జాబితాలో ఉన్నాయి. ఈ ఆహారాలలో సాధారణంగా కొవ్వు, ఉప్పు ఎక్కువగా ఉంటాయని, ఇవి అదనపు కేలరీలను జోడించడంతో పాటు మిమ్మల్ని నీరసంగా ఉంచుతాయని అంటోంది. ఆమె బదులుగా ఇంట్లో తయారు చేసిన ర్యాప్లు, పనీర్ లేదా చికెన్ టిక్కా, సాధారణ ఇంట్లో వండిన భోజనాన్ని ఇష్టపడింది.అర్ధరాత్రి పూట చిరుతిండిచివరగా కంటెంట్ క్రియేటర్ అర్ధరాత్రి పూట అడ్డదిడ్డంగా చిరుతిండి తినడం వంటి అలవాట్లకు దూరంగా ఉన్నట్లు తెలిపింది. పడుకునే ముందు అనాలోచితంగా తినడం వల్ల, తెలియకుండానే రోజువారీ క్యాలరీల వినియోగం వేగంగా పెరిగిపోతుందని అన్నారు. అంతగా ఆకలిగా అనిపిస్తే హెర్బల్ టీ తాగి, నిద్రపోండని అన్నారు.అదనంగా, ప్రతిరోజూ 2-3 లీటర్ల నీరు తాగడం, కనీసం ఏడు గంటల పాటు నిద్రపోవడం, ప్రతిరోజూ నడవడం వంటి అలవాట్లను కూడా దీప్తి సూచించింది. ఆమె ప్రకారం, కేలరీల వినియోగాన్ని తగ్గించి తినడంతో పాటు ఈ చిన్న చిన్న అలవాట్లను పాటించడం వల్ల, కాలక్రమేణా ముఖం, శరీరంలో స్పష్టమైన మార్పు కనిపించడమే గాక చూక్కని ఆకృతిలో స్లిమ్గా కనిపిస్తారని చెబుతోంది.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. View this post on Instagram A post shared by Deepti | Mom • Fitness • Lifestyle (@deepti_harshana) (చదవండి: మాంసాన్ని తినే వ్యాధి'..! ఎందువల్ల వస్తుందంటే..) -
కేకేఆర్ చేతికి మెడికవర్ ఇండియా
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: భారత హెల్త్కేర్ విభాగంలో అవకాశాలను మరింతగా అందిపుచ్చుకునే దిశగా గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ దిగ్గజం కేకేఆర్ తాజాగా భారీ డీల్కి తెరతీసింది. అంతర్జాతీయ వైద్యసేవల దిగ్గజం మెడికవర్ ఏబీకి చెందిన భారత విభాగం మెడికవర్ ఇండియాను కొనుగోలు చేయనున్నట్లు ప్రకటించింది. ఈ డీల్ విలువ ఎంతనేది కేకేఆర్ నిర్దిష్టంగా వెల్లడించకపోయినప్పటికీ.. సంస్థ విలువను 1.2 బిలియన్ యూరోలుగా (దాదాపు రూ. 13,200 కోట్లు) లెక్కగట్టినట్లు న్యాయ సలహాలందిస్తున్న ట్రైలీగల్ వివరించింది. కేకేఆర్కి చెందిన ఫండ్స్కి 100 శాతం వాటాలను విక్రయించేందుకు తమతో పాటు మైనారిటీ వాటాదారులు ఒప్పందం కుదుర్చుకున్నట్లు మెడికవర్ తెలిపింది. దీనితో స్థూలంగా 740 మిలియన్ యూరోలు లభిస్తాయని, ఆ మొత్తంతో పోలాండ్ తదితర దేశాల్లో కార్యకలాపాలు విస్తరించనున్నట్లు పేర్కొంది. ఈ డీల్కి ఇదే సరైన సమయమని భావిస్తున్నట్లు కంపెనీ సీఈవో జాన్ స్టబింగ్టన్ చెప్పారు. మరోవైపు ప్రస్తుత మేనేజ్మెంటే మరో మూడేళ్ల పాటు కొనసాగుతుందని మెడికవర్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హరికృష్ణ వెల్లడించారు. సంస్థలో 14 వేల మంది ఉద్యోగులు, 1,900 మంది పైగా డాక్టర్లు ఉన్నారని, వారు కూడా యథాప్రకారంగానే కొనసాగుతారని పేర్కొన్నారు. సంస్థను మరింతగా విస్తరించే ప్రణాళికలు ఉన్నట్లు వివరించారు. నియంత్రణ సంస్థల అనుమతులకు లోబడి ఈ ఏడాది ఆఖరు నాటికి ఇది పూర్తి కావొచ్చని భావిస్తున్నట్లు వివరించారు. ప్రస్తు తం ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటకలో మొత్తం నాలుగు రాష్ట్రాల్లో సుమారు 11–12 లక్షల మంది పేషంట్లకు చికిత్సలు అందిస్తున్నట్లు చెప్పారు. అటు, ‘మరింత నాణ్యమైన వైద్య సేవలందించడంలో మెడికవర్ ఇండియా డాక్టర్లు, ఉద్యోగులకు మద్దతుగా నిలుస్తూ, దేశవ్యాప్తంగా అధునాతన హెల్త్కేర్ సరీ్వసులను విస్తరించేందుకు ఈ పెట్టుబడులు దోహదపడతాయి‘ అని కేకేఆర్ పార్ట్నర్ అక్షయ్ తనా తెలిపారు. నాలుగు రాష్ట్రాల్లో 24 ఆస్పత్రుల నెట్వర్క్.. మ్యాక్స్క్యూర్ హాస్పిటల్ చెయిన్ ఆపరేటర్, హైదరాబాద్కి చెందిన సహృదయ హెల్త్కేర్లో నియంత్రణాధికారాలుండే వాటాలను కొనుగోలు చేయడం ద్వారా స్వీడన్కి చెందిన మెడికవర్ 2017లో భారత హెల్త్కేర్ మార్కెట్లోకి ప్రవేశించింది. మెడికవర్ ఇండియాలో మెడికవర్ హోల్డింగ్స్ బీవీకి 67 శాతం ఉండగా, మైనారిటీ షేర్హోల్డర్లయిన ప్రస్తుత సీఎండీ జి. అనిల్ కృష్ణ తదితరుల వద్ద సుమారు 33 శాతం వాటాలు ఉన్నాయి. సంస్థలో పి. హరికృష్ణ, ఎ. శరత్ రెడ్డి ఈడీలుగా, ఏఆర్ కృష్ణప్రసాద్ డైరెక్టరుగా ఉన్నారు. సుమారు 4,800 పడకలతో 24 ఆస్పత్రుల నెట్వర్క్ ఉంది. 80 పైచిలుకు స్పెషాలిటీల్లో సేవలు అందిస్తోంది. భారీ విస్తరణ బాటలో కేకేఆర్ కేకేఆర్ 2004 నుంచి అంతర్జాతీయంగా హెల్త్కేర్ విభాగంలో సుమారు 20 బిలియన్ డాలర్ల పైగా ఇన్వెస్ట్ చేసింది. గత కొన్నాళ్లుగా భారత్లోనూ విస్తరించింది. మ్యాక్స్ హెల్త్కేర్లో భారీ లాభాలకు నిష్క్రమించిన దాదాపు నాలుగేళ్ల తర్వాత 2025లో కేరళకు చెందిన బేబీ మెమోరియల్ హాస్పిటల్ (బీఎంహెచ్)లో దాదాపు రూ. 2,500 కోట్లకు సుమారు 70 శాతం వాటాలను కొనుగోలు చేయడం ద్వారా మళ్లీ హెల్త్కేర్ విభాగంలోకి ప్రవేశించింది. అప్పటి నుంచి దక్షిణాది మరింతగా కార్యకలాపాలు విస్తరించింది. మైత్రా హాస్పిటల్, చళికట్టు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ను కొనుగోలు చేసింది. అలాగే హెల్త్కేర్ గ్లోబల్ ఎంటర్ప్రైజెస్లో నియంత్రణాధికారాలున్న వాటాలను దక్కించుకుంది. ఈ విభాగంలో ఫైనాన్సింగ్ కార్యకలాపాలు కూడా నిర్వహిస్తోంది. -
బాలింతలు ఎంత తినాలి? ఏం తినాలి?!
‘మేం మా పెద్దలు ఎలా చెబితే అలా విన్నాం’ అనే మాటలు బాలింత ఉన్న ఇంట్లో తరచూ వినపడుతుంటుంది. పథ్యం నియమాలు పాటించాలంటూ ‘ఈ రకం భోజనం వద్దు’ అనేవారుంటారు. ‘పోషకాలు ఉండే భోజనం తింటేనే బిడ్డకు సరిపడా పాలు లభిస్తాయి’ అని కొందరంటారు. ఏది తింటే బిడ్డకు మంచిదో అర్థం కాక, ఆందోళనకు లోనయ్యే బాలింతలూ ఉంటారు. ఈ తరహా సమస్యలకు పరిష్కారం.. పోషకాహార నిపుణులిచ్చే సూచనలు...ఆరోగ్యకరమైన తల్లులు ఉంటేనే ముందు తరాలు ఆరోగ్యంగా వర్ధిల్లుతాయి. భారతీయ మహిళకు రోజుకు దాదాపు 1,800 నుండి 2,200 కేలరీలు అవసరం. పాలిచ్చే తల్లులుకు వీటికన్నా రోజుకు 450 నుండి 500 అదనపు కేలరీలు అవసరం. శరీర పరిమాణం, శారీరక శ్రమ, ఎన్నిసార్లు పాలిస్తున్నారు .. అనేదానిని బట్టి ఆహారం తీసుకునే వ్యక్తిగత అవసరాలు మారుతూ ఉంటాయి. అయితే, ఇది కేలరీలను తగ్గించుకునే సమయం కాదు. పాల ఉత్పత్తికి, ప్రసవానంతరం తల్లి కోలుకోవడానికి కూడా తగినంత ఆహారం అవసరం.ఉదయం వేళలో... → ఉదయం నిద్రలేచిన గంటలోపు వేడి వేడి రాగిజావ లేదా సాంబార్, కొబ్బరి చట్నీతో రెండు ఇడ్లీలు తీసుకోవాలి. అరగంట తర్వాత ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్లు తాగితే జీర్ణక్రియకు మేలు చేస్తుంది → అల్పాహారంగా నానబెట్టిన ఐదారు బాదం పప్పులు, రెండు ఖర్జూరాలు, ఒక అంజీర్, చిటికెడు జీలకర్ర వేసిన ఒక చిన్న కప్పు మజ్జిగ తీసుకోవాలి.మధ్యాహ్నం... → అన్నం లేదా రెండు రోటీలు, పప్పు, ఆకుకూరలతో కూర, కప్పు పెరుగు, కొద్దిగా నెయ్యి. మాంసాహారులైతే చేపలు లేదా చికెన్ తీసుకోవచ్చు. వీటి నుంచి ప్రోటీన్ అందుతుంది → మధ్యాహ్నపు చిరుతిండికి అరటిపండు, గుప్పెడు వాల్నట్లు లేదా పెరుగుతో మెంతి పరాఠా లేదా ఒక కప్పు రాగి మాల్ట్ తీసుకోవాలి.రాత్రి సమయంలో... → కూరగాయలతో చేసిన కిచిడీ లేదా పనీర్ కూర లేదా ఏదైనా ఆకుకూరతో రోటీ తినవచ్చు. → పడుకునే ముందు చిన్న కప్పు గోరువెచ్చని పాలు. దీనిలో చిటికెడు నల్ల మిరియాల పొడి కలిపి తాగడం వల్ల శరీర వాపు తగ్గుతుంది. కాల్షియం సమృద్ధిగా ఉంటుంది. క్రమం తప్పని ఈ తరహా భోజనం, పోషకాలు గల చిరుతిళ్లతో రోజంతా మీ రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరంగా, శక్తిని మరింత నిలకడగా ఉంచి పాల సమృద్ధికి తోడ్పడుతుంది.మరికొన్ని జాగ్రత్తలు... → తల్లిపాలలో అధికభాగం నీరే ఉంటుంది. అందుకని శరీరంలో నీటి శాతం తగ్గకూడదు → రోజుకు 8 నుండి 10 గ్లాసుల నీళ్లు తాగలి. వేడిగా ఉన్నప్పుడు లేదా రాత్రిపూట చెమట పడుతుంటే ఇంకా ఎక్కువ నీళ్లు తాగాలి. బిడ్డకు పాలు పట్టడానికి కూర్చున్న ప్రతీసారి చిన్న కప్పు నీళ్లు తాగడం మంచిది → రసం, సాంబార్, పప్పు సూప్, రాగిజావ, తాజా కొబ్బరి నీళ్లు, హెర్బల్ టీలు పాలిచ్చే తల్లులకు మేలు చేస్తాయి. ఇవి శరీరానికి తేమను అందించడంతో పాటు, జీర్ణక్రియకు సహాయపడే ఐరన్, తగు మసాలాలను కూడా అందిస్తాయి. → యూరిన్ లేత పసుపు రంగులో ఉండేలా చూసుకోవాలి. ముదురు పసుపు రంగులో ఉంటే నీళ్లు మరిన్ని అవసరమని చెప్పే సంకేతం అని గ్రహించాలి.తగ్గించాల్సినవి...→ కాఫీ, టీలు తాగడం మానుకోవాలి. వీటిని సేవించే తల్లుల పాలు తాగిన పిల్లలు నిద్రపోవడంలో సమస్యలు ఎదుర్కొంటారు. → పథ్యం భోజనం అని కొంతమంది తల్లులకు నెలల పాటు కారం భోజనం మాత్రమే పెడుతుంటారు. దీని వల్ల తల్లులకే కాదు, బిడ్డకూ తరచూ కడుపు ఉబ్బరం, అసౌకర్యంగా ఉంటుంది → అధికంగాప్రాసెస్ చేసిన, ప్యాక్ చేసిన స్నాక్స్ తీసుకోవద్దు. వీటిలో సోడియం, మైదా ఎక్కువ ఉంటాయి. వీటి ద్వారా శరీరానికి ఎలాంటి పోషకాలు లభించవు. పాలు తక్కువగా వస్తుంటే.. అనేక కారణాలు ఉండవచ్చు, వాటిలో ఆహారం ఒకటి మాత్రమే. బిడ్డ అడిగినప్పుడల్లా, సరిగ్గా పాలు పట్టేలా చూసుకోవడం కూడా అంతే ముఖ్యం. పాలు సరిగా అందడం లేదని ఆందోళనగా ఉంటే, లాక్టేషన్ కన్సల్టెంట్తో మాట్లాడవచ్చు. తల్లిపాలకు ప్రోత్సాహం తప్పనిసరి...గర్భంతో ఉన్నప్పుడు, ప్రసవానంతరం పాలిచ్చే తల్లులు పోషకాహారం పట్ల తప్పక జాగ్రత్తలు తీసుకోవాలి. కుటుంబాలు తల్లికి మంచి పోషకాహారాన్ని ఇస్తే, వారి పిల్లలు కూడా ఆరోగ్యంగా ఎదుగుతారు. ప్రసవం అయిన వారం రోజుల నుంచి పాలు, గుడ్లు, చేపలు, పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు.. ఇలా ప్రోటీన్ ఫుడ్ ఇవ్వాలి. ఐరన్, ప్రోటీన్, విటమిన్ సి ఫుడ్తీసుకుంటే బిడ్డకు పాలు సమృద్ధిగా లభిస్తాయి. పని ప్రదేశాలలో ఉన్నా బిడ్డ పాలు తాగేలా తల్లులు అందుబాటులో ఉండాలి. మొదటి ఆరు నెలల పాటు పూర్తిగా, నిరంతరాయంగా తల్లిపాలు ఇస్తూ ఉండాలి. బిడ్డకు ఐదవ నెల చివరి వారం నుంచి ఉగ్గు లాంటి ఘనాహారం కూడా కొద్ది కొద్దిగా ఇవ్వవచ్చు. బిడ్డకు రెండేళ్లు వచ్చేవరకు తల్లిపాలు ఇవ్వచ్చు. పాలు ఇచ్చే తల్లులు రసాయనాలు, రంగులు కలిపినవీ ప్యాకేజ్ చేసిన జంక్ఫుడ్ తినకూడదు.డా. సుజాతా స్టీఫెన్న్యూట్రిషినిస్ట్ -
'మాంసాన్ని తినే వ్యాధి'..! ఎందువల్ల వస్తుందంటే..
'మాంసాన్ని తినే వ్యాధి' అనే పేరు వినగానే ఎవరికైనా భయం, ఆందోళన కలగడం సహజం. ఈ వ్యాధి శాస్త్రీయ నామం 'నెక్రోటైజింగ్ ఫాసిటిస్' అని చెబుతున్నారు వైద్యులు. దీనికి చికిత్స సైతం అందుబాటులో ఉందట. వినడానికే భయం కలిగిస్తున్న ఈ వ్యాధి ఏంటో, ఎందువల్ల వస్తుంది వంటి వాటి గురించి సవివరంగా తెలుసుకుందామా..!.నెక్రోటైజింగ్ ఫాసిటిస్గా వ్యవహరించి మాంసాన్ని తినే వ్యాధి చర్మం క్రింద ఉండే మృదు కణజాలాన్ని ప్రభావితం చేసే ఒక అరుదైన ఇన్ఫెక్షన్గా పేర్కొంటారు. ఇది శరీరంలో ఎక్కడైనా రావొచ్చు. అత్యంత అరుదైన సందర్భాలలో కళ్ల చుట్టూ కూడా రావొచ్చు. చిన్న కోత, శస్త్రచికిత్స గాయం లేదా కీటకం కాటు వంటి వాటి ద్వారా చర్మంలో ఏర్పడిన గాయం గుండా కొన్ని రకాల బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశించడం వల్ల ఈ వ్యాధి వస్తుందని చెబుతున్నారు వైద్యులు. ఈ వ్యాధి బారిన పడే వారిలో చాలామందికి బలహీనమైన రోగనిరోధక శక్తి వంటి ఇతర ఆరోగ్య సమస్యలు ఉంటాయని చెబుతున్నారు.లక్షణాలు..చికిత్స..ఈ వ్యాధి లక్షణాలు చాలా వేగంగా తీవ్రతరమవుతాయి. సులభంగా గుర్తించగలిగే మార్పులు ఇవి:వాపు, ఎర్రబడటంఒక నిర్దిష్ట ప్రాంతంలో నొప్పి లేదా సున్నితత్వం (స్పర్శకు నొప్పిగా అనిపించడం)అయితే, బయటకు కనిపించే దానికంటే ఆ అసౌకర్యం లేదా నొప్పి చాలా తీవ్రంగా ఉండవచ్చని వైద్యులు తెలిపారు. దీనికి యాంటీబయాటిక్స్ ద్వారా చికిత్స చేస్తారు. కొన్ని సందర్భాల్లో ఇన్ఫెక్షన్ సోకిన కణజాలాన్ని తొలగించే ప్రక్రియ అవసరం కావచ్చు అని చెబుతున్నారు వైద్యులు.నివారించడం ఎలా అంటే..నెక్రోటైజింగ్ ఫాసిటిస్ను పూర్తిగా నివారించడం ఎప్పుడూ సాధ్యం కాకపోవచ్చు. అయితే, దీని ముప్పును తగ్గించడానికి ఇలా చేయండని చెబుతున్నారు వైద్యులు. అవేంటంటే..గాయాలను సబ్బు నీటితో శుభ్రం చేయండి. అవి నయమయ్యే వరకు శుభ్రమైన కట్టుతో (bandage) కప్పి ఉంచండి.ఏదైనా లోతైన కోత లేదా గుచ్చుకున్న గాయం అయినట్లయితే వైద్యుడిని సంప్రదించండి.చర్మంపై గాయం లేదా కోత ఉన్నప్పుడు స్విమ్మింగ్ పూల్స్, హాట్ టబ్స్ లేదా బయట ఉండే నీటి వనరులలోకి వెళ్లకండి. View this post on Instagram A post shared by Kunal Sood, MD (@doctorsoood) (చదవండి: షాంపూ బదులు.. ప్రకృతి సిద్ధమైన ప్రత్యామ్నాయం ఇదే! వైద్యులు సైతం..) -
తల్లిపాల నిర్వహణలో... స్మార్ట్ పరికరాలు
బిడ్డ పుట్టడానికి ముందే తల్లిపాలు పట్టే పరికరాలను సిద్ధం చేసుకోవడం వల్ల ప్రసవానంతర ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా మార్చుకోవచ్చు అనేది నిపుణుల సూచన. ఫలితంగా తల్లి ప్రసవానంతరం కలిగే వివిధ రకాల ఒత్తిడులను తగ్గించుకునే వీలుంది.తల్లిపాల పరికరాలు రోజువారీ సవాళ్లలో కొన్నింటిని సులభతరం చేసినా, సరైన సహకారం అందినప్పుడే వాటిని బాగా వినియోగించుకోగలరు. చనుబాలు పట్టించే నిపుణుల గైడెన్స్తో పాటు బాధ్యతలను పంచుకునే భాగస్వామి మద్దతు అవసరం. ‘బిడ్డలకు పాలిచ్చే పనులను సులువు చేయడానికి తల్లులు బ్రెస్ట్ పంపులు (51 శాతం), నర్సింగ్ బ్రాలు (37 శాతం), నర్సింగ్ దిండ్లు (31శాతం) వంటి సాధనాలను ఉపయోగిస్తున్నారని నివేదికలు చూపుతున్నాయి. నవతరం అమ్మలకు వచ్చిన అనుకూల ఉత్పత్తుల గురించి...ఫీడింగ్ మానిటర్స్: శిశువు పాలు మింగే శబ్దాలను గుర్తించడానికి, ఎన్ని పాలు తాగిందో లెక్కించడానికి, ఏఐ–ఆధారిత సెన్సార్లు కూడా వచ్చాయి.రియల్–టైమ్ బ్రెస్ట్ ఫీడింగ్ వేరబుల్: ఇది రొమ్ము చుట్టూ చుట్టుకునే ఒక మృదువైన, అనువైన పరికరం. ఇది బయోఇంపిడెన్ ్సను ఉపయోగించి, శిశువు ఎన్ని పాలు తాగిందో అనే దానిపై క్లినికల్–గ్రేడ్, లైవ్ డేటాను మొబైల్ స్క్రీన్ లపై అందిస్తుంది. లాక్టేషన్ ప్యాడ్ డ్రగ్ ట్రాకర్లు: ఇవి మైక్రోఫ్లూయిడిక్ ఛానెల్స్, లేజర్–ప్రేరిత గ్రాఫేన్ సెన్సార్లతో పొందుపరిచిన మోడర్న్ వేరబుల్ ప్యాడ్స్. తల్లి తీసుకునే మందులు (ఎసిటమినోఫెన్ వంటివి) నేరుగా తల్లిపాలలోకి చేరే రేటును ట్రాక్ చేసి, కొలుస్తాయి.ఇన్ఫాంట్ స్మార్ట్ బాటిల్స్: ఆహారపు అలవాట్లను మెరుగుపరచడానికి, సింక్రొనైజ్డ్ యాప్ల ద్వారా శిశువు బరువు పెరుగుదలను ట్రాక్ చేయడానికి బయోఫీడ్బ్యాక్ డేటాను అందిస్తాయి.ఇతర అనుకూలమైన పరికరాలు...ఎలక్ట్రిక్ బ్రెస్ట్ పంప్స్: వీటిని నర్సింగ్ బ్రా లోపల సెట్ చేసుకోవచ్చు. పాలు ఎక్కువైనప్పుడు ఈ పరికరం ద్వారా పాలు తీసి, స్టోరేజ్ చేయవచ్చు.నర్సింగ్ కవర్స్: తల్లిపాలు పట్టే సమయంలో మెడ భాగం నుంచి నడుము కిందవరకు ఆ్రపాన్ తరహాలో ఉండే కాటన్ కవర్ పూర్తిగా కప్పి ఉంచుతుంది. బిడ్డ పాలు తాగుతుండగా తల్లి నేరుగా చూసే అవకాశమూ ఉంటుంది. బయట పాలు పట్టడం అనే ఇబ్బందిని ఈ కవర్ దూరం చేస్తుంది.బ్రెస్ట్ ఫీడింగ్ పిల్లోస్: పాలిచ్చే సమయంలో బిడ్డను పిల్లోపైన పడుకోబెట్టడానికి., కదలకుండా ఉండటానికి.. వీటిని ఉపయోగిస్తుంటారు. పాలు తాగే సమయంలో తల్లికి–బిడ్డకు ఈ పిల్లో అనువుగా ఉంటుంది.నర్సింగ్ ప్యాడ్స్: లీక్ ప్రూఫ్స్, స్కిన్ ఫ్రెండ్లీవి లభిస్తున్నాయి. వాపు, నొప్పి ఉన్న రొమ్ము చర్మానికి తక్షణ ఉపశమనాన్ని ఇచ్చే చల్లని జెల్ ప్యాడ్స్ అందుబాటులో ఉన్నాయి.బ్రెస్ట్ మిల్క్ కంటెయినర్స్, స్టోరేజీ కప్స్: రొమ్ము నుంచి తీసిన పాలను కంటెయినర్లలో భద్రపరచేవి. సెన్సార్ స్టోరేజీ బ్యాగ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఇవి బిడ్డకు తగినంత ఉష్ణోగ్రతలలో పాలు ఉండేలా నిల్వ చేస్తాయి. ఓవెన్ లేదా స్టవ్ ఉపయోగించకుండా ఫ్రీజర్లో భద్రపరిచిన పాలను కరిగించే స్మార్ట్ బాటిల్ వార్మర్స్ అందుబాటులో ఉన్నాయి.సిలికాన్ నిపుల్ ప్రొటెక్టర్: మొదటిసారి బిడ్డకు పాలు పట్టే సమయంలో, ఆ తర్వాత చనుమొనలు చిట్లడం, నొప్పి సమస్యలు ఉంటాయి. ఇలాంటప్పుడు సిలికాన్ నిపుల్ ప్రొటెక్టర్స్ బాగా ఉపయోగపడతాయి.బ్రెస్ట్ నిపుల్ క్రీమ్: ప్రసవం తర్వాత ΄÷డిబారిన, చిట్లిన, నొప్పిగా ఉన్న చనుమొనల సమస్యను నయం చేయడానికి ఉపయోగపడుతుంది. -
'మెకియా వెల్లియనిజం'.. ఈ జీవితం ఎంత నరకమంటే?
డాక్టర్ గారు... మా అమ్మనాన్నలు చనిపోతే అమ్మమ్మ దగ్గర పెరిగాను. పదహారేళ్లకే పెళ్లి చేశారు. నా భర్త కాంట్రాక్టరు. మాకు ఇద్దరు పిల్లలు. కుటుంబం బాగుకోసం అని చెప్పి, నన్ను పై అధికారుల దగ్గరకు పంపేవాడు. ఆ బాధను మర్చిపోవడానికి మద్యం అలవాటు చేశాడు. అలా ఏళ్లు గడిచిపోయాయి. ఈరోజు.. పిల్లలు పెద్దయ్యాక, వాళ్లముందే చెడ్డదానిగా నిలబెట్టాడు. కుటుంబం బాగు కోసమే అన్నీ సహించాను. ఇప్పుడు ఒంటరిదానిని అయ్యాను. చనిపోవాలని ఉన్నా నిస్సహాయతలో బతుకుతున్నాను. – ఓ అభాగ్యురాలుమీరు అనుభవించిన నరకం, ఎదుర్కొన్న మోసం, పడిన మానసిక సంఘర్షణ మాటల్లో వ్యక్తపరచలేనివి. ‘కుటుంబం, బతుకుతెరువు’ అనే భావోద్వేగాలను ఆసరాగా చేసుకుని మీ భర్త మిమ్మల్ని ఊబిలోకి నెట్టాడు. ఇది సైకాలజీలో ‘మెకియావెల్లియనిజం’ అని పిలిచే అత్యంత స్వార్థంతో కూడిన క్రూరమైన మనస్తత్వం.మీ డిప్రెషన్ను అణచివేయడానికి అతనే మిమ్మల్ని మద్యానికి కూడా అలవాటు చేశాడు. తన పాపాన్ని కప్పిపుచ్చుకోవడానికి తనలోని నేర భావనను మీపైకి నెట్టేశాడు. సైకాలజీలో దీనినే ప్రొజెక్షన్’ అంటారు. మీరు ధైర్యంగా బతికి చూపించడమే అతనికి సరైన సమాధానం. ప్రస్తుతం మీ భర్త పిల్లల దగ్గర నిజాలు దాచి మిమ్మల్ని చెడుగా చూపిస్తున్నా, కాలం మారినప్పుడు నిజం కచ్చితంగా బయట పడుతుంది.ఆవేశపడి ఎలాంటి తప్పుడు నిర్ణయం తీసుకోకండి. ముందుగా ఒక మానసిక నిపుణుడిని కలిసి కౌన్సెలింగ్ తీసుకోండి. అవసరమైతే మహిళా హెల్ప్ లైన్ లేదా చట్టపరమైన రక్షణ పొందండి. మనం చేసే పనుల వెనుక ఉన్న ‘ఉద్దేశమే’ మన వ్యక్తిత్వాన్ని నిర్ణయిస్తుంది తప్ప, బలవంతంగా మన చేతచేయించిన పనులు కాదు. ‘నేను బ్రతికి చూపిస్తాను’ అనే ఆత్మ విశ్వాసంతో ధైర్యంగా ముందడుగు వేయండి.- డా. ఇండ్ల విశాల్ రెడ్డి, సీనియర్ సైకియాట్రిస్ట్, విజయవాడ.మీ సమస్యలు, సందేహాలు పంపవలసిన మెయిల్ ఐడీ: sakshifamily3@gmail.com -
గుజరాత్లో ‘చండీపుర’ వైరస్ కలకలం..!
అహ్మదాబాద్: గుజరాత్లో అరుదైన 'చండీపుర వైరస్' ఆందోళన కలిగిస్తోంది. ఈ వైరల్ వ్యాధి బారిన పడి ఇప్పటివరకు 22 మంది చిన్నారులు మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. మరో ఏడుగురు పిల్లలు వివిధ ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు.రాష్ట్రంలో 184 మంది అనుమానితులకు పరీక్షలు నిర్వహించగా, వారిలో 35 మందికి వైరస్ సోకినట్లు నిర్ధారణ అయిందని వైద్యులు వెల్లడించారు. అయితే, వైరస్ బారిన పడిన వారంతా 15 ఏళ్లలోపు చిన్నారులేనని మంత్రి ప్రఫుల్ పన్సేరియా తెలిపారు. ఇప్పటివరకు ఆరుగురు పిల్లలు కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయినట్లు చెప్పారు.దీంతో గుజరాత్లోని పలు ప్రాంతాల్లో చండీపుర వైరస్ కేసులు నమోదవుతుండటంతో ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. వ్యాధి వ్యాప్తిని నియంత్రించేందుకు ప్రత్యేక పర్యవేక్షణ, పరీక్షలు, వైద్య చర్యలు చేపడుతున్నట్లుగా తెలుస్తోంది.అధికారుల ప్రకారం, 'చండీపుర ఎన్సెఫలైటిస్' అనేది అరుదైన వైరల్ వ్యాధి. ఇది ఇసుక ఈగల ద్వారా వ్యాపించి మెదడు వాపునకు దారితీస్తుంది. ఈ వ్యాధి ప్రధానంగా 15 ఏళ్లలోపు పిల్లలపై ప్రభావం చూపుతోందని, అయితే, ఈ వ్యాధికి ప్రస్తుతం నిర్దిష్టమైన టీకా లేదా యాంటీవైరల్ చికిత్స అందుబాటులో లేనట్లుగా వైద్యలు తెలిపారు. అలాగే, సకాలంలో చికిత్స అందకపోతే వాంతులు, మూర్ఛ వంటి తీవ్రమైన లక్షణాలు కనిపించే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. -
‘ఏడు’ ఏడుపు కాదు.. అదృష్టం తెచ్చిపెట్టింది
కొంతమందికి కొన్ని సంఖ్యలపై ప్రత్యేకమైన నమ్మకం ఉంటుంది. అవి తమ జీవితంలో అదృష్టాన్ని తీసుకొస్తాయని భావిస్తుంటారు. ఏడు అనేది అపశకునం అని ప్రపంచవ్యాప్తంగా చాలామంది నమ్మకం. అయితే.. ఇక్కడో వ్యక్తి లక్కీ నంబర్ ‘7’. చిన్నప్పటి నుంచి తనకు అదృష్ట సంఖ్యగా భావిస్తూ వచ్చాడు. అదే అతన్ని..చివరకు కోటీశ్వరుడిని కూడా చేసింది.అమెరికాలోని నార్త్ కరోలినా రాష్ట్రం బిస్కో పట్టణానికి చెందిన టోమస్ మునోజ్కు లాటరీలో ఏకంగా 10 లక్షల డాలర్లు (సుమారు రూ.9.5 కోట్లు) జాక్పాట్గా తగిలింది. నార్త్ కరోలినా ఎడ్యుకేషన్ లాటరీ కొత్తగా ప్రారంభించిన ట్రిపుల్ రెడ్ 777 జాక్పాట్ స్క్రాచ్-ఆఫ్ గేమ్లో ఆయన ఈ భారీ బహుమతిని గెలుచుకున్నారు. కాండర్లోని ఓ దుకాణంలో 10 డాలర్ల విలువైన ట్రిపుల్ రెడ్ 777 జాక్పాట్ టికెట్ కనిపించగానే దాన్ని కొనాలని మునోజ్ నిర్ణయించుకున్నారు. కారణం.. ఆ టికెట్పై ఉన్న మూడు ‘7’లే.“ఏడు నా అదృష్ట సంఖ్య. నేను 1977లో 7వ తేదీన పుట్టాను” అని మునోజ్ తెలిపారు. తన జీవితంలో 7 నంబర్కు ఎప్పటి నుంచో ప్రత్యేక స్థానం ఉందని చెప్పారు. టికెట్ను దుకాణంలోనే స్క్రాచ్ చేసిన మునోజ్.. భారీ బహుమతి గెలిచిన విషయం తెలుసుకుని భావోద్వేగానికి గురయ్యారు. “నా శరీరం మొత్తం రకరకాల భావోద్వేగాలతో నిండిపోయింది” అని తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.లాటరీ సంస్థ నుంచి బహుమతి తీసుకునే సమయంలో మునోజ్కు రెండు అవకాశాలు ఇచ్చారు. 20 ఏళ్ల పాటు ఏడాదికి 50 వేల డాలర్ల చొప్పున తీసుకోవడం లేదా ఒకేసారి నగదు తీసుకోవడం. ఆయన రెండో ఎంపికను ఎంచుకున్నారు. ఒకేసారి 6 లక్షల డాలర్లు తీసుకున్నారు. పన్నులు మినహాయించిన తర్వాత ఆయనకు 3,96,060 డాలర్లు (సుమారు రూ.3.5 కోట్లకు పైగా) అందాయి.ఈ డబ్బును పెట్టుబడులు పెట్టడంతో పాటు, తనకు ఇష్టమైన పాతకాలపు కార్ల పునరుద్ధరణ (క్లాసిక్ కార్ రీస్టోరేషన్) పనులకు ఉపయోగించనున్నట్లు మునోజ్ తెలిపారు.ఇక ట్రిపుల్ రెడ్ 777 జాక్పాట్ గేమ్లో మొత్తం మూడు మిలియన్ డాలర్ల బహుమతులు ఉండగా.. అందులో మరో రెండు మిలియన్ డాలర్ల బహుమతులు ఇంకా గెలుచుకోవాల్సి ఉంది. అదృష్ట సంఖ్యలపై నమ్మకం ఉండటం ఒకవైపు అయితే.. అదే సంఖ్యతో జీవితాన్ని మార్చే అవకాశం రావడం మాత్రం మునోజ్ విషయంలో అరుదైన యాదృచ్ఛికంగా మారింది. ‘7’ అతడికి కేవలం సంఖ్య కాదు.. అదృష్టాన్ని తెచ్చిన గుర్తుగా నిలిచిపోయింది.(చదవండి: థాంక్యూ అమ్మ..! భావోద్వేగంలో మైక్రోసాఫ్ట్ ఏఐ డైరెక్టర్ ..) -
99 కేజీల నుంచి 59 కేజీలకు..! ఆ ఐదు ఫుడ్స్తోనే..
బరువు తగ్గడం అనేది తెలివిగా డైట్ లేదా వ్యాయామాలు చేస్తూ.. సునాయాసంగా తగ్గే ప్రక్రియని పలువురు నిరూపిస్తున్నారు. అందుకు ఫ్యాన్సీ డైట్లు, ఖరీదైన సప్లిమెంట్లు అవసరం లేదని ఇష్టమైన ఆహారాలకు దూరంగా ఉంటే చాలని అంటున్నారు. మంచి పలితాలు అనేవి ప్రతిరోజు పాటించగల సాధారణ అలవాట్లుగా మంచి ఆహారపు అలవాట్లను భాగం చేసుకోవడంపైనే ఆధారపడి ఉంటుందని చెబుతున్నారు. ఇక్కడ ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ సాచీ కూడా అలానే అనుసరించి జస్ట్ మూడేళ్లలో అమాంతం 40 కేజీలు తగ్గింది. అంతేగాదు అంతలా బరువు తగ్గడానికి ఉపకరించిన ఆహారాలను కూడా ఇన్స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నారు. ఇంతకీ అవేంటో చూద్దామా..!.నిజానికి సాచీ 99 కేజీల పైనే బరువు ఉండేది. జస్ట్ ఆ ఐదు భోజనాలతో ఏకంగా 40 కేజీలపైనే బరువు తగ్గింది. తనకు వెయిట్లాస్ జర్నీలో ఉపకరించిన ఆ ఐదు ఆహారాల వివరాలు..వాటిని నిలకడగా అనుసరిస్తే కలిగే లాభాలు గురించి షేర్ చేసుకున్నారామె.అవేంటంటే..పాలక్ పనీర్ బౌల్ఈ భోజనంలో 200 గ్రాముల పాలక్ పనీర్, 150 గ్రాముల వండిన అన్నం, 100 గ్రాముల గ్రీక్ యోగర్ట్, ఒక ఉడికించిన బీట్రూట్ ఉంటాయి. ఇది ప్రోటీన్, కార్బోహైడ్రేట్లు ఫైబర్ల సమతుల్య కలయిక. పెరుగు అదనపు ప్రోటీన్ను అందిస్తుంది, బీట్రూట్ ఫైబర్,సహజమైన తీపిని ఇస్తుంది.గుడ్లతో రొయ్యల ఫ్రైడ్ రైస్సాచి 200 గ్రాముల రొయ్యల ఫ్రైడ్ రైస్ను, ఉల్లిపాయ,క్యాప్సికమ్తో వండిన ఒక పూర్తి గుడ్డు, రెండు గుడ్డు తెల్లసొనలు, తరిగిన దోసకాయతో కలిపి తీసుకుంది. ఈ భోజనంలో ప్రోటీన్ అధికంగా ఉంటుంది. పైగా ఇందులో కడుపు నిండినట్లు అనిపించడానికి ఇందులో కూరగాయలు కూడా ఉంటాయి.గుడ్లు, పుట్టగొడుగులు, క్రాకర్లుఈ ప్లేట్లో రెండు గుడ్లు, పుట్టగొడుగుల వేపుడు, 100 గ్రాముల గ్రీక్ పెరుగు, ఉడికించిన ఒక బీట్రూట్, మూడు వాసా క్రాకర్లు ఉంటాయి. ఇది ప్రోటీన్, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులతో నిండిన ఒక సాధారణ భోజనం. ఇది కూడా ఎక్కువసేపు కడుపు నిండిన అనుభూతిని అందిస్తుంది.ఎయిర్-ఫ్రైడ్ చికెన్ ప్లేట్ఆమె ప్లాన్లోని మరొక ఇష్టమైన వంటకంలో 100 గ్రాముల ఎయిర్-ఫ్రైడ్ మసాలా చికెన్, 150 గ్రాముల అన్నం, 100 గ్రాముల గ్రీక్ పెరుగు, సైడ్గా తాజా క్యారెట్, దోసకాయ సలాడ్ ఉంటాయి. ఇది లీన్ ప్రోటీన్, కార్బోహైడ్రేట్లు, తాజా కూరగాయల మిశ్రమం.గ్రీన్ చట్నీ చికెన్ మీల్ఈ చివరి ప్లేట్లో ఎయిర్-ఫ్రైడ్ చేసిన రెండు గ్రీన్ చట్నీ చికెన్ లెగ్స్, 150 గ్రాముల పాలక్ పనీర్, 120 గ్రాముల అన్నం, ఒక ఉడికించిన బీట్రూట్ ఉంటాయి. ఇది ప్రోటీన్ను ఆకుకూరలతో నియంత్రిత పరిమాణంలో అన్నంతో మిళితం చేస్తుంది.సాచీ డైట్ విధానాన్ని చూస్తే..ఆమె ఎక్కడా..అన్నం తినడం మానలేదు లేదా తనకు ఇష్టమైన ఆహారాలను పూర్తిగా వదిలేయలేదు. దానికి బదులుగా, ఆమె తగినంత ప్రోటీన్, కూరగాయలు, నియంత్రిత పరిమాణాలతో కూడిన సమతుల్య ఆహారంపై దృష్టి పెట్టింది. అలాగే ఆమెలో ఈ మార్పు రాత్రికి రాత్రే జరగలేదు. అందుకోసం ఆమెకి మూడేళ్లు పట్టింది. తక్షణ ఫలితాలనిచ్చే డైట్ల కంటే చిన్నగా, నిలకడైన అలవాట్లు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయని సాచీ వెయిట్లాస్ జర్నీ నిరూపించింది. View this post on Instagram A post shared by Saachi | Fat Loss. Real Talk. Pilates. (@saachi.pai)గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: Weight Loss: జస్ట్ మూడేళ్లలో 47 కేజీలు..! ఆ ఐదింటితోనే బరువు మాయం..) -
తల్లి మెనోపాజ్ దశ కూతురికి ఎందుకు అవసరం?
ప్రస్తుత రోజుల్లో ప్రతి కుటుంబంలోని మహిళల మెనోపాజ్ గురించి బహిరంగంగా చర్చించడం, దానిని సాధారణ విషయంగా చూడటం అత్యంత అవసరమని నిపుణులు చెబుతున్నారు. స్త్రీలలో రుతుస్రావం (పీరియడ్స్) శాశ్వతంగా ఆగిపోయే దశను మెనోపాజ్ అంటారు. భవిష్యత్ తరాల మహిళల కోసం తల్లుల మెనోపాజ్ అనుభవాలను కూతుళ్లు తప్పనిసరిగా తెలుసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.తన చిన్నతనంలో తన తల్లి మెనోపాజ్ దశను ఎదుర్కొన్నప్పుడు దాని గురించి ఎలాంటి అవగాహన లేదని, ఆమె ఎదుర్కొన్న భావోద్వేగాలను కేవలం ‘ఒత్తిడి’గా భావించామని ఓ మహిళ గుర్తుచేసుకున్నారు. ఈ అంశంపై సరైన చర్చ లేకపోవడం వల్ల తల్లులు పడే ఇబ్బందులు కూతుళ్లకు అర్థంకావని ఆమె పేర్కొన్నారు.భారతీయ కుటుంబాలలో మెనోపాజ్ ఇప్పటికీ ఒక రహస్య విషయంగానే ఉంది. దీనివల్ల తల్లుల శారీరక, మానసిక ఇబ్బందులు కూతుళ్లకు తెలియవు. కొన్ని లక్షణాలను బట్టి తల్లులు కేవలం కోప్పడుతున్నారని భావిస్తారు. కానీ వాస్తవానికి వారు తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో పోరాడుతుంటారు. ఈ దశపై అవగాహన పెంచుకోవడం ద్వారా కూతుళ్లు తమ తల్లుల కష్టాలను అర్థం చేసుకుని తగిన సహకారం అందించగలుగుతారు.భవిష్యత్తులో కూతుళ్లు కూడా ఇదే దశను ఎదుర్కొవాల్సి ఉంటుంది. తల్లి అనుభవాల ద్వారా ముందస్తు సంకేతాలను గుర్తించి, వైద్య సహాయం ఎప్పుడు అవసరమో తెలుసుకోవడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇక్కడ అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ మౌన సంస్కృతిని బద్దలు కొట్టాలి. తల్లితో ఈ అంశంపై మాట్లాడటం ద్వారా భవిష్యత్తులో తన కూతుత్తోనూ చర్చించే అవకాశం లభిస్తుంది. ఈ విజ్ఞానాన్ని తరతరాలకు అవసరమైనదిగా భావించి, కుటుంబాలలో మెనోపాజ్పై చైతన్యం తేవాలని, తద్వారా మహిళల సమస్యలను అర్థం చేసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.ఇది కూడా చదవండి: ‘కే బ్యూటీ’ గ్లాస్ స్కిన్ రహస్యం.. వంట గదిలో.. -
‘కే బ్యూటీ’ గ్లాస్ స్కిన్ రహస్యం.. వంట గదిలో..
చర్మ సంరక్షణ రంగంలో ఇప్పుడు ‘గ్లాస్ స్కిన్’ ట్రెండ్ ప్రపంచాన్ని ఊపేస్తోంది. అయితే, ఈ ఆధునిక సౌందర్య సాధనాలు పుట్టకముందే, కొరియాలోని జోసన్ రాజవంశం (1392-1897) కాలంలో మహిళలు ప్రకృతి సిద్ధమైన పద్ధతులతో తమ అందాన్ని కాపాడుకున్నారు. ఆధునిక ల్యాబ్లలో తయారవుతున్న అనేక ఉత్పత్తులకు వంటగది చిట్కాలే మూలంగా నిలిచాయి.తేనె: తేమను బంధించే అమృతంఆధునిక మాయిశ్చరైజర్లు రాకముందే, చర్మాన్ని మృదువుగా ఉంచడంలో తేనె ప్రధాన పాత్ర పోషించింది. జోసన్ కాలం నాటి మహిళలు తేనెను ధాన్యాల పొడిలో కలిపి ముఖానికి లేపనంగా రాసుకునేవారు. దీనిలోని సహజమైన చక్కెరలు చర్మాన్ని తేమగా ఉంచడానికి, పొడిబారకుండా కాపాడడానికి ఎంతగానో సహాయపడ్డాయి. నేటి కాలంలో దీని సారం ‘ప్రొపోలిస్’ రూపంలో చర్మ రక్షణకు విస్తృతంగా ఉపయోగపడుతోంది.గ్రీన్ ప్లమ్: సహజసిద్ధమైన ఎక్స్ఫోలియేటర్కొరియాలో ‘మేసిల్’ అని పిలువబడే గ్రీన్ ప్లమ్ను సాంప్రదాయ వైద్యంలో శరీరాన్ని చల్లబరచడానికి వాడేవారు. దీనిలో సహజంగా లభించే పండ్ల ఆమ్లాలు (ఫ్రూట్ యాసిడ్స్) చర్మంపై మృతకణాలను తొలగించడంలో అద్భుతంగా పనిచేస్తాయి. ఎలాంటి హానికారక స్క్రబ్లను ఉపయోగించకుండానే చర్మాన్ని నునుపుగా మార్చడానికి నాటి కాలంలో దీన్ని ఉపయోగించేవారు.రెడ్ బీన్స్: మురికిని వదిలించే ఆయుధంరెడ్ బీన్స్ను కేవలం వంటకాలకే పరిమితం చేయకుండా, సౌందర్య సాధనంగా కూడా వాడారు. వీటిని మెత్తని పొడిగా చేసి, చర్మంపై పేరుకున్న మురికిని, అదనపు నూనెను తొలగించడానికి క్లెన్సింగ్ పేస్ట్గా ఉపయోగించేవారు. చర్మం మృదువుగా, సాగే గుణంతో ఉండేందుకు రెడ్ బీన్స్ ఎంతగానో దోహదపడతాయని జోసన్ గ్రంథాలు వెల్లడిస్తున్నాయి.ముగ్వోర్ట్: చర్మానికి చల్లదనాన్నిచ్చే మూలికకొరియన్ వంటకాల్లోనూ, వైద్యంలోనూ శతాబ్దాలుగా వాడుతున్న ముగ్వోర్ట్... సౌందర్య సాధనంగానూ ప్రముఖ స్థానం సంపాదించుకుంది. చికాకు పెట్టిన చర్మాన్ని ఉపశమింపజేయడానికి దీన్ని సంప్రదాయ రీతిలో వాడుతుంటారు. యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే ఈ సువాసనగల మొక్క నేడు చర్మంపై ఉండే ఎరుపుదనాన్ని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తోంది.బియ్యపు పొట్టు: సాంప్రదాయ క్లెన్సర్బియ్యాన్ని శుభ్రం చేసిన తర్వాత వచ్చిన పొట్టును జోసన్ కాలం నాటి గృహిణులు ఎప్పుడూ వృథా చేయలేదు. దీన్ని నీటితో కలిపి తేలికపాటి క్లెన్సర్గా ఉపయోగించడం ద్వారా, చర్మానికి ఉండే తేమను కోల్పోకుండా మృదువుగా మార్చుకున్నారు. కాలక్రమేణా బియ్యపు నీరు, ఊక ఆధునిక కే బ్యూటీ ఉత్పత్తులలో ప్రధాన పదార్థాలుగా స్థానం సంపాదించుకున్నాయి.గ్రీన్ టీ, జిన్సెంగ్: దీర్ఘకాలిక యవ్వన రహస్యంగ్రీన్ టీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని పర్యావరణ కాలుష్యాల నుండి రక్షిస్తాయని నాటి కాలంలోనే నమ్మేవారు. ఇక కొరియా వారసత్వంతో ముడిపడి ఉన్న జిన్సెంగ్ వేరును దీర్ఘాయువుకు ప్రతీకగా భావించారు. నేడు ఈ రెండింటిలో లభించే సపోనిన్లు చర్మానికి కావలసిన హైడ్రేషన్ను అందిస్తూ, వృద్ధాప్య లక్షణాలను సమర్థవంతంగా అడ్డుకుంటున్నాయి. -
బిడ్డ పుట్టినప్పుడే తల్లీ పుడుతుంది...
తల్లి క్షేమానికి సురక్షితమైన ప్రసవం ఎంత ముఖ్యమో, ప్రసవానంతరం బిడ్డ క్షేమానికి పాలు పట్టడమూ అంతే ముఖ్యం. శిశువు తర్వాతి దశలలో ఆరోగ్యంగా పెరగడానికి తల్లిపాలు తాగడం ఒక్కటే సరైన పరిష్కారం. బిడ్డ పుట్టిందనే ఆనందం మాత్రమే కాదు అదే సమయంలో స్త్రీ తల్లిగా కొత్త జన్మ ఎత్తుతుందని, ఆ జన్మను మరింత దివ్యంగా మార్చుకునే శక్తి ఆమెకే ఉందని ప్రపంచస్థాయిలో ఎన్నో నివేదికలు సూచిస్తున్నాయి. ఈ విషయంలో తల్లికి కుటుంబ మద్దతు, వైద్యుల సూచనలు తప్పనిసరి అవసరం...ఔషధం లాంటి అమ్మపాలు బిడ్డకు అమృతమే. సహజ పోషకాహారం. బిడ్డ ఆరోగ్యకరమైన భావి జీవితానికి ఎంతో విలువైనవి. తల్లిపాలు తాగని పిల్లల్లో అనారోగ్యం, ఆకస్మిక మరణం, నేర్చుకునే సామర్థ్యం తగ్గడం, యుక్తవయస్సులో ఆరోగ్య సమస్యల ప్రమాదాలు పెరుగుతున్నాయని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్తో పాటు పలు నివేదికలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇలాంటి సమయంలో అమ్మపాల ్రపాధాన్యత గురించి, బిడ్డకు లభించిన జన్మహక్కు గురించి మరింత వివరంగా తెలుసుకోవడం, తెలియజెప్పడం మన విధి.ఇన్ఫెక్షన్ల నివారిణి...తల్లిపాలు కాకుండా ఇతర ఆహారాన్ని అంటే.. చాలావరకు ప్రసవం అయ్యాక శిశువుకు తేనె నాకించడం, డబ్బా పాలు పడుతుంటారు. ఈ విధానం చాలా ప్రమాదకరమైనది. దీని వల్ల తల్లిలోనూ పాల ఉత్పత్తి ఆలస్యం కావచ్చు. ఇలాంటి వాటి వల్ల బిడ్డకు ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం కూడా ఉంది. చెవి ఇన్ఫెక్షన్లు, విరేచనాలు, న్యుమోనియా వంటి అనారోగ్యాల బారిన పడే అవకాశాలూ ఉన్నాయి. తల్లిపాలు ఇవ్వడం వల్ల తల్లి శరీర వేడి ద్వారా బిడ్డను రక్షించడమే కాకుండా తల్లీ బిడ్డ మధ్య బంధం బలపడుతుంది. మొదటి గంటలో తల్లి తన బిడ్డకు ఇచ్చే ప్రతి పాల చుక్కా అనారోగ్యకారకమైన బాక్టీరియాతో పోరాడే శక్తి ప్రదాయిని. సాధారణ సిజేరియన్ ఏ ప్రసవం అయినా మొదటి తల్లిపాలు శిశువుకు తప్పక ఇవ్వాలి. – డాక్టర్ శిరీష, గైనకాలజిస్ట్బిడ్డకు తల్లి ఇచ్చే మొదటి బహుమతిముర్రుపాలుగా పిలిచే మొదటి పాలను కొలొస్ట్రమ్ అంటారు. ‘ప్రీ మిల్క్’ అనే ఈ పాలలోని పోషకాలు యాంటీబాడీలుగా శిశువుకు మొదటి సహజ టీకాగా పనిచేస్తాయి. ఎన్నో రకాల ఇన్ఫెక్షన్ల నుండి రక్షణ కల్పిస్తాయి. రోగనిరోధక శక్తిని, వ్యాధుల నుంచి రక్షణను ఏకకాలంలో అందజేస్తాయి. అంతేకాదు, ప్రసవం అయిన మొదటి గంటలో తల్లి హృదయానికి హత్తుకున్న బిడ్డ స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ వల్ల పిల్లల చర్మంలో మంచి బాక్టీరియా వృద్ధి చెంది, తల్లీ–బిడ్డల బంధాన్ని మెరుగుపరుస్తుంది. అందువల్ల అప్పుడే పుట్టిన శిశువుకు తల్లిపాలు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పట్టాలని, ‘మొదటి గంట’ మరీ కీలకం అని యూనిసెఫ్, డబ్ల్యూహెచ్వో తో పాటు ఎన్నో పరిశోధనలు తెలియజేస్తున్నాయి.ఇంతగా తల్లిపాల విశిష్టతను తెలియజేయడానికి కారణం శిశువు ఆరోగ్యకరమైన మెదడు అభివృద్ధికి, చురుకైన పనితీరుకు తోడ్పడే పోషకాలు ఆ పాలలో ఉంటాయి. ్ర΄÷టీన్, ఐరన్, కాల్షియం, విటమిన్లు సమృద్ధిగా, చక్కెరపాళ్లు తక్కువగా ఉండే తల్లి పాలు శిశువుకు మొదటి ఆరు నెలలు పూర్తి ఆహారం.తల్లి పాలు ఇవ్వడం ద్వారా... శిశువులోనూ, తల్లిలోనూ అనారోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి. మాతా – శిశు మరణాల రేటు తగ్గించవచ్చు. తల్లిపాలు తాగి పెరిగిన పిల్లలు మేధో పరీక్షలలో మెరుగ్గా రాణిస్తారు. అధికబరువు లేదా ఊబకాయం బారిన పడే అవకాశాలు తక్కువ ఉంటాయి. భవిష్యత్తులో మధుమేహం వచ్చే ప్రమాదం కూడా తక్కువ ∙తల్లిపాలు ఇచ్చే మహిళలకు రొమ్ము, అండాశయ కాన్సర్ల ప్రమాదం కూడా తక్కువ ఉంటుంది. ఆరోగ్యంగా పెరగడం వల్ల ఉత్పాదక శక్తి పెరుగుతుంది. బలమైన ఆర్థిక వ్యవస్థకు ఇది అత్యంత కీలకం. ఆరోగ్య సంరక్షణకు పెట్టే ఖర్చు భారీగా తగ్గుతుంది. తల్లిపాల పెంపుదలపై సరైన చర్యలు తీసుకోకపోవడం వల్ల ప్రపంచవ్యాప్తంగా ప్రతీరోజు మిలియన్ డాలర్ల నష్టం వాటిల్లుతోంది. తల్లిపాలు అందక ఇప్పటికీ ప్రతి వెయ్యి నవజాత శిశువులలో 224 నుంచి 263 శిశు మరణాలు సంభవిస్తున్నాయి. ఇంత జరుగుతున్నా నేటికీ 6 నెలల లోపు శిశువులలో సగం కంటే తక్కువ మంది మాత్రమే తల్లిపాలు తాగుతున్నారని నివేదికలు చెబుతున్నాయి.పని ప్రదేశాలలో తల్లిపాలకు మద్దతుపిల్లల జీవితంలో ఆరోగ్యకరమైన పునాది వేసేది తల్లిపాలు. శిశు, చిన్న పిల్లల పోషణలో అవగాహన మాత్రమే తల్లిపాలు ఇచ్చే శాతాన్ని పెంచుతాయని డబ్ల్యూహెచ్వో తెలిపింది. ఈ సంస్థ 16 అధ్యయనాల అంచనాలను క్రోడీకరించి ఆరోగ్య కేంద్రాలు, సంఘాలు, ఇళ్లలో చెప్పడం ద్వారా తల్లిపాలు ఇచ్చే రేటు 58 శాతం పెరిగిందని వివరించింది. ∙15,096 మంది నవజాత శిశువులపై జరిపిన అధ్యయనాలలో బేబీ ఫ్రెండ్లీ హాస్పిటల్ ఇనిషియేటివ్ (బిఎఫ్హెచ్ఐ) వల్ల శిశువు 6 నెలల వయసు వరకు తల్లిపాలు మాత్రమే ఇచ్చేవారి సంఖ్యలో 45 శాతం పెరిగిందని, ఆ తర్వాత కొనసాగించేవారి సంఖ్య 26 శాతం మాత్రమే పెరిగిందని వివరించింది ∙మీడియా జోక్యం ద్వారా 17 శాతం తల్లిపాలు పట్టడాన్ని పెంచిందని వివిధ అధ్యయనాల ద్వారా తెలిసింది ∙వేతనంతో కూడిన ప్రసూతి సెలవు వల్ల తల్లిపాలు ఇచ్చేవారి సంఖ్య 52 శాతం పెరిగిందని తేలింది. పని ప్రదేశంలో శిశువులకు తల్లిపాలు పట్టడానికి మద్దతు ఇచ్చే విధానాలు, కార్యక్రమాలు తల్లిపాలు ఇచ్చేవారి సంఖ్యను గణనీయంగా పెంచుతాయని అభి్రపాయపడింది. – నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
జీయూటీబీ అంటే ఏమిటి? నిర్లక్ష్యం చేస్తే ఏమవుతుంది?
ట్యూబర్క్యులోసిస్ అంటే... చదువుకున్నవారికి తప్ప పెద్దగా తెలియని ఈ వ్యాధిని టీబీ అంటే సామాన్యజనం కూడా గుర్తుపడతారు. ఇదెంతో పురాతనమైన వ్యాధి. ఎంత పురాతనమైనదంటే... క్రీ.పూ. 8000 ఏళ్ల కిందట ఈజిప్షియన్ మమ్మీలలోనూ ఈ వ్యాధి తాలూకు ఆనవాళ్లు కనిపించాయి. అంతేకాదు... మన స్వాతంత్ర సంగ్రామంలోనూ జైళ్లలో ఉంచే ఖైదీలు కూడా దాదాపు ఈ వ్యాధిబారిన పడే మరణానికి చేరువయ్యేవారు.ఎందుకంటే... చీకటిలో, తేమలో ఈ వ్యాధికి కారణమయ్యే క్రిమి పెరుగుతుంది. యాంటీబయాటిక్స్ కనుగొనేవరకూ ఇది చికిత్స లేని వ్యాధే. అయితే ధారాళంగా గాలీ, వెలుతురూ వచ్చే చోట ఈ వ్యాధి కారక క్రిమి పెరగదు కాబట్టి అప్పట్లో చికిత్స లేనిరోజుల్లో శానిటోరియమ్ అని పిలిచే గాలీ వెలుతురూ ధారాళంగా వచ్చే చోట ఉంచి బాధితులకు చికిత్స అందించేవారు. సాధారణంగా టీబీ అంటే ఎడతెరిపి లేకుండా విపరీతంగా దగ్గు వస్తూ ప్రధానంగా ఊపిరితిత్తులను ప్రభావితం చేసే వ్యాధిగా భావిస్తారు. కానీ... ఈ వ్యాధి ప్రధానంగా కేవలం ఊపిరితిత్తులనే కాదు... దేహంలోని అన్ని వ్యవస్థలనూ ప్రభావితం చేయవచ్చు. అలా మూత్రవ్యవస్థ, మూత్రవిసర్జక వ్యవస్థలను దెబ్బతీసే టీబీని ‘జెనైటో యూరినరీ ట్యూబర్క్యులోసిస్’ లేదా ‘జీయూటీబీ’ అంటారు. ఈ నేపథ్యంలో అసలు ‘జీయూటీబీ’ అంటే ఏమిటో చూద్దాం...మన దేశంలో ఇప్పటికీ ప్రతి లక్ష మంది జనాభాలో దాదాపు 187 నుంచి 192 మంది టీబీ వ్యాధిగ్రస్తులు ఉన్నట్టు అంచనా. 2015 నాటి గణాంకాలతో పోలిస్తే మన దేశంలో బాధితుల సంఖ్య దాదాపు 21% తగ్గినప్పటికీ... ఇప్పటికీ ప్రపంచంలోని టీబీ బాధితుల్లో 25% మంది (అంటే మొత్తం ప్రపంచంలోని పేషెంట్లలో నాలుగో వంతు) భారత్లోనే ఉండటం ఒకింత ఆందోళనగొలిపే అంశమే. అంతేకాదు... ప్రపంచంలోని టీబీ మరణాల్లో దాదాపు 28% అంటే దగ్గర దగ్గర మూడోవంతు మనదేశంలోనే జరుగుతుండటం కూడా టీబీ నివారణా, చికిత్సలపై మనం మరింతగా దృష్టిపెట్టాల్సిన ఆవశ్యకత ఉందని తెలిపే అంశం.ఊపిరితిత్తులనే కాదు, ఇతర వ్యవస్థల్లో కూడా... సాధారణంగా టీబీ అనేది ప్రధానంగా ఊపిరితిత్తుల వ్యవస్థలనే దెబ్బతీస్తుందన్న విషయం దాదాపుగా ప్రజలందరికీ తెలిసిన విషయమే. అయితే అది దేహంలోని మిగతా దేహవ్యవస్థలనూ దెబ్బతీసే అవకాశాలూ ఉంటాయి. ఇలా ఇతర వ్యవస్థలను ప్రభావితం చేసే టీబీని ‘ఎక్స్ట్రా పల్మునరీ టీబీ’గా పేర్కొంటారు. మొత్తం ఎక్స్ట్రా పల్మునరీ కేసుల్లో నాలుగు శాతం జీయూటీబీ కేసులు ఉంటాయన్నది మరో అంచనా.వ్యాప్తి ఇలా / ప్రభావితమయ్యే అవయవాలివి... ట్యూబర్క్యులోసిస్ బ్యాసిల్లస్ అని పిలిచే బ్యాక్టీరియా క్రిమితో వ్యాపిస్తుంది కాబట్టి దీన్ని సంక్షిప్తంగా టీబీగా వ్యవహరిస్తారన్న విషయం తెలిసిందే. మిగతా సాధారణ టీబీ కేసుల్లోలాగే ఈ ‘జెనైటో యూరినరీ ట్యూబర్క్యులోసిస్’ లేదా ‘జీయూటీబీ’ కూడా వ్యక్తి నుంచి వ్యక్తికి వాప్తి చెందుతుంది. అలా వ్యాపించిన ‘ట్యూబర్క్యులోసిస్ బ్యాసిల్లస్’ బ్యాక్టీరియా సూక్ష్మజీవులు రక్తంలోకి వ్యాప్తించి అక్కడి నుంచి మూత్రవిసర్జన వ్యవస్థలోకి కూడా వ్యాప్తి చెందుతాయి.మూత్రవ్యవస్థలోని ఏయే అవయవాలపై దుష్ప్రభావాలంటే... మూత్రవ్యవస్థలోకి బ్యాక్టీరియా వ్యాపించినప్పుడు సాధారణంగా అవి మూత్రపిండా (కిడ్నీ)లను దెబ్బతీస్తాయి. కిడ్నీల నుంచి క్రమంగా మూత్రాశయానికి వచ్చే పైపులైన యూరేటర్స్కూ, అక్కడ్నుంచి మూత్రాశయం (యూరినరీ బ్లాడర్), ప్రోస్టేట్ గ్రంథి, వృషణాల నుంచి శుక్రకణాలను బయటకు తెచ్చే సెమినల్ వెసికిల్స్తో ΄ాటు వృషణాలకూ వ్యాప్తించి, ఆ అన్ని అవయవాలపైనా తమ దుష్ప్రభావం చూపవచ్చు. అందుకే ఈ జీయూటీబీతో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరముంది. ముప్పు (రిస్క్) ఎవరిలోనంటే... సాధారణంగా అది ఏ తరహా టీబీ అయినప్పటికీ... ఒకసారి దేహంలో టీబీ వచ్చిందంటే వ్యాధి నిరోధక వ్యవస్థ చాలా బలహీనంగా ఉందని అర్థం. ఎందుకంటే దాదాపు దేశంలోని 85% మందిలో టీబీ క్రిమి అంతర్లీనంగా (డార్మంట్గా) ఉంటుందని అంచనా. అయితే ప్రజల్లో ఉండే వ్యాధి నిరోధక శక్తి కారణంగా అది తన ప్రభావం చూపలేదు. అయితే... సాధారణంగా టీబీ వచ్చిన బాధితుల్లో లేదా ఎక్స్ట్రా పల్మునరీ టీబీ వచ్చిన వాళ్లలోనూ, వ్యాధి నిరోధక శక్తి తగ్గినవాళ్లలో, చాలాకాలం ΄ాటు టీబీతో బాధపడేవారితో సన్నిహితంగా ఉండేవాళ్లలో అన్ని రకాల టీబీలతో ΄ాటు ‘జీయూటీబీ’ కూడా వచ్చే ముప్పు ఎక్కువగా ఉంటుంది.నిర్యక్ష్యం తగదు... ఎందుకంటే... ఒకసారి ఈ వ్యాధిని అనుమానించక అలాగే నిర్లక్ష్యం చేస్తే కొందరిలో కిడ్నీ పూర్తిగా దెబ్బతినే ప్రమాదం ఉండవచ్చు. ఒకసారి కిడ్నీ దెబ్బతిన్నదంటే... అటు తర్వాత అది మళ్లీ మునపటి పనితీరును ప్రదర్శించలేనంతగా దెబ్బతినే అవకాశమూ ఉండవచ్చు. మూత్రాశయం (బ్లాడర్) సామర్థ్యం కూడా తగ్గవచ్చు. అలాగే ఈ సమస్య వచ్చిన కొందరిలో సంతనలేమి (ఇన్ఫెర్టిలిటీ) సమస్య కూడా వచ్చే అవకాశం ఉంది. అందుకే సాధారణ యాంటీబయాటిక్ కోర్సు ముగిశాక కూడా మూత్రం ఇన్ఫెక్షన్ తగ్గని సందర్భాల్లో చాలా అప్రమత్తంగా ఉండి డాక్టర్ల సలహా మేరకు తగిన పరీక్షలన్నీ చేయించాలి.జీయూటీబీ నిర్ధారణ ఇలా... మామూలు మూత్రపరీక్షలతో ‘జీయూటీబీ’ నిర్ధారణ చేయడం అంతగా కుదరకపోవచ్చు. అందుకే... జీయూటీబీ నిర్ధారణ కోసమే ప్రత్యేకంగా నిర్వహించాల్సిన ‘న్యూక్లియిక్ యాసిడ్ యాంప్లిఫికేషన్ సాంకేతికత (ఎన్ఏఏటీ) సహాయంతో ‘΄ాలిమరేజ్ చైన్ రీయాక్షన్’ (పీసీఆర్) పరీక్ష చేయించాల్సి ఉంటుంది. అయితే ఈ పరీక్ష కూడా నూరు శాతం కేసుల్లో పూర్తిగా సరైన నిర్ధారణ చేయలేకపోవచ్చు. అయినప్పటికీ జీయూటీబీకి చాలావరకు ఇదే మంచి నిర్ధారణ పరీక్ష. అయితే కొన్ని సందర్భాల్లో ‘ఫాల్స్ నెగెటివ్’ ఫలితం కూడా రావచ్చు. అందుకే సాధారణ ఇన్ఫెక్షన్లా కనిపిస్తూ అందరి కనుగప్పే లక్షణాలున్నందున... అనుమానం వచ్చిన కేసుల్లో డాక్టర్లు మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తుంటారు. అలాగే అవసరాన్ని బట్టి సీటీ స్కాన్, ఎక్స్–రే పరీక్షలనూ నిర్వహిస్తారు.ఇలా కేవలం... నిర్దిష్టంగా ఒకే పరీక్ష కాకుండా... లక్షణాల ఆధారంగా, ప్రత్యేక పరీక్షలతో ΄ాటు రొటీన్ సీటీ స్కాన్, ఎక్స్–రే పరీక్షలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని వ్యాధిని నిర్ధారణ చేస్తారు.సూచన: కొందరిలో ఈ వ్యాధి ఖచ్చితంగా పూర్తిస్థాయిలో నిర్ధారణ సాధ్యం కాకపోవచ్చు. అయితే కొన్ని మార్గదర్శకాల ఆధారంగా సదరు బాధితులు ‘యాంటీ ట్యూబర్కులార్ చికిత్స–ఏటీటీ’కి అర్హులని డాక్టర్లు నిర్ణయిస్తారు.లక్షణాలు..‘జీయూటీబీ’ ఉన్నవారిలో కనిపించే సాధారణ లక్షణాలివి...చాలా తరచుగా లేదా త్వరత్వరగా మూత్రవిసర్జనకు వెళ్లాల్సి రావడం.మూత్ర విసర్జన ఫీలింగ్ను ఆపుకోలేకపోవడం.కొన్నిసార్లు మూత్రం ఎరుపు రంగులో రావడం.ఈ లక్షణాలతో కొన్ని సందర్భాల్లో ‘జీయూటీబీ’ని మూత్రంలో వచ్చే సాధారణ ఇన్ఫెక్షన్ (జనరల్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్–యూటీఐ)గా పొరబడే అవకాశాలు ఉంటాయి. లేదా తరచూ మూత్రవిసర్జనకు వెళ్తుండటంతో ‘ఓవర్ యాక్టివ్ బ్లాడర్’ అని కూడా పొరబడే అవకాశాలూ ఎక్కువే.మూత్రపరీక్ష నిర్వహించినప్పుడు మూత్రంలో ఇన్ఫెక్షన్ ఉన్నట్లు తెలియవచ్చు. అయితే అది నిర్దిష్టంగా ఫలానా ఇన్ఫెక్షన్ అని తెలియకపోవచ్చు. అలాంటి ఇన్ఫెక్షన్ను ‘స్టెరైల్ పైయూరియా’ అంటారు. ఇలాంటి సందర్భాల్లో కొన్ని సందర్భాల్లో దాన్ని మామూలుగానే ఇన్ఫెక్షన్గానే పరిగణంచి డాక్టర్లు సాధారణంగా ‘యాంటీబయాటిక్స్’ వాడతారు.అయితే సమస్య జీయూటీబీ కావడం వల్ల ఆ యాంటీబయాటిక్స్తో ఎలాంటి ప్రయోజనమూ కనిపించదు. కొందరిలో కొన్ని సూచనలు ప్రత్యేకంగా కనిపించవచ్చు. ఉదాహరణకు... చాలా తీవ్రమైన నిస్సత్తువ, నీరసం, బరువు బాగా తగ్గిపోవడం, సాయంత్రాలు ఒళ్లు వెచ్చబడటం వంటి లక్షణాలు కనిపించవచ్చు. వీటి ఆధారంగా ‘జీయూటీబీ’ని అనుమానించాల్సి ఉంటుంది.చికిత్స...∙అది జీయూటీబీ అని నిర్ధారణ అయ్యాక ‘యాంటీ ట్యూబెర్క్యులార్ చికిత్స’ (ఏటీటీ)ని మొదలుపెట్టాల్సి ఉంటుంది. ఇది కొన్ని మందుల కాంబినేషన్లతో (మల్టీ డ్రగ్ థెరపీ) రూపంలో ఆరు నెలల నుంచి తొమ్మిది నెలలు లేదా కొన్ని సందర్భాల్లో అంతకంటే ఎక్కువ రోజుల ΄ాటు డాక్టర్లు చికిత్స కొనసాగిస్తారు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ టీబీకి ప్రత్యేకంగానూ, ఉచితంగానూ మందులు ఇస్తుంటారు.కొన్ని కేసుల్లో ‘యాంటీ ట్యూబెర్క్యులార్ చికిత్స’... అంటే ఏటీటీ ట్రీట్మెంట్ అందిస్తూనే... కిడ్నీలు మరింతగా దెబ్బతినకుండా ఉండేందుకు, వాటి పనితీరును సంరక్షించడానికి తాత్కాలిక స్టెంట్లు వేయడం, శస్త్రచికిత్స చేయాల్సి రావడం వంటి చికిత్సలూ చేయాల్సి రావచ్చు.మరికొందరు బాధితుల్లో... మిగతా సాధారణ టీబీ లాగానే ఈ జీయూటీబీ కూడా.. మల్టీ డ్రగ్ రెసిస్టెన్స్ పెరగడంతో వ్యాధి బాగా ముదిరిపోతుంది. దాంతో వాళ్లలో మూత్రవిసర్జక వ్యవస్థ దెబ్బతినే ముప్పు ఎక్కువ. ఇలాంటి కొందరిలో శస్త్రచికిత్స అవసరం పడవచ్చు. అరుదుగా కొందరిలో కిడ్నీల నుంచి మూత్ర విసర్జనకు తోడ్పడే యురేటర్స్ను పునర్నిర్మించడం వంటి శస్త్రచికిత్సలూ అవసరం పడవచ్చు. మరికొందరిలో మూత్రాశయం దెబ్బతిన్నప్పుడు... మూత్రాశయాన్నీ, వారి చిన్నపేగులను అనుసంధానిస్తూ చేసే ‘ఆగుమెంటేషన్ సిస్టో΄్లాస్టీ’ అనే చికిత్స చేయాల్సి రావచ్చు. మూత్రాశయం పనితీరును మెరుగుపరచడానికి ఈ చికిత్స చేయాల్సివస్తుంది.కొన్ని ప్రభుత్వ కార్యకలా΄ాలు కూడా... ప్రధానమంత్రి టీబీ ముక్త్ భారత్ అభియాన్: కొన్ని ప్రత్యేకమైన కార్యక్రమాల ద్వారా / చికిత్స ప్రణాళికల ద్వారా కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు, ప్రభుత్వ సంస్థలు టీబీని పూర్తిగా రూపుమాపడానికి ప్రయత్నిస్తున్నాయి. ఈ ప్రయత్నంలో భాగంగా టీబీని పూర్తిగా నిరోధించే లక్ష్యంతో ‘ప్రధాన్ మంత్రి టీబీ ముక్త్ అభియాన్’ అనే కార్యక్రమం మొదలైంది. మరిన్ని కొత్తమందులతో చికిత్సా ప్రణాళికలు (న్యూ డ్రగ్ రెజిమెన్స్) : మిగతా టీబీల్లాగే ఈ టీబీలోనూ మందులు వాడటం మొదలుపెట్టగానే లక్షణాలన్నీ క్రమంగా తగ్గడం, మటుమాయం కావడం జరుగుతుంటుంది. దాంతో చాలామంది తమకు నయమైపోయిందనే భావనతో పూర్తి కోర్సు వాడకుండానే మందులు మానేస్తుంటారు. అయితే టీబీ సూక్ష్మజీవి ఆ మందులకు తన నిరోధకత పెంచుకుని మళ్లీ విజృంభిస్తుంది. దాంతో మునుపు వాడిన మందుల ప్రభావం అంతగా కనిపించదు. ఇలాంటివారికి ‘బీపీయేఎల్ ఎమ్’ అనే ప్రత్యేక మందుల కోర్సు ప్రణాళిక (రెజిమెన్)ను డాక్టర్లు సిఫార్సు చేస్తారు.వినూత్న సాంకేతికతతో: ఇటీవల టీబీపై పూర్తి అదుపు సాధించడానికి ఎక్స్–రేలూ, ఇతర రేడియాలజీ ఇమేజింగ్ చిత్రాలను విశ్లేషించడానికి కృత్రిమ మేధ (ఏఐ)తో అనుసంధానం చేయడం, ఖచ్చితంగా జీయూటీబీని గుర్తించడం వంటి వినూత్న సాంకేతికతను అవలంబిస్తున్నారు.చివరగా... మూత్ర వ్యవస్థలో ఇన్ఫెక్షన్ (యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ –యూటీఐ) కనిపించినప్పుడు సాధారణ యాంటీబయాటిక్స్తో లక్షణాలు తగ్గకపోతే... నిర్లక్ష్యం చేయకుండా తప్పనిసరిగా జీయూటీబీని అనుమానించి తప్పక డాక్టర్ను సంప్రదించాలి.- డాక్టర్ ఎ.వి. రవికుమార్, సీనియర్ కన్సల్టెంట్, యూరాలజిస్ట్ – ఆండ్రాలజిస్ట్నిర్వహణ : యాసీన్ -
జస్ట్ మూడేళ్లలో 47 కేజీలు..!ఆ ఐదింటితోనే బరువు మాయం..
బరువు తగ్గడం అనేది కాలంతో చేసే పరుగులాంటిది. కేవలం నిలకడైన మార్పులు, ఆరోగ్యకరమైన అలవాట్లు, ఓర్పు, సహనం, పట్టుదలతోనే సాధ్యమవుతుంది. అదే నిరూపించింది ఈ మహిళ. ఏకంగా వంద కేజీలపైనే బరువు ఉన్న ఈ మహిళ అద్భుతంగా వెయిట్లాస్ అయ్యి స్ఫూర్తిగా నిలిచింది. ఏకంగా 47 కేజీలపైనే బరువు తగ్గడం విశేషం.హేలీ అనే మహిళా ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ మూడేళ్లలో ఈ ఫలితాన్ని అందుకున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. మొదట తాను 116 కేజీలపైనే అధిక బరువుతో ఇబ్బంది పడ్డట్లు తెలిపింది. మూడేళ్ల పాటు నిలకడగా చక్కటి జీవనశైలి మార్పులను అనుసరించి బరువు తగ్గినట్లు తెలిపారు. అందుకోసం అనుసరించిన ఐదు ముఖ్యమైన ఆహారపు మార్పులు గురించి పంచుకున్నారు. బరువు తగ్గడం కోసం..వాకింగ్..దీన్ని చాలా తేలిగ్గ చూస్తుంటాం. కానీ తాజా గాలిలో జస్ట్ ఓ 30-45 నిమిషాలు నడవడం మన ఆలోచనలను మార్చి అద్భుతమైన మార్పుని తీసుకొస్తుందని అన్నారు.తగినంత నీరు తాగడంక్రమం తప్పకుండా తగినంత నీరు త్రాగడం ఆహార కోరికలను నియంత్రిస్తుందని అన్నారు. అలాగే తన పనులకు అవసరమైన శక్తి అంతా తిరిగి లభిస్తుందని చెప్పుకొచ్చింది. నీటి తోపాటు ప్రతిరోజూ ఒక గ్లాసు ఎలక్ట్రోలైట్స్ తీసుకోవాలని కూడా సూచించారామె.ప్రోటీన్ తీసుకోవడంప్రతిరోజూ కనీసం వంద గ్రాముల ప్రోటీన్ తీసుకోవాలని అన్నారు. దీనివల్ల కడుపు నిండిన అనుభూతి తోపాటు కండరాలను కోల్పోమని అన్నారు. కొవ్వుని కరిగించడం సులభమవుతుందని అన్నారు.ఉదయపు అలవాట్లుఉదయం నిద్రలేచిన తర్వాత వ్యాయామం లేదా ధ్యానం చేయాలని, అలాగే కనీసం 30 నిమిషాల పాటు ఫోన్లకు దూరంగా ఉండాలని ఆ మహిళ సూచించారు. ఇలా రెండు వారాలు పాటించి చూస్తే ఒత్తిడి మాయం అయ్యి మంచి నిద్ర పడుతుందని అన్నారు. అలాగే మానసిక స్పష్టత, ఏకాగ్రత, ప్రశాంతత తదితరాల్లో మెరుగుదలను చూస్తారని చెబుతోంది.ఫైబర్ వినియోగంఎక్కువ ఫైబర్ ఉన్న మూడు రకాల కూరగాయలను తినమని సూచిస్తోంది. ఇది కార్బోహైడ్రేట్లను సులభంగా జీర్ణం చేసి, మెరుగైన జీర్ణక్రియను ప్రోత్సహించడే కాకుండా కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుందని అంటోంది. చివరగా శరీరం చెప్పే మాట వింటూ ఆరోగ్యకరమైన జీవనశైలిని సాకులకు తావివ్వకుండా అనుసరిస్తే బరువు తగ్గడం సులభమని చెబుతోందామె.ఆమె సిఫార్సు చేశారు, ఎందుకంటే ఇది కార్బోహైడ్రేట్లను సులభంగా జీర్ణం చేయడానికి, మెరుగైన జీర్ణక్రియను ప్రోత్సహించడానికి మరియు ఎక్కువ సేపు కడుపు నిండుగా ఉండటానికి సహాయపడుతుంది.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: నో రన్నింగ్, నో కార్డియో..! జస్ట్ 20 నిమిషాల నడకతో 24 కిలోలు..) -
'మనం ఏది ఆలోచిస్తే అదే అవుతాం'.. ఇది శాస్త్రీయ వాస్తవం!
“మనం ఏది ఆలోచిస్తే అదే అవుతాం" అనేది కేవలం ఒక వేదాంత సూక్తి మాత్రమే కాదు, ఇప్పుడిది నిర్ధారణ అయిన ఒక శాస్త్రీయ వాస్తవం కూడా! మన మనస్సు, ఆలోచనలు మన శరీరంపై, ముఖ్యంగా వ్యాధి నిరోధక వ్యవస్థపై ఎంతటి బలమైన ప్రభావాన్ని చూపుతాయో తెలుసా? ఆశావాద ఆలోచనలు కేవలం మానసిక ప్రశాంతతకే కాదు, మన శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంచేందుకు కూడా ఉపయోగపడతాయని శాస్త్రవేత్తలకు మరోసారి తాజాగా నిరూపణ అయింది. మెదడును మనం మన ఆలోచనలతోనే 'రీ-వైరింగ్' చేస్తూ 'ఇమ్యూనిటీ'ని పెంచుకోవచ్చని ఇటీవలి ఒక విప్లవాత్మక పరిశోధన స్పష్టం చేసింది! అసలు ఆలోచనలకు, ఆరోగ్యానికి ఉన్న ఈ అద్భుతమైన లంకె ఏంటి?! చూద్దాం రండి.ఇంతవరకూ తెలుసుకున్నదిశరీరంపై ఆలోచనలు ప్రభావం చూపుతాయనే భావన ఎప్పటినుంచో ఉన్నప్పటికీ, దీని వెనుక ఉన్న నాడీ మండల నిర్మాణ శాస్త్రాన్ని అర్థం చేసుకోవడంలో కీలక పురోగతి సాధించింది గత కొన్నేళ్లలోనే అని డార్ట్మౌత్ యూనివర్సిటీకి చెందిన ప్రముఖ అమెరికన్ న్యూరోసైంటిస్ట్ టామ్ వేగర్ అంటారు. ఆశావాద ఆలోచనలు, మంచే జరుగుతుందన్న తలంపు, మెదడులోని ‘రివార్డ్ సిస్టమ్’ను (ఆనందాన్ని ఇచ్చే భాగం) క్రియాశీలం చేస్తాయి. మంచి ఆహారం తిన్నప్పుడు, ఒక ఆటలో గెలిచినప్పుడు లేదా ఎవరైనా ప్రశ్నించినప్పుడు మనకు కలిగే ఆనందానికి ఈ భాగమే కారణం. ఈ ప్రాంతంలో ఉండే నాడీ కణాలు ‘డోపమైన్’ అనే రసాయనాన్ని విడుదల చేయడం ద్వారా స్పందిస్తాయి– ఇదీ ఇంతవరకు పరిశోధకులు తెలుసుకున్నది.తాజా పరిశోధనతో నిర్థారణఇజ్రాయెల్లోని టెల్ అవీవ్ మెడికల్ సెంటర్కు చెందిన తామర్ కొరెన్ అనే వైద్య పరిశోధకురాలు, ఎలుకలలో ఈ ‘రివార్డ్ కణాలను’ ఉత్తేజపరచడానికి జన్యు పద్ధతులను ప్రయోగించినప్పుడు ఆశ్చర్యకరమైన ఆరోగ్య ప్రయోజనాలు కనిపించాయి. ఎలుకలు బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లతో మరింత సమర్థంగా పోరాడగలిగాయి. గుండెపోటు నుండి త్వరగా కోలుకున్నాయి, అంతేకాకుండా వాటిలో కణుతుల పెరుగుదల కూడా నెమ్మదించింది. ఈ విధానం చాలా ఆశాజనకంగా కనిపించడంతో, ఇది మనుషులకు కూడా పనిచేస్తుందో లేదో తెలుసుకోవాలని తామర్ కొరెన్ బృందం భావించింది. అయితే ఎలుకలలో ఉపయోగించిన జన్యుపరమైన పద్ధతులను మనుషులపై ప్రయోగించటం సురక్షితం కాదు. అందుకే, వారు కొందరు వ్యక్తులకు ఒక శిక్షణ ఇచ్చారు. తమ సొంత ఆలోచనల ద్వారానే మెదడులోని ఆ రివార్డ్ భాగాన్ని ఎలా ఉత్తేజపరుచుకోవాలో ఆ వ్యక్తులకు నేర్పించారు. వారు ఈ ప్రయోగాన్ని ఎలా నిర్వహించారో ప్రఖ్యాత ‘నేచర్ మెడిసిన్’ పత్రిక ప్రచురించింది.తొలినాళ్ల ప్రయోగం కుక్కపైన!ఈ రకమైన పరిశోధనలు 1890ల చివర్లో ఇవాన్ పావ్లోవ్ అనే రష్యన్ శాస్త్రవేత్త చేసిన ప్రయోగాల నుంచి మొదలయ్యాయి. మన శరీరం ఆహారం నుండి శక్తిని, పోషకాలను ఎలా తీసుకుంటుందో ఆయన అధ్యయనం చేశారు. ఆకలితో ఉన్న ఒక కుక్కకు ఆహారం ఇచ్చే ప్రతిసారీ ఆయన ఒక గంట మోగించేవారు. కొద్ది రోజులకే, ఆహారం ఇవ్వకపోయినా సరే... కేవలం ఆ గంట శబ్దం వినగానే కుక్క నోట్లోంచి లాలాజలం ఊరడం మొదలైంది. మనస్తత్త్వవేత్తలు దీన్ని ‘కండిషన్డ్ రెస్పాన్స్’ (అలవాటైన స్పందన) అని పిలుస్తారు. ఈ పరిశోధనలకు గాను పావ్లోవ్కు 1904లో నోబెల్ బహుమతి లభించింది.తర్వాత ఎలుకల మీదకొన్ని దశాబ్దాల తర్వాత, రాచెస్టర్ విశ్వవిద్యాలయానికి చెందిన రాబర్ట్ అడెర్, నికోలస్ కోహెన్ ఎలుకలపై ఇలాంటి ప్రయోగమే చేశారు. వారు ఎలుకలకు ఒక తీపి పానీయాన్ని ఇచ్చాక, ఆ వెంటనే వాటి రోగనిరోధక శక్తిని తగ్గించే ఒక మందును ఇంజెక్షన్ ద్వారా ఇచ్చేవారు. కొంతకాలం తర్వాత, ఆ ఇంజెక్షన్ ఇవ్వకుండా కేవలం తీపి పానీయం మాత్రమే ఇచ్చినా ఎలుకల రోగనిరోధక వ్యవస్థలో ఆ మార్పులు కనిపించాయి! ఈ ప్రభావాన్ని ‘సైకోసోమాటిక్’ అంటారు. అంటే ఏదైనా ఒక సంకేతం (గంట శబ్దం వినడం లేదా తీపి పానీయం తాగడం వంటివి) ద్వారా మెదడు శరీరంలో నిజమైన మార్పులను తీసుకురాగలదని దీని అర్థం. ఈ ‘సైకోసోమాటిక్’ అనే మాటకు సమాజంలో కాస్త ప్రతికూల ముద్ర ఉంది. మానసిక ఒత్తిడి లేదా మానసిక స్థితి వల్ల వచ్చే తలనొప్పి, నొప్పులు, వికారం లేదా చర్మ సమస్యల గురించి చెప్పటానికి తరచుగా ఈ పదాన్ని వాడతారు. చాలామంది వీటిని కేవలం ‘భ్రమ’ అని లేదా ఒక చిన్న విషయమని కొట్టిపారేస్తుంటారు.సైకోసోమాటిక్ గీ ప్లాసిబో ఎఫెక్ట్కొన్నిసార్లు సైకోసోమాటిక్కు వ్యతిరేకంగా కూడా జరుగుతుంది. ఉదాహరణకు ‘అసలు మందు’ కాకుండా, కేవలం మందు బిళ్లలా కనిపించే ‘పంచదార బిళ్ల’ వేసుకున్నా కొందరికి జబ్బు నయమవుతుంది. దీన్నే ‘ప్లాసిబో ఎఫెక్ట్’ అంటారు. ఇది కూడా నిజమైన వైద్యం కాదని కొందరు తీసిపడేస్తుంటారు. అయితే, కొందరు పరిశోధకులు మాత్రం ఈ ప్లాసిబో ప్రభావాన్ని ఒక గొప్ప ‘మంత్రం’గా చూస్తున్నారు.ప్లాసిబో ప్రభావం అనేది శరీరంలో జరిగే నిజమైన భౌతిక/జీవక్రియ మార్పులను నియంత్రిస్తుంది. ఆశావాద ఆలోచనలు, మంచి ఫలితం వస్తుందనే నమ్మకం లేదా నిరీక్షణ వల్ల ఇది జరగవచ్చు. కారణం ఏదైనప్పటికీ, ‘ఇది ఎలా పనిచేస్తుందో మనం అర్థం చేసుకోవాలి’ అని కొరెన్ అంటున్నారు. అది అర్థమైతే, రోగులకు ఇచ్చే చికిత్సలు ఇంకా బాగా పనిచేసేలా ఒక తోడ్పాటు అవుతుందని ఆమె చెబుతున్నారు.‘కొరెన్’ వినూత్న పరిశీలనతామర్ కొరెన్ బృందం ఇప్పుడు ఆ ‘ప్లాసిబో’ ఆలోచనను నిజంగానే పరీక్షించి చూసింది. టెల్ అవీవ్ విశ్వవిద్యాలయంలోని సైకాలజీ ల్యాబ్తో కలిసి పనిచేస్తున్న కొరెన్ బృందం, 85 మంది యువకులను ఈ ప్రయోగం కోసం ఎంచుకుంది. ఆ యువకులందరూ ఆ మెడికల్ సెంటర్లో వ్యాక్సిన్ తీసుకోవటానికి సమ్మతించి వచ్చిన వారు. (హెపటైటిస్–బి అనే వైరస్ సోకకుండా నిరోధించడానికి ఈ టీకా ఇస్తారు. ఈ టీకా.. మనుషుల శరీరం, రోగనిరోధక వ్యవస్థలపై ఎలా స్పందిస్తుందో చూడటం ద్వారా, వారి రోగనిరోధక శక్తిలో వచ్చే మార్పులను సులభంగా కొలవడానికి పరిశోధకులకు ఒక మార్గం లభిస్తుంది.)న్యూరోఫీడ్బ్యాక్ విధానంఈ ప్రయోగం మొదటి దశ కోసం, ఎంపిక చేసిన వారికి ఫంక్షనల్ ఎమ్ఆర్ఐ స్కాన్లు చేశారు. వారు మెదడును స్కాన్ చేసే యంత్రంలో పడుకున్నారు, ఈ యంత్రం మెదడులోని ఏ భాగాలు చురుకుగా పనిచేస్తున్నాయో చూపిస్తుంది. ప్రతి 40 సెకన్ల సెషన్లో, పాల్గొనేవారిని తమ మెదడుకు పని చెప్పమని (ఆలోచించమని) చెప్పారు. ప్రతి ఒక్కరికీ తాము ఎలా ఆలోచించాలో సొంతంగా ఎంచుకునే అవకాశం ఇచ్చారు. ఉదాహరణకు: స్క్రీన్ మీద ఉన్న ఒక ఎర్రటి చుక్కను చూడటం, తాము వెళ్లిన ఒక ప్రయాణాన్ని / పర్యటనను గుర్తుచేసుకోవడం, భవిష్యత్తు గురించి ఆలోచించడం, లేదా ఒక గణిత లెక్కను పూర్తి చేయడం... ఇలా. లక్ష్యం ఏంటంటే మన ఆలోచనలు మెదడులోని ఏ రకమైన ప్రభావాన్ని చూపుతాయో తెలుసుకోవటమే.మెదడుపై ఆలోచనల ప్రభావంప్రయోగం తర్వాత మెదడు స్కాన్ చేసిన భాగాలకు 0 నుండి 10 వరకు స్కోర్లు (రేటింగ్) ఇచ్చారు. ఈ స్కోర్లు మెదడు లోపల ఉన్న ‘రివార్డ్ మార్గం’లోని చురుకుదనాన్ని ఆధారంగా చేసుకుని ఇచ్చారు. ఇందులో ప్రధానమైన ఒక భాగాన్ని ‘వెంట్రల్ టెగ్మెంటల్ ఏరియా’ అంటారు. ఎలుకలలో ఆరోగ్యకరమైన మార్పులు తేవడానికి కొరెన్ బృందం ఉత్తేజపరిచింది కూడా ఈ భాగాన్నే. ప్రయోగంలో పాల్గొన్నవారిలో కొందరిని యాదృచ్ఛికంగా (ర్యాండమ్గా) ‘కంట్రోల్ గ్రూప్’లో పెట్టారు. వారి స్కోర్లు ఈ భాగంతో సంబంధం లేని వేరే మెదడు ప్రాంతం నుండి తీసుకున్నారు. ఎవరికైనా తక్కువ స్కోరు వస్తే, తదుపరి సెషన్లో తమ ఆలోచనలను వేరే విషయంపై కేంద్రీకరించమని వారికి చెప్పారు. ఒకవేళ వారి స్కోరు పెరిగితే, అదే విధంగా ఆలోచించే పద్ధతిని కొనసాగించమని లేదా ఇంకా మెరుగుపరచుకోమని చెప్పారు. ఈ విధమైన ‘ప్రయత్నిస్తూ నేర్చుకునే’ పద్ధతిని కొన్ని వారాల పాటు 45 నుండి 60 సెషన్లలో నిర్వహించారు. ఈ ప్రక్రియ అంతటా పాల్గొనేవారికి ఉన్న ఒకే ఒక లక్ష్యం.. వీలైనంత ఎక్కువ స్కోరు సాధించడం. అయితే ‘‘మాకు స్కోరు ఎంత వచ్చిందనే దానికంటే, ఆలోచనల ద్వారా ఎంత మెరుగుదల కనిపిస్తోంది అనేది చాలా ముఖ్యమైన విషయం’’ అని ఈ అధ్యయనానికి నాయకత్వం వహించిన నిట్జన్ లుబియానకర్ అంటారు.టీకా స్పందనలో మార్పులుచివరి ఎం.ఆర్.ఐ. సెషన్ పూర్తయిన వెంటనే, ప్రయోగంలో పాల్గొన్న వారందరికీ హెపటైటిస్ బి వ్యాక్సిన్ ఇచ్చారు. ఈ టీకా శరీరంలో ‘యాంటీబాడీలు’ (వ్యాధి నిరోధక ప్రొటీన్లు) తయారయ్యేలా చేస్తుంది. ఈ యాంటీబాడీలు హెపటైటిస్–బి వైరస్ను గుర్తించి, కాలేయానికి ఇన్ఫెక్షన్ సోకకుండా కాపాడతాయి. టీకా ఇవ్వడానికి ముందు, ఇచ్చిన రెండు వారాల తర్వాత వారి రక్త పరీక్షలు చేసి యాంటీబాడీలను కొలిచారు. ఎవరైతే తమ ఆలోచనల ద్వారా ‘వెంట్రల్ టెగ్మెంటల్ ఏరియా’లో మెదడు చురుకుదనాన్ని పెంచుకోగలిగారో, వారిలో వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత హెపటైటిస్–బి యాంటీబాడీల సంఖ్య చాలా ఎక్కువగా పెరిగింది! ఇది వారిలో రోగనిరోధక శక్తి బలపడిందని స్పష్టంగా చూపించింది. ఈ యాంటీబాడీల పెంపు 7 నుండి 10 శాతం మాత్రమే అయినప్పటికీ, ఇది చాలా గొప్ప విషయమని వాషింగ్టన్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్త జోనాథన్ కిప్నిస్ అంటున్నారు. ఆయనకు ఈ పరిశోధనతో సంబంధం లేకపోయినా.. మెదడుకి, రోగనిరోధక వ్యవస్థకి ఉన్న సంబంధాలపై ఆయన ప్రత్యేక అధ్యయనాలు చేస్తున్నారు.మనస్సుకు, శరీరానికి ఉన్న ముడి‘‘ఈ పరిశోధనలో నిజంగానే ఒక స్పష్టమైన ఫలితం కనిపించటంతో మేమంతా చాలా ఆశ్చర్యపోయాం’’ అని కొరెన్ తన సిద్ధాంత పత్రంలో రాశారు. ల్యాబ్లోని ఎలుకలలో కనిపించిన ఫలితం పెద్దగా ఆశ్చర్యం కలిగించలేదు. ఎందుకంటే శాస్త్రవేత్తలు వాటి నాడీ కణాలను నేరుగా ఉత్తేజపరిచారు. కానీ, మనుషులు కేవలం తమ సొంత ఆలోచనలతో మాత్రమే మెదడులోని ఆ భాగాన్ని యాక్టివేట్ చేసుకోవడం అనేది ఒక సైన్స్ ఫిక్షన్ (కల్పిత కథ) లాగా అనిపించిందని ఆమె అన్నారు.అంతేకాకుండా, ఈ విజయం అనేది ఒకరి వ్యక్తిత్వంపై ఆధారపడి లేదు. తాము చాలా ఆశావాదులమని లేదా నమ్మకంతో ఉంటామని సర్వేలో చెప్పిన అందరికీ ‘వెంట్రల్ టెగ్మెంటల్ ఏరియా’ స్కోర్లు ఏమీ ఎక్కువగా రాలేదు. అయితే, ఎక్కువ స్కోర్లు సాధించిన వారిలో ఒక ఉమ్మడి లక్షణం కనిపించింది. వారు ఆశావాద ఆలోచనలను (మంచి జరుగుతుందనే ఆశను) పెంచే మానసిక విధానాలను ఎంచుకున్నారు. కొందరు తమ స్నేహితులు లేదా కుటుంబ సభ్యుల గురించి ఆలోచించారు. మరికొందరు తమ జీవితంలో జరిగిన మంచి అనుభవాలపై ధ్యాస పెట్టారు.పాల్గొనేవారు దేని గురించి ఆలోచించాలో పరిశోధకులు స్పష్టంగా చెప్పలేదు కాబట్టి, ఆలోచనలోని చిన్న చిన్న వివరాలు పెద్దగా తేడాను చూపలేదు. బదులుగా, పాల్గొన్నవారు స్క్రీన్ కనిపించే స్కోర్లను బట్టి తమ ఆలోచనలను మార్చుకుంటూ వచ్చారు. ఇది చాలా ఆసక్తికరమైన విషయమని లుబియానకర్ తెలిపారు. ఈ ఫలితం ‘మన మానసిక స్థితి’ అనేది మన ఆరోగ్యంపై, రోజువారీ శరీర క్రియలపై ఎంత ప్రభావం చూపుతుందో స్పష్టంగా చెబుతోంది... మనకు తెలియకుండానే అది పనిచేస్తుంది’’ అని కొరెన్ అంటున్నారు.ఆశావాదం ఆరోగ్యదాయకంఈ అంతర్జాతీయ పరిశోధన మనకొక స్పష్టమైన, బలమైన సందేశాన్ని ఇస్తోంది: ‘శారీరక ఆరోగ్యానికి ఉదయం చేసే వ్యాయామం, తినే మంచి ఆహారం ఎంత ముఖ్యమో... మన రోజువారీ ఆలోచనా విధానం కూడా అంతే ముఖ్యం!’ అని.మనం నిత్యం అనుభవించే ఒత్తిడి, ఆందోళన, ప్రతికూల ఆలోచనలు మన వ్యాధినిరోధక వ్యవస్థను బలహీనపరుస్తుంటే... ఆశావాదం, ప్రేమ, మధుర జ్ఞాపకాలు, నమ్మకాలు మన శరీరంలో అదనపు రక్షణ కవచాన్ని నిర్మిస్తాయి. మెదడులోని ‘రివార్డ్ సిస్టమ్’ను మన సొంత ఆలోచనలతో క్రియాశీలం చేసుకోవడం ద్వారా ఏ వైద్యానికీ లభించని ‘సైకోసోమాటిక్ బూస్ట్’ మన శరీరానికి లభిస్తుంది.కాబట్టి, అనునిత్యం ఆశావాదంతో ఆలోచిద్దాం... మన మెదడును సానుకూలంగా రీ–వైర్ చేసుకుందాం... సహజమైన రోగనిరోధక శక్తితో సంపూర్ణ ఆరోగ్యం పొందుదాం. - సాక్షి స్పెషల్ డెస్క్- తామర్ కొరెన్, వైద్య శాస్త్రవేత్త, టెల్ అవీవ్ మెడికల్ సెంటర్ -
అది అంత ప్రమాదమా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాలి!
మా ఏడేళ్ల బాబుకు తరచు దగ్గు వస్తోంది. కొన్నిసార్లు ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నాడు. పిల్లికూతలు కూడా వినిపిస్తున్నాయి. డాక్టర్ ఇన్ హేలర్ వాడమన్నారు. కానీ ఇంట్లో వాళ్లు ఒకసారి ఇన్ హేలర్ మొదలుపెడితే జీవితాంతం అదే వాడాల్సి వస్తుందని భయపెడుతున్నారు. నిజంగానే ఇన్ హేలర్ అంత ప్రమాదకరమా? అది అలవాటు అవుతుందా?– సుమలత, విజయవాడ.ఇది మీ ఒక్కరి సందేహం కాదు. పిల్లలకు దగ్గు, వీజింగ్, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది వచ్చినప్పుడు దాదాపు ప్రతి పేరెంట్ అడిగే మొదటి ప్రశ్న ఇదే. నిజానికి ఇన్ హేలర్ వల్ల పిల్లలకు ప్రమాదం ఉండదు. కాని, సరైన సమయంలో ఇన్హేలర్ను ఆలస్యం చేయడమే అసలు ప్రమాదం. సమయానికి సరైన చికిత్స అందకపోతే ఊపిరితిత్తుల్లో వాపు పెరిగి, శ్వాస సమస్యలు మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంటుంది. భయంతో చికిత్సను వాయిదా వేయడం కంటే, సరైన నిర్ధారణ చేయించుకుని వైద్యుడి సూచన మేరకు చికిత్స ప్రారంభించడం మంచిది. అందుకే ఇప్పుడు ఇన్ హేలర్, ఉబ్బసం, అలాగే ఆధునిక లంగ్ ఆసిలోమెట్రీ పరీక్షల గురించి ప్రతి పేరెంట్ తెలుసుకోవాల్సిన విషయాలు చూద్దాం.ఇన్ హేలర్ అంటే స్టెరాయిడ్స్ మందా? అది ప్రమాదకరమా?కాదు. ఇది చాలామందిలో ఉన్న అపోహ మాత్రమే. ఇన్ హేలర్లోని మందు నేరుగా ఊపిరితిత్తులకు చేరుతుంది. అందుకే చాలా తక్కువ మోతాదులోనే మంచి ఫలితం ఇస్తుంది. శ్వాసనాళాల్లోని వాపు తగ్గి, పిల్లికూతలు, రాత్రిపూట వచ్చే దగ్గు తగ్గుతాయి. పిల్లలు మళ్లీ హాయిగా పరుగులు తీస్తూ ఆటలు ఆడగలుగుతారు. వైద్యుడి సూచన మేరకు వాడితే ఇన్ హేలర్ పూర్తిగా సురక్షితమైన చికిత్స.ఒకసారి ఇన్ హేలర్ మొదలుపెడితే జీవితాంతం వాడాలా?అసలు కాదు. ఇన్ హేలర్ అలవాటు చేసే మందు కాదు. అవసరమైనంత కాలం మాత్రమే వాడాల్సిన చికిత్స. పిల్లల ఆరోగ్యం మెరుగైతే వైద్యుడు మోతాదును క్రమంగా తగ్గిస్తారు. చాలామంది పిల్లల్లో పూర్తిగా ఆపేసే అవకాశం కూడా ఉంటుంది. ప్రతి చిన్నారి ఆరోగ్య పరిస్థితి వేరు కాబట్టి, చికిత్స వ్యవధి కూడా దానికి అనుగుణంగానే ఉంటుంది.వీజింగ్ ఉన్న ప్రతి చిన్నారికీ ఇన్ హేలర్ అవసరమా?అన్ని వీజింగ్లూ ఆస్తమా కావు. వైరస్ ఇన్ ఫెక్షన్లు, అలర్జీలు, ఇతర శ్వాస సమస్యల వల్ల కూడా వీజింగ్ రావచ్చు. అందుకే కారణం తెలుసుకోకుండా ఇన్ హేలర్ ప్రారంభించకూడదు. ముందుగా సరైన పరీక్షలు చేసి సమస్యను నిర్ధారించడం చాలా ముఖ్యం.లంగ్ ఆసిలోమెట్రీ పరీక్ష అంటే ఏమిటి?పిల్లల ఊపిరితిత్తుల పనితీరును సులభంగా అంచనా వేసే ఆధునిక పరీక్షే లంగ్ ఆసిలోమెట్రీ. ఇందులో సూదులు ఉండవు, నొప్పి ఉండదు, బలంగా ఊదాల్సిన అవసరమూ లేదు. మూడేళ్ల నుంచి చిన్నారులకు కూడా ఈ పరీక్ష చేయవచ్చు. కొద్ది నిమిషాల్లో పూర్తయ్యే ఈ పరీక్ష ద్వారా ఉబ్బసం ఉందా, చిన్న శ్వాసనాళాల్లో వాపు ఉందా, ఇన్ హేలర్ అవసరమా, ఇస్తున్న చికిత్స సరిగా పనిచేస్తోందా వంటి విషయాలను వైద్యుడు కచ్చితంగా గుర్తించగలుగుతారు. దీంతో అవసరమైన పిల్లలకు మాత్రమే సరైన చికిత్స అందించి, అనవసరంగా ఇన్ హేలర్ వాడాల్సిన పరిస్థితిని నివారించవచ్చు.ప్రతి దగ్గుకూ ఇన్ హేలర్ అవసరమా?లేదు. దగ్గు రావడానికి వైరస్ ఇన్ఫెక్షన్లు, ముక్కు అలర్జీ, సైనస్ సమస్యలు, కడుపులోని ఆమ్లం పైకి రావడం, అడినాయిడ్ సమస్యలు, వాతావరణ కాలుష్యం వంటి అనేక కారణాలు ఉంటాయి. పిల్లవాడు బాగున్నాక కూడా పరీక్ష అవసరమా?అవసరం ఉండొచ్చు. బయటకు దగ్గు, దమ్ము తగ్గిపోయినా ఊపిరితిత్తుల్లో స్వల్ప వాపు కొనసాగుతూ ఉండే అవకాశం ఉంటుంది. అలాంటి పరిస్థితిని ఈ పరీక్ష ద్వారా గుర్తించి చికిత్స కొనసాగించాలా, తగ్గించాలా లేదా పూర్తిగా ఆపాలా అనే విషయాన్ని వైద్యుడు నిర్ణయిస్తారు.వెంటనే వైద్యుడిని సంప్రదించాల్సిన పరిస్థితులు పిల్లలకు ఊపిరి తీసుకోవడం చాలా కష్టంగా అనిపిస్తే, పెదాలు లేదా గోళ్లు నీలిరంగులోకి మారితే, పిల్లలు మాట్లాడలేకపోయినా, తినలేకపోయినా, ఇన్ హేలర్ వాడిన తర్వాత కూడా ఉపశమనం లేకపోయినా, తరచు వీజింగ్ వస్తున్నా లేదా రాత్రిపూట దగ్గు వల్ల నిద్రపట్టకపోయినా వెంటనే పిల్లల వైద్యుడిని సంప్రదించాలి. ఇటువంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయడం మంచిది కాదు.చివరగా ఒక విషయం గుర్తుంచుకోండి. ఇన్ హేలర్ అనేది భయపడాల్సిన చికిత్స కాదు. సరైన సమయంలో ప్రారంభిస్తే అది పిల్లల ఊపిరితిత్తులను రక్షించే నమ్మకమైన మిత్రుడు. అవసరం లేనప్పుడు వాడకూడదు. అవసరమైనప్పుడు మాత్రం ఆలస్యం చేయకూడదు.- డా. కె. పవన్ కుమార్, సీనియర్ పీడియాట్రిషియన్, పీడియాట్రిక్ అలర్జిస్ట్, ప్రొఫెసర్ ఆఫ్ పీడియాట్రిక్స్మేనిమాట..నమలడానికి పని ఇస్తే మెదడు మేల్కొంటుంది! గట్టిగా ఉండే పండ్లు, కూరగాయలు నమలడం వల్ల దవడలకే కాదు, మెదడుకూ మేలు జరుగుతుంది. నమిలే ప్రక్రియ వల్ల మెదడుకు రక్తప్రసరణ పెరిగి, అప్రమత్తత మెరుగుపడుతుంది. అంటే... ఒక యాపిల్ తినడం కూడా మెదడుకు చిన్న మేల్కొలుపే! -
వీడియోలా కనిపించే ఎక్స్–రే!
ఇప్పటివరకు మనకు ఎక్స్–రే తెలుసు. ఎముకలు విరిగినవాళ్లు ఎక్స్–రే తీయించుకోవడంతో పాటు దేహంలోని ఏవైనా భాగాలను చూడాలనుకున్నప్పుడు డాక్టర్లు కొన్ని ఎక్స్–రేలు సూచించడమూ మనకు తెలుసు. అయితే ఈ ఎక్స్–రేలన్నీ ఒక స్టిల్ ఫొటోలా ఒకే చిత్రం (సింగిల్ ఇమేజ్)లా ఉంటాయి. ఒకవేళ ఎక్స్రే కూడా వీడియోలా తీస్తే ఎలా ఉంటుంది? ఇలా చూపించేదే ‘డైనమిక్ డిజిటల్ రేడియోగ్రఫీ’ (డీడీఆర్). అసలీ టెక్నాలజీ ఎలా ఉంటుంది, ఏయే ప్రయోజనాలకు పనికి వస్తుంది, దాని పరిమితులేమిటి వంటి అనేక అంశాలను చూద్దాం...బాగా లేటెస్ట్గా వస్తున్న అతి పాత టెక్నాలజీకి సరికొత్త రూపమిది. అందువల్ల డైనమిక్ డిజిటల్ రేడియోగ్రఫీ (డీడీఆర్) అనేది సాధారణ డిజిటల్ ఎక్స్–రేకు కొంత అధునాతన రూపమని చెప్పవచ్చు. కాకపోతే ఇందులో ఒక మార్పు చేశారు. అదేమిటంటే... సాధారణ ఎక్స్–రేలో అది సింగిల్ ఇమేజ్లాగా వస్తుంది. కానీ డైనమిక్ డిజిటల్ రేడియోగ్రఫీలో చాలా తక్కువ వ్యవధిలో వరుసగా / చకచకా అనేక ఎక్స్–రే స్టిల్స్ తీస్తారు. అంటే ఇందులో ఒకే స్టాటిక్ ఎక్స్–రే చిత్రం తీసే బదులుగా... తక్కువ వ్యవధిలో వరుసగా అనేక ఎక్స్–రే చిత్రాలను తీసి... అటు తర్వాత ఓ వీడియోలాగా (డైనమిక్ సీక్వెన్స్లాగా) రూపొందిస్తారు. దీని వల్ల శరీరంలోని అవయవాల కదలికలను వరుస చిత్రాల రూపంలో పరిశీలించవచ్చు. సాధారణంగా సెకండ్కు అనేక (సాధారణంగా 7 – 15) చిత్రాల చొప్పున వరుసగా ఎక్స్–రే చిత్రాలు తీసి, వాటిని వేగంగా కదపడం వల్ల వీడియో ఎఫెక్ట్ వస్తుంది. దాంతో ఎక్స్–రే చిత్రాలనే ఒక చిన్న వీడియోలా చూడటం సాధ్యపడుతుంది. అంటే... ఎక్స్–రే చిత్రాలనే కదిలే వీడియో ఫుటేజ్లా చూడటం జరుగుతుందన్నమాట. అలా... కొన్ని నిర్దిష్టమైన వైద్య పరీక్షల్లో ఫ్లోరోస్కోపీ లేదా సీటీ స్కాన్తో పోలిస్తే కాస్త తక్కువ రేడియేషన్తో అవసరమైన సమాచారం అందించే అవకాశాలెక్కువ.ఏయే సందర్భాల్లో ఇది పనికివస్తుందంటే... డైనమిక డిజిటల్ రేడియోగ్రఫీ (డీడీఆర్) అనే ఈ సాంకేతికతను ప్రధానంగా కొన్ని అవయవాల కదలికల పనితీరును అంచనా వేయడానికి ఉపయోగిస్తారు. అంటే ఉదాహరణకు... → ఊపిరితిత్తుల (లంగ్స్) పనితీరు (అంటే శ్వాస తీసుకోవడం, విడిచిపెట్టడం సమయంలో ఊపిరితిత్తుల కదలిక ఉంటున్నందున ఆ కదలికల్లో ఏమైనా తేడాలున్నాయా తెలుసుకోవడం కోసం) → డయాఫ్రం కదలిక (శ్వాస తీసుకుంటున్న సమయంలో ఛాతీ, కడుపులోని అంతర్గత భాగాలను వేరు చేసే కీలకమైన డయాఫ్రం అనే కండరం.. శ్వాస తీసుకుంటున్నప్పుడు కిందివైపునకూ, వదిలినప్పుడు పైకి కదులుతుంటుంది) → ఛాతీ గోడ కదలికలు (శ్వాసలో కదులుతుండేవి) → కొన్ని సందర్భాల్లో కీళ్ల కదలికలు, అలాగే కదిలడానికి అవకాశమున్న ఇతర అవయవాల పనితీరును అంచనా వేయడానికి.ప్రయోజనాలు...→ సాధారణ ఎక్స్–రే కేవలం స్టిల్ ఫొటోగ్రఫీ (స్థిర చిత్రం)కాగా దానితో పోలిస్తే అవయవాల కదలికలను చూడగలగడం సాధ్యం → చాలా సందర్భాల్లో ఫ్లోరోస్కోపీ లేదా సీటీ స్కాన్ కంటే తక్కువ రేడియేషన్ తోనే మంచి కీలకమైన సమాచారం పొందే అవకాశం → చాలా త్వరితంగా పూర్తయ్యే పరీక్ష → నొప్పిలేని, శస్త్రచికిత్స అవసరం లేని పరీక్షపరిమితులు...→ అన్ని ఆసుపత్రుల్లో ఈ సాంకేతికత అందుబాటులో లేకపోవడం → ప్రతి వ్యాధికీ డీడీఆర్ సరిపోకపోవచ్చు. అవసరాన్ని బట్టి డాక్టర్లు సీటీ స్కాన్, ఎమ్మారై లేదా ఇతర పరీక్షలను సూచించడానికి అవకాశం లేకపోలేదు. చివరగా... ఇది సాధారణ ఎక్స్–రేకి ప్రత్యామ్నాయం కాదు, అలాగే సీటీ స్కాన్ లేదా ఎమ్మారైకి కూడా ప్రత్యామ్నాయం కాదు. దీనిపై ఇంకా పరిశోధనలు కొనసాగుతూ ఉన్నాయి. ఉదాహరణకు ఊపిరితిత్తుల్లో గాలి, అలాగే రక్తప్రవాహానికి సంబంధించిన కొన్ని మార్పులను ఈ సాంకేతికత ద్వారా అంచనా వేసేందుకు ఉన్న అవకాశాలపై ప్రస్తుతం పరిశోధనలు కొనసాగుతున్నాయి. ఇప్పటికైతే ఈ టెక్నాలజీ కొన్ని కేంద్రాల్లో మాత్రమే అందుబాటులో ఉంది. భవిష్యత్తులో దీని ఉపయోగాలు మరింత పెరిగే అవకాశం ఉన్నప్పటికీ, ఇప్పటికి మాత్రం దీనిని ఎంపిక చేసిన కొద్దిమంది పేషెంట్లలోనే అవసరాన్ని బట్టి ఉపయోగిస్తున్నారు.డాక్టర్ సుధీర్ రెడ్డి సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్నిర్వహణ: యాసీన్ -
ఐదు పదుల వయసులోనూ యంగ్గా నటి శోభనా..! ఫిట్నెస్ సీక్రెట్ ఏంటో తెలుసా..
"యమునా తటిలో నల్లనయ్యకై ఎదురుచూసెనే రాధా.."అన్న పాట రాగానే అలనాటి అందాల నటి శోభనా(actress Shobana) టక్కున గుర్తొస్తారు. ఆమె తన కళ్లతో అభినయం పలికించగల గొప్ప నటి. 90ల టైంలో అగ్ర తారగా ఓ వెలుగు వెలిగిన నటి. అంతేగాదు మంచి క్లాసికల్ డ్యాన్సర్ కూడా. కొంతకాలం సినిమాలకు దూరమై..నాట్యానికి జీవితానని అంకితం చేశారామె. మళ్లీ ఇటీవల కల్కి మూవితో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టారు. తాజాగా బాలీవుడ్ నిర్మాత నితేష్ తివారీ ప్రతిష్టాత్మక పౌరాణిక ఇతిహాసం 'రామాయణం'లో కనిపించనున్నారు. అందులో రావణుడిగా నటిస్తున్న యశ్ తల్లి కైకేసి పాత్రను పోషించనుందామె. అలాగే ఆమె చెన్నైలో నృత్య అకాడమీ 'కళాతర్పణ'ను కూడా నడుపుతున్నారు. ప్రస్తుతం ఆమె 54 ఏళ్లు. ఈ వయసులోనూ అంతే గ్లామర్గా పిట్గా ఉంటారు శోభనా. తను ఇంతలా ఎనర్జిటిక్గా, హెల్దీగా ఉండటానికి కారణం ఏమిటో ఒక ఇంటర్యూలో ఆమెనే స్వయంగా వెల్లడించారు. మరి ఆమె అనుసరించే ఫిట్నెస్ సీక్రెట్ ఏంటో చూద్దామా..!.ఆమె భారత్లోనూ విదేశాల్లోనే నృత్య ప్రదర్శనలిస్తుంటారు. ముఖ్యంగా సాంస్కృతిక కార్యక్రమాల్లో తప్పకుండా ప్రదర్శనలిస్తుంటారామె. ఇంత బిజీ షెడ్యూల్లో కూడా ఫిట్గా ఉండేందుకు ప్రాధాన్యత ఇస్తానని, క్రమశిక్షణతో కూడిన దినచర్యను పాటిస్తానని చెప్పారామె. అలాగే ఆహారం విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉంటానన్నారు. ఆమె ప్రోటీన్ షేక్లు, డైటింగ్ రెండిటిని పాటిస్తానని చెప్పారు. ఈ విధానం చూసి చాలా మంది ఆశ్చర్యపోతారని అన్నారు. అలా ఎందుకంటే తన ఆకలి ఎక్కువగా ఉంటుందని అందుకని ఇలా చేస్తానని అన్నారామె. తన బిజీ షెడ్యూల్కి అనుగుణంగానే ఆహారపు అలవాట్లు రూపొందించుకుంటానని తెలిపారామె. వేదికపై శాస్త్రీయ నృత్య ప్రదర్శనలు కొనసాగిస్తున్నందున సమతుల్యమైన ఆహారమే తీసుకోవాలని చెప్పారు. అయితే తాను ఏడాదంతా ఒకేరకమైన డైట్ ప్లాన్ని పాటించనని చెప్పారామె. తన శరీరానికి అనుగుణంగా దినచర్యను మార్చుకుంటూ..బరువుని అదుపులో ఉంచడంపై అటెన్షన్ పెడతానని అన్నారామె. ఒక్కోసారి మూడు రోజుల డైట్ని పాటిస్తే..మరికొన్నిసార్లు ఏకంగా ఏడుసార్లు డైట్ పాటిస్తానని చెప్పారు. ఒక్కోసారి క్రాష్ డైట్ కూడా పాటిస్తానని ధీమాగా వెల్లడించారు. తను ప్రతిసారా కఠినమైన భోజన ప్రణాళిక అనుసరించకుండా అవసరమైనప్పుడల్లా షెడ్యూల్ని సర్దుబాటు చేసుకుంటానని తెలిపింది అందాల శోభన. దూరంగా ఉంచే ఆహారాలు..అధిక కేలరీలు, అనారోగ్యకరమైన కొవ్వులకు చాలా దూరంగా ఉంటానని అన్నారు. పిజ్జా, బర్గర్లు, పాస్తా, బ్రెడ్, శాండ్విచ్లు, నూనెలో అధికంగా వేయించిన ఆహారాలకు బహుదూరంగా ఉంటానని చెప్పారామె. థాయి వంటకాలు, కొన్ని రకాల డెజర్ట్లంటే ఇష్టమని చెప్పుకొచ్చింది. కాగా ఇక్కడ అందాల నటి శోభన కూడా తన శరీరం మాట వింటూ అందుకు అనుగుణంగా డైట్ని అనుసరిస్తున్నట్లు నొక్కి చెప్పారు. ఏ డైట్ అయినా గుడ్డిగా కాకుండా శరీరానికి పడేది..అన్ని విధాల ఆరోగ్యానికి మేలు అని చెప్పకనే చెబుతోంది కదా ఈ నటి డైట్.(చదవండి: ఒంటరిగా ఫ్లైట్ జర్నీ..ఆ మహిళను ఎంతలా మార్చిందంటే?) -
హ్మ్..! చెప్పులు బయట!! పెద్దల హెచ్చరికలో పరమార్థం ఏంటంటే?
కొంతమంది బయట వాడే చెప్పులు, షూ లను ఇంట్లో కూడా వాడేస్తుంటారు. వారు ఇది పాదాల శుభ్రతకు సంబంధించిన అంశంగా భావించినప్పటికీ, ఇది ఆరోగ్యానికి సంబంధించిన అంశం కూడా. ఎందుకంటే మీరు షూలను, చెప్పులను మాత్రమే ఇంటిలోకి తీసుకెళ్లరు.. వాటితో పాటుగా లక్షలాది క్రిములను, బ్యాక్టీరియాను కూడా వెంట తీసుకెళ్తుంటారు.బూట్ల అడుగుభాగంలో ఈ.కోలై, సి.డిఫిసిల్, స్టెఫిలోకోకస్ వంటి ప్రమాదకర బాక్టీరియాలు అధిక మొత్తంలో ఉన్నట్లు పరిశోధనల్లో తేలింది. ఇవి కడుపునొప్పి, విరేచనాలు, ఇన్ఫెక్షన్లకు దారితీస్తాయి. చిన్నపిల్లలు, వృద్ధులు ఉన్న ఇంట్లో ఇది మరింత ప్రమాదకరం. వారు తొందరగా అనారోగ్యానికి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.అయితే కీళ్ల నొప్పులు, పాదాల సమస్యలు ఉన్నవారు చెప్పులు లేకుండా నేలపై నడవడం వల్ల సమస్య ఎక్కువయ్యే అవకాశం ఉంది. కాబట్టి దీనికి ప్రత్యామ్నాయంగా ఇండోర్ స్లిప్పర్స్ ఉపయోగించాలి. వీటిని ఎట్టి పరిస్థితుల్లో బయట వాడకూడదు. ఇంటిగుమ్మం వద్దే షూలను వదిలేయడం అనేది ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు.. కుటుంబ సభ్యుల ఆరోగ్యాన్ని కూడా కాపాడే ఒక సులభమైన అలవాటు. -
ప్లీజ్ పసిపిల్లలు ఏడవగానే అలా చేయొద్దు..!
ఎక్కువ మంది పేరెంట్స్ శిశువులు ఏడువగానే వెంటనే వారిని కంట్రోల్ చేయడానికి ప్యాసిఫైయర్ నోట్లో పెట్టేస్తుంటారు. దీంతో వెంటనే శిశువులు ఏడుపు మానేస్తారు. ఇది కొన్ని సందర్భాల్లో శిశువుకి, తల్లికి ఉపశమనం కలిగించినప్పటికీ.. అదే పనిగా ఉపయోగించడం మాత్రం అంతమంచిది కాదని నిపుణులు సూచిస్తున్నారు. ప్యాసిఫైయర్ నిత్యం సకింగ్ చేయడం వల్ల పిల్లల్లో దంతాల పెరుగుదలపై ప్రభావం పడుతుంది. పసివయసులో ఉపయోగిస్తే పెద్దగా సమస్య ఉండకపోయినా, 18 నెలల వయస్సు దాటిన తర్వాత కూడా వాడితే పళ్ల అమరిక దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. ప్యాసిఫైయర్ను ఎక్కువగా ఉపయోగిస్తే చెవి ఇన్ఫెక్షన్లతోపాటు సకింగ్ వల్ల చెవి సంబంధిత నాళాలపై ఒత్తిడి పడుతుంది. రాత్రి వేళల్లో ప్యాసిఫైయర్ ఊడిపోగానే పిల్లలు ఏడుస్తుంటారు. ఇది పిల్లలతో పాటు తల్లిదండ్రుల నిద్రను కూడా డిస్టర్బ్ చేస్తుంది. తప్పనిసరి పరిస్థితుల్లో వాడాల్సివచ్చినపుడు ఎప్పుడూ సింగిల్ పీస్వే ఎంచుకోవాలి. వాటిపై తేనె లేదా తియ్యటి పదార్థాలను రాయకూడదు. అలాగే వీటిని క్రమం తప్పకుండా స్టెరిలైజ్ చేస్తుండాలి. పగుళ్లు వస్తే వెంటనే మార్చేయాలి.ఇది ఒక ఆప్షనే కానీ తప్పనిసరి అవసరం కాదు. తల్లి పాలు ఇవ్వడం బాగా అలవాటైన తర్వాత అవసరమైతేనే ఉపయోగించాలి. పిల్లలు దీనిని సకింగ్ చేయడానికి ఇష్టపడకపోతే బలవంతంగా అలవాటు చేయడానికి ప్రయత్నించొద్దు. 12 నెలల వయస్సు దాటిన తర్వాత దీని వాడకాన్ని క్రమంగా తగ్గించడం శ్రేయస్కరం. (చదవండి: అధిక ప్రోటీన్ ఆహారంతో జస్ట్ 60 రోజుల్లో 22 కేజీలు..! సహాయపడిన డైట్ ఇదే..) -
అధిక ప్రోటీన్ ఆహారంతో జస్ట్ 60 రోజుల్లో 22 కేజీలు..! సహాయపడిన డైట్ ఇదే..
బరువు తగ్గడంలో సత్వర ఫలితాలు కోసం క్రాష్ డైట్లు జోలికిపోకుడండా పలువురు క్రమశిక్షణతో కూడిన జీవినశైలితో అమాంతం స్మార్ట్గా మారి ఆశ్చర్యపరుస్తున్నారు. కొందరు స్ట్రిక్ట్ డైట్ల జోలికపోకుండా చేస్తే..కొందరు కఠినమైన డైట్లతో కడుపు నిండిన అనుభూతికి ప్రాధాన్యత ఇస్తూ కిలోల కొద్దీ బరువు తగ్గి చూపిస్తున్నారు. అలాంటి కోవకు చెందిన వాడు ఈ వ్యాపారవేత్త. జస్ట్ నెల రోజుల్లోనే 22 కేజీల పైనే బరువు తగ్గడం విశేషం. ఆ వెయిట్లాస్ జర్నీలో హెల్ప్ అయిన ఆహార పదార్థాల గురించి ఇన్స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసుకున్నారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది.ఆయనే కేరళకు చెందిన వ్యాపారవేత్త డాక్టర్ షిబిన్ మాథ్యు. ఒకప్పుడు దాదాపు 110 కేజీల బరువు ఉండేవారు. కఠినమైన దినచర్య, పటిష్టమైన ఆహార ప్రణాళిక, జీవనశైలి మార్పులు చక్కటి పరివర్తనకు దారితీస్తాయని అన్నారు. క్రమశిక్షణ సవ్యంగా ఉంటే దాని ఫలితమే చెబుతుందని అంటున్నారు. సరైన ఆహార ప్రణాళిక, చక్కటి జీవనశైలి మార్పులు మంచి రూపుకి దారితీస్తుందని నమ్మకంగా చెప్పారు. తనకు బరువు తగ్గడంలో సహాయపడిన రోజువారి అధిక ప్రోటీన్ ఆహారం గురించి ఇలా చెప్పుకొచ్చారు. బరువు తగ్గడానికి రోజువారీ ఆహారంఆయన తన రోజును ఒక కప్పు కాఫీ, రెండు గుడ్లు, మిరప నూనెతో కలిపిన రెండు స్కూప్ల అధిక ప్రోటీన్ పెరుగుతో ప్రారంభిస్తారు. ఈ భోజనం కడుపు నిండిన అనుభూతిని కలిగించి, జీవక్రియను పెంచడానికి తోడ్పడుతుంది. అధిక ప్రోటీన్ ఆహారాలు, కెఫిన్, కారమైన కొవ్వులను మిళితం చేస్తుంది. ఈ అల్పాహారం రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచి, ఉదయం పూట వచ్చే నీరసాన్ని నివారిస్తుంది.మధ్యాహ్న భోజనానికి, మాథ్యూ ఎక్కువగా ఒక చికెన్ బ్రెస్ట్తో పాటు ఒక గుడ్డు, ఒక స్కూప్ అధిక ప్రోటీన్ ఉన్న పెరుగు తీసుకునేవాడు. సలాడ్ల కోసం, అతను తాజా దోసకాయలను ఎంచుకున్నాడు. ఈ కలయిక కడుపు నిండుగా ఉంచడానికి అవసరమైన లీన్ ప్రోటీన్ను అందిస్తుంది.బరువు తగ్గడానికి సహాయపడటానికి, ఇందులో ఆరోగ్యకరమైన కొవ్వులు, అధిక నీటి శాతం ఉన్న తక్కువ కేలరీల కూరగాయలు కూడా ఉంటాయి. శాకాహారులైతే గుడ్లకు బదులుగా అర కప్పు గట్టిగా, ముక్కలుగా చేసి, పెనంపై వేయించిన టోఫును, చికెన్కు బదులుగా మసాలాలతో కాల్చిన టెంపే లేదా సీటాన్ను తీసుకోవడం మంచిదని సూచించారు.మధ్యాహ్న భోజనం తర్వాత అతను సాధారణంగా తక్కువ మోతాదులో ఆహారం తీసుకునేవాడినని అన్నారు. రాత్రి పడుకునే ముందు, అతను ఒక కప్పు కాఫీ.ఒక ఆపిల్కు మాత్రమే పరిమితమైనట్లు తెలిపారు.తన కఠినమైన డైట్ దినచర్య గురించి వివరిస్తూ అతను ఇలా అన్నాడు, కఠినమైన ఆహార లోటు, అధిక ప్రోటీన్ తోపాటు సాకులకు తావివక్కపోతే..కచ్చితంగా బరువు తగ్గుతారు. నిర్దిష్ట లక్ష్యాల కోసం తీవ్రమైన ఆహార కోత తప్పనిసరని అంటున్నారు.అలాగే ఏ డైట్ రొటీన్ను గుడ్డిగా అనుసరించవద్దని, తమ శరీరం చెప్పేది వినాలని హెచ్చిరిస్తున్నారు. అంతేగాదు ఇలాంటి తీవ్రమైన ఆహార నియమాన్ని ప్రారంభించే ముందు నిపుణులను సంప్రదించాలని ప్రజలకు సూచించారు కూడా.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. View this post on Instagram A post shared by Dr Shibin Mathew (@mathewdotin) (చదవండి: Ravi Kishan Weight Loss: ‘మద్దాలి శివారెడ్డి’గా అలరించిన రవికిషన్ వెయిట్లాస్ జర్నీ..! ఓమాడ్తో ఏకంగా 18 కేజీలు..) -
మెలనోమా హెచ్చరిక సంకేతాలు: పుట్టుమచ్చలు డేంజరా?
శరీరంపై పుట్టుమచ్చలు (Moles) ఉండటం సాధారణ విషయం. వీటిలో చాలా వరకు జీవితాంతం ఎలాంటి సమస్య కలిగించవు. అయితే ఒక పుట్టుమచ్చ ఆకారం, రంగు లేదా ఆకృతిలో మార్పులు కనిపిస్తే వాటిని నిర్లక్ష్యం చేయవద్దని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో ఇవి మెలనోమా అనే తీవ్రమైన స్కిన్ కేన్సర్కు ప్రారంభ సంకేతాలు కావచ్చు. క్లీవ్ల్యాండ్ క్లినిక్, బ్రిటన్ NHS సూచనల ప్రకారం, ప్రతి మారిన పుట్టుమచ్చ కేన్సర్ కాదు, కానీ సకాలంలో పరీక్ష చేయించుకోవడం చాలా ముఖ్యం.ప్రతి పుట్టుమచ్చ స్కిన్ కేన్సర్ సంకేతమేనా?క్లీవ్ల్యాండ్ క్లినిక్, NHS ప్రకారం, చాలా పుట్టుమచ్చలు పూర్తిగా సాధారణమైనవి, జీవితాంతం ఎలాంటి సమస్యా కలిగించవు. అయితే కొన్ని సందర్భాల్లో చర్మానికి రంగునిచ్చే కణాలైన మెలనోసైట్లలో అసాధారణ మార్పులు జరిగి మెలనోమా అభివృద్ధి చెందవచ్చు. ఇతర స్కిన్ కేన్సర్లతో పోలిస్తే మెలనోమా తక్కువగా కనిపించినా, ఇది శరీరంలోని ఇతర భాగాలకు వేగంగా వ్యాపించే అవకాశం ఉంది. అందువల్ల దీన్ని త్వరగా గుర్తించడం చాలా అవసరం.ఏ మార్పులపై వెంటనే దృష్టి పెట్టాలి?అనుమానాస్పద పుట్టుమచ్చలను గుర్తించడానికి వైద్యులు "ABCDE రూల్"ను ఉపయోగిస్తారు:A – Asymmetry (అసమాన ఆకారం): పుట్టుమచ్చలో ఒక భాగం మరో భాగం కంటే భిన్నంగా కనిపించడం.B – Border (అనియమిత అంచులు): అంచులు అస్పష్టంగా, కోతల్లా లేదా అసమానంగా ఉండటం.C – Color (రంగులో మార్పు): ఒకే పుట్టుమచ్చలో నలుపు, గోధుమ, ఎరుపు, తెలుపు లేదా నీలం వంటి అనేక రంగులు కనిపించడం.D – Diameter (పరిమాణం): పుట్టుమచ్చ దాదాపు 6 మిల్లీమీటర్ల కంటే పెద్దగా ఉండటం లేదా వేగంగా పెరగడం.E – Evolving (నిరంతర మార్పు): కాలక్రమేణా ఆకారం, రంగు, ఎత్తు లేదా అనుభూతిలో మార్పు రావడం, లేదా దురద, నొప్పి, రక్తస్రావం మొదలవడం.మెలనోమా ప్రమాదం ఎవరిలో ఎక్కువ?WHO, NHS, క్లీవ్ల్యాండ్ క్లినిక్ ప్రకారం, ఈ కారణాలు మెలనోమా ప్రమాదాన్ని పెంచవచ్చు:సూర్యుని అతినీలలోహిత (UV) కిరణాలకు దీర్ఘకాలం గురికావడంపదేపదే సన్బర్న్లు కావడం, ముఖ్యంగా బాల్యం లేదా కౌమార దశలోశరీరంపై చాలా ఎక్కువ లేదా అసాధారణ ఆకారంలో పుట్టుమచ్చలు ఉండటంకుటుంబంలో స్కిన్ క్యాన్సర్ చరిత్ర ఉండటంటానింగ్ బెడ్లను ఉపయోగించడంఎప్పుడు వైద్యుడిని సంప్రదించాలి?కింది మార్పులు కనిపిస్తే వెంటనే చర్మవ్యాధి నిపుణుడిని సంప్రదించాలని వైద్యులు సూచిస్తున్నారు:పాత పుట్టుమచ్చ ఆకారం, రంగు లేదా ఆకృతి మారడం30 ఏళ్ల వయసు తర్వాత కొత్త పుట్టుమచ్చ కనిపించడంపుట్టుమచ్చ నుంచి రక్తస్రావం, పొక్కు ఏర్పడటం లేదా నిరంతర దురదపుట్టుమచ్చ చుట్టూ నొప్పి, వాపు లేదా ఎరుపు రంగు రావడంశరీరంలోని మిగతా పుట్టుమచ్చలకు పూర్తిగా భిన్నంగా కనిపించే పుట్టుమచ్చ ("Ugly Duckling Sign")చాలా పుట్టుమచ్చలు హానికరం కానప్పటికీ, అసాధారణ మార్పులు కనిపించినప్పుడు సకాలంలో వైద్య పరీక్ష చేయించుకోవడం చాలా ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు, ఎందుకంటే మెలనోమాను ప్రారంభ దశలోనే గుర్తిస్తే చికిత్స మరింత ప్రభావవంతంగా ఉంటుంది.(చదవండి: మద్దాలి శివారెడ్డి’గా అలరించిన రవికిషన్ వెయిట్లాస్ జర్నీ..! ఓమాడ్తో ఏకంగా 18 కేజీలు..) -
‘మద్దాలి శివారెడ్డి’గా అలరించిన రవికిషన్ వెయిట్లాస్ జర్నీ..!
‘రేసుగుర్రం’ మూవీలో ‘మద్దాలి శివారెడ్డి’గా తన విలనిజంతో అలరించిన తెలుగు ప్రేక్షకులను అలరించిన నటుడు రవి కిషన్. భోజపురి సూపర్ స్టార్ అయిన ఆయన.. ప్రస్తుతం రాజకీయాల్లోనూ బిజీగా ఉన్నారు. ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్పూర్ పార్లమెంట్ స్థానం నుంచి వరుసగా రెండోసారి ఎంపీగా ప్రజా నాయకుడిగా మన్ననలను అందుకుంటున్నారు. అలాంటి ఈ యాక్టర్ కమ్ పొలిటీషియన్ 57 ఏళ్ల వయసులో చక్కటి ఫిట్నెస్తో అందర్నీ ఆశ్చర్యపరుస్తుంటారు. ఒక ఇంటర్వ్యూలో ఆయనే స్వయంగా తన వెయిట్లాస్ జర్నీ గురించి వెల్లడించారు. తను కావాలంటే బరువు పెరగగలను, అదుపులోనూ ఉంచుకోగలనని అన్నారు. అయితే బరువు తగ్గడం కోసం కఠిన ఆహార నియమాలతో పనిలేదని చెబుతున్నారు. స్థిరమైన జీవనశైలి మార్పులతోనే సులభంగా బరువు తగ్గొచ్చని అంటున్నారు. మరి అదెలాగో ఆయన మాటల్లోనే సవివరంగా చూద్దామా.!.రవికిషన్ తాను వెయిట్లాస్ జర్నీలో తక్షణ పరిష్కారాల కంటే పౌష్టికరమైన భోజనం, క్రమం తప్పని వ్యాయామం, క్రమశిక్షణకే ప్రాధాన్యత ఇస్తానని అన్నారు. తాను ఒకప్పుడు సుమారు 90 కేజీల దాక బరువు ఉండేవాడినని, ప్రస్తుతం 72 కేజీల వరకు తగ్గానని అన్నారు. కండరాలు పెంచుకుంటూ, సన్నబడుతున్నానని అన్నారు. రాజకీయ విధులు, గోరఖపూర్ నియోజకవర్గ పర్యటనలు కారణంగా కొంత బరువు పెరిగానని అన్నారు. దాంతో తను పండ్లతో కూడిన ఆహారం తింటూ స్లిమ్గా అయ్యానని అన్నారు. తినే విధానం మార్చుకుంటూ సుమారు 18 కేజీలు దాక తగ్గినట్లు వెల్లడించారు. వెండి తెరపై వచ్చే పాత్రల కారణంగానే ఫిట్గా మారాల్సి వచ్చిందన్నారు. తాను "'లాపటా లేడీస్' కోసం బరువు పెరగాల్సి వచ్చిందన్నారు. మళ్లా 'మిర్జాపూర్: ది మూవీ'లో సన్నగా కనిపించగా, 'నాగ్జిల్లా'లో నేను సూపర్-ఫిట్ బాడీతో ఉంటానని చెప్పుకొచ్చారు. అయితే 50 ఏళ్ల వయసులో మాత్రం..ఇదంతా అంత సులభం కాదని అన్నారు. అయితే ఆహారపు అలవాట్లలో మార్పులతో దాన్ని ఈజీగా సాధించొచ్చని అన్నారు. మనం తినేది సుమారు 70-80% అని, మిగిలిందంతా వ్యాయామమేనని అన్నారు. ఇక తన ఆహారపు అలవాట్ల గురించి మాట్లాడుతూ..కేవలం పండ్లకే పరిమతం కానని చెప్పారు. 'వన్ మీల్ ఏ డే' అనే ఓమాడ్ టెక్నిక్ని ఫాలో అవుతానని అన్నారు. అంటే..ఒక పూట మాత్రమే ఆహారం తీసుకోవడం, మధ్యంతర ఉపవాసం లేదా కేవలం పండ్లు మాత్రమే తినడం. రవి కిషన్ అలాంటి డైట్ని చేయగలిగే శక్తి ఆ మహాదేవుడు తనకిచ్చిన వరంగా అభివర్ణించారు. అయితే రాజకీయ బాధ్యతలను నిర్వర్తించడానికి దానిలో కొద్దిగా మార్పులు చేస్తుంటానని అన్నారు. పార్లమెంటు సమావేశాలు జరిగే రోజుల్లో..తన డైట్ విధానం మారిపోతుందట. ఆ రోజుల్లో నానబెట్టిన డ్రై ఫ్రూట్స్, సలాడ్ తీసుకుంటానని అన్నారు. అవసరం అనుకుంటే ప్రోటీన్, కార్బోహైడ్రేట్లు, నెయ్యి కూడా తీసుకుంటానని అన్నారు. తనకు ఇష్టమైన పండ్ల గురించి మాట్లాడుతూ..తన భోజనంలో తప్పనిసరిగా అవకాడో, కివీ, ఆపిల్, అరటిపండ్లు, నారింజ, తాజా పండ్ల రసాలు ఉంటాయని చెప్పారు. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడంతో పాటు, కండరాల ఆరోగ్యానికి క్రమం తప్పకుండా వ్యాయామం కూడా చేయాలని రవి కిషన్ నొక్కి చెప్పారు.(చదవండి: కేలరీల లోటు పద్ధతితో ఏకంగా 26 కిలోలు..! ఎలా చేయాలంటే..) -
లేవగానే ఫోన్ ఎందుకు చూస్తాం?
ఉదయం కళ్లు తెరిచిన వెంటనే చాలామందికి తెలియకుండానే చేయి ఫోన్ వైపు వెళ్తుంది. అలారం ఆపిన వెంటనే.. వాట్సాప్ మెసేజ్లు, ఇన్స్టాగ్రామ్.. ఈమెయిల్స్ చెక్ చేయడం.. ఆఖరికి వాతావరణం ఎలా ఉందో చూడడం రోజువారీ అలవాటుగా మారిపోయింది. చాలామంది దీన్ని “మొబైల్ అడిక్షన్” భావిస్తారు. కానీ సైకాలజీ నిపుణుల ప్రకారం.. కాదంట!. ఉదయం లేవగానే ఫోన్ చూడాలనే కోరిక వెనుక కేవలం వ్యసనం మాత్రమే ఉండదు. అలవాటు, ఆసక్తి, అనిశ్చితిని తగ్గించుకోవాలనే మెదడు స్వభావం, కొత్త సమాచారం కోసం ఎదురుచూపు వంటి అనేక మానసిక అంశాలు పనిచేస్తాయి.రాత్రంతా ఏం జరిగిందో తెలుసుకోవాలనే ఆత్రుత.. మనిషి మెదడు సహజంగానే అనిశ్చితిని ఇష్టపడదు. మనం నిద్రలో ఉన్న సమయంలో ప్రపంచం ముందుకు సాగుతూనే ఉంటుంది. ఎవరైనా మెసేజ్ పంపి ఉండొచ్చు.. ముఖ్యమైన వార్త వచ్చి ఉండొచ్చు.. ఆఫీసు నుంచి మెయిల్ వచ్చి ఉండొచ్చు.. మరుసటి రోజు ప్లాన్ మారి ఉండొచ్చు. లేవగానే ఫోన్ చూడటం ద్వారా మన మెదడు ‘‘ఏమైనా ముఖ్యమైన విషయం జరిగిందా?’’ అనే సందేహానికి సమాధానం వెతుకుతుంది.ఉదాహరణకు.. ముఖ్యమైన ఇంటర్వ్యూ లేదా పరీక్ష ఉన్న రోజు లేవగానే ఫోన్ చెక్ చేయాలనే కోరిక మరింత ఎక్కువగా ఉంటుంది. కారణం.. ఆ రోజు గురించి ఏదైనా కొత్త సమాచారం వచ్చిందేమో తెలుసుకోవాలనే మెదడు ప్రయత్నం.అలవాటు ఎలా బలపడుతుంది?సైకాలజీలో దీనిని హ్యాబిట్ లూప్ (Habit Loop) అంటారు. ఒకే పని ఒకే సందర్భంలో పదేపదే చేయడం వల్ల అది క్రమంగా ఆటోమేటిక్గా మారుతుంది.ఇక్కడ:సంకేతం (Cue): ఉదయం నిద్ర లేవడంచర్య (Routine): ఫోన్ చెక్ చేయడంబహుమతి (Reward): కొత్త మెసేజ్, నోటిఫికేషన్, ఆసక్తికరమైన సమాచారం తెలుసుకోవడం.. ఈ మూడు కలిసి ఒక అలవాటుగా మారతాయి.కొంతకాలానికి ఫోన్లో ఏదైనా ఆసక్తికరమైన విషయం ఉంటుందని మెదడు ముందుగానే ఊహిస్తుంది. దీంతో ఉదయం లేవగానే ఫోన్ చూడాలనే అలవాటు మరింత బలపడుతుంది.ఏదో ఒకసారి వచ్చే ‘రివార్డ్’ మరింత ఆకర్షిస్తుంది.. ఫోన్ చెక్ చేసిన ప్రతిసారీ ఆసక్తికరమైన విషయం కనిపించకపోయినా.. అప్పుడప్పుడు వచ్చే మంచి అనుభవం ఆ అలవాటును కొనసాగిస్తుంది. ఒక రోజు పాత స్నేహితుడి నుంచి మెసేజ్ రావచ్చు. మరో రోజు ముఖ్యమైన ఈమెయిల్ ఉండొచ్చు. ఇంకో రోజు ఆసక్తికరమైన వీడియో కనిపించొచ్చు. ఇలా ఎప్పుడు ఏ కొత్త విషయం కనిపిస్తుందో తెలియకపోవడం వల్లే మెదడు మళ్లీ మళ్లీ ఫోన్ వైపు ఆకర్షితమవుతుంది. సైకాలజీలో దీనిని వేరియబుల్ రివార్డ్ (Variable Reward) అంటారు.ప్రపంచంతో మళ్లీ కనెక్ట్ అయ్యేందుకు.. నిద్రలో ఉన్నప్పుడు మనిషి కొంత సమయం ప్రపంచానికి దూరంగా ఉంటాడు. లేవగానే ఫోన్ చూడటం ద్వారా చాలామంది తమ చుట్టూ ఉన్న పరిస్థితులను అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారు. ప్రస్తుతం సమయం ఎంత?, వాతావరణం ఎలా ఉంది?, ఎవరైనా కాల్ చేశారా?, ఈరోజు ఏ పనులు ఉన్నాయి?.. ఇలా రోజును ప్రారంభించేందుకు అవసరమైన సమాచారాన్ని సేకరించేందుకు ఫోన్ ఒక సాధనంగా మారింది.అయితే ఇది ఆరోగ్యకరమైన అలవాటేనా?ఉదయం ఫోన్ చూడటం అనేది సాధారణ అలవాటే అయినప్పటికీ.. అది ఎంతసేపు కొనసాగుతుందన్నదే ముఖ్యం. లేవగానే రెండు నిమిషాలు ముఖ్యమైన విషయాలు చూసి పక్కన పెట్టడం పెద్ద సమస్య కాకపోవచ్చు. కానీ అదే అలవాటు 45 నిమిషాల పాటు సోషల్ మీడియా స్క్రోలింగ్గా మారితే.. దృష్టి, ఉత్పాదకత, మానసిక స్థితిపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది.ఫోన్ చూడటం అంటే అడిక్షన్ కాదు!లేవగానే ఫోన్ కోసం వెతకడం మాత్రమే చూసి దాన్ని వ్యసనంగా పరిగణించలేమని నిపుణులు చెబుతున్నారు. నిజమైన మొబైల్ అడిక్షన్ అంటే నియంత్రణ కోల్పోవడం, అవసరం లేకున్నా పదేపదే ఉపయోగించడం, దాని వల్ల రోజువారీ జీవితంపై ప్రతికూల ప్రభావం పడటం వంటి లక్షణాలు ఉండాలి. అందుకే.. ఉదయం ఫోన్ వైపు చేయి వెళ్లడం వెనుక కేవలం అలవాటు మాత్రమే కాదు.. మెదడు కొత్త సమాచారం కోసం చేసే సహజ ప్రయత్నం కూడా ఉంటుంది. -
కేలరీల లోటు పద్ధతితో ఏకంగా 26 కిలోలు..! ఎలా చేయాలంటే..
బరువు తగ్గడం తరుచుగా సవాలుగా అనిపించొచ్చు. విపరీతమైన ఆకలి కోరికలు, స్థిరత్వం లేని పురోగతి చాలామందిని వెయిట్లాస్ లక్ష్యం నుంచి వెనక్కి తగ్గేలా నిరుత్సాహపరుస్తుంది. అలాంటి వారికీ ఈ మహిళ పాటించిన టెక్నిక్ హెల్ప్ అవ్వొచ్చు. ఆరోగ్యకరమైన అవాట్లతోటే స్థిరంగా బరువు తగ్గింది. తిరిగి పెరగకుండా మెయింటైన్ చేస్తూ స్ఫూర్తిగా నిలిచింది. అదెలాగో సవివరంగా ఆమె మాటల్లోనే తెలుసుకుందామా..!.ఆ మహిళా కంటెంట్ క్రియేటర్ అందుకు సంబంధించిన వీడియోని ఇన్స్టాగ్రామ్లో పంచుకుంది. కేలరీల వినయోగంలో అటెన్షన్తో వ్యవహరించి సుమారు 26 కిలోలు వరకు తగ్గినట్లు తెలిపింది. కేలరీల లోటు అనే భావనను అర్థం చేసుకోవడమే తన ఫిట్నెస్ ప్రయాణంలో ఒక ఒకకొత్త మలుపు అని చెబుతోంది. శ్వాస తీసుకోవడం, ఆలోచించడం, కదలడం, శారీరక ప్రక్రియలను నిర్వహించడం వంటి ప్రాథమిక విధులను నిర్వర్తించడానికి ప్రతి వ్యక్తి శరీరానికి నిర్దిష్ట సంఖ్యలో కేలరీలు అవసరం. ఆ సంఖ్యను మెయింటెనెన్స్ కేలరీలు అంటారు. దానిపై అటెన్షన్ ఉంచితే బరువు తగ్గడం సులభం అని అంటున్నారు. మనం ఖర్చు చేసే కేలరీల కంటే అతిగా తింటే బరువు పెరగడానికే దారితీస్తుందని అన్నారు. అదే సమయంలో మెయింటెనెన్స్ కంటే తక్కువగా తినడం క్యాలరీల లోటును సృష్టిస్తుంది. ఇది కాలక్రమేణా బరువు తగ్గడానికి దారితీస్తుందని వెల్లడించింది. తాను సుమారు రెండువేల కేలరీలతో ప్రారంభించి, రోజుకు సుమారు 1,450 కేలరీలకు చేరుకుని ప్రతి వారం 100 నుంచి 150 కేలరీల చొప్పున ఆహారం తీసుకోవడాన్ని తగ్గించుకున్నానని అన్నారు. ఆమె ఈ లోటును 12 వారాల పాటు కొనసాగించి, ఆ తర్వాత మళ్లీ దాన్ని రిపీట్ చేస్తూ బరువు తగ్గుతూ వచ్చానని అన్నారు. ఇది ఎలాంటి తీవ్రమైన డైటింగ్ పద్ధతులను పాటించకుండా 26 కిలోల బరువు తగ్గడానికి దారితీస్తుందని అన్నారు.కేలరీల లోటుని ఎలా లెక్కించాలి..ఉచిత ఆన్లైన్ TDEE (మొత్తం రోజువారీ శక్తి వ్యయం) కాలిక్యులేటర్ను ఉపయోగించి, మీ వయసు, ఎత్తు, బరువు ఆదారంగా అనుసరించాల్సిన కేలరీల వివరణ ఇస్తుంది. చిన్నగా కేలరీల లోటు మొదలుపెట్టి దాదాపు వంద నుంచి 300 దాక కేలరీలు తగ్గించండి. అలాగే ప్రతివారం పురోగతని చెక్చేయండి. ఒకవేళ ఫలితం కనిపించకపోతే కేలరీల లోటుని కొద్దిగా తగ్గించి, శారీరక శ్రమను పెంచాలని చెప్పుకొచ్చింది. చివరగా ఆమె వెయిట్లాస్ జర్నీతో కేలరీల లోటుని సరైన విధంగా నిర్వహిస్తే స్థిరంగా బరువు తగ్గడం అనేది అత్యంత సులువైన మార్గమని చెబుతోందామె.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. View this post on Instagram A post shared by Ritm | Desi Fat Loss (@ritmsfitness) (చదవండి: ఎవరీ మిరాండా గిబ్సన్? ఏకంగా 449 రోజులు..) -
ప్లీజ్ శరీరాన్ని నిర్లక్ష్యం చెయ్యొద్దు..! పాపం ఆ 26 ఏళ్ల మహిళ..
గత కొన్నేళ్లుగా చర్మ కేన్సర్పై అవగాహన కల్పిస్తున్న టెక్సాస్కు చెందిన 26 ఏళ్ల మహిళ చివరి సందేశం నెట్టింట వైరల్గా మారింది. ఆమె కన్నీటి కథ నెటిజన్లను కదిలించింది. అంతేగాదు తనలా మరెవ్వరూ అలాంటి అనారోగ్య సమస్య బారిన పడకూడదని చివరి క్షణాల వరకు పడిన తపన ప్రతిఒక్కర్ని కదిలిస్తోంది. అంతేగాదు ప్రజలదర్నీ శరీరం విషయంలో బీకేర్ఫుల్గా ఉండమని కోరుతూ పంపిన సందేశం ఆ వ్యాధిపై అందరికీ అవగాహన ఉండాలనే విషయాన్ని నొక్కి చెప్పింది. ఇంతకీ ఎవరా మహిళ?, ఏ వ్యాధి గురించి ఇంతలా ఆమె మాట్లాడారు అంటే..గత కొన్నేళ్లుగా చర్మ కేన్సర్పై అవగాహన కల్పిస్తోంది టెక్సాస్కు చెందిన 26 ఏళ్ల మహిళ అలోండ్రా సియెర్రా. ఆమె తన మరణానికి ముందు వరకు ఆ వ్యాధిపై అవగాహన కల్పించే ప్రయత్నం చేసింది. అంతేగాదు వ్యాధిని ముందుగా గుర్తిస్తే..ఎంత బిగ్ రిలీఫ్ ఉంటుందో వివరించింది. అది మన మనుగడకు ఎంత కీలకమో కూడా నొక్కి చెప్పింది. సియెర్రా కేవలం 19 ఏళ్ల వయసులో నుదిటిపై మచ్చ ఏర్పడటం గమనించింది. కాలక్రమేణా, అది లేత రంగు నుంచి ముదురు రంగులోకి మారింది. కానీ అది కేన్సర్ కాగలదని ఎప్పుడూ ఊహించలేదు. ముఖ్యంగా మెలనోమా వచ్చే అవకాశం ఉందని కలలో కూడా ఊహించలేదని అంటోంది. కానీ ఈ ఏడాది చివరి నాటికి ఈ చికిత్స తను తీసుకున్నప్పటికీ.. విజయవంతం కాలేదని తెలిపింది. అంతేగాదు తనలా మరెవ్వరు ఈ వ్యాధి బారినపడకూడదనే ఉద్దేశ్యంతో గత నాలుగేళ్లుగా సూర్యరశ్మి నుంచి రక్షణ, క్రమం తప్పని చర్మ పరీక్షల ప్రాముఖ్యత గురించి సోషల్ మీడియా వేదికగా అవగాహన కల్పిస్తోంది. హానికరమైన యూవీ కిరణాల నుంచి తమను తాము రక్షించుకోవాలని ప్రోత్సహిస్తోంది కూడా. అలాగే కృత్రిమ యూవీ మూలాలతో ఉన్న ప్రమాదాల గురించి కూడా మాట్లాడారామె. అలాగే ఇలాంటి వాటిన బారినపడకుండా తీసుకోవాల్సిన చర్చలు, ముందస్తు పరీక్షల గురించి కూడా అవగాహన కల్పించే యత్నం చేసింది. అంతేగాదు తగ మే నెలలో మెలనోమా అవగాహన మాసం పురస్కరించుకుని పంచుకున్న వీడియో ప్రతి ఒక్కర్ని కదిలిస్తుంది. ఆ వీడియోలో సియెర్రా.. "నివారణ అనేది మనుగడకు సంబంధించిన విషయంగా అభివర్ణించింది. ఈ నెల వేడుకలకు ప్రతీక అయితే ఎంత బాగుండును, కానీ బదులుగా మనుగడకు ప్రతీకగా నిలుస్తోంది. దురదృష్టవశాత్తు, ప్రస్తుతం ఇదే నా వాస్తవికత. చాలామందికి మే 1వ తేదీ, మెలనోమా అవగాహన మాసం ప్రారంభం. అలాగే మరో నెల మాత్రమే. నాకు మాత్రం, ఇది నివారణ, ఇది ప్రచారం. ఇది జీవితం, ఇది మనుగడ అని భావోద్వేగంగా మాట్లాడింది వీడియోలో". తన పరిస్థితి రోజు రోజుకి దిగజారిపోతున్నా..తానెలాగో ఈ వ్యాధిని ముందుగా గుర్తించలేకపోయానని..కనీసం ఇతరులకకైన సహాయపడాలని..ప్రతి విషయాన్ని ప్రస్తావిస్తూ అవగాహన కల్పించే ప్రయత్నం చేసింది. అన్ని వయసుల వారు తన చర్మాన్ని జాగ్రత్తగా గమనించాలని చెప్పింది. పుట్టుమచ్చ రంగు, ఆకారం, పరిమాణంలోని తేడాలను నిర్లక్ష్యం చేయొద్దని కోరిందామె. ఒకవేళ ఆలస్యం చేస్తే..తల నుంచి చెవుల వెనుక వరకు..అలాగే రొమ్ము, పాదాలు, జననాంగాల వరకు ఎలా వ్యాపిస్తుందో వివరిస్తూ..తన సంభాషణను ముగించింది. కానీ అదే ఆమె చివరి వీడియోగా మిగిలింది. ఎందుకంటే..స్టేజ్ 4 మెలనోమా కేన్సర్తో సుదీర్ఘ పోరాటం చేసి ఈ నెల జూలె 17న మరణించింది. మందుగా ఈ వ్యాధిని ఎలా గుర్తించాలంటే..ఈ మెలనోమాను ముందుగా గుర్తించే హెచ్చరిక సంకేతాల కోసం చర్మవ్యాధినిపుణులు ABCDE అనే నియమాన్ని అనుసరించమని సూచిస్తున్నారు. A - అసమానతB – అంచులలో క్రమరాహిత్యంC - రంగులో వైవిధ్యంD - 6 మి.మీ కంటే పెద్ద వ్యాసంE – పరిమాణం, ఆకారం లేదా రంగులో మార్పులుకాగా సియెర్రా..అధునాతన కేన్సర్తో పోరాడుతున్నప్పటికీ, జీవితంలోని ముఖ్యమైన మైలురాళ్లను జరుపుకుంది. ఆమె 2024లో కళాశాల నుంచి పట్టభద్రురాలైంది, అదే ఏడాది ఆ వ్యాధి తన శరీరం అంతటా వ్యాపించిందని తెలుసుకుంది. ఈ ఏడాది మార్చిలో, రేడియేషన్ చికిత్స పూర్తి చేసిన కొద్ది రోజులకే, ఆమె అమెరికా పౌరసత్వం పొంది మరో కలను నెరవేర్చుకుంది. అంతేగాదు తన కథ ద్వారా, ఇతరులు కూడా తమ చర్మంలో అనుమానాస్పద మార్పులను ముందుగానే గుర్తించి, ఆలస్యం కాకముందే వైద్య సలహా తీసుకోవాలని సియెర్రా ఆశించింది. చివరి వరకు ఆమె ఆ లక్ష్యం కోసమే పోరాడిందని కన్నీటి పర్యంతమైంది ఆమె కుటుంబం. View this post on Instagram A post shared by Alondra Sierra (@alondrasierrat)గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. ఈ వ్యాధి గురించి పూర్తి వివరాలను వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: హీర్ అజిత్ డైట్ సీక్రెట్..! ఆఖరికి పోషకాహార నిపుణుల సైతం..) -
హీర్ అజిత్ డైట్ సీక్రెట్..! ఆఖరికి పోషకాహార నిపుణుల సైతం..
తమిళ నటుడు అజిత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. విలక్షణమైన సినిమాలతో వైవిధ్యభరితమైన నటనతో మెప్పిస్తుంటాడు ఈ సూపర్ స్టార్. ప్రముఖ హీరోయిన్ షాలిని పెళ్లాడిని ఆయన ఫ్యామిలీకి ఎంత ప్రాధాన్యత ఇస్తుంటారనేది.. పలు ఇంటర్వ్యూల్లో అజిత్ చెప్పిన మాటలే నిదర్శనం. ఆఖరికి ఇటీవల పద్మభూషణ్ అవార్డుని గెలుచుకున్నప్పుడూ కూడా ఆ క్రెడిట్ మొత్తాన్ని భార్యకే ఇచ్చేశారు. ఫ్యామిలీకి, కుటుంబ విలువలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చే ఆయన డైట్ విషయంలో ఎంత కేర్గా ఉంటారో తెలిస్తే విస్తుపోతారు. అందుకు సంబంధించిన ఆసక్తికర విషయాలను ఆయన వ్యక్తిగత పోషకాహార నిపుణురాలు దివ్య కె పురుషోత్తం అరవింద్ సురేష్ పాడ్కాస్ట్లో పంచుకున్నారు. అవేంటంటే..తాను చాలామంది సెలబ్రిటీలో పనిచేశాను కానీ అజిత్ ఫ్యామిలీ ఆహారం విషయంలో పాటించే క్రమశిక్షణను చూసి ఎప్పుడూ ఆశ్చర్యపోతుంటానని అన్నారు దివ్య. అది కేవలం అజిత్ సార్లోనే కాదు మేడమ్ షాలిని కూడా ఆహారం విషయంలో చాలా కేర్గా ఉంటారని చెప్పారు. తను నోట్లో పెట్టుకునే ప్రతి ఆహారానికి, తన పిల్లలకు, ఇంట్లో పనిచేసే వాళ్లకు కూడా మంచి ఆహారమే ఉండేలా చూస్తారు. శుభ్రంగా, ఆరోగ్యకరమైనది, పోషకాలతో కూడినదే తినడానికి ప్రాధాన్యత ఇస్తుంటారు. నిజంగా ఇది అందరూ నేర్చుకోవాల్సిన విషయం అని అన్నారామె. నిపుణులు ఏం అంటున్నారంటే..ఇంతలా ఆరోగ్యంపై శ్రద్ధ అవసరమేనని, ముఖ్యంగా మితంగా తినడం మంచిదని అన్నారు. ఇలా ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉంటే దీర్ఘకాలంలో ఆరోగ్యానికి ఎలాంటి ఢోకా ఉండదన్నారు. ఇలాంటి శ్రద్ధ ఫలితం అధిక జంక్ ఫుడ్, చక్కెర, నూనె పదార్థాలకు దూరంగా ఉండగలుగుతారని అన్నారు. శ్రద్ధగా ఉండటం మంచిదే కానీ ప్రతి ముద్దను తనిఖీ చేసేంత అతి వద్దని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. ఇంట్లో వండిన తాజా ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వండి తప్ప..అందుకోసం ఆందోళనల, ఒత్తిడి వద్దన్నారు. క్లీన్ ఈటింగ్కి ప్రాధాన్యత ఇవ్వమని సూచించారు ఆరోగ్య నిపుణులు.“క్లీన్ ఈటింగ్” అంటే ..క్లీన్ ఈటింగ్ అనే భావనను తరచుగా ఖరీదైనదిగా లేదా పరిమితమైనదిగా తప్పుగా అర్థం చేసుకుంటారు. “క్లీన్ ఈటింగ్ అంటే పండ్లు, కూరగాయలు, పప్పులు, ధాన్యాలు, ఇంట్లో వండిన తాజా భోజనం వంటి సహజమైన ఆహారాన్ని తినడం. ఇది ఏమి ఠినమైన డైటింగ్ కూడా కాదు. కేవంల ఎక్కువగా ప్రాసెస్ చేసే జంక్ఫుడ్కి దూరంగా ఉండటం లాంటిది. ఇంట్లో క్రమశిక్షణతో కూడిన జీవనశైలికి ప్రాధాన్యత ఇస్తే..పిల్లలు కూడా ఆటోమేటిగ్గా ఆ అలవాట్లకే ప్రాధాన్యత ఇస్తారని అన్నారు. View this post on Instagram A post shared by Love Theory Media ™️ (@lovetheorymedia) (చదవండి: మిస్ టీన్ యూనివర్స్ ఇండియా విజేతగా ప్రసుచి పాండా) -
Health: 'నాలో సమస్య ఉండదు' అనేదే పెద్ద అపోహ!
ఇటీవల సంతానలేమి సమస్య బాగా పెరుగుతున్న నేపథ్యంతో పాటు ఈ నెల 25న ఐవీఎఫ్ / ఎంబ్రియాలజీ డే సందర్భంగా ‘సాక్షి’ వరుస కథనాలను వెలువరించింది. ప్రత్యేకంగా 21వ తేదీ నుంచి 25వ తేదీ వరకు వచ్చిన వరుస కథనాల్లో సంతానలేమి కారణాలతో పాటు ఐవీఎఫ్ ప్రక్రియను ఎలా నిర్వహిస్తారు, అందులోని కాంప్లికేషన్లూ, నైతికాంశాలను విపులంగా చర్చించింది.ఈ నేపథ్యంలో అత్యంత సంక్లిష్టమైన హార్మోన్ సైకిళ్లు కొనసాగే మహిళల్లో వచ్చే సమస్యలపై మరింత వివరమైన కథనాలొచ్చాయి. అయితే పురుషుల్లో సంతానలేమికి కారణాలపై చిన్న ప్రస్తావనలకే పరిమితమైనందున ఈ కథనంలో పురుషుల్లో పెరుగుతున్న వంధ్యత్వ సమస్యలు దంపతుల సంతానలేమికి ఏ మేరకు కారణమవుతున్నాయనే అంశంపై ఓ వివరణాత్మకమైన కథనమిది. నిజానికి దంపతుల్లో సంతానలేమి సమస్య ఉన్నప్పుడు పురుషులే తొలి చొరవ తీసుకోవాలని చెప్పడంతో పాటు... అందుకు కారణాలేమిటో తెలిపే కథనమిది.సంతానలేమి సమస్య ఉన్న దంపతుల్లో మహిళలతో పాటు పురుషులూ అందుకు కారణం కావచ్చు. నిజానికి సంతానలేమికి మహిళలూ, పురుషులూ సమానంగా కారణం కావచ్చని గుర్తించాలి. అయితే పురుషాధిక్యత కారణంగా... ఇంత పురోగతీ, జెండర్ ఈక్వాలిటీ తర్వాత కూడా సమాజం ఇప్పటికీ మహిళలనే ఇందుకు బాధ్యులను చేస్తుండటం గమనించవచ్చు. పురుషులలో సంతాన లేమికి కారణాలుపురుషుల్లో సంతాన లేమికి కారణాలను ప్రధానంగా మూడు రకాలుగా చెప్పవచ్చు. అవి జీవనశైలికి సంబంధించినవీ, పర్యావరణ కారణాలూ, వైద్యపరమైన అంశాలు. వాటి గురించి వివరంగా... జీవనశైలికి సంబంధించినవి...పొగతాగడం, మద్యం వంటి దురలవాట్లు. (ఇవి శుక్రకణాల సంఖ్య, నాణ్యత, కదలిక (మొటిలిటీ)ని తగ్గిస్తాయి. మరీ ముఖ్యంగా పొగతాగడమనే అలవాటు శుక్రకణాల మొటిలిటీని విపరీతంగా ప్రభావితం చేస్తుంది).కూర్చుని చేసే వృత్తులతో శారీరక శ్రమ లేకపోవడం, స్థూలకాయం (ఒబేసిటీ)ఆధునిక జీవనశైలిలో ఉండే తీవ్రమైన ఒత్తిడి.ఈ అంశాలన్నీ పురుషుల్లో హార్మోన్లపై దుష్ప్రభావం కలిగించి శుక్రకణాల (స్పెర్మ్) ఉత్పత్తిని తీవ్రంగా ప్రభావితం చేస్తాయి/ చేస్తున్నాయి.పర్యావరణ అంశాలు...కాలుష్యం, వాతావరణంలోని విషపదార్థాలు (టాక్సిన్స్), భారలోహాల (హెవీమెటల్స్) తాలూకు దుష్ప్రభావాలు.పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, రకరకాల ఎలక్ట్రానిక్ ఉత్పాదనల ఉపయోగంతో వాతావరణంలోని రేడియేషన్... వంటి అంశాలూ స్పెర్మ్పై ప్రతికూలంగా పనిచేస్తుంటాయి. (ఉదాహరణకు సెల్ఫోన్ ప్యాంటు జేబులో పెట్టుకోవడం, ల్యాప్టాప్ ఒళ్లో పెట్టుకుని పనిచేయడం వంటివి స్పెర్మ్ కౌంట్ను తగ్గిస్తాయన్న పరిశీలనలూ, అధ్యయనాలూ ఉన్నాయి).వైద్యపరమైన అంశాలు...వృషణాల్లో రక్తనాళాలు ఉబ్బడం వల్ల కనిపించే వేరికోసీల్.టెస్టోస్టెరాన్ మొదలగు హార్మోన్ సమస్యలు.కొన్ని జన్యుపరమైన అంశాలు, పురుష ప్రత్యుత్పత్తి అవయవాల ఇన్ఫెక్షన్లుకారణాలు తెలుసుకోవడం కోసం...పురుషుల్లో సంతానలేమికి కారణాలను తెలుసుకోడానికి దంపతులకు మొట్టమొదటగా డాక్టర్ నుంచి కౌన్సెలింగ్ అవసరం. పరీక్షల కంటే ముందుగా ఇదే ఎందుకు అవసరమంటే... సాధారణంగా మన దేశంలో లైంగిక అంశాలపై విజ్ఞానం చాలా తక్కువ. పైగా లైంగికపరమైన సమస్యలూ, పరిష్కారాల కోసం నోరుతెరచి ఓపెన్గా మాట్లాడటానికి కొంత వెనకాడుతుంటారు. అందుకే దంపతులు మొట్టమొదట తమ మనసు విప్పి డాక్టర్ ఎదుటనైనా మాట్లాడేలా దంపతులను సంసిద్ధం చేయాలి. ఆ తర్వాత వారి లైంగిక జీవితం పై కొన్ని ప్రశ్నలు అడగాల్సి ఉంటుంది. నిజానికి లైంగిక జీవితంపై ప్రశ్నలు అనగానే దంపతులు సంకోచిస్తుంటారు. కానీ అవి వైజ్ఞానికంగానూ, ఏవైనా తప్పులు / లోపాలు ఉంటే కనుగొనేందుకు ఉపయోగపడేవిగానూ ఉంటాయని గుర్తించాలి. ఉదాహరణకు ఆ ప్రశ్నలెలా ఉంటాయంటే...పురుషుల్లో సంతానలేమికి కారణాలు కనుక్కునే ముందర అసలు ఆ పురుషుడిలో అంగస్తంభన సరిగా ఉందా, లేదా?ఒక నెలలో మహిళకు నెలసరి మొదలైన తర్వాత 10వ రోజు నుంచి 20వ రోజుల్లో ఎలాంటి ప్రొటెక్షన్ లేకుండా రోజూ గానీ లేదా రోజు తప్పించి రోజుగానీ క్రమం తప్పకుండా కలుస్తున్నారా?కలయిక తర్వాత పురుషుడి వీర్యం మహిళలోకి సక్రమంగానే చేరుతోందా అన్నది తెలుస్తోందా?పురుషుల్లో అంగస్తంభన సమస్య ఉన్నా, ఒకవేళ కలయిక సాధ్యమైనప్పటికీ... వీర్యం సక్రమంగా మహిళలోకి పూర్తిగా ప్రవేశించకపోయినా... ఆ మహిళకు ఎన్ని పరీక్షలు, చికిత్సలూ చేయించినా ప్రయోజనం ఉండదు. అందుకే పురుషుల్లో సాధారణంగా కనిపించే ఈ సమస్యలను యాండ్రాలజిస్ట్ / యూరాలజిస్ట్ ద్వారా ముందుగా పురుషుల విషయంలోనే తెలుసుకోవాలి.సమాజపరంగా అందరి బాధ్యత ఇది... ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే... ఒకవేళ పురుషుల్లో ఏదైనా సమస్య ఉన్నప్పటికీ అది కూడా మిగతా సాధారణ ఆరోగ్య సమస్యల్లాంటిదే. నిజానికి దాన్ని లోపంగా కూడా చూడకూడదు. అన్నిసాధారణ ఆరోగ్య సమస్యలకు చికిత్స ఎలా చేయిస్తారో, ఈ సమస్యకూ అలాగే చికిత్స అందించాలి. నిజానికి ఈరోజు అందుబాటులో ఉన్న వైద్యపరిజ్ఞానంతో లైంగిక సమస్యలను చక్కదిద్దడం దాదాపు పూర్తిగా సాధ్యమేనని గుర్తించాలి. అంతేతప్ప ‘మగ’తనం లోపమంటూ, మరొకటంటూ ఈ లైంగిక సమస్యను సమాజం చిన్నచూపు చూడకూడదు. అలా చూడటమూ సరికాదు.తొలుత భౌతిక పరీక్షల (ఫిజికల్ ఎగ్జామినేషన్స్)తో మొదలు...పురుషులతో మాట్లాడాక... ఫిజికల్ ఎగ్జామినేషన్స్గా పిలిచే కొన్ని భౌతిక అంశాల పరీక్షలు నిర్వహించాలి. ఇందులో... పురుషుల్లో సెకండరీ సెక్సువల్ కారెక్టరస్టిక్స్ అన్నీ సరిగా అభివృద్ధి చెందాయా అని చూడాలి. సెకండరీ సెక్సువల్ కారెక్టరిస్టిక్స్ అంటే... ఆ వ్యక్తికి మీసాలూ గడ్డాలూ బాగానే ఉన్నాయా, అతడి ప్యూబిక్ హెయిర్ పెరుగుదల సాధారణంగానే ఉందా, పురుషాంగం పరిమాణం కనీసంగా ఉందా, వృషణాల సైజ్ సాధారణంగానే ఉందా... లాంటి అనేక అంశాలను ఫిజికల్ ఎగ్జామినేషన్స్లో పరీక్షిస్తారు. ఇవన్నీ చేశాక ఆ తర్వాతి పరీక్షలకు వెళ్తారు.తర్వాత నిర్ధారణ పరీక్షలు...వీర్యపరీక్ష (సెమెన్ ఎనాలసిస్ టెస్ట్) : ఈ పరీక్షలో వీర్యకణాల సంఖ్య (కౌంట్), నాణ్యత (క్వాలిటీ), కదలికలు (మొటిలిటీ), వీర్యకణాల ఆకృతి (మార్ఫాలజీ) వంటి అంశాలు తెలుస్తాయి. ఈ పరీక్షకు ముందుగా కనీసం మూడు రోజుల పాటు కలయికగానీ లేదా హస్తప్రయోగంగానీ కూడదు. ఒక్కోసారి ఒక పరీక్షకూ మరో పరీక్షకూ కూడా పొంతన లేని ఫలితాలు ఉండకపోవచ్చు. అందుకే కేవలం ఒక పరీక్షతోనే సెమెన్ ఎనాలసిస్పై ఒక నిర్ధారణకు రాకూడదు. చాలా రకాల అంశాలు వీర్యపరీక్ష ఫలితాలపై ప్రభావం చూపిస్తాయి. ఉదాహరణకు... కొందరిలో సాధారణ జ్వరం వచ్చినప్పుడు కూడా వీర్యకణాల ఉత్పత్తి పడిపోయి, వీర్యకణాల సంఖ్య చాలా తక్కువగా ఉన్నట్లుగా ఫలితం వస్తుంది. అందుకే పూర్తి ఆరోగ్యంగా, ఉల్లాసంగా ఉన్నప్పుడే వీర్యపరీక్ష ఫలితాలు మెరుగ్గా వస్తాయి. అందుకే సెమెన్ టెస్ట్లో ఒక్కోసారి కేవలం పరీక్షకే పరిమితమయ్యే బదులు కొన్నిసార్లు డాక్టర్లు ఒకటికి రెండుసార్లు ఈ పరీక్ష చేయించే అవకాశం ఉండవచ్చు.చికిత్స ప్రక్రియలు...ఇన్ఫెక్షన్లు ఉండటం వల్ల వీర్యకణాల సంఖ్య తగ్గితే... యాంటీబయాటిక్స్ ఇవ్వడం.హార్మోన్ల లోపం ఉంటే... దాన్ని భర్తీ చేసేందుకు అందుకు అవసరమైన హార్మోన్ చికిత్స అందిస్తారు.వీర్యంలో అసలు వీర్యకణాలే లేకపోతే : నిజానికి వీర్యం అనేది వీర్యకణాలు జీవిస్తూ, చురుగ్గా కదలడానికి అవసరమైన ఒక ద్రవపు మీడియం మాత్రమే. దీన్ని ప్రోస్టేట్ గ్రంథి అండ్ సెమినల్ వెసికిల్స్ తయారు చేస్తాయి. సంతానానికి కారణమయ్యే ‘వీర్యకణాలు’ వృషణాల్లో ఉత్పత్తి అవుతాయి. అక్కడ పుట్టిన ఆ కణాలు, వాస్ డిఫరెన్స్ అనే సన్నటి గొట్టం ద్వారా వీర్యంలోకి చేరి, అందులో ఈదుతూ ఉంటాయి.పురుషులకే తొలి పరీక్షలు మేలు... నిజానికి సంతాన లేమి సమస్యలు ఉన్నప్పుడు తొలి పరీక్షలు పురుషులు చేయించుకోవడమే మంచిది. ఇలా చెప్పడానికి అనేక కారణాలతో పాటు అనేక ప్రయోజనాలూ ఉన్నాయి. అవేమిటంటే... పురుషుల్లో కారణాలు కనుగొనడం చాలా సులువు. ఖర్చు కూడా చాలా తక్కువ. మొదటే మహిళల్లో సమస్యల కోసం పరీక్షలు చేయిస్తే... పురుషుల విషయంలో చేయించాల్సిన పరీక్షల కన్నా అవి చాలా ఎక్కువ. పైగా అవన్నీ చేయించాక మహిళల్లో సమస్య ఏదీ లేదని తేలితే ఎంతో డబ్బు, శ్రమ, సమయం... ఇవన్నీ వృథా అవుతాయి.మన సమాజంలోని పురుషాధిక్యతతో కూడిన వివక్ష, పురుషుడిలో సమస్య ఉందంటే... ముఖ్యంగా పల్లెల్లో పొరుగువారి నుంచి ఎదురయ్యే చిన్నచూపు వంటి అంశాలు పురుషుడు తన సమస్యను కప్పిపెట్టుకునేలా ప్రేరేపిస్తుంటాయి. నిజానికి సంతానలేమికి మహిళల్లో ఎన్ని కారణాలు ఉంటాయో వాస్తవానికి పురుషుల్లోనూ అన్నే ఉంటాయన్నది వైద్యపరంగా తేలిన సత్యం. అందుకే సంతానం లేని దంపతుల్లో... పురుషులే తొలి పరీక్షలు చేయించుకోవడం అని రకాలా ప్రయోజనకరం.ఈరోజు అందుబాటులో ఉన్న వైద్యపరిజ్ఞానంతో లైంగిక సమస్యలను చక్కదిద్దడం దాదాపు పూర్తిగా సాధ్యమేనని గుర్తించాలి. అంతేతప్ప ‘మగ’తనం లోపమంటూ, మరొకటంటూ ఈ లైంగిక సమస్యను సమాజం చిన్నచూపు చూడకూడదు. అలా చూడటమూ సరికాదు.కౌంట్ను ప్రభావితం చేసే దురలవాట్లుసిగరెట్ స్మోకింగ్, ఆల్కహాల్ అలవాటు ఉన్నవారిలో కూడా వీర్యకణాల సంఖ్య తగ్గుతుంది. ఒత్తిడి కూడా వీర్యకణాల సంఖ్యను ప్రభావితం చేస్తుంది. అంతెందుకు... తీవ్రఒత్తిడిలో పనిచేసే వారిలో అంగస్తంభన సమస్య కనిపించడమన్నది చాలా సాధారణం. అంతేకాదు... వీళ్లలో వీర్యకణాల సంఖ్య, నాణ్యత, కదలికలు చురుగ్గా ఉండవు. ఈ కారణం వల్ల కూడా వాస్తవానికి పురుషుల్లో పరీక్షల కంటే ముందుగా యాండ్రాలజిస్ట్ ఆ దంపతుల సెక్స్ జీవితానికి సంబంధించిన వివరాల సేకరణకే ఎక్కువ ్రపాముఖ్యత ఇస్తుంటారు.లైంగిక జీవితంపై ప్రశ్నలు అనగానే దంపతులు సంకోచిస్తుంటారు. కానీ అవి వైజ్ఞానికంగానూ, ఏవైనా తప్పులు / లోపాలు ఉంటే కనుగొనేందుకు ఉపయోగపడేవిగానూ ఉంటాయని గుర్తించాలి.హార్మోన్ పరీక్షలు...ఇందులో ఎఫ్ఎస్హెచ్, ఎల్హెచ్,ప్రోలాక్టిన్, టెస్టోస్టెరాన్. ఈస్ట్రోడియల్ ఈ ఐదు పరీక్షలూ చేయించడం వల్ల హార్మోన్ సమతౌల్యత ఉందా లేదా అన్న సంగతి తెలుస్తుంది. (నిజానికి ఒక టెస్టోస్టెరాన్ మినహా మిగతా వైద్య పరీక్షలు మహిళలకే చేస్తారనేది సాధారణ అపోహ. కానీ ఈ హార్మోన్లు మహిళలూ, పురుషుల్లో వేర్వేరు మోతాదుల్లో వెలువడి ఒక క్రమమైన సమతౌల్యతను నిర్వహిస్తుంటాయి. ఆ సమతౌల్యత సక్రమంగానే ఉందా లేక అసమతౌల్యతా ఉందా అని తెలుసుకునేందుకు పురుషులకూ ఈ హార్మోన్ పరీక్షలు చేస్తారు). జన్యుపరమైన పరీక్షలు: సంతానలేమికి ఏవైనా జన్యుపరమైన కారణాలున్నాయా అని తెలుసుకునేందుకు చేసే పరీక్షలివి.ఇమేజింగ్ పరీక్షలు: వీర్యంలో వీర్యకణాల సంఖ్య తగ్గినా లేదా వీర్యకణాలు నార్మల్గానే ఉండి పిల్లలు పుట్టకపోయినా డాక్టర్లు ‘స్క్రోటల్ అల్ట్రాసౌండ్ డాప్లర్’ అనే స్కానింగ్ పరీక్ష నిర్వహిస్తారు. ఇది ఏమాత్రం నొప్పి ఉండని సాధారణ పరీక్ష. దీనివల్ల వృషణాల పరిమాణం, వేరికోసిల్ సమస్య ఏదైనా ఉందా అని తెలుస్తాయి.వేరికోసిల్ అంటే...వృషణాల్లోని రక్తనాళాల వాపు. ఇది ఉన్నవారిలో చెడు రక్తం తీసుకెళ్లే రక్తనాళాలు (సిరలు) ఉబ్బిపోయి రక్త ప్రవాహం సరిగా లేకపోవడం. దీనివల్ల వీర్యకణాల సంఖ్య, నాణ్యత తగ్గుతాయి. ఈ సమస్యను ఓ సాధారణ శస్త్రచికిత్సతో చక్కదిద్దాల్సి ఉంటుంది. వేరికోసిల్ ఆపరేషన్ పూర్తయ్యాక దాదాపు 70 శాతం మంది పురుషుల్లో వీర్యకణాల సంఖ్య బాగా పెరిగే అవకాశం ఉంటుంది. మైక్రోస్కోప్ ద్వారా గజ్జల్లో చిన్న కోతతో చేసే ఈ సర్జరీని అనుభవజ్ఞులు నిర్వహిస్తే ఫలితాలు చాలా మెరుగ్గా ఉంటాయి. ఈ శస్త్రచికిత్స నిర్వహించిన మూడు నెలల తర్వాత ప్రెగ్నెన్సీ రావడానికి అవకాశాలు పెరుగుతాయి.వీర్యకణాలే లేని కండిషన్ ‘అజూస్పెర్మియా’ఏవైనా కారణాల వల్ల కొందరి వీర్యంలో అసలు వీర్యకణాలే ఉండకపోవచ్చు. ఈ కండిషన్ను అజూస్పెర్మియా అంటారు. ఈ సమస్య ఉంటే గర్భం రాదు. ఎందుకంటే... 60 లక్షల నుంచి కోటికణాలు ఉండాల్సిన చోట ఒక్క కణం కూడా లేకపోతే గర్భం వచ్చే అవకాశం ఉండదు. అయితే ఇందుకు కారణాలను కచ్చితంగా కనుగొంటే... దీన్ని అధిగమించడం సాధ్యమే. వీర్యకణాలు లేవని రిపోర్టు వచ్చినప్పుడు నిర్ధారణ కోసం ఒక నెల తర్వాత మళ్లీ పరీక్షలు చేయించాలి. అప్పుడు కూడా వీర్యకణాలు లేవని రిపోర్ట్ వస్తే అప్పుడు టెస్టిక్యులార్ బయాప్సీ అనే పరీక్ష చేయాల్సి ఉంటుంది. ఇందులో వృషణాల్లోంచి ఒక చిన్న ముక్కను తీసి పరీక్షిస్తారు. అసలు వృషణాల్లో వీర్యకణాల ఉత్పత్తి జరుగుతుందో లేదో అన్నది ఈ పరీక్షతో తెలుసుకుంటారు.వాస్ రిపేర్ (వాసో వాసాస్టమీ) : కొందరిలో వృషణాల్లో వీర్యకణాల ఉత్పత్తి జరుగుతూ ఉండి, అవి వీర్యరాశిలోకి రాని కండిషన్ కూడా ఉంటుంది. టెస్టిక్యులార్ బయాప్సీలో వృషణాల్లో వీర్యకణాలను ఉత్పత్తి చేసే శక్తి ఉందని తెలిశాక... ఆ వీర్యకణాలను వీర్యరాశి వరకు తీసుకొచ్చే నాళాన్ని (వాస్)ని రిపేర్ చేసి, కలయిక సమయంలో అవి బయటకు వచ్చేలా చేయవచ్చు. అయితే ఇది కాస్త సంక్లిష్టమైన శస్త్రచికిత్స ప్రక్రియ. వృషణాల్లో వీర్యకణాల తయారీ నార్మల్గా ఉందని తెలిశాకే ఈ సర్జరీ గురించి ఆలోచించాలి.టెస్ట్ట్యూబ్ బేబీ కోసం : వీర్యకణాల తయరీ బాగుండి, మహిళలకు సమస్యలు ఉన్నప్పుడు... డాక్టర్లు వీర్యకణాల్లో నాణ్యమైన వాటిని సేకరించి, వాటిని ల్యాబ్ ఫ్రిజ్లో (క్రయో ప్రిజర్వేషన్ పద్ధతిలో) నిల్వచేసి నెలనెలా టెస్ట్ట్యూబ్ బేబీ ప్రక్రియ కోసం వీటిని ఉపయోగిస్తారు. సేకరించిన వీర్యకణలను కోల్డ్ స్టోరేజీలో పెట్టుకొని, ఇన్ఫెర్టిలిటీ సెంటర్లో టెస్ట్ట్యూబ్ బేబీ ప్రక్రియకు వెళ్తారు. ఇందులో వీర్యకణాన్ని, అండాన్ని టెస్ట్ట్యూబ్లో ఫలదీకరించి, ఆ పిండాన్ని మహిళ గర్భంలోకి ప్రవేశపెడతారు.చివరగా... ఆరోగ్యకరమైన జీవనశైలి; మంచి సమతులాహారం; పరిశుభ్రమైన వాతావరణంలో నివాసం; శారీరకంగా శ్రమ చేస్తూ దేహానికి తగినంత వ్యాయామం ఇవ్వడంతో పాటు పొగతాగడం, మద్యం వంటి దురలవాట్లకు దూరంగా ఉండటం, మానసికంగా, శరీరకంగా ఒత్తిడికి దూరంగా ఉండటం వంటివి చేస్తుంటే... అసలు వైద్యపరీక్షలూ, చికిత్సలేమీ లేకుండానే సంతానాన్ని పొందే అవకాశాలుండవచ్చు. ఒకవేళ ఏవైనా సమస్యలు ఉన్నప్పటికీ ఇప్పుడున్న వైద్యవిజ్ఞానంతో దాదాపు ప్రతి సమస్యకూ పరిష్కారముందని పురుషులు గుర్తుంచుకోవడం అవసరం. చాలా ముఖ్యం కూడా.- డా. రాఘవేందర్ కొస్గీ, సీనియర్ కన్సల్టెంట్, మైక్రో సర్జికల్ యూరో–యాండ్రాలజిస్ట్నిర్వహణ: యాసిన్ -
కంగనా రనౌత్ వైరల్ కేన్సర్ స్టోరీ..నిజంగానే అధిక ప్రోటీన్ ప్రమాదకరమా?
50 ఏళ్లు లోపు వారిలో పెరుగుతున్న కేన్సర్ కేసుల గురించి నటి, రాజకీయ నాయకురాలు కంగనా రనౌత్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ పెద్ద దుమారం రేపి.. వివిధ చర్చలకు దారితీసింది. ఆమె ఆ పోస్ట్లో ప్రోటీన్ సప్లిమెంట్ల పట్ల పెరుగుతున్న ప్రజాదరణ గురించి మాట్లాడారు. అతిగా ప్రాసెస్ చేసిన ఆహారాలు, ప్రోటీన్ షేక్లకు దూరంగా ఉండాలని అన్నారు. అవి కేన్సర్ వంటి ఆరోగ్య ప్రమాదాలను మరింత పెంచేస్తాయని నొక్కి చెప్పారు. దాంతో ఒక్కసారిగా శరీరానికి అవసరమైన దానికంటే అధిక మోతాదులో ప్రోటీన్ తీసుకుంటే చాలా ప్రమాదకరమా అని చర్చలు మొదలయ్యాయి నెట్టింట. నిజంగా ఇది ఎంతవరకు సమంజసం అంటే..కండరాల మరమ్మత్తు, కణజాల నిర్వహణ, హార్మోన్ల ఉత్పత్తి, రోగనిరోధక పనితీరుకు ప్రోటీన్ ఒక ముఖ్యమైన స్థూల పోషకం. ఇది గుడ్లు, చేపలు, చికెన్, పాల ఉత్పత్తులు, పప్పుధాన్యాలు, బీన్స్, నట్స్, విత్తనాలలో సహజంగా లభిస్తుంది. క్రమం తప్పకుండా వ్యాయామం చేసేవారికి ప్రోటీన్ చాలా ముఖ్యం, ఎందుకంటే ఇది కండరాల పునరుద్ధరణకు, నిర్వహణకు తోడ్పడుతుంది. అలాగని అధికంగా తీసుకోవడం మంచిది కాదనే చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ఏదైన సమతుల్యతకు ప్రాధాన్యత ఇవ్వమని నొక్కి చెబుతున్నారు.ప్రోటీన్ షేక్ల వల్ల కేన్సర్ వస్తుందా అంటే..ప్రోటీన్ షేక్ల వల్లనే కేన్సర్ వస్తుందనడానికి ఎలాంటి నిర్ధారిత ఆధారాలు లేవు. దీన్ని ఒక నిర్దిష్ట ఆహారానికి లేదా సప్లిమెంట్కు ముడిపెట్టలేమని అన్నారు. అయితే కొన్ని ప్రోటీన్ షేక్లు, బార్లు, ఇతర ఫిట్నెస్ ఉత్పత్తులలో అదనపు చక్కెరలు, అధిక కేలరీలు లేదా అధికంగా ప్రాసెస్ చేయబడిన పదార్థాలు ఉంటాయి. అందువల్ల అలాంటివి నిత్యం తీసుకుంటే బరువుని అదుపులో ఉంచుకోవడం కష్టతరమవుతుంది.ఎవరికీ మంచిది కాదంటే..ప్రోటీన్ను సరైన మోతాదులో తీసుకున్నప్పుడు ఆరోగ్యవంతులకు సాధారణంగా సురక్షితమే అయినప్పటికీ, కొన్ని వైద్య పరిస్థితులు ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలి. ముందు నుంచే కిడ్నీ వ్యాధి ఉన్న వ్యక్తులు వైద్య పర్యవేక్షణలో ప్రోటీన్ తీసుకోవడాన్ని మార్చుకోవలసి ఉంటుంది. ఇతర దీర్ఘకాలిక అనారోగ్యాలు ఉన్నవారు కూడా తమ ఆహారంలో ముఖ్యమైన మార్పుల గురించి వైద్యులను సంప్రదించాలి.ఎంత ప్రోటీన్ అవసరం?ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి ప్రోటీన్ అవసరాలు గణనీయంగా మారుతూ ఉంటాయి. ఈ క్రింది అంశాలు:వయస్సుశరీర బరువుశారీరక శ్రమవ్యాయామ తీవ్రతఇప్పటికే ఉన్న ఆరోగ్య సమస్యలుగర్భధారణ స్థితిఫిట్నెస్ లక్ష్యాలుతదితరాలు వ్యక్తిగత ప్రోటీన్ అవసరాలను ప్రభావితం చేయగలవు. శారీరకంగా చురుకుగా ఉండే లేదా బలం పెంచే శిక్షణ పొందుతున్న వారికి, నిశ్చల జీవనం గడిపే వ్యక్తి కంటే ఎక్కువ ప్రోటీన్ అవసరం కావొచ్చు. కేవలం ఫిట్నెస్ ట్రెండ్లను అనుసరిస్తూ కాకుండా, నిజమైన పోషకాహార అవసరం ఉన్నప్పుడు మాత్రమే సప్లిమెంట్లను ఉపయోగించాలి అని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు.ప్రోటీన్ సప్లిమెంట్ల కంటే ఆహారమే మేలా?చాలా మందికి, ప్రోటీన్ అవసరాలను వైవిధ్యమైన, సమతుల్యమైన ఆహారం ద్వారా పొందొచ్చు. అవేంటంటే..గుడ్లుచేపలుచికెన్పాలు, పెరుగుపనీర్పప్పు, బీన్స్సోయా, టోఫుగింజలు, విత్తనాలుసంపూర్ణ ఆహారాలు ప్రోటీన్తో పాటు ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు, ఆరోగ్యకరమైన కొవ్వులు వంటి ఇతర ముఖ్యమైన పోషకాలను అందిస్తాయి. కేవలం ఆహారం ద్వారా ప్రోటీన్ అవసరాలను తీర్చుకోవడంలో ఇబ్బంది ఉన్నవారిలో, కొన్ని పరిస్థితులలో ప్రోటీన్ సప్లిమెంట్లు ఉపయోగపడతాయి. అయితే, అవి ఆరోగ్యకరమైన ఆహారానికి ప్రత్యామ్నాయంగా కాకుండా, దానికి అనుబంధంగా ఉండాలి.కేన్సర్ ప్రమాదాన్ని పెంచేవి ఏమిటి?కేన్సర్కు ఒకే ఒక్క కారణం లేదు. ఈ వ్యాధి రావడానికి అనేక కారకాలు దోహదపడతాయి, వాటిలో కొన్నింటిని మార్చవచ్చు, మరికొన్నింటిని మార్చలేము. ముఖ్యమైన ప్రమాద కారకాలు:పొగాకు, మద్యంఅధిక శరీర బరువుశారీరక శ్రమ లేకపోవడంకుటుంబ చరిత్ర, జన్యువులుపర్యావరణ కారకాలకు గురికావడంజీవనశైలి మార్పులతో కేన్సర్ ప్రమాదానికి చెక్..ప్రతి క్యాన్సర్ను నివారించలేనప్పటికీ, ఆరోగ్యకరమైన జీవనశైలి ఎంపికలు అనేక కేన్సర్ల ప్రమాదాన్ని తగ్గించి, మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. కూరగాయలు, పండ్లు, తృణధాన్యాలు, పప్పుధాన్యాలు, తక్కువగా ప్రాసెస్ చేసిన ఇతర ఆహారపదార్థాల తోపాటుసమతుల్య ఆహారం తీసుకోవాలని నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. క్రమం తప్పని శారీరక వ్యాయామం, ఆరోగ్యకరమైన బరువును కాపాడుకోవడం, పొగాకుకు దూరంగా ఉండటం, మద్యపానాన్ని పరిమితం చేయడం తోపాటు తప్పనిసరిగా కేన్సర్ స్క్రీనింగ్ వంటి వైద్య పరీక్షలు చేయించుకోవడం తదితరాలతో ఆ కేన్సర్ ప్రమాదాన్ని నివారించొచ్చు. -
ఆలస్యంగా పెళ్లి.. సంతానంపై ఎలాంటి ప్రభావం?
అమ్మ అనే పిలుపు కోసం మహిళలు ఎంతగానో ఎదురు చూస్తుంటారు. ఆధునిక జీవనశైలి వల్ల నేడు సంతానలేమి సమస్యలు పెరిగిపోతున్నాయి. ఒకప్పుడు సంతానలేమి సమస్య ఏడు శాతం ఉండేదని నేడు రెట్టింపు అయినట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు. గుంటూరులో ప్రత్యేక ఆస్పత్రులు, ఐవీఎఫ్ సెంటర్స్ చాలా వచ్చాయి.పిల్లలు పుట్టకపోవటానికి కారణాలు... పెళ్ళైన ఏడాది పాటు ఎలాంటి గర్భనిరోధక పద్ధతులు పాటించకుండా దాంపత్య జీవితాన్ని కొనసాగించినా గర్భం రాకపోవటాన్ని వంధత్వం(ఇన్ఫెర్టిలిటీ) అంటారు. ఆడవాళ్లలో సంతాన లేమికి కారణా ల్లో ఆలస్యంగా అంటే 35 సంవత్సరాల వయసులో పెళ్లి చేసుకోవటం. ఆలస్యంగా రజస్వల అవ్వటం. అండం విడుదల అవ్వకపోవటం, హోర్మోన్ల సమస్య, గర్భసంచి, కడుపులో ఇన్ఫెక్షన్లు, గర్భసంచి ట్యూబ్ లు మూసుకుపోవటం, పీసీఓడీ, జునైటైల్ టీబీ, బీపీ, షుగర్, జీవనశైలి, అధిక మానసిక ఒత్తిడి, అధిక బరువు, అండం విడుదల జరిగే సమయంలో దాంపత్యంలో పాల్గొనకపోవటం, దాంపత్యం కోసం మూఢనమ్మకాలు పెట్టుకుని ఆచరించటం, సెక్స్పై అవగాహన లేకపోవటం తదితర కారణాలు ఉన్నాయి. మగవారిలో సంతానలేమికి కారణాలు.... మగవాళ్లలో దీర్ఘకాలిక వ్యాధులైన బీపీ, షుగర్ సంతానలేమికి దారితీస్తాయి. స్మోకింగ్, ఆల్కహాల్, డ్రగ్స్, కొన్ని రకాల మందులు వాడటం వలన కూడా సంతానలేని సమస్య ఉత్పన్నమవుతుంది. సుఖవ్యాధులు, టీబీ, బీర్జాలకు గాయాలు అవ్వటం, దెబ్బలు తగలటం, అంగం సైజుల్లో తేడాలు, పని ఒత్తిడి వలన సంతానలేమి సమస్యలు వస్తున్నాయి. కంప్యూటర్ను 6 నుంచి 8 గంటలపాటు వినియోగించటం, రాత్రివేళల్లో ఎక్కవగా సెల్ఫోన్ మాట్లాడటం, వీర్యకణాలు తక్కువగా ఉండటం, రాత్రివేళలో నిద్రపోకుండా ఉండటం, హార్మోన్ సమస్యలు, గర్భనిరోధక సాధనాలు ఎక్కువగా వాడటం వల్ల సమస్యలు వస్తున్నాయి. ఆధునిక చికిత్సలతో సంతానం.... సంతానం కోసం చింతించేవారికి నేడు అత్యాధునిక వైద్య పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. సంతానం కోసం ఇన్విట్రో ఫెర్టిలైజేషన్ (ఐవీఎఫ్) విధానంలో భార్య అండాన్ని, భర్త శుక్రకణాల్ని ఇంక్యుబేటర్లో పెట్టి రెండు నుంచి ఐదు రోజుల్లో పిండం తయారైయ్యాక ఇంజెక్షన్ రూపంలో భార్య గర్భంలో పిండాన్ని పెడతారు. భర్త శుక్రకణాల సంఖ్య తక్కవగా ఉంటే ఇక్సీ విధానం ద్వారా, సంఖ్య జీరో అయితే టీసా పద్ధతి ద్వారా బీర్జాల్లో నుంచి సిరంజి ద్వారా వీర్యకణాలు తీసి ఫలదీకరణం చెందించి పిండాన్ని తయారు చేసి గర్భంలో పెడతారు. ఇంట్రాయుటైన్ ఇన్సెమినేషన్(ఐయూఐ) విధానంలో భర్త శుక్రకణాలు తీసి ఇంజెక్షన్ రూపంలో భార్య గర్భంలో ప్రవేశపెడతారు. భార్య గర్భసంచి పిండం మోసే స్థితిలో లేకపోయినా, ఆమె ఆరోగ్యరీత్యా గర్భం రాకూడదని వైద్యులు నిర్ధారిస్తే సరోగసి ద్వారా(అద్దెగర్భం) సంతానం పొందవచ్చు. ఆరోగ్య కరమైన సంతానం కోసం..ఆరోగ్యకరమైన సంతానం పుట్టేందుకు 23 నుంచి 28 ఏళ్ల వయస్సు చాలా అనుకూలం. గర్భం దాల్చేందుకు ముందుగానే ఫోలిక్ యాసిడ్ మాత్రలు తీసుకోవటం చాలా మంచిది. గర్భం దాలి్చన 13 వారాలలోపు న్యూకల్ ట్రాన్స్ ల్యూసెన్సీ (ఎన్టి) స్కాన్ చేయించాలి. డబుల్మార్కర్ టెస్ట్, క్రోమోజోన్ ఎనాలసిస్ టెస్ట్, షుగర్ టెస్ట్, రక్తహీనత టెస్ట్ చేయించాలి. 18 వారాల నుండి ఐరన్మాత్రలు, ఫోలిక్యాసిడ్, క్యాల్షియం మాత్రలు, మూడు, ఐదు నెలల్లో టీటీ ఇంజెక్షన్లు చేయించాలి. – డాక్టర్ శ్రీహర్ష రావూరి, ఐవీఎఫ్ స్పెషలిస్ట్, గుంటూరు అందుబాటులో ఆధునిక వైద్యంనూతన వైద్య విధానంలో సంతానలేమి సమస్యతో వచ్చిన వారు ఆస్పత్రిలో వైద్యం పొందిన పిదప సంతానం పొందుతున్నారు. గుంటూరు నగరంలో అత్యాధునిక చికిత్సా పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. ఐవీఎప్ చికిత్సల్లో ప్రస్తుతం రొ»ొటిక్ ఇక్సీ విధానం, నానో రోబోస్ సాంకేతిక పరిజ్ఞానం కూడా పలు దేశాల్లో అందుబాటులోకి వచ్చింది. దీని ద్వారా కచ్చితత్వం ఎక్కువగా ఉంది. –డాక్టర్ బూసిరెడ్డి దీప్తిరెడ్డి, స్త్రీ,ప్రసూతి, సంతాన సాఫల్య వైద్య నిపుణురాలు, గుంటూరు ఐవీఎఫ్తో త్వరగా సంతానం సంతానలేమి సమస్య ఆందోళన కలిగిస్తుంది. జిల్లాలో 300 మంది గైనకాలజిస్టులు ఉన్నారు. సంతాన సాఫల్య కేంద్రాలు 11 ఉన్నాయి. ఒక్కో వైద్యుడి వద్దకు ప్రతి రోజు ఒకరు సంతాన లేమి చికిత్స కోసం సంప్రదిస్తున్నారు. వివాహమైన ఏడాదిలోపు గర్భం దాల్చకపోతే వెంటనే ఐవీఎఫ్ నిపుణులను సంప్రదించటం ద్వారా త్వరగా సంతానం పొందే అవకాశం ఉంది. – డాక్టర్ శనక్కాయల ఉమాశంకర్, సీనియర్ ఐవీఎఫ్ స్పెషలిస్ట్, గుంటూరు. -
స్లిమ్గా అర్జున్ రణతుంగ..! ఊబకాయులకు ఇదే సరైనదా?
సెలబ్రిటీలు, ప్రముఖులు, సాధారణ వ్యక్తుల అసాధారణ వెయిట్లాస్ జర్నీలు గురించి విన్నాం. కానీ ఊబకాయంతో బాధపడే వారు..డైట్లు, వర్కౌట్లు చేసినా..అంత సులభంగా బరువు తగ్గక ఇబ్బంది పడుతుండే వారికి ఉపయుక్తమైన ఓ క్రికెటర్ వెయిట్లాస్ స్టోరీ నెట్టింట హాట్టాపిక్గా మారింది. ఇది నిజంగానే ఊబకాయులకు అద్భుతమైన వరమా? అనే చర్చలు మొదలయ్యాయి. ఇంతకీ ఎవరీ వెయిట్లాస్ జర్నీ అంటే..ఆయనే శ్రీలంక మాజీ క్రికెట్ కెప్టెన్ అర్జున్ రణతుంగా. కాంగ్రెస్ నాయకుడు శశి థరూర్, కొలంబోలో జరిగిన తొలి కొలంబో సాహిత్య ఉత్సవానికి హాజరైన సందర్భంగా, రణతుంగతో కలిసి దిగిన ఒక ఫోటోను నెట్టింట షేర్ చేయడతో..ఒక్కసారిగా ఆ క్రికెటర్ స్మార్ట్ లుక్పై సర్వత్రా చర్చలు మొదలయ్యాయి. శశిథరూర్ ఆ ఫోటోని షేర్ చేస్తూ సోషల్ మీడియా ఎక్స్ పోస్ట్లో ఇలా రాసుకొచ్చారు. ఆయన అద్భుతమైన మార్పు కారణంగా, ప్రపంచ కప్ గెలిచిన ఈ మాజీ కెప్టెన్ను చాలా మంది క్రికెట్ అభిమానులు గుర్తించలేకపోవచ్చు. ప్రస్తుతం 62 ఏళ్ల వయసున్న రణతుంగ బేరియాట్రిక్ సర్జరీ చేయించుకున్నారని, అప్పటి నుంచి ఆయన చాలా స్లిమ్గా మారారని వెల్లడించారు. అంతేగాదు క్రికెట్ దిగ్గజం రణతుంగా క్రికెట్ ఆడే రోజుల్లో మూడు ఓవర్లకే అలిసిపోయేవాడినని, కానీ ఇప్పుడు ఛారిటీ మ్యాచ్లలో మూడు గంటల పాటు సునాయాసంగా బ్యాటింగ్ చేయగలనని సరదా అన్నారు. ఇక్కడ రణతుంగా శరీరాకృతి ఊబకాయంతో బాధపడుతున్న వారికి బేరియాట్రిక్ సర్జరీ, దాని ఆరోగ్య ప్రయోజనాలపై దృష్టిసారించేలా చేసింది.బేరియాట్రిక్ సర్జరీ అంటే?బేరియాట్రిక్ సర్జరీ అనేది శాశ్వత బరువు తగ్గడానికి సహాయపడే వెయిట్లాస్ సర్జరీల్లో ఒకటి. ఈ ఆపరేషన్లో కడుపు పరిమాణాన్ని తగ్గించడం, అలాగే చిన్న ప్రేగు పోషకాలను గ్రహించే విధానాన్ని మార్చేలా.. జీర్ణవ్యవస్థను సవరిస్తాయి.ఈ విధానం సాధారణంగా తీవ్రమైన ఊబకాయం ఉన్నవారికి, ముఖ్యంగా ఆహారం, వ్యాయామం, మందులు వంటి జీవనశైలి మార్పులు శాశ్వత ఫలితాలను ఇవ్వడంలో విఫలమైనప్పుడు సిఫార్సు చేయబడుతుంది.బేరియాట్రిక్ సర్జరీ రకాలు:గ్యాస్ట్రిక్ స్లీవ్ (స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ): కడుపులోని పెద్ద భాగాన్ని తొలగించి, ఆహార తీసుకోవడాన్ని పరిమితం చేస్తుంది.గ్యాస్ట్రిక్ బైపాస్ (రౌక్స్-ఎన్-వై గ్యాస్ట్రిక్ బైపాస్): ఒక చిన్న కడుపు సంచిని సృష్టించి, చిన్న ప్రేగులోని కొంత భాగాన్ని దారి మళ్లిస్తుంది.వ్యక్తిగత ఆరోగ్య అవసరాలను బట్టి మినీ గ్యాస్ట్రిక్ బైపాస్, ఇతర జీవక్రియ విధానాలను కూడా పరిగణించవచ్చు.బరువు తగ్గడంకి మించి ఆరోగ్య ప్రయోజనాలు..బేరియాట్రిక్ సర్జరీ అనేది సౌందర్య విధానం కాదని వైద్యులు నొక్కి చెబుతున్నారు. ఊబకాయ సంబంధిత సమస్యలను తగ్గించే మెరుగైన ఆరోగ్య విధానం. బారియాట్రిక్ సర్జరీ ఈ క్రింది విషయాలలో సహాయపడుతుందని పరిశోధనలో తేలిందిటైప్ 2 మధుమేహాన్ని మెరుగుపరచడం లేదా పూర్తిగా నయం చేయడంఅధిక రక్తపోటును తగ్గించడంగుండె జబ్బులు, పక్షవాతం ప్రమాదాన్ని తగ్గించడంస్లీప్ అప్నియాను మెరుగుపరచడంమోకాళ్లు, తుంటిపై ఒత్తిడిని తగ్గించడం ద్వారా కీళ్ల నొప్పులను తగ్గించడంఫ్యాటీ లివర్ వ్యాధి ప్రమాదాన్ని తగ్గించడంచలనశీలత, ఓర్పు మొత్తం జీవన నాణ్యతను మెరుగుపరచడంశస్త్రచికిత్స తర్వాత రణతుంగ గంటల తరబడి బ్యాటింగ్ చేయగలగడం అనేది, రోగులు తరచుగా నివేదించే అత్యంత గుర్తించదగిన ప్రయోజనాలలో ఒకటైన - పెరిగిన శారీరక ఓర్పు, మెరుగైన ఫిట్నెస్ను ప్రతిబింబిస్తుంది.ఎవరికి మంచిదంటే..నిపుణుల ప్రకారం, బారియాట్రిక్ సర్జరీ సాధారణంగా ఈ క్రింది లక్షణాలు ఉన్న పెద్దలకు సిఫార్సు చేస్తారు.బాడీ మాస్ ఇండెక్స్ (BMI) 40 లేదా అంతకంటే ఎక్కువBMI 35 లేదా అంతకంటే ఎక్కువ ఉండి, మధుమేహం, అధిక రక్తపోటు లేదా అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా వంటి ఊబకాయ సంబంధిత సమస్యలు ఉన్నవారుశస్త్రచికిత్సకు ముందు, ఈ ప్రక్రియ సరైనదేనా అని నిర్ధారించడానికి రోగులకు వివరణాత్మక వైద్య, పోషకాహార మానసిక అంచనాలు నిర్వహిస్తారు.ముమ్మాటికీ షార్ట్కట్ కాదుబారియాట్రిక్ సర్జరీని ఎప్పుడూ తక్షణ పరిష్కారంగా చూడకూడదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీర్ఘకాలిక విజయం అనేది శాశ్వత జీవనశైలి మార్పులపై ఆధారపడి ఉంటుంది. ఇందులో భాగంగా సమతుల్యమైన, అధిక ప్రోటీన్ ఉన్న ఆహారం తీసుకోవడం, వైద్యులు సూచించిన విటమిన్, మినరల్ సప్లిమెంట్లు తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవడం, జీవితాంతం ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను పాటించడం వంటివి ఉంటాయి.ఈ మార్పులు చేయకపోతే, రోగులు తిరిగి బరువు పెరగవచ్చు, పోషకాహార లోపాలు ఏర్పడవచ్చు. ఇక్కడ రణతుంగ రూపాంతరం ఊబకాయం అనేది కేవలం రూపానికి సంబంధించిన విషయం కాదని, అది ఒక దీర్ఘకాలిక వైద్య సమస్య అని వెల్లడైంది. అలాంటప్పుడు సమర్థవంతమైన చికిత్స అనేది ఆరోగ్యం, జీవననాణ్యతను గణనీయంగా మెరుపరుస్తుందని ఈ క్రికెటర్ వెయిట్లాస్ జర్నీ తెలుపుతోంది. అలాగే ఇది ఊబకాయాన్ని చక్కగా నిర్వహిస్తూనే ఆరోగ్యంగా ఉండే చికిత్స విధానాలపై అవగాహన కల్పిస్తోందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. -
98 కేజీల నుంచి 78 కేజీలకు..! హెల్ప్ అయిన డైట్ప్లాన్..
అధిక బరువు కొందరికీ జంక్ఫుడ్, అనారోగ్యకరమైన జీవనశైలి వంటివి ప్రధాన కారణాలు. మరికొందరు గంటలకొద్దీ కూర్చొని పనిచేసే డెస్క్ జాబ్లు, సరైన కదలికలు లేకపోవడంతో అధిక బరువు సమస్యను ఎదుర్కొన్నారు. ఆ తర్వాత తగ్గడానికి ప్రయత్నాలు మొదలు పెట్టినా..సక్సెస్ అయినవాళ్లు మాత్రం కొందరే. ఎందువల్ల అంటే ఇక్కడ నిలకడ, క్రమం తప్పకుండా చేయడం అనేవి అత్యంత కీలకం. ఇక్కడొక మహిళ కూడా లాక్డౌన్ కారణంగా కదలికలు లేక ఊహించిన విధంగా లావుగా అయిపోయింది. చివరికి కార్డియో వ్యాయమాలు, సరైన డైట్తో బరువు తగ్గడమే కాదు స్ఫూర్తిగా నిలిచింది. ఆ మహిళే..ఆనంద్ భార్గవ్. తాను 2020లో ఉన్నత విద్యను అభ్యసించడానికి మెల్బోర్న్ వెళ్లింది. మునుసటి నెలలోనే లాక్డౌన్ ప్రకటించారు. ఇంటి నుంచి కాలేజ్కి హాజరవడం వంటి కారణాల వల్ల కదలికలేని జీవనశైలికి దారితీసి, గణనీయంగా బరువు పెరిగిందామె. ఫలితంగా ఊబకాయ సంబంధిత లక్షణాలను అనుభవించింది. జిమ్లో చేరి తగ్గాలని చూసినా..పెద్దగా ప్రయోజనం లేకపోగా, మరింత ఆకలికి దారితీసి నియంత్రణ కోల్పయింది. దాంతో ఆయాసం, పాదాల వాపు వంటి సమస్యలు ఎదుర్కొంది. రక్తపరీక్షలన్నీ సాధారణంగానే ఉన్నా, నడుము నొప్పి, మోకాళ్ల నొప్పి, ఒళ్లునొప్పులు వంటి ఊబకాయం సంబంధిత సమస్యలను ఎదుర్కొన్నట్లు వెల్లడించింది. దాని ఫలితంగా కోపం, ఆందోళన వంటి మానసిక సమస్యలు కూడా ఎక్కువైనట్లు తెలిపింది. ఇక బరువు తగ్గగపోతే కష్టమనే పరిస్థితి ఎదురైంది ఆమెకు. దాంతో ఎలాగైన బరువు తగ్గాని డిసైడ్ అందుకోసం ప్రయత్నం మొదలుపెట్టినట్లు తెలిపింది. తనకు భారతీయ వంటకాలంటే మహా ఇష్టమని, అందుకని ఆ రుచిపోకుండా డైట్ ప్లాన్ చేసుకున్నట్లు వెల్లడించింది. తన అధిక బరువుని అమాంతం తగ్గేలా చేసిన సాధరణ డైట్ ప్లాన్ని కూడా పంచుకుంది. ఉదయం: చియా సీడ్ వాటర్, అల్లం-నిమ్మకాయ నీరు, సోంపు, వాము నీరు, గుప్పెడు నట్స్అల్పాహారం: అవకాడో టోస్ట్, పోహా, ఎయిర్-ఫ్రైడ్ బ్రెడ్ పకోరా, లేదా పీనట్ బటర్ టోస్ట్ఉదయం పూట చిరుతిండి: ఆయా కాలాల్లో లభించే పండ్లుమధ్యాహ్న భోజనం: రాజ్మా రైస్ లేదా కధి రైస్తో పాటు 100 గ్రాముల సలాడ్, 100 గ్రాముల పెరుగుసాయంత్రం చిరుతిండి: గ్రీన్ టీ లేదా కాఫీ, వేయించిన నట్స్, వేయించిన మఖానా, భేల్ లేదా ఖాఖ్రారాత్రి భోజనం: పప్పు అన్నం, రాగి లేదా బజ్రా రోటీ, కూరగాయలు, బీన్స్ లేదా పులావ్ఈ ఆహారంతో పాటు, ఆమె తగినంత నీరు తాగడంపై కూడా దృష్టి సారించింది. ఆమె ప్రతిరోజూ తప్పనిసరిగా నీరు తాగేది, దీనివల్ల బరువు పెరిగిన తర్వాత తరచుగా వచ్చే కండరాల నొప్పులను నివారించగలిగింది.ఆరోగ్యకరమైన ఆహారం, వ్యాయామ దినచర్యను పాటించడం ద్వారా, ఆమె తన శక్తి స్థాయిలు పెరగడాన్ని గమనించడం ప్రారంభించింది. ఆమె మరింత చురుకుగా మారడమే కాకుండా, ఆదిత్య తన మొత్తం ఆరోగ్యం మెరుగుపడటాన్ని కూడా చూసింది. ఆమె గతంలో ఎదుర్కొన్న సమస్యలు వాటంతట అవే తగ్గడం ప్రారంభించాయి. క్రమంగా, ఆమె జిమ్లో చేరి, కార్డియో వ్యాయామాలు చేసి, చివరికి 20 కిలోల బరువు తగ్గింది. అలాగే ఆమె ఆరోగ్యకరమైన, చురుకైన జీవనశైలిని కొనసాగిస్తూనే ఉండాలని స్ట్రాంగ్గా నిర్ణయించుకుందామె.(చదవండి: అందమైన బుగ్గల కోసం..కుసుమ పూల రసం) -
పెస్కటేరియన్ డైట్తో స్థూలకాయం దూరం!
ఆరోగ్యంగా, ఆనందంగా జీవించాలనే కోరిక ప్రతి ఒక్కరికీ ఉంటుంది. అయితే నేటి ఆధునిక జీవనశైలి వల్ల స్థూలకాయం, గుండె జబ్బులు, మధుమేహం వంటి వ్యాధులు చిన్న వయసులోనే చుట్టుముడుతున్నాయి. అందువల్ల పెస్కటేరియన్ డైట్ అనుసరించడం వల్ల స్థూలకాయం తగ్గడమే కాకుండా ఆయుష్షు కూడా పెరుగుతుందని పరిశోధనల్లో తేలింది.పెస్కటేరియన్ డైట్ అంటే...?శాకాహారంలో చేపలు, రొయ్యలు సంబంధిత సీఫుడ్లను చేర్చుకోవడాన్ని పెస్కటేరియన్ డైట్ అంటారు. శాకాహారంలోని పోషకాలతో పాటు చేపలలో ఉండే నాణ్యమైన ప్రోటీన్లు, ఒమేగా–3 కొవ్వు ఆమ్లాలు శరీరానికి లభించడం ఈ డైట్ ప్రత్యేకత.ఈ డైట్ పాటించడం వల్ల...స్థూలకాయం నియంత్రణలో ఉంటుంది.ధమనులలో కొలెస్ట్రాల్ పేరుకుపోకుండా నిరోధించి, రక్తపోటును క్రమబద్ధీకరిస్తుంది.మధుమేహం వచ్చే ప్రమాదాన్ని గణనీయంగా తగ్గిస్తుంది.శరీరంలో అంతర్గత వాపులు, మంటలను తగ్గించి కణాల జీవక్రియను వేగవంతం చేస్తుంది.మాంసాహారులతో పోలిస్తే, పెస్కటేరియన్ విధానాన్ని పాటించేవారిలో అకాల మరణ ముప్పు దాదాపు 18% తక్కువగా ఉంటుందని పరిశోధకులు గుర్తించారు. ముఖ్యంగా వృద్ధులకు, స్థూలకాయంతో బాధపడేవారికి ఇది ఉపయోగంగా ఉంటుంది. -
డ్రాగన్ ఫ్రూట్తో... సీజనల్ వ్యాధులకు చెక్!
చూడటానికి ఎంతో ఆకర్షణీయంగా ఉండే డ్రాగన్ ఫ్రూట్ పోషకాల గని. క్యాలరీలు తక్కువగా, పోషకాలు ఎక్కువగా ఉండే ఈ ఫ్రూట్ని ముఖ్యంగా వర్షాకాలంలో తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను సొంతం చేసుకోవచ్చు...డ్రాగన్ ఫ్రూట్లో విటమిన్ ‘సి’ అత్యధికంగా ఉంటుంది. ఇది శరీరంలో ఇమ్యూనిటీని పెంచి, వర్షాకాలంలో వచ్చే రకరకాల సీజనల్ వ్యాధుల నుంచి మనల్ని కాపాడుతుంది. జలుబు, దగ్గు, గొంతు నొప్పి నుంచి రక్షించి, ఊపిరితిత్తుల్లో కఫం పేరుకు పోకుండా కాపాడుతుంది.ఈ పండులో సహజసిద్ధమైన యాంటీబ్యాక్టీరియల్ గుణాలు ఉన్నాయి. ఇవి వర్షాకాలంలో సాధారణంగా ఇబ్బంది పెట్టే ప్రమాదకరమైన బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడతాయి.వర్షాకాలంలో చాలామందిని వేధించే గ్యాస్, మలబద్ధకం వంటి జీర్ణ సమస్యలకు ఈ పండు చక్కని పరిష్కారం. ఇందులో ఉండే పీచుపదార్థం ప్రేగుల కదలికలను క్రమబద్ధం చేసి జీర్ణక్రియ సాఫీగా సాగేలా చేస్తుంది.ఈ పండులోని యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాలు కీళ్లనొప్పులు, అస్తమా, అలర్జీల వంటి సమస్యల తీవ్రతను తగ్గించడంలో సహాయపడతాయి.వాతావరణంలో పెరిగే తేమ, కాలుష్యం వల్ల చర్మం జీవం కోల్పోకుండా ఇందులో ఉండే విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు కాపాడతాయి. చర్మాన్ని ఆరోగ్యవంతంగా, కాంతివంతంగా ఉంచుతాయి. -
మధుమేహాన్ని తగ్గించే పరివృత్త త్రికోణాసనం..
శరీరాన్ని ముందుకు వంచి, వెన్నెముకను ఒక వైపుకు తిప్పి చేసే భంగిమ కనుక దీనిని పరివృత్త త్రికోణాసనం అంటారు.చేసే విధానం...ముందుగా మ్యాట్పై తాడాసనంలో నిటారుగా నిలబడాలి.రెండు కాళ్లను 3–4 అడుగుల దూరంలో ఉంచండి.కుడి పాదాన్ని ముందుకు, ఎడమ పాదాన్ని సుమారు 45 డిగ్రీలు లోపలికి తిప్పండి.రెండు చేతులను భుజాల స్థాయిలో చాపండి.శ్వాసను బయటకు వదులుతూ నడుము నుంచి ముందుకు వంగండి.ఎడమ చేతిని కుడి పాదం బయట లేదా లోపల నేలపై ఉంచండి.కుడి చేతిని నిటారుగా పైకి ఎత్తి, పై చేతి వేళ్లవైపు చూడాలి.వెన్నెముకను నిటారుగా ఉంచి, సాధారణ శ్వాసతో 20–30 సెకన్లు ఉండాలి.శ్వాసను లోపలికి తీసుకుంటూ నెమ్మదిగా పైకి లేవాలి.ఇదేవిధంగా మరోవైపున కూడా చేయాలి.ప్రయోజనాలు...బరువు నియంత్రణకు తోడ్పడుతుంది.వెన్నెముకకు మంచి ట్విస్ట్ లభించి ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది.కాళ్లు, తుంటి, హ్యామ్స్ట్రింగ్స్ బలపడతాయి.జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది.పొత్తికడుపు అవయవాలకు మసాజ్ లభిస్తుంది.నడుము భాగంలోని కొవ్వు తగ్గించే వ్యాయామాలకు సహాయకంగా ఉంటుంది.శరీర సమతుల్యత, ఏకాగ్రత పెరుగుతుంది.ఛాతి విస్తరించి శ్వాస సామర్థ్యం మెరుగుపడుతుంది.భుజాలు, నడుము బిగుతు తగ్గుతుంది.పొత్తికడుపు భాగంపై మృదువైన ఒత్తిడి ఏర్పడి జీర్ణక్రియకు సహాయపడుతుంది.కండరాలు ఎక్కువగా పనిచేయడం వల్ల క్యాలరీల ఖర్చు పెరుగుతుంది.జాగ్రత్తలు...తీవ్రమైన వెన్నునొప్పి, స్లిప్ డిస్క్ ఉన్నవారు చేయ కూడదు.మెడ సమస్యలు ఉన్నవారు పైకి చూడకుండా ముందుకు చూడాలి.గర్భిణీలు ఈ ఆసనాన్ని చేయకూడదు.భోజనం చేసిన వెంటనే చేయకూడదు. కనీసం 3–4 గంటల విరామం ఉండాలి. శరీరాన్ని బలవంతంగా తిప్పకుండా మీ సామర్థ్యానికి అనుగుణంగా మాత్రమే చేయాలి.ప్రతి వైపు 20–30 సెకన్లు ఉండాలి.2–3 రౌండ్లు సాధన చేయాలి.- అనిత పాతర్ల, యోగా ట్రైనర్ -
అవును ఇది నిజమే.. వీటితో ఒత్తిడి అవుట్!
ఒత్తిడి నుంచి బయటపడటానికో, లేదంటే తగ్గించుకోవడానికో చాలామంది స్ట్రెస్ బాల్ కానీ, స్పిన్నర్ కానీ వాడుతుంటారు. ఇదే స్థానంలో జ్యువెలరీ చేరితే. అందానికి అందం.. ఒత్తిడి అవుట్. మానసిక ఆందోళన బయటకు కనిపించకుండా తగ్గించుకోవడానికి నేటి యువత ఒక కొత్త మార్గాన్ని ఎంచుకుంటోంది. అదే యాంటీ–యాంగ్జైటీ జ్యువెల్లరీ. దీనినే ఫిడ్జెట్ జ్యువెలరీగా కూడా పిలుస్తారు.స్పిన్నర్ల ఆధునిక, స్టైలిష్ రూపమే ఈ ఫిడ్జెట్ జ్యువెల్లరీ! రింగులు, చైన్లు, బ్రాస్లెట్ల రూపంలో లభించే ఈ ఆభరణాలు కేవలం అలంకారానికి మాత్రమే కాకుండా, మానసిక ప్రశాంతతను అందించే సాధనాలుగానూ ఉపయోగపడుతుండటంతో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. సాధారణ నగలకు భిన్నంగా, వీటిలో చిన్న΄ాటి కదలికలు ఉండేలా డిజైన్ చేస్తారు. ఈ ప్రత్యేకతే స్ట్రెస్ని తగ్గించడంలో తోడ్పడుతుంది.స్పిన్నర్ రింగ్స్: ఉంగరానికి పైన ఉండే సన్నని బ్యాండ్ లేదా పూసలు వేలితో తిప్పేలా ఉంటాయి. తీవ్ర ఆందోళనలో ఉన్నప్పుడు వేళ్లతో వాటిని తిప్పడం వల్ల మనస్సు క్షణాల్లో వేరే వైపు మళ్లుతుంది.బ్రీథింగ్ పెండెంట్లు: లాకెట్ లాంటి చిన్న ప్లాటినం లేదా స్టీల్ గొట్టాల డిజైన్తో వీటిని రూ΄÷ందిస్తారు. ఒత్తిడి పెరిగినప్పుడు సాధారణంగా ఊపిరి తీసుకుని, ఈ గొట్టం ద్వారా నెమ్మదిగా వదలడం వల్ల శరీరం వెంటనే ప్రశాంత స్థితికి చేరుకుంటుంది.అరోమాథెరపీ జ్యువెల్లరీ: నూనెలను పీల్చుకునే లావా స్టోన్స్ కలిగిన ఈ నగలు, సువాసనల ద్వారా మనసును ఆహ్లాదపరుస్తాయి. ఒకప్పుడు కేవలం అలంకారానికే పరిమితమైన ఆభరణాలు, నేడు మానసిక ఆరోగ్యానికి సైతం తోడ్పడుతుండటం విశేషం. ఇవి ప్లాస్టిక్ బొమ్మల వలే కాకుండా గోల్డ్, సిల్వర్, స్టెయిన్ లెస్ స్టీల్లో అత్యంత మినిమలిస్టిక్ డిజైన్లలో వస్తుండటంతో ఫ్యాషన్ ప్రేమికులనూ విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. -
బోసి మెడ.. ఖాళీ చేతులు.. ఇదేం అలవాటు?
చేతికి వాచ్ లేదు.. వేళ్లకు ఉంగరాలు కనిపించవు.. మెడలో చైన్, చెవులకు ఆభరణాలు కూడా ధరించరు.. ఇలాంటి వారిని చూసినప్పుడు చాలామందికి ఒకే ప్రశ్న వస్తుంది.. “ఇదేం అలవాటు?” అని. కొందరు వీరికి ఫ్యాషన్పై ఆసక్తి ఉండదని అనుకుంటారు. కానీ ఆభరణాలకు దూరంగా ఉండటానికి కేవలం ఫ్యాషన్ కారణమే కాదు.. ఇతర కారణాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.సైకాలజీ ప్రకారం.. ఒక వ్యక్తి ఏ వస్తువులు ధరిస్తారు.. ఏవి ధరించరు అన్నది వారి వ్యక్తిగత ఆలోచనా విధానాన్ని ప్రతిబింబించొచ్చు. కొందరికి చేతికి వాచ్, బ్రేస్లెట్, ఉంగరం వంటి వస్తువులు పెట్టుకోవడం అసౌకర్యంగా అనిపిస్తుంది. రోజువారీ పనుల్లో అవి ఇబ్బందిగా అనిపించడం, శరీరంపై అదనంగా ఏదైనా ఉండటం ఇష్టం లేకపోవడం వంటి కారణాలతో వాటికి దూరంగా ఉంటారు.ముఖ్యంగా సింపుల్ జీవనశైలిని ఇష్టపడేవారు తక్కువ వస్తువులతోనే ఉండాలని కోరుకుంటారు. వారికి ఆర్భాటం కంటే సౌకర్యం, స్వేచ్ఛ, సమయం ముఖ్యమని సైకాలజీ నిపుణులు చెబుతున్నారు.ఫ్యాషన్ అంటే వ్యతిరేకత కాదు!ఆభరణాలు ధరించని వారంతా ఫ్యాషన్కు వ్యతిరేకమని భావించడం తప్పు. కొందరు తమ రూపాన్ని సహజంగా ఉంచుకోవాలని కోరుకుంటారు. మరికొందరు దుస్తులు, అలంకరణ కంటే వ్యక్తిత్వం, పనితీరు, ఆలోచనలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. అలాగే కొందరికి చిన్నప్పటి నుంచి అలాంటి అలవాటే ఉండొచ్చు. కుటుంబ వాతావరణం, పెరిగిన తీరు, వ్యక్తిగత అనుభవాలు కూడా ఇలాంటి అభిరుచులపై ప్రభావం చూపుతాయి.ఆర్థిక కారణాలు కూడా ఉండొచ్చు!ఆభరణాలకు దూరంగా ఉండటానికి ఆర్థిక కారణాలు కూడా ఒక అంశం కావచ్చు. బంగారం, వెండి వంటి ఆభరణాలు కొనుగోలు చేయడం అందరికీ సాధ్యపడకపోవచ్చు. కొందరు అవసరమైన ఖర్చులకు ప్రాధాన్యం ఇస్తూ ఆభరణాల కొనుగోలును పక్కన పెడతారు. మరికొందరు ఆభరణాలు కొనుగోలు చేయగల సామర్థ్యం ఉన్నప్పటికీ.. వాటిపై డబ్బు ఖర్చు చేయడం కంటే పొదుపు, పెట్టుబడులు లేదంటే ఇతర అవసరాలకు ప్రాధాన్యం ఇస్తారు. కాబట్టి ఎవరైనా ఆభరణాలు ధరించకపోతే దాన్ని కేవలం వారి అభిరుచితోనే ముడిపెట్టలేమని నిపుణులు చెబుతున్నారు.తక్కువ వస్తువులు.. తక్కువ ఆందోళనకొంతమంది జీవితంలో మినిమలిజం (తక్కువ వస్తువులతో సరళంగా జీవించడం)ను పాటిస్తారు. ఎక్కువ వస్తువులను నిర్వహించడం కంటే అవసరమైన వాటితోనే జీవించడం వారికి ఇష్టం. ఇలాంటి వారు దుస్తులు, ఆభరణాలు, ఇతర వస్తువుల ఎంపికలో కూడా సరళతకు ప్రాధాన్యం ఇస్తారు.అయితే ఆభరణాలు ధరించని వ్యక్తి తప్పనిసరిగా అంతర్ముఖి అని, సామాజికంగా కలవలేడని చెప్పలేం. అదే విధంగా ఆభరణాలు ఎక్కువగా ధరించే వారు ఆర్భాటాన్ని ఇష్టపడతారని కూడా భావించకూడదు.అలవాటు వెనుక కారణం ఒక్కటే కాదు..మనిషి ప్రవర్తన అనేది అనేక అంశాల కలయిక. వ్యక్తిగత అభిరుచులు, సౌకర్యం, ఆర్థిక పరిస్థితులు, జీవన విధానం.. ఇలా ఎన్నో విషయాలు కలిసి ఒకరి అలవాట్లను నిర్ణయిస్తాయి. అందుకే బోసి మెడ, ఖాళీ చేతులు కనిపిస్తే దాని వెనుక ఒకే కారణం ఉందని భావించకూడదు. అది వారి స్వంత ఎంపిక కావచ్చు.. వారి జీవనశైలిలో భాగం కావచ్చు.(గమనిక: ఇవి సైకాలజీ, ప్రవర్తనా విశ్లేషణల ఆధారంగా చెప్పే సాధారణ అంశాలు మాత్రమే. ఒక్క అలవాటుతో ఒకరి వ్యక్తిత్వం లేదంటే ఆర్థిక పరిస్థితిని నిర్ణయించలేం.) -
Sana Saeed: నేను బులీమియా సమస్యను ఎదుర్కొన్నాను..
బాలీవుడ్ సూపర్స్టార్ షారుఖ్ఖాన్తో ‘కుచ్ కుచ్ హోతాహై’ సినిమాలో నటించిన సనా సయిద్ ‘నేను బులీమియా సమస్యను ఎదుర్కొన్నాను’ అని ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో తెలియజేసింది. ‘బులీమియా అంటే ఏమిటి?’ అనే ఆసక్తిని ఎంతోమందిలో రేకెత్తించింది....చాలా చిన్న వయసు నుంచే తనకు బులీమియా ఉన్నట్లు తెలియజేసింది సనా సయిద్. ‘నాకు బులీమియా అనే ఈటింగ్ డిజార్డర్ ఉన్నట్లు చాలా సంవత్సరాల వరకు తెలియదు. బులీమియా అనే మాట ఎప్పుడూ వినలేదు. అయితే ఒకానొక రోజు బులీమియా గురించి ఒక పుస్తకం చదివినప్పుడు నాకు ఏంజరుగుతుందో మొదటిసారి అర్థమైంది. ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో, నవ్వుకుంటారేమో అనే భయం వల్ల చాలా కాలం పాటు నా సమస్య గురించి ఎవరికీ చెప్పుకోలేదు’ అంటుంది సనా సయిద్.సాధారణ బరువుతోనే కనిపించడం వల్ల బులీమియాను గుర్తించడం అతి పెద్ద సవాలు. జన్యుపరమైన కారణాలతో పాటు మానసిక ఒత్తిడిలాంటి సమస్యలు...మొదలైనవి బులీమియాకు కారణం అవుతాయి. బులీమియా ఉన్న వ్యక్తులు డిప్రెషన్ బారిన పడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి.కొన్ని లక్షణాలు...భోజనం చేసిన వెంటనే టాయిలెట్కు వెళ్లడం.తమ శరీర బరువు, ఆకారంపై ఎప్పుడూ ఆందోళనతో ఉండడం.పదే పదే కఠినమైన ఆహార నియమాలను పాటించి ఆపై అతిగా తినడం.తిన్న తరువాత బరువు పెరగకుండా నిరోధించడానికి స్వయంగా వాంతులు చేసుకోవడం.మార్గం ఉంది...సనా సయిద్ ఎమోషనల్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ‘నేను బులీమియా సమస్యతో బాధ పడ్డాను అని బహిరంగంగా చెప్పుకోవడానికి కారణం... ఇలాంటి సమస్యతో ఎక్కడో ఒకచోట ఎవరో ఒకరు సతమతమవుతుంటారు. తమకు పేరు కూడా తెలియని సమస్యతో బాధ పడుతూ ఉండవచ్చు. దానికి ఒక పేరు ఉందనే విషయం వారు తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. మీరు ఒంటరి వారు కాదు. సమస్య నుంచి బయటపడే మార్గం ఉంది. సమస్య నుంచి నేను పూర్తిగా బయటపడ్డాను. మీరు ఇబ్బంది పడుతుంటే దయచేసి వైద్యులను సంప్రదించండి.నాకు ఈటింగ్ డిజార్డర్ ఉందని అంగీకరంచడం అత్యంత కష్టం కావచ్చు. కానీ తప్పదు. సమస్యను దాచివేస్తే, భయపడితే ఆ సమస్యతో మనం పోరాడలేము’ అంటుంది సనా సయిద్.బులీమియా అంటే...తక్కువ సమయంలో అసాధారణంగా, అధిక మొత్తంలో ఆహారం పదే పదే తీసుకునే రుగ్మతను బులీమియా నెర్వోసా అంటారు. బులీమియా ఉండే వ్యక్తులు తీవ్రమైన సిగ్గు, అపరాధ భావంతో ఉంటారు. ఎవరికీ చెప్పుకోకుండా అత్యంత గోప్యంగా ఉంచబడే మానసిక ఆరోగ్య సమస్యలలో బులీమియా ఒకటి. -
బరువు తగ్గడంలో పురుషులే ఫాస్ట్!
బరువు తగ్గే విషయంలో పురుషులకు, మహిళలకు పోటీ పెడితే.. విజేతలుగా నిలిచేది మగాళ్లే. ఔనండి.. మహిళల కంటే పురుషులే త్వరగా బరువు తగ్గుతారట. స్త్రీ, పురుషులిద్దరు ఒకే షెడ్యూల్లో ఒకే డైట్, ఒకే వ్యాయామం పాటించినా సరే.. పురుషులే వేగంగా బరువు తగ్గుతారు. అయితే, ఈ విషయంలో మహిళల తప్పిదం ఏమీ లేదు. ఇందుకు కొన్ని జీవ సంబంధిత కారణాలు ఉన్నాయి. తాజా అధ్యయనం ప్రకారం.. పురుషులు బరువును కోల్పోవడంలోనే కాదు.. దానివల్ల పొందే ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఎక్కువేనట. మరి, పురుషులే త్వరగా బరువు తగ్గేందుకు గల కారణాలేమిటో చూద్దామా!బరువు తగ్గించడమంటే.. శరీరంలోని క్యాలరీని కరిగించడమే. అసలు విషయం ఏమిటంటే.. ఇతరులతో పోల్చితే ఎక్కువ సన్నని కండరాలు ఉన్నవారు ఎక్కువ క్యాలరీలను ఖర్చు చేస్తారు. పురుషులు వేగంగా బరువు తగ్గడానికి ఇది కూడా ఒక కారణం. మహిళలతో పోలిస్తే.. పురుషులు ఎక్కువ సన్నని కండర ద్రవ్యరాశిని కలిగి ఉంటారు. ఇది ఎక్కువ క్యాలరీలను బర్న్ చేయడానికి సహాయపడుతుంది. కండర ద్రవ్యరాశిని పెంచాలంటే మహిళలు.. పురుషులు కంటే ఎక్కువసేపు శ్రమించాల్సి ఉంటుంది.బరువు తగ్గడంలో జీవక్రియ కూడా భారీ పాత్ర పోషిస్తుంది. జీవక్రియ ఎక్కువగా ఉంటే అధిక క్యాలరీలు ఖర్చవుతాయి. ఫలితంగా త్వరగా బరువు తగ్గుతారు. జీవక్రియ కూడా సన్నని కండరాల వల్లే ప్రభావితమవుతుంది. పురుషులు ఎక్కువ సన్నని కండరాలను కలిగి ఉన్నందున వారు అధిక జీవక్రియను కలిగి ఉంటారు. ఫలితంగా మహిళలతో పోలిస్తే వేగంగా బరువు తగ్గడానికి ఇది సహాయపడుతుంది.పురుషులు, మహిళల్లో వేర్వేరు ్రపాంతాల్లో కొవ్వు నిల్వ ఉంటుంది. ఇది కూడా ఇరువురి బరువులపై ప్రభావం చూపుతంది. పురుషులకు ఎక్కువగా పొత్తి కడుపులో కొవ్వు పేరుకుపోతుంది. మహిళలకు తొడలు, పిరుదుల్లో కొవ్వు పెరుగుతుంది. పొత్తికడుపులో పేరుకుపోయే కొవ్వుతోనే ఆరోగ్యానికి ఎక్కువ ప్రమాదం. అయితే, దీన్ని కరిగించడం సులభమే. తక్కువ వ్యాయామంతోనే త్వరగా పొట్టను తగ్గింవచ్చు.రోజూ ఎంత సేపు నడిస్తే మంచిదంటే..హార్మోన్ల వల్ల కూడా స్త్రీలు.. పురుషులు కంటే ఆలస్యంగా బరువు తగ్గుతారు. పురుషుల కంటే మహిళల్లో 6 నుంచి 11 శాతం కొవ్వు ఎక్కువగా ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి. మహిళల్లో ఉండే ఈస్ట్రోజెన్ వల్ల భోజనం తర్వాత క్యాలరీలు ఖర్చు చేసే సామర్థ్యం తక్కువగా ఉంటుంది. ఈస్ట్రోజెన్ స్థాయి పడిపోతే బరువు పెరుగుతారు. పురుషులతో పోల్చితే మహిళలు తగిన డైట్ ΄్లాన్ పాటించలేరు. తమకు ఇష్టమైన ఆహారాన్ని చూడగానే కంట్రోల్ చేసుకోలేరు. అయితే, అత్యధిక శాతం మంది పురుషులు శ్రద్ధగా డైట్ పాటిస్తూ బరువు తగ్గేందుకు ప్రయత్నిస్తారు. ఫలితంగా మహిళల కంటే వేగంగా పురుషులు బరువు తగ్గుతారు. -
ఇవీ నిబంధనలు!
కృత్రిమ గర్భధారణ కోసం ఐవీఎఫ్ ప్రక్రియకు వెళ్లడం లో కేవలం చికిత్స మాత్రమే కాకుండా ఇంకా ఉద్వేగపరమైన అంశాలూ ముడిపడి ఉంటాయి. అందుకే దంపతుల హక్కులను కేంద్రప్రభుత్వం స్పష్టంగా నిర్ణయించిందీ, నిర్వచించింది. పిల్లల పట్ల దంపతులకు ఉండే సహజ ఉద్వేగాల కారణంగా వారు ఏ రకంగానూ ఎక్స్ప్లాయిట్ కాకుండా ఉండేందుకు ఇన్ఫెర్టిలిటీ సెంటర్లకు కొన్ని కీలకమైన బాధ్యతలనూ, మార్గదర్శకాలను రూపొందించింది. నేడు (జూలై 25న) ‘ఐవీఎఫ్ డే’ సందర్భంగా ఈ వరస కథనాల్లో చివరిదైన ఈ ఆర్టికల్లో ప్రభుత్వం నిర్దేశించిన ఆ మార్గదర్శకాలేమిటో చూద్దాం.కృత్రిమ గర్భధారణ అంశంలో ఇటు సంతాన సాఫల్య కేంద్రాలకూ, అటు ప్రజలకోసం భారతీయ కేంద్ర ప్రభుత్వం ‘ద ఏఆర్టీ (అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీస్) యాక్ట్ ఆఫ్ 2021’, అలాగే ‘సరోగసీ యాక్ట్ ఆఫ్ 2021’ కింద కొన్ని చట్టాలు చేసింది. కృత్రిమ గర్భధారణ చికిత్స తీసుకునే పేషెంట్లు (దంపతులు), అండాలను లేదా శుక్రకణాలను ప్రదానం చేసే దాతలు, అలాగే ఐవీఎఫ్ ద్వారా పుట్టే చిన్నారులకు మేలు కలిగేందుకే ప్రభుత్వం ఈ చట్టాలు చేసింది. నైతిక అంశాలకు ప్రాధాన్యమిస్తూ రూపొందించిన ఈ నియమ నిబంధనలను చట్టపరంగా అందరూ పాటించాలి. ఏఆర్టీ చట్టం 2021 ప్రకారం దంపతులకు ఉన్న హక్కులు... దంపతులందరికీ తమకు ఉన్న హక్కులపైనా అలాగే ఇన్ఫెర్టిలిటీ సెంటర్లలో నిర్వహించే ప్రక్రియల పైనా అవగాహన పొందేందుకుగాను దంపతులు ఏఆర్టీ (అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీస్) చట్టం గురించి తెలుసుకుని ఉండాలి. దేశంలోని ప్రతి ఐవీఎఫ్ సెంటర్... కేంద్రంతోపాటు రాష్ట్ర ఏఆర్టీ బోర్డు కింద తన సంస్థను నమోదు చేసుకుని ఉండాలి. → లెవల్ 1 కింద నమోదైన వారు – బేసిక్ ఫెర్టిలిటీ చికిత్సలు (ఐయూఐ)ల కోసం. → లెవల్ 2 కింద నమోదైన వారు – ఐవీఎఫ్, సరోగసీ క్లినిక్స్ కోసం. చట్టం నిర్దేశించిన నియమ నిబంధనలను ఐవీఎఫ్ డాక్టర్లు, ఎంబ్రియాలజిస్టులు, యాండ్రాలజిస్టులు తప్పనిసరిగా పాటించి తీరాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ వసతులు: చట్టంలో నిర్దేశించిన ప్రకారం ఇన్ఫెర్టిలిటీ సెంటర్లలో ఉండాల్సిన వసతులూ, ఉపకరణాలూ, పరికరాలూ (ఇన్ఫ్రాస్ట్రక్చర్) అన్నీ తప్పక / ఖచ్చితంగా ఉండి తీరాలి. చట్టబద్ధంగా పేషెంట్లు ఇవ్వాల్సిన ఆమోద పత్రాలు (కన్సెంట్) ఆయా నియమ నిబంధనలకు అనుగుణంగా రూపొందిన ఫార్మాట్ (టెంప్లెట్స్)లో ఇవ్వాలి. వయసు: వయసు నిబంధనలను తప్పక పాటించాలి. అంటే మనదేశంలో ఐవీఎఫ్ చికిత్సలు పొందడానికి మహిళల వయసు 21 – 50 ల మధ్య; అలాగే పురుషులు 21 – 55 మధ్య ఉండాలి. ఇన్ఫార్మ్డ్ కన్సెంట్: ఐవీఎఫ్ చికిత్సకు తాము అంగీకరిస్తున్నట్టుగా దంపతులు ఆమోదపత్రం (కన్సెంట్) తప్పక ఇవ్వాలి – ఈ ప్రక్రియ నిర్వహిస్తున్న నిపుణులు... ‘ఐవీఎఫ్ ప్రక్రియ గురించీ, దానివల్ల ఉండే రిస్కులు, దుష్ప్రభావాలూ, ప్రయోజనాలూ, సక్సెస్ రేటూ... ఇతర ప్రత్యామ్నాయ పద్ధతులూ’... వీటన్నింటి గురించి దంపతులకు తాము వివరంగా చె΄్పామనీ, దానికి వారు ఆమోదం తెలిపారంటూ పేషెంట్స్ నుంచి రాతపూర్వకంగా ఇన్ఫార్మ్డ్ కన్సెంట్ తీసుకోవాలి. గోప్యత: తమ వద్ద చికిత్స తీసుకుంటున్న దంపతుల వివరాలూ, వారి మెడికల్ రికార్డులను ఇన్ఫెర్టిలిటీ క్లినిక్లు పూర్తిగా గోప్యంగా ఉంచాలి. వారి గోప్యతకు (ప్రైవసీకి) ఎట్టిపరిస్థితుల్లోనూ భంగం రానివ్వకూడదు.కౌన్సెలింగ్తో సహా అన్నీ అందుబాటులో.. ఏదైనా సలహాల కోసం లేదా తమకు వచ్చే సందేహాలను తీర్చుకోవడం కోసం అవసరమైన కౌన్సెలింగ్ సదుపాయాలు పేషెంట్లకు ఎప్పుడూ అందుబాటులో ఉండాలి. ఆ కౌన్సెలింగ్ నిర్వహించేవారు ఐవీఎఫ్ గురించి అన్ని విషయాలూ పేషెంట్లకు వివరిస్తూ సహాయపడుతుండాలి. చికిత్స తీసుకునే/వద్దనే హక్కు: తాము ఐవీఎఫ్ తీసుకునేందుకు లేదా చికిత్స తీసుకుంటున్న ఏ సమయంలోనైనా తమకు వద్దనిపిస్తే చికిత్సనుంచి వైదొలగేందుకు పేషెంట్స్ ఎప్పుడూ హక్కు ఉంటుంది.ఫిర్యాదులకు ఓ కేంద్రం (గ్రీవెన్స్ సెల్) తమకు కలిగే అసౌకర్యాల విషయంలో ఫిర్యాదు చేసేందుకు లేదా తమ అసమ్మతిని తెలిపేందుకు ప్రతి క్లినిక్ తమ దగ్గర ఓ ఫిర్యాదుల కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి. ఈ విషయంలో క్లినిక్పైన తమ అసౌకర్యాలను/ అసమ్మతిని... ఉన్నత వైద్యాధికారులకు ఫిర్యాదు చేసే హక్కు కూడా పేషెంట్స్కు ఎప్పుడూ ఉంటుంది. పేషెంట్స్ ఎవరికి ఫిర్యాదు చేయవచ్చో తెలిపే వివరాలను గ్రీవెన్స్ సెల్ దగ్గర రాసి ఉంచాలి. కృత్రిమ గర్భధారణ పొందడానికీ, ఈ ప్రక్రియలో కాబోయే తల్లిదండ్రులు తాము మోసపోకుండా ఉండటానికి ప్రభుత్వం రూపొందించిన మార్గదర్శకాలివి. తమకు ప్రయోజనం చేకూర్చే ఉద్దేశంతో ప్రభుత్వం రూపొందించిన ఈ నియమ నిబంధనలనూ, నైతికాంశాలను కాబోయే దంపతులు తెలుసుకుని ఉండటం వారికి మేలు చేసే అంశం. పేషెంట్ల హక్కుతమకు జరుగుతున్న వైద్యపరీక్షలు (డయాగ్నోసిస్), చికిత్స ప్రణాళికలు (ట్రీట్మెంట్ ప్లాన్స్), అవి సఫలమయ్యేందుకు గల అవకాశాలు (ప్రొగ్నోసిస్)... వీటన్నింటి గురించి దంపతులు వివరంగా తెలుసుకోవచ్చు. క్లినిక్ నిర్వాహకులు/డాక్టర్లు కూడా ఈ అన్ని వివరాలను ఏమాత్రం దాపరికం లేకుండా పేషెంట్లకు వివరించాలి. పేషెంట్లకు ఇచ్చిన ఇంజెక్షన్లూ, నిర్వహించిన పరీక్షలూ (ఇన్వెస్టిగేషన్లు), నిర్వహించిన లేదా నిర్వహించబోయే ప్రక్రియల అన్ని వివరాలూ... అంటే అండాలు/ శుక్రకణాల/ పిండం (ఎంబ్రియోలు) వీటన్నింటి గురించీ... దాపరికం లేకుండా వివరించడంతోపాటు వీటికి సంబంధించిన అన్ని రికార్డులూ పేషెంట్లకు ఇవ్వాలి. ఈ విషయంలో పేషెంట్ల పట్ల పారదర్శకత పాటించడం క్లినిక్లు తప్పనిసరిగా చేసి తీరాలి. – నిర్వహణ: యాసీన్ -
84 కేజీల నుంచి 54 కేజీలకు..! ఈజీగా చేసే కార్డియో వ్యాయామాలివే..
బరువు తగ్గడం అంటే తక్షణ పరిష్కారాల కోసం చూడకుండా.. బదులుగా నిలకడగా చేయగలిగే అలవాట్లను అనుసరించడం అని నొక్కి చెబుతుంటారు ఫిట్నెస్ నిపుణులు. అందుకోసం సక్రమమైన జీవనశైలి, చక్కటి వ్యాయామాలను క్రమం తప్పకుండా చేయాల్సిందే. అలాగని కష్టతరమైనవి కాకుండా తేలిగ్గా చేసే వర్కౌట్లు, రిపిటేషన్స్ ప్రధానం అని అంటోంది ఫిట్నెస్ ఔత్సాహికురాలు అంజలి సచెన్. చేసే వ్యాయామాలు సెట్స్ వారిగా రిపిటేషన్ చేస్తే చాలు..కష్టతరమైన వాటి జోలికి పోనవసరం లేదంటోంది. అంతేగాదు తేలిగ్గా చేసే కార్డియో వ్యాయమాల వివరాలను కూడా ఆమె పంచుకున్నారు. అవేంటంటే..అంజలి సచెన్ అనే ఈ మహిళ, క్రమశిక్షణతో కూడిన దినచర్యను పాటిస్తూ, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వల్లే తాను 84 కేజీల నుంచి 54 కేజీలకు తగ్గినట్లు తెలిపింది. అందుకోసం ఎలాంటి కార్డియో వ్యాయామాలు చేసేదో వెల్లడించారామె. అదనపు కొవ్వుని తగ్గించుకోవడానికి సహాయపడే వ్యాయామాలు ఇవే..హై నీస్ (మోకాళ్లకు వ్యాయామం)ఆమె 20 రెప్స్తో నాలుగు సెట్లు హై నీస్ చేయడంతో ప్రారంభించారు. ఈ డైనమిక్ కార్డియో వ్యాయామంలో, మోకాళ్లను తుంటి ఎత్తుకు తీసుకువస్తూ..చేతులను పంప్ చేస్తూ ఒకే చోట పరుగెత్తాలి లేదా నడవాలి. ఇది హృదయ స్పందన రేటును పెంచడానికి, శరీర దిగువ భాగం శక్తిని పెంపొందించడానికి, కోర్ను ఉత్తేజపరచడానికి ఒక అద్భుతమైన వ్యాయామం.జంపింగ్ జాక్స్తరువాత, ఆమె జంపింగ్ జాక్స్ను 50 రెప్స్తో మూడు సెట్లు చేయమని సిఫార్సు చేసింది. ఈ వ్యాయామంలో, ఆమె తన మోకాళ్లను కొద్దిగా వంచి గెంతింది, తన కాళ్లను బయటకు చాస్తూ, చేతులను బయటకు ఊపుతూ వాటిని ఒక వంపులో పైకి లేపింది.కిక్బ్యాక్స్ఆమె సిఫార్సు చేసిన తదుపరి వ్యాయామం కిక్బ్యాక్స్. ఉత్తమ ఫలితాల కోసం కనీసం 20 రెప్స్తో మూడు సెట్లు చేయమని ఆమె సలహా ఇచ్చింది. ఆమె తన చేతులను తుంటిపై ఉంచి నిలబడి, తన కాళ్లను వెనక్కి తన్ని, చేతులను తాకడానికి ప్రయత్నించింది.జంపింగ్ స్క్వాట్స్ఈ జంపింగ్ స్క్వాట్స్ను కూడా 12 రెప్స్తో మూడు సెట్లు చేయమని సిఫార్సు చేసింది. ఈ వ్యాయామం ఒక ప్రామాణిక బాడీవెయిట్ స్క్వాట్ను నిలువు జంప్తో మిళితం చేస్తుంది. అలాగే హృదయ స్పందన రేటును పెంచుతూ కాళ్ల బలాన్ని పెంపొందించడంలో సహాయపడుతుంది.జంపింగ్ లంజెస్సాధారణ లంజెస్ కు బదులుగా, జంపింగ్ లంజెస్లో కాళ్ళను రెండుగా చాపి నిలబడి, నిలువుగా పైకి ఎగిరి గాలిలోనే కాళ్ళ స్థానాలను మార్చుకుని, వేగంగా తిరిగి లోతైన లంజ్ భంగిమలోకి దిగాలి. ఈ వ్యాయామాన్ని 10 రెప్స్ చొప్పున మూడు సెట్లలో చేయాలని ఆ ఇన్ఫ్లుయెన్సర్ సలహా ఇచ్చారు.మౌంటెన్ క్లైంబర్స్చివరి వ్యాయామంగా, మౌంటెన్ క్లైంబర్స్ను 15 రెప్స్ చొప్పున మూడు సెట్లలో చేయాలని ఆమె సిఫార్సు చేశారు. ఆమె సాధారణ 'ప్లాంక్' (plank) భంగిమలోకి వచ్చి, ఒక మోకాలిని తన ఛాతీ వైపునకు లాగి, వెంటనే తిరిగి మొదటి స్థితికి తీసుకువచ్చింది. ఈ వ్యాయామం శరీర మధ్య భాగం (కోర్) బలాన్ని,భుజాల స్థిరత్వాన్ని పెంచడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది.చివరగా, ఉప్పు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు, ఫాస్ట్ ఫుడ్, శీతల పానీయాలు, చక్కెర అధికంగా ఉండే పదార్థాలు కడుపు ఉబ్బరంగా కనిపించేలా చేస్తాయని ఆమె పేర్కొంది. వీటికి బదులుగా, అరటిపండ్లు, కొబ్బరి నీళ్లు, పాలకూర, అవకాడోలు, ఉబ్బరాన్ని తగ్గించడంలో సహాయపడే ఇతర ఆరోగ్యకరమైన ఆహారాలను తీసుకోవాలని ఆమె సూచించింది. View this post on Instagram A post shared by Anjali Sachan (@_anjali_sachan_)గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆయా వ్యక్తుల ఆరోగ్య చరిత్రని అనుసరించి.వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం చేయడం ఉత్తమం. (చదవండి: వర్షాకాలంలో బియ్యం పాడవ్వకూడదంటే..!) -
వానాకాలం పాము కాట్లు.. ఒక్క తప్పు చేసినా ప్రాణం పోయే ప్రమాదం
వానాకాలం వచ్చిందంటే పాములు బయటకు వస్తాయి. పొలాలు, చెట్లు, ఇళ్ల పరిసరాలు, నీరు నిలిచిన చోట మనుషులకు పాము కాటు ప్రమాదం పెరుగుతుంది. అలాంటి సమయంలో ఏం చేయాలి? ఏం చేయకూడదు? తెలుసుకుంటే మన ప్రాణాలు కాపాడుకోవచ్చు. పాము కాటు వేస్తే వెంటనే సరైన ప్రథమ చికిత్స తీసుకుని ఆసుపత్రికి చేరడం అత్యంత ముఖ్యం. విషపూరిత పాము కాటు వేస్తే అత్యవసరంగా ఆసుపత్రికి తీసుకెళ్లాలి.పాము కాటు వేస్తే ఏం జరుగుతుంది?పాము విషంకాటు గాయం ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తుంది. విషం సాధారణంగా రక్తంలోకి నేరుగా వెళ్లదు. ముందుగా లింఫ్ వ్యవస్థలో వ్యాపిస్తుంది. లింఫ్ వ్యవస్థ అంటే శరీర రక్షణ వ్యవస్థలో భాగమైన ద్రవ మార్గాల జాలం. ఎక్కువ కదలిక ఉంటే విషం వేగంగా వ్యాపిస్తుంది. ప్రశాంతంగా ఉంటే విషం వ్యాపించే వేగం తగ్గుతుంది. విషపూరిత పాము కాట్లలో ఎక్కువగా కాటు చోట నొప్పి, వాపు కనిపిస్తాయి. కొన్ని పాములు న్యూరోటాక్సిక్ విషాన్ని విడుదల చేస్తాయి. అది నాడీ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. న్యూరోటాక్సిక్ విషం అంటే నాడులు, మెదడు పనితీరును దెబ్బతీసే విషం. న్యూరోటాక్సిక్ విషం వల్ల కనురెప్పలు వాలిపోవడం, మాట స్పష్టంగా రాకపోవడం, మింగడం కష్టమవుతుంది. తీవ్ర న్యూరోటాక్సిక్ విష ప్రభావం వల్ల శ్వాస ఆగే ప్రమాదం ఉంటుంది. కొన్ని పాములు హీమోటాక్సిక్ విషాన్ని విడుదల చేస్తాయి. అది రక్తం, రక్తనాళాలను దెబ్బతీస్తుంది. హీమోటాక్సిక్ విషం అంటే రక్తం, రక్తనాళాలపై హాని చేసే విషం. హీమోటాక్సిక్ విషం వల్ల రక్తస్రావం, రక్తం గడ్డకట్టే ప్రక్రియలో సమస్యలు వస్తాయి. కొన్ని పాముల విషం కండరాలు, చుట్టుపక్కల కణజాలాన్ని నాశనం చేస్తుంది. లక్షణాలు కొన్ని నిమిషాల్లో కనిపించవచ్చు. లేక కొన్ని గంటల తర్వాత కనిపించవచ్చు.ఏం చేయాలి?చిన్న పిల్లలు, వృద్ధుల్లో తీవ్ర సమస్యల ప్రమాదం ఎక్కువ. కాటు పడిన వెంటనే పాము దగ్గర నుంచి దూరంగా వెళ్లాలి. పామును పట్టుకోవడానికి లేదా చంపడానికి ప్రయత్నించవద్దు. కాటు పడిన అవయవాన్ని వీలైతే స్ప్లింట్తో కదలకుండా ఉంచాలి. స్ప్లింట్ అంటే గాయమైన అవయవాన్ని స్థిరంగా ఉంచే గట్టి ఆధార పరికరం. వాపు మొదలయ్యే ముందు ఉంగరాలు, గాజులు, గడియారం, బిగుతైన దుస్తులు తొలగించాలి.వీలైనంత త్వరగా సమీప ఆసుపత్రికి చేరాలి. యాంటీ స్నేక్ వెనం మాత్రమే విషపూరిత పాము కాటుకు ప్రత్యేక చికిత్స. లక్షణాలను బట్టి ఎంత మోతాదు ఇవ్వాలో వైద్యులు నిర్ణయిస్తారు. శ్వాసపై ప్రభావం ఉంటే ఆక్సిజన్ లేదా వెంటిలేటర్ సహాయం అవసరం కావచ్చు.ఇవి మర్చిపోవద్దుకాటు గాయాన్ని కోయవద్దు. నోటితో విషాన్ని పీల్చే ప్రయత్నం చేయవద్దు. కాటు చోట మంచు లేదా వేడి పెట్టవద్దు. కాటు పడిన అవయవానికి బిగుతుగా కట్టు వేయవద్దు. మూలికలు, రసాయనాలు, ఇంటి చిట్కాలు వాడవద్దు. సురక్షితంగా ఉంటే పాము రూపాన్ని గుర్తుంచుకోవాలి లేదా దూరం నుంచి ఫొటో తీయాలి. లక్షణాలు తక్కువగా కనిపించినా అనుమానాస్పద పాము కాటుకు వెంటనే వైద్య పరీక్ష చేయించుకోవాలి. వెంటనే ప్రథమ చికిత్స, త్వరగా ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటే ప్రాణాపాయం తగ్గి, సమస్యలు తగ్గుతాయి. -
76 ఏళ్ల వయసులోనూ అంతే ఫిట్గా రాకేశ్ రోషన్..! ఆరోగ్యవంతమైన వృద్ధాప్యం కోసం..
బాలీవుడ్ చిత్ర నిర్మాత, దర్శకుడు, స్క్రీన్ రైటర్ రాకేష్ రోషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నటుడిగా తాను రాణించలేకపోయినా..కుమారుడు హృతిక్ రోషన్ని వెండితెరకు పరిచయం చేసి హీరోగా వెలుగొందేలా చేశాడు. అలాగే దర్శకుడిగా, మంచి స్క్రీన్ రైటర్గా, నిర్మాతగా పేరు తెచ్చుకున్న వ్యక్తి. ప్రస్తుతం ఆయన వయసు 76 ఏళ్లు. ఈ వయసులో కూడా ఎంతో ఫిట్గా, స్మార్ట్గా ఉండటమే కాదు..యువ హీరోలకు తీసిపోని విధంగా గ్లామరస్గా కనిపిస్తుంటారు. ఆయన అంత ఏజ్లోనూ అంతలా ఎలా స్లిమ్గా చురుకుగా ఉన్నారు. అందుకోసం ఏం చేస్తుంటారు, ఎలాంటి ఫుడ్ తీసుకుంటారు వంటి విషయాల గురించి సవివరంగా చూద్దామా!.ప్రముఖ చిత్ర నిర్మాత రాకేశ్ రోషన్ 76 ఏళ్ల వయసులో కూడా తన ఫిట్నెస పట్ల తనకున్న అచంచలమైన నిబద్ధతతో ఈ తరానికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. వృద్ధాప్యంలో కూడా ఎంతో చురుకుగా, శక్తిమంతంగా ఉండటానికి తనకు సహయపడిని అలవాట్ల గురించి తన కుమార్తె సునైనా రోషన్ ఇన్స్టాగ్రామ్ పేజీలో జరిపిన సంభాషణలో వెల్లడించారు. అంతేగాదు తాను అనుసరించే క్రమశిక్షణతో కూడిన జీవనశైలి గురించి కూడా చెప్పారు. వయసు పెరిగే కొద్దీ మరింతగా శిక్షణ పొందాలని, అదే మనల్ని ఫిట్గా ఉంచుతుందని అన్నారు. 65 లేదా 70 ఏళ్ల తర్వాత భుజాలు వంగిపోయి, పొట్ట ముందుకు పొడుచుకు వచ్చిన వారిని చూశానని అన్నారు. కఠినమైన డైట్ తోపాటు క్రమం తప్పకుండా జిమ్,వెయిట్ ట్రైనింగ్ చేస్తుతంటానని అన్నారు. మంచి ఆరోగ్యానికి వ్యాయామం కంటే ఆహారమే ముఖ్యమని అన్నారు. అంతేగాదు మనం ఆరోగ్యంగా ఉండటంలో వ్యాయామం కేవలం 10% మాత్రమేనని, మిగిలిన 90% తీసుకునే ఆహారమేనని అన్నారు. గత మూడేళ్లుగా ఇలాంటి జీవనశైలిని ప్రారంభించానని, ఇది తనలో చాలా మార్పు తీసుకొచ్చిందని చెప్పుకొచ్చారు. తాను బాగా నిద్రపోతానని, ఉత్సాహంగా మేల్కొంటానని చెప్పారు. అది ఇవాళ తనకొక దినచర్యగా మారిందని అన్నారు. వ్యాయామం చేయాలనే మూడ్ లేని రోజుల్లో ఏం చేస్తారని కుమార్తె అడగ్గా..అలా చాలా అరుదుగా జరుగుతుందని, ఆ టైంలో కూడా తనను తాను చేసేలా ప్రేరేపించుకుంటానని అన్నారు. తనకు బద్ధకంగా అనిపించి వ్యాయామం చేయాలనిపించకపోయినా..జిమ్లోకి అడుగుపెట్టి, తనకు సాధ్యమైనంత మేరకు వర్కౌట్లు చేస్తుంటానని అన్నారు. ఆయన అనేది శిక్షణ కంటే హాజరు ముఖ్యం అనుకుంటే..కనీసం వార్మప్ వ్యాయామాలైనా చేయగలుగుతామని అన్నారు. ప్రతిరోజూ ఎలాగైతే అల్పాహారం, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం చేస్తామో, వ్యాయామం కూడా మన దినచర్యలో ఒక భాగం కావాలని అన్నారు. అలా అనుకుని చేస్తే ఆరోగ్య సమస్యల బారిన పడరని, పైగా పోరాడే సామర్థ్యం పెరుగుతుందని అన్నారు. అయినా అంతర్గతంగా ఆరోగ్యంగా దృఢంగా ఉన్నప్పుడు జీవితం చాలా సులభం అవుతుందని అన్నారు. ఇక కుమార్తె సునైనా రోషన్ సైతం..తండ్రి మాటలకు మద్దతిస్తూ.తాను కూడా ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవడంతోనో తన ఆరోగ్యంలో నిజంగా పెద్ద మార్పు చోటుచేసుకుందంటూ తన అనుభవాన్ని పంచుకుంది. అందువల్లే తనకు గ్రేడ్1 ఫ్యాటీ లివర్ సమస్య తగ్గిందని పేర్కొంది. కాగా, రాకేష్ రోషన్కు 2019లో గొంతు క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. చికిత్స తర్వాత పూర్తిగా కోలుకున్నారు. అప్పటి నుంచి ఈ చిత్ర నిర్మాత క్రమం తప్పని వ్యాయామం, ఆలోచనాత్మకమైన ఆహారాన్ని తన దినచర్యలో భాగంగా చేసుకుని, మరింత క్రమశిక్షణతో కూడిన జీవనశైలిని అలవర్చుకున్నారు. View this post on Instagram A post shared by Sunaina Roshan (@roshansunaina) (చదవండి: వెయ్యి ఇంజెక్షన్లు, రెండు గర్భస్రావాలు..! ఐవీఎఫ్ జర్నీపై నటి షాకింగ్ వ్యాఖ్యలు) -
ఐవీఎఫ్లో ఏం జరుగుతుందంటే...
సామాన్య ప్రజలు టెస్ట్ట్యూబ్ బేబీ అని పిలిచే ఈ ప్రక్రియనే వైద్య పరిభాషలో ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ (ఐవీఎఫ్) అంటారు. దీని కంటే ముందుగా కొందరిలో ఇంటా యుటెరైన్ ఇన్సెమినేషన్ (ఐయూఐ) ప్రక్రియను అనుసరిస్తారు. ఐయూఐలో మిగతాదంతా నేచురల్ పద్ధతిలోనే జరిగినప్పటికీ కేవలం వీర్యకణాలను నేరుగా యోని మార్గం గుండా సెర్విక్స్ ద్వారా గర్భాశయంలోకి పంపుతారు. దీనితో పోలిస్తే ఐవీఎఫ్ చాలా సంక్లిష్టమైన ప్రక్రియ. ఇది కృత్రిమ గర్భధారణ ప్రక్రియలో దంపతులకు ఓ వరం. ఇందులో వరసగా ఏమేం జరుగుతుందో, స్టెప్ బై స్టెప్ చూద్దాం...ఐవీఎఫ్లో ముందుగా మహిళలో అండాల సంఖ్య పెద్దమొత్తంలో పెరిగేందుకు మందులిస్తారు. వాటిల్లోంచి బాగా ఆరోగ్యంగా ఉన్న కొన్నింటిని సేకరించి, పురుషుడి నుంచి సేకరించిన వీర్యకణాలతో ల్యాబ్లోని ‘టెస్ట్ట్యూబ్’లో ఫలదీకరణం చేస్తారు. ఇలా ఫెర్టిలైజ్ చేస్తున్నప్పుడు కొన్నిసార్లు ఒకటి కంటే ఎక్కువ పిండాలూ పెరగవచ్చు.ఇలా రూపొందించిన పిండాల్లో ఆరోగ్యకరమైన వాటిని మహిళ గర్భంలోకి ప్రవేశపెడతారు. రెండు వారాలప్పుడు ఒకసారి చూసి... మళ్లీ నాలుగు వారాల తర్వాత అల్ట్రాసౌండ్ పరీక్ష చేసి, గర్భం నిలిచిందా లేదా అన్నది నిర్ధారణ చేసుకుంటారు. గర్భం నిలవకపోతే కారణాలను విశ్లేషించి, మళ్లీ ప్లాన్ చేస్తారు.వరుస క్రమంలో జరిగే ప్రక్రియలు.. (ఒవేరియన్ స్టిమ్యులేషన్) ఇందులో అండాశయాల నుంచి ఎక్కువ అండాలు తయారుకావడం కోసం హార్మోన్ ఇంజెక్షన్లు ఇస్తారు. దీన్నే ఒవేరియన్ స్టిమ్యులేషన్ అంటారు. ఈ టైములో వెజైనల్ స్కానింగ్ ద్వారా మహిళలోని అండాలను పర్యవేక్షిస్తూ, హార్మోన్ పరీక్షలు చేస్తూ, అండాల సంఖ్య, సైజు నిర్ణీత స్థాయికి వచ్చేవరకు వేచిచూస్తారు. అండాలను తీయడం అండాలు తగిన సైజుకు పెరిగాక... అనస్థీషియాతో మహిళకు నొప్పి తెలియకుండా యోని మార్గం నుంచి సన్నటి, పొడవాటి సూది ద్వారా అండాశయాల నుంచి అండాలను బయటకు తీస్తారు. దీన్ని ‘ఎగ్/ఊసైట్ రిట్రైవల్’ అంటారు. 3. ఫలదీకరణ (ఫెర్టిలైజేషన్): బయటకు తీసిన అండాలను మైక్రోస్కోప్లో పరీక్షిస్తూ, మంచి అండాలను వేరుచేస్తారు. వాటిని శుభ్రపరచి, వాటిల్లో నాణ్యమైనవిగా గుర్తించిన వాటిని శుక్రకణాలతో న్యూట్రిషన్ మీడియా ఉన్న ఓ చిన్న డిష్లో కలుపుతారు. ఇలా ఫలదీకరణ జరుగుతుంది. ఇది అనేక కణాలుగా విభజితమవుతూ, పిండంగా మారుతుంది. వీటిల్లో ఇలా కలిపిన అండాలన్నీ ఫలదీకరణ చెందకపోవచ్చు. కొన్ని మాత్రమే పిండంగా ఏర్పడతాయి. → ఐసీఎస్ఐఈ (ఇక్సీ): అండాలను, శుక్రకణాలతో కలిపే సమయంలో కొన్నిసార్లు వీర్యకణాలు వాటంతట అవే అండంలోకి వెళ్లలేకపోవచ్చు. అప్పుడు శుక్రకణాన్ని సన్నటి సూది ద్వారా అండంలోకి నేరుగా ఇంజెక్ట్ చేస్తారు. దీన్నే ‘ఇంట్రా సైటోప్లాస్మిక్ స్పెర్మ్ ఇంజెక్షన్’ (ఇక్సీ) అంటారు. కణవిభజన (ఎంబ్రియో కల్చర్): ఫలదీకరణ జరిగిన ఆ అండాలను, న్యూట్రిషన్ మీడియా ఉన్న ఒక డిష్లో పెట్టి, ఇంక్యుబేటర్లో 3 – 5 రోజుల పాటు అలా ఉంచేస్తారు. వీటిలో కణాలు విభజన జరుగుతూ తయారైన పిండాన్ని 3 నుంచి 5 రోజులలోపు బయటకు తీసి, మైక్రోస్కోప్లో వాటి నాణ్యతను పరీక్షిస్తారు. ఎంబ్రియో ట్రాన్స్ఫర్: ఇంక్యుబేటర్లో కాస్తంత పెరిగిన పిండాల్లోని నాణ్యమైన వాటిని వేరుచేసి, వాటిలో 2, 3 పిండాలను సన్నటి కాన్యులా ద్వారా గర్భాశయంలోకి ప్రవేశపెడతారు. మిగిలిన పిండాలను ఫ్రీజ్ చేస్తారు. ఇలా గర్భాశయంలోకి ప్రవేశపెట్టడాన్ని ‘ఎంబ్రియో ట్రాన్స్ఫర్’ అంటారు. ఇంప్లాంటేషన్: ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ద్వారా గర్భాశయంలోకి పంపిన పిండాలు... గర్భాశయంలోని పొరలోకి అంటుకుపోయి, పెరగడం మొదలవుతాయి. ఇది అందరిలోనూ నార్మల్గా జరగకపోవచ్చు. ఈ ప్రక్రియ సజావుగా జరడానికి, గర్భాశయపొర బాగుండాలి. దానికి రక్తప్రసరణ, హార్మోన్లతో పాటు ఇంకా తెలియని అనేక అంశాలు సరిగా ఉండాలి. అప్పుడు మాత్రమే గర్భాశయం పిండాన్ని స్వీకరిస్తుంది. అలా స్వీకరిస్తేనే గర్భం నిలుస్తుంది. అయితే అందరిలోనూ పిండం ఎందుకు అతుక్కోదనే దానికి కారణాలు ఇంకా తెలియదు. అందుకే ఈ ఐవీఎఫ్ (టెస్ట్ట్యూబ్) పద్ధతిలోనూ గర్భం దాల్చే అవకాశాలు 40 – 50 శాతమే!ల్యూటియల్ ఫేజ్ సపోర్ట్→ పిండం గర్భాశయపొరలోకి అంటుకుపోయేలా చేసే ‘ఇంప్లాంటేషన్’ సక్సెస్ అయ్యేందుకు కొన్ని మందులను మాత్రలూ, ఇంజెక్షన్లూ, జెల్స్ రూపంలో ఇవ్వాల్సి ఉంటుంది.→ దంపతుల్లో ‘టెస్ట్ట్యూబ్ బేబీ’ పద్ధతి ఒకసారి ఫలించకపోతే, మళ్లీ కొన్ని నెలలు ఆగి, మళ్లీ మళ్లీ ప్రయత్నించవచ్చు. ఇలా రెండుమూడు సార్లు ప్రయత్నించి చూస్తారు. ఒకసారి సఫలం కాకపోతే, మళ్లీ ఒకసారి దంపతులకు చేయించిన పరీక్షలన్నీ తిరిగి సరిచూసుకుంటూ, కారణాలను పునఃసమీక్షించుకుంటూ, ఇంకా ఏమైనా సమస్యలున్నాయా అంటూ విశ్లేషించుకుంటూ, అవసరమైన పరీక్షలేమైనా ఉంటే అవి కూడా చేయిస్తూ, చికిత్సల్లో కొద్దిపాటి మార్పులు చేస్తూ, డాక్టర్లు టెస్ట్ట్యూబ్బేబీ పద్ధతిని మళ్లీ ప్రయత్నిస్తారు.కన్నది మేమే కాని...కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్ అని పాట వరకు పాడుకుంటాం కాని, నిజ జీవితంలో కొన్ని తికమకల వల్ల జీవితాలే తలకిందులవుతాయి. నవ మాసాలు మోసి కన్న తల్లికి పుట్టింది తన బిడ్డ కాదని అంటే? ఐవీఎఫ్ పద్ధతిలో జరిగిన తప్పిదాల వల్ల ఇప్పుడు అలాంటి వింతలే వినాల్సి వస్తోంది. అమెరికాలోని ఫ్లోరిడాకి చెందిన టిఫనీ స్కోర్, ఆమె భర్త స్టీవెన్ మిల్స్ ఎన్నో ఏళ్ల నిరీక్షణ తర్వాత ఐవీఎఫ్ ద్వారా తల్లిదండ్రులు కావాలని నిర్ణయించుకున్నారు. ఫెర్టిలిటీ సెంటర్ ఆఫ్ ఓర్లాండ్లో రూపొందించిన ఎంబ్రియోలలో ఒక దానిని టిఫనీ గర్భాశయంలో ప్రవేశపెట్టారు. 2025 డిసెంబర్ 11న టిఫనీ ఆరోగ్యవంతమైన ఆడబిడ్డ (షియా)కు జన్మనిచ్చింది. కాని ట్విస్ట్ ఏంటంటే, పుట్టిన బిడ్డకి జన్యుపరంగా టిఫనీ, స్టీవెన్లు తల్లిదండ్రులు కారు. డీఎన్ఏ పరీక్ష చేయించగా... ఆ బిడ్డకి బయోలాజికల్స్ పేరెంట్స్ తాము కాదని తెలిసింది. కాని టిఫనీ మనసు బరువైంది. జన్యుపరంగా తమ బిడ్డ కాకపోయినా నవ మాసాలు మోసింది తానే కదా.. ఆ మాతృత్వ భావన తనని, బిడ్డని వేరు చేయడానికి ఇష్టపడలేదు.. షియాని తామే పెంచుకుంటామని టిఫనీ, స్టీఫెన్లు నిర్ణయించుకున్నారు.మరో సంఘటనలో ఆస్ట్రేలియా బ్రిస్బేన్లోని ఓ ప్రముఖ ఫెర్టిలిటీ సెంటర్ మోనాష్ ఐవీఎఫ్ సెంటర్లో మానవ తప్పిదం కారణంగా ఒక మహిళకు మరో కుటుంబానికి చెందిన ఎంబ్రియో పొరపాటున బదిలీ అయ్యింది. ఇది తెలియక సదరు మహిళ గర్భం దాల్చి ఒక మగశిశువుకి జన్మనిచ్చింది. ఆ బిడ్డకి ఇప్పుడు రెండేళ్లు కావస్తోంది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ సంఘటనపై విచారణ చేయగా పొరపాటు వల్లే ఇంతటి పెను సమస్య వచ్చిందని నిర్ధారించారు. ఈ రెండు కథలలో బిడ్డకు జన్యుపరంగా తల్లులు కాలేకపోయినా పేగుపాశం ఆ బంధాలను శాశ్వతం చేసింది. డాక్టర్ రాధికా గుప్తాసీనియర్ కన్సల్టెంట్ – ఫెర్టిలిటీ స్పెషలిస్ట్నిర్వహణ: యాసీన్ -
తామర పువ్వులు తింటే.. నిజంగానే జ్ఞాపకశక్తిని కోల్పోతామా?
బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తున్న హాలీవుడ్ చిత్రం ఒడిస్సీ ఫస్ట్ వీకెండ్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 2 కోట్లకు పైగా కలెక్షన్స్తో దూసుకుపోతోంది. దర్శకుడు క్రిస్టఫర్ నోలన్ తెరకెక్కించిన ఈ చిత్ర భారత్ బాక్సాఫీస్ వద్ద రూ. 7.78 కోట్లు వసూల చేయడం విశేషం. ఆ మూవీలో జన్ వార్ తర్వాత ఒడిస్సియస్ సైన్యంతో కలిసి తన రాజ్యం ఇథాకాకు యలుదేరతాడు. పది రోజుల్లో చేరుకోవాల్సిన ప్రయాణం పదేళ్లు పడుతుంది.ఆ మధ్యలో ఓగిగియా అనే పౌరాణిక ద్వీపంలో చిక్కుకోవడంతో ఇలా జరుగుతుంది. ఆ ద్వీపంలో కాలిప్సో అనే అప్సరస అతనిపై మనుసుపడి..అక్కడే ఉంచేసుకుందామనే దురుర్దేశంతో నీలి తామరపువ్వుని తినిపించడంతో జ్ఞాపకశక్తిని కోల్పోయి ఇబ్బంది పడినట్లుగా చూపిస్తారు. మరి ఇంతకీ నిజంగా తామరపువ్వులు లేదా కలువలు తింటే నిజంగానే జ్ఞాపకశక్తిని కోల్పోతామా?, నిజంగానే నీలి తామర పువ్వులు అనారోగ్యకరమైనవా అంటే..'ది ఒడిస్సీ' (The Odyssey) అనే ప్రసిద్ధ గ్రీకు పురాణ కథలో, తామర పూలు (Lotus-eaters) తిన్నవారు తమ గతాన్ని, జ్ఞాపకాలను మర్చిపోయి హాయిగా జీవిస్తారని రాశారు. అలాగే మన భారతీయ పురాణాల్లో సైతం దీనికి అగ్రస్థానం ఇచ్చారు. దేవతలను ఈ పూలతో పూజిస్తే వారి అనుగ్రహం సులభంగా లభిస్తుందనేది భక్తుల ప్రగాఢ నమ్మకం. రామాయణ, భారత ఇతి హాసాల్లో సైతం ఈ పువ్వుల గొప్పతనం గురించి రాసి ఉంటుంది. అలాంటి ప్రాముఖ్యత కలిగిన దేవతాపుష్పాలు తింటే జ్ఞాపకశక్తి పోవడం ఖాయమా? అంటే..తామర పువ్వులు, వేర్లు మరియు గింజలు జ్ఞాపకశక్తిని కోల్పోయేలా చేయవు. వాస్తవానికి, ఆసియా దేశాల సాంప్రదాయ వైద్యంలో తామర మొక్కలోని వివిధ భాగాలను నాడీ వ్యవస్థను మెరుగుపరచడానికి, ఒత్తిడిని తగ్గించడానికి ఉపయోగిస్తారు.అయినప్పటికీ, బ్లూ లోటస్ (Blue Lotus) వంటి కొన్ని ప్రత్యేక తామర జాతులను అధికంగా తీసుకుంటే, వాటిలో ఉండే ఆల్కలాయిడ్స్ వల్ల కొద్దిసేపు స్పృహ తప్పినట్లు, హాయిగా లేదా కొద్దిగా మత్తుగా అనిపించవచ్చని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయిఈజిప్షియన్ బ్లూ లోటస్, దీనిని బ్లూ వాటర్ లిల్లీ అని కూడా పిలుస్తారు, ఇందులో న్యూసిఫెరిన్ మరియు అపోర్ఫిన్ అనే సమ్మేళనాలు ఉంటాయి. ఇవి మెదడులోని డోపమైన్ సెరోటోనిన్ రిసెప్టర్లతో సంకర్షణ చెందుతాయి. ఈ సమ్మేళనాలు తేలికపాటి ఉల్లాసం, విశ్రాంతి, ప్రశాంత, ఆందోళన, పారానోయా, మానియా, ఇతర న్యూరోసైకియాట్రిక్ లక్షణాల వరకు ప్రభావాలతో ముడిపడి ఉన్నాయి. అయినప్పటికీ, మానవులపై దాని ప్రభావంపై మరింత లోతుగా పరిశోధన చేయాల్సి ఉంది. అయితే, కొన్ని మొక్కలలో నాడీ వ్యవస్థను ప్రభావితం చేసే కొన్ని ఆల్కలాయిడ్లు, మరికొన్ని సమ్మేళనాలు ఉన్నాయని గుర్తించారు. తామరపువ్వు ఇలాంటి ప్రమాదం చూపించనప్పటికీ..జ్ఞాపకశక్తి లోపం, గందరగోళం, మతిభ్రమణం , బ్రాంతులకు కారణమయ్యే ఇతర మొక్కలు ఉన్నాయనేది గుర్తురెగాలని హెచ్చరిస్తున్నారు నిపుణులు.(చదవండి: IVF journey.: వెయ్యి ఇంజెక్షన్లు, రెండు గర్భస్రావాలు..! ఐవీఎఫ్ జర్నీపై నటి షాకింగ్ వ్యాఖలు) -
వెయ్యి ఇంజెక్షన్లు, రెండు గర్భస్రావాలు..! ఐవీఎఫ్ జర్నీపై నటి షాకింగ్ వ్యాఖ్యలు
సూపర్ మోడల్, బాలీవుడ్ నటి తేజస్విని కొల్హాపూరే టెలివిజన్ సిరీస్తో కెరీర్ మొదలు పెట్టి..'తేరా జాదూ చల్ గయా మూవీతో బాలీవుడ్లోకి అడుగుపెట్టింది. విలక్షణమైన నటనతో మెప్పించి విమర్శకులు ప్రశంసలందుకున్న దిగ్గజ నటి. ఆమె స్వయాన పద్మినీ కొల్హాపూరేకు సోదరి, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్ధా కపూర్కు మేనత్త. ఆమె చిత్ర నిర్మాత, నటుడు పంకజ్ సరస్వత్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. ఆ దంపతులకు ఒక కుమార్తె. ఆమె సిద్ధార్థ కన్నన్ పాడ్కాస్ట్ తన ఐవీఎఫ్ జర్నీ గురించి చాలా ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఆ ప్రక్రియ ఎంత కష్టమైందో ఆవేదనగా చెప్పుకొచ్చారు. అంతేగాదు యువతకు సంతాన విషయంలో చక్కటి సందేశం కూడా ఇచ్చారామె. తన జీవితంలో చాలా కష్టమైన దశ అంటూ ఉంటే అది ఐవీఎఫ్ జర్నీనే కన్నటీపర్యంతమైంది. అది మానసికంగా, శారీరకంగా ఎంతటి ఒత్తిడికి గురిచేస్తుందో పంచుకుంది. తాను ఐదుసార్లు ఐవీఎఫ్ చేయించుకున్నానని, నిస్సంకోచంగా వెల్లడించింది. ఎందుకు ఇంత ధైర్యంగా చెబుతున్నాననంటే ఆ ప్రక్రియలో ఉండే కష్టాలపై అదరికీ అవగాహన కల్పించాలనే ఉద్దేశ్యంతోనే అంటూ తను ఎదుర్కొన్న బాధను వివరించారామె. నటిగా ఉన్నప్పడు ఇప్పటికీ తన ఆకృతిలో ఎంతో వ్యత్యాసం ఉందని అన్నారు. మానసికంగా ఇప్పుడు బలంగా ఉన్నానను, కానీ ఆ సమయంలో శారీరకంగా మానసికంగా ఇంజెక్షన్ల వల్ల తన శరీరాకృతి ఘోరంగా మారిపోయిందని చెప్పుకొచ్చింది. సుమారు వెయ్యికి పైగా ఇంజెక్షన్లు తీసుకున్నానని అన్నారు. గర్భం ధరించేంత వరకు వాటిని ఇస్తూనే ఉంటారని చెప్పారు. అలా ఐదు సార్లు ఆ ప్రక్రియ చేయించుకున్నా..సక్సెస్కాలేదని..చివరికి తన ప్రయత్నం ఫలించి నిలిచినా..రెండు సార్లు గర్భస్రావం అనంతరం..ప్రెగ్నెంట్ అయినట్లు వివరించింది. ఆ మధ్యలో పడే బాధ అలాంటి ఇలాంటిది కాదని, మానసికంగా కుంగిపోతామంటూ వేదనగా చెప్పుకొచ్చింది. కాగా తేజస్విని కొల్హాపూరే, పంకజ్ సరస్వత్లు జనవరి 30, 2015న వేదిక అనే కుమార్తె జన్మనిచ్చారు. వివాహం అయిన ఎనిమిదేళ్లకు ఆ దంపతులకు సంతానం కలిగింది.(చదవండి: ఒకేసారి ఎంబీబీఎస్, ఇంజనీరింగ్..! కట్చేస్తే..) -
ఒకేసారి ఎంబీబీఎస్, ఇంజనీరింగ్..! కట్చేస్తే..
చాలామంది విద్యార్థులు వైద్య వృత్తి లేదా ఇంజనీరింగ్ కోర్సులలో ఏదో ఒకటి ఎంచుకుంటారు. ఇది సర్వసాధారణం. అలా కాకుండా రెండు నేర్చుకోగలిగే సామర్థ్యం ఉన్నప్పుడు ఒకదాన్నే ఎందుకు ఎంచుకోవాలి అని ప్రశ్నించి మరీ విభిన్న మార్గంలో ప్రయాణించి సత్తా చాటింది. వైద్య రంగంలో ఓ సరికొత్త ఒరవడిని సృష్టించింది. ఎవరా అమ్మాయ్ అంటే..ఆ యువతే బీవీఎస్ మాధవి. ఆమె ఆంద్ర మెడికల్ కాలేజ్లో ఎంబీబీఎస్ చదువుతున్నప్పుడే ఐఐటీ మద్రాస్లో డేటా సైన్స్ అండ్ ప్రోగ్రామింగ్లో బీఎస్ డిగ్రీ కూడా చేశారు. మెడికల్ స్కూల్, ఆసుపత్రి విధులు, కోడింగ్ అసైన్మెంట్లు, పరీక్షలు,పరిశోధనలు సమన్వయం చేసుకోవడం అంత సులభం కాదు. కానీ వైద్యం, సాంకేతికతను అనుసంధానించగలిగిన వారికే భవిష్యత్తు ఉంటుందని ప్రగాడంగా నమ్మింది మాధవి.ఆ నమ్మకమే నిజమై ఆమె వృత్తికి సరైన రూపునిచ్చింది. ప్రస్తుతం ఆమె ఎన్ఫరెన్స్లో జూనియర్ క్లినికల్ సైంటిస్ట్గా పనిచేస్తున్నారు. అక్కడ ఆమె ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించి ఆంకాలజీలో వాస్తవ ప్రపంచ ఆధారాలను వెలికితీస్తున్నారు. ఇది పరిశోధకులు కేన్సర్ను మరింత బాగా అర్థం చేసుకోవడానికి రోగుల సంరక్షణను మెరుగుపరుచడానికి సహాయపడుతుంది. మరి రెండు విభిన్న కోర్సులను ఎలా చదవగలిగిందంటే..ఏఐని తెలుసుకోవాలని..చాలా మంది వైద్య విద్యార్థులకు, ఎంబీబీఎస్ పూర్తి చేయడమే ఒక కఠినమైన సవాలు. కానీ మాధవి ఈ జాబితాకు మరో డిగ్రీని జోడించాలని నిర్ణయించుకున్నారు. రాబోయే సంవత్సరాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ ఆరోగ్య సంరక్షణను రూపు మార్చుతాయని దృఢంగా నమ్మి, ఆమె 2021లో ఐఐటి మద్రాస్లోని డేటా సైన్స్ అండ్ ప్రోగ్రామింగ్లో బిఎస్ ప్రోగ్రామ్లో చేరారు.టెక్నాలజీని వైద్యం నుంచి వేరుగా చూడకుండా, రోగ నిర్ధారణలను మరింత కచ్చితంగా చేయడానికి, పరిశోధనను మెరుగుపరచడానికి, రోగులకు మెరుగైన ఫలితాలను అందించడానికి ఒక ఆవశ్యక సాధనంగా భావించారామె. ఆ నిర్ణయం వల్ల ఆమె లెక్చర్లు, క్లినికల్ పోస్టింగ్లు, వార్డ్ డ్యూటీలు, ప్రాక్టికల్ పరీక్షలు,ఐఐటి అసైన్మెంట్లు అన్నింటినీ ఒకే సమయంలో నిర్వహించాల్సి వచ్చింది. ఆ షెడ్యూల్ అలసట కలిగించినప్పటికీ, ఆమె రెండు విభాగాల నిబద్ధతతో సత్తా చాటిందామె.సాధించిన విజయాలు..ఆంధ్ర మెడికల్ కాలేజీలో తన క్లినికల్ ఇంటర్న్షిప్ సమయంలో, ఆమె జనరల్ మెడిసిన్, సర్జరీ, పీడియాట్రిక్స్, ప్రసూతి మరియు గైనకాలజీ, ఆర్థోపెడిక్స్, సైకియాట్రీ, డెర్మటాలజీ,ఎమర్జెన్సీ మెడిసిన్తో సహా పలు ప్రధాన విభాగాలలో శిక్షణ పొందారు. అదే సమయంలో ఆమె రోగుల సంరక్షణ తోపాటు, మెషిన్ లెర్నింగ్, వైద్య పరిశోధనaలో తన నైపుణ్యాన్ని పెంచుకుంటూనే ఉన్నారు. స్టార్లైన్ ఏఐలో మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్ ఇంటర్న్గా, ఆమె ఛాతీ ఎక్స్-రేలు, డీప్ లెర్నింగ్ మోడల్లను ఉపయోగించి ఏఐ ఆధారిత న్యుమోనియా గుర్తింపు వ్యవస్థను అభివృద్ధి చేసింది. ఈ ప్రాజెక్ట్ సుమారు 90% కచ్చితత్వాన్ని సాధించి, మహిళల కోసం నిర్వహించిన స్టార్టప్ ఐడియాథాన్లో గుర్తింపు పొందింది.అంతకుముందు, ఆంధ్ర మెడికల్ కాలేజీలో రీసెర్చ్ అసిస్టెంట్గా ఉన్నప్పుడు, వ్యక్తిగత గుర్తింపులో పెదాల నమూనాలను విశ్లేషించడానికి మెషిన్ లెర్నింగ్ మోడల్లను అభివృద్ధి చేయడం ద్వారా ఫోరెన్సిక్ మెడిసిన్లో కృత్రిమ మేధ వినియోగాన్ని ఆమె అన్వేషించింది.అంతర్జాతీయ స్థాయికి..సిడ్నీలో జరిగిన అంతర్జాతీయ వ్యోమగామి కాంగ్రెస్ (IAC) 2025లో, మాధవి సూక్ష్మగురుత్వాకర్షణలో ఇంద్రియ గ్రహణశక్తిపై అంతరిక్ష వైద్యం కోసం 3D బయోప్రింటింగ్ సామర్థ్యంపై తన పరిశోధనను సమర్పించారు. తద్వారా సుదీర్ఘకాల అంతరిక్ష యాత్రల సమయంలో భవిష్యత్ ఆరోగ్య సంరక్షణపై జరిగిన చర్చలకు ఆమె తోడ్పడ్డారు.నిజానికి మాధవి ప్రయాణం ప్రపంచ ఆరోగ్య సంరక్షణలో పెరుగుతున్న ఒక కొత్త ధోరణిని తెలియజేస్తుంది. ప్రస్తుతం ఆసుపత్రులు, ఫార్మాస్యూటికల్ కంపెనీలు, పరిశోధనా సంస్థలు వైద్యం, సాంకేతికత రెండింటినీ అర్థం చేసుకోగల నిపుణులపై ఎక్కువగా ఆధారపడుతుండటం విశేషం. ఇది యువతకు ఒక పాఠంవిద్యార్థులను తరచుగా సైన్స్ లేదా టెక్నాలజీ, వైద్యం లేదా ఇంజనీరింగ్ వంటి ఒకే విభాగాన్ని ఎంచుకోమని ప్రోత్సహిస్తారు. భవిష్యత్తు ఎల్లప్పుడూ ఒకే వర్గంలోకి సరిగ్గా ఇమడదని మాధవి ప్రయాణం చూపిస్తుంది. కృత్రిమ మేధస్సు ఆరోగ్య సంరక్షణను పునర్నిర్మిస్తున్నందున, వైద్యం అంతకంతకూ డేటా-ఆధారితంగా మారుతోంది. సాంకేతికతను అర్థం చేసుకున్న వైద్యులు, వైద్యశాస్త్రాన్ని అర్థం చేసుకున్న సాంకేతిక నిపుణులు ప్రపంచంలోని అతిపెద్ద ఆరోగ్య సంరక్షణ సవాళ్లలో కొన్నింటిని పరిష్కరించడంలో కీలక పాత్ర పోషించగలరని నిరూపించే ఘటన ఇది. అంతేగాదు ఒక ప్రతిష్టాత్మకమైన సంస్థలో సీటు సంపాదించడంతోనే ఆగిపోకూడదని మాధవి కథ చెబుతోంది. విభిన్నంగా ఆలోచించి సంప్రదాయ కోర్సులను మిళితం చేసేలా అభ్యసించి మరిన్ని అవకాశాలు సృష్టించుకోగలుగుతామని చెబుతోంది.(చదవండి: అత్యంత ఖరీదైన 'టీ'.. కిలో రూ. 9 కోట్లా..! ఐతే..) -
ఒకటిన్న ఏడాదిలోనే 67 కిలోలు బరువు..! జస్ట్ ఒక్క నిమిషంలోనే..
బరువు తగ్గడం అంటే కఠినమైన డైట్, కష్టతరమైన వ్యాయామాలు, అధిక సమయం జిమ్ సెషన్ అనే భావన అందరిలో ఉంటుంది. కానీ కొందరు అవేమీ అవసరం లేకుండా రోజువారీ సరదాగా చేసే వర్కౌట్లతోనే సాధ్యమని చూపిస్తారు. అయితే వాటి ఏదో ఒక్కసారి కాకుండా ఇన్నిసార్లు అని చేస్తే చాలు అధిక సంఖ్యలో కేలరీలు, కొవ్వుని తగ్గించుకోవచ్చని అంటోంది ఈ ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్. అదెలాగో ఆమె మాటల్లోనే సవివరంగా తెలుసుకుందామా.!.క్రమం తప్పకుండా చేసే చిన్నపాటి కదలికలు కూడా మిమ్మల్ని చురుకుగా ఉంచుతాయని చెబుతున్నారు ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ రాజీ ఘంగాస్. ఆ వ్యాయామాలు ఒక నిమిషంలోనే గరిష్ట కేలరీలను తగ్గించగలదని అంటున్నారు. తాను సుమారు 155 కేజీల బరువు ఉండేదాన్ని అన్ని క్రమం తప్పకుండా చేసే తేలికపాటి వ్యాయామాలతోటే ఇంతలా బరువు తగ్గానంటూ తన వెయిట్లాస్ జర్నీ గురించి చెప్పుకొచ్చింది. అంతేగాదు రోజువారి దినచర్యలో సులభంగా చేర్చుకోగలిగే ఒక ఐదు సాధారణ కదలికల వ్యాయామాలను గురించి ఇన్స్టాగ్రామ్ వీడియోలో పంచుకుంది. బరువు తగ్గడం అంటే కేవలం జిమ్లో గంటల తరబడి గడపడం కాదు, క్రమం తప్పకుండా చేసే చిన్నపాటి కదలికలు కూడా అని అంటున్నారామె. చురుకుగా ఉంచడానికి, ఫిట్నెస్ని మెరుగుపరుచుకోవడానికి, కేలరీలను కరిగించుకోవడానికి ఎంతగానో ఉపయోగపడతాయని అంటున్నారామె. క్రమం తప్పకుండా వ్యాయామాలు చేసేలా చూసుకోవడం, సమతుల్య ఆహారం, ఆరోగ్యకరమైన జీవనశైలి వంటి వాటితోనే స్మార్ట్గా మారిపోవచ్చిన చెబుతోంది. తాను చెప్పబోయే చిన్న పాటి వర్కౌట్లు ఎంతటి బిజీ షెడ్యూల్లో అయినా సులభంగా చేయొచ్చని చెప్పుకొచ్చింది. అలా చేసే తాను సుమారు 67 కిలోలు పైనే తగ్గినట్లు తెలిపింది. అవేంటంటే..జంపింగ్ జాక్స్: పాదాలను కలిపి, చేతులను పక్కన ఉంచి నిలబడండి. కాళ్ళను దూరంగా చాపుతూ, చేతులను తల పైకి ఎత్తుతూ గెంతండి. తిరిగి ప్రారంభ స్థానానికి గెంతి, మళ్ళీ చేయండి.ఇలా కొద్దిసేపు రిపీట్ చేయాలి.హై నీ క్లాప్: నిటారుగా నిలబడి, ఒక మోకాలిని ఛాతీ వైపుకు పైకి లేపుతూ, పైకి లేపిన మోకాలి కింద లేదా పైన చేతులతో చప్పట్లు కొట్టండి. వేగంగా రెండు కాళ్ళ మధ్య మార్చి మార్చి చేయండి.స్టాండింగ్ క్రాస్-బాడీ క్రంచ్: మీపాదాలను భుజాల వెడల్పులో ఉంచి నిలబడి, చేతులను తల వెనుక ఉంచండి. ఒక మోకాలిని పైకి లేపుతూ, దానికి ఎదురుగా ఉన్న మోచేతిని దాని వైపుకు తీసుకురండి. తిరిగి ప్రారంభ స్థానానికి వచ్చి, రెండవ వైపున కూడా చేయండి.ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ జంప్: మపాదాలను కలిపి నిలబడండి. రెండు పాదాలతో ముందుకు గెంతి, వెంటనే తిరిగి ప్రారంభ స్థానానికి గెంతండి. మెత్తగా కింద పడటానికి మోకాళ్ళను కొద్దిగా వంచి ఉంచండి.స్పాట్ జాగింగ్: ఒకే చోట నిలబడి, ముందుకు కదలకుండా జాగింగ్ చేయండి. కదలికను సున్నితంగా, స్థిరంగా ఉంచడానికి, మచేతులను సహజంగా ఊపుతూ పాదాలను సౌకర్యవంతమైన వేగంతో పైకి లేపండి.చురుకుగా ఉండటం ఎల్లప్పుడూ సంక్లిష్టంగా ఉండనవసరం తన వర్కౌట్లతో చెప్పకనే చెప్పింది ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ రాజీ. క్రమం తప్పకుండా చేసే కొన్ని సాధారణ కదలికలు కూడా ఫిట్నెస్ అలవాటును పెంపొందించుకోవడాన్ని సులభతరం చేస్తాయి. వ్యాయామం చేయడం కొత్తగా ప్రారంభిస్తున్నట్లయితే, నెమ్మదిగా మొదలుపెట్టి, సరైన భంగిమపై దృష్టి సారించి, శక్తి సామర్థ్యాలు మెరుగుపడే కొద్దీ రౌండ్ల సంఖ్యను పెంచుకోడం మంచిదని సూచిస్తోంది. కాబట్టి మరింత కష్టతరమైన మార్గం కాకుండా సులువుగా సునాయాసంగా చేసే వర్కౌట్లను ఎంచుకుని కిలోల కొద్దీ బరువు తగ్గేందుకు రెడీ అవుదామా మరి..!. View this post on Instagram A post shared by Rajii Ghanghas (@rajiighanghas) (చదవండి: పెళ్లిలో ప్రాంక్ తెచ్చిన తంట..!పాపం ఆ వధువు స్నేహితురాలు..) -
నిరసనల్లో షబానా అజ్మీకి ఆకస్మిక తలతిరుగుడు..! ఎందుకిలా అంటే..
న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగిన శాంతియుత విద్యార్థి నిరసనలో పాల్గొంటున్నప్పుడు బాలీవుడ్ నటి షబానా అజ్మీ స్వల్ప అనారోగ్య సమస్యకు గురైనట్లు సమాచారం. నిరసన ప్రదర్శన వీడియోలలో వాలంటీర్లు, భద్రతా సిబ్బంది ఆ 75 ఏళ్ల నటికి సహాయం చేస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది అక్కడ రద్దీగా ఉన్న పరిసరాలలో మద్దతుదారులు ఆమెకు విసనకర్రతో విసురుతుండగా, ఆమె విశ్రాంతి తీసుకుంటుండటం స్పష్టంగా కనిపిస్తుంది వీడియోలో. ఆ నటి ఆరోజు అంతకుముందు నిరసన ప్రదర్శనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు పంచుకున్నారు. వాటిలో నటుడు ప్రకాశ్ రాజ్తో కలిసి ట్రక్కులో తోటి నిరసనకారులతో ప్రయాణిస్తున్న దృశ్యాలను కూడా పంచుకున్నారామె. ఈ ప్రదర్శన శాంతియుతంగా, విద్యా సంస్కరణకు మద్దతుగా జరిగిందని పునరుద్ఘాటించారు కూడా. అయితే ఆమెకు ఆ సమయంలో ఆకస్మికంగా తలతిరగడానికి గల కచ్చితమైన కారణం అధికారికంగా వెల్లడించినప్పటికీ..తరుచుగా నిర్లక్ష్యంగా చూసే ఈ ఆరోగ్య లక్షణం గురించి వెలుగులోకి వచ్చింది. ఇది చూడటానికి సాధారణ సమస్యే కానీ..ఒక్కోసారి ప్రమాదకరంగా మారుతుందని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. ఈ నేపథ్యంలో అసలు ఆకస్మిక తలతిరుగుడు అంటే ఏంటి? ఎందువల్ల వస్తుంది తదితరాల గురించి సవివరంగా తెలుసుకుందామా.ఆకస్మిక తలతిరుగుడు అంటే..తల తేలిపోతున్నట్లుగా అనిపించి, స్పృహతప్పి పడిపోవడం, సమతుల్యత కోల్పోవడం అని అంటారు. లేదా చుట్టూ ఉన్న పరిసరాలు గిరగిర తిరుగుతున్నట్లు అనిపించడం వంటి అనుభూతులను ఎదుర్కొంటుంటారు. ముఖ్యంగా వృద్ధులలో అత్యంత వైద్య సంరక్షణ కోరడానికి అత్యంత సాధారణ కారణాలలో ఈ ఆరోగ్య సమస్య కూడా ఒకటి. చాలా సందర్భాలలో తల తిరగడం తాత్కాలికమే. అందుకోసం కేవలం విశ్రాంతి, తగినంత నీరు తాగడం లేదా మూల కారణానికి చికిత్స చేయడం ద్వారా తగ్గిపోతుంది. ఒక్కోసారి తీవ్రమైన ఆరోగ్య సమస్యకు సంకేతం కూడా మారుతుంది. ఎందుకిలా జరుగుతుందంటే..ఎక్కువసేపు ఆరుబయట కార్యకలాపాలు చేసేటప్పుడు లేదా రద్దీగా ఉండే కార్యక్రమాలలో ఇలా జరుగుతుందిడీహైడ్రేషన్ (శరీరంలో నీటి శాతం తగ్గడం)వేడి వాతావరణం, అధికంగా చెమట పట్టడం, తగినంత ద్రవపదార్థాలు తీసుకోకపోవడం వల్ల రరక్తపోటు పడిపోయి, ఇది తల తిరగడానికి కారణమవుతుంది.ఎక్కువసేపు ఆరుబయట ఉండటం వల్ల హీట్ ఎగ్జాషన్ (వేడి అలసట) కలగవచ్చు. దీని లక్షణాలలో తల తిరగడం, అలసట, తలనొప్పి, వికారం, అధికంగా చెమట పట్టడం వంటివి ఉంటాయి.రక్తపోటు అకస్మాత్తుగా తగ్గడం - ముఖ్యంగా వేగంగా నిలబడిన తర్వాత - మెదడుకు రక్త ప్రసరణను తగ్గించి, తల తేలిపోవడానికి దారితీస్తుంది.భోజనం మానేయడం లేదా ఎక్కువసేపు శారీరక శ్రమ చేయడం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పడిపోయి, నీరసం, వణుకు, తల తిరగడం వంటి లక్షణాలు కనిపించవచ్చు.లోపలి చెవి రుగ్మతలు కారణంగా కూడా ఇలా జరగొచ్చు.రక్తపోటు మందులు, నిద్రమందులు కొన్ని యాంటీడిప్రెసెంట్లతో సహా కొన్ని రకాల మందులు వృద్ధులలో తల తిరగడానికి కారణం కావొచ్చు. వైద్య అత్యవసర పరిస్థితిగా ఎప్పుడు పరిగణిస్తారు..ఛాతీ నొప్పిఅకస్మాత్తుగా నీరసించడం లేదా తిమ్మిరిమాట్లాడటంలో ఇబ్బందితీవ్రమైన తలనొప్పిస్పృహ కోల్పోవడందృష్టి మసకబారడం లేదా రెండుగా కనిపించడంనిరంతర వాంతులుశ్వాస తీసుకోవడంలో ఇబ్బందిఎలా నివారించాలి?సాధారణ జీవనశైలి చర్యలు ప్రమాదాన్ని తగ్గించగలవు.ముఖ్యంగా వేడి వాతావరణంలో, తగినంత నీరు తాగండి.విరామం లేకుండా ఎక్కువసేపు నిలబడటం మానుకోండి.రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడానికి, క్రమం తప్పకుండా సమతుల్య భోజనం చేయండి.కూర్చున్న లేదా పడుకున్న స్థితి నుంచి నెమ్మదిగా లేవండి.వెచ్చని వాతావరణంలో తేలికపాటి దుస్తులు ధరించండి.అత్యధిక వేడిలో నీడ లేదా ఎయిర్ కండిషన్డ్ ప్రదేశాలను ఆశ్రయించండి.తల తిరగడం తరచుగా జరుగుతుంటే, వైద్యుడి సలహాలు, సూచనలు తీసుకోవాలి. గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. View this post on Instagram A post shared by Shabana Azmi (@azmishabana18) (చదవండి: వర్షాకాలంలోనే ఇన్ఫెక్షన్లు ఎందుకు అధికం.. ? వైద్యులు ఏమంటున్నారంటే..) -
వర్షాకాలంలోనే ఇన్ఫెక్షన్లు ఎందుకు అధికం.. ? వైద్యులు ఏమంటున్నారంటే..
వర్షాకాలం అంటేనే చాలు ఇన్ఫెక్షన్లు అధికమవుతాయి. అదీగాక చాలామంది పలానా ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నామంటూ వాపోతారు. దాంతో ఈ కాలం వ్యాధుల కాలమా? అనే ఫీలింగ్ కలుగుతంది కూడా. అసలు ఈ కాలంలో ఎందుకిలా జరుగుతుంది? అందుకు గల కారణాల గురించి ఆరోగ్య నిపుణుల మాటల్లోనే సవివరంగా తెలుసుకుందామా.వర్షాకాలంలో అధిక తేమ, నీరు నిల్వ ఉండటం, ఉష్ణోగ్రతలలో హెచ్చుతగ్గులు బ్యాక్టీరియా, వైరస్లు, దోమలు వేగంగా వృద్ధి చెందడానికి అనుకూలమైన వాతావరణాన్ని సృష్టిస్తాయి. దీనివల్ల సులభంగా ఇన్ఫెక్షన్లు వ్యాపిస్తాయి. అలాగే చాలా ప్రాంతాలు వరదల కారణంగా ముప్పుకి గురవ్వుతాయి. దీంతో నీటినిల్వలు అధికమై దోమలు వృద్ధి చెంది డెంగ్యూ, మలేరియా, చికున్గున్యా వంటి వ్యాధులు వ్యాప్తి చెందుతాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ఈ కలుషిత నీటి వల్ల తీసుకున్న ఆహారం సైతం పాయిజన్ అయ్యి, జీర్ణ సంబంధిత సమస్యలు, టైఫాయిడ్, హెపటైటిస్ఏ వంటి వ్యాధులు వచ్చే అవకాశాలు అధికమవుతాయని అంటున్నారు. అలాగే వాతావరణంలోని అధిక తేమ ఫలితంగా శిలింధ్రాలు లేదా బ్యాక్టీరియా వృద్ధికి దారితీసి మరిన్ని చర్మవ్యాధులకు కారణమవుతుందని హెచ్చరిస్తున్నారు. పైగా ఈ కాలంలో ప్రజలు రద్దీగా ఉండే ప్రదేశాలలోనూ, ఇళ్లల్లోనే ఎక్కువగా ఉంటారు. ఫలితంగా ఈ వైరస్లు ఒకరి నుంచి ఒకరికి సులభంగా సంక్రమిస్తాయని అన్నారు. అందుకే ఈకాలంలో జలుబు, ఫ్లూ, వైరల్ జ్వరం వంటి ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఎక్కువ. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే..ఈ కాలంలో బాత్రూంలను ఉపయోగించిన తర్వాత తినడానికి ముందు చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవడం వంటివి చేయాలి. తాజా ఆహారాన్ని మాత్రమే తినండి, శుభ్రమైన ఫిల్టర్ చేసినా లేదా మరిగించిన నీటిని మాత్రమే తాగండిరోడ్డు పక్కన కోసిన పండ్లు, పచ్చి సలాడ్లు కలుషితమయ్యే అవకాశాలు ఎక్కువ, కావున నివారించండిపరిసరాలను శుభ్రంగా ఉంచుకోండి. ఇంటి సమీపంలో ఎక్కడ నీటి నిల్వలు లేకుండా చూసుకోండికీటక నివారిణులను ఉపయోగించడం, ముఖ్యంగా తెల్లవారుజామున, సాయంత్రం వేళల్లో దోమల నివారణ వలలను వాడటం, పూర్తి చేతుల కప్పి ఉంచేలా దుస్తులు ధరించడం ద్వారా కీటకాల కాటును నివారించండి.వర్షంలో బూట్లు లేదా దుస్తులు తడిస్తే, ఫంగల్ చర్మ ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని తగ్గించడానికి పొడి బూట్లు లేదా దుస్తులు మార్చుకోండి. మధుమేహం, ఆస్తమా, గుండె జబ్బులు, దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధులు, బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ ఉన్నవారు, చిన్నపిల్లలు లేదా వృద్ధులు ఇన్ఫెక్షన్ సంబంధిత సమస్యల బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వారు ఇన్ఫెక్షన్ను నివారించడానికి తగిన శ్రద్ధ తీసుకోవాలని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ఇవి వైరల్ ఇన్ఫెక్షన్లను తగ్గించకపోగా, యాంటీ బయోటిక్ నిరోధకతను పెంచుతుంది. రెండు రోజుల కంటే ఎక్కువ కాలం జ్వరం, తీవ్రమైన నొప్పి, నిరంతర వాంతులు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, మూత్రవిసర్జన తగ్గడం, రక్తస్రావం లేదా నీరసం వంటి లక్షణాలు ఉంటే తక్షణమే వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం. అదీగాక వ్యాధిని సకాలంలో గుర్తించగలిగితే, వైద్యులు సమస్యకు తగిని విధంగా చికిత్స అందించి ఇతర సమస్యలు తలెత్తకుండా నివారించగలరనే విషయం గుర్తించుకోండి అని నొక్కి చెబుతున్నారు వైద్యులు.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం.(చదవండి: జస్ట్ రెండేళ్లలో 142 కేజీల నుంచి 80 కేజీలకు..! నిలకడగా బరువు తగ్గాలంటే..) -
Health: తప్పొప్పుల ఉప్పు..
మనం ప్రతిరోజూ ఉప్పు వాడకుండా అస్సలు ఉండం. ఇందులో ఉండే రసాయనం పేరే ‘సోడియమ్ క్లోరైడ్’. సాంకేతికంగా సంక్షిప్తంగా ఎన్ఏసీఎల్ అంటూ చెబుతారు. ఇప్పుడు మార్కెట్లో రకరకాల ఉప్పులు దొరుకుతున్నాయి. వాటి ప్రయోజనాలూ, ప్రతికూలతలూ పరిశీలిద్దాం. ఉప్పు మోతాదు ఎక్కువైనా తక్కువైనా ముప్పు అన్న విషయాన్నీ తెలుసుకుందాం.- మన సంస్కృతిలో ఉప్పు భూమిక తక్కువేమీ కాదు.- మన వాడుకలో ఉప్పు వాడకం చిన్నదేమీ కాదు. అందుకే అది...- ‘ఉప్పు’కప్పురంబు అంటూ పద్యాల్లో ఉంటుంది. - పదునగు మంచికూర నలపాకం చేసి... అందు ‘ఉప్పు’ లేక రుచిపుట్టగ నేర్చునా అంటూ శతకాల్లో ఉంటుంది. - ఎంతటి ధనవంతుడైనా ఉప్పు భోజనమే తప్ప మెరుగుబంగారం మింగబోడంటూ జాతీయాల్లో ఉంటుంది. - ఒకప్పుడు వేతనం ఉప్పు రూపంలో ఉండటంతో ‘‘మీ ఉప్పు తిని బతికాం’’ అంటూ నుడికారాల్లోనూ ఉంటుంది. - ఉప్పు లేని కూర... చప్పిడి భోజనం అంటూ సామెతల్లోనూ ఉంటుంది. - వీటన్నింటికీ తోడు మన వంటల్లో ఎలాగూ ఉంటుంది. - సంస్కృతిలోనే కాదు... ఆరోగ్యం పేరిట ఇప్పుడు వంట దినుసుగా కూడా ఎన్నెన్నో రకాలుగా దొరుకుతోంది. ఆ ‘ఉప్పు’ స్వరూపాలేమిటో, వాటి ఉపయోగాలేమిటో చూద్దాం.1. ఫ్లేక్ సాల్ట్..ఇది పూర్తిగా సాధారణ టేబుల్ సాల్ట్ లాంటిదే. అయితే ఇది స్ఫటికాలలా కాకుండా చాలా పలుచని రేకుల్లా, తేలిగ్గా విరిగే (బ్రిటిల్) పొరలు పొరల రేకుల్లా, కొన్ని సందర్భాల్లో ఖాళీగా ఉండే పిరమిడ్లా కూడా ఉంటుంది. దీన్ని ఖరీదైన రెస్టారెంట్లలో వాడుతుంటారు. వంట చివర్లో చల్లుతారు.లాభాలు / లోపాలు ఫ్లేక్ సాల్ట్ను రుచి కోసం కంటే మంచి టెక్స్చర్ కోసం ఎక్కువగా వాడతారని చెప్పవచ్చు. వంటల్లో త్వరగా కరిగిపోతుంది. ఇది మినహా మిగతాదంతా దాదాపుగా టేబుల్ సాల్ట్ లాగే ఉంటుంది.2. స్మోక్డ్ సాల్ట్..ఇది కొన్ని ప్రత్యేకమైన కలప / చెక్కను కాల్చి ఆ పొగతో పొగచూరేలా చేసిన ఉప్పు. నిర్దిష్టమైన కొన్ని రకాల చెక్క బెరడును కాలుస్తూ ఆ పొగను దాదాపు 14 రోజుల పాటు పొగచూరేలా చేశాక ఆ ఉప్పు ఒక రకమైన (సు)వాసన వస్తుంటుంది. ఇలా ఉప్పును ‘స్మోక్డ్’ ఉప్పుగా మార్చడం కోసం సాధారణంగా ఓక్, ఆపిల్ ఉడ్, ఆల్డర్, హికరీ, మెస్క్వైట్ వంటి చెక్కలను కాలుస్తారు. ఇలా సరికొత్త ఫ్లేవర్తో రూపొందడంతో ఈ తరహా ఉప్పు బార్బెక్యూ వంటలకు బాగా సరిపోతుంది.లాభాలు / లోపాలుదీని వాడకం వల్ల జీర్ణక్రియ కొంత మెరుగుపడుతుందనే భావన ఉంటుంది. ఇందుకు శాస్త్రీయమైన రుజువులు పెద్దగా లేవు. అయితే పరిమితంగా వాడినప్పుడు అలాంటి ఫీలింగ్ కొంతమందిలో కనిపిస్తుంది. దీన్ని ఎక్కువగా వాడటం వల్ల కడుపు ఉబ్బరం వంటి ప్రతికూలతలు కనిపిస్తాయి. ఎక్కువగా వాడితే సాధారణ ఉప్పు వల్ల ఉండే దుష్పరిణామాలే ఉంటాయి.3. పొటాషియం ఉప్పు..(పొటాషియమ్ ఉప్పు) లేదా ‘లో–సోడియం సాల్ట్’ (సోడియమ్ తక్కువ మోతాదులో ఉండే ఉప్పు) ఇందులో సోడియం మోతాదును కొంత తగ్గించి పొటాషియం క్లోరైడ్ కలుపుతారు. ఎందుకంటే సోడియమ్ క్లోరైడ్కు బదులు పూర్తిగా పొటాషియమ్ క్లోరైడ్ ఉంటే అది ఒకరకమైన చేదైన రుచితో ఉండవచ్చు.లాభాలు / లోపాలుసాధారణంగా సోడియమ్ లవణాలు రక్తపోటు (బీపీ)ను పెంచితే... దీనికి భిన్నంగా పొటాషియమ్ బీపీని తగ్గిస్తుంది. అందుకే బీపీ ఉన్నవారికి ప్రయోజనకరంగా దీన్ని కొందరు ఉపయోగిస్తుంటారు. అయితే దీన్ని ఎక్కువగా వాడటం వల్ల రక్తంలో పొటాషియమ్ మోతాదు పెరిగి ‘హైపర్కెలామియా’ అనే ఆరోగ్యపరమైన అనర్థం కలగవచ్చు. దీనికి తోడు కిడ్నీ వ్యాధి లేదా కిడ్నీ సమస్యలు ఉన్నవారు దీని వాడకంలో జాగ్రత్తగా ఉండటం అవసరం.4. సెలరీ సాల్ట్సెలరీ గింజల పొడిని ఉప్పుతో కలిపి బ్లెండ్ చేయడం వల్ల వచ్చే ‘ఉప్పు’ను ‘సెలరీ సాల్ట్’గా పేర్కొంటారు. ఇది పూర్తిగా మామూలు ఉప్పు లాంటిదే అయినప్పటికీ కొన్ని రకాల ఆహారాల్లో ఫ్లేవర్ కోసం దీన్ని వాడుతుంటారు. సాధారణంగా బేకరీ ఐటమ్స్ అయిన హాట్డాగ్లు, కొన్ని మాక్టెయిల్ పానియాల్లో, అలాగే కొన్ని రకాల సలాడ్స్లో దీన్ని వాడతారు. ఇక కొన్ని సూపులూ, రోస్టెడ్ వెజిటబుల్స్లోనూ ఉపయోగిస్తారు. సెలరీ గింజలను కలపడం తప్ప దీని మిగతా గుణాగణాలన్నీ సాధారణ ఉప్పువే.5. వెల్లుల్లి ఉప్పు (గార్లిక్ సాల్ట్) మూడు మోతాదుల ఉప్పుకు ఒక మోతాదు ఎండిన వెల్లుల్లి ΄ûడర్ను కలిపి తయారు చేసేదే ఈ గార్లిక్ సాల్ట్. వంటల్లో మంచి రుచికోసం దీన్ని వాడుతుంటారు. సాధారణంగా మంచి రుచి కోసం మాంసాహారాలూ, కొన్ని రకాల శాకాహారాలతో పాటు ముఖ్యంగా పాప్కార్న్ తయారీలో దీన్ని ఉపయోగిస్తుంటారు. ఇది మినహా దాదాపుగా ఇది సాధారణ ఉప్పు లాంటిదే.6. ఉల్లి ఉప్పు (ఆనియన్ సాల్ట్)వెల్లుల్లి ఉప్పులో వెల్లుల్లి కలిపినట్టే... ఇందులో మూడు మోతాదుల ఉప్పుకు ఒక మోతాదు ఎండబెట్టిన ఉల్లి ΄ûడర్ను కలిపి దీన్ని తయారు చేస్తారు. కాస్తంత మంచి ఫ్లేవర్ కోసం దీన్ని వాడుతుంటారు. ఇది మినహా ఇందులోనూ దాదాపు టేబుల్ సాల్ట్లో ఉండే గుణగణాలూ, లాభనష్టాలే ఉంటాయి. 7. అయోడైజ్డ్ సాల్ట్సాధారణ టేబుల్ సాల్ట్కు అయోడిన్ కలిపితే వచ్చేదే ఐయోడైజ్డ్ సాల్ట్. కొన్నేళ్ల నుంచి మనదేశంలో సామాజిక, సామూహిక ఆరోగ్యం కోసం వాడుతున్న ఉప్పు ఈ అయోడైజ్డ్ ఉప్పు.లాభాలు..- ఒకప్పుడు మన దేశంలో లక్షలాది మందికి అయోడిన్ లోపం వల్ల... గాయిటర్, థైరాయిడ్ సమస్యలు- పిల్లల్లో మెదడు ఎదుగుదలలో లోపాలు... కనిపించేవి. అందుకే మన ప్రభుత్వాల ఆధ్వర్యంలో అయోడైజ్డ్ ఉప్పుకు ప్రాధాన్యం,ప్రోత్సాహం దొరికింది. దాంతో పిల్లలూ, పెద్దల్లో ఆ ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పట్టాయి.లోపాలు..ఒక్క అయోడిన్ కలపడం మినహా ఇది పూర్తిగా సాధారణ టేబుల్ సాల్ట్ లాంటిదే. అందుకే ఎక్కువ మోతాదులో వాడితే బీపీ పెరగడం వంటి అనర్థాలు ఏర్పడతాయి. రక్తం వడపోత సమయంలో మూత్రపిండాలపై ప్రతికూల ప్రభావాలు కనపడతాయి.8. సీజనింగ్ సాల్ట్ ఇందులో సాధారణ ఉప్పుకు మిరియాల ΄ûడర్, వెల్లుల్లి ΄ûడర్, ఉల్లి ΄ûడర్, కొన్ని సందర్భాల్లో అజినమోటో వంటి (ఎమ్ఎస్జీ) ΄ûడర్, పాప్రికా (ఇది ఒకరకం కలరింగ్ అండ్ ఫ్లేవర్ ఏజెంట్)తో పాటు ఇతర రకాల మసాలాలు కలిపి తయారు చేస్తారు. మంచి రుచి కోసం వాడే ఉప్పు ఇది. ఇందులోనూ ప్రధానంగా రుచి కోసం కలిపే పదార్థాల గుణాలు తప్ప... ఎక్కువ మోతాదు సాధారణ ఉప్పే ఉంటున్నందున... పరిమితికి మించి వాడితే దానివల్ల కలిగే దుష్పరిణామాలే కనిపిస్తాయి.9. అజినోమోటో (ఎమ్ఎస్జీ)ఇది చైనీస్ వంటకాల్లో వాడే ఉప్పు అని చాలామందికి తెలిసిన విషయమే. సాధారణ ఉప్పులో ఉండే రసాయనం సోడియమ్ క్లోరైడ్ అయితే ఇందులో మోనో సోడియమ్ గ్లుటామేట్ అనే రసాయనం ఉంటుంది. దీనివల్ల సా«ధారణంగా మనకు తెలిసిన తీపి, ఉప్పు, చేదు, వగరు రుచులకు తోడుగా ‘ఉమామీ’ అనే ప్రత్యేకమైన రుచి వస్తుంది. అందుకే ఈ ప్రత్యేక రుచి కోసం జపనీయులు, కొరియన్లు... మరీ ముఖ్యంగా చైనీస్ తమ వంటకాల్లో ఈ తరహా ‘ఉప్పు’ను వాడుతుంటారు.10. పిక్లింగ్ సాల్ట్దీన్ని ఊరగాయల కోసం ప్రత్యేకంగా తయారు చేస్తారు. ఇందులో అయోడిన్, యాంటీ–కేకింగ్ పదార్థాలు ఉండవు కాబట్టి ఊరగాయ రంగు మారకుండా ఉండటానికి ఉపయోగపడుతుంది.11. సాధారణ ఉప్పు (టేబుల్ సాల్ట్)ఇది దాదాపు మనందరమూ ప్రతిరోజూ కూరల్లో, వంటకాల్లో... భోజనం అయ్యాక పెరుగులో రోజూ వాడే తెల్లని ఉప్పు. ఇందులో ఉండేవి...- 97–99% సోడియం క్లోరైడ్.- ఉప్పు గడ్డకట్టకుండా ఉండటం కోసం కొద్దిగా యాంటీ–కేకింగ్ ఏజెంట్లు వాడతారు.- కొంతకాలం కిందటి నుంచి అయోడిన్ కలుపుతున్నారు. - లాభాలు.. చాలా చవక, దాదాపు చాలావరకు పరిశుభ్రంగా ఉంటుంది.- అయోడిన్ కలిపితే అయోడైజ్డ్ రూపంలో దొరుకుతుంది.- లోపాలు.. సోడియం మోతాదు ఎక్కువ. ఎక్కువగా తినడం వల్ల హై–బీపీ రావచ్చు. (బీపీ పెరగవచ్చు)12. రాక్ సాల్ట్ (సైంధవ లవణం)ఇది కూడా సాధారణ టేబుల్ సాల్ట్ లాంటిదే అయినా ఇది లభ్యమయ్యేది గనుల నుంచే. అందుకే కొన్ని ఇతర లవణాలు కలవడం వల్ల దీన్ని రంగు కాస్త వేరుగా ఉండవచ్చు. సాధారణంగా దీని రంగు... తెలుపు, గులాబీ, లేత బూడిద.- ప్రత్యేకత : ఇందులో కొద్ది మోతాదులో కొన్ని సహజ ఖనిజాలు ఉంటాయి. కానీ వాటి మోతాదు చాలా చాలా తక్కువ. అందువల్ల ‘రాక్ సాల్ట్ తీసుకోవడం వల్ల దేహానికి కాల్షియం, మెగ్నీషియం బాగా అందుతాయి’ అనే మాటలో పెద్దగా వాస్తవం లేదు.13. కోషర్ సాల్ట్ ఇది పూర్తిగా సాధారణ ఉప్పులాంటిదే. అయితే దీని స్ఫటికాల సైజు, వాటి సాంద్రత వేరుగా ఉంటాయి. ఇందులో అయోడిన్, యాంటీ కేకింగ్ ఏజెంట్స్ ఉండవు.దీని ప్రత్యేకతలు..- దీని లభ్యత పెద్ద స్ఫటికాల రూపంలో.- చేతితో చల్లడానికి సులువుగా ఉంటుంది.- మాంసానికి బాగా అంటుతుంది. సాధారణ ఉప్పతో పోలిస్తే ఆరోగ్య పరంగా ప్రత్యేకమైన తేడా ఏమీ ఉండదు.14. బ్లాక్ సాల్ట్ (కాలా నమక్)ఇది భారతదేశంలో బాగా ప్రసిద్ధి. తెలుగులో దీన్ని ‘నల్ల ఉప్పు’ / ‘నల్లుప్పు’ అని పిలుస్తారు. ఇందులో గంధకం (సల్ఫర్) సమ్మేళనాలు ఉండటం వల్ల కొద్దిగా ఉడికించిన గుడ్డులాంటి వాసన లేదా కాస్తంత ఘాటైన వాసన వస్తుంటుంది. దీన్ని చాట్ మసాలాలు, పెరుగుచట్నీ (రాయితా), పండ్లపై చల్లుతారు.15. హిమాలయన్ పింక్ సాల్ట్ఇది కూడా ఒక రకం రాక్ సాల్టే. కాకపోతే ఇది హిమాలయ సానువులనుంచి లభ్యమయ్యే లవణం. దీనికి గులాబీ రంగు రావడానికి కారణం ఇందులో ఉండే ఐరన్ ఆక్సైడ్. అయితే దీన్ని మార్కెట్ చేసే కొన్ని కంపెనీలు ఇందులో ‘84 రకాల ఖనిజలవణాలు (మినరల్స్) ఉన్నాయంటూ పేర్కొంటుంటాయి. ఇది వాస్తవమే అయినప్పటికీ... నిజానికి ఆ మోతాదులు చాలా చాలా తక్కువ. ఆ 84 ఖనిజాలన్నీ చాలా సూక్ష్మ పరిమాణాల్లో మాత్రమే ఉంటాయి. అందువల్ల వాటి ద్వారా ఆరోగ్యానికి ప్రత్యేకమైన ప్రయోజనాలు చేకూరతాయని చెప్పే మాటలకు బలమైన శాస్త్రీయ ఆధారాలు లేవు.16. సముద్రపు ఉప్పు (సీ సాల్ట్)దీన్ని సముద్రపు నీటి నుంచి తయారు చేస్తారు. సముద్రపు ఒడ్డున మడిలాగా చేసి అనేక మడులలో సముద్రపు నీటిని ప్రవహింపజేసి, ఆ నీరు క్రమంగా ఇగిరిపోయేలా / ఆవిరైపోయేలా చూస్తారు. ఇలా మడిలా చేసి తీస్తారు కాబట్టి దీన్ని సముద్రం నుంచి పండించే ‘‘ఉప్పు పంట’’గా అభివర్ణిస్తారు.ఇందులో ‘సోడియం క్లోరైడ్’తో పాటు ఉండేవి... మెగ్నీషియం – కాల్షియం ∙పొటాషియం... అనే ఈ లవణాలన్నీ కూడా కొద్ది కొద్ది మోతాదుల్లో ఉంటాయి. ఈ లవణాల కారణంగా రుచి కాస్త భిన్నంగా ఉన్నప్పటికీ ఇది దాదాపు టేబుల్ సాల్ట్తో సమానమే. ఇందులోని అనుకూలతలూ, ప్రతికూలతలూ సాధారణ టేబుల్ సాల్ట్తో సమానం.ఇదొక ఉప్పు కాని ఉప్పు..వాస్తవంగా చెప్పాలంటే ఇది మామూలు ఉప్పు లాంటిది కాదు. ఈ మోనోసోడియం గ్లూటామేట్ రసాయనంలో గ్లూటామేట్ అనే అమైనో యాసిడ్ ఉంటుంది. దీనివల్లనే ఉమామీ అనే కొత్త రుచి వస్తుంది. ఈ తరహా ఉప్పు కాని ఉప్పులో కొన్ని రకాల మష్రూమ్ (పుట్టగొడుగుల) పొడి, సముద్రపు ఆల్గే తాలూకు పొడి, ఎండిన టమాటా, ఈస్ట్ నుంచి తీసిన ఎక్స్ట్రాక్ట్ల వంటివి కలిపి తయారు చేస్తారు. దీన్ని కొన్ని రకాల వంటల్లో ఒక సీజనింగ్ మిశ్రమాలతో తయారైన ‘ఉమామీ సాల్ట్’గా వాడుతుంటారు. అందుకే దీన్ని ఉప్పు అనడం కంటే... ఇదొక అనేక రకాల ఫ్లేవర్లను ఇచ్చే పదార్థాల ఒక ప్రత్యేకమైన మిశ్రమంగా చెప్పవచ్చు.ఒక సూచన: దీన్ని ఎక్కువగా వాడటం వల్ల ఆరోగ్యపరమైన అనర్థాలు ఎక్కువే. అందుకే దీన్ని చాలా పరిమితంగా మాత్రమే... అందునా చాలా అరుదుగా వాడటమే మంచిది.ఉప్పు... ముప్పు! చాలా కంపెనీలు తమ ఉత్పాదన తాలూకు ఉప్పులో 70 రకాల ఖనిజాలు, 84 ఖనిజాలు, ప్రాచీన సముద్రాల ఉప్పు‘, ‘డిటాక్స్ సాల్ట్’, ‘మినరల్ సాల్ట్‘ వంటి ఆకర్షణీయమైన పదాలతో ప్రచారం చేసుకుంటూ ఉంటాయి. వినడానికి ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ, ఆరోగ్యపరంగా వాటితో అంతగా ప్రయోజనం ఉండదన్న విషయం తెలుసుకోవాలి. అది ఏ రకమైన ఉప్పు అయినప్పటికీ అందులోని సోడియం మోతాదు ఎక్కువైతే అధిక రక్తపోటు, గుండె–రక్తనాళాల సమస్యల ప్రమాదాలు పెరుగుతాయి. అందుకే మనం ఏ రకమైనది అయినప్పటికీ ‘ఉప్పు పెరిగితే ముప్పు’ అని గుర్తుంచుకోవాలి.ఒక ముఖ్యమైన విషయం... సాధారణ ప్రజలలందరూ వాడుకోతగినది అయోడైజ్డ్ ఉప్పు. ఇక రక్తపోటు ఉన్నవారు వైద్యుల సలహా మేరకు లో–సోడియం (పొటాషియం) ఉప్పు వాడుకోవచ్చు. అలాగే రాక్ సాల్ట్, పింక్ సాల్ట్, సీ సాల్ట్ వంటి వాటిని రుచి లేదా వంట అవసరాల కోసం వాడవచ్చుగానీ అవేవో ఆరోగ్యపరంగా అద్భుతాలు చేస్తాయన్నది కేవలం అపోహ మాత్రమే. చివరగా... ఆసక్తికరమైన విషయం చెప్పాలంటే... ఉప్పు (సోడియం క్లోరైడ్)లోని అయాన్ల వల్లనే మన మెదడు నుంచి కండరాలకు కదలికల కోసం అవసరమైన సంకేతాలు అందుతుంటాయి. ఈ ఉప్పు అనేదే లేకపోతే మన నరాల నుంచి విద్యుత్ తరంగాల రూపంలో సంకేతాలు అందవు. అప్పుడు కండరాలు కదలవు, గుండె సక్రమంగా కొట్టుకోదు. అందుకే ఎంత మోతాదులో అవసరమో అంత మోతాదులో ఉప్పు వాడాల్సిందే. అది ప్రతివ్యక్తికి రోజుకు 5 గ్రాములు మించకూడదు (డబ్ల్యూహెచ్ఓ ప్రకారమైనా లేదా మన ఐసీఎమ్ఆర్ సూచనల ప్రకారమైనా) అని గుర్తుంచుకోండి. అంతేతప్ప పూర్తిగా ఉప్పు మానేస్తే ‘హైపో నైట్రీమియా’ అనే ఆరోగ్యపరమైన అనర్థం ఏర్పడుతుందని గుర్తుంచుకోవాలి.- ఎస్. స్వాతి, క్లినికల్ డైటీషియన్నిర్వహణ: యాసీన్ -
వేగంగా తింటున్నారా? ఇది మీ కోసమే..
ఉదయం హడావుడి.. ఆఫీసుకు వెళ్లే తొందర.. సమయం సరిపోకపోవడం.. ఇలా కారణాలు ఏవైనా కావచ్చు. కానీ కొందరి భోజనం చేసే స్టైల్ మాత్రం అందరికీ కనిపిస్తుంది. పక్కన కూర్చున్న వారు ఇంకా మొదటి ముద్దలో ఉండగానే.. వీరు మాత్రం ప్లేట్ ఖాళీ చేసేస్తారు. ఒక్కో ముద్దను వేగంగా తీసుకుంటూ.. మధ్యలో పెద్దగా విరామం లేకుండా భోజనం ముగించేస్తారు. “త్వరగా తినడం ఒక అలవాటే కదా.. ఇందులో ఏముంది?” అనుకుంటాం. కానీ..మనం తినే వేగం కూడా మన ఆలోచనా విధానం, జీవనశైలి, కొన్ని ప్రవర్తనా లక్షణాలకు చిన్న సంకేతం కావచ్చట. సైకాలజిస్టులు చెబుతున్న విషయం ఆసక్తికరంగా ఉంది మరి. ఆ విషయాలు పరిశీలిస్తే.. వేగంగా తినే అలవాటు వెనుక కేవలం తొందర మాత్రమే కాకుండా.. సమయాన్ని చూసే విధానం, పనులను పూర్తి చేసే తీరు, రోజువారీ జీవితంలో ఉండే వేగం వంటి అంశాలు కూడా దాగి ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు. అయితే ఇది వ్యక్తిత్వాన్ని పూర్తిగా అంచనా వేసే పరీక్ష కాదని.. కేవలం కొన్ని ప్రవర్తనా ధోరణులను అర్థం చేసుకునేందుకు ఉపయోగపడే చిన్న సంకేతంగా మాత్రమే చూడాలని సూచిస్తున్నారు.లక్ష్యాలపై ఫోకస్ ఎక్కువగా ఉంటుందా?.. వేగంగా తినే వ్యక్తుల్లో.. కొంతమంది లక్ష్యాలపై ఎక్కువ దృష్టి పెట్టే స్వభావం కలిగి ఉంటారని నిపుణులు చెబుతున్నారు. వీరికి సమయం చాలా విలువైనదిగా అనిపిస్తుంది. చేయాల్సిన పనుల జాబితాను త్వరగా పూర్తి చేసి.. తర్వాతి లక్ష్యానికి వెళ్లాలనే ఆలోచన ఎక్కువగా ఉండొచ్చు. అందుకే భోజనం కూడా ఆస్వాదించే సమయం కంటే.. పూర్తి చేయాల్సిన మరో పనిలా మారిపోయే అవకాశం ఉంటుంది.వేచి ఉండటం నచ్చదా?.. వేచి ఉండటాన్ని ఇష్టపడకపోవచ్చని నిపుణులు చెబుతున్నారు. క్యూలో నిలబడటం, ఆలస్యంగా జరిగే పనులు, నెమ్మదిగా సాగే చర్చలు వారికి అసహనాన్ని కలిగించవచ్చు. వారి జీవనశైలి కూడా వేగంగానే సాగుతూ ఉంటుంది. ఒక పని పూర్తయిన వెంటనే మరో పని మొదలుపెట్టాలనే ఆలోచన వారిలో కనిపించవచ్చు. అయితే ప్రతి వేగంగా తినేవారు అసహన స్వభావం కలిగిన వారే అని చెప్పలేం. సమయాభావం, పని ఒత్తిడి వంటి కారణాలు కూడా దీనికి కారణం కావచ్చు.ఎప్పుడూ తర్వాతి పని గురించే ఆలోచనా?.. కొంతమంది భోజనం చేస్తున్నప్పటికీ వారి మనసు అక్కడ ఉండదు. ఫోన్లో మెసేజ్లు చూడటం.. ఆఫీస్ పనుల గురించి ఆలోచించడం.. తర్వాత చేయాల్సిన పనుల జాబితా సిద్ధం చేసుకోవడం వంటి అలవాట్లు ఉండొచ్చు. సైకాలజిస్టుల ప్రకారం ఇది ‘టాస్క్-ఫోకస్డ్ మైండ్సెట్’ కావొచ్చు. అంటే ప్రస్తుత క్షణాన్ని ఆస్వాదించడం కంటే.. తర్వాతి పని పూర్తి చేయడంపై దృష్టి పెట్టే స్వభావం.👉..అయితే.. వేగంగా తినడం వల్ల శరీరం ఇచ్చే ముఖ్యమైన సంకేతాలను మనం పట్టించుకోకపోవచ్చు. ముఖ్యంగా “ఇక చాలు” అనే తృప్తి సంకేతం మెదడుకు చేరడానికి కొంత సమయం పడుతుంది. కానీ వేగంగా తినేవారిలో భోజనం అప్పటికే పూర్తవుతుంది. దీంతో అవసరానికి మించి తినే అవకాశం పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అందుకే నెమ్మదిగా తినడం వల్ల ఆకలి, తృప్తి స్థాయిని మెరుగ్గా అర్థం చేసుకోవచ్చని సూచిస్తున్నారు.👉ఈ అలవాటు ఉన్నవారు బిజీ షెడ్యూల్స్కు త్వరగా అలవాటు పడే అవకాశం ఉందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. తక్కువ సమయంలో నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితులు, ఒత్తిడితో కూడిన పనులు, వేగంగా మారే పరిస్థితుల్లో వీరు సౌకర్యంగా పనిచేయగలరని నిపుణులు భావిస్తున్నారు. అయితే కొందరు కేవలం పరిస్థితుల వల్లే వేగంగా తింటారు. ఉదాహరణకు.. తక్కువ లంచ్ బ్రేక్, కుటుంబ బాధ్యతలు, చిన్నప్పటి నుంచి వచ్చిన అలవాట్లు కూడా కారణం కావచ్చు.👉భోజనం చేసే సమయంలో ఆహారం రుచి, వాసన, ఆకలి, తృప్తిని గమనిస్తూ తినడాన్ని ‘మైండ్ఫుల్ ఈటింగ్’ అంటారు. వేగంగా తినే వారిలో ఈ అలవాటు తక్కువగా ఉండే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. నెమ్మదిగా తినడం వల్ల ఆహారాన్ని ఆస్వాదించడంతో పాటు.. శరీరం ఇచ్చే సంకేతాలను కూడా మెరుగ్గా గమనించవచ్చు.ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఒక్కటే.. తినే వేగం ఆధారంగా ఒకరి వ్యక్తిత్వాన్ని నిర్ణయించలేం. చిన్ననాటి అలవాట్లు, కుటుంబ వాతావరణం, సంస్కృతి, పని ఒత్తిడి, జీవన పరిస్థితులు.. ఇలా ఎన్నో అంశాలు మన తినే విధానాన్ని ప్రభావితం చేస్తాయి. కాబట్టి వేగంగా తింటున్నారని మీరు తప్పనిసరిగా ఓ ప్రత్యేకమైన వ్యక్తిత్వం కలిగిన వారని కాదు. కానీ మీ రోజువారీ అలవాట్లను గమనించడానికి ఇది ఒక చిన్న సంకేతం కావచ్చు. మరి మీరు ఏ రకం? ప్లేట్ అందరికంటే ముందే ఖాళీ చేసేవారా.. లేక నెమ్మదిగా ఆహారాన్ని ఆస్వాదిస్తూ తినేవారా?. -
ఎందుకీ సంతానలేమి?
మునపటితో పోలిస్తే ఇటీవల మనదేశంలో సంతానలేమి కేసులు పెరుగుతున్నాయి. అందుకే కృత్రిమ గర్భధారణ (ఫెర్టిలిటీ) సెంటర్లను సందర్శించే దంపతుల సంఖ్యా పెరుగుతోంది. ఒక అంచనా ప్రకారం చూస్తే... ప్రతి ఆరుగురు దంపతుల్లో ఒక జంటను సంతానలేమి సమస్య బాధిస్తోంది. ఇది కాస్త గడ్డు పరిస్థితే అని చెప్పవచ్చు. ఎందుకంటే ... జనాభాలో యువత శాతం తగ్గడం వల్ల అనేక ప్రతికూలతలు కనిపిస్తాయి. ఆ సమాజం వృద్ధసమాజంగా మారి మానవ వనరులు కొరవడతాయి. దాంతో ఆ దేశ ఆర్థిక సంపద తగ్గడం, జీవన నాణ్యతలు దిగజారడం వంటి అనర్థాలు ఏర్పడతాయి. ప్రస్తుతం జపాన్ వంటి కొన్ని దేశాలు ఇందుకు ఉదాహరణ. అలాంటి పరిస్థితి రాకుండా ఉండి ఓ సమాజం యౌవనంగా, ఆరోగ్యకరంగా ఉండాలంటే పనిచేసే సామర్థ్యం ఉన్న యువత సంఖ్య స్థిరంగా ఉండటమో లేదా పెరుగుతుండమో జరగాలి. ఇదే జరగకపోతే ఆ దేశం వంధ్యత్వ సంక్షోభం (ఇన్ఫెర్టిలిటీ) దిశగా పురోగమిస్తూ.. అభివృద్ధి పథంలో తిరోగమిస్తుంది.25న ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ డే సందర్భంగా కృత్రిమ గర్భధారణ విషయంలో అనేక అంశాలపై ‘సాక్షి’ వరుస కథనాలు...ఇటీవల మన సమాజంలో సంతానలేమి సమస్యతో బాధపడుతున్నవారి సంఖ్య పెద్ద ఎత్తున పెరగడానికి అనేక అంశాలు కారణమవుతున్నప్పటికీ వీటిని ప్రధానంగా రెండుగా చెప్పవచ్చు. అవి మొదటిది... సామాజిక , రెండు ఆరోగ్య కారణాలుగా చెప్పవచ్చు. → సామాజికం: ఒకప్పుడు మన సమాజంలో అబ్బాయిగానీ, అమ్మాయిగానీ పెళ్లీడుకు రాగానే కుటుంబసభ్యులు మొదట వివాహానికే ప్రాధాన్యమిచ్చేవారు. ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసు లో జరగాలంటూ అబ్బాయి సంపాదన అంతంతమాత్రంగానే ఉన్నా పెళ్లికి సిద్ధపడేవారు. కానీ ఇటీవల యువత చదువులూ, ఉన్నత ఉద్యోగాలంటూ తమ కెరియర్కే తొలి ప్రాధాన్యం ఇస్తున్నారు. పెద్ద పెద్ద లక్ష్యాలు ఏర్పరచుకొని... అవి పూర్తయ్యేవరకూ పెళ్లిళ్లను వాయిదా వేసుకోవడం వంటి పనులు ఇటు అబ్బాయిలూ, అటు అమ్మాయిలూ చేస్తున్నారు. దీనికి తోడు ఇటీవలి కొత్త ఉద్యోగాల్లో ఉండే తీవ్రమైన శారీరక, మానసిక ఒత్తిడులూ, అర్ధరాత్రి అపరాత్రి అనకుండా పనిచేయడాలు, శారీరకంగా కదలికలు లేని ఒకేచోట కూర్చుని చేసే ఉద్యోగాలు, ఒబేసిటీ, మద్యం, పొగతాగడం వంటి దురలవాట్లు... ఇవన్నీ కలసి సంతానలేమికి దారితీస్తున్నాయి.→ ఆరోగ్య కారణాలు: గతంతో పోలిస్తే యువతులు సైతం తమ కెరియర్కోసం విపరీతంగా శ్రమిస్తున్నారు. దాంతో... ఆ ఒత్తిడుల ఫలితంగా యువతుల్లో హార్మోన్ల అసమతౌల్యత ఏర్పడి అవి సంతానలేమికి దారితీస్తున్నాయి. ఉదాహరణకు యువతుల్లో అనేక హార్మోన్లతో కూడిన ఓ నిర్దిష్టమైన ‘సైకిల్’ నడుస్తుంటుంది. ఈ హార్మోన్ల అసమతౌల్యత కారణంగా ఆ సైకిల్ దెబ్బతినడంతో ఈ అంశం కూడ సంతానలేమికి కారణమవుతోంది. ఇలా సైకిల్ దెబ్బతినడంతో అండం తయారీలో, ఫలదీకరణలో, పిండం ఇం΄్లాంటేషన్లో ఇబ్బందుల వంటివి మహిళలకు ప్రత్యేకంగా వచ్చే సమస్యల్లో కొన్ని. దీనికి తోడు కొన్నిసార్లు యువతుల్లో కొన్ని రకాల ఇన్ఫెక్షన్లు కూడా సంతానం కలగడంపై ప్రభావం చూపవచ్చు.→ పురుషుల విషయంలో: ఒకప్పుడు సంతానలేమికి మహిళలనే ఎక్కువగా బాధ్యులను చేసేవారు. కానీ ఇప్పుడున్న సామాజిక అంశాలూ, యువతలో దురలవాట్లూ, మారుతున్న జీవనశైలి కారణంగా యువకుల్లో వీర్యకణాల సంఖ్య, కదలికలు (మొటిలిటీ), నాణ్యత తగ్గడం వంటి అనేక అంశాలు సంతానలేమికి దారితీస్తున్నాయి. అందుకే ఒక జంటకు సంతానం కలగని సందర్భాల్లో సదరు యువకుడిలో తన వీర్యంలోని శుక్రకణాల విషయంలో వాటి సంఖ్య, కదలికలు, నాణ్యత ఇవన్నీ బాగున్నాయా అనే అంశాలను తెలుసుకోడానికి మొదట పురుషుడే వైద్యపరీక్షలు చేయించుకోవడం ముఖ్యం, అవసరం... పైగా మహిళలతో పోలిస్తే పురుషులకు నిర్వహించే వైద్యపరీక్షలు తేలికా, చవకా!నిర్ధారణ ఇలా... సంతానలేమిని ప్రైమరీ ఇన్ఫెర్టిలిటీ, సెకండరీ ఇన్ఫెర్టిలిటీ అని రెండు రకాలుగా చెప్పవచ్చు. .ప్రైమరీ ఇన్ఫెర్టిలిటీ... పూర్తి ఆరోగ్యంగా ఉన్న దంపతులు వివాహం అయ్యాక ఎలాంటి కుటుంబనియంత్రణ పద్ధతులను పాటించకుండా, కలిసి ఉంటూ ఏడాదిపాటు గర్భధారణ కోసం ప్రయత్నించినా గర్భం రానప్పుడు... ఆ జంటకు సంతానలేమి సమస్య ఉంటే దానిని ప్రైమరీ ఇన్ఫెర్టిలిటీ అంటారు.సెకండరీ ఇన్ఫెర్టిలిటీ... జంటలో మొదటిసారి గర్భధారణ జరిగాక... మళ్లీ రెండోసారి గర్భధారణ కోరుకుని, ఏడాదిపాటు ప్రయత్నించాక కూడా గర్భం దాల్చకపోతే దాన్ని సెకండరీ ఇన్ఫెర్టిలిటీ అంటారు.ఈ చికిత్స ఎవరెవరికి? ∙ప్రతినెలా పీరియడ్స్ సరిగా వస్తూ, ఏడాదిపాటు ప్రయత్నించాక కూడా గర్భం రానివాళ్లలో ∙ఆ మహిళ 30 ఏళ్ల వయసుకు చేరుకున్న తర్వాత కూడా ఇంకా గర్భం రాని సందర్భాల్లో... ∙సెకండరీ ఇన్ఫెర్టిలిటీ ఉన్న మహిళ వయసు 35 ఏళ్లు దాటుతున్నా... అప్పటికి ఆర్నెల్లుగా ప్రయత్నిస్తున్నా గర్భం రానప్పుడు... ఇలాంటి జంటలు ఫెర్టిలిటీ నిపుణులను సంప్రదించడం అవసరం.ట్విన్స్ మూడేళ్ల తేడా!ఏం కోల్పోయిన తిరిగి సంపాదించుకోవచ్చు. కాని ఎంత ప్రయత్నించినా తిరిగి రానివి రెండే..ఒకటి కాలం రెండు ప్రాణం...కాని ఆ కాలాన్ని ఫ్రీజ్ చేస్తే..? అదెలా జరగుతుందనుకుంటే మీరు ఈ కథ చదవాల్సిందే..అమెరికాలోని ముస్సోరి రాష్ట్రానికి చెందిన కెన్సాస్లో టేలర్ గ్రీన్హాగెన్ డెంటల్ హైజెనిస్ట్, తన భర్త జస్టిన్ ఒక ఫార్మాసిస్ట్. వీరిద్దరు సంతానం కోసం 2022లో ఐవీఎఫ్ పద్థతిని ఎంచుకున్నారు. 2023లో వీరిద్దరికి మగ శిశువు జన్మించాడు. అదే ఐవీఎఫ్ సైకిల్లో ఏర్పడిన మరో ఎంబ్రియోను క్రయోప్రిజర్వేషన్ (పిండాన్ని ఘనీభవింపజేసే ప్రక్రియ) ద్వారా భద్రపరిచి, మూడేళ్ల తర్వాత గర్భాశయంలో ప్రవేశపెట్టారు. దీంతో 2025లో వీరికి ఓ కుమార్తె జన్మించింది. ఇక్కడ విశేషమేమిటంటే ఈ ఇద్దరు పిల్లలు ఒకే రోజున ఎంబ్రియోలుగా జీవం పొందినా, ఈ ప్రపంచంలోకి రావడానికి మాత్రం మూడేళ్ల కాలం పట్టిందన్నమాట. ఐవీఎఫ్ ద్వారా పిల్లల్ని కనడం ఇప్పుడు మామూలే అయినా ఒకేసారి రూపొందిన ఎంబ్రియోలను ఇలా కాలవ్యవధిలో పిల్లలుగా జన్మించడం విశేషం. తాజాగా ఈ ఇద్దరు పిల్లలు ఆడుకుంటున్న వీడియో టేలర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.డాక్టర్ బి. సృజనసీనియర్ కన్సల్టెంట్ ఇన్ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ -
జస్ట్ రెండేళ్లలో 142 కేజీల నుంచి 80 కేజీలకు..! నిలకడగా బరువు తగ్గాలంటే..
బరువు తగ్గడం కష్టం కాదు గానీ, మళ్లీ యథావిధిగా పెరగకుండా ఉండటమే అతి పెద్ద టాస్క్ అని అంటున్నారు పలువురు. అందుకే వెయిట్లాస్ జర్నీలో నిలకడగా బరువు తగ్గేందుకు ప్రాధాన్యత ఇవ్వమని నొక్కి చెబుతున్నారు ఫిట్నెస్ నిపుణులు. అదే మిమ్మల్ని స్మార్ట్గా మార్చి వెయిట్లాస్ జర్నీలో విజయం సాధించేలా చేస్తుందని చెబుతున్నారు. అందుకు ఉదాహరణే..ఈ యువకుడు. బరువు తగ్గక మునుపు తన రూపం, ఆ తర్వాత ఉన్న మార్పులను ఇన్స్టాగ్రామ్ వేదికగా వీడియో షేర్ చేశారు.ఆ వ్యక్తే కువార్ కపూర్. ఆయన సుమారు 142 కేజీల బరువు ఉండేవాడినని అన్నారు. బరువు తగ్గక మునుపు ఏవిధంగా ఉన్నానో పంచుకుంటూ..ప్రస్తుతం సుమారు 62 కేజీల పైనే తగ్గి 80 కేజీలకు తగ్గినట్లు వెల్లడించారు వీడియోలో. ఈ మార్పుకి వెనుక రహస్యం క్రాష్ డైట్లు కాదని, సరైన మార్గంలో నిలకడగా చేయడమేనని అన్నారు. తాను సరైన మార్గంలో నిలకడగా కార్డియో దినచర్యపై దృష్టిసారించి రెండేళ్లలోనే ఇంతలా స్మార్ట్గా మారానని చెప్పుకొచ్చాడు. అందుకోసం ఎలా కార్షియో సెషన్లు చేయాలో చెప్పారు. ఆయన వీడియోలో చాలామంది నేరుగా పదివేల అడుగులతో వాకింగ్ ప్రారంభిస్తారు. దీంతో త్వరితగతిన అలిసిపోయి..రెండో వారానికల్లా స్కిప్ చేస్తారని అన్నారు. అస్సలు ఈ పద్ధతిని పొరపాటుగా అభివర్ణించారు. అందుకే అతడు కొవ్వు తగ్గడానికి నిలకడగా చేసే కార్డియో ప్రగతిని పంచుకున్నారు. ప్రారంభ అధిక బరువులో..ప్రారంభ దశలో నేరుగా పదివేలు అడుగులు కాకుండా నెమ్మదిగా మొదలు పెట్టానని చెప్పారు. నిర్వహించగలిగితే సాధారణంగా రోజుకు 3000 నుంచి 5000 అడుగులు సరి అని చెప్పారు. లేదా అంతకంటే తక్కువ నడిచినా పర్లేదని అన్నారు. ఇక్కడ అలిసిపోకుండా నిలకడగా ఉండటమే లక్ష్యం అని అన్నారు. అధిక బరువు దశలో..అధిక బరువు ఉన్నవారు వారానికి రెండు సెషన్లలో, ఒకే జోన్లో 8000 అడుగులతో ప్రారంభించాలని ఆయన సిఫార్సు చేశారు. ఆయన ప్రకారం, శరీరం అలవాటుపడినప్పుడు, కార్డియో మెరుగుపడుతుంది. సామర్థ్యానికి మించి ప్రయత్నించే బదులు, సాధారణ వేగంతో చేయాలని కూడా ఆయన సూచించారు.ఓ మోస్తారు మార్పు మొదలయ్యాక..వారానికి రెండు సెషన్లలో, రెండు జోన్లలో 10,000 నుంచి 12,000 అడుగులు వేయాలని ఆ వ్యక్తి సూచించారు. ఎందుకంటే, ఈ దశలో స్థూలకాయం లేదా అధిక బరువు దశలతో పోలిస్తే శరీరం సమర్థవంతంగా పనిచేసే సామర్థ్యం మెరుగుపడుతుందని అన్నారు.బరువు తగ్గే దశఈ దశలో, రెండు లేదా మూడు ప్రాంతాలలో వారానికి రెండుసార్లు 15,000 అడుగులు నడవాలని ఆయన సలహా ఇచ్చారు. ఇది కొవ్వు తగ్గే ప్రక్రియను వేగవంతం చేయడానికి సహాయపడుతుంది. ఒకవేళ జిమ్లో పనితీరు తగ్గితే, ఆహారాన్ని కాకుండా కార్డియోను తగ్గించడం మంచిదని కూడా ఆయన తెలిపారు.అత్యంత కీలకమైన దశఇందులో అధిక ఫలితాలు, గొప్ప ప్రయోజనాలు లభిస్తాయి కాబట్టి, రెండు లేదా మూడు విడతలుగా (సెషన్లలో) మొత్తం 20,000 అడుగులు నడవాలని ఆయన సూచించారు. ప్రతి దశకు తగిన కార్డియో వ్యాయామాలను వివరించడంతో పాటు, ఏ దశలో ఉన్నవారైనా సరే వారానికి కనీసం మూడు లేదా నాలుగు సార్లు బరువులు ఎత్తే వ్యాయామాలు (వెయిట్ లిఫ్టింగ్) చేయాలని కూడా సూచించారు. ఇలా కార్డియోని పెంచుకుంటే మెరుగైన ఫలితాలు అందుకోవడమే గాక ఆటోమేటిగ్గా బరువు కూడా తగ్గుతారని చెబుతున్నారు కువార్ కపూర్. View this post on Instagram A post shared by Kuwar Kapur (@fitnessbykuwar)గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: పదవిలో ఉండగా తండ్రైన తొలి ఉపాధ్యక్షుడు..హాట్టాపిక్గా ఆ శాపం..!) -
రన్నింగ్ జస్ట్ ఫిట్నెస్ కాదు! అంతకుమించి..
ఆరోగ్యం కోసం వ్యాయామాలు, వాకింగ్ , రన్నింగ్ వంటివి అన్ని చేస్తుంటాం. ఇది సర్వసాధారణం. చాలామంది రోజువారి దినచర్యలో భాగం కూడా. కానీ అదొక జస్ట్ రోజు చేసే ఒక సాధారణ దినచర్య కాదని, అంతకుమించి అని అనుభవపూర్వకంగా తెలుసుకున్నా అంటూ షేర్ చేసిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. నిజాయితీగా వెల్లడించిన ఆ అభిప్రాయం నెటిజన్ల మనసుని హత్తుకుంది. ఆ వీడియోలో ప్రఖర్ నేగి అనే ఇన్స్టాగ్రామ్ వినియోగదారుడు తనకు 29 ఏళ్లు అని, స్థిరమైన ఉద్యోగం కూడా ఉందని చెప్పాడు. గురుగ్రామ్లో రాత్రి 7:30 గంటలకు తాను 15 కిలోమీటర్లు పరుగెత్తడానికి కారణం ఏదో తప్పనిసరి పరిస్థితులు కాదని, తనను కాపాడటానికి ఎవ్వరూ రారని తెలుసుకోవడమేనని అన్నారు. తాను సాధించాల్సిన లక్ష్యాలు తనంతట తానే సాధించుకోవాలని అన్నారు. ఇది అంగీకరించేందుకు కష్టంగా ఉన్నా..ఇదే నిజం అని అన్నారు. ఆరోగ్యంగా ఉండాలనే ఆశావాదం పెంపొందించుకుంటే..ఏదైనా సాధ్యమేనని మనఃపూర్వకంగా విశ్వసించాలని అన్నారు. అలా రోజు చేయడం కాస్త కష్టం ఉన్నా..గొప్పగా లైప్ ఉండాలి, మరిన్ని చూడాలంటే తప్పదని అన్నారు. అలాంటి వాళ్ల గొప్ప విజయాలకు అర్హులని చెప్పారు. దయచేసి మీరు కూడా ఇలాంటి ఆశావాహ దృక్పథాన్నే అలవరుచుకోవాలని పిలుపునిస్తూ..అందరికీ "హ్యాపీ రన్నింగ్" శుభాకాంక్షలని చెప్పారు. నెటిజన్లకు ప్రఖర్ పంచుకున్న ఆలోచనలు ఎంతగానో ఆకట్టుకోవడమే కాదు..ఆరోగ్యంగా ఉండటంపై మంచి స్ఫూర్తినిచ్చారు, ధన్యవాదాలు అని పోస్టులు పెట్టడం విశేషం. View this post on Instagram A post shared by Prakhar Negi (@negisdayintheliferunning) (చదవండి: కేవలం ఆటో నడుపుతూ నెలకు రూ. 60 వేలు..!) -
చిన్నదని వదిలేస్తే... పెద్ద సమస్య కావచ్చు!
మా ఐదేళ్ల బాబు రాత్రంతా నోరు తెరిచే నిద్రపోతాడు. గురక కూడా బాగా పెడుతున్నాడు. చిన్నపిల్లలకు ఇది సహజమే అనుకున్నాం. కానీ ఇప్పుడు ఆందోళనగా ఉంది. – కీర్తి, నంద్యాలపిల్లల్లో తరచు గురక పెట్టడం, నోరు తెరిచి నిద్రపోవడం సాధారణం కాదు. ఇవి శ్వాస మార్గంలో ఉన్న సమస్యకు సంకేతాలు కావచ్చు.ఈ సమస్య ఎందుకు వస్తుంది?సాధారణంగా మనం ముక్కు ద్వారానే శ్వాస తీసుకుంటాం. ముక్కు గాలిని శుభ్రపరచి, తేమను కలిపి, సరైన ఉష్ణోగ్రతకు మార్చి ఊపిరితిత్తులకు పంపుతుంది. కానీ ముక్కు మూసుకుపోయినప్పుడు పిల్లలు నోటి ద్వారా శ్వాస తీసుకోవడం ప్రారంభిస్తారు. దీనికి ప్రధానంగా రెండు కారణాలు ఉంటాయి.1. అలర్జీ: దుమ్ము, ధూళి, పొగ, కాలుష్యం, డస్ట్మైట్స్ లేదా పెంపుడు జంతువుల వెంట్రుకల వల్ల ముక్కులో వాపు ఏర్పడి శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది.2. అడినాయిడ్స్ పెరగడం: ముక్కు వెనుక భాగంలో ఉండే అడినాయిడ్స్ అనే కణజాలం చిన్నపిల్లల్లో ఇన్ ఫెక్షన్ల నుంచి రక్షణ కల్పిస్తుంది. అయితే తరచు ఇన్ ఫెక్షన్లు లేదా అలర్జీల కారణంగా ఇవి పెద్దవై గాలి వెళ్లే మార్గాన్ని ఇరుకుగా చేస్తాయి. దీంతో పిల్లలు నోటి ద్వారానే శ్వాస తీసుకోవాల్సి వస్తుంది. గాలి వెళ్లే మార్గం ఇరుకుగా మారినప్పుడు గాలి ప్రవాహం వల్ల కంపనం ఏర్పడి గురక వస్తుంది. అందువల్ల గురక అనేది కేవలం శబ్దం మాత్రమే కాదు, శ్వాసకు ఆటంకం ఏర్పడుతోందని శరీరం ఇస్తున్న హెచ్చరిక.నిర్లక్ష్యం చేయకండి...కొంతమంది పిల్లల్లో గురకతో పాటు నిద్రలో కొద్ది క్షణాలు శ్వాస కూడా ఆగిపోవచ్చు. దీనివల్ల మెదడుకు సరిపడా ఆక్సిజన్ అందక, దీర్ఘకాలంలో కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఉదయం అలసటగా లేవడం, చదువుపై ఏకాగ్రత తగ్గడం, చిరాకు, అతి చురుకుదనం, ఎదుగుదల మందగించడం వంటి లక్షణాలు కనిపించవచ్చు. ఎప్పుడూ నోటి ద్వారానే శ్వాస తీసుకునే పిల్లల్లో దవడ, పళ్ల అమరిక, ముఖ ఆకృతిలో కూడా మార్పులు రావచ్చు.ఎప్పుడు వైద్యుడిని సంప్రదించాలి?మీ బిడ్డ గురకను లేదా నోరు తెరిచి నిద్రపోవడాన్ని కేవలం ఒక అలవాటుగా భావించకండి. ప్రతిరోజూ నోరు తెరిచి నిద్రపోవడం, వారానికి మూడు లేదా అంతకంటే ఎక్కువ రోజులు గురక పెట్టడం, నిద్రలో శ్వాస ఆగినట్లు కనిపించడం, పగటిపూట ఎక్కువ నిద్రమత్తుగా ఉండడం, తరచూ చెవి ఇన్ ఫెక్షన్లు రావడం, ముక్కు ఎప్పుడూ మూసుకుపోవడం లేదా ఎప్పుడూ నోటి ద్వారానే శ్వాస తీసుకోవడం వంటి లక్షణాలు ఉంటే ఆలస్యం చేయకుండా పిల్లల వైద్యుడిని లేదా ముక్కు–చెవి–గొంతు నిపుణుడిని సంప్రదించాలి. శస్త్రచికిత్స అవసరమా?అసలు అవసరం లేదు. ఇది చాలా పెద్ద అపోహ. చాలామంది పిల్లల్లో అలర్జీని నియంత్రించడం ద్వారా మంచి ఫలితం కనిపిస్తుంది. అవసరాన్ని బట్టి సెలైన్ నాసల్ డ్రాప్స్, నాసల్ స్ప్రేలు, అలర్జీ మందులు సూచిస్తారు. అలాగే దుమ్ము, పొగ, సిగరెట్ పొగ వంటి వాటికి పిల్లలను దూరంగా ఉంచడం కూడా చాలా ముఖ్యం. అయితే నిద్రలో శ్వాస ఆగిపోవడం, వినికిడి తగ్గడం, చెవిలో పదేపదే ద్రవం చేరడం లేదా మందులతో ప్రయోజనం లేకపోతే అడినాయిడ్స్ను తొలగించే శస్త్రచికిత్స అవసరం కావచ్చు.తల్లిదండ్రులకు సూచనలుగురకను చిన్న విషయంగా తీసుకోవద్దు.నోటి ద్వారా శ్వాస తీసుకోవడం ఒక అలవాటు కాదు, అది ఒక లక్షణం.తరచూ జలుబు లేదా ముక్కు మూసుకుపోవడం ఉంటే అలర్జీ ఉందేమో పరీక్ష చేయించండి.పిల్లలకు ప్రశాంతమైన నిద్ర వాతావరణాన్ని కల్పించండి. నిద్రకు ముందు మొబైల్, ట్యాబ్ లేదా ఇతర స్క్రీన్ ల వినియోగాన్ని తగ్గించండి.సమస్య కొనసాగితే పిల్లల వైద్యుడు లేదా ముక్కు–చెవి–గొంతు నిపుణుడిని ఆలస్యం చేయకుండా సంప్రదించండి.పిల్లల నవ్వు, చదువు, ఎదుగుదల ఎంత ముఖ్యమో; వారి నిద్ర కూడా అంతే ముఖ్యం.గురక అనేది నిద్రలో వచ్చే శబ్దం మాత్రమే కాదు, పిల్లల ఆరోగ్యం గురించి శరీరం పంపించే ఒక ముఖ్యమైన హెచ్చరిక.సరైన సమయంలో కారణాన్ని గుర్తించి చికిత్స తీసుకుంటే పిల్లల నిద్ర, ఎదుగుదల, ఏకాగ్రత, మొత్తం ఆరోగ్యం మెరుగుపడతాయి. మంచి నిద్రే ఆరోగ్యకరమైన ఎదుగుదలకు మొదటి మెట్టు.- డా. కె. పవన్ కుమార్, సీనియర్ పీడియాట్రిషియన్, పీడియాట్రిక్ అలర్జిస్ట్, ప్రొఫెసర్ ఆఫ్ పీడియాట్రిక్స్ -
సిటీ లైఫ్తో పరేషాన్!
భారత్లో టైఫాయిడ్, మలేరియా వంటి అంటువ్యాధులు తగ్గుముఖం పట్టినప్పటికీ, జీవనశైలికి సంబంధించిన దీర్ఘకాలిక వ్యాధులు మాత్రం ప్రమాదకర స్థాయిలో పెరుగుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. దేశవ్యాప్తంగా నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ (జాతీయ గణాంక కార్యాలయం) నిర్వహించిన తాజా ఆరోగ్య సర్వేలో వెల్లడయిన అంశాలు ఆందోళన కలిగిస్తున్నాయి.హైపర్టెన్షన్, మధుమేహం, గుండె జబ్బులు, థైరాయిడ్ వంటి సమస్యలు గత పదేళ్లలో దేశంలో విపరీతంగా పెరిగినట్లు ఎన్ఎస్వో సర్వేలో స్పష్టమయ్యింది. ప్రస్తుతం దేశ జనాభాలో దాదాపు సగం మంది గుండె సంబంధిత సమస్యలు, మెటబాలిక్ లోపాలతో బాధపడుతున్నారు. పదేళ్ల క్రితం ఈ సంఖ్య కేవలం 31 శాతంగా మాత్రమే ఉండేది.గణాంకాల ప్రకారం.. 2017–18 నాటి సర్వేలో గుండె సంబంధిత వ్యాధులతో బాధపడే వారు 16.7 శాతం మాత్రమే ఉండగా.. నేడు అది 25.6 శాతానికి పెరిగిపోయింది. అలాగే థైరాయిడ్, మధుమేహం వంటి జీవనశైలి సమస్యలు గతంలో 15 శాతం మాత్రమే ఉండగా నేడు 24.2 శాతం పెరిగినట్లు తేలింది. ముఖ్యంగా 45 ఏళ్లు పైబడిన వారిలో ఈ నాన్ కమ్యూనికేబుల్ జబ్బులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. 2017–18లో 32 శాతంగా ఉన్న ఇన్ఫెక్షన్ల రేటు, 2025 నాటికి 15 శాతానికి పడిపోయింది.మహిళల్లో పెరుగుతోన్న అనారోగ్యం..దేశవ్యాప్తంగా దాదాపు 1.4 లక్షల కుటుంబాల నుంచి సేకరించిన వివరాల ప్రకారం.. భారతీయుల్లో మొత్తం అనారోగ్య స్థాయిలు గత సర్వేతో పోల్చినపుడు విపరీతంగా పెరిగాయి. గత సర్వేలో 7.5 శాతం మాత్రమే ఉండగా ప్రస్తుతం 13.1 శాతానికి పెరిగింది. ఇందులో పురుషుల శాతం 11.8 శాతం ఉండగా, మహిళల శాతం 14.4 శాతంగా ఉంది. అంటే పురుషుల కంటే మహిళలే ఎక్కువగా అనారోగ్యానికి గురవుతున్నారు. అలాగే వయసు పైబడిన వారిలో ఈ సమస్య మరింత తీవ్రంగా ఉంది. 60 ఏళ్లు పైబడిన వారిలో అనారోగ్య రేటు 27.7% నుండి 43.9%కి పెరిగింది. అలాగే వైద్య ఖర్చులు కూడా తీవ్రంగా పెరిగినట్లు ఎన్ఎస్ఓ అధ్యయనాలు తెలిపాయి. -
వెన్నుకు దన్నుగా... శలభాసనం!
శలభం అంటే మిడత. ఈ ఆసనంలో శరీర ఆకారం మిడతలా కనిపిస్తుంది కాబట్టి దీనిని శలభాసనం అంటారు. శలభాసనం అనేది పొట్టపై పడుకుని చేసే యోగాసనం. ఇది వెన్నెముకను బలపరచి, శరీరానికి స్థిరత్వాన్ని, శక్తిని అందించడంలో సహాయపడుతుంది.చేసే విధానం...- మ్యాట్పై బోర్లా (పొట్టపై) పడుకోవాలి.- రెండు కాళ్లను నిటారుగా ఉంచి, చేతులను తొడల కింద ఉంచాలి.- గడ్డాన్ని లేదా నుదుటిని నేలపై ఆనించాలి.- శ్వాసను లోపలికి తీసుకుంటూ రెండు కాళ్లను మోకాళ్లు వంచకుండా పైకి ఎత్తాలి.- తొడలు, నడుము కండరాలను బిగించి 10–30 సెకన్లు అదే స్థితిలో ఉంచాలి.- శ్వాసను వదులుతూ నెమ్మదిగా కాళ్లను కిందికి దించాలి.- 3–5 సార్లు పునరావృతం చేయాలి.జాగ్రత్తలు...- గర్భిణులు ఈ ఆసనం వేయకూడదు.- ఇటీవల కాలంలో పొట్ట లేదా వెన్నెముక శస్త్రచికిత్స చేయించుకున్నవారు చేయకూడదు.- తీవ్రమైన నడుము నొప్పి, స్లిప్ డిస్క్, హెర్నియా ఉన్నవారు వైద్యుడు లేదా యోగా నిపుణుల సలహాతో మాత్రమే చేయాలి.- అధిక రక్తపోటు లేదా తీవ్రమైన గుండె సమస్యలు ఉన్నవారు జాగ్రత్తగా చేయాలి.- కాళ్లను ఒక్కసారిగా పైకి ఎత్తకుండా, నెమ్మదిగా శ్వాసతో సమన్వయం చేసుకుంటూ చేయాలి.- నొప్పి అనిపిస్తే వెంటనే ఆసనం ఆపాలి.ప్రయోజనాలు... - వెన్నెముకను బలంగా, ఫ్లెక్సిబుల్గా చేస్తుంది.- నడుము కండరాలు, తొడలు బలపడతాయి.- పొట్ట అవయవాలకు మసాజ్ లభించి జీర్ణక్రియ మెరుగుపడుతుంది.- వెన్నునొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది (సరైన మార్గదర్శకత్వంలో చేస్తే).- శరీర భంగిమ మెరుగుపడుతుంది.- రక్తప్రసరణను మెరుగు పరుస్తుంది.- అలసటను తగ్గించి శక్తిని పెంచుతుంది.- కోర్ కండరాలను బలపరుస్తుంది.- మానసిక ఏకాగ్రతను పెంచుతుంది.- అనిత పాతర్ల, యోగా ట్రైనర్ -
నైంటీ.. అయితే ఏంటి?
ఫిట్నెస్ అనేది కేవలం యువకులకు, బాడీబిల్డర్లకు మాత్రమే సొంతం కాదని నిరూపిస్తున్నాడు ఓ 90 ఏళ్ల వృద్ధుడు. ముసలితనం వచ్చిందని ఇంట్లోనే కూర్చోకుండా, జిమ్కు వెళ్తూ ఆయన చేస్తున్న కఠినమైన వర్కవుట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ముంబైకి చెందిన ప్రముఖ ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ ఆకాష్ సింగ్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఈ వృద్ధుడికి సంబంధించిన ఒక వీడియోను షేర్ చేస్తూ ఈవిధంగా రాసుకొచ్చారు.‘జిమ్ అనేది కేవలం సిక్స్ ప్యాక్ కోసమో, కండలు పెంచి అందంగా కనిపించడం కోసమో మాత్రమే కాదు. అంతకు మించి.. వయసు పైబడిన వారు తమ దైనందిన పనులను ఎవరి సహాయం లేకుండా చేసుకోగలగడానికి, శరీర బ్యాలెన్స్ మెరుగుపరుచుకోవడానికి, కీళ్ల నొప్పులు తగ్గించుకోవడానికి వ్యాయామం ఎంతో అవసరం.’ మన ఇంట్లో ఉండే తల్లిదండ్రులు, నానమ్మ, తాతయ్యలను కూడా శారీరక శ్రమ వైపు ప్రోత్సహించేలా ఉన్న ఈ వీడియో ఎంతో స్ఫూర్తిదాయకం. -
మనలో కూడా దాగున్న ఈ జబ్బు ఇంత ప్రమాదమా!?
సోమరితనం, బద్ధకం, నిర్లక్ష్యం... ఏదైతేనేం? చేయాల్సిన పనులు ఆపేయడానికి..? రేపు చేస్తా, ఎల్లుండి చేస్తా అంటూ ‘వాయిదా’ల అటకెక్కించడానికి..? నిజానికి ఇలాంటి బద్ధకస్తుల జాబితాలో మన చుట్టూ ఉన్నవాళ్లే కాదు మనం కూడా కొన్నికొన్ని సార్లు చేరిపోతుంటాం. ఎందుకంటే వాయిదా వేయడం కొందరికి అలవాటు.. మరికొందరికి అదోరకం కంఫర్ట్. నేటి యువతలో ఎక్కువగా కనిపించే లక్షణం సోమరితనం. కాని జపాన్ ప్రజలు మాత్రం వారి పిల్లలకి సోమరితనాన్ని ఒక బూచిలా చూపిస్తారు. కొన్ని ప్రత్యేకమైన పద్ధతుల ద్వారా సోమరితనాన్ని మెల్లమెల్లగా దూరం చేస్తారు. జపాన్లో సోమరితనాన్ని దూరం చేసే అత్యంత ప్రాచుర్యం పొందిన ఏడు జీవన సూత్రాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం..1.కైజెన్పెద్ద లక్ష్యాలు పెట్టుకుంటే మొదటికే మోసం వస్తుంది. అందుకే ఏదైనా చిన్న లక్ష్యంతో ప్రారంభించండి. క్రమక్రమంగా లక్ష్యాలను పెద్దగా మార్చుకుంటే మీ బ్రెయిన్కి మీరే గురువుతారు.2. ఇకిగైఏం చేయాలన్న దాని మీద స్పష్టత లోపించినప్పుడే పనులు సక్రమంగా సాగవు. అందుకే ‘ఏం చేయాలి?’ అని కాకుండా ‘ఎందుకు చేయాలి?’ అని ఎవరికి వారే ప్రశ్నించుకోగలిగినప్పుడు పని మీద గురి కుదురుతుంది.3. హరా హచి బుఏదైనా మితంగా తినడం మంచిది. బిర్యాని అంటే ఇష్టమని పొట్ట పగిలేలా తినకుండా 80 శాతం ఆకలి తీరినంత వరకే తినాలన్నది జపాన్ సంప్రదాయం. ఇలా చేయడం వల్ల శరీరం తేలికగా ఉండడమే కాకుండా మెదడు కూడా చురుకుగా మారుతుందని జపాన్ ప్రజలు భావిస్తారు.4. సెయిరి – సెయితోనుమీరు ఎక్కడ పని చేస్తున్నారో అక్కడి ప్రదేశం పరిశుభ్రంగా ఉండాలి. ప్రతి వస్తువు క్రమ బద్ధంగా, వీలైనంత వరకు కాస్త నిశబ్ధంగా ఉంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది. చేస్తున్న పని మీద ఏకాగ్రత పెరుగుతుంది.5. కింట్సుగికొన్నిసార్లు పొరపాట్లు జరగవచ్చు. తప్పులు దొర్లవచ్చు. భయపడకండి. ధైర్యంతో ఎదుర్కోండి. తప్పులను ఒప్పుకోండి. లోపాలను అంగీకరించండి...అలా చేసినప్పుడే నిజమైన ఎదుగుదల సాధ్యమవుతుంది.6. వాబి సాబిప్రతి క్షణం విలువైనదే.. మొదలు పెట్టేవరకు ఏదీ పూర్తి కాదు. ఇంకా సమయం కావాలని ఆలోచించక ఉన్న వనరులతో పని మొదలుపెట్టండి. విశ్వాశమే విజయానికి తొలిమెట్టు.7. యాంకర్డ్ ఫోకస్ప్రతిసారి గంటల తరబడి కుర్చుని పని చేయడం కంటే ప్రతి పనిని మొదలు పెట్టే ముందు గట్టిగా శ్వాస తీసుకోండి. తర్వాత నచ్చిన మ్యూజిక్ కొన్ని నిమిషాల పాటు వినండి. ఆ తర్వాత పనిని మొదలు పెట్టండి. ప్రతి 25 నిమిషాలకొకసారి లేచి ఓ ఐదు నిమిషాల పాటు విరామం తీసుకోండి. దీని వల్ల శరీరంలో ఉత్సాహంతో పాటు పనిలో ఉత్పాదకత పెరుగుతుంది. -
అమ్మను కొంచెం యంగ్గా...
చాలామంది తల్లిదండ్రులలో నాన్న యంగ్గా కనిపిస్తే... అమ్మేమో కొంచెం వయసు పైబడ్డట్లుగా కనిపించడం సహజం. అలా ఎందుకు జరుగుతుందో తెలుసుకుందామా?అమ్మానాన్నల వయసు దాదాపు ఒకటే. చె΄్పాలంటే సహజంగానే అమ్మకంటే నాన్నే వయసులో బాగా పెద్ద అయినా, చాలామందిలో నాన్నే యంగ్గా.. యాక్టివ్గా ఉంటే అమ్మలేమో కొంచెం పెద్దగా కనిపిస్తుంటారు. అందుకు వారి జీన్స్ ఒక్కటే కారణం కాదు. మహిళలలో ముందుగా వచ్చే మెనోపాజ్ కారణంగా శరీరంలో వృద్ధాప్య ప్రక్రియ కొంచెం వేగంగా జరుగుతుంది. హార్మోన్ల అసమతుల్యతలు, ముఖ్యంగా ఈస్ట్రోజన్ హార్మోన్ ఉత్పత్తి తగ్గిపోవడం వల్ల ఈ వయస్సులో ఈ మార్పులు త్వరగా కనిపించొచ్చు. 40 ఏళ్ల వరకు మహిళల శరీరంలో ఈస్ట్రోజన్ హార్మోన్ ఉత్పత్తి అవుతుంది. ఆ తర్వాత ఇది తగ్గిపోవడం వల్ల శరీరం అనేక మార్పులకు లోనవుతుంది.ఈ మార్పుల వల్ల మెదడు పనితీరు మందగించడం, ఎముకలు బలహీనపడటం, పొట్టలో కొవ్వు పెరగడం లాంటి సమస్యలు ఎక్కువగా వస్తాయి. అయితే ఈ హార్మోన్ల మార్పులు మాత్రమే కాదు.. నిద్రలేమి, ఆహారంలో పోషకాల లోపం, దీర్ఘకాలిక ఒత్తిడి లాంటి కారణాలు కూడా స్త్రీ శరీరాన్ని త్వరగా బలహీన పరిచే కారకాలు.అన్నింటికన్నా ముఖ్యంగా... చాలా మంది మహిళలు సరైన ఆహారం తీసుకోకపోవడం, గర్భధారణ సమయంలో పోషకాలు తగ్గిపోవడం లాంటి కారణాలతో హార్మోన్ల అసమతుల్యతను ఎదుర్కొంటారు. దాని ఫలితంగానే తొందరగా వయసు మీదపడ్డట్లు కనిపిస్తారు. చర్మ ఆరోగ్యం, ఎముకల బలం కోసం విటమిన్ ఇ,సి,డి విటమిన్లు, కాల్షియం, మెగ్నీషియం, ఒమేగా 3 లాంటి పోషకాలు తీసుకోవడం చాలా అవసరం.ఉదాహరణకి పొద్దుతిరుగుడు గింజలు, బాదం, కీర దోస, క్యాప్సికమ్, బ్రోకలీ, నారింజ, టమాటా లాంటి ఆహారాల్లో విటమిన్లు సమృద్ధిగా ఉంటాయి. వీటిని ఆహారంలో చేర్చడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. పెరుగు, పనీర్, కేఫిర్, మజ్జిగ, ఇడ్లీ లాంటివి ఆరోగ్యకరమైన పేగులోని మంచి బ్యాక్టీరియాను పెంచుతాయి. వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం అరుగుదల వ్యవస్థను బలపరుస్తుంది. అలాగే యాంటీ బయాటిక్స్ వల్ల నాశనం అయిన మంచి బ్యాక్టీరియాను తిరిగి పెంచడానికి ఇది సహాయపడుతుంది.ఈ వయసులో అధిక రక్తపోటు ఎక్కువగా సమస్యగా మారే అవకాశం ఉంటుంది. టేబుల్ ఉప్పు తక్కువగా తీసుకోవడం, వెల్లుల్లి, ఉల్లిపాయ పొడి, మిరియాలు, కొత్తిమీర లాంటి సహజమైన మసాలాపదార్థాలు ఉపయోగించడం గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. సోడియం తక్కువగా ఉండే ఆహారాలు తీసుకోవడం మంచిది. వారానికి కనీసం మూడు రోజుల పాటు బలం పెంచే వ్యాయామాలు చేయడం, యోగా, నడక లాంటి వ్యాయామాలు చేయడం వయసును నియంత్రించడంలో సహాయపడతాయి. అదే సమయంలో 7 నుంచి 9 గంటల వరకు నిద్రపోవడం, మానసిక ఆరోగ్యం కోసం కొంతసేపు విశ్రాంతి తీసుకోవడం అవసరం. ఈ సూచనలు పాటిస్తే అమ్మ కూడా నాన్న లాగే ఆరోగ్యంగా, యంగ్గా ఉటుంది.అమ్మ యాక్టివ్గా ఉండాలంటే..?వయసు పైబడ్డట్టు కనిపించే మాటెలా ఉన్నా... ఈ వయసులో వారు యాక్టివ్గా ఉండాలంటే మాత్రం వారి బరువుకు తగ్గట్టు రోజుకు 5 నుంచి 10 గ్రాముల వరకు ప్రోటీన్ తీసుకోవాలి. ఇది ఎముకలు, కండరాల బలాన్ని పెంచడంలో సహాయపడుతుంది. ఇంకా మూత్రపిండాల సమస్యలు తగ్గించడానికి దోహదం చేస్తుంది. -
గర్భంలో పడినప్పుడే..ఆయుర్ధాయం ఖరారు..!
మనిషి ఆయుర్దాయంపై ఎన్నో పరిశోధనలు చేస్తూనే ఉన్నారు శాస్త్రవేత్తలు. దాని సాయంతో వృద్ధాప్యాన్ని, పలు రోగాల బారి నుంచి మనిషిని రక్షించి.. దీర్ఘాయువుని ప్రసాదించే దిశగా ఏళ్లుగా ప్రయోగాలు, పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. దానికి ఓ మార్గం దొరికేలా సరికొత్త విషయం వెలుగులోకి వచ్చింది తాజా పరిశోధనల్లో. ఒకరకంగా ఇది మనిషి జీవితకాలంపై సరికొత్త ఆశాకిరణం అందించిందని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. ఇంతకీ మనిషికి దీర్ఘాయువు సాధ్యమేనా అంటే..అమెరికా శాస్త్రవేత్తల తాజా పరిశోధనల ప్రకారం పుట్టకకు ముందు అనుభవించే వాతావరణం ఆయుర్ధాయంపై ప్రభావం చూపగలదనే విషయం నిర్థారణ అయ్యింది. అంటే గర్భధారణ సమయంలో పిండ దశలో ఉండగానే ఆయుర్థాయం నిర్ణయింపబడి ఉంటుందంట. ఆ సమయంలో ఆ పిండానికి ఆరోగ్యం నుంచి వృద్ధాప్య దశలు ఎలా ఉంటాయి..పైగా ఎంతవరకు జీవించగలడనేది కూడా నిర్థారించొచ్చని ఈ కొత్త పరిశోధన వెల్లడించింది. ఈ పరిశోధన నేచర్ హెల్త్లో ప్రచురితమైంది. గర్భధారణ సమయంలో పిండ దశలో ఉన్నప్పుడే ఆ జీవి బాల్యం, జీవిత కాల ఆరోగ్యం, స్థితిస్థాపకత తదితరాలతో అతడి దీర్ఘాయువుని తెలుసుకోగలమని అంటున్నారు. సింపుల్గా చెప్పాలంటే వాటి సాయంతో అతడి ఆయువుని నిర్ణయించొచ్చని అన్నారు. ఈ మేరకు శాస్త్రవేత్తలు PROSPER అనే ప్రసవ పూర్వం పరిశోధనపేరుతో అధ్యయనం మొదలు పెట్టినట్లు వెల్లడించారు. గర్భంలోని పరిస్థితులు జీవితాంతం కొనసాగే విధంగా శరీర అభివృద్ధిని ప్రభావితం చేస్తాయని అధ్యయనంలో గుర్తించారు. జన్యువులు ముఖ్యమైనవి అయినప్పటికీ, దీర్ఘకాలిక ఆరోగ్యం, స్థితి స్థాపకతన నిర్ణయించడంలో గర్భస్థ వాతావరణం కూడా గణనీయమైన పాత్ర పోషిస్తుందని పరిశోధనలు పేర్కొన్నాయని అన్నారు. గర్భధారణ సమయంలో తల్లి పోషణ, ఒత్తిడి స్థాయిలు, మొత్తం ఆరోగ్యం వంటి అంశాలు పుట్టుకకు మందు శరీర అవయవాలు, వ్యవస్థలు ఎలా అభివృద్ధి చెందుతాయనేదాన్ని ప్రభావితం చేస్తుందని చెబుతున్నారు పరిశోధకులు. అలాగని పుట్టకకు మందే భవిష్యత్తు నిర్ణయించబడిపోతుందని భయపడిపోవాల్సిన అవసరం కూడా లేదంటున్నారు. జననం తర్వాత కూడా సమతుల్య ఆహారం, క్రమం తప్పని వ్యాయామం, మంచి నిద్ర, ధూమపానానికి దూరంగా ఉండటం వంటి ఆరోగ్యకరమై జీవనశైలితో ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చని, వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చని చెబుతున్నారు. అయితే ఈ పరిశోధన గర్భధారణ సమయంలో పరిస్థితులను మెరుగుపరిస్తే గనుక ఒక వ్యక్తి జీవితకాల ఆరోగ్యానికి ప్రయోజనం చేకూర్చగలదని నిరూపించిందన్నారు. ఇది ఒకరకంగా తల్లి ఆరోగ్యం, ప్రసవ పూర్వ సంరక్షణ తదితరాలపై దృష్టి పెట్టేలనే అంశం గురించి నొక్కి చెప్పిందన్నారు పరిశోధకులు.(చదవండి: ఆ అలవాట్లతో 15 కిలోలు బరువు..! 5 ఏళ్ల పాటు అలానే..) -
హెర్నియా ఆపరేషన్కి రూ. 11 లక్షలా? నెటిజన్లు గగ్గోలు
సాక్షి,ముంబై: ఇప్పటిదాకామనం అమెరికా వైద్య ఖర్చులు గురించిన కథనాలు చదివాం. ఇపుడు మన దేశంలోనే ఒక మామూలు ఆపరేషన్ కోసం ఏకంగా రూ. 11.04 లక్షల బిల్లు గురించి తెలుసుకుంటూ ఔరా అనాల్సిందే. భారతదేశంలోని మెట్రో నగరాల్లో సామాన్యుడికి వైద్యం ఎంత భారంగా మారుతుందో, అలాగే మెడికల్ బిల్లింగ్ విధానంలో పారదర్శకత ఎంత అవసరమో స్పష్టం చేస్తోంది. ముంబైలోని ఒక ప్రముఖ ఆసుపత్రిలో సాధారణ హెర్నియా శస్త్రచికిత్స (Hernia Surgery) చేయించుకున్న ఒక రోగికి ఏకంగా రూ. 11.04 లక్షల బిల్లు రావడం సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. 'నిఖిల్ ఝా' అనే ఎక్స్ యూజర్ షేర్ చేసిన వివరాల ప్రకారం ఫాలోవర్ ఒకరు ముంబైలో 'ఇంగువినల్ హెర్నియా' సర్జరీ చేయించుకున్నారని అంటూ దానికి సంబంధించిన ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఇతర వివరాలను పంచుకున్నారు. కేవలం నాలుగు రోజులు(జూలై 6 నుంచి 10 వరకు)ఆసుపత్రిలో ఇన్పేషెంట్గా ఉన్నారు. ఈ ఆపరేషన్ కోసం ఆసుపత్రి బిల్లు అక్షరాలా రూ. 11,04,100. ఇందులో ఇన్సూరెన్స్ సెటిల్మెంట్: రూ. 4,64,000 మాత్రమే క్లెయిమ్ వచ్చింది. దీంతో అవాక్కవ్వడం వారి వంతైంది.ఒక చిన్న హెర్నియా సర్జరీకే ఇంత ఖర్చయితే, పెద్ద పెద్ద సర్జరీల పరిస్థితి ఏంటి? ముంబైలో ఆసుపత్రిలో చేరడం నేరమా? అంటూ ప్రశ్నించారు. నాణ్యమైన వైద్యం కేవలం ధనవంతులకు మాత్రమేనా? అటూ నిఖిల్ ఝా సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. ఇదీ చదవండి: మూడో పెళ్లి : ఫత్వా, లవ్ జిహాద్ ఆరోపణలపై స్పందించిన ఆమీర్ A follower messaged us yesterday about their hernia surgery at a top Mumbai hospital.The total cost=11.04LYes, 11.04L for a hernia surgery,We were shocked and stunned by the cost,If this is the cost for a small hernia surgery,What will be the cost for bigger surgeries?… pic.twitter.com/RUfAOy5UVL— Nikhil Jha (@NIKHILLJHA) July 15, 2026నెటిజన్లు ఏమన్నారంటే? ఈ పోస్ట్పై నెటిజన్లు, వైద్యులు రకరకాలుగా స్పందించారను. ఒక వైద్యుడు స్పందిస్తూ, "హెర్నియా సర్జరీకి రూ. 11 లక్షలా? ఇందులో ఏమైనా హెలికాప్టర్ పికప్ అండ్ డ్రాప్ సౌకర్యం కూడా ఉందా?" అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. సూరత్లో రూ. 1.5 లక్షలకే అయ్యే ఈ సర్జరీకి, ముంబైలో రూ. 11 లక్షలు వసూలు చేయడంపై ఒకరు మండిపడ్డారు. మెట్రో నగరాల్లో పెరిగిపోతున్న వైద్య ఖర్చుల వల్ల అందరి హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంలు కూడా పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు కేవలం ఈ ఒక్క మెసేజ్ చూసి నిర్ధారణకు రాలేమని, రోగికి ఏ రకమైన రూమ్ కేటగిరీ ఇచ్చారు? ఏమైనా కాంప్లికేషన్స్ వచ్చి ఐసీయూలో ఉంచారా? వంటి వివరాలు 'డిశ్చార్జ్ సమ్మరీ' ,'ఆపరేషన్ నోట్స్' చూస్తేనే క్లారిటీ వస్తుందని మరికొందరు అభిప్రాయపడ్డారు.ఇదీ చదవండి: 18 ఏళ్ల ఎన్ఆర్ఐ జీవితం నుంచి : మెటా టెకీ ఎమోషనల్ పోస్ట్ వైరల్ -
ఆ అలవాట్లతో 15 కిలోలు బరువు..! 5 ఏళ్ల పాటు అలానే..
వెయిట్లాస్ జర్నీలో చాలామంది సునాయాసంగా బరువు తగ్గే ప్రయత్నం చేస్తారు. ఆ క్రమంలో విజయం సాధిస్తారు కూడా. అయితే ఆ బరువునే మెయింటైన్ చేయడం అతి పెద్ద సవాలు. మళ్లీ యథాస్థితికి రాకుండా..అంతే స్మార్ట్గా మెయింటైన్ చేయడమే అత్యంత ముఖ్యం అని అంటోంది ఇషితా లంబా అనే మహిళ. చాలామంది బరువు తగ్గగలరు అంతే..కొందరే దాన్ని నిలబెట్టుకోగలరు అంటూ ఇన్స్టాగ్రామ్ పోస్ట్తో తన వెయిట్ లాస్ అనుభవాలను షేర్ చేసుకున్నారు. మరి అవేంటో చూసేద్దామా..!.తాను ఎలాంటి క్రాష్డైట్లపై ఆధారపడకుండా నిలకడగా 20 వాస్తవిక అలవాట్లను పాటించి సునాయాసంగా 15 కిలోలు వరకు బరువు తగ్గినట్లు చెప్పుకొచ్చారు. అయితే దాన్ని ఐదేళ్ల పాటు నిలకడగా నిలబెట్టుకున్నానని చెప్పారు. ఈ వెయిట్లాస్ జర్నీలో బరువు తగ్గడం పెద్ద సమస్య కాదని తగ్గిన బరువుని మెయింటైన్ చేయడమే అతిపెద్ద సవాలని పేర్కొంది. అందుకోసం తాను ఏం చేసిందో సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. అవేంటంటే..అతిగా తిన్న తర్వాత పస్తులుండాల్సిన పనిలేదు..ఒక్కోసారి ఎక్కువగా తినేస్తాం. దాంతో సాధారణంగా మరుసటి రోజు పస్తులుండే ప్రయత్నం చేస్తుంటారు. అయితే తాను అలా చేయనని, తన సాధారణ దినచర్యకు తిరిగి వచ్చేస్తానంటోంది. అంటే ఇదివరకటి సాధారణ ఆహారపు అలవాట్లను యథావిధిగా ఫాలో అయితే చాలు అని అంటోంది. అంతేగాదు తన ప్రతి భోజనం తర్వాత రెండు వేల అడుగులు వేస్తానని చెబుతోంది. కేలరీల పరిమితి కంటే ప్రోటీన్కు ప్రాముఖ్యతన ఇస్తానని నొక్కి చెప్పారు. సాధ్యమైనంత వరకు తక్కువ తినడం కంటే ప్రోటీన్ లక్ష్యాన్ని చేరుకోవడంపైనే ఫోకస్ పెడతానని తెలిపింది. అంతేగాదు తన శరీర బరువులో ప్రతి కిలోగ్రాముకు 1.2-1.6 గ్రాముల ప్రోటీన్ ఉండేలా చూసుకుంటానని అన్నారు. బరువులు ఎత్తడం, తగినంత నీరు తీసుకోవడం..వ్యాయామం కోసం ఇషితా తాను వారానికి నాలుగు సార్లు బరువులు ఎత్తుతానని, వారానికి రెండుసార్లు కార్డియో చేస్తానని పంచుకున్నారు. దాంతోపాటు వాలుగా నడవడం, సైక్లింగ్ లేదా ఈత కొట్టడం వంటివి చేస్తానని అన్నారు. అలాగే రోజుకు మూడు నుంచి నాలుగు లీటర్ల నీరు తాగడానికి ప్రయత్నిస్తానని చెప్పుకొచ్చింది. అలాగే రాత్రి భోజనం తర్వాత సోంపు నీరు కూడా తాగుతానని చెప్పింది. ఇఇ జీర్ణక్రియకు సహాయపడుతుందని, మంచి నిద్ర పట్టేలా చేస్తుందని వెల్లడించింది. అలాగే వ్యాయామం చేయాలని అనిపించని రోజున దానికి బదులుగా మ్యూజిక్ వింటూ వాక్ చేస్తుంటానని అన్నారామె. తాను ఇప్పటికీ పిజ్జా, డెజర్ట్లు, బర్గర్లు తింటానని, అయితే ప్రతిరోజూ కాదని చెప్పుకొచ్చింది. ఒకవేళ డ్రింక్ చేయాలనిపిస్తే ముందుగా భోజనం చేసి, చక్కెర కలిపిన వాటికి ప్రత్యామ్నాయంగా ఎంచుకుంటానని చెప్పింది. అలాగే స్వీట్స్ తినాలనిపించినప్పుడూ ప్రోటీన్ బార్లు లేదా ఆరోగ్యకరమైన కుకీలను, ఉప్పగా తినాలనిపించినప్పుడు ఇంట్లో తయారుచేసిన వేయించిన మఖానాను తీసుకుంటానని చెప్పుకొచ్చింది. నిలకడగా దినచర్యను పాటించాలంటే..నచ్చిన ఆహారాలను తినడమే మంచిదని అంటోంది. ప్రయాణాలు చేసేటప్పడు నడుస్తానని, వీలైనప్పుడల్లా మెట్లు ఎక్కుతానని చెప్పుకొచ్చింది. ఒక్కోసారి వ్యాయామం చేసే తీరిక దొరక్కపోతే..కనీసం 30 నిమిషాలైనా వ్యాయామం చేసేలా చూస్తానని వెల్లడించింది. అలాగే రోజుకు నాలుగు నుంచి ఐదుసార్లు కొద్దికొద్దిగా ఆహారం తీసుకుంటానని తెలిపింది. చివరగా బరువు తగ్గడం అంటే తీవ్రమైన డైటింగ్లు చేయడం కాదని..దీర్ఘకాలం పాటు కొనసాగించ గల అలవాట్లనే ఎంచుకుంటే ఈజీగా బరువు తగ్గగలరని అన్నారు.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: మామ్ వెయిట్లాస్ స్టోరీ..! 103 కిలోలు నుంచి 71 కిలోలకు..) -
వయసు పైబడితే..నీళ్లు తాగేటప్పుడు జర భద్రం..!
ఒక అరవై ఏళ్లుపై బడ్డ సీనియర్ సిటిజన్ రాత్రి 11:00 గంటలకు ఒక గ్లాసు నీళ్లు తాగుతూ ఊపిరాడక అవస్థ పడ్డాడు. సకాలంలో ఆస్పత్రికి తరలించినప్పటికీ..ఆయన మరణించారు. ఇలాంటివి ఇటీవల కాలంలో చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. అందుకు గల కారణం, ఎలాంటి జాగ్రత్తు తీసుకుంటే మంచిది వంటి వాటి గురించి సవివరంగా తెలుసుకుందామా.!.ఇలాంటి ఘటనలు ఒక ముఖ్యమైన విషయాన్ని తెలియజేస్తుంటాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. అందుకే వయసు పైబడిన వారు జీవితంలో ఏ పని చేసినా, ముఖ్యంగా ఈ రెండు విషయాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. అవేంటంటే..పడకుండా జాగ్రత్తపడటం (Prevent Falling)గొంతుకు అడ్డం పడకుండా (దండుపోకుండా) చూసుకోవడం (Prevent Choking)60 ఏళ్లు దాటితే..ఈ అలవాట్లను అలవర్చుకోవాలి..నీళ్లు తాగేటప్పుడు:మిగతా పనులన్నీ పక్కన పెట్టి, పూర్తి శ్రద్ధతో నీటిని నెమ్మదిగా, జాగ్రత్తగా తాగాలి. వృద్ధులలో గొంతు మింగడానికి సహాయపడే కండరాలు బలహీనపడటం వల్ల గొంతుకు అడ్డం పడే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని హెచ్చిరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. అలాగే నీరు, పాలు, సూప్ వంటి ద్రవపదార్థాలు గొంతుకు అడ్డం పడటం వల్ల వృద్ధులలో 'ఆస్పిరేషన్ న్యుమోనియా' (Aspiration Pneumonia) వచ్చే అవకాశం చాలా ఎక్కువ.ఇంట్లో వృద్ధులు ఉంటే గమనించాల్సిన ముఖ్య విషయాలు:స్ట్రా (Straw) ఉపయోగించండి: వీలైనంత వరకు నీళ్లు తాగడానికి స్ట్రా ఉపయోగించండి. అలాగే నీటిని మింగేటప్పుడు తల కొద్దిగా దించి (క్రిందికి వంచి) మింగాలి.చిక్కటి సూప్లు ఇవ్వండి: పల్చటి సూప్ల కంటే చిక్కటి (Thick) సూప్లు ఇవ్వడం మంచిది. పల్చటి ద్రవాలు నోట్లోకి వేగంగా ప్రవహిస్తాయి, దీనివల్ల శ్వాస తీసుకోవడంలో స్వల్ప తేడా వచ్చినా వెంటనే గొంతుకు అడ్డం పడతాయి.నోట్లో ఆహారం ఉన్నప్పుడు నీళ్లు వద్దు: నోట్లో ఘనపదార్థం (అన్నం లేదా టిఫిన్) నములుతున్నప్పుడు లేదా నోట్లో ఆహారం ఉన్నప్పుడు ద్రవపదార్థాలు తాగకూడదు. నీరు నోటిలో ఎక్కువసేపు ఉండిపోతే, అది తెలియకుండానే శ్వాసనాళంలోకి (Trachea) వెళ్లిపోయే ప్రమాదం ఉంది.మాట్లాడటం లేదా తల తిప్పడం చేయకూడదు: నోట్లో అన్నం లేదా నీళ్లు ఉన్నప్పుడు అస్సలు మాట్లాడకూడదు, అలాగే అటు ఇటు తల తిప్పకూడదు.శారీరక బలం తక్కువగా ఉంటుంది: యువకులకు ఉన్నంత శారీరక శక్తి, తట్టుకునే సామర్థ్యం వృద్ధులకు ఉండవు.ఒకవేళ ఏదైనా ద్రవం లేదా ఆహారం శ్వాసనాళంలోకి వెళ్లి, దాన్ని బయటకు దగ్గడానికి ప్రయత్నించినప్పుడు ముఖం ఎర్రగా మారిపోతుంది. అలాగే రక్తపోటు (Blood Pressure) అకస్మాత్తుగా పెరుగుతుంది. కొన్నిసార్లు ఈ ఊపిరి ఆడకపోవడం ప్రాణాంతకం కావచ్చు. అందువల్ల వయసు పెరుగుతున్న కొద్దీ నీటిని నెమ్మదిగా, శ్రద్ధగా, జాగ్రత్తగా తాగడం అలవాటు చేసుకోవాలని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. (చదవండి: Sanjay Dutt: వైరల్ ఫ్లూలా భావించి..కేన్సర్తో పోరాడా..!) -
వైరల్ ఫ్లూలా భావించి..ఆ వ్యాధిని జయించా..!: సంజయ్ దత్
బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ విలక్షణమైన నటనకు పేరుగాంచిన హీరో. సంజు బాబాగా పిలిచే ఆయన తన నాలుగు దశాబ్దాల సినీ కెరీర్లో ఎన్నో అవార్డులు సొంతం చేసుకున్నారు. ఆయన స్టేజ్ 4 లంగ్ కేన్సర్ని జయించిన వారియర్ కూడా. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో సంజయ్ దత్ స్వయంగా తాను ఈ కేన్సర్ని ఎలా జయించానో వెల్లడించారు. అంతేగాదు అందరూ ఇలానే పోరాడాలంటూ కేన్సర్ బాధితుల్లో స్ఫూర్తి నింపే ప్రయత్నం చేశారు. సంజయ్ దత్కు 2020 ఆగస్టులో స్టేజ్ 4 ఊపిరితిత్తుల కేన్సర్ నిర్థారణ అయింది. ఆయనకు ఊపిరితిత్తుల్లో ద్రవంచ చేరడంతో శ్వాస తీసుకోవడలో చాలా ఇబ్బందిపడ్డారు. ఆయన ముంబైలో చికిత్స తీసుకున్నారు. ఆ తర్వాత అక్టోబర్ 2020లోనే కేన్సర్ నుంచి బయటపడ్డారు కూడా. దాంతో ఒక్కసారిగా కుటంబసభ్యులు, అభిమానులు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఈ కేన్సర్ని జయించడంలో తను ఎలాంటి మానసిక ధైర్యంతో ఉన్నానో పంచుకున్నారు. తాను ఆ సమయంలో కేన్సర్ని వైరల్ ఫ్లూ వ్యాధిలా చూశానని, అన్నారు. ఎప్పుడూ మనం పోరాట యోధులుగా ఉండాలే తప్ప.. అంత సులభంగా వదిలేయకూడదని అన్నారు. అనారోగ్య సమస్య ఎలాంటిదైనా ధైర్యంగా పోరాడలని అన్నారు. కేన్సర్ బాధితులు ఎవరైనా..ఆ వ్యాధికి లొంగిపోకూడదని, బదులుగా ఇతర అనారోగ్యాల మాదరిగా చూడాలని హితవు పలికారు. నిజానికి అది కష్టమని తనకు తెలుసని..అయినప్పటికీ మనం నవ్వుతూనే పోరాడలన్నారు. కేన్సర్ నుంచి కోలుకుంటున్నప్పుడూ ఎదురయ్యే శారీరక బాధలు గురించి తనకు తెలుసన్నారు. ముఖ్యంగా మహిళలు ఈ విషయంలో ఎక్కువ ఇబ్బంది పడతారని అన్నారు. అదే సమయంలో తనకు సూదులంటే ఎంత భయమో కూడా చెప్పారు. తను యోగా లేదా ధ్యానం వంటివి చేయనని, కానీ జిమ్లో వర్కౌట్లు చేస్తానని చెప్పారు. అలాగే తను శివ భక్తుడనని, తనకు శివుడే సర్వస్వం అని చెప్పారు. చివరగా ఆయన జీవితంలో ఎలాంటి పరిస్థితుల్లోనైనా పోరాడాల్సిందేనని అన్నారు. మనం పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు పోరాడుతూనే ఉంటామని అన్నారు. పుట్టినప్పుడు మొదటగా ఆక్సిజన్ కోసం పోరాడతాం, ఆ తర్వాత ఆరోగ్యం లేదా వ్యక్తిగత సమస్యల కోసం పోరాడతామని అన్నారు. ఒక్కటి గుర్తించుకోండి సమస్యను ఎదుర్కోండి తప్ప పారిపోకండని పిలుపునిచ్చారు. ఒక్కసారిగా సమస్యను ఎదుర్కోవడం మొదలుపెడితే..ఆటోమేటిగ్గా పరిష్కరించుకోవడం ప్రారంభిస్తారని అన్నారు. అందుకే ఏ సమస్యనైనా ఎదుర్కోండి తప్ప పారిపోయే ప్రయత్నం చేయకండి దానివల్ల సమస్య మరింత ఎక్కువవుతుంతే గానీ దానికి పులిస్టాప్ పడదంటూ తన సంభాషణను ముగించారు. (చదవండి: ప్రేమ కోసం సైకిల్పై భారత్ నుంచి స్వీడన్కు..! ట్విస్ట్ ఏంటంటే..) -
మామ్ వెయిట్లాస్ స్టోరీ..! 103 కిలోలు నుంచి 71 కిలోలకు..
వెయిట్లాస్ ఒక్కోక్కరూ ఒక్కో విధానం అనుసరిస్తూ బరువు తగ్గుతారు. బరువు తగ్గించుకోవడమే కాదు దాన్ని అదుపులో ఉంచుకునేలా మెయింటైన్ చేయడమే అత్యంత ముఖ్యం అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. శరీరానికి అనుగుణంగా, నిలకడైన జీవనశైలితో నిధానంగా బరువు తగ్గడం అన్ని విధాల మేలు అని అందరికీ తెలిసిందే. ఆ విధంగానే ఈ ఇన్ఫ్లుయెన్సర్ మామ్ అనుసరించి ఏకంగా 32 కిలోలు తగ్గింది. అంతేగాదు అందుకోసం తాను ఏమి అనుసరించిందో కూడా ఇన్స్టాగ్రామ్ వేదికగా షేర్ చసుకుంది. మరి అవేంటో చూద్దామా.!.శాన్ డియాగోకు చెందిన ఇన్ఫ్లుయెన్సర్, తానియా అనే పిల్లల తల్లి వెయిట్లాస్ జర్నీ ఇది. ఆమె 103 కిలోల నుంచి 71 కిలోలకు తగ్గిన జర్నీని షేర్ చేసుకుంది. అంతలా 32 కిలోలు తగ్గడానికి సులభమైన నిలకడైన అలవాట్లే కారణమని అంటోంది. తాను ప్రధానంగా ఆరోగ్యకరమైన ఆహారం తినడం, వ్యాయామం చేయడంపై దృష్టిసారించానని అంటోంది. మూడేళ్లలో దీన్ని సాధించానని పేర్కొంది. తాను వెయిట్ట్రైనింగ్, యోగ ద్వారా బరువు తగ్గినట్లు పోస్ట్లో తెలిపింది. ఇంట్లోనే సులభంగా బరువు తగ్గాలంటే ఐదు పనులు చేయాలని వెల్లడించింది. అవేంటంటే..ప్రోటీన్రోజుకు 3 సార్లు కనీసం 30 గ్రాముల ప్రోటీన్ తీసుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించింది. ప్రాసెస్ చేసిన ప్రోటీన్ల కంటే..సహజసిద్ధమైన వాటికే ప్రాధాన్యత ఇచ్చానని తెలిపింది. బరువు తగ్గాలనుకుంటే రోజుకి శరీరానికి తగినంత ప్రోటీన్ మస్ట్ అని అంటోందామె.వ్యాయామంలో సౌలభ్యం..ఒక తల్లిగా, ఖచ్చితమైన' వ్యాయామ సమయం కోసం వెతకడం మానేశాను. కొన్ని రోజులు ఉదయం 5 గంటలకు, కొన్ని రోజులు నా బిడ్డ నిద్రపోతున్నప్పుడు మధ్యాహ్నం 3 గంటలకు, మరికొన్ని రోజులు అందరూ నిద్రపోయిన తర్వాత రాత్రి 9 గంటలకు కూడా వ్యాయామం చేశానని ఆమె చెప్పుకొచ్చింది. తన ఉద్దేశ్యంలో క్రమంతప్పకుండా చేయగలిగే సమయమే ఉత్తమమైన వ్యాయామ సమయం అని చెబుతోందామె. కచ్చితమైన షెడ్యూల్ అంటూ టై వేస్ట చేయొద్దని హెచ్చరించింది. జీవితానుగుణంగా కదలికలు ఉండేలా చూసుకోవడమే ముఖ్యం అని అంటోందామె. బరువులు ఎత్తడంతమకు సాధ్యమైనంత బరువును ఎత్తాలి. వారానికి 3 సార్లు బరువులు ఎత్తాలి. తక్కువ బరువుతో ప్రారంభించండి, క్రమబద్ధతను పెంచుకోమని చెబుతోంది. అలాగే పూర్తి శరీర వ్యాయామాలపై దృష్టి పెట్టండి, నెమ్మదిగా బరువులను పెంచుతూ పోవాలని సూచించింది.శరీరానికి తగినంత నీరు..హైడ్రేటెడ్గా ఉన్నారని నిర్ధారించుకోండి. రీర బరువులో సగం ఔన్సుల నీటిని తాగాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపింది.ఉదాహరణకు:బరువు 120 పౌండ్లు అయితే, రోజుకు 60 ఔన్సులు తాగాలని లక్ష్యంగా పెట్టుకోండి. హైడ్రేటెడ్గా ఉండటం శక్తికి, కోలుకోవడానికి మద్దతు ఇస్తుంది, అలాగు అత్యుత్తమ పనితీరును కనబరచడానికి సహాయపడుతుంది.నిద్రవీలైనంత నాణ్యమైన నిద్రను లక్ష్యంగా పెట్టుకోండి. ప్రసవానంతర దశలో ఉంటే, కొన్ని రాత్రులు పరిపూర్ణంగా ఉండకపోవచ్చని అయినప్పటికీ ఫర్వాలేదని అంటోందామె. అలాంటి తల్లులు వీలైనప్పుడల్లా విశ్రాంతికి ప్రాధాన్యత ఇవ్వండి, ఎందుకంటే కోలుకోవడం, కొవ్వు తగ్గడం, కండరాల నిర్మాణం, మొత్తం ఆరోగ్యం అన్నీ దానిపైనే ఆధారపడి ఉంటాయి.ఇలా కనీసం ఆరు నుంచి 12 వారాల పాటు ప్రయత్నించి చూస్తే..కచ్చితంగా మనలోని మార్పు మనమే స్వయంగా చూస్తామని నమ్మకంగా చెబుతోంది. అంతేగాదు ఇలా క్రమంతప్పకుండా చేస్తే..ఆలోచనా విధానంలో మార్పు తోపాటు శరీరం కూడా బలంగా మారడాన్ని చూస్తామని అంటోంది.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. View this post on Instagram A post shared by TaniaUnplugged | Yoga&More (@taniaunplugged) (చదవండి: అత్యంత క్లిష్టమైన అరుదైన కణితిని విజయవంతంగా తొలగించిన వైద్యులు) -
8 కిలోలు తగ్గిన సోనమ్.. ఇకపైనా ఆహారం తీసుకోకుంటే జరిగేది ఇదే!
విద్యావేత్త, వాతావరణ కార్యకర్త సోనమ్ వాంగ్చుక్ జంతర్ మంతర్ వద్ద చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష బుధవారంతో 17వ రోజుకు చేరుకుంది. ఆయన ‘నీట్’అవకతవకలపై జంతర్ మంతర్ వద్ద నిరసన తెలుపుతున్న ‘కాక్రోచ్ జనతా పార్టీ’కి మద్దతు ప్రకటిస్తూ, జూన్ 29న ఈ నిరాహార దీక్షకు దిగిన సంగతి తెలిసిందే. సుదీర్ఘ ఉవాసం కారణంగా..ఇప్పటికే ఆయన ఏకంగా 8.2 కిలోల బరువు తగ్గి ఆరోగ్యం క్షీణిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఇంతలా సుదీర్ఘ ఉపవాసం కారణంగా శరీరంలో ఏ జరుగుతుంది?, ఎదురయ్యే ఆరోగ్య ప్రమాదాల గురించి సవివరంగా తెలుసుకుందామా.!ఇంతలా వాంగ్చుక్ సుదీర్ఘ ఉపవాసం కొనసాగిస్తే.. కలిగే వైద్యపరమైన ప్రమాదాలపై సర్వత్రా ఆందోళన నెలకొంది. అంతేగాదు ఇప్పటికే ఆయన రక్తంలో గ్లూకోజ్స్థాయిలో 67 mg/dLకి పడిపోగా, ఆయన రక్తపోటు 107/70 mm Hgగా నమోదైంది. ఇలా సుదీర్ఘకాలం ఆహారం తీసుకోవపోవడం ఎలాంటి శారీరక ప్రభావాన్ని చూపిస్తుందో.. విషమిస్తున్న ఆయన ఆరోగ్యమే నిదర్శనం అంటున్నారు వైద్యులు. అదీగాక వాంగ్చుక్ తీవ్రమైన నొప్పితో విలవిలలాడుతున్నట్లు సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. అందుకే ఆయన్ను దీక్ష విరమించమని కోరుతున్న అందుకు ఆయన నిరాకరిస్తున్నట్లు వెల్లడించాయి. శాంతియుత నిరసన రూపంగా ఇలాంటి నిరాహార దీక్షలు ఎంచుకున్నప్పటికీ..దీర్ఘకాలిక ఉపవాసం తీవ్రమైన ఆరోగ్య ప్రమాదాలకు దారితీస్తుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒక వ్యక్తి తగినంత పోషణ లేకుండా ఎంత ఎక్కువ కాలం ఉంటే, అంతకు రెట్టింపుగా ప్రాణాంతక సమస్యలు వచ్చే ప్రమాదం అధికమవుతుందని అంటున్నారు. అసలు అన్ని రోజులు ఆహారం తీసుకోకుంటే ఏం జరుగుతుందంటే..దీర్ఘకాలిక ఉపవాస సమయంలో ఏం జరుగుతుందంటే..శరీరం మొదట శక్తి కోసం నిల్వ ఉన్న గ్లూకోజ్పై ఆధారపడుతుంది. ఈ నిల్వలు అయిపోయిన తర్వాత, అది ఇంధనం కోసం కొవ్వును విచ్ఛిన్నం చేయడం ప్రారంభిస్తుంది. అయితే, ఉపవాసం కొనసాగుతున్న కొద్దీ, శరీరం తన శక్తి అవసరాలను తీర్చడానికి కండరాల ప్రోటీన్ను ఉపయోగించడం ప్రారంభిస్తుంది. దీని ఫలితంగా కండరాలు క్షీణించి బలహీన పడటంతో వేగంగా బరువు తగ్గడం జరుగుతుంది. దీర్ఘకాలిక ఉపవాస సమయంలో, శక్తిని ఆదా చేయడానికి జీవక్రియ కూడా నెమ్మదిస్తుంది. ఫలితంగా ఈ లక్షణాలు అనుభవిస్తారు..అలసట, తీవ్రమైన బలహీనతతల తిరగడం, స్పృహ కోల్పోవడంఏకాగ్రత లోపంనిరంతర తలనొప్పిచిరాకు, మానసిక స్థితిలో మార్పులుకండరాల నొప్పులుడీహైడ్రేషన్ (నిర్జలీకరణం)వాంగ్చుక్ కేవలం రెండు వారాల్లో 8.2 కిలోలు బరువు తగ్గినట్లు ఆరోగ్య నివేదికలు చెబుతున్నాయి. ఇంతలా తక్కువ సమయంలో గణనీయంగా బరువు తగ్గడం అనేది కొవ్వు, కండర ద్రవ్యరాశి రెండింటిలోనూ గణనీయమైన క్షీణతను సూచిస్తుంది.ప్రమాదకర స్థాయిలో గ్లూకోజ్ స్థాయిలు..వాంగ్చుక్ రక్తంలో గ్లూకోజ్ స్థాయి 67 mg/dLగా నమోదైంది, ఇది చాలా మంది ఆరోగ్యవంతులైన పెద్దలలో ఉండే సాధారణ ఉపవాస స్థాయి కంటే తక్కువ. రక్తంలో చక్కెర స్థాయి తగ్గడం (హైపోగ్లైసీమియా) వల్ల వణుకు, చెమటలు పట్టడం, దృష్టి మసకబారడం, గందరగోళం, వేగంగా గుండె కొట్టుకోవడం, మాట్లాడటంలో ఇబ్బంది, తీవ్రమైన సందర్భాల్లో స్పృహ కోల్పోవడం వంటివి సంభవించవచ్చు. వైద్య సహాయం లేకుండా రక్తంలో చక్కెర స్థాయి తగ్గుతూనే ఉంటే, అది వైద్య అత్యవసర పరిస్థితిగా మారే ప్రమాదం లేకపోలేదని హెచ్చరిస్తున్నారు వైద్యులు.దీర్ఘకాలిక ఉపవాసం దాదాపు ప్రతి అవయవ వ్యవస్థను ప్రభావితం చేస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా వైద్య పర్యవేక్షణ లేకుండా, ఉపవాసం చాలా వారాల పాటు కొనసాగితే, ఈ సమస్యలు తీవ్రంగా మారే ప్రమాదం లేకపోలేదని హెచ్చరిస్తున్నారు. ఇలానే నిరాహార దీక్ష కొనసాగితే వచ్చే అనారోగ్య సమస్యలు ఏంటంటే.ఎలక్ట్రోలైట్ అసమతుల్యతలు, అసాధారణ గుండె లయల ప్రమాదాన్ని పెంచుతాయితక్కువ రక్తపోటు, దీనివల్ల తల తిరగడం, స్పృహ కోల్పోవడం కలుగుతాయికండర ద్రవ్యరాశి క్షీణించడం, గుండె కండరం బలహీనపడటంతో సహావిటమిన్, ఖనిజ లోపాలురోగనిరోధక శక్తి తగ్గడం, దీనివల్ల ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం పెరుగుతుందిడీహైడ్రేషన్ కారణంగా మూత్రపిండాల సమస్యలుదీర్ఘకాలిక జీవక్రియ మార్పుల వల్ల కాలేయంపై ఒత్తిడితప్పనిసరిగగా వైద్య పర్యవేక్షణ దీర్ఘకాలిక ఉపవాసాలు లేదా నిరాహార దీక్షలు చేసే వ్యక్తులకు క్రమం తప్పని వైద్య పర్యవేక్షణ అవసరం. ఎందుకంటే వైద్యులు సాధారణంగా రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు, రక్తపోటు, హృదయ స్పందన రేటు, శరీర బరువు, శరీరంలో నీటి శాతం, ఎలక్ట్రోలైట్ స్థాయిలు, మూత్రపిండాలు, కాలేయ పనితీరును పర్యవేక్షిస్తుంటారు. ఈ పర్యవేక్షణ, ప్రమాదకరమైన మార్పులను ముందుగానే గుర్తించడానికి, తక్షణ చికిత్స అవసరమా కాదా అనే నిర్ణయాలకు మార్గనిర్దేశం చేస్తుంది.నిరాహార దీక్షలు ఒక రకమైన శాంతియుత నిరసన అయినప్పటికీ, నిశితమైన వైద్య పర్యవేక్షణ లేకుండా సుదీర్ఘకాలం పాటు ఉపవాసం ఉండకూడదని వైద్య నిపుణులు నొక్కి చెబుతున్నారు. తీవ్రమైన బలహీనత, గందరగోళం, స్పృహ కోల్పోవడం, ఛాతీ నొప్పి, లేదా నిరంతరంగా రక్తంలో చక్కెర స్థాయిలు తక్కువగా ఉండటం వంటి ముందస్తు హెచ్చరిక సంకేతాలను గుర్తించడం అనేది కోలుకోలేని సమస్యలను నివారించడానికి చాలా కీలకం అని నొక్కి చెబుతున్నారు వైద్యులు.(చదవండి: మరణాన్ని జయించాలనుకుంటే..చివరికి ఆ వ్యాధి భారిన..!) -
తాతయ్య కంటే మనవడికే బీపీ ఎక్కువ..
యువతలో రక్తపోటు (హైపర్టెన్షన్) కేసులు వేగంగా పెరుగుతున్నాయని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు వృద్ధులలో మాత్రమే కనిపించే ఈ సమస్య, ప్రస్తుతం 20, 30 ఏళ్ల వయసు వారిలోనూ ఎక్కువగా బయటపడుతోంది. శారీరక శ్రమ లేకపోవడం, ఊబకాయం, మానసిక ఒత్తిడి, నిద్రలేమి, జంక్ ఫుడ్ అలవాట్లే దీనికి ప్రధాన కారణాలని కార్డియాలజిస్టులు చెబుతున్నారు. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం భారతదేశంలో 15 ఏళ్లు పైబడిన వారిలో 19.4% మహిళలు, 22.1% పురుషులు అధిక రక్తపోటుతో బాధపడుతున్నారు.గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే పట్టణాల్లో ఈ తీవ్రత మరింత ఎక్కువగా ఉంది. ‘ఐసీఎమ్ఆర్’ అధ్యయనం ప్రకారం, ప్రతి నలుగురు భారతీయులలో ఒకరికి హైపర్టెన్షన్ ఉంటోంది. అత్యంత ప్రమాదకరమైన విషయం ఏంటంటే, ఈ వ్యాధి ఎలాంటి లక్షణాలు లేకుండా నిశ్శబ్దంగా దాడి చేస్తుంది. గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్ లేదా కిడ్నీ వ్యాధులు వచ్చే వరకు చాలామందికి తమకు బీపీ ఉందనే విషయమే తెలియడం లేదు.అందుకే ఇంట్లోనే డిజిటల్ డివైజ్ల ద్వారా తరచూ బీపీని పరీక్షించుకోవాలని, వారానికి కనీసం 150 నిమిషాల శారీరక శ్రమ, తక్కువ ఉప్పు వాడకం, పండ్లు-కూరగాయలు ఎక్కువగా తీసుకోవడం వంటి జీవనశైలి మార్పుల ద్వారా ఈ ముప్పు నుంచి తప్పించుకోవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. -
‘అన్యురిజమ్’ అంటే..! బ్రెయిన్లో రావడానికి రీజన్..
దేహంలోని రక్తనాళాల్లో కొన్ని రక్తనాళాల పొరల నిడివి అంతటా ఒకే లాంటి మందం కలిగి ఉండకపోవచ్చు. ఆ రక్తనాళాల్లో కొన్ని కొన్నిచోట్ల బలహీనమైన చోట్లు / ప్రదేశాలు ఉండవచ్చు. మెదడులోనూ అల్లుకున్న రక్తనాళాల్లో బలహీనమైన చోట చిన్న బుడగలా ఉబ్బిపోయి... ఆ రక్తనాళపు పొర మరింత బలహీనపడ్డవేళ ఒక్కోసారి అది ఒక్కసారిగా చిట్లిపోతే మెదడులో రక్తస్రావం అయ్యే ప్రమాదం ఉంది. ఇలా మెదడులో రక్తనాళాల్లో ఎక్కడైనా బలహీనమైన ప్రాంతం ఉండి, అక్కడ రక్తం బుడగలా మారడాన్ని ‘సెరిబ్రల్ అన్యురిజమ్స్’ అంటారు. ఆ బలహీనమైన రక్తనాళ పొర అకస్మాత్తుగా చిట్లిపోవడం జరిగితే అది ఆ వ్యక్తికి అదిప్రాణాంతకంగా మారవచ్చు. ఇలా రక్తనాళాల్లో బలహీనమైన చోట ఉబ్బిపోయి... అది చిట్లిపొవడం ఎందుకు, అలా రక్తనాళపు పొరలు బలహీనపడి ‘అన్యురిజమ్’గా దారితీసే పరిస్థితులేమిటి లాంటి అనేక అంశాలపై అవగాహన కోసం ఈ కథనం.దాదాపు 30 నుంచి 40 ఏళ్ల కిందట ‘అన్యురిజమ్స్’పై వైద్యవర్గాల్లో పెద్దగా అవగాహన లేకపోవడంతో పేషెంట్ ఆకస్మికంగా చనిపోతే అది ఎందువల్లనో తెలియని పరిస్థితే ఎక్కువగా ఉండేది. సుమారు 30 ఏళ్ల కిందట ప్రతి లక్షమందిలో 5 నుంచి 10 మంది అన్యురిజమ్స్తో చనిపోయినా... అప్పట్లో ఆ మరణాలకు కారణం పెద్దగా తెలిసేది కాదు. ఎందుకంటే కారణం తెలిసేలోపే పేషెంట్ మరణించే పరిస్థితులే ఎక్కువగా ఉండేవి. ఈ అన్యురిజమ్స్ గురించి ఇప్పుడు చాలా ఎక్కువగా అవగాహన పెరిగింది. ఈ నేపథ్యంలో వాటి గురించి సమగ్రంగా తెలుసుకుందాం.మెదడులో వచ్చే అన్యూరిజమ్లు (సెరిబ్రల్ ఎన్యురిజమ్స్)మెదడు అన్యూరిజమ్ (సెరిబ్రల్ / ఇంట్రాక్రేనియల్ ఎన్యురిజమ్) అనేది మెదడులోని ఒక ధమని (ఆర్టరీ) గోడలోని లోపలి పొర బలహీనపడటం వల్ల ఆ రక్తనాళం ఒక చిన్న బుడగ (బ్లిస్టర్) లాగా ఉబ్బిపోవడం. ఈ ఉబ్బిన భాగం క్రమంగా చాలా పలుచగా మారి ఎలాంటి సూచనగానీ హెచ్చరికగానీ ఇవ్వకుండానే చిట్లిపోయే ప్రమాదం ఉంటుంది. ఇలా అన్యూరిజమ్ చిట్లిపోయినప్పుడు మెదడు చుట్టూ ఉన్న ఖాళీ ప్రదేశంలో రక్తస్రావం జరుగుతుంది. దీనిని సబ్ అరాక్నాయిడ్ హీమరేజ్ (ఎస్ఏహెచ్) అంటారు. ఇటువంటి రక్తస్రావాలలో సుమారు 90% అన్యూరిజమ్ చిట్లిపోవడం వల్లే సంభవిస్తాయి. ఇది పక్షవాతం (స్ట్రోక్), కోమా లేదా మరణానికి కూడా దారితీయవచ్చు.మెదడు అన్యూరిజమ్ ఏర్పడడానికి కారణాలు- అధిక రక్తపోటు (హైపర్టెన్షన్)- పొగతాగడం (సిగరెట్, బీడీ, చుట్ట తాగడం లాంటి అలవాట్లు)- పుట్టుకతో వచ్చే (జన్యుపరమైన) కారణాలతో.- రక్తనాళాలకు గాయం లేదా దెబ్బతగలడం- కొన్ని రకాల బ్లడ్ ఇన్ ఫెక్షన్ల కారణంగా వచ్చే పరిణామాలతో.అన్యూరిజమ్ ఎలా చిట్లుతుందంటే... - అన్యూరిజమ్ సంచిలో (స్యాక్) చిన్న రంధ్రం ఏర్పడినప్పుడు అది చిట్లినట్లుగా భావిస్తారు. - రంధ్రం చిన్నదైతే కొద్దిపాటి రక్తం మాత్రమే లీక్ అవుతుంది.- రంధ్రం పెద్దదైతే తీవ్రమైన రక్తస్రావం జరుగుతుంది.- చిట్లని అన్యూరిజమ్ (అన్ రప్చర్డ్ అన్యురిజమ్) అంటే ఇంతకుముందు ఎప్పుడూ రక్తం లీక్ కాని అన్యూరిజమ్.పగలని (అన్ రప్ఛర్డ్) అన్యూరిజమ్ లక్షణాలు- పక్షవాతం (స్ట్రోక్ ) – 37%- తలనొప్పి – 37%- ఫిట్స్ (మూర్ఛ) – 18%- చూపు సమస్యలు – 29%పగిలిన (రప్చర్డ్) అన్యూరిజమ్ లక్షణాలు- జీవితంలో ఎన్నడూ / ఎప్పుడూ అనుభవించని తీవ్రమైన తలనొప్పి- స్పృహ కోల్పోవడం- పక్షవాతం (స్ట్రోక్) - మాట్లాడలేకపోవడం, నోరు ఒకవైపు వంగిపోవడం - ఫిట్స్ (మూర్ఛ)చికిత్స విధానాలు...- ఔషధ చికిత్స (మెడికల్ / నాన్ సర్జికల్ థెరపీ) - శస్త్రచికిత్స (సర్జికల్ క్లిప్పింగ్) ∙ఎండోవాస్క్యులర్ చికిత్స (ఎండోవాస్క్యులార్ కాయిలింగ్)- అవసరమైతే స్టెంట్ లేదా బెలూన్ సహాయంతోమన దేశంలోని పరిస్థితి ఇది... ప్రతి ఏటా మన దేశంలో ప్రతి లక్షమందికి పది నుంచి పన్నెండు మందికి పైగా అన్యురిజమ్ బారిన పడుతున్నట్లు ఓ అంచనా. ఇటీవల వీరి సంఖ్య పెరిగినట్లుగా కూడా గణాంకాలు చెబుతున్నాయి. ఇందులో దాదాపు 40 శాతం మంది మృతిచెందుతుంటారు. బతికి బయటపడ్డ వారిలోనూ దాదాపు మూడింట రెండు వంతుల మంది ఏదో ఒక రకమైన వైకల్యం లేదా అవయవలోపం కలుగుతుంది. అంటే వారు ఏదో ఒక రకమైన న్యూరలాజికల్ డెఫిసిట్తో బాధపడాల్సిన పరిస్థితి. మెదడులో రక్తస్రావమై... అది అవయవాలను నియంత్రించే సెంటర్లపై దుష్ప్రభావం చూపడం వల్ల ఈ పరిస్థితి వస్తుంది.కొందరిలో జీవితకాలంలో బయటపడకపోవచ్చు...అన్యురిజమ్స్ ఉన్న చాలామందిలో మెదడులో రక్తనాళాలు కొంత బలహీనంగా ఉండవచ్చు. చాలా బలహీనంగా కూడా ఉండవచ్చు. అయినప్పటికీ అదృష్టవశాత్తు జీవితకాలంలో అవి చిట్లకపోవచ్చు. ఉదాహరణకు ఒక రక్తనాళంలో అంగుళంలో ఎనిమిదో వంతు ఉండే అన్యురిజమ్స్లో 50 శాతం నుంచి 80 శాతం ఎప్పటికీ చిట్లకపోవచ్చు. ఇక కొందరిలో ఈ రక్తనాళాల్లోని ఉబ్బు అంగుళం కంటే పెద్దగా కూడా ఉండవచ్చు. వీటినే ‘జెయింట్ అన్యురిజమ్స్’ అంటారు. ఇలాంటి జెయింట్ అన్యురిజమ్స్ అకస్మాత్తుగా చిట్లడానికి ఆస్కారం ఉంది. ఇవి చిట్లాక రోగికి అకస్మాత్తుగా పక్షవాతం రావచ్చు.నిర్ధారణ కోసం సెరిబ్రల్ ఏంజియోగ్రామ్...గుండెపోటు వచ్చిన వారిలో నిర్ధారణ కోసం చేసే యాంజియోగ్రామ్ పరీక్ష లాగే మెదడుకూ యాంజియోగ్రామ్ చేస్తారు. ఇందులో న్యూరోఇంటర్వెన్షనల్ సర్జన్ ఒక ట్యూబ్ ద్వారా మెదడు రక్తనాళాల వరకు చేరి... అక్కడ ఒకరకమైన రంగు పదార్థాన్ని (డై అని పిలిచే రంగుపదార్థం) మెదడులోని రక్తనాళాల్లోకి వదులుతారు. దాంతో ఆ రంగు పదార్థం రక్తనాళాల్లో చేరి ఉబ్బినట్లుగా ఉన్న ప్రాంతాలను (అన్యురిజమ్స్ను) స్పష్టంగా చూపుతుంది. ఇలాంటి చిత్రాలను చూపించే ప్రక్రియను ‘ఫ్లోరోస్కోప్’గా చెబుతారు. ఈ చిత్రాల సహాయంతో మెదడులోని ఏయే ప్రాంతాల్లో అన్యురిజమ్స్ ఉన్నాయి, వాటి పరిమాణం, ఆకృతి వంటి అనేక కీలకమైన అంశాలను తెలుసుకోగలుగుతారు. వాటి తీవ్రత ఆధారంగా అవసరమైన చికిత్సను డాక్టర్లు సూచిస్తారు.అన్యురిజమ్ మెదడులోనే వస్తాయా?అన్యురిజమ్స్ అంటే బలహీనమైన చోట్లలో రక్తనాళాలు ఉబ్బడం. అది దేహంలోని ఏ ప్రాంతలో ఉన్న రక్తనాళల్లోనైనా జరగవచ్చు. అయితే... దేహంలోని మిగతా ప్రాంతాల్లో అలా ఉబ్బు రావడం లేదా చిట్లడం వల్ల తక్షణ ప్రమాదంగానీ లేదాప్రాణాపాయంగానీ పెద్దగా ఉండకపోవచ్చు. కానీ మెదడు విషయంలో అలా కాదు. మెదడులో రక్తస్రావం జరిగితే... శరీరంలోని అన్ని కీలకమైన అవయవాలనూ, అలాగే దేహ భాగాలను నియంత్రించే నాడులు అక్కడే ఉంటాయి కాబట్టి అవి దెబ్బతినిప్రాణాపాయం కలిగే అవకాశాలెక్కువ. అందుకే మెదడులో సంభవించే అన్యురిజమ్ను తేలికగా తీసుకోకూడదు. ఇలా మెదడులో వచ్చే అన్యురిజమ్స్ను ‘సెరిబ్రల్ అన్యురిజమ్స్’గా చెబుతారు. మిగతా చోట్ల వచ్చే వాటిని దేహంలోని ఆ ప్రదేశం పేరుతో చెబుతారు. ఉదాహరణకు ఛాతీ ప్రాంతంలో వస్తే వాటిని థొరాసిక్ అన్యురిజమ్స్ అని పేర్కొంటారు.1. మందులతో చేసే చికిత్స (మెడికల్ థెరపీ) ఈ చికిత్స సాధారణంగా చిట్లిపోని (అన్ రప్చర్డ్) అన్యూరిజమ్లకు మాత్రమే ఉపయోగిస్తారు. చికిత్స తర్వాత ప్రధానంగా...- పొగతాగే అలవాటు పూర్తిగా మానేయడం- రక్తపోటును నియంత్రణలో ఉంచడం- వైద్యుడు సూచించిన ఆహార నియమాలు పాటించడం- క్రమం తప్పకుండా వ్యాయామం చేయడంఈ చర్యలే అన్యూరిజమ్ ఏర్పడటం, పెరగడం లేదా చిట్లుపోవడం వంటి ముప్పులను తప్పించడానికి దోహదపడేవిగా నిరూపితమయ్యాయి.అలాగే, అన్యూరిజమ్ పరిమాణం లేదా పెరుగుదలను గమనించేందుకు డాక్టర్లు అవసరాన్ని ఎమ్మారై, సీటీ స్కాన్ లేదా సంప్రదాయ యాంజియోగ్రఫీ వంటి పరీక్షలను క్రమం తప్పకుండా చేయాలని సూచించవచ్చు.2. శస్త్రచికిత్స (సర్జికల్ క్లిప్పింగ్)ఈ విధానంలో క్రేనియోటమీ అనే శస్త్రచికిత్స ద్వారా పుర్రెలో చిన్న రంధ్రం చేసి మెదడును, అలాగే ప్రభావితమైన రక్తనాళాల వరకు చేరుకుంటారు. అన్యూరిజమ్ను గుర్తించిన తర్వాత, చుట్టూ ఉన్న మెదడు కణజాలం నుంచి దాన్ని (అన్యురజమ్ను) జాగ్రత్తగా వేరుచేస్తారు.తర్వాత టైటానియంతో తయారు చేసిన చిన్న మెటల్ క్లిప్ను అన్యూరిజమ్ వచ్చిన ప్రాంతంలో (దీన్ని సాధారణంగా నెక్ అని వ్యవహరిస్తారు) వద్ద అమర్చుతారు. దీంతో అన్యూరిజమ్లోకి రక్త ప్రవాహం పూర్తిగా ఆగిపోతుంది. దాంతో మెదడులో సాధారణ రక్తప్రసరణ తిరిగి కొనసాగుతుంది.3. ఎండోవాస్క్యులర్ కాయిలింగ్ఈ విధానంలో కాలులోని ఫెమొరల్ ఆర్టరీ ద్వారా ఒక క్యాథెటర్ను ప్రవేశపెట్టి, దాని ద్వారా చిన్న మైక్రోక్యాథెటర్ను అన్యూరిజమ్ వరకు తీసుకెళ్తారు. ఆ తర్వాత అన్యూరిజమ్ లోపల ప్రత్యేకమైన మెటల్ కాయిల్స్ వేస్తారు. దీంతో అన్యూరిజమ్లో రక్తప్రవాహం ఆగి అది మూసుకుపోతుంది.ఈ చికిత్సలో తల / పుర్రె (స్కల్)ను తెరవాల్సిన అవసరం ఉండదు. అందువల్ల శస్త్రచికిత్స చాలా తక్కువ సమయంలోనే పూర్తవుతుంది.మత్తుమందు (అనస్థీషియా) అవసరం కూడా తక్కువే. చాలా వేగంగా కోలుకుంటారు.4. స్టెంట్ లేదా బెలూన్ సహాయంతో కాయిలింగ్కొన్ని సంక్లిష్టమైన అన్యూరిజమ్లలో... మరీ ముఖ్యంగా వెడ్ నెక్డ్ అన్యురిజమ్ అనే అన్యురిజమ్స్లో లేదా పెద్ద లేదా అతి పెద్ద (లార్జ్ అండ్ జెయింట్ అన్యురిజమ్) వంటి సందర్భాల్లో స్టెంట్ లేదా బెలూన్ సహాయంతో కాయిలింగ్ చేస్తారు. ఇలా చేయడం వల్ల కాయిల్స్ ప్రధాన రక్తనాళంలోకి జారిపోకుండా నివారించవచ్చు. లేదంటే పక్షవాతం (స్ట్రోక్) వచ్చే ప్రమాదం ఉంటుంది.బెలూన్–అసిస్టెడ్ కాయిలింగ్లో, కాయిల్స్ వేస్తున్న సమయంలో అన్యూరిజమ్ నెక్ ప్రాంతంలో బెలూన్ ను తాత్కాలికంగా ఉబ్బించి ఉంచుతారు.5. ఫ్లో డైవర్షన్ అన్యూరిజమ్ చికిత్స కోసం సుమారు ఏడు సంవత్సరాల క్రితం ఫ్లో డైవర్టర్ (ఎఫ్డీ) స్టెంట్లు అందుబాటులోకి వచ్చాయి. ఇవి ట్యూబ్ ఆకారంలో ఉండే ప్రత్యేక స్టెంట్లు. ఇవి రక్తప్రవాహాన్ని అన్యూరిజమ్ వైపు వెళ్లకుండా మళ్లిస్తాయి. దీంతో అన్యూరిజమ్ స్యాక్లోకి వెళ్లే రక్తప్రవాహం క్రమంగా తగ్గిపోతుంది. ఫలితంగా అన్యూరిజమ్ నెమ్మదిగా పూర్తిగా మూసుకుపోయి, కాలక్రమేణా సహజంగా నయమవుతుంది.చికిత్సలో ఎదురయ్యే సవాళ్లుచిట్లిన లేదా చిట్లని... ఇలా రెండు రకాల మెదడు అన్యూరిజమ్ల చికిత్సలు ఇటు పేషెంట్కూ, అటు డాక్టర్లకూ ఓ పెద్ద సవాలుగా మారడం చాలా సాధారణం.గుండెపోటు లాగే అన్యురిజమ్ కూడా... అన్యురిజమ్స్తో వచ్చే పరిణామాలను మనం గుండెజబ్బు అనంతర పరిణామాలతో పోల్చవచ్చు. అకస్మాత్తుగా హార్ట్ ఎటాక్ వచ్చినట్టుగానే అన్యురిజమ్స్ కూడా అంతే అకస్మాత్తుగా రావచ్చు. గుండెపోటు విషయంలో గుండెకు రక్తాన్ని చేరవేసే రక్తనాళాల్లోని పూడిక చేరినందువల్ల అడ్డంకులు ఏర్పడి గుండెపోటు వస్తే... అన్యురిజమ్స్ విషయంలో మాత్రం మెదడుకు చేరవేసే రక్తనాళాలు చిట్లడం వల్ల ఈ సమస్య వస్తుంది. గుండెపోటుకు పొగాకు వాడకం, కుటుంబంలో ఎవరికైనా గుండెజబ్బుల చరిత్ర (ఫ్యామిలీ హిస్టరీ) రిస్క్ ఫ్యాక్టర్లు అయినట్లుగానే... దీనికీ పొగాకు, ఫ్యామిలీ హిస్టరీలే పెద్ద రిస్క్ ఫ్యాకర్లు.మరికొన్ని రిస్క్ ఫ్యాక్టర్లు కూడా... శరీర నిర్మాణానికి దోహదపడే కొన్నిప్రోటీన్లకు సంబంధించిన జబ్బులు (ఉదాహరణకు ఎహ్లర్స్–డాన్లోస్ సిండ్రోమ్, మార్ఫన్స్ సిండ్రోమ్), కండరాల జబ్బు అయిన ఫైబ్రోమస్క్యులార్ డిస్ప్లేసియా, దీర్ఘకాలికంగా ఉండే రక్తపోటు, కుటుంబ సభ్యుల్లో చాలా దగ్గరి వారికి అన్యురిజమ్స్ ఉండటం, కోకెయిన్ వంటి మాదకద్రవ్యాలు తీసుకునే దురలవాటు, మూత్రపిండాల్లో నీటితిత్తుల ఉండే పాలిసిస్టిక్ కిడ్నీ డిసీజ్ ఉండటం... అన్యురిజమ్కు రిస్క్ఫ్యాక్టర్లు.గ్లాస్గో కోమా స్కేల్పై తీవ్రత కొలతతో గ్రేడింగ్... అన్యురిజమ్స్ కారణంగా కానీ లేదా ఇతరత్రాగానీ... ఒక వ్యక్తి కోమాలోకి వెళ్లినప్పుడు దాని తీవ్రతను కొలిచేందుకు ఉపయోగపడే స్కేల్ను గ్లాస్గో కోమా స్కేల్గా అంటారు. ఇందులో ఒక్కోరకమైన స్పందనకు ఒక్కో స్కోర్ ఇస్తారు. ఉదాహరణకు పేషెంట్ కంటి కదలికలకూ, డాక్టర్ మాటలకు పేషెంట్ స్పందించే తీరుకూ, ఇలా... ఒక్కోదానికి కొంత స్కోర్ ఉంటుంది. ఇందులో డాక్టర్ ఇచ్చిన ఏ ఆదేశానికీ పేషెంట్ నుంచి స్పందన లేకపోతే కనిష్టంగా స్కోర్ మూడుగా నమోదవుతుంది. అదే ఆదేశాలకు పేషెంట్ స్పందిస్తున్న కొద్దీ గ్లాస్గో కోమా స్కేల్పై స్కోర్ పెరుగుతుంది. అంటే మూడు స్కోర్ ఉంటే అది పేషెంట్ నుంచి ఏ స్పందనా లేని పరిస్థితి. అంటే అది పూర్తిస్థాయి కోమా అని అర్థం. అదే స్కోర్ పెరుగుతూ... అన్ని ఆదేశాలకూ స్పందిస్తే అది నార్మల్గా 15 ఉంటుంది. ఈ స్కోర్ను బట్టి అన్యురిజమ్స్ కారణంగా సబర్కనాయిడ్ హామరేజ్ జరిగినప్పుడు పేషెంట్లో దాని తీవ్రతను గ్రేడింగ్ చేస్తారు. (వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ న్యూరలాజికల్ సర్జన్స్ ఆమోదించిన గ్రేడింగ్ ప్రక్రియ ఇది).హేమరేజ్ జరిగిన కేసుల్లో పేషెంట్ తాలూకు గ్లాస్గో కోమా స్కేల్పై కొలతల గ్రేడ్... - స్కోరు 15 ఉంటే రోగి కోలుకోవడానికి పూర్తిగా అవకాశాలుంటాయి.- స్కోరు 3 ఉంటే రోగి కోలుకోడానికి అవకాశాలు ఉండవు.- స్కోరు 8 లేదా అంతకంటే ఎక్కువ ఉంటే రోగి కోలుకోవడానికి మంచి అవకాశాలుంటాయి.- స్కోరు 3 – 5 ఉంటే అది ప్రమాదకరమైన స్థితి.చివరగా... ఒకప్పుడు పాశ్చాత్య దేశాల్లో కాస్త ఎక్కువగా కనిపించే ఈ కేసులు ఇటీవల మన దేశంలోనూ ఎక్కువగా వస్తున్నాయి. అప్పట్లో మన దగ్గర వ్యాధి నిర్ధారణకు అవసరమైన పరీక్షలు అంతగా అందుబాటులో లేవు. కానీ ఇప్పుడా పరీక్షలు, వాటితో పాటు సరికొత్త చికిత్స ప్రక్రియలు అందుబాటులోకి రావడంతో మన దగ్గర కూడా ఆ పేషెంట్ల వివరాలు తెలియడంతో పాటు చాలామందిని రక్షించడమూ ఇప్పుడు సాధ్యమవుతోంది.- డా. కిశోర్ కుమార్, సీనియర్ న్యూరో సర్జన్- నిర్వహణ: యాసీన్ -
శస్త్ర చికిత్స లేకుండా 'ఏఐ' ఎండోమెట్రియోసిస్ను నిర్థారించగలదా?
టెక్ బిలియనీర్, దీర్ఘాయువు ప్రచారకర్త బ్రయాన్ జాన్సన్ తన స్నేహితురాలు కేట్కు శస్త్ర చికిత్స చేయించుకోకుండానే ఎండోమెట్రియోసిస్ ఉన్నట్లు నిర్ధారణ అయిందని చెప్పారు. ఏళ్ల తరబడి స్కానింగ్ల తర్వాత ఏఐ సహాయక ఎంఆర్ఐ విశ్లేషణలో ఎండోమెట్రియోసిస్ని సులభంగా నిర్థారించిదని వెల్లడించారు. శస్త్ర చికిత్స లేకుండా నిర్థారించలేని ఈ సమస్యను తాము ఏఐ ఆధారిత స్కానింగ్, బహుళ రక్త పరీక్షల సాయంతో నిర్థారించామని అన్నారు. ఈ నేపథ్యంలో అసలు ఏంటి ఎండోమెట్రియోసిస్?, ఈ సమస్యను గుర్తించడంలో ఏఐ ప్రత్యామ్నాయంగా ఉంటుందా? తదితరాల గురించి సవివరంగా తెలుసుకుందామా.!.ఎండోమెట్రియోసిస్ అంటే..ఇది మహిళల్లో కనిపించే ఒక సాధారణ మరియు దీర్ఘకాలిక ఆరోగ్య సమస్య. ఇందులో, గర్భాశయం లోపలి పొరను పోలి ఉండే కణజాలం (ఎండోమెట్రియం) గర్భాశయం వెలుపల.. అండాశయాలు, ఫెలోపియన్ ట్యూబ్లు, లేదా పొత్తికడుపులోని ఇతర అవయవాలపై పెరగడం ప్రారంభమవుతుంది. దీన్నే ఎండోమెట్రియోసిస్ అంటారు. దీనివల్ల వాపు, మచ్చలు, తీవ్రమైన కటి నొప్పి కలుగుతాయి. డబ్ల్యూహెచ్ఓ ప్రకారం..ప్రపంచవ్యాప్తంగా సంతానోత్పత్తి వయస్సులో ఉన్న ప్రతి 10 మంది మహిళల్లో ఒకరు దీని బారిన పడుతున్నారని అంచనా. దీని కారణంగా మహిళలు ఈ కింది సమస్యలు ఎదుర్కొంటారు.లక్షణాలు..నెలసరి సమయంలో తీవ్రమైన కడుపు నొప్పి, నడుము నొప్పిరుతుస్రావం సమయంలో లేదా సంభోగం సమయంలో విపరీతమైన నొప్పిఅధిక రక్తస్రావం (హెవీ పీరియడ్స్)వంధ్యత్వం (గర్భం దాల్చడంలో ఇబ్బందులు)దీన్ని నిర్థారించడం ఎందుకంత కష్టం అంటే..ఈ సమస్య లక్షణాలు తరచుగా ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ (IBS), పెల్విక్ ఇన్ప్లమేటరీ డిసీజ్ లేదా అండాశయ తిత్తులు వంటి ఇతర ఆరోగ్య సమస్యలతో కలిసి ఉంటాయి. ఫలితంగా, చాలా మంది మహిళలకు ఈ వ్యాధి నిర్ధారణ కావడానికి 6 నుంచి 10 ఏళ్ల వరకు వేచి ఉండాల్సి వస్తుంది.సాధారణ స్కాన్లు గుర్తించలేకపోవడానికి రీజన్..ఇక్కడ బ్రయాన్ జాన్సన్ తన గర్ల్ఫ్రెండ్ కేట్ మొదటగా ఎమ్మారై, ట్రాన్స్వజైనల్ అల్ట్రాసౌండ్ చేయించుకుందని చెప్పారు. కానీ ఈ రెండూ ఆ వ్యాధిని గుర్తించడంలో విఫలమయ్యాయని చెప్పారు. నిజానికి సాధారణ ఇమేజింగ్ పద్ధతుల ద్వారా ఎండోమెట్రియోసిస్ గాయాలను గుర్తించడం కష్టమని వైద్యులు కూడా చెబుతున్నారు. అండాశయాలు లేదా లోతైన పెల్విక్ కణజాలాలను ప్రభావితం బాగా ప్రభావితం చేసే ముదిరిన పరిస్థితుల్లోనే సాంప్రదాయ స్కానింగ్లో దీన్ని గుర్తించగలరట. అదీగాక దశాబ్దాలుగా, ఎండోమెట్రియోసిస్ను నిర్ధారించడానికి లాపరోస్కోపీని (వైద్యులు పెల్విక్ కుహరాన్ని నేరుగా పరీక్షించడానికి వీలు కల్పించే అతి తక్కువ కోతతో చేసే శస్త్రచికిత్సా విధానం) అత్యుత్తమ ప్రమాణంగా పరిగణిస్తున్నారు. ఇక్కడ ఏఐ ఆధారిత అధిక నాణ్యత ఇమేజింగ్ ఆ కోతను కూడా తగ్గించి సులభంగా ఈ సమస్యను గుర్తించడం విశేషం.కృత్రిమ మేధ (AI) రోగ నిర్ధారణను మెరుగుపరచగలదా?మహిళల ఆరోగ్య రంగంలో కృత్రిమ మేధ ఒక ఆశాజనకమైన సాధనంగా ఆవిర్భవించనుంది. పెల్విక్ MRI స్కాన్లను విశ్లేషించడానికి, రేడియాలజిస్టులు కూడా గమనించలేని సూక్ష్మమైన నమూనాలను గుర్తించడానికి AI అల్గారిథమ్లను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేస్తున్నారు. అందువల్ల ఈ సాంకేతికత లోతుగా చొచ్చుకుపోయే ఎండోమెట్రియోసిస్ను గుర్తించడంలో చక్కటి మెరుగుదలను అందిస్తుందని అంటున్నారు నిపుణులు. ఇక్కడ జాన్సన్ AI-సహాయక ఇమేజింగ్, ఎండోమెట్రియోసిస్-నిర్దిష్ట అల్ట్రాసౌండ్తో పాటు వివధ రక్త పరీక్షల ఆధారంగా ఈ సమస్యను నిర్థారించినట్లు తెలిపారు. అందువల్ల ఇది కచ్చితంగా మెరుగైన ఫలితాలు ఇవ్వగలదని చెప్పలేమని..ఇంకా పలు క్లినికల్ ట్రయల్స్ నిర్వహించాల్సి ఉందని అంటున్నారు. అందువల్ల తాము ఏఐ సాధనం గైనకాలజిస్ట్ నిపుణుడికి ప్రత్యామ్నాయం కాదని గుర్తుపెట్టుకోండని హెచ్చరిస్తున్నారు.ప్లీజ్ ఈ విషయాలన్ను విస్మరించొద్దు..అందుకనే మహిళలు ఎండోమెట్రియోసిస్ను సూచించే లక్షణాలు ఉంటే, కేవలం ప్రాథమిక స్కాన్ ఆధారంగా నిర్లక్ష్యం చేయొద్దని అంటున్నారు. ఎండోమెట్రియోసిస్ విషయంలో అనుభవం ఉన్న గైనకాలజిస్ట్ను సంప్రదించి వారి సలహాలు, సూచనలు తీసుకోవడం ఉత్తమం అని అంటున్నారు. ఇక్కడ జాన్సన్ చెబుతోంది దీర్ఘకాలిక కటి నొప్పితో బాధపడుతున్న లక్షలాది మంది మహిళలకు, ఈ ఆవిష్కరణలు ముందస్తు నిర్థారణకు, అలాగే తక్కువ బాధతోనే త్వరితగతిని వైద్య పరీక్షలు చేయించుకునే అవకాశానికి వీలు కల్పిస్తుందనే ఆశను అందిస్తుందే తప్ప..దీనిపై మరిన్ని పరిశోధనలు చేయాల్సి ఉందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.(చదవండి: కేన్సర్తో పోరాడుతూ షూటింగ్లో పాల్గొన్నా..! ఆ కారణంగానే ఆమె..) -
కేన్సర్తో పోరాడుతూ షూటింగ్లో పాల్గొన్నా..! ఆ కారణంగానే ఆమె..
బాలీవుడ్ నటి, మోడల్ నఫీసా అలీ కేన్సర్ వారియర్. ఇప్పటికీ దానిపై పోరాడుతున్నారామె. నిజానికి ఇలాంటి వ్యాధి ఎంతటి వ్యక్తులనైనా కుంగదీసేస్తుంది. కానీ ఆమె ఆ మహమ్మారి విడవకుండా మరోసారి తిరగబెడుతున్నా..నవ్వుతూనే పోరాడుతోంది. పైగా ఎందుకిలానో ఆమెనే స్వయంగా వెల్లడించారు. అంతేగాదు తనకు తొలిసారి కేన్సర్ నిర్థారణ అయినప్పుడూ కూడా షూటింగ్ల్లో పాల్గొన్నానని అందుకు కారణం ఉందంటూ ఆలోచింప చేసేలా మాట్లాడారామె. ఆ ఆసక్తికర విషయాల గురించి సవివరంగా తెలుసుకుందామా. బాలీవుడ్ ప్రముఖ నటి నఫీసా అలీ జూనూన్' (1979), 'మేజర్ సాబ్' (1998), 'లైఫ్ ఇన్ ఎ మెట్రో' (2007), 'గుజారిష్' (2010), 'యమ్లా పగ్లా దీవానా' (2011) వంటి బ్లాక్బస్టర్ చిత్రాలలో నటనకు పేరుగాంచింది. తన నటన, అభినయంతో విమర్శకులు ప్రశంసలు అందుకున్న ఈ బెంగాలీ భామకు 'మ్యాక్స్, మిన్ అండ్ మ్యావ్జాకి' షూటింగ్ సమయంలోనే స్టేజ్ 3 కేన్సర్తో పోరాడుతున్నట్లు తెలిపింది. అయితే ఆ టైంలో ఈ మూవీని పూర్తి చేయగలనా..ఆ పాత్రలో నటించగలనా అనే భయాలు వెంటాడుతున్న తరుణంలో ఆ చిత్రనిర్మాత పద్మకుమార్ నరసింహమూర్తి తనపై పూర్తి నమ్మకం ఉంచారని అందుకు ఆయనకు శతకోటి ధన్యవాదాలని అన్నారామె. ఆయన తనని ప్యాడీ అని ముద్దుగా పిలిచేవారని, ఆ టైంలో అంత ధైర్యంగా సినిమా చేయడానికి కారణం కూడా ఆయనే అని నాటి ఘటనను గుర్తుతెచ్చుకున్నారు. ఆ చ్రితం కూడా చక్కటి సందేశాన్ని ఇచ్చేది కావడం ఒకటైతే, కేన్సర్ లాంటి వ్యాధితో పోరాడుతూ కూడా తన పనుల్లో సాగిపోవాలని భవిష్యత్తు తరాలకు కొత్త ఆశను అందించేందుకు అంటోంది నఫీసా అలీ. అంతేగాదు తన జీవితంతో ఒక సందేశాన్ని అందించాలనే పోరాటమే అత్యంత ముఖ్యమైనదని తెలుసుకున్నా. ఎందుకంటే ఎప్పుడు ఏం జరుగుతోందో ఎవ్వరికీ తెలియదు, అలాంటప్పడు నాకే ఇలా అనే కుంగుబాటుకు లోనవ్వాల్సిన పనిలేదు అని చెప్పేందుకని అంటోందామె. ఇలాంటి సమయంలో మనం ఒకరినొకరు జాగ్రత్తగా చూసుకోవాలి, అందరూ దీని గురించి ఆలోచించడం ముఖ్యం. అలాగే ఇలాంటి పరిస్థితుల్లో తీసుకోవాల్సిన తగిన జాగ్రత్తలు, నైతిక బాధ్యత గురించి ఆలోచించాలని చెబుతోంది. జీవితం ఎప్పటికీ అనూమ్యమైనదే, అందుకనే ప్రజలు సదా కరుణతో ఉండాలి, సాముహిక బాధ్యతను కలిగి ఉండాలన్నేదే నమ్ముతానని అంటోంది. ఈ రోజు ఇక్కడ ఉన్నానని, రేపు ఏం జరుగుతుందనే ఎవరికి తెలుసు కాబట్టి ఆ వ్యాధిపై ధైర్యంగా పోరాడుతూనే ఉండండి..ఆ సత్యాన్ని చెప్పేందుకే ఆ సమయంలో కూడా షూటింగ్లలో పాల్గొన్నట్లు తెలిపింది. తాను అప్పుడు స్టేజ్ 3 కేన్సర్తో పోరాడా, గెలిచా..కానీ మళ్లీ తిరగబెట్టి స్టేజ్ 4 కు చేరుకుంది అయినా..తన పోరాటం ఆపనని ధీమాగా చెబుతోందామె. ఆమె ముందు క్రీడాకారిణి..కోల్కతాలో బెంగాలీ తండ్రికి, ఆంగ్లో ఇండియన్ తల్లికి జన్మించిన నఫిసా అలీ విభిన్న సంస్కృతులు కలగలసిన కుటుంబ నుంచి వచ్చారామె. ఆమె స్విమ్మింగ్లో అర్జున అవార్డు గ్రహిత. క్రీడాకారుడైన కల్నల్ రవీందర్ సింగ్ సోధీని పెళ్లి చేసుకున్నారు. నటలోకి ప్రవేశించడానికి ముందే ఆమె నేషనల్ స్విమ్మింగ్ ఛాంపియన్గా ఉండేవారు. 1976లో ఈవ్స్ వీక్లీ మిస్ ఇండియా టైటిల్ను గెలుచుకున్నారు. అంతేగాదు శశి కపూర్, ధర్మేంద్ర, అమితాబ్ బచ్చన్ వంఇ ప్రముఖ నటనలతో పనిచేశారు. 2004, 2009లలో లోక్సభ ఎన్నికలలో పోటీ చేశారు. 2005లో, ఆమె చిల్డ్రన్స్ ఫిల్మ్ సొసైటీ ఆఫ్ ఇండియా (CFSI) ఛైర్పర్సన్గా నియమితులయ్యారు. నవంబర్ 2018లో, ఆమెకు స్టేజ్ 3 పెరిటోనియల్, ఓవేరియన్ కేన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. View this post on Instagram A post shared by Nafisa Ali Sodhi (@nafisaalisodhi) (చదవండి: కదులుతున్న రైలులో పూజలు..! రైల్వే ఏం చెప్పిందంటే) -
'వాకింగ్'కి అత్యంత అనుకూలమైన నగరం అదే..! కానీ హారన్ కొట్టారో..
నగరాల్లో వాకింగ్ వెళ్లాలంటే విసుగొచ్చేస్తుంది. కొద్ది దూరం నడిచేటప్పటికే అలసట, చికాకు అన్ని వచ్చేస్తాయి. ఎందుకంటే రద్దీగా ఉండే రహదారులు, వీధులు, ఓ పక్క హారన్ మోతలలో హోరెత్తిపోతుంది. కాబట్టి హాయిగా నడవడం చాలా కష్టం. ఏ పార్క్ లేదా చక్కటి ఉద్యానవనం లాంటి ప్రదేశాల్లోనే ప్రశాంతంగా వాకింగ్ చేయగలం అంతే. కానీ భారత్లోనే ఓ నగరం వాకింగ్ అత్యంత అనుకూలమైంది. అక్కడ నడిస్తే ఎంత హాయిగా అనిపిస్తుందంటే..అలసట కూడా తెలియదు. మన దేశంలో ఎక్కడుందంటే ఆ నగరం..పట్టణ ప్రాంతాలు ఎల్లప్పుడూ వాకింగ్కి అనుకూలంగా ఉండవనేది తెలిసిందే. భారత్లో ప్రతిచోటా ట్రాఫిక్, మరోవైపు ఫుట్పాత్లపై కూడా ద్విచక్రవాహనాలు దర్శనం ఇవ్వడంతో..నడకకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. అయితే ఇలాంటి సమస్యలే లేని ప్రశాంతమైన నగరం భారత్లో ఉంది. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ట్రావెల్ వ్లాగర్ తాన్య ఖనిజో ఆ నగరం గురించి నెటింట షేర్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చంది. ఆమె తన వీడియోకి ‘భారతదేశంలో అత్యంత నడవడానికి అనువైన నగరం’ అనే క్యాప్షన్ జోడించి మరి ఆ నగరం విశేషాల గురించి వీడియోలో వివరించారు. అది ఉత్తర భారతదేశంలోని పర్వత ప్రాంత రాష్ట్రమైన సిక్కిం రాజధాని గ్యాంగ్టక్ అని పేర్కొంది. తాన్యా పోస్ట్లో తన అభిప్రాయంలో, భారతదేశంలో అత్యంత నడవడానికి అనువైన నగరం ఇదే అని రాశారు. ఈ గ్యాంగ్టక్ భారతదేశంలోని పట్టణ నగరాలలో ప్రత్యేకంగా నిలిచే, పాదచారులకు అత్యంత అనుకూలమైన గమ్యస్థానం. నగరంలోని ఎత్తైన నడక మార్గాలు వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగించకుండా ప్రజలు సురక్షితంగా ప్రయాణించడానికి వీలు కల్పిస్తాయని చెప్పుకొచ్చింది. తాను ఇప్పటి వరకు వెళ్లిన నగరాలలో నడవడానికి అనుకూలమైన నగరం ఇదే. ఇక్కడ ట్రాఫిక్కు అంతరాయం కలిగించని, అంతరాయం లేని ఎత్తైన ఫుట్పాత్లు చాలానే ఉన్నాయన్నారు. నడుస్తున్నప్పుడు ఎంతో హాయిగా సురక్షితంగా ఉంటుందన్నారు. ఒకవేళ హారన్ కొట్టారో ఏకంగా రూ. 1000 జరిమానా పడుతుందని తెలిపింది. అందువల్ల ఈ నగరం ప్రశాంతమైన వాతావరణానికి ప్రసిద్ధి చెందిందని వెల్లడించింది. ఈ నగరం ఆహ్లాదకరమైన వాతావరణంతో కూడిన సుదీర్ఘ నడకలను ప్రోత్సహిస్తుందని, అందువల్లే తాను తెలియకుండానే అరగంటపైనే నడిచానని సంబరంగా చెప్పింది. ముఖ్యంగా మహిళలు ఒంటరిగా నడుస్తున్నప్పుడు ఇబ్బందికరమైన చూపులు లేదా వేధింపులకు గురికాకపోవడం వల్ల సురక్షితంగా భావిస్తారని పేర్కొంది. మహిళలు సోలాగా వాక్ చేయాలనుకుంటే ఈ నగరమే అత్యంత అనుకూలమైందని అంటోంది. చివరగా వ్లాగర్ తాన్య నడవడానికి అనువైన ప్రాంతాల విషయంలో ఇంతటి ఉన్నత ప్రమాణాలు, మహిళల ప్రదేశాలకు ఇచ్చే గౌరవం, సామాన్య ప్రజల అవసరాలపై అవగాహన తదితరాలను చూసి ఆశ్చర్యంగా అనిపిస్తోందని అంటోంది. నగరాలన్ని ఇలానే ఉంటే బాగుండును అంటూ తన వీడియోని ముగించింది. నెటిజన్లు కూడా నగరాన్ని అందరికీ నివాసయోగ్యంగా మార్చడానికి గ్యాంగ్టక్ చూపిస్తున్న నిబద్ధతను ప్రశంసించగా, మరికొందరు ప్లీజ్ దీని గురించి మరి ఎక్కువగా ప్రచారం చేయకండి, లేదంటే ప్రజలంతా తండొపతండాలుగా వచ్చి ఆ ఆహ్లాదభరితమైన వాతావరణాన్ని కూడా పాడుచేస్తారంటూ ఆందోళన వ్యక్తం చేస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Tanya Khanijow (@tanyakhanijow) (చదవండి: ఐఐటీ నేపథ్యం కాదు..కానీ ఏకంగా యూఎస్ ఎన్విడియాలో రూ. 2.6 కోట్ల జీతం) -
Health: నా బిడ్డకు ఏమైనా ప్రమాదమా?
నా వయస్సు 22 సంవత్సరాలు. నాకిప్పుడు ఏడోనెల. ఇటీవల పరీక్ష చేయించుకుంటే రక్తపోటు ఎక్కువగా ఉందని డాక్టర్ చెప్పారు. మందులు కూడా వాడమన్నారు. ఈ సమస్య వల్ల నాకు లేదా నా బిడ్డకు ఏమైనా ప్రమాదమా? ఈ మందులు గర్భంలో సురక్షితమేనా? – చైత్ర, మంచిర్యాల.గర్భధారణ సమయంలో మొదటిసారిగా అధిక రక్తపోటు రావడాన్ని ‘ప్రీఎక్లాంప్సియా’ అంటారు. సాధారణంగా రక్తపోటు ‘140/90 ఎమ్ఎమ్హెచ్జీ’ లేదా అంతకంటే ఎక్కువగా ఉన్నప్పుడు దీనిని అనుమానిస్తారు. కొంతమందిలో దీనితో పాటు మూత్రంలో ప్రొటీన్ కనిపించడం, రక్తపరీక్షల్లో మార్పులు లేదా కాలేయం, మూత్రపిండాల పనితీరులో లోపాలు కూడా ఉండవచ్చు. కొన్ని పరిస్థితుల్లో ఈ సమస్య వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మొదటిసారి గర్భం దాల్చడం, చాలా చిన్న వయస్సులో లేదా ఎక్కువ వయస్సులో గర్భం ధరించడం లేదా గత గర్భంలో అధిక రక్తపోటు వచ్చినా, కవల పిల్లలు గర్భంలో ఉన్నా, గర్భానికి ముందే రక్తపోటు లేదా మధుమేహం ఉన్నా, అధిక బరువు ఉన్నా లేదా సంతానలేమి చికిత్సల ద్వారా గర్భం దాల్చినా ప్రమాదం కొంత ఎక్కువగా ఉంటుంది. ఈ సమస్య సాధారణంగా 20 వారాల తర్వాత ప్రారంభమవుతుంది. ఎక్కువగా మూడో త్రైమాసికంలో కనిపిస్తుంది. అరుదుగా ప్రసవం తర్వాత ఆరు వారాల వరకు కూడా రావచ్చు.చాలామంది గర్భిణీల్లో ఈ సమస్యకు మొదట్లో ఎలాంటి లక్షణాలు కనిపించవు. సాధారణ గర్భధారణ పరీక్షల్లోనే ఇది బయటపడుతుంది. అయితే కొందరిలో అకస్మాత్తుగా బరువు పెరగడం, శరీరం మొత్తం వాపు రావడం, స్కానింగ్లో బిడ్డ ఎదుగుదల తగ్గడం వంటి మార్పులు కనిపించవచ్చు. అయితే కొందరిలో తీవ్రమైన తలనొప్పి, చూపు మసకబారడం లేదా వెలుగులు మెరుస్తున్నట్లు కనిపించడం, వాంతులు, ముఖం, చేతులు లేదా కాళ్లలో అకస్మాత్తుగా వాపు రావడం, మూత్రం తగ్గిపోవడం, కడుపు పైభాగంలో తీవ్రమైన నొప్పి, తీవ్రమైన పరిస్థితుల్లో మూర్ఛలు (సీజర్లు) రావడం వంటి లక్షణాలు కనిపించవచ్చు.ప్రీఎక్లాంప్సియా నిర్ధారణ అయితే రక్తపోటును నియంత్రించేందుకు మందులు అవసరం అవుతాయి. సాధారణంగా ‘లాబెటాలోల్’లేదా ‘నైఫెడిపిన్’ వంటి మందులు గర్భధారణలో సురక్షితంగా పరిగణించబడతాయి. వైద్యుడి సూచన మేరకు వీటిని క్రమం తప్పకుండా తీసుకోవాలి. స్వయంగా మందులు ఆపడం లేదా మోతాదు మార్చడం చేయకూడదు. గర్భధారణ ప్రారంభ దశలో చేసిన ఎన్ టీ స్కాన్, ఇతర రక్తపరీక్షల ఆధారంగా ప్రీఎక్లాంప్సియా వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని గుర్తిస్తే, నివారణ కోసం కొంతమందికి తక్కువ మోతాదులో మందును సూచిస్తారు.ప్రీఎక్లాంప్సియాను నిర్లక్ష్యం చేస్తే తల్లికీ, బిడ్డకీ కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. తల్లిలో రక్తపోటు మరింత పెరగడం, మూర్ఛలు రావడం, కాలేయం లేదా మూత్రపిండాల పనితీరు దెబ్బతినడం, ముందస్తు ప్రసవం లేదా అత్యవసర శస్త్రచికిత్స అవసరమయ్యే పరిస్థితులు ఏర్పడవచ్చు. బిడ్డలో ఎదుగుదల తగ్గిపోవడం, గర్భాశయంలో నీటి పరిమాణం తగ్గడం, ముందుగానే పుట్టడం లేదా పుట్టిన తర్వాత కొంతకాలం ప్రత్యేక సంరక్షణ అవసరం కావడం వంటి సమస్యలు రావచ్చు.అయితే భయపడాల్సిన అవసరం లేదు. ఈ సమస్యను ముందుగానే గుర్తించి, రక్తపోటును నియంత్రిస్తూ, క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకుంటూ, బిడ్డ ఎదుగుదలను పర్యవేక్షిస్తే చాలా వరకు ఈ ప్రమాదాలను తగ్గించవచ్చు. అందుకే గర్భధారణ సమయంలో ప్రతి పరీక్షను సమయానికి చేయించుకోవడం, వైద్యులు సూచించిన మందులు క్రమం తప్పకుండా వాడటం, తలనొప్పి, చూపు మసకబారడం, శరీరం ఎక్కువగా వాపు రావడం లేదా బిడ్డ కదలికలు తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆసుపత్రికి వెళ్లడం చాలా ముఖ్యం. సరైన సమయంలో గుర్తించడం, సరైన చికిత్స తీసుకోవడం, నిరంతర వైద్య పర్యవేక్షణలో ఉండడం వల్ల తల్లి, బిడ్డ ఇద్దరూ సురక్షితంగా ఉండే అవకాశం చాలా ఎక్కువ. కాబట్టి ఆందోళన చెందకుండా మీ వైద్యుల సూచనలు తప్పకుండా పాటించండి.- డా. కడియాల రమ్య, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్ -
అరుదైన సార్కోమా క్యాన్సర్.. గుర్తించడం ఎలా?
క్యాన్సర్ అనగానే మనకు సాధారణంగా రొమ్ము, ఊపిరితిత్తులు లేదా ప్రేగుల క్యాన్సర్లు మాత్రమే గుర్తుకు వస్తుంటాయి. అయితే శరీరంలోని అనుసంధాన కణజాలాలలో (connective tissues) వచ్చే ‘సార్కోమా’ అనే అరుదైన క్యాన్సర్ను త్వరగా గుర్తించలేం. ఫలితంగా తీవ్రమైన పరిణామాలు ఎదురయ్యే ప్రమాదం ఉంది. సార్కోమా క్యాన్సర్లు ఎముకలు, కండరాలు, కొవ్వు, మృదులాస్థి (cartilage), రక్తనాళాలు, నరాలు, ఇతర మృదువైన కణజాలాలలో (soft tissues) ఉత్పన్నమవుతాయి. పెద్దవారిలో వచ్చే క్యాన్సర్లలో ఇవి కేవలం ఒక శాతం మాత్రమే అయినప్పటికీ, ఇవి అటు పిల్లలపై, ఇటు పెద్దలపై కూడా ప్రభావం చూపిస్తాయి. దీని ప్రారంభ లక్షణాలు చాలా స్వల్పంగా, నొప్పి లేకుండా ఉండటం వల్ల వ్యాధి నిర్ధారణ ఆలస్యమవుతున్నది. అందుకే దీనిపై అవగాహన పెంచుకోవడం ఎంతో అవసరం.సార్కోమా అంటే ఏమిటి?మ్యాక్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మెడికల్ ఆంకాలజీ ప్రిన్సిపల్ డైరెక్టర్ డాక్టర్ సమీర్ ఖత్రీ తెలిపిన వివరాల ప్రకారం.. సార్కోమా అనేది ఒక అసాధారణ క్యాన్సర్. ఇది స్పష్టమైన కారణం లేకుండానే వస్తుంది. ‘సార్కోమా బారిన పడిన చాలామందికి అది తమకు ఎందుకు వచ్చిందో అసలు తెలియదు. చాలా కేసులలో దీనికి నిర్దిష్టమైన జీవనశైలి అలవాట్లు గానీ లేదా బాహ్య కారణాలు గానీ బాధ్యత వహించవు’ అని ఆయన వివరించారు. సార్కోమాలో 100 కంటే ఎక్కువ ఉప రకాలు ఉన్నాయి. ఒక్కొక్కటి ఒక్కోలా ప్రవర్తిస్తుంది. అందుకే దీని నిర్ధారణ, చికిత్స చాలా సవాలుతో కూడుకున్నవి. అయితే, ఈ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచే కొన్ని అంశాలను వైద్యులు గుర్తించారు.ప్రమాద కారకాలు సార్కోమాను సాధారణంగా నివారించలేనప్పటికీ, దీని ముప్పును పెంచే కొన్ని అంశాలను వైద్యులు గుర్తించారు. అవి.. ‘లి-ఫ్రౌమెని సిండ్రోమ్’ వంటి వంశపారంపర్య జన్యుపరమైన సమస్యలు. న్యూరోఫైబ్రోమాటోసిస్ టైప్ 1.. గతంలో ఇతర క్యాన్సర్ల కోసం రేడియేషన్ థెరపీ తీసుకోవడం. దీర్ఘకాలంగా ఉండే లింఫెడెమా (lymphoedema - వాపు సమస్య). కొన్ని రకాల పారిశ్రామిక రసాయనాలకు సుదీర్ఘకాలం గురికావడం.ఉపేక్షించకూడని హెచ్చరిక సంకేతాలుసార్కోమా ఆలస్యంగా నిర్ధారణ కావడానికి ప్రధాన కారణం.. దీని ప్రాథమిక లక్షణం నొప్పి లేని గడ్డలా కనిపించడమే. క్యాన్సర్ నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం.. నిరంతరం పెరుగుతూ ఉండే గడ్డ, ఐదు సెంటీమీటర్ల కంటే పెద్దగా (సుమారుగా ఒక గోల్ఫ్ బంతి పరిమాణంలో) ఉండే వాపు, కండరాల లోపల లోతుగా ఉండే గడ్డ, ఎటువంటి గాయం కాకపోయినా ఎముకలలో నిరంతరం నొప్పి రావడం, రాత్రి వేళల్లో ఎముకల నొప్పి మరింత తీవ్రం కావడం, తగ్గకుండా పదే పదే వచ్చే వాపు. శరీరంలో వచ్చే చాలా గడ్డలు ప్రమాదకరమైనవి కానప్పటికీ, ఏదైనా వాపు తగ్గకుండా ఉన్నా లేదా పరిమాణం పెరుగుతున్నా వెంటనే వైద్య నిపుణులను సంప్రదించి పరీక్షించుకోవాలి.వ్యాధి నిర్ధారణ ఎలా చేస్తారు?అనుమానాస్పదంగా ఉన్న గడ్డలను పరీక్షించడానికి వైద్యులు సాధారణంగా ఎంఆర్ఐ స్కాన్లు, పెట్-సిటి ఇమేజింగ్, ముందస్తు ప్రణాళికతో చేసే బయాప్సీ, ఇమ్యునోహిస్టోకెమిస్ట్రీ, మాలిక్యులర్, జన్యుపరమైన పరీక్షలు, నెక్స్ట్-జనరేషన్ సీక్వెన్సింగ్ వంటి పద్ధతులను ఉపయోగిస్తారు. సార్కోమా చికిత్సలో అనుభవజ్ఞులైన కేంద్రాలలోనే బయాప్సీ చేయించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.నివారించడం సాధ్యమేనా?మిగతా సాధారణ క్యాన్సర్లలా కాకుండా, సార్కోమా రావడానికి ఖచ్చితమైన కారణం తెలియదు కాబట్టి దీనిని నివారించడానికి నిర్దిష్టమైన మార్గాలేవీ లేవు. అయితే, అనవసరమైన రేడియేషన్కు గురికాకపోవడం, ప్రమాదకర రసాయనాలను ఉపయోగించే కార్యాలయాల్లో భద్రతా ప్రమాణాలు పాటించడం, వంశపారంపర్య క్యాన్సర్ సమస్యలు ఉన్నవారు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవడం, శరీరంలో తగ్గని గడ్డలు లేదా ఎముకల నొప్పులు ఉన్నప్పుడు వెంటనే వైద్యులను సంప్రదించడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. -
పాటలు పాడటం.. నిజంగానే ఊపిరితిత్తులకు మంచిదా?
స్నానం చేస్తూ పాటలు పాడుతున్నారా? అయితే మీ ఆరోగ్యానికి కూడా మేలు చేస్తున్నట్టే! పాటలు పాడేటప్పుడు ఊపిరిని లోతుగా తీసి వదలాల్సి ఉంటుంది. దీంతో ఊపిరితిత్తుల పనితీరు మెరుగుపడుతుంది. అంటే... మీ బాత్రూమ్ కచేరీ కూడా ఒక చిన్న వ్యాయామమే!. అదెలాగో సవివరంగా తెలసుకుందామా..!పాటలు పాడటం అనేది కేవలం కళ మాత్రమే కాదు, ఇది ఒక అద్భుతమైన వ్యాయామం. క్రమం తప్పకుండా పాటలు పాడటం వల్ల డయాఫ్రాగమ్, ఇంటర్కోస్టల్ కండరాలు బలపడి, ఊపిరితిత్తుల సామర్థ్యం (lung capacity), శ్వాస నియంత్రణ మెరుగుపడతాయిశ్వాసకోశ కండరాల బలోపేతం: దీర్ఘమైన శ్వాస దశలు, నియంత్రిత శ్వాస తీసుకోవడం, నెమ్మదిగా శ్వాస వదలడం అనేవి డయాఫ్రమ్, ఇంటర్కోస్టల్ సహాయక కండరాలను ఉత్తేజపరిచి, ఓర్పును, సామర్థ్యాన్ని పెంచుతాయి.మెరుగైన శ్వాస నియంత్రణ సామర్థ్యం: సంగీత శిక్షణ సౌకర్యవంతమైన ఉచ్ఛ్వాస సమయాన్ని పెంచుతుంది. ఊపిరితిత్తుల అసలు పరిమాణం మారకపోయినా, ఇప్పటికే ఉన్న ఊపిరితిత్తుల పరిమాణాన్ని మెరుగ్గా ఉపయోగించడం ద్వారా క్రియాత్మక కీలక సామర్థ్యాన్ని పెంచుతుంది.మెరుగైన శ్వాస సామర్థ్యం: పాడటం నెమ్మదిగా, నియంత్రితంగా శ్వాస తీసుకునే విధానాలను ప్రోత్సహిస్తుంది. దీనివల్ల అనవసరమైన వేగవంతమైన, నిస్సారమైన శ్వాసలు తగ్గి, వాయు మార్పిడి ప్రక్రియ మెరుగుపడుతుంది.వాయుమార్గం తెరుచుకోవడం, శ్లేష్మం తొలగిపోవడం: ఫిజియోథెరపీ పద్ధతులతో కలిపి ఉపయోగించినప్పుడు, దీర్ఘకాలిక శ్వాసకోశ సమస్యలు ఉన్నవారిలో స్వర వ్యాయామాలు సున్నితమైన ఉచ్చారణ శ్లేష్మాన్ని కదిలించి, వాయుమార్గం శుభ్రపరచడాన్ని మెరుగుపరుస్తాయి.అంతేగాదు పాడటం శ్వాస, మింగడం మధ్య సమన్వయాన్ని మెరుగుపరుస్తుంది. ఇది న్యూరోజెనిక్ డిస్ఫేజియా, కొన్ని నాడీకండర రుగ్మతలకు ఉపయోగపడుతుంది.సమూహ గానం ఒత్తిడి, ఆందోళనను తగ్గించి ఆయాసం అనే భావనను తొలగిస్తుంది. టానమిక్ సమతుల్యతను (సింపథెటిక్ టోన్ను తగ్గించడం) అనుకూలంగా మార్చవచ్చు, తద్వారా పరోక్షంగా శ్వాస సరళకి ప్రయోజనం చేకూరుస్తుంది.(చదవండి: దెయ్యంపై కేసు..! జడ్జీ వేసిన ఆ ఒక్క ప్రశ్నతో..) -
39 అత్యవసర ఔషధాల ధరల్లో మార్పు
దేశంలో సామాన్యుడి వైద్యభారాన్ని తగ్గించే దిశగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నిరంతరం వాడాల్సిన అత్యవసర మందుల ధరలను నియంత్రిస్తూ జాతీయ ఔషధ ధరల నియంత్రణ సంస్థ (ఎన్పీపీఏ) సరికొత్త ఉత్తర్వులు జారీ చేసింది. మధుమేహం (డయాబెటిస్), రక్తపోటు (బీపీ), గుండె జబ్బులు వంటి దీర్ఘకాలిక వ్యాధుల చికిత్సకు ఉపయోగించే 39 కీలక ఔషధాల (న్యూ డ్రగ్ ఫార్ములేషన్స్) రిటైల్ ధరలపై ఎన్పీపీఏ గరిష్ఠ పరిమితిని (క్యాపింగ్) విధించింది. డ్రగ్స్ ప్రైస్ కంట్రోల్ ఆర్డర్ (డీపీసీఓ), 2013 నిబంధనల ప్రకారం ఇటీవల జారీ చేసిన ఈ అధికారిక నోటిఫికేషన్లు తక్షణమే అమలులోకి రానున్నాయి.కీలక సవరణలు.. ధరల వివరాలుఎన్పీపీఏ తాజా ఉత్తర్వుల ప్రకారం, నిత్యం ప్రజలు ఉపయోగించే విటమిన్లు, అత్యవసర ఇంజెక్షన్ల ధరలను ఈ క్రింది విధంగా నిర్ణయించారు:కాల్షియం, విటమిన్ D3 మాత్రలు: ఎముకల పుష్టికి, విటమిన్లోప నివారణకు విస్తృతంగా వాడే ఈ మాత్రల గరిష్ఠ రిటైల్ ధరను అన్ని పన్నులతో కలిపి ఒక టాబ్లెట్కు రూ.8.93గా స్థిరీకరించారు.యాంటీ-రేబీస్ ఇమ్యునోగ్లోబులిన్ ఇంజెక్షన్: పిచ్చి కుక్కలు లేదా ఇతర జంతువులు కరిచినప్పుడు అత్యవసరంగా ఇచ్చే ఈ ప్రాణరక్షక ఇంజెక్షన్ (150 IU/ml) ధరను రూ.119.48గా సవరించారు.కార్డియాక్, బీపీ ఔషధాలు: గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదాలను తగ్గించే క్లోపిడోగ్రెల్ + ఆస్పిరిన్ + అటోర్వాస్టాటిన్ క్యాప్సూల్ ధరను ఒక్కోదానికి రూ.6.37గా, హైపర్టెన్షన్ చికిత్సకు వాడే అమ్లోడిపైన్ + బైసోప్రోలోల్ + టెల్మిసార్టాన్ టాబ్లెట్ ధరను రూ.14.74గా నిర్ణయించారు.జీవనశైలి జబ్బుల బాధితులకు ఊరటభారతదేశంలో వైద్య ఖర్చులు చాలా ఎక్కువ. ముఖ్యంగా ఇంట్లో వృద్ధులు లేదా దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు ఉన్న కుటుంబాలకు నెలవారీ మందుల బిల్లులు పెద్ద భారంగా మారుతున్నాయి. తాజా నిర్ణయం ద్వారా బీపీ, షుగర్, హెచ్ఐవీ, శ్వాసకోశ సమస్యలు, కంటి ఇన్ఫెక్షన్ల ఔషధాల ధరలు నియంత్రణలోకి రావడం వల్ల మధ్యతరగతి, పేద కుటుంబాల బడ్జెట్కు పెద్ద ఊరట లభించనుంది.ఇదీ చదవండి: నిప్పుల కొలిమిలో నగరాలు -
జనాభా.. జగమెరుగని సత్యాలు
ప్రతి ఏటా జూలై 11న ప్రపంచవ్యాప్తంగా ‘ప్రపంచ జనాభా దినోత్సవం’ నిర్వహిస్తారు. జనాభా పెరుగుదల వల్ల కలిగే పరిణామాలు, వనరుల కొరత, లింగ సమానత్వం, మానవ హక్కులపై అవగాహన కల్పించడానికి ఐక్యరాజ్యసమితి ఈ రోజును కేటాయించింది.– మొదటి ‘వంద కోట్లు’ చేరడానికి లక్షల ఏళ్లు!మానవ చరిత్ర ప్రారంభమైనప్పటి నుంచి ప్రపంచ జనాభా మొదటి 100 కోట్లకు చేరడానికి కొన్ని లక్షల సంవత్సరాలు పట్టింది (దాదాపు క్రీ.శ. 1804 లో). కానీ, ఆ తర్వాత కేవలం 200 ఏళ్లలోనే ఆ సంఖ్య ఏకంగా ఎనిమిది రెట్లు పెరిగిపోవడం విశేషం!– 830 కోట్లుగణాంకాల ప్రకారం ప్రస్తుతం ప్రపంచ జనాభా 830 కోట్లు దాటి దూసుకుపోతోంది. 2022 నవంబర్ నాటికి మనం 800 కోట్ల మార్కును దాటగా, కేవలం ఈ నాలుగేళ్లలోనే జనాభా ఎంత వేగంగా పెరిగిందో దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు.– 1000 కోట్లకు ఎప్పుడు చేరుతాం?ఐక్యరాజ్యసమితి నివేదికల ప్రకారం.. ప్రపంచ జనాభా 2030 నాటికి 850 కోట్లకు, అలాగే 2050 నాటికి 970 కోట్లకు చేరుకుంటుంది. ఇక 2080 నాటికి ప్రపంచ జనాభా గరిష్టంగా 1030 కోట్లకు చేరి, ఆ తర్వాత స్థిరంగా ఉండిపోతుందని లేదా క్రమంగా తగ్గుముఖం పడుతుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.– సెకనుకు నలుగురుప్రపంచవ్యాప్తంగా ప్రతి సెకనుకు సగటున నలుగురు పిల్లలు జన్మిస్తుంటే, ఇద్దరు మరణిస్తున్నారు. అంటే ప్రతి సెకనుకు ఇద్దరు చొప్పున ప్రపంచ జనాభాకు అదనంగా చేరుతున్నారు. ఈ లెక్కన రోజుకు దాదాపు 2 లక్షల మందికి పైగా కొత్తగా భూమిపైకి వస్తున్నారు. -
World Population Day: మనదే పైచేయి.. కాని..
ప్రపంచంలో అత్యధికంగా ఫర్టిలిటీ రేట్ ఉన్న దేశాలు నైజర్, చాడ్, సోమాలియా, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో వంటి ఆఫ్రికా దేశాలు ఉన్నాయి. ఇక్కడ ఒక్కో మహిళ సగటున ఐదు నుంచి ఆరుగురు పిల్లలకు జన్మనిస్తోంది. మరోవైపు దక్షిణ కొరియా, సింగపూర్, హాంకాంగ్, మకావ్, ఇటలీ వంటి దేశాల్లో ఈ రేటు ఒక శాతం కంటే తక్కువగా ఉంది. అందుకే ఇప్పుడు ఆ దేశాలు పిల్లల్ని కనే కుటుంబాలకు ప్రత్యేకమైన ప్రోత్సాహకాలు, పన్ను రాయితీలు, ఉచిత శిశు సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసి జనాభా పెంపునకు ప్రయత్నాలు చేస్తున్నాయి.మనదే పైచేయి.. కాని..దాదాపు 70 సంవత్సరాల పాటు ప్రపంచ జనాభాలో చైనాదే అగ్రస్థానం. కాని 2023లో చరిత్ర పూర్తిగా మారిపోయింది. 146 కోట్ల జనాభాతో చైనాను వెనక్కి నెట్టి భారత్ అగ్రస్థానంలోకి వెళ్లిపోయింది. ప్రస్తుతం ప్రపంచ భూభాగంలో భారత్ వాటా కేవలం 2.4 శాతం అయినా జనాభాలో మాత్రం దాదాపు 17.8 శాతం, కలిగి ఉంది. ఇప్పుడు ప్రపంచంలో ప్రతి వంద మందిలో దాదాపు 18 మంది భారతీయులే.. సరాసరి చూస్తే భూమి మీద ప్రతి ఆరుగురిలో ఒకరు భారతీయుడే. ఇంత వరకూ బాగానే ఉన్నా..ఒకప్పుడు భారతదేశంలో ఒక్కో మహిళ సగటున ఆరుగురు పిల్లలకు జన్మనిచ్చేది. ప్రస్తుతం ఆ సంఖ్య దాదాపు రెండుకి చేరుకుంది.పట్టణీకరణ, ఉపాధి అవకాశాలు, మహిళా విద్య, కుటుంబ నియంత్రణ, ఆలస్యంగా పెళ్లిళ్లు చేసుకోవడం, పిల్లల పెంపకంపై పెరుగుతున్న వ్యయాలు వంటి కారణాల వల్ల మనదేశంలో జనాభా వృద్ధి రేటు 2.1 శాతంగా ఉండాల్సింది పోయి 1.94కి తగ్గింది. ప్రస్తుతం మనదేశంలో బీహార్లో అత్యధిక జననాల రేటు (3.0) ఉండగా తర్వాత రాష్ట్రాలు మేఘాలయ, ఉత్తరప్రదేశ్లు ఉన్నాయి. మరోవైపు ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు వంటి రాష్ట్రాలలో 1.4 నుంచి 1.6 మధ్య లో జననాల రేటు ఉంది. మన తెలుగు రాష్ట్రాలలో కూడా 1.5 నుంచి 1.6 శాతం ఉంది. ఒకప్పుడు జనాభా పెరుగుదల ఎక్కువగా ఉందని ఆందోళన చెందిన తెలుగు రాష్ట్రాలలోనే ఇప్పుడు జనాభా కొరత కనిపించడం గమనార్హం.ఇదీ ఇవాళ్టి ప్రస్థానం!ప్రతి ఏటా జూలై 11వ తేదీన, ప్రపంచ దేశాలన్నీ భూమిపై మారుతున్న జనాభా పోకడలను, అవి మన భవిష్యత్తుపై చూపే ప్రభావాన్ని అంచనా వేయడానికి ఒకక్షణం ఆగి ఆలోచిస్తాయి. ప్రస్తుతం ప్రపంచ జనాభా ఏకంగా 830 కోట్లు దాటిన తరుణంలో, ఈ ఏడాది ప్రపంచ జనాభా దినోత్సవం ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. చారిత్రాత్మక మైలురాళ్ల నుంచి నేటి యువత ఆకాంక్షల వరకు.. ఈ ఏడాది జనాభా దినోత్సవాన్ని ప్రత్యేకంగా మార్చే ఐదు ముఖ్యమైన అంశాలు...ఈ ఏడాది థీమ్ ప్రపంచ జనాభా దినోత్సవం 2026 ప్రధాన నినాదం ‘యువత ఆశలు, ఆకాంక్షలను.. నేడు.. భవిష్యత్తు కోసం సాకారం చేయడం’. అంటే నేటి యువత తమ బంధాల గురించి, కుటుంబ నియంత్రణ లేదా పిల్లలను కనడం గురించి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు? వారి ఆశలు ఏమిటి? వారు ఎదుర్కొంటున్న సవాళ్లు ఏమిటి? అనే విషయాలపై ప్రపంచవ్యాప్తంగా నిర్వహించిన ఒక సర్వే ఆధారంగా ఈ ఏడాది థీమ్ను రూపొందించారు.చారిత్రాత్మక మైలురాయి1987 జూలై 11 నాటికి జనాభా సరిగ్గా ఐదు వందల కోట్లకు చేరింది. అప్పట్లో దీనిపై ప్రపంచ వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ నడిచింది. దాంతో జనాభా సమస్యలపై నిరంతరం అవగాహన కల్పించడం కోసం 1989లో ఐక్యరాజ్యసమితి ప్రతి ఏటా జూలై 11ను ప్రపంచ జనాభా దినోత్సవంగా ప్రకటించింది. అప్పటి నుంచి ప్రతి ఏడాది జూలై 11న ప్రపంచ వ్యాప్తంగా జనాభా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.ఇలా మొదలైంది..మొట్టమొదటి అధికారిక ప్రపంచ జనాభా దినోత్సవాన్ని 1990లో 90 కి పైగా దేశాల భాగస్వామ్యంతో ఘనంగా నిర్వహించారు. అప్పటి నుంచి ఏటా ఈ రోజున భాగస్వామ్యం వహిస్తున్న దేశాలు, సంస్థలు, స్వచ్ఛంద సంఘాల సంఖ్య నిరంతరం పెరుగుతూనే ఉంది. జనాభా సమస్యలతో పాటు అవి ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్యం, అభివృద్ధి, పర్యావరణంపై చూపే ప్రభావాల గురించి అవగాహన పెంచడానికి ప్రపంచవ్యాప్తంగా అందరూ చేతులు కలుపుతున్నారు.ఆరోగ్య సంరక్షణే లక్ష్యం!అన్ని ప్రాంతాల వారికి, ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాలలోని మహిళలు, యువతకు సార్వత్రిక పునరుత్పత్తి ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలు అందేలా చూడటమే ఈ రోజు ప్రధాన లక్ష్యం. కుటుంబ నియంత్రణ, మాతా శిశు సంరక్షణ విషయాలలో ప్రజలు సరైన నిర్ణయాలు తీసుకునేలా అవగాహన కల్పించడం ఈ రోజు జరుపుకోవడంలో ఉన్న ముఖ్య ఉద్దేశ్యం. దీనిని మానవ హక్కులు, లింగ సమానత్వం, ప్రపంచ సుస్థిర అభివృద్ధితో ఐక్యరాజ్యసమితి నేరుగా ముడిపెట్టింది.పెరుగుదల ఒకేలా లేదు!ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా జనాభా మార్పులు చాలా విచిత్రంగా ఉన్నాయి. భారతదేశం వంటి దేశాలు ఇప్పటికీ వేగవంతమైన జనాభా వృద్ధిని నమోదు చేస్తుంటే, జపాన్ వంటి దేశాలలో జనాభా క్రమంగా పడిపోతోంది. ఈ భిన్నమైన పోకడలు ఆయా దేశాలకు వేర్వేరు సవాళ్లను విసురుతున్నాయి. పెరుగుతున్న జనాభా వల్ల ఇళ్లు, ఉద్యోగాలు, వైద్యం, వనరుల కొరత ఏర్పడుతుంటే, తగ్గుతున్న జనాభా వల్ల సమాజంలో వృద్ధుల సంఖ్య పెరిగి, పనిచేసే యువశక్తి తగ్గిపోతోంది. దీనివల్ల వివిధ దేశాలు తమ సామాజిక, ఆర్థిక అవసరాలకు తగ్గట్టుగా భిన్నమైన ప్రణాళికలు వేసుకోవాల్సి వస్తోంది. ఇలా నాణ్యమైన ప్రమాణాలతో జీవించే దేశాలలో జనాభా రోజురోజుకీ తగ్గిపోతోంది. మా దేశానికి రండి జనాభాను పెంచండి..మీకు ఉపాధి కల్పిస్తాం..ఉద్యోగాలిస్తాం అంటూ పలు దేశాలు ప్రకటనలు చేయడం ఇప్పటికే మనం చూస్తున్నాం.– శ్రావణ్ జయ -
అవేర్నెస్ ఆపొద్దు..
పిరియడ్స్ గురించిన అవేర్నెస్ను మళ్లీ మళ్లీ గుర్తు చేసుకోవాల్సిందేఒక అమ్మాయి స్కూల్కు సెలవు పెట్టడానికిఒక క్రీడాకారిణి మైదానానికి దూరంగా ఉండడానికిఉద్యోగినులు చాలాసార్లు ఇబ్బంది పడటానికిఈ సమస్య పై అవగాహన లోపమే కారణం.శరీరం పెట్టే ఇబ్బంది కంటే సమాజం చేస్తున్న అవమానమే జాస్తి.చైతన్యం కోసం అందరూ తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు.సినిమా రంగంలో కూడా ‘ప్యాడ్మ్యాన్’ వంటి సినిమాలు నిశ్శబ్దంగా ఉన్న గోడలను బద్దలు కొట్టాయి. ఇప్పుడు ‘పిరియడ్ సేఫ్’ పేరుతో మన వంతు కాంపెయిన్ మనం చేశాం.స్కూల్ పిల్లల నుంచి జాతీయ క్రీడాకారిణుల వరకు వారి గొంతు విన్నాం. కానీ... ఇది సరిపోదు. ఈ సంభాషణ ఇక్కడితో ఆగకూడదు. ప్రతి అమ్మాయికి సురక్షితమైన గౌరవప్రదమైన పిరియడ్ దక్కే వరకు మన పోరాటం ఆగదు. ఈరోజు మనం మాట్లాడింది రక్తం గురించి కాదు. రేపటి తరం ధైర్యం గురించి.నెలసరి సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సమస్యలకు పరిష్కారాలు తెలియజేస్తున్నవారి సూచనలను మనమూ పాటిద్దాం. మన ఇంట్లోనూ పీరియడ్ ఫేజ్ నిశ్శబ్దపు గోడలను కూల్చేద్దాం. ‘ఆ రోజులలో’ ఆమె పరిస్థితిని అర్థం చేసుకుందాం.. అండగా ఉందాం..టీచర్లే ముందు గుర్తించగలరుమాది కో ఎడ్యుకేషన్ స్కూల్. అబ్బాయిలకన్నా అమ్మాయిల సంఖ్యే అధికం. నెలసరి సమయంలో అమ్మాయిల శారీరక, మానసిక స్థితి ఎలా ఉంటుందో తెలుసు కాబట్టి దానిపై వారికి అవగాహన కోసం ఏడాదికి మూడుసార్లైనా అవేర్నెస్ క్యాంపులను ఏర్పాటు చేయిస్తాం. అమ్మాయిల నెలసరి సమస్యలను అడిగి తెలుసుకుంటాం. నెలసరి సమయంలో శుభ్రత పాటించకపోతే భవిష్యత్తులో ఎలాంటి ఇన్ఫెక్షన్లు వస్తాయి, అవి దీర్ఘకాలం ఎలా బాధిస్తాయో వివరిస్తాం. ఇన్ఫెక్షన్లు వచ్చిన మహిళలు తల్లులు కావాలనుకుంటే ఎలాంటి సమస్యలు వస్తాయో తెలియజేస్తాం. శానిటరీ ప్యాడ్స్ వాడకం గురించి చెబుతూ, ఎన్జీవోల సాయంతో స్కూల్స్కి శానిటరీ ప్యాడ్స్ తెప్పిస్తుంటాం. ఆరు నెలలకు సరిపడా అమ్మాయిలకు కావల్సిన ప్యాడ్స్ ఒకేసారి పంపిణీ చేస్తాం. ఆరోగ్యంగా ఎదగడానికి కావల్సిన అవగాహన స్కూల్లో కలిగిస్తాం. – వాణీ సక్కుబాయి, జెడ్పిహెచ్ఎస్ టీచర్ఇంటింటికీ వెళ్లి అవగాహనఆశావర్కర్గా ఇరవై ఏళ్లుగా పనిచేస్తున్నాను. గ్రామీణ ప్రాంతంలో తల్లీ పిల్లల ఆరోగ్య సంరక్షణ గురించి ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటాం. ప్రసవం తర్వాత మహిళలు చాలా సమస్యలు ఎదుర్కొంటుంటారు. అధిక రక్తస్రావం, నెలసరి సక్రమంగా రాకపోవడం, రక్తహీనత వంటి సమస్యల గురించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో మహిళలకు చెబుతుంటాం. స్కూళ్లకు వెళ్లి నెలసరి సమయంలో శుభ్రత లేకపోతే వచ్చే సమస్యల గురించి వివరించడం, సర్వైకల్ క్యాన్సర్ గురించి చెప్పడం, వ్యాక్సిన్లు వేయించడం చేస్తుంటాం. బిడ్డ పుట్టిన దగ్గర నుంచి ఆ బిడ్డ తల్లి అయ్యి, ఆరోగ్యకర జీవనం గడిపే వరకు మా పాత్ర ఉంటుంది. ఫోన్ల ద్వారానూ, ఇంటింటికి వెళ్లి కూడా మా సేవలను అందిస్తాం. – గంగిలి ధనలక్ష్మి, ఏఎన్ఎమ్తరచూ వర్క్షాప్స్మేం వాటర్, శానిటరీ క్లీనింగ్కు సంబంధించి వర్క్ చేస్తుంటాం. దీంట్లో భాగంగా తరచూ యువతులకు, మహిళలకు శుభ్రతకు సంబంధించిన వర్క్షాప్స్ నిర్వహిస్తుంటాం. ఉపయోగించిన ప్యాడ్స్ను ఎలా డిస్పోజ్ చేయాలో చెబుతాం. మట్టిలో పూడ్చిపెట్టడం కన్నా వాడిన ప్యాడ్స్ను కాల్చేయమని సూచిస్తాం. పీరియడ్స్ వచ్చిన సమయంలో చేతులు, డ్రెస్సుల శుభ్రత, ప్యాడ్స్ మార్చుకోవడం, ఇన్ఫెక్షన్స్ గురించి తరచూ చెబుతుంటాం. కొందరు తమ సమస్యలను నేరుగా వచ్చి, చర్చిస్తుంటారు. వ్యక్తిగత పరిశుభ్రతతోపాటు పరిసరాల శుభ్రతను పాటించడం కూడా చాలా ముఖ్యం.– రేవతి, వాటర్ ఎయిడ్ ఇండియా, స్వచ్ఛంద స్వస్థ కమ్యూనిటీ ఫెసిలిటేటర్కుటుంబ మద్దతు అవసరంనెలసరి సమయంలో అమ్మాయిల మనస్తత్వంలో చాలా మార్పులు ఉంటాయి. వారు తినే ఆహారం, పెరిగిన వాతావరణం కూడా వారి శారీరక, మానసిక ఆరోగ్యాలపై ప్రభావం చూపుతుంటాయి. ముఖ్యంగా చదువుకునే పిల్లలు నెలసరి సమయంలో వచ్చే సమస్యలను అంత సులువుగా అర్థం చేసుకోలేక ఆందోళన పడుతుంటారు. ఆ సమయంలో వారికి మనస్తత్వ నిపుణుల కౌన్సెలింగ్ అవసరం. ఉద్యోగినులు నెలసరి సమయంలో తమ వర్క్ ప్లేస్లో బ్యాలెన్స్డ్గా ఉండటానికి ప్రయత్నిస్తున్నారు. ఇంట్లో మాత్రం చిన్న విషయాలకు కూడా తీవ్రంగా ప్రతిస్పందిస్తారు. పీరియడ్స్ ఉన్నవారి మనస్తత్వాన్ని అర్ధం చేసుకుంటూ కుటుంబం వారికి మద్దతుగా ఉండాలి. అప్పుడే ‘ఆమె’ సంతోషంగా ఉంటుంది. కుటుంబమూ సంతోషంగా ఉంటుంది. – డాక్టర్ సునీతాప్రసాద్, సైకాలజిస్ట్నిర్వహణ: నిర్మలారెడ్డి -
వర్షాకాలంలో ఆ ఇన్ఫెక్షన్ల బారిన పడకూడదంటే..! తప్పనిసరిగా ఆ ఆహారాలు..
తొలకరి జల్లులతో హమ్మయ్యా అనేలా..భగభగ మండే ఎండల నుంచి చల్లటి ఉపశమనం కలిగించే ఆహ్లాదభరిత వాతావరణం ఇది. ఎంతో చల్లగా ఉండే ఈ సీజన్ ఆహారం, నీరు కలుషితమయ్యే అవకాశాలు పుష్కలంగా ఉండే కాలం కూడా. అందువల్లే ఈ సీజన్లో తాజాగా వండిన భోజనం, సురక్షితమైన తాగు నీటిని ఎంచుకుంటేనే కాలానుగుణ వ్యాధులకు అడ్డుకట్ట వేయగలమని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. వెచ్చని ఉష్ణోగ్రతల కలయికలో బ్యాక్టీరియా, వైరస్లు, ఫంగస్లు పెరగడానికి సరైన సమయం ఇది. ఫలితంగా కడుపు ఇన్ఫెక్షన్లు, ఫుడ్ పాయిజనింగ్ డయేరియా, గ్యాస్ట్రోఎంటరైటిస్, టైఫాయిడ్, హెపటైటిస్ ఏ వంటి అనేక వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువ ఈ కాలంలో. అందువల్ల ఎలాంటి ఆహారం తింటే అనారోగ్యం బారిన పడకుండా ఉంటాం, అందుకోసం ఏం చేయాలి తదితరాల గురించి సవివరంగా తెలుసుకుందామా.!.స్ట్రీట్ ఫుడ్..వర్షాకాలంలో దూరంగా ఉండవలసిన అతిపెద్ద ఆహారాలలో వీధి ఆహారం ఒకటి. చాట్, పానీ పూరీలు, కోసిన పండ్లు, మూతపెట్టని చిరుతిళ్లు, బహిరంగ ప్రదేశాల్లో తయారు చేసే ఆహారాలు తదితరాలకు దూరంగా ఉండటం మంచిది. అమ్మకందారులు సురక్షితమైన నీటిని వినియోగించనట్లయితే..కడుపు ఇన్ఫెక్షన్ల ప్రమాదం అధికంగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు. అందువల్ల తాజాగా ఇంట్లో తయారు చేసిన ఆహారాన్ని ఎంచుకోవడమే సురక్షితమైందని సూచిస్తున్నారు.పచ్చి ఆకు కూరలు, సలాడ్లుపచ్చి ఆకుకూరలలో, ముఖ్యంగా వర్షాకాలంలో, మట్టితోపాటు పరాన్నజీవులు, హానికరమైన సూక్ష్మజీవులు ఉండవచ్చు. వాటిని సరిగ్గా కడగకపోతే, అవి జీర్ణాశయ సంబంధిత ఇన్ఫెక్షన్లకు కారణం కావచ్చు. వండటం వల్ల వ్యాధులను కలిగించే చాలా సూక్ష్మక్రిములు నశిస్తాయి కాబట్టి, సాధ్యమైనంత వరకు వండిన కూరగాయలను తినమని వైద్యులు సిఫార్సు చేస్తున్నారు. ఒకవేళ సలాడ్లు తినాలనుకుంటే, వాటిని ఇంట్లో శుభ్రమైన నీటితో బాగా కడిగి తీసుకోవడం మేలు. పండ్లు, కూరగాయలను బాగా కడిగే ముందు, వాటిని కొద్దిగా వెనిగర్ కలిపిన నీటిలో నానబెట్టి తీసుకోవడం మరింత మంచిది.తాజాగా లేని సముద్రపు ఆహారంవర్షాకాలంలో సముద్రపు ఆహారాన్ని జాగ్రత్తగా తినాలి. ఎందుకంటే ఈ కాలంలో చాలా చేపలకు సంతానోత్పత్తి కాలం. దాంతో ఈ సమయంలో, కలుషితం కావడం,పాడైపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సముద్రపు ఆహారాన్ని తినాలని ఎంచుకుంటే, అది తాజాగా, పూర్తిగా ఉడికించినదైతేనే తీసుకోవడం సురక్షితం. సరిగ్గా ఉడకని లేదా పాడైపోయిన సముద్రపు ఆహారం వల్ల ఆహార సంబంధిత అనారోగ్యాలు, కడుపు ఇన్ఫెక్షన్ల ప్రమాదం అధికంగా ఉంటుంది.మిగిలిపోయిన..పాడైపోయిన ఆహారంఎక్కువ కాలం పాటు రిఫ్రిజిరేటర్లో ఉంచిన లేదా చాలా గంటల పాటు బయట వదిలేసిన ఆహారాన్ని తినడం మానుకోవాలి. ఎందుకంటే తేమతో కూడిన వాతావరణంలో బ్యాక్టీరియా చాలా వేగంగా వృద్ధి చెందుతుంది. దీనివల్ల మిగిలిపోయిన ఆహారాన్ని సరిగ్గా నిల్వ చేయకపోతే అది సురక్షితం కాదు. తప్పనిసరిగా ఆహారాన్ని నిల్వ చేయాల్సి వస్తే, దానిని త్వరగా రిఫ్రిజిరేటర్లో పెట్టి, తినే ముందు బాగా వేడి చేసుకోండి.వేయించిన నూనెతో కూడిన ఆహారాలువర్షాకాలంలో ప్రజలు తరుచుగా పకోడాలు, సమోసాలు, ఇతర వేయించిన చిరుతిళ్లను తినేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. ఈ ఆహారాలు బరువుగా ఉండి, జీర్ణం కావడం కష్టంగా ఉంటాయి. పైగా ఇలాంటి ఆహారాల వల్ల ఎసిడిటీ, కడుపు ఉబ్బరం, అజీర్ణం వంటి అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం అధికంగా ఉంటుంది.చక్కెర పానీయాలు, డెజర్ట్లు, పచ్చి ఆహారాలుఅధిక చక్కెర పానీయాలు , డెజర్ట్లు వాపుకు కారణం కావచ్చు. పైగా మొత్తం రోగనిరోధక శక్తిని ప్రభావితం చేయగలవు. వర్షాకాలంలో బయట అమ్మే పచ్చి మొలకలు,ముందుగా కోసిన పండ్లకు దూరంగా ఉండటం మంచిది.ఎందుకంటే అవి బ్యాక్టీరియా వృద్ధికి సులభంగా నిలయాలుగా మారతాయి. బదులుగా, అరటిపండ్లు దానిమ్మపండ్లు వంటి తొక్క తీయగలిగే సీజనల్ పండ్లను ఎంచుకోవడం మేలు.ఆరోగ్యకరమైన ఆహారపు చిట్కాలుతేలికగా, పోషక విలువలతో, సులభంగా జీర్ణమయ్యే, తాజాగా తయారుచేసిన ఇంట్లో వండిన భోజనంపై దృష్టి పెట్టాలని సూచిస్తున్నారు వైద్యులుబాటిల్లోని నీటిని లేదా మరిగించిన నీటిని మాత్రమే తాగండి. అవసరమైతే..వాటర్ ప్యూరిఫైయర్ను ఉపయోగించండి లేదా క్లోరిన్ టాబ్లెట్ను కలపండి.వీధి ఆహారానికి దూరంగా ఉండి, ఇంట్లో వండిన భోజనానికే ప్రాధాన్యత ఇవ్వండి.గోధుమలు, పిండిచేసిన ధాన్యాలు సురక్షితమైనవిపండ్లు, కూరగాయలను క్షుణ్ణంగా కడగి తీసుకోవడం మేలుపచ్చి మొలకలు, కోసిన పండ్లకు దూరంగా ఉండండి: ఇవి బ్యాక్టీరియా వృద్ధికి నిలయాలుగా మారతాయిశుభ్రమైన పాత్రలు, పళ్ళాలు వాడండి: వాటిని సబ్బుతో క్షుణ్ణంగా కడగండిశరీరంలో నీటి శాతం తగ్గకుండా చూసుకోండి: పుష్కలంగా ద్రవపదార్థాలు తాగండితరచుగా చేతులు కడుక్కోండి: ముఖ్యంగా తినడానికి ముందు, వాష్రూమ్కి వెళ్లి వచ్చాక తప్పనిసరిగా చేతులు కడుక్కుని తినడం మంచిది. గమనిక: ఇది కేవలం అగాహన కోసం మాత్రమే. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: సంస్కృతం చదవడం రాదు.. ఐనా భగవద్గీతను ఎంబ్రాయిడరీ చేసింది!) -
మెన్స్ట్రువల్ లీవ్.. ఓ చర్చ! బలమా... బలహీనతా?
ఉద్యోగాలు చేసే మహిళలకు ఇచ్చే మెన్ స్ట్రువల్ లీవ్ పాలసీపై సానుకూల, ప్రతికూల కోణాల్లో దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. కొన్ని కార్పొరేట్ కంపెనీలు, కర్ణాటక వంటి కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఈ దిశగా అడుగులు వేస్తుండగా.. సుప్రీంకోర్టు, పలువురు మేధావులు మహిళలకు పీరియడ్స్ లీవ్స్ తప్పనిసరి చేయడం వల్ల వారు ఉపాధి రంగంలో వెనుకబడిపోయే ప్రమాదం ఉండటమే కాదు, ప్రాజెక్ట్ డెడ్లైన్లు, వ్యాపార ఉత్పాదకతను దృష్టిలో ఉంచుకుని కార్పొరేట్ సంస్థలు పురుషులకేప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఇలాంటి సెలవుల వల్ల పురుషులతో సమానంగా గుర్తింపు, వేతనం కోసం మహిళలు దశాబ్దాలుగా చేస్తున్న పోరాటాలు నీరుగారిపోయి, మహిళలను శారీరకంగా బలహీనులుగా చూసే పాతకాలపు మూస పద్ధతులు మళ్లీ బలపడతాయని ప్రముఖంగా వినిపిస్తున్న వాదన.కాబట్టి మహిళల కెరీర్ను దృష్టిలో ఉంచుకుని సమతుల్యమైన విధానాలను రూ΄÷ందించాలి. అంటే ‘ఆ రోజుల్లో’ ఇంటినుంచి పనిచేసే సౌలభ్యం ఇవ్వడం, మెడికల్ లీవ్స్ పెంచడం, పనిగంటల్లో వెసులుబాటు... వంటివి. దీనివల్ల యాజమాన్యాలకు నష్టం జరగకుండా.. పని ఉత్పాదకత లో మార్పు లేకుండా ఉంటుంది. మహిళలకూ ఉపశమనంగా ఉంటుంది. దీనివల్ల మెన్స్ట్రువల్ లీవ్ అనే ప్రత్యేక లేబుల్ లేకుండా.. మహిళల గోప్యతకు భంగం లేకుండా కూడా ఉంటుందని పలువురి అభిప్రాయం. -
Health: శరీరం ఇచ్చే సంకేతాలను వినాలి..
‘నెలసరి సమస్యల గురించి, పాటించాల్సిన జాగ్రత్తల గురించి ఎంత ఎక్కువ మాట్లాడుకుంటే అంత అవగాహన పెరుగుతుంది’ అంటున్నారు వైద్యులు. ‘శరీరం ఇచ్చే సంకేతాలను వినాలి, అర్థం చేసుకోవాలి’ అంటున్నారు. పీరియడ్ సేఫ్ గురించి స్త్రీల వైద్య నిపుణులు చెప్పే విషయాలు తెలుసుకుందాం.. ఆచరణలో పెడదాం..సేఫ్ పీరియడ్ పద్ధతిని అనుసరించాలనుకునే మహిళలు ముందుగా తమ రుతుక్రమ చక్రాన్ని కనీసం ఆరు నెలల నుంచి ఒక సంవత్సరం వరకు గమనించడం మంచిది. ప్రతి నెల పీరియడ్స్ ప్రారంభమైన తేదీని నమోదు చేసుకోవడం, చక్రం క్రమబద్ధంగా ఉందో లేదో తెలుసుకోవడం అవసరం. అవసరమైతే మొబైల్ యాప్ లేదా క్యాలెండర్ను ఉపయోగించవచ్చు. సాధారణంగా 28 రోజుల క్రమబద్ధమైన నెలసరి చక్రం ఉంటుంది. అయితే, ప్రతి మహిళ రుతుక్రమ చక్రం ఒకేలా ఉండదు. కొందరికి 21 రోజులు, మరికొందరికి 35 రోజుల వరకు కూడా సైకిల్ ఉండవచ్చు. ఒత్తిడి, హార్మోన్ల మార్పులు, ప్రయాణాలు, అనారోగ్యం, బరువులో మార్పులు వంటి కారణాల వల్ల అండాల విడుదల తేదీ మారవచ్చు. అందుకని ఎవరికి వారు మెన్స్ట్రువల్ క్యాలెండర్ని ఏర్పాటు చేసుకోవాలి.ప్యాడ్స్ పడేయడమూ సమస్యే!రుతుక్రమం సమయంలో శుభ్రత పాటించేవాళ్లు ఎక్కువకాలం ఆరోగ్యంగా ఉంటారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ శానిటరీ ప్యాడ్స్ కొనుక్కోవాలనే అవగాహన ఉంది. కానీ, వాటిని ఎక్కడ పడేయాలో తెలియక, ఇంట్లో పిల్లలు ప్రశ్నిస్తారనో, ఎవరూ చూడకుండా చీకటిపడ్డాక తీసేద్దామని అలాగే ఉంచడం.. ఈ కారణాలతో రోజంతా ప్యాడ్స్లోనే ఉంటారు. కొందరు తక్కువ స్రావం అవుతుందని ప్యాడ్స్ ఖర్చు తగ్గించుకోవడానికి కూడా రోజంతా అలాగే వాడతారు. ప్రతి 4 నుంచి 8 గంటలలోపు ప్యాడ్ మార్చుకోవాలి. లేదంటే అలెర్జీ, ఇన్ఫెక్షన్ వస్తాయి. గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లోని వారికి మహిళా సంఘాలు, స్వచ్ఛంద సంస్థల ద్వారా ప్యాడ్స్ అందిస్తే వాడి పడేస్తారు. తిరిగి అడగరు. వారికై వారు కొనుగోలు చేయరు. సమస్య మళ్లీ మొదలవుతుంది. వారికి మెనుస్ట్రువల్ కప్స్ వాడకాన్నిప్రోత్సహిస్తే సమస్య చాలా వరకు పరిష్కారం అవుతుంది. పీరియడ్ సేఫ్ గురించి సరైన అవగాహన కలిగి ఉండటం ప్రతి ఒక్కరికీ అవసరం. ఆరోగ్యంపై అవగాహన, శాస్త్రీయ సమాచారం, వైద్యుల సూచనలు ఉంటేనే మహిళలు తమ పునరుత్పత్తి ఆరోగ్యాన్ని మరింత సురక్షితంగా కాపాడుకోగలరు.అవగాహన తప్పనిసరి..పిల్లలు కావాలని డాక్టర్లను సంప్రదించేవారే తమ రుతుక్రమ సైకిల్ను శ్రద్ధగా పట్టించుకుంటున్నారు. మిగిలిన వాళ్లు మాత్రం రుతుక్రమ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల పట్ల నిర్లక్ష్యంగానే ఉంటున్నారు. స్కూల్కి వెళ్లే అమ్మాయిలకు తమ శరీరం గురించి, రుతుక్రమం సైకిల్ గురించి సరైన అవగాహన లేక΄ోవడం వల్ల గర్భధారణ, విచ్చిత్తి.. వంటి సంఘటనలు కూడా చూస్తున్నాం. పీరియడ్స్ వచ్చిన అయిదవ రోజు నుంచి శరీరంలో జరిగే మార్పుల గురించి అమ్మాయిలకు చె΄్పాలి. ఈ విషయంలో టీచర్లు, తల్లులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. – డాక్టర్ మనోరమ, ఇన్ఫెర్టిలిటీ స్పెషలిస్ట్, ల్యాప్రోస్కోపిక్ సర్జన్సొంత నిర్ణయాలు వద్దు..చాలా మంది నెలసరి సమయాలలో అధిక రక్తస్రావం, హార్మోన్లలో మార్పులు, రక్తహీనత, తీవ్రమైన నొప్పి.. వంటి సమస్యలెన్నో ఎదుర్కొంటుంటారు. ఇక గర్భధారణ లేదంటే గర్భం రాకూడదనుకునేవాళ్లు తమ సొంత నిర్ణయాలు అమలు చేస్తుంటారు. నెలసరి ఆలస్యం కావడానికి వాడే మాత్రలు, గర్భనిరోధక పద్ధతులు వైద్యుల సూచన మేరకే ఉపయోగించాలి. లేదంటే మరిన్ని ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది. ప్రతి మహిళ శరీరం భిన్నమైనది. వ్యక్తిగత ఆరోగ్య పరిస్థితికి అనుగుణంగా వైద్యుల సలహా పాటించడం సురక్షితమైన మార్గం.– డాక్టర్ శిరీషా రెడ్డి, గైనకాలజిస్ట్ -
5 రకాల ఫుడ్స్ కంప్లీట్ బంద్ : 11 నెలల్లో 32 కిలోలు తగ్గింది
మహిళలు పెళ్లి, పిల్లలు తరువాత చాలా బరువు పెరుగుతారు. ఇలా అదనంగా పెరిగిన బరువును తగ్గించు కోవడానికి చాలానే కష్టపడాల్సి వస్తుంది. కానీ అసాధ్యం కాదు. ఈ విషయాన్నే అక్షరాలా నిరూపించారు గురుగ్రామ్కు చెందిన దీప్తి హర్షానా. ఆహారం కూడా అంతే కీలక పాత్ర పోషిస్తుంది. డైటీషియన్ సహాయం లేకుండా, ఖరీదైన డైట్ ప్లాన్స్ జోలికి వెళ్లకుండానే తన బరువును 92 కిలోల నుండి 60 కిలోలకు తగ్గించుకున్నారు. అదెలాగో ఒకసారి చూద్దాం.క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం మరియు చురుకైన జీవనశైలిని కలిగి ఉండటం బరువు తగ్గడానికి ఎంతగానో సహాయపడినప్పటికీ, బరువు తగ్గాల నుకునే వారికి సరైన ఆహారపు అలవాట్లు (డైట్) చాలా ముఖ్యం. ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ దీప్తి హర్షానా సోషల్ మీడియాలో షేర్ చేసిన వివరాల ప్రకారం ఆమె కేవలం ఇంట్లో వండుకునే సాధారణ భోజనం, రోజుకు 45 నిమిషాల వ్యాయామంతో ఈ విజయాన్ని సాధించారు. ముఖ్యంగా 5 పదార్థాలను తన ఆహారం నుండి పూర్తిగా దూరం పెట్టి ఈ సక్సెస్ను సాధించడం విశేషం. View this post on Instagram A post shared by Deepti | Mom • Fitness • Lifestyle (@deepti_harshana)చక్కెర పానీయాలు (Sugary Drinks)ఇవి శరీరంలో కేలరీలను, బరువును మరియు ముఖం ఉబ్బిపోయేలా చేసే 'వాటర్ రిటెన్షన్'ను పెంచుతాయి. దీనికి ప్రత్యామ్నాయంగా ఆమె నిమ్మరసం, కొబ్బరి నీళ్లు మరియు గ్రీన్ టీ తాగడం అలవాటు చేసుకున్నారు. వైట్ బ్రెడ్ (White Bread)మైదాతో చేసే వైట్ బ్రెడ్లోని రిఫైన్డ్ కార్బోహైడ్రేట్లు రక్తంలో చక్కెర స్థాయిలను వేగంగా పెంచి, కొవ్వు పేరుకుపోయేలా చేస్తాయి. దీనికి బదులుగా మల్టీగ్రెయిన్ లేదా హోల్ వీట్ (గోధుమ) బ్రెడ్, సోర్డో (sourdough) బ్రెడ్ మరియు ఓట్స్ ఎంచుకున్నారు.ప్యాక్ చేసిన స్నాక్స్ (Packaged Snacks)చిప్స్, కుర్కురే లాంటి స్నాక్స్లో ఉప్పు, కేలరీలు ఎక్కువగా ఉంటాయి. ఇవి కడుపు ఉబ్బరానికి (bloating, ఇంకా లేనిపోని ఆకలికి కారణమవుతాయి. వీటి స్థానంలో కొద్దిగా వేయించిన శనగలు (roasted chana), డ్రై ఫ్రూట్స్ (nuts), తామర గింజలు (makhana) తిన్నారు.నూనెలో వేయించిన ఫాస్ట్ ఫుడ్ (Fried Fast Food)వీటిలోని అధిక కొవ్వు, ఉప్పు బరువును పెంచడమే కాకుండా శరీరాన్ని బద్ధకంగా మారుస్తాయి. అందుకే ఇంట్లోనే చేసుకునే హెల్తీ వ్రాప్స్ (wraps), పనీర్ లేదా చికెన్ టిక్కా మరియు సాధారణ ఇంటి భోజనాన్ని ప్రాధాన్యత ఇచ్చారు. ఇదీ చదవండి: 256 గంటలు, 131 మంది శ్రమ : ఆమీర్-గౌరీ అరుదైన వెడ్డింగ్ రింగ్అర్ధరాత్రి స్నాక్స్ (Late-Night Snacking)రాత్రి వేళల్లో ఆలోచించకుండా ఏది పడితే అది తినడం వల్ల శరీరానికి అవసరం లేని అదనపు కేలరీలు చేరతాయి. ఈ విషయాన్నిగ్రహించిన ఆమె రాత్రి వేళ చిరుతిండ్లను పూర్తిగా దూరం పెట్టాడు. అలాగే ఆకలిగా లేదా ఏదైనా తినాలనిపిస్తే హెర్బల్ టీ తాగాలని ఆమె సూచించారు. ఇంకా రోజుకు 2-3 లీటర్ల నీళ్లు తాగడం, 7 గంటల నిద్ర, ప్రతీరోజూ వాకింగ్ చేస్తే, బాడీలో, ముఖ్యంగా మార్పు తప్పకుండా గమనిస్తారు అంటూ చెప్పుకొచ్చారు. View this post on Instagram A post shared by Deepti | Mom • Fitness • Lifestyle (@deepti_harshana)నోట్: కచ్చితమైన ప్రణాళిక, నిపుణుల పర్యవేక్షణ ఉంటే అధిక బరువును తగ్గించుకోవడం సులువే అవుతుంది. ఈ సమాచారం కేవలం సాధారణ అవగాహన కోసం మాత్రమే. బరువు తగ్గడానికి ఎలాంటి డైట్ పాటించాలన్నా ముందుగా వైద్యులను లేదా నిపుణులను సంప్రదించడం మంచిది.ఇదీ చదవండి: ఆమీర్ భార్య గౌరి బ్రైడల్ లుక్ : 'పఠానీ హార్' విశేషాలు తెలుసా? -
సంతోషాన్ని ప్రకటించడానికి 'నవ్వు' చాలు..
నవ్వే ఆరోగ్యం అని, ఔషధం అనీ కొందరంటుంటే అందానికి చిహ్నం అని మరికొందరు అంటున్నారు.. నవ్వుల రేడు చార్లీ చార్లిన్ నవ్వలేని రోజు వృథా అంటాడు... శతకాల్లో నవ్వును గురించి పెద్దలు ఏం చెప్పారో తెలుసుకుందాం.సభల్లో, పెద్దల ముందు ఎవరిని చూసి నవ్వకూడదో సుమతీ శతకంలో బద్దెన చెప్పాడు...‘నవ్వకుమీ సభ లోపల నవ్వకుమీతల్లిదండ్రి నాధులతోడన్నవ్వకుమీ పరసతితో నవ్వకుమీ విప్రవరుల నయమిది సుమతీ‘తాను చెప్తున్నది లోకనీతి అంటూ ఎవరితో అపహాస్యంగా నవ్వకూడదో ఒక జాబితా తయారు చేశాడు బద్దెన. ఏడు శతాబ్దాలు దాటినా బద్దెన చెప్పిన మాటలు ఇప్పటి సామాజిక పరిస్థితులకు అనువర్తించేలా ఉంటాయి..వేమన ‘కల్మషం లేని నవ్వును, నిర్మలమైన మనస్సులేని నవ్వును నిజమైన నవ్వు కాద’ని తీర్పే ఇచ్చాడు.అదే తోవలో కపట నవ్వుని ప్రస్తావిస్తూ ఆ నవ్వు నవ్వే కాదని తేల్చేశాడు.‘మనసునందు మాలిన్యంబు మానకుండామాటలందు మైత్రి నాటింపనేలలోని కల్మషంబు లేకుండ నవ్వని నవ్వు నవ్వు గాదు నరులకెల్లవిశ్వదాభిరామ వినుర వేమ..’ అని అంటాడు.నిర్మలమైన మనసుకు నవ్వే అందం అంటాడు.‘తప్పులెన్నువారు తమ తమ తప్పులెరుగురు’ అన్నట్లు..‘తమకుగల్గు పెక్కు తప్పులునుండగా ఓగు నేరమంచు నోరులగాంచి చక్కిలంబుగాంచి జంతిక నగినట్టు విశ్వదాభిరామ వినుర వేమ ‘పద్యం లో ‘నగి’ అంటే నవ్వు గూర్చి ప్రస్తావన... చక్కిలాన్ని చూసి జంతిక నవ్విందట.మరో సందర్భంలో వేమన ఏమని అంటున్నాడో చదవండి.‘భూమి నాదియనిన భూమి ఫక్కున నవ్వుదానహీను జూచి ధనము నవ్వుకదన భీతు జూచి కాలుండు నవ్వును ‘ఇందులో నవ్వు మాట వచ్చినా వేదాంతం గోచరిస్తుంది..ఈ రోజుల్లో భూమి కోసం హత్యలు చేస్తున్నారు... యాజమాన్యం మారుతుంది, భూమి మారదు, అందుకే నవ్వుతుందేమో.. దానం చేయమని, యుద్ధంలో పారిపోకుండా ఉండాలని యోగి భావన.భాస్కర శతకం ద్వారా ‘పరులను హేళన చేసేవాడు తానే నవ్వుల పాలవుతాడు’ చెప్పారు..సంతోషాన్ని ప్రకటించడానికి నవ్వు చాలు.. మనసారా నవ్వండి.– డా. కందాళ సత్యనారాయణ మూర్తి -
నీళ్లు తాగితే ఇరుక్కుపోతాయేమోనని.. తాగడమే మానేశా!
నాకు 24 ఏళ్లు. నేను బీటెక్ చేసి ఉద్యోగ ప్రయత్నాలలో ఉన్నాను. మా నాన్న చిన్నప్పుడే మమ్మల్ని వదిలి వెళ్లిపోయారు. అప్పటినుంచి మా అమ్మే ఎంతో కష్టపడి నన్ను, నా ఇద్దరు చెల్లెళ్లను చదివిస్తోంది. నాకు గత ఆరు నెలలుగా గొంతులో ఏదో ముద్ద ఉన్నట్లుగా అనిపిస్తోంది. మొదట్లో తినడానికి, తాగడానికి ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదు. కానీ క్రమంగా ఏదైనా తింటే లేదా నీళ్లు తాగితే అవి గొంతులోనే ఇరుక్కుపోతాయేమో, ఊపిరాడక చనిపోతానేమో అనే భయం మొదలై, అన్నం, నీళ్లు చాలా తక్కువగా తీసుకుంటున్నాను. దాంతో నా బరువు కూడా బాగా తగ్గిపోయింది. ఈఎన్టీ స్పెషలిస్టును సంప్రదించాను. ఆయన పరీక్షించి గొంతులో ఎలాంటి సమస్యా లేదని, ఒకసారి సైకియాట్రిస్టును కలవమని సూచించారు. గొంతులో మింగడానికి ఇబ్బంది ఉంటే సైకియాట్రిస్టును ఎందుకు కలవాలన్నది నా సందేహం. – సుజాత, తిరుపతిమీరు పడుతున్న ఇబ్బంది, మీ మనసులోని ఆందోళన అర్థమైంది. అధైర్య పడకండి, సమస్య ఏదైనా... దానికి పరిష్కారం ఉంటుంది. మీరు చెప్పిన వివరాల ప్రకారం వైద్యపరిభాషలో ఈ సమస్యను ‘గ్లోబస్ ఫారింజియస్’ లేదా ‘ఫాగోఫోబియా’ అంటారు, అంటే మింగడానికి భయపడటం. మన మనసుకు, శరీరానికి విడదీయరాని సంబంధం ఉంది. తీవ్రమైన మానసిక ఒత్తిడి లేదా ఆందోళన ఉన్నప్పుడు, శరీరం రకరకాలుగా స్పందిస్తుంది. మీ విషయంలో ఆ ఒత్తిడి గొంతులోని కండరాలను గట్టిగా బిగుసుకుపోయేలా చేసింది, దాంతో ఏదో ముద్దలా అడ్డం పడినట్లు అనిపిస్తోంది. ఇది శారీరక రోగం కాదు, తీవ్రమైన ఆందోళన వల్ల శరీరం చూపే స్పందన మాత్రమే, దీనినే ‘సైకోసోమాటిక్ సింప్టమ్’ అంటారు.రూపాయి నాణెంలో బొమ్మను, బొరుసును ఎలా వేరు చేయలేమో మనిషి మనసును– శరీరాన్ని కూడా వేరు చేయలేము. వాటిలో ఒకటి ఒత్తిడికి లోనయితే మరొకటి స్పందిస్తుంది. ఇలాంటి వాటిని నయం చేయడానికి సైకియాట్రిస్ట్లే సరైన నిపుణులు. ఒంట్లో నలతగా ఉంటే జనరల్ ఫిజీషియన్ ను ఎలా కలుస్తామో... మనసులో ఆందోళన ఎక్కువైతే సైకియాట్రిస్ట్ను అలాగే కలవాలి, ఇందులో సంకోచించడానికేం లేదు.మీరు తిరుపతిలోనే ఉన్నారు కాబట్టి, అక్కడ ఉన్న మంచి మానసిక వైద్యుణ్ణి కలవండి, మీ ఆందోళన తగ్గడానికి వారు కొన్ని సురక్షితమైన మందులు, కౌన్సెలింగ్ ఇస్తారు, దీనివల్ల గొంతు కండరాలు రిలాక్స్ అయి, మింగడం మళ్లీ మామూలైపోతుంది. మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది. మీరు త్వరగా కోలుకుంటేనే, మీ కుటుంబానికి మీరు అనుకున్నట్లుగా ఆసరాగా నిలబడగలుగుతారు. మంచి వైద్యం అందుబాటులో ఉన్న ఈ చిన్న సమస్యను, అనవసరమైన అపోహలతో పెద్దది చేసుకోకండి, మీరు త్వరలోనే సంపూర్ణ ఆరోగ్యంతో, ఉద్యోగంలో స్థిరపడాలని ఆశిస్తున్నాను, మీకు అంతా మంచే జరుగుతుంది!- డా. ఇండ్ల విశాల్ రెడ్డి, సీనియర్ సైకియాట్రిస్ట్, విజయవాడ.మీ సమస్యలు, సందేహాలు పంపవలసిన మెయిల్ ఐడీ: sakshifamily3@gmail.com -
నెలసరి అని సరిపెట్టద్దు
ఒకప్పుడు స్త్రీల ‘నెలసరి’ ఒక దాపరికం. సిగ్గు, భయం, ఆందోళనల మధ్య ఇంటిలో ఏదో మూలన దాగే దైన్యం. ఇప్పుడా పరిస్థితి లేదు. ఎలాంటి సందర్భంలోనైనా తమని తాము నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. వెండితెరపైన రాకుమార్తెల్లా మెరిసే ఈ హీరోయిన్లు షూటింగ్లలో పాల్గొనేటప్పుడు పీరియడ్స్ సమయంలో తమ సమస్య గురించి వివిధ సందర్భాలలో పంచుకున్న విషయాలు..అదేమీ నిషిద్ధ విషయం కాదునెలసరి గురించిన సంభాషణలు ఇప్పటికీ గుసగుసగా జరుగుతుంటాయి. అది ఒక నిషిద్ధ విషయంగా పరిగణిస్తారు. మహిళలుగా మనం చాలా విషయాల్లో ఎంతో ముందున్నాం. కానీ, ఇప్పటికీ నెలసరికి సంబంధించిన విషయాల్లో సిగ్గుపడుతుంటాం. పాతకాలపు భావనలు బద్దలు కొట్టడం ఈ రోజుల్లో చాలా కీలకం. మన రుతుక్రమాలు చాలా శక్తిమంతమైనవి. ఎప్పుడూ తేలికగా తీసుకోకూడదు. – సమంతఎక్స్క్యూజ్ ఉండదు‘సాంగ్ అండ్ డ్యాన్స్ స్వీక్వెన్స్ టైమ్లో పీరియడ్స్ వస్తే ఏం చేస్తారు’ అని అడుగుతుంటారు కొందరు. నావరకు ఫైట్సీన్లు ఉన్న ప్రతిసారీ పీరియడ్స్లోనే ఉంటాను. నా టీమ్ జోక్ చేస్తారు కూడా.. ‘మేడమ్ డేట్ వచ్చిందా, మీకు ఫైట్ సీన్ తప్పక ఉంటుంది..’ అంటారు. ఫైట్ సీన్లలో తాళ్లు పట్టుకొని పైకి ఎక్కడం, దిగడం, పరిగెత్తడం.. ఇవన్నీ ఉంటాయి. కానీ, ‘నాకు పీరియడ్స్ వచ్చింది, ఈ టైమ్లో చేయలేను. నన్ను ఎక్స్క్యూజ్ చేయండి’ అని అడగడానికి ఉండదు. షూట్లో కొన్నిసార్లు ΄్యాడ్స్ మార్చుకోవడానికి కూడా వీలుండదు. ఒకసారి ఫైట్ సీన్లు చేసే సమయంలో ఓవర్ బ్లీడింగ్ అయ్యింది. చెయిర్ పైన కూడా కనిపించి, చాలా ఇబ్బందిగా అనిపించింది. కానీ, అలాంటి టైమ్లో కూడా మేనేజ్ చేయక తప్పదు. మహిళలకు శారీరకపరంగా ప్రతినెలా ఈ సమస్య తప్పదు. ఇది మన శరీరం. మహిళలుగా మన శరీరాన్ని మనం అర్థం చేసుకోవాలి. అందుకు తగిన జాగ్రత్తలూ తీసుకోవాలి. – వరలక్ష్మి శరత్పరిమితులు ఉండవునేను చేసిన ఫాస్ట్ బీట్ సాంగ్స్ అన్నీ ప్రశంసలు అందుకున్నాయి. నేను నెలసరిలో ఉన్నప్పుడు కూడా షూటింగ్లో పాల్గొన్నా. పీరియడ్ టైమ్లో కూడా మాకు ఎక్స్క్యూజ్ ఉండదు. అంతే జోష్తో సాంగ్స్ షూట్లో పాల్గొనాలి. మిగతావారితో సమానంగా డ్యాన్స్ చేయాలి. స్త్రీలకు శారీరకంగా కొన్ని పరిమితులు ఉంటాయి. అవి మానసికంగానూ ప్రభావం చూపేవీ ఉంటాయి. అయినా వర్క్ విషయంలో వేటికీ పరిమితులు ఉండవు. శారీరక అడ్డంకులను అధిగమించి ముందుకు వెళ్లాల్సిందే. – శ్రీ లీలపీరియడ్స్ పురుషులకు ఉంటే...మగవాళ్లు కూడా ఒక్కసారన్నా నెలసరిని అనుభవించి, ఆ నొప్పిని, ఆ వేదనను తెలసుకోవాలని నేను కోరుకుంటున్నాను. హార్మోన్ల అసమతుల్యత కారణంగా మనకు అర్థం కాని భావోద్వేగాలను అనుభవిస్తాం. ఆ పెయిన్, ఆ ట్రామా, హార్మోనల్ ఇన్ బ్యాలన్స్, ఆ ఒత్తిడిని ఎంత వివరించినా వారికి ఆ ఫీలింగ్స్ అర్థం కావు. కాబట్టి మగవారికి ఒక్కసారైనా నెలసరి వస్తే, నెలసరి నొప్పి ఎలా ఉంటుందో భరిస్తే.. అర్ధం అవుతుంది. నాకు పీరియడ్స్ సమయంలో కడుపు నొప్పి వస్తే ఆ బాధ వర్ణనాతీతం. చాలాసార్లు అబ్డామినల్ స్కాన్, బ్లడ్ టెస్టులు చేయించాల్సి వచ్చింది. చాలా మంది డాక్టర్లను కలిశాను. కానీ, ఎలాంటి ఉపయోగమూ లేదు. ప్రతి నెలా దేవుడు నన్ను ఎందుకు ఇంత టార్చర్ పెడుతున్నాడు .. నేనేం చేశానా అని ఫీలవుతుంటాను కూడా. ఈ బాధ అర్థం చేసుకోవాలంటే అబ్బాయిలకి కూడా ఒక్కసారి పీరియడ్స్ వస్తే బాగుండు అనిపిస్తుంది. – రష్మికా మందన్నాపోరాటం తప్పదునెలసరి సమయంలో చాలా నొప్పితో బాధపడుతుంటాను. అలాంటి సమయంలో నటిగా డ్యాన్స్, స్టంట్స్ చేస్తున్నప్పుడు చాలా కష్టంగా ఉంటుంది. అప్పటికే అలసిన శరీరంతో పోరాడుతుంటాం. ఇక వర్క్ విషయంలో మరింత శక్తిని ధారపోయక తప్పదు. ఆ సమయంలో కొందరు విశ్రాంతి తీసుకుంటారు. కానీ, మాలో చాలా మందికి నెలసరి విశ్రాంతి ఉండదు. సాకుగా కూడా చెప్పలేం. – శృతీ హాసన్ నిర్వహణ: నిర్మలారెడ్డి -
యువ క్రికెటర్ బలి : ఇంత ప్రమాదమా ఈ వ్యాధి? లక్షణాలేంటి?
Shapoor Zadran ఆఫ్గానిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షాపూర్ జద్రాన్(38) అకాల మరణం క్రికెట్ అభిమానులను దిగ్భ్రాంతికి గురిచేసింది. అరుదైన, ప్రాణాంతక అనారోగ్య సమస్యతో బాధపడుతూ ఎంతో ఉజ్వలమైన భవిష్యత్తు మిగిలి ఉండగానే చిన్న వయసులోనే కన్ను మూశాడు. అసలేంటీ వ్యాధి? తెలుసుకుందాం.'హీమోఫాగోసిటిక్ లింఫోహిస్టియోసైటోసిస్' ((Hemophagocytic Lymphohistiocytosis) అనే వ్యాధితో చికిత్స పొందుతూ జద్రాను మరణించాడని ప్రకటించిన ఆఫ్గానిస్తాన్ క్రికెట్ బోర్డు (ACB) తీవ్ర విచారాన్ని వెలిబుచ్చింది. ఆఫ్గానిస్తాన్ క్రికెట్ ఎదుగుదలలో, దేశ క్రికెట్ను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడంలో షాపూర్ జద్రాన్ అందించిన సేవలు, నిబద్ధత ఎనలేనివంటూ బోర్డు అతనికి నివాళులర్పించింది.HLH అంటే ఏంటి? లక్షణాలు, చికిత్సఇది చాలా అరుదైన, తీవ్రమైన రోగనిరోధక వ్యవస్థ (Immune System) రుగ్మత. సాధారణంగా మన రోగనిరోధక వ్యవస్థ బాక్టీరియా, వైరస్ల నుండి శరీరాన్ని రక్షిస్తుంది. కానీ, ఈ వ్యాధి సోకినప్పుడు రోగనిరోధక వ్యవస్థ చాలా యాక్టివ్ అయి పోతుంది. ఇన్ఫెక్షన్లపై పోరాడాల్సింది పోయి సొంత శరీరంలోని ఆరోగ్యకరమైన కణజాలాలు, అవయవాలపైనే దాడి చేయడం ప్రారంభిస్తుంది. ఫలితంగా లివర్, ప్లీహం (Spleen), ఎముక మజ్జ (Bone Marrow), మెదడు వంటి ముఖ్యమైన అవయవాలు తీవ్రంగా దెబ్బతింటాయి.HLH రావడానికి కారణలు1. సాధారణంగా వంశపారంపర్యంగా వస్తుంది. తల్లిదండ్రుల నుండి వచ్చే జన్యుపరమైన లోపాల వల్ల వస్తుంది. ఎక్కువగా చిన్నపిల్లల్లో కనిపిస్తుంది.2. అలాగే కొన్ని రకాల అనారోగ్య సమస్యల వల్లఈ వ్యాధిసోకవచ్చు. తీవ్రమైన వైరల్ ఇన్ఫెక్షన్లు (ఉదాహరణకు ఎప్స్టీన్-బార్ వైరస్), లూపస్ వంటి ఆటోఇమ్యూన్ వ్యాధులు లేదా బ్లడ్ క్యాన్సర్ (లింఫోమా, ల్యుకేమియా) వంటి వాటి వల్ల ఇది రావచ్చు.ముఖ్యలక్షణాలుదీని లక్షణాలు సాధారణ ఇన్ఫెక్షన్ల లాగే ఉండటం వల్ల మొదట్లో గుర్తించడం కష్టం.తగ్గని తీవ్రమైన జ్వరం, తీవ్రమైన అలసట, బలహీనతకాలేయం (లివర్), ప్లీహం వాపునకు గురవడంచర్మంపై దద్దుర్లు, సులభంగా రక్తస్రావం కావడం లేదా వాతలు పడటంరక్తహీనత వల్ల చర్మం తెల్లబడటం లేదా కామెర్లు (Jaundice) రావడంతీవ్రమైన సందర్భాల్లో ఫిట్స్ (Seizures) రావడం లేదా మతిస్థిమితం తప్పడం.వ్యాధి నిర్ధారణ , చికిత్సఈ వ్యాధి సోకిందని నిర్ధారించేకు కొన్ని పరీక్షలు చేయాల్సి ఉంటుంది. కేవలం ఒకే ఒక పరీక్షతో దీనిని నిర్ధారించలేరు. రక్తం లోని కణాల సంఖ్య, ఫెర్రిటిన్ (Ferritin) స్థాయిలు, లివర్ ఫంక్షన్ టెస్ట్లు, మరియు బోన్ మ్యారో పరీక్షల ద్వారా వైద్యులు దీనిని గుర్తిస్తారు.మితిమీరిన రోగనిరోధక శక్తిని అదుపు చేయడానికి కార్టికోస్టెరాయిడ్స్, కీమోథెరపీ మందులు, ఇమ్యునోథెరపీ ఇస్తారు. ఇన్ఫెక్షన్ల నివారణకు యాంటీబయాటిక్స్ వాడుతుంటారు. జన్యుపరమైన సమస్య ఉన్నవారికి లేదా పరిస్థితి తీవ్రంగా ఉన్నవారికి 'స్టెమ్ సెల్ (బోన్ మ్యారో) ట్రాన్స్ప్లాంటేషన్' మాత్రమే ఏకైక మార్గం.ఇదీ చదవండి: రెడ్ బెనారసీ డ్రెస్లో పార్టీ లుక్.. తొలిసారి ఇలా అన్షులా! -
కంచంలో ఉన్నది అమృతమేనా?
‘మనిషి తినే ఆహారం ఔషధంలా ఉండాలి... ఔషధమే ఆహారంలా మారే పరిస్థితి రాకూడదు’ అని హిప్పోక్రటీస్ ఏనాడో చెప్పాడు. కానీ నేడు పరిస్థితి ఏమిటి? మనం తినేది ఆహారమో, విషమో తెలియని దుఃస్థితి. కల్తీ ఆహారం అనేది ‘స్లో పాయిజన్’. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం 2021లో ప్రపంచవ్యాప్తంగా 86 కోట్లకు పైగా ఆహార సంబంధిత అనారోగ్య కేసులు నమోదయ్యాయి. 15 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ఇది కేవలం రికార్డుల్లోకెక్కిన లెక్క మాత్రమే!అవే లెక్కల ప్రకారం, మన దేశంలోని మొత్తం మరణాల్లో 63 శాతం అంటురోగాలు కానివాటివల్లే కలుగుతున్నాయి. అందులో 27 శాతం మంది గుండె జబ్బుల వల్లే కన్నుమూస్తున్నారు. క్యాన్సర్ల గురించైతే ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఐసీఎమ్ఆర్ అంచనా ప్రకారం ఒక్క 2022లోనే భారత్లో 14.6 లక్షల కొత్త క్యాన్సర్ కేసులు నమోదయ్యాయి. ప్రతి 9 మంది భారతీయుల్లో ఒకరికి తమ జీవితకాలంలో క్యాన్సర్ ముప్పు పొంచి ఉందట! మరోవైపు, దాదాపు 13.8 కోట్ల మంది దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధులతో మగ్గి పోతున్నారు.ఎందుకిలా జరుగుతోంది? కూర గాయల నుంచి పండ్ల దాకా కొడుతున్న రసాయనాలు... హోటళ్లలో వాడిన నూనెనే పదే పదే వాడటం, ప్రాసెస్డ్ ఫుడ్లో ఉండే విషపూరిత ప్రిజర్వేటివ్స్, అల్లం పేస్ట్ నుంచి కారం వరకు అన్నింటిలో జరుగుతున్న కల్తీ– ఇవన్నీ మనిషిని బతకనిస్తాయా? అందుకే అభివృద్ధిచెందిన దేశాలు ఆహార భద్రతకు ప్రాధాన్యం ఇస్తున్నాయి.మన తెలంగాణ విషయానికి వస్తే... గతంలో జరిగిన తప్పులను సరిదిద్దు కుంటూ... ‘కల్తీ లేని తెలంగాణ’ లక్ష్యంగా 2024 జనవరి నుండి సరికొత్త వ్యూహంతో ముందుకు వెళ్తోంది. ఇందులో భాగంగానే హెచ్ఫాస్ట్, ప్రత్యేక ఫుడ్ సేఫ్టీ టాస్క్ఫోర్స్ బృందాలను రంగంలోకి దించి కఠిన చర్యలు తీసుకుంటోంది.2024 నుండి 5,500కి పైగా ముమ్మర తనిఖీలు చేసి, నాణ్యత లేని 2,000కి పైగా సంస్థలకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. తీవ్ర ఉల్లంఘనలకు పాల్పడిన 150కి పైగా హోటళ్లు, తయారీ కేంద్రాలను సీజ్ చేయడమే కాకుండా, రూ. 2 కోట్లకు పైగా జరిమానాలు విధించారు. 100కి పైగా క్రిమినల్ కేసులు నమోదు చేసి నిర్వాహకులను అరెస్ట్ చేశారు. దేశాన్ని అభివృద్ధి చేయడంతో పాటు ప్రజల కంచంలో పడే అన్నం సురక్షితంగా ఉండేలా ప్రభుత్వాలు చూడాలి. మన కంచంలోని ఆహారం సురక్షితం కాకపోతే... అభివృద్ధి కథనాలన్నీ చివరకు ఆసుపత్రి కారిడార్లలో ముగిసి పోతాయి. – నవీన్ కుమార్ రెడ్డి, సీనియర్ జర్నలిస్ట్ -
డాక్టర్ రోబో..! ఎంత దూరం నుంచైనా..
మనిషి నిర్మించిన యంత్రాల్లో అద్భుతమైనదీ, మానవుడికి ఇప్పుడు దాదాపుగా ప్రత్నామ్నాయం లాంటిది ‘రోబో’. అప్పట్లో కేవలం సైన్స్ ఫిక్షన్లా ఉన్న ‘ రోబో’లు ఇప్పుడు మానవ దేహ నిర్మాణానికి ఉండే పరిమితులను అ«ధిగమించి పనిచేస్తున్నాయి. దాంతో కొన్ని సమయాల్లో ఫిక్షన్కూ, వాస్తవానికీ మధ్య ఉండే సన్నటి రేఖ కూడా చెరిగిపోయిందా అనిపిస్తుంటుంది. ఎందుకంటే మానవుడు చేయడానికి కొంత ఇబ్బంది పడేవీ, లేదా పూర్తిగా చేయలేకపోయే ఎన్నింటినో ‘రోబో’ అలవోకగా చేసేస్తుంది.అందులో సర్జరీలూ ఉండటం విశేషం. సర్జరీలో మనిషి చేయి కొన్ని సంక్లిష్టమైన చోట్లకు చేరడం సాధ్యం కాకపోవచ్చు. కానీ ‘యంత్రుడి’ వేళ్లు అలాంటి చోట్లకూ చేరగలవు. నిజానికి ఈ పనులు రోబో చేస్తున్నట్టు అనిపించినా మళ్లీ వాటిని నిజానికి చేసేది నిపుణులైన శస్త్రచికిత్సకులే. కొన్ని కష్టసాధ్యమైన శస్త్రచికిత్సల్ని రోబోలు ఎలా చేస్తున్నాయో, ఏయే వైద్యవిభాగాల్లోని ఏయే శస్త్రచికిత్సలు జరుగుతున్నాయో తెలపడంతో పాటు రోబోలకు సంబంధించి అనేక అంశాలను ఈ కథనంలో చూద్దాం.రోబోటిక్ టెలీ సర్జరీతో వైద్యరంగంలో కొత్త అధ్యాయం ఈ రోబో శస్త్రచికిత్సలని చెప్పవచ్చు. ప్రస్తుతం రోబోటిక్ టెలీ సర్జరీ ప్రపంచ వైద్యరంగంలో విప్లవాత్మక సాంకేతికతగా గుర్తింపు పొందుతోంది. అమెరికాలో దాదాపు పదేళ్ల క్రితమే ఈ విధానం ప్రయోగాత్మకంగాప్రారంభమైంది. యుద్ధరంగంలోని సైనికులకు నేరుగా వెళ్లి శస్త్రచికిత్స చేసే అవకాశం ఉండకపోవడంతో... సమరరంగంలో ఉన్నవారికీ సర్జరీలు చేసే ఉద్దేశంతో మొదలైన ఈ ప్రయోగాత్మక శస్త్రచికిత్సలు ఇప్పుడు పూర్తిస్థాయిలో అవసరమైన బాధితులకు అందుతున్నాయి.మన భారతదేశంలో మాత్రం గత మూడేళ్లుగా ఈ సాంకేతికత మరింత వేగంగా అభివృద్ధి చెందుతూ, వైద్య సేవలను మరింత మందికి అందునా సుదూరప్రాంతాల్లోని పేషెంట్స్కు పెద్ద పెద్ద నగరాల్లో ఉండే అత్యంత నిపుణులైన శస్త్రచికిత్సల నైపుణ్యాలను అందుబాటులోకి తీసుకువస్తోంది. మన ఇండియా వంటి విశాలమైన దేశంలో, ఒక రాష్ట్రంలో ఉన్న నిపుణులైన వైద్యులు మరో రాష్ట్రంలో ఉన్న పేషెంట్లకు ప్రత్యక్షంగా అక్కడికి వెళ్లకుండానే రోబోటిక్ టెలీ సర్జరీ ద్వారా శస్త్రచికిత్సలు చేయగలగడం ఈ సాంకేతికత తాలూకు ప్రధాన ప్రయోజనం. దీంతో నాణ్యమైన వైద్య సేవలు దూర ప్రాంతాల రోగులకు కూడా అందుబాటులోకి వస్తున్నాయి.భారతదేశంలో రోబోటిక్ టెలీ సర్జరీకి శ్రీకారం చుట్టిన వారిలో డాక్టర్ సుధీర్ శ్రీవాత్సవ ప్రముఖులు. ఆయన ఢిల్లీలోని ఒక ఆసుపత్రి నుంచి మరో ఆసుపత్రికి దూర నియంత్రణ ద్వారా తొలి గుండె బైపాస్ శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. తర్వాత కిడ్నీ, ప్రోస్టేట్ తదితర సంక్లిష్ట శస్త్రచికిత్సలు కూడా ఈ విధానంలో విజయవంతంగా నిర్వహితమయ్యాయి.ఈ రంగంలో మరో ముఖ్యమైన మైలురాయిగా డా. చంద్రమోహన్ వడ్డి (ప్రస్తుత ఈ కథన / ఆర్టికల్) రచయిత కూడా ఢిల్లీలోని రోబోటిక్ కన్సోల్ నుంచి హైదరాబాద్లో ఉన్న కేవలం 16 నెలల చిన్నారికి ప్రపంచంలోనే అత్యంత చిన్న వయస్సులో రోబోటిక్ టెలీ సర్జరీని విజయవంతంగా నిర్వహించారు. ఈ విజయం తాలూకు కేసు వివరాలు ఇటీవల ఇండియన్ జర్నల్ ఆఫ్ యూరాలజీలో ప్రచురితమయ్యాయి.అటు తర్వాత దేశంలోని పలుప్రాంతాల మధ్య, అలాగే ఒక దేశం నుంచి మరో దేశానికి కూడా రోబోటిక్ టెలీ సర్జరీలు విజయవంతంగా నిర్వహితమవుతున్నాయి. ఇటీవల చైనా నుంచి హైదరాబాద్లోని పేషెంట్కూ టెలీ సర్జరీ నిర్వహించడం ఈ సాంకేతికత ప్రపంచవ్యాప్తంగా ఎంత వేగంగా విస్తరిస్తోందో తెలియజేస్తోంది. భవిష్యత్తులో రోబోటిక్ టెలీ సర్జరీ ద్వారా దూరప్రాంతాల్లోని రోగులకు అత్యున్నత స్థాయి వైద్య సేవలను వేగంగా, సురక్షితంగా అందించడానికి విస్తృత అవకాశాలు ఉన్నాయని వైద్య నిపుణులు అభిప్రాయం.ఇటీవలి చైనా కేస్ స్టడీ : ఇటీవలే మన భారతీయ డాక్టర్ ఒకరు చైనా నుంచి దాదాపుమూడు వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న మన హైదరాబాద్లోని పేషెంట్కు రోబో సహాయంతో శస్త్రచికిత్స చేశారు. దాదాపు 90 నిమిషాల పాటు నిర్వహించిన ఈ సర్జరీలో సుదూరంలో ఉన్న ఊహాన్ నగరంలోని టాంగ్జీ హాస్పిటల్లోంచి... దేశ దేశాంతరాలు దాటి మరీ మన హైదరాబాద్లోని పేషెంట్కు శస్త్రచికిత్స చేయడం... ఆ చేసిన వైద్యుడు కూడా డాక్టర్ సయ్యద్ మొహమ్మద్ గౌస్ అనే మన భారతీయ డాక్టర్ కావడం మన దేశవాసులందరికీ గర్వకారణమైన విషయం. అల్ట్రాఫాస్ట్ 5జీ ఇంటర్నెట్ కనెక్టివిటీతో జరిగిన ఈ సర్జరీ చేసింది. మన ఖ్యాతిని ఇనుమడింపజేసిన ఈ విషయాన్ని భారత్లోని చైనా ఎంబసీ స్పోక్స్పర్సన్ యూ జింగ్ తన ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. ‘‘3000 కిలోమీటర్ల దూరంలోని హైదరాబాద్ పేషెంట్కు 5జీ టెక్నాలజీ సహాయంతో సరిహద్దులను అధిగమించి జీవితాన్ని రక్షించే వైద్య సహాయం అందించడం ఓ అద్భుతం’’ అని ఆమె ‘ఎక్స్’లో ప్రస్తావించారు.ఆపరేషన్కు ముందర ఇక్కడ హైదరాబాద్లో కూడా డాక్టర్లు అవసరమైన ఉపకరణాలను, హై–డెఫినిషన్ కెమెరాలను సిద్ధం చేసుకోవడం వంటి పనులు చేశాక... అక్కడ వూహాన్లోని టాంగ్జీ హాస్పిటల్లో డాక్టర్ గౌస్ శస్త్రచికిత్స మొదలు పెట్టగానే ఇక్కడి రోబోటిక్ హస్తాలు శస్త్రచికిత్స చేయాల్సిన భాగాన్ని 3–డీ చిత్రాల్లో చూస్తూ తమ పనులు పూర్తి చేశాయి. హైస్పీడ్ 5జీ నెట్వర్క్ కావడంతో కేవలం 200 మిల్లీసెకండ్స్లోనే డాక్టర్ ఆజ్ఞలు పేషెంట్కు చేరి సజావుగా సర్జరీ జరగడంతో పాటు అది విజయవంతమూ అయ్యింది. అయితే సమాంతరంగా ఇక్కడ హైదరాబాద్లో కూడా ఏదైనా ఎమర్జెన్సీ అవసరమైతే రంగంలోకి దూకడానికి సిద్ధంగా డాక్టర్లంతా శస్త్రచికిత్స జరుగుతున్నంత సేపూ అప్రమత్తంగా అక్కడే ఉన్నారు.‘ద ఇంటర్నేషనల్ హెపాటో ΄్యాంక్రియాటో బిలియరీ అసోసియేషన్’, చైనీస్ చాప్టర్ ఆధ్వర్యంలో నిర్వహించిన 26 డెమాన్స్ట్రేషన్స్లో ఈ శస్త్రచికిత్స కూడా ఒకటి. ఇందులో లైవ్గా శస్త్రచికిత్స చేసి చూపినవారిలో... భారత్, బ్రెజిల్, జార్జియా, గ్రీస్, ఉజ్బెకిస్తాన్ దేశాల నుంచి వచ్చిన వైద్యనిపుణులున్నారు.చూడగలిగే రేంజ్ కూడా ఎక్కువే... రోబో చేతుల సహాయంతో సర్జరీ చేస్తున్నప్పుడు... డాక్టర్ తాను శస్త్రచికిత్స నిర్వహిస్తున్న అవయవాన్నీ, అందులోని భాగాల్నీ (ఫీల్డ్ను) 3–డీ ఇమేజ్లో తెరపై స్పష్టంగా చూస్తుంటారు. ఆ వర్చువల్ ఇమేజ్ చాలా పెద్దగా, స్పష్టంగా ఉండటంతో అక్కడి నరాలూ, రక్తనాళాలు చాలా పెద్దగా (మాగ్నిఫికేషన్తో) కంటికి కనిపిస్తుంటాయి. ఈ అంశం కూడా సాంప్రదాయికమైన శస్త్రచికిత్స కంటే రోబో చేసే సర్జరీని మరింత ప్రత్యేకంగా నిలుపుతుంది. అంటే... సంప్రదాయ శస్త్రచికిత్సలో సదరు అవయవభాగం కాస్త వెనక ఉంటే అది స్పష్టంగా కనిపించక... తెగకూడని భాగం ప్రమాదవశాత్తూ తెగేందుకు అవకాశం ఉంటే ఉండవచ్చుగానీ... చాలా ఎక్కువ మాగ్నిఫికేషన్తో అన్ని అవయవాలూ, నరాలూ, రక్తనాళాలూ కనిపిస్తున్నప్పుడు మరి దేన్నీ టచ్ చేయకుండా కేవలం కోయాల్సిన భాగంలోనే కోత పడటమూ, రక్షించాల్సిన అవయవాలకు ఏమాత్రం దెబ్బతగలకుండా చూసుకోవడం సాధ్యమవుతాయి.స్పష్టత ఎక్కువ... మెరుగుదలా ఎక్కువే... సంప్రదాయ శస్త్రచికిత్సలో నేరుగా చూసేవాటితో పోలిస్తే... ఇక్కడ రోబోటిక్ శస్త్రచికిత్సలో.... డాక్టర్లు తాము తొలగించాల్సిన హానికరమైన చిన్న కణుతుల్నీ, గడ్డలనూ... లేదా కుట్లు వేయాల్సిన అత్యంత సన్నటి సూచర్స్ వంటి వాటిని (అంటే కొన్నిసార్లు పెన్సిల్లోపలి లెడ్ కంటే సన్నటి రక్తనాళాల్నీ, అలాంటి అవయవాల్ని) స్పష్టంగా చూడగలుగుతుంటారు. దాంతో తాము చేయాల్సిన పనుల్ని నైపుణ్యంతో మరిత సమర్థంగానూ చేయగలుగుతారు. ఇక్కడ నిశితత్వం కూడా ఎక్కువే. అంటే ఉదాహరణకు తొలగించాల్సిన కణజాలాన్ని అత్యంత ఖచ్చితంగా అవసరమైనంత మేరకే తొలగించవచ్చు. అదే నేరుగా మనిషి చేతితో చేసే శస్త్రచికిత్సల్లో హానికర కణజాలాన్ని మళ్లీ పెరగకుండా నివారించేందుకు కొంత ఆరోగ్యకరమైన కణజాలాన్నీ తొలగించాల్సి రావచ్చు. కానీ రోబో సాయంతో అదెంతో ఆక్యురేట్గా జరుగుతుంది. కాబట్టి మున్ముందు హానికర కణజాలం మళ్లీ పెరగకుండా ఉండేందుకే అవకాశాలు మరింత ఎక్కువగా ఉంటాయి. ఎందుకు మరింత సురక్షితమంటే... కోత చాలా చిన్నగా, ఖచ్చితంగా ఉండటంవల్ల కోలుకునే సమయం తగ్గుతుంది. గాయమూ వేగంగా మానుతుంది. కోతా, గాయం తక్కువ కావడం వల్ల ఇన్ఫెక్షన్కు అవకాశాలు బాగా తక్కువ. అంతేకాదు... సర్జరీకి పట్టే సమయమూ, అవసరమైన మత్తుమందూ, రక్తస్రావం... ఇఅన్నీ తక్కువే. దాంతో శస్త్రచికిత్స మరింత సురక్షితం కావడంతో కోలుకోవడమూ చాలా వేగంగా జరుగుతుంది.ఏయే శాఖల్లో ఏయే శస్త్రచికిత్సలు? మొదట్లో రోబో సహాయంతో నిర్వహించే శస్త్రచికిత్సలు... మెదడు వంటి కీలకమైన, సున్నితమైన ప్రదేశాల్లో చాలా లోతుగా ఉండి, మానవ హస్తంగా అంత తేలిగ్గా చేరలేని భాగాల్లోనే జరిగేవి. ఉదాహరణకు... మెదడు కణితి తొలగింపు చికిత్సల్లో ట్యూమర్ చాలా స్పష్టంగా కనిపిస్తుంటే... చిన్న రంధ్రంనుంచి అత్యంత నిశితంగా, ఎంతో నైపుణ్యంతో శస్త్రచికిత్స నిర్వహించడానికి రోబో చక్కగా సహాయపడుతుంది. బాధితులు త్వరగా కోలుకుంటారు. అలాగే మూర్ఛవ్యాధికి సాధారణంగా మందులతోనే చికిత్స జరుగుతుంది. అయితే ఎంతకీ తగ్గని కేసుల్లో అత్యంత సునిశితంగా శస్త్రచికిత్స నిర్వహించడానికి రోబో సహాయం తీసుకోవడం వల్ల సర్జరీ మరింత ఎక్కువ సురక్షితంగా జరుగుతుంది.అయితే... వైద్యశాస్త్ర విజ్ఞానం పెరుగుతున్న కొద్దీ రోబోల సర్జరీలు ఇప్పుడు రకరకాల వైద్యవిభాగాల్లోకి విస్తరించాయి. ఉదాహరణకు సంయుక్తంగా మొత్తం మూత్ర వ్యవస్థ (యూరో, నెఫ్రో, గైనిక్) విభాగాలతో పాటు ఇంకా అనేక విభాగాల్లో రోబో సహాయంతో శస్త్రచికిత్సలు జరుగుతున్నాయి. రోబోలు శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్న దేహ వ్యవస్తలూ... ఆ వ్యవస్థల్లో ఏయే శస్త్రచికిత్సలను అవి నిర్వహిస్తున్నాయో చూద్దాం.ఇతరత్రా విభాగాల్లోని శస్త్రచికిత్సలివి... ∙విపుల్ ప్రొసీజర్ : పాంక్రియాస్ (క్లోమం)లోని ‘హెడ్’ అనే భాగాన్నీ, అలాగే చిన్నపేగుల్లోని ‘డియోడినమ్’ అనే భాగాన్ని, గాల్బ్లాడర్ను (పిత్తాశయాన్ని), బైల్ డక్ట్ను తొలగించే శస్త్రచికిత్సను ‘పాంక్రియాటికో–డియోడనెక్టమీ’ అంటారు. ఇది చాలా సంక్లిష్టమైన ప్రక్రియ. ఆయా భాగాల్లోని గడ్డల తొలగింపుతో పాటు... పాంక్రియాస్, చిన్నపేగులు, గాల్బ్లాడర్లోని కొన్ని జబ్బులు (డిజార్డర్స్)లో ఇది ఉపయోగపడుతుంది. ఉదాహరణకు క్రానిక్ పాంక్రియాటైటిస్, డియోడనల్ ట్రామా వంటి చికిత్సల్లో ఎంతో బాగా ఉపయోగపడుతుంది.థైరాయిడెక్టమీ..క్యాన్సర్కు గురైన థైరాయిడ్ను తొలగించడానికి చేసే సంప్రదాయ శస్త్రచికిత్స తర్వాత మెడ చుట్టూ గీత కనిపిస్తుంది. కానీ రోబో చేసే శస్త్రచికిత్స తర్వాత ఎలాంటి గీతా ఉండదు. అందంగా కనిపించాలని కోరుకునే యువతీ యువకులకూ / పెళ్లి కావాల్సిన యువతకు కాస్మటిక్గా ఇదో వరం.భవిష్యత్ ఆశారేఖగా ‘మైక్రో–రోబో’ చికిత్స! సెకండరీ నిమోనియా ఇన్ఫెక్షన్స్ చాలా ప్రమాదకరమైనవి. ఇవి ఎంతటి ప్రమాదాన్ని తెచ్చిపెడతాయన్నది డాక్టర్లతో పాటు చాలామంది పేషెంట్లకూ తెలిసిన విషయమే. తొలుత వచ్చిన ఇన్ఫెక్షన్ కారణంగా అటు తర్వాత ఊపిరితిత్తుల్లో నిమోనియా వస్తే దాన్ని ‘సెకండరీ నిమోనియా ఇన్ఫెక్షన్’ అంటారు. నేరుగా వచ్చే నిమోనియా కంటే దీంతో ప్రమాదం చాలా ఎక్కువ.ఇలాంటి ప్రమాదకరమైన నిమోనియాకి చాలా చాలా చిన్నవైన మైక్రోస్కోపిక్ ‘రోబో’లతో కొంతకాలం కిందట వైద్య పరిశోధకులు ఎలుకల్లో ఓ ప్రయోగాత్మకమైన చికిత్స నిర్వహించారు. అతి చిన్న ఆల్గైలను (పాచిలాంటి మొక్కలను) సేకరించి మైక్రోస్కోపులో చూస్తే తప్ప కనిపించనంతటి ఆ చిన్న చిన్న జీవమున్న మొక్కలపై ‘యాంటీబయాటిక్ నానోపార్టికిల్స్’ను పైపూతగా పూశారు. ఈ పూత... ఇన్ఫెక్షన్లను సమూలంగా నిర్మూలించే తెల్లరక్తకణాల్లోని ‘న్యూట్రోఫిల్స్’.వాటినే ఓ పూతలా పూసి నిమోనియాతో బాధపడుతున్న ఎలుకల ఊపిరితిత్తులోకి ఈ సజీవ ‘మైక్రో–రోబో’లను పంపారు. జీవమున్న ఈ మైక్రో రోబోలకు ‘మైక్రోబో’ (మైక్రో + రోబో = మైక్రోబో) అని పేరు పెట్టారు. యాంటీబయాటిక్ నానోపార్టికిల్స్ పూత ఉన్న ఈ ‘మైక్రోబో’లు ఊపిరితిత్తుల్లో కదులుతూ, ఈదులాడుతూ నిమోనియాకు కారణమైన అతి చిన్న సూక్ష్మజీవులను తుదముట్టించాయి. నిమోనియా వచ్చిన కేసుల్లో చాలావరకు ‘సూడోమొనాస్ ఆరిజినోసా’ అనే అత్యంత సూక్ష్మజీవులు ఇన్ఫెక్షన్ను కలిగించి, బాధితుల మరణానికి కారణమవుతుంటాయి.ఈ సూడోమొనాస్ ఆరిజినోసా మైక్రోబ్స్ కారణంగా నిమోనియా ఇన్ఫెక్షన్ గురైన వాటిల్లోని సగం ఎలుకల్లోకి ఈ మైక్రోబోలను పంపి, మరో సగానికి పంపకుండా వదిలేశారు. మైక్రో రోబోలు పంపిన ఎలుకలన్నీ బతికాయి. మిగతావి మూడు రోజుల్లో చనిపోయాయి. ఈ ప్రయోగ ఫలితాలు ‘నేచర్ మెటీరియల్స్’ అనే మెడికల్ జర్నల్లో ప్రచురితమయ్యాయి. ఇలాంటి పరిశోధనల ఫలితాలను బట్టి చూస్తే... భవిష్యత్తులో మరింత సూక్ష్మాతి సూక్ష్మమైన ప్రక్రియల నిర్వహణకు మైక్రో రోబోలు ఎలా పనిచేయగలవో అన్నది ఊహించవచ్చు. ఇది ప్రయోగదశలో ఉన్న మున్ముందు సాకారం కాబోయే చికిత్స ప్రక్రియ.మానవ హస్తం కంటే రోబోతో సర్జరీలు కొంత ఈజీ... ఎందుకంటే... మానవ మణికట్టును అటు ఇటు తిప్పి చూసినప్పుడు కొంతవరకే తేలిగ్గా తిరగగలుగుతుంది. అయితే ఓ రోబో మణికట్టు మాత్రం ఎటువైపైనా దాదాపు 270 డీగ్రీల వరకు తిరిగేలా రూపొందిస్తారు. ఇక రోబో చేతులూ, వేళ్లూ సన్నగా, బాగా పొడుగ్గా ఉంటాయి. దాంతో సన్నటి ఇరుకైన చోట్లకు కూడా చేరగలుగుతాయ. అంతేకాదు... వాటికి అందించిన ఆదేశాల మేరకు ముందుగా నిర్దేశించిన మేరకు మాత్రమే కోసేలా... ఖచ్చితంగా అంతే గాటు పెట్టేలా చూస్తాయి. ఇలా మానవహస్తానికి కష్టసాధ్యమైన శస్త్రచికిత్స ప్రక్రియల్ని రోబో సహాయంతో డాక్టర్లు చేయగలుగుతారు.మూత్ర / గైనిక్ వ్యవస్థలో ... ∙మూత్రపిండాల శస్త్రచికిత్సలో : మూత్రపిండం నుంచి మూత్రాశయానికి (బ్లాడర్కు) మూత్రం తీసుకొచ్చే పైపులు... యురేటర్లలో ఏవైనా అడ్డంకులు ఏర్పడినప్పుడు ‘పైలో΄్లాస్టీప్రొసిజర్’ అనే శస్త్రచికిత్సతో దాన్ని చక్కదిద్దవచ్చు. (ఉదాహరణకు యురేటరో–పెల్విక్ జంక్షన్లో అడ్డంకి. దీన్నే యూపీజే అబ్స్టక్షన్ అని అంటారు). అలాగే మూత్రపిండాల్లో ఏర్పడ్డ గడ్డల (రీనల్ ట్యూమర్స్) తొలగింపు, కిడ్నీని పూర్తిగా తొలగించడానికి చేసే నెఫ్రెక్టమీ వంటి చికిత్సల్లో రోబోలు బాగా ఉపయోగపడతాయి.ప్రోస్టెక్టమీ :ప్రోస్టేట్ గ్రంథిని తొలగించే శస్త్రచికిత్సలో..గైనకాలజీలో: గర్భసంచికీ... అలాగే గర్భాశయ ముఖద్వారంలో క్యాన్సర్ (ప్రీ–మెలిగ్నెంట్ సర్విక్స్ అండ్ యుటెరస్) వచ్చే అవకాశముందని తెలిసినప్పుడు; ఫైబ్రాయిడ్, అడినోమయోసిస్ వంటి గడ్డల తొలగింపులో; ఎండోమెట్రియాసిస్ కేసుల్లో సమస్యాత్మకమైన / వ్యాధికి గురైన భాగాలను తొలగించడానికి రోబోలు చక్కగా ఉపయోగపడతాయి. మామూలుగా ఇలాంటి సమస్య ఉన్నప్పుడు బాధితుల్లో రుతుస్రావం సరిగా రాకపోవడం, తీవ్రమైన నొప్పి వంటి సమస్యలు ఎక్కువ. రోబో శస్త్రచికిత్సలతో వాటిని తేలిగ్గా సరిదిద్దవచ్చు. యుటెరస్ పెద్దదిగా ఉన్నప్పుడు రోబో చేసే శస్త్రచికిత్సతో తేలిగ్గా తొలగించవచ్చు. మరీ ముఖ్యంగా ఎండోమెట్రియమ్ శస్త్రచికిత్సలో అడ్హెషన్స్ వచ్చినప్పుడు (ఒక అవయవంలో ఒక భాగం ఇతర శరీర అవయవ భాగాలకు అతక్కుపోవడం) అది సర్జన్లకు ఓ సవాలుగా మారుతుంది. రోబో చేతులు వాటిని తేలిగ్గా విడదీస్తాయి.యూరో–గైనకాలజీ శస్త్రచికిత్సల్లో: పొత్తికడుపు కింది భాగంలోని అవయవాలు చాలా దగ్గరదగ్గరగా ఉంటాయి. అవి మరో అవయవంలోకి చొచ్చుకునిపోయి (హెర్నియా కేసులతో) బాధించేప్పుడు చేసే సాక్రోకాల్పోపెక్సీ చేయడానికీ; అలాగే దగ్గినప్పుడూ, ఒత్తిడికి గురైనప్పుడు తమ ప్రమేయం లేకుండా బాధితుల్లో మూత్రం పడిపోయే కేసుల్లో చేసే కాల్పోసస్పెన్షన్ప్రొసీజర్లలో, ఫిస్టులా రిపేర్ల వంటి కేసుల్లో సర్జరీ కాంప్లికేషన్లను తగ్గించేందుకు రోబోలు ఎక్కువగా సహాయపడుతుంటాయి.భవిష్యత్తులో మరింత చవగ్గా... ఇప్పుడు చాలా చోట్ల అమెరికన్ తయారీ రోబోలు ఉపయోగంలో ఉన్నాయి. ఇవి బాగా ఖరీదు కావడంతో ఈ శస్త్రచికిత్సలూ కాస్త ఖరీదే. అయితే భారతీయ రోబోలు అతి వేగంగా అందుబాటులోకి రానున్నాయి. ఎస్ఎస్ఐ మంత్ర ఇలాంటి వాటిల్లో ఒకటి. ఇవి అమెరికన్ రోబోల ఖరీదులో సగానికే దొరుకుతాయి. ఫలితంగా అవి అందుబాటులోకి వస్తే ఇప్పటివరకూ అడ్వాన్స్డ్గా పరిగణిస్తున్న లాపరోస్కోపీ సర్జరీల స్థానంలో ఇవి... అన్ని వర్గాల ప్రజలకూ అందుబాటులోకి వచ్చే అవకాశముంది. అందునా చాలా చవగ్గా కూడా.- డా. వి. చంద్రమోహన్, సీనియర్ యూరో సర్జన్. నిర్వహణ: యాసీన్ -
ముద్దు చేస్తే మొదటికే మోసం
రోజురోజుకూ పెంపుడు జంతువులు పెంచుకునే వారి సంఖ్య పెరుగుతోంది. పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ కుక్కలు, పిల్లులను, కుందేళ్లను, చిలుకలును పెంచుకోవడానికి ఇష్టపడతున్నారు. వాటితో ఆడుకోవడం, ఫొ టోలు దిగడం. సరదాగా బయటకు తీసుకెళ్తూ ఎంజాయ్ చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో వాటిని ము ద్దాడుతూ సంబరపడిపోతుంటారు. అయితే పెట్స్ పెంచుకునే వాళ్లు చాలా జాగ్రత్తలు తీసుకోవాలని.. వాటిన వల్ల మనకు వ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. జూలై 6వ తేదీని ప్రపంచవ్యాప్తంగా జూనోసిస్ డే సందర్భంగా జంతువుల నుంచి మనుషులకు సోకే వ్యాధులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను మంచిర్యాల జిల్లా పశుసంవర్థక శాఖ అధికారి యాకుబ్రెడ్డి తెలిపారు. జూనోసిస్ వ్యాధులు అంటే..జంతువుల నుంచి మనుషులకు సంక్రమించే వ్యాధులను జూనోసిస్ వ్యాధులు అంటారు. పశువులు, కుక్కలు, పిల్లులు, పక్షులు, కోళ్లు వంటి జంతువుల నుంచి మనుషులకు సుమారు 200 రకాల వ్యాధులు సోకే అవకాశం ఉంది. పశువుల పాకల అపరిశుభ్రత, సరైన జాగ్రత్తలు లేకపోవడం వంటి కారణాలతో ఈ వ్యాధులు వ్యా ప్తి చెందుతాయి. ఈ రోజు పశుపోషకులు, పెంపుడు జంతువుల ప్రేమికులు అప్రమత్తంగా ఉండాలని, అవగాహన కల్పించాలని జిల్లా పశుసంవర్థక శాఖ అధికారులు సూ చిస్తున్నారు. అప్రమత్తం కోసం జూనోసిస్ డే1885వ సంవత్సరం జూలై 6వ తేదీన ఫ్రెంచ్ శాస్త్రవేత్త లూయిస్ పాశ్చర్ చరిత్రాత్మకమైన ప్రయోగం చేశారు. పిచ్చి కుక్క కరిచిన ఒక బాలుడికి ఆయన మొదటిసారిగా రేబిస్ వ్యాధి నివారణ టీకా ఇచ్చారు. ఆ ప్రయత్నం విజయవంతం కావడంతో జూలై 6న ప్రపంచ జూనోసిస్ దినోత్సవంగా పాటించడం ప్రారంభమైంది. ఈ రోజు జంతువుల నుంచి వచ్చే వ్యాధుల నివారణపై విస్తృత అవగాహన కల్పించడం, అప్రమత్తం చేయడం, టీకాల ప్రాముఖ్యతను తెలియజేయడం ఈ రోజు ప్రత్యేకత. తీసుకోవాల్సిన జాగ్రత్తలు..పెంపుడు కుక్కలను శాస్త్రీయ పద్ధతిలో, పశువైద్యుని సలహా మేరకు పెంచకపోతే వాటి నుండి వచ్చే వ్యాధులు ప్రాణాంతకంగా మారవచ్చు. శుచి, శుభ్రత పాటించడం అత్యంత ముఖ్యం. పెంపుడు కుక్కలకు సకాలంలో టీకాలు వేయించడం వల్ల యజమానులు, కుటుంబ సభ్యులు, పొరుగువారు అందరూ సురక్షితంగా ఉంటారు. కుక్కలతో సన్నిహితంగా ఉండేవారు కూడా రేబిస్ టీకా వేయించుకోవాలి. జూనోసిస్ వ్యాధుల నుండి రక్షణకు జాగ్రత్తలుపశువుల పాకలు, ఇళ్లు ఎప్పుడూ శుభ్రంగా ఉంచాలి. పెంపుడు జంతువులకు క్రమం తప్పకుండా టీకాలు వేయించాలి. అనుమానాస్పద జంతువులను తాకకూడదు. గాయాలు ఉంటే వెంటనే వైద్య సహాయం తీసుకోవాలి. పాలు, మాంసం బాగా ఉడికించి తినాలి. పశువైద్యుని సలహా తీసుకుని జంతువులను పెంచాలి.వీరికి జూనోసిస్ వ్యాధులు..కొన్ని వృత్తులు, జీవన విధానాలు జూనోసిస్ వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతాయి. పశువుల కాపరులు, పశువైద్యులు, పెంపుడు కుక్కలు, పక్షులు పెంచేవారు, పౌల్ట్రీ ఫారాలు, డెయిరీ కార్మికులు, మాంసాహారులకు జూనోసిస్ వ్యాధులు సోకే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.రేబిస్ ప్రాణాంతకం..అత్యంత ప్రమాదకరమైన జూనోసిసూ్జనోసిస్ వ్యాధుల్లో రేబిస్ ప్రాణాంతకమైనది. ఇది రా బ్డోవైరస్ అనే వైరస్ వల్ల వస్తుంది. పిచ్చి కుక్క కాటు, లాలాజలం గాయానికి అంటడం ద్వా రా ఈవ్యాధి సోకుతుంది. కుక్కలు, పిల్లులు, నక్కలు, ముంగీసలు,తోడేళ్లువంటిజంతువుల ద్వారా మనుషులు, పశువులకు సోకుతుంది. లక్షణాలు..కుక్క కరిచిన 2–3 వారాల తర్వాత లక్షణాలు కనిపిస్తాయి. ముఖం, మెడ ప్రాంతంలో కాటు వేస్తే వ్యాధి త్వరగా వ్యాపిస్తుంది. చివరికి నాడీ వ్యవస్థ ప్రభావితమై పక్షవాతం, మరణం సంభవిస్తుంది. ఒకసారి లక్షణాలు కనిపించిన తర్వాత చికిత్స దాదాపు అసాధ్యం. రేబిస్ వ్యాధి నివారణకు ఏఆర్వీ (ఆంటీ రేబిస్ వ్యాక్సిన్) టీకా అత్యంత ప్రభావవంతం. మొదటి డోసు 30వ రోజు, బూస్టర్ డోసు 90వ రోజు, తర్వాత ఏడాదికి ఒకసారి ఇవ్వాలి. జూనోసిస్ దినోత్సవం కేవలం ఒక రోజు పాటించే వేడుక కాదు. ఇది జంతువులు, మనుషుల మధ్య ఆరోగ్య సంబంధాన్ని బలోపేతం చేసే అవగాహనా కార్యక్రమం. సరైన జాగ్రత్తలు, సకాలంలో టీకాలు వేయించడం ద్వారా మనం ఈ వ్యాధుల బారిన పడకుండా సురక్షితంగా ఉండవచ్చు. -
Beauty Tips: ఈ మాస్క్తో ముడతలు దూరం
వయసు పెరిగే కొద్దీ చర్మంలో మార్పులు రావడం సహజం. మార్కెట్లో దొరికే చాలా రకాల ఎల్ఈడీ ఫేస్ మాస్క్లు కేవలం ముఖంపై వచ్చే ముడతలు, చారలు, మచ్చలను మాత్రమే తగ్గిస్తాయి. కానీ, సోలావేవ్ నెక్ – చెస్ట్ రెజువనేటింగ్ మాస్క్ ముఖం కింద ఉండే నెక్, చెస్ట్ చర్మ సంరక్షణలోనూ తోడ్పడుతుంది.ముఖం లాగే మెడ, ఛాతీ భాగాలపై కూడా వయసు పైబడిన లక్షణాలు స్పష్టంగా కనిపిస్తాయి. అందువల్ల చర్మం సాగడం, ముడతలను తగ్గించుకోవాలనుకునే వారి కోసం సోలావేవ్ సంస్థ రూపొందించిన ఈ రెజువనేటింగ్ పరికరం ఉపయోగకరంగా ఉంటుంది. ఇది ‘మైక్రోకరెంట్’, ‘రెడ్ లైట్ థెరపీ’ సాంకేతికతతో పనిచేస్తుంది. ఈ మాస్క్ మెడ, ఛాతీ భాగాలపై ఉండే సన్నని ముడతలను సున్నితంగా తొలగిస్తుంది. చర్మాన్ని బిగుతుగా, కాంతివంతంగా మారుస్తుంది. రోజుకు పది నిమిషాలు దీనిని ఉపయోగిస్తే చాలు. దీనిని చేతులతో పట్టుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. బెల్ట్తో ఫిక్స్ చేసుకుంటే సరిపోతుంది.బొగ్గుపొడితో దంతాలు ధగధగకొన్ని సందర్భాల్లో కాఫీ, టీ లు ఎక్కువగా తాగడం, ఎనామిల్ పొర బలహీనపడటం వల్ల దంతాలు పచ్చగా మారిపోతుంటాయి. ఇందుకోసం డెంటిస్టుల చుట్టూ తిరిగి డబ్బులు ఖర్చు చేయాల్సిన పనిలేకుండా, సహజంగా దొరికే వస్తువులతోనే దంతాలను మెరిపించుకోవచ్చు.దంతాలను సహజంగా క్లీన్ చేయడానికి బేకింగ్ సోడా అద్భుతంగా పనిచేస్తుంది. ఇది దంతాలపై పేరుకుపోయిన మరకలను సున్నితంగా తొలగిస్తుంది. అలాగే యాపిల్ సైడర్ వెనిగర్ దంతాలపై ఉండే రంగు మారిన పొరలను తొలగిస్తుంది. అయితే దీనిని చాలా జాగ్రత్తగా, తక్కువ మోతాదులో మాత్రమే వాడాలి. చూడటానికి నల్లగా ఉన్నప్పటికీ, బొగ్గుపొడి పళ్లపై ఉండే టాక్సి¯Œ ్స, రంగు మరకలను తన వైపుకు లాక్కునే ప్రత్యేక గుణాన్ని కలిగి ఉంటుంది. దీనిని కూడా తక్కువ మోతాదులో మాత్రమే ఉపయోగించాలి.సాంబ్రాణితో సహజ మెరుపు!తలస్నానం చేసిన వెంటనే నేడు జుట్టు ఆరబెట్టుకోవడానికి హెయిర్ డ్రైయర్లను వాడుతున్నారు. కానీ పూర్వం ఎంతటి పొడవాటి జుట్టునయినా ఆరబెట్టుకోవడానికి తలకు ‘ధూపం’ వేసుకునేవారు.ఇది నేటి తరానికి కేవలం సువాసన కోసం చేసే ప్రక్రియగా అనిపించినప్పటికీ ఇందులో ఎన్నో ఆయుర్వేద, ఆరోగ్య రహస్యాలు దాగున్నాయి. సాంబ్రాణిని వేయడం వల్ల, ఆ వెచ్చని పొగ జుట్టులోని తేమను వేగంగా పీల్చేస్తుంది. రక్త ప్రసరణను మెరుగుపరచి తలనొప్పి వంటి సమస్యలు రాకుండా కాపాడుతుంది. ఇందులో ఉండే శక్తిమంతమైన యాంటీ–మైక్రోబియల్, యాంటీ–ఫంగల్ గుణాలు తలలో చుండ్రు చేరకుండా రక్షిస్తాయి. -
36 గంటల ఆపరేషన్తో.. ఒకే పేషెంట్కి ఐదు అవయవాల మార్పిడి!
హైదరాబాద్లోని ప్రముఖ ప్రభుత్వ ఆసుపత్రి ‘ఉస్మానియా జనరల్ హాస్పిటల్’ (Osmania General Hospital) వైద్య బృందం దేశంలోనే అత్యంత అరుదైన, సరికొత్త రికార్డును సృష్టించింది. ఏకబిగిన 36 గంటల పాటు శ్రమించి ఒకేసారి ఒక రోగికి అయిదు రకాల శస్త్రచికిత్సలను (Organ Transplants) విజయవంతంగా నిర్వహించారు. ఈ అసాధారణ విజయాన్ని సాధించిన ఉస్మానియా వైద్యులు, నర్సింగ్, ఇతర సహాయక సిబ్బందికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ మేరకు సిరిసిల్ల జిల్లాకు చెందిన 30 ఏళ్ల యువ ఇంజనీర్కు జీర్ణాశయం, డ్యూడెనమ్, ప్యాంక్రియాస్, చిన్నపేగు, పెద్దపేగు అవయవాలను ఒకేసారి మార్పిడి చేసి దేశంలోనే అరుదైన వైద్య ఘనతను సాధించారు ఉస్మానియా వైద్యులు. మరిన్ని వివరాలకు ఈ కింద లింక్పై క్లిక్ చేయండి. (చదవండి: ఎవరీ డాక్టర్ ల్యుడ్మిలా ఖోఖ్లోవా? రష్యాలో భారత్ గురించి..) -
ఏఐ ఫిట్నెస్ యాప్స్ని నమ్మొచ్చా?
సాంకేతిక ప్రపంచాన్ని శాసిస్తున్న ఏఐ ఫిట్నెస్ రంగంలోకి కూడా దూసుకొచ్చింది. మనం వ్యాయామం చేసే విధానాన్ని, లైఫ్స్టైల్ను ఇది పూర్తిగా మార్చేస్తోంది. ప్రతి ఒక్కరి శరీర తత్వానికి తగ్గట్టుగా పర్సనలైజ్డ్ వర్కవుట్ ప్లాన్స్ ఇవ్వడం, న్యూట్రిషన్ నియమాలను సూచించడం, రోజువారీ పురోగతిని ట్రాక్ చేస్తూ రియల్–టైమ్ సమాచారాన్ని అందించడం వంటి ఎన్నో ఫీచర్ల తో ఏఐ యాప్స్ సరికొత్త ట్రెండ్ను సృష్టి్టస్తున్నాయి. అయితే ఈ ఏఐ ఫిట్నెస్ యాప్స్తో లాభాలెన్నో.. నష్టాలు కూడా అదేవిధంగా ఉంటాయంటున్నారు ఫిట్నెస్ నిపుణులు.ఏఐ యాప్స్ డేటాను విశ్లేషించడంలో ఎంత నైపుణ్యం కలిగి ఉన్నప్పటికీ, ఒక హ్యూమన్ కోచ్ స్థానాన్ని భర్తీ చేయలేవు. ఉదాహరణకు, ఎవరైనా డెడ్లిఫ్ట్ వ్యాయామం చేస్తున్నప్పుడు.. పొడవాటి కాళ్లు ఉన్న వ్యక్తి చేసే విధానం, పొట్టిగా ఉండే వ్యక్తి చేసే విధానం వేరువేరుగా ఉంటాయి. ఒక మంచి ఫిట్నెస్ కోచ్ మాత్రమే ఈ శారీరక వ్యత్యాసాలను గమనించి సరైన గైడెన్స్ ఇవ్వగలరు. కానీ ఏఐ యాప్స్ ఈ తేడాలను గుర్తించలేక, కరెక్ట్గా చేస్తున్నా తప్పు అని చెప్పే ప్రమాదం ఉంది.అంతేకాకుండా, గతంలో ఏవైనా గాయాలు అయ్యాయా? బాడీలో ఎక్కడైనా నొప్పి ఉందా? లేదా అలసట కారణంగా తప్పుగా చేస్తున్నారా? అనే మానవీయ కోణాలను ఏఐ అర్థం చేసుకోలేదు. ఇవి కేవలం మీ ఫిట్నెస్ను మెరుగుపరచడానికి మాత్రమే, ఏదైనా అనారోగ్యం లేదా గాయం ఉంటే మాత్రం ఖచ్చితంగా డాక్టర్ సలహా తీసుకోవాల్సిందే.ఫోన్ లో సులభంగా ఫిట్నెస్ ప్లాన్ కావాలనుకునే వారికి, క్రీడాకారులకు ఏఐ యాప్స్ ఎంతగానో ఉపయోగపడతాయి. వ్యాయామాన్ని మరింత సరదాగా మార్చుకోవడానికి ఇవి చక్కటి సాధనాలు. అయినప్పటికీ, ఒక ప్రొఫెషనల్ ఫిట్నెస్ కోచ్ పర్యవేక్షణలో వీటిని వాడుకుంటేనే ఆశించిన ఫలితాలు వస్తాయి. ఏఐ ఫిట్నెస్ యాప్స్ చాలా అద్భుతమైనవే.. కానీ అవి ఎప్పటికీ ఒక నిజమైన కోచ్కి ప్రత్యామ్నాయం కాలేవు. -
అందరిలా కాదు.. నీలా నువ్వుండు చాలు!
మనకు లేనిదానిపైనే మన చూపంతా.. యువతలో బాగా ప్రబలుతున్న ఈ మానసిక నిర్లిప్తత ఇప్పుడు బడికెళ్లే పిల్లల్లోనూ కనిపిస్తోంది. సోషల్ మీడియా ప్రభావం పెద్దలకే కాదు.. చిన్నపిల్లల్లో కూడా కనిపిస్తూ కన్నవాళ్లను కలవరపెడుతోంది. ‘అందరూ ఏదేదో చేస్తున్నారు.. ఎక్కడికంటే అక్కడికెళుతున్నారు వారిలా నేనెందుకు లేను.. వారిలా నేనెందుకు ఏ పనీ చేయలేకపోతున్నాను.. ’ఈ భావననే ‘ఫెమో’ (ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్) అంటారు. ఎప్పుడూ ఎదుటివారిలా తానెందుకు ఉండలేకపోతున్నానని బాధపడడం, ఎప్పుడూ తనని తాను నిందించుకుంటూ ఉండడం, కోపం వచ్చినా.. దానిని ఎవరి మీద చూపించాలో తెలియక అవస్థలు పడడం... ఇలాంటి లక్షణాలు మీ పిల్లల్లో కనిపిస్తే ఏం చేయాలో వెంటనే ఈ సూచనలు పాటించడం మంచిది.ఎవరిలో ఫెమో ఉంది?1. తరచూ ఫోన్లో తన వయసువాళ్ల వీడియోలు, రీల్స్ చూడడం, తనెందుకు చేయలేకపోతున్నానని బాధపడడం2. తమకు లేని ప్రతిభ కోసం లేదా తమ దగ్గర లేని వస్తువుల కోసం పట్టుబట్టడం.3. ప్రతి విషయానికీ ఇతరులతో పోల్చుకోవడం. ఆత్మన్యూనతాభావానికి లోనవ్వడం.4. చిన్న పొరపాటు జరిగినా తమని తాము నిందించుకోవడం.5. ఏ పని చేయాలన్నా ఆసక్తి కనబరచక పోవడం, ఒంటరిగా ఫీలవ్వడం.ఏం చేయాలి?1. ఫెమో సమస్య కి విరుగుడు జెమో (జాయ్ ఆఫ్ మిస్సింగ్). పిల్లల ప్రవర్తన చూసి తల్లిదండ్రులు వారిని మందలించడం కంటే ప్రతిరోజు వారితో కాస్త సమయం గడపాలి. వారి సమస్యల్ని వినాలి. 2. సోషల్ మీడియాలో కనిపించేదంతా నిజ జీవితం కాదని వారికి అర్థమయ్యేలా చె΄్పాలి.3. స్క్రీన్ టైమ్కు పరిమితులు విధించి, ఆటలు, పుస్తక పఠనం, సంగీతం, కుటుంబంతో కలిసి గడిపే సమయాన్ని ్రపోత్సహించాలి. 4. ఎవరినో చూసి వారిలా ఉండాలని కోరుకోవడం కన్నా నువ్వు నీలా ఉంటేనే మంచిదని తెలిసేలా చేయాలి.5. నచ్చిన పని చేసినప్పుడు వచ్చే అనుభూతే నిజమైన ఆనందమని వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించాలి. -
సీతాకోకచిలుకలా... ప్రయోజనాలను ఇచ్చే బద్ధకోణాసనం!
డెస్క్ ఉద్యోగాల్లో ఒత్తిడిని తగ్గించి, శరీరానికి మంచి ప్రయోజనాలను అందించడంలో అధిక ప్రయోజనాలను ఇచ్చే యోగాసనాల్లో బద్ధకోణాసనం ఒకటి. ఈ యోగా భంగిమలో సీతాకోక చిలుక రెక్కల్లా మోకాళ్లు కదలికలు ఉంటాయి కాబట్టి దీనిని ఈ పేరుతో పిలుస్తారు. కాళ్లు, తుంటి, వెన్ను భాగాలకు ఇది ఎంతో మేలు చేస్తుంది.ఉదయం లేదా సాయంత్రం రోజూ కొన్ని నిమిషాలు ఈ బటర్ఫ్లై ఆసనాన్ని సాధన చేస్తే మెరుగైన ప్రయోజనాలను పొందవచ్చు. కంప్యూటర్లలో పని చేసే వారు, వెన్ను నొప్పి, మెడ, తుంటి నొప్పితో ఇబ్బంది పడేవారికి ఇది ఎంతో ఉపయోగకరం.చేసే విధానం (20 నుంచి 30 సార్లు)నేలపై యోగా మ్యాట్పై కూర్చోవాలి.రెండు పాదాలను ఒకదానికొకటి తాకించి, చేతులతో పాదాలను పట్టుకోవాలి.వెన్నెముకను నిటారుగా ఉంచాలి.శ్వాసను గమనిస్తూ మోకాళ్లను సీతాకోకచిలుక రెక్కల్లా మెల్లగా పైకి–కిందికి మెల్లగా కదిలించాలి ∙సాధారణ శ్వాసతో 20 నుంచి 30 సార్లు చేయాలి.ప్రయోజనాలు...పెల్విక్ప్రాంతంలో రక్తప్రసరణ మెరుగుపడుతుంది.వెన్ను నొప్పి, నడుము బిగుతు తగ్గించడంలో సహాయపడుతుంది.ఎక్కువసేపు కూర్చునే వారికి ఉపశమనం కలిగిస్తుంది.మహిళల్లో పెల్విక్ ఆరోగ్యానికి, గర్భధారణ సమయంలో (నిపుణుల పర్యవేక్షణలో) ఉపయోగకరంగా ఉంటుంది.శరీర ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది.లోయర్ బ్యాక్ కండరాలకు బలం చేకూరుతుంది.ఒత్తిడి తగ్గి మనసు ప్రశాంతంగా ఉంటుంది. జీర్ణక్రియ మెరుగుపడుతుంది.వెన్ను, మెడ, తుంటి నొప్పులు తగ్గడంలో సహాయపడుతుంది.జాగ్రత్తలు...మోకాలి లేదా హిప్కు తీవ్రమైన గాయం ఉంటే చేయకూడదు. ∙మోకాళ్లను బలవంతంగా నేలకు నొక్కకూడదు. ∙వెన్ను వంచకుండా నిటారుగా ఉంచాలి.నొప్పి అనిపిస్తే వెంటనే ఆపాలి.గర్భిణులు తప్పనిసరిగా శిక్షణ పొందిన యోగా గురువు పర్యవేక్షణలో మాత్రమే చేయాలి.-అనిత పాతర్ల, యోగా ట్రైనర్


