breaking news
Health
-
నిమ్స్లో చిన్నారులకు ఉచితంగా గుండె ఆపరేషన్లు
హైదరాబాద్: కొందరు చిన్నారులు పిల్లలు పుట్టుకతోనే వ్యాధులతో బాధపడుతుంటారు. వాటిలో గుండె సంబంధిత వ్యాధులు ఎక్కువగా కనిపిస్తాయి. ఆర్థికంగా స్థోమత ఉన్నవారు పెద్ద పెద్ద ఆసుపత్రుల్లో చికిత్స చేయించుకోగలుగుతారు. కానీ పేద , మధ్యతరగతి కుటుంబాల పరిస్థితి మాత్రం చాలా కష్టంగా ఉంటుంది. అలాంటి వారికి నిజాం ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్(నిమ్స్) ఉచితంగా ఆపరేషన్లు చేయనున్నది. అప్పుడే పుట్టిన శిశువుల మొదలు 14 ఏళ్ల చిన్నారులకు ఉచితంగా గుండె ఆపరేషన్లు చేయనున్నారు. ఇందుకు గాను బ్రిటన్ వైద్యులు నిమ్స్కు రానున్నారు.ప్రముఖ వైద్యులు, తెలంగాణకు చెందిన డాక్టర్ రమణ దన్నపనేని నేతృత్వంలోని ఈ బృందం ఏటా సెప్టెంబర్లో వారం రోజుల పాటు ఉచిత గుండె ఆపరేషన్ల శిబిరాన్ని నిర్వహిస్తుంది. కార్డియోథొరాసిక్ వైద్యుల సమన్వయంతో నిర్వహించే శిబిరాన్ని ఈ నెల 14 నుంచి 20 వరకు నిమ్స్లో నిర్వహించనున్నట్టు నిమ్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ నగరి బీరప్ప (Bheerappa Nagari) తెలిపారు. కొన్ని క్లిష్టమైన సర్జరీలను సైతం యూకే డాక్టర్ల చేత నిర్వహిస్తున్నామన్నారు. ఇందులో భాగంగా చిన్నారులకు ఉచితంగా 2డి ఎకోకార్డియోగ్రామ్ స్క్రీనింగ్లు చేస్తున్నట్లు తెలిపారు.నిమ్స్ పీడియాట్రిక్ విభాగంలో నెలకు 25 సర్జరీలు పీడియాట్రిక్ కార్డియాలజీ ఐసీయూ (Paediatric Cardiac ICU) ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు వెయ్యికి పైగా గుండె ఆపరేషన్లు చేశామని డైరెక్టర్ బీరప్ప తెలిపారు. రెండేళ్ల నుంచి నెలకు 20 నుంచి 25 సర్జరీలు చేయగా ప్రస్తుతం నెలకు 35 సర్జరీలు చేస్తున్నామన్నారు. శిశువు పుట్టిన వెంటనే చేసే సర్జరీల నుంచి, ఏడాదికి, రెండేళ్లు, ఐదేళ్లకు ఇలా పరిమిత సమయంలోపే చేసే సర్జరీలు కూడా ఉంటాయన్నారు. ఆ సమయంలోగా చేయకపోతే ఆ సమస్యలు ముదిరి తీవ్ర అనారోగ్యానికి దారితీస్తాయన్నారు. నిమ్స్కు వచ్చే కేసులు ఎక్కువగా క్రిటికల్లో ఉన్నవే వస్తుంటాయన్నారు. ఆరోగ్యశ్రీ ద్వారా గుండె మార్పిడి చికిత్సల నుంచి రోబోటిక్ చికిత్సలను చేస్తున్నామన్నారు.రిజిస్ట్రేషన్ ఇలా చేసుకోండి.. నిమ్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ నగరి బీరప్ప గుండె సంబంధిత సమస్యలున్న చిన్నారుల తల్లిదండ్రులు 040– 23489025లో సంప్రదింవచ్చని డైరెక్టర్ బీరప్ప తెలిపారు. నిమ్స్ పాత భవనంలోని సీటీవీఎస్ కార్యాలయంలో కార్డియోథోరాసిక్ సర్జన్ డాక్టర్ అరమేశ్వరరావు, డాక్టర్ ప్రవీణ్ డాక్టర్ గోపాల్లను మంగళ, గురు, శుక్రవారాల్లో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు సంప్రదించాలని, పూర్వపు రిపోర్టులు తమ వెంట తీసుకురావాలని సూచించారు. చదవండి: ఆరాటం ముందు ఆటంకం ఎంత!రికార్డు అందుబాటులో లేకుంటే.. ఆస్పత్రిలోనే అవసరమైన స్కీన్రింగ్ నిర్వహిస్తామన్నారు. వారం రోజుల పాటు జరిగే ఈ శిబిరంలో 25 మంది చిన్నారులకు మాత్రమే శస్త్ర చికిత్సలు చేసినా.. ఆ తర్వాత కూడా దశల వారీగా నిమ్స్ వైద్యులు ఆపరేషన్లు కొనసాగిస్తారని చెప్పారు. ఈ క్రమంలో ఈ ఏడాది దాదాపు 350 మంది చిన్నారులకు గుండె ఆపరేషన్లు చేశామన్నారు. ఈ చికిత్సలకు అయ్యే ఖర్చును ఆరోగ్యశ్రీ, సీఎం సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) ద్వారా రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందన్నారు. -
పిల్లలకు జ్వరం రాగనే పారాసెటమాల్ ఇచ్చేస్తున్నారా..?
ఈ వర్షాకాలం అనంగానే వ్యాధుల భయం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా చిన్నారులకు జలుబు, జ్వరం వంటి అనారోగ్యాలు తక్షణమే అటాక్ అవుతాయి. ఓ పట్టాన తగ్గవు. దాంతో సాధారణంగా తల్లిదండ్రులు సమీపంలో ఉన్న మెడికల్ షాఫుకో లేక ఇంట్లోనే ఎప్పటిదో పారాసెటమాల్ సిరప్ ఉంటే వెంటనే వేసేస్తాం. తగ్గిపోతే సరే లేదంటే ఇక తప్పని పరిస్థితుల్లో డాక్టర్ వద్దకు వెళ్తుంటారు. చాలామటుకు తల్లిదండ్రులు ఇలానే చేస్తారు. కానీ ఇలా పారాసెటమాల్ ఉపయోగించేటప్పుడూ ఈ విషయాలు తప్పక తెలుసుకోవాలంటున్నారు వైద్య నిపుణులు.ప్రీడియాట్రిక్ నిపుణులు పిలల్లకు జ్వరం రాగానే పారాసెటమాల్ వేయడం వరకు కరెక్టే అయినా..అది వైద్యుల సిఫార్సు మేరకు వేయడమే ఉత్తమం అని చెబుతున్నారు. ఎందుకంటే..డాక్టర్లు కూడా పారాసెటమాలే సూచిస్తారు. కానీ ఎంత మోతాదు ఉపయోగించాలనేది బాటిల్పై ఉండే ఇన్ఫర్మేషన్ని అనుసరించి ఉంటుందని నొక్కి చెబుతున్నారు. నెలల పిల్లలకు సాధారణంగా చుక్కల మోతాదుని సూచించడం జరుగుతుంది. దాన్ని ఒక నిడిల్ సాయంతో డ్రాప్స్ మాదిరిగా ఇస్తాం అందులో గాఢత పరిమాణం ఎక్కువ. అలా కాకుండా 2 నుంచి 5 ఎంఎల్ మాదిరిగా అయితే మాత్రం కాస్త గాఢత తక్కువ ఉంటుంది. అది గమనించి ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే వయసుల వారిగా చిన్నారులకు ఇవ్వాల్సిన మోతాదులో వ్యత్సాసం కూడా చాలా వేరుగా ఉంటుందని చెబుతున్నారు వైద్యులు. అలాగే ఇంట్లో ఒకసారి సీల్ తీసిన పారాసెటమాల్ సీసాలను మరొసారి వినియోగించేటప్పుడూ ఈ అంశాలను దృష్టిలో ఉంచుకోవాలని చెబుతున్నారు. ఎందుకంటే..పారాసెటమాల్ని ఒక్కసారి వినియోగించిన బాటిల్ని మహా అయితే ఆ తర్వాత నెల వరకు వినియోగించ్చొచ్చట. అదే నెలల తరబడి వాడితే ఆ మందులోని గాఢత తగ్గిపోతుందట. అదీ సరిగా పనిచేయకపోవచ్చు లేదా ఒక్కోసారి దుష్ప్రభావాలు చూపించే ప్రమాదం లేకపోలేదని హెచ్చరిస్తున్నారు. సాధ్యమైనంత వరకు తల్లిందండ్రులు పిల్లలకు జ్వరం అనంగానే పారాసెటమాల్ ఇవ్వొద్దనే అంటున్నారు. చిన్నారి పరిస్థితి అనుసరించి ముందుగా వైద్యులను సంప్రదించి, వాళ్ల సూచనల మేరకు వాడితేనే శ్రేయస్కరమని అంటున్నారు. కాబట్టి తల్లిదండ్రలూ..జ్వరం అనగానే పారాసెటమాల్ కాదు..ఎంత వరకు ఉపయోగించాలి, అవసరమా కాదా అన్నది బేరీజు వేసుకుని ఉపయోగించండి మరి..!.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: అందువల్లే భారత్కి తిరిగి రావాలనుకుంటున్నా..? రూ. 1.2 కోట్లు శాలరీ చాలా..) -
మైండ్ఫుల్నెస్గా తినడం, ఒక యోగా భంగిమ అద్భుతం చేశాయ్..!
అధికి బరువు సమస్యకు చెక్పెట్టేందుకు ఒక్కొక్కరు ఒక్కో విధానాన్ని ఎంచుకుని సత్ఫలితాలు పొంది మార్గదర్శకులుగా నిలుస్తున్నారు. భారంగా ఉండే సమస్యకు చాలామంది ఆరోగ్యకరమైన విధానానికే మద్దతిస్తుండటం విశేషం. షార్ట్కట్లు, ఔషధాలతో కాకుండా శారీరక శ్రమ, ఓపిక, క్రమశిక్షణ అనే ఆయుధాలతో బరువుని కరిగిస్తున్నారు..స్లిమ్గా మారుతున్నారు. అలాంటి కోవలోకి అక్షయ్ కక్కర్ అనే ఇన్ఫ్లుయెన్సర్ కూడా చేరిపోయాడు. పైగా గతేడాది గణేష్ చుతర్థికి ఈ ఏడాది గణేష్ చతుర్థికి తనలో భారీగా సంతరించుకున్న మార్పుని సోషల్మీడియా వేదికగా షేర్ చేయడమే గాక అంతలా బరువు తగ్గేందుకు ఉపకరించిన ట్రిక్స్ని కూడా చేసుకున్నారు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అక్షయ్ కక్కర్(Akshay Kakkar) వెయిట్లాస్(Weight loss) జర్నీ ఏవిధంగా నెటిజన్లతో షేర్ చేసుకున్నారు. అసాధారణమైన తన అధిక బరువుని తగ్గించేందుకు ఎంతలా కష్టపడింది వివరించారు. ఏకంగా 179 కిలోలు పైనే బరువు ఉండే అక్షయ్ కేవలం ఒక్క ఏడాదికే ఊహించనంతంగా బరువు తగ్గి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అంటే సుమారు 44 కిలోలు పైనే బరువు తగ్గాడు. శారీరకంగానే కాకుండా మానసికంగానూ ఆరోగ్యవంతమైన మార్పుని అందుకున్నాడు. అందుకోసం తనకు క్రమశిక్షణ, సహనం, అచంచలమైన నమ్మకమే ఉపకరించాయని చెబుతున్నాడు అక్షయ్. "అంతేగాదు తన వెయిట్ లాస్ జర్నీకి గతేడాది వినాయక చవితికి..ఈ ఏడాది పండుగకి ఎంతో వ్యత్సాసం ఉంది. ఈ మార్పు నా జీవితంలో అదిపెద్ద బహుమతి. దీని వెనుక ఎంతో శ్రమ, చిందించిన చెమట, పోరాటం ఉన్నాయి. ఈ మార్పుకి ఎంతో సంతోషంగా ఉంది. గణపతి బప్పా నిజంగా అందరికి మంచి చేస్తాడు." అనే క్యాప్షన్ జోడించి మరి తన వెయిట్ లాస్ జర్నీ గురించి వివరించాడు. View this post on Instagram A post shared by Akshay Kakkar (@shezaadakakkar) ఎలాంటి డైట్, వ్యాయామాలు చేశాడంటే..తాను ఎలాంటి షార్ట్ కర్ట్లు అనుకరించలేదని అన్నారు. మైండ్ఫుల్నెస్గా తినడం, సముతుల్యంగా తినేలా జాగ్రత్త తీసుకోవడం, వంటి వాటి తోపాటు రుచికరమైన ఆహారాన్ని వదులుకోలేదని చెబుతున్నాడు. తన ప్లేట్లో సలాడ్, ప్రోటీన్ ప్యాక్, కూరగాయలు, పిండి పదార్థాల కోసం పప్పు, రోటీ, కరకరలాడే పాపడ్ వంటి ఉన్నాయని చెప్పారు. బరువు తగ్గడం నచ్చిన ఆహారం వదిలిపెట్టడం కాదు సరిగ్గా తినడం, సమతుల్యతకు ప్రాధాన్యత ఇవ్వడం అని చెబుతున్నాడు. దాంతోపాటు కార్డియో వ్యాయామాలు..ముచ్చెమటలు పట్టేలా చేసి త్వరితగతిన బరువు తగ్గేందుకు ఉపయోగపడ్డాయని చెప్పారు. అలాగే యోగా కూడా బరువు తగ్గడంలో సమర్థవంతంగా పనిచేస్తుందని అంటున్నాడు. ఇది మానసికంగా బరువు తగ్గేలా బలోపేతం చేస్తుందని చెబుతున్నాడు. కేలరీలు తగ్గేందుకు కార్డియో అద్భుతమైన మ్యాజిక్ చేస్తుందని చెబుతున్నాడు. View this post on Instagram A post shared by Akshay Kakkar (@shezaadakakkar) వర్కౌట్లను మన శరీరాన్ని మంచిగా మార్చే వైద్య ప్రక్రియగా భావిస్తే..భారంగా అనిపించిందని అంటున్నాడు. అలా తను ఒక్క ఏడాదిలోనే 179 కిలోలు నుంచి 139 కిలోలకు వచ్చినట్లు తెలిపాడు. ఇక్కడ కేవలం బరువు తగ్గేందుకు ధైర్యంగా ముందడుగు వేయడం, మైండ్ఫుల్నెస్గా తినడం, ఓపిక, ఒక యోగా భంగిమ..అద్భుతమే చేస్తాయని నమ్మకంగా చెబుతున్నాడు అక్షయ్ కక్కర్.(చదవండి: ఆహారంలో వాపుని ఆపుదాం..! ఫుడ్ ఫర్ ఇన్ఫ్లమేషన్..) -
ఆహారంలో వాపుని ఆపుదాం..! ఫుడ్ ఫర్ ఇన్ఫ్లమేషన్..
ఎవరికైనా శరీరంలోని ఏ భాగంలోనైనా దెబ్బతగిలినప్పుడు అక్కడ ఎర్రగా మారి, వాపు వచ్చి మంట వస్తుంది. ఇలా జరగడాన్నే ఇంగ్లిష్లో ఇన్ఫ్లమేషన్ అంటారు. ఇది చర్మం పై వచ్చినప్పుడు స్పష్టంగా కనిపిస్తుంది. అయితే కొన్నిసార్లు దేహభాగాల్లో లోపలి దెబ్బలకూ, గాయాలకు ఇన్ఫ్లమేషన్ రావచ్చు. ఇలా కేవలం దెబ్బలు తగిలినప్పుడు మాత్రమే కాకుండా... సాధారణంగా ఏదైనా ఇన్ఫెక్షన్ దేహంలోని ఆ భాగంలోనైనా వస్తే అక్కడ కూడా ఇన్ఫ్లమేషన్ రావచ్చు. ఆర్థరైటిస్ వంటి సమస్యలు వచ్చినప్పుడు కీళ్ల వద్ద, కీళ్ల మధ్య కూడా ఇన్ఫ్లమేషన్ రావడం జరగవచ్చు. దెబ్బలూ, గాయాలూ, ఇన్ఫెక్షన్లు, ఆర్థరైటిస్ వంటి కేసుల్లో గాయాలూ, కీళ్లలోనే కాకుండా అనేక సందర్భాల్లో అనేక అవయవాల్లోనూ ఇన్ఫ్లమేషన్లు రావచ్చు. ఉదాహరణకు... గుండెకు సంబంధించిన కార్డియోవాస్క్యులార్ జబ్బుల్లోనూ ఇన్ఫ్లమేషన్ కనిపించవచ్చు. ఈ ఇన్ఫ్లమేషన్ను తగ్గించి, గాయాలూ, ఇన్ఫెక్షన్లను నయం చేయడానికి మందుల్ని వాడినప్పటికీ... కొన్ని రకాల ఆహారాలు సైతం ఇన్ఫ్లమేషన్ను వేగంగా తగ్గించేందుకు ఉపయోగపడతాయి. ఆ ఆహారాలేమిటో చూద్దాం...సాధారణంగా ఇన్ఫ్లమేషన్ వచ్చినప్పుడు అది వేగంగా తగ్గడానికి, గాయంగానీ లేదా ఇన్ఫెక్షన్గానీ నయం కావడానికి కొన్ని మందులు ఇస్తారు. వీటినే ‘యాంటీ ఇన్ఫ్లమేటరీ’ మందులుగా చెబుతారు. అయితే యాంటీఇన్ఫ్లమేటరీ మందులు, ఎన్ఎస్ఏఐడీ (నాన్ స్టెరాయిడ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్) వంటి ఔషధాలతోపాటు... దేహంలో ఇన్ఫెక్షన్, ఇన్ఫ్లమేషన్తో ప్రభావితమైన చోట అది తగ్గడానికీ, అలాగే అక్కడ వచ్చే నొప్పి తగ్గడానికి ఇచ్చే నొప్పి నివారణ (పెయిన్ కిల్లర్స్) మందులు... వీటన్నింటి కారణంగా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు. ఉదాహరణకు సుదీర్ఘకాలం పెయిన్ కిల్లర్స్ వాడటం వల్ల కిడ్నీలు దెబ్బతినడం జరగవచ్చు. అలాగే ఇన్ఫ్లమేషన్ తగ్గించే మందులను సైతం సుదీర్ఘకాలం పాటు వాడటమూ అంత మంచిది కాదు. అలా ఆ మందుల్ని దీర్ఘకాలం పాటు వాడటం వల్ల దేహంలో వ్యాధి నిరోధకశక్తి తగ్గడం, దేహం ఆ మందుల పట్ల నిరోధకత (రెసిస్టెన్స్) పెంచుకోవడం లాంటి పరిణామాలు జరగవచ్చు.చేపలు : చేపల్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు సమృద్ధిగా ఉంటాయి. మరీముఖ్యంగా సాల్మన్ చేపల్లోని ఒమెగా 3–ఫ్యాటీ యాసిడ్స్ స్వాభావికమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ స్వభావాన్ని కలిగి ఉండి, మంచి ప్రయోజనాన్ని ఇస్తుంది. కెల్ప్ : ఇది ఆల్గే ప్రజాతికి చెందిన ఒక రకం ఆహారం. ప్రస్తుతం మన దగ్గర (మనదేశంలో) అంత విస్తృతంగా దొరకదు. అయితే యాంటీ ఇన్ఫ్లమేటరీ ఆహారాల్లో ఇది చేపల తర్వాత అంత సమర్థమైనది. పైగా ఇది కేవలం యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలను కలిగి ఉండటం మాత్రమే కాకుండా... కాలేయ క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్ను తగ్గించే నేచురల్ యాంటీ ట్యూమర్, యాంటీ ఆక్సిడేటివ్ గుణాలున్న ఆహారం కావడంతో దీన్ని వాడటం వల్ల మంచి ప్రయోజనాలు కలుగుతాయి. ఆలివ్ ఆయిల్ : మధ్యధరా (మెడిటెరేనియన్ సీ) ప్రాంతపు వాసులు చాలా ఆరోగ్యంగా సుదీర్ఘకాలం జీవించడానికి వాళ్ల వంటకాల్లో ఆలివ్ ఆయిల్ను విస్తృతంగా వాడటం అని మనలో చాలామందికి తెలిసిన విషయమే. ఇక వాళ్ల సంస్కృతిలో తాజా పండ్లతోపాటు ఆలివ్ నూనెను వారి సంప్రదాయ వంటకాల్లో వాడటం వల్ల ఆ ప్రాంత వాసులు మరింత ఆరోగ్యంగా జీవిస్తున్నారని అనేక అధ్యయనాల్లో వెల్లడైంది. ఇందుకు కారణమేమిటంటే... ఈ ఆలివ్ నూనెలో కొవ్వులు ఎంత మోతాదులో ఉండాలో అంతే మోతాదులో ఉంటాయి. దాంతో పాటు ఆలివ్ ఆయిల్లో కేవలం ఇన్ఫ్లమేషన్ను తగ్గించే గుణం మాత్రమే కాకుండా... ఆస్థమానూ, ఆర్థరైటిస్నూ తగ్గించే గుణమూ ఉంది. గుండెకూ, రక్తనాళాలకూ మేలు చేసే స్వభావం కూడా ఈ ఆలివ్ ఆయిల్లో ఉండటం విశేషం. క్రూసిఫెరస్ వెజిటబుల్స్ : కాలీఫ్లవర్, క్యాబేజీ, బ్రాకలీలను క్రూసిఫెరల్ వెజిటబుల్స్గా పేర్కొంటారు. మొదట్లో మన దగ్గర కేవలం కాలీఫ్లవర్, క్యాబేజీ మాత్రమే లభ్యమవుతూ ఉండగా... ఇటీవల బ్రాకలీ లభ్యత కూడా బాగా పెరిగింది. ఈ క్రూసిఫెరస్ వెజిటిబుల్స్లో యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉండటంతో పాటు... మన శరీరంలోని విషాలను (టాక్సిన్స్ను) స్వాభావికంగానే హరించే శక్తి ఉంది. ఇలా శరీరం నుంచి స్వాభావికంగా విషాలను తొలగించే శక్తి కారణంగానే ఇవి ప్రభావవంతమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ ఆహారంగా గణుతికెక్కాయి. బ్లూ బెర్రీస్ : ఇవి ఇన్ఫ్లమేషన్ను స్వాభావికంగానే పూర్తిగా ప్రభావవంతంతో తగ్గించడమే కాదు... వయసు పెరుగుతున్న కొద్దీ మెదడుతోపాటు దేహంలోని అన్ని అవయవాల్లో కలిగే నష్టాలూ / అనర్థాలను తగ్గించే గుణాలూ ఉన్నాయి. వయసు పెరిగాక వచ్చే మతిమరపు (డిమెన్షియా)ను ఇవి సమర్థంగా అరికడతాయి. ఇక బ్లూబెర్రీస్లో యాంటీ క్యాన్సర్ గుణాలూ ఎక్కువే. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే... ఎరువులు వాడి పండించిన బ్లూ బెర్రీస్తో ΄ోలిస్తే... స్వాభావికంగా పండించిన బ్లూ బెర్రీస్ మంచివి. పసుపు : పసుపుకు ఔషధ గుణాలు (మెడిసినల్ ప్రోపర్టీస్) ఉన్నాయన్న విషయం మనకు చాలా కాలం కిందటి నుంచే తెలుసు. పసుపులో ఉండే కర్క్యుమిన్ అనే పోషకం / పదార్థం యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాన్ని కలిగి ఉంటుంది. అందువల్లనే ఆహారంలో పసుపు వాడినప్పుడు అది యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రయోజనాలతోపాటు సమర్థమైన నొప్పి నివారణిగా కూడా పనిచేస్తుంది. మనం మెడికల్ షాపుకు వెళ్లి ఆన్ కౌంటర్ మెడిసిన్గా కొనుగోలు చేసే కొన్ని మందులు కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ చూపవచ్చు. కానీ పసుపు వేసి వండిన ఆహారాలు ఎలాంటి దుష్ప్రభావాలూ చూపకుండానే మంచి ప్రయోజనాన్ని ఇస్తూ మెడిసిన్ ఇచ్చే ప్రభావాన్ని చూపుతాయి. అల్లం : అల్లానికి కూడా ఔషధ గుణాలూ, వైద్య ప్రయోజనాలు చాలానే ఉన్నాయి. వాటిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణం కూడా ఒకటి. ఒక్క యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణం మాత్రమే కాకుండా అల్లానికి... రక్తంలో చక్కెర మోతాదులను తగ్గించే గుణం కూడా ఉంది. వెల్లుల్లి : వెల్లుల్లిలో ఎన్నో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నట్టు ఇప్పటికే అనేక పరిశోధనల్లో వెల్లడైంది. అంతేకాదు... ఇందులోని యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలూ, దీనితో కలిగే ప్రయోజనాలపై ఇంకా పరిశోధన జరుగుతూనే ఉన్నాయి. ఇది సమర్థమైన నొప్పి నివారిణి మాత్రమే కాదు... ఇది చాలా రకాల క్యాన్సర్లనూ నివారిస్తుంది. అంతేకాదు... శరీరంలో ఇన్ఫెక్షన్లతోనూ ΄ోరాడుతుంది. రక్తంలోని చక్కెరనూ సమర్థంగా నియంత్రిస్తుంది. చిలగడదుంప : తెలుగు రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో మోరంగడ్డ, గెణుసుగడ్డ అని పిలిచే ఈ దుంపలో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్, పీచుపదార్థాలు, బీటా కెరోటిన్, మాంగనీసు, విటమిన్ బి6, విటమిన్– సి వంటి అనేక కీలకమైన పోషకాలు ఉంటాయి. వీటి కారణంగా చిలగడదుంపకు ఇన్ఫ్లమేషన్ను త్వరగా మానేలా చేసే గుణం ఉంది. గ్రీన్ టీ : గ్రీన్ టీలోని ఫ్లేవనాయిడ్స్ అనే పోషకాలు గ్రీన్–టీ కి యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలను ఇస్తాయి. చాలా రకాల క్యాన్సర్లకు గ్రీన్–టీ మంచి విరుగుడుగా పనిచేస్తుంది. ఇవన్నీ ఇన్ఫ్లమేషన్ను తగ్గించేందుకు ఉపయోగపడే ఆహారాలు కాగా... కొన్ని రకాల ఆహారాలు ఇన్ఫ్లమేషన్ పెంచుతాయి కూడా.ఇన్ఫ్లమేషన్ తగ్గించే పని ఆహారమే చేస్తే...ఒకవేళ మందుల్ని కేవలం పరిమితంగానే తీసుకుంటూ ఇన్ఫ్లమేషన్ను తగ్గించే కొన్ని రకాల ఆహారాలను తీసుకోవడం వల్ల సదరు ఆహారాలలోని పోషకాల వల్ల ఇన్ఫ్లమేషన్ తగ్గించడం సాధ్యమవుతుందా అన్న ప్రశ్నకు అది సాధ్యపడుతుందనే అంటున్నారు డాక్టర్లు, ఆహార నిపుణులు. ఈ నేపథ్యంలో ఇన్ఫ్లమేషన్ తగ్గించే ఆహారాల గురించి తెలుసుకుందాం.ఇన్ఫ్లమేషన్ తగ్గించే ఆహారాలతో ప్రయోజనాలివి...ఒకవేళ ఇన్ఫ్లమేషన్ను తగ్గించడానికి ఆహారాల మీదే ఆధారపడటం వల్ల నొప్పి నివారణ మందుల తాలూకు దుష్ప్రభావాన్ని తగ్గించడమే కాదు... వాటి వల్ల కోల్పోయే రోగనిరోధక శక్తినీ పెంపొందించుకోవచ్చు. అనవసరంగా వాడే మందుల మోతాదులు తగ్గించడంతోపాటు... వ్యాధినిరోధక వ్యవస్థను పరిపుష్టం చేసేలా దేహానికి అవసరమైన స్వాభావికమైన పోషకాలనే తీసుకోవడంతో శరీరానికి అవసరమైన విటమిన్లు, లవణాలు సమకూరతాయి. దాంతో నేచురల్ పదార్థాల వల్ల స్వాభావికంగానే ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది. రిఫైన్డ్ ధాన్యాలు : ధాన్యంపై ఉండే పొట్టును తొలగించి తీసుకునే ఆహారాలు ఇన్ఫ్లమేషన్ను పెంచుతాయి. కొన్ని రకాల ఆహారంపై పెంచే జంతువుల మాంసం: ఆహారంగా ఉపయోగపడే జంతువులను పెంచే క్రమంలో కొన్నిచోట్ల వాటికి సోయా, కార్న్ వంటివి తినిపిస్తుంటారు. ఇలా సోయా, కార్న్ వంటివి తింటూ పెరిగిన ఆ జంతువుల మాంసం తిన్నప్పుడు దేహంలోని ఇన్ఫ్లమేషన్ ఒక పట్టాన తగ్గదు. అలాగే... ఇంకొన్ని జంతువులు త్వరగా లావెక్కి, వేగంగా కొవ్వు పట్టడానికి హార్మోన్, యాంటీబయాటిక్ ఇంజెక్షన్లు చేస్తారు. ఇలాంటి జంతువుల మాంసం కూడా ఇన్ఫ్లమేషన్ను పెంచుతుంది. రెడ్మీట్, ప్రాసెస్డ్ మీట్ : కొవ్వు ఎక్కువగా ఉండే గొడ్డు మాంసంలో ఎన్ఈయూ5జీసీ అనే పదార్థం ఉంటుంది. ఇది శరీరంలోకి చేరగానే ఇన్ఫ్లమేటరీ గుణానికి పెం΄÷ందిస్తుంది. అందుకే ఏదైనా ఇన్ఫ్లమేషన్ ఉన్నవారు రెడ్మీట్ను తీసుకోవాల్సి వస్తే దాన్ని చాలా పరిమిత మోతాదుల్లో మాత్రమే తినాలి. ఒకవేళ రెడ్మీట్కు బదులు కోడిమాంసం, చేపలు తీసుకోవడం వల్ల ఇన్ఫ్లమేషన్ను పెంచుకోకుండా... తగ్గించుకునే అవకాశాలూ పెరుగుతాయి. చక్కెరలు : చక్కెరతోపాటు చక్కెరను వాడి తయారు చేసే అన్నిరకాల తీపి పదార్థాలూ ఇన్ఫ్లమేషన్ను పెంచుతాయి.వంటనూనెలు : ఒక్క ఆలివ్ నూనె మినహాయించి... కుసుమ, సోయా, పొద్దుతిరుగుడు, కార్న్ నూనెలతోపాటు, పత్తినూనె సహా అన్ని రకాల వంట నూనెలూ ఇన్ఫ్లమేషన్ను పెంచుతాయి. ట్రాన్స్ఫ్యాట్స్ (కొవ్వులు): స్వాభావికంగా పాల నుంచి వచ్చిన నెయ్యి కాకుండా... కృత్రిమంగా తయారు చేసే నెయ్యి లాంటి డాల్డా వంటి వాటిని ట్రాన్స్ఫ్యాట్స్గా పేర్కొంటారు. ఇక కొన్ని ఆహారాల్లో నూనెలు, నెయ్యి వంటివి వాడితే త్వరగా పాడవుతాయనీ, అలా పాడు కాకుండా ఉంచేందుకు దీర్ఘకాలం నిల్వ ఉంచేందుకూ (షెల్ఫ్ లైఫ్ పెంచేందుకు) మార్జరిన్ వంటి నూనెలు వాడతారు. ఈ ట్రాన్స్ఫ్యాట్స్ అన్నీ దేహంలొ చెడు కొవ్వులనూ, చెడు కొలెస్ట్రాల్ను పెంచుతాయి. దాంతో అన్ని రకాల కొవ్వులూ, వేపుళ్లు, ఫాస్ట్ఫుడ్స్, బేకరీ ఐటమ్స్ మాత్రమే కాకుండా మార్జరిన్ వంటి నూనెను ఉపయోగించిన అన్ని ఆహారాలూ దేహంలో ఇన్ఫ్లమేషన్ను పెంచేందుకు కారణమవుతాయి. పాలలో అలర్జీని తెచ్చిపెట్టే కారకాలు / పోషకాలు : పాలలోని అలర్జీ కలిగించే పదార్థాలు దేహంలో ఇన్ఫ్లమేషన్ను పెంచతారు. ఉదాహరణకు పాలు సరిపడని కొందరిలో వాటిని తాగినప్పుడు వాళ్ల ఒంటిపై ర్యాష్ వస్తుంది. దేహంలో ఇన్ఫ్లమేషన్ రావడం వల్లనే ఇలా జరుగుతుంది. (అయితే పాల అలర్జీ కారణంగా అవి సరిపడనివారికి మినహా మిగతా వారందరికీ పాలు మంచి ఆహారం). ఆహారానికి కలిపే కృత్రిమ పదార్థాలు : కొన్ని రకాల ఆహారాలకు ఆస్పార్టమ్, ఎమ్ఎస్జీ అనే అడెటివ్స్ కలుపుతారు. ఇవి కలిపిన ఆహారం ఇన్ఫ్లమేషన్ను పెంచుతుంది. మనకు సరిపడని అన్ని రకాల ఆహారాలు : కొందరిలో కొన్ని రకాల ఆహారాలు అలర్జీని కలిగిస్తాయి. ఇలా సరిపడని ఆహారాల వల్ల కూడా ఇన్ఫ్లమేషన్ పెరుగుతుంది. ఆల్కహాల్ : ఆల్కహాల్ దేహంలోని చాలా భాగాల్లో ఉండే ఇన్ఫ్లమేషన్ను మరింత పెరిగేలా చేస్తుంది. దేహంలో ఇన్ఫ్లమేషన్ ఉండి, క్రమం తప్పకుండా ఆల్కహాల్ తీసుకుంటుంటే ఆ ఇన్ఫ్లమేషన్నే కాలక్రమంలో కేన్సర్గా మారే ప్రమాదమూ ఉంటుంది. అందుకే ఇన్ఫ్లమేషన్ ఉన్నవారు ఆల్కహాల్కు దూరంగా ఉండాలి. ఆ మాటకొస్తే ఇన్ఫ్లమేషన్ లేనప్పుడూ ఆల్కహాల్ ముట్టుకోకపోవడమే మంచిది. డాక్టర్ రాజీబ్ పాల్, సీనియర్ కన్సల్టెంట్, ఇంటర్నల్ మెడిసిన్నిర్వహణ: యాసిన్(చదవండి: బాధించిన శారీరక ఎత్తునే చిత్తుచేసి.. ఐఏఎస్ స్థాయికి..) -
తూకం కాదు... సమతూకం ఉండాలి
పోషకాహారం అంటే అత్యంత ఖరీదైన ఆహారం అని కాదు. అలాగని కేవలం ఆకలి తీర్చుకోవడానికి తీసుకునే ఆహారమూ కాదు. రుచితో పాటు పోషక విలువలు ఉండాలి. అంతకు ముందు మన శరీరానికి ఎలాంటి ఆహారం కావాలో అర్థం చేసుకోవడం ముఖ్యం. శరీరానికి అవసరమైన అన్ని పోషకాలను సరైన ప్రమాణంలో అందిస్తే అవి ఆరోగ్యంగా పనిచేయడానికి సహాయపడతాయి. అందుకే సమతుల ఆహారంపై దృష్టి పెట్టమని నిపుణులు చెబుతుంటారు. మనం తీసుకునే ఆహారం రోజంతా పనిచేయడానికి అవసరమైన శక్తిని అందిస్తుంది. శరీర ఎదుగుదలకు ముఖ్యంగా పిల్లలు, యుక్తవయసులో ఉన్నవారికి సరైన పోషకాలు ఎముకలు, కండరాలు, ఇతర కణజాలాల పెరుగుదలకు సహాయపడతాయి. మన రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. వివిధ రకాల వ్యాధుల నుండి రక్షిస్తుంది. మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. కొన్ని పోషకాలు మన మెదడు పనితీరును, మానసిక స్థితిని మెరుగు పరచటంలో ముఖ్యపాత్రను పోషిస్తాయి. దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదం తోపాటు గుండె జబ్బులు, మధుమేహం, కొన్ని రకాల క్యాన్సర్లను తగ్గిస్తాయి.కార్బోహైడ్రేట్లు మన శరీరానికి తప్పక కావాల్సిందే. అవి తృణధాన్యాలు, కూరగాయలలో లభిస్తాయి. శక్తికి, హార్మోన్ల ఉత్పత్తికి ఐరన్ తప్పక అవసరం. ఆరోగ్యకరమైన కొవ్వులు మేలు చేస్తాయి.ప్రోటీన్లు కండరాలకు, హార్మోన్ల ఉత్పత్తికి అవసరం. మాంసం, గుడ్లు, పాల ఉత్పత్తులు, పప్పుధాన్యాలలో లభిస్తాయి. విటమిన్లు శరీరంలోని రసాయన చర్యలకు సహాయపడతాయి. వివిధ రకాల పండ్లు, కూరగాయలలో లభిస్తాయి. మినరల్స్ ద్వారా ఎముకల నిర్మాణం జరుగుతుంది. అదేవిధంగా నరాల పనితీరుకు క్యాల్షియం, ఐరన్, పొటాషియం వంటి ఖనిజాలు ముఖ్యమైనవి. రక్తంలో ఐరన్ శాతం తగ్గితే బలహీనంగా అవుతారు. త్వరగా నీరసం వస్తుంది. తలనొప్పి, జుట్టు రాలడం వంటి సమస్యలు తలెత్తుతాయి. బచ్చలి, పాలకూర, గోంగూర వంటి ఆకుపచ్చ కూరలు, బీట్రూట్, చిక్కుళ్ళు, శెనగ, మటన్, పెసలు, నట్స్, ఎండు ఖర్జూరాలు, ఎండుద్రాక్ష, తృణధాన్యాలు, గుడ్డు.. వంటివి శరీరం లో ఐరన్ శాతం పెరగడానికి సహాయపడతాయి. పిల్లలకు వారి వయసు, యాక్టివిటీని బట్టి 1000 నుంచి 1400 కిలో క్యాలరీలు అవసరం అవుతాయి. పెద్ద పిల్లలైతే 1800 కిలో క్యాలరీల వరకు తీసుకోవచ్చు. ఎదిగే వయసు కాబట్టి జంక్ఫుడ్ కాకుండా రోజువారీ భోజనంలో మొలకెత్తిన గింజలు, చేపలు, గుడ్లు, తాజా ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు ఇవ్వాలి. చిన్నపిల్లలైతే రోజుకు 4 గ్లాసులు, పెద్దపిల్లలైతే 12 గ్లాసుల వరకు నీళ్లు తాగేలా చూడాలి. వాతావరణం బట్టి నీటి మోతాదులో మార్పులు ఉండవచ్చు. ప్రతి అరగంటలకు ఒకసారి నీళ్లు కొద్దిగానైనా తాగేలా సూచనలు ఇవ్వాలి. -
సంపదలోనే కాదు ఆరోగ్యంగానూ బిలియనీరే..! ఆ ఒక్క సూత్రంతో..
ప్రపంచంలో అత్యధిక ధనవంతుల్లో 5వ వ్యక్తి అయిన వారెన్ బఫెట్ 94 వయస్సులోనూ అత్యంత తెలివిగా స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెడుతూ లాభాలను ఆర్జిస్తున్నారు. సంపదను అర్జించడంతో పాటు దానిని రక్షించుకోవడం, దాని విలువను పెంచుకోవడం వంటి విషయాల్లో ఆయనకు ఆయనే సాటి. ఆయనచెప్పే ఆర్థిక సూత్రాలు ఆర్ధిక నిరక్షరాస్యులకు గొప్పపాఠాలే కాదు శ్రీమంతులుగా మార్చే గొప్ప సూత్రాలు కూడా. ఆయన సంపదర పరంగానే కాదండోయ్ ఆరోగ్యపరంగానే బిలియనీరే. ఆయనేమి ఆరోగ్యానికి సంబంధించిన వాటిల్లోపెట్టుబడులు పెట్టలేదు గానీ వెల్నెస్ పరంగా ఆయన అలవాట్లు చూస్తే విస్తుపోతారు. అలాంటి ఆహారపు అలవాట్లు ఆయన దీర్ఘాయువు రహస్యమా అని విస్తుపోతారు. వైద్యులు, పరిశోధకులు నో అంటూ..మొత్తుకుని హెచ్చిరించి మరి చెప్పే వాటినే ఆయన ఇష్టంగా తింటాడట. అందరికీ అనారోగ్యకారకమైనవి మరి ఆయనకు ఎలా ఆరోగ్యకరంగా మారాయ్ అంటే..తొంభైఐదు వసంతాలకు చేరువైన బఫెట్ 2015లో ఫార్చ్యూన్ మ్యాగజైన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆరేళ్ల పిల్లవాడిలా తింటానని ఎందుకంటే వాళ్లల్లో అత్యల్ప మరణ రేటు ఉంటుంది కాబట్టి అని చెప్పారు. ఈ డైలాగ్ నెట్టింట వైరల్గా మరి చాలామందిని ఆలోచింప చేసేలా చేసింది. అంతేగాదు ఆయన కేలరీలను లెక్కించడట. తాను అచ్చం చిన్నపిల్లవాడి మాదిరిగా తింటాను, నిద్రపోతానని అన్నారు. కోకాకోలా అంటే బఫేట్కి మహాప్రీతి. ప్రతిరోజూ ఐదు నుంచి 12 ఔన్స్ డబ్బాలు అయిపోవాల్సిందేనట. తాను రోజుకి సుమారు 2,700 కేలరీలు తింటే..దానిలో పావువంతు కోకాకోలా ఉంటుందని ఇంటర్వ్యూలో ఆయనే స్వయంగా చెప్పారు. అలాగే ఉదయం ఆరోగ్యానికి సంబంధించిన హెల్త్ డ్రింక్లు, సూపర్ ఫుడ్లు వంటివి ఏమి తీసుకోరు. ఆయన ప్రతిరోజూ మెక్డొనాల్డ్స్ మీల్స్ తింటాడు. ఫాస్ట్ఫుడ్నే అత్యంత ఇష్టంగా తింటారట. అంటే ఆయన తీసుకునే ఆహారంలో దాదాపు జంక్ ఫుడ్ అధికం. నిజానికి వెల్నెస్ ప్రియులు దూరంగా ఉండే ఫుడ్నే ఆయన అత్యంత ఇష్టంగా తినడం విశేషం. తప్పనిసరిగా ఒక ఆదివారం ఐస్క్రీం తినాల్సిందేనట. అయితే బఫెట్ ఆరోగ్యపు అలవాట్లు ఆరోగ్యకరమైనవి కాకపోయినా..ఎంతటి బిజీ లైప్లో కూడా ఆయన ఎనిమిదింటికే నిద్రించడం, తెల్లవారుజామున నాలుగు గంటలకు వెళ్లడం, ఆనందానికి ప్రాధాన్యత ఇవ్వడమే ఇన్నేళ్లు ఆరోగ్యవంతంగా ఉండేందుకు కారణమని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. అంతేగాదు బఫెట్ తరుచుగా తనకు గాఢంగా నిద్రపోవడం అంటే అత్యంత ఇష్టమని పలుమార్లు ఇంటర్వ్యూలో చెప్పాడు కూడా. అలాగే అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీ కూడా ఇలాంటి మంచి నిద్ర అలవాటు అనేది దీర్గాయువు సీక్రెట్కి సంబంధించిన వాటిల్లో ఒకటని పేర్కొంది. అంతేగాదు వయసు పెరుగుతున్న..అంతరంగంలో పసిబిడ్డలాంటి ఉత్సుకత కలిగిన మనసుని మర్చిపోవద్దని చెబుతుంటారు. అంటే మనకు ఇష్టమైన వాటిని వెంటనే ఆస్వాదించే చిన్నపిల్లల మనస్తత్వాన్ని వదులుకోవద్దని చెబుతుంటారు. ఇప్పటికీ ఆయన తన స్నేహితులతో బ్రిడ్జ్ వంటి ఆటలను ఆస్వాదిస్తారట. అది తన మెదడుకు మేధోపరమైన వ్యాయామం అని చెబుతున్నారాయన. అలాగే తన షెడ్యూల్లో ఖాళీ అనే పదానికి అస్సలు అవకాశం ఉండదట. అలా తన సమయాన్ని వృద్ధా చేయకుండా సద్వినియోగం చేసుకోగలనని అన్నారు. ఇక తనకు రోజులో కనీసం ఐదు నుంచి ఆరుగంటలు చదవడం, ఆలోచించడం వంటి వాటితో గుడుపుతాడట. ముఖ్యంగా వ్యాపారం లేదా పెట్టుబడి గురించి ఆలోచించడం వంటి వాటిపట్ల మిక్కిలి ఆనందదాయకంగా ఉంటుందట. అంటే మనం చేస్తున్న పనిని ప్రేమించడం, ఇష్టపూర్వకంగా పనిచేయంలోని ఆనందాన్ని ఆస్వాదిస్తే..భారం అనే పదకు ఆస్కారం ఉండదంటారు బఫేట్. అలాగే వారంలో మూడు రోజులు వ్యాయమాలు చేస్తానని చెప్పారు. ఇక ధూమపానం, మద్యపానం వంటి వాటి జోలికి అస్సలు పోనని చెబుతున్నారు. అంతేగాదు బఫేట్ ఎలాంటి కఠినమైన డైట్లు అనుసరించనని..నచ్చిన ఫుడ్ని సంతోషభరితంగా ఆస్వాదించడం..తన శరీరం ఇష్టపడే వాటిని మితంగా ఆస్వాదించేలా నియంత్రించుకోగల సామర్థ్యం వంటివే తన ఆరోగ్య రహస్యమని నవ్వుతూ చెబుతున్నారు బఫెట్. పోషకాహార నిపుణులు చెప్పే చెడు ఆహారపు అలవాట్లే బఫేట్వి అయినా..ఆయన మంచి నిద్రకు, శారీరక శ్రమకు మద్దతిస్తూ..చెడు అలవాట్లకు దూరంగా ఉండటమే ఆయన సుదీర్ఘకాలం ఆరోగ్యంగా ఉండేందుకు దోహదపడిందని చెబుతున్నారు పోషకాహార నిపుణులు.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం.(చదవండి: హృదయం విరిగితే అతికించలేం గానీ నయం చేయొచ్చు..!) -
హృదయం విరిగితే అతికించలేం గానీ నయం చేయొచ్చు..!
ప్రేమ విఫలం లేదా మనం ఎంతగానో ఆరాధించే వ్యక్తి దూరమవ్వడం, లేదా నమ్మకద్రోహం వంటి వాటి వల్ల హృదయం ముక్కలైపోతుంది. అది సర్వసాధారణంగా అందరికీ ఎదురయ్యే సమస్యే. అయితే కొందరు గుండెను రాయి చేసుకుని ధైర్యంగా లైఫ్ని లీడ్ చేస్తే..మరికొందరు అంత తేలిగ్గా ఆ సమస్య నుంచి బయటపడరు. పైగా గుండె బలహీనమైపోయి..తాత్కాలికి గుండె సంబంధిత అనారోగ్య సమస్యల బారిన పడతారు. దీన్ని వైద్య పరిభాషలో టాకోట్సుబో కార్డియోమయోపతి లేదా "బ్రోకెన్ హార్ట్ సిండ్రోమ్"గా వ్యవహరిస్తారు. అయితే అలా ముక్కలైన హృదయాన్ని బాగు చేసుకుని, ఆరోగ్యవంతంగా మార్చుకోవచ్చట. పరిశోధకులు జరిపిన తాజా అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. అసలేం జరిగిందంటే..ప్రపంచంలో లక్షలాది మంది ఈ టాకోట్సుబో కార్డియోమయోపతి సమస్యతో బాధపడుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. దీని కారణంగా అకస్మాత్తుగా గుండె కండరాలు బహీనపడిపోయి గుండెపోటు లక్షణాలు తలెత్తుతాయట. చెప్పాలంటే మరణ ప్రమాదానికి చేరవయ్యే ప్రమాదం ఎక్కువ అవ్వుతుందట. ఇలాంటి తాత్కాలిక గుండెపోటు ప్రమాదాల నుంచి కోలుకోవడం అంత ఈజీ కాదంటున్నారు మాడ్రిడ్ పరిశోధకులు. ఒక్కోసారి ఏళ్లకు ఏళ్ల సమయం పడుతుందని చెబుతున్నారు. ఆ నేపథ్యంలోనే ఇలాంటి గుండెపోటు సిండ్రోమ్ని నివారించే దిశగా అధ్యయనాలు చేయగా, వ్యాయామమే చక్కటి నివారణ అని తేలిందన్నారు. గుండె ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచే వ్యాయామలు, థెరపీలు ఆయా రోగులకు అందివ్వగా మెరుగైన ఫలితాలు వచ్చాయని పేర్కొన్నారు. అందుకోసం దాదాపు 76 మంది రోగులపై అధ్యయనం చేసినట్లు వెల్లడించారు. వారిలో 66 ఏళ్లు పైబడ్డ మహిళలు కూడా ఉన్నారని తెలిపారు. వారందరిని రెండు సముహాలుగా విభజించారు. ఒక సముహం సాధారణ వ్యాయామాలు, వాకింగ్ చేయగా, మరొక సముహానికి కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ ఇచ్చారు. ఈ థెరపీలో భాగంగా ఆయా వ్యక్తులకు 12 టు 1 సెషన్లో జీవితంలో ఎదురయ్యే ఒడిదుడుకులను ఎలాహ్యాండిల్ చేయాలి, అవన్నీ జీవితంలో ఏ విధంగాభాగం తదితరాలపై శిక్షణ ఇస్తారు. ఇలా మొత్తం 12 వారాలు శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. ఇక వ్యాయామాల్లో భాగంగా, స్విమ్మింగ్, సైక్లింగ్, ఏరోబిక్స్తో కూడిన వ్యాయామాలను 12 వారాలు తర్ఫీదుని మిగతా సగంమందికి ఇచ్చామని చెప్పారు. ఫలితంగా వారందరీ గుండె పనితీరు మెరుగ్గా ఉండటమే గాక గుండె సంబంధిత ప్రమాదాలు తగ్గినట్లు గుర్తించామని అన్నారు. అంతేగాదు వారందరిలోనూ ఆక్సిజన్ వినియోగించే సామర్థ్యాన్ని మెరుగుపరచారని చెప్పారు. ఇలాంటి తాత్కాలిక గుండె సంబంధిత సమస్యలను కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ లేదా వ్యాయామాలతో నయం చేయగలవని అన్నారు. లక్షల్లో డబ్బులు ఖర్చు పెట్టకుండా కొద్దిపాటి జీవన శైలి మార్పులు, శారీరక శ్రమతో కామన్ మ్యాన్ కూడా ఇలాంటి అనారోగ్య సమస్యల నుంచి సులభంగా బయటపడగలరని అన్నారు. ఈ పరిశోధన మరిన్ని వ్యాధులకు సంబంధించిన అధ్యయనంలో మార్గదర్శకంగా ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు కార్డియాలజీ పరిశోధకులు.(చదవండి: తమిళ పాకానికి అమెరికా వణక్కం!) -
ఇది నాకూ బిడ్డకూ ప్రమాదమా?
నేను ఐదు నెలల గర్భవతిని. డాక్టర్ చెప్పడంతో ఓజీటీటీ పరీక్ష చేయించుకున్నాను. దీంతో రక్తంలో చక్కెర స్థాయి ఎక్కువగా ఉన్నట్లు తెలిసింది. ఇది నాకు, నా బిడ్డకు ప్రమాదమా? ఇందుకోసం ప్రత్యేక ఆహార నియమాలు పాటించాల్సి వస్తుందా?– శైలజ, గుంటూరుగర్భధారణ సమయంలో చాలామంది మహిళల్లో మధుమేహం వచ్చే అవకాశం ఉంటుంది. దీనిని గర్భస్థ మధుమేహం (జెస్టేషనల్ డయాబెటిస్) అంటారు. ఇది గర్భధారణ సమయంలో విడుదలయ్యే హార్మోన్ల ప్రభావంతో శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గిపోవడం వలన వస్తుంది. ఎక్కువగా ఇది ఇరవై నాలుగు నుంచి ఇరవై ఎనిమిది వారాల మధ్య కనిపిస్తుంది. అందుకే ఆ సమయంలో ఓజీటీటీ పరీక్షను చేయాలని ప్రతి గర్భిణీకి సూచిస్తారు. ఇప్పుడు మీలో గర్భస్థ మధుమేహం నిర్ధారణ కావడంతో, కొంచెం ఆందోళన కలగడం సహజమే! దీనిని సరైన సమయంలో గుర్తించడం, నియంత్రణలో ఉంచడం చాలా ముఖ్యం. గర్భస్థ మధుమేహం నియంత్రణలో లేకపోతే తల్లికి ప్రసవ సమయంలో ఇబ్బందులు, ఇన్ఫెక్షన్లు లేదా రక్తస్రావం ఎక్కువయ్యే ప్రమాదం ఉంటుంది. అలాగే శిశువు గర్భంలోనే బరువు ఎక్కువ కావచ్చు, ఉమ్మనీరు పెరిగే అవకాశం ఉంటుంది. పుట్టిన తర్వాత కొన్నిసార్లు బిడ్డకు రక్తంలో తక్కువ చక్కెర స్థాయి లేదా స్వల్ప శ్వాస ఇబ్బందులు రావచ్చు. అయితే ఇవన్నీ సాధారణంగా సులభంగా చికిత్స చేయగలిగినవే. గర్భస్థ మధుమేహం నిర్ధారణ అయిన వెంటనే మీరు కొన్ని ప్రత్యేక ఆహార నియమాలు పాటించాలి. తక్కువ కార్బోహైడ్రేట్లు, తక్కువ కొవ్వులు, అధిక ప్రొటీన్లు కలిగిన ఆహారం తీసుకోవాలి. అలాగే రక్తంలో చక్కెర స్థాయిలను క్రమం తప్పకుండా తనిఖీ చేసుకోవటం చాలా ముఖ్యం. ఆహారం, వ్యాయామాలతో ఈ మధుమేహం నియంత్రణ కాకపోతే, డాక్టర్లు సురక్షితమైన మాత్రలు లేదా ఇన్సులిన్ ఇంజెక్షన్లు సూచిస్తారు. ఇవి తల్లికీ, బిడ్డకీ పూర్తిగా హానికరం కాదు. సరైన నియంత్రణతో గర్భస్థ మధుమేహం సాధారణంగా ప్రసవం జరిగిన వెంటనే తగ్గిపోతుంది. కాని, కొన్నిసార్లు ప్రసవం తర్వాత కూడా మందులు, ఆహార నియమాలు కొంతకాలం కొనసాగించాల్సి రావచ్చు. భవిష్యత్తులో మధుమేహం వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది కాబట్టి, ప్రసవం తర్వాత కూడా ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఫాలోఅప్ తప్పనిసరిగా చేయించుకోవాలి.నాకు గతంలో ఏడు వారాలలో గర్భస్రావం అయింది. ఇప్పుడు గర్భవతిని. ఈ గర్భధారణలోనూ ఇప్పటివరకు రెండుసార్లు బ్లీడింగ్ వచ్చింది. డాక్టర్ నాకు విశ్రాంతి తీసుకోవాలని, కొన్ని మందులు వాడాలని చెప్పారు. ఈ బిడ్డను కూడా కోల్పోతానేమో అన్న భయం నన్ను చాలా బాధిస్తోంది. ఇది నా ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తోంది. దయచేసి మార్గనిర్దేశం చేయండి.– రూప, కర్నూలుగర్భధారణలో తొలి పన్నెండు వారాలను ఫస్ట్ ట్రైమెస్టర్ అంటారు. ఈ దశలో బిడ్డ ముఖ్యమైన అవయవాలు అభివృద్ధి చెందుతాయి. అదే సమయంలో గర్భస్రావం వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. అందుకే ఈ దశలో రక్తస్రావం, కడుపు నొప్పి వంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయకూడదు. అయితే ప్రతి రక్తస్రావం గర్భస్రావానికే సంకేతం కాదు. ఇంప్లాంటేషన్ బ్లీడింగ్, హార్మోన్ల మార్పులు, గర్భాశయంలో చిన్న మార్పుల వలన కూడా రక్తస్రావం రావచ్చు. ఇవి సాధారణంగా హానికరం కావు. కాని, రక్తస్రావం వచ్చిన ప్రతిసారీ డాక్టర్ను సంప్రదించాలి. డాక్టర్ మీ వైద్య చరిత్ర తెలుసుకొని, శరీరపరీక్ష చేసి, అల్ట్రాసౌండ్ స్కాన్ చేస్తారు. బిడ్డ ఆరోగ్యంగా ఉంటే ఎక్కువగా ఆందోళన అవసరం ఉండదు. చికిత్సలో భాగంగా విశ్రాంతి తీసుకోవడం, ఒత్తిడిని తగ్గించుకోవడం ముఖ్యమైనవి. కొన్నిసార్లు ప్రొజెస్టరాన్ మందులు ఇస్తారు. రక్తస్రావం అధికంగా ఉంటే ఆసుపత్రి పర్యవేక్షణ అవసరం కావచ్చు. గతంలో గర్భస్రావం అనుభవించారని, ఇప్పుడు కూడా మళ్లీ అదే జరుగుతుందని భావించాల్సిన అవసరం లేదు. ప్రతి గర్భస్రావం తర్వాత మళ్లీ అదే జరుగుతుందన్న నిబంధన లేదు. సమయానికి వైద్యుల సహాయం తీసుకుంటే చాలామంది మహిళలు సురక్షితంగా గర్భధారణను కొనసాగించి, ఆరోగ్యవంతమైన బిడ్డలకు జన్మనిస్తున్నారు. కాబట్టి ప్రశాంతంగా ఉండి వైద్యుల సూచనలు పాటించడం అత్యంత ముఖ్యం. డా. కడియాల రమ్య, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్ -
ఈ సబ్బు క్యాన్సర్కు ఆన్సర్!
అందం కోసం వాడే సబ్బును ఒక బాలుడు క్యాన్సర్ వ్యాధి మీద ప్రయోగించే ఆయుధంగా మార్చాడు. ఆశ్చర్యంగా ఉంది కదూ? కాని, ఇది నిజం. అమెరికాకు చెందిన పదిహేనేళ్ల హీమన్ బెకెలె తయారు చేసిన ఈ సబ్బు ప్రస్తుతం స్కిన్ క్యాన్సర్ రోగులకు వరంగా మారింది. ఈ ప్రత్యేకమైన సబ్బు చర్మంలోని రోగనిరోధక వ్యవస్థను ఉత్తేజపరచి, క్యాన్సర్ కణాలను ఎదుర్కొనేలా చేస్తుంది. సింపుల్గా చెప్పాలంటే, ఈ సబ్బు వాడితే చర్మంపై ఉన్న మలినాలకే కాదు, చర్మం లోపల చాపకింద నీరులా దాగి ఉన్న క్యాన్సర్ కణాలకు కూడా గుడ్బై చెప్పొచ్చు! కీమోథెరపీ, వేల కొద్దీ మాత్రలు అవసరం లేకుండా, ఒక చిన్న సబ్బుతోనే క్యాన్సర్కు చెక్ పెట్టొచ్చు. ప్రస్తుతానికి ఇది ఇంకా పరిశోధనల దశలో ఉన్నప్పటికీ, శాస్త్రవేత్తలు దీని పనితీరుపై విశ్వాసంతో ఉన్నారు. ఇది కచ్చితంగా ఉపయోగకరమైన ఫలితాలను ఇస్తుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ అద్భుత ఆవిష్కరణకు గుర్తింపుగా హీమన్ బెకెలెకు టైమ్ మ్యాగజైన్ ‘2024 కిడ్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు లభించింది. అంతేకాదు, ‘త్రీ ఎమ్ యంగ్ సైంటిస్టు’ చాలెంజ్లో పాల్గొని, పాతికవేల డాలర్లు (అంటే రూ. 21,82,600) నగదు బహుమతిని కూడా గెలుచుకున్నాడు. ఇంత డబ్బు వచ్చిందని పుస్తకాలకు గుడ్బై చెప్పలేదీ హీమ¯Œ . స్కూల్లో క్లాసులు, హోమ్వర్క్ల మధ్యలో కూడా ఫార్ములాలను కలిపి ఈ క్యాన్సర్ కిల్లింగ్ సబ్బు మీద తన పరిశోధనను కొనసాగిస్తున్నాడు. దీనిని త్వరలోనే పెద్దస్థాయిలో ఉత్పత్తి చేసి, అవసరమున్నవారికి ఉచితంగా అందించాలన్న ఆశయంతో ఒక స్వచ్ఛంద సంస్థను స్థాపించాలని కలలు కంటున్నాడు.అలా మొదలైంది!ఇంత చిన్న వయసులోనే ఇలాంటి గొప్ప ఆలోచన రావడానికి ఓ గట్టి కారణం ఉంది. హీమన్ పుట్టిన ఇథియోపియాలో ప్రజలకు తగినన్ని వైద్య సౌకర్యాలు లేకపోవడాన్ని చిన్నప్పుడే గమనించాడు. అందుకే, ‘అందరికీ వైద్య సౌకర్యాలు అందాలంటే ఎలా?’అనే ప్రశ్నతో మొదలుపెట్టి, అందరికీ చౌకగా, సులభంగా చికిత్స అందించే మార్గాన్ని వెతికాడు. ఆ వెతుకులాట చివరకు బాత్రూమ్ షెల్ఫ్పై ఉన్న సాధారణ సబ్బు దగ్గర ఆగింది. అలా రోజూ వాడే సబ్బులో శాస్త్ర విజ్ఞానాన్ని, రసాయనాలను కలిపి, ఒక మహాశక్తిమంతమైన ఆయుధంగా మార్చేశాడు. -
జస్ట్ నాలుగు నెలల్లో 25 కిలోలు తగ్గింది..! అమూల్యమైన ఆ ఏడు పాఠాలివే..
బరువు తగ్గడం అనేది అదిపెద్ద క్లిష్టమైన టాస్క్. తగ్గడం అంత ఈజీ కాదు. ఆ క్రమంలో ఒక్కోసారి తగ్గినట్లు తగ్గి..మళ్లీ యథాస్థితికి వచ్చినవాళ్లు కూడా ఉన్నారు. అయితే అందరు ఈ వెయిట్ లాస్ జర్నీలో కొన్ని పొరపాట్లు చేస్తుంటారని, వాటిని సర్దుబాటు చేసుకుంటే కిలోలు కొద్ది బరువు సులభంగా తగ్గిపోగలమని అంటోంది ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ అమకా. తనకు స్లిమ్గా మారడంలో హెల్ప్ అయిన ఏడు జీవనశైలి పాఠాలను కూడా సోషల్మీడియా వేదికగా షేర్ చేసుకుంది. అవేంటో చూద్దామా..!.బరువు తగ్గాలంటే కచ్చితంగా మన జీవనశైలిలో అతిపెద్ద మార్పులు చేయక తప్పదని అంటోంది. దాంతోపాటు ఓర్పు, క్రమంతప్పకుండా వ్యాయామం చేయడం, ఆరోగ్యకరమైన ఆహారం అత్యంత కీలకమని అంటోందామె. తాను ఆక్రమంలో ఏడు అద్భుతమైన పాఠాలను నేర్చుకున్నట్లు వివరించింది. ప్రస్తుతం తాను నాలుగు నెలల్లో అద్భుతంగా 25 కిలోలు అమాంతం తగ్గిపోయినట్లు ఇన్స్టా పోస్ట్లో తెలిపింది. నిజానికి ఎందువల్ల త్వరగా బరువు తగ్గలేకపోతున్నామనే దాని గురించి ఓపెన్గా మాట్లాడరని అంటెంది. అన్ని చేస్తున్న కొండలాంటి మన శరీరం ఏ మాత్రం మార్పు చెందని ఫీల్ కలుగుతుంటుంది. అలాంటి బరువుని తగ్గించాలంటే ఈ మార్పులు స్వాగతించండి, డైలీలైఫ్లో భాగం చేసుకోండని అంటోంది. అవేంటంటే..ఆకలి అనేది చిరుతండి లేదా మరొక ఎక్స్ట్రా ప్లేట్ ఆహారం కాదని నమ్మండి, ఆకలిగా అనిపించిన ప్రతిసారి తినేందుకు త్వరపడొద్దు. నిద్ర కూడా అత్యంత ముఖ్యమైనదని గ్రహించండని హెచ్చరిస్తోంది. నిద్ర కూడా మన బాడీకి ఒక ఆహారం లాంటిదేనని తెలుసుకోండని చెబుతోంది. తగినంత నిద్ర లేకపోతే తినాలనే కోరికలు ఎక్కువవుతాయట. స్థిరత్వం పరిపూర్ణమైన మార్పులకు మచ్చు తునక అట. దానికి ప్రాధాన్యత ఇస్తే..సకాలంలో మెరుగైన ఫలితాలు పొందడమే గాక చాలామటుకు లిమిటెడ్గా తినడాన్ని బ్యాలెన్స్ చేయగలుగుతారు. స్ట్రెంగ్స్ ట్రైనింగ్ కార్డియో వ్యాయామాల కంటే మెరుగ్గా పనిచేశాయాని చెబుతోంది. బరువులు ఎత్తడం, తన శరీర ఆకృతిని మార్చడంలో హెల్ప్ అయ్యిందని అంటోంది.అలాగే చక్కెర తగ్గించడం అనేది బరువు తగ్గడంలో చక్కటి గేమ ఛేంజర్ అని అంటోంది. సోడాలు, స్వీట్లు, పేస్ట్రీలకు దూరంగా ఉండటంతో.. వెంటనే బొడ్డు కొవ్వు తగ్గడం ప్రారంభించిందని అంటోంది. ఇవేగాక రాత్రిపూట తాగే హెర్బల్ పానీయాలు బరువు తగ్గడంలో కీలక పాత్ర పోషిస్తాయని అంటోంది. అవి ఆకలి కోరికలను నియంత్రిస్తాయని చెబుతోంది. ఉదా: లెమెన్ టీ, అల్లం టీ, యాపిల్ సైడ్ వెనిగర్, దాల్చిన చెక్క టీ వంటివి. వీటన్నింటి తోపాటు నియామానుసారంగా ఈ అలవాట్లను పాటించడం అనే క్రమశిక్షణ తనకు మరింత బాగా హెల్ప్ అయ్యిందని అంటోంది. అన్నింట్లకంటే బరువు తగ్గాలనే ఇంటెన్షన్తో కూడిన స్థిరత్వం కలిగిన మనసు అత్యంత ప్రధానమని, అప్పుడే సత్ఫలితాలను సులభంగా అందుకోగలమని అంటోంది ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ అమాక. కాగా, నెటిజన్లు ఈ పోస్ట్ని చూసి..బరువు తగ్గడంలో సత్ఫలితాలు అందాక దాదాపు ఆశను వదిలేసుకున్నాం. మీరిచ్చిన ఉత్తమ సలహాలతో కొంగొత్త ఆశ రెకెత్తించిందంటూ పోస్టు పెట్టారు. అయితే అమాక మాత్రం మన నిర్దేశిత లక్ష్య బరుని చేరుకోవడం అనేది అంత సులభం కాదని గుర్తెరగండి. కేవలం అటెన్షన్ అనే, స్థిరత్వం అనేవే టార్గెట్ని రీచ్ అయ్యేలా బరువు తగ్గుతామని గ్రహించండని సూచిస్తోంది.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: పారాగ్లైడింగ్ చేస్తూ లైవ్ మ్యూజిక్ ప్లే చేసిన మహిళ..!) -
పోషకాల బ్రేక్ఫాస్ట్..!
ఒక రోజంతా శక్తిమంతంగా, ఉత్సాహంగా గడిచిందంటే వారిపై ఆ రోజు ఉదయాన్నే తీసుకునే అల్పాహారం ప్రభావం తప్పక ఉంటుంది. పిల్లల జ్ఞాపకశక్తికీ పోషకాలు గల ఆహారం ఎంతో మేలు చేస్తుంది. ఉదయాన్నే పిల్లలు, పెద్దలు తీసుకునే బలవర్ధకమైన, సులువుగా తయారు చేసుకునే వంటకాలు ఇవి.. హెల్తీ మిక్స్ హల్వాకావల్సిన పదార్థాలుహెల్త్ మిక్స్ – కప్పు (క్యారెట్ లేదా బీట్రూట్ లేదా గుమ్మడి తురుము లేదా గోధుమ నూక); నెయ్యి – 2 టేబుల్ స్పూన్లు; బెల్లం లేదా కొబ్బరి చక్కెర – 1/4 కప్పు; పాలు – కప్పు; బాదం, జీడిపప్పు, చియా సీడ్స్ – టేబుల్ స్పూన్;తయారీ విధానంపాన్లో నెయ్యి వేడి చేసి, హెల్తీ మిక్స్ వేసి, బాగా వేయించాలి. పాలు పోసి, కలుపుతూ ఉండాలి.. మిశ్రమం చిక్కగా అయ్యాక, తురిమిన బెల్లం, కొబ్బరి చక్కెర ’కోకో షుగర్) వేసి బాగా కలపాలి. అన్నీ పూర్తిగా కలిసే వరకు మరో 2–3 నిమిషాలు ఉడికించాలి.తరిగిన డ్రై ఫ్రూట్స్ అలంకరించి, సర్వ్ చేయాలి. పోషకాలు: పిల్లలకు, పెద్దలకు ఇష్టమైనదే కాదు... మంచి పోషకాలు కూడా ఉండే స్వీట్ ఇది. బెల్లం లేదా కొబ్బరి చక్కెర వాడటం వల్ల ఐరన్ సమృద్ధిగా లభిస్తుంది. బీట్రూట్, క్యారట్, గుమ్మడిలో పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు లభిస్తాయి. పాల మిశ్రమం కాబట్టి క్యాల్షియమూ అందుతుంది. చిల్లాకావల్సిన పదార్థాలు: పెసరపప్పు – కప్పు (తగినన్ని నీళ్లు ΄ోసి, రెండు గంటలసేపు నానబెట్టాలి); నీళ్లు – అర కప్పు (తగినన్ని); ఉల్లిపాయ – చిన్నది (సన్నగా తరగాలి); పచ్చి మిర్చి – సన్నగా తరగాలి; కొత్తిమీర తరుగు – టేబుల్ స్పూన్; ఉప్పు – రుచికి తగినంత; నూనె – తగినంత.తయారీ విధానంపెసరపప్పును వడకట్టి, నీళ్లు కలిపి, మెత్తగా రుబ్బుకోవాలి. పిండిని గిన్నెలోకి తీసుకొని (క్యారెట్ తురుము, పాలకూర తరుగు, నానబెట్టిన ఓట్స్ కూడా కలుపుకోవచ్చు) తరిగిన ఉల్లిపాయలు, పచ్చి మిర్చి తరుగు, కొత్తిమీర, ఉప్పు వేసి కలపాలి. పెనం వేడి చేసి, ఒక గరిటెతో పెనం పైన పిండి పోసి, దోసెలా వెడల్పు చేయాలి. మీడియం మంట మీద రెండు వైపులా గోధుమ రంగు వచ్చేవరకు ఉంచాలి. కొత్తిమీర, పుదీనా చట్నీతో వేడిగా సర్వ్ చేయాలి.పోషకాలుక్యాలరీలు తక్కువగా ప్రోటీన్లు, క్యాల్షియం, ఐరన్, జింక్ సమృద్ధిగా లభించే ఈ చిల్లా ఉదయం, సాయంత్రం స్నాక్గా తీసుకోవచ్చు. పిల్లలకు లంచ్ బాక్స్లోకీ బాగుంటుంది. దీనిని రోల్ చేసి, ఉడికించిన కూరగాయలతో స్టఫ్ చేసి కూడా అందివ్వవచ్చు. హెల్తీ మిక్స్ పరాఠాకావల్సిన పదార్థాలుహెల్తీ మిక్స్ (రాగులు, జొన్న, సజ్జలు, కొర్రలు మొలకెత్తిన గింజలు, గుమ్మడి, అవిసెగింజలతో చేసిన పిండి) – కప్పు; నెయ్యి లేదా నూనె – టీ స్పూన్; ఉప్పు – తగినంత; గోరువెచ్చని నీళ్లు (తగినన్ని); తయారీ విధానంఒక గిన్నెలో, మిల్లెట్ మిక్స్, ఉప్పు వేయాలి. గోరువెచ్చని నీటిని క్రమంగా వేస్తూ, పిండిని మెత్తని ముద్దలా అయ్యేలా బాగా కలపాలి. చేతులకు నూనె లేదా నెయ్యి రాసుకొని, చిన్న చిన్న ముద్దలుగా తీసుకోవాలి. రెండు బటర్ పేపర్ షీట్ల మధ్య పిండి బాల్ ఉంచి, చపాతీ కర్రతో మెల్లగా, తేలికపాటి ఒత్తిడితో, రోల్ చేయాలి. పెనం వేడి చేసి, ప్రతి పరాఠాను సన్నని మంట మీద కొద్దిగా నెయ్యి/నూనెతో బంగారు గోధుమ రంగు వచ్చే వరకు రెండు వైపులా కాల్చాలి. చట్నీ లేదా పెరుగుతో వేడిగా వడ్డించాలి. పోషకాలు: పరాటాకు కూరగాయలను ఉడికించి, వాడుకోవచ్చు. ఏమేం దినుసులు, కూరగాయలు వాడుతున్నామో దానిని బట్టి కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్లు, క్యాల్షియం, ఐరన్ సమృద్ధిగా లభిస్తాయి. (చదవండి: కూల్ మాన్సూన్లో..స్పెషల్ హాట్ ట్రీట్స్..!) -
ఆరుపదులు దాటినా ఫిట్గా కనిపించాలంటే..! నాగార్జున ఫిట్నెస్ మంత్ర.
టాలీవుడ్ కింగ్, హీరోయిన్ల మన్మథుడు హీరో నాగార్జున ఇవాళ 67వ వసంతంలోకి అడుగుపెడుతున్నారు. అయితే ఆయన ఇప్పటికీ అంతే గ్లామర్గా టోన్డ్ బాడీతో ఆకర్షణగా కనిపిస్తారు. ఆగస్టు 29 ఆయన పుట్టిన రోజు సందర్భంగా అంతలా ఫిట్గా ఉండేందుకు నాగార్జున ఎలాంటి వ్యాయామాలు చేస్తుంటారు, ఆరుపదులు వయసులో కూడా అంతలా యంగ్గా కనిపించేందుకు ఎలాంటి చిట్కాలు అనుసరిస్తారు వంటి వాటి గురించి సవివరంగా తెలుసుకుందామా..!.నాగార్జున ఇంచుమించుగా గత 30 లేదా 35 సంవత్సరాలుగా వర్కౌట్లు చేస్తూనే ఉన్నారు. ఎన్నడు స్కిప్ చేయలేదని ఆయన ఫిట్నెస్ ట్రైనర్ చెబుతున్నారు. ఒక ఇంటర్వ్యూలో కూడా క్రమంతప్పకుండా వ్యాయామం చేస్తానని ఆయనే స్వయంగా చెప్పారు. వాటిలో కార్డియో, స్ట్రెంగ్త్ ట్రైనింగ్ వంటి వ్యాయామాలు తప్పనిసరి. అయితే అవన్ని ప్రతి ఉదయం జస్ట్ 45 నిమిషాల నుంచి ఒక గంట వరకే చేస్తారట. అంతలా ఫిట్గా ఉండటానికి రీజన్..క్రమంతప్పకుండా వ్యాయామం చేయడం అనేది తప్పనిసరి అని చెబుతున్నారు నాగార్జున. అంతేగాదు పనిచేయకుండానైనా ఉంటాను గానీ వ్యాయామం చేయకుండా అస్సలు ఉండనని చెబుతున్నారు. మేల్కొన్న వెంటనే వ్యాయామం తన తొలి ప్రాధాన్యతని చెబుతున్నారు. కచ్చితంగా వారానికి ఐదు నుంచి ఆరు రోజులు వర్కౌట్లనేవి తన దినచర్యలో భాగమని చెబుతున్నారు. అయితే అవి చాలా తీవ్రంగా ఉంటాయట.ఆ ఏజ్లో కూడా యంగ్గా కనిపించాలంటే..వర్కౌట్ల సమయంలో తన హృదయ స్పందన రేటును గరిష్ట రేటు 70 శాతం కంటే ఎక్కువగా ఉంచుకోవడం ఎలాగై తన ట్రైనర్ నేర్పించాడని తెలిపారు నాగార్జున. అధిక జీవక్రియను నిర్వహించడానికి వర్కౌట్ల సమయంలో విశ్రాంతి , పరధ్యానం అనేవి అస్సలు పనికిరావని, పైగా మెరుగైన ఫలితాలు అందుకోలేమని చెప్పారు. చేసేపని చిన్నదైన, పెద్దదైనా ఫోకస్, స్కిప్ చేయని అంకిత భావం అంత్యంత ముఖ్యమని, అప్పుడే ఎప్పటికీ యవ్వనంగా ఉండగలమని పరోక్షంగా చెప్పకనే చెప్పారు హీరో నాగార్జున. View this post on Instagram A post shared by Aalim Hakim (@aalimhakim) (చదవండి: ఫుడ్ డెలివరికి వెళ్లి కస్టమర్కి ప్రపోజ్ చేశాడు ..కట్చేస్తే..!) -
స్ట్రెంగ్త్ ట్రైనింగ్తో ఆ అమ్మ లైఫే మారిపోయింది..! బీపీ, షుగర్ మాయం..
ఓ వయసు వచ్చాక రోగాల బారినపడటం అనేది సహజం. అయితే అప్పటికైనా తేరుకుని జీవనశైలిలో మార్పులు, ఫిట్నెస్పై దృష్టిసారించి కేర్ తీసుకుంటే చాలు. చాలామటుకు వ్యాధులు తగ్గుముఖం పడతాయి. ఇక్కడ ఆలస్యం అనే పదం గాక..ఆశావాహ దృక్పథానికి చోటిస్తే..కచ్చితంగా అద్భుతాలు తప్పక జరుగుతాయి. అందుకు నిదర్శంన ఈ అమ్మే..!. పాపం నడవలేక ఇబ్బంది పడింది. ఓ పక్క మధుమేహం, బీపీతో నరకం చూసింది. అలాంటామె కొడుకు సపోర్టుతో ఎంతలా ఆమె జీవితం మలుపు తిరిగిందంటే..ఈమె ఆమేనా అనే సందేహం కలిగేంతలా చురుగ్గా మారిపోయింది. ఓ అథ్లెటిక్ మాదిరిగా తయారైంది. అంతేగాదు చుట్టుముట్టిన అనారోగ్య సమస్యలన్ని ఒక్కొక్కటిగా మాయమైపోయాయి. ఎలా అంటే..ఫిట్నెస్ నిపుణుడు కుల్విందర్ సింగ్ ఆరోగ్యవంతంగా మారిన తన 59 ఏళ్ల తల్లి కథను ఇన్స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసుకున్నారు. తన తల్లి ఒకప్పుడు డయాబెటిస్ , రక్తపోటు సమస్యలతో బాధపడుతుండేదని తెలిపారు. వాటికి తోడు ఆర్థరైటిస్ సమస్య కూడా జత అవ్వడంతో కనీసం బాత్రూమ్కి కూడా వెళ్లలేని పరిస్థితికి చేరుకుందని చెప్పుకొచ్చారు. తన పరిస్థితి చూసి తనకే బాధగా అనిపించేదని అన్నారు. కనీసం కాలు కదిపేందుకు చాలా బాధపడిపోయేదన్నారు. శరీరంలో యూరిక్ యాసిడ్స్ పెరిగిపోయి ఆమెకు కనీసం మోకాలిని వంచలేని పరిస్థితికి వచ్చేసింది. ఫలితంగా ఆమె 90 కిలోల అధిక బరువు కూడా చేరుకున్నట్లు తెలిపారు. ఇక ఇలానే ఉంటే ఆమె పరిస్థితి క్రిటికల్గా మారిపోతుందని తానే ఆమెను జిమ్కు తీసుకువెళ్లి బల శిక్షణ తీసుకోవాల్సిందిగా బలవంతం చేశారట.అద్భుతమైన పరివర్తన..దాంతో ఆమె పరిస్థితి రెండు నెలల్లోనూ పూర్తిగా మారిపోయిందిచి. పైగా మెరుగైన ఫలితాలు కనిపించాయని అన్నారు. చెప్పాలంటే శరీరంలో కొవ్వు చాలామటుకు తగ్గిపోయిందని చెప్పారు. రక్తపోటు, మధుమేహం సాధారణ స్థితికి వచ్చేశాయి. అలాగే ఆమె మోకాలి నొప్పి 50% మెరుగ్గా ఉండటమేగాక, చాలా అద్భుతమైన మార్పులు చోటుచేసుకున్నాయని అన్నారు.స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అంటే..బరువులు ఎత్తడం వంటి శిక్షణతో కండరాలను బలోపేతం చేయడం. ఇక్కడ కుల్విందర్ సింగ్ తల్లి ఒక గంటపాటు నిరంతరాయంగా నడవడం, రెండు గంటల వ్యాయామం, 40 కిలోలు వరకు బరువులు ఎత్తడం వంటివి చేసేది. ఒక నిమిషం పైనే ప్లాంక్ పొజిషన్లో ఉండటం వంటివి చేసి అద్భుతమైన మార్పులు చవిచూశారామె. అంతేగాదు జస్ట్ ఆరు నెలలకే చలాకీగా పరిగెత్తగలిగింది. వృద్ధాప్యంలో ఇలాంటివి చేయడం గురించి ఆలస్యంగా పరిగణించొద్దు..ఆరోగ్యవంతమైన మార్పుకి గ్రాండ్ వెల్కమ్ చెప్పడమని భావించండి అని చెబుతున్నారు ఫిట్నెస్ నిపుణులుడు కుల్విందర్ సింగ్స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ప్రాముఖ్యత..కార్డియో, యోగా, పైలేట్స్ వంటి ఇతర రకాల వ్యాయామాలు మానసిక ఆరోగ్యానికి మంచివైతే ఈ బల శిక్షణ అనేది జీవన నాణ్యతను మెరుగుపరుస్తుందట. అంతేగాదు రోజువారీ కార్యకలాపాలను చేసేలా సామర్థ్యాన్ని పెంపొందించుకునేలా చేస్తుందని పరిశోధనలో తేలింది. అంతేగాదు ప్రపంచవ్యాప్తంగా జరిగిన 16 అధ్యయనాల్లో కండరాలను బలోపేతం చేసే వ్యాయామాలు ఆయుర్ధాయాన్ని పెంచుతాయని నిరూపితమైంది కూడా. ఇది కండర ద్రవ్యరాశిని సంరక్షించడమే కాదు పెంచేందుకు సహాయపడుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) ప్రకారం, ఇది కండరాలు, ఎముకల పెరుగుదలను ప్రేరేపించి బోలు ఎముకల వ్యాధి, బలహీనతలను నివారించి, తద్వారా ఆరోగ్యవంతంగా ఉండేలా చేస్తుందట. View this post on Instagram A post shared by Kulwinder Singh (@freebird.sodhi)గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వ్యైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: కూలీ కుమార్తె సక్సెస్ స్టోరీ..! టీసీఎస్ నుంచి ఐఏఎస్ రేంజ్కి..) -
లైవ్ ఈవెంట్లో కుప్పకూలిన నటుడు, వెంటిలేటర్పై చికిత్స
ప్రముఖ నటుడు, టెలివిజన్ ప్రెజెంటర్ రాజేష్ కేశవ్ (47), అలియాస్ RK ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. ఒక లైవ్ ఈవెంట్లో కుప్పకూలి, కొచ్చిలోని ఒక ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో ఆయన త్వరగా కోలుకోవాలంటూ అభిమానులు, పరిశ్రమపెద్దలు సోషల్ మీడియా ద్వారా కోరుకుంటున్నారు.ఆసుపత్రి వర్గాల సమాచారం ప్రకారం, ఆయనకు గుండెపోటు రావడంతో యాంజియోప్లాస్టీ చేయించుకున్నారు. ఇంటెన్సివ్ కేర్ యూనిట్లోవెంటిలేటర్ సహాయంతో చికిత్స పొందుతున్నారు. అయితే మెదడు ప్రభావితమైందని, ప్రస్తుతం పరిస్థితి విషమంగా ఉందని, రాబోయే 72 గంటలు చాలి క్లిష్టమైనవని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి .దీంతో కేశవ్ త్వరగా కోలుకోవాలంటూ సన్నిహితులు, స్నేహితులు, సహచరులు కన్నీరుమున్నీరవుతున్నారు.ఆదివారం (ఆగస్టు 24) రాత్రి ఆదివారం రాత్రి కొచ్చిలో ఒక పబ్లిక్ ప్రోగ్రాం నిర్వహిస్తూ అకస్మాత్తుగా వేదికపై కుప్పకూలిపోయారు. నిర్వాహకులు, వైద్య సిబ్బంది వెంటనే స్పందించి అత్యవసర చికిత్స కోసం వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు రాజేష్కు అత్యవసర యాంజియోప్లాస్టీ చేశారు. ప్రస్తుతం ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో వెంటిలేటర్పై ఉన్నారని, వైద్యులు అతని పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నారంటూ,ఈ ఘటన సందర్బంగా, అక్కడే ఉన్న చిత్రనిర్మాత ప్రతాప్ జయలక్ష్మి సోషల్ మీడియా ద్వారా అప్డేట్ను పంచుకున్నారు.ఎవరీ రాజేష్ కేశవ్?కేరళలో టెలివిజన్ యాంకర్గా రాజేష్ కేశవ్ చాలా పాపులర్. అనేక హిట్ రియాలిటీ, టాక్ షోల ద్వారా అపారమైన ప్రజాదరణను సంపాదించుకున్నారు. ఈ క్రమంలోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి తనదైన నటనతో విమర్శకుల ప్రశంసలను దక్కించుకున్నాడు.ఇదీ చదవండి: ఈ గుడిలో ఎలుక రాజా చెవిలో చెబితే చాలు.. అన్ని శుభాలే!కార్డియాక్ అరెస్ట్ అంటే?గుండె అకస్మాత్తుగా సరిగ్గా కొట్టుకోవడం ఆగిపోయి, మెదడు, ఇతర ముఖ్య అవయవాలకు రక్త ప్రవాహం నిలిచిపోవడం.గుండెపోటులాగా కాకుండా ఈ షాక్ వల్ల ఒక్కోసారి గుండె ఆగిపోయే ప్రమాదం ఉంది.ఆకస్మికంగా కుప్పకూలడం, స్పృహ కోల్పోవడం , పల్స్ లేకపోవడం వంటివి తక్షణ లక్షణాలు.CPR (కార్డియోపల్మోనరీ రిససిటేషన్) వంటి తక్షణ చర్యలు , డీఫిబ్రిలేటర్ వాడకం కీలకం.చికిత్సకు స్పందించకపోతే, రాజేష్ విషయంలో లాగా, రోగులకు తరచుగా ఇంటెన్సివ్ కేర్ చికిత్స అవసరం.లక్షణాలు: తీవ్రమైన తలనొప్పి, ఆందోళన ,గందరగోళం, తలతిరగడం , వాంతులు రావడం, రెండు లేదా ఒక కన్ను చూడటంలో ఇబ్బంది చేతులు, కాళ్ళు ,ఇతర శరీరంభాగాల్లో తిమ్మిరి లేదా బలహీనత లాంటి లక్షణాలుంటే వెంటనే అప్రమత్తం కావాలి. నివారణ ఎలా?ఆరోగ్యకరమైన జీవనశైలిని, కొన్ని ముందు జాగ్రత్త చర్యల ద్వారా కార్డియాక్ అరెస్ట్ ముప్పునుంచి తప్పించుకోవచ్చు.క్రమం తప్పకుండా వ్యాయామం, ధూమపానం, మద్యపానానికి దూరంగా ఉండాలి.కొలెస్ట్రాల్ , రక్తపోటు స్థాయిలను క్రమం తప్పకుండా చెక్ చేసుకోవడం. కుటుంబంలో గుండె జబ్బుల చరిత్ర ఉంటే మరీ జాగ్రత్తగా ఉండాలి. క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకోవాలి.ఆరోగ్యకరమైన, సమతులం ఆహారం తీసుకోవాలి. ఎత్తుకు తగిన బరువు ఉండేలా చూసుకోవాలి.. బరువును అదుపులో ఉంచుకోవడం వల్ల చాలా అనారోగ్యాలనుంచి దూరంగా ఉండవచ్చు. చదవండి : దేశంలోనే రిచెస్ట్ గణపతిగా రికార్డు, భారీ బీమా -
విటమిన్ డి లోపం... ఎన్నో ఆరోగ్య సమస్యలు
స్వాభావికంగానే విటమిన్ ‘డి’ని పొందాలంటే... ముఖం, చేతులు, భుజాలు వంటి శరీర భాగాలను సాధ్యమైనంత వరకు లేత ఎండకూ లేదా హాని చేయనంత సూర్యకాంతికి ఎక్స్΄ోజ్ అయ్యేలా సూర్యోదయ వేళల్లో ఆరుబయట నడవడం మేలు. ఒకవేళ మాత్రలు సరిపడనివారు నేచురల్గానే విటమిన్–డి ని పొందాలని అనుకుంటే తీసుకోవాల్సిన ఆహారాలివి...విటమిన్ ‘డి’లో అనేక రకాలు... ‘విటమిన్ డి’లో విటమిన్ డి1, డి2, డి3...డి7... ఇలా చాలా రకాలు (దాదాపు పది వరకు) ఉన్నాయి. కానీ వాటిల్లో విటమిన్ డి2 (ఎర్గో క్యాల్సిఫెరాల్), విటమిన్ డి3 (కోలీ క్యాల్సిఫెరాల్) చాలా ముఖ్యమైనవి, కీలక మైనవి. విటమిన్–డి లోపాలతో వచ్చే సమస్యలు... విటమిన్–డి లోపాలతో వచ్చే ఆరోగ్య సమస్యల జాబితా చాలా పెద్దదే. అందుకే ఇటీవల సాధారణ ఆరోగ్య సమస్యలతో ఆసుపత్రులకు వెళ్లే బాధితుల్లో విటమిన్‘డి’ లోపాన్ని డాక్టర్లు ఎక్కువగా కనుగొంటున్నారు.శరీరంలో ఖనిజలవణాల అసమతౌల్యత (ముఖ్యంగా జింక్, ఐరన్, ఫాస్ఫరస్ వంటివి) హార్మోన్ల అసమతౌల్యత అత్యంత వేగంతో భావోద్వేగాలు మారిపోవడం (మూడ్స్ స్వింగింగ్) మానసిక ఆరోగ్యం దెబ్బతినడం గర్భవతుల్లో పిండం ఎదుగుదలలో లోపాలు ∙మెదడు కణాలైన న్యూరాన్లు (నరాల కనెక్షన్లలో) లోపాలు కండరాల కదలికల్లో సమన్వయ లోపాలు రక్తపోటు ధమనుల్లో రక్తప్రసరణ లోపాలుచక్కెర నియంత్రణలో లోపాలు దంతసంబంధమైన సమస్యలు కణ విభజనలో లోపాలు ఎముకల బలం లోపించడం వ్యాధి నిరోధక శక్తి తగ్గడం రికెట్స్ వ్యాధి ఆస్టియో పోరోసిస్ ఆస్టియోమలేసియా ఒక్కోసారి ఫిట్స్ రావడం మొదలైనవి. వాస్తవానికి ఆహారపదార్థాల ద్వారా లభ్యమయ్యేదాని కంటే సూర్యరశ్మికి తాకినప్పుడు చర్మం కింది పొరలో దీని ఉత్పత్తి ఎక్కువ. అయినప్పటికీ కొద్ది మోతాదుల్లో కొన్ని రకాల ఆహారపదార్థాల నుంచి అది లభిస్తుంది. అవి... ఏయే పదార్థాలలో ఎంతెంత...? ఆహార పదార్థం పరిమాణం (మైక్రోగ్రాముల్లో) కాడ్లివర్ ఆయిల్ 175 షార్క్ లివర్ ఆయిల్ 50 గుడ్లు (పచ్చసొనతో) 1.5 నెయ్యి 2.5 వెన్న 1.0(ఇవన్నీ 100 గ్రాముల ఎడిబుల్ పోర్షన్లో లభించే మోతాదులు)చేపల్లో... చేపల కాలేయాల్లో లభ్యమయ్యే నూనెల్లో విటమిన్ డి సమృద్ధిగా లభ్యమవుతుంది. మరీ ముఖ్యంగా కాడ్, మాక్రెల్, సొరచేప (షార్క్), సార్డైన్, ట్యూనా వంటి చేపల కాలేయాలలో విటమిన్–డి ఎక్కువ. మాంసాహారాల వంటి యానిమల్ సోర్స్ నుంచి... వేటమాసం, అందులోనూ ప్రత్యేకంగా కాలేయం మాంసంలో; అలాగే వెన్న, నెయ్యి, గుడ్డులోని పచ్చసొనలో ‘విటమిన్–డి’ ఎక్కువ. ఇటీవల చాలామంది పచ్చసొన ఆరోగ్యానికి మంచిది కాదంటూ దాన్ని తీసుకోవడం లేదు. కానీ గుడ్డు తాలూకు పచ్చసొనలో కొలెస్ట్రాల్తోపాటు క్యాల్సిటరాల్ అని పిలిచే విటమిన్–డి ఉంటుంది. కాబట్టి విటమిన్–డి పొందాలనుకునే వాళ్లు గుడ్డులోని పచ్చసొన తీసుకోవడం చాలా మంచిది. పచ్చసొన తీసుకోకపోవడం వల్ల ఆరోగ్యానికి కలిగే మేలు కంటే క్యాల్సిటరాల్ వంటి ఎన్నో పోషకాలను పోగొట్టుకోవడం ద్వారా పొందే నష్టమే ఎక్కువ. అందుకే పరిమిత స్థాయిలో పచ్చసొన తీసుకోవడం ఆరోగ్యానికి మంచి చేస్తుందని గుర్తించాలి.మష్రూమ్స్లో... పుట్టగొడుగుల్లో (మష్రూమ్స్లో) విటమిన్–డి2 సమృద్ధిగా దొరుకుతుంది. విటమిన్–డి లోపం ఉన్నవారు పుట్టగొడుగులతో చేసిన రకరకాల ఆహార పదార్థాలు తీసుకోవడంతో పాటు ఎండలో నడవటం వల్ల స్వాభావికంగానే విటమిన్–డి2 లభ్యమవుతుంది.ఫోర్టిఫైడ్ ఆహారాల్లో... పాలు, జ్యూస్ వంటి కొన్ని రకాల ఆహారపదార్థాల్లో ఇతర పోషకాలతో మరింత సంతృప్తమయ్యేలా చేస్తారు. ఇలాంటి ఆహారాలను ఫోర్టిఫైడ్ ఆహారాలుగా పేర్కొంటారు. మామూలుగా అయితే పాలలో విటమిన్–డిపాళ్లు తక్కువే. కానీ ఫోర్టిఫైడ్ మిల్క్, ఫోర్టిఫైడ్ సోయామిల్క్, ఫోర్టిఫైడ్ ఆరెంజ్, ఫోర్టిఫైడ్ ఓట్మీల్, ఫోర్టిఫైడ్ సిరేల్స్ (తృణధాన్యాల) వంటి సంతృప్తం చేసిన ఆహార పదార్థాల్లో విటమిన్–డి మోతాదులు ఎక్కువ. విటమిన్ ‘డి’ తాలూకు కొన్ని విశేషాలు... ఎండవేళలోనే విటమిన్–డి తయారవుతుంది. పైగా చర్మాన్ని తాకాక అది కాలేయాన్ని చేరుతుంది. ఇలా విటమిన్–డి తయారీలోనూ, నిక్షిప్తం చేయడంలోనూ కాలేయం కీలక పాత్ర వహిస్తుంది కాబట్టి... ఎండ తక్కువగా ఉండే చలికాలం నాలుగు నెలల కోసం అవసరమైన విటమిన్–డిని కాలేయం నిల్వ చేసుకుని పెట్టుకుంటుంది. ( నీడ పట్టున వద్దండి. ఇది పెద్ద లోపమం‘డి’)గర్భిణులకు తగినంత విటమిన్ –డి ఇవ్వడం వల్ల వాళ్లకు పుట్టే పిల్లలు భవిష్యత్తులో ఆరోగ్యంగా ఎదుగుతారు. అన్ని రకాలుగా వాళ్ల వికాసానికి (మైల్ స్టోన్స్కు) విటమిన్–డి ఎంతగానో తోడ్పడుతుంది. ఇదీ చదవండి: Yoga మైగ్రేన్తో భరించలేని బాధా? బెస్ట్ యోగాసనాలు జుట్టు ఒత్తుగా పెరగడం కోసంకూడా విటమిన్–డి సహాయపడుతుంది.ప్రపంచంలోని చాలా పాశ్చాత్య దేశాలు ఉత్తరార్ధ గోళంలోని భూమధ్య రేఖ నుంచి దూరంగా ఉండే అక్షాంశాల్లో ఉండటంతో ఆయా దేశాల్లో సూర్యకాంతి అంతగా ప్రసరించదు. కాబట్టి... అలాంటి దేశాల్లో విటమిన్ ‘డి’ లోపం చాలా సాధారణం. అందుకే ప్రపంచ వ్యాప్తంగా ఒక బిలియన్ మంది అంటే నూరు కోట్ల మంది, (వారిలో పాశ్చాత్యులే ఎక్కువ) విటమిన్–డి లోపంతో బాధపడుతున్నారని ఒక అంచనా. అందుకే వారు అక్కడి బీచ్లలో సన్బాత్ల వంటి ప్రక్రియలను ఆశ్రయిస్తూ సూర్యకాంతికి తమ దేహం ఎక్స్పోజ్ అయ్యేలా చేసుకుంటూ విటమిన్–డి పొందడానికి ప్రయత్నిస్తుంటారు. అయితే ఇటీవల సూర్యకాంతి, ఎండ పుష్కలంగా ఉండే మన భారతదేశంలాంటి చోట్ల కూడా చాలామందిలో విటమిన్ ‘డి’ లోపం విస్తృతంగా కనిపిస్తోంది. మన సమాజంలో చాలావేగంగా చోటు చేసుకున్న మార్పుల కారణంగా ఎండలోకి వెళ్లి చేసే పనుల కంటే నీడపట్టునే ఉండి చేసే పనులు పెరిగిపోవడం, ఎండకు ఎక్స్΄ోజ్ అయ్యే అవసరాలు తగ్గడం అన్న అంశమే విటమిన్–డి లోపం పెరగడానికి ప్రధాన కారణం. దాంతో విటమిన్–డి లోపం వల్ల కనిపించే అనర్థాలు చాలామందిలో కనిపిస్తున్నాయి. అందుకే చాలామంది ఫిజీషియన్లు ఈ విటమిన్ను ప్రిస్క్రయిబ్ చేయడం ద్వారా ఈ లోపాన్ని అధిగమించడానికి ప్రయత్నిస్తున్నారు.విటమిన్ డి లోపం నిర్ధారణ ఇలా... ఒక రకమైన రక్తపరీక్ష ద్వారా విటమిన్–డి ఉండాల్సిన మోతాదులో ఉన్నదా, లేదా అనే విషయాన్ని తెలుసుకుంటారు. ఇందుకోసం 25 (ఓహెచ్)డీ అనే పరీక్షనూ లేదా 1,25 (ఓహెచ్) డీ3 అనే పరీక్షను చేస్తారు. విటమిన్–డి ఉండాల్సిన మోతాదును తెలుసుకునేందుకు పైన పేర్కొన్న మొదటి పరీక్ష అయిన 25 (ఓహెచ్)డీ బాగా ఉపయోగపడుతుంది. ఇక 25 (ఓహెచ్)డీ పరీక్షనే 25–హైడ్రాక్సీక్యాల్సిఫెరాల్ లేదా 25–హైడ్రాక్సీ విటమిన్– డి అనే మాటకు సంక్షిప్త రూపం. సాధారణంగా ఆరోగ్యవంతుడి రక్తంలో విటమిన్ డి మోతాదు 50–65 ఎన్జీ/ఎమ్ఎల్ ఉండాలి. దాని కంటే తక్కువగా ఉంటే డాక్టర్లు విటమిన్–డి టాబ్లెట్స్ ప్రిస్క్రయిబ్ చేస్తారు.క్యాల్షియమ్ సక్రమంగా ఎముకల్లోకి ఇంకిపోవవడంతో పాటు ఎముకల్ని మరింత బలంగా, పటిష్టంగా రూ పొందేలా చేసేందుకు విటమిన్–డి చాలా అవసరం. ఆహారంలోని క్యాల్షియమ్ను శరీరం గ్రహించే ప్రక్రియ మన పేగుల్లోనే జరిగేందుకు విటమిన్–డి సహాయపడుతుంది. -డాక్టర్ శ్రీకృష్ణ ఆర్. బొడ్డుసీనియర్ కన్సల్టెంట్ఫిజీషియన్ నిర్వహణ: యాసీన్ -
నీడ పట్టున వద్దండి. ఇది పెద్ద లోపమం‘డి’
ఇటీవల చాలామందిలో విటమిన్ – డి లోపం చాలా ఎక్కువగా కనిపిస్తోంది. ఇలాంటి ధోరణి గతంలో అంతగా కనిపించేది కాదు. మన దేశం సూర్యరశ్మి సమృద్ధిగా లభ్యమయ్యే దేశమైనందువల్లా, అలాగే మూడు నాలుగు దశాబ్దాల కిందటి వరకూ మనలో చాలామంది వ్యవసాయ వృత్తుల్లో ఉండేవారు కావడంతో విటమిన్–డి లోపం చాలా అరుదుగానే కనిపించేది. కానీ ఈమధ్య మన వృత్తులు చాలావరకు మారిపోవడం, ఇన్డోర్స్లోనే ఉంటూ పనులు చేసుకునేవారి సంఖ్య పెరగడంతో విటమిన్–డి లోపం చాలామందిలోతరచూ కనిపిస్తూనే ఉంది. పైగా వ్యాధి నిరోధకతకు తోడ్పడటంతో పాటు అనేక జీవక్రియల్లో ఇదెంతో కీలకమైనందున... విటమిన్ డి నిర్వహించే వివిధ కార్యకలాపాలతోపాటు ఆ లోపం కలిగినప్పుడు దాన్ని ఎలా భర్తీ చేసుకోవాలి, తద్వారా వ్యాధి నిరోధక శక్తిని ఎలా పెంపొందించుకోవాలన్న అనేక అంశాల అవగాహన కోసం విపులమైన కథనం. ప్రపంచంలోని చాలా పాశ్చాత్య దేశాలు ఉత్తరార్ధ గోళంలోని భూమధ్య రేఖ నుంచి దూరంగా ఉండే అక్షాంశాల్లో ఉండటంతో ఆయా దేశాల్లో సూర్యకాంతి అంతగా ప్రసరించదు. కాబట్టి... అలాంటి దేశాల్లో విటమిన్ ‘డి’ లోపం చాలా సాధారణం. అందుకే ప్రపంచ వ్యాప్తంగా ఒక బిలియన్ మంది అంటే నూరు కోట్ల మంది, (వారిలో పాశ్చాత్యులే ఎక్కువ) విటమిన్–డి లోపంతో బాధపడుతున్నారని ఒక అంచనా. అందుకే వారు అక్కడి బీచ్లలో సన్బాత్ వంటి ప్రక్రియలను ఆశ్రయిస్తూ సూర్యకాంతికి తమ దేహం ఎక్స్పోజ్ అయ్యేలా చేసుకుంటూ విటమిన్–డి పొందడానికి ప్రయత్నిస్తుంటారు. అయితే ఇటీవల సూర్యకాంతి, ఎండ పుష్కలంగా ఉండే మన భారతదేశంలాంటి చోట్ల కూడా చాలామందిలో విటమిన్ ‘డి’ లోపం విస్తృతంగా కనిపిస్తోంది. మన సమాజంలో చాలావేగంగా చోటు చేసుకున్న మార్పుల కారణంగా ఎండలోకి వెళ్లి చేసే పనుల కంటే నీడపట్టునే ఉండి చేసే పనులు పెరిగిపోవడం, ఎండకు ఎక్స్పోజ్ అయ్యే అవసరాలు తగ్గడం అన్న అంశమే విటమిన్–డి లోపం పెరగడానికి ప్రధాన కారణం. దాంతో విటమిన్–డి లోపం వల్ల కనిపించే అనర్థాలు చాలామందిలో కనిపిస్తున్నాయి. అందుకే చాలామంది ఫిజీషియన్లు ఈ విటమిన్ను ప్రిస్క్రయిబ్ చేయడం ద్వారా ఈ లోపాన్ని అధిగమించడానికి ప్రయత్నిస్తున్నారు.(Yoga మైగ్రేన్తో భరించలేని బాధా? బెస్ట్ యోగాసనాలు)వాస్తవానికి ఏమిటీ విటమిన్ ‘డి’..? ఎముకల బలం మొదలుకొని అనేక జబ్బుల నుంచి రక్షణ కల్పించే వ్యాధి నిరోధక శక్తి వరకు దేహానికి అవసరమైన పోషకాల్లో అతి ముఖ్యమైనది విటమిన్ డి. నిజానికి ఈ పోషకం ఆహారం కంటే సూర్మరశ్మి నుంచే ఎక్కువగా దొరుకుతుంది. వాస్తవానికి సూర్యకాంతి వల్ల దొరికేది 80 శాతమైతే... మిగతా 20 శాతం మాత్రమే ఆహార పదార్థాల నుంచి లభ్యమవుతుంటుంది. ఇది కొవ్వులో కరిగే (ఫ్యాట్ సొల్యుబుల్) విటమిన్. సాంకేతిక పరిభాషల చెప్పాలంటే దీన్ని ‘సెకో స్టెరాయిడ్’ అంటారు. అంటే దీని మాలెక్యూల్స్ నిర్మాణాన్ని పరిశీలిస్తే ఇందులో... పరమాణు వలయాలు తెగినట్లుగా ఉంటాయి. (సెకో అంటే బ్రోకెన్ అని అర్థం). పైగా స్టెరాయిడ్ వంటి పదార్థాల నుంచి ఆవిర్భవించిందనే మరో అర్థం కూడా ఉంది. కాబట్టి ఇది సహజ స్వాభావికమైన స్టెరాయిడ్ గుణాలతో పాటు విటమిన్ (వైటల్ ఎమైన్)గా కూడా పనిచేస్తుండటంతో దీంతో దేహానికి ఒనగూరే ఎన్నో ప్రయోజనాలెన్నో ఉన్నాయి.విటమిన్ డి ఎలా తయారవుతుందంటే..? సూర్యరశ్మిలోని అల్ట్రావయొలెట్ కిరణాలు చర్మాన్ని తాకినప్పుడు కొన్ని రకాల జీవరసాయనాలూ ఉత్పత్తి అవుతాయి. వాటిని ‘క్యాల్సిఫెరాల్స్’ అంటారు. ఒకరకంగా ఈ క్యాల్సిఫెరాల్స్ విటమిన్ డి తయారీకి కారణమవుతాయని చెప్పవచ్చు. కాల్సిఫెరాల్... రక్తంలో కలిసి ఎట్టకేలకు కాలేయాన్ని చేరుతుంది. కాలేయంలో అది ‘క్యాల్సీడియల్’ అనే ఒక పూర్తిస్థాయి హార్మోన్ తాలూకు తొలిరూపాన్ని తీసుకుంటుంది. మళ్లీ అది రక్తప్రవాహంలో కలిసి ‘క్యాల్సీడియల్’ నుంచి ‘క్యాల్సిట్రియల్’గా మారుతుంది. ఈ క్యాల్సిట్రియాల్నే దాదాపుగా ‘విటమిన్–డి’ అనుకోవచ్చు. రక్తప్రవాహం ద్వారా ఇది మూత్రపిండాల్లోకి చేరినప్పుడు పూర్తిస్థాయి ‘విటమిన్–డి’గా రూపొందుతుంది. అంతేకాదు... వ్యాధి నిరోధకత కలిగించే కణాల్లోనూ ఈ విటమిన్ తయారవుతుంటుంది. అందుకే ఈ విటమిన్ అంతటి ప్రభావవంతమైన ‘సహజమైన వ్యాధినిరోధత కల్పించే కీలక జీవరసాయనం’గా పనిచేస్తుంది. ఇదీ చదవండి: Vinayaka Chavithi 2025 : ప్రపంచంలో కొలువైన ఈ గణపయ్యల గురించి తెలుసా?కనుగొన్న తీరు ఆద్యంతం ఆసక్తికరం... విటమిన్–డి ని కనుగొన్న తీరు ఒక థ్రిల్లర్ను తలపింపజేస్తుంది. కొన్ని శతాబ్దాల కిందట... ముఖ్యంగా నావికులు (సెయిలర్స్) ప్రపంచం (గ్లోబు)లోని కొత్త కొత్త ప్రాంతాలను కనుగొనడానికి నావికా ప్రయాణాలు చేసే రోజుల్లో రికెట్స్ అనే ఎముకల వ్యాధి చాలా ఎక్కువగా ఉండేది. మామూలు ప్రజల్లోనూ కనిపించే ఈ రికెట్స్ వ్యాధి నిల్వ ఉండే ఆహారాలు ఎక్కువగా తీసుకునే నావికుల్లో మరింత ఎక్కువగా కనిపిస్తుండేది.రికెట్స్ వ్యాధి వచ్చిన వాళ్లలో ఎముకలు తమ సహజ ఆకృతిని కోల్పోయి వంకర తిరగడం, కాళ్లు దొడ్డికాళ్లలా మారడం వంటి పరిణామాలు చోటుచేసుకునేవి. పిల్లల్లో వచ్చే రికెట్స్ను ‘ఆస్టోమలేసియా’ అనేవారు. దాదాపు వంద ఏళ్ల కిందట హాలెండ్, ఫ్రాన్స్, జర్మనీ వంటి దేశాల్లో ఈ రికెట్స్కు విరుగుడుగా వైద్యులు ‘కాడ్ లివర్ ఆయిల్’ అనే నూనెను ఉపయోగించేవారు. దీన్ని కాడ్ అనే రకం చేప కాలేయం నుంచి తయారు చేయడం వల్ల దాన్ని ‘కాడ్ లివర్ ఆయిల్’ అనే పిలిచేవారు. 1918లో ఎడ్వర్డ్ మెలాన్బీ అనే శాస్త్రవేత్త – కాడ్లివర్ ఆయిల్లోని కొవ్వులో కరిగే ఒకానొక పోషకం రికెట్స్ వ్యాధికి మంచి విరుగుడు అని తెలుసుకున్నాడు. ఆ తర్వాత 1924లో హెచ్. స్టీన్బాక్, ఆల్ఫ్రెడ్ ఫేబియన్ హెస్ అనే శాస్త్రవేత్తల పరిశోధనల్లో ఓ కొత్త విషయం తెలిసింది. అదేమిటంటే... సూర్యరశ్మిలోని అల్ట్రా వయొలెట్ కిరణాలు కొన్ని జీవులను తాకినప్పుడు... ఆ జీవుల్లో కొవ్వులాంటి ఓ పోషకం ఉత్పత్తి అవుతోందని కనుగొన్నారు. ఆ పోషకాన్ని తొలుత వాళ్లు ‘వయొస్టెరాల్’ అని పిలిచేవారు. ఇక 1935లో దీన్ని ల్యాబ్లో ఐసోలేట్ చేసి, దానికి ‘క్యాల్సిఫెరాల్’ అని పేరుపెట్టారు. ఆ తర్వాత అందులో కొద్దికొద్ది నిర్మాణపరమైన మార్పులతో ఉండే... అనేక రకాల విటమిన్ డి (డి1, డి2, డి3, డి4, డి5, డి6, డి7, డి8)లను కనుగొన్నారుఇతరత్రా అనేక ఆరోగ్య సమస్యల్లోనూ చికిత్స కోసం... ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడేవారికీ విటమిన్ ‘డి’ని వైద్యులు ప్రిస్క్రయిబ్ చేస్తారు. హై కొలెస్ట్రాల్తో బాధపడేవారికి, డయాబెటిస్, స్థూలకాయం ఉన్నవారికి, మల్టిపుల్ స్క్లెరోసిస్ రుమటాయిడ్ ఆర్థరైటిస్, క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మునరీ డిసీజ్ (సీఓపీడీ) ఉన్నవారికి, ఆస్తమా, బ్రాంకైటిస్ బాధితులకు, మహిళల్లో ప్రీ–మెన్స్ట్రువల్ సిండ్రోమ్తో బాధపడేవారికి, పంటి, చిగుళ్ల వ్యాధుల నివారణకు, అనేక రకాల చర్మం వ్యాధుల చికిత్సలో అంటే ఉదాహరణకు... విటిలిగో (బొల్లి), స్కిరోడెర్మా, సోరియాసిస్ వంటి చర్మరోగాలు ఉన్నవారికి డాక్టర్లు విటమిన్–డిని సూచిస్తారు. సోరియాసిస్ చికిత్సలో ‘క్యాల్సిట్రియల్’ లేదా ‘క్యాల్సిపోట్రియాల్ / క్యాల్సి ప్రొట్రిన్’ అనే రూపంలో విటమిన్–డిని పైపూతమందుగా పూస్తారు. ఇక విటమిన్–డి ఎన్నో రకాల క్యాన్సర్లను సమర్థంగా నివారిస్తుంది. క్యాన్సర్ కణాలను నాశనం చేస్తుంది. అందుకే అనేక రకాల క్యాన్సర్ల చికిత్సల్లో ‘విటమిన్–డి’ని ఒక మందులా డాక్టర్లు తమ ప్రిస్క్రిప్షన్లో సూచిస్తారు.విటమిన్ డి టాక్సిసిటీ అంటే.... ఇంతటి ఉపయోగకరమైన విటమిన్–డి ఉండాల్సిన మోతాదు కంటే మించితే... అది ప్రతికూల ఫలితాలకు దారి తీస్తుంది. ఉదాహరణకు సొంతంగా విటమిన్–డి మాత్రలు వాడటం, కాడ్లివర్ ఆయిల్ క్యాప్సూల్స్ తీసుకోవడం వల్ల రోజుకు 125 మైక్రో గ్రాముల మోతాదు దాటితే ఒక్కోసారి విపరీతంగా దాహం, కంట్లో కురుపులు, చర్మంపై దురదలు రావడం సాధారణం. దాంతోపాటు వాంతులు, నీళ్లవిరేచనాలు వంటివి కూడా కనిపించవచ్చు. ఒక్కోసారి రక్తనాళాల్లోని గోడలపైనా, మూత్రపిండాలలో క్యాల్షియమ్ పెచ్చులు (క్యాల్సిఫికేషన్) రావచ్చు. రక్తనాళాలతో పాటు కాలేయంలో, ఊపిరితిత్తుల్లో, మూత్రపిండాల్లో, కడుపులో క్యాల్షియమ్ మోతాదులు పెరిగే ప్రమాదం ఉంటుంది. అందుకే ఎండలో తిరగడం లేదా స్వాభావికమైన ఆహారం ద్వారా కాకుండా... ఇతరత్రా రూపాల్లో విటమిన్–డి తీసుకోవాల్సి వచ్చినప్పుడు కేవలం నిపుణుల సూచనల మేరకే, దేహానికి అవసరమైనప్పుడు మాత్రమే దాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. -డాక్టర్ శ్రీకృష్ణ ఆర్. బొడ్డుసీనియర్ కన్సల్టెంట్, ఫిజీషియన్ -నిర్వహణ: యాసీన్ -
99 కిలోలు నుంచి 59 కిలోలుకు..! నో స్ట్రిక్ట్ డైట్ కానీ
ఎన్నో వెయిట్ లాస్ స్టోరీల్లో డైట్, జిమ్ వంటి వాటితో బరువు తగ్గడం చూశాం. కానీ ఈ మహిళ చివరి వరకు స్థిరంగా ఉంటూ..తినే ఆహారంలో ఎలాంటి మార్పులు చేయకుండానే తగ్గింది. తాను రెగ్యులర్గా తీసుకునే డైట్నే తీసుకుంటూ వెయిట్ లాస్ అయ్యింది. అది తనకు ఏవిధంగా సాధ్యమైందో ఇన్స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసుకుంది. కొందరు క్రమశిక్షణతో కూడిన జీవనశైలి, మరికొందరు ఓపికకు పెద్దపీటవేసి బరువు తగ్గడం జరుగుతుంది. కానీ ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ సాచిపై నెమ్మదిగా, స్థిరమైన ప్రయత్నంతో అసాధారణ ఫలితాలను అందుకుంది. ఎలాంటి షార్ట్కట్లు, తీవ్రమైన డైట్లు అనుసరించలేదు. కేవలం క్వాండిటీలో మార్పు చేసింది. తాను రోజు తినే ఆహారంలో మార్పులేమి లేవు. కేవలం తీసుకునే క్వాండిటీనే తగ్గించి తీసుకునేది. అలగే మొదట 20 నిమిషాల నడక నుంచి మొదలు పెట్టి 60 నిమిషాల వరకు నడిచేలా ప్లాన్ చేసింది. అలా పదివేల అడుగులు పైనే తీసుకుంది. ప్రోటీన్ జోడించడమే గాక అల్పాహారం తప్పనిసరి చేసుకుంది డైట్లో. అలాగే తరుచుగా బరువు తగ్గానా లేదా అని అద్దంలో చూసుకోవడం నివారించాల్సిందేనంటా. అప్పుడే బరువు తగ్గడంలో గణనీయమైన మార్పులు సంభవిస్తాయట. తీసుకునే ఆహారం..సాధారణంగా మొదట డబల్ఎక్స్ఎల్లో ఉన వ్యక్తి తన సైజుని ఎక్స్ఎస్ సైజుకి మార్చుకునేలా వ్యాయమాలు కూడా హెల్ప్ అయ్యాయి. మొదటి ఐదు నుంచి ఆరు నెలలు ఇంట్లో చేసే సాధారణ వ్యాయామాలు చేయగా, ఆమె స్టామినా పెరిగే కొద్దీ..భారీగా బరువులు ఎత్తేలా జిమ్కి వెళ్లటం, పైలేట్స్ వంటివి జోడించినట్లు పేర్కొంది. మార్షల్ ఆర్ట్స్తో కలగలసిన ఈత వ్యాయామాలు తన మెరుగైన శరీరాకృతి మార్పుకి దోహదపడిందని చెప్పుకొచ్చింది. అలాగే తినే ఆహారంలో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండకుండా చూసుకునేదట. ముఖ్యంగా బ్రేక్ఫాస్ట్లో గుడ్డులోని తెల్లసొనతో అవకాడో, లెట్యూసక్ష, టమాటాలు, చికెన్ రోల్ చేసుకుని తినేదట. స్పైసీ రొయ్యల న్యూడిల్స్, హైడ్రేటెడ్గా ఉండేలా చూసుకోవడం, ఉల్లిపాయలు, క్యారెట్లు, బెల్పిప్పర్, క్యాబేజీ వంటి రంగురంగు కూరగాయలతో చేసిన స్పైసి రైస్ లేదా న్యూడిల్స్ తీసుకునేదట. వీటి తోపాటు ఫిష్ ఫ్రై, సలాడ్, పప్పు అన్నం, తదితరాలు తీసుకునేదట. ఇవి తనకు ఆకలిని నియంత్రించేలా చేసి, ఎక్కువగా ఆకలి వేయకుండా కపాడేదని పేర్కొంది. తాను స్థిరత్వం, సమతుల్యమైన ఆహారంతో ఇంతలా విజయవంతంగా బరువు తగ్గాగలిగానంటోందామె.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. View this post on Instagram A post shared by Saachi | Pilates. Fat Loss. Real Talk. (@saachi.pai) (చదవండి: నటి తనిష్టా ఛటర్జీ ఎదుర్కొంటున్న ఒలిగోమెటాస్టాటిక్ కేన్సర్ అంటే..! ఎందువల్ల వస్తుందంటే..) -
నటి తనిష్టా ఛటర్జీ ఎదుర్కొంటున్న ఒలిగోమెటాస్టాటిక్ కేన్సర్ అంటే..! ఎందువల్ల వస్తుందంటే..
అంతర్జాతీయ నటి తనిష్ట ఛటర్జీ దర్శకురాలు, మంచి యాక్టర్ కూడా. ఆమె ఎన్నో అంతర్జాతీయ అవార్డులు దక్కించుకుని..విమర్శకుల ప్రశంసలందుకున్న ప్రముఖ నటి. ఆమె ఇటీవల స్టేజ్ 4 ఒలిగోమెటాస్టాటిక్ కేన్సర్ బారిన పడినట్లు ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో పేర్కొంది. ఈ మహమ్మారితోనే తన తండ్రిని కోల్పోయింది. ఇప్పుడు అదే ప్రాణాంతక వ్యాధిబారిన పడి పోరాడుతోంది. తాను ప్రస్తుతం చికిత్స తీసుకునే కష్టతరమైన జర్నీలో ఉన్నానని వెల్లడించింది. ఇంతకీ అసలు ఏంటి ఈ కేన్సర్..? ఎందువల్ల వస్తుందంటే..ఒలిగోమెటాస్టాటిక్ కేన్సర్ అంటే..ఒలిగోమెటాస్టాటిక్ స్థితి అనేది కేన్సర్ వ్యాప్తి పరిమితంగా ఉన్న దశ. కేన్సర్ ఈ దశలో కొన్నిప్రాంతాలకు మాత్రమే వ్యాపించి ఉంటుంది. చెప్పాలంటే ఒకటి నుంచి ఐదు ప్రాంతాలకే వ్యాపింస్తుంది. అంటే ఇది పూర్తిగా ముందుగా కేన్సర్ని గుర్తించే పరిస్థితిగా పేర్కొనవచ్చని చెబుతున్నారు నిపుణులు. ఈ స్థితిలో చికిత్సకు మంచి అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. శస్త్రచికిత్స, రేడియేషన్, థెరపీ వంటి వాటితో నయం చేసే అవకాశం ఉంటుంది. చాలామటుకు బతికే ఛాన్స్లు ఉంటాయి. ఈ మెటాస్టాసిస్ అనే పదం గ్రీకు నుంచి ఉద్భవించింది. ఒలిగో అంటే మెటాస్టాసిస్. దీని అర్థం వలస. సాంప్రదాయకంగా మూడు కంటే తక్కువ సుదూర అవయవాలలో ఐదు కంటే తక్కువ కణితి గాయాలుగా పేర్కొంటారు వైద్యులు. సాంకేతిక సాయంతో త్వరితగతిని నయం చేయగల కేన్సర్గా పరిగణిస్తారు. ఎలా గుర్తిస్తారంటే..శరీరం పూర్తిగా స్కాన్ చేస్తారు, కాలి నుంచి తల వరకు ప్రతి చోట క్షుణ్ణంగా స్కాన్ చేసి..ఎక్కడైన కణితి గాయాలు ఉన్నాయా అని పరీక్షిస్తారు. ఒక వేళ FDG PET స్కాన్లో ఈ కణుతులు గుర్తించలేకపోతే పెట్ స్కాన్, కాంట్రాస్ట్ సీటీ స్కాన్ల సాయంతో గుర్తిస్తారు.మనుగడ రేటు అనేది స్కాన్లో మెటాస్టేజ్ల సంఖ్య, ఒలిగోమెటాస్టాసిస్ ప్రదేశం, స్థానిక చికిత్సలకు ప్రతిస్పందన, కణితి జీవశాస్త్రం, ఇమ్యునోథెరపీ, రోగి స్థితి ఆధారంగా నిర్ణయిస్తారని వైద్యులు చెబుతున్నారు. దీంతో భవిష్యత్తులో ఈ కణితి వచ్చే ప్రమాదం ఎంత ఉందనేది కూడా అంచనా వేయడం వంటివి కూడా ఉంటాయన్నారు. అయితే ఈ దశలో రోగి భయాందోళనలకు గురవ్వకుండా త్వరితగతిన నయం అయి బయటపడగలరని చెబుతున్నారు. ఎలా చికిత్స చేస్తారంటే..కణితి వ్యాపించిన పరిస్థితి ఆధారంగా శస్త్రచికిత్స, రేడియేషన్, ఎంబోలైజేషన్ వంటి చికిత్సలు అందిస్తారని చెబుతున్నారు. ఈ స్టేజ్ 4 ఒలిగోమెటాస్టాటిక్ దశ అనేది విజయవంతంగా వ్యాధికి చికిత్స అందించగల స్టేజ్ అని చెబుతున్నారు నిపుణులు. View this post on Instagram A post shared by Tannishtha Chatterjee (@tannishtha_c) (చదవండి: -
మైగ్రేన్తో బాధపడుతున్నారా? ఇవిగో బెస్ట్ యోగాసనాలు
తరచుగా తలనొప్పి , మైగ్రేన్ బాధపడుతున్నారా? మందులతో విసిగిపోయారా? ఆగండాగండి యోగా మీకు తప్పకుండా సాయపడుతుంది.. లోతైన శ్వాస వ్యాయామాలతో కలిపి మైండ్ఫుల్ ఆసనాలు, ఒత్తిడి, ఆందోళనను తగ్గించుకోవడం, మనస్సు ప్రశాంతంగా ఉంచుకోవడం, రక్త ప్రసరణను మెరుగు పర్చుకోవడం ఉపశమనం పొందవచ్చు. ఇవాల్టీ టిప్ ఆప్ ది డేలో భాగంగా మైగ్రేన్ తలనొప్పిని తగ్గించుకునేందుకు ఉపయోగపడే కొన్నియోగాసనాల గురించి తెలుసుకుందాం.దీర్ఘకాలిక తలనొప్పిని తగ్గించడానికి నెమ్మదిగా కదిలే, విశ్రాంతినిచ్చే యోగా ఉత్తమం. తలనొప్పి లేదా మైగ్రేన్తో బాధపడే ఎవరైనా వయస్సు లేదా ఫిట్నెస్ స్థాయితో సంబంధం లేకుండా ఈ యోగాసనాలను ప్రయత్నించవచ్చు. మైగ్రేన్ నుండి ఉపశమనం పొందడానికి సున్నితమైన, నెమ్మదిగా చేసే యోగా, ప్రాణాయామం, ధ్యానం చేయాలి. మైగ్రేన్ నొప్పిని ప్రేరేపించని లేదా తీవ్రతరం చేయని సున్నితమైన, విశ్రాంతినిచ్చే యోగా పద్ధతులను ఎంచుకోవాలి. ముఖ్యంగా బాలాసనం, సేతు బంధాసనం, శవాసనం వంటివి మేలు చేస్తాయి. వేగవంతమైన, శక్తివంతమైన యోగా, చేయకూడదు. ఎందుకంటే అవి మైగ్రేన్లను ప్రేరేపించగలవు. ప్రాణాయామం (శ్వాస వ్యాయామాలు):అనులోమ విలోమ (ముక్కు రంధ్రాలు మార్చి చేసే శ్వాస), బ్రహ్మరి (తేనెటీగ శబ్దం చేసే శ్వాస) వంటివి మనస్సును ప్రశాంతపరుస్తాయి .ఒత్తిడిని తగ్గిస్తాయి. ధ్యానం ద్వారా మనస్సును శాంతపర్చి, ఒత్తిడిని తగ్గిస్తుంది. మెడ, భుజాలు ,వెన్నెముకలో ఉద్రిక్తత తరచుగా తలనొప్పికి దోహదం చేస్తుంది. కనుక వీటిని “సున్నితంగా సాగదీయడం ఈ కండరాలను సడలిస్తుంది, లోతైన శ్వాస మెదడుకు ఆక్సిజన్ ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది. ఒత్తిడి, హార్మోన్లను తగ్గిస్తుంది. అతి చురుకైన నరాలను శాంతపరుస్తుంది. మైండ్ఫుల్ అభ్యాసాలుబాలాసనం: యోగా మ్యాట్మీద మోకాళ్లపై కూర్చోవాలి. తరువాత పాదాలపై పిరుదులు ఆనేలా కూర్చోవాలి. తరువాత నుదురు భాగం మ్యాట్కు తగిలేలా మెల్లిగా ముందుకు వంగాలి. తర్వాత రెండు చేతులను ముందుకు పూర్తిగా చాపాలి. అలా ఉండి నెమ్మదిగా శ్వాస తీసుకోవడం, వదలడం చేయాలి. శరీరం పూర్తిగా విశ్రాంతి తీసుకోనివ్వాలి. 30 సెకన్ల పాటు ఈ ఆసనం వేసినా చాలు. బాలాసనంతో ఒత్తిడిని తగ్గించి, శారీరకంగా మరియు మానసికంగా ఆరోగ్యంగా ఉండటానికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది మోకరిల్లి, ముందుకు మడిచి, మీ నుదిటిని నేలపై లేదా కుషన్పై ఉంచండి. ఇది భుజం, మెడ మరియు నుదిటి ఉద్రిక్తతను తక్షణమే తగ్గిస్తుంది.అధో ముఖ స్వనాసన: అధో ముఖ స్వనాసన అరచేతులు , పాదాలను నేలపై ఉంచి తుంటి భాగాన్ని (సూర్య నమస్కారంలో చేసినట్టుగా)పైకి లేపడం. వెన్నెముకను బలాన్నిస్తుంది. నడుము నొప్పిని తగ్గిస్తుంది. మెదడులో రక్త ప్రసరణను మెరుగుపరిచి దాని పనితీరును మెరుగుపరుస్తుంది. తలకు రక్త ప్రసరణను అందించి రిఫ్రెష్ చేస్తుంది.విపరీత కరణి: విపరీత కరణి అంటే "ప్రవాహానికి వ్యతిరేకం" అనే సంస్కృత అర్థాన్ని సూచించే యోగా భంగిమ. దీనిని "లెగ్స్ అప్ ది వాల్ పోజ్" అని కూడా పిలుస్తారు. వెల్లకిలా పడుకుని , కాళ్ళు , పాదాలను గోడకు ఆనించాలి. అరచేతులు క్రిందికి ఎదురుగా ఉండేలా చేతులను శరీరానికి దగ్గరగా ఉంచండి.ఆలోచనకు కళ్లెం వేసి, తలనొప్పి ఒత్తిడిని తగ్గిస్తుంది.సుప్త బద్ధ కోణాసన : ఇది పడుకుని చేసే సీతాకోకచిలుక భంగిమ. మనస్సును ప్రశాంతపరుస్తుంది. నేలపై వెల్లకిలా పడుకుని, పాదాల అరికాళ్ళను ఒకదానికొకటి తాకించి, మోకాళ్ళను పక్కలకు వంచండి. కావాలంటే వెన్నెముక కింద కుషన్ పెట్టుకోవచ్చు. ఈ భంగిమలో కొంత సమయం పాటు విశ్రాంతి తీసుకోండి. ఇది ఒత్తిడిని తగ్గిస్తుంది. హార్మోన్లను సమతుల్యం చేయడంలో, నిద్రను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఆందోళనతోవచ్చిన తలనొప్పిని తగ్గిస్తుంది.సేతు బంధాసనం: ఈ భంగిమ నొప్పి నుండి ఉపశమనం కలిగించడంలో సహాయపడుతుంది.శవాసన (శవ భంగిమ): రిలాక్స్డ్, ఫ్లాట్గా పడుకోండి. ఈ అంతిమ విశ్రాంతి భంగిమ మీ నాడీ వ్యవస్థను రీసెట్ చేస్తుంది. విశ్రాంతి కోసం ఈ ఆసనం చాలా ముఖ్యమైనది. ఒత్తిడిని తగ్గిస్తుంది. మనసుకు ప్రశాతంతనిచ్చి, నొప్పులను తగ్గిస్తుంది.నోట్ : అవగాహనకోసం, తాత్కాలిక ఉపశమనం కోసం అందించిన చిట్కాలుమాత్రమే. మైగ్రేన్ మరింతగా బాధిస్తోంటే వైద్యుడిని సంప్రదించం మేలు, అలాగే యోగా నిపుణుని సలమా మేరకు యోగాను ప్రారంభించడం చాలా ముఖ్యం. -
భర్తను కాపాడుకునేందుకు భార్య లివర్ దానం.. కానీ ఇద్దరూ!
శరీరంలో కీలకమైన ఏదైనా అవయవం పాడైపోయి.. ప్రాణాపాయస్థితిలో ఉన్నపుడు అవయవ మార్పిడి ఒక్కటే మార్గం. అలా దానం చేసే అవకాశం ఉన్న ఆవయవాల్లో ముఖ్యమైనవిగా కిడ్నీలు, లివర్. ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులు తమ అవయవాలను దానం చేయడంమంటే అవతలివ్యక్తికి ప్రాణ దానం చేయడమే. కానీ భర్తను కాపాడుకునేందుకు తన అవయవాన్ని దానం చేసిన సంతోషం.. అంతలోనే విషాదంగా మారింది. మహారాష్ట్ర ఆరోగ్య శాఖ పూణేలోనిఒక ప్రయివేటు ఆస్పత్రిలో జరిగిన ఈ ఘటన కలకలం రేపింది.భర్తకు తన కాలేయంలో కొంత భాగాన్ని దానం చేసిన ఒక మహిళ మార్పిడి శస్త్రచికిత్స తర్వాత కొన్ని రోజులకే మరణించింది. దీనితో మహారాష్ట్ర ఆరోగ్య శాఖ పూణేలోని సహ్యాద్రి ఆసుపత్రికి నోటీసు జారీ చేసింది. మార్పిడి ప్రక్రియకు సంబంధించిన అన్ని వివరాలను సమర్పించాలని ఆదేశించినట్లు ఆరోగ్య సేవల డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ నాగనాథ్ యెంపల్లె ఆదివారం తెలిపారు. గ్రహీత, దాత వివరాలు, వారి వీడియో రికార్డింగ్లు, చికిత్స విధానం అన్నింటి వివరాలను అందించాలని ఆసుపత్రిని కోరామని చెప్పారు.ఈ కేసులో భర్త, రోగి బాపు కోమ్కర్, అతనికి లివర్ దానం చేసిన భార్య కామిని ఆగస్టు 15న ఆసుపత్రిలో శస్త్రచికిత్సలు చేయించుకున్నారు. మార్పిడి శస్త్రచికిత్స తర్వాత బాపు కోమ్కర్ ఆరోగ్యం క్షీణించి, ఆగస్టు 17న మరణించాడు. మరోవైపు ఇన్ఫెక్షన్ కారణంగా కామిని ఆగస్టు 21న కన్నుమూసింది. దీనికి ఆస్పత్రి నిర్లక్ష్యమే కారణమని బంధువులు, కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. తమ బంధువులిద్దరి మరణాలపై విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నారు.అయితే ప్రామాణిక వైద్య ప్రోటోకాల్ల ప్రకారం శస్త్రచికిత్సలు జరిగాయని ఆసుపత్రి పేర్కొంది. దర్యాప్తులో అధికారులతో పూర్తిగా సహకరిస్తున్నామని వివరించింది. అనేక సమస్యలతో బాపు కోమ్కర్ చాలా తీవ్రమైన పరిస్థితిలో తమ వద్దకు వచ్చాడని, లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చాలా క్లిష్టమైన ఆపరేషన్అని పేర్కొన్నారు. ఈ విషంలోవారికి పూర్తిగా అన్ని విషయాలు వివరించి కౌన్సెలింగ్ అందించామని ఆసుపత్రి పేర్కొంది. దురదృష్ట వశాత్తు, మార్పిడి తర్వాత గ్రహీతకు కార్డియోజెనిక్ షాక్ వచ్చిందని తెలిపింది. అలాగే కామిని తొలుత బాగా కోలుకున్నప్పటికీ, సెప్టిక్షాక్ కారణంగా చనిపోయిందని వెల్లడించింది. కానీ ఈ కష్టకాలంలో బాధిత కుటుంబంపై తమకు సానుభూతి ఉందని తెలిపింది. నోట్ : ప్రస్తుత సమాజంలో అవయవ దానం ఆవశ్యకత బాగా పెరుగుతోంది. ఎలాంటి భయాలు, ఆందోళనలు లేకుండా పూర్తి అవగాహనతో అవయదానం చేయాల్సిన అవసరం ఉంది. ఇందులోకు కుటుంబ సభ్యులు, ఇతర అర్హులైన వారు ముందుకు రావాలి. దాని కంటే ముందు అనారోగ్య పరిస్థితి మరింత ముదరకుండా జాగ్రత్త పడటం, చక్కటి జీవనశైలి అలవర్చుకోవడం చాలా ముఖ్యం. ఇదీ చదవండి: అందమైన హారాన్ని షేర్ చేసిన సుధామూర్తి , విశేషం ఏంటంటే! -
బొజ్జలు కాదు.. కండలు పెంచగలం..!
‘మనం బొజ్జలనే కాదు.. అందమైన ఆకృతితో కూడిన కండలను పెంచగలం.. అయితే దీనికి సరైన సమయంలో సరైన మార్గనిర్దేశం అవసరం. అప్పుడే సాధన ఫలితాలనిస్తుంది.. కండలు పెంచేందుకు జెనిటిక్స్తో ఎలాంటి సంబంధం లేదు. బాడీ బిల్డింగ్పై ఉన్న అపోహలు, తెరలు తొలగిపోవాలి. అప్పుడే అంతర్జాతీయ స్థాయిలో మనం సత్తా చూపించగలం’ అని సినీనటుడు అల్లు శిరీష్ అన అభిప్రాయాన్ని వెల్లడించారు. శంషాబాద్ క్లాసిక్ కన్వెన్షన్లో ‘డెక్కన్ అప్రైజింగ్–2025 పేరిట ఐసీఎన్ (ఐ కాంపీట్ నేచురల్) సంస్థ నిర్వహించిన సహజసిద్ధ శరీర దృఢత్వ పోటీలు ఆదివారం ముగిశాయి. ఈ సందర్భంగా అవార్డు గ్రహీతలను, నిర్వాహకులను ఆయన అభినందించారు. అనంతరం ఫిట్నెస్పై తన అభిప్రాయాలను పంచుకున్నారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. గుర్తింపు అవసరం.. ప్రపంచస్థాయిలో బాడీ బిల్డింగ్కి మంచి గుర్తింపు ఉంది. ఇందులో రాణించిన అథ్లెట్లు కోట్ల రూపాయలు సంపాదిస్తారు. మన దేశంలో మాత్రం బాడీ బిల్డర్లు కోచ్లుగా మాత్రమే మిగిలిపోతున్నారు. క్రికెట్, టేబుల్ టెన్నిస్ తదితర క్రీడలకు మన దేశంలో ఇచ్చిన ప్రాధాన్యత బాడీబిల్డింగ్కు కూడా దక్కేలా చర్యలు తీసుకోవాలి. అనేక అపోహలు.. శరీర దారుఢ్యానికి మందులు, స్టిరాయిడ్లు వాడతారనే అపోహల కారణంగా చాలా మంది దీనికి దూరంగా ఉంటున్నారు. అవేవీ అవసరం లేకుండా కూడా సరైన సమయంలో సరైన కోచ్ ద్వారా శిక్షణ తీసుకుని సాధన చేస్తే అంతర్జాతీయ అథ్లెట్లను తయారు చేసుకోవచ్చు.. ఐసీఎన్ లాంటి సంస్థలు ఆ దిశగానే కృషి చేస్తున్నాయి.. అందుకే ఎంతో ఇష్టంతో గత రెండేళ్లుగా ఇక్కడికి వచ్చి అథ్లెట్లను ప్రొత్సహిస్తున్నాను. రెండు రాష్ట్రాలకు చెందిన నాలుగు వందల మంది యువత ఈ పోటీల్లో పాల్గొన్న తీరు చూస్తుంటే మన వద్ద కూడా ఫిట్నెస్పై అవగాహన పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. నాకు తగ్గ కథ వస్తే..కండలు పెంచేందుకు జన్యుపరమైన సంబంధాలేవీ లేవు. ఫిట్నెస్కు రాంగ్రూట్, షార్ట్కట్స్ ఎంత మాత్రం సరైంది కాదు. శరీర తత్వం బట్టి బొజ్జలు వస్తాయనే ప్రచారం సరికాదు. సహజంగానే ఫిట్నెస్ అంటే నాకు ఎంతో ఇష్టం. నా ఎత్తు, బరువు, ఆకృతికి అనువైన మంచి స్పోర్ట్స్ కథ వస్తే అలాంటి సినీమా చేయడానికి ఉత్సాహంగా ఉన్నాను. ఇప్పటి వరకూ వచ్చిన క్రికెట్, రన్నింగ్, ఫుట్బాల్ వంటి కథలు కాకుండా కొత్తగా ఉంటే బాగుంటుంది. (చదవండి: ఉత్తర భారత్ హెరిటేజ్ టూర్..!) -
వాన వెలిసినా... ముసిరే వ్యాధులు
ఇటు తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్లలో ఇటీవల కురినిన భారీ భారీ వర్షాల తర్వాత ఇరు రాష్ట్రాలు జలమయం కావడం, రోడ్లు మునిగిపోవడంతోపాటు అవి ప్రజల ఆరోగ్యానికీ ముప్పు తెచ్చిపెడుతున్నాయి. ఈ వర్షాల తర్వాత చాలా ఆసుపత్రులూ, క్లినిక్స్లో నిమోనియా, ఫ్లూ కేసులు పెరుగుతున్నాయి. సాధారణంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసేటప్పుడు, కురిశాక ఉండే తేమతో కూడిన వాతావరణంలో ఈ కేసులు పెరగడం సాధారణం. ఇలాంటి సందర్భాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చేయించాల్సిన చికిత్స వంటి అనేక అంశాలపై అవగాహన కోసం ఈ కథనం. వర్షాల అనంతరం నిమోనియా, ఇన్ఫ్లూయెంజా (ఫ్లూ) కేసులు విపరీతంగా పెరుగుతుండటంతో అంతటా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇవి అన్నిరకాలుగా ఆరోగ్యంగా ఉండే యువతతో పోలిస్తే... వ్యాధి నిరోధక శక్తి కాస్త తక్కువగా ఉండే వయోవృద్ధులు, చిన్నపిల్లలు, గర్భిణుల్లో ఎక్కువగా కనిపిస్తుంటాయి. అలాగే అప్పటికే అనారోగ్యాలతో బాధపడేవారిలో రోగనిరోధకత తక్కువగా ఉండటంతో వాళ్లు నిమోనియా, ఫ్లూ వంటి వర్షాకాలపు సమస్య ల బారిన వేగంగా పడే అవకాశముంది. అంతేకాదు... వ్యాధి నిరోధకత తక్కువ గా ఉండే ఇమ్యూనో కాంప్రమైజ్డ్ వ్యక్తుల్లో ఇది ఒక్కోసారి ప్రాణాపాయం లాంటి తీవ్రమైన ముప్పునకూ దారితీసే ప్రమాదం లేకపోలేదు.వర్షాకాలంలో ముప్పుఎందుకు ఎక్కువంటే... వర్షాకాలంలో ఉండే అధిక తేమ, తడి వాతావరణం వంటివి ఫంగస్ పెరుగుదలకు తోడ్పడతాయి. దాంతో ఆ పెరుగుదల వల్ల అవి శ్వాసనాళాల్లోకి ప్రవేశించినప్పుడు ఆస్తమా వంటి శ్వాసకోశ వ్యాధులకు అవకాశం పెరుగుతుంది. క్రౌడింగ్ : వర్షాల కారణంగా ప్రజలు గుంపులు గుంపులుగా చాలా దగ్గరి దగ్గరిగా ఉంటారు. అదీగాక ఇక లోతట్టు ప్రాంతాల వాళ్లనందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించి ఒకేచోట గుంపులుగా ఉంచడంతో ప్రజలు మరింత దగ్గరిదగ్గరిగా ఉండాల్సి వస్తుంది. పైగా మూసినట్టుగా ఉన్న గదుల్లో (క్లోజ్డ్ ఇన్–డోర్స్ మధ్యన, వెంటిలేషన్ సరిగా లేని చోట్లలో) ఉండటం వల్ల వైరస్లు ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే అవకాశాలెక్కువ. ఉపరితలాలను తాకడం వల్ల : తలుపులు తీసేటప్పుడు డోర్స్ హ్యాండిల్స్ను తప్పక తాకుతూ తీయాల్సి వస్తుంది. ఒకరి చేతులనుంచి డోర్స్ నాబ్స్, డోర్ హ్యాండిల్స్పై చేరుకున్న వైరస్లు మరొకరు వాటిని ముట్టుకోగానే వారికీ అంటుతాయి. పైగా వర్షాకాలం లాంటి చల్లటి తడి వాతావరణంలో డోర్నాబ్స్పై ఉండే సూక్ష్మజీవులు మరింత ఎక్కువ కాలం జీవించి ఉంటాయి. ఇలా ఈ మార్గంలో వైరస్లూ, బ్యాక్టీరియా వ్యాపించడాన్ని ‘ఫొమైట్ ట్రాన్స్మిషన్’ అని కూడా అంటారు. రొటీన్ దెబ్బతినడం వల్ల (డిస్రప్టెడ్ రొటీన్): బయట వర్షం కురుస్తుండటం వల్ల తాము వెళ్లాల్సిన పనులకు వెళ్లలేకపోవడంతో రొటీన్ దెబ్బతింటుంది. దీనివల్ల రోజులో తినేవేళలూ, నిద్రవేళలూ ఇవన్నీ క్రమం తప్పుతాయి. దాంతో కొత్త వైరస్లు రూపొందే ముప్పు: వానాకాలం లాంటి సీజన్లలో ప్రజలు దగ్గర దగ్గరగా ఉన్నప్పుడు వైరస్ల తాలూకు కొత్త స్టెయిన్లూ, బ్యాక్టీరియల్, ఫంగల్ తాలూకు దుష్ప్రభావాలు పెరుగుతాయి. సాధారణంగా వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉండే పెద్దవయసు వారిలో, చిన్న పిల్లల్లో ఈ స్ట్రెయిన్స్ వ్యాపించాక... వారి నుంచి ఇంకొన్ని స్టెయిన్స్ రూపొందడం... ఇలా సరికొత్తగా రూపొందిన వైరస్లు చాలా చురుగ్గా (విరులెంట్గా) ఉండటం వల్ల అవి వేగంగా వ్యాపిస్తూ మరింత నష్టం కలగజేస్తాయి.ఎవరెవరిలో ముప్పు ఎక్కువంటే... వయోవృద్ధులు (65+), చిన్నపిల్లలు, గర్భిణులు. గుండె, ఊపిరితిత్తుల వ్యాధులు, డయాబెటిస్, హైబీపీ లేదా వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు తడి వాతావరణంలో, గదుల్లో గుంపులుగా ఉండేవాళ్లూ / తాత్కాలిక ఆశ్రయాల్లో ఉన్నవారు ∙వ్యాక్సిన్ తీసుకోని పెద్దవయసు వాళ్లలో... ఈ సీజన్ అనంతర వ్యాధుల ముప్పు ఎక్కువ. ఫ్లూ/న్యుమోనియాలను గుర్తించడమెలా? ఫ్లూ లక్షణాలు: ఇది వైరస్లో వచ్చే సమస్య కాబట్టి ఆకస్మికంగా తీవ్ర జ్వరం (హైఫీవర్); ఒళ్లు నొప్పులు; గొంతు నొప్పి; తీవ్రమైన అలసట / నీరసం / నిస్సత్తువ; ఎడతెరిపి లేకుండా దగ్గు. అయితే కొన్ని కేసుల్లో ఇది నిమోనియా వంటి సెకండరీ ఇన్ఫెక్షన్కు దారితీసే అవకాశం. నిమోనియా లక్షణాలు: విపరీతంగా దగ్గు వస్తూ కళ్లె (మ్యూకస్) పడుతూ ఉండటం; ఛాతీలో నొప్పి, ఆయాసంతో ఎగ శ్వాస తీసుకుంటూ ఉండటం; తీవ్రమైన అలసట, నీరసం, నిస్సత్తువ; పెద్దవయసు వారిలో పరిస్థితులు మరింత తీవ్రమవుతుండటం; అయోమయానికి గురికావడం; ఆకలిలేకపోవడంతక్షణం వైద్యుడిని సంప్రదించాల్సిన పరిస్థితులు..శ్వాస తీసుకోవడంలో తీవ్రమైన ఇబ్బంది; పెదవులు నీలంగా మారడం, ఛాతీ లేదా కడుపులో తీవ్రమైన నొప్పి, అయోమయం, నీళ్లు తాగలేక΄ోవడం / ద్రవపదార్థాలు తీసుకోలేక΄ోవడం. ∙కొన్ని వైద్య పరీక్షలు : వ్యక్తిగతంగా పరీక్షించడం (క్లినికల్ ఎగ్జామినేషన్స్), కొన్ని రక్తపరీక్షలు, ఛాతీ ఎక్స్రే లేదా అవసరమైతే కొన్ని ఇమేజింగ్ పరీక్షలు.వానాకాలపు జాగ్రత్తలు / నివారణలు...వ్యాక్సిన్: ప్రతి ఏడాదీ ఫ్లూ వ్యాక్సిన్ తప్పనిసరిగా తీసుకోవడం; వయోవృద్ధులు, వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు తప్పనిసరిగా న్యుమోకోకల్ వ్యాక్సిన్ తీసుకోవడం. హైజీన్ : వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం, ఇల్లు, ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవడం, కిటికీలు, తలుపులు తెరచి గదులు తేమ లేకుండా పొడిగా ఉంచుకోవడం, ఇళ్లలో (ఆ మాటకొస్తే బయట కూడా) పొగతాగకుండా/ ఇల్లు ΄÷గచూరకుండా చూసుకోవడం ∙తరచూ చేతులు కడుక్కోవడం, ఇంట్లో ఎవరు అనారోగ్యంగా ఉన్నా అందరూ మాస్కులు వాడటం.చికిత్స...వయోవృద్ధులు, పెద్దవాళ్లు, గర్భిణులు, చిన్నారులు... వీళ్లు ఎవరైనా జబ్బుపడితే వెంటనే డాక్టర్ను సంప్రదించడం. పోషకాహారం తీసుకోవడం; తగినంత నీరు తాగుతూ ఒంటిని హైడ్రేటెడ్గా ఉంచుకోవడం; తగినంత విశ్రాంతి; కంటినిండా నిద్ర, డాక్టరు సూచించిన మందుల్ని (యాంటీ వైరల్, యాంటీ బయాటిక్స్ వంటివి) క్రమం తప్పకుండా వాడటం. అవసరాన్ని బట్టి ఆక్సిజన్ మాస్క్ లేదా నెబ్యులైజేషన్ పెట్టడం. పై జాగ్రత్తలతో ఈ వానాకాలంలో ఫ్లూ, నిమోనియా, సెకండరీ నిమోనియా రిస్కులను విజయవంతంగా ఎదుర్కోవడమే కాకుండా, నివారణ పద్ధతులు అనుసరిస్తూ, ముందుజాగ్రత్తలు తీసుకుంటూ ఇంటిల్లిపాదీ వ్యాధులకు దూరంగా కూడా ఉండవచ్చు. డాక్టర్లను ప్రజలు ఎక్కువగా అడుగుతుండే ప్రశ్నలు...ప్రశ్న : మా అబ్బాయికి జలుబు చేసి (ఫ్లూ వచ్చి) తగ్గినప్పటికీ దగ్గు ఎందుకిలా వారాల తరబడి ఉంటోంది? డాక్టర్ జవాబు : వైరస్ వచ్చి తగ్గాయ (పోస్ట్–వైరల్ సెన్సిటివిటీ) లేదా నిమోనియాలాంటి ఇన్ఫెక్షన్ వల్ల ఇలా జరుగుతుండవచ్చు.ప్రశ్న : అల్లం కలిపిన గోరువెచ్చని నీళ్లు తాగడం లాంటి చిట్కాల వల్ల ప్రయోజనం ఉంటుందా? డాక్టర్ జవాబు : ఇలాంటి ఇంటి చిట్కాలు లక్షణాలను కొంతవరకు తగ్గించవచ్చు. కానీ వ్యాక్సిన్ వేయించుకోవడం / వైద్య చికిత్స తీసుకోవడమే పూర్తి రక్షణ ఇస్తాయి.ప్రశ్న : మాస్కులు తొడగడం తప్పనిసరా? డాక్టర్ జవాబు మాస్కులు తొడుక్కోవడం, చేతులు కడుక్కోవడం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం వంటి జాగ్రత్తలు తప్పనిసరిగా అనుసరించాలి.డాక్టర్ గంగాధర్ రెడ్డి మల్లు, సీనియర్ పల్మనాలజిస్ట్, స్లీప్ మెడిసిన్ స్పెషలిస్ట్ (చదవండి: మేని కాంతికి మెరుగైన చికిత్స..!) -
రుతుక్రమం వాయిదా వేసే మాత్రలు వాడొచ్చా..?
నా వయసు ఇరవై ఐదు సంవత్సరాలు. పెళ్లి నిశ్చయమైంది. త్వరలో ఒక కుటుంబ కార్యక్రమం ఉంది. ఆ సమయానికి రుతుక్రమం రాకుండా వాయిదా వేసే మాత్రలు వాడాలని మా ఇంట్లో అందరూ చెబుతున్నారు. కాని, వాటి వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు వస్తాయో, భవిష్యత్తులో గర్భధారణకు ఇబ్బందులు కలుగుతాయో తెలుసుకోవాలని ఉంది.– ప్రియాంక, హైదరాబాద్మీ వయసు, శరీర పరిస్థితి, రుతుక్రమం సక్రమంగా జరుగుతుందా లేదా అన్న విషయాలను ముందుగా పరిశీలించడం అవసరం. రుతుక్రమం వాయిదా వేసే మాత్రలు సాధారణంగా అధిక మోతాదు ప్రొజెస్టెరాన్ హార్మోన్లు కలిగి ఉంటాయి. ఇవి శరీరంలో సహజంగా ఏర్పడే హార్మోన్ల సమతుల్యాన్ని మార్చి, గర్భాశయంలో ఏర్పడిన పొర ఊడిపోకుండా అడ్డుకుంటాయి. మాత్రలు వాడుతున్నంత కాలం రుతుక్రమం రాదు. కాని, ఆపిన తరువాత గర్భాశయ పొర ఒకేసారి ఊడిపోవడం వల్ల ఎక్కువ రక్తస్రావం జరగవచ్చు. తరచుగా వాడితే రుతుక్రమం అసాధారణంగా మారడం, గర్భసంబంధిత సమస్యలు రావచ్చు. గతంలో ఇలాంటి మాత్రలు వాడిన మహిళల్లో అండాల ఉత్పత్తి తగ్గిపోవడం, ఆరోగ్యకరమైన అండాల లభ్యత తగ్గడం వలన గర్భధారణలో ఇబ్బందులు ఎదురైన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఈ సమస్య సర్దుకోవడానికి కొంతమందికి నెలల తరబడి లేదా సంవత్సరాల పాటు సమయం పడుతుంది. తాత్కాలిక దుష్ప్రభావాలలో మానసిక భావప్రకటన మార్పులు, అజీర్ణం, వాంతులు, మైగ్రేన్ తలనొప్పి, స్తనాల నొప్పి, బరువు పెరగడం ఉంటాయి. అధిక బరువున్నవారు వాడితే రక్తం గడ్డకట్టడం, గుండె సంబంధిత వ్యాధులు, ఊపిరితిత్తుల సమస్యలు, మెదడులో రక్తనాళాలు మూసుకుపోయే ప్రమాదం ఎక్కువ. కుటుంబంలో క్యాన్సర్, అధిక రక్తపోటు, గుండె సమస్యల చరిత్ర ఉన్నవారు లేదా ఇప్పటికే రక్తపోటు ఉన్నవారు ఈ మాత్రలు వాడకూడదు. దీర్ఘకాలంగా వాడితే శాశ్వత ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంది. కాబట్టి రుతుక్రమం వాయిదా వేసే ముందు తప్పనిసరిగా డాక్టర్ని కలసి, శరీర పరిస్థితి అంచనా వేయించు కోవాలి. తక్కువ మోతాదులో ఉండే మాత్రలను, కార్యక్రమానికి ఒకటి రెండు నెలల ముందు ప్రారంభిస్తే కొంత సురక్షితంగా వాడవచ్చు. భవిష్యత్తులో గర్భధారణకు సిద్ధమవుతున్న వారు అనవసరంగా ఈ మాత్రలను వాడకూడదు. ఎందుకంటే ఇవి గర్భంలో శిశువు అభివృద్ధికి అవసరమైన హార్మోన్లపై ప్రభావం చూపవచ్చు. కాబట్టి మీ వయసు, ఆరోగ్య చరిత్ర, ప్రస్తుత రుతుక్రమ స్థితి ఇవన్నీ పరిశీలించి, వైద్యుని సలహా తీసుకుని మాత్రమే నిర్ణయం తీసుకోవాలి.నా వయసు పద్దెనిమిదేళ్లు. మొదటి నుంచే నాకు పీరియడ్స్ రెగ్యులర్గా రావు. ఈ అక్టోబర్ నెలలో దసరా పండుగకు మేము ఇంట్లో దేవుడికి పెద్దగా పూజ చేద్దామని అనుకుంటున్నాం. కాబట్టి, ఆ సమయంలో పీరియడ్స్ రాకుండా పోస్ట్పోన్ లేదా ప్రీపోన్ టాబ్లెట్లు వాడవచ్చా?– స్వాతి, విజయవాడమీ పీరియడ్స్ రెగ్యులర్గా లేనందున, వచ్చే నెలలో పీరియడ్స్ ఏ తేదీన వస్తాయో ముందుగా చెప్పడం కష్టం. అందుకే ఆ తేదీని ముందుకు తేవడం లేదా వెనక్కు మార్చడం ఈ పరిస్థితిలో కష్టమైన పని. సాధారణంగా, పీరియడ్స్ సరిగ్గా వచ్చే వాళ్లకి, తేదీకి కొన్ని రోజులు ముందు హైడోస్ హార్మోన్ మాత్రలు ఇస్తే పీరియడ్స్ వాయిదా వేయవచ్చు. కాని, మీలా నెలసరి క్రమం తప్పి ఉన్నవాళ్లకి ఇది సురక్షితం కాదు. ఈ మాత్రలు వాడితే వికారం, వాంతులు, తలనొప్పి, పొత్తికడుపు నొప్పి, మూడ్ స్వింగ్స్ వంటి సమస్యలు రావచ్చు. కొన్ని సందర్భాల్లో రక్తం గడ్డకట్టడం, కాలేయానికి నష్టం వంటి తీవ్రమైన సమస్యలు కూడా రావచ్చు. వీటిని తరచుగా వాడితే పీరియడ్స్ ఇంకా అస్తవ్యస్తంగా మారే అవకాశం ఉంది. మీ వయసులో పీరియడ్స్ రెగ్యులర్గా కాకపోవడం సహజం. ఎందుకంటే ఈ వయసులో శరీరం ఇంకా మార్పులు పొందుతూ ఉంటుంది. చాలా అమ్మాయిల్లో ఇది ఇరవై ఏళ్ల వరకు క్రమంగా సర్దుకుంటుంది. కాని, పీరియడ్స్ ఎప్పుడూ రెగ్యులర్ కాకపోతే, పీసీఓఎస్ (పాలీసిస్టిక్ ఓవరీస్ సిండ్రోమ్), థైరాయిడ్ సమస్యలు, అధిక బరువు, తక్కువ బరువు, ఒత్తిడి, నిద్రలేమి, సరైన ఆహారం తీసుకోకపోవడం వంటి కారణాలు కూడా ఉండవచ్చు. నా సలహా ఏమిటంటే, కేవలం పూజల కోసమే హార్మోన్ మందులు వాడడం కంటే, ముందుగా మీ సమస్యకు గల అసలు కారణాన్ని గుర్తించి చికిత్స చేయించుకోవడం ఉత్తమం. ఇలా చేస్తే మీ సైకిల్ సరిగా వచ్చి, భవిష్యత్తులో గర్భధారణ సామర్థ్యం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. ముఖ్యంగా ఫార్మసీ నుంచి ఇలాంటి మందులను స్వయంగా అసలు కొనకండి.డాక్టర్ భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్ (చదవండి: అనాథశ్రమంలో పెరిగి ఐఏఎస్ అయ్యాడు..! ట్విస్ట్ ఏంటంటే..) -
ఇలా చేస్తే వారం రోజుల్లో 6 కేజీల వరకూ తగ్గే అవకాశం!
నగరం బరువెక్కుతోంది.. స్థూలకాయంతో బాధపడేవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఓవైపు పని ఒత్తిడి, మరోవైపు డిప్రెషన్ దీనికి తోడు పోషకాహార లోపం ఇవన్నీ క్రమంగా నగరవాసులను రోగాలవైపు నెడుతున్నాయి. ఫలితంగా నగరవాసుల శరీరాకృతుల్లో భారీ మార్పులు చోటుచేసుకుంటున్నాయని, తద్వారా ఒబెసిటీతో బాధపడుతున్న వారి సంఖ్య భారీగా పెరుగుతోంది. ముఖ్యంగా మహిళల్లో ఈ పోషకాహార లోపం మరీ ఎక్కువగా ఉంది. దీంతో అలసట, కీళ్ల నొప్పులు, చిరాకు వంటి సమస్యలతో బాధపడుతున్నారని ఇటీవల నగరంలో నిర్వహించిన వెయిట్ గెయిన్ ట్రెండ్స్ సర్వే వెల్లడిస్తోంది. ఈ కారణంగా బీపీ, షుగర్ వంటి ఇతర రోగాలు చుట్టుముడుతున్నాయని, ఆహారపు అలవాట్లు కూడా దీనికి ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు.. – సాక్షి, సిటీబ్యూరో చుట్టూ ఎత్తయిన భవనాలు.. అద్దాల మేడలు.. ఖరీదైన కార్లు.. అత్యాధునిక వసతులు. చూడ్డానికి విలాసవంతమైన జీవితం.. అంతా బానే ఉందిగా!.. ఇది నాణేనికి ఓ వైపు మాత్రమే.. వాస్తవానికి అవతలవైపు చూస్తే.. ఉరుకుల పరుగుల జీవనం, నిత్యం పని ఒత్తిడి, తీరికలేని జీవితం, ఆందోళన, డిప్రెషన్, ఉద్యోగ భద్రత గురించిన ఆలోచన, లోన్లు, ఈఎంఐల భయాలు, నెలవారీ ఖర్చులు, లక్షల్లో పిల్లల ఫీజులు, నెలాఖరుకు జీరో బ్యాలెన్స్ అకౌంట్లు ఇది సగటున నగర జీవిని వేధిస్తోన్న ప్రధాన సమస్య.. ఫలితంగా ఒత్తిడికి లోనై కంటికి కనిపించని రోగాలైన బీపీ, షుగర్ వంటి ఆరోగ్య సమస్యలతో నిత్యం యుద్ధం చేస్తున్నాడు. సర్వే చెబుతోందేంటి? హైదరాబాద్ టెక్ రంగంలో ప్రపంచ దేశాలకు సేవలందిస్తోంది. ఐటీ కారిడార్, చుట్టూ పరిసర ప్రాంతాలు పది కిలో మీటర్ల పరిధిలో కిమ్స్ ఆస్పత్రి నిర్వహించిన వెయిట్ గెయిన్ ట్రెండ్స్ సర్వేలో ఆశ్చర్యకరమైన అంశాలు వెలుగు చూశాయి. 18 ఏళ్ల నుంచి 65 ఏళ్ల వయసు గల 6 వేల మంది ఆరోగ్య సమాచారాన్ని పరిశీలించగా అందులో ఉద్యోగుల్లో 45 శాతం మంది డిప్రెషన్లో ఉంటున్నారట. ఆందోళన, భయం, యాంగ్జైటీతో బాధపడుతున్నారని తేలింది. మరో వైపు ఇంటి పట్టునే ఉంటున్న వ్యక్తులు మధుమేహం, రక్త పోటుతో నిత్యం ఇబ్బంది పడుతున్నారట. ఆపై ఉబకాయం, డయాబెటిస్, రక్తపోటు, లివర్ సమ్యలు, థైరాయిడ్, పీసీఓడీ వంటి రోగాలతో నిత్యం సతమతమవుతున్నారని స్పష్టమవుతోంది. మహిళల్లో అత్యధికంగా ఉబకాయం, కీళ్ల నొప్పులు, ఇల్నెస్ వంటి సమస్యలు వేధిస్తున్నాయి. 35 ఏళ్ల నుంచి 40 ఏళ్ల మధ్య వయసు్కల్లో ఎక్కువ మంది ఉపవాసం (ఫాస్టింగ్) చేస్తున్నారు. మరికొంత మంది సిక్స్ప్యాక్, జీరోప్యాక్, స్లిమ్ అంటూ ఎక్కువ సమయం జిమ్లో కాలం గడుపుతున్నారు. ఆహారానికి బదులుగా ప్రొటీన్, ఇతర సప్లిమెంట్స్ తీసుకుటున్నారు. దీంతో అనర్థాలు తలెత్తుతున్నాయని వైద్యులు చెబుతున్నారు. ఇదీ చదవండి: రెండు నెలల బిడ్డను కాపాడేందుకు నర్సు సాహసం వీడియో వైరల్వ్యాయామం అవసరం.. ఇటీవల కాలంలో కార్డియాక్ అరెస్ట్ సంఘటనలను దృష్టిలో ఉంచుకుని అవసరం మేరకు మాత్రమే వ్యాయామం చేయడం మంచిదని సూచిస్తున్నారు. ముఖ్యంగా ఆహారపు అలవాట్లలో మార్పులు అవసరమని వైద్యులు సూచిస్తున్నారు. ఊబకాయంతో బాధపడుతున్న వ్యక్తులు వారం రోజుల్లో 6 కేజీల వరకూ తగ్గే అవకాశం ఉంది. అయితే ఒకే సారి మొత్తం బరువు తగ్గిపోవాలని అనుకోవడం మంచిది కాదు. వెయిట్ లాస్ కోసం వ్యాయామంతో పాటే వివిధ రకాల శస్త్రచికిత్సలు, అధునాతన పద్ధతులు అందుబాటులోకి వచ్చాయని, ఇవి దీర్ఘకాలంలో సత్ఫలితాలను అందిస్తాయంటున్నారు. లైఫ్ స్టైల్లో మార్పులు.. టెక్ కంపెనీలు, అనుబంధంగా పనిచేస్తున్న రంగాల్లో ఎక్కువ మంది ఉద్యోగులు మిడ్ షిఫ్ట్, పూర్తిగా నైట్ షిఫ్ట్ పద్ధతుల్లో రాత్రి విధుల్లో ఉంటున్నారు. దీనికి తోడు నిత్యం టార్గెట్లతో విపరీతమైన ఒత్తిడిలో విధులు నిర్వహిస్తున్నారు. మరోవైపు గ్యాడ్జెట్స్కు అతుక్కుపోతున్నారు. కొంత మంది పగలు నిద్ర పోదామన్నా పరిస్థితులు అనుకూలించడం లేదని అంటున్నారు. కనీసం 7 గంటలు నిద్రపోవాల్సి ఉన్నా డీప్ స్లీప్ రెండు నుంచి మూడు గంటలే ఉంటుందని చెబుతున్నారు. సరైన నిద్ర లేకపోవడం మరిన్ని సమస్యలకు దారితీస్తుంది. తీసుకునే ఆహారంలోనూ పాశ్చాత్య రుచులకు అలవాటుపడి పౌష్టికాహారానికి దూరమవు తున్నారు. చైనీస్, కొరియన్, అమెరికన్ స్టైల్ ఆహారానికి ఎక్కువ మంది ఆకర్షితులవుతున్నారు. పోషకాల లోటును భర్తీ చేయడం కోసం వివిధ రకాల ప్రొటీన్, ఇతర పౌడర్లను తీసుకుంటున్నారు. ఫలితంగా శరీరంలోని కెమికల్ ఇంబ్యాలెన్స్ ఏర్పడుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.చదవండి: అందమైన హారాన్ని షేర్ చేసిన సుధామూర్తి , విశేషం ఏంటంటే! -
ఇంటెర్మిటెంట్ ఫాస్టింగ్ చేస్తున్నారా? మహిళలూ ఈ చిక్కులు రావొచ్చు!
బరువు తగ్గేందుకు చాలామంది చేస్తున్న రకరకాల ప్రయత్నాలలో ఇటీవలి కాలంలో బాగా ప్రాచుర్యం పొందిన మాట ఇంటెర్మిటెంట్ ఫాస్టింగ్ (Intermittent fasting (IF). అయితే స్త్రీలకు మాత్రం ఈ పద్ధతి అంత మంచిది కాదంటున్నారు వైద్యనిపుణులు. ఇంటెర్మిటెంట్ ఫాస్టింగ్ అనేది తినే సమయానికి, ఉపవాసానికీ మధ్య నిర్దేశించు కున్న వ్యవధులను పాటించే పద్ధతి. ఉదాహరణకు ఆహారం తీసుకోవడం ఉదయం పది నుంచి సాయంత్రం ఆరుగంటల లోగా ముగించేయాలి. ఆ తర్వాత ఏమీ తినకూడదు. దీనివల్ల బరువు తగ్గడం, మెరుగైన జీవక్రియలు, మంచి జీవన నాణ్యత వంటి ప్రయోజనాలున్నాయి. ఈ ఐఎఫ్ అనేది మీరు ఎప్పుడు తింటారు అనే దానిపై దృష్టి పెట్టాలని చెబుతుంది. ఇదీ చదవండి: KBC-17లో రూ. 25 లక్షల ప్రశ్నఈ క్రికెటర్ గురించే.. ఇంట్రస్టింగ్!స్త్రీలకు జాగ్రత్త ఎందుకు ?అధిక ఉపవాసం మహిళల హార్మోన్లలో అసమతుల్యతకు దారితీస్తుంది - ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్ – ఋతు చక్రాలు, అండోత్సర్గం, థైరాయిడ్ స్థాయులు, పీసీఓస్, సంతానోత్పత్తిని కూడా ప్రభావితం చేస్తుంది. ఇది పునరుత్పత్తి పనితీరును నియంత్రిస్తుంది. అంతేకాదు.. ఒత్తిడి హార్మోన్ అయిన కార్టిసాల్ను ప్రేరేపించడం వల్ల ఆందోళన, చిరాకు నిద్రపోవడంలో ఇబ్బందులు వంటి సమస్యలకు దారితీస్తుంది. అందువల్ల ఇలాంటి లక్షణాలు కనిపిస్తే మాత్రం ఈ తరహా ఉపవాసానికి దూరంగా ఉండటం ఉత్తమం. నెమ్మదిగా ప్రారంభించండి, నెమ్మదిగా వెళ్లండి16 గంటలు ఉపవాసం ఉండి మిగిలిన 8 గంటల వ్యవధిలోపు తినడం మంచిది. అంటే 12/12 మోడ్లో, ఉపవాసం రాత్రి 8 నుండి ఉదయం 8 గంటల వరకు, తినే సమయం ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు ఉండాలంటున్నారు. రాత్రి ఆలస్యంగా భోజనం చేసే అలవాటున్న వారికిది ప్రయోజనకరం. చదవండి: పెట్రోల్ పంపు, 210 ఎకరాలు, 3 కిలోల వెండి.. రూ.15 కోట్ల కట్నం : వైరల్ వీడియోసమృద్ధిగా తినండి... హైడ్రేటెడ్ గా ఉండండిఈ పద్ధతి పాటించేవారు కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు, కొవ్వులు – ఫైబర్ వంటి అన్ని సూక్ష్మ పోషకాలు, విటమిన్లు, ఖనిజాలు, బయోఫ్లేవనాయిడ్స్ వంటి ఇతర పోషకాలను తగినంత పరిమాణంలో అందేలా చూసుకోవాలి. ఇందుకోసం కూరగాయలు, పండ్లు, గింజలు, విత్తనాలు, తృణధాన్యాలు, లీన్ మాంసాలు, చేపలు, గుడ్లు, చిక్కుళ్ళు వంటి పోషకాలు అధికంగా ఉండే ఆహారాలకు ప్రాధాన్యత ఇస్తూనే, పెరుగు, పెరుగు వంటి ప్రోబయోటిక్స్, ఫైబర్ అధికంగా ఉండే కూరగాయలు, పండ్లు వంటి ప్రీ బయోటిక్ వనరులను చేర్చడం కూడా ముఖ్యం. ఉపవాస సమయాల్లో హైడ్రేటెడ్ గా ఉండటం కూడా ముఖ్యం. ఇంటి పని, వంట పని, ఆఫీసు పని తదితర పనుల ఒత్తిడిలో ఉండే స్త్రీలకు ఇన్ని జాగ్రత్తలను పాటించడం కష్టం కాబట్టి దీనికి దూరంగా ఉండటమే ఉత్తమం అంటున్నారు డైటీషియన్లు. చదవండి: అందమైన హారాన్ని షేర్ చేసిన సుధామూర్తి , విశేషం ఏంటంటే! -
మెగాస్టార్ చిరంజీవి 7 పదుల వయస్సులోనూ షాకింగ్ ఫిట్నెస్, డైట్ సీక్రెట్స్
మెగాస్టార్ చిరంజీవి 70వ పుట్టిన రోజు. ఈ మాట వినిగానే చిరంజీవికి డెబ్భై ఏళ్లా? అని ఆశ్చర్యపోతారు. నటనలోనే కాదు, అందం, ఆరోగ్యం విషయంలోనూ ఫ్యాన్స్ను మెస్మరైజ్ చేసే ఫిట్ నెస్ చిరంజీవి సొంతం. 70 ఏళ్ల వయస్సులో చాలా చురుగ్గా ఉంటూ డ్యాన్సులైనా, ఫైట్లైనా నేను ఎవర్ రెడీ అన్నట్టు ఉంటారాయన. కొడితే కొట్టాలిరా సిక్స్ కొట్టాలి అన్నట్టుంటే ఆయన ఫిట్నెస్ సీక్రెట్ ఏంటో తెలుసుకుందాం.తాము అనుకున్న రంగంలో విజయం సాధించి స్టార్గా నిలవడం ఎంత అవసరమో, ముఖ్యంగా ఎంటర్టైన్ మెంట్ రంగంలో నిలదొక్కుకోవాలంటే.. అందాన్ని, ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కూడా అంతే అవసరం. కోట్లాది ప్రేక్షకుల గుండెల్లో స్థానం సంపాదించుకొని, ప్రపంచవ్యాప్తంగా అశేష అభిమానులను సంపాదించుకొని, ఇప్పటికీ చిరు అన్నయ్యగా పిలిపించుకునే ఘనత ఆయనది. ఎన్నో విభిన్నమైన చిత్రాలు, మరెన్నో విభిన్న పాత్రలతో ఎందరో యువ హీరోలకు సైతం స్ఫూర్తినిచ్చే చిరంజీవి ఆరోగ్యం రహస్యం వెనుకాల గొప్ప శ్రమే ఉంది. జీవితంలో ఒడిదుకులు, ఒత్తిడిని తట్టుకుంటూ, చక్కని జీవనశైలి, ఆరోగ్యకరమైన ఆహార నియమావళి క్రమ తప్పనివ్యాయామం ఇవే ఆయన సీక్రెట్స్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా చిరంజీవి ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారట. ఇంటి ఫుడ్కే ప్రాధాన్యత, తక్కువ నూనె, తక్కువ చక్కర, ప్రాసెస్డ్ ఫుడ్ పూర్తిగా దూరం. ఆరోగ్య నిపుణుడిపర్యవేక్షణలో ఆహార ప్రణాళికలో ప్రోటీన్లు, ఫైబర్, కార్బోహైడ్రేట్లు సమపాళ్లలో ఉండేలా జాగ్రత్త పడతారు.చదవండి: ఎంబీఏ చదివి క్యాప్సికం సాగుతో ఏడాదికి రూ. 4 కోట్లుఒకసారి స్వయంగా ఆయనే చెప్పినట్టు రోజువారీ ఆహారంలో తేలికపాటి, పోషకాలతో కూడిన అల్పాహారంతో ప్రారంభిస్తారు. ఎక్కువగా ఆవిరి మీద ఉడికించిన ఇడ్లీ, దోశ లేదా గుడ్డులోని తెల్లసొనతో చేసిన ఆమ్లెట్ను తీసుకుంటారు. మధ్యాహ్న భోజనంలో ఒక బ్రౌన్ రైస్ లేదా మిల్లెట్స్ తో పాటు, కూరలు ఎక్కువ ఉండేలా జాగ్రత్తపడతారు. ప్రోటీన్ కోసం పప్పు లేదా గ్రిల్ చేసిన చికెన్, చేపలు, బాయిల్డ్ ఎగ్స్ తింటారు. డిన్నర్ చాలా లైట్గా ఉండేలా చూసుకుంటారు.ఇదీ చదవండి: పెట్రోల్ పంపు, 210 ఎకరాలు, 3 కిలోల వెండి.. రూ.15 కోట్ల కట్నం : వైరల్ వీడియోకసరత్తులుసాధారణంగా వయసు పెరిగే కొద్ది శక్తి తగ్గుతుంది. ఆరోగ్య సమస్యలు పెరుగుతాయి. చర్మ ఆరోగ్యంలో కూడా తేడాలొస్తాయి. వీటినుంచి బయటపడాలంటే ఖచ్చితంగా డైలీ రొటీన వ్యాయామంతోపాటు, బాడీ స్ట్రెంత్, మజిల్ బిల్డింగ్,కార్డియో, కసరత్తు అవసరం. ఇవి శరీరం బరువు పెరగకుండా మెటబాలీజం పెంచి, కలకలం ఆరోగ్యంగా చురుగ్గా ఉండేందుకు తోడ్పడతాయి. సరిగ్గి చిరంజీవికూడా ఇదే ఫాలో అవుతున్నారు. దీనికి విశ్వంభర సినిమా కోసం జిమ్లో కసరత్తు చేస్తున్న వీడియో ఒకటి బాగా వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇందులో బెంచ్ ప్రెస్, డంబెల్ కర్ల్స్, స్క్వాడ్స్, కార్డియో ఎక్స్ర్ సైజ్లు చేయడం మనం చూశాం. సో ఏజ్ ఈజ్ నంబర్ మాత్రమే. ఎలాంటి అనారోగ్యాలు దరిచేరకుండా, ఆరోగ్యంగా, చురుగ్గా ఉండాలంటే ఒత్తిడిలేని జీవితం, మంచినిద్ర, చక్కటి జీవనశైలి, ఆరోగ్య కరమైన ఆహారం, కనీస వ్యాయామం, అప్పుడప్పుడు కొన్ని ఆరోగ్య పరీక్షలు చేసుకుంటే ఫిట్ నెస్ సొంతం చేసుకోవచ్చు అని నిరూపించిన చిరంజీవికి హ్యాపీ బర్తడే చెప్పేద్దామా! -
అర్జున్ చక్రవర్తి కోసం ముప్పై కేజీలు తగ్గాను
విజయ రామరాజు టైటిల్ రోల్లో నటించిన చిత్రం ‘అర్జున్ చక్రవర్తి’. ఈ చిత్రంలో సిజా రోజ్ హీరోయిన్. విక్రాంత్ రుద్ర దర్శకత్వంలో శ్రీని గుబ్బల నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 29న విడుదల కానుంది. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో విజయ రామరాజు మాట్లాడుతూ –‘‘ఈ సినిమా కోసం దాదాపు 30 కేజీల బరువు తగ్గాను. ఆ తర్వాత బరువు పెరిగాను. నేను సిక్స్ ప్యాక్తో ఉన్న సీన్స్ తీసినప్పుడు రెండు రోజులు ఏమీ తినలేదు. కొన్ని ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్నాను. అయితే ట్రైలర్ విజువల్స్ చూసివారు పెద్ద సినిమాలా ఉందని అంటుంటే సంతోషంగా ఉంది’’ అన్నారు. ‘‘ఈ సినిమా నా తొమ్మిదేళ్ల కల. ఆరేళ్ల మా టీమ్ కష్టం. విజయ్ ఈ సినిమా కోసం ప్రాణం పెట్టాడు. బడ్జెట్ పెరిగినా మా నిర్మాత నన్ను స΄ోర్ట్ చేశారు’’ అని చె΄్పారు విక్రాంత్ రుద్ర. ‘‘ఆగస్టు 29న నేషనల్ స్పోర్ట్స్ డే. కబడ్డీ బ్యాక్డ్రాప్లో రూపొందిన మా సినిమా అదే రోజు రిలీజ్ అవుతోంది’’ అని చెప్పారు శ్రీని గుబ్బల. – విజయ రామరాజు ఇదీ చదవండి: PCOS Belly తగ్గేదెలా? ఇవిగో అమోఘమైన టిప్స్ -
బరువు పెరగాలనుకుంటే ఇలా తినండి..! 45 కిలోలు నుంచి 87 కిలోలు..
కొందరు ఎత్తుకి తగ్గ బరువు లేక బాధపడుతుంటారు. చాలామటుకు అధిక బరువుతో బాధపడుతంటే..ఈ వ్యక్తులు మాత్రం ఎంత తిన్నా.. పీలగానే ఉంటారు. ఏదైనా అనారోగ్యం వచ్చిందా.. మరింత బక్కచిక్కిపోతారు. చూసేందుకు కూడా బాగోదు వారి ఆహార్యం. అలాంటి వాళ్లు ఆరోగ్యంగా లావు అవ్వాలనుకుంటే.. ఇలా తినండని చెబుతున్నారు కంటెంట్ క్రియేటర్ సుజీత్ చౌరాసియా. సోషల్ మీడియా వేదికగా అత్యంత బలహీనంగా ఉండే తను ఎలా ఆరోగ్యకరమైన రీతీలో బరువు పెరిగాడో వీడియో రూపంలో షేర్ చేసుకున్నాడు. మరి అదెలాగో తెలుసుకుందామా..!. కంటెంట్ క్రియేటర్ 46 కిలోలు బరువుతో బక్కపలచగా ఉండేవాడు. తన ఎత్తుకి బరువుకి వ్యత్యాసమే లేనట్లు గాలిస్తే ఎగిరిపోయేలా ఉండేవాడు. అలాంటి వాడు మంచి ఫిజిక్తో ఏకంగా 85 కిలోల ఆరోగ్యకరమైన బరువుతో ఉన్నాడు. అందుకోసం అతడు డైట్ ఎలా సెట్ చేశాడంటే ఉదయం శరీరాన్ని హైడ్రేట్ చేసేలా ఒక లీటర్ నీటితో రోజుని ప్రారంభించేవాడట. ప్రోటీన్ రిచ్ స్టార్ కోసం 70 గ్రా బ్లాక్ చనా + 60 గ్రా పెరుగు తీసుకునేవాడు. ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్గా నెమ్మదిగా జీర్ణమయ్యే 100 గ్రా ఓట్స్, రెండు అరటిపండ్లు, ఆరోగ్యకరమైన కొవ్వుల కోసం ఒక టేబుల్ స్పూన్ పీనట్ బటర్, ప్రోటీన్ బూస్ట్ కోసం బ్రెడ్ లేదా ఆమ్లెట్తో 4 బ్రెడ్, మిల్క్షేక్ రెసిపీ తీసుకునేవాడినని తెలిపాడు. అది కూడా పాలు, అరటి పండ్లు, డ్రైఫ్రూట్స్తో చేసిన మిల్క్ షేక్. లంచ్ టైంలో వందగ్రాముల బియ్యం, 80 గ్రాముల నెయ్యి,ఫైబర్, విటమిన్ల కోసం సలాడ్ తీసుకున్నట్లు చెప్పాడు. సాయంత్రం వ్యాయమానికి ముందు 80 గ్రా ఓట్స్ + 2 అరటిపండ్లు. వ్యాయమం చేసిన తర్వాత శక్తిని నింపడానికి, కోలుకోవడానికి 100 గ్రా బంగాళాదుంపలు లేదా మిల్క్ షేక్. ఇక రాత్రి డిన్నర్కి సముతల్యమైన ఆహారం కోసం మూడు రోటీలు, సబ్జి, వందగ్రాముల పన్నీర్ తీసుకునేవాడిని అంటూ తన డైటింగ్ విధానాన్ని పోస్ట్లో వివరించాడు. మెరుగైన ఫలితాల కోసం..భోజనం పరిమాణం పెంచుకోవడంహైడ్రేట్గా ఉండేలా ప్రతిరోజూ మూడు నుంచి 4 లీటర్ల నీటిని తీసుకోండిఏడు నుంచి ఎనిమిది గంటల నిద్రవ్యాయామాలను 1.5 గంటల కంటే తక్కువగా ఉండాలి. View this post on Instagram A post shared by Sujeet Chaurasia l Content Creator (@fearlesshimm)గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులను లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం (చదవండి: శంఖారావం' చేస్తే..ఆ వ్యాధి తగ్గిపోతుందట..! అధ్యయనంలో వెల్లడి) -
పీసీఓఎస్ బెల్లీ తగ్గేదెలా? ఇవిగో అమోఘమైన టిప్స్
పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS) అనేది ప్రపంచవ్యాప్తంగా చాలా మంది మహిళలను వేధిస్తున్న సమస్య. హార్మోన్ల అసమతుల్యత, ఇర్రెగ్యులర్ పీరియడ్స్, జీవక్రియ సమస్యలతోపాటు,పీసీఓఎస్వల్ల బరువు పెరగడం, మొటిమలు, అవాంఛితరోమాలు, జుట్టు రాలడంలాంటి సమస్యలుంటాయి. ముఖ్యంగా పొత్తికడుపు (బొడ్డు చుట్టూ) కొవ్వు పేరుకుపోవడం ముఖ్య లక్షణాల్లో ఒకటి. ఇది బరువుపెరగడమే కాదు, బరువు తగ్గడం కూడా కష్టమే. అందుకే దీన్ని "PCOS బెల్లీ" (క్లినికల్గా కాదు) అంటారు. PCOS ఉన్నవారిలో దాదాపు 20శాతం మంది ఈ లక్షణాలు కనిపిస్తాయి. పీసీఓఎఎస్ బెల్లీ ఎందుకు వస్తుంది?ఇన్సులిన్ నిరోధకత: ఇన్సులిన్ నిరోధకత PCOS ముఖ్య లక్షణాలలో ఒకటి. ఇది శరీరంలో ఇన్సులిన్ ప్రభావవంతమైన వాడకాన్ని పరిమితం చేయడమే కాకుండా టైప్-2 డయాబెటిస్ ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. ఇదే పొట్ట చుట్టూ కొవ్వు పేరుకు పోయేలా చేస్తుందిఇన్ఫ్లమేషన్ పీసీఓఎఎస్ మహిళలు దీర్ఘకాలిక మంటను అనుభవించే అవకాశం కూడా ఎక్కువే. ఇది కూడా ఇది బరువు పెరగడానికి, ఇతర అనారోగ్య పరిస్థితుల ప్రమాదాన్ని పెంచుతుంది.హార్మోన్ల అసమతుల్యత: PCOSను తరచుగా హార్మోన్ల అసమతుల్యత.. ఆండ్రోజెన్ల (పురుష హార్మోన్లు) పెరిగిన స్థాయిలు కొవ్వు పేరుకుపోవడానికి దోహదం చేస్తాయి. దీంతో బరువు తగ్గడం ఒక చాలెంజ్గా మారుస్తాయి.ఒత్తిడి: ఇలాంటి మహిళల్లో ఒత్తిడి హార్మోన్గా పిలిచే కార్టిసాల్ స్థాయి ఎక్కువగా ఉంటుందని పరిశోధనల ద్వారా తెలుస్తోంది. బెల్లీ ఫ్యాట్కు ఇదొక ప్రధాన కారణం.బరువు తగ్గడం నిజంగా కష్టమా?హార్మోన్ల అసమతుల్య , ఇన్సులిన్ నిరోధకత కలయిక బరువు పెరగడానికి అనుకూలమైన జీవక్రియ వాతావరణాన్ని సృష్టిస్తుంది. అలాగే బొడ్డుచుట్టూ కొవ్వును చాలా గట్టిగా మార్చేస్తుంది. అంతేకాదు PCOS నిర్వహణతో సంబంధం ఉన్న ఒత్తిడి, దాని లక్షణాల కారణంగా మానసిక ఆరోగ్యం దెబ్బతిని కార్టిసాల్ స్థాయిలు పెరగడానికి దారితీస్తుంది. PCOS ఉన్న చాలా మంది మహిళలు చాలా ఎనర్జీ లెవల్స్ తక్కువగా ఉంటాయి. దీని కారణంగా ఎక్కువగా వ్యాయామం చేయలేరు.PCOS బెల్లీ తగ్గడానికి చిట్కాలుపీసీఓఎస్తో బాధపడేవారు నిజంగా బరువు తగ్గడం అసాధ్యమా అంటే కానే కాదు. కొంచెం చాలెంజింగే అయినప్పటికీ అసాధ్యం కాదు. కొన్ని చిట్కాలు చూద్దాం.ఇదీ చదవండి: ఎంబీఏ చదివి క్యాప్సికం సాగుతో ఏడాదికి రూ. 4 కోట్లు సమతుల్య ఆహారం: సంపూర్ణ ఆహారాలు, కూరగాయలు, ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులతో కూడిన తీసుకోవాలి. ఇది ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.తద్వారా బరువు పెరగకుండా ఉంటుంది. రక్తంలో చక్కెర స్థాయి నియంత్రణ: ఇన్సులిన్ స్థాయిలను నిర్వహించడం వల్ల బరువు తగ్గడంతోపాటు, పీసీఓఎస్ దుష్ప్రభావాలలో ఒకటైన టైప్-2 డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. స్పైక్లను నివారించడానికి తక్కువ గ్లైసేమిక్ ఇండెక్స్ ఆహారాలను ఎంచుకోండి. క్రమం తప్పని వ్యాయామం: బరువు తగ్గాలంటే వ్యాయామానిది చాలా కీలక పాత్రం. ముఖ్యంగా పీసీఓఎస్ బెల్లీ ఫ్యాట్ తగ్గాలంటే కార్డియో ,బల శిక్షణ వ్యాయామాల కలయికతో కూడిన రెగ్యులర్ వ్యాయామం చాలా అవసరం.చదవండి: Wedding Anniversary: మాజీ మంత్రి ఆర్కే రోజా ఇంట్రస్టింగ్ పోస్ట్చక్కటి నిద్ర: హార్మోన్ నియంత్రణకు నాణ్యమైన నిద్ర చాలా ముఖ్యం. ఒత్తిడిని నిర్వహించడానికి మరియు సమతుల్య హార్మోన్ స్థాయిలను నిర్వహించడానికి ప్రతి రాత్రి 7-9 గంటల నిరంతరాయ నిద్ర కావాలి.ఒత్తిడిని ఎదుర్కోవడం : ఒత్తిడి లేని జీవనశైలిని ఎంచుకోవాలి. మైండ్ఫుల్నెస్, ధ్యానం లేదా ప్రాణాయామ శ్వాస వ్యాయామాలు ఒత్తిడిని అదుపులో ఉంచుతాయి. ఒత్తిడి లేని జీవితం సగం సమసల్ని నివారిస్తుంది. అవసరమైన సప్లిమెంట్లు: కొన్ని సందర్భాల్లో, ఇనోసిటాల్ లేదా ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు వంటి సప్లిమెంట్లు హార్మోన్ సమతుల్యతకు మద్దతు ఇవ్వడంలో ,జీవక్రియ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. అయితే, వీటిని వైద్యుల పర్యవేక్షణలోనే తీసుకోవాలి.పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS) అంటే ఏమిటి?PCOS అనేది స్త్రీ పునరుత్పత్తి అవయవాలు ఉన్నవారిని ప్రభావితం చేసే హార్మోన్ల రుగ్మత. ఈ అవయవాలు ఉన్నవారిలో సాధారణంగా ఆండ్రోజెన్ హార్మోన్ల స్థాయిలు తక్కువగా ఉంటాయి. PCOS ఉన్నవారిలో తరచుగా సాధారణం కంటే ఎక్కువ ఆండ్రోజెన్ స్థాయిలు ఉంటాయి. PCOS ఉన్నవారిలో కనీసం 50శాతం మందికి మందికి టైప్ 2 డయాబెటిస్ వస్తుంది.ఉదర బరువు పెరగడం వల్ల గుండె జబ్బుల ప్రమాదం కూడా పెరుగుతుంది. అందుకే వైద్యులను సంప్రదించి వారి సలహా మేరకు, సరియైన వ్యాయామం, చికిత్స తీసుకోవడం ఉత్తమం. -
'శంఖారావం' చేస్తే..ఆ వ్యాధి తగ్గిపోతుందట..! అధ్యయనంలో వెల్లడి
శంఖం (Conch) అనేది భారతీయ సంస్కృతిలో పవిత్రత, శుభం, విజయానికి ప్రతీకగా భావిస్తారు. ఇది క్షీరసాగర మథనంలో ఉద్భవించిన 14 రత్నాలలో ఒకటిగా పేర్కొంటారు. అలాంటి శంఖాన్ని ఊదితే ఆ వ్యాధి నయమైపోతుందని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. తాజా అధ్యయనంలో ఇది వెల్లడైందని తెలిపారు. ఈ శంఖరావం ప్రయోజనాన్ని హైలెట్ చేసేలా పరిశోధనలో చాలా ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. ఇటీవల చాలామంది అబ్స్ట్రక్టివ్ స్లీప్ ఆప్నియాతో బాధపడుతున్నారు. అందుకు మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లే ప్రధాన కారణం అని చెబతున్నారు నిపుణులు. ఈ సమస్య ఉన్నవారికి నిద్రలో శ్వాస కొద్దిసేపు ఆగిపోతుంది. దాంతో మధ్యలో మెలుకవ వచ్చేస్తుంటుంది. కొన్నిసార్లు శ్వాసాగిపోయి గురకపెడుతుంటారు. దీని కారణంగా మధుమేహం, గుండుపోటు, రక్తపోటు వంటి దీర్ఘకాలిక జబ్బుల బారినపడతారని చెబుతున్నారు వెద్యులు. ఈ స్లీప్ ఆప్నియా కారణంగా చాలామంది కంటిపై కునుకనేది సరిగా ఉండదు. అందువల్ల ఉదయం చాలా అలసట, ఒక విధమైన నిద్ర ఆవరించడం వంటి సమస్యలు ఎదుర్కొంటారని చెబుతున్నారు. అయితే ఈసమస్యకు మందుల కంటే శంఖం చక్కగా చెక్పెడుతుందంట. శంఖారావంతో అబ్స్ట్రక్టివ్ స్లీప్ ఆప్నియా నుంచి బయటపడొచ్చని చెబుతున్నారు పరిశోధకులు. గాలి వాయిద్యాలను వాయించడం మెరుగైన శ్వాసకు ఎలా సహాయపడుతుంది అనే దిశగా అధ్యయనం చేయగా..ఈ విషయం వెల్లడైందని తెలిపారు. అందుకోసం అబ్స్ట్రక్టివ్ స్లీప్ ఆప్నియాతో బాధపడుతున్న సుమారు 30 వ్యక్తులను రెండు గ్రూపులుగా విభజించారు. ఒక సముహం శఖం ఊదే సాంప్రదాయ భారతీయ శ్వాస వ్యాయమాన్ని అభ్యసించింది. అంటే శంఖం పూరించడం లాంటిది. మరొక సముహం లోతైన శ్వాస వాయామాలు చేశారు. అందులో శంఖం ఊదిన బృదం నిద్ర నాణ్యతలో గణనీయమైన మెరుగదల కనిపించిడాన్ని పరిశోధకులు గుర్తించారు. వాస్తవానికి ఈ స్లీప్ ఆప్నియాతో ఇబ్బంది పడేవాళ్లకి నిరంతర సానుకూల వాయుమార్గ పీడన యంత్రం లేదా CPAP వంటి ప్రామాణిక చికిత్సను అందిస్తారు. ఇందులో ఫేస్మాస్క్ ద్వారా గాలిని ఊదుతూ ఉండాల్సి ఉంటుంది. తద్వారా వాయుమార్గం తెరచుకుని ఈ సమస్య తగ్గుతుంది. అయితే దీన్ని చాలామంది రోగులు అసౌకర్యంగా భావించడమే కాకుండా ఇలా నిరంతరం చేయడంలో ఇబ్బంది పడుతున్నారట. అలాగాక ఈ శంఖ ఊదడం అనే సాంప్రదాయ యోగ శ్వాస వ్యాయామం ప్రకారం.. ఉచ్ఛ్వాసాన్ని వదులుతూ..సాధన చేస్తారు కాబట్టి చక్కటి విశ్రాంతితో కూడిన నిద్రపడుతుందట. ఈ పురాతన అభ్యాసం ఈ సమస్యకు చక్కని పరిష్కారమని వెల్లడించారు. అంతేగాదు శంఖ ఊదడం అనే వ్యాయామాలు శ్వాసకోశ కండరాలను బలోపేతం చేయగలవని, నిద్రలో వాయుమార్గాలను స్పష్టంగా తెరుచుకునేలా చేస్తుందని చెప్పుకొచ్చారు. స్లీప్ అప్నియా లక్షణాలను నిర్వహించడానికి ఈ శంఖారావం అనేది చక్కటి నివారిణి అని పేర్కొన్నారు పరిశోధకులు. ఈ అధ్యయనాన్ని భారతదేశంలోని జైపూర్లోని ఎటర్నల్ హార్ట్ కేర్ సెంటర్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నిర్వహించింది.(చదవండి: ఓపెన్గా మాట్లాడేస్తా.. అంటే కుదరదు..! నటి శ్రుతి హాసన్ ఎదుర్కొన్న చేదు అనుభవం..) -
వీల్ఛైర్కే పరిమితం చేసే అరుదైన రుగ్మత..! కానీ ఇవాళ గిన్నిస్ రికార్డు..
ఆస్తిపాస్తిల్లా కొన్ని వ్యాధులు వంశాపారంపర్యంగా సంక్రమిస్తుంటాయి. మందులతో నయం కానీ ఆ జబ్బులతో సహవాసం నరకం అనే చెప్పాలి. అలాంటి రుగ్మతతో బతకడమే గాక..తనలా బాధుపడుతున్న వారిలో స్థ్యెర్యాన్ని నింపేలా రికార్డు సృష్టించే పనిలో ఉన్నాడు ఈ 31 ఏళ్ల వ్యక్తి.అహ్మదాబాద్లోని వదోదరకు చెందిన సాగర్ బ్రహ్మభట్ మార్షల్ ఆర్ట్స్ అభిమాని. అతడు పట్టుదలతో వీల్ఛైర్కే పరిమితం చేసే వంశాపారంపర్య వ్యాధిపై గెలిచి, సమర్థవంతంగా నిర్వహించి బతకొచ్చని నిరూపించాడు. బ్రహ్మభట్ స్పినోసెరెబెల్లార్ అటాక్సియా(SCA) అనే కండరాలను నాశనం చేసే వ్యాధి బారిన పడ్డాడు. ఈ వ్యాధి అతని తాత, నాన్నను వీల్ఛైర్కే పరిమితం చేసింది. ఇది అతడి కుటుంబంలో వారసత్వంగా వస్తున్న రుగ్మత. అదృష్టవశాత్తు తాను ఆ వ్యాధి బారినపడలేదని సంతోషించేలోపే అటాక్ అయ్యి భయపెట్టింది. అచ్చం తన తండ్రి అనారోగ్యం లాంటి లక్షణాలు సరిగ్గా కోవిడ్ టైంలో మొదలయ్యాయి. అయితే అతడుదాన్ని కొట్టిపరేసి మూడేళ్లు మొండిగా బతికేవాడు. అయితే సరిగ్గా 2023కి సరిగ్గా నడవలేకపోవడం, మాట ముద్దగా రావడం వంటి సమస్యలు రావడంతో వైద్య పరీక్షలు చేయించుకోగా..స్పినోసెరెబెల్లార్ అటాక్సియా(SCA)నిర్థారణ అయ్యింది. స్పినోసెరెబెల్లార్ అటాక్సియా అంటే..ఇది జన్యు పరివర్తన వల్ల కలిగే రుగ్మత. తల్లిదండ్రుల నుంచి వారి పిల్లలకు సంక్రమిస్తుంది. ఈ వ్యాధి నాడీ కణాలు, ఫైబర్లను బలహీనపరిచి సెరెబెల్లమ్ క్షీణతకు దారితీస్తుంది. ఫలితంగా శరీర విధులపై ప్రభావం చూపి..తనంతట తాను పనులు చేసుకోని పరిస్థితి ఎదురవ్వుతుంది. సింపుల్గా చెప్పాలంటే చిన్న మెదడును ప్రభావితం చేసే అరుదైన జన్యుపరమైన న్యూరోడిజెనరేటివ్ డిజార్డర్.ఇక బ్రహ్మభట్ని న్యూరాలిజిస్ట్లు వీట్ఛైర్కే పరిమితం కాకతప్పదని..అందుకు మానసికంగా సిద్ధం అవ్వమని సూచించారు. అతడి తండ్రి ఇటీవలే మరణించడంతో ఇప్పుడు ఆ వ్యాధి తాను భారినపడ్డానంటే అమ్మ, చెల్లి తల్లడిల్లతారని ఆ వ్యాధిని కుటుంబసభ్యులకు చెప్పకుండా జాగ్రత్తపడ్డాడు. అమెరికాలో ఉండే దూరపు బంధువుతో మాట్లాడి ఈ వ్యాధిని విదేశాల్లో నయం చేయగలరే లేదా అనే విషయం గురించి చర్చించి తెలుసుకుంటుండేవాడు. అయితే అక్కడ కూడా ఈ వ్యాధికి నివారణ లేదని, మందులతో నిర్వహించాల్సిందేనని తెలుసుకుంటాడు. దాంతో ఫిజియోథెరపీస్టుతో మాట్లాడుతూ తన వ్యాధిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించేవాడు. దీన్ని తగ్గించుకునేలే ఏం చేయొచ్చు అనేదాని గురించి శాస్త్రీయ పరిశోధనలు కూడా చేశాడు. అయితే తండ్రి లేకపోవడంతో తన పరిస్థితిని మెరుగుపురుచుకునేందుకు ఆర్థికస్థితిని మెరుగుపరుచుకునేలా వ్యాపారంపై దృష్టి సారిస్తూ..అటాక్సియా రోగులు గురించి తెలుసుకుంటుండేవాడు. యూఎస్లో కొందరు ఈ వ్యాధి కోసం తాయ్చి శిక్షణ తీసుకుంటున్నారని తెలుసుకుంటాడు. తాను ఎలాగైనా వీల్చైర్కి పరిమితం కాకుండా బయటపడేలా ఏదైనా చేయాలని భావించి అస్సాంకి చెందిన తాయ్ చి మాస్టర్ బబ్లూ సావంత్ వద్ద శిక్షణ తీసుకుంటాడు. తాయ్ చి (Tai Chi) అంటే..చైనాలో పుట్టిన ఒక ప్రాచీన మార్షల్ ఆర్ట్. మనస్సు-శరీరాన్ని సమన్వయం చేసే ఒక అభ్యాసం(సాధన) ఇది శ్వాస నియంత్రణ, మైండ్ఫుల్నెస్, శరీర సమతుల్యతను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అయితే బ్రహ్మభట్కి ఈ వ్యాయామాలు శరీర కదలికలకు మంచి హెల్ప్ అయ్యాయి. అయితే నేరుగా నడవడం మాత్రం కష్టమయ్యేది. కానీ కారు నడపగలడు, వ్యాపారాన్ని కూడా సమర్థవంతంగా నిర్వహించగలడు. దీని సాయంతోనే బుద్ధిపూర్వకంగా కదలికలు, అవయవాల సమన్వయాన్ని తిరిగి క్రమాంకనం చేయగలిగాడు. ఇది ఒక యుద్ధ కళ మాత్రమే కాదు, మన శరీరాన్నే గాక, అంతర్గత అంశాలపై దృష్టి పెట్టి మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. మనస్సుపై నియంత్రణను సాదించగలుగడమే గాక ఈ భంగిమలు రక్తప్రసరణను మెరుగ్గా ఉంచుతాయి. ప్రస్తుతం బ్రహ్మ భట్ ఈ తాయ్చి సాయంతో స్పెషల్ పర్సన్స్ విభాగంలో 35 పుష్ అప్లు చేసి గిన్నిస్ రికార్డు సృష్టించాలని భావిస్తున్నాడు. ఎందుకంటే తనలాంటి వారిలో ఆశావాహ దృక్పథాన్ని అందించి ఈ వ్యాధితో జీవించడం ఎలాగో తెలియజేయాలనేది బ్రహ్మభట్ ఆకాంక్ష. అనారోగ్యంతో భయపడుతూ కూర్చోకూడదు, ధైర్యంగా పోరాడి జయించే మార్గం వెతకాలి అనే సందేశాన్ని ఇస్తోంది కదూ ఇతడి కథ..!.(చదవండి: ChatGPT Weight Loss: ఐస్క్రీం తింటూ పదికిలోలు తగ్గింది..! అదికూడా ఏఐ సాయంతో..!) -
ఐస్క్రీం తింటూ పదికిలోలు తగ్గింది..! అదికూడా ఏఐ సాయంతో..!
వివిధ వ్యాధులకు మూలమైన అధిక బరువు ప్రస్తుతం అందర్నీ వేధించే పెనుసమస్యగా మారింది. బరువు తగ్గడం అనేది ఓ సవాలు. మాటల్లో చెప్పినంత సులవు కాదు తగ్గడం. స్ట్రాంగ్మైండ్ అచంచలమైన అంకితభావం ఉన్నవాళ్లే బరువు తగ్గడంలో విజయవంతమవ్వగలురు. అందుకోసం ఫిట్నెస్ నిపుణులు లేదా వ్యక్తిగత వైద్యులు సలహాలు సూచనలతో ప్రారంభించడం అనేది సర్వసాధారణం. కానీ ఇప్పుడు అరచేతిలో ప్రపంచాన్ని చూపించే ఏఐ సాంకేతికతను స్మార్ట్గా ఉపయోగించుకుంటూ ఆశ్చర్యపరిచేలా స్లిమ్గా అవుతున్నారు. సాంకేతికతను వాడోకవడం వస్తే..బరువు అనేది భారం కాదని ప్రూవ్ చేస్తున్నారు. ఇక్కడొక ఆరోగ్య నిపుణురాలు ఏఐ సాంకేతికను ఉపయోగించుకుంటూ.. తన కిష్టమైన ఐస్క్రింని త్యాగం చేయకుండానే బరువు తగ్గి చూపించింది. అది కూడా హాయిగా ఐస్క్రీంలు లాగించేస్తూనే ఎన్నికిలోలు తగ్గిందో వింటే నోరెళ్లబెడతారు.వెయిట్లాస్ జర్నీలో ఆహారాలు, వ్యాయామ షెడ్యూల్, జీవనశైలి తదితరాలు ఇతరులకు మార్గదర్శకంగా ఉంటాయి. కానీ ఈ మహిళ ఆరోగ్యకరంగా బరువు తగ్గేందుకు కృత్రిమ మేధ సాయాన్నితీసుకుంది. ఇది మనిషి సందేహాలను సత్వరమే నివృత్తిచేసి..గైడ్ చేయగలదని చాలామంది ప్రగాఢంగా నమ్ముతుండటం విశేషం. ఆ నేఫధ్యంలోనే ప్రముఖ ఆరోగ్యనిపుణురాలు సిమ్రాన్ వలేచా కూడా ఏఐ ఆధారిత చాట్జీపీటి సాయంతో తీసుకుని బరువు తగ్గేందుకు ప్రయత్నించింది. డిసెంబర్ 2024లో ఈ చాట్జీపీటీ(ChatGPT) సాయం తీసుకుని వెయిట్ లాస్ జర్నీని ప్రారంభించారామె. అయితే ఆమె తనకెంతో ఇష్టమైన ఐస్క్రీని అస్సలు త్యాగం చేయకుండా బరువు తగ్గానంటూ ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. అంతేగాదు వెయిట్లాస్ కోసం చాట్జీపీటీతో మాట్లాడి ధైర్యంగా ముందడుగు వేయొచ్చని ధీమాగా చెప్పేస్తున్నారామె. ఇన్స్టా పోస్ట్లో సిమ్రాన్ ఇలా రాశారు. "ఐస్క్రీం తింటూనే పది కిలోలు తగ్గాను. అలాగే బరువు తగ్గాలనుకుంటే స్వంతంగా డైట్ని ఎంచుకోండి. అందుకోసం చాట్జీపీటీని ఎలా ఉపయోగించాలో తెలుసుకోండి". అంటూ సవివరంగా తన వెయిట్ లాస్ జర్నీ గురించి వివరించింది.చాట్జీపీటీలో ఎలా అడగాలంటే..చాట్జీపీటీలో సిమ్రాన్ తన ఎత్తు, బరువు వివరాలను వెల్లడించినట్లు తెలిపింది. ఆరోగ్యకరంగా బరువు తగ్గాలనకుంటున్నా..అందుకోసం తీసుకోవాల్సిన ఆహారాలు, చిరుతిండ్లు వివరాలను ఇవ్వాల్సిందిగా కోరినట్లు పేర్కొంది. అలాగే తన పనిగంటలు, ఖాళీ సమయం వంటి వివరాలు కూడా ఏఐకి ఇచ్చినట్లు తెలిపింది. ఎన్నిగంటలు వ్యాయమానికి కేటాయించగలను అనేది కూడా ఇచ్చినట్లు తెలిపింది. అల్పాహారం దగ్గర నుంచి రాత్రి భోజనం వరకు ఆహారం విషయంలో ఎలాంటి జాగ్రత్తులు తీసుకోవాలో సవివరంగా తెలుసుకుని బరువు తగ్గానని పోస్ట్లో రాసుకొచ్చింది సిమ్రాన్. గమనిక: ఇక్కడ సాంకేతికత అనేది జస్ట్ ఆరోగ్యంపైన అవగాహన కల్పించగలదని, అదే కచ్చితమని భావించరాదని వైద్యలు హెచ్చరిస్తున్నారు. అది మనలను ఆరోగ్యంపై ఒక అవగాహన కల్పించే అప్లికేషన్ అని గుర్తించగలరు. వ్యక్తిగతంగా అనుసరించాలనుకుంటే వైద్యులను లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. View this post on Instagram A post shared by Simran - Health, Wellness & Weight Loss Expert (@simvalecha) (చదవండి: 'బ్యూటిఫుల్ బామ్మ'..! ఫిట్నెస్లో సరిలేరు ఈమెకెవ్వరూ..) -
మలేరియా తగ్గితే జీడీపీ పెరిగింది!
ప్రపంచ వ్యాప్తంగా దోమల నివారణ పెద్ద సమస్యగా మారింది. దోమల వల్ల వచ్చే ముఖ్యమైన వ్యాధి మలేరియా. దీని వల్ల ప్రపంచ వ్యాప్తంగా ప్రతి నిమిషానికి ఒక మరణం సంభవిస్తోంది. గత కొన్ని దశాబ్దాలుగా మలేరియా నియంత్రణలో కష్టించి సాధించిన ప్రగతి ఇప్పుడు ప్రమాదంలో పడి, ముందుకు సాగలేని పరి స్థితి వచ్చింది. వాతావరణం, సామాజిక సంఘర్షణలు, ఆర్థిక స్థితి గతులు, అత్యవసర పరిస్థితులు దీనికి అడ్డంకులుగా మారుతు న్నాయి. అందువలన మలేరియా నియంత్రణ ప్రాథమిక సూత్రాలైన గుర్తింపు, చికిత్స, నివారణ చర్యలు అందుబాటులో ఉండటం లేదు. నిరూపితమైన నివా రణ చర్యల కోసం తిరిగి పెట్టుబడి పెట్టడం, అడ్డంకులను తొలగించు వ్యూహా లను పన్నడం, కలసికట్టుగా తిరిగి అందరూ ఈ కొత్త ప్రయత్నాలను మొదలు పెట్టడం ద్వారా మలేరియాను అంతం చేయవచ్చు.2000 – 2017 మధ్య 180 దేశాల మలే రియా, స్థూల దేశీయోత్పత్తు (జీడీపీ)ల డేటాలను విశ్లేషించినప్పుడు... మలేరియా సంభవం 10% తగ్గినప్పుడు తలసరి జీడీపీలో సగటున 0.3% పెరుగుదల ఉందని తేలింది. ప్రతి దేశం మలేరి యాను నివారించడానికీ, గుర్తించడానికీ, చికిత్స చేయడానికీ ఒక కొంగొత్త సాంకేతికతను వాడుతున్నాయి. దోమల జీవిత కాలాన్నీ, అవి మలేరియాను వ్యాప్తి చేసే సామర్థ్యాన్నీ తగ్గించడానికి పురుగు మందులతో కూడిన దోమ తెరల సాంకేతికతను ఉపయోగిస్తున్నారు. 2000లో ఈ సాంకేతికతను విస్తరించినప్పటి నుండి 68 శాతం మలేరియా కేసులను నివారించినట్లు అంచనా. ‘కాలానుగుణ మలేరియా చికిత్స’ పొందిన పిల్లలలో దాదాపు 75 శాతం మలేరియా బారి నుంచి బయటపడ్డారు. నేడు ప్రపంచ వ్యాప్తంగా శాస్త్రవేత్తలు దీర్ఘకాలం ఉండే దోమ తెరలు, మోనోక్లోనల్ యాంటీ బాడీ చికిత్స, శక్తిమంతమైన కొత్త వాహక నియంత్రణ సాధనాలు, జన్యుపరంగా మార్పు చెందిన దోమలు, ప్రపంచంలోని మొట్టమొదటి మలేరియా వ్యాక్సిన్ వంటి విప్లవాత్మక ఆవిష్కరణలపై పనిచేస్తున్నారు. ఇదీ చదవండి: కేవలం రూ.3.5 లక్షలతో ఫ్యాషన్ బ్రాండ్..రూ. 500 కోట్ల దిశగాEven mosquitoes are worried! 🦟With clean surroundings, covered tanks, and repellents in every home, they have nowhere to hide. This World Mosquito Day, let’s keep our communities safe and mosquito-free.#WorldMosquitoDay #FightTheBite pic.twitter.com/ydoux9ZrwO— Ministry of Health (@MoHFW_INDIA) August 20, 2025 అందువలన గతంలో కంటే ఇప్పుడు ఎక్కువ దేశాలు మలేరియా నిర్మూ లనకు దగ్గరగా ఉన్నాయి. మన దేశంలో గత సంవత్సరం 2,57,383 మలే రియా కేసులు, 62 మరణాలు నమోదయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో ముఖ్యంగా గిరిజన ఆవాసాలు, కొండ ప్రాంతాల్లో మలేరియా కేసులు ఎక్కువగా నమో దవుతూ ఉన్నాయి. అక్కడ జనాభా 20% మాత్రమే ఉన్నప్పటికీ, 80% కేసులు అక్కడే ఉన్నాయి. మనందరం కలిసి మలేరియాను సమూలంగా తొలగించేందుకు కంకణం కట్టుకుందాం. ఇది మన సమష్టి బాధ్యత.– తలతోటి రత్న జోసఫ్, మెడికల్ ఎంటమాలజిస్ట్ -
82 ఏళ్ల వయసులోనూ ఫిట్గా అమితాబ్..! ఆ జాగ్రత్తలు తప్పనిసరి..
‘వయసు పైబడడం అనేది సహజం... వచ్చే సమస్యలు కూడా సహజం’ అని ఆరోగ్యాన్ని గాలికి వదిలేసేవారు కొందరు. ‘వయసు పైబడడం అనేది సహజమే అయినా, తగిన జాగ్రత్తలు తీసుకోవడం, వ్యాయామాలు చేయడం తప్పనిసరి’ అని ముందుకు వెళ్లేవారు కొందరు. బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్ రెండో కోవకు చెందిన వ్యక్తి.తన ఆలోచనలను పర్సనల్ బ్లాగ్ ద్వారా ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటారు బిగ్ బి. 82 సంవత్సరాల అమితాబ్ తాజాగా వృద్ధాప్యానికి సంబంధించిన సవాళ్ల గురించి తన తాజా పోస్ట్లో రాశారు. ఇంట్లో ‘హ్యాండిల్ బార్స్’ అవసరం గురించి ప్రస్తావించారు.వృద్ధుల కోసం బాత్రూమ్లో, ఇంట్లోని కొన్ని చోట్ల హ్యాండిల్ బార్స్ లేదా గ్రాబ్ బార్స్ ఏర్పాటు చేస్తారు.‘మీట్–అండ్–గ్రీట్ విత్ ఫ్యాన్స్’లో భాగంగా అభిమానులను కలుసుకున్న తరువాత తన దినచర్య గురించి రాశారు బిగ్ బి.‘శరీరం క్రమేణా సమతుల్యత కోల్పోతోంది’ అని రాసిన బచ్చన్ తన ఆరోగ్యంపై మరింత శ్రద్ధ పెడుతున్నారు. యోగా, శ్వాస వ్యాయామాలు, మొబిలిటీ వ్యాయామాల ప్రాముఖ్యత గురించి తన పోస్ట్లో నొక్కి చెప్పారు.‘82 సంవత్సరాల వయసులోనూ ఇంత చురుగ్గా ఎలా ఉండగలుగుతున్నారు?’ అనే ప్రశ్నకు సోషల్ మీడియాలో ఆయన పోస్ట్లే సమాధానం చెబుతాయి. సందర్భానుసారంగా ఉన్నత జీవనశైలికి సంబంధించిన అలవాట్ల గుంచి ఎన్నో పోస్ట్లలో వివరించారు అమితాబ్.ఎన్నో అనారోగ్య సమస్యలను అధిగమించి ఉత్సాహంగా ముందుకు వెళుతున్న సూపర్ స్టార్ నిజమైన పోరాట యోధుడు. ఎంతోమందికి స్ఫూర్తినిచ్చే వ్యక్తి. (చదవండి: 'బ్యూటిఫుల్ బామ్మ'..! ఫిట్నెస్లో సరిలేరు ఈమెకెవ్వరూ..) -
'బ్యూటిఫుల్ బామ్మ'..! ఫిట్నెస్లో సరిలేరు ఈమెకెవ్వరూ..
సుదీర్ఘకాలం ఆయురారోగ్యాలతో జీవించిన ఎందరో బామ్మలు, ముత్తాతల స్టోరీలను చూశాం. ఒక్కొక్కరిది ఒక్కో కథ. వివిధ కారణాల రీత్యా వారంతా తమ ఆరోగ్యంపై ఫోకస్ పెట్టారు. కానీ వందేళ్లకు చేరువయ్యేటప్పటికీ.. అంత చురుగ్గా లేరు. కానీ వృద్ధాప్యాన్ని ఆరోగ్యవంతంగా మార్చుకోవడంలో స్ఫూర్తిని కలిగించారు. కానీ ఈ బామ్మ వందేళ్లుంటాయా..! అని ఆశ్చర్యపోయేలా ఆమె ఆహార్యం ఉంటుంది. అచ్చం సంతూర్ యాడ్ తలపించేలా భలే యాక్టివ్గా యంగ్ విమెన్లా ఉంటుంది. అంతేకాదండోయ్ చూడటానికి మంచి అందంగా కూడా ఉంటుంది ఈ బామ్మ. ఆఖరికి ఫిట్నెస్లో కూడా ఆమెకు సరిరావెవ్వరూ..!.. అన్నట్లుగా కసరత్తులు చేస్తుంది ఈ బామ్మ. ఆ బామ్మ పేరు హోస్ట్ ర్యాన్ జేమ్స్ రూత్. ఆమెకు వందేళ్లు. ఆమె స్వయంగా తన దీర్ఘాయువు రహస్యాన్ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంటూ..తన వర్కౌట్లకు సంబంధించిన వీడియోని పంచుకుంది. ఆ వీడియో క్లిప్లో జిమ్లో రకరకాల మిషన్లపై ఎలాంటి వ్యాయామాలు చేయగలదో చూపించడమే గాక..ప్రతిరోజూ తప్పకుండా 4 మైళ్లు దూరం నడుస్తానని అంటోంది. అదే తనను ఇన్నాళ్లు ఆయురారోగ్యాలతో జీవించేలా చేసిందని చెబుతోంది. తాను పదవీవిరణమణ చేసినప్పటి నుంచి నాలుగు మైళ్లు దూరం నడుస్తున్నట్లు తెలిపింది. చక్కటి వ్యాయామాలు, 9.30 కల్లా కంటినిండా నిద్రపోవడం తదితరాలే తన ఆరోగ్య రహస్యమని అంటోంది. ఎక్కువగా కూరగాయలే తీసుకుంటాను, పైగా ఆరోగ్యంగా ఉండేలా శ్రద్ధ తీసుకుంటానంటోంది. చివరగా తాను అత్యంత ధనవంతురాలిగా పేర్కొంది. అంటే ఆయురారోగ్యాలకు మించిన ఐశ్వర్యం లేదని పరోక్షంగా ఇలా చెప్పింది ఆ బామ్మ. ఇదిలా ఉండగా, సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) ప్రకారం..వృద్ధాప్యంలో చక్కగా వ్యాయామాలు చేస్తే రక్తపోటు, బ్రెయిన్-గుండె ఆరోగ్యం మెరుగ్గా ఉంటాయట. అలాగే కేన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు దరిచేరవని చెబుతున్నారు. పైగా బరువుని నిర్వహించగలమని, ఎముకలు కూడా దృఢంగా ఉంటాయని చెబుతున్నారు. కాగా, నెటిజన్లు ఆ బామ్మ దీర్ఘాయువు రహస్యం విని విస్తుపోవడమే కాదు..ఆమె ఈ వయసులో ఏకంగా నాలుగు మైళ్ల దూరం నడుస్తోందంటే..ఈమె సూపర్ బామ్మ. ఫిట్నెస్లో ఈమెకు సరిరెవ్వరూ అని ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు. గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. View this post on Instagram A post shared by evry.day club (@evrydayclub) (చదవండి: Pregnant Women: బీకేర్ఫుల్.. మార్నింగ్ సిక్నెస్ని లైట్ తీసుకోవద్దు!) -
బీకేర్ఫుల్..! కాబోయే తల్లులూ..మార్నింగ్ సిక్నెస్ని లైట్ తీసుకోవద్దు!
ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడూ కాస్త నలతగా ఉండటం అనేది సహజం. పైగా చాలామందికి మార్నింగ్ సిక్నెస్ ఉంటుంది. ప్రతి ఉదయం మూడ్ స్వింగ్స్ మారుతూ ఒక విధమైన అలసటగా ఉంటుంది. వైద్యులు, పెద్దవాళ్లు కూడా ఈ సమయంలో ఇది అత్యంత సహజం అని చెబుతుంటారు. అలా అని లైట్ తీసుకుంటే ఒక్కోసారి ప్రాణాంతంకంగా మారిపోయి క్రిటికల్గా పరిణమిస్తుంది. అచ్చం అలానే జరిగింది ఈ బ్రిటన్కు చెందిన ఈ మహిళకు. పాపం ఆ కారణంగా ఆమె అమ్మ అను భాగ్యాన్ని కూడా దూరం చేసుకోవాల్సి వచ్చింది. అసలేం జరిగిందంటే..బ్రిటన్కి చెందిన 29 ఏళ్ల సోఫియా యాసిన్ పెళ్లైన రెండు సంవత్సరాలకు గర్భం దాల్చింది. ఆ విషయ తెలుసుకున్నప్పటి నుంచి ఆ దంపతులిద్దరి ఆనందానికి అవధులు లేవు. అయితే ప్రతి ఉదయం అలసిపోతూ, నీరసంగా ఉండేది. అదే విషయం వైద్యులకు తెలిపినా..ఇది కామన్ అని సర్ది చెప్పారు. ఇది రాను రాను మరింత ఎక్కువ అవుతుందే గానీ తగ్గేది కాదు. ఆఖరికి రాత్రుళ్లు, చెమటలు, దురద వంటి సమస్యలు కూడా ఉత్ఫన్నమయ్యేవి. ఆ తర్వాత 14 వారాల ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడూ ఉన్నట్టుండి హఠాత్తు కుప్పకూలిపోయింది. దాంతో ఆమెను హుటాహుటినా ఆస్పత్రికి తరలించగా.. బహశా ఆమెకు న్యూమోనియా ఉందేమోనని భావించారు వైద్యులు. అయితే పలు వైద్య పరీక్షలు నిర్వహించగా.. ఆమెకు గుండెపై కణితి ఉందని, నాన్-హాడ్కిన్కు సంబంధించిన ప్రాణంతక బ్లడ్ కేన్సర్తో బాధపడుతున్నట్లు వివరించారు. ఒక్కసారిగా కాళ్ల కింద భూమి కదిలిపోయినంత పనైంది. ఏం చేయాలో తెలియని దిగ్బ్రాంతికి గురయ్యారు. అంతేగాదు గర్భాన్ని కూడా కొనసాగించడం సాధ్యం కాదని, ఒకవేళ కొనసాగించినా..ఆ చిన్నారి కూడా ఈ సమస్య బారినపడే అవకాశం ఉందని హెచ్చరించారు. దాంతో ఆ దంపతులు ఒక్కరోజుతో తమ సంతోషమంతా దుఃఖంగా మారిపోయిందని భోరుమని విలపించారు. తప్పనిసరి పరిస్థితుల్లో 15 వారాల ప్రెగ్నెన్సీని తొలగించుకుని ఆరు రౌండ్ల కీమోథెరపీ ట్రీటెమంట్లు తీసుకుంది సోఫియా. ఈ ఏడాది ప్రారంభంలో సోఫియా పూర్తిగా కోలుకుని యథావిధిగా ఆరోగ్యవంతురాలైంది. అంతేగాదు తనలా మరెవ్వరూ బాధపడకూడదని, లింఫోమా(బ్లడ్ కేన్సర్ చెంది)తో పోరాడి గెలిచేలా నిధులు సేకరిస్తోందామె.నాన్-హాడ్కిన్ లింఫోమా అంటే ఏమిటి?నాన్-హాడ్కిన్ లింఫోమా అనేది శోషరస వ్యవస్థను ప్రభావితం చేసే ఒక రకమైన కేన్సర్. ఇది అవయవాలు, గ్రంథులు, ట్యూబ్ లాంటి నాళాలు, శోషరస నోడ్స్ వంటి కణాల సముహాన్ని ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా శరీరంలోని రోగనిరోధక వ్యవస్థలో ఒక భాగమైన జెర్మ్-ఫైటింగ్ కణాలు శరీరం అంతటా నియంత్రణ లేకుండా పెరిగి, కణితులనే ఏర్పరిస్తే..దాన్నినాన్-హాడ్కిన్ లింఫోమాగా నిర్థారిస్తారు వైద్యులు. సంకేతాలు-లక్షణాలు.. మెడ, చంకలు లేదా గజ్జల్లో వాపు శోషరస గ్రంథులుబొడ్డు నొప్పి లేదా వాపుఛాతీ నొప్పి, దగ్గు లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిచాలా అలసటగా అనిపించడంజ్వరంరాత్రిపూట చెమటలు పట్టడంఆకస్మికంగా బరువు తగ్గడం వంటి లక్షణాలు ఉంటాయని చెబుతున్నారు నిపుణులు. అయితే చాలామటుకు దీన్ని అంత సులభంగా గుర్తించలేమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కానీ పైన చెప్పిన మార్పుల్లో ఏదో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ లక్షణాలు కనిపిస్తుంటే..తక్షణమే వైద్యుడిని సంప్రదించడం మంచిదని చెబుతున్నారు నిపుణులు.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: -
డిజిటల్ డ్యామేజ్..! స్క్రీన్ టైం తగ్గించాల్సిందే..
ప్రస్తుత స్క్రీన్ వినియోగ దోరణులు ఇలాగే కొనసాగితే 2050 నాటికి దాదాపు 50% మంది పిల్లలు మయోపియాకు ప్రభావితమవుతారని ఆప్తాల్మిక్ – ఫిజియోలాజికల్ ఆప్టిక్స్ అంచనా. వినోదం నుంచి విద్య వరకూ డిజిటల్ స్క్రీన్లు వినియోగించడం అనేది నగర రోజువారీ జీవితంలో భాగమవుతోంది. దీంతో చిన్నారుల్లో కంటి సంబంధిత మయోపియా నుంచి డిజిటల్ కంటి ఒత్తిడి, నిద్రలోపాలు, ప్రవర్తనా మార్పుల వరకూ పలు అనారోగ్య సమస్యలు భారీగా పెరిగే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు, క్యూరియస్ జర్నల్ పరిశోధన ఫలితాలను ఉటంకిస్తూ ఇటీవల ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లల్లో 50% కంటే ఎక్కువ మంది డిజిటల్ కంటి ఒత్తిడి లక్షణాలను కలిగి ఉన్నారు. వీటిలో అలసట, తలనొప్పి, నిద్ర ఆటంకాలు, మానసిక పరమైన ప్రవర్తనా సమస్యలు ఉన్నాయి. ఇవి దీర్ఘకాలిక ఆరోగ్యంపై చూపే ప్రభావం గురించిన ఆందోళనలు పెంచుతున్నాయి.కఠిన పరిమితులు అవసరం.. ‘ప్రారంభంలోనే ఆరోగ్యకరమైన స్క్రీన్ అలవాట్లను పెంపొందించడం పిల్లల కంటి ఆరోగ్యాన్ని కాపాడటానికి కీలకం’ అని వైద్యులు చెబుతున్నారు. ‘కఠినమైన స్క్రీన్ సమయ పరిమితిని నిర్ణయించడం అనే అంశానికి తల్లిదండ్రులు కూడా మద్దతు ఇవ్వగలగడం ఆరోగ్యకరమైన మార్పుకు ఒక మార్గం. విద్యావేత్తలకు స్క్రీన్లు అవసరమైనప్పుడు, 20–20–20 నియమాన్ని అనుసరించండి. ప్రతి ఇరవై నిమిషాలకు, ఇరవై సెకన్ల విరామం తీసుకోండి. డిజిటల్ కంటి ఒత్తిడిని తగ్గించడానికి 20 అడుగుల దూరంలో ఉన్న దేనినైనా చూడండి. బ్లూ లైట్ ఫిల్టర్ మోడ్ ఉపయోగించడం కూడా కంటి ఆరోగ్యానికి సహాయపడుతుంది’ అంటూ సూచిస్తున్నారు. స్క్రీన్ టైం ప్రభావం.. ‘ఎక్కువసేపు స్క్రీన్ టైం వాడటం వల్ల పాఠశాల వయసు పిల్లలకు మయోపియా లేదా సమీప దృష్టి లోపం కలుగుతోంది. ఈ మయోపియా వేగంగా అభివృద్ధి చెందడం వల్ల మెల్లకన్ను, పొడి కంటి వ్యాధి, కంటి డిజిటల్ ఒత్తిడి ప్రమాదం ఎక్కువవుతుంది’ అని కంటి వైద్య నిపుణులు అంటున్నారు. ‘స్క్రీన్ నుంచి వెలువడే నీలి కాంతి విభిన్న రకాల ముప్పును కలిగిస్తుంది. ఫ్రీ రాడికల్స్ కారణంగా రెటీనాకు నష్టం కలిగించడం, మెలటోనిన్ను అణచివేయడం వల్ల నిద్రకు భంగం కలుగుతుంది. తద్వారా మొత్తం ఆరోగ్యం ప్రభావితం అవుతుందని వివరిస్తున్నారు. (చదవండి: వ్యాధులు.. ప్రభావాలు! కంటిపై 'కన్నేస్తాయి'..) -
వ్యాధులు.. ప్రభావాలు! కంటిపై 'కన్నేస్తాయి'..
‘కన్ను లేనిదే కలికాలమే లేద’ని సామెత. అయితే వ్యాధుల్లేకుండా కూడా ఈ కలికాలం లేదు. పైగా ఈ వ్యాధులన్నీ అంతటి కీలకమైన కంటిని దెబ్బతీసే అవకాశం లేకపపోలేదు. డయాబెటిస్, రక్తపోటు వంటివి కనిపించినప్పుడు ఇంకేవైనా అవయవాలు దెబ్బతిన్నాయో చూడటంతోపాటు డాక్టర్లు కంటి పరీక్షలూ విధిగా నిర్వహిస్తారు. అలాగే మైగ్రేన్ మొదలుకొని థైరాయిడ్, రక్తహీనత (అనీమియా) వరకు ఎన్నో రకాల వ్యాధులు కంటి చూపుపై తమ దుష్ప్రభావాన్ని చూపే అవకాశముంది. అందుకే నేరుగా కంటికి వచ్చే ఆరోగ్య సమస్యలతోపాటు ఇతర వ్యాధుల వల్ల కంటిపై పడే దుష్ప్రభావాలు ఎలా ఉంటాయో, వాటి వల్ల కంటికి వచ్చే సమస్యలేమిటో తెలుసుకుందాం...ఎవరిలోనైనా ఏదైనా వ్యాధి వచ్చిందంటే చాలా సందర్భాల్లో అది ఆ అవయవానికో లేదా ఆ అవయవం ఏ వ్యవస్థదైతే ఆ వ్యవస్థకు మాత్రమే పరిమితమని అపోహ పడుతుంటాం. ఉదాహరణకు రక్తహీనత ఏర్పడిందంటే... అది రక్తం సరఫరా అయ్యే అన్ని అవయవాలతో పాటు కంటిపైనా తన దుష్ప్రభావాన్ని చూపవచ్చు. ఇక థైరాయిడ్కు ఏదైనా జబ్బు వస్తే అది థైరాయిడ్కు మాత్రమే పరిమితం కాక΄ోవచ్చు. అలా కంటిపై ప్రభావం చూపేందుకు అవకాశమున్న కొన్ని ఆరోగ్య సమస్యలూ, వ్యాధులు, కండిషన్స్ తాలూకు ఉదాహరణలు... డయాబెటిస్ రక్తపోటు థైరాయిడ్రక్తహీనత (అనీమియా) ∙కొలాజెన్ వాస్క్యులార్ డిసీజ్ ∙ఆటోఇమ్యూన్ డిసీజెస్ ∙కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ కొన్ని ట్యూమర్లు (గడ్డలు) ∙వంశపారంపర్యంగా వచ్చే కొన్ని రకాల (హెరిడిటరీ) వ్యాధులు. ఇవి మాత్రమే కాదు... మనం వాడే కొన్ని రకాల మందులు, మన హార్మోన్లలో చోటుచేసుకునే అసమతౌల్యతలు... ఇవి కూడా కంటిపైన దుష్ప్రభావాలను చూపవచ్చు. అందుకే కొన్ని వ్యాధులు ఉన్నవారు, కొన్ని మందులు తీసుకునేవారు విధిగా వాటి వల్ల తమ కంటిపై ఏదైనా చెడు ప్రభావాలు కనిపిస్తాయా అని తెలుసుకోవాలి. అలాంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే డాక్టరును సంప్రదించాలి. కొన్ని జబ్బులూ... కంటిపై అవి చూపే దుష్ప్రభావాలు...డయాబెటిస్ఈరోజుల్లో ఇంటికి ఒకరికైనా ఉండే లైఫ్స్టైల్ వ్యాధి ఇది. ఈ సమస్య వచ్చినవారిలోని కనీసం 20 శాతం మందిలో దాని దుష్ప్రభావాలు కంటిపైనా పడే అవకాశాలుంటాయి. డయాబెటిస్ వల్ల కంటికి వచ్చే వ్యాధులివే...డయాబెటిక్ రెటినోపతి : కంటివెనక ఉండే రెటీనా అనే తెరపై పడే ప్రతిబంబం నుంచి మెదడుకు సిగ్నల్స్ అందడం వల్లనే మనం చూడగలం. డయాబెటిస్ కారణంగా రక్తనాళాలు మొద్దుబారడంతో రెటినాకు అందాల్సిన పోషకాలు, ఆక్సిజన్ అందకపోవడంతో రెటీనా పనితీరు క్రమక్రమంగా తగ్గే అవకాశముంటుంది. ఫలితంగా దృష్టిలోపం వచ్చే ముప్పు ఉంటుంది. అందుకే డయాబెటిస్తో బాధపడుతున్నవారు క్రమం తప్పకుండా కంటి పరీక్షలూ, కంటి నరాలు మొద్దుబారుతున్నాయా అన్న విషయాన్ని క్రమం తప్పకుండా పరీక్షించుకుంటూ ఉండాలి. గ్లకోమా : డయాబెటిస్ ఉన్నవారికి కంట్లో నల్లముత్యం లేదా నీటికాసులు అనే గ్లకోమా బారిన పడే ముప్పు ఉంటుంది. గ్లకోమా ఉన్నవాళ్లలో కంట్లో ఉండే ఇంట్రా ఆక్యులార్ ప్రెషర్ అనే ఒత్తిడి పెరిగి మనం చూసే దృష్టి విస్తృతి (ఫీల్డ్ ఆఫ్ విజన్) క్రమంగా తగ్గి΄ోతుంది. కాబట్టి డయాబెటిస్ ఉన్నవారు గ్లకోమా కండిషన్ ఏమైనా వచ్చిందా అని తరచూ కంటి డాక్టర్ చేత పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. క్యాటకార్ట్ : కంట్లోని లెన్స్ తన పారదర్శకతను కోల్పోయే కండిషన్ను కాటకార్ట్ అంటారన్న విషయం తెలిసిందే. వయసు పెరగడమే (ఏజింగ్ మాత్రమే) కాకుండా డయాబెటిస్ వల్ల కూడా కాటకార్ట్ వచ్చే అవకాశమున్నందువల్ల చక్కెర వ్యాధితో బాధపడేవారు క్యాటరాక్ట్కు సంబంధించిన పరీక్షలూ చేయించుకోవాలి. ఎందుకంటే సాధారణ ఆరోగ్యవంతులతో పోలిస్తే డయాబెటిస్ ఉన్నవాళ్లకు క్యాటరాక్ట్ పదేళ్లు ముందుగానే వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ. ఆప్టిక్ న్యూరోపతీ : డయాబెటస్ వల్ల నరాలు మొద్దుబారి తమ చైతన్యాన్ని కోల్పోతాయన్న విషయం తెలిసిందే. అన్ని నరాలతో పాటు ఆప్టిక్ నర్వ్కు కూడా ఈ ముప్పు పొంచి ఉంటుంది. మిగతా నరాల విషయం ఎలా ఉన్నా చూపునిచ్చే ఆప్టిక్ నర్వ్ దెబ్బతింటే జీవితమంతా చీకటయ్యే ముప్పు ఉన్నందున డయాబెటిస్ ఉన్నవారు తప్పనిసరిగా క్రమం తప్పకుండా కంటిపరీక్షలు చేయించుకుంటూ ఉండాలి.పాటించాల్సిన సూచనలు / తీసుకోవాల్సిన జాగ్రత్తలు / చికిత్సలు...డయాబెటిస్ ఉన్నవారు క్రమం తప్పకుండా మందులు వాడుతూ, వ్యాయామం చేస్తూ రక్తంలో చక్కెర మోతాదులను ఎప్పుడూ అదుపులో పెట్టుకుంటూ ఉండటం క్రమం తప్పకుండా తమ వ్యక్తిగత వైద్యులతో పాటు కంటి డాక్టర్ ఫాలో అప్లో ఉండటం.రక్తపోటు (హైపర్టెన్షన్)రక్తపోటు ఉన్నవారిలో కొందరికి అకస్మాత్తుగా చూపు కొంత మసకబారవచ్చు. లేదా దాదాపుగా చూపు కనిపించకపోవచ్చు. దీనికి అనేక కారణాలుంటాయి. రక్తపోటు కారణంగా... రెటీనాకు సంబంధించిన ప్రధాన రక్తనాళం (సిర)లోగానీ లేదా ఇతరత్రా ఏదైనా చిన్న రక్తనాళం (బ్రాంచ్ ఆఫ్ బ్లడ్ వెసెల్)లోగానీ రక్తం గడ్డకట్టి క్లాట్ ఏర్పడి అది అడ్డుపడే ముప్పు ఉండవచ్చు. రెటీనాకు సంబంధించిన ప్రధాన ధమని లేదా ధమని శాఖలో రక్తం గడ్డకట్టి రక్తప్రవాహానికి ఆ క్లాట్ అడ్డుపడవచ్చు. ఆప్టిక్ న్యూరోపతి అనే నరాలకు సంబంధించిన సమస్య రావచ్చు.కన్నులోని ఒక భాగమైన విట్రియల్ ఛేంబర్లో రక్తస్రావం కావచ్చు. గ్లకోమా వచ్చే ముప్పు కూడా ఉంటుంది.పాటించాల్సిన సూచనలు / తీసుకోవాల్సిన జాగ్రత్తలు / చికిత్సలు...రక్తపోటు ఉన్నవారు బీపీని అదుపులో ఉంచే ప్రయత్నాలు చేస్తుండాలి ఉప్పు, నూనె పదార్థాలు చాలా తక్కువగా తీసుకోవాలి కంటికి సంబంధించిన సమస్య వస్తే మందులు వాడటం లేదా లేజర్ చికిత్స లేదా శస్త్రచికిత్స చేయించుకోవాలి. డిస్లిపిడేమియారక్తంలో ఉండే కొన్ని రకాల కొవ్వు పదార్థాలు (ఉదా: కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరాయిడ్స్ వంటివి) ఉండాల్సిన మోతాదుల్లో కాకుండా హెచ్చుతగ్గులతో ఉన్నప్పుడు కంటి సమస్యలు రావచ్చు. అవి చూపును ప్రభావితం చేసే అవకాశం ఉంది.పాటించాల్సిన సూచనలు / తీసుకోవాల్సిన జాగ్రత్తలు / చికిత్సలు... కొవ్వులు తక్కువగానూ, పీచు ఎక్కువగానూ ఉండే ఆహారపదార్థాలు తీసుకోవాలి తాము తీసుకున్న కొవ్వులు దహనమయ్యేలా (బర్న్) అయ్యేలా వ్యాయాయం చేయాలి డాక్టర్లు కొవ్వుల మోతాదులను తగ్గించే మందులు సూచిస్తే వాటిని తప్పక వాడాలి. రక్తహీనత (అనీమియా)మన రక్తంలో ఉండే ఎర్ర రక్తకణాలే దేహంలోని అన్ని కణాలకూ అవసరమైన ఆక్సిజన్నూ, పోషకాలను మోసుకెళ్తుంటాయన్న విషయం తెలిసిందే. అనేక రకాల కారణాలతో కొంతమందిలో ఈ ఎర్రరక్తకణాల సంఖ్య (ఆర్బీసీ) తక్కువగా ఉండే కండిషన్ను రక్తహీనత (అనీమియా) అంటారు. మరికొందరిలో రరక్తకణాల సంఖ్య తగినంతగా ఉన్నా ఆక్సిజన్ను మోసుకు΄ోయే హిమోగ్లోబిన్ తక్కువగా ఉండవచ్చు. ఇలా రక్తహీనత ఉన్నవారిలో ఈ కింది లక్షణాలు కనిపిస్తాయి. రెటీనాపై రక్తస్రావం (రెటినల్ హేమరేజ్) కంటిలోని లెన్స్ తన పారదర్శకత కోల్పోవడం నరాల సమస్య వంటివి.పాటించాల్సిన సూచనలు / తీసుకోవాల్సిన జాగ్రత్తలు / చికిత్సలు... అనీమియాను తగ్గించే ఐరన్ టాబ్లెట్లు / ఐరన్ సప్లిమెంట్లు ఉన్న మందులు వాడటం ∙ఐరన్, ఇతరత్రా విటమిన్లు, ఇతర పోషకాలు సమృద్ధిగా ఉండే ఆహారాలు తీసుకోవడం. మైగ్రేన్ఇది ఒక రకం తలనొప్పి. తరచూ వస్తూ పోతూ... చాలా తీవ్రంగా బాధించే ఈ తలనొప్పి చాలామందిలో నుదుటికి ఒకవైపే రావచ్చు. అందుకే కొందరు దీన్ని పార్శ్వపు నొప్పి అని కూడా పిలుస్తారు. టీనేజ్ పిల్లల్లో తీవ్రంగా వచ్చి వాళ్ల చదువుపై కూడా ప్రభావం చూపే ఈ నొప్పిలో కన్ను కూడా చాలా నొప్పిగా ఉన్నట్లుగా అనిపిస్తుంటుంది. దాంతో పాటు కంటికి సంబంధించిన ఈ కింద లక్షణాలూ కనిపిస్తాయి. అవి... చూపు సరిగా కనిపించకుండా మసకమసగ్గా కనిపించడం నుదుటి మీద ఒకవైపున లేదా ఒక పక్క కన్నుగుడ్డులో తీవ్రమైన నొప్పి ఉండటం తాత్కాలికంగా చూపు తగ్గడం లేదా తాత్కాలికంగా ఏమీ కనిపించకపోవడం కంటి కండరాలకూ, కనురెప్పలకూ తాత్కాలికంగా పక్షవాతం రావడం. పాటించాల్సిన సూచనలు / తీసుకోవాల్సిన జాగ్రత్తలు / చికిత్సలు...కొన్ని అంశాలు మైగ్రేన్ తలనొప్పిని తక్షణం ప్రేరేపిస్తాయి. ఉదాహరణకు కొన్ని రకాల సుగంధద్రవ్యాల వాసనా లేదా అగరుబత్తీల వాసనలు మైగ్రేన్ను ప్రేరేపించి వెంటనే తలనొప్పి వచ్చేలా చేస్తాయి. ఇలా మైగ్రేన్ తలనొప్పిని ప్రేరేపించే అంశాలను ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్స్ అంటారు. తమకు తలనొప్పి ఏ అంశం వల్ల వస్తుందో గుర్తించి దాని నుంచి దూరంగా ఉండటం వల్ల దీన్ని చాలావరకు నివారించవచ్చు. ఇక మైగ్రేన్కు సంబంధించి డాక్టర్లు రెండురకాల చికిత్సలు చేస్తారు. మొదటిది... నొప్పి తక్షణమే తగ్గేందుకు చేసే చికిత్స, రెండోది దీర్ఘకాలంలో ఈ నొప్పి మళ్లీ మళ్లీ రాకుండా నివారించేందుకు ఇచ్చే ప్రివెంటివ్ చికిత్స. ఈ రెండు రకాల ఈ మందులను బాధితులు తప్పనిసరిగా వాడాలి. గుండెజబ్బులుకొన్ని రకాల గుండెజబ్బులు (కార్డియోవాస్క్యులార్ డిసీజెస్) కూడా కంటిపై దుష్ప్రభావాన్ని చూపవచ్చు. గుండెజబ్బుల కారణంగా కొందరిలో ఈ లక్షణాలు కనిపించవచ్చు. ఉదాహరణకు... అకస్మాత్తుగా చూపు మందగించడం తాత్కాలికంగా చూపు కోల్పోవడం కంటి చూపునకు / దృష్టిజ్ఞానానికి సహాయపడే నరానికి (ఆప్టిక్ నర్వ్కు) సంబంధించిన సమస్యలు.పాటించాల్సిన సూచనలు / తీసుకోవాల్సిన జాగ్రత్తలు / చికిత్సలు...అసలు సమస్యకు (అండర్లైయింగ్ హార్ట్ ప్రాబ్లమ్కు) చికిత్స తీసుకోవడం వల్ల దాని కారణంగా వచ్చే కంటి సమస్యలూ తగ్గుతాయి. అలాగే తరచూ కంటి పరీక్షలూ చేయించుకుంటూ ఉండాలి. సోరియాసిస్సోరియాసిస్ వ్యాధిలో చర్మం పొడిబారి పట్టు రాలుతున్నట్లుగా ఉంటుంది. సొంత రోగ నిరోధకశక్తి బాధితులపై ప్రతికూలంగా పనిచేయడంతో పాటు మరికొన్ని కారణాలతో వచ్చే ఈ జబ్బులో కన్ను కూడా ప్రభావితమయ్యే అవకాశాలుంటాయి. ఈ జబ్బు ఉన్నవాళ్లలో...రెటీనాకూ, తెల్లగుడ్డులో భాగమైన స్క్లెరాలరా ΄÷రకు మధ్య ఇన్ఫ్లమేషన్ రావడం (యువైటిస్) కార్నియాకు ఇన్ఫ్లమేషన్ రావడం (కెరటైటిస్), కంటిలో ఉండే కంజెంక్టివా అనే పొరకు ఇన్ఫెక్షన్ రావడం (కంజెక్టివైటిస్), కన్ను పొడిబారడం (డ్రై ఐ) వంటి లక్షణాలు కనిపించవచ్చు.పాటించాల్సిన సూచనలు / తీసుకోవాల్సిన జాగ్రత్తలు / చికిత్సలు...సోరియాసిస్కు ఇప్పుడు గతంలో కంటే అధునాతనమైన చికిత్స ప్రక్రియలు అందుబాటులో ఉన్నాయి. ఉదాహరణకు పూవా, గతంలో మాదిరిగా అల్ట్రావయొలెట్ రేడియేషన్ కిరణాలతో ఇచ్చే చికిత్సలు, ఇమ్యూనోమాడ్యులేటర్స్ అనే ఆధునిక తరహా చికిత్సలు. వీటిని తీసుకుంటూనే ఒకసారి కంటి వైద్యుడిని కూడా సంప్రదించాలి.కొలాజెన్ వ్యాస్క్యులార్ డిసీజెస్ కొలాజెన్ అనేది శరీరంలోని ఒకరకం ప్రోటీన్లతో కూడిన కణజాలం. మన రోగనిరోధక శక్తి మన కణజాలాన్నే శత్రువుగా పరిగణించి మన కొలాజెన్ ప్రోటీన్లపై దాడి చేయడం వల్ల కొన్ని వ్యాధులు కనిపిస్తాయి. వాటన్నింటినీ కలిపి కొలాజెన్ వ్యాస్క్యులార్ డిసీజెస్గా చెబుతారు. ఆ వ్యాధులేమిటంటే... సిస్టమిక్ లూపస్ అరిథమెటోసిస్ (ఎస్ఎల్ఈ) ∙కీళ్లనొప్పులు (జాయింట్పెయిన్స్) రుమటాయిడ్ ఆర్థరైటిస్ వెజెనెర్స్ గ్రాన్యులొమాటోసిస్ వంటి వ్యాధులు. ఎస్ఎల్ఈ (లూపస్) : లూపస్ అంటే వుల్ఫ్ (తోడేలు) అని అర్థం. ముఖం మీద ముక్కుకు ఇరువైపులా మచ్చతో కనిపించే వ్యాధి తాలూకు ఒక లక్షణం. ఇది శారీరక వ్యవస్థలపై ప్రభావం చూపుతుంది కాబట్టి దీన్ని సిస్టమిక్ లూపస్ అరిథమెటోసస్ (ఎస్ఎల్ఈ) అని చెబుతారు. లక్షణాలు... ముక్కుపై నుంచి చెంపలపైన ఇరువైపులా మచ్చల్లా కనిపించే దద్దుర్లలా (ర్యాష్) వస్తుంది. సూర్యకాంతి (ఫోటోసెన్సిటివిటీతో) వల్ల ఈ ర్యాష్ మరింత పెరగవచ్చు. పాలిపోయినట్లుగా ఉండే చర్మం ∙కొందరిలో వెంట్రుకల మూలాలు మూసుకుపోవడం (లూపస్లో ఇది ఒక రకం). దీన్ని డిస్కాయిడ్ లూపస్ అంటారు. ఇది వచ్చిన వారిలో ర్యాష్ చేతులు, ముఖం మీద వస్తుంది. కొన్నిసార్లు ఒళ్లంతా ర్యాష్ కూడా రావచ్చు కారణం తెలియని జ్వరం ∙బరువు తగ్గడం కాళ్లూ చేతులకు సంబంధించిన రెండు మూడు జాయింట్స్లో వాపు; రుమటాయిడ్ జబ్బుల్లోలా లూపస్లో జాయింట్స్ వాపు వచ్చి జాయింట్స్ ఒంగిపోతాయి. అయితే... రుమటిజంలోలా ఈ ఒంపు వల్ల శాశ్వత అంగవైకల్యం రాదు. ఇది కేవలం తాత్కాలికం. కొందరు డిప్రెషన్తో ఉద్వేగాలకు లోనవుతుంటారు. వీళ్ల సమస్యను మానసికమైన లేదా నరాలకు సంబంధించినదిగా పొరపాటు పడే అవకాశం ఉంది. ఇలాంటి వాళ్లలో ఏఎన్ఏ పరీక్ష నిర్వహించి– లూపస్ వల్ల మెదడుపై ఏదైనా దుష్ప్రభావం పడిందేమోనని పరీక్షించాలి. కొందరిలో ఫిట్స్ కొందరిలో జుట్టు రాలడం మరికొందరిలో నోటిలో, ముక్కులో పుండ్లు (అల్సర్స్) కూడా రావచ్చు. ఈ అల్సర్స్ వల్ల నొప్పి ఉండదు. ఇక ఈ వ్యాధుల వల్ల కంటిపై పడే దుష్పరిణామమేమిటంటే... అరుదుగా కొందరిలో కళ్లలో రక్త΄ోటు పెరిగి (హేమరేజిక్ రెటినైటిస్) అంధత్వానికి దారితీయవచ్చు. కొందరిలో కంటి చూపు క్రమంగా తగ్గుతూ ఉండవచ్చు. వీటన్నింటితో పాటు కళ్లకు సంబంధించి కన్ను పొడిబారడం (డ్రై ఐ); రెటీనాకూ, తెల్లగుడ్డులో భాగమైన స్క్లెరా పొరకు మధ్య ఇన్ఫ్లమేషన్ రావడం (యువైటిస్); స్క్లెరా పొరకు ఇన్ఫ్లమేషన్; కార్నియాకు ఇన్ఫ్లమేషన్ రావడం (కెరటైటిస్) వంటి సమస్యలు రావచ్చు.పిల్లల్లోనూ... పిల్లల్లోనూ లూపస్ రావచ్చు. దీన్ని జువెనైల్ సిస్టమిక్ లూపస్ అని అంటారు. పిల్లల్లో జ్వరం వచ్చి రెండు మూడు కీళ్లలో వాపు రావడం ద్వారా ఇది కనిపిస్తుంది. ఎండను చూడలేక బాధపడుతుండే పిల్లల విషయంలో జువెనైల్ లూపస్ ఉందేమోనని అనుమానించి పరీక్షలు చేయించడం ముఖ్యం. పిల్లల్లో వచ్చినప్పుడు (నియోనేటల్ లూపస్)–పుట్టుకతోనే గుండె కవాటాలలో లోపం (కంజెనిటల్ హార్ట్ బ్లాక్) రావచ్చు. ఇలా పిల్లల్లో లూపస్ వస్తే అది కళ్లపై దుష్ప్రభావం చూపుతుంది కాబట్టి స్కూళ్లకు వెళ్లే వయసు పిల్లల్లో ప్రతి ఆర్నెల్లకు ఓమారు వైద్యపరీక్షలు, కంటి పరీక్షలు (మాక్యులార్ టెస్ట్) చేయించడం మంచిది.పాటించాల్సిన సూచనలు / తీసుకోవాల్సిన జాగ్రత్తలు / చికిత్సలు : ప్రధానమైన సమస్యలైన సిస్టమిక్ లూపర్ అరిథమెటోసిస్ (ఎస్ఎల్ఈ), కీళ్లనొప్పులు, రుమటాయిడ్ ఆర్థరైటిస్ వంటి సమస్యలకు చికిత్స తీసుకోవడంతో పాటు కంటికి సంబంధించిన సమస్యలకూ తగిన చికిత్స తీసుకోవాలి. ఇక పిల్లల్లో జువెనైల్ సిస్టమిక్ లూపస్ను గుర్తించడం సాధ్యం కాదు కాబట్టి స్కూల్ పిల్లలందరికీ కంటివైద్యుల ద్వారా ప్రతి ఆర్నెల్లకోమారు పరీక్షలు చేయించడం అవసరం. డాక్టర్ రవికుమార్ రెడ్డి, సీనియర్ కంటి వైద్య నిపుణులు (చదవండి: కుంభకర్ణుడిని తలదన్నేలా.. ఆమె ఏకంగా 32 ఏళ్లు నిద్రపోయింది!) -
క్యూఆర్ కోడ్తో క్యూలైన్లకు చెల్లు
సికింద్రాబాద్కు చెందిన వెంకటేశం తీవ్ర జ్వరంతో ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చాడు. ఓపీ చిట్టీ కోసం గంటల తరబడి క్యూలైన్లలో నిలబడ్డాడు. బీపీ ఎక్కువై మరింత అస్వస్థతకు గురయ్యాడు. నిజామాబాద్కు చెందిన భూక్యానాయక్ నగరంలో పెయింటింగ్ పనులు చేస్తుంటాడు. తరచూ మూర్ఛ వ్యాధికి గురవుతుంటాడు. ఓ రోజు హఠాత్తుగా కిందపడి కాళ్లు, చేతులు కొట్టుకోవడంతో అంబులెన్స్లో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అభా నంబరు ద్వారా మెరుగైన వైద్యసేవలు అందించడంతో కొద్దిసేపటికే కోలుకున్నాడు. ప్రాణాపాయస్థితిలో ఉన్న రోగికి ‘ఆయుష్మాన్ భారత్’ అభయహస్తం అందిస్తోంది. ఓపీ చిట్టీ కోసం గంటల తరబడి క్యూలో నిల్చొని అవస్థలు పడే పరిస్థితికి క్యూఆర్ కోడ్తో ఫుల్స్టాప్ పెట్టింది. తక్షణం వైద్యసేవలు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్(ఏబీడీఎం) ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. ఇందులో భాగంగా క్యూఆర్ కోడ్ను స్కాన్ చేస్తే క్షణాల వ్యవధిలో ఓపీ చిట్టీ మీ చేతుల్లో ఉంటుంది. కౌంటర్లో అభా నంబరు ఎంటర్ చేస్తే అప్పటివరకు మీకు అందించిన వైద్యసేవలు, మందులతోపాటు సమగ్ర వివరాలను దేశవ్యాప్తంగా ఎక్కడి నుంచైనా తెలుసుకునే వెసులుబాటు ఉంటుంది. పౌరులందరికీ డిజిటల్ హెల్త్ ఐడీ... ప్రజలకు మరింత మెరుగైన వైద్యసేవలను త్వరితగతిన అందించేందుకు ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా డిజిటల్ హెల్త్ ఐడీని అందించాలని 2021లో నిర్ణయించింది. దీనిని నేషనల్ హెల్త్ అథారిటీ(ఎన్హెచ్ఏ) అమలు చేస్తోంది. ప్రతిఒక్కరికీ ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ (ఏబీహెచ్ఏ–అభా) (Ayushman Bharat Health Account) ద్వారా ఆధార్ నంబర్ను అనుసంధానం చేస్తూ 14 అంకెల యూనిక్ నంబర్ కేటాయిస్తుంది. అభా నంబర్ను ఇలా క్రియేట్ చేసుకోండి... గూగుల్ ప్లేస్టోర్ నుంచి అభా యాప్ను డౌన్లోడ్ చేసుకుని మొబైల్ నంబర్ ఎంటర్ చేస్తే వన్టైమ్ పాస్వర్డ్ వస్తుంది. పేరు, చిరునామా, ఆధార్, ఫోన్ నంబరు, ఈమెయిల్ ఐడీ తదితర వివరాలతో సబ్మిట్ చేయాలి. క్రియేట్ న్యూ అభా అడ్రస్ ద్వారా సొంత ఐడీని క్రియేట్ చేసుకుని పాస్వర్డ్ పెట్టుకుని, అభా యాప్ ద్వారా లాగిన్ అవ్వాలి. abdm.gov.in ద్వారా కూడా అభా నంబరు పొందవచ్చు. ఆయా ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఏర్పాటు చేసిన క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే టోకెన్ నంబరు వస్తుంది. కౌంటర్ వద్దకు వెళ్లి టోకెన్ నంబరు చూపిస్తే అస్వస్థత, అనారోగ్య వివరాలు తెలుసుకుని సంబంధిత విభాగానికి రిఫర్ చేస్తూ ఓపీ చిట్టీ అందిస్తారు.14 అంకెల నంబరుతో లాభాలు ఎన్నో... క్యూలైన్లలో గంటల తరబడి నిల్చోకుండా ప్రభుత్వ ఆస్పత్రుల్లో క్షణాల వ్యవధిలో సులభంగా అవుట్ పేషెంట్(ఓపీ) చిట్టీ పొందవచ్చు. వైద్యుడు అందించే వైద్యసేవలు డిజిటలైజేషన్ అవుతాయి. దేశంలో ఏ ప్రాంతంలో ఉన్నా ఒక్క క్లిక్తో పూర్తి వివరాలు పొందవచ్చు. గతంలో అందించిన వైద్యవివరాలను మరో డాక్టర్ చూసి మరింత మెరుగైన వైద్యం అందించే వెసులుబాటు కలుగుతుంది. ప్రతిఒక్కరూ నమోదు చేసుకోవాలి ప్రతిఒక్కరు అబా యాప్లో తమ వివరాలు నమోదు చేసుకోవాలి. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఈ పథకం అమలవుతోంది. గాందీఆస్పత్రిలో ఇప్పటివరకు సుమారు 3 లక్షల వరకు రోగుల వివరాలు ఆబా యాప్లో పొందుపర్చాం. ఈఎన్టీ, ఆప్తమాలజీ విభాగాల్లో జరిగే వైద్యపరీక్షల పూర్తి వివరాలు యాప్ ద్వారా పీడీఎఫ్ ఫైల్ రూపంలో రోగులు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇతర విభాగాలకు త్వరలోనే వర్తింపజేస్తాం. – డాక్టర్ కళ్యాణ చక్రవర్తి, గాంధీ అభా నోడల్ ఆఫీసర్ -
నార్కోలెప్సీ: స్లీప్లోకి స్లిప్!
కొందరు ఎక్కడ ఉంటే అక్కడ నిద్రలోకి జారిపోతుంటారు. ఇలా బస్సెక్కగానే అలా నిద్రపోతుంటారు. వాళ్లను చూసినప్పుడు కొంతమంది వాళ్లంత అదృష్టవంతులు లేరని అంటుంటారు. ఇలా పడుకోగానే అలా నిద్రపట్టేయడం మంచిదే. అయితే నిద్రకు ఉపక్రమించినప్పుడు నిద్రపట్టడానికీ... తమకు తెలియకుండానే నిద్రలోకి జారిపోవడానికీ తేడా ఉందంటున్నారు వైద్యనిపుణులు. కొందరు కూర్చుని పనిచేస్తూ చేస్తేనే... మరికొందరు కూర్చుని తింటూ తింటూ కూడా నిద్రలోకి జారుకుంటూ ఉంటారు. ‘నార్కొలెప్సీ’ అనే స్లీప్ సమస్య ఉన్నవారు పట్టపగలు తాము పని చేస్తూ చేస్తూనే తమకు తెలియకుండానే నిద్రలోకి వెళ్లిపోతుంటారు. దీన్ని ఒక రకం స్లీప్ డిజార్డర్గా పరిగణించాలి.నార్కోలెప్సీ ఎలా వస్తుందంటే...? నిద్రలో కొన్ని దశలు అంటే స్లీప్ సైకిల్స్ నడుస్తుంటాయి. మొదట ప్రాంరంభ దశ తర్వాత గాఢ నిద్ర దశ, ఆ తర్వాత కనుపాపలు వేగంగా కదిలే దశ... ఇలాగ దశలవారీగా స్లీప్సైకిల్స్ కొనసాగుతుంటాయి. వేగంగా కదిలే దశను ర్యాపిడ్ ఐ మూవ్మెంట్ (ఆర్ఈఎమ్) నిద్ర దశగా పేర్కొంటారు. నార్కొలెప్సీతో బాధపడేవారిలో నిద్రలోకి జారుకున్న వెంటనే ఈ ఆర్ఈఎమ్ నిద్ర దశ సాధారణం కంటే వేగంగా వచ్చేస్తుంది. ఈ దశలో కను΄ాపలు, ఊపిరితిత్తులను పనిచేయించే డయాఫ్రమ్ తప్ప మిగతా అన్ని కండరాలూ పూర్తిగా అచేతన స్థితిలో ఉంటాయి.ఎందుకో ఇప్పటికీ పెద్దగా తెలియదు... ఈ సమస్య జన్యువులతో ముడిపడి ఉన్నందున చాలామందిలో నార్కొలెప్సీతో బాధపడేవారి కుటుంబాల్లోని పిల్లల్లో కనిపించడాన్ని పరిశోధకులు గమనించారు. అయితే నార్కొలెప్సీ ఎందుకొస్తుందనే అంశం ఇంకా నిర్దిష్టంగా తెలియరాలేదు. ఈ సమస్యతో బాధపడేవారు హెవీ మెషిన్స్, డ్రైవింగ్ వంటి వాటికి దూరంగా ఉండటం మంచిది. చికిత్స... నార్కొలెప్సీ వచ్చినప్పుడు మనం చేతనావస్థలో ఉపయోగించే కండరాలు అకస్మాత్తుగా అచేతనం అయిసెతాయి. మాటకూడా ముద్దముద్దగా వస్తుంది. వారు కొన్ని రకాల భ్రాంతులకూ గురికావచ్చు. ఇప్పటికి దీనికి పూర్తిగా చికిత్స లేక΄ోయినా నార్కోలెప్సీతో బాధపడేవారు స్లీప్ స్పెషలిస్టులను సంప్రదిస్తే... వారు కొన్ని రకాల యాంటీడిప్రెసెంట్స్, యాంఫిటమైన్ మందులతో కొంతవరకు మంచి ఫలితాలు వచ్చేలా చూస్తారు. అలాగే ఈ సమస్య తాలూకు మేనేజ్మెంట్ ఎలాగో సూచిస్తారు. డా‘‘ రమణ ప్రసాద్, సీనియర్ స్లీప్ స్పెషలిస్ట్, పల్మునాలజిస్ట్, హైదరాబాద్ (చదవండి: -
కాలమూ కాటేస్తది..! పక్షవాతంపై సీజన్స్ ప్రభావం..
బ్రెయిన్ స్ట్రోక్ అంటే పక్షవాతం రావడానికి మన సీజన్స్ కూడా ఓ అంశంగా ఉంటాయన్న విషయం తెలుసా? వేసవిలో ఒక రకంగా, వర్షకాలంలో మరో రకంగా, చలికాలంలో ఇంకో రకంగా ఇలా వేర్వేరు తీరుల్లోస్ట్రోక్ వచ్చేలా ఆయా కాలాలు పక్షవాతాన్ని పరోక్షంగా ట్రిగర్ చేస్తాయన్న సంగతీ మీకు తెలుసా? చాలామందికి తెలియని ఈ విషయాన్ని చూద్దాం... రండి...స్ట్రోక్ రావడానికి ఆ సీజన్ తాలూకు వాతావరణం కూడా కొంత మేర కారణమవుతుంటుంది. అలా కాలాలకూ స్ట్రోక్కూ సంబంధముంటుంది. ఆరుబయట అప్పుడుండే వాతావరణం దేహంలోపల ఉండే మెదడు స్ట్రోక్కు ఎలా కారణమవుతుందన్న కోణంలో చూసినప్పుడు... వాతావరణంలోని అప్పుడుండే ఉష్ణోగ్రత, తేమ... ఆమాటకొస్తే అప్పుడున్న వాతావరణంలోని గాలిలోని కాలుష్యాలూ (ఎయిర్ క్వాలిటీ) ఇవన్నీ స్ట్రోక్ను ప్రేరేపిస్తాయి. అదెలాగో తెలుసుకునే ముందు అసలు స్ట్రోక్ (బ్రెయిన్ స్ట్రోక్ / పక్షవాతం) అంటే ఏమిటో చూద్దాం.బ్రెయిన్ స్ట్రోక్ అంటే... అన్ని అవయవాల్లాగే మెదడుకూ ప్రతినిత్యం రక్తం ద్వారా ఆక్సిజన్, పోషకాలు అందుతుండాలి. పైగా మెదడు కీలకమైన అవయవం కావడంతో మొత్తం దేహానికి సరఫరా అవుతుండే రక్తంలోంచి 20 శాతం మెదడుకే సప్లై అవుతుంటుంది. ఇంతటి కీలకమైన మెదడుకు ఏ కారణంగానైనా రక్తసరఫరా జరగక΄ోవడం వల్ల పక్షవాతం / స్ట్రోక్ వస్తుంది. ఇందులోనూ మళ్లీ రెండు రకాలుగా రక్తం అందకపోవడం జరుగుతుంది. అవి... 1) ఇస్కిమిక్ స్ట్రోక్ : మెదడులోని రక్తనాళాల్లో ఏదైనా అడ్డంకి ఏర్పడటం వల్ల అక్కడి భాగాలకు రక్తప్రసరణ సరిగా జరగక వచ్చే స్ట్రోక్ను ఇస్కిమిక్ స్ట్రోక్ అంటారు. మెదడులోని ఏయే భాగాలకు రక్తం అందదో ఆ సెంటర్స్ నియంత్రించే అవయవాలు చచ్చుబడతాయి. 2) హేమరేజిక్ స్ట్రోక్ : మెదడులో రక్తనాళాలు చిట్లడంతో అక్కడ రక్తస్రావం అయి వచ్చే పక్షవాతాన్ని హేమరేజిక్ స్ట్రోక్ అంటారు. మెదడులోని ఏ భాగంలో రక్తస్రావం అవుతుందో ఆ భాగం నియంత్రించే అవయవాలు చచ్చుబడతాయి. 3) ట్రాన్సియెంట్ ఇస్కిమిక్ అటాక్ (టీఐఏ) : ఇది ఒక రకంగా చూస్తే ఇస్కిమిక్ అటాకే గానీ... ఇందులో తొలుత పక్షవాతం లక్షణాలు కనిపించాక మళ్లీ అవి 24 గంటలలోపు తగ్గి΄ోయి బాధితులు దాదాపుగా రికవర్ అయితే దాన్ని ‘ట్రాన్సియెంట్ ఇస్కిమిక్ అటాక్’గా చెబుతారు. అంటే... భారీ భూకంపం రావడానికి ముందు చిన్న చిన్న ప్రకంపనల (ట్రిమర్స్)లాగే... ఓ పెద్ద స్ట్రోక్ రావడానికి ముందస్తు సూచనగా ఇలాంటివి వస్తుంటాయి. ఒకవేళ ఈ మినీ–స్ట్రోక్ తాలూకు చిన్న చిన్న లక్షణాలు కనిపించాక 24 గంటల తర్వాత కూడా బాధితుడు వాటి ప్రభావం నుంచి బయటపడక΄ోతే అప్పుడు దాన్ని పూర్తిస్థాయి స్ట్రోక్గా పరిగణిస్తారు. ఇక స్ట్రోక్ లక్షణాలైన... దేహంలోని ఒకవైపు భాగాలు బలహీనంగా మారడం, అయోమయం, మాట్లాడటంలో ఇబ్బంది / మాట ముద్దగా రావడం, ముఖంలో ఒకవైపు భాగంపై నియంత్రణ కోల్పోవడం వంటివి కనిపిస్తే... ఆ బాధితులను తక్షణం ఆసుపత్రికి తరలించాలి. చివరగా... వాతావరణాన్నీ అందులోని మార్పులనూ మనమెవరమూ మార్చలేమూ, నియంత్రించలేం. అయితే మన వ్యక్తిగత అలవాట్లతో మంచి జీవనశైలి మార్పులతో ఆరోగ్యంగా ఉండటం ద్వారా పక్షవాతం ముప్పును నివారించగలం. కాబట్టి మంచి జీవనశైలితో వ్యక్తిగత ఆరోగ్య నిర్వహణతో స్ట్రోక్ ముప్పును తప్పించుకోవచ్చు.వేసవిలోని వేడిమి...డీ–హైడ్రేషన్ : ఎండాకాలంలో వాతావరణంలో విపరీతమైన వేడిమి ఉంటుంది. దాంతో ఒంట్లోని నీళ్లు చెమట రూపంలో చాలా ఎక్కువగా వాతావరణంలోకి చేరుతుండటంతో దేహం డీ–హైడ్రేట్ అవుతుంది. ఎప్పుడైతే రక్తంలోని నీటిపాళ్లు తగ్గుతాయో అప్పుడు రక్తం చిక్కబడుతుంది. చిక్కబడ్డ రక్తం కాస్తా క్లాట్స్కు కారణమవుతాయనీ, దాంతో అవి స్ట్రోక్నూ ప్రేరేపించవచ్చన్న విషయం తెలిసిందే. వడదెబ్బ (హీట్స్ట్రోక్) : వడదెబ్బ కూడా స్ట్రోక్ ముప్పును పెంచడంతోపాటు ఆ టైమ్లో కనిపించే లక్షణాలనూ కనిపించేలా చేస్తుంది. అత్యంత ఎక్కువగా అలసటకూ / నీరసానికి గురి కావడం (ఓవర్ ఎగ్జర్షన్) : వేసవిలో తక్కువగా శ్రమ చేసినప్పటికీ ఆ శ్రమ తాలూకు లక్షణాలై అలసటా, నీరసం, నిస్సత్తువగా, తీవ్రంగా చెమటలు పట్టడం చాలా ఎక్కువగా జరుగుతుంటాయి. ఎర్రటి ఎండలో దేహానికి తీవ్రమైన శ్రమ కలిగించడం జరిగితే... ఒకవేళ బాధితుల్లో ఇంతకు మునుపే రక్త΄ోటు వంటి రిస్క్ఫ్యాక్టర్లు ఉన్నవారైతే వాళ్లలో స్ట్రోక్ ముప్పు మరింతగా పెరుగుతుంది.వర్షాకాలంలో...ఇన్ఫెక్షన్లు : నీళ్లు పెరగడం కారణంగా అందులో వృద్ధి చెందే బ్యాక్టీరియల్ / వైరల్ ఇన్ఫెక్షన్ల కారణంగా దేహంలో ఇన్ఫ్లమేషన్ పెరగడం వల్ల. రక్తపోటులో హెచ్చుతగ్గులు (బ్లడ్ ప్రెషర్ ఫ్లక్చుయేషన్స్) : వాతావరణంలో వర్షం కురవబోయే ముందర తీవ్రమైన ఉక్కబోత లేదా వర్షం కురవగానే ఉండే చలి... ఇలా వర్షాకాలంలో వాతావరణంలోని వేడిమి అస్థిమితంగా ఉండటం వల్ల దానికి అనుగుణంగా రక్త΄ోటూ మారుతుంటుంది. ఇలా రక్త΄ోటు లోని హెచ్చుతగ్గులు (బీపీ ఫ్లక్చుయేషన్స్) స్ట్రోక్ ముప్పును పెంచుతాయి. వాతావరణంలోని అధిక తేమ, డీ హైడ్రేషన్ : మాన్సూన్ సీజన్లో వర్షం కురవబోయే ముందరి ఉక్క΄ోతతో దేహం డీ–హైడ్రేషన్కు గురికావడం... దాంతో రక్తం చిక్కబడటం వంటి అంశాలు రక్త΄ోటు ముప్పును పెంచుతాయి. ముప్పును పెంచే వ్యక్తిగత అంశాలు : నిజానికి సీజన్ల తాలూకు ఈ మార్పులన్నీ స్ట్రోక్ ముప్పును ప్రతి ఒక్కరిలోనూ సమానంగా పెంచవు. అంతకు మునుపే వ్యక్తిగతంగా రిస్క్ ఎక్కువగా ఉన్నవారిలో ఇవి స్ట్రోక్ ముప్పును పెంచుతాయి.చలికాలంలో...వాతావరణంలోని వేడిమి ఒక సెంటీగ్రేడ్ తగ్గినా... అది స్ట్రోక్ వచ్చే ముప్పును నాలుగు శాతం పెంచుతుందన్నది నిపుణులు గమనించిన అంశం. వాసోకన్స్ట్రిక్షన్ : చలికాలంలోని తీవ్రమైన చల్లదనం కారణంగా రక్తనాళాలు సన్నబారతాయి. ఇలా రక్తనాళాలు సన్నబారడాన్ని వాసోకన్స్ట్రిక్షన్ అంటారు. నాళం సన్నబారడంతో రక్తం ప్రవహించే వేగం (రక్తపోటు / బీపీ) పెరుగుతుంది. రక్తపు సాంద్రత పెరగడం : చల్లదనం కారణంగా అన్ని ద్రవాలూ చిక్కబడ్డట్టే రక్తమూ చిక్కబడుతుంది. ఇలా రక్తం చిక్కబడటం అన్నది రక్తంలో క్లాట్స్ పెరిగేలా చేసి స్ట్రోక్ ముప్పును పెంచుతుంది. చురుకుదనం తగ్గడం : చలికాలంలో జనం వేసవిలో ఉన్నంత చురుగ్గా ఉండరు. వాళ్ల కదలికలూ మందగిస్తాయి. ఇలా చురుకుదనం తగ్గి, కదలికలు తగ్గడంతో దేహానికి అవసరమైన వ్యాయామం అందక బరువు పెరగుతారు. అంతేకాదు... చురుకుదనం తగ్గడంతో రక్తంలో (కొలెస్ట్రాల్ వంటి) కొవ్వుల మోతాదులూ పెరుగుతాయి. బరువూ, కొవ్వులూ పెరగడం స్ట్రోక్ ముప్పును పెంచుతుందన్న విషయం తెలిసిందే. డీ–హైడ్రేషన్ : చలికాలంలో నీళ్లు తాగడం తగ్గుతుంది. దాంతో రక్తంలో నీటి మోతాదులూ తగ్గడంతో రక్తం చిక్కబడుతుంది. ఇలా చిక్కబడటమన్నది స్ట్రోక్ వచ్చే అవకాశాలను పెంచుతుంది. ఇన్ఫెక్షన్లు : చలికాలంలో ఫ్లూ, శ్వాసకోశ సమస్యలకు కారణమయ్యే ఇన్ఫెక్షన్ల ముప్పు పెరగడంతో... అది స్ట్రోక్ ముప్పు కూడా పెరిగేలా చేస్తుంది. వాతావరణ కాలుష్యాలు : చలికాలంలో వాతావరణంలోకి చేరే పొగ, కాలుష్యాలన్నీ అప్పుడు కురిసే మంచు (ఫాగ్)తో కలిసి ‘స్మాగ్’ అనే మంద΄ాటి కాలుష్యాల తెరలు ఏర్పడేలా చేస్తాయి. కాలుష్యాలతో కూడిన స్మాగ్ కూడా స్ట్రోక్ ముప్పును పెంచేస్తుంది. నివారణ...ప్రతి ఒక్కరూ తగినన్ని నీళ్లూ ద్రవాహారాలు తీసుకుంటూ హైడ్రేటెడ్గా ఉండటం. అన్ని సీజన్లలోనూ ఆయా సీజన్లో దొరికే పోషకాలతో కూడిన మంచి సమతులాహారం తీసుకోవడం. ఏ సీజన్లోనైనా తగినంత వ్యాయామం చేస్తూ, దేహాన్ని చురుగ్గా ఉంచడం. కంటినిండా తగినంత నిద్రపోతుండటంతోపాటు ఒత్తిడి లేకుండా చూసుకోవడం.ఒకవేళ అధికరక్తపోటు (హైబీపీ), డయాబెటిస్ ఉంటే... మందులతో వాటిని ఎప్పుడూ అదుపులో ఉండేలా చూసుకోవడం వంటి జాగ్రత్తలు పాటించాలి. (చదవండి: ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు హెపటైటిస్ బీ వస్తే ప్రమాదమా..? బిడ్డకి కూడా వస్తుందా?) -
హెచ్పీవీ–ఫ్రీ ఇండియా
సర్వైకల్ క్యాన్సర్ బారిన పడకుండా, భవిష్యత్ సురక్షితంగా ఉండేలా అట్టడుగు వర్గాల బాలికలకు ఉచిత హెచ్పీవి వ్యాక్సిన్ అందించే లక్ష్యంగా సుదీర్ఘ కారు యాత్ర ప్రారంభించారు ప్రియా రాజ్గోపాల్, మీనాక్షి సాయి. ‘హెచ్పీవీ–ఫ్రీ ఇండియా’ నినాదంతో ముంబైలో మొదలైన ఈ కారు యాత్ర 40 రోజుల్లో 15 రాష్ట్రాలను చేరుతుంది. తాము వెళ్లిన ప్రాంతాలలో గర్భాశయ క్యాన్సర్, నివారణ గురించి పేదింటి మహిళలకు అవగాహన కలిగిస్తున్నారు ప్రియా, మీనాక్షి. ప్రస్తుతం వారి యాత్ర తమిళనాడుకు చేరింది. అక్కడ వారికి ఘనస్వాగతం లభించింది. చెన్నైలోని అడయార్ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్లో డా.జయశ్రీ ఆధ్వర్యంలో 50 మంది నిరుపేద బాలికలు ఉచిత హెచ్పీవి టీకా తీసుకున్నారు. హెచ్పీవీ వ్యాక్సిన్ సర్వైకల్ క్యాన్సర్కు మాత్రమే కాకుండా వెజైనల్ క్యాన్సర్, వల్వర్ క్యాన్సర్లను కూడా నివారిస్తుంది. లక్షమంది నిరుపేద బాలికలకు హెచ్పీవీ టీకా వేయించాలనేది ప్రియా రాజ్గోపాల్, మీనాక్షి సాయిల లక్ష్యం. మనోబలం మూర్తీభవించిన ఈ మహిళలకు అదేమీ పెద్ద కష్టం కాబోదు. -
తలసేమియా లేని భారత్ కోసం : అకాన్ ఆహ్వానం పేరుతో నిధుల సేకరణ
హైదరాబాద్: తలసేమియా లేని భారత్ తమ లక్ష్యంతో బ్లడ్ వారియర్స్ స్వచ్ఛంద సంస్థ విశిష్ట కార్యక్రమాన్ని నిర్వహించింది. “భారతదేశాన్ని తలసేమియా నుండి విముక్తి చేయడం తమ లక్ష్యమనీ రోగులకు సమయానికి రక్తం అందించడం, కొత్త కేసులు రాకుండా తక్కువ ఖర్చుతో స్క్రీనింగ్ చేయించడం ద్వారానే ఇది సాధ్యమని వ్యవస్థాపకుడు కృష్ణ వంశీ వెల్లడించింది. గతంలో పోలియో నిర్మూలన చేసినట్లు, మనం కలసికట్టుగా కృషి చేస్తే తలసేమియాను కూడా నిర్మూలించవచ్చని ఆయన తెలిపారు. 79వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్లోని ప్రముఖ లౌంజ్ అండ్ పబ్ అకాన్ సౌజన్యంతో బ్లడ్ వారియర్స్కు నిధుల సేకరణ కోసం అకాన్ ఆహ్వానం కార్యక్రమం నిర్వహించింది. రోజంతా సాగిన ఈ కార్యక్రమంలో నగరానికి చెందిన పౌరులు, సామాజిక కార్యకర్తలు, పలువురు ప్రతినిధులు పాల్గొన్నారు. తలసేమియా లేని భారత నిర్మాణానికి మద్దతుగా ఈ సందర్భంగా అందరూ ప్రతిన బూనారు.అకాన్ వ్యవస్థాపకుడు నిహాల్ రెడ్డి గుర్రాల మాట్లాడుతూ.. సమాజానికి తిరిగి ఇవ్వాలన్న తపనతో అకాన్ ఆహ్వానం కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు. ఇలాంటి కార్యక్రమాలు సమాజాన్ని చైతన్యపరచి, కలసికట్టుగా చర్యలు తీసుకునేలా చేస్తాయని కృష్ణ వంశీ అభిప్రాయపడ్డారు. బ్లడ్ వారియర్స్ చేస్తున్న సేవా కార్యక్రమాలను వివరించారు. కొత్తగూడెం–భద్రాచలంను దేశంలోనే తొలి తలసేమియా రహిత జిల్లాగా మార్చాలని సంకల్పించినట్టు చెప్పారు. -
గ్రాండ్మా, మోటీ.. పట్టించుకోలే : కానీ ఏడాదిలో 23 కిలోలు తగ్గా
టీవీ షోలు, తనదైన ప్రత్యేక పాత్రలతో బాలీవుడ్లో పేరు తెచ్చుకున్న నటి నేహా ధూపియా (Neha Dhupia) . 2018లో నటుడు అంగద్ బేడీని వివాహం చేసుకుంది. ఇద్దరు పిల్లల తల్లైన ఆమె 45 ఏళ్ల నటి ప్రసవానంతర బరువు తగ్గినప్పుడు వార్తల్లో నిలిచింది. అనేక విమర్శలు, సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ పట్టుదలగా 23 కిలోల బరువు తగ్గినవైనం విశేషంగా నిలిచింది. తక్కువ తినడం గురించి కాదు, సరిగ్గా తినడం గురించి తెలుసుకోవాలని తెలిపింది. మరింకెందుకు ఆలస్యం నేహా ధూపియా వెయిట్లాస్ జర్నీ గురించి తెలుసుకుందాం.నేహా ధూపియా ప్రసవానంతర బరువును ఎలా తగ్గించుకుందో మీడియాతో పంచుకుంది. నాలుగేళ్ల కాలంలో పదే పదే బరువు పెరిగాను, సన్నగా అయ్యాను. చాలా విమర్శలెదుర్కొన్నాను. అయినా సరే గర్భవతిగా ఉన్నప్పుడు, ప్రసవానంతర సమయంలో ఎలా ఉన్నాను అనేది పట్టించుకోలేదు. తల్లిగా తాను తన పిల్లలకు తల్లిపాలు ఇవ్వడంపై ఎక్కువ దృష్టి పెట్టాను తప్ప, బరువు తగ్గడం గురించి ఆలోచించలేదని చెప్పింది. అయితే లాక్డౌన్ సమయంలోనే తాను లో-కేలరీ డైట్పై దృష్టిపెట్టినట్టు చెప్పింది. చదవండి: నిన్నగాక మొన్న నోటీసులు, యూట్యూబర్ రెండో భార్య రెండో ప్రెగ్నెన్సీఆతరువాత ఆరోగ్య రీత్యా బరువు తగ్గాలని నిర్ణయించుకున్నారు. అదీ ఎలాంటి షార్ట్ కట్లు, క్రాష్ డైట్లూ లేకుండా. అయితే ఈ విషయంలో మొదట చాలా ఇబ్బందులు పడ్డాననీ కానీ సమతుల్య ఆహారం, వ్యాయామంతో బరువు తగ్గినట్టు చెప్పుకొచ్చింది. ముఖ్యంగా చక్కెర, వేయించిన ఆహారాలు, గ్లూటెన్ను తగ్గించుకుంది. జిమ్కు వెళ్లడం తనకు పెద్దగా ఇష్టం ఉందనీ, అందుకే పరుగు లాంటి వ్యాయామ దినచర్యను ఎంచుకు న్నానని వెల్లడించింది. అలా తల్లిగా బిజీగా ఉన్నప్పటికీ, జీవనశైలి మార్పులు, దానికి తగ్గ ఆహారం, వ్యాయామంతో ఏడాది కాలంలో దాదాపు 24 కిలోలు బరువును తగ్గించుకుంది.ఇదీ చదవండి: జయాబచ్చన్ సెల్ఫీ వివాదం, ఘాటుగా స్పందించిన మరో నటినేహా ధూపియా ఇంకా ఇలా పంచుకున్నారు. నిజానికి ఇందులో దీనికి షార్ట్ కట్స్ లేవు, అంత ఈజీకూడా కాదు రాకెట్ సైన్స్ కూడా లేదు, గట్టి నిలబడండి, స్థిరంగా ఉండండి, కష్టపడి పనిచేయండి. ముఖ్యంగా మీకు అస్సలు మనస్కరించని రోజుల్లో ఇంకా స్ట్రాంగ్గా ఉండండి అని తెలిపింది. ఈ శారీరక మార్పులు తన మానసిక ఆరోగ్యానికి కూడా ఎలా సహాయపడ్డాయో కూడా వివరించింది. "ఆరోగ్యంగా ఉండటం వల్ల నా పిల్లలతో కలిసి చురుగ్గా ఉండటానికి తోడ్పడింది. కాన్ఫిడెన్స్ పెరిగింది. మానసిక బలానికి శారీరక ఆరోగ్యానికి చాలా దగ్గరి సంబంధం ఉంటుందని కూడా వెల్లడించింది. రాత్రి 7 గంటల కల్లా పిల్లలతో కలిసి డిన్నర్ చేయడం. ఇక మరుసటి రోజు ఉదయం 11 గంటలకు నా భర్త అంగద్తో కలిసి బ్రేక్ఫాస్ట్ తీసుకొని మధ్యలో ఏమీ తీసుకునేదాన్ని కాదు అంటూ వెయిట్లాస్ సీక్రెట్స్ని పంచుకున్నారామె. అంతేకాదు చాలామందిలాగా క్రాష్ డైట్లు, జిమ్ కసరత్తులు లేకుండానే వ్యాయామాలతో సింపుల్ లైఫ్స్టైల్తోనే తాను అనుకున్న వెయిట్లాస్ సాధించానని తెలిపింది.కాగా నేహా ధూపియా -అంగద్ బేడీ దంపతులకు ఇద్దరు సంతానం. (కూతురు మెహ్ర్, కొడుకు గురిఖ్) మొదటినుంచీ కాస్తా బొద్దుగా ఉండే నేహా, ప్రెగ్నెన్సీ సమయాల్లో బాగా బరువు పెరిగింది. దీంతో ‘దాదీ ధూపియా, గ్రాండ్మా ‘మోటీ, తిమింగలం అంటూ ఆమెను సోషల్ మీడియాలో బాగా ట్రోల్ చేశారు. అయినా ఇవేవీ పట్టించుకోకుండా, అటు ఇంటిని, ఇటు కరియర్ను చక్కదిద్దుకున్న సూపర్మామ్ నేహా ధూపియా. -
గట్ హెల్త్ కోసం..టాక్సిక్ ఫ్రీ, బయోడీగ్రేడబుల్ పాత్రలు
వాతావరణం మారుతోంది. మారుతున్న వాతావరణానికి అనుగుణంగా మన కిచెన్ కూడా తనను తాను మార్చుకుంటుంది. వంట పాత్రలు కూడా మారాలంటున్నాయి అధ్యయనాలు. పదార్థాలు ఎక్కువ సేపు నిలవ ఉండాలంటే, పోషకాలను కోల్పోకుండా, రుచి మారకుండా ఉంచే పాత్రల్లోనే వండాలి. ఈ గుణాలున్నవి మట్టి పాత్రలే. వండడానికి మాత్రమే కాదు, భోజనాల తర్వాత మిగిలిన పదార్థాలను మరుసటి రోజుకు నిల్వ చేయడానికి కూడా మట్టి పాత్రలను మించిన పాత్ర మరొకటి ఉండదని తాజా పరిశోధన. మట్టి మంచిదేనంటున్నాయి అధ్యయనాలు. స్టీలు, ప్లాస్టిక్ పాత్రల్లో నిల్వ చేసిన పదార్థాలు ఆవిరిపట్టడం, అనారోగ్యకరమైన రసాయన చర్యలకు లోనుకావడం సహజం. మట్టిపాత్రలకు ఉండే సహజమైన రంధ్రాల ద్వారా గాలి ప్రసరిస్తుంది. పదార్థాలు ఎటువంటి మార్పులకూ లోనుకావని ఈజిప్టు పరిశోధన బృందం వెల్లడించింది. పైగా మట్టి సహజంగానే క్షారగుణం ఉంటుంది. ఇది ఆహారపదార్థాల్లోని ఆమ్లగుణాలను క్రమబద్ధీకరిస్తుంది. పీహెచ్ స్థాయులు జీర్ణక్రియకు తగిన మోతాదులో ఉండేలా మారుస్తుంది మట్టిపాత్ర. దీంతో గట్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. గట్ హెల్త్ కోసం ప్రపంచం పరిశోధనలు చేస్తోంది. మన సంప్రదాయ జీవనశైలి గట్ హెల్త్ను పరిరక్షించేదని ఆయుర్వేద నిపుణులు తెలియచేస్తున్నారు. మట్టిపాత్రల్లో వండడం వల్ల మట్టిలో సహజంగా ఉండే మినరల్స్ పదార్థాలకు తోడవుతాయి. ‘మట్టిపాత్ర టాక్సిక్ ఫ్రీ, బయోడీగ్రేడబుల్’ అనే ట్యాగ్ లైన్తో మోడరన్ కిచెన్, డైనింగ్ టేబుల్ మీద మట్టిపాత్రలు రాజ్యమేలనున్నాయి.మంచినీటి కోసం మట్టికుండలు మోడరన్ కిచెన్లోకి మట్టికుండలు వచ్చాయి. తాజా అధ్యయనం ప్రకారం పదార్థాలను మట్టిపాత్రల్లో నిల్వ చేస్తే ఫ్రిజ్లో పెట్టాల్సిన అవసరం ఉండదు. ఇకపై ఫ్రిజ్ ఇంట్లో అలంకార వస్తువుగా మారే రోజు కూడా రావచ్చు. ఆయుర్వేదం– ఆధునిక శాస్త్రం రెండూ ఏకాభిప్రాయం వ్యక్తం చేస్తున్న విషయమిది.(Health Tip ఫ్యాటీ లివర్కు బొప్పాయితో చెక్)మృణ్మయం– ఆరోగ్యమయంపృథ్వి, అప్, తేజస్, వాయు, ఆకాశము’ ఇవి పంచమహాభూతాలు. వీటిలో భూమిదే ప్రథమస్థానం. చరాచర జీవరాశులకివే ఆయువుపట్టు. భూమి అంటేనే మట్టిమయం. కణాల పరిమాణాన్ని బట్టి ఇది ప్రధానంగా మూడు రకాలు. ఇసుక, ఒండ్రు, బంకమట్టి. మనం వాడే మట్టి పాత్రలకు ప్రధాన భూమిక ఒండ్రుమట్టి. అనాదిగా వస్తున్న ఆయుర్వేద శాస్త్రంలో మట్టి పాత్రల వాడకానికి మంచి విశిష్టత ఉంది. త్రాగునీరు సహజసిద్ధంగా చల్లబడాలన్నా, ఔషధాలు తయారు చేయాలన్నా, పుటాలు పెట్టాలన్నా, ఆహార ద్రవ్యాలు నిల్వ చేయాలన్నా కుండలు, మూకుడు వంటి మూతలు, వివిధ రూ పాల్లో తయారు చేసిన మట్టిపాత్రలనే వాడేవారు. ఇవి నిదానంగా వేడెక్కి నిదానంగా చల్లబడతాయి. మట్టిలో సహజంగా నిక్షిప్తమైన ఖనిజాలు కొన్ని రకాల సూక్ష్మ క్రిములు మనిషి ఆరోగ్యానికి ప్రకృతి ప్రసాదించిన వరాలు. వండిన పదార్థాలను పూర్వీకులు ‘ఉట్టి’లో పెట్టి వేలాడ దీసేవారు. ఆ ఉట్టిలో మట్టి పాత్రలను పెట్టేవారు. ఈ పాత్రల ఉపరితలంలోని సూక్ష్మరంధ్రాల ద్వారా పర్యావరణంతో అనుబంధమై వాటిలో ఉంచిన పదార్థాలుపాడవకుండా సహజస్థితిలోనే ఉంటాయి. ఇప్పటికీ ఉత్తరాదిలో మట్టి పాత్రలలో తేనీరు తాగే ఆచారం ఉంది. నేటి సమాజం మరలా నాటి సంప్రదాయాలకు మొగ్గుచూపడం హర్షణీయం. ఇదీ చదవండి: జయాబచ్చన్ సెల్ఫీ వివాదం, ఘాటుగా స్పందించిన మరో నటి -
ఫ్యాటీ లివర్కు బొప్పాయితో చెక్
కాలేయంలో అదనపు కొవ్వు పేరుకుని పోయే ఫ్యాటీ లివర్ వ్యాధికి ఇతర ఔషధాలకన్నా బొప్పాయి మంచి మందని పరిశోధనలు చెబుతున్నాయి. ఇవాల్టి టిప్ ఆఫ్ ది డేలో వారేం చెబుతున్నారో చూద్దాం...బొప్పాయిలో విటమిన్ సి, బీటా–కెరోటిన్, ఫ్లేవనాయిడ్లు వంటి యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఈ పోషకాలు కాలేయాన్ని ఆక్సీకరణ ఒత్తిడి నుండి రక్షిస్తాయి.లివర్ డిటాక్స్కు మద్దతు బొప్పాయిలో పపైన్ మరియు కైమో΄ాపైన్ వంటి ఎంజైమ్లు ఉంటాయి, ఇవి జీర్ణక్రియకు సహాయపడతాయి. పరోక్షంగా కాలేయం నిర్విషీకరణ విధులకు మద్దతు ఇస్తాయి. ఈ ఎంజైమ్లు ప్రోటీన్లను విచ్ఛిన్నం చేయడంలో, కాలేయంపై జీర్ణ భారాన్ని తగ్గించడంలో సహాయపడతాయి.కాలేయ ఎంజైమ్ స్థాయిలను మెరుగుపరుస్తుంది. బొప్పాయి వంటి కాలేయానికి అనుకూల మైన పండ్లను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల కాలేయ ఎంజైమ్ ప్రొఫైల్స్ మెరుగుపడతాయని అధ్యయనాలు సూచిస్తున్నాయి. వాపును తగ్గిస్తుందిబొప్పాయిలోని కొన్ని సమ్మేళనాలు కాలేయ కణజాలాలలో వాపును తగ్గించడంలో సహాయపడతాయి. బొప్పాయిలోని పోషక విలువలుతక్కువ కేలరీలు, అధిక ఫైబర్ కంటెంట్, సహజ చక్కెరలు, అనారోగ్యకరమైన కొవ్వులు లేదా కొలెస్ట్రాల్ ఉండకపోవడమనే లక్షణాలు కొవ్వు కాలేయ ఆహారాన్ని అనుసరించే వారికి బొ΄్పాయిని ఆదర్శవంతమైన పండుగా చేస్తాయి. ఎంత తినాలి?మితంగా తినడం చాలా ముఖ్యం. రోజుకు ఒక చిన్న గిన్నె బొప్పాయి – ఉదయం లేదా మధ్యాహ్నం స్నాక్గా – సహజ చక్కెరలపై ఓవర్లోడ్ లేకుండా అవసరమైన పోషకాలను అందిస్తుంది. కూరగాయలు, లీన్ ప్రొటీన్లు, తృణధాన్యాలు అధికంగా ఉండే సమతుల్య ఆహారంతో దీన్ని ఎల్లప్పుడూ జత చేయండి. -
స్ట్రాబెర్రీలతో దంతాలు తెల్లబడతాయా..? సైన్స్ ఏం చెబుతోందంటే..
చాలామందికి, టీ, కాపీ, కొన్ని రకాల పానీయాలను సేవించడంతో దంతాలు పసుపురంగులోకి మారిపోతుంటాయి. అయితే స్ట్రాబెర్రీలు వంటి వాటితో తెల్లగా మార్చేయొచ్చంటూ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. పైగా చాలామంది దీన్ని గట్టిగా నమ్ముతున్నారు కూడా. అయితే ఇందులో ఎంతమాత్రం నిజం లేదంటున్నారు వైద్య నిపుణులు. డెంటిస్ట్ని సంప్రదించకుండానే స్ట్రాబెర్రీలతో దంతాలు తెల్లగా మార్చుకోవచ్చనేది నిజం కాదని నొక్కి చెబుతున్నారు. ఇంతకీ సైన్సు ఏం అంటోందో చూద్దామా..!స్ట్రాబెర్రీలు దంతాలను తెల్లగా మారుస్తాయని చెప్పే శాస్త్రియ ఆవిష్కరణ లేదని చెబుతున్నారు పరిశోధకులు. ఇది దంతాలపై ఉపరితల మరకలను తొలగించినప్పటికీ అది శాశ్వతంగా కాదని చెబుతున్నారు. పరిశోధనల్లో మిశ్రమ ఫలితాలు వచ్చాయని చెబుతున్నారు. వాణిజ్య ఉత్పత్తుల కంటే మెరుగ్గా ఈ స్ట్రాబెర్రీలు సహజంగా దంతాల రంగు మార్చేస్తాయనేది వాస్తవం కాదని చెప్పారు. అధ్యయనంలో స్ట్రాబెర్రీలు దంతాల రంగును మార్చడం చూశాం. అయితే దీనిలో 100% గాఢత కలిగిన స్ట్రాబెర్రీ సారం 2-4 రోజుల్లో దంతాల్లో ప్రభావవంతమైన మార్పు చూపిస్తోంది గానీ..శాశ్వతమైన తెల్లటి రంగుని ఇవ్వదని తెలిపారు. అది గణనీయమైన మార్పులను కూడా ఏమి ఇవ్వదని చెప్పారు. పైగా దీనివల్ల ప్రమాదాలు ఉంటాయని అన్నారు.ఎందుకు మంచిది కాదంటే..స్ట్రాబెర్రీలు ఆమ్లంగా ఉంటాయి. ఆమ్లం దంతాలపై ఉన్న రక్షణపొర అయిన ఎనామెల్ను దెబ్బతీస్తుందిఎనామిల్ పలుచబటం మొదలైతే మళ్లీ యథావిధిగా దంతాలు పసుపు రంగులో కనిపిస్తాయని చెబుతున్నారు. ఇందులో ఉండే సహజ చక్కెరలు నోటిలోని బ్యాక్టీరియాను తినేస్తాయి. అంతేగాదు కుహారాలను దెబ్బతీసే ప్రమాదం కూడా ఉంటుందని చెబుతున్నారు నిపుణులు.ప్రయత్నించాలనుకుంటే..ఇలా వెంటనే తెల్లగా అవ్వడం కావాలి అనుకుంటే..దంతాలపై స్ట్రాబెర్రీల యాసిడ్, చక్కెరను పూర్తిగా తొలగించాలి. ఎనామిల్ దెబ్బతినకుండా బ్రష్ చేసేందుకు కనీసం 30 నిమిసాలు వేచి ఉండండిసురక్షితమైన మార్గాలు..కాఫీ, టీ, వైన్ వంటి పానీయాలను పరిమితం చేయండిక్రమం తప్పకుండా బ్రష్ చేయండి. దంతవైద్యుడు ఆమోదించిన వైటెనింగ్ టూత్పేస్ట్ లేదా స్ట్రిప్స్ను ఉపయోగించండిబ్లీచింగ్ లేదా ఇన్-క్లినిక్ వైటెనింగ్ వంటి ప్రొఫెషనల్ చికిత్సలు మేలు View this post on Instagram A post shared by Cheryl Hickey (@cherylhickey) గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం (చదవండి: Independence Day 2025: మోదీ ప్రసంగంలో ఆరోగ్యంపై కీలక వ్యాఖ్యలు..! హాట్టాపిక్గా ఊబకాయం..) -
"నిశ్శబ్ద సంక్షోభం"గా ఊబకాయం: ప్రధాని మోదీ
స్వాతంత్ర్య దినోత్సవ వేళ ప్రధాని మోదీ యువతకు, ప్రజలకు ఎన్నో వరాలజల్లు కురిపించేలా పథకాలను అందించడమే కాకుండా ప్రజా ఆరోగ్యంపై కూడా మాట్లాడారు. ఈమేరకు ఢిల్లీ ఎర్రకోట వేదికగా ప్రధాని మోదీ మాట్లాడుతూ..ప్రస్తుతం ప్రజలంతా ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యపై కీలక వ్యాఖ్యలతోపాటు కొన్ని సూచనలు కూడా అందించారు. 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు పురస్కరించుకుని సుమారు 103 నిమిషాల పాటు జరిగిన ప్రసంగంలో లక్షలాది మంది పౌరులను ఉద్దేశించి మాట్లాడుతూ..జీవనశైలిలో వస్తున్న మార్పులు, సరైన ఆహారపు అలవాట్ల లేమి, తగిన శారీరక శ్రమ లేకపోవడం కారణంగా గుండెజబ్బులు, మధుమేహం, రక్తపోటు, వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదం ఎలా పెరిగిపోతోందో నొక్కి చెప్పారు. అంతేగాదు రాబోయే సంవత్సరాల్లో ఊబకాయం మన దేశానికి పెద్ద సవాలుగా మారవచ్చు అని కూడా అన్నారు. ప్రతి కుటుంబంలో నూనె వాడకాన్ని సుమారు 10% తగ్గిస్తే ఇది దేశ ఆరోగ్యానికే మేలు చేస్తుందని చెప్పారు. వంటనూనెతో వ్యాధుల కనెక్షన్..ప్రధాని మోదీ నూనె వాడకం గురించి ఇచ్చిన పిలుపు నిజంగా సరైనదేనా..అంటే..ముమ్మాటికి కరెక్టేనని చెబుతున్నారు నిపుణులు. అధిక నూనె వినియోగం వల్ల సంతృప్త, ట్రాన్స్ ఫ్యాట్లు శరీరంలో అధికమై బరువు పెరిగేందుకు దారితీస్తుందని తెలిపారు. అలాగే ఈ అధిక కొలెస్ట్రాల్ హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాని పెంచేస్తుందని పోషకాహారా నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆ నేపథ్యంలోనే మోదీ భారతీయులు తక్కువ నూనెను ఉపయోగించే సాంప్రదాయ వంట పద్ధతులను స్వీకరించడం తోపాటు ఆవిరి పట్టడం, వేయించడం, ఉడకబెట్టడం, వంటి వాటిపై ఆధారపడాలని, మొక్కల ఆధారిత పదార్థాలను చేర్చుకోవాలని ప్రజలకు హితవు పలుకుతున్నారు. జీవనశైలిపై దృష్టి సారించాలి..ఒత్తిడి, ఆందోళనతో యువత బాధపడటానికి కారణం, యోగా ధ్యానం వంటి అలవాట్ల లేమి కారణమని చెబుతున్నారు మోదీ. కనీసం నడక, సైక్లింగ్, కొద్దిపాటి వ్యాయామాలు చేయాలని సూచించారు. ప్రాసెస్ చేసిన పదార్థాలకు దరిచేరనీయకుండా తృణధాన్యాలు, కూరగాయలు, కాలానుగుణ పండ్లను తీసుకోవాలని సూచించారు. చారిత్రాత్మకంగా భారత్ అనుసరించే సమతుల్య సాంప్రదాయ ఆహార జ్ఞానానికి మళ్లీ తిరిగి రావాలని ఆ ప్రసంగంలో కోరారు.ఎందకు ఈ హెచ్చరికలు అంటే..ఈ ఊబకాయం ప్రస్తుతం నగరాలకే పరిమితం కాలేదు. భారతదేశంలో 24% మంది మహిళలు, 23% మంది పురుషులు అధిక బరువు లేదా ఊబకాయంతో ఉన్నారు. పట్టణ ప్రాంతంలో ఈ పరిస్థితి మరి ఎక్కువగా ఉంది. బాధకరం ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో కూడా పరిస్థితి ఇలానే ఉండటమేనని అన్నారు మోదీ. అందుకు ప్రధాన కారణం కేలరీలు అధికంగా ఉండే ఆహార పదార్థాల వినియోగమేనని చెప్పారు.ఇక 136 మిలియన్ల మందికి పైగా ప్రీ డయాబెటిస్ ఉంది. అందులో ఎక్కువ భాగం ఊబకాయం కారణంగా ఈ వ్యాధి బారినపడినవే.బడి వయసు పిల్లలు సైతం ఈ సమస్యను ఎదుర్కొంటున్నట్లు నివేదికలు చెబుతున్నాయి.ఊబకాయం కారణంగా వచ్చే వ్యాధుల ప్రమాదం..ఊబకాయం బహుళ దీర్ఘకాలిక పరిస్థితుల ప్రమాదాన్ని పెంచుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అవేంటంటే..టైప్ 2 డయాబెటిస్రక్తపోటు, హృదయ సంబంధ వ్యాధులురొమ్ము, పెద్దప్రేగు కేన్సర్తో సహా కొన్ని రకాల కేన్సర్లుకీళ్ల ఒత్తిడి కారణంగా వచ్చే ఆస్టియో ఆర్థరైటిస్ తదితరాలు వస్తాయి.దీన్ని గనుక ఆదిలోనే అదుపులో ఉంచే ప్రయత్నం చేయకపోతే 2035 నాటికి, ప్రతి ముగ్గురు భారతీయుల్లో ఒకరు ఈ అధిక బరువు లేదా ఊబకాయంతో బాధపడే అవకాశం ఉందని వరల్డ్ ఒబెసిటీ సమాఖ్య అంచనా వేసింది.ఆరోగ్యం కోసం జాతీయ మిషన్..ఊబకాయంపై వ్యతిరేకంగా పోరాడటాన్ని వ్యక్తిగత బాధ్యత, సమిష్టి లక్ష్యంగా రూపొందించారు మోదీ. నిజానికి చమురు వినియోగాన్ని 10% తగ్గించాలనే ఆయన సూచన పెద్ద ఖర్చుతో కూడుకున్నది కాదు..పైగా అందరూ సులభంగా ఆచరించదగినదే. తర్వాతి తరాలకి ఆరోగ్యకరమైన దేశాన్ని బహుమతిగా ఇవ్వాలన్న ఆకాంక్షతో మోఈ ప్రజలకు ఈ ఆరోగ్య సూచనలిచ్చారు. ఆ నేపథ్యంనే మోదీ ఫిట్ ఇండియా ఉద్యమం, పోషన్ అభియాన్ వంటి ప్రచార కారక్రమాలను చేపట్టారు.ఆచరణలోకి తీసుకురాగలమా అంటే..ప్రధాని మోదీ పిలుపుని ఆచరణలో పెట్టేందుకు ఏమంత కష్టపడిపోవాల్సిన పనిలేదు..జస్ట్ ఈ సింపుల్ ట్రిక్స్ పాటిస్తే చాలు..వంట చేసే మందుకు నూనెను కొలత ప్రకారం ఉపయోగిస్తే చాలు. కంటైనర్ నుంచి నేరుగా కాకుండా ఒక స్పూన్ లేదా కొలతగా పెట్టుకున్న మరేదైనా చాలు. ఆరోగ్యకరమైన నూనెలు ఎంచుకోండి. అంటే ఆవాలు, వేరుశెనగ, బియ్యం ఊక నుంచి వచ్చే ఆయిల్ వంటి వాటిని ఎంచుకోండి. డీప్ ఫ్రై చేసిన ఆహారాలకు దూరంగా ఉండండి. రోజుకు 30 నిమిషాలు నడక లేదా కొద్దిపాటి వ్యాయమాలకి కేటాయించే ప్రయత్నం చేయండి చాలు.గమనిక: ఇది కేవలం అవగామన కోసంమ మాత్రమే ఇచ్చాం. పూర్తి వివ్రాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: స్వేచ్ఛా తరంగాలు..! నవతరానికి స్ఫూర్తి ఈ నారీమణులు..) -
వేరుశెనగల్ని ఇలా తింటే వృద్ధాప్యం దూరం..! న్యూ స్టడీ
అందరికీ అందుబాటులో ఈజీగా తినగలిగే నట్స్ ఏవంటే వేరుశెనగనే చెప్పాలి. టైం పాస్గా, స్నాక్స్గా తినే ఈ గింజలతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయట. తాజాగా ఆ విషయాన్ని శాస్త్రీయ పూర్వకంగా నిర్థారించారు పరిశోధకులు. అంతేగాదు అధ్యయనంలో చాలా ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అవేంటంటే..శాస్త్రవేత్తలు ఈ వేరుశెనగ గింజల వల్ల కలిగే ప్రయోజనాలపై అధ్యయనం చేస్తున్నారు. ఇందులో ఉండే ఫైబర్లు, విటమిన్లు, ఆరోగ్యకరమైన కొవ్వు, బరువు తగ్గడానికి, కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడానికి, వాపుతో పోరాడటానికి, గుండె జబ్బులు, స్ట్రోక్ ప్రమాదాన్ని నివారించడానికి సహాయపడతాయని తేలింది. వీటిని క్రమం తప్పకుండా తీసుకుంటే శారీరకంగా చురుకుగా ఉండగలరని అంటున్నారు. అలాగే ఒమెగా-3 కొవ్వులు, ఫైటోకెమికల్స్, కండరాల పునరుద్ధరణకు సహాయపడతాయని, కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తాయని చెబుతున్నారు. మానసికంగా కూడా స్ట్రాంగ్గా ఉంటామని చెబుతున్నారు. అలాగే దీనిలోని సెల్యులార్ వృద్ధాప్యాన్ని మందగించేలా శక్తిమంతమైన యవ్వనాన్ని ప్రసాదిస్తుందని చెబుతున్నారు. అధ్యయనంలో విస్తుపోయే విషయాలు..అందుకోసం 59 మంది యువకులపై మూడు వేర్వేరు సముహాలుగా విభజించి అధ్యయనం చేశారు. ఆరునెలల పాటు ప్రతిరోజూ ఒక సముహానికి 25గ్రాముల వేరుశెనగ గింజలు, 32 గ్రాముల వేరుశెనగ వెన్న లేదా క్రీమ్ మరో సముహంకు ఇచ్చారు. ఆ తర్వాత వారందరిలోని టెలోమీర్ పొడవుని కొలవగా..గింజలు తిన్నవారిలో టెలోమీర్ పొడవు మెరుగ్గా ఉంది. వేరుశెనగ క్రీమ్ తీసుకున్నవారికంటే గింజల రూపంలో తిన్నవారిలోనే ఈ పొడువు కాస్త మెరుగ్గా ఉండటం విశేషం. అయితే ఆ ఇరు సముహాల్లోనూ మరీ అంతా వ్యత్యాసాలు లేవని..అయితే ఈ వేరుశెనగ తినడం వల్ల టెలోమీర్ పొడవు తరిగిపోదనే విషయం మాత్రం హైలెట్ అయ్యిందని చెబుతున్నారు. టెలోమీర్ పొడవు అంటే..టెలోమీర్ అనేది క్రోమోజోమ్ చివరన ఉన్న ఒక రక్షణ నిర్మాణం, ఇది వయస్సు పెరిగే కొద్దీ తగ్గిపోతుంది. ఇది కుంచించుకుపోవడాన్ని పూర్తిగా ఆపలేం. కానీ అవి కుంచించుకుపోయే రేటును తగ్గించడం సాధ్యమవుతుందట. ఇది గనుక వేగంగా కుచించుకుపోతే వ్యాధి వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నట్లు లెక్క అని చెబుతున్నారు. చివరగా బిలియనీర్ టెక్ వ్యవస్థాపకుడు బ్రయాన్ జాన్సన్ రోజుకు 100 సప్లిమెంట్లను తీసుకుంటూ, వృద్ధాప్యాన్ని నెమ్మదింపజేయాలనే లక్ష్యంతో ఉన్న సంగతి తెలిసిందే. ఆ క్రమంలో ప్రతి ఒక్క కేలరీని లెక్కవేస్తూ దీర్ఘాయువు కోసం పాటుపడుతున్నారు. కానీ ఈ అధ్యయనం మంచి పోషకాహారాన్ని సరైన విధంగా తీసుకోవడం అనేది ప్రధానమని, దాంతో దీర్ఘాయువుని పొందడం, వృద్ధాప్యాని నెమ్మదించగలమని హైలెట్ చేసిందని చెబుతున్నారు నిపుణులు.గమనిక: ఈ కథనం కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: జస్ట్ నాలుగు నెలల్లో 25 కిలోలు..! న్యూట్రిషనిస్ట్ వెయిట్లాస్ సీక్రెట్) -
జస్ట్ నాలుగు నెలల్లో 25 కిలోలు..! కష్టసాధ్యమైన ఆ పదింటిని..
బరువు తగ్గడం అనేది సవాలుతో కూడుకున్నది. అందులోనూ ఆరోగ్యకరమైన రీతిలో తగ్గాలంటే అంతఈజీ కాదు కూడా. కానీ పోషకాహార నిపుణురాలు(Nutritionist) ఆ భారమైన అధిక బరువుని జస్ట్ నాలుగు నెలల్లో మాయం చేసింది. అంత త్వరిగతిన బరువు తగ్గడం ఎలా సాధ్యమైందో ఇన్స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసుకుందామె. ఎంతో బాధకరమైన త్యాగాలు చేయడం వల్ల వెయిట్లాస్ జర్నీ విజయవంతమైందని అంటోంది.భారాన్ని తగ్గించుకోవాలంటే బాధను కలిగించే ఇష్టమైన వాటన్నింటిని తృణప్రాయంగా వదులుకోవాల్సిందేనని అంటోంది. మరి అవేంటో చూద్దామా..పోషకాహార నిపుణురాలు అమాకా(Amaka) బరువు తగ్గేందుకు ప్రయత్నిస్తున్నప్పుడూ మొదట్లో చాలా ఇబ్బందిపడ్డానంటోంది. అమ్మో మన వల్ల కాదు అనిపించింది. ఎందుకంటే కచ్చితమైన మంచి ఫలితాలు త్వరితగతిన రావాలంటే కష్టసాధ్యమైన ఆ పదింటిని చాలా స్ట్రాంగ్గా వదులుకోవాలి. దాంతో తనకు నరకంలా అనిపించిందని, ఆ తర్వాత బరువు తగ్గుతున్న మార్పులను చూసినప్పుడూ విజయం సాధించానన్న ఆనందం ముందు ఇదేమంతా కష్టం కాదనిపించిందని అంటోంది అమాకా. అందువల్లే జస్ట్ నాలుగు నెల్లలో ఏకంగా 25 కిలోలు వరకు తగ్గాగలిగానని అదికూడా ఆరోగ్యకరమైన రీతీలోనే అని చెబుతోంది పోషకాహార నిపుణురాలు అమాకా. ఇంతకీ ఆమె వదులుకున్న ఆ పది ఇష్టమైనవి ఏంటో చూద్దామా..!.నో కంఫర్ట్ ఫుడ్స్: అమాకా మనకు ఎంతో ఇష్టమైన జంక్ ఫుడ్ లాంటి ఆహారాలన్నింటిని దూరం చేసుకోవడం అంత ఈజీ కాదని అంటోంది. ఎంత బలంగా జంక్కు నో చెప్పగలుగుతాం అంత తొందగా మంచి ఫలితాలు అందకోగలమని చెబుతోంది. ఎర్లీ మార్నింగ్ వర్కౌట్స్: వ్యాయామం చేయడానికి బెస్ట్ టైం ఉదయమేనని చెబుతోంది. అదీకూడా కష్టమైనదే. తెల్లవారుజామున నిద్ర ఎంత మధురంగా ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు. దాన్ని వదలించుకుని బెడ్మీద నుంచి లేగాలంటే కష్టమే అయినా బరువు కోసం త్యాగం చేయక తప్పదని అంటోంది అమాకా. అడపాదడపా ఉపవాసం:వారానికి రెండు మూడు రోజులు అడపాదడపా ఉపవాసం బరువు తగ్గేందుకు ఎంతో హెల్ప్ అవుతుంది. అలా చేయాలంటే ఎంతో కఠినమైన నిబద్ధతోనే సాధ్యమని అంటోంది.రాత్రుళ్లు పార్టీలు, డిన్నర్లకు దూరంగా ఉండటం..ఫిజీ డ్రింక్స్, ఆల్కహాల్ వంటి అన్నింటికీ దూరంగా ఉండాలి. బయట తినాలనే కోరికను బలంగా నివారించాలి. బయట తింటే మనం అనుసరించే డైట్ ఒక్కసారిగా వృధా అయిపోతుందని హెచ్చరిస్తోంది.సమయాపాలన..టైంకి తినేలా చూసుకునేదాన్ని. మరీ ఆకలి వేసేంత వరకు వేచి ఉండకుండా కేర్ తీసుకునేదాన్ని అంటోంది. దాని వల్ల అతిగా తినేస్తామని చెబుతోంది.మానసికంగా దృఢంగా ఉండటం..బరువు తగ్గడం అనే ప్రక్రియం కష్టతరమైనది కాబట్టి మానసికంగా మనల్ని మనం బలోపేతం చేసుకునేందుకు యోగా వంటి వాటితో ప్రయత్నించాల్సిందే. మనస్సు మన అధీనంలో ఉంటేనే నచ్చినవన్నింటిని తినేయాలనే ఆలోచనను నియంత్రించగలమని చెబుతోంది.తింటున్న ఫుడ్ని ట్రాక్ చేయడం..ఇది కాస్త ఇబ్బందిగా ఉన్నా..శరీరంలో ఎంత ేమేర ేకేలరీలు, ప్రోటీన్లు తీసుకుంటున్నాం అనే దానిపై మంచి అవగాహన ఉంటుంది. పైగా అతిగా తినడాన్ని నివారిస్తుంది.క్రమం తప్పకుండా వ్యాయామాలు..వర్షం, చలి కారణంగా వ్యాయామాలు వద్దు అనిపిస్తుంది. దాన్ని అధిగమించాలి. ఈ విషయంలో క్రమశిక్షణతో ఉంటే సత్ఫలితాలు త్వరిగతిన పొందగలం అని అమాకా చెబుతోంది.మార్పులను గమనించడం..శరీరంలో వస్తున్న మార్పులను గమనించడం. ఒక వేళ్ల అనుకున్నట్లుగా మంచి ఫలితం రాకపోతే నిరాశ పొందడం మానేసి ఇంకేలా సత్ఫలితాలు అందుకోగలం అనే దానిపై దృష్టి సారించాలి.స్ట్రాంగ్గా ఉండటం..ఈ వెయిట్ లాస్ జర్నీలో ఎక్కడ వీక్ అవ్వకుండా బలంగా ఉండేలా సానుకూల దృక్పథాన్ని పెంపొందించుకోవాలి. స్వీట్స్ తినాలనే కోరికను అదుపులో ఉంచడం, కొన్ని పదార్థాలకు దూరంగా ఉండటం తదితరాలపై దృఢంగా ఉండాలే ధ్యానం చేస్తూ ఉండేదాన్ని అని చెబుతోంది అమాకా. View this post on Instagram A post shared by CERTIFIED NUTRITIONIST (@shred_with_amaka) గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం . పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: Independence Day: 107 ఏళ్ల నాటి షెర్బత్ దుకాణం..నాటి సమర యోధులు నేతాజీ, సత్యజిత్రే..) -
వర్షాకాలంలో మొటిమలా : ఆయుర్వేద సూపర్ ఫుడ్స్ ఇవిగో!
వర్షాకాలంలో మారుతున్న సీజన్ తేమ, ఉష్ణోగ్రత మార్పులను తెస్తుంది. ఈ మార్పులు అనేక చర్మ సమస్యలకు దారి తీస్తాయి. అయితే రసాయనలతో కూడిన చర్మ సంరక్షణ ఉత్పత్తులపై ఆధార పడడం కాకుండా కొన్ని ఆయుర్వేద మూలికల ద్వారా చాలా చర్మ సమస్యలకు చెక్ చెప్పవచ్చు. ఇవాల్టి టిప్ ఆఫ్ది డేలో భాగంగా అవేంటో చూద్దాం.ఆయుర్వేదం ప్రకారం, రుతుపవనాల సమయంలో వచ్చే కాలానుగుణ మార్పులు దోషాలను - ముఖ్యంగా వాత, పిత్త - తీవ్రతరం చేస్తాయి . మొటిమలు లేదా దద్దుర్లు వంటి చర్మ సమస్యలకు దారితీస్తాయి.ప్రముఖ ఆయుర్వేద వైద్యురాలు డాక్టర్ మధుమిత కృష్ణన్ చర్మ సమస్యల నివారణ, మొటిమలు నివారణ, చక్కగా మెరిసే చర్మాన్ని కలిగి ఉండటానికి తీపి పదార్థాలు, పోషక బాదం నుండి త్రిదోష సమతుల్య ఆమ్లా వరకు ఐదు ఆయుర్వేద సూపర్ఫుడ్లను సిఫార్సు చేస్తున్నారు.బాదం: బాదం రుచిలో తీపిగా ఉంటాయి. వాత , పిత్త దోషాలను సమతుల్యం చేస్తాయి. ఇవి కొద్దిగా జిడ్డుగా ఉండటం వల్ల చర్మాన్ని లోపలి నుండి పోషించడానికి పరిపూర్ణంగా ఉంటాయి. ఆయుర్వేదం, సిద్ధ ,యునాని గ్రంథాల ప్రకారం వర్షాకాలం అంతటా బాదం చర్మమెరుపునకు, ఆరోగ్యానికి మంచిది. రాత్రంతా నానబెట్టడం వల్ల మెరుగైన జీర్ణక్రియకు సహాయపడుతుంది . లోతైన చర్మ పోషణను అందిస్తుంది.పసుపు: ఈ బంగారు సుగంధ ద్రవ్యాన్ని తరతరాలుగా వాడుతున్నారు. ఇందులోని యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు జీర్ణక్రియనె మెరుగుపర్చి, వాత దోషాన్ని చర్మానికి సరైన సమతుల్యం చేయడానికి అద్భుతమైన మార్గం. సాధారణ భోజనంలో పసుపును చేర్చుకోవడం ద్వారా, తరచుగా మొటిమలు ,మొటిమలకు కారణమయ్యే మంటను తగ్గించుకోవచ్చు. పసుపు ఇన్ఫెక్షన్లతో పోరాడుతుంది, చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది రక్తాన్ని శుద్ధి చేస్తుంది.ఆమ్లా (భారతీయ ఉసిరి) : అన్ని త్రిదోషాలను సమతుల్యం చేసే ఆమ్లా, రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది, చర్మాన్ని యవ్వనంగా మారుస్తుంది. శక్తినిస్తుంది. శరీరం నుండి మలినాలను తొలగించడం ద్వారా, దాని నిర్విషీకరణ లక్షణాలు వర్షాకాలంలో మొటిమలు వచ్చే అవకాశాలను తగ్గిస్తాయి.వేప: మొటిమలు లేని చర్మానికి ఆయుర్వేదంలో అత్యంత నమ్మదగిన చికిత్సలలో ఒకటి వేప. వేపలో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ ,రక్త శుద్ధి లక్షణాల మెండుగా ఉంటాయి. వెల్లుల్లి: వెల్లుల్లిలోని వాత బ్యాలెన్సింగ్ లక్షణాలు దాని బలమైన రుచి ఉన్నప్పటికీ లోపలి నుండి పనిచేస్తాయి. ఇవి సహజమైన, చర్మాన్ని శుభ్రపరిచే సూపర్ఫుడ్ వెల్లుల్లి.నోట్... చర్మ ఆరోగ్యం, అందం పైపైనదిగా మాత్రమే ఉండదు. ఆయుర్వేదం మనకు బోధించినట్లుగా, నిజమైన అందం లోపలి నుండే ప్రారంభమవుతుంది. కాలిఫోర్నియా బాదం వంటి గింజలు ,పసుపు వంటి సుగంధ ద్రవ్యాలను చేర్చడం వల్ల ఈ తేమ వాతావరణంలో కూడా మెరుస్తున్న చర్మం మన సొంతం. ఈ ఆయుర్వేద సూపర్ఫుడ్లతో మొటిమలకు వీడ్కోలు చెప్పేద్దాం. -
జిమ్ ఎంపికలో బీకేర్ఫుల్..!
జీవితం ఆనందంగా ఉండాలంటే ఆరోగ్యం ఉండాలి.. ఆరోగ్యంగా ఉండాలంటే వ్యాయామం చేయాలి.. వ్యాయామం అంటే సరైన జిమ్ను ఎంచుకోవాలి. లేదంటే ఆరోగ్యం సంగతి దేవుడెరుగు.. జీవితమే కోల్పోవాల్సి రావొచ్చు.. సిటీ యూత్లో పెరుగుతున్న ఫిట్నెస్ క్రేజ్ను వాడుకుని లాభార్జనే ధ్యేయంగా ఎటువంటి అవగాహన లేకుండా జిమ్లు నెలకొల్పుతున్న వారూ ఉన్నారు.. సో బీకేర్ ఫుల్.. జిమ్ ఎంపికలో తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు.. వ్యాయామాలు చేయడానికి ఎంచుకునే జిమ్ వీలైనంత వరకూ ఇంటికి దగ్గరగానే ఉండాలి. దీనివల్ల సమయం కలిసి రావడమే కాకుండా, రెగ్యులారిటీ అలవాటై డుమ్మాలు కొట్టే అవకాశం తగ్గుతుంది. నగరంలో ఇపుడు వీధికో జిమ్ ఉంది. ఏరియాకో ఫిట్నెస్ సెంటర్ ఉంది. అయితే అన్నీ మన అవసరాలను తీర్చేవి కాకపోవచ్చు. కొన్నింటిలో చేరితే లాభం కంటే నష్టమే ఎక్కువ. అందుకే జిమ్ని ఎంచుకునేటప్పుడు కొన్ని సందేహాలను తప్పనిసరిగా నివృత్తి చేసుకోవాలి. సదరు జిమ్/ఫిట్నెస్ సెంటర్ గత చరిత్ర ఏమిటి? అక్కడ మెంబర్లుగా ఉన్న ఇతరుల అభిప్రాయాలూ సేకరించాలి. అంతేకాకుండా వర్కవుట్స్ చేసే ప్రాంగణం సరిపడా విస్తీర్ణంలో ఉందా? లేదా? ఏసీ జిమ్ అయితే లోపలి గాలి బయటకు వెళ్లేందుకు సరైన ఏర్పాట్లు ఉన్నాయా లేదా? వంటివి సరిచూసుకోవాలి.శిక్షణ అందించే కోచ్లకు సరైన సర్టిఫైడ్ అర్హతలు ఉన్నాయో లేదో వాకబు చేయాలి. పర్సనల్ ట్రైనింగ్ కావాలంటే విడిగా మాట్లాడుకోవాలని పలు జిమ్స్ సూచిస్తుంటాయి. సదరు జిమ్లో మెంబర్ల సంఖ్య ఎంత అనేది తెలుసుకోవాలి. ఎందుకంటే సామర్థ్యానికి మించి మెంబర్లను చేర్చుకుంటే అక్కడి ఎక్విప్మెంట్ను ఉపయోగించుకోవడానికి మనం క్యూలో నిలుచునే దుస్థితి కూడా తలెత్తవచ్చు.కొన్ని జిమ్లు చూడటానికి ఆర్భాటంగా ఉండి, శిక్షణ పరంగా అంత మెరుగ్గా ఉండకపోవచ్చు. కొన్ని చూసేందుకు సాధారణంగా ఉన్నా.. మంచి ట్రాక్ రికార్డు ఉండొచ్చు. కాబట్టి ఫస్ట్ లుక్కు.. పడిపోవద్దు. జిమ్లో సభ్యత్వం తీసుకునేటప్పుడు నిర్వాహకుల తీయటి పలుకుల మాయలో పడిపోవద్దు. వీలున్నంత వరకూ లైఫ్ మెంబర్షిప్ల జోలికి పోవద్దు. ఏడాది లోపున మాత్రమే పరిమితం కావాలి. అప్పుడే మధ్యలో మీకేమైనా అసౌకర్యం కలిగినా, జిమ్ నచ్చకపోయినా మారేందుకు ఇబ్బంది ఉండదు.జిమ్లో దుస్తులు మార్చుకునేందుకు, మన వస్తువులు జాగ్రత్తగా పెట్టుకునేందుకు సరైన వసతులు ఉన్నాయా లేదా ముందుగానే చూసుకోవాలి.చాలా వరకూ జిమ్లలో యువతీ యువకులకు ప్రత్యేక సమయాలు ఉంటాయి. ఇది గమనించి అవసరాన్ని బట్టి సమయాన్ని ఎంచుకోవాలి.ఒకసారి వర్కవుట్ టైమ్ ఎంచుకున్న తర్వాత అది వెంట వెంటనే మార్చుకోవడానికి జిమ్లో నిబంధనల ప్రకారం వీలుండకపోవచ్చు. కాబట్టి, రోజూ ఎక్సర్సైజ్లు చేసేందుకు అనువైన సమయాన్ని ఒకటికి రెండుసార్లు ముందుగా ఆలోచించి నిర్ణయించుకోవాలి. ఎంసీహెచ్ గ్రౌండ్స్లో అధికారికంగా నిర్వహిస్తున్న వ్యాయామ కేంద్రాలలో సాధారణ స్థాయిలోనే నెలవారీ రుసుము వసూలు చేస్తున్నారు. తక్కువ్చ ఫీజు చెల్లించగలిగిన వారికి ఇవి నప్పుతాయి.స్టార్ హోటల్స్, క్లబ్స్, రిసార్ట్స్.. అన్నీ జిమ్లను నిర్వహిస్తున్నాయి. రూమ్స్లో బస చేసిన అతిథులతో పాటు కేవలం జిమ్ మాత్రమే ఉపయోగించుకునే నగరవాసులకూ తమ సేవలను ఇవి అందిస్తున్నాయి. కొన్ని బ్రాండెడ్ జిమ్స్ ప్రొటీన్ షేక్ల విక్రయంతో మొదలుపెట్టి సభ్యులకు రకరకాల ఆకర్షణలు చూపిస్తూ డబ్బులు గుంజాలని చూస్తుంటాయి. అలాంటివి ఎంచుకునేటప్పుడు ఆచి తూచి నిర్ణయం తీసుకోవాలి. స్వల్పకాలిక ఫలితాల మీద ఆశతో స్టెరాయిడ్స్ జోలికి మాత్రం అస్సలు పోవద్దు. కొన్ని జిమ్లు అందిస్తున్న ప్రత్యేక సభ్యత్వం తీసుకుంటే సదరు జిమ్కు నగరంలో అన్ని ప్రాంతాల్లో అలాగే దేశవ్యాప్తంగా ఉన్న అనుబంధ సంస్థలలో కూడా దానిని ఉపయోగించుకునే వీలుంటుంది. తరచూ ఇళ్లు మారేవారికి, ఇతర ఊర్లకు, వేరే ప్రాంతాలకు రాకపోకలు సాగించే వారికి ఈ తరహా సభ్యత్వం బాగా ప్రయోజనకరం. ఒకటీ అరా జిమ్లు ఇంటర్నేషనల్ మెంబర్షిప్లను కూడా అందిస్తున్నాయి. ఈ జిమ్స్లో మెంబర్షిప్ తీసుకుంటే విదేశాల్లో కూడా ఆ సభ్యత్వాన్ని వినియోగించుకునే అవకాశం ఉంటుంది. కొన్ని జిమ్లలో మనకు కేటాయించిన సమయంలో అదనపు రుసుము చెల్లించగలిగితే.. మనకు మాత్రమే పరిమితమై వ్యక్తిగత సేవలు అందించే కోచ్ను కూడా ఏర్పాటు చేస్తున్నారు. అయితే తొలి దశలోనే పర్సనల్ ట్రైనింగ్ కోసం డబ్బులు వృథా చేసుకోవాల్సిన అవసరం లేదు. కొంత కాలం చేశాక.. మన వ్యక్తిగత లక్ష్యాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవచ్చు. కొన్ని జిమ్లు అందిస్తున్న ప్రత్యేక సభ్యత్వం తీసుకుంటే సదరు జిమ్కు నగరంలో అన్ని ప్రాంతాల్లో అలాగే దేశవ్యాప్తంగా ఉన్న అనుబంధ సంస్థలలో కూడా దానిని ఉపయోగించుకునే వీలుంటుంది. తరచూ ఇళ్లు మారేవారికి, ఇతర ఊర్లకు, వేరే ప్రాంతాలకు రాకపోకలు సాగించే వారికి ఈ తరహా సభ్యత్వం బాగా ప్రయోజనకరం. ఒకటీ అరా జిమ్లు ఇంటర్నేషనల్ మెంబర్షిప్లను కూడా అందిస్తున్నాయి. ఈ జిమ్స్లో మెంబర్షిప్ తీసుకుంటే విదేశాల్లో కూడా ఆ సభ్యత్వాన్ని వినియోగించుకునే అవకాశం ఉంటుంది. నగరంలోని జిమ్ల మెంబర్షిప్ వివరాలు.. టాప్క్లాస్ కేటగిరిలోకి వచ్చే ‘స్పా’లలో ఎక్సర్సైజ్లు చేసే అవకాశంతో పాటు మసాజ్, స్టీమ్బాత్, సోనాథెరపీ, పార్లర్.. వంటి అదనపు సౌకర్యాలూ ఉంటాయి. ఇంటి తరహాలో కొన్ని గంటల పాటు ఇక్కడ గడిపేందుకు వీలుంది. సభ్యత్వ రుసుము ఏడాదికి రూ.25వేలు.మూడో కేటగిరీలోకి వచ్చే జిమ్స్లో అన్ని రకాల ఎక్విప్మెంట్ ఉంటుంది. జిమ్ మొత్తానికి ఒకరిద్దరు మించి ట్రయినర్లు ఉండరు. వీటికి రుసుము ఏడాదికి రూ.8వేలు ఆపైన. ఆ తర్వాత కేటగిరిలోకి వచ్చే ఫిట్నెస్ సెంటర్లలో అత్యాధునిక జిమ్ ఎక్విప్మెంట్ ఉంటుంది. అలాగే స్టీమ్ రూమ్స్, డ్రెస్సింగ్ రూమ్స్, ప్రత్యేకంగా ఫిట్నెస్ డ్యాన్స్ ఫ్లోర్స్.. వగైరా వసతులుంటాయి. వీటి సభ్యత్వ రుసుము ఏడాదికి రూ.15వేలు ఆపైన. (చదవండి: ఆరోగ్యకరమైన ఆహారమే తీసుకున్నా ఐనా..! స్టేజ్ 4 కేన్సర్ బాధితురాలి అవేదన..!) -
ప్రాణదాతలకు సలాం!
ఒడిశా, హిరమండలం: జిల్లాలో అవయవదానంపై చైతన్యం పెరుగుతోంది. కుటుంబసభ్యుల అంగీకారంతో చేసిన అవయవదానం ఎంతోమందికి పునర్జన్మనిస్తోంది. ఎన్నో కుటుంబాల్లో వెలుగులు నింపుతోంది. కొంతమంది ప్రమాదాలబారిన పడినప్పుడు బ్రెయిన్ డెడ్కు గురవుతున్నారు. అటువంటి వారి అవయవాలను కుటుంబసభ్యుల సమ్మతితో దానం చేస్తే ఎంతోమంది ప్రాణాలను నిలపవచ్చు. ఒక మనిషి అవయవదానంతో 8 మంది ప్రాణాలను నిలపవచ్చు. కాలేయం, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, గుండె, కవటాలు, పేగులు, క్లోమం, కారి్నయా వంటివి సేకరించి మరొకరికి అమర్చవచ్చు. జీవించి ఉన్న వ్యక్తుల నుంచి మూత్రపిండాలు, ఎముకలోని మూలుగు, కాలేయంలోని కొంతభాగం దానం చేయవచ్చు. బ్రెయిన్ డెడ్ అయితే.. రోడ్డు ప్రమాదంలో ఎంతో మంది తీవ్రగాయాలపాలవుతుంటారు. ఆ సమయంలో కొన్నిసార్లు మెదడు దెబ్బతిని బ్రెయన్ డెడ్ అవుతుంటుంది. తిరిగి కోలు కోలేని స్థితికి వెళ్లిపోతుంటారు. ఇలాంటి వారిలో గుండె, కాలేయం, కిడ్నీల వంటి అవయవాలు పనిచేస్తుంటాయి. వీటన్నింటినీ నడిపించే కీలకమైన అవయవం మెదడు మాత్రం పనిచేయదు. దానినే బ్రెయిన్ డెడ్ అంటారు. పక్షవాతం వంటి మెదడు సమస్య తలెత్తినప్పుడు కూడా బ్రెయిన్డెడ్ కావొచ్చు. నిర్థారణ కీలకం.. ఎవరైనా బ్రెయిన్ డెడ్ అయ్యారని నిర్దారించేందుకు కట్టుదిట్టమైన విధానాలు ఉన్నాయి. ఆస్పత్రి వైద్యులు మాత్రమే దీనిని నిర్ధారించరు. ఇతర ఆస్పత్రుల వైద్యులు, జీవన్దాన్ సంస్థ తరఫున వచ్చే నిపుణులు వ్యక్తిని క్షుణ్ణంగా పరిశీలిస్తారు. అక్కడకు 6 గంటల తరువాత మరో బృందం పరిశీలించి బ్రెయిన్ డెడ్ అని నిర్ధారిస్తారు. శ్వాసతీసుకునే పరిస్థితి ఉండకపోవడం, ఒకవేళ కృత్రిమ శ్వాస తీసిన 5 నిమిషాల్లో చనిపోయే స్థితిలో ఉన్న వ్యక్తి నుంచి మాత్రమే అవయవాలను సేకరిస్తారు. కనుపాపల్లో వెలుతురు పడినా స్పందించకపోయేవారిని, కాళ్లు, చేతులు, తల ఎంతమాత్రం కదపలేకపోయేవారిని, మెదడుకు ఏమాత్రం రక్తప్రసరణ జరగడం లేదని నిర్ధారించుకున్న తరువాత బ్రెయిన్ డెడ్ అని తేల్చుతారు. ఈ నెల 7న ఒడిశాలోని రాణిపేట గ్రామానికి చెందిన లెంక రవణమ్మ రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైంది. కుటుంబ సభ్యులు రాగోలు జెమ్స్కు తీసుకురాగా బ్రెయిన్డెడ్గా చెప్పారు. వైద్యుల సూచన మేరకు కుటుంబ సభ్యులు ఆమె అవయవదానానికి అంగీకరించారు. దీంతో గ్రీన్చానెల్ ద్వారా అవయవాలను ఇతర ప్రాంతాలకు తరలించారు. జూలై 29న కోటబొమ్మాళి మండలం నిమ్మాడ జంక్షన్కు చెందిన పినిమింటి శ్రీరామ్ అనే యువకుడు రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలయ్యాడు. కుటుంబసభ్యులు వెంటనే రాగోలు జెమ్స్కు తీసుకొచ్చారు. ఆయన బ్రెయిన్డెడ్ కావడంతో వైద్యుల సూచన మేరకు కుటుంబ సభ్యులు అవయవదానానికి ముందుకొచ్చారు. గ్రీన్చానెల్ ద్వారా అవయవాలను తరలించారు. పునర్జన్మ అవయవదానం మహోన్నతమైనది. ఒకరు దానం చేస్తే 8 మందికి పునర్జన్మ దక్కుతుంది. జిల్లాలో అవయవదానాలు పెరుగుతుండడం శుభపరిణామం. అయితే చాలామందిలో అపోహలు ఉన్నాయి. అయితే ఆపదకాలంలో ఉన్నవారికి తమవారి అవయవాలు దానం చేసి వారి బతుకుల్లో వెలుగులు నింపవచ్చు. – ఫారుక్ హూస్సేన్,వైద్యాధికారి, హిరమండలం పీహెచ్సీ ఇదీ చదవండి: అమితాబ్ పరువు తీస్తోంది.. సిగ్గులేని మనిషి : జయపై కంగన ఫైర్కఠిన నిబంధనలు.. బాధితుల నుంచి అవయవాలను సేకరించే వైద్యులు తప్పకుండా జీవన్దాన్లో నమోదై ఉండాలి. తమ పేర్లు తప్పకుండా రిజి్రస్టేషన్లు చేయాలి. మన జిల్లాకు సంబంధించి జెమ్స్ ఆస్పత్రి వైద్యులు నమోదైనట్టు తెలుస్తోంది. అయితే చనిపోయిన వారికి, అవయవాలు అవసరమైన వారికి ఈ వైద్యులు బంధువులు కాకూడదు. బ్రెయిన్ డెడ్ అయిన వారి కుటుంబసభ్యుల అంగీకారం కీలకం. ఎవరికైనా అవయవాలు అవసరమైతే జీవన్దాన్లో నమోదుచేసుకోవాలి. అవయవదాత ఉన్నారని సమాచారం అందితే ప్రాధాన్యతాక్రమంలో, ముందు వరుసన బట్టి అవయవాలను తెచ్చి అమర్చుతారు. గుండెను బయటకు తీశాక 4 గంటల్లో అమర్చితే ఫలితాలు 90 శాతం మెరుగ్గా ఉంటాయి. ఆరు గంటలు లోపు అయితే 50 శాతం ఫలితమే ఉంటుంది. 6 గంటలు దాటితే అమర్చినా ఫలితం ఉండదు. ఊపిరితిత్తులు 8 గంటల్లోపు, కాలేయం 18 గంటల్లోపు, కిడ్నీ 24 గంటల్లోపు అమర్చాలి. -
ఒత్తైన మెరిసే జుట్టు కోసం ఈ ఆయిల్ ట్రై చేశారా?
వర్షాకాలం మొదలైంది. రోజూ వర్షంలో తడవడం, చలిగాలులు, వాతావరణం కారణంగా జుట్టు ఆరోగ్యం దెబ్బతింటుంది. చుండ్రు, జుట్టు రాలిపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి. తడి జుట్టును అలా వదిలేస్తే జుట్టు ఎక్కువగా ఊడిపోతూ ఉంటుంది. అందుకే జుట్టు సంరక్షణకు కొన్ని జాగ్రత్తలు పాటించాల్సిందే. ఇవాల్టి టిప్ ఆఫ్ ది డేలో భాగంగా జుట్టు రాలడం, తగ్గి, ఒత్తైన, ఆరోగ్యకరమైన జుట్టు కావాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం. జుట్టు ఆరోగ్యానికి ఉల్లి రసం బెస్ట్ ఆప్షన్. ఉల్లిపాయలకు రుచి, వాసన గురించి కొన్ని అభ్యంతరాలున్నప్పటికీ, ఉల్లిపాయ నూనె జుట్టు సమస్యలకు అద్భుతమైన నివారణగా పనిచేస్తుంది. ఉల్లిపాయ రసం జుట్టులో ఉండే ఫంగస్, బ్యాక్టీరియాల్ని చంపే కొన్ని గుణాల్ని కలిగి ఉంటుంది.ఉల్లిరసంలో ఉండే సల్ఫర్, జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. జుట్టు తెగిపోయే సమస్యను కూడా పరిష్కరిస్తుంది. సల్ఫర్ కంటెంట్ అధిక మొత్తంలో కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది.అవి జుట్టు కుదుళ్లను బలోపేతం చేస్తుంది. కొల్లాజెన్ జుట్టు పెరుగుదలలో చాలా ముఖ్యమైనది. ఉల్లిపాయలలోని యాంటీఆక్సిడెంట్లు జుట్టు తెల్లబడటాన్ని ఆలస్యం చేస్తాయి. అంతేకాదు యాంటీ బాక్టీరియల్ లక్షణాలు మాడు చర్మంఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడతాయి. ఉల్లిపాయ నూనెను ఎలా తయారు చేయాలి?ఉల్లిపాయ తొక్క తీసి మెత్తగా దంచి రసం తీసుకోవాలి. ఇందులో కొద్దిగా మెంతులు, అల్లోవెరా ముక్కలు వేసి, స్వచ్ఛమైన కొబ్బరి నూనె వేసి తక్కువ మంట మీద మరిగించండి. ఉల్లిపాయ, పచ్చి వాసన అంతా పోయి చక్కని అరోమా వస్తుంది. ఈ నూనెను సన్నని బట్టసాయంతో ఫిల్టర్ చేసి గాజు సీసాలో నిల్వ చేసుకొని వాడవచ్చు.మెరిసే జుట్టు: ఉల్లిపాయ నూనె జుట్టు మెరుపును పెంచడంలో బాగా పనిచేస్తుంది. దీన్ని జుట్టు మూలాలకు మాత్రమే కాకుండా జుట్టు చివరలకు కూడా అప్లై చేసి ఒకటి లేదా రెండు గంటల తర్వాత తలస్నానం చేయండి. అంతే కాదు, మీరు నొప్పిని తట్టుకోగలిగితే, పచ్చి ఉల్లిపాయను పేస్ట్ లా చేసి నేరుగా జుట్టుకు అప్లై చేయండి. రెండు గంటల తర్వాత తలస్నానం చేయండి. ఇలా చేయడం వల్ల సహజ కండిషనర్గా పనిచేస్తుంది మరియు జుట్టు మెరుపు పెరుగుతుంది.ఉల్లిపాయ నూనెను క్రమం తప్పకుండా వాడటం వల్ల జుట్టు రాలడాన్ని నివారించవచ్చు. ఈ నూనెతో జుట్టు మూలాల్లో మసాజ్ చేయడం వల్ల జుట్టు మూలాలు బలపడి జుట్టు మందంగా, ఒత్తుగా పెరుగుతుంది. ఇదీ చదవండి: అమితాబ్ పరువు తీస్తోంది.. సిగ్గులేని మనిషి : జయపై కంగన ఫైర్ఈ నూనెలోని యాంటీ బాక్టీరియల్ ,యాంటీ ఫంగల్ లక్షణాలతో చుండ్రు, ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి. ఇది జుట్టును నల్లగా చేయడమే కాకుండా, దురద వంటి సమస్యలను కూడా తొలగిస్తుంది. జుట్టు సహజ ముదురు రంగు తిరిగి వస్తుంది. అన్ని పొడిబారడం తగ్గి, మృదువుగా , మెరుస్తూ ఉంటుంది. నూనె అప్లయ్ చేసిన రాత్రం అలానే ఉంచేడి ఉదయాన్నే తలస్నానం చేయాలి. ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల జుట్టు తొందరగా తెల్లబడదు. అయితే ఉల్లిపాయ రసాన్ని, మెంతులు, కొబ్బరి నూనె,అలోవెరా జెల్ లాంటివాటితో కలిపి రాస్తే మెరుగైన ఫలితం లభిస్తుంది.నోట్: అవగాహనకోసం అందించిన సమాచారం మాత్రమే. ఉల్లివాసన పడనివారు అలర్జీ ఉన్నవారు అప్రమత్తంగా ఉండాలి. ఉల్లి నూనెను అప్లయ్ చేసే ముందు నిపుణులను సంప్రదించడం ఉత్తమం. -
ఆరోగ్యకరమైన ఆహారం అనారోగ్యాన్ని ఆపలేదు..!
ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటున్నాం కదా మనకేంటి అనుకుంటాం. ఇద సహజం. కానీ ఆ ఆలోచనే ముమ్మాటికి తప్పట. ఆరోగ్యకరమైన ఆహారంతోనే బాగుంటాం అనుకోవడం అనేది అవాస్తవమట. దాంతో బాడీకి కావల్సిన శారీరక శ్రమ తప్పనిసరి అట. పాపం ఇలాంటి అపోహతోనే చేజేతులారా ఆరోగ్యాన్ని పాడుచేసుకోని బాధపడుతోంది ఓ కేన్సర్ బాధితురాలు. తనలాంటి తప్పిదాలు చేయొద్దంటూ బాడీ చెప్పే సంకేతాలను వినండి..అద చెబుతున్నట్లుగా ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి లేదంటే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదంటూ ఇన్స్టాగ్రామ్ వేదికగా తన బాధను షేర్చేసుకుంటూ ఆరోగ్య స్పృహను కలిగిస్తోందామె. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లనే అనుసరిస్తున్నాం కదా అనారోగ్యం దరిచేరదు అనుకుంటే పొరబడినట్టేనని అంటోంది 29 ఏళ్ల మోనిక చౌదరి. తాను పోషకవంతమైన ఆహారాన్ని తీసుకునేదాన్ని తను మంచి ఆహారపు అలవాట్లనే అనుసరించానని అయినప్పటికీ స్టేజ్ 4 కేన్సర్తో పోరాడుతున్నని వాపోయింది. అందుకు కారణాలేంటో కూడా ఆమె వివరించింది. ఒత్తిడి ఆరోగ్యాన్ని ఎలా చిత్తు చేసిందంటే..తాను మంచి ఫుడ్నే తీసుకునేదాన్ని అని అంటోంది. వేయించిన పదార్థాలు, జంక్ఫుడ్ జోలికి అస్సలు వెళ్లదట. అయితే వృత్తిరీత్యా ఎక్కువగంటలు స్క్రీన్ సమయం, పనిభారం తనకు తెలియకుడానే ఒత్తిడిని పెంచేసి శారీరకంగా ప్రభావితం చేశాయంటోంది. ఇంతకుముందు సాయంత్రాలు చేసే జాగింగ్ వంటి దినచర్యలకు స్వస్తి చెప్పాల్సి వచ్చింది. చెప్పాలంటే పెద్దగా కదలికలు లేదు, శారీరక శ్రమ అనే దినచర్య పూర్తిగా లేకుండాపోయింది. అక్కడికి తన బాడీ సంకేతాలు ఇస్తునే ఉందని, కానీ తాను మాత్రం ఇది పని ఒత్తిడి వల్లే అనుకుంటూ లైట్ తీసుకుందట. సాధ్యమైనంత తొందరలో ఇదివరకటి జీవనశైలిని అనుసరించి వ్యాయామాలు చేద్దా అనుకుంటూనే ఉండేదాన్ని తప్ప..ఎప్పుడూ ఆచరణలోకి తీసుకురాలేకపోయానని వాపోయింది. అలా ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తూనే వచ్చానని చెప్పుకొచ్చారామె. ఫలితంగా అలిసిపోవడం, అసౌకర్యంగా ఉండటం వంటి కొద్దిపాటి సంకేతాలు వస్తూనే ఉన్నా..ఆ..! అదంతా పని ఒత్తిడి, నిద్రలేక వచ్చేవే కామన్ అనుకుని పెద్దగా సీరియస్గా తీసుకోలేదని చెబుతోంది మోనిక. అప్పుడే ఒకరోజు ఉన్నటుండి స్ప్రుహ తప్పి పడిపోవడం..ఇక అలా బెడ్కే పరిమితమయ్యేలా స్టేజ్ 4 కొలొరెక్టల్ కేన్సర్ నిర్థారణ అయ్యిందని తెలిపింది. ఒక్కసారిగా తన కాళ్ల కింద భూమి కంపించిపోతున్నట్లుగా.. చెప్పలేని ఏదో బాధ గుండెల్లోంచి పొంగుకొచ్చిందంటూ కన్నీటి పర్యంతమైంది. శారీరక వ్యాయమాల పట్ల చూపిన నిర్లక్ష్యం, అశ్రద్ధ ఫలితానికి భారీ మూల్యమే చెల్లించుకుంటున్నానని నెమ్మది నెమ్మదిగా అర్థమవ్వడం ప్రారంభమైందంటూ తన ఆవేదనను చెప్పుకొచ్చింది. కష్టపడటంలోనే కాదు, ఆరోగ్య విషయంలోనూ రాజీకి తావిస్తే..నిర్థాక్షిణ్యంగా అనారోగ్యం కోరల్లో చిక్కుకుపోతామని హెచ్చరిస్తోంది మోనికా. సాధ్యమైనంతవరకు మన బాడీ సంకేతాలతో కోరే శ్రద్ధపై ఫోకస్ పెట్టి వ్యాధుల బారిన పడకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోండి. అన్నింట్లకంటే విలువైనది, వెల కట్టలేని సంపద ఆరోగ్యమేనని, అదే మహాభాగ్యం అని అంటోంది కేన్సర్ బాధితురాలు మోనిక. View this post on Instagram A post shared by CancerToCourage (@cancertocourage) (చదవండి: అలాంటి ఇలాంటి అధిక బరువు కాదు..! ఏకంగా 325 కిలోలు..చివరికి..) -
అవిసె గింజలతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు
అవిసె గింజలు (Flax Seeds) ప్రాచీన కాలం నుండి ఆయుర్వేద వైద్యంలో వీటిని ఉపయోగిస్తున్నారు. ఆధునిక కాలంలో కూడా పోషకాహార నిపుణులు వీటి ప్రాముఖ్యతను గుర్తించి, రోజువారీ ఆహారంలో భాగం చేసుకుంటారు. ఇవాల్టీ టిప్ ఆఫ్ ది డేలో భాగంగా అవిసె గింజల్లో పోషకాలు వాటివ కలిగే అద్భుత ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.ఇవి చూడ్డానికి చిన్నగా కనిపించినా వీటిని సూపర్ ఫుడ్ అనిపిలుస్తారు. ప్రోటీన్, ఫైబర్, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, విటమిన్లు , ఖనిజాలు పుష్కలంగా లభిస్తాయి. అవిసె గింజలు- అద్భుతాలుఅవిసె గింజలు గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. వీటిల్లోని ఒమేగా-3 ఫ్యాటీ ఆసిడ్స్, ప్రత్యేకంగా ఆల్ఫా-లినోలెనిక్ ఆసిడ్ (ALA) అధికంగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. రక్తపోటును తగ్గించడం, చెడు కొలెస్ట్రాల్ (LDL) స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి.అవిసె గింజలు ఫైబర్ అధికంగా ఉటుంది. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది.శరీరంలోని జీవక్రియలను వేగవంతం చేసి, బరువును నియంత్రణలో ఉంచడంలో దోహదపడుతుంది.జీర్ణవ్యవస్థకు చాలా మేలు చేస్తుంది. ఇది మలబద్ధకం వంటి సమస్యలను నివారిస్తుంది, పేగుల కదలికలను క్రమబద్ధం చేస్తుంది.అవిసె గింజలు రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి. ఇవి మధుమేహంతో బాధపడేవారికి చాలామంచిది. (భార్య గర్భవతి : రూ. కోటిన్నర జాబ్ వదిలేశాడు)అవిసె గింజలు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి అవిసె గింజలు యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉంటాయి, ఇవి ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టాన్ని తగ్గిస్తాయి.అవిసె గింజల్లోని యాంటీఆక్సిడెంట్లు కేన్సర్ను నిరోధిస్తాయి. “లిగ్నన్స్” అనే యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కొన్ని రకాల కేన్సర్ల, ముఖ్యంగా రొమ్ము క్యాన్సర్, ప్రొస్టేట్ క్యాన్సర్ వంటి వాటిని నివారించడంలో సహాయపడతాయని అధ్యయనాల ద్వారా తెలుస్తోంది.అత్యధిక మొత్తంలో పాఅన్శాచ్యురేటెడ్ ఫ్యాటీ ఆమ్లాలు (పీయూఎఫ్ఏలు), ముఖ్యంగా ఎఎల్ఎలు, ఉంటాయి కాబట్టి అవిసె గింజలు ఆరోగ్యదాయకమైన అనుబంధాహారంగా ప్రాచుర్యం పొందాయి.. ఎఎల్ఎ, లిగ్నాన్లు పుష్కలంగా ఉండటం మూలంగా అవిసె గింజలు గుండెకు మేలు చేస్తాయి. రక్తపోటును తగ్గిస్తాయి. టైప్ 2 డయాబెటిస్ రోగుల్లో ఫాస్టింగ్ గ్లూకోజ్ స్థాయిలను, ఇన్సులిన్ నిరోధకతను తగ్గిస్తాయి.మెనోసాజ్ ఇబ్బందుల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. మలబద్దకం, మానసిక అలసటను తగ్గిస్తాయి. అవిసె గింజల పిండిని అనేక అనారోగ్యాలను తగ్గించడానికి అనాదిగా వాడుతున్నారు. అయితే, శ్యానోజెనిక్ గ్లైకోసైడ్స్, ట్రిప్సిన్ ఇన్హిబిటర్స్, ఫైటిక్ ఆసిడ్ వంటి యాంటీ న్యూట్రియంట్లు ఉన్నప్పటికీ.. మొత్తంగా చూస్తే అవిసె గింజలను ఆహారంలో భాగం చేసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు నెరవేరతాయి. అంతేకాదు ఇవి చర్మం, జుట్టు ఆరోగ్యానికి కూడా దోహపడతాయి. చర్మ ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి. గాయాలను త్వరగా మానేలా చేస్తాయి. ఒమేగా-3 ఫ్యాటీ ఆసిడ్స్చర్మాన్ని మృదువుగా, కాంతివంతంగా ఉంచడంలో సహాయపడతాయి. అలాగే జుట్టు ఆరోగ్యంగా, బలంగా పెరగడానికి దోహదపడతాయి.అవిసె గింజలను ఎలా ఉపయోగించాలి:అవిసె గింజలను పొడిగా చేసి, సూప్ లు, సలాడ్ లు, పెరుగు లేదా స్మూతీలలో కలుపుకోవచ్చు.అవిసె గింజల నూనెను కూడా ఉపయోగించవచ్చు.అవిసె గింజలను నానబెట్టి, రాత్రిపూట నీటిలో నానబెట్టి, ఉదయం తినవచ్చు. లైట్గా వేయించి, తేనె లేదా వెచ్చని నీటితో కూడా తీసుకోవచ్చు.అవిసె గింజలను పచ్చిగా తినడం అంత మంచిది కాదు, ఎందుకంటే వాటిలోని పోషకాలు సరిగా జీర్ణం కావు. రోజుకు ఒకటి నుండి రెండు చెంచాల అవిసె గింజల పొడి తీసుకోవడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. వీటిని వినియోగించేందుకు వైద్యుల సలహా తీసుకోవడం ఉత్తమం -
అధిక బరువని పొరపడి వర్కౌట్లతో కుస్తీ..కానీ చివరకు..
సాధారణంగా ఉండాల్సిన దానికి మించి బరువు పెరిగితే అధిక బరువుతో బాధపడుతున్నాం అనే అనుకుంటాం. ప్రతీ భారీకాయానికి అధిక బరువే సమస్య అని పొరపడొద్దు. ఎందుకంటే ఇక్కడొక మహిళ అలానే తప్పుగా అనుకుని నానాపాట్లు పడింది. చివరికి అది తగ్గే ఛాన్స్ లేని అసాధారణమైన వైద్య పరిస్థితి అని తెలిసి తల్లడిల్లిపోయింది. అయితే ఆమె తన అచంచలమైన స్థైర్యంతో ఎదుర్కొని ఎంతలా బరువు తగ్గిందో తెలిస్తే విస్తుపోతారు. అధిక బరువుతో ఇబ్బందిపడేవాళ్లకు ఆమె కథే ఒక స్ఫూర్తి . అసలేం జరిగిందంటే.. డెట్రాయిట్(Detroit)కు చెందిన 35 ఏళ్ల జమైక మౌల్దిన్(Jameka Mauldin) అనే సింగిల్ మదర్ విపరీతమైన అధిక బరువుతో ఇబ్బంది పడేది. అందుకోసం వర్కౌట్లు, డైటింగ్ వంటివి పాటించేది. అయితే అనుహ్యంగా ఆమె బరువు పెరగడం, శరీరం ఏదో బిగుతుగా మారి ఇబ్బందికరంగా అనిపించేది ఆమెకు. కచ్చితంగా ఇది అధిక బరువు కాదు అంతకు మించింది ఏదో అయి ఉండొచ్చనే అనుమానం కలిగేది జమైకాకు. అదే విషయాన్ని వైద్యులకు తెలిపినా..మరింత కష్టపడాలి అని సూచించేవారే తప్ప ఆమె సమస్య ఏంటో నిర్థారించలేకపోయేవారు. చివరికి 2019లో ఆమె విపరీతమై శరీర బాధకు తాళ్లలేక వైద్యులను సంప్రదించడంతో అసలు విషయం బయటపడింది. జమైక లింఫెడిమా అనే సమస్యతో బాధపడుతున్నట్లు నిర్థారించారు. దీని కారణంగా శరీర కణజాలంలో ద్రవం పేరుకుపోయి, వాపుకు దారితీసే దీర్ఘకాలిక వ్యాధి. అంతేగాదు దీన్ని కొవ్వు సంబంధిత రుగ్మతగా కూడా పేర్కొంటారు. దీని వల్ల బరువు పెరగడమే కానీ తగ్గడం అనేది సాధ్యం కాదు. దాంతో జమైకాకు వైద్యులు సైతం వర్కౌట్లు చేయాలని, కష్టపడమని సూచించలేదు. పైగా ఆమె పరిస్థితిని అర్థం చేసుకుని తగ్గించే మార్గంపై దృష్టిసారించారు. సంకల్పం బలంతో ఆ వ్యాధిపై పోరాడింది..ఆమె దగ్గర దగ్గర 324 కిలోలు పైనే అధిక బరువుకి చేరుకుంది. దాంతో ఆమెకు రోజువారి పనులతో సహా ప్రతిది కష్టమైపోయేది. ఒకరి సహాయం లేకుండా కనీసం బాత్రూమ్కి కూడా వెళ్లలేని స్థితికి చేరుకుంది. అయితే దీన్ని ఆమె సానుకూల దృక్పథంతో, సంకల్ప బలంతో జయించే ప్రయత్నం చేసింది. ఈ రోజు ఈ ఒక్కపని ఫినిష్ చేయాలి అని కేటాయించుకుంటూ..చిన్న విజయాలను సెలబ్రేట్ చేసుకునేది. దాంతోపాటు ఫిజికల్ థెరపీ, జీవనశైలి మార్పులు, ప్రత్యేకమైన లిపోసక్షన్ పద్ధతులతో సుమారు 159 కిలోలకు తగ్గింది. ఇక్కడ జమైక ఎలాంటి అధునాతన ఇంజెక్షన్లు, ఖరీదైన జిమ్లు, అద్భుత శస్త్ర చికిత్సలు వంటివి ఏమి లేకుండా కేవలం తన పట్టుదల, సంకల్పంతో ఆ రోగాన్ని జయించి బరువు తగ్గింది. అంతేగాదు సర్టిఫైడ్ నర్సింగ్ అసిస్టెంట్గా జాయిన్ అయ్యింది కూడా. తన కూతురు 15 ఏళ్ల జామ్యా కారణంగానే ఈ భయానక అధిక బరువుపై విజయం సాధించానని చెప్పుకొచ్చింది. అంతేగాదు ఆమెకు ఇన్స్టాగ్రామ్లో లక్షకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. ఒక పట్టాన నయం కాని వ్యాధులను ధైర్యంగా ఎదుర్కొనడంపై అవగాహన కల్పించేలా తన కథనే వివరిస్తూ ఒక పుస్తకం కూడా రాయాలనుకుంటోందామె.(చదవండి: చాట్జీపీటీ ఆధారిత డైట్తో..ఆస్పత్రి పాలైన వ్యక్తి..!) -
చాట్జీపీటీ ఆధారిత డైట్తో..ఆస్పత్రి పాలైన వ్యక్తి..!
ఏఐ కారణంగా భవిష్యత్తులో చాలా ఉద్యోగాలు ఉండవు అంటూ సర్వత్రా ఆందోళనలు ఎక్కువయ్యాయి. ఇది ఎంతవరకు నిజమో తెలియదు గానీ, ఎంతటి ఏఐ సాంకేతికత అయినా..మానవుని శక్తిమంతమైన పని ముందు అల్పమైనవిగానే మిగిలిపోతున్నాయి. ఏ సాంకేతికతైన కొంత వరకు మానవులు అవసరాన్ని తగ్గిస్తుందేమో గానీ పూర్తిస్థాయిలోమాత్రం కానే కాదు అని చెప్పొచ్చు. అందుకు ఉదాహరణే ఈ ఉదంతం. ఇక్కడొక వ్యక్తి చాట్జీపీటీని నమ్మి చేజేతులారా ఆరోగ్యాన్ని పాడుచేసుకుని ఆస్పత్రి పాలయ్యాడు.తన ఆహారాన్ని మరింత మెరుగుపరుచుకోవడం ఎలా అని చాట్జీపీటీ సలహా కోరాడు. అది ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని తూచాతప్పకుండా పాటించి ఆస్పత్రి పాలయ్యాడు. అమెరికాకు చెందిన వ్యక్తి ఎలాంటి మానసిక, అనారోగ్య చరిత్ర లేని వ్యక్తిగా గుర్తించారు వైద్యులు. అతడు కేవలం ఏఐ చాట్బాట్ కారణంగానే ఆరోగ్యాన్ని పాడుచేసుకున్నట్లు నిర్థారించారు. ఆ చాట్జీపీటీలో టేబుల్ సాల్ట్ ప్రతికూలతలను, ఆరోగ్య ప్రభావాల గురించి కూలంకషంగా తెలుసుకుని దాన్ని పూర్తిగా తొలగించాడు. ఆ ఉప్పు స్థానంలో సోడియం బ్రోమైడ్తో భర్తి చేయొచ్చని చాట్జీపీటీ సూచించడంతో దాన్ని గుడ్డిగా ఫాలో అయ్యాడు. నిజానికి ఈ సోడియం బ్రోమైడ్ కూడా టేబుల్ సాల్ట్లాగానే ఉంటుంది. కానీ ఇది చాలా విభిన్నమైన సమ్మేళనం. దీన్ని మందుల్లో ఉపయోగిస్తారు. సాధారణంగా పారిశ్రామిక శుభ్రపరిచే ప్రయోజనాల కోసం ఉపయోగిస్తారు. అలాంటి ఈ సమ్మేళనాన్ని అధికంగా తీసుకుంటే దుష్ప్రభావాలు ఎదుర్కొనక తప్పవని వెల్లడించారు వైద్యులు. ఇక ఆ వ్యక్తి ఆ కారణంగానే జస్ట్ 24 గంటల్లోనే ఆస్పత్రి పాలయ్యాడని చెప్పారు వైద్యులు. అంతేగాదు మానసికంగా శారీరకంగా అనారోగ్యం పాలయ్యాడు. ఆ వ్యక్తికి ఎలక్ట్రోలైట్లు, యాంటీసైకోటిక్స్తో చికిత్స అందిచడం, సైక్రియాట్రీక్ పర్యవేక్షణ తదితరాలతో మెరుగయ్యేలా చేశారు. దాదాపు మూడు వారాల పాటు ఆస్పత్రిలోనే చికిత్స తీసుకోవాల్సి వచ్చింది. అతను కాలేజ్లో న్యూట్రిషన్ ఫుడ్పై అధ్యయనం చేస్తున్నాడని అందులో భాగంగానే తనపై ఇలా ప్రయోగం చేసుకున్నట్లు సమాచారం. ఇక్కడ చాట్జీపీటీ వంటివి సమాచారం ఎల్లప్పుడూ కచ్చితమైనది కాదని కేవలం అవగాహన కల్పించగలదని చెబుతున్నారు నిపుణులు. అది ఇచ్చే సమాచారం నమ్మి స్వీయ చికిత్సలు తీసుకోరాదని, వ్యక్తిగత వైద్యలు లేదా నిపుణులను సంప్రదించి కికిత్స తీసుకోవడం మంచిదని పేర్కొన్నారు. ఇక ఔషధంగా ఉపయోగించే సోడియం బ్రోమైడ్ వల్ల కలిగే ప్రమాదాలు ఏంటంటే..అధిక మోతాదులో తీసుకుంటే నరాల వ్యవస్థపై ప్రభావం చూపి..తలనొప్పి, మానసిక ఆందోళన, మత్తు వంటి లక్షణాలు ఉత్పన్నమవుతాయిచర్మంపై అలెర్జీ, వాపు వంటి సమస్యలువాంతులు, మలబద్ధకం, ఆకలి లేకపోవడంమూర్ఛ, కోమా, శ్వాస సంబంధిత సమస్యలు, ప్రాణపాయం వంటివి సంభవిస్తాయి. అందువల్ల దీన్ని ఉప్పుగా వాడటం అనేది అత్యంత ప్రమాదకరమని చెబుతున్నారు. దీన్ని వైద్యుల పర్యవేక్షణలోనే ఔషధంగా ఉపయోగించాలని హెచ్చరిస్తున్నారు.(చదవండి: హార్ట్ అటాక్ ముప్పు మహిళల్లోనే ఎక్కువ..! ఎందుకంటే..) -
హార్ట్ అటాక్ ముప్పు మహిళల్లోనే ఎక్కువ..!
గుండె పోటు (హార్ట్ అటాక్) గురించి ఆలోచన రాగానే... మనకు కనిపించే దృశ్యం... మధ్య వయస్కుడైన పురుషుడు అలా తన ఛాతి పట్టుకుని ఒరిగి΄ోతున్నట్లుగామన కళ్ల ముందుకు వస్తుంది. కానీ అసలైన చేదు నిజం ఏమిటంటే... భారతదేశంలో గుండెజబ్బులు పురుషులతోపాటు మహిళల ప్రాణాలను కూడా ఎక్కువగానే తీసుకుంటున్నాయి. ఇంకా చెప్పాలంటే... బ్రెస్ట్ క్యాన్సర్, సర్వికల్ క్యాన్సర్, ప్రెగ్నెన్సీ సంబంధిత మరణాల కంటే గుండె జబ్బులే మహిళల ప్రాణాలను ఎక్కువగా హరిస్తున్నాయి. ఇది కేవలం ప్రాణాలను తీసుకోవడానికే పరిమితం కావడం లేదు...వాళ్లల్లో వచ్చే గుండెజబ్బులను సరిగా అర్థం చేసుకోలేకపోవడం, సరిగా నిర్ధారణ చేయలేకపోవడం, తగిన చికిత్స అందించలేకపోవడానికీ దారితీస్తోంది. ఈ నేపథ్యంలో మహిళల్లో వచ్చే గుండెజబ్బులు సాధారణం కంటే ఏ రకంగా భిన్నంగా ఉంటున్నాయో తెలుసుకునేందుకే ఈ కథనం. భారతీయ మహిళల్లో దురదృష్టకరమైన అంశమేమిటంటే... పాశ్చాత్య మహిళలతో పోలిస్తే వీళ్లలో గుండెజబ్బులు దాదాపు పదేళ్లు ముందుగానే వస్తున్నాయి. ఇటీవల వయసు పరంగా తమ ముప్ఫైలలో, లేదా నలభైలలో ఉన్న మహిళలు గుండెపోటుతో ఆసుపత్రికి రావడం మునపటి కంటే చాలా ఎక్కువైంది. ఒక అధ్యయనం ప్రకారం, భారతదేశంలో గుండె΄ోటుకు గురయ్యే వారిలో చాలా తక్కువ వయసున్న వాళ్లే! వీళ్లలోనూ 40 ఏళ్ల వయసు కంటే తక్కువగా ఉండేవారు 25 శాతం వరకు ఉంటారు. వీళ్లలోనూ మహిళల సంఖ్య గణనీయంగానే ఉంది. పాశ్చాత్య దేశాల్లో మెనోపాజ్ వరకు హార్మోన్ అయిన ఈస్ట్రోజన్ రక్షణగా పనిచేస్తుంది. కానీ భారతీయ మహిళలకు జన్యుపరమైన సమస్యలు, జీవనశైలి సమస్యలు, సమాజంలోని నిర్లక్ష్యం కలగలిపి ఇది ముందే రావడానికి కారణమవుతున్నాయి. అయితే... ఇది కేవలం ఐస్బర్గ్కి తాలూకు పైకి కనిపిస్తున్న టిప్ మాత్రమే. అసలు మూలాలు ఇంతకంటే చాలా లోతుగా ఉంటాయి. పురుషుల గుండెపోటు లక్షణాలు సాధారణంగా ఛాతీలో ఎడమవైపున తీవ్రమైన నొప్పితో కుదేలై΄ోయేలా చేస్తుంది. ఆ నొప్పితో ఎడమ చేతికి పాకుతూ ఉండటం వంటివి చాలా మామూలుగా కనిపించే లక్షణమైతే మహిళల్లో మాత్రం కాస్త భిన్నంగా కనిపించవచ్చు. ఆ లక్షణాలివి... అస్థిమితంగా, ఇబ్బందిగా ఉండటం (అనీజీనెస్) ఛాతీ నొక్కుకు పోయినట్లుగా/ఛాతీలో ఇబ్బందిగా ఉండటం దవడ, భుజాలు, కొన్నిసార్లు వీపులో నొప్పి తీవ్రమైన నీరసం, నిస్సత్తువ, అలసట ఊపిరి అందకపోవడం, ఆయాసం వికారం, వాంతులు చెమటలు పట్టడంచాలామంది మహిళలు ఈ లక్షణాలను తమ తీవ్రమైన ఒత్తిడికీ, గ్యాస్ సమస్యకూ, ఇంట్లోని పనుల ఒత్తిడికీ ముడిపెడుతుంటారు. కుటుంబ సభ్యులూ ఇదే అనుకుంటారు. చివరికి చాలామంది డాక్టర్లు కూడా ఇలాగే అపోహపడుతుండటం మామూలే. ఇవన్నీ దాటి వారు హాస్పిటల్లోకి వచ్చేనాటికి... విలువైన పుణ్యకాలం కాస్తా గడిచిపోతుంది. మహిళల్లోఈ ముప్పుఎందుకంటే? ఈ విషయం తెలుసుకోవాలంటే... జీవశాస్త్రపరంగా లేదా విజ్ఞానశాస్త్రపరంగా కేవలం వాళ్ల శరీర నిర్మాణానికే పరిమితమైతే సరిపోదు. ఇంకా లోతుగా ఆలోచించాల్సి ఉంటుంది. భారతీయ మహిళకు కనిపించని సవాళ్లెన్నో ఉంటాయి. ఉదహరణకు బయటకు కనిపించకుండానే వాళ్లల్లో పొట్టచుట్టు కొవ్వు పెరగడాన్ని (మరీ ముఖ్యంగా ప్రసవాల తర్వాత) అది సహజం అనుకుంటారు తప్ప పెద్దగా ఎవరూ సీరియస్గా తీసుకోరు. వాళ్లుకూడా తమ రోజువారీ పనుల్లో పడిపోవడం, ఇంటి పని, పిల్లల సంరక్షణల తర్వాతే తమ సొంత ఆరోగ్యం అంటూ తమను తాము మోసగించునే తప్పుడు అపోహల్లో ఉండిపోవడం వంటివి ఓ ఒత్తి వెలిగించిన బాంబు చివరన మహిళలు ఉండటమంతటి తీవ్రమైన ముప్పునకు గురిచేస్తున్నాయి. ఎట్టకేలకు వాళ్లు ఇలా తమ ఇంటిపనుల సంస్కృతిలో మునిగిపోయి మౌనంగా ఉండిపోతున్నారు. వీటిల్లో పడి తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడం, పురుషులతో పోలిస్తే... అప్పుడప్పుడైనా చేయించుకోవాల్సిన ఆరోగ్య పరీక్షలకు మహిళలు దూరంగా ఉండటం, కనీసం దగ్గర్లో ఉండే క్లినిక్కూ వెళ్లకపోవడం వంటి అంశాలు వారిని ఆరోగ్యానికి దూరం చేస్తూ, గుండెజబ్బులకు దగ్గర చేస్తున్నాయి. ఆ సూచనలు వాళ్ల గర్భధారణసమస్యలకే కాదు... గుండె తాలూకు ముప్పునకూ చిహ్నాలు... కొన్ని సూచనలను మహిళల తాలూకు జెండర్కూ, వాళ్లకు మాత్రమే సంబంధించిన గర్భధారణ వంటి అంశాల తాలూకు సమస్యలు అనుకుంటారు తప్ప అవి గుండెకూ వర్తిస్తాయని అనుకోరు. ఉదాహరణకు... గర్భవతిగా ఉన్నప్పుడు పెరిగే రక్త΄ోటు (ప్రీ–ఎక్లాంప్సియా), గర్భిణిగా ఉన్నప్పుడు కనిపించే డయాబెటిస్ (జెస్టేషనల్ డయాబెటిస్), నెలలు నిండకముందే ప్రసవం కావడం (ప్రీ–టర్మ్ డెలివరీ) అనేవి గర్భవతికి వచ్చే ముప్పులుగా పరిగణిస్తారు. కానీ చాలామంది మహిళలు తమ ప్రసవం తర్వాత... అన్ని సూచనలనూ హాయిగా మరచి΄ోతారు. కానీ... నిజానికి అవి మున్ముందు రాబోయే గుండెజబ్బులకు సూచనలుగా చూడాల్సిన అంశాలు. అయితే ఇక్కడ కూడా మహిళలు తమ చేతులు కాలాకే ఆకుల కోసం చూస్తారు. అంటే నివారణకు అవకాశమున్నప్పుడే జాగ్రత్త పడకుండా దాన్ని చికిత్స వరకూ తీసుకొస్తారు. మరింత అప్రమత్తంగాఉండాలని సూచించే ఆసక్తికరమైన ప్రత్యేకాంశాలు ఏమిటంటే... తొలిసారి గుండెపోటు తర్వాత ఏడాదిలోపు చని΄ోయే కేసుల్లో పురుషుల కంటే మహిళల సంఖ్య దాదాపు రెట్టింపు. టకోట్సుబో కార్డియోమయోపతి (దీన్నే వాడుక భాషలో బ్రోకెన్ హార్ట్ సిండ్రోమ్) అనేది మహిళల్లోనే ఎక్కువ. ఇది అచ్చం గుండెపోటు లక్షణాలను కనబరుస్తుంది. అయితే దీని చికిత్స మాత్రం కాస్త వేరుగా ఉంటుంది. తప్పుడు లక్షణాలతో వ్యక్తం కావడంతో వారికి అందాల్సిన చికిత్స సరిగా అందకపోవడం. ఇక ఇటీవల కోవిడ్ (కరోనా వైరస్) దెబ్బ, లాక్డౌన్ తర్వాత మన భారతీయ మహిళల్లో గుండెపోటు కేసులు విపరీతంగా పెరిగినట్లు అధ్యయన ఫలితాల డేటా వెల్లడిస్తోంది. వాళ్లలో పెరుగుతున్న ఒత్తిడీ, బరువు పెరగడం, తరచూ చెకప్స్కు వెళ్లక΄ోవడం వంటి అంశాలు ఈ ముప్పును మరింతగా పెంచేస్తున్నాయి. మరి ఇప్పుడు జరగాల్సింది ఏమిటి..? జరగాల్సిందేమిటంటే... ముందుగా మహిళల్లో అవగాహన పెరగాలి. గుండెజబ్బులూ లేదా గుండె΄ోటు అనేది కేవలం పురుషుల సమస్య మాత్రమే కాదు... అది మహిళల్లోనూ వచ్చే అవకాశం అంతే ఉందనీ, కొన్నిసార్లు వాళ్లకంటే ఎక్కువేనన్న అవగాహనను మహిళలు పెంచుకోవాలి. తమ సమస్యలైన రక్తపోటు, డయాబెటిస్, రక్తంలో కొవ్వులు (కొలెస్ట్రాల్) వంటి స్క్రీనింగ్ పరీక్షలు ఆలస్యం కాకుండా చూసుకోవాలి. క్రమం తప్పకుండా చేయించుకుంటూ ఉండాలి. అంతేకాదు... ఏదో మధ్యవయసుకు వచ్చాక మొదలుపెట్టడం కంటే ఈ పరీక్షలను ముందునుంచే చేయించుకుంటూ ఉండటం మేలు. గర్భధారణ, ప్రసవం సమయాల్లో కనిపించే లక్షణాలను ఆ తర్వాత విస్మరించకూడదు. మున్ముందు రాబోయే గుండె తాలూకు ముప్పులకు సూచికగా పరిగణించి, వాటి గురించి మీ డాక్టర్తో చర్చించాలి. ఈ ముప్పుల గురించి డాక్టర్లకు కూడా.. మరీ ముఖ్యంగా ఎమర్జెన్సీలో ఉండే డాక్టర్లూ, గ్రామీణ ప్రాంతల్లో సేవలందించే ప్రైమరీ కేర్ డాక్టర్లకు కూడా వీటి పట్ల అవగాహన పెంచాలి. మహిళల స్వావలంబన, అవగాహన అనేది వైద్యవిజ్ఞానం, వైద్యచికిత్సల విషయంలోనూ పెరగాలి. తమకు కనిపిస్తున్న లక్షణాల గురించి, తమ ఆరోగ్య ప్రాధాన్యం గురించి వాళ్లు ఇంటిపనులను పక్కనబెట్టి నిర్మొహమాటంగా మాట్లాడుతుండాలి. నిజానికి మహిళలకు అందే చికిత్స సరైనదేనా? వాస్తవానికి కాదనే జవాబే చాలాసార్లు వస్తుందీ ప్రశ్నకు! గుండెజబ్బు ఉండి హాస్పిటల్కు వచ్చే వాళ్లలో చాలా తక్కువ మందికి మాత్రమే థ్రాంబోలైసిస్కూ, యాంజియోప్లాస్టీ వంటికి చికిత్సలకూ... అంతెందుకు గుండెపోటుగా అనుమానించినప్పుడు ఇచ్చే చాలా బేసిక్ మందు ఆస్పిరిన్ టాబ్లెట్ కూడా వాళ్లకు అందడం కష్టమే. వాళ్ల లక్షణాలను పెద్దగా పరిగణనలోకి తీసుకోరు. వాళ్ల ఈసీజీని తప్పుగా అర్థం చేసుకుంటారు. ఇవన్నీ కలగలిసి వాళ్ల ముప్పు అనూహ్యంగా పెరుగుతుంది. ఈ ముప్పును మరింతగా పెంచే మరో అంశమేమిటంటే... ఇటీవల మనం వాడుతున్న మార్గదర్శకాలన్నీ పాశ్చాత్య దేశాలనుంచి తీసుకున్నవే. అవి మన దేశీయ మహిళల శరీర నిర్మాణాన్ని బట్టి పాశ్చాత్యులతో పోలిస్తే మన మహిళల్లో రక్తనాళాలు ఒకింత సన్నగా ఉండటం, ఇక్కడ డయాబెటిస్ కేసులు ఎక్కువగా ఉండటం, పాశ్చాత్యులతో పోలిస్తే మన భారతీయ మహిళల దేహాల్లో కొవ్వు పేరుకుపోయే చోట్లు వేరుగా ఉండటం వంటి మన తాలూకు ప్రత్యేక అంశాలను పరిగణనలోకి తీసుకోక΄ోవడం వంటివి మహిళల్లో గుండెజబ్బుల ముప్పును మరింత పెంచుతున్నాయి. ‘ఇంటికి మూలం ఇల్లాలే’... ‘ఇల్లాలు బాగుంటేనే ఇల్లు బాగుంటుంది’... ‘ఇల్లాల్ని చూసి ఇంటిని చూడమన్నారు... ‘ఇంటికి ఇల్లాలే గుండెకాయ’... లాంటి భావోద్వేగపరమైన సూక్తులను మనం చాలా ఎక్కువే చెప్పుకుంటూ ఉంటాం. కానీ నిజంగా వైద్యచికిత్స విషయానికి వచ్చేప్పటికీ వాటిని తెలియకుండానే విస్మరిస్తుంటాం. మహిళకు వచ్చే గుండెజబ్బు అనేది కేవలం ఆమె ఒంటికి మాత్రమే పరిమితం కాదు.. అది సామాజికంగా, సాంస్కృతికంగా కూడా మనపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. అందుకే పురుషుల గుండెజబ్బులతో సమానంగా... మరీ చె΄్పాలంటే అంతకంటే ముఖ్యంగా పరిగణిస్తే కుటుంబ హృదయస్పందనలు సజావుగా జరుగుతాయని గుర్తుపెట్టుకోవాలి.ఎం.ఎస్.ఎస్. ముఖర్జీ, సీనియర్ కార్డియాలజిస్ట్ (చదవండి: -
'వైకింగ్స్ డైట్' అంటే..! ఆరోగ్యానికి మంచిదేనా?
చాలా రకాల డైట్లు గురించి విన్నాం. ఇదేంటి 'వైకింగ్స్ డైట్(Viking Diet)'. పేరే ఇలా ఉంది. ఇక డైట్ ఎలా ఉంటుందో అనిపిస్తోంది కదూ..!. అదేం లేదండి అసలు అలా పిలవడానికి పెద్ద కథే ఉంది. ఆలస్యం చేయకుండా అదేంటో చకచక చదివేయండి మరి..'వైకింగ్స్' అంటే ఎనిమిదో శతాబ్దం నుంచి పదకొండవ శతాబ్దం వరకు స్కాండినేవియా నుంచి వచ్చిన సముద్రయాన ప్రజల(Scandinavian people)ను వైకింగ్స్ అని పిలుస్తారు. వీళ్లు దాడిదారులు లేదా సముద్రదొంగలు అని కూడా అంటారు. వలసదారులుగా ఐరోపా వచ్చి అక్కడ స్థానిక వ్యాపారాలపై దాడుల చేసి స్థిరపడ్డ ప్రజలను ఇలా వైకింగ్స్ అని పిలుస్తారు. వీళ్లంతా డెన్మార్క్, నార్వే, స్వీడన్ నుంచి వలస వచ్చిన వారు. అలా వలస వచ్చేటప్పుడూ స్థానికంగా దొరికే వాటినే తమ ఆహారంలో భాగం చేసుకుంటారు. అలా పుట్టుకొచ్చిందే ఈ 'వైకింగ్స్ డైట్'. అయితే ఇది ఆరోగ్యకరమైనది, పైగా అన్ని విధాల మంచిదని నిపుణులు చెబుతుండటం విశేషం. అలాగే ఈ డైట్లో కొన్ని దుష్ప్రభావాలు కూడా ఉన్నట్లు తెలిపారు. మరి ఆ డైట్లో ప్రజలు ఏం తినేవారో చూద్దామా..!.'వైకింగ్స్ డైట్' అంటే?దీన్ని 'నార్డక్ డైట్' అని కూడా పిలుస్తారు. ఇది బౌగోళిక స్థానం, సామాజిక స్థితి, సీజన్ ఆధారంగా తీసుకునే ఆహారపదార్థాలను కలిగి ఉంటుంది. తీర ప్రాంతాల్లో నివశించేవారికి చేపలు ప్రదాన ఆహారం. కాబట్టి వాళ్లంతా వైకింగ్స్ కాడ్, హెర్రింగ్, ఈల్ వంటి చేపలను తింటుంటారు. వీటి తోపాటు మస్సెల్స్, ఓస్టర్స్ వంటి సముద్ర ఆహారాన్ని తీసుకునేవారు. అలాగే బెర్రీలు, ఆపిల్స్, ఫ్లమ్స్ వంటి పండ్లుఉ, కాబ్యేజీ, క్యారెట్లు, ఉల్లిపాయలు వంటి కూరగాయలను కూడా తమ డైట్లో భాగం చేసుకునేవారు. ఆవులు, మేక, గొర్రెల నుంచి పాలు, జున్ను వంటివి తీసుకునేవారు. పైగా ఆహారాన్ని నిల్వ చేసుకునేందుకు ఉప్పు వేయడం లేదా కిణ్వన ప్రక్రియ వంటి పద్ధతులను వినియోగించేవారు. మంచిదేనా..?ఈ డైట్లో అందుబాటులో ఉన్న ఆహారానికే పరిమితం అవ్వుతూ..ఆరోగ్యకరమైన పోషక పదార్థాలనే తీసుకోవడంతో ఇది అనేక ఆరోగ్య ప్రయోజనాలకు పేరుగాంచిందని చెబుతున్నారు నిపుణులు. ఇందులో పండ్లు, కూరగాయలు, చిక్కుళ్లు, గింజలు, తృణధాన్యాలు, ఫైబర్ అధికంగా ఉండే కార్బోహైడ్రేట్లు, పేగు ఆరోగ్యానికి మద్దుతిస్తాయి. పైగా మధుమేహం, హృదయ సంబంధ వ్యాధులు, కేన్సర్లతో సహా వివిధ జీవనశైలి వ్యాధులను నివారించడంలో సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు. దుష్ప్రభావాలు..అయితే ఈ డైట్లో కొన్ని పోషకపరమైన నష్టాలు కూడా ఉంటాయని చెబుతున్నారు. మెడిటేరియన్ డైట్తో గణనీయమైన మొత్తంలో మాంసం, జంతువుల కొవ్వు ఉంటుందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. అధిక కొవ్వు పదార్థం ఆ ప్రజలకు శీతకాలన్ని తట్టుకునేందుకు సహాయపడుతుంది గానీ ఆ సంతృప్త కొవ్వు హృదయ సంబంధ ప్రమాదాన్ని పెంచుతుందని చెబుతున్నారు నిపుణులు. ఈ డైట్ని అనుసరించేవాళ్లు ఆరోగ్యకరమైన అలవాట్లకు కట్టుబడి ఉండి, అధిక కొవ్వు ఉన్న ఆహారాలకు దూరంగా ఉండాలని సూచించారు నిపుణులు.(చదవండి: మండే ఎఫెక్ట్ ఇంతలా ఉంటుందా..? ఏంటి ‘మండే బ్లూస్?) -
మండే ఎఫెక్ట్ ఇంతలా ఉంటుందా..? ఏంటి ‘మండే బ్లూస్' ?
ఉదయాన్నే నిద్రలేవడం, ఉత్సాహంగా రొటీన్ వర్క్లోకి దూకేయడం... ప్రతిరోజూ ఏమోగానీ, సోమవారం మాత్రం అంత వీజీ కాదు. విద్యార్థుల నుంచి కార్పొరేట్ ఉద్యోగుల దాకా... సోమవారం ముంచుకొచ్చే బద్ధకం.. మండే అంటే ఒళ్లు మండేలా చేస్తోంది. ఇదే మండే బ్లూస్కి కారణమవుతోంది. ‘మండే బ్లూస్ అనే పదం సాధారణంగా సోమవారం రోజు పని లేదా చదువులను మొదలు పెట్టాల్సిన తప్పనిసరి అవసరం వల్ల కలిగే అలసట, నిరుత్సాహం వంటి భావాలకు అద్దం పడుతోంది. కొంతకాలంగా లెక్కలేనన్ని మీమ్స్, ట్వీట్లు కాఫీ మగ్ నినాదాలకు ‘మండే బ్లూస్‘అనేది ఒక పంచ్లైన్. ఆ పాపం వీకెండ్ దే... వారాంతంలో 2 రోజులపాటు సెలవులు అనే కార్పొరేట్ కల్చర్ విస్తృతంగా వ్యాపించడం ఈ మండే బ్లూస్కి ప్రధాన కారణమవుతోంది. వారంలో ఐదురోజుల పని ముగుస్తుండగానే శుక్రవారం సాయంత్రానికే వీకెండ్ ఉత్సాహం పుంజుకుంటుండగా, శనివారం, ఆదివారం సెలవులు పూర్తయ్యాక సోమవారం మళ్లీ రొటీన్ వర్క్ లేదా స్కూల్/కాలేజ్కు వెళ్లాల్సిన పరిస్థితి మండే బ్లూస్ని సృష్టిస్తోంది. సాధారణంగా సోమవారం ఆలస్యంగా లేచే అలవాటు చాలామందిలో ఉంటుంది. దీనికి కారణం వీకెండ్ రోజుల్లో ఆలస్యంగా నిద్రలేవడమే. పని మొదలు పెట్టే రోజు కాబట్టి సోమవారం పట్ల మానసిక విరక్తి, పని పట్ల ప్రతికూల భావన ఏర్పడుతోంది. ఒత్తిడి స్థాయిలు పెరుగుతున్నాయ్... వారంలో తొలి నిరుత్సాహకర ప్రారంభం అనేది కేవలం మన ఆలోచనలపై మాత్రమే ప్రభావం చూపడం లేదని, అది మన శారీరక ధర్మాలను కూడా ప్రభావితం చేస్తోందని వైస్ (వీఐసీఇ) రిపోర్ట్ పేరిట జర్నల్ ఆఫ్ ఎఫెక్టివ్ డిజార్డర్స్లో ప్రచురించిన తాజా అధ్యయనం వెల్లడిస్తోంది. దీని ప్రకారం.. ఒత్తిడిని అనుభవిస్తున్న వ్యక్తుల్లో కార్టిసాల్ స్థాయిలు ఇతర ఏ రోజు ఒత్తిడిని నివేదించిన వారి కంటే సోమవారాల్లో 23 శాతం వరకు ఎక్కువగా ఉన్నాయి. డాక్టర్ తరణి చందోలా నేతృత్వంలో 3,500 మందిపై నిర్వహించిన ఈ అధ్యయనం ప్రాథమిక ఒత్తిడి హార్మోన్ కార్టిసాల్ ‘సోమవారం వ్యక్తుల’లో గణనీయంగా పెరిగినట్టు కనిపెట్టింది. మానసికమే కాదు, అంతకు మించి... కార్టిసాల్ దీర్ఘకాలిక ఒత్తిడికి గురి కావడానికి కీలకమైన బయోమార్కర్ అని పరిశోధకులు వెల్లడించారు. మెదడుకు ముప్పు లేదా ప్రమాదాన్ని గ్రహించినప్పుడు కలిగే ప్రతిస్పందన ఈ హార్మోన్. అంతేకాదు కార్టిసాల్ స్థాయిల్లో హెచ్చుతగ్గులు హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదం, బలహీనమైన రోగనిరోధక శక్తి, రక్తపోటు, మధుమేహం వంటి వాటికి కూడా దారితీస్తున్నాయి. సంక్షిప్తంగా చెప్పాలంటే సోమవారం భయం మానసిక స్థితిని దెబ్బతీయడం కంటే మరింత ఎక్కువ హాని కలిగిస్తుంది. అది వ్యక్తుల ఆరోగ్యాన్ని నిశ్శబ్దంగా దెబ్బతీస్తుంది. పరిష్కారం..సైకాలజిస్ట్ల కొన్ని సూచనలు.. ప్రణాళికాబద్ధంగా పనిని విభజించుకోవడం అనేది అలవాటు చేసుకోవాలి. వారాంతపు రోజుల్లో ఆహారపు అలవాట్లలో అతి మార్పు చేర్పులు చేయవద్దు. శుక్రవారం రోజే సోమవారం నాటి పనులను పకడ్బందీగా ప్లాన్ చేసుకోవడం వర్క్ ప్రెషర్ను దూరం చేస్తుంది. ప్రతీ సోమవారం ఏదైనా కొత్త రకం వ్యాయామం, కొత్త రూట్లో వాకింగ్ వంటివి ప్లాన్ చేయడం ద్వారా కొత్త ఉత్సాహం వస్తుంది. మరోవైపు.. సోమవారాల్లో గుండె సంబంధిత సంఘటనలు పెరగడాన్ని వైద్యులు చాలాకాలంగా గమనిస్తున్నారు. దీన్ని ‘‘మండే ఎఫెక్ట్’’అని పిలుస్తారు. వారంలోని మొదటి రోజున గుండెపోటు, ఆకస్మిక గుండె సంబంధిత మరణాలు ఎక్కువగా సంభవిస్తున్నాయని గణాంకాల పరంగా గుర్తించారు. ఈ ధోరణికి తరచూ వారాంతపు విశ్రాంతి నుంచి ఆకస్మిక పని వైపు మళ్లిన ఆలోచనలే కారణమని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో వైద్యుల సలహాలను అనుసరించి ఈ సమస్య నుంచి వీలైనంత త్వరగా బయటపడటం అవసరం. -
స్కార్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే..? ఇది ప్రమాదకరమా..
నేను రెండోసారి గర్భవతిని. ఇప్పుడు స్కాన్లో స్కార్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అని తేలింది. ఇది ప్రమాదకరమా? ఆపరేషన్ తప్పకుండా చేయించుకోవాలా?– మధు, విశాఖపట్నంస్కార్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అనేది ఒక అరుదైన గర్భధారణ సమస్య. ఇది సాధారణంగా గర్భాశయంలో ఏర్పడే గర్భం కాకుండా, గతంలో సిజేరియన్ చేసిన కుట్టు వద్ద ఏర్పడుతుంది. ఇది సుమారు రెండువేల మందిలో ఒకరికి మాత్రమే వచ్చే సమస్య. ప్రస్తుతం సిజేరియన్ డెలివరీల సంఖ్య పెరగడం, స్కానింగ్ పరికరాల మెరుగుదల వలన స్కార్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీని సకాలంలో గుర్తించడం సాధ్యమవుతోంది. కానీ, ఈ గర్భం కొనసాగితే తీవ్రమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా గర్భధారణ సమయంలో గర్భాశయపు కుట్టు తెరుచుకోవడం, గర్భాశయం చీలిపోవడం వంటి ప్రమాదాలు ఉన్నాయి. గర్భం పెరిగే కొద్దీ కుట్టుపై ఒత్తిడి పెరిగి అది తెరుచుకోవచ్చు. ఇది ప్రాణాపాయ పరిస్థితికి దారి తీసే అవకాశం ఉంది. ఇంకా, స్కార్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వలన ప్లాసెంటా గర్భాశయ గోడకు గట్టిగా అతుక్కుపోయే అవకాశం ఉంటుంది. దీనిని ప్లాసెంటా అక్రీటా స్పెక్ట్రమ్ అంటారు. ఇది గర్భధారణ చివర్లో తీవ్రమైన రక్తస్రావానికి కారణమవుతుంది. కొన్నిసార్లు ప్లాసెంటా మూత్రాశయానికి కూడా అతుక్కుపోతుంది. అలాంటి పరిస్థితుల్లో గర్భాశయాన్ని పూర్తిగా తీసేయాల్సి రావచ్చు. ఇవన్నీ ముందుగా గుర్తించడం కష్టం. చాలా సందర్భాల్లో చిన్న లక్షణాలు మాత్రమే కనిపిస్తాయి. ప్రసవ సమయంలో కూడా స్కార్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వలన తీవ్రమైన రక్తస్రావం సంభవించవచ్చు. ముఖ్యంగా ప్లాసెంటా వేరుచేసే సమయంలో ఇది జరుగుతుంది. అలాంటి పరిస్థితుల్లో గర్భాశయాన్ని తొలగించడం, రక్త మార్పిడి, ఐసీయూలో చికిత్స అవసరం కావచ్చు. గర్భాన్ని కొనసాగించాలంటే అత్యంత జాగ్రత్తగా, నిపుణుల పర్యవేక్షణలో మాత్రమే ఉండాలి. అవసరమైన ప్రత్యేక స్కాన్లు, పరీక్షలు చేయించుకోవాలి. స్కార్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఉన్న చోట ప్లాసెంటా అతుక్కుపోతే, పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారుతుంది. ఈ పరిస్థితిని ముందే అంచనా వేసి, తగిన నిర్ణయం తీసుకోవాలి. సాధారణంగా స్కార్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు గర్భాన్ని తొలగించడం ఉత్తమమని వైద్య నిపుణులు సూచిస్తారు. దీనికోసం కొన్ని మార్గాలు ఉన్నాయి. ఒకటి: చిన్న రంధ్రాల ద్వారా శస్త్రచికిత్స చేసి గర్భాన్ని తొలగించడం. ఈ సమయంలో గత కుట్టు భాగాన్ని బలపరచే చర్యలు కూడా తీసుకుంటారు. తద్వారా భవిష్యత్తులో స్కార్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మళ్లీ కలుగకుండా ఉంటుంది. ఇంకొన్ని సందర్భాల్లో, స్కార్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ప్రారంభ దశలో ఉంటే, మిథోట్రెక్సేట్ అనే ఔషధాన్ని గర్భాశయంలోకి నేరుగా ఇంజెక్షన్ రూపంలో ఇచ్చి, గర్భాన్ని ఆపవచ్చు. ఇది గర్భం చాలా చిన్న దశలో ఉన్నప్పుడు మాత్రమే ఉపయోగపడుతుంది. చివరిగా, డి అండ్ సి (డైలటేషన్ అండ్ క్యూరెటేజ్) అనే చిన్న శస్త్రచికిత్స ద్వారా కూడా గర్భాన్ని తొలగించవచ్చు. కాబట్టి, స్కార్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అని తెలిసిన వెంటనే ఆలస్యం చేయకుండా ప్రసూతి నిపుణులను కలసి, గర్భాన్ని కొనసాగించాలా లేక తొలగించాలా అనే విషయాన్ని నిర్ణయించుకోవాలి. భవిష్యత్తులో సురక్షితమైన గర్భధారణ కోసం ఇది చాలా అవసరం. డాక్టర్ ప్రమత శిరీష, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్ (చదవండి: శాకాహారుల్లో బీ12 లోపం అంటే..?)∙ -
ప్లాస్టిక్ సర్జరీలలో భద్రత ముఖ్యం.. ఉన్న అందం చెడకుండా
హైదరాబాద్: సాంకేతికత ఎంతగా అభివృద్ధి చెందినా, వైద్యశాస్త్రంలో సరికొత్త మార్పులు వస్తున్నా ఇప్పటికీ హెయిర్ ట్రాన్స్ప్లాంట్, లేజర్ చికిత్సలు, ముఖానికి సంబంధించిన మార్పుల కోసం చేయించుకునే శస్త్రచికిత్సల విషయంలో చాలామంది వెనకడుగు వేస్తున్నారు. దానికి ప్రధాన కారణం.. చేయించుకుంటే ఏమైనా అవుతుందేమోనన్న భయం. రోగుల్లో ఈ భయం రావడానికి కూడా కారణాలు లేకపోలేవు. కొన్నిసార్లు ఈ తరహా చికిత్సల వల్ల కొంతమందికి ఇన్ఫెక్షన్లు రావడం, రకరకాల సమస్యలు తలెత్తడం లాంటివి ఉంటున్నాయి. కుప్పలు తెప్పలుగా నకిలీ వైద్యులు పుట్టుకురావడం, ఉన్నవారిలో కొందరికి నైపుణ్యాలు లేకపోవడం ఇందుకు ప్రధాన కారణాలని వక్తలు పేర్కొన్నారు. రోగులకు ఈస్థటిక్ చికిత్సలు, కాస్మొటిక్ శస్త్రచికిత్సలు, ప్లాస్టిక్ సర్జరీలు అత్యంత సురక్షితంగా చేయడం ఎలాగన్న విషయాన్ని తెలియజేయడమే ప్రధాన ఉద్దేశంగా నగరంలోని టి-హబ్ వేదికగా రెండురోజుల పాటు నిర్వహించే సేఫ్ ప్లాస్ట్-2025 సదస్సు శనివారం ఘనంగా ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాలకు చెందిన 120 మందికి పైగా ప్లాస్టిక్ సర్జన్లు, డెర్మటాలజిస్టులతో పాటు విదేశాల నుంచి ఆన్లైన్లో కూడా కొందరు పాల్గొన్న ఈ సదస్సులో దేశ విదేశాల నుంచి 25 మంది సీనియర్ ప్లాస్టిక్ సర్జన్లు వివిధ అంశాలపై మాట్లాడి అవగాహన కల్పించారు.ఈ సదస్సులో దుబాయ్కి చెందిన ప్రముఖ సీనియర్ ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ సంజయ్ పరాశర్ మాట్లాడుతూ, ‘‘ప్లాస్టిక్, ఈస్థటిక్ సర్జరీలు చాలా సంక్లిష్టమైనవి. కొన్ని సందర్భాల్లో మనం నూటికి నూరుశాతం కృషిచేసినా, ఫలితాలు మాత్రం అలా ఉండకపోవచ్చు. మరికొన్నిసార్లు అనుకోని అవాంతరాలు ఎదురవు తుంటాయి. అలా ఏదైనా సమస్య వచ్చినప్పుడు దాన్ని ఎలా పరిష్కరించు కోవాలో తెలియడం ముఖ్యం. అలాగే అసలు సమస్యకు కారణం ఏంటన్నది కూడా గుర్తించాలి. అసలు ప్రక్రియ ఎలా చేయాలన్నది తగినంత శిక్షణ లేకుండా కేవలం పుస్తకాలు చూసి చేసేయడం కూడా సరికాదు. పూర్తిస్థాయిలో శిక్షణ పొందిన తర్వాత చేస్తే మాత్రమే రోగులకు అత్యంత సురక్షితంగా చికిత్స చేయగలం. మిగిలిన విభాగాలలో చేసే చికిత్సలు వేరు, ప్లాస్టిక్ సర్జన్లు, డెర్మటాలజిస్టులు చేసే చికిత్సలు వేరు. కాస్త అందంగా కనపడాలని, ఉన్న లోపాన్ని సరిచేయించుకోవాలని వచ్చేవాళ్లకు మనం పూర్తి సంతృప్తి ఇవ్వగలగాలి. అంతే తప్ప ఉన్నదాన్ని కూడా మరికొంత చెడగొడితే ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి. చికిత్స చేసిన తర్వాత ఏదో ఒక కారణంతో ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంటుంది. అవి రాకుండా చూసుకోవడం ముఖ్యం. ముఖ్యంగా లైపోసక్షన్, కాస్మొటిక్ శస్త్రచికిత్సలు, ముఖం మీద వివిధ భాగాలు అంటే ముక్కు, గడ్డం, బుగ్గలు.. ఇలాంటివి సరిచేయించుకునే చికిత్సలు, హెయిర్ ట్రాన్స్ప్లాంట్ లాంటివి చాలా సున్నితమైనవి. వీటి విషయంలో ఇప్పుడు చెప్పిన విషయాలన్నింటినీ జాగ్రత్తగా గమనించుకుని రోగుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలి’’ అని చెప్పారు.పెర్సానిక్స్ కాస్మొటిక్స్, ప్లాస్టిక్ సర్జరీ సెంటర్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ గురుకర్ణ వేముల మాట్లాడుతూ, ‘‘అసలు ఈ చికిత్సలు చేయించుకోవడానికి ఎవరి వద్దకు వెళ్లాలనేది రోగులు ముందుగా నిర్ణయించుకోవాలి. అందుకోసం వాళ్ల ప్రొఫైల్, వెబ్సైట్లు, రాష్ట్ర స్థాయిలో తెలంగాణ మెడికల్ కౌన్సిల్ లాంటివాటిలో రిజిస్ట్రేషన్లు అన్నీ చూసుకోవాలి. వైద్యుల డిగ్రీల గురించి తెలుసుకోవాలి. ఎంబీబీఎస్, ఎండీ, ఎంసీహెచ్ లాంటివి అన్నీ మంచి డిగ్రీలు. అవికాకుండా ఎఫ్ఐఎస్ఎస్, ఇలాంటి ఏవేవో పేర్లతో ఉండే ఫెలోషిప్లు ఉన్నాయంటే మాత్రం కొంత అనుమానించాలి. తగిన శిక్షణ లేని వాళ్లు ఇలాంటి చికిత్సలు చేయడం వల్ల పలురకాల సమస్యలు వస్తున్నాయి. హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకున్నప్పుడు కొంతమందికి తలమీద ఇన్ఫెక్షన్లు వస్తున్నాయి. అలాగే బొటాక్స్, ఫిల్లర్లు, లేజర్ చికిత్సల వల్ల కూడా కొన్ని దుష్ప్రభావాలు తలెత్తుతున్నాయి. ఇవన్నీ లేకుండా ఉండాలంటే.. రోగులు ముందుగా తగిన వైద్యుడిని ఎంచుకోవడం ముఖ్యం. అలాగే, ఈస్థటిక్ సర్జరీల గురించి మన దేశంలో ఇంకా శిక్షణ మెరుగుపడాలి. శిక్షణ కార్యక్రమాలు పెంచాలి. బొటాక్స్, ఫిల్లర్స్, లేజర్స్, హెయిర్ ట్రాన్స్ ప్లాంట్ లాంటి చికిత్సలను అత్యంత సురక్షితంగా చేయాలి. ప్లాస్టిక్ సర్జరీ చేసేటప్పుడు అనుక్షణం అత్యంత అప్రమత్తంగా ఉండాలి. ఇది కేవలం అందాన్ని మెరుగుపరిచేది మాత్రమే కాదు.. అనేక సందర్భాలలో ప్రాణాలను సైతం రక్షిస్తుంది. ఇక్కడ దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి, అలాగే విదేశాల నుంచి వచ్చిన సీనియర్లు చెబుతున్న విషయాలేవీ వైద్య పుస్తకాల్లో ఉండవు. వీటిని కేవలం వారి అనుభవాల ద్వారానే తెలుసుకోవాలి. ఈ రంగంలో ఉన్న అత్యుత్తమ వైద్య నిపుణులు తమ అనుభవాలను పాఠాలుగా చెబుతున్నందున వీటినుంచి నేర్చుకుంటే ప్లాస్టిక్ సర్జన్లు, డెర్మటాలజిస్టులు తమ వృత్తి జీవితంలో రాణించగలరు’’ అని తెలిపారు. -
70 ఏళ్ల వెయిట్ లిఫ్టర్ రోష్ని దేవి సంగ్వాన్ డైట్ సీక్రెట్..!
చాలామంది ప్రముఖుల డైట్ సీక్రెట్ల గురించి విన్నాం. అలా చేస్తే మనం కూడా స్మార్ట్గా మారిపోవచ్చు అని ప్రేరణ కలిగించేలా ఉంటాయి అవి. కానీ అలా ఏదీ పడితే అది ఫాలో కావొద్దని చెబుతోంది ఈ 70 ఏళ్ల వెయిట్ లిఫ్టర్. శరీరం మాట వినండి, అందరికీ ఒక విధమైన డైట్ ఎట్టిపరిస్థితిలో సరిపడదని కూడా సూచిస్తోంది. ఈ వయసులో కూడా చురుగ్గా బరువులు ఎత్తే ఆమె తన డైట్ సీక్రెట్ని షేర్ చేసుకోవడమే గాక ఎలా ఆహారం తీసుకుంటే మంచిదో కూడా సూచించారు. రోష్ని దేవి సంగ్వాన్ 68 సంవత్సరాల వయస్సులో వెయిట్లిఫ్టింగ్ ప్రారంభించి ప్రొఫెషనల్ పవర్ లిఫ్టర్గా మారారు. ఆమె ఆర్థరైటిస్తో బాధపడుతున్నప్పటికీ తన బలాన్ని, శక్తిని ప్రదర్శిస్తూ.. ప్రజలకు స్ఫూర్తిగా నిలుస్తున్నారామె. అంత లేటు వయసులు బరువులు ఎత్తడం మొదలు పెట్టినా..అంతలా ఎనర్జీగా చేసేందుకు ఆమె ఎలాంటి ఆహారం తీసుకుంటుందంటే..రోజు పది బాదంపప్పులు, ఎండుద్రాక్ష తీసకుంటుందట. సాయంత్రం పెసరపప్పుతో చేసే అట్లు, పనీర్, ఒక కప్పు పాలు తీసుకుంటానని అన్నారు. చాలా తక్కువ మోతాదులో రైస్ తీసుకుంటానని చెప్పారామె. భారతీయ వంటకాలు శరీరానికి మంచి రిప్రెష్ని అందిస్తాయని అంటున్నారామె. పప్పు, బియ్యం, పెరుగు, ఓట్స్, బాదం, మూంగ్ చిల్లా, పనీర్లను కలిగి ఉన్న ఈ డైట్ ప్లాన్ సంక్లిష్ట కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్ మిశ్రమాన్ని అందిస్తుంది. శరీరం నెమ్మదిగా జీర్ణమయ్యే శక్తిని, మెరుగైన ప్రేగు ఆరోగ్యం తోపాటు రక్తంలో స్థిరమైన చక్కెర స్థాయిలు ఉండేలా చేసే పోషకమైన ఆహారం ఇది. ఇక్కడ పెసరపప్పు, బాదం, పనీర్ వంటి పదార్థాలు జీవక్రియ, కండరాల మరమతఉకు మద్దతు ఇచ్చే అద్భుతమైన శాకాహార ప్రోటీన్ వనరులు అని చెబుతున్నారు పోషకాహార నిపుణులు. అయితే వెయిట్ లిఫ్టర్ రోష్ని దేవి ఈ ఆహారాలన్నీ ఆరోగ్యకరమైనవి అయినప్పటికీ..తినే క్వాండిటీ అనేది అత్యంత ప్రధానం అని చెబుతోందామె. ఉదహారణకు నట్స్, పనీర్ పోషకాలు, కేలరీలు అధికంగా ఉంటాయి. కాబట్టి తీసుకునే క్వాండిటి ప్రధానం. అలాగే ఈ ఆహారాలు అందరికీ సరిపడకపోవచ్చని అంటున్నారామె. ఎందుకంటే కొందరికి లాక్టోస్ పడకపోవచ్చు, అలాగే వీటిలో కొన్ని పీసీఓడీ, డయాబెటిస్ వంటి సమస్యలతో బాధపడుతున్న వారు తీసుకోకూడనివి కూడా అయి ఉండొచ్చని అమె చెబుతున్నారు. ఇన్సులిన్, ధైరాయిడ్ సమస్యలతో బాధపడేవారు ఎక్కువ ప్రోటీన్, తక్కువ కార్బోహైడ్రేట్లు అవసరం కావొచ్చు. అందువల్ల ఈ డైట్ని ఫాలో కావొద్దని చెబుతున్నారు రోష్ని దేవి. దీర్ఘకాలిక వ్యాధులతో ఇబ్బంది పడేవారు ఆన్లైన్ కంటెంట్ ఆధారంగా ఆహారంలో మార్పులు చేయడం కంటే మంచి డైటీషియన్ని సంప్రదించి అనుసరించడమే మంచిదని సూచించారామె. చివరగా ఆమె ఒక్క విషయానికి తప్పక కట్టుబడి ఉండండని అంటున్నారామె. భారతీయ భోజనం సదా శక్తిమంతంగా ఉంటుంది, వ్యక్తిగతమైనది కూడా అనేది గ్రహించండని అంటోందామె. ఒక వ్యక్తికి బాగా పనిచేసిన ఆహారం మరొకరికి ఇబ్బందికరంగా ఉండొచ్చని అన్నారు. అన్నింట్లకంటే మన శరీరం చెప్పింది వినాలని అన్నారామె. సో వ్యక్తిగత వైద్యులను సంప్రదించి శరీరానికి సరపడా డైట్ తీసుకుని ఫిట్గా ఉందామా మరి.. View this post on Instagram A post shared by Ranveer Allahbadia (@ranveerallahbadia) (చదవండి: Parenting Tip: తండ్రి ఇచ్చిన సలహా ఆమె జీవితాన్నే మార్చేసింది..! ఇవాళ సీఈవోగా..) -
55 ఏళ్ల వయసులో పాతికేళ్ల కుర్రాడిలా డాక్డర్..!
‘దీర్ఘకాల రోగాలతో రోగులు నా తలుపు తట్టని రోజునే నేను వైద్యుడిగా విజయం సాధించినట్టు’ అంటున్నారు నగరంలోని జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రికి చెందిన న్యూరాలజిస్ట్ డా.సుదీర్కుమార్. రోగులు రావాలని కాకుండా.. రోగాలు రాకూడదని కోరుకునే మంచి వైద్యుడిగా మాత్రమే కాదు రోగాల బారిన పడకుండా ఏం చేయాలి? అనే దానికి కూడా ఆయన స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఒకప్పుడు అధిక బరువుతో, దీర్ఘకాలిక వ్యాధితో పోరాడిన ఆయన వాటిని మందులతో కాకుండా జీవనశైలి మార్పులతో జయించవచ్చని నిరూపించారు. వైద్యుడిగా బిజీ అయిపోయాక ఆరోగ్యంపై శ్రద్ధ తగ్గింది. వేళాపాళా లేని నిద్ర, ఆహారపు అలవాట్లు, పని ఒత్తిడి.. నాకు 49 సంవత్సరాల వయస్సు వచ్చేసరికి దాదాపు 100 కిలోల బరువుకు చేరుకున్నా. అలాగే ఆంకైలోజింగ్ స్పాండిలైటిస్ అనే వ్యాధి కూడా ఇబ్బంది పెట్టేంది అంటూ గుర్తు చేసుకున్నారు జూబ్లీహిల్స్లోని అపోలో హాస్పిటల్లో సీనియర్ న్యూరాలజిస్ట్గా సేవలు అందిస్తున్న డాక్టర్ సుదీర్ కుమార్. ఆ పరిస్థితిని తాను అధిగమించిన తీరు, స్ఫూర్తిదాయక ట్రాన్స్ఫార్మేషన్ విశేషాలను సాక్షితో పంచుకున్నారు ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. లాస్ గుర్తు చేసిన లాక్డౌన్ కోవిడ్–19 లాక్డౌన్ అందించిన ఖాళీ సమయం నా గురించి నేను ఆలోచించుకునే అవకాశం అందించింది. అప్పుడే బరువు తగ్గాలని నిర్ణయించుకుని జాగింగ్ ప్రారంభించాను. రోడ్లు ఖాళీగా ఉండటం కాలుష్యం లేకపోవడం.. నా ప్రయత్నాలకు ఊతమిచ్చింది. అయితే మొదటిసారి 400 మీటర్లు మించి పరుగెత్తడానికి ప్రయత్నించినప్పుడు, నాకు ఊపిరి ఆడలేదు. కానీ ఆపడానికి బదులుగా దాన్ని నడకగా మార్చి కొనసాగించాను. పట్టు విడవకుండా ప్రయచి రోజూ 5–10 కి.మీ నడక, అలా పరుగుకు చేరుకున్నా. ‘ఎటువంటి శిక్షణ లేకుండా మారథాన్ల సమయంలో ఏడాదికి ఒకసారి మాత్రమే పరిగెత్తేవాడిని కాలక్రమేణా నగరంతో పాటు లడఖ్ తదితర చోట్ల మారథాన్లలో పాల్గొని మొత్తం 14,000 కిలోమీటర్లకు పైగా రన్ చేశా. వాటిలో 10కి.మీ పరుగులు 822, హాఫ్ మారథాన్లు 133 ఉన్నాయి. వెయిట్ లాస్.. మజిల్ మిస్.. నిర్విరామ నడక, పరుగు, డైట్లతో రెండేళ్ల స్వల్ప వ్యవధిలోనే 30 కిలోల బరువు తగ్గి 69 కిలోలకు చేరాను. అయితే, మజిల్ లాస్ (కండరాల నష్టాన్ని) కూడా గమనించా, స్ట్రెంగ్త్ ట్రైనింగ్లో చేరి 4.5 కిలోల కండర(మజిల్ మాస్) సముదాయాన్ని తిరిగి పొందాను. శారీరక శ్రమ, ప్రొటీన్ రిచ్ ఫుడ్ పెంచడం వంటి మెరుగైన ఆహారపు అలవాట్లు, తగినంత నిద్ర వంటివి ఈ సక్సెస్లో ఇమిడి ఉన్నాయి. అత్యంత క్రమశిక్షణతో కూడిన దినచర్య కూడా అనారోగ్యకరమైన ఆహారం వలన కలిగే నష్టాన్ని భర్తీ చేయలేదని గుర్తుంచుకోవాలి. అందుకే ప్రాసెస్డ్ ఫుడ్, చక్కెర, శీతల పానీయాలను పూర్తిగా మానేశా.. పని గంటలు తగ్గించుకుని 7–8 గంటలకు నిద్ర సమయాన్ని పెంచుకున్నా అంటూ వివరించారు డా.సు«దీర్కుమార్. రోగాలకు చికిత్స చేయడం కాదు చికిత్స చేసే అవసరం రాకుండా చేయడం కూడా వైద్యుల బాధ్యతే అంటున్న ఆయన అందుకు తనను తానే నిదర్శనంగా మలుచుకున్న తీరు స్ఫూర్తిదాయకం. How an extremely busy Hyderabad doctor lost 30 kg weight. He started his fitness journey at 50 then completed 133 half marathons"For Dr. Sudhir Kumar, a senior neurologist at Apollo Hospital, Jubilee Hills, Hyderabad, fitness wasn’t a priority—until it became one. In 2020, at… https://t.co/q1sqombu5P— Dr Sudhir Kumar MD DM (@hyderabaddoctor) July 23, 2025 (చదవండి: Punita Arora: ఎవరీ పునీతా అరోరా..? సైన్యం, నేవీలలో అత్యున్నత హోదాలు..) -
5 నెలల్లో 28 కిలోలు : అమీర్ ఖాన్ అద్భుత చిట్కాలు
బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ తనదైన నటన, వ్యక్తిత్వంతో మిస్టర్ పర్ఫెక్షనిస్ట్గా పేరు తెచ్చుకున్నారు. కరీయర్లో అనేక బ్లాక్ బస్టర్ మూవీలను అందించడమాత్రమే కాదు, హీరోగా, డైరెక్టర్గా, నిర్మాతగా కూడా తన ప్రత్యేకతను చాటుకున్నారు. తాను పోషించే పాత్ర కోసం ఎలాంటి ప్రయోగానికైనా వెనుకాడని నటుడు. ఫిట్నెస్ విషయంలో కూడా ఎక్కడా తగ్గకుండా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు. బాలీవుడ్ సూపర్ స్టార్ తన ఫిట్నెస్ ప్రయాణంతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తారు. గజని మూవీనుంచి దంగల్ దాకా ఆయన చేసిన ప్రతీ ప్రయోగమూ సక్సెస్ను అందుకుంది. 5 నెలల్లో 25 కిలోలకు పైగా బరువు తగ్గినా, కొన్ని నెలల్లో బరువు పెరిగినా అది ఆయనకే చెల్లు.ముఖ్యంగా అమీర్ ఖాన్ 60 ఏళ్ళ వయసులో ఫిట్ అండ్ ఫ్యాబ్గా ఉండటంలో ఆయనకు ఆయనే సాటి. 2016లో వచ్చిన తన బ్లాక్ బస్టర్ సినిమా దంగల్ కోసం అనూహ్యంగా బరువు పెరిగి, పాత్ర పట్ల తన నిబద్ధతను చాటుకున్నారు. భారతీయ రెజ్లింగ్ ఛాంపియన్ మహావీర్ సింగ్ ఫోగట్లా కనిపించేందుకు పెద్ద సాహసమే చేశారు. ఒక ప్రధాన రెజ్లర్ నుండి మధ్య వయస్కుడైన తండ్రిలా కనిపించేందుకు బాడీసూట్ ధరించడం కంటే, ఆ పాత్రకు న్యాయం చేసేందుకు సహజంగానే బరువు పెరిగి, మళ్లీ బరువు తగ్గి అభిమానులను ఆశ్చర్యపరిచారు.. అమీర్ ఖాన్ దంగల్ సినిమా కోసం సుమారు 28 కిలోల బరువు తగ్గారు. కేవలం ఐదు నెలల్లో 97 కిలోల నుండి 68 కిలోలకు చేరుకున్నారు. ఈ సమయంలో తన శరీర కొవ్వు శాతాన్ని 37శాతం నుండి 9.67శాతానికి తగ్గించుకోవడం విశేషం. ఈ మూవీ దర్శకుడు నితేష్ తివారీ అమీర్ అంకితభావాన్ని ప్రశంసించకుండా ఉండలేకపోయాడు."బరువు పెరగడం సరదాగానే ఉంటుంది. కోరుకున్నది తినవచ్చు. కానీ చురుగ్గా కదలలేం. శ్వాస కూడా కష్టంగా మారుతుంది. బాడీ లాంగ్వేజ్, నడక , కూర్చునే విధానం... ప్రతిదీ మారుతుంది. కానీ ఆ తరువాత బరువు తగ్గడం చాలా కష్టం అనిపించింది’’ అంటారు అమీర్. కానీ కఠినమైన ఫిట్నెస్ విధానాన్ని అనుసరించి అనుకున్నది సాధించారు. శరీర బరువులో "ఆహారం నంబర్ వన్" అంటారాయన. మీరెంత వ్యాయామం చేసినా ఫుడ్ సరిగ్గా తీసుకోకపోతే ఫలితం ఉండదు. మొదట్లో నిరాశ అనిపించినా, క్రమశిక్షణతో సాగితే ఫలితం ఉంటుంది అనే ఫిట్నెస్ సీక్రెట్ను అమీర్ వెయిట్ లాస్ జర్నీ ద్వారా తెలుసుకోవచ్చు.యాభై శాతం ఆహారం. 25 శాతం వ్యాయామం, 25 శాతం విశ్రాంతి కావాలంటూ తన అనుభవాన్ని గతంలోనే వివరించారు అమీర్ ఖాన్. ఎనిమిది గంటలు నిద్ర లేనిదే వెయిట్లాస్ జర్నీలేదు అంటారాయన.రాత్రిపూట అన్నం మానేయడం, తక్కువ తినడం లేదా ఆకలితో అలమటించడం లేదా అధిక ప్రోటీన్ భోజనం తీసుకోవడం వంటివి చిట్కాలను చాలామంది పాటిస్తున్నప్పటికీ తాను మాత్రం బరువు తగ్గడానికి పాతకాలపు పద్ధతిని అనుసరించానని చెప్పారు. ‘‘2,000 యూనిట్ల శక్తిని ఖర్చు చేస్తే, అదే మోతాదులో కేలరీలు తింటే, బరువు అలాగే ఉంటుంది. అలా కాకుండా 2,000 యూనిట్ల శక్తిని ఖర్చు చేసి 1,500 కేలరీలు తింటే, ప్రతిరోజు 500 కేలరీలు తగ్గుతాయి. ప్రతిరోజూ 7 కిలోమీటర్లు నడిస్తే వారానికి 7వేల కేలరీలు ఖర్చవుతాయి. ఇది శాస్త్రం. దీంతోపాటు కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్, కొవ్వులు, ఫైబర్, సోడియంతో మన ఆహారాన్ని సమతులం చేసుకోవాలి అని అమీర్తెలిపారు. -
ఒంటరితనం కోసం 'రిటైల్ థెరపీ'..! కరణ్ జోహార్ హెల్త్ టిప్స్
ఒంటరితనంతో ఇటీవల చాలామంది బాధపడుతున్నారు. ఉరుకుల పరుగుల జీవన విధానంలో మంచి సత్సంబంధాలు నెరపలేక ఒంటరిగా మిగిలిపోతుంటారు కొందరు. అలాగని మనం చొరవగా ఉన్నా.. మన సన్నిహితులు మనతో ఎంజాయ్ చేయలేనంత బిజిబిజీ పనులతో సతమతమవుతుంటారు. దాంతో తెలియని ఒంటిరితనం ఆవరిస్తుంటుంది. అది ఒక్కోసారి డిప్రెషన్కి దారితీస్తుంది కూడా. దానికి సరైన మందు రిటైల్ ధెరపీ అని అంటున్నారు బాలీవుడ్ దర్శకుడు, నిర్మాత కరణ్ జోహార్. అసలేంటి థెరపీ..?, ఎలా పనిచేస్తుందంటే..ఎన్నో బ్లాక్బస్టర్ మూవీలతో మంచి సక్సెస్ని అందుకున్న ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్. ఆయన కాస్ట్యూం డిజైనర్, రచయితగా, నిర్మాతగా తన మల్టీ టాలెంట్తో ప్రేక్షఖులను అలరించి ఎన్నో అవార్డులను అందుకున్నారుడా. అంతటి విజయాన్ని అందుకుని కూడా ఒక్కోసారి దారుణమైన ఒంటరితనం అనే సమస్యను ఫేస్ చేస్తుంటారట కరణ్. స్వయంగా ఆ విషయాన్ని సోల్ సఫర్ విత్ భావ్ అనే పాడ్కాస్ట్ సంభాషణలో కరణ్ వెల్లడించారు. తాను కూడా భావోద్వేగా సమస్యలను ఎదుర్కొని ఒంటరిగా ఫీలవుతుంటానని అన్నారు. దాన్ని అధిగమించేందుకు షాపింగ్ చేస్తుంటానని అన్నారు. దీన్ని రిటైల్ థెరపీ అంటారని చెప్పారు కరణ్. సక్సెస్ అందుకుంటే ఆనందం వస్తుందని చాలామంంది అనుకుంటారు కానీ అది ముమ్మాటికి తప్పని అంటున్నారు. ఇలాంటి భావోద్వేగ సమస్యలు, విచారం, ఒంటరితనం ఆవరించినప్పుడూ ధెర్యంగా నిలబడి ఎదర్కొన్నప్పుడూ కలిగే ఆనందమే వేరెలెవల్ అని అంటున్నారు కరణ్. ఈ విచారం, ఒంటిరితనానికి తాను రిటైల్ ధెరపీతో చెక్పెడతాని అన్నారు. ఆ థెరపీలో భాగంగా ఆయన షాపింగ్ చేస్తుంటారట. ఈ ఒంటరితనాన్ని భర్తీ చేసేందుకు షాపింగ్ చేస్తుంటానని చెప్పారు. నా భావోద్వేగాన్ని అదుపు చేసేందుకు ఇలా షాపింగ్ పేరుతో వస్తువును కొని ఆ వ్యాధిని అధిగమిస్తానని అన్నారు. కొనుగోలు చేస్తున్నప్పుడూ ఎంత ఖరీదు వస్తువు కొంటున్నామనే దానిపై ధ్యాస..ఎంత ఖర్చు చేస్తున్నాం అనేదానిపై అటెన్షన్తో ఈ ఒత్తిడి, విచారం, ఒంటరితననాన్ని తెలియకుండానే దూరం చేసుకుంటామని చెబుతున్నారు కరణ్. View this post on Instagram A post shared by Soul Safar with Bhaav (@soulsafarwithbhaav) మంచిగానే పనిచేస్తుందా..?రిటైల్ థెరపీ అంటే..నిరాశనిస్ప్రుహలకు లోనైనప్పుడూ లేదా ఒత్తిడికి గురైనప్పుడు షాపింగ్ చేయడాన్ని రిటైల్ థెరపీ అంటారట. మానసిక స్థితిని పెంచేలా వస్తువులు కొనుగోలు చేయడమే రిటైల్ థెరపీ అట. అధ్యయనాలు కూడా మానసిక స్థితిని మెరుగ్గా ఉంచాడానికి ఇది సరైన థెరపీగా పేర్కొన్నాయి. నిజానికి ఇది తాత్కాలిక పరిష్కారం కాకపోయినా..అప్పటికప్పుడూ ఈ ఒత్తిడిని హ్యాండిల్ చేసేందుకు షాపింగ్ని ఉపయోగిస్తే..ఆటోమెటిగ్గా మానసికంగా మెరుగ్గా ఉండే వీలు ఏర్పడుతుందట. వ్యక్తిగతంగా ఈ థెరపీ మనల్ని ఇబ్బంది పెట్టే వాటిని ఎదుర్కొనేలా సహాయపడకపోయినా.. మన మానసిక స్థితి అప్పటికప్పుడూ సవ్యంగా సాధారణ స్థితికి తీసుకువస్తుందట. ఇది దీర్ఘకాలిక ఫలితాలను ఇవ్వగల ప్రొఫెషనల్ థెరపీ మాత్రం కాదట. కేవలం ఆ సమయంలో మనలో వచ్చే నెగిటివ్ ఆలోచనలకు చెక్పెట్టి సాధారణ స్థితికి వచ్చేలా చేసే రెడీమేడ్ పరిష్కారంగా ఈ రిటైల్ థెరపీని పేర్కొనవచ్చు అని చెబుతున్నారు నిపుణులు .గమనిక: ఇది కేవలం అవగాన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: 'మన ఆరోగ్యానికి మనమే సీఈఓ': నటి లిసా రే) -
ఆతప స్నానం అంటే ఏంటి? ప్రయోజనాలు
కార్తీక స్నానం, మాఘస్నానం, పుష్కరస్నానం, త్రివేణీసంగమ స్నానం... ఇలా రకరకాల స్నానాల విశిష్టతను గూర్చి మన శాస్త్రాలు చెప్పాయి. కోట్లాది ప్రజలు పుణ్య తిథులలో, బ్రహ్మ ముహూర్తంలో, సూర్యోదయానికి కాస్త ముందే ఆ పుణ్యస్నానాలు చేయటానికి పుణ్యనదీ తీరాలకు చేరుకుంటారు. అయితే క్రియాయోగాన్ని ప్రపంచానికి అందించిన పరమహంస యోగానంద ‘ఆతపస్నాన’ విశిష్టతను గూర్చి చెప్పారు.ఆతపస్నానం (sunbathing) అంటే ఏమిటో, ఎలా చేయాలో, ఎంతసేపు చేయాలో వారు ఇలా వివరించారు: ‘మందులకంటె ఉత్తమ మైనవి సూర్యకిరణాలు. వాటిలో ఉంది రోగాలను నయంచేసే అద్భుత శక్తి. ప్రతి దినం పది నిమిషాలసేపు ఆతపస్నానం చేయాలి (ఒంటి మీద ఎండపడేలా చేయాలి). అప్పుడోసారి, ఇప్పుడోసారి ఎక్కువసేపు ఎండలో ఉండడం కంటె దినానికి పదేసి నిమిషాల చొప్పున ఎండలో ఉండడం మంచిది. ఆరోగ్యపరమైన అలవాట్లు, మంచి అలవాట్లు ఏర్పరచుకోవడంతో పాటు ప్రతి రోజూ కొద్ది సేపు చేసే ఆతపస్నానం, హానికరమైన సూక్ష్మ జీవులను నాశనం చేయడానికి తగినంత ప్రాణ శక్తిని శరీరానికి సరఫరా చేస్తూఉంటుంది’ (పుట 100– మానవుడి నిత్యాన్వేషణ – శ్రీ పరమహంస యోగానంద). మనకు సూర్యుడు కేవలం ఒక అగ్ని గోళం కాదు, ‘సూర్య భగవానుడు’, ‘శక్తి ప్రదాత’. కాబట్టే భక్తిని జత చేసి సూర్య నమస్కారాలు చేయమన్నారు మహర్షులు.ఈ ఆతపస్నానం ఆచరించటానికి మనం ఎక్కడికో పోవాల్సిన పనికానీ, డబ్బు ఖర్చు చేయాల్సిన అవసరం కానీ లేదు. లక్షణంగా మన ఇంటి ముందో, మిద్దెపైననో ప్రశాంతంగా, భక్తి పూర్వకంగా చేసుకోవచ్చు. ‘ఆదిదేవ! నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర! దివాకర! నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే’ అని ప్రతి రోజూ సూర్యోదయ సమయాన ప్రార్ధిద్దాం. శారీరక, మానసిక, ఆధ్యాత్మిక లాభాలను పొందుదాం.– రాచమడుగు శ్రీనివాసులుఆతప స్నానం అంటే సూర్య స్నానం చేయడం. ఈ పదం "ఆతప" (సూర్యకాంతి) స్నానం. పురాతన భారతీయ వైద్య వ్యవస్థ అయిన ఆయుర్వేదంలో దీనికి చాలా ప్రాముఖ్యత ఉంది. దీనివల్ల అనేక ప్రయోజనాలున్నాయని నమ్ముతారు. ముఖ్యంగా శరీరంలో విటమిన్ డీ విరివిగా లభిస్తుంది. విటమిన్ డీ ఎముకల ఆరోగ్యానికి , మొత్తం శ్రేయస్సుకు ,ఆలా అవసరం. విటమిన్ డితో పాటు, మెరుగైన మానసిక స్థితి , ఎనర్జీ మెరుగుపడుతుంది. -
ప్రియుడు కంటికి రెప్పలా కాపాడుకున్నాడు కానీ..రేర్ కేన్సర్ కబళించింది!
ప్రముఖ అమెరికన్ నటి, ప్రొడ్యూసర్ కెల్లీ మాక్ (kelley mack) ప్రాణాంతకమైన కేన్సర్తో కన్ను మూసింది.అరుదైన మెదడు కేన్సర్తో సుదీర్ఘ పోరాటం తర్వాత ఆమె తుది శ్వాస విడిచింది. చిన్న వయసులోనే నటిగా అనేకమంది అభిమానులను సంపాదించుకున్న కెల్లీ అకాల మరణంపై పలువురు సంతాపం వ్యక్తం చేశారు.జూలై 10, 1992న ఒహియోలోని సిన్సినాటిలో జన్మించారు కెల్లీ మాక్. ది వాకింగ్ డెడ్, 9-1-1 , చికాగో మెడ్ వంటి మూవీలతో బాగా పాపులర్ అయ్యారు. అందమైన చిరునవ్వు, అద్భుతమైన నటనతో ఎంతోమంది అభిమానుల అభిమానాన్ని సంపాదించుకున్నారు. కరియర్ పీక్లో కొనసాగుతున్న సమయంలో, అరుదైన గ్లియోమా కారణంగా 33 ఏళ్లకే ఆమెకు నూరేళ్లు నిండిపోయాయి. కెల్లీ మాక్ సోదరి, కాథరిన్ క్లెబెనో ఇతర కుటుంబ సభ్యులు ఆమె మరణ వార్తను ఇన్స్టాగ్రామ్ ద్వారా ధృవీకరించారు.కెల్లీ మాక్ మరణ వార్త అభిమానుల హృదయాలను కలచి వేసింది. అరుదైన కేన్సర్ ఉన్నట్లు నిర్ధారణ , బతికే అవకాశాలు తక్కువగా ఉన్నాయని తెలిసిన తరువాత కూడా ఆమె చాలా ధైర్యంగా పోరాడింది. ఈ పోరాటంలో ఆమె ప్రియుడు లోగన్ లానియర్ చాలా అండగా నిలిచాడు. ఒక్క క్షణం కూడా విడిచిపెట్టలేదు. అనుక్షణం తనకు తోడుగా ఉన్నాడని స్వయంగా కెల్లీ సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంది. ఈ ఏడాది జనవరిలో కెల్లీ తన గ్లియోమా వ్యాధి గురించి అది తన జీవితాన్ని ఎలా ప్రభావితం చేసిందో పంచుకున్నారు."సెప్టెంబర్లో, నేను నా బాయ్ఫ్రెండ్ లోగన్తో కలిసి కొత్త అపార్ట్మెంట్లోకి మారాను. ఆ తర్వాత ఒక నెల పాటు, నడుము నొప్పి విపరీతంగా ఉంది. డిస్క్ జారిందనుకున్నాను. కొన్ని వారాల తర్వాత, నా కుడి క్వాడ్(తొడకు, మెకాలిపైభాగానికి మధ్యలో)లో న్యూరోపతిక్ పెయిన్, ఆపై, కాళ్ళు , వీపులో తట్టుకోలేనంత నొప్పులు ప్రారంభమయ్యాయి. ఆ తరువాత కొన్ని నెలలకు అరుదైన ఆస్ట్రోసైటోమా, డిఫ్యూజ్ మిడ్లైన్ గ్లియోమా ఉన్నట్లు నిర్ధారణ అయింది’’గ్లియోమా అంటే ఏమిటి?గ్లియోమా అనేది మెదడు, వెన్నుపాములలో వచ్చే ఒక రకమైన కణితి. న్యూరోగ్లియా అని కూడా పిలిచే గ్లియల్ కణాల నుండి అభివృద్ధి చెందుతుంది. సాధారణంగా, ఈ కణాలు నరాలకు మద్దతు ఇస్తాయి . కేంద్ర నాడీ వ్యవస్థ పనికి సహాయపడతాయి. అన్ని గ్లియోమాలు కణితులు కేన్సర్కు దారి తీయవు కానీ చాలా గ్లియోమాలు ప్రాణాంతకమైనవి.గ్లియోమాలు సాధారణంగా మెదడులో పెరుగుతాయి. కానీ వెన్నుపాములో కూడా ఏర్పడవచ్చు. ఇందులో ఆస్ట్రోసైటోమా, గ్లియోబ్లాస్టోమా, ఒలిగోడెండ్రోగ్లియోమా, ఒలిగోడెండ్రోగ్లియోమా లాంటి అనేక రకాలు ఉన్నాయి. గ్లియోమా లక్షణాలు:గ్లియోమా లక్షణాలు కణితి ఎక్కడ ఉందో, పరిమాణం, కణితిఎంత వేగంగా పెరుగుతుందో దానిపై ఆధారపడి ఉంటాయి. నొప్పి, వాంతులు, దృష్టి సమస్యలు, బలహీనత, మూర్ఛలు సాధారణంగా కనిపించే లక్షణాలు. గ్లియోమా చికిత్స కణితి రకం, పరిమాణం, వచ్చిన ప్లేస్పై ఆధారపడి ఉంటుంది. శస్త్రచికిత్స, రేడియేషన్ థెరపీ , కీమోథెరపీ లాంటి చికిత్సలు చేస్తారు. View this post on Instagram A post shared by Kelley Mack (@itskelleymack) -
'మన ఆరోగ్యానికి మనమే సీఈఓ' : నటి లిసా రే
‘నేను అత్యంత క్రమశిక్షణ కలిగిన మోడల్ను. కానీ దీని కోసం భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చింది. 37 ఏళ్ల వయసులో ఒక అసాధారణమైన రీతిలో బ్లడ్ క్యాన్సర్ నిర్ధారణ అయ్యింది. నేను ఐదు సంవత్సరాలు మించి బతకబోనని వైద్యులు చెప్పారు.. కానీ నా అంతరాత్మ మాత్రం నన్ను బలంగా నిలిపింది. ఇప్పడు నేను 53 ఏళ్ల వయసులో సంతృప్తికరమైన జీవితాన్ని గడుపుతున్నాను’ అని చెప్పుకొచ్చారు ప్రముఖ నటి, రచయిత లిసారే. ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఎల్ఓ) హైదరాబాద్ చాప్టర్ ఆధ్వర్యంలో ‘ది మేనీ లైవ్స్ ఆఫ్ లిసా రే’ పేరిట బంజారాహిల్స్లోని రాడిసన్ బ్లూ హోటల్లో ఇంటరాక్టివ్ సెషన్ మంగళవారం జరిగింది. ఇందులో లిసా రే తన జీవిత అనుభవాలను పంచుకున్నారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే.. ‘నా అత్యున్నత విజయ ఘడియ, నాకు అత్యంత చీకటి సమయంగా మారింది’ అంటూ ఆమె వాఖ్యానించారు. మన ఆరోగ్యానికి మనమే సీఈఓ అన్నారు. ‘బాధ్యత తీసుకోండి, ఆరోగ్యానికి ప్రాధాన్యతనివ్వండి’ అన్నారు. విజయం సమస్యలు పరిష్కరించదని, మన భావోద్వేగం ఆత్మవేదనను తొలగించబోదని అభిప్రాయపడ్డారు. సమాజం నిర్వచించిన విజయాన్ని తానే ప్రశ్నించాల్సి వచ్చిందన్నారు. లోపల నా భావాలు వేరుగా ఉండడంతో, నేను లోతుగా వెతకాల్సి వచ్చిందని చెప్పారు. రోగం అనేది దాచుకోవాల్సిన, సిగ్గుపడాల్సిన విషయం కాదు.. నా శరీరం, నా జీవితం, నా వ్యాధి.. అన్నీ అంగీకరించడం వల్ల నాకు నిజమైన విముక్తి లభించిందన్నారు. ధ్యానం నాకు ఆత్మస్థైర్యాన్ని ఇచ్చిందన్నారు. కార్లను శుభ్రం చేస్తాం.. ఇంటి చుట్టూ పరిసరాలను శుభ్రంగా ఉంచుతాం.. కానీ మన మనసులోని నెగెటివ్ ఆలోచనలను ఎందుకు శుభ్రం చేయలేకపోతున్నామని ప్రశ్నించారు. దేశం పరిపూర్ణం కాకపోయినా, జీవించడానికి ఇది ఉత్తమ స్థలమని పేర్కొన్నారు. హైదరాబాద్ నాకు ఎంతో ప్రత్యేకం. ఇక్కడి ప్రజల ఆత్మీయత, ప్రేమతోపాటు ఆహారాన్ని, ఇతర రంగాలన్నింటినీ నేను ప్రేమిస్తాను. మళ్లీ మళ్లీ ఇక్కడికే వస్తుంటానని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎఫ్ఎల్ఓ హైదరాబాద్ చైర్పర్సన్ ప్రతిభా కుందా తదితరులు పాల్గొన్నారు. (చదవండి: ఆ ఆస్తిపై మీ తల్లికి మాత్రమే హక్కులు..) -
బరువు తగ్గి.. డయాబెటిస్ నుంచి బయటపడింది..!
బరువు తగ్గించుకుంటే ఎలాంటి అనారోగ్య సమస్యలు దరిచేరవని పలువురు నిపుణులు, వైద్యులు సూచిస్తూనే ఉన్నారు. ఆ నేపథ్యంలో చాలామంది బరువుతగ్గే ప్రయత్నానికి పూనుకుంటున్నారు కూడా. అయితే ఈ మహిళ మాత్రం తన అధిక బరువుని తగ్గించుకోవడమే ఆమెకు వరంగా మారింది. జస్ట్ 90 రోజుల్లో మధుమేహ సమస్యకు చెక్పెట్టి ఔరా అనిపించుకుంది. మరి ఇంతకీ ఇదెలా సాధ్యమైందో ఆమె మాటల్లోనే సవివరంగా తెలుసుకుందామా!.40 ఏళ్ల నార్మా లియోన్స్కు, అధిక బరువుతో ఉండటంతో ఆమె రూపు రేఖలన్నీ బొద్దుగా ఉండేవి. దీంతో అధిక ఒత్తిడికి గురై డయాబెటిస్ బారిన పడింది. తరుచుగా తన ఆహార్యాన్ని చూసుకుని కుంగిపోతూ ఉండేది. దాంతో ఆమె ఈ దీర్ఘకాలిక వ్యాధి మధుమేహం కోసం బరువు తగ్గాల్సిందే అని ఫిక్స్ అయ్యింది. ముగ్గురు పిల్లల తల్లి అయిన నార్మాలియోన్స్కు పిల్లల పెంపకం, కుటుంబ బాధ్యతల నడుమ తనపై ఫోకస్ పెట్టడం కుదురేది కాదు. ఆ నిర్లక్ష్యంగా కారణంగానే నార్మాలియోన్స్ అధిక బరువు సమస్యలను ఎదుర్కొందామె. దాంతో ఆమె తన ఆరోగ్యంపై ఫోకస్ పెట్టి బరువు తగ్గాలని పట్టుదలతో ప్రయత్నించింది. అలా ఆ తల్లి కేవలం 90 రోజుల్లో..డైట్, ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టి తన బరువులో గణనీయమైన మార్పలను అందుకుంది నార్మాలియోన్స్. ఫలితంగాఆ రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలోకి వచ్చేశాయి. ఎలాంటి మెడిసిన్ వాడకుండానే డయాబెటిస్ నుంచి బయటపడింది నార్మాలియోస్. దాదాపు రెండు దశాబ్దల తర్వాత ..ఆ 60 ఏళ్ల తల్లి జస్ట్ ఆహారం, ఆరోగ్యంలో మార్పులు చేసుకోడంతో గణనీయమైన బరువు తగ్గి, తన అనారోగ్యాన్ని స్వయంగా నయం చేసుకుంది. ప్రీ డయాబెటిస్ అంటే..ఇక్కడ నార్మా ప్రీ డయాబెటిస్తో బాధపడుతోంది. అంటే రక్తంలో చక్కెర స్థాయిలు సాధారణం కంటే ఎక్కువగా ఉండే స్థితి. కానీ టైప్2 డయాబెటిస్ని నిర్థారించినట్లుగా..దీన్ని ముందుగా గుర్తించడం అంత ఈజీ కాదుఈ ప్రీడయాబెటిస్ని ఆహారం, వ్యాయమాలు, చక్కటి జీవనశైలి తరితదరాలతో నిర్వహించడమే గాక తిప్పికొట్టొచ్చు. వైద్యులు ఆమెకు ఈ షుగర్ వ్యాధి కోసం నోటి ద్వారా తీసుకునే మెట్ఫార్మిన్ ఇచ్చినప్పటికీ..ఆమె వాటిని వేసుకునేందుకు తిరస్కరించింది. ఇలా చేయొద్దని వైద్యులు హెచ్చరించారు కూడా. చివరికి ఆమె మెడిసిన్ వాడనని మొండిపట్టుపట్టడంతో సరే నీ అదృష్టం అని వైద్యులు వదిలేశారు.అందుకోసం ఏం చేసిందంట..నార్మా లియోన్స్ చాలా అధ్యయనం చేసి కీటో డైట్ అనుసరించింది. ప్రాసెస్ చేసిన ఆహారాలు, కార్బోహైడ్రేట్లును దరిచేరనీయకుండా కేర్ తీసుకుంది. సమతుల్య ఆహారాన్ని తీసుకునేది. ప్రతిరోజూ ఉదయం గుడ్లు, బేకన్, చీజ్, చికెన్ సలాడ్, లీన్ మాంసం తదితరాలను తీసుకున్నట్లు వివరించింది. ఈ కఠినమై డైట్తో నార్మాలియోన్స్ కేవలం మూడు నెలల్లో పది కిలోలు తగ్గి..రక్తంలోని చక్కెర స్థాయిలను పెరగనీయకుండా చేసింది. ప్రస్తుతం ఆమె ప్రీ డయాబెటిక్ పేషెంట్ కాదని వెల్లడించారు వైద్యులు. పట్టుదలతో బరువు తగ్గింది అనారోగ్యం నుంచి కూడా బయటపడింది. ఇక్కడ కావాల్సింది ఆరోగ్యంపై శ్రద్ధ ఉంటే చాలు ఎలాంటి వ్యాధినైనా తిప్పికొట్టచ్చు అనేందుకు నార్మాలియోన్స్ వెయిట్లాస్ స్టోరీనే ఉదాహారణ. గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం(చదవండి: Weight Loss: బరువు తగ్గాలనుకుంటే.. ఇవిగో ఐదు చిట్కాలు!: ఫిట్నెస్ కోచ్) -
ఈ బామ్మ రూటే సెపరేటు..! వందో పుట్టినరోజుని అందరిలా కాకుండా..
60 ఏళ్లు దాటిని సీనియర్ సిటీజన్లంతా జీవిత చరమాంకంలో తమ జీవితాన్ని ఎలా గడుపుతారో తెలిసిందే. రెస్ట్ తీసుకుంటూ ఉంటారు. అలాంటిది ఈ బామ్మ మాత్రం ఈ జనరేషన్ అవాక్యయ్యేలా జీవిస్తోంది. ఈ ఏజ్లో యువత మాదిరిగా చురుగ్గా ఉంటూ అన్ని వ్యాయమాలు చేస్తోంది. జిమ్లో ఆమే చేసే వ్యాయామాలకు ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే. ఇటీవలే వందేళ్ల వయసుకుకి చేరుకుంది. అయితే ఆమె అందరిలో కాకుండా విభిన్నంగా తన పుట్టినరోజుని చేసుకుంది. ఆఖరికి తన జీవన విధానం సైతం అందరి వృద్ధుల్లా కాకుండా..యంగ్ ఏజ్లో ఉండే వ్యక్తుల్లా అత్యంత యాక్టివ్గా ఆరోగ్యకరమైన జీవితాన్ని ఆస్వాదిస్తోంది. పైగా 120 ఏళ్లు జీవించాలనుకుంటున్నా అని అత్యంత ధీమాగా చెబుతోంది ఈ బామ్మ. ఇంతకీ ఆమె ఎవరంటే..యునైటెడ్ స్టేట్స్ కనెక్టికట్లోని నార్వాక్కు చెందిన మేరీ కరోనియోస్ అనే బామ్మ ఇటీవలే సెంచరీ వయసులోకి చేరుకుంది. అయితే ఆమె తన వందో పుట్టిన రోజుని అందరిలా కేకులు, చాక్లెట్లు, మిఠాయిలతో కాకుండా జిమ్లో చేసుకుంది. జిమ్లో చేసుకోవడం ఏంటి అనుకోకండి. ఈ బామ్మ స్పెషాలిటీ అందులోనే కాదు ఆమె జీవిన విధానంలోనూ ఉంది. ఎందుకంటే అందరి వృద్ధుల్లా కాకుండా డైనమిక్గా ఉంటుంది ఈ బామ్మ. ఆమె జిమ్లో హుషారుగా బరువులు ఎత్తుతు..తన వందో పుట్టిన రోజుని జరుపుకుంది. తానింకా వృద్ధురాలిని కాదు యంగ్ అని చెప్పేందుకే ఇలా విభిన్నంగా తన పుట్టినరోజుని జరుపుకుందామె. అంతా ఆ బామ్మను జిమ్ మేయర్ అని ముద్దుగా పిలుచుకుంటారు. దీర్ఘాయువుతో ఉండాలని, తన వృద్ధాప్యం భారంగా సాగకూడదనే మంచి ఆహారపు అలవాట్లను అనుసరిస్తోందట. వ్యక్తిగత ట్రైనర్లతో కలిసి జిమ్లో ఇతరులకు శిక్షణ కూడా ఇస్తుందట కూడా. అంతేగాదు అక్కడకు వచ్చే వారు ఈ వందేళ్ల బామ్మ ట్రైనింగ్ చూసి స్ఫూర్తి పొందుతారట. జీవతాన్ని ఆస్వాదించడం అంటే ఇదే కదా అని ఆ బామ్మని చూసి అనుకుంటుంటారట. ఆ బామ్మ కూతురు ఎథీనా సైతం ఆమె దినచర్య, ఆహరపు అవాట్లకు ఫిదా అవుతుంటుందట. తనకు దీర్ఘాయువుతో రికార్డులు బ్రేక్ చేయడమ తన లక్ష్యం కాదని, మానసిక పరిమితులను బద్దలు కొట్టేలా జీవించడమే తన ధ్యేయం అని ఆమె కూతురు ఎథీనా చెబుతోంది. ఈ బామ్మ నేపథ్యం..లైఫ్స్టైల్..మాజీ ఉపాధ్యాయురాలైన కరోనియోస్ వృద్ధుల సంప్రదాయ జీవన విధానాన్ని విడిచిపెట్టి ఆధునిక జీవిన విధానానికి అడాప్ట్ అయ్యింది. సీనియర్ కేంద్రాల కంటే జిమ్కు వెళ్లేవారితో కలిసే యత్నం చేసేది. ఆమె ఈ ఏజ్లోనూ యువకులతో వేళాకోలం ఆడుతూ..హుషారుగా ఉంటుందట. ఆమె వయసుకి జిమ్ అనేది అతిపెద్ద శారీరక శ్రమ అయినా..ఆ అనితర సాధ్యమైన వర్కౌట్లు, బరువుల ఎత్తడం అంటేనే ఆమెకు ఇష్టమట. ఆరోగ్యానికి మదద్దుతి ఇచ్చే వ్యాయామాలన్నింటిని అలవోకగా చేసేస్తుందట. అలాగే సమాజంతో మంచి సత్సంబంధాలను నెరుపుతుందట. బంధువులు, కుటుంబ సభ్యుల అందరితోనూ సానూకూల దృక్పథంలో వ్యవహరిస్తుందట. ఇవే తన ధీర్ఘాయువుకి కారణమని నమ్మకంగా చెబుతోంది కరోనియస్ బామ్మ. హార్వర్డ్ స్టడీ ఆఫ్ అడల్ట్ డెవలప్మెంట్ సైతం ఇదే విషయాన్ని వెల్లడించింది. దీర్ఘాయువుకి సంబంధించి.. నిపుణులు సైతం..ఆమె ఆహారపు అలవాట్లను ప్రశంసిస్తున్నారు. ఆమె అత్యంత మితంగా భోజనం, మొక్కల ఆధారిత పోషకాహారం, బాడీకి సరైన కదలికలు ఉండేలా చేసే వ్యాయామాలు తదితరాలన్నీ మంచి అలవాట్లకు దగ్గరగా ఉండే సూత్రాలుగా పేర్కొన్నారు పోషకాహార నిపుణులు. ఎలాంటి అనారోగ్య సమస్యలు వచ్చినా పర్లేదు కానీ 120 ఏళ్ల వరకు ఆరోగ్యంగా జీవించాలని కోరుకుంటున్నానని ఆ బామ్మ చెబుతుండటం విశేషం. ప్రస్తుతం ఆమె హైపర్ ధైరాయిడిజంకి సంబంధించిన మందులు ఒక్కటే తీసుకుంటున్నారు. ఈ విధమైన మంచి జీవన విధానానికి కీలకం తన గ్రామీణ నేపథ్యమేనని అంటోందామె. పెన్సిల్వేనియా గ్రామంలో పుట్టి పెరిగిన ఆమె తన తోబుట్టువులు ఐదుగురిలో ఈ బామ్మే పెద్దదట. ఈత నుంచి చెట్లు ఎక్కడం, బాస్కెట్బాల్, వాలీబాల్ వంటి అన్ని ఆటలను హాయిగా ఆడేదాన్ని అని చెబుతోంది. అంతేగాదు తనలా జీవితానికి పరమార్థం ఉండేలా ఏదో ఒకటి సాధించేలా లక్ష్యాన్ని ఏర్పరుచుకోవాలని సూచిస్తోంది ఈ కరోనియోస్ బామ్మ.(చదవండి: Weight Loss: బరువు తగ్గాలనుకుంటే.. ఇవిగో ఐదు చిట్కాలు!: ఫిట్నెస్ కోచ్) -
ఇలా చేస్తే.. జస్ట్ ఐదు నెలల్లోనే 25 కిలోల బరువు..!
బరువు తగ్గాలని స్ట్రాంగ్ డిసైడ్ ఉన్నావారు ఈ సింపుల్ చిట్కాలు పాటిస్తే చాలంటోంది ఫిట్నెస్ కోచ్ అమకా. జస్ట్ ఐదు నెలల్లోనే మంచి ఫలితాలు అందుకోవాలని ప్రగాఢంగా కోరుకుంటే ఇలాంటి చిట్కాలు అనుసరించడం మంచిదని సూచిస్తుంది. తాను ఆ రెమిడీస్తోనే ఐదు నెలల్లోనే అనూహ్యంగా కిలోలు కొద్దీ బరువు తగ్గినట్టు చెప్పుకొచ్చింది. త్వరితగతిన ఆరోగ్యకరమైన రీతీలో బరువు తగ్గాలనుకుంటే.. బెస్ట్ టిప్స్ ఇవే అని చెబుతోంది ఫిట్నెస్ కోచ్ అమకా.బరువు తగ్గాలనుకుంటున్నవారు ముందుగా తాను ఎందుకు బరువు తగ్గలనుకుంటున్నా, ఎంత వెయిట్ లాస్ అవ్వాలన్నది లక్ష్యం అనేవి స్ట్రాంగ్గా నిర్దేశించుకోవాలంటున్నారు అమకా. అది మీకు లక్ష్యంపై ఫోకస్ పెట్టేలా చేస్తుందట. బరువు తగ్గాలనుకునేవారు ఎవ్వరైనా సింపుల్ దినచర్యను ప్రారంభించాలని చెప్పారు. ముందుగా రోజుకు మూడు లేదా రెండు సార్లు సమతుల్య భోజనం, పది నుంచి 20 నిమిషాల నడక, రెండు లీటర్ల నీరు, మంచి నిద్ర, సరైన క్వాంటిటీలో తీసుకోవడం వంటివి చాలని చెప్పారు. ఇక్కడ ఆహారం శరీరానికి సరిపడ పోషకాలు అందేలా సంతృప్తిని కలిగించేలా ఉండాలని చెప్పారు. అతిగా తినడాన్ని నివారించాలన్నారు. ముఖ్యంగా ప్రతి భోజనంలో ప్రోటీన్, అధిక ఫైబర్ తప్పనిసరిగా భాగం చేసుకోవాలని చెప్పారు. కార్బోహైడ్రేట్లు కూడా తగు మోతాదులో తీసుకోవాలని సూచించారు. ప్రధానంగా సమతుల్యతను పాటిస్తే చాలు ఎలాంటి ఆహారమైనా ధైర్యంగా తినొచ్చని చెబుతున్నారామె. ప్రతి రోజు వాకింగ్, చక్కెర పానీయాలు దూరంగా ఉండటం అనేది అత్యంత ముఖ్యం. ఈ చిన్నపాటి రెమిడీలు భారీ ఫలితాలను అందించి..శరీరంలో సత్వర మార్పులకు నాంది పలుకుతుందట. ఇలా స్ట్రిక్ట్గా డైట్ని అనుసరిస్తే..జస్ట్ ఐదు నెలల్లోనే 25 కిలోలు మేర బరువు తగ్గుతారట. తాను కూడా అలాంటి సింపుల్ చిట్కాలను అనుసరించే ఐదునెలల్లోనే 25 కిలోలు పైనే తగ్గానని చెప్పుకొచ్చింది. ఆరోగ్యకరమైన రీతీలో బరువు తగ్గాలనుకుంటే ఈ విధానం చాలా హెల్ప్ అవుతుందని సూచిస్తోంది ఫిట్నెస్ కోచ్ అమకా. View this post on Instagram A post shared by CERTIFIED NUTRITIONIST (@shred_with_amaka) (చదవండి: Mona Singhs weight loss journey: యోగా, డైట్తో ఆరు నెలల్లో 15కిలోలు..! స్లిమ్గా మోనాసింగ్) -
అరచేతిలో అనర్థం..!
అరచేతిలో అద్భుతాన్ని చూపించే స్మార్ట్ఫోన్లు.. అనర్థాలకు దారితీస్తోంది.. ప్రపంచాన్ని మన గుప్పిట్లోకి తెచి్చన టెక్నాలజీ.. చివరికి మనల్నే తన గుప్పిట్లో బం«దీగా చేస్తోంది. రోజువారీ అవసరాలు తీర్చడంతోపాటు.. రోజువారీ సమస్యలనూ తెచి్చపెడుతోంది.. సరదాగా కాలక్షేపం కోసం మొదట్లో వినియోగంలోకొచ్చి.. ఇప్పుడు అదే కాలక్షేపంగా మారిపోయింది.. అనేక సౌకర్యాలను అందుబాటులోకి తెచ్చి సమయాన్ని ఆదా చేస్తుందనుకున్న మొబైల్ నేడు మన సమయాన్ని వృథా చేస్తోంది.. నెమ్మదిగా దానికి బానిసలుగా మార్చేసుకుంటోంది.. మొబైల్ వినియోగించకుండా ఉండలేకపోవడాన్ని సైంటిఫిక్గా నోమోఫోబియా అంటున్నారు. ప్రస్తుతం ఈ ఫోబియాకు గురవుతున్నవారి సంఖ్య క్రమంగా పెరుగుతోందని ఓ సంస్థ నిర్వహించిన సర్వేలో ఫలితాలు చెబుతున్నాయి. ఒకప్పుడు కేవలం సమాచారానికి, అవసరమైన కమ్యూనికేషన్కు మాత్రమే ఉపయోగించుకున్న మొబైల్ ఫోన్లు.. ఇప్పుడు మన జీవితాల్లో ప్రధాన భాగమైపోయాయి. సోషల్ మీడియా, గేమ్స్, షార్ట్ వీడియోలు, అరచేతిలో టిక్ టిక్ మంటూ వచ్చే నోటిఫికేషన్లతో.. అసలు మొబైల్ను మనమే పట్టించుకోవడం లేదు.. అది మనల్ని పట్టేసింది! ఒక ప్రైవేట్ సర్వే ప్రకారం.. హైదరాబాద్లోని విద్యార్థుల్లో 62% మందికి పైగా రోజుకు సగటున 6–8 గంటలు మొబైల్లో గడుపుతున్నారని తేలింది. అయితే వ్యసనంలా మారిన ఈ మొబైల్ అడిక్షన్ నుంచి బయటపడటానికి కొందరు మాత్రం ప్రత్యామ్నాయ మార్గాలను వెతుకుతున్నారు. నగర యువతపై ప్రభావం.. హైదరాబాద్ వంటి మహానగరాల్లో మొబైల్ యూజర్ల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. టెక్ జాబ్స్, మెట్రో జీవితం, ఒంటరి అపార్ట్మెంట్ కల్చర్ తదితర కారణాలతో మొబైల్ను ఓ సాధనంగా కాకుండా ఒక సహజీవిగా మార్చేశాయి. ప్రత్యేకించి 15–30 ఏళ్ల వయసులో ఉన్న యువతలో ఇది తీవ్రమైన డిజిటల్ డిపెండెన్సీగా మారింది. ముఖ్యంగా రాత్రిపూట స్క్రోల్ చేస్తూ నిద్రపోయే వరకూ ఫోన్ చూస్తుండటం వల్ల నిద్రలేమి, తలనొప్పి, ఏకాగ్రత లోపం, డిప్రెషన్ వంటి మానసిక, శారీరక రుగ్మతలకు లోనవుతున్నారు. సర్వేలు ఏమంటున్నాయంటే.. నిమాన్స్ (ఎన్ఐఎంహెచ్ఏఎన్ఎస్) చేసిన అధ్యయనంలో దాదాపు 40% మందికి ‘నో మొబైల్ ఫోబియా’ (నోమోఫోబియా) ఉందని వెల్లడైంది. తెలంగాణ సైకలాజికల్ అసోసియేషన్ అధ్యయనం ప్రకారం, 18–25 ఏళ్ల మధ్య వయస్కుల్లో ప్రతి 10 మందిలో ఏడుగురు మొబైల్ లేని జీవితాన్ని ఊహించలేకపోతున్నారని తేలింది. హైదరాబాద్లోని విద్యాసంస్థలు తాము నిర్వహించిన అంతర్గత సర్వేల్లో విద్యార్థులు చదువుపై ఫోకస్ కోల్పోతున్నారని స్పష్టంగా పేర్కొన్నాయి. చిన్నారుల్లో దీని ప్రభావం.. పిల్లలు ఆహ్లాదంగా ఆడుకోవాల్సిన వయసులో మొబైల్ స్క్రీన్కి అలవాటుపడుతున్నారు. తల్లిదండ్రులు తాత్కాలికంగా వారి తలనొప్పి తగ్గించుకోవాలనే ఉద్దేశంతో మొబైల్ అందిస్తుంటే.. అది శాశ్వతంగా పిల్లల అభివృద్ధికి అడ్డుగోడవుతోంది. స్పీచ్ డిలే, అటెన్షన్ డెఫిసిట్, హైపర్ యాక్టివిటీ వంటి సమస్యలు పిల్లల్లో గణనీయంగా పెరిగిపోతున్నాయి. విముక్తి మార్గాలు.. డిజిటల్ డీటాక్స్ ఛాలెంజ్ : ప్రతి వారం ఒక రోజు లేదా ప్రతి రోజు ఒక నిరీ్ణత సమయం మొబైల్కి బ్రేక్ ఇవ్వడం. ఆఫ్లైన్ హాబీస్ : పుస్తక పఠనం, ఆర్ట్, గార్డెనింగ్, యోగా వంటి కార్యకలాపాలు మొబైల్ డిపెండెన్సీని తగ్గించడంలో సహాయపడతాయి. సోషల్ మీడియా మేనేజ్మెంట్ : సోషల్ మీడియా అకౌంట్స్ డిలీట్ చేయడం కాదు, వాటిని ‘లిమిటెడ్ యూజ్’ మోడ్లో పెట్టడం, నోటిఫికేషన్లు ఆఫ్ చేయడం. డిజిటల్ వెల్ బీయింగ్ యాప్స్ : స్క్రీన్ టైమ్ ట్రాకింగ్, రిమైండర్లు ఇవ్వగల యాప్స్ ఉపయోగించడం. ఫ్యామిలీ టైమ్..: ప్రతి రోజు 1–2 గంటలు కుటుంబ సభ్యులతో గడిపేందుకు ప్రయతి్నంచాలి. హైదరాబాద్ స్పెషల్ ఇన్షియేటివ్స్.. కొన్ని కార్పొరేట్ కంపెనీలు ఉద్యోగులకు నెల్లో ఒక్కరోజు ‘నో మొబైల్ డే’ పాటిస్తున్నారు. బంజారాహిల్స్లోని ఓ స్కూల్ ‘టెక్ ఫ్రీ అవర్’ అంటూ రోజుకు ఒక పిరియడ్ను స్క్రీన్ లేని యాక్టివిటీలకు కేటాయిస్తోంది. సైకలాజికల్ వెల్ బీయింగ్ సెంటర్స్ ఆధ్వర్యంలో మొబైల్ డిపెండెన్సీకి కౌన్సెలింగ్ ప్రోగ్రామ్లు నిర్వహిస్తున్నారు. స్మార్ట్ యూజ్.. ప్రస్తుత అధునాతన జీవన శైలిలో టెక్నాలజీని వదిలేయమనడం సాధ్యం కాదు.. కానీ మనమే నియంత్రించలేకపోతే అది మనల్ని నియంత్రించడం ఖాయం. మొబైల్ అనేది ఓ సాధనం మాత్రమే, జీవితం కాదు. ప్రత్యేకించి యువత.. కెరీర్, మానసిక ఆరోగ్యం, రిలేషన్షిప్స్ అన్నింటినీ తారుమారు చేసే ఈ డిజిటల్ బానిసత్వం నుంచి బయటపడితేనే నిజమైన ‘స్మార్ట్ యూజ్’ అవుతుంది. (చదవండి: తుమ్ములు కుమ్మేస్తున్నాయా..? వాచ్ ది హాచ్) -
యోగా, డైట్తో ఆరు నెలల్లో 15కిలోలు..! స్లిమ్గా మోనాసింగ్
బరువు తగ్గడంలో ఎందరో ప్రముఖుల, సెలబ్రిటీలు స్ఫూర్తిగా నిలిచారు. అయినప్పటికీ అత్యంత కష్టసాధ్యమైన ఈ టాస్క్ని వ్యసనంలా చేస్తే ఈజీగా బరువు తగ్గిపోవచ్చట. అలా పూర్తి ఫోకస్ పెట్టి చేస్తేనే..కచ్చితంగా త్వరిత గతిన బరువు తగ్గిపోతారట. అదీగాక చూస్తుండగానే వేగవంతంగా మనలో వస్తున్న మార్పులను చూసి ఆత్మవిశ్వాసంగా ఫీలవుతామని అంటోంది ప్రముఖ బాలీవుడ్ నటి మోనాసింగ్. అదెలాగో సవివరంగా చూద్దామా..!.బాలీవుడ్ టెలివిజన్ సీరియల్తో జస్సీ జైస్సీ కోయి నటి మోనాసింగ్ పలు సినిమాల్లో నటించే ఛాన్స్ కొట్టేసింది. లాల్ సింగ్ చద్దా, అమావాస్, 3 ఇడియట్స్ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకుంది. చివరగా ముంజియా అనే మూవీలో కనిపించారు. గత కొంత కాలం మూవీలకు దూరంగా ఉన్నా ఆమె పాన్ పర్దా సర్దా అనే గ్యాంగ్ స్టర్ సిరీస్ కోసం బరువు తగ్గాలని నిర్మాతలు కోరడంతో వెయిట్ లాస్ అయ్యేందుకు సద్ధమైనట్లు తెలిపింది. వాస్తవానికి ఆమె కూడా గత కొన్నాళ్లుగా బరువు తగ్గాలని అనకుందని గానీ కుదరలేదు. కొత్త ఏడాది సందర్భంగా కూడా బరువు తగ్గే ప్రయత్నం చేయాలనకున్నా సాధ్యం కాలేదు. కానీ ఆ సిరిస్లో తన పాత్ర కోసం బరువు తగ్గక తప్పదని స్ట్రాంగ్గా డిసైడ్ అయ్యి వెంటనే కసరత్తులు ప్రారంభించింది. నిజానికి బరువు తగ్గడం అనగానే నచ్చిన ఆహారం త్యాగం చేయడం అని ఫీలవుతుంటారు. కానీ ఫలితాలు మంచిగా వస్తున్నప్పుడల్లా అదేమంతా భారమైన పని కాదని అదిమలనో భాగమయ్యేలా వ్యసనంలా మారిపోతుందని అంటోంది మోనాసింగ్. బరువు తగ్గడం అంటే..మంచి ఆకృతిలోకి మారి అందంగా కనిపించడం అనుకుంటే ఏమంత కష్టం కాదట. తాను వెయిట్ లాస్కి ఉపక్రమిస్తున్నా అనగానే..తినే ఆహరంపై స్పష్టత కలిగి ఉండటం, వ్యాయామాలు చేయడమని ఫిక్స్ అయ్యానంటోంది. తన యోగా గురువు చెప్పిన అద్భత ట్రిక్ ఫాలో అవ్వడంతోనే కేవలం ఆరునెలల్లో ఏకంగా 15 కిలోలు తగ్గానని అంటోంది. "రోజుకి ఒకపూట తింటే ఆరోగ్యం, అదే రెండు పూటలా తింటే అనారోగ్యం, అలా కూడా కాకుండా మూడు పూటలా తింటే రోగి" అని ఆదే ఆరోగ్య సూత్రమని చెప్పుకొచ్చింది. తాను ఆరోగ్యకరమైన జీవనశైలితోనే ఇంతలా బరువు తగ్గినట్లు వివరించింది. రాత్రి 9.30 కల్లా నిద్రపోతే సగం అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయంటోంది. మనకోసం మనం సమయం కేటాయించు కోవాలని సూచించింది. ఇన్నాళ్లు సోమరితనం కారణంగానే దీన్ని సాధించలేకపోయాని చెప్పింది. ఆరోగ్యకరమైన బరువుని నిర్వహించడమే కష్టం తప్ప బరువు తగ్గడం కష్టం కాదంటోదామె. ఆరోగ్య నిపుణుల సంరక్షణలో మంచి జీవనశైలిని పాటిస్తే త్వరితగతిన మంచి ఫలితాలు అందుకుంటారని చెబుతోంది మోనాసింగ్.(చదవండి: ఆ మట్టి'..మెళియాపుట్టి..! ఔరా అనిపిస్తున్న కళాకారులు..) -
డెలివరీ తర్వాత బరువు తగ్గాలంటే..! మసాబా గుప్తా హెల్త్ టిప్స్
బాలీవుడ్ నటి, ఫ్యాషన్ డిజైనర్ మసాబా గుప్తా, నటుడు సత్యదీప్ మిశ్రా దంపతులు గతేడాది అక్టోబర్లో పండంటి బిడ్డకు స్వాగతం పలికారు. ఓ తల్లిగా బిడ్డతో బిజీ బిజీగా లైఫ్ సాగిపోతున్నా.. ఆమె తన ఫిట్నెస్పై ఫోకస్ని పెట్టడమే కాదు అదనపు బరువుని కూడా తగ్గించుకున్నారు. సాధారణంగా ప్రతి మహిళ ప్రెగ్నెన్నీలో బరువు పెరగడం సహజం. అయితే ప్రసవానంతరం ఆ బరువుని తగ్గించుకోవడం అనేది అంత ఈజీ కాదు. అయితే మసాబా మాత్రం దాన్ని ఈజీగానే సాధించారు. పైగా డెలివరీ తర్వాత బరువు ఎలా తగ్గించుకోవచ్చో వివరిస్తూ..టిప్స్ కూడా షేర్ చేసుకున్నారు. అవేంటంటే..ప్రసవానంతరంలో ఆహారంలో కొద్దిమార్పులు చేసుకుంటే బరువు తగ్గడం సులభం అని అంటోంది. తాను ప్రసవానంతరం ఆరు నెలలు బాదం పాలు, వేయించిన కూరగాయలు, కాల్చిన చేప, ఎల్లప్పుడూ తేనె బాల్సమిక్ వెనిగ్రెట్(క్రంచింగ్ కోసం విత్తనాలు) తీసుకున్నట్లు తెలిపారు. వాటి తోపాటు గుడ్లు, వేరుశెనగ, వెన్నటోస్ట్, బీట్రూట్, చికెన్, ఓట్స్ అంజూర పండ్లు, తదితరాలు తీసుకునేదాన్ని. తల్లిగా బిడ్డకు పాలిచ్చేలా, తన బరువు బ్యాలెన్స్ చేసుకునేలా ఆరోగ్యకరమైన ఫుడ్స్నే తీసుకునేదాన్ని అని ఆమె వివరించారు. అలాగే కుదిరినంతలో తేలికపాటి వ్యాయామాలు, కెటిల్బెల్ సెషన్ వ్యాయామాలు తదితరాలు చేశానని చెప్పుకొచ్చారు. ఇవి కండరాల కదలికలకు, ఫ్యాట్ని కరిగించడంలో సమర్థవంతంగా ఉంటాయని అన్నారు. అలా తాను పదికిలోలు బరువు తగ్గినట్లు వివరించారామె. స్ట్రాంగ్ ఫోకస్ ఉంటేనే బరువు తగ్గడం సాధ్యమవుతుందని అంటోంది మసాబా గుప్తా.(చదవండి: అరుదైన స్ట్రోక్తో..మెడుల్లాపై దాడి!) -
సర్వైకల్ క్యాన్సర్ రాకుండా వ్యాక్సిన్ తీసుకోవచ్చా?
నేను ఇద్దరు పిల్లల తల్లిని. వయసు నలభై రెండు సంవత్సరాలు. ఇప్పుడు సర్వైకల్ క్యాన్సర్ రాకుండా వ్యాక్సిన్ తీసుకోవచ్చా?– శాంత, విజయవాడ.మీరు తప్పకుండా ఈ వ్యాక్సిన్ తీసుకోవచ్చు. ఎందుకంటే సర్వైకల్ క్యాన్సర్ హ్యూమన్ పాపిలోమా వైరస్ వలన వస్తుంది. ఇది లైంగిక చర్యల ద్వారా ఒకరి నుంచి మరొకరికి వేగంగా వ్యాపించే ఇన్ఫెఫెక్షన్. ఎక్కువసార్లు ఈ ఇన్ఫెక్షన్ కు ఎటువంటి లక్షణాలు ఉండవు. మన రోగనిరోధక వ్యవస్థ చాలాసార్లు దీన్ని తట్టుకోగలుగుతుంది. కాని, కొన్నిసార్లు హైరిస్క్ వైరస్లు పదహారు నుంచి పద్దెనిమిది రకాలు శరీరంలో ఉండిపోతే, గర్భాశయ కణాల్లో మార్పులు వస్తాయి. ఇవి కాలక్రమంలో క్యాన్సర్కి దారితీయవచ్చు. ఇలా క్యాన్సర్గా మారటానికి మూడు నుంచి పదిహేను సంవత్సరాల వరకు పడుతుంది. ఇది కేవలం సర్వైకల్ క్యాన్సర్కే కాకుండా జననాంగ క్యాన్సర్, మలద్వారం, నోటి, గొంతు క్యాన్సర్లు, పురుషుల్లో పురుషాంగ క్యాన్సర్ వంటి ఇతర ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. ఈ టీకా ఎక్కువ ప్రయోజనం ఇచ్చేది పెళ్లికి ముందే తీసుకుంటే. ఎందుకంటే లైంగికంగా చురుకుగా ఉండే వారిలో ఈ ఇన్ఫెక్షన్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మనకు తెలిసిన పదమూడు రకాల వైరస్ల వలన క్యాన్సర్ రావచ్చు. అయితే, ఈ టీకా వాటిలో కొన్ని ముఖ్యమైన రకాల నుంచే రక్షణ ఇస్తుంది. అందుకే టీకాతో పాటు కండోమ్ వాడటం, అవసరమైనప్పుడు స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవడం కూడా చాలా ముఖ్యం. ఇది నిర్ధారించాలంటే ప్యాప్ టెస్ట్, వైరస్ టెస్ట్ అనే రెండు పరీక్షలు చేయించాలి. ఇవి గర్భాశయ కణాల్లో అసాధారణ మార్పులను ముందే చూపిస్తాయి. అవసరమైతే వెంటనే చికిత్స తీసుకుని క్యాన్సర్ దశకు వెళ్లకుండా అడ్డుకోవచ్చు. వైరస్ టెస్ట్ ద్వారా హైరిస్క్ వైరస్లు ఉన్నాయా లేదా అనే విషయం స్పష్టమవుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ టీకా వలన సర్వైకల్ క్యాన్సర్, మొటిమలు వచ్చిన వారి సంఖ్య చాలా తగ్గిపోయింది. అందుకే టీకా తీసుకోవడం ఎంతో అవసరం. టీకా తీసుకున్నాక కూడా ప్రతి మూడేళ్లకోసారి లేదా ఐదేళ్లకోసారి స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవాలి. తొమ్మిది నుంచి నలభై ఐదేళ్ల వయస్సు మధ్యలో ఉన్నవారికి ఈ టీకా ఇవ్వవచ్చు. తొమ్మిది నుంచి పద్నాలుగేళ్ల లోపు వయస్సు కలిగినవారికి రెండు డోసులు వేస్తారు. మొదటి డోసు తర్వాత ఆరు నుంచి పన్నెండు నెలల్లో రెండవ డోసు వేయాలి. పదిహేను నుంచి నలభై ఐదేళ్లవారికి మూడు డోసులు అవసరం. మొదటి డోసు తర్వాత రెండు నెలల్లో రెండవ డోసు, ఆరు నెలల్లో మూడవ డోసు తీసుకోవాలి. ఈ టీకాతో పెద్దగా సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇది సురక్షితమైంది. కాబట్టి డాక్టర్ను సంప్రదించి వారి పర్యవేక్షణలో తప్పకుండా తీసుకోండి. డాక్టర్ ప్రమత శిరీష, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్ (చదవండి: గుండె ఆరోగ్యం కోసం బ్రిస్క్ వాకింగ్..! ఎలా చేయాలంటే..) -
బ్రెయిన్ ఆరోగ్యం కోసం ఇవి తప్పనిసరి..!
రాగి అనేది శరీరంలోని ప్రతి కణజాలంలో కనిపించే ఒక ముఖ్యమైన ట్రేస్ మినరల్. ఇతర ఖనిజాల మాదిరిగా, శరీరం దానిని స్వంతంగా తయారు చేసుకోదు; మనం తీసుకునే ఆహారం ద్వారానే లభిస్తుంది. అనేక ఇతర ముఖ్యమైన ఖనిజాలతో పోలిస్తే, ఎక్కువ రాగి అవసరం లేదు. అలాగని రాగి లోపిస్తే మాత్రం మెదడు పనితీరు మందగిస్తుంది. అందువల్ల రోజూ ఆహారంలో తగినంత కాపర్ ఉండేలా చూసుకుంటే మెదడు కణజాలం చురుగ్గా పని చేస్తుంది. దానిద్వారా జ్ఞాపకశక్తి మెరుగవుతుంది. రాగి వివిధ న్యూరోహార్మోన్లను సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది, జన్యు వ్యక్తీకరణను నియంత్రిస్తుంది. మెదడు అభివృద్ధికి మద్దతు ఇస్తుంది, పిగ్మెంటేషన్ను ప్రభావితం చేస్తుంది. రోగనిరోధక వ్యవస్థ పనితీరును నిర్వహిస్తుంది. మెదడు ఆరోగ్యంలో...మెదడు అభివృద్ధికి, దాని పనితీరుకు సరైన మొత్తంలో రాగి కూడా అవసరం. మానసిక స్థితి, ప్రేరణ, శ్రద్ధ, ఒత్తిడి ప్రతిస్పందనను నియంత్రించడం వంటి వివిధ మెదడు విధుల్లో రాగి ప్రముఖ పాత్ర పోషిస్తుంది. అధిక రాగి స్థాయులు అల్జీమర్స్ వ్యాధికి కూడా దారితీస్తాయి. హిప్పోకాంపస్, సెరిబ్రల్ కార్టెక్స్ వంటి మెదడులోని ముఖ్యమైన ప్రాంతాలలో న్యూరాన్ల పనితీరును అధిక స్థాయిలో రాగి ప్రభావితం చేస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇది జ్ఞాపకశక్తి, విమర్శనాత్మక ఆలోచన వంటి వాటికి ఉపకరిస్తుంది. రాగి అత్యధికంగా ఉండే ఆహారాలు ఆర్గాన్ మీట్స్, గుల్లలు, ఇతర సముద్ర ఆహారాలు, పౌల్ట్రీ, రెడ్ మీట్ వంటి జంతువుల నుండి తీసుకోబడిన ఉత్పత్తులు. మీరు డైటరీ కాపర్ కోసం జంతు ఉత్పత్తులను తినవలసిన అవసరం లేదు. అనేక మొక్కల ఆధారిత ఆహారాలు రాగికి సురక్షితమైన వనరులు.మెదడు, ఎముకలు, కీళ్ళు, గుండె, ధమనులు, చర్మం, రోగనిరోధక వ్యవస్థ అంటే అనేక శారీరక ప్రక్రియలకు రాగి చాలా అవసరం కానీ అది లోపిస్తే ఎంత ఇబ్బందో, ఎక్కువ అయితే కూడా అంతటి హానికరం. అందువల్ల తగిన రాగి స్థాయులను నిర్వహించడం శరీర ఆరోగ్యానికి అత్యవసరం. మొక్కల ఆధారిత డైటరీ కాపర్బంగాళదుంపలు, పుట్టగొడుగులు, జీడిపప్పు, పొద్దుతిరుగుడు విత్తనాలు, డార్క్ చాక్లెట్, టోఫు చిక్పీస్, చిరుధాన్యాలు, కాయధాన్యాలు, అవకాడో, టర్నిప్ గ్రీన్స్, పాలకూర. (చదవండి: జస్ట్ 30 నిమిషాల పనికి రూ. 18 వేలు..! కార్పొరేట్ ఉద్యోగి రేంజ్లో..) -
ఆయుష్షా.. ఆరోగ్యమా..!
ఆయుష్షు.. ఆరోగ్యం.. ఈ రెండింటిలో మీ ఓటు దేనికి అంటే చెప్పలేం. ఎందుకంటే ఎంత ఆరోగ్యంగా ఉన్నా... ఆయుష్షు లేకపోతే ఏం లాభం? అదేవిధంగా ఎంత కాలం జీవించి ఉన్నా, ఆరోగ్యం లేకుండా ఎప్పుడూ మంచంలో పడి ఉంటే ప్రయోజనం ఏముంది? అయితే జీవిత కాలానికి, ఆరోగ్య కాలానికీ తేడా ఏమిటని అడిగితే మాత్రం కచ్చితంగా చెప్పచ్చు... జీవిత కాలం అంటే మనం లేదా ఇతర జీవులు ఎంతకాలం పాటు గరిష్టంగా జీవించి ఉన్నారన్నది చెప్పడమే. అదే ఆరోగ్య కాలం అంటే మనం లేదా ఆయా జీవులు బతికిన కాలంలో ఎంత కాలం పాటు ఆరోగ్యంగా ఉన్నారో చెప్పడం. ఆయుష్షులోనూ, ఆరోగ్యంలోనూ జన్యువుల పాత్ర కీలకమైనప్పటికీ ఎవరికి వారు కొన్ని జాగ్రత్తలు పాటించడం ద్వారా ఆరోగ్యంగా ఉండటం, అలా ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ద్వారా అధిక కాలం జీవించడం అనేది వారి చేతుల్లోనే ఉంటుంది. ఆయుఃప్రమాణం దేశాన్ని బట్టి మారుతుంటుంది. ఉదాహరణకు అమెరికాలో పురుషుల సగటు ఆయుఃప్రమాణం 75 ఏళ్లయితే స్త్రీలకు 80 సంవత్సరాలు. ప్రతివారూ దీర్ఘకాలం టు ఆరోగ్యంగా గడపాలంటే కొవ్వు స్థాయులు తక్కువగా.. పోషకాలు, పీచు పదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం, తేలికపాటి వ్యాయామాలు చేయడం, ఆరోగ్యకరమైన జీవన శైలి పాటించడం వంటి అలవాట్ల వల్ల జీవిత కాలం, ఆరోగ్య కాలం.. రెండూ సమతుల్యంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. (చదవండి: జస్ట్ 30 నిమిషాల పనికి రూ. 18 వేలు..! కార్పొరేట్ ఉద్యోగి రేంజ్లో..) -
77 ఏళ్ల 'ఫిట్నెస్ క్వీన్'..! ఓ బామ్మ సరిలేరు మీకెవ్వరూ..
సెలబ్రిటీలు, ప్రముఖులు ఫిట్నెస్ ట్రైనర్లు, పోషకాహారుల నిపుణులు పర్యవేక్షణ వంటివి ఉంటేనే మంచి ఫిట్నెస్ని సాధించగలరు. అవన్నీ కూడా పెద్దపెద్ద వాళ్లకే మనలాంటి వాళ్లకు అలాంటి సౌకర్యాలు ఉండవు కాబట్టి మనవల్ల కాదు అనుకుంటారు చాలామంది. కానీ ఈ బామ్మని చూస్తే ఆ విధమైన ఆలోచనతీరునే మార్చుకుంటారు. సాదాసీదాగా ఉన్నవాళ్లు కూడా తమ ఆరోగ్యంపై ఫోకస్ పెట్టొచ్చు అని తెలుస్తుంది ఈ బామ్మని చూస్తే. వృద్ధాప్యాన్ని అత్యంత ఆనందంగా ఎలా ఆస్వాదించాలో నేర్పుతోందామె. ఆమెనే హర్యానాకు చెందిన సాబో దేవి అనే 77 ఏళ్ల బామ్మ. గ్రామీణ హర్యానాకు చెందిన సాబోదేవి..అసాధారణమైన ఫిట్నెస్కి కేరాప్ అడ్రస్ ఆమె. చక్కటి జీవనశైలి, మంచి వర్కౌట్లతో అందరిని ఆశ్చర్యపరుస్తుంది. ఈ వయసులో అంతలా వ్యాయమాలా అని ఆశ్చర్యపోయేలా చేస్తోందామె. అంతేగాదు ఆమె ఫిట్నెస్ పట్ల ఫోకస్ని చూసి చుట్టుపక్కల వాళ్లంతా 'హర్యానా ఫిట్నెస్ క్వీన్' అని ఆమెకు కితాబు కూడా ఇచ్చారు. అంతలా ఆకర్షించేలా ఆమె ఏం చేస్తుంది అనే కదా సందేహం. ఆమె బాల్యంలో సరదాగా నేర్చుకున్న ఈత తన దినచర్యలో భాగం చేసుకుంది. ఆమె తన ప్రతి ఉదయాన్ని ఈతతో ప్రారంభిస్తారామె. ఈ ఈత నైపుణ్యంతోనే గంగానదిలో పడిపోయిన ముగ్గురు వ్యక్తులను కాపాడి సూపర్ బామ్మ అని కూడా అనిపించుకుంది. ఈ తరాన్ని ప్రేరేపించేలా స్క్వాట్లు చేస్తుంది. తన వయసు శారీరక పరిమితులకు సంబంధం లేకుండా యువత మాదిరిగా చురుకుగా ఉంటుందామె. అందులోనూ ఆమెది గ్రామీణ నేపథ్యమే అయినా..ప్రతి ఉదయం వ్యాయమాలు, తీసుకునే ఆహారానికి ప్రాధాన్యత ఇస్తుంది. అథ్లెట్లకు కూడా కష్టసాధ్యమైన గంగానది ఈతను అలవోకగా చుట్టొచ్చేసింది. అంతేగాదు 2024లో తన మనవడితో కలసి సాబోదేవి 'ఐస్ ఛాలెంజ్'ను స్వీకరించి అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఆమె తన మనవడి పక్కన మంచుతో నిండిన తొట్టిలో గంటల తరబడి ఉండి మరి అతడిని ఓడించింది.ప్రమాదవశాత్తు సోషల్ మీడియా ఐకాన్..హర్యానాలో సోనిపట్లోని సీతావాలి గ్రామంలో జన్మిచింది సాబో దేవి. హుల్లెడి గ్రామానికి చెందిన ట్రాక్టర్ మెకానిక్ కృష్ణను వివాహం చేసుకుంది. చిన్న వయసులోనే ఆమె భర్త మరణించడంతో ఆమె ఒక్కత్తే ఆ ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలను ఒంటరిగా పెంచింది. పిల్లలందరికి వివాహలైపోగా, తన రెండో కుమారుడితో ఉంటుందామె. అతడి కొడుకు చిరాగ్ అకా ఖగత్ కారణంగా సోషల్ మీడియా ఐకాన్గా మారింది. చిరాగ్ తన బామ్మ వ్యాయామాలు, ఈత కొడుతున్న చేస్తున్న వీడియోలు నెట్టింట షేర్ చేయడంతో ఒక్కసారి ఓవర్నైట్ స్టార్గా మారిపోయింది. సాంప్రదాయ భారతీయ జీవన విధానం ప్రాముఖ్యతను తెలియజేసేలా ఆమె ఆహార్యం అందరిని ఆకట్టుకుంటుంది. ఆవనూనె, నెయ్యి, తాజా ఆకుకూరలు, తేలికపాటి పదార్థాలనే తీసుకుంటానని చెబుతోంది. అంతేగాదు దేశీ నెయ్యి, ఆవాల నూనె, పచ్చి కూరగాయలు, గోధుమలు తదితరాలే మంచి ఆరోగ్యానికి ప్రధానమైనవని నిపుణులు సైతం సూచించడం విశేషం. అందువల్ల ఆమెను అంతా ఫిట్నెస్ క్వీన్ కీర్తిస్తున్నారు. ఆమె జీవిత విలువలకే కాదు ఫిటనెస్కు, సాంస్కృతిక పరిజ్ఞానానికి, ధైర్యానికి ఐకాన్గా నిలిచి అందరికి స్ఫూర్తిని కలిగిస్తోంది. (చదవండి: పిల్లికి హైలెవల్ సెక్యూరిటీ..! ఇంకా ఇలానా..!) -
బీపీ మందులు పనిచేయకపోవడానికి రీజన్ ఇదే..!
హైపర్టెన్షన్ లేదా అధిక రక్తపోటు అనేది ఒక నిశ్శబ్ద కిల్లర్. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని ప్రభావితం చేస్తున్న వ్యాధి. మందులు తీసుకున్నప్పటికీ, చాలా మంది వ్యక్తులు ఇప్పటికీ వారి రక్తపోటును సమర్థవంతంగా నియంత్రించలేక పోతున్నారు.నేషనల్ హెల్త్ మిషన్ ప్రకారం, ఏడాదికి 1.6 మిలియన్ల మరణాలకు కారణం రక్తపోటే. ఒక్కమాటలో చెప్పాలంటే భారతీయ జనాభాలో దాదాపు 29.8% మందిని ప్రభావితం చేస్తోంది. సమర్థవంతమైన చికిత్సా విధానాలు ఉన్నప్పటికీ లక్షలాది మంది ఇంకా ఈ సమస్యను ఎదుర్కొంటూనే ఉండటం బాధకరం. కొందరికి మందులతో రక్తపోటు అదుపులో ఉండగా, మరికొందరిలో ఇది అసాధ్యంగా ఉండటానికి గల కారణాలు, ఈ వ్యాధిని ఎలా అర్థం చేసుకోవాలి తదితరాల గురించి అపోలో ఆస్పత్రి ఇంటర్వెన్షన్ కార్డియాలజీస్ట్ డాక్టర్ మనోజ్ కుమార్ అగర్వాలా మాటల్లో తెలుసుకుందాం. మందులు వాడుతున్నప్పటికీ రక్తపోటు అదుపులో లేదని ఆందోళన చెందాల్సిన పనిలేదంటున్నారు డాక్టర్ మనోజ్. దీన్ని నిరోధక రక్తపోటుగా పిలుస్తారని తెలిపారు. సాధారణ చికిత్సల వల్ల అంతగా మార్పు లేదంటే..అంతర్గత అవయవ నష్టానికి సంకేతంగా పరిగణించాలని అన్నారు. అలాంటప్పుడు మూత్రపిండాల డెనెర్వేషన్' వంటి ఆధునిక చికిత్సలు ఈ సమస్య నుంచి బయటపడేయగలవని చెబుతున్నారు. ఈ విధానంలో మూత్రపిండాల్లోని హైపర్యాక్టివ్ నరాలకు చికిత్స చేయడం ద్వారా రక్తపోటుని నియంత్రించగలగడమే కాకుండా దీర్ఘకాలిక హృదయనాళ ప్రమాదాన్ని కూడా తగ్గించగలమని చెప్పారు. ఈ చికిత్సా విధానం మెరుగైన జీవన నాణ్యతను అందించి, జీవితంపై కొత్త ఆశను అందిస్తుందన్నారు. అయితే రక్తపోటు మందులు రోగికి పనిచయడానికి ప్రధానంగా మూడు కారణాలని వాటి గురించి వివరించారు. మందులు పనిచేయకపోవడానికి రీజన్..నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ నివేదిక ప్రకారం, దాదాపు 50% మంది రోగులు తమ ఔషధ మోతాదులను సమర్థవంతంగా పాటించరు. అలాగే తాము ఆరోగ్యంగా ఉన్నామని భావించినప్పుడు లేదా దుష్ప్రభావాలు ఎదుర్కొన్నప్పుడూ మందులను నిలిపేస్తారు. అందువల్లే రక్తపోటు నియంత్రణ లోపం తలెత్తుందట. ఫలితంగా దీర్ఘకాలిక అనారోగ్యాల బారినపడే ప్రమాదం పెరుగుతుందని చెబుతున్నారు డాక్టర్ మనోజ్. ఇక నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ నివేదిక ప్రకారం, భారతదేశంలో 28.1% మంది పెద్దలకు అధిక రక్తపోటు ఉన్నప్పటికీ, వారిలో కేవలం 36.9% మందికి మాత్రమే కచ్చితమైన రోగనిర్ధారణ జరిగింది. వారిలో మందులు వాడేవాళ్లు 44.7% కాగా, కేవలం 8.5% మందికి బీపీ నియంత్రణలో ఉందట. సకాలంలో మందులు తీసుకోలేకపోవడాన్ని వైద్యులకు తెలిపి తగు ప్రత్యామ్నాయా వైద్య చికిత్సలు తీసుకోవాలని చెబుతున్నారు డాక్టర్ మనోజ్.సాధారణ చికిత్సలకు స్పందించకపోవడానికి కారణం..కొన్ని సందర్భాల్లో రక్తపోటు అనేది ఒక హెచ్చరిక. దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి (CKD), అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా, లేదా హార్మోనల్ అసమతుల్యతలు వంటి మూల రుగ్మతలకు ప్రధాన కారణమవుతుంది. సాధారణ చికిత్సల ద్వారా రక్తపోటు నియంత్రణ సాధ్యం కాకపోతే, వైద్య నిపుణులు అంతర్లీన ఆరోగ్య సమస్యలను వెలికితీసేందుకు ప్రత్నించడమే కాకుండా సమర్థవంతంగా నిర్వహించి రక్తపోటు స్థాయిలను నియంత్రిస్తారు. పలితంగా రోగి మొత్తం ఆరోగ్య స్థితి కూడా గణనీయంగా మెరుగవుతుంది.రెసిస్టెంట్ హైపర్టెన్షన్ కావొచ్చు..మందులకు లొంగకపోతే అది'రెసిస్టెంట్ హైపర్ టెన్షన్' గా పరగణిస్తారు. అంటే ఆయా రోగుల్లో రక్తపోటు 140/90 mmHg కన్నా ఎక్కువ ఉంటుందట. ఈ పరిస్థితి గుండెపోటు, స్ట్రోక్ లేదా మూత్రపిండాల వైఫల్యం వంటి తీవ్రమైన ఆరోగ్యప్రమాదాలను గణనీయంగా పెంచుతుంది. అలాంటప్పుడే మూత్రపిండాల డెనెర్వేషన్ లేదా RDN వంటి అత్యాధునిక చికిత్సలు చేయాల్సి వస్తుందని చెబుతున్నారు డాక్టర్ మనోజ్. ఈ విధానంలో రేడియోఫ్రీక్వెన్సీ టెక్నాలజీ సాయంతో రక్తపోటును ప్రభావితం చేసే మూత్రపిండాల ధమనుల్లో ఉన్న అధిక ఉత్కంఠ కలిగించే నరాలను లక్ష్యంగా చికిత్స అందిస్తారు. ఫలితంగా రక్తపోటు గణనీయంగా నింయత్రణలోకి వస్తుంది. సాదారణ మందుకుల స్పందించిన రోగులకు ఈ చికిత్సా విధానం ఒక వరం లాంటిది.తక్షణమే అవగాహన అవసరం.."రక్తపోటు మందుకు పనిచేయకపోతే సంప్రదాయ ఔషధ చికిత్సలకు మించి అత్యాధుని చికిత్స అవసరం అనేది గుర్తించాలి. ఈ విషయాన్ని వైద్యునితో చర్చించాలి. ఆర్డీఎన వంటి అత్యాధునిక చికిత్స విధానం అవసరం అవ్వక మునుపే మేల్కొని ..ఈ వ్యాధిని నియంత్రణలోకి తెచ్చుకోవాలి. ఇక్కడ రక్తపోటు నియంత్రణలో ఉండటం అనేది మెరుగైన ఆరోగ్యకరమైన భవిష్యత్తుకు పునాది లాంటిది అని గ్రహించాలి". చెబుతున్నారు డాక్టర్ మనోజ్డాక్టర్ మనోజ్ కుమార్ అగర్వాలా, డైరెక్టర్ ఇంటర్వెన్షన్ కార్డియాలజీ, అపోలో ఆస్పత్రి, హైదరాబాద్గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం(చదవండి: ఆ గుండె17 నిమిషాల పాటు ఆగింది!) -
నో ఫ్యాషన్ డైట్.. జస్ట్ ఆరు నెలల్లో 17 కిలోలు! స్లిమ్గా నటి దీప్తి సాధ్వానీ
బరువు తగ్గేందుకు సామాన్యులు నుంచి సెలబ్రిటీల వరకు అందరు నానాప్రయాసలు పడి మరీ స్లిమ్గా మారుతున్నారు. ఆహార్యం పరంగానే కాదు ఆరోగ్యపరంగా ఫిట్గా ఉండాలన్నదే అందరి అటెన్షన్. అయితే ఆ బరువు తగ్గే ప్రయాణం అంత ఈజీగా విజయవంతం కాదు. ఎందుకంటే..ఎక్కడ రాజీపడని దృఢ సంకల్పంతో ముందుకు సాగినవారే మంచి ఫలితాలను అందుకుని చక్కటి ఆకృతితో మన ముందుకు వస్తున్నారు. అలాంటి కోవలోకి బాలీవుడ్ బుల్లితెర నటి తారక్ మెహతా కా ఊల్తా చాష్మా ఫేమ్ దీప్తి సాధ్వానీ కూడా చేరిపోయారు. ఎలాంటి షార్ట్కట్లు డైట్లు పాటించకుండానే ఆరోగ్యవంతంగా బరువు తగ్గి అందరిచేత ప్రశంసలందుకుంటోంది దీప్తి. మరి ఆమెకు అదెలా సాధ్యమైందో సవివరంగా చూద్దామా..!.34 ఏళ్ల దీప్తి సాధ్వానీ తారక్ మెహతా కా ఊల్తా చాష్మాలో ఆరాధన శర్మ పాత్రతో ప్రేక్షకులను మెప్పించి వేలాది అభిమానులను సంపాదించుకున్న నటి. గతేడాది తన బ్యూటిఫుల్ లుక్తో ఫ్యాన్స్ని ఆశ్చర్యపరిచింది. ఇండ సడెన్గా అంతలా మెరుపు తీగలా ఎలా అని విస్తుపోయారంతా. అంతలా తన ఆహార్యాన్ని మార్చుకుంది దీప్తి. అంతేగాదు తాను ఎలా స్లిమ్గా మారిందో కూడా ఓ ఇంటర్వ్యూలో షేర్ చేసుకున్నారామె. తాను ఎలాంటి క్రాష్ డైట్లు ఫాలో కాలేదని, కనీసం బరువు తగ్గే మాత్రలను కూడా ఉపయోగించలేదని చెప్పుకొచ్చింది. కేవలం ఆరోగ్యకరమైన ఆహారం, తగిన వ్యాయామాలతోనే బరువు తగ్గించుకున్నానని తెలిపింది. అయితే ఏ నెల స్కిప్ చేయకుండా వెయిట్లాస్ జర్నీని విజయవంతంగా పూర్తిచేసినట్లు వెల్లడించింది. అలాగే బరువు తగ్గడం ఏమంత సులువు కాదని చెబుతోంది. ఇక్కడ అంకితభావంతో డుమ్మా కొట్టకుండా పాటిస్తేనే మంచి ఫలితాలు త్వరితగతిన పొందగలమని చెబుతోంది. ముఖ్యంగా చక్కెరకు సంబంధించినవి, ప్రాసెస్ చేసిన ఆహారాలను దరిచేరనివ్వకుండా చేస్తే చాలు బాడీలోని మార్పులు త్వరితగతిన సంతరించుకుంటాయంటోంది. దీంతోపాటు రోజుకి 16 గంటలు అడపాదడపా ఉపవాసం ఉంటుందట. అలాగే మైండ్ఫుల్ కేలరీ ట్రాకింగ్ వీటన్నింటితో సమతుల్య ఆహారానికి ప్రాధాన్యత ఇచ్చేలా చూసుకున్నానని చెబుతోంది. ఇవి మంచివేనా అంటే..కెనడాలోని కాలేజ్ ఆఫ్ ఫ్యామిలీ ఫిజిషియన్స్ జర్నల్ సైతం అడపాదడపా ఉపవాసం అనుసరించే వ్యక్తులు తక్కువ వ్యవధిలో 0.8% నుండి 13% బరువు తగ్గుతారని పేర్కొంది. అలాగే కేలరీలరట్రాకింగ్అనేది కూడా అత్యంత ఆరోగ్యకరమైన రీతిలో ఉంటే బరువు తగ్గడంలో అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తుందట. ఇక దీప్తి వ్యాయమాలు దగ్గరకు వచ్చేటప్పటికీ బాక్సింగ్, ఈత, వైమానిక యోగా వంటివి చేసినట్లు వెల్లడించింది. ఒకటే రొటీన్ వ్యాయమాలు కాకుండా మారుస్తూ చేస్తూ.. ఉంటే..బాడీకి స్వాంతన తోపాటు..చేయాలనే ఉత్సాహం వస్తుందని చెబుతోంది. ఇక్కడ బరువు తగ్గడం అనేది శారీరకంగానే కాదు మానసిక ఆరోగ్యాన్ని కూడా మెరుగ్గా ఉంచుతుందనని అంటోంది దీప్తి సాధ్వానీ. గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం.(చదవండి: Dog Therapy In Hyderabad: డాగ్ థెరపీ.. ! 'ఒత్తిడికి బైబై'..) -
డాగ్ థెరపీ.. ! 'ఒత్తిడికి బైబై'..
హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అందమైన టాయ్ పూడుల్స్ ప్రయాణికులను సాదరంగా ఆహా్వనిస్తున్నాయి. చిరకాల నేస్తాల్లా పలకరిస్తాయి. తాకితే చాలు వచ్చి ఒడిలో వాలిపోతాయి. ప్రయాణికులకు ఒక ఆహ్లాదకరమైన అనుభూతిని కలిగిస్తాయి. పిల్లలు ఆడుకొనే సున్నితమైన టాయ్స్ను తలపించే ఈ శునకరాజాలు ఇప్పుడు హైదరాబాద్ ఎయిర్పోర్టులో ప్రత్యేక ఆకర్షణగా మారాయి. జాతీయ, అంతర్జాతీయ ప్రయాణికులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ప్రయాణికుల్లో ఒత్తిడి, ఆందోళన తగ్గించేందుకు రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం డాగ్ థెరపీలో భాగంగా వినూత్నంగా ఈ శునకాలను ప్రవేశపెట్టింది. ప్రయాణికులు బయలుదేరే ప్రవేశ ద్వారాల వద్ద ఈ శునకాలు కనువిందు చేస్తూ కనిపిస్తాయి. టాయ్ పూడుల్స్ శునకాలకు తర్ఫీదు సాధారణంగా ప్రయాణం అనగానే ఏదో ఒక స్థాయిలో ఒత్తిడి ఉంటుంది. పద్మవ్యూహంలాంటి ట్రాఫిక్ రద్దీని ఛేదించుకొని సకాలంలో ఎయిర్పోర్టుకు చేరుకోవడమే ఒక సవాల్, ఏదో ఒక విధంగా ఆ సవాల్ను అధిగమించి ఎయిర్పోర్టుకు చేరుకున్న తర్వాత మరోవిధమైన ఆందోళన మొదలవుతుంది. భద్రతా తనిఖీలు దాటుకొని లగేజీ బరువు సరిచూసుకొని, బోర్డింగ్ పాస్ తీసుకొనే వరకు టెన్షన్గానే ఉంటుంది. వరుసగా తనిఖీలు, ఇమ్మిగ్రేషన్ వంటి ప్రహసనాలన్నీ ముగించుకొని టెరి్మనల్కు చేరుకొనే వరకు ఒత్తిడి ఉంటుంది. ఈ క్రమంలో ప్రయాణికులకు ఆ ఒత్తిడి నుంచి ఊరటనిచ్చేందుకు మానసిక ప్రశాంతత కలిగించేందుకు డాగ్థెరపీ దోహదం చేయనుంది. ప్రస్తుతం ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో డొమెస్టిక్, ఇంటర్నేషనల్ ప్రయాణికులకు ఈ డాగ్ థెరపీ సదుపాయం అందుబాటులో ఉంది. అదే తరహాలో హైదరాబాద్లో ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ఇందుకోసం నాలుగు టాయ్ పూడుల్స్ శునకాలకు ప్రత్యేక తర్ఫీదునిచ్చారు. అలాగే వాటి నిర్వహణ కోసం నిపుణులను కూడా అందుబాటులో ఉంచారు. ‘ఈ టాయ్ పూడుల్స్ ఎంతో మృదుస్వభావాన్ని కలిగి ఉంటాయి. పెద్దలు, పిల్లలతో స్నేహపూర్వకంగా ఉంటాయి. అందరితో కలిసిపోయేవిధంగా శిక్షణనిచ్చారు.’ అని ఎయిర్పోర్టు అధికారి ఒకరు తెలిపారు. ఒంటరిగా ప్రయాణం చేసేవారికి కొన్ని గంటల పాటు ఇవి తోడుగా ఉంటాయని చెప్పారు.సెల్ఫీ ప్లీజ్.. ఈ శునకాలను ప్రయాణికులకు తమ బాల్యాన్ని గుర్తుకు తెస్తాయి. వాటితో ఆటలాడుకోవచ్చు. ఒడిలోకి తీసుకొని నిమురుతూ కాలక్షేపం చేయొచ్చు. సెలీ్ఫలు కూడా తీసుకోవచ్చు. టాయ్ పూడుల్స్ ద్వారా పొందే అనుభూతులు ప్రయాణికులకు ఆత్మవిశ్వాసాన్ని, ఆనందాన్ని కలగజేస్తాయని, డాగ్ థెరపీలో ఇది ఒక భాగమని నిర్వాహకులు తెలిపారు. వీటితో కాలక్షేపం చేసేందుకు ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. ‘డాగ్ థెరపీ మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఒత్తిడికి గురయ్యే కారి్టసాల్ హార్మోన్లను తగ్గిస్తుందని చెప్పారు. అలాగే ఆనందాన్ని కలిగించే ఆక్సిటోసిన్ను పెంచుతుంది. ప్రస్తుతం హైదరాబాద్ ఎయిర్పోర్టులో ఉన్న 4 శునకాలు వారానికి 5 రోజులు అంటే ప్రతి సోమవారం నుంచి శుక్రవారం వరకు రోజుకు 6 గంటల పాటు అందుబాటులో ఉంటాయి. ఈజీగా జర్నీ.. సాధారణంగా విమానప్రయాణంలో రకరకాల ఒత్తిళ్లు ఉంటాయి. విమాన ప్రయాణం పట్ల ఉండే భయం, ఆందోళనలను డాగ్థెరపీ ద్వారా అధిగమించవచ్చు. అంతర్జాతీయ ప్రయాణాల్లో ఆలస్యంగా నడిచే విమానాల వల్ల కనెక్టింగ్ ఫ్లైట్ లభిస్తుందో లేదోననే భయం పట్టుకుంటుంది. ఆ సమయంలో ఈ శునకాలు ఒక డైవర్షన్ టెక్నిక్లా పని చేస్తాయి. (చదవండి: జొన్న రొట్టె రుచికి అమెరికన్ సీఈవో ఫిదా..! ఇది చాలా హెల్దీ..) -
టీ ఆరోగ్యకరమే గుండెకు మంచిదే ! ఇలా తాగితే..
చాలా మందికి కప్పు చాయ్ తాగితే గాని రోజు ప్రారంభం కాదు, లక్షలాది మంది భారతీయులకు, టీ అనేది కేవలం ఒక పానీయం కంటే ఎక్కువ. కొన్ని చోట్ల ఇది ఒక ఆచారం కూడా. అయితే ఇది ఒక కప్పులో మనకు అందిస్తున్న వైద్య చికిత్స కూడా అంటున్నాయి అధ్యయనాలు. రోజుకు రెండు కప్పుల వరకు టీ తాగడం గుండెను కాపాడుతుంది. అంతేగాదు స్ట్రోక్, గుండె వైఫల్య ప్రమాదాన్ని తగ్గించవచ్చు అని ఒక కొత్త అధ్యయనం చెబుతోంది. నాంటాంగ్ విశ్వవిద్యాలయం చేపట్టిన 2 అధ్యయనాలు టీ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలపై దృష్టి సారించాయి. అవి నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ లో ‘‘హృదయ నాళ ప్రమాద కారకాలను నిర్వహించడంలో టీ పాత్ర: అందే ప్రయోజనాలు, విధానాలు ఇంటర్వెన్షనల్ వ్యూహాలు’’ అనే అంశంపై అదే విధంగా కార్డియోవాస్కులర్ రిస్క్ అండ్ ప్రివెన్షన్ అనే అంశంపైనా నిర్వహించిన పరిశోధన ఫలితాలు ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ కార్డియాలజీలో ప్రచురితమయ్యాయి. అవి చెబుతున్న ప్రకారం...టీ దాని రసాయన కూర్పు కారణంగా కేవలం పానీయం కాదు; ఇది యాంటీఆక్సిడెంట్లు, పాలీఫెనాల్స్ ప్రత్యేకమైన మొక్కల సమ్మేళనాలతో నిండిన సహజ శక్తి కేంద్రం. దీనిలో గుండె ఆరోగ్యానికి మద్దతు ఇచ్చే, వాపును తగ్గించే ఫ్రీ రాడికల్స్తో పోరాడే కాటెచిన్లు థియాఫ్లావిన్లు ఉన్నాయి. అంతేకాకుండా, టీ లోని పాలీశాకరైడ్లు రక్తంలో చక్కెరను సరైన విధంగా నిర్వహించడానికి రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడతాయి.ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ కార్డియాలజీ: కార్డియోవాస్కులర్ రిస్క్ అండ్ ప్రివెన్షన్ లో ప్రచురించిన ఈ నాంటాంగ్ విశ్వవిద్యాలయం చేసిన అధ్యయనం దాదాపు 13 సంవత్సరాలుగా 177,000 మందిని భాగం చేసింది.టీ దాని ఆరోగ్య ప్రయోజనాలకు చాలా కాలంగా పేరొంది. శరీరంలో ఆరోగ్యకరమైన లిపిడ్ (కొవ్వు మరియు కొలెస్ట్రాల్) స్థాయిలకు మద్దతు ఇచ్చే దాని సామర్థ్యం వాటిలో ముఖ్యమైనది.ప్రతిరోజూ రెండు కప్పుల వరకు టీ తాగితే.. గుండె పోటు ప్రమాదం 21% తగ్గుతుంది. స్ట్రోక్ వచ్చే ప్రమాదం 14%, కరోనరీ హార్ట్ డిసీజ్ వచ్చే ప్రమాదం 7% తగ్గుతాయి.కొవ్వు జీవక్రియను మెరుగుపరుస్తుంది: టీ శరీరపు సహజ కొవ్వును నిర్మూలించే ప్రక్రియలను బలోపేతం చేస్తుంది. ఇది ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించే యాంటీఆక్సిడెంట్ ఎంజైమ్లను సక్రియం చేస్తుంది అల్లం వంటి సప్లిమెంట్లతో కలిపితే ట్రైగ్లిజరైడ్లు, కొలెస్ట్రాల్ను నియంత్రించడానికి సహాయపడుతుంది.మహిళలకు ఎక్కువ ప్రయోజనాలు: శరీరంలో కొవ్వు సంబంధిత నష్టాన్ని తగ్గించే విషయంలో 20 నుండి 48 సంవత్సరాల వయస్సు గల మహిళలు విటమిన్ల నుంచి వచ్చే వాటి కంటే టీ తాలూకు యాంటీఆక్సిడెంట్ల నుంచి మరింత ప్రయోజనం పొందవచ్చు.రక్తపోటు (అధిక రక్తపోటు) గుండె జబ్బులకు ప్రధాన ప్రమాద కారకం. ముఖ్యంగా మితమైన పరిమాణంలో దీర్ఘకాలిక టీ వినియోగం వృద్ధులలో సిస్టోలిక్ డయాస్టొలిక్ రక్తపోటు రెండింటినీ 2–3 ఎంఎంహెచ్జి వరకూ తగ్గించడంలో సహాయపడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.తైవాన్ లో జరిగిన ఒక అధ్యయనంలో సంవత్సరానికి పైగా రోజుకు 120 మి.లీ. మించకుండా టీ తాగేవారికి అధిక రక్తపోటు వచ్చే ప్రమాదం బాగా తక్కువని తేలింది. రక్త నాళాల పనితీరును మెరుగుపరుస్తుంది: టీలో చాలా యాంటీఆక్సిడెంట్లు పాలీఫెనాల్స్ ఉన్నాయి, ఇవి రక్త నాళాలు సరళంగా ఉండటానికి (వాసోడైలేషన్), వాపును తగ్గించడానికి ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడానికి సహాయపడతాయి. ఇవన్నీ కాలక్రమేణా రక్తపోటు స్థాయిలను మెరుగుపరుస్తాయి.ప్రయోజనాలు అందాలంటే...ఇలా తాగాలంతే...కానీ ట్విస్ట్ ఏమిటంటే... టీకి చక్కెర లేదా కృత్రిమ స్వీటెనర్లను జోడించిన వెంటనే అనేక ఆరోగ్య ప్రయోజనాలు అదృశ్యమవుతాయి, అంటే చాలా మంది ఇష్టపడే తీపి, పాల మసాలా చాయ్ వల్ల లాభాలు శూన్యం. ఆకుపచ్చ లేదా నలుపు రంగులో (గ్రీన్ టీ లేదా బ్లాక్ టీ) ఉన్న ప్రతి కప్పు సైన్స్ ఆధారిత ఆరోగ్య లాభాలను అందిస్తుంది. అంతేగాదు చక్కెర లేదా కృత్రిమ స్వీటెనర్లు లేకుండా ఆస్వాదించినప్పుడు దాని నిజమైన రుచి అలవాటవుతుంది. దానిని ఆరోగ్యం కోసం అనుసరించే ప్రిస్క్రిప్షన్ గా భావించాలి. కొన్ని రోజులు దీన్ని కొద్ది కొద్దిగా ప్రయత్నిస్తే త్వరగానే అలవాటు పడతారు దాని స్వచ్ఛమైన రూపంలో టీ ఎంత రిఫ్రెషింగ్గా సహజంగా సంతృప్తికరంగా ఉంటుందో కూడా తెలిసివస్తుంది. -
ఈ గింజలతో మెకాళ్ల నొప్పి, అధిక బరువుకు చెక్ !
ఒక వయసు పెరిగిన తరువాత, ప్రస్తుతం ఆధునికకాలంలో మారిన జీవనశైలి కారణంగా కీళ్లు (Cartilage) అరిగి మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నారు చాలామంది.కొందరికి నడవడం కూడా చాలా కష్టంగా మారుతుంది. అయితే ఈ నొప్పులకు పెయిన్కిల్లర్స్తో తాత్కాలిక ఉపశమనం లభించినా, అవి ఎక్కువ కాలం వాడలేం. సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయామోనని భయం. అందుకే తేలికపాటి వ్యాయామం, కొన్ని ఆయుర్వేద చిట్కాలతో మోకాళ్ల నొప్పులను తగ్గించుకోవచ్చు. ఇవాల్టి టిప్ ఆఫ్ ది డేలో భాగంగా మహాబీర గింజల ద్వారా మంచి ఫలితం ఉంటుందంటున్నారు ఆయుర్వేద నిపుణులు.అసలు మోకాళ్ల నొప్పులు ఎందుకు వస్తాయి?సాధారణంగా మోకాళ్లలోని రెండు ఎముకల మధ్య గుజ్జు Cartilage కరుగిపోతుంది. ఇలా రెండు ఎముకల మధ్య ఉండే ఈ గుజ్జు పూర్తిగా కరిగిపోతే నడవడం, మెట్లు ఎక్కడం కష్టంగా ఉంటుంది. ఒక్కోసారి కింద కూర్చుని లేవడం కూడా కష్టం. అలాగే మోకాళ్లలో తీవ్రమైన నొప్పి, మంట వంటివి కలుగుతుంటాయి. దీన్నే ఆర్థరైటిస్ అని పిలుస్తారు.మోకాళ్లలో గుజ్జు పెరగడానికి స్విమ్మింగ్, సైక్లింగ్, యోగా వంటి రకరకాల వ్యాయామాలతో పాటు కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. నొప్పిగా ఉంది కదా అని భయపడకూడదు. మెల్లిగా నడక లాంటి వ్యాయామాలు చేస్తూ, కండరాలను బలోపేతం చేసే వ్యాయామాలను చేయాలి. (Beauty Tips ముడతల్లేకుండా...అందంగా, యవ్వనంగా మెరిసిపోవాలంటే!)మహాబీర గింజలు- ప్రయోజనాలుమహాబీర గింజలువీటినే వనతులసి గింజలు అంటారు. తులసి జాతికి చెందిన మొక్కల ద్వారా వచ్చిన గింజలు. చూడటానికి సబ్జా గింజలలాగానే కనిపించే ఈ మహాబీర గింజలు ఆయుర్వేద దుకాణాల్లో లభిస్తాయి. వీటిని రాత్రంతా నీళ్లలో నానబెట్టి తినడం మోకాళ్లలో నొప్పి తగ్గుతుంది. మహాబీర విత్తనాల్లో క్యాల్షియం, విటమిన్ డి, జింక్ వంటి పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. అంతేకాదు జీర్ణక్రియ మెరుగువుతుంది. వెయిట్లాస్కు కూడా ఉపయోపడుతుంది. ఈ నీటిని తాగడం వల్ల శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కరుగుతుంది. ఇవి చర్మ సంబంధింత ఇన్ఫెక్షన్లను తగ్గిస్తాయి. ఒత్తిడి, శ్వాసకోశ రుగ్మతలు తగ్గడానికి కూడా మహాబీర గింజలు ఉపయోగపడతాయి.మహాబీర విత్తనాల్లో వున్న యాంటీఆక్సిడెంట్స్ శరీరంలో ఫ్రీరాడికల్స్తో పోరాడి కేన్సర్ వంటి వాటిని నిరోధిస్తుంది.మహాబీర గింజలను ఎలా వాడాలి?ఒక గ్లాసు నీటిలో ఒక స్పూన్ మహాబీర గింజలు వేసి ఎనిమిది గంటల పాటు నాన బెట్టాలి. ఉదయాన్నే పరగడుపున అలాగే తీసుకోవాలి. గింజలు బాగా నమిలాలని ఆయుర్వేదం చెబుతోంది.ఇంకా నిమ్మరసంలో, పెరుగులో లేదంటే సలాడ్లు, స్మూతీలు వంటి వాటిలో వీటిని కలుపుకుని తినచ్చు. ప్రతి రోజు క్రమం తప్పకుండా తిన్నారంటే మోకాళ్ల నొప్పుల సమస్యలు తగ్గుముఖం పడతాయి. వీటి పౌడర్ను నూనెలో కలిపి నొప్పి ఉన్న ప్రదేశాలలో రాస్తారు.మహాబీర చెట్టు ఆకుల రసాన్ని చర్మవ్యాధులైన గజ్జి, తామర నివారణలో కూడా వాడతారు. ఎవరు తినకూడదు: మహాబీర విత్తనాలు ఈస్ట్రోజెన్ స్థాయిలను పెంచుతాయి. థైరాయిడ్ సమస్యలను కలిగించవచ్చు, కాబట్టి, గర్భిణీ స్త్రీలు, థైరాయిడ్ ఉన్నవారు తీసుకోకుండా ఉండటం మంచిది. గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం కేవలం అవగాహనకోసమే అని గమనించాలి. మోకాళ్ల నొప్పి గల కారణాలను వైద్యుల ద్వారా నిర్ధారించుకోవాలి. ఏదైనా ఆరోగ్య సమస్యలకు వైద్యుడిని సంప్రదించి, వారి సలహా మేరకు మాత్రమే చికిత్స తీసుకోవడం మంచిది.ఇదీ చదవండి: Today tips : బొద్దింకలతో వేగలేకపోతున్నారా? -
ఐబ్రోస్ చేయించుకుంటున్నారా?.. ఇది మీకోసమే.. కాలేయంపై ఎఫెక్ట్?
బ్యూటీ పార్లర్కి వెళ్లి ఐబ్రోస్ని అందంగా తీర్చిదిద్దుకోవడం అనేది చాలామంది మహిళలు చేయించుకునే సాధారణ సౌందర్య చికిత్స. దీన్ని రెండు నెలలకొకసారి చేయించుకుంటుంటారు. తక్కువ ఖర్చులో ముఖాన్ని అందంగా మార్చుకునే కొద్దిపాటి సౌందర్య ప్రక్రియ ఇది. దీంతో ఆరోగ్య సమస్యలు ఏం ఉంటాయని తేలిగ్గా తీసుకోకండి. ఎందుకంటే ఇంది ప్రాణాంతక ఇన్ఫెక్షన్ల బారిన పడేలా చేస్తుందని చెబుతున్నారు వైద్యులు. అసలు ఐబ్రోస్ థ్రెడింగ్తో ఎలా అనారోగ్యానికి గురవ్వుతారు అనే సందేహాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఈ రోజు వరల్డ్ హెపటైటిస్ డే సందర్భంగా ఈ వ్యాధి సంక్రమణం, కాస్మెటిక్ విధానాల వల్ల కూడా ఇది సోకుతుందా వంటి వాటి గురించి సవివరంగా తెలుసుకుందాం.!.ఇటీవల ఓ 28 ఏళ్ల మహిళ ఇలాంటి సమస్యను ఎదుర్కొవడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఆమెన కనుబొమ్మలు థ్రెడింగ్ చేయించుకున్న తర్వాత కాలేయ ఇన్ఫెక్షన్కి సంబంధించిన హెపటైటిస్ బీ బారిన పడిందని వైద్య పరీక్షల్లో తేలింది. శతాబ్దాల నాటి బ్యూటీషియన్ విధానం ఇది. పైగా ప్రతి రెండు నెలలకోసారి చేయించుకుంటుంటారు. చాలా సరసమైన ధరలో ముఖాకృతి అందంగా మార్చుకుని ఈ సౌందర్య చికిత్స సదరు మహిళకు ప్రాణంతకంగా మారిందని వెల్లడించారు వైద్యులు. ఆ యువతికి థ్రెడింగ్ ద్వారా హెపటైటిస్ బి వ్యాపించిందని చెప్పుకొచ్చారు. ఆమె ఆ ఐబ్రోస్ షేప్ చేయించుకున్న తదనంతరం..అలసట, వికారం, పసుపు కళ్లు వంటి సమస్యలను ఎదుర్కొంది. ఈ థ్రెడ్డింగ్ కారణంగా ఆమె శరీరంలోకి హెపటైటిస్ బి లేదా సి వైరస్లు రక్తప్రవాహంలోకి ప్రవేశించినట్లు వైద్య పరీక్షల్లో తేలింది. అందుకు సంబంధించిన విషయం నెట్టింట తెగ వైరల్గా మారింది. View this post on Instagram A post shared by Dr. Aditij Dhamija | Health Educator | MBBS (@drdhamija)అసలు హెపటైటిస్కు ఎలా దారితీస్తుంది...కొన్ని పార్లర్లలో కనుబొమ్మల ఆకృతి కోసం చేసే థ్రెడింగ్ దారం సాధారణంగా అందరికి ఉపయోగించే దాన్నే వినియోగిస్తుంటారు. అక్కడ వాళ్లు కాస్త పరిశుభ్రత పాటించకపోవడం వల్ల ఈ సమస్య వస్తోందని అన్నారు. ఒకరికి ఉపయోగించని దారం మరొకరికి వినియోగించడంతో ఆ థ్రెడ్డ్ కనుబొమ్మలను కట్ చేస్తున్నప్పుడే ఈ హెపటైటిస్ బి, సీ వైరస్లు సులభంగా సక్రమింస్తాయట. ఒక్కోసారి దీని వల్లే హెచ్ఐవీ బారీన కూడా పడే ప్రమాదం ఉందట.డబ్ల్యూహెచ్ఓ సైతం..ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం టాటూ వేయించుకోవడం, రేజర్లను షేర్ చేసుకోవడం, థ్రెడింగ్ చేయించుకోవడం వంటి కాస్మెటిక్ విధానాల వల్ల హెపటైటిస్ బి బారినపడ్డ పలు కేసులు ఉన్నాయని నివేదికలో వెల్లడైంది. ఈ హెపటైటిస్ బి వైరస్ చిన్న కలుషితమైన వాటి ఉపరితలాలపై రోజుల తరబడి జీవించి ఉంటుందట. ఇది కేవలం రక్తం వల్ల సంక్రమించదని, ఈ వైరస్ ఇన్ఫెక్షన్ ఉన్న ఒక్క దారం చాలు సులభంగా ఈ వ్యాధి సంక్రమిస్తుందని నిపుణులు చెబుతున్నారు.ఎంత వ్యవధి పడుతుందంటే..వ్యాధి నిరోధక శక్తి బాగున్నంత వరకు ఈ వైరస్తో ఇబ్బంది ఉండదు. ఎప్పుడైతే అనారోగ్యానికి గురవ్వడం లేదా వీక్ అవుతామో అప్పుడు ఈ వైరస్ విజృంభణ మొదలవ్వుతుందట. తీవ్రమైన హెపటైటిస్ బి ఆరునెలల వరకు ఉంటుందట. ఈ టైంలో వైరస్ శరీరమంతా వ్యాపిస్తుందని చెబుతున్నారు. ఒక్కోసారి క్రియాశీల హెపటైటిస్ బారిన పడితే..సుదీర్ఘకాలం ఈ సమస్యతో బాధపడాల్సిందేనని చెబుతున్నారు నిపుణులు. ఇందులోనే సాధారణ హెపటైటిస్ బారిన పడితే..ప్రమాదం తక్కువగా ఉంటుంది. వైద్య పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటే కొద్ది రోజుల్లోనే ఈ సమస్య నుంచి బయటపడగలరని చెబుతున్నారు నిపుణులు. లక్షణాలు..ఒక్కోసారి ఈ హెపటైటిస్ బి అనేది ఎలాంటి సంకేతాలు చూపకుండానే దాడి చేసే అవకాశం కూడా ఉందని చెబుతున్నారు నిపుణులు. సాధారణంగా చాలామటుకు అందరిలోనూ ఒకేలా ఈ కింది సంకేతాలు కనిపిస్తాయి..కడుపు నొప్పిఅలసటజ్వరంకీళ్ల నొప్పులుఆకలి లేకపోవడంవికారం, వాంతులుముదురు రంగు మూత్రంలేత లేదా మట్టి రంగు మలంచేతులు, కాళ్లు వాచినట్లు లేదా ఉబ్బినట్లుగా నీరి చేరి ఉండటంచర్మం, కళ్లు పసుపు రంగులోకి మారడం తదితర లక్షణాలుఅందువల్ల సాధ్యమైనంత వరకు కాస్మెటిక్కి సంబంధించిన వాటి విషయంలో బహు జాగ్రత్తగా ఉండండి. పార్లర్లో సరైన పరి శుభ్రత ఉందో లేదో నిర్థారించుకున్నాక..ఎలాంటి సౌందర్య చికిత్సా విధానానికైనా ముందుకెళ్లడం మంచిది అని సూచిస్తున్నారు నిపుణులుగమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. మరిన్ని వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: తొమ్మిది కాదు.. ఐదో నెలలోనే పుట్టేశాడు.. వండర్ బేబీ!) -
నో జిమ్, ఓన్లీ చాట్జీపీటీ, డంబెల్స్ 18 కిలోలు తగ్గి మెరుపు తీగలా
అధిక బరువును తగ్గించుకుని ఫిట్గా ఉండాలని అందరూ అనుకుంటారు. కొందరు అనుకోవడంతోనే సరిపెట్టుకుంటారు. మరికొందరు దాన్ని సాధించి తీరతారు. అదీ ఖరీదైన జిమ్లు, క్రాష్ డైట్లు ఇలాంటివేమీ లేకుండానే శరీరం మీద అవగాహన పెంచుకుని, అధిక బరువును తగ్గించుకుంది. 20 ఏళ్ల వయసులో చాలా పట్టుదలగా అదీ సింపుల్ చిట్కాలతో ఫిట్నెస్ సాధించింది. పదండి ఆమె పాటించిన టిప్స్ ఏంటో తెలుసుకుందాం. ప్రముఖ కంటెంట్ సృష్టికర్త ఆర్య అరోరా జత డంబెల్స్ , కొంచెం స్వీయ-అవగాహన, చాట్జీపీటీ సాయంతో 18 కిలోల బరువు తగ్గింది. ఈ వెయిట్ లాస్జర్నీని ఇన్స్టాగ్రామ్ పోస్ట్లు, వీడియోల ద్వారా అభిమానులను ఆకర్షిస్తోంది.తన విజయానికి కారణమైన చిట్కాల గురించి పంచుకుంటూ ఆర్య వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఏడంటే ఏడు టిప్స్జిమ్ వర్కౌట్స్, ఫ్యాన్సీ డైట్ ఇవేమీ లేకుండా 18 కేజీల బరువు తగ్గింది. ఆర్య మొదట్లో అధిక బరువుతో బాధపడేది. కానీ , ఇపుడు స్లిమ్ అండ్ ట్రిమ్గా మారిపోయింది. ఇందుకు 7 చిట్కాలు ఫాలో అయినట్టు పేర్కొంది. View this post on Instagram A post shared by Aryaa Arora (@wutaryaadoin)BMR : ముందు తన శరీరానికి అవసరమైన కేలరీల గురించి అర్థం చేసుకోవడం మొదలు పెట్టింది. ఇందుకు చాట్ జీపీటీ సాయాన్ని తీసుకుంది. ChatGPT ప్రాంప్ట్ని ఉపయోగించి తన బేసల్ మెటబాలిక్ రేట్ (BMR)ను అంచనావేసింది. రోజువారీ కేలరీల అవసరాలను నిర్ణయించడంలో సహాయపడే మెట్రిక్. బరువు తగ్గడానికి కేలరీ ఇంటేక్ ఎంత? అని చాట్ జీపీటీని కోరింది. తన శరీరాకృతిని బట్టి ఏఐ ఇచ్చిన డేటాతో సరైన కేలరీ లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. ఇదీ చదవండి: చదివింది పదో తరగతే... కట్ చేస్తే కోట్లలో సంపాదన పోర్షన్-బ్యాలెన్సింగ్: ఆర్య పోర్షణ్ బ్యాలెన్సింగ్ ప్రధానంగా పాటించింది. 40% ప్రోటీన్, 30% ఫైబర్, 20% కార్బోహైడ్రేట్లు, 10% ఆరోగ్యకరమైన కొవ్వులు.పరిమితంగా తినడం పరిష్కారం కాదని,అవగాహన , నియంత్రణ ముఖ్యమని స్పష్టం చేసింది. "కటింగ్ లేదు, బ్యాలెన్స్ మాత్రమే" అంటుంది. View this post on Instagram A post shared by Aryaa Arora (@wutaryaadoin)బరువు తగ్గడమే కాదు ఎనర్జీ పెంచుకోవాలి : బరువు తగ్గడం, ఫ్యాట్ను కరిగించడంతోపాటు బాడీకి శక్తి కావాలి, దానికి తగ్గ వ్యాయామం కావాలి అంటుంది ఆర్య. ఈ విషయంలో తనకైతే డంబెల్స్చాలు అంటుంది.2.5 కిలోలతో ప్రారంచి, 5 కిలోల డంబెల్స్తో వర్కైట్స్ చేసింది. రోజూ నడక, రెండు రోజులు , 4 రోజులు స్ట్రెంగ్త్ ట్రైనింగ్తో కండరాలు దృఢంగా మారడంతో పాటు వేగంగా శరీరంలోని కొవ్వు కరిగిపోతుందని ఆర్య తెలిపింది. క్యాలరీల లెక్కలు: ఆర్య క్యాలరీల అవగాహన రావాలంటే వారం రోజులు చాలు అని, అలాగ ఒక వారంపాటు తన ఆహారాన్ని ట్రాక్ చేసుకుంటూ, ఆహార అలవాట్లను బాగా అర్థం చేసుసుకుని ఆచరించినట్టు తెలిపింది.జంక్ ఫడ్ : జంక్ ఫుడ్ విషయంలో 80:20 నియమాన్ని పాటించిదట. తినే ఫుడ్ లో జంక్ ఫుడ్ శాతాన్ని 20 శాతానికి పరిమితం చేసింది. ప్రాసెస్ చేసిన ఫుడ్, చక్కెర, పిండి, నూనె పదార్థాలు, ఫ్రై చేసిన ఫుడ్ ను తీసుకోవడం ఆమె తగ్గించింది. నీళ్లు, నిద్ర: బరువు తగ్గే క్రమంలో రోజుకు 2-3 లీటర్ల నీరు, 7-8 గంటల నాణ్యమైన నిద్ర చాలా అవసరమని తద్వారా శరీరంలో ఎనర్జీ లెవెల్స్ పెరిగి, జీర్ణ క్రియ సమర్థవంతంగా పనిచేస్తుందని తెలిపింది.హార్మోన్స్ : బరువు తగ్గడంలో మానసిక ఆరోగ్యం చాలా ముఖ్యమైనదని ఆర్య తెలిపింది. ఇందుకోసం క్రమం తప్పకుండా చదవడం, ధ్యానం కృతజ్ఞతా భావంతో ఉండటం ఇవి మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయని పేర్కొంది. -
ఆపదలో అమ్మ: సర్వైకల్ క్యాన్సర్ లక్షణాలివే!
గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ ముంచుకొస్తోంది. అవగాహన లోపంతో మహిళలను ముప్పుతిప్పలు పెడుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతో కేసుల సంఖ్య క్రమేణా పెరుగుతోంది. ఈ వ్యాధి ఎక్కువగా పేద, మధ్య తరగతికి చెందిన అబలలనే బలితీసుకుంటోంది. ఉచిత టీకాల విషయంపై ఎవరూ నోరెత్తకపోవడం విమర్శలకు తావిస్తోంది. జిల్లాలో పెరుగుతున్న గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ (సర్వైకల్ క్యాన్సర్, Cervical cancer)చిత్తూరు రూరల్ (కాణిపాకం): జిల్లాలోని ఆరోగ్య కేంద్రాల పరిధిలో ఇటీవల సిబ్బంది ఎన్సీడీ సర్వే చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా 5,92,514 కుటుంబాలు ఉండగా 5,03,311 కుటుంబాలను సర్వే చేశారు. ఈ సర్వేలో కొంత మేర సరై్వకల్ క్యాన్సర్ కేసులు బయటపడ్డాయి. 18 ఏళ్లు దాటిన వారు 15,67,268 మంది ఉంటే 11,24,511 మందికి స్క్రీనింగ్ పరీక్షలు చేశారు. ఇందులో 273 మందికి ఓరల్ క్యాన్సర్, 218 మందికి రొమ్ము క్యాన్సర్, 203 మందికి సరై్వకల్ క్యాన్సర్ ఉన్నట్లు గుర్తించారు. ఇక అవగాహన రాహిత్యంతో సర్వైకల్ క్యాన్సర్ను గుర్తించలేకపోతున్నారు. ఇలాంటి వారు వివిధ కారణాలతో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయించడంతో కేసులు బయటపడుతున్నాయి. సర్వైకల్ క్యాన్సర్ వ్యాప్తి ఇలా...సరై్వకల్ క్యాన్సర్ సోకడానికి ప్రధాన కారణం ‘హ్యూమన్ పాపిలోమా వైరస్ (హెచ్పీవీ)’. ఎక్కు వ మంది భాగస్వాములతో శృగారంలో పాల్గొనడం వల్ల ఈ వైరస్ శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఇది కొన్నేళ్ల తర్వాత వృద్ధి చెంది క్యాన్సర్కు కారణమవుతుంది. హెచ్ఐవీ/ఎయిడ్స్ రోగుల్లో, కొన్ని రకాల మందులు తరచూ వాడడం వల్ల రోగనిరోధక వ్యవస్థ బలహీనపడుతుంది. తద్వారా కూడా సరై్వకల్ క్యాన్సర్ ముప్పు పొంచి ఉంటుంది. చిన్న వయసులో శృంగారంలో పాల్గొనడం వల్ల హెచ్పీవీ ఇన్ఫెక్షన్ సోకే ముప్పు ఎక్కువగా ఉంటుందని నిపుణులు అంటున్నారు. అందుకే బాల్య వివాహాలు చేసుకునే వారిలో ఈ కేసులు ఎక్కువగా నమోదవుతున్నట్లు స్పష్టం చేస్తున్నారు. గర్భనిరోధక మాత్రలు ఏళ్ల తరబడి వాడినా సరై్వకల్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. నెలసరి సమయంలో సరైన వ్యక్తిగత పరిశుభ్రత పాటించకపోవడం కూడా ఈ క్యాన్సర్ ముప్పును పెంచుతుంది. వీటితో పాటు ధూమపానం, అనారోగ్యకరమైన జీవనశైలి, వంశపారంపర్యంగా కూడా కొంతమందిలో సరై్వకల్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని పలు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి ఈ కేసులు అత్యధికంగా పేద కుటుంబాల్లోని మహిళల్లోనే వెలుగుచూస్తున్నాయి.వ్యాధి లక్షణాలురుతుక్రమంలో సమస్యలుయోని నుంచి రక్తస్రావం లైంగిక సంపర్కం తర్వాత రక్తస్రావంపీరియడ్స్ ఆగిపోయిన తర్వాత రక్తస్రావం యోని నుంచి దుర్వాసన, రక్తంతో కూడిన గడ్డలు రావడం మూత్రం, మల విసర్జనలో ఆటంకాలు పొత్తికడుపులో నొప్పి, బరువు తగ్గడం, నీరసం, విరేచనాలు, కాళ్లవాపు వంటి సమస్యలువ్యాక్సినేషన్ మాటేమిటో?ఈ వ్యాధి బారిన పడకుండా ముందుగానే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అందులో ఒకటి వ్యాక్సినేషన్. ప్రస్తుతం 9–26 ఏళ్ల వారికి ఈ టీకా అందుబాటులో ఉంది. అటు కేంద్రం కూడా దీనిపై దృష్టి సారించింది. 19–14 ఏళ్ల లోపు బాలికలు సరై్వకల్ క్యాన్సర్బారిన పడకుండా వ్యాక్సినేషన్ను పోత్సహిస్తామని ప్రకటించింది. దీని ధర మార్కెట్లో రూ.2వేల వరకు ఉన్నట్లు వైద్యనిపుణులు చెబుతున్నారు. విడతల వారీగా ఈ వ్యాక్సినేషన్ను వేయించుకోవాలని సూచిస్తున్నారు. అయితే ఈ వ్యాక్సిన్ వేయించుకునే స్థోమత పేద, మధ్యతరగతి కుటుంబాల్లో లేదు. ఈ కారణంగా ప్రభుత్వమే వ్యాక్సిన్ను మహిళలకు ఉచితంగా అందించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. దీనికితోడు క్షేత్ర స్థాయిలో సరై్వకల్ క్యాన్సర్పై సరైనా అవగాహన కల్పించడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు, మిడ్లెవల్ హెల్త్ ప్రొవైడర్లు ఈ క్యాన్సర్పై మహిళలకు అవగాహన కల్పించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. పూర్తి స్థాయిలో అవగాహన కల్పిస్తే క్యాన్సర్ నివారణ తొలి దశలోనే గుర్తించొచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. వ్యాక్సిన్ ఉందిగంటకు దేశంలో 9 మంది సర్వైకల్ క్యాన్సర్తో చనిపోతున్నారు. ఇప్పటి వరకు 80వేల మంది మరణించారు. కొత్త కేసులు 1.70 లక్షలు ఉన్నాయి. ఇలానే వదిలేస్తే ఇంకా కేసుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. అన్ని క్యాన్సర్లకంటే..ఈ సరై్వకల్ క్యాన్సర్ నివారణకు మాత్రమే వ్యాక్సిన్ ఉంది. ఈ క్యాన్సర్ నివారణకు ఏళ్ల లోపు పిల్లలకు 90శాతం వ్యాక్సినేషన్ పూర్తయి ఉండాలి. 35–45 సంవత్సరాల లోపు మహిళలకు 70 శాతం స్క్రీనింగ్ పరీక్షలు అయి ఉండాలి. బాధితులు కచ్చితంగా మెరుగైన వైద్యం చేయించుకోవాలి. హెచ్పీవీ వ్యాక్సిన్ వల్ల 80శాతం కేసులను నివారించవచ్చు. – ఆశ్రీత, వైద్య నిపుణులుగ్రామాల్లోనే అధికంగ్రామాల్లోనే గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ కేసులు ఎక్కువగా ఉంటున్నాయి. ఈ క్యాన్సర్ను పాప్ స్మియర్ టెస్టు ద్వారా ముందే గుర్తించే అవకాశం ఉంది. తద్వారా మరణాలను కూడా గణనీయంగా తగ్గించవచ్చు. ఈ ముప్పును తప్పించుకోవాలంటే మన శరీరంపై అవగాహన ఉండాలి. ఏ మాత్రం మార్పు కనిపించినా దాన్ని గుర్తించాలి. శరీరంలో నొప్పి లేని గడ్డలు ఏమి కనిపించినా నిర్లక్ష్యం చేయొద్దు. తక్షణం వైద్యులను సంప్రదించాలి. – ఉషశ్రీ, సూపరింటెండెంట్, జిల్లా ప్రభుత్వాస్పత్రి, చిత్తూరుముందే గుర్తిస్తే మేలుసరై్వకల్ క్యాన్సర్ దాచిపెడితే ప్రాణానికే ప్రమాదం. ఇందులో దాపరికాలు వద్దు. లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్లను సంప్రదించాలి. పరీక్షలు చేయించాలి. నిర్థారణ అయితే సరైనా చికిత్స తీసుకోవాలి. బయపడాల్సి పనిలేదు. దీనికి తోడు కౌమార దశలో బాలికలు హెచ్పీవీ వ్యాక్సిన్ వేయించుకోవాలి. ఈ వ్యాధిపై గ్రామాల్లో అవగాహన కల్పిస్తున్నాం. మరింత అవగాహన కల్పించేలా చర్యలు తీసుకుంటాం. - సుధారాణి, డీఎంఅండ్ హెచ్ఓ, చిత్తూరు -
‘ఇక్సీ’తో.. ఇన్ఫెర్టిలిటీ ఫిక్స్..!
ఫెర్టిలిటీ సమస్యలకు ప్రత్యామ్నాయం టెక్నాలజీ రోజు రోజుకూ కొత్త పుంతలు తొక్కుతోంది.. ఇది మానవ జీవితాన్ని గట్టిగానే ప్రభావితం చేస్తోంది. మానవ మనుగడకు తోడ్పాటునందిస్తోంది.. కాలుష్యం, రసాయనాల ప్రభావంతో పాటు తీవ్ర ఒత్తిడి అనేక రుగ్మతలకు దారితీస్తోంది. మరీ ముఖ్యంగా చెప్పాలంటే సంతానోత్పత్తిపై విపరీతమైన ప్రభావాన్ని చూపిస్తోంది.. దీనికి పరిష్కారంగా అనేక పద్ధతులు అందుబాటులోకి వస్తున్నాయి. వాటిల్లో చెప్పుకోదగినది ఐవీఎఫ్ పద్ధతి. చదువులు, ఉద్యోగాలు, భారీ జీతాల కోసం భారీ లక్ష్యాలతో వివాహ వయసు దాటిపోతోంది. దీంతో గతంలో మహిళలనే ఇబ్బంది పెట్టిన ఇన్ఫెర్టిలిటీ సమస్య మగవారిలోనూ కనిపిస్తోంది. నగరాలు, పట్టణాలు, పల్లెలు తేడాలేకుండా సగటున 50 శాతం మందిలో ఈ సమస్య తలెత్తుతోందని అధ్యయనాలు చెబుతున్నాయి. దీనికి ప్రత్యామ్నాయంగా యుక్త వయసులోనే పురుషులు శుక్ర కణాలను, మహిళలు అండాలను భద్రపరుచుకునే వెసులుబాటు వచ్చేసింది. మారుతున్న కాలంలో పాటే అధునాతన చికిత్సలు అందుబాలోకి వచ్చేశాయి. ఆలస్యంగా వివాహాలు చేసుకునే వారి వేధించే ఇన్ఫెర్టిలిటీ సమస్యకు పరిష్కారంగా ఎంబ్రియో ఫ్రీజింగ్ కేంద్రాలు వెలుస్తున్నాయి. మెట్రోనగరాల్లో ఒకటైన మన నగరంలోనూ ఈ వెసులుబాటు వచ్చేసింది. శుక్ర కణాలు, ఎగ్ (జీవ కణం) క్వాలిటీలో ఎలాంటి ఇబ్బందులూ లేనివారు యుక్త వయసులో ఆరోగ్యంగా ఉన్నప్పుడే వీటిని ఫ్రీజ్ చేసుకుంటున్నారు. ఇలా ఫ్రీజ్ చేసిన వాటిని ఐదు నుంచి పదేళ్లలో ఎప్పుడైనా గర్భాశయంలోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఆరోగ్యవంతమైన పిల్లలకు జన్మనివ్వవచ్చు. దీంతో విద్య, ఉద్యోగం వంటి కారణాలతో అనేక మంది వివాహాన్ని ఆలస్యం చేస్తున్నారు. ఇది సంతానోత్పత్తిపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. దీంతో నగర ప్రజలు ఐవీఎఫ్ కేంద్రాలకు క్యూ కట్టేవారు.. దీనికి పరిష్కారంగా అధునాతన చికిత్సలు అందుబాటులోకి రావడంతో ఫ్రీజింగ్ కేంద్రాలను ఆశ్రయిస్తున్నారు. 40 శాతం దంపతుల్లో సంతాన సమస్యలు..ప్రస్తుత ఉరుకులు పరుగుల జీవితంలో ఉద్యోగం, వ్యాపారం, ఒత్తిడి, సంపాదన, లైఫ్స్టైల్, కుటుంబ పరిస్థితులు, కాలుష్యం, ఆహారం, మైక్రో ప్లాస్టిక్, హార్మోన్ల సమతుల్యత, ఆలస్యంగా వివాహం చేసుకోవడం, మద్యం సేవించడం, పొగ తాగడం, రక్త సంబందీకులను పెళ్లి చేసుకోవడం, జన్యుపరమైన, ఇతర సమస్యలతో సుమారు 40 శాతం కొత్తగా పెళ్లైన జంటల్లో సంతానోత్పత్తి సమస్యలు ఎదురవుతున్నాయి. ఇందులో పురుషుల్లో 50 శాతం మందిలో, 45 శాతం మంది స్త్రీలల్లో పునరుత్పత్తి సమస్యలు గుర్తిస్తున్నారు. ఇద్దరిలోనూ సమస్యలు ఉన్న జంటలు సుమారు 15 శాతం నుంచి 20 శాతం ఉంటున్నాయి. ఈ సమయంలో కొంత మంది మానసికంగా కుంగిపోవడం కనిపిస్తోంది. ఐవీఎఫ్ పద్ధతులను ఆశ్రయిస్తున్నారు. 30 ఏళ్లు వయసుగల వారిలో ఐవీఎఫ్ పద్దతులు సుమారు 60 శాతం నుంచి 70 శాతం సక్సస్ రేటు ఉండగా, ఆపై వయసున్న వారిలో సుమారు 40 శాతం నుంచి 50 శాతం ఉంటోందని నిపుణులు చెబుతున్నారు. జీవ కణం పదేళ్లు..ఆరోగ్య రంగంలో ప్రపంచానికే మార్గదర్శిగా వెలుగొందుతున్న హైదరాబాద్ సంతాన సమస్యలకు చెక్ పెట్టే అధునాతన పద్ధతులను ఆవిష్కరిస్తోంది. ఈ క్రమంలోనే ఐవీఎఫ్ కంటే అధునాతన చికిత్సా విధానాలను అందుబాటులోకి తెచి్చంది. దంపతుల నుంచి సేకరించిన ఎగ్స్, శుక్రకణాలను ఎంబ్రియాలజీ ల్యాబ్లో మైక్రోస్కోప్ కింద పిండాన్ని (జీవ కణం) తయారు చేస్తారు. ఐదు నుంచి ఆరు రోజుల్లో పిండం సిద్ధమైపోతుంది. ఇలా తయారు చేసిన పిండాన్ని పదేళ్లలోపు ఎప్పుడైనా మహిళ గర్భాశయంలోకి ట్రాన్స్ఫర్ చేయవచ్చని వైద్యులు చెబుతున్నారు. వైరల్ మార్కర్ టెస్టులు.. పెళ్లికి ముందు, లేదా వివాహం నిశ్చయించుకున్న జంటలు ముందుగా వైరల్ మార్కర్, ఏఎంహెచ్ వంటి టెస్టులు చేయించుకుంటే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. ఒక వేళ ఇద్దరిలో ఎవరికైనా సమస్యలు ఉంటే ముందుగానే వాటికి చికిత్సలు తీసుకునే అవకాశం ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. అధిక ఉష్ణోగ్రత ఉన్న ప్రాంతల్లో పనిచేసే వారిలో శుక్రకణాల సంఖ్య తగ్గిపోతుందట. మహిళల్లో 25 ఏళ్ల లోపు ఎగ్ రిలీజ్ బాగుంటుందని, తరువాత తగ్గిపోతుందని చెబుతున్నారు. ప్రీ కన్సెప్షనల్ కౌన్సిలింగ్ వివాహానికి ముందే చేసుకుంటే మంచిది. ఏడాది వరకూ సహజంగానే ట్రై చేసుకోవచ్చు. ఇది డే కేర్ ప్రొసీజర్..పట్టణ ప్రాంతాల్లో జీవన శైలి, ఇతర అలవాట్లతో సంతాన సమ్యలు సర్వసాధారణం అయిపోయాయి. దీంతో కొందరు ఐవీఎఫ్ కేంద్రాలను ఆశ్రయిస్తున్నారు. అందులోనూ అధునాతన పద్ధతులు అందుబాటులోకి వచ్చాయి. శుక్రకణాలు, అండం, పిండాన్ని ఫ్రీజ్ చేయడం, ఎంబ్రియోస్ ట్రాన్స్ఫర్ చేసే ప్రొసీజర్లు కొనసాగుతున్నాయి. శుక్ర కణాలు, ఎగ్స్ ఎంబ్రియాలజీ ల్యాబ్లో మైక్రో స్కోప్ కింద కలిపి పిండం (జీవకణం) తయారు చేస్తాం. దీన్ని ఇక్సీ పద్ధతి అంటారు. మహిళకు నొప్పి లేకుండా డే కేర్ ప్రొసీజర్లో పూర్తయిపోతుంది. మరుసటి రోజు నుంచి అన్ని పనులు చేసుకోవచ్చు. – పీ.స్వాతి, రీప్రొడక్టివ్ మెడిసిన్, కన్సల్టెంట్ రైన్బో హాస్పటల్స్ (చదవండి: సైక్లింగ్ పర్యావరణ హితం.. ఆరోగ్యం కూడా..!) -
Cycling: అనారోగ్యాన్ని ‘తొక్కేద్దాం’!
సైకిల్ పట్ల నగరవాసుల్లో ఇటీవల కాలంలో ఆసక్తి పెరుగుతోంది. నగరంలో ట్రాఫిక్ దృష్ట్యా చాలా మంది సైకిల్ వినియోగం పట్ల సుముఖత వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే అనేక మంది పర్యావరణ ప్రేమికులు, ఐటీ నిపుణులు పలు కారణాలతో సైకిల్ వినియోగిస్తున్నారు. దీనికితోడు సైకిల్ వినియోగం ఆరోగ్యానికీ మంచిదని, అనారోగ్య సమస్యలు దూరమవ్వాలంటే సైకిల్ తొక్కడం ఓ మార్గం అని వైద్యులు సూచిస్తున్నారు. దీంతో మధ్యవయస్కులు, పెద్దలు విరివిగా సైకిల్ వినియోగిస్తున్నారు. దీంతో వీటికి మార్కెట్లో గిరాకీ పెరిగిందని పలువురు చెబుతున్నారు. – జవహర్నగర్ ప్రపంచీకరణ నేపథ్యంలో ఆధునిక పోకడలు, ప్రాశ్యాత్య సంస్కృతి పెరిగిపోయింది. యువతతో పాటు మధ్య వయసు్కలు సైతం ఎప్పటికప్పుడు కొత్త టెక్నాలజీని అందిపుచ్చుకునే సాధనలో పడిపోతున్నారు. దీంతో మార్కెట్లో యంత్రాల వినియోగం భారీగా పెరిగిపోయింది. ఫలితంగా శారీరక శ్రమ తగ్గిపోయి అనారోగ్యాల బారినపడుతున్నారు. మరోవైపు ఒత్తిడితో కూడిన ఉద్యోగాల వల్ల గుండె సంబంధిత వ్యాధులు, ఉబకాయంతో బాధపడుతున్నవారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. దీంతో అనేక వ్యాధులు చుట్టుముడుతున్నాయి. శారీరక శ్రమ తగినంత లేకపోవడమే దీనికి కారణమని పలువురు వైద్యులు సూచిస్తున్నారు. రోజులో కనీసం గంట సేపైనా వ్యాయామం చేయాలని, లేందటే కనీసం సైకిల్ వినియోగించాలని సూచిస్తున్నారు. ఈ క్రమంలో సైకిల్ వినియోగించే వారి సంఖ్య నగరంలో గణనీయంగా పెరుగుతోంది. నగర ప్రజల్లో ఆరోగ్య పరిరక్షణపై కరోనా తర్వాత వచ్చి మార్పుతో ఈ సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దీనికితోడు రోజు రోజుకూ మెట్రో నగరాల్లో దెబ్బతింటోన్న పర్యావరణ సమతుల్యత, కాలుష్యం గాడిన పడాలంటే సైకిళ్ల వినియోగమూ ఓ పరిష్కారమని పర్యావరణ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. పెరుగుతున్న వాడకం.. పట్టణాల్లో పెరుగుతున్న ఆర్థిక అవసరాలు, వ్యయాలు, ఆరోగ్య పరిరక్షణ కూడా సైకిల్ వైపు మళ్లడానికి ఓ కారణమని ఇటీవల ఓ సంస్థ జరిపిన సర్వే చెబుతోంది. నగరంలో ట్రాఫిక్ కారణంగా ఇంధన ఖర్చులు పెరుగుతున్నాయని, అవసరానికి మించి ఇంధనం ఖర్చవుతోందని, దీని ఫలితంగా కాలుష్యం కూడా పెరుగుతోందని ఫలితాలు చెబుతున్నాయి. ఈ కారణంగా కూడా కొందరు ఇంధన పొదుపు చర్యల్లో భాగంగా సైకిళ్లవైపు దృష్టిసారిస్తున్నారని ఈ అధ్యయనం చెబుతోంది. యువతలోనూ పెరిగిన ఆసక్తి.. నగరాలతో పోలిస్తే నగర శివారు ప్రాంతాల్లో నివాసముండే యువత సైకిల్ వినియోగం పట్ల ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నారు. విద్యార్థులు దగ్గర్లోని పాఠశాలలకు, కళాశాలలకు వెళ్లడానికి, లోకల్లో పనులు చక్కబెట్టుకోడానికి సైకిల్ ఎక్కువగా వినియోగిస్తున్నారు. నగరంలో అయితే ఫిట్నెస్పై దృష్టిసారించేవారు, ఆరోగ్య సమస్యలను దూరంచేసుకోవాలనుకునే వారు వీటిని వాడుతున్నారు. సైకిళ్ల గిరాకీ పెరిగింది.. గతంలో కంటే ఇప్పుడు సైకిల్ కొనే వారి సంఖ్య పెరిగింది. ప్రస్తుతం అమ్మకాలు బాగున్నాయి. అన్ని వయసుల వారికీ మోడళ్లు అందుబాటులో ఉన్నాయి. పెట్రోల్ ధరలను తగ్గించుకునేందుకు కొందరు, డాక్టర్ల సలహా మేరకు కొందరు వాడుతున్నారు. – జ్ఞాన్రాం, సైకిల్షాపు యజమాని, జవహర్నగర్ ఆరోగ్యానికి మేలు.. సైకిల్ వినియోగం వల్ల రక్త ప్రసరణ వ్యవస్థ మెరుగ్గా ఉంటుంది. రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. శరీరంలో పేరుకుపోయిన కొవ్వు తగ్గుతుంది. వ్యాధుల నుంచి దూరంగా ఉండొచ్చు. రోజూ కనీసం పది కిలోమీటర్లు సైకిల్ వినియోగిస్తా. – బొంకూరి రమేష్, కరాటే మాస్టర్ వ్యాధులకు దూరంగా.. సైకిల్ వినియోగం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అనారోగ్య సమస్యలు దరిచేరవు. రక్తపోటు, మధుమేహం, కొవ్వు వంటి సమస్యలుకు చక్కని పరిష్కారం. రోజుకు గంటపాటు సైకిల్ తొక్కితే మంచిది. దీనిద్వారా జీర్ణశక్తి మొరుగుపడుతుంది. – డాక్టర్ అశోక్, జవహర్నగర్ (చదవండి: నాన్నే... ఎలాగోలా ఇల్లు చేరుకుంటాడు) -
మెరుగైన ఆరోగ్యం కోసం..జస్ట్ ఏడువేల అడుగులు..!
ఇంతకు మునుపు పదివేల అడగులు నడిస్తే..దీర్ఘకాలిక వ్యాధులు ప్రమాదం తగ్గుతుందని పలు అధ్యయనాలు వెల్లడించాయి. ఇప్పుడు అన్ని అడుగులు అవసరం లేదు జస్ట్ ఏడు వేల అడుగులతో కూడా అనారోగ్య సమస్యల తోపాటు అకాల మరణాన్ని కూడా నివారించొచ్చని తాజా అధ్యయనం వెల్లడించింది. ఆ కొంచెం నడకతోనే చాలమటుకు అనారోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయని చెబుతోంది అధ్యయనం. మరి ఆ విశేషాలేంటో చూద్దామా..!.మంచి ఆరోగ్యానికి పదివేల అడుగులని ప్రామాణికంగా చెప్పాయి గత అధ్యయానాలు..కానీ తాజా పరిశోధనలు అంత కష్టపడాల్సిన పనిలేదంటోంది. ఏడు వేల అడుగులతోటే గుండె జబ్బులు, చిత్త వైకల్యం, అకాల మరణాన్ని నివారించొచ్చు. అందుకోసం దాదాపు 35 వేల జనసముహాలపై 57 అధ్యయనాలు నిర్వహించారు పరిశోధకులు. ఆ అధ్యయనంలో ఎక్కువగా నడవడం వల్ల ఆరోగ్యానికి మంచిదనే తేలింది. అయితే అకాల మరణాల ప్రమాదాన్ని తగ్గించడానికి దాదాపు ఏడు వేల అడుగులు చాలని నిర్థారించారు. దాంతోనే పలు ప్రయోజనాలు పొందగలమని తెలిపారు పరిశోధకులు. రోజుకి రెండు వేల అడుగులు మాత్రమే నడిచిన వ్యక్తులతో పోలిస్తే..ఏడు వేల అడుగులు నడిచిన వారు ఎలాంటి ప్రయోజనాలు పొందగలరో సవివరంగా వెల్లడించింది కొత్త అధ్యయనం. అవేంటంటే..ఏ కారంణ చేతనైనా ముందుగా చనిపోయే ప్రమాదం 47% కంటే తక్కువగుండె జబ్బు వచ్చే ప్రమాదం 25% తక్కువగుండె జబ్బుతో చనిపోయే ప్రమాదం 47% తక్కువకేన్సర్తో చనిపోయే ప్రమాదం 37% తక్కువఅల్జీమర్స్ వచ్చే ప్రమాదం 38% తక్కువడిప్రెషన్ ప్రమాదం 22% తక్కువటైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం 14% తక్కువకాలు స్లిప్ అయ్యి చనిపోయే ప్రమాదం 28% తక్కువఆ లెక్క ఏంటంటే..డబ్ల్యూహెచ్ఓ ప్రకారం..ప్రపంచవ్యాప్తంగా ప్రతి ముగ్గురిలో ఒకరికి తగినంత వ్యాయామం లేదు. మంచి కదలిక లేకపోవడం, తగినంత శారీరక శ్రమ లేకపోవడం కారణంగా గుండెపోటు, స్ట్రోక్, కేన్సర్తో సహా 8% సంక్రమిత వ్యాధుల బారినపడుతున్నట్లు డబ్యూహెచ్ఓ తెలిపింది. ఈ అనారోగ్య సమస్యల కారణంగా ఏటా బిలియన్ల కొద్ది డబ్బు ఖర్చు అవుతున్నట్లు పేర్కొంది. అలాంటి సమస్యలన్నింటిని సింపుల్ చక్కటి నడకతో చెక్ పెట్టొచ్చన్న దిశగా పరిశోధనలకు నాంది పలికామని శాస్త్రవేత్తలు తెలిపారు. ఆ నేపథ్యంలోనే ప్రామాణికంగా ఎన్ని అడుగులు వేస్తే ప్రజలు అత్యంత సౌలభ్యకరంగా తమ ఆరోగ్యాన్ని రక్షించుకోగలరు అనే దానిపై పలు అధ్యయనాలు నిర్వహించామని వెల్లడించారు. అందరికి జిమ్ సౌలభ్యం ఉంకపోవచ్చు లేదా వెళ్లగలిగే సామర్థ్యం లేకపోవచ్చని అన్నారు. అదే వాకింగ్ అయితే సామాన్యుడి సైతం చేయగలిగేదే గాక మెరుగైన ఆరోగ్యాన్ని చాలా సులభంగా పొందగలుగుతాడని పరిశోధకులు చెబుతున్నారు.(చదవండి: బరువు తగ్గడానికి ఉపయోగపడే అద్భుత పానీయాలు..!) -
బరువు తగ్గించే అద్భుత పానీయాలు ఇవే..!
బరువు తగ్గేందుకు ఎన్నో రకాల డైట్లు, వర్కౌట్లు చేస్తుంటారు. వాటి తోపాటు బాడీలోని చెడు కొలస్ట్రాల్ని తగ్గించి మొత్తం ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచే ఈ పానీయాలను కూడా జోడించినట్లయితే బరువు తగ్గడం మరింత సులభమవుతుంది. అందుకోసం అల్లాన్ని తప్పనిసరిగా మన రోజువారి జీవితంలో భాగం చేసుకోవాలి. మరి అదెలాగో తెలుసుకుందామా..!.అధిక బరువుకి చెక్ చెప్పే అద్భుత పానీయాలివే..గోరు వెచ్చిని అల్లం లెమెన్ వాటర్.. గోరువెచ్చని అల్లం నీటిలో కొద్దిగా నిమ్మరసం జోడించి పరగడుపునే తీసుకుంటే జీర్ణక్రియ మెరుగ్గా ఉంటుంది. అలాగే బాడీలోని చెడు కొలస్ట్రాల్ని తగ్గించి త్వరితగతిన బరువు తగ్గేలా చేస్తుంది. తయారీ విధానం: గోరువెచ్చని నీటిలో అల్లం వేసి మరిగించాలి. ఆ తర్వాత నిమ్మకాయను జోడించి తీసుకుంటే చాలు. కావాలనుకుంటే దాల్చిన చెక్క లేదా నల్లమిరియాలు కూడా జోడించొచ్చు. ఆపిల్ సైడర్ వెనిగర్ లేదా అల్లం షాట్: ఆపిల్ సైడర్ వెనిగర్ రక్తంలోని చక్కెరను సమర్థవంతంగా నియంత్రిస్తుంది. అల్లంతో కలిపి తీసుకుంటే జీర్ణ సంబంధిత సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఎలా తయారు చేయాలంటే: ఒక టేబుల్ స్పూన్ ఆపిల్ సైడర్ వెనిగర్కు అరటీస్పూన్ అల్లం రసం జోడించాలి. ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ల గోరువెచ్చని నీరు జోడించాలి. రోజుకు ఒకసారి భోజనానికి ముందు తాగాలి. ఇది దంతాల సంరక్షణకు, నోటి ఆరోగ్యాన్ని కాపాడుతుంది. దోసకాయ అల్లం డీటాక్స్: దీన్ని రిఫ్రెషింగ్ డ్రింగ్గా పిలుస్తారు. రోజంతా ఈ నీటిని సిప్ చేయొచ్చు. ఇది మిమ్మల్ని హైడ్రేటెడ్గా ఉంచుతుంది. అనవసరమైన చిరుతిండిని అరికట్టడంలో సహాయపడుతుంది. తయారీ విధానం: దోసకాయ, ఒక చిన్న అల్లం ముక్క, పుదీనా ఆకులు వేసి కొన్ని గంటలు లేదా రాత్రంత నానబెట్టాలి. ఈ వాటర్ని ఒక బాటిల్లో పోసుకుని కూడా హాయిగా తీసుకువెళ్లొచ్చు. అల్లం గ్రీన్ టీ: ఇది శరీరంలో కొవ్వుని సులభంగా కరిగిస్తుంది. భారీ భోజనాన్ని నివారిస్తుంది, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. తయారీ విధానం: వేడినీటిలో గ్రీన్ టీ బ్యాగ్ని ఉంచి, అల్లం జోడించాలి. తాగాడానికి కొన్ని నిమిషాలు ముందు చేసుకుంటే చాలు. వ్యాయమానికి ముందు ఆస్వాదిస్తే..సులభంగా బరువు తగ్గుతారు.పసుపు అల్లం లాట్టే (గోల్డెన్ మిల్క్)మంచి నిద్రకు సరైనది ఇది. చలికాలంలో మంచి వెచ్చదనాన్ని అందించి ఉపశమనాన్ని ఇస్తుంది. అల్లం, పసుపు మిశ్రం శరీరంలోని మంటను తగ్గించడంలో సహాయపడుతుంది. రాత్రిపూట జీర్ణక్రియకు మద్దతిస్తుంది. తయారీ విధానం: గోరువెచ్చని ఒక కప్పు బాదం లేదా ఓట్మిల్క్లో తాజా అల్లం లేదా అలం పొడిని కలపాలి. చిటికెడు నల్లమిరాయాలు, దాల్చిన చెక్క కలపి మరిగించండి. అవసరమైతే తేనెతో తాగండి. ఈ పానీయాలు డైట్లో చేర్చుకుంటే ఆకస్మికంగా అద్భుతమైన మార్పులు రాకపోయినప్పటికీ, మొత్తం ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది. అలాగే సమతుల్యం ఆహారాన్ని మెయింటైన్ చేయడంలో ఉపకరించడమే గాక సులభంగా బరువు తగ్గేందుకు దారితీస్తుంది.(చదవండి: యువరాజ్ సింగ్ లగ్జరీ ఇల్లు.. అసలైన ఇంటీరియర్ డిజైన్ అదే అంటున్న యువీ!) -
జిమ్కెళ్లకుండానే 26 కిలోలు కరిగించాడట : బోనీ కపూర్ లుక్ వైరల్
అందాల నటి జగదేకసుందరి, దివంగత శ్రీదేవి భర్త, చిత్ర నిర్మాత బోనీ కపూర్ న్యూలుక్లో కనిపిస్తూ అందర్నీ మెస్మరైజ్ చేశాడు. 69 ఏళ్ల వయసులో కేవలం జ్యూస్ డైట్ తర్వాత 26 కిలోలు తగ్గి అంత స్లిమ్గా మారాడనే విషయంలో మరోసారి నెట్టింట సందడిగా మారింది. ముఖ్యంగా నిర్మాత కరణ్ జోహార్, టీవీ నటుడు రామ్ కపూర్ బాగా బరువు తగ్గి, న్యూలుక్లో అలరిస్తున్న నేపథ్యంలో వైరల్ భయానీ ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసిన బోనీ కపూర్ తాజా చిత్రాలు ఇంటర్నెట్లో వైరల్ అయ్యాయి. కపూర్ క్రమశిక్షణతో కూడిన ఆహారం, ప్రాసెస్ చేసిన ఆహారాలు, కార్బోహైడ్రేట్లను నివారించడం, తరచుగా విందుకు బదులుగా తేలికపాటి సూప్లను ఎంచుకోవడం ద్వారా ఈ పరివర్తనను సాధించాడట తాను బరువు తగ్గడం వెనుక ప్రేరణ తన భార్య శ్రీదేవి అని 2024లో మీడియాకు ఇంటర్వ్యూలో బోనీ కపూర్ తెలిపాడు. ‘నేను నిన్ను కలిసినప్పుడు, నువ్వు సన్నగా, ట్రిమ్ గా, పొడవుగా అందంగా ఉన్నావు.. ఇపుడు చూడు ఎలా ఉన్నావో.. అంతకంటే నిన్ను ఏమి అడగలను చెప్పు ’’అని నిరంతరం గుర్తు చేసేదట. ఆరోగ్య కారణాల వల్ల, రీత్యా బరువు తగ్గించుకోవాలని కోరుకునేదట. అంతేకాదు కలిసి జిమ్కి, వాకింగ్కు తీసుకెళ్లేది.. ఆమె కోరుకున్నట్టుగా 10-12 రోజులు కొనసాగించి కానీ కొన్ని సమస్యల కారణంగా మానేశా’ అని తెలిపాడు.కానీ తరువాత సిన్సియర్గా ప్రయత్నించి, కొంత బరువును తగ్గించుకున్నాడు. ప్రస్తుతం ఏకంగా 26 కిలోల బరువు తగ్గాడు. మొదట్లో బోనీ కపూర్ బరువు తగ్గడానికి రహస్యం ఏమిటంటే డిన్నర్ మానేసి సూప్ మాత్రమే తాగేవాడు. దీంతో కొంత బరువు తగ్గడంతో మరింత ప్రయత్నించి బ్రేక్ఫాస్ట్లో పళ్ల రసాలు, జొన్న రోటీ డైట్తో 26 కిలోలు తగ్గాడట. ఈ స్లిమ్ లుక్ కోసం బోనీ జిమ్కు కూడా వెళ్ళలేదని వైరల్ భయానీ ఇన్స్టాగ్రామ్లో రాసుకొచ్చాడు. అయితే నెటిజన్లు మాత్రం బరువు తగ్గించే మందు ఓజెంపిక్ లేదా మౌంజారో వాడి ఉంటాడు అందుకే ఇంత మార్పు అని వ్యాఖ్యానించారు. భార్యకు నివాళిగా ఇలా స్లిమ్గా మారి ఉంటాడని మరికొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు.ఇదీ చదవండి: నో జిమ్, నో ట్రైనర్.. 46 రోజుల్లో 11 కిలోలు ఉఫ్..! -
అంతిమ క్షణాల్లో.. 'విల్' పవర్!
మీరు ఎలా చనిపోవాలనుకుంటున్నారు? ఏమిటి పిచ్చి ప్రశ్న అంటూ ఫైర్ అవకండి. మనం ఎలా చనిపోవాలో ఎంచుకునే అవకాశం ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. నమ్మలేకపోతున్నారా! దీనికి మనం చేయాల్సిందల్లా వీలునామా రాయడమే. చివరి మజిలీని ఎలా ముగించాలనుకుంటున్నామో తెలుపుతూ ముందుగానే వీలునామా రాసిపెట్టుకుంటే చాలు. అయితే ఇది ఎలా రాయాలి, ఎప్పుడు రాయాలి, దీనికి ఏమేం కావాలనే వివరాలు తెలుసుకోవాలంటే ముంబైలోని పీడీ హిందుజా నేషనల్ ఆస్పత్రికి వెళ్లాల్సిందే. దాని కంటే ముందు 'లివింగ్ విల్' అంటే ఏంటో చూద్దాం.'లివింగ్ విల్' అంటే?మనిషి ఎంత హాయిగా బతికాడన్నది కాదు, ఎంత సుఖంగా కన్నుమూశాడన్నది ముఖ్యం అంటారు మన పెద్దలు. ఇలాంటి ఆలోచన నుంచే లివింగ్ విల్ (living will) కాన్సెప్ట్ పుట్టుకొచ్చింది. నయం కాని రోగాలతో మంచాన పడి మరణం ముంగిట నిలుచున్నప్పుడు లివింగ్ విల్ క్లారిటీ ఇస్తుంది. చివరి క్షణాల్లో వైద్య సహాయం కావాలా, వద్దా అనేది ఎవరి వారే నిర్ణయించుకోవచ్చు. అఖరి గడియల్లో వెంటిలేటర్ సపోర్ట్ తీసుకోవాలా, వద్దా అనేది కూడా ఎంచుకోవచ్చు. ఇందుకోసం ముందుగానే రాసే వీలునామానే లివింగ్ విల్ లేదా అడ్వాన్స్ మెడికల్ డైరెక్టివ్స్గా పిలుస్తారు. సింపుల్గా చెప్పాలంటే.. మన చావు ఎలా ఉండాలో నిర్ణయించుకోవడం. చివరి రోజుల్లో మంచాన పడి జీవచ్ఛవంగా నరకయాతన అనుభవించకుండా సునాయాస మరణం పొందేందుకు ముందుగానే మనం చేసుకునే ఏర్పాటుగా దీన్ని భావించొచ్చు.సుప్రీం తీర్పు ఆధారంగా..మనిషి ఎలా చనిపోవాలనుకుంటున్నాడో తెలుపుతూ ముందుగానే రాసే వీలునామా (లివింగ్ విల్)ను సుప్రీంకోర్టు తీర్పు ఆధారంగా 2018లో కేంద్ర ప్రభుత్వం అధికారికంగా గుర్తించింది. లివింగ్ విల్ విషయంలో ఎలా ముందుకెళ్లాలనే దానిపై స్పష్టత లేకపోవడంతో 2023లో సర్వోన్నత న్యాయస్థానం మరోసారి జోక్యం చేసుకుంది. లివింగ్ విల్ నమోదు విధానాన్ని సులభతరం చేస్తూ కొన్ని సడలింపులు ఇచ్చింది. అయినప్పటికీ ఇంకా కొన్ని విషయాల్లో అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ వీలునామాలను ఎక్కడ భద్రపరుస్తారనే ప్రశ్న ఉత్పన్నమైంది. దీనికి బాంబే హైకోర్టు (Bombay High Court) పరిష్కారం చూపించింది. వీలునామాలను భద్రపరచడానికి, సులువుగా అందుబాటులో ఉండేందుకు ప్రత్యేకంగా వెబ్సైట్ తయారు చేయాలని బాంబే హైకోర్టు 2024లో మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.ఇప్పటివరకు 40 మంది..న్యాయస్థానాల ఆదేశాల మేరకు బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్(బీఎంసీ) ఈ వీలునామాల నమోదు ప్రారంభించింది. 24 వార్డుల్లో ఇప్పటివరకు 40 మంది లివింగ్ విల్ సమర్పించారు. ఇందులో 10 మంది మహిళలు ఉండడం గమనార్హం. 50, 60, 70 ఏళ్ల వారి నుంచి ఈ వీలునామాలు వచ్చాయి. 83 ఏళ్ల వ్యక్తి కూడా ఉన్నారు. ఈ పత్రాలకు నగరంలోని 24 వార్డుల్లో మెడికల్ ఆఫీసర్లు, అసిస్టెంట్ హెల్త్ ఆఫీసర్లు సంరక్షకులుగా ఉంటారు. వీరి వివరాలు బీఎంసీ వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయని బీఎంసీ అసిస్టెంట్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ భూపేంద్ర పాటిల్ తెలిపారు. ఆన్లైన్లోనూ వీలునామాలు సమర్పించేలా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.లివింగ్ విల్ క్లినిక్మహిమ్ ప్రాంతంలోని హిందుజా ఆస్పత్రి.. లివింగ్ విల్ క్లినిక్ను జూన్ నెలలో ప్రారంభించింది. గౌరవంగా చనిపోవడం (డైయింగ్ విత్ డిగ్నిటీ) పోరాటంలో చురుకైన పాత్ర పోషించిన సీనియర్ న్యూరాలజిస్ట్ డాక్టర్ రూప్ గుర్సహాని చొరవతో లివింగ్ విల్ వీక్లీ క్లినిక్ ప్రారంభమైంది. పాలియేటివ్ కేర్ స్పెషలిస్ట్ డాక్టర్ స్మృతి ఖన్నా దీన్ని నిర్వహిస్తున్నారు. లివింగ్ విల్పై ప్రజలకు అవగాహన కలిగించడంతో పాటు వీలునామా (veelunama) రాయడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లను తమ క్లినిక్ చేస్తుందని డాక్టర్ స్మృతి ఖన్నా తెలిపారు. భవిష్యత్తులో ఊహించని ఉత్పాలను తాము ఎలా ఎదుర్కొవాలనే దాని గురించి వీలునామాలో ప్రస్తావించొచ్చని తెలిపారు. ఆకస్మిక ప్రమాదాలు, నయం కాని వ్యాధులు బారిన పడి చివరి గడియల్లో ఉన్నప్పుడు తాము ఏం కోరుకుంటామో.. ముందుగానే లివింగ్ విల్లో రాసుకోవచ్చు.'లివింగ్ విల్ క్లినిక్ (Living Will Clinic) ప్రారంభమైప్పటి నుంచి ఇక్కడి వచ్చే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. వీరిలో 40 నుంచి 80 ఏళ్ల వయసు వాళ్లు ఉన్నారు. చాలా మంది కుటుంబ సభ్యులతో కలిసి వస్తున్నారు. కొంత మంది మాత్రం ఒంటరిగా వస్తున్నారు. నయం కాని దీర్ఘకాలిక రోగాలతో బాధ పడుతున్నవారికి అన్ని సందర్భాల్లో ఐసీయూ ఆధారిత వైద్యసేవలు సహాయకపడకపోవచ్చు. కొన్ని సందర్భాల్లో జీవితాన్ని పొడిగించడం కంటే కూడా బాధల నుంచి విముక్తి కల్పించడం అవసరమన్పిస్తుంద'ని డాక్టర్ స్మృతి ఖన్నా పేర్కొన్నారు. 18 ఏళ్లు నిండినవారు ఎవరైనా.. ఆరోగ్యంగా ఉన్నా, లేకున్నా లివింగ్ విల్ రాయొచ్చన్నారు. 'జీవితం అనూహ్యమైనది, కానీ మీ వైద్య ఎంపికలు అలా ఉండనవసరం లేదు. మీరు వాటిని స్వయంగా వ్యక్తపరచలేకపోయినా, మీ చికిత్సా ప్రాధాన్యతలను తెలుసుకుని, వాటిని అనుసరించేలా లివింగ్ విల్ సహాయపడుతుంది. మీ ఉద్దేశాలను స్పష్టంగా తెలియజేయడానికి, మీ గౌరవాన్ని కాపాడుకోవడానికి ఇది సరళమైన, అర్థవంతమైన మార్గం' అంటూ అవగాహన కల్పిస్తోంది హిందుజా ఆస్పత్రి.లివింగ్ విల్ క్లినిక్ ఏం చేస్తుంది?వెంటిలేటర్, ఫీడింగ్ ట్యూబ్, సీపీఆర్ వంటి అత్యవసర చికిత్స తీసుకుంటున్న సందర్భాల్లో మెడికల్ కౌన్సిలింగ్ ఇస్తుంది.సుప్రీంకోర్టు ఆమోదించిన పార్మాట్లో ఇద్దరు సాక్షుల సమక్షంలో లీగల్ డాక్యుమెంటేషన్ చేస్తుంది.లివింగ్ విల్ అమలు చేయడానికి అవసరమైన పత్రాలు తయారు చేస్తుంది. (నఖలు పత్రాలను కుటుంబ సభ్యులు, డాక్టర్లతో పాటు పేషంట్ల చిరునామా ఆధారంగా సంబంధిత ప్రభుత్వ అధికారులకు పంపిస్తారు)లివింగ్ విల్ సేవలకు అవుట్ పేషంట్స్ డిపార్ట్మెంట్(ఓపీడీ) ధరల ప్రకారం ఫీజు తీసుకుంటారు. అవసరమైన వారికి ఉచితంగా కూడా పని చేసి పెడతారు.లివింగ్ విల్ ఎప్పుడు అమలు చేస్తారు?బతికుండగానే రాసిన వీలునామాను ఎప్పుడు అమలు చేస్తారనే సందేహం చాలా మందికి కలుగుతుంది. నిబంధనల మేరకు ఈ వీలునామాను వైద్యులు, ప్రభుత్వ అధికారుల బృందం పర్యవేక్షణలో అమలు చేస్తారు. ఆఖరి రోజుల్లో రోగి తనకు తానుగా నిర్ణయం తీసుకోలేనప్పుడు లివింగ్ విల్ ఆధారంగా ముందుకెళతారు. రోగి ఆరోగ్య పరిస్థితి విషమం అని లేదా ఇక కోలుకోలేరని కనీసం 2 మెడికల్ బోర్డులు ధృవీకరించిన తర్వాతే లివింగ్ విల్ ప్రకారం చర్యలు చేపడతారు.ఎవరెవరు రాశారు?ముంబైకి చెందిన పలువురు లివింగ్ విల్ రాసిపెట్టుకున్నారు. డాక్టర్ నిఖిల్ దాతర్(55), చార్టెడ్ అకౌంటెంట్ ప్రఫుల్ పురాణిక్ (60), డాక్టర్ లోపా మెహతా(78), యశ్వంత్ కజ్రోల్కర్ (83) తదితరులు లివింగ్ విల్ రాసిన వారిలో ఉన్నారు. గైనకాలిస్ట్గా పనిచేస్తున్న నిఖిల్ దాతర్.. లివింగ్ విల్ మార్గదర్శకాలను సుప్రీంకోర్టు సులభతరం చేసిన వెంటనే.. 2023, ఫిబ్రవరిలో వీలునామా రాశారు. అయితే ఈ వీలునామాను ఎవరికి ఇవ్వాలనే సమస్య ఆయనకు ఎదురైంది. దీంతో ఆయన బాంబే హైకోర్టు తలుపు తట్టారు. సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయడానికి వీలుగా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలివ్వాలని కోరుతూ పిల్ దాఖలు చేశారు. హైకోర్టు ఆదేశాలతో చివరకు మహారాష్ట్ర ప్రభుత్వం వైద్య అధికారులకు ఈ వీలునామా సంరక్షణ బాధ్యతలు అప్పగించింది. వీలునామా రాయడం పెద్ద విషయం కాదు. సమయం వచ్చినప్పడు మనం రాసిన వీలునామాను ఎంత వరకు అమలు చేస్తారనేదే ముఖ్యమని డాక్టర్ నిఖిల్ దాతర్ అన్నారు.సహజ మరణం కోరుకుంటున్నాఅఖరి గడియల్లో తనకు వైద్య సహాయం అవసరం లేదని శివాజీ పార్క్ ప్రాంత నివాసి డాక్టర్ లోపా మెహతా అన్నారు. తన ఆరోగ్య పరిస్థితి పూర్తిగా క్షీణించినప్పుడు వెంటిలేటర్లు, ఫీడింగ్ ట్యూబ్స్తో అందించే చికిత్స తనకు వద్దని ఆమె స్పష్టం చేశారు. చివరి క్షణాల్లో తమ వారికి కాపాడుకునేందుకు ప్రయత్నించి ఆర్థికంగా, మానసికంగా నలిగిపోయిన ఎన్నో కుటుంబాలను చూసిన తర్వాత తాను ఈ నిర్ణయానికి వచ్చినట్టు వెల్లడించారు. ''చివరి రోజుల్లో నన్ను ఆస్పత్రిలో చేర్చాల్సిన పరిస్థితి వస్తే.. నేను పనిచేసిన కింగ్ ఎడ్వార్డ్ మెమోరియల్ ఆస్పత్రికి తీసుకెళ్లండి. అక్కడ అనవసరమైన జోక్యం ఉండదని నేను నమ్ముతున్నాను" అని ఆమె పేర్కొన్నారు.అమ్మ బాధ చూసిన తర్వాత..మనం చనిపోతామని తెలిసినప్పుడు దాన్ని ఎందుకు ఆలస్యం చేయాలని ప్రశ్నిస్తున్నారు ఎయిరిండియా మాజీ ఉద్యోగి యశ్వంత్ కజ్రోల్కర్. పార్కిస్సన్ వ్యాధితో తన తల్లి అనుభవించిన నరకయాతన చూశాక, అలాంటి అవస్థ తనకు రాకూడదని కోరుకుంటున్నట్టు చెప్పారు. ఇదే అభిప్రాయాన్ని ప్రఫుల్ పురాణిక్ వ్యక్తం చేశారు. బ్లడ్ క్యాన్సర్తో తన వదిన ఎంతో వేదన పడ్డారని, ఆమె బాధ చూసిన తర్వాత అలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదని కోరుకుంటున్నట్టు చెప్పారు. 'మనవాళ్లను కాపాడుకోవడానికి చేయాల్సిందంతా చేస్తాం. పరిస్థితి చేయి దాటిపోయిందని తెలిసినప్పుడు మనం ఏమీ చేయలేం. నా పిల్లలు నన్ను.. వెంటిలేటర్పై ఉన్న వ్యాధిగ్రస్తులా కాకుండా, నేనున్నట్టుగానే గుర్తుపెట్టుకోవాల'ని కోరుకుంటానని ప్రఫుల్ పేర్కొన్నారు. -
ఆ మూవీలో మాదిరిగా 20 ఏళ్లకే అల్జీమర్స్ వస్తుందా..? నిపుణులు ఏమంటున్నారంటే..
చిన్న సినిమాగా వచ్చి బాలీవుడ్ బాక్సాఫీస్ను షేక్ చేస్తోన్న సినిమా ‘సయ్యారా’ (Saiyaara). మోహిత్ సూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో హీరో అహాన్ పాండే సంగీతకారుడు క్రిష్కపూర్గా, హీరోయిన్గా అనీత్ పద్దా ఆశావహ జర్నలిస్ట్ వాణి బాత్రాగా నటించారు. ఈ ఇద్దరి మధ్య సాగే రొమాంటిక్ ప్రేమ కథ ఇది. ఇందులో వాణిబాత్రా పాత్రలో ఒదిగిపోయిన 22 ఏళ్ల అనిత అల్జీమర్స్ వ్యాధితో బాధపడుతున్నట్లు చూపిస్తాడు దర్శకుడు. ఆ వ్యాధి కారణంగా వాణి క్రిష్ మద్య సంబంధాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది అనే దాని చుట్టూ సాగుతుంది ఈ సినిమా. అయితే ఆ సినిమాలో హీరోయిన్ మాదిరిగా చిన్న వయసులోనే అల్జీమర్స్ వ్యాధి బారినపడతామా అనే సందేహాలు సర్వత్రా వ్యక్తమయ్యాయి. ఎందుకంటే ఇది 60 ఏళ్లు పైబడ్డాక వచ్చే వ్యాధి. మరి చిన్నవయసులోనే ఈ వ్యాధిబారిన పడే ఛాన్స్లు కూడా ఉన్నాయా అంటే..సినిమా కాబట్టి అలా కథ కోసం హీరోయిన్ చిన్న వయసులోనే అల్జీమర్స్ వ్యాధి బారినపడినట్లు చూపించారా..? లేక వాస్తవికంగానే అది నిజమా అంటే..ఔననే చెబుతున్నారు నిపుణులు. ఈ అల్జీమర్స్ వ్యాధి 65 ఏళ్లు పైబడిన వారికి వచ్చినప్పటికీ..కొన్నిసార్లు 30 లేదా 40 ఏళ్ల వారిని కూడా ప్రభావితం చేస్తుందట. అయితే 20 ఏళ్లలోపు వ్యక్తుల్లో మాత్రం అరుదుగా కనిపిస్తుందని చెప్పారు. తక్కువ వయసులోనే ఈ సమస్య బారినపడిన వాళ్లు కూడా ఉన్నారని అన్నారు. ఇది జన్యుపరమైన కారణాల వల్ల వస్తుందట. ప్రధానంగా APP TSEN వంటి జన్యువులలో ఉత్పరివర్తనల కారణంగా చిన్న వయసులోనే ఆ వ్యాధి బారిన పడతారని చెబుతున్నారు వైద్యులు. అలాగే ఆ మూవీలో వాణి పాత్రలో ఒదిగిపోయిన హీరోయిన్లా అపస్మారక స్థితి, తలతిరగడం, జ్ఞాపకశక్తి కోల్పోవడం వంటి లక్షణాలు ఉండవని అన్నారు. పైగా ఈ లక్షణాలు అల్జీమర్స్ వ్యాధిలో భాగం కాదని కూడా చెప్పారు. లక్షణాలు ఎలా ఉంటాయంటే..ఇటీవలే జరిగిన సంభాషణలు లేదా సంఘటనలు మర్చిపోవడంవస్తువులను తప్పుగా ఐడెంటిఫై చేయడంఒక ప్రదేశం లేదా వస్తువుల పేర్లను మర్చిపోవడంఆలోచించడంలో ఇబ్బంది పడటంపదేపదే ప్రశ్నించడంకొత్త విషయాలను ప్రయత్నించడానికి సంకోచించడంనిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బంది పడటంఅలాగే ఆ సినిమాలో తన భర్తను చూడగానే వాణి తన వ్యాధి నుంచి త్వరితగతిన కోలుకుంటున్నట్లు చూపించారు. కానీ రియల్గా అలా జరగదు. అంత స్పీడ్గా రికవరీ కావడం జరగదని చెప్పుకొచ్చారు నిపుణులు. వృద్ధాప్యంలో వచ్చే చిత్తవైకల్యానికి కారణం డిప్రెషన్ అయితే..చిన్న వయసులో ఈ వ్యాధి బారిన పడటానికి జన్యు సంబంధిత సమస్యలే కారణమని అన్నారు. పైగా దీన్ని కరెంట్ షాక్తో ట్రీట్మెంట్ చేయరని కూడా చెప్పారు. అయితే ఈ మూవీ జ్ఞాపకశక్తిని కోల్పోవడాన్ని ముందుగా గుర్తించాలనే విషయాన్ని హైలెట్ చేసింది. దీన్ని గనుక గమనించనట్లయితే అల్జీమర్స్ వ్యాధి తీవ్ర స్థాయికి చేరకమునుపే ఆయా పేషెంట్లను మందులు, కౌన్సిలింగ్లతో తర్వితగతిన నయం చేయగలుగుతామని అన్నారు నిపుణులు.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. -
నో జిమ్, నో ట్రైనర్.. 46 రోజుల్లో 11 కిలోలు ఉఫ్..!
అమెరికాకు చెందిన ప్రముఖ యూ ట్యూబర్ కేవలం 46 రోజుల్లో 11 కిలోల బరువు తగ్గడం విశేషంగా నిలుస్తోంది. అదీ 56 ఏళ్ల వయసులో జిమ్కు వెళ్లకుండానే, ఎలాంటి ట్రైనర్ లేకుండానే దీన్ని సాధించాడు. అన్నట్టు ఎలాంటి ఫ్యాషన్ డైట్ కూడా పాటించలేదు. మరి అతని వెయిట్ లాస్ సక్సెస్ సీక్రెట్ ఏంటో తెలుసుకుందామా.పసిఫిక్ నార్త్వెస్ట్లోనివసిస్తున్న 'మిస్టర్ రాంగ్లర్ స్టార్'గా పాపులర్ అయిన అమెరికన్ కోడి క్రోన్ తన వెయిట్ లాస్తో అందరినీ ఆశ్చర్యపరిచాడు. చాట్ జీపీటీ వంటి ఏఐ సాయంతో తన బరువు తగ్గే ప్లాన్ను పక్కాగా అమలు చేశాడు. విజయం సాధించాడు. తన 56వ పుట్టిన రోజునాడు ఆరోగ్యం , ఫిట్నెస్పై దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నాడుకోడి క్రోన్. బరువు తగ్గాల్సిందే అని తీర్మానించుకున్నాడు. ఇందుకోసం AI ని ఆశ్రయించాడు. తన బరువు, ఎత్తు, జీవనశైలి, శారీరక స్థితిగతులను బట్టి చాట్ జీపీటీ సహాయంతో ఒక సమగ్ర ప్రణాళికను రూపొందించుకున్నాడు. (6 నెలల్లో 27 కిలోలు తగ్గాను..ఇదంతా దాని పుణ్యమే!)అలా చాట్జీపీటి సాయంతో 95 కిలోల నుండి 83 కిలోలకు బరువు తగ్గించుకున్నాడు కోడి. కేవలం ఒకటిన్నర నెలల్లో 25.2 పౌండ్లు (సుమారు 11.4 కిలోలు) కోల్పోయాడు. ఇందుకోసం అతను ఓజెంపిక్ లాంటి బరువు తగ్గించే మందులను ఉపయోగించ లేదు, వ్యక్తిగత కోచ్ను నియమించుకోలేదు. దీనికి బదులుగా ఇంట్లోనే చేయగలిగే సాధారణ వ్యాయామాలు, ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లు, జీవనశైలి మార్పులకు ప్రాధాన్యత ఇచ్చాడు. క్రమశిక్షణ, క్లీన్ ఈటింగ్, స్మార్ట్ సప్లిమెంటేషన్, వ్యాయామాలు ఇవే అతని సీక్రెట్స్.కోడి క్రోన్ పాటించిన నియమాలుపోషకాహారం & ఉపవాసం : లాంగ్ ఫాస్టింగ్ తరువాత రోజుకు రెండు సార్లు సంపూర్ణ భోజనాలు. సాయంత్రం 5 గంటల తరువాత నో ఫుడ్అల్పాహారం: 4 గుడ్లు, అర పౌండ్ లీన్ గ్రాస్-ఫెడ్ బీఫ్, స్టీల్-కట్ ఓట్స్ (తీపి లేనివి), ఆకుకూరల సప్లిమెంట్. ప్రాసెస్ చేసిన ఆహారం, చక్కెర, స్నాక్స్ . సీడ్ ఆయిల్స్ , పాల ఉత్పత్తులకు పూర్తిగా దూరం.రాత్రి భోజనం: 1/3 కప్పు జాస్మిన్ రైస్, సుమారు 225 గ్రా. లీన్ స్టీక్, ఆలివ్ ఆయిల్ లేదా సగం అవకాడో.సప్లిమెంట్లు: క్రియేటిన్, బీటా-అలనైన్, వె ప్రోటీన్, కొల్లాజెన్, మెగ్నీషియం మరియు ఇతర క్లీన్-లేబుల్ పెర్ఫార్మెన్స్ బూస్టర్లువర్కౌట్స్: ఇంట్లోనే పుల్-అప్ బార్, రెసిస్టెన్స్ బ్యాండ్లు, కెటిల్బెల్స్, డిప్ బార్ లాంటి వ్యాయామాలు చేసేవాడు. వారానికి ఆరు రోజులు, ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు వ్యాయామం.గంట నుంచి గంటన్నర పాటు ఎక్సర్పైజ్లు స్లీప్: 7–8 గంటల నిద్ర. మంచి నిద్ర కోసం నిద్రవేళకు ఒక గంట ముందు స్క్రీన్స్ ఆఫ్. గది అంతా చీకటిగా ఉండేలా ఏర్పాటు.రోజువారీ 4 లీటర్ల నీళ్లు తాగడం. అలాగే జీవక్రియ శక్తిని పెంచడానికి ప్రతిరోజూ ఉదయం 15–20 నిమిషాలు ఉదయం పూట సూర్యరశ్మి తగిలేలా చూసుకునేవాడు.ట్రాకింగ్ ప్రోగ్రెస్: ప్రతి ఉదయం తన ఉపవాస బరువును చెక్ చేసుకునేవాడు. దీన్ని బట్టి AI ప్లాన్ను తు.చ తప్పకుండా పాటిస్తూ, ప్రణాళికను సర్దుబాటు చేసుకునేవాడు. దీంతో బరువు తగ్గడమే కాకుండాకీళ్ల నొప్పులు తగ్గాయి, మంచి నిద్ర, శక్తి వీటన్నిటితోపాటు, స్పష్టమైన ఆలోచన, మెరుగైన మానసిక ఆరోగ్యం కూడా లభించిందని చెప్పుకొచ్చాడు. 46 రోజుల్లో 11 కజీల బరువు తగ్గడం అనేది సాధారణ విషయం కాదు దీనికి ఎంతో పట్టుదల శ్రమ, ఉండాలి అంటున్నారు నెటిజన్లు. ఖరీదైన జిమ్లు, ట్రైనర్లు లేకుండానే సరైన సమాచారంతో ఇంట్లోనే ఆరోగ్యకరంగా బరువు తగ్గొచ్చని కోడి క్రోన్ నిరూపించాడు. దీనికి సంబంధించి తన అనుభవాలను యూట్యూబ్ వీడియోల ద్వారా పంచుకుంటూ, ఇతరులకూ స్ఫూర్తినిస్తున్నాడునోట్: అంతర్లీనంగా మరేతర ఆరోగ్య సమస్యలు లేనపుడు బరువు తగ్గే విషయంలో అనుకున్న ఫలితాలు సాధించాలంటే ముందు నిబద్ధత అవసరం. పోషకాహారం తీసుకుంటూ, వ్యాయామం చేస్తూ, మంచి నిద్ర, రోజుకు కనీసం మూడు లీటర్ల నీళ్లు తదితర సరైన ప్రణాళికతో ముందుకు వెళ్తే శారీరక ఆరోగ్యాన్ని పొందడం సాధ్యమే. -
'స్కాన్ అండ్ పే'తో తప్పుతున్న లెక్క..!
స్కాన్ అండ్ పే.. వినడానికి ఎంత సింపుల్గా ఉంది.. చిల్లర గొడవలేదు.. పెద్దనోట్ల బెడదలేదు.. అనిపిస్తోంది..కదా! అయితే స్కాన్ అండ్ పేతో ఆర్థిక నియంత్రణ కోల్పోతున్నామని, అకౌంట్లో డబ్బులు ఇట్టే ఖాళీ అయ్యేది కూడా తెలియడంలేదని పలువురు చెబుతోన్న మాట. డిజిటల్ పేమెంట్స్లో ఎంత సౌలభ్యం ఉందో.. అంతే ఇబ్బందులూ ఉన్నాయనేది వాస్తవం.. ఒకప్పుడు ఏదైనా ఖర్చు చేయాలంటే ముందుగా జేబు చూసుకునే అలావాటు ఉండేది. ఆన్లైన్ పేమెంట్స్ పుణ్యమాని అదికాస్త అదుపుతప్పింది.. ‘జస్ట్ స్వైప్ అండ్ బై’ ఆప్షన్తో నెమ్మదిగా నోట్ల కాలాన్ని మర్చిపోతున్న తరుణంలో ఒక సరికొత్త జీవన శైలికి అలవాటుపడ్డారు. ఈ సౌలభ్యంతో పాటు పెరిగిన ఖర్చులు, తగ్గిన పొదుపులు, అదుపులో లేని ఆర్థిక వ్యయాలకు సంబంధించిన అధ్యయనాలు ఆర్థిక క్రమశిక్షణ అవసరమని హెచ్చరిస్తున్నాయి. ఆన్లైన్ పేమెంట్స్ సిటీ లైఫ్స్టైల్కు కొత్త ఊపునిచ్చాయి. వేగం, సౌలభ్యం, భద్రతను పెంచాయి. అయితే ఇదే క్రమంలో వ్యయం విషయంలో నియంత్రణను కోల్పోయేలా చేస్తున్నాయని, ఈ సౌలభ్యతతో పాటు ఖర్చులు పెరిగాయని, పుదపు పూర్తిగా తగ్గిపోయిందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. జీవన ప్రమాణాల పేరుతో అదుపులేని ఖర్చులతో అప్పుల భారం పెరుగుతోందని, ఇది భవిష్య ఆర్థిక భద్రతను ప్రశ్నార్థకంగా మారుస్తుందని సూచిస్తున్నారు. సింగిల్ టచ్తో.. డిజిటల్ పేమెంట్స్ వల్ల మనం ఎంత ఖర్చు చేస్తున్నామో మర్చిపోతున్నాం. సింగిల్ టచ్తో చెల్లింపులు జరిగిపోవడం వల్ల, ఆ ఖర్చు విలువ ఆ క్షణంలో తెలియడం లేదు. ఖరీదైన కాఫీ, ఫుడ్ డెలివరీ, కాస్మొటిక్స్, ఓటీటీ సబ్స్క్రిప్షన్లు, ఫిట్నెస్ యాప్స్, విలాసవంతమైన గ్యాడ్జెట్లు.. ఇలా ప్రతి రోజూ చిన్న చిన్న ఖర్చులన్నీ కలిసిపోయి పెద్ద మొత్తాన్ని తినేస్తున్నాయి. ముఖ్యంగా యువతలో ఈ విషయంలో నియంత్రణ కొరవడుతోంది. డబ్బు నోట్లను చేత్తో పట్టుకున్నప్పుడు కలిగిన భావన, డిజిటల్ నెంబర్ల రూపంలో ఉండడంలేదని చెబుతున్నారు. పాత రోజుల్లో జీతం వచ్చిన వెంటనే ఒక భాగాన్ని పొదుపుకు ఉంచే అలవాటు ఉండేది. కానీ ఇప్పుడు డబ్బు బ్యాంకులో క్రెడిట్ అయినప్పటికీ, డిజిటల్ పేమెంట్స్ వల్ల ఒక్క రోజు గడిచేలోపు వేగంగా ఖర్చవుతోంది. నెల చివరికి మిగిలే డబ్బు మిగలకపోగా క్రెడిట్కార్డులకు చేరువ చేస్తోంది. ఈ కారణంగా, పొదుపు ఖాతాల్లో నిల్వలు కరిగిపోతున్నాయి. ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసే అలవాటు కూడా మందగిస్తోంది.ఆర్థిక భద్రత తప్పనిసరి.. హైదరాబాద్ వంటి పట్టణాల్లో యువతరం అత్యంత ఎక్కువగా డిజిటల్ లావాదేవీలు జరుపుతుంటారు. నేటితరం జీవనశైలిలో డిజిటల్ లావాదేవీలు.. షార్ట్స్ మెనూ డెలివరీలు, ఓటీటీ ట్రెండ్లు, ఇన్స్టంట్ బుకింగ్స్, ఈఎంఐలపై ఫోన్లు, గ్యాడ్జెట్లు, నిత్యం మారే డిజిటల్ ఖర్చులతో ఆర్థిక భద్రత కనుమరుగవుతోంది. పైగా ఇన్స్టెంట్ లోన్ యాప్స్పై ఆధారపడుతున్నారు. చిన్న వయసులోనే అప్పులు, క్రెడిట్ కార్డ్ బకాయిల సమస్య తలెత్తుతోంది. వ్యక్తిగత ఆర్థిక భద్రతపై అవగాహన కొరవడుతోంది. డిజిటల్ డిపెండెన్సీకి వ్యతిరేకంగా.. ‘పేమెంట్ సౌలభ్యం ఉండటం మంచిదే.. కానీ, అది మనం పొదుపు చేయడం మర్చిపోయే స్థాయికి వెళితే ప్రమాదమే’.. అన్నది ఆర్థిక నిపుణులు చెబుతున్న మాట. డిజిటల్ ట్రాన్సాక్షన్ గణాంకాలు పెరగడమే కాకుండా, ఆర్థిక సమతుల్యత కూడా విపరీతంగా పెరుగుతోంది. సగం మందికిపైగా వినియోగదారులు తాము నెల మొత్తంలో చేసిన ఖర్చు ఎంతో గుర్తించలేని స్థితిలో యూపీఐ పేమెంట్స్ చేస్తున్నారని ఓ అధ్యయనం చెబుతోంది. ఖర్చులను ట్రాక్ చేసే టెక్నాలజీ.. డిజిటల్ మానిటరింగ్ టూల్స్ వినియోగం ఈ సమస్యకు పరిష్కారంగా ఉంటాయని కొందరు సాంకేతిక నిపుణులు సూచిస్తున్నారు. ఇటీవలి కాలంలో కాయిన్, వాల్నట్, ఈటీ మనీ వంటి కొన్న యాప్స్ నెలవారీ బడ్జెట్ అప్లికేషన్లు, ఖర్చులను ట్రాక్ చేయడానికి ఉపకరిస్తున్నాయి. అలాగే, ‘స్పెండ్ బిఫోర్ యూ ఎర్న్’ తరహా మానసిక ధోరణికి బదులుగా ‘సేవ్ బిఫోర్ యూ స్పెండ్’ అలవాటుగా చేసుకోవాలి. -
ఫ్యాటీ లివర్.. పారాహుషార్!
మీకు పొట్ట కాస్తో కూస్తో లేదా బాగా ముందుకు వచ్చో కనిపిస్తోందా? ఇలా పొట్ట ముందుకు వస్తే మొదట చూసుకోవాల్సింది కాలేయాన్ని! ఎందుకంటే.. పొట్ట పెరగడమన్నది ‘ఫ్యాటీ లివర్’ సమస్యకు ఒక సూచన కావచ్చు. అంటే కాలేయంలో క్రమక్రమంగా కాలేయ కణాల స్థానే కొవ్వు కణాలు వచ్చి చేరడం. ఈ ‘ఫ్యాటీ లివర్’.. డయాబెటిస్, రక్తపోటు లాగే ఓ జీవనశైలి (లైఫ్స్టైల్) సమస్య. ముందే తెలుసుకుంటే జాగ్రత్త పడవచ్చు. భవిష్యత్తులో పూర్తిగా కొవ్వు కణాలతో నిండిపోయి.. ఒక దశలో చివరి స్టేజ్ లివర్ డిసీజ్, లివర్ కేన్సర్కూ దారితీసే ముప్పునూ తప్పించుకోవచ్చు.ఫ్యాటీ లివర్ అంటే...మన పొట్టలో కుడివైపున కాలేయం ఉంటుంది. మనం తీసుకుంటున్న ఆహారంలో క్యాలరీలు, చక్కెరలు పెరుగుతున్న కొద్దీ మనం చేసే శారీరక శ్రమలో దహించుకుపోయినవి తప్ప మిగతావన్నీ కొవ్వు రూపంలో కాలేయంలోనే నిల్వ అవుతుంటాయి. ఇలా చక్కెరలు పెరగడమూ, శారీరక శ్రమ తగ్గడంతో క్రమంగా కాలేయంలో కొవ్వు కణాలు పెరిగిపోయి కాలేయ కణాలు తమ సహజ గుణాన్ని కోల్పోతాయి. ఆరోగ్యకరమైన లివర్ కాస్తా కొవ్వు పేరుకుపోతున్న ఫ్యాటీలివర్ కండిషన్ గా మారిపోతుంది. ఇలా కాలేయకణాలను కోల్పోతూ... కొవ్వుకణాలను నింపుకొంటున్న కండిషన్ నే ఫ్యాటీ లివర్ అంటారు. కాలేయం 90 శాతం దెబ్బతినేవరకు తనకు సంబంధించిన లక్షణాలను బయటపడనివ్వదు. అంతేకాదు... జాగ్రత్తలు తీసుకుంటే మళ్లీ తనను తాను బాగుచేసుకోనూ గలదు. కారణాలేంటి?ఈ మధ్యకాలంలో ఎక్కువగా హై క్యాలరీ ఫుడ్ తీసుకోవడం పెరిగింది. చక్కెర మోతాదులు చాలా ఎక్కువగా ఉండే వాటినీ తింటున్నారు. ఆ క్యాలరీలను దహించడానికి మాత్రం ఎలాంటి వ్యాయామాలూ చేయడం లేదు. మారుతున్న జీవనశైలిలో భాగంగా ఒకేచోట కూర్చుని చేసే ఉద్యోగాలూ, వృత్తులతో కూర్చుని కూర్చుని పొట్ట పెరుగుతోంది. మరికొందరికి మద్యపానం అలవాటు. ఇలాంటి జీవనశైలి మార్పులతో స్థూలకాయం, మధుమేహంతోపాటు ఫ్యాటీలివర్ కూడా చాలామందిలో కనిపిస్తోంది.ఇవీ గ్రేడ్స్..: ఫ్యాటీ లివర్ సమస్య తీవ్రతను బట్టి ఇందులో గ్రేడ్స్ ఉంటాయి. మొదటి లేదా రెండో గ్రేడ్ వరకు కొంత నిరుపాయకరమని చెప్పవచ్చు. ఇక్కడ కొన్ని నిబంధనలు వర్తిస్తాయి. జీవనశైలిని మెరుగుపరచుకుంటూ ఆరోగ్యకరమైన లైఫ్స్టైల్ అలవరచుకుని కొంత క్రమశిక్షణతో మెలగడం, వ్యాయామం చేయడం ద్వారా మొదటి, రెండో దశలోని ‘ఫ్యాటీ లివర్’ను అదుపులో పెట్టవచ్చు. మూడో గ్రేడ్, ఆపైన గ్రేడులకు చేరితే కాలేయమార్పిడి తప్ప మరో మార్గం ఉండకపోవచ్చు.మొదటి దశ: ఇది సాధారణ ఫ్యాటీ లివర్ వ్యాధి. ఇందులో కాలేయ కణాల మధ్య కొవ్వు చాలా పరిమితంగా ఉంటుంది.రెండో దశ: ఈ దశను నాష్ (ఎన్ ఏఎస్హెచ్) అంటారు. ఇందులో కాలేయం కొద్దిగా దెబ్బతింటుంది. కొన్ని కాలేయ కణాలు నశిస్తాయి. మూడో దశ: ఈ దశలో సిర్రోసిస్ వస్తుంది. అంటే కాలేయం పూర్తిగా తన స్వరూపాన్ని కోల్పోయి, గట్టిపడుతుంది.నివారించగల కారణాలుమద్యపానం చేసేవారికి ఫ్యాటీ లివర్ వచ్చే అవకాశాలు ఎక్కువ. ఈ అలవాటును మనం ప్రయత్నపూర్వకంగా పూర్తిగా అదుపులో పెట్టుకోవచ్చు. ఇక వ్యాయామం చేస్తూ బరువు తగ్గించుకోవడమూ మన చేతుల్లో ఉన్నదే. అధిక రక్తపోటు ఉన్నవారు దాన్ని అదుపులో ఉంచుకోవాలి. అధిక మోతాదులో మందులు వాడకాన్ని నివారించాలి. వైద్యులు సూచించిన ఆహారాన్ని తీసుకోవాలి. నివారించుకోలేని కారణాలునివారించుకోలేనంత బరువు పెరగడం అన్నది మన చేతుల్లో ఉండదు. పొట్ట బాగా ముందుకు వచ్చినవాళ్లలోనూ, స్థూలకాయం ఉన్న 90 శాతం మందిలోనూ మొదటి దశ ఫ్యాటీలివర్ కనిపించడం చాలా సాధారణం. అలాగే స్థూలకాయం ఉన్న 20 శాతం వ్యక్తుల్లో రెండో దశ ఉంటోంది. ఫ్యాటీ లివర్ వచ్చిన వ్యక్తుల్లో ఎక్కువ శాతం మందిలో మధుమేహం వచ్చే ప్రమాదం ఉంటుంది.ఇవీ లక్షణాలుతొలిదశల్లో సాధారణంగా ఫ్యాటీలివర్ బాధితుల్లో ఎలాంటి లక్షణాలు కనిపించవు. అల్ట్రా సౌండ్ స్కానింగ్ చేయించుకుంటే ఫ్యాటీలివర్ ఉనికి తెలుస్తుంది. ⇒ కొందరికి కుడివైపు పొట్ట పైభాగంలో (రిబ్కేజ్ కింద) పొడుస్తున్నట్లుగా నొప్పి వస్తుంటుంది. కాలేయం క్రమంగా పెరగడమే ఇందుకు కారణం.క్యాన్సర్ ముప్పు కూడా... ఫ్యాటీ లివర్ వ్యాధి వచ్చాక తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే కాలేయం పూర్తిగా దెబ్బతినే సిర్రోసిస్ లేదా కొందరిలో లివర్ క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన పరిస్థితులకు దారితీయవచ్చు.నివారణ ఇలా : బరువు నియంత్రించుకోండి : మీరు ఉండాల్సిన దాని కంటే ఎక్కువ బరువు ఉంటే మీ ఆహారంలో పిండి పదార్థాలను తగ్గించుకోవాలి. మీ బాడీ మాస్ ఇండెక్స్ (బీఎమ్ఐ) అనుగుణంగా శరీర బరువును నియంత్రించుకోవాలి.ఆరోగ్యకరమైన ఆహారం : ఆహారంలో తప్పనిసరిగా తాజా ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు ఉండేలా చూసుకోండి. మాంసాహారంలో రెడ్మీట్కు బదులు మెత్తని మాంసంతో (లీన్) కూడిన చికెన్, చేపలు వంటివి తీసుకోవాలి. వంటల్లో నూనె వాడకం తగు మోతాదులో ఉండాలి. పొట్టుతీయని తృణ ధాన్యాలు ఎక్కువగా వాడాలి. ⇒ డయాబెటిస్ను అదుపులో ఉంచుకోవాలి⇒ కొలెస్ట్రాల్ తగ్గించుకోవాలి. వ్యాయామం : ప్రతిరోజూ కనీసం 30 నిమిషాలకు తగ్గకుండా వ్యాయామం చేయాలి.చికిత్స⇒ ఆల్కహాల్ అలవాటు ఉన్నవారు పూర్తిగా మానేయాలి.⇒ చాలా కొద్దిమందిలో మందులు, శస్త్రచికిత్స అవసరం కావచ్చు.⇒ బాధితులు వాడుతున్న ఏవైనా మందుల వల్ల ఫ్యాటీ లివర్ వ్యాధి వచ్చిందేమో చూసుకోవాలి. అవసరమైతే డాక్టర్లు మందులను మారుస్తారు.చివరిగా.. ఫ్యాటీ లివర్ వ్యాధి విషయంలో చికిత్స కంటే నివారణ మేలు. -
ఆరోగ్యం కోసం మైక్రోసాఫ్ట్ కెరీర్ని వదిలేసుకున్న సీఈవో..!
ఆరోగ్యమే మహాభాగ్యం అంటున్నారు కొందరు ప్రముఖులు. అందుకోసం అత్యున్నతమైన కెరీర్ని కూడా వదిలేస్తున్నారు. ఆ కోవకు చెందని వారే భారత సంతతికి చెందిన ఈ సీఈవో. ఫిట్నెస్కి ప్రాధాన్యత ఇచ్చి మంచి కెరీర్కి స్వస్తి పలికిన వ్యక్తిగా వార్తల్లో నిలిచారాయన. ఎందుకిలా అంటే..అమెరికాలో నివసిస్తున్న భారత సంతతికి చెందిన సీఈఓ సుధీర్ కోనేరు ఐఐటీ మద్రాస్ పూర్వ విద్యార్థి. ఆరోగ్యవంతంగా జీవించాలని మైక్రోసాఫ్ట్లో సుమారు 15 ఏళ్ల విజయవంతమైన కెరీర్కు స్వస్థి పలికి రిటైరయ్యారు. ప్రస్తుతం ఆయన సియాటిల్కు చెందిన జెనోటీ అనే కంపెనీకి నాయకత్వం వహిస్తున్నారు. ఇది సెలూన్లు, స్పాలు, ఫిట్నెస్ కేంద్రాలకు మంచి వ్యాపార సాఫ్ట్వేర్ని అందిస్తుందట. అంతేగాదు 56 ఏళ్ల సుధీర్ మంచి ఆరోగ్యానికి పెద్దపీట వేసి మరీ బెంగళూరు బ్రీతింగ్ వర్క్షాప్లకు హాజరవుతారట. అందుకోసం సుమారు రూ. 1లక్ష నుంచి 1.6 లక్షలు ఖర్చు చేస్తారు. కేవలం నాలుగు రోజుల ఈ బ్రితింగ్ వర్క్షాప్లకు ఆయన ప్రతి ఏడాది రూ. 3.5 లక్షల వరకు ఖర్చు చేస్తారట. ఈ సెషన్లలో ఆధ్యాత్మిక శ్వాస పద్ధతులకు సంబంధించి రెండు గంటల గైడ్లైన్స్, ధ్యానాలు ఉంటాయట. వాటిని సుధీర్ శరీరాన్ని అద్భుతంగా నయం చేసేవి, చాలా శక్తిమంతమైనవిగా పేర్కొంటారాయన.మైక్రోసాఫ్ట్లో సుధీర్ ప్రస్థానం..సుధీర్ 1992లో మైక్రోసాఫ్ట్ ప్రొడక్ట్ మేనేజర్గా కెరీర్ ప్రారంభించి..జస్ట్ ఎనిమిదేళ్లకే 2000లో తన సొంత కంపెనీ ఇంటెలిప్రెప్ను ప్రారంభించారాయన. సరిగ్గా 2008లో అంటే 39 ఏళ్ల వయసులో కెరీర్ మంచి పీక్ పొజిషన్లో ఉండగా యోగా, వాకింగ్, జాగింగ్ వంటి ఫిట్నెస్ కోసం కంపెనీని విడిచిపెట్టారు. తాను ఆర్థికంగా ఉన్నత స్థితిలోఉన్నా..కానీ ప్రస్తుత లక్ష్యం కేవలం తన వ్యక్తిగత శ్రేయస్సు తోపాటు కుటుంబంతో బలమైన బంధాలు ఏర్పరుచుకోవడమేనని చెబుతున్నారు సుధీర్. వర్క్ పరంగా తాను చాలా బెస్ట్ కానీ, కేవలం డబ్బు సంపాదించడమే కాదు..అంతకుమించి తన కోసం సమయం కేటాయించాలని, అప్పుడే ఆరోగ్యంగా ఉండగలమని గ్రహించానంటాడు సుధీర్. అందుకోసమే రెండేళ్ల సుదీర్థ సెలవుల అనంతరం మైక్రోసాఫ్ట్ కంపెనీని నుంచి పదవీ విరమణ చేసి జెనోటిని స్థాపించానని తెలిపారు. తన కంపెనీ సంస్కృతిలో వెల్నెస్ సూత్రాలు అందించడానికి ప్రయత్నిస్తున్నాడు. అంతేగాదు తన సంస్థ పని సమయంలో యోగా, కిక్బాక్సింగ్, పైలేట్స్, వంటి ఫిట్నెస్ తరగతులను నిర్వహిస్తుంది. ఉద్యోగులు వీటిలో పాల్గొని వర్కౌట్లు చేసినట్లయితే మంచి పారితోషకం కూడా పొందుతారట. అంతేగాదు తన ఉద్యోగులకు స్పా, సెలున్లలో మంచి మసాజ్లు, ఆరోగ్యకరమైన స్నాక్స్ వంటివి కూడా అందుబాటులో ఉంటాయని చెబుతున్నారు. ఇక తన దృష్టిలో ఫిట్నెస్ అంటే సిక్స్ ప్యాక్ని కలిగి ఉండటం కాదట. సమతుల్యమైన ఆహారంతో మంచి సామర్థ్యంతో జీవించడమే తన ధ్యేయమని చెబుతున్నారు. ఇక సుధీర్ వీక్ఆఫ్లతో సహా వారం రోజులు ఉదయమే ఏడింటికే యోగా చేస్తారట. బాలికి వెళ్లి కొన్నిరోజులు రెస్ట్ తీసుకుంటారట. అక్కడ మసాజ్లు, సన్బాత్ వంటి చికిత్సలు తీసుకుంటారట. అలాగే బెంగళూరులోని నాలుగు రోజుల శ్వాస వర్క్షాప్లో కూడా పాలుపంచుకుంటారట.(చదవండి: 56 ఏళ్ల తర్వాత స్కూల్కి వెళ్తే..! పెద్దాళ్లు కాస్తా చిన్నపిల్లల్లా..) -
ఉల్లిపాయలు, బంగాళదుంపలు కలిపి నిల్వ చేయకూడదా..?
సాధారణంగా ఉల్లిపాయలు, బంగాళదుంపలు ఫ్రిడ్జ్లో ఉంచం. సాధారణంగా బయట అరమాల్లో రెండింటిని ఒకే చోట ఉంచుతాం. కొందరైతే నేరుగా ఉల్లిపాయ బుట్టలోనే ఉంచుతారు. అయితే ఇలా మాత్రం అస్సలు ఉంచకూడదంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నారు. ఇది ప్రాణాంతంకమని, ఒక్కోసారి ఇలా నిల్వచేసిన వాటినే గనుక వండి తింటే ప్రాణాలు పోయే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. అందుకు సరైన ఆధారాలు స్పష్టం కానప్పటికీ ఇలా రెండింటిని కలిసి నిల్వ చేయద్దని మాత్రం సూచిస్తున్నారు. ఎందుకంటే..ఇలా ఎప్పుడైతే రెండింటిని కలిపి నిల్వ చేస్తారో..అప్పుడు ఉల్లిలో విడుదలయ్యే ఎథెలిన్ బంగాళదుంపలతో చర్య జరిపి..త్వరగా మొలకెత్తేలా చేస్తుందట. అంతేగాదు అలాంటి బంగాళ దుంపల్లో సోలనిన్, చాకోనిన్ అనే విషాలు ఉత్పత్తి అవుతాయి. అవి గనుక తీసుకుంటే..అల్సర్లు, పేగువాపు, ఫుడ్ పాయిజనింగ్ అయ్యే అవకాశాలు మెండుగా ఉంటాయట. అంతేగాదు ఒక్కోసారి నాడీ సంబంధిత రుగ్మతలకు దారితీసి ప్రాణాంతకంగా మారే ప్రమాదం కూడా ఉందని చెబుతున్నారు నిపుణులు. అధ్యయనంలో కూడా..అమెరికా సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ ఇన్ఫర్మేషన అధ్యయనాల ప్రకారం ఉల్లిపాయలు ఇథలీన్ను విడుదల చేస్తాయి. ఎప్పుడైతే వాటి సమీపంలో ఇతర ఆహార పదార్థాలను ఉంచుతామో.. అవి త్వరగా పాడవ్వడం జరగుతుందని చెబుతున్నారు నిపుణులు. అదీగాక ఈ బంగాళ దుంపలు సహజంగా సోలనిన్, చాకోనిన్ వంటి ఆల్కాలయిడ్లను కలిగి ఉంటుంది. ఎప్పుడైతే ఇలా ఉల్లిపాయల వద్ద వాటిని ఉంచగా..అవి త్వరగా మొలకెత్తి..పెద్ద మొత్తంలో విషపూరితమైన ఆల్కలాయిడ్లను విడుదల చేస్తుందని యూరోపియన్ ఫుడ్ సేఫ్టీ అథారిటీ పేర్కొంది. ఈ పచ్చి లేదా చెడిపోయిన బంగాళ దుంపలు మానవులకు అత్యంత ప్రమాదమని అధ్యయనంలో వెల్లడైంది. అందువల్ల మొలకెత్తని తాజా బంగాళ దుంపలే తినడం మంచిదని పేర్కొంది. సాధ్యమైనంత వరకు ఈ రెండిని కలిపి నిల్వ చేయకపోవడమే మంచిదని సూచిస్తున్నారు నిపుణులు. (చదవండి: నేచురల్ బ్యూటీ కోసం ఐదు పువ్వులు..! ఆ సమస్యలు దూరం..) -
వరల్డ్ బ్రెయిన్ డే : ఎలాంటి సంకేతాలు, లక్షణాలుండవు..అదొక్కటే రక్ష!
హైదరాబాద్ : మానవ జీవక్రియలను నియంత్రించే మెదడు ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ఒత్తిడి లేని జీవన శైలియే కీలకమని ఆలివ్ హాస్పిటల్ వైద్యులు పేర్కొన్నారు. జులై 22 ప్రపంచ మెదడు దినోత్సవం సందర్భంగా "వయో భేదం లేకుండా మెదడు ఆరోగ్యం" అనే అంశంపై పుల్లారెడ్డి డిగ్రీ & పిజి కళాశాలలో ఆలివ్ హాస్పిటల్ యాజమాన్యం అవగాహన సదస్సును నిర్వహించింది. మానసిక స్థిరత్వం, ఆరోగ్యంపై విద్యార్థులు, అధ్యాపకులకు అవగాహన కల్పించింది. హాస్పిటల్లోని కన్సల్టెంట్ న్యూరో సర్జన్ డాక్టర్ షేక్ ఇమ్రాన్ అలీ సదస్సుకు ప్రాతినిధ్యం వహించారు. మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం, ప్రారంభ సంకేతాలను గుర్తించడం, భావోద్వేగాల నియంత్రణ ఎలా దోహదపడుతుందోననే విషయాలను వివరించారు.200 మందికి పైగా విద్యార్థులతో మాట్లాడుతూ, డాక్టర్ షేక్ ఇమ్రాన్ మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో జీవనశైలి, ఒత్తిడి నిర్వహణ, మానసిక దృఢత్వం కీలక పాత్రను పోషిస్తాయన్నారు. "మెదడు ఆరోగ్యం దెబ్బతిన్నట్లుగా ఎలాంటి సంకేతాలు, లక్షణాలు ఉండవని అందుకే మెదడు శ్రేయస్సును కాపాడుకోవడం చాలా ముఖ్యమన్నారు. ఇది కేవలం వైద్యపరమైన ఆందోళన మాత్రమే కాదనీ, విద్యావిషయక సాధనకు, జీవితకాలం పాటు నాడీ ఆరోగ్యానికి మానసిక స్థితిస్థాపకతను పెంపొందించుకోవడం చాలా అవసరం అన్నారు. మెదడుకు క్రమం తప్పకుండా విరామం ఇవ్వడం, స్క్రీన్ టైమింగ్ తగ్గించడం, ఒత్తిడి నియంత్రణకు ప్రాణాయామ సాధన అవసరం" అని ఆయన అన్నారు. సమాచార వ్యాప్తి, నాడీ సంబంధిత రుగ్మతలు ఇప్పుడు మరణానికి రెండవ ప్రధాన కారణమని WHO విడుదల చేసిన నివేదికను ప్రస్తావించారు.ఇదీ చదవండి: ఓ మహిళ పశ్చాత్తాప స్టోరీ : ‘భర్తలూ మిమ్మల్ని మీరే కాపాడుకోండయ్యా!’ఈ అవగాహన ద్వారా, ఆలివ్ హాస్పిటల్ అభిజ్ఞా క్షీణత యొక్క ముందస్తు హెచ్చరిక సంకేతాలు, దృష్టిని మెరుగుపరచడానికి పద్ధతులు మానసిక స్పష్టత, భావోద్వేగ సమతుల్యతను నిర్వహించడానికి ఆచరణాత్మక దశలపై ఇంటరాక్టివ్ సెషన్ ద్వారా వివరించారు. మెదడు ఆరోగ్యం యొక్క ప్రాథమికాలపై యువ తరాలకు అవగాహన కల్పించడం ద్వారా క్లినికల్ కేర్, కమ్యూనిటీ అవగాహన మధ్య అంతరాన్ని తగ్గించడం లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు.చదవండి: మునుపెన్నడూ ఎరుగని ఉల్లాస యాత్ర : పురాతన ఆలయాలు, సరస్సులు -
'A2 నెయ్యి' అంటే..? దీనికి మాములు నెయ్యికి తేడా ఏంటంటే..
నెయ్యి తినడం మంచిదని విన్నాం. ఇటీవలకాలంలో పోషకాహార స్పృహ ఎక్కువై..మంచి విటమిన్లుతో కూడిన వాటికే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఏదో తిన్నామంటే తినడం కాకుండా..ఆరోగ్యదాయకమైన వాటికే ప్రాధాన్యత ఇస్తున్నారు. అందులో ఒకటే ఈ 'ఏ2 నెయ్యి' . దీన్ని ఆధునిక సూపర్ ఫుడ్గా కీర్తిస్తున్నారు. అంతేగాదు ఆయుర్వేద గ్రంథాల్లో సైతం దీన్ని "లిక్విడ్ గోల్డ్"గా వ్యవహరిస్తున్నారు. అసలేంటీ నెయ్యి..? మాములు నెయ్యికి దీనికి ఉన్న తేడా ఏంటంటే..ఏ2 నెయ్యి అంటే..గిర్, సాహివాల్ మరియు రతి వంటి స్వదేశీ భారతీయ ఆవుల పాల నుంచి తీసిన నెయ్యిని ఏ2 నెయ్యిగా వ్యవహరిస్తారు. దీన్ని తీసే విధానంలో కూడా చాలా వ్యత్యాసం ఉంటుందట. ఎందుకంటే మాములు వాటిలో పచ్చి పాల నుంచే నేరుగా నెయ్యిని సెపరేట్ చేయరు. పెరుగుగా తోడుపెట్టి పులిసిన మజ్జిగ నుంచే వెన్నను సెపరేట్ చేసి చక్కగా కాస్తారు. ఇది చూడటానికి గోల్డెన్ రంగులో సువాసనలు వెదజల్లుతూ ఉంటుందట. ఇందులో బీటా కేసిన్ ప్రోటీన్ మాత్రమే ఉంటుందట. అదే సాధారణ వాణిజ్య పాల్లో ఏ1 బీటా కేసిన్ ఉంటుందట. అంతేగాదు ఈ ఏ2 పాలు టైప్ 1 డయాబెటిస్, కరోనరి హార్ట్ డిసీటజ్ ఆర్టెరియోస్క్లెరోసిస్ ఆటిజం, స్కిజోఫెనియా వంటి శిశు ఆకస్మిక మరణాలను నివారించగలదట. ఈ ఏ2 నెయ్యిని 5 వేల ఏళ్లనాటి పురాతన పద్ధుతుల్లో చేయడం వల్లే ఇన్ని విటమిన్స్ , పోషకాలు సమృద్ధిగా ఉంటాయిట.ఎలాంటి పోషకాలు ఉంటాయంటే.. ఇందులో విటమిన్ ఏ, విటమిన్ డీ, కాల్షియం, విటమిన్ ఈ, యాంటీ ఆక్సిడెంట్ విటమిన్ కే, ఒమేగా 3, ఒమేగా 9 తదితర కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. ఇవేగాక మెదడు పనితీరుని మెరుగుపరిచే సంయోగ లినోలిక్ ఆమ్లం (CLA) వంటివి ఉంటాయి. ఇందులో ఉండే విటమిన్లు పిల్లలు, గర్భిణీ స్త్రీలు, అథ్లెట్లు, అనారోగ్యం నుంచి కోలుకుంటున్న వ్యక్తులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. సులభంగా జీర్ణమయ్యే సామర్థ్యం పెరుగుతుంది కూడా. అలాగే ఆరోగ్యకరమైన గట్ మైక్రోబయోమ్కు మద్దతు ఇచ్చి, జీర్ణవ్యవస్థలో మంటను తగ్గిస్తుంది. పాలు, పన్నీర్ వంటివి పడవని వారికి ఈ ఏ2 నెయ్యి మంచి సహాయకారిగా ఉంటుందని చెబుతున్నారు నిపుణులు. చర్మం, జుట్టు, కొలెస్ట్రాల్ వంటి సమస్యలను నివారిస్తుందా..ఈ ఏ2 నెయ్యి రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేసి చర్మ వ్యాధుల నుంచి రక్షిస్తుంది. సహజమైన మెరుపుని అందిస్తుంది. అలాగే జుట్టు ఆకృతిని మెరుగుపరిచి, జుట్టురాలు సమస్యను నివారిస్తుంది. ఇందులో గుండె ఆరోగ్యానికి మద్దతు ఇచ్చే ఆరోగ్యకరమైన కొలెస్ట్రాల్ ఉంటుందట. అలాగని మితీమిరీ వినయోగించొద్దని హెచ్చరిస్తున్నారు నిపుణులు. ఎప్పుడు సమతుల్యతకు పెద్దపీట వేస్తే..ఏదైనా ఆరోగ్యకరంగా ఉంటుందని చెబుతున్నారు.(చదవండి: 56 ఏళ్ల తర్వాత స్కూల్కి వెళ్తే..! పెద్దాళ్లు కాస్తా చిన్నపిల్లల్లా..) -
'నేచర్లో' నేర్చుకో..! ఆరుబయట అభ్యాసం..
ఆకాశంలో తారలు, చందమామల గురించి మనకు తెలుసు. చెట్లూ పుట్టల గురించి కూడా మనకు తెలుసు.. అయితే వీటిలో చాలా వరకూ మనం నాలుగు గోడల మధ్య తరగతి గదిలో కూర్చుని చదువుకున్నాం.. కాబట్టి మనకు అవగాహన ఉంది.. కానీ ఆకాశంలోకి చూస్తూ.. నక్షత్రాల గురించి, అడవిలో నడుస్తూ ఆకులు, చెట్ల గురించి తెలుసుకోవడం ఎలా ఉంటుంది? ‘అదే అసలైన చదువు’ అంటున్నారు పలువురు నగరవాసులు. అవుట్ డోర్ క్లాస్ రూమ్ లెసన్స్కి జై కొడుతున్నారు. ప్రస్తుతం ఆకాశం వైపు చూడటం కంటే మొబైల్ స్క్రీన్లనే పిల్లలు ఎక్కువగా చూస్తున్నారు. చందమామను కూడా తల్లులు మొబైల్స్లోనే చూపించాల్సిన దుస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో అసలైన చదువు అంతా ఆరుబయటే ఉందని భావించిందో మిత్రబృందం. అనుకున్నదే తడవుగా ఓ కొత్త ఆలోచనకు తెరతీసింది. తద్వారా అవుట్ డోర్ క్లాస్ రూమ్ అనే కాన్సెప్ట్ డిజైన్ చేసింది. సరికొత్త తరగతి గదులను నగరవాసులకు పరిచయం చేస్తోంది. ‘ఈ కాన్సెప్్టని కోవిడ్ సమయంలో ఆలోచించాం. నాలుగేళ్ల క్రితం మొదలుపెట్టాం. తొలిదశలో మొత్తం ఐదారుగురమే కానీ, ఇప్పుడు మా టీమ్ 25కి చేరింది’ అంటూ చెప్పారు మాజీ ఐటీ ఉద్యోగి రాఘవ. తమ కాన్సెప్ట్ గురించి ఆయన పంచుకున్న విశేషాలు ఆయన మాటల్లోనే.. వాట్సాప్ గ్రూప్గా ప్రారంభమై.. నా స్నేహితుడు దేవేందర్, ఐశ్వర్యలతో కలిసి మరికొందరు స్నేహితులను ఆహ్వానించడం ద్వారా అది ఒక వాట్సాప్ గ్రూప్గా ప్రారంభమైంది. కాలక్రమేణా మా కార్యకలాపాలు వైవిధ్యభరితంగా మారాయి. మా టీమ్లో నక్షత్రాలూ పాలపుంతలను విడమరిచే ఆ్రస్టానమీ తెలిసిన నిపుణుల నుంచి గణితాన్ని ప్రకృతితో ముడిపెట్టి వివరించే మాథ్ మెటీషియన్ వరకూ.. ఒక్కొక్కరూ ఒక్కో సబ్జెక్ట్లో స్పెషలైజేషన్ చేసిన 25 మంది ఉన్నారు. ఎంచుకున్న టాపిక్ బట్టి వారు ఆయా సెషన్లకు హాజరవుతూ పాఠాలు బోధనలా కాకుండా ప్రాక్టికల్ అనుభవాలను అందిస్తారు. నగరంలోని పార్కుల నుంచి కర్ణాటకలోని కూర్గ్ వరకూ.. ‘నగరంలోని రాక్ ఏరియాలు, పార్కులు, లేక్స్.. ఇలా కాదేదీ క్లాస్రూమ్కి అనర్హం అన్నట్టుగా మారిపోతాయి. నగరం మాత్రమే కాదు రాష్ట్రాలు కూడా దాటుతూ, కూర్గ్ వంటి హిల్ స్టేషన్స్లో సైతం సెషన్స్ ఏర్పాటు చేస్తాం. ట్రెక్కింగ్, రాక్ క్లైంబింగ్, హైకింగ్లు, ఫొటో వాక్లు, చారిత్రక బాటలు, రాత్రుళ్లు నక్షత్రాల వీక్షణం, తల్లిదండ్రులు–పిల్లల శిబిరాలు.. ఇలా అవుట్డోర్ క్లాస్రూమ్స్ ప్రతి నెలా అనేక సెషన్లు నిర్వహిస్తుంది. పాఠశాల విద్యార్థుల నుంచి కార్పొరేట్ బృందాల వరకూ ఇందులో భాగస్వాములవుతున్నారు. పైగా వీరంతా ఈ తరహాబోధనకు ఆకర్షితులవుతున్నారు’ అని చెప్పుకొచ్చారు. ఇప్పటికి దాదాపు 100కిపైగా క్లాసులు.. ‘ప్రతి సెషన్లో కనీసం 25 నుంచి 40 మంది వరకూ స్థానం కల్పిస్తాం. నగరంలోని పలు స్కూల్స్, కార్పొరేట్ సంస్థలతో కలిసి వీటిని ప్లాన్ చేస్తుంటాం. ఇప్పటికి దాదాపు 100కి పైగానే క్లాస్ రూమ్స్ నిర్వహించాం. ఇతర నగరాల్లోనే కాకుండా భవిష్యత్తులో విదేశాలకు సైతం విస్తరించాలనే ఆలోచన చేస్తున్నాం’ అంటూ ముగించారు రాఘవ. ఉరుకుల పరుగుల జీవితంలో నేర్చుకోవడం కూడా అంతే వేగంగా మారిపోయింది. ఈ నేపథ్యంలో నేచర్ గురించి తెలుసుకోవడం ఎంత ముఖ్యమో.. నేచురల్గా నేర్చుకోవడమూ అంతే ముఖ్యం అనే ఆలోచనే ఈ తరహా అవుట్ డోర్ క్లాస్ రూమ్స్కి ఊపునిస్తోందనేది నిరి్వవాదమైన అంశం. (చదవండి: -
పచ్చని విరులు.. ఆరోగ్యపు సిరులు..
ప్రతి ఒక్కరూ పచ్చని ప్రకృతిని చూస్తే పరవశించిపోతారు. అలాంటి పచ్చని ప్రకృతి మన ఇంట్లోనే ఉంటే ఇటు కంటికి.. అటు ఒంటికి ఆరోగ్యాన్ని అందిస్తాయి. వర్షాకాలం కావడంతో నగరంలో నర్సరీలు పూలు, పండ్లు, ఆయుర్వేదం మొక్కలతో అమ్మకాలకు సిద్ధమయ్యాయి. అదే తరహాలో కొనుగోలుదారులతో సందడిగా మారుతున్నాయి. ఇంటి అలంకరణలో భాగంగా మొక్కలు పెంచేందుకు రంగు రంగుల కుండీలు సైతం ఆకర్షిస్తున్నాయి. హఫీజ్పేట డివిజన్ పరిధిలోని కొత్తకుంట చెరువు కట్టపై ఆర్టీసీ కాలనీ వద్ద, జాతీయ రహదారి జెనిసిస్ స్కూల్ వద్ద నర్సరీలు ఏర్పాటు చేశారు. ఇవి మొక్కల ప్రేమికులను, కొనుగోలుదారులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రి, కడియం నర్సరీల నుంచి మొక్కలు తీసుకొచ్చి అమ్మకందారులు ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. గత పదేళ్లుగా కూకట్పల్లిలోని హౌసింగ్ బోర్డులో నర్సరీలు ఏర్పాటు చేసేవారు మొక్కల అమ్మకాలకు డిమాండ్ ఏర్పడటంతో మియాపూర్, హఫీజ్పేట్ పరిసర ప్రాంతాల్లోనూ విరివిగా ఏర్పాటు చేస్తున్నారు. కొన్ని కుటుంబాలకు నర్సరీలే జీవనాధారం. ఈ నర్సరీల్లో 500ల రకాల వరకూ వివిధ రకాల మొక్కలు ఏర్పాటు చేస్తారు. అలంకరణ మొక్కలు, పూల మొక్కలు, ఆయుర్వేదం, పండ్ల జాతులు అమ్మకాలకు ఉంచుతారు. ఇతర ఉత్పత్తులు.. మొక్కల పెంపకానికి కావాల్సిన వివిధ రకాల మోడళ్లలో రంగు రంగుల కుండీలు, సేంద్రీయ ఎరువులు, వర్మీ కంపోస్టు, కోకోపిట్, ఆయుర్వేదం, పండ్లు, పూలు, అలంకరణ మొక్కలకు కావాల్సిన పురుగు మందులు, ఇళ్లలోకి కీటకాలను నివారించే మొక్కలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. దీంతో పాటు ఇంటి ఆవరణలో ఏర్పాటు చేసే లాన్ కూడా సప్లై చేస్తున్నారు. కుండీలు రూ.20 నుంచి రూ.350 వరకూ అమ్ముతున్నారు. పూల మొక్కలకు గిరాకీ.. గులాబీ, చామంతి, మందారం, అలంకరణ పూలు వంటివి సుమారు 300 రకాలు అందుబాటులో ఉన్నాయి. ఇన్ అండ్ అవుట్ డోర్ మొక్కలు, తులసిలో లక్ష్మీ, కృష్ణ, శివుడి పూజకు బిల్వపత్రం, శంకం పూలు, పారిజాతం, ఉసిరి, జమ్మి వంటి మొక్కలు అమ్మకానికి ఉన్నాయి. వీటిలో రూ.30 నుంచి రూ.350 వరకూ ధరల్లో విక్రయిస్తున్నారు. ఆయుర్వేదం, పండ్ల మొక్కలు.. వివిధ రకాల రోగాలను నియంత్రించడంలో ఉపయోగపడే ఆయుర్వేదం మొక్కలైన తులసి, కలబంద, నల్లేరు, రణపాల, గరిక, తిప్పతీగ, మారేడు మొక్కలతోపాటు పండ్ల మొక్కలైన సపోట, దానిమ్మ, జామ, మామిడి, అంగూర్, నిమ్మ తదితర హైబ్రిడ్ మొక్కలు అలరిస్తున్నాయి. దోమలను నివారించే లెమన్ గ్రాస్, లావెండర్, పుదీన, సిటోన్రెల్లా వంటి అనేక మొక్కలు ఉన్నాయి. నర్సరీ ఏర్పాటు సంతోషకరం..కొత్తకుంట చెరువు కట్టపై నర్సరీ ఏర్పాటు సంతోషకరం.. కాలనీ వాసులు ఇష్టానుసారం చెత్త వేస్తున్న నేపథ్యంలో అదే స్థలంలో మొక్కలు పెంచడం మంచిపరిణామం. చెరువు నీరు మొక్కల ఎదుగుదలకు ఉపయోగం. వివిధ రకాల పూలు, పండ్ల మొక్కలు అమ్మకానికి అందుబాటులో ఉంచారు. – సురేష్ మదీనాగూడఆయుర్వేద మొక్కలకు గిరాకీ.. ఇటీవలి కాలంలో చాలా మందికి ఆరోగ్యంపై అవగాహన పెరగడంతో ఆయుర్వేద మొక్కలకు గిరాకీ పెరిగింది. దీంతో పాటు కీటకాలను నివారించే కొన్ని రగకాల గడ్డిజాతి మొక్కలకు కూడా డిమాండ్ ఏర్పడింది. – రాజు, నర్సరీ నిర్వాహకుడు -
బట్టతల, వైట్ హెయిర్ ఎందుకు వస్తుంది...? జుట్టు నల్లబడాలంటే!
కొందరిలో జుట్టు ఉండి కూడా నెరిసిపోతుంటే అది కూడా ఓ సమస్యే. అయితే ఈ పరిస్థితి కాస్త ఉపశమనం కలిగించే సమస్య. ఎందుకంటే... అసలు జుట్టు లేకపోవడం కంటే... తలపై వెంట్రుకలు ఉండి అవి తెల్లబడుతుంటే కనీసం రంగైనా వేసుకోవచ్చునన్నది పలువురి అభిప్రాయం. ఒక వయసు రాకముందే జుట్టు తెల్లబడటాన్ని బాలనెరుపుగా (ప్రీ–మెచ్యుర్ గ్రేయింగ్ ఆఫ్ హెయిర్గా) చెబుతుంటారు. వెంట్రుకలు ఎందుకు నెరుస్తాయో చూద్దాం. వెంట్రుకలు తెల్లబడటం ఎందుకు... సాధారణంగా మన వెంట్రుకల మూలాన్ని హెయిర్ ఫాలికిల్ అంటారు. ఇక్కడ మెలనోసైట్స్ అనే కణాలు ఉంటాయి. ఇవి మెలనిన్ అనే రంగునిచ్చే పిగ్మెంట్ను ఉత్పత్తి చేస్తాయి. ఈ పిగ్మెంట్ వల్లనే వెంట్రుకకు నల్లటి రంగు వస్తుంది. కొన్ని వెంట్రుకల్లో మెలనిన్ ఉత్పత్తి ఆగిపోతుంది. ఫలితంగా ఆ వెంట్రుక నల్లరంగును కోల్పోయి తెల్లగా మారుతుంది. నిజానికి వాడుక భాషలో దాన్ని తెల్లవెంట్రుకగా చెబుతుంటాంగానీ... వాస్తవానికి వెంట్రుక తెల్లగా మారదు. మెలనిన్ ఇచ్చే నలుపు రంగును కోల్పోవడం వల్ల అది ఒక మేరకు పాక్షికంగా పారదర్శకం (ట్రాన్స్లుసియెంట్)గా మారుతుంది. దాంతో అది తెల్లవెంట్రుకలా కనిపిస్తుంది.చదవండి: Hidden Threats : జుట్టు రాలిపోయే.. స్కిన్పాలిపోయే! జుట్టు తెల్లబడటానికి కారణాలు... వెంట్రుకలు తెల్లబడటానికి అనేక కారణాలు ఉన్నాయి. అందులో అన్నిటికంటే ప్రధానమైనవి జన్యుపరమైన కారణాలు. తల్లిదండ్రుల్లో ఎవరికైనా వెంట్రుకలు త్వరగా నెరిస్తే పిల్లల్లోనూ అవి త్వరగా తెల్లబడటానికి అవకాశాలెక్కువ. వయసు పెరుగుతున్న కొద్దీ వెంట్రుకలు తెల్లబడటం జరగాలి. కానీ కొందరిలో చాలా త్వరగా వెంట్రుకలు తెల్లగా కావచ్చు. ఇందుకు సహాయపడే మరికొన్ని కారణాలు చూద్దాం. కారణాలు : రక్తహీనత (అనీమియా) పొగతాగే అలవాటు, మితిమీరిన ఒత్తిడి, థైరాయిడ్ లోపాలు / థైరాయిడ్ అసమతౌల్యత, విటమిన్ బి–12 లోపం వీటికి తోడు కాలుష్యం, పోషకాహార లోపం కూడా కొంతమేరకు తెల్లవెంట్రుకలకు కారణమవుతాయి.వెంట్రుకలు నల్లబడాలంటే... విటమిన్ బి–12 మాంసాహారంలో ఎక్కువగా లభ్యవమతుంటుంది కాబట్టి అది సమృద్ధిగా అందేలా మాంసాహారం తీసుకోవడం. ఒకవేళ శాకాహారులైతే రోజూ గ్లాసెడు పాలు తాగడంతోపాటు, వైటమిన్ బి12 ఎక్కువగా లభించే తృణధాన్యాలు తినడం, అప్పటికీ సరైన మోతాదులో విటమిన్ బి12 అందకపోతే డాక్టర్ సలహా మేరకు వైటమిన్ బి12 అందేలా టాబ్లెట్లు వాడటం అవసరం.కాలుష్యం తాలూకు దుష్ప్రభావంతో వెంట్రుక బలహీనమవుతుంది. దాంతో అది తేలిగ్గా తెగిపోవడం, జుట్టుకు సహజంగా ఉండే మెరుపు తగ్గిపోవడం జరుగుతుంది. దీనికి తోడు వాతావరణ ఉష్ణోగ్రత కూడా పెరగడంతో... దేహానికి అవసరమైన అన్ని రకాల పోషకాలు అందడం తగ్గుతుంది. దాంతో ఆ ప్రభావం వెంట్రుక మీద కూడా పడుతుంది. వాతావరణంలోని వేడిమితో విపరీతంగా చెమటలు పట్టడం వంటి కారణాలతో... శరీరంలోని లవణాలు, పోషకాలు వెంట్రుకలకు అందడం తగ్గి అది జుట్టు మీదా ప్రభావం చూపుతుంది. ఫలితంగా జుట్టు చింపిరిగా మారడం, తేలిగ్గా విరిగి΄ోయేలా (అంటే తెగడం–ఫ్రాజైల్గా మారిపోయేలా) వెంట్రుకలో కొన్ని మార్పులు వస్తాయి. దుమ్మూధూళి వల్ల జుట్టు తేలిగ్గా చింపిరిగా మారడంతో పాటు మాడుపైన దుష్పరిణామాలు కనిపించవచ్చు. దాంతో మాడుపైనుంచి చుండ్రు, పొట్టు రాలుతుండటం వంటివి పెరిగేందుకు అవకాశాలెక్కువ. వీటన్నింటి మొత్తం ప్రభావాల వల్ల వెంట్రుకలు తేలిగ్గా రాలడం వంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి. కాలుష్య ప్రభావం వెంట్రుకలూ / జుట్టుపై ఎలా పడుతుందంటే... పురుషుల్లో బట్టతలకు జన్యుపరమైన కారణాలే ప్రధానమైనవి. దానికి తోడు మగపిల్లల్లో వారు యుక్తవయసు వచ్చేనాటికి అతడిలో స్రవించే పురుష హార్మోన్లు వెంట్రుకలను పలచబార్చడం మొదలుపెడతాయి. ఇలా పురుష హార్మోన్ల కారణంగా వెంట్రుకలు పలచబడుతూ ΄ోవడాన్ని ‘యాండ్రోజెనిక్ అలొపేషియా’ అంటారు. పురుషుల్లో ఒక యుక్తవయసు వచ్చిన నాటి నుంచి తలవెంట్రుకలు మొదలయ్యే హెయిర్ లైన్ క్రమంగదా వెనక్కు జరుగుతుంటుంది. అందుకే పురుషుల్లో దాదాపు 25 శాతం మందిలో యుక్త వయసు నుంచి 30 ఏళ్లు వచ్చే వరకు ఎంతోకొంత జుట్టు పలచబారుతుంది. కారణాలు: పురుషుల్లో కండరాలు బలపడటానికి, ఎముకల సాంద్రత పెరగడానికి వీలుగా టెస్టోస్టెరాన్ అనే హార్మోన్ ఉత్పత్తి పెరుగుతుంది. అది రోమాంకురమైన హెయిర్ ఫాలికిల్ను ఎంతో కొంత బలహీన పరుస్తుంది. దాంతో వెంట్రుకలు రాలడం పెరిగి జుట్టు పలచబారుతూ పోతుంది. దీనికి తోడు ఒత్తిడి వంటి మరికొన్ని అంశాలు దీనికి తోడైతే జుట్టు రాలడం మరింత పెరుగుతుంది. ఇదీ చదవండి: 6 నెలల్లో 27 కిలోలు తగ్గాను..ఇదంతా దాని పుణ్యమే!మందులు : వెంట్రుకలు రాలడాన్ని పూర్తిగా నివారించలేకపోయినప్పటికీ... జుట్టు రాలడాన్ని ఆపేందుకూ, రాలిన వెంట్రుకలు తిరిగి మొలవడానికి సహాయపడే కొన్ని పూత మందులు, నోటి ద్వారా తీసుకునే మందుల వంటివి కొన్ని అందుబాటులో ఉన్నాయి. అయితే వాటివల్ల దుష్ప్రభావాలు ఎక్కువ. ఉదాహరణకు ఇవి వాడేవారిలో తలనొప్పి, చుండ్రు, మాడు చర్మం మందంగా మారడం, రక్తపోటు తగ్గిపోవడం వంటి అనేక సమస్యలు రావచ్చు. నోటి ద్వారా మందులు వాడే వారిలో రొమ్ములు పెరగడం, అంగస్తంభన లోపాలు వంటివీ రావచ్చు. పైగా వీటి ఉపయోగం తాత్కాలికమే. ఆ మందులు ఆపేసిన మరుక్షణం జుట్టు రాలడమనేది మళ్లీ మొదలుకావచ్చు. అందుకే మరీ అవసరమని భావిస్తేనే వీటిని తప్పనిసరిగా నిపుణులైన డాక్టర్ల పర్యవేక్షణలోనే వాడాలని గుర్తుంచుకోండి. డా. స్వప్నప్రియసీనియర్ డర్మటాలజిస్ట్ -
జుట్టు రాలిపోయే... స్కిన్పాలిపోయే! తీసుకోవాల్సిన జాగ్రత్తలు
మన దేహంలోని అంతర్గత అవయవాలను కాపాడేది చర్మం. మళ్లీ ఈ చర్మం తాలూకు రోమాంకురాల నుంచి పెరిగి... ఆ చర్మాన్నీ, దాంతోపాటు చాలావరకు దేహాన్ని కాపాడేవి వెంట్రుకలు. అయితే ఇటీవల వాహనాల కాలుష్యం, కర్మాగారాల నుంచి వెలువడే వ్యర్థాలు... ఇవన్నీ వాతావరణంలో కలిసి΄ోవడంతో ఇటు చర్మం మీదా, ఆపై కురుల మీదా దుష్ప్రభావాలు చూడటంతో వాటి తొలి ప్రభావం పడేది చర్మం మీదనే. తర్వాతి ప్రభావం జుట్టు మీద! కాలుష్యంతో పాటు నేరుగా పడే సూర్యకాంతి తీక్షణతకూ ఈ రెండూ ప్రభావితమవుతాయి. మన చుట్టూ ఉండే వాతావరణంలో దుమ్ము, ధూళి, సస్పెండెండ్పార్టికిల్స్ కాలుష్యాల వంటి వాటితో చర్మంపైనా, దాంతో పాటు వెంట్రుకలు జుట్టు పడేదుష్ప్రభావాల నుంచి కాపాడుకోడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం. చర్మం మన దేహాన్ని ఆవరించి ఉండే అతి పెద్ద అవయవం. ఇది శరీరంపై ఉండాల్సిన తేమను ఎప్పుడూ నియంత్రిస్తూ ఉంటుంది. కాలుష్య పదార్థాలు ఈ ప్రక్రియపై తీవ్రమైన ప్రభావం చూపిస్తూ ఉండటంతో క్రమంగా మేనిపైనుండే తేమ ఏ మేరకు ఉండాలో నియంత్రించే శక్తిని చర్మం క్రమంగా కోల్పోతుంది. ఫలితంగా చర్మం పొడిపొడిగా మారి, పొలుసులు (స్కేలీ)గా విచ్చుకు పోయే అవకాశముంది. ఎగ్జిమా వంటి అలర్జీ సంబంధమైన చర్మవ్యాధులున్న వారిలో ఆ ప్రభావం తీవ్రంగా ఉంటుంది. ఫలితంగా వాతావరణ కాలుష్యాల వల్ల చర్మం మరింతగా దురదలు పుడుతూ, ఎర్రబారే అవకాశం ఉంది. ట్రాఫిక్ కాలుష్యాల వల్ల ప్రధానంగా చర్మంపై అలర్జీలు వచ్చే అవకాశాలు ఎక్కువ అని ల్యాబరేటరీ పరిశోధనల్లో తేలింది. చిన్న పిల్లల చర్మంపై వీటి ప్రభావం మరింత ఎక్కువ. ఎందుకిలా జరుగుతుందంటే... మొదటి కారణం సీబమ్ స్రావం... : వాతావరణంలో వేడి ఎక్కువ ఉన్న కారణంగా తేమ (హ్యూమిడ్) బాగా పెరిగినప్పుడు మన చర్మంపై ఉండే సబేషియస్ (ఒక రకమైన నూనెను స్రవించే) గ్రంథులు ఎక్కువగా పనిచేస్తాయి. దాంతో చర్మంపై మరింత చెమట, సీబమ్ (సబేషియస్ గ్రంథుల నుంచి స్రవించే నూనె) ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి. అటు వాతావరణంలోనూ, ఇటు అత్యధిక ట్రాఫిక్ కారణంగా ఆటోమొబైల్ కాలుష్యంలో ఉండే అత్యంత సూక్ష్మమైన కాలుష్య పదార్థాలు చర్మంపై పడి సబేషియస్ గ్లాండ్ నుంచి మరింతగా సీబమ్ ఉత్పత్తి అయ్యేలా చేస్తాయి. దాంతో ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండే నగరాల్లోని వాతావరణం కారణంగా చర్మం మరింతగా దుష్ప్రభావాలకు లోనయ్యే అవకాశం ఉంది.వయసు పెరగడంతో వచ్చే మార్పులు త్వరితం కావడం... కాలుష్యం దుష్ప్రభావం కారణంగా ఏజింగ్ మరింత చురుగ్గా జరుగుతుంది. అంటే వయసు పెరగడం వల్ల చర్మంపైన కనిపించే వృద్ధాప్య లక్షణాలైన చర్మం ముడుతలు పడటం, చర్మంపై ఏజింగ్ మార్క్స్, రింకిల్స్, మచ్చలు రావడం వంటివి... రావాల్సిన టైమ్ కంటే ముందుగానే వస్తాయంటూ కొన్ని అధ్యయనాల్లో తేలింది. ఇందుకు కారణం... కాలుష్యం... చర్మం కణ సముదాయాల్లో (మాలెక్యూల్స్లో) వయసు పరంగా తెచ్చే మార్పులను చాలా త్వరగా వచ్చేలా చేయడమే.వాతావరణంలోని కర్బన కాలుష్యాలతోనూ... ఇంధనం మండటంతో గాల్లోకి వెలువడే కర్బన కాలుష్య కణాలు (పొల్యూషన్ పార్టికిల్స్), పాలీ అరోమాటిక్ హైడ్రోకార్బన్స్ వంటివి కూడా వయసు మీద పడటం వల్ల చర్మంపై కనిపించే మార్పులను చాలా వేగవంతం చేస్తాయి. వాతావరణంలో, గాలిలో కార్బన్ కాలుష్యాలు ఎంత ఎక్కువగా ఉంటే వయసు మీదపడటంతో వచ్చే మార్పులు అంత ఎక్కువంటూ ఒక పరిశోధన తాలూకు ఫలితాలు ‘జర్నల్ ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ డెర్మటాలజీ’ అనే సైన్స్ మ్యాగజైన్ / జర్మల్లో ప్రచురితమయ్యాయి. చర్మంలో ఒక కణం మరొక కణంతో కలిసి ఉండేందుకు కొలాజెన్ తోడ్పడుతుంది. కాలుష్యాల వల్ల కొలాజెన్తో సమకూరే బంధం బలహీనమ వుతుంది. అందుకే వృద్ధాప్యంలో వచ్చే ముడుతలు కాలుష్యం వల్ల చాలా త్వరగా / వేగంగా వస్తాయి.అల్ట్రా వయొలెట్ కిరణాల ప్రభావంతో... చర్మంపై అల్ట్రా వయొలెట్ కిరణాల ప్రభావం చాలా ప్రతికూలంగా పడుతుందన్న విషయం తెలిసిందే. ట్రాఫిక్ కారణంగా గాలిలో కలుస్తున్న కాలుష్యాల ప్రభావంతో భూమి ఉపరితల వాతావరణంపై ఉండే ఓజోన్ పొర దెబ్బతింటోంది. ఫలితంగా ఓజోన్ పొరలో...చర్మానికి హానికరమైన అల్ట్రా వయొలెట్ కిరణాల వడ΄ోత కూడా దెబ్బతింటోంది. దాంతో మునుపటి కంటే ఇప్పుడు అల్ట్రా వయొలెట్ కిరణాల తీవ్రత పెరడగం... దాని ఫలితంగా చర్మక్యాన్సర్, చర్మం నల్లబారడం (పిగ్మెంటేషన్) వంటి పరిణామాలూ ఎక్కువ కావడం వంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నట్లుగా మరికొన్ని అధ్యయనాలూ, పరిశోధనల్లో తేలింది.చర్మంపైనే కాకుండా... వెంట్రుకలూ, జుట్టుపైన కూడా... ట్రాఫిక్ కాలుష్య దుష్ప్రభావం కేవలం చర్మంపైనే గాక వెంట్రుకలూ, జుట్టుపైన కూడా పడుతోంది. కాలుష్యం కారణంగా వెంట్రుకలు రాలి΄ోవడమన్నది చాలా సాధారణంగా కనిపించే పరిణామం. ఇలా వెంట్రుకలు రాలి΄ోవడం అన్నది నగరీకరణ, ΄ారీశ్రామికీకరణ ఎక్కువగా ఉన్నచోట్ల చాలా ఎక్కువగా కనిపిస్తుంది. పల్లెలు, ఓ మోస్తరు పట్టణాలతో ΄ోలిస్తే పెద్ద పట్టణాలూ, నగరాల్లో కాలుష్యాలు మరింత ఎక్కువగా ఉండటమే ఇందుకు కారణం. కాలుష్యం నుంచి చర్మాన్ని, వెంట్రుకలను కాపాడుకోవడం ఎలా? కాలుష్యాలై పొగ, దుమ్ము, ధూళి, రేడియేషన్ వంటివి నేరుగా మేనిని తాకకుండా వీలైనంతమేరకు చర్మం మొత్తాన్ని కప్పి ఉంచే దుస్తులు ధరించాలి. ముఖం, చేతులను రక్షించుకోడానికి స్కార్ఫ్, గ్లవ్జ్ వంటివి తొడుక్కోవాలి. చర్మానికి, వెంట్రుకలకు మంచి పోషకాలు అందేలా యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండేవైన ఆకుపచ్చని కూరలు (గ్రీన్ లీఫీ వెజిటబుల్స్), తాజా పండ్లు, విటమిన్ ఏ, సీ, ఈ ఉండే ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి.బయటకు వెళ్లడానికి కనీసం 15–20 నిమిషాల ముందు సన్స్క్రీన్ లోషన్ రాసుకోవాలి. దీనికి తోడు బయటకు వెళ్లాక కూడా ప్రతి రెండు, మూడు గంటలకోమారు మళ్లీ సన్స్క్రీన్ లోషన్ రాసుకుంటూ ఉండాలి. ప్రతి రోజూ చర్మం, వెంట్రుకలు శుభ్రం అయ్యేలా స్నానం చేయాలి.వెంట్రుకలు రాలకుండా ఉండాలంటే... వెంట్రుకలను షాంపూతో క్రమం తప్పకుండా శుభ్రం చేసుకోవాలి. అయితే వెంట్రుకలను మరీ ఎక్కువగా కడగటం మంచిదికాదని గుర్తుంచుకోవాలి. ఇలా అవసరమైనదానికంటే వెంట్రుకలను ఎక్కువగా కడుగుతూ ఉంటే అవి పొడిబారవచ్చు. అలర్జెన్స్, కాలుష్యాలు నేరుగా వెంట్రుకలు తాకకుండా స్కార్ఫ్ కట్టుకోవడం, బ్రిమ్ హ్యాట్ పెట్టుకోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి.ఒకవేళ చుండ్రు వంటి సమస్య ఉంటే కీటోకెనజాల్ లేదా సైక్లోపిరోగ్సాలమైన్ ఉండే షాంపూలతో వారానికి రెండుసార్లు తలస్నానం చేయాలి. వెంట్రుక చివర్లు చిట్లిపోకుండా ఉండేలా ప్రతి ఆరువారాలకు ఓమారు జుట్టును ట్రిమ్ చేసుకోవాలి. రంగు వేసుకునేవారైతే అది సరిపడుతోందా లేదా అన్నది పరిశీలించుకున్న తర్వాతే దాన్ని వాడటం మొదలుపెట్టాలి.జుట్టు ఊడిపోతుంటే ఈ జాగ్రత్తలు పాటించండి... తమ జట్టు బాగా రాలిపోతోందంటూ చాలామంది ప్రతిరోజూ ఆందోళన పడుతుంటారు. అయితే ప్రతి రోజూ ప్రతి ఒక్కరూ దాదాపు నూరు వెంట్రుకల (స్ట్రాండ్స్) వరకు కోల్పోతుంటారు. ఇది చాలా సాధారణం. అయితే అదే పనిగా జుట్టు ఊడిపోవడం వల్ల తమకు బట్టతల వచ్చేస్తుందేమోనని చాలామంది ఆందోళన పడుతుంటారు. వాళ్ల ఆందోళన తీరాలంటే చేయాల్సిందేమిటంటే... జుట్టుకు అవసరమైన మూడు పోషకాలు జింక్, ఐరన్, విటమిన్–సీ. ఈ మూడూ జుట్టును సంరక్షిస్తూ, దాని మెరుపును కాపాడుతుండే ముఖ్యమైన మూడు అంశాలుగా చెప్పవచ్చు. అందుకే మనం తీసుకునే ఆహారంలో ఈ మూడూ సమృద్ధిగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. అందుకు ఆహారంలో తీసుకోవాల్సినవి... జింక్ కోసం : జుట్టుకు అవసరమైన జింక్ కోసం మీ ఆహారంలో గుమ్మడి గింజలు ఎక్కువగా తీసుకునేలా జాగ్రత్తపడాలి. జుట్టు విపరీతంగా ఊడిపోయేవారి ఆహారంలో జింక్తో పాటు, ఐరన్ పుష్కలంగా ఉండాలని బ్రిటిష్ న్యూట్రిషన్ ఫౌండేషన్ సిఫార్సు చేస్తోంది. ఆహార పదార్థాలన్నింటిలోనూ జింక్ గుమ్మడి గింజల్లో చాలా ఎక్కువగా లభిస్తుంటుంది. అలాగే సీఫుడ్స్, డార్క్చాక్లెట్, వేరుసెనగలు, వేటమాంసంలో కూడా జింక్ మోతాదులు ఎక్కువ. దాంతోపాటు పుచ్చకాయ తినేటప్పుడు వాటి గింజలనూ ఊసేయకుండా తినడం మంచిది. ఎందుకంటే పుచ్చకాయ గింజల్లోనూ జింక్ ఎక్కువే. ఐరన్ కోసం : ఆహారంలో ఐరన్ సమృద్ధిగా దొరకడం కోసం గుడ్డు, డ్రైఫ్రూట్స్, జీడిపప్పు లాంటి నట్స్, సీఫుడ్స్ వంటివి తీసుకోవచ్చు. ఇక మాంసాహారంలోనైతే కాలేయం, కిడ్నీల్లో ఐరన్ చాలా ఎక్కువ. శాకాహారులైతే ముదురు ఆకుపచ్చ రంగులో ఉండే పాలకూర వంటి ఆకుకూరల్లో ఐరన్ ఎక్కువని తెలుసుకుని మీరు తీసుకునే ఆహారంలో అలాంటి ఆకుకూరలు ఎక్కువగా ఉండేలా జాగ్రత్తపడాలి. విటమిన్–సీ కోసం : మనకు అందుబాటులో ఉన్న అన్ని ఆహార పదార్థాలతో ΄ోలిస్తే ఉసిరిలో నాణ్యమైన విటమిన్–సి పుష్కలంగా దొరుకుతుంది. దాంతోపాటు ఇక నిమ్మజాతి పండ్లన్నింటిలోనూ విటమిన్–సి ఎక్కువగా ఉంటుందన్న విషయం తెలిసిందే. మిగతావాటితో పోలిస్తే... బత్తాయి, నారింజ వంటి నిమ్మజాతి పండ్లు ఎక్కువగా తినేవారిలో జుట్టు రాలడం కాస్త తక్కువేనని చెప్పవచ్చు.అప్పటికీ జుట్టు రాలుతుంటే... ఇక్కడ చెప్పినవన్నీ తీసుకుంటూ, వారంలో కనీసం రెండు సార్లు తలస్నానం చేయడం వంటి జుట్టు హైజీన్ పాటిస్తున్నప్పటికీ జుట్టు రాలిపోతుంటే ఒకసారి థైరాయిడ్ పరీక్ష చేయించుకుని డాక్టర్ను కలవాల్సి ఉంటుంది. ఎందుకంటే థైరాక్సిన్ హార్మోన్ అసమతౌల్యత జుట్టు రాలే ముప్పును తెచ్చిపెడుతుంది. దేహంలో అలాంటి సమస్య / అనారోగ్యం ఏదైనా ఉంటే దాన్ని డాక్టర్లు పరిష్కరిస్తారు. ఒకవేళ ఇలాంటి సమస్యను స్వాభావికంగానే నివారించుకోవాలంటే... చేపలు ఎక్కువగా తినేవారిలో థైరాక్సిన్ అసమతౌల్యత సమస్య చాలా తక్కువని తెలుసుకోండి. ఇన్ని జాగ్రత్తల తర్వాత కూడా జుట్టు రాలడం ఆగగకపోతే అప్పుడు మీరు డర్మటాలజిస్ట్లు లేదా ట్రైకాలజిస్ట్ల వంటి నిపుణులను కలవాల్సి ఉంటుంది. డా. స్వప్నప్రియసీనియర్ డర్మటాలజిస్ట్ చదవండి: 6 నెలల్లో 27 కిలోలు తగ్గాను..ఇదంతా దాని పుణ్యమే! -
6 నెలల్లో 27 కిలోలు తగ్గాను..ఇదంతా దాని పుణ్యమే!
టెక్ప్రపంచంలో చాట్ జీపీటీ ఒక విప్లవం. విద్యార్థులనుంచి మేధావుల దాకా ఏఐ ఒక షార్ట్కట్గా మారిపోయింది. తాజాగా బరువు తగ్గే విషయంలో కూడా ఇదొక గేమ్ చేంజర్లా మారుతోంది. తాజాగా ఒక యూట్యూబర్ AI సహాయంతో అధిక బరువును విజయవంతంగా తగ్గించుకోవడంతోపాటు, ఆరోగ్యాన్ని ఎలా పొందాడో, జీవితంలో గొప్ప పాఠాన్ని ఏలా నేర్చుకున్నాడో షేర్ చేశాడు. దీంతో ఇది వైరల్గా మారింది. ChatGPT ప్రోగ్రామ్ ద్వారా ‘మై లైఫ్ బై AI’ అంటూ తన ఆరు నెలల సుదీర్ఘ ప్రయాణాన్ని వెల్లడించాడు. చాట్జీపీటీ లాంటి ఏఐ ద్వారా రూపొందించిన డిజిటల్ అసిస్టెంట్, ఫిట్నెస్ కోచ్ లేదా వర్చువల్ కోచ్కి ‘ఆర్థర్’ అని పేరు కూడా పెట్టుకున్నాడు. ఆర్థర్ సహాయంతో తన రొటీన్ డైట్ ప్లాన్ చేసుకునేవాడు. భోజనం, వర్కౌట్స్ ఇలా ప్రతీ అంశాన్ని నియంత్రించే సమగ్ర ఫ్రేమ్వర్క్ క్రియేట్ చేసుకున్నాడు. అదే అతని వెయిట్లాస్ జర్నీకి నాంది పలికింది. కేవలం ఆరు నెలల్లోనే కీలక పురోగతిని సాధించాడు. చాట్ జీపీటీ ఇచ్చిన సలహాలతో ఆరు నెలల్లో సుమారు 27 కిలోలు తగ్గాడు. అంతేకాదు తన మెంటల్ హెల్త్, ఎనర్జీ స్థాయిల్లో కూడా మార్పును గమనించాడు. ఇది తన ఫిట్నెస్ ప్రయాణాన్ని మెరుగుపరచడమే కాకుండా, కంటెంట్ సృష్టిపై అభిరుచి మరింత పెంచిందనీ చెప్పాడు. దీంతో ఇప్పుడు పూర్తి సమయం యూట్యూబర్గా మారిపోవాలని ఆలోచిస్తున్నాడు. అయితే ఈ జర్నీ అంత సజావుగా లేదు. ఆరంభంలో చాలా కష్టపడ్డాడు. వీకెండ్ మజాగా భావించే ఫాస్ట్ ఫుడ్ - బర్గర్లు, ఫ్రైస్, బీర్ లాంటి అనారోగ్య కరమైన అలవాట్లను మానుకునేందుకు ఇబ్బంది పడ్డాడు. నెమ్మదిగా వాటినుంచి బయటపడ్డాడు. ప్రతిరోజూ కిలోమీటర్లు, కిలోమీటర్లు నడవడం, బరువులు ఎత్తడం లాంటి కఠిన వ్యాయామాలపై దృష్టిపెట్టాడు.AI-ఆధారిత భోజన ప్లాన్తో క్లీనర్ ఛాయిసెస్, స్మార్టర్ మీల్స్ అంటే శుభ్రమైన, పోషకాహారంపై దృష్టిపెట్టాడు. ప్రాసెస్ చేసిన స్నాక్స్, చక్కెర పానీయాలను పూర్తిగా మానేశాడు. తినే ఆహారంలో పోషకాలు మాత్రమే ఉండేలా చూసుకున్నాడు. అల్పాహారంలో గుడ్లు, పర్మేసన్ చీజ్, టోస్ట్లు చేర్చుకున్నాడు. భోజనంలోచిల్లీ బీఫ్, బియ్యం ,రిఫ్రైడ్ బీన్స్ తీసుకునేవాడు. డిన్నర్లో కాల్చిన చికెన్ఒక రకమైన చిలగడదుంప, కాల్చిన ఎర్ర క్యాప్సికమ్, కోర్జెట్లు , గ్రీకు యోగర్ట్ ఇదే డిన్నర్.ఏఐ తన జీవితంలో లైఫ్స్టైల్ రీబూట్గా మారిందని, స్థిరంగా, పట్టుదలగా ఉండటంలోని పవర్ గురించి ఆర్థర్ తెలియచెప్పిందనీ మొత్తంగా , ఏఐ తన జీవితాన్ని పెర్ఫెక్ట్గా మార్చడమే కాదు ఎదురు దెబ్బలను ఎదుర్కోవడం ఎలాగో నేర్పించింది. నాలైఫ్ మొత్తాన్ని మార్చేసిందని చెప్పుకొచ్చాడు సంతోషంగా. -
చిరుజల్లుల్లో బికేర్ఫుల్.. ఆ ఆహారాలను తీసుకోకపోవడమే మేలు..!
వర్షాకాలం అనగానే భలే సరదాగా ఉంటుంది. చిరుజల్లుల్లో ఆహ్లాదభరితమైన వాతావరణం మనసు మెచ్చినా.. ఆరోగ్యపరంగా సమస్యాత్మకమే. ఈ కాలం వ్యాధులు ముసిరే కాలం. కాస్త తీసుకునే ఆహారంలో ఇలా మార్పులు చేసుకుంటే..ఇన్ఫెక్షన్లు, వ్యాధుల బారినపడకుండా ఉంటారని చెబుతున్నారు ప్రముఖ పోషకాహార నిపుణులు బాత్రా. అదెలాగో ఆమె మాటల్లో చూద్దామా..!.ఈ కాలంలో జీర్ణవ్యవస్థ మందగిస్తుంది. అంత చురుగ్గా ఉండదు కాబట్టి తీసుకునే ఆహారంపై కాస్త ఫోకస్ పెట్టాలని చెబుతున్నారు ఆరోగ్య నిపుణురాలు బాత్రా. మారే రుతుపవనాల దృష్ట్యా తీసుకునే డైట్లో మార్పులు తప్పనిసరి అని అంటున్నారు. ఈ వర్షాకాలంలోవ్యాధుల బారిన పడకుండా సురక్షితంగా ఉంచే ప్రభావవంతమైన ఆహారాలను గురించి ఇన్స్టా వేదిక షేర్ చేశారు పోషకాహార నిపుణురాలు బాత్రా. తేలికగా జీర్ణమయ్యే ఈ తొమ్మిది ఆహారాలను తీసుకోమని చెబుతున్నారామె. అవేంటంటే..మొదటగా తెల్ల బియ్యాన్ని నివారించి బదులుగా బ్లాక్ రైస్ను ఎంచుకోవాలని అన్నారామె. ఎందుకంటే ఇందులో పుష్కలంగా యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. కాబట్టి వ్యాధి నిరోధక శక్తి మెరుగా ఉండి, జీర్ణక్రియ గట్ ఆరోగ్యాన్ని ప్రభావవంతంగా ఉంచుతుంది. పైగా రక్తంలో చక్కెర స్థాయిలు స్థిరంగా ఉండేలా చేస్తుంది అని చెబుతోంది బాత్రఅందువల్ల నిరోధక పిండి పదార్ధాలతో సమృద్ధిగా ఉంటుంది. ఇది జీర్ణక్రియ మరియు గట్ ఆరోగ్యాన్ని మందగించిన రుతుపవన జీవక్రియలో రక్తంలో చక్కెరను స్థిరంగా ఉంచుతుంది.పచ్చి సలాడ్ కంటే మెత్తగా ఉడికించిన కూరగాయలను ఎంచుకోవాలట. ఎందుకంటే పచ్చి కూరగాయలు వర్షాకాలంలో పొట్ట ఉబ్బరాన్ని కలిగిస్తాయి. ఇక ఉడకబెట్టిన కూరగాయలు ప్రేగుకు ఉపశమనం కలిగించేలా మంచి బ్యాక్టీరియాను పెంచుతాయి.వీధుల్లో అమ్మే తినుబండరాలు, చాట్ వంటి ఆహారాలకు దూరంగా ఉండండి. బదులుగా ఆవితో ఉడికించిన మొలకెత్తిన మూంగ్ చాట్ని తీసుకోవాలని సూచిస్తున్నారు. దీనిలో ఎంజైమ్లు, ప్రోటీన్లలో అధికంగా ఉండటమే గాక ఇన్ఫెక్షన్ ప్రమాదాన్ని తగ్గిస్తుందట.ఈ కాలంలో తప్పనిసరిగా తులసి-అల్లం కషాయం వంటి వాటిని సేవించాలని సూచిస్తున్నారామె. ఇది జీర్ణక్రియ, రోగనిరోధక శక్తిని మెరుగ్గా ఉంచి ఆహారం సులభంగా జీర్ణమయ్యేలా చేస్తుందట. ఈ కాలంలో ముడి ఆకుకూరలకు బదులుగా మోరింగ సూప్ తీసుకోవాలని చెబుతున్నారు. దీనిలో ఐరన్, యాంటీమైక్రోబయాల్, క్లోరోఫిల్ సమృద్ధిగా ఉంటాయి అందువల్ల దీన్ని తీసుకుంటే బాడీ మంచి యాక్టివ్గా ఉండి జీర్ణ సమస్యలు దరిచేరవు.ఈ కాలంలో మిగిలిపోయిన చద్దన్నం నివారించాలట. సాధ్యమైనంత వరకు తాజాగా వండిన భోజనం తీసుకోవడమే మంచిదని చెబుతున్నారు. ఎందుకంటే ఈ కాలంలో నీటిలోనూ, చల్లటి పదార్థాల్లోనూ బ్యాక్టీరియా ఎక్కువ ఉంటుంది. అందువల్ల తాజాగా వేడిగా ఉండే ఆహారాలకే ప్రాధాన్యత ఇవ్వడమే మంచిదని చెబుతోందామె.అలాగే బేకరీ ఉత్పత్తులను నివారించి.. ఇంట్లో చేసిన ధోక్లా లేదా ఉడికించిన సెనగలు, స్వీట్కార్న్, చిలగడ దుంపలు వంటివి తీసుకోవాలని చెబుతోందామె.అలాగే కట్చేసి నిల్వ ఉంచిన పండ్ల ముక్కలకు బదులుగా తాజాగా కడిగి కట్ చేసిన పండ్లను తినాలని సూచిస్తున్నారామె.ఈ వర్షాకాలంలో వేడిగా పొగలతో కూడిన ఆహారంత తీసుకుంటేనే మంచిది. ఇది రుచికరంగానే కాకుండా రోగనిరోధక శక్తిని పెంచి, మంచి జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది. లేదంటే చల్లటి ఆహారాలు జీర్ణ సమస్యలు, పలు ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని పెంచుతాయని చెబుతున్నారు పోషకాహార నిపుణురాలు బాత్రా.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం మంచిది. (చదవండి: -
కేన్సర్తో కన్నుమూసిన నటి, ప్రముఖ గాయని, కన్నీటి సంద్రంలో అభిమానులు
ప్రముఖ గాయని, నటి, వ్యాపారవేత్త ప్రెటా గిల్ కేన్సర్ పోరాడి, పోరాడి తనువు చాలించింది. తనదైన స్వరంతో సంగీత ప్రపంచాన్నిఉర్రూత లూగించిన ఆమె, 50 ఏళ్ల వయసులో పేగు క్యాన్సర్ తో పోరాడి, చికిత్స పొందుతూ,న్యూయార్క్ నగరంలో జూలై 20న తుది శ్వాస విడిచింది. దీంతో సంగతం ప్రపంచం తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. సోషల్ మీడియాలో పలువురుప్రముఖుల సంతాప సందేశాలు వెల్లువెత్తాయి.ప్రేటా గిల్ బ్రెజిలియన్ సంగీత పరిశ్రమలో పేరుగాంచిన మహిళ ప్రెటా. 2023 జనవరిలో ఆమెకు పేగు కేన్సర్ నిర్ధారణ అయింది. కేన్సర్తో పోరాటం గురించి బహిరంగంగా చర్చించేది. రెండేళ్లకు పైగా సాగిన సుదీర్ఘమైన, కఠినమైన తన పోరాటంలో అభిమానులు ఆమెకు అండగా నిలిచారు. 2024లో శస్త్రచికిత్స జరిగింది.కణితిని, గర్భాశయాన్ని కూడా తొలగించారు. కీమోథెరపీ , రేడియోథెరపీతో చికిత్స తీసుకుంటూ ఎంతో ధైర్యంగా, చాలా ఆశావహ దృక్పథంలో ఉండేది. తన పోరాటంలో అనేక సవాళ్ల గురించి ఆత్మస్థైర్యంతో మాట్లాడేది. తద్వారా తనలాంటి కేన్సర్ రోగులకు ఎంతోమందికి ధైర్యాన్నిచ్చేది.సంగీత కారుడు, రాజకీయవేత్త గిల్బర్టో గిల్ కుమార్తెప్రేటా. 'ప్రేటా' అంటే పోర్చుగీస్ భాషలో 'నలుపు' అని అర్థం. తన కుమార్తెకు ఈ పేరు పెట్టడానికి చాలా ఇబ్బందలు పడ్డాడట.గిల్బర్టో గిల్ తన కుమార్తె ప్రేటా గిల్ మరణ వార్తను సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. దీంతో అనేక మంది ప్రముఖులు సంతాపం వ్యక్తం చేసి నివాళులర్పించారు.lutou até o fim. tentou, foi forte, foi guerreira. lidou com abandono, traição em plena descoberta da doença e em nenhum momento parou de sorrir. descanse em paz, preta gil. você é amor 🤍 pic.twitter.com/T6ddwBpPcY— mari (@ahcamilas) July 20, 2025 పేగు కేన్సర్, లేదా పెద్ద పేగు కేన్సర్, పెద్దప్రేగు లేదా మలనాళంలో ఏర్పడే కేన్సర్. సాధారణంగా 50 ఏళ్లు పైబడిన వారిలో ఈ కేన్సర్ కనిపిస్తుంది, కానీ ఇటీవల యువతలో కూడా ఈ కేన్సర్ కేసులు పెరుగుతున్నాయి.లక్షణాలు:మలంలో రక్తంమలబద్ధకం లేదా అతిసారం వంటి ప్రేగు అలవాట్లలో మార్పుబలహీనత, అలసట, బరువు తగ్గడంకడుపు నొప్పి, తిమ్మిరి, లేదా ఉబ్బరంపేగు కదలిక తర్వాత ప్రేగులు పూర్తిగా ఖాళీ అవ్వడం లేదనే భావన కారణాలు: 50 ఏళ్లు పైబడిన వారిలో ఎక్కువగా వస్తుంది.పేగు కేన్సర్ లేదా పాలిప్స్ చరిత్ర ఉన్నవారికి ప్రమాదం ఎక్కువ. ఫ్యాటీ ఫుడ్స్, రెడ్ మీట్ ఎక్కువగా తీసుకోవడం, తక్కువ పీచు పదార్థాలు తీసుకోవడం.శారీరక శ్రమ లేకపోవడం.సిగరెట్లు, మద్యపానం. -
ఫీల్ యువర్ ఫీలింగ్.. ఆర్ట్ ఆఫ్ హీల్..!
ఇటీవలి కాలంలో మన హైదరాబాద్తో పాటు మెట్రో నగరాల్లో ఎక్కువగా వినిపిస్తున్న మాట.. ఆందోళన, ఒత్తిడి, శారీరక ఆలసట, మానసిక భావోద్వేగాలను నియంత్రించే శక్తి కళలకు ఉందనేది వాస్తవం.. మనం ఎంత ఒత్తిడిలో ఉన్నా ఓ మంచి పాట వినబడగానే మనసుకు హాయిగా అనిపిస్తుంది.. కొందరికి ప్రకృతిని చూస్తే, మరికొందరికి ఆర్ట్ని చూసినా.. బొమ్మలు వేసినా మనసుకు హాయినిస్తాయి.. దీనికి ఇవే ఉదాహరణ.. మనలోని కనిపించని భావాలు.. కళలకు స్పందిస్తాయి.. సాంత్వన చేకూరుస్తాయి. దీంతో గత కొద్దికాలంగా నగరంలో ‘హీలింగ్ థెరపీలు’ విస్తృత ఆదరణ పొందుతున్నాయి. ఈ చికిత్సా పద్ధతుల్లో ఆర్ట్ ఆఫ్ హీలింగ్ థెరపీలకు ప్రత్యేక స్థానం ఉంది. మానసిక ప్రశాంతతను కోరుకునే యువత, కార్పొరేట్ ఉద్యోగులు ఈ సృజనాత్మక మెడిటేషన్ వేదికగా సాంత్వన పొందుతున్నారు.. ప్రస్తుతం నగరంలో ఏ రంగం చూసినా విపరీతమైన ఆదరణ పొందుతోంది. ఈ వైవిధ్యంతో పాటే అనేక మానసిక, సామాజిక ఒత్తిళ్లను నగరవాసులకు చేరువ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాటి నుంచి బయటపడటానికి ఆర్ట్ హీలింగ్ థెరపీలను జీవన శైలిలో భాగం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో నగర వేదికగా విభిన్న రకాల హీలింగ్ థెరపీలు అందుబాటులో ఉన్నాయి. ఆర్ట్ థెరపీల్లో మ్యూజిక్ థెరపీ, డాన్స్ మూవ్మెంట్ థెరపీ, సౌండ్ బౌల్ హీలింగ్, యోగా–శ్వాస పరమైన ధ్యాన చికిత్స, రేయికి– ఎమోషనల్ ఫ్రీడమ్ టెక్నిక్స్ (ఈ ఎఫ్ టీ), క్లే మోడలింగ్/పోటరీ థెరపీ, ఎక్సŠప్రెషన్ జర్నలింగ్/రైటింగ్ థెరపీ వంటివి ఈ తరం లైఫ్స్టైల్లో ప్రధానంగా కనిపిస్తున్నాయి. ఈ థెరపీలన్నీ మెడిటేటివ్ ఎఫెక్ట్ కలిగించేలా ఉండి, మానసిక ఒత్తిడి, ఆత్మవిమర్శ, ఒంటరితనంతో ఇబ్బంది పడుతున్న వారికి సాంత్వన చేకూరుస్తూ, మనశ్శాంతిని అందిస్తున్నాయి. మానసిక స్పందనలు తెలిపే భాష.. ఆర్ట్ హీలింగ్ థెరపీ ఒక మందు కాదు – అది ఓ మనో విశ్రాంతి పాఠశాల. భిన్న రంగాల వేదికైన హైదరాబాద్ లాంటి మహానగరంలో ఈ థెరపీలు సమాజాన్ని మనశ్శాంతి వైపు నడిపిస్తున్నాయనడంలో సందేహం లేదు. ఆర్ట్ థెరపీ అనేది వినూత్నంగా, వైవిధ్యంగా మనసుపై ప్రభావం చూపించే ఒక మానసిక చికిత్స. చిత్రకళ అనేది రంగుల సమ్మేళనం, మట్టి శిల్పాల తయారీ, మాస్క్ మేకింగ్, కలర్ థెరపీ లాంటి అంశాల ద్వారా వ్యక్తి భావోద్వేగాలను బయటకు తీసే ఒక మృదు స్పర్శా విధానం. ఇది శాస్త్రీయ వైద్యం కాదు, కేవలం మెదడుపై సున్నిత ప్రభావాన్ని చూపిస్తూ మౌనంగా స్పందనలు తెలిపే ఓ భాష మాత్రమే. సాంత్వనకు కేంద్రంగా సిటీ.. నగరంలోని కన్హ శాంతి వనం హార్ట్ఫుల్ నెస్ సెంటర్లో ఆర్ట్ – ధ్యానం కలిసిన హోలిస్టిక్ మాడ్యూల్స్ అందుబాటులో ఉన్నాయి. అంతే కాకుండా బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ వంటి ప్రాంతాల్లోనూ లైసెన్స్డ్ ఆర్ట్ థెరపిస్టుల సహాయంతో సరికొత్త థెరపీలు అందించే వేదికలు ఎన్నో ఉన్నాయి. కొన్ని క్లే (మట్టి), పెయింటింగ్ ఆధారిత వర్క్షాపులు నిర్తహిస్తుంటే ఆర్ట్ ఫర్ థెరపీ ఫౌండేషన్ వంటి వేదికలు పిల్లలు, యువత కోసం ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. కల్పతరు ఆర్ట్ హీలింగ్ వంటి సంస్థలు మునుపటి ట్రామాలను చక్కదిద్దేందుకు క్రియేటివ్ ఎక్స్ప్రెషన్ వంటి పద్ధతులు పాటిస్తున్నారు. జెన్ జీ హీలింగ్... ఇలాంటి థెరపీలను ఈ తరం యువతకు అనువుగా మలుస్తున్నాయి సంస్థలు. ఈ జెన్ జీ తరంలో డిజిటల్ లోన్లీ నెస్, ఒత్తిడి పెంచే విద్యావ్యవస్థ, వర్క్–లైఫ్ ఇంబ్యాలెన్స్, ఎమోషనల్ అన్ఎక్స్ప్రెషన్ వంటి సమస్యలు ఎక్కువగా ఉన్నాయని జూబ్లీహిల్స్ లోని ఓ ప్రముఖ హీలింగ్ థెరపిస్ట్ తెలిపారు. ఈ తరం శారీరకంగా కన్నా మానసికంగా ఎక్కువగా ఇబ్బందులు పడుతోంది. ప్రభావం చూపే మాటలకంటే రంగులు, ఆకారాలు, కళల సృజనాత్మకతతో కలగలిసిన ప్రయాణంతో మనసు తన బాధను చెప్పే అవకాశం పొందుతోంది. ఇలాంటి కారణాలతో ఈ ఆర్ట్ థెరపీల అవసరం ఎక్కువైందని మరి కొందరి నిపుణుల అభిప్రాయం. అవస్థలు ఎన్నో.. మార్గం ఒకటే..!! డిప్రెషన్(నిరాశ), ఆందోళన (యాంగ్జైటీ) బాధితులు, పిల్లల్లో స్పీచ్/బిహేవియరల్ సమస్యలు ఉన్నవారు, ట్రామా/లాస్/బ్రేకప్ నుంచి కోలుకునేవారు, ఏకాంత జీవితం గడుపుతున్న వృద్ధులు, క్రియేటివ్ బ్లాక్ ఎదుర్కొంటున్న కళాకారులకు ఈ ఆర్ట్ థెరపీలు వరంగా మారుతున్నాయి. -
ఏరియల్ యోగా అంటే..? కేవలం మహిళల కోసమేనా..
ఇటీవల ఆరోగ్య స్పృహ ఎక్కువై అంతా జిమ్, వాకింగ్, యోగా, వ్యాయమాలు బాట పట్టారు. మరికొందరు ఇంకాస్త ముందడుగు వేసి విభిన్న రకాల వర్కౌట్లను అనుసరిస్తున్నారు. వినూత్న శైలిలో ఆరోగ్యంగా ఉండటం ఎలా అంటూ సరికొత్త యోగాలను పరిచయం చేస్తున్నారు. అలానే నెట్టింట ఇండోనేషియా బండా అషేలోని మహిళా జిమ్లోని సరికొత్త యోగా ఫోజ్లు పెద్ద దుమారం రేపి చర్చనీయాంశంగా మారాయి. ఎందుకంటే అక్కడ మహిళలంతా వ్యాయామాలు చేస్తున్నారా..? ఊయల్లో సేదతీరుతున్నారా అని అర్థంకానీ ఫోజ్లలో కనిపించారు. మరి ఆ సరికొత్త యోగా భంగిమ ఏంటి..? ఎలా చేస్తారు..? ఎవరికి మంచిది తదితరాల గురించి సవివరంగా చూద్దామా..!.2004 సునామీ తర్వాత ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన నగరమే ఈ బందా అసే. అక్కడ కాస్త మహిళలకు సంబంధించి కట్టుదట్టమైన చట్టాలు అమలులో ఉన్నా దేశం ఇది. అయితే అక్కడ మహిళా ఫిట్నెస్ ట్రైనర్ పర్యవేక్షణలో యోగా క్లాసులు, పలు వెల్నెస్ సెంటర్లు నడుస్తుండటం విశేషం. అక్కడ ఓ మహిళల జిమ్లో ఈ వింతైన దృశ్యం కనువిందు చేసింది. ఆ మహిళలంతా ఊయల ఆసనం మాదిరి యోగా భంగిమలో వేలాడుతూ కనిపించారు. దాన్ని ఏరియల్ యోగా అని పిలుస్తారట. అదెలా చేస్తారంటే.. View this post on Instagram A post shared by Chaideer Mahyuddin (@mirroreye) ఏరియల్ యోగా అంటే: ఊయలలాంటివి లేదా పైకప్పు నుంచి వేలాడే మృదువైన వస్త్రాల సాయంతో చేసే యోగా పద్ధతి. ఇది సాధారణ యోగాతో పాటు జిమ్నాస్టిక్స్, పైలేట్స్ వంటి వర్కౌట్లను కలగలపిన ఒక ప్రత్యేకమైన యోగాసనం.ప్రయోజనాలు..ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది: శరీర భాగాలు గాలిలో సాగదీయబడి, కండరాలు మెరుగవుతాయివెన్నునొప్పి తగ్గుతుంది: వెన్నెముకపై ఒత్తిడి లేకుండా స్ట్రెచ్ అవుతుందిఒత్తిడి తగ్గుతుంది: గాలిలో వేలాడుతూ ధ్యానం చేయడం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుందిబరువు తగ్గేందుకు సహాయపడుతుంది: 50 నిమిషాల సెషన్లో సుమారు 320 కేలరీలు ఖర్చవుతాయిజీర్ణక్రియ మెరుగవుతుంది: పొత్తికడుపు సమస్యలు, గ్యాస్ సమస్యలు తగ్గుతాయిశ్వాసకోశ ఆరోగ్యం మెరుగవుతుంది: ఊపిరితిత్తులకు వ్యాయామం అవుతుందిఎవరికి మంచిది కాదంటే..గుండె జబ్బులు, బీనీ, గ్లకోమా, ఆర్థరైటిస్ ఉన్నవారుగర్భిణులు, పెద్ద ఆపరేషన్ చేసినవారుఒకవేళ ఈ ఏరియల్ యోగా చేయాలనుకున్న నిపుణుల పర్యవేక్షణలో చేయడమే ఉత్తమం. ఇది కేవలం మహిళలే కాదు ఆరోగ్యవంతమైన పురుషుల కూడా చేయవచ్చు. పైన చెప్పిన అనారోగ్య సమస్యలు లేనివాళ్లు ఎవరైనా నిపుణుల పర్యవేక్షలో నిస్సందేహంగా ఈ ఏరియల్ యోగాని నేర్చుకోవచ్చని చెబుతున్నారు. -
వాట్ ఏ బ్యాలెన్సింగ్ : రకుల్ ప్రీత్ ఫిట్నెస్ వీడియో
నటి రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh) ఫిట్నెస్ విషయంలో చాలా శ్రద్ధ తీసుకుంటుంది. జిమ్, యోగా, పైలేట్స్ , కార్డియో, రన్నింగ్, హైకింగ్, గోల్ప్ ఇలా వివిధ రకాల వర్కౌట్స్తో ఫ్యాన్స్ను మెస్మరైజ్ చేస్తుంది. తన ఫిట్నెస్ రొటీన్, వ్యాయామ నియమావళికి సంబంధించిన స్నీక్ పీక్లను ఇన్స్టాగ్రామ్లో పంచుకుంటుంది. తాజాగా బాలెన్స్కు సంబంధించిన ఒక ఇంట్రస్టింగ్ వీడియోనే షేర్ చేసింది.అందరూ వీకెండ్ మూడ్లో ఉంటే, రకుల్ ప్రీత్ ఒక ఆసక్తికరమైన విషయం గురించి చెప్పుకొచ్చింది. మనం పెద్దగా పట్టించుకోని “చిన్న కండరాలకు” కూడా ప్రాధాన్య ఇవ్వాలని, వాటి దృఢత్వం ప్రాముఖ్యతను నొక్కి చెప్పింది. ఇన్స్టాలో రెండు వీడియోలను పోస్ట్ చేసింది. అద్భుతమైన బాలెన్సింగ్తో చిన్న వాటర్ బాల్ వ్యాయాయాన్ని చేసి చూపించడం విశేషం. ఇదీ చదవండి: వెయిట్లాస్కి 6 చిట్కాలు : సిల్లీ కాదు..సూపరంటున్న ఫిట్నెస్ కోచ్ View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) ఈ ట్రైనింగ్లో చిన్న కండరాలను బలోపేతం చేయడంతో పాటు, బరువులు ఎత్తడం అంతే ముఖ్యమని పేర్కొంది. మొదట్లో బోసు బాల్పై కూడా బ్యాలెన్స్ చేయలేకపోయాను కానీ ఇప్పుడు ఈ చిన్న నీటి బంతి మీద సులువుగా చేస్తున్నానని వెల్లడించింది. ఈ వీడియోలో ముందు తన చేతులను ఫ్రీగా వదిలేసి బ్యాలెన్స్ చేయగా, ఆ తరువాత జోతులను కలిపి ఉంచి, ఒంటి కాలిపై సింగిల్-లెగ్ స్క్వాట్స్తో ఫ్లూయిడ్ బాల్పై తన శరీరాన్ని బాలెన్స్ చేసింది. ఈ సారి జిమ్కి వెళ్ళినప్పుడు ఇలా ప్రయత్నించండం అంటూ అభిమాలకు సూచించింది.(నో-షుగర్, నో-మిల్క్: 45 కిలోలు తగ్గింది, ఇప్పటికీ కష్టాలే!)స్మాల్బాల్ ఎక్సర్ సైజ్ లాభాలుఈ బ్యాలెన్సింగ్ టెక్నిక్ వల్ల సమన్వయం, శరీర నియంత్రణ , ప్రతిచర్యలను మెరుగుపరుస్తుంది. మొత్తం క్రియాత్మక బలం పెరుగుతుంది.మంచి బ్యాలెన్సింగ్ శక్తిని ఇస్తుంది. ఉదర కండరాలను బలోపేతం చచేస్తుంది. కోర్ను టోన్ చేయడంతోపాటు బలోపేతం చేయడంలో కూడా సహాయపడతాయి. పోశ్చర్ (భంగిమను) మెరుగుపరుస్తుంది.శరీర అమరికను సాధించడంలో సహాయపడుతుంది.కీళ్లపై ఒత్తిడిని తగ్గిస్తుంది, గాయాలు, ఆర్థరైటిస్ నొప్పులను నివారిస్తుంది. బాడీకి ఫ్లెక్సిబిలీటీని అందిస్తుంది. ముఖ్యంగా తుంటి, వీపు , భుజాల చుట్టూ, కండరాల దృఢత్వాన్ని మంచిది. -
వెయిట్లాస్కి 6 చిట్కాలు : సిల్లీ కాదు..సూపరంటున్న ఫిట్నెస్ కోచ్
బరువు తగ్గాలి అంటే కచ్చితంగా కొన్ని జీవనశైలి మార్పులు చేసుకోవాలి. బరువు ఎందుకు ఎక్కువ ఉన్నామనే విషయాలను నిపుణుల సలహా మేరకు అంచనావేసుకోవాలి. ఆ తరువాత బరువు ఎంత? ఎలా తగ్గాలి అనే ప్రణాళిక వేసుకోవాలి. ఎక్కడా నిరాశ పడకుండా, ప్లాన్ ప్రకారం పూర్తి కమిట్మెంట్తో ఓపిగ్గా , స్మార్ట్గా ప్రయత్నిస్తే ఫలితం సాధించడం సులువే. ఈ విషయాన్ని అనేక మంది సెలబ్రిటీలు, ఫిట్నెస్ కోచ్లు చెబుతున్నమాట. చిన్న, చిన్న మార్పులతో పెద్ద పెద్ద ఫలితాలను ఎలా సాధించవచ్చో తాజాగా ఫిట్నెస్ కోచ్ వివరించారు.తెలివిగా, వ్యూహాత్మకంగా ఉంటే బరువు తగ్గాలనే లక్ష్యాలను సాధించవచ్చు. చిన్న మార్పులు పెద్ద తేడాను ఎలా కలిగిస్తాయో ఫిట్నెస్ కోచ్ వివరించారు. తన ఇన్స్టాగ్రామ్లో తరచుగా ఫిట్నెస్ సంబంధిత చిట్కాలను పంచుకునే జోష్ ఇటీవల కొన్ని చిట్కాల గురించి చర్చించారు. సిల్లీగా అనిపించినా ఇవి చాలా ప్రభావాన్ని చూపుతాయంటూ 6 ప్రధాన సూత్రాల గురించి వివరించారు.కుడి చేతి వాటం వాళ్లు, ఎడం చేత్తో, ఎడం చేయి వాటం ఉన్న వాళ్లు కుడి చేత్తో తినాలి అంట. దీని వల్ల 30 శాతం తక్కువ తినడానికి ఆస్కారం ఉంటుంది. సిల్లీగా అనిపించినా ఇది ఫలితం ఇస్తుందంటున్నారు. ఒక భోజనంలో 150-300 కేలరీలు తగ్గించుకోవచ్చని చెప్పారు. View this post on Instagram A post shared by Professional Athlete & Online Coach (@joshbainbridgefit)సాయంత్రం తొందరగా పళ్లుతోముకోవడం వల్ల ఇక తినడం అపేయాలనే సంకేతం మెదడుకు అందుతుందని, ముఖ్యంగా అర్థరాత్రి స్నాక్స్ తీసుకోనే అలవాటును మానుకోవడంలో ఇది గేమ్ ఛేంజర్లా పనిచేస్తుందని, తత్ఫలితంగా 200-600 కేలరీలను సులభంగా ఆదా చేయవచ్చని చెప్పారు.మోసం చేసే లిక్విడ్ కేలరీస్.. మీరు నమ్మరు గానీ రోజుకు 2-3 కాఫీలు, వందల కేలరీలకు దారితీయవచ్చు,ఆల్కహాల్, క్రీమర్లు, స్మూతీలు... అవన్నీఇందలో కలిసిపోతాయి అంటాడు జోష్. వీటితో అప్రమత్తంగా ఉండాలంటాడు.అలాగే డీప్ ఫ్రైయింగ్ ఆరోగ్యానికి హానికరమంటాడు. ఆయిల్ ఫుడ్తో చెడు కొలెస్ట్రాల్, రక్తపోటు, బ్లడ్ షుగర్ లాంటి ప్రమాదకరమైన అనారోగ్యాల్ని పెంచుతుంది. దీనికి బదులుగా తక్కువ కేలరీల స్ప్రేని లేదా ఎయిర్ ఫ్రైయర్ను ఎంచుకోండి అంటాడీ ఫిట్నెస్ కోచ్భోజనానికి ముందు ఒక గ్లాసు నిమ్మకాయ నీరు, తక్కువ కేలరీల పళ్ల రసం తాగడం వల్ల కడుపు నిండిన ఫీలింగ్ ఉంటుంది. తక్కువ తినడానికి అవకాశం ఉంటుంది.ఇదీ చదవండి: నో-షుగర్, నో-మిల్క్: 45 కిలోలు తగ్గింది, ఇప్పటికీ కష్టాలే!బరువు తగ్గడంలో పోర్షన్ కంట్రోల్ చాలా ముఖ్చమని, సరైన ఆహారాన్ని తీసుకోవడంపై దృష్టిపెట్టాలని చెప్పాడు. తక్కువ కేలరీ ఫుడ్తో పొట్టను నింపేయాలి అంటాడు. ముఖ్యంగా సెలెరీ, దోసకాయ, గెర్కిన్స్, టమోటాలు, క్యాబేజీ, ఆకుకూరలులాంటి వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలంటాడు. నోట్: ఫిట్నెస్ కోచ్ ఇన్స్టా ఐడీ ఆధారంగా అందించిన టిప్స్ మాత్రం అని గమనించగలరు. వీటితోపాటు కార్డియో, కఠినమైన ఇతర వ్యాయామాలను కూడా ఇక్కడ గమనించవచ్చు. బరువు తగ్గడం అనే ప్రక్రియలో ఎవరికి వారు ఆలోచించి, వైద్యులు సలహా మేరకు ముందుకు సాగాలి -
పిల్లల్లో మెధోవికాసం పెరగాలంటే..ఈ ఫుడ్స్ బెస్ట్
కొన్ని రకాల ఆహారాన్ని తరచు పిల్లలకు తినిపించడం వల్ల వారిలో మేధోవికాసం పెరుగుతుంది. కాబట్టి పిల్లలకు ఆరోగ్యంతో పాటు తెలివితేటలను పెంచే సూపర్ ఫుడ్స్ కూడా ఇస్తూ ఉండాలి. వేరుశనగ.. ఇందులో ధయామిన్తోపాటు విటమిన్ ఇ ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్స్ కూడా సమృద్ధిగా ఉండటం వల్ల పిల్లల్లో మెదడు ఎదుగుదలకు కావలసిన శక్తి అంది, చక్కగా పెరుగుతుంది. జ్ఞాపకశక్తి పెరుగుతుంది. వోట్స్.. పిల్లల కోసం ఆరోగ్యాన్ని అందించే తృణధాన్యాలలో మొదటిది వోట్స్. ఇది మెదడుకు ఆరోగ్యాన్ని, శక్తిని అందిస్తుంది. ఓట్స్ లోని పీచుపదార్థం పిల్లల మెదడుకు మంచి ఇంధనంగా పనిచేస్తుంది. పొటాషియం, జింక్, విటమిన్ ఇ, బి వారి పెరుగుదలకు సహకరిస్తాయి.బెర్రీలు.. బ్లూబెర్రీస్, బ్లాక్ బెర్రీస్, చెర్రీస్, స్ట్రాబెర్రీస్ ఇవి రకరకాల రంగులలో ఎక్కువ పోషకాలను కలిగి ఉన్నాయి. వీటిలోని యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి, క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి.బీన్స్.. బీన్స్ ప్రత్యేకమైనవి. ప్రొటీన్, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లు, ఫైబర్ శక్తితో పాటు విటమిన్లు, ఖనిజాలు కలిగి ఉంటాయి. మానసికమైన సామర్థ్యాన్ని ఇస్తాయి. మెదడుకు బీన్స్ పింటో బీన్స్ ఒమేగా 3, ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి మెదడు ఆరోగ్యం కోసం చక్కగా పనిచేస్తాయి.ఇదీ చదవండి: నో-షుగర్, నో-మిల్క్: 45 కిలోలు తగ్గింది, ఇప్పటికీ కష్టాలే! -
హెల్త్ స్టార్టప్లను ప్రోత్సహించాలి
న్యూఢిల్లీ: 2035 నాటికి భారత్ అంతర్జాతీయ మెడికల్ హబ్గా ఎదగాలంటే విదేశీ పేషంట్లకు చికిత్స చేసే ఆస్పత్రులకు పన్నులపరమైన ప్రోత్సాహకాలు ఇవ్వాలని ఓ నివేదిక సూచించింది. అలాగే ఆరోగ్య సంరక్షణ రంగ అంకుర సంస్థలకు మరింత తోడ్పాటు ఇవ్వాల్సి ఉంటుందని పేర్కొంది. కేపీఎంజీ ఇన్ ఇండియా, భారతీయ హోటళ్లు, రెస్టారెంట్ అసోసియేషన్ల సమాఖ్య (ఎఫ్హెచ్ఆర్ఏఐ) రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం 2025లో 18.2 బిలియన్ డాలర్లుగా ఉండే భారత మెడికల్ టూరిజం మార్కెట్ వార్షికంగా 12.3 శాతం వృద్ధితో 2035 నాటికి 58.2 బిలియన్ డాలర్ల స్థాయికి చేరనుంది. ఈ నేపథ్యంలో దీనికి తోడ్పాటు అందించేందుకు ఎంబసీలు, ఎగ్జిబిషన్లు, డిజిటల్ ప్లాట్ఫాంల ద్వారా అంతర్జాతీయంగా బ్రాండింగ్ ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని రిపోర్ట్ సూచించింది. అలాగే, రాష్ట్రాలు, జాతీయ స్థాయిలో ’హీల్ ఇన్ ఇండియా’ మిషన్ను ఆవిష్కరించాలని పేర్కొంది. ‘పెట్టుబడులను ఆకర్షించేందుకు, సేవలను మరింత మెరుగుపర్చుకునేందుకు ప్రభుత్వం ద్రవ్యేతర, ద్రవ్యపరమైన ప్రోత్సాహకాలు ఇవ్వాలి. అంతర్జాతీయ పేషంట్లకు చికిత్స చేసే ఆస్పత్రులకు పన్నులపరంగా మినహాయింపులు ఇవ్వొచ్చు. మార్కెటింగ్ డెవలప్మెంట్ అసిస్టెన్స్ స్కీము కింద సబ్సిడీలను పెంచవచ్చు. డిజిటల్ ప్లాట్ఫాంలు సహా ఇతరత్రా మాధ్యమాల్లో మార్కెటింగ్, ప్రమోషన్ కోసం సాంకేతిక సహకారం అందించవచ్చు. అలాగే వెల్నెస్ సెంటర్లు సహా వైద్యపరమైన మౌలిక సదుపాయాల విభాగంలోకి 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతించవచ్చు‘ అని నివేదిక తెలిపింది. మరిన్ని విశేషాలు.. → మెడికల్ టూరిజానికి ప్రత్యక్షంగా దోహదపడే హెల్త్–టెక్, వైద్య పరిశోధనలు, డిజిటల్ హెల్త్ సొల్యూషన్ల విభాగాల్లో పని చేసే స్టార్టప్లు, ఇతర సంస్థలకు నిర్దిష్ట సబ్సిడీలు, గ్రాంట్లు ఇవ్వాలి. → భారత ఆస్పత్రులను కూడా తమ నెట్వర్క్ల్లో జోడించుకునేందుకు అంతర్జాతీయ బీమా సంస్థలతో కలిసి పనిచేస్తూ బీమా పోర్టబిలిటీ వెసులుబాటును తీసుకురావచ్చు. దీనితో విదేశీ పేషంట్లకు ఆర్థిక ప్రతిబంధకాలు తగ్గుతాయి. బీమా ఉన్న విదేశీ పేషంట్లకు భారత్ మరింత ఆకర్షణీయమైన గమ్యస్థానంగా మారేందుకు ఇది ఉపయోగపడుతుంది. → వీసా–ఇన్సూరెన్స్ లింకేజీ మధ్య అంతరాలను తగ్గించడం, అంతర్జాతీయ ప్రమాణాలతో, బహు భాషల్లో సేవలందించేలా ఆస్పత్రుల్లో సిబ్బందికి శిక్షణనివ్వడంపై దృష్టి పెట్టాలి. → మెడికల్, వెల్నెస్ టూరిజంపై జాతీయ వ్యూ హం, మార్గదర్శ ప్రణాళికకు అనుగుణంగా జాతీయ స్థాయిలో మిషన్ ఏర్పాటు చేయాలి. → పాలసీల అమలు, అంతర్–మంత్రిత్వ శాఖల సమన్వయం కోసం జాతీయ మెడికల్, వెల్నెస్ టూరిజం ప్రమోషన్ బోర్డును సమగ్ర జాతీయ మిషన్గా అప్గ్రేడ్ చేయాలి. → మెడికల్ టూరిజం సూచీలో భారత్ 10వ ర్యాంకులో, వెల్నెస్ టూరిజంలో 7వ స్థానంలో ఉంది. → 2024లో భారత్ 4,63,725 మెడికల్ వీసాలను జారీ చేసింది. మెజారిటీ పేషంట్లు బంగ్లాదేశ్, జీసీసీ దేశాలు, ఆఫ్రికా నుంచి వచ్చారు. → 2024లో అంతర్జాతీయంగా మెడికల్ టూరిజం మార్కెట్ 41.75 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇది 2030 నాటికి రెట్టింపు అవుతుందని అంచనా. -
పార్లమెంట్ ఫుడ్ మెనూ..! లిస్టు చూసేయండి!
పార్లమెంటు క్యాంటీన్లో ఫుడ్ మెనూ ఎలా ఉంటుందో తెలుసా..!. ఎప్పుడైనా దీని గురించి విన్నారా అంటే..చాలామందికి తెలియదనే చెప్పాలి. అధికారులు, శాసనసభ్యులు, మహామహారథులు ఉండే ఆ శాసనసభలో వారికి మంచి విలాసవంతమైన భోజనమే క్యాంటిన్లో ఉంటుదనేది వాస్తవమే. కానీ ఈసారి ఆరోగ్యమే మహాభాగ్యం అంటూ సరికొత్త మార్పులకు శ్రీకారం చుట్టింది పార్లమెంట్. అక్కడ క్యాంటీన్ మెనూలో ఎలాంటి వంటకాలు చేర్చారంటే..మంచి రుచికరమైన థాలిస్, కూరలను అందిచిన పార్లమెంట్ క్యాంటీన్ ఇటీవలే దాని మెనూని సరికొత్త వంటకాలతో మార్పులు చేసింది. ఇదివరకటిలా నెయ్యి, నూనెతో కూడిన భారీ భోజనాలకు స్వస్తి చెప్పేసేలా ఓ ముందడుగు వేసింది. ఆ వంటకాల స్థానంలో.. సుదీర్ఘ గంటలు పనిచేసే శాసనసభ్యుల్లో ఉత్సాహం నింపేలా, జోవర్ ఉప్మా, మిల్లెట్ ఇడ్లీలు, శక్తిమంతమైన సలాడ్లు, కాల్చిన చేపలు సర్వ్ చేయనుంది. దీన్ని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ప్రారంభించారు. మెనూలో రుచి, పోషకాహారాన్ని కోల్పోకుండా ఆరోగ్యకరమైన భోజనానికి ప్రాధాన్యత ఇస్తోంది. అంతేగాదు ఇక్కడ అందించే ఫుడ్ పోషకాహార నిపుణుల మార్గదర్వకత్వంలో జాతీయ ఆరోగ్య ప్రచారానికి అనుగుణంగా ఉంటుందట. బ్రౌన్ రైస్, మిల్లెట్ వంటి ఆరోగ్యప్రదాయకమైన వంటకాలతో సమతుల్య ఆహారానికే పెద్దపీట వేసేలా అందించనుంది. ఈ విభిన్న రుచులకు అనుగుణంగా ప్రతి వంటకం పక్కన కేలరీ ట్యాగ్ని కూడా ఇస్తారట. ఈ విధానం జాగ్రత్తగా తినడాన్ని ప్రోత్సహిస్తుందట.ముఖ్యంగా మిల్లెట్ ఆధారిత అల్పాహార వంటకాల నుంచి 270 కిలో కేలరీలతో నిండిన సాంబార్తో రాగి ఇడ్లీ, 206 కిలో కేలరీలతో కూడిన జోవర్ ఉప్మా, మూంగ్ పప్పు చిల్, చనా చాట్, ఉడికించిన కూరగాయలు (157 కిలో కేలరీలు) ఉండగా, మాంసాహార ప్రియుల కోసం గ్రిల్డ్ చికెన్, గ్రిల్డ్ ఫిష్ వంటి లీన్ ప్రోటీన్లను సర్వ్ చేయనుంది. ఎంపీలు (పార్లమెంటు సభ్యులు) ఇప్పుడు ఇక స్నాక్స్, పానీయాల కోసం..గార్డెన్లో పండిన తాజా పండ్ల సలాడ్లు(113 కిలో కేలరీలు), క్లియర్ సూప్, కాల్చిన టమోటా, తులిసి షోర్బాల వంటి జ్యూస్లు సిప్ చేయొచ్చు. అలాగే భోజనాన్ని చివరగా తీపి పదార్థం ముగించేలా మిక్స్ మిల్లెట్ ఖీర్ కూడా అందించనున్నారు. సుదీర్ఘ గంటలు పనిచేసే నాయకుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని మరి ఆరోగ్యదాయకంగా రూపొందించారు ఈ మెనూని. 2023 సంవత్సరాన్ని ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ చిరు ధాన్యాల సంవత్సరం ప్రకటించి..చిరు ధాన్యాలకు భారీ ప్రచారం లభించింది. ఆ నేపథ్యంలోనే పార్లమెంటులో మెనూలో ఈ సరికొత్త మార్పులు చేశారు. అలాగే శరీరం రోజువారీ అవసరాలను తీర్చడానికి పిండి పదార్థాలు, కేలరీలు, సోడియం తక్కువగా ఉండి, ఫైబర్, ప్రోటీన్లు సమృద్ధిగా ఉండేలా మెనూని చాలా ఆలోచనాత్మకంగా రూపొందించారు. పని చేసే అధికారులలో ఊబకాయం, దీర్ఘకాలిక వ్యాధులు ముప్పు వంటి ఆందోళనలకు చెక్ పెట్టేలా ఈ మెనూని అత్యంత ఆరోగ్యదాయకంగా రూపొందించడం విశేషం. (చదవండి: 114 ఏళ్ల వయసులోనూ హుషారుగా.. ఆయన ఫిట్నెస్ సీక్రెట్ ఇదే!.. కానీ..) -
'కెరీర్'.. వెరీ కేర్ఫుల్..!
ప్రస్తుతం నగరం చదువుల ఉత్సాహంతో ఉప్పొంగిపోతోంది. ఎక్కడ చూసినా నోటిఫికేషన్లు, ఎంట్రెన్స్ ఫలితాలు, ర్యాంకుల ఆధారంగా కాలేజీ ఎంపికలు, సీట్ల కేటాయింపులు, కౌన్సెలింగ్ల ప్రక్రియల చర్చలు హోరెత్తుతున్నాయి. ఈ వాతావరణంలో విద్యార్థులూ, వారి తల్లిదండ్రులూ సందేహాలు, అనుమానాలతో ముందస్తు మార్గాలను అన్వేషిస్తున్నారు. ఈ సమయంలో పలు కోర్సులపై, కాలేజీలపై, కెరీర్ అవకాశాలపై స్పష్టత లేనిదే నిర్ణయాలు తీసుకుంటే.. అది భవిష్యత్తు పట్ల ప్రమాదకరంగా మారుతుంది. ఈ నేపథ్యంలో చదువుల ప్రపంచాన్ని అర్థం చేసుకోవడం, వివిధ కోణాల్లో విశ్లేషించడం తప్పనిసరిగా మారింది. ఇది కేవలం చదువు గురించి కాదు.. జీవితం గురించి. ఒక నిర్ణయం మీ జీవితానికి దిశ చూపుతుంది. మరి ఆ నిర్ణయం, నిజమైన సమాచారం ఆధారంగా ఉండాలి. ట్రెండ్లు చూసో, ఇష్టమైన రంగం అనో కాకుండా వాస్తవ పరిస్థితుల ఆధారంగా ముందుకు సాగడం ముఖ్యమని నిపుణుల సూచన. విద్యార్థులు ఏ కోర్సు ఎంచుకోవాలి? ఎలాంటి కాలేజీ ఏ రంగానికి బాగా అనుకూలం? జాబ్ మార్కెట్లో ఏ రంగానికి డిమాండ్ ఉంది? ఇవన్నీ తెలుసుకోవడమే మొదటి మెట్టు. సమాచారం మూడు మార్గాల్లో సులభంగా లభిస్తుంది. ముఖ్యంగా ఎంట్రన్స్ పరీక్షల తేదీలు, అప్లికేషన్లు, కౌన్సెలింగ్, సరి్టఫికెట్ వెరిఫికేషన్ తదితర తేదీలను ఎప్పటికప్పుడు అధికారిక వెబ్సైట్లలో తెలుసుకుంటుండాలి. ప్రభుత్వ వెబ్సైట్లు (తప్పనిసరిగా చూడాల్సినవి): టీజీ ఈఏపీసీఈటీ, నీట్, సీయూఈటీ వంటి పరీక్షల అధికారిక వెబ్సైట్లు, ఏఐసీటీఈ, యూజీసీ వంటి ప్రభుత్వ శిక్షణ సంస్థల వెబ్సైట్లు.నిపుణుల సలహాలు: కెరీర్ కౌన్సెలర్లు, సబ్జెక్ట్ నిపుణులు, సైకాలజిస్టులు విద్యార్థుల ప్రొఫైల్ ఆధారంగా సరైన మార్గదర్శనం అందించగలరు. ఉదాహరణకు ‘యూనివర్సిటీ, కెరీర్ ల్యాబ్స్, బైజూస్ కెరీర్ కౌన్సెలింగ్, టీసీఎస్ ఐఆన్’ వంటి ప్లాట్ఫాంలు ఉపయుక్తం.పూర్వ విద్యార్థుల అనుభవాలు: ఆయా కాలేజీల పూర్వ విద్యార్థులను సంప్రదించడం వల్ల కాలేజీ రియాలిటీ, ఫ్యాకల్టీ, ప్లేస్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వంటి విషయాల్లో స్పష్టత వస్తుంది. తల్లిదండ్రుల పాత్ర.. పిల్లల కలలు మీ కోరికలు కావొద్దు. పిల్లల ఆసక్తులు, సామర్థ్యాలు, నైపుణ్యాలు, వ్యక్తిత్వ లక్షణాల ఆధారంగా గైడెన్స్ ఇవ్వాలి. ఎదుటివారి పిల్లలు చేసినట్లు చేయాలని అనడం ద్వారా పిల్లలపై ఒత్తిడి తీసుకురావద్దు. ఎవరి మాట నమ్మాలి..? ఫేక్ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్లు: వీరి మాటలు చాలాసార్లు మోసం చేస్తాయి. వారి చెప్పినంతగా స్కాలర్ షిప్స్, సీట్లు ఉండవు. సోషల్ మీడియాలో డైరెక్ట్ యాడ్స్: వీరిని నమ్మొద్దు.. గుర్తింపు లేని సంస్థల్లో అవకతవకలు ఎక్కువగా ఉంటాయి. ప్రభుత్వ టోల్ ఫ్రీ నంబర్లలో సమాచారం ఉత్తమం. కార్యాచరణ సూచనలు.. నాకు ఏవైనా ఆసక్తులు ఉన్నాయా? నేనేం బాగా చేయగలను? అనే స్వీయ విశ్లేషణ అవసరం. స్కూల్, కాలేజీ కౌన్సెలర్లు/సీనియర్ల ప్రాథమిక గైడెన్స్ తీసుకోవడం ఆన్లైన్లో సర్టిఫైడ్ కౌన్సెలింగ్ పొందడం. చివరి ఎంపికకు ముందు కనీసం ఇద్దరు–ముగ్గురు నిపుణులను సంప్రదించండి. తప్పక తెలుసుకోవాల్సిన కోర్సులు.. ఇంజినీరింగ్ (బీ.టెక్): సీఎస్సీ, ఈసీఈ, ఏఐఎమ్ఎల్, సైబర్ సెక్యూరిటీ వంటి కొత్త స్పెషలైజేషన్లు డిమాండ్లో ఉన్నాయి. జేఎన్టీయూ, ట్రిపుల్ ఐటీ హైదరాబాద్, సీబీఐటీ, వీఎన్ఆర్ వంటి కాలేజీలు మంచి పేరు తెచ్చుకున్నాయి. మెడిసిన్ (ఎంబీబీఎస్, బీడీఎస్, బీఏఎమ్ఎస్, బీహెచ్ఎమ్ఎస్): నీట్ ఆధారంగా అఖిల భారత, రాష్ట్రస్థాయి కోటాలో సీట్లు లభిస్తాయి. ప్రైవేట్ కాలేజీలు ఫీజులు చాలా ఎక్కువ. ప్రభుత్వ కాలేజీలు అయితే అత్యుత్తమమైనవి. లిబరల్ ఆర్ట్స్, మాస్ కమ్యూనికేషన్, డిజైన్: ఎన్ఐడీ, నిఫ్ట్, ఎఫ్ఎల్ఏఎమ్ఈ యూనివర్సిటీ వంటి సంస్థలు ఆర్ట్స్కి ప్రాధాన్యతనిచ్చే విద్యార్థులకు అనుకూలం. వృత్తి విద్యా కోర్సులు(డిప్లొమా, ఐటీఐ, పారామెడికల్): తక్కువ ఖర్చుతో, త్వరగా ఉపాధి అవకాశాలు ఇవ్వగలిగే కోర్సులు కావాలంటే ఇవి బెస్ట్. రాష్ట్ర ప్రభుత్వాల మేనేజ్డ్ ఐటీఐ, పాలిటెక్నిక్ విద్యా సంస్థలు ఈ కోణంలో మంచి పనితీరు కనబరుస్తున్నాయి. డిగ్రీ (అండర్ గ్రాడ్యుయేషన్–యూజీ): ఇది విద్యార్థి కెరీర్కు బేసిక్గా పనిచేసే దశ. మూడేళ్ల (బీఏ, బీఎస్సీ, బీకాం) నుంచి నాలుగేళ్ల (బీటెక్, బీ.ఫార్మా) వరకు కోర్సులు ఉన్నాయి. యూజీలో ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న బీఎస్సీ డేటా సైన్స్, న్యూట్రీషన్, ఫోరెన్సిక్ సైన్స్.. బీకాం ఫిన్టెక్, బిజినెస్ అనలైటిక్స్.. బీఏ సైకాలజీ, మాస్ కమ్యూనికేషన్స్ వంటి రంగాలపై దృష్టి పెట్టాలి. డిగ్రీలో నేర్చుకున్న ఫౌండేషన్ బలంగా ఉంటే పీజీలో విశ్లేషణాత్మక విద్యనూ, పరిశోధనాత్మక దృక్పథాన్నీ పొందొచ్చు. పీజీ (పోస్ట్గ్రాడ్యుయేషన్): పీజీ అనేది యూజీలో పొందిన జ్ఞానాన్ని మరింత లోతుగా తెలుసుకునే దశ. ఇది రెండు సంవత్సరాల కోర్సు. ఉద్యోగ అవకాశాలు మెరుగుపర్చుకోవడానికి లేదా అధ్యాపక వృత్తిలోకి రావడానికి పీజీ ఉపయోగపడుతుంది. కొన్ని కోర్సులకు ప్రత్యేక ఎంట్రెన్స్ అవసరం: క్యాట్–ఎంబీఏ, సీయూఈటీ పీజీ లేదా టీజీ సీపీజీఈటీ–ఎమ్ఏ, ఎమ్మెస్సీ, ఎమ్కాం, గేట్–ఎమ్టెక్, నీట్ పీజీ–మెడికల్ పీజీ కోర్సులు. పీహెచ్డీ (డాక్టరల్ రీసెర్చ్): పరిశోధన రంగం అంటే సీరియస్గా గమనించాల్సిన అంశం. పీహెచ్డీ విద్యార్థి కొంత కాలం లోతుగా ఒక సబ్జెక్ట్ మీద పరిశోధన చేస్తూ సొంత థీసిస్ అందజేసే దశ. అభ్యాసం, పరిశోధన మీద ఆసక్తి ఉన్నవారికి మాత్రమే పీహెచ్డీ సరైన మార్గం. యూజీసీ–నెట్, సీఎస్ఐఆర్–నెట్, గేట్, జేఆర్ఎఫ్ వంటి పరీక్షల ద్వారా స్కాలర్షిప్తో చేరొచ్చు. హై–ఎండ్ కార్పొరేట్ ఆర్అండ్డీ, యూనివర్సి టీలలో ప్రొఫెసర్ ఉద్యోగాలు సాధించాలంటే పీహెచ్డీ అవసరం. (చదవండి: 114 ఏళ్ల వయసులోనూ హుషారుగా.. ఆయన ఫిట్నెస్ సీక్రెట్ ఇదే!.. కానీ..) -
114 ఏళ్ల వయసులోనూ హుషారుగా.. ఆయన ఫిట్నెస్ సీక్రెట్ ఇదే!.. కానీ..
ప్రపంచంలో అత్యంత పెద్ద వయస్కుడైన మారథాన్ అథ్లెట్గా గుర్తింపు పొందిన ఫౌజా సింగ్(114) రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన సంగతి తెలిసిందే. ఆయన చనిపోయేంత వరకు మంచి ఫిట్నెస్తో అందర్నీ ఆశ్చర్యపరిచేవారు. "టర్బన్డ్ టోర్నడో"గా మంచి గుర్తింపు తెచ్చకున్న ఫౌజా సింగ్ జూలై 14న 114 వయసులోకి అడుగుపెట్టారు. ఆయన ప్రపంచంలోనే అత్యంత శతాధిక వృద్ధ మారథాన్ అథ్లెట్గా మంచి పేరు తెచ్చుకున్న వ్యక్తి. అలాంటి వ్యక్తి ఆకస్మికంగా మృతి చెందడం బాధకరం. ఆయన చనిపోయేంత వరకు చక్కటి క్రమశిక్షణయుత జీవనశైలికి మారుపేరుగా నిలిచారాయన. వందేళ్ల వయసులో కూడా యువకుడు మాదిరి దూకుడుగా ఉండే అతడి తీరు అందర్నీ ఆశ్చచకితులను చేసేది. అంతలా సుదీర్ఘకాలం జీవించడమే కాకుండా..ఆరోగ్యంగా ఫిట్గా ఉండేందుకు ఆయన ఎలాంటి ఆహార తీసుకునేవారు..?. అతడి జీవన విధానం ఎలా ఉండేది అంటే..ప్రపంచంలోనే అత్యంత వృద్ధ మారథాన్లలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్న ఫౌజా సింగ్ 1911లో జన్మించారు. వందేళ్లు పూర్తి అయిన వెంటనే మారథాన్లో పాల్గొని పరుగుపెట్టడం ప్రారంభించారు. ఆ వయసులో అతడి అపారమైన ఓపిక, చలాకితనం చూసి శాస్త్రవేత్తలు సైతం ఆశ్చర్యపోయారు. ఆయన ఈ మారథాన్ ప్రయాణాన్ని 89 ఏళ్ల వయసులో ప్రారంభించి 2000 నుంచి 2013 మధ్య మొత్తం 9 మారథన్లు పూర్తి చేశారు. అంతేగాదు ఆయన తన 101వ పుట్టి రోజు జరుపుకున్న మూడు వారాలకే లండన్ మారథాన్లో పాల్గొని ఏడు గంటల 49 నిమిషాల్లో పూర్తి చేశారట. గత 12 ఏళ్లలో మొత్తం ఎనిమది మారథాన్లు పూర్తి చేశారు. ఇంతలా యాక్టివ్గా ఆ వయసులో మారథాన్లు పూర్తి చేయడానికి గల సీక్రెట్ సింపుల్ ట్రిక్సేనని అంటారు ఫౌజా సింగ్. తాను శాకాహారాలు మాత్రమే తింటానని, అదే తన ఆరోగ్య రహస్యమని చెబుతున్నారు. అంతేగాదు ఆయన శాకాహారులు మాంసం తినేవారికంటే సుదీర్ఘకాలం బతుకుతారని బలంగా విశ్వసిస్తాడాయన. ఇదే విషయం అధ్యయనాల్లో కూడా వెల్లడైంది. తాను ప్రతిరోజు చపాతీ, పప్పు, సబ్జీ, సాగ్ వంటి శాకాహారాలు తినడం తోపాటు నడవడం, జాగింగ్ వంటివి కూడా చేస్తానని వెల్లడించారు. వయసు పరిణితిని అందిచవచ్చేమో గానీ ఓర్పు, ప్రశాంత జీవనం, మంచి ఆరోగ్యం మాత్రం పోషకాహారమైన శాకాహారంతోనే వస్తుందని సదా పిలుపునిచ్చేవారు ఫౌజా. తాను జీవితాంతం శాకాహారినే అని ప్రకటించారు కూడా. సిక్కు మతం "జీవించడానికి తినాలే తప్ప తినడానికే జీవించకూడదు" అని ప్రభోదిస్తుంది. తాను పుట్టిన భారతావనిలోని పంజాబ్లో స్వయంగా తాము పండించే పంటలనే తింటారని, అదే వారి దీర్ఘాయువు రహస్యమని తరుచుగా చెబుతుండేవారు. ఆ క్రెడిట్ అంతా శాకాహారాలకే ఆపాదిస్తానని అంటుండేవారు. మన భారత ప్రధాని మోదీ సైతం శాకాహారాలతోనే ఆరోగ్యం అని మన్కీ బాత్లో చెబుతుంటారు. అలానే చాలామంది ప్రముఖులు, సెలబ్రిటీలు కూడా మొక్కల ఆధారిత ఆహారాలతోనే అనారోగ్యం బారిన పడకుంటా ఉంటామని చెబుతుండటం విశేషం. (చదవండి: హీరో మాధవన్ వెయిట్లాస్ జర్నీ..! వ్యాయమాలు చేయకుండా జస్ట్ 21 రోజుల్లో..) -
హీరో మాధవన్ వెయిట్లాస్ జర్నీ..! వ్యాయమాలు చేయకుండా జస్ట్ 21 రోజుల్లో..
తమిళ నటుడు మాధవన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. లేడీ ఫ్యాన్స్ ఎక్కువగా ఉన్న నటుడిగా పేరుగాంచిన ఆర్ మాధవన్..ఐదు పదుల వయసులో కూడా అదే యంగ్ లుక్లో అభిమానులను అలరిస్తున్నారు. ఒకనొక టైంలో అధిక బరువుతో ఇబ్బందిపడ్డ మాధవన్ గతేడాది 2024లో అనూహ్యంగా బరువు తగ్గి అందర్నీ ఆశ్చర్యపరిచారు. మళ్లీ ఇదివరకటి మాధవన్ మన ముందుకు వచ్చేశాడంటూ అతడి అభిమానులు ఖుషీ అవుతున్నారు. అది కూడా 21 రోజుల్లోనే అదనపు బరువుని తగ్గించుకోవడం విశేషం. మరి అందుకోసం అతడు ఎలాంటి డైట్ ప్లాన్ అనుసరించాడు, ఎలాంటి వర్కౌట్లు చేసేవాడో తెలుసుకుందామా..!.చాలా తక్కువ సమయంలోనే బరువు తగ్గేందుకు మాధవన్ ఎలాంటి వర్కౌట్లను ఆశ్రయించలేదన. జస్ట్ తీసుకునే ఆహారంలోనే మార్పులు, చక్కటి జీవనశైలితో బరువు తగ్గాడట. ఓ ఇంటర్వ్యూలో ఆయనే స్వయంగా వెల్లడించారు. తాను అడపాదడపా ఉపవాసం(మెడిటేరియన్ డైట్), రోజుకు 45 నుంచి 60 సార్లు బాగా నమిలి తినడం, నీళ్లు అధికంగా తీసుకోవడం వంటివి అనుసరించినట్లు తెలిపారు. అలాగే రోజులో తన చివరి భోజనం సాయంత్రం 6.45 గంటలకు (వండిన ఆహారం మాత్రమే తీసుకునేవారట). తెల్లవారుజామున సుదీర్ఘ వాకింగ్, గాఢనిద్ర, పోన్కి దూరంగా ఉండటం వంటివి చేశానని చెప్పారు. పుష్కలంగా నీరు, ఆకుపచ్చని కూరగాయలు తీసుకున్నానని చెప్పుకొచ్చారు. శరీరంగా సులభంగా జీర్ణం చేసుకునే పోషకాహారానికే ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలిపారు. అలా మాధవన్ 21 రోజుల్లో ఆరోగ్యకరమైన రీతీలో బరువు తగ్గారు. ఇది మంచిదేనా అంటే..నిపుణులు ఏమంటున్నారంటే..అడపాదడపా ఉపవాసంఅడపాదడపా ఉపవాసం అనేది ఒక విధమైన తినే విధానం. ఇది ఇన్సులిన్ స్థాయిలను నిర్వహించడానికి మొత్తం ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఆర్.మాధవన్ ప్రతిరోజూ సాయంత్రం 6:45 గంటలకల్లా తన చివరి భోజనం తింటానని, మధ్యాహ్నం 3:00 గంటల తర్వాత ఎలాంటి పచ్చి ఆహారాన్ని తిననని వెల్లడించాడు.ఆహారాన్ని సరిగ్గా నమలడంఇలా 45 నుంచి 60 సార్లు ఆహారాన్ని నమలడానికి బరువు తగ్గడానికి మధ్య చాలా అవినాభావ సంబంధం ఉందని అధ్యయనాలు పేర్కొన్నాయి కూడా. ఇది బరువు తగ్గాలనుకునేవారికి సరైన వ్యూహంగా చెబుతున్నారు నిపుణులు.ఉదయాన్నే వాకింగ్బరవుని అదుపులో ఉంచడానికి ఉత్తమ మార్గం ఇది. ఎలాంటి కఠిన వ్యాయామాలతో పనిలేకుండా చేసే సుదీర్ఘ వాకింగ్ కండరాలకు మంచి కదలిక తోపాటు సులభంగా కేలరీలను బర్న్ చేయడంలో తోడ్పడుతుంది.స్లీప్ అండ్ స్క్రీన్ డిటాక్స్మంచి నాణ్యమైన నిద్రకు స్కీన్ సమయం తగ్గించడమే అని నిపుణులు చెబుతున్నారు. నిద్రకు కనీసం ముందు 90 నిమిషాలు పాటు స్క్రీన్లకు దూరంగా ఉండటం చాలామంచిదని సూచించారు.పుష్కలంగా ద్రవాలు, ఆరోగ్యకరమైన ఆకుకూరలుబరువు తగ్గించే ప్రయాణంలో తాను పుష్కలంగా ద్రవాలు తాగానని హైడ్రేటెడ్గా ఉంచుకున్నానని ఆర్.మాధవన్ తెలిపారు. మాధవన్ తన శరీరం సులభంగా జీర్ణం చేసే ఆకుపచ్చ కూరగాయలు, ఆహారాలకే ప్రాధాన్యత ఇచ్చారు. ప్రాసెస్ చేసిన ఆహారాలకు చాలా దూరంగా ఉన్నారు. ఇది సరైన జీవనశైలికి నిదర్శనమని చెబుతున్నారు నిపుణులు. ఈ విధమైన ఆరోగ్యకరమైన పద్ధతులను అనుసరిస్తే ఎవ్వరైనా..సులభంగా బరువు తగ్గుతారని నమ్మకంగా చెబుతున్నారు. ఇంకెందుకు ఆలస్యం ప్రయత్నించి చూడండి మరి..!.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం.No exercise, No running... 😏21 நாட்களில் மாதவன் உடல் மாற்றம், அது எப்படி சாத்தியம்? 🤔 pic.twitter.com/ssrATrqOnr— Aadhavan® (@aadaavaan) July 17, 2024 (చదవండి: రిమ్ 'జిమ్'.. హోమ్..! కోవిడ్ తర్వాత పెరుగుతున్న ట్రెండ్..) -
చేప.. చేదా...వర్షకాలంలో అస్సలు తినకూడదా..?
ఎంతగా మనకు ఇష్టం ఉన్నప్పటికీ వర్షాకాలంలో చేపలు తినడం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే...ఇది చేపల ఉత్పత్తి సమయం అంటే బ్రీడింగ్ సైకిల్..వర్షాకాలంలో చేపలు సంతానాన్ని ఉత్పత్తి చేస్తాయి. ఆ సమయంలో వాటిని తినడం అంత మంచిది కాదు. అది వాటి పునరుత్పత్తిని వ్యతిరేకించే చర్య దీని వల్ల చేపల జనాభా మందగిస్తుంది.. అలాగే పర్యావరణ సమతౌల్యం దెబ్బతింటుంది కూడా. అందువల్ల ఈ సమయంలో చేపలను తీసుకోవడం తగ్గిస్తే మన ఆరోగ్యానికి మాత్రమే కాదు పర్యావరణానికి మేలు చేసిన వాళ్లం అవుతాం. అంతేకాదు వాటి బ్రీడింగ్ దెబ్బతినకూడదని కొన్ని ప్రాంతాల్లో ఈ సీజన్లో చేపల వేటను నిషేధిస్తారు కూడా. తద్వారా నాణ్యమైన చేపల దిగుబడి తగ్గుతుంది.వర్షాలు వస్తే సరఫరా వ్యవస్థలో కీలకమార్పులు చోటు చేసుకుంటాయి. వినియోగదారులకు చేపలను అందించేందుకు ట్రాన్స్పోర్ట్ చేసే ట్రక్, నిల్వ చేసే పోలీస్టర్ బ్యాగులు తదితర పద్ధతుల్లో అలసత్వం మరింత బాక్టీరియా పెరుగుదలకు దారితీసే అవకాశం ఉంటుంది.వర్షాలు నీటిని కలుషితం చేస్తాయి, యాంటిజన్లను, బ్యాక్టీరియా, వైరస్ల వృద్ధికి కారణమవుతాయి. ఈ పరిస్థితిలో చేపలు ఆ కలుషిత నదీ/ తలపు/ఏరియా నీళ్ళలో ఉంటే, వాటి ద్వారా మనకు కలరా, హెపటైటిస్ బి, టైఫాయిడ్, గ్యాస్ట్రోఎంటరైటిస్ వంటి వ్యాధులు వచ్చే అవకాశం పెరుగుతుంది అంతేకాదు అలర్జీలు ఉన్నా లేక వ్యాధి నిరోధక శక్తి లేకపోయినా వారికి కూడా ఈ సీజన్లో చేపలు ఆహారం మంచిది కాదని వైద్యులు అంటున్నారు.వర్షాకాలంలో వాతావరణంలో తేమ ఉండటం వల్ల, చేపలు మరింత వేగంగా పాడైపోవడం జరుగుతుంది. ఇది కొద్దిగా తాజా కనబడినా, అది వాస్తవానికి పాడైపోవడం కాకపోవడం అన్న ఒక గందరగోళ అనుభూతి మాత్రమే. ఆరోగ్యం దృష్ట్యా ప్రొటీన్ కోసం తీసుకుంటున్నవారు ప్రత్యామ్నాయంగా, ప్రోటీన్ అవసరాన్ని తీర్చుకోవడానికి కొన్ని రకాల శాఖాహారాలను ఎంచుకోవచ్చు.చేపలను తీసుకోకుండా ఉండలేని ఫిష్ లవర్స్ ఈ సీజన్లో చేపలను తక్కువగా లేదా ఆచి తూచి ఎంచుకుని తినడం అవసరం. విశ్వసనీయమైన విక్రయదారుని నుంచి మాత్రమే చేపలు కొనుగోలు చేయాలి. సరైన , తగినంత టెంపరేచర్లో పరిశుభ్రమైన పద్ధతిలో వండి మాత్రమే వినియోగించాలి. తాయ్ మంగూర్ వంటి కొన్ని హానికారక జాతుల చేపల్ని ప్రభుత్వం నిషేధించింది. అయినప్పటికీ కొందరు విక్రయిస్తున్నారు. ఇలాంటి చేపల జాతుల గురించి అవగాహనతో ఎంపిక చేసుకోవాలి.(చదవండి: దృఢ సంకల్పానికి కేరాఫ్ అడ్రస్ ఈ పారాసైక్లిస్ట్..! ఒంటి కాలితో ఏకంగా..) -
పుట్టగొడుగులకు డిమాండ్, కిలో రూ. 1400
కొరాపుట్: వర్షాలు కురుస్తుండడంతో పుట్టగొడుగుల (Mushrooms) సీజన్ ప్రారంభమైంది. వీటిని సేకరిస్తున్న వ్యక్తులు విక్రయించేందుకు జయపూర్ మార్కెట్కు మంగళవారం భారీగా తీసుకొని వచ్చారు. ఇప్పుడిప్పుడే పుట్టగొడుగులు లభ్యమవుతుండడంతో వీటికి డిమాండ్ పెరిగింది. కిలో 1400 రూపాయల చొప్పున వ్యాపారులు విక్రయిస్తున్నారు. పుట్టగొడుగుల్లోని పోషక లక్షణాలు, బయోయాక్టివ్ సమ్మేళనాలు ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. అవి యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు , ఖనిజాలకు మంచి మూలం. అంతేకాదు కొన్ని పుట్ట గొడుగులు ప్రీబయోటిక్ లక్షణాలను కలిగి ఉంటాయి, ఇవి పేగు ఆరోగ్యంపై సానుకూల ప్రభావాన్ని చూపుతాయి.చదవండి: ఇషా-ఆనంద్ లవ్, ప్రపోజల్ స్టోరీని రివీల్ చేసిన పాపులర్ సింగర్పుట్టగొడుగులతో ఆరోగ్య ప్రయోజనాలుమష్రూమ్స్ను మన ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఎన్నో అద్భుత లాభాలు ఉన్నాయి. విటమిన్ డి,డి2, పుష్కలంగా లభిస్తాయి.ఎముకలు, కండలకి బలంరోగ నిరోధక శక్తి పెరుగుతుంది. యాంటీ ఇక్సిడెంట్స్ కారణంగా స్ట్రెస్ తగ్గుతుంది.మష్రూమ్స్లోయాంటీ ఆక్సిడెంట్స్, పాలీఫెనాల్స్ పుష్కలంగా ఉంటాయి. వీటితో బ్రెయిన్ హెల్త్ బాగుంటుంది. దీంతో పాటు జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుంది.పుట్టగొడుగులు తినడం వల్ల బరువు తగ్గుతారు. వీటిల్లో పొటాషియం, మినరల్స్, ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి. ఇవి బీపిని అదుపులో పుంచుకునేందుకు సాయ పడతాయి. పుట్టగొడుగులతో కార్డియోవాస్క్యులర్ సమస్యలు తగ్గుతాయి. పుట్టగొడుగుల్లోని ప్లాంట్ బేస్డ్ కాంపౌండ్స్ రక్తనాళాలని మెరుగ్గా చేసి గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. సోడియం లెవల్స్, కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గుతాయి.గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం అందించిన వివరాలివి. అలాగే ఆరోగ్యకరమైన పుట్ట గొడుగులను మాత్రమే ఎంచుకోవాలి. కొన్ని విషపూరితమైన పుట్ట గొడుగులతో ప్రాణాలకు ముప్పు అని గమనించగలరు. ఇదీ చదవండి: Soumyashree అలసిపోయిన ప్రాణం: పాడె మోసిన గ్రామస్తులు -
Amblyopia: లేజీ 'ఐ' ఓ కన్నేయండి..!
కొన్ని సందర్భాల్లో రెండు కళ్లలో... ఏదో ఓ కన్ను పనిచేయడానికి కాస్త బద్ధకిస్తుంటుంది. ఈ సమస్య అందరిలోనూ వచ్చే అవకాశమున్నా ముఖ్యంగా చిన్న పిల్లల్లో ఇలాంటి కేసులు ఎక్కువ. అయితే... తమకు ఉన్న రెండు కళ్లలో ఒకటి... తన పక్కదానంత బాగా పనిచేయడం లేదన్న విషయం వారికి తెలిసే అవకాశం సాధారణంగా ఉండదు. ఇలాంటి సందర్భాల్లో స్పష్టంగా కనిపించే కంటి నుంచే ప్రతిబింబాలను గ్రహించి, అస్పష్టంగా కనిపించే ప్రతిబింబాలను మెదడు నిరాకరిస్తుంది. అంటే ఈ రెండు కళ్లలో ఒకటి ప్రతిబింబాన్ని ప్రసారం చేయడంలో కాస్త బద్ధకంగా పనిచేస్తుందన్నమాట. ఇలా బద్ధకంగా పనిచేసే కన్ను పనితీరు క్రమంగా తగ్గి΄ోతూ... ఒక దశలో పూర్తిగా పనిచేయకుండా ΄ోయే ప్రమాదం ఉంది. ఈ సమస్యనే వాడుక భాషలో ‘లేజీ ఐ’ అనీ, వైద్యపరిభాషలో ‘ఆంబ్లోపియా’ అని అంటారు. సాధారణంగా ఆంబ్లోపియా సమస్య ఉన్నప్పుడు... కొద్దిగానైనా చూపు ఉన్నంత కాలం... తమ కళ్లలో ఒకదానికి సమస్య ఉందన్న విషయమే బాధితులకు తెలిసే అవకాశం పెద్దగా ఉండదు. ఈలోపే జరగాల్సిన అనర్థాలు జరిగే అవకాశముంది. అందుకే ‘లేజీ ఐ’ (యాంబ్లోపియా)పై అవగాహన అవసరం. అందుకు ఉపయోగపడేదే ఈ కథనం. ఓ కేస్ స్టడీశిరీష (పేరు మార్చాం) అనే ఓ ఎనిమిదేళ్ల చిన్నారి రెండు కళ్లలో ఒక కన్నులోంచే దృశ్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఆ రెండో కన్ను మంచి ప్రతిబింబాన్ని పంపడంలో కాస్త బద్ధకిస్తోంది. ఇలా కంటిన్యువస్గా జరిగే సమయంలో ఎదుటి దృశ్యాన్ని స్పష్టంగా పంపే కంటి తాలూకు ప్రతిబింబాన్నే మెదడు తీసుకుంటోంది. సరిగ్గా కనిపించని కంటి నుంచి వచ్చే ఆ సమాచారాన్ని తీసుకోవడాన్ని నిరాకరిస్తూ పోవడంతో కొంతకాలానికి ఆ కంటికి క్రమంగా అంధత్వం వచ్చే ప్రమాదం ఏర్పడింది. ఈలోపు ఏదో ఇతర పరీక్ష కోసం వెళ్లిన సమయంలో డాక్టర్లకు ఒక కన్ను బద్ధకిస్తోన్న విషయం తెలిసివచ్చింది. దాంతో డాక్టర్లు అతి కష్టమ్మీద ఆ రెండో కంటి చూపునూ కాపాడగలిగారు. అసలు ‘లేజీ ఐ’ పై అవగాహన రావాలంటే ముందుగా... చూడడమనే ప్రక్రియ ఎలా జరుగుతుందో తెలియడం చాలా ప్రధానం. మనం ఏదైనా దృశ్యాన్ని లేదా వస్తువును చూడాలంటే... తొలుత ఆ వస్తువుపై కాంతి పడి, మళ్లీ అదే కాంతి మన కంటిని చేరాలి. అప్పుడది తొలుత నల్లగుడ్డు అయిన కార్నియా నుంచి, తర్వాత పారదర్శకమైన మన లెన్స్ నుంచీ ప్రసరించి... రెటీనా అనే తెరపై ఆ వస్తువు తాలూకు ప్రతిబింబాన్ని తలకిందులుగా పడేలా చేస్తుంది. ‘ఆప్టిక్ నర్వ్’ అనే కీలకమైన నాడి ద్వారా రెటీనాపైనున్న ప్రతిబింబం సమాచారాన్ని మెదడుకు చేరవేస్తుంది. దాంతో ఆ వస్తువు కనిపించడం వల్ల మనకు దృష్టిజ్ఞానం కలుగుతుంది. ఏమిటీ ‘లేజీ ఐ’?మనకు కలిగే దృష్టి జ్ఞానాన్ని ‘బైనాక్యులర్ విజన్’ అంటారు. అంటే... మన రెండు కళ్లలోని దృశ్యాలూ తమ తమ రెటీనాలపై కలిసి (ఇంటిగ్రేట్ అయి) ఆ రెండూ ఒకే దృశ్యంగా / వస్తువుగా కనిపిస్తాయి. అంటే ‘బై’ అంటే రెండు... ‘ఆక్యులార్’ అంటే ‘కళ్లు’... ఈ రెండు కళ్లూ కలిసి ఒకే దృశ్యాన్ని చూపడమే ‘బైనాక్యులార్ విజన్’! ఏదైనా కారణాలతో ఒకవేళ ఒకరి రెండు కళ్లలో... ఒకదానికి ఏదైనా కొంత లోపం ఉంటే... అలాంటప్పుడు ఒక కంటిలోని ప్రతిబింబం చాలా స్పష్టంగానూ, లోపమున్న కంటిలోని ప్రతిబింబం కొంత అస్పష్టంగా... ఇలా తన రెండు రెటీనాలపై ప్రతిబింబాలను చూపుతుంది. అయితే రెండు కళ్లతో చూసేప్పుడు బైనాక్యులర్ విజన్ కారణంగా ఆ లోపం తెలియక΄ోవచ్చు. ఒక్కో కంటితో విడివిడిగా, పరీక్షగా చూసినప్పుడు మాత్రమే అది తెలిసిరావచ్చు.ఇలాంటి సందర్భాల్లో స్పష్టమైన ప్రతిబింబాన్నే మెదడు స్వీకరిస్తుంది. అస్పష్టమైన దాన్ని క్రమంగా నిరాకరిస్తూపోతుంది. ఇలా అస్పష్టమైన ప్రతిబింబాన్ని నిరాకరించడాన్ని ‘సప్రెషన్’ అంటారు. ఒక కంట్లో ప్రతిబింబం అస్పష్టంగా ఏర్పడుతున్నప్పుడూ, ఆ సమాచారాన్ని మెదడు క్రమంగా నిరాకరిస్తూపోతూ ఉండే మెడికల్ కండిషన్ను ‘లేజీ ఐ’ అనీ, వైద్యపరిభాషలో ‘ఆంబ్లోపియా’ అని అంటారు. లేజీ ఐ / ఆంబ్లోపియా సమస్య ఉన్నవారిలో తొలుత ఎలాంటి లోపమూ కనిపించదు. చిన్నపిల్లల్లోనైతే వాళ్ల కన్ను అభివృద్ధి / వికాసం కూడా మామూలుగానే జరుగుతాయి. వైద్యపరీక్షల్లోనూ కంటి గురించి ఎలాంటి లోపమూ తెలియదు. కాని కొన్నిసార్లు ఏదో ఒక కంట్లోగానీ లేదా ఒక్కోసారి రెండు కళ్లల్లోనూ చూపు మందగిస్తుంది. ‘లేజీ ఐ’ కండిషన్ వయసుతో పాటు పెరుగుతూ పోతుంది. పైకి అంతా బాగానే ఉండటంతో ఈ కండిషన్ను తొలిదశల్లో గుర్తుపట్టడమూ కష్టమే.ఆంబ్లోపియా విస్తృతి : మన దేశంలోని చిన్నారుల్లో దీని విస్తృతి దాదాపు రెండు శాతం. అంటే ప్రతి వంద మంది పిల్లల్లో ఇద్దరిలో ఈ లోపం కనిపిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా దీని విస్తృతి ఇంకా ఎక్కువ. అంటే దాదాపు 4 శాతం. ఆంబ్లోపియా రకాలు అన్ ఐసోమెట్రోపిక్ ఆంబ్లోపియా : ఒక కంట్లో ఉన్న దృష్టిలో΄ానికీ (రిఫ్రాక్టివ్ ఎర్రర్కూ), మరో కంటికీ తేడా ఉండటం. ఈ సమస్య ఉన్న వాళ్లలో చాలా ఎక్కువమందిలో ఈ సమస్యే ఉంటుంది. ఐసోమెట్రిక్ ఆంబ్లోపియా : రెండు కళ్లలోనూ ఎక్కువ దృష్టిలోపం (రిఫ్రాక్టివ్ ఎర్రర్) ఉండటం. (ఉదా + 6.0 ; +6.0) మెరిడోనల్ ఆంబ్లోపియా: కళ్లలో సిలెండ్రికల్ పవర్ ‘2.0’ కంటే ఎక్కువ ఉండటం. స్టెడిస్మస్ ఆంబ్లోపియా : మెల్లకన్ను కారణంగా వచ్చే ఆంబ్లోపియా ఇది. డిప్రొవేషనల్ ఆంబ్లోపియా : పుట్టుకతోనే కంట్లో శుక్లం ఉండటం, కార్నియా సమస్య, రెటీనా సమస్య, కనురెప్ప వాలిపోవడం వంటి సమస్యలున్నప్పుడు, కాంతి కిరణాలు రెటీనాకు సరిగా చేరకపోవడం ఈ తరహా ఆంబ్లోపియా వస్తుంది.ఎంత త్వరగా చికిత్స జరిగితే... అంత మేలైన ఫలితాలుఆంబ్లోపియాను ఎంత త్వరగా గుర్తించి, ఎంత చిన్న వయసులో చికిత్స చేయిస్తే ఫలితాలు అంత మెరుగ్గా ఉంటాయి. అయితే ఆ పసివయసులో తమ చూపులో లోపం ఉందన్న విషయాన్ని పిల్లలు గ్రహించలేకపోవడం, అలాగే చిన్నారుల నుంచి ఎలాంటి ఫిర్యాదులూ లేకపోవడంతో తల్లిదండ్రులు కూడా దీన్ని ఒకపట్టాన గుర్తించలేరు. అయితే చిన్నతనంలోనే అంటే... రెండు నుంచి ఎనిమిది ఏళ్లలోపు గుర్తించి, చికిత్స చేయిస్తే ఫలితాలు చాలా మెరుగ్గా ఉంటాయి. అంతమాత్రాన నిరాశపడాల్సిన అవసరం లేదు. పన్నెండేళ్ల నుంచి పద్దెనిమిదేళ్ల వరకు చికిత్స చేయించడానికి అవకాశం ఉంది. కాకపోతే ఫలితాలు చిన్నప్పటితో పోలిస్తే కాస్త నిదానంగా కనిపిస్తాయి. పెద్దవాళ్లలో కూడా ‘విజన్ థెరపీ’ ద్వారా కొంతవరకు ఫలితాలను రాబట్టవచ్చు. ఏ కారణంతో ఆంబ్లోపియా వచ్చిందో దానికి చికిత్స చేయడం : అంటే ఉదాహరణకు దృష్టిలోపాల వల్ల సమస్య వచ్చినట్లయితే దానికి సరిపడిన అద్దాలను ఇవ్వడం. ఉదాహరణకు ప్లస్ పవర్, మైనస్ పవర్, సిలెండ్రికల్ పవర్. మెల్లకన్ను కారణంగా ఆంబ్లోపియా వస్తే మెల్లకన్ను కరెక్షన్ చికిత్సతో దాన్ని సరిచేయడం. డిప్రెవేషన్ ఆంబ్లోపియా జబ్బులకు... అంటే శుక్లం, కార్నియా, రెటీనా, వాలిపోయే కనురెప్పలు వంటి సమస్యలు ఉన్నప్పుడు వాటిని సరిచేయడం ద్వారా లోపాల్ని తొలగించవచ్చు. ఉదాహరణకు... పుట్టుకతోనే శుక్లం (కాటకార్ట్) కారణంగా ఆంబ్లోపియా వస్తే... శస్త్రచికిత్స ద్వారా తొలుత పారదర్శకత కోల్పోయిన శుక్లాన్ని తొలగించాలి. ఆ స్థానంలో ఇంట్రా ఆక్యులార్ లెన్స్ను అమర్చాలి. శుక్లం కేవలం ఒకే కంట్లోనే ఉంటే– బిడ్డ పుట్టిన వెంటనే ఈ ఆపరేషన్ చేయవచ్చు. ఒకవేళ శుక్లాలు రెండు కళ్లలోనూ ఉంటే ఆపరేషన్కు కొన్ని మాసాల వ్యవధి తీసుకోవచ్చు. కాని శస్త్రచికిత్స మాత్రం తప్పనిసరిగా చేయించాలి. ఆపరేషన్ ఎంత త్వరగా చేస్తే చూపు వచ్చే అవకాశాలు అంత మెరుగ్గా ఉంటాయి. ఆపరేషన్ తర్వాత కూడా పిల్లలకు డాక్టర్లు సూచించిన ప్రకారం... క్రమం తప్పకుండా కంటి పరీక్షలు చేయిస్తూ ఉండాలి. ఇలా ఆ చిన్నారికి 14 ఏళ్ల వయస్సు వచ్చే వరకూ పరీక్షలు చేయించడం తప్పనిసరి. పిల్లల్లో మెల్లకన్ను ఉన్నప్పుడు అశ్రద్ధ చేయకుండా కంటి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాలి. మూడేళ్లలోపు పిల్లలకు ఇది వచ్చే అవకాశం ఎక్కువ. కొందరిలో పుట్టగానే మెల్లకన్ను ఉండవచ్చు. కొందరు తల్లిదండ్రులు తమ బిడ్డకు మెల్లకన్ను ఉండటాన్ని అదృష్టంగా భావిస్తారు. పిల్లలు ఎదిగిన తర్వాత పరీక్షలు చేయించవచ్చని మరికొంతమంది తల్లిదండ్రులు అభిప్రాయపడుతుంటారు. ఈ రెండూ సరికాదు. పిల్లల్లో మెల్లకన్నును గమనించగానే వెంటనే పిల్లలను డాక్టర్ వద్దకు తీసుకెళ్లాలి. మెల్లకంటి సమస్యకూ ఎంతత్వరగా చికిత్స చేయిస్తే... అంత మంచిది. కంటి రెప్ప వాలిపోవడం వల్ల ఆంబ్లోపియా వస్తే... ఆ రెప్ప పైకెత్తి నిలిపి ఉంచేలా ఓ శస్త్రచికిత్స అవసరమవుతుంది. దీన్నే ‘టోసిస్ కరెక్షన్’ సర్జరీ అంటారు. ఈ ఆపరేషన్ తర్వాత కూడా క్రమం తప్పకుండా కంటి పరీక్షలు చేయిస్తూ ఉండటం అవసరం. కొందరిలో కంటికి అద్దాలు అవసరమవుతాయి. ఇలాంటివారు అద్దాలు వాడుతూనే ఆంబ్లోపియాకూ చికిత్స చేయించాలి.అంబ్లోపియాకు కారణాలు(ఆంబ్లోజెనెసిస్)విజువల్ డిప్రవేషన్ : చూపు విషయంలో ఒక కంటిలో ఉన్నంత స్పష్టత మరోదానిలో లేకపోవడం. లైట్ డిప్రవేషన్ : కంటిలోని కొన్ని దోషాల కారణంగా (కాటరాక్ట్ వంటి వాటివల్ల) రెటీనాకు తగినంత కాంతి చేరకపోవడం. అబ్–నార్మల్ బైనాక్యులార్ విజన్ : అంటే రెండు కళ్లూ సమంగా ఒకే వస్తువుపై కేంద్రీకరించలేకపోవడం... ఈ అంశాలు ఉన్నవారిలో ఆంబ్లోపియా క్రమంగా వృద్ధిచెందుతుంది.అక్లూజన్ థెరపీఈ చికిత్స ప్రక్రియలో నార్మల్గా ఉన్న కంటిని పూర్తిగా మూసివేసి, చూపు మందగించిన కంటి తాలూకు దృష్టి మెరుగుపడేలా స్టిమ్యులేట్ చేస్తారు. నార్మల్గా ఉన్న కంటిని ఎన్నాళ్లు మూసి ఉంచి... ఈ స్టిమ్యూలేషన్ చికిత్స చేయాల్సి ఉంటుందన్నది డాక్టర్ నిర్ధారణ చేస్తారు. ఈ చికిత్స వల్ల 8 నుంచి 10 ఏళ్ల వరకు ఉన్న పిల్లల్లో మంచి ఫలితాలు కనిపిస్తాయి.పీనలైజేషన్అట్రోపిన్ చుక్కల మందులు లేదా బలమైన లెన్స్లను బాగా కనిపించే కంటికి వాడతారు. అప్పుడు బలహీనంగా ఉన్న కన్ను స్టిమ్యులేట్ అవుతుంది. దాంతో అది చూడటానికి ప్రయత్నించడాన్ని మొదలు పెడుతుంది. కన్నును మూసివేసి ఉంచి చేసే చికిత్స అయిన ‘అక్లూజన్ థెరపీ’లోలా కాకుండా, కన్ను తెరచే ఉంచి చేసే చికిత్స ఇది.విజన్ థెరపీపైన పేర్కొన్న అక్లూజన్ పద్ధతిలో చికిత్స చేస్తూ... కంప్యూటర్ ప్రోగ్రామ్ ద్వారా బలహీనమైన కంటిని చురుగ్గా మారేలా చేస్తారు. దీని వల్ల మెదడు కూడా తిరిగి ప్రతిబింబాన్ని గ్రహించేలా, పక్క కన్ను ప్రతిబింబంతో పోల్చుకుని... మళ్లీ చూపు, బైనాక్యులర్ విజన్ పొందేలా ప్రయత్నం జరుగుతుంది. ఈ ప్రక్రియకు దాదాపుగా 100 నుంచి 200 గంటల పాటు చికిత్స అవసరమవుతుంది. లక్షణాలు / నిర్ధారణనిజానికి చాలా మంది తమకు లోపం ఉన్నట్లు గుర్తించలేరు / చెప్పలేరు. ∙ఒక కంటిలో చూపు తగ్గడంక్రౌడింగ్ ఫినామినా: అంటే... అనేక అక్షరాలు ఉన్నప్పుడు ఏదో ఒక అక్షరాన్ని మాత్రమే చూడగలగటం. ఒక్క అక్షరాన్ని మాత్రమే చదవడగలగడం. న్యూట్రల్ డెన్సిటీ ఫిల్టర్ : దీనితో పరీక్షించినప్పుడు మామూలు కంటి చూపు ఉన్నవారికిస్పష్టంగా కనిపించదు. కానీ ‘ఆంబ్లోపియా’ ఉన్నవారు దీనిలోంచి చూసినప్పుడు... వారికి మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. కొంతమందిలో మెల్లకన్ను ఉండటం, అలాగే రంగులు చూసే సామర్థ్యం తక్కువగా ఉండటం. కంటి డాక్టర్లు పైన పేర్కొన్న లక్షణాలను బట్టి ‘ఆంబ్లోపియా’ను నిర్ధారణ చేస్తారు. నివారణమూడు నుంచి ఐదేళ్ల వయసులోని పిల్లలకు తప్పనిసరిగా కంటి పరీక్షలు చేయించాలి. లోపాలుండి శస్త్రచికిత్స అవసరమైన వారికి వీలైనంత త్వరగా చేయించాలి. ఆక్లూజన్ థెరపీ ద్వారా చూపు తిరిగి వచ్చాక కూడా ‘మెయింటెనెన్స్ థెరపీ’ అంటూ రోజూ రెండు గంటల పాటు అక్లూజన్ ప్రక్రియను కొనసాగిస్తూ ఉండాలి. ∙తరచూ కంటి డాక్టర్ను సంప్రదిస్తూ ఉండాలి.ఫ్యూజనల్, స్టీరియాప్టిక్ ఎక్సర్సైజెస్లేజీ ఐ తన చురుకుదనాన్ని పొందేలా చేసిన చికిత్స ప్రక్రియల తర్వాత ఆ రెండు కళ్లూ ఒకేలాంటి మంచి ప్రతిబింబాన్నే మెదడుకు ఇచ్చేలా చేసేందుకు కొన్ని వ్యాయాయాలు చేయిస్తారు. ఇందులో ఫ్యూజనల్ ఎక్సర్సైజ్లో రెండు కళ్లూ తాము ప్రతిబింబించే దృశ్యాన్ని మెదడు ఒకేలా గ్రహించేలా చేస్తారు. ఇక స్టీరియాప్టిక్ ఎక్సర్సైజ్లో ఈ రెండు కళ్లూ డెప్త్ / 3 డీ ఇమేజ్ సాధించేలా చేయడానికి చేయిస్తారు. ఈ రెండు ఎక్సర్సైజ్లు చేయిస్తేనే భవిష్యత్తులో లేజీ ఐ లో చూపు తగ్గకుండా ఉంటుంది. లేదంటే మళ్లీ వెనక్కువెళ్లే అవకాశాలు ఉంటాయి.ఫార్మకోథెరపీలీవోడోపావంటి మందుల ద్వారా కంటి నరాలు బాగా పనిచేసేలా చేస్తారు. భవిష్యత్తు చికిత్స ప్రక్రియల్లో జీన్ థెరపీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా సరికొత్త చికిత్స ప్రక్రియలు అందివచ్చే అవకాశాలున్నాయి. ఇటీవల అడల్ట్ ఆంబ్లోపియాకు కూడా మరిన్ని అధునాతన చికిత్సలను అందుబాటు తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. డాక్టర్ కె. రవికుమార్ రెడ్డి, సీనియర్ కంటి వైద్య నిపుణులు (చదవండి: 'మార్నింగ్ వాకింగ్' ఎందుకంటే..! థైరోకేర్ వేలుమణి ఆసక్తికర వివరణ) -
ఇష్టమైన గులాబ్ జామ్లు తింటూనే 40 కిలోలు బరువు తగ్గాడు!
అధిక బరువుని సులభంగా తగ్గించుకుని స్మార్ట్గా మారిన ఎన్నో స్ఫూర్తిదాయక కథలు విన్నాం. ఎన్నో విభిన్న డైట్లతో తేలిగ్గా కొలెస్ట్రాల్ని మాయం చేసుకుని ఫిట్గా మారారు. ఇక్కడున్న వ్యక్తి తనకిష్టమైన స్వీట్ని త్యాగం చేయకుండానే ఆరోగ్యకరమైన రీతీలో బరువు తగ్గి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. అస్సలు అదెలా సాధ్యమైదనేది అతడి మాటల్లోనే తెలుసుకుందామా..!ప్రసిద్ధ యూట్యూబర్ ఆశిష్ చంచలానీకి ఎక్కువగా చిన్నారులు, యువకులు అతడి అభిమానులు. అతడు మంచి టైమింగ్ కామెడీకి ప్రసిద్ధి. అదే అతడికి వేలాది అభిమానులను సంపాదించి పెట్టింది. అలాంటి వ్యక్తి జస్ట్ ఆరు నెలల్లో 40 కిలోలు తగ్గాడు. ఒక్కసారిగా మారిన అతడి బాడీ ఆకృతి అదరిని ఫిదా చేసింది. అబ్బా అంతలా ఎలా బరువు తగ్గాడని ఏంటా డైట్ సీక్రెట్ అని ఆరా తీయడం ప్రారంభించారు. అయితే ఆశిష్ స్వయంగా ఆ సీక్రెట్ ఏంటో స్వయంగా వెల్లడించారు. నిజానికి ఆయన దగ్గర దగ్గరగా 130 కిలోలు పైనే బరువు ఉండేవాడు. తన 30వ పుట్టనరోజున తన ఆరోగ్యానికి ప్రాధానత ఇచ్చేలా స్మార్ట్గా మారిపోవాలని గట్టిగా తీర్మానం చేసుకున్నాడట. అయితే తన బరువు, ప్రకారం తనను తాను అద్దంలో చూసుకుంటే చాలా బాధగా అనిపించిందట. అలా అని నోరు కట్టేసుకునేలా ఆహారాన్ని పూర్తిగా తగ్గించలేడట ఆశిష్. దాంతో ఆహారాన్ని సర్దుబాటు చేసుకున్నాడట. అంటే..తనకు నచ్చిన ఆహారాన్ని వదులుకోకుండా క్రమబద్ధమైన జీవనశైలిని అనుసరిచడం అన్నమాట. తనకు నచ్చిన గులాబ్ జామ్లు ఆస్వాదిస్తూ డైట్ ఎలా తీసుకోవాలో ప్లాన్ చేసుకున్నారట. అందుకోసం ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు, కార్బోహైడ్రేట్లు ఎంచుకున్నారు. తన ఆహారంలో తప్పనిసరిగా ప్రోటీన్ పుష్కలంగా ఉండేలా జాగ్రత్త పడేవాడట. ఫైబర్, కార్బోహైడ్రేట్లు తన డైట్ జాబితాలో చివరి ప్రాధాన్యత అని చెబుతున్నాడు ఆశిష్. డైట్ విధానం..అల్పాహారం: ఆశిష్ కనీసం ఆరు ఉడికించిన గుడ్లు లేదా కొన్నిసార్లు వెరైటీగా ఆమ్లెట్, కాల్చిన మొలకలు తీసుకుంటాడు. లంచ్ఆశిష్ భోజనంలో 200 గ్రాముల చికెన్తో పాటు ఒక రోటీ ఉండేది, సలాడ్ ఎక్కువగా దోసకాయ, సెలెరీ జ్యూస్తో ఉంటుంది.స్నాక్స్సాయంత్రం స్నాక్స్ కోసం, ఆశిష్ వ్యాయామం చేస్తున్నందున సాయంత్రం 6 గంటలకు క్రమం తప్పకుండా పాలవిరుగుడు ప్రోటీన్ తీసుకుంటాడు.విందుఆశిష్ విందు కూడా ప్రోటీన్తో నిండి ఉండేది - రోటీ లేదా రైస్ వంటి కార్బోహైడ్రేట్లు లేకుండా గ్రిల్డ్ లేదా రోస్ట్ చేసిన చికెన్. బర్న్ చేసే కేలరీల సంఖ్య, తినే కేలరీలను బ్యాలెన్స్ చేసుకుంటూ బరువు తగ్గారట. తింటున్న ప్రతిదాన్ని లెక్కించేవాడట.. అలా తన ప్లేట్ని చూడగానే ఎంత కేలరీల మొత్తంలో ఆహారం తీసుకోవాలో అర్థమయ్యేదట.అప్పడప్పుడు చీట్మీల్..ఆశిష్ తనకు బాగా ఇష్టమైన డెజర్ట్లు తినకుండా ఉండలేడట. అందుకనే టీ, గులాబ్ జామున్లు, రసమలై వంటి స్వీట్లను వదులుకోలేదని చెప్పాడు. అయితే తన కేలరీలను కూడా పర్యవేక్షించడం ఎప్పటికీ మిస్ అయ్యేవాడు కాదట.(చదవండి: ఆ నింగే పెళ్లికి సాక్ష్యం అంటూ ఆ జంట..!) -
సింపుల్ చిట్కాలతో 15 కిలోలు తగ్గింది : నచ్చిన బట్టలు, క్రాప్ టాప్లు
ప్రముఖ హాస్యనటి,'లాఫర్ క్వీన్' భారతీ సింగ్ (Bharti Singh) చాలా కష్టపడి బరువును తగ్గించుకొని స్లిమ్గా మారడం అందర్నీ ఆశ్చర్యపర్చింది. 10 నెలల్లో దాదాపు 15 కిలోలు వెయిల్ లాస్ అయ్య ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచింది. యూట్యూబర్ నటి ప్రజక్తా కోలితో జరిగిన పాడ్కాస్ట్లో, భారతీ తన వెయిట్ లాజ్జర్నీ గురించి వివరించింది.భారతీ సింగ్ వెయిట్ లాస్ జర్నీ ఇలాకేవలం బరువు తగ్గడం మాత్రమే కాకుండా మొత్తం ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కూడా ఆలోచించింది భారతీ సింగ్. ఎందుకంటే అప్పటికే ఆమె ఆస్తమా . డయాబెటిస్తో బాధపడేది. ఎక్కువగా తల తిరుగుతూ ఉండేది. ఒక్కోసారి ఊపిరి ఆడేది కాదు. డాక్టర్ల సలహామేరకు ఎలాగైనా బరువు తగ్గాలని నిర్ణయించింది. 2021లో 91 కిలోల నుండి 76 కిలోలకు తగ్గించుకుని ఆటు ఫ్యాన్స్ను ఇటు సినీ అభిమానులను ఆశ్చర్య పర్చింది. బరువుతగ్గడం వల్ల ఆత్మవిశ్వాసంతోపాటు, ఆరోగ్యంగా, శక్తివంతంగా మారినట్టు తెలిపింది. అంతేకాదు డయాబెటిస్, ఆస్తమా కూడా నియంత్రణలో ఉన్నాయని సంతోషంగా చెప్పింది. ఇపుడు తాను చాలాఫిట్గా, హ్యాపీగా ఉన్నానని చెప్పుకొచ్చింది. తలతిరగడాలు, ఊపిరి ఆడకపోవడంలాంటి ఇబ్బందులేవీ లేవని వెల్లడించింది.అడపాదడపా ఉపవాసం Intermittent Fastingసాయంత్రం 7 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉపవాసం. మధ్యాహ్నం ఆహారం తీసుకునేది. 30-32 ఏళ్లుగా చాలా తినేశాను. ఆ తరువాత సంవత్సరం పాటు విరామం ఇచ్చాను.2022 అధ్యయనం ప్రకారం అడపాదడపా ఉపవాసం జీవక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఇదిబ ఎక్కువ కేలరీలను బర్న్ చేయడంలో సహాయపడుతుంది.కడుపు మాడ్చుకోలే, ఇష్టమైన ఫుడ్ను త్యాగతం చేయలేదు: తనకిష్టమైన ప్రతిదాన్ని ఆహారంలో చేర్చుకునేది. కానీ మితంగా తినడాన్ని అలవాటు చేసుకుంది. తనకెంతో ఇష్టమైన రెగ్యులర్ పరాఠాలు, గుడ్లు, పప్పు-సబ్జీ, నెయ్యి ఇవన్నీ తీసుకునేదాన్నని తెలిపింది. పోర్షన్ కంట్రోల్: అతిగా తినకుండా తనను తాను నియంత్రించుకుంది. ఎక్కువ కేలరీలు తీసుకోకుండా పోర్షన్ కంట్రోల్ను అలవాటు చేసుకున్నానని భారతీ సింగ్ తెలిపింది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డయాబెటిస్ అండ్ డైజెస్టివ్ అండ్ కిడ్నీ డిసీజెస్ ప్రకారం, పోర్షన్ కంట్రోల్ సాధన చేయడం అధిక బరువును తగ్గించుకోవచ్చు.ఇదీ చదవండి: Today Tip ఎంత బిజీ అయినా సరే, ఇలా బరువు తగ్గొచ్చు!ఖచ్చితమైన మీల్ టైమింగ్స్ : భోజనం టైమింగ్స్ పాటించకపోవడం వల్ల చాలా నష్టం జరుగుతుందనీ, అందుకే తాను తన భోజన సమయాలను పాటించేదానన్ని గుర్తు చేసుకుంది. బాగా హెక్టిక్ పనుల్లో ఉంటే, బాగా లేట్ నైట్ తినడం వదిలివేసింది. వేళగాని వేళ తినడాన్ని పూర్తిగా మానేసింది. మరో విధంగా చెప్పాలంటే రాత్రి 7 గంటల తర్వాత నో డిన్నర్ సూత్రం తు.చ తప్పకుండా పాలించింది. ఇది తన బరువును తగ్గించుకోవడంలో చాలా ఉపయోగపడిందని తెలిపింది. 15 కిలోల భారీ బరువు తగ్గడం చాలా ఆనందానిచ్చిందని భారతీ సింగ్కు సంతోషంగా తెలిపింది. క్రాప్ టాప్స్, ఇంకా ఇష్టమైన బట్టలు వేసుకోగలగడం భలే సంతోషాన్నిస్తోందని చెప్పింది.బరువు తగ్గడం స్లిమ్గా కనపించడం ఆనందాన్ని ఇవ్వడం మాత్రమే కాదు ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మంచి అనుభూతిని కలిగిస్తుంది. కష్టంగా కాకుండా, ఇష్టంగా నిష్టగా కృషి చేస్తే భారతీ సింగ్లా మంచి ఫలితాలను సాధించడం కష్టమేమీ కాదేమో కదా!ఇదీ చదవండి: TodayRecepies బనానాతో ఇలాంటి వెరైటీలు ఎప్పుడైనా ట్రై చేశారా? -
'వాకింగ్'పై థైరోకేర్ వేలుమణి ఆసక్తికర వివరణ..!
ఇటీవలకాలంలో ప్రజల్లో ఆరోగ్య స్పృహ ఎక్కువైంది. అంతా తమ ఫిట్నెస్కి తొలి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆ నేపథ్యంలో కొందరు వాకింగ్, యోగా, జిమ్ వంటి ఇతరత్రా వర్కౌట్లు చేసేస్తున్నారు. అయితే కొందరు మాత్రం చాలా టెన్షన్గా పొద్దుపొద్దునే వాకింగ్కి వెళ్లిపోతుంటారు. ఎంతలా అంటే..ఒక్కరోజు వాకింగ్ మిస్ అయితే ఏదో పోయినట్లుగా గాభర పడిపోతుంటారు. అయితే అంతలా వాకింగ్ చేసేవాళ్లంతా ఆరోగ్యం కోసమేనా అన్న సందేహాన్ని లెవెనత్తారు శాస్త్రవేత్త-థైరోకేర్ టెక్నాలజీస్ వ్యవస్థాపకుడు ఎ వేలుమణి. ఆయన దీనిపై స్వయంగా మూడేళ్లు అధ్యయనం చేసినట్లు కూడా వివరించారు. అలా ఉదయమే నడవడానికి వెనుకున్న ప్రధాన కారణాలేంటో సోషల్ మీడియో పోస్ట్లో చాలా ఆసక్తికరంగా చెప్పుకొచ్చారు. కోయంబత్తూరులోని మూడు పార్కులలో ఉదయం నడిచేవారిపై అధ్యయనం చేశారట. దాదాపు 100 నుంచి 500 మీటర్లు వాకింగ్కి వెళ్లే వారందరిపై ఆయన అధ్యయనం చేశానన్నారు. అయితే అది ఫిట్నెస్ కాదు, క్రమశిక్షణ అంతకంటే కాదట. మరేంటంటే..ఇది హార్మోన్ల ప్రేరేపిత నడకగా తేల్చేశారాయన. అంతేగాదు ఉదయం పబ్లిక్ పార్కుల్లో వాకింగ్ చేసేవారందర్నీ మూడు గ్రూప్లుగా వర్గీకరించి మరి దాని వెనుకున్న కారణాలను వెల్లడించారు.మొదటి రకం..వేలుమణి గమనించి వ్యక్తుల్లో దాదాపు 20% మంది వివిధ వయసుల వారిగా వేగంగా నడవడం, లేదా పరుగెత్తడంలో చాలా యాక్టివ్గా నిమగ్నమై ఉన్నవారు. ఇది కొనితెచ్చుకున్న బలవంతంపై చేసున్న వాకింగ్ అట. వారంతా శ్రేయోభిలాషులు, ఆరోగ్య నిపుణులు మార్గనిర్దేశం ప్రకారం లక్ష్యం ఆధారిత వ్యక్తులట. శారరీక రూపం, ఫిట్నెస్కి కేరాప్ అడ్రస్గా స్ఫూర్తినిచ్చే కేటగిరి వ్యక్తులే వీరు అని చెప్పారు. రెండో రకం..ఆరోగ్య స్ప్రుహతో..40 ప్లస్లో వైద్య అవసరం రీత్యా తప్పక వాకింగ్ చేసే కేటగిరికి చెందినవారట. వీరంతా, టైప్ 2 డయాబెటిస్ వంటి దీర్ఘకాలిక సమస్యలతో వాక్ చేసే వ్యక్తులట. అంటే వీళ్లంతా స్వచ్ఛందంగా నడక కోసం వచ్చిన వాళ్లు కాదని "హర్మోన్ల బందీలు"గా వ్యాఖ్యానించారు.ప్రేమ పక్షులు..ఇక మిగతా సముహం 18 నుంచి 22 ఏళ్ల వయస్సు గల యువ జంటల సముహం. ఉదయం పార్కుల్లో వాకింగ్ చేసేవాళ్లలో దాదాపు 30 శాతం యువత కూడా ఉన్నట్లు తెలిపారు. అయితే వాళ్లు ఫిట్నెస్ లేదా వైద్య పరిస్థితి వంటి కారణాలతో నడవడం లేదని చెప్పారు. కేవలం వాళ్లు పార్కు మూలల్లో నిశబ్దంగా కూర్చొని గడిపేందుకు వస్తుంటారని అన్నారు. ఇది కూడా హార్మోన్ల బలవంతమే అని పేర్కొన్నారు. ఎందుకంటే యుక్త వయసులో సహజంగా వచ్చే ఫీలింగ్స్కి కారణం హార్మోన్ల ప్రభావమనే ఉద్దేశ్యంతో వేలుమణి ఆ విధంగా వ్యాఖ్యానించారు. చివరగా తాను చేసిన ఈ అధ్యయనంలో 80% మంది ఆరోగ్యం లేదా జీవనశైలిలో భాగంగా చేయలేదు. కేవలం హర్మోన్ల ప్రభావం కారణంగానే చేసిన వాకింగ్ అని అన్నారు. ఎందుకంటే ఆ మూడు రకాల వ్యక్తుల సముహం..“లుకింగ్, డయాబెటిస్, ప్రేమ తదితర మూడు కారణాలతో వాకింగ్ చేస్తున్న వారు. ఇవన్ని హర్మోన్లతో లింక్ అప్ అయ్యి ఉన్నాయి కాబట్టి ఇది ఫిట్నెస్ కోసం చేసిన వాకింగ్ కాదు..హార్మోన్లతో ప్రేరేపించబడిన నడక అని పేర్కొన్నారు వేలుమణి. (చదవండి: సిగరెట్టు ప్యాకెట్లపై ఉన్నట్లుగా ఆ చిరుతిండ్లపై హెల్త్ వార్నింగ్ మెసేజ్..!) -
Millets అనారోగ్యాలు సరి : ఆరోగ్య సిరి
భామిని: అంతరించి పోతున్న చిరుధాన్యాలను రక్షిస్తూ నేటి తరాలకు పరిచయం చేసేందుకు చిరుధ్యానాల విత్తన సంరక్షణతో పాటు, పంటల సాగు పెరుగుతోంది. సంప్రదాయ పంటలుగా పురాతన కొండ పంటలుగా పిలిచే మిల్లెట్స్ ప్రాముఖ్యతను వివరిస్తూ సాగు విస్తరణ పెంచుతున్నారు. ఐటీడీఏల పరిధిలో మిల్లెట్స్ సాగు విస్తరణ ప్రణాళిక అమలవుతోంది. ఏపీపీఐ సంస్థ ఆర్థిక సహకారంతో గిరిజనులకు చిరుధాన్యాల విత్తనాలు సేకరించి ఉచితంగా అందిస్తున్నారు. స్వచ్ఛంద సంస్థ పర్యవేక్షణలో కొండ పంటలు సాగు చేస్తున్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలో ప్రకృతి సాగు, మిశ్రమ సాగు విధానంలో చిరుధాన్యాల సాగు విస్తీర్ణం పెంచుతున్నారు. స్వచ్ఛంద సంస్థల సహకారంతో మిల్లెట్స్పై అవగాహన పెంచుతున్నారు.దీంతో చిరుధాన్యాలైన కొర్రలు, సామలు, గంటెలు, రాగులు, జొన్నలు, ఊదలు, అరిరెకల సాగు పెరుగుతోంది.. ఔషధ గుణాల సమ్మిళితం తృణధాన్యాలు ప్రకృతి ప్రసాదించిన వరాలు. ఔషధ గుణాల సమ్మిళితమైన తిండి గింజలు.స్వచ్ఛంద సంస్థల సహకారంతో సంప్రదాయ పంటల సాగును పునరుద్ధరిస్తున్నాం. ఖరీఫ్లో చిరుధాన్యాల సాగుకు ప్రాధాన్యం పెంచాం. పండించిన చిరు ధాన్యాలు మిగులు పంటకు మార్కెట్లో విలువ వచ్చేలా చర్యలు చేపట్టాం. పట్టణాల్లో పెరుగుతున్న వాడకానికి తగ్గట్లు పండించడానికి గిరిజన ప్రాంతాల్లో సమాయిత్తం చేస్తున్నాం. కె.రాబర్ట్పాల్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి, పార్వతీపురం మన్యం జిల్లా ఆరోగ్య గుళికలుగా వీటిని వర్ణిస్తారు.ఇవి తింటూ ఆరు నెలల నుంచి రెండేళ్ల లోపు వ్యాధులను నిర్మూలించుకోవచ్చు.రోగ కారణాలను శరీరం నుంచి తొలగించి దేహాన్ని శుద్ధి చేస్తాయి. తృణధాన్యాలలోని పీచు పదార్థం రక్షణగా నిలుస్తుందని న్యూట్రిస్టులు చెబుతున్నారు. రోజుకు మనిషికి 38 గ్రాముల పీచు పదార్థం అవసరం. చిరుధాన్యాల్లో 25 నుంచి 30 గ్రాముల పీచు పదార్థం లభిస్తుంది. కూరగాయలు, ఆకు కూరల్లో పీచు పదార్థం పొందవచ్చు. కొండపోడు భూముల్లో చేపట్టే చిరుధాన్యాల సాగు పల్లపు ప్రాంతాల భూముల్లోనూ విస్తరిస్తున్నారు. ఆధునిక వ్యవసాయ విధానంలో నాట్లు వేయడం, కలుపు నివారణ, చీడపీడల నివారణకు కషాయాల వైద్యంతో సాగు చేస్తున్నారు. చిరుధాన్యాల పంటలకు తోడు పప్పుధాన్యాలు, కూరగాయల పంటలను మిశ్రమ పంటలుగా పండిస్తున్నారు. -
జబ్బొచ్చినా.. జ్వరమొచ్చినా.. నిలువుదోపిడి!
విజయనగరం ఫోర్ట్: వర్షాలు కురుస్తున్నాయి. సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నాయి. ఆసుపత్రుల్లో రోగుల సంఖ్య క్రమేణ పెరుగుతోంది. ఇటు ప్రభుత్వ ఆసుపత్రుల తో పాటు అటు ప్రైవేటు ఆసుపత్రులకు రోగులు క్యూ కడుతున్నారు. ఇక్కడ వరకు ఓకే.. తరువాతే వైద్యులు రోగులకు చుక్కలు చూపిస్తున్నారు. తలనొప్పి, జ్వరం అని వెళ్లినా... రూ.వేలల్లో ఖర్చయ్యేలా వైద్య పరీక్షలు చేయిస్తున్నారు. చేసేది లేక భయంతో రోగులు ప్రైవేటు ల్యాబ్లకు పరుగులు తీస్తున్నారు. అక్కడ రూ.వేలల్లో రోగులను దోచుకుంటున్నారు. సేవకు పరమార్ధంగా ఉండాల్సిన కొందరు వైద్యులు ధనార్జనే ధ్యేయంగా మారడంతో పేదలు, మధ్యతరగతి ప్రజలు ఈ పరీక్షలు చేయించుకోలేక ఆర్థికంగా చితికిపోతున్నారు. వచ్చే రోగాలకు స్కానింగ్, పలు రకాల పరీక్షలు అవసరం లేకున్నా వైద్యులు రాసేస్తుండడంతో చేసేది లేక ఇబ్బందులు పడుతున్నారు. స్కానింగ్ వల్ల రోగులు రేడియేషన్కు కూడా గురై ఇతర వ్యాధులకు గురయ్యే ప్రమాదం కూడా ఉంది. అయినా వైద్యులు వెనక్కి తగ్గడం లేదు. ప్రతీదానికి స్కానింగ్, ఎంఆర్ఐ అంటూ రాసేస్తున్నారు. (Bobbili Veena బొబ్బిలి వీణకు అరుదైన గుర్తింపు)ఆర్ఎంపీలే మధ్యవర్తులు: ప్రైవేటు ఆసుపత్రులకు, స్కానింగ్ సెంటర్లకు,ల్యాబొరేటరీలకు ఆర్ఎంపీలే మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్నారు. కేసును బట్టి వారికి కమీషన్ అందిస్తున్నారు. రిజిస్ట్రషన్ లేకుండానే.. జిల్లాలో 57 ల్యాబొరేటరీలు మాత్రమే వైద్య ఆరోగ్య శాఖ వద్ద రిజి్రస్టేషన్ అయ్యాయి. రిజిస్ట్రేషన్ లేకుండా కొందరు జిల్లాలో ల్యాబొరేటరీలు నిర్వహిస్తున్న ట్టు సమాచారం. ముఖ్యంగా వైరల్ జ్వరాలు, డెంగీ జ్వరాలు వ్యాప్తి అధికంగా ఉన్న తరుణంలో ల్యాబొరేటరీలు క్యాష్ చేసుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. జ్వరం రాగానే తమకు ఏమవుతుందోనని ఆందోళనలో రోగులు నేరుగా ల్యాబొరేటరీలకు వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకుంటున్నారు. ఇదే అదునుగా వారు దోచుకుంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇదీచదవండి: వంట గదుల్లో గత వైభవం.. మట్టి పాత్రలతో ఆరోగ్యమస్తు! కనిపించని ఫీజుల బోర్డులు ఏ ల్యాబొరేటరీలోగాని, ఆసుపత్రిలోగాని, స్కానింగ్ సెంటర్లోగాని ఏ వైద్య పరీక్షకు ఎంత ఫీజు వసూలు చేస్తున్నామో తెలిపే బోర్డు బయట వేలాడదీయాలి. కొన్ని ల్యాబొరేటరీల్లో మాత్రమే ఇవి కనిపిస్తున్నాయి. మిగతా వాటిల్లో ఉండడం లేదు. ఫీజుల వివరాలు తెలిపే బోర్డులు లేని చోట వారు ఎంత అడిగితే అంత ఇవ్వాల్సిన పరిస్థితి. అధిక శాతం ల్యాబొరేటరీల్లో కానరాని పెథాలజిస్టులు జిల్లాలో ఉన్న ల్యాబొరేటరీల్లో పెథాలజిస్టులు కాన రావడం లేదు. నిబంధన ప్రకారం యూరిన్ కల్చర్, బ్లడ్ కల్చర్, ప్లేట్లెట్ కౌంట్ వంటి పరీక్షలు పెథాలజిస్టుల పర్యవేక్షణలో జరగాలి. కానీ అధికశాతం ల్యాబొరేటరీల్లో పెథాలజిస్టులు లేరు. ఒకటి, రెండు ల్యాబొరేటరీల్లో తప్ప మిగతా వాటిల్లో లేరు. గంట్యాడ మండలానికి చెందిన సీహెచ్ శ్రీనివాస్ తలనొప్పి అని విజయనగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లాడు. అక్కడి వైద్యుడు ఎంఆర్ఐ స్కాన్ తీయించుకోమని చీటి రాసి ఇచ్చాడు. సదరు వ్యక్తి ఓ ప్రైవేటు స్కానింగ్ సెంటర్లో రూ.4వేలు పెట్టి స్కానింగ్ తీయించుకున్నాడు. విజయనగరానికి చెందిన రామారావు జ్వరం వచ్చిందని పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లగా వైద్యులు కొన్ని వైద్య పరీక్షలు రాశారు. సదరు వ్యక్తి వైద్య పరీక్షలకు రూ.వెయ్యి బిల్లు చెల్లించాడు. జ్వరం అని వెళ్తే.. జ్వరం అని ఎవరైనా ప్రైవేటు ఆసుపత్రికి వెళ్తే...వారికి వైద్య పరీక్షలు రాసేస్తున్నారు. సాధారణ జ్వరానికి కూడా వైరల్, డెంగీ, మలేరియా, సీబీసీ, హెచ్బీ, ఇలా అనేక రకాల వైద్య పరీక్షలు రాసేస్తున్నారు. దీంతో రోగులకు ఖర్చు తడిసి మోపుడవుతుంది. జ్వరం కోసం వెళ్లిన వారికి వైద్య పరీక్షలకు కనీసం రూ.1000 నుంచి రూ.1500 వరకు వసూలు చేస్తున్నారు. స్కానింగ్లకు రూ.వేలల్లో... సీటీ స్కాన్, ఎంఆర్ఐ స్కాన్లకు అయితే రూ.వేల ల్లో ఫీజులు వసూలు చేస్తున్నారు. ప్రైవేటు స్కానింగ్ సెంటర్లో సీటీ స్కాన్కు రూ.2500 నుంచి రూ.3 వేలు, ఎంఆర్ఐ స్కాన్కు రూ.4 వేల నుంచి రూ.5 వేల వరకు వసూలు చేస్తున్నారు. ఇందులో సగం వైద్యుల కమీషన్కే పోతుందని నిర్వాహకులు చెప్పడం గమనార్హం. చాలా మంది ప్రైవేటు వైద్యులకు ఆయా స్కానింగ్ల్లో షేర్ ఉంటుంది. షేర్ లేని వైద్యులకు కమీషన్లు ఆఫర్ చేస్తున్నారు. దీంతో వారు అవసరం లేకున్నా.. స్కానింగ్లు రాస్తున్నారు.ఆదేశాలిచ్చాం.. ఫీజుల వివరాలు తెలిపే బోర్డులు ల్యాబొటరీ, స్కానింగ్, ఆసుపత్రుల్లో ఏర్పాటు చేయాలని సంబంధిత నిర్వాహకులకు ఆదేశాలు జారీ చేశాం. అవి ఏర్పాటయ్యే విధంగా చర్యలు తీసుకుంటాం. ల్యాబరేటరీగాని, ఆసుపత్రిలోగాని, స్కానింగ్ సెంటర్లోగాని బోర్డులు పెట్టకపోతే వారిపై చర్యలు తీసుకుంటాం. ఆకస్మిక తనిఖీలు నిర్వహించి చర్యలు చేపడతాం. – డాక్టర్ ఎస్.జీవనరాణి, డీఎంహెచ్వో -
వంట గదుల్లో గత వైభవం.. మట్టి పాత్రలతో ఆరోగ్యమస్తు!
ఖిలా వరంగల్ : పూర్వం రోజుల్లో వంటలకు మట్టి పాత్రలనే వాడే వారు. అన్నం, కూర, పాలు, పెరుగు.. ఇలా ప్రతీ పదార్థం మట్టి కుండలోనే వండేవారు, భద్రపరిచేవారు. ఈ పాత్రల్లో వండిన, భోజనం చేసిన వారు ఎక్కువ కాలం ఆరోగ్యంతో జీవించేవారని పెద్దలు చెబుతుంటారు. అయితే పెరిగిన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో మట్టి పాత్రలు మాయమయ్యాయి. వాటి స్థానంలో అల్యూమినియం పాత్రలు, పేపర్ పేట్లు ప్రత్యక్షమయ్యాయి. ఫలితంగా వీటిని వినియోగించిన ప్రజలు అనారోగ్యాలు కొని తెచ్చుకుంటున్నారు. ఈ ప్రమాదాన్ని గ్రహించిన ప్రస్తుత తరం మట్టి పాత్రలపై మక్కువ చూపుతోంది. దీంతో ఏళ్ల క్రితం వదిలేసిన మట్టి పాత్రలు ప్రజలు మళ్లీ ఇంటికి తెచ్చుకుంటున్నారు. ఫలితంగా మార్కెట్లో మట్టి పాత్రలకు డిమాండ్ కనిపిస్తోంది. అయితే ఈ కాలంలో కూడా మట్టి పాత్రలను ఎవరు వాడతారనుకుంటే పొరపాటే.. వీటిని నేటికీ వినియోగించే వారు ఉన్నత వర్గాల్లో ఎక్కువ సంఖ్యలో ఉన్నారు.రుచి..ఆరోగ్యకరం..మట్టిపాత్రలో వంట రుచిగా ఉంటుంది. అలాగే, ఎక్కువ కాలం పాడవకుండా ఉంటుంది. మట్టి పాత్రలను తయారు చేసే బురద మట్టిని సిరామిక్ అంటారు. ఈ సిరామిక్కు వేడి తగలగానే ఇన్ ఫ్రారెడ్ అనే కంటికి కనిపించని కిరణాలు ఉత్పత్తవుతాయి. ఈ కిరణాలు ప్రసరించిన ప్రాంతమంతా పూర్తిస్థాయిలో శుద్ధి అవుతుంది. ఉదాహరణకు పిల్లలు బలహీనంగా, తక్కువ బరువుతో పుట్టినా.. పుట్టుకతోనే అనారోగ్యంతో ఉన్నా ఇంక్యుబేటర్ అనే పరికరంలో (లైట్ కింద పెడతారు) కొన్ని గంటల పాటు ఉంచుతారు. ఆ పరికరంలో ఉండే లైట్ ద్వారా ఇన్ ఫ్రారెడ్ కిరణాలను ప్రసరింపజేసి పుట్టిన పిల్లల శరీరాన్ని పూర్తిగా శుద్ధి చేస్తారు. కేవలం కొద్ది గంటల్లోనే శిశువులకు పూర్తి స్థాయిలో ఆరోగ్యాన్ని సరిచేయగల శక్తి ఈ కిరణాలకు ఉంది. ప్రకృతి వైద్యంలో బురద స్నానం (మడ్ బాత్) గురించి తెలిసే ఉంటుంది. శరీరం నిండా బురద పూసి ఎండలో ఉంచుతారు. అందులో కూడా ఇవే కిరణాలు ఉత్పత్తి అయ్యి రోగి శరీరాన్ని శుద్ధి చేయడం ద్వారా వ్యాధి నుంచి విముక్తి లభిస్తుంది. అలాగే, మట్టి పాత్రల్లో వంట చేస్తే పురుగు మందుల అవశేషాలను పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేసి పదార్థంలోని పోషక విలువలను ఏమాత్రం వృథా కాకుండా చేయడమేకాక పోషకాలకు అదనపు శక్తిని కలిగించి ఆహారాన్ని సమతుల్యంగా మారుస్తాయి. అందుకే మట్టి పాత్రల్లో చేసిన వంటలకు ఎక్కువ రుచి, ఎక్కువ నిల్వ సామర్థ్యం ఉంటుంది. లోహపాత్రల వల్లే రోగాలు..అల్యూమినియం పాత్రలో వండిన పదార్థాలు విషతుల్యమవుతాయి. ఈ పదార్థలు తిన్న ప్రజలు బీపీ, షుగర్, కీళ్ల నొప్పులు, కాలేయ సమస్యలు, క్యాన్సర్ వంటి జబ్బుల బారిన పడుతారని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. అందుబాటులో మట్టి టీ గ్లాస్, వాటర్ బాటిళ్లు..తెలంగాణలోని ఆదిలాబాద్, గుజరాత్, రాజస్థాన్లోని కొన్ని ప్రాంతాల్లో గృహోపకర పాత్రలను మట్టితోనే తయారు చేస్తారు. ఇక్కడి నుంచే దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలకు ఎగుమతి చేస్తారు. కాగా, ఉమ్మడి వరంగల్ జిల్లాలో కుమ్మరి కులస్తులు మట్టి పాత్రలు అందుబాటులో ఉంచారు. టీ గ్లాస్, వాటర్ బాటిల్, కంచాలు, స్పూన్లు.. ఇలా అన్ని రకాల మట్టి పాత్రలు అందుబాటులో ఉన్నాయి.చదవండి: Today Tip ఎంత బిజీ అయినా సరే, ఇలా బరువు తగ్గొచ్చు!మట్టి కడవల్లోనే మంచినీరు..పూర్వకాలంలో మట్టి పాత్ర(కుండ)ల్లో వంటలు చేసే వారు. మట్టి కడవల్లోనే మంచినీరు తాగే వారు. అందుకే ఆ కాలపు వారు ఆరోగ్యంగా ఉండేవారు. అయితే 40 ఏళ్ల నుంచి మట్టి పాత్రలు వాడకం క్రమేనా తగ్గతూ వచ్చింది. ప్రస్తుతం వ్యాప్తిస్తున్న రోగాలతో పాతకాలం నాటి ఆహార పద్ధతులపై ప్రజలు మక్కువ పెంచుకుంటన్నారు. ఇందులో భాగంగా మట్టి కుండలో చికెన్, మట్టి పాత్రలో వంటలకు క్రేజ్ పెరుగుతోంది. మట్టి పాత్రల్లో వంటలు ఆరోగ్యకరం అనగానే ఆ పాత్రలు మార్కెట్లో భారీగా అమ్ముడవుతున్నాయి. గతంలో ఇళ్లలో మట్టితో తయారు చేసే వస్తువులు అనేకం ఉండేవి. ప్రస్తుతం మార్కెట్లో లభించే కుండలు తప్ప మరే ఇతర మట్టి పాత్రలు కనిపించడం లేదు.ఇదీ చదవండి: Bobbili Veena బొబ్బిలి వీణకు అరుదైన గుర్తింపుమట్టి పాత్రలే ముద్దు : అల్యూమినియం కంటే మట్టి పాత్రలే ముద్దు. తెలంగాణలో ఉగాది పచ్చడి కొత్త మట్టి కుండల్లో చేస్తారు. ఇలా చేయడం వల్ల మట్టి పాత్రల్లో ఉండే పోషకాలు నేరుగా శరీరంలోకి వెళ్తాయి. దీని వల్ల ఎలాంటి రోగాలు దరిచేరవు. పూరి జగన్నాథుడి ఆలయంలో ఇప్పటికీ మట్టి పాత్రల్లోనే ప్రసాదాలు తయారు చేసి పంపణీ చేస్తారు.-డాక్టర్ నరేశ్కుమార్, ఫోర్ట్ రోడ్డు వరంగల్ -
ఔట్ పేషెంట్ ప్లాన్.. నో టెన్షన్!
అనారోగ్యంతో డాక్టర్ దగ్గరకెళ్తే వ్యాధి నిర్ధారణ పరీక్షల తర్వాతే పరిష్కారం సూచిస్తుంటారు. కన్సల్టేషన్, డయాగ్నోస్టిక్స్ చార్జీలు, మందులకు కలిపి ఎంతలేదన్నా రూ.2,000–5,000 మధ్య ఖర్చు చేయాల్సిందే. నలుగురు లేదా ఐదుగురు సభ్యులున్న కుటుంబం ఏడాదిలో ఇలా వైద్యుల వద్దకు ఎన్నిసార్లు వెళ్లాల్సి వస్తుందో ఊహించలేం. ఈ రూపంలో ఎంత ఖర్చు ఎదురవుతుందో అంచనా వేయలేం. హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ ఉన్నా కానీ, కేవలం హాస్పిటల్లో చేరి తీసుకునే చికిత్సలకే (ఇన్ పేషెంట్ కవర్) అధిక శాతం పాలసీలు కవరేజీ అమలు చేస్తుంటాయి. జీనవశైలి వ్యాధులు, వైరల్ ఫీవర్లు, ఇన్ఫెక్షన్లు పెరిగిపోయిన తరుణంలో.. ఔట్ పేషెంట్ డిపార్ట్మెంట్ (ఓపీడీ) కవరేజీకి ప్రాధాన్యం పెరుగుతోంది. ఇది ఉంటే ఊహించని ఖర్చును కొంత వరకు తట్టుకోవచ్చు. ఓపీడీ ప్లాన్లలో సదుపాయాలు, వీటి కోసం ఎంత ఖర్చవుతుంది? తదితర అంశాలపై అవగాహన కల్పించే కథనమే ఇది. ఔట్ పేషెంట్ విభాగం (ఓపీడీ)లో చేసే ఖర్చు గణనీయంగా పెరుగుతోంది. ముఖ్యంగా సగటు ద్రవ్యోల్బణం మించి వైద్యుల కన్సల్టేషన్, డయాగ్నోస్టిక్స్ చార్జీలు పెరుగుతున్నాయి. 2023–24 ఆరి్థక సంవత్సరంలో ఓపీడీపై దేశ ప్రజలు చేసిన ఖర్చు 37.7 బిలియన్ డాలర్లుగా ఉంటుందని (రూ.3.20 లక్షల కోట్లు సుమారు) ‘ఇండియా ఇన్సూర్టెక్ అసోసియేషన్’ అంచనా వేసింది. ఈ ఖర్చులో రిటైల్ ఓపీడీ ఇన్సూరెన్స్ ద్వారా చెల్లించింది కేవలం 0.1 శాతమే. అంటే దాదాపు 99.9 శాతం మంది ఓపీడీ కవరేజీకి దూరంగా ఉన్నట్టు ఈ గణాంకాలు తెలియజేస్తున్నాయి. హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు చాలా వాటిల్లో ఓపీడీ కవరేజీ ఒక సదుపాయంగా ఉండదు. ఓపీడీకి పెరుగుతున్న ప్రాధాన్యం నేపథ్యంలో బీమా కంపెనీలు ఇప్పుడు ఈ కవరేజీని సైతం ఇన్పేషెంట్ కవర్తోపాటు ఆఫర్ చేస్తున్నాయి. ఓపీడీ ప్లాన్లలో కవరేజీ.. ఓపీడీ కవరేజీ ఇన్బిల్ట్గా కలిగిన హెల్త్ ప్లాన్లు కొన్నే ఉన్నాయి. దాదాపు అన్ని కంపెనీలు ఓపీడీ కవర్ను యాడాన్ కింద అందిస్తున్నాయి. హాస్పిటల్లో చేరాల్సిన అవసరం లేకుండా.. వైద్యుల వద్దకు వెళ్లి సమస్యల గురించి చెప్పి, తీసుకుని వెళ్లిపోయే చికిత్సా సలహాలు ఓపీడీ కిందకు వస్తాయి. ‘‘ఓపీడీ కవర్ కింద ఔషధాలు, వ్యాధి నిర్ధారణ పరీక్షలు, వైద్యుల కన్సల్టేషన్ చార్జీ (డాక్టర్ ఫీజు)లను బీమా సంస్థలు చెల్లిస్తాయి. రెగ్యుల్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్లలో పాలసీదారు హాస్పిటల్ పాలైతే తప్పించి వీటికి పరిహారం రాదు’’ అని హెచ్డీఎఫ్సీ ఎర్గో జనరల్ ఇన్సూరెన్స్ ఈడీ పార్థాని ఘోష్ తెలిపారు. కాకపోతే ఇలా వైద్యుల ఫీజులు, ఔషధాలు, డయాగ్నోస్టిక్స్కు చెల్లింపుల పరంగా ఓపీడీ కవర్లో కొన్ని పరిమితులు ఉండడాన్ని గమనించొచ్చు. సాధారణంగా నగదు రహిత విధానంలో నెట్వర్క్ ఆస్పత్రుల్లో ఈ ఓపీడీ చెల్లింపులకు బీమా సంస్థలు ప్రాధాన్యం ఇస్తుంటాయి. బీమా సంస్థలకు ఆస్పత్రులతో టైఅప్ ఉంటుంది. కనుక వీటికి అయ్యే వ్యయాలు తక్కువగా ఉంటాయి.నెట్వర్క్ ఆస్పత్రుల్లో చికిత్స తీసుకుని రీయింబర్స్మెంట్ దరఖాస్తు చేసుకున్నా బీమా సంస్థలు అనుమతిస్తుంటాయి. కానీ, నాన్నెట్వర్క్ ఆస్పత్రుల్లో నగదు రహిత విధానంలో ఓపీడీ చెల్లింపులకు కొన్ని బీమా సంస్థలు అంగీకరించడం లేదు. ఇందులో మోసాల రిస్క్ ఉంటుందని, రీయింబర్స్మెంట్కే ప్రాధాన్యం ఇస్తున్నాయి. కొన్ని బీమా సంస్థలు ఓపీడీ కవరేజీని పూర్తిగా నెట్వర్క్ ఆస్పత్రులకే పరిమితం చేస్తున్నాయి. ప్రీమియం.. పరిమితులు → ఐసీఐసీఐ లాంబార్డ్ ‘ఎలివేట్’ అన్నది ఓపీడీ రైడర్. 35 ఏళ్ల వ్యక్తి రూ.10,000 వార్షిక కవరేజీకి చెల్లించాల్సిన ప్రీమియం రూ.4,980. నగదు రహిత విధానంలో ఈ →పనిచేస్తుంది. ఎలాంటి ఉప పరిమితుల్లేవు. → బజాజ్ అలియాంజ్ ‘హెల్త్ ప్రైమ్’ రూ.15,000 కవరేజీకి రూ.2,062 ప్రీమియంను (35 ఏళ్ల వ్యక్తికి) వసూలు చేస్తోంది. → నివా బూపా ‘అక్యూట్ బెస్ట్ కేర్’ ప్లాన్ సైతం నగదు రహిత, రీయింబర్స్మెంట్ విధానంలో కవరేజీని ఆఫర్ చేస్తోంది. రూ.10,000 కవరేజీకి రూ.4,801 ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. → నివా బూపా వెల్ కన్సల్ట్ ఓపీడీ ప్లాన్ 20 శాతం కోపేమెంట్ను రీయింబర్స్మెంట్కు అమలు చేస్తోంది. → స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ ఓపీడీ కవర్ను.. ప్రమాదాలకు సంబంధించి చికిత్సలకు నగదు రహిత, రీయింబర్స్మెంట్ క్లెయిమ్లను అనుమతిస్తోంది. ఈ ప్లాన్ రూ.25,000 కవరేజీకి రూ.4,802 ప్రీమియం వసూలు చేస్తోంది. ‘‘సంప్రదాయంగా చూస్తే ఓపీడీ ప్లాన్లలో డాక్టర్ కన్సల్టేషన్, డయాగ్నోస్టిక్స్, ఫార్మసీ బిల్లుల పరంగా ఉప పరిమితులు ఉంటాయి. ఉదాహరణకు ఓపీడీ సమ్ ఇన్సూర్డ్ రూ.20,000 ఉండొచ్చు. అయినప్పటికీ, ఫార్మసీ (ఔషధాలు)కి సంబంధించి రూ.5,000 ఉప పరిమితిగా ఉండొచ్చు. అయితే కవరేజీని తమ అవసరాల మేరకు పూర్తి స్థాయిలో వినియోగించుకునేందుకు వీలుగా ఉప పరిమితుల్లేని ప్లాన్లను సైతం బీమా సంస్థలు తీసుకొస్తున్నాయి’’ అని పాలసీ బజార్ హెల్త్ ఇన్సూరెన్స్ బిజినెస్ హెడ్ సిద్ధార్థ్ సింఘాల్ తెలిపారు. ఓపీడీ కవర్ తీసుకునే ముందు ఉప పరిమితుల గురించి సంపూర్ణంగా తెలుసుకోవాలి. తమకు అప్పటికే జీవనశైలి వ్యాధులు ఉంటే, వాటికి సైతం చెల్లింపులు చేసే విధంగా చూసుకోవాలి. కొన్ని ఓపీడీ ప్లాన్లలో ఏడాదిలో వైద్యుల కన్సల్టేషన్లు గరిష్టంగా ఇన్ని పర్యాయాలు మాత్రమే అన్న పరిమితులు కూడా ఉంటున్నాయి. కొన్ని బీమా సంస్థలు నెట్వర్క్ ఆస్పత్రులు కాకుండా వేరే చోటు తీసుకునే చికిత్సలకు చెల్లింపులు చేయడం లేదు.ఇతర ప్లాన్లు బీమా కంపెనీల భాగస్వామ్యంతో కొన్ని ప్రైవేటు సంస్థలు ప్రత్యేక ఓపీడీ ప్లాన్లను అందిస్తున్నాయి. ఇందులో లివ్లాంగ్ ఇన్సూరెన్స్ ఒకటి. దాదాపు అన్ని ప్రముఖ బీమా సంస్థల తరఫున ఓపీడీ కవర్ సేవలను ఆఫర్ చేస్తోంది. రూ.15,000 కవరేజీకి రూ.5,500, రూ.16,000 కవరేజీకి రూ.6,000, రూ.28,800 కవరేజీకి రూ.11,599 ప్రీమియం కింద వసూలు చేస్తోంది. ఈ తరహా సంస్థల ఓపీడీ ప్లాన్లలో కొన్ని పరిమితులు ఉన్నప్పటికీ.. ఎన్నో ఉచిత ప్రయోజనాలను ఆఫర్ చేస్తున్నాయి. లివ్లాంగ్ ‘ఎల్డర్కేర్’ ఓపీడీ ప్లాన్ కోసం 66 ఏళ్ల గీత ఏడాదికి రూ.12,000 ప్రీమియం చెల్లిస్తోంది. ఇందులో ఔషధాలు, డయాగ్నోస్టిక్స్ చార్జీలకు ఏడాదిలో గరిష్ట చెల్లింపులు రూ.3,000కు పరిమితం. అయినప్పటికీ 83 ప్యారామీటర్లతో కూడిన ఫుల్బాడీ చెకప్, వైద్యులు, పోషకాహార నిపుణులతో అపరిమిత కన్సల్టేషన్లు, ఏడాదిలో ఆరు స్పెషలిస్ట్ వైద్యుల కన్సల్టేషన్లను ఉచితంగా ఆఫర్ చేస్తున్నట్టు ఆమె చెప్పారు. అంతేకాదు ఏడాదిలో రెండు ఉచిత అంబులెన్స్ సరీ్వసులను సైతం వినియోగించుకునే సదుపాయం ఇందులో ఉంది. ‘ఈవెన్ హెల్త్కేర్’ కంపెనీ సైతం మాగ్మా జనరల్ ఇన్సూరెన్స్ సంస్థతో కలసి ఓపీడీ ఇన్సూరెన్స్ను అందిస్తోంది. కాకపోతే దీన్ని విడిగా రైడర్ కింద కాకుండా.. ఇండెమ్నిటీ కవర్కు యాడాన్గా ఆఫర్ చేస్తోంది. రూ.10 లక్షల వరకు ఓపీడీ కవర్ తీసుకోవచ్చు. ప్రీమియం కూడా 35 ఏళ్లలోపు వారికి ఏడాదికి రూ.4,500, 36–49 ఏళ్లలోపు వారికి రూ.10,000, 50 ఏళ్లు మించిన వారికి రూ.19,000 చార్జ్ తీసుకుంటోంది. ఓపీడీలో క్లెయిమ్స్ ఎక్కువ. అందుకే ప్రీమియం కూడా ఎక్కువే. ‘ఓపీడీ కవర్లో ప్రతి రూ.100 రక్షణ కోసం చెల్లించే ప్రీమియం రూ.50 వరకు ఉంటుంది. ఈ మేరకు పొదుపు చేసుకోవచ్చు’ అని సెక్యూర్నౌ ఇన్సూరెన్స్ బ్రోకర్ సహ వ్యవస్థాపకుడు కపిల్ మెహతా తెలిపారు. ఉచిత హెల్త్ స్క్రీనింగ్, చెకప్ల ద్వారా ఇవి వ్యాధి నివారణను ప్రోత్సహిస్తాయని చెప్పారు. ఓపీడీ రక్షణ ఉంటే.. ఎన్నిసార్లు వైద్యుల వద్దకు వెళ్లి, పరీక్షలు చేయించుకోవాల్సి వచ్చినా నిశ్చింతగా ఉండొచ్చన్నారు.పనిచేసే సంస్థ నుంచి ఓపీడీ ప్లాన్ కొన్ని బీమా సంస్థలు ప్రైవేటు కంపెనీల ఉద్యోగులకు ఓపీడీ కవరేజీని గ్రూప్ ప్లాన్ కింద ఆఫర్ చేస్తున్నాయి. నోయిడాకు చెందిన అన్మోల్ ఓ ఆరి్థక సేవల కంపెనీలో పనిచేస్తున్నాడు. పనిచేసే సంస్థ నుంచి తనకు, తన తల్లిదండ్రులకు కలిపి ఓపీడీ ప్లాన్ తీసుకున్నాడు. ఏడాదికి కవరేజీ రూ.21,000 కాగా, రూ.11,000 ప్రీమియం చెల్లిస్తున్నాడు. అన్మోల్కు 10 శాతం, అతడి తల్లిదండ్రులకు 20 శాతం కో–పే షరతు ప్లాన్లో భాగంగా ఉంది. అంటే ప్రతీ బిల్లులోనూ ఈ మేరకు అన్మోల్ సొంతంగా చెల్లించుకోవాలి. అయినప్పటికీ ఏటా రూ.18,000 విలువైన ఓపీడీ ప్రయోజనాలను తాను పొందుతున్నట్టు తెలిపాడు. అంటే ప్రీమియం చెల్లింపులు పోను అతడికి నికర మిగులు రూ.7,000గా ఉందని అర్థమవుతోంది. కొన్ని సంస్థలు అయితే ఉచితంగానే తమ ఉద్యోగులకు ఓపీడీ కవర్ను ఆఫర్ చేస్తున్నాయి. కొన్ని ఓపీడీ ప్లాన్లు కళ్లు, దంత సంబంధిత చికిత్సలకు సైతం కవరేజీనిస్తున్నాయి. ఇలా చేస్తే మెరుగు.. → ఓపీడీ కవర్లో భాగంగా వచ్చే ఉచిత హెల్త్ చెకప్లు, టెలీ కన్సల్టేషన్ సేవలను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలి. → నెట్వర్క్ ఆస్పత్రుల్లో నగదు రహిత విధానంలో సులభంగా సేవలు పొందొచ్చు. రీయింబర్స్మెంట్ విధానంలో అయితే అన్ని బిల్లులను జాగ్రత్తపరిచి క్లెయిమ్ దాఖలు చేయాల్సి వస్తుంది. నగదు రహిత విధానంలో అయితే ఈ ప్రహసనం తప్పించొచ్చు. → ఉప పరిమితులను జాగ్రత్తగా గమనిస్తూ, గరిష్ట పరిమితి మేరకు ఉపయోగించుకోవాలి. → ఓపీడీ కవర్ను రెన్యువల్ సమయంలో సమీక్షించుకోవాలి. కవరేజీ చాలకపోయినా.. ప్లాన్ ఆఫర్ చేస్తున్న ప్రయోజనాలు, ఉప పరిమితులు అంత అనుకూలంగా అనిపించకపోయినా మెరుగైన ప్లాన్కు అప్గ్రేడ్ కావాలి. ఓపీడీ ప్లాన్ తీసుకోవచ్చా..? తరచూ వైద్యుల సలహాలు, చికిత్సల కోసం వెళ్లే వారికి ఓపీడీ ప్లాన్లు ఉపయోగకరం. ముఖ్యంగా జీవనశైలి వ్యాధులు, దీర్ఘకాల వ్యాధులతో బాధపడే వారు వీటిని తీసుకోవచ్చు. ‘‘ఆరోగ్యవంతులైన వ్యక్తులకు సైతం ఓపీడీ కవర్ ప్రయోజకరమే. ముందస్తు వ్యాధి నిర్ధారణ పరీక్షల ద్వారా అనారోగ్యాలను తొలి దశలోనే గుర్తించొచ్చు’’ అని మణిపాల్ సిగ్నా హెల్త్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్, బిజినెస్ హెడ్ ఆశిష్ యాదవ్ సూచించారు. బీమా సంస్థ ఆఫర్ చేసే నగదు రహిత ఆస్పత్రుల నెట్వర్క్ను కూడా చూడాలి. ఓపీడీ ప్లాన్లలో తమకు నచ్చిన వైద్య నిపుణుడి వద్దకు కాకుండా, బీమా సంస్థ నెట్వర్క్ ఆస్పత్రుల్లోని వైద్యుల సేవలకు పరిమితం కావాల్సి వస్తుంది. కనుక నెట్వర్క్ జాబితాలో పేరున్న హాస్పిటల్స్ ఉన్నాయేమో పరిశీలించాలి. రీయింబర్స్మెంట్ విధానంలో షరతులు ఉన్నాయేమో తెలుసుకోవాలి. అసలు షరతుల్లేని లేదా పరిమిత షరతులతో మెరుగైన ప్రయోజనాలను ఆఫర్ చేసే ఓపీడీ ప్లాన్ను ఎంపిక చేసుకోవచ్చు. పనిచేసే సంస్థ నుంచి ఓపీడీ ప్లాన్కు అవకాశం ఉంటే అదే తీసుకోవడం మేలు. తమ అవసరాలకు సరితూగే ఓపీడీ ప్లాన్ను ఎంపిక చేసుకోవడం అన్నింటికంటే ప్రధానమైనది. వివిధ సంస్థలు ఆఫర్ చేస్తున్న ఓపీడీ ప్లాన్లు, వాటిల్లోని సదుపాయాలు, నెట్వర్క్ ఆస్పత్రుల జాబితాను పోల్చి చూడాలి. మెరుగైన చెల్లింపుల చరిత్రతో సహేతుక ప్రీమియంతో ఉన్న ప్లాన్ను ఎంపిక చేసుకోవచ్చు. -
....ఇన్ఫెక్షన్లు వస్తున్నాయి
∙నా వయసు ఇరవైఐదు సంవత్సరాలు. నాకు తరచు మూత్రసంబంధ ఇన్ఫెక్షన్లు వస్తున్నాయి. కారణం ఏమిటి? పరిష్కార మార్గాలు చెప్పండి. – కీర్తి, అనంతపురం. మూత్రనాళ ఇన్ఫెక్షన్ అంటే మూత్ర వ్యవస్థలోకి బాక్టీరియా ప్రవేశించడం వల్ల కలిగే సమస్య. సాధారణంగా ఈ బాక్టీరియా బయట నుంచి యూరినరీ బ్లాడర్లోకి ప్రవేశిస్తే ఇలా జరుగుతుంది. కొన్నిసార్లు మరింత తీవ్రమవుతూ మూత్రనాళం మొత్తం పైకి, కిడ్నీల వరకు చేరుతుంది. దీనివలన మూత్రం పోతున్నప్పుడు మంటగా అనిపించడం, తరచుగా మూత్రం రావడం, నొప్పి ఉండటం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. తక్కువ నీరు తాగటం, బయట తినే ఆహారం, శరీర శుభ్రత సరిగ్గా పాటించకపోవడం వంటి వాటి వల్ల ఈ సమస్యలు పునరావృతం అవుతూనే ఉంటాయి.రోజుకు కనీసం మూడున్నర లీటర్ల నీరు తాగాలి. మసాలా, కారం ఎక్కువుండే ఆహార పదార్థాలు, చల్లని పానీయాలు, టీ, కాఫీ లాంటివి తగ్గించాలి. ఇవి మూత్రపిండాలపై ఒత్తిడి పెంచుతాయి. జననేంద్రియ భాగాన్ని ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచాలి. సెంటు ఉన్న సబ్బులు, పరిమళభరిత పదార్థాలు వాడకూడదు. భర్తతో ఇంటర్కోర్స్ జరిగిన వెంటనే శుభ్రత పాటించాలి. మలవిసర్జన తర్వాత ముందువైపు నుంచి వెనుకవైపు వైపు మాత్రమే శుభ్రం చేసుకోవాలి. వెనుక నుంచి ముందుకు శుభ్రం చేయకూడదు. ఇలా చేయడం వల్ల బాక్టీరియా బ్లాడర్లోకి వెళ్లే ప్రమాదం ఉంటుంది. కాటన్ అండర్వేర్ ధరించాలి. ఎప్పుడూ పొడిగా ఉండేలా చూసుకోవాలి. స్నానం చేసిన తరువాత కూడా ఆ భాగాన్ని బాగా పొడిగా ఉంచుకోవాలి. కొంతమంది క్రమం తప్పకుండా వచ్చే ఇన్ఫెక్షన్లకు సహజమైన చికిత్సలు బాగా ఉపయోగపడతాయి. ఉదాహరణకు, తాజా పండ్ల రసాలు, బార్లీ నీరు, నిమ్మకాయ నీరు, కొబ్బరి నీరు రోజూ తీసుకోవచ్చు. ఇవి మూత్రనాళం శుభ్రంగా ఉండేలా చేస్తాయి. తరచు పొత్తి కడుపులో నొప్పిగా అనిపించటం, మూత్రంలో ముదురు రంగు, రక్తం కనిపించడం లాంటి లక్షణాలు ఉంటే వెంటనే డాక్టర్ను సంప్రదించాలి. జ్వరమొచ్చినా, నడుము నొప్పి ఉన్నా ఆలస్యం చేయకూడదు. మొదటి దశలోనే పరీక్షలు చేయించుకుని, చికిత్స తీసుకుంటే సమస్య తిరిగి రాదు. అవసరమైతే మూత్రపరీక్షలో బాక్టీరియా ఏ రకమైనదో చూసి, దానికి సరిపడే మందులు మాత్రమే వాడాలి. ఇతర వైద్యం అవసరం లేకుండా, ఒత్తిడి తగ్గించి, శరీర శుభ్రతను పాటించడం ద్వారా చాలా వరకు నియంత్రించ వచ్చు. రాగానే తలనొప్పి నాకు గత రెండేళ్లుగా ప్రతి నెలా పీరియడ్ రాగానే తీవ్రమైన తలనొప్పి వస్తోంది. ఇది మైగ్రేన్∙ అంటున్నారు. ఇది ఎందుకు వస్తోంది? దానికి ఏమైనా పరిష్కారం ఉందా?– శారద, తిరుపతి. మీకు వస్తున్న తలనొప్పి సాధ్యమైనంత వరకు హార్మోన్ల మార్పుల వల్ల కలిగే మైగ్రేన్ కావచ్చు. పీరియడ్ వచ్చే కొన్ని రోజుల ముందు ఈస్ట్రోజన్ అనే హార్మోన్ శరీరంలో తగ్గిపోతుంది. దాని ప్రభావంతో తలనొప్పి ప్రారంభమవుతుంది. కొంతమందికి ఇది నాలుగు రోజుల ముందే మొదలై, పీరియడ్ మొదటి రెండు రోజుల వరకూ ఎక్కువగా ఉంటుంది. దీనిని మెన్స్ట్రువల్ మైగ్రేన్ అంటారు. ఇది ఓ పద్ధతిలో వచ్చే తలనొప్పి కాబట్టి, మీరు ఒక డైరీ రాసుకోవాలి – ఎప్పుడు వస్తోంది, ఎంతసేపు ఉంటుంది, ఏమి తిన్నాక లేదా ఏ పరిస్థితుల్లో వస్తోంది అన్నదాన్ని గమనించాలి. ఆ వివరాలతో డాక్టర్ సరైన మందులు సూచిస్తారు. కొంతమంది మైగ్రేన్ రాకముందే కొన్ని రోజుల పాటు నాప్రోక్సెన్, ఐబుప్రొఫెన్ లాంటి నొప్పి నివారణ మాత్రలు వాడతారు. ఇవి శరీరంలో వాపు, నొప్పిని తగ్గించడంలో సహాయపడతాయి. గర్భధారణ ఉన్నవారు అయితే, కొన్ని మందులు వాడకుండా ఉండాలి. అప్పుడు మాత్రమే గర్భసంచయానికి అనుకూలంగా ఉండే ప్రొజెస్టెరాన్ మాత్రలు ఇవ్వడం జరుగుతుంది. పీరియడ్ సమయాల్లో మైగ్రేన్ ఎక్కువగా ఉంటే, ఆ రోజుల్లో తీసుకోవాల్సిన మందులు ప్రత్యేకంగా సూచిస్తారు. కొంతమందికి ఈస్ట్రోజన్ తక్కువ స్థాయిలో ఉండటం వల్లే ఇది వస్తుంది కాబట్టి, తగిన ఈస్ట్రోజన్ ప్యాచ్లు లేదా ఇతర మార్గాల్లో ఇచ్చే చికిత్సలు ఉపయోగపడతాయి. గర్భధారణ సమయంలో ఏ మాత్రలు తీసుకోవాలో, ఏవి తీసుకోవద్దో వైద్యులే నిర్ణయిస్తారు. మైగ్రే తో పాటు వాంతులు, వికారం వంటి సమస్యలు ఉంటే, అటువంటి లక్షణాల కోసం ప్రత్యేక మందులు ఇస్తారు. తిండి మానేయకూడదు, ఆకలితో ఉండకూడదు. ప్రతిరోజూ ఒకే సమయంలో తినడం, నీరు ఎక్కువగా తాగడం, శరీరాన్ని విశ్రాంతిగా ఉంచడం అవసరం. ఒక నెలలో మూడుసార్లు లేదా అంతకంటే ఎక్కువ సార్లు మైగ్రేన్ వస్తున్నట్లయితే, రోజూ తీసుకునే ప్రివెంటివ్ మందులు అవసరమవుతాయి. ఈ మందుల్ని మొదటి మూడు నెలల పాటు వాడిన తరువాత, దాని ప్రభావాన్ని డాక్టర్ అంచనా వేస్తారు. దాని ఆధారంగా మందులు వాడాలి. -
సూపర్ టిప్స్ : ఎంత బిజీ అయినా సరే, ఇలా బరువు తగ్గొచ్చు!
బరువు తగ్గాలంటే ఆహార అలవాట్లను మార్చుకోవాలి. వ్యాయామం చేయాలి. వీటన్నింటి కంటే ముందు అసలు మనం ఎందుకు బరువు ఎక్కువగా ఉన్నాయో విశ్లేషించుకోవాలి. అంతర్లీనంగా ఏవైనా ఆరోగ్యసమస్యలున్నాయేమో అనేది వైద్య నిపుణుల ద్వారా చెక్ చేసుకోవాలి. అప్పుడు వ్యాయామం, ఆహారంమీద దృష్టిపెట్టాలి. అయితే ఎక్స్ర్సైజ్ చేయడానికి టైం లేదబ్బా.. ఇది అందరూ చెప్పేమాట. మరి దీనికి పరిష్కారమేంటి? బిజీ షెడ్యూల్తో సతమతయ్యేవారు, అస్సలు టైం ఉండటం లేదు అని బాధపడే వారు ఏం చేయాలి? ఇవాల్టి ‘ టిప్ ఆఫ్ ది డే’ లో తెలుసుకుందాం.బిజీ బిజీ జీవితాల్లో బరువు తగ్గడంపై దృష్టి పెట్టేందుకు సమయం దొరకడం కష్టంగా అనిపించవచ్చు. కానీ మన కోసం, మన ఆరోగ్యం కోసం ఎంతో కొంత సమయాన్ని కేటాయించడం చాలా అవసరం. అలాంటి కొన్ని చిట్కాలు చూద్దాం. స్మార్ట్గా మన షెడ్యూల్ ఆధారంగా దినచర్యను అలవాటు చేసుకోవాలి. గంటలు గంటలు జిమ్లో గడాల్సిన అవసరం లేకుండానే, సింపుల్ చిట్కాలు, చిన్న చిన్న జీవనశైలి సర్దుబాట్లతో ఫిట్నెస్ సాధించవచ్చు.స్మార్ట్ ప్రిపరేషన్బరువు తగ్గడం, ఫిట్గా ఉండాలి అనే విషయంలో కూడా కమిట్మెంట్ చాలా ముఖ్యం. ప్లాన్డ్గా, స్మార్ట్గా ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఉదయం బ్రేక్ ఫాస్ట్నుంచే మన ప్రిపరేషన్ మొదలు పెట్టేద్దాం. ఇందుకు పది నిమిషాలు చాలు. ఉడికించిన గుడ్లు, స్మూతీ, లేదా రాత్రి నానబెట్టిన ఓట్స్ బెస్ట్. వీటిని తొందరగా ప్రిపేర్ చేసుకోవచ్చు. పోషకాలు కూడా ఎక్కువే. ఖచ్చితంగా ఇంతే తినాలని అనుకొని, టిఫిన్ లేదా లంచ్ ప్యాక్ చేసుకుంటే..అతిగా తినే ముప్పు తప్పుతుంది. వ్యాయామం- ఆ 2 నిమిషాలు కనీసం వ్యాయామం శరీరాన్ని చురుగ్గా ఉంచుతుంది. రోజులో కనీసం అర్థగంట వ్యాయామానికి కేటాయిస్తే చాలు. అలాగే సుదీర్ఘ వ్యాయామం చేయలేకపోతున్నామన్న దిగులు అవసరం లేదు. రోజంతా రెండు, రెండు నిమిషాలు మినీ వర్కౌట్లు చేయండి. అంటే కాఫీ విరామాలలో స్క్వాట్లు, డెస్క్ స్ట్రెచ్లు లేదా లిఫ్ట్లకు బదులుగా ఎక్కడం లాంటివి. డెస్క్ వర్క్ అయినా సరే.. ప్రతీ గంటకు ఒకసారి స్వల్ప విరామివ్వడం ముఖ్యం. వీలు, సౌలభ్యాన్ని బట్టి, చిన్న చిన్న డెస్క్ వ్యాయామాలు చేయవచ్చు.అందుకే ఇటీవల చాలా ఐటీ కంపెనీల్లో స్టాండింగ్ డెస్క్లను ఏర్పాటు చేస్తున్నాయి. ప్రయాణాల్లో రైల్వే స్టేషన్, బస్టాండ్, ఎయిర్పోర్ట్లలో సమయం ఉన్నపుడు సాధ్యమైనంత నడవడానికి, నిల్చొని ఉండడానికి ప్రయత్నించండి. ఇవి జీవక్రియను చురుకుగా ఉంచడం తోపాటు, శరీర భాగాల్లో కొవ్వు పేరుకు పోకుండా చేస్తుంది.ఇదీ చదవండి: Today Tip : మూడు నెలల్లో బాన పొట్ట కరిగిపోవాలంటే..!హైడ్రేషన్: ఎక్కడికి వెళ్లినా వాటర్ బాటిల్ను వెంట తీసుకెళ్లండి. హైడ్రేటెడ్గా ఉండటం జీవక్రియను మెరుగు పరుస్తుంది. ఆకలిని తగ్గిస్తుంది. మరింత ఉత్సాహంకోసం నిమ్మకాయ, పుదీనా కలిపిన నీళ్లు, లేదా పల్చని మజ్జిగ తాగండి.“స్నాక్ స్మార్ట్”: వండుకునే టైం లేదనో టైం పాస్ కోసమో, ఆకలిగా ఉండనో, ఎనర్జీ డ్రింక్స్, ప్యాక్డ్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ వైపు మళ్లకండి. దీనికి బదులుగా నట్స్, రోస్టెడ్ సీడ్స్, ప్రోటీన్ బార్లు, పండ్లు వంటి ఆరోగ్యకరమైన స్నాక్ ప్యాక్లపై దృష్టిపెట్టండి. వీలైతే వీటిని మీ బ్యాగ్, డెస్క్ లేదా కారులోనో ఉంచుకోండి. వీటి వల్ల పోషకాలు బాగా అందుతాయి. శక్తి లభిస్తుంది. అంతేకాదు దీని వల్ల షుగర్ ఫుడ్స్, ఆయిలీ ఫుడ్, అనారోగ్యకరమైన స్ట్రీట్ ఫుడ్కి దూరంగా ఉండొచ్చు. వండుకోవడానికి సమయంలో లేనప్పుడు. తక్కువ సమయంలో, ఎక్కువ ప్రొటీన్డ్ ఫుడ్ తినేలా ప్లాన్ చేసుకోండి. గంటల తరబడి కుర్చీకి, సోఫాకి అతుక్కుపోవద్దు. వీలైనన్నిసార్లు లేచి నడుస్తూ ఉండాలి. ఉదా : ఫోన్ మాట్లాటప్పుడు, టీవీ చూస్తున్నపుడు, పాడ్కాస్ట్ వింటున్నప్పుడు నడుస్తూ ఉండాలి. అలాగే భోజనం తరువాత కనీసం 10నిమిషాల నడక అలవాటు చేసుకోండి.ఇలా చేయడం వల్లన యాక్టివ్ఉండటంతోపాటు,రోజంతా కేలరీలను బర్న్ చేయడంలో సహాయపడుతుంది.చదవండి: యూఎస్కు బైబై : ఇండియాలో రూ.25 కోట్లతో బతికేయొచ్చా? చెప్పండి ప్లీజ్!పోర్షన్ కంట్రోల్: మన తినే ఆహారంలో కొర్బ్స్ తక్కువ, ప్రొటీన్ ఎక్కువ ఉండేలా చూసుకోవాలి. "మైండ్ఫుల్ ఈటింగ్" అనేది ముఖ్యం. ఎక్కువ తినకుండా పొట్ట నిండేలా ఉడికించిన కూరగాయ ముక్కలు, మొలకెత్తిన గింజలు, పుచ్చ, బొప్పాయి లాంటి పళ్లకు చోటివ్వండి. కొద్దిగా కొద్దిగా నెమ్మదిగా తినండి. చిన్న ప్లేట్లను ఉపయోగించండి. ఎందుకంటే బిజీగా ఉండేవారు ఆ హడావిడిలో వేగంగా, ఎక్కువగా తినేస్తారు. అలాగని కేలరీలను మరీ అబ్సెసివ్గా లెక్కించాల్సిన అవసరం లేదు. పోర్షన్ కంట్రోల్పై దృష్టిపెడాలి. అపుడు ఎంత తక్కువ తిన్నా కడుపు నిండిన అనుభూతినిస్తుంది. స్క్రోలింగ్ చేస్తున్నప్పుడు లేదా పని చేస్తున్నప్పుడు తినడం మానుకోండి. ఏం తింటున్నామన్న దానిపై దృష్టి పెట్టి శ్రద్ధగా, ఆస్వాదిస్తూ తినండి.గంట కొట్టినట్టు నిద్రపోవాలినిద్ర లేకపోవడం ఆకలి హార్మోన్లను ఉత్తేజితం చేస్తుంది. సమయానికి నిద్రపోవాలి. వారాంతాల్లో కూడా నిద్రవేళకు ఒక నిర్దిష్ట సమయాన్ని సెట్ చేసుకోండి, దానికి కట్టుబడి ఉండండి. చక్కటి విశ్రాంతి తీసుకున్న శరీరం ఎక్కువ బరువు తగ్గేలా ప్రతిస్పందిస్తుంది. సంకల్ప శక్తి పెరుగుతుంది.చీట్ మీల్, ఓకే అప్పుడప్పుడూ వ్యాయామాన్ని మిస్ అయినా, కాస్త ఎక్కువ తిన్నే మరీ ఎక్కువ ఆందోళన చెందకండి. చీట్మీల్ అనుకోండి. బిజీ షెడ్యూల్లో అన్నీ అనుకున్నట్టు ప్రణాళిక ప్రకారం జరగవు అని సర్దుకుపోండి. మిస్ అయిన వ్యాయాన్ని మరునాడు సర్దుబాటు చేసుకోండి. అంతే... అందం, ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం మీ సొంతం.నోట్: ఇవి అవగాహనకోసం అందించిన చిట్కాలు మాత్రమే. ఎవరి శరీరాన్నివారు అర్థం చేసుకొని, ప్రేమించాలి. బరువు తగ్గడం అనేది ఎవరికి వారు నిశ్చయించుకొని, స్వీయ క్రమశిక్షణతో, పట్టుదలగా చేయాల్సిన పని అని మర్చిపోవద్దు. -
నిండు నూరేళ్లు.. వందేళ్లయినా మలేషియా మాజీ ప్రధానిలో అదే జోష్!
నిండు నూరేళ్లు ఆరోగ్యంగా బతకడం అనేది ఈ రోజుల్లో అత్యంత కష్ట సాధ్యమైన పనే. పెరిగిన సాంకేతికత మనిషిపై పెత్తనం చేస్తుందేమో అనేలా..దానికి బానిసై ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నాడు మానవుడు. కానీ ఈ మలేషియా ప్రధాని డాక్టర్ మహతిర్ ముహమ్మద్ ఒత్తిడితో కూడిన రాజకీయ వాతావరణంలో సుదీర్ఘకాలం పనిచేసిన మంత్రిగా పేరు తెచ్చుకోవడమే గాక ఈ నెల పదితో ఆయనకు నూరేళ్లు నిండాయి. ఈ అద్భుత మైలు రాయిని ఈ నెల జూలై 10, 2025న చేరుకున్నారు. ఆయన వయస్సు పరంగా..ఇప్పటికీ చాలా స్పష్టంగా మాట్లాడగలరు. వృద్ధులలో ఉండే తడబాటు, ఒణుకు అవేమి ఆయనలో కనిపించావు..40 లేదా 50 ఏళ్ల వాడిలా అత్యంత హుషారుగా ఉంటారు. అంతేగాదు ఈ వయసులో కూడా యువతతో పోటీ పడేలా బ్రెయిన్కి పదను పెట్టగల సామర్థ్యం ఆయన సొత్తు. ఐతే అందుకు ఎలాంటి మ్యాజిక్ ఉండదని క్రమశిక్షణాయుతమైన జీవనశైలి ఒక్కటే తోడ్పడుతుందని చెబుతున్నారు. అంతేగాదు ఈ ఆరు అలవాట్లు తప్పనిసరి అంటూ తన దీర్ఘాయువు రహస్యాలను పంచుకున్నారు. అవేంటో చూద్దామా..!.అధిక వ్యాయామం వద్దు..చురుకుగా ఉందాం..అధిక వ్యాయామాలు జోలికి పోవద్దన్నారు. ఇది వృద్ధాప్యం కండరాల నష్టం (సార్కోపెనియా), హృదయనాళ పనితీరుపై తీవ్ర ప్రభావం చూపుతుందని అంటున్నారు మహాతిర్. దాని బదులు, నడవడం, రోజు వారి పనులపై ఎవ్వరిపై ఆధార పడకుండా చేసుకోవడం తదితరాలు శరీరంలో మంచి కదలికను ప్రోత్సహింస్తుందని అన్నారు. తాను తీవ్రంగా చేసే జిమ్ జోలికి కూడా పోనననారు. ఈ వయసులో తేలికపాటి వ్యాయమాలే బెస్ట్ అని చెప్పారు. బాడీ తోపాటు మనసుకి కూడా వ్యాయామం..మొదడు ఉపయోగించకపోతే..మతిమరుపు వంటి సమస్యలు వస్తాయన్నారు. అందుకోసం మహతిర్ చదవడం, రాయడం, మాట్లాడటం వంటి పనులు చేస్తారు. ఆయన ఎక్కువగా స్పీచ్లు ఇస్తుంటారట. ఇది తన మెదడుని చురుకుగా ఉండేలా చేస్తుందట. మేధోపరమైన పనులతోనే చిత్త వైకల్యం వంటి సమస్యలను అధిగమించగలమని చెప్పారు. ఇది పరిశోధనల్లో కూడా వెల్లడైందని అన్నారు. పదవీ విరమణ అంటే బ్రేక్ కాదు..రిటైర్మెంట్ తీసుకున్న తదనంతర కూడా తన కార్యకలాపలను వదులుకోలేదట మహతీర్. అది తాను విశ్రాంతి తీసుకునే సమయంగా అస్స్లు ఫీల్ కాలేదట. మరింతగా తనపై తాను ఏకాగ్రత చిత్తంతో ఆలోచించుకునే విరామ సమయంగా భావించానని చెబుతున్నారు. తాను ఈ ఖాళీ సమయంలో రాయడం, సలహాలు ఇవ్వడం, బహిరంగ చర్చల్లో పాల్గొనడం వంటి కార్యకలాపాల్లో మునిగిపోతారట. ఇది మెరుగైన మానసిక ఆరోగ్యం తోపాటు అకాల మరణ ప్రమాదాన్ని నివారిస్తుందట. సంభవించే ప్రమాదాన్ని తగ్గిస్తుందట.భావోద్వేగ పరంగా బీ స్ట్రాంగ్..తన రాజకీయ ప్రయాణంలో ఎన్నో విమర్శలు, అంతర్జాతీయ ఒత్తిడి వంటి రాజకీయ సవాళ్లను చాలానే ఎదుర్కొన్నారట. దాన్ని అధిగమించేందుకు ధ్యానం లేదా మైండ్ఫుల్నెస్ టెక్నిక్లపై దృష్టిసారించేవారట. తనలోకి తాను అవలోకనం చేసుకున్నప్పుడూ ఎలాంటి ఒత్తుడులు మనల్ని ఏం చేయలేవని ధీమాగా చెబుతున్నారు. అందువల్ల భావోద్వేగ పరంగా బలంగా ఉంటే వృద్ధాప్యం దరిచేరే ప్రమాదం ఆటోమేటిక్గా తగ్గిపోతుందట. ఈ భావోద్వేగ నియంత్రణ దీర్ఘాయువుకి అత్యంత కీలకమైనదని చెబుతున్నారు.హానికరమైన అలవాట్లకు దూరం..ఆహారంలో నియంత్రణ, చక్కటి జీవనశైలి ఆరోగ్యంగా ఉండటంలో ప్రధాన పాత్ర పోషిస్తాయని అన్నారు. అలాగే ఎలాంటి ఫ్యాషన్ డైట్లు, అధిక పోషకాహార డైట్లు వద్దని సూచించారు. బదులుగా సమతుల్య భోజనానికి ప్రాముఖ్యత ఇవ్వమని కోరారు. దీర్ఘాయువు అనేది మితంగా తినడంపైనే ఆధారపడి ఉంటుందని నొక్కి చెప్పారు. ముఖ్యంగా 60వ దశకంలో జీవక్రియ నెమ్మదించి వ్యాధులు అటాక్ చేసే సమయం అని..అందువల్ల మితాహారానికి ప్రాధాన్యత ఇవ్వడం మంచిదని సూచించారు.ఉరకలు వేసే ఉత్సాహం..దీన్ని ఓ అభ్యాసంలా చేస్తే..ఉత్సాహం మన నుంచి దూరం కాదని చెబుతున్నారు. ఇది ఆరోగ్యంగా ఉండటంలో కీలకపాత్ర పోషిస్తుందని చెప్పారు. నిరంతరం నేర్చుకోవడానికి ప్రాధాన్యత ఇస్తే..యువకుడిలా ఉత్సాహంగా ఉంటామని చెప్పారు. ఈ ఉత్సాహమే సకలం నేర్చుకోవడానికి దోహద పడుతుందని అన్నారు. అందుకోసం అసరం అనుకుంటే యువతరంతో మమేకం కండి, వారితో మీ అనుభవాలు పెంచుకండి మీ ఆయుష్షు పెరగడమే గాక యంగ్గా ఉంటారని అంటున్నారు. నిత్య యవ్వనంగా ఉండటం అంటే..నెరిసిన జుట్టుతో ఉన్నా..శరీరం ఒణకకుండా..మాట తీరు అత్యంత స్పష్టంగా ఉండటమేనని చెబుతున్నారు మహతీర్. ఇంకెందుకు ఆలస్యం ఆయనలా ఆ ఆరు అలవాట్లను మన జీవితంలో భాగం చేసుకుని దీర్ఘాయుష్షుతో నిండు నూరేళ్లు ఆరోగ్యంగా జీవిద్దామా...(చదవండి: బెల్లం ఫేస్ వాష్..దెబ్బకు ముఖంపై ముడతలు మాయం..!) -
వాకింగా? జాగింగా? ఎవరికి ఏది మంచిది?
సాధారణంగా నడక (వాకింగ్) జాగింగ్ చాలా ప్రముఖమైన సులభమైన అత్యధిక శాతం మంది అనుసరించే వ్యాయామాలు. ఎక్కడైనా, ఎప్పుడైనా సరే ఎవరి సాయం లేకుండా కూడా చేయగలిగిన ప్రయోజనకరమైన వ్యాయామాలు కావడంతో వీటికి చాలా ప్రాధాన్యత ఉంది అయితే కొందరిలో సందేహాలు ఉన్నాయి. నడక మంచిదా? జాగింగ్ మంచిదా? అసలు ఏది ఎవరు చేయాలి? ఎంత సేపు చేయాలి... వంటి అనుమానాల నివృత్తి కోసం...వైద్యులు చెబుతున్న కొన్ని విషయాలు..నలతను దూరం చేసే నడక : శరీరంపై తక్కువ ఒత్తిడి, గాయాలకు అవకాశం చాలా తక్కువ. తగినంత, మితమైన వేగంతో చేస్తే రోగనిరోధక శక్తి పెంచుకోవచ్చు. దీర్ఘకాలం పాటు నిరంతరంగా చేస్తే ఇది శరీరంలోని కొవ్వు కారక క్యాలరీలు తగ్గించడంలో, సహాయపడుతుంది. సాధారణ వేగంతో నడిస్తే 45 నిమిషాల నడక వల్ల సుమారు 150 నుంచి 250 క్యాలరీలు ఖర్చు అవుతాయి. ఇది అన్ని వయస్సుల వారికి, కొన్ని రకాల ఆరోగ్య పరిమితులతో ఉన్న వారికి కూడా అనుకూలం.జాగ్రత్తలతో...జాగింగ్పరుగుకీ, నడకకు మధ్యన ఉండేదే జాగింగ్. నిదానంగా చేసే జాగింగ్ వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి. కనీసం 15 నిమిషాల పాటు చేసే స్లో జాగింగ్ ద్వారా 100 నుంచి 150 క్యాలరీలు ఖర్చు చేయవచ్చు. కాస్త వేగంగా వేయడం వల్ల శరీరం మరిన్ని ఎక్కువ క్యాలరీలు తక్కువ సమయంలో ఖర్చు చేస్తుంది. ఇది గుండె రక్తనాళ వ్యవస్థకు మేలు కలుగు జేసే వ్యాయామం, ఆక్సిజన్ వినియోగాన్ని మెటబాలిజం వేగాన్ని పెంచడంలో కూడా మనకు తోడ్పడుతుంది .ఏది ఉత్తమం?ఈ ప్రశ్నకు సమాధానం వ్యక్తిగత లక్ష్యాల మీద ఆధారపడుతుంది. ఉదాహరణకు కేవలం ఆరోగ్యాన్ని కాపాడుకునే లక్ష్యం మాత్రమే కలిగి ఉంటే వాకింగ్ సరిపోతుంది. అదే బరువు తగ్గాలి అంతేకాకుండా గుండెకు తగిన వ్యాయామంకావాలి అనుకుంటే బ్రిస్క్ వాక్, జాగింగ్ మేలు చేస్తాయి.వ్యక్తి శారీరక పరిస్థితులు కూడా దృష్టిలో ఉంచుకోవాలి. కాళ్ళు, గాయాలు, గుండె సంబంధమైన సమస్యలు ఉన్నట్లయితే జాగింగ్ కాకుండా నడక బెస్ట్ అని చెప్పాలి. అలాగే 60ఏళ్లు దాటిన మగవాళ్లు, 50 ఏళ్లు దాటిన మహిళలు తమ తమ ఆరోగ్య సమస్యలను దృష్టిలో ఉంచుకుని తొలుత నడకతో మాత్రమే ప్రారంభించాలి. ఇతరత్రా ఏ సమస్యలూ రాకపోతే స్లో జాగింగ్కు మళ్లవచ్చు. అదే యుక్త వయసు వాళ్లు అయితే జాగింగ్ను ఎంచుకోవచ్చు. ఏదేమైనా, నిరంతరంగా కొనసాగించగల వ్యాయామం ఎంచుకోవడం ముఖ్యం. అది 45 నిమిషాలు నడక కావచ్చు, లేక 20 నిమిషాలు జాగింగ్ అయినా సరే. ఎంచుకున్న వ్యాయామాన్ని క్రమబద్ధంగా చేయడం అత్యంత ముఖ్యమైనది ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచిస్తున్న ప్రకారం శరీర క్రియలు సజావుగా జరగాలంటే వారానికి కనీసం 150 నిమిషాల పాటు ‘మోడరేట్ యాక్టివిటీ’ లేదా 75 నిమిషాల ‘విగరస్ యాక్టివిటీ’ చేయడం అవసరం. చురుకుదనం, ఆరోగ్యం వంటివి చాలనుకుంటే నడక తక్కువ సమయంలో ఫిట్నెస్ పెంచాలనుకుంటే జాగింగ్ మంచిది. నోట్ : ఏది ఏమైనా ముందస్తుగా ఆరోగ్య నిపుణులతో సంప్రదించి మీ ఆరోగ్య పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని, వ్యాయామం చేయడం ఉత్తమం. -
Today Tip : మూడు నెలల్లో బాన పొట్ట కరిగిపోవాలంటే..!
అధిక బరువు సమస్య కొంతమందిని వేధిస్తే, ముందుకు పొడుచుకు వచ్చిన బాన పొట్ట మరికొంతమందిని బాధిస్తుంది. కానీ మన ఇంట్లోనే, మన పోపుల పెట్టెలోనే సులువుగా లభించే దినుసులతో బెల్లి ఫ్యాట్ను కరిగించుకోవచ్చు. అదెలాగో ఇవాల్టి ‘టిప్ ఆఫ్ ది డే’ లో భాగంగా తెలుసుకుందాం.బెల్లీ ఫ్యాట్ను తగ్గించుకునేందుకు సోంపు, జీలకర్ర, ధనియాలతో చేసిన కషాయం బాగా పనిచేస్తుందని ఆయుర్వేదనిపుణులు చెబుతున్నారు. అంతేకాదు ఇది శరీర ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ కషాయం త్రాగడం వలన జీర్ణక్రియ మెరుగు పడుతుంది. బరువు తగ్గడానికి సహాయపడుతుంది, శరీరంలో మంటను తగ్గిస్తుంది.ఎలా తయారుచేసుకోవాలిరెండు స్పూన్ల ధనియాలు, రెండు స్పూన్ల సోంపు, రెండు స్పూన్ల జీలకర్ర4 కప్పుల నీళ్లు తీసుకోవాలి. ఇందులో జీలకర్ర, సోంపు, ధనియాలు వేసి 10-15 నిమిషాలు ఉడికించాలి. బాగా మరిగిన తరువాత ఈ కషాయాన్ని వడపోసుకోవాలి. ఉదయాన్నే పరగడుపున (empty stomach)న తాగాలి. కనీసం మూడు నెలల పాటు క్రమం తప్పకుండా ఇలా చేస్తే ఎంత వేలాడే పొట్ట అయినా సరే ఫ్లాట్గా మారిపోతుంది.మరిన్నిలాభాలుజీర్ణక్రియకు మంచిది, తద్వారా బరువు తగ్గుతుంది.గట్ హెల్త్ మెరుగుపడుతుంది. గ్యాస్, ఉబ్బరం, మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. దీని వలన అనేక సమస్యలకు ఉపశమనం లభిస్తుంది. మలబద్ధకం అనేక సమస్యలకు మూలం. సోంపు, జీలకర్ర, ధనియాలలో యాంటీ-ఇన్ఫ్లమేటరీ గుణాలు శరీరంలో మంటను తగ్గిస్తాయి. రోగనిరోధక శక్తి పెరుగుతుంది.చర్మం ప్రకాశం వంతంగా ఉంటుంది. మొటిమలు, మచ్చలు మటుమాయవుతాయి.ఇది మర్చిపోవద్దు : అయితే ఈ కషాయం తాగుతున్నాం కదా అని ఆహార నియమాల పట్ల నిర్లక్ష్యంగా ఉండకూడదు. ఈ చిట్కాను పాటిస్తూనే, కొద్ది సేపు నడక, కొవ్వు పదార్థాలు, నూనెలో వేయించిన పదార్థాలకు దూరంగా ఉండాలి. తగినన్ని నీళ్లు సేవించాలి. రాత్రి భోజనం తొందరగా ముగించాలి. ప్రతీ భోజనం తరువాత కనీసం పది నిమిషాలు నడిస్తే అద్భుతమైన ఫలితాలు సాధించడం ఖాయం.నోట్: ఈ ప్రక్రియ కొందరికి వారి వారి బాడీ మెటబాలిజాన్ని బట్టి కొంచెం ఆలస్యం కావచ్చు ఓపిగ్గా ప్రయత్నించాలి. బరువుతగ్గాలంటే ఆ మాత్రం ఓపిక తప్పదు మరి. అలాగే ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే, ఈ నీటిని త్రాగే ముందు వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం. ఇదీ చదవండి: Tip of the Day : రాగుల జావతో మ్యాజిక్ -
'వాటర్ ఫాస్టింగ్' ఆరోగ్యానికి మంచిదేనా..? నటి నర్గీస్ ఫక్రీ..
బాలీవుడ్ నటి నర్గీస్ ఫక్రీ అమెరికన్ నటి, మోడల్. అమెరికాలో మోడల్గా పనిచేసిన ఫక్రీ 2011లో బాలీవుడ్లో వచ్చిన రొమాంటిక్ డ్రామా చిత్రం రాక్స్టార్ మూవీతో ఉత్తమ మహిళా నటిగా ఫిల్మ్ఫేర్ అవార్డుని దక్కించుకుని అందర్నీ ఆకర్షించింది. నటన పరంగానే గాదు, గ్లామర్ పరంగానూ తనకు సాటిలేరెవ్వరూ అన్నట్లుగా ఆకర్షణీయంగా ఉంటారామె. ఇటీవల సోహా అలీకాన్తో జరిగిన సంభాషణలో తన ఫిట్నెస్ సీక్రెట్స్ వెల్లడించి అందరిని విస్తుపోయేలా చేశారు. తన లుక్ అంతలా ఉండటానికి తొమ్మిది రోజుల కఠిన ఉపవాసమేనని అంటోంది. దాని వల్ల తన ముఖంలో గ్లో వస్తుందని చెబుతోంది. నిజానికి అలాంటి ఉపవాసం ఆరోగ్యానికి మంచిదేనా..?. నిపుణులు ఏమంటున్నారంటే..సోహా అలీఖాన్ సంభాషణలో తన లైఫ్స్టైల్ గురించి వెల్లడించింది. కెటిల్బెల్ వంటి వ్యాయామాలు చేస్తానని, 8 గంటలు నిద్ర తప్పనిసరి అంటూ తన బ్యూటీ రహస్యాలు షేర్ చేసుకున్నారు. అయితే తాను ఏడాదికి రెండుసార్లు కఠిన ఉపవాసం ఉంటానని ఆ సమయంలో అస్సలు ఏమి తినని చెప్పుకొచ్చింది. కేవలం నీళ్లు మాత్రమే తాగుతానని అంటోంది. దాని వల్ల ముఖం పీక్కుపోయినట్లు కనిపించినా..ఒక విధమైన గ్లో వస్తుందని చెప్పుకొచ్చిందామె. అయితే ఇది కాస్తా కష్టమైనదని, ఎవ్వరూ ప్రయత్నించొద్దని సూచించారామె. ఇంకా తనకు బట్టర్ చికెన్, బిర్యానీ వంటి భారతీయ వంటకాలన్నా మహా ఇష్టమని తెలిపింది. అలాగే చర్మం ఆరోగ్యం కోసం హైడ్రేటెడ్గా ఉంటానని, మంచి నిద్ర, మినరల్స్, విటమిన్లు, పోషకాలతో కూడిన ఆహారమే తీసుకుంటానని చెప్పుకొచ్చారు నర్గీస్ ఫక్రీ. వాటర్ ఫాస్టింగ్ మంచిదేనా..?ఇది ఒకరకమైన ఉపవాసం. ఫ్యాట్ డైట్ పరంగా చేసే క్రేజీ ఫాస్టింగ్ అని చెబుతున్నారు. ఈ విధానంలో కేవలం నీటిని మాత్రమే తీసుకుంటారు. ప్రస్తుతం ఇది బాగా ట్రెండింగ్లో ఉంది. అలాగే పరిశోధనల్లో కేవలం నీటినే ఆహరంగా తీసుకుని ఉపవాసం ఉండే ఈ ప్రక్రియతో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయన్నారు. కొన్ని దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదం తగ్గే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని పరిశోధనలో తేలింది. అయితే ఇది ఎంతలా ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ.. సరైన విధంగా చేయకపోతే అంతే స్థాయిలో ప్రమాదాలు తప్పవని హెచ్చరిస్తున్నారు నిపుణులు. దుష్ప్రభావాలు..దీని వల్ల నీటి ఉపవాసం నిర్జలీకరణం, కండరాల నష్టం, రక్తపోటు మార్పులు వంటి ఇతర ఆరోగ్య పరిస్థితులకు దారితీస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి.ఆహారం లేకుండా ఎక్కువసేపు ఉండటం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు అందవు. పైగా ఎలక్ట్రోలైట్ అసమతుల్యత, కండరాల నష్టం, రోగనిరోధక శక్తి తగ్గడం, అలసట, తలతిరగడం,, మతిమరుపు, జీవక్రియ మందగించడం తదితర సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. అలాగే అందరి వ్యక్తుల శరీర తీరు విభిన్నంగా ఉంటుంది. కాబట్టి ఇది అందరికి సరిపడదని అన్నారు. ఇలాంటివి ఆరోగ్య నిపుణుల సమక్షంలో ఏ మేరకు చేయాలో నిర్ణయించి పాటిస్తేనే మంచిదని చెబుతున్నారు నిపుణులు.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం(చదవండి: ఐరన్ సయామీ..! ఒకే ఏడాదిలో రెండుసార్లు..) -
నిర్లక్ష్యం వద్దు ..డయేరియాతో జాగ్రత్త.!
నల్లకుంట: వర్షాకాలం వచ్చిందంటే సీజనల్ వ్యాధులు ఒక్కసారిగా చుట్టుముడుతాయి. ఈ కాలంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే దీని ప్రభావం చిన్నారులపై తీవ్రంగా ఉంటుంది. వర్షాకాలం వచ్చే వ్యాధుల్లో డయేరియా(అతిసార- diarrhea) ముఖ్యమైనది. దీనికి నీటి కాలుష్యం, ఆహార కాలుష్యం ముఖ్య కారణాలు కాగా, బహిరంగ ప్రదేశాల్లో మలవిసర్జన వ్యాధి వ్యాప్తికి దోహదపడుతుంది. పెద్దలైనా, పిల్లలైనా ఓ సారి డయేరియా బారిన పడితే శరీరంలో ఉన్న లవణాలన్నీ బయటకు వెళ్లిపోయి శరీరం శుష్కించి పోతుంది. చిన్నారుల్లో దీని తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుంది. నిర్లక్ష్యం చేస్తే కిడ్నీలు దెబ్బతిని అపస్మారక స్థితికి చేరుకునే పరిస్థితి వస్తుంది. బహిరంగ ప్రదేశాలలో మలవిసర్జన వద్దని అధికారులు పదేపదే చెబుతున్నా మురికి వాడల్లోని ప్రజానీకంలో తగిన చైతన్యం రాకపోవడంతో ఓ రోగి నుంచి మరొకరికి ఈగల ద్వారా రాటావైరస్ క్రిమి వ్యాపిస్తుంది. వాటి ద్వారా ఆహార పదార్థాలు కలుషితమై డయేరియాకు దారి తీస్తాయి. ప్రధానంగా ఐదేళ్ల లోపు చిన్నారులు డయేరియా పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఫీవర్కు పెరుగుతున్న డయేరియా కేసులు.. నల్లకుంట ఫీవర్ ఆస్పత్రిలో డయేరియా కేసులు పెరుగుతున్నాయి. ఈ ఏడాది జనవరి నుంచి జూన్ 15వ తేదీ వరకు 1,034 కేసులు నమోదయ్యాయి. ఇదీ చదవండి : Today tip : ఒళ్లంత తుళ్లింత.. ఈ టిప్స్ తప్పవు మరి!నీటి కాలుష్యం ద్వారానే అధికం.. వర్షాలు కురుస్తుండంతో చిన్నపిల్లలు, వృద్దులు వ్యాధుల బారిపడుతున్నారు. డయేరియా వ్యాధి ఎక్కువగా నీటి కలుíÙతం ద్వారానే వస్తుంది. ఈ వర్షాకాలంలో మంచినీటి వనరులు, రిజర్వాయర్లలో కలుషిత నీరు చేరి, కుళాయిల ద్వారా అవే రావడం వల్ల డయేరియా వచ్చే అవకాశాలు ఎక్కువ. మంచినీటి పైపులు లీక్ అయినప్పుడు అందులో మురికినీరు కలిసి ఆ నీటిని తాగడం వల్ల ఈ వ్యాధి వస్తుంది. 80 శాతం డయేరియాకు కలుషిత నీరే కారణమని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇక మిగిలిన 20 శాతం కలుషిత ఆహారం వల్ల వస్తుంది. నగరంలో చాలా వరకు ఈ వర్షాకాలంలోనే డయేరియాకు గురవుతున్నట్లు తెలుస్తోంది.ఇదీ చదవండి: ట్విన్స్కు జన్మనివ్వబోతున్నా.. నా బిడ్డలకు తండ్రి లేడు : నటి భావోద్వేగ పోస్ట్వ్యాధి లక్షణాలు... తరుచూ వాంతులు,విరేచనాలు కావడం. నాలుక పిడచ కట్టుకుపోవడం, కళ్లు లోపలికి పోవడం. చర్మం సాగే గుణం కోల్పోవడం. రక్తపోటు పడిపోయి అపస్మారక స్థితిలోకి పోవడం.నిర్లక్ష్యం వద్దు... వర్షాకాలంలో డయేరియా వ్యాధిపట్ల ఎలాంటి నిర్లక్ష్యం వద్దు. చిన్నారుల్లో ఈ వ్యాధి లక్షణాలను గుర్తిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి. లేదంటే తీవ్ర అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. ఆహార నియమాలు, చిన్నపాటి జాగ్రత్తలతో వ్యాధిని నియంత్రించుకోవచ్చు. ఏడు సంవత్సరాలు పై బడిన వారికి ఫీవర్లో చికిత్సలు అందిస్తున్నాం. ఏడు సంవత్సరాల లోపు చిన్నారులను నీలోఫర్కు పంపిస్తాం. – డాక్టర్ జయలక్ష్మి, ఫీవర్ ఆస్పత్రి సీఎస్ ఆర్ఎంవో -
అవును ఒజెంపిక్ తీసుకున్నా.. తప్పేంటి? నటుడు రామ్కపూర్ ఆగ్రహం
ప్రముఖ టీవీ నటుడు బడే అచ్చే లగ్తే హై ఫేమ్ రామ్ కపూర్ (Ram Kapoor) అనూహ్యంగా బరువు తగ్గి అభిమానులను ఆశ్చర్యపర్చాడు. ఏకంగా 55 కిలోల బరువు తగ్గి నెట్టింట తెగ హల్చల్ చేశాడు. దీంతో ఓజెంపిక్ , మౌంజారో ( Ozempic and Mounjaro)వంటి మందులు వాడి ఉంటాడనే చర్చ మొదలైంది. తాజాగా దీనిపై రామ్ సంచలన ప్రకటన చేశాడు. బరువు తగ్గడానికి ఓజెంపిక్ వాడితే తప్పేంటి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. బరువు తగ్గిన తీరును బట్టి, వారిని జడ్జ్ చేయొద్దని కోరాడు.అంతేకాదు ఎవరైనా డ్రగ్స్ వాడితే జనానికేంటి బాధ అని వ్యాఖ్యానించాడు. ‘‘అవును ఓజెంపిక్ ,మౌంజారో డ్రగ్స్ తీసుకున్నాను. అయితే తప్పేంటి? దయచేసి ఎ వరైనా సమాధానం చెప్పండి? దీనికెవరు సమాధానం చెప్పరే..ఎవరైనా ఒజెంపిక్ తీసుకుంటే అందులో తప్పేంటి? ఆ మనిషి చేసిన నేరం ఏంటి? దీనికి ఎవరూ సమాధానం చెప్పలేరు ఎందుకంటే, అసలు సమాధానమే లేదు.’’ అంటూ ఒక ఇంటర్య్వూలో చెప్పుకొచ్చాడు.బరువు తగ్గడానికి తాను చాలా కష్టపడ్డానని, తన వైద్యుడు మౌంజారో వాడమని ఎందుకుచెప్పాడో రామ్ కపూర్ వెల్లడించాడు. బరువు తగ్గడానికి శారీరక శిక్షణపై దృష్టి పెట్టినట్టు తెలిపాడు. అప్పట్లో ఆయన 140 కిలోల భారీ బరువతో అత్యంత అనారోగ్యకరమైన స్థితితోపాటు చక్కెర అదుపులో ఉండేది కాదు, దీంతో రోజుకు మూడు సార్లు ఇన్సులిన్ తీసుకునేవాడినని గుర్తు చేసుకున్నాడు. ఇదీ చదవండి: జిమ్కు వెళ్లకుండానే 30 కిలోలు తగ్గిందిమరోపక్క పని ఒత్తిడి, రెస్ట్ లేదు దీంతో ఇంత వర్క్ చేస్తూ, అనారోగ్యంగా ఉంటే డయాబెటిక్ స్ట్రోక్ రావచ్చు, తక్షణమే బరువు తగ్గించుకోవాలని డాక్టర్ సూచించారు అయితే ఇంకా రెండు ప్రాజెక్టులు పూర్తి చేయాల్సిన ఉన్ననేపథ్యంలో మరో ఆరు-ఎనిమిది నెలల తర్వాత చూద్దామని చెప్పాను.కానీ డాక్టర్ ససేమిరా అన్నారు. కచ్చితంగా ఇపుడే ఏదైనా మొదలు పెట్టాలని హెచ్చరించారు. మూడు నుండి నాలుగు నెలలు తీసుకోమని కూడా చెప్పారు. కానీ మొదట్లో తన డాక్టర్ మాట వినాలని అనుకున్నా, కానీ తర్వాత భుజం ప్రమాదం, శస్త్రచికిత్స కారణంగా, వెయిట్ లాస్ ఎక్స్ర్సైజులు, బాడీబిల్డింగ్ పై దృష్టి పెట్టానని తెలిపాడు. అయితే ఓజెంపిక్ తీసుకోవద్దని, కావాలంటే మోంజరో తీసుకోవచ్చని సూచించాడు.కాగా ఓజెంపిక్ అనేది వాస్తవానికి మధుమేహం చికిత్సకు ఉపయోగించే ఔషధం. కానీ ఇపుడు దీర్ఘకాలికంగా ఊబకాయంతో తీవ్రంగా బాధపడే వారికి కూడా ఉపయోగపడుతోంది. అనేక మంద్రి సెలబ్రిటీలతోపాటు దీనిని ఆశ్రయిస్తున్నారనే అంచనాలు భారీగానే ఉన్నాయి. సెమాగ్లుటైడ్ (ఒజెంపిక్ ప్రాథమిక భాగం) దీర్ఘకాలిక బరువు నిర్వహణకు ఉపయోగపడుతుందంటున్నారు వైద్య నిపుణులు.ఓజెంపిక్ (GLP-1 డ్రగ్స్) ఆకలిని తగ్గించి, క్రమంగా బరువు తగ్గడానికి దారితీస్తుంది.సెమాగ్లుటైడ్ ప్యాంక్రియాస్ ఇన్సులిన్ను ఉత్పత్తిలో కూడా సహాయపడుతుంది.ఇది టైప్ 2 డయాబెటిస్ను నిర్వహించడంలో సహాయపడుతుంది. మనం తినే ఆహారం నుండి గ్లూకోజ్ (లేదా రక్తంలో చక్కెర)ను మన కణాలలోకి రవాణా చేయడానికి బాడీకి ఇన్సులిన్ అవసరం.దీనిని శక్తిగా ఉపయోగించుకోవడానికి వీలు కల్పిస్తుంది.అయితే జాగ్రత్త వైద్యుల పర్యవేక్షణ అవసరమని, ఓజెంపిక్ వంటి డ్రగ్స్కారణంగా, వికారం, వాంతులు, విరేచనాలు , తదితర సమస్యలతో సహా దుష్ప్రభావాలను కలిగిస్తాయని హెచ్చరిస్తున్నారు. -
అరుదైన వ్యాధికి ఎక్మో చికిత్స: 11 నెలల చిన్నారిని కాపాడిన అంకుర వైద్యులు
హైదరాబాద్: అంకుర ఆసుపత్రి కూకట్పల్లిలో ECMO (ఎక్స్ట్రాకార్పోరియల్ మెంబ్రేన్ ఆక్సిజనేషన్) ఉపయోగించి అరుదైన వైరల్ మయోకార్డిటిస్తో బాధపడుతున్న శిశువు ప్రాణాలను కాపాడారు. ఈ టెక్నాలజీ ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులకు కృత్రిమ గుండె , ఊపిరితిత్తులా పనిచేస్తుంది 11 నెలల చిన్నారి గజర్ల మోక్షిత్ తీవ్రమైన ఫుల్మినెంట్ వైరల్ మయోకార్డిటిస్ (గుండె తీవ్రమైన వాపు) తో బాధపడుతున్నాడు. సకాలంలో జోక్యం చేసుకొని ఆసుపత్రి బృందం ఎక్మో చికిత్స అందించి, బాలుడిని ప్రాణాపాయం నుంచి కాపాడారు.జలుబు, దగ్గు ,యు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందితో జూన్ 2న స్థానిక ఆసుపత్రిలో మోక్షిత్ ఆసుపత్రిలో చేరాడు. అతని పరిస్థితి తీవ్రంగా ఉండటంతో రెండు ఆసుపత్రిలు అతనికి చికిత్స చేసేందుకు నిరాకరించారు.కానీకూకట్పల్లిలోని అంకుర ఆసుపత్రి నిపుణులు తక్షణమే స్పందించి సరియైన చికిత్స అందించారని ఆసుపత్రి వర్గాలు ప్రకటించాయి."పదకొండు నెలల వయసున్న ఆ శిశువు బర్త్ వైయిటట్ బరువు 3 కిలోగ్రాములు ఉన్నాడని, పుట్టుకతో వచ్చేఅసాధారణ జబ్బులేవీ లేనప్పటికీ,గత కొన్ని రోజులుగా, ఆ బిడ్డ తీవ్రమైన లక్షణాలతో కనిపించాయనీ కూకట్పల్లిలోని అంకురా హాస్పిటల్లోని సీనియర్ పీడియాట్రిక్ ఇంటెన్సివిస్ట్ డాక్టర్ తంజిలా తెలిపారు. అయితే సీనియర్ పీడియాట్రిక్ ఇంటెన్సివిస్ట్లైన డాక్టర్ సుజిత్ టి,,డాక్టర్ నవీద్ తో కూడిన క్రిటికల్ కేర్ బృందం సాయంతో సకాలంలో సరియైన చికిత్స అందించామన్నారు.ఎక్స్ట్రాకార్పోరియల్ మెంబ్రేన్ ఆక్సిజనేషన్ అనేది రోగి ప్రాణాపాయం క్రమంలో కృత్రిమ గుండె ,ఊపిరితిత్తులుగా పనిచేస్తుంది. ఈ అవయవాలు తీవ్రంగా దెబ్బతిన్నప్పుడు రోగి శరీరం విశ్రాంతి తీసుకోవడానికి , నయం కావడానికి వీలు కల్పిస్తుందని ఈ ప్రక్రియను విజయవంతంగా నిర్వహించిన కార్డియోథొరాసిక్ సర్జన్ డాక్టర్ థామస్ మాథ్యూ వివరించారు. శిశువు ఐదు రోజులు ECMO సపోర్ట్పైనే ఉన్నట్టు వెల్లడించారు. దీనికి తోడు COVID-19 పాజిటివ్, కాళ్ళ సిరల్లో రక్తం గడ్డకట్టడంలాంటి పరిస్థితిని కూడా అంకురా ఆసుపత్రిలోని వైద్య బృందం చాకచక్యంగా వ్యవహరించిన వైద్య బృందం IVIG, స్టెరాయిడ్స్, యాంటీబయాటిక్స్, యాంటీఅర్రిథమిక్ మందులు , యాంటీకోగ్యులెంట్లు, పలు సార్లు రక్తమార్పిడి లాంటి చికిత్సఅను అందించింది. ఫలితంగా మోక్షిత్ గుండె పనితీరు క్రమంగా మెరుగుపడింది . ECMO ,మెకానికల్ వెంటిలేషన్ నుండి విజయవంగా బయటపడ్డాడు. జూన్ 19న అతను డిశ్చార్జ్ అయ్యాడని అంకురం యాజమాన్యం వెల్లడించింది. -
వాకింగూ కాదు, రన్నింగూ కాదు అరవైలో ఇరవైలా ఫిట్గా : ఇవిగో టిప్స్
సాక్షి, హైదరాబాద్: వయసు పెరిగే కొద్దీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే అధిక శాతం మంది నడక లేదా స్వల్ప శరీర వ్యాయామమే సరిపోతుందనుకుంటారు. అయితే.. తాజాగా హార్వర్డ్ మెడికల్ స్కూల్ అధ్య యనం ప్రకారం చూస్తే.. వయసు పైబడినవారు ఆరో గ్యంగా, ఉల్లాసంగా ఉండాలంటే కేవలం నడక సరిపో దని.. మొత్తంగా వారి ఆలోచనల్లో మార్పు రావడానికి శారీరకంగా చైతన్యంగా ఉండేందుకు కదలికలు అవసరమని వెల్లడైంది. ఈ ప్రయోగంలో శరీరానికి మాత్రమే కాక, మనసుకు కూడా ఉత్తేజం కలిగించే వ్యాయామాల ప్రాధాన్యాన్ని వివరించారు. తై చీ, ఐకిడో, వింగ్ చున్.. వంటి మార్షల్ ఆర్ట్స్ పద్ధతులు వృద్ధుల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని ఈ అధ్యయ నంలో పేర్కొన్నారు.ఏమిటీ అధ్యయనం..?హార్వర్డ్ మెడికల్ స్కూల్కు చెందిన డాక్టర్ పీటర్ ఎం.వె యిన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పరిశీలనలో తై చీ వంటి నెమ్మదిగా, స్వల్ప కదలి కలతో సాగే మార్షల్ ఆర్ట్స్ మనుషుల శరీరంలో ‘ఫిజి యొలాజికల్ కాంప్లెక్సిటీ’ ను పెంచుతాయని వెల్లడైంది. అంటే.. వృద్ధాప్యంలో ఎదురయ్యే అడ్డంకులకు మెరుగ్గా స్పందించే సామర్థ్యం శరీరానికి పెరుగుతుందని తేలింది.ఇవి కేవలం శారీరక ఆరోగ్య ప్రయోజనాలు మాత్రమే కాక, జీవన నాణ్యత మెరుగుదలకు తోడ్పడుతున్నట్టు స్పష్ట మైంది. ఇప్పటిదాకా మన దగ్గర పెద్దల ఆరోగ్యంపై దృష్టి చికిత్సాపరంగా ఉండేది. కానీ తాజా అధ్యయనం సూచిస్తున్న మార్గం ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు, పునరావాస కేంద్రాలు, సామాజిక కార్యక్రమాల రూపంలో మార్షల్ ఆర్ట్స్ వంటి చురుకైన లేదా మృదువైన కదలికలతో కూడిన వ్యాయామాలను ప్రవే శపెట్టాల్సిన అవసరం ఉందని స్పష్టం చేస్తోంది.నడకతో పోలిస్తే ?నడక.. కేవలం కాలి కదలికలతో పరిమితమైన వ్యాయామం. తైచీ.. శరీరం, శ్వాస, మేధస్సు.. మూడింటినీ ఒకే సమయంలో సమతుల్యంగా ఉత్తేజపరిచే ప్రక్రియ. వృద్ధులకు.. మరీ ముఖ్యంగా 60 ఏళ్లు దాటిన వారికి సులభ, స్వల్ప తరహా మార్షల్ ఆర్ట్స్ ఎంతో ఉపయోగపడతాయి.ఇది వృద్ధుల్లో.. తూలిపడిపోవడం వంటి వాటిని తగ్గిస్తుందినిద్ర నాణ్యత మెరుగవుతుందిమానసిక స్థైర్యం పెరుగుతుందితెలుగు రాష్ట్రాల్లో వృద్ధుల పరిస్థితి మార్పు ఆవశ్యకత..తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వృద్ధుల జనాభా అనేది 13 శాతానికి పైగా ఉందని 2011 జనగణన ద్వారా వెల్లడైంది. 2036 నాటికి ఇది 20 శాతం దాటే అవకాశం ఉంది. ఈ వయోధిక వర్గానికి సరిపడే ఆరోగ్య విధానాలు, శారీరక దృఢత్వం కలిగించే వ్యాయామాలను అందుబాటులోకి తేవడం అత్యవసరం.వృద్ధులకు ఎలాంటి మార్షల్ ఆర్ట్స్ తగినవి.. ఉపయోగాలు..తై చీ: నెమ్మదిగా జరిగే ప్రవాహ రూప కదలికలు, శ్వాస నియంత్రణ, శరీర సమతుల్యత, మానసిక ప్రశాంతతఐకిడో: శక్తిని మళ్లించే శక్తివంతమైన కాన్సెప్ట్, కణజాలానికి మెరుగైన కదలికలువింగ్ చున్: ఓ మోస్తరు క్లిష్టమైన కదలికలు, మెరుగైన ప్రతిస్పందన సామర్థ్యం, స్వీయ రక్షణఇదీ చదవండి: జిమ్కు వెళ్లకుండానే 30 కిలోలు తగ్గిందివృద్ధాప్యం ఓ ప్రతిబంధకం కాదు. అది మనం కొత్త విషయాలు నేర్చుకోవాలనే సంకల్పానికి తెరలేపే అవకాశంగా భావించాల్సి ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. ఈ అంశంపై వృద్ధుల్లోనే కాకుండా అందరి ఆలోచనా ధోరణిలోనూ మార్పు వచ్చి అవగాహన పెరిగితే సమాజానికి మంచి ప్రయోజనా లు చేకూరుతాయని స్పష్టం చేస్తున్నా రు. వృద్ధుల్లో ఆరోగ్యకరమైన వాతావరణం ఏర్పడడంతో పాటు.. 60 ఏళ్ల తర్వాత జీవితానికి సంబంధించి కచ్చితమైన అవగాహన, చైతన్యం ఏర్పడతాయని వారు పేర్కొంటున్నారు.చదవండి: 300కు పైగా రైతులకు సాధికారత : తొలి ఏడాదిలోనే రూ. 8.7 కోట్లు -
జిమ్కు వెళ్లకుండానే 30 కిలోలు తగ్గింది
అధిక బరువుకు కారణాలనేకం. జీవన శైలి, ఆహార అలవాట్లు, కొన్ని రకాల అనారోగ్య సమస్యలతో చాలా మంది అధిక బరువుతో బాధపడుతూ ఉంటారు. అయితే ‘‘చిన్నప్పటినుంచీ నేనింతే’’ అని కొంతమంది సరిపెట్టుకుంటే, మరికొంతమంది మాత్రం భిన్నంగా ఉంటారు. అధిక బరువుతో వచ్చే అనారోగ్య సమస్యల కారణంగా అయితేనే నేమి, అందంగా ఆరోగ్యంగా ఉండాలనే కోరికతోనేమి కష్టపడి శరీర బరువును తగ్గించు కుంటారు. అలా జిమ్ కెళ్లకుండానే 95 కిలోల వెయిట్ నుంచి 65 కిలోలకు చేరుకుందో యవతి. అదెలాగో తెలుసుకుందాం.ఇది ఉదితా అగర్వాల్ వెయిట్ లాస్ జర్నీ. బరువు తగ్గడం అనేది కష్టమైన ప్రయాణం. ముఖ్యంగా ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటూ బరువు తగ్గాల్సి వస్తే ఇంకా కష్టం. అందుకే కారణాలను విశ్లేషించుకుని నిపుణుల సలహాతో ముందుకు సాగాలి. అలా సర్టిఫైడ్ న్యూట్రిషనిస్ట్ అయిన ఉదితా అగర్వాల్ కేవలం ఫిట్నెస్ కోసం మాత్రమే కాకుండా తన ఆరోగ్యాన్ని మెరుగుపరచు కోవడానికి కూడా బరువు తగ్గాలని నిర్ణయించుకుంది. అద్బుతమైన విజయాన్ని సాధించింది.ఇదీ చదవండి: 300కు పైగా రైతులకు సాధికారత : తొలి ఏడాదిలోనే రూ. 8.7 కోట్లుఉదితా చిన్నప్పటి నుంచి ఊబకాయంతో బాధపడేది. దీనికి తోడు పిగ్మెంటేషన్, తీవ్రమైన ఆరోగ్య సమస్యలు, విపరీతంగా జుట్టు రాలిపోవడం, మొటిమలు, ముఖం మీద అన్వాంటెడ్ హెయిర్ ఇలా సవాలక్ష సమస్యలతో సతమతమయ్యేది. ఆరోగ్యకరమైన ఆహారం, జీవనశైలికి మారడం ద్వారా 8 నెలల్లో 30 కిలోల బరువు తగ్గింది. అదీ జిమ్కు వెళ్లకుండానే 95 కిలోల బరువున్న ఉదితా 65 కిలోలకు చేరుకుంది. ఆరోగ్యం కూడా మెరుగుపడింది. View this post on Instagram A post shared by Udita Agarwal (@udita_agarwal20) తన వెయిట్ లాస్ జర్నీ గురించి సోషల్ మీడియాలో పంచుకోవడంతో వైరల్గా మారింది. శుభ్రమైన ఆహారాలు తినడం ద్వారా ఆమె సహజంగానే 30 కిలోల బరువు తగ్గింది. ముఖ్యంగా "బరువు తగ్గడంలో జంక్ ఫుడ్ను మానేయడమే అది పెద్ద చాలెంజ్’’ అని ఆమె చెప్పుకొచ్చింది.చదవండి: చిన్నతనం నుంచే ఇంత పిచ్చా, పట్టించుకోకపోతే ముప్పే : ఆర్టీసీ ఎండీ సజ్జనార్ఉదిత వెయిట్ లాస్లో సాయపడిన అలవాట్లుడీటాక్స్ వాటర్: ప్రతిరోజూ డీటాక్స్ వాటర్ తీసుకునేది. ముఖ్యంగా జీరా, అజ్వైన్, సోంపు, మెంతిని నీటిలో మరిగించి తాగేది. ఇది ఉబ్బరాన్ని నివారించి జీర్ణక్రియకు సహాయపడుతుంది.ఆహారంపై దృష్టి: అప్పుడప్పుడు చీట్ మీల్ తీసుకున్నా.. ఆరోగ్యకరమైన ఆహార నియమాన్ని కచ్చితంగా పాటించేది.ఒక్కోసారి వెయిట్ పెరిగినా నిరాశపడలేదు: ప్రతీ రోజు వెయిట్ చెక్ చేసుకుంటూ ఉండేది. ఒకసారి బరువు పెరిగినా నిరుత్సాహ పడేది కాదు,అసలు ఆ హెచ్చుతగ్గులను పట్టించుకోలేదు.ఇంటి ఫుడ్: ఇంట్లో ఉన్నా, బయటికెళ్లినా, ఇంట్లో వండిన ఆహారాన్ని మాత్రమే తినేది. చియా సీడ్ వాటర్: చియా విత్తనాలను అర లీటరు నీటి నాన బెట్టి రోజుకు 3-4 లీటర్ల చొప్పున రోజంతా తాగేది. రోజుకు ఒకసారి టీ, మైదా ఫుడ్కు దూరంగా ఉంటూ అతిగా తినకుండా ఉండటానికి ఉదిత ప్రతి భోజనానికి ముందు నీరు త్రాగేది. -
మెడనొప్పి 'పీకల' మీదకు...
మెడనొప్పి అనే సమస్య జీవితకాలంలో ప్రతి వ్యక్తీ ఏదో ఓ సందర్భంలో ఎదుర్కొనేదే. అయితే అదేపనిగా నొప్పి వస్తుంటేనో లేదా మెడ నుంచి అది భుజానికీ లేదా చేతుల చివరలకో పాకుతుంటే మాత్రం కొన్ని అంశాలను జాగ్రత్తగా గమనించాలి. మెడనొప్పికి కారణాలు, నివారణ, చికిత్స వంటి అంశాలను తెలుసుకుందాం. తీవ్రమైన మెడనొప్పి కారణంగా కొన్నిసార్లు కొంతమందిలో నొప్పి ఎక్కువైన కొద్దీ నరాల మీద ఒత్తిడి పెరిగి మూత్రవిసర్జనలో సైతం తేడాలు వచ్చి ఇతర సమస్యలకూ దారితీయవచ్చు. అందుకే ఎప్పుడో ఓసారి వచ్చే నొప్పిని మినహాయించి, పదే పదే నొప్పి వస్తున్నా లేదా దీర్ఘకాలంగా బాధిస్తున్నా డాక్టర్ను సంప్రదించాల్సి ఉంటుంది.ఎందుకీ మెడనొప్పి... మెడ భాగంలో ఉండే వెన్నెముకలో ఏడు వెన్నుపూసలు ఉంటాయి. వాటిలో మొదటిదాన్ని అట్లాస్ అనీ, రెండో వెన్నుపూసను యాక్సిస్ అంటారు. ఈ తర్వాత ఉండే పూసలను వరసగా సి3, సి4, సి5, సి6, సి7 అని పిలుస్తారు. ఈ వెన్నుపూసల మధ్య ఉండే ప్రదేశాన్ని స్పైనల్ కెనాల్ అంటారు. దానిలోంచి వెన్నుపాము వెళ్తూ మెదడు నుంచి చేతులు, కాళ్ల చివరి వరకు నరాలను తీసుకెళ్తుంది. వెన్నుపూసకూ, వెన్నుపూసకూ మధ్యనున్న ‘వర్టిబ్రల్ ఫొరామినా’ అనే రంధ్రాల నుంచి వెన్నుపాము తాలూకు నరాలు బయటకు వచ్చి అన్ని అవయవాలకూ వ్యాపించి ఉంటాయి. ఈ వెన్నుపూసల మధ్యన కుషన్లా, షాక్ అబ్జార్బర్లా డిస్క్లు ఉంటాయి. ఒక్కోసారి వెన్నుపూసల మధ్య కుషన్లా ఉండే డిస్క్లు పక్కకు జారడం వల్లనో లేదా బాగా అరగడంతో నరాలపై (ప్రధానంగా చేతులకి సప్లై అయ్యే నరాలపై) ఒత్తిడి పడి మెడనొప్పి వస్తుంటుంది. మెడదగ్గర ఉండే నరాలు భుజం వరకు ఉండటంతో ఈ నొప్పి మెడ నుంచి భుజం మీదుగా చేతుల వరకు పాకుతూ బాధిస్తుంటుంది.నిర్ధారణ ఇలా... మెడనొప్పి వచ్చే వారికి తొలుత ఎక్స్–రే పరీక్ష చేయిస్తారు. ఇందులో మెడ వెన్నుపూసలలో ఏమైనా తేడాలు వచ్చాయా అని తెలుస్తుంది. మరింత సునిశితమైన అంశాల కోసం ఎమ్మారై కూడా చేయించాల్సి రావచ్చు. ఏ నరంపై ఎంత ఒత్తిడి ఉంది, దేనివల్ల కలుగుతోంది, ఎముక ఏదైనా ఫ్రాక్చరైందా, నరాల్లో వాపు, గడ్డలు ఉన్నాయా... లాంటి అనేక విషయాలు ఎమ్మారైలో తెలుస్తాయి. ఉపశమనం కోసం... మెడ నొప్పి వచ్చినప్పుడు వేడి నీళ్లలో మెత్తటి గుడ్డను ముంచి, పిండి మెడపైన కాపడం పెట్టాలి. ఐస్ ముక్కను బట్టలో చుట్టి కాపడం పెట్టడం కూడా మంచిదే. ఈ కాపడాల వల్ల నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. మెడ కండరాల్లో నొప్పి ఉన్నప్పుడు తప్పనిసరిగా మెడకు విశ్రాంతి ఇవ్వాలి. ఎందుకంటే ఆ సమయంలో మెడ కండరాలు బిగుసుకుపోయి ఉంటాయి. అలా విశ్రాంతి ఇవ్వకపోతే నొప్పి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంది. నొప్పి ఉన్న సమయంలోనే గాక... మామూలు వేళల్లోనూ ఒకే భుజానికి బరువైన బ్యాగ్ల వంటివి తగిలించుకోకూడదు. ఇలా చేయడం వల్ల మెడ కండరాలు, నరాలపై ఒత్తిడి పెరిగి నొప్పి వస్తుంది. నడిచే సమయంలో ఒకేవైపునకు ఒంగడం సరికాదు. చికిత్స...సాధారణ మెడనొప్పి అయితే పెయిన్కిల్లర్ ఆయింట్మెంట్లను రోజుకి ఐదు నుంచి ఆరుసార్లు పూయాలి.నొప్పి నివారణ కోసం దీర్ఘకాలం పెయిన్కిల్లర్స్ ఉపయోగించడం సరికాదు. ఒకవేళ పెయిన్కిల్లర్స్తో ఒకటి రెండు రోజుల్లో రిలీఫ్ రాకపోతే తప్పనిసరిగా డాక్టర్ను / ఆర్థోపెడిక్ సర్జన్ను సంప్రదించి చికిత్స తీసుకోవాలి.డిస్క్ తన స్థానం నుంచి పక్కకు జరగడం లాంటిది జరిగితే శస్త్రచికిత్సతో సరిదిద్దాల్సిన అవసరం పడవచ్చు. డాక్టర్ రవితేజా రెడ్డి, కారుమూరి, సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్ (చదవండి: హీరో సల్మాన్ఖాన్ సైతం విలవిలలాడిన సమస్య..! ఏంటి ట్రెజెమినల్ న్యూరాల్జియా..) -
డైట్లో తగ్గిన తృణధాన్యాలు
న్యూఢిల్లీ: ప్రజల ఆహార అలవాట్లలో గణనీయంగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. 2023–24లో గ్రామీణ, పట్టణ ప్రాంతాల వారు రోజువారీ తీసుకునే ఆహారంలో తృణధాన్యాలు, పప్పు ధాన్యాల వాటా తగ్గిపోయింది. అదే సమయంలో పాలు, పాల ఉత్పత్తుల వినియోగం పెరిగింది. కుటుంబాల వినియోగ వ్యయాలపై నిర్వహించిన సర్వే నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. 2022 ఆగస్టు – 2023 జూలై, 2023 ఆగస్టు – 2024 జూలై మధ్య కాలంలో ఈ సర్వే నిర్వహించారు. దీని ప్రకారం, పట్టణ ప్రాంతాల్లో గుడ్లు, చేపలు, మాంసం వినియోగంలో పెద్దగా మార్పు లేనప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం పెరిగింది. 2022–23లో పట్టణ ప్రాంతాల్లో ఆహారంలో తృణ ధాన్యాల వాటా 38.8 శాతంగా ఉండగా 2023–24లో 38.7 శాతానికి స్వల్పంగా తగ్గింది. గ్రామీణ భారతంలో ఇది 46.9 శాతం నుంచి 45.9 శాతానికి క్షీణించింది. అలాగే పప్పు ధాన్యాల విషయానికొస్తే పట్టణ ప్రాంతాల్లో వినియోగం 9.6 శాతం నుంచి 9.1 శాతానికి, గ్రామీణ ప్రాంతాల్లో 8.8 శాతం నుంచి 8.7 శాతానికి నెమ్మదించింది. → మరోవైపు, పట్టణ ప్రాంతాల ప్రజల ఆహారంలో పాలు, పాల ఉత్పత్తుల వినియోగం 12.8 శాతం నుంచి 12.9 శాతానికి, గ్రామీణ ప్రాంతాల్లో 10.6 శాతం నుంచి 11 శాతానికి పెరిగింది. → డైట్లో గుడ్లు, చేపలు, మాంసం వాటా గ్రామీణ ప్రాంతాల్లో 12.3 శాతం నుంచి 12.4 శాతానికి పెరగ్గా, పట్టణ ప్రాంతాల్లో ఎలాంటి మార్పు లేకుండా 14.1 శాతం స్థాయిలోనే ఉంది. → గ్రామీణ ప్రాంతాల్లో ‘ఇతర ఆహార’ పదార్థాల వాటా 21.4 శాతం నుంచి 22 శాతానికి, పట్టణ ప్రాంతాల్లో 24.8 శాతం నుంచి 25.3 శాతానికి పెరిగింది. → గ్రామాల్లో రోజుకు తలసరి కేలరీల సగటు వినియోగం, సర్వే నిర్వహించిన రెండేళ్లలో వరుసగా 2233 కిలోకేలరీలుగా, 2212 కిలోకేలరీలుగా ఉంది. పట్టణ ప్రాంతాల్లో ఇది 2250 కిలోకేలరీలు, 2240 కిలోకేలరీలుగా నమోదైంది. → నెలవారీగా తలసరి వినియోగ వ్యయం (ఎంపీసీఈ) పెరిగే కొద్దీ ప్రాంతాలకతీతంగా సగటు కేలరీల వినియోగం కూడా పెరిగింది. -
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వర్క్ లైఫ్ బ్యాలెన్స్ పాఠాలు..!
మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉదయం నుంచి పలు ముఖ్యమంత్రులను, అధికారులను కలుస్తూ అత్యంత బిజీగా ఉంటారామె. హోదా రీత్యా అత్యంత బిజీ బిజీ పనులతో సాగుతుంటుంది ఆమె జీవితం. అంతటి ఉరుకుల పరుగుల జీవితంలో కూడా ఆమె చాలా చక్కటి జీవనశైలిని అవలంభిస్తారామె. క్రమశిక్షణాయుత జీవనశైలికి కేరాఫ్ అడ్రస్ ఆమె. మరి అంతలా ఫిట్నెస్కి ప్రాధాన్యత ఇచ్చే ద్రౌపది ముర్ము తన రోజుని ఏవిధంగా ప్రారంభిస్తారో తెలుసుకుందామా.. ఢిల్లీలోని ప్రాంతాలన్ని ఉయాన్ని రణగణ ధ్వనులతో బిజిబిజీగా ప్రారంభమవ్వగా ద్రౌపది ముర్ము రోజు ఉదయం ఆరుతో ప్రారంభమవుతుంది. ఆమె ఉదయం మేల్కొన్న వెంటనే రాష్ట్రపతి భవన్ కాంప్లెక్స్లో ఉండే అమృత ఉద్యాన్ అనే పచ్చటి తోటలో వాకింగ్కు వెళ్తారు. అక్కడ మంచుగడ్డిపై నడుస్తూ..చుట్టు ఉన్న పచ్చదనాన్ని ఆస్వాదిస్తూ కాసేపు అలా కలియదిరుగుతారు. ఆ తర్వాత ఓ రెండు గంటపాలు ధ్యాన సెషన్ ఉంటుంది. తనలోకి తాను అవలోకనం చేసుకునే ఈ ధ్యాన ప్రక్రియలో ఆ రోజు తాను నిర్వర్తించాల్సిన బాధ్యతలకు తనను తాను సిద్ధం చేసుకుంటారామె. నిపుణుల సైతం ధ్యాన ప్రక్రియ వల్ల బాధ్యతలను చురుకైన మేధాస్సుతో వేగవంతంగా చక్కబెట్టగలరని చెప్పడమే గాక పరిశోధనల్లో కూడా వెల్లడైంది. అందుకే ప్రధాని మోదీ సైతం ప్రజలకు విజ్ఞిప్తి చేసేది ఇదే. ధ్యాన నిమగ్నులమై మన పూర్వీకుల మాదిరి దీర్ఘాయువుని పొందుదాం అని సదా పిలుపునిస్తుంటారు. ఆ నేపథ్యంలోనే ధనవంతులు, సెలబ్రిటీలు ప్రముఖులు నుంచి అత్యున్నత హోదాల్లో పనిచేసే వారు వరకు అంతా ధ్యాన ప్రక్రియకే అగ్రతాంబులం ఇస్తున్నారు. ఇక ఆ తర్వాత ముర్ము ఆ 165 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ తోట మొత్తం కవర్ చేసేలా రెండు కిలోమీటర్లు వాకింగ్ చేస్తూ..అక్కడే ఉంటే నెమళ్లను పలకరించి సేద తీరతారు. ఆ తదుపరి భాద్యతల్లో నిమగ్నమయ్యేందుకు సన్నద్ధమవుతారు. ఆ తర్వాత ఆమె రాష్ట్రపతి భవన్లోని కారిడార్ల గుండా అధ్యక్ష భవనంలోకి ప్రవేశిస్తారు. అక్కడ పలు కీలకమైన జాతీయ పత్రాలపై సంతకం చేసి, ప్రముఖులను, రాష్ట్ర అతిథులను కలవడం వంటివి చేస్తారు. అక్కడే అతిథులతో కీలకమైన చర్చలు జరపడం, సమావేశమవ్వడం వంటి పనులు జరుగుతాయి. అయితే ఈ అధ్యక్ష భవనంలోకి ఐదుగురు వ్యక్తులకు మాత్రమే అనుమతి ఉంటుందట. ఎవరెవరంటే..ప్రధానమంత్రి, ఉపరాష్ట్రపతి, భారత ప్రధాన న్యాయమూర్తి, మాజీ అధ్యక్షులు, లోక్సభ స్పీకర్ తదితరులు. ఒక పక్క తన వ్యక్తిగత జీవితాన్ని, బాధ్యతలను క్రమశిక్షణాయుతంగా నిర్వర్తిస్తూ ప్రశాంత చిత్తంతో ఉంటారామె. అందుకు ఉపకరించేవి కాసింత వ్యక్తిగత విశ్రాంతి సమయమే ఆమెను శక్తిమంతంగా రీచార్జ్ చేసి కార్యోన్ముఖురాలిగా మారుస్తుంది. ఇది వర్క్ లైఫ్ బ్యాలెన్స్కి అసలైన అర్థం. పైగా సమతుల్యత తినే ఆహారంలోనే కాదు..మన జీవన విధానంలో కూడా అవసరమే అన్న సత్యాన్ని ఎలుగెత్తి చెబుతోంది కదూ..!. అంతేగాదు అత్యంత బిజీ అనే పదం ఉపయోగించే వారందరికీ ఇలాంటి మహోన్నత వ్యక్తుల దినచర్యే ఒక ప్రేరణ.(చదవండి: ఫ్యామిలీతో వెళ్లాలంటే బిజినెస్ క్లాస్ వద్దు..! వైరల్గా సీఈవో పోస్ట్..) -
వ్యాయామం తంటా లేకుండా ఆరోగ్యం!
ఆరోగ్యం.. కడుపులోని చల్ల కదలకుండా!ఊబకాయం తగ్గించుకునేందుకు..ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకూ..రకరకాల వ్యాయామాలు చేస్తున్న వారందరికీ ఓ గుడ్న్యూస్!ఈ తంటాలేవీ పడక్కరలేదు అంటున్నారు శాస్త్రవేత్తలు!ఎంచక్కా అప్పుడప్పుడూ ఓ మాత్ర వేసేసుకుంటే చాలని..వ్యాయామం చేస్తే వచ్చే లాభాలన్నీ వచ్చేస్తాయని చెబుతున్నారు!ఆ వివరాలేమిటో చూద్దామా?ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం.. అందుకు తగ్గట్టుగా తగిన వ్యాయామంతో శరీరాన్ని ఫిట్గా ఉంచుకోవడం.. ఈ ఆధునిక కాలంలో చాలామంది పాటించే సూత్రం. అయితే, కొంత మందికి వ్యాయామం ఎంత చేసినా.. ఎంతలా కడుపు కట్టుకున్నా ఒళ్లు తగ్గదు. ఆరోగ్య సమస్యలూ వీరిని పీడిస్తూంటాయి. ఇలాంటి వారికీ ఉపయోగపడే ఓ ప్రయోగాన్ని చేశారు చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ శాస్త్రవేత్తలు. బీట్రూట్, పాలకూర, గింజ ధాన్యాల్లో సహజంగా లభించే ఓ పదార్థం.. వ్యాయామం చేస్తే వచ్చే ఫలితాలను ఇస్తున్నట్లు గుర్తించారు. అంతేకాదు.. ఈ పదార్థం ద్వారా వయసుతోపాటు వచ్చే చాలా ఆరోగ్య సమస్యలను దూరంగా ఉంచవచ్చు అని తేలింది.శారీరక వ్యాయామం చేయకున్నా ఆ ఫలితాలన్నీ ఇచ్చే అద్భుతం కోసం శాస్త్రవేత్తలు ఒకవైపు పరిశోధనలు చేస్తూనే ఉండగా.. చైనా శాస్త్రవేత్తలు ఈ దిశగా ఒక అడుగు ముందుకు వేయగలిగారు. క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తున్న వారిని పరిశీలించగా.. మిగిలిన వారితో పోలిస్తే వీరిలో బెటనైన్ అనే పదార్థం ఎక్కువ మోతాదులో ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇది మూత్రపిండాల ద్వారా శరీరానికి అందుతుంటుంది. బెటనైన్ ఎలా ఉత్పత్తి అవుతుంది? ఎలా ఉపయోగపడుతుంది అని వివరంగా తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలు పరిశోధనలు ప్రారంభించారు.ఇందు కోసం కొంతమంది యువకులను ఎంచుకుని ఆరేళ్లపాటు పరిశీలించారు. వీరు రెండు రకాల వ్యాయామాలు చేసేవారు. కొందరు శారీరక దారుఢ్యానికి పరీక్ష పెట్టే ఎండ్యూరెన్స్ వ్యాయామాలు చేస్తుండగా.. మిగిలిన వారు ఎక్కువ శ్రమ ఉన్నవి చేస్తున్నారు. రెండింటివల్ల శరీరంలో ఎలాంటి మార్పులు వస్తున్నాయో గుర్తించాలన్నది దీని ఉద్దేశం. ఆశ్చర్యకరంగా శరీర కణాల వయసు పెరగకుండా చేయడంలో మూత్రపిండాలు కీలకపాత్ర పోషిస్తున్నట్లు తెలిసింది!. ఎండ్యూరెన్స్ వ్యాయామాలు చేసే వారిలో కణాల వార్ధక్యం, మంట/వాపు మిగిలిన వారికంటే తక్కువగా ఉన్నట్లు తెలిసింది. శారీరక శ్రమ ఎక్కువగా ఉన్న వ్యాయామాలు చేస్తున్న వారిలో కణాలు ఒత్తిడికి గురవుతున్నట్లు స్పష్టమైంది.ఎండ్యూరెన్స్ వ్యాయామం చేస్తున్న వారిపై మరిన్ని పరిశోధనలు చేయడం ద్వారా రోగ నిరోధక శక్తిని ప్రభావితం చేసే ఒక ప్రొటీన్ (ఈటీఎస్1) ఉత్పత్తి తగ్గినట్లు స్పష్టమైంది. అదే సమయంలో కిడ్నీల్లో బెటనైన్ తయారవడం ఎక్కువైంది. వయసు ఎక్కువగా ఉన్న వారు వ్యాయామం చేసిన తరువాత రక్తంలో బెటనైన్ ఎక్కువగా ఉన్నట్లు, ఈ పదార్థం కండరాల శక్తి, జీవక్రియలు, కణంలో చక్కెరలను శక్తిగా మార్చే మైటోకాండ్రియాల ఆరోగ్యం మెరుగైనట్లు తెలిసింది. దీంతో వ్యాయామంతో వచ్చే ప్రయోజనాల వెనుక బెటనైన్ ఉందని స్పష్టమైంది.ఎలుకలకు ఇచ్చి చూశారు..తమ అంచనాలను నిర్ధారించుకునేందుకు శాస్త్రవేత్తలు వయసు మళ్లిన ఎలుకలకు నిర్దిష్ట మోతాదుల్లో బెటనైన్ అందించారు. ఆ తరువాత పరిశీలించినప్పుడు వ్యాయామం చేస్తే వచ్చే లాభాలన్నీ వాటిల్లోనూ కనిపించాయి. అంటే కండరాలు గట్టిపడ్డాయి, ఎక్కువ కాలం శ్రమను ఓర్చుకోగలిగాయి. మంట/వాపు వంటివి తగ్గాయి అన్నమాట!. కణజాలం పునరుత్పత్తి కూడా వేగంగా జరుగుతున్నట్లు తెలిసింది. ‘వ్యాయామం చేయడం వల్ల ముందుగా శరీరంలో మంట/వాపు వస్తాయి. ఒత్తిడి కూడా పెరుగుతుంది. అలాగే కొనసాగిస్తే.. ఇవి తగ్గిపోతాయి. కిడ్నీ ద్వారా ఉత్పత్తి అయ్యే బెటనైన్ తగ్గిస్తుంది’ అని ఈ ప్రయోగాల్లో పాలుపంచుకున్న శాస్త్రవేత్త లియు గువాంగ్హూయి తెలిపారు. మొత్తమ్మీద విషయం ఏమిటంటే.. వ్యాయామం అప్పుడప్పుడు చేయడం కాకుండా.. క్రమం తప్పకుండా చేయాలి అని!!. అలాగే బెటనైన్ సమృద్ధిగా లభించే ఆహార పదార్థాలు తినడమూ శరీరానికి మేలు చేస్తుందన్నమాట!. లేదా.. మరిన్ని పరిశోధనల తరువాత బెటనైన్ సప్లిమెంట్లు మార్కెట్లోకి వచ్చినప్పుడు వాటిని రోజూ తీసుకోవచ్చు!!.- గిళియారు గోపాలకృష్ణ మయ్యా. -
రెండే రెండు టిప్స్: 120 కిలోల నుంచి స్మార్ట్ అండ్ స్లిమ్గా
తమిళ నటుడు విజయ్ సేతుపతి కుమారుడు సూర్య సేతుపతి హీరోగా ఎంట్రీ వచ్చి అరంగేట్రంలోనే మంచి మార్కులు కొట్టేశాడు. స్పోర్ట్స్ ఆధారిత యాక్షన్ డ్రామా ఫీనిక్స్లో సూర్య ప్రధాన పాత్రలో నటించి ఆకట్టుకున్నాడు. ఈ సందర్బంగా తన వెయిల్లాస్కు సంబంధించి ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు సూర్య. ‘ఫీనిక్స్’ సినిమా మొదలుకాకముందు నా బరువు దాదాపు 120 కిలోలు ఉండేవాడినని. ఈ బరువును తగ్గించుకోవడానికి నాకు ఒకటిన్నర సంవత్సరం పట్టిందట. మరి సూర్య వెయిట్లాస్ జర్నీ గురించి తెలుసుకుందాం.120 కిలోల బరువుతో బాధపడుతున్న సూర్య ఉన్నట్టుండి అంత బరువు ఎలా తగ్గాడు అనేది నెట్టింట ఆసక్తికరంగా మారింది. ‘ఫీనిక్స్’ సినిమా మొదలుకాకముందు తన బరువు దాదాపు 120 కిలోలు ఉండేదని గుర్తు చేసుకున్న సూర్య దాదాపు సగం బరువు తగ్గించుకోవడం విశేషం. ఇటీవల ఈ సినిమా ప్రమోషన్స్లో సూర్య ఫిట్నెస్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. చాలా కష్టపడి బరువు తగ్గానని తెలిపాడు. ఇందుకోసం తనకు ఒకటిన్నర సంవత్సరం పట్టిందన్నాడు. బరువు తగ్గే క్రమంలోనే మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ (MMA) నేర్చుకున్నానని, ఇదే సినిమాకు కూడా ప్రధానాంశం అని సూర్య వెల్లడించాడు.చదవండి: ఆరోగ్యానికి వెరీ ‘గుడ్డూ’.. ఎగ్స్ట్రా వెరైటీస్ ట్రై చేశారా?నుమ్ రౌడీ ధాన్లో తన తండ్రి చిన్నపటి వెర్షన్ను పోషించిన సూర్య ఫీనిక్స్లో తన ప్రధాన పాత్ర కోసం సిద్ధమయ్యేందుకు అనేక కసరత్తు చేశాడట. చాలా కఠినమైన శిక్షణ తీసుకున్నాడట. అలాగే తన ఆహార ప్రణాళికలలో కూడా కొన్ని మార్పులు చేసుకోవాల్సి వచ్చిందని, ఈ క్రమంలో మొదటి ఆరునెలలు, ఆయిల్, షుగర్ ఫుడ్స్కు పూర్తిగా దూరంగా ఉన్నానని, నిజంగా ఇది చాలా ఛాలెంజింగ్ పీరియడ్ అని చెప్పు కొచ్చాడు. మొత్తానికి హీరో అవ్వాలనే డ్రీమ్ను నెరవేర్చుకునేందుకు, స్లిమ్ అండ్ ట్రిమ్గా కనిపించేందుకు బరువు తగ్గాలని నిర్ణయించాడు. పట్టుదల, కఠినమైన శిక్షణతో చాలా ఓపిగ్గా తాను అనుకున్నది సాధించాడు.ఇదీ చదవండి: 7 నెలల్లో 35 కిలోలు..వాటికి దూరం: ఇదే నా సక్సెస్ అంటున్న నేహా -
Antidepressants మహిళలు సేఫే, బట్ పురుషులకే!
‘మనసున్న మనిషికి సుఖము లేదంతే..’ అన్నారు ఆచార్య ఆత్రేయ. సుఖం ఉండకపోగా, డిప్రెషన్లోకి వెళ్లిపోయే ప్రమాదమూఉండొచ్చు. ‘యాంటీడిప్రెసెంట్స్’లు వాడి ఆ డిప్రెషన్ నుంచి బయట పడొచ్చనుకోండీ.. అయితే వాటిని వాడితే మెదడుపై దీర్ఘకాల దుష్ప్రభావాలు ఉంటాయని శాస్త్ర పరిశోధకులు కనిపెట్టారు. ‘ఇందులో కొత్తేముందీ!’ అంటారా? ఉంది. యాంటీడిప్రెసెంట్లు వాడితే మెదడుపై పడే దుష్ప్రభావాలు మగవాళ్లలోనే కానీ, ఆడవాళ్లలో కాదట!మానసిక రుగ్మతలకు వైద్యులు సిఫారసు చేసే ‘యాంటీడిప్రెసెంట్’ ఔషధాలు దీర్ఘకాలంలో పురుషుల మెదడుపై దుష్ప్రభావాలు చూపే అవకాశాలు ఉండగా, మహిళల్లో అలాంటి ప్రభావం దాదాపు లేదని టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ (టి.ఐ.ఎఫ్.ఆర్.) శాస్త్రవేత్తలు ఎలుకలపై జరిపిన తాజా పరిశోధనలో వెల్లడైంది. అయితే యాంటీడిప్రెసెంట్లు పురుషుల మెదడుపై ఈ విధంగా ప్రభావాన్ని చూపటం అన్నది వారి వయసుపై కూడా ఆధారపడి ఉండొచ్చని వారు భావిస్తున్నారు.చదవండి: ఎక్కడ చూసినా గోరింటాకు సందడి : ఈ ప్రయోజనాలు తెలుసా?యాంటీ డిప్రెసెంట్లు ఏం చేస్తాయి?సెరటోనిన్ అనే న్యూరోహార్మోన్ మెదడులోని భావోద్వేగాల రూపకల్పనలో కీలక పాత్ర పోషిస్తుంది. ఆ హార్మోన్ను నియంత్రించటమే యాంటీడిప్రెసెంట్ల పని. నిరాశ, నిస్పృహ, ఆందోళన తదితర న్యూరోసైకియాట్రిక్ వ్యాకులతలకు వైద్యులు ప్రధానంగా ‘సెలెక్టివ్ సెరటోనిన్ రీఅప్టేక్ ఇన్హిబిటర్లు’ (ఎస్.ఎస్.ఆర్.ఐ.లు) సిఫారసు చేస్తారు. ఈ మందులు మెదడులోని సెరటోనిన్ అధికం చేసి మానసిక ఉపశమనానికి తోడ్పడతాయి.ఇదీ చదవండి: ఒకప్పటి సెక్యూరిటీ గార్డే .. ఇపుడు మైగేట్ యాప్ సీఈవో!మగ ఎలుకల్లోనే మార్పులుఎస్.ఎస్.ఆర్.ఐ.లలో విస్తృతంగా వాడుకలో ఉన్న ఔషధం ‘ఫ్లూఆక్సిటీన్’. గర్భిణులు, బాలింతలు, పిల్లలు, కౌమార దశలో ఉన్నవారు సహా అన్ని వయసుల వారికి వైద్యులు సిఫారసు చేసే ఈ ఫ్లూఆక్సిటీన్ దీర్ఘకాలిక ప్రభావాలు ఎలా ఉంటాయన్న విషయమై ఎలుకల మెదడుపై జరిపిన ఈ అధ్యయనంలో అనేక ఆసక్తికరమైన సంగతులు వెల్లడయ్యాయి. ఫ్లూఆక్సిటీన్ను ఇవ్వడం వల్ల మగ ఎలుకల మెదడులో విస్తృతమైన వ్యతిరేక మార్పులు కనిపించాయి. పుట్టిన కొద్ది రోజుల వయసున్న ఎలుకలకు యాంటీడిప్రెసెంట్లను ఇచ్చినప్పుడు క్రమేణా ఆందోళన స్థాయిలు పెరిగాయి. లైంగిక పరిపక్వతకు చేరుకున్న దశలో ఉన్న ఎలుకలకు ఇచ్చినప్పుడు అవి తక్కువ ఆందోళనను కనబరిచాయి. ఈ మందు ఇచ్చిన ఆడ ఎలుకల ప్రవర్తన, మెదడు నిర్మాణం, మైటోకాండ్రియా లేదా జన్యు వ్యక్తీకరణలలో మార్పులేమీ కనిపించలేదు. బహుశా ఇందుకు ఈస్ట్రోజెన్, ఇతర స్త్రీ హార్మోనుంచి రక్షణ లభిస్తుండవచ్చునని తెలిపారు. జెండర్ క్రోమోజోమ్లు, జన్యుపరమైన వ్యత్యాసాలపై మరింత అధ్యయనం జరిపితే దీనిపై నిర్ధారణకు అవకాశం ఉంటుందని పరిశోధకులు భావిస్తున్నారు.అత్యంత సాధారణ ఔషధం‘ఫ్లూఆక్సిటిన్’ అనేది 18 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న వారికి, గర్భిణులకు చికిత్సపరంగా మంచి ఫలితాల కోసం ఇచ్చే అత్యంత సాధారణ ఔషధం. ప్రొజాక్, ఫ్లూడాక్ వంటి బ్రాండ్పేర్లతో ఇది లభిస్తోంది. అయితే దాని దీర్ఘకాలిక ప్రభావాన్ని అంచనా వేయడానికి మరిన్ని పరిశోధనలు జరగాల్సి ఉంది’ అని తాజా పరిశోధనా పత్రాన్ని సమర్పించిన ముఖ్య అధ్యయనకర్త ఉత్కర్షా ఘాయ్ అంటున్నారు. ఘాయ్ ముంబైలోని టి.ఐ.ఎఫ్.ఆర్. (టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రిసెర్చ్) లో పీహెచ్డి, బెంగళూరులోని నిమ్హాన్స్లో పోస్ట్డాక్టరల్ రీసెర్చ్ చేశారు. అధ్యయనం జరిగిన విధానంఫ్లూఆక్సిటిన్ తీసుకున్న తర్వాత.. సెక్సువల్ హార్మోన్లు క్రియాశీలకం కావడానికి ముందు, తర్వాత మెదడుపై ప్రభావాలను అధ్యయనం చేసేందుకు టి.ఐ.ఎఫ్.ఆర్. శాస్త్రవేత్తల బృందం ఎలుకల్ని రెండు జట్లుగా విభజించింది. ఒక జట్టు : ఎలుకలు 2 నుండి 21 రోజుల వయసున్నవి. ఇంకో జట్టు : 28–48 రోజుల వయసున్నవి. అప్పుడే పుట్టిన ఎలుకల్లో ఈ మందు వాడకంతో ఆందోళన క్రమంగా పెరిగింది. అదే రెండో జట్టు ఎలుకల్లో ఒత్తిడి, ఆందోళన స్వల్పంగా తగ్గాయి. ఈ అధ్యయన ఫలితాలను మానవుల్లోనూ అవే రెండు దశలుగా శైశవ దశ నుంచి శరీరంలో సెక్సువల్ హార్మోన్లు కనిపించే వయసు వరకు; టీనేజీ నుంచి 25 ఏళ్ల వరకు ఈ బృందం అన్వయించింది. సహాయకారిగా విటమిన్ బి3యాంటీడిప్రెసెంట్ల వాడటం వల్ల కొందరి మెదడుపై కనిపించే దుష్ప్రభావాలను తగ్గించేందుకు చేసిన అధ్యయనంలో భాగంగా ఈ బృందం విటమిన్ బి3 (నికోటినమైడ్)ని ఎలుకలకు ఇచ్చింది. ఆశ్చర్యకరంగా, పుట్టి కొద్ది రోజులే అయిన ఎలుకలలో గమనించిన అనేక ప్రతికూల ప్రభావాలు బి3 ప్రభావంతో ఉపశమించాయి. వాటి జీవక్రియ పునరుద్ధరణ జరిగింది. వాటి నిరాశ, నిస్పృహల ప్రవర్తనలలో గణనీయమైన తగ్గుదల కనిపించింది. దీంతో వైద్యులకు ఒక ఆశారేఖ దొరికినట్టయింది. తీవ్రమైన ఆందోళన, ఒత్తిడి ఉండి.. ఆత్మహత్య చేసుకోవాలనుకునే మానసిక స్థితి ఉన్న గర్భిణులకు ఎస్ఎస్ఆర్ఐలు తప్పనిసరిగా ఇవ్వాల్సి వస్తుంది. అలా ఇస్తే వాటి ప్రభావం పుట్టే పిల్లలపై పడుతుంది. కానీ, విటమిన్ బీ3 వాడితే... ఆ ప్రభావం తగ్గుతుందని ప్రస్తుత పరిశోధనల్లో కొంత వరకు తేలింది. ఇది గర్భిణులందరికీ గొప్ప శుభవార్తే. కాకపోతే పూర్తిస్థాయిలో పరిశోధనలు జరగాల్సి ఉంది. -
నాన్నా నా పెళ్లిలో డ్యాన్స్ చేస్తావా..? ఆ మాటలే ఊపిరి పోశాయి..
హాయిగా సాగిపోతున్న జీవితాన్ని భయానక వ్యాధులు ఒక్క ఊదుటన మొత్తం జీవితాన్నే తలికిందులు చేస్తాయి. వైద్యానికి అయ్యే ఖర్చులతో కుటుంబాన్ని రోడ్డుమీదకు తీసుకొచ్చేస్తాయి. వీటన్నింటికి తోడు ఆ మహమ్మారి పెట్టే భయాన్ని తట్టకోవాలంటే కొండంత ధైర్యం ఉండాల్సిందే. అలా అనితరసాధ్యమైన స్థైర్యంతో ఓ నాన్న కూతురు కోసం కేన్సర్ మహమ్మారిని ఎలా జయించాడో తెలిస్తే..హృదయం ద్రవించిపోతుంది. లెక్కలేనన్ని సర్జరీలు, బతుకుతానా లేదా అన్న నిరాశ నిస్ప్రహల నడుమ పోరాడి గెలిచిన ఓ తండ్రి కథ ఇది.అతడే 60 ఏళ్ల అర్జున్ సేన్. అతడు మార్కెటింగగ్ ఎగ్జిక్యూటివ్, పాడ్కాస్ట్ హోస్ట్, రచయిత, వ్యవస్థాపకుడు కూడా. కానీ అతడి జీవితం ప్రతిక్షణం మరణం అనే పంజాను విసురుతూనే ఉండేది. కానీ అది ప్రతిసారి అతడి నవ్వు ముందుకు ఓడిపోయింది. ఆయకు 1996లో, కడుపుకు మెటాస్టాసిస్ అనే స్వరపేటిక కేన్సర్ వచ్చింది. వైద్యులు వంద రోజులకు మించి బతికే ఛాన్స్ లేదని చెప్పేశారు. ఏం చేయాలో పాలుపోని పరిస్థితి. ఆ వ్యాధి సోకినప్పడు అర్జున్కి 32 ఏళ్లు. వాస్తవానికి అర్జున్ అందరిని నవ్వించేవాడే..ఈ రోజు నిరాసనిస్ప్రుహలతో ఏం చేయలేని పరిస్థితిలో ఉండిపోయాడు. సరిగ్గా అతడి కూతురు రాకా అతడిని చూసి.." నాన్న చనిపోవడం అంటే ఏమిటి, నువ్వు చనిపోతున్నావా..? మరి నా పెళ్లిలో డ్యాన్స్ చేయవా అంటూ అమాయకంగా అడిగిన కూతురు మాటలకు నిశ్చేష్టుడయ్యాడు. కాసేపటికి తేరుకుని అప్పుడే పెళ్లికి ఎందుకు తొందరపడుతున్నావ్ రా అనగానే కూతురు మోములోని సిగ్గు అతని ముఖంలోకి నవ్వు తెప్పించింది. పైగా కూతురిని దగ్గరకు తీసుకుని లేదు కచ్చితంగా నీ పెళ్లిలో ఈ నాన్న డ్యాన్స్ చేస్తాడు అని కూతురికి వాగ్దానం చేశాడు." అది అబద్ధమని తెలిసి కూడా అప్రయత్నంగా అర్జున్ ఆ మాటలు అనేశాడు. కానీ ఆ మాటలే ఆ తండ్రికి ఊపిరిపోశాయి..అప్పటి దాక ఉన్న బాధకు ఆ నవ్వు ఔషధంగా మారింది. తనకింకా వంద రోజుల కాదు వేల వందల 24 గంటలు ఉన్నాయన్నంత కొండంత ఆశను, ధైర్యాన్ని అందించాయి. అసలు ఈ మహమ్మారి ముందు చేతులు పైకెత్తేసి ఓడిపోవడం దేనికి పోరాడితే ఏముంది అనే శక్తిమంతమైన ఆలోచనను రేకెత్తించింది. ఆ ధైర్యంతోనే కీమోథెరపీ చికిత్సలు తీసుకునేవాడు..ప్రతిసారి ట్రీట్మెంట్కి వెళ్లినప్పుడూ తాను బయటపడతానా అనే ప్రశ్న.. వైద్యులను అడిగేవాడు..వాళ్లు కూడా బి పాజిటివ్ అనేవారే తప్ప..పర్లేదు బయటపడగలవు అనే భరోసా ఇచ్చేవారు కారు. అయినా సరే అర్జున్కి తన కూతురు రాకా కోసం బతికి బట్టగట్టగాలి అనే మొండి ధైర్యాన్ని కొని తెచ్చుకుని మరి చికిత్స తీసుకునేవాడు. అలా ఒకటి కాదు, రెండు కాదు..ఏకంగా 20 సర్జరీలు చేయించుకున్నాడు. మంచి చికిత్స తీసుకుని పూర్తి స్థాయిలో కోలుకున్నాడు. అలా ఆ మహమ్మారి నుంచి బయటపడి కూతురికిచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకున్నాడు. అంతేగాదు అతడి గాథని పికూ (2015), విక్కీ డోనర్ (2012) మూవీల దర్శకుడు షూజిత్ సిర్కార్ ఐ వాంట్ టు టాక్ మూవీగా తెరకెక్కించాడు. ఈ మూవీలో తండ్రి కూతుళ్ల మధ్య సైలంట్గా సాగే ఎమోషనల్ సన్నివేశాలు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యింది. బాక్సాపీస్ వద్ద విమర్శకుల ప్రశంసలందుకుంది కూడా. అసలు ముందు మనమే సమస్యకు భయపడిపోతే ఎలా మన కంటి పాపల కోసమైన మృత్యువుతో పోరాడే చిన్న ప్రయత్నమైనా.. చేయాలి అని చాటిచెప్పే భావోద్వేగ కథ ఇది.(చదవండి: కపిల్ శర్మ వెయిట్ లాస్ స్టోరీ..! రెండు నెలల్లో 11 కిలోలు..! ఏంటి 21. 21. 21 రూల్..?) -
7 నెలల్లో 35 కిలోలు..వాటికి దూరం: ఇదే నా సక్సెస్ అంటున్న నేహా
అధిక బరువును తగ్గించుకోవాలంటే ఆహారం పాత్ర చాలా కీలకం. ఆహారపు అలవాట్లే బరువు తగ్గడంలో ప్రధాన భూమిక పోషిస్తాయి. ఇది అందరూ చెప్పేమాట. క్రమం తప్పని వ్యాయామంతోపాటు ఏం తింటున్నాము? ఎంత తింటున్నాం? ఏ సమయంలో తింటున్నాము అనేది బేరీజు వేసుకోవాలని ఆహార నిపుణులు కూడా సూచిస్తారు.అయితే తాజాగా కేవలం 7 నెలల్లో ఏకంగా 35 కిలోల బరువు తగ్గిన మహిళ, తన అనుభవాలను ఇన్స్టాగ్రామ్ ద్వారా పంచుకుంది. పదండి మరి ఆమె సక్సెస్మంత్రా ఏంటో తెలుసుకుందాం.ఇన్స్టాలో నేహా తన వెయిట్ లాస్ జర్నీ గురించి వివరించింది. ముఖ్యంగా వ్యాయామంతోపాటు, దూరంగాపెట్టాల్సినకొన్ని ఆహారాల గురించి చెప్పుకొచ్చింది. నిజంగా బరువు తగ్గడమే అదొక యజ్ఞంలాగా చేయాలి. భారీ కసరత్తులు, డైట్ చేసినా అనుకున్న ఫలితం కనపించక చాలామంది నిరాశపడిపోతారు చాలామంది . అయితే మనం రోజూ తినే ఆహారపు అలవాట్లే బరువు తగ్గడంలో కీలకం అంటోంది నేహా తాను. కేవలం 7 నెలల్లో ఏకంగా 35 కిలోల బరువు తగ్గినట్టు వెల్లడించింది. ‘‘బరువు తగ్గాలనుకుంటే, ఈ ఆహారాలకు దూరంగా ఉండాలి లేదా వాటిని చాలా తక్కువగా తీసుకోవాలి" అనే క్యాప్షన్లో తన అనుభవాన్ని షేర్ చేసింది. నేహా. View this post on Instagram A post shared by LeanwithNeha (@leanwithneha)p; ఇదీ చదవండి: అవును మేమిద్దరమూ విడిపోతున్నాం.. కానీ!నేహా దూరం పెట్టిన ఆ 10 రకాల ఫుడ్ గ్రానోలా (Granola): ఇది ఆరోగ్యకరమైన ఆహారంగా ప్రచారంలో ఉంది. కానీ ఇందులో చక్కెర, అనారోగ్యకరమైన నూనెలు ఎక్కువగా ఉంటాయి. ఇవి మంచి కంటే చెడే ఎక్కువ చేస్తాయి.ఫ్లేవర్డ్ యోగర్ట్: ఇందులో కనిపించని చక్కెరలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఇన్సులిన్ స్థాయిలను పెంచి, శరీరంలో కొవ్వు పేరుకుపోవడానికి కారణమవుతాయి.ప్యాక్ చేసిన పళ్ల రసాలు: : వీటిలో ఫైబర్ ఉండదు, చక్కెర ఎక్కువగా ఉంటుంది. కొన్ని రకాలు సోడా కంటే కూడా ప్రమాదకరమైనవి.డైట్ నమ్కీన్, బేక్డ్ చిప్స్ : "డైట్" అని ఉన్నంత మాత్రాన వీటిని చూసిబుట్టలోపడిపోకండి మోసపోకండి. ఇవి కూడా బాగా ప్రాసెస్ చేసిన ఆహారాలే. వీటిలో శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లు, చెడు కొవ్వులు ఉంటాయి సో.. జాగ్రత్త.ప్రోటీన్ బార్స్ (Protein bars): చాలా ప్రోటీన్ బార్లు చక్కెర మిఠాయిల్లాగే ఉంటాయి. కేవలం కొద్దిగా ప్రోటీన్ అదనంగా చేరుస్తారు అంతే. వీటిని కొనే ముందు పదార్థాల జాబితాను జాగ్రత్తగా చూడండి.తేనె, బెల్లం (Honey and jaggery): ఇవి సహజమైనవి కావచ్చు, కానీ అవి కూడా చక్కెరలే. శుద్ధి చేసిన చక్కెరలాగే ఇవి కూడా మీ ఇన్సులిన్ స్థాయిలను పెంచుతాయి.బ్రౌన్ బ్రెడ్ (Brown bread): ఇది తరచుగా శుద్ధి చేసిన మైదా పిండితో తయారు చేస్తారు. ఆరోగ్యకరంగా కనిపించడానికి రంగు కలుపుతారు. నిజానికి ఇందులో పోషక విలువలు తక్కువగా ఉంటాయి.స్టోర్స్లో కొనే స్మూతీలు: వీటిలో పండ్ల చక్కెరలు, కొన్నిసార్లు కృత్రిమ రుచులు ఎక్కువగా ఉంటాయి. ఇవి కొవ్వు పెరగడానికి దారితీస్తాయి. (Tip of the Day : రాగుల జావతో మ్యాజిక్)తక్కువ కొవ్వు ప్యాకేజ్డ్ ఆహారాలు: వీటిలో సహజ కొవ్వులను తొలగించి, రుచి కోసం సాధారణంగా చక్కెరను కలుపుతారు. ఇది తక్కువ కొవ్వు తీసుకునే ఉద్దేశ్యాన్ని దెబ్బతీస్తుంది.సోయా ఉత్పత్తులు: సోయా ఉత్పత్తులను కూడా మితిమీరి, ముఖ్యంగా ప్రాసెస్ చేసిన సోయాను ఎక్కువగా తీసుకోవడం హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీస్తుంది. (సినీ దర్శకుడవ్వడమే టార్గెట్ : మత్స్యకార మణిహారం)నోట్ : నేహా ఇన్స్టా పోస్ట్ ఆధారంగా అందించింది మాత్రమే అని గమనించగలరు. వృత్తిపరమైన వైద్య సలహాకు ఇది ప్రత్యామ్నాయం కాదు. ఏదైనా సందేహాలుంటే నిపుణుల సలహా తీసుకోవడం ఉత్తమం. -
గుండెను గుచ్చే అందమైన ముల్లు
‘కాంటా లగా’ మ్యూజిక్ ఆల్బమ్ ఫేమ్, ప్రముఖ బాలీవుడ్ నటి షెఫాలీ జరీవాలా బ్యూటీ ట్రీట్మెంట్లో భాగంగా ఓ ఇంజెక్షన్ తీసుకున్న కొద్దిసేపటికే కార్డియాక్ అరెస్ట్తో మృతిచెందిన సంఘటన ఇటీవల చాలా సంచలనం రేపింది. షెఫాలీ అనేక ఏళ్లుగా ఈ చికిత్స తీసుకుంటున్నప్పటికీ ఆరోజు ఆమె ఉపవాసంలో ఉండి... ఇంజెక్షన్ తీసుకున్నందున ఇలా జరిగిందనే వార్తలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో సాధారణంగా నటీనటులతో పాటు ఇతరులు తీసుకునే బ్యూటీ చికిత్సలనూ అలాగే... గుండెపై వాటి ప్రభావాలను చూద్దాం...‘అందమె ఆనందం... ఆనందమె జీవిత మకరందం’ అంటూ తెలుగు కవులు వినిపించారూ... వివరించారు. అందం ఆనందాన్నిస్తుంది. దానికి ప్రాణాల్ని మూల్యంగా చెల్లించాలా అన్నది సమాజం అడుగుతున్న ప్రశ్న. ఈ నేపథ్యంలో అసలు బ్యూటీ చికిత్సలో జరిగేదేమిటి, వాటి పర్యవసానాలేమిటి, గుండెపైన వాటి ప్రభావాలేమిటో తెలుసుకుందాం. మొదట్లో సినీతారలు... తర్వాత్తర్వాత క్రమంగా బాగా ధనవంతులు మొదలు... నేడు సామాన్యుల వరకూ సౌందర్య కాంక్ష చేరింది. ఇప్పుడు పార్లర్కు వెళ్లడమన్నది మధ్యతరగతీ, దిగువ మధ్యతరగతికీ సాధారణమైంది. మెరుస్తున్న మేని నిగారింపు, యూత్ఫుల్ లుక్తో కనిపించడం అందరికీ ఇష్టమైన అంశమైంది. బ్యూటీ థెరపీ లేదా ఈస్థటిక్ ట్రీట్మెంట్ అని పిలిచే సౌందర్య చికిత్సల్లో రక్తనాళం ద్వారా నేరుగా రక్తంలోకి పంపించే గ్లుటాథియోన్ డ్రిప్స్ మొదలుకొని రకరకాల మీసోథెరపీ (మీసో థెరపీ అంటే చర్మంలో ఉండే మూడు పొరల్లోని మధ్యపొరపై ప్రభావం చూపేవి) మందులూ, కొలాజెన్ ΄ పౌడర్లు, చర్మం నిగారింపుతో ఫెయిర్గా కనిపించేందుకు వాడే ఇంజెక్షన్లు, పైపూతగా వాడే క్రీములు, ΄ పౌడర్లు... ఇలా రకరకాల ట్రీట్మెంట్లు ఉంటాయి. పైకి మిలమిలా మెరుస్తూ ఉండే చర్మం వెనక కొన్ని నల్లటి చిక్కటి చీకటి రహస్యాలూ ఉంటాయి. కొన్నింటిపైన ఓ మేరకు నియంత్రణలు ఉన్నప్పటికీ... మరికొన్నింటి విషయంలో అసలు ఎలాంటి అదుపూ లేకుండా ఏమాత్రం శిక్షణ లేనివారూ, తమకు ఎలాంటి పరిజ్ఞానమూ లేనివారూ చేసేవి కూడా ఉంటాయన్నది ఓ నగ్న సత్యం. ఇదీ చదవండి: Tip of the Day : రాగుల జావతో మ్యాజిక్ బ్యూటీ చికిత్సల్లో ఎన్నెన్నో రకాలు... వ్యక్తులు అందంగా కనిపించేందుకు చేసే చికిత్సల్లో పలు రకాలైనవి ఉంటాయి. ఉదాహరణకు... → పెరుగుతున్న వయసు ఛాయలు చర్మంపై కనిపించకుండా... ముడుతలూ, లోతైన గీతలు కనిపించకుండా చేసేందుకు యాంటీ ఏజింగ్ చికిత్సగా బొటాక్స్ ఇంజెక్షన్లు, ఇతర డర్మల్ ఫిల్లర్స్ → మార్కెట్లో యాంటీ ఏజింగ్ మందులు, డీ–టాక్స్ లేదా ఇమ్యూనిటీ బూస్టర్స్గా పిలుస్తూ... రక్తనాళం ద్వారా రక్తంలోకి మందును ఎక్కించే గ్లుటాథియోన్, నికొటినెమైడ్ అడినైన్ డైన్యూక్లియోటైడ్ (ఎన్ఏడీ+) మందులు → రక్తంలోని ప్లాస్మాను వేరు చేసి చర్మంలోకి ఎక్కించే పీఆర్పీ (ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా) థెరపీ, (జుట్టు ఒత్తుగా పెరిగేలా చేసే గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సంట్రేట్ (జీఎఫ్సీ) చికిత్స, ఎగ్జోసోమ్స్, చర్మాన్ని ఉత్తేజితం చేసే పాలీ డైయాక్సీ రైబో న్యూక్లియోటైడ్ (పీడీఆర్ఎన్) వంటి చికిత్సలు → కొలాజెన్ పెపై్టడ్స్, బయోటిన్, చర్మాన్ని తెల్లగా మార్చే గుట్లాథియోన్ లాంటి పిల్స్తో పాటు కొన్ని హార్మోన్ థెరపీలు. ఇవన్నీ ఆహారంలోని సప్లిమెంట్స్ కాగా... వీటిలో కొన్నింటిని నోటిద్వారా (ఓరల్గా) ఇస్తారు → ఇక పైపూత లేపనాలు (టాపికల్)గా వాడే పెపై్టడులూ, రెటినాయిడ్స్ ఉండే క్రీములు... ఇవి సౌందర్య ఔషధ రూపాల్లో ఇస్తుండటం వల్ల వీటిని ‘కాస్మస్యూటికల్స్’గానూ చెబుతారు.మన దేశంలోఅనుమతిఉన్నవి కొన్నే...మన దేశంలో ఇలాంటి మందులకు అనుమతి ఇచ్చే అత్యున్నత అథారిటీ ‘సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ – సీడీఎస్సీఓ) అనే సంస్థ. దీనితో పాటు అమెరికన్ సంస్థ ఎఫ్డీఏ అనుమతించిన వాటిని మనదేశంలోనూ అనుమతిస్తుంటారు. వాటిల్లో కొన్నింటికే అనుమతులున్నాయి → ఉదాహరణకు రక్తంలోకి ఎక్కించే గ్లుటాథియోన్, హై–డోస్ విటమిన్ సి, ఎన్ఏడీ+ లేదా మరికొన్ని మిశ్రమ మందులు (కాక్టెయిల్స్)కు పై సంస్థల అనుమతి లేదు → చర్మంలో ఉండే మూడు పొరల్లో మధ్యపొరపై పనిచేసే మరికొన్ని చికిత్సలను ‘ఎక్సోజోమ్ బేస్డ్’ చికిత్సలు అంటారు. వీటితో పాటు స్టెమ్సెల్ థెరపీల వంటివాటిని శిక్షణ పొందిన క్వాలిఫైడ్ నిపుణులు అందిస్తేనే సురక్షితం.ప్రమాదాలూ / అనర్థాలు ఎప్పుడంటే... ముందుగా చెప్పిన ప్రకారం... అత్యంత సుశిక్షితులూ, అన్ని విధాలా తగిన విద్యార్హతలు ఉన్న డర్మటాలజిస్టుల వంటి నిపుణులు మాత్రమే ఈ చికిత్సలను అందించాల్సిన నేపథ్యంలో ప్రస్తుతం చాలాచోట్ల అనధికారిక సెలూన్లు, స్పాలు ఇంకా చెప్పాలంటే కొన్నిచోట్ల ఇళ్లలో కూడా అనధికారికంగా ఈ ఔషధాలనూ, ఇవ్వకూడని సప్లిమెంట్లను ఇస్తున్నారు. పైగా ఇళ్లలో ఇచ్చే ఈ చికిత్సల్లో ఏవైనా దుష్ప్రభావాలు ఎదురైతే... వాటి పర్యవసానాలేమిటీ, వాటిని ఎలా ఎదుర్కోవాలన్న పరిజ్ఞానం అనర్హులైన చికిత్సకులకు ఉండదూ, అలా ఎదుర్కొనేందుకు అవసరమైన వనరులూ ఉండవు. అయినప్పటికీ చాలామంది వీటిని యధేచ్ఛగా ఇస్తున్నారూ... అలాగే అందంపై ఆసక్తి ఉన్న యువతీయువకులు తీసుకుంటున్నారు.చదవండి: క్యాషియర్ సెకండ్ హ్యాండ్ కారు కొనుక్కుంటే నేరమా బాస్?!ఇవీ నమోదైన (డాక్యుమెంటెడ్) ప్రమాదాలు / అనర్థాలు → అలర్జిక్ రియాక్షన్లు, అనాఫిలాక్సిస్ అనర్థాలు (అదుపు చేయలేని విధంగా చాలా తక్కువ వ్యవధిలో వచ్చే తీవ్రమైన రియాక్షన్లు వీటి ద్వారా ఒక్కోసారి షాక్ కూడా కలిగితే దాన్ని అనాఫిలెక్టిక్ షాక్గా కూడా వ్యవహరిస్తారు). ఈ రియాక్షన్లు అరుదుగా ప్రాణాంతకమూ అయ్యే అవకాశాలు లేక΄ోలేదు → రక్తంలోకి ఎక్కించే గ్లుటాథియోన్ ఇంజెక్షన్లతో అనాఫిలెక్టిక్ షాక్, అసెప్టిక్ మెనింజైటిస్ (మెదడు, వెన్నుపాములో ఉండే పొరల వాపు) వంటివి చాలా అరుదు. అయితే కొన్నిసార్లు ఇలాంటి రియాక్షన్స్ కనిపించిన దాఖలాలు ఉన్నాయి → హై–డోస్ విటమిన్ బి కాంప్లెక్స్ ఇచ్చిన కొన్ని సందర్భాల్లో అవి వికటించి, ప్రాణాంతకంగా మారిన సందర్భాలూ ఉన్నాయి. నిజానికి చాలాకాలం నిల్వ చేయడానికి అందులో వాడే ప్రిజర్వేటివ్స్ వల్ల ఇలాంటి రియాక్షన్లు కనిపించాయి → కొన్ని సందర్భాల్లో బ్యూటీ మందులు వాడాక ఇన్ఫెక్షన్లు, రక్తానికి ఇన్ఫెక్షన్ (సెప్సిస్) కనిపించాయి → స్టెమ్ సెల్ చికిత్సల్లో కొంతమేరకు కనిపించే ముప్పు (రిస్క్)→ స్టెమ్సెల్స్తో చేసే చికిత్సల్లో ఇమ్యూన్ రియాక్షన్స్, ఇన్ఫెక్షన్స్ వచ్చే ముప్పు ఉన్నందున నిజానికి బ్యూటీ చికిత్సల్లో స్టెమ్సెల్స్కు అనుమతి లేదు.ప్రజలు తెలుసుకోవలసిన అంశాలు... → బ్యూటీ చికిత్స అందించేవారికి వాస్తవంగా ఆ అర్హత ఉందా, వారికి తగిన విద్యార్హతలు ఉన్నాయా వంటి అంశాలను అడిగి తెలుసుకోవాలి → చాలా త్వరగా ప్రభావం చూపుతాయన్న ‘క్విక్ ఫిక్స్ మార్కెటింగ్’ ప్రచారాలను నమ్మడం సరికాదు. మెల్లగా వచ్చే ప్రభావాలే దీర్ఘకాలం నిలుస్తాయి. ఇవి చాలావరకు నిరపాయకరమని గుర్తించాలి → ఆ సౌందర్యసాధనాలకూ, ఉత్పాదనలకు ఎఫ్డీఏ లేదా సీడీఎస్సీవో సంస్థల ఆమోదం ఉందా అని చూడాలి→ గ్లుటాథియోన్ వంటి మందులు ఇచ్చే సమయంలో అది నిరపాయకరమైన మోతాదులోనే ఉందా అని చూడాలి. అంటే వారానికి 600 నుంచి 1200 ఎంజీకి మించి మందు తీసుకోకూడదు. (అనర్థాలు సంభవించిన కొన్ని కేసులను చూసినప్పుడు కొందరు అవసరమైన మోతాదుకు ఐదు రెట్లు ఇచ్చిన దాఖలాలనూ గుర్తించారు) చివరగా... అందం చాలా ఆకర్షణీయమైదే. అందరూ కోరుకునేదే. అయితే దానికి చెల్లించాల్సిన మూల్యం ప్రాణాలు కాకూడదు. అందంగా ఉండటం కంటే ఆరోగ్యంగా జీవించి ఉండటం ముఖ్యం.ఎందుకీ అనర్థాలు... ఈ అనర్థాలకు చాలా కారణాలు ఉంటాయి. → చట్టపరంగా వీటిని అదుపు చేసే యంత్రాంగం కొరవడటం → యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ వంటి ప్లాట్ఫామ్స్ ద్వారా ఈ తరహా క్లినిక్లూ, చికిత్సల గురించి విపరీత ప్రచారం → ఏమాత్రం అర్హతా, పర్యవసానాలపై అవగాహన లేని అనర్హులు చికిత్సలందించడం. అన్నిటికంటే ముఖ్యంగా వినియోగ దారుల్లో కొరవడిన అవగాహన : ఈ ఉత్పాదనల విషయంలో ప్రజల్లో ఎలాంటి అవగాహన లేక΄ోవడం వల్ల కూడా ఈ తరహా అనర్థాలు చోటు చేసుకుంటున్నాయి. ఉదాహరణకు ‘స్వాభావికమైన, ప్రకృతిసిద్ధమైన (నేచురల్)’ వంటి మాటలు ఉపయోగించినప్పుడు అవేవీ ప్రమాదకరం కానివిగా భావిస్తూ చాలామంది ప్రమాదకరమైన సింథసైడ్ రసాయనాలనూ విచ్చలవిడిగా వాడుతున్నారు.వసతులన్నీ హాస్పిటల్స్లోనే... బ్యూటీ చికిత్సలు తీసుకునే సమయంలో అది పెద్ద హాస్పిటల్ అయి ఉండటం, ఎమర్జెన్సీ సౌకర్యాలూ కలిగి ఉండేలా చూసుకోవడం ముప్పును తప్పిస్తుంది. వాస్తవానికి రక్తంలోకి ఎక్కించే గ్లుటాథియోన్ వంటివి తగిన మోతాదులో ఇచ్చినప్పుడు గుండె΄ోటు రావడం, గుండె ఆగి΄ోవడం (కార్డియాక్ అరెస్ట్), అనాఫిలెక్టిక్ షాక్కు గురికావడం వంటి సందర్భాలు చాలా అరుదు. అయితే అన్ని వసతులూ, ఎమర్జెన్సీ సౌకర్యాలు ఉన్న ఆసుపత్రితో తగిన విద్యార్హతలూ, చికిత్స అర్హతలూ కలిగిన డాక్టర్ల ఆధ్వర్యంలో బ్యూటీ చికిత్సలు తీసుకుంటే... ఒకవేళ ఏవైనా రియాక్షన్స్, అనాఫిలెక్టిక్ రియాక్షన్స్ వచ్చినా తక్షణం చికిత్స అందించడం వల్ల ప్రాణాలను కాపాడటానికి అవకాశముంటుంది. -
Tip of the Day : రాగుల జావతో మ్యాజిక్
భారతదేశంలో అత్యంత చౌకగా లభించే తృణధాన్యం.దీన్నే ఆంగ్లంలో ఫింగర్ మిల్లెట్ అని పిలుస్తారు.ఈ చిరు ధాన్యాలలో కాల్షియం, ఇనుము , విటమిన్లు బి1 నుండి బి3 లాంటి పోషకాలు మెండుగా లభిస్తాయి. ఇవాల్టి టిప్ ఆఫ్ ది డేలో భాగంగా రాగా మాల్ట్ లేదా రాగి జావ ఎలా తయారు చేయాలో చూద్దాం.మొలకలతో పిండి రాగి మాల్ట్ తయారు చేయడానికి రాగులను నానబెట్టి, మెత్తని బట్టలో కట్టిపెట్టి, మొలకెత్తించి, నీడలో ఎండబెట్టి, పిండిగా తయారు చేసుకోవాలి. మొలకెత్తిన రాగులతో తయారుచేసిన రాగి మాల్ట్ మరింత పోషకమైనది, సులభంగా జీర్ణమయ్యేది కాబట్టి. చిన్నపిల్లలు, వృద్ధులు కూడా దీన్ని నిస్సంకోచంగా తీసుకోవచ్చు.రాగి మాల్ట్ తయారీస్టవ్ మీద పాన్ లేదా కుండలో రెండు కప్పుల నీళ్లు పోసి మరగనివ్వాలి. ఆ లోపు ఒక కప్పు నీళ్లలో రాగుల పిండి జారుగా కలుపుకోవాలి.నీళ్లు మరుగుతున్నపుడు కలిపిన రాగిపిండిని పోసి, ముద్దలు లేకుండా తరచుగా కలుపుతూ ఉడికించుకోవాలి. మిశ్రమం కాస్త చిక్కగా గరిటె జారుగా అయ్యేలా చూసుకోవాలి.ఇందులో మజ్జిగ, ఉప్పు కలుపుకొంటే కమ్మటి రాగి జావ రెడీ.ఇందులో ఇష్టమున్న వారు బెల్లం, నెయ్యికలుపుకొని తాగవచ్చు. అలాగే ఉడికించే నీళ్లలో కొంచెం పాలనుకూడా కలుపుకోవచ్చు.ఇంకా బాదం పౌడర్ లేదా డ్రై ఫ్రూట్స్ పౌడర్ లేదా సన్నగా తరిగిన ముక్కలతో గార్నిష్తో చేస్తే పిల్లలకు చాలామంచిది. రాగుల జావ, ఆరోగ్య ప్రయోజనాలురాగి జావలో కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇది బాడీకి శక్తినిస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉండడం వల్ల రోగనిరోధక శక్తిని పెంచుతుంది.రాగి జావలో కేలరీలు తక్కువగా ఉండడం వల్ల బరువు తగ్గడానికి సహాయపడుతుంది.గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. రక్తపోటు, కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడంలో, సాయ పడుతుంది.మధుమేహాన్ని నియంత్రిస్తుంది: రాగి జావలో ఫైబర్ అధికంగా ఉండడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది.రాగి జావలో కాల్షియం అధికంగా ఉండడం వల్ల ఎముకలను బలపరుస్తుంది.రాగి జావలో ఐరన్ అధికంగా ఉండడం వల్ల రక్తహీనతను నివారిస్తుంది.రాగి జావలో ఉండే పోషకాలు జుట్టు రాలడం నివారించడంలో సహాయపడతాయి.రాగి జావలో ఉండే యాంటీఆక్సిడెంట్లు చర్మం ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి.రాగి జావను ఉదయాన్నే ఖాళీ కడుపుతో తాగడం మంచిది. లేదా, భోజనానికి ముందు లేదా తర్వాత తాగవచ్చు.