breaking news
Health
-
ఆరోగ్యం.. ఒక డైనమిక్ ప్రయాణం
స్త్రీల జీవితంలో నెలసరి మొదలైనప్పటి నుంచి, నెలసరి ఆగిపోయే వరకు, ఆ తరువాత తీసుకోవాల్సిన ఆరోగ్య రక్షణ చర్యలు, సమస్యలు, వాటి పరిష్కారాల గురించి...ప్రతి స్త్రీ జీవితంలో టీనేజ్, పునరుత్పాదక వయస్సు, మెనోపాజ్ అనే ముఖ్యమైన మూడు దశలుంటాయి. ఈ మూడు దశల్లో హార్మోన్ మార్పులు, శారీరక మార్పులు ఎక్కువ. అందుకే వీటిని ముందుగానే గుర్తించి జాగ్రత్తలు తీసుకోవాలి.టీనేజ్ దశలో...యుక్తవయస్సులో నెలసరి ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. ముఖ్యంగా మొదటి నెలసరి వచ్చినప్పుడే పరిశుభ్రత గురించి తెలియజెప్పాలి. శుభ్రమైన ప్యాడ్లు వాడాలి. ప్రతి నాలుగు గంటలకు మార్చాలి. వేడినీటితో శుభ్రంగా కడుక్కోవాలి. ఈ సమయంలో తల్లిదండ్రులు ధైర్యం చెప్పాలి. శరీరంలో జరిగే మార్పులను అంగీకరించేలా కౌన్సెలింగ్ అవసరం. అవసరమైతే వైద్యులను సంప్రదించాలి. పాఠశాలల్లో లైంగిక ఆరోగ్యంపై అవగాహన కల్పించాలి. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణకు హెచ్పీవీ టీకా వేయించాలి. సాధారణంగా 11 నుంచి 19 సంవత్సరాల మధ్య నెలసరి సరిగా రాకపోవడం సాధారణ విషయమే. ఆ తర్వాత హార్మోన్లు సర్దుబాటుతో 18 నుంచి 19 సంవత్సరాల నాటికి నెలసరి క్రమబద్ధంగా మారుతుంది. బరువు పెరగడం వల్ల కూడా ఇలాంటి సమస్యలు రావచ్చు. వ్యాయామం, సరైన ఆహారం, బరువు నియంత్రణ అవసరం. అవసరమైతే థైరాయిడ్ పరీక్ష చేస్తారు. అధిక రక్తస్రావం ఉన్నవారికి రక్తహీనత రాకుండా విటమిన్లు ఇస్తారు. అల్ట్రాసౌండ్ ద్వారా గడ్డలు లేదా సిస్టులు ఉన్నాయా పరిశీలిస్తారు. కొన్నిసార్లు విటమిన్లు మాత్రమే సరి΄ోతాయి.పునరుత్పాదక వయస్సులో...20 నుంచి 40 సంవత్సరాల మధ్య దశలో వివాహం, గర్భధారణ, ప్రసవం, ప్రసవానంతర సంరక్షణ ముఖ్యమైనవి. వివాహం ప్లాన్ చేసుకునే ముందు పూర్తి ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి. ముందుగా టీకాలు వేయించుకోక΄ోతే రుబెల్లా, చికెన్ఫాక్స్, హెచ్పీవీ టీకాలు వేయించుకోవాలి. పాప్ స్మియర్ పరీక్ష, లైంగిక వ్యాధుల రక్తపరీక్షలు చేయించుకోవాలి. గర్భధారణ ప్లానింగ్కు ముందు థైరాయిడ్, బీపీ, షుగర్, జన్యుపరమైన సమస్యలు, ఇన్ఫెక్షన్లు ఉన్నాయో లేవో చూసుకోవాలి. కుటుంబ నియంత్రణ పద్ధతుల గురించి తెలుసుకోవాలి. నెలసరి తరువాత స్తనాన్ని స్వయంగా పరీక్షించుకోవాలి. స్తనంలో గడ్డ, నొప్పి, నిపల్ నుంచి స్రావం, ఇతర మార్పులు ఉంటే వైద్యుని సంప్రదించాలి.40 సంవత్సరాల తరువాత చాలామందికి మూత్రంలో మంట, నొప్పి, జ్వరం కనిపిస్తాయి. రోజుకు 3 నుంచి 3.5 లీటర్లు నీరు తాగాలి. పరిశుభ్రత పాటించాలి. మలబద్ధకం లేకుండా పండ్లు, కూరగాయలు తినాలి. యోని లేదా మూత్రనాళ ఇన్ఫెక్షన్లకు సరిగా చికిత్స చేయక΄ోతే గర్భాశయానికి వ్యాపించి, పెల్విక్ ఇన్ఫ్లమేటరీ వ్యాధి వస్తుంది. దీనిని స్కాన్ , రక్తపరీక్షల ద్వారా గుర్తించి చికిత్స చేస్తారు.మెనోపాజ్ దశలో...నెలసరి ఒక సంవత్సరం పాటు రాకపోతే సహజ మెనోపాజ్ అంటారు. ఈ దశలో హార్మోన్ మార్పుల వల్ల వేడి ఆవిర్లు, చిరాకు, దిగులు, నిద్రలేమి వస్తాయి. కాఫీ, మసాలా పదార్థాలు తగ్గించాలి. ప్రాణాయామం, యోగా, ధ్యానం చేయాలి.ఈస్ట్రోజన్ తగ్గడం వల్ల ఎముకల బలహీనత పెరుగుతుంది. ΄ోషకాహారం తీసుకోవాలి. చర్మం, యోని పొడిబారడం ఉంటుంది. అవసరమైతే లూబ్రికెంట్లు, మాయిశ్చరైజర్లు వాడాలి. కొందరికి హార్మోన్ చికిత్స అవసరం పడుతుంది. బీపీ, షుగర్, గుండె ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి. పాప్ స్మియర్, మామోగ్రఫీని డాక్టర్ సూచన మేరకు కొనసాగించాలి.మహిళల ఆరోగ్యం వయస్సు మార్పులు, హార్మోన్ మార్పులు, జీవనశైలిపై ఆధారపడి ఉంటుంది. ముందస్తు పరీక్షలు, అవగాహన, సరైన జీవనశైలి ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. (చదవండి: 24 ఏళ్ల వయసులో 197 దేశాలు..!) -
అత్యంత విషపూరితమైన పాయిజన్తో..ప్రాణాంతక వ్యాధులకు చెక్..!
పాములను భయానకంగా మార్చేది ఏమిటంటే, కొన్ని విషాన్ని ఇంజెక్ట్ చేయడం ద్వారా చంపే సామర్థ్యం. కానీ విషపూరిత కాటుకు తెలిసిన ఏకైక విరుగుడు, యాంటీవెనమ్, అదే విషంతో తయారు చేయబడింది. శతాబ్దాలుగా,పాము విషంలోని ఎంజైమ్ల మిశ్రమంలో వివిధ రకాల ఔషధాలు కూడా ఉండొచ్చని మానవుడు ఏనాడో గుర్తించాడు.ఈ క్రమంలోనే విషం నుంచి తయారు చేసిన ఆధునిక చికిత్సా ఉత్పత్తులు నాడీ వ్యవస్థ, హృదయనాళ వ్యవస్థ, రక్తాన్ని ప్రభావితం చేసే వ్యాధులకు చికిత్సగా ఉపయోగించారు. ఈ పాముల విషాన్ని ఎన్నో రకాల వ్యాధులను నయం చేసేలా లక్ష్యంగా పెట్టుకుని మరి మందులు రూపొందించారు వైద్య నిపుణులు. అవేంటంటే రక్తపోటు , పుట్టుకతో వచ్చే గుండె జబ్బులకు చికిత్స చేసే కాప్టోప్రిల్ జరారాకా (దీన్ని దక్షిణ అమెరికా పిట్ వైపర్ అనే అత్యంత విషపూరిత పాము నుంచి తయారు చేస్తారట), అస్వస్థతకు చికిత్స చేయడానికి ఉపయోగించే ఎప్టిఫిబాటైడ్ (రాటిల్ స్నేక్ నుంచి తయారు చేస్తారు). ఇవేగాక కింగ్కోబ్రా విషంపై పరిశోధనలు జరుగుతున్నాయి కూడా. ఇందులో కూడా అద్భుతమైన సమ్మేళనాలు ఉన్నాయి. దీని విషాన్ని హృదయ స్పందన రేటు, రక్తపోటును తగ్గించే బీటా-కార్డియోటాక్సిన్ ఔషధ తయారీలో ఇనియోగిస్తారట. అలాగే పెప్టైడ్ను నోటి ద్వారా తీసుకునే మందుని కూడా తయారు చేస్తారట.కేవలం పాముల నుంచే కాదు అవి కూడా..విషాన్ని ఉత్పత్తి చేసే జీవులు పాములు మాత్రమే కాదు. గొంగళి పురుగులు,కందిరీగలు, కోన్ నత్తల నుంచి టోడ్లు, జెల్లీ ఫిష్ వరకు వివిధ రకాల జంతువులు విషాన్ని ఉత్పత్తి చేస్తాయి. అఖరికి కొన్ని బల్లులు కూడా విషపూరితమైనవేనని చెబుతున్నారు నిపుణులు. మనం తరుచుగా పిల్లలు మధ్యాహ్నం భోజన పథకం కింద అందించే భోజనం తిన్న తర్వాత అస్వస్థతకు గురయ్యారు అని వింటుంటాం. అందుకు కారణం అన్నం లేదా కూరలో బల్లి పడటంతో ఇది జరిగిందని చెబుతుంటారు. అంటే సాధారణంగా బల్లలు విషపూరితమైనవి కావు, కానీ మనం తినే పదార్థాల్లో పడినప్పుడు దానిలోని సాల్మొనెల్లా బ్యాక్టీరియా ప్రేగుల్లో చేరి పాయిజన్ అవుతుందట. అంతేకాదండోయ్ అమెరికా, మెక్సికో ఎడారులలో కనిపించే గిలా అనే బల్లి విషం నుంచి టైప్ 2 డయాబెటిస్ నివారణ మందును తయారు చేస్తారట. అంతేగాదు అంతకుమించి ప్రమాదకరమైన మరో చిన్నజీవి ఉంది. మనం తరుచుగా ఇళ్లల్లో చూసేదే. అదేనండి గొంగళి పురుగు. దక్షిణ అమెరికాలోని లోనోమియా గొంగళి పురుగు అత్యంత ప్రాణాంతకమైనదట. 1989లోబ్రెటిజల్లో వీటిని చూశారట. ఇవి సముహాలుగా గుత్తులగా ఉంటాయట. ఒక గుత్తిని తాకినా..అంతే ప్రాణాలే పోతాయట. అందుకు పెరూలోనే ఓ రోగి కేసు ఉదాహరణ అంటున్నారు వైద్య నిపుణులు. పెరూలో ఐదు గొంగళి పురుగులపై కాలు వేసిన ఒక యువ కెనడియన్ పర్యాటకుడి ప్రారంభంలో కొద్దిపాటి లక్షణాలు అనుభవించిన..రోజులు గడుస్తున్నకొద్ది బహుళ అవయవాల వైఫల్యంతో మరణించిన ఉదంతం అందర్నీ దిగ్బ్రాంతికి గురిచేసింది. ఈ గొంగళి పురుగు విషం శాస్త్రవేత్తల పరిశోధనలో అంతర్గత రక్తస్రావం, మూత్రపిండ వైఫల్యానికి దాదితీస్తుందని తర్వాత తెలిసింది. దీనికి విరుగుడు బ్రెజిల్లోని ఇన్స్టిట్యూటో బుటాంటన్ తయారు చేసిన యాంటీవినమ్ మాత్రమే చికిత్స. ఇక సాలీడు విషం సైతం మానవులకు ఉపయోగపడుతుందట. ప్రపంచంలోని నాలుగు ప్రాణాంతక సాలెపురుగులలో ఒకటైన ఆస్ట్రేలియాలోని గరాటు వెబ్ అనే సాలీడు విషం నుంచి సహజ పురుగుల మందు నివారిణిని తయారు చేస్తున్నారు. ఇది దోమలను నియంత్రించడంలో ఉపయోగపడుతుందట. అలాగే ఇది డీడీటీ వంటి ఇతర పురుగుమందుల నిరోధకతను కూడా కలిగి ఉందట. మల్టిపుల్ స్క్లెరోసిస్ చికిత్సలో పాము విషం వాడకాన్ని ప్రోత్సహిస్తోంది యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్. తేలు కుట్టిన తర్వాత కొన్ని నెలలు అనుభవించిన ఉపశమనం ఆధారంగా తేలు విషాన్ని చికిత్సలో ఉపయోగించారు. అంతేగాదు ఈ తేలు విషం ఒంటి నొప్పులకు నివారణగా కూడా ఉపయోగిస్తారట. అలాగే సముద్ర ఎనిమోన్ల ద్వారా ఉత్పత్తి చేసే టాక్సిన్లను ఆటో ఇమ్యూన్ రుగ్మతలకు చికిత్స చేయడానికి ఉపయోగిస్తారట. పురాత గ్రీకులు ఈ విషయాన్ని ముందుగానే కనిపెట్టారు. పైగా రాబోయే ఔషధాలన్నీ విషం నుంచే తయారవుతాయని ఆనాడే అంచనా వేసి ఉండొచ్చని భావిస్తున్నారు వైద్య నిపుణులు. ఆ నేపథ్యంలోనే ప్రపంచవ్యాప్తంగా ఉన్న వైద్య సంస్థలు చాలామటుకు తమ చిహ్నంగా సిబ్బంది చుట్టుతా చుట్టబడిన పాము నమునాని ఎంచుకోడానికి రీజనే ఇదే కావొచ్చు కూడా.జానికి లెనిన్(చదవండి: Frogs: నన్నుఇంటికి తీసుకువెళ్ళు) -
ట్రంప్ మెడపై ఎర్రటి మచ్చ..! స్కిన్ క్రీములతో జర భద్రం..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మెడపై ఎర్రటి మచ్చ కనిపించడంలో సర్వత్రా రకరకాల ఊహగానాలు మొదలయ్యాయి. ట్రంప్ అనారోగ్యం పాలయ్యారా? అని యూఎస్ ప్రజానీకం చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే వైట్హౌస్ వివరణ ఇచ్చింది కూడా. ట్రంప్ మెడపై ఎర్రటి మచ్చకు గల కారణాన్ని వైట్ హౌస్ వైద్యుడు సీన్ బార్బబెల్లా వెల్లడించారు. అది సాధారణ చర్మక్రీమ్ని ఉపయోగించడం వల్ల వచ్చిన అలెర్జీగా పేర్కొన్నారు. కొన్ని వారాలపాటు ఇలా ఉంటుందని కూడా అన్నారు. దీంతో ఒక్కసారిగా మనం సాధారణంగా వాడే స్కిన్ క్రీములు కూడా ఒక్కోసారి అలెర్జీకి దారితీస్తుందా అనే సందేహాలు వెల్లువెత్తాయి. అయితే దీని గురించి డెర్మటాలజిస్టులు ఏమంటున్నారంటే..మనం రెగ్యులర్గా వాడే స్కిన్ క్రీములు కూడా ఒక్కోసారి వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ఇబ్బందులు తలెత్తుతాయని అంటున్నారు నిపుణులు. అదిగాక డీ హైడ్రేషన్ వల్ల, చర్మం పైపొర దెబ్బతిని ఇలా సమస్యలు ఉత్పన్నమవుతాయట. మనం రెగ్యులర్ రాసే ఈ క్రీమ్ సున్నితత్వానికి అలవాటుపడి కూడా ఇలా దద్దుర్లతో కూడిన ఇరిటేషన్ వస్తుంటుందని చెబుతున్నారు. కొందరి సున్నితమైన వ్యక్తుల్లో ఈ అలెర్జీ మరింత తీవ్రంగా ఉండొచ్చని కూడా అన్నారు. ఒక్కోసారి ఏజ్ పైబడటం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి సన్నగిల్లినా..ఇలా ఎప్పుడూ రాసే స్కిన్ క్రీమ్ ప్రతిచర్య చూపించి చర్మ సంబంధిత సమస్యలు ఉత్పన్నమవుతాయని అంటున్నారు. కొందరికి వెంటనే ఈ సమస్య చూపించగా, మరికొందరికి కనీసం 24 నుంచి 72 గంటల్లో ప్రభావం చూపిస్తుందని చెబుతున్నారు. అందుకే మన శరీరానికి సరిపడే క్రీమ్ అయినా ప్రతిచర్య చూపిన వెంటనే కడిగేయాలని సూచిస్తున్నారు నిపుణులు. ఆ సమస్య తగ్గేంత వరకు ఆయా క్రీమ్లు వినియోగించకపోవడమే మేలు అని అంటున్నారు. ఇది అందరికీ ఒకేలా ఉండదు..కొందరికీ తక్కువ రియాక్టివ్ చర్మం ఉంటుంది.పదే పదే అదే క్రీమ్ వాడటం వల్ల ఆ సంరక్షణకు మించి చర్మానికి ఎఫెక్టివ్ క్రీమ్ అవసరమై ఇలా ప్రతిచర్య చూపించొచ్చు కూడా. అంతేగాదు కొందరికీ ఆ క్షణం అలెర్జీ వచ్చినా..ఆ తర్వాత కొద్ది నిమిషాల్లోనే సమస్య తగ్గుముఖం పడుతుంది. అందువల్ల మన శరీరాని పడిన క్రీమ్ అని గుడ్డిగా అదే పనిగా రాసేయొద్దు..ఒక్కోసారి మనం వేరే ప్రాంతంలో ఉంటే అక్కడి వాతావరణానికి తగ్గట్టుగా స్కిన్క్రీమ్ మార్చాల్సి ఉంటుందనే విషయం గుర్తెరగండి అని చెబుతున్నారు. అలాగే ఏ మాత్రం దురదగా..ఇబ్బందిగా అనిపించినా తక్షణమే ఆ ప్రదేశాన్ని నీళ్లతో శుభ్రపరుచుకుని ఆయా క్రీమ్లను కొద్దిరోజులపాటు వినియోగించకుండా ఉండటమే బెస్ట్ అని చెబుతున్నారు. ఒకరకంగా ఈ ఘటన స్కిన్క్రీమ్ల విషయంలో ఎంత జాగురకతతో వ్యవహరించాలో హైలెట్ చేసిందని చెబుతున్నారు చర్మ నిపుణులు.(చదవండి: బుల్లి ఫ్యాషన్ డిజైనర్..! జస్ట్ పదేళ్లకే..) -
‘ఆస్పత్రి మాఫియా’ ఇక లగెత్తాల్సిందే!
ప్రభుత్వ ఖజానాకు కన్నం వేసే అక్రమార్కుల ఆటలకు ఇక కాలం చెల్లింది! పేదల ఆరోగ్యం కోసం కేటాయించిన ఒక్క రూపాయి కూడా పక్కదారి పట్టకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం అత్యంత శక్తివంతమైన ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్’ (AI) అస్త్రాన్ని ప్రయోగించింది. ఆయుష్మాన్ భారత్లో చోటుచేసుకుంటున్న కోట్లాది రూపాయల క్లెయిమ్ల మోసాలను ‘ఏఐ టెక్నాలజీ’ చిటికెలో కనిపెట్టేస్తోంది. ఆస్పత్రుల అక్రమాలకు అడ్డుకట్ట వేయడమే కాకుండా, డాక్టర్లు ప్రిస్క్రిప్షన్లు టైప్ చేసే శ్రమ లేకుండా.. వారు మాట్లాడితే చాలు డిజిటల్ రిపోర్టులు తయారయ్యే విప్లవాత్మక మార్పునకు శ్రీకారం చుట్టింది. సామాన్యుడికి అందాల్సిన వైద్యం మరింత వేగంగా, నిజాయితీగా అందేందుకు ఈ డిజిటల్ మేధస్సు తోడ్పాటునందిస్తోంది.నకిలీ క్లెయిమ్లపై ఏఐ ‘సర్జరీ’దేశవ్యాప్తంగా అమలవుతున్న ఆయుష్మాన్ భారత్ పథకంలో పారదర్శకతను పెంచేందుకు నేషనల్ హెల్త్ అథారిటీ (NHA) నడుం బిగించింది. ‘నేషనల్ యాంటీ ఫ్రాడ్ యూనిట్’ (NAFU) ద్వారా రంగంలోకి దిగిన ఏఐ ఇంజిన్లు.. ఆస్పత్రులు పంపే ప్రతి క్లెయిమ్ను క్షుణ్ణంగా స్కాన్ చేస్తున్నాయి. అనవసరంగా రోగులను ఆస్పత్రులలో ఉంచుకోవడం, చికిత్స చేయకుండానే బిల్లులు వేయడం లాంటి మోసాలను ఈ వ్యవస్థ ఇట్టే పసిగడుతోంది. ఫలితంగా ప్రభుత్వం కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం కాకుండా కాపాడగలిగింది.గంటల్లోనే క్లెయిమ్ సెటిల్మెంట్గతంలో ఇన్సూరెన్స్ క్లెయిమ్ పరిష్కారానికి 15 నుండి 20 రోజుల సుదీర్ఘ సమయం పట్టేది. కానీ ఇప్పుడు టెక్నాలజీ పుణ్యమా అని కేవలం రెండు గంటల్లోనే క్లెయిమ్ ప్రక్రియ పూర్తవుతోంది. క్లౌడ్ డేటాను సెకన్లలో విశ్లేషించే ఏఐ, నిబంధనల ప్రకారం ఉన్న బిల్లులను వెంటనే ఆమోదిస్తుంది. అనుమానాస్పదంగా ఉన్న కేసులను మాత్రమే మానవ పర్యవేక్షణకు పంపి తనిఖీ చేయిస్తారు. దీనివల్ల ఆసుపత్రులకు చెల్లింపులు వేగంగా అందుతున్నాయి.డాక్టర్ల మాటతో ప్రిస్క్రిప్షన్లు రెడీ!ప్రభుత్వ ఆస్పత్రులలో ఉండే రద్దీ వల్ల డాక్టర్లు కంప్యూటర్ ముందు కూర్చుని ప్రిస్క్రిప్షన్లు టైప్ చేయడం ఒక పెద్ద సవాలుగా మారింది. దీనికి పరిష్కారంగా ‘వాయిస్-టు-టెక్స్ట్’ (VTT) సాంకేతికతను ప్రవేశపెట్టారు. డాక్టర్ పేషెంట్ను పరీక్షిస్తూ, ఏవైతే సూచనలు చేస్తారో, ఆ మాటలను ఏఐ నేరుగా డిజిటల్ టెక్స్ట్గా మారుస్తుంది. డాక్టర్లు టైప్ చేయాల్సిన అవసరం లేకుండానే, ప్రిస్క్రిప్షన్ ఆటోమేటిక్గా తయారై, హెల్త్ రికార్డుల్లో నిక్షిప్తమవుతుంది.మెరుగైన చికిత్సకు మార్గంఈ ఏఐ టూల్స్ వల్ల వైద్యులకు డాక్యుమెంటేషన్ భారం గణనీయంగా తగ్గనుంది. సాధారణంగా ఒక డాక్టర్ తన సమయాన్ని రిపోర్టులు రాయడానికే ఎక్కువ కేటాయించాల్సి వచ్చేది. అయితే వాయిస్-టు-టెక్స్ట్ విధానం వల్ల ఆ సమయం ఆదా అవుతుంది. ఫలితంగా డాక్టర్లు రోగుల సమస్యలను మరింత ఓపిగ్గా వినేందుకు, మెరుగైన చికిత్స అందించేందుకు అవకాశం కలుగుతుందని వైద్యశాఖ అధికారులు భావిస్తున్నారు.డేటా భద్రతతో కూడిన ప్లాట్ఫామ్ఈ వినూత్న మార్పులను నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ (NIC) అభివృద్ధి చేసిన ‘ఈ-హాస్పిటల్’ ప్లాట్ఫామ్లో అనుసంధానించారు. క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో సమాచారం అంతా భద్రంగా ఉండటమే కాకుండా, ఏ రాష్ట్రం నుంచైనా డేటాను విశ్లేషించే వీలుంటుంది. ఈ ఏడాది జనవరి 19 నుంచి పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చిన ఈ వ్యవస్థను ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాలకు విస్తరిస్తున్నారు.వైద్య రంగంలో డిజిటల్ భవిష్యత్తుఇటీవలి ‘ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026’లో ప్రదర్శించిన ఈ సాంకేతికతలు ఆరోగ్య రంగంలో ఒక కొత్త శకానికి నాంది పలికాయి. టెక్నాలజీ సాయంతో అక్రమాలను అరికట్టడమే కాకుండా, సామాన్యుడికి వేగవంతమైన వైద్య సేవలు అందించడమే ఈ ప్రాజెక్ట్ ప్రధాన ఉద్దేశ్యం. మానవ తప్పిదాలకు తావులేకుండా, యంత్రాల సాయంతో సాగుతున్న ఈ డిజిటల్ హెల్త్ విప్లవం భవిష్యత్తులో మరిన్ని అద్భుతాలు సృష్టించనున్నదనడంలో సందేహం లేదు.ఇది కూడా చదవండి: రాజ్యసభ బరిలో నితీష్ తనయుడు నిశాంత్? -
ఫిట్నెస్ ప్రపంచాన్ని షేక్ చేస్తున్న ‘జెఫింగ్’
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎవరికైనా సరే ఒక పెద్ద సవాలుగా మారింది. బరువు తగ్గాలని ఉత్సాహంగా పరుగు మొదలుపెట్టిన కొద్ది రోజుల్లోనే తీవ్రమైన అలసట, కండరాల నొప్పులు వచ్చేస్తుంటాయి. అటువంటి వారి కోసం ‘జెఫింగ్’ అనే సరికొత్త వ్యాయామ పద్ధతి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ట్రెండ్ అవుతోంది. ఇది కేవలం పరుగు మాత్రమే కాదు, అలాగని కేవలం నడక కూడా కాదు.. ఈ రెండింటి కలయికతో కూడిన ఒక అద్భుతమైన ఫిట్నెస్ సూత్రం... అద్భుత మంత్రం..ఎలా మొదలయ్యింది?ఒలింపిక్ రన్నర్ జెఫ్ గాల్లోవే ప్రాచుర్యంలోకి తెచ్చిన ఈ విధానానికి ఆయన పేరు మీదనే ‘జెఫింగ్’ అని పేరు వచ్చింది. ఇటీవలే తన 80 ఏళ్ల వయసులో కన్నుమూసిన గాల్లోవే.. ఫిట్నెస్ ప్రపంచానికి అందించిన అతిపెద్ద కానుక ఇది. నిర్ణీత సమయం పాటు పరిగెత్తడం, ఆ వెంటనే కొంత సమయం వేగంగా నడవడం అనే ప్రక్రియ ద్వారా శరీర సత్తువను పెంచడమే దీని ప్రధాన ఉద్దేశ్యం. బరువు తగ్గాలని ఉత్సాహంగా పరుగు మొదలుపెట్టిన కొద్ది రోజుల్లోనే తీవ్రమైన అలసట, కండరాల నొప్పులను చూసి నీరసించిపోయే వారి సంఖ్య తక్కువేమీ కాదు. అటువంటి వారి కోసం ‘జెఫింగ్’ అనే సరికొత్త వ్యాయామ పద్ధతి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ట్రెండ్ అవుతోంది.‘30-30’ మ్యాజిక్ ఫార్ములానిర్ణీత సమయం పాటు పరిగెత్తడం, ఆ వెంటనే కొంత సమయం వేగంగా నడవడం అనే ప్రక్రియ ద్వారా శరీర సత్తువను పెంచడమే ‘జెఫింగ్’ ప్రధాన ఉద్దేశ్యం. జెఫింగ్లో అత్యంత ప్రాచుర్యం పొందిన సూత్రం ‘30-30’ ఫార్ములా. అంటే 30 సెకన్ల పాటు పరుగు, ఆ వెంటనే 30 సెకన్ల పాటు చురుకైన నడక. ఇలా చేయడం వల్ల కండరాలు పూర్తిగా అలసిపోకముందే వాటికి స్వల్ప విశ్రాంతి లభిస్తుంది. దీనివల్ల సాధారణంగా పరిగెత్తే దూరం కంటే ఎక్కువ దూరం సులువుగా పరుగెత్తగలుగుతారు.సామర్థ్యం అనుసరించి మూడు స్థాయిలుఈ వ్యాయామాన్ని ప్రారంభించే వారు తమ శారీరక స్థితిని అనుసరించి మూడు స్థాయిలలో సాధన చేయవచ్చు. కొత్తగా మొదలుపెట్టే వారు 30 సెకన్ల పరుగు-నడక విరామాలను పాటించవచ్చు. మధ్యస్థ స్థాయి వారు 3 నిమిషాల పరుగుకు ఒక నిమిషం నడకను, నిష్ణాతులు 9 నిమిషాల పరుగుకు ఒక నిమిషం నడకను అనుసరించవచ్చు. అయితే ఇక్కడ గమనించాల్సిన ముఖ్య విషయం ఏంటంటే.. పూర్తిగా అలసిపోయేంత వరకు వేచి చూడకుండా, మొదటి నుంచే ఈ విరామాలను పాటించడం వల్ల కండరాల ఒత్తిడిని సమర్థవంతంగా నిర్వహించవచ్చు.నడక అంటే అదొక స్ట్రాటజీజెఫింగ్లో ‘నడక’ అంటే విశ్రాంతి అని భావించకూడదు. గుండె కొట్టుకునే వేగం తగ్గకుండా చురుకుగా సాగాలి. పరుగు తీసే సమయంలో వీపు, భుజాలు నిటారుగా ఉంచి, చేతులను 90 డిగ్రీల కోణంలో ఉంచుతూ పక్కవారిలో సులువుగా మాట్లాడగలిగే వేగంతో సాగాలి. ఒకవేళ ఊపిరి తీసుకోవడం కష్టంగా అనిపిస్తే ‘హఫ్ అండ్ పఫ్’ నిబంధన ప్రకారం పరుగు సమయాన్ని తగ్గించి, నడక సమయాన్ని పెంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.గాయాల ముప్పు తక్కువఈ క్రమబద్ధమైన విధానం వల్ల కీళ్ల మీద పడే ఒత్తిడి గణనీయంగా తగ్గుతుంది. బరువు తగ్గడమే కాకుండా, గుండె ఆరోగ్యానికి కూడా ఇది ఎంతో మేలు చేస్తుంది. సాధారణ పరుగులో ఎదురయ్యే గాయాల బారిన పడకుండా, ఎక్కువ కాలం ఫిట్నెస్ ప్రయాణాన్ని కొనసాగించేందుకు ‘జెఫింగ్’ తోడ్పడుతుంది.కండరాల నొప్పులను తగ్గించి..ఈ వ్యాయామ విధానం కండరాల నొప్పులను తగ్గించి, శరీరం త్వరగా కోలుకునేందుకు అద్భుతంగా పని చేస్తుంది. పరుగును ఒక శిక్షగా కాకుండా ఒక ఆహ్లాదకరమైన అనుభవంగా మార్చుకోవాలనుకునే వారికి ఇది ఒక సరైన మార్గం. అందుకే మీరు కూడా ఈరోజే మీ ‘జెఫింగ్’ ప్రయాణాన్ని మొదలుపెట్టి, ఆరోగ్యకరమైన జీవనశైలి వైపు అడుగులు వేయండి. ఇది కూడా చదవండి: చపాతీలు చేస్తూ చెత్త బుట్ట.. వంట మనిషిని పట్టుకున్న ఏఐ బాట్ -
జస్ట్ రెండేళ్లలో 17కిలోలు తగ్గిన టీనేజర్..!
ఇంతవరకు చూసిన వెయిట్లాస్ జర్నీలలో ఇది అత్యంత విభిన్నం. ఓ టీనేజర్ అధిక బరువు తగ్గేంచేందుకు ఎలా ప్రయత్నించాడో వివరించే వెయిట్లాస్ స్టోరీ ఇది. తన పదహారవ పుట్టిన రోజున తీసుకున్న నిర్ణయం..తనలో ఎంతలా పరివర్తనకు దారితీసిందో తెలిపాడు. అయితే జిమ్కి వెళ్లలేదని, అలాగే ఎలాంటి కఠినమైన డైట్లు పాటించలేదని అంటున్నాడు. కానీ రెండేళ్లలో 17 కిలోలు పైనే తగ్గానని అంటున్నాడు. జిమ్, డైట్ పాటించకుండా ఆ టీనేజర్ ఎలా బరువుతగ్గాడంటే..ఇంటి వ్యాయామాలతో అని చెబుతున్నాడు. అదేంటి అనుకోకండి. ఎందుకంటే తాను స్లిమ్గా ఆరోగ్యకరమైన బరువుతో ఉండాలనుకుంటున్నట్లు తల్లిదండ్రులకు చెప్పి..వారి సహాయసహకారాలతో బరువు తగ్గాడు. పేరెంట్స్ సాయంతోనే..ఇంటిలోనే చేసే వ్యాయామా పరికరాలను కొనుగోలు చేసి మరి..వర్కౌట్లకు ఉపక్రమించాడు. బరువులు ఎత్తే ప్లేట్ల తోపాటు బార్బెల్ వంటి పరకరాలతో మంచి పురోగతిని అందుకున్నాడు. మొదట్లో పుల్అప్బార్లతో వేలాడిదీసినట్లు ఉండటం దాదాపు అసాధ్యం అనిపించింది. ఒకపుల్అప్ని కూడా పూర్తి చేయలేకపోయేవాడు. అయితే క్రమం తప్పకుండా సాధన చేసి..మంచి మెరుగుదలను అందుకున్నాడు. సరైన టెక్నిక్తో ఇవాళ సుమారు 18 పుల్అప్లు దాక నిర్వహించి..కండరాల బలాన్ని పెంపొందించుకుంటున్నాడు. అలా రెండేళ్లలో చూస్తుండగానే దాదాపు 17 కిలోలు తగ్గి..చాలా స్మార్ట్గా మారిన తన పరివర్తన పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నాడు ఆ టీనేజర్. కేవలం క్రమశిక్షణ, నిబద్ధతత, క్రమం తప్పకుండా చేయడం వంటివి వెయిట్లాస్కి ప్రధానమైనవని అంటున్నాడు. బరువు తగ్గడం గురించి భయపడే వారికి తన వెయిట్లాస్ స్టోరీ ప్రేరణ అని చెప్పడమే గాక, స్లిమ్గా మారేలా ఇతరులను ప్రోత్సహిస్తానని కూడా చెబుతున్నాడు.(చదవండి: పదేపదే వైఫ్యల్యాలు, ఆర్థిక కష్టాలు..కానీ ఇవాళ సీఈవోగా విద్యార్థులకు..!) -
పగటి నిద్ర.. మరణ శాసనమే..!
‘నిద్ర తగ్గితే ఏమవుతుందిలే.. తరువాత పడుకోవచ్చు’ అని ఎవరైనా సరిపెట్టుకుంటుంటే, వారు వారి మరణ శాసనాన్ని స్వయంగా రాసుకుంటున్నారని వైద్యులు హెచ్చరిస్తున్నారు. నిద్ర అనేది కేవలం విశ్రాంతి మాత్రమే కాదు.. అది శరీర అంతర్గత వ్యవస్థలు చేసే 'రిపేర్ వర్క్'. నిద్రకు దూరమైన సమయంలో మెదడులోని ‘మాస్టర్ క్లాక్’ దిశానిర్దేశం కోల్పోయి, పిచ్చిగా ప్రవర్తించడం మొదలుపెడుతుంది. ఫలితంగా లోపల నిశ్శబ్ద యుద్ధం మొదలవుతుంది.నిద్రలేమి పరిస్థితిలో మనకు తెలియకుండానే మెలటోనిన్ ఉత్పత్తి ఆగిపోతుంది. రక్త ప్రసరణలో అసమతుల్యత ఏర్పడుతుంది. చివరికి ఊపిరితిత్తులు గాలిని పీల్చుకునేందుకు ఇబ్బంది పడతాయి. రాత్రి నిద్రను ఎగ్గొట్టి, పగలు పడుకుంటే సరిపోతుందిలే అనుకోవడం ఒక పెద్ద భ్రమ. కిటికీ తెరల నుంచి వచ్చే సన్నని వెలుతురు కూడా సరిగా నిద్ర పోనివ్వదు. ఫలితం.. పగలు ఎన్ని గంటలు పడుకున్నా తీరని అలసట, జ్ఞాపకశక్తి మందగించడం, బరువు పెరగడం లాంటి సమస్యలు తలెత్తుతాయి. ‘మాస్టర్ క్లాక్’ గందరగోళంమన మెదడులో ఉండే 'మాస్టర్ క్లాక్' ప్రకృతి వెలుతురును అనుసరించి పనిచేస్తుంది. రాత్రంతా మేల్కొని, పగలు పడుకుంటే ఈ క్లాక్ పూర్తిగా దెబ్బతింటుంది. కిటికీ రెక్కల నుంచి వచ్చే కొద్దిపాటి వెలుతురు కూడా మెలటోనిన్ ఉత్పత్తిని ఆపేస్తుంది. దీనివల్ల మీరు 10 గంటలు పడుకున్నా శరీరం మాత్రం విశ్రాంతి లేక అల్లాడిపోతూనే ఉంటుంది.మెదడు మొద్దుబారుతుందినిద్రలేమి వల్ల మొదట దెబ్బతినేది ఆలోచనా శక్తి, ఏకాగ్రత లోపించడం. చిన్న విషయాలకే విపరీతమైన చికాకు కలగడం, జ్ఞాపకశక్తి మందగించడం వంటివి దీని ప్రధాన సంకేతాలు. క్రమంగా ఇది డిప్రెషన్, యాంగ్జైటీ వంటి మానసిక సమస్యల సుడిగుండంలోకి నెట్టేస్తుంది. తరచుగా వచ్చే తలనొప్పిని కేవలం పని ఒత్తిడి అనుకుంటే పొరపాటే.. అది మీ నరాల వ్యవస్థ ఇస్తున్న హెచ్చరిక అని గుర్తుంచుకోవాలి.ఊపిరితిత్తులపై తీవ్ర ప్రభావంచాలామంది నిద్రలేమి సమమస్యను చిన్నదిగా తీసుకుంటారు. నోయిడా కైలాష్ హాస్పిటల్ నిపుణులు చెబుతున్న వివరాల ప్రకారం.. నిద్రలేమి అనేది శ్వాసకోస వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తుంది. శరీరంలోని 'సిర్కాడియన్ రిథమ్' దెబ్బతినడం వల్ల ఊపిరితిత్తుల సామర్థ్యం తగ్గిపోతుంది.రోగనిరోధక శక్తిపై..నిద్ర లేకపోతే శరీరంలోని రోగనిరోధక కణాలు పగటిపూట నిష్క్రియంగా మారిపోతాయి. ఫలితంగా సామాన్యమైన అంటువ్యాధులు కూడా శరీరంపై తీవ్రంగా దాడి చేస్తాయి. చర్మం, కళ్లు పొడిబారడం లాంటి లక్షణాలు కనిపిస్తున్నాయంటే, శరీర అంతర్గత వ్యవస్థ కుప్పకూలడానికి సిద్ధంగా ఉందని గుర్తించాలి.అకస్మాత్తుగా బరువు పెరగడంనిద్రలేమి వల్ల శరీరంలో హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటుంది. జీవక్రియ మందగించడం వల్ల.. తక్కువ తిన్నప్పటికీ శరీర బరువు అకస్మాత్తుగా పెరుగుతుంది. ఇది అధిక రక్తపోటు (BP), గుండె సంబంధిత సమస్యలకు దారితీస్తుంది.కోలుకోలేని నష్టం జరగకముందే..ఆటో ఇమ్యూన్ వ్యాధులు, దీర్ఘకాలిక అనారోగ్యాల బారిన పడకముందే అస్తవ్యస్తమైన నిద్ర అలవాట్లను మార్చుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. రాత్రిపూట మేల్కొని ఉండటాన్ని 'స్టైల్' గానో లేదా 'అలవాటు' గానో భావిస్తే, అది ఆరోగాన్ని తీవ్రంగా దెబ్బ తీస్తుంది. అందుకే ప్రకృతితో కలిసి నడవడమే ఆరోగ్యానికి ఏకైక మార్గమని వైద్యులు సూచిస్తున్నారు. ఇది కూడా చదవండి: రంగులే కాదు.. పండ్లు, బురదతోనూ రచ్చ -
హెల్త్కు సూపర్ టాపప్!
పదేళ్ల కిందట హెల్త్ ఇన్సూరెన్స్ అంటే... లక్ష రూపాయలు చాలు. ఆ మాత్రం కవరేజీ ఉంటే హ్యాపీ. ఇక రెండు లక్షలంటే లగ్జరీకిందే లెక్క. మరిప్పుడు? చాలామంది తమకు రూ.5 లక్షలు, రూ.10 లక్షలు కవరేజీ ఉన్నా సరే ధీమాగా ఉండలేని పరిస్థితి. ఎందుకంటే ఒక్కసారి ఆసుపత్రి మెట్లెక్కితే ఎన్ని పరీక్షలు ఎదుర్కోవాల్సి వస్తుందో తెలియదు. ఏ పరీక్షల్లో ఏం బయటపడుతుందో తెలియదు. దానికి ఎన్ని లక్షలవుతుందో తెలియదు. ఎందుకంటే జీవనశైలి మారిపోయింది. ఆహారపు అలవాట్లు మారిపోయాయి. అనారోగ్య సమస్యలు తీవ్రమవుతున్నాయి. దానికి తగ్గట్లే అత్యాధునిక హంగులతో కార్పొరేట్ ఆసుపత్రులు పుట్టుకొస్తున్నాయి. ఖర్చు ఏటా 14% చొప్పున పెరుగుతోందన్నది ఒక అంచనా. మరిప్పుడు ఏం చేయాలి? ఈ ప్రశ్నకు సమాధానమే టాపప్. ఆ వివరాలే ఈ ‘వెల్త్ స్టోరీ’అవసరానికి పనికిరాకుంటే హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నా లేనట్టే. ఎందుకంటే మన ఆరోగ్యానికి ఎంత బీమా కవరేజీ ఉన్నదనేది ఇప్పుడు ప్రధానం కాదు. అది ఎంతవరకూ అవసరానికి పనికొస్తుందన్నదే ప్రధానం. చాలామందికి రూ.5 లక్షలు లేదా రూ.10 లక్షల కవరేజీ ఉంటోంది. చాలా సందర్భాల్లో అది సరిపోతుంది. కానీ పెద్ద ప్రమాదం జరిగితేనో, కేన్సర్ వంటి మహమ్మారి చికిత్సలు అవసరమైతేనో అది ఎంతమాత్రం చాలదు. ఎందుకంటే కేన్సర్ చికిత్సకు దాని స్టేజ్ను బట్టి ఆరంభంలో రూ.15 లక్షల వరకు కూడా ఖర్చు అవుతుంటుంది. ఇక వైద్యం ఎప్పటికప్పుడు ఆధునికతను సంతరించుకుంటూ ఉండటంతో చికిత్సల వ్యయాలూ అదే స్థాయిలో పెరుగుతున్నాయి. 14 శాతంగా ఉంటున్న వైద్య ద్రవ్యోల్బణం మనకు తెలియకుండానే.. మన బీమా రక్షణ కవరేజీ సామర్థ్యాన్ని తినేస్తోంది. గతంలో రూ.3000 ఉన్న ఆసుపత్రి రూమ్ చార్జీ ఇపుడు రూ.6వేలు దాటిపోయింది. ఇపుడు తీసుకున్న రూ.5 లక్షల బీమా ఐదేళ్ల తర్వాత రూ.2.5 లక్షలకు సమానం. కనుక మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఆరోగ్య బీమానూ సమీక్షించుకోవాలి. ప్రీమియం భారం..? వైద్య చికిత్సల వ్యయాలు, క్లెయిమ్లకు అనుగుణంగా బీమా సంస్థలు ప్రీమియంను సవరిస్తుంటాయి. దీంతో కరోనా తర్వాతి కాలంలో హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంలు 50 శాతానికి పైనే పెరిగాయి. అధిక ఆయుర్దాయం, పెరిగిపోతున్న వ్యాధులు, కరోనా విపత్తు అనంతరం ఆరోగ్య సమస్యలతో కంపెనీలపై క్లెయిమ్ల భారం పడడం ఈ పరిస్థితికి కారణం. ఇక వయసును బట్టి ప్రీమియంల పెంపు సహజంగానే చూస్తుంటాం. 35– 40, 45–50, 60 తర్వాత ప్రీమియం ఎంతలేదన్నా 20 శాతం మేర పెరుగుతుంటుంది. కనుక చాలా మంది మధ్య తరగతి కుటుంబాలకు భారీ ప్రీమియంతో ప్రాథమిక హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ (బేసిక్ ఇండెమ్నిటీ ప్లాన్) తీసుకోవడం కష్టమే. ఈ పరిస్థితుల్లో తక్కువ ప్రీమియానికి అదనపు రక్షణనిచ్చే టాపప్, సూపర్ టాపప్ ప్లాన్ల గురించి, ఇవి ఏ రకంగా ఉపయోగపడతాయన్నది తప్పకుండా తెలుసుకోవాలి. టాపప్ ప్లాన్లు.. పరిమిత ప్రీమియానికి అదనపు ఆరోగ్య బీమా రక్షణను టాపప్, సూపర్ టాపప్లు అందిస్తుంటాయి. బేస్ పాలసీ కవరేజీని రూ.5 నుంచి రూ.15 లక్షలకు పెంచుకోవాలంటే ప్రీమియం చాలా ఎక్కువుంటుంది. కానీ రూ.15 లక్షల సూపర్ టాపప్ ప్రీమియం చాలా తక్కువ. ఇవి బేస్ పాలసీతో అనుసంధానమై పనిచేస్తాయి. ‘డిడక్టబుల్’ (తగ్గించడం) ఇక్కడ కీలకం. టాపప్ అయినా, సూపర్ టాపప్ అయినా కనీస డిడక్టబుల్తో వస్తాయి. ఉదాహరణకు రూ.5 లక్షల డిడక్టబుల్తో రూ.50 లక్షలకు టాపప్ లేదా సూపర్ టాపప్ తీసుకున్నారనుకుంటే.. హాస్పిటల్ బిల్లు రూ.5 లక్షల్లోపే ఉంటే టాపప్, సూపర్ టాపప్తో పని ఉండదు. బేస్ పాలసీలోనే క్లెయిమ్ పరిష్కారం అవుతుంది. బిల్లు రూ.5 లక్షలు దాటినప్పుడు ఈ ప్రత్యేక ప్లాన్లు యాక్టివ్గా మారతాయి. అదనపు మొత్తాన్ని అందిస్తాయి. బిల్లు రూ.8 లక్షలు వచి్చందనుకుందాం. అప్పుడు బేస్ పాలసీ రూ.5 లక్షలు, టాపప్ లేదా సూపర్ టాపప్ రూ.3 లక్షలు చెల్లిస్తాయి. రెండూ వేర్వేరు.. ఇక్కడ టాపప్, సూపర్ టాపప్ రెండూ డిడక్టబుల్తో వచ్చినప్పటికీ.. కొంత స్పష్టమైన వైరుధ్యం ఉంది. టాపప్, సూపర్ టాపప్ రెండూ ‘డిడక్టబుల్’ దాటిన సందర్భాల్లో అమల్లోకి వస్తాయి. ఇందులో టాపప్ ప్లాన్ అనేది ఒకసారి ఆసుపత్రిలో చేరినపుడు ఆ క్లెయిమ్ మొత్తం డిడక్టబుల్ మొత్తాన్ని మించినప్పుడే అమలవుతుంది. సూపర్ టాపప్ అలా కాదు. ఒక బిల్లు డిడక్టబుల్ను మించిన సందర్భాల్లోనూ చెల్లింపులు చేస్తుంది. అలాగే, ఒక పాలసీ సంవత్సరంలో విడిగా ఒక్కో బిల్లు డిడక్టబుల్ దాటకుండా.. అన్నీ కలసి డిడక్టబుల్ను మించిన సందర్భంలోనూ చెల్లింపులు చేస్తుంది. పాలసీ కవరేజీబేస్ ప్లాన్ రూ.10 లక్షలు టాపప్ రూ.20 లక్షలు సూపర్ టాపప్ రూ.20 లక్షలు డిడక్టబుల్ రూ.10 లక్షలుఒక ఏడాదిలో క్లెయిమ్లు మొదటి క్లెయిమ్ 4 లక్షలు రెండో క్లెయిమ్ 3.50 లక్షలు మూడో క్లెయిమ్ 4.50 లక్షలు మొత్తం రూ.12 లక్షలు → ఇందులో టాపప్ ప్లాన్ కింద ఎలాంటి చెల్లింపులు రావు. ఎందుకంటే విడిగా ప్రతీ క్లెయిమ్ డిడక్టబుల్ రూ.10 లక్షలుమించలేదు. → సూపర్ టాపప్ ప్లాన్ మాత్రం విడిగా ఒక క్లెయిమ్ అనే కాకుండా, ఒక ఏడాదిలో మొత్తం క్లెయిమ్లు రూ.10 లక్షలు మించినా యాక్టివేట్ అవుతుంది. కనుక రూ.10 లక్షలు డిడక్టబుల్ పోను మిగిలిన రూ.2 లక్షలు చెల్లిస్తుంది. ఒక ఏడాదిలో ఎన్ని సందర్భాలు ఆస్పత్రిలో చేరారన్న దానితో సంబంధం లేకుండా డిడక్టబుల్ దాటిన తర్వాత నుంచి ఆ పాలసీ సంవత్సరంలో అయ్యే వ్యయాలు అన్నింటికీ పాలసీ గరిష్ట పరిమితి మేరకు చెల్లింపులు లభిస్తాయి. రూ.10 లక్షల డిడక్టబుల్తో రూ.20 లక్షలకు సూపర్ టాపప్ తీసుకుంటే.. ఒక ఏడాదిలో రూ.10 లక్షలు మించి, రూ.20 లక్షల వరకు పాలసీ నిబంధనల మేరకు చెల్లింపులు అందుకోవచ్చు. → టాపప్లో ఈ ఫీచర్ లేదు. ఏ బిల్లు అయినా డిడక్టబుల్ దాటినప్పుడే యాక్టివేట్ అవుతుంది. → ఒక ఏడాదిలో ఎన్ని సందర్భాల్లో వైద్యం అవసరమవుతుందో తెలియదు. ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్ అన్నది కుటుంబం అంతటికీ ఉద్దేశించినది. ఒక ఏడాదిలో ఒకరు ఆస్పత్రి పాలై బేసిక్ కవరేజీ ఖర్చయిపోయితే, అదే ఏడాది అదే కుటుంబంలో మరొకరికి వైద్యం అవసరం పడొచ్చు. అటువంటప్పుడు సూపర్ టాపప్ ప్లాన్ ఆదుకుంటుంది. ముఖ్యంగా కరోనా వంటి విపత్తులు, వైరల్ ఇన్ఫెక్షన్లు, ప్రమాదాల కారణంగా ఒకే ఏడాది కుటుంబంలో ఒకరికి మించి వైద్యం అవసరం ఏర్పడొచ్చు. ఏది తీసుకోవాలి..? → వివాహం కాని వారు, ఇండివిడ్యువల్ హెల్త్ ఇన్సూరెన్స్తోపాటు టాపప్ ప్లాన్ తీసుకోవచ్చు. → కుటుంబం అంతటికీ ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్ తీసుకునే వారికి సూపర్ టాపప్ అనుకూలం. → బేసిక్ ఇండెమ్నిటీ హెల్త్ ప్లాన్ కంపెనీ నుంచే టాపప్ లేదా సూపర్ టాపప్ తీసుకోవాలని లేదు. ఐఆర్డీఏఐ నిబంధనల ప్రకారం ఇది తప్పనిసరి కాదు. పాలసీదారులు తమకు నచి్చన సంస్థ నుంచి ఈ రక్షణలను ఎంపిక చేసుకోవచ్చు. → ఒకే కంపెనీ నుంచి బేసిక్ ప్లాన్, టాపప్/సూపర్ టాపప్ ఉంటే క్లెయిమ్లు సాఫీగా పరిష్కారం అవుతాయి. టాపప్–సూపర్ టాపప్ క్లెయిమ్ కోసం పెద్దగా శ్రమ పడక్కర్లేదు. → టాపప్– సూపర్ టాపప్ ప్లాన్ ప్రీమియం తక్కువ కోరుకుంటే, వేర్వేరు కంపెనీల నుంచి ఎంపిక చేసుకోవాల్సి రావచ్చు. → బేసిక్ ప్లాన్, టాపప్/సూపర్ టాపప్ కవరేజీల్లో ఏకరూపత ఉంటే మంచిది.వీటిపై ఫోకస్ చేయండి.. → బీమా కంపెనీ ఆస్పత్రుల నెట్వర్క్ ఎంత బలంగా ఉందో చూడాలి. తాము నివసించే ప్రాంతంలో దాదాపు అన్ని ముఖ్యమైన ఆస్పత్రులు బీమా కంపెనీ నగదు రహిత ఆస్పత్రుల నెట్వర్క్లో ఉంటే నయం. → ఆస్పత్రిలో చేరాల్సిన అవసరం లేకుండా.. అదే రోజు చికిత్స తీసుకుని వెళ్లిపోయే (డే కేర్ ప్రొసీజర్స్) చికిత్సలకు (అన్నింటికీ) కవరేజీ ఉన్నాయేమో ధ్రువీకరించుకోవాలి. → ఆస్పత్రిలో చేరడానికి ముందు.. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత ఎక్కువ రోజులకు కవరేజీ ఉండాలి. → అత్యాధునిక రోబోటిక్, లేజర్ సర్జరీలకు పాలసీలో చెల్లింపుల ప్రయోజనాలు ఉంటే మెరుగు. → ముందస్తు వ్యాధులకు కవరేజీ ఎంత వెయిటింగ్ తర్వాత అమల్లోకి వస్తాయో తెలుసుకోవాలి. → ముఖ్యంగా రీసోర్టేషన్ ప్రయోజనం ఉంటే మంచిది. అంటే ఒక ఏడాదిలో కుటుంబంలో ఒకరు ఆస్పత్రిలో చేరడం వల్ల సమ్ అష్యూర్డ్ మొత్తం ఖర్చయిపోతే.. తిరిగి అంతే మొత్తాన్ని తదుపరి వైద్యానికి బీమా సంస్థ పునరుద్ధరిస్తుంది. → ఎంపిక చేసుకునే పాలసీల ప్రీమియం భరించగలిగే స్థాయిలోనే ఉండేలా చూసుకోవాలి. తగినంత కవరేజీ.. → చాలా కుటుంబాలు తమ అవసరాలకు సరిపడా రక్షణను (సమ్ అష్యూర్డ్) ఎంపిక చేసుకోవడం లేదని ఎన్నో సర్వేల్లో తేలింది. మెజారిటీ పాలసీదారుల రక్షణ అవసరానికంటే తక్కువే ఉంటోంది. → కుటుంబంలో ఎంత మంది సభ్యులు ఉన్నారు, వారికి అప్పటికే ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయా? తాము నివసించే ప్రాంతం, ఆ ప్రాంతంలో వైద్యానికి అయ్యే వ్యయాల ఆధారంగా కవరేజీని నిర్ణయించుకోవాలన్నది నిపుణుల సూచన. → కనీసం రూ.10 లక్షల సమ్ అష్యూర్డ్తో బేసిక్ ప్లాన్, రూ.10 లక్షల డిడక్టబుల్తో రూ.50 లక్షలు లేదా రూ.కోటికి సూపర్ టాపప్ ప్లాన్ తీసుకోవడం సముచితంగా ఉంటుంది. దీనివల్ల నేటి వ్యయాలకే కాకుండా, భవిష్యత్తు వ్యయాలకు సైతం రక్షణను ఏర్పాటు చేసుకున్నట్టు అవుతుంది. -
ఆఫీసులో పని ఒత్తిడి... కుటుంబ సభ్యులపై కోపం
రోజంతా ఆఫీసులో బాస్ మాటలు, డెడ్లైన్ల ఒత్తిడి.. ఈ కోపాన్నంతా లోపలే దాచుకుని సాయంత్రం ఇంటికి వస్తారు. తలుపు తీయగానే పిల్లలు ఏదో అడిగితేనో, భార్య చిన్న ప్రశ్న అడిగితేనో ఒక్కసారిగా పేలిపోతారు. మరుక్షణమే "ఎందుకు అంత కోప్పడ్డాను?" అని గిల్టీగా ఫీల్ అవుతారు. దీన్ని Displaced Aggression అంటారు. అంటే, ఆఫీసులో ఎవరినీ ఏమీ అనలేక, ఆ కోపాన్నిఇంట్లో చూపించడం. దీనివల్ల ఇంట్లో ప్రశాంతతే కాదు, కుటుంబ సంబంధాలు కూడా దెబ్బతింటాయి.కుటుంబం మీదే ఎందుకు?ఆఫీసులో మీకు కోపం తెప్పించిన బాస్ను మీరు తిరిగి ఏమీ అనలేరు. ఎందుకంటే అది మీ కెరీర్కు ప్రమాదం. కానీ, ఆ కోపం ఎక్కడో ఒకచోట బయటకు రావాలి. అందుకే, అత్యంత సురక్షితమైన ప్రదేశం.. అంటే మీ ఇల్లు, మీ కుటుంబ సభ్యులు ఆ కోపానికి బలవుతారు. ఇది బలహీనత కాదు, ఒక రకమైన 'ఎమోషనల్ బ్లీడింగ్'.నా దగ్గరికి వచ్చిన రమేష్ (పేరు, వివరాలు మార్చాను) ఒక కార్పొరేట్ కంపెనీలో మేనేజర్. ఆఫీసులో పాలిటిక్స్ వల్ల అతను తీవ్ర ఒత్తిడిలో ఉండేవాడు. ఇంటికి రాగానే అతని భార్య కబుర్లు చెప్పేది. కానీ అతను వినలేకపోయేవాడు. "నాకు ఆఫీసులో తలనొప్పి చాలదు అన్నట్టు, ఇంటికి రాగానే నీ నసేంటి" అని గట్టిగా అరిచేవాడు. ఆ మాటలు అతని భార్యను ఎంతగానో బాధించేవి. రమేష్ తన కోపాన్ని ఆఫీసులో వదిలేయకుండా, ఇంటికి కూడా తెచ్చుకోవడమే అసలైన సమస్య.కుటుంబానికి విముక్తి ఎలా? 1. Decompression Period: ఆఫీసు నుండి ఇంటికి వెళ్లిన వెంటనే కుటుంబంతో కలవకండి. ఒక 15-20 నిమిషాలు మీ కోసం కేటాయించండి. స్నానం చేయడం, కాసేపు ప్రశాంతంగా కూర్చోవడం, సంగీతం వినడం చేయండి. ఇది ఆఫీసు ఒత్తిడిని మీ మనసు నుండి తొలగిస్తుంది.2. Voice Out: మీ మనసులో ఆఫీసు పట్ల ఉన్న అసహనాన్ని ఇంట్లో చెప్పకండి. దానికి బదులు, ఇంటికి వచ్చే దారిలో ఒక మంచి ఫ్రెండ్తో మాట్లాడండి లేదా ఆఫీసులో జరిగిన కోపాన్ని ఒక డైరీలో రాసి పెట్టండి. అది మీలోని కోపాన్ని తగ్గించే 'వెంటిలేషన్' లా పనిచేస్తుంది.3. ఫోన్/మెయిల్ ఆఫ్ చేయండి: ఇంటి గుమ్మం తొక్కే ముందే మీ ఫోన్ లోని ఆఫీస్ యాప్స్ నోటిఫికేషన్లను ఆఫ్ చేయండి. ఇంటికి వచ్చాక కూడా ఆఫీస్ గురించి ఆలోచిస్తుంటే, మీరు ఫిజికల్ గా ఇంట్లో ఉన్నా, మెంటల్ గా ఆఫీసులోనే ఉంటారు.4. "ఐ యామ్ స్ట్రెస్డ్" అని చెప్పండి: "ఈరోజు ఆఫీసులో చాలా ఒత్తిడి ఉంది, నాకు కాసేపు ప్రశాంతంగా ఉండాలనిపిస్తోంది. కాసేపు నన్ను డిస్టర్బ్ చేయకండి" అని ఇంట్లో వాళ్లకు చెప్పడంలో తప్పులేదు. ఇది మీ కోపాన్ని అరిచే వరకు వెళ్ళకుండా ఆపుతుంది.5. కుటుంబమే మీ శక్తి: కోపం వస్తున్నప్పుడు ఒక్కసారి ఆలోచించండి.. "ఈరోజు నేను కష్టపడి పనిచేసింది ఎవరి కోసం? నా కుటుంబం కోసమే కదా!" అప్పుడు ఆ కుటుంబ సభ్యుల మీద కోపం రాదు, ఒక రకమైన కృతజ్ఞత కలుగుతుంది.మీ కోసం ఒక చిన్న పరీక్ష...ఈ సాయంత్రం ఇంటికి వెళ్లేటప్పుడు మిమ్మల్ని మీరు ఒక ప్రశ్న అడగండి: "నేను ఇప్పుడు నా ఆఫీసు కోపాన్ని నా వాళ్లకు బహుమతిగా ఇస్తున్నానా? లేక నా ప్రేమను ఇస్తున్నానా?"కెరీర్లో గెలవడం ఎంత ముఖ్యమో, మనసున్న మనుషుల ప్రేమను గెలుచుకోవడం అంతకంటే ముఖ్యం. గుర్తుంచుకోండి.. ఆఫీసు మీ శ్రమను అడుగుతుంది, కానీ కుటుంబం మీ చిరునవ్వును, మీ సమయాన్ని కోరుకుంటుంది. ఆఫీసు కోపాన్ని ఆఫీసులోనే వదిలేయండి, సంతోషాన్ని ఇంటికి తీసుకెళ్లండి.సైకాలజిస్ విశేష్కెరీర్ & మైండ్సెట్ కోచ్8019 000066www.psyvisesh.com -
హార్ట్బీట్ 120 దాటినప్పుడల్లా..14 సెకన్లపాటు ఆగిపోయే గుండెజబ్బు..!
పుట్టుకతో వచ్చే రెండు రకాల గుండె లోపాలతో జన్మించిన కార్షియాక్ స్పెషలిస్ట్ అయినా ఆ మహిళ అలుపెరగని పోరాటం చేసి మరి జీవిస్తోందామె. ఒకటి, రెండు కాదు ఏకంగా తొమ్మిది ఆపరేషన్లు చేయించుకున్నా ఆశా అనే జ్యోతిని వెలిగిస్తూ..తన ప్రాణాన్ని నిలబెట్టుకుంది. ప్రాణాంతకమైన ఆ గుండె పరిస్థితిని మందులతో నిర్వహిస్తూనే ఆరోగ్యకరంగా జీవిస్తూ..స్ఫూర్తిగా నిలుస్తున్నారు. చిన్నపాటి అనారోగ్య పరిస్థితికి కుంగిపోయే వారికి ఆమె కథ ఓ ప్రేరణపుట్టుకతో వచ్చే గుండె లోపాలతో జన్మించిన కార్డియాక్ స్పెషలిస్ట్ ఏంజెలికి అసిమాకి ఇంటర్మెటెంట్ ఏవీ బ్లాక కారణంగా 14 సెకన్లపాట్లు గుండె ఆగిపోయే పరిస్థితితో పోరాడుతోందామె. ప్రాణాంతకమైన పరిస్థితిలో పోరాడుతున్న ఆమెకు సరిగ్గా 36 ఏళ్ల వయసులో వచ్చిన స్ట్రోక్ మరోసారి కుప్పకూలిపోయేలా చేసింది. అప్పుడే తెలిసింది ఈ ప్రాణాంతక పరిస్థితికి తోడు గుండెలో "గ్యాపింగ్ హోల్" కూడా ఉందని నిర్థారణ అయ్యింది. ఆమెది ఆకస్మిక కార్డియాక్ మ సంబంధం ఉన్న పరిస్థితికి ఇది మరింత ప్రమాదకరమైన సంకట స్థితి.ఎప్పటి నుంచి పోరాడుతోందంటే..25 ఏళ్ల వయసులో ఏంజెలికీ తొలిసారిగా తనకు గుండెజబ్బుకి సంబంధించిన లక్షణాలు తొలిసారిగా కనిపించాయని చెప్పుకొచ్చింది. నెమ్మదిగా తలతిరడం నుంచి మొదలై నెలలుగా మూర్చపోయే వరకు దారితీసింది. గుండె జబ్బుల కుటుంబ చరిత్ర లేకపోయినా..ఆమె ప్రాణాంతక గుండెజబ్బు బారినపడింది. పలు వైద్య పరీక్షల అనంతరం ఆమె హృదయస్పందన నిమిషానికి 120 బీట్స్ దాటినప్పుడల్లా ఆమె గుండె 14 సెకన్ల వరకు ఆగిపోతుందని వైద్యులు నిర్ధారించారు. దీని కారణంగా గుండెలో "పై నుంచి దిగువ గదులకు విద్యుత్ ప్రవహించదు, కాబట్టి ఆమెకు పేస్మేకర్ అవసరం. ఈ తీవ్రమైన గుండె జబ్బు గురించి వినడంతోనే ఏంజెలి ఇక తన జీవితం ముగిసిపోయిందనుకుంది. ఎందుకంటే బెడరూమ్ నుంచి బాత్రూమ్ వరకు కూడా వెళ్లలేనంతగా స్ప్రుహతప్పి పడిపోయేది. ఆ తర్వాత ఏంజెలికి ఫేస్మేకర్ని అమర్చారు. 1990లలో ఈ యంత్రంలో అనేక సమస్యలతో రావడంతో మళ్లీ కష్టాలు మొదలయ్యాయి ఆమెకు. ముఖ్యంగా బ్యాటరీలను నిరంతరం మార్చాల్సి వచ్చేది. ఆ క్రమంలో మెదడులోని రక్తనాళం పగిలి రక్తస్రావం కావడంతో స్ట్రోక్ను ఎదుర్కొంది. దాంతో ఆమెకు ఓపెన్-హార్ట్ సర్జరీతో సహా ఐదు ఫేస్మేకర్లు, మూడు అబ్లేషన్ల, ఒక ఓపెన్-హార్ట్ సర్జరీతో సహ తొమ్మిది వైద్య చికిత్సలు తీసుకుంది. ఇలా ఆమె జీవితాంతం ఇన్ని అనారోగ్య సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ..లండన్ నుండి కార్డియోమయోపతిలో పిహెచ్డి పూర్తి చేసింది, తర్వాత హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో ఇంటర్న్ చేసింది, అక్కడ ఆమె ఫ్యాకల్టీ సభ్యురాలిగా పనిచేసింది,. అలాగే అమెరికాలో 11 ఏళ్లు గడిపింది. అంతేగాదు ఏంజెలి తనలాంటి గుండె సమస్యతో బాధపడుతున్న వారికోసం..ఆ వ్యాధి నిర్థారణ పర్యవేక్షణ కోసం..ఒక పద్ధతిని ఆవిష్కరించింది. ఇది ప్రమాదకరమైన గుండె బయాప్సీలకు సురక్షితమైన ప్రత్యామ్నాయాన్ని అందిస్తుంది. ఇక ఏంజెలికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అదీగాక ఏంజెలి పుట్టుకతో వచ్చే గుండెజబ్బు కారణంగా అనేక గర్భస్రావాలను ఎదుర్కొని మరి..ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చారామె. అయితే ఆ పిల్లలు ఇద్దరు పూర్తి స్థాయిలో ఆరోగ్యంగా ఉన్నారు. పుట్టుకతో వచ్చే గుండె సమస్యల లోపాన్ని అధిగమించడమే కాకుండా దాన్నే తన కెరీర్గా ఎంచుకుని..ఆ సమస్యకు చెక్పెట్టే దిశగా అడుగులు వేయడం నిజంగా ప్రశంసించదగ్గ విషయం.(చదవండి: ఆర్మీ ట్రైనింగ్ సెంటర్లో మెనింగోకాకల్ ఇన్ఫెక్షన్ కలకలం..! ఎందువల్ల వస్తుందంటే..) -
ఆర్మీ ట్రైనింగ్ సెంటర్లో మెనింగోకాకల్ ఇన్ఫెక్షన్ కలకలం..! ఎందువల్ల వస్తుందంటే..
షిల్లాంగ్లోని ఆర్మీ శిక్షణా కేంద్రంలో ఇద్దరు అగ్నివీర్ శిక్షణార్థులు అనుమానిత మెనింగోకాకల్ ఇన్ఫెక్షన్ బారినపడి గంటల వ్యవధిలోనే మరణించారు. ఒక్కసారిగా అస్సాం రెజిమెంటల్ సెంటర్ ఉలక్కిపడింది. సత్వరమై సైనిక సౌకర్యంలో చుట్టుపక్కల కాంటాక్ట్ ట్రేసింగ్, ఆయా వ్యక్తులతో టచ్లో ఉన్నవారిని ఐసోలేషన్లో ఉంచడం తదితరాలతో వ్యాధి వ్యాప్తి చెందకుండా నిరోధించేలా సత్వరమే అన్ని చర్యలు చేపట్టింది. కేవలం ఆర్మీ శిక్షణా కేంద్రంలోనే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాలపై కూడా గట్టి నిఘా ఉంచినట్లు స్థానిక ఆరోగ్య అధికారులు తెలిపారు. ఇంతకీ అసలేంటి మెనింగోకాకల్ వ్యాధి ..? ఎందువల్ల వస్తుందంటే..?మెనింగోకాకల్ వ్యాధి అంటే ..?మెనింజైటిస్ మెదడు, వెన్నుపాము చుట్టూ ఉన్న కణజాలాల వాపుకు కారణమవుతుంది. ఈ వ్యాధిని ప్రపంచ ఆరోగ్యానికి ఒక తీవ్రమైన ముప్పుగా అభివర్ణించింది ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ). ఇది అనేక రకాల బ్యాక్టీరియాలు, వైరస్లు, శిలీంధ్రాలు, పరాన్నజీవుల వల్ల సంభవిస్తుందని WHO పేర్కొంది. అయితే ఇది అంటువ్యాధి లాంటిదేనా..? కాదా అనేది కచ్చితంగా చెప్పలేమని అంటున్నారు వైద్యులు.బాక్టీరియల్ మెనింజైటిస్ అత్యంత తీవ్రమైన రకం మెనింజైటిస్ అని WHO చెబుతోంది. దీని కారణంగా రోగికి తీవ్రమైన, ప్రాణాంతక పరిస్థితి ఏర్పడుతుందని తెలిపింది. మెనింగోకోకస్ అనేది నీసేరియా మెనింగిటిడిస్ అనే బాక్టీరియా వల్ల కలిగే బాక్టీరియల్ మెనింజైటిస్.వ్యాధి లక్షణాలుక్లీవ్ల్యాండ్ క్లినిక్ ప్రకారం మెనింగోకాకల్ వ్యాధి యొక్క కొన్ని సాధారణ లక్షణాలు:ప్రకాశవంతమైన కాంతి వల్ల ఇబ్బంది పడటంవిరేచనాలుజ్వరంతలనొప్పివాంతులుముదురు రంగులోకి మారినట్లు కనిపించే చర్మ దద్దుర్లుగట్టి మెడగందరగోళం,చిరాకుచాలా నిద్రమత్తుగా అనిపించడంనడవడానికి లేదా నిటారుగా ఉండటానికి ఇబ్బందివిపరీతమైన మంటలు, నొప్పులుకీళ్లు, కండరాల నొప్పిఆకలి లేకపోవడంఎవరికీ ఈ ప్రమాదం అధికం అంటే..ఈ ఇన్ఫెక్షన్ ఏ వ్యక్తినైనా ప్రభావితం చేయవచ్చు, అయితే, కొంతమందికి ఎక్కువ ప్రమాదాలు ఉంటాయి. ఒక సంవత్సరం కంటే తక్కువ వయస్సు ఉన్నవారు, టీనేజర్ లేదా చిన్న వయస్సులో ఉన్నవారుప్లీహ గాయం లేదా ప్లీహము లేకపోవడంసికిల్ సెల్ వ్యాధి ఉన్నవాళ్లకుకాంప్లిమెంట్ ఇన్హిబిటర్ మందులు తీసుకునేవాళ్లుమెనింగోకాకల్ వ్యాధి సాధారణంగా ఉండే ప్రాంతాలను సందర్శించడం వల్లదీనికారణంగా ఎదురయ్యే అనారోగ్య సమస్యలు..బాధిత వ్యక్తులు వెంటనే వైద్య చికిత్స పొందకపోతే ప్రాణాంతకంగా మారే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు, చికిత్స పొందినప్పటికీ ప్రజలు చనిపోవచ్చు. ఈ వ్యాధి కారణంగా ఎదురయ్యే సమస్యలు..మెదడు దెబ్బతినడంమూత్రపిండాల నష్టంఅవయవాలు కోల్పోవడంనరాల దెబ్బతినడంపూర్తిగా వినికిడి లోపంనివారణ చర్యలువ్యాక్సిన్లు సాధారణ రకాల బాక్టీరియల్ మెనింజైటిస్ నుంచి ఉత్తమ రక్షణను అందిస్తాయని WHO చెబుతోంది. మెనింగోకాకస్, న్యుమోకాకస్, హేమోఫిలస్ ఇన్ఫ్లుఎంజా టైప్ బి (Hib) వల్ల కలిగే మెనింగోకాకల్ వ్యాధిని టీకాలు నిరోధించగలవు. ఇతర నివారణ చర్యలు..11-12 సంవత్సరాల వయస్సులో మెనింగోకాకల్ కంజుగేట్ (MenACWY) వంటి టీకాలు వేయించడం.16 ఏళ్ల లోపు వాళ్లకు బూస్టర్డోస్లు వేయించడం. అలాగే సెరోగ్రూప్ B నుంచి అదనపు రక్షణ కోసం సిఫార్సు చేసిన MenB టీకాలు వేయించడం. టీకాలు సాధారణ జాతులను (A, C, W, Y, B) లక్ష్యంగా చేసుకుంటాయి. టీనేజ్ పిల్లలు, టీనేజర్లు, HIV లేదా అస్ప్లెనియా వంటి ఆరోగ్య ప్రమాదాలు ఉన్నవారికి ఈ టీకాలు వేయించడం మంచిది.పరిశుభ్రత పద్ధతులు: ముఖ్యంగా బాత్రూమ్ ఉపయోగించిన తర్వాత లేదా తినడానికి ముందు సబ్బుతో తరచుగా చేతులు కడుక్కోండి. కడగని చేతులతో కళ్ళు, ముక్కు లేదా నోటిని తాకకుండా ఉండండి. పానీయాలు, ఆహారం, పాత్రలు, లిప్స్టిక్లు లేదా సిగరెట్లను పంచుకోవద్దు, దగ్గు/తుమ్ము వచ్చినప్పుడు చేతులు లేదా జేబురుమాల్ అడ్డుపెట్టుకోవడం. ఈ చర్యలు తీసుకుంటే శ్వాసకోశ బిందువుల ద్వారా వ్యాప్తి చెందే ఈ బ్యాక్టీరియాను కట్టడి చేయొచ్చు. ముఖ్యంగా దద్దుర్లు, మెడనొప్పి, జ్వరం వంటి లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యం సహాయం తీసుకోవడం ఉత్తమం. గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. మరిన్ని వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: రీల్స్ పిచ్చి వర్సెస్ చదువు..!) -
దేశవ్యాప్తంగా 14 ఏళ్ల బాలికలకు HPV టీకాలు : ప్రధాని మోదీ
రాజస్థాన్లోని అజ్మీర్లో శుక్రవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా హ్యూమన్ పాపిల్లోమావైరస్ (HPV vaccination) టీకా కార్యక్రమాన్ని ప్రారంభించారు. మహిళల్లో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్తోపాటు, నివారించదగిన మరికొన్ని రకాల క్యాన్సర్లను అరికట్టడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమం ప్రారంభించిన తర్వాత, రాష్ట్రంలో జరిగిన ర్యాలీలో ప్రధాని ప్రసంగించారు. NDA ప్రభుత్వం అన్ని స్థాయిలలో అభివృద్ధిని నిర్ధారించాలని నిశ్చయించుకుందని, HPV టీకా ప్రారంభం దానికి నిదర్శనమని పేర్కొన్నారు.అన్ని రాష్ట్రాలు .కేంద్రపాలిత ప్రాంతాలలో ప్రతీ ఏడాది 14 ఏళ్ల సుమారు 1.15 కోట్ల మంది బాలికలకు ‘గార్డాసిల్’ అనే టీకాను ఉచితంగా అందించాలనేది లక్ష్యం. ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలలో ఈ వ్యాక్సిన్ ఉచితంగా అందించబడుతుంది. ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు (ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు), కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాలు, ఉప-జిల్లా ,జిల్లా ఆసుపత్రులు, అలాగే ప్రభుత్వ వైద్య కళాశాలలు, ఆసుపత్రులలో ఈ టీకాలు అందుబాటులో ఉంటాయి.ఇదీ చదవండి: Liquor Policy: కేజ్రీవాల్కు క్లీన్ చిట్, అన్నా హజారే కీలక వ్యాఖ్యలుభారతదేశంలో 80 కంటే ఎక్కువ గర్భాశయ క్యాన్సర్ కేసులకు కారణమైన హై-రిస్క్ రకాల హ్యూమన్ పాపిల్లోమా వైరస్ (HPV), గర్భాశయ క్యాన్సర్, (ముఖ్యంగా హెచ్పీవీ టైప్ 16, 18) ప్రముఖ క్యాన్సర్లలో ఒకటిగా ఉంది. ఈ వ్యాక్సిన్ హెచ్పీవీ టైప్ 16, 18తోపాటు టైప్ 6, 11 రకాల నుంచి కూడా రక్షణ కల్పిస్తుందని కేంద్రం తెలిపింది. ఇదీ చదవండి: ప్రియుడి మోసం: ఇదే అదునుగా అగంతకుడి దారుణ హత్యాచారం -
ముప్పై ఏళ్లకే గుల్లబారుతున్నాయి
మహిళల ఆరోగ్యంలో ఎముకల క్షీణత (ఆస్టియో పోరోసిస్) ఒక ప్రధాన సంక్షోభంగా మారుతోంది. ఒకప్పుడు మెనోపాజ్ దాటిన మహిళల్లో మాత్రమే కనిపించే ఈ వ్యాధి నేడు 30 ఏళ్లకే ముంచుకొస్తుంది. ప్రీ–మెనోపాజల్ ఆస్టియో పోరోసిస్గా పిలిచే ఈ ఎముకల బలహీనత గత దశాబ్దంతో పోలిస్తే గణనీయంగా పెరిగిందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. 30 ఏళ్లకే...ఒక మహిళ తన జీవితంలో అత్యధిక ఎముక సాంద్రతను (బోన్ డెన్సిటీ) 25 నుంచి 30 ఏళ్ల మధ్యే సాధిస్తుంది. ఒకసారి 30 ఏళ్లు దాటాక, కొత్త ఎముక ఏర్పడే వేగం కంటే పాత ఎముక అరిగి పోయే వేగం పెరుగుతుంది.80%భారతదేశంలో సుమారు 6.1 కోట్ల మంది ఆస్టియో పోరోసిస్తో బాధపడుతున్నారు. వీరిలో సుమారు 80% మంది మహిళలే కావడం ఆందోళన కలిగించే అంశం.20–25%పట్టణ ప్రాంతాల్లో నివసించే 30 ఏళ్ల పైబడిన మహిళల్లో సుమారు 20% నుంచి 25% మందికి ఆస్టియో పీనియా (ఎముకలు పల్చబడటం – ఇది ఆస్టియో పోరోసిస్కు ముందు దశ) ఉన్నట్లు గుర్తించారు.70–80%∙భారతదేశంలోని మెట్రో నగరాల్లో 30 ఏళ్ల మహిళల్లో దాదాపు 70% నుంచి 80% మంది విటమిన్–డి లోపంతో బాధపడుతున్నారు. ఇది ఎముకలు కాల్షియంను గ్రహించకుండా అడ్డుకుంటుంది.50 ఏళ్లు∙50 ఏళ్లు దాటిన ప్రతి ముగ్గురు మహిళల్లో ఒకరు తమ జీవితకాలంలో ఒక్కసారైనా ఎముక విరుపునకు గురవుతున్నారు.15%∙ఒక మహిళ తన జీవితంలో అత్యధిక ఎముక సాంద్రతను 30 ఏళ్ల నాటికి చేరుకోవాల్సి ఉన్నా.. సరైన పోషకాహారం లేక పోవడం వల్ల 15% మంది మహిళలు అసలు గరిష్ట సాంద్రతను చేరుకోవడంలో విఫలమవుతున్నారు, దీనివల్ల వీరికి 45 ఏళ్లకే ఎముకలు విరిగే ప్రమాదం పెరుగుతోంది.20%∙మెనోపాజ్ ప్రారంభమైన మొదటి 5 నుంచి 7 ఏళ్లలోనే మహిళలు తమ శరీరంలోని మొత్తం ఎముక ద్రవ్యరాశిలో 20% వరకు కోల్పోతున్నారు.2040∙ప్రస్తు్తతం 30 ఏళ్ల వయసులో ఉన్న మహిళలు, తమ ఎముకల ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తే, 2040 నాటికి దేశంలో హిప్ ఫ్రాక్చర్ల సంఖ్య రెట్టింపు అయ్యే అవకాశం ఉందని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు.21.2%∙ప్రపంచవ్యాప్తంగా 50 ఏళ్లు పైబడిన మహిళల్లో సుమారు 21.2% మందికి ఆస్టియో పోరోసిస్ ఉందిముందు జాగ్రత్తలే ముఖ్యం∙ప్రతిరోజూ శరీరానికి కాల్షియం అందేలా చూసుకోవాలి. పాలు, పెరుగు, రాగులు వంటివి తీసుకోవాలి ∙రోజూ ఉదయం 10 నుంచి 15 నిమిషాల పాటు సహజమైన ఎండ తగిలేలా చూసుకోవాలి ∙కేవలం నడక సరి పోదు, ఎముకలపై ఒత్తిడి కలిగించే వెయిట్–బేరింగ్ వ్యాయామాలు, యోగా ఉండేట్లు చూసుకోవాలి ∙50 ఏళ్లు దాటిన మహిళలు, ప్రమాద సూచనలు ఉన్నవారు తప్పనిసరిగా బోన్ డెన్సిటీ టెస్ట్ చేయించుకోవాలి.ఎముకల ఆరోగ్యంపై అవగాహన పెంచుకోవడం కేవలం వృద్ధాప్యంలోనే కాదు, యవ్వనం నుంచే ప్రారంభమవడం ఎంతో ముఖ్యం. అందుకోసం తగిన పోషకాహారం తీసుకుంటూ, తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. -
ఆ కమెడియన్కి వెయిట్లాస్ మందులు ఎందుకు పనిచేయలేదంటే..!
ఇటీవల కాలంలో చాలామంది స్లిమ్గా మారేందుకు ప్రయత్నిస్తున్నారు. అందులోనూ కొందరు సహజపద్ధతిలో ఆరోగ్యంగా బరువు తగ్గితే..ఇంకొందరు ముఖ్యంగా సెలబ్రిటీలు, ప్రముఖులు మాత్రం బరువు తగ్గించే టైప్2 డయాబెటిస్ మందులపై ఆధారపడుతున్నారు. అది కూడా వైద్యుల పర్యవేక్షణలో.. ఆరోగ్యకరమైన రీతీలో బరువు తగ్గుతుండటం విశేషం. అయితే కొందరిలో ఈ డ్రగ్ పనిచేయడం లేదనే విషయం అందరిలోనూ తీవ్ర ఆందోళనలను లేవనెత్తింది. ఎందుకంటే యూట్యూబర్, హాస్యనటుడు, రచయిత తన్మయ్ భట్ విషయంలో కూడా ఇలానే జరిగింది. ఆ విషయాన్ని ఆయనే స్వయంగా సోషల్ మీడియా పోస్ట్లో తెలిపారు. నిజంగానే ఈ మెడిసిన్ అందరికి ప్రభావవంతంగా పనిచేయదా..? అందుకు గల కారణాల ఏంటి..? వంటి వాటి గురించి సవివరంగా తెలుసుకుందామా..!.హాస్యనటుడు తన్మయ్ భట్ టైప్2 డయాబెటస్ నిర్వహించడానికి ఎఫ్డీఏ ఆమోదించిన GLP-1 మందులతో బరువు తగ్గే ప్రయత్నం చేసినట్లు ఎక్స్ పోస్ట్లో తెలిపారు. ఈ సెమాగ్లుటైడ్, టిర్జెపటైడ్ వంటి GLP-1 మందులు టైప్ 2 డయాబెటిస్ను నిర్వహించడానికి FDA-ఆమోదించిన చికిత్సలు. వీటిని బరువు నిర్వహణకు కూడా వినియోగిస్తారు. తాను GLP-1 మందుల సాయంతో ఆకలి తగ్గించుకోవాలనుకున్నా..కానీ తనకు అంతగా పనిచేయలేదని అన్నారు. తనకు ఆ మందు వినియోగించడంవల్ల ఆకలికి సంబంధించి..బలహీన సంతృప్తి సంకేతాలనే అందించిందని అన్నారు. అంతేగాదు తన్మయ్ తాను ఈ మందులు వాడక మునుపే నేచురల్గా 75 కిలోలుల తగ్గానని అన్నారు. అయితే తనకు కొంగొత్త సాంకేతిక వైద్య విధానాన్ని తెలుసుకోవడం, ప్రయత్నించడం ఇష్టమని ఆ నేపథ్యంలోనే ఈ మెడిసిన్ని ప్రయత్నించినట్లు తెలిపారు. ఎందుకు తనకు ఈ మెడిసిన్ పనిచేయలేదు ఎవరైన వైద్యులు లేదా నిపుణులు వివరించాలని కూడా కోరారు పోస్ట్లో.నిపుణులు ఏమంటున్నారంటే..కొందిరిలో ఈ డయాబెటిస్ మెడిసిన్ బరువు తగ్గడానికి పనిచేయకపోవడానికి పలు విధాల కారణాలు ఉంటాయని అంటున్నారు. అవన్నీ బేరీజు వేసుకుని గానీ నిర్థారించలేమని చెబుతున్నారు నిపుణులు. తక్కువ మోతాదు..కొన్నిసార్లు వ్యక్తులు GLP-1 మందులతో ఆకలి నియంత్రణలో ఉన్నట్లు కనిపించదు. ఎందుకంటే ప్రారంభంలో తక్కువ మోతాదు ఉంటుంది కాబట్టి. ఈ మందులు పనిచేయడానికి కొంత సమయం అవసరం. ఒక్కోసారి నెలల సమయం కూడా పడుతుందని అన్నారు.ఒక్కోసారి శరీరం స్పందించదు..కొందరిలో అస్సలు ఈ మెడిసిన్ పనిచేయదట. ఎందుకుంటే వారి వారి జన్యు సంబంధిత పరిస్థితతులు, అంతర్లీన జీవక్రియ పరిస్థితులపై ఆధారపడి ఉంటుందట. అలాగే కొందరు హెల్త్ దృష్ట్యా వాడే ఇతర మందుల వల్ల కూడా ఈ మెడిసిన్ ప్రభావవంతంగా పనిచేయదని చెబుతున్నారు వైద్యులు.జీవనశైలి కారణంగా..అధికంగా ప్రాసెస్ చేయబడిన ఆహారాలు లేదా శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లు బాగా తీసుకునే వారిలో ఈ మందుల ప్రభావాన్ని అధిగమిస్తాయట. అలాంటి వారికి అధిక ప్రోటీన్, అధిక ఫైబర్తో కూడిన ఆహారాన్ని జత చేస్తేనే ఈ GLP-1 మందులు ప్రభావవంతంగా పనిచేస్తాయని చెబుతున్నారు వైద్యులు .ఇక్కడ తన్మయ్ భట్ అనుభవం బరువు తగ్గడానికి ఏ విధంగా ఆయన ఈ మెడిసిన్ని ఏవిధంగా విరియోగించారనేది అత్యంత ముఖ్యం అనే విషయాన్ని నొక్కిచెబుతోంది. అందువల్ల ఈ వెయిట్లాస్ మందులు వాడాలనుకునేవారు వైద్యులు లేదా నిపుణులు పర్యవేక్షణలో వారి సూచనలు సలహాల మేరకు ఉపయోగించటమే మేలని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.(చదవండి: అర్జున్ టెండూల్కర్ ప్రీ-వెడ్డింగ్ వేడుకలో హైలెట్గా నీతా అంబానీ స్పీచ్..!) -
మీకూ ప్రోటీన్ కావాలండోయ్!
ప్రోటీన్.. కణాల పునరుద్ధరణకు ఈ సూక్ష్మపోషకం ప్రధాన వనరు. శరీరంలో హార్మోన్ల సమతుల్యతను కాపాడుతుంది. వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. ఆక్సిజన్ సరఫరాలో (హిమోగ్లోబిన్ ద్వారా) కీలక పాత్ర పోషిస్తుంది. ఇంతటి ప్రాముఖ్యత ఉన్నప్పటికీ ప్రోటీన్ పోషించే పాత్ర గురించి చాలా మందికి తెలియకపోవడం గమనార్హం. ప్రోటీన్లపై అవగాహన, వినియోగంపై కంట్రీ డిలైట్ భాగస్వామ్యంతో ‘కమ్యూనిటీ ప్లాట్ఫామ్ లోకల్ సర్కిల్స్’దేశవ్యాప్తంగా సర్వే నిర్వహించింది. 25 మెట్రో, నగరాలకు చెందిన 2.07 లక్షల మంది ఇందులో పాలుపంచుకున్నారు. నగరాల్లో నివసించే భారతీయులలో దాదాపు 60 శాతం మంది ప్రతిరోజూ ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం లేదని ఈ సర్వేలో తేలింది. జనంలో ఆరోగ్యం పట్ల అవగాహన పెరుగుతున్నా, విభిన్న ఆహారోత్పత్తులు లభిస్తున్నా ఈ పరిస్థితి నెలకొంది. ధర అందుబాటులో లేకపోవడమే పెద్ద అడ్డంకి అన్నది అత్యధికుల మాట. చవక ప్రోటీన్ ప్రత్యామ్నాయాలు లభిస్తే వాటిని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నామని 71% మంది తెలిపారు.సమతుల ఆహారమని.. సర్వే ప్రకారం పట్టణ ప్రాంతాలలో 10 మందిలో నలుగురు మాత్రమే తమ రోజువారీ భోజనంలో కొవ్వు తక్కువగా ఉండే మాంసం, పప్పులు, గుడ్లు, పాలు, పనీర్, చేపలు, గింజలు వంటి ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాన్ని క్రమం తప్పకుండా తీసుకుంటున్నారు. ఫిట్నెస్, వెల్నెస్, ముందస్తు వ్యాధి నివారణ గురించి అవగాహన పెరుగుతున్నప్పటికీ ప్రోటీన్ తీసుకోవడంలో మాత్రం వెనుకబడి ఉన్నారు. దాదాపు నాలుగింట మూడొంతుల మందికి రోజూ ఎంత ప్రోటీన్ అవసరమో తెలియదు. 85% మంది రోజూ తమకు ఎంత ప్రోటీన్ అందుతుందో కొలవడం లేదు. ఎంత అవసరమో అన్న విషయం అవగాహన లేకపోవడంతో ప్రోటీన్ తక్కువగా తీసుకుంటున్నారు. అంతేకాదు చాలా మంది తాము సమతుల ఆహారం స్వీకరిస్తున్నామని నమ్ముతున్నారు. పొంచి ఉన్న ముప్పు.. సగం మందికి పైగా ప్రజలు తమకు ఎదురయ్యే నీరసం, జుట్టు రాలడం, తరచుగా అనారోగ్యానికి గురవ్వడం వంటి సమస్యలు ప్రోటీన్ లోపం వల్ల వస్తున్నాయని గుర్తించడం లేదు. ప్రోటీన్ లేమితో కండరాల క్షీణత మాత్రమే కాకుండా జీవక్రియ సమస్యలు, జ్ఞాపకశక్తి తగ్గడం వంటి ముప్పు కూడా పొంచి ఉందని నిపుణులు చెబుతున్నారు. ఆరోగ్యంగా ముసలితనాన్ని గడపడానికి, వ్యాధులను నిరోధించడానికి ప్రోటీన్ ఒక పునాది వంటిదని అంటున్నారు.ఐసీఎంఆర్ ప్రకారం.. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసర్చ్ (ఐసీఎంఆర్) అధ్యయనాల ప్రకారం భారత్లో దాదాపు అన్ని రకాల ఆదాయ వర్గాలు తగినంత ప్రోటీన్ తీసుకోవడం లేదు. ముఖ్యంగా పట్టణ భారత్లో ఈ సమస్య ఎక్కువగా ఉంది. ఆరోగ్యకరమైన పెద్దలకు రోజుకు కిలోగ్రాము శరీర బరువుకు 0.66–0.83 గ్రాముల ప్రోటీన్ తీసుకోవాలి.పోషక వనరు ఇలా.. ∙ప్రోటీన్ ఫుడ్ అనేది శరీరానికి అత్యవసరమైన పోషకాలు కలిగిన వనరులు. ∙కండరాలు, చర్మం, ఎముకల వంటి శరీర కణజాలాలను నిర్మించడానికి, మరమ్మతు చేయడానికి అవసరమైన అమైనో ఆమ్లాలను ప్రోటీన్స్ అందిస్తాయి. ∙జీవక్రియ పనితీరు, రోగనిరోధక శక్తి, హార్మోన్ల ఉత్పత్తి, ఆకలిని నియంత్రించడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. అవగాహన లోపం.. ప్రోటీన్ అంటే కేవలం బాడీ బిల్డింగ్ కోసమే అని చాలా మంది భావిస్తారు. కానీ రోగనిరోధక శక్తి, చర్మం, జుట్టు ఆరోగ్యం, వయసు పెరిగే కొద్దీ కండరాలు క్షీణించకుండా ఉండటానికి ప్రోటీన్ ఎంతో అవసరం. ఒక చిన్న కప్పు నిండా పప్పు లేదా ఒక గ్లాసు పాలు తాగితే సరిపోతుందని అనుకుంటారు. కిలో శరీర బరువుకు 0.83 గ్రాముల లక్ష్యాన్ని చేరుకోవడానికి ఇది ఏమాత్రం సరిపోదు. అన్నం, చపాతీలు తిన్నప్పుడు కడుపు నిండినట్లు అనిపిస్తుంది. శరీరానికి కావాల్సిన అమైనో ఆమ్లాలు అందక అంతర్గతంగా శరీరం బలహీనపడుతుంది. లోపిస్తే సమస్యలే.. రోగనిరోధక శక్తి బలహీనపడటం, తీవ్రమైన అలసట కలుగుతాయి. జుట్టు రాలడం, పెళుసుగా మారడం, గోర్లు విరిగిపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి. ప్రోటీన్ లోపం దీర్ఘకాలం కొనసాగితే శరీర కణజాలాలలో ద్రవాలు పేరుకుపోవడం వల్ల కలిగే వాపు (ఎడెమా) వస్తుంది. గాయాలు త్వరగా మానవు. మూడ్ స్వింగ్స్, మానసిక స్థితిలో మార్పులు రావొచ్చు. ఫ్యాటీ లివర్, పిల్లల్లో పెరుగుదల ఆగిపోవడం వంటి సమస్యలూ ఎదురుపడవచ్చు. -
జస్ట్ 11 నెలల్లో 52 కిలోలు బరువు తగ్గింది..! నో జిమ్, నో స్ట్రిక్ట్ డైట్..
బరువు తగ్గడం అందరికీ ఒకలా ఉండదు. కొందరికి చాలా కష్టమైనదిగా..మరికొందరికి చాలా తేలికైన వాటితో సులభంగా తగ్గే టాస్క్లా ఉంటుంది. అయితే ఇక్కడ స్థిరత్వాన్ని బ్రేక్ చేయకపోతేనే..లక్ష్యానికి చేరుకోగలం. ఇక్కడ ట్యునిషియాకు చెందిన హిబా అల్లా వెయిట్లాస్ స్టోరీ ఆ విధంగానే సాగింది. ఆమె ఓర్పుతో స్థిరత్వంతో బరువు తగ్గే ప్రయాణాన్ని మొదలు పెట్టి ఏకంగా 133 కిలోల బరువు నుంచి 52 కిలోలకు తగ్గి అందర్నీ ఆశ్చర్యపరిచింది. అదికూడా జస్ట్ 11 నెలల్లో ఈ ఫలితాన్ని అందుకుని స్ఫూర్తిగా నిలిచిందామె. ఇంతకీ ఆమె ఎలాంటి ట్రిక్స్ అనుసరించిందంటే..ట్యునీషియాలోని ట్యునీస్కు చెందని 22 ఏళ్ల హిబా అల్లా అయాది ఒక స్టూడెంట్. ఆమె ఎత్తు 5 అడుగులు 8 అంగుళాలు, బరువు ఏకంగా 133.3 కిలోలు ఉండేది. ఆమె రూపం భారీగా ఉండి..కనీసం నాలుగు అడుగులు వేయాలన్నా..ఆయాసంతో ఇబ్బందిపడేది. శ్వాస తీసుకోవడంలో నిరంతరం అలసటను ఎదుర్కొనేది. ఆరోగ్యం రోజు రోజుకి భారంగా మారిపోవడం మొదలైంది. ఇక తనకు తానుగా బరువు తగ్గేందుకు ఉపక్రమించకపోతే..ఉనికే కష్టమవుతుందని అర్థమైంది హిబాకు. దాంతో వెయిట్లాస్ అయ్యేందుకు రెడీ అయ్యింది. అయితే ఆమె అందరు అనుక్నుట్లుగా బరువు తగ్గడం అంటే..తినడం తగ్గించడం, నోరు కట్టేసుకోవడం కాదంటోంది. ఆమె తింటూనే బరువు తగ్గే ప్రయత్నం చేసిందంటే. అయితే తినే వాటిలో ఆరోగ్యకరమైనవి, ప్రోటీన్,ఫైబర్ ఉండేవి ఎంచుకున్నట్లు తెలిపింది. ముందుగా ఆకలి తీరి సంతృప్తిని కలిగించేలా భోజనం ఉండేలా చూసుకునేదాన్ని. అప్పుడు బరువు తగ్గడం భారంగా..భయానకంగా ఉండదట. పైగా తరుచుగా అద్దంలో చూసుకోవడం..స్లిమ్గా మారాలనే లక్ష్యాన్ని నిరంతరం గుర్తుచేస్తుంది. నోరు ఆటోమేటిగ్గా అదుపులో ఉండేలా ఆహారం తీసుకునేలా మైండ్సెట్ అవుతుందట. ఆమెకు అధిక బరువు కారణంగా జిమ్ సభ్యత్వం లభించలేదట. అందుకని హిబా వర్కౌట్లకు బదులుగా నడకను ఎంచుకుందట. నెమ్మదిగా చిన్న అడుగులతో మొదలు పెట్టి..కిలోమీటర్ల కొద్ది నడకను పెంచుకుంటూ పోయేదాన్ని అంటోంది. అధికంగా నీటిని తీసుకోవడం, తాజా పండ్లను తీసుకోవడం వంటివి చేసేదట. అలేగు ఉప్పు, చక్కెరలను మితంగా తీసుకునేదట. ఇక బరువు తగ్గడం శారీరకం భావోద్వేగ పోరాటంగా అభివర్ణించింది. మొదట్లో అంత తొందరగా తన బాడీలో మార్పులు సంతరించుకోలేదని, అయినా..ఎక్కడ అసహనం చెందకుండా ఓర్పుతో తన దినచర్యను కొనసాగించానని చెప్పుకొచ్చింది. ఏం తీసుకున్నా..ఆరోగ్యకరమైన విధంగా ఎంచుకోవడం, వాకింగ్ని స్కిప్ చేయకపోవడం వంటి అలవాట్లతో బరువు తగ్గడం ప్రారంభమవ్వడం మొదలైంది. అయితే తాను ఆ ఉత్సాహంతో అలసిపోతున్నప్పుడూ కూడా ఓపికతో తన డైలీ యాక్టివిటీని కొనసాగించేదాన్ని అంటోంది. అలా ఇవాళ 52.45 కిలోలు బరువుతగ్గి 52 కిలోల ఆరోగ్యకరమైన బరువుతో ఉన్నా అని నవ్వతూ చెప్పింది హిబా. అంతేగాదు బరువు తగ్గడం అనేది శిక్ష కాదని, శరీరం, జీవితానికి ఇచ్చే గౌరవప్రదమైన చర్యగా అభిర్ణించింది. ఈ రోజు తాను ఆరోగ్యంగా, హాయిగా శ్వాస తీసుకునే ఆహ్లాదభరితమైన జీవితాన్ని ఆస్వాదిస్తున్నానని ఆనందంగా చెబుతోంది. దయచేసి బరువు తగ్గడం అంటే..విపరీతమైన వర్కౌట్లు, కఠినమైన ఆహారంగా భావించొద్దు..సంతృప్తికరంగా తింటూ..ఎంజాయ్ చేస్తూ తగ్గాలి..అప్పుడే మంచి ఫలితాలు అందుకోగలం అని నమ్మకంగా చెబుతోంది హిబా.(చదవండి: బిడ్డలు పుట్టే అవకాశం లేదన్నారు..!కానీ ఆ మహిళ ..) -
బిడ్డలు పుట్టే అవకాశం లేదన్నారు..!కానీ ఆ మహిళ ..
వైద్యశాస్త్రం రోజు రోజుకి పురోగమిస్తు బాధిత రోగులకు కొత్త జీవితాన్ని ప్రసాదిస్తుంది. ముఖ్యంగా సంతానం విషయంలో ఇటీవల కాలంలో ఎన్ని జంటలు ఇబ్బందులు పడుతున్నారో తెలిసిందే. ఐవీఎఫ్, సరోగసీ ద్వారా కొంత ఉపశమనం లభించినప్పటికీ..కొందరు పుట్టుకతో గర్భాశయం లేని అమ్మాయిలకు మాత్రం సంతానం ఓ కలగానే మిగిలిపోతోంది. రూపం, ఆరోగ్యం.. పరంగా బాగుండి ఆ విషయంలో మాత్రం జీవితాంతం వారికో లోపం, శాపంగా ఉండిపోతోంది. ఇప్పుడు ఆ సమస్యకు చక్కటి ఉపశమనం అందించారు వైద్యులు. వైద్యశాస్త్రంలోనే సరికొత్త అద్భుతం చోటు చేసుకునేలా కొంగొత్త వైద్య ఆవిష్కరణలకు నాంది పలికి రోగుల్లో కొత్త ఆశలను నింపుతున్నారు. అందుకు ఈ జంట ఉదంతమే ఓ ఉదాహరణ. అసలేం జరిగిందంటే..యూకేకి చెందిన 30 ఏళ్ల గ్రేస్ బెల్ పుట్టుకతోనే గర్భం లేదామెకు. గర్భం లేదు కాబట్టి పీరియడ్స్ ఉండవు గానీ సాధారణ అండశయాలు ఉంటాయి. ఈ పరిస్థితిని ఎంఆర్కేహెచ్ సిండ్రోమ్గా పేర్కొంటారు. యూకేలో ప్రతి 5 వేల మంది మహిళల్లో ఒకరు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. బెల్కి పిల్లలు పుట్టాలంటే గర్భమార్పిడి లేదా సరోగసీ ఒక్కటే మార్గం. దాంతో బెల్ భర్త స్టీవ్ పావెల్ ఇద్దరూ గర్భశయాన్ని దానం చేసే దాత కోసం ఎదురు చూస్తుండేవారు. గర్భం దొరికిందని, మార్పిడికి సిద్ధంగా ఉండమని ఆస్పత్రి నుంచి వచ్చిన కాల్ వారిని ఉక్కిరిబిక్కిరి చేసింది. నమ్మశక్యం కానీ నిజంలా అనిపించింది ఆ జంటకు. అలా బెల్కి జూన్ 2024లో ఆక్స్ఫర్డ్లోని చర్చిల్ హాస్పిటల్లో దాదాపు 10 గంటలు శ్రమించి గర్భశయ మార్పిడి ఆపరేషన్ చేశారు వైద్యులు. ఆ తర్వాత కొన్ని నెలలకు ఐవీఎఫ్ని ఆశ్రయించి ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకున్నారు. ఆ విధంగా ఈ జంటకు 2025లో ఓ అద్భుత వరంలా 7 పౌండ్ల బరువుతో హ్యోగో అనే బిడ్డ జన్మించాడు. ప్రస్తుతం ఆ చిన్నారికి పదివారాల వయసు. ఆ దంపతులు ఇద్దరు తమకు సంతానభాగ్యాన్ని అందించిన ఆ మహిళకు, ఆమె కుటుంబానికి ఎంతో రుణపడి ఉంటామంటూ భావోద్వేగంగా చెప్పారు. మా బిడ్డను చూసిన ప్రతిసారి వాళ్లే మాకు గుర్తొస్తారంని అన్నారు. అయితే ఆ జంట మరో బిడ్డను కనాలనుకునేంత వరకు మార్పిడి చేసిన గర్భాశయాన్ని ఉంచి, ఆ తర్వాత తొలిగిస్తారట. ఎందుకంటే ఆ అవయవంపై శరీర రోగ నిరోధక వ్యవస్థ దాడి చేయకుండా నిరోధించడానికి, అలాగే ఆమె జీవతాంత మందులు తీసకోకుండా నివారించేందుకు ఇది తప్పదని చెబుతున్నారు వైద్యులు. కాగా, ఇలాంటి ఘటనే 2025 ప్రారంభంలో యూకేలో మొదటి సజీవ గర్భదానం ద్వారా అమీ అనే శిశువు జన్మించింది. ఈకేసులో అక్క గర్భాన్ని పొందింది సదరు మహిళ. ఆమెకు అప్పటికే ఇద్దరు పిల్లలు ఉండటంతో చెలెల్లికి తన గర్భాన్ని దానం చేసింది. వైద్యశాస్త్రంలో ఈ పురోగతి..పుట్టుకతో గర్భంలేని యువతుల పాలిట వరంగా మారుతుంది. పైగా అవయవ దానం పట్ల ప్రజల్లో అవగాహన పెరిగేందుకు నాంది పలకడమే గాక..మరణం తర్వాత ఇతరుల జీవితాల్లో వెలుగులు పంచేలా బతకడం ఈ దానం వల్లే సాధ్యమని తెలుసుకుంటారని వైద్యులు ఆశాభావం వ్యక్తం చేశారు. (చదవండి: అద్దంలో కనిపించని అసలు రూపం) -
నయనేంద్రియానం కార్నియా ప్రధానం..!
ఓ చిన్నారి పుట్టినప్పటి నుంచి అతడు / ఆమె నేర్చుకునే మొత్తం జీవన నైపుణ్యాల్లో దాదాపు 80 శాతానికి పైగా కంటిచూపు వల్లనే సాధ్యమవుతుంది. పైగా ఈ యుగంలోని చిత్రవిచిత్రాలన్నీ చూడాలంటే కన్నుంటేనే సాధ్యం. అందుకే ‘కన్నుంటేనే కలికాలం’ అన్న నానుడి స్థిరపడింది. జనసామాన్యంలోని ఈ మాటే ఈరోజుల్లో కంటికి ఉన్న ప్రాముఖ్యతనూ, ప్రాధాన్యాన్నీ నొక్కి చెబుతుంది. మరి ఇంతటి విలువైన కంటిచూపును ఏదైనా కారణాల వల్ల కోల్పోయినప్పుడు నేత్రదానం తర్వాత కంటి చూపు పొందడం సాధ్యమవుతుందనే అభిప్రాయం చాలామందిలో ఉంది. పైగా ఈ కంటిదానం సమయంలో మొత్తం కనుగుడ్డును స్వీకరిస్తారనే అపోహ కూడా చాలామందిలో ఉంటుంది. నిజానికి కార్నియా అనే పారదర్శకమైన పొర దెబ్బతినడం వల్ల వచ్చిన దృష్టిలోపాన్ని మాత్రమే నేత్రదానంతో సరిచేయడం సాధ్యమవుతుంది. పైగా ఇలా నేత్రదానం చేసిన కేసుల్లో కనుగుడ్డు మొత్తం కాకుండా కేవలం ‘కార్నియా’ అనే నల్లగుడ్డుపై ఉండే పోరనే స్వీకరిస్తారు. ఈ నేపథ్యంలో నేత్రదానమనేది ఎప్పుడెప్పుడు ఎంతమేరకు సాధ్యం? ట్రాన్స్ప్లాంటేషన్ ద్వారా కంటి చూపును పొందడం ఏయే సందర్భాల్లో సాధ్యమవుతుంది? ఏయే సందర్భాల్లో అది సాధ్యం కాదు... అలా సాధ్యం కాక΄ోవడానికి కారణాలేమిటి... వంటి అనేక అంశాలపై అవగాహన కోసం... ఈ కథనం. కంటితో చూడటాన్ని సాధ్యం చేసే కంటి నల్లగుడ్డుపై ఉండే పారదర్శకమైన పొరను ‘కార్నియా’ అంటారు. నిజానికి నేత్రదానం చేసిన వారి నుంచి కంటిని తీసుకునే సమయంలో కనుగుడ్డునంతా స్వీకరించరు. కేవలం కార్నియా అని పిలిచే ఈ నల్లగుడ్డుపై ఉండే పారదర్శకమైన పొరను మాత్రమే తీసుకుంటారు.కార్నియా అంటే..?ఇది కంట్లో ఉండే ఒక పారదర్శకమైన పొర. కంటిలోని నల్లగుడ్డుపై ఉండటం వల్ల... ఇది పారదర్శకమైన పొర కావడంతో ఇది కూడా నల్లగా కనిపిస్తుంది. ఇది కంట్లోని ఐరిస్ అనే భాగాన్ని, ప్యూపిల్నూ, యాంటీరియర్ ఛేంబర్ను కప్పి ఉంచుతుంది. ఇది బయటి నుంచి వచ్చే కాంతికిరణాలను కంటిపై పడేలా చూస్తూ... మొదట కంట్లోకి ప్రవేశించేలా... అటు పిమ్మట కంటి వెనక ఉండే పొర రెటీనాపై ప్రతిబింబించేలా చేస్తుంది. ఇది పారదర్శకంగా ఉంటేనే చూపు ఉంటుంది. ఇది పారదర్శకత కోల్పోవడం వల్ల చూపునూ కోల్పోవడం జరుగుతుంది. కార్నియా మార్పిడి చికిత్స అంటే..?కార్నియా గాయపడటం లేదా దెబ్బతినడం వల్ల కలిగిన అంధత్వాన్ని కార్నియల్ బ్లైండ్నెస్ అంటారు. కార్నియా దెబ్బతినడం వల్ల ఎవరైనా కంటి చూపు కోల్పోతే... అలాంటి వారికి దెబ్బతిన్న కార్నియా స్థానంలో మంచి కార్నియాను అమర్చడం ద్వారా వారు కోల్పోయిన చూపును తిరిగి తెప్పించడం సాధ్యమే. అంటే కార్నియా దెబ్బతినడం వల్ల వచ్చిన అంధత్వానికి మాత్రమే కార్నియా ద్వారా చూపు తెప్పించవచ్చు. ప్రస్తుతానికి కోల్పోయిన కంటి చూపును ΄పొందడానికి ఈ ప్రక్రియ ఒక్కటే అందుబాటులో ఉంది. ఇప్పటికి ఇది మాత్రమే సాధ్యం. ఇంకా ఇతరత్రా కారణాల వల్ల కోల్పోయిన కంటిచూపును ΄పొందేందుకు పెద్దగా అవకాశాలేమీ లేవు. అయితే కేవలం కార్నియల్ బ్లైండ్నెస్నే కాకుండా ఇతరత్రా కారణాల వల్ల కోల్పోయిన కంటి చూపును ΄పొందడానికి ప్రయత్నాలూ, పరిశోధనలు మాత్రం ముమ్మరంగా కొనసాగుతున్నాయి.తొలిసారి కార్నియా మార్పిడి చికిత్స నేపథ్యమిలా... తొలిసారిగా కార్నియా మార్పిడి శస్త్రచికిత్సను డాక్టర్ ఎడ్వర్డ్ జిమ్ అనే వైద్య నిపుణుడు 1905లో చేశారు. కార్నియా మార్పిడి శస్త్రచికిత్స విజయవంతమయ్యే అవకాశాలు దాదాపు 90 శాతానికి పైగా ఉంటాయి. అయితే ఎవరైనా కళ్లు దానం చేసిన వ్యక్తి మరణించాక ఆరుగంటలలోపే అతడి నుంచి కార్నియాను స్వీకరించి, ఐ–బ్యాంక్లో భద్రపరచాల్సి ఉంటుంది. అటు తర్వాత సేకరించినప్పటికీ అది కార్నియా మార్పిడికి ఉపయోగపడదు.కార్నియల్ బ్లైండ్నెస్కు దారితీసే పరిస్థితులు కంటికి అయ్యే గాయాల కారణంగా కార్నియా దెబ్బతినడం రసాయన ప్రమాదాలకు గురికావడంతో కార్నియా గాయపడటం లేదా కాలి΄ోవడం (కార్నియల్ బర్న్) పోషకాహార లోపం వల్ల కార్నియా దెబ్బతినడం (మరీ ముఖ్యంగా చిన్న వయసులో వైటమిన్ ఏ లోపం వల్ల) కంటికి... మరీ ముఖ్యంగా కార్నియాకు వచ్చే ఇన్ఫెక్షన్స్ (కార్నియల్ అల్సర్స్ – నిజానికి మిగతా కారణాల కంటే కార్నియల్ ఇన్ఫెక్షన్తోనే అంధత్వాలు వచ్చే అవకాశం ఎక్కువ) పుట్టుకతో లేదా జన్యుపరంగా వచ్చే కొన్ని రకాల సమస్యలు ఆపరేషన్ తర్వాత వచ్చే కాంప్లికేషన్లతో ఒకవేళ పైన పేర్కొన్న కారణాలతో కార్నియా దెబ్బతిని అంధత్వం వస్తే దాన్ని కార్నియా మార్పిడి (కార్నియల్ ట్రాన్స్ప్లాంటేషన్) చికిత్సతో బాధితులకు చూపు తెప్పించవచ్చు.కార్నియల్ ట్రాన్స్ప్లాంటేషన్ ఎప్పుడెప్పుడంటే... కంటి చూపునకు సంబంధించిన కొన్ని సమస్యలున్నప్పుడు (ఆప్టికల్) : సూడోఫేకిక్ బుల్లోస్ కెరటోపతి, కార్నియల్ డీజనరేషన్, కెరటోకోనస్, కెరటోగ్లోబస్, కార్నియల్ డిస్ట్రఫీ వంటి కొన్ని కంటి సమస్యలు ఉన్నప్పుడు కంటిచూపును మెరుగుపరచడానికి. కంటిలోని భాగాలను సమీకృతంగా (ఇంటెగ్రల్గా) ఉంచడానికి (టెక్టానిక్) : ‘స్ట్రోమల్ థిన్నింగ్ డెస్మాటోసీల్’ అనే సమస్యలున్నప్పుడు కంటిలోని భాగాలను బయటికి రాకుండా నియంత్రించి వాటిని ఏకీకృతంగా లోపలే కలిపి ఉంచడానికి. చికిత్సలో భాగంగా చేసే ట్రాన్స్ప్లాంట్స్లో (థెరటిక్) : ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు చికిత్సకు ఎంతమాత్రమూ సహకరించకుండా ఉండే కార్నియల్ భాగాన్ని తొలగించి, ఆ ప్రదేశంలో కొత్త కార్నియా ఉంచి చూపు తెప్పించడానికి. అందం కోసం (కాస్మటిక్): కంటి నల్లగుడ్డు భాగంలో తెల్లమచ్చలు ఉన్నప్పుడు...ఆ కార్నియల్ స్కార్స్ను తొలగించి, అందాన్ని ఇనుమడింపజేయడం కోసం.ఎవరెవరిలో కార్నియా ట్రాన్స్ప్లాంటేషన్ సాధ్యం కాదంటే... కొందరిలో కార్నియా ట్రాన్స్ప్లాంటేషన్ ద్వారా చూపు తెప్పించడం సాధ్యం కాదు. అది ఎవరిలోనంటే... ∙రెటీనా లోపం లేదా ఆప్టిక్ నర్వ్ లోపంతో అంధత్వం వచ్చినవారు రెటినైటిస్ పిగ్మెంటోజా అనే కండిషన్ కారణంగా చూపు కోల్పోయిన వారు వయసు పెరుగుతున్న కొద్దీ వచ్చిన మాక్యులార్ డీజనరేషన్ అనే సమస్య కారణంగా చూపు పోగొట్టుకున్నవారు ∙ఆప్టిక్ అట్రోఫీతో బాధపడుతున్నవారు రాడ్ అండ్ కోన్ డిస్ట్రఫీ అనే జబ్బుల కారణంగా చూపు కోల్పోయిన వారు ∙నీటికాసుల (అడ్వాన్స్డ్ గ్లకోమా)తో కంటిచూపు కోల్పోయినవారు, కాంతికి స్పందించని (లైట్ పర్సెప్షన్ లేని) కళ్లలో ఈ చికిత్స సాధ్యం కాదు. ఇక్కడ పేర్కొన్న అన్ని సందర్భాల్లోనూ కార్నియల్ ట్రాన్స్ప్లాంటేషన్తో ఏమాత్రం ప్రయోజనం చేకూరదు.నేత్రదానం ఎందుకు చేయాలి? భారతదేశంలో దాదాపు 12 లక్షల నుంచి 15 లక్షల మంది కార్నియల్ బ్లైండ్నెస్ కారణంగా అంధులుగా మారుతున్నారని గణాంకాలు చెబుతున్నాయి. పైగా ప్రతి సంవత్సరమూ ఈ కార్నియల్ బ్లైండ్నెస్ కారణంగా ఏడాదికి 25,000 నుంచి 30,000 వరకు కొత్త కేసులు ఈ అంధుల జాబితాకు జత అవుతున్నాయన్నది మరో అంచనా. నేత్రదానం అంటే కార్నియాను ఇవ్వడం వల్ల వీళ్లకు అంధత్వాన్ని దూరం చేసి, కంటిచూపు ప్రసాదించవచ్చు. నిజానికి మన దేహంలోని కొన్ని కణజాలాలను కృత్రిమంగా సృష్టించడం సాధ్యం కాదు. ఒకరి నుంచి దానంగా స్వీకరించిన కణజాలాన్ని వేరే చోట అమర్చగలగడం సాధ్యమవుతుంది. అందువల్ల అలాంటి కణజాలాలు అవసరమైనప్పుడు వాటిని దాత ఇచ్చినప్పుడే స్వీకరించడం సాధ్యమవుతుంది. అలాంటివాటిల్లో కార్నియా ఒకటి. ఒకవేళ పిల్లల్లో ఇలా కార్నియా లోపం వల్ల అంధత్వం వస్తే... ఆ పిల్లలకు తెలిసే ఒకే ఒక రంగు... నలుపు! ఈ రంగురంగుల ప్రపంచాన్ని వాళ్లు చూడటమే సాధ్యం కాదు. ఆ చిన్నారి జీవితాల్లోంచి ఆ నలుపును తొలగించి, వాళ్ల జీవితాలను రంగుల మయం చేయడానికి కార్నియాలు లభ్యం కావడమన్నది ఎంతగానో అవసరం. అందువల్ల వ్యక్తులంతా తమ మరణానంతరం కార్నియాను నిరుపయోగంగా మట్టిలో కలిసి΄ోయేలా చేయడానికి బదులు, వాటిని దానంగా ఇవ్వడం ద్వారా ప్రతి వ్యక్తీ మరో ఇద్దరికి చూపును తెప్పించే అవకాశం ఉంటుంది. అందుకే అలా కంటిచూపునకు దూరమైన వ్యక్తులకు ఈ లోకం చూపించడానికి నేత్రదానాలు పెరగడం ఎంతగానో అవసరం.నేత్రదానం చేయడానికి ఎవరెవరు అర్హులు ? ఏడాది వయసుకు పైగా ఉన్నవారెవరైనా తమ మరణానంతరం నేత్రదానం చేయడానికి అర్హులవుతారు. అలాంటి వారిలో ఈ కింద పేర్కొన్న సమస్యలునప్పటికీ వారు తమ మరణానంతరం నేత్రదానం చేయవచ్చు. అవి... పాక్షికంగానే కనుచూపు ఉన్నవారు (పూర్ సైట్), ∙కళ్లజోడు వాడేవారు డయాబెటిస్తో బాధపడేవారు రక్తపోటుతో బాధపడేవారు (చక్కెర వ్యాధి, హైబీపీ ఉన్నప్పటికీ నిరభ్యంతరంగా నేత్రదానం చేయవచ్చు. ఇలాంటి రుగ్మతలు ఉన్నప్పటికీ నేత్రదానానికి వారు పూర్తిగా అర్హులే) రెటీనా లేదా ఆప్టిక్ నర్వ్ లోపం వల్ల అంధత్వం వచ్చినవారూ... వీరంతా ఎంతగా వయసుపైబడ్డవారైనప్పటికీ నిరభ్యంతరంగా నేత్రదానం చేయవచ్చు.కార్నియాల లభ్యత అవసరమైన మేరకు ఎందుకు ఉండటం లేదంటే? నేత్రదానం అని చెప్పే ఈ కార్నియా దానాలు ఇంకా జరగాల్సినంత విస్తృతంగా జరగడం లేదనే చె΄్పాలి. దాంతో బాధితులకు అవసరమైనన్ని కార్నియాలు లభ్యం కావడం లేదు. చాలా అంశాలు ఇందుకు కారణమవుతున్నాయి. వాటిలో కొన్ని ఇవే... నేత్రదానం విషయంలో అవగాహనలోపం ∙నేత్రదానం తర్వాత కార్నియాలను నిలువ చేయడానికి అవసరమైననన్ని కేంద్రాలు (ఐ బ్యాంకులు) లేకపోవడం, నేత్రదానాన్ని ్ర΄ోత్సహించే వారి సంఖ్య అంతగా లేక΄ోవడం (మోటివేషన్ లేక΄ోవడం) సామాజిక, మతపరమైన కారణాలతో నేత్రదానానికి ముందుకు వచ్చేవారి సంఖ్య తక్కువగా ఉండటం.కార్నియా సేకరణ ఎలా జరుగుతుందంటే..? నేత్రదానం చేస్తానని వాగ్దానం చేసిన వ్యక్తి మరణించిన వెన్వెంటనే... బంధుమిత్రులు ‘ఐ బ్యాంక్’కు సమాచారమివ్వాలి. ఎందుకంటే... మరణించాక ఆరు గంటలలోపే దాత నుంచి కార్నియాను సేకరించాలి. లేకపోతే ఆ కార్నియా నిరుపయోగంగా మారిపోతుంది. ఈలోపు ఐ–బ్యాంక్ నుంచి సిబ్బంది వచ్చే లోపు మరణించిన వ్యక్తి కళ్లపైన తడి దూదిని ఉంచాలి. ఆ గదిలో ఉన్న ఫ్యాన్ను స్విచ్–ఆఫ్ చేయాలి. మరణించిన వ్యక్తి తల భాగం మిగతా శరీరానికి ఆరు అంగుళాల ఎత్తుండేలా మృతుడి తలకింద తలగడ అమర్చాలి. ఐ–బ్యాంక్ సిబ్బంది వచ్చాక... ఇక్కడ పేర్కొన్నట్లుగా ఉంచిన మృతుడి పార్థివ శరీరంలోని కళ్లలోని కార్నియాతోపాటు 10 సి.సి.ల రక్తపు నమూనానూ సేకరిస్తారు. కార్నియా తొలగింపు తర్వాత ఐ–బ్యాంక్ సిబ్బంది ఆ ప్రదేశంలో కృత్రిమ కార్నియాను అమర్చి కంటి ఆకృతిలో ఎలాంటి తేడా కనిపించకుండా చూస్తారు.చూపు పొందడానికే అవకాశాలెక్కువ... కార్నియా మార్పిడి శస్త్రచికిత్స విజయవంతం కాకసోవడానికి అవకాశాలు చాలా తక్కువ. శస్త్రచికిత్స విజయవంతమై చూపు పొందడానికే అవకాశాలెక్కువ. ఈ మాట చె΄్పాల్సిన అవసరమేమిటంటే... సాధారణంగా మిగతా అవయావాల మార్పిడి తాలూకు శస్త్రచికిత్స చేసినప్పుడు శరీరం ఆ అవయవాలను అంత తేలిగ్గా తనవిగా ఆమోదించదు. తనది కాని బయటి పదార్థం (ఫారిన్బాడీ) పరిగణించి, దాన్ని రిజెక్ట్ చేయడానికి ప్రయత్నిస్తుంది. కానీ కార్నియల్ ట్రాన్స్ప్లాంటేషన్లో అలాంటి అవకాశాలు చాలా తక్కువ. అందుకే దాదాపు 90 శాతం కేసులకు పైగా విజయవంతం అవుతాయి. పైగా పైన పేర్కొన్న రిస్క్ ఉన్నందున మిగతా అవయవ మార్పిడి శస్త్రచికిత్స కేసుల్లో శరీరానికి రోగనిరోధక శక్తిని (ఇమ్యూనిటీని) తగ్గించడానికి ఇమ్యూనోసప్రెసెంట్ ఔషధాలు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ కార్నియాకు అలాంటి ప్రమాదం లేదు కాబట్టి ఇమ్యూనో సప్రెసెంట్స్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. ఇది నేత్రదానం విషయంలో ఉన్న మంచి సౌకర్యం. కంటి ఆపరేషన్ అయినవాళ్లు కూడా నేత్రదానానికి అర్హులే.ఏయే సందర్భాల్లో రిస్క్ ఉంటుందంటే... కార్నియాను అమర్చే సమయంలో స్వీకర్త శరీరం దాన్ని స్వీకరించక΄ోవడం అన్న రిస్క్ చాలా తక్కువ. అయినప్పటికీ కొన్ని సందర్భాల్లో ఆ ప్రమాదం ఉండవచ్చు. అదెప్పుడంటే...అంటించిన గ్రాఫ్ట్ ఊడిపోవడం లేదా కదిలిపోవడం గ్రాఫ్ట్ తర్వాత కంటికి ఇన్ఫెక్షన్ రావడం కంటిలోని గుడ్డులో ఒత్తిడి పెరగడం వల్ల (గ్లకోమా) కుట్లు వేయడంలో కొన్ని సమస్యల కారణంగా కార్నియా వాపు వచ్చినప్పుడు.కార్నియా నిరుపయోగమని తేలితే...? కొందరు పెద్దమనసుతో నేత్రదానం చేయడానికి ముందుకు వచ్చినప్పటికీ వాళ్ల కార్నియా నిరుపయోగం అని తేలితే... అప్పుడూ దాతల వల్ల కొన్ని ప్రయోజనాలు కలుగుతాయి. ఉదాహరణకు ఎయిడ్స్ రోగులు, హెపటైటిస్ బీ లేదా సీ ఉన్నవారి కార్నియాలు దానంగా స్వీకరించడానికి ఉపయోగపడవు. అయితే కొన్ని సందర్భాల్లో వారి నుంచి స్ల్కెరా వంటి కొన్ని కంటి భాగాలను గ్రాఫ్టింగ్ కోసం వాడుకోవచ్చు. మరికొన్ని సందర్భాల్లో మానవాళికి ఉపయోగపడే కొన్ని పరిశోధనల కోసం కూడా ఆ కార్నియాలను ఉపయోగించుకోవచ్చు. అందుకే మరో బాధితుడికి అమర్చడానికి వీల్లేనంత మాత్రాన కార్నియా నిరుపయోగం అవుతుందనే అభి్ర΄ాయానికి రావద్దు. చివరగా... మరణానంతరం వృథాగా మట్టిలో కలసిపోవడం వల్లగానీ లేదా కట్టెపై కాలిపోవడం ద్వారాగానీ వృథాగా పోయే కార్నియాలను వీలైనంత ఎక్కవ మంది దానం చేస్తే... ఎంతోమంది చిన్నారులూ, పెద్దవారూ చూపు పొందేలా చేయవచ్చు. అందుకే కార్నియా దానాల ప్రాధాన్యాన్ని గుర్తించి ప్రతి ఒక్కరూ నేత్రదానంపై అవగాహనను పెంచుకోవడం ఎంతైనా అవసరమని గుర్తించాలి. ఎవరు నేత్రదానం చేయడానికి అర్హులు కారంటే... కొందరి నుంచి మరణానంతరం కార్నియా స్వీకరించడం కుదరకపోవచ్చు. వారు ఎవరంటే... నిర్దిష్టంగా ఏ కారణం వల్ల చనిపోయారో చెప్పలేని వారు రేబిస్, సిఫిలిస్, హెపటైటిస్, సెప్టిసీమియా, ఎయిడ్స్ వంటి జబ్బులతో చనిపోయిన వారి నుంచి కంటికి వచ్చే ఆక్యులార్ ఇన్ఫెక్షన్స్ ఉన్నవారు... ఈ అందరి నుంచి కార్నియా స్వీకరించడం కుదరదు. అంటే వీళ్లు నేత్రదానానికి అర్హులు కాదు. డాక్టర్ కె. రవికుమార్ రెడ్డిసీనియర్ కంటి వైద్య నిపుణులు నిర్వహణ: యాసీన్ (చదవండి: -
మందిరా బేడి ఫిట్నెస్ మంత్ర..! 30 ఏళ్ల వయసులో కంటే ఇప్పుడే..
ఫ్యాషన్ డిజైనర్, నటి, టీవీ వ్యాఖ్యాత మందిర బేడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాలీవుడ్లో ఆమె హవా మాములుగా లేదు. ఆమె స్వరం, నటనతో వేలాది అభిమానులను సంపాదించుకున్న ముద్దుగుమ్మ మందిరా బేడి. ఐదు పదుల వయసులోనూ యువ హీరోయిన్ మాదిరి ఆహార్యంతో..ఆకర్షణీయమైన లుక్తో అలరిస్తుంటుందామె. ఇంతలా హెల్దీగా, యంగ్గా ఉండటానికి గల రీజన్ గురించి హెర్బాలైఫ్ పాడ్కాస్ట్ వెల్లడిస్తూ..తన బ్యూటీసీక్రెట్ని షేర్ చేసుకున్నారామె.మరి అవేంటో తెలుసుకుందామా..!.మందిరా తన వయసు గురించి చెప్పడానికి అస్సలు భయపడనని, కానీ ఆహార్యం పరంగా యంగ్గానే కనిపిస్తానని అన్నారామె. అందరు కదలిక ఓ మెడిసిన్, వ్యాయామం ఓ ఔషధ అని అంటుండటం వినేదాన్ని. కానీ అది తన విషయంలో నిజమైందని అంటోందామె. వ్యాయామం ఒక్కటే ప్రజలను అనారోగ్యం బారినపడకుండా చేస్తుందని, అదొక సప్లిమెంట్గా అభివర్ణించింది. అన్ని సమస్యలకు వ్యాయామం అద్భుతమైన నివారిని అని నమ్మకంగా చెబుతోందామె. అంతేగాదు 50లలో అధిక బరువు శిక్షణ తప్పనిసరి అని అంటోందామె. ఎందుకంటే..ఆ సమయంలో వృద్ధాప్యం మనలోకి ఎంటర్ అవుతుంటుంది. కాబట్టి ఆ టైంలో ఫిట్నెస్ చాలా ముఖ్యం, అదీగాక శారీరక క్షీణతకు దారితీసే సమయం కూడా అదే. అందువల్ల బలశిక్షణ శరీరానికి ఎంతో అవసరమని అన్నారు. ఇది మనకు శక్తిమంతమైన మార్పుతో పాటు, మన కండరాలను బలోపేతం చేస్తాయని చెబుతోంది. అంతేగాదు వర్కౌట్లు శారీరక, మానసిక ఆరోగ్యానికి అత్యద్భుతమైనవని అన్నారు. దీర్ఘకాలిక ఆరోగ్యానికి ఎంతో హెల్ప్ అవుతాయని అన్నారు. అయితే దీన్ని తీవ్రంగా భయపెట్టేలా చెయ్యొద్దని చెప్పారామె. ఇష్టంతో..స్వాంతన చేకూరేలే చేయాలి. అప్పుడే వృద్ధాప్యాన్ని ధీమాగా తిప్పికొట్టగలమని అన్నారామె. అంతేగాదు ఈ ఏజ్లో నిరంతర సంరక్షణ, నిబద్దతతో చేసే రోజువారీ వ్యాయామాలు మన ఆయుష్షుకి శ్రీరామరక్ష అని చెబుతున్నారు మందిరా బేడి. View this post on Instagram A post shared by Herbalife India Official (@herbalifeindiaofficial)గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: పిల్లలకు నేర్పించాల్సింది ఇదే..! గుడ్ పేరెంటింగ్ స్టైల్) -
ఆరు నెలల్లో 12 కిలోలు బరువు తగ్గిన మహిళ..!
బరువు తగ్గడం అంత ఈజీ కాకపోయినా..అసాధ్యం మాత్రం కాదు. అదనపు బరువుని తగ్గించుకోవడానికి ఇక్కడొక మహిళ అనుసరించిన విధానం..అందర్నీ కదిలిస్తోంది, ప్రేరేపిస్తోంది కూడా. కేవలం ఆరు నెలల్లోనే మంచి ఫలితాన్ని అందుకుంది. పైగా అందుకోసం ఆమె ఎంతలా కష్టపడిందో తెలిస్తే..విస్తుపోతారు. మంచి శీరారకృతి, ఆరోగ్యకరమైన బరువు కోసం ఆ మాత్రం డెడికేషన్ ఉండాల్సిందే మరి. ఇక్కడ ఈ మహిళ బరువు తగ్గడం కోసం ఏం అనుసరించిందంటే..దుబాయ్కి చెందిన షెర్రీ పీటర్ అనే మహిళ తాను ఆరు నెలల్లో 12 కిలోలుకు పైగా బరువు తగ్గానని సోషల్ మీడియా ఎక్స్ వేదికగా పేర్కొంది. అంతేగాదు ఆగస్టు 2025 vs ఫిబ్రవరి 2026 కల్లా 12 కిలోలు తగ్గి..స్లిమ్గా మారాను అని పోస్ట్లో తెలిపింది. మంచి శరీరాకృతి కోసం అనుసరించిన వెయిట్లాస్ వ్యూహం గురించి పేర్కొన్నారామె.ప్రతిరోజూ పదివేల అడుగులురోజువారీగా పదివేల అడుగుల వాకింగ్. ఇది బరువు తగ్గడానికి ఒక ప్రభావవంతమైన వ్యూహం. దీనివల్ల రోజుకు దాదాపు 300–500 అదనపు కేలరీలను బర్న్ చేస్తుంది. తాను దీన్ని ఒక ఏడాది నుంచి పాటిస్తున్నానని చెప్పారు. జిమ్కి వెళ్లడానికంటే మందు నుంచి ప్రారంభించానని చెప్పారు. వారంలో నాలుగు రోజులు..బరువులు ఎత్తడం, పైలేట్స్ వెయిట్ లిఫ్టింగ్, పైలేట్స్ను వారానికి నాలుగు నుంచి ఐదు రోజులు కేటాయించానని తెలిపింది. వాటిలో స్ట్రెంగ్త్ ట్రైనింగ్ జీవక్రియను పెంచగా, పైలేట్స్ కోర్ బలాన్ని పెంపొందిస్తాయి. ఎమ్స్కల్ప్ట్ నియో వారానికి రెండుసార్లుఎమ్స్కల్ప్ట్ నియో అనే మిషన్ సాయంంతో శరీర ఆకృతి చికిత్స తీసుకున్నట్లు తెలిపారు. ఇది ఏకకాలంలో కొవ్వును కరిగింఇచ 30 నిమిషాల సెషన్లలో కండరాలను నిర్మిస్తుంది. ఇది ఉదరం, పిరుదులు, చేతులు, తొడలపై ప్రభావవంతంగా ఉంటుంది.ఆహారంసమర్థవంతమైన బరువు తగ్గడంలో అధిక ఫైబర్, పోషకాలు అధికంగా ఉండే ఆహారాలపై దృష్టి సారించడం అత్యంత కీలకం. అలాగే హైడ్రేటెడ్గా ఉంటూనే చక్కెర, శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్ వినియోగాన్ని కూడా పరిమితం చేయాలి. అదనంగా తినాలనిపించినప్పుడల్లా.. తీసుకున్న గ్రీన్ టీ కాస్త భావోద్వేగ మద్దతుగా మారిందని షెర్రీ చెప్పింది.మద్యం మానేయడంక్యాలరీ తీసుకోవడం తగ్గించడానికి ఆల్కహాల్ తగ్గించడం అనేది చాలా ప్రభావవంతమైన మార్గం. సాధారణంగా ప్రతి పెగ్ ఆల్కహాల్ వంద కేలరీనలు పెంచుతుంది. అందుకే పూర్తిగా మానేసి పైలేట్స్, జిమ్, వాకింగ్లపై ఫోకస్ పెట్టినట్లు తెలిపారామె.సింపుల్గా చెప్పాలంటే..ఎక్కువ నడవడం, తక్కువ తినడం బరువు తగ్గడానికి సరళమైన మార్గం అని అందరికీ తెలుసు. కానీ ఇలా షెర్రీ లాంటి మహిళల అనుభవపూర్వకమైన వెయిట్లస్ స్టోరీలు..ఇలాంటి వాటిని అనుసరించేలా చేయడంలో ప్రేరణటీ ఉంటాయి కదూ..!. ఇంకెందుకు ఆలస్యం ప్రయత్నించి చూడండి మరి..!.august 2025 vs february 202612kgs down and in the best shape of my life pic.twitter.com/ZLMHIIr4H3— deSherry (@Sherrypeter) February 20, 2026 (చదవండి: నాట్యమయూరి సుధా చంద్రన్ వెల్నెస్ సీక్రెట్..! ఆయిల్ మసాజ్లు, ఇంట్లో తయారు చేసే..) -
నాట్యమయూరి సుధా చంద్రన్ వెల్నెస్ సీక్రెట్..!
భారతీయ భరతనాట్య నృత్యకారిణి, నటి సుధాచంద్రన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నటిగానూ, నృత్యకారిణిగా మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుని, గుర్తింపు తెచ్చుకున్నారు. అలాగే బుల్లితెరపై విలక్షణమైన నటతో అశేష ప్రేక్షక ఆదరాభిమానాలు పొందారామె. అలాంటి సుధాచంద్రన్ ఆరు పదుల వయసులో కూడా అంతే అందం, ఫిట్నెస్తో యాక్టివ్గా ఉండే ఆమె..అందం, ఆరోగ్యపరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారో సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నారామె. ప్రస్తుతం ఉన్న హెల్త్ అండ్ బ్యూటీ ట్రెండ్లకు విరుద్ధంగా పూర్వకాల నాటి ఆయుర్వేద ఆచారాలే తన అందం, ఆరోగ్యం వెనుక సీక్రెట్ అంటోందామె. వాటి గొప్పతనం గురించి సుధా మాటల్లోనే సవివరంగా తెలుసుకుందామా..!. View this post on Instagram A post shared by Sudhaa Chandran (@sudhaachandran) ప్రస్తుతం బ్యూటీ అనగానే సీరమ్లు, షీట్ మాస్క్లు ట్రెండ్ల హవా ఎక్కువగా ఉంది. పైగా చాలామంది సీనియర్ సెలబ్రిటీలు ఈ ఆధునిక కాలానికి అనుగుణంగా ఉన్న ట్రెండ్లే అనుసరిస్తే..ఆమె పాతకాలం నాటి ఆయుర్వేదం, నాటి ఆచార సంప్రదాయలకే జై కొడుతోంది సుధాచంద్రన్. అంతేగాదు ఆరోగ్యం, చర్మ సంరక్షణ అనేవి దినచర్యలు కావని, అవి మన అమ్మమ్మల నాటి జ్ఞాపకాతో ముడిపడి ఉన్నావి, తరతరాలుగా ఒకరి నుంచి ఒకరికి సంక్రమించినవిగా పేర్కొన్నారామె. తాను దక్షిణి భారత్లోని కేరళ నుంచి వచ్చానని, అందువల్ల దేశీ ఆచారాలకే ప్రాముఖ్యత ఇస్తానని అన్నారామె. తనకు ఆయుర్వేదం ఒక ట్రెండ్ కాదని, అదొక జీవన విధానమని అన్నారు. చిన్ననాటి నుంచి చూసినవే ఈనాటికి తూ.చా తప్పకుండా ఆచరిస్తున్నానని అన్నారామె. దక్షిణ భారత దేశం నుంచి రావడంతో మంగళ, శుఖ్రవారాల్లో తలస్నానం తప్పనిసరి అని చెప్పారు. కొబ్బరి నూనె రాసుకుని మరి స్నానం చేయడం అలవాటని కూడా చెప్పారామె. తన అమ్మమ్మ జుట్టు అందంగా, ఒత్తుగా ఉండాలంటే కొబ్బరినూనె తప్పనిసరి అని చెబుతూ తాను పాఠశాలకి వెళ్తున్నప్పుడూ అమ్మమ్మ ఎంతలా తన జుట్టుకి శ్రద్ధగా నూనె రాసేవారో గుర్తు తెచ్చుకున్నారామె. అలాగే 15 రోజులకొకసారి కడుపుని శుభ్రపరుచుకోవడం అంటే..సాఫీగా విరేచనాలు అయ్యేలా కేటాయించడం. మన పురాతన భారతీయ వైద్య విధానమైన ఆయుర్వేదన్నే గట్టిగా విశ్వసిస్తానని చెప్పారామె. కనీసం జలుబు చేసినప్పుడు కూడా దశములారాష్టాన్ని క్రమం తప్పకుండా ఉపయోగిస్తానని చెప్పారామె. దశములారాష్టం అనేది సాంప్రదాయ ఆయుర్వేద టానిక్. ఇది పది వేర్లు, ఇతర మూలిక మిశ్రమాలతో తయారు చేస్తారని తెలిపారు. శ్వాసకోశ ఆరోగ్యానికి చాలామంచిదని చెప్పారు. అలాగే కళ్లకు పెట్టుకునే కాజల్ కూడా ఇంట్లో తయారుచేసినదే వాడతానని, ఇది తన అమ్మమ్మ నుంచి అమ్మకు..అలా తనకు సంక్రమించిన ఆచారమని. అదే తాను ఇప్పటికీ ఫాలో అవుతానని అన్నారామె. అలాగే జుట్టు ఆరోగ్యానికి ఆముదం కూడా ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారామె. అలాగే మాయిశ్చరైజింగ్ కొబ్బరి నూనెని ఉపయోగిస్తానని, ఆఖరికి మేకప్ని తొలగించేందుకు కూడా వెట్ వైప్స్ వాడనని, కొబ్బరినూనెతోనే తొలగిస్తానని అన్నారామె. తాను కేరళ నుంచి వచ్చి ముంబైలో స్థిరపడ్డా తన మూలాలను, ఇంటి ఆచారాలనే అనుసరిస్తానని చెప్పారామె. అంతేగాదు కేరళ మసాజ్లు తీసుకుంటానని కూడా అన్నారు. శరీరంలోని అదనపు నీటి నిలుపుదలను తొలగించేందు ఎంతగానో ఉపకరిస్తాయని అన్నారు. తాను కొత్తగా ఎలాంటి ప్రయోగాలు చేసేందుకు ఇష్టపడనని, తరతరాల సంప్రదాయాలు, ఆచారాలనే పాటిస్తానని చెప్పారామె. అప్పుడే జీవితం చాలా సులభంగా తేలికగా ఉంటుందన్నారామె. కానీ నేటితరం మార్కెట్లో వచ్చేప్రతి ట్రెండ్ ఫాలో అయ్యి జీవితాన్ని క్లిష్టతరంగా మార్చుకుని సమస్యలు కొనితెచ్చుకుంటున్నారంటూ..తన పోస్ట్ని ముగించారు సుధాచంద్రన్. View this post on Instagram A post shared by Sudhaa Chandran (@sudhaachandran) (చదవండి: The 'Ideal Self' Trap: ఎదుటివారిలా ఉండాలనుకోవడమే సమస్య!) -
డెంటల్ యాబ్సెస్ అంటే..? ఎందువల్ల వస్తుందంటే..
ఎప్పుడైనా మీ పంటిచిగురు దగ్గర తెల్లగా... చిన్న ఉండలాంటి సంచిలో కాస్త చీము నిండినట్టుగా చిన్న తిత్తి మాదిరిగా కనిపించిందా? కొద్దిగా వాచినట్టుగా, నొప్పిగా, బాధగా ఏదో చిగుర్లకు వచ్చిన సమస్యగా అనిపించిందా? దాన్ని ‘డెంటల్ యాబ్సెస్’ అంటారు. అంటే నోటి పుండు. ఒక్కసారి అది బాగా పొడుస్తున్నట్టుగా తీవ్రమైన నొప్పి రావచ్చు. జ్వరం కూడా కనిపించవచ్చు. కారణం అదో బ్యాక్టీరియల్ సమస్య. ఈ డెంటల్ యాబ్సెస్ అంటే ఏమిటీ, అదెందుకు వస్తుంది, చికిత్స ఏమిటన్న అనేక విషయాలను తెలుసుకుందాం...పంటి చిగురుకు ఏదైనా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చి దాన్నిండా చీము చేరడం వల్ల వచ్చే సమస్యే ‘పంటి యాబ్సెస్’. నిజానికి పంటిచిగురు దగ్గర చీము చేరడం వల్ల ఈ సమస్య వస్తుంది. ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు దాన్ని ఎదుర్కోడానికి తెల్లరక్తకణాలు రంగంలోకి దిగడం తెలిసిందే. ఇలా యుద్ధానికి సన్నద్ధమైన ఈ తెల్లరక్తకణాలు... బ్యాక్టీరియాతో జరిగిన పోరాటంలో నశించాక... ఆ తెల్లరక్తకణాల తాలూకు మృతకణాలన్నీ చీము రూపంలో అక్కడ ఓ తిత్తి (పాకెట్)లాగా ఉండి΄ోతాయి. దాంతో నోరు తెరచి చూసుకున్నప్పుడు ఓ తెల్లటి చీము ఉండ కనిపిస్తుంది.తగ్గినట్టు ఉన్నా ఉపేక్షించడం సరికాదు... పంటి చిగురు దగ్గర కనిపించిన ఆ ఇన్ఫెక్షన్ చిగురుకు పాకే అవకాశముంది. అంతేకాదు... అది పంటిని వదులు చేసేందుకూ ఛాన్స్ ఉంది. ఒక్కోసారి ఆ గడ్డ చిదిమినట్లవుతుంది. ఇది జరిగినప్పుడు నొప్పి కాస్తా అకస్మాత్తుగా చేత్తో తీసేసినట్లు అవుతుంది. మొదట ఉన్న తీవ్రమైన నొప్పి అకస్మాత్తుగా లేకుండా పోయి, నొప్పి లేదంటే సమస్య తగ్గిపోయిందని కాదు. సాధారణంగా డెంటల్ యాబ్సెస్ అన్నది దానంతట తగ్గి΄ోవడం కాస్త అరుదే. అందుకే అలా పంటి చిరుగురు ప్రాంతంలో తెల్లటి చీము ఉండ కనిపించిందంటే తప్పక చికిత్స తీసుకోవడం అవసరం. ఇతర అవయవాలకూ పాకవచ్చుడెంటల్ యాబ్సెస్కు తగిన చికిత్స తీసుకోకపోవడం వల్ల ఒక్కోసారి ఆ సూక్ష్మజీవులు రక్తప్రవాహంలో కలిసి ఇతరచోట్లకూ పాకే అవకాశముంది. ఒకవేళ ఇన్ఫెక్షన్ దవడకూ, తలకూ, మెడకు కూడా పాకితే ఆ ప్రాంతాల్లోనూ తీవ్రమైన నొప్పి రావచ్చు. ఒక్కోసారి భరించలేనంత నొప్పిగా కూడా ఉండవచ్చు. లక్షణాలుసాధారణంగా నోట్లో పేరుకు΄ోయే బ్యాక్టీరియా సంఖ్య చాలా ఎక్కువ. దీన్నే ఓరల్ బ్యాక్టీరియా, ఓరో–ఫ్యారింజియల్ బ్యాక్టీరియా అంటారు. వీటిలో చాలావరకు నిరపాయకరమైనవే ఎక్కువ. అయితే హానికరమైన బ్యాక్టీరియాతో ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు నోరు బ్యాక్టీరియా పెరుగుదలకు దోహదంచేసే భాగం అయినందున అవి వేగంగా పెరుగుతాయి. పలువరసలో ఏదైనా భాగం దెబ్బతిని ఉంటే అక్కడ బ్యాక్టీరియా విస్తరించేందుకు అవకాశాలు మరింతగా పెరుగుతాయి. దాంతో చీముగడ్డ (పస్ పాకెట్) ఏర్పడటంతో మరికొన్ని లక్షణాలూ కనిపిస్తుంటాయి. అవి... ∙ మాటిమాటికీ పొడిచినట్లుగా తీవ్రమైన నొప్పి ∙ చల్లటి లేదా వేడి ప్రదార్థాలు తీసుకున్నప్పుడు జిల్లుమనడం. ∙ఏదైనా వస్తువు నమలగానే పొడుచుకువచ్చినట్టుగా నొప్పి కలగడం. గొంతులోని గ్రంథులు వాచడం. నోటిలో దుర్వాసన వస్తున్న భావన లేదా దుర్వాసన రావడం. ఏదైనా తినేపదార్థం నోట్లోకి తీసుకుంటే దాని రుచి మారినట్లు అనిపించడం. (ఇలా అనిపిస్తుందంటే అది చీముగడ్డ పగిలినందుకు సూచన. అయితే అప్పటికీ ఇన్ఫెక్షన్ మాత్రం శరీరంలోనే ఉంటుంది. కాబట్టి అది శరీరంలోని ఇతర ప్రాంతాలకు పాకే అవకాశమున్నందున... అలా జరగడం మరింత ప్రమాదానికి దారితీసే ముప్పున్నందున... తప్పనిసరిగా డెంటల్ డాక్టర్ను కలిసి తగిన సూచనలూ, చికిత్స తీసుకోవాలి. నివారణప్రతిరోజూ క్రమంతప్పకుండా ఉదయం, రాత్రి బ్రషింగ్ చేసుకోవడం. ∙బ్రషింగ్ కోసం మృదువైన బ్రిజిల్స్ ఉన్న టూత్బ్రష్నే వాడంటం. పైన చిగుళ్లూ, పళ్లూ కలిసే చోటి నుంచి కింద మళ్లీ చిగుళ్లూ, పళ్లూ కలిసే చోటు వరకు గుండ్రంగా బ్రష్ చేసుకోవడం. పంటికి బయటివైపే కాకుండా లోపలి వైపునా బ్రష్ చేసుకోవడంతో పాటు నమిలే ప్రదేశాలల్లో... అంటే పంటిపైన వెడల్పుగా ఉంటే ప్రాంతంలోనూ చక్కగా బ్రష్ చేసుకోవడం. బ్రషింగ్ టైమ్ రెండు లేదా మూడు నిమిషాలకు మించకుండా చూసుకోవడం. నాలుకపైనున్న బక్టీరియాను తొలగించుకోడానికి కనీసం 30 సెకన్ల పాటు స్క్రబ్ చేసుకోవడం. చిగుర్ల ఆరోగ్యం కోసం బ్రషింగ్ తర్వాత చేత్తో చిగుళ్లపై మృదువుగా మసాజ్ చేసుకోవడం. ప్రతి ఆర్నెల్లకోసారి క్రమంతప్పకుండా దంత పరీక్షలు చేయించుకోవడం. చికిత్సపంటి యాబ్సెస్కు డాక్టర్లు సాధారణ యాంటీబయాటిక్స్తో చికిత్స అందిస్తారు. మరీఅవసరమైన వారికి ఆ చీముపాకెట్ను తొలగించడంతోటు రూట్కెనాల్ అవసరం పడవచ్చు. డాక్టర్ ప్రత్యూష, సీనియర్ కన్సల్టెంట్ డెంటల్ – కాస్మెటిక్ సర్జన్ (చదవండి: అరుదైన కేన్సర్లతో పోరాడిన యువ యోధురాలు..!) -
రాత్రి నిద్రలో కూడా ఆఫీస్ ఆలోచనలేనా?
పగలు ఆఫీసులో ఎనిమిది గంటలు పని చేస్తే.. రాత్రి నిద్రలో మరో ఎనిమిది గంటలు మెదడు అదే పనిని చేస్తూనే ఉందా?. బెడ్ మీద పడుకున్నాక కూడా రేపటి మీటింగ్, బాస్ అడిగే ప్రశ్నలు, పూర్తికాని రిపోర్టులు కళ్ళ ముందు సినిమా రీళ్లలా తిరుగుతున్నాయా? అయితే మీరు 'మెంటల్ స్విచ్ ఆఫ్' చేయడంలో విఫలమవుతున్నారు. ఫలితంగా నిద్రలేమి, ఉదయాన్నే విపరీతమైన నీరసం మీ జీవితంలో భాగమైపోతున్నాయి.ఆలోచనలు ఎందుకు వస్తాయి? (The Zeigarnik Effect)మానసిక శాస్త్రంలో 'జైగార్నిక్ ఎఫెక్ట్' అనే ఒక సిద్ధాంతం ఉంది. మన మెదడు పూర్తి చేసిన పనుల కంటే, అసంపూర్తిగా వదిలేసిన పనులను (Unfinished Tasks) పదే పదే గుర్తు చేస్తూ ఉంటుంది. అందుకే శుక్రవారం వదిలేసిన ఫైలు ఆదివారం రాత్రి వరకు మిమ్మల్ని వెంటాడుతుంది. దీనివల్ల శరీరం విశ్రాంతి తీసుకుంటున్నా, మెదడు మాత్రం 'ఓవర్ టైమ్' పని చేస్తూనే ఉంటుంది.నా వద్దకు వచ్చిన రాకేష్ అనే టీమ్ లీడర్ అనుభవమే అందుకు ఉదాహరణ. అతను రాత్రి 2 గంటలకు కూడా మేలుకుని ఈమెయిల్స్ చెక్ చేసేవాడు. "మెయిల్ చెక్ చేయకపోతే ఏదో అపరాధం చేస్తున్నట్టు అనిపిస్తుంది" అని చెప్పేవాడు. ఫలితంగా అతనికి 'క్రానిక్ ఇన్సోమ్నియా' (దీర్ఘకాలిక నిద్రలేమి) మొదలైంది. మేము అతనికి 'డిజిటల్ కర్ఫ్యూ' మరియు 'బ్రెయిన్ డంప్' టెక్నిక్స్ నేర్పించాం. పక్షం రోజుల్లోనే అతని నిద్ర నాణ్యత పెరిగింది, ఆఫీసులో పనితీరు కూడా మెరుగైంది.ఆఫీస్ ఆలోచనల నుండి విముక్తి పొందే 5 మార్గాలుబ్రెయిన్ డంప్ (Brain Dump): ఆఫీసు వదిలే ముందే లేదా పడుకోవడానికి గంట ముందు, మీ మెదడులో ఉన్న పనులన్నింటినీ ఒక పేపర్ మీద రాయండి. "ఇదిగో, ఈ పనులన్నీ ఇక్కడ రాసి ఉన్నాయి, రేపు చూసుకోవచ్చు" అని మీ మెదడుకు ఒక స్పష్టమైన సంకేతం ఇవ్వండి. అప్పుడు అది పదే పదే గుర్తు చేయడం ఆపుతుంది.వర్క్-హోమ్ రిచ్యువల్ (Work-Home Ritual): ఆఫీసు నుండి ఇంటికి వచ్చే దారిలో ఒక నిర్దిష్టమైన పనిని అలవాటు చేసుకోండి. ఉదాహరణకు, ఆఫీసు ఐడి కార్డు తీసి బ్యాగులో పెట్టడం లేదా ఆఫీసు బట్టలు మార్చుకుని స్నానం చేయడం. ఇది మీ మెదడుకు "ఆఫీసు పని అయిపోయింది, ఇప్పుడు వ్యక్తిగత సమయం మొదలైంది" అని చెప్పే ఒక 'సైకలాజికల్ స్విచ్'.డిజిటల్ బౌండరీస్: పడుకోవడానికి కనీసం ఒక గంట ముందు ఫోన్ను పక్కన పెట్టండి. ఆఫీసు వాట్సాప్ గ్రూపులను 'మ్యూట్' చేయండి. ఆ నీలి రంగు వెలుతురు (Blue light) మీ నిద్రకు అవసరమైన 'మెలటోనిన్' హార్మోన్ను దెబ్బతీస్తుంది.వర్రీ టైమ్ (Worry Time): మీకు ఆందోళన కలిగించే విషయాల గురించి ఆలోచించడానికి సాయంత్రం ఒక 15 నిమిషాల సమయాన్ని కేటాయించండి. ఆ సమయంలో మాత్రమే వాటి గురించి ఆలోచించండి. బెడ్ మీదకు వెళ్ళాక ఆలోచనలు వస్తే, "దీని గురించి ఆలోచించడానికి రేపు సాయంత్రం టైమ్ ఉంది కదా" అని వాయిదా వేయండి.మైండ్ఫుల్ బ్రీతింగ్: నిద్రపోయే ముందు 4-7-8 టెక్నిక్ (4 సెకన్లు శ్వాస తీసుకోవడం, 7 సెకన్లు ఆపడం, 8 సెకన్లు వదలడం) పాటించండి. ఇది మీ నాడీ వ్యవస్థను శాంతపరిచి, ఆలోచనల వేగాన్ని తగ్గిస్తుంది.Today's Taskఈ రాత్రి పడుకునే ముందు, రేపు చేయాల్సిన మూడు ముఖ్యమైన పనులను ఒక డైరీలో రాసి, ఆ డైరీని మూసి పక్కన పెట్టండి. మీ మెదడు ఎంత ప్రశాంతంగా ఉంటుందో గమనించండి.మీరు నిద్రపోవడం అంటే పనిని నిర్లక్ష్యం చేయడం కాదు.. రేపటి పనిని మరింత సమర్థవంతంగా చేయడానికి మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోవడం. గుర్రానికి విశ్రాంతి ఇస్తేనే అది రేపటి రేసులో పరిగెత్తగలదు. మీ మెదడు కూడా అంతే!- సైకాలజిస్ట్ విశేష్ కెరీర్ & మైండ్సెట్ కోచ్8019 000066www.psyvisesh.com -
పిల్లల్లో ‘డబ్ల్యూ’ సిట్టింగ్ను ప్రోత్సహించవద్దు!
పిల్లలు తమ కాళ్లను ఇంగ్లిషు అక్షరం ‘డబ్ల్యూ’ ఆకృతిలో ఉంచి కూర్చోవడం వాళ్ల కీళ్ల ఆరోగ్యానికీ, కండరాలకూ అంత మంచిదికాదంటూ సూచిస్తున్నారు పిల్లల డాక్టర్లు. పిల్లలు మోకాళ్లను ముందు పెట్టి... మిగతా కాళ్ల భాగాన్ని వెనకకు నెట్టి ఉంచడంతో చూడ్డానికి ఆ భంగిమ ‘డబ్ల్యూ’ లాగా ఉంటుంది కాబట్టి దాన్ని డబ్ల్యూ సిట్టింగ్ అంటారు. పిల్లలు ఈ భంగిమలో కూర్చోడానికి అలవాటైతే దాని వల్ల కలిగే అనేక అనర్థాలేమిటన్నది తెలుసుకుందాం...కూర్చునే వయసుకు వచ్చాక చిన్నారులు నేల మీద డబ్ల్యూ ఆకృతిలో కాళ్లుంచేలా కూర్చుండిపోయే భంగిమను ‘రివర్స్ టైలరింగ్ సిట్టింగ్’ అనీ లేదా ‘ఫ్రాగ్ సిట్టింగ్’ అని కూడా అంటారు. ఇలా క్యూట్గా కనిపించేలా మోకాళ్లను ముందువైపునకూ, అరికాళ్లు రెండూ వెనక్కు ఉంచుతూ కూర్చుండిపోవడం వల్ల మున్ముందు అనేక సమస్యలొస్తాయంటూ పేర్కొంటున్నారు.డబ్ల్యూ సిట్టింగ్తో అనర్థాలివే... → ఇలా కూర్చున్నప్పుడు తొడ ఎముక (ఫీమర్)తో పాటు, మోకాలి కిందివైపున ఉండే ప్రధాన ఎముక ‘టిబియా’పై ఒత్తిడి పడటం వల్ల చిన్నారుల పాదాలు ఉండాల్సినట్లుగా కాకుండా లోపలివైపునకు తిరగడం (ఇన్ టోయింగ్) జరగవచ్చు. → ఇలాగే కూర్చుండిపోవడం అలవాట్లయ్యాక వాళ్ల కాళ్ల కదలికలు... కదలాల్సినంతగా కాకుండా కాస్త పరిమితంగా కదిలే అవకాశముంది. ఆ తర్వాత వీళ్లు బాసిపట్లు (సక్లంముక్లం) వేసినట్లుగా కూర్చోవడమూ కష్టమవుతుంది. → కండరాలు బలహీనపడటం : ఈ డబ్ల్యూ సిట్టింగ్లో దీర్ఘకాలం కూర్చుండేవారి కాలి కండరాలు బలహీనంగా మారే అవకాశమూ ఉంటుంది. → బాలెన్స్ తప్పడం, మైల్స్స్టోన్స్ ఆలస్యం కావడం : కండరాలు బలహీనం కావడంతో నిలబడినప్పుడు వారు బ్యాలెన్స్ సరిగ్గా నిలపలేకపోవడం వంటి అనర్థాలూ ఉండవచ్చు. దీనివల్ల వారి వయసుకు తగ్గట్లుగా చోటుచేసుకోవాల్సిన క్రమబద్ధమైన అభివృద్ధి (డెవలప్మెంటల్ మైల్స్టోన్స్) ఆలస్యం కావచ్చు. → మోకాళ్లు, కీళ్ల నొప్పులు : డబ్ల్యూ సిట్టింగ్స్ బాగా అలవాటైన పిల్లల్లో మోకాళ్ల, కీళ్ల నొప్పులు చాలా త్వరగా వచ్చే అవకాశం ఉంది. అలాగే ఆర్థరైటిస్ సమస్య కూడా వచ్చే అవకాశాలు ఎక్కువ. → పోష్చర్ సరిగా లేకపోవడం : ఈ పిల్లల్లో భవిష్యత్తులో పాదాలు లోపలివైపునకు తిరిగే ‘ఇన్ టోయింగ్’తో పాటు వెన్ను సరైన భంగిమలో లేకపోవడంతో వాళ్ల దేహం పోష్చర్లో కూడా మార్పులు వచ్చే అవకాశముంది.సరిదిద్దడమిలా... → బాసిపట్లు వేసినట్లుగా (సక్లం ముక్లం) కూర్చోబెట్టడం : దీన్నే ఇంగ్లిష్లో క్రిస్క్రాస్ సిట్టింగ్ అని కూడా అంటారు. డబ్ల్యూ సిట్టింగ్లో ఉండే పిల్లలను ఆ భంగిమలో బదులు క్రిస్ క్రాస్ భంగిమలో కూర్చుబెడుతూ... క్రమంగా డబ్ల్యూ సిట్టింగ్కు దూరం చేయడం. → కాళ్లు రెండూ సాచినట్లుగా (లాంగ్ సిట్టింగ్) కూర్చోబెట్టడం : చిన్నారులు కాళ్లను డబ్ల్యూ ఆకృతిలో ముడిచి ఉన్నప్పుడు వాళ్లను రెండు కాళ్లూ సాచినట్లుగా లాంగ్ సిట్టింగ్లో కూర్చోబెట్టడం. → డబ్ల్యూ సిట్టింగ్ భంగిమలో కాకుండా కరెక్ట్ పోష్చర్లో కూర్చుండేలా సైడ్ సిట్టింగ్లాంటివీ ప్రోత్సహించడం. → డబ్ల్యూ సిట్టింగ్కు బదులు ఇతరత్రా పోష్చర్లలో కూర్చున్నప్పుడు వాళ్లను మెచ్చుకుంటూ ఉండటం. పై అలవాట్లను ప్రోత్సహించడం వల్ల డబ్ల్యూ సిట్టింగ్తో కలిగే అనర్థాలు తొలగిపోవడంతోపాటు భవిష్యత్తులో ఎముకలూ, కీళ్లు, కండరాలు ఆరోగ్యకరంగా ఉండేందుకు ఇది దోహదపడుతుంది. -
నెలసరి పోరాటం
నెలసరి... ప్రకృతి సిద్ధమైన ప్రక్రియే అయినప్పటికీ నేటి ఆధునిక జీవనశైలిలో అది లక్షలాది మంది మహిళలకు ఒక అగ్నిపరీక్షగా మారుతోంది. శారీరక పరమైన సమస్యలే కాకుండా, సామాజిక వివక్ష, మౌలిక సదుపాయాల లేమి, హార్మోన్ల అసమతుల్యత యువతులను ఇబ్బందులపాలు చేస్తున్నాయి. ఇటీవల వెలువడిన తాజా నివేదికలు ఈ సమస్య తీవ్రతను కళ్లకు కడుతున్నాయి.21వ అధికరణంనెలసరి ఆరోగ్యం అనేది కేవలం ఒక వ్యక్తిగత విషయం.. అనే దాని నుంచి ప్రాథమిక హక్కు స్థాయికి చేరింది. ఇటీవల సుప్రీంకోర్టు వెలువరించిన ఈ చారిత్రాత్మక తీర్పు కొత్త విప్లవానికి నాంది పలికింది. రాజ్యాంగంలోని 21వ అధికరణం ప్రకారం నెలసరి ఆరోగ్యం–పరిశుభ్రత మహిళల గౌరవప్రదమైన జీవన హక్కులో ఒక భాగమని కోర్టు స్పష్టం చేసింది.612 దేశంలోని అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో 6–12వ తరగతి చదువుతున్న బాలికలకు ఉచితంగా శానిటరీ ప్యాడ్స్ అందించాలని, విడిగా మరుగుదొడ్ల సౌకర్యం కల్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.33.4%25 ఏళ్లలోపు యువతుల్లో ప్రతి ముగ్గురిలో ఒకరికి అంటే 33.4% మందికి తమ గురించి సరైన అవగాహన లేదు.23 మిలియన్లు పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు లేకపోవడం వల్ల ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో 23 మిలియన్ల మంది బాలికలు పీరియడ్స్ ప్రారంభమైన తర్వాత చదువును మధ్యలోనే ఆపేస్తున్నారు.32% 15–24 ఏళ్ల యువతుల్లో సుమారు 77.3% మంది పరిశుభ్రమైన పద్ధతులు పాటిస్తున్నారు. అయితే బీహార్ వంటి రాష్ట్రాల్లో ఇది కేవలం 32% ఉండటం ఆందోళనకరం.1022% భారత్లో 10% నుంచి 22% మంది యువతులు పీసీఓఎస్ వంటి నిశ్శబ్ద శత్రువుతో బాధపడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా 10% నుంచి∙13% మంది మహిళలు ఇబ్బందిపడుతున్నారు. పీసీఓఎస్ వంటి హార్మోన్ల సమస్యలు ఉన్నవారిలో 70% మందికి అసలు తమకు ఆ సమస్య ఉందన్న విషయమే తెలియదు.50% పీసీఓఎస్ ఉన్న మహిళల్లో 50% కంటే ఎక్కువ మంది ఆందోళన, నిరాశ వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు.6584% పీరియడ్స్ సమయంలో సుమారు 65% నుంచి 84% మంది విద్యార్థినిలు తీవ్రమైన కడుపు నొప్పితో (డిస్మెనోరియా) బాధపడుతున్నారు. సగటున ఒక విద్యార్థిని ప్రతినెల 3 నుండి 5 రోజులు పాఠశాలకు దూరమవుతోంది.2.3 కోట్లు ఇప్పటికీ సరైన సౌకర్యాలు లేకపోవడం వల్ల దేశవ్యాప్తంగా సుమారు 2.3 కోట్ల మంది బాలికలు ప్రతి సంవత్సరం నెలసరి సమయంలో పాఠశాలకు వెళ్లడం మానేస్తున్నారు.79.7% రాజస్థాన్ లో జరిగిన ఒక అధ్యయనం ప్రకారం, కడుపునొప్పి కారణంగా 79.7% మంది విద్యార్థినులు క్లాసులకు హాజరు కాలేకపోతున్నారు.50% పీరియడ్స్ సమస్యలు ఉన్న మహిళల్లో 50% మంది మాత్రమే వైద్యుని సంప్రదిస్తున్నారు. చాలామంది దీనిని సాధారణం అని నిర్లక్ష్యం చేయడం వల్ల అది ఇతర ఆరోగ్య సమస్యలకు దారితీస్తోంది.68.9% తీవ్రమైన పీరియడ్ నొప్పితో బాధపడే వారిలో 68.9% మందికి నిద్ర సరిగ్గా పట్టడం లేదు.38% పీరియడ్స్ సమయంలో 38% మంది మహిళలు తమ రోజువారీ పనులను సరిగ్గా చేసుకోలేకపోతున్నారు.7885% జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే గణాంకాల ప్రకారం, 15–24 ఏళ్ల మధ్య వయస్సు గల మహిళల్లో దాదాపు 78% నుంచి 85% మంది పీరియడ్స్ సమయంలో ఆరోగ్యకరమైన ఉత్పత్తులను (శానిటరీ ప్యాడ్స్, కప్స్ మొదలైనవి) వాడుతున్నారు.12% సుమారుగా 12% మంది మహిళలకు ప్యాడ్లు కొనే స్తోమత లేకపోవడం, అపరిశుభ్రమైన బట్టలు వాడటం వల్ల వారిలో ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయి.ఐదుగురిలో 1 బాలికనెలసరి మొదలయ్యాక ప్రతి ఐదుగురిలో ఒక బాలిక చదువు మానేస్తుంది. మౌలిక సౌకర్యాల లేమి, బాల్య వివాహాలు, అవగాహన లోపం వల్ల పాఠశాల మానేస్తున్నారు. 1.13 భారతదేశం ఏటా సుమారు 1.13 లక్షల టన్నుల శానిటరీ ప్యాడ్స్ను ఉత్పత్తి చేస్తోంది. వీటిని పర్యావరణానికి హాని కలగకుండా నిర్వీర్యం చేయడం ఇప్పుడు పెద్ద సవాలుగా మారింది.సమాజంలో పీరియడ్స్ గురించి ఉన్న అపోహలు ఇంకా తొలగిపోవడం లేదు. ముఖ్యంగా విద్యార్థినిలు, యువతులలో ఈ సమస్యలు వారి చదువు, మానసిక స్థితి, దైనందిన జీవితంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. కేవలం శానిటరీ ప్యాడ్స్ పంపిణీ చేస్తే సరిపోదని, పాఠశాల స్థాయి నుంచే లింగ–సమగ్ర విద్య అందించాలని నిపుణులు సూచిస్తున్నారు. -
పెరుగుపై పేరుకునే నీరు పారబోస్తున్నారా..?
ప్రతిరోజూ మనం కిచెన్లో చేసే చిన్నచిన్న పొరపాట్లు మన ఆరోగ్యంపై ఎంతగానో ప్రభావం చూపిస్తాయి. సాధారణంగా మనం ఇంట్లో పెరుగు తోడుపెట్టినపుడు, దానిపై ఒక పలుచని నీరులాంటి పొర పేరుకుపోతుంది. చాలా మంది దీనిని పారబోస్తుంటారు. కానీ ఇందులోనే ఎంతో ముఖ్యమైన పోషక విలువలున్నాయని వైద్యులు చెబుతున్నారు. పాలు తోడు పెట్టినపుడు పెరుగుగా మారే ప్రక్రియలో పాలుగడ్డకట్టి, నీటి రూపంలో ఉండే ప్రోటీన్లు విడిపోయి పైకి చేరుతాయి. దీనినే చల్ల అని, వే ప్రోటీన్ అని, మజ్జిగతేట అని పలు రకాలుగా పిలుస్తుంటారు. ఇందులో కండరాల నిర్మాణానికి అవసరమైన ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. ఇంకా కాల్షియం, పొటాషియం వంటి గుండెకు, ఎముకలకు మేలుచేసే పోషకాలు కూడా ఉంటాయి. అలాగే ఇది పేగు ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది. సాధారణంగా జిమ్కు వెళ్లేవారు, లేదంటే కండరాల పుష్టికోసం వేల రూపాయలు ఖర్చు చేసి కొనే ప్రోటీన్ పౌడర్లు ఈ ద్రవం నుంచే తయారవుతాయి. పరిశ్రమలలో ఈ ద్రవాన్ని సేకరించి, ఫిల్టర్ చేసి, ఎండబెట్టి పౌడర్గా మారుస్తారు. ఇంట్లో అది సహజ రూపంలోనే లభిస్తోంది. కాబట్టి ఇకపై పెరుగుపై నీరు కనిపిస్తే దాన్ని పారబోయకుండా, తిరిగి ఆ పెరుగులోనే కలిపేయండి. దీనివల్ల పెరుగులోని పూర్తి పోషకాలు మన శరీరానికి అందుతాయి. చిన్న మార్పుతో పెద్ద ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. -
బెల్లీఫ్యాట్ తగ్గేందుకు 5:1:1 రూల్ అంటే..!
కార్బోహైడ్రేట్స్ తీసుకోవడం తగ్గిస్తే బరువు తగ్గి స్లిమ్గా అవుతామన్నది చాలామందిలో ఉండే అభిప్రాయం. అయితే మనం తీసుకునే కార్బోహైడ్రేట్లకు తగినట్లుగా పీచు, ప్రోటీన్లను చేర్చాలి. ఐదు గ్రాముల కార్బోహైడ్రేట్లు : 1 గ్రాము పీచు (ఫైబర్) : 1 గ్రాము ప్రోటీన్ అంటూ 5:1:1 నిష్పత్తిలో తీసుకుంటే కడుపు చుట్టూ కొవ్వు పేరుకోవడం తగ్గడంతో పొట్ట అలాగే దేహం బరువు పెరగక వ్యక్తులు స్లిమ్గా ఉంటారన్నది న్యూట్రిషనిస్టుల మాట.తెల్ల బ్రెడ్డు, పేస్ట్రీలు, మైదా, ఇన్స్టాంట్ నూడుల్స్ వంటి రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్లో కేవలం పిండిపదార్థాలు మాత్రమే ఉంటాయి. వాటిలో పీచుపదార్థాలుగానీ లేదా ప్రోటీన్గానీ ఉండక΄ోవడంతో అవి తిన్నవెంటనే రక్తంలోకి చక్కెర విడుదలవుతుంది. వినియోగం కాని చక్కెర కొవ్వుగా మారి బరువు పెరుగుతారన్నది చాలామందికి తెలిసిన విషయమే. 5:1:1 రూల్ అంటే... ఐదు (5 ) గ్రాముల కార్బోహైడ్రేట్ ఉండే ఆహారాన్ని తీసుకుంటే... దానికి అనుగుణంగా –1 గ్రాము పీచు పదార్థం అలాగే – 1 గ్రాము ప్రోటీన్ తీసుకోవాలి. దాంతో పిండిపదార్థంవల్ల పెరగాల్సిన కొవ్వు పెరగకుండా ఈ పీచు, అలాగే ప్రోటీన్లు అడ్డుపడతాయి. 5:1:1 నిష్పత్తికి అర్థమిదే. ఈ నిష్పత్తిలోని 1 గ్రాముల పీచు, 1 గ్రాము ప్రోటీన్తో ఏయే ప్రయోజనాలు చేకూరతాయో చూద్దాం. 1 గ్రాము పీచుతో... పీచు (ఫైబర్) జీర్ణక్రియను మెల్లగా జరిగేలా చూస్తుంది. దాంతో చక్కెరలు వెంటనే రక్తంలో పెరగకుండా మెల్లమెల్లగా ఇంకుతుంటాయి. ఫలితంగా రక్తంలోని చక్కెర మోతాదులు అకస్మాత్తుగా పెరగవు (స్పైక్ అవ్వవు). ఒకేసారి చక్కెరలు రక్తంలో విడుదల కావు కాబట్టి దాన్ని అదుపు చేయాల్సిన ఇన్సులిన్ కూడా అకస్మాత్తుగా విడుదల కావాల్సిన అవసరం లేదు. అందువల్ల అది నెమ్మదిగా తగిన మోతాదులోనే విడుదలవుతూ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఇక పీచు వల్ల కడుపు నిండుగా ఉన్న భావనతో వెంటనే ఆకలిగా అనిపించదు. అంతేకాదు జీర్ణవ్యవస్థ ఆరోగ్యమూ బాగుంటుంది. జీర్ణవ్యవస్థలో ఉండాల్సిన మేలు చేసే మంచి బ్యాక్టీరియా (గట్ బ్యాక్టీరియా) పెరగడంతో వ్యాధి నిరోధక వ్యవస్థ కూడా చురుగ్గా పనిచేస్తుంది. దాంతో అంత తేలిగ్గా వ్యాధుల బారిన పడకుండా ఆరోగ్యంగా ఉండటం సాధ్యమవుతుంది. ఇక పీచు (ఫైబర్) అన్నది కొవ్వులను సమీకరించి వ్యర్థాల రూపంలో వెళ్లకుండా మలం నుంచి వేరు చేస్తుంది. 1 గ్రాము ప్రోటీన్తో ప్రోటీన్ వల్ల కూడా చక్కెరలు తక్షణం పెరగక΄ోగా... కండరాల బలం కూడా సమంగా నిర్వహితమవుతుంది. ్ర΄ోటీన్ తిన్న తర్వాత వెంటనే ఆకలిగా అనిపించదవు. దాంతో మితిమీరు తినడం (ఓవర్ ఈటింగ్) తగ్గుతుంది. ఫలితంగా బరువు పెరిగే ప్రమాదం బాగా తగ్గుతుంది. ఇక ్ర΄ోటీన్ వల్ల కండరాల రిపేర్లు జరుగుతుండటం, దేహానికి అవసరమైన శక్తి అందుతుంది. మరి... ప్రోటీన్లూ, పీచు... ఈ రెండూ పుష్కలంగా ఉండే ఆహారాలేమిటంటే... దాదాపు చాలారకాల పప్పుదినుసులు / కాయధాన్యాలు (లెంటిల్స్) లోప్రోటీన్ తోపాటు పీచుపదార్థాలూ ఎక్కువగానే ఉంటాయి. ఉదాహరణకు కందులు, శనగలు, చిక్కుళ్లలో 40 నుంచి 50 శాతం కార్బోహైడ్రేట్లతోపాటు ప్రోటీన్, పీచు ఎక్కువగా ఉంటాయి. పొట్టుతీయని ధాన్యాలలో కార్బోహైడ్రేట్లతో పాటు కొంత ప్రోటీన్, పీచుపదార్థాలు పుష్కలంగా ఉంటాయి. ఉదాహరణకు ముడిబియ్యం, జొన్నలు, కొర్రలు, సజ్జలు, అరికలు, సామలు, ఊదలు, క్వినోవా. అన్నిరకాల తాజా పండ్లలో స్వాభావికమైన చక్కెరతో పాటు విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు, తేమ (మాయిశ్చర్) లకు అదనంగా పీచుపదార్థాలూ (ఫైబర్) ఉంటాయి. వీలైనంతవరకు పండ్ల రసాలను కాకుండా పండ్లు తీసుకోవడం మేలు. దూరం ఉంచాల్సినవి... బ్రెడ్, పేస్ట్రీలు, బిస్కెట్లు, కేకులు, డోనట్స్, పిజ్జా, బర్గర్, నూడుల్స్, బేకరీ పదార్థాలు, చిప్స్ వంటి కరకరలాడే (క్రిస్పీ) వేపుళ్లకు వీలైనంత దూరం ఉండాలి. అలాగే ప్యాకేజ్డ్ జ్యూస్లు, జామ్, స్వీట్లకు కూడా దూరంగా ఉండటం మేలు.5:1:1 అనే ఈ నిబంధనను వీలైనంతగా పాటిస్తూ ఉంటే... బరువు పెరగక΄ోవడం, కడుపు చుట్టూ అనవసరమైన కొవ్వు పేరుకుని పొట్టరావడం వీలైనంతగా తగ్గుతుంది. దాంతో ఊబకాయంతో వచ్చే అనేక అనర్థాలు అంటే... డయాబెటిస్, హైబీపీ, ఫ్యాటీలివర్ గుండెజబ్బులు... వీటన్నింటినీ నివారించుకుని ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపవచ్చు. డాక్టర్ శ్రీలత సీనియర్ క్లినికల్ డైటీషియన్ అండ్ న్యూట్రీషనిస్ట్ (చదవండి: Actress Sneha and Prasanna: మైండ్ఫుల్ పేరెంటింగ్ మంత్ర!) -
అరుదైన కేన్సర్లతో పోరాడిన యువ యోధురాలు..!
మహమ్మారి కేన్సర్ ఎంతటి బలవంతుడినైన బలహీనుడిగా మార్చేస్తుంది. అంతలా మానసికంగా, శారీరకంగా ఢీలా పడేలా చేసే వ్యాధిని..19 ఏళ్ల అమ్మాయి అలుపెరగని పోరాటం చేసి..మట్టికరిపించింది. ఎందరో కేన్సర్ బాధితులకు స్ఫూర్తిగా నిలవడమే గాక..ప్లీజ్ పోరాడండి అని ధైర్యం చెబుతోంది. యువ కేన్సర్ వారియర్ అని అందరిచేత ప్రశంసలందుకుంటోంది. ఆ అమ్మాయే 19 ఏళ్ల లకితా ఫిద్రా..కెన్యాకు చెందిన ఆమెకు ఐదేళ్ల వయసులో ఉండగా తండ్రి కేన్సర్తో మరణించాడు. ఒంటరి తల్లి పెంపకంలో సాగుతున్న ఆమె జీవితం సరిగ్గా పదేళ్ల వయసులో ఊహించని మలుపు తిరిగింది. ఒకరోజు ఆటలు ఆడుకుంటుండగా, సడెన్గా కుడిమోకాలులో విపరీతమైన నొప్పి..అల్లాడిపోతోంది. తీరా వైద్యుల వద్దకు తీసుకువెళ్తే..వాళ్లు నార్మల్ సమస్యగానే భావించి చికిత్స అందిస్తున్నారు. ఎప్పుడైతే ఆమె కుటుంబ చరిత్రలో తండ్రి అత్త సార్కోమా కేన్సర్ బాధితులని తెలిసిందో..వెంటనే అనుమానంతో డాక్లర్లు వైద్య పరీక్షలు చేయగా..తీవ్రమైన ఆస్టియోసార్కోమా కేన్సర్ నిర్థారణ అయ్యింది. స్కానింగ్లో ఆమె కుడి తొడ ఎముకలో ఈ కేన్సర్ కణితిని గుర్తించారు. దాంతో వైద్యులు కీమోథెరపీ చేయించి, లింబ్ సాల్వేజ్ సర్జరీ చేశారు. ఈ ప్రక్రియలో మోకాలి కీలును టైటానియం ఇంప్లాంట్తో భర్తీ చేశారు. ఆ తర్వాత రెండేళ్లకు హాయిగా స్కూల్కి వెళ్లి..యథావిధిగా చదువుకోడం ప్రారంభించింది. మళ్లీ ఆ మహమ్మారి 2020లో దాడి చేసింది. ఈసారి ఆమె కాలుని పూర్తిగా తొలగించక తప్పలేదు. అదే ఏడాది అదనపు కీమోథెరపీ, ఎముకమజ్జ మార్పిడి జరిగాయి. ఆమె సొంత స్టెమ్ సెల్స్ ఉపయోగించి మొట్టమొదిటి మార్పిడి చేశారు. దాదాపు వందరోజులపైనే ఆస్ప్రత్రిలో చికిత్స పొందింది. అక్కడితో ఆ కేన్సర్ విజృంభణ ఆగలేదు. ముచ్చటగా మూడోసారి 2022లో, ఆమెకు మైలోడిస్ప్లాస్టిక్ సిండ్రోమ్ అభివృద్ధి చెందింది. ఇది అతి తీవ్రమైన ఎముక మజ్జ రుగ్మత.ఇది మళ్లీ దాడిచేసే అరుదైన కేన్సర్వ్యాధి. అయితే ఈసారి ఆమెకు అండగా తల్లి నిలబడింది. తల్లి ఎముకమజ్జ మార్పిడితో లకితాకి చికిత్స అందించారు. ఈప్రక్రియ విజయవంతమైంది. ఇక్కడ లకితా మూడోసారి ఎదుర్కొన్న తీవ్రమైన ఎముకమజ్జ మార్పడి..బహుళ కేన్సర్లకు దారితీసే జీవితకాల ప్రమాదం. కానీ ఆమె జన్యువులు దూకుడు లేకుండా చికిత్సా వ్యూహానికి అనుమతించి..తగ్గుముఖం పట్టడం విశేషం. అయితే ఆమెకు సదా వైద్యు పర్యవేక్షణ తప్పనిసరి. కనీసం రెండు మూడేళ్ల కొకసారి కేన్సర్ పరీక్షలు చేయిచుకోక తప్పదు. ఇన్ని కష్టాల మధ్య చదువుని నిర్లక్ష్యం చేయలేదు. ఆమె ఇప్పుడు సైకాలజీ, సామాజిక శాస్త్రం, సాహిత్యం ఏ లెవెల్ను చదువుతోంది. పైగా విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించాలనే యోచనలో ఉంది. తాను పరుగెత్తలేకపోయినా, జిమ్నాస్టిక్స్ చేయలేకపోతేనేం..డ్యాన్స్ చేయగలను, పేయింటింగ్ వేయగలను అంటోంది. పునరావృతమయ్యే బోన్ కేన్సర్, లి-ఫ్రామిని సిండ్రోమ్పై ధైర్యంగా పోరాడిని ధీరురాలిగా గుర్తింపు తెచ్చుకుంది. అలాగే కేన్సర్ బాధితుల్లో స్థైర్యాన్ని నింపేలా గొప్ప సందేశాన్ని కూడా అందిస్తుంటుంది. మీరు కేన్సర్ రోగిగా ఆస్పత్రల్లో గడపడం కష్టమే అయినపపటికీ తెలియన ధైర్యంతో సాగుతారు. ఆ వ్యాధని చూసి భయపడినప్పటికీ స్ట్రాంగ్గా మారతారు. అప్పుడు తెలుస్తుంది మీరు రోగి కాదు..హీరో అనే సందేశాలతో వాళ్లను వీరోచితంగా కేన్సర్పై పోరాడేలా చేస్తుంది లకితా. (చదవండి: నిజమైన వ్యక్తిత్వ వికాసం మొదలయ్యేది అప్పుడే..!) -
ఆ తాతగారి లైఫ్స్టైల్కి ఫిదా అవ్వాల్సిందే..!
ఇటీవలకాలంలో అందరిలో ఆరోగ్య స్ప్రుహ ఎక్కువైంది. మంచి ఆహారపు అలవాట్లు,వర్కౌట్లతో హెల్దీగా ఉండే ప్రయత్నం చేస్తున్నారు. మరికొందరు ప్రోటీన్ పౌడర్లు, జిమ్లు వంటి వాటితో ఆరోగ్యకరమైన వృద్ధాప్య జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు. కానీ ఈ తాత అంతలా ఆరోగ్యం కోసం ఏమాత్రం ఖర్చు చేయకుండానే..చాలా చురుకుగా, దీర్ఘాయువుతో ఉండటం విశేషం. ఈ ఏజ్లో కూడా అన్ని పనులు తానే చాలా యాక్టివ్గా చేసుకుంటున్న తీరుకి ఫిదా అవ్వాల్సిందే. మరి అతడి ఆరోగ్య రహస్యం ఏంటో చూద్దామా..ఆ తాత గారి గురించి ఆయన మనవరాలు కంటెంట్ క్రియేటర్ 28 ఏళ్ల సింధూ ఇన్స్టాగ్రామ్లో వీడియో రూపంలో పోస్ట్ చేయడంతో అది నెట్టింట సంచలనంగా మారడమే కాదు, ప్రశంసలు వెల్లువెత్తాయి. తన తాతగారికి దగ్గర దగ్గర 95 ఏళ్ల ఉంటాయని, ఆయన రిటైర్డ్ అనస్థీషియాలజిస్ట్ అని వీడియోలో వివరిస్తోంది సింధు. ఆమె తన తాతగారి రోజు ఉదయం 5.30 గంటలకు యోగాతో ప్రారంభమవుతుందని, పదవీవిరమణ చేసి రెండు దశాబ్దాలకు పైనే అవుతున్నా..ల్యాప్టాప్లో వైద్య సాహిత్యం గురించి చదవడం, కొత్త సాంకేతిక నైపుణ్యాలను నేర్చుకోవడం వంటి వాటితో కాలక్షేపం చేస్తారు. వీటి అన్నింటి తోపాటు అప్పుడప్పుడు షాపింగ్ ట్రిప్పులు, రోజువారీ పూజ, ధ్యానం, యాప్లు లేకుండా సాధన చేయడం తదితరాలు ఉన్నాయి. ఇవేగాక తన వంటను తానే చేసుకుంటారని, "మినీ ఇడ్లీలు" వండటంలో మంచి నిపుణుడని చమత్కరిస్తోంది. ఆయన రిటైర్ అయ్యాక కూడా వైద్యవృత్తిపై ఆసక్తి ఏమాత్రం తగ్గలేదని, ఇప్పటికీ వాటికి సంబంధించినవి చదవడం, ఆర్టికల్స్ రాయడం వంటివి చేస్తుంటారని చెబుతోంది. ఆయన తమిళనాడులోని మధురైలో చాలా ఏళ్లుగా అనస్థీషియాలజిస్ట్గా పనిచేసినట్లు పేర్కొంది. తన తాతగారి రోజువారీ దినచర్య దీర్ఘకాల ఆరోగ్యానికి ఖరీదైన ధోరణులతో పనిలేదని నిరూపించింది. ఇప్పటికీ ఆయన హ్యాపీగా వాక్ చేస్తారు, వంటకూడా చేసుకుంటారు, కొత్తకొత్త నైపుణ్యాలను నేర్చుకుంటుంటారు. పైగా ఆయన ఎలాంటి జిమ్ సభ్యుత్వం లేకుండా, కనీసం సప్లిమెంట్లపై ఆధారపడకుండా.. జస్ట్ శ్రద్ధ అనే రెండు అక్షరాల పదంపై ఫోకస్ పెట్టి ఆరోగ్యకరమైన జీవితాన్ని ఆస్వాదిస్తున్నాడని సింధు చెపుకొచ్చింది. దక్షిణాసియా హిందూ సంప్రదాయల్లో వందల ఏళ్ల నుంచి రోజువారీ కదలికలు, భావోద్వేగాలపై నియంత్రణ, మానసిక స్పష్టత తదితరాలు ఉన్నాయి. అయితే వాటిని కంటిన్యూ చేసేలా జీవన విధానంలో భాగమైతే తన తాతలా సుదీర్ఘకాలం ఆరోగ్యంగా జీవితాన్ని గడపొచ్చని అంటోంది. చిన్న చిన్న వాటిల్లో కూడా ఆనందాన్ని వెతుక్కునే మనస్తత్వం ఉన్నవారికి ఎదురే ఉండదని, అది వారికి బలోపేతంగా ఉండేలా సామర్థ్యాన్ని అందిస్తుందని అంటోంది. View this post on Instagram A post shared by Sindhu 👩🏽🍳 (@sindhusfoodforthought) (చదవండి: అంబానీల ఆడపడుచు కోడలు.. లెహంగా ధర తెలిస్తే షాక్!) -
అలాంటి పిల్లలను వదిలించుకోవాలని చూస్తే జైలు శిక్ష..
నాకు పెళ్లయి 15 సంవత్సరాలు. పెళ్లి అయిన తర్వాత నా భర్త నన్ను అమెరికాకు తీసుకువెళ్లారు. ఇద్దరు పిల్లలు అక్కడే పుట్టారు. దురదృష్టవశాత్తూ ఇద్దరికీ తీవ్రమైన ఆటిజం.. అమెరికాలో ఉండగా కూడా నా భర్త పిల్లలను పట్టించుకోకపోగా కొట్టేవాడు. విషయం తెలుసుకున్న అక్కడి అధికారులు పిల్లలను తమ రక్షణలోకి తీసుకుని నా భర్తపై చర్యలు కూడా తీసుకున్నారు. ఇదే క్రమంలో తను ఇండియా పారిపోయి వచ్చాడు. చాలా కష్టాలు పడి నేను కూడా వచ్చాను. తీవ్రమైన లెవెల్ 3 ఆటిజంతో ఉన్న పిల్లలను పెంచడం చాలా కష్టంతో – ఖర్చుతో కూడుకున్న పని. అతను వాళ్లని వదిలించుకోవడమే కాదు, మేమిద్దరం కలిసి కొనుక్కున్న ఆస్తికి ఈఎంఐలు కట్టకుండా ఇబ్బంది పెడుతున్నాడు. నేను 24 గంటలు పిల్లల చుట్టే ఉండవలసిన పరిస్థితి కాబట్టి నేను పని కూడా చేయలేను. ఆటిజం బారిన పడిన పిల్లలకు మన దేశంలో సరైన చట్టాలు పెద్దగా లేవు – ప్రభుత్వ వసతులు కూడా లేవు అని అంటున్నారు. పరిష్కారం సూచించగలరు.– సుమతి, వరంగల్మీ బాధ వింటుంటే హృదయాన్ని కలచివేస్తుంది. మీరన్నది నిజమే! మన దేశంలో ఆటిజంపై పెద్దగా అవగాహన లేదు – బహుశా అందుకే ప్రభుత్వ వసతులు, పథకాలు కూడా పెద్దగా అందుబాటులో లేవు. దివ్యాంగుల హక్కుల చట్టం 2016 కింద ఆటిజంను మానసిక/మేధోవైకల్యంగా పరిగణిస్తారు. ఈ చట్టం కింద ఎటువంటి వైకల్యం కల్గిన వ్యక్తినైనా వివక్షకు గురిచేస్తే కఠిన శిక్షలు ఉన్నాయి. అలాగే జాతీయ ట్రస్ట్ చట్టం 1999 అనేది ఆటిజం, సెరిబ్రల్ పాల్సీ, మానసిక వికలాంగత, బహుళ వైకల్యాలున్న వ్యక్తుల సంరక్షణ, చట్టపరమైన సంరక్షకులను నియమించడం, స్వతంత్ర జీవనానికి మద్దతు ఇవ్వడం కోసం ఏర్పాటు చేసిన చట్టం/సంస్థ. అయినప్పటికీ ఆటిజం ఉన్నవారికి మిగతా వారిలా సరైన ఇన్సూరెన్స్ కూడా లేదు! అమెరికాలో ఉన్నట్టు పటిష్టమైన ప్రభుత్వ వసతులు, సంస్థలు లేనందున ఆర్థికంగా బలహీనమైన, మధ్యతరగతి తల్లిదండ్రులు చాలా కష్టాలు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వాలు వీటిపై బలమైన మార్పులు చేయాల్సిన అవసరం ఉంది. మీ విషయానికి వస్తే మీ భర్తపై ముందుగా క్రిమినల్ కేసులు పెట్టండి. మీ భర్త చేసినవి నేరాలు! బీ.ఎన్.ఎస్.లోని సెక్షన్ 93 (పూర్వం ఐ.పీ.సీ 317) ఇలా చెప్తుంది: ‘‘పన్నెండు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లల తండ్రి అయినా, తల్లి అయినా లేదా అలాంటి పిల్లల సంరక్షణ కలిగి ఉన్న ఎవరైనా, ఆ బిడ్డను పూర్తిగా విడిచిపెట్టాలనే ఉద్దేశ్యంతో – ఆ బిడ్డను వదిలించుకునే ఉద్దేశంతో బహిర్గతం చేసినా లేదా వదిలేసినా, ఏడు సంవత్సరాల వరకు జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ విధించబడతాయి.’’ అంతేకాదు. జువెనైల్ జస్టిస్ యాక్ట్ 2015, సెక్షన్ 75 ప్రకారం: పిల్లలను శారీరకంగా, మానసికంగా క్రూరత్వానికి గురి చేయడం లేదా నిర్లక్ష్యం చేయడంపై కఠిన చర్యలు ఉన్నాయి. పిల్లలపై బాధ్యత లేదా నియంత్రణ ఉన్న వ్యక్తి, వారి ఆరోగ్యం లేదా భద్రతకు హాని కలిగించేలా ప్రవర్తిస్తే 3 ఏళ్ల వరకు జైలుశిక్ష, లక్ష వరకు జరిమానా ఉంటుంది.కాబట్టి పై కేసులు పెట్టండి. పోలీసులకి గానీ, శిశు సంక్షేమ శాఖవారి ద్వారా కానీ పిర్యాదు చేయవచ్చు. అదనంగా మీ పిల్లల కోసం – మీకోసం కూడా మెయింటెనెన్స్ కోరుతూ కేసు వేయండి. డీ.వీ.సీ. చట్టం కింద భారీ పరిహారం, గృహ వసతి కూడా కోరవచ్చు. మీకు త్వరగా ఉపశమనం కావాలి అనుకుంటే అదనంగా హై కోర్టును ఆశ్రయించి త్వరితగతిన కేసులు తేల్చవలసిందిగా దరఖాస్తు చేసుకోవచ్చు.– శ్రీకాంత్ చింతల, హైకోర్టు న్యాయవాదిమీకున్న న్యాయపరమైన సమస్యలు, సందేహాల కోసం sakshifamily3@gmail.com కు మెయిల్ చేయవచ్చు. (చదవండి: కిరణ్ రావుకు చికున్గున్యా నిర్థారణ..! ఏకంగా కీళ్ల ఆరోగ్యాన్ని..) -
కిరణ్ రావుకు చికున్గున్యా నిర్థారణ..! ఏకంగా కీళ్ల ఆరోగ్యాన్ని..
బాలీవుడ్ చిత్ర నిర్మాత కిరణ్ రావు ఇటీవల సోషల్ మీడియా పోస్ట్లో తనకు చికున్గున్యా వచ్చినట్లు తెలిపారు. దాని కారణంగా కనీసం పుస్తకం కూడా పట్టుకోలేకపోతున్నట్లు పేర్కొన్నారు. ఆ వ్యాధి తన కీళ్లను ఎంతలా బలహీనపరిచిందో వివరించారామె. అసలు ఈ వ్యాధి అంతలా కీళ్ల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందా అంటే..ఆల్ఫావైరస్ అనే దోమ జాతి కారణంగా RNA వైరస్ అయిన చికున్గున్యా మానవ శరీరం లక్ష్యంగా తీవ్రమైన ప్రభావం చూపిస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. కొన్ని రోజుల్లో జ్వరం తగ్గుతుందేమో కానీ..దాని తాలుకా ఇబ్బందులు శరీరంలో స్పష్టంగా కనిపిస్తాయి, ఎదుర్కొంటాం కూడా అంటున్నారు నిపుణులు. అసలు 'చికున్గున్యా' అంటేనే వంగి ఉండే భంగిమ అని అర్థం. అంటే మన కీళ్లను, కండరాలపై ప్రభావం చూపి..కదపలేని పరిస్థితికి తీసుకువస్తాయి.కీళ్ల ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుందంటే..ఏడిస్ ఈజిప్టి లేదా ఏడిస్ ఆల్బోపిక్టస్ వంటి జాతి దోమలు కుట్టడం వల్ల ఈ వ్యాధి సంక్రమిస్తుందట. ఆ దోమకాటు కారణంగా ఈ చికున్గున్యా వైరస్ రక్తప్రవాహంలోకి ప్రవేశించి కీళ్లలోని బంధన కణజాలం సైనోవియల్ ఫైబ్రోబ్లాస్ట్లకు వ్యాపిస్తుంది. దాంతో మనకు శరీరమంతా విపరీతమైన నొప్పులు..నడవాలన్న వణుకు పుట్టడం వంటి సమస్యలు వస్తాయట. ఇది మన రోగ నిరోధక వ్యవస్థపై త్రీవంగా దాడి చేస్తుందట. ఫలితంగా శరీరంలో పలుచోట్ల వాపులు కూడా వస్తాయని చెబుతున్నారు నిపుణులు. ఈ వైరస్ చాలా దూకుడుగా ఉంటుందని, ఒక్కోసారి దీర్ఘకాలిక కీళ్ల వ్యాధిని ప్రేరేపిస్తుందని చెబుతున్నారు. కొందరిలో రుమటాయడ్ ఆర్థరైటిస్ బారిన పడేలా చేస్తుందట. అంతేగాదు కొంతమందికి కోలుకున్నాక కూడా పూర్తిస్థాయిలో కదలికలను తిరిగి పొందలేరట. అలాంటి వారికి ఫిజియోథెరపీ అవసరం ఏర్పడుతుందని చెబుతున్నారు. నిరంతర కీళ్లనొప్పి ఈ వ్యాధి ముఖ్య లక్షణంగా చెబుతున్నారు నిపుణులు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు..చుట్టుపక్కల నిల్వ నీరు లేకుండా చూసుకోవాలి. అంటే పూలకుండీలు, ఇంటి బయట ఉండే కంటైనర్లు లేదా డ్రమ్లో నిల్వ నీరు లేకుండా చూసుకోవాలనిపగటి పూట కుట్టే దోమల వల్ల వస్తుంది కాబట్టి..పొడవాటి చేతులు ఉన్న బట్టలు ధరించాలి. దోమల కుట్టకుండా లోషన్లు వంటివి రాసుకోవడం చేయాలి. అవసరమైతే దోమతెరలు తదితరాలను వాడటంఅలాగే ఇంట్లో ఎవ్వరికైనా చికున్గున్యా వస్తే..తక్షణమే దోమల రాకుండా తగిన చర్యలు తీసుకోవడం వంటివి చేయాలి.చివరగా ఈవ్యాధి నుంచి కోలుకోవడానికి చాలా సమయం పడుతుందని, ఓపికతో తగిన ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండాలని చెబుతున్నారు నిపుణులు. దీనికి నిర్ధిష్ట నివారిణి గానీ, టీకా వంటివి లేవని వైద్య నిపుణులు నొక్కి చెబుతున్నారు. త్వరితగతిన కోలుకోవాలంటే మాత్రం..జ్వరం తగ్గేలా మందులు తీసుకుంటూ..వ్యాధినిరోధక శక్తిని పెంచే ఆహారాలు పుష్కలంగా తీసుకోవాలి. అలాగే కీళ్లు మరి బిగిసుపోకుండా ఉండేలా సాగదీయడం, ఫిజియోథెరపీ వంటివి తీసుకోవడం వంటివి చేయాని చెబుతున్నారు నిపుణులు.(చదవండి: ఎవరీ సరితా యోల్మా..? 146 ఏళ్లకు..) -
రంజాన్.... ఆరోగ్యం రీసెట్కు అద్భుత అవకాశం!
ముస్లింల పవిత్ర మాసం రంజాన్ వచ్చేసింది. రోజంతా పచ్చినీళ్లు కూడా ముట్టకుండా నెల రోజులపాటు ఉపవాసం! మన జీర్ణ వ్యవస్థకు సుదీర్ఘమైన విశ్రాంతినిచ్చి...పునరుజ్జీవం కల్పించేందుకు అద్భుత అవకాశమిది. కానీ...ముస్లిం సోదరులు ఉపవాస దీక్షకు ముందు.. ఇలా ఆహారం తీసుకుంటే గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు పొందొచ్చని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. మరి అవేంటో తెలుసకుందామా..!.సమోసాలు, పకోడి, లస్సీ, చక్కెర దట్టించిన మసాలా టీ, బిర్యానీ, రోటీ, పరాటా.. హలీమ్ వంటివి రంజాన్ సమయంలో బాగా పాప్యులర్ అవుతూంటాయి. పండ్లు, ఖర్జురాలు తినేవాళ్లు ఉంటారు కానీ చాలామంది బిర్యానీల వంటివాటికి అదనంగా వీటిని స్వీకరిస్తూంటారు. ఫలితంగా రోజంతా ఉండే ఉపవాసంతో వచ్చే ఆరోగ్య ప్రయోజనాలు కాస్తా దెబ్బతింటాయని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఏడాది మొత్తమ్మీద పేరుకుపోయిన మలినాలను శరీరం పగలు మొత్తం శుభ్రం చేసుకుంటే... రాత్రికాగానే మళ్లీ అవే అనారోగ్య కారకాలను లోపలికి పంపిస్తున్నామన్నట. వీటన్నింటినీ జీర్ణం చేసేందుకు కాలేయం కాస్తా కష్టపడాలి. ఫలితంగా నిద్ర చెడిపోతుంది. నెలరోజులపాటు సాగే ఈ తంతు కారణంగా మలినాలను మొత్తం వదిలించుకునే బదులు కాలేయం మరింత ఎక్కువ శ్రమ పడుతుంది. రక్తంలో చక్కెర మోతాదులు తరచూ మారిపోతూండటం వల్ల నాడీ వ్యవస్థపై ఒత్తిడికి గురవుతుంది. ఉపవాసం పుణ్యమా అని పొట్ట తేలిక అయ్యే బదులు వేయించిన తిండి, చక్కెరలతో నిండిపోతూంటుంది.ఇలా చేస్తే మేలు...ఇఫ్తార్...ఖర్జూరం, నీళ్లళ్లతో మీ దీక్ష విరమణ చేపట్టండి. శరీరానికి అవసరమైన ఎలక్ట్రోలైట్లు ఖర్చూరాల్లో మెండు. డీహైడ్రైషన్ నుంచి కాపాడతాయి. వీటితోపాటు వేడి వేడి సూప్, ప్రొటీన్ కోసం కొంచెం మాంసం/చేప/కోడిగుడ్లు తీసుకోవడం మేలు. అలాగే.. ఉడికించిన కాయగూరలు, ఆరోగ్యకరమైన కొవ్వులు కొంత మోతాదులో తినడం శరీరంలో మంట/వాపులను తగ్గిస్తుంది. గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. మేలు చేస్తుంది. అవకాడో, ఆలివ్ ఆయిల్, బాదాం. జీడిపప్పు, వాల్నట్స్ వంటివి లేదంటే, గుమ్మడి/సూర్యకాంతి, అవిశ గింజల వంటి వాటిల్లో ఆరోగ్యకరమైన కొవ్వులు, ఖనిజాలు, ప్రొటీన్, ఫైబర్లు లభిస్తాయి.షుహూర్ (తెల్లవారుఝాము)ప్రొటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులకు ప్రాధాన్యమివ్వండి. రోజంతా శక్తిని అందించేందుకు సంక్లిష్టమైన కార్బోహైడ్రేట్లు తీసుకోవడం మేలు. బ్రౌన్ రైస్, ఓట్స్, చిరుధాన్యాలు, చిలగడదుంపలు, క్యారెట్స్లు మాత్రమే కాదు... ఆపిల్స్, ఆరటిపండ్లు, నారింజ వంటి పండ్లు మేలు. చిటికెడు ఉప్పు కలుపుకుని నీళ్లు తాగాలి. ఉప్పు ఎక్కువగా ఉన్న, బాగా శుద్ధి చేసిన ఆహారం తీసుకోవడం వల్ల దాహం ఎక్కువ అవుతుంది.రెండింటి మధ్య...నిద్రకు ప్రాధాన్యమివ్వండి. రాత్రి ఎక్కువ సేపు మేలుకుని ఉండటం వల్ల శరీరంపై ఒత్తిడి పెరిగిపోయి మంట/వాపులు పెచ్చరిల్లుతాయి. ఇఫ్తార్ విందు తరువాత కాసేపు అటు ఇటు కదలడం వల్ల జీర్ణక్రియ మెరుగవుతుంది. అద్భుతమైన అవకాశం...రంజాన్ మాసం... దైవిక సేవతోపాటు మీకు మీరు సేవ చేసుకునేందుకు ఉపయోగించుకునే అద్భుత అవకాశం. అయితే ఉపవాసం ఒక్కటే సరిపోదు. శరీర హీలింగ్కు అవసరమైన పరిస్థితులను కల్పిస్తుంది అంతే. ఇక్కడ ఉపవాసాన్ని మీరెలా చేస్తున్నారనే దానిపై శరీరానికి కలిగే ప్రయోజనాలు ఆధారపడి ఉంటాయి. ముస్లిం సోదరులు ఏటా ఒక నెల రోజులపాటు పైన చెప్పుకున్న ఆహార నియమాలను పాటిస్తే.. మిగిలిన 11 నెలలూ శరీరం మెరుగ్గా పనిచేస్తుంది. ముస్లిం సోదరులు ఒక్కరే కాదు... మిగిలిన వారు కూడా అప్పుడప్పుడు కొంత కాలం పాటు ఉపవాసం చేయడం ద్వారా అనేక ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు. - మైక్ ఎన్డీగ్వా, నేచురల్ హెల్త్ గైడ్ -
సింకోప్.. పడి లేచే ప్రమాదం
ఫెయింట్ అయిపోవడం అనే మాట చాలామంది వినే ఉంటారు. తెలుగులో చెప్పాలంటే స్వాధీనం తప్పిపోవడం. ఇది స్పహతప్పి అలాగే ఉండిపోవడం కాదు...కాసేపట్లో మళ్లీ మామూలైపోవడం. ఇలా స్వాధినం తప్పిపోయి... కొద్దిక్షణాల్లోనే మళ్లీ మామూలైపోవడాన్ని వైద్యపరిభాషలో ‘సింకోప్’ అంటారు. అయితే కొద్దిసేపట్లోనే మళ్లీ మామూలైపోయినప్పటికీ ఇలా జరగడం కొన్నిసార్లు ప్రమాదాలకూ దారితీయవచ్చు. ఉదాహరణకు ఏ వాహనం నడుపుతున్నప్పుడో ఇలా జరిగితే అది పెను ప్రమాదం తెచ్చిపెట్టవచ్చు. ఈ సమస్యకు చాలా కారణాలుంటాయి. సింపుల్గా దేహంలో నీళ్లు / ద్రవాలు తగ్గిపోవడం (డీహైడ్రేషన్) మొదలుకొని వేగస్ నరం అతిగా స్పందించడం వరకు అనేక కారణాలతో వచ్చే ఈ ‘సింకోప్’ సమస్యపై అవగాహనతో పాటు దీనికి పరిష్కారాలేమిటో తెలుసుకుందాం.కొందరు ఏదైనా తట్టుకోలేని దృశ్యం చూడగానే స్పృహ తప్పినట్లుగా అయిపోతారు. మరికొందరిలో వారి ఆందోళన స్థాయి మితిమీరిపోతే వెంటనే స్వాధీనం తప్పి పడిపోతారు. ఎందుకిలా అవుతుంది. ఎందుకంటే... గుండె స్పందనల లయ (రిథమ్)లో ఏమాత్రం తేడా రాకూడదు. స్పందన పెరిగినా, తగ్గినా అది ప్రమాదకరమే. గుండె స్పందనలు తగ్గడంతో... మన దేహంలో అత్యంత కీలక అవయవమైన మెదడుకు రక్తసరఫరా తగ్గిపోతుంది. అలా తగ్గినప్పుడు స్పృహ తప్పి పడిపోయే కండిషన్ను సింకోప్ అంటారు. ఇది సాధారణంగా చాలాసార్లు నిరపాయకరమే అయినప్పటికీ... కొన్నిసార్లు మాత్రం అది ప్రమాదకరంగా పరిణమించవచ్చు. సింకోప్ లక్షణాలు, నివారణ, చికిత్సలేమిటో చూద్దాం.సింకోప్లో రకాలున్యూరల్లీ మీడియేటెడ్ : బాగా తీవ్రమైన నొప్పి రావడం లేదా చాలా ఎక్కువగా భావోద్వేగాలకు గురికావడం, అత్యంత తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురికావడం వల్ల. సింకోప్ కండిషన్ రావచ్చు. ఆర్థోస్టాటిక్ హైపోటెన్షన్ : దేహంలో నీళ్లు / ద్రవాలు తగ్గడం వల్లగానీ లేదా ఏవైనా మందులు వాడుతున్నప్పుడు వాటి వల్ల అకస్మాత్తుగా ఒక్కసారిగా రక్తపోటు (బ్లడ్ప్రెషర్) తగ్గిపోవడం వల్ల. కార్డియాక్ సింకోప్ : గుండె రిథమ్లో తేడా రావడం వల్ల (అరిథ్మియా అనే కండిషన్లో) గుండెవేగం పెరగడమో లేదా తగ్గడమో జరిగినప్పుడు. సిచ్చువేషనల్ సింకోప్ : గట్టిగా దగ్గడం లేదా మింగడం లేదా మూత్రవిసర్జన చేస్తున్నప్పుడు అకస్మాత్తుగా స్వాధీనం తప్పిపోవడం.సింకోప్ కారణమయ్యే మెకానిజమ్ 1) మెదడుకు గుండెనుంచి తగినంత రక్తం అందకపోవడం / గుండె తగినంత రక్తాన్ని మెదడుకు అందించలేకపోవడం.2) గుండె పంపింగ్ సరిగా ఉన్నప్పటికీ మెదడుకు ఆ రక్తం అందడానికి అవసరమైన బ్లడ్ప్రెషర్ను మెయిన్టెయిన్ చేయడానికి సదరు రక్తనాళానికి తగినంత సామర్థ్యం లేకపోవడం.3) రక్తనాళానికి సామర్థ్యం ఉన్నప్పటికీ రక్తనాళంలో తగినంత రక్తం లేకపోవడం... ఈ మూడింటిలో ఏదో ఒకటిగానీ, లేదా ఒకటి కంటే ఎక్కువగా అంటే... ఏవైనా రెండు కారణాల వల్ల గానీ ఇలా జరగవచ్చు.ఎందుకిలా జరుగుతుందంటే... గుండె ఒక కండర నిర్మితమైన ఒక ఎలక్ట్రిక్ పంపు లాంటి అవయవం అన్న విషయం తెలిసిందే. ఎస్ఏ నోడ్ (సైనో ఏట్రియల్ నోడ్) అనే ఒక కీలకమైన చోటి నుంచి గుండె స్పందించడానికి అవసరమైన కరెంటు మన శరీరంలోనే నిత్యం ఉత్పత్తి అవుతూ ఉంటుంది. ఆ ఎలక్ట్రిసిటీ సరఫరాలో తేడాల వల్ల ఒక్కోసారి గుండె కండరాలు వేగంగానైనా కొట్టుకోవచ్చు లేదా ఒక్కోసారి అకస్మాత్తుగా స్పందనలు తగ్గవచ్చు. కార్డియాక్ సింకోప్లో ఇలా జరుగుతుంది.వేగం పెరిగితే... కొన్ని సార్లు గుండె స్పందనల్లో వేగం బాగా పెరిగిపోయి ‘టాకికార్డియా’ అనే కండిషన్ ఏర్పడుతుంది. దీని వల్ల గుండె పై గదుల్లోగాని, కింది గదుల్లోగాని వేగం పెరుగుతుంది. అంటే గుండెలో పంప్ చేయడానికి అవసరమైన రక్తం చేరుకోకముందే గుండె ముడుచుకోవడం... అంటే గుండె స్పందన జరుగుతుందన్నమాట. దాంతో గుండె నుంచి కీలకమైన అవయవాలకు అందాల్సినంత రక్తం రక్తనాళాల్లోకి వెలువడదు. ఈ టాకికార్డియా అనే కండిషన్ ఏ వయసు వారికైనా రావచ్చు.వేగం తగ్గితే... గుండె స్పందనల్లో వేగం తగ్గితే ఆ కండిషన్ను బ్రాడికార్డియా అంటారు. బ్రాడి... అంటే నెమ్మదించడం (స్లో కావడం). ఇక ‘కార్డియా’ అంటే గుండె అని అర్థం. గుండె స్పందనల వేగం తగ్గడం వల్ల కూడా కీలకమైన అవయవాలకు రక్తసరఫరా తగ్గుతుంది. మనుషుల్లో తమ వయసు పెరుగుతున్న కొద్దీ వారి గుండె స్పందనలకు అవసరమైన ఎలక్ట్రికల్ సరఫరాల్లో తేడాలు వస్తుండవచ్చు. లేదా కొందరిలో పుట్టుకతోనే గుండెలో బ్లాక్స్ ఉండవచ్చు. గుండెకు అవసరమైన ఎలక్ట్రిసిటీలో తేడాలు రావడం వల్ల వచ్చే సమస్య అన్నది గుండెలో బ్లాక్స్ ఉండటం వల్ల వచ్చే సమస్య కంటే వేరుగా ఉంటుంది.సింకోప్కు కారణాలుగుండె నిర్మాణపరమైనవి : కొన్నిసార్లు గుండెలో నిర్మాణపరంగా ఏవైనా తేడాలు ఉండటం వల్ల మెదడులాంటి కీలక అవయవాలకు తగినంత రక్తాన్ని పంప్ చేయలేకపోవచ్చు. ఉదాహరణకు గుండె కండరాలు బలహీనంగా మారడంవల్లనో, లేదా కార్డియోమయోపతి అన్న కండిషన్లో సింకోప్ రావచ్చు.గుండె కవాటాల్లో మార్పులు : గుండె కవాటాలు రక్తాన్ని నిర్దిష్టంగా ఒకే దిశలో ప్రవహించేలా చూస్తుంటాయి. కొన్నిసార్లు గుండె కవాటాలు సన్నబడవచ్చు. ఇలా జరగడాన్ని ‘స్టెనోసిస్’ అంటారు. కొన్నిసార్లు అవి లీక్ కావచ్చు. ఇలా జరగడాన్ని ‘ఇన్సఫిషియెన్సీ’ లేదా ‘రీ–గర్జిటేషన్’ అంటారు. ఈ కండిషన్స్లో దేనివల్లనైనా సింకోప్ రావచ్చు.మితిమీరిన వ్యాయామం : కొందరు వ్యక్తుల్లో... అంటే మరీ ముఖ్యంగా క్రీడాకారులు / అథ్లెట్లలో గుండె కండరాలు మందం కావడం వల్ల కూడా సింకోప్ రావచ్చు. అతి వ్యాయామంతో గుండెపై విపరీతమైన భారం పడేలా పనిచేయించడం వల్ల ఈ కండిషన్ ఏర్పడే అవకాశముంది.పోష్చురల్ హైపోటెన్షన్ : కొన్ని సందర్భాల్లో పక్క మీద పడుకున్న వ్యక్తి స్థిమితంగా కాకుండా హాడావుడిగా లేదా అకస్మాత్తుగా నిల్చునప్పుడు... అతడి కదలికలకు తగ్గట్లుగా గుండె తన స్పందనలను అంతే వేగంగా పెంచుకోలేదు. దాంతో వేగంగా జరిగే శరీర కదలికకు అనుగుణంగా గుండె స్పందనవేగం పెరగకపోవడంతో... కీలక అవయవాలకు రక్తప్రసరణ తగ్గుతుంది. ఇలా జరగడాన్ని పోష్చురల్ హైపోటెన్షన్’ అంటారు.వేసోవేగల్ సింకోప్ : నరాల పనితీరు వ్యవస్థలో మన సంకల్పం లేకుండా దానంతట అవే జరిగేపోయేవి, మన సంకల్పంతో జరిగేవి అని రెండు రకాలు ఉంటాయి. ఈ రెండిటికీ మధ్య సమన్వయం లేకపోవడం వల్ల కూడా కొన్నిసార్లు ‘సింకోప్’ కండిషన్ వస్తుంది. వేగస్ అనే నరం గుండె వేగాన్ని నెమ్మదించేలా చేస్తుంది. అది ఒక్కోసారి గుండె వేగాన్ని బాగా తగ్గిస్తుంది. ఇలా వేగస్ నరం వల్ల గుండె వేగం మందగిస్తే దాన్ని వేసోవేగల్ సింకోప్ అంటారు.తీవ్రమైన నొప్పి వచ్చినప్పుడు ఒక్కోసారి ఆ విపరీతమైన నొప్పి వేగస్ నరాన్ని ప్రేరేపిస్తుంది. ఒక్కోసారి తీవ్రమైన / విపరీతమైన ఒత్తిడులు (సివియర్ స్ట్రెస్) కూడా వేగస్ నరాన్ని ప్రేరేపిస్తాయి. ఏదైనా దుర్వార్త విన్నప్పుడు కొందరు స్పృహ తప్పడానికి కారణం కూడా ఈ సింకోపే. కొందరు రక్తం చూసినప్పుడు లేదా కత్తులు– కటార్ల వంటి మారణాయుధాలు చూసినప్పుడు కూడా ఇలా స్పృహ తప్పడం దీనివల్లనే.పేగుల కదలికలు తగ్గడం : కొందరిలో జీర్ణక్రియలో జరుగుతుండే పేగుల కదలికలు (బవెల్ మూవ్మెంట్స్), విపరీతంగా తగ్గడం కూడా వేగస్ నరం మీద ఒత్తిడి కలిగింవచ్చు. అప్పుడు కూడా సింకోప్ కండిషన్ వస్తుంది.అకస్మాత్తుగా తల తిప్పడం వల్ల...కొందరు అకస్మాత్తుగా తలతిప్పడం వల్ల వేగస్ సరం మీద ఒత్తిడి పెరుగుతుంది. ఆ వెంటనే అది మళ్లీ సింకోప్ కండిషన్కు దారితీస్తుంది.రక్తహీనత.. అనీమియా అనే రక్తహీనత కండిషన్ కూడా సింకోప్కు కారణం. అనిమియా కండిషన్లో రక్తంలో తగినన్ని ఎర్రరక్తకణాలు లేకపోవడంతో మెదడుకు తగినంత ఆక్సిజన్ అందకపోవడంతో కూడా సింకోప్ రావచ్చు. శరీరంలో నీరు / ద్రవాలు తగ్గడం : ఒక్కోసారి దేహంలో నీరు / ద్రవాలు తగ్గడం (డీ–హైడ్రేషన్) వల్ల కూడా సింకోప్ రావచ్చు. కొందరిలో చాలా ఎక్కువగా వాంతులు కావడం వల్లగానీ లేదా నీళ్ల విరేచనాల (డయేరియా) వల్ల గానీ లేదా విపరీతంగా చెమటలు పట్టడం వల్ల శరీరంలో దేహంలో నీటి / ద్రవాల మోతాదులు తగ్గవచ్చు. డయాబెటిస్ సమస్య ఉన్న కొందరిలో వారు మాటిమాటికీ మూత్రానికి వెళ్లాల్సిరావడం వల్ల కూడా వాళ్ల శరీరం డీ హైడ్రేషన్కు లోనుకావచ్చు. ఈ కండిషన్లు కొందరిలో సింకోప్కు దారితీసేందుకు అవకాశముంది. చికిత్ససింకోప్ అన్న కండిషన్ నిజానికి అంత సీరియస్ కాదు. కానీ ఇలా ఫెయింట్ కావడం తరచూ జరుగుతుంటే మాత్రం సింకోప్ను నిర్లక్ష్యం చేయడమన్నది ఏమాత్రం తగదు. ఏవైనా ఇతరత్రా ఆరోగ్య సమస్యల (అండర్లైయింగ్ కాజెస్) వల్ల ఇలా జరుగుతుందేమో చూసేందుకు అవసరమైన వైద్యపరీక్షలు జరపాలి. ఇందుకోసం తొలుత డాక్టర్ సలహా తీసుకుని, బాధితుడికి చికిత్స అవసరమా కాదా అన్నది నిర్ధారణ చేసుకోవాలి. ఇతరత్రా సమస్యలతో (అండర్లైయింగ్ కాజెస్తో) ఇలా జరుగుతుంటే మాత్రం బాధితుడికి అవసరమైన చికిత్స అందించాలి. సింకోప్ అన్నది ఒకసారి స్వల్పంగా వచ్చి, దాని వల్ల ఎలాంటి గాయాలు జరగకపోతే ప్రైమరీ మెడికల్ కేర్ సెంటర్లో డాక్టర్లు కూడా సాధారణ చికిత్స అందించవచ్చు. అయితే సరిగ్గా నాడిగానీ, శ్వాసగానీ అందని పరిస్థితిని మెడికల్ ఎమర్జెన్సీగా పరిగణించి పరిగణించి వెంటనే పెద్ద హాస్పిటల్స్కు (టెరిషియరీ హెల్త్ కేర్ సెంటర్కు) తరలించాల్సి ఉంటుంది.గుండె స్పందనల లయ (రిథమ్)లో మార్పులు వచ్చిన వారికి, గుండె స్పందనల వేగం తగ్గిన వారిలో కొందరికి పేస్ మేకర్ అమర్చాల్సి రావచ్చు. ఈ పేస్మేకర్ అనేది గుండె స్పందనల వేగం తగ్గడాన్ని... అంటే ‘బ్రాడీకార్డియా’ను ముందుగానే పసిగట్టి... గుండె స్పందనల వేగం తగ్గిపోకుండా చూస్తుంది. ఇలా పేస్ మేకర్ అన్నది తగ్గిపోయే గుండె స్పందనలను మళ్లీ మామూలయ్యేలా (నార్మల్గా స్పందించేలా) చేసేందుకు వాడే ఒక ఉపకరణం. అలాగే టాకీకార్డియా కండిషన్లో ఒక షాక్ ద్వారా గుండె స్పందనలు మళ్లీ నార్మల్ అయ్యేలా చూడటం; అలాగే ఇది గుండెలో పైన, కింద ఉండే గదులు కదలికలు సమన్వయంతో జరిగేలా చూడటం; గుండెలోని ఎడమ, కుడి భాగాలు స్పందనల్లో సమన్వయం ఉండేలా చూడటం వంటి పనులనూ చేస్తుంది.చదవండి: గుండె జబ్బుల రిస్క్ ఎవరికి ఎక్కువ?ఈ పనులన్నింటినీ పేస్ మేకర్ సహాయంతో జరిగేలా చూసే/ చేసే చికిత్సను ‘కార్డియాక్ రీ–సింక్రనైజేషన్ థెరపీ’ (సీఆర్టీ) అని అంటారు. గుండె లయలో వచ్చే మార్పుల వల్ల వచ్చే ప్రమాదాలను నివారించడానికి ఈ చికిత్స చేయాల్సి ఉంటుంది. ఈ పేస్ మేకర్లలో కూడా తాత్కాలికంగా అమర్చేవి, శాశ్వతంగా అమర్చేవి అని రెండు రకాలుగా ఉంటాయి. డాక్టర్ల సలహా మేరకు అవసరమైనవారు (సాధారణంగా ‘బ్రాడీ–కార్డియా’ సమస్య ఉన్నవారు) దీన్ని వాడాల్సి ఉంటుంది. పేస్మేకర్ అమర్చాక పేషెంట్స్ తాము అంతకుమునుపు చేసే రోజువారీ పనులన్నింటినీ నార్మల్గానే చేసుకోవచ్చు.తక్షణం అందించాల్సిన సపర్యలు∙సింకోప్కు గురైన వ్యక్తిని కాస్తంత చల్లగా ఉన్న ప్రదేశంలోకి తీసుకెళ్లి సౌకర్యంగా పడుకోబెట్టాలి. లేదా అతడి తల రెండు మోకాళ్ల మధ్య ఉండేలా చూస్తూ రిలాక్స్డ్గా కూర్చోబెట్టాలి.∙అలా పడుకోబెట్టడం / కూర్చోబెట్టడం జరిగాక... అతడు స్పృహలోకి వచ్చిన కొద్దిసేపటి తర్వాత కాస్తంత ఉప్పు కలిపిన ద్రవాన్నిగానీ లేదా ఓఆర్ఎస్ ద్రావణాన్ని గానీ నెమ్మదిగా తాగించాలి. ఒకవేళ రక్తపోటు పడిపోవడం (హైపోటెన్షన్) వల్ల సింకోప్ ఏర్పడితే... ఇలా చేయడం వల్ల బాధితుడు మామూలుగా మారిపోతాడు.నివారణ : నిజానికి సింకోప్కు దారితీసే అసలు కారణాలను కనుగొంటే అందుకు అవసరమైన తదుపరి చర్యలను తీసుకోవచ్చు. ఉదాహరణకు... వేసోవేగల్ నరం అతి స్పందన వల్ల ఈ సమస్య వస్తుంటే దానికి కారణాలు కనుగొని చికిత్స అందించడం వల్ల ఆ తర్వాత వచ్చే సింకోప్లను నివారించవచ్చు. అకస్మాత్తుగా లేవడం, అకస్మాత్తు కదలికల వల్ల వచ్చే పోష్చురల్ హైపోటెన్షన్ సింకోప్ను అకస్మాత్తు కదలికలు లేకుండా చూసుకోవడం ద్వారా నివారించవచ్చు. ఉదాహరణకు పక్క మీద నుంచి లేచేప్పుడు మెల్లగా లేవడం, వెంటనే నిలబడకుండా కొద్ది సేపు కూర్చోవడం.. ఇలా కదలికలు క్రమంగా ఉండేలా చూసుకోవడంతో ఈ తరహా సింకోప్ రాకుండా చూసుకోవచ్చు. ఇది డీ హైడ్రేషన్ సమస్య వల్ల వస్తే తగినన్ని ద్రవాలు అందేలా చూసుకోవడం వల్ల కూడా సింకోప్ను నివారించవచ్చు.చివరగా...ప్రతినిత్యం తగినన్ని నీళ్లు తాగుతూ, అన్ని రకాల పోషకాలనూ తీసుకుంటూ, మానసిక ఒత్తిడికి దూరంగా ఉన్నవారిలో సింకోప్ సమస్య చాలా అరుదు. అందుకే అందరూ ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరిస్తూ ఉండటం అన్నది కేవలం సింకోప్ నివారణకు మాత్రమే కాకుండా అన్నివిధాలా ఆరోగ్యంగా ఉండటానికీ దోహదపడుతుందని గుర్తుంచుకోవాలి.నిర్వహణ: యాసీన్ -
బేబీ కేర్పై పరిణీతి చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు..! జీవితంలోనే..
బాలీవుడ్ నటుడు పరిణీతి చోప్రా, రాజకీయ నాయకుడు రాఘవ్ చద్దా అక్టోబర్ 19, 2025లో పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కొత్తతల్లి పరిణీతి తన బిడ్డపై కేరింగ్ విషయంలో ఎలా టెన్షన్ పడుతోందో షేర్ చేసుకుంది. అంతేగాదు తన కుమారుడి కోసం ఇంటిని తీర్చిదిద్దిన విధం గురించి కూడా నెటిజన్లతో షేర్ చేసుకుంది. పాతకాలం నాటి వైబ్స్తో మన సంప్రదాయ బేబీ కేరింగ్ విధానం గురించి హైలెట్ చేసింది.ప్రస్తుతం తాను తల్లిగా చాలా బిజీ అని, అతడి సంరక్షణతోనే తలమునకలవుతున్నట్లు పేర్కొంది. ఇది చాలా అలసట, బాధ్యతతో కూడినది, పైగా జీవితంలో అత్యంత సంతోషభరితమైన దశ కూడా అని అభిర్ణించింది. మనిషి ఉపయోగించే కలర్లను బట్టి అతడి మనస్తత్వం ఎలా చెప్పేయొచ్చో..అలాగే ఇక్కడ నటి పరిణీతి తన కొడుకు కోసం రూమ్ అలకరణకు ఏ రంగులకు ప్రాధాన్యత ఇచ్చిందో చూస్తే..ఆమె ఏంటనేది ఇట్టే అర్థమైపోతుంది. తన కొడుకు నీర్ కోసం అన్ని లైట్ కలర్స్, తెలుపు, గోధమ రంగులకే ప్రాధాన్యత ఇచ్చారామె. "బ్రిటిష్-శైలి" ప్యానెలింగ్తో తీర్చిదిద్దారు. తనది, రాఘవా టేస్ట్ దగ్గర దగ్గరగా ఒకటేనని, అందువల్ల అందుకనుగుణంగా ఆ గదిని ఈ విధంగా డిజైన్ చేశానని చెబుతోంది. అక్కడ గోడలన్నీ వింటేజ్ కార్ ఆర్ట్వర్క్తో ఆకర్షించగా, అక్కడ రాఘవ్ తండ్రి గిఫ్ట్గా చెక్క ఫ్లోరింగ్ వింటేజ్ కార్పెట్తో అనుబంధంగా ఉంది. ఇవేగాక క్లాసిక్ రంగుల తెల్లటి తొట్టి, బొమ్లలు, కస్టమ్ మేడ్ లేత గోధమ రంగు వార్డ్రోబ్లు తదితరాలు ఉన్నాయి. నిజానికి ఇది తన రీడిండ్ రూమ్ అని చెప్పుకొచ్చాడు. ఈ గదిలోకి ఎవరు ప్రవేశించిన తమ ఇట్టే తమ సమస్యలన్నింటిని మరిచపోయేలా చేసే..అందమైన ప్రదేశం. ఇంత ప్రశాంతమైన ప్రదేశంగా మార్చినందుకు పరిణీతికి క్రెడిట్ ఇస్తూ..దీన్ని స్వర్గమపు అభయారణ్యంగా పిలిచారు రాఘవ చద్దా. కాగా, పరిణీతి, రాఘవ్లు మే 2023లో ఉదయపూర్లోని ది లీలా ప్యాలెస్లో అట్టహాసంగా పెళ్లిచేసుకున్నారు. వివాహం అయిన రెండేళ్లకు అక్టోబర్ 19, 2025న పండంటి మగబిడ్డ నీర్కు స్వాగతం పలికారు.(చదవండి: మసాలా దోస రుచి చూసిన అమెరికా రాయబారి..!) -
చిత్తూరు జిల్లాలో విపరీతంగా పెరుగుతున్న మానసిక వ్యాధిగ్రస్తుల సంఖ్య
చిత్తూరు నగరానికి చెందిన 53 ఏళ్ల వ్యక్తి ఒకప్పుడు ధనవంతుడు. కార్లల్లో షికారు చేసినవాడు. ఎప్పుడూ అతని చుట్టూ 10 మంది ఉండేవారు. అలా దర్జాగా బతికిన ఆ వ్యక్తి చివరకు అప్పుల పాలయ్యాడు. ఆర్థిక కష్టాలను అధిగమించలేక.. మత్తుకు బానిసయ్యాడు. మానసికంగా కుంగిపోయాడు. కుటుంబసభ్యులు వైద్యం చేయించినా నయం కాకపోవడంతో చివరకు ప్రాణాలు కోల్పోయాడు. చిత్తూరు జిల్లా బంగారుపాళెం మండలానికి చెందిన 30 ఏళ్ల యువకుడు మద్యానికి బానిసయ్యాడు. తాగి తాగి మతిపోగొట్టుకున్నాడు. ప్రవర్తనలో మార్పులు చూసిన కుటుంబసభ్యులు ఆ యువకుడిని చికిత్స కోసం చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తీసుకొచ్చారు. మూడు నెలలుగా చికిత్స తీసుకుంటున్నాడు. క్రమం తప్పకుండా మందులు, మాత్రలు వాడుతున్నారు. ప్రస్తుతం ఆ వ్యక్తి నిలకడగా ఉంటూ సొంత పనులు చేసుకుంటున్నాడని, మళ్లీ మద్యం జోలికెళితే, మానసిక సమస్యలు తప్పవని వైద్యులు చెబుతున్నారు.కాణిపాకం: ఆధునిక సమాజంలో మనిషి జీవితం ఉరుకులు పరుగులతో సాగుతోంది. ఉదయం నిద్రలేస్తే ఇంటి సరుకుల నుంచి ఈఎంఐలు, బ్యాంకు అప్పులు, డ్వాక్రా చీటీలు, వ్యాపారాలు, పిల్లల చదువులతో సతమతమవుతున్నారు. లక్ష్యాన్ని అందుకోవాలనే తపనతో విద్యార్థులు, ఉద్యోగులు, గృహిణులు, వ్యాపారులు ఇలా అందరూ మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. దీనికితోడు మత్తుకు బానిసవుతూ మానసిక రుగ్మతలకు గురవుతున్నారు.చిత్తూరు జిల్లాలో మానసిక వ్యాధిగ్రస్తుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ప్రతి వంద మందిలో 20 నుంచి 25 శాతం మంది మానసిక రుగ్మతల బారిన పడుతున్నట్లు వైద్యనిపుణులు చెబుతున్నారు. యువకుల నుంచి పెద్దల వరకు ఒత్తిళ్లకు గురై మానసిక జబ్బును కొని తెచ్చుకుంటున్నారని గుర్తించారు. మరోవైపు మద్యంతో చిత్తవుతున్నారని వెల్లడిస్తున్నారు. ఇక ఆర్థిక కష్టాలు, ప్రేమ, పెళ్లిలు, ఇతరత్రా సమస్యలతో కూడా మానసికంగా ఇబ్బందిపడుతున్నారు. ఈక్రమంలో చిత్తూరు నగరంలోని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి ప్రతిరోజూ 40 నుంచి 50 ఓపీలు వస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు. ఆర్థిక కష్టాలు చిదిమేస్తున్నాయి ఆర్థిక భారం తట్టుకోలేక అనేక మంది మానసికంగా పూర్తిగా కుంగిపోతున్నారు. వ్యవసాయం నుంచి వ్యాపారం వరకు, ఉద్యోగాల నుంచి పెట్టుబడుల వరకు ఎక్కడ చూసినా అనిశి్చతి. కుటుంబాన్ని పోషించలేని స్థితిలో పడిపోయిన వ్యక్తి మౌనంగా లోలోపలే ఆత్మహత్యే మార్గంగా ఎంచుకుంటున్నారు. ఇక ఉద్యోగాల్లో టార్గెట్లు, ఒత్తిడి, భద్రత లేమి మనుషులను యంత్రాల్లా మార్చేసింది. నిద్రలేని రాత్రులు, ఆందోళనతో గడిచే రోజులుం చివరకు డిప్రెషన్. కానీ మానసిక జబ్బు అన్న మాట బయటకు చెప్పడానికి చాలామంది భయపడుతున్నారు. ఆత్మహత్యలు... చివరి ఫలితం ఈ కారణాల ఫలితం ఒక్కటే ఆత్మహత్యలు. మానసిక జబ్బు చివరకు ప్రాణాంతక నిర్ణయానికి నెడుతోంది. ఇటీవల హైదరాబాద్తోపాటు పలు ప్రాంతాల్లో చోటుచేసుకున్న ఆత్మహత్యలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ఇవి కేవలం సంఖ్యలు కాదు.. చెదిరిపోయిన కుటుంబాల కథలు. తీవ్రమైన ఒత్తిళ్లకు గురయ్యే వారు అనేక రుగ్మతలకు గురవుతున్నారు. నిద్రలేమి సమస్యలు మనిíÙని తీవ్రంగా వేధిస్తున్నాయి. ముఖ్యంగా యువకులు తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నారు. మద్యానికి బానిసవుతున్నారు. సెల్ఫోన్ ప్రభావం కూడా ఎక్కువగా ఉంది . ఆర్థికంగా రాణించకపోవడం వంటి సమస్యలు మానసిక సమస్యలను తీవ్రతరం చేస్తున్నాయి. ఇవి మనిషిని చంపేసేంతగా పనిచేస్తున్నాయి. ఇటీవల కొన్ని ఘటనలను ఆధారంగా తీసుకుని ప్రజలు మేల్కొవాలి. మానసిక సమస్యలుంటే.. వెంటనే డాక్టర్లను కలిసి చికిత్స తీసుకోండి. – దినేష్, మానసిక వైద్య నిపుణులు, -
మనసే.. మరణశాసనం
చిత్తూరు నగరానికి చెందిన 53 ఏళ్ల వ్యక్తి ఒకప్పుడు ధనవంతుడు. కార్లల్లో షికారు చేసినవాడు. ఎప్పుడూ అతని చుట్టూ 10 మంది ఉండేవారు. అలా దర్జాగా బతికిన ఆ వ్యక్తి చివరకు అప్పుల పాలయ్యాడు. ఆర్థిక కష్టాలను అధిగమించలేక.. మత్తుకు బానిసయ్యాడు. మానసికంగా కుంగిపోయాడు. కుటుంబసభ్యులు వైద్యం చేయించినా నయం కాకపోవడంతో చివరకు ప్రాణాలు కోల్పోయాడు.చిత్తూరు జిల్లా బంగారుపాళెం మండలానికి చెందిన 30 ఏళ్ల యువకుడు మద్యానికి బానిసయ్యాడు. తాగి తాగి మతిపోగొట్టుకున్నాడు. ప్రవర్తనలో మార్పులు చూసిన కుటుంబసభ్యులు ఆ యువకుడిని చికిత్స కోసం చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తీసుకొచ్చారు. మూడు నెలలుగా చికిత్స తీసుకుంటున్నాడు. క్రమం తప్పకుండా మందులు, మాత్రలు వాడుతున్నారు. ప్రస్తుతం ఆ వ్యక్తి నిలకడగా ఉంటూ సొంత పనులు చేసుకుంటున్నాడని, మళ్లీ మద్యం జోలికెళితే, మానసిక సమస్యలు తప్పవని వైద్యులు చెబుతున్నారు.కాణిపాకం: ఆధునిక సమాజంలో మనిషి జీవితం ఉరుకులు పరుగులతో సాగుతోంది. ఉదయం నిద్రలేస్తే ఇంటి సరుకుల నుంచి ఈఎంఐలు, బ్యాంకు అప్పులు, డ్వాక్రా చీటీలు, వ్యాపారాలు, పిల్లల చదువులతో సతమతమవుతున్నారు. లక్ష్యాన్ని అందుకోవాలనే తపనతో విద్యార్థులు, ఉద్యోగులు, గృహిణులు, వ్యాపారులు ఇలా అందరూ మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. దీనికితోడు మత్తుకు బానిసవుతూ మానసిక రుగ్మతలకు గురవుతున్నారు. చిత్తూరు జిల్లాలో మానసిక వ్యాధిగ్రస్తుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ప్రతి వంద మందిలో 20 నుంచి 25 శాతం మంది మానసిక రుగ్మతల బారిన పడుతున్నట్లు వైద్యనిపుణులు చెబుతున్నారు. యువకుల నుంచి పెద్దల వరకు ఒత్తిళ్లకు గురై మానసిక జబ్బును కొని తెచ్చుకుంటున్నారని గుర్తించారు. మరోవైపు మద్యంతో చిత్తవుతున్నారని వెల్లడిస్తున్నారు. ఇక ఆర్థిక కష్టాలు, ప్రేమ, పెళ్లిలు, ఇతరత్రా సమస్యలతో కూడా మానసికంగా ఇబ్బందిపడుతున్నారు. ఈక్రమంలో చిత్తూరు నగరంలోని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి ప్రతిరోజూ 40 నుంచి 50 ఓపీలు వస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు. ఆర్థిక కష్టాలు చిదిమేస్తున్నాయి ఆర్థిక భారం తట్టుకోలేక అనేక మంది మానసికంగా పూర్తిగా కుంగిపోతున్నారు. వ్యవసాయం నుంచి వ్యాపారం వరకు, ఉద్యోగాల నుంచి పెట్టుబడుల వరకు ఎక్కడ చూసినా అనిశి్చతి. కుటుంబాన్ని పోషించలేని స్థితిలో పడిపోయిన వ్యక్తి మౌనంగా లోలోపలే ఆత్మహత్యే మార్గంగా ఎంచుకుంటున్నారు. ఇక ఉద్యోగాల్లో టార్గెట్లు, ఒత్తిడి, భద్రత లేమి మనుషులను యంత్రాల్లా మార్చేసింది. నిద్రలేని రాత్రులు, ఆందోళనతో గడిచే రోజులుం చివరకు డిప్రెషన్. కానీ మానసిక జబ్బు అన్న మాట బయటకు చెప్పడానికి చాలామంది భయపడుతున్నారు. ఆత్మహత్యలు... చివరి ఫలితం ఈ కారణాల ఫలితం ఒక్కటే ఆత్మహత్యలు. మానసిక జబ్బు చివరకు ప్రాణాంతక నిర్ణయానికి నెడుతోంది. ఇటీవల హైదరాబాద్తోపాటు పలు ప్రాంతాల్లో చోటుచేసుకున్న ఆత్మహత్యలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ఇవి కేవలం సంఖ్యలు కాదు.. చెదిరిపోయిన కుటుంబాల కథలు.ఒత్తిడికి లోనుకావొద్దు... తీవ్రమైన ఒత్తిళ్లకు గురయ్యే వారు అనేక రుగ్మతలకు గురవుతున్నారు. నిద్రలేమి సమస్యలు మనిíÙని తీవ్రంగా వేధిస్తున్నాయి. ముఖ్యంగా యువకులు తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నారు. మద్యానికి బానిసవుతున్నారు. సెల్ఫోన్ ప్రభావం కూడా ఎక్కువగా ఉంది . ఆర్థికంగా రాణించకపోవడం వంటి సమస్యలు మానసిక సమస్యలను తీవ్రతరం చేస్తున్నాయి. ఇవి మనిషిని చంపేసేంతగా పనిచేస్తున్నాయి. ఇటీవల కొన్ని ఘటనలను ఆధారంగా తీసుకుని ప్రజలు మేల్కొవాలి. మానసిక సమస్యలుంటే.. వెంటనే డాక్టర్లను కలిసి చికిత్స తీసుకోండి. – దినేష్, మానసిక వైద్య నిపుణులు, చిత్తూరుసెల్ఫోన్.. చేతిలో ఉన్న విషంసెల్ఫోన్లతో కాలక్షేపం చేస్తూ మనుషులు తెలియకుండానే మానసిక జబ్బులను కొనితెచ్చుకుంటున్నారు. వాస్తవ జీవితానికి దూరమై, వర్చువల్ ప్రపంచంలో మునిగిపోతూ ఒంటరితనాన్ని పెంచుకుంటున్నారు. సోషల్ మీడియా పోలికలు, అవమానాలు, నెగెటివ్ కంటెంట్ యువత మనస్సును చిదిమేస్తోంది. దీనికితోడు ఒంటరి జీవనం పెరిగిపోవడంతో కొందరు మద్యం, మత్తు పదార్థాలకు బానిసలవుతున్నారు. ఇవి సమస్యలకు పరిష్కారం కాదని తెలిసినా, తాత్కాలిక ఉపశమనానికి అలవాట్లలో చిక్కుకుపోతున్నారు. చివరకు మానసిక, శారీరక, ఆర్థికంగా పూర్తిగా కుమిలిపోతున్నారు. ఇక ఒకప్పుడు కుటుంబాలతో కలిసి మెలిసి జీవించిన సమాజం ఇప్పుడు విడిపోయింది. మాట్లాడే మనుషులు లేరు. వినే చెవులు లేవు. బాధను పంచుకునే వారు లేక అనేక మంది లోలోపలే కుంగిపోతున్నారు. పల్లె, పట్నం తేడా లేకుండా మానసిక రుగ్మతలు వ్యాపిస్తున్నాయి. -
91 ఏళ్ల వయసులో ఇంత ఫిట్గానా..!
ఏడుపదుల వయసుకు చేరుకోగానే ఎంతటి ఫిట్నెస్ కోచ్లు అయినా లేదా క్రమం తప్రకుండా వ్యాయామాలు చేస్తూ ఆరోగ్య స్ప్రుహ ఉన్నా కూడా..యువకుల మాదిరిగా చురుకుగా ఫిట్గా ఉండటం కష్టమే. కానీ ఈ బామ్మ తొమ్మిది పదుల వయసులో యువతే విస్తుపోయాలే యాక్టివ్గా ఉండటమే కాదు..ఫోర్స్తో కూడిన వ్యాయామాలు చేస్తూ భళా అనిపించుకుంటోంది. ఎవరా ఆ సూపర్ బామ్మ అంటే..ఆ బామ్మే ఆస్ట్రేలియాకు చెందిన 91 ఏళ్ల జిల్. ఆమె కఠినమైన క్రమశిక్షణ కలిగిన జీవనశైలికి పేరుగాంచింది. ఆమె రోజుకు సగటున 12 వేల అడుగులు నడుస్తుందట. అంతేగాదు తరుచుగా సిడ్నీ హార్బర్ వంతెన మీదుగా ఒపెరా హౌస్కు వెళ్లే ఐకానిక్ ట్రెక్కు వెళ్తుందట. ఇది నిటారుగా ఉన్న కొండలు, అంతులేని మెట్లకు ప్రసిద్ధి చెందిన మార్గం. అలాగే వారానికి రెండుసార్లు ఈత కొట్టడం, బలాన్ని కాపాడుకునేలా యోగ, పైలేట్స్ వంటి సెషన్లు తప్పనిసరిగా చేస్తానని చెబుతోంది. అలాగే అందరితోనూ సన్నిహితంగా ఉండేలా టచ్లో ఉంటానని, అది శారీరక వ్యాయామం వలే మనసుకోక ఆహ్లాదకరమైన వ్యాయామం అని అంటోంది. అంతేగాదు ఈ జిల్ బామ్మ దీర్ఘాయువు కోసం చురుగ్గా ఉండటమే మంచిదనేది తన అభిప్రాయామని అంటోంది. అందుకు సంబంధించిన వీడియోని ఫిట్నెస్ కోచ్ థెరిసా మోలోనీ షేర్ చేయడంతో నెట్టింట తెగ వైరల్గా మారింది. కాగా, శారీరక వ్యాయామం వలే దీర్ఘాయవు కోసం సామాజిక అనుసంధానం కూడా అంతే ముఖ్యమని చెబుతున్నాయి అధ్యయనాలు. పైగా చురుకైన జీవనశైలి మంచి మానసిక ఆనందాన్ని, శారీరక శ్రమను స్థిరంగా ఉంచుతుందని పలు పరిశోధనల్లో తేలింది కూడా. నిజంగా ఈ బామ్మ సూపరో సూపర్ కదూ..!. View this post on Instagram A post shared by Certified Nutritionist and Fitness Coach (@theresa_moloney) (చదవండి: ఏడేళ్ల చిచ్చర పిడుగు..సముద్రాన్ని ఈదేసింది..!) -
‘డ్రై ఐస్ సిండ్రోమ్’ అంటే..? ఎందువల్ల వస్తుందంటే..
కంటతడిపై ‘కన్నే’యండి!కొందరిలో కళ్లనిండా నీళ్లు ఉండటం... కళ్లు చెమ్మగిల్లినట్టుగా ఉండటం కనిపిస్తుండేదే. ఇందుకు చాలా అంశాలు కారణమవుతాయి. ఇలా కళ్లలో నీరు ఉన్నట్లు కనిపిస్తుండటం, చెమ్మగిల్లుతూ ఉండటానికికారణాలేమిటో తెలుసుకుందాం.కారణాలు...కళ్లలో ఏదైనా ఇన్ఫ్లమేషన్ లేదా ఇన్ఫెక్షన్తో కళ్లుమండుతూ ఉన్నప్పుడు దుమ్ము, ధూళి, పుప్పొడి వంటి అంశాలతో అలర్జీ వల్ల కళ్లకలక (కంజంక్టివైటిస్) వంటి ఇన్ఫెక్షన్లతో కళ్లలో నీళ్లూరేందుకు ఉండే డక్ట్స్ మూసుకుపోవడంతో కన్నీళ్లు బలవంతంగా రావడానికి ప్రయత్నించడం ‘డ్రై ఐస్ సిండ్రోమ్’ ఉన్నవాళ్లలో. ఇక్కడ ఒక సందేహం కలగడం సాధారణం. అంటే డ్రై ఐస్ సిండ్రోమ్లో కళ్లు పొడిబారాలి కదా అనే సందేహం చాలామందిలో ఉంటుంది. కానీ నిజానికి ఈ సిండ్రోమ్లో కళ్లుకు ఇన్ఫ్లమేషన్ వస్తుంది. దీన్నే ‘డ్రై ఐస్ సిండ్రోమ్’ అంటారు. ఈ ఇన్ఫ్లమేషన్ వల్ల కళ్లలో నీరు ఎక్కువగా ఊరుతుంది.నివారణ, చికిత్స...∙చిన్నపిల్లల కళ్లల్లో ఇలా నీరూరుతున్నప్పుడు లేదా కళ్లలోకి దుమ్మువెళ్లినప్పుడు పాతకాలపు పెద్దవాళ్లు ఓ మెత్తటి టవల్ లేదా మెత్తటి గుడ్డను ఉండగా చేసి, దానిపై నోటితో గాలి ఊది దాన్ని కొద్దిగా వెచ్చబడేలా చేసి కంటిపై అద్దడం అన్నది కాస్తంత మధ్యవయస్కులకూ, పెద్దవాళ్లకు తెలిసిందే. అలా కాస్తంత గోరువెచ్చని ఆవిరితో గుడ్డను ఉండగా చేసి కళ్లపై అద్దడం వల్ల మంచి రిలీఫ్ వస్తుంది అలర్జీ వల్ల ఇలా జరిగినప్పుడు డాక్టర్ల సూచన మేరకు యాంటిహిస్టమైన్చుక్కల మందు వాడాలి. అలాగే ఇన్ఫెక్షన్ వల్ల ఇలా జరిగితే డాక్టర్లు యాంటీబయాటిక్ చుక్కల మందును సూచిస్తారు మాటిమాటికీ కళ్లను తాకకుండా ఉండాలి ∙ఇంతకు మించి సమస్య తీవ్రత ఎక్కువగా ఉంటే వెంటనే కళ్ల డాక్టర్ను సంప్రదించాలి.ఉబ్బు కళ్లు...కొందరిలో ఉబ్బుకళ్లు కనిపిస్తుంటాయి. పొద్దున్నే నిద్రలేవగానే కొద్దిసేపటి వరకు ఉబ్బుకళ్లు కనిపించడం మామూలే. కానీ కొందరిలో ఇవి చాలాసేపు అలాగే ఉండి΄ోతాయి. ఈ సమస్యను ఇంగ్లిష్లో ‘పఫ్ఫీ ఐస్’ అంటుంటారు. సాధారణంగా చాలామందిలో ఇది తాత్కాలిక సమస్యే. కళ్లు బాగా అలసి΄ోవడం (ఫెటీగ్) వల్ల కూడా ఇలా జరగవచ్చు.కారణాలు...∙రాత్రి ఎక్కువసేపు నిద్ర΄ోకుండా ఉండటం లేదా నిద్రలేమి కారణంగా ∙క్రితం రాత్రి ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం కొందరిలో ఉప్పుకారాలు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకున్న తర్వాత ∙ఇక చాలామందిలో ఇలా కళ్లు ఉబ్బినట్టుగా ఉండటం లేదా కళ్ల కింద చర్మం జారినట్టుగా ఉండటమన్నది వయసు పెరుగుతుండటం (ఏజింగ్) వల్ల జరగవచ్చు ∙మూత్రపిండాల వ్యాధి ఉన్నవారిలోనూ, రక్తంలో ్ర΄ోటీన్ తక్కువగా ఉండటం వల్ల, అలాగే రక్తహీనత (అనిమియా) సమస్య తీవ్రంగా ఉన్నవాళ్లలోనూ ఇలా ఉబ్బుకళ్లు కనిపిస్తాయి.నివారణ / చికిత్స...మెత్తటి టవల్ లేదా మెత్తటి గుడ్డను చల్లటి నీటిలో ముంచి కళ్లపై అద్దడం (కోల్డ్ కంప్రెస్)ఆహారంలో ఉప్పుకారాల మోతాదును తగ్గించడం కంటినిండా గాఢంగా నిద్ర΄ోవడం.డాక్టర్ రవికుమార్ రెడ్డి సీనియర్ కంటి వైద్య నిపుణులు ఈ సూచనలు పాటించండికళ్ల జాగ్రత్తల్లో 20 – 20 – 20 అనేది ఓ మంచి సూచన. అంటే... ప్రతి 20 నిమిషాలకోసారి మనం దృష్టిని కేంద్రీకరించి ఉన్న అంశంపైనుంచి (కంప్యూటర్ / ఫోన్) దృష్టి మరల్చి 20 ఫీట్ల దూరంలో ఉన్న మరో వస్తువును 20 సెకన్ల పాటు చూస్తుండటం. ఏకాగ్రతతో ఏదైనా పనిచేస్తున్నా లేదా వృత్తిరీత్యా కంప్యూటర్ స్క్రీన్ గానీ, టీవీ స్క్రీన్నుగానీ తదేకంగా చూస్తున్నప్పుడు ఇలా చేయడం మంచిది. టీవీ, కంప్యూటర్ లేదా మొబైల్ ఇలా ఏదైనప్పటికీ ఆ స్క్రీన్ టైమ్ను గణనీయంగా తగ్గించడం ∙తరచూ కన్రెప్పలను కదిలిస్తూ / మూస్తూ ఉండాలి. (అంటే బ్లింకింగ్ చేస్తూ ఉండాలి). ఫలితంగా కన్నీరు కంటిపైన సమంగా అలముకుని కంటిని పొడిబారకుండా కాపాడుతుంది ఇంట్లో లేదా ఆఫీసులో ఏసీ చాలాసేపు నడుస్తుంటే అక్కడి వాతావరణంలోని గాలిలో తేమ శాతం తగ్గుతుంది. ఇలా చాలాసేపు ఏసీలో ఉన్నవారు కాసేపు మామూలు వాతావరణంలోనూ కిసేపు గడపాలి కళ్లజోడు తాలూకు గ్లాసెస్ లేదా కాంటాక్ట్ లెన్సులను తరచూ పరీక్షించుకుంటూ ఉండాలి. పవర్ మారిందని తెలుసుకోగానే తగిన పవర్ ఉన్న అద్దాలను మార్చుకోవాలి. ఈ కొద్ది΄ాటి జాగ్రత్తల తర్వాత కూడా కంటికి సంబంధించిన అసౌకర్యం తగ్గక΄ోతే వెంటనే కంటి డాక్టర్ను తప్పక సంప్రదించాలి. నిర్వహణ యాసీన్ (చదవండి: 14 కిలోల బరువు తగ్గిన డాక్టర్..! ఓపిక, స్థిరత్వంతోనే సాధ్యం..) -
14 కిలోల బరువు తగ్గిన డాక్టర్..! ఓపిక, స్థిరత్వంతోనే సాధ్యం..
వెయిట్లాస్ జర్నీలో అనేది శారీరక, భావోద్వేగ ఇబ్బందులతో ముడిపడి ఉన్న అంశం అని అంటోంది ఓ డాక్టర్. తాను ప్రెగ్నెన్సీ అనతరం ఎంతలా బరువు పెరిగిందో సవివరంగా తెలిపింది. ఆ తర్వాత బరువు తగ్గే క్రమంలో ఎంతలా శారీరకంగా, మానసికంగా సమస్యలు ఎదుర్కుందో తెలిపింది. ఆఖరికి వెయిట్లాస్ మందులు సైతం పెద్దగా ఫలితం ఇవ్వకపోగా..చివరికి దుష్ప్రభావాల బారినపడి ఎంతలా ఇబ్బందిపడిందో పేర్కొంది. అయితే బరువు తగ్గాలంటే అచంచలమైన ఓపిక, స్థిరత్వం అత్యంత ముఖ్యమని అంటున్నారామె. అలా అన్ని అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటూ..ఒకటిన్న ఏడాదిలోపు చాలా బరువు తగ్గగలిగానని అంటోంది. ఎవరా డాక్టర్..? ఆమె వెయిట్లాస్ జర్నీ ఎలా సాగిందంటే..చెన్నైకి చెందిన వైద్యురాలు ప్రీతి మృణాళిని తన వెయిట్లాస్ జర్నీ గురించి ఇన్స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసుకున్నారు. అత్యంత నైపుణ్యం కలిగిన లాపరోస్కోపిక్ బారియాట్రిక్ సర్జన్ డాక్టర్ ప్రీతి మృణాళినికి వైద్యురాలిగా 12 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఆమె ప్రసవం తర్వాత తన బాడీ ఎలా మారిపోయిందో వివరించారు. 2021లో గర్భందాల్చినప్పుడు తన బరువు 78 కిలోలని పేర్కొంది. అయితే 2022లో ప్రసవం అనంతరం 79 కిలోలకు చేరుకున్నట్లు వెల్లడించారు. అందులోనూ సీ సెక్షన్ కారణంగా ఒక నెలపాటు రెస్ట్ తీసుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత బిడ్డకు ఫీడింగ్ ఇవ్వడంతో విపరీతమైన ఆకలి విపరీతంగే వేసేదని, దాంతో 92 కిలోలు దాక పెరిగిపోయానని చెప్పుకొచ్చింది. ఆ తర్వాత ప్రతి ఉయం మేల్కొని వ్యాయామాలు చేస్తూ ఉండేదాన్ని..అయితే బరువులో మార్పు లేకపోగా..మరింత అధికమైంది. ఈ అధిక బరువు తన రూపంతోపాటు ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసిందని అంటోంది. అప్పుడే జీఎల్పీ 1 అనే బరువు తగ్గించే మందులను వాడినట్లు తెలిపారు. దాంతో మార్పు కనబడటం మొదలైది కానీ ఒక కిలోనే తగ్గానని అన్నారు. అయితే ఈ డ్రగ్ కారణంగా జుట్టు రాలిపోవడం, నోరు పొడిబారడం, వ్యాయమం సమయలో కండరాల అలసట తదితర సమస్యలను ఎదుర్కొన్నట్లు తెలిపారు. అయితే చాలా ఓపికతో తన జీవనశైలిని మార్చుకుని..బరువు తగ్గడంపై ఫోకస్ పెట్టి సుమారు 14 కిలోలు తగ్గినట్టు తెలిపారు. సమారు ఏడాదిన్నరకి మంచి ఫలితాన్ని అందుకోగలిగానని అన్నారు. డాక్టర్ మృణాలిని చెబుతోంది ఒకటే..బరువు తగ్గడంలో కావాల్సింది, ఓపిక, భావోద్వేగాన్ని నియంత్రించేలా స్థిరతత్వం అత్యంత ప్రధానమని అంటోంది. కాగా డబ్ల్యూహెచ్ఓ ప్రకారం..జీఎల్పీ 1 మందులు రక్తంలో చక్కెరను నియంత్రించడానికి, కడుపు నిండిపోయిన అనుభూతిని, జీర్ణక్రియను నెమ్మదింపచేసేలా సహజ హర్మోన్లా అనుకరించే మందు. కానీ ఈ మందులు వైద్యుల పర్యవేక్షణలో సలహాలు సూచనలతో వాడాల్సి ఉందనేది గ్రహించాలి. View this post on Instagram A post shared by Dr.Preethi Mrinalini | Laparoscopic & Bariatric Surgeon (@dr.preethimrinalini)గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం.(చదవండి: వెయిట్లాస్ మందులతో స్లిమ్గా ఐశ్వర్య మోహన్ రాజ్..! నిపుణులు ఏమంటున్నారంటే..) -
మీరు అలసిపోయారా? విసిగిపోయారా?
"ఉదయం నిద్ర లేవగానే ఒళ్లంతా భారంగా ఉంటుంది.. ఆఫీసుకి వెళ్లాలనే ఉత్సాహం అస్సలు ఉండదు.. చేసే పని మీద ఏకాగ్రత కుదరదు.." ఈ లక్షణాలు మీకు కనిపిస్తున్నాయా? అయితే మీరు కేవలం 'అలసిపోలేదు', మీరు 'బర్న్ అవుట్' (Burnout) కి గురవుతున్నారు. సాధారణ అలసట ఒక రాత్రి నిద్రతో పోతుంది, కానీ బర్న్ అవుట్ అనేది నిద్రపోయినా తగ్గని ఒక దీర్ఘకాలిక మానసిక నిస్సత్తువ.బర్న్ అవుట్ అంటే ఏమిటి?యంత్రం అతిగా వాడితే ఎలా వేడెక్కి ఆగిపోతుందో, మనిషి కూడా తన శక్తికి మించిన మానసిక ఒత్తిడిని నిరంతరం భరిస్తే 'బర్న్ అవుట్' అవుతాడు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) దీన్ని ఒక 'వృత్తిపరమైన రుగ్మత'గా గుర్తించింది. ఇది పని పట్ల విరక్తిని, అపనమ్మకాన్ని కలిగిస్తుంది.4 ముఖ్య సంకేతాలు...1. Emotional Exhaustion ( నిరంతర అలసట): రాత్రి 8 గంటలు పడుకున్నా, ఉదయం లేవగానే ఇంకా నిద్ర చాలలేదన్నట్టు, శక్తి లేనట్టు అనిపించడం. ఇది శారీరక అలసట కాదు, మానసిక శ్రమ వల్ల కలిగే నీరసం.2. Cynicism (నిరాశావాదం): ఒకప్పుడు ఇష్టంగా చేసిన పని ఇప్పుడు భారంగా అనిపించడం. సహోద్యోగుల మీద, క్లయింట్స్ మీద కారణం లేకుండా కోపం రావడం. "నేను ఇది ఎందుకు చేస్తున్నాను? దీనివల్ల ఉపయోగం ఏంటి?" అనే నైరాశ్యం.3. Reduced Productivity (తగ్గిన పనితీరు): ఎంత ప్రయత్నించినా పాత వేగంతో పని చేయలేకపోవడం. చిన్న చిన్న నిర్ణయాలు తీసుకోవడానికి కూడా గంటల తరబడి సమయం పట్టడం.4. శారీరక సమస్యలు: కారణం లేని తలనొప్పి, కడుపులో అసౌకర్యం, తరచూ అనారోగ్యానికి గురవ్వడం. మనసు పడే ఒత్తిడిని శరీరం ఇలా బయటపెడుతుంది.నా వద్దకు వచ్చిన ఒక సీనియర్ బ్యాంక్ మేనేజర్ రాధ (పేరు మార్చాను) కథ ఇక్కడ చెప్పుకోవాలి. ఆమె 15 ఏళ్లుగా అద్భుతంగా పని చేస్తోంది. కానీ గత కొన్ని నెలలుగా ఆమె ఆఫీసులో అందరితో గొడవ పడుతోంది. "నాకు ఈ జాబ్ వద్దు, నేను రాజీనామా చేస్తాను" అని ఏడుస్తూ చెప్పింది. వాస్తవానికి ఆమెకు పని చేతకాక కాదు, గత మూడేళ్లుగా సెలవు తీసుకోకుండా పని చేయడం వల్ల ఆమె మెదడు 'బర్న్ అవుట్' స్టేజ్ కి చేరుకుంది. ఆమెకు కావాల్సింది రాజీనామా కాదు, ఒక సుదీర్ఘమైన 'మెంటల్ బ్రేక్'.బయటపడటం ఇలా...* మీ శక్తికి మించిన బాధ్యతలను స్వీకరించడం ఆపండి. ప్రయారిటీలను సెట్ చేసుకోండి. 'నో' చెప్పడం నేర్చుకోండి.* ఆఫీస్ సమయం తర్వాత ల్యాప్టాప్, ఆఫీస్ వాట్సాప్ గ్రూపులకు దూరంగా ఉండండి. డిజిటల్ కనెక్షన్ కట్ చేయండి. మీ మెదడుకు 'ఆఫ్ టైమ్' ఇవ్వండి. * మీకు ఇష్టమైన పని (సంగీతం, పెయింటింగ్, లేదా నడక) కోసం రోజుకు కనీసం 30 నిమిషాలు కేటాయించండి. హాబీలను పునరుద్ధరించండి. ఇది మీ మెదడుకు రీఛార్జ్ లా పనిచేస్తుంది.* విశ్రాంతిని ప్లాన్ చేయండి. సెలవు తీసుకోవడం అంటే సోమరితనం కాదు. అది మీ పనితీరును మెరుగుపరుచుకోవడానికి తీసుకునే ఒక ఇన్వెస్ట్మెంట్.ఈ వారం మీ కోసం పరీక్ష...* మీకు ఇష్టమైన పనులు చేయడానికి కూడా ఇప్పుడు ఉత్సాహం ఉండటం లేదా?* ఆఫీసులో చిన్న పొరపాటు జరిగినా అతిగా స్పందిస్తున్నారా (Overreacting)?* ఒంటరిగా ఉండాలని, ఎవరితోనూ మాట్లాడకూడదని అనిపిస్తోందా?పై మూడింటికి 'అవును' అని సమాధానం వస్తే, మీరు బర్న్ అవుట్ వైపు వెళ్తున్నారని అర్థం చేసుకోండి.గుర్తుంచుకోండి.. కాలిపోయిన కొవ్వొత్తి వెలుగునివ్వలేదు. మీరు ఇతరులకు, మీ కంపెనీకి ఉపయోగపడాలి అంటే ముందు మీరు ఆరోగ్యంగా ఉండాలి. మీలోని ఉత్సాహం ఆవిరి కాకముందే మేల్కొనండి. బర్న్ అవుట్ లేదా కెరీర్ ఒత్తిడి నుండి బయటపడటానికి కౌన్సెలింగ్ లేదా కోచింగ్ తీసుకోండి.- సైకాలజిస్ట్ విశేష్ కెరీర్ & మైండ్సెట్ కోచ్8019 000066www.psyvisesh.com -
శతాయుష్షు బామ్మ.. ఇప్పటికీ ఆమె అమ్మ
నెల్లూరు జిల్లా: నాలుగడుగులు నడిస్తే ఆయాస పడే ఇప్పటి తరానికి ఆ బామ్మ మాటలు బంగారు బాటలు. కష్టపడి పనిచేస్తే ఎలాంటి జబ్బులు రావనేందుకు ఆమె జీవనశైలి పెద్దబాల శిక్ష. వందేళ్ల వయసు పైబడినా తన పని తానే చేసుకుంటూ ఇంట్లో వారికి సైతం సాయంగా ఉంది. టీవీలు, స్మార్ట్ ఫోన్ల మాయలో పడి పిల్లలకు కూడా వ్యాధులతోపాటు ఊబకాయం వస్తుంటే వారి పెద్దలు ఆందోళన పడుతున్నారు. 103 సంవత్సరాల వయస్సులో బామ్మ ఇప్పటికీ వంట చేస్తుంది. ఇంట్లో గేదెలకు గడ్డి తెచ్చి మేతగా వేస్తుంది.వంట చేస్తూ..పొదలకూరు మండలం, మొగళ్లూరు గ్రామానికి చెందిన అచ్చాల పెంచలమ్మ శతాధిక వృద్ధురాలు. గ్రామంలో ఆమెకంటే పెద్దవారు ఎవరూ జీవించి లేరు. నాలుగు తరాలకు ప్రతినిధిగా కుటుంబాన్ని నెట్టుకొచ్చిన పెంచలమ్మకు నలుగురు సంతానం. ఇద్దరు మగపిల్లలు, ఇద్దరు ఆడపిల్లలున్నారు. ఇప్పటికీ బామ్మ హుషారుగా ఉంది. ఆమెకు ఎలాంటి జబ్బులు లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. రాత్రివేళ అప్పుడప్పుడు కాళ్లునొప్పులు వస్తుంటాయని చెబుతోంది. వినికిడి, కంటిచూపు ఈ వయస్సులో కూడా పెంచలమ్మకు బాగున్నాయి. కట్టెల పొయ్యి వద్ద ఆమె ఇంట్లో అందరికీ వంట చేస్తుంది.మంచి ఆహారపు అలవాట్లుపెంచలమ్మ కాయ కష్టం చేసేవారు. మంచి ఆహారపు అలవాట్లు కలిగి ఉండటమే కాక జొన్న, రాగి సంగటి తినేవారు. అందువల్లే ఇప్పటికీ ఆమె ఎంత సమయమైనా కూర్చొని లేవగలుగుతున్నారు. వయోభారంతో కొంత ఆలసటగా కనిపించినా పనులు చేస్తూనే ఉంటారు. కుమారుడు మస్తాన్రెడ్డి, కోడలు సంపూర్ణమ్మ వ్యవసాయ పనులపై తోటకు వెళ్తే పెంచలమ్మ వంటి చేసి పెడుతుంది. వందేళ్లు పైబడినా బంధువులు, స్నేహితుల పేర్లు వెంటనే తడుముకోకుండా చెబుతుంది. షుగర్, బీపీ వ్యాధులు ఆమె దరిచేరలేదు. ఎలాంటి మందులు కూడా వాడటం లేదని పెంచలమ్మ చెప్పారు. ఇప్పటి తిండిలో శక్తి లేదని, తాను వయస్సులో ఉన్నప్పుడు కల్తీ లేని ఆహారం తినడం వల్లే ఇంతకాలం జీవించి ఉన్నానంటారు పెంచలమ్మ. కల్మషం లేని లేని జీవితం, కల్తీ లేని ఆహారం తింటే ఎవరైనా తనలా జీవించేందుకు అవకాశం ఉంటుందని బామ్మ వెల్లడిస్తున్నారు. -
గోధుమ/జొన్న/రాగులతో రోటీలు,దోసెలు.. లాభాలేమిటి? ఏ సీజన్లో ఏవి తినాలి?
పుల్కా కావచ్చు, చపాతీ కావచ్చు...ప్రస్తుతం ప్రతి రోజూ రోటీలను తినడం చాలా మంది ఆరోగ్యార్ధులకు అలవాటుగా మారింది. నిజానికి సంప్రదాయంగా వస్తున్న ఆహారపు అలవాట్ల స్థానంలో రోటీలు ఆరోగ్యకర ప్రత్యామ్నాయంగా స్థిరపడుతున్న పరిస్థితుల్లో గోధుమలతో పాటు మరికొన్ని కూడా రోటీలు, దోసెల తయారీలో వినియోగిస్తున్నారు. అలాంటి వాటిలో రాగులు, జొన్నలు, సజ్జలు వంటి తృణ ధాన్యాలను కూడా చేరుస్తున్నారు. సహజ ఆహారాన్ని ప్రోత్సహించే వైద్యులు కల్పిస్తున్న అవగాహన కూడా వీటి వినియోగాన్ని పెంచుతోంది.అయితే ఇప్పుడున్న అవగాహన ప్రకారం.. ఇవి కేవలం కేలరీలు లేదా ఫైబర్ గురించి మాత్రమే అనుకోకూడదు. నిజానికి శతాబ్దాల క్రితమే ఇవి మనకు ఆహారంలో భాగంగా ఉన్నాయి. ప్రపంచ వాణిజ్యానికి ముందు, వాతావరణానికి తగ్గట్టుగాస్థానికంగా భూమి ఏమి అందించింది? అనేదానిపైనా, శరీరానికి ఏమి అవసరమో దానిపైనా మాత్రమే ఆహారపు అలవాట్లు ఆధారపడి ఉండేవి. ఆ తర్వాత తర్వాత వాతావరణ మార్పులతో సంబంధం లేకుండా ఏడాది పొడవునా ఆహారం అందుబాటులోకి రావడంతో... కాలానుగుణంగా తినడం అనే అలవాటు తగ్గిపోయింది.మరోవైపు గోధుమలు చిరుధాన్యాలు (బజ్రా, రాగి, జొన్న, మక్కీ) వంటి తృణ ధాన్యాలు పోషకాలతో నిండి ఉంటాయి పరిశోధనల ప్రకారం ఈ ధాన్యాలు ఫైబర్, విటమిన్లు తదితర ఆరోగ్యకరమైన సమ్మేళనాలను అందిస్తాయి, ఇవి మధుమేహం, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. అయితే వీటిని వినియోగించడంలో సీజన్లను దృష్టిలో పెట్టుకుంటేనే సంపూర్ణ ప్రయోజనాలు సిద్ధిస్తాయని సంప్రదాయ ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. కాలానుగుణ మార్పులకు అనుగుణంగా ఈ ధాన్యాలను తీసుకుంటనే శరీరానికి మేలు చేస్తాయని అంటున్నారు.మన శరీరాలు వేడి సీజన్లో లేదా చలి కాలంలో ఆహారాన్ని వేర్వేరుగా జీర్ణం చేసుకుంటాయని ఆయుర్వేదం సహా సంప్రదాయ వైవ్య విధానాలు చెబుతున్నాయి. వేసవిలో వేగంగా, శీతాకాలంలో నెమ్మదిగా...ఇలా జీర్ణక్రియ మార్పు చేర్పులతో శరీరం ఎలా స్పందిస్తుందో గమనించడం ద్వారా, వాతావరణానికి సరిపోయే ధాన్యాలను మనం ఎంచుకోవచ్చు.గోధుమలు...మనం నిత్యం ఇష్టపడేవి గోధుమలతో చేసిన ఆహారం. ఇది వెచ్చదనం జీర్ణ ప్రక్రియలను సమతుల్యం చేస్తుంది. వసంతకాలంలో లేదా శీతాకాలం ప్రారంభంలో జీర్ణక్రియ నెమ్మదించినప్పుడు, గోధుమ రోటిలు కడుపుపై భారం పడకుండా శక్తిని, ఫైబర్, బి–విటమిన్లు సంక్లిష్ట కార్బోహైడ్రేట్లను అందిస్తాయి, బరువు పెంచకుండా రోజువారీ కార్యకలాపాలను కొనసాగించేలా చేస్తాయి.సజ్జలు...సజ్జలు ఆరోగ్యకరమైన ధాన్యరకమే కానీ దీనిది వేడెక్కించే స్వభావం దీని అధిక పోషక సాంద్రత, ఇనుము, మెగ్నీషియం, ప్రోటీన్ ఫైబర్ జీర్ణక్రియను ప్రభావితం చేస్తుంది. వెచ్చదనం శక్తిని అందిస్తాయి కాబట్టి చల్లని వాతావరణంలోనే వీటిని వినియోగిస్తారు.రాగులుప్రస్తుతం ఇడ్లీల నుంచి రోటీలు, దోసెల దాకా చేసేందుకు వాడే రాగులు (ఫింగర్ మిల్లెట్) కాల్షియం సూక్ష్మపోషకాలతో సమృద్ధికర ఆహారం. వేడి సీజన్లో ఉదరంలో తేలికగా ఉంటుంది. ఇది శరీరాన్ని చల్లబరుస్తుంది వేసవి సీజన్లలో జీర్ణ మందగమనాన్ని నివారిస్తుంది. అనేక దక్షిణ భారత ప్రాంతాలు రాగులను వేసవిలో ప్రధాన ఆహారంగా చేయడానికి కారణం దాని చల్లబరిచే గుణమే.జొన్నలు..మక్కీ లేదా మొక్కజోన్న, జొన్న (జోవర్) రోటీలు తక్కువ గ్లైసెమిక్ ప్రభావాలు చూపిస్తూ బలమైన ఫైబర్ లను కలిగి ఉంటాయి. అవి బలమైన జీర్ణక్రియ, అధిక శ్రమ కలిగిన జీవనశైలులకు సరిపోతాయి, కానీ వాటిని కొవ్వులు లేదా కూరగాయలతో జాగ్రత్తగా జతచేయడం అవసరం. వేసవిలో చల్లదనాన్ని అందించే జొన్నలు.. శీతాకాలంలో కూడా ఉపయుక్తమైనవే.సంవత్సరమంతా ఒకే ధాన్యాన్ని తినడానికి బదులుగా, రుతువులకు అనుగుణంగా ధాన్యాలను ఆరగించడం శరీరానికి మంచిదని సంప్రదాయ వైద్య విజ్ఞానం స్పష్టం చేస్తోంది. -
వెయిట్లాస్ మందులతో స్లిమ్గా ఐశ్వర్య మోహన్ రాజ్..! నిపుణులు ఏమంటున్నారంటే..
కంటెంట్ క్రియేటర్, కమెడియన్, బాలీవుడ్ నటి ఐశ్వర్య మోహన్ రాజ్ స్లిమ్గా మారిన సంగతి తెలిసిందే. అంతేగాదు తన వెయిట్లాస్ సీక్రెట్ని కూడా చాలా నిజాయితీగా బయటపెట్టారామె. తాను వెయిట్లాస్ డ్రగ్ మౌంజారోని వాడనని దానివల్ల 22 కిలోలు వరకు బరువు తగ్గానని నర్మగర్భంగా చెప్పారామె. అయితే అలా చెప్పినందుకు పలువురు విమర్శించారు కూడా. కానీ బాలీవుడ్ నటి సోహ అలీఖాన్ వంటి పలువురు ప్రముఖులు ఆమె నిజాయితీని ప్రశంసించారు. మరి ఇంతకీ ఇలాంటి బరువు తగ్గించే మందులు ఆరోగ్యానికి సురక్షితమేనా..? దీనిపై వైద్యులు ఏమంటున్నారంటే..అయితే కమెడియన్ ఐశ్వర్య మోహన్ రాజ్ బరువు తగ్గేందుకు మౌంజారోలాంటివి హెల్ప్ అవుతాయి గానీ వైద్యుల పర్యవేక్షణ అవసరమని తెలిపినప్పటికీ..చాలామంది ఆమెను ట్రోల్ చేస్తూనే ఉన్నారు. అలాంటి మందులు ఆరోగ్యంపై దుష్ప్రభావాలు చూపిస్తాయనేది వారందరి వాదన. ఈ నేపథ్యంలో సోహా అలీ ఖాన్ తన తాజా పాడ్కాస్ట్లో ఎండోక్రినాలజీ అండ్ డయాబెటాలజీ గ్రూప్ చైర్మన్ డాక్టర్ అంబ్రిష్ మిథల్, క్లినికల్ న్యూట్రిషనిస్ట్ డాక్టర్ జూహి అగర్వాల్తో చర్చించి మరి ఎలాంటి వాళ్లు బరువు తగ్గించే మందులు తీసుకోవచ్చు?ఎవరికి మంచిది కాదు తదితరాలను అడిగి అందరి అనుమానాలను పటాపంచలు చేశారామె. వాళ్లంతా ఏచెబుతున్నారంటే..ఒక వ్యక్తికి ఫ్యాటీ లివర్, డయాబెటిస్ లేదా ప్రీ-డయాబెటిక్ , ఊబకాయం వంటి ఆరోగ్య సమస్యలు ఉంటే వైద్యులు బరువు తగ్గించే మందులను సిఫారసు చేస్తారని చెప్పారు. వాటి సాయంతో బరువు తగ్గితే సదరు రోగి పరిస్థితి మెరుగుపడుతుంది..తదనుగుణంగా అప్పటి నుంచి జీవనశైలిలో మార్పులు తీసుకుంటూ తగిన జాగ్రత్తలు తీసుకుంటే చాలని చెప్పారు. View this post on Instagram A post shared by Soha (@sakpataudi) బాడీమాస్ ఇండెక్స్(బీఎంఐ) 27 లేదా 30 ఉంటే వాళ్లు వైద్యుల సూచన మేరకు నిరభ్యంతరంగా ఈ బరువు తగ్గించే మందులు వాడొచ్చని అన్నారు. ఇంతకుమునుపు వెయిట్లాస్ డ్రగ్స్ అత్యంత ఖరీదుగా ఉండేవి. ఇప్పుడు నెలకు తక్కువ మోతాదు అయితే రూ. 12000లని, అదే ఎక్కువ మోతాదు అయితే నెలకు రూ. 22,000 దాక ఖర్చు అవుతుందని వెల్లడించారు. ఎవరికి మంచిది కాదంటే..థైరాయిడ్ కేన్సర్ చరితర ఉన్న వ్యక్తులుప్యాంక్రియాటైటిస్ చరిత్రజీర్ణశయాంతర సమస్యలుమధుమేహం కారణంగా కంటివ్యాధితో బాధపడుతున్న వ్యక్తులు తదితరులకు ఈ మందులు సరిపడవని చెప్పారు. ఏమందులైనా..నిపుణలు పర్యవేక్షణలో సలహాలు సూచనలతో ఉపయోగిస్తే ఎలాంటి సమస్య ఉండదని అన్నారు. ప్రస్తుతం కాలంలో అధిక బరువు సమస్యతోనే అనారోగ్యం బారిన పడుతున్న వారెందరికో ఈ మందులు వరంగా మారాయని అంటున్నారు వైద్యనిపుణులు.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: నటి ఆలియా భట్ చెప్పే జీవిత పాఠాలు..!) -
ఆరోగ్యాన్నలా.. డీప్ ఫ్రై చేయొద్దు!
ఆహార పదార్థాలకు నూనె లేదా కొవ్వు తోడైతే రుచి ఇనుమడిస్తుంది. అయితే, ఈ వంట ప్రక్రియలో, ముఖ్యంగా అధిక ఉష్ణోగ్రతలో వేపుడు చేసినప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది. వేపుళ్లు, పిండి వంటలు, గారెలు, పూరీలు, బజ్జీలు, పునుగులు, అప్పడాలు, వడియాలు.. మనం ఇష్టంగా తినే ఇటువంటివి వండేటప్పుడు జాగ్రత్త తీసుకోకపోతే ఆ ఆహారమే విషతుల్యంగా మారి అనారోగ్యానికి దారితీస్తుంది. దీర్ఘకాలంలో ప్రాణాంతక జబ్బులకూ కారణం కావొచ్చు. వేపుళ్లకు లేదా డీప్ ఫ్రైలకు నూనెలు, కొవ్వు పదార్థాలను ఉపయోగించేటప్పుడు అప్రమత్తత అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. వేపుళ్లకు ఏయే నూనెలు విడిగా వాడొచ్చు? ఏయే నూనెలను కలిపి వాడొచ్చు? అనే విషయాలూ ముఖ్యమే.. అవేమిటో చూద్దాం.. గుండె జబ్బులు, కేన్సర్ ముప్పు?నూనెలు, కొవ్వుల్లో పాలీఅన్శాచురేటెడ్ కొవ్వు ఆమ్లాలు (పీయూఎఫ్ఏ– ‘పూఫా’లు) ఉంటాయి. ఒకసారి వేపుడుకు వాడితే ప్రమాదం లేదు. ఒక్కసారి వేపుడు లేదా డీప్ ఫ్రై చేయడానికి వాడిన నూనెను మళ్లీ వేపుళ్ల కోసం వాడితే అవి హానికరంగా మారిపోతాయని నిపుణులు చెబుతున్నారు. నూనెలు, కొవ్వుల్లోని ‘పూఫా’లు వేపుడు కోసం రెండు అంతకన్నా ఎక్కువసార్లు అధికంగా వేడి చేసినప్పుడు ఆక్సీకరణం చెందుతాయి. ఆక్సీకరణం చెందిన పూఫాలతో కూడిన ఆహారం తీసుకున్న వారు గుండె సంబంధ వ్యాధులు, కేన్సర్ బారిన పడే ప్రమాదం పెరుగుతుందని హైదరాబాద్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ) సెంటర్ ఫర్ లిపిడ్ రీసెర్చ్ మాజీ చీఫ్ సైంటిస్ట్ అండ్ హెడ్ డాక్టర్ ఆర్బీఎన్ ప్రసాద్ ‘సాక్షి’తో చెప్పారు.వేపుళ్లకు ఏయే నూనెలు మేలు?కరకరలాడే వంటకాల తయారీ కోసం వంట నూనెలను ఎక్కువ మంటపై పొగలు కక్కేలా వేడి చేయాల్సి ఉంటుంది. స్మోక్ పాయింట్ను మాత్రమే చూడకుండా రసాయన స్థిరత్వాన్ని బట్టి వేపుళ్లకు నూనెను ఎంచుకోవాలి. ఇందుకు ఉపయోగపడే నూనెలు ఏవంటే.. అధిక మొత్తంలో సంతృప్త కొవ్వు ఆమ్లాలు ఉండే కొబ్బరి నూనె, పామాయిల్ వంటివి లేదా వేరుశనగ నూనె, శుద్ధి చేసిన వరి తవుడు నూనె, అధిక ఓలిక్ పొద్దుతిరుగుడు (మోనోఅన్శాచురేటెడ్ కొవ్వు ఆమ్లం కలిగిన) నూనెలు ఆహారాన్ని వేయించడానికి మంచివని డాక్టర్ ప్రసాద్ వివరించారు.కలిపి వాడుకోదగినవిఇంట్లో రోజువారీ కూరల్లో లేదా డీప్ ఫ్రైలకు కూడా కనీసం రెండు రకాల వంట నూనెలు కలిపి వాడుకుంటే మేలని, నిలువ పచ్చళ్లకు నువ్వుల నూనె మంచిదని డా. ప్రసాద్ చెప్పారు. వాటిలో ఉండే పోషకాలను బట్టి కలిపి వాడుకోదగిన నూనెలు ఇవీ.. పామాయిల్ + సోయా నూనెపామాయిల్ + పొద్దుతిరుగుడు నూనె వరి తవుడు నూనె + నువ్వుల నూనెఆలివ్ నూనె + పొద్దుతిరుగుడు లేదా సోయా ఆయిల్మళ్లీ ఫ్రైలకు వాడొద్దు..మన ఇంట్లో వేపుళ్లకు ఒకసారి వాడిన నూనెను పారబోయాల్సిన అవసరం లేదు. ఆ నూనెను వడగట్టి కూరల తాలింపుల్లో వాడుకోవచ్చు. ఎక్కువ రోజులు నిల్వ ఉంచకుండా 3–4 రోజుల్లోనే (వేపుళ్లకు కాకుండా) కూరల్లో వాడుకోవాలి. నిల్వ ఉంచితే ఆ నూనె చెడిపోయే అవకాశం ఉంది. అయితే, డీప్ ఫ్రైలకు వాడిన నూనెనే మళ్లీ మళ్లీ వేపుళ్లకు వాడితే ప్రమాదం. అవి తిన్న వారు దీర్ఘకాలంలో హృదయ సంబంధ వ్యాధులు, కేన్సర్ వంటి తీవ్రమైన జబ్బుల పాలయ్యే ముప్పు ఉంది. –డాక్టర్ ఆర్బీఎన్ ప్రసాద్, మాజీ చీఫ్ సైంటిస్ట్ -
ఇంట్లోనే గర్భాశయ కేన్సర్ స్క్రీనింగ్ టెస్ట్..! సురక్షితమేనా..?
కొన్నికేన్సర్లు.. సులభంగా టెస్ట్లు చేయించుకోలేం. అలాంటి వాటిల్లో ఒకటి ఈ గర్భాశయ కేన్సర్. ఇది కాస్త గోపత్యకు సంబంధించినవి కావడంతో మహిళలు క్లినిక్లను సందర్శించడంలో జాప్యం చేస్తున్నారు. ఆ నేపథ్యంలో వైద్యశాస్త్రం సాంకేతిక సాయంతో మరింత పురోగతిని అందించేలా మహిళలే స్వీయంగా చేసుకునే వెసులబాటు అందించింది. అంటే ఇంట్లోనే సులభంగా గర్భాశయ కేన్సర్ స్క్రీనింగ్ టెస్ట్(HPV స్వీయ-నమూనా అని కూడా పిలుస్తారు) చేసుకోవచ్చు అన్నమాట. ఇది భవిష్యత్తు కాలంలో మంచి గేమ్ ఛేంజర్గా ఉద్భవించనుంది. అచ్చం ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్ మాదిరిగానే ఇంట్లోనే గర్భాశయం ఆరోగ్యం కోసం మనమే స్వయంగా చేసుకోవచ్చని చెబుతున్నారు వైద్య నిపుణులు. అసలేంటి టెస్ట్? ఎలా చేయాలి?, సురక్షితమేనా? తదితరాల గురించి సవివరంగా తెలుసుకుందామా..!.ఇంట్లోనే గర్భాశయ కేన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ అంటే..గర్భాశయం నుంచి కణాలను సేకరించడానికి వైద్యుడు స్పెక్యులమ్ను ఉపయోగించే సాంప్రదాయ పాప్ స్మియర్ మాదిరిగా కాకుండా, ఇంట్లోనే నిర్వహించే స్వీయ-నమూనా కిట్ ఇది. ఇందులో 95% కచ్చితత్వం ఉంటుందని చెబుతున్నారు నిపుణులుఎలా చేయాలంటే..కిట్: స్టెరైల్ స్వాబ్ (పొడవైన Q-టిప్ లాగా) లేదా ప్రత్యేకమైన బ్రష్ను కలిగి ఉన్న చిన్న ప్యాకేజీని అందుకుంటారు.బాత్రూమ్ లేదా గదిలో ఆ స్వాబ్ను యోనిలోకి చొప్పించి కొన్ని సెకన్ల పాటు తిప్పాలి. అది గర్భాశయాన్ని చేరుకోవాల్సిన అవసరం లేదు. అప్పుడు ఆ స్వాబ్ HPV DNA కలిగి ఉన్న యోని గోడల నుంచి కణాలు, ద్రవాలను తీసుకుంటుంది. ఆ స్వాబ్ను ప్రిజర్వేటివ్ ట్యూబ్లో ఉంచి, దానిని సమీపంలోని ల్యాబ్కు పంపించాలి. ఫలితం: పరీక్షలో నెగిటివ్ వస్తే..గర్భాశయ కేన్సర్వచ్చే ప్రమాదం చాలా తక్కువని, ఒకవేళ పాజిటివ్ అయితే ..ప్రమాదకర హెచ్పీవి శరీరంలో ఉందని అర్థం. అలాంటప్పుడు తదుపరి పాప్ స్మియర్ లేదా కోల్పోస్కోపీ కోసం గైనకాలజిస్ట్ను సందర్శించాలి.ఇక్కడ మహిళలకు ఓ వైద్యుడి మాదిరిగా చేసుకోగలమా అనే సందేహం రావడం సహజం. అయితే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR), జేసీఓ గ్లోబల్ ఆంకాలజీ ఈ స్వీయ నమునా చాలా ప్రభావవంతంగా ఉంటుందని పేర్కొంది. ముందుగా ఈ గర్భాశయ కేన్సర్ని గుర్తించడంలో సాంప్రదాయ పాప్ స్మియర్ల కంటే HPV DNA పరీక్షలు చాలా సులభంగా, ఎలాంటి అసౌకర్యం కలగకుండా నిర్వహించగలిగేవని పేర్కొంది. ఈ హెచ్పీవీ కిట్ల సాయంతో మహిళలు స్వయంగా సేకరించిన నమునాలు, వైద్యులు సేకరించిన వాటివలే ఉంటాయని హామి ఇచ్చింది కూడా. ఇది ప్రారంభ స్కీనింగ్ వైద్య పరీక్షగా ఉపయోగపడుతుంది. అయితే ఇది కేన్సర్ని మందస్తు దశలోనే గుర్తించడానికి హెల్ప్ అయ్యే సాధనమే తప్ప కేన్సర్ని నిర్థారించేది మాత్రం కాదు.ఎందుకు అత్యంత ముఖ్యమైనదంటే..భారతదేశంలో, గర్భాశయ కేన్సర్ మహిళల్లో రెండవ అత్యంత సాధారణ కేన్సర్గా మారింది. ప్రతి ఏడాది దాదాపు 75 వేల నుంచి 80 వేల మంది దాక మహిళలు ఈ వ్యాధి కారణాంగా ప్రాణాలు కోల్పోతున్నారు. వాటిని నివారించేందుకు ఇంట్లేనే నిర్వహించుకునే ఈ సులభమైన స్క్రీనింగ్ పరీక్ష అత్యంత ప్రధానమైనదిగా మారింది.ఏవిధంగా అంటే..?ఈ టెస్ట్ నిమిత్తం చాలామంది మహిళలు అసౌకర్యంగా ఫీలవుతారు. ఆ అసౌకర్యాన్ని ఈ పరీక్ష తొలగిస్తుంది. అదీగాక గ్రామీణ మహిళలకు, అత్యంత బిజీగా ఉండే పట్టణ మహిళలకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. పైగా వైద్య ఖర్చులను తగ్గిస్తుంది. పైగా ఈ పరీక్షలో ఎలాంటి నొప్పి ఉండదు, ఐదు నిమిషాల కంటే తక్కువ సమయమే పడుతుంది.నిజానికి ఈ కిట్లు ఆరోగ్యకరమైన భవిష్యత్తుగా వారధిగా పనిచేస్తాయి. పైగా 25 నుంచి 65 ఏళ్ల మధ్య వయసు వాళ్లు కనీసం మూడేళ్ల కొకసారైనా ఈ పరీక్షను చేసుకోవడం మంచిదని చెబుతున్నారు నిపుణులు.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: వారసత్వ వేడుక..'జుట్టు విప్పే ఆచారం'!: సోనమ్ కపూర్) -
గుండెజబ్బుల రిస్క్ ఎవరికి ఎక్కువ?
హార్ట్ఎటాక్ అంటే చాలామందికి ఆందోళన. కుటుంబంలో ఎవరికైనా లేదా చుట్టుపక్కల వాళ్లలో ఎవరికైనా హార్ట్ ఎటాక్ వచ్చి... నిన్నటి వరకూ తమతోనే ఉన్న వ్యక్తి అకస్మాత్తుగా మిస్ అయిపోవడం ఎందరికో విషాదంతో కూడిన ఆశ్చర్యకరమైన అంశం. అందుకే... గుండెపోటును నివారించే మందులేమైనా ఉంటే బాగుండు అనే భావన. మరికొందరిలో... రక్తాన్ని పలచబార్చేవీ, గుండెనొప్పి అనిపించగానే నాలుక కింద పెట్టుకోమ్మని డాక్టర్లు చెప్పేవాటి గురించి విని... అలాంటి ఏవైనా మందులున్నాయనే అభిప్రాయం కూడా ఉంటుంది. నిజంగా గుండెపోటును నివారించే మందులేమైనా ఉంటాయా అన్న విషయం గురించి అసలు వాస్తవాలేమిటో చూద్దాం.ఓ కేస్ స్టడీ... శ్రీధర్ వాళ్ల నాన్నగారు చాలా చిన్నప్పుడే హార్ట్ ఎటాక్తో పోయారు. ఇటీవలే వాళ్ల చిన్నాన్నకు కూడా అకస్మాత్తుగా హార్ట్ ఎటాక్ వచ్చింది. అయితే అదృష్టవశాత్తూ ఆయనకేమీ కాలేదుగానీ... ఒకటోసారీ, రెండోసారి హార్ట్ ఎటాక్ ఉపేక్షిస్తుందేమోగానీ మూడోసారి వచ్చిందంటే మాత్రం తప్పక ప్రాణాపాయం కలుగుతుందంటూ చుట్టుపక్కలవారు చెబుతుండటంతో అతడిలో ఆందోళన ఇంకా పెరిగిపోతోంది. అయితే శ్రీధర్కు ఇప్పటికైతే ఎలాంటి సమస్యా లేదు. కాకపోతే అతడి వయసు నలభై ప్లస్. కుటుంబంలో చాలామందికి హార్ట్ ఎటాక్ రావడం, పైగా నాన్నగారు హార్ట్ ఎటాక్తో పోవడంతో వంశపారంపర్యంగా తనకూ హార్ట్ ఎటాక్ వస్తుందేమోనన్న ఆందోళన అతడిని నిలువనీయడం లేదు. దాంతో తమకు తెలిసిన కార్డియాలజిస్ట్ను సంప్రదించి... ‘‘మా నాన్నకూ, చిన్నాన్నకూ వచ్చినట్టుగా నాకు హార్ట్ ఎటాక్ రాకుండా ఉండేందుకు మందులివ్వండం’’టూ డాక్టర్ను అడగసాగాడు.శ్రీధర్కు వచ్చిన సందేహమే చాలామందిలో ఉంటుంది. ‘‘గుండెపోటు వచ్చాక కొన్ని రకాల మందులు తీసుకోవడం తప్పదు కదా. అయితే... అసలది రాకుండానే నివారించుకునేందుకు మొదట్నుంచీ ఆ మందులు తీసుకోవచ్చా?... ఇలాంటి నివారణ మందులేమైనా ఉన్నాయా?’’ అనే సందేహం కొందరిలో మెదులుతుంటుంది. మరీ ముఖ్యంగా కుటుంబంలో గుండెపోటు వచ్చినవారుండటం... వారేవో కొన్ని రకాల మందులు వాడుతుండటంతో... అవే మందులు తామూ వాడితే గుండెపోటు రాదేమో అనే ఆలోచనా ఉంటుంది. ఎందుకంటే... ఒకసారి గుండెపోటుకు గురైనవారికి మళ్లీ అది రాకుండా ఉండేందుకు డాక్టర్లు కొన్ని మందులు సూచిస్తుంటారు. ఉదాహరణకు... అలాంటి పేషెంట్లు ఆస్పిరిన్, క్లోపిడోగ్రెల్, రామిప్రిల్ వంటి మందులతో పాటు, బీటాబ్లాకర్, స్టాటిన్స్ వంటి మందుల్ని వాడుతుంటారు. దాంతో అవే మందుల్ని మనమూ తీసుకుంటూ ఉంటుంటే గుండెపోటును నివారించవచ్చు కదా అనే సందేహం రావడం చాలా సాధారణం.గుండెపోటు / గుండెజబ్బులకు అవకాశమున్నది ఎవరికంటే... కొందరిలో స్వాభావికంగానే గుండెజబ్బులు వచ్చే అవకాశాలెక్కువ. కొన్ని అంశాలు గుండెజబ్బులు / గుండెపోటుకు ఆస్కారమిస్తాయి. వాటిని రిస్క్ఫ్యాక్టర్స్గా చెప్పవచ్చు. అవేమిటంటే... ఇవీ ఆ రిస్క్ఫ్యాక్టర్స్...వయసు : నలభై ఏళ్ల వయసు దాటాక గుండెజబ్బులు వచ్చే అవకాశం ఎక్కువ. డయాబెటిస్ : చక్కెర వ్యాధి (మధుమేహం) ఉన్నవారిలో గుండె జబ్బులకు అవకాశాలెక్కువ. రక్తపోటు : అధికరక్తపోటు (హై–బీపీ) ఎక్కువగా ఉన్నవారిలో... కొలెస్ట్రాల్ : రక్తంలో చెడు కొలెస్ట్రాల్ వంటి కొవ్వు పదార్థాలు నిర్ణీత మోతాదు కంటే ఎక్కువగా ఉన్నవారిలో. స్మోకింగ్ : పొగతాగే అలవాటు ఉన్నవారిలో. స్థూలకాయం : ఉండాల్సిన దాని కంటే ఎక్కువ బరువు ఉన్నవారిలో గుండెజబ్బులూ / గుండెపోటు వచ్చే అవకాశాలెక్కువ. మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉండటం, నిద్ర సరిగా పోకపోవడం, తల్లిదండ్రులు లేదా తోడబుట్టినవాళ్లులో తక్కువ వయసులో హార్ట్ ఎటాక్ రావడం వంటివి కూడా రిస్క్ ఫ్యాక్టర్లే.పురుషుల్లో గుండెజబ్బుల రిస్క్ ఎక్కువ... మహిళలతో పోలిస్తే పురుషుల్లో గుండెజబ్బులకు ముప్పు ఎక్కువ. మహిళల్లో రుతుస్రావం కొనసాగుతున్నంత వరకూ వారిలో స్రవించే ఈస్ట్రోజెన్ కారణంగా వాళ్లకు ఓ స్వాభావిక రక్షణ ఉంటుంది. అయితే మహిళల్లో రుతుస్రావం ఆగాక (మెనోపాజ్ తర్వాత) ఈస్ట్రోజెన్ స్రావాలు తగ్గుతాయి కాబట్టి.. ఆ దశ తర్వాత పురుషులకూ, మహిళలకూ గుండెపోటు వచ్చే అవకాశాలు సమానంగా ఉంటాయి.రామిప్రిల్ : ఈ మందు హైబీపీని (రక్తపోటును) తగ్గించి... తద్వారా గుండెపోటు వచ్చే అవకాశాలను తగ్గిస్తుంది కాబట్టి గుండెపోటు వచ్చిన తర్వాత రామిప్రిల్గానీ... అలాంటి మరికొన్ని మందులుగానీ డాక్టర్లు సూచిస్తుంటారు. అయితే ముందుజాగ్రత్తగా ఆహారంలో ఉప్పు మోతాదు, కొవ్వు పదార్థాలు తగ్గించడం, మద్యపానం మానివేయడం, నడక లాంటి వ్యాయామాలు చేయడం, పచ్చికూరలు తీసుకోవడం వంటి సూచనలనూ ఈ మందు తీసుకుంటూ పాటిస్తుండాలి. బీటాబ్లాకర్స్ : ఒకసారి గుండెపోటు (Heart attack) వచ్చిన తర్వాత గుండె పంపింగ్ తగ్గినవారికి మాత్రమే ఇవి ఉపయోగపడతాయి. అయితే బీటాబ్లాకర్స్ వాడేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయమేమిటంటే... ఇవి వాడినప్పుడు రక్తపోటు (బీపీ) తగ్గే అవకాశముంటుంది. కాబట్టి బీపీని జాగ్రత్తగా మానిటర్ చేసుకుంటూ ఉండాలి. ఈ మందులతో నివారణ ఎప్పడూ... ఎలాగంటే... హై రిస్క్ ఉన్నవారికి మాత్రమే : ఇవి సెకండరీ ప్రివెన్షన్ కోసం మాత్రమే. ఆస్పిరిన్ను సాధారణంగా... ఒకసారి గుండెజబ్బులు కనిపించిన వారికి మాత్రమే ఉపయోగిస్తారు. మునుపు డయాబెటిస్ ఉండి, గుండెజబ్బు లేనివారికి కూడా ప్రైమరీ ప్రివెన్షన్ కోసం ఆస్పిరిన్ను వాడేవారు. అయితే కొత్త పరిశోధనల ఆధారంగా ఇప్పుడు ఆస్పిరిన్ను కేవలం సెకండరీ ప్రివెన్షన్ కోసం మాత్రమే ఉపయోగిస్తున్నారు. పై అంశాలు లేకపోతే ఆస్పిరిన్ వాడటం వల్ల ప్రయోజనం కంటే రిస్కే ఎక్కువ.మందులెప్పుడూ సెకండరీ ప్రిపెన్షన్గానే... ఆరోగ్య సమస్య ఏదీ లేనప్పుడు... అది రాకుండా చూసుకునేందుకు పాటించే నివారణ చర్యలను ప్రాథమిక నివారణ’ (ప్రైమరీ ప్రివెన్షన్) అంటారు. అయితే గుండెపోటుగాని, బ్రెయిన్స్ట్రోక్గాని ఒకసారి వచ్చాక... అది మళ్లీ రాకుండా ఉండేందుకు కొన్ని రకాల మందులు తీసుకోవడం, అలాగే జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవడం చాలా సాధారణంగా జరిగే ప్రక్రియ. ఈ మందులు తీసుకోవడాన్ని, అలాగే ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించే పద్ధతిని ‘సెకండరీ ప్రివెన్షన్’గా చెబుతారు. సాధారణంగా మధుమేహం (డయాబెటిస్), రక్తపోటు (హైబీపీ) ఉందని బయటపడ్డ తర్వాత అది గుండెపోటుకు లేదా గుండెజబ్బులకు దారితీయకుండా కొన్ని రకాల మందులు వాడటం లేదా కొన్ని ఆరోగ్య నియమాలు పాటించడం, ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించడం చేస్తుంటారు. దీన్ని ప్రైమరీ ప్రివెన్షన్గా చెప్పవచ్చు. అసలు డయాబెటిస్గానీ లేదా రక్తపోటు (హైబీపీ)గానీ రాకుండా ముందుగానే జాగ్రత్త పడటం ‘ప్రైమార్డియల్ ప్రివెన్షన్’ అవుతుంది. ఈ ప్రివెన్షన్ ప్రైమరీ ప్రివెన్షన్ కంటే ఇంకా ముందు దశ. అంటే రిస్క్ ఫ్యాక్టర్లు కనిపించకముందే... నివారణ చర్యలు చేపట్టడం అన్నమాట. అంతేతప్ప... సెకండరీ ప్రివెన్షన్లో వాడే మందులను ముందునుంచే గుండెపోటు రాకుండా ఉండేందుకు వాడే మందులుగా పొరబడకూడదు.సెకండరీ ప్రివెన్షన్గా వాడే మందులివి... ఆస్పిరిన్: సాధారణంగా నొప్పుల నివారణకు వాడే ఆస్పిరిన్ మాత్ర రక్తాన్ని పలచబార్చడం కోసం కూడా సమర్థంగా ఉపయోగపడుతుంది. అలా పరచబార్చడం వల్ల రక్తనాళాల్లో రక్తం గడ్డలుగా పేరుకుపోయే అవకాశం తగ్గుతుంది. ఫలితంగా గుండెపోటు వచ్చే అవకాశాలూ తగ్గుతాయి. అందుకే ఒకసారి గుండె΄ోటు వచ్చినవారు జీవితాంతం ఆస్ప్రిన్ మాత్ర క్రమం తప్పకుండా వాడుతూనే ఉండాలి.అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే... గుండెజబ్బు లేకుండానే ఆస్పిరిన్ వాడటం వల్ల అంతగా ఫలితమేమీ కనిపించదు. పైగా ముందునుంచే మాత్రలు వేసుకోవడం వల్ల రక్తం పలచబారిపోవడం వల్ల ఏ చిన్నదెబ్బ లేదా చిన్నగాయానికైనా ఆగకుండా రక్తస్రావమై... ఆ కారణంగా పరిస్థితి ప్రమాదకరంగా మారే అవకాశం కూడా ఉంటుంది. అందుకే కొంతకాలం క్రితం డయాబెటిస్ ఉన్నవాళ్లకు గుండెజబ్బులు ఉన్నా లేకపోయినా ఆస్పిరిన్ ఇచ్చేవారు. కానీ... ఆ కారణంగా సమస్యలు తలెత్తే అవకాశాలు ఎక్కువని కొన్ని శాస్త్రపరిశోధనల్లో వెల్లడయ్యాక డయాబెటిస్ ఉన్న ప్రతి ఒక్కరికీ కాకుండా కేవలం హై రిస్క్ ఉన్నవారికి మాత్రమే ఆస్పిరిన్ సూచిస్తున్నారు.స్టాటిన్స్ : రక్తంలోని కొవ్వుల మోతాదులను తగ్గించే మందులివి. మరీ ముఖ్యంగా చెడు కొలెస్ట్రాల్ అయిన లో–డెన్సిటీ లైప్రొటీన్ (ఎల్డీఎల్) అనే కొవ్వులను తగ్గిస్తాయి. అందుకే గుండెపోటు వచ్చిన ప్రతివారికీ ఈ మందును జీవితాంతం సూచిస్తారు. అంతేకాదు... డయాబెటిస్ ఉన్నవారికి గుండెజబ్బుల ముప్పు కూడా పెరగడం వల్ల చక్కెర వ్యాధి ఉన్నవారు స్టాటిన్లు కూడా వాడాలంటూ డాక్టర్లు సూచిస్తారు. చదవండి: ఫిట్స్తో ఎవరైనా పడిపోతే ఇలా చేయకండిఇక్కడ గమనించాల్సిన విషయమేమిటంటే... కేవలం రిస్క్ ఎక్కువగా ఉన్నవారికి మాత్రమే గాక... తక్కువ రిస్క్ ఉన్నవారికి సైతం స్టాటిన్స్ వాడటం వల్ల గుండెపోటు వచ్చే అవకాశాలు తక్కువ అని తేలింది. దాంతో రక్త పరీక్షల్లో ‘హెచ్ఎస్ సిఆర్పీ’ విలువ – 2 ఎంజీ కంటే ఎక్కువగా ఉంటే గుండె΄ోటు లేనివాళ్లకూ గుండెజబ్బులను నివారించవచ్చని తేలింది. ‘సీటీ స్కాన్’తో చూసే ‘కరొనరీ క్యాల్షియమ్ స్కోర్’ ఎక్కువ ఉన్నప్పుడు కూడా డాక్టర్లు స్టాటిన్స్ను సూచిస్తారు. అందుకే స్టాటిన్స్ వాడాలంటే ముందుగా డాక్టర్ సూచనల మేరకు తగిన పరీక్షలు చేసి అవి తీసుకోవాలా లేదా అన్నది కేవలం డాక్టర్లు మాత్రమే నిర్ధారణ చేయాల్సి ఉంటుంది.వ్యాయామంతో గుండెజబ్బులు దూరం ప్రతిరోజూ ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వ్యాయామం చేయడం గుండెజబ్బులు / గుండెపోటుకు మంచి నివారణ అని అనేక అధ్యయనాల్లో తేలింది. అయితే ఈ వ్యాయామం కేవలం మొక్కుబడిగా కాకుండా... ప్రతిరోజూ కనీసం 30 నిమిషాలు వ్యాయామం చేయాలి. కాకపోతే మరీ ఎక్కువగా శ్రమ కలిగించేలా ఉండకూడదు. అలాగని మరీ విశ్రాంతిగా కూడా ఉండకూడదు. శరీరానికి మరీ ఎక్కువ శ్రమ కలగని రీతిలో ఉండే బ్రిస్క్వాకింగ్, ఈత లేదా ఏదైనా స్పోర్ట్ వంటి వ్యాయామాలు మంచివి. మరీ ఎక్కువగా శ్రమ కలిగించేవి అకస్మాత్తుగా మొదలుపెట్టకూడదు. తీవ్రతను క్రమంగా పెంచుకుంటూ పోవడం మంచి పద్ధతి.ఏయే కొలతలు ఎంతెంత ఉండాలంటే... గుండెజబ్బులు ఉన్నవారిలో రక్తపోటు విలువ 130/80 కంతే తక్కువగా ఉండాలి. కొలెస్ట్రాల్ మోతాదులు : రక్తంలో పూర్తి కొలెస్ట్రాల్ మోతాదులు... 200 కంటే తక్కువ ఉండాలి. చెడు కొలెస్ట్రాల్ (ఎల్డీఎల్) మోతాదులు... 100 కంటే తక్కువ ఉండాలి. గుండె జబ్బులు ఉన్నవారికి 70 కంటే తక్కువగా ఉండాలి. మంచి కొలెస్ట్రాల్ (హెచ్డీఎల్) మోతాదులు... 40 కంటే ఎక్కువగా ఉండాలి. ట్రైగ్లిజరైడ్స్ అనే రకం కొవ్వుల మోతాదులు... 200 కంటే తక్కువగా ఉండాలి. -
పక్షవాతంతో మంచానికే పరిమితం..కానీ ఆయుర్వేదం నడిచేలా చేసింది..!
అమ్మాయిల కలల రాకుమారుడిలా ఉండే తమిళ నటుడు అరవింద్ స్వామి నటన పరంగానే కాదు గ్లామరస్ పరంగా ఆయనకు సాటిలేరెవ్వరూ. బాంబే, రోజా మూవీలో వేలాది అభిమానులను సొంతం చేసుకున్న నటుడు అరవింద్స్వామి. అలాంటి ఆయన కెరీర్పీక్లో ఉండగానే సినిమాలకు దూరమయ్యారు. మళ్లీ ఇటీవలే ప్రధాన పాత్రలతో ప్రేక్షకులకు చేరవవుతున్నారు. ఈ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో ఇన్నాళ్లు తాను ఎందుకు సినీ ఫీల్డ్కి ఎందుకు దూరంగా ఉన్నారో వెల్లడించారు. అనారోగ్యం బారిన పడటం ఒక కారణమైతే, అధిక బరువు మరో కారణమంటూ..తాను ఎదుర్కొన్య ఆరోగ్య సమస్య గురించి కూడా వివరించారు. ఇంతకీ ఆయన ఏ అనారోగ్య సమస్యతో బాధపడ్డారంటే..అరవింద్ స్వామికి 2005లో పాక్షికంగా పక్షవాతం వచ్చింది. 18 నెలలు ఎంతగానో నొప్పితో విలవిలలాడాడు. చివరికి శస్త్ర చికిత్స చేయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఆయన అది వద్దనుకుని కేరళకు చెందని ఆయుర్వేద వైద్యుడిని ఆశ్రయించినట్లు తెలిపారు. ఒకటిన్నర ఏడాదిగా అనుభవించిన బాధ అంత ఇంత కాదని, ఆఖరికి స్పర్శను కూడా కోల్పోయానని అన్నారు. కానీ ఆయుర్వేదం తనను మూడు రోజుల్లో తిరిగి నడిచేలా చేసిందన్నారు. అది నాకు చాలా అద్భుతంగా పనిచేసిందని చెప్పుకొచ్చారు. అయితే ఆయన తనకు పనిచేసింది కాబట్టి ప్రజలను ఫాలో అవ్వమని సూచించడం లేదు. అలాగే గుడ్డిగా కూడా ఫాలో కావొద్దన్నారు. వైద్యుల సూచనల మేరకు, ఆరోగ్య పరిస్థితి రీత్యా సరైన నిర్ణయం తీసుకోండని అన్నారు. ఇక్క నొప్పి, కదలలేని పరిస్థితి కంటే..మానసికంగా స్థైర్యంగా ఉండటం అత్యంత ప్రధానమని అన్నారు. ఆ పరిస్థితిలో నాకే ఇలా అనే ఆలోచన దరిదాపుల్లోకి కూడా వెళ్లకూడదన్నారు. ఆ సమస్య నుంచి బయటపడ్డ వెంటనే..ఫజిల్స్, చదరంగం వంటి ఆటలతో బిజీ అయిపోయినట్లు తెలిపారు. అయితే ఆ అనారోగ్య సమస్య నుంచి బయటపడ్డాక మళ్లీ సినీ రంగంవైపుకి రావాలని అస్సలు అనుకోలేదు, సినిమా చేయాలని కూడా అనుకోలేదట. ఎందుకంటే ఆ టైంలో చాలా మందులు వాడటంతో విపరీతం బరువు పెరిగిపోయి, జుట్టు ఊడిపోయి అదోలా తయారయ్యానని, దాంతో సినిమాల ఆలోచన రాలేదని చెప్పుకొచ్చారు అరవింద్ స్వామి. ఎంత టెక్నాలజీ అభివృద్ది చెంది..ఆధునాత వైద్యం చెంతకు చేరినా..ఏళ్లనాటి పురాతన ఆయుర్వేదమే అత్యుతమమని పలు ఉదంతాల్లో నిరూపితమైంది కూడా.(చదవండి: అమెరికా కోడలు..ఇండియా అత్త..! అనుబంధం మాములుగా లేదుగా..) -
షుగర్ లెవల్స్ తెలుసుకోవాలంటే ఈ టెస్ట్ తప్పనిసరి
మధుమేహ రోగులకు HbA1c పరీక్ష ప్రామాణికం. రక్తంలో చక్కెర స్థాయుల సగటు ఎంత ఉందో ఈ పరీక్షలో కచ్చితంగా తెలుస్తుందని అందరూ భావిస్తారు. కానీ ఈ పరీక్ష ఫలితాలపై ప్రస్తుతం నమ్మకం సన్నగిల్లుతోంది. ఈ మాట చెబుతోంది ఎవరో కాదు... ప్రపంచవ్యాప్త వైద్యవిశేషాలతో ప్రచురితమయ్యే ప్రముఖ పత్రిక లాన్సెట్! భారతీయులు HbA1c పరీక్ష బదులుగా ఓరల్ గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ (ఓజీటీటీ) లేదా నిరంతర గ్లూకోజ్ మానిటరింగ్ (సీజీఎం) టెస్ట్ చేయించుకోవడమే ఉత్తమమని నిపుణులు అంటున్నారు. గత కొద్ది నెలలుగా గ్లూకోజ్ స్థాయులు నియంత్రణలో ఉన్న మధుమేహ రోగుల విషయంలో సాధారణంగా చేసే HbA1c పరీక్ష అత్యంత కచ్చితమైన పద్ధతి కాదనేది దేశంలోని పలువురు సుప్రసిద్ధ డయాబెటాలజిస్టుల తాజా వాదన. లాన్సెట్ పత్రికలో ‘ప్రాంతీయ ఆరోగ్యం: ఆగ్నేయాసియా (రీజినల్ హెల్త్: సౌత్ ఈస్ట్ ఆసియా) పేరిట ఈ అధ్యయన ఫలితాలు ఈ నెల 9న ప్రచురితమయ్యాయి. చక్కెర వ్యాధికి భారత్ రాజధాని. మన దేశంలో మధుమేహ రోగుల సంఖ్య దాదాపు 10.10 కోట్లు. వీరిలో చాలామంది తమ గ్లూకోజ్ స్థాయులు తెలుసుకోవడానికి HbA1c పరీక్ష చేయించుకుంటుంటారు. అయితే ఇండియాలో ఈ పరీక్ష స్పష్టమైన వాస్తవిక చిత్రాన్ని ప్రతిబింబించడం లేదనే మరో కథనం కూడా ఇటీవల ‘లాన్సెట్’లో వచ్చింది.HbA1c పరీక్ష ఎందుకు?ఎర్ర రక్తకణాలు సుమారు మూడు మాసాలు జీవిస్తాయి. కనుక HbA1c లేదా గ్లైకేటెడ్ హీమోగ్లోబిన్ పరీక్షను గత రెండు నెలలు లేదా మూడు నెలల కాలానికి రక్తంలోని చక్కెర నిల్వల స్థాయిని తెలుసుకోవడానికి చేస్తారు. హీమోగ్లోబిన్ అనేది రక్తంలో ఆక్సిజన్ ను మోసుకెళ్లే ప్రోటీన్. ఇది గ్లూకోజును అతుక్కుని ఉంటుంది. HbA1c టెస్టులో హీమోగ్లోబిన్ శాతాన్ని పరీక్షిస్తారు. HbA1c స్థాయి 5.7 శాతం కంటే తక్కువ ఉంటే డయాబెటిస్ లేనట్టు. అది 5.7-6.4 శాతం మధ్య ఉంటే ప్రీ-డయబెటిస్ కింద లెక్క. 6.5 శాతాన్ని మించితే సుగర్ వ్యాధి ఉన్నట్టు పరిగణిస్తారు. రక్తంలో చక్కెర నియంత్రణ, HbA1c లెవల్స్ మధ్య గల లింకు గురించి 1976లో తెలిసినప్పట్నుంచి ‘గ్లైసెమిక్ కంట్రోల్’ పరిశీలనకు సంబంధించి HbA1c అనేది ‘స్వర్ణ ప్రామాణిక పరీక్ష’ తరహాలో ఓ గీటురాయిగా మారింది. ఇది ఓ స్థిరమైన ముందస్తు విశ్లేషణతో కూడిన పరీక్ష. 2010లో దీన్ని ఓ డయాగ్నొస్టిక్ విధానంగా కూడా ప్రతిపాదించారు. పరగడుపున సేకరించే రక్త నమూనా కోసం సంప్రదాయ పద్ధతిలో మాదిరిగా HbA1c విధానంలో రోగి ఏమీ తినకుండా ‘ఉపవాసం’ పాటించాల్సిన అవసరం లేదు.HbA1cలో కచ్చితత్వం ఉండదా?పరిశోధకులు ఈ సందర్భంగా వివిధ పద్ధతుల ద్వారా రక్తంలో చక్కెర స్థాయులను కొలిచి, వాటిని పోల్చుతూ పలు అధ్యయనాలతో సమీక్షించారు. దక్షిణ భారత దేశంలో ఇటీవల 1,120 మందిపై నిర్వహించిన ఓ అధ్యయనంలో HbA1c పరీక్ష (45.4%)తో పోలిస్తే ఓరల్ గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ (87.8%) (OGTT)లో ఎక్కువ ప్రీ-డయాబెటిస్ కేసులు నమోదయ్యాయి. (ప్రీ-డయాబెటిస్ అంటే మధుమేహం త్వరలో రాబోతోందని తెలిపే ఓ ముందస్తు సూచిక. ఆహార అలవాట్లు మార్చుకోవడం, వ్యాయామం చేయడం, మద్యం- ధూమపానం మానివేయడం, జీవన శైలిని మార్చుకోవడం వంటివి పాటించకపోతే అనతి కాలంలోనే వారికి అతిదాహం-అతిమూత్ర వ్యాధి ఖాయం!). పుణెలో 116 మంది యువతపై నిర్వహించిన ఓ స్టడీలో 23.3% ప్రీ-డయాబెటిస్ కేసుల్ని HbA1c పరీక్ష గుర్తించగా, ఓరల్ గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ (OGTT) మాత్రం 7.8% కేసుల్లో మాత్రమే ప్రీ-డయాబెటిస్ ఉన్నట్టు తేల్చింది. ఆయా వ్యక్తుల్లో ఎర్ర రక్తకణాల స్థాయులు, వాటి జీవితకాలం, అవి గ్లూకోజుతో అంటిపెట్టుకొని ఉండే అంశాల కారణంగానే ఈ వ్యత్యాసాలు చోటుచేసుకున్నట్టు పరిశోధకులు వెల్లడించారు. “HbA1c స్థాయులపై వివిధ అంశాలు ప్రభావం చూపిస్తాయి. ఐరన్ (ఇనుము) కొరతతో తలెత్తే రక్తహీనత (అనీమియా) లేదా జీ6పీడీ (ఎర్ర రక్తకణం ఎంజైమ్) కొరత వల్ల రక్తకణాలు విచ్ఛిన్నమవుతాయి. ఇటువంటి పరిస్థితులు హీమోగ్లిబిన్ లెవల్స్ మీద ప్రభావం చూపిస్తాయి. ఫలితంగా HbA1c లెవల్స్ మారతాయి” అని ఫోర్టిస్ సి-డాక్ సెంటర్ ఫర్ డయాబెటిస్ ఛైర్మన్, పరిశోధన పత్రం రూపకల్పనలో పాలుపంచుకున్న రచయితల్లో ఒకరైన డాక్టర్ అనూప్ మిశ్రా వ్యాఖ్యానించారు.దేశంలో అనీమియా వ్యాప్తి అధికంగా ఉందని, దీంతోపాటు కొన్ని జన సమూహాల్లో తలసేమియా (దేహంలో హీమోగ్లోబిన్ తక్కువగా ఉత్పత్తయ్యే అనువంశిక రక్తసంబంధ రుగ్మత), సికిల్ సెల్ (హీమోగ్లోబిన్ సంబంధిత వంశపారంపర్య రుగ్మత) వంటి హీమోగ్లోబినోపతీస్ (జన్యుపరమైన అనువంశిక వ్యాధులు) ఉన్నాయని లీలావతి ఆస్పత్రి వైద్యుడు, అధ్యయనకర్తల్లో ఒకరైన శశాంక్ జోషి తెలిపారు. అలాగే మలేరియా కేసులు కూడా వ్యాప్తిలో ఉన్నాయని, ఇవన్నీ హీమోగ్లోబిన్ స్థాయులపై ప్రభావం చూపుతాయని చెప్పారు. ఇటువంటి స్థితిలో HbA1c లెవల్స్ కచ్చితమైన ఫలితాలు ఇవ్వలేదని అన్నారు. నిపుణుల సలహా ఏమిటంటే... మధుమేహ రోగులకు HbA1c పరీక్ష కంటే ఓరల్ గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ (ఓజీటీటీ) లేదా నిరంతర గ్లూకోజ్ మానిటరింగ్ (సీజీఎం) టెస్ట్ ఉత్తమం. HbA1c పరీక్ష అక్కర్లేదని, వారంలో రెండు లేదా మూడు సార్లు వంతున కొంతకాలం పాటు రక్తపరీక్ష చేయించుకుంటే షుగర్ లెవల్స్ సంగతి ఇట్టే తెలిసిపోతుందని డాక్టర్ అనూప్ మిశ్రా చెప్పారు. ప్రస్తుతం అన్ని కార్పొరేట్ ఆస్పత్రుల్లో HbA1c పరీక్ష రుసుము సుమారు రూ.600గా ఉంది. - జమ్ముల శ్రీకాంత్(Credits: The Lancet, The Indian Express, Hindustan Times, The Economic Times, ET Health World, NDTV) -
Weight Loss: తూచా తప్పకుండా ఈ ఏడు సూత్రాలు..!
బరువు తగ్గడం అన్నది చాలామందికి అతిపెద్ద సమస్య. కానీ కొందరికి చాలా సింపుల్. అదికూడా నచ్చిన ఆహారాన్ని వదులుకోకుండానే వెయిట్లాస్ అవుతారు. అలాగని, అధిక వర్కౌట్లు, వ్యాయామాలు కూడా చేయరు. సాధారణంగా రోజువారీగా చేసే సింపుల్ వ్యాయామాలు..కాస్త తెలిగా మంచి ఆహారం తీసుకుంటూ తగ్గుతారు. ఇక్కడ ఆరోగ్యానికి భంగం వాటిల్లకుండా..తగిన ప్రోటీన్లు, విటమిన్లు అందేలా జాగ్రత్త వహిస్తే..ఎలాంటి దుష్ప్రభావాల బారిన పడకుండా బరువు తగ్గేలా మంచి ఫలితాలు అందుకుంటారని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ఇక్కడొక ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ కూడా అదే నిరూపించాడు. రోజువారీ ఆహారాన్ని రుచికరంగా, ఆరోగ్యకరంగా మార్చుకుని..అవలీలగా 35 కిలోలు తగ్గి స్ఫూర్తిగా నిలిచాడు. అంతేగాదు బరువు తగ్గాలంటే ఈ ఏడు చిట్కాలు తప్పకుండా ఫాలో అవ్వాలని అంటున్నాడు. అవేంటో చూద్దామా..!ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ అన్ష్ త్రిపాఠి కొలెస్ట్రాల్ తగ్గించే వాస్తవిక ఆహార నియమాలను షేర్ చేసుకున్నాడు. తన పోస్ట్లో ఇలా రాసుకొచ్చారు. బరువు తగ్గడంలో కన్ఫ్యూజన్కి గురికావొద్దని అంటున్నాడు. మన స్వచ్ఛమైన భారతీయ ఆహారంతోనే కొవ్వుని కరిగించేలా తీసుకుంటే చాలని చెబుతున్నాడు. ప్రధాన నియమం..కొలెస్ట్రాల్ని తగ్గించే ఆహారాలే మన భోజనపు ప్లేట్లో ఉండేలా చూసుకోవాలి. ప్రోటీన్ వేటిలో ఉంది..? తగినన్ని కూరగాయలు తింటున్నామా?.. నూనె దగ్గర నుంచి కార్బోహైడ్రేట్స్ వరకు అన్ని నియంత్రణలో ఉన్నాయా..? అని గమనించాలి. ఇక్కడ ఏది మిస్ అవ్వకూడదు. ఆహారంలో ఉండాల్సినవి..తప్పనిసరిగా సగం కూరగాయల్లో 1/4 వంతు ప్రోటీన్, 1/4 కార్బోహైడ్రేట్లు ఉండేలా చూడాలి.ప్రోటీన్ తప్పనిసరి..ఆహారంలో కొవ్వు నష్టాన్ని ప్రోటీన్ నిర్ణయిస్తుంది. ఇక్కడ ప్రోటీన్ తక్కువగా ఉంటే ఆకలి కోరికలు పెరుగుతాయి. ఫలితంగా శరీరంలో కండరాలను కోల్పోవడం ప్రారంభమవుతుంది. .కూరగాయలు తప్పనిసరి..ఆరోగ్యకరమైన ఆహారంలో అతి ముఖ్యమైన భాగం. ప్లేట్లో వండిన లేదా పచ్చిగా ఉన్న భోజనానికి కనీసం రెండు వేర్వేరు కూరగాయలు ఉండాలి. అవి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి, తక్కువ కేలరీలను కలిగి ఉంటాయికార్బోహైడ్రేట్ నియంత్రణ నియమంమన ఆహారంలో కార్బోహైడ్రేట్లను జోడించాలి కానీ మితంగా ఉండాలి. భోజనంలో 1 రోటీ లేదా 1 కప్పు బియ్యం ఉండేలా కేర్ తీసుకోవాలి. అవసరం అనుకుంటే వాటి స్థానంలో పోహా లేదా ఉప్మాతో కూడా మార్చుకోవచ్చు. కొవ్వు/నూనె నియమండైట్ విషయంలో చాలామంది ఫెయిలైదే ఇక్కడే అని అంటున్నాడు. మన భోజనంలో రెండు నుంచి మూడు స్పూన్లకు మించి నూనె ఉండకుండా చూసుకోవాలి. అప్పుడు ఆహారం ఆరోగ్యకరంగా ఉంటుంది. కేలరీలు కూడా సమృద్ధిగా ఉంటాయి.గుర్తించుకోవాల్సిన విషయాలుశాఖాహారుల కోసం, కొవ్వు తగ్గింపు ప్లేట్లో సగం ప్లేట్ సబ్జీ, 1 కటోరి పప్పు/పనీర్/టోఫు, 1 రోటీ లేదా చిన్న మొత్తం రైస్ ఉండాలి. శాఖాహారులకు కొవ్వు నష్టం కష్టంగా అనిపించిందంటే..ప్రోటీన్ తీసుకోవడం చాలా తక్కువగా ఉందని అర్థం.అలాగే నాన్-వెజ్ ప్లేట్లో చికెన్/చేప/గుడ్లు ప్రధానంగా ఉంటాయి. ప్లేట్లో సగానికిపైగా కూరగాయలు ఉండాలి. సమతుల్యతను కాపాడుకోవడానికి కార్బ్ భాగం చిన్నగా ఉండాలి. భాగాలను నియంత్రించినప్పుడు మాత్రమే మాంసాహార ప్లేట్ కొవ్వు తగ్గడానికి సహాయపడుతుంది.అల్పాహారం ప్లేట్లలో తక్కువ కార్బోహైడ్రేట్లతో ప్రోటీన్ ఉండాలి, ద్రవ కేలరీలు ఉండకూడదు. అయితే డిన్నర్ లేదా లంచ్ ప్లేట్లో ప్రోటీన్ క్వాండిటీ తక్కువగా ఉంటే..ఎక్కువ కార్బోహైడ్రేట్లు ఉండవచ్చు.చక్కెర పానీయాలు నివారించండి. కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండే వంటకాలను ఇతరులతో షేర్ చేసుకోండి. ఇలా గనుక ఆహారంలో మార్పులు చేసుకుని తూచా తప్పకుండా ఫాలో అయితే..ఇట్టే బరువు తగ్గుతారంటూ తన పోస్ట్ని ముగించాడు ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ త్రిపాఠి.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: ఉబర్ సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని వదులుకుని మరి.. యూట్యూబ్లో కోడింగ్..!) -
'భారతీయ పేరెంటింగ్'పై మ్యాట్రిమోని యాప్ సీఈవో ఫైర్..!
భారతీయ పేరెంటింగ్పై గురుగ్రామ్ సీఈవో, నాట్ డేటింగ్ సహ వ్యవస్థాపకుడు పెద్ద ఎత్తున విరుచుకుపడ్డారు. చాలామంది భారతీయ తల్లిదండ్రుల పిల్లల పెంపకం సరైనది కాదన్నారు. తల్లిదండ్రులు మంచివాళ్లేనని, కానీ పెంపకంలో ఆలోచన తీరు సరిగా లేదన్నారు. పేరెంటింగ్పై ఎన్నో పుస్తకాలు వచ్చినా ఎందుకనో భారతీయ తల్లిదండ్రుల తీరు మారట్లేదని, వాళ్లు పిల్లలను పెంచడం లేదు, ఫలితాలను పెంచుతున్నారంటూ సోషల్మీడియా వేదికగా విమర్శించారు. ఇంతకీ ఆయన ఎందుకిలా అన్నారు. అసలు ఆ సీఈవో ఆంతర్యం ఏంటీ అంటే..భారతీయ కుటుంబ వ్యవస్థను యావత్తు ప్రపంచం మెచ్చుకుంటే..మన భారతీయుడు, గురుగ్రామ్కి చెందిన మ్యాట్రిమోని యాప్ సీఈవో జస్వీర్ సింగ్ భారత పేరెంటింగ్ని తప్పుపడుతున్నారు. భారత తల్లిదండ్రులు పిల్లలను పెంచే విధానం అత్యంత అధ్వాన్నమైనది అని తిట్టిపోశారు. వాళ్లు పిల్లలను తమ సొంత ఆస్తులుగా చూస్తారని అన్నారు. ప్రపంచంలో మిగిలిన ప్రాంతాల్లో చూసిన దానికంటే అత్యంత భిన్నంగా ఉంటుందన్నారు. సాంస్కృతికంగా భారతీయ పేరెంటింగ్ విధానంలో పెద్దలు ఎల్లప్పుడూ గొప్పవారు అని గుండెల్లో నాటుకుపోతుందన్నారు. అంతేగాదు జస్వీర్ సింగ్ సోషల్మీడియా ఎక్స్పోస్ట్లో భారత తల్లిదండ్రుల పిల్లలను పెంచే విధానం గురించి ఇలా రాసుకొచ్చారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పిల్లల పెంపక విధానాలలో కెల్లా అత్యంత చెత్త విధానంగా పేర్కొన్నారు. దీన్ని ప్రెషర్ కుక్కర్ పేరెంటింగా అభివర్ణించారు. ఇక్కడ భారత తల్లిదండ్రులు చెడ్డవారు కాదు గానీ ఆలోచన తీరు సరైనది కాదంటున్నారు. ముఖ్యంగా పిల్లలను ప్రశ్నించే విధంగా పెంచరన్నారు. తల్లిదండ్రులదే తుది నిర్ణయం..చాలామటుకు తల్లిదండ్రులు పిల్లలను పెంచరని, వాళ్ల ఫలితాలను పెంచుతారని రాసుకొచ్చారు. వాళ్లు వ్యక్తలుగా స్వతంత్రంగా ఉండాలని కోరుకోరు. ఎందుకంటే భారత్లో ఒక పిల్లవాడు ఏం చదువుకోవాలి, భవిష్యత్తులో ఏ వృత్తిలో కొనసాగించాలి, ఎలాంటి జీవితాన్ని గడపాలి...అన్ని తల్లిదండ్రులే ఆలోచిస్తారు, నిర్ణయిస్తారు. ఆఖరికి ఎవరిని పెళ్లి చేసుకోవాలన్నది కూడా తల్లిదండ్రలదే ఫైనల్ నిర్ణయం అన్నారు. ఇక్కడ భారత పేరెంట్స్ దృష్టిలో మానసిక ఆరోగ్యం, ఆసక్తి, ఉత్సుకత, ఆప్టిట్యూడ్, తదితరాలన్ని ఎందుకు పనికిరానివి, విలువలేనివి అన్నారు. కేవలం వాళ్ల మైండ్లో తల్లిదండ్రులుగా తమకే అన్ని తెలుసని, మేము చెప్పినట్లుగా చేయాలనే ధోరణే ఎక్కువగా ఉంటుందన్నారు. చెప్పాలంటే ఇదొక వస్తుమార్పిడిలా ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే తామే ఈ ప్రపంచంలోకి పిల్లల్ని తీసుకొచ్చాం కాబట్టి వాళ్లపై తమకే సర్వహక్కులు ఉంటాయన్నట్లుగా ఉంటుంది వారి తీరు. ప్రశ్నించడమే అతిపెద్ద నేరం..దాంతో పిల్లలు భావోద్వేగపరంగా చిక్కుకుపోతుంటారు. పైగా వైఫల్యాన్ని నేరంగా చూస్తారు. అదొక సిగ్గుచేటు, ఆందోళనగా పిల్లల మైండ్లోకి చొప్పిస్తారు. అంతేగాదు బంధువుల్లోనూ, సమాజంలోనూ తక్కువ అయినట్లుగా ప్రతిక్షణం పిల్లలకు నూరుపోస్తుంటారు. దీన్ని ఇక్కడ తల్లిదండ్రులుగా తాము పిల్లల భవిష్యత్తును కాపాడుతున్నట్లుగా ఫీలవుతుంటారు కానీ, సవాలుని స్వీకరించేలా కాకుండా వైఫల్యం నుంచి కాపాడుకుంటున్నట్లుగా పెంచుతున్నాం అని గ్రహించరని మండిపడ్డారు. అంతేగాదు ఇక్కడ పిల్లలు ప్రశ్నించడం అనేది అగౌరమైనది, ఒకవేళ ఏ పిల్లవాడైన ధైర్యంగా ప్రశ్నించడం మొదలుపెడితే..అతడని దూరంగా ఉంచాల్సిన వ్యక్తిగా నిలబెడతారు. కేవలం నిశబ్దాన్ని ప్రోత్సహిస్తారు. ముందు తల్లిదండ్రులుగా వాళ్లు ఇలానే పెరిగారు, నియంత్రించబడ్డారు, ప్రశ్నించలేదు, భావోద్వేగపరంగా అణిచివేయబడ్డారు..కాబట్టి అదే తర్వాతి తరాలకు పునరావృతం అవుతుందని అన్నారు. అలాగే కొంతమంది పిల్లలకు చిన్న వయసులోనే పెద్దలకు మించిన పరిణితి, అపారమైన మేధస్సు ఉంటుంది, అయినప్పటకీ అక్కడ కూడా ప్రశ్నించడం ద్రోహం, విబేధించడం, అపరాధం అనే భావన కిందకు రావడం దురదృష్టకరం అని అన్నారు. కొందరు తల్లిదండ్రలు ఇలా ప్రశ్నిస్తున్నందుకు పనిష్మెంట్తో నొరు నొక్కే ప్రయత్నం చేస్తుంటారు లేదా గర్విష్టులు, మొండోడు కింద ముద్రవేస్తారని అన్నారు. నో చెప్పడానికి జంకేలా..ఇక్కడ తల్లిదండ్రులు సమాజా అభిప్రాయానికి భయపడతారని అంటున్నారు. పిల్లలను తమను అనుసరించి, తమపై ఆధారపడేలా పెంచుతారని అన్నారు. అదీగాక తల్లిదండ్రలు మరో విషపూరి సంస్కృతికి ప్రాధాన్యత ఇస్తారు. అదేంటంటే పక్కంటి పిల్లవాడితో ప్రతిదానితో పోలుస్తూ..పెంచే ప్రయత్నం చేస్తుంటారు.. ఇది అన్నిట్లంకంటే దారుణైమనది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడ భారతీయ తల్లిదండ్రులు సమాజంపై పోరాడలేక తమ భయాలను పిల్లలపై వేస్తారు, ఆధిపత్యం చెలాయిస్తారని అన్నారు. సింపుల్గా చెప్పాలంటే పిరికితనంతో పెంచుతారని, అది పితృస్వామ్యం విధేయత నుంచి వచ్చిందని అన్నారు. తల్లిదండ్రులు 'నో' అని స్వతహాగా చెప్పడం నేర్చుకోలేదు..పిల్లలకు అది నేర్పించరు. చెప్పాలంటే భారత పేరెంటింగ్స్ తమ పిల్లలను బాగా పెంచామనే ముసుగులో వారికి తెలియని నష్టం చేకురుస్తున్నారు. పైగా వ్యక్తిగత వైఫల్యాన్ని తరతరాలు మోసేలా చేస్తున్నారని తిట్టిపోశారు జస్వీర్ సింగ్. ఆయన ఉద్దేశ్యం ప్రకారం భారత పేరెంటింగ్ టాలీవుడ్ మూవీ బొమ్మరిల్లు లాంటిదని తేల్చేశారు. అయితే గత దశాబ్ద కాలంలో పెంపకం గురించి మనస్తత్వవేత్తలు, అధ్యయనాలు, కౌన్సలర్లు తమ అభిప్రాయాలు పంచుకున్నారు. అలాగే నకుల్ మెహతా, జాన్కీ మెహతా వంటి మిలీనియల్ తల్లిదండ్రులు ఆధునిక అవగాహనతో పిల్లలను స్వతంత్రంగా ఆరోగ్యకరంగా ఎలా పెంచచ్చో అనుభవాలను షేర్ చేసుకున్నారు కూడా.Indian parenting is pressure cooker parenting. One of the worst models globally. Not because parents are evil. But because the system is broken and no one questions it.Most Indian parents didn’t raise children. They raised outcomes.Children are treated like owned assets -…— Jasveer Singh (@jasveer10) February 8, 2026 చదవండి: నీతా అంబానీ ధరించిన చానెల్ బ్లేజర్ ..అంత ఖరీదా!? -
ఫిట్స్ వస్తే.. ఏం చేయాలి?
ఫిట్స్, సీజర్స్, ఎపిలెప్సీ అంటూ పిలిచే ఈ వ్యాధిని చాలా సాధారణ సమస్యగా పరిగణించాలి. చికిత్సతో పూర్తిగా తగ్గే సమస్య ఇది. అయితే దీని గురించి ఇంకా ఇప్పటికీ చాలా అపోహలు ఉన్నాయి. నేడు (ఫిబ్రవరి 9) ఎపిలెప్సీ డే (International Epilepsy Day) సందర్భంగా ఫిట్స్పై అవగాహన కోసమే ఈ కథనం. 90 శాతంలో పూర్తి తగ్గుదల 10 శాతంలోనే మాటిమాటికీ... తీవ్రత ఆధారంగా మందును, మోతాదును నిర్ణయిస్తారు. దాదాపు 70 శాతం మందిలో కేవలం ఒకే ఒక మందుతో నియంత్రణలోకి వస్తాయి. కొద్దిమందిలో... అంటే మరో 10 శాతం బాధితులకు రెండు మందులు, ఇంకో 10 శాతం మందిలో మూడు మందులను వాడాల్సి రావచ్చు. దాదాపు 70 శాతం మంది బాధితులు రెండేళ్ల తర్వాత మందును ఆపేయవచ్చు. దీనికోసం డాక్టర్లు అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుని మందులు ఇక ఆపేయవచ్చనే నిర్ణయానికి వస్తారు. కానీ మరో 10 శాతం మందికి నాలుగు రకాల మందులు వాడినా కూడా ఫిట్స్ పదే పదే వస్తుండవచ్చు.6.5 కోట్ల మందిప్రపంచవ్యాప్తంగా 6.5 కోట్ల మంది ఫిట్స్తో బాధపడుతుండగా మనదేశంలో దాదాపు కోటి నుంచి 1.2 కోట్ల మంది బాధితులున్నారు. డబ్ల్యూహెచ్ఓ లెక్కల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏడాదీ 50 లక్షల మంది కొత్త పేషెంట్స్ ఈ జాబితాలో చేరుతున్నారు. 26 మందిలో ఒకరికి... చూడ్డానికి ఎంతో భయంకరంగా, ఆందోళన గొలిపేలా ఉండే లక్షణాలూ, అపోహల కారణంగానే ఈ పరిణామం చోటుచేసుకుంటోంది. దేశంలోని ప్రతి 26 మందిలో ఒకరికి ఫిట్స్ కనిపిస్తున్నాయి. ఇందులో 80% అల్పాదాయ, మధ్యతరగతివారే. ఇదేమీ భయంకరమైన వ్యాధి కాదు. మానసిక వ్యాధి అంతకంటే కాదు. అంటువ్యాధి కానే కాదు. చికిత్స తీసుకుంటే పూర్తిగా తగ్గిపోయే నిరపాయకరమైన వ్యాధి. అనేక అపోహల కారణంగా దేశంలోని 50% పైగా బాధితులు ఇంకా చికిత్సకు దూరంగా ఉన్నారు.70% మందిలో.. ఫిట్స్ / ఎపిలెప్సీ వచ్చినవాళ్లలో దాదాపు 70 శాతం మందిలో కారణాలు తెలియవు. మిగతా 30 శాతం మందిలో ఏవైనా నిర్దిష్టమైన కారణాలతో ఫిట్స్ వస్తుంటాయి. ఉదాహరణకు... కొందరిలో వంశపారంపర్యంగా, తలకు దెబ్బతగలడం, పక్షవాతం, మెదడులో గడ్డలుగానీ లేదా ఇన్ఫెక్షన్గానీ రావడం వల్ల అలాగే మరికొందరిలో పక్షవాతం (స్ట్రోక్) కారణంగా రావచ్చు.ప్రస్తుతం ఫిట్స్ కోసం దాదాపు 15 రకాల మందులు అందుబాటులో ఉన్నాయి. డాక్టర్లు బాధితుల బరువు ఆధారంగా వీటి మోతాదును నిర్ణయిస్తారు. ఫిట్స్ మళ్లీ మాటిమాటికీ రాకుండా ఉండాలంటే పూర్తి కోర్సు వాడాల్సిందే.మరికొన్ని మార్గాలు ఫిట్స్ తగ్గించేందుకు కొన్ని మార్గాలూ అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో... శస్త్రచికిత్స ప్రక్రియ ద్వారా ఫిట్స్ ఆవిర్భావ కేంద్రాన్ని గుర్తించినట్లయితే... దాన్ని శస్త్రచికిత్స ద్వారా తొలగించుకుని, శాశ్వత పరిష్కారం పొందవచ్చు. ఇక డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ ప్రక్రియ మరొకటి. ఇక కొందరు చిన్నపిల్లలకు కొవ్వులు ఎక్కువగా ఉండే ఆహారం (కీటోజెనిక్ డైట్) ఇవ్వడం ద్వారా ఫిట్స్ను అదుపు చేయవచ్చ. మరికొందరిలో ‘వేగస్ నర్వ్’ అనే నరాన్ని స్టిమ్యులేట్ చేయడం ద్వారా కూడా ఫిట్స్ను అదుపుచేయవచ్చు.ఫిట్స్ వచ్చినప్పుడు... ఫిట్స్ వచ్చినవారికి తాళం చేతులు అందించడం, ఏదైనా లోహపు వస్తువును చేతిలో పెట్టడం చేస్తుంటారు. వాస్తవానికి ఇవేవీ చేయకూడదు. ఫిట్స్రాగానే ఆ వ్యక్తిని.. ∙సురక్షితమైన ప్రదేశంలో ఉంచాలి. ఎక్కువగా కదిలించకూడదు. ∙నోటిలోగాని చేతిలోగాని బలమైన లోహపు వస్తువులను ఉంచకూడదు. ∙ఒక పక్కకు ఒరిగి ఉండేలా పడుకోబెట్టాలి. ∙కాళ్లూ, చేతులు కొట్టుకుంటుంటే దాన్ని ఆపడానికి ప్రయత్నించకూడదు. సాధారణంగా ఫిట్స్ వచ్చినప్పుడు ఐదు నిమిషాల్లో అతడు తనంతట తానే మామూలు స్థితికి వస్తాడు. ఒకవేళ అలా జరగకపోయినా లేదా మళ్లీ వెంటనే ఫిట్స్ రావడం ప్రారంభమైనా వీలైనంత త్వరగా అతడిని ఆసుపత్రికి తరలించాలి.చదవండి: అవాంఛిత రోమాలకు పరిష్కారంచివరగా... ఎపిలెప్సీ అనేది ఉన్నతికి ఏమాత్రం ప్రతిబంధకం కాదు.మహిళల్లో ఎపిలెప్సీ వచ్చినా అది సాధారణ జీవితానికి ఏమాత్రం అడ్డంకి కాదు. అందరిలానే వీళ్లూ పెళ్లిళ్లు చేసుకుని, పిల్లలను కనవచ్చు. -
సాంప్రదాయ తమిళ ఆహారం తింటూనే..22 కిలోలు ..!
వెయిట్లాస్ కోసం ఎన్నో రకాల డైట్లు ఫాలో అవుతుంటాం. కానీ కొందరు సంప్రదాయ ఆహారాన్ని తింటూనే స్లిమ్గా మారతారు. అలాంటి కోవకు చెందిన వాడే ఈ ఫిట్నెస్కోచ్ కాగివన్ ప్రభాహరణ్. అమ్మలాంటి సాంప్రదాయ వంట తింటూనే బరువు తగ్గొచ్చని అంటున్నారు. తాను ఒకప్పుడు అధిక బరువుతో బానలాంటి పొట్టతో ఉండేవాడినని..కానీ ఇప్పుడు సిక్స్ప్యాక్ శరీరంతో స్మార్ట్గా మారానని చెప్పుకొచ్చాడు. అయితే రైస్కి దూరంగా ఉండలేదని..సంప్రదాయ వంటను ఆస్వాదిస్తూనే వెయిట్లాస్ అయ్యినట్లు తెలిపాడు. అందుకోసం డైట్ ఎలా ఫాలో అవ్వాలో కూడా ఇన్స్టాగ్రామ్ వేదికగా వివరించాడు.తమిళులు చాలామంది సిక్స్ ప్యాక్ కోసం డైట్ వేరుగా ఉంటుందని భావిస్తారు. కానీ తాను తమిళ వారసత్వంలో పాతుకుపోయిన పప్పు వంటి వంటకాలను తింటూనే బరువు తగ్గానని అంటున్నాడు. వాటిని తీసుకుంటూనే సిక్స్ ప్యాక్ సాధించానని చెబుతున్నాడు. అమ్మలాంటి సంప్రదాయ వంటకాన్ని, రుచిని వదులుకుని వెయిట్లాస్ అవ్వాల్సిన పనిలేదని, కేవలం స్మార్ట్గా తింటే చాలట. వాస్తవానికి తమిళ భోజనాలలో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయని, ప్రోటీన్ చాలా తక్కువగా ఉంటుందని చెబుతున్నాడు. అందువల్ల అధిక కేలరీలు తీసుకోకుండానే శక్తిని ఇచ్చే వాటిని తీసుకునేవాడినని వీడియోలో తెలిపాడు. ఆ మూడు తప్పనిసరి..సంతృప్తికరమైన భోజనం ఆస్వాదిస్తూనే బరువు తగ్గేందుకు ఈ మూడు మార్పులు చాలా హెల్ప్ అయ్యాయని చెబుతున్నాడు. మొదటి ప్లేట్లో అన్నాన్ని తక్కువ పరిమాణంలో పెట్టుకోవడం. ఎందుకంటే కొలస్ట్రాల్ కరిగేలా..కండరాలను నిర్మించడానికి కార్మోహైడ్రేట్లు అవసరం అందువల్ల ఇలా తీసుకున్నట్లు తెలిపారు. రెండోది సాంప్రదాయ తమిళ ఆహారంలో ప్రోటీన్లు చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి ప్రోటీన్ల నిమిత్తం..చికెన్, చేపలు, గ్రీకు పెరుగు వంటి వాటికి ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలిపారు. ఇక మూడోది..వీటితోపాటు ఫైబర్ కోసం ఆకుకూరలను కూడా చేర్చుకున్నట్లు తెలిపారు. అలాగే ఫిట్నెస్ ప్రపంచంలో తెల్లబియ్యాన్ని దగ్గరకు రానీయరు, కానీ ఇది వెయిట్లాస్కి అడ్డంకి కాదని అన్నారు. ముఖ్యంగా వర్కౌట్ల సమయంలో కండరాలకు ఇంధనంలా ఉపయోగపడుతుందని చెబుతున్నారు. ఇక్కడ ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవడం వల్ల బియ్యం తక్కువగా ఉన్నా..కడుపు నిండిన అనుభూతి మిస్ చేసుకోవాల్సిన పని ఉండదని చెబుతున్నారు. ఎప్పుడైనా నచ్చిన ఆహారం ఆస్వాదిస్తూనే..తెలివిగా కేలరీలు తక్కువగా ఉండేలా చూసుకుంటే వెయిట్లాస్ అవుతామని చెబుతున్నాడు కాగివన్ View this post on Instagram A post shared by Kagivan Prabaharan | Tamil Transformation Coach (@kagsfit) (చదవండి: శ్రుతిమించిన పాజిటివిటీ వద్దు..!) -
ఎంత తక్కువ మోతాదైనా.. ఆ ముప్పు తప్పదు
ఆల్కహాల్ ఎంత తక్కువ మోతాదులో తీసుకున్నప్పటికీ...దాంతో ముప్పు తప్పదంటూ ఇటీవలి తాజా అధ్యయనాలు తెలుపుతున్నాయి. చాలా కొద్దిమోతాదులో ఆల్కహాల్ తీసుకున్నప్పటికీ నోటిలోని చర్మపు పొరల్లో (బక్కల్ మ్యూకోజల్) కేన్సర్ వచ్చేందుకు అవకాశాలు చాలా బలంగా ఉంటాయని ఇటీవలి పరిశోధనల తాలూకు ఫలితాలను ‘బీఎమ్జే గ్లోబల్ హెల్త్’ జర్నల్ ప్రచురించింది. ఆ జర్నల్లో ప్రచురితమైన వివరాల ప్రకారం రోజూ కేవలం తొమ్మిది గ్రాముల ఆల్కహాల్ తీసుకున్నా నోటి క్యాన్సర్ వచ్చే ముప్పు 50 శాతం పెరుగుతుందనీ, అయితే దీనికి తోడు పొగాకు నలమడం కూడా తోడైతే ఆ ముప్పు 62 శాతానికి చేరుకుంటుందని ఆ అధ్యయన వివరాలు తెలుపుతున్నాయి.అందరూ 25 నుంచి 45 ఏళ్ల మధ్యవారే...ఈ నోటి క్యాన్సర్లే వరకే తీసుకుంటే మన దేశంలో ప్రతి ఏడాదీ 1,43,759 కొత్త కేసులు నమోదువుతున్నాయి. అంతేకాదు... ప్రతి ఏడాది ఈ క్యాన్సర్లతో 80,000 మంది మృత్యువాత పడుతున్నారని తేలింది. ఈ క్యాన్సర్ బాధితులందరిలోనూ 45 శాతం మంది 25 నుంచి 45 ఏళ్ల మధ్యవారే ఉంటున్నారని తెలిసింది.ఇక విదేశీమద్యం నాణ్యమైనదనీ, అది తాగేవారిలో ఈ ముప్పు తక్కువని అనుకో డానికి వీల్లేదు. ఇంటర్నేషనల్ బ్రాండ్స్ తాగేవారికి దాదాపు 72 శాతం ముప్పు ఉంటే... అదే దేశీ మద్యం తాగేవారిలో క్యాన్సర్ ముప్పు 82 శాతానికి పెరుగుతుంది.(చదవండి: రూ.20 లంచం కేసులో 30 ఏళ్లు జైలు శిక్ష..! చివరికి..) -
వర్క్-లైఫ్ బ్యాలెన్స్: సాధ్యమేనా? లేక అపోహనా?
"ఆఫీసులో ఉన్నప్పుడు ఇంటి పనులు గుర్తుకొస్తాయి.. ఇంట్లో ఉన్నప్పుడు ఆఫీసు ఫైళ్లు కళ్లముందు కదులుతాయి." ఇదీ ఈ తరం ఉద్యోగి ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాలు. చాలామందికి 'వర్క్-లైఫ్ బ్యాలెన్స్' అనేది కేవలం పుస్తకాల్లో కనిపించే పదంలా, లేదా కార్పొరేట్ కంపెనీలు గోడల మీద తగిలించే పోస్టర్లా మాత్రమే మిగిలిపోయింది. అసలు ఈ బ్యాలెన్స్ సాధ్యమేనా? లేక అదో అందని ద్రాక్షా?బ్యాలెన్స్ అంటే 50-50 కాదు!చాలామంది 'బ్యాలెన్స్' అంటే 24 గంటలను సమానంగా ఆఫీసుకి, ఇంటికి పంచడం అనుకుంటారు. కానీ సైకాలజీ ప్రకారం, వర్క్-లైఫ్ బ్యాలెన్స్ అంటే సమయాన్ని పంచడం కాదు..'ప్రెజెన్స్' (ఉనికిని)పంచడం. అంటే ఆఫీసులో ఉన్నప్పుడు 100శాతంఅక్కడే ఉండటం, ఇంటికి వచ్చాక ఆఫీసు ఆలోచనల నుంచి 100శాతంబయటపడటం. అది లేనప్పుడే అసలైన ఒత్తిడి మొదలవుతుంది.నా దగ్గరికి వచ్చిన ఒక సాఫ్ట్వేర్ మేనేజర్ కిరణ్ (పేరు మార్చాను) అనుభవమే దీనికి నిదర్శనం. కిరణ్రోజూ 12 గంటలు పని చేస్తాడు. "నా భార్యాపిల్లల కోసమే కదా ఇంత కష్టపడుతున్నాను" అంటాడు. కానీ, ఇంట్లో ఉన్నప్పుడు కూడా అతని చేతిలో ఫోన్, మెదడులో ప్రాజెక్ట్ డెడ్ లైన్లు ఉంటాయి. పిల్లలు ఏదైనా అడిగితే చిరాకు పడతాడు. ఫలితంగా, అతను భౌతికంగా ఇంట్లోనే ఉన్నా, మానసికంగా ఎప్పుడో ఆఫీసుకి వెళ్ళిపోయాడు. ఇక్కడ సమస్య 'సమయం' కాదు.. 'మెంటల్ స్విచ్ ఆఫ్' చేయలేకపోవడం.బ్యాలెన్స్ ఎందుకు దెబ్బతింటోంది?• డిజిటల్ కనెక్షన్:వాట్సాప్ గ్రూపులు, ఈమెయిల్ నోటిఫికేషన్లు ఆఫీసుని మన బెడ్రూమ్ దాకా తీసుకొచ్చాయి.• గిల్ట్ (అపరాధ భావం): "నేను ఆన్ లైన్ లో లేకపోతే పని ఆగిపోతుందేమో" లేదా "నా బాస్ ఏమనుకుంటారో" అన్న భయం.• ‘నో’చెప్పలేకపోవడం:మన శక్తికి మించిన బాధ్యతలను మొహమాటానికి ఒప్పుకోవడం.'బ్యాలెన్స్' సాధించడానికి 5 ప్రాక్టికల్ టిప్స్1. Mental Gateway:ఆఫీసు నుంచి ఇంటికి వచ్చే దారిని ఒక వంతెనలా వాడుకోండి. ఆ ప్రయాణంలో సంగీతం వినడమో, లేదా ఆ రోజు జరిగిన పనుల గురించి ఆలోచనలను అక్కడే క్లోజ్ చేయడమో చేయండి. ఇంటి తలుపు తీసే ముందే ఆఫీసు టెన్షన్లను బయటే వదిలేయండి.2. Tech-Free Zone:రాత్రి భోజనం చేసేటప్పుడు లేదా పిల్లలతో ఆడుకునేటప్పుడు ఫోన్ ని పక్క గదిలో ఉంచండి. నోటిఫికేషన్ల శబ్దం మీ ప్రశాంతతను దోచుకోకుండా చూసుకోండి.3. Quality Vs Quantity:మీరు కుటుంబంతో ఎన్ని గంటలు ఉన్నారన్నది కాదు.. ఉన్న ఆ కాసేపు ఎంత quality time గడిపారన్నదే ముఖ్యం. రెండు గంటలు ఫోన్ పక్కన పెట్టుకుని కూర్చోవడం కంటే, ఫోన్ చూడకుండా 20 నిమిషాలు మీ భాగస్వామితో, పిల్లలతో మాట్లాడటం ఎంతో మేలు.4. Boundaries:పని వేళలు ముగిశాక, అత్యవసరమైతే తప్ప కాల్స్/మెయిల్స్ కి అటెండ్ అవ్వకూడదనే నియమాన్ని మీ బాస్ కి, కొలీగ్స్ కి సున్నితంగా చెప్పండి. మీ ప్రైవేట్ టైమ్ ని మీరు గౌరవిస్తేనే, ఇతరులు గౌరవిస్తారు.5. Self-Care:ఖాళీ గ్లాసుతో ఇతరుల దాహం తీర్చలేం. మీకు ఇష్టమైన హాబీని పాటించడం లేదా వ్యాయామం చేయడం వల్ల మీ 'ఎనర్జీ లెవల్స్' పెరుగుతాయి. అప్పుడు మీరు ఆఫీసులోనూ, ఇంట్లోనూ యాక్టివ్ గా ఉండగలరు.మీ కోసం ఒక సెల్ఫ్-చెక్గత వారం రోజుల్లో, మీరు ఏకాగ్రతతో మీ కుటుంబ సభ్యుల కళ్లలోకి చూస్తూ కనీసం 10 నిమిషాలు మాట్లాడారా? లేకపోతే, మీరు బ్యాలెన్స్ తప్పుతున్నారని అర్థం.గుర్తుంచుకోండి.. మీరు ఉద్యోగం మానేస్తే మీ సీటును భర్తీ చేయడానికి కంపెనీకి వారం రోజులు పట్టదు. కానీ మీ కుటుంబంలో మీ స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు. కెరీర్ లో ఎదగండి.. కానీ ఆ క్రమంలో మీ జీవితాన్ని కోల్పోకండి. అవసరమనిపిస్తే సైకాలజిస్ట్ లేదా కెరీర్ కోచ్ సహాయం తీసుకోండి.సైకాలజిస్ట్ విశేష్కెరీర్&మైండ్సెట్ కోచ్8019 000067www.psyvisesh.com -
50 తర్వాత ఇంట్లోనే చేసే వెయిట్లాస్ వ్యాయామాలు..!
50 ఏళ్లు దాటాక ఇదివరకటిలా అధిక ప్రభావ వ్యాయామాలు చేయడం కష్టం. మోకాలి నొప్పి, గాయం వంటి సమస్యలు ఎదురుకావొచ్చు. పైగా ఒంట్లో మునుపటి ఎనర్జీ ఉండదు. అందువల్ల ప్రజలు సులభమైన తక్కువ ప్రభావ వ్యాయామాలు ఎంచుకుంటే మంచిది. అలాగే ఓ వయసు వచ్చాక బరువు తగ్గించే వ్యాయామాలకు శరీరం కూడా సహకరించదు. అలాంటప్పుడు ఇంట్లో సులభంగా చేసే ఈ కొద్దిపాటి వ్యాయామాలు చేస్తే మంచిదని చెబుతున్నారు ఫిట్నెస్ నిపుణులు. అవేంటో చూద్దామా..!.మోకాళ్లపై ఒత్తిడి పడకుండా ఉపయోగకరంగా ఉండే ఈ వ్యాయామాలు 80,90 లేదా వంద కిలోలు బరువుతో ఉండే వాళ్లకు అత్యంత ఉపయుక్తమైనవి. చాలా తేలిగ్గా చేసుకునేవి.మడమ నుంచి తుంటి వరకు నిలబడటం..ఒక కాలు వంచి తుంటికి తాకే ప్రయత్నం చేయాలి. అలాగే చేతులు నిటారుగా ఉంచాలి. ఈ వ్యాయామం మోకాళ్లను సురక్షితంగా ఉంచుతూ తొడలు, పిరుదులను సక్రియం చేయడానికి హెల్ప్ అవుతుంది.తక్కువ-ప్రభావ జంపింగ్ జాక్ఇది మోకాలికి అనుకూలమైన వెర్షన్. పక్కపక్కలకు కాళ్లను కదుపుతూ చాలా తక్కువ మోతాదులో జంప్ చేయడం. ఇది హృదయ స్పందన రేటుని సున్నితంగా పెంచుతుంది. కేలరీలను బర్న్ చేస్తుంది. కీళ్లపై ఒత్తిడి పడకుండా సమన్వయాన్ని మెరుగుపరుస్తుంది.ఒక వైపు నుంచి ఒక వైపుకి..నియంత్రిత పద్ధతిలో ఒక వైపు నుంచి ఒక వైపు నడక. చాలా ఈజీగా చేసే వ్యాయామం. ఇది తుంటి కండరాలను బలోపేతం చేయడానికి, స్థిరత్వాన్నిఇ మెరుగుపరచడానికి సహాయపడుతుంది. ఈ మూడింటిని 20 సార్లు చేసి, ఐదు సెట్లు పునరావృతం చేస్తే చాలని అంటున్నారు ఫిట్నెస్ నిపుణులు. స్థిరత్వంపై దృష్టి పెడుతూ..తేలికైన ఈ కదలికలు బాడీని ఫిట్గా ఉంచడంలో చాలా హెల్ప్ అవుతాయి. ఇలా ప్రతీరోజు చేయడం వల్ల బరువు తగ్గడమే గాక, మోకాళ్ల గాయాలు గానీ, సమస్యలు ఎదురవ్వవని అంటున్నారు. View this post on Instagram A post shared by Nehafun&fitness🤸♂️🧘♀️ (@nehafunandfitness) (చదవండి: తస్మాత్ జాగ్రత్త..! ఎల్లప్పుడూ.."మంచి" ఆరోగ్యానికి ముప్పు..!) -
తస్మాత్ జాగ్రత్త..! అన్నివేళలా "మంచి" ఆరోగ్యానికి చేటు..!
కొందరు అమ్మాయిలు ఎవర్ని నొప్పించకుండా అందరి దృష్టిలో మంచి అనిపించుకునేలా ఉండేందుకు ఇష్టపడతారు. అందుకోసం తమను తాము మార్చుకోవడం, సర్దుబాటు చేసుకోవడం చేస్తుంటారు. అది ఓ మోస్తారు స్థాయిలో ఉంటే పర్లదు. తనను పూర్తిగా ఇబ్బందుల్లోకి నెట్టేలా పరిస్థితులు ఉన్నప్పుడూ కూడా..మంచి వ్యక్తిలా నూటికి నూరు మార్కులు తెచ్చుకోవాలనే ధోరణిలో ఉంటే మాత్రం అంతరంగికి ప్రశాంతత కనుమరుగవ్వుతుంది. అదికాస్త శారీరక, మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపి భారీ మూల్యం చెల్లించేలా చేస్తుందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. అందుకే సాధ్యమైనంత వరకు అన్నివేళలా మంచి అమ్మాయిలా ఉండటం సురక్షితం కాదని నొక్కి చెబుతున్నారు. ఎప్పుడు మంచిగా ఉండటం కోపానికి మించి ఆరోగ్యానికి హానికరమని అంటున్నారు సెలబ్రిటీ హార్మోన్ కోచ్ పూర్ణిమ. అంతేగాదు ఆమె దీన్ని "గుడ్ గర్ల్ సిండ్రోమ్"గా పిలిచారు. మంచి అమ్మాయిగా ఉండండి కానీ..మిమ్మల్ని ఇబ్బందుల్లోకి నెట్టేంతగా మాత్రం కాదు. లేదంటే అది ఒక విధమైన ఒత్తిడికి గురిచేసి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. అదెలాగంటే..దీర్ఘకాలిక ఒత్తిడి, అధిక కార్టిసాల్ఎప్పటికీ ఇతరులను సంతోషపెట్టాలని అనుకుంటే..సదా నాడీ వ్యవస్థ అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది. అది ఒక అలవాటులా మారి నో చెప్పడం, హద్దులు నిర్ణయించడం అసురక్షితంగా మారి..అభద్రతాభావంలోకి నెట్టేస్తుంది. దాంతో ఒత్తిడి బారినపడి శరీరంలో కార్టిసాల్ స్టాయిలను పెంచేస్తుంది. ఫలితంగా నిద్ర లేమి, అధిక బరువు వంటి సమస్యలను ఎదుర్కొంటారు.థైరాయిడ్ అసమతుల్యతఇలా మంచి అనిపించుకునే ధోరణి భావోద్వేగాలను అణిచేస్తుంది. అంటే కోపాన్ని అణిచేసి, గొతు పెగలనీయకుండా చేస్తుంది. దాంతో థైరాయిడ్ బారిన పడతామని అంటున్నారు.జీర్ణ సమస్యలుమన భావాలు ఎప్పుడైతే వ్యక్తీకరించలేకపోతే..జీర్ణక్రియపై ప్రభావం చూపి.. ఉబ్బరం, ఆమ్లత్వం IBS లాంటి లక్షణాలు సాధారణం. భావోద్వేగాలు ప్రాసెస్ చేయబడనప్పుడు శరీరం ప్రతిస్పందిస్తుందట. అదీగాక అధ్యయనం ప్రకారం, ఒత్తిడి శరీరం జీర్ణక్రియను నెమ్మదిస్తుంది లేదా పాజ్ చేయమని సూచిస్తుంది. ఫలితంగా జీర్ణక్రియ దెబ్బతిని..తిన్నది ఒంటబట్టలేని సమస్యను ఎదుర్కొంటారట.హార్మోన్ల అసమతుల్యత, అలసటఇక్కడ "మంచిగా" ఉండటం చాలా శక్తిని ఖర్చు చేస్తుంది. అంటే ఇక్కడ శరీరం ప్రతిసారి మనుగడ అనే మోడ్లోనే ఉండాలి. దాంతో హార్మోన్ల అసమతుల్యతకు దారితీసి..వ్యాధినిరోధక శక్తి సన్నగిల్లుతుంది. నిరంతరం అలసటకు గురవ్వుతారట.ఆందోళన, భావోద్వేగ అలసటఎల్లప్పుడూ మంచిగా ఉండటం వల్ల విశ్రాంతి లేదా ప్రామాణికతకు చోటు ఉండదు. ఆందోళన పెరుగుతుంది. భావోద్వేగ అలసట ఒక వ్యసనంగా మారుతుంది. నిజానికి బయటకు ప్రశాంతంగా కనిపించిన..లోలోపల కుంగిపోయి అలసిపోతారట.దీనికి వైద్యం మిమ్మల్ని మార్చుకోవాలనే సంకల్పానికి పునాది వేయడమే అని అంటున్నారు సెలబ్రిటీ హార్మోన్ కోచ్. ఇది నిజాయితీగా వ్యవహరించటంతో మొదలైన "మంచి" మిమిల్ని అన్నిరకాలుగా ముంచేయడం ప్రారంభిస్తుందన్నది గ్రహించాలి. అసురక్షితమైన స్థితికి తీసుకువచ్చే మంచిని వదులుకోవడమే అన్ని వేళల మంచిదని అంటోందామె. దాంతోపాటు శరీరం మాట వినాలి. మనకు అనుకూలంగా సాధ్యమైనదే అయితే.. దానికే సుముఖత వ్యక్తం చేయాలి. సాధ్యమైనంత వరకు కొన్నింటికి "నో" అని ఎంత మేర చెప్పగలుగుతామో అప్పుడు మనం మానసికంగా, శారీరకంగా సురక్షితంగా, స్ట్రాంగ్గా ఉండగలుగుతారని అన్నారు. అతి సర్వత్ర వజ్రయేత్ అనిపెద్దలు చెప్పిన నానుడిలా అతి మంచి పనికిరాదని గుర్తెరగండి అని సూచిస్తున్నారు నిపుణులు. గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత నిపుణులు లేదా వైద్యులను సంప్రదించడం ఉత్తమం. View this post on Instagram A post shared by Poornima Peri (@poorniimahormonecoach) (చదవండి: మెట్లపై నడుస్తూ ఫోన్ మాట్లాడుతున్నారా..? కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్..) -
మెట్లపై నడుస్తూ ఫోన్ మాట్లాడుతున్నారా..? కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్..
కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ శశి థరూర్ పార్లమెంట్ వెలుపల మెట్లపై పోన్లో మాట్లాడుతూ పడిపోయిన వీడియో నెట్టింట తెగ వైరల్ అయ్యింది. ఆ ఘటనలో శశి ధరూర్కి మడమ ఫ్యాక్చర్ అయ్యిందని ఆయనే స్వయంగా సోషల్ మీడియా పోస్ట్లో పేర్కొన్నారు కూడా. అలాగే ఆయన కోలుకున్నాని, ప్రస్తుతం బాగానే ఉన్నట్లు కూడా తెలిపారు. ఇలా మెట్లపై నడుస్తూ..ఫోన్ మాట్లాడటం మంచిది కాదని నూర్యాలజీ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒకేసారి మల్టీటాస్కింగ్ని బ్రెయిన్ నిర్వహించలేదని హితవు చెప్పారు. ముఖ్యంగా మెట్లపై ఫోన్ స్క్రోల్ చేస్తూ లేదా మాట్లాడుతూ నడవడం అత్యంత డేంజర్ అని హెచ్చరిస్తున్నారు నిపుణులు. ఇది అజాగ్రత్తగా వ్యవహరించడం గురించి కాదని, బ్రెయిన్ వర్కింగ్పై అవగాహన ఉండటం.. అత్యంత ముఖ్యమని అంటున్నారు న్యూరాలజిస్ట్లు. మానవ బ్రెయిన్ బహుళ పనులు చేయగలదు. కానీ ఒకేసారి అన్ని పనులు చేస్తున్నప్పుడు.. విభజింపబడతాయి. దాంతో మొదటి దానికి ప్రాముఖ్యత ఇచ్చి మరోకటిపై అటెన్షన్ పెట్టడంలో విఫలమవుతుంది ఫలితంగా ఆ ప్రభావం మనపై పడుతుందన్నారు. ఇక్కడ మెట్లపై నడుస్తూ ఫోన్ చూసినప్పడూ..చూడటంపైనే అంటే కళ్లమీద బ్రెయిన్ ఫోకస్ ఉండి..నడకపై అటెన్షన్ తప్పుతుంది. అందులోనూ నేలలా చదునుగా ఉండకుండా స్టెప్స్లా ఉంటుంది కాబట్టి పాదం సవ్యంగా పడాలి లేదంటే బ్యాలెన్స్ అవ్వలేం. దాంతో ఎప్పుడైత్ ఫోన్ మాట్లాడుతూ మెట్లు ఎక్కుతామో పడిపోవడం లేదా జారిపడటం జరుగుతంది. దాంతో మెదడు, లేదా శరీరానికి గాయాలయ్యే ప్రమాదం ఉంటుంది. ఒక్కోసారి ప్రాణాంతకంగా కూడా మారే అవకాశం ఉంటుందంటున్నారు నిపుణులు. అంతేగాదు నిపుణులు ఇలా ఎన్నో సార్లు చేశాను అని తేలిగ్గా కొట్టిపారేయొద్దని హెచ్చరిస్తున్నారు కూడా. సాధ్యమైనంత వరకు ఫోన్ మాట్లాడుతూ స్టెప్స్పై నడవాలనుకుంటే రైలింగ్ని పట్టుకోండి నడకపై దృష్టిపెట్టండని అంటున్నారు. సాధ్యమైనంత వరకు వచ్చిన కాల్ పాజ్లో పెట్టి..మెట్లపై నుంచి చదునైన నేలపైకి వచ్చేశాక ఫోన్ కాల్ మాట్లాడితే మంచిదని సూచిస్తున్నారు నిపుణులు.One phone call. One staircase. One misstep.This video of Mr. Shashi Tharoor tripping while talking on the phone and walking downstairs is not about clumsiness. It’s about the brain.(Glad to note that Mr Tharoor is doing well🙏)Your brain is terrible at “walking + phone”… pic.twitter.com/KgNE7XxOYU— Dr Sudhir Kumar MD DM (@hyderabaddoctor) February 5, 2026(చదవండి: బరువు తగ్గించే జైలు'..! ఏకంగా మిలటరీ రేంజ్ శిక్షణ..12 గంటల వ్యాయామాలు..) -
'కొలీగ్పై ఫీలింగ్స్ వస్తున్నాయి.. మా ఆయనకు చెబితే..'
డాక్టర్గారూ నాదొక చిత్రమైన సమస్య. అసలు ఇది సమస్య అవునో కాదో కూడా తెలియడం లేదు. మీరే దీనికి పరిష్కారం చెప్పాలి. నేను ఒక బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్గా పని చేస్తున్నాను. నాది చాలా కలివిడి స్వభావం. అందరితో స్నేహంగా ఉంటాను. ఎవరినీ నొప్పించను. నా మూలాన ఎవరూ బాధపడకూడదనుకునే స్వభావం వల్ల చాలాసార్లు నేను పరిస్థితులతో రాజీపడుతూ వచ్చాను. ఈ లక్షణాన్ని ఆసరాగా తీసుకుని చాలామంది నన్ను మోసం చేసిన సందర్భాలు ఉన్నాయి.కొన్ని సంవత్సరాలుగా నేను ఒకతన్ని ప్రేమిస్తున్నాను. మా మధ్య కూడా చిన్న చిన్న సమస్యలు వచ్చి బ్రేకప్ అవుతూ మళ్లీ కలిసిపోతూ ఉండటం కామన్. మేం ఒకరినొకరు ఇష్టపడి పెళ్లి కూడా చేసుకున్నాం. అతను కూడా బ్యాంక్ ఉద్యోగే. ప్రస్తుతం అతనికి వేరే రాష్ట్రంలో పోస్టింగ్ రావడం వల్ల నెలకు ఒకసారి మాత్రమే కలుసుకుంటున్నాం. ఆరునెలల క్రితం ఒకబ్బాయి నేను పని చేసే బ్యాంకులో ప్రొబేషన్ కోసం జాయిన్ అయ్యాడు. అనుకోకుండా అతనికీ నాకూ మధ్య మంచి స్నేహం ఏర్పడింది. కలిసి సినిమాలకు వెళ్లినా మేమెప్పుడూ హద్దులు దాటలేదు. అయితే నాకు ఇటీవల కొంతకాలంగా అతనిపై ఫీలింగ్స్ వస్తున్నాయి.ఈ విషయం గురించి నా భర్తకు చెబితే మేమిద్దరం దూరంగా ఉండటం వల్లే అలా వస్తూ ఉండి ఉండచ్చని, అందువల్ల నేను ఉద్యోగం మానేసి అతని దగ్గరకు వెళ్లడం గానీ లేదా తనే ఉద్యోగం మానేసి ఇక్కడకు వచ్చి వేరే ఏదైనా ఉద్యోగం చూసుకోవడం మంచిదనీ అన్నాడు. నాకు నా భర్తను వదిలేయాలన్న ఉద్దేశ్యం లేదు. అలాగని ఆ అబ్బాయి మీద ఫీలింగ్స్ను చంపుకోలేకపోతున్నాను. అతనికీ నేనంటే చాలా ఇష్టం. ఈ విషయం నా భర్తకు కూడా తెలిసింది. ఒకవేళ నాకు తనతో ఉండటం ఇష్టం లేకపోతే ఆ అబ్బాయితోనే ఉండమని కూడా అన్నాడు. దీంతో నేను చాలా గందరగోళంలో ఉన్నాను. దయచేసి నేను ఏం చేయాలో సలహా ఇవ్వగలరు. – ఓ సోదరి, విశాఖపట్నంమీ ఉత్తరం చదివాక నాకు అర్థం అయిందేమంటే మీరు చెడ్డవారు కానే కాదు, ఇతరుల కోసం మీ అవసరాలను కూడా వెనక్కినెట్టే మనిషని. ఇది చాలామంది మహిళల్లో కనిపించే గుడ్ గర్ల్ సిండ్రోమ్ (Good Girl Syndrome). చిన్న వయసులోనే ఎవరినీ బాధ పెట్టకూడదు, అందరినీ నచ్చాలి. మనవల్ల ఎవరికైనా కష్టం వస్తే అది మన తప్పే అనే భావనతో పెరిగారు. ఇలాంటివారు పెద్దయ్యాక కూడా ఇదే అలవాటును కొన సాగిస్తారు. అది రిలేషన్షిప్కు కూడా వర్తింపచేసుకోవడం వల్ల ఎప్పుడూ ఇతరుల కోసం అడ్జస్ట్ అవుతూ ఉండటంతోనే సరిపోతుంది. మీ గత రిలేషన్షిప్ అన్నింటిలోనూ ఒక ప్యాటర్న్ కనిపిస్తోంది. మీరు ఎదుటి వారికి నచ్చినట్టుగా ఉన్నంత కాలం మీ బంధం బాగుంటుంది. మీరు మీ అప్రాయం చెప్పినప్పుడో, మీరు అవసరాలు ఉన్నాయని గుర్తు చేసినప్పుడో ఆ బంధం కూలిపోతుంది. దీనివల్ల మీరు మరింత ఆత్మరక్షణ ధోరణిలో పడిపోయారు. నాలాగా నేను ఉంటే నన్ను వదిలేస్తారేమో... ఒంటరి అవుతాననే భయం మిమ్మల్ని పదే పదే కాంప్రమైజ్ అయ్యేలా నడిపించింది.ఇక మీ ప్రస్తుత సమస్య విషయానికొస్తే మీ ఎమోషనల్ సైకిల్ మీ వివాహ బంధంలో కూడా కొనసాగింది. అయితే మీ భర్త మెచ్యూరిటీ వల్ల మీ రిలేషన్షిప్లో ఒక స్థిరత్వం ఏర్పడింది. అదే సమయంలో తను మీకు దూరంగా ఉండటం మీలో ఒక శూన్యాన్ని తీసుకొచ్చింది. ఆ ఖాళీని పూడ్చుకోవడం కోసం మీకు ఆఫీసులో పరిచయం అయిన అబ్బాయికి దగ్గరయ్యారు. ఎప్పుడూ ఎవరో ఒకరిపై ఎమోషనల్గా ఆధారడపడటం అనే మీ గుణం వల్ల మీరు అతనికి ఆకర్షితులయ్యారు. కాని అది నిజమైన ప్రేమ (True Love) కాకపోవచ్చు. మీలో బార్డర్లైన్ పర్సనాలిటీ లక్షణాలు పుష్కలంగా కనపడుతున్నాయి. మీలో చిన్న వయసు నుంచి ఎప్పుడూ ఒక రకమైన ఎమోషనల్ ఎంప్టీనెస్ ఉంది. దీన్ని ఎవరోఒకరి తో భర్తీ చేస్తున్నారు. దీనికోసం ఎవరో ఒకర్ని ఎన్నుకుంటున్నారు. కానీ ఇప్పటివరకు ఎప్పుడైనా మిమ్మల్ని మీరు ఎన్నుకున్నారా అనేది ప్రశ్న! మీ మనసు ఇప్పుడు ఒక అల్లకల్లోలంగా ఉన్న సముద్రంలా ఉంది.చదవండి: నన్ను చూసి నా భార్య భయపడుతోంది.. ఇప్పుడేం చేయాలి?ఇలాంటి సమయంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నా, తర్వాత పశ్చాత్తాప పడాల్సి ఉంటుంది. సమస్య నుంచి బయటపడే మార్గం వెతకండి. వెంటనే ఒక మంచి సైకియాట్రిస్ట్ని, ఒక క్లినికల్ సైకాలజిస్టును కలిస్తే మీలోని ఇబ్బందుల్ని ఎలా అధిగమించాలో నేర్పిస్తారు. మీ జీవితం మీద ఒక స్పష్టత వచ్చేలా సహాయపడతారు. విష్ యు ఆల్ ది బెస్ట్!- డా. ఇండ్ల విశాల్ రెడ్డి, సీనియర్ సైకియాట్రిస్ట్, విజయవాడ. మీ సమస్యలు, సందేహాలు పంపవలసిన మెయిల్ ఐడీ: sakshifamily3@gmail.com -
పాలల్లో యూరియా.. ఐస్క్రీమ్లో డిటర్జెంట్!
ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నాయకుడు రాఘవ్ చద్దా రాజ్యసభలో ఆహారకల్తీపై ధ్వజమెత్తారు. భారతదేశంలో అతిపెద్ద అతిపెద్ద ఆరోగ్య సంక్షోభం: ఆహార కల్తీనే అంటూ మండిపడ్డారు. పాలు దగ్గర నుంచి సుగంధ ద్రవ్యాలు, వంట నూనెలు, ప్యాకేజ్డ్ ఆహారాలు, పానీయాల్లో హానికరమైన రసాయనాలు, అధిక స్థాయిలో సంతృప్త కొవ్వులు, చక్కెర లేదా ఉప్పు వంటివి ఉన్నాయని అన్నారు. అవి అనారోగ్య కారకాలని, పైగా ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయంటూ పెద్దఎత్తున విమర్శలు గుప్పించారు. పైగా దాన్ని స్వచ్ఛత ముసుగులో ఉన్న నకిలీగా అభివర్ణించారు. మార్కెట్లోకి విషాన్ని తీసుకొచ్చి అమ్ముతున్నారంటూ ఆందోళన వ్యక్తం చేశారు. అంతేగాదు సోషల్ మీడియా ఎక్స్ వేదికగా కల్తీకి సంబంధించిన వాటిని జాబితా చేశారు కూడా.పాలలో యూరియాకూరగాయలలో ఆక్సిటోసిన్పనీర్లో కాస్టిక్ సోడాసుగంధ ద్రవ్యాలలో ఇటుక పొడితేనెలో పసుపు రంగుపౌల్ట్రీలో స్టెరాయిడ్లుఐస్క్రీమ్లో డిటర్జెంట్పార్లమెంటులో పాలకల్తీ సమస్యను లేవనెత్తుతూ..చద్దా ఇలా అన్నారు. పరిశోధనల ప్రకారం పాల నమూనాలలో 71% యూరియా, 64 శాతం సోడియం బైకార్బోనేట్ వంటి న్యూట్రలైజర్లు ఉన్నాయి. ఈ దేశంలో అమ్ముడవుతున్నంత పరిమాణంలో పాలు ఉత్పత్తి కావడం లేదు.ఆక్సిటోసిన్ ఒక హానికరమైన రసాయనమని, ఇది తలతిరగడం, తలనొప్పి, గుండె వైఫల్యం, వంధ్యత్వం, క్యాన్సర్కు కారణమవుతుందని అన్నారు.పరీక్షించిన ప్రతి నాలుగు ఆహార నమూనాలలో ఒకటి కల్తీ అయినట్లు తేలింది2014-15 నుంచి 2026 వరకు, పరీక్షించిన అన్ని నమూనాల్లో 25 శాతం కల్తీ ఉన్నట్లు తేలిందని చెప్పారు . అంటే ప్రతి నాలుగు నమూనాలలో ఒకటి కల్తీకి గురవ్వుతుందని అర్థం. దీనివల్ల చాలా మంది అనారోగ్యానికి గురవ్వడమే కాదు ప్రాణాలు కూడా కోల్పోతున్నారంటూ ఆందోళన వ్యకం చేశారు చద్దా.అంతేగాదు చద్దా అంతర్జాతీయంగా నిషేధించిన భారతీయ ఆహార ఉత్పత్తుల గురించి ప్రస్తావిస్తూ.. ఈ దేశంలోని రెండు అతిపెద్ద గరం మసాలా కంపెనీలను అమెరికా, యూకే, యూరప్ అంతటా నిషేధించారు. ఎందుకంటే వాటిలో కేన్సర్కు కారణమయ్యే పురుగులమందులు ఉన్నాయి. కానీ అవే సుగంధ ద్రవ్యాలు భారతదేశంలో ఇప్పటికీ పెద్ద మొత్తంలో అమ్ముడవుతుండటం బాధకరం అని అన్నారు.రాఘవ్ చద్దా దిద్దుబాటు చర్యలను కూడా సూచించారుప్రభుత్వం తక్షణ చర్య తీసుకోవాలని కోరుతూ, ఆమ్ఆద్మీపార్టీ ఎంపీ ఈ చర్యలను సిఫార్సు చేశారు:1. మానవశక్తిని పెంచి..ప్రయోగశాల పరీక్షా సౌకర్యాలను అప్గ్రేడ్ చేయడం ద్వారా భారత ఆహార భద్రత, ప్రమాణాల అథారిటీ (FSSAI)ని బలోపేతం చేయడం.2. నేరస్థులను అరికట్టడానికి కఠినమైన జరిమానాలను ప్రవేశపెట్టడం.3. కల్తీ ఉత్పత్తుల పేర్లు, బహిరంగంగా వెల్లడించడం మార్కెట్ నుంచి తక్షణమే తొలగించేలా చర్చలు తీసుకోవడం వంటివి చేయాలి. Biggest Health Crisis in India 🚨FOOD ADULTERATION - खाने में मिलावट👉Urea in Milk👉Oxytocin in Vegetables👉Caustic Soda in Paneer👉Brick powder in Spices👉 Yellow dye in Honey 👉 Steroids in Poultry👉 Detergent in ice creamWe all are consuming slow poison!Raised… pic.twitter.com/LxWi1nIcP0— Raghav Chadha (@raghav_chadha) February 4, 2026 (చదవండి: 70 ఏళ్ల మహిళకు అంతుపట్టని సమస్య..! కంగుతిన్న వైద్యులు) -
70 ఏళ్ల మహిళకు అంతుపట్టని సమస్య..! కంగుతిన్న వైద్యులు
ఓ వృద్ధ మహిళ దీర్ఘకాలికంగా విపరీతమైన తలతిరగడం సమస్యతో బాధపడుతోంది. ఎన్నో ఆస్ప్రతులు, పలు స్కానింగ్ పరీక్షలు చేసినా..ఎందువల్ల ఈ సమస్య అనేది ఎవ్వరు చెప్పలేకపోయారు. వెద్యులకే అంతుపట్టని మిస్టరీ వైద్య సమస్యలా మారింది ఆమె బాధ. అయితే చివరికి న్యూరాలజిస్ట్లు ఎందువల్ల ఆమెకు ఈ సమస్య వచ్చిందో తెలిసి విస్తుపోయారు. పైగా ఆ వైద్యుడు ఈ ఘటన అందరికీ ఒక హెచ్చరిక అంటూ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. 70 ఏళ్ల మహిళకు విపరీతమైన తలతిరడం సమస్యతో బాధపడుతుంది. ఒంటిరిగా వెళ్లాలన్నా..కాసేపు నుంచొన్న పడిపోతానేమో అనే భయంతో విలవిలలాడింది. ఆ సమస్యతో తాళ్లలేక పలు ఆస్పత్రులు సందర్శించినా..ఎలాంటి సమస్యల లేదని తేల్చి చెప్పారు. ఎమ్మారై నుంచి ప్రతి స్కాన్లో రిపోర్టు నార్మల్గానే రావడంతో వైద్యలు సైతం ఇదొక అంతుపట్టని మిస్టరీ సమస్యగా పేర్కొన్నారు. బ్రెయిన్లో కణితి లేక స్ట్రోక్ వల్ల వస్తుందేమోనని బ్రెయిన్కి సంబంధించిన టెస్ట్లు చేసినా..ఫలితం శూన్యం. దాంతో చివరికి ఆమె న్యూరోలజిస్ట్ని సంప్రదించగా..ఆయన ఆమె సమస్యను క్షణ్ణంగా పరిశీలించారు. ఆయన ఆమె ఎదుర్కొంటుంది సాధారణ తలతిరుగుడు సమస్య కాదని గుర్తించారు. దాంతో ఆమెను లేచి నిలబడి ఉండమని చెప్పినప్పుడూ..కొంచెం సేపు నుంచోలేకపోవడం గమనించారు. ఆ తర్వాత ఆమె ఆహారపు అలవాట్లు గురించి విచారించగా..అసలు సమస్య ఎక్కడ ఉందో ఆయన గుర్తించి సవివరంగా చెప్పారు. పైగా ఇలాంటి సమస్యను చాలామది ఫేస్ చేస్తున్నారని. అయితే వాళ్లే తేలిగ్గా తీసుకోవడంతోనే వెలుగులోకి రాలేదన్నారు. ఎందువల్ల అంటే..ఆ మహిళ దీర్ఘకాలం పాటు పూర్తిగా శాకాహారం, పాల ఉత్పత్తులను నివారించడంతోనే పోషకాహారం లోపం ఏర్పడి.. నరాలు, కీళ్లపై ప్రభావం చూపిందన్నారు. ఆమె నుంచొన్నప్పుడు కాలి వేళ్ల స్పర్శను అనుభూతి పొందలేకపోయిందని చెప్పారు. కాలి చీలమండలం దాక ఎలాంటి సెన్సేషన్ లేకపోవడం గుర్తించారు వైద్యులు. నిలబడుతున్నప్పుడూ ఆ మహిళ బ్యాలెన్స్ చేసుకోలేనట్టుగా ఊగిపోవడం గమనించారు. అది సాధారణ తలతిరగడం సమస్య కిందకు రాదని అన్నారు న్యూరాలజిస్ట్ వైద్యులు. కఠిన శాకాహారిగా తక్కువ పాల ఉత్పత్తులు తీసుకోవడంతో వచ్చిన సమస్యగా వెల్లడించారు. అంతేగాదు దీన్ని బీ12 లోపంగా పేర్కొన్నారాయన. బీ12 లోపం అంటే..నరాలను రక్షించే మైలిన్ తొడుగును నిర్వహించడానికి బీ12 చాలా అవసరం. అది లేకపోతే మెదడుకి సంకేతాలు పంపే పెద్ద ఫైబర్ నరాలు పనిచేయడం మానేస్తాయి. సదరు మహిళకు శరీరంలో బీ12 స్థాయిలు 153 pg/mL ఉన్నాయి . అంటే సాధారణ మనిషికి ఉండాల్సిన దానికంటే అత్యంత తక్కువ. దాంతో వైద్యులు ఆమెకు కండరాల ద్వారా బీ12 ఇంజెక్షన్లు అందించినట్లు తెలిపారు. దాంతో ఆమెకు కొన్ని వారాల్లోనే నడక బ్యాలెన్స్ అయ్యిందని, అలాగే పడిపోతాననే భయం మాయమైందని చెప్పారు. ఆమెకు ఇదివరకటిలా గోడలను పట్టుకోవాల్సిన అవసరం లేకుండా పోయిందన్నారు. ఈ సమస్యను రోగ నిర్థారణ స్కాన్లతో గుర్తించలేమని చెప్పారు. అంతేగాదు పాల ఉత్పత్తులు, లేదా సప్లిమెంట్లు లేకుండా దీర్ఘకాలం పాటు శాకాహారం తీసుకుంటే బీ12 విటమిన్ లోపం వచ్చే ప్రమాదం గణనీయంగా ఎక్కువగా ఉంటుందని వెల్లడించారు. అలాగే ఇలాంటి సమస్యని(బీ12 లోపం) ముందుగా గుర్తిస్తేనే నయం చేయగలమని లేదంటే శాశ్వత వైకల్యాన్ని ఎదుర్కొనక తప్పదని అంటున్నారు న్యూరాలజిస్ట్లు.When the Brain Was Blamed; but the Nerves Told the TruthShe was 70, soft-spoken, and deeply worried.For six weeks, she had been feeling dizzy and unsteady, especially while walking. She described it as “the ground moving under my feet.” At times, she felt she might fall if… pic.twitter.com/do925kj2OZ— Dr Sudhir Kumar MD DM (@hyderabaddoctor) February 4, 2026 (చదవండి: 'బరువు తగ్గించే జైలు'..! ఏకంగా మిలటరీ రేంజ్ శిక్షణ..12 గంటల వ్యాయామాలు..) -
స్ట్రాబెర్రీలతో ఆరోగ్యం..అందం కూడా..
స్ట్రాబెర్రీలు ఈ సీజన్లో పుష్కలంగా లభిస్తాయి. ఇవి రుచిని మాత్రమే కాదు ఆరోగ్యం, అందాన్నివ్వడంలోనూ మేలు చేస్తాయి. వీటిల్లో పుష్కలంగా ఉండే విటమిన్ ఇ, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు ఇమ్యూనిటీని పెంచి, ఇన్ఫెక్షన్ల నుండి రక్షిస్తాయి. మెదడుకు రక్తప్రసరణను మెరుగుపరిచి మెదడు చురుగ్గా పనిచేసేలా చేస్తాయి.స్ట్రాబెర్రీలు రక్తపోటును నియంత్రించడంలో, కొలెస్ట్రాల్ను తగ్గించడంలో సహాయపడతాయి.వీటిలో క్యాలరీలు తక్కువగా, ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల బరువు తగ్గాలనుకునే వారికి ఇవి మంచి ఎంపిక.వయస్సు తోపాటు వచ్చే కంటి సమస్యలను నివారించడంలో స్ట్రాబెర్రీలు సహాయపడుతాయి.అనేక సౌందర్య సాధనాల్లో ఉపయోగించే స్ట్రాబెర్రీ గుజ్జును ముఖానికి ప్యాక్లా వేసుకోవడం వల్ల చర్మం కాంతివంతంగా మారుతుంది. ఇందులోని ఎల్లాజిక్ యాసిడ్ చర్మం ముడతలు పడకుండా కాపాడుతుందిస్ట్రాబెర్రీలలో ఉండే మాలిక్ యాసిడ్ దంతాలపై ఉండే పసుపు రంగు మరకలను తొలగించి, దంతాలను తెల్లగా మార్చడంలో సహాయపడుతుంది.స్ట్రాబెర్రీలలో ఉండే విటమిన్ సి శరీరంలో ఒత్తిడికి కారణమయ్యే కార్టిసాల్ అనే హార్మోన్ స్థాయిని తగ్గించడంలో సహాయపడుతుంది. (చదవండి: ప్లీజ్ కూల్డ్రింక్స్కి దూరంగా ఉండండి..!) -
ప్లీజ్ కూల్డ్రింక్స్కి దూరంగా ఉండండి..!
శీతల పానీయాలు తాగొద్దని వైద్యులు పదేపదే సూచిస్తుంటారు. ఈ కార్బోనేటెడ్ డ్రింక్స్ ఫ్యాటీ లివర్, కిడ్నీ సంబంధిత అనారోగాల బారిన పడేలా చేస్తుందని ఆరోగ్య నిపుణుల సదా హెచ్చరిస్తుంటారు. అయినాసరే ఏం కాదులే అంటూ తేలిగ్గా కొట్టిపారేస్తూ..తాగేస్తుంటారు చాలామంది. అయితే అది ఎలా ఆరోగ్యాన్ని సమస్యల కోరల్లో చిక్కుకునేలా చేస్తోంది అస్సలు గ్రహించం అంటూ ఇక్కడొక వ్యక్తి కన్నీరుమున్నీరు విలపిస్తున్న కథ వింటే కచ్చితంగా విస్తుపోతారు. అంతేగాదు ఈ కూల్డ్రింక్స్ తాగాలా వద్దా అనే సందేహం కచ్చితంగా ఎదురవ్వుతుంది. ఎందుకంటే..నెట్టింట వైరల్ అవ్వుతున్న ఓ వీడియో అందర్నీ ఆలోచింపచేశాలా ఆకర్షిస్తోంది. ఆ వీడియోలో ఓ వ్యక్తి శీతల పానీయాలు తాగడం మానేయండి అంటూ వేడుకుంటున్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది. తన తముమ్మడు అలాంటి పానీయాలు తాగే ఆరోగ్యం పాడుచేసుకున్నాడంటూ భావోద్వేగం మాట్లాడటం చూడొచ్చు. అతడి ఆరోగ్యం దారుణంగా పాడైందని, ఊపిరితిత్తులు పూర్తిగా దెబ్బతిన్నాయని తెలిపాడు. దాంతో తన కుటుంబం తీవ్ర ఇబ్బందులో పడిందని పేర్కొన్నాడు. తన తమ్ముడిలా ఎవ్వరూ ఆరోగ్యం పాడుచేసుకోకండి అని కోరడం వీడియోలో స్పష్టంగా కనిపించింది. అంతేగాదు ఈ శీతల పానీయాన్ని విషంగా పేర్కొన్నాడు. దీని కారణంగా తన సోదరుడు జీవితం పాడైందంటూ కన్నీరుమున్నీరు విలపించాడు ఆ వ్యక్తి వీడియోలో. చాలామంది నెటిజన్లు అవును ఇది మంచిది కాదని తెలిసి విషాన్ని తాగుతున్నామని అంగీకరించారు. ఈ ఘటన అందరికి కనువిప్పు అని పేర్కొంటూ కొందరు పోస్టులు పెట్టగా, మరికొందరు మాత్రం అతను రోజు కూల్డ్రింక్స్ తాగుతున్నాడని తెలిసినప్పుడూ ఎందుకు అదుపుచేయలేకపోయారు అని విమర్శిస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Updated Bharat.in™ | Latest News (@updatedbharat.in) (చదవండి: 'బరువు తగ్గించే జైలు'..! ఏకంగా మిలటరీ రేంజ్ శిక్షణ..12 గంటల వ్యాయామాలు..) -
'బరువు తగ్గించే జైలు'..! ఏకంగా మిలటరీ రేంజ్ శిక్షణ..
బరువు తగ్గించే జైలు గురించి విన్నారా..?. ఔను మీరు వింటుంది నిజమే..!. నిర్బంధంలో ఉంచి స్లిమ్గా మార్చే జైలు ఇది. ఇక్కడకు వస్తే..సులభంగా వెయిట్లాస్ అవ్వొచ్చట. అంతేకాదండోయ్ అందుకోసం ఎంత చెల్లించాలో తెలిస్తే విస్తుపోతారు. ఖైదీల్లా బరువు తగ్గడం కోసం జైలు ఏంటి అనుకోకండి..అక్కడ ఉండే కఠినమైన ఆహార నియమాలు, వర్కౌట్లు తప్పించుకోకుండా ఉండేందుకు అచ్చం జైలు మాదిరి వాతావరణంతో ఉంటుంది ఆ ప్రదేశం. మరి అదెక్కడ ఉంది..?. ఎలా సన్నగా అయ్యేలా చేస్తారు అంటే..బరువు తగ్గించే జైలు చైనాలో ఉంది. దీని గురించి ఒక ఆస్ట్రేలియాన్ ఇన్ఫ్లుయెన్సర్ ఇన్స్టాగ్రామ్లో డాక్యుమెంట్ చేసి మరి వీడియో షేర్ చేశారు. తాను అధిక జీతం ఇచ్చే ఉద్యోగాన్ని వదులుకుని మరి ఇక్కడకు వెళ్లినట్లు వెల్లడించాడు కూడా. దీన్ని ఫ్యాట్ ప్రిజన్ అని కూడా పిలుస్తారు. ఇక్కడ ఎన్నో రకాలుగా డైట్లు, వర్కౌట్లు చేసినా..పెద్దగా ప్రయోజనం పొందలేని వాళ్లంతా వస్తారట. శిక్షణ ఎలా ఉంటుందంటే..అక్కడ వాళ్లకు రోజు ఉదయం 7.30 గంటలకు అలారం మోగడంతో ప్రారంభమవుతుందట. ఉదయం 8 కల్లా అదనపు బరువుని చెక్ చేయడం కోసం క్యూలైన్ ఉంటుంది. తర్వాత 9.20 నుంచి 10.30 వరకు ఏరోబిక్ క్లాస్ ఉంటుంది. దీని తర్వాత ఉదయం 11.15 గంటలకు రోజులో తొలి భోజనం మొదలవుతుంది. అందులో అల్పాహారంగా నాలుగు గుడ్లు, ఒక బ్రెడ్ స్లైస్, టమాట, కొన్ని దోసకాయ ముక్కలు మాత్రమే ఇస్తారు. ఈ సెషన్ తర్వాత కార్డియో వ్యాయామాల్లో పాల్గొనాల్సి ఉంటుంది. ఆ తర్వాత మధ్యాహ్నం 2.50 నుంచి 4 గంటల మధ్య వెయిట్ లిఫ్టింగ్ సెషన్ మొదలవుతుంది. ఇక లంచ్కి బ్రేజ్డ్ డక్, తామర కాడలు, వేయించిన కూరగాయలు, కొన్ని క్యారెట్లు, అరటిపండ్లు ఉంటాయి. దీని తర్వతా రెండు గంటల పాలు హై ఇంటెన్సివ్ శిక్షణ, స్పిన్ క్లాస్లు ఉంటాయి. ఇక రాత్రి భోజనంలో పుచ్చకాయ, కూరగాయ ముక్కలు మాత్రమే ఇస్తారు. దీని తర్వాత మరోసారి బరువు చెక్చేసే ప్రక్రియ అనంతరం నిద్రకు ఉపక్రమిస్తారు. అంటే ఈ జైలులో రోజుకి సుమారు 12 గంటల వ్యాయామాలు ఉంటాయని చెబుతున్నాడు ఇన్ఫ్టుయెన్సర్. View this post on Instagram A post shared by eggeats 🐣 I show you the real side of Asia ✨ (@eggeats) ఈ జైలులో ఉండి ఒక మహిళ నాలుగు వారాల వ్యవధిలోనే ఆరు కిలోల బరువు తగ్గినట్లు తెలిపాడు. అంటే ఆమె 85.6 కిలోల బరువు ఉండగా..ఇక్కడకు వచ్చాక 79.6 కిలోలకు వచ్చింది. అంతేగాదు మన వ్లాగర్ సైతం అంతకుమునుపుకి ఇక్కడకు వచ్చాక చాలా పరివర్తన వచ్చాడు. అంతలా బరువు తగ్గ్గిన అతడి పరివర్తనను చూసి నెటిజన్లు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ పోస్టులు పెట్టారు కూడా. ఇదిలా ఉండగా, చైనాలో లాట్జైళ్లు ఇంటెన్సివ్, రెసిడెన్షియల్, మిలటరీ తరహా బరువు తగ్గించే బ్యూట్ క్యాంపులు చాలానే ఉన్నాయట. ఎందుకంటే అక్కడ రోజురోజుకి పెరుగుతున్న ఊబకాయ సంక్షోభం నేపథ్యంలో ఇలాంటివి అత్యంత ప్రజాదరణ పొందుతుండటం విశేషం. View this post on Instagram A post shared by eggeats 🐣 I show you the real side of Asia ✨ (@eggeats) జైళ్లుగా ఎందుకు పిలుస్తారంటే..నేరస్తుల నిర్బంధ కేంద్రాలు కాకపోయినా..అక్కడ ఉండే సౌకర్యాలు జైళ్లను తలిపించేలా ఉంటాయి. పైగా చుట్టూ ఉండే వాతావరణం సైతం జైలు మాదిరిగా ఉంటుంది. అంటే ఎత్తైన కాంక్రీట్ గోడలు, ముళ్ల కంచెలతో లాక్ చేసిన గేట్లు వంటి గట్టి పకడ్బంది ఉంటుంది. దీంతోపాటు ఎక్కడకక్కడ గట్టి నిషా ఉంటుంది. ఇక్కడకు వచ్చే వాళ్లంతా సాంప్రదాయ ఆహారాలు తీసుకున్నా.. బరువు తగ్గని వాళ్లు కాబట్టి నిర్వాహకులు అంతలా వాళ్లని పర్యవేక్షిస్తారు. ఇక్కడ వాళ్లకు 14 నుంచి 28 రోజుల శిక్షణకు డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. సాధారణంగా 28 రోజులకు వసతి, ఆహారం, శిక్షణతో సహా రూ. 90 వేలు చెల్లించాల్సి ఉంటుంది. ఇక్కడ కార్యక్రమాల్లో పాలుపంచుకునేవారు ఉమ్మడి వసతినే ఎంచుకుంటారు. ఒక్కో గదికి సుమారు ఐదుగురు వరకు ఉంటారట. ఇదంతా చూస్తుంటా..ఊబకాయంతో మనుషులు ఇంతలా ఇబ్బందులు పుడుతున్నారా..? అనిపిస్తోంది కదూ..!.(చదవండి: -
అలాంటి డైట్లతో ఆరోగ్యాన్ని పాడు చేసుకోకండి..!: నటి ఊర్మిళ
ముంబై భామ ఊర్మిళ మాతోండ్కర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాలీవుడ్, టాలీవుడ్లో తనదైన అభినయం, అందంతో విమర్శకులు ప్రశంలందుకున్న ప్రముఖ నటిగా పేరుతెచ్చుకున్నారు. అంతేగాదు యువ హీరోయిన్లకు తీసిపోనివిధంగా గ్లామరస్గా కనిపిస్తుంటారామె. నాజుకైన దేహంతో పదహారణాల అమ్మాయిల కనిపిస్తుంటుంది. ఇవాళ ఫిబ్రవరి 4తో 52వ పుట్టిరోజులోకి అడుగుపెడుతున్న అలనాటి ముద్దుగుమ్మ ఈతరం యువతరానికి హెల్దీగా ఉండటంపై సలహాలు సూచనలు ఇచ్చారు. అవేంటో చూద్దామా..!.ముఖ్యంగా 2008లో సైజ్ జీరో ఫ్యాషన్ క్రేజ్ ఎలా ఉందో తెలిసిందే. ఆ టైంలో యువత ఆ ట్రెండ్తో ఉర్రూతలూగుతున్నప్పుడూ కూడా నటి ఊర్మిళ యువతకు చాలా చక్కటి పిలుపునిచ్చి అందరి దృష్టిని ఆకర్షించారు. నాజుకైన శరీరం కంటే..ఆరోగ్యం ముఖ్యం అనే విషయాన్ని గుర్తుచేస్తూ ఆలోచింపచేసేలా మాట్లాడారామె. 50 ప్లస్లో కూడా ఇంతలా స్లిమ్గా బాడీ మెయింటైన్ చేస్తున్న ఊర్మిళ యువతకు ఇస్తున్న సలహా ఏంటేంటే..ఆరోగ్యం పట్ల తానెప్పుడూ ట్రెండీ పోకడల జోలికి పోనంటున్నారామె. మన పూర్వీకులు ఫాలో అయ్యే ఆరోగ్యకరమైన అలవాట్లకే ప్రాధాన్యత ఇస్తానని నిర్మొహమాటంగా చెప్పేస్తున్నారామె. క్రాష్ డైట్లంటూ పొట్ట మాడ్చుకోనని కూడా చెప్పారు. దయచేసి యువత ట్రెండీ డైట్లు, షార్ట్కట్లో బరువు తగ్గే విధానాల జోలికిపోయి..ఆరోగ్యాన్ని చేజేతులారా పాడుచేసుకోవద్దని హితవు పలికారు. ఇటీవల కాలంలో వెయిట్లాస్ అవ్వడం ఓ ట్రెండీగా మారింది. ముఖ్యంగా స్లిమ్గా ఉంటేనే మనుషులు అనేలా పరిస్థితి మారిపోయింది. ఇవన్నీ ఎలా ఉన్నా..ఆరోగ్యంగా ఉండటమే అన్నింట్లకంటే ముఖ్యమని నొక్కి చెప్పారు. నాజుకైన శరీరం కోసం..తాన నాజుకైన శరీరం కోసం క్రమశిక్షణతో కూడిన జీవనశైలిని పాటిస్తానే తప్ప ఆహారం మానేయడం వల్ల కాదని అన్నారు. క్రాష్ డైట్ల జోలికి పోనని కూడా అన్నారామె. దేవుడు తనకు ఇచ్చిన మంచి జీన్స్ విషయమై సదా కృతజ్ఞతలు చెబుతుంటానని అన్నారు. యువత ఎక్కువగా ఉపవాస డైట్లు పాటిస్తూ..శరీరాన్ని పాడుచేసుకుంటుందని ఆందోళన వ్యక్తం చేశారామె. దానికి బదులుగా ఆరోగ్యకరమైన ఆహారం ఆస్వాదిస్తూ..వ్యాయామాలు చేయండి చాలు అని పిలుపునిచ్చారామె. ఫిట్నెస్ సీక్రెట్..చాలామంది సెలబ్రిటీలు తమ ఫిట్నెస్కి విదేశీ సూపర్ ఫుడ్స్కి క్రెడిట్ ఇస్తే..సాంప్రదాయ భారతీయ వంటకాలకే ప్రాధాన్యత ఇస్తారామె. తన మెరుగైన జీవక్రియకు, శక్తికి అవే మహారాష్ట్ర సంప్రదాయ ఆహారమేనని నొక్కి చెబుతారామె. ఫిట్గా ఉండాలంటే..పోషకాహారం, ఇంట్లో వండిన వంట్లకే కట్టుబడి ఉండటం అని చెబుతున్నారు. తాను ఇంట్లో వండిన ఆహారానికే ప్రాధాన్యత ఇవ్వడం వల్లే ఇలా స్లిమ్గా ఉన్నానని నమ్మకంగా చెప్పారామె. కాబట్టి..ఇంకెందుకు ఆలస్యం హాయిగా నచ్చిన పోషకాహారం తింటూ..వర్కౌట్లు చేస్తూ హెల్దీగా ఉందాం మరి..!.(చదవండి: మళ్లీ పెళ్లి చేసుకుంటారా..? వృద్ధ మహిళలు ఏమన్నారో తెలుసా..!) -
వెయిట్లాస్ డ్రగ్ ఉపయోగించకుండానే..90 కిలోలు తగ్గిన గ్రామీ విజేత
సెలబ్రిటీలు, ముఖ్యంగా సినీ ప్రముఖులు బరువు తగ్గేందుకు వెయిట్లాస్ డ్రగ్స్ లేదా సర్జరీలు తప్పనిసరిగా ఉపయోగిస్తారు. గ్లామర్ ఫీల్డ్ కాబట్టి..అక్కడ వారి ఆహార్యం, లుక్ అత్యంత ప్రధానం. అదీగాక నిధానంగా బరువు తగ్గాలనేంత వ్వవధి వారికి ఉండదు కూడా కానీ ఈ అమెరికన్ రాపర్, గాయకుడు అలా కాదు..తొందరగా బరువు తగ్గించే మందులు జోలికే పోకుండా..ఆరోగ్యకరమైన విధానంలో బరువు తగ్గాడు. అదీకూడా ఏకంగా 90 కిలోలు పైనే బరువు తగ్గడం విశేషం. ఎంతో ఓపికతో..ఫుడ్ ఎడిక్షన్ని దూరం చేసుకుని మరి..స్లిమ్గా మారి స్ఫూర్తిగా నిలిచాడు. మరి అతడి వెయిట్లాస్ జర్నీ ఎలా సాగిందంటే..పాటల రచయిత, గాయకుడు జెల్లీ 2026 గ్రామీ అవార్డుల ప్రెస్ ఈవెంట్లో స్మార్ట్లుక్లో కనిపించి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. అంతేగాదు అక్కడ మీడియా ఇంటర్వ్యూలో తాను ఇంతలా స్లిమ్గా మారేందుకు తన ఫుడ్ ఎడిక్షన్పై ఎంతలా పోరాటం చేశాడో బహిరంగా వెల్లడించారు. తన కొకైన్ అడిక్షన్ని దూరం చేసుకున్నట్లుగానే ఈ ఆహార వ్యసనానికి చెక్కుపెట్టగలిగానని అన్నారు. అలాగే తన ఆహారపు అలవాట్లలో కూడా మార్పులు చేసుకున్నట్లు తెలిపారు.ఆహార వ్యసనానికి చెక్పెట్టడం అంటే..తినాలనే ఆలోచనను రానివ్వకుండా చేయడమేని అంటున్నాడు. అలాగే జీవనశైలిలో వ్యాయామానికి ప్రాధాన్యత ఇవ్వడం, ఆరోగ్యకరమైన ఫుడ్ని తీసుకోవడం వల్ల ఈ మార్పులు సాధ్యమైనట్లు షేర్ చేసుకున్నారు. ఇంతకుమునుపు తన టూర్లన్నీ పార్టీలు, డ్రింక్, మత్తుపదార్థాల చుట్టూ తిరిగేది. ఇప్పుడు తన టూర్ సంస్కృతి మంచి ఆహారం, వ్యాయామం, భావోద్వేగ పరంగా బలంగా ఉండటం చుట్టూ ఉందని ఆనందంగా చెబుతున్నాడు జెల్లీ.బరువు తగ్గడంలో ఆ రెండే కీలకం..జెల్లీ రోల్ బరువు తగ్గించే ప్రయాణంలో నడక, పరుగు చాలా కీలకమైన ప్రభావాన్ని చూపించినట్లు పేర్కొన్నాడు. తాను 5కే రన్ కోసం శిక్షణ పొందుతున్నప్పుడు..చాలా బరువు తగ్గినట్లు పేర్కొన్నాడు. అలాగే 2024లో ఓ రన్ ఈవెంట్ కోసం సిద్దమయ్యే నేపథ్యంలో రోజుకి రెండు నుంచి మూడు మైళ్లు చోప్పున వారానికి నాలుగు నుంచి ఆరు రోజులు పరిగెత్తేవాడట. ఇలా బరువు తగ్గడం తనకెంతో సంతోషాన్నిచ్చిందని..అందువల్ల మరింత బరువు తగ్గేలా ప్లాన్ చేయాలని అనుకుంటున్నట్లు వివరించాడు. పైగా తేలిగ్గా ఉండి, ఏ టూర్ అయినా ఇట్టే వెళ్లిపోగలం, హాయిగా ఎంజాయ్ చేయగలం అని అంటున్నాడు. View this post on Instagram A post shared by GRAMMYS (@grammys) (చదవండి: తరుచుగా ఉద్యోగాలు మారుతున్నారా..!? కానీ ఆ ఏజ్కి..) -
క్యాన్సర్ చికిత్స.. వయొలెంట్ కణంపై సైలెంట్ రణం!
ఇప్పటికే క్యాన్సర్ చికిత్సారంగంలో విప్లవాత్మకమైన మార్పులొచ్చాయి. ఇక కృత్రిమ మేధ (ఏఐ)ను కనుగొన్న తర్వాత వచ్చిన, వస్తున్న పురోగతులు చెప్పడానికీ, వినడానికీ, చదవడానికే ఆశ్చర్యం కలిగించేలా ఉంటున్నాయి. ఇది ‘సైన్స్ ఫిక్షన్ కాదు... మెడిసిన్’ అని అనుక్షణం నిరూపితమవుతోంది. ఈ ఏడాది క్యాన్సర్ డే థీమ్ ‘యునైటెడ్ బై యునీక్’! ఈ నినాదం అర్థమేమిటంటే... ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ రోగులందరికీ (యునైటెడ్గా) చికిత్స అందేలా చేస్తూనే... ప్రతి ఒక్కరికీ ప్రత్యేకంగా... వ్యక్తిగతంగా నిర్దిష్టమైన (యూనిక్) చికిత్స అందేలా చూడటం. ఈరోజు ‘వరల్డ్ క్యాన్సర్ డే’.ఈ సందర్భంగా ఈ అంశాలన్నింటితో ప్రత్యేక కథనం...ఒక చిన్న అంశాన్ని ఊహించండి... మన దేహమంతా ఓ నగరం అనుకోండి. అప్పుడు మన ఒంట్లోని ప్రతి కణమూ ఒక ఇల్లవుతుంది. అప్పుడు మన ఇంట్లోని జన్యువు (జీన్) స్విచ్ అనుకుందాం...బాగా పనిచేసే ఆ ‘స్విచ్చు’ ఆన్ చేసినప్పుడల్లా ‘లైట్’ వెలుగుతుంది. అది నార్మల్ పెరుగుదలకు సంకేతం! ∙కొన్నిసార్లు వాటిని ఆన్ చేసినప్పుడు అలారం మోగుతుంది. అంటే రిపేర్లు అవసరమనే సూచన. ∙కొన్ని స్విచ్చులు అవసరాన్ని బట్టి పోలీస్ను పిలుస్తాయి. అది కణం మరణం!ఈ పోలికలతో చెప్పాలంటే... క్యాన్సర్ ఎప్పుడు పుడుతుందంటే...?⇒ కొన్ని స్విచ్చులు అలా ఆన్ అయ్యాక ‘స్ట్రక్’ అయిపోయి... ఆఫ్ కాకుండా ఇరుక్కుపోయినప్పుడు... అంటే... ఆన్ అయిన ఆ స్విచ్చు అలాగే జామ్ అయిపోతే... లైట్ అలా కంటిన్యువస్గా వెలుగుతూనే ఉంటుంది!... అది అప్రతిహతమైన పెరుగుదల.... ఎంతకూ ఆగకుండా పెరిగే క్యాన్సర్ పెరుగుదల! ∙అలారం మెకానిజం దెబ్బతిని అలారం మోగకుండా పోవడమంటే... కణంలో ఏదో తప్పు జరిగి... అది జరిగిందనే హెచ్చరికలు అందకుండా పోవడం. ⇒ ఇక సెల్ డెత్కు కారణమయ్యే పోలీస్ ఇన్స్పెక్టర్ తన పని మానేసి నిశ్శబ్దంగా ఉండిపోయినప్పుడూ... అంటే నార్మల్ కణం కాస్తా క్యాన్సర్ కణంగా మారినప్పుడు... అది మరో నార్మల్ కణానికి అడ్డంకి కాకుండా ఉండేందుకూ, పొరుగుదాన్ని దెబ్బతీయకుండా ఉండటానికి నిశ్శబ్దంగా తనంతట తానే మరణించడం జరగకపోవడం.ఇలా జీన్ అనే స్విచ్చులో ఏవైనా మార్పులు వచ్చి అది ‘జామ్’ అయిపోయిందంటే... అది క్యాన్సర్కు దారితీసినట్టేనని తెలుసుకోవాలి. ఇలా కణాల్లోని ‘పీ–53’ అనే ఓ ్రపోటీన్... ఈ స్విచ్చులన్నింటికీ ఓ (మాలెక్యులార్) ‘మాస్టర్ స్విచ్’గా పనిచేస్తుంది. అంటే ఇది మెయిన్బోర్డు దగ్గర ఉంటుంది. దీన్నే ‘గార్డియన్ ఆఫ్ జీనోమ్’ గానూ చెప్పవచ్చు. అదే అవసరాన్ని బట్టి డీఎన్ఏ రిపేర్లు జరిగేలా చూస్తుంది. అప్పటికీ పని జరగకపోతే ఆ తప్పుడు కణం తనంతట తానే చనిపోయేలా చూస్తుంది. (దీన్నే ‘్రపోగ్రామ్డ్ సెల్ డెత్’ అంటారు). అలా చేయడం ద్వారా మిగతా దేహాన్ని క్యాన్సర్ బారిన పడకుండా రక్షిస్తుంది.అంటే ఇంట్లో షార్ట్ సర్క్యుట్ అయితే... దానివల్ల ప్రమాదం జరగకుండా మెయిన్ బోర్డు దగ్గరే ఆఫ్ అయిపోయే మాస్టర్ స్విచ్లా పనిచేస్తుందన్నమాట. ఇటీవల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆవిష్కరణ తర్వాత క్యాన్సర్ చికిత్సా రంగంలో ఎన్నో మార్పులు వచ్చాయి. ఆ కొత్త ఆవిష్కరణలేమిటో... వాటితో వచ్చిన మార్పులేమిటో చూద్దాం. మొదటి ఆవిష్కరణ: ఆలిగో న్యూక్లియటైడ్ థెరపీగతంలో ఒంట్లోని ఏదైనా స్విచ్ చెడిపోయిం దంటే... డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సి వచ్చేది. అప్పుడు డాక్టర్గారు తన పరికరాల (కీమోథెరపీ) సహాయంతో ఓ ఎలక్ట్రీషియన్లా లేదా ఓ మేసన్ (మేస్త్రి)లా పనిచేస్తూ చెడిపోయిన స్విచ్ను రిపేరు చేసేవారు. ఆ క్రమంలోనే బోర్డులో మరికొన్ని స్విచ్చులూ మార్చాల్సి వచ్చేది. కానీ ఇప్పటి తాజా ఆవిష్కరణతో... కణం నుంచి అది చెడిపోయినట్లు సిగ్నల్ రాగానే పేషెంటే ఆ చెడిపోయిన కణానికి సందేశాలు పంపుతాడు. ‘‘చెడిపోయినట్లు వస్తున్న ఆ సిగ్నల్స్ను పరిగణనలోకి తీసుకోకు’’ ‘‘నీ సేఫ్టీ రూల్స్కు అనుగుణంగా చెడిపోయిన కణాన్ని రిపేర్ చేయ్యి’’ ‘‘ఇలా చేయడం ద్వారా చెడిపోయిన కణం వరకే పరిమితం అవ్వు. దేహంలోని మిగతా కణాలను చెడగొట్టకు’’... లాంటి సందేశాలను కణానికీ, కణంలోని రిపేర్లు చేసే అంశాలకు పంపడం ద్వారా...దేహంలోని మిగతా కణాలన్నీ ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. దాంతో క్యాన్సర్ మిగతా కణాలకు వ్యాపించదు. ఇప్పుడు ఇదెలా జరుగుతుందంటే... మానవ కణాల్లో ‘న్యూక్లియటైడ్స్’ అనే ఇటుకలు (బిల్డింగ్ బ్లాక్స్) ఉంటాయి. అయితే డాక్టర్లు ‘ఆలిగోన్యూక్లియటైడ్స్’ అనే కృత్రిమ ఇటుకలను తయారు చేసి... క్యాన్సర్తో చెడిపోయిన ఇటుకల స్థానంలో వీటిని పెట్టి ఈ రిపేర్లు జరుగుతాయి. ఇంకా మరొక పోలిక చెప్పాలంటే... మనకు ఇష్టం లేనిదీ, ఏదో అశ్లీలమైన ఎస్ఎమ్ఎస్ వచ్చిందంటే... చిరాకు పుట్టి ఫోన్ను విసిరికొట్టి దాన్ని ధ్వంసం చేయడం కంటే... కేవలం ఆ మెసేజ్ వరకే డిలీట్ చేయడం లాంటిదన్నమాట.రెండో ఆవిష్కరణ: కార్టి / ఎన్కే సెల్ థెరపీఅత్యంత కన్నింగ్ మోసగాడు... ఈ క్యాన్సర్ కణం! ఈ నేపథ్యంలో ‘క్యాన్సర్ కణం’ తాలూకు ఓ గుణాన్ని చూద్దాం. క్యాన్సర్ కణమనేది అత్యంత కన్నింగ్ మోసగాడిలాంటిది. వాడెంత కన్నింగ్ అంటే... ఎక్కణ్ణుంచో ఓ ‘ఆర్మీ యూనిఫామ్’ను కొట్టేసి, ఫేక్ ఐడీ కార్డునొకదాన్ని పట్టేసి... తానూ ఓ రక్షణ కణంలా కనిపించేలా మారువేషం వేసుకుని మరీ ఆరోగ్యకరమైన కణాలను ధ్వంసం చేస్తుంటాడు. అయితే ఇప్పటి సరికొత్త ఆవిష్కరణతో వచ్చిన ఈ అత్యంత నూతన, అధునాతన చికిత్స ప్రక్రియలో ఎన్కే అంటే... ‘నేచురల్ కిల్లర్’ అని అర్థం. ఇలా పిలిచే ఆర్మీ కమాండోస్ లాంటి ఈ ‘ఎన్కే సెల్స్ థెరపీ’లో ఏం జరుగుతుందో చూద్దాం. ∙గతంలోని ఆర్మీ కమేండోలు డేంజర్ సిగ్నల్స్ వచ్చేదాకా ఆగేవి. కానీ ఇప్పటి ఎన్కే సెల్స్ మాత్రం ఎవరి ఆదేశాల కోసం ఆగవు. అనుమానం వచ్చిందంటే చాలు ఆ క్యాన్సర్ సెల్ను అప్పటికప్పుడు ధ్వంసం చేసేస్తాయి. ∙⇒ నిశితంగా ఎంచుకుని... నిర్దిష్టంగా కేవలం చెడిపోయిన లేదా క్యాన్సర్ కణంగా మారబోతున్న కణాన్నే తుదముట్టించేస్తాయి. ∙ఇమ్యూనిటీ సెల్స్ అయిన బీ సెల్, టీ సెల్ లా తాను రక్షణ కవచాన్ని అని చెప్పే యూనిఫామ్ వేసుకోవు. సివిల్ డ్రస్లో ఉన్న సోల్జర్లా విరుచుకుపడి క్యాన్సర్ కణాన్ని ముట్టడించేస్తాయి. ఈ క్రమంలో అవి యూనిఫామ్ వేసుకుని మోసం చేసే క్యాన్సర్ కణం కన్నింగ్ వేషాల ట్రాప్లో పడిపోవు. సదరు క్యాన్సర్ కణాల కుయుక్తులనూ ముందే పసిగట్టేసి... వాటిని తుదముట్టిస్తాయి.మూడో ఆవిష్కరణ: యాంటీబాడీ డ్రగ్ కాంజుగేట్ (ఏడీసీ) «థెరపీ ఓ పొలంలో చీడ పట్టిందనుకోండి. ఆ చీడపురుగులను అంతం చేయడానికి మొత్తం పొలమంతా మందుకొట్టడం మామూలే. అలాగే ఊళ్లో ఉన్న దోమలను తుదముట్టించడానికి అత్యంత ఘాటుగానూ, ఊపిరి పీల్చుకోడానికే ఇబ్బంది పడేలా సఫకేట్ చేసేసే దోమలమందును ఊరంతా కొట్టడం సాధారణంగా జరిగేదే. తాజా ఆవిష్కరణలతో వచ్చిన చికిత్స ఎలాంటిదంటే... ఇది చాలా ఖచ్చితంగా పనిచేసే కొరియర్ బాయ్ లాంటిది. ఆ ఊళ్లో ఆ వీధి ఎక్కడుందో... ఆ వీధిలో ఆ ఇల్లు ఎక్కడుందో కనుక్కుని... బాగా ΄్యాక్ చేసి ఉన్న ఆ ‘క్యాన్సర్ మందు’ను సరిగ్గా ఆ ఇంట్లోకి డెలివరీ చేసే ఓ కొరియర్ బాయ్లా పనిచేస్తుంది. ఆ ఇంట్లోవాళ్లు ఆ ΄్యాక్ను తెరవగానే మందునంతా చిమ్మేసి క్యాన్సర్ను కమ్మేసి సైలెంట్గా చంపేస్తుంది. అలా పక్కనున్న ఇంటికి ఏమాత్రం ప్రమాదం జరగకుండా జాగ్రత్త పడుతుంది. ఈ తరహా కొత్త ఆవిష్కరణ ఫలితంగా బాధితుల్లో సైడ్ ఎఫెక్ట్స్ తగ్గుతాయి. దాంతో మునపటి కీమోథెరపీల్లోని వేదనలూ, వెతల్లా కాకుండా చికిత్సను తేలిగ్గా తట్టుకోగలగడం సాధ్యమవుతుంది.నాలుగో ఆవిష్కరణ: కృత్రిమ మేధ + జీనోమిక్స్ఇది కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) ప్లస్ జీనోమిక్స్ (జీనోమ్ చికిత్స)... ఈ రెండింటి సమన్వయంతో అందే అత్యంత అధునాతమైన సరికొత్త చికిత్స ప్రక్రియ.ఈ అంశాన్నీ తేలిగ్గా వివరించాలంటే... గతంలో నగరంలో ఎక్కడైనా అగ్నిప్రమాదం జరిగాక ఫైర్ అలారం మోగగానే ఫైర్ బ్రిగేడంతా నిప్పును ఆర్పడానికి ఉపక్రమించేవారు. ఇప్పుడు అలాకాదు.. ⇒ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఓ సీసీటీవీ లా పనిచేసి... అగ్ని అంటుకునేందుకు అవకాశమున్న చోటిని పసిగట్టినట్టే... క్యాన్సర్ పుట్టే చోటిని ముందే పసిగడుతుంది. ⇒ రక్తం / జెనెటిక్ సిగ్నల్స్... నాయిస్ సెన్సర్ మాదిరిగా పనిచేసి క్యాన్సర్ పుట్టేందుకు అవకాశమున్న ప్రదేశాన్ని ముందే కనిపెట్టేస్తాయి. ∙ఇక్కడ మనుష్యులు ఆ స్వల్పాతి స్వల్పమైన అతి చిన్న తేడాను మిస్ కావచ్చేమోగానీ... ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయం కారణంగా ఆ అతిచిన్న తేడానూ పసిగట్టే వీలుంది.ఇది ఎక్కడ ఉపయోగపడుతుందంటే... ⇒ కుటుంబ చరిత్రలో క్యాన్సర్ ఉండి... హై–రిస్క్ ఉన్న కుటుంబాల్లో. ∙చాలాకాలం నుంచి పొగతాగే అలవాటున్న స్మోకర్లలో. ∙మహిళల్లోనే వచ్చే ఉమన్ క్యాన్సర్లను పసిగట్టే విషయంలో. ∙క్యాన్సర్ వచ్చేందుకు అవకాశమున్న జీవనశైలిని అనుసరించేవారిలో లేదా అలాంటి వాతావరణంలో పనిచేసేవారిలో.ఐదో ఆవిష్కరణ: పర్సనలైజ్డ్ థెరపీ (ప్రెసిషన్ ఆంకాలజీ) గతంలో ఎవరైనా బాధితుడిలో ఒక రకం క్యాన్సర్ను కనుగొన్నారంటే... ఆ రకం క్యాన్సర్ వచ్చినవారందరికీ ఇచ్చే మందును లేదా చికిత్స ప్రక్రియను అతడికి కూడా అందించేవారు. కానీ కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ – ఏఐ) సహాయంతో ఇప్పుడు అతడిలో క్యాన్సర్ కణం ప్రవర్తించే పద్ధతిని (బిహేవియరల్ మేనర్ను) బట్టి, అతడి జీవనశైలి ఆధారంగా, అతడి బ్లడ్ మార్కర్స్, అతడి స్కాన్లూ, అతడికే ప్రత్యేకమైన అతడిలోని ‘పీ–53’ ్రపోటీన్... అంటే... అతడి ‘మాలెక్యులార్ మాస్టర్ స్విచ్’ ఎంత బలహీనంగా ఉందీ, అది ఏ మేరకు పనిచేయడంలేదు... లాంటి అంశాలన్నీ తెలుసుకొని అతడికే ప్రత్యేకమైన, ఎంతో ప్రభావపూర్వకంగా పనిచేసేలా అతడికే వ్యక్తిగతమైన చికిత్స అందించవచ్చు. ఈ అధునిక ఆవిష్కరణలతో లాభాలివి...⇒ చాలా హాస్పిటల్స్లో ఇప్పటికే ఈ ప్రయోజనాలను పొందుతున్నారు. ∙తమ జీవన నాణ్యతను (క్వాలిటీ ఆఫ్ లైఫ్ను) మెరుగుపరచుకుంటున్నారు. ∙ఎంతో డబ్బునూ, టైమ్నూ ఆదాచేసుకోవడమే కాదు... గతంలో పేషెంట్లకు ఉండే ఎన్నో బాధలూ, వెతలూ, వేదనలకు దూరంగా ఉంచగలగడం సాధ్యమవుతోంది.నిర్వహణ: యాసీన్డాక్టర్ సురేశ్ ఏవీఎస్ సీనియర్ మెడికల్ ఆంకాలజిస్ట్, కన్వీనర్, ఏఐ ఇన్ మెడికల్ ఎడ్యుకేషన్, నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ – మెడికల్ సైన్సెస్ -
అవాంఛిత రోమాలు ఎందుకు పెరుగుతాయి?
తలపై జుట్టు బాగా పెరగాలని మహిళలు కోరుకోవడం ఎంతో సాధారణమో... దేహంలోని కొన్ని భాగాల్లో అంటే... పైపెదవీ, గదమ మీద జుట్టు పెరగకూడదని కోరుకోవడం కూడా అంతే సహజం. అలా జుట్టు పెదవులపైనా గడ్డంపైనా పెరగడాన్ని వారు ఎంతమాత్రమూ ఇష్టపడరు. అలాంటి అవాంఛిత రోమాలను అనేక విధాల తొలగించుకోడానికి మహిళలు ప్రయత్నిస్తుంటారు. ఇలా వారు కోరుకోని ప్రదేశాల్లో వెంట్రుకలు పెరగడాన్ని అవాంఛిత రోమాలు అనీ... అదే వైద్యపరిభాషలో హిర్సుటిజమ్ (Hirsutism) అని చెబుతారు. అవాంఛిత రోమాలు వచ్చేందుకు కారణాలు, వాటికి పరిష్కారాలేమిటన్నది తెలుసుకుందాం...సాధారణంగా మానవుల శరీరమంతటా రోమాలు ఉండనే ఉంటాయి. మనం క్షీరదాల కోవకు చెందినవాళ్లం కావడం వల్ల... క్షీరదాల్లో ఇలా ఒళ్లంతా వెంట్రుకలు ఉండటం ఒక లక్షణం కావడం వల్ల ఒంటి నిండా రోమాలు ఉండటం సహజం. కాకపోతే దేహంలోని కొన్ని చోట్ల అవి అవి ఉండాల్సినట్టుగా ఉండకుండా పెరగడాన్ని అవాంఛిత రోమాలుగా చెప్పవచ్చు. ఉదాహరణకు పురుషుల్లో గడ్డం, మీసం ఉండటం సహజం. కానీ మహిళల్లో అవి ఉండవు. ఉన్నప్పటికీ ప్రస్ఫుటంగా కనిపించకుండా... నూగుగా... ఉండీ ఉండకుండా కనిపిస్తుంటాయి. అయితే కొందరిలో అవి పురుషుల్లో మాదిరిగా పెరుగుతూ స్పష్టంగా కనిపించే అవకాశముంటుంది. అవాంఛిత రోమాలంటే... మహిళల్లో చెంపలూ, చుబుకం, పై పెదవుల వంటి చోట్ల కూడా కనీ కనిపించకుండా రోమాలు ఉన్నప్పటికీ వాటిని గుర్తించడం అంత సులభం కాదు. సాధారణంగా మహిళలందరి విషయంలోలా కాకుండా భిన్నంగా కనిపించేవాటిని అసహజమైన వెంట్రుకలుగా చెప్పుకోవచ్చు. ఉదాహరణకు గదమ, చెంపలు, పెదవులపైన వెంట్రుకలు పెరుగుతూ... అవి మరీ గుబురుగా పెరుగుతుంటే వాటిని అవాంఛిత రోమాలుగా పేర్కొనవచ్చు. ఒక అంచనా ప్రకారం దాదాపు ఎనిమిది శాతం మహిళల్లో... పురుషుల్లో మాదిరిగానే గడ్డంపైనా, పెదవులపైనా వెంట్రుకలు కనిపిస్తాయన్నది వైద్య నిపుణుల మాట.హిర్సుటిజం, హైపర్ట్రైకోసిస్ అంటే...?మహిళల్లో కనిపించే ఈ అవాంఛిత రోమాలను హిర్సుటిజమ్ అనీ అలాగే హైపర్ట్రైకోసిస్ (Hypertrichosis) అని రెండు రకాలుగా చెప్పవచ్చు. స్త్రీలలోనూ పురుషుల మాదిరిగానే వెంట్రుకలు పెరగడాన్ని ‘హిర్సుటిజమ్’గా చెప్పవచ్చు.అయితే హైపర్ట్రైకోసిస్ కండిషన్లోనూ వెంట్రుకలు పెరిగినప్పటికీ... అవి పురుషుల్లోలాగా ఉండవు. ఉదాహరణకు మహిళల హార్మోన్లలో ఏవైనా తేడాలు వచ్చి పురుషుల్లోలా వెంట్రుకలు పెరగడాన్ని హిర్సుటిజమ్గా చెప్పవచ్చు. కానీ వాళ్ల దేహంపైనా వెంట్రుకలు ఉన్నప్పటికీ అవి ఉండాల్సినంతగా కాకుండా చాలా ఎక్కువగా పెరగడాన్ని ‘హైపర్ ట్రైకోసిస్’ అంటారు. జన్యుపరమైన కారణాలతో ఇలా జరుగుతుంది. ఇక కొందరిలో అంతకుముందు లేకపోయినా... కొన్ని రకాల మందులు వాడాక దేహంపైన రోమాలు రావచ్చు. అలా మునుపు లేనివీ... అటు తర్వాత ఏదైనా కారణాలతో రోమాలు పెరగడాన్ని కూడా ‘హైపర్ ట్రైకోసిస్’గా చెప్పవచ్చు.కారణాలు మహిళల్లో అవాంఛిత రోమాలు పెరగడానికి అనేక అంశాలు కారణమవుతాయి. అవి... హార్మోన్లలో తేడాలు...మహిళల్లో స్రవించే హార్మోన్లలో పురుష హార్మోన్ అయిన టెస్టోస్టెరాన్ అవసరమైన మోతాదు కంటే మించి స్రవించినప్పుడు... ఆ అంశం మహిళల్లో అవాంఛిత రోమాలకు దారితీయవచ్చు.పాలీసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్... మహిళల్లో పురుషుల్లోలా వెంట్రుకలు పెరిగేందుకు పాలిసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్’ (పీసీవోడీ) కూడా ఒక కారణం. హిర్సుటిజమ్ ఉన్న మహిళలలో వైద్యపరీక్షలు చేసినప్పుడు వాళ్లలో చాలామందికి (దాదాపు 70% మందిలో) పీసీవోఎస్ ఉన్నట్లుగా ఫలితాలు రావడం చాలా సహజం. పీసీఓఎస్ ఉన్న మహిళల అండాశయాలు (ఓవరీస్) పురుష హార్మోన్ అయిన టెస్టోస్టెరాన్ను ఎక్కువగా ఉత్పత్తి చేస్తాయి. దాంతో ఆ హార్మోన్ మహిళల్లో సాధారణంగా ఉండాల్సిన మోతాదు కంటే ఎక్కువగా ఉంటుంది. ఫలితంగా అవాంఛిత రోమాలు పెరగడం కనిపిస్తుంది. ఈ సమస్యతో బాధపడేవాళ్లలో మొటిమలు కూడా ఎక్కువగానే వస్తుంటాయి. యుక్తవయసు దాటి΄ోయాక కూడా మొటిమలు రావడం, అవాంఛితమైన రోమాలు ఉంటే పీసీవోఎస్ ఉందేమో అని అనుమానించాలి.పాలిసిస్టిక్ ఒవేరియన్ డిసీజ్ (పీసీవోడీ) సమస్య ఉన్నప్పుడు నిపుణులైన గైనకాలజిస్ట్ను సంప్రదించాలి. వైద్యులు సూచించిన మందులను క్రమం తప్పకుండా వాడటం ద్వారా నెలసరి సమస్యలు సరయ్యేలా చూసుకోవడం, చికిత్సను మధ్యలో ఆపకుండా సమస్య పరిష్కారమయ్యేవరకు / పూర్తిగా తగ్గేవరకు వైద్యుల పర్యవేక్షణలో ట్రీట్మెంట్ను కొనసాగించాలి.కొన్ని రకాల గ్రంథుల సమస్య ఉన్నప్పుడు... కొందరు మహిళల్లో థైరాయిడ్ గ్రంథి సమస్యగానీ, పిట్యూటరీ గ్రంథి సమస్య ఉన్నప్పుడు కూడా వారిలో పురుషుల్లోలాగానే వెంట్రుకలు పెరగవచ్చు. అందుకే... అవాంఛిత రోమాలు ఉన్నప్పుడు నిపుణులను సంప్రదించి దానికి అసలు కారణాలు తెలుసుకుని చికిత్స తీసుకోవడం అవసరం.ఇడియోపథిక్ హిర్సుటిజమ్ అంటే...కొద్దిమంది మహిళల్లో పురుషహార్మోన్ స్రావాలు చాలా తక్కువ మోతాదులో ఉన్నప్పటికీ... వెంట్రుకల పెరుగుదల మాత్రం అసాధారణంగా ఉండవచ్చు. ఇలాంటి కండిషన్ను ‘ఇడియోపథిక్ హిర్సుటిజమ్’గా చెబుతారు. వీళ్లలో రుతుక్రమం మామూలుగానే ఉంటుంది. గర్భం రావడానికి ఎలాంటి అడ్డంకులు ఉండవు. కాకపోతే వెంట్రుకల పెరుగుదల మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది.అవాంఛిత రోమాలున్న మహిళల్లో కనిపించే ఇతర లక్షణాలు అవాంఛిత రోమాలున్న మహిళల్లో కనిపించే ఇతర లక్షణాలు ఈ కింది విధంగా ఉంటాయి. సాధారణంగా వీళ్లు ఉండాల్సిన బరువు కంటే ఎక్కువగా ఉంటారు. అంటే స్థూలకాయం / ఊబకాయంతో ఉండవచ్చు. పీరియడ్స్ సక్రమంగా రాకపోవడం. మెడ దగ్గర ప్రధానంగా మెడ వెనక భాగంలోనూ, చర్మం ముడతలు పడే ప్రదేశాల్లో చర్మం మరింతగా నల్లగా, మందంగా కనిపించవచ్చు. ఇలా చర్మం మందంగా, నల్లగా కనిపించే కండిషన్ను ‘ఎకాంథోసిస్ నైగ్రికాన్స్’ అంటారు.డయాబెటిస్ వచ్చే ముప్పు ఎక్కువ... అవాంఛిత రోమాల సమస్యతో బాధపడేవాళ్ల రక్తంలో సాధారణంగా చక్కెర మోతాదులను అదుపులో పెట్టేందుకు మరింత ఎక్కువగా ‘ఇన్సులిన్’ హార్మోను అవసరమవుతుంది. అందుకే ఇలాంటి వాళ్లు చాలాకాలం పాటు ఎలాంటి చికిత్సా తీసుకోకపోతే ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చి, అది క్రమంగా డయాబెటిస్ సమస్యకు దారితీసేందుకు అవకాశాలెక్కువ.ఈ వైద్యనిపుణుల సహాయంతో... అవాంఛిత రోమాలు వచ్చే మహిళల్లో రుతుక్రమం సరిగా ఉండదు. అంటే వీళ్లలో నెలసరి (పీరియడ్స్) సక్రమంగా రావు. బరువు ఎక్కువగా పెరగడం, చర్మంలో ముడతలు ఉండే మెడ, బాహుమూలాలు వంటి చోట్ల చర్మం దళసరిగా మారడం, మొటిమలు ఎక్కువగా వస్తుండటం వంటి లక్షణాలతో పాటు ఒకవేళ మాడుపై తగినన్ని వెంట్రుకలు లేకపోవడం వంటి లక్షణాలు కనిపించినప్పుడు ఆ బాధితులు.. ఎండోక్రైనాలజిస్ట్ (హార్మోన్ల నిపుణులు)ను, డెర్మటాలజిస్ట్ (చర్మవ్యాధుల నిపుణుల)ను సంప్రదించాలి. ఈ లక్షణాలున్నవారు తాము ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్నప్పుడు గైనకాలజిస్ట్ను తప్పనిసరిగా సంప్రదించాలి. కొన్ని సందర్భాల్లో ఎండోక్రైనాలజిస్ట్, డెర్మటాలజిస్ట్, గైనకాలజిస్ట్... ఈ ముగ్గురూ ఒక టీమ్గా చికిత్స అందిస్తే మరింత మంచి ఫలితాలు ఉంటాయి. ఒకవేళ పాలీసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్ (పీసీఓఎస్)తో బాధపడుతున్న మహిళలైతే వారు తమ జీవనశైలిని, ఆహారపు అలవాట్లను మార్చుకోవాలి. సమతులాహారం తీసుకుంటూ వ్యాయామం చేయడం వంటి అలవాట్లను కొనసాగించాలి. ఇవి చేస్తూ తమ బరువును తగ్గించుకోవడం లేదా నియంత్రణలో ఉంచుకోవడం చేస్తూ... వాటితో పాటు అవాంఛిత రోమాలను తొలగించుకోడానికి తాత్కాలిక ప్రక్రియలనో లేదా శాశ్వత పద్ధతులనో అవలంబించాలి.అవాంఛిత రోమాల తొలగింపునకు తాత్కాలిక ప్రక్రియలుథ్రైడ్డింగ్ అండ్ వ్యాక్సింగ్ ...సాధారణంగా చాలామంది మహిళలు తమ అవాంఛిత రోమాలను తొలగించుకోడానికి ముఖ్యంగా థ్రెడింగ్, వ్యాక్సింగ్ లాంటి తాత్కాలిక ప్రక్రియలను అనుసరిస్తుంటారు. ఇవి తరచూ చేస్తున్న క్రమంలో కొందరిలో వెంట్రుకమూలంలో/ రోమం అంకురంలో ఇన్ఫెక్షన్స్ రావడం (ఫాలిక్యులైటిస్) వంటి ముప్పులు ఎక్కువగా కనిపిస్తుంటాయి. అప్పుడక్కడ రోమం కుదురు దగ్గర ఒక గడ్డలా మారి అక్కడ చీమూ పట్టే అవకాశాలెక్కువ. అలాంటి సందర్భాల్లో నొప్పి కూడా రావచ్చు. ఈ థ్రెడ్డింగ్, వ్యాక్సింగ్ ప్రక్రియలను అనురించేవారి చర్మం నల్లబడవచ్చు. తగినంత పరిశుభ్రత పాటించకపోతే థ్రెడ్డింగ్తో ఒక్కోసారి పులిపిరులతో కూడిన వైరల్ వార్ట్స్ రావచ్చు. కొందరు మహిళలు అవాంఛిత రోమాలను తొలగించుకోడానికి హెయిర్ రిమూవల్ క్రీమ్స్ ఉపయోగిస్తుంటారు. వాటిని ఉపయోగించేప్పుడు అలర్జీలు రాకపోతే వాటిని సురక్షితమైనవిగా భావించి, వాటిని వాడుకోవచ్చు. అయితే హెయిర్ రిమూవల్ క్రీమ్ను ఉపయోగించే ముందు అది సురక్షితమా, కాదా అని తెలుసుకోడానికి చర్మంపై ఎక్కడైనా కొద్దిగా ఉపయోగించి చూడటం (ప్యాచ్ టెస్ట్) అవసరం.షేవింగ్... అపోహలు... అవాంఛిత రోమాలను తొలగించుకోడానికి సాధారణంగా భారతీయ మహిళలు షేవింగ్ను అంతగా ఇష్టపడరు. షేవింగ్ తర్వాత మరింత గుబురుగా వెంట్రుకలు వస్తాయన్న అపోహ ఉండటం, షేవింగ్ (Shaving) వల్ల చర్మం మరింత గరుగ్గా, మందంగా మారుతుందనే అభిప్రాయాలు ఉండటంతో తమ లుక్స్ను కాపాడుకునే క్రమంలో దాన్ని ఒక సురక్షితమైన, నమ్మదగిన ప్రక్రియ అనుకోరు. అయితే అవి అపోహలే. అయినప్పటికీ షేవ్ చేసిన మర్నాడో లేదా వెంటవెంటనో వెంట్రుకలు పెరుగుతుండటం మామూలే కావడం, షేవ్ చేసిన మేర చర్మం రంగు ఒకింత మారడం వంటి కారణాల వల్ల ఇలా అపోహ పడటానికి అవకాశముంది.చదవండి: నిద్ర పట్టడం లేదా.. ఇదిగో పరిష్కారంఇవిగాక... అవాంఛితమైన రోమాలను తొలగించుకునేందుకు ఇప్పుడు ఎన్నో రకాల వైద్యప్రక్రియలూ అందుబాటులో ఉన్నాయి. ఉదాహరణకు లేజర్ ప్రక్రియలూ, ఎలక్ట్రోలైసిస్ (electrolysis) మార్గాల వంటి అధునాతన చికిత్సలూ ఉన్నాయి. అయితే వైద్య సంబంధితమైన ఎలాంటి విద్యార్హతలు లేకుండా తమను తాము బ్యూటీషియన్లు, కాస్మటాలజిస్టులమని చెప్పుకునే వారి దగ్గరకు వెళ్లడం కంటే... వైద్యపరమైన విద్యార్హతలు (క్వాలిఫైడ్) వైద్యనిపుణులై డర్మటాలజిస్టులు /ట్రైకాలజిస్టులను సంప్రదించడం చాలా మంచిది. ఇక ఇలాంటివారైతే... మహిళల్లో ఏవైనా ఇతర ఆరోగ్య సమస్యలు (అండర్లైయింగ్ కాజెస్) ఉండటం వల్ల అవాంఛిత రోమాలు వస్తే... తగిన మందులు ఇవ్వడం లేదా సమస్య మూలాలను తెలుసుకుని సంబంధిత వైద్యనిపుణులను సంప్రదించమంటూ సలహా ఇవ్వడం వంటివి చేస్తారు.కొందరు మహిళల్లో వెంట్రుకలు పలుచబడటం కూడా...మహిళల్లో అవాంఛిత రోమాలు ఎంత సహజమో... అలాగే కొంతమంది స్త్రీలలో వెంట్రుకలు పలచబారడమూ కనిపిస్తుంది. ఇది ప్రధానంగా పాపిట తీసే చోట కనిపించడం చాలా సాధారణం. అక్కడ వెంట్రుకలు మరింతగా పలచబారిపోయి పాపిట ఉండాల్సిన దానికంటే చాలా వెడల్పుగా కనిపిస్తుంటుంది. ఇలా జరగడాన్ని ‘ఫిమేల్ ప్యాటరన్ హెయిర్ లాస్’’ అంటారు. కొందరిలో ఈ సమస్యను గుర్తించాక... వీలైనంత త్వరగా చికిత్స తీసుకుంటే (సాధారణంగా ఆర్నెల్లలోపు) ఈ సమస్యను మందులతో అధిగమించవచ్చు. అంటే కోల్పోయిన వెంట్రుకలను తిరిగి పొందవచ్చు. అది కుదరకపోయినా మరిన్ని వెంట్రుకలు రాలిపోకుండా జాగ్రత్త పడవచ్చు. అయితే వెంట్రుకలు మరింతగా రాలిపోయి పూర్తిగా పలచబడితే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ మాత్రమే ప్రత్యామ్నాయమవుతుంది. నిర్వహణ: యాసీన్ -
పోరాటానికి సిద్ధం చేసే సైకో ఆంకాలజీ
‘నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ క్యాన్సర్ ప్రివెన్షన్ అండ్ రీసెర్చ్’2024 అధ్యయనం ప్రకారం మన దేశంలో 25 లక్షల మంది క్యాన్సర్తో పోరాడుతున్నారు. గత ముపై ్ప ఏళ్లలో క్యాన్సర్ బాధితుల సంఖ్య 24 శాతం పెరగడమే ఇంత భారీ సంఖ్యకు కారణం. అయితే క్యాన్సర్ నయం చేయడంలో వైద్యంతో పాటు మనసును దృఢం చేయడం కూడా చాలా ముఖ్యం అంటున్నారు సైకో అంకాలజిస్ట్లు. క్యాన్సర్ పోరాటంలో బాధితునికి సైకో ఆంకాలజిస్ట్లు అందించే సహాయం ఏమిటి?‘ఇటీవల మా అధ్యయనం ఏం చెబుతున్నదంటే క్యాన్సర్ ట్యూమర్తో పాటు మనసుకు కూడా వైద్యం చేయడం వల్ల క్లినికల్గా మంచి ఫలితాలు వస్తాయని. ఆంకాలజీ విభాగంలో సైకాలజీ ఇక ఎంత మాత్రం ఆప్షనల్ కాదు. తప్పనిసరి అవసరం’ అన్నారు న్యూఢిల్లీలోని ఎంఓసి క్యాన్సర్ కేర్ సెంటర్ వైద్యుడు డాక్టర్ నిఖిల్ హింతాని. ‘అందుకే దేశంలోని క్యాన్సర్ సెంటర్లలో సైకో ఆంకాలజిస్ట్ల సంఖ్య క్రమంగా పెరుగుతోంది’ అన్నారాయన.క్యాన్సర్ బారిన పడటం ఎవరినైనా కుంగదీసే విషయమే. క్యాన్సర్ నిర్థారణ అయ్యాక ప్రతి పేషంట్కు తనవైన భావోద్వేగ సవాళ్లు ఉంటాయి. వాటిని ఎదుర్కొనడంతో పాటు వ్యాధిని ఎదుర్కొనాలి... ఈ రెంటి సమన్వయానికి కౌన్సిలింగ్ తప్పనిసరి అంటున్నారు క్యాన్సర్ నిపుణులు. అందుకే ఇప్పుడు క్యాన్సర్ మీద పోరాటంలో సైకో ఆంకాలజిస్ట్ల ప్రాధాన్యం పెరిగింది.→ ఎవరీ సైకో ఆంకాలజిస్టులు?క్యాన్సర్ వ్యాధికి చికిత్స అందించే నిపుణులను ‘ఆంకాలజిస్టు’ అంటారని తెలిసిందే. ఆ విభాగంలోనిదే ఈ ‘సైకో–ఆంకాలజీ’. సైకాలజీలో మాస్టర్స్ లేదా పిహెచ్డి చేసి, సైకో ఆంకాలజీని ప్రత్యేకంగా అధ్యయనం చేసిన వారు ‘సైకో ఆంకాలజిస్ట్లు’గా విధులకు సిద్ధమవుతారు. ఆంకాలజిస్ట్లతోటి, పేషంట్స్తోటి సమన్వయం చేసుకుంటూ పేషంట్ మనసుకు స్వాంతన ఇస్తూ వారిలో ధైర్యం నూరి పోయడం, క్యాన్సర్ను గెలవగలననే భరోసాను ఇవ్వడం వీరి ప్రధాన పని.→ క్యాన్సర్ నయమైన వారికీ అండగా..క్యాన్సర్ నయమైన తర్వాత కూడా క్యాన్సర్ విజేతలకు అనేక ఆందోళనలు ఉంటాయి. చికిత్స వల్ల వారి శరీరంలో అనేక మార్పులు వస్తాయి. వాటిని తట్టుకోలేక కొందరు కుంగి పోతుంటారు. అటువంటి వారికీ ‘సైకో–ఆంకాలజీ’ అండగా ఉంటుంది. తిరిగి మేలైన జీవితాన్ని ఎలా ప్రారంభించాలో, ఎలా సహజంగా జీవించాలో నేర్పుతుంది. మానసిక ప్రశాంతత, ఆరోగ్య సూత్రాలు, ఒత్తిడి లేని జీవనాన్ని పాటించేలా సూచనలు చేస్తారు సైకో–ఆంకాలజిస్టులు. క్యాన్సర్ నయం కాగానే అంతా మామూలై పోయిందని చాలామంది భావిస్తుంటారు. అక్కడి నుంచే అసలైన సవాళ్లు మొదలవుతాయని నిపుణులు అంటున్నారు. ఆ మార్పులకు అనుగుణంగా వారిని సంసిద్ధం చేయడం అత్యవసరమని, దానికి ‘సైకో– ఆంకాలజీ’ తోడ్పడుతుందని అంటున్నారు.→ దశాబ్ద కాలంగా ‘సైకో–ఆంకాలజీ’పై పెరుగుతున్న అవగాహన మనదేశంలో ఎక్కువగా రొమ్ము, గొంతు, ఊపిరితిత్తుల క్యాన్సర్ బాధితులు ఉన్నారు. ఇందులో పురుషులు, స్త్రీలు బాధితులుగా ఉంటారు. వీరిలో ఒక్కొక్కరి ఒక్కో నేపథ్యం. పేద, మధ్యతరగతి ప్రజలు క్యాన్సర్ బారిన పడితే ఇక ఆ కుటుంబంలో నెలకొనే ఆందోళన గురించి చెప్పనక్కర్లేదు. ఈ క్రమంలో క్యాన్సర్కు గురైన వారు ధైర్యంగా ఉంటే మిగిలినవారూ ధైర్యాన్ని కూడగట్టుకుంటారు. అందుకు ‘సైకో–ఆంకాలజీ’ కీలక భూమిక పోషిస్తుంది. గత పదేళ్లుగా దీనిపై అవగాహన పెరుగుతోంది. ‘క్యాన్సర్ని ఎదుర్కొవడం మాత్రమే కాదు, జీవితంలో ఎదురయ్యే ప్రతి సవాలునూ ఎదుర్కునేలా వారిని సిద్ధం చేయడమే మా బాధ్యత’ అంటున్నారు ‘సైకో– ఆంకాలజిస్టులు’.మానసిక ధైర్యమే కొండంత అండసైకో ఆంకాలజీలో పేషంట్కు అవసరాన్ని బట్టి ‘కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ’, ‘స్ట్రెస్ రిడక్షన్ టెక్నిక్స్’, ‘యాక్సెప్టెన్స్ అండ్ కమిట్మెంట్ థెరపీ’, ‘స పోర్టివ్ ఎక్స్ప్రెసివ్ థెరపీ’, ‘సైకో థెరపీ’, ‘ఫ్యామిలీ అండ్ కపుల్స్ థెరపీ’, ‘ట్రామా ఇన్ఫార్మ్డ్ థెరపీ’... వంటి అనేక థెరపీలు సైకో ఆంకాలజిస్ట్లు అందిస్తారు. ఎన్ని మందులు ఉన్నా వైద్యులు ఇచ్చే భరోసా వారిలో కొండంత బలాన్ని నింపుతుంది. క్యాన్సర్ మీద ఉన్న అనేక అ పోహల కారణంగా ఈ వ్యాధికి గురైన వారు తీవ్ర మానసిక వేదనతో పాటు చుట్టూ ఉన్న వారి జాలిచూపులు, చికిత్స సమయంలో నొప్పి, తమకేమవుతుందోనన్న ఆందోళన, డబ్బు కోసం కుటుంబ సభ్యులు పడే ఆరాటం.. వీటన్నింటితో సతమతం అవుతుంటారు. సైకో–ఆంకాలజిస్టులు వారితో మాట్లాడి బతుకు మీద ఆశ కలిగించేందుకు ప్రయత్నిస్తారు. -
ఒబెసిటీ డాక్టర్ వెయిట్లాస్ స్టోరీ..! కేవలం 18 నెలల్లో 56 కిలోలు..
అధిక బరువు కేవలం సామాన్యులనే వేధించే సమస్య కాదు. ఊబకాయంతో బాధపడుతున్న రోగులకు కౌన్సలింగ్ ఇచ్చి బరువు తగ్గేలా చేసే ఒబెసిటీ వైద్యులు సైతం అధిక బరువు బాధితులే. అందుకు ఉదాహరణ ఈ వైద్యుడు కెవిన్ జెండ్రూ. అందరికి ఆరోగ్యకరమై జీవిన విధానానికి కౌన్సిలింగ్ ఇచ్చే ఈ ఒబెసిటి డాక్టరే తన స్వతం జీవన విధానాన్ని సరైన మార్గంలో నడిపించడంలో విఫలమై అధిక బరువుతో బాధపడ్డాడు. అధిక పని ఒత్తిడికి ఈ వైద్యుడు సైతం సామాన్యుడిలా అధిక బరువు బారినపడ్డాడు. రోగులకు కౌన్సిలింగ్ ఇచ్చే వ్యక్తే సరైన జీవన విధానం అవలంభించకలేక ఇబ్బందిపడ్డాడు. చివరికి ఆ ఒక్క దురదృష్టకర ఘటన అతడి జీవితాన్ని ఊహించని మలుపుతిప్పి బరువు తగ్గేందుకు దారితీయడమే కాదు..వెయిట్లాస్ అవ్వడంలో స్ఫూర్తిగా నిలిచాడు. మరి ఆ వైద్యుడి వెయిట్లాస్ జర్నీ ఎలా మొదలైందంటే..మసాచుసెట్స్కి చెందిన కెవిన్ జెండ్రూ ఒకప్పుడూ 138 కిలోల బరువు ఉండేవాడు. అతడి వృత్తి ఊబకాయంతో బాధపడే రోగులకు వైద్యం చేయడం. విచిత్రం ఏంటంటే అతడే ఓ ఒబెసిటీ రోగి..పైగా తన లైఫ్ని ఆరోగ్యప్రదంగా ఉంచుకోలేదు. కానీ రోగులకు అధిక బరువు తగ్గించుకునేలా చికిత్స, కౌన్సిలింగ్ ఇస్తుండటం విశేషం. సుదీర్ఘ గంటల పని ఒత్తిడి అతడిని తరుచుగా ఏదో ఒకటి తినేలా చిరుతిండికి బానిసగా మార్చేసింది. అది కాస్త ఆరోగ్యంపై ప్రభావం చూపడం మొదలైంది. మరోవైపు అతడి తండ్రికి టెర్మినల్ మెలనోమా ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. దాంతో ఏం తింటున్నాడో..ఎలా ఉంటున్నాడనే దానిపై స్పృహ లేకుండా జంక్ఫుడ్ తీసుకునేవాడు. అదికూడా నిర్ణిత సమయం అంటూ లేకుండా తినాలనిపించినా..లేకపోయినా..వీలు దొరికినప్పుడల్లా తినడం ఓ అలవాటుగా మారి..విపరీతంగా బరువు పెరిగిపోయాడు. ఫలితంగా టైప్ 2 డయాబెటిస్, స్లీప్ అప్నియా, అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్, ఫ్యాటీ లివర్ వంటి సమస్యల బారినపడ్డాడు. ఊబకాయం ఆరోగ్య ప్రమాదాలపై అవగాహన ఉన్న వైద్యుడే ఊబకాయంతో బాధపడుతూ అనారోగ్య సమస్యలు ఎదుర్కొనడం ఒకింత సిగ్గుగా అనిపించడం మొదలైంది కెవిన్కి. ఇంతలో సోదరికి కేన్సర్ ఉన్నట్లు నిర్థారణ అవ్వడం ఒక్కసారిగా కెవిన్ ఉలిక్కిపడ్డాడు. ఇప్పటికైనా మేలుకోకపోతే పరిస్థితి అంతే అని ఫిక్స్ అయ్యి..ఆరోగ్యకరమైన జీవన విధానంపై దృష్టిపెట్టడం ప్రారంభించాడు. తన పిల్లల కోసమైన ఆరోగ్యం ఉండాలని స్ట్రాంగ్గా నిర్ణయించుకున్నాడు.ఎలా తగ్గాడంటే..సాధారణ ఆహార మార్పులు, అడపాదడపా ఉపవాసం తదితరాలను ప్రారంభించాడు. అలాగే తనకున్న వైద్య పరిజ్ఞానంతో ఆరోగ్యకరంగా బరువు తగ్గే ప్రణాళిలు ఏర్పాటు చేసుకుని మరి బరువు తగ్గేందుకు ప్రయత్నించాడు. ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, అధిక ఫైబర్ ఉండే ఆహారం, బెర్రీలను తీసుకోవడం ప్రారంభించాడు. ప్రాసెస్ చేసిన కార్బోహైడ్రేట్లు, శుద్ధి చేసిన చక్కెరను నివారించాడు. అతని సాధారణ భోజనంలో గ్రిల్డ్ చికెన్, సిర్లోయిన్ స్టీక్ లేదా చేపలు, కాల్చిన నాన్-స్టార్చీ కూరగాయలు ఉంటాయి. దాంతోపాటు అవకాడో, గింజలు, ఆలివ్ నూనె, గుడ్లు, చీజ్ కూడా ఉంటాయి. ముఖ్యంగా మైండ్పెట్టి తినడం, కడుపు నిండిన అనుభూతినిచ్చేలా ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉండే ఆహారం తీసుకునేవాడు. ఇక అడదడపా ఉపవాసాన్ని కూడా హెల్దీగా చేసినట్లు తెలిపాడు. మధ్యాహ్నం 12 గంటల నుంచి ఉదయం ఆరు గంటల వ్యవధిలో తక్కువ కార్బ్, చక్కెర ఉన్న ప్రోటీన్ భోజనం మాత్రమే తీసుకునేవాడు. దీనివల్ల చక్కెర స్థాయిలు సాధారణస్థితికి వచ్చి డయాబెటిస్ అదుపులోకి వచ్చింది. వర్కౌట్ల దగ్గరకు వచ్చేటప్పటికీ..రోజుకి పదివేల నుంచి పదిహైను వేల వరకు నడక వంటివి కచ్చితంగా చేసేవాడు.ఇలా ఆరోగ్యకరమైన అలవాట్లతో కేవలం 18 నెలల్లో 138 నుంచి ఏకంగా 56 కిలోలు బరువు తగ్గాడు. ప్రస్తుతం ఆరోగ్యకరమైన బరువుతో 20లలో ఉన్న వ్యక్తిలా అన్నిపనులు సునాయాసంగా చేయగలుగుతున్నానంటూ తన వెయిట్లాస్ స్టోరీని ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసుకున్నాడు. (చదవండి: ట్విన్స్ పేరెంట్స్ చేసిన పనికి..ఉబ్బితబ్బిబైన డాక్టర్..!) -
జాబ్ స్ట్రెస్.. శత్రువే కాదు మిత్రుడు కూడా!
నేటి కార్పొరేట్ యుగంలో ’ఉద్యోగం’ అంటే కేవలం పని మాత్రమే కాదు, అదో నిరంతర యుద్ధం. ఉదయం అలారం మోగినప్పటి నుండి, ఆఫీసు డెడ్లైన్లు.. బాస్ నుంచి వచ్చే కాల్స్.. టార్గెట్లు.. పక్క సీటు సహోద్యోగితో పోటీ.. అర్ధరాత్రి బాస్ పంపే మెయిల్,,, అన్నీ కలిసి జాబ్ స్ట్రెస్. నేటి కార్పొరేట్ ప్రపంచంలో ఉద్యోగిని ఉదయం నిద్ర లేచింది మొదలు, రాత్రి పడుకునే వరకు వెంటాడే భూతం ఇది.అసలు ఈ ఒత్తిడి ఎందుకు వస్తుంది? ఇది ఎప్పుడూ మనకు శత్రువేనా? అంటే కాదనే అంటాను. అది మిత్రుడిలా మనల్ని ముందుకు నడిపించగలదు, శత్రువులా మనల్ని కుంగదీయగలదు. ఆ తేడాను గుర్తించడమే ’ఉద్యోగ పర్వం’లో మనం నేర్చుకోవాల్సిన మొదటి పాఠం.శాస్త్రీయంగా ఒత్తిడి రెండు రకాలు.. 1. యూస్ట్రెస్ (పాజిటివ్ ఒత్తిడి): ఒక ప్రజెంటేషన్ ఇచ్చే ముందు కలిగే చిన్నపాటి భయం, ఒక కొత్త బాధ్యత తీసుకున్నప్పుడు వచ్చే ఉత్సాహం. ఇది మనల్ని ఏకాగ్రతతో పనిచేసేలా చేస్తుంది. ఇది మనకు ’మిత్రుడు’.2. డిస్ట్రెస్ (నెగటివ్ ఒత్తిడి): పని భారం మితిమీరినప్పుడు, భవిష్యత్తుపై అభద్రతాభావం కలిగినప్పుడు వచ్చేది. ఇది మన ఆరోగ్యాన్ని, పనితీరును దెబ్బతీస్తుంది. ఇది మన ’శత్రువు’.శత్రువుగా మారినప్పుడు సంకేతాలు..ఒత్తిడి మీ నియంత్రణ తప్పుతోందని చెప్పడానికి మీ శరీరం కొన్ని సిగ్నల్స్ ఇస్తుంది.· ఆఫీసు పేరు వింటేనే గుండెల్లో దడ మొదలవ్వడం.· ఆకలి మందగించడం లేదా ’స్ట్రెస్ ఈటింగ్’ (ఒత్తిడిలో ఎక్కువగా తినడం).· ఏకాగ్రత కుదరకపోవడం, నిర్ణయాలు తీసుకోవడంలో తడబాటు.· చిన్న చిన్న విషయాలకే చిరాకు, కోపం రావడం· ఆఫీసు నుంచి ఇంటికి వచ్చినా పని గురించి ఆలోచిస్తూ కుటుంబానికి దూరం కావడం.· నిద్రలేమి, తలనొప్పి లేదా జీర్ణ సంబంధిత సమస్యలు· పని మీద ఆసక్తి తగ్గిపోవడం.రాజేష్ ఒక ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలో టీమ్ లీడర్. అద్భుతమైన పనితీరు ఉన్నప్పటికీ, గత ఆరు నెలలుగా అతను తీవ్రమైన మెడనొప్పి, నిద్రలేమితో బాధపడుతున్నాడు. ఆఫీసులో చిన్న విషయాలకే చిరాకు పడటం, ఇంటికి వెళ్ళాక పిల్లలతో సరిగ్గా గడపలేకపోవడం అతన్ని మానసిక వేదనకు గురిచేసింది. రాజేష్ తన టీమ్ చేసే ప్రతి చిన్న పనిని తానే పర్యవేక్షించాలనుకోవడం (Micromanagement ). ‘నేను లేకపోతే ప్రాజెక్ట్ ఆగిపోతుంది‘ అనే అపోహే అతని ఒత్తిడికి ప్రధాన కారణం. కౌన్సెలింగ్లో అతనికి ’డెలిగేషన్’ (పనిని ఇతరులకు అప్పగించడం), ’మైండ్ఫుల్నెస్’ టెక్నిక్స్ నేర్పించాం. మూడు నెలల తర్వాత, రాజేష్ ఇప్పుడు ప్రశాంతంగా ఉండటమే కాకుండా, అతని టీమ్ ఉత్పాదకత కూడా 30శాతం పెరిగింది.ఒత్తిడిని మిత్రుడిగా మార్చుకోవడానికి 5 సూత్రాలు..1. Circle of Control : మీరు మార్చగలిగే పనుల మీద (మీ పనితీరు, టైమ్ మేనేజ్మెంట్) దృష్టి పెట్టండి. మీరు మార్చలేని విషయాల గురించి (ఆర్థిక మాంద్యం, బాస్ మూడ్) చింతించడం మానేయండి.2. 2 మినిట్ బ్రీతింగ్: ఒత్తిడి పెరిగినప్పుడు 2 నిమిషాల పాటు దీర్ఘ శ్వాస తీసుకోండి. ఇది మెదడులోని ’అమిగ్డాలా’ను శాంతపరిచి, తక్షణ ఉపశమనాన్ని ఇస్తుంది.3. డిజిటల్ డెటాక్స్: ఆఫీస్ సమయం ముగిశాక, కనీసం ఒక గంట పాటు ఫోన్ను పక్కన పెట్టండి. నోటిఫికేషన్ల మోత మీ మెదడును నిరంతరం అప్రమత్తంగా (Alert mode) ఉంచి ఒత్తిడిని పెంచుతుంది.4. శారీరక శ్రమ: కనీసం 20 నిమిషాల నడక మీ మెదడులో ’ఎండార్ఫిన్’లను విడుదల చేస్తుంది, ఇవి ఒత్తిడిని తగ్గించే సహజ సిద్ధమైన మందులు.5. Perfectionism వద్దు: అన్ని పనులూ 100శాతం పర్ఫెక్ట్గా ఉండాలనే పట్టుదల ఒత్తిడిని పెంచుతుంది. ’ఎక్సలెన్స్’ మీద దృష్టి పెట్టండి, పర్ఫెక్షన్ మీద కాదు.మీ కోసం చిన్న పరీక్ష.. ఈ క్రింది ప్రశ్నలకు ’అవును’ లేదా ’కాదు’ అని సమాధానం చెప్పుకోండి:· ఆదివారం సాయంత్రం నుంచే మీకు ఆఫీసు గురించి ఆందోళన మొదలవుతోందా?· పని ఒత్తిడి వల్ల మీ వ్యక్తిగత సంబంధాలు లేదా ఆరోగ్యం దెబ్బతింటున్నాయా?· విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు కూడా మీరు అపరాధ భావన (Guilt) కి గురవుతున్నారా?పై ప్రశ్నల్లో రెండింటికి ’అవును’ అనే సమాధానం వస్తే, మీరు మీ ఒత్తిడిని శత్రువుగా మార్చుకున్నారని అర్థం. ఒత్తిడిని జయించడం అంటే పనిని వదిలేయడం కాదు, పని చేసే విధానాన్ని మార్చుకోవడం. గుర్తుంచుకోండి. మీ కెరీర్ కంటే మీ ఆరోగ్యం.. మీ చిరునవ్వు చాలా విలువైంది.సైకాలజిస్ట్ విశేష్కెరీర్ – మైండ్సెట్ కోచ్8019 000067www.psyvisesh.com -
అడపాదడపా ఉపవాసం.. మహిళలకు చేటు!
బరువు తగ్గించే పద్దతుల్లో అడపాదడపా ఉపవాసం (ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్(ఐఎఫ్). బరువు తగ్గడానికి అత్యంత సులభమైన పద్ధతిగా పేర్కొంటారు. త్వరితగతిన బాడీలో మార్పులు..పైగా ఆరోగ్యకరమైన విధానమని పలువురు వెల్న్స్ నిపుణుల అభిప్రాయం. అయితే ఇది మహిళలకు ఎప్పటికీ ప్రమాదకరమని, ముఖ్యంగా పీరియడ్స్ వచ్చే మహిళలకు మరింత ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు ఫెర్టిలిటీ కోచింగ్ వ్యవస్థాపకురాలు ప్రీతికాసిరెడ్డి. సోషల్ మీడియా వేదికగా ఈ పద్ధతి మహిళ ఆరోగ్యానికి ఏవిధంగా చేటు చేస్తుందో తన స్వీయానుభవాన్నిషేర్ చేసుకున్నారు.విపరీతంగా ప్రజాదరణ పొందిన అడపాదడపా ఉపవాసం మహిళల ఆరోగ్యానికి చాలా వ్యతిరేకంగా పనిచేస్తుందన్నారు. ఇది హర్మోన్లను ఇన్బ్యాలెన్స్ కారణమయ్యే విధానంగా అభివర్ణించారు. దీన్ని అవలంభించడంతో తనకు టీ స్థాయిలు గణనీయంగా పడిపోయాయని, జీవక్రియ నెమ్మదించిందని, కార్టిసాల్ స్థాయిలు ఉదయంపూట ఎక్కుగా ఉన్నట్లు తెలిపారు. అలాగే నిరంతరం చలిగా అనిపించిందని, పీరియడ్స్ రావడం తగ్గిపోవడం వంటి సమస్యలు ఉత్పన్నమయ్యాయని అన్నారామె. ఈ విధానం మహిళల ఆరోగ్యానికి అత్యంత ప్రమాదమని తేల్చి చెప్పారామె. నిజానికి ఈ విధానంలో అల్పాహారం దాటవేయాల్సి ఉంటుంది. ఇది శరీరాన్ని ఆహరం కంటే కార్టిసాల్తో నడపేలా బలవంతం చేస్తుందన్నారు. ఫలితంగా థైరాయిడ్ పనితీరుపై ప్రభావం చూపడం, పునరుత్పత్తి ఆరోగ్యాన్ని దెబ్బతీయడం వంటి సమస్యల బారిన పడతారని హెచ్చరిస్తున్నారామె. బ్రేక్ఫాస్ట్ అనేది శక్తి కదలికని, అది తప్పనసరి అన్నారామె. ఇక ఈ అడపాదడపా ఉపవాసం..తప్పుదారి పట్టించే వెల్నెస్ సలహాగా అభివర్ణించారామె. అడపాదడపా ఉపవాసం అంటే..ఈ విధానంలో ఏం తింటున్నారు, ఎప్పుడు తింటున్నారు అనేదానిపై ఫోకస్ పెట్టే చేసే డైట్ విధానం. అత్యంత సాధారణ వెర్షన్ 16:8 పద్ధతి. ఇక్కడ 16 గంటలు ఉపవాసం ఉండి ఎనిమిది గంటలలోపు తినాల్సి ఉంటుంది. ఇది డైటింగ్ను సులభతరం చేస్తుందని, బరువు తగ్గడంలో సహాయపడుతుందని, జీవక్రియ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని పలువురు నిపుణులు వాదన. .సైన్స్ ఏం అంటుందంటే..అయితే ఈ వాదనలలో కొన్నింటిని సైన్స్ సమర్థిస్తుంది. బహుళ అధ్యయనాలు IF బరువు తగ్గడానికి, నడుము చుట్టుకొలతను తగ్గించడానికి, రక్తంలో మెరుగైన చక్కెర నియంత్రణకు ఉపకరిస్తుందని చెబుతున్నారు. నిపుణులు ఏమంటున్నారంటే..నొయిడా ఇంటర్నేషనల్ యూనివర్శిటీలోని స్కూల్ ఆఫ్ అలైడ్ హెల్త్ సైన్స్ డీన్ డాక్టర్ సుప్రియా అవస్థి మాట్లాడుతూ, అడపాదడపా ఉపవాసం మహిళలందరికీ మంచిది కాదని చెప్పలేం కానీ ఇది అందరికీ సురక్షితమైనది కాదని అన్నారు. అయితే మహిళలు తమ ఆరోగ్యానికి సరిపడితే ఈ పద్ధతి పాటించొచ్చని, అయితే చాలామటుకు మహిళల్లో ఈ విధానం వల్ల హార్మోన్ల అసమతుల్యతకు దారితీసే ప్రమాదం ఉందని హెచ్చిరిస్తున్నారు. పురుషుల కంటే మహిళలు ఎక్కువ సేపు ఆహారం తీసుకోకుండా ఉండాలంటే కష్టమని, అది ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని అన్నారు.Intermittent fasting was one of the worst things I did for my hormones (7 years ago).My free T3 levels dropped significantly when I did it, which means my metabolism slowed to a crawl. I was cold all the time. My cortisol levels were elevated in the morning. My periods were…— Preethi Kasireddy (@iam_preethi) January 26, 2026 (చదవండి: పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్కు తీవ్రమైన కంటి వ్యాధి.. ఆర్వీఓ అంటే..?) -
పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్కు తీవ్రమైన కంటి వ్యాధి.. ఆర్వీఓ అంటే..?
పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రస్తుతం జైలులో ఉన్న సంగతి తెలిసిందే. ఆయన ప్రమాదకరమైన కంటి సమస్యతో బాధపడుతున్నారని, అందుకోసం ప్రభుత్వ ఆస్పత్రిలో చికత్స తీసకుంటున్నట్లు స్థానిక మీడియాలు పేర్కొన్నాయి. పైగా ఇమ్రాన్ ఎదుర్కొంటుంది ప్రమాదకరమైన కంటి వ్యాధి అని, సకాలంలో వైద్యం అందించకపోతే కంటి చూపే పోయే ప్రమాదం కూడా ఉందని చెబుతున్నారు నిపుణులు. అసలు ఇమ్రాన్కు వచ్చిన తీవ్రమైన కంటి వ్యాధి ఏంటి..ఎందువల్ల వస్తుంది తదితరాల గురించి తెలుసుకుందామా..!.రావల్పిండిలోని అడియాలా జైలులో శిక్ష అనుభవిస్తున్న ఇమ్రాన్ ఖాన్ని అక్కడ వైద్యులు పరీక్షించి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఖాన్కు రెటీనా సిర మూసివేత(రెటీనా నుంచి రక్తాన్ని తీసుకువెళ్లే చిన్న సిరలు మూసివేత) ఉన్నట్లు వైద్య పరీక్షలో తేలిందని అధికారులు తెలిపారు. ఆయన్ను ప్రభుత్వాస్పత్రికి తరలించి ఓ 20 నిమిషాల పాటు చికిత్స అందించి తిరిగి జైలుకు తరలించినట్లు అధికారిక వర్గాల సమాచారం. ప్రస్తుతం ఆయన ఆరోగ్యంగా ఉన్నట్లు జైలు అధికారులు వెల్లడించారు కూడా. ఇంతకీ అసలేంటి రెటీనా సిర మూసుకుపోవడం..రెటీనా సిర మూసుకుపోవడం అంటే..రెటీనా సిర మూసుకుపోవడం లేదా ఆవీఓ అనేది రెటీనా నుంచి రక్తాన్ని బయటకు పంపే సిరలో పాక్షికంగా లేదా పూర్తిగా అడ్డుపడటం. దీని వల్ల కంటి వెనుక భాగంలో ఉన్న కణజాల పొర, కాంతిని మనం చూడగలిగే చిత్రాలలోకి అనువదిస్తుంది.రెటీనా సిరలో అడ్డంకి రెటీనా నుంచి రక్తం బయటకు రాకుండా నిరోధిస్తుంది.దాంతో కంటిలో ఒత్తిడి పెరిగి వాపు వంటి తీవ్రమైన సమస్యలను కలిగిస్తుంది. ఫలితం దృష్టి సమస్యలు లేదా నష్టం వాటిల్లే ప్రమాదం ఉంటుంది. రోగి కంటి పరిస్థితి దృష్ట్యా ఇంజెక్షన్ల ద్వారా చికిత్స నుంచి శస్త్రచికిత్స వరకు ఏదైనా చేయాల్సి ఉంటుంది. అదంతా రోగి కంటి సమస్యపై ఆధారపడి ఉంటుందట. ఈ పరిస్థితి ఎందువల్ల అంటే..నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ప్రచురించిన అధ్యయనాలు ప్రకారం..ఈ పరిస్థితి రెటీనా సిర ద్వారా సాధారణ రక్త ప్రవాహానికి అంతరాయం వల్ల సంభవిస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి.కారణాలు..రక్తం గడ్డకట్టడంరక్త ప్రవాహం మందగించడంరెటీనా సిర, రెటీనా ధమనితో కలిసే చోట కుంచించుకుపోవడం.ఇది ఎక్కువగా 40 ఏళ్లు పైబడిన యువకులలో, ముఖ్యంగా డయాబెటిస్, గ్లాకోమా లేదా అధిక రక్తపోటు వంటి కొన్ని వైద్య పరిస్థితులు ఉంటే ఈ ప్రమాదం మరింత ఎక్కువ.రెటీనా సిర మూసుకుపోవడంలో సంకేతాలు, లక్షణాలుఅస్పష్టమైన దృష్టి లేదా దృష్టి నష్టంనల్ల మచ్చలు లేదా గీతలుకంటిలో నొప్పి, ఒత్తిడిఎలా నిర్ధారిస్తారు..కంటి సంరక్షణ నిపుణులు కంటి పరీక్ష, రెటీనా ఇమేజింగ్ పరీక్షల ద్వారా కనుపాపలను విస్తరించి ఆవీఓని నిర్ధారిస్తారు. చికిత్స..రెటీనా సిరలో అడ్డంకిని తిప్పికొట్టడానికి లేదా నయం చేయడానికి ప్రస్తుతం ఎటువంటి మార్గం లేదు. కానీ కంటి సంరక్షణ నిపుణులు యాంటీ-VEGF ఇంజెక్షన్లు, స్టెరాయిడ్ ఇంజెక్షన్లు, ప్యాన్రెటినల్ ఫోటోకోగ్యులేషన్తో రెటీనా సిర మూసుకుపోవడం వల్ల కలిగే సమస్యలను నివారించవచ్చు లేదా చికిత్స చేయవచ్చు.రెటీనా సిర మూసుకుపోయే ప్రమాదాన్ని నివారించడానికి మొదటి సకాలంలో గుర్తించి చికిత్స తీసుకోవడం. ఈ సమస్య బారినపడకూడదంటే..ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, ఆరోగ్యకరమైన బరువుని నిర్వహించడం వంటివి చేయాలి. అలాగే ధూమపానం, పొగాకు వంటి ఉత్పత్తులకు దూరంగా ఉండాలి.. గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులును సంప్రదించడం ఉత్తమం.(చదవండి: అడవి బిడ్డలే ఆరాధ్య దైవాలై..) -
నిద్ర... సమస్యలు- పరిష్కారాలు
నిద్ర... దాన్ని అనుభవించి, ఆస్వాదించి తెలుసుకోవాలేగానీ అక్షరాల్లో నిర్వచించడం కష్టం. నిర్వచనమే ఇవ్వలేని ఓ అద్భుతం. దేహం, మనసూ ప్రశాంతంగా సేదదీరే అనిర్వచనీయమైన ప్రక్రియ. అందుకే నిద్ర తాలూకు ప్రశాంతత లోపించినవారు ఆ నిద్రాసుఖం కోసం పరితపిస్తారు. ఆ సుఖానుభూతి కోసం తాపత్రయపడతారు. సాధారణంగా రోజుకు ఆరు నుంచి ఎనిమిది గంటల పాటు అనుభవించే ఆ అనుభవం కోసం ప్రతి వ్యక్తీ తన జీవితంలోని దాదాపు మూడో వంతు వెచ్చిస్తాడు. అయితే కొందరిని ఆ నిద్రదేవత కరుణించదు.మరికొందరిలో నిద్రపరమైన కొన్ని సమస్యలుంటాయి. ఆ సమస్యలు ఆరోగ్య సమస్యలనూ తెచ్చిపెడతాయి. నిద్రలో నడవడం వంటి కొన్ని రకాల నిద్రకు సంబంధించిన సమస్యలు ఒక్కోసారి కొన్ని ప్రమాదాలకూ కారణమవుతాయి. నిద్ర గురించి ఇలాంటి ఎన్నో విషయాలను తెలిపే ఈ కథనంలో స్లీప్కు సంబంధించిన అనేక ఆసక్తికరమైన అంశాలను తెలుసుకుందాం...ఎవరిలోనైనా నిద్ర (Sleep) తక్కువైతే దాని తాలూకు ప్రతికూల ప్రభావాలు దేహంపైనా, మనసుపైనా... ఇలా రెండింటిపైనా ఉంటాయి. చిత్రంగా ఇంకొందరిలో నిద్ర ఎక్కువ కావడం వల్ల వచ్చే సమస్యలూ కనిపిస్తుంటాయి. ప్రధానంగా నిద్ర తాలూకు సమస్యలను మూడు రకాలుగా విభజించవచ్చు. అవి... ’నిద్రలేమి (ఇన్సామ్నియా) ’అతి నిద్ర (హైపర్సామ్నియా) ’ నిద్రలో విచిత్రంగా ప్రవర్తించడం (పారాసామ్నియా).నిద్రలేమి (ఇన్సామ్నియా)...సాధారణంగా ప్రతి ఒక్కరూ దాదాపు 6 నుంచి 8 గంటల పాటు నిద్రపోతుంటారు. ఇది సాధారణం. అంతకంటే తక్కువగా నిద్రపోతే... దాన్ని నిద్రలేమి (ఇన్సామ్నియా) అని చెప్పవచ్చు. సాధారణ నిద్ర ఆరు నుంచి ఎనిమిది గంటల పాటే అయినా... జనాభాలోని 2 శాతం నుంచి 4 శాతం ప్రజల్లో ఇది కేవలం మూడు నుంచి నాలుగు గంటలు మాత్రమే ఉంటుంది. అయినప్పటికీ వాళ్ల శరీర తత్వాన్ని బట్టి అది వాళ్లకు ఎలాంటి సమస్యను తెచ్చిపెట్టకపోవచ్చు. అలా కొద్దిసేపు నిద్రే అయినప్పటికీ వాళ్లలో ఎలాంటి అలసటా, నీరసం, నిస్సత్తువ లేదా ఇలాంటి సమస్యలేవీ లేకుండా ఉంటే వాళ్ల శరీర తత్వాన్ని బట్టి వాళ్లకు ఆ నిద్ర సరిపోతుందన్నమాట. అయితే చాలామందిలో నిద్రలేమి వల్ల అనేక సమస్యలు వస్తాయి. అవి...∙ఏకాగ్రత, దృష్టిని కేంద్రీకరించే శక్తి లోపించడం. ∙రాత్రి నిద్రలేమి వల్ల పగటివేళ కునికిపాట్లు పడుతూ ఉండటం. ∙జ్ఞాపకశక్తి తగ్గడం. ∙పనిలో తగినంత సామర్థ్యం చూపలేకపోవడం. నిద్రలేమి సమస్య కేవలం ఒకటి నుంచి రెండు రోజుల పాటు ఉంటే అదో సమస్య కాబోదుగాని... అదే నెలల పాటు కొనసాగితే కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు కనిపిస్తాయి. ఇలా నిద్రలేమితో బాధపడేవాళ్లలో రక్తపోటు హై–బీపీ, మధుమేహం (డయాబెటిస్), గుండెజబ్బులు, బ్రెయిన్స్ట్రోక్, భరించలేనంతగా తలనొప్పులు, హైపర్ ఎసిడిటీ, కడుపులో పుండ్లు (గ్యాస్ట్రిక్ అల్సర్స్), ఉద్విగ్నత (యాంగ్జైటీ), నరాల సమస్య (న్యూరోసిస్), కుంగుబాటు (డిప్రెషన్) లాంటి కొన్ని మానసిక సమస్యలు వచ్చే అవకాశాలుంటాయి.నిద్రలేమికి కారణాలు... ∙వేళకు నిద్రపోక పోవడం (ఇర్రెగ్యులర్ స్లీప్ హ్యాబిట్స్) ∙వేళకు తినకపోవడం (ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్) ∙నిద్రకు ముందు పొగతాగడం ∙కాఫీ, టీ, కెఫిన్ ఉండే కాఫీ అలాగే కూల్డ్రింక్స్ తాగడం ∙తీవ్రమైన మానసిక ఒత్తిడి (స్ట్రెస్, యాంగ్జైటీ)కి గురికావడం ∙ఆస్తమా, గుండెజబ్బులకు సంబంధించిన కొన్ని రకాల మందులు వాడటం వల్ల. ∙కొన్ని రకాల జబ్బుల కారణంగా... అందునా ముఖ్యంగా ఆస్తమా, కంజెస్టివ్ హార్ట్ డిసీజెస్, మూత్రపిండాల సమస్యలు (కిడ్నీలో వ్యర్థాలు మిగిలిపోవడం వల్ల), కొన్ని లివర్ సమస్యలు ∙థైరాయిడ్ సమస్యలు ∙స్థూలకాయం / ఊబకాయం ∙తీవ్రమైన నొప్పుల కారణంగా (అంటే విపరీతమైన తలనొప్పి, కడుపునొప్పి, మెడనొప్పి, తిమ్మిర్లు, మంటలు ఉండటం)నిద్ర లేమి – నివారణ చర్యలు...నిద్రలేమితో బాధపడుతున్నవాళ్లు ఈ కింది జాగ్రత్తలు తీసుకుంటే మంచి గాఢమైన నిద్రపట్టేందుకు అవకాశాలెక్కువ.∙బెడ్రూమ్ నిశ్శబ్దంగా, ప్రశాంతంగా ఉండేలా చూసుకోవాలి. వురీ చల్లగానూ, వురీ వేడిగా ఉండకూడదు. ∙నిద్రపోతున్న గదిలో మరీ ఎక్కువ వెలుగు లేకుండా చూసుకోవాలి. ∙పొగతాగడం పూర్తిగా మానేయాలి. ∙సాయంత్రం నుంచి కాఫీలు, టీలను, కెఫిన్ ఉండే కూల్డ్రింక్స్ తీసుకోకూడదు. ∙రాత్రిపూట నిద్రకు ఉపక్రమించే ముందు గోరువెచ్చని నీటితో స్నానం చేయడం.∙ప్రతీ రోజూ ఒకే నిర్ణీత వేళకి నిద్రకు ఉపక్రమించడం. ∙పగటి పూట ఎక్కువసేపు నిద్రపోకపోవడం. ∙నిద్రకు వుుందర టీవీలో తీవ్రమైన ఉద్విగ్నత, ఉద్రిక్తత, ఉద్వేగపూరితమైన దృశ్యాలున్న సినివూలూ, సీరియళ్లు, వెబ్సిరీస్లూ చూడకపోవడం.∙రాత్రి వుంచి నిద్ర పట్టాలంటే పగలు కనీసం అరగంట సేపయినా పూర్తిస్థాయి పగటి వెలుగులో (డే లైట్) గడపడం ఓ మంచి సూచన. (పగలంతా వుసకమసగ్గా ఉండే వెలుగు తక్కువ గదుల్లో గడపడం వల్ల రాత్రిపూట మంచి నిద్రపట్టకపోవచ్చు). ∙నిద్రకు వుుందు ఆహ్లాదకరమైన మ్యూజిక్ను వినడం.∙అలాగే పెద్దపెద్ద చప్పుళ్లు ఉండే రణగొణధ్వని ల్లాంటి వు్యూజిక్కు దూరంగా ఉండటం. ∙రాత్రి నిద్రకు ముందు గోరు వెచ్చని పాలు తాగడం. (పాలలో ఉండే ట్రిప్టోఫాన్ అనే అమైనో ఆసిడ్తో మంచి నిద్ర పట్టే అవకాశముంటుంది).∙నిద్రకు వుుందు పుస్తకాలు చదవడం వంటివి సరికాదు. నిజానికి పుస్తకం చదివితే నిద్ర వస్తుందని చాలావుంది అంటుంటారు. కానీ చాలా సందర్భాల్లో పుస్తకంలో ఆసక్తికరమైన అంశాలుండటం, పుస్తకంలోని కంటెంట్లో ఉద్విగ్నతకు గురిచేసే సన్నివేశాలుంటే అవి నిద్రను దూరం చేయడానికి అవకాశాలెక్కువ.∙నిద్రకు ముందర టీవీ లేదా మొబైల్ చూడటం కూడా సరికాదు. ఇది రెండు రకాలుగా నిద్రకు దూరం చేస్తుంది. స్క్రీన్ నుంచి వచ్చే బ్లూ లైట్ కారణంగా నిద్ర పట్టదు. అలాగే మొబైల్ చూస్తున్నప్పుడు అందులో కనిపించే ఆసక్తికరమైన అంశాలూ, ఉద్విగ్నతకూ, ఎక్సైట్మెంట్కు గురిచేసే అంశాలు నిద్రను దూరం చేయవచ్చు.∙నిద్రపోవడాన్ని ఓ పనిలా అనుకొని దానిపైనే దృష్టిపెట్టి నిద్రకు ఉపక్రమించాలి. ఆ సమయంలో వేరే విషయాలు ఆలోచించడం సరికాదు.∙ఆల్కహాల్కు పూర్తిగా దూరంగా ఉండాలి. ఒక్కోసారి ఆల్కహాల్ తీసుకున్న రాత్రి పూర్తిగా నిద్రపట్టకపోవచ్చు. లేదా ఆ నిద్ర నాణ్యత (స్లీప్ క్వాలిటీ) చక్కగా ఉండకపోవచ్చు. ఆల్కహాల్తో పట్టిన నిద్ర తర్వాత మనసు చికాగ్గానూ, నిద్రలేచాక పూర్తిగా అలసట తీరిన భావన లేకపోవడానికి స్లీప్ క్వాలిటీ చక్కగా లేకపోవడమే కారణం. ∙బెడ్రూమ్లో ఆహ్లాదకరమైన లైట్ మ్యూజిక్ వినడం వల్ల మంచి నిద్ర పడుతుంది. అయితే నిద్రకు ఉపక్రమించాక ఆ మ్యూజిక్ ఆపాలన్న స్పృహ కారణంగా నిద్ర ఆపుకోవాల్సి రావచ్చు.∙ఊపిరితిత్తులు, కిడ్నీల జబ్బులతో బాధపడేవారు తాము వాడే కొన్ని రకాల మందుల వల్ల సరిగా నిద్రపట్టకపోవచ్చు. ఉదాహరణకు ఆస్తమాకు వాడే కొన్ని రకాల ఇన్హేలర్స్తో కొందరికి సరిగా నిద్రపట్టకపోవచ్చు. అందుకే లంగ్స్, కిడ్నీ జబ్బులతో బాధపడేవారు తాము ఉపయోగించే మందులను డాక్టర్లకు చూపించి, వారి సలహామేరకు మందులు వాడటం లేదా వాటిని పగటిపూట వాడేలాగా వేళల్లో మార్పు చేసుకోవచ్చు. ఇక తీవ్రమైన నొప్పుల సమస్యలతో బాధపడేవారు (పెయిన్ డిజార్డర్స్ ఉన్నవారు) తమ డాక్టర్ను సంప్రదించి తమకు నిద్రాభంగం కలిగించని విధంగా తమ సమస్యలకు తగిన మందులు సూచించాల్సిందిగా కోరాలి. హైపర్సామ్నియాసాధారణంగా సగటున నిద్రపోయే వ్యవధి అయిన ఎనిమిది గంటలకంటే కూడా చాలా ఎక్కువ సేపు నిద్రపోవడాన్ని ‘హైపర్సామ్నియా’గా (hypersomnia) చెప్పవచ్చుహైపర్సామ్నియాకు కారణాలు...∙హైపోథైరాయిడిజం అనే రుగ్మత ఉన్నవాళ్లూ, అలాగే దీర్ఘకాలంగా ఊపిరితిత్తుల జబ్బులతో బాధపడేవారు... రాత్రివేళల్లో వారికి సరైన నిద్రలేకపోవడం వల్ల పగలు ఎక్కువగా నిద్రపోతుంటారు. అలాగే నిద్రలో ఊపిరి అందకపోవడం (స్లీప్ ఆప్నియా), రెస్ట్లెస్ లెగ్ సిండ్రోమ్, నార్కొలెప్సీ వంటి సమస్యలున్నవాళ్ల లోనూ నిద్ర ఎక్కువగా వస్తుంటుంది.∙స్లీప్ ఆప్నియా సమస్య : నిద్ర సమస్యల్లో ప్రధానమైనది నిద్రపోతున్నప్పుడు వచ్చే గురక కారణంగా ఊపిరి అందకపోవడం. దీన్నే స్లీప్ ఆప్నియా సిండ్రోమ్ అంటారు. శ్వాసప్రక్రియ 10 సెకండ్ల కంటే ఎక్కువ సేపు ఆగిపోతే దాన్ని ‘ఆప్నియా’గా చెబుతారు. కొందరు తమది చాలా చిన్నపాటి గురక అని, దాంతో పెద్దగా ప్రమాదం లేదని అనుకుంటుంటారు. గురక చిన్నదైనా, పెద్దదైనా వుుక్కు నుంచి గొంతు వరకు గాలి తీసుకెళ్తే అవయవాల్లో అడ్డంకి వల్లనే ఆ గురక వస్తుంటుంది. ఆ అడ్డంకి వల్ల ఊపిరితిత్తులకు అందాల్సిన ఆక్సిజన్ మోతాదు తగ్గి శరీరంలో కార్బన్–డై–ఆక్సైడ్ మోతాదులు పెరిగిపోతుంటాయి. దాంతో మెదడుకు అందాల్సినంత ఆక్సిజన్ అందక చాలాసార్లు తమకు తెలియకుండానే వాళ్లలో నిద్రాభంగమవుతుంటుంది. ఫలితంగా స్లీప్ ఆప్నియాతో బాధపడేవారికి నాణ్యమైన నిద్ర (క్వాలిటీ స్లీప్) ఉండదు. ఫలితంగా రాత్రివేళ సరిగా నిద్రలేకపోవడంతో ఆ నిద్రలేమిని (ఇంగ్లిష్లో స్లీప్ డెబిట్)ను ఉదయం వేళల్లో భర్తీ చేసుకోడానికి ప్రయత్నిస్తుంటారు. అందుకే ఇలా గురక కారణంగా తరచూ నిద్రభాగం అవుతుండేవారు తరచూ ఉదయం వేళల్లో నిద్రతో తూగుతూ (నిద్రలో జోగుతూ) ఉంటారు. ఇలా తూగడం / జోగడం వల్ల ఎన్నో రకాల ప్రమాదాలు జరిగే అవకాశముంది. డ్రైవింగ్ చేసేప్పుడు ఇలా తూగడం / జోగడం ఎంతో ప్రమాదకరం. అదీగాక ఇలా రాత్రివేళ నిద్రలేమి (స్లీప్ డెఫిసిట్) వల్ల ఉదయంవేళల్లో మందకొడిగా (డల్గా) ఉంటుంటారు.∙సమస్యలను పరిష్కరించడం (ప్రాబ్లమ్ సాల్వింగ్), ఏకాగ్రతా అలాగే సవుస్యపై దృష్టికేంద్రీకరణ (కాన్సంట్రేషన్)... ఇలాంటి అన్ని విషయాల్లోనూ సవుస్యలుంటాయి.∙తీవ్రమైన తలనొప్పులు : కొందరిలో ఉదయం వేళల్లో తీవ్రమైన తలనొప్పి వస్తుంటుంది. నిద్రసమస్య కారణంగా రాత్రివేళల్లో నోటితో గాలిపీల్చుకోవడం వల్ల నోరెండిపోయిన ఫీలింగ్ కొనసాగుతుంది. పీల్చుకునే గాలిలో ఆక్సిజన్ మోతాదులు తగ్గడంతో మెదడులో జ్ఞాపకశక్తికి కేంద్రస్థానమైన ‘వూమిల్లరీ బాడీ’ అనే అవయవం తాలుకు పరిమాణం (సైజ్) 20 శాతం వరకు తగ్గిపోతుంది. శరీరంలో ఆక్సిజన్ మోతాదులు తగ్గడం వల్ల... దాని తాలూకు దుష్ప్రభావం గుండెపై పడుతుంది. హార్ట్ ఎటాక్స్తో అకస్మాత్తుగా చనిపోయిన వాళ్ల ఆరోగ్య చరిత్ర (కేస్ హిస్టరీ) పరిశీలిస్తే... ముఖ్యంగా ‘స్లీప్ ఆప్నియా’ సమస్య ఉన్నవాళ్లలో 30 శాతం వుంది గుండెపోట్లకు గురవుతున్నట్లు అనేక పరిశీలనల్లో తేలింది. ∙‘రెస్ట్లెస్ లెగ్ సిండ్రోమ్’ : ఈ సమస్యతో బాధపడేవారు పదే పదే తమ కాళ్లను కదిలిస్తూ, ఆ చర్య వల్ల రిలీఫ్ పొందుతుంటారు. రాత్రుళ్లు నిద్రలేకపోవడంతో పగలు చాలాసేపు నిద్రపోతూ ఉంటారు.∙‘నార్కోలెప్సీ’ : మెదడుకు సంబంధించిన ఈ జబ్బుతో బాధపడేవారు రాత్రి మామూలుగా నిద్రపోయినప్పటికీ... మళ్లీ పగటివేళ అలా కునుకులోకి జారిపోయి నిద్రలోకి వెళ్లిపోతూ ఉంటారు. ఇలాంటివారు మాట్లాడుతూ మాట్లాడుతూనే నిద్రలోకి జారిపోతూ ఉంటారు.∙కెటాప్లెక్సీ : ఈ సమస్య ఉన్నప్పుడు వాళ్లకు... నిద్రలేవగానే కాళ్లూ, చేతులు రెండూ కాసేపు పనిచేయకుండాపోతాయి. ఈ కండిషన్నే ‘స్లీప్ పెరాలిసిస్’ అని కూడా అంటారు.∙క్లీన్ లెవిన్ సిండ్రోమ్ : వీళ్లు నెలల తరబడి నిద్రపోతూనే ఉంటారు. వీళ్లకు ఆకలి కూడా ఎక్కువ. ఇలా ఎక్కువగా తినడాన్ని హైపర్ బులీమియా అంటారు. ఇక్కడ పేర్కొన్న ఇలాంటి అతినిద్ర (హైపర్సామ్నియా)కు సంబంధించిన సమస్యలు ఉన్నవాళ్లు డాక్టర్ను సంప్రదించి తగిన సూచనలూ, సలహాలు, తగిన చికిత్సలు తీసుకోవాలి.పారాసామ్నియా సమస్యలునిద్రలో వింతగా ప్రవర్తించడాన్ని ‘పారాసామ్నియా’ అంటారు. ఈ పారాసామ్నియాలో చిత్రవిచిత్రమైన చాలా రకాల సమస్యలను చూడవచ్చు.∙నిద్రలో నడవడం(స్లీప్ వాకింగ్) : ఇది నాన్ ర్యాపిడ్ ఐ మూవ్మెంట్ (ఎన్ఆర్ఈఎమ్) స్టేజ్–4లో వచ్చే సమస్య. కొందరు తలుపులు తెరుచుకుని కూడా నిద్రలో నడుస్తూ వెళ్తారు. మర్నాడు ఉదయం నిద్ర లేచాక వాళ్లకు తాము చేసిందేమీ గుర్తుండదు. ఇలాంటివాళ్లు మేడ మీది నుంచి పోవడం లేదా ఇతరత్రా ప్రమాదాలకు (యాక్సిడెంట్స్కు) గురయ్యే అవకాశాలు చాలా ఎక్కువ.∙నిద్రలో భయంతో ఉలిక్కిపడిలేవడం (స్లీప్ టెర్రర్స్) : ఐదేళ్ల నుంచి పదిహేనేళ్ల పిల్లల్లో డాక్టర్లు ఈ సమస్యను ఎక్కువగా చూస్తుండటం చాలా సాధారణం. పెద్దగా అరుస్తూ నిద్రలోంచి లేవడం, లేచాక భయంకరంగా ప్రవర్తించడం, టీవీ లేదా మొబైల్ వంటి వస్తువులను విసిరేవేయడం లేదా బద్దలు కొట్టడం వంటి పనులు చేస్తుంటారు. ఇలా చేసే పిల్లల్ని అదుపు చేయడమూ చాలా కష్టంగా ఉంటుంది. ఈ సమస్య ఎన్ఆర్ఈఎమ్ స్టేజ్3, స్టేజ్4 లలో వస్తుంది. కాబట్టి ఆ దశల్లో వాళ్లేం చేస్తున్నారన్నది వాళ్లకు ఏమాత్రం తెలియదు.∙నిద్రలో పీడకలలు రావడం (నైట్మేర్) : ఈ సమస్యలో భయంకరమైన పీడకలలు వస్తుంటాయి. ఇది కూడా ఎన్ఆర్ఈఎమ్ స్టేజ్3, స్టేజ్4లో వచ్చే సమస్య. నిద్రలేచాక ఏమాత్రం గుర్తుకురాని భయంకరమైన కలలు వస్తుండటం ఈ జబ్బు విషయంలో జరుగుతుంటుంది.∙నిద్రలో కలవరింతలు, పొంతనలేని మాటలు (స్లీప్ టాకింగ్) : ఈ సమస్యతో బాధపడేవారు నిద్రలో ఏదేదో కలవరిస్తుంటారు. ఏమాత్రం పొంతన లేకుండా మాట్లాడుతుంటారు. ఇది కూడా ఎన్ఆర్ఈఎమ్ స్టేజ్3, స్టేజ్4లో వచ్చే సమస్యే. ఆ దశలో వచ్చే సమస్య కావడంతో వాళ్లు మాట్లాడుతున్నదేమిటో వాళ్లకే తెలియదు. నిద్రలేపి అడిగినా వాళ్లేమీ చెప్పలేరు. అందుకే వాళ్లనేదైనా ప్రశ్నించినా పొంతనలేని సమాధానాలు చెబుతుంటారు.∙కన్ఫ్యూజనల్ అరోజల్స్ : నిద్రలోంచి లేచి ఏవేవో పొంతన లేని విషయాలను ప్రస్తావిస్తుంటారు.∙స్లీప్ అన్యురోసిస్ : చిన్నారులు నిద్రలో పక్క తడపటం మామూలే. కానీ సాధారణంగా ఈ అలవాటు మూడునుంచి ఐదేళ్ల లోపు పిల్లలప్పుడే ఆగిపోతుంది. అయితే అరుదుగా కొందరిలో పది పదిహేనేళ్లవరకు కొనసాగుతూ వారిని చాలా ఒత్తిడికి గురి చేస్తుంది. సామాజికంగా నలుగురిలో కలవడం, ఫంక్షన్లలో పాల్గొనడం, రాత్రుళ్లు ప్రయాణాలు చేయాల్సి వచ్చినప్పుడు వెనకాడటం, ఆత్మవిశ్వాసం, తమపట్ల తమకు గౌరవం (సెల్ఫ్ ఎస్టీమ్)తగ్గడం వంటి సమస్యలు వస్తాయి. నిద్రకు సంబంధించి ఇలాంటి ఎన్నో రకాల సమస్యలు ఉంటాయి. సమస్య నిర్ధారణ కోసం కొందరిలో వాటికి అవసరమైన కొన్ని రకాల పరీక్షలూ చేయాల్సి రావచ్చు. ఇక చికిత్సల విషయానికి వస్తే నిద్రకు సంబంధించిన సమస్యలు ఉన్నవాళ్లు డాక్టర్లను సంప్రదిస్తే చాలావరకు కౌన్సెలింగ్ నిర్వహించడం, అవసరమైన కొందరికి కొన్ని రకాల ఉపకరణాలు వాడటం (సీ–ప్యాప్ లాంటివి), చాలా అవసరమైన మరికొందరికి తగిన మందులు వాడటం ద్వారా వైద్యనిపుణులు ఈ సమస్యలను పరిష్కరిస్తారు. స్లీప్ వాకింగ్ లాంటి నిద్రకు సంబంధించిన కొన్ని రకాల సమస్యలు ప్రాణాలకే ముప్పు తెచ్చిపెట్టే అవకాశం ఉన్నందున నిద్రసమస్యలను తేలిగ్గా తీసుకోకుండా, బిడియం వదిలి డాక్టర్లను తప్పనిసరిగా సంప్రదించడం అవసరం.నిద్ర అంటే ఏమిటన్నది ఇంకా ఇప్పటికీ పూర్తిగా తెలియని రహస్యమే. ఆ కలల ప్రపంచమంటే ఏమిటన్నది ఇంకా పూర్తిగా పరిష్కరానికి నోచుకోని ప్రహేళికే. అందుకే నిద్ర గురించిన అధ్యయనాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఆ నిద్ర తాలూకు అనేక దశలూ, స్లీప్కు సంబంధించిన అనేక సమస్యలూ, వాటికి పరిష్కారాలూ, ప్రశాంతమైన నిద్రకోసం పాటించాల్సిన సూచనలేమిటన్నది చూద్దాం...నిద్ర... దశలునిద్రలో ప్రధానంగా రెండు దశలుంటాయి. అందులో మొదటిది ‘నాన్ ర్యాపిడ్ ఐ మూవ్మెంట్’గా చెప్పే ‘ఎన్ఆర్ఈఎమ్’ దశ. రెండోది ‘ర్యాపిడ్ ఐ మూవ్మెంట్’గా పిలిచే ‘ఆర్ఈఎమ్’ దశ. ఇందులో మొదట పేర్కొన్న దానిలో కనురెప్పల కింద కనుపాప కదలదు కాబట్టి దాన్ని ‘నాన్ ర్యాపిడ్ ఐ మూవ్మెంట్’గానూ... అలాగే దాని తాలూకు మొదటి అక్షరాలతో సంక్షిప్తంగా ‘ఎన్ఆర్ఈఎమ్’గా చెబుతారు. ఇక రెండో దాంటో కనుపాప వేగంగా కదులుతుంటుంది కాబట్టి దాన్ని ‘ర్యాపిడ్ ఐ మూవ్మెంట్’గానూ సంక్షిప్తంగా ‘ఆర్ఈఎమ్’గా పిలుస్తారు.నాన్ ర్యాపిడ్ ఐ మూవ్మెంట్ (ఎన్ఆర్ఈఎమ్)లోని ఉపదశలు... కంటిపాప కదలికలు, కాళ్లూ చేతుల కదలికలు ఉండని మొదటి దశ ‘ఎన్ఆర్ఈఎమ్’ (నాన్ ర్యాపిడ్ ఐ వుూవ్మెంట్)లో మళ్లీ స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4 అని నాలుగు ఉపదశలుంటాయి.ఇందులో...స్టేజ్–1 అనేది 10–15 నిమిషాల పాటు స్టేజ్–2 అన్నది 10–15 నిమిషాలు పాటు స్టేజ్–3 అన్నది 20–25 నిమిషాల పాటు స్టేజ్–4 అన్నది 20–30 నిమిషాల పాటుకొనసాగుతుంటుందని ఓ అంచనా.నాన్ ర్యాపిడ్ ఐ మూవ్మెంట్లోని ఈ నాలుగు ఉప–దశలు దాటగానే... నిద్ర అనేది కంటిపాపలు వేగంగా కదిలే ఆర్ఈఎమ్ (ర్యాపిడ్ ఐ వుూవ్మెంట్) దశలోకి వెళ్తుంది. దీన్ని ఐదో దశ పరిగణిస్తే... ఇలా ఈ ఐదు దశలూ ఒక వరసలో కొనసాగడాన్ని ఒక ‘స్లీప్ సైకిల్’ అంటారు. ఇక్కడ పేర్కొన్న దశలవారీగా... ఒక రాత్రి నిద్రలో ఇలాంటి స్లీప్ సైకిల్స్ ఐదు నుంచి ఆరు వరకు నడుస్తాయి.ఏ అర్ధరాత్రో అకస్మాత్తుగా నిద్రలేచామంటే... మనం ఏ దశ తాలూకు నిద్ర నుంచి లేచామో తెలుసుకోడానికి ఓ బండగుర్తు ఉంటుంది. నిద్ర లేచీ లేవగానే చాలా వుత్తుగా ఉంటూ... వెంటనే తేరుకోలేనట్లుగా ఉంటే అప్పుడు వునం ‘ఎన్ఆర్ఈఎమ్’ దశ నుంచి లేచావున్నవూట. అదే ‘ఆర్ఈఎమ్’ దశలోంచి నిద్రలేస్తే రిఫ్రెషింగ్ ఫీలింగ్ ఉంటుంది. కనుపాపలు కదులుతుండే ‘ఆర్ఈఎమ్’ నిద్రలోనే కలలు వస్తుంటాయి. ఆ దశలోని కలలే చాలావరకు గుర్తుంటాయి. డాక్టర్ రమణ ప్రసాద్సీనియర్ స్లీప్ స్పెషలిస్ట్ – పల్మునాలజిస్ట్నిర్వహణయాసీన్ -
'డెవిల్ వెయిట్-లాస్ ప్లాన్'..! జస్ట్ 60 రోజుల్లో దాదాపు 15 కిలోల బరువు
బరువు తగ్గడం ఇటీవల ట్రెండీగా మారింది. స్మార్ట్గా వయసు తక్కువగా కనిపిస్తే ఏదో ఘనకార్యం సాధించిన ఫీలింగ్ చాలామందిలో. ఆ క్రమంలో ఆరోగ్యకరమైన పద్ధతుల వైపుకి కాకుండా షార్ట్కట్ల జోలికి వెళ్లి అనారోగ్యం పాలు చేసుకున్నవాళ్లు కూడా ఉన్నారు. ఎలాగైతేనేం వెయిట్లాస్ అయ్యితే చాలు అనుకునేవాళ్లు ఉన్నారు. ఆ వింత ధోరణిలోంచి పుట్టుకొచ్చిందే ఈ డెవిల్ వెయిట్-లాస్ ప్లాన్. దెయ్యం పేరుతో పిలిచే ఈ డైట్ప్లాన్ ఆరోగ్యానికి అసలు మంచిదేనా..? ఎవ్వరైనా పాటించారా..అంటే..చైనాలోని హాంగ్జౌకు చెందిన 26 ఏళ్ల జియావోయు అనే మహిళ తన ప్రాణ స్నేహితురాలి వివాహం సమయానికి తగ్గడానికి ఈ డెవిల్ వెయిట్లాస్ ప్లాన్ ప్రయత్నించింది. జస్ట్ రెండు నెలల్లో దాదాపు 15 కిలోలు తగ్గాలనే ఉద్దేశ్యంతో దీన్ని ప్రయత్నించింది. అయితే ప్రీడయాబెటిస్ బారినపడి ఇబ్బందులు కొనితెచ్చుకుంది. నిజానికి ఈ డైట్ వల్ల పోషకాహార లోపం, హర్మోన్ల అమసతుల్యత, పిత్తాశయ రాళ్లు వంటి అనారోగ్య సమస్యలు ఎదురవ్వుతాయినేది ఆరోగ్య నిపుణుల వాదన. ఇక్కడ ఈ చైనా మహిళ జియావోయు ఈ వెయిట్లాస్ ప్లాన్తో తన స్నేహితురాలి వివాహానికి సరిగ్గా 50 కిలోల బరువు లక్ష్యానికి చేరుకుంది. అయితే తర్వితగతిన అలసట, తీవ్ర దాహం, ఆకలి, తలతిరగడం, గుండె దడ వంటి సమస్యలను ఎదుర్కొంది. ఆ వెయిట్లాస్ ప్లాన్లో భాగంగా చేసిన ఉపవాసల వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు సాధారణం కంటే ఎక్కువగా ఉన్నాయని పరీక్షల్లో తేలింది. అధిక తీవ్రత వ్యాయామాలు చేస్తూ..పూర్తిగా కార్బోహైడ్రేట్లను తొలగించిది. దాంతో ఇన్సులిన్పై ఎఫెక్ట్పడి ప్రీ డయాబెటిస్ని ఎదుర్కొనక తప్పలేదామెకు. త్వరితగతిన బరువు తగ్గే వెయిట్లాస్ ప్లాన్ కండరాలు నష్టం, డీ హైడ్రషన్కి దారితీసి..చివరికి జీవక్రియను పూర్తిగా దెబ్బతీసింది. దెబ్బతో ఆ మహిళ వెంటనే ఆ డైట్ ప్లాన్కి స్వస్తి చెప్పి..తన జీవనశైలిలో మంచి మార్పులు చేసుకుంది. సమతుల్య ఆహారాన్ని స్వీకరించి, పరిమిత అధిక తీవ్రత వ్యాయామాలు లేదా ఏరోబిక్ వ్యాయమలు చేయడం ప్రారంభించింది. ఈ మార్పులతో ఆమె మూడు నెలల్లో 52.5 కిలోలు తగ్గింది. ఈ విధానంతో ఆమె మొత్తం ఆరోగ్యంలో గణనీయమైన మార్పులు రావడమే కాకుండా ఆరోగ్యం కూడా మెరుగుపడింది. 'డెవిల్ వెయిట్-లాస్ ప్లాన్' అంటే..ఇది సరైన డైట్ ప్లాన్ మాత్రం కాదు. స్వీయంగా రూపొందించిన డైట్ ప్లాన్. తీవ్రమైన వ్యాయామాలు, డైట్, పరిమిత కేలరీలతో కూడిన డైట్. అలాగే వేగంగా బరువు తగ్గడమే ధ్యేయంగా రూపొందించిన అనారోగ్యకరమైన డైట్. ఇందులో ప్రధానమైన ఆహారాన్ని నివారించి, తీవ్రమైన వ్యాయమాలు చేసి సమస్యలు కొని తెచ్చుకుంటంటారని హెచ్చరిస్తున్నారు వైద్య నిపుణులు. ఇలాంటి వాటి వల్ల బరువు తగ్గడం ఎలా ఉన్నా..జీవక్రియ నష్టం వంటి ఇతర తీవ్రమైన ఆరోగ్య సమస్యల బారిన పడే ప్రమాదమే ఎక్కుగా ఉంటుందని చెబుతున్నారు నిపుణులు.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వైద్యలు లేదా వ్యక్తిగత నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: భారతీయ అవుట్ఫిట్లో ఈయూ చీఫ్ ఉర్సులా ..!) -
నిపా వైరస్ కలకలం : ఎయిర్పోర్ట్స్లో హై అలర్ట్
భారతదేశంలో నిపా వైరస్ ఉనికి కలకలం రేపుతోంది. పశ్చిమ బెంగాల్లో ఐదు నిపా కేసులు నిర్ధారించారు. దాదాపు 100 మందిని హోం క్వారంటైన్లో ఉంచారు. తాజా వ్యాప్తితో ఆసియాలోని కొన్ని ప్రాంతాల విమానాశ్రయాల్లో నిబంధనలను కట్టుదిట్టం చేశారు. కోవిడ్ తరహా ఆరోగ్య తనిఖీలను ముమ్మరం చేశాయి. పశ్చిమ బెంగాల్లో ఒక ఆసుపత్రిలో వైరస్ గుర్తించారు. అదే జిల్లాకు చెందిన ఆరోగ్య సంరక్షణ సిబ్బందిలో రెండు కేసులు నమోదైనాయి. నర్సు, మరొ ఆసుపత్రి ఉద్యోగికి కూడా పాజిటివ్గా నిర్దారణ అయింది. మొత్తం 5 కేసులను నిర్ధారించారు. దాదాపు 100 మంది హోమ్ క్వారంటైన్లో ఉంచారు. ఈ రోగులు కోల్కతా,చుట్టుపక్కల ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. ఒక రోగి పరిస్థితి విషమంగా ఉంది. పశ్చిమ బెంగాల్లో ఒక వ్యక్తి తెలియని వ్యాధితో మరణించడం, మరో ఐదుగురు ఈ వైరస్ బారిన పడటంతో ఇది వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ,ఈ వైరస్ బారిన పడ్డ మరో 100- 200 మందిని పరిశీలిస్తున్నామని ఎయిమ్స్ బిలాస్పూర్ అధ్యక్షుడు ప్రొఫెసర్ డాక్టర్ నరేంద్ర కుమార్ అరోరా మీడియాకు తెలిపారు.ఈ నేపథ్యంలో అనేక ఆసియా దేశాల విమానాశ్రయాలు ఆరోగ్య పరీక్షలను కఠినతరం చేశాయి. థాయిలాండ్, నేపాల్, తైవాన్తో సహా అనేక ఆసియా దేశాలు పశ్చిమ బెంగాల్ నుండి వచ్చే ప్రయాణికులకు ఎయిర్పోర్ట్లలో ఆరోగ్య స్క్రీనింగ్లను ముమ్మరం చేశాయి. మరోవైపు చైనీస్ న్యూఇయర్ సీజన్కు ముందు నిపా వైరస్ వ్యాప్తి మరింత ఆందోళన పుట్టిస్తోంది.నిపా వైరస్ఈ వైరస్ గబ్బిలాలు (ప్టెరోపస్ జాతి),పందులు వంటి జంతువుల నుండి మానవులకు వ్యాపిస్తుంది. కొన్ని సందర్భాల్లో, ప్రజల నుంచి ప్రజలకు సామాజికసంబంధాల ద్వారా వ్యాపిస్తుంది. నిపా వైరస్ (NiV) అత్యంత అంటువ్యాధి. ప్రాణాంతకం కూడా. ఈ వైరస్ కేసు మరణాల రేటు 40–75శాతం ఉంటుంది. జ్వరం, తలనొప్పి, శ్వాసకోశ సమస్యలు, తీవ్రమైన సందర్భాల్లో మెదడు వాపు, మూర్ఛలు , కోమా వంటి లక్షణాలు ఉంటాయి. ప్రారంభ సంకేతాలు నిర్దిష్టంగా ఉండవు, గుర్తించడం కష్టమే.జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పి, వాంతులు, గొంతు నొప్పి శ్వాసకోశ ఇబ్బంది లేదా విలక్షణమైన న్యుమోనియా లాంటి లక్షణాలు ప్రధానంగా కనిపిస్తాయి. ఇదీ చదవండి: ఏడాదికి రూ. 39 కోట్లు : ఈ బిజినెస్ గురించి తెలుసా?ఇంక్యుబేషన్ వ్యవధి 4 నుండి 14 రోజుల వరకు ఉంటుంది.కొన్ని సందర్భాల్లో, 45 రోజుల వరకు ఉంటుంది. ప్రాణాలతో బయటపడినవారు మూర్ఛ లేదా వ్యక్తిత్వ మార్పులు వంటి దీర్ఘకాలిక నాడీ సంబంధిత సమస్యలు ఎదురుకావచ్చు.నివారణ ఎలాక్రమం తప్పకుండా చేతులు కడుక్కోవడం, పరిశుభ్రత పాటించడం. సెల్స్ ఐసోలేషన్, మాస్క్ ధరించడం ద్వారా మానవుని నుండి మానవునికి వ్యాప్తిని తగ్గించగలగాలి.పండ్ల గబ్బిలాలు, అనారోగ్య పందులు లేదా కలుషితమైన ఆహారానికి దూరంగా ఉండాలి.ఖర్జూర రసాన్ని మరిగించి పండ్లను పూర్తిగా కడగాలి; దెబ్బతిన్న పండ్లను పారవేయాలి.జంతువులు, వ్యాధిసోకిన వ్యక్తులకు దూరంగా ఉండాలిఅనుమానిత లక్షణాల కనిపిస్తే సెల్ఫ్ ఐసోలేషన్లో ఉంటూ, తక్షణమే వైద్య సహాయం తీసుకోవాలి. భారతదేశంలో పశ్చిమ బెంగాల్, కేరళలో రాష్ట్రాల్లో ఈ వైరస్ వ్యాప్తి ఎక్కువగా నమోదైంది. ప్రతి సంవత్సరం మే నుండి సెప్టెంబర్ వరకు ఉండే పండ్ల గబ్బిలాల సంతానోత్పత్తి కాలంలోనే ఈ వైరస్ ఎక్కువగా వ్యాపిస్తుందని భావిస్తున్నారు. గబ్బిలాల మేటింగ్ పీరియడ్ కారణంగా జూనోటిక్ ఇన్ఫెక్షన్ వ్యాప్తికి కేరళ ఆరోగ్య శాఖ కోజికోడ్, మలప్పురం, కన్నూర్, వయనాడ్, ఎర్నాకులం అనే ఐదు జిల్లాల్లో అవగాహన కల్పిస్తోంది.ఇదీ చదవండి: యాక్సిడెంట్ కాదు.. డాష్బోర్డ్ కెమెరా షాకింగ్ విజువల్స్ -
రెగ్యులర్గా కాఫీ... వయసు పెరిగిపోతుంది జాగ్రత్త!
సాధారణంగా చాలామందికి ‘కాఫీ’తోనే రోజు మొదలవుతుంది. ఈ వేడివేడి పానీయం సమయానికి అందకపోతే విలవిలలాడిపోతుంటారు. అయితే తరచూ ‘కాఫీ’ తాగడంతో వచ్చే సమస్యలపై ఒక వైద్య నిపుణుడు చెప్పిన వివరాలు అందరినీ ఆలోచింపజేస్తున్నాయి. ఇవి కాఫీ ప్రియులకు ఆందోళన కలిగించేలా ఉన్నాయి. మనం కొత్త ఉత్సాహం కోసం కాఫీని తాగుతుంటాం. అయితే ఇది మన మెదడుపై తీవ్ర ప్రభావం చూపుతుందని బెంగళూరులోని సాక్రా వరల్డ్ హాస్పిటల్ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ ఎం రవికుమార్ హెచ్చరించారు. ఆయన ‘హిందుస్తాన్ టైమ్స్’తో మాట్లాడుతూ ‘కాఫీ’తో వచ్చే సైడ్ ఎఫక్ట్స్కు సంబంధించిన వివరాలను తెలియజేశారు.తరచుగా కాఫీ తాగితే, అది మెదడులోని ‘గ్రే మ్యాటర్’ పరిమాణాన్ని తగ్గించే అవకాశం ఉందని, ఫలితంగా ఒత్తిడి నుండి మెదడు కోలుకోవడం కష్టమవుతుందని, అంతేకాకుండా, కెఫీన్ ప్రభావం సుమారు 12 గంటల వరకు ఉండి, గాఢ నిద్రకు ఆటంకం కలిగిస్తుందని డాక్టర్ రవికుమార్ హెచ్చరించారు. ఇటువంటి స్థితిలో మెదడుకు కావాల్సిన విశ్రాంతి దొరకక క్రమంగా ‘బ్రెయిన్ ఫాగ్’ వంటి సమస్యలకు దారితీస్తుందన్నారు.మనం తీసుకునే ఆహారంలోని కాల్షియం, ఐరన్ వంటి ముఖ్యమైన ఖనిజాలు శరీరానికి అందకుండా చేయడంలో కాఫీ ‘పోషకాల దొంగ’గా మారుతుందని డాక్టర్ రవికుమార్ పేర్కొన్నారు. కాఫీలోని కెఫీన్, టానిన్లు పేగుల్లో పోషకాల శోషణను అడ్డుకుంటాయని, ఫలితంగా ఎముకల సాంద్రత తగ్గిపోవడం, రక్తహీనత వంటి సమస్యలు తలెత్తుతాయన్నారు. అలాగే ఖాళీ కడుపుతో కాఫీ తాగడం వల్ల గ్యాస్ట్రిక్ యాసిడ్ ఉత్పత్తి పెరిగి, కడుపు లోపలి పొరలు దెబ్బతినే అవకాశం ఉందని, ఇది జీర్ణక్రియపై దీర్ఘకాలికంగా ప్రతికూల ప్రభావం చూపుతుందని ఆయన వివరించారు.అతిగా కాఫీ తాగడం వల్ల శరీరంలో ‘కార్టిసాల్’ అనే ఒత్తిడి హార్మోన్ స్థాయిలు పెరుగుతాయి. ఇది మానసిక ఒత్తిడికే కాకుండా, చర్మ సమస్యలకు కూడా దారితీస్తుంది. ముఖ్యంగా మొటిమలు రావడం, చర్మం తన బిగుతును కోల్పోయి, త్వరగా వృద్ధాప్య ఛాయలు కనిపించడం లాంటివి జరుగుతాయని డాక్టర్ రవికుమార్ తెలిపారు. మహిళల విషయంలో ఇది మరింత ఆందోళనకరంగా మారుతుందని, అధిక కెఫీన్ వినియోగం వల్ల నెలసరి క్రమం తప్పడమే కాకుండా, హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటుంది. దీనివల్ల ఆందోళన, గుండె దడ లాంటి లక్షణాలు కూడా కనిపిస్తాయన్నారు.సాధారణంగా చాలామంది బరువు తగ్గడానికి కాఫీ సహాయపడుతుందని అనుకుంటారు. కానీ రోజుకు నాలుగు కప్పుల కంటే ఎక్కువ తాగితే అందుకు విరుద్ధమైన ఫలితాలు వస్తాయని డాక్టర్ కుమార్ తెలిపారు. అతిగా కాఫీ తాగడం వల్ల పొట్ట దగ్గర కొవ్వు చేరడం, జీవక్రియ సంబంధిత సమస్యలు తలెత్తుతాయన్నారు. అంతేకాకుండా నోటిలోని, కడుపులోని మంచి బ్యాక్టీరియా సమతుల్యత దెబ్బతిని ‘లీకీ గట్’ సమస్య వస్తుందన్నారు. ఫలితంగా తిన్న ఆహారం పడకపోవడం, కడుపు ఉబ్బరం లాంటి ఇబ్బందులు ఎదురవుతాయి. అందుకే కాఫీని పరిమితంగా తీసుకుంటేనే ఆరోగ్యకరమని డాక్టర్ ఎం రవికుమార్ సూచిస్తున్నారు.ఇది కూడా చదవండి: ట్రంప్ ‘టారిఫ్’ పిడుగు: మరో దేశంపై ప్రతీకారం? -
మెనోపాజ్ టైంలో 'బ్రెయిన్ఫాగ్' వస్తుందా..?
ఒక వయసు వచ్చాక మహిళల్లో గర్భధారణలు పూర్తిగా ఆగిపోవడానికి చిహ్నంగా రుతుక్రమం ఆగడమన్నది చాలా సాధారణం. ఇలా పీరియడ్స్ రావడం ఆగిపోవడాన్ని డాక్టర్లు ‘మెనోపాజ్’గా చెబుతుంటారు. హార్మోన్ల మార్పులతో ఇలా మెనోపాజ్ ఆగడానికి ముందుగా మహిళల్లో చాలా రకాల ప్రతికూల లక్షణాలు కనిపిస్తుంటాయి. అందులో ఒంటి నుంచి వేడి ఆవిర్లు వస్తుండే హాల్ ఫ్లషెస్, మూడ్స్ త్వరగా మారిపోతూ ఉండటం (మూడ్ స్వింగ్స్), పీరియడ్స్ పూర్తిగా ఆగిపోయే ముందు క్రమబద్ధంగా రాకపోవడం (ఇర్రెగ్యులర్ పీరియడ్స్)... ఇవన్నీ సాధారణం. అయితే వీటితోపాటు ‘బ్రెయిన్ ఫాగ్’ అనే లక్షణం కూడా చాలా నిశ్శబ్దంగా కనిపిస్తుందంటున్నారు నిపుణులు. అంతేకాదు... ఈ లక్షణాన్ని మెనోపాజ్కు సంబంధించినది కాకపోవచ్చంటూ కొందరు అయోమయానికి గురికావడం కూడా సహజమంటున్నారు. మెనోపాజ్కు ముందర నిశ్శబ్దంగా వచ్చే ఈ ‘బ్రెయిన్ఫాగ్’ వివరాలేమిటో సవివరంగా చూద్దాం.!.నిజానికి బ్రెయిన్ ఫాగ్ అనేది గతంలో కరోనా వైరస్ విజృంభించాక... కోవిడ్–19 తాలూకు అనంతర దీర్ఘకాలిక దుష్ప్రభావాలలో ఒకటిగా చెబుతూ వెలుగులోకి వచ్చింది. ఈ ‘బ్రెయిన్ ఫాగ్’ దశలో మెదడు అయోమయానికి గురికావడం, మనసుకు మబ్బులు పట్టినట్లుగా మందకొడిగా ఉండి΄ోవడం, ఆలోచనల్లో స్పష్టత లేకుండా ఉండటం, ఏదీ స్పష్టంగా అనిపించక΄ోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. వాతావరణంలో మంచు బాగా కమ్మినప్పుడు చూడటానికి ఎదుటి దృశ్యం గోచరించడంలో ఉండే అస్పష్టతలాగానే... మనసుకు లేదా మెదడుకు అదే మంచు ఆవరిస్తే ఆలోచనల్లో, భావాల్లో ఎలాంటి అయోమయంగా / అస్పష్టతతో ఉంటాయో తెలియజెప్పేందుకే ఈ బ్రెయిన్ ఫాగ్ అనే పదం ఉపకరిస్తుంది. ఎందుకిలా జరుగుతుందంటే... రుతుస్రావం ఆగి΄ోయే ముందుగా మహిళల్లో స్రవించే చాలా రకాల హార్మోన్లు... వీటిల్లోనూ మరీ ముఖ్యంగా ఈస్ట్రోజెన్, ్ర΄ోజెస్టరాన్ వంటివి బాగా తగ్గడంతో హార్మోన్లలో అసమతౌల్యత ఏర్పడుతుంది. ఇవి కేవలం ప్రత్యుత్పత్తి కోసమే కాకుండా మెదడు సరిగా పనిచేయడంలో కూడా బాగా ఉపకరిస్తుంటాయి. ఉదాహరణకు ఈస్ట్రోజెన్ అన్న హార్మోన్ మెదడులోని నాడీ కణాల మధ్య కమ్యూనికేషన్ నెరపుతుంటుంది. అలాగే మెదడులో స్రవించే రసాయనాలైన సెరటోనిన్, డోపమైన్ వంటి న్యూరోట్రాన్స్మిట్టర్లు తమ బాధ్యతలను నెరవేర్చడంలోనూ ఈస్ట్రోజెన్ తగిన భూమికను పోషిస్తుంది. ఈ హార్మోన్ తగ్గడంతో ప్రత్యుత్పత్తి వ్యవస్థ పనితీరు ఆగడం ఎలాగూ జరిగేదే అయినా దాంతోపాటు మెదడులోని కార్యకలా΄ాలూ ప్రభావితమవుతాయి. దాంతో మెదడు ఆకృతిలో కూడా కొంతలో కొంత మార్పు తప్పనిసరిగా వస్తుంటుందని ఆధునిక శాస్త్రపరిశోధనలు వెల్లడిస్తున్నాయి. ఉదాహరణకు ఫ్రంటల్ కార్టెక్స్, హిపోక్యాంపస్ వంటివి ఉన్న చోటు నుంచి కాస్తంత పక్కకు జరగడం వంటివి. ఈ కారణంగా కొందరు మహిళల్లో వారి జ్ఞాపకశక్తిపైనా అలాగే మూడ్స్లో మార్పుల పైనా ప్రభావం పడుతుందని కొన్ని అధ్యయనాల్లో తేలింది. నిద్రపైనా దుష్ప్రభావాలు... ఈ బ్రెయిన్ఫాగ్ తాలూకు దుష్ప్రభావాలు మెనోపాజ్ వచ్చిన మహిళల నిద్రపైనా పడతాయి. దాంతో వాళ్లు తరచూ నిద్రాభంగానికి గురవుతుండటం జరుగుతుంది (ఒంట్లోంచి ఆవిరులు వస్తుండే హాట్ ఫ్లషెస్, రాత్రిళ్లు తీవ్రంగా చెమటలు పట్టే నైట్ స్వెట్టింగ్ వంటి లక్షణాలు కూడా మహిళల్లో నిద్రలేమి కారణమవుతుంటాయి). ఈ నిద్రలేమి తిరిగి మళ్లీ మెదడును మందకొడిగా చేయడానికి కారణమవుతుంటుంది. చికిత్స...బ్రెయిన్ఫాగ్ లక్షణాలు చాలా తీవ్రంగా ఉన్న మహిళలకు వాళ్లలో తగ్గిన హార్మోన్లను భర్తీ చేసే ‘హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ’తో లక్షణాలు అదుపులోకి వస్తాయి. అయితే వాళ్ల సమస్యలకు ఇతరత్రా వేరే కారణాలేవీ లేవని నిర్ధారణ చేసుకున్న తర్వాతే ఈ హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ (హెచ్ఆర్టీ) ఇస్తారు. బ్రెయిన్ఫాగ్లో కనిపించే లక్షణాలు...∙దేనిపైనా ఏకాగ్రత నిలవకపోవడం లేదా ఏదైనా విషయంపై దృష్టి కేంద్రీకరించడంలో ఇబ్బంది కలగడం. మనుషుల, ప్రదేశాల పేర్లూ, కొన్ని పదాలు ఠక్కుమని స్ఫురించక΄ోవడం లేదా మరచిపోవడం. మనం చేయాల్సిన పనులు, తదుపరి షెడ్యూల్స్ మరచిపోతూ ఉండటం. తీవ్రమైన నిస్సత్తువ లేదా బాగా మందకొడిగా అనిపించడం. సాఫీగా ఆలోచింకలేకపోవడం, మునపటిలా కాకుండా ఏదైనా ఆలోచనల్లో స్పష్టత వచ్చేందుకు తీవ్రంగా ఇబ్బందిపడాల్సి రావడం. అధిగమించడం ఎలా...మెనోపాజ్లో కనిపించే ఈ బ్రెయిన్ఫాగ్ను అధిగమించడానికి మంచి జీవనశైలి బాగా ఉపయోగపడుతుంది. కంటినిండా నిద్ర΄ోవడం, మంచి గాఢమైన, నాణ్యమైన నిద్రతోనూ, అన్ని రకాల పోషకాలతో కూడిన మంచి సమతులాహారంతోనూ, క్రమంతప్పకుండా చేసే వ్యాయామాలతో పాటు ఎలాంటి మానసిక ఒత్తిడి లేకుండా హాయిగా కాలం గడుపుతూ, తమను తాము బిజీగా పెట్టుకుంటూ నిత్యం మంచి పుస్తకాలు చదవడం, గళ్లనుడికట్టు లేదా క్లిష్టమైన పజిల్స్ సాధించడం లాంటి ‘మెంటల్ ఎంగేజ్మెంట్’ కార్యకలాపాలతో గడపడం వల్ల ఈ తరహా బ్రెయిన్ఫాగ్ లక్షణాలు చాలావరకు తగ్గుతాయి.మతిమరపు వస్తుందా అన్నంత ఆందోళన... బ్రెయిన్ఫాగ్ తాలూకు ఈ లక్షణాలతో మెనోపాజ్ దశలో మహిళలకు తమకు మతిమరపు గానీ లేదా అలై్జమర్స్గానీ వస్తున్నాయా అంటూ తీవ్రమైన ఆందోళనకు గురవుతుంటారు. అయితే అదృష్టవశాత్తూ ఇవేవీ అలై్జమర్స్లాంటి తీవ్రమైన మతిమరపులాంటి సమస్యలను తెచ్చిపెట్టవన్నది వైద్య నిపుణుల మాట. అంతేకాదు... బ్రెయిన్ఫాగ్తో కనిపించే ఈ లక్షణాన్నీ చాలావరకు తాత్కాలికమేనంటున్నారు. (చదవండి: అమ్మ పాలతో అదనంగా...కాంప్లిమెంటరీ ఫుడ్గా..!) -
మళ్లీ మళ్లీ వస్తున్నాయి
నా వయస్సు ముప్పై ఐదు సంవత్సరాలు. నాకు మళ్లీ మళ్లీ మూత్రనాళ ఇన్ఫెక్షన్లు వస్తున్నాయి. డాక్టర్ మందులు ఇస్తే తగ్గుతుంది. కాని, కొంతకాలానికి మళ్లీ వస్తుంది. ఈ మధ్య దగ్గు వచ్చినప్పుడు లేదా బలంగా నవ్వినప్పుడు మూత్రం లీక్ అవుతున్నట్టు అనిపిస్తోంది. దీనికి కారణం ఏమిటి? సరైన పరీక్షలు, చికిత్స ఏమిటో చెప్పండి.– రాధ, అనంతపురం. మీకు తరచూ మూత్రనాళ ఇన్ఫెక్షన్లు వస్తున్నాయని, ప్రతిసారి ఒకే రకమైన మందులు వాడితే శరీరానికి అవి అలవాటు పడిపోయే అవకాశం ఉంటుంది. దాంతో మందులు తక్కువగా పనిచేయడం, ఇన్ఫెక్షన్లు మళ్లీ మళ్లీ రావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి సారి ఇన్ఫెక్షన్ ఎందుకు వస్తోంది అనే కారణాన్ని తెలుసుకోవడం చాలా అవసరం. వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం చాలా ముఖ్యం. నీరు తక్కువగా తాగడం, మలబద్ధకం, దగ్గు ఎక్కువగా ఉండడం, మూత్రాన్ని ఎక్కువసేపు ఆపుకోవడం ఇవన్నీ సమస్యను పెంచుతాయి. రోజూ సరిపడా నీరు తాగాలి. మజ్జిగ, పండ్ల రసాలు తీసుకోవడం మంచిది. మసాలా, కారం ఎక్కువగా ఉన్న ఆహారం, చల్లని పానీయాలు, టీ, కాఫీ తగ్గించాలి. మలబద్ధకం, దగ్గు ఉంటే వాటికి కూడా చికిత్స తీసుకోవాలి.దగ్గు లేదా నవ్వినప్పుడు మూత్రం లీక్ అవడం అనేది మూత్రాశయ కండరాల బలహీనత వల్ల కావచ్చు. దీనివల్ల మూత్రాశయం, మూత్రనాళం సరిగ్గా పనిచేస్తున్నాయా లేదా తెలుసుకోవడానికి ఒక ప్రత్యేక పరీక్ష ఉంటుంది. ఆ పరీక్ష ద్వారా మూత్రాశయంలో ఒత్తిడి ఎలా ఉంది, కండరాల పని తీరు ఎలా ఉంది అనే విషయం స్పష్టంగా తెలుస్తుంది. ఈ పరీక్షను సాధారణంగా బయట చికిత్స విభాగంలోనే చేస్తారు. పెద్ద నొప్పి ఉండదు, అవసరమైతే మత్తు మందుతో చేస్తారు. అదే రోజు ఇంటికి వెళ్లొచ్చు. అయితే, ఈ పరీక్ష చేయడానికి ముందు ప్రస్తుతం ఇన్ఫెక్షన్ లేదని నిర్ధారించాలి. ఒకవేళ ఇన్ఫెక్షన్ ఉంటే ముందుగా దానికి మందులు ఇవ్వాలి. పరీక్ష ఫలితాల ఆధారంగా కండరాల వ్యాయామాలు, మందులు లేదా ఇతర చికిత్స అవసరమా అనే నిర్ణయం తీసుకుంటారు. కాబట్టి మళ్లీ మళ్లీ ఇన్ఫెక్షన్లు వస్తున్నాయి, మూత్రం లీక్ అవుతోంది అనిపిస్తే ఆలస్యం చేయకుండా వైద్యుణ్ని సంప్రదించి, అవసరమైన పరీక్షలు చేయించుకోవడం మంచిది. అలా చేస్తే సమస్యకు సరైన చికిత్స తీసుకుని, సాధారణ జీవితాన్ని కొనసాగించవచ్చు.నా వయస్సు నలభై ఎనిమిది సంవత్సరాలు. గర్భసంచి గడ్డల కారణంగా గర్భసంచి తీసివేయాలని డాక్టరు చెప్పారు. కాని, అండాశయాలను మాత్రం తీసివేయొద్దు అని అంటున్నారు. అండాశయాలు తీసివేస్తే బరువు పెరుగుతుందని కూడా చెప్పారు. ఇందులో సరైన నిర్ణయం ఏంటి?– లలిత, శ్రీకాకుళం. గర్భసంచి గడ్డల వల్ల శస్త్రచికిత్స చేస్తున్నప్పుడు అండాశయాలను తీసివేయాలా లేక ఉంచాలా అన్నది చాలా ముఖ్యమైన విషయం. ఇది ప్రతి మహిళలో ఒకేలా ఉండదు. మీ వయస్సు, సమస్య స్వభావం, కుటుంబంలో క్యాన్సర్ చరిత్ర, స్కాన్ నివేదికలు ఇవన్నీ చూసి వైద్యులు నిర్ణయం తీసుకుంటారు. క్యాన్సర్ అనుమానం ఉన్నప్పుడు, లేదా భవిష్యత్తులో క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉన్నప్పుడు, సాధారణంగా అండాశయాలను కూడా తీసివేయాలని సూచిస్తారు. అలా చేస్తే భవిష్యత్తులో మళ్లీ ఆపరేషన్ అవసరం లేకుండా ఉంటుంది. కానీ క్యాన్సర్ ప్రమాదం లేని పరిస్థితుల్లో, అండాశయాలను ఉంచితే కొన్ని ప్రయోజనాలు ఉంటాయి. అండాశయాలు ఉంచితే శరీరంలో సహజ హార్మోన్లు ఉత్పత్తి అవుతూనే ఉంటాయి. దీని వల్ల ఒక్కసారిగా వేడి దడలు, ఎక్కువ చెమటలు, మూడ్ మార్పులు, డిప్రెషన్ , జ్ఞాపకశక్తి తగ్గడం వంటి సమస్యలు తక్కువగా ఉంటాయి. అలాగే ఎముకలు బలహీనపడటం, గుండె సమస్యలు వచ్చే ప్రమాదం కూడా కొంతవరకు తగ్గుతుంది. అండాశయాలు తీసివేస్తే నెలసరి ఆగిపోయిన తర్వాత వచ్చే లక్షణాలు ముందుగానే వస్తాయి. వేడి దడలు, నిద్రలేమి, తలనొప్పులు, ఎముకల నొప్పులు, ఎముకలు పలుచబడటం వంటి సమస్యలు కనిపించవచ్చు. కొందరిలో బరువు పెరగడం కూడా జరుగుతుంది. అయితే ఇది ప్రతి ఒక్కరిలో తప్పనిసరిగా జరుగుతుందనే కాదు. కొన్ని ఎంపిక చేసిన పరిస్థితుల్లో హార్మోన్ ప్రత్యామ్నాయ చికిత్స ఇవ్వడం ద్వారా ఈ సమస్యలను తగ్గించవచ్చు. మాత్రలు లేదా ప్యాచ్ల రూపంలో ఈ చికిత్స ఇస్తారు. అయితే ఇది అందరికీ సరిపోదు. వైద్యుడు పూర్తిగా పరిశీలించిన తర్వాతే సూచిస్తారు. కొన్ని అరుదైన సందర్భాల్లో అండాశయాలు ఉంచినా, తరువాత పొత్తికడుపు నొప్పి లేదా ఇతర సమస్యల వల్ల మళ్లీ శస్త్రచికిత్స అవసరం రావచ్చు. అలాగే ఎండోమెట్రియోసిస్ లాంటి సమస్యలు ఉన్నప్పుడు అండాశయాలు ఉంచడం వల్ల నొప్పి కొనసాగవచ్చు. కాబట్టి గర్భసంచి శస్త్రచికిత్స సమయంలో అండాశయాలు తీసివేయాలా వద్దా అన్న నిర్ణయం మీ వైద్యునితో పూర్తిగా చర్చించి తీసుకోవాలి. మీకు ఉన్న సమస్య, భవిష్యత్తు ప్రమాదాలు, లాభనష్టాలు అన్నీ తెలుసుకుని నిర్ణయం తీసుకుంటేనే దీర్ఘకాలంలో మేలు జరుగుతుంది. -
క్యాన్సర్ 4వ స్టేజ్.. ఏకంగా 20 కిలోల కణితి!
ఢిల్లీలోని ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్ (AIIMS) వైద్యులు అరుదైన ఆపరేషన్ను విజవంతంగా ముగించారు. 43 ఏళ్ల పెద్దప్రేగు క్యాన్సర్ రోగి కడుపునుంచి ఏకంగా 19.9 కిలోల కణితిని తొలగించారు. మల్టీ ఆమెకు కొత్త జీవితాన్ని ఇచ్చినట్లు విజయవంతమైన శస్త్రచికిత్సను ఎయిమ్స్ ప్రకటించింది.పశ్చిమ బెంగాల్లోని దుర్గాపూర్కు చెందిన మున్మున్ను జూలై 2024లో ఉదర ఉబ్బరం (సాధారణం కంటే పెద్ద బొడ్డు)తో ఆసుపత్రికి తరలించారు. పాతికేళ్ల క్రితం, యూనిలేటర్ సాల్పింగో-ఊఫొరెక్టమీ (ఒక ఓవరీ, ఒక ఫెలోపియన్ ట్యూబ్ను) తొలగించారు.అలాగే స్టేజ్-4 పెద్దప్రేగు క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. పెల్విక్ ప్రాబల్యం ఉంది. అనేక ఆసుపత్రులను తిరిగి, పలు రౌండ్ల కీమోథెరపీ చేయించుకుంది. అయినా ఎలాంటి ఫలితం లేదు పైగా వ్యాధి పెరుగుతూనే ఉంది. కణితి అనేక ఉదర అవయవాలకు వ్యాపిస్తుండటంతో. 3-4 నెలలు ఎక్కువ బతకదని వైద్యులు అంచనా వేశారు. అయితు ఎయిమ్స్ ఢిల్లీలోని సర్జికల్ ఆంకాలజిస్ట్ ప్రొఫెసర్ ఎం.డి. రే నేతృత్వంలోని వైద్యుల బృందం జనవరి 12న విజయవంతంగా సైటోరేడక్టివ్ సర్జరీని నిర్వహించి, 19.9 కిలోల కణితిని తొలగించారు. జనవరి 15న శస్త్రచికిత్సతో పాటు HIPECని పూర్తి చేసి, ఆంకోసర్జికల్ నిర్వహణను పూర్తి చేసింది. ప్రస్తుతం ఆస్పత్తి డిశ్చార్జ్ అయ్యింది కోలుకుంటోంది. CT మరియు PET-CT స్కాన్ల ఆధారంగా, అంత పెద్ద కణితి ఆపరేషన్ ఒకేసారి చేస్తే రోగి తట్టుకోవడం కష్టమని భావించిన వైద్యులు రెండు దఫాలుగా దీన్ని పూర్తిచేశారు. పొట్టలోని కొన్ని భాగాలను అంటే. ట్రాన్స్వర్స్ పెద్దప్రేగులో మూడింట రెండు వంతులు, సిగ్మోయిడ్ పెద్దప్రేగు, ఓమెంటం, గర్భాశయం , రెండు ఫెలోపియన్ ట్యూబ్స్, కాలేయం కాప్యూల్, పెరిటోనియంను తొలగించామని డాక్టర్ రే చెప్పారు.ఇదీ చదవండి: ఫైబర్ ఎక్కువ తీసుకుంటే, ఏమవుతుందో తెలుసాసాధారణంగా కీమోథెరపీలా కాకుండా, హైపర్థెర్మిక్ ఇంట్రాపెరిటోనియల్ కీమోథెరపీలో -- కణితిని పూర్తిగా తొలగించిన తర్వాత, హీటెడ్ కీమోథెరపీ (41–43 డిగ్రీల సెల్సియస్)ని నేరుగా ఉదర కుహరంలోకి పంపించండం ద్వారా చికిత్స అందించారు. కణితులన్నీ తొలగించబడ్డాయని నిర్ధారించుకున్నాక, కంటికి కనిపించని సూక్ష్మ వ్యాధిని నిర్మూలించడానికి గంటన్నర పాటు HIPEC చికిత్స అందించారు.మొదటి శస్త్రచికిత్స జనవరి 12న, రెండోదిజనవరి 15న జరిగింది, ఐదు రోజులకు జనవరి 20న డిశ్చార్జ్ చేశామని డాక్టర్ చెప్పారు.శస్త్రచికిత్స తర్వాత, కణితులు లేకుండా కాలేయం,ప్రేగులు స్పష్టంగా కనిపించాయన్నారు.కొన్ని కోలన్ క్యాన్సర్ కేసులను నయం చేయవచ్చుపెద్దప్రేగు క్యాన్సర్ ఒకప్పుడు ప్రాణాంతక వ్యాధిగా భావించినప్పనటికీ కొన్ని కేసుల్లో నయం చేయ వచ్చ న్నారు. ఇప్పటికీ నయం చేయగలదని రే వివరించారు. నిపుణులైన సర్జన్ల సలహా లేకుండా మెటాస్టాటిక్ పెద్దప్రేగు క్యాన్సర్కు చికిత్స లేదని ప్రకటించకూడదని కూడా ఆయన పేర్కొన్నారు.ఇదీ చదవండి: వృద్ధాప్యాన్ని తిప్పికొట్టడం సాధ్యమే, కానీ రిస్క్ అంటున్న మస్క్ -
వృద్ధాప్యాన్ని తిప్పికొట్టడం సాధ్యమే, కానీ రిస్క్ అంటున్న మస్క్
టెస్లా అధినేత, స్పేస్ఎక్స్ సీఈఓ ఎలాన్ మస్క్ దావోస్లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం (WEF)లో అరంగేట్రం చేశారు. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన మస్క్, గురువారం 2026 WEF సదస్సులో కీలక వ్యాఖ్యలు చేశారు. బ్లాక్రాక్ సీఈఓ లారీ ఫింక్తో సంభాషణ సందర్భంగా, మానవుల్లో వృద్ధ్యాప్యాన్ని తిప్పికొట్టే అవకాశం ఉందంటూ ఎలాన్ మాస్క్ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. లారీ ఫింక్తో జరిగిన చర్చలో మాస్క్ వృద్ధాప్యం అనేది చాలా సులభంగా పరిష్కరించగల సమస్యే కానీ రిస్క్తో కూడుకున్నదన్నారు. వృద్ధాప్యానికి కారణమేమిటో మనం గుర్తించినపుడు ఏజింగ్ రివర్స్ ప్రక్రియ సులభ మవుతుందని తాను భావిస్తున్నా అన్నారు. వృద్ధాప్యాన్ని తిప్పికొట్టడం సాధ్యమే కానీ మరణానికి సామాజిక ప్రయోజనం ఉంది. అయితే ఇది అంత చిన్న విషయం కాదని ఎందుకంటే శరీరంలోని అన్ని కణాలు దాదాపు ఒకే రేటుతో వృద్ధాప్యానికి గురవుతాయి. బాడీలోని 35 ట్రిలియన్ కణాలన్నీ ఒకే వేగంతో వృద్ధాప్యానికి గురవు తాయని, దీని వెనుక ఒక ఖచ్చితమైన 'క్లాక్' (యంత్రాంగం) ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇది కనిపెడితే వృద్ధాప్యాన్ని అరికట్టడం సాధ్యమేనని చెప్పారు.సమాజానికి ముప్పుఅయితే ఏజ్ రివర్సింగ్ వల్ల సామాజిక సవాళ్లు, ఊహించని పరిణామాలు ఏర్పడతాయని కూడా ఆయన హెచ్చరించారు. వృద్ధాప్యం లేకపోతే కొత్త ఆలోచనలు రాకుండా సమాజం "స్తంభించిపోయే" (Ossification) ప్రమాదం ఉందని, మరణం అనేది సమాజంలో కొత్తదనం రావడానికి అవసరమని మస్క్ పేర్కొన్నారు.ఇదీ చదవండి: సెలబ్రిటీలను సైతం ఇన్స్పైర్ చేసిన 70 ఏళ్ల బామ్మదావోస్ సదస్సును గతంలో "బోరింగ్" అని విమర్శించిన మస్క్, మొదటిసారి ఈ వేదికపై ప్రసంగించడం విశేషం. దావోస్లో జరిగిన తన మొదటి WEFలో మస్క్ వయస్సు మార్పు , దీర్ఘాయువు గురించి మాట్లాడారు. అలాగే భవిష్యత్తులో మనుషుల కంటే రోబోలే ఎక్కువ ఉంటాయని, 2027 నాటికి టెస్లా రోబోలు మార్కెట్లోకి వస్తాయని మాస్క్ అంచనా వేశారు. అలాగే ఈ చర్చ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధానాలపై విమర్శలు గుప్పించారు.ఇదీ చదవండి: క్రూర హంతకుల జైలు ప్రేమ, పెళ్లి : 15 రోజుల స్పెషల్ పెరోల్ -
ప్రశాంతతనిచ్చే పశ్చిమోత్తానాసనం
టీనేజ్ అమ్మాయిల నుంచి నడి వయసు మహిళల వరకు.. ఒత్తిడి తగ్గించి, మానసిక ప్రశాంతతను పెం΄÷ందిస్తూ, వెన్నునొప్పిని నియంత్రించేలా చేస్తుంది పశ్చిమోత్తనాసనం. ఈ భంగిమ కూర్చుని చేస్తాం. ‘పశ్చిమ’ అంటే శరీరంలోని వెనుక భాగం,‘ఉత్తాన’ అంటే పూర్తిగా వంగడం, ‘ఆసనం’ అంటే భంగిమ. ఈ ఆసనం లో తల నుంచి మడమల వరకు ఉన్న వెనుక భాగం మొత్తం బాగా లాగబడుతుంది. ఈ ఆసనం వెన్నెముకను దృఢంగా చేసి, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అలాగే మనస్సుకు శాంతిని కలిగించి, ఒత్తిడిని తగ్గిస్తుంది. ఉదయం లేదా సాయంత్రం రోజూ పది నిముషాలు ఈ ఆసనాన్ని సాధన చేస్తే మెరుగైన ప్రయోజనాలు పొందవచ్చు. కంప్యూటర్తో పని చేసే వాళ్లు వెన్ను, మెడ, తలనొప్పి వంటి సమస్యలతో బాధపడుతుంటారు. ఇలాంటి వారు సులువైన, తేలికైనా పశ్చిమోత్తనాసనం ఆసనం ద్వారా ప్రయోజనం పొందవచ్చు.– పి. అనిత, యోగా ట్రైనర్ -
వెయిట్ ట్రయినింగ్ బ్రెయిన్కూ బెటరే
కండరాల బలం కోసం స్ట్రెంత్ ట్రయినింగ్ లేదా వెయిట్ ట్రయినింగ్ తప్పనిసరి అనే విషయం చాలాసార్లు వినే ఉంటాం. అయితే స్ట్రెంత్ ట్రయినింగ్ అనేది మజిల్ లాస్ను రివర్స్ చేయడమే కాదు మెదడు ఆరోగ్యానికి కూడా ఉపకరిస్తుందని, వయసు పెరిగినా మెదడు చురుగ్గా పనిచేసేలా చేస్తుందని తాజా అధ్యయనం తెలియజేస్తోంది. ఈ అధ్యయనాన్ని వాషింగ్టన్ యూనివర్శిటీలోని ఓ పరిశోధక బృందం నిర్వహించింది.1,164 మందిపై...యాభై ఐదు లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉన్న 1,164 మంది స్త్రీ, పురుషులపై వాషింగ్టన్ పరిశోధక బృందం ఈ అధ్యయనం నిర్వహించింది. వీరిని రెండు గ్రూపులుగా విభజించారు. ఒక గ్రూప్కి వారానికి రెండుసార్లు వెయిట్ ట్రయినింగ్ చేయడం అలవాటు. రెండో గ్రూప్నకు ఈ అలవాటు లేదు, మొదటి గ్రూపు వారు జ్ఞాపకశక్తి పరీక్షలో మెరుగ్గా రాణించారు. వెయిట్ ట్రయినింగ్ చేయని వారితో పోల్చితే చేసేవారు ఆరోగ్యకరమైన మెదడు న్యూరాన్లను కలిగి ఉన్నారు.స్ట్రెంత్ ట్రయినింగ్ అంటే?డంబెల్స్, బార్బెల్స్, ఒక మోస్తరు బరువులు, రెసిస్టెంట్ బ్యాండ్, బాడీ వెయిట్ (ఉదా: పుషప్లు), వాటర్బాటిల్స్, బ్రిక్స్తో చేసే వ్యాయామం.మతిమరుపునకు దూరంగా...వెయిట్ ట్రయినింగ్ అనేది మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి వివిధ న్యూరోప్రొటెక్టివ్, యాంటీ ఇన్ఫ్లమేటరీ కారకాలను ఉత్పత్తి చేస్తుందని, డిమెన్షియా (మతిమరుపు)ను దూరం చేస్తుందని చెబుతున్నారు పరిశోధకులు.ఉపయోగాలుమెదడుపై వెయిట్ ట్రయినింగ్ ఏ రకంగా ప్రభావం చూపుతుందంటే...ఏకాగ్రతను పెంచుతుందిజ్ఞాపకశక్తిని వృద్ధి చేస్తుందిఒత్తిడిని తగ్గిస్తుందినాడుల రక్షణకు ఉపయోగపడుతుంది -
8 కిలోల వెయిట్ తగ్గిన టెకీ, కారణం తెలిస్తే షాకవుతారు!
భారతదేశ టెక్ రాజధాని బెంగళూరు భారీ ట్రాఫిక్తో అల్లాడిపోతోంది. నెదర్లాండ్స్కు చెందిన లొకేషన్ టెక్నాలజీ కంపెనీ టామ్టామ్ ప్రచురించిన తాజా ట్రాఫిక్ ఇండెక్స్ ప్రకారం, 2025లో బెంగళూరు ప్రపంచంలోనే రెండవ అత్యంత రద్దీ నగరంగా పేరుపొందింది. దీంతో సామాన్య ప్రజలతో పాటు, కార్పొరేట్ ఉద్యోగులు పడుతున్న కష్టాలు అన్నీ ఇన్నీ కావు. అయితే ట్రాఫిక్ మూలంగా విపరీతంగా బరువు తగ్గిపోయాను అని ఒక టెకీ వాపోతే, దాని ఆరోగ్యం మెరుగైందని మరొకరు వాదించిన వైనం నెట్టింట వైరల్గా మారింది.నగర ట్రాఫిక్, వ్యక్తిగత ఆరోగ్య ప్రభావంపై రెడ్డిట్ పోస్ట్ అందరి దృష్టిని ఆకర్షించింది. దీని ప్రకారం వైట్ఫీల్డ్ నుండి కోరమంగళకు ఒకప్పుడు ఒక ప్రొఫెషనల్ రోజువారీ ప్రయాణం దాదాపు 90 నిమిషాలు. అంటే గంటన్నర. ఇలా రోడ్డుపై ఎక్కువ గంటలు ఉండటం వల్ల తన లైఫ్ స్టైల్. ఆరోగ్యం, దెబ్బతిన్నదని ఆయన రాసుకొచ్చారు. పని ఒత్తిడితో డెస్క్ దగ్గరే భోంచేయడంతో కనీసం వ్యాయామం కూడా లేకుండా పోయిందని వెల్లడించాడు. రోజులో ఎక్కువ భాగం అయితే డెస్క్ వద్ద లేదా ట్రాఫిక్లో కూర్చుని గడపాల్సి వచ్చేది. కాలక్రమేణా, ఒత్తిడి పెరిగిపోయిందట. వ్యాయామమే లేదని చెప్పాడు.బెంగళూరు ట్రాఫిక్ మారలేదుగానీ ఆరోగ్యంపై ప్రభావం మాత్రం స్పష్టంగా ఉందని తెలిపారు. విశ్రాంతి హృదయ స్పందన రేటు 82 నుండి 64కి తగ్గిందని,బరువు తగ్గడానికి ఎలాంటి ప్రయత్నం చేయకుండానే దాదాపు ఎనిమిది కిలోల బరువు తగ్గానని పేర్కొన్నాడు. అయితే ప్రతి వారంలో ఆఫీసుకు వెళ్లే బదులు, వారానికి మూడు రోజులు వర్క్ ఫ్రం హోం విధానంకాస్త ఊరటిచ్చిందని పేర్కొన్నారు. ఈ వెసులుబాటు కారనంగా రోజూ ఉదయం జిమ్కెళ్లడం, ఫుడ్డెలివరీపై ఆధారపడకుండా సమీపంలోని రెస్టారెంట్లకు నడవడం లాంటివి రోజువారీ దినచర్యగా సహజంగా అలవడ్డాయని చెప్పుకొచ్చారు.ఇదీ చదవండి: చిన్నారిని ఎత్తుకెళ్లి బావిలో పడేసిన కోతి, కాపాడిన డైపర్దీంతో చాలామంది తమ అనుభవాలను కూడా పంచుకున్నారు. “నేను ఒక సంవత్సరం పాటు బస్సులో ప్రయాణించాను. రెండు స్టాప్లలో బస్సులు మారుతూ 45 నిమిషాల ఒకవైపు ప్రయాణం చేసేవాడిని. ఆసమయంలో నిజంగా ఆరోగ్యంగా, రిలాక్స్గా ఉన్నాను.” అని ఒకరు వ్యాఖ్యానించగా దీన్ని కొంతమంది విభేదించారు. బెంగళూరు వంటి నగరాలకు ఇంటి నుంచి పనిచేసే విధానం మంచిదని వ్యాఖ్యానించారు. ప్రయాణానికి వెచ్చించే సమయానికి బదులుగా జిమ్కు వెళ్లవచ్చిన సూచించారు.ఇదీ చదవండి: శవం సడెన్గా కాళ్లు పైకి లేపింది...ఇదిగో వీడియో! -
పెరిమెనోపాజ్ సమయంలో బరువు తగ్గాలంటే...!
సాధారణ వ్యక్తులకు బరువు తగ్గడమే కష్టమైన టాస్క్ అనుకుంటే..అందులోనూ ఇలా పెరిమెనోపాజ్ దశలో ఉన్న మహిళలకు మరింత ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే ఆ సమయంలో మూడ్ స్వింగ్స్ సవ్యంగా ఉండవు. హర్మోన్ల మార్పులతో ఒక రకమైన చికాకు, ఒత్తిడి వంటివి ఎదుర్కొంటారు. దాంతో కొందరికి విపరీతమైన ఆకలి వేసేస్తుంటుంది కూడా. అందువల్ల ఆ టైంలో బరువుని అదుపులో ఉంచడం అనేది మాములు విషయం మాత్రం కాదు. అయితే దాన్ని ఈజీగా హ్యాండిల్ చేస్తూ వెయిట్లాస్ అవ్వొచ్చని చెబుతోంది స్వతహాగా ఫోటోగ్రాఫర్ అయిన ఈ ఇన్ఫ్లుయొన్సర్. అదెలాగో ఆమె మాటల్లోనే సవివరంగా తెలుసుకుందామా..!.పెరిమెనోపాజ్ సమయంలో బరువు తగ్గడం ఎలాగో అందుకు హెల్ప్ అయ్యే చిట్కాల గురించి షేర్ చేసుకున్నారు ఫోటోగ్రాఫర్ . ఆమె ఆ సమయంలోనే తాను ఆరు నెలల్లో 11 కిలోలు వరకు తగ్గానని చెప్పుకొచ్చారామె. ఈ సీక్రెట్ ఏంటో ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో షేర్ చేసుకున్నారామె. మొదట్లో పెరిమెనోపాజ్లో ఉన్నప్పుడు బరువు తగ్గాను అని చెప్పడానికి చాలా ఇబ్బంది పడ్డా..కానీ ఇప్పుడు గట్టిగా అరిచి చెబుతా. ఎందుకంటే..ఆ సమయంలో తన శరీరం చాలా లావుగా అసహస్యంగా ఉండటంతో..తనను తాను గుర్తించడం మానేసిన దారుణమైన పరిస్థితని చెప్పుకొచ్చారామె. అయితే లాక్డౌన్ సమయం నుంచి ఇప్పటి వరకు బరువుని అదుపులో ఉంచేలా చక్కటి ఆహారాన్ని తీసుకుని సత్ఫలితాలు పొందానని ఆనందంగా వెల్లడించారామె. భవిష్యత్తులో 50 ఏళ్లు నిండిన నా ఆహార సంబంధాన్ని ఆరోగ్యప్రదంగానే ఉంచుకుంటానంటోంది. తాను ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉండే ఆహారాలు తినడం, బరువులు ఎత్తడం, చిరుతిళ్లకు దూరంగా ఉండటం అలవాట్లను తన డైట్లో భాగం చేసుకున్నట్లు చెప్పుకొచ్చారు. అంతేగాదు ఆ సమయంలో బరువు తగ్గాలంటే మన జీవనశైలి ఎలా ఉండాలో కూడా వివరించిందామె. బరువులు ఎత్తడం..కండర ద్రవ్యరాశికి, జీవక్రియలు మెరుగుపడేందుకు వారానికి నాలుగు సార్లు బరువులు ఎత్తడం వంటివి చేసేదాన్ని అని తెలిపారామె.వాకింగ్అడుగుల సంఖ్యను రోజు రోజుకి పెంచుతూ అలా పదివేల అడుగులు వేసేలా సెట్ చేసుకున్నారట ఆమె. దీంతోపాటు వారానికి రెండుసార్లు యోగా సెషన్లకు హాజరయ్యేదాన్ని అని తెలిపింది.ప్రోటీన్కి ప్రాధాన్యత..ఎక్కువసేపు కడుపు నిండిన అనుభూతిని ఇచ్చే ఆరోగ్యకరమైన ప్రోటీన్లను ఎంపిక చేసుకుని మరి తినేదాన్ని అని చెప్పారు.చిరుతిళ్లుకు చెక్..సంతృప్తిగా తినడం ప్రారంభించడంతో..చిరుతిళ్ల జోలికి వెళ్లిపనే తప్పిందని చెప్పింది. తన అల్పాహారంలో అదనపు కేలరీల ప్రధాన మూలం తన బరువు పెరిగేందుకు కారణమని భావించే వాటికి దూరంగా ఉన్నానని వివరించింది.సహజసిద్ధమైన వాటిని తీసుకుంటూ.. ఫిట్నెస్ యాప్తో తన ఆరోగ్యాన్ని ట్రాక్ చేయడం ప్రారంబించారమె. అలాగే వెయిట్లాస్ ప్రక్రియలో ఇతరులు సహాయం తీసుకుంటూ మనలో మార్పులు వచ్చాయో లేదా అడగి తెలుసుకోవడం తదితరాలను చేయాలని చెప్పొకొచ్చింది ఫోటోగ్రాఫర్ కింబర్లీ ఎస్పినెల్. View this post on Instagram A post shared by Kimberly Espinel (@thelittleplantation) గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం(చదవండి: పోగొట్టుకున్న రూ. 30 కోట్లు తిరిగి సంపాదించా..! కానీ అతి విలువైన..) -
అధ్వాన్నంగా అమెరికాలో ఆరోగ్యం : ఎండోస్కోపీ కోసం 6 వారాలు
టెస్లా, స్పేస్ఎక్స్ అధినేత, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ఆధీనంలోని సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లోని ఒక ప్రధాన ఉద్యోగి ట్వీట్ వైరల్గా మారింది. అమెరికాలో H1b ఫీజు పెంపుతో, అమెరిలో వైద్యం అందని ద్రాక్ష మారుతోందని అక్కడి నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిపుణులైన విదేశీ డాక్టర్లు అందుబాటులో లేని కారణంగా మెడికల్ డెసర్ట్లు ఇంకా పెరుగుతాయన్న హెచ్చరికల నేపథ్యంలో టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఆధీనంలోని ఎక్స్ (ట్విటర్) ప్రొడక్షన్ హెడ్ చేసిన ట్వీట్ వైరల్గా మారింది.ఎక్స్ ప్రొడక్షన్ హెడ్ నికితా బియర్ తన ఆరోగ్యం గురించి తన ట్వీట్ ద్వారా ఒక అప్డేట్ ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఫ్రైడ్ చికెన్ తింటు న్నప్పుడు తనకు గొంతులో గాయమైందని, దీంతో తాను సరిగ్గా మాట్లాడలేక పోతున్నానని లేదా మింగలేకపోతున్నానని చెప్పారు. వైద్యులు ఎండోస్కోపీ చేయించు కోవాలని సలహా ఇచ్చారట. ఇక్కడే అసలు విషయం గురించి చెప్పారు. ముందు నష్టాన్ని అంచనా వేయడానికి చాలా వారాలు వేచి ఉండాలని తనకు సలహా ఇచ్చారని బియర్ పేర్కొన్నారు.ఎండోస్కోపీ పరీక్షకోసం అపాయింట్మెంట్ కోసం ప్రయత్నించగా , నాలుగు లేదా ఆరు వారాల తరువాతే మాత్రమే అని చెప్పడంతో షాక్ అవడం అతని వంతైంది. బియర్ ఈ అనుభవాన్ని “కాఫ్కా నవల” ను వర్ణిస్తూ రాసుకొచ్చారు. దీంతో ఈ పోస్ట్ వైరల్గా మారింది.అమెరికాలో ఆరోగ్య వ్యవస్థ ఇంత దారుణంగా ఉందా అనేచర్చకు దారి తీసింది.అమెరికన్ హెల్త్కేర్ వ్యవస్థకు సంబంధించి అనేకమంది విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా నిలిచిపోయిన ఉద్యోగ నియామకాలు, నిపుణుల కొరత, బీమా సంబంధిత ఆంక్షలు, అధిక ఖర్చులపై మాట్లాడారు. వీటి కారణంగానే సాధారణ రోగనిర్ధారణ విధానాలకు కూడా చాలా జాప్యం జరుగుతోందని మండిపడ్డారు.హాయిగా ఇండియా ట్రిప్ వేయండి! మరోవైపు బియర్ను భారతదేశంలో చికిత్స పొందాలని , అక్కడ ఆసుపత్రులలో రోగనిర్ధారణ పరీక్షలు చాలా తొందరగా అయిపోతాయని చెప్పారు. ఇండియాకు అలా విమానంలో వెళ్ళండి. గంటలోపే టాప్ డాక్టర్ని కన్సల్ట్ చేసి, ఆరు గంటల్లో ఎండోస్కోపీ లాంటివి పూర్తి చేసుకుని మూడు రోజుల్లో తిరిగి వెళ్లిపోవచ్చు అంటూ మరొకరు సూచించారు. సత్వర చికిత్స కోసం బియర్ను దక్షిణ కొరియా, దుబాయ్ లేదా థాయ్లాండ్కు వెళ్లమని కొంతమంది నెటిజన్లు సలహా ఇచ్చారు.(అనంత్ అంబానీ మరో లగ్జరీ వాచ్, అదిరిపోయే డిజైన్, ధర ఎంత?)వ్యవస్థాపకుడు అమన్ గైరోలా కూడా భారతదేశ వైద్య మౌలిక సదుపాయాలను ప్రశంసిస్తూ వ్యాఖ్యానించారు. "ఇక్కడ అత్యంత క్లిష్టమైన పరిస్థితిలో కూడా మహా అయితే 48 గంటలు పడుతుంది. దేశం అందించే సౌకర్యాలను ప్రజలు ఎప్పుడూ గ్రహించరు. ఇక్కడ కూడా ఖచ్చితంగా లోపాలు ఉన్నాయి కానీ క్రమంగా మెరుగుపడుతోంది" అని ఆయన రాశారు.ఇదీ చదవండి: H-1B వీసా ఫీజు : లక్షలాది అమెరికన్ల ఆరోగ్యం సంక్షోభంలో! -
రూ. 30 కోట్ల సంపద కంటే అతి విలువైనది పోగొట్టుకున్నా..!
జీవితంలో ఏం పోగొట్టుకున్నా..ఏదో ఒక సమయానికి తిరిగి దాన్ని సంపాదించుకోగలం. కానీ పాడైన ఆరోగ్యాన్ని తిరిగి పొందడం అనేది చాలా కష్టం. ఒక్కోసారి పూడ్చలేని నష్టం వాటిల్లచ్చు కూడా. అందుకే భూమ్మీద నూకలు ఉంటే ఏమైనా చేయగలం..అదే పోతే ఎన్ని ఉన్నా..నిరూపయోగమే అని మన పెద్దలు ఊరికే అనలేదు కాబోలు. ఇప్పుడు ఆ విషయాన్ని ఓ వ్యవస్థాపకుడు నెట్టింట షేర్చేస్తూ..తాను కూడా అదే తప్పిదం చేశానంటూ సోషల్ మీడియా వేదికగా తన గోడుని వెళ్లదీసుకున్నాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ ప్రతిఒక్కర్నీ ఆలోచించేలా చేయడమే గాక 'ఆరోగ్యమే అన్నికంటే ముఖ్యం' అనే విషయాన్ని అందరికి గర్తు చేసేలా అమితంగా ఆకర్షిస్తోంది. ముంబైకి చెందిన వ్యవస్థాపకుడు దేశాయ్ ఇన్స్టాగ్రామ్ వేదికగా ఈ విషయాన్ని షేర్ చేశాడు. తాను వ్యాపార సంస్థలో సుమారు రూ. 30 కోట్ల వరకు నష్టపోయానని చెప్పారు. దానిఫలితం తన శారీరక, మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపించిందని నిజాయితీగా వివరించారు. తాను క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తున్నప్పటికీ..బరువు పెరుగుతూనే వస్తున్నానని వాపోయారు. వ్యాపారం నష్టం తట్టుకోవడం సులువే..ఎప్పటికైన పోగొట్టుకున్నది సంపాదించేయొచ్చు. కానీ పాడైన ఆరోగ్యం బాగవ్వడం దాదాపు అసాధ్యం అని బాధగా చెప్పుకొచ్చారు. అంతేగాదు వ్యాపార నష్టం ఎప్పటికీ వ్యక్తిగత నష్టానికి దారితీయకూడదని గట్టిగా హెచ్చరించారు కూడా. తాను వ్యాపారంలో కేవలం రూ. 30 కోట్లే పోగొట్టుకున్నానని, దానికంటే విలువైన ఆరోగ్యంకోల్పోయానని ఆవేదనగా చెప్పుకొచ్చారు ఎవర్స్టోన్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ దేశాయ్. కాగా, 2017లో దేశాయ్ భారతీయ స్పోర్ట్స్ బ్రాండ్ని దేశాయ్ D: FYని ప్రారంభించారు. అయితే ఈ వెంచర్ భారీ నష్టాలను చవిచూసింది. కేవలం 30 నెలల్లో ఆయన దాచుకున్న పొదుపు మొత్తాన్ని తుడిచిపెట్టేసింది. అయితే అంతా తాను 30 కోట్లు ఎలా కోల్పోయానో ఆరా తీశారే గానీ..ఈ 30 నెలలలో ఎంత టెన్షన్, మానసిక ఒత్తిడి ఎదుర్కొన్నాననేది అడగలేదని అన్నారు. నిద్రలేమి అదిక బరువుకి దారితీస్తుంది..ఆ టైంలో ఒత్తిడితో రాత్రి ఆరుగంటల కంటే తక్కువ సమయం నిద్రపోయానని, తనకు తెలియికుండానే చాలా ఒత్తిడిని అనుభవించానని అన్నారు దేశాయ్. వారానికి నాలుగుసార్లు వాకింగ్, జాగింగ్ వంటివి అన్ని చేసినా..తన శరీరంలో పెద్దగా మార్పులు కనిపించలేదని అన్నారు. ఎంత కష్టపడి వర్కౌట్లు చేసినా..నాణ్యమైన నిద్ర మాత్రం తిరిగి పొందలేకపోయానన్నారు. అలాగే ఒత్తిడిని కూడా దూరం చేసుకోలేకపోయానని చెప్పారు. ఒత్తిడి, నిద్రలేమి శరీరాన్ని చిత్తు చేస్తాయ్..తన పోస్ట్లో ఒత్తిడి, నిద్ర లేమి ఏవిధంగా శరీరాన్ని ప్రభావితం చేస్తాయో వివరించారు. ఆరుగంటల కంటే తక్కువ నిద్ర లేమి ఇన్సులిన్ని ప్రభావితం చేసి, టెస్టోస్టిరాన్ను దెబ్బతీస్తుంది.ఎక్కువైన కార్టిసాల్ (ఒత్తిడి ) క్రమం తప్పకుండా వ్యాయామం చేసినప్పటికీ కొవ్వు తగ్గడాన్ని నిరోధిస్తుందిఎంతలా ప్రయత్నించినా నిద్ర లేమిని తరిమికొట్టలేరుచివరగా ఆయన తాను కోల్పోయిన సంపదను తిరిగి పొందగలిగినప్పటికీ..ఆరోగ్యపరంగా పూర్తిస్థాయిలో కోలుకోలేదని అన్నారు. అంతేగాదు. తాను సుమారు ఏడేళ్లలోనే కోల్పోయినదంతా సంపాదించానని, కానీ ఆరోగ్యాన్ని తిరిగి పొందలేకపోయానని అన్నారు. అలాగే దేశాయ్ తన పోస్ట్ని ముగిస్తూ..తన తోటి వ్యవస్థాపకులందర్నీ శారీరక, మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వండి. ఆరోగ్యంగా ఉండండి అని పిలుపునివ్వడం విశేషం. View this post on Instagram A post shared by Prashant Desai (@itsprashantdesai) (చదవండి: మోదీ మెచ్చిన 'బగురుంబ'..! అచ్చం సీతకోక చిలుకలా..) -
ఇదేం సినిమా కాదు.. ఈ లక్షణాలే ప్రాణాంతకం
గుండెపోటు.. హఠాత్తుగా మనిషి ప్రాణాలను తీస్తుందని అంటుంటారు. అయితే అధునిక వైద్యం ఈ హఠాత్ పరిణామాన్ని ముందుగానే గుర్తించేలా చేసింది. గుండెపోటు లక్షణాలను ముందుగా గుర్తించడం ద్వారా అమూల్యమైన ప్రాణాలను కాపాడుకోవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ విషయంలో జరుగుతున్న నిర్లక్ష్యం కారణంగా పలువురు గుండెపోటుతో ప్రాణాలు విడుస్తున్నారు. అందుకే ఛాతీలో నొప్పి అనిపించిన వెంటనే బాధితులు అప్రమత్తమై హృద్రోగ నిపుణులను సంప్రదించాలని వైద్యులు సూచిస్తున్నారు.ఇండియన్ హార్ట్ అసోసియేషన్ గణాంకాలుశరీరంలో అత్యంత కీలకమైన అవయవం గుండె అని అందరికీ తెలిసిందే. వైద్యులు గుండె సంరక్షణ విషయంలో పలు హెచ్చరికలు చేస్తున్నప్పటికీ, వాటిని కొందరు పట్టించుకోని కారణంగా హృద్రోగ మరణాలు సంభవిస్తున్నాయి. ఇండియన్ హార్ట్ అసోసియేషన్ గణాంకాల ప్రకారం ఒక్క 2020లోనే 30 నుండి 60 ఏళ్ల వయస్సు గల 19,238 మంది గుండెపోటుతో మరణించారు. 2021లో 18 నుండి 30 ఏళ్ల యువతలో 2,541 మరణాలు నమోదయ్యాయి.సినిమాల్లో మాదిరిగా..గుండెపోటు వచ్చినప్పుడు సినిమాల్లో చూపించినట్లుగా ఛాతీ పట్టుకుని కుప్పకూలిపోవడం లాంటిది నిజ జీవితంలో ఎప్పుడూ జరగకపోవచ్చని రాజ్ కోట్ లోని హెచ్ సిజి హాస్పిటల్స్ సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ దినేష్ రాజ్ ‘హిందుస్థాన్ టైమ్స్’ ఇంటర్వ్యూలో తెలిపారు. చాలామంది గ్యాస్ ట్రబుల్ లేదా కండరాల నొప్పులు అనుకుని గుండెపోటు ప్రాథమిక లక్షణాలను నిర్లక్ష్యం చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గుండెపోటు విషయంలో ‘టైమ్ ఈజ్ మజిల్’ (సమయమే కండర రక్షణ) అనే సూత్రం వర్తిస్తుందని, లక్షణాలను ఎంత త్వరగా గుర్తిస్తే గుండె కణజాలాన్ని అంత అధికంగా కాపాడుకోవచ్చని డాక్టర్ దినేష్ తెలిపారు.ఒక్క ఛాతీ నొప్పి మాత్రమే కాదు..చాలామంది అనుకుంటున్నట్లుగా గుండెపోటు నొప్పి కత్తితో పొడిచినట్లు ఉండదని, దీనికి భిన్నంగా ఛాతీలో ఏదో బరువుగా ఉన్నట్లు, లేదా ఛాతీపై ఏదో భారం మోపినట్లు అనిపిస్తుందని డాక్టర్ దినేష్ వివరించారు. ఛాతీ మధ్యలో అసౌకర్యం, నొప్పి వచ్చి పోతుండటం లేదా కొన్ని నిమిషాల పాటు అలాగే ఉండటం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే బాధితులు అప్రమత్తం కావాలన్నారు. గుండెపోటు వస్తే కేవలం ఛాతీలోనే నొప్పి వస్తుందనేది ఒక అపోహ మాత్రమేనని ఆయన తెలిపారు. నరాల అనుసంధానం కారణంగా నొప్పి ఇతర భాగాలకు కూడా పాకే అవకాశం ఉందన్నారు.విపరీతమైన అలసట, ఊపిరి ఆడకపోవటం..ముఖ్యంగా ఎడమ చేయి (కొన్నిసార్లు రెండు చేతులు), దవడ,మెడ భాగం (పంటి నొప్పి లేదా గొంతు నొప్పిగా పొరబడే అవకాశం ఉంది), వీపు వెనుక రెండు భుజాల మధ్య భరించలేని నొప్పి లేదా ఇబ్బందిగా అనిపిస్తే అది గుండెపోటు లక్షణం కావచ్చని డాక్టర్ దినేష్ సూచించారు.మహిళలు, వృద్ధులు, మధుమేహ వ్యాధిగ్రస్తులలో గుండెపోటు లక్షణాలు చాలా భిన్నంగా, సైలెంట్గా ఉంటాయని డాక్టర్ దినేష్ తెలిపారు. వీరిలో ఛాతీ నొప్పికి బదులుగా విపరీతమైన అలసట, ఊపిరి ఆడకపోవటం, వికారం లేదా చెమటలు పట్టడం లాంటివి వంటివి కనిపిస్తాయన్నారు. నడుము పైభాగంలో అకస్మాత్తుగా ఏదైనా ఇబ్బందిగా అనిపించి, అది సాధారణంగా లేదనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని డాక్టర్ దినేష్ సూచించారు. ప్రాణాలను కాపాడుకునేందుకు ఇదే ఏకైక మార్గమని ఆయన స్పష్టం చేశారు.ఇది కూడా చదవండి: అరుదైన హృద్రోగంతో చిన్నారి మృతి.. ‘కవాసాకి’ లక్షణాలివే.. -
47 ఏళ్ల వ్యక్తికి గర్భసంచి...ట్విస్ట్ ఏంటంటే!
మధ్యప్రదేశ్లోని భోపాల్లోఒక విచిత్రం చోటు చేసుకుంది. జీవ శాస్త్రంలో కనీవినీ ఎరుగని రీతిలో 47 ఏళ్ల పురుషుడికి గర్భసంచి ఉన్నట్టు రిపోర్ట్ వచ్చింది. దీంతో ఆ వ్యక్తితోపాటు, వైద్యులూ దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఇంతకీ అసలు ఏమిటంటే...ఉంచెహరా నగర పంచాయతీ ఛైర్మన్ నిరంజన్ ప్రజాపతి, కడుపు నొప్పి , ఉబ్బరంతో బాధపడుతూ జనవరి 13న సోనోగ్రఫీ చేయించుకున్నారు. దీంతో అతనికి కుడివైపున గర్భసంచి ఉందనీ అదీ తలకిందులగా ఉందని ఒక డయాగ్నస్టిక్ రిపోర్ట్ వచ్చింది. అయితే, అతనికి ఆసుపత్రి ఫైల్కు బదులుగా, ఒక వైద్య వ్యంగ్య కథకు సరిపోయే రిపోర్ట్ అందింది. దీంతో నాకు యూట్రస్ ఏంటి అని విస్తుపోయిన ప్రజాపతి వైద్యులను సంప్రదించి అసలు విషయాన్ని నిర్ధారించుకున్నారు. ఆ తరువాత పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆరోగ్య శాఖ కూడా ఈ విషయాన్ని సుమోటోగా స్వీకరించింది.ఏం జరిగిందీ అంటే..డయాగ్నస్టిక్ సెంటర్లోని గుమస్తా పొరపాటు కారణంగా ఈగందరగోళం నెలకింది. అతను ఒక రిపోర్ట్ బదులుగా, మరొకరి రిపోర్ట్ను అందించాడు. ఆరోగ్య సంరక్షణ కేంద్రాల్లో ఉద్యోగుల నిర్లక్ష్యానికి అజాగ్రత్తకు సంబంధించిన ఇదొక భయంకరమైన ఉదాహరణ అని చెప్పవచ్చు. ఇదీ చదవండి: అరుదైన కానుక : రాహుల్ గాంధీ భావోద్వేగం, వైరల్ వీడియోఆ రిపోర్ట్ అస్సలు నాది కాదు అంటూ తన అనుభవాన్ని ప్రజాపతి పంచుకున్నారు. కొన్ని రోజులుగా కడుపులో నొప్పి వచ్చేది.. మొదట్లో పెద్దగా పట్టించుకోలేదు. త రువాత మందులు తీసుకున్నా ఉపశమనం లభించలేదు. దీంతో మొదట ఉంచెహరాలో చికిత్స తీసుకుని, ఆ తర్వాత సత్నాలో సోనోగ్రఫీ చేయించుకున్నాను. ఆ తరువాత జబల్పూర్కు వెళ్ళాను. అక్కడి డాక్టర్ ఈ రిపోర్ట్ నాది కాదని స్పష్టంగా చెప్పారని తెలిపారు. ఈ విషయంపై సత్నాలోని ఆ కేంద్రానికి చెందిన డాక్టర్ అరవింద్ సరఫ్ను సంప్రదించగా, ఆయన స్పందించడానికి నిరాకరించారు. ఆయన మౌనం తీవ్రమైన నిర్లక్ష్యం ,రోగనిర్ధారణ ప్రక్రియలలో లోపాలు జరిగాయనే అనుమానాకు బలాన్నిచ్చింది. దీనిపై సత్నా చీఫ్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ మనోజ్ శుక్లా స్పందించారు. సంబంధిత రిపోర్ట్ను క్షుణ్ణంగా పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు.మరోవైపు ఇలాంటి పొరపాట్లు కేవలం గుమస్తా తప్పులు మాత్రమే కావని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. "తప్పుగా వచ్చిన సోనోగ్రఫీ రిపోర్ట్ చికిత్సను తప్పుదోవ పట్టిస్తుందనీ, ఇది రోగిపై మానసికంగా ప్రభావం మాత్రమే కాదు, దాని ఆధారంగా చర్యలు తీసుకుంటే ప్రాణాంతకం కూడా కావచ్చు అంటున్నారు సీనియర్ వైద్య నిపుణులు.ఇదీ చదవండి: మిస్ అయిన ఫోన్ దొరికితే...ఆ ఆనందం వేరే లెవల్! -
ట్రెండీగా లేటు వయసు ప్రెగ్నెన్సీ..! ఉషా వాన్స్, కత్రినా కైఫ్..
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఆయన సతీమణి అమెరికా సెకండ్ లేడీ ఉషా వాన్స్ దంపతులు తాము నాలుగో బిడ్డకు స్వాగతం పలుకుతున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో వారికి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి కూడా. అంతేగాక అమెరికా చరిత్రలోనే తొలిసారిగా ఇలా భర్త పదవిలో ఉండగా 40 ఏళ్ల వయసులో గర్భవతి అయిన తొలి అమెరికా సెకండ్ లేడిగా నిలిచారామె. ఇదంతా ఎలా ఉన్నా..ఒక్కసారిగా ఇంత లేటు వయసులో గర్భధారణ మంచిదేనా అంటూ చర్చలు మొదలయ్యాయి. మొన్నటికి మొన్న 42 ఏళ్ల వయసులో పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది కత్రినా కైవ్. అదిమరువకమునుపే మళ్లీ భారత సంతతి మహిళ, అమెరికా ఉపాధ్యాక్షుడి సతీమణి ఉష సైతం ఆ జాబితాలో చేరిపోవడంతో..ఇక రాను ఆధునిక అమ్మల వయసు ఇలానే ఉంటుందా అంటూ ఊహగానాలు వెల్లువెత్తాయి. ఇంతకీ ఆ ఏజ్లో తల్లి అవ్వడం హెల్త్ పరంగా ప్రమాదామా కాదా? మరి ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారు..2014లో వివాహం చేసుకున్న ఉషా-జేడీ వాన్స్ దంపతులకు ఇప్పటికే ఇవాన్, వివేక్ , మిరాబెల్ అనే ముగ్గురు పిల్లలు ఉన్నారు. ప్రస్తుతం వారు ఈ ఏడాది జూలైకి నాల్గోబిడ్డకు స్వాగతం పలకనున్నారు. అలాగే గతేడాది సెప్టెంబర్ 25న నటి కత్రినాకైఫ్ ఇలానే 42వ ఏటనే తల్లి కాబోతున్నానంటూ ప్రకటించిన సంగతి తెలిసిందే. అదే సరసన హాస్యనటి భారతి సింగ్ కూడా చేరిపోయారు. ఆమె 41వ ఏటా రెండో బిడ్డకు స్వాగతం పలకనున్నట్లు షేర చేసుకున్నారు. మొన్నమొన్నటి వరకు 30లలో గర్భధారణ ప్రమాదం అంటూ పలు వార్తలు విన్నాం. ఇప్పుడు ఏకంగా అది కూడా కాదని ఏకంగా నాలుగు పదుల వయసులో మాతృత్వాన్ని ఆస్వాదిస్తున్నారు ఈ ఆధునిక అమ్మలు. ఇంతకీ ఈ ఆధునిక తల్లులకు వయసు రీత్యా ఆరోగ్యప్రమాదా లేమి ఎదురుకావా? ఇకపై ఆ భయాలకు కాలం చెల్లిపోయిందా అంటే..లేటు వయసులో ప్రెగ్నెన్సీ అనేది సురక్షితం కాదని, పలు ఆరోగ్య సమస్యలు ఉంటాయనే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అదే సమయంలో ఇకపై ఇంత లేటు వయసులో గర్భందాల్చడం అనేది ప్రమాదకరం కూడా కాకపోవచ్చని, పైగా ఇది అసాధారణమైనదిగా ఉండదని ధీమాగా చెబుతున్నారు నిపుణులు. ప్రస్తుతం చాలామంది మహిళలు తగిన జాగ్రత్తలతో సానుకూల ఫలితాలను పొందుతున్నట్లు వెల్లడించారు. నిజానికి ఇంత లేటు వయసులో పిల్లలను కనడం కష్టం. పైగా అండాల నాణ్యత తగ్గి..సంతానోత్పత్తి సహజంగానే తగ్గుతుందన్నారు. అందువల్ల ఆ వయసులో ఐవీఎఫ్ వంటి సహాయక పునరుత్పత్తి సాంకేతికతలను ఆశ్రయించాల్సి ఉంటుందని కూడా అన్నారు.తల్లి, బిడ్డకు ఎదురయ్యే ప్రమాదాలు..వైద్య పురోగతి కారణంగా ఆలస్య గర్భధారణ సురక్షితంగా మారినప్పటికీ..35 ఏళ్లు దాటిన మహిళలు ప్రెగ్నెన్సీ విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిందేనని అన్నారు. సాధారణంగా 35 దాటిన తర్వాత గర్భధారణ అనేది మధుమేహం, రక్తపోటు, ప్రీకాంప్సియా వంటి అనారోగ్య ప్రమాదాలను పెంచుతుందట. పైగా ప్రసవ సమయంలో ఆ సమస్యల కారణంగా సీజేరియన్ డెలివరీ అయ్యే అవకాశాలు మెండుగా ఉంటాయట.అందువల్ల ఆ ఏజ్లో ప్రెగ్నెంట్ అయ్యే మహిళలు ముందుగానే వైద్యులను సంప్రదిస్తే..రాను రాను తలెత్తే ప్రమాదాలను నివారించడంలో హెల్ప అవుతుందని అన్నారు. అలాగే వృద్ధ తల్లులకు జన్మించిన శిశువులు డౌన్ శిండ్రోమ్ వంటి క్రోమోజోమ్ అసాధారణతలు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అలాగే అకాల జననం లేదా నెలలు నిండక ముందు జన్మనివ్వడం వంటి సమస్యలు తలెత్తే ప్రమాదం కూడా ఉందని అన్నారు.లేటు వయసులో ఆరోగ్యకరమైన గర్భధారణ కోసం..ప్రెగ్నెన్సీ ప్లానింగ్కి ముందుగానే వైద్యులను సంప్రదించి తగిన జాగ్రత్తలు తీసుకోవడం.గర్భధారణ నిర్ధారించిన దగ్గర నుంచి క్రమం తప్పకుండా వైద్యులను సంప్రదించడం, సలహాలు, సూచనలు పాటించడంసమతుల్య ఆహారం, మితకరమైన వ్యాయామం, ఆరోగ్యకరమైన బరువును నిర్వహించడం వంటి జాగ్రత్తలు తీసుకోవడంఒత్తిడి నిర్వహణ, కుటుంబ మద్దతు తదితరాలు అత్యంత అవసరం. అప్పుడే తల్లిబిడ్డ సురక్షితంగా ఉంటారు. -
కొంపముంచిన వెయిట్లాస్ టిప్..! పాపం ఆ విద్యార్థిని..
ఇటీవల కాలంలో అందర్నీ వేధించే సమస్య అధిక బరువు. అందులోనూ సోషల్ మీడియా పుణ్యమా అని ఇది తింటే బరువు తగ్గుతారు, ఈ జ్యూస్ తాగితే సన్నజాజిలా నాజుగ్గా అయిపోతారంటూ..యూట్యూబ్ వీడియోలు ఎంతలా ప్రజలను ఊదరగొట్టేస్తున్నాయో తెలిసిందే. అయితే ఏ చిట్కా లేదా హెల్త్ టిప్స్ అనేవి మన శరీరానికి ఎంత వరకు సరిపడుతుందనేది వ్యక్తిగత వైద్యులు లేదా ఆరోగ్యనిపుణులని సంప్రదించడం అనేది అత్యంత ప్రధానం. గుడ్డిగా ఏది పడితే అది ఫాలో అయితే..ప్రాణాలకే ప్రమాదం అనేందుకు ఈఉదంతమే నిదర్శనం. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలకు ఏఐ, సోషల్మీడియా సాయం తీసుకునేవాళ్లకు ఈ ఘటన ఓ కనువిప్పు కూడా. అసలేం జరిగిందంటే.. తమిళనాడు సెల్లూరులోని మీనాంబాల్పురం, కామరాజ్ క్రాస్ స్ట్రీట్కు చెందిన దినసరి కూలీ వేల్ మురుగన్ (51), విజయలక్ష్మీ దంపతుల కుమార్తె కలైయరసి(19) నరిమేడులోని ఒక ప్రముఖ ప్రైవేట్ మహిళా కళాశాలలో చదువుతోంది. కొద్దిగా అధిక బరువుతో ఉండటంతో ఆమె తరుచుగా బరువు తగ్గే చిట్కాలను యూట్యూబ్లలో చూస్తుండేది. గతవారం ఆమె కొవ్వుని తగ్గించి..శరీరాన్ని సన్నగా మార్చే..వెంకారాం(బొరాక్స్) అనే టైటిల్తో ఉన్న వీడియోని ఓ యూట్యూబ్ ఛానెల్లో చూసింది. జనవరి 16న, థెర్ముట్టి, కీళమాసి వీధి సమీపంలోని ఒక ఆయుర్వేద మందుల దుకాణంలో ఆ పదార్థాన్ని కొనుగోలు చేసిందామె. జనవరి 17న వీడియోలో చెప్పిన విధంగా సేవించింది. వెంటనే వాంతులు, విరేచనాలు ప్రారంభమయ్యాయి. తక్షణమే ఆమె తల్లి ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించింది. అక్కడ చికిత్స పొంది ఇంటికి తిరిగి వచ్చింది. అయితే ఆ లక్షణాలు తగ్గుముఖం పట్టక పోగా..మళ్లీ తిరగబెట్టాయి..దాంతో సమీపంలోని ఆస్పత్రిలో చికిత్స తీసుకుని ఇంటికి వచ్చేసింది. అయినా పరిస్థితి చక్కపడక పోగా..తీవ్రమైన కడుపునొప్పి, మలంలో రక్తం పడుతోందంటూ తండ్రిని పట్టుకుని భోరున విలపించింది. రాత్రి సుమారు 11 గంటల ప్రాంతంలో వాంతులు, విరేచనాలు మరింత తీవ్రమవ్వడంతో ఆస్పత్రిలో చేర్పించేందుకు తరలిస్తుండగా..మార్గ మధ్యలోనే తుదిశ్వాస విడిచింది. వైద్యులు సైతం అప్పటికే చనిపోయిందని దృవీకరించారు. ఆమె మృతదేహానికి పోస్ట్మార్టం నిర్వహించిన తదనంతరం కుటుంబసభ్యులకు అప్పగించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి సదరు యూట్యూబ్ ఛానెల్పై చర్యలు తీసుకునేలా దర్యాప్తు ప్రారంభించారు.(చదవండి: ఎనిమిది నెలల్లో 31 కిలోల బరువు..! ఆ సాకులకు స్వస్తి చెప్పాల్సిందే..!) -
H-1B వీసా ఫీజు : లక్షలాది అమెరికన్ల ఆరోగ్యం సంక్షోభంలో!
అమెరికాఅధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ H-1B వీసా ఫీజుల విషయంలో తీసుకున్న నిర్ణయం గ్రామీణ అమెరికాను తీవ్రంగా ప్రభావితం చేయనుందా? అక్కడి ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ మరింత సంక్షోభంలోకి కూరుకుపోనుందా. లక్షలాదిమంది అమెరికన్ల ఆరోగ్యం ప్రమాదంలో ఉందా? తాజా అంచనాలు ఈ అనుమానాలకు బలాన్నిస్తున్నాయి. హెచ్1 బీ వీసాల ఫీజు భారీ పెంపు అమెరికాలోని అత్యంత అవసరమైన ప్రాంతాలకు విదేశీ శిక్షణ పొందిన వైద్య నిపుణుల రాకకుఅంతరాయం ఏర్పడుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ విధానం వల్ల సామాన్య అమెరికన్లకు మేలు జరుగుతుందని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో మాత్రం లక్షలాది మందికి వైద్యం అందకుండా పోయే ప్రమాదం ఉందని వైద్య సంఘాలు హెచ్చరిస్తున్నాయి.గ్రామీణ అమెరికా వైద్య సంక్షోభం సమస్యను అధిగమించడానికి గ్రామీణ ఆసుపత్రులు గతంలో H-1B వీసా ద్వారా విదేశీ నిపుణులను నియమించుకునేవి. తక్కువ ఖర్చుతో నైపుణ్యం కలిగిన సిబ్బందిని పొందేందుకు ఇదొక గొప్ప మార్గంగా ఉండేది. అయితే, ట్రంప్ ప్రభుత్వం H-1B వీసా రుసుమును ఏకంగా లక్ష డాలర్లకు పెంచుతూ తీసుకున్న నిర్ణయం ఈ ఆసుపత్రులపై కోలుకోలేని దెబ్బ తీసింది. ఇప్పటికే నష్టాల్లో ఉన్న చిన్న ఆసుపత్రులు అంత భారీ మొత్తాన్ని చెల్లించి విదేశీ వైద్యులను నియమించుకోవడం అసాధ్యంగా మారింది.ట్రంప్ ప్రభుత్వం తీసుకొచ్చిన 'వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ యాక్ట్' (One Big Beautiful Bill Act) వల్ల మెడికెయిడ్ నిధులు తగ్గిపోవడం, ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీల నుండి తక్కువ రీయింబర్స్మెంట్ రావడం ఈ సంక్షోభాన్ని మరింత తీవ్రం చేస్తోంది. ఒకవైపు నిధుల కొరత, మరోవైపు పెరిగిన వీసా ఖర్చుల కారణంగా గ్రామీణ ప్రాంతాల్లో వైద్య వ్యవస్థ కుప్పకూలే ప్రమాదం ఏర్పడింది. దీనివల్ల అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశంలో కూడా సామాన్యులకు ప్రాథమిక చికిత్స అందడం గగనంగా మారుతోంది.మెడికెయిడ్ (Medicaid) నిధులలో కోతలు విధించడం వల్ల 2034 నాటికి సుమారు 1.7 కోట్ల మంది అమెరికన్లు ఆరోగ్య బీమాను కోల్పోయే ప్రమాదం ఉంది. దీనివల్ల ఖర్చులకు భయపడి ప్రజలు ఆసుపత్రులకు వెళ్లడం తగ్గించేస్తున్నారు, ఫలితంగా తక్కువ రోగులు ఉండటంతో ఆసుపత్రుల ఆదాయం తగ్గి అవి మూతపడుతున్నాయి. అమెరికాలో 2026 నాటికి దాదాపు 32 లక్షల మంది ఆరోగ్య సంరక్షణ కార్మికుల కొరత ఏర్పడవచ్చని అంచనా, ఇది ఇప్పటికే ఉన్న సంక్షోభాన్ని మరింత పెంచుతోంది. పెరుగుతున్న మెడికల్ డెసర్ట్స్ఈ పరిస్థితుల వల్ల గ్రామీణ ప్రాంతాలు "మెడికల్ డెసర్ట్స్" (వైద్య ఎడారులు) గా మారుతున్నాయి. అమెరికాలోని 80శాతం గ్రామీణ కౌంటీలు ఈ జాబితాలోకి వస్తున్నాయి. అత్యవసర చికిత్స లేదా తీవ్రమైన గాయాల కోసం ప్రజలు గంటల తరబడి ప్రయాణం చేయాల్సి వస్తోంది. పట్టణ ప్రాంతాలతో పోలిస్తే గ్రామీణ ప్రజల్లో ఊబకాయం మరియు అకాల మరణాల రేటు 20% ఎక్కువగా ఉంది. ఆసుపత్రుల మూత వల్ల సకాలంలో వ్యాధి నిర్ధారణ జరగక, చికిత్స అందక అనేక కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయని వైద్య నిపుణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వైద్యుల కొరతను తీర్చడానికి విదేశీ నిపుణులు, ముఖ్యంగా H-1B వీసాదారులు కీలక పాత్ర పోషిస్తున్నారు. అమెరికాలోని ప్రతి నలుగురు వైద్యులలో ఒకరు విదేశీయులే. అయితే తాజా వీసా రుసుమును భారీగా పెంచడం వల్ల ఈ ఆసుపత్రులు కొత్తవారిని నియమించుకోలేక పోతున్నాయి.జామా ఆందోళనది జర్నల్ ఆఫ్ ది అమెరికన్ మెడికల్ అసోసియేషన్ (JAMA)లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం, 2024 ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా 11,080 మంది వైద్యులకు H-1B వీసాలను స్పాన్సర్ చేశారు, ఇది అమెరికాలోని మొత్తం వైద్య సిబ్బందిలో 0.97 శాతానికి సమానం. గ్రామీణ ప్రాంతాలలో ఈ ఆధారపడటం దాదాపు రెట్టింపు ఎక్కువగా ఉంది, అక్కడ 1.6 శాతం మంది వైద్యులు H-1B వీసాలపై ఉండగా, పట్టణ ప్రాంతాలలో ఈ సంఖ్య 0.95 శాతంగా ఉంది. మొత్తంగా, వైద్య మరియు ఆరోగ్య వృత్తులలో H-1B ఆమోదాల సంఖ్య 16,937గా ఉంది, ఇది మొత్తం ఆమోదాలలో 4.2 శాతం. ఇందులో వైద్యులు ,సర్జన్లు సుమారు సగం మంది (8,557) ఉన్నారు.దీని వల్ల సామాజిక-ఆర్థికంగా అత్యంత బలహీనమైన సమాజాలు తీవ్రంగా దెబ్బతింటామని మాస్ జనరల్ బ్రిగమ్లో నివాసి వైద్యుడు , JAMA అధ్యయనం సహ రచయిత డాక్టర్ మైఖేల్ లియు పేర్కొన్నారు. హై క్వాలిటీ హెల్త్ కేర్ కోసం "మిలియన్ల మంది అమెరికన్లు విదేశీ ఆరోగ్య సంరక్షణ కార్మికులపై ఆధారపడతారు" అని ఆయన హెచ్చరించారు.గ్రామీణ అమెరికా ప్రస్తుతం తీవ్రమైన ఆరోగ్య సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. తగినంత మంది వైద్యులు, నర్సులు లేకపోవడం , ప్రభుత్వ నిధుల కొరత కారణంగా వందలాది ఆసుపత్రులు మూతపడుతున్నాయి లేదా సేవలను నిలిపివేస్తున్నాయి. ముఖ్యంగా 2005 నుండి సుమారు 195 గ్రామీణ ఆసుపత్రులు మూతపడగా, ప్రస్తుతం మరో 700 ఆసుపత్రులు ఆర్థిక ఇబ్బందుల వల్ల మూతపడే దిశలో ఉన్నాయి. దీనివల్ల కొన్ని లక్షల మంది ప్రజలు అత్యవసర వైద్య సేవలకు మరియు ప్రసూతి వంటి కీలక చికిత్సలకు దూరమవుతున్నారు. -
భార్య మారథాన్ రన్, ప్రముఖ వ్యాపారవేత్త భావోద్వేగ పోస్ట్ వైరల్
జెరోధా వ్యవస్థాపకుడు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నితిన్ కామత్ తన భార్య క్యాన్సర్ సోకడం, చికిత్స, కోలుకోవడం గురించి మరోసారి సోషల్ మీడియాద్వారా పంచుకున్నారు. ముఖ్యంగా టాటా ముంబై మారథాన్లో వైకల్యాన్ని చేర్చడంపై సంతోషాన్ని ప్రకటించారు. టాటా ముంబై మారథాన్లో పరుగెత్తిన దివ్యాంగులలో ఉన్న ఉత్సాహం, ఉద్వేగం మాటల్లో చెప్పలేనిదని ఆయన ప్రశంసించారు. అన్నీ సవ్యంగా ఉన్నా జీవితంలో ఏదో ఒక దాని గురించి ఫిర్యాదు చేసే ముందు ఆలోచించేలా చేస్తుందన్నారు. అదే సమయంలో తన భార్య క్యాన్సర్ కోలుకున్న తీరు గురించి ప్రస్తావిస్తూ ట్వీట్ చేశారు. క్యాన్సర్ నుండి బయటపడిన తర్వాత దాదాపు రెండున్నరేళ్ల తర్వాత 57 నిమిషాల్లో 10 కి.మీ పరిగెత్తారని వివరించారు. అలాగే మారథాన్లో పాల్గొన్న తన భార్య సీమా కామత్ ఫోటోలతో పాటు, ఆమె రాసిన వ్యక్తిగత బ్లాగుకు వ్యాఖ్యలలో లింక్ను పంచుకున్నారు.ఇదీ చదవండి: నోయిడా టెకీ విషాదం : కీలక పరిణామం The excitement and enthusiasm among people with disabilities running the Tata Mumbai Marathon today were beyond words. Makes you think about what right you have to complain about anything in life.On a personal note, Seema (wife, see the link in comments) ran 10km in ~57… pic.twitter.com/8YEDVwf0WE— Nithin Kamath (@Nithin0dha) January 18, 2026సీమా కామత్ తన బ్లాగులో అందించిన వివరాలు ప్రకారం 2021 నవంబరులో స్టేజ్ 2 బ్రెస్ట్ క్యాన్సర్ నిర్ధారణ. ఎలాంటి లక్షణాలు, ఫ్యామిలీ హిస్టరీ లేకుండానే, చాలా క్రమశిక్షణగా, ఫిట్గా చాలా ఆరోగ్యంగా ఉండే ఆమె కేన్సర్ బారిన పడ్డారు. సాధారణంగా చేసుకునే ఫుల్ బాడీ టెస్ట్లో భాగంగా జరిగిన మమోగ్రామ్ టెస్ట్లో ఆమె కుడి రొమ్ములో గడ్డను గుర్తించారు. ఆ తరువాత బయాప్సీ, PET స్కాన్ లాంటి పరీక్షల ద్వారా ఆమెకు క్యాన్సర్ సోకిందని నిర్ధారించారు.దీంతో తాను షాక్కు గురయ్యారు. మొదట కుటుంబ సభ్యులు , కొంతమంది స్నేహితులతో తప్ప మిగతా ఎవ్వరితోనూ దీని గురించి చర్చించలేదు. అదేదో తప్పు అనే భావం ఉండటం వల్లే ఇది జరిగిందనీ, "మానసిక అనారోగ్యంలాగే, క్యాన్సర్ కూడా మన దేశంలో నిషిద్ధం" అని చెప్పుకొచ్చారు. కానీ అవగాహనతో ఉండి, ముందస్తు పరీక్షలతో దీన్ని జయించవచ్చు అన్నారామె.ఇదీ చదవండి: మంచులో రీల్స్..క్షణం ఆలస్యమై ఉంటే.. వైరల్ వీడియోమాస్టెక్టమీ, కీమోథెరపీ, రేడియేషన్ థెరపీ లతో "ఎమోషనల్ రోలర్ కోస్టర్" లా గడించిందన్నారు. ఈ రోజుల్లో క్యేన్సర్ను ముందుగా గుర్తిస్తే నివారణే సాధ్యమే అన్నారు. అలాగే ఆరోగ్యంగా ఉండే వారు కూడా వైద్యులు రొటీన్ స్క్రీనింగ్ చాలా అవసరమని సీమా రాశారు. తీవ్రమైన అనారోగ్యాలు శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా తీవ్ర ప్రభావం చూపుతాయని, అందుకే ప్రతీవవారికి ఆరోగ్య బీమా అవసరమన్నారు. చికిత్స సమయంలో కుటుంబ, సామాజిక మద్దతు ప్రాముఖ్యతను కూడా ఆమె నొక్కి చెప్పారు. స్నేహితులు, కుటుంబ సభ్యులు ఎవరైనా తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో బాధపడుతుంటే వారిలో ధైర్యాన్ని నింపేందుకు మనం చేయాల్సిందంతా చేయాలని సూచించారు. గతంలో తన క్సేన్సర్ రికవరీ జర్నీగురించి మాట్లాడిన సీమ జుట్టు ఊడిపోవడం లాంటి కీమో థెరపీ కష్టాలను పంచుకున్నారు. ఆ బాధలు భరించలేక చనిపోతే మేలు అనుకునేదాన్నని చెప్పారు. ఈ సమయంలో భర్త నితిన్, తన కొడుకు గుండు చేయించుకొనిధైర్యాన్ని నింపారన్నారు. చికిత్సతోపాటు, ఆహారం, వ్యాయామంతో క్యాన్సర్ను జయించానని వెల్లడించారు. వ్యాధినుంచి కోలుకున్న తరువాత క్యాన్సర్పై అవగాహన కల్పించడం, ప్రపంచ పర్యటనలు, మారథాన్రన్ లాంటి కార్యకల్లాపాలతో బిజీగా ఉంటున్నారు సీమ. -
హెల్త్కిది...వీక్... ఎండ్!
వీకెండ్ అన్నది ఎప్పుడూ సంతోషదాయకమూ, ఆనందకరమే కాకపోవచ్చు. శని, ఆదివారాలు ఎలాగూ సెలవురోజులేగాకాస్తంత ఎంజాయ్ చేద్దాం అనే భావన ఒక్కోసారి ఆరోగ్యానికి చేటు తెచ్చిపెట్టవచ్చు. అందుకే వాటిని వీకెండ్ సమస్యలుగా చెబుతుంటారు. అయితే అవి తప్పకుండా వీకెండ్ రోజుల్లోనే వస్తాయని కాదు... ఎప్పుడైనా రావచ్చుగానీ... వీకెండ్ రోజుల్లో దొరికే సెలవల కారణంగా శని, ఆదివారాల్లో సదరు ఆరోగ్య సమస్యలు ఎక్కువగా వచ్చేందుకు అవకాశమున్నందున వాటిని వీకెండ్ ఆరోగ్య సమస్యలుగా చెబుతుంటారు. అంతేకాదు... వాటిల్లో కొన్నింటికి వారాంతపు రోజైన ‘శాటర్ డే’ పేరు కూడా ఉండటం విశేషం. అలా వారాంతపు వ్యవహారాలతో వచ్చే ఆరోగ్య సమస్యలేమిటి, వాటికి పరిష్కారాలేమిటన్న విషయాలేమిటో చూద్దాం...సాధారణంగా వారంలోని మిగతా రోజుల్లో ఆఫీసు పనులూ లేదా బిజినెస్ పనుల మీద అందరూ బిజీగా ఉంటారు. ఇక ఆదివారం రోజు సెలవు కావడంతో శనివారం నుంచే రిలాక్స్ కావడాన్ని చాలామంది మొదలుపెడుతుంటారు. దాంతో మర్నాడు సెలవే కదా అన్న ఉద్దేశంతో కాస్త ఆటవిడుపు ఫీలవుతుంటారు. దాంతో వీకెండ్ పేరిట ఉన్న కొన్ని రకాల ఆరోగ్య సమస్యలను తెలుసుకుందాం.పెద్దల్లో (అడల్ట్స్లో) వచ్చే సమస్యలివి...శాటర్డే నైట్ పాల్సీ : రాత్రి కుర్చీలో కూర్చుని అతిగా మద్యం తాగుతూ ఉండి అలాగే నిద్రపోయే అవకాశాలెక్కువ. అలాంటప్పుడు తల బరువంతా భుజం మీద ఆనడం... నిద్రకారణంగా ఆ బరువు చాలాసేపు అలాగే ఉండటంతో చేతి ప్రధాన నరమైన.. ‘రేడియల్ నర్వ్’పై తీవ్రమైన ఒత్తిడి పడుతుంది. దాంతో అది చచ్చుబడినట్లుగా అవుతుంది. ఇది కూడా ఒక రకం నరాలకు సంబంధించిన సమస్య (న్యూరోపతి)గా చెప్పవచ్చు. అయితే పేరును బట్టి ఇది కేవలం శనివారం రాత్రి మద్యం తీసుకున్నందు వల్ల వచ్చే పరిణామం మాత్రమే కాదు. నిజానికి ఏ రోజైనా రావచ్చు. కానీ వీకెండ్లో ‘మద్యం పార్టీలు’ ఎక్కువగా నిర్వహించుకుంటూ ఉంటారు కాబట్టి ఈ సమస్యకు ‘శాటర్డే నైట్ పాల్సీ’ లేదా ‘శాటర్ డే నైట్స్ పెరాలసిస్’ అని పేరు. అల్నార్ పాల్సీ : వారాంతం వరకు కంప్యూటర్ మీద చాలా ఎక్కువ సేపు పనిచేయడం వల్ల వారాంతానికి వేళ్లను కదపడానికి కూడా వీల్లేనంత బలహీనంగా మారిపోతాయి. ఇలా వారాంతం వరకు పనిచేయడం వల్ల ముఖ్యంగా చేతి వేళ్లలో బలహీనంగా ఉండేవైన చిటికెనవేలు, ఉంగరపు వేళ్లు కదల్లేనంతగా అలసిపోవచ్చు. అవి తిమ్మిరిగా ఉండి, మొద్దుబారి, పనిచేయలేని స్థితికి చేరితే ఆ కండిషన్ను అల్నార్ పాల్సీ అంటారు.ఫుట్ డ్రాప్ : అలా అదేపనిగా కూర్చుని ఉండటంతో కాలిని కదిలించలేని కండిషన్తో పాటు కాలి వేళ్ల చివర తిమ్మిరి, మొద్దుబారినట్లుగా ఉండే కండిషన్ను ఫుట్డ్రాప్ అంటారు. సాధారణంగా డాక్టర్లు వీటిని శనివారం సమస్యలుగా పేర్కొంటుంటారు.ఇక పెద్దల్లో మద్యం అలవాటుతో... ఇప్పుడు వారాంతం వస్తే చాలు దాదాపుగా అన్ని రకాల కుటుంబాలూ బయటే తినడానికే ఆసక్తి చూపుతుంటారు. ఇక ఐటీ రంగానికి చెందిన ఉద్యోగులు తమ తమ బిజీ ఉద్యోగాల్లోంచి ఆటవిడుపుకోసం బయట తినడానికి మొగ్గు చూపుతుంటారు. దీంతోపాటు మునపటితో పోలిస్తే ఇటీవల వీకెండ్ మద్యం పార్టీలు మరీ ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఈ వారాంతపు ఆరోగ్యపు అనర్థాలతో చాలావరకు ఆల్కహాల్తోనే వస్తుండటం విశేషం.ఆల్కహాల్తో అంతా అనర్థమే: మితిమీరిన ఆల్కహాల్ చేటు చేస్తుందని తెలిసినప్పటికీ శనివారాలు మద్యం తీసుకునేవారి సంఖ్య తక్కువేమీ కాదు. పైగా ఇందుకు ఓ సాకు / జస్టిఫికేషన్ కూడా ఉంటుంది. ‘‘మనం మద్యం తీసుకునేది వీకెండ్ రోజే కదా... సోమవారం రోజు ఆఫీసు ఉంటుందనే కారణంతో ఆదివారమూ రిలాక్స్ కాలేము కదా’’ అంటూ శనివారాలు చాలామంది మద్యం పార్టీలు పెట్టుకుంటూ ఉంటారు. మర్నాడు ఎలాగూ ఆదివారమే కదా అంటూ చాలామంది పెద్దగా పరిమితి కూడా పాటించరు.ఆల్కహాల్ కారణంగా దాంతో ముడిపడిన అనేక సమస్యలు కనిపిస్తుంటాయి. ఆల్కహాల్ రక్తంలో కలుస్తుండగానే అది రక్తపోటును, నాడీ వేగాన్ని (పల్స్ రేటును) పెరిగేలా చేస్తుంది. ఈ రెండు అంశాలూ... గుండెకు ముప్పు తెచ్చిపెట్టేవే. ఒక కరంగా చూస్తే గుండెపోటు తాలూకు రిస్క్ ఫ్యాక్టర్లుగా చెప్పవచ్చు. ఆల్కహాల్ తీసుకోగానే రక్తనాళాలు వ్యాకోచిస్తాయి. దాంతో రక్తం వేగంగా పరుగులెత్తుతుంది. దీనికి తోడు హృదయ స్పందనల వేగం కూడా బాగా పెరుగుతుంది. హృదయ స్పందనలు పెరగడంతో మళ్లీ అది రక్తపోటు పెరుగుదలకు దారితీస్తుంది. ఇక రక్తపోటు, హృదయస్పందనలు బాగా పెరిగినప్పుడు తక్షణం కలిగే ప్రమాదం గుండెపోటు. ఇది ఒక్కోసారి చాలా ప్రమాదకరమైన పరిస్థితికి అంటే... మరణానికి దారితీసే ప్రమాదమూ లేకపోలేదని గ్రహించాలి. ప్రతి మద్యం పార్టీతోనూ గుండెపోటు ముప్పు తప్పక వస్తుందని చెప్పలేనప్పటికీ... ప్రతిసారీ ఆల్కహాల్ తాగినప్పుడల్లా కాలేయంపై మాత్రం తీవ్రమైన ప్రతికూల ప్రభావం మాత్రం తప్పక పడుతుంది. అంతేకాదు... రక్తనాళాల్లో రక్తం ప్రవాహవేగం పెరిగినందువల్ల అది మూత్రపిండాలనూ దెబ్బతీయవచ్చు. ఇలా మద్యాన్ని సేవించడమన్నది ప్రతిసారీ మూత్రపిండాలపై అంతో ఇంతో ప్రతికూల ప్రభావాన్ని తప్పక చూపుతుందని చెప్పవచ్చు. రక్తనాళాల్లో వేగం పెరగడం వల్ల ఒక్కోసారి అది రక్తనాళాలు చిట్లడం వంటి ప్రమాదాలకూ దారితీయవచ్చు. అతి సున్నితమైన కంటి రక్తనాళాల్లోనూ రక్తప్రవాహ వేగం పెరిగితే... అరుదుగానైనా అది అంధత్వం వంటి పరిణామాలకు దారి తీసే ప్రమాదం ఉండవచ్చు.అన్ని అవయవాలకూ ముప్పు తెచ్చిపెట్టే వీకెండ్ పార్టీలు మద్యం మనపై చూపే దీర్ఘకాలిక సమస్యలు చాలా ఎక్కువే. శరీరంలోని అన్ని అవయవాలపై మద్యం తన దుష్ప్రభావం చూపుతుంది. దాని వల్ల నష్టపోని వ్యవస్థలు, కీలక భాగాలు ఉండవంటే అతిశయోక్తి కాదు. కేవలం వారానికి ఒకసారి తాగే వీకెండ్ పార్టీ వల్లనే ఈ ముప్పు వస్తుందా అంటే కేవలం ఎప్పుడో ఒకసారి తాగినప్పటికీ మద్యం వల్ల వచ్చే ముప్పు చాలా తీవ్రంగా ఉంటుంది. మద్యం దాదాపు మన శరీరంలో ఉండే అన్ని అవయవాలపై చూపే దుష్ప్రభావాలు ఇవీ...’ జీర్ణకోశ వ్యవస్థ : మద్యం వల్ల అసిడిటీ సమస్య, గ్యాస్ట్రయిటిస్, కడుపులో పేగులో పుండ్లు (అల్సర్స్), అరుగుదలలో లోపాలు, జీర్ణమైన ఆహారం ఒంటికి పట్టకపోవడం (మాల్ అబ్జార్ప్షన్ సిండ్రోమ్), ఎన్నో రకాల క్యాన్సర్లు, హెమరాయిడ్స్, కాలేయం దెబ్బతినడం, పాంక్రియాస్ గ్రంథి సమస్యలు... జీర్ణవ్యవస్థకు సంబంధించి ఇలాంటి ఎన్నో రకాల సమస్యలు కనిపిస్తాయి.’ పోషకాలు అందకపోవడం : మద్యం తాగినప్పుడు ఒక్కోసారి ఆకలి మందగించడం లేదా మద్యంతో పాటు తినే చిరుతిండ్ల వల్ల ఆహారం సరిగా తీసుకోకపోవడంతో సరిగ్గా ఆహారం తీసుకోరు. దాంతో దేహానికి అవసరమైన అన్ని రకాల పోషకాలు అందకపోవడంతో అది పోషకాహార లోపంతో వచ్చే కొన్ని రకాల సమస్యలకు ఆస్కారం ఇవ్వవచ్చు.’ గుండె : ఆల్కహాల్ కార్డియోమయోపతి (గుండె కండరం పెరగడం), గుండె స్పందనలూ గుండె లయల్లో మార్పులు (అరిథ్మియా) వంటి సమస్యలు రావచ్చు. రక్తనాళాలు తమ మృదుత్వాన్ని కోల్పోయి, గట్టిగా మారే అథెరోస్లీ్కరోసిస్ సమస్యలతో పాటు... చివరకు గుండెపోటుతో ్రపాణాలకు ముప్పు వాటిల్లడం వంటి తీవ్రమైన సమస్యలకూ దారితీసే ప్రమాదం లేకపోలేదు.’ మెదడు / నాడీ వ్యవస్థలో లోపాలు : జ్ఞాపకశక్తి లోపించడం, అనేక మానసిక వ్యాధులకు లోనుకావడం, చేతివేళ్ల చివర్లు లేదా కాలి వేళ్ల చివర్లు స్పర్శ కోల్పోవడం, తిమ్మిర్లు, పక్షవాతం వంటి సమస్యలు రావచ్చు. దీర్ఘకాలంలో జ్ఞాపకాలన్నీ మాసిపోయే అలై్జమర్స్ సమస్యతో పాటు కొందరిలో చేతులూ చేతివేళ్లు వణుకుతూ ఉండే పార్కిన్సన్ డిసీస్ వంటి ముప్పులకూ ఆల్కహాల్ ఒక కారణం.’ సెక్స్ సమస్యలు : సామర్థ్యం తగ్గడం, అంగస్తంభన సమస్యలు రావచ్చు.’ మహిళలకు మరింత ప్రమాదం : మహిళలు మరీ ముఖ్యంగా గర్భిణులు ఆల్కహాల్ తాగడం వల్ల కేవలం వారికి మాత్రమే కాకుండా... ఒకవేళ వారు గర్భవతులైతే పుట్టబోయే పిల్లలకు బుద్ధిమాంద్యం, అవయవాలు సరిగ్గా ఎదగకపోవడం సహా పుట్టబోయే చిన్నారుల్లో అనేక వైకల్యాలు కనిపించడానికి అవకాశాలెక్కువ.మద్యం తాగిన ఆ మర్నాడూ కొనసాగే ప్రతికూల ప్రభావాలు...ఆల్కహాల్ తాగినరోజే కాకుండా ఆ మర్నాడు కూడా అది ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలనే చూపుతుంది. మద్యం తాగిన తర్వాతి రోజున అది చూపే ప్రభావాలను ‘హ్యాంగోవర్’గా చెబుతుండటం చాలామందికి తెలిసిందే. అంటే... ఆల్కహాల్ తాగిన వారు మర్నాడు చాలా నీరసంగా ఉంటం, ఆ నిస్సత్తువతో ఏ పనులూ చేసుకోలేకపోవడం, దేనిపైనా దృష్టి నిలపలేకపోవడం, పనిపై దృష్టి కేంద్రీకరణ శక్తి తగ్గడం (ఫోకస్డ్గా పనిచేయలేకపోవడం), కొందరిలో తీవ్రమైన తలనొప్పి, మరికొందరిలో మైగ్రేన్ ప్రేరేపితం కావడం వంటి దుష్ప్రభావాలు కనిపిస్తాయి. దాంతో... అంటే ఆ ప్రతికూల ప్రభావాలతో చేస్తున్న పనిపై ఆసక్తి తగ్గడం, సరిగా / నిర్దుష్టంగా నిర్ణయాలు తీసుకోలేకపోవడం వంటి అనర్థాలు ఏర్పడతాయి.అధిగమించడం ఎలా? ఆల్కహాల్ను పూర్తిగా మానేయడం తప్పనిసరి. అయితే కొంతమంది మద్యాన్ని రెండు పెగ్గులకు పరిమితం చేసుకుంటే మంచిదేననీ, డాక్టర్లే ఆ మేరకు పర్వాలేదనీ చెబుతుంటారని కొందరు వాదిస్తుంటారు. కానీ ఎప్పుడో ఓసారే అయినా ఒక్క పెగ్ ఆల్కహాల్ అయినప్పటికీ దానితో ఆరోగ్యానికి నష్టమే తప్ప ఎలాంటి ప్రయోజనమూ ఉండదనేది డాక్టర్ల మాట. ఇక మద్యం ఎంత పరిమితమైన మొత్తంలో తీసుకున్నప్పటికీ.... ఆల్కహాల్ తీసుకుని ఎలాంటి పరిస్థితుల్లోనూ వాహనం నడపకూడదు. ∙బింజ్ డ్రింక్ వద్దు : కొందరు వారంలో ఎప్పుడూ తాగరు. కానీ వారాంతం రోజున చాలా ఎక్కువగా తాగేస్తారు. అలా కూర్చుండిపోయి తాగడమే పనిగా పెట్టుకుని చాలాసేపటివరకు అలా తాగుతూనే ఉంటారు. ఇలా తాగడాన్నే ‘బింజ్ డ్రింకింగ్’ అంటారు. రోజూ తాగడం వల్ల ఆరోగ్యానికి ఎంతగా నష్టం చేకూరుతుందో... వారంలో కేవలం ఒక్కరోజున తాగే ‘బింజ్ డ్రింకింగ్’తోనూ అంతకంటే ఎక్కువగానే అనర్థాలు చేకూరతాయని అర్థం చేసుకుని, బింజ్ డ్రింకింగ్కు దూరంగా ఉండాలి. ఆహారం విషయంలో : వారాంతపు పార్టీలతో మద్యం మాత్రమే కాదు... మితిమీరి తీసుకునే ఆహారంతోనూ ఆరోగ్యానికి అనర్థం తప్పదు. వారాంతపు పార్టీలలో అనారోగ్యాలు తెచ్చిపెట్టే ఫాస్ట్ఫుడ్స్, అధికంగా రిఫైన్ చేసిన పిండిపదార్థాలతో తయారు చేసే శ్నాక్స్, సూపర్ రిఫైన్డ్ రైస్తో వండిన మసాలాలతో కూడిన స్పెషల్ వంటకాలతో రక్తంలో చక్కెర మోతాదులు బాగా పెరిగిపోతాయి. ఇది డయాబెటిస్ బాధితుల్లోని రక్తంలో చక్కెరను అమాంతం పెంచేస్తుంది. ఒక్కసారిగా చక్కెర మోతాదులు పెరగడం వల్ల అది కీటోఎసిడోసిస్ అనే కండిషన్కు దారితీసి, ఒక్కోసారి బాధితుల్ని కోమాలోకి తీసుకుపోయే ప్రమాదమూ లేకపోలేదు. అధిగమించడం ఎలా? వీకెండ్ పార్టీల్లో సూపర్ రిఫైన్డ్ ఆహారం లేదా శ్నాక్స్ తీసుకునే సమయంలో అంతే మొత్తంలోగానీ లేదా వీలైతే అంతకుమించిగానీ సలాడ్స్ తీసుకోవడం మంచిది. సలాడ్స్లో భాగంగా దోస, క్యారట్, బీట్రూట్ ముక్కలు తీసుకుంటుంటే అది కార్బోహైడ్రేట్లు తీసుకోవడాన్ని తగ్గిస్తుంది. అంతేకాదు.. దేహంలోకి తగినన్ని పీచుపదార్థాలు వెళ్తాయి.ఇక్కడ మద్యం తీసుకునే వారికీ, ఆహారం ఎక్కువగా తీసుకునేవారికి... మధ్య పండ్ల రసాల విషయంలో ఒక తేడా పాటించాల్సి ఉంటుంది. అదేమిటంటే... మద్యం తీసుకునే వారు రెండు పెగ్గుల తర్వాత తప్పనిసరిగా నిమ్మజాతి పండ్లరసాలు తీసుకోవడం మంచిదైతే... ఆహార ప్రియులు మాత్రం పండ్ల రసాలకు దూరంగా ఉండాలి. ఎందుకంటే... పండ్లరసాలు రక్తంలోని చక్కెర మోతాదులను మరింతగా, అందునా అమాంతంగా పెంచేస్తాయి. కొందరు కాళ్లూ, చేతుల్లో కీళ్లనొప్పులు... గౌట్ వ్యాధితో బాధపడుతూ ఉంటారు. ఇలాంటివారు తమ ఆహారంలో ్రపోటీన్ మోతాదులు అంటే మాంసాహారం, పప్పులు బాగా తగ్గించుకోవాలి. అధిగమించడం ఎలా: ఈ వీకెండ్ ఆరోగ్య సమస్యలను నివారించడానికి ఈ కింద పేర్కొన్న సూచనలు చాలావరకు మేలు చేస్తాయి. అవి...∙పార్టీల్లో గడపడం కంటే పార్క్ వంటి చోట్లలో సోషల్ గ్యాదరింగ్స్కు వెళ్లడం చాలా మేలు చేస్తుంది. పార్టీలకు వెళ్లేవారితో పోలిస్తే... పార్క్లో కుటుంబ సభ్యులతో గడిపేవారు, గార్డెనింగ్ చేసేవారు... ఎక్కువ సంతోషంగానూ, ఆరోగ్యంగానూ ఉంటారని చాలా అధ్యయనాల్లో తేలింది.∙వీకెండ్ యోగా : వారమంతటా ఎడతెరిపిలేకుండా చేస్తున్న పని వల్ల కలిగిన ఒత్తిడిని తొలగించడానికి వీకెండ్స్లో పార్టీల కంటే వీకెండ్ యోగా వంటి కార్యక్రమాలు మేలు చేస్తాయని అధ్యయానాల్లో తేలింది. ∙బరువు చెక్ చేసుకుంటూ ఉండటం : వీకెండ్ తర్వాత సోమవారంనాడు రోజును ్రపారంభిస్తున్నప్పుడు మొదట చేయాల్సిన పని... తమ బరువు చెక్ చేసుకోవడం. దీనివల్ల మనం చేస్తున్న పనుల ప్రతికూల ప్రభావాలను తెలుసుకుంటూ... ఆమేరకు జాగ్రత్త తీసుకోవాలన్న స్పృహ అందరిలోనూ పెరుగుతుంది.పిల్లలకూ ఇబ్బందే... కేవలం పెద్దల ఆరోగ్యమే కాదు... వారాంతపు రోజుల్లో చిన్నారుల ఆరోగ్యమూ దెబ్బతినే అవకాశాలు లేకపోలేదు. అయితే ఇందుకు కారణాలు మాత్రం పెద్దలూ, పిల్లల విషయంలో వేర్వేరుగా ఉంటాయి. వారం ΄÷డవునా అన్ని రోజులూ స్కూల్కు వెళ్లడంతో మర్నాడు సెలవు కావడంతో ఆటవిడుపుగా భావించి మితిమిరి ఆడుకుంటూ ఉంటారు. దీనివల్ల ఒక్కోసారి కాళ్లనొప్పులు రావచ్చు. ఇది కేవలం తాత్కాలికమైన ఇబ్బంది మాత్రమే. అయితే దీనికంటే మించిన ఇబ్బంది ఆహారంతో వస్తుంటుంది. కొందరు పెద్దలు వారాంతపు రోజుల్లో పిల్లలను తమతో పాటు పార్టీకి తీసుకెళ్లడం చేస్తుంటారు. ప్రతివారం అక్కడ మితిమీరి ఆహారం తీసుకోవడంతో పిల్లల్లో స్థూలకాయం వచ్చే ముప్పు ఉంటుంది. ఇక మర్నాడు ఎలాగూ సెలవురోజు కావడం వల్ల వారాంతపు రోజున ఎక్కువసేపు టీవీ చూడటం, రాత్రంతా నిద్రపోకుండా ఓటీటీలో సినిమాలు చూడటం, వీడియోగేమ్స్ ఆడటం వంటివి చేస్తుంటారు. వీటివల్ల ఆరుబయట ఆటలాడటమూ తగ్గుతుంది. పైగా ఇలా టీవీలూ, సినిమాలూ చూసే సమయంలో ఏదైనా తింటూ ఉండటం వల్ల (బింజ్ ఈటింగ్ వల్ల) స్థూలకాయం రిస్క్ మరింత పెరుగుతుంది. ఇది దీర్ఘకాలంలో వారి ఆరోగ్యం విషయంలో దుష్పరిణామాలకు దారితీస్తుంది. అందుకే సెలవు రోజుల్లో పిల్లలకు ఆరోగ్యకరమైన వ్యాపకాలు నేర్పడం పెద్దలు చేయాల్సిన పని.నిర్వహణ: యాసీన్ -
తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం : ఆ కాఫ్ సిరప్ బ్యాన్
దగ్గు మందు విషయంలో తమిళనాడు ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. 'ఆల్మండ్ కిట్' దగ్గు సిరప్ను నిషేధించింది. దీని తయారీ, అమ్మకం, పంపిణీ , వినియోగాన్ని నిషేధించిందని రాష్ట్ర ఔషధ నియంత్రణ సంస్థ ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది. నిషేధాన్ని ఉల్లంఘించినట్లు తేలితే, వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.బిహార్లో తయారయ్యే ఈ సిరప్లో తీవ్రమైన, కొన్నిసార్లు ప్రాణాంతకమైన ఆరోగ్య సమస్యలను కలిగించే ఇథిలీన్ గ్లైకాల్ అనే కలుషిత పదార్థం ఉందని అధికారులు తెలిపారు. ఈ సిరప్ తీసుకోవడం వల్ల తీవ్రమైన మూత్రపిండాల వైఫల్యం, మెదడు, ఊపిరితిత్తులకు నష్టం, కొన్ని సందర్భాల్లో మరణం సంభవించవచ్చని తమిళనాడు ఔషధ నియంత్రణ డైరెక్టరేట్ హెచ్చరించింది. రాష్ట్రంలోని అన్ని మెడికల్ షాపులు, డిస్ట్రిబ్యూటర్లు, ఆసుపత్రులు, ఫార్మసీలు వెంటనే దీన్ని ఉపసంహరించుకోవాలని డ్రగ్ కంట్రోల్ డైరెక్టరేట్ ఆదేశించింది. ప్రత్యేకంగా బ్యాచ్ నంబర్ AL24002ని తనిఖీ చేయాలని, ఈ సిరప్ను అస్సలు వాడకూడదని తెలిపింది.ఈ సిరప్ను తయారు చేస్తున్నా, విక్రయిస్తున్నా, వెంటనే అధికారులకు సమాచారం అందించాలని సూచించింది. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఫార్మసీలు, ఆసుపత్రులలో తనిఖీలు, నిఘాను ముమ్మరం చేసింది. అంతేకాదు దీనికి సంబంధించిన, సమాచారం ఫిర్యాదులు లేదా తదుపరి సూచనల కోసం, ప్రజలు డైరెక్టరేట్ను 94458 65400 నంబర్లో వాట్సాప్ ద్వారా సంప్రదించాలని అధికారులు కోరారు. ఔషధాల కొనుగోలు సమయంలో అప్రమత్తంగా ఉండాలని, లేబుల్లు మరియు బ్యాచ్ నంబర్లను జాగ్రత్తగా పరిశీలించుకోవాలని, ఏదైనా అనుమానాస్పదంగా. లేదా నాణ్యత లేని మందులను గుర్తిస్తే, వెంటనే తమకు నివేదించాలని డ్రగ్ కంట్రోల్ డైరెక్టరేట్ ప్రజలకు విజ్ఞప్తి చేసింది.ఇదీ చదవండి: రూ. 50 నుంచి రూ. 100 కోట్లకు : ఆ సినిమానే ప్రేరణకాగా ఇటీవలి సంవత్సరాలలో, దేశంలో కలుషితమైన ఔషధ సిరప్లు,ఇథిలీన్ గ్లైకాల్ లేదా డైథిలీన్ గ్లైకాల్ కలిగిన సిరప్ల కారణంగా పిల్లల మరణాలు సంభవించిన నేపథ్యంలో ఈ ఆదేశాలు జారీ అయ్యాయి. ఇలాంటి విషాదాలు పునరావృతం కాకుండా నిరోధించేందుకు, సురక్షితమైన, నాణ్యమైన మందులు మాత్రమే రోగులకు చేరేలా పర్యవేక్షణ విధానాలను బలోపేతం చేస్తామని ప్రభుత్వం తెలిపింది.ఇదీ చదవండి: మ్యాట్రిమోనియల్ స్కాం : కోట్లు నష్టపోయిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ -
మౌని అమావాస్య : ధార్మికమే కాదు.. ఆరోగ్యానికి ‘సూపర్ ఫుడ్’
నేడు (ఆదివారం) మౌని అమావాస్య. హిందూ ధర్మంలో ఈ రోజుకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఉత్తరాదిన దీనిని మాఘ అమావాస్య అని కూడా అంటారు. ఈ రోజున పుణ్య స్నానం, దానధర్మాలు, పూర్వీకులకు పిండ ప్రదానాలు చేయడం ఎంతో ఉత్తమమని పండితులు చెబుతుంటారు. ఆధ్యాత్మిక, యోగ సాధకులు మౌని అమావాస్య నాడు నిశ్శబ్ద ఉపవాసం పాటిస్తారు. అంటే రోజంతా మౌనంగా ఉంటారు. ఎవరైనా సరే మౌనం వహించినప్పుడు లోపలికి దృష్టిని సారిస్తారు. నిశ్శబ్దం అనేది మనసును ప్రశాంతపరుస్తుంది. ఆలోచనలను శుద్ధి చేస్తుంది. ఆధునిక జీవనశైలిలో..నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మనమంతా నిరంతరం శబ్ద కాలుష్యం మధ్య బతుకీడుస్తున్నాం. ట్రాఫిక్ రొద, మొబైల్ రింగ్టోన్లు, రోజంతా సాగే అనవసరపు సంభాషణలు మనల్ని శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా విపరీతంగా అలసిపోయేలా చేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ‘మౌన వ్రతం’ లేదా కాసేపు నిశ్శబ్దంగా ఉండటం అనేది మనకు ఒక వరంగా పరిణమిస్తుంది.అశాంతికి, ఒత్తిడికి చెక్..మౌనం అంటే కేవలం బయటి శబ్దాలకు దూరంగా ఉండటం కాదు. ఇది అంతర్గత స్వేచ్ఛకు, నిజమైన ఆనందానికి మార్గం. ఆయుర్వేదంలో పేర్కొన్న వివరాల ప్రకారం, అతిగా మాట్లాడటం వల్ల శరీరంలో ‘వాత దోషం’ పెరుగుతుంది. ఫలితంగా మనసు అశాంతికి గురికావడం, ఒత్తిడి పెరగడం, శక్తి క్షీణించడం లాంటి సమస్యలు తలెత్తుతాయి. మౌనంగా ఉండటం వల్ల మనసులో సత్వగుణం పెరిగి, ఏకాగ్రత, ధ్యాన శక్తి మరింతగా మెరుగుపడుతుంది. భగవద్గీతలో కూడా మౌనాన్ని ఒక మానసిక తపస్సుగా అభివర్ణించారు. ఇది వాక్కుపై నియంత్రణను సాధించి, శరీరంలోని ఓజస్సును కాపాడుతూ, రక్తపోటు (బీపీ)BP)అదుపులో ఉంచుతూ, గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది.మౌనంపై సైన్స్ ఏమంటోంది?మౌనం వల్ల కలిగే ప్రయోజనాలను ఆధునిక విజ్ఞాన శాస్త్రం కూడా రుజువుచేసింది. శబ్ద కాలుష్యం మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీయడమే కాకుండా, ఒత్తిడిని పెంచి, శారీరక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. మరోవైపు, మౌనం మెదడుపై లోతైన ప్రభావాన్ని చూపుతుంది. ఒక ప్రముఖ అధ్యయనం ప్రకారం, రోజుకు కనీసం రెండు గంటల పాటు మౌనంగా ఉండటం వల్ల మెదడు కణాల (Brain Cells) అభివృద్ధి జరుగుతుంది. ఇది జ్ఞాపకశక్తిని పెంచి, భావోద్వేగాలను నియంత్రించడంలో, కొత్త విషయాలను నేర్చుకోవడంలో సానుకూల ప్రభావం చూపుతుందని శాస్త్రవేత్తలు గుర్తించారు.అద్భుత ఆరోగ్య ప్రయోజనాలుమౌన వ్రతాన్ని ఆచరించడం వల్ల శరీరంలో ఒత్తిడిని పెంచే ‘స్ట్రెస్ హార్మోన్లు’ తగ్గుముఖం పడతాయి. తద్వారా మనసు ప్రశాంతంగా మారుతుంది. ప్రతిరోజూ కాసేపు మౌనంగా ఉండే వారికి నిద్రలేమి సమస్యలు దూరమై, గాఢ నిద్ర పడుతుంది. ప్రశాంతమైన వాతావరణంలో మెదడు మరింత సమర్థవంతంగా ఆలోచించగలుగుతుంది. దీనివల్ల ఏకాగ్రత, సృజనాత్మకత పెరుగుతాయి. అంతేకాకుండా చిన్న చిన్న విషయాలకే చికాకు పడటం, కోపం తెచ్చుకోవడం లాంటి భావోద్వేగ అస్థిరత నుంచి ఉపశమనం లభించి, ఎమోషనల్ బ్యాలెన్స్ సాధ్యమవుతుంది. విపత్కర పరిస్థితుల్లో హింసకు దారితీయకుండా, శాంతియుతంగా సమస్యలను పరిష్కరించే శక్తివంతమైన సాధనం ‘మౌనం’ అనడంలో ఎంతమాత్రం సందేహం లేదు. ఇది కూడా చదవండి: మిషన్ డాల్ఫిన్: నదీ గర్భంలో భారీ ‘ఆపరేషన్’ -
పుడుతూనే మధుమేహం..
సాధారణంగా షుగర్ వ్యాధి అంటే పెద్దవాళ్లకే వస్తుందని మనం అనుకుంటాం. అయితే అప్పుడే కళ్లు తెరిచిన పసిబిడ్డలను కూడా ఈ వ్యాధి వెంటాడుతోంది. దానికి కారణం ఓ అరుదైన జన్యు లోపమని అంతర్జాతీయ శాస్త్రవేత్తలు తాజాగా గుర్తించారు. ఆరు నెలల వయసులోపు పిల్లల్లో కనిపించే ఈ వింత పరిస్థితి వెనుక ఉన్న అసలు కారణాన్ని గుర్తిస్తూ, వైద్య ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచే కీలక విషయాలను పరిశోధకులు వెల్లడించారు.‘నియోనాటల్ డయాబెటిస్’ వెనుక..ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మందిని వేధిస్తున్న మధుమేహం (Diabetes) ఒక వయసు దాటినవారికే పరిమితం కాలేదు. అది పసిపిల్లలపై కూడా ప్రభావం చూపుతోంది. ఆరు నెలలలోపు శిశువులలో కనిపించే ‘నియోనాటల్ డయాబెటిస్’ (Neonatal Diabetes) అనేది సాధారణ టైప్-1 డయాబెటిస్కు భిన్నమైనది. ఇది ఆటో ఇమ్యూన్ సమస్య వల్ల కాకుండా, ఇన్సులిన్ ఉత్పత్తిని ప్రభావితం చేసే జన్యువులోని మార్పుల వల్ల వస్తున్నదని ‘డయాబెటిస్ యూకే’ తన తాజా అధ్యయనంలో పేర్కొంది. శిశువుల్లో మధుమేహంపై ఇటీవల ‘ది జర్నల్ ఆఫ్ క్లినికల్ ఇన్వెస్టిగేషన్’లో అధ్యయన ఫలితాలు ప్రచురితమయ్యాయి. యూనివర్సిటీ ఆఫ్ ఎక్సెటర్ మెడికల్ స్కూల్, బెల్జియంలోని యూనివర్సిటీ లిబ్రే డి బ్రెక్సెల్స్ (యూఎల్బీ) శాస్త్రవేత్తలు సంయుక్తంగా నవజాత శిశువులలో డయాబెటిస్కు కారణమయ్యే ఒక అరుదైన జన్యుపరమైన రుగ్మతను గుర్తించారు.ఆరుగురు చిన్నారులపై పరిశోధనఈ పరిశోధన కోసం శాస్త్రవేత్తలు అత్యాధునిక డీఎన్ఏ సీక్వెన్సింగ్, స్టెమ్ సెల్ రీసెర్చ్ మోడల్ను ఉపయోగించారు. పుట్టిన ఆరు నెలల లోపునే డయాబెటిస్ బారిన పడిన ఆరుగురు చిన్నారులను క్షుణ్ణంగా పరిశీలించగా, వారికి మధుమేహంతో పాటు మూర్ఛ, మైక్రోసెఫాలీ లాంటి నాడీ సంబంధిత సమస్యలు కూడా ఉన్నట్లు తేలింది. ఈ ఆరుగురు పిల్లలలోనూ ‘టీఎంఈఎం1ఏ’ అనే ఒకే రకమైన జన్యువులో మ్యుటేషన్లు (మార్పులు) ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. ఈ జన్యు లోపమే పిల్లల్లో ఒకేసారి మెటబాలిక్, న్యూరోలాజికల్ సమస్యలకు ప్రధాన కారణమని ఈ అధ్యయనం ద్వారా స్పష్టమైంది.కణాల పనితీరుపై ప్రభావం ఈ జన్యువు శరీరంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసుకునేందుకు ప్రొఫెసర్ మిరియం క్నోప్ బృందం స్టెమ్ సెల్స్ ద్వారా ఇన్సులిన్ ఉత్పత్తి చేసే ‘బీటా కణాలను’ సృష్టించింది. సీఆర్ఐఎస్పీఆర్ జీన్-ఎడిటింగ్ విధానం ద్వారా ‘టీఎంఈఎం1ఏ’ జన్యువును మార్పు చేసి పరీక్షించి చూశారు. ఈ జన్యువు దెబ్బతిన్నప్పుడు, ఇన్సులిన్ ఉత్పత్తి చేసే కణాలు తమ సామర్థ్యాన్ని కోల్పోతాయని, కణాలలో ఒత్తిడి పెరిగి అవి అంతరించిపోతాయని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ జన్యువు కేవలం ఇన్సులిన్ కణాలకే కాకుండా మెదడులోని న్యూరాన్ల పనితీరుకు కూడా అత్యంత కీలకమని వెల్లడైంది.వైద్య నిపుణుల విశ్లేషణ యూనివర్సిటీ ఆఫ్ ఎక్సెటర్కు చెందిన డాక్టర్ ఎలిసా డి ఫ్రాంకో ఈ విషయమై మాట్లాడుతూ శిశువులలో డయాబెటిస్కు కారణమయ్యే డీఎన్ఏ మార్పులను గుర్తించడం ద్వారా.. ఇన్సులిన్ స్రావంలో కీలక పాత్ర పోషించే జన్యువుల గురించి మరింతగా తెలుసుకోవచ్చని పేర్కొన్నారు. ‘టీఎంఈఎం1ఏ’ వంటి అంతగా తెలియని జన్యువు పనితీరును అర్థం చేసుకోవడం వైద్యశాస్త్రంలో ఒక ముందడుగు అని ఆమె పేర్కొన్నారు. ఈ ఆవిష్కరణ వ్యాధి లక్షణాలను అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుందన్నారు. అలాగే భవిష్యత్తులో అరుదైన డయాబెటిస్ రకాలకు కొత్త చికిత్సలను అభివృద్ధి చేయడానికి నమూనాగా ఉపకరిస్తుందని ప్రొఫెసర్ క్నోప్ ఆశాభావం వ్యక్తం చేశారు.ఇది కూడా చదవండి: ఆయుర్వేదానికి షాకిస్తున్న ‘వెండి బంగారాలు’ -
12 ఏళ్ల మూత్ర సమస్యకు శస్త్రచికిత్సతో శాశ్వత విముక్తి
హైదరాబాద్: 12 సంవత్సరాలుగా మూత్ర విసర్జనలో తీవ్ర ఇబ్బందులతో బాధపడుతున్న 45 ఏళ్ల మహిళకు ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ (AINU) వైద్యులు విజయవంతంగా శస్త్రచికిత్స నిర్వహించి సాధారణ మూత్ర విసర్జనను పునరుద్ధరించారు. అరుదైన బక్కల్ మ్యూకోసల్ గ్రాఫ్ట్ యూరేత్రోప్లాస్టీ శస్త్రచికిత్స ద్వారా ఆమెకు కొత్త జీవితం అందించారు.జార్ఖండ్కు చెందిన గృహిణి (పేరు మార్చారు – పల్లవి) గత దశాబ్దానికి పైగా మూత్ర విసర్జన సమయంలో నొప్పి, మూత్ర ప్రవాహం తక్కువగా ఉండటం, మధ్యలో ఆగిపోవడం, తరచూ మూత్రనాళ ఇన్ఫెక్షన్లు వంటి సమస్యలతో బాధపడుతున్నారు. బాత్రూమ్లో ఒక్కసారి మూత్ర విసర్జనకు 15–20 నిమిషాల వరకు సమయం పట్టేది. అనేక చోట్ల చికిత్సలు తీసుకున్నా, తాత్కాలిక ఉపశమనం తప్ప సమస్య పూర్తిగా తగ్గలేదు.ఈ పేషెంట్ కి ఏఐఎన్యూ బంజారాహిల్స్లోని కన్సల్టెంట్ ఫీమేల్ యూరాలజిస్ట్ డాక్టర్ సారికా పాండ్యా, రీకన్స్ట్రక్టివ్ యూరాలజీ విభాగాధిపతి డాక్టర్ భవతేజ్ ఎంగంటి కలిసి శస్త్రచికిత్స నిర్వహించారు. శస్త్రచికిత్స అనంతరం నాలుగు నెలల్లో ఆమె మూత్ర ప్రవాహం పూర్తిగా సాధారణ స్థాయికి చేరింది.డాక్టర్ సారికా పాండ్యా మాట్లాడుతూ, మహిళకు ఫీమేల్ యూరేత్రల్ స్ట్రిక్చర్ అనే మూత్ర సంబంధ సమస్య ఉందని తెలిపారు. మూత్రనాళం సన్నబడటం వల్ల ఈ సమస్య వస్తుందని, దీని లక్షణాలుగా మూత్రం చుక్కలుగా రావడం, మధ్యలో ఆగిపోవడం, మూత్రాశయం పూర్తిగా ఖాళీ కాలేదన్న భావన, తరచూ ఇన్ఫెక్షన్లు ఉంటాయని వివరించారు.తరచూ మూత్రనాళ ఇన్ఫెక్షన్లు, సిజేరియన్ లేదా గర్భాశయ తొలగింపు వంటి శస్త్రచికిత్సల సమయంలో క్యాథెటర్ వాడకం, సరైన నిర్ధారణ లేకుండా పదేపదే యూరేత్రల్ డైలటేషన్ చేయడం వల్ల ఈ సమస్య ఎక్కువయ్యే అవకాశముందని చెప్పారు.“యూరేత్రల్ డైలటేషన్ తాత్కాలిక ఉపశమనం మాత్రమే ఇస్తుంది. నెలకు ఒకసారి లేదా రెండు నెలలకు ఒకసారి ఈ ప్రక్రియ చేయించుకోవడం వల్ల మూత్రనాళం మరింత దెబ్బతిని సమస్య తీవ్రమవుతుంది,” అని డాక్టర్ సారిక తెలిపారు.పురుషుల్లో చాలాకాలంగా ఉపయోగిస్తున్న బకల్ మ్యూకోసల్ గ్రాఫ్ట్ యూరేత్రోప్లాస్టీని ఇప్పుడు మహిళల్లోనూ విజయవంతంగా చేస్తున్నారు. నోటిలోని లోపలి పొర నుంచి తీసుకున్న కణజాలంతో మూత్రనాళాన్ని పునర్నిర్మించడం ద్వారా దీర్ఘకాలిక పరిష్కారం లభిస్తుందని ఆమె వివరించారు. ఈ శస్త్రచికిత్స వల్ల మూత్ర అదుపు కోల్పోయే ప్రమాదం లేదని కూడా స్పష్టం చేశారు.గత ఐదేళ్లలో ఏఐఎన్యూలో ఈ విధమైన శస్త్రచికిత్సను 60 మంది మహిళలకు నిర్వహించగా, దాదాపు అందరిలోనూ మంచి ఫలితాలు వచ్చాయని తెలిపారు. మరో పేషెంట్ కి కూడా మూత్రాశయం పూర్తిగా ఖాళీ కాకపోవడం వల్ల తరచూ ఇన్ఫెక్షన్లు వస్తుండగా, శస్త్రచికిత్స తర్వాత స్పష్టమైన మెరుగుదల కనిపించిందని చెప్పారు.డాక్టర్ భవతేజ్ ఎంగంటి మాట్లాడుతూ, “మహిళల్లో యూరేత్రల్ స్ట్రిక్చర్ పెద్ద సమస్యగా గుర్తించరు. దీంతో వారు సంవత్సరాల తరబడి బాధపడుతుంటారు. సరైన సమయంలో నిర్ధారణ చేసి ఆధునిక శస్త్రచికిత్స చేయిస్తే, ఎంతకాలంగా ఉన్న సమస్యనైనా సమర్థంగా నయం చేయవచ్చు అన్నారు.మూత్ర విసర్జనకు ఎక్కువ సమయం పట్టడం, మూత్ర ప్రవాహం బలహీనంగా ఉండటం, మధ్యలో ఆగిపోవడం, తరచూ మూత్రనాళ ఇన్ఫెక్షన్లు రావడం వంటి లక్షణాలు ఉన్న మహిళలు తప్పనిసరిగా నిపుణ వైద్యులను సంప్రదించాలని డాక్టర్ సారిక సూచించారు. ఈ సమస్య ఎక్కువగా 40 ఏళ్లకు పైబడిన మహిళల్లో కనిపిస్తుందని, మూత్ర సంబంధిత సమస్యలతో వచ్చే మహిళల్లో 10–20 శాతం మందిలో ఇది ఉండొచ్చని తెలిపారు. మహిళల్లో మూత్ర సమస్యలు కేవలం వైద్య పరమైన సమస్యలే కాకుండా సామాజిక, భావోద్వేగ భారం కూడా అవుతాయని వైద్యులు పేర్కొన్నారు. మూత్ర విసర్జన ఇబ్బందులపై మాట్లాడటాన్ని చాలామంది మహిళలు ఇబ్బందిగా భావిస్తారని, ఇదే సమస్య తీవ్రత పెరగడానికి కారణమవుతోందని అన్నారు. అవగాహన, సమయానుకూల చికిత్స ద్వారా ఇలాంటి సమస్యలకు శాశ్వత పరిష్కారం సాధ్యమని వారు స్పష్టం చేశారు. -
స్కిన్ చికెన్ తింటున్నారా? ఇది మీ కోసమే..
ఆదివారం రాగానే.. నాన్ వెజ్ కోసం ఉరుకులు పెడుతుంటారు. రేటు బోర్డు వంక ఒక చూపు చూసి.. కావాల్సిన క్వాంటిటీని ఆర్డర్ చేస్తుంటారు. ఇందులో చికెన్లో స్కిన్ కోడికి ప్రయారిటీ ఇచ్చేవాళ్లు లేకపోలేదు. తోలుతో కూడిన కోడిని.. అందునా కరెంట్.. గ్యాస్ స్టౌలపై కాల్పించుకుని మరీ ముక్కలు కొట్టిస్తుంటారు. అయితే ఏరికోరి పట్టుకెళ్లే ఇలాంటి చికెన్ నిజంగానే ఒంటికి మంచిదేనా?..స్కిన్ చికెన్ తినడం మంచిదా? కాదా? అని చాలామందికి అనుమానాలు, అనేక అపోహలు ఉన్నాయి. రుచి కోసం తహతహలాడే వాళ్లు కొందరైతే.. తింటే ఏదైనా జరగొచ్చని ఒకటికి పదిసార్లు ఆలోచిస్తుంటారు మరికొందరు. అయితే కోడి చర్మం చెడ్డదేం కాదు. అలాగని పూర్తిగా మంచిది కూడా కాదు. ఈ విషయంలో నిపుణులు చెబుతోంది కూడా ఇదే..చికెన్ స్కిన్లో ఎక్కువగా (unsaturated fatty acids-UFAs) ఉంటాయి. ఇవి శరీరానికి ఎంతో ఉపయోగకరమైనవి. చెడు కొలెస్ట్రాల్ (LDL) తగ్గించడంలో సహాయపడతాయి. పైగా ఇవి ఆలివ్ ఆయిల్లో ఉండే ఏక అసంతృప్త కొవ్వులు(monounsaturated fats) లాంటివే. కాబట్టి గుండెకు చాలా మంచిది. అలాగే.. కోడి చర్మంలో కొంత ప్రోటీన్, కొంత కాలజెన్ కూడా ఉంటుంది. ఇవి చర్మం, కండరాలు, కీళ్లకు బలాన్ని ఇస్తాయి. ఈ ప్రయోజనాల గురించి తెలియకుండానే చాలామంది ఉత్త రుచి కోసమే స్కిన్ కోడి వైపు మొగ్గు చూపుతుంటారు.అదే సమయంలో కోడి చర్మం అధిక కేలరీలు, కొవ్వు కలిగిన భాగం కూడా. ఒక ఔన్స్ చికెన్ స్కిన్లో సుమారు 90–128 కేలరీలు ఉంటాయి. కాబట్టి ఎక్కువగా తిన్నా.. హృదయ సంబంధ సమస్యలు, బరువు పెరగడం లాంటి ప్రమాదాలు ఉన్నాయి. కాబట్టి స్కిన్ చికెన్ మితంగా.. వారానికి ఒకసారి లేదంటే నెలలో నాలుగైదుసార్లు మాత్రమే తీసుకోవడం ఉత్తమం అని అంటున్నారు. అప్పుడే గుండెకు..ఆరోగ్యానికి మంచిదని చెబుతున్నారు.కాల్చే పద్ధతులపైనా..కాల్చిన కోడికి ప్రాధాన్యత ఇస్తుంటారు చాలా మంది. అందునా కట్టెల పొయ్యి అయితే బాగుంటుందని ఫీలవుతుంటారు. కానీ.. టౌన్లు, సిటీల్లో గ్యాస్ పొయ్యిలు, ఎలక్ట్రిక్ స్టౌలే కనిపిస్తుంటాయి. అయితే..రుచి బాగుంటుందని కట్టెల పొయ్యి ప్రిపర్ చేసేవాళ్లకు అలర్ట్. అలాంటి పొగలో హానికారక రసాయనాలు ఉంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కట్టెల పొయ్యి నుంచి వెలువడే పాలీసైక్లిక్ ఆరోమెటిక్ హైడ్రోకార్బన్స్(PAHs), హెటిరోసైక్లిక్ అమెన్స్ (HCAs) వంటి రసాయనాలు క్యాన్సర్కు దారి తీయొచ్చని పరిశోధనలు చెబుతున్నాయి కూడా. కాబట్టి.. గాలి సరైన విధంగా బయటకు వెళ్లే రీతిలో ఉన్న గ్యాస్ స్టౌ, అసలు పొగ వెలువడని ఎలక్ట్రిక్ స్టౌలతోనే మంచిదని గుర్తించాలి.స్కిన్లెస్లో బ్రెస్టే బెస్ట్స్కిన్ లెస్ చికెన్లో బ్రెస్ట్ పీస్కు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం ఉత్తమమని నిపుణులు చెబుతున్నారు. లెగ్ పీస్లతో పోలిస్తే.. పై భాగంలో కొవ్వు చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి గుండెకు మంచిది. సంతృప్త కొవ్వు(Saturated fat) తక్కువగా ఉండటం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. కండరాల పెరుగుదల, శరీర కణాల మరమ్మతుకు సాయపడే అధిక ప్రొటీన్ లభిస్తుంది. అలాగే స్కిన్ లేకుండా వాడితే కేలరీలు తగ్గుతాయి. బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచి ఎంపిక. వీటికి తోడు.. బ్రెస్ట్ పీస్లోని లీన్ మీట్(తక్కువ కొవ్వు (fat) కలిగిన మాంసం).. సులభంగా జీర్ణం అవుతుంది.సరిగ్గా ఉడకకపోయినా..స్కిన్ లేదంటే స్కిన్లెస్..ఏదైనా సరే చికెన్ తినడం శరీరానికి లాభాలు ఉన్నాయి. చికెన్లో అదనంగా విటమిన్లు B6, B12, నియాసిన్, సెలనియం, పాస్పరస్.. పోషకాలు ఉంటాయి. ఇవి మెటబాలిజంతో పాటు రక్తకణాల ఉత్పత్తి, రోగనిరోధక శక్తి పెంపు కోసం అవసరంపడేవే. అయితే వండే విధానం, తీసుకునే పరిమాణం ఆధారంగానే ఫలితం డిసైడ్ అవుతుంది. తాజా చికెన్కే ఎప్పుడూ ప్రాధాన్యత ఇవ్వాలి. చికెన్ను ఉడికించడం, గ్రిల్, బేక్ చేయడం మంచిది. సరైన వేడిలో.. సరిగ్గా ఉడకకపోతే బాక్టీరియాల వల్ల ఫుడ్ పాయిజన్ అయ్యే ప్రమాదం లేకపోలేదు. అలాగే డీప్ఫ్రైలు, స్కిన్ చికెన్ అధికంగా తీసుకుంటే గుండె జబ్బులు తప్పవు. -
మర్చిపోతున్నారా? ఇవిగో ఈ టెక్నిక్స్ మీకోసమే!
నేటి రోజుల్లో చాలా మందికి ఏం చేయాలో సరిగా గుర్తుండడం లేదు. చేద్దాం చేద్దాం అని అనుకుంటూనే చేయాల్సిన పనులు మర్చిపోతుంటారు. ఇది చాలా మామూలు విషయమే అయినా.. అలాగే ఉంటే కొద్దికాలానికి అంటే వృద్ధాప్యం రాకమునుపే మెదడు మొద్దుబారిపోతుంది. అలా కాకుండా మెదడును చురుగ్గా ఉంచాలంటే కొన్ని ప్రత్యేక పద్ధతులు పాటించాలి. ముఖ్యంగా జపాన్ నుంచే కొన్ని విశేషమైన జ్ఞాపకశక్తిని పెంచే పద్ధతులు వచ్చాయి. ఈ జపనీస్ చిట్కాల వల్ల మెదడు చురుకుగా మారి, విషయాలు మర్చిపోకుండా గుర్తుంచుకునే శక్తిని పొందుతుంది. ఆ చిట్కాల గురించి తెలుసుకుందాం.శిసా కాన్కోశిసా కాన్కో అంటే ఒక విషయాన్ని చూపిస్తూ బిగ్గరగా మాట్లాడటం. అంటే శరీరానికి, మెదడుకి ఏకకాలంలో పని చెప్పడం లేదా మాటలు చెప్పడం. దీనివల్ల మన దృష్టి పూర్తి స్థాయిలో ఆ విషయంపైనే ఉంటుంది. జపాన్లో రైలు నడిపే ఆపరేటర్లు (మనదేశంలో అయితే ఇంజిన్ డ్రైవర్లు) ఈ విధానాన్ని ఎక్కువగా అనుసరిస్తుంటారు.కొటోడమాజపనీయులు విశ్వసించే మరో శక్తిమంతమైన టెక్నిక్ కొటోడమా. ఇది ఒక పదం లేదా వాక్యాన్ని పదే పదే పునరావృతం చేయడం. దీనివల్ల ఆ పదం మన మెదడులో నిలిచిపోతుంది. విద్యార్థులు లేదా ప్రసంగం ఇచ్చే వ్యక్తులు ఈ పద్ధతిని వాడితే వారి జ్ఞాపకశక్తి బలపడుతుంది.ఇదీ చదవండి: స్వీపర్గా నెలకు రూ.లక్ష : ఇండియన్ టెకీ ఇంట్రస్టింగ్ స్టోరీఉకెటమోఉకెటమో అనే ఈ భావన టొహౌకు అనే జపనీస్ మతపరమైన వర్గం నుండి వచ్చింది. దీని అర్థం నిజాయితీగా అంగీకరిస్తాను. మనం ఏ అంశాన్నైనా హృదయపూర్వకంగా అంగీకరిస్తే మానసికంగా స్థిరంగా ఉండగలమని అప్పుడు మన భావోద్వేగాలు నియంత్రణలో ఉంటాయని ఇది చెబుతోంది.మన జ్ఞాపకశక్తి బలపడాలని, వృద్ధాప్యం మీద పడినా, మతిమరుపు లేకుండా ఉండాలంటే అనుకుంటే జపనీయులు శతాబ్దాలుగా పాటిస్తున్న ఈ చిట్కాలను అనుసరించ వచ్చు. ఇవి ఖచ్చితంగా మీ మెదడును చురుగ్గా ఉంచి మీరు మరిచి పోతున్న విషయాలను గుర్తుపెట్టుకునేలా చేస్తాయి. ప్రయత్నిస్తే మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. (టీనేజ్ లవర్స్ : 40 ఏళ్లకు 60లలో మళ్లీ పెళ్లి)కన్ సాట్సూఈ పద్ధతిని జపాన్లో సన్యాసులు, కళాకారులు ఎక్కువగా పాటిస్తారు. కన్ సాట్సూ అంటే చుట్టూ ఉన్న విషయాలను నిశ్శబ్దంగా గమనించడం. మనం ఏమీ మాట్లాడకుండా చుట్టుపక్కల ఉన్న ప్రతి చిన్న విషయాన్ని గమనిస్తే మెదడు సానుకూలంగా స్పందిస్తుంది. అన్ని విషయాలను శ్రద్ధగా గుర్తుంచుకుంటుంది. కళలతో సంబంధం ఉన్న వ్యక్తులలో ఎక్కువగా కనిపించే ఇది ఒక రకమైన మైండ్ ఫుల్ నెస్ టెక్నిక్.నైకాన్కాలం గడిచే కొద్దీ మన జ్ఞాపకశక్తి తగ్గిపోతుందని అనుకుంటాం. అయితే జపనీయులు నైకాన్ అనే విధానాన్ని పాటిస్తూ.. మౌనంగా ఉండటం ద్వారా పాత జ్ఞాపకాలను తిరిగి గుర్తుకు తెచ్చుకునే ప్రయత్నం చేస్తారు. ప్రశాంత వాతావరణంలో కూర్చొని నేను ఎవరికి ఏం ఇచ్చాను..? ఎవరి నుంచి ఏం తీసుకున్నాను..? ఎవరి వల్ల నాకు ఇబ్బంది కలిగింది..? వంటి ప్రశ్నలను మనలో మనం వేసుకుంటే పాత జ్ఞాపకాలు తిరిగి గుర్తొస్తాయని వారు చెబుతున్నారు.మన జ్ఞాపకశక్తి బలపడాలని, వృద్ధాప్యం మీద పడినా, మతిమరుపు లేకుండా ఉండాలంటే అనుకుంటే జపనీయులు శతాబ్దాలుగా పాటిస్తున్న ఈ చిట్కాలను అనుసరించవచ్చు. ఇవి ఖచ్చితంగా మీ మెదడును చురుగ్గా ఉంచి మీరు మరిచిపోతున్న విషయాలను గుర్తుపెట్టుకునేలా చేస్తాయి. ప్రయత్నిస్తే మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. -
ఐవీఎఫ్ రాజధాని.. తమిళనాడు!
దేశంలో 2026 జనవరి 6 నాటికి మొత్తం 2,650 ఐవీఎఫ్ క్లినిక్స్ ఉన్నాయి. ఇందులో 25 శాతానికిపైగా క్లినిక్స్తో.. భారతదేశపు ఐవీఎఫ్ క్లినిక్ల రాజధానిగా తమిళనాడు అవతరించిందని ‘నేషనల్ ఎ.ఆర్.టి. (అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీ), సరోగసీ రిజిస్ట్రీ; ఎస్.ఆర్.ఎస్. (శాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్) రిపోర్ట్ – 2023 గణాంకాలు చెబుతున్నాయి. కృత్రిమ విధానంలో సంతాన భాగ్యం ప్రసాదించే చికిత్సా విధానమే ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్. దీనికి గతంలో ఎన్నడూ లేనంతగా దేశంలో ఇప్పుడు క్రేజ్ పెరిగింది. ఫలితంగా క్లినిక్కులూ పెరుగుతున్నాయి. నేషనల్ ఎ.ఆర్.టి. (అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీ), సరోగసీ రిజిస్ట్రీ గణాంకాల ప్రకారం దేశంలో అత్యధిక ఐవీఎఫ్ క్లినిక్లు తమిళనాడులో ఉన్నాయి. ఎంత ఎక్కువగా అంటే రెండో స్థానంలో ఉన్న గుజరాత్లో 361 ఉంటే.. దాదాపు వాటికి రెట్టింపుగా 669 క్లినిక్లు ఉండటంతో సంతాన సాఫల్య చికిత్సలకు తమిళనాడు ప్రధాన కేంద్రంగా మారింది.సామాజిక కారణాలుతమిళనాడులో ఐవీఎఫ్ క్లినిక్లు అత్యధిక స్థాయిలో ఉండటానికి సామాజిక, ఆరోగ్య అంశాలను రిజిస్ట్రీ ప్రధాన కారణాలుగా చూపింది. తగ్గుతున్న జననాల రేటు, ఆలస్యంగా పెళ్లిళ్లు చేసుకోవటం, కెరీర్పై దృష్టి పెట్టటం వంటి వాటి వల్ల ఆ రాష్ట్రంలో సంతానోత్పత్తి రేటు జాతీయ సగటు (2.0) కంటే కూడా బాగా తగ్గిపోయి ఐవీఎఫ్ చికిత్సలకు డిమాండ్ పెరిగిందని విశ్లేషించింది. అంతేకాదు, తమిళనాడులో ప్రైవేట్ వైద్య రంగం అధునాతన సదుపాయాలతో ఉంది. కొత్త సాంకేతికతను వెంటవెంటనే అందిపుచ్చుకుంటోంది. అందువల్ల సంతాన సాఫల్య చికిత్సలు ఆ రాష్ట్రంలో సులువుగా అందుబాటులోకి వస్తున్నాయని తెలిపింది.చట్టబద్ధమైన నమోదుప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎ.ఆర్.టి. నియంత్రణ చట్టం, తమిళనాడులోని క్లినిక్లు తమ పేర్లను నమోదు చేసుకోవటంలో పారదర్శకంగా ఉండేందుకు దోహదపడుతోందని రిజిస్ట్రీ తెలిపింది. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఇక్కడ నిబంధనల అమలు మెరుగ్గా ఉండటం వల్ల కూడా అధికారిక లెక్కల్లో క్లినిక్ల సంఖ్య ఎక్కువగా కనిపిస్తోంది. చెన్నై వంటి నగరాలు ఇప్పుడు కేవలం తమిళనాడుకే కాకుండా, దేశవ్యాప్తంగా, ఇతర దేశాల నుంచి వచ్చే వారికి కూడా ‘ఫెర్టిలిటీ హబ్’గా మారాయి. నిపుణులైన డాక్టర్లు, అత్యాధునిక వైద్య పరికరాలు అందుబాటులో ఉండటం కూడా తమిళనాడుకు ఈ గుర్తింపును తెచ్చిపెట్టిందని పేర్కొంది.ఆ రాష్ట్రాల్లో ఎక్కువగా..గణాంకాల ప్రకారం చూస్తే.. దేశంలో సంతానోత్పత్తి రేటు తక్కువగా ఉన్న తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక వంటి కొన్ని రాష్ట్రాల్లో ఈ ఐవీఎఫ్ క్లినిక్కులు ఎక్కువగా ఉన్నాయి. మహారాష్ట్ర, కేరళలలో సంతానోత్పత్తి రేటు తక్కువగా ఉన్నప్పటికీ క్లినిక్లు ఎక్కువగా లేవు. -
ఇదేం విడ్డూరం..! డైరీ రాస్తూ..86 కిలోలు బరువు తగ్గిందా!?
బరువు తగ్గించే చిట్కాలు..సింపుల్ రెమిడీస్ వంటివి ఎన్నో చూశాం. పలానా వ్యాయామం, డైట్ అంటూ ఏవేవో కొంగొత్త విధానాలతో బరువు తగ్గిన ఉదంతాలు చూశాం. కొందరు ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా తీసుకుంటూ..కార్డియాక్ వర్కౌట్లు, వాకింగ్లు, స్కిప్పింగ్లు అంటూ ఎంతో శ్రమ పడి తగ్గగా.. మరికొందరు సైక్లింగ్తో కుస్తీలు పడ్డారు. ఒక్కోక్కరూ ఒక్కోదారిలో వెళ్లి బరువు తగ్గి స్ఫూర్తిగా నిలిచారు. కానీ ఈ మహిళ ఇంతలా కష్టపడకుండా అందరు సులభంగా చేసే, చాలా తేలికైన అలవాటుతో ఇట్టే బరువు తగ్గింది. అది కూడా ఏకంగా 86 కిలోలు బరువు తగ్గడం అంటే మాటలు కాదు కదా..!. అలా అని షార్ట్కట్లు, ఏవేవో మందులు, ఇంజెక్షన్లు తీసుకోలేదు సుమీ..!. మరి ఆమె ఎలా అంతలా బరువు తగ్గింది..?, ఏంటా హాబీ..? అంటే..బరువు తగ్గించే జర్నీలో అందరికీ అతిపెద్ద టాస్క్ వ్యాయామం, వర్కౌట్లు. కానీ ఈ అమెరికా మహిళ కామ్ ఆ పాట్లు ఏం పడకుండా చాలా స్మార్ట్గా చిన్న చిన్న అలవాట్లతో మైండ్ని సెట్ చేసుకుంటూ సులభంగా బరువు తగ్గి అద్భుతం చేసింది. తాను ఎలాంటి ఫిట్నెస్ ట్రైనర్, స్నేహితులు, బంధువుల సహాయం తీసుకోకుండా కేవలం ఆ చిన్న అలవాటుతో బరువు తగ్గించుకున్నానంటోంది. తాను చెప్పబోయే అలవాటు వినడానికి హాస్యస్పదంగా, నమ్మశక్యంగా అనిపించకపోయినా..అద్భుతం చేసిందనేది నమ్మక తప్పని వాస్తవం అని అంటోందామె. కామ్ తనకు ఉన్న డైరీ రాసే అలవాటే అద్భుతంగా బరువు తగ్గేందుకు హెల్ప్ అయ్యిందట. అలా ఏకంగా 86 కిలోలు పైనే బరువు తగ్గానని చెబుతోంది. ఆ డైరీలో తన వెయిట్లాస్ జర్నీని ఎందుకు ప్రారంభించింది.. ఆ టైంలో తాను ఎలా ఉండేది వంటి పోటోలతో సహా పొందుపరిచింది. వాటిని చూసుకుంటూ..తన శరీర పరివర్తనలో మార్పులకు శ్రీకారం చుట్టిందట. ఎందుకంటే ఆ డైరీ ఓపెన్ చేయగానే తన దినచర్య సరిగా ఉందా, ఆహారం మితంగా తిన్నానా లేదా అని తరచి.. తరచి.. చూసుకోవడమే కాకుండా జవాబుదారీగా ఉండాలే చేస్తుందట. ఆ క్రమంలో తనకు స్ఫూర్తిని కలిగించే సూక్తులు, మార్గదర్శకులు తదితరాలన్నింటి గురించి రాసేదట. అంతేగాదు ఒకరకంగా ఏం తిన్నాను, ఏం వ్యాయామాలు చేశాను అన్నది రాస్తున్నప్పుడూ..అబ్బా ఇది చేయలేకపోయాను..ఇంకా బాగా చేయాలి అనే ఫీడ్ బ్యాక్ ఇస్తుంటుందట ఆ అలవాటు. దాంతో బరువు తగ్గాలనే ఆలోచన బలంగా మదిలో నాటుకుని..అన్నింటిపై సరైన ఫోకస్ పెడతామట. ఫలితంగా బరువు తగ్గడం సులభం అవుతుందని అంటోందామె. నిజంగా హెల్ప్ అవుతుందా అంటే..?బరువు తగ్గించే జర్నీలో డైరీ రాసే అలవాటు పెద్ద పాత్ర పోషిస్తుందని పరిశోధనలు సైతం చెబుతుండటం విశేషం. హార్వర్డ్ నివేదిక ప్రకారం, దాదాపు 1,700 మంది రోజువారి ఆహార రికార్డులను తమ డైరీలో ట్రాక్ చేయగా..వారంతా రెండు రెట్లు బరువు తగ్గారట. అలాగే మిచిగాన్ స్టేట్ యూనివర్శిటీ ప్రచురించిన 2012 జర్నల్ సైతం ఇలా డైరీ రాసే వ్యక్తులు అధిక మొత్తంలో బరువు తగ్గినట్లు అధ్యయనం పేర్కొంది. ఇలా మనం తినేవాటిని వ్రాయడం, ప్రాముఖ్యతను హైలెట్ చేయడం వల్ల తమ ఆహారపు అలవాట్లు ఎలా ఉన్నాయనేది తరచి చూసుకునే అవకాశం వస్తుందట..దాంతో బరువు తగ్గుతారట. ఇలా ఎంత ఎక్కువగా తాము తినే ప్రతి ఆహారం గురించి నమోదు చేసే అలవాటు ఉంటే అంత అధిక మొత్తం లో బరువు తగ్గుతారని పలువురు నిపుణులు చెబుతున్నారు. మరి వెయిట్లాస్ జర్నీలో మంచి ఫలితాలు అందుకునేందుకు డైరీ రాసే అలవాటుని సత్వరమే ప్రారంభిద్దామా మరి..(చదవండి: Beauty Tips: శీతాకాలంలో ఆరోగ్యకరమైన మెరిసే చర్మం కోసం.. ఈ ఆరు సూప్లు..!) -
జొమాటో సీఈవో ధరించిన ‘టెంపుల్’ గురించి తెలుసా?
జొమాటో వ్యవస్థాపకుడు దీపేందర్ గోయెల్ ముఖం మీద ఉన్న రహస్య పరికరంపై సోషల్మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇటీవల ఓ కార్యక్రమంలో అతను మాట్లాడుతున్న సమయంలో అతని ముఖంపై అతికించి ఉన్న ఆ చిన్న వస్తువే హాట్టాపిక్గా మారింది. కొందరు ఫోన్ చార్జర్ అని, మరి కొందరు బబుల్గమ్ అతికించుకుని ఉంటాడని కూడా వ్యంగోక్తులు విసిరారు. ఇంతకీ అందేంటో తెలుసా?దీపిందర్ అందించిన వివరాల ప్రకారం ఆ పరికరం పేరు టెంపుల్. ఇది మానవ శరీరంలోని రక్త ప్రవాహాన్ని పర్యవేక్షిస్తూ.మెదడు కార్యకలాపాలను నియంత్రిస్తూ, ఓవరాల్గా మన శరీరానికి ఆరోగ్యాన్ని అందించే పరికరం. ప్రస్తుతం ప్రయోగ దశలో ఉన్న టెంపుల్ ఇంకా మార్కెట్లోకి రాలేదు. కానీ ఏడాది కాలం నుంచి దీన్ని వినియోగిస్తున్నానని దీపీందర్ చెప్పారు.ఇది ఎలా పని చేస్తుందంటే..టెంపుల్ ధరించిన వ్య క్తి తన మెదడులో రక్త ప్రవాహం... వేగం వివరాలు గుర్తించడంతో పాటు... రక్త ప్రసరణ గురించి, మనపై ఏదైనా ఒత్తిడి వచ్చినప్పడు.. శరీరంలో కలిగే మార్పులను ఇది గుర్తించి మనకు తెలియజేస్తుంది. రియల్ టైమ్ లో మన బాడీ పరిస్థితి... అది మెదడును ఎలా ప్రభావితం చేస్తోందనే అంశాలను పసిగడుతుంది. ఇదీ చదవండి: బిచ్చగాడిలా బతికాడు, చనిపోయాక డబ్బు కట్టలు చూసి అందరూ షాక్!అలసట, మనస్సు కేంద్రీకరించకపోవడం, జ్ఞాపకశక్తి సమస్యలు, వృద్ధాప్య ప్రక్రియలో సమస్యలను గుర్తించి... వాటి నివారణకు కూడా ఈ యంత్రం సహకరిస్తుంది. అయితే ఈ పరికరం మార్కెట్లోకి అందుబాటులోకి రాలేదు. ఈ పరికరం పరిశీలన దశలో ఉన్నందున, దీపేందర్ గోయెల్ వ్యక్తిగత పరిశోధన చేస్తున్నట్లు సమాచారం. ప్రయోగ దశలో ఉన్న ఈ పరికరం మార్కెట్లోకి రావాలంటే చాలా విషయాల్లో క్లీన్చిట్ లభించాల్సి ఉంటుంది. దీన్ని వినియోగిస్తే ఇతర సమస్యలు వచ్చే ప్రమాదముందనే వాదన కూడా ఉంది. ధర విషయంలోనూ ఇంకా స్పష్టత లేదు. ప్రస్తుతానికి ఈ పరికరం విలువ 25 మిలియన్ డాలర్లు అని నిర్ణయించారు... అంటే మన దేశ కరెన్సీలో సుమారు 200 కోట్ల రూపాయలు. ఇదీ చదవండి: పెళ్లికి పిలిస్తే రాలేదు.. కట్ చేస్తే అస్థిపంజరం దొరికింది -
దేవుడంటే భక్తి.. అయినా ఎందుకిలా..?
నాకు మొదటినుంచి దేవుడంటే విపరీతమైన భయభక్తులు. తరచు గుళ్లకు వెళుతుంటాను. రోజూ పూజ చేస్తుంటాను. అయితే గత రెండేళ్లుగా దేవుళ్లపైన విపరీతమైన చెడు ఆలోచనలు వస్తున్నాయి. దేవుడిని బూతుమాటలు తిట్టినట్లు, దేవుడి పటాలను అగౌరవపరచినట్టు... ఇలా రాయడానికి వీలులేని చెడ్డ తలంపులు వస్తున్నాయి. దాంతోటే ‘ఇది చాలా తప్పు, నాలాంటి భక్తుడికి ఇలాంటి చెడు ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి...’ అని మాన సికంగా చాలా మధన పడుతున్నాను. ఈ ఆలోచనల మూలాన దేవుడు నన్ను శపిస్తాడేమోననే భయంతో సరైన తిండి, నిద్రలతోపాటు మనశ్శాంతికి కూడా దూరం అయియాను. ఏ పనిమీదా ధ్యాస పెట్టలేకపోతున్నాను. నాకీ బాధనుంచి విముక్తి కలిగే మార్గం చెప్పగలరు. – రఘురామ్, నల్గొండఎంత వద్దనుకున్నా మనసులో ఇలా మాటిమాటికీ చెడు తలంపులు వచ్చి, మనసును బాధించే ఇలాంటి ఆలోచనలను అబ్సెషన్స్ అంటారు. ఆ చెడు తలంపులనుంచి బయటపడేందుకు మాటిమాటికీ లెంపలేసుకోవడం, దండాలు పెడుతూ ఉండటాన్ని కంపల్షన్స్ అంటారు. ఇది ఒక ప్రత్యేకమైన మానసిక రుగ్మత. దీనిని ఓసీడీ అంటారు. మన మెదడులోని సెరటోనిన్ అనే ఒక ప్రత్యేకమైన రసాయన పదార్థం సమతుల్యతలో తేడాలొచ్చినప్పుడు కొందరిలో ఇలాంటి విపరీతమైన ఆలోచనలు, ధోరణులు కలుగుతాయి. ఇవి రాకూడదని ప్రయత్నించినకొద్దీ మరింత ఎక్కువగా మనసులోకి చొచ్చుకొచ్చి విపరీతమైన మానసిక సంఘర్షణకు గురిచేస్తాయి. ఈ ఆలోచనలకు మూలకారణమైన మీ మెదడులోని రసాయన చర్యను సరిచేయడం ద్వారా ఈ అబ్సెషన్స్ను పూర్తిగా అదుపు చేయవచ్చు. ఆధునిక మానసిక వైద్యశాస్త్రంలో ఈ ఓసీడీ జబ్బును పూర్తిగా తగ్గించేందుకు మంచి మందులు, కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ అనే మానసిక చికిత్స అద్భుతంగా పని చేస్తాయి. మందులతోపాటు థాట్ స్టాపింగ్, ఎక్స్పోజర్ రెస్పాన్స్ అండ్ ప్రివెన్షన్ అనే మానసిక చికిత్స ద్వారా దేవుడిపైన మీకు కలిగే చెడు ఆలోచనలనుంచి విముక్తి కలిగించవచ్చు. ఓసీడీ జబ్బును తగ్గించేందుకు వీటికితోడు ఇటీవలే వచ్చిన ఆర్.టి.ఎం.ఎస్. అనే అత్యాధునిక పరికరాన్ని వాడుతున్నాము. మీరు వెంటనే మీకు అందుబాటులో ఉన్న సైకియాట్రిస్టును కలిసి చికిత్స తీసుకోండి. ఆల్ ది బెస్ట్!డా. ఇండ్ల విశాల్ రెడ్డి, సీనియర్ సైకియాట్రిస్ట్, విజయవాడ. (మీ సమస్యలు, సందేహాలు పంపవలసిన మెయిల్ ఐడీ: sakshifamily3@gmail.co) -
చికిత్సలోనూ వివక్ష!
‘‘భారతీయ మహిళకు మానసిక చికిత్స అవసరమైన సందర్భాల్లో ఇటు కుటుంబంగానీ అటు సమాజం కానీ మహిళ పట్ల సానుభూతితో సహానుభూతితో వ్యవహరించడం లేదు. ఇంకా చెప్పాలంటే కాస్త కఠినంగానే వ్యవహరిస్తూనే వచ్చాయి. మనది సహజంగా పితృస్వామ్య వ్యవస్థ కావడంతో అనాదిగా మహిళల పట్ల చిన్నచూపు అలా కొనసాగుతూ పోయిందం’’టూ ఆవేదన వ్యక్తం చేశారు ‘ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ’ ప్రెసిడెంట్ డాక్టర్ సవిత మల్హోత్ర.‘ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ ఫౌండేషన్ డే’ సందర్భంగా హైదరాబాద్లో బుధవారం నిర్వహించిన కార్యక్రమానికి హాజరైన డాక్టర్ సవిత మల్హోత్ర ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మానసిక చికిత్సల విషయంలో భారతీయ మహిళలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై మాట్లాడారు. మహిళలకు మానసిక వైద్యం అవసరమైనప్పుడు... చికిత్స అందాల్సిన వివిధ సందర్భాల్లో ఇప్పటికీ ఆమె ఎదుర్కొంటున్న వివక్ష గురించి వివరించారు. ఈ సందర్భంగా డాక్టర్ సవిత మల్హోత్ర వెలిబుచ్చిన ఆవేదన ఆమె మాటల్లోనే...చికిత్సలో మహిళలు ఎదుర్కొంటున్న సవాళ్ళుమహిళలకు మానసికమైన సమస్యలున్నప్పుడు మన సమాజం వారి పట్ల వివక్షతోనే వ్యవహరిస్తూ వచ్చింది. ఇప్పటికీ పల్లెల్లో మహిళలకు మానసిక చికిత్స సక్రమంగా అందడం లేదన్నది నిర్వివాదాంశం. కాకపోతే పాశ్చాత్య సంస్కృతి, అక్కడి స్వేచ్ఛావాతావరణం తాలూకు ప్రభావాలూ మెట్రోపాలిటన్ నగరాలూ, పెద్ద పెద్ద పట్టణాల్లో వారిని స్వేచ్ఛగా వ్యవహరించేలా చేసినప్పటికీ చిన్న చిన్న పల్లెటూళ్లలో మాత్రం వివక్ష అలాగే ఉంది. అయితే ఇక్కడ మరో ప్రమాదం పొంచి ఉంది. పాశ్చాత్య దేశాల విపరీతమైన, మితిమీరిన స్వేచ్ఛాభావన ల్లాంటి పెడ ధోరణులతో ఆమె విశృంఖలంగా ప్రవర్తిస్తున్న సందర్భాల్లో పురుషుడే కాస్తంత బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సి వస్తోంది. అయితే మహిళలు ఈ రెండు ఎక్స్ట్రీమ్స్లో కాకుండా బ్యాలెన్స్డ్గా ఉండాలి. మెట్రోపాలిటన్ నగరాలూ, చాలా పెద్ద పెద్ద నగరాల్లో మితిమీరిన నాగరికతా ధోరణులున్న కొన్ని పరిమితప్రాంతాల్లో తప్ప మిగిలిన చోట్లంతా మహిళ తీవ్రమైన వివక్షకు గురవుతూనే ఉంది.మహిళలు వివక్షకు లోనయ్యే తీరుతెన్నులునిజం చెప్పాలంటే ఆ వివక్ష చెప్పనలవి కాదు. ఉదాహరణకు ఓ మహిళకు పెళ్లి తర్వాత తనకేదైనా మానసిక చికిత్స అవసరమైందనుకోండి. వెంటనే అత్తింటివాళ్లు ఆమెను నిర్దాక్షిణ్యంగా పుట్టింటికి పంపేస్తారు. ఆ మానసిక సమస్య నుంచి విముక్తి కలిగితే తప్ప అత్తింటికి రావద్దంటూ ఆంక్షలు పెడతారు. ఒకవేళ మహిళలు వైద్యం తీసుకునే పరిస్థితి లేకపోతే వాళ్లు అత్తింటి నుంచి శాశ్వతంగా దూరమయ్యే దయనీయమైన పరిస్థితి ఉంటుంది. అదే పురుషుడికి ఏదైనా మానసిక సమస్య వచ్చిందనుకుందాం. అప్పుడు అతడి చికిత్స విషయంలో ఆమె అతడికి చేయూతనందిస్తూ అతడినే అంటిపెట్టుకుని ఉంటుంది. అతడు బాగుపడేందుకు అండదండలందిస్తూనే ఉంటుంది. ఇక పెళ్లికాని అమ్మాయిల పరిస్థితి ఇంకా దారుణం. మానసిక చికిత్స అవసరమైన మహిళకు అసలు పెళ్లికావడమే పెద్ద సమస్యగా మారుతుంది. ఇక్కడ కూడా పురుషుడికి ఉండే అనుకూతలు వేరు. మగవాడికి ఏదైనా మానసిక సమస్య వస్తే... ‘‘పెళ్లయితే అంతా సర్దుకుంటుంది’’ అంటూ అతడి సమస్య బాధ్యత నుంచి తల్లిదండ్రులు తప్పించుకుని ఓ మహిళ నెత్తిమీదికి నెట్టేస్తారు. ఒక్కమాటలో చెప్పాలంటే పురుషుడికి మానసిక సమస్య వస్తే మహిళ ఓ సపోర్ట్ సిస్టమ్గా అతడికి అండగా ఉంటుంది. కానీ మహిళకే ఆ సమస్య వస్తే అది ఆమెలో ఎమోషనల్ స్ట్రెస్ను మరింత పెంచుతుంది.గతంతో పోలిస్తే కొంత పురోగతి!నగరాలూ పట్టణప్రాంతాల్లో కొంతమేరకు నయమేగానీ చిన్నచిన్న ఊళ్లల్లోనూ, పల్లెల్లో ఇంకా మూఢనమ్మకాలు రాజ్యమేలుతూనే ఉన్నాయి. ఉదాహరణకు పల్లెప్రాంతాల్లో అమ్మవారు పూనడం, దెయ్యం పట్టడం లాంటి ‘΄÷సెషన్ స్టేట్’ మానసిక సమస్యలు మహిళల్లోనే కనిపిస్తుండటం గమనించవచ్చు. దెయ్యాన్ని వదిలించడంలో భాగంగా... చికిత్స పేరిట వాళ్లను బెత్తంతో కొట్టడం, దారుణంగా బాధించడం చేస్తుంటారు. గతంతో పోలిస్తే కాస్త నయమే అయినప్పటికీ పల్లెల్లో ఇంకా ఈ ధోరణులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పుడొచ్చిన మార్పు సరిపోదు. ఇలాంటి మానసికమైన సమస్యలు ఎవరిలో వచ్చినా... ఇంకా ప్రధానంగా మహిళల్లో కనిపించినప్పుడు ఆధునిక వైద్యచికిత్స అందించడం అన్నది ఇప్పుడు చాలా ముఖ్యం. మానసికమైన అంశాల మీద ఆహారం ప్రభావంగతంలో మానసిక సమస్యలతో బాధపడే బాధితుల ఆహారం గురించి పెద్ద పట్టింపు ఉండేది కాదు. కానీ అనేక ఆధునిక పరిశోధనల తర్వాత ‘న్యూట్రిషనల్ సైకియాట్రీ’ విభాగం కూడా ఇప్పుడు చాలా కీలకంగా మారుతోంది.మహిళలకుమరింత మెరుగైనచికిత్స అందడానికి కుటుంబం, సమాజం అందించాల్సిన సపోర్ట్కెరియర్ విషయంలోగానీ, మేధస్సుపరంగాగానీ మహిళా, పురుషుడూ సమానం. కానీ బయాలజీ, ఫిజియాలజీ పరంగా మహిళ మానసిక స్థితిగతులూ, పురుషుడి మానసిక పరిస్థితులూ వేర్వేరుగా ఉంటాయి. దీన్ని అంగీకరించి తీరాలి. మానసిక ప్రవర్తనల ధోరణుల విషయంలోనూ పురుషుడూ, మహిళలూ భిన్నంగా వ్యవహరిస్తుంటారు. ఉదాహరణకు సాధారణంగా ఒక పురుషుడు ఒక అంశంపై ఫోకస్గా వ్యవహరిస్తూ ఉంటే మహిళ మాత్రం తన మల్టీటాస్కింగ్ నైపుణ్యాలతో ఏకకాలంలో అనేక కార్యకలాపాలు నిర్వహిస్తూ ఉంటుంది. ఒక విషయాన్ని పురుషుడు తన మెదడు పరిష్కార ధోరణితో ఆలోచిస్తున్న తరుణంలో... అదే సమస్య విషయంలో మహిళ తన మనసుతో ఆలోచిస్తుంది. తన పార్ట్నర్ తాలూకు ఎమోషనల్ సపోర్ట్తో ఉద్వేగభరితమైన చేయూతతో దాన్ని పరిష్కరించాలనే ధోరణిని పురుషుడి నుంచి ఆశిస్తుంటుంది. ఆ భావోద్వేగాల సపోర్ట్ పురుషుడి నుంచి రావాలని ఎదురుచూస్తుంటుంది. కెరియర్కు సంబంధించిన రంగంలో లేదా ప్రొఫెషనల్ స్కిల్స్ ప్రదర్శించాల్సిన చోట మహిళకు తన తోటి ప్రొఫెషనల్స్ నుంచే తాను కోరుకునే సమాన భావన అందదు. మరో మూడువారాల్లో దేశరాజధానిలో సైకియాట్రిస్టుల సదస్సు జరగనుంది. ఈ విషయమే అక్కడ ప్రస్తావనకు తేవాలనుకుంటున్నాను. ఒక తల్లికి నలుగురు బిడ్డలుంటే... తాను పెద్దగా చదువుకోకపోయినా... ఆ నలుగురు చిన్నారుల స్వభావాలూ, మనస్తత్వాలూ, ప్రవర్తనల తీరుతెన్నులు ఆమెకు స్పష్టంగా తెలుస్తాయి. అలా ఆమెలో అవ్యక్తంగానే లోపల ఓ మనస్తత్వవేత్త ఇన్బిల్ట్గా ఉంటారు. దాంతో మానసిక రంగాల విషయంలో రానున్న రోజుల్లో ఆమె మరింత క్రియాశీలంగా వ్యవహరిస్తుందని నా భావన. ఈలోపు వ్యక్తిగతంగా ఆమెకు ఇవ్వాల్సిన స్పేస్ను ఇస్తూ, ఆమెను ఓ మనిషిగా చూస్తూ, మహిళను తన తోటి వ్యక్తిగా గౌరవించాల్సిన బాధ్యత పురుషులపై ఉందనేది నా స్పష్టమైన అభిప్రాయం. కుటుంబ సభ్యులకే కాదు... ఆమెనో సాటిమనిషిగా చూడాల్సిన బాధ్యత ఈ సమాజానికీ ఉంది’’ అంటూ తన అభిప్రాయాలను వెలిబుచ్చారు డాక్టర్ సవిత మల్హోత్రా.పిండదశలో ఉన్నప్పట్నుంచే మానసిక సమస్యలు!ఓ చిన్నారి పిండదశలో ఉన్నప్పట్నుంచే మానసిక సమస్యలను ఎదుర్కొంటూ వస్తోంది. ఉదాహరణకు... ఓ మహిళ గర్భవతిగా ఉన్నప్పుడు ఒత్తిడి (స్ట్రెస్)గానీ, ఉద్విగ్న పరిస్థితుల్ని (యాంగై్జటీ)గానీ, ఆందోళన, వ్యాకులత, కుంగుబాటు (డిప్రెషన్) వంటివి చోటుచేసుకున్నప్పుడు ఆమె మెదడులోని జీవరసాయనాల్లో మార్పులు రావడం సహజం. ఆ జీవరసాయనాలూ, హార్మోన్ల వంటివే ఆమెలోని మూడ్స్ మార్పులకు కారణమవుతాయి. కాబోయే తల్లిలో... ఆ హార్మోన్లు, జీవరసాయనాల సమతుల్యతల్లో మార్పులు వచ్చాయంటే అవి కడుపులోని బిడ్డపైనా, తన మానసిక స్థితిపైనా ప్రభావాలు చూపే అవకాశముంది. అందుకే గతంలోని మామూలు చైల్డ్ సైకియాట్రీ కంటే ఇప్పుడు మరింత లోతుగా... సైన్స్ గణనీయంగా పురోగమించడంతో... కడుపులోని పిండానికి మానసికంగా కలిగే ప్రభావాలను అధ్యయనం చేసే ఫీటల్ సైకియాట్రీ, అప్పుడే పుట్టిన బిడ్డ విషయంలో ఇన్ఫ్యాంట్ సైకియాట్రీ, చైల్డ్ సైకియాట్రీ, అడాలసెంట్ సైకియాట్రీ, వృద్ధాప్యంలోని మానసిక సమస్యల గురించి తెలిసే జీరియాట్రిక్ సైకియాట్రీ అంటూ మానసిక శాస్త్రం ఇప్పుడు చాలా చాలా విస్తృతంగా, ఎంతో లోతుగా అధ్యయనం చేయాల్సిన సైన్స్గా పరిణమిస్తూ... విస్తరిస్తోంది. -
బ్రయాన్ జాన్సన్లా భారత్ యువకుడు..! ఏకంగా ఏడువేల..
వృద్ధాప్యఛాయలు కనిపించకుండా ఆరోగ్యంగా ఉండాలన్న ఉద్దేశంతో కాలిఫోర్నియాకు చెందిన బ్రియాన్ జాన్సన్ అనే వ్యాపారవేత్త ఎన్ని కోట్లు ఖర్చుచేస్తున్నాడో తెలిసిందే. ఇప్పటి వరకు ఎన్నో చికిత్సలు, అనుక్షణం హెల్త్ ట్రాకింగ్లు, చుట్టూ వందలాది డాక్టర్లను మెయింటైన్ చేస్తూ వార్తల్లో నిలిచాడు. అదీగాక ఇటీవల త్వరలో వృద్ధాప్యాన్ని, చావుని జయిస్తానిని చాలా నమ్మకంగా ప్రకటించేశాడు కూడా. ఇది ఎంత వరకు సాధ్యం అన్న సందేహాలు వెల్లువెత్తున్న తరుణంలో ఒక భారత యువకుడు తాను కూడా బ్రయన్ జాన్సన్లా కావాలనుకుంటున్నా అంటూ షాంకింగ్ ప్రకటన చేశాడు. ఆయన బాటలోనే నడుస్తున్నానంటూ..తప వ్యక్తిగత ఆరోగ్య ప్రయోగం గురించి పూసగుచ్చినట్లు వివరించి నోరెళ్లబెట్టేలా చేశాడు. యవ్వనంపై ఇంత వ్యామోహమా అని నెటిజన్లు ఆ యువకుడిని ఏకీపారేస్తున్నారు నెటిజన్లు..ఇంతకీ ఆ యువకుడి ఏవిధంగా తనపై ప్రయోగాలు చేసుకుంటున్నాడంటే..బెంగళూరు సెడోనా హెల్త్ స్టార్టప్ వ్యవస్థాపకుడు 23 ఏళ్ల పునర్వ్ దినకర్ భారత్ బ్రయన్ జాన్సన్గా అవతరించాలని కోరుకుంటున్నా అని సోషల్ మీడియా ఎక్స్లో పేర్కొన్నాడు. అందులో భాగంగా తన వ్యక్తిగత ఆరోగ్య ప్రయోగాన్నికూడా మొదలు పెట్టేశానని, ప్రతీ అవయవం పనితీరుపై ఫోకస్ పెట్టేలా ట్రాక్ చేస్తున్నట్లు కూడా వెల్లడించాడు. అంతేకాదండోయ్ ఏకంగా ఇప్పటి వరకు ఏడు వేలకు పైగా రక్తపరీక్షలు కూడా చేయించుకున్నాడట. ఆఖరికి నిద్ర, ఒత్తిడిని ట్రాక్ చేసేలా WHOOPని కొనుగోలు చేసాను - నా కార్యకలాపాలను ట్రాక్ చేయడానికి స్ట్రావా, నా కేలరీలను ట్రాక్ చేయడానికి Amy, ఈ పరీక్షలన్నింటిని ట్రాక్ చేసేలా Sedona వంటివి అన్నింటిని సెటప్ చేశానని చెబుతున్నాడు. పైగా తన ఆరోగ్యానికి సంబంధించి ప్రతి అణవణువు శోధించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపాడు. అయితే ఈ యువకుడి లక్ష్యం బ్రయాన్లా వృద్ధాప్యాన్ని తిప్పికొట్టడం కానే కాదట. ఇతడి ఆశయం అత్యంత భిన్నగా ఉంది. బదులుగా డేటా ఆధారిత ఆప్టిమైజేషన్ ద్వారా జీవితాన్ని పూర్తి స్థాయిలో జీవించడం అనేది అతడి లక్ష్యమట. అలాగే ఇతరులు తన ఆరోగ్యం గురించి తెలసుకునేందుకు మొత్తం డేటాని బహిర్గతం చేసేలా డాక్యుమెంట్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాడట. తన శరీరంలో కొలిచే, ట్రాక్ చేసే, మెరుగుపరిచే ప్రతి విషయాన్ని డాక్యుమెంట్ చేస్తాను కాబట్టి ఇతరులు కూడా సులభంగా తనలా స్వచ్ఛందంగా ముందుకొచ్చేలా ప్రేరణగా ఉంటుదనేది అతడి అభిప్రాయం. చావుని జయించి దీర్ఘాయువుతో ఉండాలనే దానిపై విపరీతంగా పెరుగుతున్న ఆసక్తి నేపథ్యంలో దినకర్ ప్రకటన రావడం విశేషం. కాగా, దీపిందర్ గోయల్(జోమాటో వ్యవస్థాపకుడు) వంటి ప్రముఖ వ్యక్తులు కూడా మెదడు రక్త ప్రవాహాన్ని ట్రాక్ చేయడానికి ధరించగలిగే కంటిన్యూ', 'టెంపుల్' వంటి ప్రాజెక్టులతో ఈ రంగంలోకి అడుగుపెట్టారు. అయితే నెటిజన్లు దినకర్ ఇంత చిన్న వయసులోనే ఇలాంటి ప్రయోగాలకు సిద్ధమవ్వడానికి ప్రశంసించినప్పటికీ..ఇలా నిరంతరం ఆరోగ్యాన్ని ట్రాక్ చేస్తే..చిన్న చిన్ని వాటికి ఆందోళన చెందే పరిస్థితికి దారితీస్తుందనేది వారి వాదన. పైగా దీని కారణంగా ఒత్తిడి బారినపడే ప్రమాదం కామెంట్ చేస్తూ పోస్టుల పెట్టారు. అంతేగాదు బ్రో ఎవ్వరూ జీవితాన్నిపూర్తి స్థాయిలో ఆస్వాదించలేరనేది జగమెరిగిన సత్యం అంటూ పోస్టులు పెట్టారు.To everyone reading this, Hi, I'm Punarv.I'm 23 and starting today, I will be the Bryan Johnson of India.- Got a blood test done worth 7k covering all the imp biomarkers- Bought a WHOOP last month to track sleep, strain and recovery- Strava to track my activities, Amy to… pic.twitter.com/h8079K5LHW— punarv (@ycocerious) January 5, 2026 (చదవండి: తండ్రికి చదువు లేదు, తల్లి సూట్లు కుట్టేది....కానీ కూతురు ఐపీఎస్..!) -
ఎక్స్రే, సీటీ స్కాన్, ఎమ్మారైలు సురక్షితమేనా?
ఈరోజున ఎక్స్–రేలు లేని మెడికల్ సైన్స్ను ఊహించుకోలేం. ఏదైనా సమస్యతో డాక్టర్ దగ్గరికి వెళ్లగానే చేయించే పరీక్షల్లో మొట్టమొదటిది రక్తపరీక్షలైతే.. రెండోది తప్పకుండా ఎక్స్–రే అయి ఉంటుంది. దేహాన్ని కోయకుండా... కత్తిగాటు పెట్టకుండా లోపలి అవయవాల తీరుతెన్నులు తెలుసుకునే ఈ పరీక్ష వైద్యశాస్త్రంలోనే ఓ తిరుగులేని వరదాయిని. ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు దేహంలోపలి అవయవాలకు గానీ, ఎముకలకు గానీ... ఏ ముప్పు వాటిల్లిందో, ప్రమాదం తాలూకు దుష్ప్రభావమెంతో తెలుసుకోవడంలో ఎక్స్–రేలను మించిన పరీక్షలేదు కదా... అలాంటిది అసలీ ఎక్స్–రేలను తెలుçసుకోవడమే ఓ యాక్సిడెంట్! ఎక్స్–రే అంటే ఏమిటో, దాని వివరాలూ, తీయాల్సింది ఎందుకు, ఎప్పుడెప్పుడు, దాని తాలూకు దుష్ప్రభావాలేమిటి... అవే ఎక్స్–రేలను మరింత తక్కువ మోతాదులో ఉపయోగించి తీసే సీటీ–స్కాన్ ఏమిటి? అదెప్పుడు తీస్తారు వంటి అనేక వివరాలను తెలుసుకుందాం...ఎక్స్–రే అంటే కూడా ఒక రకం కాంతి. అనంత కాంతి పటలంలో కంటికి కనిపించేది కొంతమేరకు మాత్రమే. ఇక కంటికి కనిపించని కాంతి పుంజాలు... ఇన్ఫ్రారెడ్ అనీ, అల్ట్రా వయొలెట్ అనీ, ఎక్స్ రేస్ అనీ ఇలా వేర్వేరుగా ఉంటాయి. విస్తృతమైన రేడియేషన్లో కంటికి కనిపించే కాంతి ఒక వేవ్లెంగ్త్తో (అంటే కాంతి వేవ్లెంగ్త్ 380 నుంచి 750 నానో మీటర్ల మధ్యన) ఉంటే... ఈ రకరకాల రేడియేషన్ రూపాలు కొన్ని నిర్దిష్టమై వేవ్లెంగ్త్స్తో రకరకాలుగా ఉంటాయి. వాటి వేవ్లెంగ్త్ తాలూకు ఫ్రీక్వెన్సీలను బట్టి వాటికి ఆయా పేర్లు పెడతారు.మిగతా రేడియేషన్ల తాలూకు తీవ్రత కాంతి కంటి భిన్నంగా ఉండటంతో పాటు కాంతిలా నిరపాయకరంగా ఉండదు. ఆయా కాంతి కిరణాల తీవ్రత కారణంగా వాటి దుష్ప్రభావమూ తీవ్రంగానే ఉంటుంది. అందుకే వైద్య పరీక్షల కోసం వెలువరించే ఆ రేడియేషన్తో కొన్ని ముప్పులూ, దుష్ప్రభావలూ తప్పవు. అయితే వైద్యశాస్త్ర అవసరాల దృష్ట్యా బేరీజు వేసినప్పుడు... వాటి వల్ల కలిగే దుష్ప్రభావం కంటే వాటితో ఒనగూరే మేలు ఎక్కువ అనుకున్నప్పుడు డాక్టర్లు ఈ కిరణాలను ఉపయోగించే ఎక్స్–రే పరీక్ష లేదా సీటీ స్కాన్ చేయించమని సూచిస్తారు. అయితే ఆధునిక వైద్యశాస్త్రవేత్తలు తమ కొత్త కొత్త ఆవిష్కరణలతో ఇప్పుడీ ఎక్స్–రేల దుష్ప్రభావాలను గతం కంటే చాలా చాలా తగ్గించారు. దాంతో ఇప్పుడు ఎక్స్–రేలు చాలావరకు నిరపాయకరమే అని చెప్పవచ్చు.కనుగొనడమే ఓ యాదృచ్ఛికమైన అద్భుతం! ఎక్స్–రేలను కనుగొనడమే చాలా యాదృచ్ఛికంగా జరిగింది. ఈ అత్యద్భుతమైన ఆవిష్కారం జరిగిన తీరు కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఓ గాజు సిలిండర్లో క్యాథోడ్ కిరణాలను దారిమళ్లించాక... అవి తప్పించుకుపోకుండా ఉంచిన ఫ్లోరెసెంట్ స్క్రీన్ మెరుస్తుండటంతో అక్కడ ఒకరకమైన కిరణాలు పడుతున్నాయని విల్హెమ్ కోనార్డ్ రాంట్జన్ అనుకున్నాడు. అకస్మాత్తుగా తన చేతిని అడ్డుపెడితే చేతిలోని ఎముకలు కనిపించాయి. దాంతో తన భార్యను పిలిచి... ఆమె చేతిని కూడా ఆ కిరణాలకు అడ్డుగా ఉంచినప్పుడు ఆమె కూడా తన చేతిలోని ఎముకలు చూసి భయంతో బెంబేలెత్తిపోయింది. అలా చాలా యాక్సిడెంటల్గా రాంట్జన్ కనుగొన్న ఎక్స్–రేలతో వైద్యచికిత్సలో ఒక విప్లవాత్మకమైన మార్పు వచ్చింది. అంతకుముందు చాలా అసాధ్యంగా భావించిన సంక్లిష్టమైన చికిత్సలు చాలా చాలా సులువయ్యాయి. మరీ ముఖ్యంగా ఎముకలు మొదలుకొని శరీరంలోని కొన్ని భాగాల చికిత్స ఎంతో సులభతర మయ్యింది.అసలు ఎక్స్–రే అంటే ఏమిటి? ఏదైనా వస్తువును చూడటానికి కాంతి అవసరమవుతుంది. కానీ నిజానికి ‘కాంతి’ అంటే అనేక వేవ్లెంత్ గల రేడియేషన్ తరంగాల కిరణాల్లో అదో చిన్న భాగం మాత్రమే. అందులోని ఇతర వేవ్లెంగ్త్ ఉన్న భాగాలు నేరుగా మన కంటికి కనిపించవు. కాంతి కిరణాల కంటే ఈ ఎక్స్–రే తరంగాలు బలమైనవి. కాబట్టి కాంతి మన శరీరాన్ని తాకి వెనుదిరిగిపోతుంది. కానీ ఈ ఎక్స్ కిరణాలు మాత్రం శరీరంలోకి బలంగా దూసుకుపోతాయి. కాంతి ఓ వస్తువును తాకి వచ్చి తిరిగి మన కంటిని చేరినప్పుడు... మనమా వస్తువును చూడగలిగినట్లే... ఈ కిరణాలూ శరీరం లోపలికి వెళ్లి అక్కడి అంతర్భాగాలపై ప్రతిఫలిస్తాయి కాబట్టి... వాటిని రేడియాలజిస్ట్ (రేడియేషన్తో పని చేయగలిగే సామర్థ్యం ఉన్న నిపుణులు) మరికొంత సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి, వాటి సహాయంతో చూడగలుగుతాడు. అలాగే ఆ ప్రతిబింబాన్ని ఫొటో తీసి, ఫిల్మ్పై ముద్రించగలిగినప్పుడు అది ‘ఎక్స్–రే’ పిక్చర్ అవుతుంది. ఇప్పుడున్న సాంకేతికత సహాయంతో ఆ ప్రతిబింబాన్ని టీవీ మీదగానీ లేదా కంప్యూటర్ తెర మీదగానీ ఒడిసి పట్టగలగడమూ సాధ్యమే. వేర్వేరు ప్రాంతాల్లో వేర్వేరు రేడియేషన్లు! ఈ ప్రపంచంలో ప్రతిచోటా రేడియేషన్ ఉండనే ఉంటుంది. సగటున ఒక వ్యక్తి ప్రతి ఏడాదీ 3 ఎమ్ఎస్వీ రేడియేషన్కు గురవుతుంటాడని ఓ అంచనా. అయితే అది సగటు మాత్రమే. కొన్నిచోట్ల రేడియేషన్ తీవ్రత ఎక్కువగా ఉండవచ్చు. మరికొన్ని చోట్ల తక్కువ. ఉదాహరణకు పీఠభూమి (ప్లేటో) ్రపాంతాల్లో ఉండేవారు తమ తోటి కోస్తా (కోస్టల్) ్రపాంతాల్లో ఉండేవారితో పోలిస్తే 1.5. మిల్లీ స్టీవెర్ట్ (ఎమ్ఎస్వీ... అంటే రేడియేషన్ను కొలవడంలో ఉపయోగపడే కొలతల్లో ఒక రకమైన యూనిట్) ఎక్కువగా నేచురల్ రేడియేషన్కు గురవుతుంటారు. అలాగే మనం మన ఇండ్లలోపలే ఉన్నప్పటికీ ఎంతోకొంత రేడియేషన్కు గురవుతూనే ఉంటాం. వాతావరణంలోని రాడాన్ గ్యాస్ కూడా ఈ రేడియేషన్ మోతాదులోని మార్పులకు కారణమవుతుంటుంది. రాడాన్ వల్ల రేడియేషన్ పెరుగుతుంది (ఏడాదికి షుమారు 2 ఎమ్ఎస్వీ). ఒకదేశంలో ఉండే రేడియేషన్కీ మరో దేశం తాలూకు రేడియేషన్లో కూడా తేడాలుంటాయి. ఉజ్జాయింపుగా ఒక ఉదాహరణ చె΄్పాలంటే... మనం 10 రోజుల పాటు స్వాభావికంగానే ఎంత రేడియేషన్కు ఎక్స్పోజ్ అవుతామో... ఛాతీ ఎక్స్–రే తీయించుకోవాలనుకున్నప్పుడు కేవలం ఆ కొద్ది క్షణాల్లోనే 10 రోజులకు సరిపడా రేడియేషన్ను గురవుతామన్నది నిపుణుల తాలూకు ఓ రఫ్ అంచనా. సీటీ స్కాన్లో ఉండేవీ ‘ఎక్స్–రే’లే! వైద్య పరీక్షల్లో భాగంగా ‘సీటీ స్కాన్’గా పరిగణించే స్కానింగ్ ప్రక్రియల్లోనూ ఎక్స్–రేలనే ఉపయోగిస్తారు. కాకపోతే వాటినే మరికొంత అడ్వాన్స్డ్ ప్రక్రియల్లో ఉపయోగించి ఎక్స్–రే కంటే అదనపు ప్రయోజనాలను సాధిస్తారు. కాకపోతే ఎక్స్–రేతో పోలిస్తే సీటీ స్కాన్లో రేడియేషన్ మోతాదులు ఎక్కువ. ఫలితం కూడా ఎక్కువే. ఇందులో రేడియేషన్ తాలూకు మోతాదూ, తీవ్రతా కాస్తంత ఎక్కువ. కాబట్టి తీయించుకోవడంలోనూ డాక్టర్ల సలహాలు, సూచనలు, విచక్షణ అవసరం. అందుకే వారి సలహా లేకుండా పేషెంట్లు తామంతట తాము సీటీ స్కాన్ కోసం పట్టుబట్టడం అంత సరైనది కాదు.రేడియేషన్తో ఎప్పుడూ ప్రమాదమేనా..? నిజానికి వైజ్ఞానికి ఆవిష్కరణ అన్నది ఎప్పుడూ పదునైన కత్తి లాంటిది. ఆ పదునుతో ఎన్ని సౌలభ్యాలుంటాయో, అన్ని ప్రమాదాలూ ఉంటాయి. ఎక్స్–రే, సీటీ స్కాన్ వంటి కొన్ని పరీక్షల తాలూకు మరో కోణాన్నీ చూద్దాం. అవును. రేడియేషన్తో కచ్చితంగా ఎంతో కొంత ప్రమాదం ఉండితీరుతుంది. అయితే రేడియేషన్ అంటే అదేదో కేవలం ఎక్స్–రేలలోనే ఉండదు. నిజానికి మన చుట్టూ ఉండే వాతావరణంలోనూ ఎల్లప్పుడూ ఎంతోకొంత రేడియేషన్ ఉంటుంది. కాకపోతే అది మనకు హానికలిగించే పరిమాణంలోఉండకపోవచ్చు. వాతావరణంలో ఉన్న రేడియేషన్ అన్నది మనం తన ఉనికిని గుర్తించేంతగా ఉండదు. అదే... ఎక్స్–రే తీసేచోట లేదా వాటితో పనిచేసే చోట అది ఎక్కువగా ఉంటుంది. మితిమీరిన రేడియేషన్ కారణంగా ఎన్నో అనర్థాలూ, ఆరోగ్య సమస్యలూ వచ్చే ముప్పు ఉంటుంది.‘రేడియేషన్’ను ఎలా కొలుస్తారంటే....? ఒక ప్రదేశంలో రేడియేషన్ ఎంత పరిమాణంలో ఉందనే విషయాన్ని తెలుసుకోడానికి లేదా కొలవడానికి ఒక కొలత (యూనిట్) ఉంది. దాని పేరే మిల్లీ సీవెర్ట్ (ఎమ్ఎస్వీ). అలాగే రేడియేషన్ మోతాదునూ, తీవ్రతలను కొలవడానికీ రెడ్, రెమ్, రోంట్జెన్, సీవెర్ట్, గ్రే వంటి యూనిట్లూ ఉంటాయి. ఈ వేర్వేరు కొలతలతో మనకు ఉపయోగం ఏమిటి? కాంతి మన శరీరాన్ని తాకి వెనుదిరుగుతుంది. కానీ ఎక్స్–రేలు లోపలికి ఎముకల వరకూ వెళ్తాయి . అలాగే మన శరీరంలో వేర్వేరు అవయవాలు వాటివాటి స్వభావాన్ని బట్టి ఎక్స్–రేలను తమలోకి అనుమతించడం విషయంలో వేర్వేరుగా స్పందిస్తాయి. అంటే... ఎముకల వరకు వెళ్లాలంటే ఒక మోతాదు బలం అవసరం. అలాగే ఊపిరితిత్తులు మెత్తగా ఉంటాయి కదా. వాటిని చూడాలంటే ఎక్స్–రే వేరే మోతాదులో కావాలి. అలా మనం మన దేహంలోకి చూడాల్సిన అవయవాన్ని బట్టి వేర్వేరు మోతాదులో ఎక్స్–రే పరిమాణాన్ని లోపలికి పంపాలి. అలా మనం మన దేహంలో ఫొటో తీయాలనుకున్న అవయవాన్ని బట్టి వేర్వేరు మోతాదుల్లో ఎక్స్–రే కిరణాలను పంపాల్సి ఉంటుంది. అందుకే ఈ రెడ్, రెమ్, రోంట్జెన్, గ్రే వంటి కొలతలు అవసరమవుతాయి.సీటీ స్కాన్తోనూ ఇదే ముప్పా ? ఉంటుంది. ఎందుకంటే... సీటీ స్కాన్లోనూ వెలువడే రేడియేషన్ కూడా హానికరమైనదే. అందుకే రేడియాలజిస్ట్లు సీటీ స్కాన్ తీసేప్పుడు వాడే రేడియేషన్ తాలూకు తీవ్రతనూ వీలైనంతగా తగ్గించేలా శిక్షణ ΄÷ందుతారు. అందుకే... ఎక్స్–రేగానీ లేదా సీటీ స్కాన్ గానీ తీయించుకోవడం తప్పనప్పుడు ఈ రేడియేషన్ ప్రమాదాలకు భయపడకూడదు. అలాగే మనకు అవసరం లేకపోయినా... రొటీన్ పరీక్షల పేరిట రేడియేషన్ ఇన్వాల్వ్ అయి ఉన్న పరీక్షలనూ తరచూ చేయించుకోవడమూ సరికాదు.ఇదే ఇలాగుంటే మరి ఎమ్మారైతో...? ఎక్స్–రేలూ, సీటీ స్కాన్లతో ఇంత ముప్పు అయితే మరి వీటన్నికంటే మరింత లోతైన ఫలితాలను చెప్పే ఎమ్మారైతో ఎంత ముప్పు కలుగుతుందో అన్న సందేహం వైద్య పరిజ్ఞానం అంతగా లేని సాధారణ ప్రజల్లో కలగవచ్చు. నిజానికి ఎక్స్–రే, సీటీ స్కాన్తో పోలిస్తే ఎమ్మారైతో రేడియేషన్ ప్రమాదమే ఉండదు. ఎందుకంటే ఎమ్మారై అంటే ‘మేగ్నటిక్ రిజోనెన్స్ ఇమేజింగ్’ అని అర్థం. అంటే ఇందులో కేవలం అయస్కాంత బలాన్ని మాత్రమే ఉపయోగిస్తూ, రేడియేషన్ వాడరు కాబట్టి ఎమ్మారైతో అంతటి ప్రమాదాలు ఉండవు. రేడియేషన్ కిరణాలతో క్యాన్సర్ వంటి వైద్యచికిత్సలు... రేడియో సర్జరీలు! రేడియేషన్తోనూ వైద్యచికిత్సలు సాధ్యమవుతాయన్న సంగతి తెలిసిందే. అయితే గతంలో రేడియేషన్ థెరపీ విషయానికి వస్తే గతంలో అది చాలా భయం గొలిపేదిగా ఉండేది. అయితే ఇప్పుడలాంటి దుష్ప్రభావాలు చాలావరకు తగ్గాయి. ‘ర్యాపిడ్ ఆర్క్ ఇమేజ్ గైడెడ్ రేడియోథెరపీ’ వల్ల కేవలం క్యాన్సర్ కణాలకు మాత్రమే రేడియేషన్ తగులుతుంది. ఇలాంటి చికిత్సల్లో రేడియేషన్ కేవలం క్యాన్సర్ కణాల్ని మాత్రమే తన లక్ష్యంగా చేసుకుంటుంది. అత్యాధునిక ప్రక్రియల సహాయంతో దేహంలోని అత్యంత కీలకమైన అవయవాలైన మెదడు, ఊపిరితిత్తులు, కాలేయం వంటి చోట్ల నిర్భయంగా రేడియేషన్ను ప్రసరింపజేయవచ్చు. ఇక ఇటీవలే అందుబాటులోకి వచ్చిన ‘ఎఫ్ బీమ్’ వల్ల చాలా సురక్షితంగా ‘రేడియోసర్జరీ’ చేయవచ్చు. సాధారణ సర్జరీలో రోగిని ఆసుపత్రిలో చేర్చాలి. కానీ రేడియోసర్జరీలో రోగిని ఆసుపత్రిలో చేర్చాల్సిన అవసరమే ఉండదు. పైగా రేడియేషన్తో చేసేదైనప్పటికీ ఇది పూర్తిగా సురక్షితం.ఎక్స్–రే ఉపయోగాలేమిటి...? ఎక్స్–రే వంటి బలమైన కిరణాలు బలంగా శరీరంలో లోపలికి చొచ్చుకుపోతాయి. అవి శరీరంలోని అనేక కీలక అవయవాలను చేరి, ఫొటోలు తీసి... అక్కడి సమాచారాన్ని అందిస్తాయి. దాన్ని ఎక్స్–రే ఫిల్మ్ సహాయంతో నిక్షిప్తం చేసుకోవచ్చు. మనకు తెలిసిందల్లా... ఎక్స్–రే అంటే... ఆ కిరణాల సహాయంతో ఎముకలు విరిగాయా అన్న సమాచారం తెలుస్తుందనే సాధారణ విషయం మాత్రమే. కానీ డాక్టర్లు మాత్రం ఈ ఎక్స్–రే కిరణాల సహాయంతో చాలా రకాల సమాచారమూ, ఫలితంగా ఎన్నో ప్రయోజనాలు ΄÷ందుతారు. ఉదాహరణకు... దేహంలోకి ఓ పైప్ను పంపాలంటే... అది దేహంలోకి ఇతర అంతర్గత అవయవాలకూ తగలకుండా సాఫీగా ఎలా పంపగలమని చూస్తారు. అలాగే దేహం లోపల ఏదైనా ఉపకరణాన్ని లేదా పరికరాన్ని అమర్చాలంటే నిర్దిష్టంగా ఎక్కడ అమర్చాలన్న విషయాన్ని ఎక్స్–రేల సహాయంతోనే తెలుసుకుంటారు. ఎక్స్–రేతో ఇలాంటి ఎన్నో ప్రయోజనాలు సమకూరుతాయి. ఎక్స్–రేలు సురక్షితమేనా...? ఒక్కమాటలో చెప్పాలంటే... పూర్తిగా సురక్షితమైతే కాదు. మరెందుకు తీయించుకుంటున్నామనే ప్రశ్న ఆవిర్భవిస్తుంది. అయితే... ఎక్స్–రేలకు ఎక్స్ పోజ్ అయినప్పుడు ఉన్న రిస్క్తో పోలిస్తే... నిజంగా మనకు అవసరమైనప్పుడు చేయించిన వైద్యపరీక్షతో మనకు ఒనగూరే లాభం ఎక్కువ కాబట్టి. అందుకే ఎక్స్–రే లేదా ఇతరత్రా రేడియేషన్ సహాయంతో సీటీ స్కాన్ వంటివి తీసేప్పుడు సాధ్యమైనంత తక్కువ రిస్క్తో... సాధ్యమైనంత ఎక్కువ ప్రయోజనం పోందేలా రేడియాలజిస్టులు పనిచేస్తారు. అలా వారు శిక్షణపోందుతారు. మన ఇంట్లో మామూలు బల్బ్ ఆర్పేశాక... కాంతి మాయం అయినట్లే... ఒకసారి ఎక్స్–రే స్విచ్ ఆఫ్ చేశాక మళ్లీ అక్కడ రేడియేషన్ ఉండదు. కాబట్టి ఎక్స్–రే ప్రక్రియ ముగిశాక అక్కడ అరకొర ఎక్స్–రే దుష్ప్రభావాలు ఉండిపోయి... అవి మనకు హానిచేస్తాయేమో అనే ఆందోళన ఎంతమాత్రమూ అవసరం లేదు. అలా అనుకోవడం మన అపోహ మాత్రమే.ఎక్స్–రేలు... గర్భవతి పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు మామూలు వ్యక్తులకే ఎక్స్–రేలతో ఎంతోకొంత హాని ఉందనుకుంటే... మరి గర్భవతి కడుపులో పెరుగుతున్న చిన్నారులకూ ఇంకా ఎక్కువ హాని ఉండనే ఉంటుంది. అందుకే గర్భవతికి ఎక్స్–రే విషయంలో డాక్టర్లు చాలా జాగ్రత్తగా ఉంటారు. ఆమెకు మందులు ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఒక ఫిజీషియన్ ఎంత నిశితంగా వ్యవహరిస్తాడో... ఆమెకు ఎక్స్–రే అవసరమైనప్పుడు ఒక రేడియాలజిస్ట్ అంతే నిశితంగా ఉంటాడు. అయితే ప్రతి సందర్భంలోనూ బిడ్డకు ఎక్స్–రే తప్పనిసరిగా హానికరంగా పరిణమిస్తుందని కాదు. కాకపోతే ఇది అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు కడుపులోని బిడ్డ ఏ వయసుకు పెరిగింది (అంటే ఏ నెల గర్భం), దానికి హాని చేయకుండా ఎంత మోతాదు ఎక్స్–రేకు గురిచేయవచ్చు... లాంటి అనేక అంశాల మీద ఈ ఎక్స్–రేల తాలూకు ముప్పు ఆధారపడి ఉంటుంది. ఒకవేళ ఏదైనా కారణం చేత గర్భవతి తాలూకు తల, చెయ్యి, కాలు, ఛాతీ వంటి భాగాలకు ఎక్స్–రే తీయాల్సివస్తే... ఆమె కడుపులోని బిడ్డ వాటికి నేరుగా ఎక్స్పోజ్ అయ్యే ముప్పు అంతగా ఉండదు. కేవలం ఆమె ΄÷ట్టభాగంలో లేదా ΄÷త్తికడుపు భాగాల్లో ఎక్స్–రే తీయాల్సి వచ్చినప్పుడే బిడ్డ రేడియేషన్కు ఎక్స్పోజ్ అయ్యే ప్రమాదం ఏర్పడుతుంది. అందుకే మిగతావాళ్లతో పోల్చినప్పుడు ఎంతో అవసరమైతే తప్ప గర్భవతికి ఎక్స్–రే పరీక్ష నిర్వహించరు. ఒకవేళ చేయాల్సి వచ్చినా ఆమెకు చాలా తక్కువ మోతాదులో ఎక్స్–రేలు వాడేలా నిశితమైన జాగ్రత్తలు తీసుకుంటారు.గర్భవతులకు ఇప్పుడు ఆందోళన అక్కర్లేదు... ఏదైనా పనిలో రిస్క్ ఉందంటే... అది అన్నిసార్లూ అన్నే అనర్థాలను తెచ్చిపెట్టకపోవచ్చు. ఎక్స్–రే విషయంలోని ముప్పు కూడా అంతే. ఒకవేళ నిజంగా గర్భవతికి ఎక్స్–రే నిర్వహించాల్సి వస్తే అది తప్పకుండా అనర్థాలు తేకపోవచ్చు. కాకపోతే ఆ కిరణాల వల్ల కడుపులోని బిడ్డకు రిస్క్ ఉన్న అంశాన్ని పరిగణనలోకి తీసుకుని దాన్ని ఏ మేరకు తగ్గించగలరో... అంత మేరకు తగ్గించేలా రేడియాలజిస్టులు జాగ్రత్తలు తీసుకుంటారు. కాబట్టి గర్భవతికి నిజంగా ఎక్స్–రే తీయాల్సిన అవసరమైనప్పుడు వారు ఈ విషయంలో మరీ ఎక్కువగా ఆందోళన పడాల్సిన అవసరం ఇప్పుడు లేదు. ఎందుకంటే వైద్యపరిశోధనల్లో వచ్చిన ఎన్నో రకాల మార్పులు ఎక్స్–రే ముప్పులనూ గణనీయంగా తగ్గించగలిగాయి. నిర్వహణ: యాసీన్ -
సత్తు ప్లస్ దాల్చిన చెక్క నీటితో బెల్లీఫ్యాట్ మాయం..!
చాలామందికి బానపొట్ట పెద్దగా ఉండి ఏ డ్రెస్ లేదా చీర కట్టుకోవాలన్న ఇబ్బందిగా ఉంటుంది. ఓపట్టాన తగ్గదు కూడా. బొడ్డుకొవ్వుతో ఉండే ఇబ్బంది అంత ఇంత కాదు. అలాంటి మొండి బొడ్డుకొవ్వుని ఈ పానీయం సులభంగా కరింగించేయడమే కాకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తోంది. మరి ఆ పానీయం ఏంటో పోషకాహార నిపుణుల మాటల్లోనే సవివరంగా తెలుసుకుందామా..!.అతిగా తినడం లేదా క్రమరహిత దినచర్యల కారణంగా అధికబరువు, బెల్లీఫ్యాట్ వంటి సమస్యలను ఫేస్ చేస్తుంటాం. అలాంటి వారు దాల్చిన చెక్క పొడిని, సత్తు నీటికి జత చేసి తీసుకుంటే అద్భుత ఫలితం ఉంటుదని చెబుతున్నారు నిపుణులు. సత్తులో పుష్కలమైన ఫైబర్ ఉంటుంది. ఇది కడుపు నిండిన అనుభూతిని అందిస్తుంది. జీర్ణక్రియకు మద్దతిస్తుంది. పేగు ఆర్యోగం, రక్తంలోని చక్కెర నియంత్రణకు మద్దతిస్తుంది. ఇది బరువు తగ్గడానికే కాకుండా బొడ్డు కొవ్వుని కరిగించడంలోనూ అద్భుతంగా పనిచేస్తుంది. ఈ పానీయం మలబద్ధకాన్ని తగ్గించగలదని పరిశోధనల్లో కూడా వెల్లడైంది. ఆకలి బాధను అదుపులో ఉంచగలదు, శక్తిస్థాయిలను పెంచుతుంది. మెక్కల ఆధారిత ప్రోటీన్, ఖనిజాలతో నిండి ఉన్న సత్తు శరీరానికి కావల్సిన తక్షణ శక్తిని అందిస్తుంది. ఇది సంక్లిష్ట పదార్థాల మిశ్రమం కాబట్టి నెమ్మదిగా శక్తిని విడుదల చేస్తాయి. అలాగే దాల్చిన చెక్కలోని యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని విషపదార్థాలను సులభంగా బయటకి పంపించగలదు. తయారీ విధానం.. సత్తు: 1 టేబుల్ స్పూన్ గోరువెచ్చని నీరు: 1 గ్లాసుదాల్చిన చెక్క పొడి: చిటికెడునిమ్మరసం: కొన్ని చక్కలుచేయు విధానం: సత్తుని గోరువెచ్చని నీటిలో బాగా కలిపి, దానిలో చిటికెడు దాల్చిన చెక్క పొడి, నిమ్మచుక్కలు వేసి తాజాగా కలుపుకుని తాగితే సరి. అయితే దీనికి చక్కెర వంటి స్వీట్ని జోడించకపోవడమే మంచిది. ప్రయోజనాలు..ఈ పానీయంలో ఉండే అధిక ప్రోటీన్, ఫైబర్ కంటెంట్ జీర్ణక్రియను నెమ్మదించి, సంతృప్తిని ప్రోత్సహిస్తుంది. ఇది మొత్తం కేలరీలను తీసుకోవడాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. ఇక దాల్చిన చెక్క ఇన్సులిన్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. అలాగే బొడ్డు చుట్టూ కొవ్వు నిల్వకు దోహదపడే చక్కెర స్పైక్లను నివారిస్తుంది.పైగా రక్తంలో చక్కెర స్థాయిలను, ఆకలిని సమర్థవంతంగా నిర్వహిస్తుంది.ఎవరికి మంచిది కాదంటే..కిడ్నీ సమస్యలు ఉన్నవారికి ఇది మంచిది కాదు. ఎందుకంటే సత్తులో అధికంగా ప్రోటీన్లు, ఖనిజాలు ఉంటాయి. ఇవి మూత్రపిండాల సమస్యలు ఉన్నవారికి ఇది తీసుకుంటే మూత్రపిండాలపై మరింత భారం పడుతుంది. కొన్ని రకాల పిండుల మిశ్రమం అయిన ఈ సత్తు కొందరికి ఆయా పప్పులు వల్ల ఎలర్జీ ఉంటే వారికి కూడా మంచిది కాదు. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను తక్కువగా ఉండేలా చేస్తుంది కాబట్టి కొందరిలో ఇది హైపోగ్లైసీమియాకు గురయ్యేలా చేసే ప్రమాదం ఉంది. అలాగే జీర్ణక్రియ సమస్యలు ఉన్నవారికి కూడా ఇది కాస్త అసౌకర్యాన్ని కలిగించవచ్చు. చివరగా ఈ పానీయం అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు అందిచినప్పటికీ..దానికి మన ఆరోగ్యకరమైన జీవనశైలి తోడైతేనే మంచి ఫలితాలను మనం అందుకోగలుగుతామని అంటున్నారు నిపుణులు. ఇది ఒక్కటే బొడ్డుకొవ్వుని మాయం చేస్తుందనే అపోహలో ఉండొద్దని హచ్చరిస్తున్నారు నిపుణులు. దీనితోపాటు హైడ్రేటెడ్గా ఉండేలా చూసుకోవడం, అధిక శుద్ధి చేసిన చక్కెర పదార్థాలను నివారించడం, తగినంత ప్రోటీన్, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులను చేర్చడం వంటివి చేయాలి. అలాగే తేలికపాటి వ్యాయమాలు కూడా జోడిస్తే..మరిన్ని ప్రయోజనాలను పొందగలమని చెబుతున్నారు నిపుణులు. అలాగే భోజనం చేసిన వెంటనే కాస్త నాలుగు అడుగులు వేయమని సూచిస్తున్నారు నిపుణులు.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: నటుడు ఆర్నాల్డ్ 'క్రాష్ డైట్'..!బరువు తగ్గడానికి కాదు..) -
ఆ కారణంగానే శాకాహారిగా మారా..!: నటి జెనీలియా
ఇటీవల కాలంలో వేగనిజం అత్యంత ప్రజాదరణ పొందుతోంది. చాలామంది ప్రముఖులు, సెలబ్రిటీలు వేగన్గా మారుతున్నారు. తాజాగా టాలీవుడ్ నటి, ప్రముఖ బాలీవుడ్ హీరో భార్య జెనీలియి డిసౌజా కూడా పూర్తిగా శాకాహారిగా మారినట్లు వెల్లడించారు. అయితే తాను మొదట్లో పూర్తిగా మొక్కల ఆధారిత ఆహారం తీసుకునేదాన్ని కాదని, తర్వాత పూర్తిగా వేగన్గా మారిపోయానని అన్నారు. ఎందువల్ల ఈ మార్పు, దానికి గల కారణాలను కూడా ఆమె షేర్ చేసుకున్నారు. చాలామంది ప్రముఖులు, ఇన్ఫ్లుయెన్సర్లు మొక్కల ఆధారిత ఆహారం తీసుకుంటున్నారు. అలాంటి వారి జాబితాలోకి తాజాగా జెనీలియా డిసౌజా కూడా చేరారు. ఆమె 2020 నుంచి వేగన్గా మారారట. సోహా అలీఖాన్ యూట్యూబ్ ఛానెల్లో జరిగిన సంభాషణలో జెనీలియా తాను 2017లో మాంసాహారం నుంచి పూర్తిగా శాకాహారానికి మారినట్లు చెప్పారు. తాను 2017 నుంచి మాంసం తినడం మానేసినట్లు తెలిపింది. అయితే పూర్తిగా మొక్కల ఆధారిత ఆహారం తీసుకునేదాన్ని కాదని, కొద్దిగా పాల ఉత్పత్తులు, చీజ్, గుడ్లు వంటివి తీసుకునేదాన్ని అని అన్నారు. చాలామంది కూరగాయలు తినడం మొదలు పెడితే ఆధ్యాత్మిక స్థితికి చేరుకుంటారని తరుచుగా చాలామంది చెబుతుండే వారు. తనకు కూడా అలాంటి అనుభూతే కలిగిందని అంటోంది జెనీలియా. ఆరోగ్యానికి మంచిదన్న ఉద్దేశ్యంతోనే ఈ రకమైన జీవనశైలిని అవలంభించానని అన్నారామె. తాను మాంసం తినే కుటుంబంలో జన్మించానని, తనకు పెద్దగా శాకాహారం అంటే ఏంటో తెలియదని అన్నారు. తాను బఠానీలు, బంగాళదుంపలు, పనీర్ మాత్రమే శాకాహారం అనుకునేదాన్ని, ఆ తర్వాత తెలిసింది అంతకుమంచి మంచి ప్రోటీన్ మాంసకృత్తులు ఉన్నా ఆహారాలు శాకాహారంలో కూడా ఉన్నాయని. అయితే తాను జంతు ప్రేమికురాలినే అయినప్పటికీ..అప్పుడు మాత్రం మాంసాన్ని ఇష్టంగా ఆస్వాదించేదాన్ని అని చెప్పుకొచ్చారు. కానీ ఎప్పుడైతే మాంసాహారాన్ని పరిమితం చేయడం మొదలు పెడతామో..అప్పుడు..ప్రతిది హాయిగా ఆస్వాదించగలుగుతాం, చాలా తేలికగా కూడా ఉంటుందన్నారామె. ఎలా మొదలైందంటే..మహమ్మారి సమయంలో 2020లో తాను పూర్తిగా వేగన్గా మారానని జెనీలియా పేర్కొన్నారు. తన భర్త రితేష్ కారణంగా ఇదంతా జరిగిందన్నారు. 2016లో ఆయన మాంసం తింటుంటే ఏదో బాగోలేని అనుభూతి కలుగుతోందని మానేశారు..అయితే అప్పటికీ తాను మాంసహారిగానే ఉన్నానని గుర్తుచేసుకున్నారు. అలా జనవరి 1, 2017న తాము దీన్ని పూర్తిగా మానేయాలనే నిర్ణయానికి వచ్చామన్నారు. అయితే అప్పటికీ తాము గుడ్లు, పాల ఉత్పత్తులు తీసుకునేవాళ్లం. కరోనా మహమ్మారి సమయం ప్రతిఒక్కరూ బిక్కుబిక్కుమంటున్న టైంలో రితేష్ ఎందుకు జంతు ఉత్పత్తులను కూడా మానేయకూడదు అని అడిగారు. దాంతో తాను సరే ఈ మార్పు ప్రయత్నించి చూద్దాం అన్నాను. రాను రాను అది అద్భుతంగా అనిపించడం ప్రారంభించింది, మా రోటీలో కొద్దిగా పాలు, లేదా వెన్న తినిన ప్రతిసారి కడుపు నిండిన అనుభూతి కలిగింది. ఇలా మారడం అంత ఈజీ కాదు, అలానే పూర్తిస్థాయిలో శాకాహారిగా మారలేరు కూడా. రోజులు గడుస్తున్న కొద్దిపూర్తిగా వేగన్గా మారడం ఎలా అనేది అవగతమవుతుంటుందని, ఇంకా ఇప్పటికీ తాను నేర్చుకుంటూనే ఉన్నానని చెప్పుకొచ్చారు జెనీలియా. పూర్తి శాకాహారంతో ఆరోగ్యంగా ఉండగలమా..?శాకాహారులుగా ఉన్న చాలామంది పోషకాహార లోపాలు ఎదుర్కొంటున్నారు కదా, మరి అలాంటప్పుడూ ఇది ఏవిధంగా ఆరోగ్యానికి మంచిది అనేది అందరిలోనూ ఎదురయ్యే సందేహం. అయితే పోషకాహార నిపుణులు ప్రాథమికంగా ఏ ఆహారమైన తీసుకునే విధానం బట్టే అన్ని ప్రోటీన్లు పుష్కలంగా తీసుకోవడం సాధ్యమవుతుందంటున్నారు. మాంసం తినేవారికి సైతం బీ12 లోపం ఉంటుందనేది గుర్తెరగాలి. అందువల్ల ఇలా శాకాహారిగా మారాలనుకునే వాళ్లు..అన్ని విటమిన్లు, ప్రోటీన్లు అందేలా సవ్వంగా మార్పులు చేసుకోవాలి. అలాగే మొక్కల ఆధారిత ఆహారాలు మన శరీరానికి అన్నింటిని అందించలేకపోవచ్చు గానీ..ఆ లోపాన్ని ఆయా సప్లిమెంట్స్తో ఈజీగా భర్తీ చేసుకోవచ్చని సూచిస్తున్నారు పోషకాహార నిపుణులు. (చదవండి: ఫ్యాక్టరీ కార్మికుడి నుంచి ఫుల్స్టాక్ డెవలపర్ రేంజ్కి..!) -
జిమ్స్ జామ్ : న్యూ ఇయర్ జోష్...కసరత్తుల కళకళ
ఎప్పటి మాదిరిగానే కొత్త ఏడాది సందర్భంగా ఆరోగ్యార్థుల తీర్మానాల ఫలితంగా నగరంలోని జిమ్ సబ్స్క్రిప్షన్లు రికార్డు స్థాయిలో పెరిగాయి. దీంతో జిమ్ములు కసరత్తులు చేసే వారితో కళకళలాడాయి. నగరంతో పాటు దేశవ్యాప్తంగా ఇదే ట్రెండ్ ఉన్నట్లు పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. దేశవ్యాప్తంగా గత యేడాదితో పోలిస్తే ఈ సంవత్సరంలో 14% జిమ్ సభ్యత్వాలు పెరిగాయని, నగరంలోనూ అదే పరిస్థితి కనిపిస్తోందని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఇక గత డిసెంబర్తో పోలిస్తే 20–25% పెరుగుదల కనిపించినట్లు తెలుస్తోంది. న్యూ ఇయర్ తీర్మానాలతో పాటు భారీ డిస్కౌంట్ ఆఫర్లు కూడా దీనికి కారణమని స్పష్టమవుతోంది. – సాక్షి, సిటీబ్యూరో కొత్త సంవత్సరం ఆరోగ్యార్థులతో జిమ్స్ కళకళలాడాయి. ముఖ్యంగా మధ్య వయసు్కల సందడి అధికంగా కనిపించింది. న్యూ ఇయర్ తీర్మానాల్లో భాగంగా రికార్డు స్థాయిలో కొత్త సభ్యత్వాలు నమోదుకాగా.. దీనికి న్యూ ఇయర్ డిస్కౌంట్లు, ఆఫర్లు కూడా కారణమేనని తెలుస్తోంది. అయితే ఎప్పటి మాదిరిగానే మొదటి నెలలోనో.. లేదా రెండు నెలల తర్వాతనో వదిలేస్తే.. అది ఆరంభ శూరత్వంగా మారుతుందని ట్రైనర్లు చెబుతున్నారు. ఒక్కసారిగా భారీ స్థాయిలో కసరత్తులు చేసి.. ఆ వెంటనే వదిలేయడం సరికాదని, రోజుకు కొంత సమయం అనుకుని ఆ మేరకు క్రమంగా పెంచుకుంటూ వెళితే మంచి ఫలితాలు సాధించవచ్చని ట్రైనర్లు సూచిస్తున్నారు. తీర్మానాల ఫలం.. జిమ్కు బలం.. సాధారణ బరువు తగ్గించే లక్ష్యాలు మొదలుకుని.. పలు రకాల వ్యాధులకు చికిత్సగా వ్యాయామాలను సూచిస్తున్నారు నిపుణులు.. దీంతో ముందస్తు నివారణే ముఖ్యమనే ఆలోచనతో అనేక మంది జిమ్స్లో చేరుతున్నట్లు ట్రైనర్లు చెబుతున్నారు. నిశ్చల ఆధునిక జీవనశైలి కారణంగానే అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయనే అవగాహన అనేక మందిలో కలుగు తుండడంతో వాయిదా వేస్తూ వచి్చన వ్యాయామ కార్యాచరణను కొత్త ఏడాది సందర్భంగా అమలులోకి తీసుకొచ్చారు. జనవరి నెలలో యేటా ఈ పెరుగుదల ఉంటుందనేది ముందే తెలుసు కాబట్టి, పేరొందిన బ్రాండెడ్ జిమ్స్.. సభ్యత్వ రుసుములపై 30 నుంచి 50 శాతం వరకూ డిస్కౌంట్స్ ప్రకటించడం ఈ సారి మరింత ఊపుని అందించింది. ఇంట్లోనే వర్కవుట్స్.. ‘ఇంట్లోనే వ్యాయామం చేయాలని, హోమ్ జిమ్స్ ఏర్పాటు చేసుకోవాలని ఆశించే వారి సంఖ్య కూడా ఈ సారి భారీగానే పెరిగింది. ఇంట్లోనే వర్కవుట్ చేసుకునేందుకు వీలైన పరికరాలను ఎంచుకునే వారు పెరగడంతో మేము ‘గెట్ ఫిట్ డేస్’ పేరిట ప్రత్యేక విభాగాన్ని ప్రారంభించాం’ అంటూ ఆన్లైన్ విపణి అమెజాన్ బజార్ ప్రతినిధి ఒకరు వెల్లడించారు. ఈ మేరకు డిసెంబర్ నెలాఖరులో భారీగా జిమ్ ఎక్విప్మెంట్ అమ్ముడుపోయినట్లు వివరించారు. మధ్య వయసువారే అధికం.. ఈ ఏడాది కొత్తగా జిమ్స్ సభ్యత్వాలు తీసుకున్నవారిలో మధ్య వయస్కులు అధికంగా ఉండడం విశేషం అని నగరంలోని ఓ జిమ్ నిర్వాహకులు త్రినేత్ర తెలిపారు. తాము అందుకున్న సభ్యత్వాల్లో దాదాపు 54 శాతం మిడిల్ ఏజ్డ్ వాళ్లవే కాగా 40 శాతం యువత, మిగిలిన వారు ఉన్నారని, యువతుల సంఖ్య కూడా భారీగానే పెరిగిందని ఆయన వివరించారు. డయాబెటిస్, బీపీ తదితర దీర్ఘకాలిక వ్యాధుల నియంత్రణ కోసం మందులపై ఆధారపడే పరిస్థితిని తగ్గించే శక్తి వ్యాయామానికి ఉందనే అవగాహన పెరగడమే దీనికి కారణమని వ్యాయామ శిక్షకుడు విజయ్ గంధం తెలిపారు. చదవండి: కర్ణాటకలో అద్భుతం : ఇది ‘మామూలు చిరుత’ కాదుస్లో.. స్టడీ.. విన్.. అయితే సభ్యత్వ రుసుములు చెల్లించి జిమ్లో, ఫిట్నెస్ స్టూడియోల్లో చేరినంత సులభంగా వ్యాయామాన్ని క్రమబద్ధంగా కొనసాగించడం కష్టమని ప్రముఖ సెలబ్రిటీ ట్రైనర్ కరణ్ చెబుతున్నారు. జనవరిలో పెరిగినట్టు కనిపించిన సభ్యత్వాల సంఖ్య కేవలం ఫిబ్రవరి కల్లా 20 శాతానికి అలాగే మార్చి నెల వచ్చే సరికి 35 శాతానికి పైగా తగ్గిపోతున్నట్లు పాత గణాంకాలు వెల్లడిస్తున్నాయన్నారు. కాబట్టి త్వరిత ఫలితాల కోసం ఆధారపడకుండా, సహేతుకమైన లక్ష్యాలతో ముందుకు సాగాలని సూచించారు. కొత్తగా వ్యాయామం ప్రారంభించినప్పుడు వచ్చే ఒళ్లునొప్పులు, శారీరక సమస్యల విషయంలో గాభరా పడకుండా నిత్యం శిక్షకులు, వైద్యుల సూచనలను అనుసరిస్తూ ఫిట్నెస్ రొటీన్ కొనసాగించాలని, అదే విధంగా డైట్లోనూ తగిన మార్పులు, చేర్పులు చేసుకోవాలని స్పష్టం చేశారు. ఇదీ చదవండి: రూ. 25 వేలకే అమ్మాయిలు : మంత్రి భర్త వ్యాఖ్యలు వీడియో వైరల్ -
కిమ్స్లో జాతీయస్థాయి రుమటాలజీ సదస్సు
హైదరాబాద్, సాక్షి : ఆర్థరైటిస్, ఆస్టియో ఆర్థరైటిస్, లూపస్, ఆటో ఇమ్యూన్ వ్యాధులు తదితర రుమటాలజీ సమస్యలకు ప్రపంచవ్యాప్తంగా అనేక కొత్త రకాల చికిత్సా పద్ధతులు వస్తున్నాయని, వీటి గురించి రుమటాలజిస్టులు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ రోగులకు సాంత్వన కలిగించేందుకు ప్రయత్నించడం ముదావహమని కిమ్స్ ఆస్పత్రుల ఛైర్మన్, ఎండీ డాక్టర్ బొల్లినేని భాస్కరరావు అన్నారు. ఆస్పత్రి ప్రాంగణంలో రెండు రోజుల పాటు జరిగే క్లినికల్ రుమటాలజీ కాన్ఫరెన్స్ 2026 (సీఆర్సీ 2026) సదస్సును ఆయన ప్రారంభించారు.దేశం నలుమూలల నుంచి 400 మందికి పైగా రుమటాలజిస్టులు ఈ సదస్సుకు హాజరయ్యారు. రెండేళ్లకు ఒకసారి మాత్రమే నిర్వహించే ఈ సదస్సులోఅనుభవజ్ఞులైన రుమటాలజిస్టులు అత్యంత సంక్లిష్టమైన కేసులకు ఎలా చికిత్స చేశారన్న విషయాన్ని కేసుల వారీగా చర్చించిన తరువాత, తద్వారా సదస్సులో పాల్గొన్న అందరికీ ఈ తరహా కేసులకు ఎలా చికిత్స చేయాలన్న విషయాలను వివరించారు.సదస్సు ప్రారంభోత్సవంలో కిమ్స్ ఆస్పత్రి సీఎండీ డాక్టర్ బొల్లినేని భాస్కరరావు, కిమ్స్ హాస్పిటల్స్ సికింద్రాబాద్ మెడికల్ డైరెక్టర్ డా. సంబిత్ సాహు, డా. బి. శ్రీనివాస్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్, మినిస్టర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, డా. వినోద్ రవీంద్రన్ ప్రెసిడెంట్ ఎలెక్ట్, ఇండియన్ రుమాటాలజీ అసోసియేషన్, సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రి రుమటాలజీ విభాగం క్లినికల్ డైరెక్టర్ డాక్టర్ శరత్ చంద్రమౌళి, హైదరాబాద్ రుమటాలజీ సెంటర్ డైరెక్టర్ డాక్టర్ రాజ్కిరణ్ తదితరులు పాల్గొన్నారు. సదస్సు ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ వీరవల్లి శరత్ చంద్రమౌళి, సీఆర్సీ 2026 సైంటిఫిక్ ఛైర్ డాక్టర్ వినోద్ రవీంద్రన్, నేతృత్వంలో జరిగిన ఈ సదస్సులో రుమటాయిడ్ ఆర్థరైటిస్, లూపస్, యాంకైలోజింగ్ స్పాండిలైటిస్, సోరియాటిక్ ఆర్థరైటిస్, గౌట్, వాస్కులైటిస్, బాల్య ఆర్థరైటిస్, అరుదైన రుమాటిక్ కండిషన్ల వంటి అంశాలపై చర్చించారు. ఈ సదస్సులో ట్రైనీల కోసం రుమటాలజీ క్విజ్ కూడా నిర్వహించారు. సీఆర్సీ 2026 ప్రత్యేకతలలో ఒకటి కొత్తగా చేర్చిన ఇమేజ్ పోటీ. సదస్సులో పాల్గొన్న పలువురు ఈ అంశంలో చాలా చురుగ్గా పాల్గొన్నారు. సదస్సుకు తమ సృజనాత్మక కోణాన్ని జోడించారు. అదనంగా, భారతదేశం నలుమూలల నుండి 269 కేసు సారాంశాలను సమర్పించారు. ప్రతి కేటగిరీలో ఎంపిక చేసిన ముఖ్యమైన కేసులను కాన్ఫరెన్స్ సెషన్లలో చర్చించారు.ఈ సందర్భంగా డాక్టర్ వీరవల్లి శరత్ చంద్రమౌళి మాట్లాడుతూ, “సీఆర్సీ 2026 విజయవంతం కావడం, దేశవ్యాప్తంగా ఉన్న రుమటాలజిస్టులు ఉత్సాహభరితంగా భాగస్వామ్యం వహించడం ఎంతో సంతోషంగా ఉంది. ఇక్కడ సదస్సులో హాజరైన అనుభవజ్ఞులైన రుమటాలజిస్టులు అందరూ తమ తమ విజ్ఞానాన్ని పదిమందితో పంచుకోవడం, అత్యంత సమస్యాత్మకమైన కేసుల గురించి చర్చించడానికి ఈ సదస్సు ఒక విలువైన అవకాశాన్ని కల్పించింది. ఇందులో ప్రధానంగా రుమాటిక్, కండరాలు, లూపస్ వ్యాధులపై అవగాహన పొందగలిగాము” అన్నారు.భారతదేశంలో రుమటాలజీ రంగాన్ని అభివృద్ధి చేయడానికి క్లినికల్ రుమటాలజీ కాన్ఫరెన్స్ 2026 ఒక ప్రముఖ వేదికగా తన ప్రాముఖ్యతను మరోసారి నిరూపించింది. రుమటాలజీలో విజ్ఞాన భాగస్వామ్యం, వృత్తిపరమైన అభివృద్ధి సంప్రదాయాన్ని కొనసాగించడానికి సిద్ధంగా ఉన్న సీఆర్సీ తదుపరి ఎడిషన్ కోసం ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం అవుతున్నాయి. -
న్యూ ఇయర్ హ్యాంగోవర్: ఇలా చేస్తే క్షణాల్లో రిలీఫ్..!
న్యూ ఇయర్ సెలబ్రేషన్స్లో రాత్రంత ఆడిపాడి ఎంజాయ్ చేయడం కామన్. ముఖ్యంగా బిర్యానీలు, కూల్డ్రింక్స్తో చిల్ అవ్వుతూ..తెలియకుండానే ఎక్కువగా లాగించేస్తాం. దానికి తోడు లేటుగా ఏ అర్థరాత్రో బాగా పొద్దుపోయాక పడుకోవడంతో..తిన్న ఆహారమంతా అరగక పొద్దున్నంతా నరకరం చూస్తాం. తలంత పట్టేసి..అబ్బా చాలా ఇబ్బందిగా ఉంటుంది చాలామందికి. ఆ హ్యాంగోవర్ని వదులించుకోవడం అంత ఈజీ కాదు కూడా. అలాంటి సమస్యను ఈ రిఫ్రెషింగ్ డిటాక్స్ పానీయాలతో సులభంగా చెక్ పెట్టేయొచ్చని చెబుతున్నారు నిపుణులు. అదెలాగో తెలుసుకుందామా..!.రాత్రిపూట..అందులోనూ బాగా లేట్నైట్ వేపుళ్లు, అధిక నూనెతో కూడిన పదార్థాలు తినడం కారణంగా జీర్ణక్రియ మందగిస్తుంది. ముఖ్యంగా తలనొప్పి, వికారం, పొట్ట ఉబ్బరం, అలసట, పార్టీ హ్యాంగోవర్ వంటి సమస్యలతో సతమతమవుతుంటారు. అలాంటి వాళ్లు ఈ సమస్య నుంచి తర్విరతగతిన రిలీఫ్ పొందాలంటే సరైన డిటాక్స్ పానీయాలను తీసుకుంటే చాలు అని చెబుతున్నారు. ఇవి హైడ్రేటెడ్గా ఉండేలా చేసి, కాలేయ పనితీరు, జీర్ణక్రియకు మద్దతిస్తాయి. శరీరం వేగంగా కోలుకోవడానికి సహాయపడతాయట. ముఖ్యంగా మద్యం సేవించినవారికి ఇవి మరింత హెల్ప్ అవుతాయని చెబుతున్నారు. ఇవి ఇంట్లోనే సులభంగా తయరు చేసుకోవచ్చట కూడా. గోరువెచ్చని నీళ్లు నిమ్మకాయ..ఇది హ్యాంగోవర్కు చాలా ప్రయోజనకరమైనది. గోరువెచ్చని నిమ్మకాయ నీళ్లు హైడ్రేటెడ్గా ఉండేలా చేసి, జీర్ణక్రియను ప్రేరేపిస్తుందట. విటమిన సీ మోతాదు..కాలేయ ఎంజైమ్లకు మద్దతిస్తుందట. వికారం, పొట్ట ఉబ్బరాన్ని తగ్గిస్తుంది. చిటికెడు ఉప్పు, కొబ్బరి నీరు.. కొబ్బరి నీరు, ఉప్పు శరీరాన్ని తిరిగా ఉత్సాహభరితంగా ఉండేలా చేస్తుంది. ఇందులోని పొటాషియం, సహజ ఎలక్ట్రోలైట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది హైడ్రేషన్కి అనువైనది. అలాగే శరీరంలోని సోడియం స్థాయిలను పునరుద్ధరించడంలో సహాయపడుతుంది. కడుపుని తేలికగా చేస్తుంది. తలతిరగడం, నోరు పొడిబారడం, వంటి సాధారణ హ్యాంగోవర్ లక్షణాలను తగ్గిస్తుంది. అల్లం, తేనె నీరుఅల్లం, తేనె నీరు అనేది హ్యాంగోవర్ను సులభంగా నయం చేసే అద్భుతమై డీటాక్స్ వాటర్. అల్లం జీర్ణవ్యవస్థను శాంతపరచడానికి సహాయపడుతుంది. గ్యాస్ట్రిక్ సమస్యను నివారిస్తుంది. వికారం తగ్గడమే కాకుండా ఇందులోని తేనే సహజ గ్లూకోజ్ని అందిస్తుంది.దోసకాయ, పుదీనా, నిమ్మకాయ డిటాక్స్ వాటర్ఇది పొట్ట ఉబ్బరాన్ని తగ్గించి, హైడ్రేషన్కు మద్దతిస్తుంది. ముక్కలు చేసిన దోసకాయ, పుదీనా ఆకులు, నిమ్మకాయ ఒక బాటిల్ వాటర్లో వేసి రోజంతా త్రాగండి. దోసకాయలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. పుదీనా జీర్ణక్రియకు మద్దతిస్తుంది. నిమ్మకాయ కాలేయ పనితీరుకు మద్దతిస్తుంది.ఉసిరి నీళ్లు..శీతాకాలంలో ఉసిరిని చేర్చుకోవడం ఎంతో మంచిది. ఆమ్లాలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సీ పుష్కలంగా ఉంటాయి. ఇవి కాలేయ ఆరోగ్యానికి మద్దతిస్తాయి. ఆల్కహాల్ వల్ల కలిగే ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి. అల్లం జీర్ణవ్యవస్థను శాంతపరచడానికి సహాయపడుతుంది. హ్యాంగోవర్ తర్వాత అద్భుతమైన రికవరీ పానీయంగా మారుతుంది. అలాగే జీర్ణక్రియకు, శక్తి స్థాయిలను మెరుగుపరచడంలోనూ సహాయపడుతుంది,జీరా (జీలకర్ర) నీరుజీరా కలిపిన నీరు మీ మొత్తం ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉండటమే కాకుండా నూతన సంవత్సరానంతర హ్యాంగోవర్ను నయం చేయడానికి కూడా గొప్ప నివారణి కూడా. జీరా నీటి ఆమ్లత్వం పొట్ట ఉబ్బరం నుంచి బయటపడేలా చేస్తుంది. బరువు, మలబద్దకం, కడుపు అసౌకర్యం వంటి వాటి నుంచి బయటపడేలా చేస్తుంది.నివారించాల్సినవి:హ్యాంగోవర్ సమయంలో వీటికి మాత్రం దూరంగా ఉండాలికాఫీ తీసుకోకుంటేనే మంచిది. ఆ సమయంలో కడుపులో అసౌకర్యాన్ని కలిగిస్తుంది. ఎనర్జీ డ్రింక్లు రక్తంలోని చక్కెరను పెంచుతాయి, అలాగే కాలేయంపై మరింత ఒత్తిడి ఏర్పడేలా చేస్తుంది. నొప్పి నివారణ మందులు దరిచేరనివ్వకుండా ఉండటం.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: గాంధీ కుటుంబం మెచ్చే రణతంబోర్ నేషనల్ పార్క్..! అక్కడ న్యూ ఇయర్కి..) -
2025కి గుడ్బై.. 2026కి హెల్తీ వెల్కమ్
2025కు గుడ్బై పలికేశారా? కొత్త ఏడాదికి స్వాగతం అనేస్తున్నారా?. ఓకే.. గుడ్. 2026లో మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని నిర్ణయించుకున్నారా?.. అయితే ఈ ఈజీ టిప్స్ మీకోసమే. 2025లో శాస్త్రవేత్తల పరిశోధనల ఫలితాలివి! ఆలస్యమెందుకు?.. చదివేయండి.. తెలివిగా తినండి.. గుండె ఆరోగ్యంతోపాటు మన జీర్ణక్రియ సక్రమంగా ఉండేందుకు, నిద్ర, మూడ్ సమస్యలు అధిగమించేందుకు, రకరకాల నొప్పుల నుంచి ఉపశమనం కోసం కొంచెం తెలివిగా తినాలని, తాగాలని 2025లో జరిగిన పరిశోధనలు చెబుతున్నాయి. ఇంతకీ ఆ తినడం ఎలా ఉండాలంటే.. ➡️వారంలో ఒకటి నుంచి ఆరు వరకూ కోడిగుడ్లు తినడం గుండెజబ్బులతో చచ్చిపోయే ప్రమాదాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్న వారికీ కూడా ఇది వర్తిస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి. అలాగని అతిగా తినడం మంచిది కాదు.➡️అధిక రక్తపోటు నుంచి తప్పించుకునేందుకు ఉప్పు తినడం తగ్గించడం కాకుండా.. ఆహారంలో మరింత పొటాషియం ఉండేలా చూసుకోవడం మేలు. అరటిపండ్లు, ఆప్రికాట్స్, చిలగడదుంపల్లో పొటాషియం పుష్కలంగా లభిస్తుంది.పొటాషియం అధికంగా ఉండేవి.. • అరటిపండ్లు• ఆప్రికాట్స్ (జారదాలు)• చిలగడదుంపలు (Sweet potatoes)• పాలకూర, గోంగూర, కూరగాయలు• బీన్స్, పప్పులు• కొబ్బరి నీరు• కలబంద (Avocado)గమనిక.. కిడ్నీ సమస్యలు ఉన్నవారు అధిక పొటాషియం తీసుకోవడం ప్రమాదకరం కావొచ్చు. కాబట్టి, నిపుణుల సలహా తీసుకుని ఆహారంలో పొటాషియం బ్యాలెన్స్ తప్పకుండా చూసుకోవాలి➡️రోజంతా కూర్చునే ఉంటున్నారా? అయితే మీ రక్తనాళాలను కాపాడుకోవాలంటే... కోకోలోని ఫ్లేవనాల్స్ బాగా ఉపయోగపడతాయి. ఇవి ‘సిట్టింగ్ డిసీజ్’తో వచ్చే సమస్యల తీవ్రతను తగ్గిస్తాయి. పరిశోధనల ప్రకారం.. రోజుకు కోకో పౌడర్ లేదా డార్క్ చాక్లెట్ (70% పైగా కోకో ఉన్నది) తీసుకోవడం రక్తనాళాల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఫ్లేవనాల్స్ రక్తంలో నైట్రిక్ ఆక్సైడ్ ఉత్పత్తిని పెంచి, రక్తనాళాలను సడలిస్తాయి. దీని వల్ల రక్తప్రవాహం పెరుగుతుంది, గుండెజబ్బుల ప్రమాదం తగ్గుతుంది.ఎలా తీసుకోవాలంటే.. డార్క్ చాక్లెట్ (చక్కెర తక్కువగా ఉండే)కోకో పౌడర్ (unsweetened)కాకా నిబ్స్కోకో డ్రింక్స్ (చక్కెర లేకుండా)అధిక చక్కెర, పాలు కలిపిన చాక్లెట్ తీసుకుంటే ప్రయోజనం తగ్గిపోతుంది.మితంగా తీసుకోవాలి (రోజుకు 10–20 గ్రాముల డార్క్ చాక్లెట్ సరిపోతుంది).కొన్ని రకాల కొవ్వులు కేన్సర్ కణితులతో మన రోగ నిరోధక వ్యవస్థ పోరాడే సామర్థ్యాన్ని తగ్గిస్తాయి. అయితే మొక్కల ఆధారిత కొవ్వులు (plant-based fats) అలాంటి ప్రతికూల ప్రభావం చూపవు. మంచి కొవ్వులు• ఆలివ్ ఆయిల్• కొబ్బరి నూనె• పామ్ ఆయిల్ (మితంగా)• అవకాడో, డ్రైఫ్రూట్స్👆 ఇవి ఇమ్యూన్ సిస్టమ్ను దెబ్బతీయవు. కొన్ని సందర్భాల్లో యాంటీ-ఇన్ఫ్లమేటరీ ప్రభావం చూపుతాయి.➡️మలబద్ధకాన్ని తొలగించేందుకు పీచు పదార్థం ఎక్కువగా ఉన్న పండ్లు ఉపయోగపడతాయి. అయితే కీవీ పండ్లు ఈ జాబితాలో తొలిస్థానంలో ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.➡️ఆలివ్ ఆయిల్ వంటి ఆరోగ్యకరమైన కొవ్వులతోపాటు, శాఖాహార ప్రధానమైన మెడిటరేనియన్ ఆహారం ఐబీఎస్ (ఇరిటెబుల్ బౌల్ సిండ్రోమ్) సమస్యను తగ్గిస్తుంది.➡️అరటి పండు స్మూతీల్లో వాడే పదార్థాల్లోని మంచి పోషకాలు సరిగ్గా జీర్ణం కానివ్వదు. అరటిలో సహజంగా ఉన్న పోషకాలు, ఇతర పదార్థాల కలయిక వల్ల శరీరానికి పూర్తిగా అందకపోవచ్చు. కాబట్టి.. అరటితో పాలు / బాదం పాలు(ప్రోటీన్, కాల్షియం అందిస్తాయి), పీనట్ బట్టర్ / బాదం బట్టర్ (ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్ అందిస్తుంది), ఓట్స్ (ఫైబర్, శక్తినిస్తుంది), కాకా పొడి (unsweetened cocoa) యాంటీఆక్సిడెంట్లు, చియా సీడ్స్ / ఫ్లాక్స్ సీడ్స్ (ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు), బెర్రీలు (స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ) (విటమిన్ C, యాంటీఆక్సిడెంట్లు), తేనె / ఖర్జూరం (సహజమైన తీపి) అందిస్తాయి. అలాగే.. అరటితో కలపకూడనివి కొన్ని ఉన్నాయి. సిట్రస్ ఫలాలు (కమలపండు, మొసంబి, నిమ్మ) వీటివల్ల ఆమ్లత్వం(యాసిడిటీ) పెరిగి అరటిలోని పోషకాలు శోషణ తగ్గుతుంది. అధిక చక్కెర / ఐస్క్రీమ్ వల్ల ఫైబర్ దక్కకపోగా.. విటమిన్ ప్రయోజనం తగ్గిపోతుంది.ప్రాసెస్డ్ ప్రోటీన్ పౌడర్ల వల్ల కొన్ని సందర్భాల్లో జీర్ణక్రియకు ఆటంకం కలుగుతుంది. చాక్లెట్ సిరప్ (అధిక చక్కెర) సహజంగానే పోషకాలను తగ్గిస్తుంది. కాఫీ / టీ పొడి చేరిస్తే.. ఐరన్, కాల్షియం శోషణకు ఆటంకం కలుగుతుంది. ➡️చక్కెరల కంటే కృత్రిమ చక్కెరలతో కూడిన పానీయాలు మధుమేహం వచ్చే అవకాశాలను ఎక్కువ చేస్తాయి. కాబట్టి ఆ రకమైన పానీయాలు తీసుకోకపోవడం మేలు.పునరుత్తేజానికి వ్యాయామం..సరైన నిద్ర + సరైన వ్యాయామం= ఆరోగ్యం. అయితే హై-ఇంపాక్ట్ వ్యాయామాలు (జంపింగ్, రన్నింగ్) కీళ్ల సమస్యలు పెంచే అవకాశం ఉంది. కాబట్టి నడక, సైక్లింగ్, ఈత వంటివి మేలు. సుఖ నిద్రతో మన వ్యాయామ అలవాట్లు మెరుగవుతాయి. అయితే.. సాయంత్రాలు వ్యాయామం చేయడం అంత మంచిదేం కాదు. హృదయ స్పందన, శరీర ఉష్ణోగ్రత పెరిగి నిద్రకు భంగం కలగొచ్చు. నిద్రను నిర్లక్ష్యం చేస్తే వ్యాయామం ప్రయోజనం తగ్గిపోతుంది. కాబట్టి.. నిద్రకు ఎక్కువ ప్రాధాన్యమివ్వాలి. ఒకవేళ సాయంత్రమే చేసే వీలుంటే గనుక.. తేలికపాటి వ్యాయాయాలు (నడక, యోగా, స్ట్రెచింగ్) చేసుకోవచ్చు. ఇవి నిద్రకు ఆటంకం కలిగించవు.మానసిక సంతోషానికి.. జీవనశైలిలోని చిన్న చిన్న అలవాట్లు మన మానసిక ఆరోగ్యంపై, పనితీరుపై గణనీయమైన ప్రభావం చూపుతాయి. తాజా పరిశోధనలు కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెలుగులోకి తెచ్చాయి.క్రియాటిన్ సాధారణంగా కండరాల శక్తి పెంపు కోసం ఉపయోగించే పోషక పదార్థం. కానీ, ఇది మెదడు శక్తి వినియోగాన్ని మెరుగుపరచడంతో పాటు డిప్రెషన్ (మనోవ్యాకులత) చికిత్సలో సహాయక పాత్ర పోషిస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి. అదెలాగంటే.. క్రియాటిన్ తీసుకోవడం వల్ల మెదడు కణాలు శక్తిని సమర్థవంతంగా వినియోగించుకుంటాయి, ఫలితంగా మూడ్ స్థిరంగా ఉండేలా చేసి చికిత్సలో మెరుగైన ఫలితాన్ని చూపిస్తుంది. తిట్టుకోవడం.. పనితీరు పెంపుతిట్టుకోవడం అనేది.. ప్రతికూలంగా భావించే అంశమే. కానీ.. శాస్త్రవేత్తలు చెబుతున్నది ఏమిటంటే తీవ్ర ఒత్తిడి లేదంటే కష్టమైన పనిలో మనల్ని మనం కాస్త ఘాటు పదాలతో తిట్టుకోవడం వల్ల శరీరం ఎక్కువ శక్తి ఇస్తుంది. ఇది నొప్పి తట్టుకునే సామర్థ్యాన్ని పెంచి.. పనితీరు మెరుగుపరుస్తుంది. క్రీడల్లో, కఠినమైన వ్యాయామాల్లో ఇది సహజ రీతిలో కనిపించే అంశమే.ఉదయాన్నే కాఫీ.. మూడ్ మెరుగుదలకాఫీలోని కెఫిన్ మెదడులో డోపమైన్, సెరోటోనిన్ వంటి రసాయనాల స్థాయిని పెంచుతుంది. ఫలితంగా, రోజంతా ఉత్సాహం, ఏకాగ్రత, మూడ్ మెరుగుపడతాయి. ఉదయం ఒక కప్పు కాఫీ తాగడం వల్ల పనితీరు పెరిగి, జీవనశైలి ఉల్లాసంగా ఉంటుంది. ఇది మేం చెబుతున్నమాట కాదు.. పరిశోధనల్లో తేలిన అంశమే. -
మైగ్రేన్ తలనొప్పి ఎందుకొస్తుందంటే..!
మైగ్రేన్తో బాధపడేవారికి పనిదినాన్ని కోల్పోవడం లేదా అనారోగ్య సెలవు తీసుకోవడం సాధారణ అనుభవమే. అయితే, ఇది ఉత్పాదకత తగ్గడానికి ప్రధాన కారణాలలో ఒకటిగా మారుతుందనే విషయం చాలామందికి తెలియదు. ముఖ్యంగా 20 నుంచి 50 ఏళ్ల వయసు గల వారిలో ఎక్కువగా కనిపించే సమస్య ఇది. క్రమరహిత పనివేళలు లేదా సమావేశాలు, అధిక స్క్రీన్ వినియోగం, దీర్ఘకాలం పాటు సరైన భంగిమలో కూర్చోవడంలో పొరపాట్లు, అలాగే నిరంతర ఒత్తిడి లేదా బర్నౌట్కు దగ్గరైన భావన వంటి అనేక కారణాలు మైగ్రేన్కు కారణాలు. ఈ సవాళ్లను గుర్తించి పరిష్కరించడం అత్యవసరం అని అంటున్నారు యశోదా హాస్పిటల్స్ డాక్టర్ జయదీప్ రే చౌదరి.మైగ్రేన్ సమయంలో ఏం జరుగుతుందంటే..ప్రపంచవ్యాప్తంగా, మైగ్రేన్ను కేవలం తలనొప్పిగా కాకుండా, ఒక నర సంబంధ వ్యాధిగా గుర్తిస్తున్నారు. గణాంకాల ప్రకారం, ప్రతి నలుగురిలో ఒకరు మైగ్రేన్తో బాధపడుతుండగా, భారతదేశ జనాభాలో దాదాపు 25 శాతం మంది ఈ సమస్యను అనుభవిస్తున్నారని అంచనా. ది లాన్సెట్ (2019) నివేదిక ప్రకారం, మైగ్రేన్లు ప్రపంచవ్యాప్తంగా రెండవ అత్యధికంగా అంగవైకల్యాన్ని కలిగించే నర సంబంధ వ్యాధిగా పేర్కొంది.చాలా మంది రోగులు మైగ్రేన్తో జీవితాంతం పోరాడాల్సి వస్తుంది. దీనివల్ల వ్యక్తిగతంగా, వృత్తిపరంగా తీవ్రమైన ప్రభావాలు ఎదురవుతాయి. మైగ్రేన్ సమయంలో, మెదడు తన చుట్టూ ఉన్న రక్షణ పొరలైన మెనింజెస్కు సంకేతాలను పంపుతుంది. దీనికి ప్రతిస్పందనగా, CGRP (కాల్సిటోనిన్ జన్యు-సంబంధిత పెప్టైడ్) వంటి రసాయనాలు విడుదలవుతాయి. ఈ CGRP నిర్దిష్ట గ్రాహకాలతో బంధించబడినప్పుడు, మెనింజెస్లోని రక్తనాళాలు విస్తరించి వాపుకు గురవుతాయి.ఈ నాళాల విస్తరణ, క్రిమిరహిత వాపు కలయిక మైగ్రేన్ లక్షణ నొప్పిని ఉత్పత్తి చేస్తుంది. నొప్పి సంకేతం అప్పుడు మెదడులోకి తిరిగి ప్రయాణిస్తుంది, అక్కడ అది ప్రాసెస్ చేయబడుతుంది, ఫలితంగా వికారం, కాంతికి సున్నితత్వం (ఫోటోఫోబియా), ధ్వనికి సున్నితత్వం (ఫోనోఫోబియా) వంటి లక్షణాలు ఏర్పడతాయి. పరిష్కారం ఎలాగంటే..యశోదా హాస్పిటల్స్ న్యూరాలజిస్ట్ డాక్టర్ జయదీప్ రే చౌదరి, ఈ సమస్యను ఇలా పరిష్కారిస్తామని చెప్పుకొచ్చారు. లక్ష్యం కేవలం నొప్పిని లేదా ఒక్కో ఎపిసోడ్ను నియంత్రించడం మాత్రమే కాదు, మైగ్రేన్ నుంచి నిజమైన విముక్తిని సాధించడం. ఇందుకు మైగ్రేన్ వచ్చే పౌనఃపున్యాన్ని తగ్గించడం, దాని వ్యవధిని కుదించడం మరియు రోజువారీ జీవితంపై పడే ప్రభావాన్ని తగ్గించడం అవసరం. అలా చేయడం ద్వారా ప్రజలు తమ జీవన నాణ్యతను తిరిగి పొందగలుగుతారు, పనికి పూర్తి స్థాయిలో తిరిగి చేరగలుగుతారు. మైగ్రేన్ నుంచి స్వేచ్ఛను పొందడమే మా తుది ఆశయం.”పని రోజుల్లో మైగ్రేన్ ప్రభావంభారతదేశంలో మైగ్రేన్లు ఉత్పాదకతపై గణనీయమైన ప్రభావం చూపుతున్నాయి. మైగ్రేన్తో బాధపడే వ్యక్తులు నెలకు సగటున 5.9 పనిదినాలను కోల్పోతున్నారు. దీనివల్ల వ్యక్తిగతంగా ఇబ్బందులు పెరగడమే కాకుండా, దేశ ఆర్థిక వ్యవస్థపై కూడా భారమైన ప్రభావం పడుతోంది. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ఆదాయ నష్టం, జీవన నాణ్యతతో బాధపడుతున్నారు. మైగ్రేన్ కారణంగా వారు ముఖ్యమైన పని, వ్యక్తిగత కార్యక్రమాలకు హాజరు కాలేకపోతున్నారు, చివరి నిమిషంలో ప్లాన్లను రద్దు చేయాల్సి వస్తోంది లేదా శరీరం సహకరించకపోయినా పని చేయాల్సి వస్తోంది. దీని కారణంగా భారతదేశంలో ఒక్క వ్యక్తికి సంవత్సరానికి సగటు ఆర్థిక నష్టం రూ. 8,731గా అంచనా. అంటే దేశానికి మొత్తం ఆర్థిక నష్టం సుమారు రూ. 18,674 కోట్లకు పైగా నష్టంగా అంచనా.ఇది శారీరక నొప్పిని మించి, మైగ్రేన్లు తరచుగా ఏకాగ్రత లోపానికి, పని వేగం తగ్గడానికి, పనితీరు మందగించడానికి కారణమవుతుంది. కొన్ని సందర్భాల్లో ఇవి వ్యక్తులను తమ వృత్తి ఎంపికలు, కెరీర్ మార్గాలను మళ్లీ ఆలోచించాల్సిన పరిస్థితికి కూడా నెట్టేస్తాయి.ఈ సమస్య నుంచి బయటపడాలంటే..మైగ్రేన్ సంరక్షణకు సమగ్ర దృక్పథం అవసరం. రోగులు సూచించిన మందులు, వైద్య సలహాలను క్రమబద్ధంగా అనుసరించడానికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఎందుకంటే ఈ జోక్యాలు దీర్ఘకాలిక వ్యాధి భారాన్ని గణనీయంగా తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. చికిత్స ప్రారంభ సమయం, సాధ్యమైన దుష్ప్రభావాలు, చికిత్సకు కట్టుబడి ఉండటం వంటి అంశాలపై వైద్యులు, న్యూరాలజిస్టులతో జరిగే స్పష్టమైన, నిరంతర కమ్యూనికేషన్ నమ్మకాన్ని బలోపేతం చేస్తుంది.తలనొప్పి ప్రారంభమైన వెంటనే మైగ్రేన్ మందులు తీసుకుంటే అవి అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తాయి. అలాగే, నిర్మాణాత్మక పని విరామాలు తీసుకోవడం, సరిపడా నీరు త్రాగడం, ఆరోగ్యకరమైన నిద్రా సమయాలను పాటించడం, స్క్రీన్ సమయం-తో పాటు స్క్రీన్ కాంతిని సమర్థంగా నిర్వహించడం వంటి జీవనశైలి చర్యలు మైగ్రేన్ దాడుల తరచుదనాన్ని గణనీయంగా తగ్గించగలవు. తలనొప్పి డైరీలో లక్షణాలు, ట్రిగ్గర్లను నమోదు చేయడం ప్రారంభ దశలోనే జోక్యం చేసుకోవడానికి, అలాగే వ్యక్తిగత ట్రిగ్గర్లను గుర్తించి నివారించడానికి ఒక ఉపయోగకరమైన అభ్యాసంగా పనిచేస్తుంది.ఇంటర్నేషనల్ హెడకే సొసైటీ తన క్లినికల్ థెరపీ దృక్కోణంలో ‘మైగ్రేన్ ఫ్రీడమ్’ అనే కొత్త లక్ష్యాన్ని ప్రతిపాదించింది. ఇకపై చికిత్స లక్ష్యం కేవలం నొప్పిని తగ్గించడం లేదా ఒక్కో ఎపిసోడ్ను నివారించడం మాత్రమే కాదు, మైగ్రేన్ నుంచి సంపూర్ణ విముక్తిని సాధించడమే. ఈ దృక్కోణం వ్యక్తులు తమ సాధారణ పనితీరును తిరిగి పొందేందుకు, వేగంగా పనికి పునరాగమనం చేసేందుకు, మొత్తం జీవన నాణ్యతను మెరుగుపరుచుకునేందుకు సహాయపడటంపై దృష్టి సారిస్తుంది. సరైన ఔషధ చికిత్స, వ్యక్తిగత ట్రిగ్గర్లను గుర్తించడం, లక్ష్యిత జీవనశైలి సర్దుబాట్ల సమన్వయంతో, ఈ లక్ష్యాన్ని సాధించడం సాధ్యమవుతుంది. మనస్సు స్పష్టంగా, పనిదినాలు ఉత్పాదకంగా కొనసాగేందుకు మార్గం సుగమమవుతుంది.--డాక్టర్ జయదీప్ రే చౌదరి, న్యూరాలజిస్ట్, యశోదా హాస్పిటల్స్(చదవండి: వాట్ యాన్ ఐడియా..! యువతకు సాంకేతికతో భావోద్వేగ సందేశం..) -
కేవలం 15 వారాలలో 22 కిలోల బరువు తగ్గాలంటే..!
బరువు తగ్గేందుకు రకరకాల డైట్లు, వ్యాయామాల తోపాటు..డిటాక్స్ డ్రింక్లు తోడైతే మరింత త్వరితగతిన బరువు తగ్గుతాం. ఇవి మన ఇంట్లోదొరికే వాటితోనే సులభంగా తయరు చేసుకోవచ్చు కడా. కఠినమైన డైట్, వర్కౌట్ల కంటే..ఇలాంటి సింపుల్ చిట్కాలతో మరింత సులభంగా బరువు తగ్గిపోగలమని చెబుతున్నారు ఫిట్నెస్ నిపుణులు. తేలిక పాటి వర్కౌట్లు, చక్కటి ఆరోగ్యకరమైన డైట్ తోపాటు ఇలాంటి కొలెస్ట్రాల్ని తగ్గించే అద్భతమైన పానీయాలు త్వరితగతిన వెయిట్లాస్ అవ్వడంలో బాగా హెల్ప్అవుతాయట. నిశబ్దంగా వొంట్లో కొవ్వుని తగ్గించే ఆ గట్ రీసెంట్ డ్రింక్ ఏంటి? ఎలా తయారు చేసుకోవాలి వంటి వాటి గురించి సవివరంగా తెలుసుకుందామా..!.ఫిట్నెస్ కోచ్ నేహా పరిహార్ కేవలం 15 వారాలలో 22 కిలోల బరువు తగ్గారట. అందుకు ఈ గట్ రీసెట్ డ్రింక్ బాగా హెల్ప్ అయ్యిందట. ఇది మన ఇంట్లో దొరికే దేశీ వస్తువులతో తయారు చేసే సాధారణ దేశీ మిశ్రమ టానిక్గా చెబుతున్నారు నేహా. అందుకు కావాలసినవి:అజ్వైన్ (వాము): 1 టేబుల్ స్పూన్ సోంపు : 2 టేబుల్ స్పూన్లు మెంతి గింజలు (మెంతి గింజలు): 1 టేబుల్ స్పూన్ తాజాగా తురిమిన అల్లం: 1 టేబుల్ స్పూన్ నీరు: 2.5 లీటర్లతయారీ విధానం:నీటిలో వాము, సొంపు, మెంతి గింజలు వేసి బాగా మరిగించాలి. ఆ తర్వాత మంటను కాస్త తగ్గించిన అప్పుడే తురిమిన తాజా అల్లం వేసి కొద్దిసేపు మరగనివ్వండి. ఆ తర్వాత వడకట్టి దానికి కొంచెం నిమ్మకాయ రసం జోడించి సేవించాలి. ఇది గోరువెచ్చగా ఉన్నప్పుడే తీసుకోవాలి. ఇలా 14 రోజుల చేసి చూస్తే..తప్పక మంచి ఫలితాన్ని అందుకుంటామని చెబుతున్నారు ఫిట్నెస్ కోచ్ నేహా.కలిగే లాభాలు..నేహా ప్రకారం,కొలెస్ట్రాల్ని ఎలా కరిగిస్తుందంటే..జీర్ణక్రియను మెరుగ్గా ఉంచుతుంది, కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుందిఅదనపు నీటి నిలుపుదలను బయటకు పంపిచేయడంలో సహాయపడుతుందిఇన్సులిన్ పనితీరు మెరుగవుతుంది. జీవక్రియ పనితీరుని మెరుగ్గా ఉంచుతుందిపేగు మంటను శాంతపరుస్తుందిచెడుకొలెస్ట్రాల్ని బయటకు పంపించేస్తుందిచివరగా ఈ పానీయం బరువు తగ్గేలా చేయదు, మన శరీర వ్యవస్థకు మద్దతు ఇచ్చి..ఆయా వ్యవస్థల పనితీరుని సమర్థవంతంగా ఉంచి..బరువుతగ్గేందుకు దారితీస్తుందని చెబుతోంది నేహా. దీంతోపాటు సమతుల్య భోజనం, తేలికపాటి వ్యాయామాలు, వేళ్లకు నిద్ర తోడైతే బరువు తగ్గడం మరింత సులభమని చెబుతోంది ఫిట్నెస్ కోచ్ నేహా. ఈ చిన్నపాటి సాధారణ మార్పులు చోటుచేసుకుంటే సత్ఫలితాలను త్వరితగతిన పొందుగలమని చెప్పుకొచ్చింది.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణుల సూచనలు సలహాలు పాటించటం ఉత్తమం. View this post on Instagram A post shared by Neha Parihar (@growithneha) (చదవండి: సల్మాన్ ఖాన్ ఐకానిక్ ఫిరోజా బ్రాస్లెట్ వెనుక ఇంట్రస్టింగ్ స్టోరీ ఇదే..! అంత ఖరీదా..?) -
హీరో మహేశ్ నేర్చుకుంటున్న కలరిపయట్టుతో..ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా!
వారణాసి’మూవీతో ప్రేక్షకుల ముందుకురానున్నారు హీరో మహేశ్ బాబు. ఆ మూవీ కోసం ప్రాచీన భారత యుద్ధ కళ కలరిపయట్టు (Kalarippayattu) నేర్చుకున్నారు. ఆయనకు శిక్షణ ఇచ్చిన ట్రైనర్ పెట్టిన పోస్ట్తో ఈ విషయం బయటకు వచ్చింది. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో మహేశ్బాబు ‘రుద్ర’ పాత్రలో నటిస్తోన్న విషయం తెలిసిందే. ఈ పవర్ఫుల్ పాత్ర కోసం ఆయన కలరిపయట్టు నేర్చుకుంటున్నట్లు సమాచారం. ఇక కలరిపయట్టు ఇటీవల చాలామంది ప్రముఖులు, సెలబ్రిటీలు కూడా ఎంతో ఇష్టంతో నేర్చుకుంటున్నారు. ముఖ్యంగా ఫిట్నెస్ కోసం, మానసిక రుగ్మతల నుంచి బయటపడేందుకు దీన్ని నేర్చుకునేందుకు మక్కువ చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలేంటి కలరియపట్టు యుద్ధ కళ? ఇది ఫిట్నెస్కి ఎలా ఉపకరిస్తుంది సవివరంగా తెలుకుందాం.!.ఇంతకముందు ఈ కలరిపయట్టుని సైనా నెహ్వాల్ బయోగ్రఫీలో కథానాయకిగా తన నటనతో మెప్పించి తెలుగువారి అభిమానాన్నీ పొందిన బాలీవుడ్ నటి పరిణితిచోప్రా కూడా నేర్చుకున్నట్లు ఓ ఇంటర్వ్యూలో ఆమె స్వయంగా వెల్లడించారు కూడా. దీన్ని సాధన చేస్తే..బాడీ ఎంతో యాక్టివ్గా ఉన్నట్లు ఉంటుందని చెప్పుకొచ్చారామె. కలరిపయట్టు అంటే.కళరిపయట్టు లేదా కళరి అనేది కేరళ రాష్ట్రంలో ఆవిర్భవించిన ఒక ద్రవిడ యుద్ధ క్రీడ. దీన్ని ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన యుద్ధ క్రీడగా అభివర్ణిస్తారు. దీన్ని కేరళ, తమిళనాడు, శ్రీలంక, మలేషియాలో ఉండే మలయాళీలు తప్పక ప్రదర్శిస్తారట. కలరిపయట్టు శిక్షణలోని వేగవంతమైన కదలికలు ప్రతిచర్యలు, కంటి-చేతి ఏకీకరణ వంటివి ప్రాథమిక మోటార్ నైపుణ్యాలను మెరుగుపరుస్తాయి. అంతేగాదు మన శరీరం, మనస్సును అప్రమత్తంగా, చురుకుగా ఉంచుతాయి.ఎలా శిక్షణ ఇస్తారంటే..కలరి'గా పిలిచే ఒక ప్రత్యేక శిక్షణా స్థలంలో ఈ యుద్ధ కళ నేర్పుతారు. పోటీ పడుతున్న ప్రత్యర్థి కలరి అభ్యాసకుడికి కొత్త పోరాట కదలికలను నేర్పిస్తుంటాడు. శిక్షణ పొందే వ్యక్తి ఈ కొత్త విధానాలను గుర్తించి, వాటికి అనుగుణంగా ప్రతిఘటించే సామర్థ్యాన్ని పెంపొందించుకోవాల్సి ఉంటుంది. దీన్ని తమిళ రాజ్యాలతో యుద్ధాల చేసే సమయంలో మళయాళులు దీన్ని ఉపయోగించేవారని చరిత్రకారులు చెబుతున్నారు. ఆరోగ్య ప్రయోజనాలు..కలరిపయట్టు శిక్షణలో బలం, ఓర్పు ప్రాముఖ్యతను నేర్పిస్తుంది. ఇది శరరీ ధృడ్వత్వాన్ని పెంచుతుంది. హృదయనాళ ఆరోగ్యం మెరుగుపడుతుంది : ఇందులో వుండే వేగవంతమైన ఏరోబిక్ కదలికలు, శక్తివంతమైన దాడులు హృదయ స్పందన రేటును పెంచుతాయి. రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. ఊపిరితిత్తుల సామర్థ్యం మెరుగ్గా ఉంటుందిప్రాథమిక మోటారు వ్యవస్థకు సంబంధించిన డిజార్డర్తో బాధపడేవారికి, నరాల సమస్యలతో బాధపడేవారికి కలరిపయట్టుని నిపుణుల సమక్షంలో తర్ఫీదు పొందితే మంచి ఫలితం ఉంటుందట. అలా పలువురి విషయంలో నిరూపితమైందట కూడా. అంతేగాదు ఈ ప్రాచీన యుద్ధ విద్య పనిలో ఏకాగ్రత, నైపుణ్యాన్ని మెరుగుపరుస్తుందట. ఇంకెందుకు ఆలస్యం ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న కలరియపట్టుని నేర్చుకుని..ఆరోగ్యకరమైన జీవితాన్ని పొందుదాం. View this post on Instagram A post shared by kalari Hyderabad (@a_martialarts_space) (చదవండి: పదేళ్లుగా బాధపడ్డ ఆ వ్యాధితో..!భారత్ ఆరోగ్య సంరక్షణపై ఎన్నారై ప్రశంసల జల్లు) -
పదేళ్లుగా బాధపడ్డ ఆ వ్యాధితో..! హాట్టాపిక్గా భారత సంతతి వ్యక్తి పోస్ట్
భారత ఆరోగ్య రక్షణ వ్యవస్థపై ఓ ఎన్నారై ప్రశంసల జల్లు కురింపించాడు. తాను అమెరికాలో ఆ వ్యాధి కోసం చాలా డబ్బులు ఖర్చుపెట్టానని, కానీ నయం కాలేదని వాపోయాడు. పదేళ్లుకు పైగా ఆ వ్యాధితో నరకం చూశానని..కానీ తన మాతృభూమిలో సులభంగా నయమైపోయిందంటూ భారత చికిత్స విధానాన్ని మెచ్చుకుంటూ చేసిన పోస్ట్ నెట్టింట వైరల్గా మారడమే గాకా ఆ అంశం హాట్టాపిక్గా మారింది. అంతేగాదు భారతదేశంలో అభివృద్ధి చెందుతున్న ఆధునిక వైద్య విధానంపై చర్చలకు తెరలేపింది కూడా. ఎవరా ఆ ఎన్నారై?, ఏమా కథ చూద్దామా..అమెరికాలో స్టాప్ డేటా సైంటిస్ట్గా పనిచేస్తున్న ఓ ఎన్నారై ఓ వ్యాధి విషయంలో అమెరికాలో తాను ఎదుర్కొన్న అనుభవాన్ని రెడ్డిట్లో షేర్ చేసుకున్నాడు. ఆ పోస్ట్లో ఆ ఎన్నారై ఇలా రాసుకొచ్చాడు. "నేను అమెరికాలో పదేళ్లకు పైగా ఉన్నాను. అక్కడే తన చదువు, కెరీర్ అద్భుతం సాగింది. కానీ ఇంటిని, ఫ్యామిలీని బాగా మిస్ అయ్యా. అయితే అక్కడ సైంటిస్ట్గా పనిచేస్తున్నప్పుడు 2017లో స్కిజోఆఫెక్టివ్ డిజార్డర్ అనే మానసిక సమస్యతో బాధపడ్డాను. దీనివల్ల రోగులు నమ్మశక్యం కానీ బ్రాంతులకు గురై ఉద్యోగ కెరీర్, వ్యక్తిగత సంబంధాలు ఇబ్బందిగా మారపోతుంటాయి. ఈ మానసిక రోగంతో చాలా ఇబ్బంది పడ్డ. అందుకోసం అమెరికాలో చికిత్స కూడా తీసుకున్నా. అయితే అక్కడ అమెరికా డాక్టర్లు తనను డబ్బులు ఇచ్చే యంత్రంలా చూశారే గానీ, సరైన విధంగా చికిత్స చేయడంలో విఫలమయ్యారు. చాలా డబ్బు ఖర్చే చేశాను, ఏకంగా పదేళ్లకుపైగా బాధపడ్డను. కానీ, ఆ సమస్య నుంచి భయటపడింది కూడా లేదు. అయితే తనకు అక్కడ వైద్యులు ఆందోళన వల్ల ఈ సమస్య వస్తుందని, దాన్నితగ్గించుకునే ప్రయత్నంచేయమని సూచించేవారు, అందుకు సంబంధించి మందులే ఇచ్చారు. అంతేగాదు దీన్ని అధిగమించగలమే కానీ, నయం కాదని కూడా తేల్చి చెప్పారు. అయితే తాను మరో డాక్టర్ని సంప్రదించి సలహా తీసుకోవాలనే ఉద్దేశ్యంతో భారత్కి తిరిగి వచ్చి బెంగళూరులోని నిమ్హాన్స్లోని ప్రముఖ మానసిక వైద్యుడిని సంప్రదించాను. అక్కడ ఆ వైద్యలు ఆధ్వర్యంలో తీసుకున్న చికిత్స కారణంగా కాస్త రీలిఫ్ లభించడమే కాకుండా..చాలమటుకు క్యూర్ అయ్యింది. అంతేగాదు..ఈ మానసిక రుగ్మత నుంచి బయటపడ్డానని, కానీ ఆందోళన మాత్రం దరిచేరకుండా చూసుకోమని వైద్యులు సూచించారు అని "రాసుకొచ్చాడు". అందువల్లే తాను సాధ్యమైనంత తొందరలో భారత్కు వచ్చేసేలా ప్లాన్ చేసుకుంటున్నట్లు కూడా ఆ పోస్ట్లో పేర్కొన్నాడు. కాగా, నెటిజన్లు కూడా అతడి పోస్ట్తో ఏకభవిస్తూ..తాము కూడా అక్కడ ఉన్నప్పుడూ ఎదుర్కొన్న మానసిక సమస్యలను షేర్ చేసుకున్నారు. అంతేగాదు అక్కడ వాతావరణం కారణంగా రోగనిరోధక వ్యవస్థ సన్నగిల్లి మానసిక రుగ్మతలు బారినపడతామని అక్కడ వైద్యులు చెప్పారని మరికొందరూ పోస్ట్లు పెట్టడం గమనార్హం.(చదవండి: సంపాదన కంటే అదే అత్యంత ముఖ్యం! వైరల్గా ఎన్నారై పోస్ట్) -
ఇయర్ఫోన్ వాడకం ఇంత పరేషాన్ చేస్తుందా..?
హెడ్ఫోన్ ధరించడం కొందరికి ఫ్యాషన్ అయితే మరికొందరు ఏకాగ్రత, పనితీరు కోసం ఉపయోగిస్తుంటారు. ముఖ్యంగా చుట్టూ గందరగోళంగా ఉంటే..ఈ హెడ్ఫోన్లు ఎంతో హెల్ప్ అవుతాయి. అదీగాక సౌకర్యవంతమైన స్థాయిలో వాల్యూమ్ని ఎడ్జెస్ట్ చేసుకునే వెసులుబాటు కూడా ఉంటుంది. అయితే అవే హెడ్ఫోన్లు సుదీర్ఘకాలం లేదా గంటల తరబడి ఉపయోగిస్తే..చాలా ఆరోగ్య సమస్యలు ఫేస్ చేయక తప్పదని హెచ్చరిస్తున్నారు ..ఈఎన్టీ స్పెషలిస్ట్ డాక్టర్ జ్యోతిర్మయి హెగ్డే. మరి అవేంటో ఆయన మాటల్లోనే సవివరంగా తెలుసుకుందామా..!.వినికిడి నష్టం (NIHL)అధిక వాల్యూమ్లో ఎక్కువ సేపు హెడ్ఫోన్స్ పెట్టుకుని వింటే వినికిడి సమస్య వచ్చే ప్రమాదం ఎక్కువవుతుంది పరిశోధనలు చెబుతున్నాయి. గంటల తరబడి వినయోగించకపోవటమే మేలని చెబుతున్నారు.టిన్నిటస్ఇలా ఎక్కువసేపు హెడ్ఫోన్ ఉపయోగించడం వల్ల చెవులో వింత వింత శబ్దాలు వినిపించే టిన్నిటిస్ లక్షణాలు ఎదుర్కొనాల్సి వస్తుందట.అలసటకు గురవ్వడంఎక్కువసేపు హెడ్ఫోన్ ఉపయోగించడం వల్ల చెవి, మెదడు అలసటకు గురై..దృష్టి కేంద్రీకరించడం, లేదా ప్రసంగించడంలో సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉంటుందట. ఇది వైద్య పరమైన రుగ్మత కానప్పటికీ..ప్రభావం మాత్రం తారాస్థాయిలో ఉంటుందంటున్నారు.మిగతా శబ్దాలపై అవగాహన లోపం..అదేపనిగా హెడ్ఫోన్స్ ఉపయోగించటం వల్ల ఆ శబ్దాలకే అలవాటుపడి చుట్టుపక్కల పరిసరాల శబ్దాలను గ్రహించలేని పరిస్థితి ఎదురవ్వుతుందని ఆడియాలజిస్టులు హెచ్చరిస్తున్నారు. మతిమరుపు వచ్చే అవకాశంఅతిగా ఇయర్ ఫోన్స్ ఉపయోగించే వారిలో శ్రద్ధ లోపించి..జ్ఞాపకశక్తిని కోల్పోయే ప్రమాదం ఉందని పలు అధ్యయనాల్లో తేలిందని హెచ్చరిస్తున్నారు.సురక్షితంగా ఎలా ఉపయోగించాలంటే..ఇయర్ ఫోన్ని సురక్షితమైన పద్ధతిలో వాడుకుంటూ..వినికిడి, జ్ఞాపకశక్తిని కోల్పోయే సమస్యల బారిన పడకూడదంటే ఈ సింపుల్ చిట్కాలు అనుసరిస్తే చాలట.తక్కువ వాల్యూమ్తో వినడం.తప్పనిసరి అయితే తప్ప.. హెడ్ఫోన్ వినియోగాన్ని పరిమితంగా ఉపయోగించేలా చూడటం. సరైన హెడ్ఫోన్స్ని ఉపయోగించి..వాల్యూమ్ నేరుగా చెవిలోకి చొచ్చుకుపోనివ్వని సురక్షితమైనవి వాడటం మేలుఅంతేగాదు వినికిడి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయో లేదో గమనించుకోవడంచివరగా ఏ వస్తువైనా సరైన మార్గంలో పరిమితంగా వినియోగిస్తే ఎలాంటి సమస్యలు దరిచేరవు..పైగా మంచి ఆరోగ్యవంతమైన జీవితాన్ని బేషుగ్గా లీడ్ చేయగలుగుతామని చెబుతున్నారు ఈఎన్టీ నిపుణులు డాక్టర్ జ్యోతిర్మయి. --డాక్టర్ జ్యోతిర్మయ్ ఎస్ హెగ్డే, ఈఎన్టి స్పెషలిస్ట్, ఆస్టర్ వైట్ఫీల్డ్ ఆస్పత్రి (చదవండి: Travel Trends 2026: కొత్త ఏడాది టాప్-10 ప్రదేశాలు ఏవంటే..?) -
చలికాలం... ఫుడ్ విషయంలో జాగ్రత్త!
గజగజలాడించే చలికాలంలో... ఎప్పుడూ వేడివేడిగా, మసాలాలు బాగా దట్టించిన ఫుడ్ తినాలని అనిపిస్తూంటుంది. చలి కాబట్టి దాహం కూడా అనిపించదు. చాలామంది వేడివేడి కాఫీ, టీలతోనే గడిపేస్తూంటారు. అయితే చలికాలంలో ఇలాంటి అలవాట్లు అస్సలు మంచివి కావంటున్నారు వైద్యులు. గరం గరం ఆహారం, కాఫీ, టీలు.. జిహ్వ రుచికి హాయినిచ్చినా.. ఆరోగ్యానికి మాత్రం అస్సలు సరిపడవని అంటున్నారు. అందుకే ఈ వింటర్ సీజన్లో ఫుడ్ విషయంలో ఈ పొరపాట్లు అస్సలు చేయొద్దని హెచ్చరిస్తున్నారు. మరి అవేంటో చూద్దామా..ఈ చలికాలంలో సమతుల్య ఆహారాన్నే తీసుకోవాలని సూచిస్తున్నారు పోషకాహార నిపుణులు. అంతేకాదు ఈ కాలంలో తీసుకునే ఆహారం, రోగనిరోధక వ్యవస్థను, జీర్ణక్రియ, చర్మపరిస్థితి, శక్తిస్థాయిలు, హార్మోన్ సమతుల్యతకు అనుగుణమైన పోషకవంతమైన ఆహారమే తీసుకోవాలని చెబుతున్నారు. తప్పనిసరిగా తినాల్సినవి..ఈ కాలంలో సూప్లు, కిచిడి, పప్పులు, తృణధాన్యాల గంజి, తదితరాలు శరీరాన్ని వెచ్చగా ఉండచడమే కాకుండా, తగిన ఫైబర్ కూడా పుష్కలంగా లభిస్తుందని అంటున్నారు. అల్లం, పసుపు, దాల్చిన చెక్క, జీలకర్ర వంటి సుగంధద్రవ్యాలు పోషకవిలువను తగ్గించవు, వణికించే చలిని తట్టుకునేందుకు ఉపకరిస్తాయి కూడా. చలికాలం అని చాలామంది పండ్లు, కూరగాయల వినియోగాన్ని పరిమితం చేస్తారు. ఇది మలబద్ధకం, పొట్ట ఉబ్బరం, పోషకాల కొరతకు దారితీస్తుందట. నిజానికి ఈ కాలంలో లభించే పళ్లను తీసుకోవడం మంచి ఫలితాలనిస్తుందటతేలికగా వేయించిన ఆకుకూరలు, కాల్చిన దుంపలు, పండ్లు తదితరాల్లో ఫైబర్లు, యాంటిఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. పైగా జీర్ణక్రియకు మద్దతిస్తాయి. అంతేకాకుండా ఈ కాలంలో సిట్రస్ పండ్లు, ఆపిల్స్, జామ వంటవి రోగనిరోధక వ్యవస్థను మెరుగ్గా ఉంచడంలో హెల్ప్ అవుతాయటఇక 30 ఏళ్ల దాటిన మహిళలు, పెద్దల్లో కండరాల అలసట, ఆకలి పెరగడం, జుట్టు రాలడం, జీర్ణక్రియ నెమ్మదించడం వంటి సమస్యలను ఎదుర్కొంటారు కాబట్టి తీసుకునే ఆహారం కచ్చింగా పోషకవంతమైనేద తీసుకుంటే మేలు. పప్పులు, పన్నీర్, గుడ్లు, టోఫు, పెరుగు, నట్స, చేపలు, లీన్ మాంసాలు తదితరాలు ఆరోగ్యానికి మంచివే కాకుండా పోషక స్థిరత్వాన్ని అందించి శరీరాన్ని వెచ్చగా ఉంచేలా చేస్తాయట. ఈ కాలంలో హైడ్రేషన్ సమస్య ఎక్కువగా ఉంటుందట. ఎందుకంటే ఈ కాలంలో దాహం వేయదు, అందులోనూ చలికాలం కావడంతో పరిమితంగానే నీటిని తీసుకుంటారు అందువల్ల ఈ సమస్య ఉత్ఫన్నమవుతుందని చెబుతున్నారు. ఈ సీజన్లో స్వీట్స్ ఎక్కువగా తినాలనిపిస్తుంటుంది. ఇది హార్మోన్ల అసమతుల్యతకు, మానసిక స్థితిపై గట్టి ప్రభావం చూపిస్తాయట. స్వీట్స్కి ప్రత్యామ్నాయంగా సహజంగా లభించే తియ్యటి పండ్లు, ఖర్జురం, బెల్లం లేదా డార్క్ చాక్లెట్లు తీసుకుంటే మేలుచాలామంది కొవ్వులను అనారోగ్యకమరని తప్పుగా అపోహపడుతుంటారు. అయితే వింటర్లో ఆరోగ్యకరమైన కొవ్వలు హార్మోన్ల ఉత్పత్తికి, చర్మపరిస్థితికి, శరీర ఉష్ణోగ్రత నియంత్రకు ముఖ్యమైనవట. ఈ సమయంలో నెయ్యి, ఆలివ్ నూనె, నట్స్, అవకాడోలు, కొవ్వుచేపలను పరిమిత క్వాంటిటీలో తీసుకుంటే మంచిదట. ఇవి కడుపు నిండిన అనుభూతిని ఇవ్వడమే కాకుండా, దీర్ఘకాలిక ఆరోగ్యానికి ఎంతో మంచివని చెబుతున్నారు పోషకాహార నిపుణులు.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పాటించే ముందు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం.(చదవండి: Best Brain Boosting Foods: బ్రెయిన్కు మేలు చేసే ఆహారాలు..!) -
డయాబెటిస్?... ఈ పరీక్షలు మేలు చేస్తాయి!
మీరు మధుమేహులా? రోజూ మాత్రలు లేదంటే ఇంజెక్షన్లు వేసుకుంటున్నారా. అయితే ఈ కథనం మీ కోసమే. మీలో కొన్ని విటమిన్, సూక్ష్మ పోషకాల లోపం ఉండవచ్చు. వాటిని సరిచేసుకుంటే రక్తంలో చక్కర మోతాదులు కూడా మెరుగు అవుతాయి అని బ్రిటిష్ మెడికల్ జర్నల్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇంతకీ ఏ విటమిన్లు తక్కువ ఉంటే గ్లూకోజ్ ఎక్కువ అవుతుంది? వాటికీ మధుమేహానికి సంబంధం ఏమిటీ?మన శరీరం ఒక సంక్లిష్ట యంత్రం అన్నది అందరికి తెలిసిన విషయమే. ఇది సక్రమంగా నడవాలంటే కనీసం 13 విటమిన్లు, మరెన్నో సూక్ష్మ పోషకాలు అవసరం. ఇవన్నీ మనం తినే ఆహారం ద్వారా లభించడం కష్టం. పైగా వయసు పెరిగే కొద్దీ తిన్న ఆహారం నుంచి విటమిన్లు, పోషకాలను శోషించుకోవడం కూడా కష్టం అవుతుంది. ఈ సమస్యకు మరికొన్ని కారణాలు కూడా చేరడం వల్ల మనం వ్యాధుల బారిన పడుతూంటాము. మధుమేహం విషయానికి వస్తే... ఈ వ్యాధి బారిన పడ్డ వారు ఆధికుల్లో విటమిన్ డి, బీ 12 లు తక్కువగా ఉంటాయి అని శాస్త్రవేత్తలు గుర్తించారు. కొంచెం కచ్చితంగా చెప్పాలంటే 60 శతం మధుమేహుల్లో విటమిన్ డి తక్కువగా ఉంటుంది. అలాగే 29 శతం మంది ఆంటే నలుగురిలో ఒకరికి ఉండాల్సినంత బీ 12 ఉండదని పరిశోధనలు చెబుతున్నాయి. అంతే కాదు. 42 శాతం మధుమేహుల్లో మెగ్నీషియం లోపం ఉంటె 28 శాతం మందిలో ఐరన్ తక్కువగా ఉంటోంది. క్రోమియం, జింక్ లు కూడా తక్కువగా ఉంటాయని గుర్తించారు. ఈ లోపాలను సరిదిద్దుకుంటే మధుమేహం కూడా కంట్రోల్ లూకి వచ్చే అవకాశం ఉంటుంది.ఒక్కో దానిది ఒక్కో పాత్ర...విటమిన్ డి, బీ 12, మెగ్నీషియం, ఐరన్, జింక్, క్రోమియం లు మధుమేహ నియంత్రణలో తమదైన పాత్ర పోషిస్తాయి. విటమిన్ డి విషయం తీసుకుందాం. ఇన్సులిన్ మెరుగ్గా పని చేసేందుకు, సరిగ్గా స్రవించేందుకు అవసరం. తక్కువ అయితే హెచ్ బీ 1ఏసీ ఎక్కువ అవుతుంది. నరాలు బాగా పని చేసేందుకు కావాల్సిన బీ 12 తక్కువ అయినా పరోక్షంగా మధుమేహాన్ని ప్రభావితం చేస్తుంది.రెండు పద్ధతులు..విటమిన్, పోషక లోపాలను సరిదిద్దుకునేందుకు రెండు పద్ధతులు ఉన్నాయి. మొదటిది.. ఆకుకూరలు, నట్స్ (వేరుశెనగలు, కాజు, బాదాం, పప్పులు వంటివి) గుమ్మడి, దోస లేదా ఇతర విత్తనాలు తీసుకోవడం. సహజ సిద్దమైన పద్దతి. కుదరదు, వయసు, ఇతర ఆరోగ్య సమస్యలు ఉంటే ఈ విటమిన్లు, పోషకాల మాత్రలు తీసుకోవాలి. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఏ రకమైన మాత్రా అయినా సరే డాక్టర్ సలహా మేరకే తీసుకోవాలి. మధుమేహుల విషయంలో ఇది మరీ ముఖ్యం. అన్నింటి కంటే ముందు.. మీరు విటమిన్, పోషకాల లోపాలను గుర్తించేందుకు పరీక్షలు చేసుకోవాలి. లోపాలను గుర్తిస్తే వాటిని సప్లిమెంట్ల ద్వారా భర్తీ చేసుకుంటే మధుమేహం నియంత్రణలోకి వచ్చే అవకాశాలు మెరుగవుతాయి. వైద్యుల సలహా, సూచనల మేరకు ఒకసారి ప్రయత్నించి చూడండి. -
బ్రెయిన్కు మేలు చేసే ఆహారాలు..!
మెదడు ఎంతటి కీలకమైనదంటే... మన శరీరం బరువులో దాని బరువు కేవలం 2 శాతం మాత్రమే. కానీ మొత్తం దేహానికి అందే ఆక్సిజన్లో 20 శాతం దానికే కావాలి. దేహం మొత్తం వినియోగించే శక్తిలో 20 శాతం దానికే చెందాలి. ఇక అదెంతటి అద్భుతమో చూద్దాం... దాదాపు 1.3 కిలోల నుంచి 1.4 కిలోల బరువుండే మెదడులో 85 శాతం నీళ్లే. అన్నీ కొవ్వు కణాలే. అంటే మెదడు కణాలన్నీ కొవ్వుతో నిర్మితమైనవే. కొవ్వు లేకపోతే మెదడే లేదు. అంటే... శరీరంలోని 25 శాతం కొలెస్ట్రాల్ మెదడులోనే ఉంటుంది. మన ఆలోచనలకూ, పనులకూ, తెలివితేటలకూ అదే మూలం. కొన్ని రకాల ఆహారాలు తీసుకుంటే అది మందకొడిగానూ, మరికొన్ని ఆహారాలతో అది చురుగ్గానూ ఉంటుంది. అది చురుగ్గా పనిచేయడానికి ఎలాంటి ఆహారం కావాలో తెలిపే కథనం.మెదడుకు హాని చేసే ఆహారాలునిల్వ ఉంచిన ఉప్పు కలిపిన పదార్థాలైన చిప్స్, టిన్న్డ్ సూప్స్తోపాటు ప్రిజర్వేటివ్స్ కలిపిన ఆహార పదార్థాలు మెదడుకు హానికరం. కాబట్టి వాటిని చాలా పరిమితంగా తీసుకోవాలి. మనం తీసుకునే ఉప్పు రోజుకు 6 గ్రాములకు మించితే అది ఆరోగ్యానికే కాదు... మెదడుకూ చేటు చేస్తుంది. కొవ్వుల్లో డాల్డా వంటి ట్రాన్స్ఫ్యాట్స్, అలాగే మాంసాహారంలో ఉండే కొవ్వులు మెదడుకు అంత మంచిది కాదు. అందుకే మాంసాహారం (Non Veg) తినేవారు కొవ్వు తక్కువగా ఉండే చికెన్, చేపలే తీసుకోవాలి. బటర్, క్రీమ్ వంటి కొవ్వులనూ చాలా పరిమితంగానే (అరుదుగా కేవలం రుచి కోసమే) వాడాలి. ఆల్కహాల్ మెదడుకు హాని చేస్తుంది. ఇది తీసుకున్నప్పుడు తక్షణ ప్రభావంగా మెదడు స్తబ్ధుగా ఉంచుతుంది. ఇక దీర్ఘకాలంలో డిమెన్షియా (మతిమరపు) వంటి మెదడు సమస్యలకు దారి తీస్తుంది. కాబట్టి దీన్ని పూర్తిగా మానేయాలి. అలాగే మెదడును ఉత్తేజపరచడానికి తాగే సిగరెట్ లాంటి పొగతాగే అలవాటు కూడా దీర్ఘకాలంలో మెదడు పనితీరును మందకొడిగా మారుస్తుంది. మెదడుకు అందే ఆక్సిజన్ మోతాదులనూ తగ్గిస్తుంది. అందుకే మెదడు చురుగ్గా పనిచేయాలనీ, మెదడుకు సంబంధించిన అల్జైమర్స్ వంటి జబ్బులు నివారించడానికి మద్యం, పొగతాగడం వంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి.ఈలోకంలోని జీవులన్నింటిలోకెల్లా అత్యంత తెలివైన మెదడు మానవులని పిలుచుకునే మన హోమో సేపియన్ జీవులదే. ఈ మొత్తం కాస్మోస్లో ఇంకా తెలివిగల జీవం ఇంకెక్కడుందో ఇప్పటికీ తెలియదు కాబట్టి... ప్రస్తుతానికి ఈ సమస్త విశ్వంలో ఇంతటి సంక్లిష్టమైన మెదడు, అత్యంత అద్భుతమైన మెదడు మానవులది మాత్రమే. అందులో ఎన్ని కణాలు ఉన్నాయనేదానికి నిర్దిష్టమైన లెక్క లేదు. కానీ దాదాపు 1,000 కోట్ల కణాలు ఉన్నాయని ఒక అంచనా. ప్రతి కణాన్నీ న్యూరాన్ అంటారు. ఒక్కో కణం 40,000 ఇతర కణాలతో అనుసంధానితమై ఉంటుంది. ఇలా అనుసంధానితమై ఉండటాన్ని ‘సైనాప్స్’ అంటారు. కేవలం ఇసుక రేణువంత భాగంలో కనీసం లక్ష న్యూరాన్లు, పొరుగు కణాలతో అనుసంధానితమైన ఉన్న కనెక్షన్లు 100 కోట్ల వరకు ఉన్నందువల్లనే బహుశా ఇంతటి సంక్లిష్టమైన నిర్మాణం విశ్వంలోనే మరొకటి లేదనేది ఒక భావన.ఎదుగుదలలోనే అద్భుతాలు..తల్లికడుపులో బిడ్డ ఉండగానే మెదడు ప్రతి నిమిషానికీ 2,50,000 కొత్త కణాలు పుడుతూ ఉంటాయి. ఇలా ఆ బిడ్డ.. ఈ లోకాన్ని చూసే నాటికి అతడు 1000 కోట్ల కణాలతో పుడతాడు. పన్నెండు నెలల వయసప్పుడు తీసిన మెదడు స్కాన్, దాదాపు యుక్తవయసులో ఉన్నప్పటి మెదడు స్కాన్ దాదాపు ఒకేలా ఉంటాయి. కాక΄ోతే ట్రిలియన్ల కొద్దీ సైనాప్స్లు ఏర్పడుతూ ఉంటాయి. పదేళ్ల వయసు నుంచి చాలా వేగంగా సామాజిక, ఉద్వేగపూరితమైన, బుద్ధికి సంబంధించిన ఎదుగుదల జరుగుతుంది. మనం ఏయే అంశాలపై దృష్టి పెడతామో అవి పెరగడం, దృష్టి పెట్టని అంశాలు తగ్గడం జరుగుతాయి. ‘దీన్నే యూజ్ ఇట్... ఆర్ లూజ్ ఇట్’గా పేర్కొంటారు. మనకు ఆనందం ఇచ్చే అంశాలనూ ఈ సమయంలోనే అభివృద్ధి చేసుకుంటాం. దాదాపు 18 నుంచి 20 ఏళ్ల వయసు వచ్చేనాటికి మన వికాసం దాదాపుగా పూర్తవుతుంది. ఈ వికాస క్రమంలోనూ, అటు తర్వాత మెదడు బాగా చురుగ్గా పనిచేయడానికి కొన్ని ఆహారాలు దోహదపడుతుంటాయి. మెదడు చురుగ్గా ఉండటానికి, చాలాకాలం పాటు దాని ఆరోగ్యం చక్కగా ఉంచడానికి తీసుకోవాల్సిన ఆహారపదార్థాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.పిండదశలో... పిండ దశ నుంచీ మెదడు ఎదుగుదలకు ఉపయోగపడే కీలకమైన పోషకమే ‘ఫోలిక్ యాసిడ్’. అందుకే ఓ మహిళ గర్భం దాల్చగానే లేదా దంపతులు ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేసుకుంటూ ఉన్నప్పుడు గర్భం దాల్చకముందు నుంచే మహిళలకు ‘ఫోలిక్ యాసిడ్’ పోషకాన్ని డాక్టర్లు సిఫార్సు చేస్తుంటారు. ఈ ఫోలిక్ యాసిడ్ పోషకం మహిళ గర్భవతిగా ఉన్నప్పట్నుంచే మెదడు తాలూకు మంచి ఎదుగుదలకూ, పిండంలో న్యూరల్ ట్యూబ్కు సంబంధించిన సమస్యల నివారణకూ తోడ్పడుతుంటుంది. ఫోలిక్ యాసిడ్ అనే ఈ పోషకం అన్ని రకాల ఆకుకూరల్లోనూ పుష్కలంగా ఉంటుంది. ఫోలియేజ్ అంటే ఆకులు. అందుకే పాలకూర వంటి అన్ని ఆకుకూరల్లో సమృద్ధిగా లభ్యమవుతుంది కాబట్టే దీనికి ‘ఫోలిక్ యాసిడ్’ అని పేరు.బిడ్డ పుట్టాక...ఇక బిడ్డ పుట్టి నేల మీద పడ్డాక... ఆ చిన్నారి మెదడు ఆరోగ్యంగా ఎదగాడానికి అవసరమైనది ‘డొకోజా హెగ్జాయినోయిక్ యాసిడ్’ (సంక్షిప్తంగా ‘డీహెచ్ఏ’) అనే మరో రకం పోషకం అవసరం. ఇది ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్లో ఒక రకం. ఈ పోషకం తల్లిసాలలో సమృద్ధిగా లభిస్తుంది. బిడ్డలు పెరిగి పెద్దయ్యా వారికి ఇదే పోషకం కావాలంటే చేపల్లో సమృద్ధిగా దొరుకుతుంది. ఇక బిడ్డల పెరుగుదల తర్వాత, వారు యుక్తవయస్కులుగా మారాక... అటు పిమ్మట కూడా ఆ మెదడు ఆరోగ్యం సక్రమంగా నిర్వహితం కావాలంటే అవసరమైన పోషకాలు ఇవి...సంక్లిష్టమైన పిండిపదార్థాలు(కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్)...మెదడు చురుగ్గానూ, అలాగే సక్రమంగానూ పనిచేస్తూ... అది చేసే పనిలో సునిశితత్వం, వేగం, చురుకుదనం ఉండాలంటే ముందుగా మొత్తం శరీరానికి శరీరం తీసుకునే శక్తిలో 15 శాతం దానికే కావాలి. అంటే మొత్తం శరీరానికి శక్తినిచ్చే గ్లూకోజ్లో 15 శాతానికి తగ్గకుండా మెదడుకు సమృద్ధిగా అందుతూ ఉండాలి. అందుకోసం... ఆ శక్తిని సమకూర్చేందుకు తీసుకోవాల్సిన ఆహార పదార్థాల్లో మొదటివి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్. మనకివి పొట్టు తీయని కాయధాన్యాల నుంచి లభ్యమవుతాయి. ఉదాహరణకు దంపుడు బియ్యం లేదా ముడిబియ్యం, పొట్టుతీయకుండా పిండి పట్టించిన గోధుమలు మొదలుకొని పొట్టు తీయని అనేక ముడిధాన్యాల నుంచి ఈ కాంప్లెక్స్ కార్బోహేడ్రేట్లు అందుతాయి. శక్తి కోసం మనం తీసుకోదగ్గ వాటిలో ఇవి ప్రధానమైనవి. పొట్టుతీయకపోవడం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటంటే... పొట్టుతీసిన ఆహారం నుంచి దొరికే గ్లూకోజ్ దేహంలోకి చేరగానే తక్షణం వినియోగితమై΄ోతుంది. ఆ తర్వాత వెంటనే మళ్లీ గ్లూకోజ్ (Glucose) అవసరమవుతుంది. కానీ పొట్టుతీయని ఆహారం ద్వారా అందిన గ్లూకోజ్ ఒక క్రమమైన పద్ధతిలో చాలాసేపు పాటు మెదడుకు అందుతూ ఉంటుంది.అత్యవసరమైన కొవ్వులు (ఎసెన్షియల్ ఫ్యాటీ ఆసిడ్స్ )...మెదడు చురుగ్గా పనిచేయడానికి అవసరమయ్యే అత్యంత కీలకమైన కొవ్వు పదార్థాలు ఇవి. అందుకే మెదడుకు అవసరమైన ఈ కొవ్వులను ‘ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్’ (ఈఎఫ్ఏ) అంటారు. ఇవే ప్రధాన ఒమెగా –3 ఫ్యాటీ యాసిడ్ అయిన అల్ఫా లినోలినిక్ యాసిడ్ (ఏఎల్ఏ), ఇకోజా పెంటాయినిక్ యాసిడ్ (ఈపీఏ), డొకాజో హెగ్జాయినిక్ యాసిడ్ (డీహెచ్ఏ) వంటివి. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిందేమిటంటే... మెదడు కణాలన్నీ కేవలం కొవ్వు కణాలే. ఒకరకంగా చూస్తే... మెదడు బరువులో 60 శాతం పూర్తిగా కొవ్వే. ఇక మిగతా దానిలోనూ మరో 20 శాతం ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ను నుంచి తయారైన పదార్థాలే. ఈ ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ను దేహం తనంతట తాను తయారు చేసుకోలేదు. కాబట్టి వాటిని ఆహారం నుంచి తీసుకోవాలి. ఆ ఎనెన్షియల్ కొవ్వుల సాయంతోనే మెదడుకు అవసరమైన కీలక కొవ్వు కణాల మెయింటెనెన్స్ జరుగుతూ ఉంటుంది.ఎసెన్షియల్ ఫ్యాటీ ఆసిడ్స్ అంటే... మనం తీసుకునే ఆహారంలో ఒమెగా 3 ఫ్యాటీ ఆసిడ్స్, ఒమెగా 6 ఫ్యాటీ ఆసిడ్స్ వంటి వాటితో పాటు మరికొన్ని పోషకాలను ఎసెన్షియల్ ఫ్యాటీ ఆసిడ్స్ అనుకోవచ్చు. అవి మనకు చేపలు, ముఖ్యంగా సాల్మన్, మెకరెల్స్, సార్డిన్ వంటి చేపల నుంచి... ఇంకా గుడ్లు, నట్స్, అవిశెనూనె నుంచి లభ్యమవుతాయి.మెదడుకు మేలు చేయని కొవ్వులు...మెదడు సక్రమంగా చురుగ్గా పనిచేయడానికి కొవ్వులు కావలసినా, మళ్లీ అన్ని రకాల కొవ్వులూ మెదడుకు మంచి చేయవు. కొన్ని కొవ్వులు దాన్ని మందకొడిగా మారుస్తాయి. అవి ఏవంటే... ట్రాన్స్ఫ్యాట్స్ అని పిలిచే హైడ్రోజనేటెడ్ కొవ్వులు. ఇవి మెదడు ఆరోగ్యానికి అంత మంచిది కాదు. అవి మెదడు చురుగ్గా పనిచేయడానికి అవసరమైన ఎసెన్షియల్ ఫ్యాటీ ఆసిడ్స్ను అడ్డుకుంటాయి. తేలిగ్గా అర్థమయ్యేలా చెప్పుకోవాలంటే... ఈ హైడ్రోజనేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ కృత్రిమ నెయ్యిలో (వనస్పతిలో) ఎక్కువగా ఉంటాయి. వీటితో తయారు చేసే కేక్లు, బిస్కెట్, తీపి పదార్థాలు మెదడును చురుగ్గా ఉంచలేవు. అవి మెదడును కాస్త మందకొడిగా చేయడంతోపాటు ఆరోగ్యానికీ అంతగా మేలు చేయవు. అందుకే చాలా పాశ్చాత్య దేశాల్లో ఈ ట్రాన్స్ఫ్యాట్స్ను నిషేధించారు.తినుబండారాలు కొంటున్నారా... తస్మాత్ జాగ్రత్త...మనం మార్కెట్లో కొనే తినుబండారాల ప్యాకెట్లపై ఉండే పదార్థాల జాబితాను తప్పక పరిశీలించాలి. ఒకవేళ అందులో హైడ్రేజనేటెడ్ ఫ్యాట్స్/ఆయిల్స్ ఉంటే వాటిని కేవలం రుచికోసం పరిమితంగానే తీసుకోవాలి. అదికూడా అరుదుగానే ఎప్పుడైనా తీసుకోవడం మంచిది. మెదడుకు అవసరమైన కొవ్వులు (అసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్) కోసం చేపలు (Fishes) ఎక్కువగా తినడం అన్ని విధాలా మెదడుకు మేలు చేస్తుంది. ఎందుకంటే చేపల్లో మెదడును చురుగ్గా ఉంచడానికి అవసరమైన ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఒమెగా 6 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి.అమైనో యాసిడ్స్...మెదడులోని అనేక కణాల్లో ఒకదాని నుంచి మరోదానికి సమాచారం ఇచ్చిపుచ్చుకునేందుకు దోహదపడే అంశాలను న్యూరోట్రాన్స్మిటర్స్ అంటారు. ఈ న్యూరో ట్రాన్స్మిటర్స్ సహాయంతో సమాచారం తాలూకు ట్రాన్స్మిషన్ ఎంత వేగంగా జరిగితే మెదడు అంత చురుగ్గా పనిచేస్తుంది. ఇందుకు సహాయపడేవే ‘అమైనో ఆసిడ్స్’. ఇవి మనకు ప్రోటీన్స్ నుంచి లభ్యమవుతాయి.మన మూడ్స్ కూడా న్యూరో ట్రాన్స్మిటర్స్పైనే...మనకు కలిగే రకరకాల మూడ్స్ కూడా ఈ న్యూరోట్రాన్స్మిటర్స్పైనే ఆధారపడి ఉంటాయి. ఉదాహరణకు మనకు హాయిగా, గాఢమైన నిద్ర పట్టాలంటే సెరటోనిన్ అనే జీవరసాయనం కావాలి. దానికి ట్రిప్టొఫాన్ అనే అమైనో యాసిడ్ అవసరం. ఈ ట్రిప్టొఫాన్లలో పుష్కలంగా ఉంటుంది. అందుకే మంచి నిద్రపట్టాలంటే నిద్రకు ఉపక్రమించేముందు గోరువెచ్చని పాలు తాగాలంటూ డాక్టర్లు సూచిస్తుంటారు.విటమిన్లు / మినరల్స్ (ఖనిజలవణాలు)... మెదడు పనితీరు బాగా చురుగ్గా కొనసాగడానికి అవసరమైన పోషకాల్లో అత్యంత ముఖ్యమైనవి విటమిన్లు, ఖనిజలవణాలు చాలా ప్రధానమైనవి. ఇవి అమైనో యాసిడ్స్ను న్యూరోట్రాన్స్మిటర్లుగా మార్చడంలోనూ, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లను గ్లూకోజ్లో మార్చడంలోనూ తోడ్పడతాయి. మెదడు చురుకుదనానికి విటమిన్ బీ–కాంప్లెక్స్లోని బి–1, బి–6, బి–12 ప్రధానంగా అవసరమైవుతాయి. మళ్లీ వీటిన్నింటోనూ విటమిన్ బి–12 ఇంకా కీలకం. ఈ విటమిన్లు తాజా కూరగాయల్లో, ముదురాకుపచ్చటి ఆకుకూరల్లో, పాలలో సమృద్ధిగా దొరుకుతాయి. అయితే వీటన్నింటిలోనూ మెదడు చురుకుదనానికి దోహదం చేసే బి–12 మాంసాహారంలోనే ఎక్కువ. అందుకే... ఇటీవల చాలామంది స్ట్రిక్ట్ వెజిటేరియన్స్ (వీగన్స్)లోనూ, ఎండ అంతగా సోకనివారిలో (ఎండకు ఎక్కువగా ఎక్స్΄ోజ్ కానివారిలో) విటమిన్ ‘డి’.. ఈ రెండు రకాల విటమిన్ల లోపం కారణంగా వాళ్లలో మెదడు చురుగ్గా పనిచేయని స్థితి ఏర్పడుతుంది. ఈ పరిస్థితి కారణంగా ఒక్కోసారి వారు అకస్మాత్తుగా అపస్మారక స్థితిలోకి వెళ్లే ప్రమాదం ఎదురవుతుంది. ఇలా జరగడాన్ని వైద్య పరిభాషలో ‘సింకోప్’ / ‘సింకోపీ’ అంటారు ఇటీవల ఆధునిక జీవనశైలిలో భాగంగా ఇప్పుడీ కండిషన్ చాలామందిలో కనిపిస్తోంది. ఇలాంటివారంతా డాక్టర్ల సూచన మేరకు విటమిన్–డి సప్లిమెంట్లతోపాటు దేహంలో విటమిన్ బి–12 మోతాదులను పెంచే సప్లిమెంట్లను బయటి నుంచి తీసుకోవాలి. ఇక విటమిన్–ఈ కూడా మనలో విద్యలూ–నైపుణ్యాలు నేర్చుకునే ప్రక్రియను చురుగ్గా జరిగేలా చేస్తుంది.నీళ్లు...మెదడులోని ఘనపదార్థంలో చాలావరకు కొవ్వులే కాగా... ఇక మొత్తం మెదడులో 80 శాతం వరకు నీళ్లే ఉంటాయి. మెదడులోని న్యూరోట్రాన్స్మిటర్స్ చురుగ్గా పనిచేయడానికి నీళ్లు ఎక్కువ మోతాదులో తీసుకోవడం అవసరం. మనం మన మూత్రం రూపంలోనూ, అలాగే మనం ఊపిరి వదులుతున్నప్పుడు (ఉచ్ఛాస్వనిశ్వాసల్లో) రోజులో కనీసం 2.5 లీటర్ల నీటిని బయటకు విసర్జిస్తాం. ఇలా బయటకు పోయే నీటిని ఎప్పటికప్పుడు మళ్లీ భర్తీ చేసుకోవడం అవసరం. దీనికోసం అదేమొత్తంలో మళ్లీ నీటినీ తీసుకోవాలి. అనేక కారణాల వల్ల కొంతమంది నీళ్లు ఎక్కువగా తాగరు. ఎంతటి తక్కువ మోతాదులో నీళ్లు తాగేవారైనా రోజులో కనీసం 1.5 లీటర్లను తప్పక తీసుకోవాలి. (మిగతా నీళ్ల మోతాదు కాస్తా మనం రోజూ తీసుకునే ఘనాహారం నుంచి, మన శరీరంలో జరిగే జీవక్రియల్లో విడుదలయ్యే నీటి నుంచి భర్తీ అవుతుంటుంది. ఎవరిలోనైనా వారు రోజులో తీసుకునే నీళ్లు 1.5 లీటర్ల కంటే తగ్గాయంటే వాళ్ల మెదడు పనితీరులో చురుకుదనం ఎంతోకొంత తగ్గుతుందని గుర్తుంచుకోవాలి. ఆ మేరకు నీరు తగ్గిందంటే అది వాళ్ల వాళ్ల మూడ్స్పై కూడా ప్రభావం చూపేందుకు అవకాశాలు ఎక్కువ. అందుకే ప్రతిఒక్కరూ రోజూ 6–8 గ్లాసుల నీళ్లతో పాటు, పాలు, మజ్జిగ, పండ్లరసాలు, రాగిజావ, వంటివి తీసుకుంంటూ ఉండటం మంచిది. అప్పుడు... నీటితో పాటు తీసుకునే ఆ ద్రవాహారాలు మెదడును చురుగ్గా ఉంచడంలో సహాయపడతాయి. ఇక ద్రవాహారాల్లో టీ, కాఫీల వంటివి డీహైడ్రేషన్ను వేగవంతం చేస్తాయి. అంటే శరీరం నుంచి నీళ్లను తొలగించే పనిని చేస్తుంటాయి. అందుకే టీ, కాఫీలూ, కెఫిన్ ఉండే పానీయాలను చాలా పరిమితంగా (అంటే రోజుకు రెండు కప్పులకు మించకుండా) మాత్రమే తీసుకోవడం మంచిది. అంతకు మించితే ఆ పానీయాలు తొలుత మెదడును చురుగ్గా చేసినప్పటికీ... ఇలా వేగంగా పనిచేయించడం వల్ల మెదడు అంతే వేగంగా అలసిపోతుంది. చక్కెర కలిపిన పానీయాలు, కార్బొనేటెడ్ సాఫ్ట్డ్రింక్స్వల్ల కూడా ఇదే హాని జరుగుతుంది. మెదడుకి మేలు చేసే ఆహారాలు...మెదడు చురుగ్గా పనిచేయాలనుకుంటే మనం తీసుకునే ఆహారాల్లో ఈ కింద పేర్కొన్నవి సమృద్ధిగా ఉండేలా చూసుకోవాలి. ఆకుకూరలతోపాటు కూరగాయల్లో...పాలకూర మెదడును చురుగ్గా ఉంచుతుంది. ఇక బీట్రూట్, చిక్కుళ్లు వంటి వాటిల్లో ఉండే యాంటీ–ఆక్సిడెంట్స్ మెదడు కణాలను చాలాకాలం ΄ాటు ఆరోగ్యంగా ఉంచడంతో ΄ాటు అనేక వ్యాధులనుంచి రక్షణ కల్పిస్తాయి. వీటితో ΄ాటు చాకొలెట్, గ్రీన్ టీ కూడా మెదడుకు మేలు చేస్తాయి.చేపలు...పండుగప్ప / పండు చేప, వంజరం, కనగర్తలు (మాకరెల్), సాల్మన్, హెర్రింగ్ వంటి చేపల్లో మెదడు చురుకుదనానికి సహాయపడే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ.నూనెల్లో...మెదడు చురుకుదనానికి దోహదం చేసే నూనెల్లో ఆలివ్ ఆయిల్ చాలా మంచిది. ఇది రక్త΄ోటును కూడా తగ్గిస్తుంది. రక్తంలో కొలెస్ట్రాల్, కొవ్వులను అరికడుతుంది. కాబట్టి మెదడుకు వచ్చే పక్షవాతం (స్ట్రోక్), అలై్జమర్స్ వ్యాధులను ఆలివ్ ఆయిల్ కొంతమేరకు నివారిస్తుందని చెప్పవచ్చు.పండ్లు...మెదడుకు మేలు చేసే పండ్లలో బెర్రీ పండ్లు చాలా మంచివి. స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ, నేరేడు వంటివి మెదడుకు మేలు చేస్తాయి. - డాక్టర్ హరిత శ్యామ్ .బి, సీనియర్ డైటీషియన్ చదవండి: భాయిజాన్ సల్మాన్ఖాన్ ఫిట్నెస్ సీక్రెట్..! -
60లో కూడా సల్మాన్లా కండలు తిరిగిన బాడీ ఉండాలంటే...
బాలీవుడ్ ప్రముఖ నటుడు భాయిజాన్ సల్మాన్ఖాన్కి ఈ డిసెంబర్ 27కి 59 ఏళ్లు నిండనున్నాయి. ఇంకో ఆరు రోజుల్లో 60వ పుట్టిన రోజు జరుపుకునున్నారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో తన ఫోటోలను షేర్ చేస్తూ.. తాను అరవైవ దశకంలో కూడా ఇంతే యంగ్గా ఫిట్గా ఉండాలనుకుంటున్నా అంటూ పోస్టుపెట్టారు. అంతే ఒక్కసారిగా ఈ పోస్ట్ వైరల్గా మారడమే కాకుండా, 'మీరు ఫిట్నెస్ ఐకాన్' అంటూ ప్రశంసిస్తూ అభిమానులు పోస్టులు పెట్టారు. అంతలా ఆరు పదుల వయసులోనూ అలాంటి బాడీ మెయింటైన్ చేయాలంటే ఈ ఆరోగ్య సూత్రాలు ఫాలో అవ్వాల్సిందే అని చెబుతున్నారు నిపుణులు. అవేంటంటే..కండలు కలిగిన దేహధారుఢ్యం కోసం..ముందు నుంచి వ్యాయమాలు చేసే అలవాటు ఉంటే..మంచి ఫిట్నెస్ ట్రైనర్ సమక్షంలో కసరత్తులు ప్రారంభించాలి. క్రమంతప్పకుండా వర్కౌట్లు చేసేలా ప్లాన్ చేసుకోవాలి. ముఖ్యంగా కండలు తిరిగి దేహధారుడ్యం కోసం.. ట్రెడ్మిల్, క్రాస్ ట్రైనర్, సైక్లింగ్..లాంటి కార్డియో వ్యాయామాలు, వెయిట్ ట్రైనింగ్ కసరత్తులు, తదితరాలు తప్పనిసరి అని చెబుతున్నారు ఫిట్నెస్ నిపుణుల.అంతేగాదు ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం ఆరుపదుల వయసులోనూ యంగ్గా ఆరోగ్యంగా ఉండాలంటే.. వారానికి 150 నిమిషాల వ్యాయామం లేదా శారీరక శ్రమ చేయాలని నొక్కిచెప్పింది. అంతేగాదు ఏం చేయాలన్నా.. ఆరోగ్యం బాగుండాలన్న సూత్రం మరువకండి అంటున్నారు నిపుణులు.కనీసం జిమ్ వెళ్లని వాళ్లు ఓ ఇరవై నిమిషాలు నడిస్తే మంచిదని సూచించింది డబ్ల్యూహెచ్ఓ.డైట్ ఎలా ఉండాలంటే..ఉదయం: 5 ఎగ్వైట్స్, ఉడికించిన కూరగాయలు. పాల నుంచి తీసిన పెద్ద చెంచాడు వెన్న ప్రొటీన్. రెండుసార్లు రెండు రకాల పండ్లు. పది వేయించిన లేదా నానబెట్టిన బాదం పప్పులు.మధ్యాహ్నం: నూనె లేకుండా చేసిన 100 గ్రాముల చికెన్, కూరగాయలు, 50 గ్రాముల అన్నం, 150 గ్రాముల పండ్లు.రాత్రి: 100 గ్రాముల చికెన్ లేదా 150 గ్రాముల చేపలు, కూరగాయలు. వాటితోపాటు మూడు పూటలా కూరగాయలు, కీర దోస, పండ్లు ఎక్కువగా ఉండేలా చూసుకుంటే చాలట. అయితే ఇది వ్యక్తికి-వ్యక్తికి డైట్ మారిపోతుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. వ్యక్తిగత ఆరోగ్య సమస్యల దృష్ట్యా మార్పులు చేర్పులు ఉంటాయన్నారు. ఇది కేవలం ఆరోగ్యకరమైన వృధాప్యాన్ని ఆస్వాదించడం కోసం ఇచ్చిందే తప్ప అందరికీ సరిపడదని కూడా హెచ్చరించారు ఆరోగ్య నిపుణులు. View this post on Instagram A post shared by Salman Khan (@beingsalmankhan)గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పాటించే ముందు వ్యక్తిగత నిపుణులు లేదా వైద్యులను సంప్రదించడం ఉత్తమం.చదవండి: విండో క్లీనర్ నుంచి బిలియనీర్ రేంజ్కి..! ఆ ఉద్యోగాల వల్లే.. -
ఆత్మసాక్షాత్కారానికి ప్రాథమిక మార్గం క్రియాయోగం
హైదరాబాద్: ఏటా డిసెంబర్ 21వ తేదీని ప్రపంచ ధ్యాన దినోత్సవంగా జరుపుకోవాలని ఐక్యరాజ్యసమితి ప్రకటించినప్పటి నుంచి ప్రపంచ వ్యాప్తంగా ధ్యానంపై ఆసక్తి పెరుగుతోంది. ధ్యానాన్ని భగవంతుడ్ని చేరే మార్గంగా ఆధ్యాత్మికవేత్తలు నిర్వచిస్తుంటారు. ప్రతిరోజూ కొంచెం సమయమైనా ధ్యానంలో గడిపే సులభమైన అభ్యాసం ద్వారా మనం మన ప్రశాంతత స్థాయిలను, శారీరక ఆరోగ్యాన్ని గణనీయంగా మెరుగు పరుచుకోగలుగుతాం.పశ్చిమ దేశాలలో యోగ పితామహునిగా విస్తృతంగా గుర్తింపు పొందిన, ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొందిన "ఒక యోగి ఆత్మకథ" (Autobiography of a Yogi) గ్రంథ రచయిత అయిన పరమహంస యోగానంద, మానవులందరికీ ధ్యానం అత్యంత ప్రాముఖ్యత కలిగినదని నొక్కి చెప్పారు. క్రియాయోగం లాంటి శాస్త్రీయ ధ్యాన మార్గాన్ని అనుసరించడం వల్ల - ఉన్నత ఆత్మతో అనుసంధానం చెందుతాం. క్రియా యోగం ఒక సమగ్రమైన, వైజ్ఞానిక, సర్వవ్యాప్త పద్ధతి. ప్రతి వ్యక్తి సంపూర్ణ మానసిక శాంతిని పొందడం వైపు అభివృద్ధి సాధిస్తాడు. అంతే కాకుండా, క్రియాయోగ ధ్యాన పద్ధతి, దాని అనుబంధ పద్ధతులు శరీరం, మనస్సు, ఆత్మకు ఎంతో అవసరమైన పునరుజ్జీవనాన్ని అందిస్తాయి.'యోగ' అనే పదం వాస్తవానికి భగవంతునితో ఐక్యాన్ని సూచిస్తుంది. యోగ మార్గంలో ధ్యాన సాధన ఒక అంతర్భాగం. పరమహంస యోగానంద ద్వారా 1917లో స్థాపించబడిన యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా (వై.ఎస్.ఎస్.) , ఆ మహాగురువు ఉపదేశించిన క్రియాయోగ బోధనలను వ్యాప్తి చేస్తుంది. ఈ బోధనలు ఆత్మసాక్షాత్కారం అనే ఉన్నత లక్ష్యాన్ని సాధించడానికి ప్రాథమిక మార్గంగా క్రమం తప్పకుండా చేసే గాఢమైన ధ్యానానికి అత్యంత ప్రాధాన్యతను ఇస్తాయి.'ఒక యోగి ఆత్మకథ'లో, పరమహంస యోగానంద క్రియాయోగ ధ్యాన విజ్ఞానం అన్ని ఇతర ఆధ్యాత్మిక సాధనా పద్ధతుల కంటే ఉన్నతమైనదని, భక్తితో కూడినప్పుడు, అది అంతిమ లక్ష్యాన్ని సాధించడంలో ఖచ్చితంగా సఫలం అవుతుందని పేర్కొన్నారు! ధ్యానాన్ని తమ దైనందిన దినచర్యలలో చేర్చుకోవడంలో వాయిదా వేసేవారు వివిధ రకాల వృత్తినిపుణులు తీవ్రంగా పొరపాటుపడ్డారు. తీరిక లేని జీవితానికి, అనివార్యంగా దానితో పాటు వచ్చే ఒత్తిడులను మెరుగ్గా ఎదుర్కోవడానికి ధ్యాన సాధన మరింత అవసరం.హార్వర్డ్ విశ్వవిద్యాలయం అధ్యయనం ప్రకారం క్రమం తప్పకుండా ధ్యానం చేసే సీఈఓలు వారి వృత్తి జీవితంలో కూడా స్పష్టంగా మరింత విజయవంతంగా ఉంటారని వెల్లడించింది. ఆధునిక మనస్తత్వ సంపూర్ణ ఆరోగ్య నిపుణులు కూడా ఆరోగ్యకరమైన, సంతోషకరమైన, సంతృప్తికరమైన జీవితాలను గడపడానికి ధ్యానాన్ని ఒక అద్భుతమైన మార్గంగా ప్రతిపాదిస్తారు.ఇప్పటికే నిరంతర ఆధ్యాత్మిక సాధనను అత్యంత ప్రాధాన్యతగా ఎంచుకున్న వారికి, వారు గాఢంగా ధ్యానం చేయడానికి ఎంత ఎక్కువ సమయం కేటాయించగలిగితే అంత మంచిది. సంవత్సరాల తరబడి చేసే ధ్యానం ప్రతి మానవుడిని మరింత ఉల్లాసంగా, సమతుల్యంగా, సమర్థవంతంగా. శారీరకంగా కూడా ఆరోగ్యంగా మారుస్తుంది, ఇది నిశ్చయం.పరమహంస యోగానంద గుర్తుండి పోయేలా ఇలా అన్నారు, "ఇది వేచి ఉండగలదు, అది వేచి ఉండగలదు, కానీ భగవంతుని కోసం మీ అన్వేషణ ఆగకూడదు!" ఆ అన్వేషణను వేగవంతం చేసే మార్గం ధ్యానమే!పరమహంస యోగానందకు గురువైన స్వామి శ్రీయుక్తేశ్వర్ గిరిగా ప్రసిద్ధి చెందిన వారు, ఎంతో స్ఫూర్తిదాయకంగా ధ్యానం గురించి చెప్పారు: "మీరు ఇప్పుడు ఆధ్యాత్మిక ప్రయత్నం చేస్తే భవిష్యత్తులో ప్రతిదీ మెరుగుపడుతుంది" ఈ జీవితంలో శాశ్వత శాంతిని, ఆనందాన్ని మనం కనుగొనాలంటే ధ్యానం ఒక ఐచ్ఛిక కార్యం కాదని, అది మన జీవితాలలో తప్పనిసరి చర్య అని ప్రపంచ ధ్యాన దినోత్సవం మనందరికీ గుర్తుచేసే విధంగా ఉండాలి. మరింత సమాచారం కోసం: yssofindia.org చూడొచ్చు. -
అధికబరువుతో బాధపడేవారికి గుడ్ న్యూస్
అధిక బరువు ఊబకాయంతో నానాబాధలు పడుతున్నవారికి ఇది నిజంగా గుడ్ న్యూస్. బరువు తగ్గడానికి, జీవక్రియ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సహాయపడే ఒక కొత్త గట్ బాక్టీరియాను పరిశోధకులు కనుగొన్నారు. ఈ స్పెషల్ బాక్టీరియాను అమెరికాలోని ఉటా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు గుర్తించారు. ఎలుకలపై చేసిన అధ్యయనాలలో, టురిసిబాక్టర్ అని పిలువబడే ఒక నిర్దిష్ట రకం గట్ బాక్టీరియా జీవక్రియ ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుందని, బరువు పెరగడాన్ని తగ్గిస్తుందని ఉటా విశ్వవిద్యాలయం బృందం కనుగొంది. ప్రస్తుతం మార్కెట్లో బరువు తగ్గించే ఇంజెక్షన్లు, మందులు అందుబాటులో ఉన్నప్పటికీ, సహజసిద్ధంగా ఈ సమస్యను అధిగమించేందుకు ఈ పరిశోధన మార్గం సుగమం చేయగలదని భావిస్తున్నారు.ట్యూరిసిబాక్టర్ (Turicibacter) అనే పేగు బాక్టీరియా బరువు పెరుగుదలను నియంత్రించడంలో సమర్థవంతంగా పని చేస్తున్నట్టు గుర్తించారు. ఊబకాయం ఉన్నవారిలో టురిసిబాక్టర్ తక్కువగా ఉంటుంది. ఇది మానవులలో కూడా ఆరోగ్యకరమైన బరువుకు తోడ్పడుతుంది. గట్ బాక్టీరియాను సర్దుబాటు చేయడం ద్వారా బరువును నియంత్రించడానికి కొత్త మార్గాల అన్వేషణకు ఈ ఫలితాలు దారితీయవచ్చని సెల్ మెటబాలిజం జర్నల్లో ప్రచురించిన అధ్యయనంలో పరిశోధకులు జూన్ రౌండ్, కేంద్ర క్లాగ్ తెలిపారు. రక్తంలో చక్కెర, కొవ్వు స్థాయిని, హైఫ్యాట్ డైట్లోని సెరామైడ్ స్థాయిలను రాడ్ ఆకారంలోని టురిసిబాక్టర్ సింగిల్ హ్యాండెడ్గా తగ్గిస్తుందని కను గొన్నామన్నారు. అయితే టురిసిబాక్టర్ ప్రభావాలు ప్రత్యేకంగా ఉండే అవకాశం లేదు; విభిన్నమైన గట్ బాక్టీరియా బహుశా జీవక్రియ ఆరోగ్యానికి దోహదం చేస్తుంది. అలాగే జంతు నమూనాల ఆధారంగా ఈ ఫలితాలు ప్రజలకు వర్తించకపోవచ్చని కూడా చెప్పారు.అధిక కొవ్వు ఆహారంతో సెరామైడ్ స్థాయిలు పెరుగుతాయి. అధిక స్థాయి సిరామైడ్లు టైప్ 2 డయాబెటిస్ మరియు గుండె జబ్బులతో సహా అనేక జీవక్రియ రుగ్మతలతో సంబంధం కలిగి ఉంటాయి. కానీ టురిసిబాక్టర్ ఉత్పత్తి చేసే కొవ్వులు అధిక కొవ్వు ఆహారం మీద ఎలుకలకు కూడా సిరామైడ్ స్థాయిలను తక్కువగా ఉంచుతాయి. ట్యూరిసిబాక్టర్ చిన్న ప్రేగు ద్వారా గ్రహించబడే కొవ్వు అణువులను ఉత్పత్తి చేయడం ద్వారా జీవక్రియ ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది. ఇది ఎలుకలలో బరువు తగ్గడాన్ని గమనించినప్పటికీ, ఇది మానవులలో ఎంతవరకు సాధ్యపడుతుందని అనేది చూడాలన్నారు. కానీ ఆరోగ్యకరమైన జీవక్రియను ప్రోత్సహించేందుకు, అధిక బరువు పెరగకుండా నిరోధించే చికిత్సలను అభివృద్ధి చేయడానికి టురిసిబాక్టర్, ఈ ప్రభావాన్ని చూపే లిపిడ్ను గుర్తించడం భవిష్యత్తులో ఇది తొలి ఫ్యాక్టర్ కాగాలదని పరిశోధకులు తెలిపారు. అలాగే వ్యక్తిగత సూక్ష్మజీవులను మరింత పరిశోధించడం ద్వారా, భవిష్యత్తులో సూక్ష్మ జీవులను ఔషధంగా తయారు చేయగలమనీ, వివిధ వ్యాధులతో బాధపడుతున్న వారిలో వివిధ కీటకాల కన్సార్టియంను సృష్టించడానికి సురక్షితమైన బ్యాక్టీరియాను గుర్తించే అవకాశం ఉందని అని వర్సిటీ పరిశోధకుడు క్లాగ్ అన్నారు.గట్ మైక్రోబయోమ్లోని తేడాలు - గట్లోని బ్యాక్టీరియా, శిలీంధ్రాలు - ఊబకాయం మరియు బరువు పెరుగుదలతో సంబంధం కలిగి ఉంటాయి, మైక్రోబయోమ్ను మార్చడం వల్ల ఆరోగ్యాన్ని మెరుగుపడే అవకాశాన్ని పెంచుతుంది. కానీ వ్యక్తి ప్రేగులో వందలాది విభిన్న సూక్ష్మజీవుల జాతులు ఉంటాయి, ఏ జాతి సహాయపడుతుందో చెప్పడం కష్టతరం. అయితే ఈ ఫలితాలు మానవులకి కూడా వర్తిస్తే, ట్యూరిసిబాక్టర్-ఉత్పన్న సమ్మేళనాలు జీవక్రియ ఆరోగ్యం, ఆరోగ్యకరమైన బరువును ప్రోత్సహించడానికి ప్రభావవంతమైన చికిత్సా విధానాలుగా ఉంటాయనడంలో సందేహం లేదు. -
డబ్ల్యూహెచ్ఓ అంతర్జాతీయ మెడిసిన్ సదస్సులో హాట్టాపిక్గా అశ్వగంధ..!
డబ్ల్యూహెచ్ఓ గ్లోబల్ ట్రెడిషన్ మెడిసిన్ సమ్మిట్లో అశ్వగంధ ప్రయోజనాలు చర్చనీయాంశంగా మారింది. ఆయుర్వేదంలో అత్యంత అగ్రభాగాన ఉండే మూలికల్లో ఒకటైన అశ్వగంధ ఈ అంతర్జాతీయ కార్యక్రమంలో అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ రెండొవ డబ్ల్యూహెచ్ఓ గ్లోబల్ ట్రెడిషనల్ మెడిసిన్ సమ్మిట్ 2025కి భారత్ వేదికగా మారింది. సాంప్రదాయ వైద్యాన్ని ముందుకు తీసుకువెళ్లేలా భారత్ నాయకత్వం వహించడంతో అశ్వగంధ ప్రధాన టాపిక్గా మారింది. అంతేగాదు 'అశ్వగంధ: ట్రెడిషనల్ విజ్డమ్ టు గ్లోబల్ ఇంపాక్ట్ - పెర్స్పెక్టివ్స్ ఫ్రమ్ లీడింగ్ గ్లోబల్ ఎక్స్పర్ట్స్' అనే సెషన్ను ఆయుష్ మంత్రిత్వ సహకారంతో భారత్లో ఈ వేడుకను నిర్వహించింది. ఈ అశ్వగంధలో అడాప్టోజెనిక్, న్యూరోప్రొటెక్టివ్, ఇమ్యునోమోడ్యులేటరీ లక్షణాలకుగానూ అంతర్జాతీయ గుర్తింపు పొందుతున్న తరుణంలో శాస్త్రీయ సమకాలిన వైద్యం బలోపేతం చేసే దిశగా చర్చలపై దృష్టి సారించింది. యావత్తు ప్రపంచం క్లినికల్ మద్దతు ఇచ్చేలా దాని ప్రామాణికత, ప్రాముఖ్యతను నొక్కి చెప్పింది భారత్. అందరూ వినియోగించేలా భద్రత, నాణ్యత, చికిత్స అనువర్తనాలను హైలెట్ చేసింది. అయితే మిస్సీసిపీ విద్యాలయం రీసెర్చ్ డైరెక్టర్ డాక్టర్ ఇఖ్లాస్ ఖాన్ అందరూ వినియోగించేలా చేయడానికి బలమైన శాస్త్రీయ ఆధారాలు అత్యంత అవసరమని నొక్కి చెప్పారు. అందుకోసం ప్రపంచవ్యాప్తంగా దీనిపై శాస్త్రీయ పరిశోధనలకు పిలుపునివ్వడమే కాకుండా వినియోగించేలా చేయాలనే చర్చలకు వేదికైంది భారత్ అశ్వగంధతో కలిగే లాభలు..ఆధునిక కాలంలో అంటువ్యాధులులా మారిన ఒత్తిడి, ఆందోళనలను నివారిస్తుంది "ఆయుర్వేద మూలికల రాజు" అశ్వగంధ.నిద్రలేమిని నివారిస్తుంది. దీనిలో ప్రధాన ఒత్తిడి హార్మోన్ అయిన కార్టిసాల్ను నియంత్రించే సామర్థ్యం ఉందటకండరాల ద్రవ్యరాశి, బలాన్ని పెంచి శారీరక పనితీరుని మెరుగుపరుస్తుంది. జ్ఞాపకశక్తి మెరగవ్వుతుంది, మెదుడు ఆరోగ్యం బాగుంటుందిరోగ నిరోధక శక్తిని పెంచుతుంది. గుండె ఆరోగ్యాన్ని పెంచుతుందిరక్తంలో చక్కెర స్థాయిలను క్రమబద్దీకరిస్తుందిటెస్టోస్టీరాన్ ఉత్పత్తిని పెంచుతుంది, ప్రోటీన్ సంశ్లేషణను ప్రేరేపిస్తుంది.ఉపయోగించే విధానం..కనీసం 60 రోజుల పాటు వినియోగిస్తే.. మంచి సత్ఫలితాలను పొందగలమని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఒక గ్లాసు వెచ్చని పాలలో 1/4 నుంచి 1/2 టీస్పూన్ అశ్వగంధ పొడిని కలిపి తీసుకుంటే మంచి పలితం ఉంటుందటదీన్ని ఆవునెయ్యిలో కలిపి మాత్రల మాదిరిగా కూడా తీసుకోవచ్చట. ఉయదం బ్రేక్ ఫాస్ట్ స్మూతీ లేదా ఓట్ మీల్కు ఈ పొడిని జోడించి తీసుకోవచ్చట.వాళ్లకి మాత్రం మంచిది కాదు..గర్భిణీ స్త్రీలు హార్మోన్ల సమతుల్యతకు అంతరాయం కలిగించే అవకాశం ఉన్నందున ఈ అశ్వగంధని వినియోగించపోవడమే మేలుథైరాయిడ్ రుగ్మతలు ఉన్నవారు వైద్యులను సంప్రదించి వాడటమే మంచిది. ఆటోఇమ్యూన్ పరిస్థితులు ఉన్నవారు కూడా వైద్యుల సూచనలు మేరకు తీసుకోవడం మంచిది.గమనిక: ఇది కేవలం అవగాహన మన సంప్రదాయ వైద్య విధానం గొప్పతనం తెలియజేయడం గురించే ఇచ్చాం ఈ కథనం. ఈ మూలికను వినియోగించే ముందు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణును సంప్రదించడం ఉత్తమం. చదవండి: ప్రేమ, ఆప్యాయతలకు కేరాఫ్ 'ఆహారమే'..! అదెలాగంటే.. -
తొమ్మిది పదుల వయసులో 400 పుష్-అప్లు..!
ఓ అరవై ఏళ్లు రాగానే..మనలో శక్తి సన్నిగిల్లుతుంది, ఆటోమెటిగ్గా చేసే వ్యాయామాల జోరు తగ్గుతుంది. వయసులో ఉన్నంత సులభంగా వృధాప్యంలో వ్యాయమాలు చేయలేం. ఫిట్నెస్ నిపుణులు పర్యవేక్షణలో ఈజీగా చేయగలిగే వర్కౌట్లనే ఆశ్రయిస్తాం. అలాంటిది 92 ఏళ్ల తాత 20 ఏళ్ల యువకుడిలా ఎన్నిపుష్ అప్లు చేస్తాడో తెలిస్తే కంగుతింటారు. చెప్పాలంటే అతడు ముసలి తాతలా కనిపించే యువకుడిలా ఉంటుంది.. వ్యాయమాలు చేసే తీరు. అతనెవరు, ఫిట్నెస్ సీక్రెట్ ఏంటి వంటి వాటి గురించి తెలుసుకుందామా..!.బ్రిస్టల్లోని స్పైక్ ద్వీపంలో నివసించే కెన్ అనే తాతకు 92 ఏళ్లు. కానీ అతడు 20 ఏళ్ల యుకుడి మాదిరిగా ఎలాంటి ఆయాసం లేకుండా అలవోకగా పుష్ అప్లు చేస్తుంటాడు. మాజీ కాంకోర్డ్ ఇంజనీర్ అయిన ఈ తాత ఫిట్నెస్ పరంగా అందరికీ స్ఫూర్తి అని చెప్పొచ్చు. అతడు రోజుకి దగ్గర దగ్గర 400 నుంచి 600దాక పుష్ అప్లు చేయగలడట. అక్కడితో వర్కౌట్లు ఆపేయడు. దీని తర్వాత కోర్ వ్యాయామాలు చేస్తాడు, బరువుల ఎత్తుతాడు కూడా. దాంతోపాటు సుమారు 5 నుంచి 10 కి.మీ నడక కూడా తప్పనిసరిగా ఉంటుందట. చాలామంది ఇన్ని ఎందుకు చాలా తేలిగ్గా చేసే వాటిపై దృష్టిసారించమని హితబోధ చేసిన పట్టించుకోడట. ఎందుకిలా అంటే.. తాను చాలా ఏళ్ల నుంచి దినచర్యను ఇంట్రస్టింగ్ ఉండేలా చేసుకుంటానని చెబుతుంటాడు ఈ కెన్ తాత. ఎందుకంటే రొటీన్గా ఎప్పుడూ చేసే వ్యాయామాలు చేయడం అనేది చాలా బోరింగ్గా మారిపోతుందట. అందుకే..పుష్ అప్లు తర్వాత కడుపుని సాగదీసేలా హామ్ స్ట్రింగ్లు, పరుగు, తదితరాలు చేస్తూ..ఆసక్తికరంగా మార్చుకుంటాడట. కేవలం తాను క్రమం తప్పకుండా వ్యాయామాలు చేయాలనే డెడీకేషన్, యాక్టివ్గా ఉండటంపై నిరంతర ఫోకసే ఇంతలా ఈ వయసులో ఫిట్నెస్గా ఉండటానికి కారణమని అంటాడు కెన్. మరి అతడు ఎలాంటి ఆహారం తీసుకుంటాడంటే..డైట్..కెన్ తన రోజుని జంబో ఓట్స్, గోధుమలు, చియా గింజలతో కూడిన బ్రేక్ఫాస్ట్తో ప్రారంభిస్తాడట. వాటితోపాటు అరటిపండు, ఎండుద్రాక్ష, పాలు తదితరాలు కూడా తీసుకుంటానని చెబుతున్నాడు.కెన్లా సుదీర్ఘకాలం ఆరోగ్యంగా ఉండాలంటే..పెద్దయ్యే కొద్ది సిక్స్ప్యాకలు, మంచి శరీరాకృతి వంటి వాటిపై ఫోకస్ తగ్గి..ఆరోగ్యంగా జీవించాలనే కాంక్ష పెరుగుతుందట. అలా అనుకునేవాళ్లు క్రమం తప్పకుండా వ్యాయామాలు చేయడం, సమతుల్య ఆహారానికి పెద్ద పీటవేయడం వంటివి చేయాలట. ముఖ్యంగా గుండె, మెదడు ఆరోగ్యం బాగుండాలంటే..నడక, ఈత, సైక్లింగ్ తప్పనిసరి అట. ఇవి శరీరానికి తేలికపాటి శక్తి శక్షణ నిచ్చి..రక్తపోటు, చక్కెర, కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతాయట. అంతేగాదు మానసిక ఆరోగ్యం మెరుగగ్గా ఉండి.. ఒంటరితనం, ఆందోళన, నిరాశతో పోరాడగలిగేలా ఆరోగ్యకరమైన రసాయనాలు శరీరంలో విడుదలవుతాయట.ఇ క్కడ కెన్లా అంతలా వ్యాయామాలు చేయలేకపోయినా..కనీసం నడక, చిన్నపాటి కండరాల కదలికల కోసం కాస్త తేలికపాటి వర్కౌట్లు చేసినా.. సుదీర్ఘకాలం ఆరోగ్యంగా ఉంటామని చెబుతున్నారు నిపుణులు. గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. అనుసరించే ముందు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: స్నేహితుడి కూతురు కోసం వెల కట్టలేని గిఫ్ట్..! నెటిజన్లు ఫిదా) -
కొద్ది సేపు బ్రేక్ ఇచ్చే కిక్ వేరేలెవెల్..!
పని చేయటం, విశ్రాంతి తీసుకోవటం అనేవి జీవితంలో రెండు అత్యంత ప్రధాన విషయాలు. ఈ రెండింటిలో సమతుల్యత కలిగి ఉండటం అనేది నైపుణ్యతకు సంబంధించినది. ఈ రెండింటిపై సరైన పట్టు తెలిసి ఉండటమే జ్ఞానం. పనిచేయడంలో విశ్రాంతి, విశ్రాంతిలో కార్యచరణతను చూడటం అనేది అంతులేని స్వేచ్ఛని అందిస్తుంది.బ్రేక్ ప్రాముఖ్యత...కాలం అనేది ప్రవహించే నది లాంటిది. ఆనందంగా ఉన్న సమయాన్ని సైతం తన ప్రవాహంలో తీసుకుపోతుంది. కొన్నిసార్లు ఆ ప్రవాహంలో ముక్కుపుటాలవరకు మునిగిపోతాం. ఆ తర్వాత నది ఒరవడి తగ్గాక లేదా వరద ఉద్ధృతి తగ్గాక ఒడ్డుకి చేరుకుంటారు. అలేగా జీవితంలో కూడా ఒక్కోసారి సంపూర్ణంగా కాలంతో ఉండాల్సి ఉంటుంది. కొన్నిసార్లు ఒడ్డుకు చేరి కూర్చొని గమనించాలి కూడా. అలాగే జీవితంలో కూడా ఇలాంటి సమతుల్యతను పాటించాల్సిన అవసరం తప్పక ఉంది.సరైన కార్యాచరణే విశ్రాంతికి పునాది..!ఎంత ఎత్తైన భవనాన్ని నిర్మించాలన్నా దానికి సరైన పునాది లోతుగా ఉండాల్సిందే. వింటినారిని ఎంత భాగా వెనక్కు లాగితే అంతవరకు బాణం దూరంగా వెళ్తుంది. అలాగే మన పనులు ఫలవంతమై, విజయం సాధించాలంటే. మనకు సరైన సమయంలో తగిన విశ్రాంతి అంత అవసరం. ధ్యానం అంటే..ధ్యానం అంటే ఏం చేయకుండా ఉండే ఓ అద్భుత కళ. ఇది గాఢ నిద్రలో పొందే విశ్రాంతి కంటే విలువైనది. శ్వాస మీద ధ్యాస పెట్టే ఈ సుదర్శన క్రియ. మెదడులోని ఆల్ఫా, బీటా తరంగాలు రెండింటిని పెంచి, ఒత్తిడిని కలిగించే కార్టిసాల్ హార్మోన్ను నియంత్రిస్తుంది. ఫలితం విశ్రాంతిగా ఉంటూనే అప్రమత్తంగా(ఎరుకగా) ఉంటాం. ఫలితంగా ఒత్తిడికి గురికాకుండా పనిచేయగలుగుతాం.బ్యాలెన్సింగ్ లైఫ్ కోసం..ధ్యానం వెనుకకు లాగిపట్టి లోలోపలకు తీసుకువెళ్లి..పరిస్థితుల నుంచి పారిపోనివ్వకుండా చేస్తుంది. ఇది సమతత్వాన్నిసాధించేందుకు చేసే అభ్యాసం. అంతరంగంలో ప్రశాంతత, బాహ్యంగా చైతన్యంగా ఉండేలా చేస్తుంది.ఇది అందరికి తప్పక అవసరమైనది. మనలో కలిగే సంఘర్షణలకు పరిష్కారం తోపాటు అంతరంగ శాంతికి ఇది ఎంతో సహాయపడుతుంది. ఎప్పుడైతే అంతరంగంలో ప్రశాంతత ఏర్పడుతుందో..సానూకూలంగా స్పందించగలుగుతాం. సున్నితంగా ఉంటూ సానకూలంగా వ్యవహరించడం అత్యంత అవసరం. ఎందుకంటే సున్నిత మనస్కులు చిన్న విషయాలకే ఆవేశ పడిపోతారు. అతిగా స్పందించేవారు ఇతరులు ఏమనుకుంటారనేది అనవసరం, తమ వైఖరే సరైనదనేది వారి నమ్మకం. అందువల్ల సున్నతత్తం స్పందించే మనసు రెండూ అవసరమే మనిషికి. ఈ నాగరిక సమాజంలో మనగలగాలంటే..సంబంధాలు, సమతుల్యత రెండూ అవసరం. ముఖ్యంగా మన భావ ప్రకటన సవ్యంగా ఉంటే ఎలాంటి ఘర్షణలకు తావుండదు.విరామపు శక్తని ఎలా పెంపొందించుకోవాలంటే..మొదటగా విరామం అవసరం అన్న ఆలోచనే మిమ్మల్ని విశ్రాంతిగా ఉండనివ్వదు. బాగా కష్టపడి పనిచేయాలన్న ఆలోచన అలసట తెప్పిస్తుంది.తక్కువ సమయమైనా విశ్రాంతి పునరుత్తేజాన్ని అందిస్తుంది. ధ్యానం చేసేందుకు నాకు ఏం అక్కర్లేదు, నేను ఏం కాను, ఏమి చేయడం లేదు అనే వాటిని వదిలేయండి. మూడు కాలం మిమ్మల్ని నియంత్రించేలా చేయకండి, సమయం సరిపోవటం లేదన్న ఆలోచనే వద్దు. చివరగా చేసే పనిలో తీసుకునే ఆహారంలో సమతుల్యత పాటించండి. ఇక్కవ విశ్రాంతి తీసుకున్నప్పుడు శక్తిపొందుతారు, పనిచేసినప్పుడూ శక్తిని వ్యక్తపరుస్తారు. ఈ రెండిటి కలయికే జీవితం.సృజనాత్మకత, చైతన్యానికి మూలం ధ్యానం..చివరగా ధ్యానం చేయండి, అది మిమ్మల్ని, మీ మనసుని శుభ్రపరిచి, పనిభారాన్ని స్వీకరించేందుకు సిద్ధం చేస్తుంది. మనసు విశ్రాంతి పొందినప్పుడే బుద్ధి పదునెక్కుతుంది.ప్రశాంతమైన, స్థిరమైన మనసు మందకోడిగా ఉంటుంది. అది ఉత్సాహానికి, సృజనాత్మకతకు నెలవుగా మారి, ప్రపంచంలోని అత్యుత్తమమైన వాటన్నింటిని పొందగలిగేలా చేస్తుంది. -
వెయిట్ లిఫ్టింగ్తో తస్మాత్ జాగ్రత్త..! వైద్యుల స్ట్రాంగ్ వార్నింగ్
చాలామటుకు ఆర్థోపెడిక్ సమస్యలు ఉన్నవారు, పెద్దవాళ్లు వెయిట్లిప్టింగ్తో ఫిట్గా ఉండే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే ఆ మోకాళ్ల సమస్యల నుంచి బయటపడుతున్నారు కూడా. కానీ ఒక్కోసారి ఇలాంటి వెయిట్ లిఫ్టింగ్లు అనుకోని సమస్యలు కూడా తెచ్చుపెడుతుందట. భారీ వెయిట్ లిఫ్టింగ్లు ఎత్తితే కంటి చూపే పోయే ప్రమాదం ఉంటుందట. ఇది చాలా అరుదుగా సంభవించే గాయమట. ఇలా ఎందుకు జరుగుతుంది..? ఫిట్నెస్ కోసం చేసే వ్యాయామాలు కంటిచూపుపై ప్రభావం చూపించడానికి రీజన్.27 ఏళ్ల ఆరోగ్యవంతమైన వ్యక్తి భారీ వెయిట్ లిఫ్టింగ్ ఎత్తిన వెంటనే ఆకస్మికంగా దృష్టికోల్పోయాడు. ఒక సాధారణ జిమ్ సెషన్ కాస్తా అత్యవసర వైద్య పరిస్థితిగా మారింది. నిజానికి అంతకుమునుపు అతడి కంటికి సంబంధించి ఎలాంటి ఫిర్యాదులు కూడా లేవు. జిమ్లో డెడ్లిఫ్ట్ సమయంలో ఒత్తిడికి గురైన వెంటనే ఆ వ్యక్తికి దృష్టి సమస్యలు మొదలయ్యాయి. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లగా కుడి కంటిలో అస్పష్టత ఉందని, ఎడమకన్ను సాధారణంగా ఉందని చెప్పారు. అయితే ప్రభావిత కంటిలో దృష్టిలోపం గణనీయంగా ఉందని చెప్పారు. వ్యాయమాం చేసిన వెంటనే ఎంత అకస్మికంగా ఇబ్బందిగా అనిపించిందో వైద్యులకు వివరించాడు. అది ఎలాంటి నొప్పి లేకుండా ఒక గందరగోళంలా జరిగిందని అన్నాడు. ఎందువల్ల ఇలా అంటే..అతనికి దట్టమైన ప్రీ రెటీనా ఉందని, దీనిని సబ్హైలాయిడ్ హెమరేజ్ అని కూడా పిలుస్తారు. ఇది మాక్యులా పైన ఉంటుంది. ఇది పదునైన దృష్టికి కారణమయ్యే రెటీనా కేంద్ర భాగం. దీన్ని క్షణ్ణంగా స్కాన్ చేయగా ఆ రోగికి విట్రియస్ హెమరేజ్ ఉన్నట్లు గుర్తించారు వైద్యులు. ఇది ఆకస్మికంగా భయపడినప్పుడూ లేదా తీవ్రమైన బరువు ఎత్తడం వల్ల వస్తుందట. ప్రస్తుతం ఈ రోగి ఎదుర్కొంటున్న సమస్యను 'వల్సాల్వా రెటినోపతి'గా పేర్కొన్నారు. వల్సాల్వా రెటినోపతి అంటే..వల్సాల్వా రెటినోపతి అనేది రెటీనా రక్తస్రావం. ఇది దగ్గు, ఎత్తడం లేదా గట్టిగా వాంతు చేసుకున్నప్పుడూ..ఛాతీ ఒత్తిడిలో అకస్మాత్తుగా పెరుగుదల కారణంగా రెటీనా కేశనాళికలు పగిలిపోయి కంటిలో రక్తస్రావం కలుగుతుందట. దాంతో అకస్మాత్తుగా, నొప్పిలేకుండా దృష్టి నష్టానికి దారితీస్తుంది. సాధారణంగా ఇలాంటి సమస్య కాసేపటి తర్వాత దానంతట అదే తగ్గిపోతుంది. కానీ కొన్నిసార్లు తీవ్రంగా ఉంటే లేజర్ లేదా శస్త్రచికిత్స అవసరం అవుతుంది. బరువులు ఎత్తడం, వాంతులు లేదా లైంగిక కార్యకలాపాలు వంటి కార్యకలాపాల తర్వాత ఆరోగ్యంగా ఉన్నవారిలో కూడా ఈ సమస్య అత్యంత సాధారణం అని చెబుతున్నారు.ఇది ఎందువల్ల అంటే ఏదో తెలియని ఒత్తిడి ఫలితం ఇలాంటివి సంభవిస్తాయని చెబుతున్నారు. ఇది ఎక్కువగా ఆరోగ్యకరమైన చురుకైన వ్యక్తులనే ప్రభావితం చేస్తుందట. లక్షణాలునిపుణుల అభిప్రాయం ప్రకారం, దృష్టిలో అకస్మాత్తుగా తగ్గుదల, తరచుగా ఒక కంటిలో. రోగులు వారి కేంద్ర దృష్టిలో ఒక చీకటి మచ్చ లేదా నీడను గురించి వివరిస్తారు. దాన్ని కొన్నిసార్లు సిరా మచ్చ లేదా అద్దాలపై మరకలా ఉందని చెబుతుంటారు. అస్పష్టమైన లేదా వక్రీకరించబడిన దృశ్య క్షేత్రాలు, తేలియాడే మచ్చలు అరుదుగా, గణనీయమైన రక్తస్రావం జరిగితే తేలికపాటి అసౌకర్యంముఖ్యంగా శారీరక శ్రమ లేదా శ్రమ తర్వాత మీ దృష్టిలో ఆకస్మిక మార్పులను మీరు గమనించినట్లయితే అత్యవసర అంచనాను పొందడం చాలా అవసరం.ఎలా చికిత్స చేస్తారంటే..ఈ పరిస్థితికి చికిత్స చేయడం అంటే.. రక్తస్రావంను సురక్షితంగా, వేగంగా క్లియర్ చేసి, దృష్టిని పునరుద్ధరించడం. అలాగే శాశ్వత రెటీనా నష్టాన్ని నివారించడం అని వైద్యులు అంటున్నారు. చిన్నపాటి రక్తస్రావం కోసం, రోగి దృష్టి, రెటీనా ఆరోగ్యాన్నినిశితంగా పరిశీలించి చికిత్స అందించడం జరుగుతుంది. .యాగ్ లేజర్ చికిత్సరక్తం లోపలి పరిమితి పొర కింద చిక్కుకున్నప్పుడు, YAG లేజర్ చికిత్సను సూచిస్తారు వైద్యులు. అరుదుగానే శస్త్ర చికిత్స అవసరం అవుతుందని చెప్పుకొచ్చారు వైద్యులు. . -
క్రిటికల్ కేర్ తక్షణ.. రక్షణ!
‘‘ఆయనది చాలా క్రిటికల్ కండిషన్ అట!’’... ఒకరికి చాలా సీరియస్గా ఉన్నప్పుడు చాలామంది ఈ మాట వాడుతుంటారు. కార్డియాలజీ, న్యూరాలజీ... ఇలాంటి అనేక విభాగాల్లాగే ‘క్రిటికల్ కేర్’ అనేది కూడా ఒక విభాగం. కాకపోతే కార్డియాలజీ, న్యూరాలజీలతో పాటు ఇలాంటి అన్ని విభాగాల వారికీ చికిత్స అందించే అత్యంత కీలక విభాగమిది. అయితే... వైద్యశాస్త్ర పరిజ్ఞానం ఉన్న కొందరు తప్ప... చాలామంది క్రిటికల్ కేర్నూ, ఎమర్జెన్సీ విభాగాన్నీ ఒకటే అనుకుంటారు. కానీ అది సరికాదు. కానీ... క్రిటికల్ కేర్ అన్నా లేదా ఇంటెన్సివ్ కేర్ యూనిట్ అన్నా దాదాపుగా ఒకటే. కాకపోతే కార్డియాలజీ, న్యూరాలజీలకు ప్రత్యేకంగా ఐసీసీయూ (ఇంటెన్సివ్ కార్డియాక్ కేర్ యూనిట్), ఎన్ఐసీయూ (న్యూరో ఇంటెన్సివ్ కేర్ యూనిట్) ఇలా చాలా పెద్ద పెద్ద హాస్పిటళ్లలో వేర్వేరు ఇంటెన్సివ్ కేర్ యూనిట్లు ఉండవచ్చు. కానీ ఓ మోస్తరు పెద్ద హాస్పిటల్స్లో ఒకే ఐసీయూ ఉంటుంది. క్రిటికల్ పరిస్థితుల్లో ఉండే బాధితులకు ఈ క్రిటికల్ కేర్ యూనిట్స్లో అందే చికిత్సలూ, అందజేసే నిపుణులైన డాక్టర్లు... ఆ క్రిటికల్ కేర్ ప్రత్యేకతలేమిటో చూద్దాం.క్రిటికల్ కేర్, ఎమర్జెన్సీ కేర్ ఒకటి కాదు. ఎమర్జెన్సీ అంటే... ఏదైనా చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్న బాధితులప్రాణాలు నిలిపేందుకు కొద్దిసేపు మాత్రమే అక్కడ ఉంచి చికిత్స అందించి... ఇకప్రాణాలు నిలుస్తాయన్న తర్వాత క్రిటికల్ కేర్ / ఇంటెన్సివ్ కేర్ యూనిట్కు తరలించి అక్కడ మాత్రం చాలా సేపు ఉంచి చికిత్స అందించి, ఒక వార్డుకు లేదా రూమ్కు తరలించి చికిత్స అందిస్తారు. ఒక్కమాటలో చెప్పాలంటే ఎమర్జెన్సీ కొద్ది కాలం... క్రిటికల్ కేర్లో కాస్తంత ఎక్కువ కాలం చికిత్స అందిస్తారు.క్రిటికల్ కేర్కూ, ఎమర్జెన్సీకీ ఇదీ తేడా...మనకు తేలిగ్గా అర్థమయ్యేందుకు ఒక ఉదాహరణ చెప్పుకుందాం. విషం తీసుకున్న ఒక వ్యక్తిని ఎమర్జెన్సీకి తీసుకురాగానే... ఒక సెకండ్లోని చాలా సూక్ష్మమైన భాగం అంటే క్షణాల్లోనే గొంతులోకి పైప్ వేయగలంత సమర్థులు ఎమర్జెన్సీలో ఉంటారు. అలా ఆ గొట్టం ద్వారా కడుపులో ఉన్న విషాన్ని బయటకు తీసుకువస్తారు. అలాగే ఓ రోడ్డు యాక్సిడెంటు లేదా ఇతరత్రా ప్రమాదాలకు గురైనవారినీ (ట్రామా కేసు) లేదా గుండెపోటు వచ్చినా, పక్షవాతానికి గురైనా... తక్షణప్రాణాపాయం ఉన్నవారికి... తక్షణ వైద్యసేవ అందాల్సిన అవసరం ఉన్న వ్యక్తికి... ఆ తక్షణ చికిత్స అందేలా చేసేదే ఎమర్జెన్సీ వార్డు. ఇక అలా ఎమర్జెన్సీ చికిత్స అందిన తర్వాత... అప్పటికప్పుడు వచ్చే ప్రమాదం తప్పినప్పటికీ... తక్షణ అవసరం పెద్దగా ఏదీ లేకపోయినా... పూర్తి ప్రమాదం ఇంకా ఉండనే ఉందనీ, కొంతకాలం పాటు చాలా అప్రమత్తంగా చూసుకోవాల్సిన అవసరం ఉందని తెలిశాక... అంతటి అప్రమత్తతతో పేషెంట్స్ను చూసుకునే విభాగమే ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లేదా క్రిటికల్ కేర్ యూనిట్. ఎమర్జెన్సీలో ఉండే అన్ని రకాల అప్రమత్తమైన సేవలూ క్రిటికల్ కేర్లో ఉన్నప్పటికీ... ఇక్కడ పేషెంట్ను ఎమర్జెన్సీ వార్డులో కంటే ఎక్కువ సేపు ఉంచి చికిత్స అందిస్తారు. కొన్ని దేశాల్లో దీన్ని ‘క్రిటికల్ కేర్ విభాగం’ అంటారు. మరికొన్ని చోట్ల దీన్నే ‘ఇంటెన్సివ్ కేర్ విభాగం’ అంటారు. పేరు ఏదైనప్పటికీ... అక్కడి డాక్టర్లు, వైద్య సిబ్బంది అనునిత్యం అప్రమత్తంగా ఉంటారు. ఇందుకోసం క్రిటికల్ కేర్ డాక్టర్లు ప్రత్యేక శిక్షణ పొంది ఉంటారు. పేషెంట్ జీవితాన్ని కాపాడాటానికి రోజులోని 24 గంటలూ అంతే సావధానంగా ఉంటారు. అందుకే వీళ్లను ఇంటెన్సివిస్ట్స్ అని కూడా అంటారు.ఇక్కడి పేషెంట్స్ ఎవరంటే...?తక్షణ చికిత్స అందక అలాగే వదిలేస్తే కొద్ది క్షణాల్లోనేప్రాణాపాయం సంభవించగల అవకాశం ఉన్న పేషెంట్స్ను క్రిటికల్ కేర్ యూనిట్కు తరలిస్తారు. అత్యవసరంగా వైద్యసేవలు అవసరమైన రోగులు ఆసుపత్రిలో తొలుత వచ్చే ప్రదేశమిది. సాధారణంగా గుండెపోటు, పక్షవాతం, ఏదైనా రోడ్డు / వాహన / రైలు ప్రమాదానికి గురైనవారు, అగ్నిప్రమాదాల బారిన పడ్డవారు, పాము లేదా తేలు కాటుకు గురైనవారు, విషం తాగినవారు, ఏదైనా ప్రమాదకరమైన ఇన్ఫెక్షన్కు గురై తక్షణ చికిత్స అవసరమైనవారు... ఇలాంటి కేసులను క్రిటికల్ కేర్ యూనిట్కు తరలిస్తారు.అన్ని విభాగాలలోనూ నిష్ణాతులు... క్రిటికల్ కేర్ ఇంటెన్సివిస్టులు ఒక పేషెంట్స్కు... ఏ ప్రత్యేకమైన దేహభాగం లేదా అవయవానికి (గుండె లేదా మెదడు... ఇలా) లేదా ఓ వ్యవస్థకు (కార్డియాలజీ / న్యూరాలజీ / గ్యాస్ట్రో ఎంటరాలజీ వ్యవస్థ) ఎలాంటి వైద్యచికిత్స అవసరమో... ఆ డాక్టర్తో పాటు మిగతా అనుబంధ విభాగాలలోని ఆ డాక్టర్ల బృందమంతా వెంటనే పేషెంట్కు చికిత్స అందించడం మొదలుపెడతారు. ఉదాహరణకు ఒక వ్యక్తి రోడ్డు యాక్సిడెంట్కు లోనైనప్పుడు మొదట తలకు దెబ్బతగిలి ఉండే న్యూరో సర్జన్తో పాటు ఎముకలకు ఏదైనా హాని జరిగిందేమోనంటూ ఆర్థోపెడిక్ సర్జన్... అలాగే ఆ దెబ్బ తగిలిన చోటును బట్టి రక్తప్రసరణ వ్యవస్థకు ఏదైనా విఘాతం కలిగితే దానికి సంబంధించిన నిపుణులు... ఇలా అవసరాన్ని బట్టి ప్రధాన వైద్య నిపుణులతో బాటూ ఇతర నిపుణులూ కలిసి పనిచేసి పేషెంట్ను రక్షించడానికి ప్రయత్నిస్తారు. అలా మొదటగా అతడిలోని జీవక్రియలకు సంబంధించిన వ్యవస్థలన్నీ సక్రమంగా పనిచేసేలా చూస్తారు. ఇలాంటి పత్యేక శిక్షణ పొందిన వైద్యులను ‘ఇంటెన్సివిస్ట్స్’ అంటారు. అంటే వాళ్ల చికిత్స చాలా కేంద్రీకృతంగా, తక్షణం పేషెంట్ప్రాణాలను రక్షించడం కోసమే అయి ఉంటుంది. ఈ ఇంటెన్సివిస్ట్లందరూ కేవలం ఒక నిర్ణీతమైన దేహవ్యవస్థా లేదా ఓ నిర్దిష్టమైన అవయవం విషయంలోనే కాకుండా... పూర్తిగా అన్ని శారీరక దేహ వ్యవస్థలూ (అంటే నాడీ, జీర్ణ, రక్తప్రసరణ, గుండె ఇలా అన్ని రకాల వ్యవస్థలూ), దేహభాగాలూ / అవయవాలన్నింటిపైనా మంచి పట్టు, వాటి చికిత్సల్లో అద్భుతమైన నైపుణ్యంగలవారిగా ఉంటారు.గతం కంటే ఇప్పుడు మరిన్ని నైపుణ్యాలతోనూ ఇంకింత ప్రత్యేకంగా... దాదాపుగా గత మూడు శతాబ్దాల క్రితం అన్ని రంగాలకు చెందిన వైద్యులంతా ఈ ఇంటెన్సివ్ కేర్ యూనిట్/క్రిటికల్ కేర్ విభాగంలో ఉండేవారు. అన్ని రకాల సేవలూ అక్కడే దొరికేవి. కానీ ఇప్పుడు ఆధునిక యుగంలో ఇంటెన్సివ్ కేర్ యూనిట్లు / క్రిటికల్ కేర్ యూనిట్ల పనితీరు పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు వైద్యరంగంలో వచ్చిన ఆధునిక వైద్య పరిజ్ఞానం, అత్యున్నతమైన సేవలు అందుబాటులోకి వచ్చిన తర్వాత... పేషెంట్లను ఉంచే ప్రదేశాలూ, అక్కడి వసతులు అన్నీ ప్రత్యేకంగా మారాయి. ఉదాహరణకు... శ్వాస తీసుకోలేని రోగులకు కృత్రిమశ్వాస అందించేందుకు వెంటిలేటర్లు, పేషెంట్స్కు సంబంధించిన అన్ని రకాల కీలకమైన రీడింగ్స్ను తీసుకునే అత్యున్నత స్థాయి పరిజ్ఞానం కలిగిన సున్నితమైన (ప్రెసిషన్గా పనిచేసే సెన్సిటివిటీ ఎక్కువగా ఉండే) పరికరాలు, మూత్రపిండాలు విఫలమైన సందర్భాల్లో కృత్రిమంగా దేహంలో లేదా రక్తంలోని మలినాలన్నింటినీ తొలగించే డయాలసిస్ యంత్రాలు... ఇలా ఎన్నో కీలకమైన ఉపకరణాలన్నీ ఏ రంగానికి కావాల్సినవి ఆ రంగాలకు చెందిన ప్రత్యేక ఇంటెన్సివ్ కేర్ యూనిట్లలో ఇప్పుడు అమర్చి ఉంచుతున్నారు.అన్నింటా పురోగతితో పాటు అత్యవసర వైద్యసేవల్లో కూడా...ఇప్పటితో పోలిస్తే కొద్ది కాలం కిందట వైద్యచికిత్సలు ఇప్పటికంటే కాస్త నింపాదిగా, కాస్తంత మెల్లగా సాగేవి. అందుకే ఒకప్పటి తీవ్రమైన జబ్బులకూ శానిటోరియమ్ల తరహాలోనే ఆసుపత్రులు ఉండేవి. అత్యవసరంగా వైద్యసేవలు అందించాల్సిన చాలా సందర్భాలలో పేషెంట్లు చనిపోవడం లాంటి దుర్ఘటనలే ఎక్కువగా చోటుచేసుకునేవి. కానీ ఇప్పుడు ఆధునిక వైద్య చికిత్స ప్రక్రియల్లో గణనీయమైన పురోగతి రావడంతో ఈ చికిత్స అందించే క్రమంలోనూ విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి. అంటే ఎంత వేగంగా హాస్పిటల్కు తీసుకొస్తే అంతటి ఉత్తమమైన / వేగవంతమైన చికిత్స అందేలాగా... దానికి అనుగుణంగానే ప్రభావాలు (రిజల్ట్స్) కనిపించేలా పరిస్థితులు మారిపోయాయి. ఉదాహరణకు... పెను ప్రమాదాలేవైనా సంభవించినప్పుడు... అది జరిగిన మొదటి అరగంటలోనే పేషెంట్స్ను తీసుకువస్తే... ఆ వ్యవధిని ΄్లాటినమ్ మొమెంట్స్ అని,ప్రాణాపాయాన్ని తప్పించగల అవకాశాలు పుష్కలంగా ఉంటాయని, రెండో అరగంటను గోల్డెన్ మొమెంట్స్ అని, ఆ తర్వాతి క్షణాలను సిల్వర్ మొమెంట్స్... అంటూ అభివర్ణిస్తున్నారు. అంటే గోల్డెన్ మొమెంట్స్లోప్రాణాపాయాన్ని తప్పించడానికి మంచి అవకాశం ఉండగా... ఆ తర్వాతి క్షణాల్లో ఒక మోస్తరు అవకాశాలుంటాయని... ఇలా ప్రమాదమైనా, గుండెపోటు, పక్షవాతం లాంటి ఆరోగ్య పెనుముప్పులనైనా తప్పించే అవకాశం ఉంటుందని స్పష్టంగా తెలుస్తోంది. దీనికి తోడు అన్ని విభాగాల్లోనూ సూపర్స్పెషాలిటీలు, అందులోనూ మళ్లీ సబ్స్పెషాలిటీలు రావడం మొదలైంది. ఈ మార్పుకు తగినట్లుగానే క్రిటికల్ కేర్ యూనిట్లు సైతం తమ తమ విభాగాల్లో ఇంకా ప్రత్యేకతలను సంతరించుకోవడం మొదలుపెట్టాయి. అత్యాధునిక ఉపకరణాలు,ప్రాణాలను కాపాడేందుకు కొత్త కొత్త అత్యాధునిక వైద్యసేవలు ఆవిష్కృతమవుతున్నాయి. ఈ యూనిట్లలోకి కొత్త పరికరాలు వస్తున్నాయి. ఇక్కడ పనిచేసే వైద్యులు సైతం పీజీ (ఎం.డి.) తర్వాత ఇంకా మళ్లీ క్రిటికల్ కేర్ మెడిసిన్ అనే ప్రత్యేక విద్యార్హత / ప్రత్యే శిక్షణ పొందాల్సి ఉంటుంది.ఇక్కడి నిపుణుల ప్రత్యేకత ఏమిటంటే...ఏదైనా ఒక అవయవానికి ఓ వ్యాధి వచ్చిందనుకోండి. తొలుత అది ఆ అవయవానికే పరిమితమవుతుంది. కొంతకాలం తర్వాత అది మరింతగా తీవ్రమైతే ΄÷రుగునే ఉన్న అవయవాలకూ లేదా దానితో సంబంధం ఉన్న అవయవాలకూ, సంబంధిత వ్యవస్థలకూ విస్తరిస్తుంది లేదా వాటిపై తన ప్రతికూలతలను చూపుతుంది. ఉదాహరణకు... గుండెపోటుతో గుండె కండరం విఫలం కావడం మొదలైతే... అది కేవలం గుండెకే పరిమితం కాకుండా... రక్తసరఫరా సరిగా జరగకపోవడంతో మెదడుకు కూడా రక్తం అందకపోవడం, దాని పనితీరూ ప్రభావితం కావడం జరుగుతాయి. మెదడు అన్ని కీలక అవయవాలను నియంత్రిస్తుంటుంది కాబట్టి దాని అధీనంలో ఉండే అన్ని అవయవాలూ చచ్చుబడిపోయేందుకు అవకాశాలు పెరుగతాయి. ఒకవేళ మెదడులో రక్తస్రావం అయి, గుండెను నియంత్రించే కేంద్రంపై దాని ప్రభావం పడితే గుండెనూ ప్రభావితం చేస్తుంది. అందుకే క్రిటికల్ కేర్ యూనిట్లో ఉన్నప్పుడు వ్యాధి సోకిన అవయవం గాకుండా... దాని వల్ల ప్రభావితమైన అవయవాలూ పనిచేయకుండా పోయే కండిషన్ను ‘మల్టీ ఆర్గాన్ డిస్ఫంక్షన్’ అంటారు. ఇక అన్ని అవయవాలూ పూర్తిగా విఫలమైతే దాన్ని ‘మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్’గా చెబుతారు. ఇలాంటి పరిస్థితి రాకుండా క్రిటికల్ కేర్ యూనిట్లోని డాక్టర్లందరూ నిరంతరం శ్రమిస్తుంటారు. అందుకే క్రిటికల్ కేర్ యూనిట్లో పనిచేసే వైద్యులకు కేవలం ఒక ప్రత్యేకమైన అవయవానికి సంబంధించిన పరిజ్ఞానమో లేదా ఒక వ్యవస్థకు చెందిన పరిజ్ఞానమో కాకుండా... శరీరంలోని అన్ని అవయవాలకు సంబంధించిన సంపూర్ణ పరిజ్ఞానం ఉండేలా శిక్షణ పొందుతారన్నమాట. అందుకోసం ప్రత్యేకంగా క్రిటికల్ కేర్ మెడిసిన్ (సీసీఎమ్) అనే విభాగమే రూపొందింది. వీళ్ల నేతృత్వంలోనే అత్యంత సంక్లిష్టమైనప్రాణాపాయాన్ని నివారించే విధులు నిర్వర్తించే కీలకమైన పనులు జరుగుతుంటాయి.ఉదాహరణకు ఒక కేస్ స్టడీ...ఒక వ్యక్తికి నిమోనియా సోకిందనుకుందాం. నిజానికి నిమోనియా లంగ్స్కు సంబంధించిన సమస్య. దేహంలోని ఎన్నో వ్యవస్థల్లో ‘శ్వాసకోశ వ్యవస్థ’ ఒకటి. నిమోనియా ఆ వ్యవస్థ కిందికి వస్తుంది. సాధారణంగా నిమోనియా చికిత్స కోసం యాంటీబయాటిక్స్తో చికిత్స అందిస్తే చాలు. కానీ ఏవైనా కారణాల వల్ల సమస్య అదుపులో లేకుండా పోయి... పేషెంట్కు శ్వాస అందకపోతే ఆక్సిజన్ పెట్టాలి. కృత్రిమ శ్వాస ఇవ్వడానికి వెంటిలేటర్ అవసరం. ఒకవేళ లంగ్స్ కు ఉన్న ఇన్ఫెక్షన్ రక్తానికీ వ్యాపించి, సెప్సిస్గా మారితే అప్పుడు కేవలం యాంటీబయాటిక్స్తో మాత్రమే చికిత్స చేస్తే సరిపోదు. ఆ పరిస్థితుల్లో అన్ని వ్యవస్థలూ సక్రమంగా పనిచేయించేలా మందులు ఇవ్వాలి. గుండె, రక్తప్రసరణ వ్యవస్థ అన్ని సక్రమంగా ఉండేలా చూడాలి. రక్తపోటు నియంత్రణలోకి వచ్చేలా చూడాలి. ఒక్కోసారి అతడికి గుండె పనితీరును మెరుగుపరచడానికి హార్ట్లంగ్ బైపాస్ అనే చికిత్సనూ అందించాల్సి రావచ్చు. ఇలా చేయడాన్ని ‘ఎక్స్ట్రా కార్పోరియల్ ఆక్సిజనేషన్’ అంటారు. ఒకవేళ ఇన్ఫెక్షన్ లంగ్స్ నుంచి కిడ్నీలకు పాకితే... అప్పుడతడి రక్తంలోని వ్యర్థాలను తొలగించడానికి ‘డయాలిసిస్’ అనే ప్రక్రియను నిర్వహించాలి. రక్తం పూర్తిగా కలుషితమైతే దాన్ని బయటకు తీసుకువచ్చి అక్కడ కృత్రిమంగా శుభ్రం చేసి మళ్లీ ఆ ఇన్ఫెక్షన్ తొలగిపోయాక శరీరంలోకి ఎక్కిస్తారు. దీన్ని ‘ఎక్స్ట్రా కార్పోరియల్ ప్యూరిఫికేషన్’ అంటారు. ఇలాంటి సేవలెన్నో ఇప్పుడు ఇంటెన్సివ్ కేర్/క్రిటికల్ కేర్ యూనిట్లలో దొరుకుతాయి.ఇదో టీమ్ స్పిరిట్తో కూడిన ప్రక్రియఅత్యంత సంక్లిష్టమైన ఈ క్రిటికల్ కేర్ విభాగాల్లో కేవలం ఇంటెన్సివిస్టులు మాత్రమే కాకుండా... ఆయా విభాగాలకు చెందిన నిపుణులూ సేవలందిస్తుంటారు. ఉదాహరణకు... ఆయా అవయవానికి సంబంధించిన వైద్యులు, క్రిటికల్ కేర్ కోసం ప్రత్యేకంగా శిక్షణ పొందిన నర్స్లు, సాంకేతిక నిపుణులు (టెక్నీషియన్స్)... ఇలా ఎందరో ఒక బృందంగా (టీమ్గా) పనిచేస్తుంటారు. ఈ టీమ్ వర్క్ అంతా ఒక సీనియర్ ఇంటెన్సివిస్ట్ నేతృత్వంలో, అతడి ఆదేశాల మేరకు పనిచేస్తుంటారు. వీళ్లంతా ఒక టీమ్స్పిరిట్తో పేషెంట్ను అతడున్న సంక్లిష్ట పరిస్థితి (క్రైసిస్) నుంచి బయటపడేసి సేవ్ చేస్తారు. అందుకే ఈ వైద్యవిభాగాన్ని గౌరవపూర్వకంగా ‘క్రిటికల్ కేర్ మెడిసిన్’గా లేదా ఇంటెన్సివ్ కేర్ చికిత్స అందే ప్రదేశంగా అభివర్ణిస్తారు.ఎవరెవరికి ఈ సేవలుఅవసరమంటే...? సాధారణంగా చాలా పెద్దవీ, అలాగే అత్యంత సంక్లిష్టమైనవీ అయిన శస్త్రచికిత్సలు పూర్తయ్యాక పేషెంట్ పరిస్థితి బాగా నిలకడ స్థితికి వచ్చే వరకు క్రిటికల్ కేర్లోనే ఉంచుతారు. వాళ్లే కాకుండా ఇంకా పెద్ద పెద్ద ప్రమాదాలకు గురైనవారు, గుండెపోటు వచ్చినవారూ, పక్షవాతానికి గురైన వారూ, అవయవాల మార్పిడి చికిత్స అందుకున్నవారూ, నీళ్లలో ముగినిపోయినవారు, క్యాన్సర్ వ్యాధిగ్రస్తుల్లో కీమోథెరపీ తర్వాతా అలాగే మలేరియా, డెంగ్యూ, స్వైన్ఫ్లూ వంటి మామూలు జబ్బులు సైతం కొందరిలోప్రాణాంతకంగా మారినప్పుడు వారికీ ఈ క్రిటికల్ కేర్ సేవలు అవసరమవుతాయి. ఇంకేవైనా రోడ్డు ప్రమాదాలూ, బాంబు పేలుళ్లు జరిగి అనేకమంది పదులు, వందల సంఖ్యల్లో ప్రమాదాలకు గురైనప్పుడు కూడా క్రిటికల్ కేర్ సేవలు నిరంతరం, నిరంతరాయంగా అందుతుంటాయి.నిర్దిష్టమైన పనివేళలంటూ ఉండవు... అన్నీ పనివేళలే... అక్కడ పనిచేసే సిబ్బందికి నిర్దిష్టమైన పనివేళలంటూ ఉండవు. ఏ క్షణాల్లో అత్యవసర సేవలు అవసరమవుతాయో తెలియక అనుక్షణం అప్రమత్తంగా ఉండేలా షిఫ్టుల్లో నిపుణులైన నర్సులు, సిబ్బంది పనిచేస్తుంటాయి. సవాళ్లతో కూడిన పరిస్థితుల్లోనూ ఇంకా గట్టిగా పనిచేస్తారు. వారు కోలుకున్న తర్వాత మళ్లీ మరొకరిప్రాణాలు రక్షించే పనుల్లో... ఇలా నిరంతరమూ తమ పనుల్లో నిమగ్నమవుతుంటారు.అంతరాయాలను నివారించేందుకు కొద్దిమందికే అనుమతి... ఇంటెన్సివ్ కేర్ యూనిట్లలో పనులు సాఫీగానూ లేదా అంతరాయాలు లేకుండా కొనసాగేందుకు వీలుగా సాధారణ వ్యక్తులను చాలా పరిమితంగా మాత్రమే అనుమతిస్తుంటారు. ఒకవేళ వెళ్లాల్సివచ్చినా ప్రత్యేకమైన గౌనులు, మాస్కులు, క్యాప్స్ ధరించి వెళ్లాల్సి ఉంటుంది. ఈ జాగ్రత్తలు కూడా పేషెంట్స్కు మేలు చేసేందుకు ఉద్దేశించినవే. అక్కడ (ఐసీయూలో) ఇన్ఫెక్షన్ వ్యాప్తి చెందే ప్రమాదలను బాగా తగ్గించడానికే. ఆగిన గుండెను మళ్లీ స్పందిచేలా చేసే సీపీఆర్ (కార్డియో పల్మునరీ రిససియేషన్) చేసే సిబ్బంది వంటి ప్రత్యేక నిపుణులు అక్కడ ఉంటారు. ఈ సంయుక్త సేలవన్నింటి వల్ల ఇప్పుడు... అత్యంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో గాయపడ్డా... వారిలోప్రాణాలు కోల్పేయేవారి సంఖ్య దాదాపుగా తగ్గిపోయింది. ఇలా అందరిప్రాణాలూ కాపాడటం కోసం ఉద్దేశించిన అంత్యంత కీలకమైనదే ఈ క్రిటికల్ కేర్ విభాగం. -
ఆ యువ సైక్లిస్ట్ గట్స్కి మాటల్లేవ్..! ఏకంగా 30 దేశాలు..
ఓ యువ సైక్లిస్ట్ ఖండాల మీదుగా అసాధారణ పర్యాటనకు పూనుకున్నాడు. ఏదో రికార్డు సృష్టించాలనో..తానెంటో ప్రపంచానికి తెలియజేయాలన్న ఉద్దేశ్యంతోనో కాదు. స్వలాభం ఆశించకుండా ఓ గొప్ప సందేశాన్ని అందించేలా సాహసోపేతమైన స్ఫూర్తిదాయక పర్యాటనను చేపట్టాడు ఆ యువకుడు. ఏకంగా 18 వేల కిలోమీటర్లు తొక్కి..తన టూర్ని సక్సెస్ఫుల్గా పూర్తిచేశాడు. తాను వయసులో చిన్న గానీ ఔదార్యంలో అందరికంటే మిన్నా అని చాటిచెప్పాడు. ఎవరా యువకుడు..ఏ లక్ష్యం కోసం ఇంత పెద్ద సాహసానికి పూనుకున్నాడంటే..ఫ్రాన్స్కు చెందిన 24 ఏళ్ల యువ సైక్లిస్ట్ కిలియన్ లే గయాడర్ తన స్వస్థలం నుంచి చైనాకు 18,000 కిలోమీటర్లు తొక్కుకుంటూ సైకిల్పై వెళ్లడం విశేషం. అతడు ఖండాలు మీదుగా చేపట్టి అసాధారణ టూర్ని చేపట్టి..ఏకంగా 30కి పైగా దేశాలు చుట్టేశాడు. ఈ ఏడాది ప్రారంభంలో ఈ టూర్ని వాయువ్య ఫ్రెంచ్ నగరం రెన్నెస్ నుంచి ప్రారంభించి..నెలల తరబడి నిరంతరం ప్రయాణిస్తూ..ఇటీవలే చైనాకు చేరుకున్నాడు. సింపుల్గా చెప్పాలంటే..లే గయాడర్ తన జీవితంలో మర్చిపోలేని గొప్ప సాహసోపేతమైన పర్యాటనను విజయవంతంగా పూర్తిచేశాడు. ఇది తన లైఫ్లోనే అత్యంత చిరస్మరణీయ విజయాలలో ఒకటిని సమర్థవంతంగా పూర్తిచేయగలిగానంటున్నాడు. ఎందుకోసం ఈ పర్యాటన అంటే..అనారోగ్యంతో పోరాడుతూ కూడా మన డ్రీమ్స్ని, లక్ష్యాలను నెరవేర్చుకోవచ్చు అని చెప్పేందుకే ఈ సాహసోపతమైన పర్యాటనకు పూనుకున్నట్లు తెలిపాడు. ఇక లె గయాడర్ 2023లో ఫ్రెంచ్ విశ్వవిద్యాలయంలో గ్రాడ్యుయేషన్ పూర్తిచేశాడు. 14 ఏళ్ల ప్రాయంలో అడవిలో ఉండే బొరేలియా బాక్టీరియా కారణంగా లైమ్ వ్యాధి బారిన పడ్డాడు. దాన్నుంచి కోలుకునేందుకే నెలలు, సంవత్సరాలు పట్టింది. ఆ తర్వాత క్రమంగా శక్తిని పొంది, పూర్తిస్థాయిలో ఆరోగ్యంవంతుడయ్యేందుకు దాదాపు మూడేళ్లు పట్టింది. ఆ నేపథ్యంలోనే ఈ వ్యాధిపై ప్రజలందిరికీ అవగాహన కలిగేలా చేయాలని.. ఇలా సైకిల్ యాత్రకు సంకల్పించాడు. తనలా మరెవ్వరూ ఇంతలాబాధ పడకుండా, ముందు జాగ్రత్తలు తీసుకునేలా అవగాహన కల్పించేందుకే ఈ సాహస యాత్ర అని చెప్పుకొచ్చాడు. ఫ్రాన్స్ నుంచి యూరప్ ఆసియా అంతటా దాదాపు 10 వేల కిలోమీటర్లు పైనే ఒంటిరిగా సైకిల్ తొక్కాడు. టర్కీ, జానీయాల వరకు తన స్నేహితుడు తోడు రాగా, అక్కడ నుంచి లె గయాడర్నే ఒంటరిగా చైనాకు చేరుకున్నాడు. అయితే చైనాకు చేరుకునే మార్గం చాలా కఠినమైన భూభాగం, చాలా సవాళ్లుతో కూడిన వాతావరణమని అంటున్నాడు. ఏకంగా ఎనిమిది నెలలు..ఈ యాత్ర కోసం నిధులు సేకరించడానికి సుమారు ఎనిమిద నెలల పనిచేశాడు. అయితే ఈ మొత్తం పర్యాటకు అతడికి సుమారు రూ.15 లక్షలు పైనే ఖర్చయ్యింది. ఈ టూర్కి ఫ్రెంచ్ బ్యాంకు, స్థానిక కౌన్సిల్, సంస్థల నుంచి ఆర్థిక సహాయం సైతం అందింది లె గయాడర్కు. నిజానికి తన ఆరోగ్య సమస్యలను దృష్టిలో పెట్టుకుంటే ఈ మార్గాలలో తాను ప్రయాణిచడం అత్యంత క్లిష్టమైన సవాలు, పైగా ప్రత్యేక అనుభవ కూడా అని అంటున్నాడు ఆ యువ సైక్లిస్ట్.లైమ్ వ్యాధి (Lyme disease) అంటే:ఇది బోర్రెలియా (Borrelia) అనే బ్యాక్టీరియా వల్ల కలిగే ఇన్ఫెక్షన్. అడవుల్లో, గడ్డిపొదల గుండా వెళ్లినప్పుడూ ఈ వ్యాధి బారిన పడతారట. దీని కారనంగా ఎర్రటి వలయాకారపు దద్దుర్లు , జ్వరం, తలనొప్పి, అలసట, కీళ్ల నొప్పులు వస్తాయి. సకాలంలో చికిత్స తీసుకోకపోతే గుండె, నాడీ వ్యవస్థ, కీళ్లపై ప్రభావం చూపి ప్రాణాంతకంగా మారుతుందట. (చదవండి: ఎముకలు కొరికే చలిలో..టీ,కాఫీ తాగుతున్నారా?) -
ఎముకలు కొరికే చలిలో..టీ,కాఫీ తాగుతున్నారా?
వణికించే చలిలో వెచ్చగా మారడానికి చాలా మంది తేనీటి మీదే ఆధారపడతారు. మిగిలిన కాలాల్లో రోజుకి ఒకటి రెండు సార్లు మించి తాగే అలవాటు లేనివాళ్లు కూడా వింటర్లో టీ హంటర్స్గా మారిపోతారు. ఎక్కువ సార్లు టీ లేదా కాఫీ తాగడం ప్రారంభిస్తారు.కానీ ఈ శీతాకాలపు అలవాటు మన శరీరంపై, దాని పనితీరుపై ఊహించని దుష్ప్రభావాలను చూపుతుందని రాయ్పూర్లోని ఎయిమ్స్ ఆర్థోపెడిక్ స్పోర్ట్స్ ఇంజురీ సర్జన్ డాక్టర్ దుష్యంత్ చౌహాన్ అంటున్నారు. ఆయన ఇటీవల రాసిన ఓ ఇన్స్ట్రాగామ్ పోస్ట్లో ఈ సీజన్లో ఎడాపెడా టీ తాగేయడం ఎంతగా ఆరోగ్యపరమైన అనర్ధాలు తెస్తుందో వివరించారు మితంగా తీసుకోవడం ఎందుకు ముఖ్యమో కూడా తెలియజేశారు.వేడి పానీయాలు ఎముకల ఆరోగ్యానికి మధ్య ఉన్న మనం ఊహించని సంబంధాన్ని డాక్టర్ చౌహాన్ హైలైట్ చేశారు. చల్లని వాతావరణంతో కలిపినప్పుడు అధిక కెఫిన్ కీళ్ల ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో ఆయన వివరిస్తున్నారు. ‘‘టీ వేడిగా ఉంటుంది, కానీ అది మీ ఎముకలను ‘చల్లబరుస్తుంది’. అని చెబితే అది వినడానికి కొంచెం వింతగా అనిపించవచ్చు, కానీ అది వాస్తవం అంటున్నారాయన. శీతాకాలంలో చాలా మంది టీ లేదా కాఫీ తీసుకునే డోస్ పెంచడంతో, మోకాళ్ల లోపల మృదులాస్థి మరింత దుర్బలంగా మారుతుందని ఆయన వెల్లడించారు. ఆయన చెబుతున్న ప్రకారం...‘‘ మోకాళ్ల లోపల మృదులాస్థి రెండు ఎముకల మధ్య ఉండే పొర, ఎండిపోవచ్చు. ఇది కీళ్లలో సున్నితత్వాన్ని మొద్దుబారుస్తుంది. ఎముకలు ఒకదానికొకటి రుద్దినప్పుడు ఎక్కువ నొప్పిని కలిగిస్తుంది శీతాకాలంలో కూడా డీహైడ్రేషన్ సమస్య ఉంటుంది. అయితే ఈ డీ హైడ్రేషన్ గుర్తించబడదు. చల్లని వాతావరణం నుంచి టీ, కాఫీలు తక్షణ ఓదార్పునిచ్చినప్పటికీ, శరీరానికి సరళత కీళ్ల పనితీరుకు అవసరమైన ద్రవాలను అవి భర్తీ చేయలేవు మనం త్రాగేవి మన ఎముకలు కీళ్లను ప్రభావితం చేస్తాయని చాలా మంది గ్రహించరు .అయితే టీని ఆస్వాదించవచ్చు, కానీ దానితో పాటు తగినంత నీరు త్రాగడం చాలా అవసరం. ‘‘హైడ్రేట్గా ఉండటం వల్ల డీహైడ్రేషన్ను నివారించవచ్చు, ఇది శీతాకాలంలో సర్వసాధారణం ఆరోగ్యకరమైన కీళ్లను నిర్వహించడానికి చాలా ముఖ్యమైనది". వేడి పానీయాలను ఆస్వాదిస్తున్నప్పుడు తగినంత నీరు తీసుకోవడం వంటి సాధారణ చర్యలు గణనీయమైన మేలు చేస్తాయి.ఆర్థోపెడిక్ ట్రామా రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ డాక్టర్ పి సి జగదీష్ ఆంగ్లపత్రిక ఇంటర్వ్యూలో ఇలా చెప్పారు, ‘‘మృదులాస్థి అధిక శాతం నీటితో తయారవుతుంది దాని స్థితిస్థాపకత, షాక్ శోషణ సామర్థ్యం మృదులాస్థి ఉపరితలాన్ని నిర్వహించడానికి తగినంత హైడ్రేషన్పై ఆధారపడుతుంది. శరీరం డీ హైడ్రేషన్కి గురైనప్పుడు, మృదులాస్థి దాని అంతర్గత నీటి శాతాన్ని కోల్పోతుంది, ఇది కీళ్లను కుషన్ చేసే సామర్థ్యాన్ని తగ్గిస్తుంది కదలిక సమయంలో ఇబ్బందులను పెంచుతుంది. అయితే కెఫీన్ స్వయంగా నేరుగా కీళ్లను దెబ్బతీయదని, అది తేలికపాటి మూత్రవిసర్జన ప్రభావాన్ని కలిగి ఉంటుందని తద్వారా తక్కువగా నీటిని తీసుకునే అలవాటున్న వ్యక్తులలో ద్రవ నష్టాన్ని బాగా పెంచడానికి దోహదం చేస్తుందని ఆయన చెబుతున్నారు.. శీతాకాలంలో, నీటి తీసుకోవడం తగ్గిస్తూ దానిని నీటిని టీ లేదా కాఫీతో భర్తీ చేస్తారని ఆయన పేర్కొన్నారు, అక్కడే నిజమైన ప్రమాదం దాగి ఉంది.రోజుకు పలు కప్పుల చాయ్ లేదా కాఫీ తాగే వ్యక్తులకు, శరీర బరువు కార్యాచరణ స్థాయిని బట్టి, మొత్తం రోజువారీ ద్రవం తీసుకోవడం 2 నుంచి 2.5 లీటర్ల వరకు ఉండాలనేది సాధారణ సలహా అని డాక్టర్ జగదీష్ చెప్పారు. ‘తగినంత హైడ్రేషన్ను నిర్వహించడానికి ప్రతి కెఫిన్ పానీయం ఒక గ్లాసు సాదా నీటితో సమతుల్యం చేసుకోవాలి అని ఆయన సూచిస్తున్నారు.శీతాకాలపు కీళ్ల నిర్వహణలో హైడ్రేషన్ ఒక భాగం మాత్రమే నంటున్న ఆయన. ‘క్రమం తప్పకుండా కదలిక వ్యాయామాలు, కీళ్ల చుట్టూ కండరాల బలాన్ని నిర్వహించడం, ఎక్కువసేపు కూర్చోకుండా ఉండటం శరీరాన్ని వెచ్చగా ఉంచడం అన్నీ మెరుగైన కీళ్ల ఆరోగ్యానికి దోహదం చేస్తాయి. ఆస్టియో ఆర్థరైటిస్ ఉన్నవారు తరచుగా నడక, సైక్లింగ్ లేదా నీటి ఆధారిత వ్యాయామాలు వంటి తక్కువ ప్రభావ కార్యకలాపాల ద్వారా ప్రయోజనం పొందుతారని, అలాగే విటమిన్ డి, కాల్షియం ఒమేగా–3 అధికంగా ఉండే ఆహారాలను తగినంతగా తీసుకోవాలని సిఫార్సు చేస్తున్నారు.(చదవండి: ఆ హరిహరసుతుడి అరవణ ప్రసాదం డబ్బాల కొరత..) -
నోటిఫికేషన్లతో కెరీర్ డేమేజ్
అర్ధరాత్రి సరిగ్గా 2:17 గంటలకు అర్చనకు టీమ్స్ నోటిఫికేషన్ వచ్చింది. కళ్లు తెరవాలనిపించలేదు. కానీ ఏం నోటిఫికేషన్ వచ్చిందో వెంటనే చెక్ చేయమని మెదడు అరుస్తోంది. మెదడే నెగ్గింది. అర్చన స్మార్ట్ ఫోన్ ఓపెన్ చేసింది. ‘Tomorrow's Deck Updated’’ అని నోటిఫికేషన్ కనిపించింది. నిద్ర ఎగిరిపోయింది. ఇది కేవలం అర్చన కథ కాదు. ప్రతి నగరంలో, ప్రతి కంపెనీలో వేలాది మంది ప్రొఫెషనల్స్ ఇలా ఫోన్ నోటిఫికేషన్ శబ్దాలకు నిద్రను కోల్పోతున్నారు. చూడ్డానికి ఇది చిన్న డిస్టర్బెన్స్ అనిపిస్తుంది. కానీ దాని ప్రభావం వృత్తి, వ్యక్తిత్వం, మానసిక ప్రశాంతత... ఇలా అన్నిటిపై పడుతుంది. ఫోన్ నోటిఫికేషన్లు మన జీవితం మీద చేస్తున్న దాడులు కేవలం శబ్దాల దాడులు కావు. అవి మైక్రో–బ్రెయిన్ హిట్స్. ప్రతి పింగ్ ఒక చిన్న ఒత్తిడి. ప్రతి చిన్న ఒత్తిడి ఒక పెద్ద డిస్టర్బెన్స్. ప్రతి డిస్టర్బెన్స్ చివరకు బర్న్ఔట్కు దారితీస్తుంది. సైన చెప్పే అసలు నిజం...మన మెదడు ఏ పని మీదైనా ఫోకస్ పెట్టగలిగే సమయం సుమారు 8 నుంచి 12 నిమిషాలు మాత్రమే. ఆ సమయంలో దానికి విఘాతం కలిగితే తిరిగి ఫోకస్ రావడానికి 23 నిమిషాలు పడుతుందని బ్రెయిన్ సైంటిస్టులు చెప్తున్నారు. ఉద్యోగులకు రోజుకు వచ్చే నోటిఫికేషన్ల సంఖ్య: వాట్సప్–120, ఈమెయిల్ అలర్ట్స్–40–100, టీమ్స్ 85–150, కేలండర్ పింగ్స్ 10–20. అంటే రోజుకు సగటున 250–300 విఘాతాలు. అంటే మీ ఎనిమిది పని గంటల సమయంలో ఐదు గంటలు పూర్తిగా ఫోకస్ లేకుండా వృథా అవుతున్నాయి. అందుకే చాలామంది ప్రొఫెషనల్స్ రోజంతా బిజీగా ఉన్నప్పటికీ రోజు చివర్లో ‘ఏం చేశాను?’ అనిపిస్తుంది. ఇది మీ తప్పు కాదు. ఇది మీ మెదడుపై జరిగిన దాడి.అలసట కాదు, బ్రెయిన్ డామేజ్ప్రపంచ ఆరోగ్య సంస్థ 2019లో బర్న్ఔట్ను occupational phenomenon’ జాబితాలో పెట్టింది. వర్క్ ప్లేస్ ఒత్తిడి వల్ల మెదడు ఎగ్జాస్ట్ అవుతోందని అర్థం. బర్న్ఔట్కు మూడు ప్రాథమిక లక్షణాలున్నాయి. ∙భావోద్వేగ అలసట. అంటే, ఉదయం లేచిన వెంటనే శక్తి లేకపోవడం. ‘ఇవాళ కూడా ఇదేనా...’ అనిపించడం. ∙పనిపట్ల విసుగు. ఎంతో ఇష్టంగా చేసిన పని కూడా ఇప్పుడు చిరాకు తెప్పించడం. ∙పనితీరు పడిపోవడం, సృజనాత్మకత క్షీణించడం. చిన్న చిన్న నిర్ణయాలు తీసుకోవడంలో కూడా గందరగోళం.షాకింగ్ విషయం ఏమిటంటే నోటిఫికేషన్లు ఈ మూడు లక్షణాలను డైరెక్ట్గా పెంచుతాయని పరిశోధనలు చెబుతున్నాయి. స్టాన్ఫర్డ్ న్యూరోసైన్స్ ల్యాబ్స్ స్టడీ ప్రకారం నోటిఫికేషన్ల వల్ల పనితీరు 17శాతం పడిపోతుంది. ‘ఒక్క నిమిషం...’తో కెరీర్ డ్యామేజ్నిరంతర నోటిఫికేషన్లతో ఫోకస్ కోల్పోవడం వల్ల జరిగే నష్టం మూడు దిశల్లో సాగుతుంది.1. నోటిఫికేషన్లు మీ డీప్ జోన్ను విచ్ఛిన్నం చేసి మిమ్మల్ని ఒక రియాక్షన్–మోడ్ ఉద్యోగిగా మార్చేస్తాయి. దీనివల్ల మీరు క్రియేటివ్ థింకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్స్ లాంటి డీప్ వర్క్స్ సమర్థంగా చేయలేరు. దాంతో గుర్తింపు, పదోన్నతి, నాయకత్వ స్థానాలకు దూరమవుతారు. 2. ‘ఏం జరిగినా వెంటనే స్పందించాలి’ అనుకోవడం విధేయత కాదు, బర్న్ అవుట్ ప్రారంభదశ. దీనివల్ల భావోద్వేగ క్షీణత జరుగుతుంది. 3. మీరు రోజంతా బిజీగా ఉన్నా ప్రభావం శూన్యం కావడం మీ కెరీర్ గ్రోత్కు అత్యంత ప్రమాదకరం. మేనేజర్లు, హెచ్ఆర్, ఉన్నతాధికారులు దీన్ని గమనిస్తారు.ఇది కేవలం మీ తప్పా?ఇది కేవలం మీ తప్పు కానే కాదు, ఈనాటి వర్క్ ప్లేస్ సమస్య. ఈనాటి ఆఫీసుల్లో మీటింగ్స్ ఎక్కువ, మెసేజింగ్ యాప్స్ ఎక్కువ. డెడ్ లైన్లు నెత్తిమీద కూర్చుంటాయి. అందరూ ‘అర్జెన్సీ అడిక్షన్’లో చిక్కుకు పోయారు.పరిష్కారాలు... 1. రోజులో కనీసం రెండు గంటలు ‘నో నోటిఫికేషన్ జోన్’. ఆ సమయాన్ని మీ డీప్ వర్క్కు ఉపయోగించండి. 2. నోటిఫికేషన్ డైట్ పాటించండి. అంటే, వాట్సప్ గ్రూప్లను మ్యూట్ చేయండి. సోషల్ మీడియాను ఆఫ్ చేయండి. ఈమెయిల్స్ రోజుకు మూడుసార్లు మాత్రమే చెక్ చేయండి. 3. ప్రతి 90 నిమిషాల పని తర్వాత ఐదు నిమిషాల బ్రేక్ తీసుకోండి. ఆ సమయంలో కొద్దిగా నడవండి. లేదా నీళ్లు తాగండి. ఇది మీ కాగ్నిటివ్ ఎనర్జీని తిరిగి పెంచుతుంది. 4. మల్టీ టాస్కింగ్ అనేది మెదడుకు విషం లాంటిది. సింగిల్ టాస్క్ ఆక్సిజన్ లాంటిది. అందుకే ఒకసారి ఒకేపని అనే నిబంధన పెట్టుకుని పాటించండి. -సైకాలజిస్ట్ విశేష్ఫౌండర్, జీనియస్ మేట్రిక్స్ హబ్సైకాలజిస్ట్ విశేష్www.psyvisesh.com -
చిట్కాలున్నా... చికిత్సే ముఖ్యం!
సోషల్ మీడియా వచ్చాక ఓ ఉత్పాతమూ వచ్చిపడింది. ‘పాత పేషెంట్ కొత్త డాక్టర్తో సమాన’మంటూ అప్పట్లో ఓ సామెత లాంటి వాడుక ఉండేది. దాన్ని నిజం చేస్తూ పాత పేషెంట్లూ అంతకుమించి పాపులర్ సెలిబ్రిటీలైన సోనాలీ బెంద్రే, మనీషా కోయిరాలా, క్రికెట్ దిగ్గజం యువరాజ్ సింగ్, హాలీవుడ్ మోడల్ లీజా రే వంటి జనాల్లో మంచి క్రేజ్ ఉన్న వ్యక్తులు... ‘ఆటోఫేజీ’ అనే ఓ సైంటిఫిక్ పదాన్ని... ఇటీవలి పాపులర్ చిట్కా మంత్రా పదమైన ‘వెల్నెస్ చికిత్స’తో కలగలిపి ‘వెల్నెస్’ అద్భుతాల తాలూకు ప్రభావాలను సోషల్ మీడియా ప్రచారం చేస్తున్నారు. ఉపవాసాలూ, డీటాక్స్ విధానాల్లాంటివే అద్భుత మాయా–మంత్రాలంటూ ప్రజలకు ఇంపుగా ప్రజెంట్ చేస్తున్నారు. అసలు అన్నం కంటే పక్కన అంచుకుపెట్టుకుని నంజుకునే చిరుతిండినే నిజభోజనంగా వర్ణిస్తున్నారు. వాళ్ల మాటల మాయల్లో పడుతున్న జనాలు... అసలు వాస్తవాల కంటే అద్భుతాలనే ఎక్కువగా నమ్ముతున్నారు. ఫలితంగా ఈ ‘మిరాకిల్స్ థెరపీ’లను ఎక్కువగా నమ్ముతూ ఉండే అదే క్యాన్సర్కు అద్భుత చికిత్సేమోనంటూ అమాయక ప్రజలు అసలుకే మోసం తెచ్చుకుంటున్నారు. ఈ విషయంపై క్యాన్సర్ నిపుణులైన డాక్టర్ల మాటేమిటో చూద్దాం.వాళ్లు క్యాన్సర్ను జయించిన యోధులే. అద్భుత మనోబలంతో క్యాన్సర్ మహమ్మారిని ఎదుర్కొన్న మహామహులే. తాము క్యాన్సర్ను అధిగమించాక తాము అనుసరించిన చిట్కాలను వెల్లడిస్తూ వాళ్లు చెబుతున్న కొన్ని మాటలేమిటో చూద్దాం. → ఇంటర్మిట్టెంట్ ఫాస్టింగ్ (రోజుకు నియమిత వేళల్లోనే తిని... మిగతా సమయమంతా ఉపవాసంలో గడపడం), యాంటీ ఇన్ఫ్లమేషన్ డైట్ తీసుకోవడం, కొద్దిపాటి వ్యాయామంతో తాను క్యాన్సర్నుంచి బయటపడ్డానంటోంది ప్రముఖ బాలీవుడ్– టాలీవుడ్ ఫేమ్ సోనాలి బెంద్రే. → క్లీన్ ఈటింగ్ ప్రాసెస్ చేయని, రిఫైన్ చేయని, పొట్టుతీయని ముడి ధాన్యాలతో వండిన భోజనం)తో పాటు యోగా, ప్రాణాయామం వంటి వాటితో క్యాన్సర్ను జయించానన్నది ప్రముఖ నటి మనీషా కోయిరాలా మాట. → కీమోతో పాటు... క్రమశిక్షణతో కూడిన జీవనమూ భోజనమూ, దేహంలోని విషాలను శుభ్రపరిచే డీ–టాక్స్ ఆహార విహారాలూ తననుంచి క్యాన్సర్ను దూరం చేశాయంటాడు క్రికెటర్ యూవీ (యువరాజ్ సింగ్). → శాకాహారంతో కూడిన భోజనం, ధ్యానం (మెడిటేషన్), యోగా ఆయుర్వేద మార్గాల పయనం వల్లనే తనకు క్యాన్సర్ నయమయ్యిందంటోంది ప్రముఖ మోడల్, లీజా రే. ఇక్కడ ఈ ప్రముఖులు చెప్పిన చిట్కాలన్నీ ‘ఆటోఫేజీ’ అనే ప్రక్రియను వేగవంతం చేశాయనీ... అందువల్లనే తమకు క్యాన్సర్ వేగంగా, ప్రభావపూర్వకంగా నయమైందంటూ చెబుతున్న సోషల్ మీడియా వేదికగా చెబుతున్న మాటలు సాధారణ ప్రజల మెదళ్లలోకి తేలిగ్గా ఎక్కుతున్నాయి. వాళ్ల మనసుల్లోకి సులువుగా వెళ్తున్నాయి. అయితే జీవనశైలిలో ఆరోగ్యకరమైన మార్పులైన ఆ వెల్నెస్ మార్గాలు మంచివే. కానీ అవే క్యాన్సర్ను పూర్తిగా నయం చేయలేవని అంటున్నారు. ‘ఆటోఫేజీ’ అనే ఇటీవలి సైంటిఫిక్ పరిభాషకు చెందిన ఆ పదం అర్థం ఏమిటో తెలుసుకోవాల్సిన అవసరం ఎక్కువగా ఉందన్నది వైద్యప్రముఖుల మాట. దాంతోపాటు ‘అపాప్టోసిస్’, ‘ ప్రోటీయోజోమ్’ అనే పదాలకు అర్థాలు వాటి వెనక పరమార్థాలూ తెలుసుకుంటే కేవలం అద్భుతాలనిపించే చికిత్సప్రక్రియలు... (మిరాకిల్ రెమిడీలు) మాత్రమే కాకుండా వాస్తవ చికిత్సలకు తోడుగా... ఈ అనుబంధ మార్గాలూ జతగూడినప్పుడే అసలు ఫలితాలు వస్తాయంటున్న డాక్టర్ల మాటల ఆంతర్యాలను తెలుసుకుందాం...అసలు ‘ఆటోఫేజీ’ అంటే ఏమిటి? దేహంలో ఎప్పటికప్పుడు కణాలు పుడుతూ, చనిపోతూ ఉంటాయి. అందులో చనిపోయిన కణాలతో పాటు కొన్ని నిరర్థకమైనవీ, వ్యర్థమైనవీ ఉంటాయి. మన దేహంలోని శుభ్రం చేసే వ్యవస్థ ఇలాంటి మృతకణాలూ, నిరర్థక, వ్యర్థకణాలను తొలగిస్తూ ఉంటుంది. ఇలా ఆరోగ్యకరమైన కణాల మనగడను సుగమం చేస్తూ, ఈ మృత, వ్యర్థ, నిరర్థక కణాలను తినేసే ప్రక్రియనే ‘ఆటోఫేజీ’ అంటారు. ఈ సెలిబ్రిటీల మాటేమిటంటే... పైన చెప్పిన ఉపవాసాలూ, ప్రాణాయామ ధ్యానాలూ, డీటాక్స్ ప్రక్రియల వంటి వెల్నెస్ మార్గాల ద్వారా మన ఆరోగ్యకరమైన కణాలన్నీ ‘క్యాన్సర్ కణాలనే’ తినేస్తే? అప్పుడు క్యాన్సర్ హరించుకుపోయి ఆరోగ్యం దక్కుతుందనేలా వారి సోషల్ మీడియా సందేశాలు ప్రజలకు చేరుతున్నాయి. అంతకంటే సంక్లిష్టమైనది ఆటోఫేజీ...నిజానికి ‘క్యాన్సర్ బయాలజీ’లో ఆటోఫేజీ ప్రక్రియ అంతకంటే చాలా సంక్లిష్టమైనది అంటున్నారు ఆధునిక వైద్యచికిత్సకులు. ఒకసారి అదేమిటో చూద్దాం. ∙కణంలో మరిన్ని సూక్షమైన అంతర్గతమైన భాగాలు (ఆర్గనెల్స్) దెబ్బతిన్నప్పుడు ఆ కణం మనుగడ కష్టం. అది చనిపోయే ప్రక్రియలో దేహం దాన్ని శుభ్రం చేసి తొలగిస్తుంది. అందులోని ప్రోటీన్ శిథిలాలను ఒకచోట చేర్చి ఊడ్చేస్తుంది. అలా చనిపోయిన లేదా బలహీనపడి నిరర్థకం కాబోతున్న కణాలను దేహం తొలగించివేస్తుంది. దీన్నే ‘ఆటోఫేజీ’ అంటారు.అదీ మరచిపోతున్న ముప్పు... ఇదీ చేస్తున్న తప్పు... ఇక్కడ సెలిబ్రిటీలు ఒక విషయం మరచిపోతున్నారు. తమకున్న పరిమితమైన వైద్యపరిజ్ఞానంతో అసలు విషయాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. ఉపవాసాలు చేస్తున్నప్పుడు తన జీవక్రియల కోసం దేహంలోని కణాలు తమకు కావాల్సిన ఆహారం కోసం మృత/వ్యర్థకణాలనూ, క్యాన్సర్ కణాలనూ తినేస్తాయని భావిస్తున్నారు. కానీ ఇక్కడ వారు ఒక ముప్పును విస్మరిస్తున్నారు. క్యాన్సర్ కణం కూడా ఒక కణమే. దానికీ ఆహారం కావాలి. ఉపవాసం ద్వారా దానికి అవసరమైన ఆహారాలు అందనప్పుడు అది కూడా ఆరోగ్యకరమైన కణాలనూ తినేయడం మొదలుపెట్టేందుకు అవకాశాలు ఎక్కువ. అంతేకాదు... మామూలు కణం కంటే కూడా అది మరింత చురుగ్గా, మరింత వేగంగా ఆరోగ్యకరమైన కణాలను కబళించవచ్చు. పైగా ఆహారం అందకపోవడంతో దేహాన్ని రక్షించుకునే వ్యాధి నిరోధక వ్యవస్థ మరింత బలహీనపడితే క్యాన్సర్ కణజాలాలే మామూలు ఆరోగ్యవంతమైన కణాలను తినేయడం ప్రారంభిస్తే అది మొదటికే మోసం వచ్చే పరిస్థితి! అంటే ఉపవాసం వల్ల క్యాన్సర్ ఎండిపోవడానికి (ఫాస్టింగ్ స్టార్వ్స్ క్యాన్సర్) బదులుగా తామే ఆకలితో మాడాల్సి వస్తుందని తెలిసినప్పుడు క్యాన్సర్ కణాలు ఇంకా ఇంకా కుతంత్రాలతో (కన్నింగ్గా) ఆరోగ్యవంతమైన కణాలను తినేయడం మొదలుపెట్టే ప్రమాదలెన్నో పొంచి ఉంటాయి.ఆటోఫేజీ లాంటిదే ఆటాప్టోసిస్... సెలిబ్రిటీలు ఆటోఫేజీ గురించి సోషల్ మీడియాలో మాట్లాడటం వల్ల దాని గురించి మామూలు ప్రజలకు తెలియరావచ్చు. కానీ... ఈ రంగంలో ఇలా ఆటోఫేజీలా పనిచేస్తూ క్యాన్సర్ కణాలను తినేసేందుకు దోహదపడే పరిశోధనలూ, అలాంటి పరిజ్ఞానాలూ, పరిభాషా... ఇలాంటివి వాళ్లకు తెలియని అంశాలెన్నో ఇంకా ఉన్నాయి. ఉదాహరణకు అటాప్టోసిస్, యూబిక్విటిన్– ప్రోటియోజోమ్ సిస్టమ్ వంటివి. ఉదాహరణకు అటాప్టోసిస్ అంటే ఏమిటో చూద్దాం. ఎవరినైనా బాగా కించపరిచి, కోలుకోలేనంతగా నిందిస్తే వాళ్లేం చేస్తారు? తట్టుకోలేక ఆత్మహత్యకూ ఒడిగట్టవచ్చు కదా! అచ్చం అపాప్టోసిస్ ప్రక్రియలో కూడా అలాంటిదే జరుగుతుంది.యుబిక్విటిన్ – ప్రోటియోజోమ్ సిస్టమ్ అంటే... యుబిక్విటిన్ అనేది ఏ ప్రోటీన్కు అంటుకుంటుందో దాన్ని కాలపరిమితి ముగిసిపోయిన లేదా చెడిపోయిన / లోపభూయిష్టమైన ప్రోటీన్గా గుర్తించవచ్చు. అది కణంలో ఉన్నప్పుడు కణం సమతౌల్యాన్ని దెబ్బతీస్తుంది. అందుకే యుబిక్విటిన్ ప్రోటీన్ కణం నుంచి తొలగిపోవాలి. అప్పుడే కణం చురుగ్గా నార్మల్ కణంగా ఉంటుంది. అలా కణం నుంచి యుబిక్విటిన్ను తొలగించడానికి తోడ్పడేందుకు ఉద్దేశించిన వ్యవస్థ... అంటే యుబిక్విటిన్ ప్రోటీన్ను ధ్వంసం చేసేందుకు తోడ్పడే వ్యవస్థే ప్రోటియోజోమ్ వ్యవస్థ. అంటే ప్రోటియోజోమ్ అన్నది ప్రోటీన్ డిస్ట్రక్షన్ సిస్టమ్ అన్నమాట. ఈ యుబిక్విటిన్ అనేది అలాగే ఉంటే అది చెడిపోయిన కణానికి అమరత్వం ఇస్తుంది. ఒకవేళ ఆ చెడిపోయిన కణాలకు అమరత్వం ఉంటే అవి తొలగిపోవు. కాబట్టి ఈ ప్రోటియోజోమ్... తన డబుల్ నెగెటివ్ మార్గంలో వాటిని గుర్తించి ధ్వంసం చేస్తుంది. అలా చెడుకణాలూ లేదా దెబ్బతిన్న/లోపభూయిష్టమైన కణాలను తొలగిస్తుంది. ఇతి జరిగేందుకు దోహదపడేదే ‘యుబిక్విటిన్ – ప్రోటియోజోమ్ వ్యవస్థ’గా చెబుతారు.కొన్ని మందులతో ప్రోటీయోజోమ్ ప్రక్రియను అడ్డుకుని క్యాన్సర్ను తగ్గించడం ఇలా... ఈ యుబిక్విటిన్– ప్రోటియోజోమ్ ప్రక్రియను గుర్తించిన వైద్య శాస్త్రవేత్తలు ‘బార్టెజోమిబ్’ అలాగే ‘కార్ఫిల్జోమిబ్’ వంటి ప్రోటియోజోమ్ ఇన్హిబిటర్లను తయారు చేసి ప్రయోగించారు. ఈ మందులతో ‘మైలోమా’ అనే క్యాన్సర్ నయం కావడం మొదలైంది. ఇలాంటి మందులను ( ప్రోటియోజోమ్ ఇన్హిబిటర్స్ను) మరిన్ని కనుగొనడం ద్వారా అనేక రకాల క్యాన్సర్లను తగ్గించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇలా చూసినప్పుడు ఆటోఫేజీ, అపాప్టోసిస్, ప్రోటీయోజోమ్ అనేవి చాలా సంక్లిష్టమైన ప్రక్రియలు. అవి కొనసాగే మార్గాలను (పాత్ వేస్) అనేక మందుల సహాయంతో నిర్వహితమయ్యేలా చేయడం వల్ల క్యాన్సర్ కణం తనంతట తాను మటుమాయమయ్యే పరిస్థితి ఉంటుంది. ఇప్పటికి ఇది ‘మైలోమా’లోనే సఫలీకృతమైంది. కానీ ఇంకా కొన్ని క్యాన్సర్ల (సాలిడ్ ట్యూమర్స్) విషయంలోనూ, మరిన్ని క్యాన్సర్లలోనూ విజయవంతం కావాల్సి ఉంది. ఇందుకోసం రకరకాల కాంబినేషన్లలో అపాప్టోసిస్ మాడ్యులేటర్లు, ఇమ్యూనో, టార్గెట్ థెరపీ ప్రక్రియలూ, ప్రోటియోజోమ్ ఇన్హిబిటర్లు రూపొందించడంలో వైద్యశాస్త్రజ్ఞులు నిమగ్నమై ఉన్నారు.ఆ అపోహలన్నీ అలా ఆవిర్భవించినవే... ఎన్నో ఏళ్లుగా అటాప్టోసిస్ ప్రక్రియను క్యాన్సర్ను జయించేందుకు ఒక ప్రత్యామ్నాయ ‘నేచర్ క్యూర్’ ప్రక్రియగా జనం అపోహపడుతున్నారు. కొన్ని ఆహారాల ద్వారా క్యాన్సర్ లాంటి లోపభూయిష్టమైన కణాలు తమంతట తామే తమ మరణశాసనం రాసుకునేలా చేయడం (యాక్టివేటెడ్ / ప్రోగ్రామ్డ్ సెల్ డెత్)గా చాలామంది పొరబడుతుంటారు. కానీ అది పొరబాటు. క్యాన్సర్ కణాలు ఎంత జిత్తులమారివి అంటే... అవి ‘అటాప్టోసిస్’నూ తప్పించుకోగలవు. అదెలాగంటే... సెల్ను అపాప్టోసిస్కు గురిచేసే ప్రక్రియలో క్యాన్సర్ కణంలోని పవర్హౌజ్ అయిన మైటోకాండ్రియాను దెబ్బతీసే ప్రయత్నం జరుగుతుంది. అదే సమయంలో ‘బీసీఎల్–2’ అనే కుటంబానికి చెందిన మరో ప్రోటీన్ విడుదలై అది యాంటీ అపాప్టోటిక్ ప్రక్రియ ద్వారా క్యాన్సర్ కణంలోని మైటోకాండ్రియాలోకి రసాయనాలు వెళ్లకుండా చేయడం ద్వారా తనను తాను రక్షించుకుంటుంది.చివరగా... ప్రస్తుతానికి అందుబాటులో ఉన్న ప్రభావవంతమైన క్యాన్సర్ చికిత్సలు రేడియోథెపీ, కీమోథెరపీ, శస్త్రచికిత్సలే. వీటి తర్వాతే ఉపవాసాలూ, యోగా, ధ్యానం, డీ–టాక్స్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఆహారాలూ, పోషకాహారాలూ, నేచురోథెరపీలను అనుబంధంగా ఉపయోగించుకోవాలి. ఏ సెలిబ్రిటీలు చెప్పినా అవి ప్రత్యామ్నాయ చిట్కాలే తప్ప ప్రధాన చికిత్సలు కావని అందరూ తెలుసుకోవాలంటున్నారు డాక్టర్లు.అపాప్టోసిస్ అంటే... క్యాన్సర్ అంటేనే అది చెడిపోయిన / నార్మల్గా ఉండని కణం అన్న విషయం తెలిసిందే. ఏవైనా రసాయనాల ద్వారా ఓ చెడిపోయి దెబ్బతిన్న కణాన్ని మరింతగా అవమానించేలా చేస్తే అది బాగా కుంగి కుచించుకుపోయి నశించిపోయే పరిస్థితే ‘అపాప్టోసిస్’ అని చెప్పవచ్చు. నిజానికి చాలా సంక్లిష్టమైన జీవరసాయన పద్ధతికి ఇక్కడ చెప్పినది మామూలు ప్రజానీకానికి అర్థమయ్యేలా చెప్పేందుకు ఇదో సింపుల్ వివరణ అనుకోవచ్చు. అంటే కొన్ని రసాయనాలను ఉపయోగించి ఓ కణాన్ని అవమానించడం ద్వారా దాని మరణాన్ని అదే తెచ్చుకునే ‘ ప్రోగ్రామ్డ్ సెల్ డెత్’ కార్యక్రమం ఈ అపాప్టోసిస్.నిర్వహణ: యాసీన్ -
90 ఏళ్లకు మించి బతుకుతామా? ఈ ఐదు పరీక్షలు నెగ్గితే!
ఆధునిక ప్రపంచంలో ఆరోగ్యకరమైన సుదీర్ఘ జీవితం కావాలని అందరూ కోరుకుంటారు. అయితే ఎంత కాలం జీవించగలం అనేది జెనెటిక్ అంశాలతో పాటు, జీవనశైలి, రోజువారీ అలవాట్ల మీద కూడా ఆధారపడి ఉంటుందని చాలా అధ్యయనాలు ద్వారా తెలుస్తోంది. దీర్ఘాయుష్కులుగా 90 అంతకంటే ఎక్కువ కాలం జీవించ గలమా లేదా అనేది తెలుసుకోవాలంటే 5 అద్భుతమైన పరీక్షలున్నాయి, వీటిల్లో చాలామంది మూడు పరీక్షల్లోనే ఫెయిలవుతున్నారు అంటూ డాన్ గో అనే ఫిట్నెస్ కోచ్ ఇన్స్టా పోస్ట్ నెట్టింట ఇంట్రిస్టింగ్ మారింది. మరి ఆ పరీక్షలేంటో ఒకసారి చూసేద్దామా?సాధారణంగా సుదీర్ఘం కాలం ఆరోగ్యంగా బతకాలంటే ఒత్తిడి లేని జీవితం, సమతుల ఆహారం, చక్కటి వ్యాయామం, ఒక వయసుదాటిన తరువాత కొన్ని ఆరోగ్య పరీక్షలు (ఇతర ప్రమాదకర అనారోగ్య సమస్యలు ఏమీ లేనివారు) చేయించుకుంటూ ఉంటే సరిపోతుంది కదా. మరి 90 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ జీవించగలరా అనేది తెలియాలంటే ఈ అయిదు పరీక్షలు చాలా కీలకమంటూ ఆరోగ్య కోచ్ షేర్ చేశారు. View this post on Instagram A post shared by Dan Go | Fitness Coach (@coachdango)నడక వేగంఎంత వేగంగా నడవ గలరు అనేదాని మీద కూడా మన ఆయుష్షు ఆధారపడి ఉంటుందట. ఇచ్చిన సమయ వ్యవధిలో మీరు ఎంత వేగంగా నడవగలరో చెక్ చేసుకోవాలి. ఇది గుండెలోని నాళాల పనితీరుకు సంకేతం. 1 మీ/సె (2.2 మైళ్ల) కంటే ఎక్కువ వేగం ఎక్కువ ఆయుర్దాయం కలిగిస్తుందని అంచనా. . 2.7 మైళ్ల కంటే ఎక్కువ వేగంగా నడవ గలిగితే మరణం ముప్పు తగ్గుతుందట. వేగంగా నడిచేవారిలో వృద్ధాప్యం లక్షణాలు తొందరగా కనిపించవు.విశ్రాంతి హృదయ స్పందన రేటులో రెస్టింగ్ హాట్ బీట్ రేట్ (ఏ పనీలేదా వ్యాయామం చేయకుండా విశ్రాంతిగా ఉన్నపుడు) మన గండెప నితీరుకు, ఒత్తిడిని తట్టుకునే శక్తికి నిదర్శనం.నిమిషానికి 70 బీట్స్ (బిపిఎం) కంటే తక్కువ కొట్టుకుంటే సాలిడ్గా ఉన్నట్టు. 60 బిపిఎం కంటే తక్కువ అంటే ఎలైట్ దీర్ఘాయువు ప్రాంతం.అదే విశ్రాంతి సమయంలో 80-90 బిపిఎం కంటే ఎక్కువ గుండె స్పందన ఉంటే గుండె దృఢత్వానికి సంబందించిన వ్యాయామాలు మొదలు పెట్టాల్సిందే అని సూచన.కూర్చుని పైకి లేచే ( Sit and Rise) పరీక్షడాన్ చెప్పిన దాని ప్రకారం 87 శాతం మంది ఈ పరీక్షలో ఫెయిల్ అవుతున్నారట.ఇది చాలా సులభం అనుకుంటారుగానీ, నేలపై కూర్చుని,చేతుల సాయం లేకుండా తిరిగి నిలబడటం అనేది వయస్సు పెరిగే కొద్దీ బలం, సమతుల్యత, చలనశీలత, సమన్వయానికి నిదర్శనం. 85 సంవత్సరాల వయస్సులో, గాయాలకు సంబంధించిన అన్ని మరణాలలో దాదాపు 2/3 వంతు పడిపోవడంవల్లే సంభవిస్తాయి. 8 మంది పెద్దవారిలో ఒకరు మాత్రమే ఈ ఎక్సర్సైజ్ చేయగలరు.బార్ హ్యాంగ్స్ (గ్రిప్ స్ట్రెంత్)దీనికి ఆహారం లేదా వ్యాయామంతో సంబంధం లేదు.బలమైన పట్టు గుండె ఆరోగ్యం, కండరాల బలం, ,ఎముక సాంద్రతకు సూచిక. గ్రిప్ స్ట్రెంత్ దీర్ఘాయువును అంచనా వేస్తుంది. అందుకే పరిశోధకులు దీనిని ఆరో ముఖ్యమైన సంకేతం అంటారు. 90 సెకన్లలో బార్ పట్టుకుని వేలాడితే సాధారణం కంటే బెటర్గా ఉన్నట్టు.ఒక మైలు పరుగు సమయంఏ వయసులోనైనా 10 నిమిషాల్లో ఒక మైలు పరుగెత్తగలిగితే, హృదయనాళ వ్యవస్థ మంచి స్థితిలో ఉన్నట్టు. 8 నిమిషాల కంటే తక్కువ సమయమైతే దీర్ఘాయుష్షు-అథ్లెట్ స్థాయి ఫిట్నెస్తో ఉన్నట్టు అర్థం. ఇది ఫిట్నెస్ స్థాయికి స్నాప్షాట్ లాంటిది. ఎంత ఫిట్గా ఉన్నారో అంచనా వేయడానికి శరీర ప్రతిస్పందనలే సూచిక అని డాన్ వెల్లడించారు.నోట్ : ఆరోగ్య , ఫిట్నెస్కు సంబంధించి ఇది ఒక సలహా మాత్రమే. ఏదైనా అనారోగ్య సమస్యలున్నవారు సంబంధిత వైద్యుల సలహా తీసుకోవడం సరియైన మార్గం. -
ఎందుకొచ్చిన తలనొప్పి ఇది?
ఒక విచిత్రమైన విషయం తెలుసా? మన ఎమోషన్స్కూ, ఆలోచనలకూ, ఉపాయాలకూ, బాధలకూ, సంతోషాలకూ కారణమైన మెదడులో ఉండేదంతా కేవలం కొవ్వుల కణజాలం మాత్రమే. అయినా ఒంట్లో ఎక్కడెక్కడి నొప్పులనూ తాను ఇట్టే తెలిసేలా చేస్తుంది కదా... కానీ ఇంతా చేసి ఇలా అన్ని నొప్పుల్నీ తెలియజేసే ఈ మెదడుకు మాత్రం నొప్పి తెలియదు. తనను కోస్తున్నా తనకు నొప్పే తెలియని ఇదే మెదడు... మిగతా ‘తల’నొప్పులను మాత్రం ఎందుకు తెలియజేస్తుంది? అసలు తలనొప్పి అంటే ఏమిటి? అది ఎందుకు వస్తుంది?... ఇలాంటి అనేక ప్రశ్నలకు సమాధానాలు.మామూలుగా తలనొప్పి అనగానే తేలిగ్గా తీసుకున్నా... ‘అబ్బ... అదో తలనొప్పి రా’ అనే వాడుక మాట వల్ల అదెంత దుర్భరంగా ఉంటుందో, ఎలా మన రోజునూ, సంతోషాలనూ పాడుచేస్తుందో చెప్పకనే చెప్పినట్లవుతుంది. అన్నట్టు తలనొప్పి వచ్చినప్పుడు ఓ ఆసక్తికరమైన ప్రశ్న కూడా ఉద్భవిస్తుంది. అదేమిటంటే... మెదడుకు నొప్పి అనే అనుభూతే కలగక΄ోతే... తలనొప్పి సమయంలో ఇంత బాధ ఎందుకు కలుగుతుంది? అప్పుడు తలలో ఏం జరుగుతుందంటే... ఎప్పుడెప్పుడు...? నాడీ వ్యవస్థలో ఏమైనా సమస్యలున్నా, మైగ్రేన్ వంటి సమస్య లేదా ఏదైనా తీవ్రమైన మానసిక ఒత్తిడి వంటి సమస్యలు ఉన్నప్పుడు చాలామందిలో తలనొప్పి వస్తుంటుంది. అంతేకాదు... ఈ తలనొప్పుల రహస్యాలను ఇంకా ఎందరో పరిశోధకులూ, వైద్యశాస్త్రవేత్తలూ శోధిస్తూ తలనొప్పుల కారణాలను అన్వేషిస్తూ కొత్త కొత్త విషయాలను తెలుసుకుంటున్నారు. తోడు తెచ్చుకునే ఇతర నొప్పులెన్నో! సాధారణంగా తలనొప్పి ఒంటరిగా రాకుండా... మరికొన్ని నొప్పులతో పాటు వస్తుంటుంది. ఉదాహరణకు... ∙వికారం ∙ముక్కు కారుతుండటం కళ్ల నుంచి నీళ్లు కారుతుండటం ∙దేనిపైనా దృష్టి కేంద్రీకరించలేని సమయాల్లో... ఇలా పైన పేర్కొన్న లక్షణాలతోపాటు తలనొప్పి ఎందుకు వస్తుంటుందన్నది స్పష్టంగా తెలియదు. కానీ ఇప్పటికి తెలిసిందల్లా... దేహాన్ని రక్షించే ప్రక్రియలో భాగంగానే ఇలా జరుగుతోందన్న విషయం మాత్రం స్పష్టం. ఎందుకు వస్తాయి? సాధారణంగా శరీరం ఏదో రకమైన ఒత్తిడి.. శారీరకమైన ఒత్తిడి లేదా భావోద్వేగాల వల్ల లేదా పర్యావరణపరమైన ఒత్తిడుల వల్ల కావచ్చు. మెదడు, మెడ చుట్టూ ఉండే నరాలు, రక్తనాళాలు చాలా సున్నితమైన మార్పులకూ తేలిగ్గా ప్రతిస్పందించేలా ఉంటాయి. దాంతో పైన పేర్కొన్న ఏ మార్పులు కలిగినా వెంటనే ఇరిటేట్ అయి నొప్పిని కలిగించేలా చేస్తాయి. వైరల్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు, అలర్జీలు, కౌమారసమయంలో హార్మోన్లలో వచ్చే మార్పులు, నిద్రలేమి, ఒంట్లో నీరు తగ్గడం (డీహైడ్రేషన్), ఆహారం తీసుకోక΄ోవడం, మోతాదుకు మించి కెఫిన్ తీసుకోవడం వంటి వాటితో తలనొప్పులు రావచ్చు. అలాగే తీవ్రమైన భావోద్వేగాలకు లోనుకావడం వల్ల కూడా తలనొప్పిని ప్రేరేపిస్తుంది. ఉదాహరణకు బాగా ఉద్విగ్నతకు లోనుకావడం, తీవ్రంగా ఎక్సైట్ కావడం, తీవ్రమైన విచారంలో మునిగి΄ోవడం వంటి చర్యలు మెదడులోని కొన్ని రసాయనాల సమతుల్యతను భగ్నం చేస్తాయి. కండరాల్లో ఒత్తిడిని కలిగిస్తాయి. ఇవన్నీ కలిసి తలనొప్పులను ప్రేరేపిస్తాయి. ఒక్కోసారి వాతావరణంలో తీవ్ర మార్పు... ఉదాహరణకు ఒక ప్రదేశంలో ఎక్కువగా ఉన్న వాతావరణ ఒత్తిడి కారణంగా సైనస్లలో ఒత్తిడి పెరిగి అది ముఖం కండరాల్లో ముఖ్యంగా నుదురు వెనకనుండే ప్రదేశం, చెంపలు, కళ్ల దగ్గర ఉండే కండరాల్లో టెన్షన్ వృద్ధి చేయడం వల్ల కూడా తలనొప్పి రావచ్చు. నివారణ / చికిత్స తలనొప్పులకు చికిత్స అందించాలంటే ముందుగా దానికి నిర్దిష్టమైన కారణం ఏదో తెలుసుకోవాలి. మైగ్రేన్ లాంటి తీవ్రమైన, డాక్టర్ దగ్గర చికిత్స అందించాల్సిన తలనొప్పి మినహా చాలా రకాల తలనొప్పులు సింపుల్గా జీవనశైలిలో మార్పులు చేసుకోవడం వల్లనే తగ్గి΄ోతాయి. ఉదాహరణకు నీళ్లు ఎక్కువగా తాగుతూ దేహాన్ని హైడ్రేటెడ్గా ఉంచుకోవడం లాంటి సాధారణ సూచనలతోనూ తగ్గుతాయి. ఇక వేళకు తినడం, వేళకు నిద్ర΄ోవడం వల్ల నాడీవ్యవస్థలో సమతౌల్యత, క్రమం తప్పని వ్యాయామం వల్ల ఒత్తిడి తగ్గడం వంటి చర్యలతో చాలావరకు నివారితమవుతాయి లేదా అవి వచ్చే అవకాశాలు బాగా తగ్గుతాయి. దీనికి తోడుగా యోగా, రిలాక్సేషన్ టెక్నిక్స్, బ్రీతింగ్ ఎక్సర్సైజ్లతో ఒత్తిడి తగ్గించుకోవడం ద్వారానూ నివారించుకోవచ్చు. చికిత్స విషయానికి వస్తే... ఒకటి రెండుసార్లు పెయిన్ కిల్లర్స్ వాడాక అప్పటికీ తలనొప్పలు వస్తూనే ఉంటే.... దానికి ఇంకేదో కారణం (అండర్ లైయింగ్ కాజ్) ఉంటుందని గ్రహించి, దానికి చికిత్స తీసుకోవాలి. ఇక మైగ్రేన్కు డాక్టర్లు అప్పటికప్పుడు నొప్పిని తగ్గించేందుకు ఒక రకం, మళ్లీ మళ్లీ రాకుండా ఉండేందుకు మరో రకం... ఇలా రెండు రకాల మందులు వాడతారు. ఇలా తలనొప్పులకు కారణాలు తెలుసుకునే దానికి తగ్గ చికిత్స తీసుకోవడం ద్వారా తలనొప్పులు తగ్గుతాయి. – యాసీన్తలనొప్పి అంటే ఏమిటి?తలనొప్పిని అర్థం చేసుకోవాలంటే మొదట మెదడు నొప్పిని అనుభవించదు అనే విషయాన్ని తెలుసుకోవాలి. ఎందుకంటే మెదడులో నొప్పిని తెలుసుకునే పెయిన్ రిసె΄్టార్స్ ఉండవు. దాంతో మెదడుకు గాయమైనా లేదా మెదడును కోస్తున్నా అది నొప్పిని అనుభవించదు. ఇటీవల కొన్ని సందర్భాల్లో మెదడుకు సర్జరీ చేస్తుంటే బాధితుడికి సినిమా చూపిస్తూ శస్త్రచికిత్స నిర్వహించామంటూ న్యూస్పేపర్లలో, టీవీల్లో చూసిన సంఘటనలు చాలామందికి గుర్తుండే ఉంటాయి. అయితే మెదడు చుట్టూ ఉండే అనేక పొరలు, రక్తనాళాలు, వాటిని రక్షించే కణజాలం, నాడీతంత్రులు, నరాల్లో నొప్పిని గ్రహించే పెయిన్ రిసె΄్టార్స్ వల్లనే తలనొప్పి అనుభవంలోకి వస్తుంది.మైగ్రేన్ అంటే ఏమిటి?మైగ్రేన్ అనేది తలనొప్పుల్లో చాలా తీవ్రంగా నొప్పిని కలగజేస్తుంటుంది. తలబద్దలవుతున్నట్లుగా వచ్చే ఈ తలనొప్పితో పాటు వికారం, వాంతులు, వెలుతురు చూడలేక΄ోవడం/ శబ్దాలు వింటుంటే చికాకు, కళ్ల ముందు మిరిమిట్లు గొలుపుతున్నట్లుగా వింతకాంతులు ఇలాంటి లక్షణాలూ కలగలసి బాధను మరింత తీవ్రతరం చేస్తాయి. ప్రతి పదకొండు మంది పిల్లల్లో ఒకరిని బాధించే ఈ మైగ్రేన్ వల్ల చాలామంది పిల్లలు చదువులో వెనకబడతారు. ఆడుకోలేరు, గదిలోంచి కదల్లేనంతగా బాధపడుతుంటారు. తమకు సరిపడని ఏదో అంశం పిల్లలను ట్రిగర్ చేయడం వల్ల వచ్చే ఈ తలనొప్పిలో మెదడులోని నొప్పిని తెలిపే పాత్వేస్ అవసరానికంటే ఎక్కువగా... అంటే మరింతగా ప్రతిస్పందించడం వల్ల నొప్పి కలుగుతుంది. తల్లిదండ్రుల్లో ఈ వ్యాధి ఉన్నవారి పిల్లల్లో ఇది అనువంశీకంగా కూడా రావచ్చు. తీవ్రమైన ఎండ, గాఢమైన వాసనలు, చెవులు బద్దలయ్యే శబ్దాలు, వేళకు తినక΄ోవడం / వేళకు నిద్ర΄ోక΄ోవడం వంటి అంశాలు మైగ్రేన్ను ప్రేరేపించవచ్చు. -
సూపర్స్టార్ రజనీకాంత్ ఫిట్నెస్ సీక్రెట్..! ఇప్పటికీ యువ హీరోలా..
తమిళ సినిమా ఐకాన్ రజనీకాంత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికీ కుర్రహారోల మాదిరిగా అంతే ఫిట్గా ఉండటమే కాదు, స్టైలిష్గా డ్యాన్స్లు కూడా చేస్తుంటారు. ఏడు పదుల వయసులోనూ అంతే స్ట్రాంగ్ పర్సనాలిటి మెయింటైన్ చేస్తున్న సూపర్స్టార్ డైట్ సీక్రెట్ తెలిస్తే ఆశ్చర్యపోతారు. అంతేగాదు ఒక చెన్నై డాక్టర్ రజనీ డైట్ గురించి వివరిస్తూ ఇన్స్టాగ్రామ్లో ఓ వీడియోను కూడా ఇషేర్ చేశారు. మరి ఇవాళ (డిసెంబర్ 12) రజనీకాంత్ 75వ పుట్టిన రోజు సందర్భంగా ఆయన ఆరోగ్య రహాస్యాలు, డైట్ ఎలా ఉంటుంది వంటి వాటి గురించి ఆ డాక్టర్ మాటల్లోనే తెలుసుకుందామా.చెన్నై బారియాట్రిక్ సర్జన్ డాక్టర్ ప్రీతి మృణాళిని రజనీ ఆరోగ్య రహస్యం గురించి ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. ఆయన ఐదు తెల్లటి ఆహారాలను నివారించడం వల్ల ఇంతలా ఆరోగ్యంగా యాక్టివ్గా ఉన్నారని అన్నారామె. ఉప్పు, చక్కెర, మైదా, పాలు, పెరుగు అతిగా తీసుకుంటే వాపు, ఇన్సులిన్ స్పైక్లు, ఆమ్లత్వం, గట్ సమస్యలకు దోహదం చేస్తాయి. అలాగే ఆయన మంచి పోషకవంతమైన ఆహారం తోపాటు రోజువారీ వ్యాయామాలు, ధ్యానం వంటివి ఆరోగ్యకరమైన వృద్ధాప్యానికి దోహదపడతాయని అన్నారు. అలాగే డాక్టర్ మృణాళిని రజనీ డ్యాన్సులు చేస్తున్న వీడియోలు పంచుకుంటూ..మన సూపర్ స్టార్ రజనీకాంత్ 74 సంవత్సరాల వయస్సులో కూడా చాలా అందంగా నృత్యం చేస్తున్నారు కదా..!. దానికి కారణం ఏంటో తెలుసా..అంటూ ఆయనే స్వయంగా తాను ఎలాంటి ఆహారం తీసుకుంటాననేది చెబుతున్న వీడియోని కూడా ఆమె జోడించారు. ఆ వీడియోలో రజనీకాంత్ స్వయంగా తాను తెల్లటి ఆహారాలకు దూరంగా ఉంటానని అన్నారు. అవేంటో కూడా ఆయనే చెప్పారు కూడా.ఆ ఐదు ఎందుకు నివారించాలంటే.1. ప్రాసెస్ చేసిన తెల్లటి చక్కెరడాక్టర్ మృణాళిని మాట్లాడుతూ.. "ఇది బొడ్డు కొవ్వు, ఇన్సులిన్ నిరోధకత, ఆకలి కోరికలను పెంచుతుంది. కాబట్టి, దీన్ని ఎంత త్వరగా నివారిస్తే అంత మంచిది." అని సూచించారు.2. తెల్ల ఉప్పుపరిమితంగా తీసుకోకపోతే పొట్ట ఉబ్బరం, అధిక బిపి (రక్తపోటు) కూడా రావొచ్చు3. తెల్ల బియ్యందీన్ని (తెల్ల బియ్యం) కూరగాయలతో కలిపి మితమైన పరిమాణంలో తీసుకుంటే పర్లేదు లేదంటే బరువు వేగంగా పెరిగిపోయేందుకు దారితీస్తుందని హెచ్చరించారు డాక్టర్ మృణాళిని. 4. మైదాబియ్యంలో కొద్దిగా ఫైబర్ ఉంటుంది, కానీ మైదాలో పూర్తిగా జీరో కేలరీలు ఉంటాయి. కాబట్టి, బరువు పెరగడం ఖాయం అని హెచ్చరిస్తున్నారు వైద్యులు5. పాలు, పెరుగు వెన్న వంటి పాల ఉత్పత్తులుఇవి కాల్షియం, ప్రోటీన్లకు మంచి మూలం. కానీ, 40 ఏళ్ల తర్వాత, జీవక్రియ మందగించడం ప్రారంభమవుతుందట. అందువల్ల వీటిని ఎక్కువగా తీసుకోకపోవడమే మంచిదని అంటున్నారు. అప్పుడే పొట్ట ఉబ్బరం, అధిక బరువు సమస్య దరిచేరవని అంటున్నారు.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. View this post on Instagram A post shared by Dr.Preethi Mrinalini | Laparoscopic & Bariatric Surgeon (@dr.preethimrinalini) చదవండి: డెలివరీ బాయ్ నుంచి జొమాటో డిజైనర్ రేంజ్కు! మనసును కదిలించే సక్సెస్ స్టోరీ.. -
మధుమేహులకు గుడ్ న్యూస్ : నోవో నార్డిస్క్ మందు వచ్చేసింది
డానిష్ ఔషధ తయారీ సంస్థ నోవో నార్డిస్క్ తన బ్లాక్బస్టర్ యాంటీ-టైప్-2 డయాబెటిస్ డ్రగ్ ఓజెంపిక్ (సెమాగ్లుటైడ్ ఇంజెక్షన్)ను ఇండియాలో లాంచ్ చేసింది. దీన్ని అధిక బరువు నియంత్రలో కూడా వాడుతున్నారు. 0.25 మిల్లీగ్రాముల డోసేజ్ వెర్షన్కు వారానికి రూ. 2,200 ప్రారంభ ధరకు భారతదేశంలో విడుదల చేస్తున్నట్లు శుక్రవారం ప్రకటించింది.ఈ ఔషధం 0.25మి.గ్రా., 0.5 మి.గ్రా, 1 మి.గ్రా మూడు మోతాదు రూపాల్లో లభిస్తుంది నొప్పి లేకుండా సబ్కటానియస్ నోవోఫైన్ నీడిల్స్ ఇంజెక్షన్. ఇది సింగిల్-యూజ్ ప్రీ-ఫిల్డ్ పెన్. ‘ఒజెంపిక్’ను మొదటి 4 వారాల పాటు వారానికి ఒకసారి చొప్పున 0.25 మి.గ్రాతో ప్రారంభిస్తారు, ఆ తర్వాత కనీసం 4 వారాల పాటు వారానికి ఒకసారి 0.5 మి.గ్రా స్టెప్ అప్ డోసేజ్ ఇస్తారు. లాంగ్ డోసేజ్ కింద వారానికి ఒకసారి 1 మి.గ్రీ వరకు తీసుకోవచ్చు.ఇదీ చదవండి : దీన్ని సివిక్ సెన్స్ అంటారా..రోడ్డుపై రచ్చ మూడు మోతాదుల ఇంజెక్షన్గా ప్రీ-ఫిల్డ్ పెన్ను వస్తుంది. దీని ఖరీదు నెలకు రూ.8800 (వారానికి రూ.2200), మరొక డోస్ ధర రూ.10,170 (వారానికి రూ.2542.5), నెలకు రూ.11,175 (వారానికి రూ.2793.75) అవుతుందని కంపెనీ చెప్పింది.భారతదేశంలో ఇన్సులిన్ ధరల జోన్లోనే ఇది అందుబాటులో ఉందన్నారు. ఇదొక కీలకమైన అభివృద్ధిగా అభివర్ణించారు. వైద్య చరిత్రను మార్చిన పెన్సిలిన్ , యాంటీ బయాటిక్స్ ఆవిష్కరణలకు ఇది సమానమని నోవో నార్డిస్క్ ఇండియా కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్, మేనేజింగ్ డైరెక్టర్ విక్రాంత్ శ్రోత్రియ పేర్కొన్నారు. నిజంగా ఓజెంపిక్ను ఈ ధర జోన్లోకి తీసుకురావడం చాలా కష్టతర మైందన్నారు. ఇండియాలో వైద్యులు సూచన మేరకు ఎక్కువ మంది తమ మందును వాడాలని ఆశిస్తున్నామన్నారు. దీని వాడకంపై ఆందోళనలుమానసిక-ఆరోగ్య సవాళ్లు, ఆత్మహత్య ధోరణుల ఆందోళనలపై బరువు తగ్గించే మందులపై ఆస్ట్రేలియా కొత్త భద్రతా హెచ్చరిక మధ్య, విస్తృతమైన ప్రపంచ & భారతీయ నియంత్రణ సంస్థ పరిశీలన నేపథ్యంలో ఇండియాలో అలాంటి ప్రతిసవాళ్లేవీ లేవని విక్రాంత్ శ్రోత్రియ ప్రకటించారు.కాగా చైనా తర్వాత భారతదేశంలో టైప్ 2 డయాబెటిస్ రోగులు అధికంగా ఉన్నారు. వేగంగా పెరుగుతున్న ఊబకాయం రేట్లతో పాటు, వేగంగా అభివృద్ధి చెందుతున్నబరువు తగ్గించే మందుల మార్కెట్లో వాటా కోసం పోటీ పడుతున్న ప్రపంచ ఔషధ తయారీదారులకు కీలకమైన జోన్గా ఇండియా మారింది. దీనికి సంబంధించి ప్రపంచ మార్కెట్ దశాబ్దం చివరి నాటికి ఏటా 150 బిలియన్ డాలర్లుగా ఉంటుందని అంచనా. -
ఆరోగ్యకరమైన జీవనశైలితో డయాబెటిస్ తగ్గిపోతుందా..?
చాలామందిని వేధించే సమస్య డయాబెటిస్. గణాంకాలు సైతం రానున్న రోజుల్లో భారత డయాబెటిస్ కేరాఫ్గా మారనుందంటూ హెచ్చరిస్తున్నాయి కూడా. కొందరికి అధిక బరువుతో మొదలై డయాబెటిస్ బారినపడి ఇబ్బందులు పడుతున్నవారెందరో. కానీ కొందరూ ఆ వ్యాధి రావడంతోనే మేల్కొని ఆరోగ్య స్పృహ తెచ్చుకుని మరి బరువు తగ్గడమే కాదు డయాబెటిస్ని ితిప్పుకొడుతున్నారు. ఆ కోవలో ఈ కామెడీ హీరో కూడా చేరిపోయి ప్రేరణ కలిగిస్తున్నారు. ఏకంగా 78 ికిలోలు వరకు బరువు ఉండే ఆయన అంతలా ఎలా బరువు తగ్గారో సవివరంగా తెలుసకుందామా...!.అమెరికా హాస్య నటడు 'మైక్ అండ్ మోలీ' స్టార్ బిల్లీ గార్డెల్ టైప్ 2 అధికబరువుతో ఇబ్బంది పడుతూ ఉండేవాడు. డయాబెటిస్ నిర్ధారణ అయ్యేటప్పటికీ సుమారు 172 కిలోలు పైనే బరువు పెరిగిపోయాడు. సరిగ్గా 2020లో రక్తంలో చక్కెర స్థాయిలు అధికమయ్యేంత వరకు మేల్కొలేదు. అదీగాక ఆ టైంలో మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో బిల్లీ గార్డెల్ అధిక బరువు, స్లీప్ అప్నియా, ధూమపానం చేసేవాడు, టైప్ 2 డయాబెటిస్, ఉబ్బసం వంటి అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటుండేవాడు. ఓపక్క కరోనా మహమ్మారి,మరోవైపు అనారోగ్యా జాబితాతో భయాందోళనలకు లోనై ఆరోగ్య స్పృహపై ఫోకస్ పెట్టాడు. కానీ తగ్గుదామని ఉపక్రమించిన ప్రతిసారి పెరిగిపోవడంతో లాభం లేదనుకుని..తన వ్యక్తిగత వైద్యులతో చర్చించి మరి బరువు తగ్గించే సర్జరీలకు ప్లాన్ చేశాడు.మార్పు వచ్చిందా అంటే..ఈ 53 ఏళ్ల గార్డెల్ జూలై 2021లో బారియాట్రిక్ శస్త్రచికిత్స చేయించుకున్నాడు. ఇది అతడి పరివర్తనలో తొలి అడుగు. ఆహారం విషయంలో తీసుకున్న జాగురకత..మంచి మార్పుకి శ్రీకారం చుట్టింది. కడుపు ఫుల్గా ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలతో ఓదార్పునిచ్చే ఆహారం తీసుకుంటూ..ఆకలిని నియంత్రించగలిగాడు. అలా 78 కిలోల వరకు అధిక బరువుని తగ్గించుకుని స్లిమ్గా హీరోలా మారిపోయాడు. అంతేగాదు డయాబెటిస్ కూడా నయం అయిపోయింది.ఇది మంచిదేనా అంటే..నిపుణుల అభిప్రాయం ప్రకారం, ముఖ్యంగా ఊబకాయం ఉన్నవారు గణనీయమైన బరువు తగ్గడం వల్ల టైప్ 2 డయాబెటిస్ను తిప్పికొట్టగలరని చెబుతున్నారు. ఇక్కడ హాస్య నటుడు కాలేయం , క్లోమంలో కొవ్వును తగ్గించి.. ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరిచాడు. ఇది రక్తంలో చక్కెర స్థాయిలు తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడానికి వీలు కల్పించి డయాబెటిస్ నుంచి ఉపశమనం అందిస్తుంది. అయితే బరువు పెరిగితే మాత్రం మళ్లీ డయాబెటిస్ తిరగబెట్టొచ్చు. అందువల్ల ఇలా సర్జరీ చేయించుకున్నవాళ్లు ఆ బరువుని మెయింటైన్ చేసేలా..జీవనశైలిలో మార్పులు, వ్యాయామం తదితరాల విషయాల్లో కేర్ తీసుకుంటే చాలని చెబుతున్నారు నిపుణులు. అంతేగాదు ఇక్కడ బరువు తగ్గించే సర్జరీతో కేవలం ఐదు నుంచి పది శాతమే బరువు తగ్గుతారని, ఆ తర్వాత అంతా ఫిజికల్గా మనం కష్టపడి స్లిమ్గా మారాల్సిందేనని చెబుతున్నారు నిపుణులు.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం . పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: భారత్ గుర్తింపును "మధురంగా" మార్చిన మహిళ..!ఆనంద్ మహీంద్రా ప్రశంసల జల్లు..) -
తస్మాత్ జాగ్రత్త..! బాడీబిల్డర్లు కండలు ముఖ్యమే కానీ..
‘జిమ్కు వెళ్లేవారు స్టెరాయిడ్లు వాడుతున్నారు’ అనే మాట వినిపించినప్పుడు కళ్ల ముందు కండలు తిరిగిన పురుషుడి చిత్రం ఆవిష్కృతం అవుతుంది. అయితే సీన్ మారుతోంది. పురుషులే కాదు స్టెరాయిడ్లు వాడుతున్న మహిళల సంఖ్య కూడా పెరుగుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి...ప్రపంచవ్యాప్తంగా మహిళలలో అనబాలిక్ స్టెరాయిడ్ల వాడకం పెరిగిందని చెబుతోంది ఇంటర్నేషనల్ స్టడీస్ సిస్టమేటిక్ రివ్యూ. 2014లో స్టెరాయిడ్లు వాడిన మహిళలు 1.6 శాతం ఉండగా, 2024 రివ్యూ ప్రకారం 4 శాతం మంది మహిళలు స్టెరాయిడ్లు ఉపయోగిస్తున్నారు. మహిళా బాడీబిల్డర్లలో దాదాపు 17 శాతం మంది, ప్రతి ఆరుగురిలో ఒకరు స్టెరాయిడ్లను ఉపయోగిస్తున్నారని నివేదిక చెబుతోంది. ఈ పెరుగుదలకు సోషల్ మీడియాలోని ‘ఫిట్ఫ్లూయెన్సర్స్’ ప్రభావమే కారణం అనే విమర్శ ఉంది.స్టెరాయిడ్లు వాడుతున్న వారిలో ఎక్కువమంది మహిళలకు దీర్ఘకాలంలో వాటి దుష్ప్రభావం గురించి అవగాహన లేదు. వీటిని వాడుతున్న క్రమంలో అనారోగ్య సమస్యలు ఎదురైనా వైద్యులను సంప్రదించడం లేదు.గతంతో పోల్చితే పవర్లిఫ్టింగ్, వెయిట్ లిఫ్టింగ్, బాడీబిల్డింగ్లలో మహిళల సంఖ్య వేగంగా పెరిగింది. ‘ఆటతీరు మెరుగు పడాలి. ప్రత్యర్థిపై పైచేయి ఉండాలంటే మాదకద్రవ్యాలు వాడాలి’ అనే భావన వల్ల కొందరు వాటికి దగ్గరవుతున్నారు.ఆస్ట్రేలియా, స్కాండినేవియాలలో చేసిన ఒక అధ్యయనం ప్రకారం...పురుష స్నేహితులు, కోచ్ల వల్ల స్టెరాయిడ్లను ఉపయోగించడం మొదలుపెడతారు. ఇవి హానికరం అనే భావన కంటే పోటీకి అనివార్యమనే భావనే వారిలో ఉంటుంది. స్టెరాయిడ్లు ఆటకు ఎంత మేలు చేస్తాయనేది పక్కన పెడితే ఆరోగ్యానికి హాని చేస్తాయి.వాటిలో కొన్ని...ముఖంపై వెంట్రుకలు పెరగడం స్వరంలో మార్పులు రుతుక్రమంలో మార్పులు, సంతానలేమి రొమ్ము కణజాలం తగ్గడం మొటిమలు రావడం, వెంట్రుకలు రాలడం ఆందోళన, చిరాకు, తీవ్రమైన మానసిక స్థితిస్టెరాయిడ్లలో సీసం, ఆర్సెనిక్, కాడ్మియంలాంటి ప్రమాదకరమైన విషపూరితాలు ఉంటాయని పరిశోధనలు తెలియజేస్తున్నాయి. ఇవి క్యాన్సర్, హృదయ సంబంధ వ్యాధులకు కారణమయ్యే విషాలు.‘ఈ ప్రమాదాలను నివారించాలంటే స్టెరాయిడ్ల వాడకం వల్ల కలిగే నష్టాల గురించి సోషల్ మీడియా వేదికగా ఫిట్నెస్ ఇన్ఫ్లూయెన్సర్ల ద్వారా విస్తృత ప్రచారం చేయడమే మార్గం’ అంటున్నారు నిపుణులు. (చదవండి: అయోర్టిక్ స్టెనోసిస్ అంటే..? తొమ్మిది పదుల వయసులో ఇది తప్పదా..?) -
నవ్వినా.. ఏడ్చినా... కుప్పకూలిపోతుంటాను..?
డాక్టర్ గారూ, నేనొక చిత్రమైన సమస్యతో బాధపడుతున్నాను. అదేమంటే, రాత్రి నేను ఎంతసేపు పడుకున్నా. రోజంతా మగత గానే ఉంటుంది. కంప్యూటర్ ముందు కూర్చున్నా టీ.వి చూస్తున్నా. చివరకు భోజనం చేస్తూ చేస్తూ అలాగే పడుకుని ΄ోతాను. డ్రైవింగ్ చేస్తూ నిద్రపోతానేమో అని ఈ మధ్య డ్రైవింగ్ చేయడం కూడా మానేశాను. అలాగే బాగా భయపడ్డా, గట్టిగా నవ్వినా కుప్పకూలిపోతాను. నేను కావాలనే ఇదంతా చేస్తున్నాననుకుని మా ఇంట్లో వాళ్లు నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళడం లేదు. నేను సాక్షిలో మీ కాలమ్ రెగ్యులర్గా చదువుతాను. కనీసం మీ సమాధానం చూసైనా ఇంట్లో వాళ్ళు నన్ను డాక్టర్కి చూపిస్తారనే నమ్మకంతో, నా సమస్యను మీకు మెయిల్ చేస్తున్నాను! – స్వాతి,ప్రొద్దుటూరుమీ సమస్య చాలా ఇబ్బందికరమైనది, మీ పరిస్థితికి బాధ కూడా కలుగుతోంది. కేవలం అవగాహనా లోపం వలన సరియైన చికిత్స అందుబాటులో ఉన్న సమస్యలని కూడా పట్టించుకోక పోవడం వల్ల ఎలా జరుగుతోందో మీ విషయాన్ని బట్టి అర్థం అవుతుంది. మీరు చెబుతున్న లక్షణాలని బట్టి మీరు ‘నార్కోలెప్సీ’ అనే సమస్యతో బాధపడుతున్నారని అనిపిస్తోంది. ఇది మెదడులోని ‘హైపోథాలమస్ అనే భాగం పని విధానంలో మార్పుల వలన వచ్చే ఒక న్యూరో.. సైకియాట్రిక్ డిజార్డర్. ఈ సమస్యలో నిద్రకి సంబంధించిన సాధారణ లయ దెబ్బతింటుంది. నిద్రలో వచ్చే REM & NREM అనే రెండు నిద్ర దశల క్రమ పద్ధతిలో మార్పులు ఈ సమస్యకి ప్రధాన కారణం. దాని వలన పడుకునే ముందు, నిద్రలేచే ముందు వివిధ రకాల భ్రాంతులు కలుగుతాయి. విపరీతమైన కలలు వస్తాయి. నిద్ర లేచే ముందు శరీరం పక్షవాతానికి గురైనట్లు అనిపిస్తుంది. కాళ్లూ చేతులు కదిలించలేరు. అన్నీ వినబడతాయి, కనబడతాయి, కానీ సమాధానం చెప్పలేరు. దీని వలన విపరీతమైన భయానికి, అసౌకర్యానికీ గురౌతారు. అలాగే బాగా ఎమోషనల్ అయినప్పుడు మెలకువ స్థితిలోనే, మెదడు REM స్థితిలోకి వెళ్ళిపోతుంది. దీనివలన ఒక్కసారిగా కుప్పకూలిపోతారు. ఈ అనుభవం కూడా అత్యంత భయానకంగా ఉంటుంది. ఒక్కొక్కసారి ఈ కండిషన్ను ‘ఫిట్స్’ అనుకొని తప్పుగా వైద్యం కూడా చేసే కేసులు కూడా చూస్తూంటాను. కొంతమంది కావాలనే ఇలా చేస్తున్నారనే అసలు చికిత్సే ఇప్పించరు. పాలిమ్నోగ్రఫీ అనే పరీక్ష ద్వారా ఈ సమస్యను నిర్ధారించవచ్చు. అలాగే ‘స్టిమ్యులెంట్సు, కొన్ని రకాల ‘యాంటీ డిప్రెసెంట్’ మందులు వాడితే ఈ సమస్య నియంత్రణలో ఉంటుంది. ఎక్కువగా ఎమోషన్స్కి గురికాకుండా కౌన్సెలింగ్ కూడా తీసుకోవాలి. ఉదయంపూట కొంచెంసేపు నిద్రపోవడం కూడా ఈ సమస్యలోంచి బయట పడేందుకు దోహదం చేస్తుంది. మీరు నిరాశకు గురికాకుండా మీ ఇంట్లో వాళ్ళకి ‘సాక్షి’లో నా సలహా చూపించండి. అర్థం చేసుకొని మీకు వైద్య సహాయం అందిస్తారని నా నమ్మకం. ఆల్ ది బెస్ట్! డా. ఇండ్ల విశాల్ రెడ్డి, సీనియర్ సైకియాట్రిస్ట్, విజయవాడ. మీ సమస్యలు, సందేహాలు పంపవలసిన మెయిల్ ఐడీ: sakshifamily3@gmail.com -
అయోర్టిక్ స్టెనోసిస్ అంటే..? తొమ్మిది పదుల వయసులో ఇది తప్పదా..?
90 ఏళ్ల ప్రముఖ బాలీవుడ్ నటుడు ప్రేమ్ చోప్రాకు తీవ్రమైన అయోర్టిక్ స్టెనోసిస్ ఉన్నట్లు నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే. ఆ నేపథ్యంలోనే ఆయనకు ట్రాన్స్కాథెటర్ అయోర్టిక్ వాల్వ్ ఇంప్లాంటేషన్ (TAVI) ప్రక్రియ జరిగింది. దీన్ని గుండె సంబంధిత పరిస్థితిగా పేర్కొన్నారు వైద్యులు. గుండె కవాటాలు పనిచయకపోవడం వల్లే వచ్చే సమస్యగా పేర్కొన్నారు. అంటే గుండె, శరీరంలోని వివిధ భాగాల మధ్య ప్రధాన రక్త వాహక ధమని అయిన అయోర్టాకు రక్త ప్రవాహాన్ని ప్రభావితం చేస్తుంది. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నట్లు అల్లుడు షర్మాన్ జోషి ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అసలు అయోర్టిక్ స్టెనోసిస్ అంటే ఏంటి, ఇది ఎందువల్ల వస్తుంది తదితరాల గురించి తెలుసుకుందామా..!.అయోర్టిక్ స్టెనోసిస్ అంటే ఏమిటి?అయోర్టిక్ స్టెనోసిస్ (AS) అనేది అయోర్టిక్ వాల్వ్ తీవ్రమైన పరిస్థితి. ఈ స్థితిలో, బృహద్ధమని కవాటం ఇరుకుగా మారి పూర్తిగా తెరుచుకోదు. ఈ సంకుచితం గుండె నుంచి బృహద్ధమనిలోకి, తర్వాత శరీరంలోని మిగిలిన భాగాలకు రక్త ప్రవాహాన్ని అడ్డుకుంటుందని కార్డియాలజిస్ట్లు చెబుతున్నారు.ఎందువల్ల ఇలా అంటే.."రక్త ప్రవాహం తగ్గినప్పుడు, గుండె కండరం బలహీనపడవచ్చు. నిజానికి ఇది తీవ్రమైన సమస్య సకాలంలో సమస్యను నిర్థారించి చికిత్స అందించకపోతే తీవ్రమైన బృహద్ధమని స్టెనోసిస్ గుండె వైఫల్యంతో తీవ్ర సమస్యలకు దారితీస్తుందని చెప్పుకొచ్చారు.వయసు పెరిగే కొద్దీ, గుండె కవాటాల కాల్సిఫికేషన్ కారణంగా ఈ పరిస్థితి తరచుగా అభివృద్ధి చెందుతుంది. కాలక్రమేణా, కాల్షియం నిక్షేపాలు గట్టిపడతాయి వాల్వ్ కరపత్రాలను గట్టిపరుస్తాయి. దాంతో వాల్వ్ పూర్తిగా తెరవడం కష్టతరం చేస్తుంది. సింపుల్గా చెప్పాలంటే.. ఇది ఇరుక్కుపోయిన తలుపును తెరవడానికి ప్రయత్నించడం లాంటిది. అంటే ఊపిరిరాడని పరిస్థితి ఎదురవ్వుతుంది. బలవంతంగా ప్రయత్నిస్తే మరో సమస్య ఎదురుకావొచ్చని చెబుతున్నారు వైద్య నిపుణులు.లక్షణాలు ఎలా ఉంటాయంటే..ఊపిరి ఆడకపోవడం, ఛాతీ నొప్పి లేదా మూర్ఛపోవడం వంటి లక్షణాలను అనుభవిస్తే.. ఇరుకైన వాల్వ్ గుండెపై ఒత్తిడి తెస్తుందని అర్థం. ఇది గుండె వైఫల్య అవకాశాలను పెంచుతుంది. సకాలంలో చికిత్స అందకపోతే ప్రాణాలకే ముప్పు వాటిల్లుతుంది.ముందస్తుగా గుర్తించగలమా..?బృహద్ధమని స్టెనోసిస్ గమ్మత్తైనది. ఎందుకంటే ప్రారంభ దశల్లో గుర్తించడ కష్టం. ఇరుకైన బృహద్ధమని కవాటం ఉన్న చాలా మందికి ఎటువంటి లక్షణాలు ఉండవు. ఇది ప్రారంభ రోగ నిర్ధారణలను కోల్పోవడానికి దారితీస్తుంది. మితమైన బృహద్ధమని స్టెనోసిస్ ఉన్న చాలా మందికి లక్షణాలు ఉండవని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ కూడా పేర్కొంది. మరి ఎలా నిర్ధారిస్తారు?లక్షణాలు వెంటనే స్పష్టంగా కనిపించకపోవచ్చు కాబట్టి బృహద్ధమని స్టెనోసిస్ను గుర్తించడం కష్టంగా ఉంటుంది. ఈ పరిస్థితిని నిర్ధారించడానికి, ఇమేజింగ్ కీలక పాత్ర పోషిస్తుంది. బృహద్ధమని స్టెనోసిస్ తీవ్రతను విశ్లేషించడానికి, అంచనా వేయడానికి ఉత్తమ ప్రారంభ పరీక్ష ట్రాన్స్థొరాసిక్ ఎకోకార్డియోగ్రఫీ (TTE) ఈ పరీక్ష వాల్వ్ ప్రాంతం, రక్త ప్రవాహ వేగం, అలాగే వాల్వ్ అంతటా పీడన ప్రవణతలతో సహా సమాచారాన్ని అందిస్తుంది.వాటి తోపాటు ఎలక్ట్రో కార్డియోగ్రామ్లు (ECGలు), ఛాతీ ఎక్స్-కిరణాలు వంటి పరీక్షలు గుండె ఆరోగ్యాన్ని బాగా అర్థం చేసుకోవడానికి మనకు సహాయపడతాయి.TAVI ఒక్కటే ప్రత్యామ్నాయమా..ప్రేమ్ చోప్రా వంటి వృద్ధాప్య రోగులకు, TAVI నిజమైన ఆశను అందిస్తుంది. సాంప్రదాయకంగా, తీవ్రమైన బృహద్ధమని స్టెనోసిస్కు చికిత్స చేయడం అంటే ఓపెన్-హార్ట్ సర్జరీ కిందకు వస్తుంది. దానికంటే ఈ TAVI తక్కువ ప్రమాదంతో సులభంగా బయటపడతారు. ఈ చికిత్సలో తక్కువ రోజులో ఆస్పత్రిలో ఉంటే వెసులుబాటు తోపాటు తొందరగా కోలుకోగలం కూడా. అలాగే ఇది జీవన నాణ్యతను కొనసాగించే అవకాశాన్ని కూడా అందిస్తుంది.(చదవండి: -
రాగులు ఆరోగ్యానికి ఇంత మంచిదా..? అందుకే ఉపాసన అలా..
ఇటీవల కాలంలో ప్రజలలో ఆరోగ్య స్పృహ ఎక్కువైంది. అంతా పోషకాహారాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ముఖ్యంగా చిరుధాన్యాలను తీసుకునేందుకు చాలా ఆసక్తి కనబరుస్తున్నారు. ఆ చిరుధాన్యాలలో ఒకటి ఈ రాగులు. ఇవి ఆరోగ్యానికి ఎంత మంచిదంటే..సెలబ్రెటీలు, ప్రముఖులు సైతం వీటిని రోజువారీ ఆహారంలో భాగం చేసుకునేందుకే ఇష్టపడుతున్నారు. ముఖ్యంగా టాలీవుడ్ హీరో రామ్చరణ్ భార్య, మెగా ఇంటి కోడలు ఉపాసన సైతం ఇది డైట్లో తప్పనిసరని ఓ ఇంటర్వ్యూలో ఆమెనే స్వయంగా చెప్పడం విశేషం. అంతలా అందిరి మదిని దోచిన ఈ చిరుధాన్యం రాగులతో కలిటే లాభాలు, ఎలా తీసుకుంటే మంచిది తదితరాల గురించి సవివరంగా చూద్దామా..!.ఉపాసన కూడా క్రమశిక్షణతో కూడిన డైట్కే ప్రాధాన్యత ఇస్తారామె. 36 ఏళ్ల ఆమె ప్రతి రోజు ఆరోగ్యకరమైన పోషకాహారాన్నే తీసుకోవాలనే విశ్వసిస్తానంటోంది. చిరుధాన్యాల్లో తనకు బాగా నచ్చింద రాగులని పేర్కొంది. అంతేగాదు తనకు సద్గురు జగ్గీ వాసుదేవ్ ఇచ్చిన సలహాలను గుర్తు చేసుకుంటూ..ఉపాసన రాగులను ఏదోరూపంలో మీ డైట్ బాగంగా చేసుకోండని సూచించినట్లు వెల్లడించింది. అలాగే ఆయన కుమార్తే రాధా జగ్గీతో జరిగిన సంభాషణను కూడా షేర్ చేసుకున్నారామె. భరతనాట్య నృత్యకారిణి అయిన ఆమెకు సద్గురువే స్వయంగా రాగి గంజిని చేసి ఇచ్చేవారని, అదే తనను ఇంతలా ఫిట్గా ఆకర్షణీయంగా కనిపించేలా చేస్తోందని ఆమె చెప్పినట్లు పేర్కొన్నారు ఉపాసన. అందుకే దీన్ని తన కుమార్తె డైట్లో కూడా భాగం చేశానని చెప్పుకొచ్చింది. అయితే తన కూతురు ఈ రాగులను ఇష్టపడిందా అని అడిగితే మాత్రం..ఆరోగ్యం కోసం తప్పదు, తనకు మరో ఛాయిస్ లేదని నవ్వేశారామె. మరి నిజంగానే రాగులు అంత పోషకవంతమైనదా అంటే..ఎముకలకు బలం..రాగుల్లో క్యాల్షియం అధికంగా ఉంటుంది. ఇది ఎముకలను దృఢంగా మార్చి ఆరోగ్యంగా ఉంచుతుంది. వృద్ధాప్యంలో ఆస్టియో పోరోసిస్ వంటి ఎముకల సంబంధిత సమస్యలు రాకుండా చూస్తుంది. చిన్నారులు, వృద్ధులు రాగులను తింటే ఎంతో మేలు జరుగుతుంది. ఎముకలు బలహీనంగా మారకుండా ఉంటాయి. పాలిచ్చే తల్లులు కూడా రాగును తింటే శిశువుకు ఎంతో మేలు జరుగుతుంది. శిశువు ఆరోగ్యం మెరుగు పడుతుంది. ఎముకలు బలంగా మారుతాయి. చక్కగా ఎదుగుతారు.మధుమేహం రోగులకు..డయాబెటిస్ ఉన్నవారికి రాగులు ఎంతో మేలు చేస్తాయి. రాగుల గ్లైసీమిక్ ఇండెక్స్ విలువ చాలా తక్కువగా ఉంటుంది. అందువల్ల రాగులను తింటే రక్తంలో చక్కెర స్థాయిలు నెమ్మదిగా పెరుగుతాయి. దీని వల్ల షుగర్ లెవల్స్ నియంత్రణలో ఉంటాయి. డయాబెటిస్ ఉన్నవారికి ఎంతో మేలు జరుగుతుంది. రాగుల్లో అధికంగా ఉండే ఫైబర్, పాలిఫినాల్స్ షుగర్ లెవల్స్ను తగ్గించేందుకు సహాయం చేస్తాయి. రాగుల్లో ఫైబర్ అధికంగా ఉన్న కారణంగా జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. మలబద్దకం తగ్గుతుంది. అధికంగా బరువు ఉన్నవారు బరువును తగ్గించుకునేందుకు గాను రాగులు సహాయం చేస్తాయి.రక్తహీనతకు..రాగుల్లో ఐరన్ అధికంగా ఉంటుంది. ఇది సహజసిద్ధంగా మనకు లభిస్తుంది. అందువల్ల రాగులను తింటుంటే రక్తం వృద్ధి చెందుతుంది. రక్తహీనత తగ్గుతుంది. ముఖ్యంగా మహిళలు, చిన్నారులలో వచ్చే రక్తహీనత సమస్యను తగ్గించవచ్చు. రాగుల్లో అనేక రకాల యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. అనేక ఫినోలిక్ సమ్మేళనాలు సైతం ఉంటాయి. ఇవి ఆక్సీకరణ ఒత్తిడి తగ్గేందుకు సహాయం చేస్తాయి. దీని వల్ల కణాలకు జరిగే నష్టం నివారించబడుతుంది. ఫ్రీ ర్యాడికల్స్ వల్ల శరీరానికి జరిగే నష్టం తగ్గుతుంది. ఫలితంగా గుండెపోటు, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు రాకుండా అడ్డుకోవచ్చు.మితంగానే మంచిది..ఇన్నిప్రయోజనాలు కలిగించే రాగులున తగు మోతాదులోనే తీసుకోవాలని చెబుతున్నారు నిపుణుల. న్యూట్రిషన్ల ప్రకారం..రాగులను పిండి రూపంలో తీసుకుంటే రోజుకు 100 గ్రాముల వరకు తీసుకోవచ్చు. మరీ అధికంగా తింటే శరీరంలో ఆగ్జాలిక్ యాసిడ్ పెరిగే అవకాశం ఉంటుంది. ఇది కిడ్నీ స్టోన్లను కలగజేస్తుంది -
కాలేయ మార్పిడి చేయించుకున్న వారికి ఇన్ఫెక్షన్లు
గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో సైతం కాలేయ సంబంధిత సమస్యలు ఎదుర్కొంటున్న వారిలో ఇన్ఫెక్షన్ల తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు తేలడం ఆందోళన కలిగిస్తున్నదని సౌత్ ఏషియన్ లివర్ ఇనిస్టిట్యూట్ లివర్ ట్రాన్స్ప్లాంట్ విభాగాధిపతి ప్రొఫెసర్ డాక్టర్ టామ్ చెరియన్ అన్నారు. మంగళవారం బంజారాహిల్స్లో సౌత్ ఏషియన్ లివర్ ఇనిస్టిట్యూట్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రెండున్నరేళ్ళ పాటు కాలేయ మార్పిడి శస్త్రచికిత్స చేయించుకున్న 67 మంది రోగుల ఆరోగ్యంపై నిర్వహించిన అధ్యయనంలో బహుళ మల్టీ డ్రగ్ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్(ఎండీఆర్) తీవ్ర స్థాయిలో ఉన్నట్లు తేలిందన్నారు. 24 శాతం మందిలో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు ఉండగా మరి కొంత మందిలో ఇతర సమస్యలు ఉన్నాయన్నారు. 16 బ్యాక్టీరియా కేసుల్లో 15 మందిలో యాంటీ బయాటిక్స్కు పూర్తిగా రెసిస్టెంట్గా ఉండటం ఆందోళనకరంగా ఉందన్నారు. దీంతో పాటు కొన్ని కేసుల్లో యాక్సా జోలిడినోన్ తరగతికి చెందిన ఔషదాల పట్ల కూడా ప్రతిఘటన కనిపించడం ఆందోళన కలిగించే అంశమన్నారు. పాజిటీవ్ వచ్చిన 16 మందిలో తొమ్మిది మంది సర్జరీకి ముందే రక్త పరీక్షల్లో బ్యాక్టీరియా ఉన్నట్లు తేలిందని వారు అప్పటికే ఎండీఆర్ బ్యాక్టీరియాతో ఉన్నారని వెల్లడి అయిందన్నారు. ఈ అధ్యయనం వల్ల ఆరోగ్య విధానాల్లో చికిత్సా పద్ధతుల్లో మార్పు అవసరం ఉన్నదని సూచిస్తోందన్నారు. గత వందేళ్ళుగా రోగులకు ఇన్ఫెక్షన్ వ్యాప్తి చెందకుండా నియంత్రించడమే ఆస్పత్రుల ప్రధాన లక్ష్యంగా ఉండేదని తాజా అధ్యయనంలో ఆస్పత్రికి వచ్చే ముందే వారిలో ఎండీఆర్ ఇన్ఫెక్షన్ ఉండటం పరిశీలిస్తే ప్రస్తుతం అవలంభిస్తున్న విధానాలు సరిపోవని తేలిందన్నారు. కాలేయ మార్పిడి శస్త్ర చికిత్సకు ముందే ఇలాంటి ఇన్ఫెక్షన్లను గుర్తించి నియంత్రించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఇది జాతీయ స్థాయిలో ఆరోగ్య సంక్షోభంగా భావించాల్సి ఉంటుందని ప్రజలతో పాటు అన్ని వర్గాల వారు ఈ సమస్యపై తక్షణమే దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో లివర్ క్రిటికల్ కేర్ కన్సల్టెంట్ ఎ. గోగినేని తదితరులు పాల్గొన్నారు. -
మిసెస్ మామ్ గ్రాండ్ ఫినాలె..!
ఇటీవలి కాలంలో ప్రసవం అంటేనే సిజేరియన్ అంటున్నారని, వాటి కంటే సురక్షిత, సాధారణ ప్రసవాలే ఎప్పుడూ శ్రేయస్కరమని కిమ్స్ గ్రూప్ ఆస్పత్రుల సీఈఓ డాక్టర్ అభినయ్ తెలిపారు. సాధారణ ప్రసవాల మీద అవగాహన పెంపొందించే లక్ష్యంతో డాక్టర్ కె.శిల్పిరెడ్డి ఫౌండేషన్, కిమ్స్ కడల్స్ ఆస్పత్రి ఆధ్వర్యంలో గత ఎనిమిది సంవత్సరాలుగా విజయవంతంగా నిర్వహించిన మిసెస్ మామ్ తొమ్మిదో సీజన్ గ్రాండ్ ఫినాలె కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. డాక్టర్. శిల్పిరెడ్డి, డా. శిల్పిరెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ ప్రత్యేక కార్యక్రమం గర్భిణీ స్త్రీలకు మాతృత్వంలో ఉన్న సవాళ్లు, ఆనందాల గురించి తెలుసుకోవడానికి ఒక అవకాశాన్ని కల్పించింది. తొమ్మిదో సీజన్కు మొత్తం 220 జంటలు పేర్లు నమోదుచేసుకోగా వారిలో 57 జంటలు గ్రాండ్ ఫినాలెకు అర్హత సాధించారు. వారందరినీ డాక్టర్ అభినయ్ అభినందించారు. మాతృత్వం అనేది ఒక మధురానుభవం అని, అందులోని ప్రతి దశనూ తల్లిదండ్రులు ఇద్దరూ ఆస్వాదించాలని తెలిపారు. గర్భిణి అయిన భార్యను కంటికి రెప్పలా కాపాడుకోవడంతో పాటు, పుట్టబోయే బిడ్డ సంరక్షణ విషయంలో కూడా తండ్రులది చాలా కీలక పాత్ర అని ఆయన చెప్పారు. భర్త చేదోడువాదోడుగా ఉంటే భార్య తన మాతృత్వాన్ని మరింత ఆస్వాదించగలదని వివరించారు. సాధారణ లేదా సిజేరియన్ సురక్షిత ప్రసవాలు మంచివని డాక్టర్ అభినయ్ అన్నారు. గ్రాండ్ ఫినాలెకు హాజరైన అతిథులు, జంటలను ఉద్దేశించి కిమ్స్ కడల్స్ ఆస్పత్రి ఆబ్స్టెట్రిక్స్, గైనకాలజీ క్లినికల్ డైరెక్టర్ డాక్టర్ కె. శిల్పిరెడ్డి మాట్లాడుతూ.. “సాధారణ ప్రసవాలను ప్రోత్సహించడంతో పాటు కుటుంబం యొక్క గొప్పతనాన్ని పరిచయం చేయడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం. తల్లిదండ్రులు ఏం తినాలి, పిల్లలకు ఏం పెట్టాలనే అంశాలను వారికి వివరించాం. 70-80 రకాల అంశాలను ఈ తల్లిదండ్రులకు పరిచయం చేశాం. ఇంతమందికి ఒకేచోట అవగాహన కల్పించగలిగితే వాళ్లు సమాజంలో ఈ సందేశాన్ని పంచుతారు. సాధారణ ప్రసవం అనగానే నొప్పులు భరించలేం అన్నట్లుగా చెబుతున్నారు. ఇది తప్పు. గతంలో అన్నీ సాధారణ ప్రసవాలే ఉండేవి. తర్వాత క్రమంగా వివిధ కారణాలతో సిజేరియన్లు పెరిగాయి. ప్రసవం అనేది సహజంగా జరిగే ప్రక్రియ. దాన్ని అలాగే జరగనివ్వాలి. ఇంతకుముందు సీజన్లలో పాల్గొన్నవారిలో 85% మందికి సాధారణ ప్రసవాలే జరిగాయి. వక్రీకరణలు చాలా జరుగుతున్నాయి కాబట్టి, వీరికి అవగాహన పెంచాలి. ఇక్కడ పాల్గొన్నవారు తమ బంధువులు, స్నేహితులకు చెప్పినా నెమ్మదిగా సమాజం మొత్తం మారుతుంది” అని చెప్పారు. గర్భధారణ సంరక్షణ తోపాటు భవిష్యత్తు తల్లిదండ్రులకు అవసరమైన అవగాహన కల్పించారు. చదవండి: మేనరికాల జోడు..భావితరాలకు చేటు..! -
మేనరికాల జోడు..భావితరాలకు చేటు..!
బిడ్డ పుట్టగానే చుట్టాలూ పక్కాలూ అందరి ముఖాల్లో సంతోషమే. బిడ్డ కాళ్లూ వేళ్లూ... ఇలా అవయవాలన్నీ సరిగా ఉన్నాయో లేదో చూసి అంతా బాగుంటే పండంటి బిడ్డ అంటూ ఆనందిస్తారు, ఆశీర్వదిస్తారు. ఎదుగుతున్నకొద్దీ ఆ చిన్నారి కనబరుస్తున్న తెలివితేటలను చూసి ఇంకాస్త మురిసిపోతుంటారు. కానీ ఇలా ఎదిగే సమయంలో ఏవైనా మానసిక సమస్యలు కనిపిస్తే మాత్రం ఆ తల్లిదండ్రుల వేదన చెప్పనలవి కాదు. ఆ బాధను మాటల్లో వర్ణించడానికి వీలు కాదు. సాధారణంగా ఇలాంటి శారీరక వైకల్యాలూ, లేదా మానసికమైన ఎదుగుదల లోపాలూ కనిపించే పిల్లలు మేనరికపు వివాహాల్లోని జంటలకే పుట్టడం ఎక్కువ. అందుకే డాక్టర్లు కూడా దగ్గరి సంబంధాలు వద్దనే సూచిస్తుంటారు. ఎందుకు? మేనరికపు వివాహాల్లో ఇలా ఎందుకిలా జరుగుతుంది, ఒకవేళ మేనరికపు పెళ్లిళ్లు తప్పనప్పుడు బిడ్డ పుట్టకముందూ, కడుపున పడ్డ తర్వాత చేయించుకోవాల్సిన పరీక్షలూ, తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటనే పలు అంశాలను తెలుసుకునేందుకు ఉపయోగపడే కథనమిది.ఓ బిడ్డలో లోపం వచ్చిందంటే ... తల్లిదండ్రులిద్దరిలోంచి వచ్చిన జన్యువులే (జీన్స్) సాధారణంగా ఇందుకు కారణం. తల్లిదండ్రులకు చెందిన ఆ జన్యువుల్లో ఏ లోపాలూ లేకపోతే ఆరోగ్యకరమైన అవయవాలే బిడ్డలకు వస్తాయి. సాధారణంగా ఒక లోపం వచ్చిదంటే... తల్లిదండ్రుల్లో ఎవరిదో ఒకరి జీన్ లోపభూయిష్టంగా ఉండవచ్చు. అయితే ఆ లోపం తల్లిదండ్రుల్లో ఎవరినుంచి వచ్చిందో చెప్పడం కష్టం. ఇది ఎలా జరుగుతుందంటే... ఓ అవయవానికి సంబంధించి తల్లిదండ్రులిద్దరి నుంచీ జీన్స్ బిడ్డకు వస్తాయి. ఈ రెండింటిలో ఒకదాంట్లో లోపం ఉందనుకోండి. అప్పుడు అదే అవయవానికి సంబంధించిన మంచి జీన్... లోపమున్న జీన్ను డామినేట్ చేసి... ఆ లోపం రాకుండా నివారిస్తుంది. ఒకవేళ తల్లిదండ్రులిద్దరి జన్యువుల్లోనూ లోపం ఉంటే...? అప్పుడు ఆ బిడ్డకు ఆ అవయవానికి సంబంధించిన లోపం వస్తుంది. ఇప్పుడు తల్లిదండ్రులిద్దరూ ఎలాంటి దగ్గరి సంబంధాలూ లేని వేర్వేరు కుటుంబాలకు చెందిన వారనుకుందాం. అప్పుడు తల్లిదండ్రుల్లో ఒకరిలో జన్యులోపం ఉంటే లోపం లేని మరో జన్యువు దాన్ని డామినేట్ చేసి లోపాన్ని నివారిస్తుంది. అయితే ఒకే కుటుంబాల వారిలో (మేనరికాల్లో అదే కుటుంబాల వారి మధ్య పెళ్లి అవుతుంది కాబట్టి) ఇద్దరి జన్యువులూ లోపంతోనే ఉండే అవకాశముంటుంది కాబట్టి ఆ లోపం వచ్చే అవకాశాలు పెరుగుతాయి. అందుకే దగ్గరి సంతతికి చెందిన... దగ్గరి సంబంధం కలిగిన వ్యక్తుల మధ్య పెళ్లిళ్లను ఆధునిక వైద్యశాస్త్రం అంతగా ప్రోత్సహించదు. మరి ఎలాంటి దగ్గరి సంబంధాలు లేనప్పుడు ఇలాంటి అవకరాలకు అవకాశం లేదా? ఉంటుంది. కానీ... దూరపు సంబంధాల్లో ప్రతి 400 జంటల్లో ఒకరికి లోపమున్న బిడ్డ పుట్టే అవకాశం ఉంటే... దగ్గరి సంబంధాల విషయంలో కేవలం 200 జంటల్లోనే లోపమున్న బిడ్డ పుట్టేందుకు ఛాన్సులెక్కువ. అందుకే ఆరోగ్యకరమైన బిడ్డ కోసం దూరపు సంబంధాలనూ, వీలైతే అసలు రక్తసంబంధాలే లేని ఇతర కుటుంబాల వారితో వివాహాలను ఆధునిక వైద్యశాస్త్రం ప్రోత్సహిస్తోంది. కానీ... దగ్గరి సంబంధాల వివాహాలతో పుట్టబోయే బిడ్డలకు ముప్పు పొంచి ఉంటుందిలా... దగ్గరి వివాహాలను వైద్య పరిభాషలో కన్సాంగ్వినియస్ మ్యారేజెస్ అంటారు. అంటే ఉదాహరణకు అక్కకూతుర్ని... అంటే కోడలు వరసయ్యే అమ్మాయి తన మామను చేసుకోవడం, లేదా మేనమామ, మేనత్త పిల్లలను పెళ్లి చేసుకోవడం. ఇలాంటి దగ్గరి సంబంధాల వల్ల పుట్టబోయే బిడ్డల్లో అనేక రకాల అవయవలోపాల నుంచి బుద్ధిమాంద్యం వరకు ఎన్నో రకాల రుగ్మతలు, సిండ్రోమ్స్ వచ్చే అవకాశం పొంచి ఉంటుంది.పేరెంట్స్ నుంచి బిడ్డలకు పోలికలూ, గుణాలూ లక్షణాలెలా వస్తాయంటే... బిడ్డ పుట్టగానే బంధువులందరూ చుట్టూ చేరి మురిపెంగా చూసుకుంటూ రకరకాల వ్యాఖ్యానాలు చేస్తుంటారు. ‘‘అరె... వీడి ముక్కు చూడండి. అచ్చం వాళ్ల నాన్నదే. వాడి కళ్లు చూడండి. అచ్చం వాళ్ల అమ్మవే’’ అంటూ మురిపెంగా పోలికలు చూస్తూ మురిసిపోతుంటారు. బిడ్డలో ఎలా వస్తాయి ఈ పోలికలు? ఎలాగంటే... మనిషి దేహం కోటానుకోట్ల కణాలతో నిర్మితమై ఉంటుంది. ఈ కణాలన్నీ మొదట ఒకే ఒక తొలికణంతో మొదలైన జైగోట్ నుంచి అనేకానేక కణవిభజనల తర్వాత ఏర్పడతాయి. ఇక మానవుని ప్రతి కణంలో 46 క్రోమోజోములుంటాయి. అంటే 23 జతలు. వీటిలో ఈ జతలో... 23 మహిళ నుంచి, మరో 23 పురుషుడి నుంచి వచ్చి కలిసి... తొలి కణం ఏర్పడుతుంది. దీన్నే మనం పిండం అంటాం. ఈ పిండంలోని 23 జతల క్రోమోజోములపై అనేక జన్యువులు ఉంటాయి. జన్యువు అంటే ఏమిటంటే... దేహంలోని ప్రతి అంశానికీ, ప్రతి అవయవానికీ, ఎదుగుదలకూ, బిడ్డ అవయవాల షేపుకూ, సైజ్కూ, పెరిగే ఒడ్డూ పొడవునకు సంబంధించిన ప్రతి సమాచారమూ ఈ జన్యువుల్లో నిక్షిప్తమై ఉంటుంది. ఈ జన్యువులన్నీ క్రోమోజోములపై ఉంటాయి. ఈ క్రోమోజోముల 23 జతలు ఒకదానితో మరొకటి కలిసి ఒక కణంగా రూపొందే సమయంలో తల్లిదండ్రుల నుంచి బిడ్డలకు ΄ోలికలు, తల్లిదండ్రుల లక్షణాలూ, శరీరాకృతి, రంగు వంటి అనేక అంశాలు సంక్రమిస్తాయి. ఇలా ఈ లక్షణాలన్నీ ఒక తరం నుంచి మరో తరానికి బదిలీ అవుతుంటాయి.దగ్గరివాళ్లలో పెళ్లిళ్లతో లోపాలు ఎందుకంటే... క్రోమోజోములపై లక్షణాలను సంక్రమింపజేసే జన్యువులు తండ్రి నుంచి ఒకటీ, తల్లి నుంచి మరొకటి కలిసి సంపూర్ణమవుతాయన్న విషయం తెలిసిందే. ఉదాహరణకు... ఒక మహిళలో (కాబోయే తల్లిలోని) ఒక జన్యువు కాస్త చెడి΄ోయి... బిడ్డలో అది ఆస్తమా వ్యాధిని కలగజేసే అవకాశం ఉందనుకుందాం. ఆ మహిళ తన కుటుంబంలోని దగ్గరి వారిని కాకుండా అసలు ఏ సంబంధమూ లేనివారిని పెళ్లి చేసుకుందని అనుకుందాం. ఆ పురుషుడిలోని అదే రకమైన జన్యువు ఆరోగ్యంగా ఉందనుకుందాం. ఈ ఆరోగ్యకరమైన పురుషుడి జన్యువు, అనారోగ్యకరమైన ఆ స్త్రీ జన్యువును అధిగమిస్తుంది. అంటే ఇంగ్లిష్లో చెప్పాలంటే డామినేట్ చేస్తుంది. ఇలా లొంగి ఉండే అనారోగ్యకరమైన జన్యువును ‘రెసెసివ్’ జీన్ అంటారు. అలాగే డామినేట్ చేసే జన్యువును ‘డామినెంట్’ జీన్ అంటారు. ఒకవేళ కుటుంబ సభ్యుల్లోని దగ్గరి సంబంధంలోనే పెళ్లి జరిగిందనుకోండి. అప్పుడు తల్లిదండ్రులిద్దరూ ఒకే కుటుంబం నుంచి వచ్చినవారు కాబట్టి వారిద్దరిలోనూ ఆ జన్యువులు ఒకేలా ఉంటాయి. దాంతో ఇద్దరి జన్యువుల్లోనూ ఏదీ మరొకదాన్ని డామినేట్ చేయక΄ోవడం, రెండూ లోపంతోనే ఉండటంతో పుట్టబోయే బిడ్డలో ఆస్తమా బయటపడుతుంది. ఇది ఒక జన్యువు ఉదాహరణ మాత్రమే. ఇలా తల్లిదండ్రుల లక్షణాలను మోసుకెళ్లే జన్యువులు ఒక్క క్రోమోజోమ్పై దాదాపు 20,000 వరకూ ఉంటాయి. అంటే భవిష్యత్తులో ఆ పుట్టబోయే బిడ్డ ప్రతి లక్షణమూ ముందే ప్రోగ్రామ్ అయి΄ోయి జన్యువుల్లో నిక్షిప్తమై ఉంటుంది. అందుకే దంపతులిద్దరూ అపరిచిత కుటుంబాల నుంచి పెళ్లిళ్లు చేసుకుంటే ఒకరిలో అనారోగ్యకరమైన జన్యువు (ఫాల్టీ జీన్) ఉన్నా... దాన్ని దంపతుల్లోని మరో ఆరోగ్యకరమైన జన్యువు డామినేట్ చేస్తుంది. అయితే ఇక్కడ పేర్కొన్న ఆస్తమా ఉదాహరణలా ఇది అన్నివేళలా ఇలాగే బిడ్డలో వ్యక్తమవ్వాలనే నిబంధన ఏదీ ఉండదు. కొన్ని ఫాల్టీ జీన్స్... ఇలా ఒక తరం నుంచి మరో తరానికి వెళ్లే క్రమంలో మరింతగా చెడిపోతూ.... చెడిపోతూ... అకస్మాత్తుగా ఒక పెద్ద లోపంగా బిడ్డలో వ్యక్తం (ఎగ్జిబిట్) కావచ్చు. అందువల్లనే మేనరికాల్లో దంపతులిద్దరూ ఒకే కుటుంబానికి చెందినవారు కావడంతోఫాల్టీ జీన్స్ అనేవి దంపతులిద్దరిలోనూ ఒకేలా ఉండి అవయవ లోపాలూ లేదా జబ్బులూ వ్యక్తమవుతాయి. ఎలాంటి జబ్బులకు ఆస్కారం ఉంది? మేనరికపు వివాహాలు చేసుకున్న వారిలో అవయవలోపాలూ, పుట్టుకతో వచ్చే జబ్బులు (కంజెనిటల్ డిసీజెస్), రక్తసంబంధిత వ్యాధులైన హీమోఫీలియా, థలసీమియా వంటివి, సిస్టిక్ ఫైబ్రోసిస్, మూత్రపిండాల వ్యాధులు (కంజెనిటల్ యురెట్రో పెల్విక్ అబ్స్ట్రక్షన్), కండరాల, నరాలకు సంబంధించిన వ్యాధులు, కొన్ని రకాల సిండ్రోములు (అనే జబ్బుల లక్షణాల మిశ్రమంతో ప్రయుక్తమయ్యే జబ్బులన్నింటినీ కలుపుకుని ఒకే ఒక మాటరూపంలో ‘సిండ్రోమ్’ అని పిలుస్తారు), బుద్ధిమాంద్యత, వికినిడి సమస్యలు, కళ్లసమస్యలు, గుండెకు సంబంధించిన సమస్యలు (గుండెలో రంధ్రాలు, వాటి ధమనుల్లో లోపాలు), చిన్నప్పుడే వచ్చే డయాబెటిస్, జన్యుపరమైన సమస్యలు రావచ్చు. ఇక కాబోయే తల్లిలో మాటిమాటికీ జరిగే గర్భస్రావాలు, బిడ్డ పుట్టగానే చనిపోవడం, బిడ్డకు శ్వాససంబంధిత సమస్యలు, జీవక్రియలకు సంబంధించిన (మెటబాలిక్) సమస్యలు ఇలా అనేక వైద్యపరమైన సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. జన్యుపరమైన సమస్యలూ – రకాలు సాధారణంగా జన్యుపరమైన సమస్యలను మూడు రకాలుగా విభజించవచ్చు. అవి... 1) ఆటోజోమల్ డామినెంట్ : ఇలాంటి జీన్స్ వచ్చిన పిల్లల్లో సమస్య బయటకు కనిపిస్తూ ఉంటుంది. పైగా లోపంతో ఉన్న జీన్ డామినెంట్గా ఉంటుంది. దాంతో ఒక్క జీన్ సంక్రమించినా పిల్లల్లో సమస్య బయటపడుతుంది. 2) ఆటోజోమల్ రెసెసివ్ : వీటిలో సమస్య బయటపడదుగానీ... సమస్యను / వ్యాధిని కలగజేసే జన్యువులు తల్లిదండ్రులిద్దరిలోనూ నిశ్శబ్దంగా లోపలే ఉంటాయి. వీళ్లు తర్వాత తరానికి సమస్యను మోసుకెళ్తారు. కాబట్టి వీరిని ‘క్యారియర్స్’ అంటారు. ఇద్దరు ‘క్యారియర్స్’ పెళ్లాడితే... రెండు రెసెసివ్ జీన్స్ కలిసి... పుట్టబోయే బిడ్డలో సమస్య తప్పక బయటపడుతుంది. 3) ఎక్స్ లింక్డ్ సమస్యలు : ఇలాంటి సమస్యలు ‘ఎక్స్’ క్రోమోజోమ్పై నిక్షిప్తమై ఉంటాయి. దాంతో ఈ జీన్ కలిగిన ఆడపిల్లలు సమస్యకు ‘క్యారియర్స్’గా ఉంటారు. సమస్య మగపిల్లల్లో బయటపడుతుంది.పెళ్లి తప్పదనుకుంటే... ఈ సమస్యలను దృష్టిలో పెట్టుకుని మేనరికపు వివాహాలకు దూరంగా ఉండటమే చాలావరకు మంచిది. ఒకవేళ ఈ అంశాలన్నీ తెలియక నిశ్చితార్థమో, వివాహమో చేసుకుంటే... అప్పుడు ఆ జంట చేయాల్సిన పనులివి... వివాహానికంటే ముందుగా : పెళ్లికి ముందే అమ్మాయీ, అబ్బాయి... ఈ ఇద్దరినీ ప్రీ–మేరిటల్ అండ్ జెనెటిక్ కౌన్సెలింగ్ కోసం నిపుణులను కలవాలి. అప్పుడా నిపుణులు కుటుంబ ఆరోగ్య చరిత్రను పరిగణనలో తీసుకుంటారు. అంటే వీరి తల్లిదండ్రులు, మేనత్త, మేనమామ, తాతలు, ముత్తాతల్లో ఏవైనా దగ్గరి సంబంధం చేసుకోవడం వల్ల వచ్చిన సమస్యలు ఉన్నాయా అని తెలుసుకుంటారు. ఉంటే... వీరికి పుట్టే పిల్లలకు ఆ ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయో విశ్లేషణాత్మకంగా అంచనావేస్తారు. వాటి ఆధారంగా రిస్క్ తీసుకోవచ్చా లేదా అనేది ఆ జంట నిర్ణయించుకోవచ్చు. అవసరమైతే ఆ జంటకు కొన్ని రక్తపరీక్షలూ చేయించే అవకాశమూ ఉంటుంది. సాధారణంగా వచ్చే జన్యుపరమైన సమస్యలను తెచ్చే జీన్స్ ఏమైనా ఉన్నాయా అనేది తెలుసుకోడానికి ఇద్దరికీ జెనెటిక్ టెస్టింగ్ చేస్తారు. అయితే ఎన్ని పరీక్షలు చేసినా వారికి ఏ సమస్యా రాదనో, వస్తుందనో నిర్ధారణగా చెప్పడం కష్టం. ఒకవేళ ఆటోజోమల్ డామినెంట్ సమస్యలు వస్తాయని తెలిస్తే వీలైనంతవరకు ఆ పెళ్లి వద్దనుకోవడమే మంచిది. పెళ్లి తర్వాత : పెళ్లి తర్వాత కూడా జెనెటిక్ కౌన్సెలింగ్కు వెళ్లి పైన పేర్కొన్నవన్నీ పాటించవచ్చు. గర్భం దాల్చడానికి మూడు నెలల ముందునుంచే ఫోలిక్యాసిడ్ మాత్రలు రోజుకు ఒకటి చొప్పున తీసుకోవాలి. గర్భం వచ్చాక : ఇక్కడ పేర్కొంటున్న సమస్యలన్నీ జన్యుపరమైనవి కావడంతో పుట్టబోయే పిల్లల్లో ఏ సమస్యా రాకుండా చేయడమన్నది ఏ నిపుణులకూ సాధ్యం కాదు. కాక΄ోతే కొన్ని గుర్తించదగిన సమస్యలను ముందుగానే పసిగట్టడం వల్ల, పుట్టిన తర్వాత వెంటనే చెయ్యగలిగిన చికిత్సలేవైనా ఉంటే వాటికోసం తక్షణమే సన్నద్ధమయ్యేలా జాగ్రత్త తీసుకోవడం చేయవచ్చు. లేదా లోపల ఉన్న సమస్యను తెలుసుకోవడం... ఒకవేళ అది మెదడుకు సంబంధించినదీ లేదా ఎప్పటికీ సరిచేయలేనిదని తెలిస్తే గర్భస్రావం (ఐదు నెలల లోపల) అవకాశాల గురించి ఆలోచించడం లేదా బిడ్డను కనడం... ఈ రెండింటిలో వారికి అనువైన / తగిన నిర్ణయం తీసుకోవచ్చు. చివరగా... మేనరికపు పెళ్లిళ్ల వల్ల పుట్టే పిల్లలకు వచ్చే అవయవ లోపాలను రాకుండా చేసేందుకు గర్భంతో ఉన్నప్పుడే ఇచ్చే మందులు, చేసే ఇంజెక్షన్లు ఉన్నాయని చాలామంది అనుకుంటారు. కానీ అది కేవలం అపోహ మాత్రమే. అలాంటి ఇంజెక్షన్లుగానీ మందులు గానీ ఉండవు. ఇక మేనరికపు వివాహాల వల్ల పిల్లలకు అవకరాలు వచ్చే అవకాశాలు ఎక్కువ కాబట్టి ఆస్తి కోసమో లేదా ఇతరత్రా కుటుంబ భద్రతల దృష్ట్యా అలాంటి వాటిని చేసుకుని... ఆర్థికంగా, మానసికంగాబాధపడటం కంటే... ఆరోగ్యకరమైన బిడ్డల కోసం కాస్తంత మంచి సంబంధాలు వెదికి బయటి సంబంధాలు చేసుకోవడమే మేలు అని గుర్తుంచుకోవాలి. అయితే ఇది వారి వారి వ్యక్తిగతమైన కుటుంబ పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది. రక్తసంబంధాల్లోనే వివాహాలకు కారణాలివి... ఆర్థిక కారణాలూ, తెలిసినవారి కుటుంబంలో అయితే బిడ్డ బాగోగులు తెలుస్తాయనే ఈ రెండు అంశాలే దగ్గరి బంధుత్వాల్లో పెళ్లిళ్లకు కారణం. అందునా... ప్రధానంగా ఆర్థిక అంశాలే బాగా దగ్గరి సంబంధాలు చేసుకునేలా చాలావరకు ఆ కుటంబాలవారిని ప్రభావితం చేస్తుంటాయి. మేనత్త / మేనమామ పిల్లలను చేసుకుంటే ఆస్తి బయటివారికి చెందకుండా... ఆస్తిలో ఆస్తి కలుస్తుందనే అంశమే చాలా సందర్భాల్లో ఇలాంటి పెళ్లిళ్లను ఎక్కువగా ప్రోత్సహిస్తుంది. ఇక రెండో ప్రధాన అంశం... ఉద్వేగపూరిత బంధం. అంటే ఎమోషనల్ రిలేషన్షిప్. మనం ప్రాణప్రదంగా పెంచుకున్న మన బిడ్డను ఎక్కడో దూరంగా ఉన్నవారికి ఇచ్చి పెళ్లి చేస్తే... వారెలా చూసుకుంటారో, బాగా చూసుకుంటాఓ లేక ఆరళ్లు పెడుతూ బాధలకు గురిచేస్తారో? అదే... బిడ్డ మన కళ్లెదురుగా ఉంటే మనమూ కూతురి బాగోగులు కళ్లారా చూస్తూ ఉండవచ్చు. ఈ రెండు అంశాల కారణంగా కులాలు, మతాలు, ప్రాంతాలకు అతీతంగా దగ్గరి బంధువుల్లోనే పెళ్లిళ్లు జరుగుతుంటాయి. దాంతో తమ జీవనశైలుల్లోనూ, తమ సాంస్కృతిక విధానంలో దంపతులిద్దరూ తేలిగ్గా ఇమిడిపోతారు... దాంతో దంపతులకు ఇబ్బందులు రావనే భావన ఇలాంటి వివాహాలను ప్రోత్సహిస్తుంది.మేనరికపు పెళ్లిళ్లు... దంపతులు చేయించుకోవాల్సిన పరీక్షలు :గర్భందాల్చిన మూడో నెలలో (12 వారాల్లో) డబుల్ మార్కర్ టెస్ట్ అనే రక్తపరీక్ష చేయించుకుంటే బిడ్డలో డౌన్స్ సిండ్రోమ్, ట్రైజోమ్ 18, 13 వంటి కొన్ని రకాల జన్యుపరమైన సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయా లేక తక్కువగా ఉన్నాయా అని తెలుస్తుంది. ఈ పరీక్షల ఫలితాలను బట్టి వేరే పరీక్షలు అవసరమా కాదా అని తెలుస్తుంది. మూడో నెలలో (12వారాలప్పుడు) న్యూకల్ ట్రాన్స్లుయెన్సీ స్కాన్ (ఎన్టీ స్కాన్) చేయించుకుంటే, ఆ సమయానికి బయటపడే సమస్యలు ఏమైనా ఉంటే తెలుస్తాయి. పై పరీక్షల్లో కొన్ని జన్యుపరమైన సమస్యలు వచ్చే అవకాశం ఉందనే సందేహం కలిగినప్పుడు దాన్ని నిర్ధారణ చేయడానికి బిడ్డ చుట్టూ ఉండే మాయ నుంచి కొంత ముక్క సేకరించి ‘కోరియా విల్లస్ బయాప్సీ’ అనే పరీక్ష చేస్తారు. ఐదో నెలలో ట్రిపుల్ మార్కర్ లేదా క్వాడ్రపుల్ మార్కర్ వంటి రక్తపరీక్షలు చేయించుకుంటే పుట్టబోయే బిడ్డలో కొన్ని రకాల జన్యుపరమైన సమస్యల ముప్పు ఎక్కువా లేదా తక్కువా అన్నది తెలుస్తుంది. ఇందులో రిస్క్ ఎక్కువగా ఉన్నట్లు ఫలితాలు వస్తే ఆమ్నియోసెంటైసిస్ అనే పరీక్ష చేయించాలి. ఇందులో గర్భంలోని బిడ్డ చుట్టూ ఉండే ఉమ్మనీరు లోంచి 10 – 20 ఎమ్ఎల్ తీసి జన్యువుల పరీక్షకు (క్యారియోటైపింగ్కు) పంపించి సమస్యను నిర్ధారణ చేస్తారు. ఈ పరీక్ష వల్ల ఒక శాతం మందిలో గర్భస్రావమయ్యే అవకాశం ఉంటుంది. ఐదో నెల చివరిలో 18–22 వారాలప్పుడు ‘టిఫ్ఫా’ అనే స్కానింగ్ చేయడం వల్ల బిడ్డలో వచ్చే అవయవలోపాలను ముందుగానే గుర్తించవచ్చు. దీనితో ΄ాటు జెనెటిక్ సోనోగ్రామ్ చేయించుకుంటే కొన్ని జన్యుసంబంధిత వ్యాధులను సూచించే సాఫ్ట్ మార్కర్లను గుర్తించి, దానికి తగినట్లుగా తర్వాతి నిర్ణయం తీసుకోవచ్చు. ఆరో నెలలో 22–24 వారాల్లో 2డీ ఫీటల్ ఎకో కూడా చేయించుకుంటే గుండెకు సంబంధించిన లోపాలను తెలుసుకోవచ్చు. స్కానింగ్లో నూటికి నూరు శాతం లోపాలను కనుక్కోలేకపోవచ్చు. కొందరిలో బిడ్డ పొజిషన్, ఉమ్మనీటి శాతం, తల్లి పొట్ట మీద అధికకొవ్వు వంటి అంశాలను బట్టి కూడా కొన్ని లోపాలను కనుగొనడం మిస్సయ్యే అవకాశం ఉంది. బిడ్డ పుట్టాక : బిడ్డపుట్టిన తర్వాత మొదటి వారంలోనే నియోనేటల్ స్క్రీనింగ్ పరీక్షలు చేయించడం వల్ల త్వరగా చికిత్స చేయదగిన వ్యాధులు ఏవైనా ఉంటే తెలుస్తుంది. అంటే ఎర్రర్స్ ఆఫ్ మెటబాలిజమ్ వంటివి గుర్తించవచ్చు. బిడ్డ మూడో నెలలో వినికిడి లోపాలను గుర్తించే పరీక్షలు చేయించి, ఒకవేళ ఉంటే వాటిని చాలావరకు సరిదిద్దవచ్చు.డాక్టర్ శ్రీజ గుర్రాల, సీనియర్ కన్సల్టెంట్ యూరోగైనకాలజిస్ట్ (చదవండి: హార్న్బిల్ ఫెస్టివల్ ..! ఫుడ్ మెనూ చూస్తే..మతిపోవడం ఖాయం..!) -
జంటలకు ఐవీఎఫ్ వైఫల్యం వర్రీ ఉండదు..! క్లినిక్లు కూడా..
భారతదేశంలో అభివృద్ధి చెందుతున్న ఐటీ హబ్లలో ముఖ్యంగా బెంగళూరు, హైదరాబాద్, పూణే, చెన్నైలలో కెరీర్ ప్లానింగ్కే ప్రాధాన్యత ఇస్తున్నారు ఐటీ జంటలు. దాంతో ఆ తర్వాత పేరెంట్స్గా మారలేకపోతున్నాం అని బాధపడుతున్న జంటలెందరో. సుదీర్ఘ పనిగంటలు, జీవనశైలి మార్పులు, ఆలస్యంగా వివాహం, పని ఒత్తిడి తదితర కారణాలతో చాలా జంటలు తమ సంతానోత్పత్తి ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడేస్తున్నారు. చివకికి ఏక్లినిక్ని సంప్రదిస్తే మంచిదన్న టెన్షన్తో సన్నిహితులు, బంధువులు సూచనలను ఆశ్రయిస్తారు. చివరికి అక్కడ ఈ ఐవీఎఫ్ సంతాన సాఫల్య కేంద్రాలను ఆశ్రయిస్తారు. ఆఖరికి అందులో కూడా వరుస ఫెయిలర్స్ చూసి విసిగివేసారిన దంపతులెందరో. కొందరు మాత్రం పట్టుదలతో తల్లిందండ్రలవ్వగా మరికొందరికి మాతం అదొక కలగానే మిగిలిపోతుంది. ఆ సమస్యను చక్కబెట్టేందుకు ఒయాసిస్ ఫెర్టిలిటీ మరో ముందడుగు వేసింది. సహజంగా గర్భం దాల్చలేక ఇబ్బందిపడి క్లినిక్లను ఆశ్రయిస్తే ఆఖరికి ఐపీఎఫ్లో కూడా నిరాశను ఎదుర్కొన్న జంటలకు ఊరటనిచ్చేలా..భావోద్వేగ మద్దతను అందిస్తోంది ఒయాసిస్ ఆస్పత్రి. సౌకర్యవంతమైన టెలి-కన్సల్టేషన్లతో మద్దతిస్తోంది దంపతులకు. అంతేగాదు సంతానోత్పత్తి సంరక్షణ వృత్తిపరమైన నిబద్ధతలతో సమలేఖనం చేసేందుకు ప్రయత్నిస్తోంది. దీన్ని అన్ని ఆస్పత్రులు అమలు చేసేందుకు ముందుకొస్తే.. చాలా జంటలకు తల్లిందండ్రులు అయ్యే అవ్వకాశం ఉంటుందని పేర్కొంది. డాక్టర్ వరలక్ష్మి యాకసిరి, ప్రాంతీయ వైద్య విభాగాధిపతి, ఒయాసిస్ ఫెర్టిలిటీ చదవండి: అతి పిన్న వయస్కురాలైన యువ బిలియనీర్..! ఏకంగా రూ. 10వేల కోట్లు.. -
మలబద్ధకం నివారణ కోసం...
మలబద్ధకం చాలామందిని బాధిస్తూ ఉంటుంది. ఫ్రీ మోషన్ కాకపోవడం వల్ల వచ్చే ఈ సమస్యతో దీర్ఘకాలంలో మరిన్ని ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలూ ఉంటాయి. అందుకే ఈ సమస్యను నివారించుకోవడం ఎంతోముఖ్యం. అందుకు పాటించాల్సిన కొన్ని సూచనలుఫైబర్ (పీచు) సమృద్ధిగా ఉండే ఆహారాలతో మలబద్ధకాన్ని నివారించుకోవడం తేలికే. వాటివల్ల జీర్ణాశయమార్గం శుభ్రమవ్వడమే కాకుండా తేలిగ్గా విరేచనం అయ్యేందుకు ఆ పీచు సహాయపడుతుంది. ఫైబర్ వల్ల దేహంలో మనం తీసుకున్న పిండిపదార్థాల నుంచి చక్కెర నెమ్మదిగా విడుదలవుతుంది. ఫలితంగా రక్తంలో చక్కెర మోతాదులు ఒకేసారి పెరగవు. పొట్టుతో కూడిన అన్ని రకాల ధాన్యాల్లోనూ ఈ పీచు ఎక్కువ. అందుకే పొట్టు తీయని ధాన్యాలు... మరీ ముఖ్యంగా వరి విషయానికి వస్తే దంపుడు బియ్యం వంటివి మేలు చేస్తాయి. ఇక మామూలు ధాన్యాల్లో కంటే తృణధాన్యాల్లో పీచు మోతాదులు ఎక్కువ. కాయగూరలు, ఆకుకూరలు, మొలకెత్తిన ధాన్యాల్లోనూ పీచుపాళ్లు ఎక్కువ. ఇవి మలబద్ధకంతో పాటు చాలా రకాల క్యాన్సర్లనూ నివారిస్తాయి. చిక్కుళ్లలో ప్రోటీన్ తోపాటు ఫైబర్ కూడా ఎక్కువే. ఇవి కండరాలకు బలాన్నివ్వడంతోపాటు మలబద్దకం నివారణకూ తోడ్పడుతూ ఒకేసారి రెండు ప్రయోజనాలనిస్తాయి. తాజాపండ్లలోనూ పీచు ఎక్కువగానే ఉంటుంది. అందుకే అతిగా తీపి ఉండని తాజాపండ్లు డయాబెటిస్ ఉన్నవారికీ మేలు చేస్తాయి. బొప్పాయి, పుచ్చ, నారింజ వంటి పండ్లలో పీచు మోతాదు ఎక్కువగా ఉండటంతో మలబద్ధకాన్ని తేలిగ్గా నివారిస్తాయి. పండ్లను పళ్లరసాల రూపంలో తీసుకుంటే అందులో పీచుపదార్థాలు దాదాపుగా ఉండవు. అందుకే పండ్లను కొరికి తినడమే మేలు. పీచుపదార్థాలతోపాటు తగినన్ని నీళ్లు తాగడం వల్ల విరేచనం సాఫీగా అవుతుంది. రోజుకు కనీసం రెండు లీటర్ల (కనీసం పది గ్లాసుల) నీళ్లు తాగడం మంచిది. (చదవండి: డయాబెటిక్ నెఫ్రోపతి: చాపకింద నీరులా వ్యాపిస్తుంది..జరభద్రం) -
డయాబెటిక్ నెఫ్రోపతి: చాపకింద నీరులా వ్యాపిస్తుంది..జరభద్రం
డయాబెటిస్ (మధుమేహం) అంటే కేవలం రక్తంలో చక్కెర మోతాదులు పెరగడం మాత్రమే కాదు. అది దేహంలోని అనేక అవయవాలను నిశ్శబ్దంగా దెబ్బతీసే ప్రమాదకారి. డయాబెటిస్ వల్ల మిగిలిన అన్ని అవయవాల్లో కన్నా కిడ్నీలు దెబ్బతినే అవకాశాలెక్కువ. ఎంత ఎక్కువ అంటే... డయాబెటిస్తో బాధపడే వ్యక్తులలో 60% మందికి కిడ్నీలు దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. పైగా ఆ సమస్య తారస్థాయికి చేరే వరకూ చాలామందికి ఆ విషయం తెలియనే తెలియదు. ఇలా చాపకింద నీరులా నిశ్శబ్దంగా పెరుగుతూపోయే డయాబెటిక్ నెఫ్రోపతీ అనే ఈ కిడ్నీల వ్యాధి కారణంగా వచ్చే అనర్థాలూ, లక్షణాలూ, చికిత్స వంటి అంశాలపై అవగాహన కోసం...ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే డయాబెటిస్తోపాటు దానివల్ల కలిగే అనర్థాలు పెరిగిపోయాయి. టైప్ 1 అలాగే టైప్ 2... ఈ రెండు రకాల డయాబెటిస్లూ నెఫ్రోపతీకి దారితీస్తాయి, అయితే ఎక్కువ మందికి టైప్ 2 డయాబెటిస్ ఉండటం వల్ల చాలా కేసుల్లో కిడ్నీ పనిచేయకపోడానికి ఇదే కారణం. పైగా కిడ్నీ దాదాపుగా దెబ్బతిని పూర్తిగా పనిచేయకుండా పోయేవరకు చాలామందికి ఈ విషయం తెలియనే తెలియదు. డయాబెటిస్తో కిడ్నీలు ఎలా దెబ్బతింటాయంటే... కిడ్నీలు నిరంతరం రక్తాన్ని వడ΄ోస్తూ, అందులోని వ్యర్థాలూ, విషపదార్థాలను తొలగిస్తూ, వాటిని మూత్రం ద్వారా బయటకు ΄ోయేలా చేస్తుంటాయి. రక్తంలో చక్కెర మోతాదులు ఎక్కువగా ఉన్నకొద్దీ కిడ్నీలోని అత్యంత సన్నటి రక్తనాళాలు దెబ్బతింటాయి. ఫలితంగా వాటి వడ΄ోత సామర్థ్యం క్రమంగా తగ్గుతూ పోతుంటుంది. ఒకనాటికి కిడ్నీ పూర్తిగా పనిచేయని పరిస్థితి వస్తుంది. దాంతో జీవితాంతం డయాలసిస్ మీద ఆధారపడాల్సి వస్తుంది లేదా కిడ్నీ మార్పిడి తప్ప వేరే ప్రత్యామ్నాయమే ఉండదు.ముందుగానే గుర్తించడం ఇలా... డయాబెటిక్ నెఫ్రోపతికి చికిత్స చేసి మళ్లీ మొదటిలా కిడ్నీని పనిచేయించడం అసాధ్యం. అంటే దీనిని రివర్స్ చేయలేమని అర్థం. పైగా దాదాపుగా కిడ్నీ పూర్తిగా దెబ్బతినేవరకు దీని లక్షణాలు కనిపించవు. అందుకే నిశ్శబ్దంగా వృద్ధిచెందే ఈ వ్యాధిని తెలుసుకోడానికి క్రమం తప్పకుండా స్క్రీనింగ్ పరీక్షలు చేయిస్తుండటం అవసరం.ఇవీ వైద్యపరీక్షలు... మైక్రో అల్బుమిన్ మూత్ర పరీక్ష : ఈ పరీక్షతో మూత్రంలో కొద్ది మొత్తంలోనైనా లీక్ అవుతుండే ప్రోటీన్ (అల్బుమిన్)ను గుర్తించవచ్చు. కిడ్నీ దెబ్బతినడంలో ఇది తొలి దశ. సీరం క్రియాటినిన్ అండ్ ఈ–జీఆర్ఎఫ్ (ఎస్టిమేటెడ్ గ్లోమెరులర్ ఫిల్టరేషన్ రేట్) : ఈ పరీక్షతో కిడ్నీ వడ΄ోత సామర్థ్యాన్ని కొలవవచ్చు. ఈ–జీఆర్ఎఫ్ తగ్గడం అంటే అది కిడ్నీ పనితీరు తగ్గడానికి ఒక సూచన.రక్తపోటును నిరంతరం పర్యవేక్షిస్తుండటం : హైబీపీ అన్నది కిడ్నీ దెబ్బతినే ప్రక్రియను వేగవంతం చేస్తుంది. అందుకే రక్తపోటును ఎప్పటికప్పుడు పరీక్షించుకుంటూ ఉండటం, మందులతో అదుపులో పెట్టుకోవడం అవసరం. వార్షిక ఆరోగ్య పరీక్షలు: మధుమేహం ఉన్న ప్రతి ఒక్కరికీ, ముఖ్యంగా ఐదేళ్ల కంటే ఎక్కువగా డయాబెటిస్తో బాధపడుతున్న ఆరోగ్య చరిత్ర ఉన్నవారు ప్రతి ఏడాదీ వార్షిక పరీక్షలు చేయించుకుంటూ ఉండటం అవసరం. ఎందుకంటే ఈ డయాబెటిస్ ఏ అవయవంపై తన ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందో ఎవరికీ తెలియదు. అందుకే డయాబెటిస్తో బాధపడే ప్రతి ఒక్కరూ ఇలా ప్రతి ఏడాది అన్ని రకాల వైద్యపరీక్షలూ చేయించుకోవడం మేలు.ఎండ్ స్టేజ్ కిడ్నీ డిసీజ్కి చికిత్సలిలా:కిడ్నీ పనితీరు పూర్తిగా దెబ్బతిని, కిడ్నీ సామర్థ్యం పూర్తిగా తగ్గినట్లయితే, మూత్రపిండాల మార్పిడి చికిత్స (రీనల్ రీప్లేస్మెంట్ థెరపీ) అవసరం డయాలసిస్: ఈ ప్రక్రియ ద్వారా రక్తంలోని వ్యర్థాలనూ, విషాలతో కూడిన ద్రవాలను తొలగిస్తారు హీమో–డయాలసిస్: శరీరం వెలుపల అమర్చే యంత్రంతో వారానికి పలు మార్లు రక్తాన్ని వడ΄ోయడం పెరిటోనియల్ డయాలసిస్: కడుపులోని పెరిటోనియమ్ అనే పొరలో అమర్చే క్యాథటర్ (గొట్టం లాంటి పరికరం) సహాయంతో దేహంలోని వ్యర్థాలూ, విషాలను వడపోయడం చివరగా కిడ్నీ మార్పిడి చికిత్స : చనిపోయిన వ్యక్తి నుంచి సేకరించిన లేదా బతికే ఉన్న దగ్గరి బంధువైన దాత నుంచి తీసుకున్న కిడ్నీని బాధితులకు అమర్చేందుకు చేసే శస్త్రచికిత్స ఇది ∙ఇక టైప్ 1 మధుమేహంతో బాధపడే బాధితులకు కిడ్నీ–ప్రాంక్రియాస్ మార్పిడి చికిత్స కూడా ఒక ప్రత్యామ్నాయం కావచ్చు.మేనేజ్మెంట్ : పరిస్థితి డయాలసిస్ లేదా కిడ్నీ మార్పిడి వరకు వెళ్లకూడదనుకునే బాధితులు ఎప్పటికప్పుడు వైద్యులు సూచించిన మందులు వాడుతూ, తమ బీపీ, చక్కెర మోతాదులు అదుపులో ఉండేలా చూసుకోవాలి.చివరగా... డయాబెటిక్ నెఫ్రోపతీ అనేది రివర్స్ చేయలేని తీవ్రమైన వేదన కలిగించే పరిస్థితి. డయాబెటిస్ను ఎప్పటికప్పుడు అదుపులో పెట్టుకోవడం, క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకోవడం, జీవనశైలి మార్పులను క్రమశిక్షణతో అవలంబించడం, డాక్టర్ సూచనలను తప్పక పాటించడం వంటి జాగ్రత్తలతో చాలా ఖర్చుతో కూడినవీ లేదా బాధించేవైన డయాలసిస్, కిడ్నీ మార్పిడి వరకు వెళ్లకుండా జాగ్రత్త పడవచ్చని అవగాహన పెంచుకోవడమన్నది అవసరమని అందరూ గుర్తుంచుకోవాలి. మొదటి, రెండో దశల్లో... జీవనశైలిలో మార్పులు:రక్తంలో చక్కెరను అదుపులో ఉంచడం ( గ్లైసీమిక్ కంట్రోల్) : రక్తంలోని చక్కెర మోతాదులను పరిమిత స్థాయిలోనే ఉండేలా చూసేందుకు కొన్ని మందులు అవసరమైన వారికి ఇన్సులిన్ వంటివి ఇవ్వడం. రక్తపోటును అదుపు చేయడం (బీపీ కంట్రోల్) : ఏంజియోటెన్సిన్ కన్వర్టింగ్ ఎంజైమ్ (ఏసీఈ) ఇన్హిబిటర్స్ లేదా ఏంజియోటెన్సిన్ రిసెప్టార్ బ్లాకర్స్ సహాయంతో బీపీని 130 / 80 అనే కొలతకంటే తక్కువగా ఉండేలా మందులివ్వడం ఆహారంలో మార్పులు : తీసుకునే ఆహారంలో ఉప్పు మోతాదులు తగ్గించడం అలాగే ్ర΄ోటీన్ నియంత్రిత స్థాయిలోనే ఉండేలా జాగ్రత్త తీసుకోవడం వంటి జాగ్రత్తలు క్రమ తప్పకుండా చేసే వ్యాయామలు : బరువును ఆరోగ్యకరమైన పరిమితిలోనే ఉంచుకునేందుకు క్రమం తప్పకుండా వ్యాయామాలు చేయడం దురలవాట్లకు దూరంగా ఉండటం : పొగతాగడం, మద్యం వంటి అలవాట్లకు పూర్తిగా దూరంగా ఉండటం.డయాబెటిక్ నెఫ్రోపతీ లక్షణాలు సాధారణంగా డయాబెటిక్ నెఫ్రోపతీ తాలూకు మొదటి దశల్లో గుర్తించదగిన లక్షణాలేవీ కనిపించవు. అయితే జబ్బు పెరుగుతున్నకొద్దీ ఈ కింద పేర్కొన్న లక్షణాలూ, సూచనలూ కనిపించవచ్చు పాదాలు, చీలమండలు లేదా కళ్ల చుట్టూ ఉబ్బు లేదా వాపు (కిడ్నీల పనితీరు తగ్గడంతో దేహంలోని నీరు బయటకు పోలేకపోవడవంతో ఈ ఉబ్బు / వాపు కనిపిస్తుంది) అలసట, నీరసం, నిస్సత్తువ, బలహీనతఆకలి లేకపఓవడం లేదా వికారం మరీ ఎక్కువగాగానీ లేదా తక్కువగాగానీ జరిగే మూత్ర విసర్జన నురుగుతో కూడిన మూత్రం (ప్రోటీన్ నష్టం వల్ల)నిరంతరం అధిక రక్తపోటు (కన్సిస్టెంట్గా హైబీపీ)శ్వాస ఆడకపోవడం (దేహంలోని నీరు ఊపిరితిత్తుల్లో చేరడం వల్ల) ఈ లక్షణాలను గమనించినట్లయితే, కిడ్నీ వ్యాధి నిర్ధారణ కోసం వెంటనే డాక్టర్ను సంప్రదించాలి.డయాబెటిక్ నెఫ్రోపతి చికిత్సలుదీనికి నిర్దిష్టంగా కాకుండా ఒక ప్రణాళికాబద్ధంగానూ, వ్యక్తిగతంగానూ (పర్సనలైజ్డ్ ట్రీట్మెంట్) చికిత్సలు ఉంటాయి. ఈ వైద్య చికిత్సల ద్వారా కిడ్నీ దెబ్బతినడం మరింత వేగంగా జరగకుండా చూడటంతోపాటు అప్పటికే దెబ్బతిన్నందున ఆరోగ్యంపై పడే ప్రతికూల ప్రభావాలను తగ్గించడమే లక్ష్యంగా చేస్తారు.ఇవీ వాడాల్సిన మందులు ఎస్జీఎల్టీ 2 ఇన్హిబిటర్లు (ఉదాహరణకు, డపాగ్లిఫ్లోజిన్, ఎంపాగ్లిఫ్లోజిన్); అలాగే జీఎల్పీ – 1 రిసెప్టర్ అగోనిస్ట్లు (ఉదాహరణకు లిరాగ్లూటైడ్, సెమాగ్లూటైడ్) అనేవి టైప్ 2 మధుమేహంతో బాధపడుతున్న బాధితుల్లో కిడ్నీ వ్యాధి మరింత వేగంగా పురోగమించకుండా చూడటంతోపాటు గుండెకు సంబంధించిన జబ్బులను తగ్గించడానికి ఉపయోగించే కొత్త మందులివి ఫైనెరెనోన్ (కెరెండియా) అనేది ఒక నాన్–స్టెరాయిడల్ మినరలో కార్టికాయిడ్ రిసెప్టర్ యాంటాగనిస్ట్ డ్రగ్. కిడ్నీ వైఫల్యమూ అలాగే గుండె సంబంధిత జబ్బుల వల్ల కలిగే ప్రమాదాలను తగ్గించడానికి వాడే మందు అధిక కొలెస్ట్రాల్ను అదుపు చేయడానికి స్టాట అనే మందులు. డాక్టర్ గంధె శ్రీధర్, సీనియర్ కన్సల్టెంట్ నెఫ్రాలజీ అండ్ ట్రాన్స్ప్లాంట్ ఫిజీషియన్ (చదవండి: కూతురిని అలా చూసి..! ఆ తల్లిదండ్రుల రియాక్షన్ మాములుగా లేదుగా..!) -
గుండెకు 'చలిపోటు'
సాక్షి, అమరావతి: చలికాలం అనారోగ్య సమస్యలకు పుట్టినిల్లు లాంటిది. వైరస్, బ్యాక్టీరియల్ జబ్బులతో పాటు గుండెజబ్బుల ముప్పు చలికాలంలో ఎక్కువని వైద్యులు హెచ్చరిస్తున్నారు. రాష్ట్రంలో రోజురోజుకు ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. జనవరి, ఫిబ్రవరి నెలల్లో చలితీవ్రత మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఈ కాలంలో సాధారణ రోజుల్లో ఎదురయ్యే గుండెపోటు తీవ్రత కంటే ముప్పు 50 శాతం అధికంగా ముప్పు ఉంటుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. నవంబర్–ఫిబ్రవరి మధ్య గుండెపోటు ఘటనలు 15–20 శాతం అధికంగా నమోదయ్యే అవకాశం ఉందని ఇండియన్ హార్ట్ అసోసియేషన్ హెచ్చరిస్తోంది. మిగిలిన రోజులతో పోలిస్తే చలి వాతావరణం రోజుల్లో రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టే స్వభావం 14–20 శాతం అధికంగా ఉంటుంది. ఈ సమస్య హార్ట్, బ్రెయిన్ స్ట్రోక్లకు, గుండె వైఫల్యానికి కారణమవుతుంది. చలితీవ్రతకు శ్వాసనాళాలతో పాటు గుండెకు రక్తం సరఫరాచేసే రక్తనాళాలు కుంచించుకుపోతాయి. గుండె ఎక్కువగా శ్రమించాల్సి వచ్చి, అదనపు ఒత్తిడి పడుతుంది. ఈ సమస్య వయస్సు పైబడిన వారిలో ఎక్కువగా తలెత్తే అవకాశం ఉంటుంది. ధూమపానం, మద్యపానం వంటి అలవాట్లు, ఊబకాయం, అనారోగ్యకరమైన జీవనశైలి ఉంటే 40 ఏళ్లలోపు వారిలోను గుండె ఎక్కువగా శ్రమించాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. దీంతో రక్తంలో కెటాకెలోమిన్స్ హార్మోన్ స్థాయి పెరిగి, రక్తనాళాల్లో అప్పటికే పూడికలు ఉంటే అక్కడ రక్తం గడ్డకట్టి గుండెపోటుకు దారితీస్తుందని శాస్త్రీయంగా నిర్ధారణ అయినట్టు వైద్యులు తెలిపారు. చలిని తట్టుకోవడం కోసం కొందరు అధికంగా ధూమపానం, మద్యపానం చేస్తుంటారు. ఇది గుండె వేగాన్ని, లయను నియంత్రించే నాడీవ్యవస్థపై దు్రష్పభావం చూపి గుండె లయ తప్పుతుంది. అత్యంత వేగంగా కొట్టుకుని హార్ట్ అరిథ్మియాకు దారితీస్తుంది.వీరు జాగ్రత్త » ఇప్పటికే గుండె జబ్బులున్నవారు » బీపీ, షుగర్, ఇతర దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు » ధూమపానం, మద్యపానం చేసేవారు » కుటుంబంలో గుండెజబ్బు చరిత్ర ఉన్నవారు » ఊబకాయం, నిత్యం ఒత్తిడితో బాధపడేవారు » రక్తంలో చెడు కొలె్రస్టాల్ ఎక్కువగా ఉన్నవారు ఈ లక్షణాలుంటే అశ్రద్ధ వద్దు » ఛాతీ మధ్య, పైభాగంలో నొప్పి » ఛాతీ పట్టేసినట్టు, బరువుగా అనిపించడం » శ్వాస తీసుకోవడం కష్టతరం కావడం » చలిలోను చెమటలు పట్టడంశరీరంలో నీటిశాతం తగ్గకుండా చూడాలిచలికాలం కాబట్టి సాధారణంగా అందరూ తక్కువగా నీరు తాగుతుంటారు. దీంతో శరీరంలో నీటిశాతం తగ్గిపోతూ ఉంటుంది. దీంతో రక్తం చిక్కబడుతుంది. ఈ క్రమంలో ఇప్పటికే రక్త నాళాల్లో కొవ్వు పేరుకుపోయిన వ్యక్తుల్లో రక్తం చిక్కబడి క్లాట్లు వస్తాయి. చలికి రక్తనాళాలు సైతం కుంచించుకుపోయే అవకాశం ఉండటంతో గుండె పోటు సంభవించే ప్రమాదం ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరు శరీరంలో నీటిశాతం తగ్గకుండా జాగ్రత్తపడాలి. జీవనశైలి మార్చుకోవాలని కొందరు కొత్తగా వ్యాయామాలు ప్రారంభిస్తుంటారు. అలాంటివారు తొలుత వైద్యులను సంప్రదించి జాగ్రత్తలు తెలుసుకోవాలి. తేలికపాటి వ్యాయామాలు చేయాలి. దీర్ఘకాలిక అలర్జీలు, ఆస్తమా వంటి సమస్యలున్నవారు శీతలపానీయాలు, ఐస్క్రీమ్స్ వంటి వాటికి దూరంగా ఉండాలి. – డాక్టర్ ప్రభాకర్రెడ్డి, విభాగాధిపతి, కార్డియో వాసు్క్యలర్ సర్జరీ, కర్నూలు జీజీహెచ్ -
ఊపిరితిత్తుల్లో గుచ్చుకుపోయిన ఇనుప రాడ్లు
భాగ్యనగరంలో నిర్మాణంలో ఉన్న ఒక భవనం మూడో అంతస్తు నుంచి నవీన్ కుమార్ అనే ఓ భవన నిర్మాణ కార్మికుడు ప్రమాదవశాత్తు పడిపోయాడు. అతడి ఊపిరితిత్తుల్లోకి ఇనుప రాడ్లు గుచ్చుకుపోయి, వాటికి రంధ్రం పడింది. అయినా సరే.. ఆ కార్మికుడికి అమోర్ ఆస్పత్రి వైద్యులు రికార్డు సమయంలో అత్యవసర శస్త్రచికిత్స చేసి, అతడి ప్రాణాలు నిలబెట్టారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి..42 ఏళ్ల వయసున్న నవీన్ కుమార్ను ఆస్పత్రికి తీసుకొచ్చేసరికి అతడి శరీరం నుంచి రెండు ఇనుప రాడ్లను తొలగించాల్సి ఉంది. అప్పటికే అతడు స్పృహ కోల్పోయాడు, అతడి రక్తపోటు కేవలం 50/30 మాత్రమే ఉంది. ఇక ఆక్సిజన్ శాచ్యురేషన్ అయితే కనీసం లెక్కలకు కూడా అందనంత తక్కువగా ఉంది. అతడి హృదయం వద్ద పెద్ద గాయం ఉండడం, అందులోంచి గుండె, ఊపిరితిత్తులు కూడా కనిపిస్తుండడం, దాదాపు 2-3 లీటర్ల వరకు రక్తం పోవడం, ఊపిరితిత్తులకు-ఛాతీ గోడకు మధ్య రక్తం గడ్డకట్టడం, ఊపిరితిత్తులకు రంధ్రం పడడం... ఇన్ని సమస్యలు అతడికి ఉన్నాయి.ముందు అత్యవసరంగా అతడిని వెంటిలేటర్ మీద పెట్టారు. శరవేగంగా రక్తం ఎక్కించి, రీససిటేషన్ చేశారు. గాయం చాలా పెద్దగా ఉన్నట్లు సీటీ స్కానింగ్లో తెలిసింది. దాంతో వెనువెంటనే అతడిని ఆపరేషన్ థియేటర్కు తరలించారు. వైద్యులు అతడికి అత్యవసరంగా థొరకాటమీ శస్త్రచికిత్స చేశారు. అతడి ఎడమ ఊపిరితిత్తిలోని శ్వాసకోశం పూర్తిగా ధ్వంసమైపోయింది. దాంతో దాన్ని తొలగించాల్సి వచ్చింది. కానీ రక్తస్రావం చాలా ఎక్కువగా ఉండడంతో నవీన్ రక్తపోటు మరింతగా పడిపోసాగింది. ఫలితంగా రక్తం మరింత ఎక్కించారు. ఒక ఊపిరితిత్తి మాత్రమే పనిచేస్తుండడంతో దాన్ని రక్షించేందుకు వెంటిలేషన్ వ్యూహాలను అమలుచేశారు. అతడికి ఆక్సిజన్ ఏమాత్రం అందకపోతున్నా కూడా మెదడు, ఇతర కీలక అవయవాలు ఏవీ దెబ్బతినకుండా వైద్యబృందం చాలా కష్టపడింది.ఈ కేసు సంక్లిష్టత గురించి అమోఆర్ ఆస్పత్రి మేనేజింగ్ డైరెక్టర్, ఆర్థో ఆంకాలజీ సర్జన్ డాక్టర్ కిశోర్ బి. రెడ్డి మాట్లాడుతూ, “మేం చికిత్స చేసిన వాటిలో ఇది అత్యంత సంక్లిష్టమైన, సమస్యాత్మకమైన ట్రామా కేసు. నవీన్కు తగిలిన గాయాలన్నీ ప్రాణాంతకమే. ప్రతి నిమిషం చాలా విలువైనది. దాంతో మా అత్యవసర, సర్జికల్, ఎనస్థీషియా, క్రిటికల్ కేర్ బృందాల్లోని వైద్యులందరూ అద్భుతమైన సమన్వయంతో పనిచేసి అతడి ప్రాణాలు కాపాడారు. ప్రపంచస్థాయి ట్రామాకేర్ సదుపాయాలు, సరైన సమయానికి చికిత్స అందించాం అనడానికి అతడి ప్రాణాలు నిలబడడమే నిదర్శనం. ఇప్పుడతడు కోలుకుని సాధారణ జీవితం గడపడం మాకెంతో ఆనందాన్నిస్తోంది” అని తెలిపారు.నవీన్ చాలా అద్భుతంగా కోలుకోవడంతో, 48 గంటల్లోనే వెంటిలేటర్ తొలగించారు. కాసేపటి తర్వాత అతడు ఒకరి సాయంతో నడవగలిగాడు. వారం రోజుల్లోపే అతడు ఎలాంటి సాయం అవసరం లేకుండా తన కాళ్ల మీద తాను నడుస్తూ కోలుకోవడంతో డిశ్చార్జి చేశాం.అతడికి చికిత్స చేసిన వైద్యబృందంలో శస్త్రచికిత్స నిపుణులు డాక్టర్ కళ్యాణ్, డాక్టర్ పూజిత, ఎమర్జెన్సీ బృందానికి చెందిన డాక్టర్ నందీప్, డాక్టర్ అశోక్, క్రిటికల్ కేర్ విభాగ నిపుణులు డాక్టర్ ప్రత్యూష, ఎనస్థీషియా నిపుణులు డాక్టర్ జగదీష్ కీలకంగా వ్యవహరించారు.(చదవండి: మాంజా మెడకు చుట్టుకుని తెగిన రక్తనాళాలు..హెల్మెట్ పెట్టుకున్నా..!) -
ఊపిరితిత్తుల కేన్సర్కి విలన్..జస్ట్ స్మోకింగ్ మాత్రమే కాదు..!
ఊపిరితిత్తుల కేన్సర్ ఎందువల్ల వస్తుదంటే...అందరూ చెప్పేది బీడి,చుట్ట సిగరెట్ల వల్ల అనే ఠక్కున చెప్పేస్తారు. కానీ అదొక్కటే కారణం కాదని శాస్త్రవేత్తలు నొక్కి చెబుతున్నారు. మనచుట్టూ ఉన్న పరిసరాలే ప్రధాన ముప్పుగా పరిణమిస్తునన్నాయిని హెచ్చరిస్తున్నారు. మరి అదెలాగో సవివరింగా తెలుసుకుందాం. నిజానికి ఇటీవల కాలంలో పట్టణ ప్రాంతాల్లో ధూమపానం చేయని వారి సంఖ్య పెరుగుతున్నప్పటికీ చాలామంది ఈ మహమ్మారిని బాధపడుతున్నారని వైద్యులు చెబుతున్నారు. కనీసం సిగరెట్ వాసన కూడా చూడని వారిలో కూడా పీఎం2.5గా పిలిచే కణాలు ఊపిరితిత్తుల్లోనూ, రక్తప్రవాహంలో ప్రవహించి కణాలను దెబ్బతీసి, ఊపిరితిత్తుల కేన్సర్కు దారితీసే ఉత్పరివర్తనాలను ప్రేరేపిస్తాయని చెబుతున్నారు. ఇది కేవలం నగరాల్లోనూ కాదు గ్రామాల్లో కూడా ఇదే పరిస్థితని చెబుతున్నారు. ఎందుకంటే..డీజిల్, పంట అవశేషాలను కాల్చడం వల్ల ఈ మహమ్మారి బారిన పడుతున్నట్లు అధ్యయనాల్లో తేలింది. అదీగాక గ్రామీణ ప్రాంతాల్లో కట్టెల పొయ్యిమీద వంట చేస్తారు. దాన్నుంచి వచ్చే పొగ, ఒకవేళ కిచెన్లో సరైన వెంటిలేషన్ లేకపోతే.. ఆ పొగాకు ఎక్కువసేపు గురవ్వాల్సి వస్తుంది. ఫలితంగా ఊపిరితిత్తుల కేన్సర్ బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు నిపుణులు. అలాగే రాడాన్ వాయువు, సహజంగా సంభవించే రేడియో ధార్మిక వాయువుకి ఎక్కువ ఎక్స్పోజ్ అయినా..ఈ వ్యాధి బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అన్నారు. అలాగే మైనింగ్, సిలికా దుమ్మ లేదా డీజిల్తో నడిచే కర్మాగారాల్లో వర్క్చేసే వ్యక్తులు ఈ వ్యాధి బారిన పడుతుంటారని చెప్పుకొచ్చారు. ధూమపానం చేయనివారు ఎందుకు సేఫ్గా లేరు...ధూమపానం చేయనివారిలో, ముఖ్యంగా యువకులు, మహిళల్లో ఊపిరితిత్తుల కేన్సర్ ఉపరకం అయినా అడెనోకార్సినోమా పెరుగుదల ఉన్నట్లు గుర్తించారు. అలాగే పర్యావరణం తోపాటు జన్యుపరమైన కారకాలు కూడా పెద్దపాత్ర పోషిస్తున్నట్లు పేర్కొన్నారు. ముఖ్యంగా వాయకాలుష్యం, జీవనశైలి, ఆహారపు అలవాట్లు ఈ ప్రమాదాన్ని మరింత పెంచుతాయని చెబుతున్నారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు..రోజువారీ AQI (ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్) స్థాయిలను పర్యవేక్షించడంకాలుష్యం ఎక్కువగా ఉన్న రోజుల్లో, బహిరంగ కార్యకలాపాలను పరిమితం చేయడంట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉన్న సమయంలో కిటికీలు మూసి ఉంచడం.ఎగ్జాస్ట్ ఫ్యాన్లు, ఎయిర్ ప్యూరిఫైయర్లు లేదా సహజంగా గాలిని ఫిల్టర్ చేసే పీస్ లిల్లీస్, స్పైడర్ ప్లాంట్లు వంటి మొక్కలను ఉపయోగించండి.పొగ రహిత గృహాలు, కార్యాలయాల ఉండేలా మెయింటైన్ చేయడంవర్కింగ్లో దుమ్ము లేదా రసాయనాలకు గురికాకుండా ఉండటం. చెట్ల పెంపకానికి ప్రాధాన్యత ఇవ్వడం.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే. మెరుగైన ఫలితాల కోసం వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: బెడ్షీట్స్ మార్చి ఎంత కాలమైంది?)


