breaking news
Health
-
ఏరియల్ యోగా అంటే..? కేవలం మహిళల కోసమేనా..
ఇటీవల ఆరోగ్య స్పృహ ఎక్కువై అంతా జిమ్, వాకింగ్, యోగా, వ్యాయమాలు బాట పట్టారు. మరికొందరు ఇంకాస్త ముందడుగు వేసి విభిన్న రకాల వర్కౌట్లను అనుసరిస్తున్నారు. వినూత్న శైలిలో ఆరోగ్యంగా ఉండటం ఎలా అంటూ సరికొత్త యోగాలను పరిచయం చేస్తున్నారు. అలానే నెట్టింట ఇండోనేషియా బండా అషేలోని మహిళా జిమ్లోని సరికొత్త యోగా ఫోజ్లు పెద్ద దుమారం రేపి చర్చనీయాంశంగా మారాయి. ఎందుకంటే అక్కడ మహిళలంతా వ్యాయామాలు చేస్తున్నారా..? ఊయల్లో సేదతీరుతున్నారా అని అర్థంకానీ ఫోజ్లలో కనిపించారు. మరి ఆ సరికొత్త యోగా భంగిమ ఏంటి..? ఎలా చేస్తారు..? ఎవరికి మంచిది తదితరాల గురించి సవివరంగా చూద్దామా..!.2004 సునామీ తర్వాత ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన నగరమే ఈ బందా అసే. అక్కడ కాస్త మహిళలకు సంబంధించి కట్టుదట్టమైన చట్టాలు అమలులో ఉన్నా దేశం ఇది. అయితే అక్కడ మహిళా ఫిట్నెస్ ట్రైనర్ పర్యవేక్షణలో యోగా క్లాసులు, పలు వెల్నెస్ సెంటర్లు నడుస్తుండటం విశేషం. అక్కడ ఓ మహిళల జిమ్లో ఈ వింతైన దృశ్యం కనువిందు చేసింది. ఆ మహిళలంతా ఊయల ఆసనం మాదిరి యోగా భంగిమలో వేలాడుతూ కనిపించారు. దాన్ని ఏరియల్ యోగా అని పిలుస్తారట. అదెలా చేస్తారంటే.. View this post on Instagram A post shared by Chaideer Mahyuddin (@mirroreye) ఏరియల్ యోగా అంటే: ఊయలలాంటివి లేదా పైకప్పు నుంచి వేలాడే మృదువైన వస్త్రాల సాయంతో చేసే యోగా పద్ధతి. ఇది సాధారణ యోగాతో పాటు జిమ్నాస్టిక్స్, పైలేట్స్ వంటి వర్కౌట్లను కలగలపిన ఒక ప్రత్యేకమైన యోగాసనం.ప్రయోజనాలు..ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది: శరీర భాగాలు గాలిలో సాగదీయబడి, కండరాలు మెరుగవుతాయివెన్నునొప్పి తగ్గుతుంది: వెన్నెముకపై ఒత్తిడి లేకుండా స్ట్రెచ్ అవుతుందిఒత్తిడి తగ్గుతుంది: గాలిలో వేలాడుతూ ధ్యానం చేయడం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుందిబరువు తగ్గేందుకు సహాయపడుతుంది: 50 నిమిషాల సెషన్లో సుమారు 320 కేలరీలు ఖర్చవుతాయిజీర్ణక్రియ మెరుగవుతుంది: పొత్తికడుపు సమస్యలు, గ్యాస్ సమస్యలు తగ్గుతాయిశ్వాసకోశ ఆరోగ్యం మెరుగవుతుంది: ఊపిరితిత్తులకు వ్యాయామం అవుతుందిఎవరికి మంచిది కాదంటే..గుండె జబ్బులు, బీనీ, గ్లకోమా, ఆర్థరైటిస్ ఉన్నవారుగర్భిణులు, పెద్ద ఆపరేషన్ చేసినవారుఒకవేళ ఈ ఏరియల్ యోగా చేయాలనుకున్న నిపుణుల పర్యవేక్షణలో చేయడమే ఉత్తమం. ఇది కేవలం మహిళలే కాదు ఆరోగ్యవంతమైన పురుషుల కూడా చేయవచ్చు. పైన చెప్పిన అనారోగ్య సమస్యలు లేనివాళ్లు ఎవరైనా నిపుణుల పర్యవేక్షలో నిస్సందేహంగా ఈ ఏరియల్ యోగాని నేర్చుకోవచ్చని చెబుతున్నారు. -
వాట్ ఏ బ్యాలెన్సింగ్ : రకుల్ ప్రీత్ ఫిట్నెస్ వీడియో
నటి రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh) ఫిట్నెస్ విషయంలో చాలా శ్రద్ధ తీసుకుంటుంది. జిమ్, యోగా, పైలేట్స్ , కార్డియో, రన్నింగ్, హైకింగ్, గోల్ప్ ఇలా వివిధ రకాల వర్కౌట్స్తో ఫ్యాన్స్ను మెస్మరైజ్ చేస్తుంది. తన ఫిట్నెస్ రొటీన్, వ్యాయామ నియమావళికి సంబంధించిన స్నీక్ పీక్లను ఇన్స్టాగ్రామ్లో పంచుకుంటుంది. తాజాగా బాలెన్స్కు సంబంధించిన ఒక ఇంట్రస్టింగ్ వీడియోనే షేర్ చేసింది.అందరూ వీకెండ్ మూడ్లో ఉంటే, రకుల్ ప్రీత్ ఒక ఆసక్తికరమైన విషయం గురించి చెప్పుకొచ్చింది. మనం పెద్దగా పట్టించుకోని “చిన్న కండరాలకు” కూడా ప్రాధాన్య ఇవ్వాలని, వాటి దృఢత్వం ప్రాముఖ్యతను నొక్కి చెప్పింది. ఇన్స్టాలో రెండు వీడియోలను పోస్ట్ చేసింది. అద్భుతమైన బాలెన్సింగ్తో చిన్న వాటర్ బాల్ వ్యాయాయాన్ని చేసి చూపించడం విశేషం. ఇదీ చదవండి: వెయిట్లాస్కి 6 చిట్కాలు : సిల్లీ కాదు..సూపరంటున్న ఫిట్నెస్ కోచ్ View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) ఈ ట్రైనింగ్లో చిన్న కండరాలను బలోపేతం చేయడంతో పాటు, బరువులు ఎత్తడం అంతే ముఖ్యమని పేర్కొంది. మొదట్లో బోసు బాల్పై కూడా బ్యాలెన్స్ చేయలేకపోయాను కానీ ఇప్పుడు ఈ చిన్న నీటి బంతి మీద సులువుగా చేస్తున్నానని వెల్లడించింది. ఈ వీడియోలో ముందు తన చేతులను ఫ్రీగా వదిలేసి బ్యాలెన్స్ చేయగా, ఆ తరువాత జోతులను కలిపి ఉంచి, ఒంటి కాలిపై సింగిల్-లెగ్ స్క్వాట్స్తో ఫ్లూయిడ్ బాల్పై తన శరీరాన్ని బాలెన్స్ చేసింది. ఈ సారి జిమ్కి వెళ్ళినప్పుడు ఇలా ప్రయత్నించండం అంటూ అభిమాలకు సూచించింది.(నో-షుగర్, నో-మిల్క్: 45 కిలోలు తగ్గింది, ఇప్పటికీ కష్టాలే!)స్మాల్బాల్ ఎక్సర్ సైజ్ లాభాలుఈ బ్యాలెన్సింగ్ టెక్నిక్ వల్ల సమన్వయం, శరీర నియంత్రణ , ప్రతిచర్యలను మెరుగుపరుస్తుంది. మొత్తం క్రియాత్మక బలం పెరుగుతుంది.మంచి బ్యాలెన్సింగ్ శక్తిని ఇస్తుంది. ఉదర కండరాలను బలోపేతం చచేస్తుంది. కోర్ను టోన్ చేయడంతోపాటు బలోపేతం చేయడంలో కూడా సహాయపడతాయి. పోశ్చర్ (భంగిమను) మెరుగుపరుస్తుంది.శరీర అమరికను సాధించడంలో సహాయపడుతుంది.కీళ్లపై ఒత్తిడిని తగ్గిస్తుంది, గాయాలు, ఆర్థరైటిస్ నొప్పులను నివారిస్తుంది. బాడీకి ఫ్లెక్సిబిలీటీని అందిస్తుంది. ముఖ్యంగా తుంటి, వీపు , భుజాల చుట్టూ, కండరాల దృఢత్వాన్ని మంచిది. -
వెయిట్లాస్కి 6 చిట్కాలు : సిల్లీ కాదు..సూపరంటున్న ఫిట్నెస్ కోచ్
బరువు తగ్గాలి అంటే కచ్చితంగా కొన్ని జీవనశైలి మార్పులు చేసుకోవాలి. బరువు ఎందుకు ఎక్కువ ఉన్నామనే విషయాలను నిపుణుల సలహా మేరకు అంచనావేసుకోవాలి. ఆ తరువాత బరువు ఎంత? ఎలా తగ్గాలి అనే ప్రణాళిక వేసుకోవాలి. ఎక్కడా నిరాశ పడకుండా, ప్లాన్ ప్రకారం పూర్తి కమిట్మెంట్తో ఓపిగ్గా , స్మార్ట్గా ప్రయత్నిస్తే ఫలితం సాధించడం సులువే. ఈ విషయాన్ని అనేక మంది సెలబ్రిటీలు, ఫిట్నెస్ కోచ్లు చెబుతున్నమాట. చిన్న, చిన్న మార్పులతో పెద్ద పెద్ద ఫలితాలను ఎలా సాధించవచ్చో తాజాగా ఫిట్నెస్ కోచ్ వివరించారు.తెలివిగా, వ్యూహాత్మకంగా ఉంటే బరువు తగ్గాలనే లక్ష్యాలను సాధించవచ్చు. చిన్న మార్పులు పెద్ద తేడాను ఎలా కలిగిస్తాయో ఫిట్నెస్ కోచ్ వివరించారు. తన ఇన్స్టాగ్రామ్లో తరచుగా ఫిట్నెస్ సంబంధిత చిట్కాలను పంచుకునే జోష్ ఇటీవల కొన్ని చిట్కాల గురించి చర్చించారు. సిల్లీగా అనిపించినా ఇవి చాలా ప్రభావాన్ని చూపుతాయంటూ 6 ప్రధాన సూత్రాల గురించి వివరించారు.కుడి చేతి వాటం వాళ్లు, ఎడం చేత్తో, ఎడం చేయి వాటం ఉన్న వాళ్లు కుడి చేత్తో తినాలి అంట. దీని వల్ల 30 శాతం తక్కువ తినడానికి ఆస్కారం ఉంటుంది. సిల్లీగా అనిపించినా ఇది ఫలితం ఇస్తుందంటున్నారు. ఒక భోజనంలో 150-300 కేలరీలు తగ్గించుకోవచ్చని చెప్పారు. View this post on Instagram A post shared by Professional Athlete & Online Coach (@joshbainbridgefit)సాయంత్రం తొందరగా పళ్లుతోముకోవడం వల్ల ఇక తినడం అపేయాలనే సంకేతం మెదడుకు అందుతుందని, ముఖ్యంగా అర్థరాత్రి స్నాక్స్ తీసుకోనే అలవాటును మానుకోవడంలో ఇది గేమ్ ఛేంజర్లా పనిచేస్తుందని, తత్ఫలితంగా 200-600 కేలరీలను సులభంగా ఆదా చేయవచ్చని చెప్పారు.మోసం చేసే లిక్విడ్ కేలరీస్.. మీరు నమ్మరు గానీ రోజుకు 2-3 కాఫీలు, వందల కేలరీలకు దారితీయవచ్చు,ఆల్కహాల్, క్రీమర్లు, స్మూతీలు... అవన్నీఇందలో కలిసిపోతాయి అంటాడు జోష్. వీటితో అప్రమత్తంగా ఉండాలంటాడు.అలాగే డీప్ ఫ్రైయింగ్ ఆరోగ్యానికి హానికరమంటాడు. ఆయిల్ ఫుడ్తో చెడు కొలెస్ట్రాల్, రక్తపోటు, బ్లడ్ షుగర్ లాంటి ప్రమాదకరమైన అనారోగ్యాల్ని పెంచుతుంది. దీనికి బదులుగా తక్కువ కేలరీల స్ప్రేని లేదా ఎయిర్ ఫ్రైయర్ను ఎంచుకోండి అంటాడీ ఫిట్నెస్ కోచ్భోజనానికి ముందు ఒక గ్లాసు నిమ్మకాయ నీరు, తక్కువ కేలరీల పళ్ల రసం తాగడం వల్ల కడుపు నిండిన ఫీలింగ్ ఉంటుంది. తక్కువ తినడానికి అవకాశం ఉంటుంది.ఇదీ చదవండి: నో-షుగర్, నో-మిల్క్: 45 కిలోలు తగ్గింది, ఇప్పటికీ కష్టాలే!బరువు తగ్గడంలో పోర్షన్ కంట్రోల్ చాలా ముఖ్చమని, సరైన ఆహారాన్ని తీసుకోవడంపై దృష్టిపెట్టాలని చెప్పాడు. తక్కువ కేలరీ ఫుడ్తో పొట్టను నింపేయాలి అంటాడు. ముఖ్యంగా సెలెరీ, దోసకాయ, గెర్కిన్స్, టమోటాలు, క్యాబేజీ, ఆకుకూరలులాంటి వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలంటాడు. నోట్: ఫిట్నెస్ కోచ్ ఇన్స్టా ఐడీ ఆధారంగా అందించిన టిప్స్ మాత్రం అని గమనించగలరు. వీటితోపాటు కార్డియో, కఠినమైన ఇతర వ్యాయామాలను కూడా ఇక్కడ గమనించవచ్చు. బరువు తగ్గడం అనే ప్రక్రియలో ఎవరికి వారు ఆలోచించి, వైద్యులు సలహా మేరకు ముందుకు సాగాలి -
పిల్లల్లో మెధోవికాసం పెరగాలంటే..ఈ ఫుడ్స్ బెస్ట్
కొన్ని రకాల ఆహారాన్ని తరచు పిల్లలకు తినిపించడం వల్ల వారిలో మేధోవికాసం పెరుగుతుంది. కాబట్టి పిల్లలకు ఆరోగ్యంతో పాటు తెలివితేటలను పెంచే సూపర్ ఫుడ్స్ కూడా ఇస్తూ ఉండాలి. వేరుశనగ.. ఇందులో ధయామిన్తోపాటు విటమిన్ ఇ ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్స్ కూడా సమృద్ధిగా ఉండటం వల్ల పిల్లల్లో మెదడు ఎదుగుదలకు కావలసిన శక్తి అంది, చక్కగా పెరుగుతుంది. జ్ఞాపకశక్తి పెరుగుతుంది. వోట్స్.. పిల్లల కోసం ఆరోగ్యాన్ని అందించే తృణధాన్యాలలో మొదటిది వోట్స్. ఇది మెదడుకు ఆరోగ్యాన్ని, శక్తిని అందిస్తుంది. ఓట్స్ లోని పీచుపదార్థం పిల్లల మెదడుకు మంచి ఇంధనంగా పనిచేస్తుంది. పొటాషియం, జింక్, విటమిన్ ఇ, బి వారి పెరుగుదలకు సహకరిస్తాయి.బెర్రీలు.. బ్లూబెర్రీస్, బ్లాక్ బెర్రీస్, చెర్రీస్, స్ట్రాబెర్రీస్ ఇవి రకరకాల రంగులలో ఎక్కువ పోషకాలను కలిగి ఉన్నాయి. వీటిలోని యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి, క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి.బీన్స్.. బీన్స్ ప్రత్యేకమైనవి. ప్రొటీన్, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లు, ఫైబర్ శక్తితో పాటు విటమిన్లు, ఖనిజాలు కలిగి ఉంటాయి. మానసికమైన సామర్థ్యాన్ని ఇస్తాయి. మెదడుకు బీన్స్ పింటో బీన్స్ ఒమేగా 3, ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి మెదడు ఆరోగ్యం కోసం చక్కగా పనిచేస్తాయి.ఇదీ చదవండి: నో-షుగర్, నో-మిల్క్: 45 కిలోలు తగ్గింది, ఇప్పటికీ కష్టాలే! -
హెల్త్ స్టార్టప్లను ప్రోత్సహించాలి
న్యూఢిల్లీ: 2035 నాటికి భారత్ అంతర్జాతీయ మెడికల్ హబ్గా ఎదగాలంటే విదేశీ పేషంట్లకు చికిత్స చేసే ఆస్పత్రులకు పన్నులపరమైన ప్రోత్సాహకాలు ఇవ్వాలని ఓ నివేదిక సూచించింది. అలాగే ఆరోగ్య సంరక్షణ రంగ అంకుర సంస్థలకు మరింత తోడ్పాటు ఇవ్వాల్సి ఉంటుందని పేర్కొంది. కేపీఎంజీ ఇన్ ఇండియా, భారతీయ హోటళ్లు, రెస్టారెంట్ అసోసియేషన్ల సమాఖ్య (ఎఫ్హెచ్ఆర్ఏఐ) రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం 2025లో 18.2 బిలియన్ డాలర్లుగా ఉండే భారత మెడికల్ టూరిజం మార్కెట్ వార్షికంగా 12.3 శాతం వృద్ధితో 2035 నాటికి 58.2 బిలియన్ డాలర్ల స్థాయికి చేరనుంది. ఈ నేపథ్యంలో దీనికి తోడ్పాటు అందించేందుకు ఎంబసీలు, ఎగ్జిబిషన్లు, డిజిటల్ ప్లాట్ఫాంల ద్వారా అంతర్జాతీయంగా బ్రాండింగ్ ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని రిపోర్ట్ సూచించింది. అలాగే, రాష్ట్రాలు, జాతీయ స్థాయిలో ’హీల్ ఇన్ ఇండియా’ మిషన్ను ఆవిష్కరించాలని పేర్కొంది. ‘పెట్టుబడులను ఆకర్షించేందుకు, సేవలను మరింత మెరుగుపర్చుకునేందుకు ప్రభుత్వం ద్రవ్యేతర, ద్రవ్యపరమైన ప్రోత్సాహకాలు ఇవ్వాలి. అంతర్జాతీయ పేషంట్లకు చికిత్స చేసే ఆస్పత్రులకు పన్నులపరంగా మినహాయింపులు ఇవ్వొచ్చు. మార్కెటింగ్ డెవలప్మెంట్ అసిస్టెన్స్ స్కీము కింద సబ్సిడీలను పెంచవచ్చు. డిజిటల్ ప్లాట్ఫాంలు సహా ఇతరత్రా మాధ్యమాల్లో మార్కెటింగ్, ప్రమోషన్ కోసం సాంకేతిక సహకారం అందించవచ్చు. అలాగే వెల్నెస్ సెంటర్లు సహా వైద్యపరమైన మౌలిక సదుపాయాల విభాగంలోకి 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతించవచ్చు‘ అని నివేదిక తెలిపింది. మరిన్ని విశేషాలు.. → మెడికల్ టూరిజానికి ప్రత్యక్షంగా దోహదపడే హెల్త్–టెక్, వైద్య పరిశోధనలు, డిజిటల్ హెల్త్ సొల్యూషన్ల విభాగాల్లో పని చేసే స్టార్టప్లు, ఇతర సంస్థలకు నిర్దిష్ట సబ్సిడీలు, గ్రాంట్లు ఇవ్వాలి. → భారత ఆస్పత్రులను కూడా తమ నెట్వర్క్ల్లో జోడించుకునేందుకు అంతర్జాతీయ బీమా సంస్థలతో కలిసి పనిచేస్తూ బీమా పోర్టబిలిటీ వెసులుబాటును తీసుకురావచ్చు. దీనితో విదేశీ పేషంట్లకు ఆర్థిక ప్రతిబంధకాలు తగ్గుతాయి. బీమా ఉన్న విదేశీ పేషంట్లకు భారత్ మరింత ఆకర్షణీయమైన గమ్యస్థానంగా మారేందుకు ఇది ఉపయోగపడుతుంది. → వీసా–ఇన్సూరెన్స్ లింకేజీ మధ్య అంతరాలను తగ్గించడం, అంతర్జాతీయ ప్రమాణాలతో, బహు భాషల్లో సేవలందించేలా ఆస్పత్రుల్లో సిబ్బందికి శిక్షణనివ్వడంపై దృష్టి పెట్టాలి. → మెడికల్, వెల్నెస్ టూరిజంపై జాతీయ వ్యూ హం, మార్గదర్శ ప్రణాళికకు అనుగుణంగా జాతీయ స్థాయిలో మిషన్ ఏర్పాటు చేయాలి. → పాలసీల అమలు, అంతర్–మంత్రిత్వ శాఖల సమన్వయం కోసం జాతీయ మెడికల్, వెల్నెస్ టూరిజం ప్రమోషన్ బోర్డును సమగ్ర జాతీయ మిషన్గా అప్గ్రేడ్ చేయాలి. → మెడికల్ టూరిజం సూచీలో భారత్ 10వ ర్యాంకులో, వెల్నెస్ టూరిజంలో 7వ స్థానంలో ఉంది. → 2024లో భారత్ 4,63,725 మెడికల్ వీసాలను జారీ చేసింది. మెజారిటీ పేషంట్లు బంగ్లాదేశ్, జీసీసీ దేశాలు, ఆఫ్రికా నుంచి వచ్చారు. → 2024లో అంతర్జాతీయంగా మెడికల్ టూరిజం మార్కెట్ 41.75 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇది 2030 నాటికి రెట్టింపు అవుతుందని అంచనా. -
పార్లమెంట్ ఫుడ్ మెనూ..! లిస్టు చూసేయండి!
పార్లమెంటు క్యాంటీన్లో ఫుడ్ మెనూ ఎలా ఉంటుందో తెలుసా..!. ఎప్పుడైనా దీని గురించి విన్నారా అంటే..చాలామందికి తెలియదనే చెప్పాలి. అధికారులు, శాసనసభ్యులు, మహామహారథులు ఉండే ఆ శాసనసభలో వారికి మంచి విలాసవంతమైన భోజనమే క్యాంటిన్లో ఉంటుదనేది వాస్తవమే. కానీ ఈసారి ఆరోగ్యమే మహాభాగ్యం అంటూ సరికొత్త మార్పులకు శ్రీకారం చుట్టింది పార్లమెంట్. అక్కడ క్యాంటీన్ మెనూలో ఎలాంటి వంటకాలు చేర్చారంటే..మంచి రుచికరమైన థాలిస్, కూరలను అందిచిన పార్లమెంట్ క్యాంటీన్ ఇటీవలే దాని మెనూని సరికొత్త వంటకాలతో మార్పులు చేసింది. ఇదివరకటిలా నెయ్యి, నూనెతో కూడిన భారీ భోజనాలకు స్వస్తి చెప్పేసేలా ఓ ముందడుగు వేసింది. ఆ వంటకాల స్థానంలో.. సుదీర్ఘ గంటలు పనిచేసే శాసనసభ్యుల్లో ఉత్సాహం నింపేలా, జోవర్ ఉప్మా, మిల్లెట్ ఇడ్లీలు, శక్తిమంతమైన సలాడ్లు, కాల్చిన చేపలు సర్వ్ చేయనుంది. దీన్ని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ప్రారంభించారు. మెనూలో రుచి, పోషకాహారాన్ని కోల్పోకుండా ఆరోగ్యకరమైన భోజనానికి ప్రాధాన్యత ఇస్తోంది. అంతేగాదు ఇక్కడ అందించే ఫుడ్ పోషకాహార నిపుణుల మార్గదర్వకత్వంలో జాతీయ ఆరోగ్య ప్రచారానికి అనుగుణంగా ఉంటుందట. బ్రౌన్ రైస్, మిల్లెట్ వంటి ఆరోగ్యప్రదాయకమైన వంటకాలతో సమతుల్య ఆహారానికే పెద్దపీట వేసేలా అందించనుంది. ఈ విభిన్న రుచులకు అనుగుణంగా ప్రతి వంటకం పక్కన కేలరీ ట్యాగ్ని కూడా ఇస్తారట. ఈ విధానం జాగ్రత్తగా తినడాన్ని ప్రోత్సహిస్తుందట.ముఖ్యంగా మిల్లెట్ ఆధారిత అల్పాహార వంటకాల నుంచి 270 కిలో కేలరీలతో నిండిన సాంబార్తో రాగి ఇడ్లీ, 206 కిలో కేలరీలతో కూడిన జోవర్ ఉప్మా, మూంగ్ పప్పు చిల్, చనా చాట్, ఉడికించిన కూరగాయలు (157 కిలో కేలరీలు) ఉండగా, మాంసాహార ప్రియుల కోసం గ్రిల్డ్ చికెన్, గ్రిల్డ్ ఫిష్ వంటి లీన్ ప్రోటీన్లను సర్వ్ చేయనుంది. ఎంపీలు (పార్లమెంటు సభ్యులు) ఇప్పుడు ఇక స్నాక్స్, పానీయాల కోసం..గార్డెన్లో పండిన తాజా పండ్ల సలాడ్లు(113 కిలో కేలరీలు), క్లియర్ సూప్, కాల్చిన టమోటా, తులిసి షోర్బాల వంటి జ్యూస్లు సిప్ చేయొచ్చు. అలాగే భోజనాన్ని చివరగా తీపి పదార్థం ముగించేలా మిక్స్ మిల్లెట్ ఖీర్ కూడా అందించనున్నారు. సుదీర్ఘ గంటలు పనిచేసే నాయకుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని మరి ఆరోగ్యదాయకంగా రూపొందించారు ఈ మెనూని. 2023 సంవత్సరాన్ని ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ చిరు ధాన్యాల సంవత్సరం ప్రకటించి..చిరు ధాన్యాలకు భారీ ప్రచారం లభించింది. ఆ నేపథ్యంలోనే పార్లమెంటులో మెనూలో ఈ సరికొత్త మార్పులు చేశారు. అలాగే శరీరం రోజువారీ అవసరాలను తీర్చడానికి పిండి పదార్థాలు, కేలరీలు, సోడియం తక్కువగా ఉండి, ఫైబర్, ప్రోటీన్లు సమృద్ధిగా ఉండేలా మెనూని చాలా ఆలోచనాత్మకంగా రూపొందించారు. పని చేసే అధికారులలో ఊబకాయం, దీర్ఘకాలిక వ్యాధులు ముప్పు వంటి ఆందోళనలకు చెక్ పెట్టేలా ఈ మెనూని అత్యంత ఆరోగ్యదాయకంగా రూపొందించడం విశేషం. (చదవండి: 114 ఏళ్ల వయసులోనూ హుషారుగా.. ఆయన ఫిట్నెస్ సీక్రెట్ ఇదే!.. కానీ..) -
'కెరీర్'.. వెరీ కేర్ఫుల్..!
ప్రస్తుతం నగరం చదువుల ఉత్సాహంతో ఉప్పొంగిపోతోంది. ఎక్కడ చూసినా నోటిఫికేషన్లు, ఎంట్రెన్స్ ఫలితాలు, ర్యాంకుల ఆధారంగా కాలేజీ ఎంపికలు, సీట్ల కేటాయింపులు, కౌన్సెలింగ్ల ప్రక్రియల చర్చలు హోరెత్తుతున్నాయి. ఈ వాతావరణంలో విద్యార్థులూ, వారి తల్లిదండ్రులూ సందేహాలు, అనుమానాలతో ముందస్తు మార్గాలను అన్వేషిస్తున్నారు. ఈ సమయంలో పలు కోర్సులపై, కాలేజీలపై, కెరీర్ అవకాశాలపై స్పష్టత లేనిదే నిర్ణయాలు తీసుకుంటే.. అది భవిష్యత్తు పట్ల ప్రమాదకరంగా మారుతుంది. ఈ నేపథ్యంలో చదువుల ప్రపంచాన్ని అర్థం చేసుకోవడం, వివిధ కోణాల్లో విశ్లేషించడం తప్పనిసరిగా మారింది. ఇది కేవలం చదువు గురించి కాదు.. జీవితం గురించి. ఒక నిర్ణయం మీ జీవితానికి దిశ చూపుతుంది. మరి ఆ నిర్ణయం, నిజమైన సమాచారం ఆధారంగా ఉండాలి. ట్రెండ్లు చూసో, ఇష్టమైన రంగం అనో కాకుండా వాస్తవ పరిస్థితుల ఆధారంగా ముందుకు సాగడం ముఖ్యమని నిపుణుల సూచన. విద్యార్థులు ఏ కోర్సు ఎంచుకోవాలి? ఎలాంటి కాలేజీ ఏ రంగానికి బాగా అనుకూలం? జాబ్ మార్కెట్లో ఏ రంగానికి డిమాండ్ ఉంది? ఇవన్నీ తెలుసుకోవడమే మొదటి మెట్టు. సమాచారం మూడు మార్గాల్లో సులభంగా లభిస్తుంది. ముఖ్యంగా ఎంట్రన్స్ పరీక్షల తేదీలు, అప్లికేషన్లు, కౌన్సెలింగ్, సరి్టఫికెట్ వెరిఫికేషన్ తదితర తేదీలను ఎప్పటికప్పుడు అధికారిక వెబ్సైట్లలో తెలుసుకుంటుండాలి. ప్రభుత్వ వెబ్సైట్లు (తప్పనిసరిగా చూడాల్సినవి): టీజీ ఈఏపీసీఈటీ, నీట్, సీయూఈటీ వంటి పరీక్షల అధికారిక వెబ్సైట్లు, ఏఐసీటీఈ, యూజీసీ వంటి ప్రభుత్వ శిక్షణ సంస్థల వెబ్సైట్లు.నిపుణుల సలహాలు: కెరీర్ కౌన్సెలర్లు, సబ్జెక్ట్ నిపుణులు, సైకాలజిస్టులు విద్యార్థుల ప్రొఫైల్ ఆధారంగా సరైన మార్గదర్శనం అందించగలరు. ఉదాహరణకు ‘యూనివర్సిటీ, కెరీర్ ల్యాబ్స్, బైజూస్ కెరీర్ కౌన్సెలింగ్, టీసీఎస్ ఐఆన్’ వంటి ప్లాట్ఫాంలు ఉపయుక్తం.పూర్వ విద్యార్థుల అనుభవాలు: ఆయా కాలేజీల పూర్వ విద్యార్థులను సంప్రదించడం వల్ల కాలేజీ రియాలిటీ, ఫ్యాకల్టీ, ప్లేస్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వంటి విషయాల్లో స్పష్టత వస్తుంది. తల్లిదండ్రుల పాత్ర.. పిల్లల కలలు మీ కోరికలు కావొద్దు. పిల్లల ఆసక్తులు, సామర్థ్యాలు, నైపుణ్యాలు, వ్యక్తిత్వ లక్షణాల ఆధారంగా గైడెన్స్ ఇవ్వాలి. ఎదుటివారి పిల్లలు చేసినట్లు చేయాలని అనడం ద్వారా పిల్లలపై ఒత్తిడి తీసుకురావద్దు. ఎవరి మాట నమ్మాలి..? ఫేక్ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్లు: వీరి మాటలు చాలాసార్లు మోసం చేస్తాయి. వారి చెప్పినంతగా స్కాలర్ షిప్స్, సీట్లు ఉండవు. సోషల్ మీడియాలో డైరెక్ట్ యాడ్స్: వీరిని నమ్మొద్దు.. గుర్తింపు లేని సంస్థల్లో అవకతవకలు ఎక్కువగా ఉంటాయి. ప్రభుత్వ టోల్ ఫ్రీ నంబర్లలో సమాచారం ఉత్తమం. కార్యాచరణ సూచనలు.. నాకు ఏవైనా ఆసక్తులు ఉన్నాయా? నేనేం బాగా చేయగలను? అనే స్వీయ విశ్లేషణ అవసరం. స్కూల్, కాలేజీ కౌన్సెలర్లు/సీనియర్ల ప్రాథమిక గైడెన్స్ తీసుకోవడం ఆన్లైన్లో సర్టిఫైడ్ కౌన్సెలింగ్ పొందడం. చివరి ఎంపికకు ముందు కనీసం ఇద్దరు–ముగ్గురు నిపుణులను సంప్రదించండి. తప్పక తెలుసుకోవాల్సిన కోర్సులు.. ఇంజినీరింగ్ (బీ.టెక్): సీఎస్సీ, ఈసీఈ, ఏఐఎమ్ఎల్, సైబర్ సెక్యూరిటీ వంటి కొత్త స్పెషలైజేషన్లు డిమాండ్లో ఉన్నాయి. జేఎన్టీయూ, ట్రిపుల్ ఐటీ హైదరాబాద్, సీబీఐటీ, వీఎన్ఆర్ వంటి కాలేజీలు మంచి పేరు తెచ్చుకున్నాయి. మెడిసిన్ (ఎంబీబీఎస్, బీడీఎస్, బీఏఎమ్ఎస్, బీహెచ్ఎమ్ఎస్): నీట్ ఆధారంగా అఖిల భారత, రాష్ట్రస్థాయి కోటాలో సీట్లు లభిస్తాయి. ప్రైవేట్ కాలేజీలు ఫీజులు చాలా ఎక్కువ. ప్రభుత్వ కాలేజీలు అయితే అత్యుత్తమమైనవి. లిబరల్ ఆర్ట్స్, మాస్ కమ్యూనికేషన్, డిజైన్: ఎన్ఐడీ, నిఫ్ట్, ఎఫ్ఎల్ఏఎమ్ఈ యూనివర్సిటీ వంటి సంస్థలు ఆర్ట్స్కి ప్రాధాన్యతనిచ్చే విద్యార్థులకు అనుకూలం. వృత్తి విద్యా కోర్సులు(డిప్లొమా, ఐటీఐ, పారామెడికల్): తక్కువ ఖర్చుతో, త్వరగా ఉపాధి అవకాశాలు ఇవ్వగలిగే కోర్సులు కావాలంటే ఇవి బెస్ట్. రాష్ట్ర ప్రభుత్వాల మేనేజ్డ్ ఐటీఐ, పాలిటెక్నిక్ విద్యా సంస్థలు ఈ కోణంలో మంచి పనితీరు కనబరుస్తున్నాయి. డిగ్రీ (అండర్ గ్రాడ్యుయేషన్–యూజీ): ఇది విద్యార్థి కెరీర్కు బేసిక్గా పనిచేసే దశ. మూడేళ్ల (బీఏ, బీఎస్సీ, బీకాం) నుంచి నాలుగేళ్ల (బీటెక్, బీ.ఫార్మా) వరకు కోర్సులు ఉన్నాయి. యూజీలో ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న బీఎస్సీ డేటా సైన్స్, న్యూట్రీషన్, ఫోరెన్సిక్ సైన్స్.. బీకాం ఫిన్టెక్, బిజినెస్ అనలైటిక్స్.. బీఏ సైకాలజీ, మాస్ కమ్యూనికేషన్స్ వంటి రంగాలపై దృష్టి పెట్టాలి. డిగ్రీలో నేర్చుకున్న ఫౌండేషన్ బలంగా ఉంటే పీజీలో విశ్లేషణాత్మక విద్యనూ, పరిశోధనాత్మక దృక్పథాన్నీ పొందొచ్చు. పీజీ (పోస్ట్గ్రాడ్యుయేషన్): పీజీ అనేది యూజీలో పొందిన జ్ఞానాన్ని మరింత లోతుగా తెలుసుకునే దశ. ఇది రెండు సంవత్సరాల కోర్సు. ఉద్యోగ అవకాశాలు మెరుగుపర్చుకోవడానికి లేదా అధ్యాపక వృత్తిలోకి రావడానికి పీజీ ఉపయోగపడుతుంది. కొన్ని కోర్సులకు ప్రత్యేక ఎంట్రెన్స్ అవసరం: క్యాట్–ఎంబీఏ, సీయూఈటీ పీజీ లేదా టీజీ సీపీజీఈటీ–ఎమ్ఏ, ఎమ్మెస్సీ, ఎమ్కాం, గేట్–ఎమ్టెక్, నీట్ పీజీ–మెడికల్ పీజీ కోర్సులు. పీహెచ్డీ (డాక్టరల్ రీసెర్చ్): పరిశోధన రంగం అంటే సీరియస్గా గమనించాల్సిన అంశం. పీహెచ్డీ విద్యార్థి కొంత కాలం లోతుగా ఒక సబ్జెక్ట్ మీద పరిశోధన చేస్తూ సొంత థీసిస్ అందజేసే దశ. అభ్యాసం, పరిశోధన మీద ఆసక్తి ఉన్నవారికి మాత్రమే పీహెచ్డీ సరైన మార్గం. యూజీసీ–నెట్, సీఎస్ఐఆర్–నెట్, గేట్, జేఆర్ఎఫ్ వంటి పరీక్షల ద్వారా స్కాలర్షిప్తో చేరొచ్చు. హై–ఎండ్ కార్పొరేట్ ఆర్అండ్డీ, యూనివర్సి టీలలో ప్రొఫెసర్ ఉద్యోగాలు సాధించాలంటే పీహెచ్డీ అవసరం. (చదవండి: 114 ఏళ్ల వయసులోనూ హుషారుగా.. ఆయన ఫిట్నెస్ సీక్రెట్ ఇదే!.. కానీ..) -
114 ఏళ్ల వయసులోనూ హుషారుగా.. ఆయన ఫిట్నెస్ సీక్రెట్ ఇదే!.. కానీ..
ప్రపంచంలో అత్యంత పెద్ద వయస్కుడైన మారథాన్ అథ్లెట్గా గుర్తింపు పొందిన ఫౌజా సింగ్(114) రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన సంగతి తెలిసిందే. ఆయన చనిపోయేంత వరకు మంచి ఫిట్నెస్తో అందర్నీ ఆశ్చర్యపరిచేవారు. "టర్బన్డ్ టోర్నడో"గా మంచి గుర్తింపు తెచ్చకున్న ఫౌజా సింగ్ జూలై 14న 114 వయసులోకి అడుగుపెట్టారు. ఆయన ప్రపంచంలోనే అత్యంత శతాధిక వృద్ధ మారథాన్ అథ్లెట్గా మంచి పేరు తెచ్చుకున్న వ్యక్తి. అలాంటి వ్యక్తి ఆకస్మికంగా మృతి చెందడం బాధకరం. ఆయన చనిపోయేంత వరకు చక్కటి క్రమశిక్షణయుత జీవనశైలికి మారుపేరుగా నిలిచారాయన. వందేళ్ల వయసులో కూడా యువకుడు మాదిరి దూకుడుగా ఉండే అతడి తీరు అందర్నీ ఆశ్చచకితులను చేసేది. అంతలా సుదీర్ఘకాలం జీవించడమే కాకుండా..ఆరోగ్యంగా ఫిట్గా ఉండేందుకు ఆయన ఎలాంటి ఆహార తీసుకునేవారు..?. అతడి జీవన విధానం ఎలా ఉండేది అంటే..ప్రపంచంలోనే అత్యంత వృద్ధ మారథాన్లలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్న ఫౌజా సింగ్ 1911లో జన్మించారు. వందేళ్లు పూర్తి అయిన వెంటనే మారథాన్లో పాల్గొని పరుగుపెట్టడం ప్రారంభించారు. ఆ వయసులో అతడి అపారమైన ఓపిక, చలాకితనం చూసి శాస్త్రవేత్తలు సైతం ఆశ్చర్యపోయారు. ఆయన ఈ మారథాన్ ప్రయాణాన్ని 89 ఏళ్ల వయసులో ప్రారంభించి 2000 నుంచి 2013 మధ్య మొత్తం 9 మారథన్లు పూర్తి చేశారు. అంతేగాదు ఆయన తన 101వ పుట్టి రోజు జరుపుకున్న మూడు వారాలకే లండన్ మారథాన్లో పాల్గొని ఏడు గంటల 49 నిమిషాల్లో పూర్తి చేశారట. గత 12 ఏళ్లలో మొత్తం ఎనిమది మారథాన్లు పూర్తి చేశారు. ఇంతలా యాక్టివ్గా ఆ వయసులో మారథాన్లు పూర్తి చేయడానికి గల సీక్రెట్ సింపుల్ ట్రిక్సేనని అంటారు ఫౌజా సింగ్. తాను శాకాహారాలు మాత్రమే తింటానని, అదే తన ఆరోగ్య రహస్యమని చెబుతున్నారు. అంతేగాదు ఆయన శాకాహారులు మాంసం తినేవారికంటే సుదీర్ఘకాలం బతుకుతారని బలంగా విశ్వసిస్తాడాయన. ఇదే విషయం అధ్యయనాల్లో కూడా వెల్లడైంది. తాను ప్రతిరోజు చపాతీ, పప్పు, సబ్జీ, సాగ్ వంటి శాకాహారాలు తినడం తోపాటు నడవడం, జాగింగ్ వంటివి కూడా చేస్తానని వెల్లడించారు. వయసు పరిణితిని అందిచవచ్చేమో గానీ ఓర్పు, ప్రశాంత జీవనం, మంచి ఆరోగ్యం మాత్రం పోషకాహారమైన శాకాహారంతోనే వస్తుందని సదా పిలుపునిచ్చేవారు ఫౌజా. తాను జీవితాంతం శాకాహారినే అని ప్రకటించారు కూడా. సిక్కు మతం "జీవించడానికి తినాలే తప్ప తినడానికే జీవించకూడదు" అని ప్రభోదిస్తుంది. తాను పుట్టిన భారతావనిలోని పంజాబ్లో స్వయంగా తాము పండించే పంటలనే తింటారని, అదే వారి దీర్ఘాయువు రహస్యమని తరుచుగా చెబుతుండేవారు. ఆ క్రెడిట్ అంతా శాకాహారాలకే ఆపాదిస్తానని అంటుండేవారు. మన భారత ప్రధాని మోదీ సైతం శాకాహారాలతోనే ఆరోగ్యం అని మన్కీ బాత్లో చెబుతుంటారు. అలానే చాలామంది ప్రముఖులు, సెలబ్రిటీలు కూడా మొక్కల ఆధారిత ఆహారాలతోనే అనారోగ్యం బారిన పడకుంటా ఉంటామని చెబుతుండటం విశేషం. (చదవండి: హీరో మాధవన్ వెయిట్లాస్ జర్నీ..! వ్యాయమాలు చేయకుండా జస్ట్ 21 రోజుల్లో..) -
హీరో మాధవన్ వెయిట్లాస్ జర్నీ..! వ్యాయమాలు చేయకుండా జస్ట్ 21 రోజుల్లో..
తమిళ నటుడు మాధవన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. లేడీ ఫ్యాన్స్ ఎక్కువగా ఉన్న నటుడిగా పేరుగాంచిన ఆర్ మాధవన్..ఐదు పదుల వయసులో కూడా అదే యంగ్ లుక్లో అభిమానులను అలరిస్తున్నారు. ఒకనొక టైంలో అధిక బరువుతో ఇబ్బందిపడ్డ మాధవన్ గతేడాది 2024లో అనూహ్యంగా బరువు తగ్గి అందర్నీ ఆశ్చర్యపరిచారు. మళ్లీ ఇదివరకటి మాధవన్ మన ముందుకు వచ్చేశాడంటూ అతడి అభిమానులు ఖుషీ అవుతున్నారు. అది కూడా 21 రోజుల్లోనే అదనపు బరువుని తగ్గించుకోవడం విశేషం. మరి అందుకోసం అతడు ఎలాంటి డైట్ ప్లాన్ అనుసరించాడు, ఎలాంటి వర్కౌట్లు చేసేవాడో తెలుసుకుందామా..!.చాలా తక్కువ సమయంలోనే బరువు తగ్గేందుకు మాధవన్ ఎలాంటి వర్కౌట్లను ఆశ్రయించలేదన. జస్ట్ తీసుకునే ఆహారంలోనే మార్పులు, చక్కటి జీవనశైలితో బరువు తగ్గాడట. ఓ ఇంటర్వ్యూలో ఆయనే స్వయంగా వెల్లడించారు. తాను అడపాదడపా ఉపవాసం(మెడిటేరియన్ డైట్), రోజుకు 45 నుంచి 60 సార్లు బాగా నమిలి తినడం, నీళ్లు అధికంగా తీసుకోవడం వంటివి అనుసరించినట్లు తెలిపారు. అలాగే రోజులో తన చివరి భోజనం సాయంత్రం 6.45 గంటలకు (వండిన ఆహారం మాత్రమే తీసుకునేవారట). తెల్లవారుజామున సుదీర్ఘ వాకింగ్, గాఢనిద్ర, పోన్కి దూరంగా ఉండటం వంటివి చేశానని చెప్పారు. పుష్కలంగా నీరు, ఆకుపచ్చని కూరగాయలు తీసుకున్నానని చెప్పుకొచ్చారు. శరీరంగా సులభంగా జీర్ణం చేసుకునే పోషకాహారానికే ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలిపారు. అలా మాధవన్ 21 రోజుల్లో ఆరోగ్యకరమైన రీతీలో బరువు తగ్గారు. ఇది మంచిదేనా అంటే..నిపుణులు ఏమంటున్నారంటే..అడపాదడపా ఉపవాసంఅడపాదడపా ఉపవాసం అనేది ఒక విధమైన తినే విధానం. ఇది ఇన్సులిన్ స్థాయిలను నిర్వహించడానికి మొత్తం ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఆర్.మాధవన్ ప్రతిరోజూ సాయంత్రం 6:45 గంటలకల్లా తన చివరి భోజనం తింటానని, మధ్యాహ్నం 3:00 గంటల తర్వాత ఎలాంటి పచ్చి ఆహారాన్ని తిననని వెల్లడించాడు.ఆహారాన్ని సరిగ్గా నమలడంఇలా 45 నుంచి 60 సార్లు ఆహారాన్ని నమలడానికి బరువు తగ్గడానికి మధ్య చాలా అవినాభావ సంబంధం ఉందని అధ్యయనాలు పేర్కొన్నాయి కూడా. ఇది బరువు తగ్గాలనుకునేవారికి సరైన వ్యూహంగా చెబుతున్నారు నిపుణులు.ఉదయాన్నే వాకింగ్బరవుని అదుపులో ఉంచడానికి ఉత్తమ మార్గం ఇది. ఎలాంటి కఠిన వ్యాయామాలతో పనిలేకుండా చేసే సుదీర్ఘ వాకింగ్ కండరాలకు మంచి కదలిక తోపాటు సులభంగా కేలరీలను బర్న్ చేయడంలో తోడ్పడుతుంది.స్లీప్ అండ్ స్క్రీన్ డిటాక్స్మంచి నాణ్యమైన నిద్రకు స్కీన్ సమయం తగ్గించడమే అని నిపుణులు చెబుతున్నారు. నిద్రకు కనీసం ముందు 90 నిమిషాలు పాటు స్క్రీన్లకు దూరంగా ఉండటం చాలామంచిదని సూచించారు.పుష్కలంగా ద్రవాలు, ఆరోగ్యకరమైన ఆకుకూరలుబరువు తగ్గించే ప్రయాణంలో తాను పుష్కలంగా ద్రవాలు తాగానని హైడ్రేటెడ్గా ఉంచుకున్నానని ఆర్.మాధవన్ తెలిపారు. మాధవన్ తన శరీరం సులభంగా జీర్ణం చేసే ఆకుపచ్చ కూరగాయలు, ఆహారాలకే ప్రాధాన్యత ఇచ్చారు. ప్రాసెస్ చేసిన ఆహారాలకు చాలా దూరంగా ఉన్నారు. ఇది సరైన జీవనశైలికి నిదర్శనమని చెబుతున్నారు నిపుణులు. ఈ విధమైన ఆరోగ్యకరమైన పద్ధతులను అనుసరిస్తే ఎవ్వరైనా..సులభంగా బరువు తగ్గుతారని నమ్మకంగా చెబుతున్నారు. ఇంకెందుకు ఆలస్యం ప్రయత్నించి చూడండి మరి..!.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం.No exercise, No running... 😏21 நாட்களில் மாதவன் உடல் மாற்றம், அது எப்படி சாத்தியம்? 🤔 pic.twitter.com/ssrATrqOnr— Aadhavan® (@aadaavaan) July 17, 2024 (చదవండి: రిమ్ 'జిమ్'.. హోమ్..! కోవిడ్ తర్వాత పెరుగుతున్న ట్రెండ్..) -
చేప.. చేదా...వర్షకాలంలో అస్సలు తినకూడదా..?
ఎంతగా మనకు ఇష్టం ఉన్నప్పటికీ వర్షాకాలంలో చేపలు తినడం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే...ఇది చేపల ఉత్పత్తి సమయం అంటే బ్రీడింగ్ సైకిల్..వర్షాకాలంలో చేపలు సంతానాన్ని ఉత్పత్తి చేస్తాయి. ఆ సమయంలో వాటిని తినడం అంత మంచిది కాదు. అది వాటి పునరుత్పత్తిని వ్యతిరేకించే చర్య దీని వల్ల చేపల జనాభా మందగిస్తుంది.. అలాగే పర్యావరణ సమతౌల్యం దెబ్బతింటుంది కూడా. అందువల్ల ఈ సమయంలో చేపలను తీసుకోవడం తగ్గిస్తే మన ఆరోగ్యానికి మాత్రమే కాదు పర్యావరణానికి మేలు చేసిన వాళ్లం అవుతాం. అంతేకాదు వాటి బ్రీడింగ్ దెబ్బతినకూడదని కొన్ని ప్రాంతాల్లో ఈ సీజన్లో చేపల వేటను నిషేధిస్తారు కూడా. తద్వారా నాణ్యమైన చేపల దిగుబడి తగ్గుతుంది.వర్షాలు వస్తే సరఫరా వ్యవస్థలో కీలకమార్పులు చోటు చేసుకుంటాయి. వినియోగదారులకు చేపలను అందించేందుకు ట్రాన్స్పోర్ట్ చేసే ట్రక్, నిల్వ చేసే పోలీస్టర్ బ్యాగులు తదితర పద్ధతుల్లో అలసత్వం మరింత బాక్టీరియా పెరుగుదలకు దారితీసే అవకాశం ఉంటుంది.వర్షాలు నీటిని కలుషితం చేస్తాయి, యాంటిజన్లను, బ్యాక్టీరియా, వైరస్ల వృద్ధికి కారణమవుతాయి. ఈ పరిస్థితిలో చేపలు ఆ కలుషిత నదీ/ తలపు/ఏరియా నీళ్ళలో ఉంటే, వాటి ద్వారా మనకు కలరా, హెపటైటిస్ బి, టైఫాయిడ్, గ్యాస్ట్రోఎంటరైటిస్ వంటి వ్యాధులు వచ్చే అవకాశం పెరుగుతుంది అంతేకాదు అలర్జీలు ఉన్నా లేక వ్యాధి నిరోధక శక్తి లేకపోయినా వారికి కూడా ఈ సీజన్లో చేపలు ఆహారం మంచిది కాదని వైద్యులు అంటున్నారు.వర్షాకాలంలో వాతావరణంలో తేమ ఉండటం వల్ల, చేపలు మరింత వేగంగా పాడైపోవడం జరుగుతుంది. ఇది కొద్దిగా తాజా కనబడినా, అది వాస్తవానికి పాడైపోవడం కాకపోవడం అన్న ఒక గందరగోళ అనుభూతి మాత్రమే. ఆరోగ్యం దృష్ట్యా ప్రొటీన్ కోసం తీసుకుంటున్నవారు ప్రత్యామ్నాయంగా, ప్రోటీన్ అవసరాన్ని తీర్చుకోవడానికి కొన్ని రకాల శాఖాహారాలను ఎంచుకోవచ్చు.చేపలను తీసుకోకుండా ఉండలేని ఫిష్ లవర్స్ ఈ సీజన్లో చేపలను తక్కువగా లేదా ఆచి తూచి ఎంచుకుని తినడం అవసరం. విశ్వసనీయమైన విక్రయదారుని నుంచి మాత్రమే చేపలు కొనుగోలు చేయాలి. సరైన , తగినంత టెంపరేచర్లో పరిశుభ్రమైన పద్ధతిలో వండి మాత్రమే వినియోగించాలి. తాయ్ మంగూర్ వంటి కొన్ని హానికారక జాతుల చేపల్ని ప్రభుత్వం నిషేధించింది. అయినప్పటికీ కొందరు విక్రయిస్తున్నారు. ఇలాంటి చేపల జాతుల గురించి అవగాహనతో ఎంపిక చేసుకోవాలి.(చదవండి: దృఢ సంకల్పానికి కేరాఫ్ అడ్రస్ ఈ పారాసైక్లిస్ట్..! ఒంటి కాలితో ఏకంగా..) -
పుట్టగొడుగులకు డిమాండ్, కిలో రూ. 1400
కొరాపుట్: వర్షాలు కురుస్తుండడంతో పుట్టగొడుగుల (Mushrooms) సీజన్ ప్రారంభమైంది. వీటిని సేకరిస్తున్న వ్యక్తులు విక్రయించేందుకు జయపూర్ మార్కెట్కు మంగళవారం భారీగా తీసుకొని వచ్చారు. ఇప్పుడిప్పుడే పుట్టగొడుగులు లభ్యమవుతుండడంతో వీటికి డిమాండ్ పెరిగింది. కిలో 1400 రూపాయల చొప్పున వ్యాపారులు విక్రయిస్తున్నారు. పుట్టగొడుగుల్లోని పోషక లక్షణాలు, బయోయాక్టివ్ సమ్మేళనాలు ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. అవి యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు , ఖనిజాలకు మంచి మూలం. అంతేకాదు కొన్ని పుట్ట గొడుగులు ప్రీబయోటిక్ లక్షణాలను కలిగి ఉంటాయి, ఇవి పేగు ఆరోగ్యంపై సానుకూల ప్రభావాన్ని చూపుతాయి.చదవండి: ఇషా-ఆనంద్ లవ్, ప్రపోజల్ స్టోరీని రివీల్ చేసిన పాపులర్ సింగర్పుట్టగొడుగులతో ఆరోగ్య ప్రయోజనాలుమష్రూమ్స్ను మన ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఎన్నో అద్భుత లాభాలు ఉన్నాయి. విటమిన్ డి,డి2, పుష్కలంగా లభిస్తాయి.ఎముకలు, కండలకి బలంరోగ నిరోధక శక్తి పెరుగుతుంది. యాంటీ ఇక్సిడెంట్స్ కారణంగా స్ట్రెస్ తగ్గుతుంది.మష్రూమ్స్లోయాంటీ ఆక్సిడెంట్స్, పాలీఫెనాల్స్ పుష్కలంగా ఉంటాయి. వీటితో బ్రెయిన్ హెల్త్ బాగుంటుంది. దీంతో పాటు జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుంది.పుట్టగొడుగులు తినడం వల్ల బరువు తగ్గుతారు. వీటిల్లో పొటాషియం, మినరల్స్, ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి. ఇవి బీపిని అదుపులో పుంచుకునేందుకు సాయ పడతాయి. పుట్టగొడుగులతో కార్డియోవాస్క్యులర్ సమస్యలు తగ్గుతాయి. పుట్టగొడుగుల్లోని ప్లాంట్ బేస్డ్ కాంపౌండ్స్ రక్తనాళాలని మెరుగ్గా చేసి గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. సోడియం లెవల్స్, కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గుతాయి.గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం అందించిన వివరాలివి. అలాగే ఆరోగ్యకరమైన పుట్ట గొడుగులను మాత్రమే ఎంచుకోవాలి. కొన్ని విషపూరితమైన పుట్ట గొడుగులతో ప్రాణాలకు ముప్పు అని గమనించగలరు. ఇదీ చదవండి: Soumyashree అలసిపోయిన ప్రాణం: పాడె మోసిన గ్రామస్తులు -
Amblyopia: లేజీ 'ఐ' ఓ కన్నేయండి..!
కొన్ని సందర్భాల్లో రెండు కళ్లలో... ఏదో ఓ కన్ను పనిచేయడానికి కాస్త బద్ధకిస్తుంటుంది. ఈ సమస్య అందరిలోనూ వచ్చే అవకాశమున్నా ముఖ్యంగా చిన్న పిల్లల్లో ఇలాంటి కేసులు ఎక్కువ. అయితే... తమకు ఉన్న రెండు కళ్లలో ఒకటి... తన పక్కదానంత బాగా పనిచేయడం లేదన్న విషయం వారికి తెలిసే అవకాశం సాధారణంగా ఉండదు. ఇలాంటి సందర్భాల్లో స్పష్టంగా కనిపించే కంటి నుంచే ప్రతిబింబాలను గ్రహించి, అస్పష్టంగా కనిపించే ప్రతిబింబాలను మెదడు నిరాకరిస్తుంది. అంటే ఈ రెండు కళ్లలో ఒకటి ప్రతిబింబాన్ని ప్రసారం చేయడంలో కాస్త బద్ధకంగా పనిచేస్తుందన్నమాట. ఇలా బద్ధకంగా పనిచేసే కన్ను పనితీరు క్రమంగా తగ్గి΄ోతూ... ఒక దశలో పూర్తిగా పనిచేయకుండా ΄ోయే ప్రమాదం ఉంది. ఈ సమస్యనే వాడుక భాషలో ‘లేజీ ఐ’ అనీ, వైద్యపరిభాషలో ‘ఆంబ్లోపియా’ అని అంటారు. సాధారణంగా ఆంబ్లోపియా సమస్య ఉన్నప్పుడు... కొద్దిగానైనా చూపు ఉన్నంత కాలం... తమ కళ్లలో ఒకదానికి సమస్య ఉందన్న విషయమే బాధితులకు తెలిసే అవకాశం పెద్దగా ఉండదు. ఈలోపే జరగాల్సిన అనర్థాలు జరిగే అవకాశముంది. అందుకే ‘లేజీ ఐ’ (యాంబ్లోపియా)పై అవగాహన అవసరం. అందుకు ఉపయోగపడేదే ఈ కథనం. ఓ కేస్ స్టడీశిరీష (పేరు మార్చాం) అనే ఓ ఎనిమిదేళ్ల చిన్నారి రెండు కళ్లలో ఒక కన్నులోంచే దృశ్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఆ రెండో కన్ను మంచి ప్రతిబింబాన్ని పంపడంలో కాస్త బద్ధకిస్తోంది. ఇలా కంటిన్యువస్గా జరిగే సమయంలో ఎదుటి దృశ్యాన్ని స్పష్టంగా పంపే కంటి తాలూకు ప్రతిబింబాన్నే మెదడు తీసుకుంటోంది. సరిగ్గా కనిపించని కంటి నుంచి వచ్చే ఆ సమాచారాన్ని తీసుకోవడాన్ని నిరాకరిస్తూ పోవడంతో కొంతకాలానికి ఆ కంటికి క్రమంగా అంధత్వం వచ్చే ప్రమాదం ఏర్పడింది. ఈలోపు ఏదో ఇతర పరీక్ష కోసం వెళ్లిన సమయంలో డాక్టర్లకు ఒక కన్ను బద్ధకిస్తోన్న విషయం తెలిసివచ్చింది. దాంతో డాక్టర్లు అతి కష్టమ్మీద ఆ రెండో కంటి చూపునూ కాపాడగలిగారు. అసలు ‘లేజీ ఐ’ పై అవగాహన రావాలంటే ముందుగా... చూడడమనే ప్రక్రియ ఎలా జరుగుతుందో తెలియడం చాలా ప్రధానం. మనం ఏదైనా దృశ్యాన్ని లేదా వస్తువును చూడాలంటే... తొలుత ఆ వస్తువుపై కాంతి పడి, మళ్లీ అదే కాంతి మన కంటిని చేరాలి. అప్పుడది తొలుత నల్లగుడ్డు అయిన కార్నియా నుంచి, తర్వాత పారదర్శకమైన మన లెన్స్ నుంచీ ప్రసరించి... రెటీనా అనే తెరపై ఆ వస్తువు తాలూకు ప్రతిబింబాన్ని తలకిందులుగా పడేలా చేస్తుంది. ‘ఆప్టిక్ నర్వ్’ అనే కీలకమైన నాడి ద్వారా రెటీనాపైనున్న ప్రతిబింబం సమాచారాన్ని మెదడుకు చేరవేస్తుంది. దాంతో ఆ వస్తువు కనిపించడం వల్ల మనకు దృష్టిజ్ఞానం కలుగుతుంది. ఏమిటీ ‘లేజీ ఐ’?మనకు కలిగే దృష్టి జ్ఞానాన్ని ‘బైనాక్యులర్ విజన్’ అంటారు. అంటే... మన రెండు కళ్లలోని దృశ్యాలూ తమ తమ రెటీనాలపై కలిసి (ఇంటిగ్రేట్ అయి) ఆ రెండూ ఒకే దృశ్యంగా / వస్తువుగా కనిపిస్తాయి. అంటే ‘బై’ అంటే రెండు... ‘ఆక్యులార్’ అంటే ‘కళ్లు’... ఈ రెండు కళ్లూ కలిసి ఒకే దృశ్యాన్ని చూపడమే ‘బైనాక్యులార్ విజన్’! ఏదైనా కారణాలతో ఒకవేళ ఒకరి రెండు కళ్లలో... ఒకదానికి ఏదైనా కొంత లోపం ఉంటే... అలాంటప్పుడు ఒక కంటిలోని ప్రతిబింబం చాలా స్పష్టంగానూ, లోపమున్న కంటిలోని ప్రతిబింబం కొంత అస్పష్టంగా... ఇలా తన రెండు రెటీనాలపై ప్రతిబింబాలను చూపుతుంది. అయితే రెండు కళ్లతో చూసేప్పుడు బైనాక్యులర్ విజన్ కారణంగా ఆ లోపం తెలియక΄ోవచ్చు. ఒక్కో కంటితో విడివిడిగా, పరీక్షగా చూసినప్పుడు మాత్రమే అది తెలిసిరావచ్చు.ఇలాంటి సందర్భాల్లో స్పష్టమైన ప్రతిబింబాన్నే మెదడు స్వీకరిస్తుంది. అస్పష్టమైన దాన్ని క్రమంగా నిరాకరిస్తూపోతుంది. ఇలా అస్పష్టమైన ప్రతిబింబాన్ని నిరాకరించడాన్ని ‘సప్రెషన్’ అంటారు. ఒక కంట్లో ప్రతిబింబం అస్పష్టంగా ఏర్పడుతున్నప్పుడూ, ఆ సమాచారాన్ని మెదడు క్రమంగా నిరాకరిస్తూపోతూ ఉండే మెడికల్ కండిషన్ను ‘లేజీ ఐ’ అనీ, వైద్యపరిభాషలో ‘ఆంబ్లోపియా’ అని అంటారు. లేజీ ఐ / ఆంబ్లోపియా సమస్య ఉన్నవారిలో తొలుత ఎలాంటి లోపమూ కనిపించదు. చిన్నపిల్లల్లోనైతే వాళ్ల కన్ను అభివృద్ధి / వికాసం కూడా మామూలుగానే జరుగుతాయి. వైద్యపరీక్షల్లోనూ కంటి గురించి ఎలాంటి లోపమూ తెలియదు. కాని కొన్నిసార్లు ఏదో ఒక కంట్లోగానీ లేదా ఒక్కోసారి రెండు కళ్లల్లోనూ చూపు మందగిస్తుంది. ‘లేజీ ఐ’ కండిషన్ వయసుతో పాటు పెరుగుతూ పోతుంది. పైకి అంతా బాగానే ఉండటంతో ఈ కండిషన్ను తొలిదశల్లో గుర్తుపట్టడమూ కష్టమే.ఆంబ్లోపియా విస్తృతి : మన దేశంలోని చిన్నారుల్లో దీని విస్తృతి దాదాపు రెండు శాతం. అంటే ప్రతి వంద మంది పిల్లల్లో ఇద్దరిలో ఈ లోపం కనిపిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా దీని విస్తృతి ఇంకా ఎక్కువ. అంటే దాదాపు 4 శాతం. ఆంబ్లోపియా రకాలు అన్ ఐసోమెట్రోపిక్ ఆంబ్లోపియా : ఒక కంట్లో ఉన్న దృష్టిలో΄ానికీ (రిఫ్రాక్టివ్ ఎర్రర్కూ), మరో కంటికీ తేడా ఉండటం. ఈ సమస్య ఉన్న వాళ్లలో చాలా ఎక్కువమందిలో ఈ సమస్యే ఉంటుంది. ఐసోమెట్రిక్ ఆంబ్లోపియా : రెండు కళ్లలోనూ ఎక్కువ దృష్టిలోపం (రిఫ్రాక్టివ్ ఎర్రర్) ఉండటం. (ఉదా + 6.0 ; +6.0) మెరిడోనల్ ఆంబ్లోపియా: కళ్లలో సిలెండ్రికల్ పవర్ ‘2.0’ కంటే ఎక్కువ ఉండటం. స్టెడిస్మస్ ఆంబ్లోపియా : మెల్లకన్ను కారణంగా వచ్చే ఆంబ్లోపియా ఇది. డిప్రొవేషనల్ ఆంబ్లోపియా : పుట్టుకతోనే కంట్లో శుక్లం ఉండటం, కార్నియా సమస్య, రెటీనా సమస్య, కనురెప్ప వాలిపోవడం వంటి సమస్యలున్నప్పుడు, కాంతి కిరణాలు రెటీనాకు సరిగా చేరకపోవడం ఈ తరహా ఆంబ్లోపియా వస్తుంది.ఎంత త్వరగా చికిత్స జరిగితే... అంత మేలైన ఫలితాలుఆంబ్లోపియాను ఎంత త్వరగా గుర్తించి, ఎంత చిన్న వయసులో చికిత్స చేయిస్తే ఫలితాలు అంత మెరుగ్గా ఉంటాయి. అయితే ఆ పసివయసులో తమ చూపులో లోపం ఉందన్న విషయాన్ని పిల్లలు గ్రహించలేకపోవడం, అలాగే చిన్నారుల నుంచి ఎలాంటి ఫిర్యాదులూ లేకపోవడంతో తల్లిదండ్రులు కూడా దీన్ని ఒకపట్టాన గుర్తించలేరు. అయితే చిన్నతనంలోనే అంటే... రెండు నుంచి ఎనిమిది ఏళ్లలోపు గుర్తించి, చికిత్స చేయిస్తే ఫలితాలు చాలా మెరుగ్గా ఉంటాయి. అంతమాత్రాన నిరాశపడాల్సిన అవసరం లేదు. పన్నెండేళ్ల నుంచి పద్దెనిమిదేళ్ల వరకు చికిత్స చేయించడానికి అవకాశం ఉంది. కాకపోతే ఫలితాలు చిన్నప్పటితో పోలిస్తే కాస్త నిదానంగా కనిపిస్తాయి. పెద్దవాళ్లలో కూడా ‘విజన్ థెరపీ’ ద్వారా కొంతవరకు ఫలితాలను రాబట్టవచ్చు. ఏ కారణంతో ఆంబ్లోపియా వచ్చిందో దానికి చికిత్స చేయడం : అంటే ఉదాహరణకు దృష్టిలోపాల వల్ల సమస్య వచ్చినట్లయితే దానికి సరిపడిన అద్దాలను ఇవ్వడం. ఉదాహరణకు ప్లస్ పవర్, మైనస్ పవర్, సిలెండ్రికల్ పవర్. మెల్లకన్ను కారణంగా ఆంబ్లోపియా వస్తే మెల్లకన్ను కరెక్షన్ చికిత్సతో దాన్ని సరిచేయడం. డిప్రెవేషన్ ఆంబ్లోపియా జబ్బులకు... అంటే శుక్లం, కార్నియా, రెటీనా, వాలిపోయే కనురెప్పలు వంటి సమస్యలు ఉన్నప్పుడు వాటిని సరిచేయడం ద్వారా లోపాల్ని తొలగించవచ్చు. ఉదాహరణకు... పుట్టుకతోనే శుక్లం (కాటకార్ట్) కారణంగా ఆంబ్లోపియా వస్తే... శస్త్రచికిత్స ద్వారా తొలుత పారదర్శకత కోల్పోయిన శుక్లాన్ని తొలగించాలి. ఆ స్థానంలో ఇంట్రా ఆక్యులార్ లెన్స్ను అమర్చాలి. శుక్లం కేవలం ఒకే కంట్లోనే ఉంటే– బిడ్డ పుట్టిన వెంటనే ఈ ఆపరేషన్ చేయవచ్చు. ఒకవేళ శుక్లాలు రెండు కళ్లలోనూ ఉంటే ఆపరేషన్కు కొన్ని మాసాల వ్యవధి తీసుకోవచ్చు. కాని శస్త్రచికిత్స మాత్రం తప్పనిసరిగా చేయించాలి. ఆపరేషన్ ఎంత త్వరగా చేస్తే చూపు వచ్చే అవకాశాలు అంత మెరుగ్గా ఉంటాయి. ఆపరేషన్ తర్వాత కూడా పిల్లలకు డాక్టర్లు సూచించిన ప్రకారం... క్రమం తప్పకుండా కంటి పరీక్షలు చేయిస్తూ ఉండాలి. ఇలా ఆ చిన్నారికి 14 ఏళ్ల వయస్సు వచ్చే వరకూ పరీక్షలు చేయించడం తప్పనిసరి. పిల్లల్లో మెల్లకన్ను ఉన్నప్పుడు అశ్రద్ధ చేయకుండా కంటి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాలి. మూడేళ్లలోపు పిల్లలకు ఇది వచ్చే అవకాశం ఎక్కువ. కొందరిలో పుట్టగానే మెల్లకన్ను ఉండవచ్చు. కొందరు తల్లిదండ్రులు తమ బిడ్డకు మెల్లకన్ను ఉండటాన్ని అదృష్టంగా భావిస్తారు. పిల్లలు ఎదిగిన తర్వాత పరీక్షలు చేయించవచ్చని మరికొంతమంది తల్లిదండ్రులు అభిప్రాయపడుతుంటారు. ఈ రెండూ సరికాదు. పిల్లల్లో మెల్లకన్నును గమనించగానే వెంటనే పిల్లలను డాక్టర్ వద్దకు తీసుకెళ్లాలి. మెల్లకంటి సమస్యకూ ఎంతత్వరగా చికిత్స చేయిస్తే... అంత మంచిది. కంటి రెప్ప వాలిపోవడం వల్ల ఆంబ్లోపియా వస్తే... ఆ రెప్ప పైకెత్తి నిలిపి ఉంచేలా ఓ శస్త్రచికిత్స అవసరమవుతుంది. దీన్నే ‘టోసిస్ కరెక్షన్’ సర్జరీ అంటారు. ఈ ఆపరేషన్ తర్వాత కూడా క్రమం తప్పకుండా కంటి పరీక్షలు చేయిస్తూ ఉండటం అవసరం. కొందరిలో కంటికి అద్దాలు అవసరమవుతాయి. ఇలాంటివారు అద్దాలు వాడుతూనే ఆంబ్లోపియాకూ చికిత్స చేయించాలి.అంబ్లోపియాకు కారణాలు(ఆంబ్లోజెనెసిస్)విజువల్ డిప్రవేషన్ : చూపు విషయంలో ఒక కంటిలో ఉన్నంత స్పష్టత మరోదానిలో లేకపోవడం. లైట్ డిప్రవేషన్ : కంటిలోని కొన్ని దోషాల కారణంగా (కాటరాక్ట్ వంటి వాటివల్ల) రెటీనాకు తగినంత కాంతి చేరకపోవడం. అబ్–నార్మల్ బైనాక్యులార్ విజన్ : అంటే రెండు కళ్లూ సమంగా ఒకే వస్తువుపై కేంద్రీకరించలేకపోవడం... ఈ అంశాలు ఉన్నవారిలో ఆంబ్లోపియా క్రమంగా వృద్ధిచెందుతుంది.అక్లూజన్ థెరపీఈ చికిత్స ప్రక్రియలో నార్మల్గా ఉన్న కంటిని పూర్తిగా మూసివేసి, చూపు మందగించిన కంటి తాలూకు దృష్టి మెరుగుపడేలా స్టిమ్యులేట్ చేస్తారు. నార్మల్గా ఉన్న కంటిని ఎన్నాళ్లు మూసి ఉంచి... ఈ స్టిమ్యూలేషన్ చికిత్స చేయాల్సి ఉంటుందన్నది డాక్టర్ నిర్ధారణ చేస్తారు. ఈ చికిత్స వల్ల 8 నుంచి 10 ఏళ్ల వరకు ఉన్న పిల్లల్లో మంచి ఫలితాలు కనిపిస్తాయి.పీనలైజేషన్అట్రోపిన్ చుక్కల మందులు లేదా బలమైన లెన్స్లను బాగా కనిపించే కంటికి వాడతారు. అప్పుడు బలహీనంగా ఉన్న కన్ను స్టిమ్యులేట్ అవుతుంది. దాంతో అది చూడటానికి ప్రయత్నించడాన్ని మొదలు పెడుతుంది. కన్నును మూసివేసి ఉంచి చేసే చికిత్స అయిన ‘అక్లూజన్ థెరపీ’లోలా కాకుండా, కన్ను తెరచే ఉంచి చేసే చికిత్స ఇది.విజన్ థెరపీపైన పేర్కొన్న అక్లూజన్ పద్ధతిలో చికిత్స చేస్తూ... కంప్యూటర్ ప్రోగ్రామ్ ద్వారా బలహీనమైన కంటిని చురుగ్గా మారేలా చేస్తారు. దీని వల్ల మెదడు కూడా తిరిగి ప్రతిబింబాన్ని గ్రహించేలా, పక్క కన్ను ప్రతిబింబంతో పోల్చుకుని... మళ్లీ చూపు, బైనాక్యులర్ విజన్ పొందేలా ప్రయత్నం జరుగుతుంది. ఈ ప్రక్రియకు దాదాపుగా 100 నుంచి 200 గంటల పాటు చికిత్స అవసరమవుతుంది. లక్షణాలు / నిర్ధారణనిజానికి చాలా మంది తమకు లోపం ఉన్నట్లు గుర్తించలేరు / చెప్పలేరు. ∙ఒక కంటిలో చూపు తగ్గడంక్రౌడింగ్ ఫినామినా: అంటే... అనేక అక్షరాలు ఉన్నప్పుడు ఏదో ఒక అక్షరాన్ని మాత్రమే చూడగలగటం. ఒక్క అక్షరాన్ని మాత్రమే చదవడగలగడం. న్యూట్రల్ డెన్సిటీ ఫిల్టర్ : దీనితో పరీక్షించినప్పుడు మామూలు కంటి చూపు ఉన్నవారికిస్పష్టంగా కనిపించదు. కానీ ‘ఆంబ్లోపియా’ ఉన్నవారు దీనిలోంచి చూసినప్పుడు... వారికి మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. కొంతమందిలో మెల్లకన్ను ఉండటం, అలాగే రంగులు చూసే సామర్థ్యం తక్కువగా ఉండటం. కంటి డాక్టర్లు పైన పేర్కొన్న లక్షణాలను బట్టి ‘ఆంబ్లోపియా’ను నిర్ధారణ చేస్తారు. నివారణమూడు నుంచి ఐదేళ్ల వయసులోని పిల్లలకు తప్పనిసరిగా కంటి పరీక్షలు చేయించాలి. లోపాలుండి శస్త్రచికిత్స అవసరమైన వారికి వీలైనంత త్వరగా చేయించాలి. ఆక్లూజన్ థెరపీ ద్వారా చూపు తిరిగి వచ్చాక కూడా ‘మెయింటెనెన్స్ థెరపీ’ అంటూ రోజూ రెండు గంటల పాటు అక్లూజన్ ప్రక్రియను కొనసాగిస్తూ ఉండాలి. ∙తరచూ కంటి డాక్టర్ను సంప్రదిస్తూ ఉండాలి.ఫ్యూజనల్, స్టీరియాప్టిక్ ఎక్సర్సైజెస్లేజీ ఐ తన చురుకుదనాన్ని పొందేలా చేసిన చికిత్స ప్రక్రియల తర్వాత ఆ రెండు కళ్లూ ఒకేలాంటి మంచి ప్రతిబింబాన్నే మెదడుకు ఇచ్చేలా చేసేందుకు కొన్ని వ్యాయాయాలు చేయిస్తారు. ఇందులో ఫ్యూజనల్ ఎక్సర్సైజ్లో రెండు కళ్లూ తాము ప్రతిబింబించే దృశ్యాన్ని మెదడు ఒకేలా గ్రహించేలా చేస్తారు. ఇక స్టీరియాప్టిక్ ఎక్సర్సైజ్లో ఈ రెండు కళ్లూ డెప్త్ / 3 డీ ఇమేజ్ సాధించేలా చేయడానికి చేయిస్తారు. ఈ రెండు ఎక్సర్సైజ్లు చేయిస్తేనే భవిష్యత్తులో లేజీ ఐ లో చూపు తగ్గకుండా ఉంటుంది. లేదంటే మళ్లీ వెనక్కువెళ్లే అవకాశాలు ఉంటాయి.ఫార్మకోథెరపీలీవోడోపావంటి మందుల ద్వారా కంటి నరాలు బాగా పనిచేసేలా చేస్తారు. భవిష్యత్తు చికిత్స ప్రక్రియల్లో జీన్ థెరపీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా సరికొత్త చికిత్స ప్రక్రియలు అందివచ్చే అవకాశాలున్నాయి. ఇటీవల అడల్ట్ ఆంబ్లోపియాకు కూడా మరిన్ని అధునాతన చికిత్సలను అందుబాటు తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. డాక్టర్ కె. రవికుమార్ రెడ్డి, సీనియర్ కంటి వైద్య నిపుణులు (చదవండి: 'మార్నింగ్ వాకింగ్' ఎందుకంటే..! థైరోకేర్ వేలుమణి ఆసక్తికర వివరణ) -
ఇష్టమైన గులాబ్ జామ్లు తింటూనే 40 కిలోలు బరువు తగ్గాడు!
అధిక బరువుని సులభంగా తగ్గించుకుని స్మార్ట్గా మారిన ఎన్నో స్ఫూర్తిదాయక కథలు విన్నాం. ఎన్నో విభిన్న డైట్లతో తేలిగ్గా కొలెస్ట్రాల్ని మాయం చేసుకుని ఫిట్గా మారారు. ఇక్కడున్న వ్యక్తి తనకిష్టమైన స్వీట్ని త్యాగం చేయకుండానే ఆరోగ్యకరమైన రీతీలో బరువు తగ్గి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. అస్సలు అదెలా సాధ్యమైదనేది అతడి మాటల్లోనే తెలుసుకుందామా..!ప్రసిద్ధ యూట్యూబర్ ఆశిష్ చంచలానీకి ఎక్కువగా చిన్నారులు, యువకులు అతడి అభిమానులు. అతడు మంచి టైమింగ్ కామెడీకి ప్రసిద్ధి. అదే అతడికి వేలాది అభిమానులను సంపాదించి పెట్టింది. అలాంటి వ్యక్తి జస్ట్ ఆరు నెలల్లో 40 కిలోలు తగ్గాడు. ఒక్కసారిగా మారిన అతడి బాడీ ఆకృతి అదరిని ఫిదా చేసింది. అబ్బా అంతలా ఎలా బరువు తగ్గాడని ఏంటా డైట్ సీక్రెట్ అని ఆరా తీయడం ప్రారంభించారు. అయితే ఆశిష్ స్వయంగా ఆ సీక్రెట్ ఏంటో స్వయంగా వెల్లడించారు. నిజానికి ఆయన దగ్గర దగ్గరగా 130 కిలోలు పైనే బరువు ఉండేవాడు. తన 30వ పుట్టనరోజున తన ఆరోగ్యానికి ప్రాధానత ఇచ్చేలా స్మార్ట్గా మారిపోవాలని గట్టిగా తీర్మానం చేసుకున్నాడట. అయితే తన బరువు, ప్రకారం తనను తాను అద్దంలో చూసుకుంటే చాలా బాధగా అనిపించిందట. అలా అని నోరు కట్టేసుకునేలా ఆహారాన్ని పూర్తిగా తగ్గించలేడట ఆశిష్. దాంతో ఆహారాన్ని సర్దుబాటు చేసుకున్నాడట. అంటే..తనకు నచ్చిన ఆహారాన్ని వదులుకోకుండా క్రమబద్ధమైన జీవనశైలిని అనుసరిచడం అన్నమాట. తనకు నచ్చిన గులాబ్ జామ్లు ఆస్వాదిస్తూ డైట్ ఎలా తీసుకోవాలో ప్లాన్ చేసుకున్నారట. అందుకోసం ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు, కార్బోహైడ్రేట్లు ఎంచుకున్నారు. తన ఆహారంలో తప్పనిసరిగా ప్రోటీన్ పుష్కలంగా ఉండేలా జాగ్రత్త పడేవాడట. ఫైబర్, కార్బోహైడ్రేట్లు తన డైట్ జాబితాలో చివరి ప్రాధాన్యత అని చెబుతున్నాడు ఆశిష్. డైట్ విధానం..అల్పాహారం: ఆశిష్ కనీసం ఆరు ఉడికించిన గుడ్లు లేదా కొన్నిసార్లు వెరైటీగా ఆమ్లెట్, కాల్చిన మొలకలు తీసుకుంటాడు. లంచ్ఆశిష్ భోజనంలో 200 గ్రాముల చికెన్తో పాటు ఒక రోటీ ఉండేది, సలాడ్ ఎక్కువగా దోసకాయ, సెలెరీ జ్యూస్తో ఉంటుంది.స్నాక్స్సాయంత్రం స్నాక్స్ కోసం, ఆశిష్ వ్యాయామం చేస్తున్నందున సాయంత్రం 6 గంటలకు క్రమం తప్పకుండా పాలవిరుగుడు ప్రోటీన్ తీసుకుంటాడు.విందుఆశిష్ విందు కూడా ప్రోటీన్తో నిండి ఉండేది - రోటీ లేదా రైస్ వంటి కార్బోహైడ్రేట్లు లేకుండా గ్రిల్డ్ లేదా రోస్ట్ చేసిన చికెన్. బర్న్ చేసే కేలరీల సంఖ్య, తినే కేలరీలను బ్యాలెన్స్ చేసుకుంటూ బరువు తగ్గారట. తింటున్న ప్రతిదాన్ని లెక్కించేవాడట.. అలా తన ప్లేట్ని చూడగానే ఎంత కేలరీల మొత్తంలో ఆహారం తీసుకోవాలో అర్థమయ్యేదట.అప్పడప్పుడు చీట్మీల్..ఆశిష్ తనకు బాగా ఇష్టమైన డెజర్ట్లు తినకుండా ఉండలేడట. అందుకనే టీ, గులాబ్ జామున్లు, రసమలై వంటి స్వీట్లను వదులుకోలేదని చెప్పాడు. అయితే తన కేలరీలను కూడా పర్యవేక్షించడం ఎప్పటికీ మిస్ అయ్యేవాడు కాదట.(చదవండి: ఆ నింగే పెళ్లికి సాక్ష్యం అంటూ ఆ జంట..!) -
సింపుల్ చిట్కాలతో 15 కిలోలు తగ్గింది : నచ్చిన బట్టలు, క్రాప్ టాప్లు
ప్రముఖ హాస్యనటి,'లాఫర్ క్వీన్' భారతీ సింగ్ (Bharti Singh) చాలా కష్టపడి బరువును తగ్గించుకొని స్లిమ్గా మారడం అందర్నీ ఆశ్చర్యపర్చింది. 10 నెలల్లో దాదాపు 15 కిలోలు వెయిల్ లాస్ అయ్య ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచింది. యూట్యూబర్ నటి ప్రజక్తా కోలితో జరిగిన పాడ్కాస్ట్లో, భారతీ తన వెయిట్ లాజ్జర్నీ గురించి వివరించింది.భారతీ సింగ్ వెయిట్ లాస్ జర్నీ ఇలాకేవలం బరువు తగ్గడం మాత్రమే కాకుండా మొత్తం ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కూడా ఆలోచించింది భారతీ సింగ్. ఎందుకంటే అప్పటికే ఆమె ఆస్తమా . డయాబెటిస్తో బాధపడేది. ఎక్కువగా తల తిరుగుతూ ఉండేది. ఒక్కోసారి ఊపిరి ఆడేది కాదు. డాక్టర్ల సలహామేరకు ఎలాగైనా బరువు తగ్గాలని నిర్ణయించింది. 2021లో 91 కిలోల నుండి 76 కిలోలకు తగ్గించుకుని ఆటు ఫ్యాన్స్ను ఇటు సినీ అభిమానులను ఆశ్చర్య పర్చింది. బరువుతగ్గడం వల్ల ఆత్మవిశ్వాసంతోపాటు, ఆరోగ్యంగా, శక్తివంతంగా మారినట్టు తెలిపింది. అంతేకాదు డయాబెటిస్, ఆస్తమా కూడా నియంత్రణలో ఉన్నాయని సంతోషంగా చెప్పింది. ఇపుడు తాను చాలాఫిట్గా, హ్యాపీగా ఉన్నానని చెప్పుకొచ్చింది. తలతిరగడాలు, ఊపిరి ఆడకపోవడంలాంటి ఇబ్బందులేవీ లేవని వెల్లడించింది.అడపాదడపా ఉపవాసం Intermittent Fastingసాయంత్రం 7 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉపవాసం. మధ్యాహ్నం ఆహారం తీసుకునేది. 30-32 ఏళ్లుగా చాలా తినేశాను. ఆ తరువాత సంవత్సరం పాటు విరామం ఇచ్చాను.2022 అధ్యయనం ప్రకారం అడపాదడపా ఉపవాసం జీవక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఇదిబ ఎక్కువ కేలరీలను బర్న్ చేయడంలో సహాయపడుతుంది.కడుపు మాడ్చుకోలే, ఇష్టమైన ఫుడ్ను త్యాగతం చేయలేదు: తనకిష్టమైన ప్రతిదాన్ని ఆహారంలో చేర్చుకునేది. కానీ మితంగా తినడాన్ని అలవాటు చేసుకుంది. తనకెంతో ఇష్టమైన రెగ్యులర్ పరాఠాలు, గుడ్లు, పప్పు-సబ్జీ, నెయ్యి ఇవన్నీ తీసుకునేదాన్నని తెలిపింది. పోర్షన్ కంట్రోల్: అతిగా తినకుండా తనను తాను నియంత్రించుకుంది. ఎక్కువ కేలరీలు తీసుకోకుండా పోర్షన్ కంట్రోల్ను అలవాటు చేసుకున్నానని భారతీ సింగ్ తెలిపింది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డయాబెటిస్ అండ్ డైజెస్టివ్ అండ్ కిడ్నీ డిసీజెస్ ప్రకారం, పోర్షన్ కంట్రోల్ సాధన చేయడం అధిక బరువును తగ్గించుకోవచ్చు.ఇదీ చదవండి: Today Tip ఎంత బిజీ అయినా సరే, ఇలా బరువు తగ్గొచ్చు!ఖచ్చితమైన మీల్ టైమింగ్స్ : భోజనం టైమింగ్స్ పాటించకపోవడం వల్ల చాలా నష్టం జరుగుతుందనీ, అందుకే తాను తన భోజన సమయాలను పాటించేదానన్ని గుర్తు చేసుకుంది. బాగా హెక్టిక్ పనుల్లో ఉంటే, బాగా లేట్ నైట్ తినడం వదిలివేసింది. వేళగాని వేళ తినడాన్ని పూర్తిగా మానేసింది. మరో విధంగా చెప్పాలంటే రాత్రి 7 గంటల తర్వాత నో డిన్నర్ సూత్రం తు.చ తప్పకుండా పాలించింది. ఇది తన బరువును తగ్గించుకోవడంలో చాలా ఉపయోగపడిందని తెలిపింది. 15 కిలోల భారీ బరువు తగ్గడం చాలా ఆనందానిచ్చిందని భారతీ సింగ్కు సంతోషంగా తెలిపింది. క్రాప్ టాప్స్, ఇంకా ఇష్టమైన బట్టలు వేసుకోగలగడం భలే సంతోషాన్నిస్తోందని చెప్పింది.బరువు తగ్గడం స్లిమ్గా కనపించడం ఆనందాన్ని ఇవ్వడం మాత్రమే కాదు ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మంచి అనుభూతిని కలిగిస్తుంది. కష్టంగా కాకుండా, ఇష్టంగా నిష్టగా కృషి చేస్తే భారతీ సింగ్లా మంచి ఫలితాలను సాధించడం కష్టమేమీ కాదేమో కదా!ఇదీ చదవండి: TodayRecepies బనానాతో ఇలాంటి వెరైటీలు ఎప్పుడైనా ట్రై చేశారా? -
'వాకింగ్'పై థైరోకేర్ వేలుమణి ఆసక్తికర వివరణ..!
ఇటీవలకాలంలో ప్రజల్లో ఆరోగ్య స్పృహ ఎక్కువైంది. అంతా తమ ఫిట్నెస్కి తొలి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆ నేపథ్యంలో కొందరు వాకింగ్, యోగా, జిమ్ వంటి ఇతరత్రా వర్కౌట్లు చేసేస్తున్నారు. అయితే కొందరు మాత్రం చాలా టెన్షన్గా పొద్దుపొద్దునే వాకింగ్కి వెళ్లిపోతుంటారు. ఎంతలా అంటే..ఒక్కరోజు వాకింగ్ మిస్ అయితే ఏదో పోయినట్లుగా గాభర పడిపోతుంటారు. అయితే అంతలా వాకింగ్ చేసేవాళ్లంతా ఆరోగ్యం కోసమేనా అన్న సందేహాన్ని లెవెనత్తారు శాస్త్రవేత్త-థైరోకేర్ టెక్నాలజీస్ వ్యవస్థాపకుడు ఎ వేలుమణి. ఆయన దీనిపై స్వయంగా మూడేళ్లు అధ్యయనం చేసినట్లు కూడా వివరించారు. అలా ఉదయమే నడవడానికి వెనుకున్న ప్రధాన కారణాలేంటో సోషల్ మీడియో పోస్ట్లో చాలా ఆసక్తికరంగా చెప్పుకొచ్చారు. కోయంబత్తూరులోని మూడు పార్కులలో ఉదయం నడిచేవారిపై అధ్యయనం చేశారట. దాదాపు 100 నుంచి 500 మీటర్లు వాకింగ్కి వెళ్లే వారందరిపై ఆయన అధ్యయనం చేశానన్నారు. అయితే అది ఫిట్నెస్ కాదు, క్రమశిక్షణ అంతకంటే కాదట. మరేంటంటే..ఇది హార్మోన్ల ప్రేరేపిత నడకగా తేల్చేశారాయన. అంతేగాదు ఉదయం పబ్లిక్ పార్కుల్లో వాకింగ్ చేసేవారందర్నీ మూడు గ్రూప్లుగా వర్గీకరించి మరి దాని వెనుకున్న కారణాలను వెల్లడించారు.మొదటి రకం..వేలుమణి గమనించి వ్యక్తుల్లో దాదాపు 20% మంది వివిధ వయసుల వారిగా వేగంగా నడవడం, లేదా పరుగెత్తడంలో చాలా యాక్టివ్గా నిమగ్నమై ఉన్నవారు. ఇది కొనితెచ్చుకున్న బలవంతంపై చేసున్న వాకింగ్ అట. వారంతా శ్రేయోభిలాషులు, ఆరోగ్య నిపుణులు మార్గనిర్దేశం ప్రకారం లక్ష్యం ఆధారిత వ్యక్తులట. శారరీక రూపం, ఫిట్నెస్కి కేరాప్ అడ్రస్గా స్ఫూర్తినిచ్చే కేటగిరి వ్యక్తులే వీరు అని చెప్పారు. రెండో రకం..ఆరోగ్య స్ప్రుహతో..40 ప్లస్లో వైద్య అవసరం రీత్యా తప్పక వాకింగ్ చేసే కేటగిరికి చెందినవారట. వీరంతా, టైప్ 2 డయాబెటిస్ వంటి దీర్ఘకాలిక సమస్యలతో వాక్ చేసే వ్యక్తులట. అంటే వీళ్లంతా స్వచ్ఛందంగా నడక కోసం వచ్చిన వాళ్లు కాదని "హర్మోన్ల బందీలు"గా వ్యాఖ్యానించారు.ప్రేమ పక్షులు..ఇక మిగతా సముహం 18 నుంచి 22 ఏళ్ల వయస్సు గల యువ జంటల సముహం. ఉదయం పార్కుల్లో వాకింగ్ చేసేవాళ్లలో దాదాపు 30 శాతం యువత కూడా ఉన్నట్లు తెలిపారు. అయితే వాళ్లు ఫిట్నెస్ లేదా వైద్య పరిస్థితి వంటి కారణాలతో నడవడం లేదని చెప్పారు. కేవలం వాళ్లు పార్కు మూలల్లో నిశబ్దంగా కూర్చొని గడిపేందుకు వస్తుంటారని అన్నారు. ఇది కూడా హార్మోన్ల బలవంతమే అని పేర్కొన్నారు. ఎందుకంటే యుక్త వయసులో సహజంగా వచ్చే ఫీలింగ్స్కి కారణం హార్మోన్ల ప్రభావమనే ఉద్దేశ్యంతో వేలుమణి ఆ విధంగా వ్యాఖ్యానించారు. చివరగా తాను చేసిన ఈ అధ్యయనంలో 80% మంది ఆరోగ్యం లేదా జీవనశైలిలో భాగంగా చేయలేదు. కేవలం హర్మోన్ల ప్రభావం కారణంగానే చేసిన వాకింగ్ అని అన్నారు. ఎందుకంటే ఆ మూడు రకాల వ్యక్తుల సముహం..“లుకింగ్, డయాబెటిస్, ప్రేమ తదితర మూడు కారణాలతో వాకింగ్ చేస్తున్న వారు. ఇవన్ని హర్మోన్లతో లింక్ అప్ అయ్యి ఉన్నాయి కాబట్టి ఇది ఫిట్నెస్ కోసం చేసిన వాకింగ్ కాదు..హార్మోన్లతో ప్రేరేపించబడిన నడక అని పేర్కొన్నారు వేలుమణి. (చదవండి: సిగరెట్టు ప్యాకెట్లపై ఉన్నట్లుగా ఆ చిరుతిండ్లపై హెల్త్ వార్నింగ్ మెసేజ్..!) -
Millets అనారోగ్యాలు సరి : ఆరోగ్య సిరి
భామిని: అంతరించి పోతున్న చిరుధాన్యాలను రక్షిస్తూ నేటి తరాలకు పరిచయం చేసేందుకు చిరుధ్యానాల విత్తన సంరక్షణతో పాటు, పంటల సాగు పెరుగుతోంది. సంప్రదాయ పంటలుగా పురాతన కొండ పంటలుగా పిలిచే మిల్లెట్స్ ప్రాముఖ్యతను వివరిస్తూ సాగు విస్తరణ పెంచుతున్నారు. ఐటీడీఏల పరిధిలో మిల్లెట్స్ సాగు విస్తరణ ప్రణాళిక అమలవుతోంది. ఏపీపీఐ సంస్థ ఆర్థిక సహకారంతో గిరిజనులకు చిరుధాన్యాల విత్తనాలు సేకరించి ఉచితంగా అందిస్తున్నారు. స్వచ్ఛంద సంస్థ పర్యవేక్షణలో కొండ పంటలు సాగు చేస్తున్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలో ప్రకృతి సాగు, మిశ్రమ సాగు విధానంలో చిరుధాన్యాల సాగు విస్తీర్ణం పెంచుతున్నారు. స్వచ్ఛంద సంస్థల సహకారంతో మిల్లెట్స్పై అవగాహన పెంచుతున్నారు.దీంతో చిరుధాన్యాలైన కొర్రలు, సామలు, గంటెలు, రాగులు, జొన్నలు, ఊదలు, అరిరెకల సాగు పెరుగుతోంది.. ఔషధ గుణాల సమ్మిళితం తృణధాన్యాలు ప్రకృతి ప్రసాదించిన వరాలు. ఔషధ గుణాల సమ్మిళితమైన తిండి గింజలు.స్వచ్ఛంద సంస్థల సహకారంతో సంప్రదాయ పంటల సాగును పునరుద్ధరిస్తున్నాం. ఖరీఫ్లో చిరుధాన్యాల సాగుకు ప్రాధాన్యం పెంచాం. పండించిన చిరు ధాన్యాలు మిగులు పంటకు మార్కెట్లో విలువ వచ్చేలా చర్యలు చేపట్టాం. పట్టణాల్లో పెరుగుతున్న వాడకానికి తగ్గట్లు పండించడానికి గిరిజన ప్రాంతాల్లో సమాయిత్తం చేస్తున్నాం. కె.రాబర్ట్పాల్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి, పార్వతీపురం మన్యం జిల్లా ఆరోగ్య గుళికలుగా వీటిని వర్ణిస్తారు.ఇవి తింటూ ఆరు నెలల నుంచి రెండేళ్ల లోపు వ్యాధులను నిర్మూలించుకోవచ్చు.రోగ కారణాలను శరీరం నుంచి తొలగించి దేహాన్ని శుద్ధి చేస్తాయి. తృణధాన్యాలలోని పీచు పదార్థం రక్షణగా నిలుస్తుందని న్యూట్రిస్టులు చెబుతున్నారు. రోజుకు మనిషికి 38 గ్రాముల పీచు పదార్థం అవసరం. చిరుధాన్యాల్లో 25 నుంచి 30 గ్రాముల పీచు పదార్థం లభిస్తుంది. కూరగాయలు, ఆకు కూరల్లో పీచు పదార్థం పొందవచ్చు. కొండపోడు భూముల్లో చేపట్టే చిరుధాన్యాల సాగు పల్లపు ప్రాంతాల భూముల్లోనూ విస్తరిస్తున్నారు. ఆధునిక వ్యవసాయ విధానంలో నాట్లు వేయడం, కలుపు నివారణ, చీడపీడల నివారణకు కషాయాల వైద్యంతో సాగు చేస్తున్నారు. చిరుధాన్యాల పంటలకు తోడు పప్పుధాన్యాలు, కూరగాయల పంటలను మిశ్రమ పంటలుగా పండిస్తున్నారు. -
జబ్బొచ్చినా.. జ్వరమొచ్చినా.. నిలువుదోపిడి!
విజయనగరం ఫోర్ట్: వర్షాలు కురుస్తున్నాయి. సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నాయి. ఆసుపత్రుల్లో రోగుల సంఖ్య క్రమేణ పెరుగుతోంది. ఇటు ప్రభుత్వ ఆసుపత్రుల తో పాటు అటు ప్రైవేటు ఆసుపత్రులకు రోగులు క్యూ కడుతున్నారు. ఇక్కడ వరకు ఓకే.. తరువాతే వైద్యులు రోగులకు చుక్కలు చూపిస్తున్నారు. తలనొప్పి, జ్వరం అని వెళ్లినా... రూ.వేలల్లో ఖర్చయ్యేలా వైద్య పరీక్షలు చేయిస్తున్నారు. చేసేది లేక భయంతో రోగులు ప్రైవేటు ల్యాబ్లకు పరుగులు తీస్తున్నారు. అక్కడ రూ.వేలల్లో రోగులను దోచుకుంటున్నారు. సేవకు పరమార్ధంగా ఉండాల్సిన కొందరు వైద్యులు ధనార్జనే ధ్యేయంగా మారడంతో పేదలు, మధ్యతరగతి ప్రజలు ఈ పరీక్షలు చేయించుకోలేక ఆర్థికంగా చితికిపోతున్నారు. వచ్చే రోగాలకు స్కానింగ్, పలు రకాల పరీక్షలు అవసరం లేకున్నా వైద్యులు రాసేస్తుండడంతో చేసేది లేక ఇబ్బందులు పడుతున్నారు. స్కానింగ్ వల్ల రోగులు రేడియేషన్కు కూడా గురై ఇతర వ్యాధులకు గురయ్యే ప్రమాదం కూడా ఉంది. అయినా వైద్యులు వెనక్కి తగ్గడం లేదు. ప్రతీదానికి స్కానింగ్, ఎంఆర్ఐ అంటూ రాసేస్తున్నారు. (Bobbili Veena బొబ్బిలి వీణకు అరుదైన గుర్తింపు)ఆర్ఎంపీలే మధ్యవర్తులు: ప్రైవేటు ఆసుపత్రులకు, స్కానింగ్ సెంటర్లకు,ల్యాబొరేటరీలకు ఆర్ఎంపీలే మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్నారు. కేసును బట్టి వారికి కమీషన్ అందిస్తున్నారు. రిజిస్ట్రషన్ లేకుండానే.. జిల్లాలో 57 ల్యాబొరేటరీలు మాత్రమే వైద్య ఆరోగ్య శాఖ వద్ద రిజి్రస్టేషన్ అయ్యాయి. రిజిస్ట్రేషన్ లేకుండా కొందరు జిల్లాలో ల్యాబొరేటరీలు నిర్వహిస్తున్న ట్టు సమాచారం. ముఖ్యంగా వైరల్ జ్వరాలు, డెంగీ జ్వరాలు వ్యాప్తి అధికంగా ఉన్న తరుణంలో ల్యాబొరేటరీలు క్యాష్ చేసుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. జ్వరం రాగానే తమకు ఏమవుతుందోనని ఆందోళనలో రోగులు నేరుగా ల్యాబొరేటరీలకు వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకుంటున్నారు. ఇదే అదునుగా వారు దోచుకుంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇదీచదవండి: వంట గదుల్లో గత వైభవం.. మట్టి పాత్రలతో ఆరోగ్యమస్తు! కనిపించని ఫీజుల బోర్డులు ఏ ల్యాబొరేటరీలోగాని, ఆసుపత్రిలోగాని, స్కానింగ్ సెంటర్లోగాని ఏ వైద్య పరీక్షకు ఎంత ఫీజు వసూలు చేస్తున్నామో తెలిపే బోర్డు బయట వేలాడదీయాలి. కొన్ని ల్యాబొరేటరీల్లో మాత్రమే ఇవి కనిపిస్తున్నాయి. మిగతా వాటిల్లో ఉండడం లేదు. ఫీజుల వివరాలు తెలిపే బోర్డులు లేని చోట వారు ఎంత అడిగితే అంత ఇవ్వాల్సిన పరిస్థితి. అధిక శాతం ల్యాబొరేటరీల్లో కానరాని పెథాలజిస్టులు జిల్లాలో ఉన్న ల్యాబొరేటరీల్లో పెథాలజిస్టులు కాన రావడం లేదు. నిబంధన ప్రకారం యూరిన్ కల్చర్, బ్లడ్ కల్చర్, ప్లేట్లెట్ కౌంట్ వంటి పరీక్షలు పెథాలజిస్టుల పర్యవేక్షణలో జరగాలి. కానీ అధికశాతం ల్యాబొరేటరీల్లో పెథాలజిస్టులు లేరు. ఒకటి, రెండు ల్యాబొరేటరీల్లో తప్ప మిగతా వాటిల్లో లేరు. గంట్యాడ మండలానికి చెందిన సీహెచ్ శ్రీనివాస్ తలనొప్పి అని విజయనగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లాడు. అక్కడి వైద్యుడు ఎంఆర్ఐ స్కాన్ తీయించుకోమని చీటి రాసి ఇచ్చాడు. సదరు వ్యక్తి ఓ ప్రైవేటు స్కానింగ్ సెంటర్లో రూ.4వేలు పెట్టి స్కానింగ్ తీయించుకున్నాడు. విజయనగరానికి చెందిన రామారావు జ్వరం వచ్చిందని పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లగా వైద్యులు కొన్ని వైద్య పరీక్షలు రాశారు. సదరు వ్యక్తి వైద్య పరీక్షలకు రూ.వెయ్యి బిల్లు చెల్లించాడు. జ్వరం అని వెళ్తే.. జ్వరం అని ఎవరైనా ప్రైవేటు ఆసుపత్రికి వెళ్తే...వారికి వైద్య పరీక్షలు రాసేస్తున్నారు. సాధారణ జ్వరానికి కూడా వైరల్, డెంగీ, మలేరియా, సీబీసీ, హెచ్బీ, ఇలా అనేక రకాల వైద్య పరీక్షలు రాసేస్తున్నారు. దీంతో రోగులకు ఖర్చు తడిసి మోపుడవుతుంది. జ్వరం కోసం వెళ్లిన వారికి వైద్య పరీక్షలకు కనీసం రూ.1000 నుంచి రూ.1500 వరకు వసూలు చేస్తున్నారు. స్కానింగ్లకు రూ.వేలల్లో... సీటీ స్కాన్, ఎంఆర్ఐ స్కాన్లకు అయితే రూ.వేల ల్లో ఫీజులు వసూలు చేస్తున్నారు. ప్రైవేటు స్కానింగ్ సెంటర్లో సీటీ స్కాన్కు రూ.2500 నుంచి రూ.3 వేలు, ఎంఆర్ఐ స్కాన్కు రూ.4 వేల నుంచి రూ.5 వేల వరకు వసూలు చేస్తున్నారు. ఇందులో సగం వైద్యుల కమీషన్కే పోతుందని నిర్వాహకులు చెప్పడం గమనార్హం. చాలా మంది ప్రైవేటు వైద్యులకు ఆయా స్కానింగ్ల్లో షేర్ ఉంటుంది. షేర్ లేని వైద్యులకు కమీషన్లు ఆఫర్ చేస్తున్నారు. దీంతో వారు అవసరం లేకున్నా.. స్కానింగ్లు రాస్తున్నారు.ఆదేశాలిచ్చాం.. ఫీజుల వివరాలు తెలిపే బోర్డులు ల్యాబొటరీ, స్కానింగ్, ఆసుపత్రుల్లో ఏర్పాటు చేయాలని సంబంధిత నిర్వాహకులకు ఆదేశాలు జారీ చేశాం. అవి ఏర్పాటయ్యే విధంగా చర్యలు తీసుకుంటాం. ల్యాబరేటరీగాని, ఆసుపత్రిలోగాని, స్కానింగ్ సెంటర్లోగాని బోర్డులు పెట్టకపోతే వారిపై చర్యలు తీసుకుంటాం. ఆకస్మిక తనిఖీలు నిర్వహించి చర్యలు చేపడతాం. – డాక్టర్ ఎస్.జీవనరాణి, డీఎంహెచ్వో -
వంట గదుల్లో గత వైభవం.. మట్టి పాత్రలతో ఆరోగ్యమస్తు!
ఖిలా వరంగల్ : పూర్వం రోజుల్లో వంటలకు మట్టి పాత్రలనే వాడే వారు. అన్నం, కూర, పాలు, పెరుగు.. ఇలా ప్రతీ పదార్థం మట్టి కుండలోనే వండేవారు, భద్రపరిచేవారు. ఈ పాత్రల్లో వండిన, భోజనం చేసిన వారు ఎక్కువ కాలం ఆరోగ్యంతో జీవించేవారని పెద్దలు చెబుతుంటారు. అయితే పెరిగిన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో మట్టి పాత్రలు మాయమయ్యాయి. వాటి స్థానంలో అల్యూమినియం పాత్రలు, పేపర్ పేట్లు ప్రత్యక్షమయ్యాయి. ఫలితంగా వీటిని వినియోగించిన ప్రజలు అనారోగ్యాలు కొని తెచ్చుకుంటున్నారు. ఈ ప్రమాదాన్ని గ్రహించిన ప్రస్తుత తరం మట్టి పాత్రలపై మక్కువ చూపుతోంది. దీంతో ఏళ్ల క్రితం వదిలేసిన మట్టి పాత్రలు ప్రజలు మళ్లీ ఇంటికి తెచ్చుకుంటున్నారు. ఫలితంగా మార్కెట్లో మట్టి పాత్రలకు డిమాండ్ కనిపిస్తోంది. అయితే ఈ కాలంలో కూడా మట్టి పాత్రలను ఎవరు వాడతారనుకుంటే పొరపాటే.. వీటిని నేటికీ వినియోగించే వారు ఉన్నత వర్గాల్లో ఎక్కువ సంఖ్యలో ఉన్నారు.రుచి..ఆరోగ్యకరం..మట్టిపాత్రలో వంట రుచిగా ఉంటుంది. అలాగే, ఎక్కువ కాలం పాడవకుండా ఉంటుంది. మట్టి పాత్రలను తయారు చేసే బురద మట్టిని సిరామిక్ అంటారు. ఈ సిరామిక్కు వేడి తగలగానే ఇన్ ఫ్రారెడ్ అనే కంటికి కనిపించని కిరణాలు ఉత్పత్తవుతాయి. ఈ కిరణాలు ప్రసరించిన ప్రాంతమంతా పూర్తిస్థాయిలో శుద్ధి అవుతుంది. ఉదాహరణకు పిల్లలు బలహీనంగా, తక్కువ బరువుతో పుట్టినా.. పుట్టుకతోనే అనారోగ్యంతో ఉన్నా ఇంక్యుబేటర్ అనే పరికరంలో (లైట్ కింద పెడతారు) కొన్ని గంటల పాటు ఉంచుతారు. ఆ పరికరంలో ఉండే లైట్ ద్వారా ఇన్ ఫ్రారెడ్ కిరణాలను ప్రసరింపజేసి పుట్టిన పిల్లల శరీరాన్ని పూర్తిగా శుద్ధి చేస్తారు. కేవలం కొద్ది గంటల్లోనే శిశువులకు పూర్తి స్థాయిలో ఆరోగ్యాన్ని సరిచేయగల శక్తి ఈ కిరణాలకు ఉంది. ప్రకృతి వైద్యంలో బురద స్నానం (మడ్ బాత్) గురించి తెలిసే ఉంటుంది. శరీరం నిండా బురద పూసి ఎండలో ఉంచుతారు. అందులో కూడా ఇవే కిరణాలు ఉత్పత్తి అయ్యి రోగి శరీరాన్ని శుద్ధి చేయడం ద్వారా వ్యాధి నుంచి విముక్తి లభిస్తుంది. అలాగే, మట్టి పాత్రల్లో వంట చేస్తే పురుగు మందుల అవశేషాలను పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేసి పదార్థంలోని పోషక విలువలను ఏమాత్రం వృథా కాకుండా చేయడమేకాక పోషకాలకు అదనపు శక్తిని కలిగించి ఆహారాన్ని సమతుల్యంగా మారుస్తాయి. అందుకే మట్టి పాత్రల్లో చేసిన వంటలకు ఎక్కువ రుచి, ఎక్కువ నిల్వ సామర్థ్యం ఉంటుంది. లోహపాత్రల వల్లే రోగాలు..అల్యూమినియం పాత్రలో వండిన పదార్థాలు విషతుల్యమవుతాయి. ఈ పదార్థలు తిన్న ప్రజలు బీపీ, షుగర్, కీళ్ల నొప్పులు, కాలేయ సమస్యలు, క్యాన్సర్ వంటి జబ్బుల బారిన పడుతారని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. అందుబాటులో మట్టి టీ గ్లాస్, వాటర్ బాటిళ్లు..తెలంగాణలోని ఆదిలాబాద్, గుజరాత్, రాజస్థాన్లోని కొన్ని ప్రాంతాల్లో గృహోపకర పాత్రలను మట్టితోనే తయారు చేస్తారు. ఇక్కడి నుంచే దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలకు ఎగుమతి చేస్తారు. కాగా, ఉమ్మడి వరంగల్ జిల్లాలో కుమ్మరి కులస్తులు మట్టి పాత్రలు అందుబాటులో ఉంచారు. టీ గ్లాస్, వాటర్ బాటిల్, కంచాలు, స్పూన్లు.. ఇలా అన్ని రకాల మట్టి పాత్రలు అందుబాటులో ఉన్నాయి.చదవండి: Today Tip ఎంత బిజీ అయినా సరే, ఇలా బరువు తగ్గొచ్చు!మట్టి కడవల్లోనే మంచినీరు..పూర్వకాలంలో మట్టి పాత్ర(కుండ)ల్లో వంటలు చేసే వారు. మట్టి కడవల్లోనే మంచినీరు తాగే వారు. అందుకే ఆ కాలపు వారు ఆరోగ్యంగా ఉండేవారు. అయితే 40 ఏళ్ల నుంచి మట్టి పాత్రలు వాడకం క్రమేనా తగ్గతూ వచ్చింది. ప్రస్తుతం వ్యాప్తిస్తున్న రోగాలతో పాతకాలం నాటి ఆహార పద్ధతులపై ప్రజలు మక్కువ పెంచుకుంటన్నారు. ఇందులో భాగంగా మట్టి కుండలో చికెన్, మట్టి పాత్రలో వంటలకు క్రేజ్ పెరుగుతోంది. మట్టి పాత్రల్లో వంటలు ఆరోగ్యకరం అనగానే ఆ పాత్రలు మార్కెట్లో భారీగా అమ్ముడవుతున్నాయి. గతంలో ఇళ్లలో మట్టితో తయారు చేసే వస్తువులు అనేకం ఉండేవి. ప్రస్తుతం మార్కెట్లో లభించే కుండలు తప్ప మరే ఇతర మట్టి పాత్రలు కనిపించడం లేదు.ఇదీ చదవండి: Bobbili Veena బొబ్బిలి వీణకు అరుదైన గుర్తింపుమట్టి పాత్రలే ముద్దు : అల్యూమినియం కంటే మట్టి పాత్రలే ముద్దు. తెలంగాణలో ఉగాది పచ్చడి కొత్త మట్టి కుండల్లో చేస్తారు. ఇలా చేయడం వల్ల మట్టి పాత్రల్లో ఉండే పోషకాలు నేరుగా శరీరంలోకి వెళ్తాయి. దీని వల్ల ఎలాంటి రోగాలు దరిచేరవు. పూరి జగన్నాథుడి ఆలయంలో ఇప్పటికీ మట్టి పాత్రల్లోనే ప్రసాదాలు తయారు చేసి పంపణీ చేస్తారు.-డాక్టర్ నరేశ్కుమార్, ఫోర్ట్ రోడ్డు వరంగల్ -
ఔట్ పేషెంట్ ప్లాన్.. నో టెన్షన్!
అనారోగ్యంతో డాక్టర్ దగ్గరకెళ్తే వ్యాధి నిర్ధారణ పరీక్షల తర్వాతే పరిష్కారం సూచిస్తుంటారు. కన్సల్టేషన్, డయాగ్నోస్టిక్స్ చార్జీలు, మందులకు కలిపి ఎంతలేదన్నా రూ.2,000–5,000 మధ్య ఖర్చు చేయాల్సిందే. నలుగురు లేదా ఐదుగురు సభ్యులున్న కుటుంబం ఏడాదిలో ఇలా వైద్యుల వద్దకు ఎన్నిసార్లు వెళ్లాల్సి వస్తుందో ఊహించలేం. ఈ రూపంలో ఎంత ఖర్చు ఎదురవుతుందో అంచనా వేయలేం. హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ ఉన్నా కానీ, కేవలం హాస్పిటల్లో చేరి తీసుకునే చికిత్సలకే (ఇన్ పేషెంట్ కవర్) అధిక శాతం పాలసీలు కవరేజీ అమలు చేస్తుంటాయి. జీనవశైలి వ్యాధులు, వైరల్ ఫీవర్లు, ఇన్ఫెక్షన్లు పెరిగిపోయిన తరుణంలో.. ఔట్ పేషెంట్ డిపార్ట్మెంట్ (ఓపీడీ) కవరేజీకి ప్రాధాన్యం పెరుగుతోంది. ఇది ఉంటే ఊహించని ఖర్చును కొంత వరకు తట్టుకోవచ్చు. ఓపీడీ ప్లాన్లలో సదుపాయాలు, వీటి కోసం ఎంత ఖర్చవుతుంది? తదితర అంశాలపై అవగాహన కల్పించే కథనమే ఇది. ఔట్ పేషెంట్ విభాగం (ఓపీడీ)లో చేసే ఖర్చు గణనీయంగా పెరుగుతోంది. ముఖ్యంగా సగటు ద్రవ్యోల్బణం మించి వైద్యుల కన్సల్టేషన్, డయాగ్నోస్టిక్స్ చార్జీలు పెరుగుతున్నాయి. 2023–24 ఆరి్థక సంవత్సరంలో ఓపీడీపై దేశ ప్రజలు చేసిన ఖర్చు 37.7 బిలియన్ డాలర్లుగా ఉంటుందని (రూ.3.20 లక్షల కోట్లు సుమారు) ‘ఇండియా ఇన్సూర్టెక్ అసోసియేషన్’ అంచనా వేసింది. ఈ ఖర్చులో రిటైల్ ఓపీడీ ఇన్సూరెన్స్ ద్వారా చెల్లించింది కేవలం 0.1 శాతమే. అంటే దాదాపు 99.9 శాతం మంది ఓపీడీ కవరేజీకి దూరంగా ఉన్నట్టు ఈ గణాంకాలు తెలియజేస్తున్నాయి. హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు చాలా వాటిల్లో ఓపీడీ కవరేజీ ఒక సదుపాయంగా ఉండదు. ఓపీడీకి పెరుగుతున్న ప్రాధాన్యం నేపథ్యంలో బీమా కంపెనీలు ఇప్పుడు ఈ కవరేజీని సైతం ఇన్పేషెంట్ కవర్తోపాటు ఆఫర్ చేస్తున్నాయి. ఓపీడీ ప్లాన్లలో కవరేజీ.. ఓపీడీ కవరేజీ ఇన్బిల్ట్గా కలిగిన హెల్త్ ప్లాన్లు కొన్నే ఉన్నాయి. దాదాపు అన్ని కంపెనీలు ఓపీడీ కవర్ను యాడాన్ కింద అందిస్తున్నాయి. హాస్పిటల్లో చేరాల్సిన అవసరం లేకుండా.. వైద్యుల వద్దకు వెళ్లి సమస్యల గురించి చెప్పి, తీసుకుని వెళ్లిపోయే చికిత్సా సలహాలు ఓపీడీ కిందకు వస్తాయి. ‘‘ఓపీడీ కవర్ కింద ఔషధాలు, వ్యాధి నిర్ధారణ పరీక్షలు, వైద్యుల కన్సల్టేషన్ చార్జీ (డాక్టర్ ఫీజు)లను బీమా సంస్థలు చెల్లిస్తాయి. రెగ్యుల్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్లలో పాలసీదారు హాస్పిటల్ పాలైతే తప్పించి వీటికి పరిహారం రాదు’’ అని హెచ్డీఎఫ్సీ ఎర్గో జనరల్ ఇన్సూరెన్స్ ఈడీ పార్థాని ఘోష్ తెలిపారు. కాకపోతే ఇలా వైద్యుల ఫీజులు, ఔషధాలు, డయాగ్నోస్టిక్స్కు చెల్లింపుల పరంగా ఓపీడీ కవర్లో కొన్ని పరిమితులు ఉండడాన్ని గమనించొచ్చు. సాధారణంగా నగదు రహిత విధానంలో నెట్వర్క్ ఆస్పత్రుల్లో ఈ ఓపీడీ చెల్లింపులకు బీమా సంస్థలు ప్రాధాన్యం ఇస్తుంటాయి. బీమా సంస్థలకు ఆస్పత్రులతో టైఅప్ ఉంటుంది. కనుక వీటికి అయ్యే వ్యయాలు తక్కువగా ఉంటాయి.నెట్వర్క్ ఆస్పత్రుల్లో చికిత్స తీసుకుని రీయింబర్స్మెంట్ దరఖాస్తు చేసుకున్నా బీమా సంస్థలు అనుమతిస్తుంటాయి. కానీ, నాన్నెట్వర్క్ ఆస్పత్రుల్లో నగదు రహిత విధానంలో ఓపీడీ చెల్లింపులకు కొన్ని బీమా సంస్థలు అంగీకరించడం లేదు. ఇందులో మోసాల రిస్క్ ఉంటుందని, రీయింబర్స్మెంట్కే ప్రాధాన్యం ఇస్తున్నాయి. కొన్ని బీమా సంస్థలు ఓపీడీ కవరేజీని పూర్తిగా నెట్వర్క్ ఆస్పత్రులకే పరిమితం చేస్తున్నాయి. ప్రీమియం.. పరిమితులు → ఐసీఐసీఐ లాంబార్డ్ ‘ఎలివేట్’ అన్నది ఓపీడీ రైడర్. 35 ఏళ్ల వ్యక్తి రూ.10,000 వార్షిక కవరేజీకి చెల్లించాల్సిన ప్రీమియం రూ.4,980. నగదు రహిత విధానంలో ఈ →పనిచేస్తుంది. ఎలాంటి ఉప పరిమితుల్లేవు. → బజాజ్ అలియాంజ్ ‘హెల్త్ ప్రైమ్’ రూ.15,000 కవరేజీకి రూ.2,062 ప్రీమియంను (35 ఏళ్ల వ్యక్తికి) వసూలు చేస్తోంది. → నివా బూపా ‘అక్యూట్ బెస్ట్ కేర్’ ప్లాన్ సైతం నగదు రహిత, రీయింబర్స్మెంట్ విధానంలో కవరేజీని ఆఫర్ చేస్తోంది. రూ.10,000 కవరేజీకి రూ.4,801 ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. → నివా బూపా వెల్ కన్సల్ట్ ఓపీడీ ప్లాన్ 20 శాతం కోపేమెంట్ను రీయింబర్స్మెంట్కు అమలు చేస్తోంది. → స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ ఓపీడీ కవర్ను.. ప్రమాదాలకు సంబంధించి చికిత్సలకు నగదు రహిత, రీయింబర్స్మెంట్ క్లెయిమ్లను అనుమతిస్తోంది. ఈ ప్లాన్ రూ.25,000 కవరేజీకి రూ.4,802 ప్రీమియం వసూలు చేస్తోంది. ‘‘సంప్రదాయంగా చూస్తే ఓపీడీ ప్లాన్లలో డాక్టర్ కన్సల్టేషన్, డయాగ్నోస్టిక్స్, ఫార్మసీ బిల్లుల పరంగా ఉప పరిమితులు ఉంటాయి. ఉదాహరణకు ఓపీడీ సమ్ ఇన్సూర్డ్ రూ.20,000 ఉండొచ్చు. అయినప్పటికీ, ఫార్మసీ (ఔషధాలు)కి సంబంధించి రూ.5,000 ఉప పరిమితిగా ఉండొచ్చు. అయితే కవరేజీని తమ అవసరాల మేరకు పూర్తి స్థాయిలో వినియోగించుకునేందుకు వీలుగా ఉప పరిమితుల్లేని ప్లాన్లను సైతం బీమా సంస్థలు తీసుకొస్తున్నాయి’’ అని పాలసీ బజార్ హెల్త్ ఇన్సూరెన్స్ బిజినెస్ హెడ్ సిద్ధార్థ్ సింఘాల్ తెలిపారు. ఓపీడీ కవర్ తీసుకునే ముందు ఉప పరిమితుల గురించి సంపూర్ణంగా తెలుసుకోవాలి. తమకు అప్పటికే జీవనశైలి వ్యాధులు ఉంటే, వాటికి సైతం చెల్లింపులు చేసే విధంగా చూసుకోవాలి. కొన్ని ఓపీడీ ప్లాన్లలో ఏడాదిలో వైద్యుల కన్సల్టేషన్లు గరిష్టంగా ఇన్ని పర్యాయాలు మాత్రమే అన్న పరిమితులు కూడా ఉంటున్నాయి. కొన్ని బీమా సంస్థలు నెట్వర్క్ ఆస్పత్రులు కాకుండా వేరే చోటు తీసుకునే చికిత్సలకు చెల్లింపులు చేయడం లేదు.ఇతర ప్లాన్లు బీమా కంపెనీల భాగస్వామ్యంతో కొన్ని ప్రైవేటు సంస్థలు ప్రత్యేక ఓపీడీ ప్లాన్లను అందిస్తున్నాయి. ఇందులో లివ్లాంగ్ ఇన్సూరెన్స్ ఒకటి. దాదాపు అన్ని ప్రముఖ బీమా సంస్థల తరఫున ఓపీడీ కవర్ సేవలను ఆఫర్ చేస్తోంది. రూ.15,000 కవరేజీకి రూ.5,500, రూ.16,000 కవరేజీకి రూ.6,000, రూ.28,800 కవరేజీకి రూ.11,599 ప్రీమియం కింద వసూలు చేస్తోంది. ఈ తరహా సంస్థల ఓపీడీ ప్లాన్లలో కొన్ని పరిమితులు ఉన్నప్పటికీ.. ఎన్నో ఉచిత ప్రయోజనాలను ఆఫర్ చేస్తున్నాయి. లివ్లాంగ్ ‘ఎల్డర్కేర్’ ఓపీడీ ప్లాన్ కోసం 66 ఏళ్ల గీత ఏడాదికి రూ.12,000 ప్రీమియం చెల్లిస్తోంది. ఇందులో ఔషధాలు, డయాగ్నోస్టిక్స్ చార్జీలకు ఏడాదిలో గరిష్ట చెల్లింపులు రూ.3,000కు పరిమితం. అయినప్పటికీ 83 ప్యారామీటర్లతో కూడిన ఫుల్బాడీ చెకప్, వైద్యులు, పోషకాహార నిపుణులతో అపరిమిత కన్సల్టేషన్లు, ఏడాదిలో ఆరు స్పెషలిస్ట్ వైద్యుల కన్సల్టేషన్లను ఉచితంగా ఆఫర్ చేస్తున్నట్టు ఆమె చెప్పారు. అంతేకాదు ఏడాదిలో రెండు ఉచిత అంబులెన్స్ సరీ్వసులను సైతం వినియోగించుకునే సదుపాయం ఇందులో ఉంది. ‘ఈవెన్ హెల్త్కేర్’ కంపెనీ సైతం మాగ్మా జనరల్ ఇన్సూరెన్స్ సంస్థతో కలసి ఓపీడీ ఇన్సూరెన్స్ను అందిస్తోంది. కాకపోతే దీన్ని విడిగా రైడర్ కింద కాకుండా.. ఇండెమ్నిటీ కవర్కు యాడాన్గా ఆఫర్ చేస్తోంది. రూ.10 లక్షల వరకు ఓపీడీ కవర్ తీసుకోవచ్చు. ప్రీమియం కూడా 35 ఏళ్లలోపు వారికి ఏడాదికి రూ.4,500, 36–49 ఏళ్లలోపు వారికి రూ.10,000, 50 ఏళ్లు మించిన వారికి రూ.19,000 చార్జ్ తీసుకుంటోంది. ఓపీడీలో క్లెయిమ్స్ ఎక్కువ. అందుకే ప్రీమియం కూడా ఎక్కువే. ‘ఓపీడీ కవర్లో ప్రతి రూ.100 రక్షణ కోసం చెల్లించే ప్రీమియం రూ.50 వరకు ఉంటుంది. ఈ మేరకు పొదుపు చేసుకోవచ్చు’ అని సెక్యూర్నౌ ఇన్సూరెన్స్ బ్రోకర్ సహ వ్యవస్థాపకుడు కపిల్ మెహతా తెలిపారు. ఉచిత హెల్త్ స్క్రీనింగ్, చెకప్ల ద్వారా ఇవి వ్యాధి నివారణను ప్రోత్సహిస్తాయని చెప్పారు. ఓపీడీ రక్షణ ఉంటే.. ఎన్నిసార్లు వైద్యుల వద్దకు వెళ్లి, పరీక్షలు చేయించుకోవాల్సి వచ్చినా నిశ్చింతగా ఉండొచ్చన్నారు.పనిచేసే సంస్థ నుంచి ఓపీడీ ప్లాన్ కొన్ని బీమా సంస్థలు ప్రైవేటు కంపెనీల ఉద్యోగులకు ఓపీడీ కవరేజీని గ్రూప్ ప్లాన్ కింద ఆఫర్ చేస్తున్నాయి. నోయిడాకు చెందిన అన్మోల్ ఓ ఆరి్థక సేవల కంపెనీలో పనిచేస్తున్నాడు. పనిచేసే సంస్థ నుంచి తనకు, తన తల్లిదండ్రులకు కలిపి ఓపీడీ ప్లాన్ తీసుకున్నాడు. ఏడాదికి కవరేజీ రూ.21,000 కాగా, రూ.11,000 ప్రీమియం చెల్లిస్తున్నాడు. అన్మోల్కు 10 శాతం, అతడి తల్లిదండ్రులకు 20 శాతం కో–పే షరతు ప్లాన్లో భాగంగా ఉంది. అంటే ప్రతీ బిల్లులోనూ ఈ మేరకు అన్మోల్ సొంతంగా చెల్లించుకోవాలి. అయినప్పటికీ ఏటా రూ.18,000 విలువైన ఓపీడీ ప్రయోజనాలను తాను పొందుతున్నట్టు తెలిపాడు. అంటే ప్రీమియం చెల్లింపులు పోను అతడికి నికర మిగులు రూ.7,000గా ఉందని అర్థమవుతోంది. కొన్ని సంస్థలు అయితే ఉచితంగానే తమ ఉద్యోగులకు ఓపీడీ కవర్ను ఆఫర్ చేస్తున్నాయి. కొన్ని ఓపీడీ ప్లాన్లు కళ్లు, దంత సంబంధిత చికిత్సలకు సైతం కవరేజీనిస్తున్నాయి. ఇలా చేస్తే మెరుగు.. → ఓపీడీ కవర్లో భాగంగా వచ్చే ఉచిత హెల్త్ చెకప్లు, టెలీ కన్సల్టేషన్ సేవలను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలి. → నెట్వర్క్ ఆస్పత్రుల్లో నగదు రహిత విధానంలో సులభంగా సేవలు పొందొచ్చు. రీయింబర్స్మెంట్ విధానంలో అయితే అన్ని బిల్లులను జాగ్రత్తపరిచి క్లెయిమ్ దాఖలు చేయాల్సి వస్తుంది. నగదు రహిత విధానంలో అయితే ఈ ప్రహసనం తప్పించొచ్చు. → ఉప పరిమితులను జాగ్రత్తగా గమనిస్తూ, గరిష్ట పరిమితి మేరకు ఉపయోగించుకోవాలి. → ఓపీడీ కవర్ను రెన్యువల్ సమయంలో సమీక్షించుకోవాలి. కవరేజీ చాలకపోయినా.. ప్లాన్ ఆఫర్ చేస్తున్న ప్రయోజనాలు, ఉప పరిమితులు అంత అనుకూలంగా అనిపించకపోయినా మెరుగైన ప్లాన్కు అప్గ్రేడ్ కావాలి. ఓపీడీ ప్లాన్ తీసుకోవచ్చా..? తరచూ వైద్యుల సలహాలు, చికిత్సల కోసం వెళ్లే వారికి ఓపీడీ ప్లాన్లు ఉపయోగకరం. ముఖ్యంగా జీవనశైలి వ్యాధులు, దీర్ఘకాల వ్యాధులతో బాధపడే వారు వీటిని తీసుకోవచ్చు. ‘‘ఆరోగ్యవంతులైన వ్యక్తులకు సైతం ఓపీడీ కవర్ ప్రయోజకరమే. ముందస్తు వ్యాధి నిర్ధారణ పరీక్షల ద్వారా అనారోగ్యాలను తొలి దశలోనే గుర్తించొచ్చు’’ అని మణిపాల్ సిగ్నా హెల్త్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్, బిజినెస్ హెడ్ ఆశిష్ యాదవ్ సూచించారు. బీమా సంస్థ ఆఫర్ చేసే నగదు రహిత ఆస్పత్రుల నెట్వర్క్ను కూడా చూడాలి. ఓపీడీ ప్లాన్లలో తమకు నచ్చిన వైద్య నిపుణుడి వద్దకు కాకుండా, బీమా సంస్థ నెట్వర్క్ ఆస్పత్రుల్లోని వైద్యుల సేవలకు పరిమితం కావాల్సి వస్తుంది. కనుక నెట్వర్క్ జాబితాలో పేరున్న హాస్పిటల్స్ ఉన్నాయేమో పరిశీలించాలి. రీయింబర్స్మెంట్ విధానంలో షరతులు ఉన్నాయేమో తెలుసుకోవాలి. అసలు షరతుల్లేని లేదా పరిమిత షరతులతో మెరుగైన ప్రయోజనాలను ఆఫర్ చేసే ఓపీడీ ప్లాన్ను ఎంపిక చేసుకోవచ్చు. పనిచేసే సంస్థ నుంచి ఓపీడీ ప్లాన్కు అవకాశం ఉంటే అదే తీసుకోవడం మేలు. తమ అవసరాలకు సరితూగే ఓపీడీ ప్లాన్ను ఎంపిక చేసుకోవడం అన్నింటికంటే ప్రధానమైనది. వివిధ సంస్థలు ఆఫర్ చేస్తున్న ఓపీడీ ప్లాన్లు, వాటిల్లోని సదుపాయాలు, నెట్వర్క్ ఆస్పత్రుల జాబితాను పోల్చి చూడాలి. మెరుగైన చెల్లింపుల చరిత్రతో సహేతుక ప్రీమియంతో ఉన్న ప్లాన్ను ఎంపిక చేసుకోవచ్చు. -
....ఇన్ఫెక్షన్లు వస్తున్నాయి
∙నా వయసు ఇరవైఐదు సంవత్సరాలు. నాకు తరచు మూత్రసంబంధ ఇన్ఫెక్షన్లు వస్తున్నాయి. కారణం ఏమిటి? పరిష్కార మార్గాలు చెప్పండి. – కీర్తి, అనంతపురం. మూత్రనాళ ఇన్ఫెక్షన్ అంటే మూత్ర వ్యవస్థలోకి బాక్టీరియా ప్రవేశించడం వల్ల కలిగే సమస్య. సాధారణంగా ఈ బాక్టీరియా బయట నుంచి యూరినరీ బ్లాడర్లోకి ప్రవేశిస్తే ఇలా జరుగుతుంది. కొన్నిసార్లు మరింత తీవ్రమవుతూ మూత్రనాళం మొత్తం పైకి, కిడ్నీల వరకు చేరుతుంది. దీనివలన మూత్రం పోతున్నప్పుడు మంటగా అనిపించడం, తరచుగా మూత్రం రావడం, నొప్పి ఉండటం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. తక్కువ నీరు తాగటం, బయట తినే ఆహారం, శరీర శుభ్రత సరిగ్గా పాటించకపోవడం వంటి వాటి వల్ల ఈ సమస్యలు పునరావృతం అవుతూనే ఉంటాయి.రోజుకు కనీసం మూడున్నర లీటర్ల నీరు తాగాలి. మసాలా, కారం ఎక్కువుండే ఆహార పదార్థాలు, చల్లని పానీయాలు, టీ, కాఫీ లాంటివి తగ్గించాలి. ఇవి మూత్రపిండాలపై ఒత్తిడి పెంచుతాయి. జననేంద్రియ భాగాన్ని ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచాలి. సెంటు ఉన్న సబ్బులు, పరిమళభరిత పదార్థాలు వాడకూడదు. భర్తతో ఇంటర్కోర్స్ జరిగిన వెంటనే శుభ్రత పాటించాలి. మలవిసర్జన తర్వాత ముందువైపు నుంచి వెనుకవైపు వైపు మాత్రమే శుభ్రం చేసుకోవాలి. వెనుక నుంచి ముందుకు శుభ్రం చేయకూడదు. ఇలా చేయడం వల్ల బాక్టీరియా బ్లాడర్లోకి వెళ్లే ప్రమాదం ఉంటుంది. కాటన్ అండర్వేర్ ధరించాలి. ఎప్పుడూ పొడిగా ఉండేలా చూసుకోవాలి. స్నానం చేసిన తరువాత కూడా ఆ భాగాన్ని బాగా పొడిగా ఉంచుకోవాలి. కొంతమంది క్రమం తప్పకుండా వచ్చే ఇన్ఫెక్షన్లకు సహజమైన చికిత్సలు బాగా ఉపయోగపడతాయి. ఉదాహరణకు, తాజా పండ్ల రసాలు, బార్లీ నీరు, నిమ్మకాయ నీరు, కొబ్బరి నీరు రోజూ తీసుకోవచ్చు. ఇవి మూత్రనాళం శుభ్రంగా ఉండేలా చేస్తాయి. తరచు పొత్తి కడుపులో నొప్పిగా అనిపించటం, మూత్రంలో ముదురు రంగు, రక్తం కనిపించడం లాంటి లక్షణాలు ఉంటే వెంటనే డాక్టర్ను సంప్రదించాలి. జ్వరమొచ్చినా, నడుము నొప్పి ఉన్నా ఆలస్యం చేయకూడదు. మొదటి దశలోనే పరీక్షలు చేయించుకుని, చికిత్స తీసుకుంటే సమస్య తిరిగి రాదు. అవసరమైతే మూత్రపరీక్షలో బాక్టీరియా ఏ రకమైనదో చూసి, దానికి సరిపడే మందులు మాత్రమే వాడాలి. ఇతర వైద్యం అవసరం లేకుండా, ఒత్తిడి తగ్గించి, శరీర శుభ్రతను పాటించడం ద్వారా చాలా వరకు నియంత్రించ వచ్చు. రాగానే తలనొప్పి నాకు గత రెండేళ్లుగా ప్రతి నెలా పీరియడ్ రాగానే తీవ్రమైన తలనొప్పి వస్తోంది. ఇది మైగ్రేన్∙ అంటున్నారు. ఇది ఎందుకు వస్తోంది? దానికి ఏమైనా పరిష్కారం ఉందా?– శారద, తిరుపతి. మీకు వస్తున్న తలనొప్పి సాధ్యమైనంత వరకు హార్మోన్ల మార్పుల వల్ల కలిగే మైగ్రేన్ కావచ్చు. పీరియడ్ వచ్చే కొన్ని రోజుల ముందు ఈస్ట్రోజన్ అనే హార్మోన్ శరీరంలో తగ్గిపోతుంది. దాని ప్రభావంతో తలనొప్పి ప్రారంభమవుతుంది. కొంతమందికి ఇది నాలుగు రోజుల ముందే మొదలై, పీరియడ్ మొదటి రెండు రోజుల వరకూ ఎక్కువగా ఉంటుంది. దీనిని మెన్స్ట్రువల్ మైగ్రేన్ అంటారు. ఇది ఓ పద్ధతిలో వచ్చే తలనొప్పి కాబట్టి, మీరు ఒక డైరీ రాసుకోవాలి – ఎప్పుడు వస్తోంది, ఎంతసేపు ఉంటుంది, ఏమి తిన్నాక లేదా ఏ పరిస్థితుల్లో వస్తోంది అన్నదాన్ని గమనించాలి. ఆ వివరాలతో డాక్టర్ సరైన మందులు సూచిస్తారు. కొంతమంది మైగ్రేన్ రాకముందే కొన్ని రోజుల పాటు నాప్రోక్సెన్, ఐబుప్రొఫెన్ లాంటి నొప్పి నివారణ మాత్రలు వాడతారు. ఇవి శరీరంలో వాపు, నొప్పిని తగ్గించడంలో సహాయపడతాయి. గర్భధారణ ఉన్నవారు అయితే, కొన్ని మందులు వాడకుండా ఉండాలి. అప్పుడు మాత్రమే గర్భసంచయానికి అనుకూలంగా ఉండే ప్రొజెస్టెరాన్ మాత్రలు ఇవ్వడం జరుగుతుంది. పీరియడ్ సమయాల్లో మైగ్రేన్ ఎక్కువగా ఉంటే, ఆ రోజుల్లో తీసుకోవాల్సిన మందులు ప్రత్యేకంగా సూచిస్తారు. కొంతమందికి ఈస్ట్రోజన్ తక్కువ స్థాయిలో ఉండటం వల్లే ఇది వస్తుంది కాబట్టి, తగిన ఈస్ట్రోజన్ ప్యాచ్లు లేదా ఇతర మార్గాల్లో ఇచ్చే చికిత్సలు ఉపయోగపడతాయి. గర్భధారణ సమయంలో ఏ మాత్రలు తీసుకోవాలో, ఏవి తీసుకోవద్దో వైద్యులే నిర్ణయిస్తారు. మైగ్రే తో పాటు వాంతులు, వికారం వంటి సమస్యలు ఉంటే, అటువంటి లక్షణాల కోసం ప్రత్యేక మందులు ఇస్తారు. తిండి మానేయకూడదు, ఆకలితో ఉండకూడదు. ప్రతిరోజూ ఒకే సమయంలో తినడం, నీరు ఎక్కువగా తాగడం, శరీరాన్ని విశ్రాంతిగా ఉంచడం అవసరం. ఒక నెలలో మూడుసార్లు లేదా అంతకంటే ఎక్కువ సార్లు మైగ్రేన్ వస్తున్నట్లయితే, రోజూ తీసుకునే ప్రివెంటివ్ మందులు అవసరమవుతాయి. ఈ మందుల్ని మొదటి మూడు నెలల పాటు వాడిన తరువాత, దాని ప్రభావాన్ని డాక్టర్ అంచనా వేస్తారు. దాని ఆధారంగా మందులు వాడాలి. -
సూపర్ టిప్స్ : ఎంత బిజీ అయినా సరే, ఇలా బరువు తగ్గొచ్చు!
బరువు తగ్గాలంటే ఆహార అలవాట్లను మార్చుకోవాలి. వ్యాయామం చేయాలి. వీటన్నింటి కంటే ముందు అసలు మనం ఎందుకు బరువు ఎక్కువగా ఉన్నాయో విశ్లేషించుకోవాలి. అంతర్లీనంగా ఏవైనా ఆరోగ్యసమస్యలున్నాయేమో అనేది వైద్య నిపుణుల ద్వారా చెక్ చేసుకోవాలి. అప్పుడు వ్యాయామం, ఆహారంమీద దృష్టిపెట్టాలి. అయితే ఎక్స్ర్సైజ్ చేయడానికి టైం లేదబ్బా.. ఇది అందరూ చెప్పేమాట. మరి దీనికి పరిష్కారమేంటి? బిజీ షెడ్యూల్తో సతమతయ్యేవారు, అస్సలు టైం ఉండటం లేదు అని బాధపడే వారు ఏం చేయాలి? ఇవాల్టి ‘ టిప్ ఆఫ్ ది డే’ లో తెలుసుకుందాం.బిజీ బిజీ జీవితాల్లో బరువు తగ్గడంపై దృష్టి పెట్టేందుకు సమయం దొరకడం కష్టంగా అనిపించవచ్చు. కానీ మన కోసం, మన ఆరోగ్యం కోసం ఎంతో కొంత సమయాన్ని కేటాయించడం చాలా అవసరం. అలాంటి కొన్ని చిట్కాలు చూద్దాం. స్మార్ట్గా మన షెడ్యూల్ ఆధారంగా దినచర్యను అలవాటు చేసుకోవాలి. గంటలు గంటలు జిమ్లో గడాల్సిన అవసరం లేకుండానే, సింపుల్ చిట్కాలు, చిన్న చిన్న జీవనశైలి సర్దుబాట్లతో ఫిట్నెస్ సాధించవచ్చు.స్మార్ట్ ప్రిపరేషన్బరువు తగ్గడం, ఫిట్గా ఉండాలి అనే విషయంలో కూడా కమిట్మెంట్ చాలా ముఖ్యం. ప్లాన్డ్గా, స్మార్ట్గా ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఉదయం బ్రేక్ ఫాస్ట్నుంచే మన ప్రిపరేషన్ మొదలు పెట్టేద్దాం. ఇందుకు పది నిమిషాలు చాలు. ఉడికించిన గుడ్లు, స్మూతీ, లేదా రాత్రి నానబెట్టిన ఓట్స్ బెస్ట్. వీటిని తొందరగా ప్రిపేర్ చేసుకోవచ్చు. పోషకాలు కూడా ఎక్కువే. ఖచ్చితంగా ఇంతే తినాలని అనుకొని, టిఫిన్ లేదా లంచ్ ప్యాక్ చేసుకుంటే..అతిగా తినే ముప్పు తప్పుతుంది. వ్యాయామం- ఆ 2 నిమిషాలు కనీసం వ్యాయామం శరీరాన్ని చురుగ్గా ఉంచుతుంది. రోజులో కనీసం అర్థగంట వ్యాయామానికి కేటాయిస్తే చాలు. అలాగే సుదీర్ఘ వ్యాయామం చేయలేకపోతున్నామన్న దిగులు అవసరం లేదు. రోజంతా రెండు, రెండు నిమిషాలు మినీ వర్కౌట్లు చేయండి. అంటే కాఫీ విరామాలలో స్క్వాట్లు, డెస్క్ స్ట్రెచ్లు లేదా లిఫ్ట్లకు బదులుగా ఎక్కడం లాంటివి. డెస్క్ వర్క్ అయినా సరే.. ప్రతీ గంటకు ఒకసారి స్వల్ప విరామివ్వడం ముఖ్యం. వీలు, సౌలభ్యాన్ని బట్టి, చిన్న చిన్న డెస్క్ వ్యాయామాలు చేయవచ్చు.అందుకే ఇటీవల చాలా ఐటీ కంపెనీల్లో స్టాండింగ్ డెస్క్లను ఏర్పాటు చేస్తున్నాయి. ప్రయాణాల్లో రైల్వే స్టేషన్, బస్టాండ్, ఎయిర్పోర్ట్లలో సమయం ఉన్నపుడు సాధ్యమైనంత నడవడానికి, నిల్చొని ఉండడానికి ప్రయత్నించండి. ఇవి జీవక్రియను చురుకుగా ఉంచడం తోపాటు, శరీర భాగాల్లో కొవ్వు పేరుకు పోకుండా చేస్తుంది.ఇదీ చదవండి: Today Tip : మూడు నెలల్లో బాన పొట్ట కరిగిపోవాలంటే..!హైడ్రేషన్: ఎక్కడికి వెళ్లినా వాటర్ బాటిల్ను వెంట తీసుకెళ్లండి. హైడ్రేటెడ్గా ఉండటం జీవక్రియను మెరుగు పరుస్తుంది. ఆకలిని తగ్గిస్తుంది. మరింత ఉత్సాహంకోసం నిమ్మకాయ, పుదీనా కలిపిన నీళ్లు, లేదా పల్చని మజ్జిగ తాగండి.“స్నాక్ స్మార్ట్”: వండుకునే టైం లేదనో టైం పాస్ కోసమో, ఆకలిగా ఉండనో, ఎనర్జీ డ్రింక్స్, ప్యాక్డ్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ వైపు మళ్లకండి. దీనికి బదులుగా నట్స్, రోస్టెడ్ సీడ్స్, ప్రోటీన్ బార్లు, పండ్లు వంటి ఆరోగ్యకరమైన స్నాక్ ప్యాక్లపై దృష్టిపెట్టండి. వీలైతే వీటిని మీ బ్యాగ్, డెస్క్ లేదా కారులోనో ఉంచుకోండి. వీటి వల్ల పోషకాలు బాగా అందుతాయి. శక్తి లభిస్తుంది. అంతేకాదు దీని వల్ల షుగర్ ఫుడ్స్, ఆయిలీ ఫుడ్, అనారోగ్యకరమైన స్ట్రీట్ ఫుడ్కి దూరంగా ఉండొచ్చు. వండుకోవడానికి సమయంలో లేనప్పుడు. తక్కువ సమయంలో, ఎక్కువ ప్రొటీన్డ్ ఫుడ్ తినేలా ప్లాన్ చేసుకోండి. గంటల తరబడి కుర్చీకి, సోఫాకి అతుక్కుపోవద్దు. వీలైనన్నిసార్లు లేచి నడుస్తూ ఉండాలి. ఉదా : ఫోన్ మాట్లాటప్పుడు, టీవీ చూస్తున్నపుడు, పాడ్కాస్ట్ వింటున్నప్పుడు నడుస్తూ ఉండాలి. అలాగే భోజనం తరువాత కనీసం 10నిమిషాల నడక అలవాటు చేసుకోండి.ఇలా చేయడం వల్లన యాక్టివ్ఉండటంతోపాటు,రోజంతా కేలరీలను బర్న్ చేయడంలో సహాయపడుతుంది.చదవండి: యూఎస్కు బైబై : ఇండియాలో రూ.25 కోట్లతో బతికేయొచ్చా? చెప్పండి ప్లీజ్!పోర్షన్ కంట్రోల్: మన తినే ఆహారంలో కొర్బ్స్ తక్కువ, ప్రొటీన్ ఎక్కువ ఉండేలా చూసుకోవాలి. "మైండ్ఫుల్ ఈటింగ్" అనేది ముఖ్యం. ఎక్కువ తినకుండా పొట్ట నిండేలా ఉడికించిన కూరగాయ ముక్కలు, మొలకెత్తిన గింజలు, పుచ్చ, బొప్పాయి లాంటి పళ్లకు చోటివ్వండి. కొద్దిగా కొద్దిగా నెమ్మదిగా తినండి. చిన్న ప్లేట్లను ఉపయోగించండి. ఎందుకంటే బిజీగా ఉండేవారు ఆ హడావిడిలో వేగంగా, ఎక్కువగా తినేస్తారు. అలాగని కేలరీలను మరీ అబ్సెసివ్గా లెక్కించాల్సిన అవసరం లేదు. పోర్షన్ కంట్రోల్పై దృష్టిపెడాలి. అపుడు ఎంత తక్కువ తిన్నా కడుపు నిండిన అనుభూతినిస్తుంది. స్క్రోలింగ్ చేస్తున్నప్పుడు లేదా పని చేస్తున్నప్పుడు తినడం మానుకోండి. ఏం తింటున్నామన్న దానిపై దృష్టి పెట్టి శ్రద్ధగా, ఆస్వాదిస్తూ తినండి.గంట కొట్టినట్టు నిద్రపోవాలినిద్ర లేకపోవడం ఆకలి హార్మోన్లను ఉత్తేజితం చేస్తుంది. సమయానికి నిద్రపోవాలి. వారాంతాల్లో కూడా నిద్రవేళకు ఒక నిర్దిష్ట సమయాన్ని సెట్ చేసుకోండి, దానికి కట్టుబడి ఉండండి. చక్కటి విశ్రాంతి తీసుకున్న శరీరం ఎక్కువ బరువు తగ్గేలా ప్రతిస్పందిస్తుంది. సంకల్ప శక్తి పెరుగుతుంది.చీట్ మీల్, ఓకే అప్పుడప్పుడూ వ్యాయామాన్ని మిస్ అయినా, కాస్త ఎక్కువ తిన్నే మరీ ఎక్కువ ఆందోళన చెందకండి. చీట్మీల్ అనుకోండి. బిజీ షెడ్యూల్లో అన్నీ అనుకున్నట్టు ప్రణాళిక ప్రకారం జరగవు అని సర్దుకుపోండి. మిస్ అయిన వ్యాయాన్ని మరునాడు సర్దుబాటు చేసుకోండి. అంతే... అందం, ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం మీ సొంతం.నోట్: ఇవి అవగాహనకోసం అందించిన చిట్కాలు మాత్రమే. ఎవరి శరీరాన్నివారు అర్థం చేసుకొని, ప్రేమించాలి. బరువు తగ్గడం అనేది ఎవరికి వారు నిశ్చయించుకొని, స్వీయ క్రమశిక్షణతో, పట్టుదలగా చేయాల్సిన పని అని మర్చిపోవద్దు. -
నిండు నూరేళ్లు.. వందేళ్లయినా మలేషియా మాజీ ప్రధానిలో అదే జోష్!
నిండు నూరేళ్లు ఆరోగ్యంగా బతకడం అనేది ఈ రోజుల్లో అత్యంత కష్ట సాధ్యమైన పనే. పెరిగిన సాంకేతికత మనిషిపై పెత్తనం చేస్తుందేమో అనేలా..దానికి బానిసై ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నాడు మానవుడు. కానీ ఈ మలేషియా ప్రధాని డాక్టర్ మహతిర్ ముహమ్మద్ ఒత్తిడితో కూడిన రాజకీయ వాతావరణంలో సుదీర్ఘకాలం పనిచేసిన మంత్రిగా పేరు తెచ్చుకోవడమే గాక ఈ నెల పదితో ఆయనకు నూరేళ్లు నిండాయి. ఈ అద్భుత మైలు రాయిని ఈ నెల జూలై 10, 2025న చేరుకున్నారు. ఆయన వయస్సు పరంగా..ఇప్పటికీ చాలా స్పష్టంగా మాట్లాడగలరు. వృద్ధులలో ఉండే తడబాటు, ఒణుకు అవేమి ఆయనలో కనిపించావు..40 లేదా 50 ఏళ్ల వాడిలా అత్యంత హుషారుగా ఉంటారు. అంతేగాదు ఈ వయసులో కూడా యువతతో పోటీ పడేలా బ్రెయిన్కి పదను పెట్టగల సామర్థ్యం ఆయన సొత్తు. ఐతే అందుకు ఎలాంటి మ్యాజిక్ ఉండదని క్రమశిక్షణాయుతమైన జీవనశైలి ఒక్కటే తోడ్పడుతుందని చెబుతున్నారు. అంతేగాదు ఈ ఆరు అలవాట్లు తప్పనిసరి అంటూ తన దీర్ఘాయువు రహస్యాలను పంచుకున్నారు. అవేంటో చూద్దామా..!.అధిక వ్యాయామం వద్దు..చురుకుగా ఉందాం..అధిక వ్యాయామాలు జోలికి పోవద్దన్నారు. ఇది వృద్ధాప్యం కండరాల నష్టం (సార్కోపెనియా), హృదయనాళ పనితీరుపై తీవ్ర ప్రభావం చూపుతుందని అంటున్నారు మహాతిర్. దాని బదులు, నడవడం, రోజు వారి పనులపై ఎవ్వరిపై ఆధార పడకుండా చేసుకోవడం తదితరాలు శరీరంలో మంచి కదలికను ప్రోత్సహింస్తుందని అన్నారు. తాను తీవ్రంగా చేసే జిమ్ జోలికి కూడా పోనననారు. ఈ వయసులో తేలికపాటి వ్యాయమాలే బెస్ట్ అని చెప్పారు. బాడీ తోపాటు మనసుకి కూడా వ్యాయామం..మొదడు ఉపయోగించకపోతే..మతిమరుపు వంటి సమస్యలు వస్తాయన్నారు. అందుకోసం మహతిర్ చదవడం, రాయడం, మాట్లాడటం వంటి పనులు చేస్తారు. ఆయన ఎక్కువగా స్పీచ్లు ఇస్తుంటారట. ఇది తన మెదడుని చురుకుగా ఉండేలా చేస్తుందట. మేధోపరమైన పనులతోనే చిత్త వైకల్యం వంటి సమస్యలను అధిగమించగలమని చెప్పారు. ఇది పరిశోధనల్లో కూడా వెల్లడైందని అన్నారు. పదవీ విరమణ అంటే బ్రేక్ కాదు..రిటైర్మెంట్ తీసుకున్న తదనంతర కూడా తన కార్యకలాపలను వదులుకోలేదట మహతీర్. అది తాను విశ్రాంతి తీసుకునే సమయంగా అస్స్లు ఫీల్ కాలేదట. మరింతగా తనపై తాను ఏకాగ్రత చిత్తంతో ఆలోచించుకునే విరామ సమయంగా భావించానని చెబుతున్నారు. తాను ఈ ఖాళీ సమయంలో రాయడం, సలహాలు ఇవ్వడం, బహిరంగ చర్చల్లో పాల్గొనడం వంటి కార్యకలాపాల్లో మునిగిపోతారట. ఇది మెరుగైన మానసిక ఆరోగ్యం తోపాటు అకాల మరణ ప్రమాదాన్ని నివారిస్తుందట. సంభవించే ప్రమాదాన్ని తగ్గిస్తుందట.భావోద్వేగ పరంగా బీ స్ట్రాంగ్..తన రాజకీయ ప్రయాణంలో ఎన్నో విమర్శలు, అంతర్జాతీయ ఒత్తిడి వంటి రాజకీయ సవాళ్లను చాలానే ఎదుర్కొన్నారట. దాన్ని అధిగమించేందుకు ధ్యానం లేదా మైండ్ఫుల్నెస్ టెక్నిక్లపై దృష్టిసారించేవారట. తనలోకి తాను అవలోకనం చేసుకున్నప్పుడూ ఎలాంటి ఒత్తుడులు మనల్ని ఏం చేయలేవని ధీమాగా చెబుతున్నారు. అందువల్ల భావోద్వేగ పరంగా బలంగా ఉంటే వృద్ధాప్యం దరిచేరే ప్రమాదం ఆటోమేటిక్గా తగ్గిపోతుందట. ఈ భావోద్వేగ నియంత్రణ దీర్ఘాయువుకి అత్యంత కీలకమైనదని చెబుతున్నారు.హానికరమైన అలవాట్లకు దూరం..ఆహారంలో నియంత్రణ, చక్కటి జీవనశైలి ఆరోగ్యంగా ఉండటంలో ప్రధాన పాత్ర పోషిస్తాయని అన్నారు. అలాగే ఎలాంటి ఫ్యాషన్ డైట్లు, అధిక పోషకాహార డైట్లు వద్దని సూచించారు. బదులుగా సమతుల్య భోజనానికి ప్రాముఖ్యత ఇవ్వమని కోరారు. దీర్ఘాయువు అనేది మితంగా తినడంపైనే ఆధారపడి ఉంటుందని నొక్కి చెప్పారు. ముఖ్యంగా 60వ దశకంలో జీవక్రియ నెమ్మదించి వ్యాధులు అటాక్ చేసే సమయం అని..అందువల్ల మితాహారానికి ప్రాధాన్యత ఇవ్వడం మంచిదని సూచించారు.ఉరకలు వేసే ఉత్సాహం..దీన్ని ఓ అభ్యాసంలా చేస్తే..ఉత్సాహం మన నుంచి దూరం కాదని చెబుతున్నారు. ఇది ఆరోగ్యంగా ఉండటంలో కీలకపాత్ర పోషిస్తుందని చెప్పారు. నిరంతరం నేర్చుకోవడానికి ప్రాధాన్యత ఇస్తే..యువకుడిలా ఉత్సాహంగా ఉంటామని చెప్పారు. ఈ ఉత్సాహమే సకలం నేర్చుకోవడానికి దోహద పడుతుందని అన్నారు. అందుకోసం అసరం అనుకుంటే యువతరంతో మమేకం కండి, వారితో మీ అనుభవాలు పెంచుకండి మీ ఆయుష్షు పెరగడమే గాక యంగ్గా ఉంటారని అంటున్నారు. నిత్య యవ్వనంగా ఉండటం అంటే..నెరిసిన జుట్టుతో ఉన్నా..శరీరం ఒణకకుండా..మాట తీరు అత్యంత స్పష్టంగా ఉండటమేనని చెబుతున్నారు మహతీర్. ఇంకెందుకు ఆలస్యం ఆయనలా ఆ ఆరు అలవాట్లను మన జీవితంలో భాగం చేసుకుని దీర్ఘాయుష్షుతో నిండు నూరేళ్లు ఆరోగ్యంగా జీవిద్దామా...(చదవండి: బెల్లం ఫేస్ వాష్..దెబ్బకు ముఖంపై ముడతలు మాయం..!) -
వాకింగా? జాగింగా? ఎవరికి ఏది మంచిది?
సాధారణంగా నడక (వాకింగ్) జాగింగ్ చాలా ప్రముఖమైన సులభమైన అత్యధిక శాతం మంది అనుసరించే వ్యాయామాలు. ఎక్కడైనా, ఎప్పుడైనా సరే ఎవరి సాయం లేకుండా కూడా చేయగలిగిన ప్రయోజనకరమైన వ్యాయామాలు కావడంతో వీటికి చాలా ప్రాధాన్యత ఉంది అయితే కొందరిలో సందేహాలు ఉన్నాయి. నడక మంచిదా? జాగింగ్ మంచిదా? అసలు ఏది ఎవరు చేయాలి? ఎంత సేపు చేయాలి... వంటి అనుమానాల నివృత్తి కోసం...వైద్యులు చెబుతున్న కొన్ని విషయాలు..నలతను దూరం చేసే నడక : శరీరంపై తక్కువ ఒత్తిడి, గాయాలకు అవకాశం చాలా తక్కువ. తగినంత, మితమైన వేగంతో చేస్తే రోగనిరోధక శక్తి పెంచుకోవచ్చు. దీర్ఘకాలం పాటు నిరంతరంగా చేస్తే ఇది శరీరంలోని కొవ్వు కారక క్యాలరీలు తగ్గించడంలో, సహాయపడుతుంది. సాధారణ వేగంతో నడిస్తే 45 నిమిషాల నడక వల్ల సుమారు 150 నుంచి 250 క్యాలరీలు ఖర్చు అవుతాయి. ఇది అన్ని వయస్సుల వారికి, కొన్ని రకాల ఆరోగ్య పరిమితులతో ఉన్న వారికి కూడా అనుకూలం.జాగ్రత్తలతో...జాగింగ్పరుగుకీ, నడకకు మధ్యన ఉండేదే జాగింగ్. నిదానంగా చేసే జాగింగ్ వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి. కనీసం 15 నిమిషాల పాటు చేసే స్లో జాగింగ్ ద్వారా 100 నుంచి 150 క్యాలరీలు ఖర్చు చేయవచ్చు. కాస్త వేగంగా వేయడం వల్ల శరీరం మరిన్ని ఎక్కువ క్యాలరీలు తక్కువ సమయంలో ఖర్చు చేస్తుంది. ఇది గుండె రక్తనాళ వ్యవస్థకు మేలు కలుగు జేసే వ్యాయామం, ఆక్సిజన్ వినియోగాన్ని మెటబాలిజం వేగాన్ని పెంచడంలో కూడా మనకు తోడ్పడుతుంది .ఏది ఉత్తమం?ఈ ప్రశ్నకు సమాధానం వ్యక్తిగత లక్ష్యాల మీద ఆధారపడుతుంది. ఉదాహరణకు కేవలం ఆరోగ్యాన్ని కాపాడుకునే లక్ష్యం మాత్రమే కలిగి ఉంటే వాకింగ్ సరిపోతుంది. అదే బరువు తగ్గాలి అంతేకాకుండా గుండెకు తగిన వ్యాయామంకావాలి అనుకుంటే బ్రిస్క్ వాక్, జాగింగ్ మేలు చేస్తాయి.వ్యక్తి శారీరక పరిస్థితులు కూడా దృష్టిలో ఉంచుకోవాలి. కాళ్ళు, గాయాలు, గుండె సంబంధమైన సమస్యలు ఉన్నట్లయితే జాగింగ్ కాకుండా నడక బెస్ట్ అని చెప్పాలి. అలాగే 60ఏళ్లు దాటిన మగవాళ్లు, 50 ఏళ్లు దాటిన మహిళలు తమ తమ ఆరోగ్య సమస్యలను దృష్టిలో ఉంచుకుని తొలుత నడకతో మాత్రమే ప్రారంభించాలి. ఇతరత్రా ఏ సమస్యలూ రాకపోతే స్లో జాగింగ్కు మళ్లవచ్చు. అదే యుక్త వయసు వాళ్లు అయితే జాగింగ్ను ఎంచుకోవచ్చు. ఏదేమైనా, నిరంతరంగా కొనసాగించగల వ్యాయామం ఎంచుకోవడం ముఖ్యం. అది 45 నిమిషాలు నడక కావచ్చు, లేక 20 నిమిషాలు జాగింగ్ అయినా సరే. ఎంచుకున్న వ్యాయామాన్ని క్రమబద్ధంగా చేయడం అత్యంత ముఖ్యమైనది ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచిస్తున్న ప్రకారం శరీర క్రియలు సజావుగా జరగాలంటే వారానికి కనీసం 150 నిమిషాల పాటు ‘మోడరేట్ యాక్టివిటీ’ లేదా 75 నిమిషాల ‘విగరస్ యాక్టివిటీ’ చేయడం అవసరం. చురుకుదనం, ఆరోగ్యం వంటివి చాలనుకుంటే నడక తక్కువ సమయంలో ఫిట్నెస్ పెంచాలనుకుంటే జాగింగ్ మంచిది. నోట్ : ఏది ఏమైనా ముందస్తుగా ఆరోగ్య నిపుణులతో సంప్రదించి మీ ఆరోగ్య పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని, వ్యాయామం చేయడం ఉత్తమం. -
Today Tip : మూడు నెలల్లో బాన పొట్ట కరిగిపోవాలంటే..!
అధిక బరువు సమస్య కొంతమందిని వేధిస్తే, ముందుకు పొడుచుకు వచ్చిన బాన పొట్ట మరికొంతమందిని బాధిస్తుంది. కానీ మన ఇంట్లోనే, మన పోపుల పెట్టెలోనే సులువుగా లభించే దినుసులతో బెల్లి ఫ్యాట్ను కరిగించుకోవచ్చు. అదెలాగో ఇవాల్టి ‘టిప్ ఆఫ్ ది డే’ లో భాగంగా తెలుసుకుందాం.బెల్లీ ఫ్యాట్ను తగ్గించుకునేందుకు సోంపు, జీలకర్ర, ధనియాలతో చేసిన కషాయం బాగా పనిచేస్తుందని ఆయుర్వేదనిపుణులు చెబుతున్నారు. అంతేకాదు ఇది శరీర ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ కషాయం త్రాగడం వలన జీర్ణక్రియ మెరుగు పడుతుంది. బరువు తగ్గడానికి సహాయపడుతుంది, శరీరంలో మంటను తగ్గిస్తుంది.ఎలా తయారుచేసుకోవాలిరెండు స్పూన్ల ధనియాలు, రెండు స్పూన్ల సోంపు, రెండు స్పూన్ల జీలకర్ర4 కప్పుల నీళ్లు తీసుకోవాలి. ఇందులో జీలకర్ర, సోంపు, ధనియాలు వేసి 10-15 నిమిషాలు ఉడికించాలి. బాగా మరిగిన తరువాత ఈ కషాయాన్ని వడపోసుకోవాలి. ఉదయాన్నే పరగడుపున (empty stomach)న తాగాలి. కనీసం మూడు నెలల పాటు క్రమం తప్పకుండా ఇలా చేస్తే ఎంత వేలాడే పొట్ట అయినా సరే ఫ్లాట్గా మారిపోతుంది.మరిన్నిలాభాలుజీర్ణక్రియకు మంచిది, తద్వారా బరువు తగ్గుతుంది.గట్ హెల్త్ మెరుగుపడుతుంది. గ్యాస్, ఉబ్బరం, మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. దీని వలన అనేక సమస్యలకు ఉపశమనం లభిస్తుంది. మలబద్ధకం అనేక సమస్యలకు మూలం. సోంపు, జీలకర్ర, ధనియాలలో యాంటీ-ఇన్ఫ్లమేటరీ గుణాలు శరీరంలో మంటను తగ్గిస్తాయి. రోగనిరోధక శక్తి పెరుగుతుంది.చర్మం ప్రకాశం వంతంగా ఉంటుంది. మొటిమలు, మచ్చలు మటుమాయవుతాయి.ఇది మర్చిపోవద్దు : అయితే ఈ కషాయం తాగుతున్నాం కదా అని ఆహార నియమాల పట్ల నిర్లక్ష్యంగా ఉండకూడదు. ఈ చిట్కాను పాటిస్తూనే, కొద్ది సేపు నడక, కొవ్వు పదార్థాలు, నూనెలో వేయించిన పదార్థాలకు దూరంగా ఉండాలి. తగినన్ని నీళ్లు సేవించాలి. రాత్రి భోజనం తొందరగా ముగించాలి. ప్రతీ భోజనం తరువాత కనీసం పది నిమిషాలు నడిస్తే అద్భుతమైన ఫలితాలు సాధించడం ఖాయం.నోట్: ఈ ప్రక్రియ కొందరికి వారి వారి బాడీ మెటబాలిజాన్ని బట్టి కొంచెం ఆలస్యం కావచ్చు ఓపిగ్గా ప్రయత్నించాలి. బరువుతగ్గాలంటే ఆ మాత్రం ఓపిక తప్పదు మరి. అలాగే ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే, ఈ నీటిని త్రాగే ముందు వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం. ఇదీ చదవండి: Tip of the Day : రాగుల జావతో మ్యాజిక్ -
'వాటర్ ఫాస్టింగ్' ఆరోగ్యానికి మంచిదేనా..? నటి నర్గీస్ ఫక్రీ..
బాలీవుడ్ నటి నర్గీస్ ఫక్రీ అమెరికన్ నటి, మోడల్. అమెరికాలో మోడల్గా పనిచేసిన ఫక్రీ 2011లో బాలీవుడ్లో వచ్చిన రొమాంటిక్ డ్రామా చిత్రం రాక్స్టార్ మూవీతో ఉత్తమ మహిళా నటిగా ఫిల్మ్ఫేర్ అవార్డుని దక్కించుకుని అందర్నీ ఆకర్షించింది. నటన పరంగానే గాదు, గ్లామర్ పరంగానూ తనకు సాటిలేరెవ్వరూ అన్నట్లుగా ఆకర్షణీయంగా ఉంటారామె. ఇటీవల సోహా అలీకాన్తో జరిగిన సంభాషణలో తన ఫిట్నెస్ సీక్రెట్స్ వెల్లడించి అందరిని విస్తుపోయేలా చేశారు. తన లుక్ అంతలా ఉండటానికి తొమ్మిది రోజుల కఠిన ఉపవాసమేనని అంటోంది. దాని వల్ల తన ముఖంలో గ్లో వస్తుందని చెబుతోంది. నిజానికి అలాంటి ఉపవాసం ఆరోగ్యానికి మంచిదేనా..?. నిపుణులు ఏమంటున్నారంటే..సోహా అలీఖాన్ సంభాషణలో తన లైఫ్స్టైల్ గురించి వెల్లడించింది. కెటిల్బెల్ వంటి వ్యాయామాలు చేస్తానని, 8 గంటలు నిద్ర తప్పనిసరి అంటూ తన బ్యూటీ రహస్యాలు షేర్ చేసుకున్నారు. అయితే తాను ఏడాదికి రెండుసార్లు కఠిన ఉపవాసం ఉంటానని ఆ సమయంలో అస్సలు ఏమి తినని చెప్పుకొచ్చింది. కేవలం నీళ్లు మాత్రమే తాగుతానని అంటోంది. దాని వల్ల ముఖం పీక్కుపోయినట్లు కనిపించినా..ఒక విధమైన గ్లో వస్తుందని చెప్పుకొచ్చిందామె. అయితే ఇది కాస్తా కష్టమైనదని, ఎవ్వరూ ప్రయత్నించొద్దని సూచించారామె. ఇంకా తనకు బట్టర్ చికెన్, బిర్యానీ వంటి భారతీయ వంటకాలన్నా మహా ఇష్టమని తెలిపింది. అలాగే చర్మం ఆరోగ్యం కోసం హైడ్రేటెడ్గా ఉంటానని, మంచి నిద్ర, మినరల్స్, విటమిన్లు, పోషకాలతో కూడిన ఆహారమే తీసుకుంటానని చెప్పుకొచ్చారు నర్గీస్ ఫక్రీ. వాటర్ ఫాస్టింగ్ మంచిదేనా..?ఇది ఒకరకమైన ఉపవాసం. ఫ్యాట్ డైట్ పరంగా చేసే క్రేజీ ఫాస్టింగ్ అని చెబుతున్నారు. ఈ విధానంలో కేవలం నీటిని మాత్రమే తీసుకుంటారు. ప్రస్తుతం ఇది బాగా ట్రెండింగ్లో ఉంది. అలాగే పరిశోధనల్లో కేవలం నీటినే ఆహరంగా తీసుకుని ఉపవాసం ఉండే ఈ ప్రక్రియతో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయన్నారు. కొన్ని దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదం తగ్గే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని పరిశోధనలో తేలింది. అయితే ఇది ఎంతలా ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ.. సరైన విధంగా చేయకపోతే అంతే స్థాయిలో ప్రమాదాలు తప్పవని హెచ్చరిస్తున్నారు నిపుణులు. దుష్ప్రభావాలు..దీని వల్ల నీటి ఉపవాసం నిర్జలీకరణం, కండరాల నష్టం, రక్తపోటు మార్పులు వంటి ఇతర ఆరోగ్య పరిస్థితులకు దారితీస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి.ఆహారం లేకుండా ఎక్కువసేపు ఉండటం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు అందవు. పైగా ఎలక్ట్రోలైట్ అసమతుల్యత, కండరాల నష్టం, రోగనిరోధక శక్తి తగ్గడం, అలసట, తలతిరగడం,, మతిమరుపు, జీవక్రియ మందగించడం తదితర సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. అలాగే అందరి వ్యక్తుల శరీర తీరు విభిన్నంగా ఉంటుంది. కాబట్టి ఇది అందరికి సరిపడదని అన్నారు. ఇలాంటివి ఆరోగ్య నిపుణుల సమక్షంలో ఏ మేరకు చేయాలో నిర్ణయించి పాటిస్తేనే మంచిదని చెబుతున్నారు నిపుణులు.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం(చదవండి: ఐరన్ సయామీ..! ఒకే ఏడాదిలో రెండుసార్లు..) -
నిర్లక్ష్యం వద్దు ..డయేరియాతో జాగ్రత్త.!
నల్లకుంట: వర్షాకాలం వచ్చిందంటే సీజనల్ వ్యాధులు ఒక్కసారిగా చుట్టుముడుతాయి. ఈ కాలంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే దీని ప్రభావం చిన్నారులపై తీవ్రంగా ఉంటుంది. వర్షాకాలం వచ్చే వ్యాధుల్లో డయేరియా(అతిసార- diarrhea) ముఖ్యమైనది. దీనికి నీటి కాలుష్యం, ఆహార కాలుష్యం ముఖ్య కారణాలు కాగా, బహిరంగ ప్రదేశాల్లో మలవిసర్జన వ్యాధి వ్యాప్తికి దోహదపడుతుంది. పెద్దలైనా, పిల్లలైనా ఓ సారి డయేరియా బారిన పడితే శరీరంలో ఉన్న లవణాలన్నీ బయటకు వెళ్లిపోయి శరీరం శుష్కించి పోతుంది. చిన్నారుల్లో దీని తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుంది. నిర్లక్ష్యం చేస్తే కిడ్నీలు దెబ్బతిని అపస్మారక స్థితికి చేరుకునే పరిస్థితి వస్తుంది. బహిరంగ ప్రదేశాలలో మలవిసర్జన వద్దని అధికారులు పదేపదే చెబుతున్నా మురికి వాడల్లోని ప్రజానీకంలో తగిన చైతన్యం రాకపోవడంతో ఓ రోగి నుంచి మరొకరికి ఈగల ద్వారా రాటావైరస్ క్రిమి వ్యాపిస్తుంది. వాటి ద్వారా ఆహార పదార్థాలు కలుషితమై డయేరియాకు దారి తీస్తాయి. ప్రధానంగా ఐదేళ్ల లోపు చిన్నారులు డయేరియా పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఫీవర్కు పెరుగుతున్న డయేరియా కేసులు.. నల్లకుంట ఫీవర్ ఆస్పత్రిలో డయేరియా కేసులు పెరుగుతున్నాయి. ఈ ఏడాది జనవరి నుంచి జూన్ 15వ తేదీ వరకు 1,034 కేసులు నమోదయ్యాయి. ఇదీ చదవండి : Today tip : ఒళ్లంత తుళ్లింత.. ఈ టిప్స్ తప్పవు మరి!నీటి కాలుష్యం ద్వారానే అధికం.. వర్షాలు కురుస్తుండంతో చిన్నపిల్లలు, వృద్దులు వ్యాధుల బారిపడుతున్నారు. డయేరియా వ్యాధి ఎక్కువగా నీటి కలుíÙతం ద్వారానే వస్తుంది. ఈ వర్షాకాలంలో మంచినీటి వనరులు, రిజర్వాయర్లలో కలుషిత నీరు చేరి, కుళాయిల ద్వారా అవే రావడం వల్ల డయేరియా వచ్చే అవకాశాలు ఎక్కువ. మంచినీటి పైపులు లీక్ అయినప్పుడు అందులో మురికినీరు కలిసి ఆ నీటిని తాగడం వల్ల ఈ వ్యాధి వస్తుంది. 80 శాతం డయేరియాకు కలుషిత నీరే కారణమని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇక మిగిలిన 20 శాతం కలుషిత ఆహారం వల్ల వస్తుంది. నగరంలో చాలా వరకు ఈ వర్షాకాలంలోనే డయేరియాకు గురవుతున్నట్లు తెలుస్తోంది.ఇదీ చదవండి: ట్విన్స్కు జన్మనివ్వబోతున్నా.. నా బిడ్డలకు తండ్రి లేడు : నటి భావోద్వేగ పోస్ట్వ్యాధి లక్షణాలు... తరుచూ వాంతులు,విరేచనాలు కావడం. నాలుక పిడచ కట్టుకుపోవడం, కళ్లు లోపలికి పోవడం. చర్మం సాగే గుణం కోల్పోవడం. రక్తపోటు పడిపోయి అపస్మారక స్థితిలోకి పోవడం.నిర్లక్ష్యం వద్దు... వర్షాకాలంలో డయేరియా వ్యాధిపట్ల ఎలాంటి నిర్లక్ష్యం వద్దు. చిన్నారుల్లో ఈ వ్యాధి లక్షణాలను గుర్తిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి. లేదంటే తీవ్ర అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. ఆహార నియమాలు, చిన్నపాటి జాగ్రత్తలతో వ్యాధిని నియంత్రించుకోవచ్చు. ఏడు సంవత్సరాలు పై బడిన వారికి ఫీవర్లో చికిత్సలు అందిస్తున్నాం. ఏడు సంవత్సరాల లోపు చిన్నారులను నీలోఫర్కు పంపిస్తాం. – డాక్టర్ జయలక్ష్మి, ఫీవర్ ఆస్పత్రి సీఎస్ ఆర్ఎంవో -
అవును ఒజెంపిక్ తీసుకున్నా.. తప్పేంటి? నటుడు రామ్కపూర్ ఆగ్రహం
ప్రముఖ టీవీ నటుడు బడే అచ్చే లగ్తే హై ఫేమ్ రామ్ కపూర్ (Ram Kapoor) అనూహ్యంగా బరువు తగ్గి అభిమానులను ఆశ్చర్యపర్చాడు. ఏకంగా 55 కిలోల బరువు తగ్గి నెట్టింట తెగ హల్చల్ చేశాడు. దీంతో ఓజెంపిక్ , మౌంజారో ( Ozempic and Mounjaro)వంటి మందులు వాడి ఉంటాడనే చర్చ మొదలైంది. తాజాగా దీనిపై రామ్ సంచలన ప్రకటన చేశాడు. బరువు తగ్గడానికి ఓజెంపిక్ వాడితే తప్పేంటి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. బరువు తగ్గిన తీరును బట్టి, వారిని జడ్జ్ చేయొద్దని కోరాడు.అంతేకాదు ఎవరైనా డ్రగ్స్ వాడితే జనానికేంటి బాధ అని వ్యాఖ్యానించాడు. ‘‘అవును ఓజెంపిక్ ,మౌంజారో డ్రగ్స్ తీసుకున్నాను. అయితే తప్పేంటి? దయచేసి ఎ వరైనా సమాధానం చెప్పండి? దీనికెవరు సమాధానం చెప్పరే..ఎవరైనా ఒజెంపిక్ తీసుకుంటే అందులో తప్పేంటి? ఆ మనిషి చేసిన నేరం ఏంటి? దీనికి ఎవరూ సమాధానం చెప్పలేరు ఎందుకంటే, అసలు సమాధానమే లేదు.’’ అంటూ ఒక ఇంటర్య్వూలో చెప్పుకొచ్చాడు.బరువు తగ్గడానికి తాను చాలా కష్టపడ్డానని, తన వైద్యుడు మౌంజారో వాడమని ఎందుకుచెప్పాడో రామ్ కపూర్ వెల్లడించాడు. బరువు తగ్గడానికి శారీరక శిక్షణపై దృష్టి పెట్టినట్టు తెలిపాడు. అప్పట్లో ఆయన 140 కిలోల భారీ బరువతో అత్యంత అనారోగ్యకరమైన స్థితితోపాటు చక్కెర అదుపులో ఉండేది కాదు, దీంతో రోజుకు మూడు సార్లు ఇన్సులిన్ తీసుకునేవాడినని గుర్తు చేసుకున్నాడు. ఇదీ చదవండి: జిమ్కు వెళ్లకుండానే 30 కిలోలు తగ్గిందిమరోపక్క పని ఒత్తిడి, రెస్ట్ లేదు దీంతో ఇంత వర్క్ చేస్తూ, అనారోగ్యంగా ఉంటే డయాబెటిక్ స్ట్రోక్ రావచ్చు, తక్షణమే బరువు తగ్గించుకోవాలని డాక్టర్ సూచించారు అయితే ఇంకా రెండు ప్రాజెక్టులు పూర్తి చేయాల్సిన ఉన్ననేపథ్యంలో మరో ఆరు-ఎనిమిది నెలల తర్వాత చూద్దామని చెప్పాను.కానీ డాక్టర్ ససేమిరా అన్నారు. కచ్చితంగా ఇపుడే ఏదైనా మొదలు పెట్టాలని హెచ్చరించారు. మూడు నుండి నాలుగు నెలలు తీసుకోమని కూడా చెప్పారు. కానీ మొదట్లో తన డాక్టర్ మాట వినాలని అనుకున్నా, కానీ తర్వాత భుజం ప్రమాదం, శస్త్రచికిత్స కారణంగా, వెయిట్ లాస్ ఎక్స్ర్సైజులు, బాడీబిల్డింగ్ పై దృష్టి పెట్టానని తెలిపాడు. అయితే ఓజెంపిక్ తీసుకోవద్దని, కావాలంటే మోంజరో తీసుకోవచ్చని సూచించాడు.కాగా ఓజెంపిక్ అనేది వాస్తవానికి మధుమేహం చికిత్సకు ఉపయోగించే ఔషధం. కానీ ఇపుడు దీర్ఘకాలికంగా ఊబకాయంతో తీవ్రంగా బాధపడే వారికి కూడా ఉపయోగపడుతోంది. అనేక మంద్రి సెలబ్రిటీలతోపాటు దీనిని ఆశ్రయిస్తున్నారనే అంచనాలు భారీగానే ఉన్నాయి. సెమాగ్లుటైడ్ (ఒజెంపిక్ ప్రాథమిక భాగం) దీర్ఘకాలిక బరువు నిర్వహణకు ఉపయోగపడుతుందంటున్నారు వైద్య నిపుణులు.ఓజెంపిక్ (GLP-1 డ్రగ్స్) ఆకలిని తగ్గించి, క్రమంగా బరువు తగ్గడానికి దారితీస్తుంది.సెమాగ్లుటైడ్ ప్యాంక్రియాస్ ఇన్సులిన్ను ఉత్పత్తిలో కూడా సహాయపడుతుంది.ఇది టైప్ 2 డయాబెటిస్ను నిర్వహించడంలో సహాయపడుతుంది. మనం తినే ఆహారం నుండి గ్లూకోజ్ (లేదా రక్తంలో చక్కెర)ను మన కణాలలోకి రవాణా చేయడానికి బాడీకి ఇన్సులిన్ అవసరం.దీనిని శక్తిగా ఉపయోగించుకోవడానికి వీలు కల్పిస్తుంది.అయితే జాగ్రత్త వైద్యుల పర్యవేక్షణ అవసరమని, ఓజెంపిక్ వంటి డ్రగ్స్కారణంగా, వికారం, వాంతులు, విరేచనాలు , తదితర సమస్యలతో సహా దుష్ప్రభావాలను కలిగిస్తాయని హెచ్చరిస్తున్నారు. -
అరుదైన వ్యాధికి ఎక్మో చికిత్స: 11 నెలల చిన్నారిని కాపాడిన అంకుర వైద్యులు
హైదరాబాద్: అంకుర ఆసుపత్రి కూకట్పల్లిలో ECMO (ఎక్స్ట్రాకార్పోరియల్ మెంబ్రేన్ ఆక్సిజనేషన్) ఉపయోగించి అరుదైన వైరల్ మయోకార్డిటిస్తో బాధపడుతున్న శిశువు ప్రాణాలను కాపాడారు. ఈ టెక్నాలజీ ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులకు కృత్రిమ గుండె , ఊపిరితిత్తులా పనిచేస్తుంది 11 నెలల చిన్నారి గజర్ల మోక్షిత్ తీవ్రమైన ఫుల్మినెంట్ వైరల్ మయోకార్డిటిస్ (గుండె తీవ్రమైన వాపు) తో బాధపడుతున్నాడు. సకాలంలో జోక్యం చేసుకొని ఆసుపత్రి బృందం ఎక్మో చికిత్స అందించి, బాలుడిని ప్రాణాపాయం నుంచి కాపాడారు.జలుబు, దగ్గు ,యు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందితో జూన్ 2న స్థానిక ఆసుపత్రిలో మోక్షిత్ ఆసుపత్రిలో చేరాడు. అతని పరిస్థితి తీవ్రంగా ఉండటంతో రెండు ఆసుపత్రిలు అతనికి చికిత్స చేసేందుకు నిరాకరించారు.కానీకూకట్పల్లిలోని అంకుర ఆసుపత్రి నిపుణులు తక్షణమే స్పందించి సరియైన చికిత్స అందించారని ఆసుపత్రి వర్గాలు ప్రకటించాయి."పదకొండు నెలల వయసున్న ఆ శిశువు బర్త్ వైయిటట్ బరువు 3 కిలోగ్రాములు ఉన్నాడని, పుట్టుకతో వచ్చేఅసాధారణ జబ్బులేవీ లేనప్పటికీ,గత కొన్ని రోజులుగా, ఆ బిడ్డ తీవ్రమైన లక్షణాలతో కనిపించాయనీ కూకట్పల్లిలోని అంకురా హాస్పిటల్లోని సీనియర్ పీడియాట్రిక్ ఇంటెన్సివిస్ట్ డాక్టర్ తంజిలా తెలిపారు. అయితే సీనియర్ పీడియాట్రిక్ ఇంటెన్సివిస్ట్లైన డాక్టర్ సుజిత్ టి,,డాక్టర్ నవీద్ తో కూడిన క్రిటికల్ కేర్ బృందం సాయంతో సకాలంలో సరియైన చికిత్స అందించామన్నారు.ఎక్స్ట్రాకార్పోరియల్ మెంబ్రేన్ ఆక్సిజనేషన్ అనేది రోగి ప్రాణాపాయం క్రమంలో కృత్రిమ గుండె ,ఊపిరితిత్తులుగా పనిచేస్తుంది. ఈ అవయవాలు తీవ్రంగా దెబ్బతిన్నప్పుడు రోగి శరీరం విశ్రాంతి తీసుకోవడానికి , నయం కావడానికి వీలు కల్పిస్తుందని ఈ ప్రక్రియను విజయవంతంగా నిర్వహించిన కార్డియోథొరాసిక్ సర్జన్ డాక్టర్ థామస్ మాథ్యూ వివరించారు. శిశువు ఐదు రోజులు ECMO సపోర్ట్పైనే ఉన్నట్టు వెల్లడించారు. దీనికి తోడు COVID-19 పాజిటివ్, కాళ్ళ సిరల్లో రక్తం గడ్డకట్టడంలాంటి పరిస్థితిని కూడా అంకురా ఆసుపత్రిలోని వైద్య బృందం చాకచక్యంగా వ్యవహరించిన వైద్య బృందం IVIG, స్టెరాయిడ్స్, యాంటీబయాటిక్స్, యాంటీఅర్రిథమిక్ మందులు , యాంటీకోగ్యులెంట్లు, పలు సార్లు రక్తమార్పిడి లాంటి చికిత్సఅను అందించింది. ఫలితంగా మోక్షిత్ గుండె పనితీరు క్రమంగా మెరుగుపడింది . ECMO ,మెకానికల్ వెంటిలేషన్ నుండి విజయవంగా బయటపడ్డాడు. జూన్ 19న అతను డిశ్చార్జ్ అయ్యాడని అంకురం యాజమాన్యం వెల్లడించింది. -
వాకింగూ కాదు, రన్నింగూ కాదు అరవైలో ఇరవైలా ఫిట్గా : ఇవిగో టిప్స్
సాక్షి, హైదరాబాద్: వయసు పెరిగే కొద్దీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే అధిక శాతం మంది నడక లేదా స్వల్ప శరీర వ్యాయామమే సరిపోతుందనుకుంటారు. అయితే.. తాజాగా హార్వర్డ్ మెడికల్ స్కూల్ అధ్య యనం ప్రకారం చూస్తే.. వయసు పైబడినవారు ఆరో గ్యంగా, ఉల్లాసంగా ఉండాలంటే కేవలం నడక సరిపో దని.. మొత్తంగా వారి ఆలోచనల్లో మార్పు రావడానికి శారీరకంగా చైతన్యంగా ఉండేందుకు కదలికలు అవసరమని వెల్లడైంది. ఈ ప్రయోగంలో శరీరానికి మాత్రమే కాక, మనసుకు కూడా ఉత్తేజం కలిగించే వ్యాయామాల ప్రాధాన్యాన్ని వివరించారు. తై చీ, ఐకిడో, వింగ్ చున్.. వంటి మార్షల్ ఆర్ట్స్ పద్ధతులు వృద్ధుల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని ఈ అధ్యయ నంలో పేర్కొన్నారు.ఏమిటీ అధ్యయనం..?హార్వర్డ్ మెడికల్ స్కూల్కు చెందిన డాక్టర్ పీటర్ ఎం.వె యిన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పరిశీలనలో తై చీ వంటి నెమ్మదిగా, స్వల్ప కదలి కలతో సాగే మార్షల్ ఆర్ట్స్ మనుషుల శరీరంలో ‘ఫిజి యొలాజికల్ కాంప్లెక్సిటీ’ ను పెంచుతాయని వెల్లడైంది. అంటే.. వృద్ధాప్యంలో ఎదురయ్యే అడ్డంకులకు మెరుగ్గా స్పందించే సామర్థ్యం శరీరానికి పెరుగుతుందని తేలింది.ఇవి కేవలం శారీరక ఆరోగ్య ప్రయోజనాలు మాత్రమే కాక, జీవన నాణ్యత మెరుగుదలకు తోడ్పడుతున్నట్టు స్పష్ట మైంది. ఇప్పటిదాకా మన దగ్గర పెద్దల ఆరోగ్యంపై దృష్టి చికిత్సాపరంగా ఉండేది. కానీ తాజా అధ్యయనం సూచిస్తున్న మార్గం ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు, పునరావాస కేంద్రాలు, సామాజిక కార్యక్రమాల రూపంలో మార్షల్ ఆర్ట్స్ వంటి చురుకైన లేదా మృదువైన కదలికలతో కూడిన వ్యాయామాలను ప్రవే శపెట్టాల్సిన అవసరం ఉందని స్పష్టం చేస్తోంది.నడకతో పోలిస్తే ?నడక.. కేవలం కాలి కదలికలతో పరిమితమైన వ్యాయామం. తైచీ.. శరీరం, శ్వాస, మేధస్సు.. మూడింటినీ ఒకే సమయంలో సమతుల్యంగా ఉత్తేజపరిచే ప్రక్రియ. వృద్ధులకు.. మరీ ముఖ్యంగా 60 ఏళ్లు దాటిన వారికి సులభ, స్వల్ప తరహా మార్షల్ ఆర్ట్స్ ఎంతో ఉపయోగపడతాయి.ఇది వృద్ధుల్లో.. తూలిపడిపోవడం వంటి వాటిని తగ్గిస్తుందినిద్ర నాణ్యత మెరుగవుతుందిమానసిక స్థైర్యం పెరుగుతుందితెలుగు రాష్ట్రాల్లో వృద్ధుల పరిస్థితి మార్పు ఆవశ్యకత..తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వృద్ధుల జనాభా అనేది 13 శాతానికి పైగా ఉందని 2011 జనగణన ద్వారా వెల్లడైంది. 2036 నాటికి ఇది 20 శాతం దాటే అవకాశం ఉంది. ఈ వయోధిక వర్గానికి సరిపడే ఆరోగ్య విధానాలు, శారీరక దృఢత్వం కలిగించే వ్యాయామాలను అందుబాటులోకి తేవడం అత్యవసరం.వృద్ధులకు ఎలాంటి మార్షల్ ఆర్ట్స్ తగినవి.. ఉపయోగాలు..తై చీ: నెమ్మదిగా జరిగే ప్రవాహ రూప కదలికలు, శ్వాస నియంత్రణ, శరీర సమతుల్యత, మానసిక ప్రశాంతతఐకిడో: శక్తిని మళ్లించే శక్తివంతమైన కాన్సెప్ట్, కణజాలానికి మెరుగైన కదలికలువింగ్ చున్: ఓ మోస్తరు క్లిష్టమైన కదలికలు, మెరుగైన ప్రతిస్పందన సామర్థ్యం, స్వీయ రక్షణఇదీ చదవండి: జిమ్కు వెళ్లకుండానే 30 కిలోలు తగ్గిందివృద్ధాప్యం ఓ ప్రతిబంధకం కాదు. అది మనం కొత్త విషయాలు నేర్చుకోవాలనే సంకల్పానికి తెరలేపే అవకాశంగా భావించాల్సి ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. ఈ అంశంపై వృద్ధుల్లోనే కాకుండా అందరి ఆలోచనా ధోరణిలోనూ మార్పు వచ్చి అవగాహన పెరిగితే సమాజానికి మంచి ప్రయోజనా లు చేకూరుతాయని స్పష్టం చేస్తున్నా రు. వృద్ధుల్లో ఆరోగ్యకరమైన వాతావరణం ఏర్పడడంతో పాటు.. 60 ఏళ్ల తర్వాత జీవితానికి సంబంధించి కచ్చితమైన అవగాహన, చైతన్యం ఏర్పడతాయని వారు పేర్కొంటున్నారు.చదవండి: 300కు పైగా రైతులకు సాధికారత : తొలి ఏడాదిలోనే రూ. 8.7 కోట్లు -
జిమ్కు వెళ్లకుండానే 30 కిలోలు తగ్గింది
అధిక బరువుకు కారణాలనేకం. జీవన శైలి, ఆహార అలవాట్లు, కొన్ని రకాల అనారోగ్య సమస్యలతో చాలా మంది అధిక బరువుతో బాధపడుతూ ఉంటారు. అయితే ‘‘చిన్నప్పటినుంచీ నేనింతే’’ అని కొంతమంది సరిపెట్టుకుంటే, మరికొంతమంది మాత్రం భిన్నంగా ఉంటారు. అధిక బరువుతో వచ్చే అనారోగ్య సమస్యల కారణంగా అయితేనే నేమి, అందంగా ఆరోగ్యంగా ఉండాలనే కోరికతోనేమి కష్టపడి శరీర బరువును తగ్గించు కుంటారు. అలా జిమ్ కెళ్లకుండానే 95 కిలోల వెయిట్ నుంచి 65 కిలోలకు చేరుకుందో యవతి. అదెలాగో తెలుసుకుందాం.ఇది ఉదితా అగర్వాల్ వెయిట్ లాస్ జర్నీ. బరువు తగ్గడం అనేది కష్టమైన ప్రయాణం. ముఖ్యంగా ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటూ బరువు తగ్గాల్సి వస్తే ఇంకా కష్టం. అందుకే కారణాలను విశ్లేషించుకుని నిపుణుల సలహాతో ముందుకు సాగాలి. అలా సర్టిఫైడ్ న్యూట్రిషనిస్ట్ అయిన ఉదితా అగర్వాల్ కేవలం ఫిట్నెస్ కోసం మాత్రమే కాకుండా తన ఆరోగ్యాన్ని మెరుగుపరచు కోవడానికి కూడా బరువు తగ్గాలని నిర్ణయించుకుంది. అద్బుతమైన విజయాన్ని సాధించింది.ఇదీ చదవండి: 300కు పైగా రైతులకు సాధికారత : తొలి ఏడాదిలోనే రూ. 8.7 కోట్లుఉదితా చిన్నప్పటి నుంచి ఊబకాయంతో బాధపడేది. దీనికి తోడు పిగ్మెంటేషన్, తీవ్రమైన ఆరోగ్య సమస్యలు, విపరీతంగా జుట్టు రాలిపోవడం, మొటిమలు, ముఖం మీద అన్వాంటెడ్ హెయిర్ ఇలా సవాలక్ష సమస్యలతో సతమతమయ్యేది. ఆరోగ్యకరమైన ఆహారం, జీవనశైలికి మారడం ద్వారా 8 నెలల్లో 30 కిలోల బరువు తగ్గింది. అదీ జిమ్కు వెళ్లకుండానే 95 కిలోల బరువున్న ఉదితా 65 కిలోలకు చేరుకుంది. ఆరోగ్యం కూడా మెరుగుపడింది. View this post on Instagram A post shared by Udita Agarwal (@udita_agarwal20) తన వెయిట్ లాస్ జర్నీ గురించి సోషల్ మీడియాలో పంచుకోవడంతో వైరల్గా మారింది. శుభ్రమైన ఆహారాలు తినడం ద్వారా ఆమె సహజంగానే 30 కిలోల బరువు తగ్గింది. ముఖ్యంగా "బరువు తగ్గడంలో జంక్ ఫుడ్ను మానేయడమే అది పెద్ద చాలెంజ్’’ అని ఆమె చెప్పుకొచ్చింది.చదవండి: చిన్నతనం నుంచే ఇంత పిచ్చా, పట్టించుకోకపోతే ముప్పే : ఆర్టీసీ ఎండీ సజ్జనార్ఉదిత వెయిట్ లాస్లో సాయపడిన అలవాట్లుడీటాక్స్ వాటర్: ప్రతిరోజూ డీటాక్స్ వాటర్ తీసుకునేది. ముఖ్యంగా జీరా, అజ్వైన్, సోంపు, మెంతిని నీటిలో మరిగించి తాగేది. ఇది ఉబ్బరాన్ని నివారించి జీర్ణక్రియకు సహాయపడుతుంది.ఆహారంపై దృష్టి: అప్పుడప్పుడు చీట్ మీల్ తీసుకున్నా.. ఆరోగ్యకరమైన ఆహార నియమాన్ని కచ్చితంగా పాటించేది.ఒక్కోసారి వెయిట్ పెరిగినా నిరాశపడలేదు: ప్రతీ రోజు వెయిట్ చెక్ చేసుకుంటూ ఉండేది. ఒకసారి బరువు పెరిగినా నిరుత్సాహ పడేది కాదు,అసలు ఆ హెచ్చుతగ్గులను పట్టించుకోలేదు.ఇంటి ఫుడ్: ఇంట్లో ఉన్నా, బయటికెళ్లినా, ఇంట్లో వండిన ఆహారాన్ని మాత్రమే తినేది. చియా సీడ్ వాటర్: చియా విత్తనాలను అర లీటరు నీటి నాన బెట్టి రోజుకు 3-4 లీటర్ల చొప్పున రోజంతా తాగేది. రోజుకు ఒకసారి టీ, మైదా ఫుడ్కు దూరంగా ఉంటూ అతిగా తినకుండా ఉండటానికి ఉదిత ప్రతి భోజనానికి ముందు నీరు త్రాగేది. -
మెడనొప్పి 'పీకల' మీదకు...
మెడనొప్పి అనే సమస్య జీవితకాలంలో ప్రతి వ్యక్తీ ఏదో ఓ సందర్భంలో ఎదుర్కొనేదే. అయితే అదేపనిగా నొప్పి వస్తుంటేనో లేదా మెడ నుంచి అది భుజానికీ లేదా చేతుల చివరలకో పాకుతుంటే మాత్రం కొన్ని అంశాలను జాగ్రత్తగా గమనించాలి. మెడనొప్పికి కారణాలు, నివారణ, చికిత్స వంటి అంశాలను తెలుసుకుందాం. తీవ్రమైన మెడనొప్పి కారణంగా కొన్నిసార్లు కొంతమందిలో నొప్పి ఎక్కువైన కొద్దీ నరాల మీద ఒత్తిడి పెరిగి మూత్రవిసర్జనలో సైతం తేడాలు వచ్చి ఇతర సమస్యలకూ దారితీయవచ్చు. అందుకే ఎప్పుడో ఓసారి వచ్చే నొప్పిని మినహాయించి, పదే పదే నొప్పి వస్తున్నా లేదా దీర్ఘకాలంగా బాధిస్తున్నా డాక్టర్ను సంప్రదించాల్సి ఉంటుంది.ఎందుకీ మెడనొప్పి... మెడ భాగంలో ఉండే వెన్నెముకలో ఏడు వెన్నుపూసలు ఉంటాయి. వాటిలో మొదటిదాన్ని అట్లాస్ అనీ, రెండో వెన్నుపూసను యాక్సిస్ అంటారు. ఈ తర్వాత ఉండే పూసలను వరసగా సి3, సి4, సి5, సి6, సి7 అని పిలుస్తారు. ఈ వెన్నుపూసల మధ్య ఉండే ప్రదేశాన్ని స్పైనల్ కెనాల్ అంటారు. దానిలోంచి వెన్నుపాము వెళ్తూ మెదడు నుంచి చేతులు, కాళ్ల చివరి వరకు నరాలను తీసుకెళ్తుంది. వెన్నుపూసకూ, వెన్నుపూసకూ మధ్యనున్న ‘వర్టిబ్రల్ ఫొరామినా’ అనే రంధ్రాల నుంచి వెన్నుపాము తాలూకు నరాలు బయటకు వచ్చి అన్ని అవయవాలకూ వ్యాపించి ఉంటాయి. ఈ వెన్నుపూసల మధ్యన కుషన్లా, షాక్ అబ్జార్బర్లా డిస్క్లు ఉంటాయి. ఒక్కోసారి వెన్నుపూసల మధ్య కుషన్లా ఉండే డిస్క్లు పక్కకు జారడం వల్లనో లేదా బాగా అరగడంతో నరాలపై (ప్రధానంగా చేతులకి సప్లై అయ్యే నరాలపై) ఒత్తిడి పడి మెడనొప్పి వస్తుంటుంది. మెడదగ్గర ఉండే నరాలు భుజం వరకు ఉండటంతో ఈ నొప్పి మెడ నుంచి భుజం మీదుగా చేతుల వరకు పాకుతూ బాధిస్తుంటుంది.నిర్ధారణ ఇలా... మెడనొప్పి వచ్చే వారికి తొలుత ఎక్స్–రే పరీక్ష చేయిస్తారు. ఇందులో మెడ వెన్నుపూసలలో ఏమైనా తేడాలు వచ్చాయా అని తెలుస్తుంది. మరింత సునిశితమైన అంశాల కోసం ఎమ్మారై కూడా చేయించాల్సి రావచ్చు. ఏ నరంపై ఎంత ఒత్తిడి ఉంది, దేనివల్ల కలుగుతోంది, ఎముక ఏదైనా ఫ్రాక్చరైందా, నరాల్లో వాపు, గడ్డలు ఉన్నాయా... లాంటి అనేక విషయాలు ఎమ్మారైలో తెలుస్తాయి. ఉపశమనం కోసం... మెడ నొప్పి వచ్చినప్పుడు వేడి నీళ్లలో మెత్తటి గుడ్డను ముంచి, పిండి మెడపైన కాపడం పెట్టాలి. ఐస్ ముక్కను బట్టలో చుట్టి కాపడం పెట్టడం కూడా మంచిదే. ఈ కాపడాల వల్ల నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. మెడ కండరాల్లో నొప్పి ఉన్నప్పుడు తప్పనిసరిగా మెడకు విశ్రాంతి ఇవ్వాలి. ఎందుకంటే ఆ సమయంలో మెడ కండరాలు బిగుసుకుపోయి ఉంటాయి. అలా విశ్రాంతి ఇవ్వకపోతే నొప్పి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంది. నొప్పి ఉన్న సమయంలోనే గాక... మామూలు వేళల్లోనూ ఒకే భుజానికి బరువైన బ్యాగ్ల వంటివి తగిలించుకోకూడదు. ఇలా చేయడం వల్ల మెడ కండరాలు, నరాలపై ఒత్తిడి పెరిగి నొప్పి వస్తుంది. నడిచే సమయంలో ఒకేవైపునకు ఒంగడం సరికాదు. చికిత్స...సాధారణ మెడనొప్పి అయితే పెయిన్కిల్లర్ ఆయింట్మెంట్లను రోజుకి ఐదు నుంచి ఆరుసార్లు పూయాలి.నొప్పి నివారణ కోసం దీర్ఘకాలం పెయిన్కిల్లర్స్ ఉపయోగించడం సరికాదు. ఒకవేళ పెయిన్కిల్లర్స్తో ఒకటి రెండు రోజుల్లో రిలీఫ్ రాకపోతే తప్పనిసరిగా డాక్టర్ను / ఆర్థోపెడిక్ సర్జన్ను సంప్రదించి చికిత్స తీసుకోవాలి.డిస్క్ తన స్థానం నుంచి పక్కకు జరగడం లాంటిది జరిగితే శస్త్రచికిత్సతో సరిదిద్దాల్సిన అవసరం పడవచ్చు. డాక్టర్ రవితేజా రెడ్డి, కారుమూరి, సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్ (చదవండి: హీరో సల్మాన్ఖాన్ సైతం విలవిలలాడిన సమస్య..! ఏంటి ట్రెజెమినల్ న్యూరాల్జియా..) -
డైట్లో తగ్గిన తృణధాన్యాలు
న్యూఢిల్లీ: ప్రజల ఆహార అలవాట్లలో గణనీయంగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. 2023–24లో గ్రామీణ, పట్టణ ప్రాంతాల వారు రోజువారీ తీసుకునే ఆహారంలో తృణధాన్యాలు, పప్పు ధాన్యాల వాటా తగ్గిపోయింది. అదే సమయంలో పాలు, పాల ఉత్పత్తుల వినియోగం పెరిగింది. కుటుంబాల వినియోగ వ్యయాలపై నిర్వహించిన సర్వే నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. 2022 ఆగస్టు – 2023 జూలై, 2023 ఆగస్టు – 2024 జూలై మధ్య కాలంలో ఈ సర్వే నిర్వహించారు. దీని ప్రకారం, పట్టణ ప్రాంతాల్లో గుడ్లు, చేపలు, మాంసం వినియోగంలో పెద్దగా మార్పు లేనప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం పెరిగింది. 2022–23లో పట్టణ ప్రాంతాల్లో ఆహారంలో తృణ ధాన్యాల వాటా 38.8 శాతంగా ఉండగా 2023–24లో 38.7 శాతానికి స్వల్పంగా తగ్గింది. గ్రామీణ భారతంలో ఇది 46.9 శాతం నుంచి 45.9 శాతానికి క్షీణించింది. అలాగే పప్పు ధాన్యాల విషయానికొస్తే పట్టణ ప్రాంతాల్లో వినియోగం 9.6 శాతం నుంచి 9.1 శాతానికి, గ్రామీణ ప్రాంతాల్లో 8.8 శాతం నుంచి 8.7 శాతానికి నెమ్మదించింది. → మరోవైపు, పట్టణ ప్రాంతాల ప్రజల ఆహారంలో పాలు, పాల ఉత్పత్తుల వినియోగం 12.8 శాతం నుంచి 12.9 శాతానికి, గ్రామీణ ప్రాంతాల్లో 10.6 శాతం నుంచి 11 శాతానికి పెరిగింది. → డైట్లో గుడ్లు, చేపలు, మాంసం వాటా గ్రామీణ ప్రాంతాల్లో 12.3 శాతం నుంచి 12.4 శాతానికి పెరగ్గా, పట్టణ ప్రాంతాల్లో ఎలాంటి మార్పు లేకుండా 14.1 శాతం స్థాయిలోనే ఉంది. → గ్రామీణ ప్రాంతాల్లో ‘ఇతర ఆహార’ పదార్థాల వాటా 21.4 శాతం నుంచి 22 శాతానికి, పట్టణ ప్రాంతాల్లో 24.8 శాతం నుంచి 25.3 శాతానికి పెరిగింది. → గ్రామాల్లో రోజుకు తలసరి కేలరీల సగటు వినియోగం, సర్వే నిర్వహించిన రెండేళ్లలో వరుసగా 2233 కిలోకేలరీలుగా, 2212 కిలోకేలరీలుగా ఉంది. పట్టణ ప్రాంతాల్లో ఇది 2250 కిలోకేలరీలు, 2240 కిలోకేలరీలుగా నమోదైంది. → నెలవారీగా తలసరి వినియోగ వ్యయం (ఎంపీసీఈ) పెరిగే కొద్దీ ప్రాంతాలకతీతంగా సగటు కేలరీల వినియోగం కూడా పెరిగింది. -
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వర్క్ లైఫ్ బ్యాలెన్స్ పాఠాలు..!
మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉదయం నుంచి పలు ముఖ్యమంత్రులను, అధికారులను కలుస్తూ అత్యంత బిజీగా ఉంటారామె. హోదా రీత్యా అత్యంత బిజీ బిజీ పనులతో సాగుతుంటుంది ఆమె జీవితం. అంతటి ఉరుకుల పరుగుల జీవితంలో కూడా ఆమె చాలా చక్కటి జీవనశైలిని అవలంభిస్తారామె. క్రమశిక్షణాయుత జీవనశైలికి కేరాఫ్ అడ్రస్ ఆమె. మరి అంతలా ఫిట్నెస్కి ప్రాధాన్యత ఇచ్చే ద్రౌపది ముర్ము తన రోజుని ఏవిధంగా ప్రారంభిస్తారో తెలుసుకుందామా.. ఢిల్లీలోని ప్రాంతాలన్ని ఉయాన్ని రణగణ ధ్వనులతో బిజిబిజీగా ప్రారంభమవ్వగా ద్రౌపది ముర్ము రోజు ఉదయం ఆరుతో ప్రారంభమవుతుంది. ఆమె ఉదయం మేల్కొన్న వెంటనే రాష్ట్రపతి భవన్ కాంప్లెక్స్లో ఉండే అమృత ఉద్యాన్ అనే పచ్చటి తోటలో వాకింగ్కు వెళ్తారు. అక్కడ మంచుగడ్డిపై నడుస్తూ..చుట్టు ఉన్న పచ్చదనాన్ని ఆస్వాదిస్తూ కాసేపు అలా కలియదిరుగుతారు. ఆ తర్వాత ఓ రెండు గంటపాలు ధ్యాన సెషన్ ఉంటుంది. తనలోకి తాను అవలోకనం చేసుకునే ఈ ధ్యాన ప్రక్రియలో ఆ రోజు తాను నిర్వర్తించాల్సిన బాధ్యతలకు తనను తాను సిద్ధం చేసుకుంటారామె. నిపుణుల సైతం ధ్యాన ప్రక్రియ వల్ల బాధ్యతలను చురుకైన మేధాస్సుతో వేగవంతంగా చక్కబెట్టగలరని చెప్పడమే గాక పరిశోధనల్లో కూడా వెల్లడైంది. అందుకే ప్రధాని మోదీ సైతం ప్రజలకు విజ్ఞిప్తి చేసేది ఇదే. ధ్యాన నిమగ్నులమై మన పూర్వీకుల మాదిరి దీర్ఘాయువుని పొందుదాం అని సదా పిలుపునిస్తుంటారు. ఆ నేపథ్యంలోనే ధనవంతులు, సెలబ్రిటీలు ప్రముఖులు నుంచి అత్యున్నత హోదాల్లో పనిచేసే వారు వరకు అంతా ధ్యాన ప్రక్రియకే అగ్రతాంబులం ఇస్తున్నారు. ఇక ఆ తర్వాత ముర్ము ఆ 165 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ తోట మొత్తం కవర్ చేసేలా రెండు కిలోమీటర్లు వాకింగ్ చేస్తూ..అక్కడే ఉంటే నెమళ్లను పలకరించి సేద తీరతారు. ఆ తదుపరి భాద్యతల్లో నిమగ్నమయ్యేందుకు సన్నద్ధమవుతారు. ఆ తర్వాత ఆమె రాష్ట్రపతి భవన్లోని కారిడార్ల గుండా అధ్యక్ష భవనంలోకి ప్రవేశిస్తారు. అక్కడ పలు కీలకమైన జాతీయ పత్రాలపై సంతకం చేసి, ప్రముఖులను, రాష్ట్ర అతిథులను కలవడం వంటివి చేస్తారు. అక్కడే అతిథులతో కీలకమైన చర్చలు జరపడం, సమావేశమవ్వడం వంటి పనులు జరుగుతాయి. అయితే ఈ అధ్యక్ష భవనంలోకి ఐదుగురు వ్యక్తులకు మాత్రమే అనుమతి ఉంటుందట. ఎవరెవరంటే..ప్రధానమంత్రి, ఉపరాష్ట్రపతి, భారత ప్రధాన న్యాయమూర్తి, మాజీ అధ్యక్షులు, లోక్సభ స్పీకర్ తదితరులు. ఒక పక్క తన వ్యక్తిగత జీవితాన్ని, బాధ్యతలను క్రమశిక్షణాయుతంగా నిర్వర్తిస్తూ ప్రశాంత చిత్తంతో ఉంటారామె. అందుకు ఉపకరించేవి కాసింత వ్యక్తిగత విశ్రాంతి సమయమే ఆమెను శక్తిమంతంగా రీచార్జ్ చేసి కార్యోన్ముఖురాలిగా మారుస్తుంది. ఇది వర్క్ లైఫ్ బ్యాలెన్స్కి అసలైన అర్థం. పైగా సమతుల్యత తినే ఆహారంలోనే కాదు..మన జీవన విధానంలో కూడా అవసరమే అన్న సత్యాన్ని ఎలుగెత్తి చెబుతోంది కదూ..!. అంతేగాదు అత్యంత బిజీ అనే పదం ఉపయోగించే వారందరికీ ఇలాంటి మహోన్నత వ్యక్తుల దినచర్యే ఒక ప్రేరణ.(చదవండి: ఫ్యామిలీతో వెళ్లాలంటే బిజినెస్ క్లాస్ వద్దు..! వైరల్గా సీఈవో పోస్ట్..) -
వ్యాయామం తంటా లేకుండా ఆరోగ్యం!
ఆరోగ్యం.. కడుపులోని చల్ల కదలకుండా!ఊబకాయం తగ్గించుకునేందుకు..ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకూ..రకరకాల వ్యాయామాలు చేస్తున్న వారందరికీ ఓ గుడ్న్యూస్!ఈ తంటాలేవీ పడక్కరలేదు అంటున్నారు శాస్త్రవేత్తలు!ఎంచక్కా అప్పుడప్పుడూ ఓ మాత్ర వేసేసుకుంటే చాలని..వ్యాయామం చేస్తే వచ్చే లాభాలన్నీ వచ్చేస్తాయని చెబుతున్నారు!ఆ వివరాలేమిటో చూద్దామా?ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం.. అందుకు తగ్గట్టుగా తగిన వ్యాయామంతో శరీరాన్ని ఫిట్గా ఉంచుకోవడం.. ఈ ఆధునిక కాలంలో చాలామంది పాటించే సూత్రం. అయితే, కొంత మందికి వ్యాయామం ఎంత చేసినా.. ఎంతలా కడుపు కట్టుకున్నా ఒళ్లు తగ్గదు. ఆరోగ్య సమస్యలూ వీరిని పీడిస్తూంటాయి. ఇలాంటి వారికీ ఉపయోగపడే ఓ ప్రయోగాన్ని చేశారు చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ శాస్త్రవేత్తలు. బీట్రూట్, పాలకూర, గింజ ధాన్యాల్లో సహజంగా లభించే ఓ పదార్థం.. వ్యాయామం చేస్తే వచ్చే ఫలితాలను ఇస్తున్నట్లు గుర్తించారు. అంతేకాదు.. ఈ పదార్థం ద్వారా వయసుతోపాటు వచ్చే చాలా ఆరోగ్య సమస్యలను దూరంగా ఉంచవచ్చు అని తేలింది.శారీరక వ్యాయామం చేయకున్నా ఆ ఫలితాలన్నీ ఇచ్చే అద్భుతం కోసం శాస్త్రవేత్తలు ఒకవైపు పరిశోధనలు చేస్తూనే ఉండగా.. చైనా శాస్త్రవేత్తలు ఈ దిశగా ఒక అడుగు ముందుకు వేయగలిగారు. క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తున్న వారిని పరిశీలించగా.. మిగిలిన వారితో పోలిస్తే వీరిలో బెటనైన్ అనే పదార్థం ఎక్కువ మోతాదులో ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇది మూత్రపిండాల ద్వారా శరీరానికి అందుతుంటుంది. బెటనైన్ ఎలా ఉత్పత్తి అవుతుంది? ఎలా ఉపయోగపడుతుంది అని వివరంగా తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలు పరిశోధనలు ప్రారంభించారు.ఇందు కోసం కొంతమంది యువకులను ఎంచుకుని ఆరేళ్లపాటు పరిశీలించారు. వీరు రెండు రకాల వ్యాయామాలు చేసేవారు. కొందరు శారీరక దారుఢ్యానికి పరీక్ష పెట్టే ఎండ్యూరెన్స్ వ్యాయామాలు చేస్తుండగా.. మిగిలిన వారు ఎక్కువ శ్రమ ఉన్నవి చేస్తున్నారు. రెండింటివల్ల శరీరంలో ఎలాంటి మార్పులు వస్తున్నాయో గుర్తించాలన్నది దీని ఉద్దేశం. ఆశ్చర్యకరంగా శరీర కణాల వయసు పెరగకుండా చేయడంలో మూత్రపిండాలు కీలకపాత్ర పోషిస్తున్నట్లు తెలిసింది!. ఎండ్యూరెన్స్ వ్యాయామాలు చేసే వారిలో కణాల వార్ధక్యం, మంట/వాపు మిగిలిన వారికంటే తక్కువగా ఉన్నట్లు తెలిసింది. శారీరక శ్రమ ఎక్కువగా ఉన్న వ్యాయామాలు చేస్తున్న వారిలో కణాలు ఒత్తిడికి గురవుతున్నట్లు స్పష్టమైంది.ఎండ్యూరెన్స్ వ్యాయామం చేస్తున్న వారిపై మరిన్ని పరిశోధనలు చేయడం ద్వారా రోగ నిరోధక శక్తిని ప్రభావితం చేసే ఒక ప్రొటీన్ (ఈటీఎస్1) ఉత్పత్తి తగ్గినట్లు స్పష్టమైంది. అదే సమయంలో కిడ్నీల్లో బెటనైన్ తయారవడం ఎక్కువైంది. వయసు ఎక్కువగా ఉన్న వారు వ్యాయామం చేసిన తరువాత రక్తంలో బెటనైన్ ఎక్కువగా ఉన్నట్లు, ఈ పదార్థం కండరాల శక్తి, జీవక్రియలు, కణంలో చక్కెరలను శక్తిగా మార్చే మైటోకాండ్రియాల ఆరోగ్యం మెరుగైనట్లు తెలిసింది. దీంతో వ్యాయామంతో వచ్చే ప్రయోజనాల వెనుక బెటనైన్ ఉందని స్పష్టమైంది.ఎలుకలకు ఇచ్చి చూశారు..తమ అంచనాలను నిర్ధారించుకునేందుకు శాస్త్రవేత్తలు వయసు మళ్లిన ఎలుకలకు నిర్దిష్ట మోతాదుల్లో బెటనైన్ అందించారు. ఆ తరువాత పరిశీలించినప్పుడు వ్యాయామం చేస్తే వచ్చే లాభాలన్నీ వాటిల్లోనూ కనిపించాయి. అంటే కండరాలు గట్టిపడ్డాయి, ఎక్కువ కాలం శ్రమను ఓర్చుకోగలిగాయి. మంట/వాపు వంటివి తగ్గాయి అన్నమాట!. కణజాలం పునరుత్పత్తి కూడా వేగంగా జరుగుతున్నట్లు తెలిసింది. ‘వ్యాయామం చేయడం వల్ల ముందుగా శరీరంలో మంట/వాపు వస్తాయి. ఒత్తిడి కూడా పెరుగుతుంది. అలాగే కొనసాగిస్తే.. ఇవి తగ్గిపోతాయి. కిడ్నీ ద్వారా ఉత్పత్తి అయ్యే బెటనైన్ తగ్గిస్తుంది’ అని ఈ ప్రయోగాల్లో పాలుపంచుకున్న శాస్త్రవేత్త లియు గువాంగ్హూయి తెలిపారు. మొత్తమ్మీద విషయం ఏమిటంటే.. వ్యాయామం అప్పుడప్పుడు చేయడం కాకుండా.. క్రమం తప్పకుండా చేయాలి అని!!. అలాగే బెటనైన్ సమృద్ధిగా లభించే ఆహార పదార్థాలు తినడమూ శరీరానికి మేలు చేస్తుందన్నమాట!. లేదా.. మరిన్ని పరిశోధనల తరువాత బెటనైన్ సప్లిమెంట్లు మార్కెట్లోకి వచ్చినప్పుడు వాటిని రోజూ తీసుకోవచ్చు!!.- గిళియారు గోపాలకృష్ణ మయ్యా. -
రెండే రెండు టిప్స్: 120 కిలోల నుంచి స్మార్ట్ అండ్ స్లిమ్గా
తమిళ నటుడు విజయ్ సేతుపతి కుమారుడు సూర్య సేతుపతి హీరోగా ఎంట్రీ వచ్చి అరంగేట్రంలోనే మంచి మార్కులు కొట్టేశాడు. స్పోర్ట్స్ ఆధారిత యాక్షన్ డ్రామా ఫీనిక్స్లో సూర్య ప్రధాన పాత్రలో నటించి ఆకట్టుకున్నాడు. ఈ సందర్బంగా తన వెయిల్లాస్కు సంబంధించి ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు సూర్య. ‘ఫీనిక్స్’ సినిమా మొదలుకాకముందు నా బరువు దాదాపు 120 కిలోలు ఉండేవాడినని. ఈ బరువును తగ్గించుకోవడానికి నాకు ఒకటిన్నర సంవత్సరం పట్టిందట. మరి సూర్య వెయిట్లాస్ జర్నీ గురించి తెలుసుకుందాం.120 కిలోల బరువుతో బాధపడుతున్న సూర్య ఉన్నట్టుండి అంత బరువు ఎలా తగ్గాడు అనేది నెట్టింట ఆసక్తికరంగా మారింది. ‘ఫీనిక్స్’ సినిమా మొదలుకాకముందు తన బరువు దాదాపు 120 కిలోలు ఉండేదని గుర్తు చేసుకున్న సూర్య దాదాపు సగం బరువు తగ్గించుకోవడం విశేషం. ఇటీవల ఈ సినిమా ప్రమోషన్స్లో సూర్య ఫిట్నెస్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. చాలా కష్టపడి బరువు తగ్గానని తెలిపాడు. ఇందుకోసం తనకు ఒకటిన్నర సంవత్సరం పట్టిందన్నాడు. బరువు తగ్గే క్రమంలోనే మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ (MMA) నేర్చుకున్నానని, ఇదే సినిమాకు కూడా ప్రధానాంశం అని సూర్య వెల్లడించాడు.చదవండి: ఆరోగ్యానికి వెరీ ‘గుడ్డూ’.. ఎగ్స్ట్రా వెరైటీస్ ట్రై చేశారా?నుమ్ రౌడీ ధాన్లో తన తండ్రి చిన్నపటి వెర్షన్ను పోషించిన సూర్య ఫీనిక్స్లో తన ప్రధాన పాత్ర కోసం సిద్ధమయ్యేందుకు అనేక కసరత్తు చేశాడట. చాలా కఠినమైన శిక్షణ తీసుకున్నాడట. అలాగే తన ఆహార ప్రణాళికలలో కూడా కొన్ని మార్పులు చేసుకోవాల్సి వచ్చిందని, ఈ క్రమంలో మొదటి ఆరునెలలు, ఆయిల్, షుగర్ ఫుడ్స్కు పూర్తిగా దూరంగా ఉన్నానని, నిజంగా ఇది చాలా ఛాలెంజింగ్ పీరియడ్ అని చెప్పు కొచ్చాడు. మొత్తానికి హీరో అవ్వాలనే డ్రీమ్ను నెరవేర్చుకునేందుకు, స్లిమ్ అండ్ ట్రిమ్గా కనిపించేందుకు బరువు తగ్గాలని నిర్ణయించాడు. పట్టుదల, కఠినమైన శిక్షణతో చాలా ఓపిగ్గా తాను అనుకున్నది సాధించాడు.ఇదీ చదవండి: 7 నెలల్లో 35 కిలోలు..వాటికి దూరం: ఇదే నా సక్సెస్ అంటున్న నేహా -
Antidepressants మహిళలు సేఫే, బట్ పురుషులకే!
‘మనసున్న మనిషికి సుఖము లేదంతే..’ అన్నారు ఆచార్య ఆత్రేయ. సుఖం ఉండకపోగా, డిప్రెషన్లోకి వెళ్లిపోయే ప్రమాదమూఉండొచ్చు. ‘యాంటీడిప్రెసెంట్స్’లు వాడి ఆ డిప్రెషన్ నుంచి బయట పడొచ్చనుకోండీ.. అయితే వాటిని వాడితే మెదడుపై దీర్ఘకాల దుష్ప్రభావాలు ఉంటాయని శాస్త్ర పరిశోధకులు కనిపెట్టారు. ‘ఇందులో కొత్తేముందీ!’ అంటారా? ఉంది. యాంటీడిప్రెసెంట్లు వాడితే మెదడుపై పడే దుష్ప్రభావాలు మగవాళ్లలోనే కానీ, ఆడవాళ్లలో కాదట!మానసిక రుగ్మతలకు వైద్యులు సిఫారసు చేసే ‘యాంటీడిప్రెసెంట్’ ఔషధాలు దీర్ఘకాలంలో పురుషుల మెదడుపై దుష్ప్రభావాలు చూపే అవకాశాలు ఉండగా, మహిళల్లో అలాంటి ప్రభావం దాదాపు లేదని టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ (టి.ఐ.ఎఫ్.ఆర్.) శాస్త్రవేత్తలు ఎలుకలపై జరిపిన తాజా పరిశోధనలో వెల్లడైంది. అయితే యాంటీడిప్రెసెంట్లు పురుషుల మెదడుపై ఈ విధంగా ప్రభావాన్ని చూపటం అన్నది వారి వయసుపై కూడా ఆధారపడి ఉండొచ్చని వారు భావిస్తున్నారు.చదవండి: ఎక్కడ చూసినా గోరింటాకు సందడి : ఈ ప్రయోజనాలు తెలుసా?యాంటీ డిప్రెసెంట్లు ఏం చేస్తాయి?సెరటోనిన్ అనే న్యూరోహార్మోన్ మెదడులోని భావోద్వేగాల రూపకల్పనలో కీలక పాత్ర పోషిస్తుంది. ఆ హార్మోన్ను నియంత్రించటమే యాంటీడిప్రెసెంట్ల పని. నిరాశ, నిస్పృహ, ఆందోళన తదితర న్యూరోసైకియాట్రిక్ వ్యాకులతలకు వైద్యులు ప్రధానంగా ‘సెలెక్టివ్ సెరటోనిన్ రీఅప్టేక్ ఇన్హిబిటర్లు’ (ఎస్.ఎస్.ఆర్.ఐ.లు) సిఫారసు చేస్తారు. ఈ మందులు మెదడులోని సెరటోనిన్ అధికం చేసి మానసిక ఉపశమనానికి తోడ్పడతాయి.ఇదీ చదవండి: ఒకప్పటి సెక్యూరిటీ గార్డే .. ఇపుడు మైగేట్ యాప్ సీఈవో!మగ ఎలుకల్లోనే మార్పులుఎస్.ఎస్.ఆర్.ఐ.లలో విస్తృతంగా వాడుకలో ఉన్న ఔషధం ‘ఫ్లూఆక్సిటీన్’. గర్భిణులు, బాలింతలు, పిల్లలు, కౌమార దశలో ఉన్నవారు సహా అన్ని వయసుల వారికి వైద్యులు సిఫారసు చేసే ఈ ఫ్లూఆక్సిటీన్ దీర్ఘకాలిక ప్రభావాలు ఎలా ఉంటాయన్న విషయమై ఎలుకల మెదడుపై జరిపిన ఈ అధ్యయనంలో అనేక ఆసక్తికరమైన సంగతులు వెల్లడయ్యాయి. ఫ్లూఆక్సిటీన్ను ఇవ్వడం వల్ల మగ ఎలుకల మెదడులో విస్తృతమైన వ్యతిరేక మార్పులు కనిపించాయి. పుట్టిన కొద్ది రోజుల వయసున్న ఎలుకలకు యాంటీడిప్రెసెంట్లను ఇచ్చినప్పుడు క్రమేణా ఆందోళన స్థాయిలు పెరిగాయి. లైంగిక పరిపక్వతకు చేరుకున్న దశలో ఉన్న ఎలుకలకు ఇచ్చినప్పుడు అవి తక్కువ ఆందోళనను కనబరిచాయి. ఈ మందు ఇచ్చిన ఆడ ఎలుకల ప్రవర్తన, మెదడు నిర్మాణం, మైటోకాండ్రియా లేదా జన్యు వ్యక్తీకరణలలో మార్పులేమీ కనిపించలేదు. బహుశా ఇందుకు ఈస్ట్రోజెన్, ఇతర స్త్రీ హార్మోనుంచి రక్షణ లభిస్తుండవచ్చునని తెలిపారు. జెండర్ క్రోమోజోమ్లు, జన్యుపరమైన వ్యత్యాసాలపై మరింత అధ్యయనం జరిపితే దీనిపై నిర్ధారణకు అవకాశం ఉంటుందని పరిశోధకులు భావిస్తున్నారు.అత్యంత సాధారణ ఔషధం‘ఫ్లూఆక్సిటిన్’ అనేది 18 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న వారికి, గర్భిణులకు చికిత్సపరంగా మంచి ఫలితాల కోసం ఇచ్చే అత్యంత సాధారణ ఔషధం. ప్రొజాక్, ఫ్లూడాక్ వంటి బ్రాండ్పేర్లతో ఇది లభిస్తోంది. అయితే దాని దీర్ఘకాలిక ప్రభావాన్ని అంచనా వేయడానికి మరిన్ని పరిశోధనలు జరగాల్సి ఉంది’ అని తాజా పరిశోధనా పత్రాన్ని సమర్పించిన ముఖ్య అధ్యయనకర్త ఉత్కర్షా ఘాయ్ అంటున్నారు. ఘాయ్ ముంబైలోని టి.ఐ.ఎఫ్.ఆర్. (టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రిసెర్చ్) లో పీహెచ్డి, బెంగళూరులోని నిమ్హాన్స్లో పోస్ట్డాక్టరల్ రీసెర్చ్ చేశారు. అధ్యయనం జరిగిన విధానంఫ్లూఆక్సిటిన్ తీసుకున్న తర్వాత.. సెక్సువల్ హార్మోన్లు క్రియాశీలకం కావడానికి ముందు, తర్వాత మెదడుపై ప్రభావాలను అధ్యయనం చేసేందుకు టి.ఐ.ఎఫ్.ఆర్. శాస్త్రవేత్తల బృందం ఎలుకల్ని రెండు జట్లుగా విభజించింది. ఒక జట్టు : ఎలుకలు 2 నుండి 21 రోజుల వయసున్నవి. ఇంకో జట్టు : 28–48 రోజుల వయసున్నవి. అప్పుడే పుట్టిన ఎలుకల్లో ఈ మందు వాడకంతో ఆందోళన క్రమంగా పెరిగింది. అదే రెండో జట్టు ఎలుకల్లో ఒత్తిడి, ఆందోళన స్వల్పంగా తగ్గాయి. ఈ అధ్యయన ఫలితాలను మానవుల్లోనూ అవే రెండు దశలుగా శైశవ దశ నుంచి శరీరంలో సెక్సువల్ హార్మోన్లు కనిపించే వయసు వరకు; టీనేజీ నుంచి 25 ఏళ్ల వరకు ఈ బృందం అన్వయించింది. సహాయకారిగా విటమిన్ బి3యాంటీడిప్రెసెంట్ల వాడటం వల్ల కొందరి మెదడుపై కనిపించే దుష్ప్రభావాలను తగ్గించేందుకు చేసిన అధ్యయనంలో భాగంగా ఈ బృందం విటమిన్ బి3 (నికోటినమైడ్)ని ఎలుకలకు ఇచ్చింది. ఆశ్చర్యకరంగా, పుట్టి కొద్ది రోజులే అయిన ఎలుకలలో గమనించిన అనేక ప్రతికూల ప్రభావాలు బి3 ప్రభావంతో ఉపశమించాయి. వాటి జీవక్రియ పునరుద్ధరణ జరిగింది. వాటి నిరాశ, నిస్పృహల ప్రవర్తనలలో గణనీయమైన తగ్గుదల కనిపించింది. దీంతో వైద్యులకు ఒక ఆశారేఖ దొరికినట్టయింది. తీవ్రమైన ఆందోళన, ఒత్తిడి ఉండి.. ఆత్మహత్య చేసుకోవాలనుకునే మానసిక స్థితి ఉన్న గర్భిణులకు ఎస్ఎస్ఆర్ఐలు తప్పనిసరిగా ఇవ్వాల్సి వస్తుంది. అలా ఇస్తే వాటి ప్రభావం పుట్టే పిల్లలపై పడుతుంది. కానీ, విటమిన్ బీ3 వాడితే... ఆ ప్రభావం తగ్గుతుందని ప్రస్తుత పరిశోధనల్లో కొంత వరకు తేలింది. ఇది గర్భిణులందరికీ గొప్ప శుభవార్తే. కాకపోతే పూర్తిస్థాయిలో పరిశోధనలు జరగాల్సి ఉంది. -
నాన్నా నా పెళ్లిలో డ్యాన్స్ చేస్తావా..? ఆ మాటలే ఊపిరి పోశాయి..
హాయిగా సాగిపోతున్న జీవితాన్ని భయానక వ్యాధులు ఒక్క ఊదుటన మొత్తం జీవితాన్నే తలికిందులు చేస్తాయి. వైద్యానికి అయ్యే ఖర్చులతో కుటుంబాన్ని రోడ్డుమీదకు తీసుకొచ్చేస్తాయి. వీటన్నింటికి తోడు ఆ మహమ్మారి పెట్టే భయాన్ని తట్టకోవాలంటే కొండంత ధైర్యం ఉండాల్సిందే. అలా అనితరసాధ్యమైన స్థైర్యంతో ఓ నాన్న కూతురు కోసం కేన్సర్ మహమ్మారిని ఎలా జయించాడో తెలిస్తే..హృదయం ద్రవించిపోతుంది. లెక్కలేనన్ని సర్జరీలు, బతుకుతానా లేదా అన్న నిరాశ నిస్ప్రహల నడుమ పోరాడి గెలిచిన ఓ తండ్రి కథ ఇది.అతడే 60 ఏళ్ల అర్జున్ సేన్. అతడు మార్కెటింగగ్ ఎగ్జిక్యూటివ్, పాడ్కాస్ట్ హోస్ట్, రచయిత, వ్యవస్థాపకుడు కూడా. కానీ అతడి జీవితం ప్రతిక్షణం మరణం అనే పంజాను విసురుతూనే ఉండేది. కానీ అది ప్రతిసారి అతడి నవ్వు ముందుకు ఓడిపోయింది. ఆయకు 1996లో, కడుపుకు మెటాస్టాసిస్ అనే స్వరపేటిక కేన్సర్ వచ్చింది. వైద్యులు వంద రోజులకు మించి బతికే ఛాన్స్ లేదని చెప్పేశారు. ఏం చేయాలో పాలుపోని పరిస్థితి. ఆ వ్యాధి సోకినప్పడు అర్జున్కి 32 ఏళ్లు. వాస్తవానికి అర్జున్ అందరిని నవ్వించేవాడే..ఈ రోజు నిరాసనిస్ప్రుహలతో ఏం చేయలేని పరిస్థితిలో ఉండిపోయాడు. సరిగ్గా అతడి కూతురు రాకా అతడిని చూసి.." నాన్న చనిపోవడం అంటే ఏమిటి, నువ్వు చనిపోతున్నావా..? మరి నా పెళ్లిలో డ్యాన్స్ చేయవా అంటూ అమాయకంగా అడిగిన కూతురు మాటలకు నిశ్చేష్టుడయ్యాడు. కాసేపటికి తేరుకుని అప్పుడే పెళ్లికి ఎందుకు తొందరపడుతున్నావ్ రా అనగానే కూతురు మోములోని సిగ్గు అతని ముఖంలోకి నవ్వు తెప్పించింది. పైగా కూతురిని దగ్గరకు తీసుకుని లేదు కచ్చితంగా నీ పెళ్లిలో ఈ నాన్న డ్యాన్స్ చేస్తాడు అని కూతురికి వాగ్దానం చేశాడు." అది అబద్ధమని తెలిసి కూడా అప్రయత్నంగా అర్జున్ ఆ మాటలు అనేశాడు. కానీ ఆ మాటలే ఆ తండ్రికి ఊపిరిపోశాయి..అప్పటి దాక ఉన్న బాధకు ఆ నవ్వు ఔషధంగా మారింది. తనకింకా వంద రోజుల కాదు వేల వందల 24 గంటలు ఉన్నాయన్నంత కొండంత ఆశను, ధైర్యాన్ని అందించాయి. అసలు ఈ మహమ్మారి ముందు చేతులు పైకెత్తేసి ఓడిపోవడం దేనికి పోరాడితే ఏముంది అనే శక్తిమంతమైన ఆలోచనను రేకెత్తించింది. ఆ ధైర్యంతోనే కీమోథెరపీ చికిత్సలు తీసుకునేవాడు..ప్రతిసారి ట్రీట్మెంట్కి వెళ్లినప్పుడూ తాను బయటపడతానా అనే ప్రశ్న.. వైద్యులను అడిగేవాడు..వాళ్లు కూడా బి పాజిటివ్ అనేవారే తప్ప..పర్లేదు బయటపడగలవు అనే భరోసా ఇచ్చేవారు కారు. అయినా సరే అర్జున్కి తన కూతురు రాకా కోసం బతికి బట్టగట్టగాలి అనే మొండి ధైర్యాన్ని కొని తెచ్చుకుని మరి చికిత్స తీసుకునేవాడు. అలా ఒకటి కాదు, రెండు కాదు..ఏకంగా 20 సర్జరీలు చేయించుకున్నాడు. మంచి చికిత్స తీసుకుని పూర్తి స్థాయిలో కోలుకున్నాడు. అలా ఆ మహమ్మారి నుంచి బయటపడి కూతురికిచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకున్నాడు. అంతేగాదు అతడి గాథని పికూ (2015), విక్కీ డోనర్ (2012) మూవీల దర్శకుడు షూజిత్ సిర్కార్ ఐ వాంట్ టు టాక్ మూవీగా తెరకెక్కించాడు. ఈ మూవీలో తండ్రి కూతుళ్ల మధ్య సైలంట్గా సాగే ఎమోషనల్ సన్నివేశాలు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యింది. బాక్సాపీస్ వద్ద విమర్శకుల ప్రశంసలందుకుంది కూడా. అసలు ముందు మనమే సమస్యకు భయపడిపోతే ఎలా మన కంటి పాపల కోసమైన మృత్యువుతో పోరాడే చిన్న ప్రయత్నమైనా.. చేయాలి అని చాటిచెప్పే భావోద్వేగ కథ ఇది.(చదవండి: కపిల్ శర్మ వెయిట్ లాస్ స్టోరీ..! రెండు నెలల్లో 11 కిలోలు..! ఏంటి 21. 21. 21 రూల్..?) -
7 నెలల్లో 35 కిలోలు..వాటికి దూరం: ఇదే నా సక్సెస్ అంటున్న నేహా
అధిక బరువును తగ్గించుకోవాలంటే ఆహారం పాత్ర చాలా కీలకం. ఆహారపు అలవాట్లే బరువు తగ్గడంలో ప్రధాన భూమిక పోషిస్తాయి. ఇది అందరూ చెప్పేమాట. క్రమం తప్పని వ్యాయామంతోపాటు ఏం తింటున్నాము? ఎంత తింటున్నాం? ఏ సమయంలో తింటున్నాము అనేది బేరీజు వేసుకోవాలని ఆహార నిపుణులు కూడా సూచిస్తారు.అయితే తాజాగా కేవలం 7 నెలల్లో ఏకంగా 35 కిలోల బరువు తగ్గిన మహిళ, తన అనుభవాలను ఇన్స్టాగ్రామ్ ద్వారా పంచుకుంది. పదండి మరి ఆమె సక్సెస్మంత్రా ఏంటో తెలుసుకుందాం.ఇన్స్టాలో నేహా తన వెయిట్ లాస్ జర్నీ గురించి వివరించింది. ముఖ్యంగా వ్యాయామంతోపాటు, దూరంగాపెట్టాల్సినకొన్ని ఆహారాల గురించి చెప్పుకొచ్చింది. నిజంగా బరువు తగ్గడమే అదొక యజ్ఞంలాగా చేయాలి. భారీ కసరత్తులు, డైట్ చేసినా అనుకున్న ఫలితం కనపించక చాలామంది నిరాశపడిపోతారు చాలామంది . అయితే మనం రోజూ తినే ఆహారపు అలవాట్లే బరువు తగ్గడంలో కీలకం అంటోంది నేహా తాను. కేవలం 7 నెలల్లో ఏకంగా 35 కిలోల బరువు తగ్గినట్టు వెల్లడించింది. ‘‘బరువు తగ్గాలనుకుంటే, ఈ ఆహారాలకు దూరంగా ఉండాలి లేదా వాటిని చాలా తక్కువగా తీసుకోవాలి" అనే క్యాప్షన్లో తన అనుభవాన్ని షేర్ చేసింది. నేహా. View this post on Instagram A post shared by LeanwithNeha (@leanwithneha)p; ఇదీ చదవండి: అవును మేమిద్దరమూ విడిపోతున్నాం.. కానీ!నేహా దూరం పెట్టిన ఆ 10 రకాల ఫుడ్ గ్రానోలా (Granola): ఇది ఆరోగ్యకరమైన ఆహారంగా ప్రచారంలో ఉంది. కానీ ఇందులో చక్కెర, అనారోగ్యకరమైన నూనెలు ఎక్కువగా ఉంటాయి. ఇవి మంచి కంటే చెడే ఎక్కువ చేస్తాయి.ఫ్లేవర్డ్ యోగర్ట్: ఇందులో కనిపించని చక్కెరలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఇన్సులిన్ స్థాయిలను పెంచి, శరీరంలో కొవ్వు పేరుకుపోవడానికి కారణమవుతాయి.ప్యాక్ చేసిన పళ్ల రసాలు: : వీటిలో ఫైబర్ ఉండదు, చక్కెర ఎక్కువగా ఉంటుంది. కొన్ని రకాలు సోడా కంటే కూడా ప్రమాదకరమైనవి.డైట్ నమ్కీన్, బేక్డ్ చిప్స్ : "డైట్" అని ఉన్నంత మాత్రాన వీటిని చూసిబుట్టలోపడిపోకండి మోసపోకండి. ఇవి కూడా బాగా ప్రాసెస్ చేసిన ఆహారాలే. వీటిలో శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లు, చెడు కొవ్వులు ఉంటాయి సో.. జాగ్రత్త.ప్రోటీన్ బార్స్ (Protein bars): చాలా ప్రోటీన్ బార్లు చక్కెర మిఠాయిల్లాగే ఉంటాయి. కేవలం కొద్దిగా ప్రోటీన్ అదనంగా చేరుస్తారు అంతే. వీటిని కొనే ముందు పదార్థాల జాబితాను జాగ్రత్తగా చూడండి.తేనె, బెల్లం (Honey and jaggery): ఇవి సహజమైనవి కావచ్చు, కానీ అవి కూడా చక్కెరలే. శుద్ధి చేసిన చక్కెరలాగే ఇవి కూడా మీ ఇన్సులిన్ స్థాయిలను పెంచుతాయి.బ్రౌన్ బ్రెడ్ (Brown bread): ఇది తరచుగా శుద్ధి చేసిన మైదా పిండితో తయారు చేస్తారు. ఆరోగ్యకరంగా కనిపించడానికి రంగు కలుపుతారు. నిజానికి ఇందులో పోషక విలువలు తక్కువగా ఉంటాయి.స్టోర్స్లో కొనే స్మూతీలు: వీటిలో పండ్ల చక్కెరలు, కొన్నిసార్లు కృత్రిమ రుచులు ఎక్కువగా ఉంటాయి. ఇవి కొవ్వు పెరగడానికి దారితీస్తాయి. (Tip of the Day : రాగుల జావతో మ్యాజిక్)తక్కువ కొవ్వు ప్యాకేజ్డ్ ఆహారాలు: వీటిలో సహజ కొవ్వులను తొలగించి, రుచి కోసం సాధారణంగా చక్కెరను కలుపుతారు. ఇది తక్కువ కొవ్వు తీసుకునే ఉద్దేశ్యాన్ని దెబ్బతీస్తుంది.సోయా ఉత్పత్తులు: సోయా ఉత్పత్తులను కూడా మితిమీరి, ముఖ్యంగా ప్రాసెస్ చేసిన సోయాను ఎక్కువగా తీసుకోవడం హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీస్తుంది. (సినీ దర్శకుడవ్వడమే టార్గెట్ : మత్స్యకార మణిహారం)నోట్ : నేహా ఇన్స్టా పోస్ట్ ఆధారంగా అందించింది మాత్రమే అని గమనించగలరు. వృత్తిపరమైన వైద్య సలహాకు ఇది ప్రత్యామ్నాయం కాదు. ఏదైనా సందేహాలుంటే నిపుణుల సలహా తీసుకోవడం ఉత్తమం. -
గుండెను గుచ్చే అందమైన ముల్లు
‘కాంటా లగా’ మ్యూజిక్ ఆల్బమ్ ఫేమ్, ప్రముఖ బాలీవుడ్ నటి షెఫాలీ జరీవాలా బ్యూటీ ట్రీట్మెంట్లో భాగంగా ఓ ఇంజెక్షన్ తీసుకున్న కొద్దిసేపటికే కార్డియాక్ అరెస్ట్తో మృతిచెందిన సంఘటన ఇటీవల చాలా సంచలనం రేపింది. షెఫాలీ అనేక ఏళ్లుగా ఈ చికిత్స తీసుకుంటున్నప్పటికీ ఆరోజు ఆమె ఉపవాసంలో ఉండి... ఇంజెక్షన్ తీసుకున్నందున ఇలా జరిగిందనే వార్తలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో సాధారణంగా నటీనటులతో పాటు ఇతరులు తీసుకునే బ్యూటీ చికిత్సలనూ అలాగే... గుండెపై వాటి ప్రభావాలను చూద్దాం...‘అందమె ఆనందం... ఆనందమె జీవిత మకరందం’ అంటూ తెలుగు కవులు వినిపించారూ... వివరించారు. అందం ఆనందాన్నిస్తుంది. దానికి ప్రాణాల్ని మూల్యంగా చెల్లించాలా అన్నది సమాజం అడుగుతున్న ప్రశ్న. ఈ నేపథ్యంలో అసలు బ్యూటీ చికిత్సలో జరిగేదేమిటి, వాటి పర్యవసానాలేమిటి, గుండెపైన వాటి ప్రభావాలేమిటో తెలుసుకుందాం. మొదట్లో సినీతారలు... తర్వాత్తర్వాత క్రమంగా బాగా ధనవంతులు మొదలు... నేడు సామాన్యుల వరకూ సౌందర్య కాంక్ష చేరింది. ఇప్పుడు పార్లర్కు వెళ్లడమన్నది మధ్యతరగతీ, దిగువ మధ్యతరగతికీ సాధారణమైంది. మెరుస్తున్న మేని నిగారింపు, యూత్ఫుల్ లుక్తో కనిపించడం అందరికీ ఇష్టమైన అంశమైంది. బ్యూటీ థెరపీ లేదా ఈస్థటిక్ ట్రీట్మెంట్ అని పిలిచే సౌందర్య చికిత్సల్లో రక్తనాళం ద్వారా నేరుగా రక్తంలోకి పంపించే గ్లుటాథియోన్ డ్రిప్స్ మొదలుకొని రకరకాల మీసోథెరపీ (మీసో థెరపీ అంటే చర్మంలో ఉండే మూడు పొరల్లోని మధ్యపొరపై ప్రభావం చూపేవి) మందులూ, కొలాజెన్ ΄ పౌడర్లు, చర్మం నిగారింపుతో ఫెయిర్గా కనిపించేందుకు వాడే ఇంజెక్షన్లు, పైపూతగా వాడే క్రీములు, ΄ పౌడర్లు... ఇలా రకరకాల ట్రీట్మెంట్లు ఉంటాయి. పైకి మిలమిలా మెరుస్తూ ఉండే చర్మం వెనక కొన్ని నల్లటి చిక్కటి చీకటి రహస్యాలూ ఉంటాయి. కొన్నింటిపైన ఓ మేరకు నియంత్రణలు ఉన్నప్పటికీ... మరికొన్నింటి విషయంలో అసలు ఎలాంటి అదుపూ లేకుండా ఏమాత్రం శిక్షణ లేనివారూ, తమకు ఎలాంటి పరిజ్ఞానమూ లేనివారూ చేసేవి కూడా ఉంటాయన్నది ఓ నగ్న సత్యం. ఇదీ చదవండి: Tip of the Day : రాగుల జావతో మ్యాజిక్ బ్యూటీ చికిత్సల్లో ఎన్నెన్నో రకాలు... వ్యక్తులు అందంగా కనిపించేందుకు చేసే చికిత్సల్లో పలు రకాలైనవి ఉంటాయి. ఉదాహరణకు... → పెరుగుతున్న వయసు ఛాయలు చర్మంపై కనిపించకుండా... ముడుతలూ, లోతైన గీతలు కనిపించకుండా చేసేందుకు యాంటీ ఏజింగ్ చికిత్సగా బొటాక్స్ ఇంజెక్షన్లు, ఇతర డర్మల్ ఫిల్లర్స్ → మార్కెట్లో యాంటీ ఏజింగ్ మందులు, డీ–టాక్స్ లేదా ఇమ్యూనిటీ బూస్టర్స్గా పిలుస్తూ... రక్తనాళం ద్వారా రక్తంలోకి మందును ఎక్కించే గ్లుటాథియోన్, నికొటినెమైడ్ అడినైన్ డైన్యూక్లియోటైడ్ (ఎన్ఏడీ+) మందులు → రక్తంలోని ప్లాస్మాను వేరు చేసి చర్మంలోకి ఎక్కించే పీఆర్పీ (ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా) థెరపీ, (జుట్టు ఒత్తుగా పెరిగేలా చేసే గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సంట్రేట్ (జీఎఫ్సీ) చికిత్స, ఎగ్జోసోమ్స్, చర్మాన్ని ఉత్తేజితం చేసే పాలీ డైయాక్సీ రైబో న్యూక్లియోటైడ్ (పీడీఆర్ఎన్) వంటి చికిత్సలు → కొలాజెన్ పెపై్టడ్స్, బయోటిన్, చర్మాన్ని తెల్లగా మార్చే గుట్లాథియోన్ లాంటి పిల్స్తో పాటు కొన్ని హార్మోన్ థెరపీలు. ఇవన్నీ ఆహారంలోని సప్లిమెంట్స్ కాగా... వీటిలో కొన్నింటిని నోటిద్వారా (ఓరల్గా) ఇస్తారు → ఇక పైపూత లేపనాలు (టాపికల్)గా వాడే పెపై్టడులూ, రెటినాయిడ్స్ ఉండే క్రీములు... ఇవి సౌందర్య ఔషధ రూపాల్లో ఇస్తుండటం వల్ల వీటిని ‘కాస్మస్యూటికల్స్’గానూ చెబుతారు.మన దేశంలోఅనుమతిఉన్నవి కొన్నే...మన దేశంలో ఇలాంటి మందులకు అనుమతి ఇచ్చే అత్యున్నత అథారిటీ ‘సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ – సీడీఎస్సీఓ) అనే సంస్థ. దీనితో పాటు అమెరికన్ సంస్థ ఎఫ్డీఏ అనుమతించిన వాటిని మనదేశంలోనూ అనుమతిస్తుంటారు. వాటిల్లో కొన్నింటికే అనుమతులున్నాయి → ఉదాహరణకు రక్తంలోకి ఎక్కించే గ్లుటాథియోన్, హై–డోస్ విటమిన్ సి, ఎన్ఏడీ+ లేదా మరికొన్ని మిశ్రమ మందులు (కాక్టెయిల్స్)కు పై సంస్థల అనుమతి లేదు → చర్మంలో ఉండే మూడు పొరల్లో మధ్యపొరపై పనిచేసే మరికొన్ని చికిత్సలను ‘ఎక్సోజోమ్ బేస్డ్’ చికిత్సలు అంటారు. వీటితో పాటు స్టెమ్సెల్ థెరపీల వంటివాటిని శిక్షణ పొందిన క్వాలిఫైడ్ నిపుణులు అందిస్తేనే సురక్షితం.ప్రమాదాలూ / అనర్థాలు ఎప్పుడంటే... ముందుగా చెప్పిన ప్రకారం... అత్యంత సుశిక్షితులూ, అన్ని విధాలా తగిన విద్యార్హతలు ఉన్న డర్మటాలజిస్టుల వంటి నిపుణులు మాత్రమే ఈ చికిత్సలను అందించాల్సిన నేపథ్యంలో ప్రస్తుతం చాలాచోట్ల అనధికారిక సెలూన్లు, స్పాలు ఇంకా చెప్పాలంటే కొన్నిచోట్ల ఇళ్లలో కూడా అనధికారికంగా ఈ ఔషధాలనూ, ఇవ్వకూడని సప్లిమెంట్లను ఇస్తున్నారు. పైగా ఇళ్లలో ఇచ్చే ఈ చికిత్సల్లో ఏవైనా దుష్ప్రభావాలు ఎదురైతే... వాటి పర్యవసానాలేమిటీ, వాటిని ఎలా ఎదుర్కోవాలన్న పరిజ్ఞానం అనర్హులైన చికిత్సకులకు ఉండదూ, అలా ఎదుర్కొనేందుకు అవసరమైన వనరులూ ఉండవు. అయినప్పటికీ చాలామంది వీటిని యధేచ్ఛగా ఇస్తున్నారూ... అలాగే అందంపై ఆసక్తి ఉన్న యువతీయువకులు తీసుకుంటున్నారు.చదవండి: క్యాషియర్ సెకండ్ హ్యాండ్ కారు కొనుక్కుంటే నేరమా బాస్?!ఇవీ నమోదైన (డాక్యుమెంటెడ్) ప్రమాదాలు / అనర్థాలు → అలర్జిక్ రియాక్షన్లు, అనాఫిలాక్సిస్ అనర్థాలు (అదుపు చేయలేని విధంగా చాలా తక్కువ వ్యవధిలో వచ్చే తీవ్రమైన రియాక్షన్లు వీటి ద్వారా ఒక్కోసారి షాక్ కూడా కలిగితే దాన్ని అనాఫిలెక్టిక్ షాక్గా కూడా వ్యవహరిస్తారు). ఈ రియాక్షన్లు అరుదుగా ప్రాణాంతకమూ అయ్యే అవకాశాలు లేక΄ోలేదు → రక్తంలోకి ఎక్కించే గ్లుటాథియోన్ ఇంజెక్షన్లతో అనాఫిలెక్టిక్ షాక్, అసెప్టిక్ మెనింజైటిస్ (మెదడు, వెన్నుపాములో ఉండే పొరల వాపు) వంటివి చాలా అరుదు. అయితే కొన్నిసార్లు ఇలాంటి రియాక్షన్స్ కనిపించిన దాఖలాలు ఉన్నాయి → హై–డోస్ విటమిన్ బి కాంప్లెక్స్ ఇచ్చిన కొన్ని సందర్భాల్లో అవి వికటించి, ప్రాణాంతకంగా మారిన సందర్భాలూ ఉన్నాయి. నిజానికి చాలాకాలం నిల్వ చేయడానికి అందులో వాడే ప్రిజర్వేటివ్స్ వల్ల ఇలాంటి రియాక్షన్లు కనిపించాయి → కొన్ని సందర్భాల్లో బ్యూటీ మందులు వాడాక ఇన్ఫెక్షన్లు, రక్తానికి ఇన్ఫెక్షన్ (సెప్సిస్) కనిపించాయి → స్టెమ్ సెల్ చికిత్సల్లో కొంతమేరకు కనిపించే ముప్పు (రిస్క్)→ స్టెమ్సెల్స్తో చేసే చికిత్సల్లో ఇమ్యూన్ రియాక్షన్స్, ఇన్ఫెక్షన్స్ వచ్చే ముప్పు ఉన్నందున నిజానికి బ్యూటీ చికిత్సల్లో స్టెమ్సెల్స్కు అనుమతి లేదు.ప్రజలు తెలుసుకోవలసిన అంశాలు... → బ్యూటీ చికిత్స అందించేవారికి వాస్తవంగా ఆ అర్హత ఉందా, వారికి తగిన విద్యార్హతలు ఉన్నాయా వంటి అంశాలను అడిగి తెలుసుకోవాలి → చాలా త్వరగా ప్రభావం చూపుతాయన్న ‘క్విక్ ఫిక్స్ మార్కెటింగ్’ ప్రచారాలను నమ్మడం సరికాదు. మెల్లగా వచ్చే ప్రభావాలే దీర్ఘకాలం నిలుస్తాయి. ఇవి చాలావరకు నిరపాయకరమని గుర్తించాలి → ఆ సౌందర్యసాధనాలకూ, ఉత్పాదనలకు ఎఫ్డీఏ లేదా సీడీఎస్సీవో సంస్థల ఆమోదం ఉందా అని చూడాలి→ గ్లుటాథియోన్ వంటి మందులు ఇచ్చే సమయంలో అది నిరపాయకరమైన మోతాదులోనే ఉందా అని చూడాలి. అంటే వారానికి 600 నుంచి 1200 ఎంజీకి మించి మందు తీసుకోకూడదు. (అనర్థాలు సంభవించిన కొన్ని కేసులను చూసినప్పుడు కొందరు అవసరమైన మోతాదుకు ఐదు రెట్లు ఇచ్చిన దాఖలాలనూ గుర్తించారు) చివరగా... అందం చాలా ఆకర్షణీయమైదే. అందరూ కోరుకునేదే. అయితే దానికి చెల్లించాల్సిన మూల్యం ప్రాణాలు కాకూడదు. అందంగా ఉండటం కంటే ఆరోగ్యంగా జీవించి ఉండటం ముఖ్యం.ఎందుకీ అనర్థాలు... ఈ అనర్థాలకు చాలా కారణాలు ఉంటాయి. → చట్టపరంగా వీటిని అదుపు చేసే యంత్రాంగం కొరవడటం → యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ వంటి ప్లాట్ఫామ్స్ ద్వారా ఈ తరహా క్లినిక్లూ, చికిత్సల గురించి విపరీత ప్రచారం → ఏమాత్రం అర్హతా, పర్యవసానాలపై అవగాహన లేని అనర్హులు చికిత్సలందించడం. అన్నిటికంటే ముఖ్యంగా వినియోగ దారుల్లో కొరవడిన అవగాహన : ఈ ఉత్పాదనల విషయంలో ప్రజల్లో ఎలాంటి అవగాహన లేక΄ోవడం వల్ల కూడా ఈ తరహా అనర్థాలు చోటు చేసుకుంటున్నాయి. ఉదాహరణకు ‘స్వాభావికమైన, ప్రకృతిసిద్ధమైన (నేచురల్)’ వంటి మాటలు ఉపయోగించినప్పుడు అవేవీ ప్రమాదకరం కానివిగా భావిస్తూ చాలామంది ప్రమాదకరమైన సింథసైడ్ రసాయనాలనూ విచ్చలవిడిగా వాడుతున్నారు.వసతులన్నీ హాస్పిటల్స్లోనే... బ్యూటీ చికిత్సలు తీసుకునే సమయంలో అది పెద్ద హాస్పిటల్ అయి ఉండటం, ఎమర్జెన్సీ సౌకర్యాలూ కలిగి ఉండేలా చూసుకోవడం ముప్పును తప్పిస్తుంది. వాస్తవానికి రక్తంలోకి ఎక్కించే గ్లుటాథియోన్ వంటివి తగిన మోతాదులో ఇచ్చినప్పుడు గుండె΄ోటు రావడం, గుండె ఆగి΄ోవడం (కార్డియాక్ అరెస్ట్), అనాఫిలెక్టిక్ షాక్కు గురికావడం వంటి సందర్భాలు చాలా అరుదు. అయితే అన్ని వసతులూ, ఎమర్జెన్సీ సౌకర్యాలు ఉన్న ఆసుపత్రితో తగిన విద్యార్హతలూ, చికిత్స అర్హతలూ కలిగిన డాక్టర్ల ఆధ్వర్యంలో బ్యూటీ చికిత్సలు తీసుకుంటే... ఒకవేళ ఏవైనా రియాక్షన్స్, అనాఫిలెక్టిక్ రియాక్షన్స్ వచ్చినా తక్షణం చికిత్స అందించడం వల్ల ప్రాణాలను కాపాడటానికి అవకాశముంటుంది. -
Tip of the Day : రాగుల జావతో మ్యాజిక్
భారతదేశంలో అత్యంత చౌకగా లభించే తృణధాన్యం.దీన్నే ఆంగ్లంలో ఫింగర్ మిల్లెట్ అని పిలుస్తారు.ఈ చిరు ధాన్యాలలో కాల్షియం, ఇనుము , విటమిన్లు బి1 నుండి బి3 లాంటి పోషకాలు మెండుగా లభిస్తాయి. ఇవాల్టి టిప్ ఆఫ్ ది డేలో భాగంగా రాగా మాల్ట్ లేదా రాగి జావ ఎలా తయారు చేయాలో చూద్దాం.మొలకలతో పిండి రాగి మాల్ట్ తయారు చేయడానికి రాగులను నానబెట్టి, మెత్తని బట్టలో కట్టిపెట్టి, మొలకెత్తించి, నీడలో ఎండబెట్టి, పిండిగా తయారు చేసుకోవాలి. మొలకెత్తిన రాగులతో తయారుచేసిన రాగి మాల్ట్ మరింత పోషకమైనది, సులభంగా జీర్ణమయ్యేది కాబట్టి. చిన్నపిల్లలు, వృద్ధులు కూడా దీన్ని నిస్సంకోచంగా తీసుకోవచ్చు.రాగి మాల్ట్ తయారీస్టవ్ మీద పాన్ లేదా కుండలో రెండు కప్పుల నీళ్లు పోసి మరగనివ్వాలి. ఆ లోపు ఒక కప్పు నీళ్లలో రాగుల పిండి జారుగా కలుపుకోవాలి.నీళ్లు మరుగుతున్నపుడు కలిపిన రాగిపిండిని పోసి, ముద్దలు లేకుండా తరచుగా కలుపుతూ ఉడికించుకోవాలి. మిశ్రమం కాస్త చిక్కగా గరిటె జారుగా అయ్యేలా చూసుకోవాలి.ఇందులో మజ్జిగ, ఉప్పు కలుపుకొంటే కమ్మటి రాగి జావ రెడీ.ఇందులో ఇష్టమున్న వారు బెల్లం, నెయ్యికలుపుకొని తాగవచ్చు. అలాగే ఉడికించే నీళ్లలో కొంచెం పాలనుకూడా కలుపుకోవచ్చు.ఇంకా బాదం పౌడర్ లేదా డ్రై ఫ్రూట్స్ పౌడర్ లేదా సన్నగా తరిగిన ముక్కలతో గార్నిష్తో చేస్తే పిల్లలకు చాలామంచిది. రాగుల జావ, ఆరోగ్య ప్రయోజనాలురాగి జావలో కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇది బాడీకి శక్తినిస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉండడం వల్ల రోగనిరోధక శక్తిని పెంచుతుంది.రాగి జావలో కేలరీలు తక్కువగా ఉండడం వల్ల బరువు తగ్గడానికి సహాయపడుతుంది.గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. రక్తపోటు, కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడంలో, సాయ పడుతుంది.మధుమేహాన్ని నియంత్రిస్తుంది: రాగి జావలో ఫైబర్ అధికంగా ఉండడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది.రాగి జావలో కాల్షియం అధికంగా ఉండడం వల్ల ఎముకలను బలపరుస్తుంది.రాగి జావలో ఐరన్ అధికంగా ఉండడం వల్ల రక్తహీనతను నివారిస్తుంది.రాగి జావలో ఉండే పోషకాలు జుట్టు రాలడం నివారించడంలో సహాయపడతాయి.రాగి జావలో ఉండే యాంటీఆక్సిడెంట్లు చర్మం ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి.రాగి జావను ఉదయాన్నే ఖాళీ కడుపుతో తాగడం మంచిది. లేదా, భోజనానికి ముందు లేదా తర్వాత తాగవచ్చు. -
Finger Millet: పోషకాల రాగి
ప్రధాన ఆహార పంటల్లో రాగి పంట ఒకటి. చిరుధాన్యం పంటగా రాగి పండిస్తారు. ఖరీఫ్, రబీ సీజన్లతో పాటు వేసవిలో కూడా రాగి సాగు అధికంగా చేస్తారు. రాగిలో క్యాల్షియం అధికంగా ఉండడం, కొవ్వుపదార్థాలు తక్కువగా ఉండడం, పీచుపదార్థం కావడం, వరి, గోధుమల కంటే పోషకాల శాతం ఎక్కువ ఉన్న మంచి పౌష్టికాహారం కావడంతో ఇటీవల కాలంలో రాగి వినియోగం పెరిగింది. దీంతో రాగి సాగు విస్తీర్ణం ప్రస్తుతం పెరిగింది. ప్రభుత్వాలు కూడా రాగి పంటకు మద్దతు ధర కల్పించడంతో రైతులు లాభాలు పొందుతున్నారు. బంగారుపాళెం: నియోజకవర్గంలో రైతులు చిరుధాన్యాల పంటల సాగుపై దృష్టి సారించారు. ముఖ్యంగా రాగి పంట సాగుపై ఆసక్తి చూపుతున్నారు. నీటి తడులకు అవకాశం ఉన్న రైతులు రాగి పంటతో పాటు వేరుశనగ సాగు చేస్తున్నారు. ప్రస్తుతం రాగులకు మంచి గిరాకీ ఉంది. గతంలో గ్రామాల్లో రాగి, జొన్న, సజ్జ, కొర్ర, సామ, అరికె పంటలు సాగు చేసేవారు. క్రమంగా ఆయా పంటల సాగు తగ్గుతూ వచ్చింది. ప్రస్తుతం కొన్ని గ్రామాల్లో రాగి, కొర్ర పంట సాగు చేస్తున్నారు. గ్రామాల్లో మధ్యాహ్న రాగి సంగటి వాడుతున్నారు. హోటళ్లలో కూడా రాగిసంగటి అందుబాటులో ఉంటోంది. షుగర్ వ్యాధిగ్రస్తులు ఎక్కువగా రాగి సంగటి తినడానికి ఇష్టపడుతున్నారు. దీంతో రాగి «ధాన్యానికి డిమాండ్ పెరిగింది. వరి కోసిన తరువాత రాగిపంట సాగు చేస్తున్నారు. రాగులు కిలో రూ.30 నుంచి రూ.40 వరకు ధర పలుకుతోంది. దీంతో రాగి పంట సాగుతో మంచి లాభాలు రాబడుతున్నారు. అధిక దిగుబడినిచ్చే రకాలు.. రాగి పంటలో అధిక దిగుబడినిచ్చే రకాల్లో మేలైన రకం మారుతిరకం. ఈ రకం పంట 85 రోజుల నుంచి 90 రోజుల్లో దిగుబడి వస్తుంది. తెగుళ్లను తట్టుకుని 10 క్వింటాళ్ల వరకు దిగుబడి ఇస్తుంది. అన్ని ప్రాంతాల్లో సాగు చేసేందుకు వీలుగా ఉంటుంది. మిగతా రకాలైన వేగావతి, సువర్ణముఖి, వకుళ, భారతి, హిమ, శ్రీచైతన్య రకాలు కూడా అధిక దిగుబడినిస్తాయి. బంగారుపాళెంలో సాగు చేసిన రాగి పంట విత్తనశుద్ధి ఇలా.. రాగి పంట సాగు చేసే సమయంలో విత్తనశుద్ధి అవసరం. కిలో విత్తనానికి 2 గ్రాముల కార్బండిజం అనే మందు కలిపి విత్తనశుద్ధి చేయడం ద్వారా పంటకు తెగుళ్లు సోకకుండా ఉంటాయి. నారు నాటే పద్ధతిలో అయితే ఒక ఎకరానికి నారు కావాలంటే 2 కేజీల విత్తనాన్ని 5 సెంట్ల భూమిలో నారుమడిలో పోయాలి. 21 రోజుల తరువాత నారు నాటాలి. పొలం దున్నిన తరువాత ఆఖరి దుక్కిలో మూడు నుంచి నాలుగు టన్నుల పశువుల ఎరువులు వాడాలి. ఖరీఫ్లో వర్షాధారంగా పండించే రాగి పంటకు 24 కిలోల నత్రజని, 12 కిలోల భాస్వరం, 8 కిలోల పొటాషియం వేయాలి. అగ్గి తెగుళ్ల నివారణకు ట్రై సైక్లోజెల్ 6 గ్రాములను లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. వెర్రి తెగులు నివారణకు 2 గ్రాముల మెటలాక్సిల్ను లీటరు నీటిలో కలిపి స్ప్రే చేస్తే సరిపోతుంది. కాండం తొలిచే పురుగు నివారణకు కొరాజిన్ 3 మిల్లీలీటరును లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. ఈవిధంగా పంట సస్యరక్షణ చేస్తే పంట అధిక దిగుబడి వస్తుందని వ్యవసాయ అధికారులు వెల్లడిస్తున్నారు. రాగితో ఆరోగ్యం.. రాగి ఆహారంగా తీసుకోవడం ద్వారా ఆరోగ్యంగా ఉండవచ్చు. రాగులతో చేసే సంగటి, రాగి జావ, రొట్టె తీసుకోవడం ఎంతో మంచిది. రాగులు 100 గ్రాములు తీసుకుంటే, అందులో 344 మిల్లీ గ్రాముల క్యాల్షియం, 328 క్యాలరీలు, 3,6 గ్రాముల పీచు పదార్థాలు, 7.3 గ్రాముల ప్రోటీన్ లభిస్తుంది. అందుకే పూర్వం ఎక్కువగా రాగులతో చేసిన పదార్థాలే తినేవారు. రాగి జావ తాగితే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు అదుపులో ఉంటాయి. రాగులు వాడకంతో బరువు తగ్గుతారు. -
'చేత్తో తినడం' ఇది ఎప్పటి అలవాటంటే..!
న్యూయార్క్ సిటీ మేయర్ ఎన్నికల్లో డెమొక్రటిక్ అభ్యర్థిత్వాన్ని గెల్చుకున్న జోహ్రామ్ ఖ్వామీ మమ్దానీ చేతులతో బిర్యానీ తింటున్న వైరల్ వీడయో నెట్టింట వైరల్ అవ్వడంతో ఒక్కసారిగా విమర్శలు వెల్లువెత్తాయి. అమెరికాలో ఉంటూ ఇలా చేత్తో తినడం అనాగరికం అని, మీరు థర్డ్ వరల్డ్లోనే బతకండి అంటూ మామ్దని తీరుని తప్పుపట్టారు. అయితే కొందరు నెటిజన్లు ఆయనకు మద్దతుగా నిలిచి చేత్తో తింటే తప్పేంటి అని కూడా ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో చేత్తో తినడం అనే అలవాటు ఏనాటిది? పాశ్చాత్యులు తొలి నుంచే ఫోర్క్లు, స్పూన్లు,చాకులతోనే తినేవారా అంటే..చేతులతో తినడం అనేది పాశ్చాత్య దేశాలకు సుపరిచితమైన అలవాటు కాకపోయినా..ఇది మన భారతీయ ఆచారం. అది మన సంస్కృతిలో భాగం కూడా. సింపుల్గా చెప్పాలంటే భారతీయులకు కేవలం పోషణ కాదు ఒక విధి విధానం. చరిత్ర ప్రకారం ఆదిమానవుల కాలం నాటిది ఈ అలవాటు. ఈజిప్షియన్లు, గ్రీకులు, మెసొపొటేమియన్లు, సింధులోయ నాగరికత ప్రజలు అంతా చేత్తోనే తినేవారు. ఇది మైండ్ఫుల్గా తినేందుకు చిహ్నం.అంతేగాదు జీర్ణక్రియకు నేరుగా ఆహారాన్ని అందించే ప్రక్రియ అని ఆయుర్వేదం చెబుతోంది. ఇక భారతీయ గ్రంథలు, ఉపనిషత్తులు కూడా చేతులతో తినడం అనేది శరీరాన్ని ఆత్మకు అనుసంధానం చేసే ఒక ప్రక్రియగా పేర్కొన్నాయి. ఎందుకంటే చూడటం, వాసన రుచి, స్పర్శతో కూడిన ఇంద్రియానుభవమే భోజనం అని పురాణాలు చెబుతున్నాయి. మన భారతీయ భోజనం బియ్యం, కూరలు కలయిక. కాబట్టి వాటిని తినాలంటే చేతులతో కలుపుకుని తింటే చక్కటి రుచిని ఆస్వాదించగలరు. అదే పాశ్చాత్యులకు రోస్ట్లు, గ్రిల్డ్ మాంసం, పాస్తా, బ్రెడ్ వంటివి ఆహారాలు. వాటిని తినాలంటే వాళ్లు చాక్లు, ఫోర్క్లు ఉపయోగించి తినాల్సిందే. ఎందుకంటే వాటిని అలానే తినేయం సాధ్యం కాదు. అయినా భారతీయుల ఆహారం అంతలా ఘనపదార్థాలుగా ఉండదు కాబట్టి ఆ అవసరం మనకు రాలేదు. పైగా ఇది మన సంస్కృతిలో భాగం. చాప్స్టిక్స్ సంగతేంటి?చైనా, జపాన్లోని ప్రజలు చాప్స్టిక్లను ఉపయోగిస్తారు. వాళ్లు వీటిని క్రీశ 400 ఏళ్ల నాటి నుంచి ఆచరిస్తున్నారట. ఇటీవలే వాళ్ల భోజన విధానంలో ఫోర్క్లు, చాక్లు వచ్చాయట. ప్రస్తుతం అది ఆదునికతకు గుర్తుగా మారిందని చెబుతున్నారు నిపుణులు. ఇక చైనా, జపాన్లో చాప్స్టిక్తో తినడానికి కారణం.. బుద్దిపూర్వకంగా మనసుపెట్టి తినాలనే ఉద్దేశ్యంతో ఈ ఆచారాన్ని ఏర్పాటు చేసుకున్నారట. అదీగాక వాళ్ల ఆహారం చాలామటుకు చిన్ని చిన్న ముక్కులుగానే ఉంటుంది. వాళ్లకు భోజనం అనేది ఏకాగ్ర చిత్తంతో చేసే ప్రక్రియ. ఈ విధానంలో తింటే మాటలు దొర్లవు, తింటున్న దానిపై ఫోకస్ ఉంటుదంట. అందులోనూ ఆకలితో ఉంటే..స్పీడ్గా తినాంటే ఆ చాప్స్టిక్లపై ఫోకస్ పెడితేనే తినగలరు లేదంటే వాటి మధ్య నుంచి ఆహారం జారిపోతుంది. పైగా అలా గనుక ఆహారం పారేస్తుంటే చైనా పెద్దలు తిట్టడమే గాక మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడే తినమని ఆదేశిస్తారట.చేత్తో తినడం మంచిదేనా.. చేత్తో తినడం పరిశభ్రకరమైనదా అని పాశ్చాత్యులు ప్రశ్నిస్తుంటారు. కాని ఇది పరిశుభ్రతకు సంబంధించిన అంశమని నొక్కిచెబుతున్నారు శాస్త్రవేత్త అదితి. ఎందుకంటే భోజనానికి ముందు తర్వాత చేతులు తప్పక కడుక్కుంటారు. అలాగే కుడిచేయి అనేది పవిత్రమైన పనులకే ఉపయోగిస్తారు భారతీయులు. తిలకం పెట్టుకోవడం దగ్గర నుంచి ఇతరులకు డబ్బులు ఇవ్వడం, శుభాకార్యలకు అన్నింటికి కుడి చేతినే ప్రధానం ఉపయోగిస్తారు. అలాగే ఎడమ చేతిని వ్యక్తిగత పరిశుభ్రతకే కేటాయిస్తారని చెప్పుకొచ్చారు. ఇక చేత్తే తినడం వల్ల మనసారా తింటున్న అనుభూతి తోపాటు జీర్ణక్రియ నేరుగా వెళ్లి సులభంగా అరిగిపోయేలా చేయడంలో దోహదపడుతుందట. చేత్తో తింటేనే త్వరితగతిన అరిగిపోతుందని, ఆరోగ్యానికి మంచిదని పలు అధ్యయనాల్లో కూడా వెల్లడైందని చెప్పుకొచ్చారు వైద్యులు.(చదవండి: Zohran Mamdani: పప్పన్నం చేత్తో తిన్నందుకు తిట్టిపోస్తున్నారే!) -
బరువు తగ్గాలనుకుంటున్నారా? ఐతే హెల్ప్ అయ్యే 'జీరో కేలరీ ఫుడ్స్' ఇవే..
బరువు తగ్గడమే సవాలుగా మారింది యువతకు. ఎందుకంటే దాదాపు చిన్న పెద్ద అనే భేదం లేకుండా అందరిని బాధించే భారమైన సమస్య ఇది. అయితే ఎంతలా డైట్ పాటించినా..ఒక్కోసారి చీట్ మీల్స్ తినక తప్పదు. అలాంటప్పుడూ కడుపు నిండుగా..బరువు పెరగకుండా ఉండే కొన్ని రకాలా ఆహారాలు ట్రై చేస్తే చాలంటున్నారు ప్రముఖ ఫిట్నెస్ కోచ్ సామ్ ఎవెరింగ్హామ్. జస్ట్ అవి శ్రద్ధ పెట్టి తీసుకుంటే చాలట బరువు పెరిగే ప్రసక్తే లేదంటున్నారు. భోజనంలోనూ, బ్రేక్ఫాస్ట్లోనూ ఈ ఆహారాలను జోడిస్తే..హాయిగా కడుపు నిండా తిన్న అనుభూతి తోపాటు బరువు తగ్గుతారని చెబుతున్నారు. మరి అవేంటో చూద్దామా..!కేలరీలు తక్కువగా ఉండే ఆహారాలు మొత్తం 20 ఉన్నాయట. ఇవన్నీ జీరో కేలరీ ఆహారాలట. వీటిని డైట్లో జోడిస్తే బరువు అదుపులో ఉండటమే కాకుండా హెల్దీగా కూడా ఉంటామని నమ్మకంగా చెబుతున్నారు ఫిట్నెస్ కోచ్ సామ్. మరి అవేంటొ చూసేద్దామా..పూల్మఖానా – 100 గ్రాములకు 15 కిలో కేలరీలుస్ట్రాబెర్రీలు – 100 గ్రాములకు 32 కిలో కేలరీలుపుట్టగొడుగులు – 100 గ్రాములకు 22 కిలో కేలరీలుబ్రోకలీ – 100 గ్రాములకు 34 కిలో కేలరీలుక్యారెట్లు – 100 గ్రాములకు 41 కిలో కేలరీలుటమోటాలు – 100 గ్రాములకు 18 కిలో కేలరీలుకీరదోసకాయ – 100 గ్రాములకు 17 కిలో కేలరీలుకాలీఫ్లవర్ – 100 గ్రాములకు 25 కిలో కేలరీలుక్యాప్సికం – 100 గ్రాములకు 31 కిలో కేలరీలుపైనాపిల్ – 100 గ్రాములకు 50 కిలో కేలరీలుయాపిల్స్ – 100 గ్రాములకు 52 కిలో కేలరీలుఊరబెట్టిన దోసకాయలు (గెర్కిన్స్) – 100 గ్రాములకు 12 కిలో కేలరీలుకొత్తిమీర– 100 గ్రాములకు 14 కిలో కేలరీలుఉల్లిపాయలు – 100 గ్రాములకు 40 కిలో కేలరీలునిమ్మకాయ/నిమ్మకాయ – 100 గ్రాములకు 29 కిలో కేలరీలుపాలకూర – 100 గ్రాములకు 23 కిలో కేలరీలుకాలే(క్యాబేజీ జాతికి చెందిన కూరగాయ) – 100 గ్రాములకు 35 కిలో కేలరీలుక్యాబేజీ – 100 గ్రాములకు 25 కిలో కేలరీలుప్రయోజనాలు..వీటిలో ఎక్కువగా నీరు, పైబర్ని ఉంటుంది. అందువల్ల బరువు తగ్గడం సులభం అవ్వడమే కాదు అదుపులో పెట్టొచ్చు. ఇవి తినడం వల్ల కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది. తద్వారా అతిగా తినడం నివారించగలుగుతాం. అదీగాక దీనిలోని ఫైబర్ ఆరోగ్యకరమైన జీవక్రియకు ఉపయోగపడుతుంది. మలబద్దకాన్ని నివారించి ప్రేగు కదలికలను ప్రోత్సహిస్తుంది. ఇందులో చాలా వరకు విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి ఇవి తీసుకుంటే అదనపు కేలరీల కోసం అదనంగా పోషకాలను జోడించాల్సిన అవసరం రాదు అని చెబుతున్నార ఫిట్నెస్ కోచ్ సామ్.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యుల లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం.(చదవండి: కాస్మెటిక్ యాంటీ-ఏజింగ్ చికిత్సల ఖరీదు ఎంతంటే..!) -
అసిడిటీ, గ్యాస్, అజీర్ణ సమస్యలున్నాయా?
అబ్బా.. గ్యాస్ ఎక్కువైంది. సోడా తాగాలితిన్నది అరిగి చావడం లేదు... హాజ్మోలా తీసుకు రాఅసిడిటీ ఎక్కువైపోతోంది. రోజుకో ట్యాబ్లెట్ వేసుకుంటున్నా’’ఇలాంటి డైలాగులు మీరు తరచూ వింటూనే ఉంటారు. ఆల్ ఈజ్ వెల్ అనుకుని మందులు, మాత్రలు మింగుతూ కాలం గడిపేస్తూంటారు. చిన్నవని తీసిపారేసే ఈ సమస్యలు కాలం గడిచేకొద్దీ ముదిరిపోయి రకరకాల ఆరోగ్య సమస్యలకు దారితీస్తూంటాయి. అప్పుడు ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. బోలెడంత డబ్బులు ఖర్చు పెట్టాల్సి వస్తుంది కూడా. ఇలా కాకుండా.. అసలు రోగమే రాకుండా చూసుకోవడమే మేలు కదా? అందుకు ఏం చేయాలంటే..దేశంలో గ్యాస్, అసిడిటీ, అజీర్ణం వంటి సమస్యలు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. మరీ ముఖ్యంగా నగర ప్రాంతాల్లో. వంద మంది నగరవాసుల్లో కనీసం 70 మంది ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. అప్పుడప్పుడు సమస్యలు ఎదుర్కొనేవాళ్లు 59 మందైతే.. వారం రోజుల్లో 12 మంది, రోజూ నలుగురు జీర్ణకోశ సంబంధిత సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. మలబద్ధకం సమస్య 22 మందిని పీడిస్తూంటే.. దేశంలో ఇన్ఫ్లమేటరీ బోవెల్ డిసీజ్ సమస్యతో బాధపడుతున్న వారి సంఖ్య 14 లక్షలు!. ఈ సమస్యలన్నింటికీ తినే ఆహారం కారణమని, జీవనశైలి కూడా తోడ్పడుతుందని ఒకప్పుడు అనుకునేవాళ్లం కానీ.. ఇప్పుడు ఈ జాబితాలోకి ఇంకోటి వచ్చి చేరింది. గట్ మైక్రోబయోమ్!మన జీర్ణకోశంలో బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ వంటివి కనీసం వెయ్యి రకాలు ఉంటాయి. తాజా పరిశోధనల ప్రకారం.. ఈ సూక్ష్మజీవుల వైవిధ్యత, సంఖ్యల్లో తేడా వస్తే అసిడిటీ మొదలుకొని కేన్సర్ వరకూ అనేక రకాల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు పెరిగిపోతాయి. శాస్త్రీయ పరిశోధనల ప్రకారం... 60 శాతం మంది నగర వాసుల్లో నిశ్శక్తి, యాంగ్జైటీ, మూడ్ మారిపోవడం వంటి సమస్యలకు ఈ గట్ మైక్రోబయోమ్(gut microbiom) కారణం!. అందుకే ఇటీవలి కాలంలో మన జీర్ణకోశంలోని సూక్ష్మజీవులను బ్యాలెన్స్ చేసుకునేందుకు, ఉపయోగకరమైన వాటిని పెంచుకునేందుకు రకరకాల పద్ధతులు, అలవాట్లు ప్రచారంలోకి వచ్చాయి. తినే తిండిని మార్చితే..అనేక ఆరోగ్య సమస్యలకు కారణమవుతున్న గట్ మైక్రోబయోమ్ సమస్యను సరి చేసుకోవడం చాలా సులువు కూడా. తినే ఆహారంలో చిన్న చిన్న మార్పుల ద్వారా కొన్ని నెలల్లోపే పూర్వస్థితికి చేరుకోవచ్చునంటున్నారు నిపుణులు. చేయాల్సిందిలా సింపుల్...పీచుపదార్థాలు ఎక్కువగా ఉండే గింజలు, పప్పు ధాన్యాలు, పండ్లు కాయగూరలు తినడం. వీటివల్ల మన జీర్ణకోశంలోని ఉపయోగకరమైన బ్యాక్టీరియా వృద్ధి అవుతుంది.పెరుగు, మజ్జిగ, కెఫిర్ (పాలను కెఫీర్ గింజలతో కలిపి పులియబెట్టి తయారు చేసుకోవాలి), కిమ్చీ, కంబూచా వంటివి తీసుకోవడం వల్ల ఉపయోగకరమైన బ్యాక్టీరియా పెరిగేందుకు ఉపయోగపడుతుంది. వీటిని ప్రోబయాటిక్స్ అని పిలుస్తారు.వెల్లుల్లి, ఉల్లిపాయ, అరటికాయ, ఓట్స్ వంటివి జీర్ణకోశంలోని ఉపయోగకరమైన బ్యాక్టీరియా ఎదిగేందుకు ఉపయోగపడతాయి. ప్రీబయాటిక్స్ అన్నమాట.డార్క్ చాకొలెట్ (కనీసం 70 శాతం కోకో ఉన్నది), గ్రీన్ టీ, రకరకాల బెర్రీస్ వంటివాటిల్లో ఉండే పాలిఫినాల్స్ జీర్ణకోశంలోని సూక్ష్మజీవుల వైవిధ్యత పెరిగేందుకు దోహదపడతాయి. జీర్ణకోశం బ్యాలెన్స్ చేసుకోవడానికి ఆహారం మాత్రమే సరిపోదు. దీంతోపాటు రోజూ కనీసం ఏడు గంటలపాటు నిద్రపోవడం అవసరం. వీలైనంత వరకూ ఒత్తిడిని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల శరీరంలో మంట/వాపులు తగ్గిపోతాయి. ఫ్యాక్టరీల్లో తయారైన ఆహారం, చక్కెర, కృత్రిమ చక్కెరలు, మితిమీరిన మద్యపానం, ధూమపానాలు జీర్ణకోశం లోపలిపొరలను బలహీనపరుస్తాయి. తద్వారా చెడు బ్యాక్టీరియా పెరిగేందుకు కారణమవుతాయి. శరీరం, ఆరోగ్యం సహకరిస్తే ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేయండి. జీర్ణకోశాన్ని కాపాడే మ్యూకస్ ఎక్కువ ఉత్పత్తి అయ్యే అవకాశముంది. చివరిగా... అన్నింటికంటే ముఖ్యమైన విషయం... అవసరమైతే కానీ యాంటీబయాటిక్స్ వాడకూడదు. వీటివల్ల శరీరంలో ఉండే ఉపయోగకరమైన బ్యాక్టీరియా నశించిపోతుంది. :::గిళియారు గోపాలకృష్ణ మయ్యా -
మధుమేహం ఉన్నవాళ్లు అంతరిక్షంలోకి వెళ్లొచ్చా..? శుభాంశు మిషన్..
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం( ఐఎస్ఎస్)లో కి అడుగుపెట్టిన తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించిన ఇండియన్ ఎయిర్ఫోర్స్ గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా తన చరిత్రాత్మక మిషన్ యాగ్జియం-4లో భాగంగా పలు పరిశోధను చేయనున్న సంగతి తెలిసిందే. ఆ పరిశోధనల్లో ఏటా వేలా మంది బాధపడుతున్న దీర్థకాలిక వ్యాధి మధుమేహంపై కూడా అధ్యనం చేయనున్నారట. అంతేగాదు ఒక రకంగా ఈ అధ్యయనం ఆ వ్యాధిని ఎలా నిర్వహించాలో తెలియజేయడమే గాక మధుమేహం వ్యాధిగ్రస్తుల్లో కొండంత ఆశను రేకెత్తించే అవకాశం కూడా ఉందని సమాచారం. మరీ ఆ విశేషాలేంటో చూద్దామా..!. భారతీయ వ్యోమగామి శుభాంశు శుక్లా తన యాగ్జియమ్ మిషన్4లో భాగంగా సుమారు 60కి పైగా శాస్త్రీయ ప్రయోగాల్లో పాల్గొనన్నారు. వాటిలో డయాబెటిస్ వ్యాధిపై అధ్యయనం కూడా ఉంది. ఈ వ్యాధిని ఎలా నిర్వహించొచ్చు లేదా బయటపడొచ్చు అనే దిశగా అధ్యయనాలు చేస్తున్నారు. ముఖ్యంగా మధుమేహం ఉన్న వ్యక్తులు అంతిరిక్షంలోకి వెళ్లొచ్చా..? లేదా అనే దిశగా కూడా పరిశోధనలు చేయనుంది శుభాంశు బృందం. ఎందుకంటే జీరో గ్రావిటీలో రక్తంలోని చక్కెర స్థాయిలపై ఎలాంటి ప్రభావం చూపిస్తోందని మధుమేహం ఉన్న వ్యోమగాములను అంతరిక్ష కార్యకలాపాలను పూర్తిగా మినహాయించారు. ఆ నేపథ్యంలోనే ఈ యాగ్జియ-4 మిషన్ సూట్రైడ్ అనే పరిశోధన ప్రాజెక్టులో భాగంగా ఈ దీర్ఘకాలిక వ్యాధిపై పరిశోధన చేస్తోంది. మధుమేహం ఉన్నవారు అంతరిక్షంలో నివశించడానికి, అక్కడి కార్యకలాపాల్లో పాల్గొనడానకి అనుకూలమా కాదా అనేదే ప్రధాన ధ్యేయం అని ఈ పరిశోధనకు సారథ్యం వహిస్తున్న డాక్టర్ మొహమ్మద్ ఫిత్యాన్ వెల్లడించారు. ఒకరకంగా ఈ పరిశోధన గురుత్వాకర్షణ ప్రభావం లేకుండా జీవక్రియను అధ్యయనం చేసే వీలు కల్పిస్తోందన్నరు. అంతేగాక ఇన్సులిన్ నిరోధకతపై కొత్త మార్గాన్ని అందిస్తుందని చెప్పారు.ఈ పరిధనలోని ముఖ్యాంశాలు..రెండలు వారాల మిషన్ సమయంలో ఒకరు లేదా ఇద్దరు వ్యోమగాములు కంటిన్యూయస్ గ్లూకోజ్ మానిటర్లు (CGM)లను ధరిస్తారు. ఈ పరికరాలు రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలను నిరంతరం పర్యవేక్షిస్తూ డేటాను భూమికి పంపిస్తాయి. ప్రతిక్షణం ఆ వ్యోమగాముల రీడింగ్లు పర్యవేక్షించడం జరుగుతుందని చెప్పారు డాక్టర్ ఫిత్యాన్. ఈ మైక్రోగ్రావిటీలో ఆరోగ్యకరమైన జీవిక్రియ ఎలా మార్పులు సంతరించుకుంటోంది తెలుసుకోవడమేగాక భవిష్యత్తులో డయాబెటిస్ ఉన్న వ్యోమగాములు ఈ సీజీఎం(CGM)లను ధరించి వెళ్లడం సురక్షితం కాదో తెలుసుకోవడంలో హెల్ప్ అవుతుందని చెప్పుకొచ్చారు. ఈ పరిశోధన భూమిపై మారుమూల ప్రాంతాలు లేదా ఎలాంటి సదుపాయాలు లేని ప్రదేశాల్లో ప్రజలకు చాలా ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. అలాగే ఈ పరిశోధన భవిష్యత్తు అధ్యయనాలకు మార్గం సుగమం చేస్తుందని ధీమాగా చెప్పారు. కాగా, ఈ పరిశోధన అనంతరం డయాబెటిస్ ఉన్న తొలి వ్యొమగామిని అంతరిక్షంలోకి పంపి పరిస్థితిని అంచనా వేయడం వంటి మరిన్ని పరిశోధనలు కూడా చేయనున్నట్లు ఫిత్యాన్ వెల్లడించారు.(చదవండి: 'కన్నీళ్లు ఉప్పొంగే క్షణం': శుభాంశు తల్లిదండ్రుల భావోద్వేగం) -
Today Tips టైగర్ దోమ- డెంగ్యూ ఫీవర్, ఈ జాగ్రత్తలు మస్ట్!
Monsoon Health Care వర్షాకాలం వచ్చిందంటే జలుబు, దగ్గు, వైరల్ ఫీవర్లు దండెత్తుతాయి. ముఖ్యంగా డెంగ్యూ వ్యాధి వ్యాప్తికి ఈ సీజన్ చాలా అనుకూలమైంది. ఎందుకంటే దోమలు ఈ సమయంలో బాగా వృద్ధి చెందుతాయి. డెంగ్యూ అనేది దోమల ద్వారా వ్యాపించే ఒక వైరల్ వ్యాధి, ఇది తీవ్రమైన జ్వరం, తలనొప్పి, కండరాలు, కీళ్ల నొప్పులు, చర్మంపై దద్దుర్లు వంటి లక్షణాలు ఉంటాయి. నిర్లక్ష్యం చేస్తే ఒక్కోసారి ప్రాణాపాయం ముప్పు కూడా ఉంది. అందుకే ఇవాల్టి టిప్ ఆఫ్ ది డేలో భాగంగా డెంగ్యూపై అవగాహనకు సంబంధించిన టిప్స్ తెలుసుకుందాం.వర్షాకాలంలో దోమల వ్యాప్తి అధికంగా ఉంటుందన్నారు. ఏడిస్ జాతికి చెందిన టైగర్ అనే దోమ మంచి నీటిలో వృద్ధి చెంది పగటి సమయంలో దాడి చేస్తుంది. ఏడిస్ (Aedes) జాతికి చెందిన దోమలలో టైగర్ దోమ (Asian Tiger Mosquito) ఒకటి. దీని శాస్త్రీయ నామం ఏడిస్ ఆల్బోపిక్టస్ (Aedes albopictus). ఇది నలుపు, తెలుపు చారలతో ఉంటుంది, అందుకే దీనిని పులి దోమ అని కూడా పిలుస్తారు. ఈ దోమల కాటు వల్ల ప్రాణాంతక డెంగ్యూ జ్వరం వ్యాప్తి చెందుతుందన్నారు. దోమల వ్యాప్తిని అరికట్టాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.సాధారణంగా 8-10 రోజుల పాటు వేధించే వ్యాధి.దోమలు కుట్టడం వల్ల ఈ వ్యాధి వస్తుంది. అయితే చాలా వరకు డెంగ్యూ లక్షణాలు సాధారణ జ్వరాన్ని పోలి ఉండడంతో మొదట్లో గుర్తించడం కష్టంగా ఉంటుంది. అయితే నిర్లక్ష్యం చేస్తే కొన్ని సందర్భాల్లో అది ప్రాణాపాయానికి కూడా దారి తీస్తుంది.వర్షపు నీరు నిలిచిపోవడంతో దోమలు వృద్ధి చెందుతాయి. ఈ కాలంలో దోమలు చాలా చురుకుగా ఉంటాయి . ఎక్కడ నిల్వ నీరు, మురుగు నీరు కనిపించినా గుడ్లు పెట్టేస్తాయి. సూర్యోదయం తర్వాత, సూర్యాస్తమయానికి ముందు దోమలు ఎక్కువగా యాక్టివ్ గా ఉంటాయనేది గమనించాలి.. డెంగ్యూ -తీసుకోవలసిన చర్యలుపరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి.నిలిచిపోయిన నీటిని తొలగించాలి. ప్లాస్టిక్ డబ్బాలు, పాత తొట్టెలు , బండి టైర్లలో నీళ్లు నిల్వలేకుండా చూసుకోవాలి. దోమల నివారణకు దోమతెరలు, స్ప్రేలు వాడాలి.డెంగ్యూ వైరస్ సోకిన రోగిని కుట్టిన తర్వాత దోమ ఆ వైరస్ను తీసుకెళ్లి ఆరోగ్యంగా ఉన్న మరో వ్యక్తిని కుట్టినప్పుడు ఈ వ్యాధి వ్యాపిస్తుంది కనుక అప్రమత్తంగా ఉండాలి.వర్షాకాలంలో వీలైనంతవరకు ఇంట్లోనే ఉంటూ, పోషకాహారాన్ని తీసుకోవాలి. వేడి వేడి, శుభ్రమైన ఆహారాన్ని భుజించాలి. జ్వరం, ఇతర లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి డెంగ్యూ జ్వరం లక్షణాలు:అధిక జ్వరంతీవ్రమైన తలనొప్పికను రెప్పల చుట్టూ నొప్పికండరాలు, కీళ్ల నొప్పులు, చిగుళ్లలో రక్తస్రావం,వికారం , వాంతులు,తీవ్రమైన అలసట, చర్మంపై దద్దుర్లునోట్: వర్షకాలంలో జ్వరాలు, వైరల్ ఫీవర్లు, జలుబు, గొంతు నొప్ప సహజం. ప్రతీ చిన్న జ్వరానికి భయపడకూడదు. అలాగని నిర్లక్ష్యమూ తగదు. జ్వరం తీవ్రత,లక్షణాలను బట్టి తక్షణమే వైద్యులను సంప్రదించి, తగిన చికిత్స తీసుకోవాలి. ముఖ్యంగా ఇంట్లోని పిల్లలు, వృద్ధుల పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలి. -
Today tip : ఒళ్లంత తుళ్లింత.. ఈ టిప్స్ తప్పవు మరి!
చిరు జల్లుల, హోరు వానలతో వర్షాకాలం హాయిగా మనల్ని పలకరించేసింది. ఒళ్లంత తుళ్లింత కావాలిలే.. గుండెల్లో జల్లంతా కురవాలిలే! అన్న మురిపెం మాత్రమే కాదు ఇది వ్యాధులు ముసురుకునే కాలం కూడా. వైరస్లు, బ్యాక్టీరియా విజృంభించే కాలం. ఇన్ఫెక్షన్లు చాలా తొందరగా వ్యాపిస్తాయి. ఫలితంగా వైరల్ ఫీవర్లు, జలుబు, దగ్గు, గొంతు నొప్పి, కలరా, టైఫాయిడ్ ముసిరే అవకాశం ఉంది. ఇవాల్టి టిప్ ఆఫ్ ది డే లో భాగంగా వర్షకాలంలో తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు గురించి తెలుసుకుందాం.వేసవి తర్వాత వాతావరణంలో జరిగే మార్పులు, రుతుపవనాలు మార్పుల తదితర కారణా లరీత్యా సీజనల్ వ్యాధులు దాడిచేస్తాయి.ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది.ఎడతెరపి లేని వర్షాలు, వాటివల్ల నిల్వ ఉండే నీటిలో దోమలు ఆవాసాలను ఏర్పరచుకోవడం, రోడ్లపై మురిగిన నీరు ఉండటం.. ఇలా రకరకాల కారణాల వల్ల సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందుతాయి.నీటికుంటలో, కాలువల్లో, ఇంటి పరిసరాల్లో నీరు చేరకుండా చూసుకోవాలి. నిల్వ ఉన్న నీరు దోమలకు, బ్యాక్టీరియాలు, శిలీంధ్రాలకు సంతానోత్పత్తి నిలయంగా మారి,వ్యాధులకు కారణమవుతాయి.దోమల డెంగ్యూ, మలేరియా టైపాయిడ్ తో పాటు గాలి ద్వారా వ్యాపించే జబ్బులు జలుబు, గొంతునొప్పి వస్తాయి. (Today Tip బరువు తగ్గాలంటే.. జామ ఆకూ ఔషధమే)వర్షాల వల్ల నీరు కలుషితమయ్యే అవకాశాలు ఎక్కువ. అందుకే శుభ్రమైన, కాచి చల్లార్చిన నీటిని తాగడం మంచిది. గోరువెచ్చని నీటిని తాగితే ఇంకా మంచిది.తాజాకూరగాయలు, పండ్లు తీసుకోవాలి. ముఖ్యంగా వర్షాకాలంలో ఆకుకూరలు వాడేటపుడు మరింత జాగ్రత్తగా ఉండాలి. శుభ్రంగా కడిగి, బాగా ఉడికించి తీసుకోవాలి.బయట ఫుడ్కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఇంట్లోనే తయారు చేసుకున్న ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వాలి. కలుషిత ఆహారం ద్వారా వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉంటుంది. అందుకే వీలైనంతవరకు స్ట్రీట్ ఫుడ్ తినడం మానుకోవాలి.ఆహారానికి తీసుకునేముందు ముందు చేతులు కడుక్కోవాలి.ఏదైనా తినడానికి ముందు శుభ్రంగా చేతులు కడుక్కోవాలి. ఈ చిన్న అలవాటు మిమ్మల్ని ప్రమాదకర బ్యాక్టీరియా, వైరస్ నుంచి కాపాడుతుంది. ముఖ్యంగా పిల్లలకు దీన్ని బాగా అలవాటు చేయాలి.రాత్రి పూటదోమలు కుట్టకుండా దోమతెరలు వాడటం మంచిది. బాగా చల్లగా ఉన్నపుడు శరీరం వెచ్చగా ఉండేలా ఉన్ని దుస్తులు ధరించాలి.పోషకాహారం ఆహారంపై శ్రద్ధపెట్టాలి. రోగనిరోధక శక్తి బలపడేలావిటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉండే ఆహారాలు ఎక్కువగా తినాలి. ఇవి వ్యాధులు రాకుండా నివారిస్తాయి.వర్షం అనగానే సంబరపడిపోయే పిల్లల్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఒక వేళ వర్షంలో తడిచినా, వెంటనే శుభ్రంగా తుడిచి పొడి బట్టలు వేయాలి. ముఖ్యంగా తల తడి లేకుండా చూసుకోవాలి. ఏమాత్రం అశ్రద్ధ చేసినా అనారోగ్యం తప్పదు.ఇదీ చదవండి : కూతురి కోసం ప్రాణాలను సైతం లెక్కచేయని తండ్రి సాహసం, వైరల్ వీడియోపిల్లల్లో జలుబు, చిన్నపాటి జ్వరాల నుంచి కాపడడానికి అల్లం, తులసి, వామ్ము ఆకులతో చేసిన కషాయానికి కొద్దిగా తేనె కలిపి ఇస్తే మంచి ఉపశమనం లభిస్తుంది.నోట్ : ఈ జాగ్రత్తలు పాటిస్తూనే ఎలాంటి అనారోగ్య లక్షణాలు కన్పించినా వెంటనే వైద్యుడిని సంప్రదించి చికిత్స తీసుకోవడం ఉత్తమం. -
పుట్టగొడుగులను అలానే వండేయొద్దు..! నిపుణుల షాకింగ్ విషయాలు
పుట్టగొడుగులు లేదా మష్రూమ్స్ రుచికరమే కాకుండా ఆరోగ్యకరం కూడా. అయితే వీటి నుంచి మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు పొందాలనుకుంటే..అలా నేరుగా వండకూడదట. ఈ పుట్టగొడుగులు విటమిన్ డీకి సంబంధించిన ఆహారాల్లో ఒకటి. అందువల్ల వాటి నుంచి సమృద్ధిగా విటమిన్డీ తోపాటు మంచి ఆరోగ్య ప్రయోజనాలు పొందాలంటే ఫ్రిజ్ నుంచే లేదా మార్కెట్ నుంచి కొనుగోలు చేసి నేరుగా వండేయకూడదని పోషకాహార నిపుణుల చెబుతున్నారు. మరి ఎలా వండాలంటే..పుట్టగొడుగులు(Mushrooms)ను వండడానికి ముందు కొద్దిసేపు ఎండలో వదిలేసి వండితే విటమిన్ డీని గణనీయంగా పొందగలుగుతామని చెబుతున్నారు నిపుణుడు. సుమారు 15 నుంచి 30 నిమిషాలు సూర్యకాంతికి గురి చేస్తే విటమిన్ డీ స్థాయిలు అనూహ్యంగా పెరుగుతాయని పరిశోధనల్లో కూడా తేలింది. ఎందుకంటే వీటిలో ఎర్గోస్టెరాల్ ఉంటుందట. ఇది సూర్యకాంతికి గురవ్వడంతో విటమిన్ డీగా మారడాన్ని గుర్తించారట. అందువల్ల ఆరోగ్యానికి అత్యంత ముఖ్యమైన విటమిన్ డీ కోసం కొద్దిసేపు సూర్యకాంతిలో ఉంచి వండమని సూచిస్తున్నారు. కలిగే లాభాలు..బరువుని అదుపులో ఉంచుతుంది. పేగు ఆరోగ్యం, రోగనిరోధక శక్తికి హెల్ప్ అవుతుందిమెదుడు ఆరోగ్యం తోపాటు దృష్టిని మెరుగుపరుస్తుంది. కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుందిఎముకలు దృఢంగా ఉండేలా చేస్తుంది. అలాగే ఎముకల వ్యాధులు దరిచేరవుఎలా ఎండబెట్టాలంటే.. వీటిని కాంతికి దూరంగా నిల్వచేసినా లేదా ప్రిజ్ నుంచి నేరుగా ఉడికించిన ఈ విటమిన్ని సమృద్ధిగా పొందలేరటఈ పుట్టగొడుగులను ముక్కలుగా కోసి సూర్యకాంతిలో అంటే ఉదయం 10 నుంచి మధ్యాహ్నం రెండు గంటల మధ్యలో ఓ 30 నుంచి 60 నిమిషాలు ఉంచితే చాలట. ఏ రోజు వండాలనుకుంటున్నామో ఆ రోజే ఎండలో ఉంచి వండితే మరి మంచిదటకేవలం 100 గ్రాముల సూర్యరశ్మికి గురైన పుట్టగొడుగులు 10–15 మైక్రోగ్రాముల విటమిన్ డి 2 లభిస్తుందట.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం(చదవండి: ఎయిమ్స్కు తొలి మహిళా డైరెక్టర్ ఆమె..! నాటి ప్రధాని ఇందిరా గాంధీ అంతిమ క్షణాల్లో..) -
యాప్ ఆరోగ్యం సేఫ్!
కాలం మారుతున్న కొద్దీ మన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, పని ఒత్తిడి ఇవన్నీ వివిధ రకాల ఆరోగ్య సమస్యలకు దారితీస్తున్నాయి. ఇదే సమయంలో సాంకేతిక పరిజ్ఞానం కూడా వేగంగా అభివృద్ధి చెందుతూ, అనేక రంగాల్లో మార్పులకు దారితీస్తోంది. ముఖ్యంగా ఆరోగ్య రంగంలో టెక్నాలజీ తెచి్చన విప్లవాత్మక మార్పులు ఎంతో ఆశాజనకంగా మారాయి. ఒకప్పుడు వైద్య పరీక్షల కోసం ఆస్పత్రుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉండేది. ప్రస్తుతం ఆ అవసరం తగ్గిపోయింది. కేవలం స్మార్ట్ఫోన్ ఉంటే సరిపోతుంది. ఆరోగ్యానికి సంబంధించిన ఎన్నో అంశాలను మనం ట్రాక్ చేయగలుగుతున్నాం. దీని వల్ల ఆరోగ్యంపై అవగాహన పెరగడమే కాకుండా ముందు జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఏర్పడుతోంది. – సాక్షి, సిటీబ్యూరో సాంకేతికత మన ఆరోగ్య సంరక్షణ విధానాన్ని పూర్తిగా మార్చేస్తోంది. అప్రమత్తతతో సరైన యాప్లను ఎంచుకొని ఉపయోగించుకుంటే, రోజువారీ జీవనశైలిలో ఆరోగ్యాన్ని మెరుగుపర్చుకోవడం చాలా సులభం. టెక్నాలజీ ఆధారంగా ఆరోగ్య సంరక్షణ ఇప్పుడు ఒక శక్తివంతమైన సమాచారంగా మారుతోంది. ప్రస్తుతం ఆరోగ్య సంరక్షణకు మార్కెట్లో అనేక అనుసంధానిత యాప్లు అందుబాటులో ఉన్నాయి. ఇవి వివిధ అవసరాలకు అనుగుణంగా రూపుదిద్దుకున్నాయి.హార్ట్ రేట్ మానిటర్, ఈసీజీ యాప్లు : హార్ట్ బీట్స్ను ట్రాక్ చేయడం, ఏవైనా అసాధారణ పరిస్థితులు ఉన్నాయా అనే విషయం తెలుసుకోవడం ఈ యాప్ల ద్వారా సాధ్యమవుతుంది. ఉదాహరణకు కార్డియా మొబైల్, వెల్ట్రాయ్ వంటి యాప్లు ఇంటి వద్ద నుంచే గుండె పనితీరును గమనించేందుకు తోడ్పడుతున్నాయి. స్కిన్ కేర్ అనలైజర్ యాప్స్ : నిద్రలేమి, కాలుష్య వాతావరణ ప్రభావం వంటి వాటి వల్ల ఏర్పడే చర్మ సమస్యలను అంచనా వేసి, తగిన చిట్కాలు అందించే యాప్లు మనకు అందుబాటులో ఉన్నాయి. స్కిన్ విజన్, ట్రోవ్ స్కిన్ వంటి యాప్లు అందులో ముఖ్యమైనవిగా నిలుస్తున్నాయి. ఉమెన్ హెల్త్, ప్రెగ్నెన్సీ ట్రాకర్స్ : గర్భిణుల ఆరోగ్యానికి సంబంధించి ప్రతి దశనూ గమనిస్తూ, తగిన ఆహారం, వ్యాయామ సూచనలు, నిద్ర పద్ధతులు వంటి విషయాల్లో దారి చూపించే యాప్లు ఇప్పుడు చాలా ప్రాచుర్యంలో ఉన్నాయి. బేబీ సెంటర్, ఫ్లో, ఒవియా ప్రెగ్నెన్సీ వంటి యాప్లు మహిళల ఆరోగ్య సహచరులుగా మారాయి. మెంటల్ వెల్నెస్ యాప్స్: మానసిక ఆరోగ్యం కూడా శారీరక ఆరోగ్యానికంతే ముఖ్యం. ఈ అవసరాన్ని గుర్తించి కామ్, హెడ్ స్పేస్, మైండ్ హౌస్ వంటి యాప్లు ధ్యానం, బ్రీథింగ్ టెక్నిక్లు, అనువైన నిద్ర కోసం ఉపాయాలను అందిస్తున్నాయి. డైట్ – ఫిట్నెస్ ట్రాకర్స్ : ఆరోగ్యకరమైన జీవనశైలికి సరైన ఆహారం, శారీరక చురుకుదనం అవసరం. మై ఫిట్నెస్ పాల్, హెల్తిఫై మీ, ఫిట్టర్ వంటి యాప్లు రోజువారీ కేలరీలు, వ్యాయామం, నీటి మోతాదు మొదలైన వాటిని ట్రాక్ చేస్తాయి. ఇలాంటి యాప్స్ వల్ల ఉపయోగాలు.. ‡ సులభతరం : యాప్ల ద్వారా వైద్యుడు వద్దకు వెళ్లకుండా ప్రాథమిక ఆరోగ్య సమస్యలను గుర్తించవచ్చు. సకాలంలో హెచ్చరికలు: కొన్ని యాప్లు ఆరోగ్య సూచీలను విశ్లేíÙంచి ప్రమాద సూచనలుగా అలర్ట్ చేస్తాయి. ‡ వ్యక్తిగత సమాచారం ఆధారంగా : ప్రతి వ్యక్తి ఆరోగ్య సమాచారాన్ని అనుసంధానం చేసుకుని యాప్లు ప్రత్యేకమైన మార్గదర్శకతను ఇస్తాయి. ‡ అనుసంధానం: ఫిట్నెస్ బ్యాండ్లు, స్మార్ట్వాచ్లు, డిజిటల్ బీపీ మానిటర్లు వంటి పరికరాలను యాప్తో అనుసంధానించి మరింత ఖచ్చితంగా డేటా పొందవచ్చు.ఆరోగ్యపరమైన అలవాట్లకు : నిద్ర సమయం గుర్తుచేయడం, నీరు తాగమని రిమైండర్ చేయడం లాంటి చిన్న విషయాలు ఆరోగ్యానికి బాగా సహాయపడతాయి. జాగ్రత్తలు కూడా అవసరమే.. నోట్: ఆరోగ్య యాప్ల వినియోగిస్తున్నప్పుడు కొన్ని విషయాలను గమనించాలి. ముందుగా, వాడే యాప్ విశ్వస నీయమైనదేనా? డేటా ప్రైవసీ ఎలా ఉంది? యాప్ ఇచ్చే సమాచారం వైద్యుని సలహాకు ప్రత్యామ్నాయంగా కాకుండా, తోడ్పాటు సాధనంగా ఉపయోగపడేలా ఉండాలి. ‘ఆరోగ్య సమస్యల విషయంలో తుది నిర్ణయం ఎప్పుడూ వైద్యునిదే కావాలి’. -
ఆ ప్రమాదం : వాళ్ల ప్రేమకు పునర్జన్మ!
సురేశ్, సమీర (పేర్లు మార్చాం) ప్రేమించుకున్నారు. అయితే అన్ని ప్రేమకథల్లోలాగే అమ్మాయి వాళ్ల పెద్దలు ఈ ప్రేమను ఒప్పుకోలేదు. కలిసే బతుకుదామని నిర్ణయించు కున్నారు. పారిపోయి పెళ్లి చేసుకుందామనుకున్నారు. అమ్మాయి నిర్ణీత స్థలానికి రాగానే అప్పటికే అక్కడ టూ వీలర్ మీద వెయిట్ చేస్తున్న సురేశ్... సమీరను పికప్ చేసుకున్నాడు. అసలే యాంగై్జటీ. తమను వెతికేవారికి దొరక్కూడదనే టెన్షన్. ఆ యాంగై్జటీ, టెన్షన్లతో బండి వేగంగా నడిపాడు. ఫలితం... బండి బోల్తా కొట్టి యాక్సిడెంట్ అయ్యింది. వెంబడిస్తున్న సమీర తరఫు బంధువులకు అమ్మాయి చిన్న చిన్న దెబ్బలతో సేఫ్గానే దక్కింది. కానీ... సురేశ్ తల బద్దలైంది. అచ్చం అతడి ప్రేమలా! సురేశ్ మెదడు బయటకు వచ్చింది. ఛాతీ ఎముకలూ విరిగాయి. పొట్టలోకి నీరు వచ్చింది. ఇలా మెడికల్కు సంబంధించిన మల్టీ డిసిప్లినరీ సమస్యలెన్నో వచ్చాయి. ఆ స్థితిలో తీసుకువచ్చిన సురేశ్కు చికిత్సలు చాలా జాగ్రత్తగా అందించాల్సి వచ్చింది. తల తాలూకు చిన్న చిన్న ముక్కలు కొన్ని (మరీ లోతుగా కాకపోయినా) మెదడులోనూ ఇరుక్కున్నాయి. మెదడులోకి లోతైన గాయాలు కాకుండా వాటిని చాలా జాగ్రత్తగా బయటకు తీయాల్సి వచ్చింది. వెంటిలేటర్పై పెట్టి చికిత్స ఇవ్వాల్సిన పరిస్థితి.అత్యంత సునిశితమైన చికిత్సలూ, గాజుబొమ్మలా చూసుకున్న జాగ్రత్తల తర్వాత ఎట్టకేలకు సురేశ్ కోలుకున్నాడు. ఈలోపు... వాళ్ల ప్రేమకథలో ఓ ట్విస్ట్. అతడి యాక్సిడెంట్ వృత్తాంతం వాళ్ల క్లోజ్ క్లోజ్ సర్కిల్స్లో వ్యాపించడంతో అతడికి సంబంధాలేమీ రాలేదు. అటువైపు ఆ అమ్మాయి పరిస్థితీ అంతే. బద్దలైన తల తాలూకు చిన్న చిన్న ముక్కల్నీ పేర్చి అతికిస్తే అవే మెల్లగా అమరాయి కదా... అచ్చం అలాగే పెద్దలు బద్దలు చేయాలనుకున్న వాళ్ల ప్రేమ కూడా చక్కగా కుదిరింది. వెరసి పెళ్లీ జరిగింది. తన కాళ్ల మీద నిలబడ్డ సురేశ్ ఇప్పుడు ఓ మంచి రెస్టారెంట్ నడుపుతున్నాడు. వాళ్లిద్దర్నీ చూసినప్పుడు ఇప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది. డాక్టర్ ఎస్. రమేశ్ సీనియర్ న్యూరో సర్జన్, మినిమల్ యాక్సెస్ బ్రెయిన్ – స్పైన్ సర్జన్, కామినేని హాస్పిటల్స్, హైదరాబాద్యాసీన్ -
ఐఏఎస్ కల : మృత్యువు పెట్టిన ‘పరీక్ష’ పాసయ్యాడు!
ఎలాగైనా యూపీఎస్సీ పరీక్ష రాసి ఐఏఎస్ సాధించాలనే తపనతో చదువుతున్నాడు మిస్టర్ రంజిత్ (పేరు మార్చాం). అతడు నరాలు తెగే ఏకాగ్రతతో చదువుతుంటే గులియన్ బ్యారీ సిండ్రోమ్ (జీబీఎస్) అనే సమస్య అతడి నరాలను దెబ్బతీసింది. జీబీఎస్ అనేది నరాలకు సంబంధించిన వ్యాధి. ఏదైనా ఇన్ఫెక్షన్కు గురైన తర్వాత వస్తుందిది. ఇందులో నుంచి దేహంలోని ప్రతి భాగానికీ ఆదేశాలందించే నరాలపైన ఉండే ‘మైలీన్’ అనే పొర దెబ్బతింటుంది. సొంత వ్యాధి నిరోధక వ్యవస్థలోని యాంటీబాడీస్ వెలువడి... అవి తమ సొంత మైలీన్ పొరను దెబ్బతీసినప్పుడు మెదడు నుంచి వచ్చే సిగ్నల్స్ అందక సొంత అవయవాలు అచేతనమవుతాయి. అందునా ఈసారి రంజిత్కు వచ్చిన వ్యాధి మామూలు జీబీఎస్ కాదు. జీబీఎస్ వచ్చేవాళ్లలోనూ ప్రతి 1000 మందిలో ఒకరికి మాత్రమే వచ్చే అరుదైన, అత్యంత తీవ్రమైన గులియన్ బ్యారీ సిండ్రోమ్ (Guillain-Barré syndrome (GBS) రకమిది. నరాల కూడలి (నోడల్) ప్రదేశాల్లో వస్తుంది కాబట్టి దీన్ని ‘నోడోపతి’ అంటారు. అది ఎంతటి తీవ్రమైనదంటే... సాధారణంగా కాళ్ల నుంచి పైకి చచ్చుబడిపోయేలా చేసే ఆ వ్యాధి... ఇతడిలో మాత్రం దేహమంతా అచేతనమయ్యేలా చేసింది. ఊపిరి తీసుకునేందుకు సహాయపడే కండరాలు అచేతనమైపోతే కొద్ది క్షణాల్లోనే ప్రాణం పోతుంది కదా. అలాంటిది అతడి కంటికి సంబంధించిన కండరాల్లో కొంత మినహాయించి మిగతా దేహమంతా కదలిక లేకుండా పోయింది. సొంత వ్యాధి నిరోధక వ్యవస్థ అతడిని దెబ్బతీసిందేమో కానీ పరిస్థితులు అతడి సంకల్ప బలాన్ని ఏమాత్రమూ దెబ్బతీయలేకపోయాయి. సొంత కుటుంబ సభ్యులు అండగా నిలబడ్డ తీరు అసామాన్యం, అనితరసాధ్యం, నిరుపమానం, నిరంతర స్ఫూర్తి. సొంత సోదరి కూడా ఐఏఎస్కు ప్రిపేర్ అవుతుండటంతో ఆమె అతడిలో మోటివేషన్ నింపుతూ ఉంది. అతడి పరిస్థితికి అతడిలోని వ్యాధి నిరోధక వ్యవస్థను బలోపేతం చేసేందుకు ఐవీఐజీ అనే తరహా ఇమ్యునోథెరపీ ఇవ్వాల్సి ఉంది. ఇది బాగా ఖరీదైన చికిత్స. అతడిది కేవలం ఓ దిగువ మధ్యతరగతి కుటుంబం. దాంతో అతడి మనోబలాన్ని పెంచేందుకూ, అతడిలో స్ఫూర్తి రగిలించేందుకూ మేం డాక్టర్లం కూడా అతడికి ఆర్థికంగా కొంత సహాయం (క్రౌడ్ ఫండింగ్) చేశాం. ఆసుపత్రి కూడా తనవంతు అండదండలందించింది. అన్నివైపుల నుంచి అందుతున్న సహకారాలతో అతడు రెండునెలల పాటు ఐసీయూలో వ్యాధితో పోరాడాడు. ఈలోపు మరో రెండుసార్లు ఇన్ఫెక్షన్ వచ్చి అతడిని మృత్యువు అంచులవరకూ తీసుకెళ్లింది. దాంతో అతడి పరిసరాలు అత్యంత శుభ్రంగా ఉండేలా చేశాం. అతడికి అందే ఆహారాలు బలవర్థకంగా ఉండేలా చూశాం. రిటుక్సిమాబ్ అనే ఇమ్యూన్ సపోర్ట్ మందులిచ్చాం. ఇలా అనేక ప్రయత్నాలు చేసి అతడిని కాపాడాం. రెండు నెలల పాటు అతడి నరాలకు ఏ ఆహారమూ అందకపోవడంతో, అవి రెండునెలల పాటూ ఏ పనీ చేయకపోవడంతో... ఆ తర్వాత ఎంతో బలహీనపడి శక్తిపుంజుకునేందుకు ఎంతో కష్టమైంది. అయినప్పటికీ ఫిజియోథెరపీ సహాయంతో అతడెంతో కష్టపడి బయటకొచ్చాడు. ఇప్పుడు హాయిగా హ్యాపీగా ఉన్నాడు. చదవండి: బరువైన బతుకులో చిరునవ్వు .. డాక్టర్నే ఇన్స్పైర్ చేసిన ఇంట్రస్టింగ్ కథనంఈ ఏడాది కాకుండా ఆ వచ్చే ఏడాది పరీక్ష రాద్దువుగానీ అంటే... ‘‘లేదు సర్... మీరిచ్చిన ప్రోత్సాహంతో ఈ ఏడాది కూడా పరీక్ష రాయాల్సిందే. అది కుదరకపోతే నేను చెబుతుంటే ఎవరైనా స్క్రైబ్ను పెట్టుకునైనా సరే’’ అన్నాడా అబ్బాయి. మేం ఒక టీమ్గా పనిచేసే డాక్టర్లమంతా కలిసి, మా శక్తియుక్తులన్నీ వెచ్చించి, సంయుక్తంగా అతడిని మృత్యుదేవత ఒడిలోంచి బలవంతంగా వెనక్కుతీసుకొచ్చామంటే అది అతిశయోక్తి కాదు. ఇదీ చదవండి: కూతురి కోసం ప్రాణాలను సైతం లెక్కచేయని తండ్రి సాహసం, వైరల్ వీడియోక్రిటికల్ కేర్లో పనిచేసే మేము రోజులోని 24 గంటలూ క్రిటికల్ కేసుల్నే చూస్తాం. ఇటీవలే మేం ఒక డబుల్ ట్విన్స్ కడుపులో ఉన్న మహిళను రక్షించాం. అత్యంత సంక్లిష్టమైన టీబీ ఇన్ఫెక్షన్లూ, చాలా అరుదుగా కనిపించే మెనింజైటిస్ విత్ టీటీపీ అనే కేసులూ చూశాం. కానీ ఇలా చదువుకోసం తాపత్రయపడే ఓ చురుకైన కుర్రాణ్ణి మేమంతా ఓ టీమ్గా రక్షించిన ఉదంతం మాకు ఎంతో సంతృప్తినిచ్చింది.డాక్టర్ హర్ష్ ఖండేలియా సీనియర్ కన్సల్టెంట్ క్రిటికల్ కేర్ ఫిజీషియన్, కిమ్స్ హాస్పిటల్స్, సికింద్రాబాద్-యాసీన్ -
5 వేల కిలోమీటర్ల దూరం నుంచి రెండుగంటల్లో సర్జరీ : విప్లవాత్మక అడుగు
చైనా వైద్యులు వైద్యచరిత్రలో విప్లవాత్మకమైన పురోగతి సాధించారు. ఉపగ్రహ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి 5,000 కిలోమీటర్ల దూరం నుండి రిమోట్ రోబోటిక్ ఆపరేషన్ నిర్వహించి రికార్డు సృష్టించారు. శాటిలైట్ కమ్యూనికేషన్ ద్వారా ఇలా శస్త్రచికిత్స చేయడం ప్రపంచంలోనే ఇది తొలిసారి. టిబెట్లోని లాసాలో ఉన్న వైద్య బృందం బీజింగ్లోని 5000 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇద్దరు రోగులకు రోబోటిక్ సాయంతో కాలేయ శస్త్రచికిత్స నిర్వహించింది. PLA జనరల్ హాస్పిటల్కు చెందిన ప్రొఫెసర్ రోంగ్ లియు నేతృత్వంలో కాలేయ శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. ఉపగ్రహ కమ్యూనికేషన్ను ఉపయోగించి ఇప్పటివరకు నిర్వహించిన అతి పొడవైన దూర శస్త్రచికిత్సగా నిలిచింది.Apstar-6D ఉపగ్రహం ద్వారా 68 ఏళ్ల కాలేయ కేన్సర్ రోగి, 56 ఏళ్ల హెపాటిక్ హెమాంగియోమాకు ఈ రెండు శస్త్రచికిత్సలు నిర్వహించారు. కేవలం 125 నిమిషాల్లో బ్లడ్ లాస్ లేకుండా చేయడమే కాదు, 24 గంటల్లో రోగులు పూర్తిగా కోలుకోవడం విశేషం. ఉపగ్రహ శస్త్రచికిత్స, సిద్ధాంతపరంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నప్పటికీ, సిగ్నల్ ఆలస్యం కారణంగా సవాళ్లను ఎదుర్కొంది. వీటిని అధిగమించడానికి, ప్రొఫెసర్ లియు బృందం మూడు ప్రధాన ఆవిష్కరణలను ప్రవేశపెట్టింది: 632 ms జాప్యంలో కూడా రోబోటిక్ హ్యాండ్ లోపాన్ని 0.32 mmకి పరిమితం చేసేలా న్యూరాల్ నెట్వర్క్ను వినియోగించింది. అలాగే ఉపగ్రహం విఫలమైతే తక్షణమే 5G బ్యాకప్కు మారే ద్వంద్వ-లింక్ వ్యవస్థను, HD ఇమేజింగ్ను కొనసాగిస్తూనే, డేటా లోడ్ను 62శాతం తగ్గించేందుకు డైనమిక్ బ్యాండ్విడ్త్ కేటాయింపును వాడింది.ఇదీ చదవండి: కొడుకు స్నేహితుడితో పెళ్లి, త్వరలో బిడ్డ : వ్యాపారవేత్త లవ్ స్టోరీ వైరల్రిమోట్,విపత్తు ప్రభావిత ప్రాంతాలకు అధునాతన శస్త్రచికిత్స సేవలు అందించడంలో ఇది కీలక మలుపు అని ప్రొఫెసర్ లియూ చెప్పారు. ముఖ్యంగా వైద్యులు సకాలంలో చేరుకోలేని వార్ జోన్స్, ప్రకృతి వైపరీత్యాలలో క్లిష్టమైన రెస్క్యూ మిషన్లకు ఇది చక్కటి పరిష్కారం అన్నారు. చైనా ఇప్పుడు ఉపగ్రహ సాంకేతికతో చేసే ఆపరేషన్ల మోడల్ను విస్తృత జాతీయ ఆరోగ్య సంరక్షణ వ్యూహాలలో చేర్చాలని యోచిస్తోంది. ఇది అంతరిక్ష ఆధారిత వైద్యం విషయంలో కొత్త యుగానికి నాంది పలికిందని నిపుణులు పేర్కొంటున్నారు.చదవండి: 900 గంటలు, 180 బటన్స్ : ఆమె స్పెషల్ వెడ్డింగ్ గౌను విశేషాలు -
మన మనో బలం ఎంత?
కొందరు ఎప్పుడూ ఆడుతూపాడుతూ, నవ్వుతూ, తుళ్లుతూ ఉంటారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ అలాగే కనిపిస్తుంటారు. పైగా ఆ పరిస్థితిని ఎదుర్కొనేంత ధైర్యాన్ని కనబరుస్తుంటారు. తమ మానసిక బలంతో సంక్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కొంటారు. తాము విజయం సాధిస్తే మరీ మంచిది. ఒకవేళ సాధించలేకపాయినా తమ ప్రయత్నం మాత్రం మానరు. ఇక మరికొందరు చిన్న చిన్న సమస్యకే డీలాపడిపాతుంటారు. కిందా మీదా పడుతూ ఎంతో ప్రయాస పడుతున్నట్టుగా కనిపిస్తారు. వాళ్ల మాటల్లో ఆందోళన, నిరుత్సాహం, చిరాకు, చికాకూ అన్నీ కనిపిస్తుంటాయి. అందరూ మనుషులే.. అయితే వాళ్ల మధ్య ఈ వ్యత్యాసాలెలా కనిపిస్తున్నాయి? ఈ తేడాలెందుకున్నాయి? ఎందుకంటే ఒక్కొక్కరికి ఐక్యూలలో తేడాలున్నట్టే... వాళ్ల ఎమోషన్ కోషియెంట్ (ఈక్యూ)లలో ఉన్న తేడాల వల్ల. ఎమోషనల్ కోషియెంట్ అంటే ఏమిటి, అది ఎందుకు అవసరం, దాన్ని ఎలా అభివృద్ధి పరచుకోవాలి... వంటి అనేక అంశాలను తెలిపేదే ఈ కథనం. ఐన్స్టైన్ చాలా మేధావి అనీ, అతడి ఐక్యూ సాధారణ జనాల ఐక్యూ కంటే చాలా ఎక్కువనే మాట వినే ఉంటారు. ఐక్యూ వల్ల తెలివితేటలు బాగానే ఉండవచ్చు. కానీ జీవితంలో విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేందుకు అవసరమైనది ఎమోషనల్ కోషియెంట్. అలాంటి ‘ఈక్యూ’ గురించి తెలుసుకుందాం.ఎమోషనల్ ఎపిడమిక్... ఏదైనా వైరస్ లేదా బ్యాక్టీరియా వంటి వాటి వల్ల అనేక చోట్ల ఒక్కసారిగా వ్యాధులు పెచ్చరిల్లి వ్యాప్తిచెందుతూ ఉంటే దాన్ని ఎపిడమిక్ అంటారు కదా. మరి ఇప్పుడున్న వాతావరణంలో ఎమోషన్ ఎపిడమిక్ అనే పరిస్థితి నెలకొని ఉందని అనుకోవచ్చు. అసలు ఎమోషనల్ ఎపిడమిక్ అంటే ఏమిటో చూద్దాం. ఈ మధ్యకాలంలో మన సమాజంలో అనేక రకాల మానవ సంబంధాలకు (రిలేషన్షిప్ప్రాబ్లమ్స్కు) సంబంధించిన సమస్యలు పెరుగుతున్నాయి. సంక్లిష్టమైన ఈ మానవ సంబంధాలతో వచ్చే మానసిక వేదనలూ, దౌర్బల్యాలూ, కుంగుబాట్ల వల్ల అనేక అనర్థాలూ చోటు చేసుకుంటున్నాయి. ఈ తరహా కుటుంబ కలహాలు... భార్యాభర్తలు, తల్లిదండ్రులు–పిల్లలూ, అన్నాచెల్లెళ్లూ, అక్కా తమ్ముళ్లూ... స్నేహితులూ, ఇతరుల మధ్య... దాదాపుగా ఇలాంటి సమస్యలు లేనివారంటూ ఉండరనే చెప్పవచ్చు. కాకపోతే వాటి తీవ్రతలోనే తేడా ఉంటే ఉండవచ్చుగానీ... సమస్యలంటూ లేనివారు ఉండరు. ఇలా అన్నిచోట్లా ఇలాంటి మానసిక సమస్యలు పెచ్చరిల్లి మానవ సంబంధాలు ప్రభావితం కావడాన్ని ‘ఎమోషనల్ ఎపిడెమిక్’గా చెప్పవచ్చు. ఈ ఎమోషనల్ ఎపిడమిక్కు కారణం... మనం, చదువుకూ, డబ్బుకూ ఇచ్చిన ప్రాధాన్యాన్ని ఉద్వేగాలకు అతీతంగా స్థిరంగా ఉండటానికి... అంటే ‘ఎమోషనల్ డెవలప్మెంట్’కు ఇవ్వకపోవడమే. దాంతో క్షణికోద్రేకాలు... వాటి కారణంగా ఘర్షణలూ, కొన్నిసార్లు ఆత్మహత్యలు, హత్యల వంటివీ చోటు చేసుకుంటున్నాయి. దీనికి కారణం మనుషుల్లో ఐక్యూలాగా... ఈక్యూను అంటే ఎమోషనల్ కోషియెంట్ను కూడా పెంపోందించుకోవాలన్న దృష్టి కొరవడటం. అందుకే ఇప్పుడు స్కూలు పిల్లల చదువులలో ఐక్యూతో పాటు ఈక్యూనూ పెంచడంతోపాటు చిన్నప్పట్నుంచే పిల్లలకు ఈక్యూ కూడా పెంపోందేలా చూడటం అవసరం.భావోద్వేగ మేధాశక్తి అంటే ఏమిటి? ఏదైనా ఓ మానసిక స్థితి తాత్కాలికంగా కొనసాగడాన్ని ఉద్వేగం లేదా ఎమోషన్ అంటారు. అదే మానసిక స్థితి చాలా ఎక్కుసేపు కొనసాగితే దాన్ని ‘మూడ్’ అని వ్యవహరిస్తారు. ఉదాహరణకు బాధ పడటం ఒక మానసిక స్థితి. దాన్ని ఒక డిప్రెసివ్ ఎమోషన్గా చెప్పవచ్చు. అయితే అదే బాధ అలా దీర్ఘకాలం పాటు కొనసాగుతూ ఉంటే దాన్ని ‘డిప్రెస్డ్ మూడ్’ అంటారు. రోజుల తరబడి అదే బాధ నిత్యం ఉంటే అది మూడ్ డిజార్డర్ అవుతుంది. బాధ, సంతోషం, దిగులు, ఆందోళన, భయం, కోపం, ప్రేమ, ఉత్సాహం... ఇవన్నీ మనందరిలోనూ రకరకాల సమయాల్లో కలిగే మానసిక స్థితులు. వాటినే భావోద్వేగ స్థితులుగా చెప్పవచ్చు. సరైన సమయంలో సరైన భావోద్వేగాలను సరైన రీతిలో ప్రదర్శించడాన్ని ‘భావోద్వేగ మేధాశక్తి’గా చెప్పవచ్చు. ఉదాహరణకు చాలా పెద్ద పోరబాటు జరిగినప్పుడు ఆ సమయంలో (అంటే తగిన సమయంలో) తగిన రీతిలో కోపం ప్రదర్శించినప్పుడు అది తనకూ, ఇతరులకు కూడా సక్రమంగా ఉపయోగపడుతుంది. అయితే అదే కోపాన్ని ఎప్పుడూ ప్రదర్శిస్తూ ఉంటే అది వారికి తీరని నష్టం కలగజేయవచ్చు. అతడితో పనిచేయడానికి ఎవరూ ముందుకు రాకపోవచ్చు. అంటే... తన భావోగ్వేగ మేధాశక్తిని సమర్థంగా తగిన రీతిలో సరైన రీతిలో ఉపయోగపడేలా చేసుకోవడమే ఇక్కడ ప్రయోజన్ని ఇస్తుందని గుర్తించాలి. ఇలా ఎప్పుడు ఏ రకమైన ఉద్వేగాన్ని, ఎంత మేరకు, ఏ పరిమితుల్లో ఉపయోగించాలన్నదే ‘ఈక్యూ’గా చెప్పవచ్చు.భావోద్వేగ మేధాశక్తి (ఈక్యూ) ఉన్నవారి లక్షణాలివి... ఎప్పుడూ సంతోషంగా కనిపించడం... తమ భావోద్వేగాలను ఎప్పుడూ తమ అదుపులో ఉంచుకోవడం, ఇతరుల భావోద్వేగాలనూ గుర్తించగలగడం. వాటిని గుర్తెరిగి వాటికి అనుగుణంగా ప్రవర్తించడం.అవసరమైనప్పుడు ఇతరుల భావోద్వేగాలను సైతం తాను నియంత్రిస్తూ, వారిని సంతోషపరచడం లేదా పరిస్థితులు వారికి అనుగుణంగా ఉండేలా మార్చగలగడం. అవసరాన్ని బట్టి తన లక్ష్యం కోసం కొన్ని తన సుఖాలను తాత్కాలికంగా వాయిదా వేయడం. అలా తన తక్షణ సుఖాలను వాయిదా వేయడం వల్ల కూడా తాను సంతోషం పోందగలగడం. సమర్థమైన నాయకత్వ లక్షణాలూ అలాగే మంచి సంభాణాచాతుర్యం. ఓటమికి భయపడకపోవడం, కుంగిపోకుండా వాటిని ఎలా ఎదుర్కోవాలన్నది తక్షణం ఆలోచించగలగడం. ఈక్యూ తాలూకు లక్షణాల వల్ల కలిగే ఫలితాలు... ఇలాంటివారు గతంలో తమకు ఎదురైన అనుభవాలను ఒక పాఠంగా తీసుకుని ప్రస్తుతంలో జీవిస్తారు. జీవితాన్ని ప్రణాళికాబద్ధంగా నడుపుతారు. దాంతో గెలుపూ, సంతోషం ఎప్పుడూ వాళ్లతోనే ఉంటాయి. అతడితో సమయం గడపడానికి అందరూ ఇష్టపడుతుంటారు. తనతో ఉన్నవారినీ సంతోషపెడుతూ ఈ ఈక్యూ ఎక్కువగా ఉన్నవారు ఇతరులకు మార్గదర్శకుడుగా ఉంటాడు. ∙సమర్థమైన నాయకుడిగా ఎదుగుతాడు. తొలుత కుటుంబానికీ, ఆ తర్వాత సమాజానికీ నేతృత్వం వహిస్తుంటాడు. ఈక్యూను (భావోద్వేగ మేధాశక్తిని) పెంచుకోవడం ఎలా...? ఈక్యూ (భావోద్వేగ మేధాశక్తి)ని అభివృద్ధి చేసుకోడానికి ముందర... ముఖ్యంగా అదెలా ఏర్పడుతుందో తెలుసుకోవాలి. భావోద్వేగ మేధాశక్తికి మొదటి పునాదులు అర్లీ ఛైల్డ్హుడ్ టైమ్లో పడి అప్పట్నుంచి 18 ఏళ్ల వయసు వరకు వేగంగా అభివృద్ధి చెందుతుంటుంది. ఆ తర్వాత కూడా ఈక్యూ పెరుగుతుంటుంది కానీ... అర్లీ ఛైల్డ్హుడ్ నుంచి 18 ఏళ్ల వరకు జరిగినంత వేగంగా ఆ అభివృద్ధి జరగదు. చిన్నప్పుడు తమ తల్లిదండ్రుల, సమాజంలోని ఇతరుల ప్రవర్తన, తాము ఎదిగిన పరిస్థితులు... ఇవన్నీ పిల్లల భావోద్వేగ మేధాశక్తిపై ప్రభావం చూపుతాయి. ∙మెదడులో చిన్నప్పుడు ΄్లాస్టిసిటీ అనే స్వభావం ఎక్కువగా ఉంటుంది. అంటే... దాన్ని ఏరకంగా మలిస్తే మెదడులో స్వభావాలను ఏర్పరచుకునే తత్వం / పరిస్థితి ఆ రకంగా మారుతుందని చెప్పవచ్చు. ఈ స్వభావం లేదా గుణం మనం ఎదిగే కొద్దీ తగ్గుతూ పోతుంది. అందుకే ‘మొక్కై వంగనిది, మానై వంగునా’ అనే సామెత భావోద్వేగ మేధాశక్తి విషయంలో అక్షర సత్యమని చెప్పవచ్చు.ఎమోషనల్ ఇంటెలిజెన్స్... తల్లిదండ్రుల పాత్ర... తల్లిదండ్రులు కేవలం పిల్లల చదువుల మీద శ్రద్ధ పెట్టినంత మాత్రాన సరిపోదని గుర్తించాలి. నిజానికి వారు ప్రధానంగా దృష్టి పెట్టాల్సిన అంశమేమిటంటే... తమ పిల్లలు ఎదుటివారిలో మెలిగేప్పుడు ఎలా ప్రవర్తిస్తున్నారు, వాళ్ల ప్రవర్తనలో తేడాలుంటే ఎలా చక్కదిద్దాలి... అలాగే విపత్కర పరిస్థితుల్లో వాటిని ఎదుర్కొనేందుకు వాళ్లు అనుసరిస్తున్న పద్ధతులు లేదా వ్యూహమేమిటి, వాటిని పరిష్కరించడానికి వాళ్లు ఎదుర్కొంటున్న మార్గాలేమిటి అని చూడాలి. అవి చాలా చిన్న చిన్న అంశాలే కావచ్చు. ఉదాహరణకు ఏదైనా ఓ కారణంతో ఓ చిన్నారి తన హోమ్వర్క్ పూర్తిగా కంప్లీట్ చేయలేదు. ఆ వయసుకు అతడికి అదే విపత్కరమైన పరిస్థితి. దాన్ని అతడు ఎలా ఎదుర్కొంటున్నాడు అన్నది తల్లిదండ్రులు గమనించాలి. కడుపునొప్పి లేదా ఇతరత్రా వంక పెట్టి ఆ రోజుకు స్కూల్ మానేయాలని చూస్తున్నాడా లేదా తగిన (కన్విన్సింగ్) జవాబును సిద్ధం చేసుకుని పరిస్థితిని ఎదుర్కొనేందుకు సంసిద్ధమవుతున్నాడా అన్నది తల్లిదండ్రులు చూడాల్సిన అంశం. ఒకవేళ అతడు స్కూల్ మానాలని అనుకుంటే... అది సరికాదనీ... టీచర్ అడిగినప్పుడు ఈ సమాధానం చెప్పమనీ, ‘‘ముందు నువ్వు ఈ విషయం ఇలా చెప్పు. ఒకవేళ ఆయన వినకపోతే మేమూ స్కూల్కు వచ్చి కన్విన్స్ చేస్తా’’మంటూ పిల్లలను పరిస్థితి ఎదుర్కొనేందుకు సంసిద్ధం చేయాలి. ఇది చిన్నపిల్లల విషయంలో జరగాల్సిన పనికి ఓ ఉదాహరణ. పరిస్థితులను బట్టి ఇలాంటివే పిల్లలు ఎదుర్కొనేలా తలిదండ్రులు ధైర్య, స్థైర్యాలను తమ పిల్లల్లో పాదుకునేలా చూడాలి. నిజానికి చదువు కంటే... భవిష్యత్తులో ఎదురయ్యే అనేక రకాల సమస్యలను ఎదుర్కోడానికి ఇలాంటి పాఠాలే చాలా అవసరమని గుర్తించాలి. లోకంలోని అనేక పరిస్థితులను ఎదుర్కోడానికి ఐక్యూ కంటే కూడా ఈక్యూనే ప్రధానం. ఇక అవసరమైన చోట ఓపిగ్గా ఉండటాన్ని అభ్యాసం చేయించాలి. ఓరిమితో ఉండటం క్షమాగుణాన్నీ పెంపోందిస్తుంది. క్షమాగుణం వల్ల గొడవలు తగ్గి చాలా ప్రశాంతంగా హాయిగా జీవించడం సాధ్యమవుతుంది. ఎదుటివారిలో మంచి కనిపించినప్పుడు దాన్ని గుర్తించి అభినందించే మనస్తత్వాన్ని అభ్యాసం చేయిస్తే... ఈర్ష్య తగ్గి చాలా ప్రశాంతతతో జీవించే గుణం అలవడుతుంది. ప్రతికూల ప్రవర్తనలతో ఈక్యూ తగ్గిన సందర్భాల్లో... తల్లిదండ్రులు తమ పిల్లలను తరచూ తిడుతూ, ఇతరులతో పోల్చి వారిని నిందిస్తూ ఉంటే పిల్లలు కూడా తమ తప్పులకు ఇతరులను బాధ్యులు అనుకోవడం, అందుకు వారిని దూషించడం, నిందించడం నేర్చుకుంటారు. ఇది అదేపనిగా కొనసాగడం వల్ల ద్వేషించడాన్ని కొనసాగిస్తుంటారు. ఇక మరికొందరు పెద్దవాళ్ల చేత అదేపనిగా ఎగతాళికి గురవుతుంటే ఆ పిల్లలు బిడియస్తులుగా, పిరికివారుగా తయారవుతారు. మరికొందరు అవమానం కారణంగా నేరస్వభావాన్ని పెంచుకుంటారు. అందుకే పిల్లలకు ఈక్యూ నేర్పడంలో తల్లిదండ్రుల ప్రవర్తన చాలా కీలకం.భావోద్వేగ మేధాశక్తితో కలిగే ప్రయోజనాల్లో కొన్ని... భావోద్వేగ మేధాశక్తి ఉన్నవారికి మానసిక సమస్యలు చాలా తక్కువ. వారిలో శారీరక సమస్యలు వచ్చే అవకాశాలు కూడా తక్కువ అని అధ్యయనాలు తెలుపుతున్నాయి. గుండె జబ్బులు ఉన్న వ్యక్తికి ఎమోషనల్ సపోర్ట్ లేకపోతే గుండె పోటు వచ్చే అవకాశాలు మూడు రెట్లు ఎక్కువ. అదే ఒకసారి గుండెపోటు వచ్చిన వ్యక్తికి డిప్రెషన్ ఉంటే గుండెపోటు వచ్చే అవకాశాలు 3.5 రెట్లు అధికం. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని మనం మనలోని ఉద్వేగ మేధాశక్తిని (ఈక్యూను) నిరంతర సాధనతో పెంచుకుంటూ ఉండటంతో పాటు... ఆ ప్రభావం ఎదుటివారికీ ప్రయోజనం కలిగేలా వ్యవహరించడం (దీన్నే మానసిక విశ్లేషకులు ‘విన్ – విన్ సిచ్యువేషన్’ అంటుంటారు) వల్ల మానవ సంబంధాలు మెరుగుపడటంతో పాటు మరింత మంచి సమాజం ఏర్పడుతుందన్నది చాలామంది మానసిక వైద్యులూ, శాస్త్రవేత్తల మాట. ఈక్యూ ఎందుకంటే... మేధాశక్తి (ఇంటెలిజెన్స్)ని రెండు రకాలుగా చెప్పవచ్చు. ఒకటి విషయ సంబంధమైన పరిజ్ఞానం, తెలివితేటలు మొదలైన వాటికి సంబంధించినది. విషయసంబంధమైన మేధాశక్తిని ఇంటెలిజెన్స్ కోషియెన్స్ (ఐక్యూ) ద్వారా చెబుతారు. రెండోది భావోద్వేగ మేధాశక్తి. దీనినే ‘ఎమోషనల్ ఇంటెలిజెన్స్’ అంటారు. భావోద్వేగ మేధాశక్తి ద్వారా ఈక్యూను అంచనా వేస్తారు. ఒక వ్యక్తి సంతోషంగా జీవించడానికి, ఇతరులతో చక్కటి సంబంధాలను ఏర్పరచుకోడానికి భావోద్వేగ మేధాశక్తి ఎంతో కీలకం. మరెంతో అవసరం. తెలివితేటలు, చదువు, విషయపరిజ్ఞానం వంటి ఎన్నో అంశాలు ఉండి కూడా కొందరు సమస్యలను ఎదుర్కునేలా అంతగా మానసిక దృఢత్వం లేకపోవడానికీ, ఢక్కాముక్కీలు తిన్నవారిలా కాకుండా సమస్యకు తేలిగ్గా లొంగిపొయి, బెదిరిపోవడానికి కారణం ఈక్యూ తక్కువగా ఉండటమే. -
డాక్టర్ హార్ట్ బీట్ : అమ్మతనం ఇచ్చిన‘బ్రహ్మా’నందం
జీవితం ఒక సినిమా అయితే... దేవుడు రాసిన స్క్రిప్ట్ను కూడా మార్చి రాయగల రైటర్లు డాక్టర్లు. జీవితం ఒక మూవీ అయితే... పేషెంట్కు లైఫ్కో కొత్త డైరెక్షనిచ్చి హిట్ చేయగల టాప్ డైరెక్టర్లు డాక్టర్లు. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తోందంటే... జీవితం... సినిమా కంటే విచిత్రమైనది. దాంట్లో లవ్, మదర్ సెంటిమెంట్, స్టడీస్లో సక్సెస్తో కెమెరా టిల్ట్ చేసి తలెత్తి పైకి చూడాల్సినంత అడ్మిరేషన్, ఎదురుగా మృత్యువు నిలబడ్డా చిరునవ్వుతో ఎదుర్కొనేంత హీరోయిక్ కరేజ్, హెల్మెట్లు లేకపోవడంతో జరిగే అనర్థాల స్టంట్స్... ఇలా ఎన్నో... ఎన్నెన్నో!! ఇన్ని ఎమోషన్స్ను మనతో పంచుకున్నారు నిష్ణాతులూ, లబ్ధప్రతిష్ఠులైన కొందరు డాక్టర్లు... నేడు డాక్టర్స్ డే సందర్భంగా కొన్ని భావోద్వేగాలు వాళ్ల మాటల్లోనే...మదర్ హుడ్అమ్మతనపు కమ్మదనం కోసం అర్రులు సాచే అమ్మాయిలెందరో! అలాంటి అమ్మాయిల్లో ఆమె కూడా ఒకరు. అప్పటికే ఆ అమ్మాయికి నాలుగు అబార్షన్లు అయ్యాయి. ఆ గర్భస్రావాల్లో ఒకట్రెండు దాదాపు పూర్తికాలం గర్భం మోసిన దాఖలాలూ ఉన్నాయి. కానీ ఏ ప్రసవంలోనూ బిడ్డ జీవించి పుట్టలేదు. ఈసారి ఐదో ప్రసవం సమయంలో ఆ దంపతులు నా దగ్గరికి వచ్చారు. వాళ్లకు ఇది ఐదోసారి గర్భధారణ. అల్ట్రా సౌండ్ స్కానింగ్లో ఏదో తేడా ఉంది. వాళ్లలో ఉండే వేదన ఎంతో ఎవ్వరైనా అంచనా వేయవచ్చు. చదవండి: ఐఏఎస్ కల: మృత్యువు పెట్టిన ‘పరీక్ష’ పాసయ్యాడు!మా దగ్గర రెండు రకాలుగా పరీక్షలు నిర్వహిస్తాం. మొదటిది క్రోమోజోముల్లో ఏదైనా తేడా ఉందేమో తెలుసుకునే క్యారియోటైపింగ్ టెస్ట్. రెండోది ఆరోగ్యకరమైన బిడ్డ పుట్టడానికి గల అవకాశాలను తెలిపే ప్రాంబబిలిటీ పరీక్ష. వాళ్లు రెండోది కోరుకున్నప్పటికీ... అప్పటికే ఉన్న ప్రతికూలతల కారణంగా అది సాధ్యం కాలేదు. ఇలాంటి సందర్భాల్లో ఏమవుతుందంటే... ఒకవేళ పుట్టబోయే బిడ్డకు శారీరక అవయవాల్లో లోపాలో లేదా మానసికంగా బిడ్డ ఎదుగుదల బాగుండదనో తెలిస్తే జెనెటిక్ కౌన్సెలింగ్ ఇచ్చి... ‘ఇదీ పరిస్థితి. ఇక మీరు నిర్ణయం తీసుకోండి’ అని చెబుతాం. ఇక ఆ తర్వాత నిర్వహించిన క్యారియోటైపింగ్ పరీక్షల్లో బిడ్డలో ‘క్రోమోజోమల్ ట్రాన్స్ లొకేషన్’ జరిగినట్లు తేలింది. అంటే... క్రోమోజోముల్లోని ఒకచోట ఉండాల్సినవి అక్కడినుంచి మారి మరోచోట చేరాయి. కానీ చూడ్డానికి అంతా బాగానే ఉంది. ఇలాంటప్పుడు బిడ్డ ఆరోగ్య కరంగానే పుడుతుందా అంటే చెప్పలేం. ఇలాంటి సందర్భాల్లో ప్రకృతి ఓ పని చేస్తుంది. అనారోగ్యకరమైన బిడ్డను ఈ లోకంలోకి రాకుండా చేసేందుకు మూడు నెలలలోపు స్వాభావికంగా దానంతట అదే బిడ్డ పడిపోయేలా చేస్తుంది. అంటే నేచురల్ అబార్షన్ జరిగిపోతుందన్నమాట. అదే ఒకవేళ మూడు నెలలు గడిచిపోయాయంటే ఇక బిడ్డ పూర్తిగా ఎదగడానికి అవకాశం ఉందన్నమాట. మొదటి సస్పెన్సు కాలమైన ఆ మూడు నెలలూ గడిచిపోయాయి. ఇదీ చదవండి: కూతురి కోసం ప్రాణాలను సైతం లెక్కచేయని తండ్రి సాహసం, వైరల్ వీడియోఇప్పుడు రెండో సస్పెన్సు మొదలైంది. ఇప్పటికే నిండు చందమామలాంటి బిడ్డలు నలుగురు ఆ అమ్మ ఒడినుంచి జారిపోయారు. కడుపున మరో బంగారం పెరుగుతోందిగానీ... ఆ కొంగుబంగారమూ కొంగుజారిపోతే? అమ్మో!! అందుకే మేమంతా కాబోయే ఆ అమ్మను జాగ్రత్తగా కనిపెట్టుకుని ఉన్నాం. క్రోమోజోమల్ ట్రాన్స్లొకేషన్ జరిగిందంటే ఏదో జరిగిందనే అర్థం. కాకపోతే అదెక్కడో, ఎలాగో, దాని పర్యవసానాలేమిటో తెలియదు. జాగ్రత్తగా వేచిచూస్తున్నాం. ఎట్టకేలకు అల్లరిపిడుగు పుట్టనే పుట్టింది. ఆ బంగారుతల్లి ఒడిలోకి బంగారుకొండ చేరింది. అంతా సుఖాంతం. బిడ్డకు పూర్తి ఆరోగ్యం. మా అందరిలోనూ కొండంత ఆనందం. నేను చెప్పేదేమిటంటే... ప్రతి ఒక్కరికీ జెనెటిక్ పరీక్షలు అవసరం కాకపోవచ్చు. కానీ ఎలాంటి బిడ్డ పుడుతుందో... పుట్టి జీవితాంతం తల్లిదండ్రులను క్షోభపెడుతుందో తెలియని పరిస్థితుల్లో జన్యుపరీక్షలు అవసరం. ఓ సీనియర్ జన్యువైద్య పరిశోధకురాలిగా, జెనెటిక్స్ వైద్యురాలిగా ఇదీ నా సూచన.డాక్టర్ యానీ క్యూ హసన్, సీనియర్ జెనెటిక్ – మాలెక్యులార్ స్పెషలిస్ట్, కామినేని హాస్పిటల్స్, హైదరాబాద్ -
యాంటీ ఏజింగ్ ఇంజెక్షన్లతో ముప్పు ; షెఫాలీ ప్రాణం తీసింది అవేనా?
కాంటా లగా గర్ల్ షెఫాలీ జరీవాలా (Shefali Jariwala) అకాల మరణం అనేక ఊహాగానాలు, ఆందోళనలను తెరపైకి తీసుకొచ్చింది. ముఖ్యంగా యాంటీ-ఏజింగ్ ట్రీట్మెంట్స్ అండ్ ఫాస్టింగ్ టాక్సిక్ కాక్టెయిల్ ఆమె ప్రాణాలకు ముప్పు తీసుకొచ్చినట్టు తెలుస్తోంది.షెఫాలిఖాళీ కడుపుతో కాస్మెటిక్ యాంటీ ఏజింగ్ ఇంజెక్షన్ తీసుకొని ఉండవచ్చని, ఇదే గుండెపోటుకు కారణమై ఉండవచ్చని భావిస్తున్నారు. మూర్ఛ వ్యాధితో బాధపడుతున్న షెఫాలి ఖాళీ కడుపుతో గ్లూటాతియోన్ , విటమిన్ సి కలిగిన కాస్మెటిక్ యాంటీ-ఏజింగ్ ఇంజెక్షన్ తీసుకున్నారనీ, ఆ వెంటనే ఆమె తీవ్ర అస్వస్తతతకు గురైందట. ఒళ్లు వణకడం, తర్వాత స్పృహ కోల్పోవడంతో తక్షణమే ఆమె భర్త పరాగ్ త్యాగి ముంబైలోని బెల్లెవ్యూ మల్టీస్పెషాలిటీ హాస్పిటల్కు తీసుకెళ్లినప్పటికీ ఫలితం లేకపోయింది. అంతేకాదు షెఫాలీ ఇంట్లో యాంటీ ఏజింగ్ ఇంజక్షన్ వైల్స్, విటమిన్ సప్లిమెంట్లు, గ్యాస్ట్రిక్ మాత్రలు దొరకడం ఈ అనుమానాలకు మరింత బలం చేకూరింది. అంతే కాదు ఎనిమిదేళ్ల క్రితం వైద్యుడిని సంప్రదించిన షెఫాలీ, ఆ తర్వాత కూడా స్వయంగా మందులు తీసుకోవడం ప్రారంభించి, ప్రస్తుత వైద్యుల పర్యవేక్షణ లేకుండానే దీనిని కొనసాగించిందనే అనుమానాలు కూడా బలంగా ఉన్నాయి. ఖాళీ కడుపుతో ఇంట్రావీనస్గా తీసుకోవడం లేదా ఇతర మందులతో పాటు తీసుకోవడం వంటివి - హైపోటెన్షన్ , కార్డియాక్ అరెస్ట్లాంటి ముప్పు ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. షెఫాలీ విషయంలో కూడా ఖాళీ కడుపుతో ఇంజక్షన్ తీసుకోవడం వల్ల రక్తపోటు ఒక్కసారిగా పడిపోయి గుండెపోటు వచ్చి ఉంటుందని వైద్య నిపుణులు అనుమానిస్తున్నారు. అయితే ఆమె మరణానికి ఖచ్చితమైన కారణపై ఇంకా స్పష్టతలేదు. పోస్ట్మార్టం నివేదిక తరువాత మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.గ్లుటాతియోన్, విటమిన్ సి చర్మ చికిత్సలలో విస్తృతంగా వాడుకలో ఉన్నప్పటికీ ఖాళీకడుపుతో లేదా ఉపవాసం ఉన్న స్థితిలో, ఇలాంటి మందుల కలయిక హృదయనాళ వ్యవస్థపై తీవ్ర ఒత్తిడి ఏర్పడుతుందని, ఒక్కోసారి రక్తపోటు పడిపోయి గుండె ఆగిపోవడానికి దారితీస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అందుకే వీటిని వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే తీసుకోవాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా దేశవ్యాప్తంగా అంతటా యాంటీ-ఏజింగ్ థెరపీల వాడకంపై వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.అంతేకాకుండా, ఇంజెక్ట్ చేయగల గ్లూటాతియోన్కు FDA-ఆమోదం లేదనీ, వాస్తవానికి, చర్మాన్ని తెల్లగా చేస్తుందని భావిస్తున్న గ్లూటాతియోన్ ఇంజెక్షన్ ఫలితాలపై క్లినికల్ ట్రయల్స్గానీ, లేదా అధికారిక మార్గదర్శకాలు లేవు. పైగా దీని వలన కాలేయం, మూత్రపిండాలు , నాడీ వ్యవస్థపై విషపూరిత ప్రభావంతో పాటు, స్టీవెన్స్-జాన్సన్ సిండ్రోమ్ వంటి తీవ్రమైన ప్రమాదాలను కూడా FDA లేవనెత్తింది. అలాగే చర్మకాంతికోసం ఇంజెక్టబుల్ విటమిన్ సి ఉత్పత్తులకు కూడా FDA-ఆమోదం లేదు. 2019లో, FDA అన్ని కంపెనీలను ఆస్కార్బిక్ ఆమ్లం (విటమిన్ సి) ఇంజెక్షన్ అనుమతి లేని వెర్షన్ల పంపిణీని నిలిపివేయాలని కోరింది. మరోవైపు భారతదేశంలో, సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (CDSCO) గ్లూటాతియోన్ , విటమిన్ సి ఇంజెక్షన్ల వినియోగానికి ఆమోదం తెలిపింది. కానీ సౌందర్య లేదా చర్మాన్ని తెల్లగా చేసే ఉద్దేశానికి ఎంతమాత్రం కాదు నిర్దిష్ట వైద్య సూచనల కోసం మాత్రమే.కోవిడ్ తరువాత ఇటు దేశంలో, ఆటు ప్రపంచవ్యాప్తంగా మహిళల్లో మరణానికి హృదయనాళ వ్యాధి (CVD) ప్రధాన కారణంగా నిలుస్తోందని రొమ్ము కేన్సర్ తరువాత ఇదే అత్యంత ప్రమాదకారిగా ఉందంటున్నారు వైద్య నిపుణులు. -
అల్యూమినియం పాత్ర.. ‘అతి’ వాడకంతో ముప్పు!
ఒకప్పుడు వంట చేయాలంటే మట్టి పాత్రలే వినియోగించేవాళ్లు. ఆ తర్వాత కాలక్రమేణా వంటింట్లోకి రాగి, ఇత్తడి, స్టీల్, అల్యూమినియం, నాన్స్టిక్ పాత్రలు చొచ్చుకొచ్చేశాయి. ప్రస్తుతం వీటిలో అత్యధిక మంది ఉపయోగించేవి అల్యూమినియం పాత్రలే. అన్నం, కూర, పిండివంటలు.. వంటకం ఏదైనా అల్యూమినియం గిన్నెలు ఉండాల్సిందే. ఈ పాత్రలు ఉపయోగించడం వరకు బాగానే ఉన్నా.. వాటిని సుదీర్ఘ కాలం వాడటం ఆరోగ్యానికి ఎంత మాత్రం మంచిది కాదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ వంట పాత్రలకూ ఎక్స్పెయిరీ ఉంటుందని బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్(బీఐఎస్) వెల్లడించింది. రెండేళ్లకు మించి వాడొద్దు..1938లో ఇండియన్ అల్యూమినియం కంపెనీ మన దేశంలో ఉత్పాదకత ప్రారంభించింది. అనంతరం అల్యూమినియం వంట పాత్రల తయారీ కుటీర పరిశ్రమగా మారింది. దేశంలో ఈ పాత్రలు లేని వంట గది ఉండదు. అందుబాటు ధరల్లో లభిస్తుండడంతో ప్రజలు వీటిని విరివిగా ఉపయోగిస్తున్నారు. అయితే వీటిని సుదీర్ఘకాలం ఉపయోగించకూడదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వీటి తయారీ నాణ్యతను బట్టి 12 నుంచి 24 నెలలకు ఒకసారి పాత్రలను మారుస్తుండాలని బీఐఎస్ సూచించింది. తేలికైన వంట పాత్రలను ఏడాదికి మించి వాడకూడదని తెలిపింది. సూపర్ గ్రేడ్ వంట సామగ్రి సైతం అధిక ఉష్ణోగ్రతల్లో వేడికి గురై నెలల వ్యవధిలోనే పాడై పోతుంటాయని పేర్కొంది. ఈ క్రమంలో వీటిని రెండేళ్లకు మించి వినియోగించకపోవడం ఉత్తమమని సూచించింది.ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం..ఈ పాత్రల్లో టమాటా, చింతపండు, నిమ్మకాయ వంటి పుల్లటి పదార్థాలతో వంటలు చేయడం వల్ల అల్యూమినియం కరిగి ఆహారంలోకి చేరుతుందని నిపుణులు చెబుతున్నారు. ఆ ఆహారం శరీరంలోకి ప్రవేశించి ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపిస్తుందని తెలిపారు. ఎముకలు, మెదడు సంబంధిత సమస్యలు తలెత్తే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా దీర్ఘకాల కిడ్నీజబ్బుతో బాధపడేవారికి మరింత ఎక్కువ హాని చేసే అవకాశం ఉందని వివరించారు.త్వరలో కొత్త నిబంధనలు అమల్లోకి..అల్యూమినియం వంట పాత్రల తయారీ ప్రమాణాలను బీఐఎస్ సవరించింది. వంట పాత్రల తయారీలో సీసం, కాడ్మియం, పాదరసం, హెక్సావాలెంట్ క్రోమియం వంటివి 0.05 శాతం కంటే తక్కువ ఉండాలని స్పష్టం చేసింది. వచ్చే నెల నుంచి దేశంలోని చిన్న పరిశ్రమలు, అక్టోబర్ నుంచి సూక్ష్మ పరిశ్రమల్లో ఈ నిబంధనలు అమల్లోకి రానున్నాయి. అలాగే వంట పాత్రలపై అల్యూమినియం గ్రేడ్ను లేబులింగ్ చేయడం తప్పనిసరి చేసింది.(చదవండి: డయాబెటిస్ని జయించిన జర్నలిస్ట్ స్టోరీ..! ఐసీయూలో ఉండాల్సిన స్టేజ్ నుంచి..) -
ప్రాణాంతక 'డయాబెటిక్ కోమా స్టేజ్'..! కానీ ఆమె జస్ట్ రెండు నెలల్లో..
ప్రతి ఏడాది వేలాది మంది డయాబెటిస్ సమస్యతో బాధపడుతున్నారు. దీన్ని మందులతోనే నిర్వహించగలం తప్ప నివారిణి ఉండదు. అయితే కొందరూ ఈ సమస్యను చక్కటి జీవనశైలితో అధిగమించి స్ఫూర్తిగా నిలుస్తారు. ఇక్కడ కావల్సింది తాను ఈవ్యాధి నుంచి బయటపడి మెరుగైన ఆరోగ్యంతో ఉండాలనే 'గట్టి పట్టుదల'. అది ఉంటే డయాబెటిస్ ఎంతటి ప్రమాదకర స్టేజ్లో ఉన్న అవలీల అధిగమించగలరు అనేందుకు ఉదాహారణ ఈ 57 ఏళ్ల మాజీ జర్నలిస్ట్ ఉషా రాచెల్ థామస్. ఆమెకు శరీరంలో చక్కెర స్థాయిలు ఏ రేంజ్లో ఉన్నాయో..? ఆమె పరిస్థితి ఎంత క్రిటికల్గా ఉందో తెలిస్తే విస్తుపోతారు. మరీ అంతటి ప్రమాదకరస్థితిలో ఉన్న డయాబెటిస్ని జయించి ఎలా ఆరోగ్యవంతురాలిగా మారిందో సవివరంగా చూద్దామా..!.సీనియర్ బ్రాండ్ స్ట్రాటజిస్ట్ అండ్ కమ్యూనికేషన్స్ లీడర్ ఉషా రాచెల్ థామస్ అధిక ఒత్తిడి, అనారోగ్యకరమైన జీవనశైలి అలవాట్లతో ఉండేది. చెప్పాలంటే.. తన ఆరోగ్యంపై ధ్యాస పెట్టేది కాదు. తాను డయాబెటిస్ పేషెంట్నని తెలిసి కూడా లైట్ తీసుకుంది. ఉత్తిపుణ్యానికే అలసట, విపరీతమైన దాహం, భోజనం చేసిన వెంటనే అలిసిపోవటం వంటి శరీర సంకేతాలను కూడా నిర్లక్ష్యం చేసింది. ఫలితంగా ఆమె శరీరంలోని గ్లూకోజ్ స్థాయిలు అమాంతం పెరిగిపోయాయి. ఒకరోజు అనుకోకుండా ముంబైలోని ఒక ప్రముఖ డాక్టర్ని సందర్శించింది. ఆయన శరీరంలోని గ్లూకోజ్ స్థాయిలు చూసి అవాక్కయ్యారు. ఎందుకంటే గ్లూకోమీటర్ ఏకంగా 500 నుంచి 538 పైనే రీడింగ్ చూపిస్తోంది. అంటే..ఇది ఒక షుగర్ పేషెంట్కి ఉండాల్సిన దానికంటే ఐదు రెట్లు ప్రమాదకర స్థాయిలో ఉందని అర్థం. ఆ వైద్యుడు ఉషతో మీరు ఐసీయూలో ఉండాలని చెప్పారు. ఆ మాటలు విని ఉషకు గుండె ఆగినంత పని అయ్యింది. ఆయన ఉషను డయాబెటిక్ కోమా స్టేజ్లో ఉన్నట్లు తేల్చి చెప్పారు. పరిస్థితి ఇలానే ఉంటే..ఏ క్షణం ఎలా ఉంటుందో చెప్పడం కష్టం అన్నారు. అందువల్ల ఉషా అనునిత్యం డాక్టర్ల పర్యవేక్షణలోనే ఉండటం మంచిది అని సూచించారాయన. ఆ డాక్టర్ మాటలు చెంప చెళ్లుమనిపించినట్లయ్యింది ఉషకు. ఒక్కసారి తన అనారోగ్యకరమైన అవాట్లు అన్ని కళ్లముందు కదలాడాయి. చేజేతులారా తానే ఈ పరిస్థితి కొని తెచ్చుకున్నానని కుమిలిపోయింది. మూడెళ్ల నుంచి తన శరీరం ఇస్తున్న సంకేతాలను తాను ఎలా నిర్లక్ష్యం చేసిందో గుర్తు తెచ్చుకుంది. కాళ్లలో వచ్చిన బెణుకులు, శరీరంలోని అసాధారణ మార్పులను గమనించడం ప్రారంభించింది. తన అధిక బరువుపై కూడా ఫోకస్ పెట్టింది.మార్పుని బలంగా స్వాగతించడం..వెంటనే అధిక బరువుని నియంత్రణలోకి తెచ్చుకుంటే గనుక తాను ఎదుర్కొనే చిన్న చిన్న అనారోగ్య సమస్యలను అధిగమించొచ్చు అని భావించింది ఉష. ఆ దిశగా వర్కౌట్లు, తీసుకునే ఆహారంపై ధ్యాస పెట్టడమే గాక మంచి జీవనశైలిని అనుసరించింది. ఎలాగైన డయాబెటిస్ని తన శరీరం నుంచి తరిమి కొట్టాలని స్ట్రాంగ్గా డిసైడ్ అయ్యింది. జస్ట్ 60 రోజుల్లో మాయం...క్రహశిక్షణాయుతమైన జీవనశైలి మార్పులతో కేవలం రెండు నెలల్లోనే తన రక్తంలో చక్కెరస్థాయిలను నార్మల్కి తీసుకొచ్చింది. అంతేగాదు పదినెలలు ఎలాంటి మందులు లేకుండా డయాబెటిస్ని సమర్థవంతంగా నిర్వహించింది. ప్రస్తుతం అత్యంత తక్కువ మోతాదులో డయాబెటిక్ మందులు తీసుకుంటూ..నాన్ డయాబెటిక్గా ఉన్నారామె.వర్కింగ్ విమెన్స్ మేల్కోండి..ఇద్దరు పిల్లలు తల్లి అయిన ఉషా తన శరీరంతో చక్కటి సంబంధాన్ని ఏర్పరుచుకోకపోవడంతో ఇలాంటి ప్రాణాంతక పరిస్థితిని ఎదుర్కొన్నట్లు పేర్కొంది. తనలా ప్రతి వర్కింగ్ ఉమెన్ ఆలోచనా తీరు ఉంటుందన్నారు. ఒక ఏడాది క్రితం నాన్న చనిపోవడంతో అమ్మ ఒంటిరితనం పోగొట్టేలా ధైర్యం చెప్పడం. అలాగే పిల్లలు విదేశాల్లో స్థిరపడటంతో ఏర్పడి ఒంటరితనం అనే సిండ్రోమ్. దీనికి తోడు తాను పనిచేసే 24*7 మీడియాలో లేట్నైట్ డిన్నర్లు వంటి చెడు ఆహారపు అలవాట్లు తన ఆరోగ్యాన్ని పూర్తిగా ప్రమాదంలోకి నెట్టేసిందని చెప్పుకొచ్చారామె. అలాగే మోనోపాజ్ దశలోకి వచ్చిన ప్రతి మహిళ సులభంగా అనారోగ్య సమస్యల బారినపడుతుందని గ్రహించకపోవడం వంటి తప్పిదాలే కారణాలని చెప్పుకొచ్చారు ఉషా. వర్కింగ్ విమెన్స్ ఎవ్వరూ తనలా అంతటి పరిస్థితి తెచ్చుకోవద్దని..ఉద్యోగ కెరీర్ తోపాటు ఆరోగ్యం కూడా ముఖ్యమేనని సూచించారామె.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రేమ ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులను సంప్రదించడం ఉత్తమం.(చదవండి: హార్ట్ ఫెయిల్యూర్ అంటే..? ఈ పరిస్థితి ఎందువల్ల వస్తుందంటే..) -
ప్లాన్ చేస్తున్నాం కానీ...
నాకు ముప్పై ఐదు సంవత్సరాలు. నా రెండు రొమ్ముల్లో గడ్డల్లాగా ఉన్నాయి. కాని, ఇప్పుడు ప్రెగ్నెన్సీ ప్లా¯Œ చేస్తున్నాం. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?– అనిత, విజయవాడ.మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తుండగా రొమ్ముల్లో గడ్డలు కనిపిస్తే, అది చిన్న సమస్య అయి ఉండొచ్చు, కాని నిర్లక్ష్యం చేయరానిది. చాలా సందర్భాల్లో ఇది ఫైబ్రో ఎడినోమా అనే సాదారణ సమస్యగా ఉంటుంది. ఇది నొప్పి లేకుండా కనిపిస్తుంది. మీ వయస్సు, కుటుంబంలో బ్రెస్ట్ కేన్సర్ చరిత్ర, బాడీ మాస్ ఇండెక్స్ 35 కంటే ఎక్కువగా ఉన్నట్లయితే, థైరాయిడ్, బీపీ వంటి సమస్యలుంటే, తప్పకుండా బ్రెస్ట్ అల్ట్రాసౌండ్ చెక్ చేయించాలి. గడ్డల పరిమాణం, ప్రదేశం, స్వభావం ఆధారంగా దానికి బైరాడ్స్ గ్రేడింగ్ చేస్తారు. చాలా సందర్భాల్లో ఇది తక్కువ గ్రేడింగ్ అయ్యే అవకాశం ఉంది. అలాంటి సమయంలో ఇది ప్రమాదకరం కాదు. అలాగే ఇది భవిష్యత్తులో బ్రెస్ట్ ఫీడింగ్కు కూడా అంత అడ్డు రాదు. కానీ బ్రెస్ట్లో ఆకస్మికంగా వాపు, రంగు మారటం, నొప్పి రావడం లాంటివి కనిపిస్తే వెంటనే వైద్యుని కలవాలి. సంవత్సరానికి ఒకసారి చెక్ చేయించుకోవడం మంచిది. అలాగే స్వయంగా పరిశీలించి చూసుకోవడం వలన ఏదైనా మార్పు ఉంటే వెంటనే గుర్తించవచ్చు. అవసరమైతే డాక్టర్ ఎఫ్ఎ¯Œ ఏసీ లేదా బయాప్సీ చెయ్యమని సూచిస్తారు. ఎక్కువ మార్పులు కనిపిస్తే శస్త్రచికిత్స కూడా చేస్తారు. ఇది ప్రెగ్నెన్సీకి ఏ ప్రమాదం చేయదు. అయితే ప్రతి మార్పును గమనిస్తూ రెగ్యులర్ ఫాలోఅప్ చేస్తూ, డాక్టర్ సూచించిన పరీక్షలు, స్కానింగ్లను తప్పకుండా చేయించుకోవాలి.నేను ఇప్పుడు మూడు నెలల గర్భవతిని. మా ఫ్యామిలీలో చాలామందికి థైరాయిడ్ ఉంది. అందుకే, ప్రెగ్నెన్సీలో నాకు కూడా వస్తుందేమో అనిపిస్తోంది. ఇందుకు ఏవైనా పరీక్షలు చేయించుకోవాలా?– సుమలత, నూజివీడు.మీ కుటుంబంలో థైరాయిడ్ సమస్యలు ఉన్నట్లయితే, ప్రెగ్నెన్సీ సమయంలో మీరు తప్పనిసరిగా థైరాయిడ్ పరీక్షలు చేయించుకోవాలి. ఎందుకంటే గర్భధారణ సమయంలో థైరాయిడ్ సమస్యలు ఉంటే అవి శిశువు ఆరోగ్యంపై ప్రభావం చూపవచ్చు. ముఖ్యంగా మెదడు అభివృద్ధి, నరాల వ్యవస్థపై దీని ప్రభావం ఉంటుంది. ప్రెగ్నెన్సీ మొదటి మూడు నెలల్లో టీఎస్హెచ్ అనే థైరాయిడ్ పరీక్ష చేయించాలి. ఈ సమయంలో టీఎస్హెచ్ స్థాయి 2.5 కంటే తక్కువగా ఉండాలి. అలాగే కుటుంబంలో ఇప్పటికే థైరాయిడ్ ఉన్నవారు ఉంటే, థైరాయిడ్ యాంటీబాడీ పరీక్ష కూడా చేయించాలి. ఈ పరీక్షలో యాంటీబాడీలు పాజిటివ్గా ఉంటే, గర్భస్రావం అయ్యే అవకాశాలు ఎక్కువ. అందుకే, అలాంటి సందర్భాల్లో వైద్యుని సూచనల మేరకు తక్కువ మోతాదులో థైరాక్సి¯Œ అనే మందును వాడాలి. ప్రెగ్నెన్సీ మొత్తం వ్యవధిలో టీఎస్హెచ్ స్థాయిని ప్రతి నెలా పరీక్ష చేయాలి. మూడో నెల దాటిన తర్వాత టీఎస్హెచ్ స్థాయి 3 వరకు ఉండవచ్చు. అంతకంటే ఎక్కువైతే, వైద్యులు మందుల మోతాదును సరిచేస్తారు. గర్భవతిగా ఉన్నప్పుడు టీఎస్హెచ్ స్థాయి మారుతూ ఉండే అవకాశం ఉంటుంది. అందువలన ప్రతిసారీ పరీక్షల ద్వారా స్థాయిని గమనించి, మందుల మోతాదును మార్చుకుంటూ ఉండాలి. చాలామంది గర్భవతులకు డెలివరీ తర్వాత కూడా థైరాయిడ్ యాంటీబాడీలు కొనసాగుతాయి. అందుకే డెలివరీ అనంతరం కూడా మందులను కొనసాగించే అవసరం ఉంటుంది. థైరాయిడ్ సమస్య ఉన్నా కూడా శిశువు ఆరోగ్యంగా పుట్టే అవకాశం ఉంది. ఇందుకోసం ముఖ్యంగా శిశువు మెదడు, చురుకుదనం, శరీరాభివృద్ధి బాగా జరగాలంటే మొదటి మూడు నెలల్లో టీఎస్హెచ్ స్థాయిని 2.5 కంటే తక్కువగా ఉండేలా చూసుకోవాలి. అందుకే, ఎప్పటికప్పుడు డాక్టర్ను సంప్రదిస్తూ, వారు చెప్పే సూచనలు, సలహాలు పాటించడం చాలా అవసరం. ∙ -
Today Tip బరువు తగ్గాలంటే.. జామ ఆకూ ఔషధమే
జామ పండ్లు ఆరోగ్యానికి చాలా మంచివి ఇది అందరికీ తెలిసిన విషయమే. పోషకాలు మెండుగా ఉండే జామ పండుతో ప్రయోజనాలు పొందవచ్చ. కానీ జామ ఆకులు కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. మరి ఇవాల్టి టిప్ ఆఫ్ ది డేలో భాగంగా జామ ఆకులు ప్రయోజనాలు గురించి తెలుసుకుందాం.జామ ఆకుల్లో అధిక మొత్తంలో ట్యానిన్స్, ఆక్సలేట్స్ ఉంటాయి. అందువల్ల నోటిపూత, నోటిలో పుండ్లు, చిగుళ్ల వాపు, గొంతు నొప్పి వంటి నోటి సమస్యలతో బాధపడేవారు లేత జామ ఆకుల్ని నమిలినా లేదా లేత ఆకులను నీటిలో వేసి మరిగించి ఆ నీటితో పుక్కిట పట్టినా మంచి ఫలితాలను పొందవచ్చు. జామ ఆకులు జుట్టుకి దివ్యౌషధంలా పని చేస్తాయి.జుట్టు రాలడాన్ని నివారించడంతో పాటు జుట్టు పెరగడానికి దోహదపడతాయి. సరిపడా జామ ఆకుల్ని శుభ్రం చేసుకుని తగినన్ని నీరు పోసి 15 నిముషాలసేపు మరిగించాలి. చల్లారాక ఆ నీటిని తలపై నెమ్మదిగా అప్లై చేస్తూ బాగా మర్దనా చేయాలి. గంట తరువాత తలస్నానం చేయాలి. తరచుగా ఇలా చేయడం వల్ల వెంట్రుకల కుదుళ్లు గట్టిపడి జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.జామ ఆకులు ఆరోగ్యానికి ముఖ్యంగా, ఇవి జీర్ణక్రియను మెరుగుపరచడంలో, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో, బరువు తగ్గడానికి సహాయపడతాయి జామ ఆకు టీ తాగడం వల్ల ఆకలి తగ్గుతుంది. తద్వారా అధిక బరువునుంచి బయటపడవచ్చు.(Today tip : ఈజీగా బరువు తగ్గాలంటే ఇవిగో ఆసనాలు)వీటిల్లోని అధిక యాంటీఆక్సిడెంట్లు ,యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు వ్యాధులను నయం చేయడంలో సహాయపడతాయి.జామ ఆకులలోని యాంటీఆక్సిడెంట్లు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. యాంటీ బాక్టీరియల్ లక్షణాలు హానికరమైన సూక్ష్మజీవులతో పోరాడతాయి మరియు జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి, మలబద్ధకం, విరేచనాలు వంటి సమస్యలను తగ్గిస్తాయి,జామ ఆకు టీ తాగడం వల్ల టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారిలో రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయని కొన్ని అధ్యయనాల ద్వారా తెలుస్తోంది.జామ ఆకులలోని యాంటీఆక్సిడెంట్లు చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. మొటిమలు, మచ్చలు వంటి సమస్యలను తగ్గిస్తాయి.నోట్ : ఇవి అవగాహన కోసం అందించిన సమాచారం మాత్రమే అని గమనించగలరు. వీటిని వాడేముందు,వాడిన తరువాత ఏదైనా సమస్యలొచ్చినా వైద్యుడిని సంప్రదించిన తర్వాతే జామ ఆకులను ఉపయోగించడం మంచిది. -
Yoga సంకల్ప శక్తి, స్వీయ–క్రమశిక్షణ కావాలంటే..
ముఖం కడుక్కోవడం, బ్రష్ చేసుకోవడం, స్నానం చేయడం మొదలైనవన్నీ పై శరీరాన్ని శుభ్రపరిచే క్రియలైతే యోగక్రియలు అంతర్గత అవయవాలనీ శుభ్రపరుస్తాయి. వాటిలో అతి ముఖ్యమైనది త్రాటక. యోగాసనాలు వేయడం పూర్తయ్యాక త్రాటక క్రియ సాధన చేస్తే శరీరం ప్రశాంతంగా మారుతుంది. మనసుకు శరీరానికి మధ్య శక్తివంతమైన వంతెనను సృష్టిస్తుంది. బరువు నియంత్రణలో ఉండటానికి కూడా ఈ సాధన ఉపయోగపడుతుంది. సాధన చేయడమూ సులువే... సౌకర్యవంతమైన ప్లేస్లో కూర్చోవాలి. ఎదురుగా టీ పాయ్లాంటి చిన్న టేబుల్పైన వెలుగుతున్న కొవ్వొత్తిని ఉంచాలి. విశ్రాంతిగా కూర్చొని, ప్రశాంతంగా ఉచ్ఛ్వాస నిశ్వాసలు చేస్తూ దీపకాంతిని చూస్తూ ఉండాలి. రోజూ కొంత సమయం ఈ క్రియను సాధన చేస్తూ ఉండాలి. ఇదీ చదవండి: వెయిట్లాస్ జర్నీలో ఆహారానిదే కీలక పాత్రఈ అభ్యాసం వల్ల...కంటి కండరాలను బలపరచడంతో పాటు చూపును మెరుగుపరుస్తుంది. భావోద్వేగ స్థిరత్వాన్ని కలిగిస్తుంది. ఒత్తిడి నిర్వహణకు ఒక విలువైన సాధనంగా పనిచేస్తుంది. కన్నీటి గ్రంథులను శుభ్రపరుస్తుంది. కళ్ళు ప్రకాశవంతం అవుతాయి. కంటిచూపు సామర్థ్యాన్ని బలపరుస్తుంది. నాడీ వ్యవస్థను సమతుల్యం చేస్తుంది. ఆందోళనను తగ్గిస్తుంది. నిద్రలేమి, నిరాశపూరితమైన ఆలోచనలు తగ్గి΄ోతాయి. ఓర్పు, సహన సామర్థ్యాన్ని పెంపొందించడానికి సహాయపడుతుంది. మెరుగైన శక్తిదృష్టిని మెరుగుపరచడం ద్వారా జ్ఞాపకశక్తికి కూడా దోహదపడుతుంది. నిలకడగా చూడటం అనే అభ్యాసం మనసుపై ప్రశాంత ప్రభావాన్ని చూపుతుంది. మనసును శాంతపరచడం వల్ల భావోద్వేగ స్థిరత్వం లభిస్తుంది. నిద్ర పట్టని వారికి ఇది మేలైన ఔషధం అని కూడా చెప్పవచ్చు. ముఖ్యంగా ఎక్కువసేపు స్క్రీన్ లను చూస్తూ గడిపే వారికి, ఈ అభ్యాసం కంటి ఒత్తిడి, అలసటను తగ్గించడంలో సహాయపడుతుంది. ఈ అభ్యాసం సంకల్ప శక్తి, స్వీయ–క్రమశిక్షణను పెంపొందించడంలో సహాయ పడుతుంది. – ఎన్.ఆర్. -
వెయిట్లాస్ జర్నీలో ఆహారానిదే కీలక పాత్ర
బరువు తగ్గడానికి అయినా పెరగడానికి అయినా వ్యాయామాలపాత్ర 20 శాతం ఉంటే, ఆహారంపాత్ర 80 శాతం ఉంటుంది. సాధారణ మనిషికి రోజుకు 2,200 క్యాలరిస్ అవసరం. బరువు తగ్గాలి అనుకునే వారు క్యాలరీ లోటులో ఉండాలి. మన శరీరం 2,200 కావాలి అంటే, ఒక 5 – 10 శాతం ఆహార క్యాలరీ లోటు తో మొదలుపెట్టాలి. అంటే రోజుకు 2000 క్యాలోరీలు ఇచ్చే ఆహారం తీసుకోవాలి. అది కూడా ఆరోగ్యకరమైన ఆహారం. కూరగాయలు, పళ్ళు, మాంసకృత్తులు, ఓట్స్ లాంటివి.ఉదాహరణకు కేజీ బరువు తగ్గాలి అంటే దాదాపు 7500 క్యాలరీలు కరిగించాలి. అంటే ఈ విధంగా చేస్తూ ఉంటే, 3 వారాలకు ఒక కేజీ తగ్గుతారు అన్నమాట. నెమ్మదిగా తగ్గినా ఆరోగ్యంగా తగ్గుతారు ఈ విధంగా. కానీ ఒక మనిషిలో ఎదుటి వాళ్ళు గుర్తించగలిగే మార్పు రావాలి అంటే ఒక 3 కేజీలు అయినా తగ్గాలి. అలా తగ్గడానికి కనీసం 2 నెలలు పడుతుంది.ఇదీ చదవండి: Today tip : ఈజీగా బరువు తగ్గాలంటే ఇవిగో ఆసనాలు -
Kareena Kapoor: పరాఠా విత్ నెయ్యితో 'జీరో సైజ్ ఫిగర్'..!
బాలీవుడ్ నటి కరీనా కపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన ఎవర్గ్రీన్ నటనతో అశేష అభిమానుల్ని సంపాదించుకున్న నటి ఆమె. ఇప్పటికి కుర్ర హీరోయిన్లకు తీసిపోని విధంగా గ్లామర్గా ఉంటారామె. ముఖ్యంగా ఆమె ఫిట్నెస్ విషయంలో చాలా క్రమశిక్షణగా ఉంటారు. మంచి జీవనశైలిని పాటిస్తారామె. తరుచుగా ఆమె ఈ విషయాలను సోషల్ మీడియా వేదికగా నెటిజన్లతో షేర్ చేస్తుంటారు. తన వర్కౌట్ల నుంచి ఆరోగ్యకరమైన డైట్ వరకు ప్రతిదీ పంచుకుంటారామె. అయితే హీరో హీరోయిన్లు ఎంతలా స్ట్రిక్ట్గా ఫిట్నెస్కి ప్రాముఖ్యత ఇచ్చినా..కెరీర్ పరంగా కొన్ని త్యాగాలు చేయక తప్పని పరిస్థితి. ఎందుకంటే పాత్ర డిమాండ్కి అనుగుణంగా వాళ్ల ఆకృతిని మార్చుకోక తప్పదు. ఆ క్రమంలో ఆరోగ్యానికి విరుద్ధమైన డైట్లను అనుసరించాల్సి ఉంటుంది. అలానే కరీనా కూడా ఓ మూవీ కోసం జీరో సైజ్ ఫిగర్ మెయింటైన్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది. అందుకోసం ఎలాంటి ఫుడ్ తీసుకునేదో తెలిస్తే నోరెళ్లబెడతారు. ఏంటి పరాఠాలతో తగ్గడం అని షాక్కి గురవ్వుతారు. కానీ కరీనానే ఓ ఇంటర్వ్యూలో పరాఠా విత్ నెయ్యితోనే జీరో సైజ్ బరువుకి వచ్చానని చెప్పడం విశేషం. మరి అదెలాగో చూద్దామా..!.వెయిట్ లాస్ జర్నీలో సక్సెస్ కానీ వాళ్లకు కరీనా అనుసరించిన విధానం ఓ వరమనే చెప్పాలి. ఎందుకంటే పాపం నోరు కట్టేసుకుని ఫైబర్ కోసం రుచి పచి లేని ఫుడ్ తింటుంటారు. అయితే ఇలా కమ్మటి పరాఠాలు, నెయ్యి కలిపి హాయిగా తింటూనే బరువు తగ్గే విధానం తెలుసుకుంటే హమ్మయ్యా అనే ఫీలింగ్ వచ్చేస్తుంది. మరీ ఆమె వీటితో సైజ్ జీరోకి ఎలా రాగలిగందంటే..2008 యాక్షన్-కామెడీ 'తాషన్'లో కరీనా కపూర్ జీరో సైజ్ ఫిగర్తో అందరినీ ఆశ్యర్యపరిచింది. అయితే ఆమె ఎప్పుడూ ఆకలితో అలమటించే డైట్లు ఫాలో కానని అంటోంది. ఎప్పుడూ పరాఠాలు తింటూనే ఉంటానంటోంది. అలా తింటూ..కూడా రోజంతా తీసకునే ఆహార క్రమాన్ని బ్యాలెన్స్ చేసుకుంటే చాలని చెబుతోందామె. అయితే ఆమె ఆ మూవీ కోసం దాదాపు 68 కిలోల నుంచి 48 కిలోలు చేరుకునేందుకు అస్సలు ఆకలితో ఇబ్బందిపడే లేదట. (చదవండి: Dinner: సాయంత్రం 6.30కి తినేయడమే మంచిదా? నటి కరీనా కపూర్ కూడా..)తన ఫిట్నెస్ టీమ్ పోషకాహార నిపుణుడు రుజుత దివేకర్, ట్రైనర్ నమ్రత పురోహిత్ల సాయంతో అద్భుతంగా బరువు తగ్గానని చెప్పారామె. అందుకోసం తాను సరైన మార్గాన్ని అవలంభించే మంచి శరీరాకృతిని పొందినట్లు తెలిపారామె. తాను అస్సలు తినకుండా ఉండలేనని అంటోంది. అయితే తాను సరైన మొత్తంలో కార్బోహైడ్రేట్లు తీసుకునేలా రుజుత దివేకర్ నెయ్యితో పరాఠాలు, కుంకుమ పువ్వు నీళ్లు తీసుకునేలా చేసిందని చెప్పుకొచ్చారు. వాటి తోపాటు గుల్కండ్ అనే స్వీటు, గోరువెచ్చని పాలు తప్పనిసరిగా తీసుకునేదాన్ని అని అంటోంది. అయితే 2018లో మొదటి బిడ్డ ప్రసవానంతరం బరువు పెరిగానని, అయితే త్వరితగతిన బరువుని అదుపులోకి తెచ్చుకున్నానని చెప్పుకొచ్చారు. అలాగే తాను జిమ్లో 55 నిమిషాలకు మించి ఎక్కువసేపు ఉండలేనని అన్నారు. తాను ఎక్కువగా పవర్ యోగా, పైలట్స్ వర్కౌట్లతో బాడీని ఫిట్గా ఉండేలా చూసుకుంటానని చెప్పారు. ఇక్కడ కరీనా..తనకిష్టమైన ఆహారాన్ని వదులకోకుండానే బరువు తగ్గే ప్రయత్నం చేశారు. మైండ్ఫుల్నెస్గా ఇష్టమైన ఆహారాలు దూరం చేసుకోకుండా తగ్గడమే ఆరోగ్యదాయకమని చెప్పకనే చెప్పారామె. సో ఆమెలా ఒక క్రమ పద్ధతిలో నచ్చిన ఫుడ్ తీసుకుంటూనే తగ్గే ప్రయత్నం చేసి ఆరోగ్యంగా ఉందామా..!.(చదవండి: ది బెస్ట్ ఐస్ క్రీమ్లుగా ఆ ఐదు భారతీయ బ్రాండ్లకు చోటు..!) -
Today tip : ఈజీగా బరువు తగ్గాలంటే ఇవిగో ఆసనాలు
యోగా మానసిక, శారీరక ఆరోగ్యానికి చాలా మంచిది. క్రమం తప్పకుండా యోగాను సాధన చేయడం వలన సుదీర్ఘ అనారోగ్యాలనుంచి బయటపడటం సహా అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. ముఖ్యంగా ఆధునిక కాలంలో పెద్ద సమస్యగామారిన అధిక బరువును కొన్ని ప్రత్యేకమైన యోగాసనాల ద్వారా సులువుగా తగ్గించుకోవచ్చు. ఇవాల్టి టిప్ ఆఫ్ ది డేలో భాగంగా వాటిలో కొన్నింటిని చూద్దాం. సూర్య నమస్కారాలు, విన్యాస యోగ, ఉత్కటాసన, ఉష్ట్రసన, సేతు బంధాసన, తడసన , నవాసన వంటివి బరువు తగ్గడానికి, కొన్ని యోగాసనాలు సహాయపడతాయి.సూర్య నమస్కారాలు: బరువు తగ్గడానికి హృదయ సంబంధ ఆరోగ్యానికి సహాయపడతాయి. విన్యాస యోగ: కేలరీలను బర్న్ చేయడానికి, బరువు తగ్గడానికి సహాయపడుతుంది,. ఉత్కటాసన: ఈ ఆసనం కాళ్ళు , తుంటిని బలోపేతం చేస్తుంది, పేరుకుపోయిన కొవ్వును కరిగిస్తుంది. ఉష్ట్రాసన: ఒంటె భంగిమ, ఇది బరువు తగ్గడానికి సహాయపడే ఒక సమగ్ర వ్యాయామం,. సేతు బంధాసన: ఈ ఆసనం బరువు నిర్వహణకు సహాయపడుతుంది. తడాసన: ఇది పర్వత భంగిమ అంటారు. బాలెన్స్ను, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. నవాసన: ఇది పొత్తికడుపు బొడ్డు కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది. ధనూరాసన: వెన్ను, ఛాతి, నడుము, చేతులు, పొత్తి కడుపు, కాళ్లకు మేలు జరుగుతుంది. ఫిట్నెస్ మెరుగవుతుంది. ధనస్సులా శరీరానికి వంచే ఫ్లెక్సిబులిటీ పెరిగి జీవక్రియ వేగవంతమై వెయిట్ లాస్కు ఈ యోగాసనం తోడ్పడుతుంది.వీటితో పాటు ఆహార నియమాలు, నడక లాంటి చిన్నపాటి వ్యాయామాలు చేస్తే మరింత త్వరగా ఫలితం లభిస్తుంది. యోగా ఒత్తిడిని తగ్గించడానికి, మానసిక స్థితిని మెరుగుపరచడానికి సహాయపడుతుంది. అంతిమంగాఇవన్నీ బరువు తగ్గడానికి సహాయపడతాయి.యోగాసనాలు ఎలా వేయాలి అనేది యోగా నిపుణుల ద్వారాగానీ, నమ్మకమైన యాప్ ద్వారా గానీ నేర్చుకోవాలి. -
Urine Eye Wash: ప్లీజ్ అలా చెయ్యొద్దు..! వైద్యుల స్ట్రాంగ్ వార్నింగ్
ఇటీవల ఇన్స్టా రీల్స్ పిచ్చి మాములుగా లేదు కొందరికి. అందుకోసం వాళ్లు చేసే పిచ్చి చేష్టలకు అంతుపొంతు లేకుండాపోతోంది. అది సరైనదా? కాదా..? అన్నది అనవసరం. సోషల్ మీడియా క్రేజ్, ఆ కంటెంట్కి ఎన్ని వ్యూస్ వచ్చాయ్ అన్నదే ధ్యేయం. కానీ వీటిని స్ట్రిక్ట్గా ఫాలో అయ్యి ఇబ్బందులు పడుతున్న అభాగ్యులెందరో ఉన్నారు. ప్రస్తుతం తాజాగా అలాంటి వీడియో సోషల్ మీడియాలో తీవ్ర దుమారాన్ని రేపుతోంది. ఆ వీడియోని చూసి వైద్యులే కంగుతిన్నారు. ప్లీజ్ అలా చెయ్యకండి అని హెచ్చరిస్తునన్నారు. అసలేం జరిగిందంటే.. పూణెకు చెందిన నుపుర్ పిట్టీ అనే మహిళ వైరల్ వీడియోలో తనను "మెడిసిన్-ఫ్రీ లైఫ్ కోచ్"గా పరిచయం చేసుకుంటూ "యూరిన్ ఐ వాష్ " గురించి వివరించింది. ఇది మనకు ప్రకృతి ప్రసాదించిన ఔషధం అంటూ..మూత్రం కళ్లను శుభ్రం చేసుకుంటూ కనిపించింది వీడియోలో. మన మూత్రంతో ఇలా కళ్లను వాష్ చేసుకుంటే..డ్రైగా మారడం, ఎరుపెక్కడం వంటి కంటి సమస్యలు రావని ఆరోగ్య సలహాలు కూడా ఇచ్చేసింది. అయితే ఈ వీడియోపై వైద్య నిపుణులు తీవ్రంగా స్పందించడమే గాక మండిపట్టారు. ప్రజల ఆరోగ్యంతో ఇలా చెలగాటం ఆడటం మంచిద కాదని ఫైర్ అయ్యారు. ఇలాంటి ప్రక్రియలు ప్రమాదకరమైనవని, దీనికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని తేల్చి చెప్పారు. మూత్రంతో ఇలా అస్సలు చేయొద్దని గట్టిగా హెచ్చరించారు కూడా.ఎందుకు మంచిది కాదంటే..నిపుణులు అభిప్రాయం ప్రకారం మూత్రాన్ని తాగడం లేదా ఉపయోగించటం అనేది ఆరోగ్యానికి మంచిదని శాస్త్రీయంగా ఎక్కడ నిరూపితం కాలేదు. “యూరిన్ థెరపీ“కి సంబంధించి వైద్యపరమైన ఆధారాలు కూడా లేవు. మూత్రంలో చాలా తక్కువ మొత్తంలో విటమిన్లు, ఖనిజాలు ఉన్నప్పటికీ ఏవిధమైన ఆరోగ్య ప్రయోజనాలను అందివ్వదు. అందులో శరీరానికి అవసరం లేని ద్రవం, శరీరంలోని వ్యర్థాలనను తొలగించిన ద్రవమే మూత్రం. మూత్రపిండాలు రక్తప్రవాహం నుంచి అదనపు నీటిని సెల్యులార్ వ్యర్థాలను బయటకు పంపించే ఉత్పత్తి ఇది. దీనిలో 90 శాతం నీరు ఉండగా, మిగిలిన భాగం అమ్మోనియా వంటి ఇతర లవణాలు ఉంటాయి. అంతేగాదు మూత్రపిండాల అనే రెండు కండరాల గొట్టలు ద్వారా మూత్రాశయానికి మూత్రాన్ని పంపుతాయి. మూత్రాశయం నిండినప్పుడు, నరాల చివరలు మెదడుకు బాత్రూమ్కి వెళ్లమని సంకేతమిస్తాయి. దాంతో మూత్రనాళం అనే చిన్నగొట్టం సాయంతో విసర్జిస్తాం. అదీగాక ఈ మూత్రనాళం కొన్ని రకాల బ్యాక్టీరియాలకు నిలయం.అందువల్ల మూత్రం శుభ్రమైనద కాదు. శరీరం వదిలించుకున్న ఈ వ్యర్థ ద్రవం తిరిగి శరీరంలోకి పంపిస్తే..హనికరమైన బ్యాక్టీరియాకు గురై లేనిపోని వ్యాధులు బారినపడే ప్రమాదం తీవ్రంగా ఉంటుందని చెబుతున్నారు నిపుణులు. Please don't put your urine inside your eyes. Urine is not sterile. Boomer aunties trying to be cool on Instagram is depressing...and terrifying.Source: https://t.co/SQ5cmpSOfY pic.twitter.com/qgryL9YHfI— TheLiverDoc (@theliverdr) June 25, 2025 (చదవండి: ఆ తప్పిదాలతో 116 కిలోల బరువు..కానీ 13 నెలల్లో ఏకంగా..) -
ఆ తప్పిదాలతో 116 కిలోల బరువు..కానీ 13 నెలల్లో ఏకంగా..!
వెయిట్ లాస్ జర్నీలలో చాలామంది తమ కిష్టమైన హాబీలతోనూ..ఇతరులను స్ఫూర్తిగా చేసుకుని తగ్గారు. కొందరూ ప్రోటీన్ డైట్ ఫాలో అయితే..మరికొందరు అనారోగ్య భయంతో బరువు తగ్గారు. కానీ ఈ న్యూట్రిషన్ కోచ్ తాను ఎందువల్ల బరువు పెరిగానో కారణాలను విశ్లేషించి ఆ తప్పిదాలను పునరావృతం కాకుండా చూసుకుంటూ బరువు తగ్గింది. పైగా తనలా ఎవ్వరూ ఆ తప్పులు చెయ్యొద్దని, దాని వల్ల కలిగే అనర్థాలేంటో వివరిస్తూ..ప్రేరణగా నిలిచింది. ఆమె కొన్ని నెల్లల్లోనే స్లిమ్గా మారి బరువు తగ్గడం పెద్ద కష్టమేమి కాదని నిరూపించింది. ISS సర్టిఫైడ్ న్యూట్రిషన్ అండ్ వెయిట్ లాస్ కోచ్ రక్షా భలవి ఒకప్పుడామె దాదాపు వంద కిలోలు పైనే బరువు ఉండేది. ఊబకాయం సమస్యతో చర్మం, జుట్టు, ఆరోగ్యం సరిగా లేకపోవడం వంటి సమస్యలు ఎదుర్కొంది. అందుకు ప్రధాన కారణం ఆమెకున్న జంక్ఫుడ్ వ్యనసం. దాదాపు ప్రతిరోజు చిప్స్, చాక్లెట్లు లేకుండా ఆమె రోజు ఉండేది కాదు. అలా ఆమె 116 కిలోలు బరువుతో ఇబ్బందులు పడింది. తన ఆకృతి కారణంగా ఎదుర్కొన్న బాడీ షేమింగ్లు, మరోవైపు ఎదుర్కొంటున్న అనారోగ్య సమస్యలతో బరువు తగ్గాలని స్ట్రాంగ్గా డిసైడ్ అయ్యింది. ఎలాంటి క్రాష్డైట్లు జోలికిపోకుండా పోషకాహారం గురించి క్షుణ్ణంగా తెలుసుకుంది. ముందుగా ప్రతిరోజు వ్యాయామాలు చేస్తూ.. తన బరువులో వస్తున్న మార్పులను గమనించింది. అలాగే తాను స్కూల్ డేస్లో మధ్యాహ్న భోజనానికి పరాఠాలు తినడంతో ఎలా తాను బరువు పెరిగింది అర్థం చేసుకుంది. దానిలో ఉండే అధిక కార్బ్, అధిక కొవ్వు గలిగిన ఆహారం బొడ్డు కొవ్వుకు కారణమవుతుందని తెలుసుకుంది. అందుకనే తన ఆహారపు అలవాట్లను పూర్తిగా మార్చుకుంది. సమతుల్య ఆహారాలకే పెద్దపీటవేసి..ఫైబర్ కోసం పండ్లు, ప్రోటీన్ కోసం గుడ్లు లేదా పనీర్, కార్బ్ల కోసం గోధుమ రోటీ లేదా బ్రెడ్ వంటివి తీసుకునేది. అలాగే తాను చదువుతున్నప్పుడూ బాగా ఒత్తిడికి గురయ్యేది. అందువల్ల తాను తెలియకుండా ఎలా ఎక్కువగా ఫుడ్ తీసుకుందో కూడా చెప్పుకొచ్చింది రక్ష. అలాగే అధిక ఉప్పు, చక్కెరతో ఉండే స్నాక్స్కి దూరంగా ఉండేది. వాటి బదులు మఖానా, తాజా పండ్లతో స్నాక్స్ని భర్తీ చేసింది. అలాగే రోజంతా శారీరక శ్రమ లేకుండా ఉండటాన్ని నివారించింది. స్క్రీన్ సమయాన్ని తగ్గించుకుని.. ఆటలు లేదా వ్యాయామాలకు సమయం కేటాయిస్తూ..మానసికంగా ఉల్లాసంగా ఉండేలా చూసుకునేది. చివరగా తాను చెడ్డ ఆహారపు అలవాట్ల వల్లే బరువు పెరుగుతున్నానని చాలా ఆలస్యంగా గ్రహించానని, తనలా మరెవ్వరూ చెయ్యొద్దని సూచిస్తోంది. ప్రస్తుతం ఆమె పూర్తి శాకాహారి. అలాగే తన డైట్ప్లాన్ని కూడా షేర్ చేసుకున్నారామె.(చదవండి: Nozempic Diet: 130 కిలోల అధిక బరువు..ఎన్నాళ్లో బతకదన్నారు..! కట్చేస్తే..)ఆ కోచ్ ఏమి తీసుకునేదంటే..ఉదయం: చియా సీడ్ నీరువ్యాయామం చేయడానికి ముందు: 7 నానబెట్టిన బాదం, 10 గ్రా వేరుశెనగ వ్యాయామం తర్వాత: ప్రోటీన్ పౌడర్ పానీయం (1 స్కూప్), 1 గిన్నె మస్క్మెలోన్ భోజనం: స్టైర్-ఫ్రైడ్ క్యాప్సికమ్తో గిన్నె క్వినోవా టోఫురాత్రి భోజనం: 2 బేసన్ చీలాస్, 1 కప్పు పప్పు, 100 గ్రా క్యాబేజీ సబ్జీ, 1 ప్లేట్ దోసకాయ-క్యారెట్ సలాడ్, 30 గ్రా కాల్చిన సోయా ముక్కలు View this post on Instagram A post shared by Raksha Bhalavi | Nutrition & Weight Loss Coach (@fitwithraksha_)గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత నిపుణులు లేదా వైద్యులను సంప్రదించడం ఉత్తమం.(చదవండి: ఆ చెప్పులు మన వారసత్వ కళ..ప్రముఖ ఫ్యాషన్ బ్రాండ్ ఏకంగా..!) -
చినుకుల్లో హాయి..! జాగ్రత్తలు అవసరమోయి..
చిరుజల్లులలో ఏదైనా వేడి వేడి ఫుడ్ ఉంటే.. దానికి తోడు కమ్మటి వాసనతో హాట్ కాఫీ సిప్ చేస్తుంటే.. ఆ హాయి మరోలా ఉంటుంది. ఇలాంటి అనుభూతులు నగరవాసులకు ఎన్నెన్నో.. సిటీలో చినుకులు పడుతుంటే చాలు జనం ట్యాంక్బండ్, నెక్లెస్ రోడ్లపై సందడి చేస్తుంటారు. చల్లటి వాతావరణాన్ని ఆస్వాదిస్తారు. అయితే ఈ మాన్సూన్ సీజన్లో ఆరోగ్యం, హైజీన్, డిజిటల్ టూల్స్ వంటి అంశాలను సైతం సమానంగా పరిగణనలోకి తీసుకుంటున్నారు నగరవాసులు. ఎందుకంటే ఈ కాలంలో వైరల్ ఇన్ఫెక్షన్లు, నీటి కాలుష్యం, వాతావరణ మార్పులతో అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అందుకే వర్షాకాలాన్ని సురక్షితంగా, అందంగా అనుభవించడానికి కొన్ని లైఫ్స్టైల్ హ్యాక్స్, గాడ్జెట్స్, యాప్స్ సైతం అందుబాటులో ఉన్నాయి. వర్షాకాలం అనేది సహజంగా ఆనందాన్ని కలిగించేది. కానీ అదే సమయంలో కొంత జాగ్రత్త అవసరం. ఆరోగ్యాన్ని, గాడ్జెట్లను, ఇంటిని, ఫ్యాషన్ను సమానంగా వాడుకుంటే ఈ సీజన్ను ఎంతో ప్రయోజనకరంగా మార్చుకోవచ్చు. మోడ్రన్ లైఫ్స్టైల్లో టెక్నాలజీ సహకారంతో వర్షాకాలాన్ని మరింత ఆహ్లాదకరంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు ఈ తరం. ఈ వానల్లో మీరు తీసుకునే జాగ్రత్తలు మీరు పొందే ఆనందానికి బలం అవుతాయి.వర్షాకాలం హెల్త్కేర్ టిప్స్.. వానల సమయంలో నీటి కాలుష్యం, ఆహారంలోని బ్యాక్టీరియా వల్ల జ్వరాలు, డైజెస్టివ్ సమస్యలు, స్కిన్ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఎక్కువ. ఈ సీజన్లో ఇంట్లోనే వంట చేసుకోవడం, వేడి నీళ్లు తాగడం, తులసి టీ, అల్లం–పెప్పర్ సూప్ వంటి బూస్టింగ్ ఫుడ్స్ తీసుకోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఫ్యాషన్తో పాటు ఫంక్షనాలిటీ.. వర్షాకాలం అంటే మడమ తొక్కినట్లుగా బురద, తడిగా మారే దుస్తులు.. కానీ ఇప్పుడు మార్కెట్లో అందుబాటులో ఉన్న వాటర్ రిపెలెంట్ ఫ్యాబ్రిక్స్, సిలికాన్ షూ కవర్స్, ఫోల్డబుల్ రైనిక్స్ లాంటి ఉత్పత్తులతో స్టైలిష్గా ఉండటమే కాకుండా తడిసిపోకుండా ఉండొచ్చు. ట్రెండీ అంబ్రెల్లాస్: యాక్టివ్ కలర్స్, ఓపెన్–క్లోజ్ మెకానిజంతో అందంగా ఉండే మోడల్స్ అందుబాటులో ఉన్నాయి. వాటర్ప్రూఫ్ బ్యాక్ప్యాక్స్: టెక్ లవర్స్ కోసం వర్షంలో కూడా ల్యాప్టాప్, గ్యాడ్జెట్లు భద్రంగా తీసుకెళ్లేందుకు ఉపయోగకరం. వాటర్ప్రూఫ్ ఫోన్ కవర్లు: ముఖ్యంగా రోడ్ల మీద లేదా బైక్ ప్రయాణాల్లో తప్పనిసరి. హెల్త్ మానిటరింగ్ యాప్లు, గాడ్జెట్స్.. ఫిట్ బిట్, ఎమ్ఐ బ్యాండ్ వంటి వేరబుల్స్ ద్వారా వాకింగ్ ట్రాక్ చేయవచ్చు. హెల్తీ ఫై మీ వంటి డైట్ యాప్లు మంచి ఆహార నియమాలు పాటించేందుకు దోహదపడుతున్నాయి. ప్రాక్టో, టాటా 1 ఎంజీ వంటి యాప్ల ద్వారా ఇంట్లో నుంచే డాక్టర్ కన్సల్టేషన్ పొందవచ్చు.టెక్నాలజీతో వర్షాన్ని అనుభవించండి.. వర్షాలు ఎప్పుడు వస్తాయో, ఎక్కడ ట్రాఫిక్ జామ్ ఉంటుందో ముందే తెలిసిపోతే బాగుంటుందనే మాట వాస్తవమే. ఈ విషయంలో కొన్ని యాప్స్తో పాటు ప్రయాణించవచ్చు. ఆక్యూ వెదర్, స్కైమెట్ వెదర్, లైవ్ రడార్తో వర్ష సూచన. గూగుల్ మ్యాప్స్, మై గేట్ల టెక్నాలజీతో ట్రాఫిక్ అప్డేట్స్, లోకేషన్ ఆధారిత అలర్ట్స్. స్పాటీ ఫై, పాకెట్ ఎఫ్ఎఫ్: వానలో ఒంటరిగా ప్రయాణిస్తున్నప్పుడు, లేదా ఇంట్లో కూర్చుని విండో వెనుకగా జల్లులు చూస్తున్నప్పుడు మంచి ఎంటర్టైన్మెంట్. వర్షంలో ఇంటిని కాపాడండి డోర్ మ్యాట్స్, షూ స్టాండ్స్: వర్షపు నీళ్లు ఇంట్లోకి రాకుండా అడ్డుకునేందుకు.. డీహ్యూమిడిఫైయర్స్: గదుల్లో తడిగా మారే వాతావరణం, మబ్బును నివారించేందుకు ఉపయోగపడతాయి. ఆరోమా డిఫ్యూజర్లు: తడి వాసనను తొలగించి ఫ్రెష్నెస్ కలిగించేందుకు ఉపయోగకరంగా ఉంటుంది.విందుగా మార్చే చిట్కాలు వీకెండ్ విత్ రైన్ థీమ్: ఇంట్లో ఫ్రెండ్స్తో టీవీకి దగ్గరగా బీన్స్ బ్యాగ్స్, మసాలా టీ, బజ్జీలు.. ఇదే అసలైన హ్యాపీనెస్. రెయిన్ ఫ్రేమ్స్ ఫొటోగ్రఫీ: వర్షపు నీటి బిందువులు, బల్కనీ పూల మధ్య సెల్ఫీలు.. సోషల్ మీడియాకు మరిచిపోలేని అనుభూతులు. రెయిన్ ఫ్రెండ్లీ రైడ్స్: వర్షంలో బైక్ రైడ్స్, సైక్లింగ్ ట్రిప్స్ వంటి గ్రూప్ యాక్టివిటీస్ ద్వారా వర్షాన్ని మరింత ఆస్వాదించవచ్చు. (చదవండి: 22వేల కోట్ల బ్యాంక్ బ్యాలెన్స్, అతిపెద్ద ప్యాలెస్.. ఐనా ఆమె స్టిల్ బ్యాచిలర్..!) -
కేన్సర్ కేసులు ఎందుకు పెరుగుతున్నాయి?
సాక్షి ప్రతినిధి, వరంగల్: విస్తృతంగా విస్తరిస్తున్న కేన్సర్ మహమ్మారి ప్రజలు, ప్రభుత్వాలకు సవాల్ విసురుతోంది. వేగంగా ప్రబలుతున్న ఈ వ్యాధి దేశాన్నే కలవరపెడుతోంది. చాపకింద నీరులా అయిదేళ్లుగా తెలుగు రాష్ట్రాల్లోనూ ఎగబాకింది. అధికారిక గణాంకాల ప్రకారం.. దేశవ్యాప్తంగా 5 ఏళ్లలో కేన్సర్ కేసుల సగటు పెరుగుదల 11.55 శాతంగా ఉంది. ఏపీలో 9 శాతం, తెలంగాణలో 10 శాతం చొప్పున కేసులు పెరిగాయి. మృతుల సంఖ్య కూడా దేశవ్యాప్తంగా లక్షల్లోనే ఉంది. రాష్ట్రంలో నమోదవుతున్న కేసుల్లో 41 శాతం రొమ్ము, గర్భాశయ ముఖద్వార, రక్త, నోటి కేన్సర్లు ఉన్నాయి. దేశవ్యాప్తంగా రాష్ట్రాలు / యూటీలలో కేన్సర్ పరిస్థితిపై ఇటీవలి భారతీయ ప్రజారోగ్య సంస్థ (ఐఐపీహెచ్) నివేదికపై ఏప్రిల్ 1న పార్లమెంట్కు కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపిన ఈ వివరాలు ఆందోళన కలిగిస్తున్నాయి. కాగా కేన్సర్ ఇదే విధంగా కొనసాగితే.. జనాభాలో మార్పుల కారణంగా 2040 నాటికి కేసులు రెట్టింపు అయ్యే అవకాశం ఉందని నిపుణులు, నివేదికలు హెచ్చరిస్తున్నాయి.మొదటి స్థానాల్లో యూపీ, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వశాఖ ఈ ఏడాది ఏప్రిల్ 1న పార్లమెంట్లో.. మూడేళ్లలో విస్తరించిన కేన్సర్ కేసులపై రాష్ట్రాల వారీగా నివేదిక సమర్పించింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో 2022లో 14,61,427 కేసులు నమోదైతే, 2023 నాటికి 14,96,972కు పెరిగాయి. 2024 వచ్చేసరికి కేసుల సంఖ్య 15,33,055 గా నమోదైంది. కాగా రాష్ట్రాల వారీగా చూస్తే 2022, 2023, 2024లలో మూడేళ్లపాటు వరుసగా 2,10,958, 2,15,931, 2,21,000 కేసులతో.. దేశంలో ఉత్తరప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది. రెండో స్థానంలో 1,21,717, 1,24,584, 1,27,512లతో మహారాష్ట్ర, ఆ తర్వాత స్థానంలో పశ్చిమ బెంగాల్లో 1,13,581, 1,16,230, 1,18,910 కేన్సర్ కేసులు పెరిగాయి. 4, 5, 6, 7 స్థానాల్లో బిహార్, కర్ణాటక, తమిళనాడు, మధ్యప్రదేశ్ ఉన్నాయి.కేన్సర్ వ్యాప్తికి ఇవే కారణాలు90–95 శాతం కేన్సర్లు జీవనశైలి, పర్యావరణ కారకాల వల్ల వస్తాయని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ధూమపానం, మద్యపానం, పాన్, గుట్కా వంటివి నమలడం, ఊబకాయం, మానసిక ఒత్తిడి, మర్మావయవాలను పరిశుభ్రంగా ఉంచుకోకపోవడం, ఎక్కువ మందితో లైంగిక సంబంధాలు కేన్సర్కు కారకాలుగా చెబుతున్నారు. అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, పౌష్టికాహారం లోపించడం, 18 ఏళ్లలోపే పెళ్లి కావడం, పిల్లలు పుట్టడం, ఆలస్యంగా పెళ్లి చేసుకోవడం, 35 ఏళ్లు దాటాక గర్భధారణ, బిడ్డకు తల్లిపాలు పట్టకపోవడం, తక్కువ పండ్లు, కూరగాయల వినియోగం కేన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయని అంటున్నారు. వ్యవసాయంలో రసాయనాల వాడకం కూడా కేన్సర్ వ్యాప్తికి ఒక కారణం కావచ్చని నివేదికలు చెబుతున్నాయి.తెలుగు రాష్ట్రాల్లోనూ అధికమే..కేన్సర్ కేసుల ఉధృతి తెలుగు రాష్ట్రాల్లోనూ ఎక్కువగానే ఉంది. దేశవ్యాప్తంగా చూస్తే.. ఆంధ్రప్రదేశ్ 8, తెలంగాణ 11 స్థానాల్లో ఉన్నాయి. ఏపీలో 2022లో 73,536 కేసులు ఉండగా, 2023లో 75,086, 2024లో 76,708గా, తెలంగాణలో మూడేళ్లలో 49,983, 51,145, 52,334ల కేసులు నమోదయ్యాయి. కాగా తెలంగాణలోని హైదరాబాద్లో రొమ్ము కేన్సర్ (Breast Cancer) కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని, పొగాకు, మద్యపానం, ఆహారపుటలవాట్లు, వ్యవసాయంలో రసాయనాల వాడకం వంటివి వ్యాధి వ్యాప్తికి కారణమవుతున్నాయని నివేదికలు చెబుతున్నాయి.చదవండి: ఔషధ మొక్క.. ఆరోగ్యానికి రక్ష ఉమ్మడి వరంగల్కు వస్తే పురుషుల్లో ఊపిరితిత్తులు, శ్వాసనాళం, తల, గొంతు, బోన్, రక్త (లుకేమియా), ప్రోస్టేట్ కేన్సర్లు ఎక్కువగా ఉన్నాయని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు. అత్యల్పంగా 28, 31, 32 కేసుల చొప్పున వరుసగా మూడేళ్లలో లక్షద్వీప్లో, డామన్లో 150 నుంచి 173, దాద్రా నగర్ హవేలీలో 238ల నుంచి 268లు, లద్దాఖ్లో 302 నుంచి 318కు కేన్సర్ కేసులను గుర్తించారు.స్క్రీనింగ్ టెస్టులకు ముందుకు రావాలి..కేన్సర్ను గుర్తించేందుకు ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పించింది. జిల్లాల్లో 18 ఏళ్లు నిండిన వారికి ఉచితంగా స్క్రీనింగ్ టెస్టులు చేస్తున్నారు. హనుమకొండ జిల్లాలో ఏడాదిలో 600కు పైగా కేన్సర్ కేసులున్నాయి. వీరిలో 102కు పైగా నోటి కేన్సర్తో బాధపడుతున్న వారే.. గుట్కా, పొగాకు వల్ల నోటి కేన్సర్, ధూమపానం వల్ల ఊపిరితిత్తుల కేన్సర్ వస్తున్నాయి. నలభయ్యేళ్లు దాటిన స్త్రీలు రొమ్ము కేన్సర్ రాకుండా ఆరు నెలలకోసారి కేన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలి. – ఎ.అప్పయ్య, డీఎంహెచ్వో, హనుమకొండ జిల్లా -
వెయిట్లాస్ కోసం బ్లాక్బస్టర్ ఇంజెక్షన్ వచ్చేసింది, ధర ఎంత అంటే!
Wegovy Injection: అధిక బరువుతో బాధపడుతున్న వారికి ఊరటి నిచ్చే వార్త ఇది. డెన్మార్క్కు చెందిన ఔషధ సంస్థ నోవో నార్డిస్క్.. 'వెగోవీ' అనే ఇంజెక్షన్ను తీసుకొచ్చింది. దీనికి సంబంధించి నోవో నార్డిస్క్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ విక్రాంత్ శ్రోత్రియా మంగళవారం (జూన్ 24) ఈ మెడిసిన్ను లాంచ్ చేశారు. ఊబకాయం వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలను తగ్గించడానికి ఈ ఔషధం ఉపయోగపడుతుందని చెబుతోంది. ఈ నెలాఖరులోగా అన్ని ఫార్మా దుకాణాల్లో అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది. వీగోవీ అనే ఇంజెక్షన్ నాలుగు వారాల మోతాదు సైకిల్లోఉంటుంది. నాలుగు వారాల పాటు వారానికి 0.25 mg అతి తక్కువ మోతాదుతో ప్రారంభమవుతుంది. ఆ తర్వాత ఒక నెల పాటు వారానికి 0.5 mg మోతాదు క్రమంగా పెరుగుతుంది. నెల పాటు వారానికి 1 mg మోతాదు పెరుగుతుంది. ఆ తర్వాత వైద్యుడి సిఫారసు మేరకు మోతాదును మరింత పెంచాలా, లేదా తగ్గించాలా అనే దానిపై నిర్ణయం తీసుకుంటారు. ఇది 0.25 mg, 0.5 mg, 1 mg, 1.75 mg ,2.4 mg ఐదు మోతాదు రూపాల్లో మార్కెట్లోకి లభిస్తుంది. ఇది ఉపయోగించడానికి సులభమైన పెన్ లాంటి పరికరంగా లభిస్తుంది.CNBC-TV18 Exclusive | We are confident of leading the weight loss #market as we are first to launch and have strong credibility, says Vikrant Shrotriya, MD & Corporate VP, Novo Nordisk India, as the company launches #Wegovy, a weight loss drug, in #India. Tells @ekta_batra that 1… pic.twitter.com/moiu37dB8c— CNBC-TV18 (@CNBCTV18News) June 24, 2025 ధరలు వివరాలునోవో నార్డిస్క్ వీగోవీ 0.25 mg, 0.5 mg , 1 mg మోతాదు నెలకు రూ. 17,345 ఖర్చవుతుంది. 1.75 mg అధిక మోతాదు ఇంజెక్షన్ నెలకు రూ. 24,280 ఖర్చవుతుంది. 2.4 mg మోతాదు రూ. 26,050 ఖర్చవుతుంది. దీర్ఘకాలిక బరువు నిర్వహణ ,హృదయ సంబంధ వ్యాధులకు వెగోవీ తొలిఏకైక బరువు నిర్వహణ ఔషధం. ఈ ఔషధం 30 కంటే ఎక్కువ బాడీ మాస్ ఇండెక్స్ (BMI), ఇతర అనారోగ్యాలు లేనివారికి , 27 కంటే తక్కువ BMI ఉన్న, ఇతర అనారోగ్యాలున్నా ఇస్తారు.భారతదేశంలో వెగోవీ కోసం స్థానికంగా తయారీకి ఎటువంటి ప్రణాళికలు లేవని కంపెనీ స్పష్టం చేసింది. నోవో నార్డిస్క్ ఇప్పటికే 2022లో భారతదేశంలో నోటి ద్వారా తీసుకునే సెమాగ్లుటైడ్ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. -
Sundar Pichai: సిఈఓలు యవ్వనంగా ఉండాలంటే..!
ప్రముఖుల సంభాషణల్లో గొప్ప గొప్ప సందేశాలు అలవోకగా దొర్లుతాయి. బహుశా అందుకే కాబోలు యువతను గొప్ప గొప్ప వ్యక్తుల ఉపన్యాసాలను వినమని సూచిస్తుంటారు. ఇదంతా ఎందుకంటే..ఇండియా గ్లోబల్ ఫోరం 2025లో ఇస్కాన్ సన్యాసి గౌరంగ దాస్ స్పీచ్ ఒక గొప్ప సందేశాన్ని అందించడమే గాక యువతకు కనువిప్పు కలిగించింది. అంతేగాదు ఈ ఆధునిక సాంకేతికత, డిజిటల్ యుగం మనల్ని ఏవిధంగా ఏమార్చాతున్నాయో కళ్లకు కంటినట్లు చూపించాయి ఆ సన్యాసి మాటలు.అసలేం జరిగిందంటే..లండన్లో జరిగిన ఇండియా గ్లోబల్ ఫోరం 2025లో ఇస్కాన్ సన్యాసి గౌరంగ దాస్ మాట్లాడుతూ..తన బ్యాచ్మేట్ గూగుల్ సిఇఓ సుందర్ పిచాయ్తో జరిగిన సంభాషణను షేర్ చేసుకున్నారు. ఆధ్యాత్మిక మార్గాన్ని అనుసరించడానికి ఇంజనీరింగ్ వృత్తిని విడిచిపెట్టిన ఐఐటీ బాంబే గ్రాడ్యుయేట్ గౌరంగ దాస్, గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ఇద్దరు క్లాస్మేట్లు. అదే ఐఐటీ బ్యాచ్లోవారి బ్రాంచ్లు వేరే అయినా..ఇద్దరూ స్నేహితులు. అయితే కళాశాలలో తామిద్దరం ఒకరికొకరు తారసపడటం అత్యంత అరుదుగా ఉండేదన్నారు. కానీ ఇటీవలే చాలా ఏళ్ల తర్వాత తామిద్దరం కలుసుకుని చాలాసేపు ముచ్చటించుకున్నట్లు తెలిపారు. అయితే తన స్నేహితుడు పిచాయ్ నువ్వు నాకంటే చిన్నవాడిలా యంగ్గా కనిపిస్తున్నావని ప్రశంసించినట్లు గుర్తుచేసుకున్నారు. దీనికి గౌరంగ దాస్ స్పందిస్తూ..సుందర్ పిచాయ్ "ఒత్తిడిని సృష్టించే" గూగుల్తో వ్యవహరిస్తాడని, తాను ఒత్తిడిన మాయం చేసే ఆధ్యాత్మికతతో మమేకం అవుతున్నానని సమాధానమిచ్చారు. ఆ సదస్సులో గౌరంగ దాస్ పంచుకున్న కథ ఒక్కసారిగా డిజిటల్ వ్యసనం మనుషులను ఎలా బానిసలుగా మారుస్తుందో తెరపైకి వచ్చింది. దాని ప్రభావం వల్ల మానసిక ఆరోగ్యం ఎలా క్షీణిస్తుందో అనే దానిపై అవగాహన కలిగించేలా చేసింది. ఇక సన్యాసి గౌరంగ దాస్ కూడా అధిక స్క్రీన్ సమయం,సోషల్ మీడియా వాడకంతో పెరుగుతున్న మానసిక సమస్యల గురించి కూడా వివరించారు. పంచవ్యాప్తంగా 230 మిలియన్ల మంది ప్రజలు సోషల్ మీడియాకు బానిసలయ్యారని నివేదికలు చెబుతున్నాయన్నారు. భారతదేశంలోనే, 70% మంది టీనేజర్లు ప్రతిరోజూ ఏడు గంటలు ఆన్లైన్లో గడుపుతున్నారని, ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏడుగురిలో ఒకరు మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని చెప్పుకొచ్చారు. ఒత్తిడిని తగ్గించుకునేలా చక్కటి మార్గాల తోపాటు కాసేపు మనతో మనం గడిపేలా చక్కటి ధ్యానం వంటివి చేస్తే..మానసికంగానే కాకుండా శారీరకంగానూ ఆరోగ్యంగా ఉంటారని అన్నారు గౌరంగ దాస్. View this post on Instagram A post shared by India Global Forum (@indiaglobalforum) (చదవండి: నటి సమంత ఆరోగ్య చిట్కాలు.. డయాబెటిస్ పేషెంట్లు ఇలా చేశారంటే..) -
Samantha: డయాబెటిస్ పేషెంట్లు ఇలా చేశారంటే..!
నటి సమంత రూత్ ప్రభు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన అద్భుతమైన నటనతో వేలాదిగా అభిమానులను సంపాదించుకున్న నటి. ఆమె అరుదైన మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆరోగ్యంపై పూర్తి ఫోకస్ పెట్టి..ఫిట్నెస్కి సంబంధించిన చిట్కాలను అభిమానులతో ఎప్పటికప్పుడూ షేర్ చేసుకుంటుంటుంది. వర్కౌట్ల దగ్గర నుంచి మానసిక ఆరోగ్యం వరకు ప్రతిదానిపై తన అభిమానులకు ఆరోగ్య స్ప్రుహను కలిగిస్తోంది. అలానే ఈసారి డయాబెటిస్ పేషెంట్లు ఎదుర్కొనే ఆరోగ్య సమస్యలు, చిట్కాలను షేర్ చేసుకుంది. తన అనుభవ పూర్వకంగా తెలుసుకున్న టిప్ గురించి చాలా చక్కగా వివరించింది. అదేంటో ఆమె మాటల్లోనే సవివరంగా తెలుసుకుందాం.డయాబెటిస్ పేషెంట్లు రక్తంలోని చక్కెర స్థాయిలను స్థిరంగ ఉంచుకోవడం అనేది అతిముఖ్యమైనది. ఆరోగ్యకరమైన భోజనంతోనే దాన్ని నివారించొచ్చట. సముతుల్య ఆహారానికి ప్రాధాన్యత ఇచ్చేవారికి ఆ సమస్య ఉండదని అంటున్నారు. కొన్నిసార్లు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకున్నా కూడా రక్తంలో చక్కెర పెరుగుతుందని తాను కూడా గుర్తించానని అంటోంది సమంత. భోజనం ఆరోగ్యకరమైనదే అయినా ఈ సమస్య ఉత్ఫన్నం కావడం ఆశ్చర్యకరంగా అనిపించినా..ఒక అద్భుతమైన చిట్కాతో ఆ సమస్యను నివారించానని అన్నారామె. మనం తీసుకునే ఆహారా క్రమాన్ని మార్చితే చాలు..రక్తంలో చక్కెర పెరుగుదల తగ్గడం గమినించొచ్చని చెబుతోంది. తాను దీన్ని నిరంతర గ్లూకోజ్ మానిటర్తో గురించానని వివరించింది. అందువల్లే తాను ముందుగా కూరగాయలు, తర్వాత ప్రోటీన్, చివరిలో కార్బోహైడ్రేట్లు తీసుకోవడం వంటివి ప్రారంభించినట్లు వివరించింది. ఈ విధానం తనకు చాలా అద్భుతంగా ఉపయోగపడిందని అంటోంది. దీన్ని ఫుడ్ సక్వెన్సింగ్ అంటారు. డయాబెటిస్ ఉన్నవారికి బాగా హెల్ప్ అయ్యే చిట్కాగా చాలా ప్రజాదరణ పొందుతోంది.ఫుడ్ సీక్వెన్సింగ్ అంటే..ఇక్కడ వివిధ రకాల ఆహారాలను ఒక నిర్ధిష్ట క్రమంలో తినాలి. ఫైబర్ అధికంగా ఉండే కూరగాయలతో భోజనాన్ని ప్రారంభించాలి. తర్వాత ప్రోటీన్ లేదా ఆరోగ్యకరమైన కొవ్వులు తీసుకోవాలి. చివరగా బియ్యం లేదా బ్రెడ్ వంటి కార్బోహైడ్రేట్లతో ముగించాలని నిపుణులు సూచిస్తున్నారు. పీచు, ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాలతో జీర్ణక్రియం నెమ్మదించడంతో శరీరం చక్కెరను గ్రహించడం ఆటోమేటిగ్గా తగ్గుతుంది. తద్వారా రక్తంలో చక్కెర స్థాయిలు స్థిరంగా ఉంటాయని చెబుతున్నారు పరిశోధకులు.ఈ విధానం ఎందుకు మంచిదంటే..తిన్న తర్వాత, మన రక్తంలో చక్కెర సహజంగా పెరుగుతుంది. అయితే అది చాలా స్పీడ్గా పెరిగితే టైప్ 2 డయాబెటిస్ వంటి ఆరోగ్య సమస్యలకు దారితీసే ప్రమాదం ఉంటుంది.అదే మొదటగా కూరగాయలు, ప్రోటీన్లు తినడం వల్ల జీర్ణక్రియ మందగిస్తుంది కాబట్టి రక్తంలో చక్కెర స్థాయిలు సమంగా ఉంటాయిని పరిశోధనలో వెల్లడైంది. ప్రయోజనాలు..కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది.కార్బోహైడ్రేట్లు తీసుకునే ముందు ప్రోటీన్ తినడం వల్ల హార్మోన్ GLP-1 పెరుగుతుంది. తద్వారా అతిగా తినకుండా నిరోధిస్తుంది. దీనివల్ల ఆటోమేటిగ్గా చిరుతిండిన తగ్గించగలుగుతాం. పైగా బరువు నిర్వహణకు మద్దతిస్తుంది. మధుమేహం ఉన్నవారికి చాలా బాగా ఉపయోగపడుతుంది. పైగా ఇది మెరుగైన జీర్ణక్రియ, శక్తిని అందిస్తుందిఎలా తినాలంటే..పాలకూర, క్యారెట్లు లేదా ఓక్రా వంటి కూరగాయలతో భోజనం ప్రారంభించండి.గుడ్లు, పప్పు, చికెన్, టోఫు లేదా పనీర్ వంటి ప్రోటీన్తో అనుసరించండి.ముగించడం..కార్బోహైడ్రేట్లు - బ్రౌన్ రైస్ లేదా మిల్లెట్ వంటి తృణధాన్యాలు ప్రాధాన్యంగా తీసుకోవాలి.భోజనంతో పాటు చక్కెర పానీయాలను నివారించాలి.శరీరంలో వాపులను తగ్గించడానికి ఎర్ర మాంసం కంటే లీన్ ప్రోటీన్లు లేదా మొక్కల ఆధారిత ఎంపికలను ఎంచుకోవాలి.గమనిక: ఇదికేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం.(చదవండి: జస్ట్ ఆరు రోజుల్లో ఇంగ్లీష్, అలవోకగా 46 భాషలు..ఏకంగా 400..) -
Today tip ఇలాంటి దివ్యౌషధం ఈ భూమ్మీద మరొకటి లేదు!
నిద్రను మించిన సుఖం లేదని పెద్దలు చెబుతూ ఉంటారు. ఆవేదనలనుంచి అలసటనుంచి ఎంతో ఉపశమనాన్నిస్తుంది. అందుకే కునుకు పడితే మనసు కాస్త కుదుట పడతది అంటాడో సినిమా కవి.మరో విధంగా చెప్పాలంటే ఈ భూమి మీద అత్యంత బలమైన ఔషధం నిద్ర. కానీ ఆధునిక కాలంలో నిద్ర అనేది చాలామంది అందని ద్రాక్షలా మిగిలిపోతోంది.మారుతున్న జీవన శైలి, నిద్రలేమి ప్రభావం యువతమీద , ఉద్యోగుల మీద తీవ్రంగా ఉంటోంది. జీవగడియారం సరిగా నడవడానికి నిద్ర ఎంత ముఖ్యమో తెలుసా? పదండి ఇవాల్టి టిప్ ఆఫ్ ది డేలో భాగంగా నిద్రప్రయోజనాలు, పరిష్కారాలు తెలుసుకుందాం.నిద్ర అంటే ఏమిటి?నిద్ర అంటే శరీరం , మెదడు విశ్రాంతి తీసుకోవడానికి అనుమతించే ఒక సాధారణ శరీర ప్రక్రియ. రాత్రిపూట నిద్ర వల్ల అనేక ప్రయోజనాలున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతారు. అఇయతే కళ్లు మూసుకోగానే నిద్రలోకి జారిపోయే అదృష్టవంతులకు ఇది చాలా సులభం అనిపించినా, నిద్రాదేవత అనుగ్రహించని వారి బాధలు అన్నీ ఇన్నీ కావు. వ్యాయామం ,సమతుల్య ఆహారం లాగానే నిద్ర కూడా మన ఆరోగ్యానికి చాలా అవసరం నిద్రలేమితో మధుమేహం, రక్తపోటు, గుండెజబ్బు, గుండె సంబంధిత వ్యాధులు, ఊబకాయం వంటి దీర్ఘకాలిక వ్యాధులు చుట్టుముట్టే ప్రమాదం ఉంది. ఆరోగ్యంగా ఉండాలంటే ఎనిమిది గంటల నిద్ర తప్పనిసరి. అలాగే అప్పుడే పుట్టిన పిల్లలకు 18 గంటలు , చిన్న పిల్లలు 11 గంటలు నిద్రపోవాలని, టీనేజర్లకు 10 గంటలు నిద్రపోవాలని అంటారు నిపుణులు. మంచి నిద్ర మెదడును ఉత్తేజ పరుస్తుంది. మరుసటి రోజు పనికి ఉత్సాహాన్ని ఇస్తుంది. రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తుంది. విసెరల్ కొవ్వును కరిగిస్తుంది.DNA నష్టాన్ని సరిచేస్తుంది . కొత్త మెదడు కణాలను ఉత్పత్తి చేస్తుంది.మంచి నిద్రకోసం చిట్కాలుమంచినిద్ర కావాలంటే జీవన శైలి సక్రమంగా ఉండాలి. ఒత్తిడికి దూరంగా ఉండాలి.క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల మంచి నిద్ర పడుతుంది.నిద్రవేళకు 3 గంటలలోపు వ్యాయామం చేయాలనేది గుర్తించుకోండిరోజూ ఒకే సమయానికి నిద్రపోవడం కూడా చాలా ముఖ్యం. మొబైల్ ఫోన్లు, టాబ్లెట్లు , కంప్యూటర్ల నుండి వెలువడే నీలిరంగు కాంతి నిద్రను ప్రభావితం చేస్తుంది. కనుక పడుకునే ముందు కనీసం ఒక గంట ముందు ఎలక్ట్రానిక్ పరికరాలను దూరం పెట్టేయాలి.వేడి నీటి స్నానం, పుస్తకం పఠనం, ప్రశాంతమైన సంగీతం వినడంతోపాటు నిద్రకు ముందు కెఫిన్, ఆల్కహాల్కు దూరంగా ఉండాలి.పడకగదిని నిద్రకు అనుకూలంగా అంటేగదిని చీకటిగా, ప్రశాంతంగా, వాతావరణానికి అనుగుణంగా మార్చుకోవాలి.ధ్యానం , యోగా, శ్వాస వ్యాయామాలు నిద్రకు సహాయపడతాయి.మంచినిద్ర కావాలంటే డి విటమిన్ చాలా అవసరం పగటి నిద్ర రాత్రి నిద్రకు చేటు. రాత్రి పూట హెవీ మీల్ తినవద్దుసాయం చేసే ఆహారంపైన చెప్పిన జాగ్రత్తలతోపాటు పడుకునే ముందు 1 ఔన్స్ టార్ట్ చెర్రీ రసం లేదా రోజుకు రెండుసార్లు టార్ట్ చెర్రీస్ తినవవచ్చు.పుట్టగొడుగులు,సాల్మన్, ట్యూనా చేపలు సహజంగా మెలటోనిన్ ఉత్పత్తిని పెంచుతాయి.ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు మెదడు కెమిస్ట్రీని ఆప్టిమైజ్ చేస్తాయి.పాలీఫెనాల్ అధికంగా ఉండే బెర్రీలు (బ్లూబెర్రీస్, రాస్ప్బెర్రీస్, బ్లాక్బెర్రీస్) తీసుకోవచ్చు. ఆరోగ్యవంతమైన సెక్స్ తరువాత కూడా మంచి నిద్ర పడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతారు.నోట్ : ఎంత ప్రయత్నించినా నిద్రలేమి లేదా ఇతర నిద్ర సంబంధిత సమస్యలు ఉంటే వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం. కారణాలను విశ్లేషించుకుని తగిన చికిత్స తీసుకుంటే నిద్రా దేవి ఒడిలో ఒరిగిపోవడం ఖాయం. -
ఆనంద్ మహీంద్రా ఫిట్నెస్ సీక్రెట్ ఇదే..! తప్పనిసరిగా ఓ 20 నిమిషాలు..
ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎప్పటికప్పుడూ..సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ స్ఫూర్తిదాయకమైన కథలను పంచుకుంటుంటారు. ఆయన కూడా ఫిట్నెస్కు అధిక ప్రాధాన్య ఇస్తారు. అందుకు నిదర్శనం ఆయన ఆహార్యం. 70 ఏళ్ల వయసులోనూ అంతే ఫిట్గా చురుగ్గా కనిపిస్తారు. ఈసారి సోషల్ మీడియాలో తన హెల్త్ సీక్రెట్ని పంచుకుంటూ తానేమి ఫిట్నెస్ గురువుని కాదని చెబుతున్నారు. మరి ఆనంద్ మహీంద్రా ఫిట్నెస్ రహస్యం ఏంటో సవివరంగా తెలుసుకుందామా..!.ఆయన తన వీక్లీ ఫిట్నెస్ దినచర్య మారుతూ ఉంటుందని స్వయంగా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు కూడా. అయితే మహీంద్రా ఎక్కువగా కార్డియో-వాస్కులర్ (ఈత/ఎలిప్టికల్స్), కండరాల టోన్ (బరువులు ఎత్తడం) వంటి వర్కౌట్లు చేస్తుంటారట. ఒక్కోసారి ఆ వ్యాయామాల బదులు యోగా చేస్తుంటారట. అయితే ప్రతిరోజూ తప్పనిసరిగా ఓ 20 నిమిషాలు ధ్యానం చేస్తుంటారట. అదే తనను పూర్తి ఆరోగ్యంతో ఉండేలా చేయడంలో కీలకపాత్ర పోషిస్తోందట. నిపుణులు సైతం 70 ఏళ్లు పైబడితే..తప్పనిసరిగా ధ్యానం చేస్తే మంచి ఫలితం ఉంటుందని చెబుతున్నారు. ఏవిధంగానో వారి మాటల్లోనే తెలుసుకుందాం. ధ్యానం ఆరోగ్యానికి మంచిదా..60 ఏళ్లు దాటాక..కండరాల ద్రవ్యరాశి, ఎముక సాంద్రత తగ్గడం అనేది స్పష్టంగా తెలుస్తుంది. క్రమంగా వయసు పెరిగేకొద్దీ..ఇమ్యూనిటీ పవర్ కూడా ఆటోమెటిగ్గా తగ్గుతుంది. అందువల్ల అలాంటి పెద్దవాళ్లు తప్పనిసరిగా బరువులు ఎత్తే వ్యాయామాలు, ఈత వంటివి చేస్తే..కండరాలకు సరైన కదలిక, బలం ఏర్పడుతుందట. దీనికి తోడు వ్యాయామం కూడా చేయడం వల్ల ..అవయవాలన్నీ రిలాక్స్ మోడ్లో ఉండి..మనసుపై ధ్యాస పెట్టగలుగుతారట. తమపై తాము దృష్టిసారించే ఈ అమూల్యమైన సమయం..భావోద్వేగాలను కట్టడి చేసేందుకు దోహదపడుతుంది. ఆ వయసులో మనసులో కలిగే లేనిపోనీ భయాలు మాయమవ్వడమే గాక..తెలియని ఆత్మవిశ్వాసం ఏర్పడి బాడీలో ఆటోమేటిగ్గా వ్యాధినిరోధిక శక్తి కూడా పెరుగుతుందట.ఎలా చేయాలంటే..కుషన్ లేదా కుర్చీపై కూర్చోండి. వెన్నెముక నిటారుగా లేదా విశ్రాంతి స్థితిలో ఉంచండికళ్ళు మూసుకుని మీ శ్వాసపై ధ్యాస పెట్టండి. ఈ అభ్యాసం అలా సాగితే..ఆటోమేటిగ్గా తెలియకుండానే అలవాటుగా మారడటమే గాక, మంచి మార్పులు మొదలవ్వుతాయట. ముఖ్యంగా శారీరకంగా, మానసికంగా మెరుగ్గా ఉండేలా చేసి ఆరోగ్యంగా ఉండేలా చేస్తుందని చెబుతున్నారు నిపుణులు.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాల కోసం వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం.(చదవండి: అప్పుడు ఆర్మీ అధికారి.. కానీ ఇవాళ వీధుల్లో..) -
‘శ్వాస ముద్ర’ ఇజ్రాయెల్ శాస్త్రవేత్తల న్యూ స్టడీ : ఆశ్చర్యకర ఫలితాలు
‘శ్వాస మీద ధ్యాస’.. శారీరక, మానసిక ఆరోగ్యాన్ని, స్వస్థతను ప్రసాదించే ధ్యానానికి అద్భుత సాధనం అన్న విషయం మనకు తెలుసు. ఇది కేవలం నమ్మకం కాదని, అక్షరాలా సత్యమని చెప్పడానికి శాస్త్రీయ ఆధారం చూపే అధ్యయన ఫలితం వెలువడింది. ‘వేలి ముద్ర’ మాదిరిగానే ప్రతి మనిషికీ విలక్షణమైన ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో కూడిన ‘శ్వాస ముద్ర’ ఉంటుందట! ఆలోచనలపరంగా, ఆరోగ్యపరంగా మీరేమిటో చెప్పాలంటే మీ విలక్షణమైన ‘శ్వాస ముద్ర’ను చూస్తే చాలు అనే పరిస్థితి మున్ముందు రావచ్చని అంటున్నారు శాస్త్రవేత్తలు!!-సాక్షి సాగుబడిఇజ్రాయెల్లోని వీజ్మన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్లో న్యూరో బయాలజీ ప్రొఫెసర్ నోమ్ సోబెల్, ఆయన బృందం.. శ్వాస తీరుతెన్నులకు, వ్యక్తుల భావోద్వేగాలూ ఆరోగ్య స్థితిగతులకూ ఏమైనా సంబంధం ఉందా అనే అంశంపై అధ్యయనం చేశారు. ఆశ్చర్యకరమైన ఈ అధ్యయన ఫలితాలు ఇటీవల ‘కరెంట్ బయాలజీ’ జర్నల్లో ప్రచురితమయ్యాయి.96.8% ‘ప్రత్యేకం’ఈ అధ్యయనంలో భాగంగా 100 మందిని ఎంపిక చేసి, 24 గంటల పాటు వారి ఉచ్ఛ్వాస నిశ్వాసాలను నమోదు చేసి, విశ్లేషించారు. నాసికా రంధ్రాల బయట పట్టుకొని ఉండే సెన్సార్లతో కూడిన పరికరాన్ని వారికి అమర్చారు. వారు నిద్రలో ఉన్నా, మేల్కొని ఉన్నా అనుక్షణం వారి శ్వాస తీరుతెన్నులను 24 గంటల పాటు నమోదు చేశారు. దీనితో పాటు వారికి ప్రశ్నావళిని కూడా అందించి, వారి అభిప్రాయాలను సేకరించి, విశ్లేషించారు. ప్రతి వ్యక్తీ 96.8% మేర తనదైన విలక్షణ శైలిలో శ్వాసిస్తున్నారని ఈ అధ్యయనంలో వెల్లడైంది. కొందరు నిచ్ఛ్వాస తర్వాత తిరిగి శ్వాస తీసుకునే ముందు కొద్ది విరామం తీసుకున్నారు. మరికొందరు వెనువెంటనే లేదా ఇతరులకన్నా ముందే శ్వాస తీసుకున్నారు. ఎవరి తీరు వారిదే అన్నట్లు శ్వాస తీరుతెన్నులు ఉండటం విశేషం.అనారోగ్యాలు పసిగట్టేందుకూ..వ్యాకులత తదితర అంశాలపై వారు వ్యక్తపరచిన అభిప్రాయాలకు, వారి శ్వాస తీరుతెన్నులకు మధ్య సారూప్యత కనిపించింది. దీంతో, మనుషుల మానసిక స్థితిగతులను, అనారోగ్య సమస్యలను, రుగ్మతలను పసిగట్టేందుకు వారి శ్వాస తీరుతెన్నులు ఉపయోగపడతాయని పరిశోధకులు అభిప్రాయపడ్డారు. ‘ప్రతి ఒక్కరి మెదడు మాత్రమే కాదు, వారి శ్వాస తీరుతెన్నులు కూడా విలక్షణమైనవే’ అనిపిస్తోందన్నారు వీజ్మన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్లో న్యూరో బయాలజీ ప్రొఫెసర్ నోమ్ సోబెల్. ఈ అధ్యయనంలో పాల్గొన్న వంద మందిలో 42 మంది శ్వాస ప్రక్రియను మరో 24 గంటలు అదనంగా అధ్యయనం చేశారు. ‘ఒకరు రన్నింగ్ చేస్తారు. మరొకరు చదువుకుంటుంటారు. ఇంకొకరు విశ్రమిస్తుంటారు. వీరి శ్వాస తీరుతెన్నుల్లో వైవిధ్యాన్ని గుర్తించటం చాలా కష్టమేమో అని ముందు అనుకున్నాం. అయితే, ఒకరి శ్వాస తీరుతెన్నులతో మరొకరిది చాలా విభిన్నంగా ఉండటం గమనించాం’ అని ఈ అధ్యయనంలో పాల్గొన్న ఒక విద్యార్థి తిమ్న సరోక ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు.వ్యాకులత.. తక్కువ గాలి!వారి శ్వాస తీసుకుంటున్న తీరు, నిద్రకు ఉపక్రమించటం–మేల్కొనటం, మనోవ్యథ, వ్యాకులతకు సంబంధించిన భావోద్వేగాలను బట్టి ఆయా వ్యక్తుల బాడీ మాస్ ఇండెక్స్ (బిఎంఐ)ను సైతం పరిశోధకులు అంచనా వేయగలగటం మరో విశేషం. అధ్యయనంలో భాగంగా ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాసినప్పుడు వ్యాకులతను కనబరిచిన వ్యక్తులు చాలా తక్కువగా గాలి పీల్చుకున్నారు. అంతేకాదు, నిద్రలో ఉచ్ఛ్వాస నిశ్వాసాల మధ్య వచ్చిన విరామంలో చాలా హెచ్చు తగ్గుల్ని పరిశోధకులు గుర్తించారు. మనోవ్యథతో బాధపడుతున్న వారు మేల్కొని ఉన్నప్పుడు చాలా బలవంతంగా శ్వాసను తీసుకోవటం, గాలి వదిలిన తర్వాత తిరిగి శ్వాస తీసుకోవటానికి ముందు సుదీర్ఘంగా విరామం (పాజ్) ఇస్తుండటాన్ని పరిశోధకులు గుర్తించారు. ఇదీ చదవండి: Today Tips యోగాతో లాభాలెన్నో.. ఈ చిట్కాలు తెలుసా?ఆయురారోగ్యాలకోసం.. ‘ఒత్తిడి లేదా ఆందోళనతో బాధపడేవారి శ్వాస తీరుతెన్నులు మారి పోతున్నాయని మేం భావిస్తున్నాం. దీన్ని ఇంకోలా కూడా చెప్పుకోవచ్చు. మీరు శ్వాస తీసుకునే తీరును బట్టి మీకు ఒత్తిడి లేదా ఆందోళన వస్తున్నాయని కూడా అనుకోవచ్చు. అదేగనక నిజమైతే, ఆ రుగ్మతల నుంచి బయటపడేయటానికి శ్వాసించే తీరును మార్చితే సరిపోతుందని అనుకుంటున్నాం’ అన్నారు నోమ్ సోబెల్. శ్వాస మీద ధ్యాస పెడితే ఆయురారోగ్యాలు సమకూరుతాయంటే ఇదేనేమో! -
ధమనుల్లో కాల్షియం గోడ కూల్చేదెలా..?
గుండెకు రక్తాన్నిచ్చే ధమనుల్లో సిమెంటులాంటిది పేరుకుపోతుంది. కాల్షియమ్ రాయిలా మారడంతో వచ్చే అనర్థమది. అలా ధమనుల్లో కాల్షియమ్ రాయిలా పేరుకుపోవడం వల్ల వచ్చే పరిణామాలేమిటి, వాటిని ఎదుర్కోవడమెలా వంటి అనేక అంశాలపై అవగాహన కోసం ఈ కథనం. అందరికీ తెలిసిన అంశమేమిటంటే... గుండెకు రక్తాన్ని చేరవేసే రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ పేరుకు΄ోయి, గుండెకు రక్తమందించే ప్రక్రియకు అడ్డుపడితే అది గుండెపోటుకు దారితీసే ప్రమాదం ఉంటుందన్న విషయం చాలామందికి తెలిసిందే. కానీ చాలామందికి తెలియని విషయమేమిటంటే... ఇలాంటి ముప్పు కాల్షియమ్తోనూ ఉండవచ్చునని. అయితే ఈ కాల్షియమ్ పేరుకుపోవడమన్నది కొలెస్ట్రాల్తో పాటు సాగుతుంది. ఇలా కొలెస్ట్రాల్తో కలగలసి రక్తనాళాల్లోగానీ లేదా రక్తనాళపు గోడల్లోగానీ క్రమక్రమంగా క్యాల్షియమూ పేరుకుపోవడం వల్ల ఆ ధమనులు కాస్తా తమ మృదుత్వాన్ని(ఫ్లెక్సిబిలిటీని) కోల్పోయి గట్టిగా మారతాయి. వాటితో పాటు రక్తం ప్రవహించే మధ్యభాగం లో (ల్యూమెన్లో) కాల్షియమ్ డిపాజిట్స్ కాస్తా రాయిలా అడ్డుపడి రక్తప్రవాహాన్ని నిలిపివేస్తాయి. ఇదీ గుండెకు తీవ్రంగా ముప్పు తెచ్చిపెట్టే అంశమే. అంతేకాదు.. చికిత్సకూ అంత తేలిగ్గా లొంగని సమస్య అది. అయితే ఇటీవల ఆధునిక వైద్యశాస్త్రంలో వచ్చిన మంచి పురోగతి వల్ల అలా క్యాల్షియమ్ పేరుకుపోయినప్పుడు దాన్ని మెత్తగా నలగ్గొట్టే చాలా ప్రభావ పూర్వకమైన ప్రక్రియలు అందుబాటులో ఉన్నాయి. వాటి ద్వారా ఆ కాల్షియమ్ గడ్డలను ఛిద్రం చేసి గుండెకు రక్తాన్ని ప్రవహించేలా చేయడమిప్పుడు సాధ్యమే. ధమనుల్లో కాల్షియం ఎలా పేరుకుపోతుందంటే..? ధమనులు అంటే గుండెకు మంచి రక్తాన్ని చేరవేసే ఈ రక్తనాళాలు... వాస్తవానికి గుండెకు మాత్రమే కాకుండా దేహంలోని ప్రతి కణానికీ... ఆక్సిజన్నూ, పోషకాలను చేరవేసే ప్రధాన రహదారుల్లాంటివని చెప్పవచ్చు. అయితే గుండెకు రక్తాన్ని చేరవేసే అత్యంత ప్రధానమైన రక్తనాళాలను ‘కరోనరీ ఆర్టరీస్’ అంటారు. పుట్టినప్పుడు అత్యంత క్లీన్గా ఉండే ఈ కరొనరీ ఆర్టరీస్లో... కాలం గడుస్తున్న కొద్దీ పూడిక పేరుకు΄ోతూ ఉంటంది. అంటే కొవ్వు పదార్థాలూ, కొవ్వులాంటిదే అయిన కొలెస్ట్రాల్, ఇన్ఫ్లమేటరీ కణాలూ, పీచులాంటి కణాలూ (ఫైబ్రస్ టిష్యూ)... ఇవన్నీ కలగలసి... రక్తం ప్రవహించే రక్తనాళాల మధ్యభాగంలో అడ్డంకులుగానూ, పూడిక లాగా పేరుకుపోతూ ఉంటాయి. ముప్పును పెంచే ఆరోగ్య సమస్యలుకొందరిలో కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు ఉన్నప్పుడు ఇలా రక్తనాళాలు గట్టిబారడం, రక్తనాళం మధ్యన పూడిక పేరుకుపోవడం వంటి సమస్యలు ఇంకా వేగవంతం కావచ్చు. ఉదాహరణకు మధుమేహం. దీర్ఘకాలిక మూత్రపిండాల సమస్య, వయోభారం... వంటి అంశాలన్నీ రక్తనాళాలు గట్టిబారడం, వాటి మధ్య పూడిక పేరడమనే సమస్యను మరింత వేగంగా జరిగేలా చేస్తాయి. రక్తనాళాల్లో ప్రవహిస్తున్న ఈ ‘కాల్షియమ్’ కాస్తా సిమెంట్లాగా పేరుకుపోతూ మెత్తటి మృదువైన రక్తనాళాన్ని కాస్తా ఓ లోహపు పైప్లా మరింత గట్టిబారుస్తూ పోతుంది. ఈ ప్రక్రియే ఈ సమస్యను మరింత కఠినతరం చేస్తూ, చికిత్సకు ఓ పట్టాన లొంగని అంశంలా మారుస్తుంది. సమస్యగా ఎందుకు పరిణమిస్తుందంటే..?ఎటుపడితే అటు వంగిపోయేలా మృదువుగా ఉన్నప్పడు హాయిగా విస్తరించగలిగే రక్తనాళం... గట్టిపడ్డ తర్వాత అదే తరహాలో విస్తరించదు లేదా సాగదు. అంతెందుకు రక్తనాళాన్ని విప్పారేలా చేయడానికి ‘బెలూన్’ను లేదా ‘స్టెంట్’ను పంపినప్పుడు కూడా అది ముందుకు వెళ్లదు. గట్టిబారిన / పూడిక పేరుకుపోయిన రక్తనాళంలోంచి రక్తం సాఫీగా ప్రవహించదు. ఫలితంగా ఛాతీనొప్పి (యాంజినా), ఊపిరి అందకపోవడం... ఒక్కోసారి హార్ట్ అటాక్ కూడా రావచ్చు. స్టెంట్ పంపాక కూడా రక్తనాళం విస్తరించక΄ోవడంతో చికిత్సా ఫలితాలు అంత బాగా లేకపోవడం లేదా ఒక్కోసారి మళ్లీ మళ్లీ అడ్డంకులు ఏర్పడటం, స్టెంట్ వేసిన చోట అటు ఇటు రక్తనాళాల్లో రక్తపు ఉండలు/ రక్తపు గడ్డలు పెరుగుతూ రక్తప్రవాహానికి అడ్డుపడవచ్చు. దాంతో రక్తనాళంలోపల మునపటిలాగే మూసుకుపోవచ్చు. ఇలా కాల్షియమ్ పేరుకుపోయినప్పుడు దాన్ని తొలగించేందుకూ... అలాగే రక్తప్రవాహాలకు అడ్డు తొలగించేందుకు చేసే యాంజియోప్లాస్టీ ప్రక్రియ సమయంలో అనుకోని ప్రమాదాలూ / ముప్పులూ / దుష్ప్రభావాలూ ఎదురుకావచ్చు. ఈ కాల్షియమ్ను ఎలా ఛిద్రం చేస్తారంటే... ఆధునిక ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ చికిత్స ప్రక్రియల్లో రక్తనాళం లోపల కాల్షియమ్తో రాయిలా పేరుకు΄ోయే అడ్డంకులను తొలగించి, అటు తర్వాత స్టెంట్ వేయడానికి డాక్టర్లు ఒక క్రమపద్ధతిని (స్టెప్ బై స్టెప్ మెథడ్ను) అవలంబిస్తుంటారు. ఈ ప్రక్రియనే వైద్య పరిభాషలో ‘కాల్షియమ్ మాడిఫికేషన్’ అని పిలుస్తారు. ఈ క్యాల్షియమ్ మాడిఫికేషన్లో అనేక పద్ధతులుంటాయి. డాక్టర్లు అనుసరించే కొన్ని పద్ధతులు.. హై ప్రెషర్ నాన్ కాంప్లయంట్ బెలూన్స్ ఈ ప్రక్రియలో ‘ఓపీఎన్ – ఎన్సీ బెలూన్స్’ అనే వాటిని ఉపయోగిస్తారు. మామూలుగా మూసుకుపోయిన రక్తనాళాన్ని విప్పార్చేందుకు వాడే బెలూన్స్ కంటే ఇవి అధిక ఒత్తిడి కలిగిస్తూ రక్తనాళాన్ని తెరుస్తాయి. ఇవి దాదాపుగా 40 అట్మాస్ఫియరిక్ ప్రెషర్ను కలిగిస్తాయి. సాధారణ బెలూన్స్ కలిగించే ఒత్తిడి కంటే ఇది చాలా ఎక్కువ. స్కోరింగ్ అండ్ కట్టింగ్ బెలూన్స్: ఈ తరహా బెలూన్స్కు పైపొర మీద కొన్ని బ్లేడ్లూ, వైర్లూ అమరి ఉంటాయి.రొటేషనల్ అథెరెక్టమీ: ఒక డ్రిల్లింగ్ ఉపకరణం లాంటి దాని ముందు అమర్చిన గట్టి వజ్రపుముక్కను నిమిషానికి రెండు లక్షల సార్లు తిరిగేలా చేయడం వల్ల గట్టిబారిన క్యాల్షియమ్ను బలంగా గ్రైండింగ్ చేస్తున్నప్పుడు చిన్న చిన్న ముక్కలుగా ఛిద్రం చేస్తుంది. ఆర్బిటల్ అథెరెక్టమీ: పెన్సిల్ ములుకు లాంటి త్రికోణాకృతిలో ఉన్న గట్టి ములుకు ఓ డ్రిల్లింగ్ ఉపకరణం సహాయంతో రక్తనాళం మధ్యన డ్రిల్ చేస్తున్నట్టుగా తిరుగుతుండటం దీని ప్రత్యేకత. ∙ఇంట్రావాస్కులర్ లిథోట్రిప్సీ షాక్ వేవ్ థెరపీ: ఇందులో షాక్వేవ్స్ను వెలువరించే ఓ ప్రత్యేకమైన బెలూన్ను (షాక్వేవ్ సీ2 + లేదా లిథిక్స్ హెచ్సీ వంటివి) ఉపయోగిస్తారు. షాక్వేవ్స్ పుట్టించే తరంగాలు అక్కడ పేరుకున్న కాల్షియమ్ను పొడిపొడి చేస్తాయి.లేసర్ అథెరెక్టమీ: ఇది అత్యాధునికమైనదీ, ఉపయోగకరమైనది కూడా. ఫలితాలు ఎలా ఉంటాయంటే... రక్తనాళాలు మళ్లీ మునపటిలా మృదువుగానూ క్రియాశీలంగానూ మారతాయి. స్టెంట్ వేసినప్పుడు అది గోడలకు సరిగ్గా అమరేలా విప్పారడంతో దాన్ని సరిగా అమర్చడంతో రక్తప్రవాహం సాఫీగా సజావుగా సాగుతుంది. దాంతో అప్పటివరకు కనిపిస్తున్న లక్షణాలు కనబడకపోవడంతో పాటు దీర్ఘకాలిక ఫలితాలు ఒనగూరే అవకాశాలెక్కువ. ∙పరిస్థితిని అర్థం చేసుకునేందుకు ఓ పోలిక... మనకు తేలిగ్గా అర్థమయ్యేందుకు ఓ ఉదాహరణ ఇది. ఓ మృదువైన పైప్లోకి గట్టిగా ఉండే మరో పైప్ను ఎక్కిస్తున్నామనుకోండి. అది మృదువుగా ఉండటంతో లోపలికి పంపే మరో పైప్ చాలా తేలిగ్గా ముందుకు వెళ్తూ ఉంటుంది. అదే పైప్గానీ ఎటుబడితే అటు ఒంగకుండా గట్టిగా ఉంటే లోపలికి ఎక్కించాల్సిన పైప్ తేలిగ్గా ముందుకు వెళ్లదు. అంతేకాదు... పైప్లో ఏవైనా సిమెంటు, రాళ్లు, ఇసుక ఉన్నాయనుకుందాం. అప్పుడు లోపలికి ఎక్కించే పైపు ముందుకే సాగదు. సరిగ్గా స్టెంట్ వేసే చికిత్స సమయంలోనూ ఇదే జరుగుతుంది. డాక్టర్ ఎం.ఎస్.ఎస్. ముఖర్జీ, సీనియర్ కార్డియాలజిస్ట్ (చదవండి: ఆసనం.. ఓ ఔషధం..! అధ్యయనం చెబుతోందిదే..) -
వుడెన్ ఆర్ట్తో ఇంటి లుక్నే మార్చేద్దాం ఇలా..!
సాదాసీదా గోడలను కళాత్మకంగా అలంకరించడానికి వివిధ పద్ధతులను అవలంబిస్తుంటారు. వాటిలో వాల్ పోస్టర్లు, ఫొటో ఫ్రేమ్లు, హ్యాంగింగ్స్, పెయింటింగ్స్– ఇలా విభిన్న రకాల వాటితో ఇంటిని అందంగా తీర్చిదిద్దుతుంటారు. ఈ జాబితాలో వుడెన్ ఫ్రేమ్స్ది ప్రత్యేకమైన స్థానం. ఇంటికి వింటేజ్ కళకు వుడెన్ ఆర్ట్ స్పెషల్ లుక్తో అట్రాక్ట్ చేస్తుంది. ఇంట్లో సాదా గోడలు చూడటానికి కళావిహీనంగా ఉంటాయి. వాటిని కళాత్మకంగా మార్చడానికి వుడెన్ ఆర్ట్ వాల్స్ చక్కగా ఉపయోగపడతాయి. పక్షులు, ఫలాలు, లతలు, పువ్వులు వంటివన్నీ నింపుకున్న డిజైన్లలో ఇవి లభిస్తున్నాయి. ఎవరికి వారు సొంతంగా కొంచెం క్రియేటివిటీతో వీటిని తయారు చేసుకోవచ్చు. వుడెన్ వాల్ డిజైన్లను సృష్టించడానికి అనేక సృజనాత్మక ఆలోచనలతో అనేక రకాల డిజైన్లను ప్రయత్నించవచ్చు. ఫొటోగ్రాఫ్ ప్యాటర్న్స్వుడెన్ స్లాబ్స్ లేదా ఫ్రేమ్స్పైన పెయింటింగ్ లేదా వేర్వేరు ప్యాటర్న్స్ లేదా జామెట్రిక్ రూపాలను రూపొందించవచ్చు. బేసి సంఖ్య లేదా సరి సంఖ్యలో గోడ పొడవు వెడల్పులను బట్టి ఎంత మేర డిజైన్ చేయాలనుకుంటున్నారో అన్ని ఫ్రేమ్స్ తీసుకోవచ్చు. చిన్నా పెద్ద, వెడల్పు వుడెన్ క్యూబిక్స్ను ఎంచుకోవచ్చు. పక్షులు, పూల చిత్రాలువుడెన్ స్లాబ్స్పైన పక్షులు, చెట్లు, పూలు చెక్కించవచ్చు. లేదా చెక్కినవి మార్కెట్లో ఎంపిక చేసుకోవచ్చు. ట్రయాంగిల్, స్క్వేర్, డైమండ్వుడెన్ టైల్స్లో త్రికోణం, చతురస్రం, డైమండ్ ఆకారాలు వచ్చేలా కట్ చేసుకొని, పెయింట్ వేసి లేదా వేయకుండా కూడా వాల్ డెకర్లో ఉపయోగించవచ్చు, వుడెన్ ప్యానెల్స్ ఒక దిశలో అమర్చినప్పుడు వాటి మధ్య పూర్తి విరుద్ధమైన డిజైన్ని ఉంచడం వల్ల కూడా ప్రత్యేకమైన లుక్ వస్తుంది. లైనింగ్ ఇన్ లెటర్స్ ఇంటి పేర్లు, హ్యాపీనెస్ లేదా చిన్న చిన్న కోట్స్ వంటివి వుడెన్ ఫ్రేమ్స్ మీద డిజైన్ చేయించి కూడా వాల్ డెకర్గా ఉపయోగించవచ్చు. కుటుంబ సభ్యుల ఫొటోలను కూడా ఈ ఫ్రేమ్స్కి వాడవచ్చు. ఫ్యాబ్రిక్ ప్రింటింగ్ అచ్చులు చీరలు, దుపట్టాల మీద వేసే వుడెన్ అచ్చులను కూడా వాల్ డెకర్కి ఉపయోగించవచ్చు. వీటిలో మామిడి పిందెలు, మండలాకార డిజైన్లు వంటివి లభిస్తాయి. (చదవండి: అక్కడ ప్రతిరోజూ.. క్రిస్మస్ వేడుకే..!) -
ముప్పై ఐదేళ్లు దాటాక ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేయడం ప్రమాదమా...?
నాకు ముప్పై ఐదు సంవత్సరాలు. ఇంకా పెళ్లి కాలేదు. ఫర్టిలిటీకి సంబంధించి పెళ్లిని ఇంకెంత కాలం వాయిదా వేసుకోవచ్చో చెప్పండి?– శ్రీలేఖ, హైదరాబాద్. ప్రస్తుతం మీరు ముప్పై ఐదేళ్ల వయస్సులో ఉన్నందున గర్భధారణకు సంబంధించి కొన్ని ముఖ్యమైన విషయాలను తెలుసుకోవడం అవసరం. వయస్సు పెరిగేకొద్దీ శరీరంలో ఎగ్స్ కౌంట్, వాటి నాణ్యత రెండూ తగ్గిపోతాయి. ముప్పై ఏళ్ల తర్వాత గర్భధారణలో సమస్యలు ఎక్కువ అవుతాయి. గర్భస్రావం, బీపీ, సుగర్, శిశువుకు జన్యుపరమైన లోపాలు వచ్చే అవకాశాలు పెరుగుతాయి. మహిళల ఫర్టిలిటీ గరిష్ఠ స్థాయిలో ఉండే వయస్సు ఇరవై నుంచి ముప్పై మధ్య. ఇరవై ఏళ్లలోపు గర్భం ధరించే అవకాశం ఎనభై ఐదు శాతం ఉంటే, ముప్పై నుంచి ముప్పై ఐదు సంవత్సరాల మధ్య అది అరవై శాతానికి పడిపోతుంది. ముప్పై ఐదు నుంచి నలభై మధ్య నలభై శాతానికి పడిపోతుంది. వయస్సు పెరిగే కొద్దీ గర్భం ధరించే అవకాశం తగ్గుతుంది. అప్పుడు సహజ గర్భధారణ కష్టమై, ఐయూఐ లేదా ఐవీఎఫ్ వంటి వైద్యపద్ధతులపై ఆధారపడాల్సి వస్తుంది. మీ వయస్సును బట్టి, ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకోవడం చాలా అవసరం. నెలసరి చక్రాలు క్రమంగా ఉన్నాయా? పీసీఓఎస్, ఎండోమెట్రియోసిస్ వంటి సమస్యలున్నాయా అన్నది పరిశీలించాలి. అధిక బరువు, పొగతాగే అలవాటు, రక్తపోటు, సెక్స్ మూలంగా వచ్చే వ్యాధులు వంటి అంశాలు కూడా గర్భధారణను ప్రభావితం చేస్తాయి. కనీసం ఒక సంవత్సరం పాటు సహజంగా గర్భం ధరించే ప్రయత్నం చేయాలి. ఫలితం రాకపోతే, వైద్య నిపుణుడిని కలవాలి. వయస్సు, జన్యు చరిత్ర ఆధారంగా తగిన మందులు, అవసరమైతే ఐయూఐ లేదా ఐవీఎఫ్ వంటి వైద్య విధానాలను సూచిస్తారు. అందుకే ఆలస్యం చేయకుండా మంచి నిర్ణయం తీసుకోండి. నా వయస్సు అరవై సంవత్సరాలు. ఇరవై సంవత్సరాల క్రితం బ్లీడింగ్ అవుతోందని గర్భాశయం తీసేశారు. ఇప్పుడు దగ్గినా, తుమ్మినా యోని భాగంలో గడ్డలాగా కనిపిస్తోంది. కానీ నొప్పి లేదు. డాక్టర్ను కలవాలా?– శారద, విశాఖపట్నం. మీరు చెప్పిన వివరాల ప్రకారం, మీ వయస్సులో యోని భాగంలో గడ్డలాగా కనిపించడం నిర్లక్ష్యం చేయదగ్గ విషయం కాదు. గర్భాశయం తొలగించిన తర్వాత ఆ ప్రాంతం బలహీనపడడం వలన కొన్ని సంవత్సరాల తర్వాత యోని భాగం కిందకు జారిపోతుంది. ఇది సాధారణంగా నొప్పిని కలిగించదు. కాని, ఏదో బరువుగా, ఒత్తిడిగా అనిపిస్తుంది. ఈ పరిస్థితిని వజైనల్ వాల్ ప్రోలాప్స్గా పరిగణిస్తారు. ఇది నరాలపై ఒత్తిడి కలిగించి అసహజమైన ఫీలింగ్ను కలిగిస్తుంది. అలాగే, యోని భాగంలో పుండ్లు, మంటలు, వాపులు ఏర్పడిన సందర్భాల్లో కూడా గడ్డలాగా అనిపించవచ్చు. మూత్రనాళ సమస్యల కారణంగా కూడా ఇలాంటి సమస్యే వస్తుంది. మరికొన్ని సందర్భాల్లో వజైనల్ వాల్తో పాటు మూత్ర సంచి లేదా మోషన్ పేగు కూడా బలహీనపడిపోయి కిందకు జారిపోవచ్చు. అప్పుడు మూత్రం పూర్తిగా వెలువడకపోవడం, మూత్ర సంచి తడిపోవడం, మలవిసర్జన నియంత్రణ కోల్పోవడం వంటి సమస్యలు కనిపిస్తాయి. ఇవన్నీ పెల్విక్ భాగం బలహీనతకు సంకేతాలు. ఇలాంటి సందర్భాల్లో ఆలస్యం చేయకుండా డాక్టర్ను కలవాలి. వారు పెల్విక్ వ్యాయామాలు సూచిస్తారు. అవసరమైతే మల్టీ విటమిన్ మాత్రలు ఇస్తారు. మూత్రపరీక్ష, రక్తపరీక్ష, కల్చర్ పరీక్షలు చేసి, ఇన్ఫెక్షన్స్ ఏవైనా ఉన్నాయా? లేదా? అని చెక్ చేస్తారు. శరీరానికి అవసరమైన పోషకాహారం గురించి కూడా సలహా ఇస్తారు. మీ వయస్సును బట్టి, ముందు వ్యాయామం చేయటం ప్రారంభించాలి. ఇన్ఫెక్షన్ లేకపోతే, యోనిలో పెట్టుకునే వజైనల్ పెస్సరీ వాడాలని సూచిస్తారు. ఇది సాఫ్ట్ పదార్థాలతో తయారైన దై, డాక్టర్ సూచించిన పరిమాణంలో మాత్రమే వాడాలి. ఉపయోగించడం, తొలగించడం నేర్చుకున్న తర్వాత కూడా ప్రతి రెండు నెలలకోసారి వైద్యుని పునర్విమర్శ అవసరం. ఇది ఉపశమనం కలిగిస్తే కొనసాగించవచ్చు. లేకపోతే శస్త్రచికిత్సను సూచిస్తారు. డాక్టర్ భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్ (చదవండి: నెలలు నిండాక వచ్చే నొప్పులు పురిటినొప్పులేనా..?) -
పురిటినొప్పులను గుర్తించడం ఎలా..?
గర్భిణులకు తొమ్మిది నెలలు నిండాక వచ్చే ప్రతి నొప్పులూ పురిటినొప్పుల్లాగానే అనిపిస్తుంటాయి. అలాంటి నొప్పులతో కొన్నిసార్లు ఆసుపత్రి వరకు వెళ్లాక కూడా అవి నిజమైన పురిటినొప్పులు కావంటూ... ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత ప్రసవం అయిన కేసులూ ఉంటాయి. ఈ నేపథ్యంలో నెలలు నిండాక వచ్చే నొప్పులు పురిటినొప్పులేనా అని తెలుసుకోడానికి తోడ్పడే అంశాలేమిటో చూద్దాం.గర్భవతులకు నెలలు నిండాక గర్భసంచి కండరాల సంకోచ వ్యాకోచాల వల్ల నొప్పులు వస్తున్నట్లుగా అనిపిస్తాయి. నిజానికి గర్భవతుల్లోనే కాకుండా మామూలు మహిళల్లోనూ గర్భసంచికి సంకోచ వ్యాకోచాలు కలుగుతూనే ఉంటాయి.బ్రాక్స్టన్ – హిక్స్ కంట్రాక్షన్స్?ఇక గర్భవతుల్లోనైతే ప్రసవానికి చాలా రోజుల ముందు నుంచే గర్భసంచి కండరాల్లో సంకోచవ్యాకోచాలు ఒక తెర తర్వాత మరో తెర... ఇలా తెరలు తెరలుగా వస్తూ ఉంటాయి. వీటినే ‘బ్రాక్స్టన్–హిక్స్ కంట్రాక్షన్స్’ అంటారు. ఈ సంకోచ వ్యాకోచాలు తొమ్మిది నెలలపాటూ వస్తూనే ఉంటాయి. కాకపోతే నెలలు నిండేకొద్దీ ఇవి వచ్చే వ్యవధీ అలాగే ఫ్రీక్వెన్సీ పెరుగుతూ పూర్తిగా నెలలు నిండేనాటికి అవి పురిటినొప్పులుగా రూపాంతరం చెందుతాయి. ఈ సంకోచవ్యాకోచాల సమయంలో పొట్ట కండరాలు బిగుసుకుని, ఆ తర్వాత మెత్తబడుతూ ఉంటాయి. ఏవి పురిటినొప్పులు? గర్భసంచి కండరాల్లోని సంకోచ–వ్యాకోచాల్లో ఏవి పురిటి నొప్పులో గుర్తించడానికి ఒక కొండగుర్తు ఏమిటంటే... ఈ సంకోచ సమయంలో పొట్ట కండరాలు గట్టిబడటంతోపాటు నొప్పి కూడా వస్తుంటుంది. ఈ నొప్పి నడుము వెనక భాగం నుంచి మొదలై క్రమంగా ముందు భాగంలో తొడల వరకు వ్యాపిస్తూ ఉంటుంది. పురిటి నొప్పులు మొదలయ్యాక ఇక ఆ నొప్పులు వస్తూ తగ్గుతూ... ఉంటాయి. ఈ పురిటినొప్పులు గరిష్ఠ స్థాయిలో ప్రభావం చూపుతున్నప్పుడు గర్భసంచి పైభాగం ముడుచుకుంటూ, ముఖద్వార భాగం తెరచుకుంటూ ఉంటే అవి నిజమైన పురిటి నొప్పులని గ్రహించవచ్చు. నిజమైన పురిటినొప్పులు వస్తున్నప్పుడు... 10 నిమిషాల వ్యవధిలో మూడుసార్లు కండరాల సంకోచాలు వస్తూ... ఒక్కో సంకోచ సమయం కనీసం 45 సెకన్ల పాటు కొనసాగుతూ, అదే టైమ్లో గర్భాశయ ముఖద్వారం తెరచుకుంటూ ఉంటే అది నిజమైన ప్రసవ సమయం (ట్రూ లేబర్) అని చెప్పవచ్చు. డాక్టర్ దగ్గరకు ఎప్పుడు? ఇక చాలామంది గర్భవతులకు ఒక డౌట్ వస్తుంటుంది. తాము నొప్పులను గుర్తించాక డాక్టర్ దగ్గరికి ఎప్పుడు వెళ్లడం మంచిదనే సందేహాన్ని వ్యక్తం చేస్తుంటారు. గర్భవతులకు భరించలేనంత నొప్పులు వస్తూ ఉన్నప్పుడుగాని; ఇలా పురిటినొప్పులు వస్తూ అదే టైమ్లో ఏదైనా రక్తస్రావం కనపడుతున్నా గాని; తమ ప్రమేయం లేకుండానే ఉమ్మనీరు పడిపోతున్నాగాని; లేదా కడుపులో బిడ్డ తిరిగినట్లు అనిపించకపోయినా గానీ... ఈ నాలుగు సందర్భాల్లో తప్పని సరిగా, అత్యవసరంగా డాక్టర్ను కలవాలి. నిజానికి పురిటినొప్పులను గుర్తించడమన్నది కాబోయే తల్లి కంటే డాక్టర్లకే ఎక్కువగా తెలిసే అవకాశముంటుంది. కాబట్టి అవి ట్రూ లేబర్ పెయిన్స్ అయినా కాకపోయినా... నొప్పి వస్తున్నట్లు గుర్తించగానే అత్యవసరంగా డాక్టర్ దగ్గరికి వెళ్లాలి. ఒకవేళ అవి ట్రూ లేబర్ పెయిన్స్ అయితే డాక్టర్లు గర్భవతి విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకుంటారు. దాంతో ప్రసవం సురక్షితంగా జరుగుతుంది. ఒకవేళ అది హై–రిస్క్ ప్రెగ్నెన్సీ అయితే ముందుగానే వచ్చి హాస్పిటల్లో చేరాల్సిందిగా డాక్టర్లు సూచిస్తారు. డా. నర్సేపల్లి శోభారాణి, సీనియర్ అబ్స్టెట్రీషియన్ అండ్ గైనకాలజిస్ట్ (చదవండి: చేతి రాతే భవిష్యత్తుకు బాట.. ) -
యోగాతో పరిపూర్ణ ఆరోగ్యం...ఆలివ్ ఆస్పత్రి అవగాహన సదస్సు
అనారోగ్య సమస్య లు దరిచేరకుండా , పరిపూర్ణ శా రీరక, మా నసిక ఆరోగ్యానికికి ప్రతిఒక్క రూ యో గ చేయడమే అత్యుత్తమైందని ఆలీవ్ ఆస్పత్రి వైద్యులు పేర్కొన్నారు. . అంతరాతీ య యో గా దినోత్స వం సందర్భంగా సమగ్ర ఆరో గ్య సంరక్ష ణ కో సం యో గా ను శక్తివంతమైన సా ధనంగా ప్రోత్స హించేలా సా గుతున్న ఆరోగ్య ఉద్య మంలో ఆలివ్ ఆస్పత్రి చేరింది. "యో గా ఫర్ వన్ ఎర్త్, వన్ హెల్త్ " అనే థీమ్తో చేపట్టిన యో గా దినోత్స వంసందర్భంగా ఆస్పత్రి అవగాహన కల్పించింది. ప్రపంచ మా నవాళి ఆరో గ్య సంరక్షణలో యోగా ప్రా ధా న్య తను ప్రపంచ ఆరో గ్య సంస్థ(WHO) గుర్తించిందని, WHO ని వేదిక ప్రకా రం, హృదయ సంబంధ వ్యాధులు,మధుమేహం, మా నసిక ఆరో గ్య రుగ్మ తలు వంటి నాన్ కమ్యూనికబుల్వ్యాధులు (NCD) ప్రపంచ వ్యాప్తంగా సంభవిస్తున్న మరణాలకు ప్రధాన కారణంగా మా రాయి . శారీరక శ్రమ లేకపో వడం, ఒత్తిడి వల్ల భారం పెరుగుతుందని , వీటికి పరిష్కారంగా యోగా వంటి సాంప్రదా య వెల్నస్ పద్ధతులను సమా జం, క్లినికల్ కేర్వ్యూహా లలో భా గంగా సమగ్రపరచా లని ని వేదిక సిఫార్స్ చేసిందని గుర్తు చేసింది. క్రమం తప్ప కుండా యోగాభ్యాసం చేయడం వల్ల రక్తపో టు తగ్గుతుందని , ఊపిరితిత్తు సా మర్థ్యం పెరుగుతుంది.కీళ్ల పటుత్వం పెరుగుతుందని, ఆందోళన, ని రా శ లక్ష ణా లను తగ్గిస్తుందని అధ్య యనా లు ద్వారా తెలుస్తోందని ఆస్పత్రిఇంటర్వన్షనల్ కా రియా లటిస్ట్, కన్సల్టంట్ డా. కృతిక్ కులకర్ణి తెలిపారు. యోగా అనేది వ్యాయామం కంటే ఎక్కువ అనీ, ఇది ఆచరణా త్మ క అనా రో గ్య ని వా రణ జీ వనశలి కి సా ధనమన్నారు. -
Yoga విల్లులా వంగే పాలరాతి శిల్పం.. శిల్పా శెట్టి, వైరల్ వీడియో
International Yoga Day 2025 అంతర్జాతీయ యోగా డే సందర్భంగా బాలీవుడ్ నటి శిల్పా శెట్టి కుంద్రా (shilpa shetty) అద్భుతమైన యోగాసనాలు వేసింది. దీనికి సంబంధించి ఒక వీడియోను ఇన్స్టాలో పోస్ట్ చేసింది. దీంతో ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.బాలీవుడ్ బ్యూటీ క్రమం తప్పకుండా యోగా సాధన చేస్తుంది. ఫిట్నెస్కు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే శిల్పా శెట్టి తన సోషల్ మీడియాలో, ఫిట్నెస్ యాప్లో యోగా, ధ్యానం, ఫిట్నెస్ వ్యాయామాలను పంచుకుంటుంది. తన అద్భుతమైన శరీరాకృతి, ఫిట్నెస్కు యోగానే కారణమని చాలా సార్లు వెల్లడించింది. తాజాగా యోగా డే సందర్భంగా ఇన్ష్టాలోషేర్ చేసిన వీడియో అభిమానులను ఆకట్టుకుంటోంది. 50 ఏళ్ల వయసులో చాలా ఫిట్గా యంగ్ లుక్లో తన అభిమానులను మెస్మరైజ్ చేస్తుంది. శిల్పా తరచుగా తన అభిమానులతో విభిన్న యోగాసనాలు లేదా భంగిమల్ని పంచుకుంటూ , అభిమానులకు ప్రేరణనిస్తుంది. ఇదీ చదవండి: జిమ్కి వెళ్లకుండానే 30 కిలోలు తగ్గింది..ఫేస్ గ్లో కోసం..! View this post on Instagram A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty) -
బాలనెరుపా..? డోంట్ వర్రీ.. బట్ బీ కేర్ఫుల్...!
పూర్వం రోజుల్లో జుట్టు కాస్త తెల్లబడితే, వయసు పైబడుతోందనడానికి సంకేతంగా భావించి దానిని హుందాగా తీసుకునేవారు. మరీ చిన్నవయసులోనే తెల్ల వెంట్రుకలు వస్తే బాలనెరుపు కాబోలు అని సరిపెట్టుకునేవాళ్లు. ప్రస్తుత కాలంలో నెరుపు చిన్న వయసులోనే మొదలవుతోంది. అలాగని ఇప్పుడిదంతా మామూలే అని సరిపెట్టుకోవలసిన అవసరం లేదు. ఈ సమస్యకు మూల కారణాన్ని కనిపెట్టి, దాన్ని సరిదిద్దుకుంటే, బాలనెరుపును దూరం చేసుకుని నిగనిగలాడే కురులను సొంతం చేసుకోవచ్చునంటున్నారు పరిశోధకులు. 25 ఏళ్ల లోపు వయసులో కొందరికి తల మొత్తంగా అక్కడక్కడా వెంట్రుకలు నెరిస్తే, ఇంకొందరికి చెంపల దగ్గర, తలలో ఏదో ఒకచోట వెంట్రుకలు నెరుస్తాయి. అయితే అది ఎలాంటి నెరుపైనా పాతికేళ్ల లోపు కనిపిస్తే కచ్చితంగా బాల నెరుపే! ఈ నెరుపు ఎవరికైనా రావొచ్చు.కాలానుగుణ మార్పుల ప్రభావంవాతావరణం, ఆహార కాలుష్యం, ఒత్తిడి... బాల నెరుపు తీవ్రత కాలక్రమేణా పెరగడానికి ప్రధాన కారణాలు! పూర్వంతో పోల్చుకుంటే ఆహారంలో కృత్రిమత్వం పెరిగింది. వాతావరణంలో కాలుష్యమూ పెరిగింది. మానసిక ఒత్తిడికీ కొదవ లేదు. ఇవన్నీ కాలక్రమేణా బాల నెరుపు తీవ్రమవడానికి దారితీశాయి. ఇవీ కారణాలు: జన్యుపరంగా ఈ లక్షణం సంక్రమించి ఉంటే, తల్లితండ్రులకు ఏ వయసులో తెల్ల వెంట్రుకలు కనిపించాయో, అదే వయసుకు పిల్లల్లో కూడా మొదలవుతాయి.పోషకాల లోపం ప్రధాన కారణం: ప్రొటీన్స్ లోపం ఉన్నా, ఐరన్ తగ్గి అనీమియాకు లోనైనా, కాపర్ లోపం ఉన్నా వెంట్రుకలు తెల్లగా మారతాయి. ఈ లోపాల తీవ్రత ఏ వయసులో పెరిగితే ఆ వయసులో తెల్ల వెంట్రుకలు కనిపించడం మొదలవుతుంది. పిల్లల్లో ఈ సమస్య సర్వసాధారణం. ఇంటి భోజనానికి బదులుగా బయటి చిరుతిళ్లు తినే పిల్లల్లో పోషకాహార లోపం చివరకు తెల్ల వెంట్రుకల రూపంలో బయల్పడుతుంది.చదువు ఒత్తిడీ కారణమే: ఇటీవలి కాలంలో పిల్లల్లో ప్రి మెచ్యూర్ గ్రేయింగ్ పెరగడానికి ప్రధాన కారణం చదువు ఒత్తిడి. మార్కుల కోసం, అదే పనిగా చదవమని ఒత్తిడి చేసినా, మెలనిన్ పరిమాణం తగ్గి వెంట్రుకలు తెల్లబడతాయి.ఇదీ చదవండి: జిమ్కి వెళ్లకుండానే 30 కిలోల తగ్గింది..ఫేస్ గ్లో కోసం..!కారణం తెలిస్తే చికిత్స సులువు: బాల నెరుపుకు అసలు కారణాన్ని కనిపెట్టగలిగితే సమస్య పరిష్కారం సులభమవుతుంది. ఇందుకోసం ఏ పోషకలోపం ఉందో పరీక్షల ద్వారా తెలుసుకోవాలి. థైరాయిడ్, అప్లాస్టిక్ ఎనీమియాలను గుర్తించే పరీక్షలూ చేయక తప్పదు. అలాగే ఈ నెరుపు వంశ పారంపర్యంగా సంక్రమించిందేమో గమనించాలి. జన్యు సమస్యలనూ అంచనా వేయాలి. పరీక్షల్లో ఇవేవీ కారణాలు కావని తేలితే ఒత్తిడిని ప్రధాన కారణంగా భావించాలి. పిల్లలకు బాల్యం నుంచే ఒత్తిడి లేని జీవితం గడిపేలా చూడాలి. పౌష్టికాహారం ఇవ్వాలి. అప్పుడే బాలనెరుపును జయించవచ్చు. డోంట్ వర్రీ! నో డైటింగ్, ఓన్లీ జాదూ డైట్ : నెలలో 7 కిలోలు తగ్గడం పక్కా! -
జిమ్కి వెళ్లకుండానే 30 కిలోలు తగ్గింది..ఫేస్ గ్లో కోసం..!
తీవ్రమైన వ్యాయామాలు, కఠినమైన ఆహార నియమాలతో బరువు తగ్గడం అంటే శిఖరాన్ని అధిరోహించేందుకు చేసే కసరత్తులా అనిపిస్తుంది. ముఖ్యంగా బిజీ జీవనశైలిలో అధికబరువుపై ధ్యాస, జిమ్కి వెళ్లి వ్యాయామాలు చేయడం పెద్ద యుద్ధమే అనిపిస్తుంది. పోషకాహార నిపుణురాలు ఉదిత అగర్వాల్ జిమ్కి వెళ్లకుండానే 30 కిలోల బరువు తగ్గి అందరినీ ఆశ్చర్యపరిచింది. తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో ముఖంలోని కొవ్వును సహజంగా తగ్గించడంలో సహాయపడే కొన్ని సాధారణ చిట్కాలనూ, తీసుకోదగిన ఆహారాలను మన ముందుంచింది.తీసుకునే ఆహారంలో మొత్తం కొవ్వుపై దృష్టి పెట్టాలి. ఎన్ని కేలరీలు ఉన్నాయో, దానికంటే అదనపు కేలరీలను బర్న్ చేయాలని గుర్తించాలి. అప్పుడు కేలరీలు తీసుకోవడం తగ్గిస్తారు. ఉత్తమ ఫలితాల కోసం ఆరోగ్యకరమైన ఆహారం + క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం రెండూ జీవనశైలిలో భాగం చేసుకోవాలి. సమతుల ఆహారం తీసుకోవాలి. ఉప్పు, చక్కెర, ప్రాసెస్ చేసిన ఆహారాలను తీసుకోకూడదు. అధిక ప్రొటీన్ తీసుకోవడం ద్వారా కొవ్వు తగ్గుతుంది. కడుపు నిండుగా ఉంటుంది.ఆరోగ్యకరమైన కొవ్వులు మొలకెత్తిన గింజలు, విత్తనాలలో ఉంటాయి.నీళ్లు, పీచు పదార్థాలు పుష్కలంగా ఉండే పండ్లు – కూరగాయలను తీసుకోవాలి. రోజూ కనీసం 2–3 లీటర్ల నీళ్లు తాగాలి. ఒత్తిడిని తగ్గించడం – హాయిగా నిద్రపోవడం ఒత్తిడి కార్టిసాల్ను పెంచుతుంది, ఇది కొవ్వు పేరుకుని పోయేలా చేస్తుంది. ప్రతి రాత్రి 7 నుంచి 9 గంటల సేపు నిద్ర΄ోయేలా చూసుకోండి. నిద్ర సరిగా లేక΄ోవడం వల్ల శరీరం నీరు పట్టినట్టుగా కనిపిస్తుంది. ముఖ వ్యాయామాలు – టోనింగ్ ఈ వ్యాయామాలు చర్మం నునుపును మెరుగుపరుస్తాయిబుగ్గలు ఉబ్బినట్టుగా ఉంటే, మునివేళ్లతో మృదువుగా వెనక్కి మర్దనా చేయాలి. పళ్ళు బిగించి, నవ్వుతూ, 10 సెకన్ల పాటు అలాగే ఉంచాలి. ‘ఫిష్ ఫేస్‘ ప్రయత్నించాలి. అంటే, బుగ్గలను లోపలికి పీల్చుకొని, కొన్ని సెకన్లపాటు ఉంచాలి. చక్కెర పానీయాలకు దూరంమద్యం చర్మాన్ని డీహైడ్రేట్ చేస్తుంది. నీటిని చేరుస్తుంది. చక్కెర పానీయాలలో అధిక కేలరీలు ఉంటాయి. ఇవి ఒంట్లో ఎక్కువ కొవ్వు నిల్వలను చేరుస్తాయి. పై జాగ్రత్తలన్నీ తీసుకొని, బాడీ ఫిట్నెస్ను కాపాడుకున్నాను. డైటీషియన్ కోర్సు కూడా పూర్తిచేశాను. నాపై నేను తీసుకున్న ఈ ప్రత్యేక శ్రద్ధ నన్ను నాజూగ్గా మార్చింది. బరువు తగ్గడానికి 12 రకాల ఆహార పదార్థాలు కూరగాయలు (కేలరీలు చాలా తక్కువ)1. దోసకాయ – 100 గ్రాములకు16 కిలో కేలరీలు లభిస్తాయి. హైడ్రేటింగ్, క్రంచీ, సలాడ్స్, స్నాక్స్ చేయడానికి సరైనది.2. గుమ్మడికాయ – 100 గ్రాములకు 17 కిలో కేలరీలు తేలికైనది, చాలా రకాలు చేయవచ్చు. 3. లెట్యూస్– 100 గ్రాములకు 15 కిలో కేలరీలుర్యాప్లకు, సలాడ్ బేస్గా అనువైనది.4. పాలకూర – 100 గ్రాములకు 23 కిలో కేలరీలుఐరన్ సమృద్ధిగా లభిస్తుంది, స్మూతీలు, సాగ్ లేదా సాటీయింగ్కు సరైనది.5. కాలీఫ్లవర్ – 100 గ్రాములకు 25 కిలో కేలరీలుఅన్నం, పిజ్జా క్రస్ట్ లేదా సబ్జీలలో ఉపయోగించవచ్చు. పండ్లు (సహజంగా తీపి – తక్కువ కేలరీలు)6. పుచ్చకాయ – 100 గ్రాములకు 30 కిలో కేలరీలు వేడి వాతావరణం ఉన్నప్పడు మరీ మంచిది. 7. స్ట్రాబెర్రీలు – 100 గ్రాములకు – 32 కిలో కేలరీలు తీపి, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి, జీర్ణక్రియకు మంచిది.8. బొప్పాయి – 100 గ్రాములకు 43 కిలో కేలరీలుజీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. చాలా కడుపు నిండుగా ఉంటుంది. 9. ఉడికించిన గుడ్డులోని తెల్లసొన – గుడ్డులోని తెల్లసొనకు – 17 కిలో కేలరీల స్వచ్ఛమైన ప్రొటీన్, కొవ్వు ఉండదు. కండరాల నిర్వహణకు సరైనది.10. వెన్నలేని పెరుగు (తక్కువ కొవ్వు) – 100 గ్రాములకు 59 కిలో కేలరీలు ప్రొటీన్ అధికంగా ఉంటుంది, జీర్ణాశయ ఆరోగ్యానికి మంచిది.11. టోఫు (లైట్ లేదా తక్కువ కొవ్వు) – 100 గ్రాములకు 70 కిలో కేలరీలు మొక్కల ఆధారిత ్ర΄ోటీన్, మృదువైనది మరియు సంతృప్తికరంగా ఉంటుంది.12. ఎయిర్ -పాప్డ్ పాప్కార్న్ (ఉప్పు, వెన్న లేనిది) – కప్పుకు 30 కిలో కేలరీలు. తాను ఇవన్నీ ఫాలో అయాను కాబట్టే బరువు తగ్గినా ముఖం కళ తప్పకుండా కాపాడుకోగలిగాను అని చెబుతోంది ఉదితా అగర్వాల్. View this post on Instagram A post shared by Udita Agarwal (@udita_agarwal20) ‘‘నా చిన్నతనం నుంచీ అధికబరువు సమస్యను ఎదుర్కొన్నాను. ఆరోగ్య సమస్యల బారిన పడ్డాను. జుట్టు రాలి΄ోయేది, ముఖంపై యాక్నె ఉండేది. పాతికేళ్లు వచ్చేసరికి వంద కేజీలకు పైగా బరువు పెరిగాను. జిమ్కి వెళ్లకుండా బరువు తగ్గాలనుకున్నాను. ఎనిమిది నెలల్లో 30 కేజీల బరువు తగ్గాను. కానీ, మేని చర్మం సాగినట్టు, ముఖంలోని కొవ్వునూ కోల్పోయి, సన్నబడి, కళ తగ్గినట్టుగా అనిపించింది. ఈ సమస్య దరిచేరకుండా జాగ్రత్త పడ్డాను. -ఉదితా అగర్వాల్. -
International Yoga Day మహిళలకోసం బెస్ట్ అండ్ హెల్దీ ఆసనాలు
మహిళల ఆరోగ్యానికి, అంతర్గత ఆనందానికి మేలైన సాధనంగా యోగాసనాలు ఎంతగానో ఉపయోగపడతాయి. నేడు యోగా డే సందర్భంగా కొన్ని ఆసనాలు.హెల్దీగా.. హ్యాపీగా...కోణాసనం: సైడ్ యాంగిల్ పోజ్ గా పిలిచే ఈ ఆసనం వేస్తే.. శరీరం బాగా స్టెచ్ర్ అవుతుంది. కాళ్లు, చేతులకు బలం చేకూరుతుంది. వెన్ను నొప్పి, సయాటికా సమస్యకు పరిష్కారం లభిస్తుంది.వృక్షాసనం: నిటారుగా నిల్చొని, ఒక పాదాన్ని రెండవ కాలు మధ్యకి తీసుకొచ్చి, రెండు చేతులు తలమీదుగా పూర్తిగా పైకి నమస్కారం భంగిమలో తీసుకోవాలి. ఈ ఆసనం వల్ల మానసిక సమతుల్యత ఏర్పడి ఏకాగ్రత పెరుగుతుంది.పాద హస్తాసనం: నిటారుగా నిల్చొని, శరీరాన్ని ముందుకు వంచి, చేతులను పాదాలకు, తలను మోకాళ్లకు ఆనించాలి. దీనివల్ల నరాల వ్యవస్థ చురుకుగా మారి.. రక్త ప్రసరణ మెరుగవుతుంది.అర్ధ మత్స్యేంద్రాసన: మ్యాట్ పైన కూర్చొని, ఎడమ కాలుని కుడి తొడ పక్కగా తీసుకొచ్చి, నేల మీద ఉంచాలి. ఎడమ చేతిని ఎడమ మోకాలు నుంచి తీసుకొచ్చి, పాదం పట్టుకోవాలి. కుడి చేతిని నిటారుగా నేల మీద ఉంచాలి. ఈ ఆసనం వల్ల ఆక్సిజన్ లెవెల్స్ పెరిగి ఊపిరితిత్తుల సామర్థ్యం పెరుగుతుంది.సేతు బంధాసన: దీనిని బ్రిడ్జ్ పోజ్ అంటారు. ఇది కటి భాగం, గర్భాశయం, వెన్నుకి చాలా మంచిది. ఇది కటి కండరాలను బలోపేతం చేస్తుంది. పునరుత్పత్తి అవయవాలకు రక్త ప్రసరణను పెంచుతుంది.మార్జాలాసనం: క్యాట్–కౌ పోజ్ గా పిలిచే ఈ ఆసనం వెన్నెముక బలానికి, ఒత్తిడిని తగ్గించడంలోనూ సహాయపడుతుంది కటి కండరాలను ఫ్లెక్సిబుల్గా చేస్తుంది.బాలాసన: చైల్డ్ పోజ్ పెద్దలకు కూడా మేలు చేస్తుంది. ఇది ఒత్తిడిని తగ్గించడానికి, విశ్రాంతికి సహాయపడుతుంది. ఈ ఆసనం వెన్నునొప్పిని తగ్గించి, మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది.భుజంగాసన: కోబ్రా పోజ్ గా పిలిచే ఈ ఆసనం ఛాతీ, వెన్ను భాగాలను బలోపేతం చేస్తుంది. ఇది శ్వాసను మెరుగుపరుస్తుంది. శక్తిని పెంచుతుంది. త్రికోణాసన: ట్రయాంగిల్పోజ్ వల్ల పాదాలు, కాళ్ళు, చేతులు, వెన్నును బలోపేతం అవుతాయి. శరీరానికి సమతుల్యతను అందిస్తుంది.మాలాసన: దీనిని గార్లాండ్ పోజ్ అంటారు. రెండు కాళ్ళను వెడల్పుగా ఉంచి, మోకాళ్ళ వరకు వంగి, చేతులను నమస్కారం స్థితికి తీసుకురావాలి. ఈ ఆసనం సాధన చేయడం వల్ల రుతుక్రమమం, మలబద్ధకం సమస్యలు తగ్గుతాయి. తొడ కండరాల శక్తి పెరుగుతుంది.ఈ ఆసనాలను రోజూ సాధన చేయడం వల్ల మానసిక ప్రశాంతత చేకూరి శారీరక ఆరోగ్యం అభివృద్ధి అవుతుంది ఫలితంగా జీవన శైలిలో మంచి మార్పులు కలుగుతాయి. Today Tip : బాల్కనీ మొక్కలు.. అదిరిపోయే చిట్కా!– అనూష రాకేష్, యోగా ట్రైనర్, హైదరాబాద్ -
నో డైటింగ్, ఓన్లీ జాదూ డైట్ : నెలలో 7 కిలోలు తగ్గడం పక్కా!
బరువు తగ్గాలంటే కడుపు మాడ్చుకోవాలి.చెమటలు చిందించాలి చాలామంది మదిలో మెదిలే ఆలోచన ఇది. కానీ ఇవేమీ లేకుండానే హ్యాపీగా నెలకు 7 కిలల దాకా బరువు తగ్గవచ్చని చెబుతున్నారు ఒక వైద్యుడు. అదీ కఠినమైన డైట్ లేకుండా బరువు తగ్గడం సాధ్యమే అంటున్నారు. మరి ఆ జాదూ ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారా.. పదండి.. ఆలస్యం ఎందుకు..!నాన్-ఇన్వాసివ్ కార్డియాలజీలో నిపుణుడైన కార్డియాలజిస్ట్ డాక్టర్ బిమల్ ఛాజెర్ సోషల్మీడియా ద్వారా తన ఫాలోయర్లకు అనేక ఆరోగ్య చిట్కాలను అందిస్తూ ఉంటారు. తాజాగా 'జాదూ డైట్ (మ్యాజిక్ డైట్) ఫర్ వెయిట్ లాస్' అంటూ కొన్ని వివరాలను షేర్ చేశారు. ఆయన షేర్ చేసిన వీడియో ప్రకారం ఇది శాకాహారంతో బరువు తగ్గించుకునే ఒక ప్రణాళిక. కడుపు మాడ్చుకోవాల్సి అవసరం లేకుండానే సరళమైన డైట్తో కేవలం ఒక నెలలో కనీసం 7 కిలోల బరువును తగ్గించుకోవచ్చు. కొలెస్ట్రాల్ స్థాయిలు గణనీయంగా తగ్గుముఖం పడతాయని హామీ ఇస్తున్నారు కూడా.వెయిట్ లాస్ జర్నీ- చిట్కాలుడాక్టర్ బిమల్ ఛాజెర్ చెబుతున్న డైట్ సరళమైన, ఆరోగ్యకరమైన ఆహారాల కలయితో ఉంటుంది. బరువు తగ్గడం మాత్రమే కాకుండా ఇది మొత్తం ఆరోగ్యానికి మంచిదనీ, ఆకలితో ఉండకుండా కేలరీల లోటును భర్తీ చేసి.శరీరం సహజంగా కొవ్వును కరిగించడానికి అనుమతిస్తుంది. ఇదీ చదవండి: 118-80 కిలోలకు, 6 నెలల్లో 38 కిలోలు తగ్గాడు : సింపుల్ డైట్తో'జాదూ డైట్ ఫర్ వెయిట్ లాస్'మనం మన కడుపును అధిక కేలరీల ఆహారంతో నింపితే, మన బరువు పెరుగుతుంది, అదే తక్కువ కేలరీల ఆహారంతో నింపితే, ఆకలీ వేయదు, బరువూ పెరగదు సింపుల్ మ్యాజిక్ అంటారాయన. స్వీట్ కార్న్, బీట్ రూట్, క్యారెట్లతో చేసిన సలాడ్, గుమ్మడికాయ, బీన్స్, క్యారెట్ ముక్కలు, రాగిపిండితో చేసిన సూప్ ఇలాంటివి ఆయన షేర్ చేసిన వీడియో మనం చూడవచ్చు.జాదూ డైట్లో నిజానికి బాగా తినాలి, కానీ లో-కేలరీల ఆహారాలకు కట్టుబడి ఉండాలి. ఉదాహరణకు పండ్లు, కూరగాయలు, సలాడ్లు...ఇది శరీరాన్ని ఆహారం లేకుండా ఉంచకుండా వేగంగా బరువు తగ్గడానికి దారితీస్తుంది. ఫలితంగా నెలలో 7 కిలోల బరువు తగ్గడం పక్కా..అది కూడా ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా అని చెప్పారు. View this post on Instagram A post shared by Food Link (@ig_foodlink)ఆహారంగా ఇంకా ఏం తీసుకోవచ్చుబ్లాక్ టీ తాగవచ్చు. ఎక్కువ పండ్లు తీసుకోవాలి. ప్రోటీన్ , ఇతర పోషకాల కోసం మూంగ్ లేదా మసూర్ దాల్ తీసుకోవచ్చు. ఇందులో దోసకాయ, బీట్రూట్ క్యారెట్ ఇలా పచ్చి కూరగాయలతో కలిపి పప్పును తినవచ్చు.రాత్రి భోజనంలో సూప్తో పాటు సలాడ్ , ఉడికించిన కూరగాయలుఎన్ని రోజులు చేయాలి?ఈ డైట్ను కేవలం ఒక నెల పాటు మాత్రమే సాగించాలి.దీన్ని ఎప్పటికీ అనుసరించాల్సిన అవసరం లేదు. ఈ డైట్తో మీరు సుమారు 3 నెలల్లో 10-20 కిలోలు తగ్గవచ్చు. ఈ జాదూ డైట్ అద్భుతంగా పనిచేస్తుందనంటూ కోలకత్తాకు చెందిన ఒక మహిళ 86 నుంచి -62 కిలోలకు బరువు తగ్గిన వైనాన్ని ఉదహరించారు.గమనిక: ఈ కథనం డా. బిమల్ షేర్ చేసిన సమాచారం ప్రకారం అందించినంది మాత్రమే. మీ ఆరోగ్యానికి సంబంధించిన నిర్ణయాల్లో ఎల్లప్పుడూ వైద్య సలహాలు తీసుకోవడం ఉత్తమం. -
Yoga సంపూర్ణ ఆరోగ్యం కోసం ఖర్చు లేని మందు, కానీ..!
అంతర్జాతీయ యోగా దినోత్సవం (జూన్ 21) సందర్భంగా‘సంపూర్ణ ఆరోగ్యానికి ఖర్చులేని మందు, మానసిక వికాస సిద్ధి, శరీరం – మనసు మధ్య సమతుల్య సాధనకు సహాయపడేది యోగాఒక్కటే’ అనే నినాదం మార్మోగుతోంది. విశాఖపట్నంలో యోగా ప్రధాన వేదికపై ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొననుండడం మరో విశేషం. విద్యాలయాల్లో గతంలో ప్రతిరోజూ ఒక పీరియడ్ ‘డ్రిల్ క్లాసు’ కోసం కేటాయించేవారు. తొలుత పరు గుతో పాటు ఆపై అనేక క్రీడల్లో విద్యార్థు లకు శిక్షణ ఇవ్వడానికి పీఈటీ,ఎంపీఈడీ, బీపీఈడీ టీచర్లు, అధ్యాప కులు ఉండేవారు. ఆపై వేలాది మంది శిక్షకులు విద్యార్థులకు క్రీడాంశాల్లో శిక్షణ ఇచ్చే వారు. విద్యాలయాల్లో రానురాను వీరి నియామకాలు నిలిచిపోవడంతో, ఏకంగా పలు క్రీడాంశాలే మటు మాయమయ్యాయి.గతంలో ప్రతి ఏటా జోన్, సెంట్రల్ జోన్, జిల్లా, రాష్ట్రస్థాయుల్లో జరిగే క్రీడాపోటీల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొనేవారు. ఇవి వారిలో పోటీతత్వాన్ని పెంపొందించేవి. ప్రస్తుతం జిల్లా స్థాయిలో మొక్కుబడిగా క్రీడాపోటీలు నిర్వహిస్తున్నారు. వీటిలోనూ అనేక విద్యా లయాలకు కనీస ప్రాతినిధ్యం కూడా లభించడం లేదు. నేడు అనేక పాఠశాలలు, కళాశాలల్లో క్రీడాపరికరాలు సైతం మచ్చుకైనా కనిపించడం లేదు. ఇక విద్యాలయాల్లో వ్యాయామ విద్యకు చోటెక్కడున్నట్టు? అలాగే, ప్రభుత్వ గుర్తింపు పొందిన వేలాది పాఠశాలలు జానెడు ఖాళీ స్థలానికి కూడా నోచుకోని అపార్ట్మెంట్లలో నడుస్తున్నాయి. కచ్చితంగా ఆటస్థలం ఉండాలనే విద్యాశాఖ నిబంధనలున్నా, ఫలితం మాత్రం శూన్యం! ఇదీ చదవండి: Today Tips యోగాతో లాభాలెన్నో.. ఈ చిట్కాలు తెలుసా?యోగా, వ్యాయామ విద్యల మధ్య పెద్దగా తేడాలేమీ లేవు. రెండింటిలోనూ శారీరక భంగిమలు 70 శాతం సమానం. వ్యాయామంలో తొలుత రన్నింగ్ ఉంటే, యోగాలో మెడిటేషన్ ఉంటుంది. రన్నింగ్ తర్వాత యోగా చేస్తే సత్ఫలితాలు ఉంటాయని నిపుణులు కూడా చెబుతున్నారు. అయితే, ఆధునిక కాలానుగుణంగా వ్యాయామ విద్యలో అవసరమైన మార్పు–చేర్పులు చేసి, ఉన్నత పాఠశాలల్లోని ప్రతి విద్యార్థీ విధిగా నిత్యం ‘స్పోర్ట్స్ పీరియడ్’లో పాల్గొనేలా ప్రభుత్వం పటిష్ఠమైన చర్యలు తీసుకోగలిగితే... యోగా ఉన్నత స్థాయికి చేరుకుంటుందని చెప్పడంలో సందేహించాల్సింది లేదు.చదవండి: ఎయిరిండియా విషాదం : మానవత్వం చూపించిన రియల్ హీరో– నిమ్మరాజు చలపతిరావు ( జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవం) -
International yoga day 2025 : ఆరోగ్య ‘యోగం’ ఇంతింత కాదయా
వేగంగా మారుతున్న యుగంలో యువత ఎంతో ఒత్తిడి, అపరిమిత ఆందోళనల మధ్య జీవించాల్సి వస్తోంది. విద్య, ఉద్యోగపోటీలు, డిజిటల్ లైఫ్, సామాజిక ఒత్తిళ్ల మధ్య మానసిక, శారీరక ప్రశాంతత కోల్పోతుంటారు. ‘యువత జీవనవిధానంలో ఏర్పడిన భావోద్వేగ బ్లాకేజ్లను ఎలా తొలగించుకోవాలో తెలియక చాలా ఇబ్బందులు పడుతుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో యోగ ఒక శక్తివంతమైన ఆయుధంగా పనిచేస్తుంది’ అని వివరిస్తారు యోగా ట్రైనర్ స్వప్న యోగాన్వేష్.‘లండన్లో ఎంబీయే చేసి, కార్పొరేట్ ఉద్యోగాన్ని వదిలి, యోగాతో నన్ను నేను కొత్తగా ఆవిష్కరించుకున్నాను’ అని తెలిపిన స్వప్న హైదరాబాద్లో ఐదేళ్లుగా యోగా ట్రైన ర్గా రాణిస్తున్నారు. ‘‘ఇండియాకు వచ్చి, రిషీకేష్ వంటి యోగిక్ ప్లేస్లన్నీ సందర్శించాను. వారాంతంలో స్కూళ్లు, కాలేజీలకు వెళ్లి విద్యార్థులకు ఉచితంగా యోగా శిక్షణా తరగతులు తీసుకుంటుంటాను. సాధారణంగా యువతలో చాలా మంది జిమ్లకు వెళ్లడానికి ఆసక్తి చూపుతారు. అది శారీరక ఫిట్నెస్ కోసం ఉపయోగపడుతుంది. యోగా వ్యాయామం మాత్రమే కాదు. శరీరం, మనస్సు, ఆత్మ మూడింటినీ సమతుల్యంగా ఉంచే జీవన విధానం. ఈ కాలంలో యువత ఎక్కువ శాతం డిజటల్ మీద డిపెండ్ అయి ఉంటున్నారు. అన్ని విషయాల మీద చాలా నాలెడ్జ్ వచ్చింది. కానీ, చిన్ననాటి నుంచి రకరకాల ఎమోషనల్ బ్లాకేజీలు అంతర్గతంగా ఏర్పడి, వారితో పాటు ఎదుగుతుంటాయి. వీటి నుంచి రిలాక్స్ అవడానికి యోగా ఒక సాధనంలా ఉపయోగపడుతుంది. యోగా ప్రాచీన భారత సంప్రదాయంలో భాగంగా వేల సంవత్సరాలుగా అభివృద్ధి చెంది ఉంది. పతంజలి వంటి ఎంతో మంది రుషులు, యోగులు యోగాను సాధన చేసినట్టుగా ్ర΄ాచీన భారతం మనకు చూపుతుంది. యోగా వల్ల లాభాలేంటి అని ప్రశ్నించే ఈ తరానికి చెప్పలేనన్ని అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయి.. చదవండి: Today Tips యోగాతో లాభాలెన్నో.. ఈ చిట్కాలు తెలుసా?తరగని గని యోగా! మనందరిలో ఫిజికల్, సైకలాజికల్ ట్రామా రెండూ ఉంటాయి. దైనందిన జీవనంలో శ్వాస తీసుకోవడం, వదలడం కూడా సరిగ్గా చేయడం లేదు. దీర్ఘ శ్వాస తీసుకోవడం, అంతే దీర్ఘంగా వదలడం వంటివి యోగా చేయడం వల్లే లభిస్తుంది. యోగాలో ప్రతి ఆసనం శ్వాసతో అనుసంధానించి ఉంటుంది. కొన్ని రోజులు క్రమం తప్పకుండా సాధన చేస్తూ ఉంటే తినే ఆహారం, నిద్రా సమయం కూడా క్రమ బద్ధం అవుతుంది. మొదలు పెట్టేప్పుడు ముందుగా శ్వాస యోగా నుంచి ప్రారంభించాలి. అందుకు కపాభాతి వంటి శ్వాస యోగాసనాలు ఉన్నాయి. వారంలో రెండు రోజులు, మూడు రోజులు యోగా చేస్తే సరిపోదు. క్రమం తప్పకుండా చేయాలి. దీని వల్ల తలనొప్పి వచ్చినా.. ఎందుకొచ్చింది? ఫిజికల్గా, మెంటల్గా, ఫుడ్ పరంగా ఎక్కడ మిస్టేక్ అయ్యింది? ఈ సందేహాలకు సమాధానాలు వెంటనే తెలిసిపోతాయి. కోపం, అసహనం, చిరాకు వల్ల బంధాలలో ఇబ్బందులు తలెత్తుతుంటాయి. యోగా సాధన వల్ల వ్యక్తిగత జీవితం, బంధాలు కూడా సెట్ అవుతాయి. అంతర్గత ఆనందం కలిగితే చెడు వ్యసనాల జోలికి ఎంత మాత్రం వెళ్లరు. కపాలబాతి, ప్రాణాయామం.. వంటి శ్వాస వ్యాయామాలు చేయడానికి 8 గంటల ముందు ఆహారం తీసుకోవాలి. అందుకే, యోగాను సూర్యోదయం సమయంలో ఖాళీ కడుపుతో చేయడం వల్ల మంచి ప్రయోజనాలు కలుగుతాయి. మిగతా ఆసనాలకు కనీసం ఆహారం తీసుకోవడానికి మూడున్నర గంటల ముందు తీసుకోవాలి. లంగ్స్, లివర్, స్టమక్, కిడ్నీ, హార్ట్... మనం చేసే పనులలో ఈ ఐదు ఆర్గాన్స్ పనితీరు బాగుండేలా అడ్వాన్స్డ్ మెథడ్స్ ఉంటాయి. బ్రీతింగ్ టెక్నిక్స్ ఉంటాయి. ఇంటర్నల్ హీలింగ్ ద్వారా వీటిని సాధన చేయచ్చు. – స్వప్న యోగాన్వేషి, యోగా ట్రైనర్, హైదరాబాద్ యోగాసనాలు శరీరాన్ని బలపరుస్తాయి. రక్తప్రసరణ మెరుగుపడి, హార్మోన్ల సమతుల్యత ఏర్పడుతుంది. మన శరీరంలో ఉన్న ఏడు చక్రాల కుండలిని యాక్టివేట్ చేసి, ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. ధ్యాన సాధన క్రమంగా చేస్తే ఏకాగ్రత పెరుగుతుంది. చదువులో, ఉద్యోగ జీవితంలో మెరుగైన ఫలితాలుఇస్తుంది.దృష్టి, ఏకాగ్రత పెరుగుతుంది∙మైండ్ఫుల్నెస్ (సంపూర్ణ శ్రద్ధతో జీవించడం) అభివృద్ధి చెందుతుంది.డిప్రెషన్, ఆందోళన, అలసట వంటి సమస్యలు తగ్గుతాయి.శ్వాసక్రియ( ప్రాణాయామం) వల్ల మనస్సు ప్రశాంతంగా ఉంటుంది.పొట్ట, తల, వెన్నెముక ఆరోగ్యంగా ఉంటాయి.కేటాయించాల్సిన సమయం...యోగాసనాల సాధనకు 45 నిమిషాల నుంచి గంటన్నర సమయం పడుతుంది. ప్రతి రోజు కనీసం 20–30 నిమిషాలు యోగాకు కేటాయించాలి యోగా అంటే కష్టమైన ఆసనాలు కాదు అది అందరూ చేయగలిగేది ∙సరైన గురువు లేదా యాప్ సహాయంతో శాస్త్రీయంగా ప్రారంభించాలి యోగా అనేది యువతకు శారీరక ఆరోగ్యం, మానసిక స్థైర్యం, సామాజిక నైతికత అన్నింటినీ అందించే ఓ సంపూర్ణ మార్గం. యోగాకు వయస్సు అడ్డంకి కాదు, ముందు అడుగు వేయడమే ముఖ్యంసోషల్ మీడియా డీటాక్స్: రోజంతా మొబైల్, స్క్రీన్ ముందు గడిపే యువతకు యోగా ద్వారా స్వీయ ఆత్మ పరిశీలన జరుగుతుంది. ఇది డిజిటల్ డీటాక్స్కు సహాయపడుతుంది. యువతలో స్థిరత్వం, ఓర్పు, విలువల పట్ల గౌరవం పెరుగుతుంది.ఇదీ చదవండి: ఎయిరిండియా విషాదం : మానవత్వం చూపించిన రియల్ హీరో -నిర్మలా రెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
Rahul Gandhi: ఇప్పటికీ యువకుడిలా..ఫిట్నెస్ సీక్రెట్ ఇదే..
కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ పార్టీ అధ్యక్షుడిగా తమ పార్టీని సరైన దాడిలో నడిపించడంలో ఎన్నో విమర్శలు చవిచూసినా..అన్నింటిని తనదైన శైలిలో తిప్పికొట్టి తానేంటో ప్రూవ్ చేసుకున్న నేత రాహుల్. ముఖ్యంగా భారత్ జోడో యాత్రతో అందర్నీ ఆశ్చర్యపరిచేలా అమిత ప్రజాదరణ పొందడమే గాక తన పార్టీని అధికారంలోకి వచ్చేలా శతవిధాల కృషి చేసిన సంగతి తెలిసిందే. ఇవాళ ఆయన పుట్టినరోజు(జూన్ 19). ఈ రోజు రాహుల్ తన 55వ పుట్టినరోజుని జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన ఫిట్నెస్ సీక్రెట్ ఏంటో సవివరంగా తెలుసుకుందామా..!.రాహుల్ గాంధీ జూన్ 19, 1970న న్యూఢిల్లీలో జన్మించారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ, కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ దంపతుల సంతానం. ప్రస్తుతం ఆయన ఉత్తరప్రదేశ్లోని రాయ్బరేలి నుంచి లోక్సభ సభ్యుడిగా ఉన్నారు. అలాగే.. లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు. ఆయన భారత్, విదేశాలలో విద్యను అభ్యసించారు. ఫ్లోరిడాలోని రోలిన్స్ కళాశాల నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలోని ట్రినిటీ కళాశాల నుంచి ఎం.ఫిల్. డిగ్రీని పొందారు. ఇక ఆయన ఫిట్నెస్ దినచర్య పరంగా చాలామందికి స్ఫూర్తి. అంతేగాదు తన ఫిట్నెస్ గురించి 2023లో రాజస్థాన్లోని భారత్ జోడో యాత్రలో ఉన్నప్పుడు ట్రావెల్ అండ్ ఫుడ్ ఛానల్ కర్లీటేల్స్తో జరిగిన సంభాషణలో షేర్ చేసుకున్నారు కూడా. ఆ ఇంటర్వ్యూలో తన డైట్, వర్కౌట్ల గురించి మాట్లాడారు. తాను ఆరోగ్యంగా ఉండేందుకు రకరకాల వ్యాయామాలు చేస్తానని, అలాగే అనారోగ్యం పాలుకాకుండా ఉండేలా మంచి ఆహారం తీసుకుంటానని చెప్పారు. Check out this fun interaction between @RahulGandhi and Kamiya Jani of Curlytales where they discuss food, travel, marriage plans, first paycheck & much more...Click on the link below to watch the full video.https://t.co/K5JKixgQXb#BharatJodoYatra pic.twitter.com/i5lzQvFHXs— Congress (@INCIndia) January 22, 2023 తన అధికారిక సోషల్ మీడియా ఎక్స్లో కూడా ఈ విషయం చెప్పారు. తాను ఎప్పుడూ ఒకేవిధమైన వర్కౌట్లను చేస్తానని, వాటిని ఎట్టిపరిస్థితుల్లోనూ మిస్ చేయనని అన్నారు. ఇక రాహుల్ మార్షల్ ఆర్ట్స్లో బ్లాక్ బెల్ట్ అన్న విషయం తెలిసిందే. ఆయనకు డైవింగ్ కూడా తెలుసు. అంతేగాదు తాను చేపట్టిన భారత జోడో యాత్రలో సైతం క్రమం తప్పకుండా మార్షల్ ఆర్ట్స్ తరగుతులు తీసుకునేవాడినని పలు సందర్భాల్లో చెప్పారు కూడా. తీసుకునే ఆహారం..డైట్ విషయంలో తాను కార్బోహైడ్రేట్లు అస్సలు తినని అననారు. తాను ఎక్కువుగా రోటీని ఇష్టపడతానని అన్నారు. తాను ఎక్కువగా మాంసహార ప్రియుడినని చెప్పారు. వంటకాల్లో ఎక్కువగా చికెన్ టిక్కా, సీఖ్ కబాబ్, సాదా ఆమ్లెట్ తప్పనిసరిగా ఉండాలన్నారు. అయితే ప్రతి ఉదయం ఒక కప్పు కాఫీ మాత్రం తప్పనిసరిగా తీసుకుంటానని చెప్పారు.కాగా, గురువారం కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ 55వ పుట్టినరోజును పురస్కరించుకుని, పార్టీ ఢిల్లీ యూనిట్, ఇండియన్ యూత్ కాంగ్రెస్ సంయుక్తంగా తల్కటోరా స్టేడియంలో మెగా జాబ్ మేళాను నిర్వహించనున్నాయి. ఇక ప్రధాని మోదీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వంటి పలువురు ప్రముఖులు రాహుల్కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.(చదవండి: ఆ టీచర్ పాఠాలు చెప్పే తీరే వెరేలెవెల్..! ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే) -
World Kidney Cancer Day 2025 : ఆ సమస్య తొలి సంకేతం కావచ్చు!
World Kidney Cancer Day 2025 జూన్ 19న ప్రపంచ కిడ్నీ క్యాన్సర్ దినోత్సవంగా జరుపు కుంటారు. ప్రపంచవ్యాప్తంగా అత్యంత నిర్లక్ష్యం చేయబడిన, పెరుగుతున్న సాధారణ కేన్సర్లలో ఒకటి కిడ్నీ కేన్సర్. ప్రారంభ దశలో తరచుగా లక్షణాలు లేకుండా, ఇది చాపకింద నీరులా పాకిపోతుంది. దీనికి సకాలంలో అవగాహన, ముందస్తు గుర్తింపు తప్పనిసరి. ప్రమాద కారకాలు, హెచ్చరిక సంకేతాలు , నివారణ సంరక్షణ యొక్క ప్రాముఖ్యత గురించి ప్రజలకు అవగాహన కల్పించడమే దీని లక్ష్యం.ముఖ్యంగా మహిళల్లో యూనినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్(UTI) చాలా సాధారణమైనదీ, అంతే బాధాకరమైంది కూడా. ఈ ఇన్ఫెక్షన్ మళ్లీ మళ్లీ రిపీట్ అవుతుంటే మూత్రపిండాలలో దీర్ఘకాలిక వాపుకు దారితీయవచ్చు, ఇది కాలక్రమేణా నిర్మాణాత్మక మార్పులకు తద్వారా మూత్రపిండాల కేన్సర్కు దారి తీయవచ్చు. ప్రతి సందర్భంలోనూదీని సంబంధం ప్రత్యక్షంగా ఉండక పోవచ్చు, కానీ సంకేతాలను తేలికగా తీసుకోకూడదు అంటున్నారు వైద్యులు.మూత్ర నాళాల ఇన్ఫెక్షన్ (UTI) అనేది మూత్రనాళం ద్వారా ప్రవేశించే బాక్టీరియల్ ఇన్ఫెక్షన్, ఇది తరచుగా మంట మరియు అత్యవసర పరిస్థితిని కలిగిస్తుంది. చాలామంది మహిళలు ఏదో ఒక సమయంలో దీన్ని ఎదుర్కొంటారు.. అయితే సంవత్సరానికి రెండు లేదా అంతకంటే ఎక్కువ UTIలు మీకు వస్తుంటే జాగ్రత్తపడాలి. తగిన చికిత్స తీసుకోవాలి.డైరెక్ట్గా సంబంధం లేకపోయినా, మూత్ర నాళాల ఇన్ఫెక్షన్, జననేంద్రియ క్యాన్సర్ల మధ్య సంబంధం వైద్యపరంగాచాలా కీలకమైంది. జననేంద్రియ కేన్సర్లు మూత్రపిండాలు, మూత్రాశయం, మూత్రాశయం , పునరుత్పత్తి అవయవాలను ప్రభావితం చేస్తాయి. దీర్ఘకాలిక లేదా చికిత్స చేయని ఇన్ఫెక్షన్లు, ముఖ్యంగా మూత్రాశయంలో, పొలుసుల కణ కేన్సర్తో ముడిపడి ఉన్నాయి . ఇవి చాలా రేర్.. అయినా దూకుడుగా ఉండే మూత్రాశయ కేన్సర్ రకం. మహిళల్లో, గర్భాశయ క్యాన్సర్తో దగ్గరి సంబంధం ఉన్న హ్యూమన్ పాపిల్లోమావైరస్ (HPV) ఇన్ఫెక్షన్, కొన్నిసార్లు UTIలను ప్రతిబింబించే లక్షణాలతో ఉంటుంది, ఖచ్చితమైన రోగ నిర్ధారణ అవసరం.మహిళల్లో కిడ్నీ కేన్సర్ లక్షణాలుమూత్రంలో రక్తం, పక్క లేదా వీపులో నిరంతర నొప్పి, పొత్తికడుపులో గడ్డ , అకారణంగా, అనూహ్యంగా బరువు తగ్గడం, అలసట, జ్వరం, ఆకలి లేకపోవడం, రక్తహీనత , కాళ్ళు లేదా చీలమండలలో వాపు వంటివి ఉంటాయి. అదనంగా, మహిళలు కడుపు నొప్పి, కటి ప్రాంతంలో అసౌకర్యం లేదా మూత్రంలో మార్పులు కనిపిస్తాయి.పైన పేర్కొన్న లక్షణాలలో ఏవైనా, ముఖ్యంగా మూత్రంలో రక్తం (హెమటూరియా): ఇది అత్యంత సాధారణ, గుర్తించదగిన లక్షణాలలో ఒకటి. మూత్రం గులాబీ, ఎరుపు లేదా గోధుమ రంగులో కనిపించినా, వెన్నులో తీవ్రమైన నొప్పి (మూత్రపిండాలు ఉన్న దిగువ వీపు లేదా వైపు) నిరంతర నొప్పి వేధించినా అప్రమత్తం కావాలి.అలాగే ఆహారంలో మార్పులు, వ్యాయామం ఇలాంటివేమీ లేకుండానే గణనీయమైన బరువు తగ్గడం ఒక హెచ్చరిక. ఊరికే అలసిపోవడం, అకస్మాత్తుగా తినడం పట్ల ఆసక్తి లేకపోవడం లేదా త్వరగా కడుపు నిండినట్లు ఆకలితగ్గిపోవడం, జ్వరం లాంటి లక్షణాలుంటే తక్షణమే వైద్యుడిని సంప్రదించడం అవసరరం. మూత్రపిండ కేన్సర్ చికిత్సకు ముందస్తుగా గుర్తించడం చాలా ముఖ్యం. -
'4ఏ మోడల్'తో ఒత్తిడిని జయిద్దాం ఇలా..!
ఒత్తిడిని జయించడంఈ రోజుల్లో ప్రతి మనిషి జీవితంలో ఒత్తిడి అనేది ఒక భాగంగా మారిపోయింది. ఉద్యోగ బాధ్యతలు, కుటుంబ సమస్యలు, భవిష్యత్పై భయాలు.. ఐటీ ఉద్యోగాలు కావొచ్చు, తీరికలేని వ్యాపారాలు కావొచ్చు.. జీవితంలో ఇంకేమైనా కారణాలు కావొచ్చు, కానీ ఒత్తిడి అనేది ప్రధాన సమస్యగా మారింది. ఇది దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో పాటు మానసిక రుగ్మతలకు కారణమవుతోంది. దీంతో వ్యక్తిగతంగానే కాకుండా కుటుంబం పరంగా మనశ్శాంతిని కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో ఒత్తిడిని తగ్గించడానికి పలు థెరపీలు, విధానాలు అందుబాటులోకి వస్తున్నాయి. ఒత్తిడిని పూర్తిగా నివారించడం సాధ్యం కాకపోయినా, దాన్ని సమర్థవంతంగా నిర్వహించడం మన చేతిలోనే ఉంది.ఒత్తిడిని నియంత్రించే ‘4ఏ మోడల్’.అవాయిడ్ (తగ్గించండి): అవసరం లేని ఒత్తిడికి తలవంచకండి. కొన్ని పనులను ఇతరులకు అప్పగించండి. జీవితంలో అసలైన ప్రాధాన్యతలను గుర్తించి, వాటినే ముందుగా చేయండి. ఇది మనసును చాలా వరకు ప్రశాంతంగా ఉంచుతుంది. అడాప్ట్ (అనుకూలించండి): ప్రస్తుత పరిస్థితులను మారుస్తూ, సరికొత్తగా ఆలోచించండి. అంచనాలను ఆచరణీయంగా మార్చుకోండి. నెగటివ్ ఆలోచనల్ని పాజిటివ్ దృష్టితో చూడటం అలవాటు చేసుకోండి. ప్రతి సమస్యలో పాఠం ఉంటుంది. దాన్ని గుర్తించి సమన్వయంగా ముందుకు సాగండి. ఆల్టర్(మార్పు తీసుకోండి): మీ అవసరాలను స్పష్టంగా వ్యక్తం చేయండి. ప్రతి పనిని చిన్నచిన్న దశల్లో విడదీసి చేయండి. సమస్యలు వచి్చనప్పుడు వాటిని తొలగించే మార్గాలు వెతకండి. ఇది మానసిక ఒత్తిడిని తగ్గించే ఉత్తమ మార్గాల్లో ఒకటి. యాక్సెప్ట్ (అంగీకరించండి): కొన్ని విషయాలను మనం మార్చలేం. అలాంటి వాటిని అంగీకరించడం వల్ల మనసు హాయిగా ఉంటుంది. గతాన్ని మర్చిపోండి. ప్రతి సవాల్లో అభివృద్ధికి అవకాశం ఉందని తెలుసుకోండి. ఒత్తిడి పెరుగుతోంది అంటే భయపడాల్సిన అవసరం లేదుం దానిని ఎదుర్కొనడంపై దృష్టి సారించాలని మానసిక నిపుణులు సూచిస్తున్నారు. మనసుకు శాంతి, శరీరానికి విశ్రాంతి ఇచ్చే మార్గాల్ని అన్వేషించడం ఈ తరానికి చాలా అవసరమని నిపుణుల మాట. ఈ నేపథ్యంలో ఒత్తిడిని తగ్గించేందుకు ఉపయోగపడే ‘4 ఏ మోడల్’ (అవాయిడ్, అడాప్ట్, ఆల్టర్, యాక్సెప్ట్), ‘6 ప్రాక్టికల్ టెక్నిక్స్’ బాగా ఉపయోగపడుతున్నాయి. శ్వాస వ్యాయామాలు, డిజిటల్ డిటాక్స్, మానసిక దృక్పథం మార్పు వంటి చిట్కాలతో మనశ్శాంతి ఎలా పొందాలో స్పష్టంగా తెలియజేస్తున్నాయి. ఒత్తిడిని తగ్గించేందుకు 6 మార్గాలు.. 4–7–8 బ్రీత్ టెక్నిక్: నాలుగు సెకన్లు శ్వాస తీసుకోండి, 7 సెకన్లు ఆపండి, 8 సెకన్లకు మెల్లగా విడిచిపెట్టండి. ఇది నాడీ వ్యవస్థను ప్రశాంతపరుస్తుంది. ప్రోగ్రెసివ్ మసిల్ రిలాక్సేషన్: ఒత్తడికి లోనైన కండరాలను గట్టిగా పట్టుకుని మెల్లగా విడవండి. శరీరమంతా రిలాక్స్ అవుతుంది. మెల్ రాబిన్స్ 5 సెకండ్ రూల్: ఒక నిర్ణయం తీసుకునే ముందు 5 నుంచి 1 వరకు వెనక్కి లెక్కించండి. దీని వల్ల ఆలస్యం కారణంగా వచ్చే ఒత్తిడిని నివారించవచ్చు. డిజిటల్ డిటాక్స్: రోజులో కొన్ని గంటలు స్క్రీన్లను పూర్తిగా దూరం పెట్టండి. ప్రత్యేకించి రాత్రి పూట ఫోన్లు, ల్యాప్టాప్లు పక్కన పెట్టడం ద్వారా మెదడు విశ్రాంతి పొందుతుంది. ఏబీసీ టెక్నిక్: ఒత్తిడికి కారణమైన సందర్భాన్ని, దానిపై మన నమ్మకాలను, దాని పరిణామాలను విశ్లేషించండి. ఇందులోని అవాస్తవ పరిస్థితులను మానసికంగా వదిలేయండి. బాక్స్ బ్రీథింగ్: నాలుగు సెకన్లు శ్వాస తీసుకోండి. నాలుగు సెకన్లు ఆపి వదలాలి. మరో నాలుగు సెకన్ల సమయం తరువాత ఈ పద్ధతిని మళ్లీ కొనసాగించాలి. మానసిక ఒత్తిడి తగ్గి మనోస్థితి స్థిరంగా ఉంటుంది. (చదవండి: నీట్లో సత్తా చాటిన కూలీ, చిరువ్యాపారి, రైతుల కూతుళ్లు..!) -
118-80 కిలోలకు, 6 నెలల్లో 38 కిలోలు తగ్గాడు : సింపుల్ డైట్తో
అధిక బరువుతో ఉండే వ్యక్తులు వారి వ్యక్తిగత బాధలు, శారీరక అనారోగ్యం కంటే చుట్టూ ఉండే వారు ఏమనుకుంటారో అనేదానితో ఎక్కువ బాధపడుతూ ఉంటారు. అవమానాలు, వెక్కిరింపుల ఎదుర్కోవాలంటే బరువు తగ్గాల్సిందే అనుకుంటారు. కానీ బరువు తగ్గాలి.. తగ్గాలి.. స్మార్ట్గా ఉండాలి, నచ్చిన బట్టలువేసుకోవాలి, పార్టీలకు, ఫంక్షన్లకు అందంగా వెళ్లాలి అని అనుకుంటూ సరిపోదు. దానికి తగ్గట్టుగా కఠోర శ్రమ చేయాలి. బాడీ వెయిట్కు తగ్టట్టు ఎంత బరువు తగ్గాలి అనేది అంచనా వేసుకుని నిపుణుల సలహా మేరకు ముందుకు సాగాలి. అలా 6-7 నెలల్లో 118 కిలోల నుండి 80 కిలోలకు చేరిన యువకుడి స్టోరీ గురించి తెలుసుకుందాం. నోయిడాలో నర్సింగ్ సూపరింటెండెంట్గా పనిచేస్తున్నాడు రజత్ బన్సల్ (30). ఫ్రెండ్స్ వేళాకోళాలతో పాటు, అద్దంలో తనను తాను చూసుకుని బాధపడేవాడు. 118 కిలోల బరువు పెరగడం అతని ఆత్మవిశ్వాసాన్ని తగ్గించడమే కాకుండా, మానసికంగా అతడ్ని బలహీనుడిని చేసింది. నచ్చిన బట్టలు వేసుకోవడానికి లేదు. దర్జాగా పెళ్లికో, ఫంక్షనకో వెళ్లాలంటే..సిగ్గుగా ఉండేది. బంధువుల మాటలు, స్నేహితుల జోకులు మరింత బాధించేవి. అంతే వన్ ఫైన్ మార్నింగ్ కేవలం బరువు తగ్గాల్సిందే అని గట్టిగా నిర్ణయించుకున్నాడు. కేవలం 6-7 నెలల్లో 38 కిలోల బరువు తగ్గి ఔరా అనిపించు కున్నాడు.ఏలా ఊపిరాడుతోందిరా బాబూరజత్ వెయిట్ లాస్ జర్నీలో ఫ్రెండ్స్ జోకులు, ఎగతాళి మాటలు కీలక పాత్ర పోషించాయని చెప్పవచ్చు 'నువ్వు చాలా బరువు పెరిగావు, ఏ బట్టలు ధరిస్తావు?' ‘ఎలా నడుస్తావ్.. ఊపిరి ఆడుతోందా? అంటూ అని ఎగతాళి చేసేవారు. చివరికి నోయిడాలోని డైట్ మంత్ర క్లినిక్కు చెందిన డైటీషియన్ డాక్టర్ కామిని సిన్హా, రజత్ బరువు తగ్గి, ఫిట్గా ఉండేందుకు రంగంలోకి దిగాడు.జంక్ ఫుడ్ - స్వీట్లు వీక్నెస్ రజత్కు అతిపెద్ద సవాలు ఏమిటంటే జంక్ ఫుడ్ , స్వీట్లు తినే అలవాటు మార్చుకోవడం. ఏది ఏమైనా సరే తన లైఫ్,ఆరోగ్యంతో రాజీపడకూడదని నిర్ణయించుకున్నాడు.ఆహార అలవాట్లలో విప్లవాత్మక మార్పులు చేసుకున్నాడు.ఉదయాన్నే మార్నింగ్ వాక్ కు వెళ్లేవాడు.చెమటలు పట్టేదాకా వ్యాయామం మెట్లు ఎక్కడం చేసేవాడు. అల్పాహారం: ఉడికించిన ఓట్స్ లేదా పోహా.మధ్యాహ్నం: ఉడికించిన పప్పులు, సలాడ్ మరియు పెరుగు.సాయంత్రం 4 గంటలు: కాల్చిన చిక్పీస్ , పండ్లతో భేల్.రాత్రి భోజనం: ఫ్రూట్ రైతా , సలాడ్.దీనితో పాటు హోం చిట్కాలు కూడా పాటించాడు. మెంతులు, సోంపు, జీలకర్ర, క్యారమ్ గింజలు ,దాల్చిన చెక్కను రాత్రిపూట నానబెట్టి ఉదయం ఉడకబెట్టి, ఉదయం సగం గ్లాసు , రాత్రి సగం గ్లాసు తాగేవాడు.తొలి వారాల్లో చాలా కష్టపడేవాడు. ఆకలిని తట్టుకోవడం కష్టంగా ఉండేది. చాలా నీరసంగా అనిపించేది. కానీ వెక్కిరింపులు, వేళాకోళాలు గుర్తొచ్చేవి. అద్దంలో తగ్గిన వెయిట్ చూసుకొని ఉత్సాహాన్ని తెచ్చుకునేవాడు. అలా శరీరంలో మాత్రమే కాదు, మనస్సులో ఉత్సాహంలో కూడా వచ్చిన మార్పు గమనించి మరింత పట్టుదలగా సాగాడు.6-7 నెలల కృషి తర్వాత, తన బాడీ వెయిట్ 80 కిలోలకు చేరేసరికి కళ్ళలో ఆనందంతో కన్నీళ్లు వచ్చాయి.కేవలం బరువు తగ్గడం మాత్రమే కాదు, ఆత్మవిశ్వాసం, గౌరవం కూడా తిరిగి వచ్చింది. ఎందుకు బరువు తగ్గడం నీ వల్ల కాదురా అని హేళన చేసినవాళ్లంతా 'నువ్వు ఇంత బరువు ఎలా తగ్గావు?' అని ఆశ్చర్యపోవడమే రజత్ వెయిట్ లాస్లో జర్నీలో పెద్ద సక్సెస్.. -
శరీరానికి సరిపడ బెస్ట్ ఫుడ్స్ ఏంటో తెలుసుకుందాం ఇలా..!
నగరంలో ఫుడీస్, ఫుడ్ లవర్స్, భోజనప్రియులు.. పేరేదైనా కానీ.. విభిన్న వంటకాలు ఆస్వాదించేవారు పెరుగుతున్నారు. మరోవైపు రెస్టారెంట్స్లో మాత్రమే కాదు సంపన్నుల బఫే డిన్నర్స్లోనూ, పారీ్టస్లోనూ విభిన్న రకాల విదేశీ రుచుల వడ్డన సర్వసాధారణం అయ్యింది. అయితే కంటికి ఇంపైనంత మాత్రాన ఇంటికి ఇంపు కావాలని లేనట్టే, నోటికి ఇంపుగా అనిపించినంత మాత్రాన శరీరానికి ఇంపు కాకపోవచ్చని వైద్యులు చెబుతున్నారు. రుచుల వేట సాగించేవాళ్లు ముందస్తుగా ఫుడ్ ఇన్టోలరెన్స్ టెస్టు చేయించుకోవడం మంచిదని సూచిస్తున్నారు. వైద్యులు చెబుతున్న వివరాల ప్రకారం.. సాధారణంగా మనుషులు తినకూడని ఆహారాలు మనకి తెలుసు. తినదగినవీ తెలుసు. కానీ కొందరికి మాత్రమే తినదగినవి, కొందరు తినకూడనివి కూడా ఉంటాయి. అలానే ఆరోగ్యానికి మేలు చేసే ఆహారాలు కూడా కొన్నిసార్లు అస్వస్థతకు కారణమవుతాయి. ఇవి జీర్ణక్రియ సమస్యలు, చర్మం మీద ర్యాషెస్, తలనొప్పి, కీళ్ల నొప్పులు వంటి లక్షణాలను కలిగించవచ్చు. అయితే ఎటువంటి ఆహారం అనారోగ్యానికి కారణమవుతుందో గుర్తించడం చాలా కష్టం. అనేక సందర్భాల్లో ఈ లక్షణాలు ఆహారం తిన్న కొన్ని గంటల తరువాత మాత్రమే బయటపడతాయి. ఈ క్రమంలో ఫుడ్ ఇన్టోలరెన్స్ టెస్ట్ అనేది ఉపయోగపడుతుంది. ఫుడ్ అలర్జీ.. లక్షణాలు ఇలా.. ఆహారం పడకపోవడం వల్ల మొదటిగా చర్మంపై పొక్కులు, ఎర్రని దద్దుర్లు, నొప్పులు రావచ్చు. అయితే చిన్నపిల్లల్లో మొదటి లక్షణంగా చర్మంపై ర్యాష్ కనిపిస్తుంది. అలాగే శ్వాస సంబంధిత వ్యవస్థపై ప్రభావంతో దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఛాతీ బిగుదల, ముక్కు పొంగడం వంటి సమస్యలు కలగవచ్చు. జీర్ణ వ్యవస్థపై దాడితో.. నాలుక ఉబ్బిపోవడం, బొజ్జ నొప్పి, నోటిలో మెటాలిక్ రుచి వంటి లక్షణాలు కనిపించవచ్చు. అలాగే అనాఫిలాక్టిక్ షాక్ అనే తీవ్ర పరిస్థితి ఏర్పడినప్పుడు వేగంగా నాడీ స్పందన, పెదవులు, గొంతు ఉబ్బిపోవడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, చర్మం తెల్లగా కనిపించడం, మూర్ఛ వంటివి కూడా రావచ్చు.నప్పనివి ఏమిటి? సాధారణంగా నప్పని ఆహారాల్లో పాలు, సోయా, గుడ్లు, గోధుమలు, షెల్ ఫిష్, పీనట్స్, వాల్నట్, ఆల్మండ్, కాజు, పీకాన్ వంటి డ్రై ఫ్రూట్స్.. అయితే ఇవి నప్పకపోవడానికి వాటిలో ఉండే కొన్ని ఉపపదార్థాలు కూడా కారణమే. ఉదాహరణకు పాలలో ఉండే లాక్టోజ్ అనే ఒక రకమైన తియ్యటి పదార్థం, గోధుమలు, బార్లీ వంటి ధాన్యాల్లో ఉండే గ్లూటెన్ అనే ప్రొటీన్, ఫుడ్ ఫ్లేవర్ పెంచడానికి ఉపయోగించే ఎంఎస్జీ అనే పదార్థం.. ఇలా.. కొన్ని సందర్భాల్లో అతి తక్కువ మోతాదులో ఈ ఆహారాలను తీసుకున్నా తీవ్ర సమస్యలకు కారణం కావచ్చు. అలాగే మనకు ఏ మాత్రం పరిచయం లేని వంటకాల్లో ఏయే దినుసులు కలుపుతున్నారో వాటిలో ఏవి మనకు నప్పవో తెలీదు కాబట్టి మరింత జాగ్రత్త అవసరం. ఆహారం.. అసహనం.. మన శరీరానికి హానికరం కాని ఆహారాలను హానికరమైన వైరస్లా గుర్తించి స్పందించే స్థితి కూడా ఉంటుంది. ఇది కొన్నిసార్లు చిన్నపాటి జీర్ణ సమస్యలుగా ఉంటే, మరికొన్నిసార్లు అనాఫిలాక్టిక్ షాక్ అనే ప్రాణాంతక పరిస్థితికి దారితీస్తుంది. ఈ సమస్య చిన్నపిల్లల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా 5 శాతం కంటే ఎక్కువ మంది చిన్నారులు దీని ప్రభావానికి లోనవుతున్నారు. చాలామంది పిల్లలు పెద్దయ్యాక ఈ అసహనాన్ని సహనంగా మార్చుకోగలుగుతారు. కానీ కొందరు మాత్రం కొన్నింటిని నప్పేలా చేసుకుంటారు కొన్నింటి పట్ల అసహనాన్ని కొనసాగిస్తారు. ఫుడ్ అలర్జీ పరీక్షలు.. ఎలా? ఎక్కడ? అనుమానాస్పద ఆహారాన్ని స్వల్పంగా ప్రయోగించి శరీరం ఎలా స్పందిస్తుందో పరిశీలించడాన్ని ఓరల్ ఛాలెంజ్ టెస్ట్ అంటారు. అలాగే అనుమానాస్పద ఆహారాలను పూర్తిగా ఆపి, తర్వాత ఒక్కొక్కటిగా మళ్లీ ఆహారంలో చేర్చడాన్ని ఎలిమినేషన్ డైట్, ఆహారాన్ని చర్మంపై ఉంచి సూదితో తక్కువగా గుచ్చి చేసే స్కిన్ ప్రిక్ టెస్ట్, రక్తంలో ఐజీఇ యాంటీబాడీస్ ఉన్నాయా లేదా అనేది పరీక్షించడానికి బ్లడ్ టెస్ట్ చేస్తారు. నగరంలో థైరోకేర్, మై డయాగ్నోస్టిక్స్, డీఎన్ఎ ల్యాబ్స్ ఇండియా, రెడ్ క్లిఫ్ ల్యాబ్స్, ల్యూసిడ్.. వంటి చోట్ల ఈ పరీక్షలు చేస్తున్నారు. కనీసం 200 రకాలు.. ఆ పైన అలర్జీలను గుర్తించేందుకు చేసే పరీక్షల వ్యయం కనీసం రూ.5వేల నుంచి రూ.15వేల వరకూ అవుతుంది. (చదవండి: ఆ జంట పిల్లలు కోసం సరోగసికి వెళ్తే.. ఊహకందని ట్విస్ట్! చివరికి..) -
భర్త పుట్టిన రోజునే బిడ్డకు జన్మనివ్వాలని పిచ్చి పని చేసిన భార్య..!
హిందూపురానికి చెందిన వివాహితకు నెలలు నిండాయి. ప్రసవానికి ఇంకా 15 రోజుల గడువుందని వైద్యులు చెప్పారు. అయితే తన భర్త పుట్టిన రోజునాడే తాను బిడ్డకు జన్మనివ్వాలని భావించిన గర్భిణి అనంతపురంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరి సిజేరియన్ ద్వారా మగ బిడ్డకు జన్మనిచ్చింది. అయితే ఆ తర్వాత బిడ్డ ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో బెంగళూరుకు తీసుకెళ్లి రూ.6 లక్షలు ఖర్చు చేసి రెండు నెలల పాటు చికిత్స తీసుకున్నారు. అయినా బిడ్డ మానసిక ఎదుగుదలలో లోపం కనిపిస్తోందని.. మూర్ఖత్వంతో ముందుగానే సిజేరియన్ చేయించి తప్పు చేశామని ఈ దంపతులు ఇప్పుడు పశ్చాత్తాప పడుతున్నారు.దొడ్డబళ్లాపురానికి చెందిన ఓ వ్యక్తి గర్భిణిగా ఉన్న తన భార్యకు హిందూపురంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ప్రతి నెలా పరీక్షలు చేయించేవాడు. ఓ పురోహితుడి సూచన మేరకు మంచి ముహూర్తం ఉందని నెలలు నిండకముందే భార్యకు సిజేరియన్ చేయించాడు. చిన్నారి ఆరోగ్యం అదృష్టవశాత్తూ బాగుంది.. కానీ తల్లి ఆరోగ్యం క్షీణించడంతో తర్వాత బెంగళూరుకు తీసుకెళ్లారు.సాక్షి, పుట్టపర్తి : మనిషి చంద్రమండలంలో అడుగుపెడుతున్న నేటి రోజుల్లోనూ... చాలా మంది ఇంకా మూఢనమ్మకాలను వీడడం లేదు. ముఖ్యంగా ముహూర్తాల పిచ్చితో కష్టాలు కొనితెచ్చుకుంటున్నారు. ముహూర్తం కలిసి వస్తే ఫర్వాలేదు గానీ... ఫలానా రోజే..ఫలానా ముహూర్తమే అన్నది ఇబ్బందిగా మారింది. కొందరైతే ప్రసవాలకూ ముహూర్తాలు నిర్ణయిస్తూ శిశువులు, వారికి జన్మనిచ్చే తల్లుల జీవితాలతో ఆడుకుంటున్నారు. ముహూర్తాల పిచ్చితో అమ్మ కడుపునకు గాటు పెట్టించి.. బిడ్డలను బలవంతంగా తీస్తున్నారు. తల్లీబిడ్డల ఆరోగ్యానికి ముప్పు తలపెడుతున్నారు. ఈ జాఢ్యాన్ని కొందరు తల్లులతో పాటు వారి కుటుంబ సభ్యులు ప్రోత్సహిస్తుండటం వైద్యులను సైతం ఆందోళనకు గురి చేస్తోంది. కొన్ని ప్రైవేటు ఆస్పత్రులకు మాత్రం కాసుల వర్షం కురిపిస్తోంది. సిజేరియన్కే మొగ్గు ఒకప్పుడు సిజేరియన్ పేరు చెబితే గర్భిణులు భయపడేవారు. బిడ్డ అడ్డం తిరిగినప్పుడు.. గర్భిణి నీరసంగా ఉన్నప్పుడు, రక్తపోటు అధికంగా ఉన్నప్పుడు, గర్భంలో బిడ్డ అడ్డం తిరిగినప్పుడు, ఉమ్మనీరు పోతున్నప్పుడు, గర్భాశయ ముఖద్వారాన్ని మాయ కమ్మేసినప్పుడు తదితర అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే గతంలో సిజేరియన్ చేసేవారు. కానీ ప్రస్తుత కాలంలో సిజేరియన్ సర్వసాధారణంగా మారింది. సహజ కాన్పుతో కలిగే దీర్ఘకాలిక ప్రయోజనంపై అవగాహన లేకపోవడంతో చాలామంది సిజేరియన్కే మొగ్గు చూపుతున్నారు. సరైన ముహూర్తానికే పురుడు పోయాలని వైద్యులపై ఒత్తిడి చేస్తున్నారు. ఇదీ చదవండి: షారూఖ్ను మించిపోయేలా, మహేష్ టేస్ట్ అండ్ స్టైల్ : ధర రూ. 8 కోట్లు!మారుమూల పల్లెల వరకు ముహూర్తానికే సిజేరియన్ చేసి పురుడుపోసే సంప్రదాయం పట్టణాల నుంచి పల్లెల వరకూ పాకింది. ముహూర్తాల పేరుతో తమకు నచ్చిన రోజు.. నచ్చిన సమయానికే బిడ్డలకు జన్మనిచ్చేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఏడాదిన్నర వ్యవధిలో జిల్లా పరిధిలో జరిగిన ప్రసవాల సంఖ్యలో సిజేరియన్ల సంఖ్య ఎక్కువగా ఉండటం... అందునా ప్రైవేటు ఆస్పత్రుల్లోనే అధికంగా నమోదు కావడం మనార్హం. ముహూర్తాల పేరుతో ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లి.. కావాల్సిన సమయానికి బిడ్డలకు జన్మనిస్తున్నారు. ఈ చెడు సంస్కృతి పట్టణాల నుంచి పల్లెల వరకు వ్యాపించింది. ఫలితంగా ప్రొలాక్టిన్ వంటి హార్మోన్లు విడుదల కాక పిల్లలు పుట్టిన వెంటనే పాలు ఇవ్వడం కష్టంగా మారుతోంది. ఈ క్రమంలో తల్లిపాలు పట్టకపోతే బిడ్డ ఎదుగుదలపై ప్రభావం చూపిస్తుంది. సిజేరియన్తో పలు మూత్రాశయ వ్యాధులు కూడా సోకే ప్రమాదం ఉంది.ప్రోత్సహిస్తున్న ప్రైవేటు డాక్టర్లు కొన్ని ప్రైవేటు ఆస్పత్రుల డాక్టర్లు కూడా సిజేరియన్లను ప్రోత్సహిస్తున్నట్లు సమాచారం. ఒక సిజేరియన్కు ప్రైవేటు ఆస్పత్రుల్లో రూ.40 వేల నుంచి రూ.లక్ష వరకు వసూలు చేస్తున్నారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో జరిగే ప్రసవాల్లో 80 శాతం వరకు సిజేరియన్లు ఉండటం విశేషం. సిజేరియన్ చేస్తే ఆస్పత్రిలోనే వారం రోజుల పాటు బాలింతలు ఉండాల్సి వస్తోంది. దీంతో అదనంగా మరో రూ.15 వేల వరకు దండుకుంటున్నారు. సహజ ప్రసవమైతే రూ.20 వేల లోపు ఖర్చుతో పాటు రెండు రోజుల్లో డిశ్చార్జి కావచ్చు.శిశువులకు ప్రమాదం బిడ్డ జననం సహజంగా జరిగితే అది శిశువు మానసిక, శారీరక వికాసానికి దోహపడుతుంది. సిజేరియన్ ద్వారా మంచి ముహూర్తాల కోసం నెలల నిండక ముందే జన్మనిస్తే.. ఊపిరితిత్తుల సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. తక్కువ బరువు ఉంటారు. మానసిక ఎదుగుదల లోపిస్తుంది. బిడ్డలో ఆ సమయానికి అవసరమైన దాని కంటే తక్కువ హార్మోన్లు విడుదల కావడంతో పిల్లల భవిష్యత్తుపై ప్రభావం పడే అవకాశం ఉంది. – డాక్టర్ శివకుమార్, చిన్నపిల్లల వైద్య నిపుణుడు, హిందూపురం చదవండి: పెళ్లైన 20 ఏళ్లకు.. మా ఆవిడ బెదిరిస్తోంది : కేసు అవుతుందా?ముహూర్తం..మూర్ఖత్వం కొందరు ముహూర్తం చూసుకుని సిజేరియన్ ద్వారా పిల్లలకు జన్మనిస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. కడుపుకోత తల్లుల ఆరోగ్యంపై ప్రభావం చూపే ప్రమాదం ఉంది. అంతేకాకుండా సమయానికి ముందే జని్మంచడంతో చిన్నారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం లేకపోలేదు. సిజేరియన్ విషయంలో మూర్ఖత్వంతో వైద్యులపై ఒత్తిడి తేరాదు. – డాక్టర్ ఫైరోజా బేగం, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి, పుట్టపర్తి -
Today Tips యోగాతో లాభాలెన్నో.. ఈ చిట్కాలు తెలుసా?
కేవలం ఆసనం లేదా ధ్యానం చేయడం మాత్రమే కాదు. యోగా సాధన (Yoga Practicing) చేయడం ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మనస్సు, శరీరం ,ఆత్మను అనుసంధానించే ఒక మార్గం. శరీరాన్ని అంతర్గతంగా పునరుజ్జీవింపజేయడానికి , బాహ్య ప్రపంచంలో ఉన్న కఠినమైన పరిస్థితులను తట్టుకుని పోరాడేంత బలంగా చేస్తుంది యోగా. శారీరకంగా ఆరోగ్యంగా ఉండటం మాత్రమే కాదు, మానసికంగా ఎంతో దృఢంగా ఉండొచ్చు. చిన్నవయసువారినుంచి పండు వయసు వారిదాకా సులభంగా ఆచరించే వ్యాయామం యోగ. యోగా అనేది ప్రాథమికంగా ఒక ఆధ్యాత్మిక క్రమశిక్షణ, ఇది మనస్సు శరీరం మధ్య సామరస్యాన్ని పెంచుతుంది. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్బంగా టిప్ ఆఫ్ ది డేలో భాగంగా యోగా ఆరోగ్య ప్రయోజనాలు, చిట్కాలు గురించి తెలుసుకుందాం. యోగా - ప్రయోజనాలుశారీరకంగానే కాకుండా మానసికంగానూ దృఢంగా తయారవుతాంక్రమశిక్షణ, ఏకాగ్రత పెరుగుతుంది.ఒత్తిడి దూరమవుతుంది. భావోద్వేగాలను నియంత్రించుకోవడానికి యోగా చక్కటి పరిష్కారం మానసిక ఆరోగ్యం బలపడుతుంది.యోగా ద్వారా అధిక బరువును సులభంగా తగ్గవచ్చు.యోగా చేయడం ద్వారా మధుమేహం,థైరాయిడ్, మెదడు పనితీరును మెరుగుపడుతుంది.రక్త పోటు నియంత్రణలో ఉంటుంది. ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని మెరుగుపడుతుంది. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.కీళ్ల నొప్పులు, అజీర్ణం, గ్యాస్, నిద్రలేమి తదితర సమస్యలనుంచి దూరం కావచ్చు.దీర్ఘకాలిక వెన్నునొప్పిని తగ్గిస్తుంది. కండరాలు , ఎముకలు బలపడతాయి. చిట్కాలు: యోగా సాధనలో బాడీని మనసును రిలాక్స్డ్గా ఉంచుకోండి. ఆరోగ్యంగా , సమయం ప్రకారం తినండి. తాజా పండ్లు, ఆరోగ్యకర పానీయాలు సేవించండి.యోగా ,ధ్యానం చేసినప్పుడు ఎలాంటి ఆలోచనలు మిమ్మల్ని ప్రభావితం చేయకుండా చూసుకోండి. మీ శరీర పరిమితులను అర్థం చేసుకోండి. సానుకూల ధోరణిని అలవర్చుకోండి.నిష్టగా, నిబద్ధతతో సాధన చేయండి. ఉత్తమ ఫలితాలు సాధించండి.చదవండి: కూతురి వెర్రి పని... సూపర్ డాడీ సాహసం, వైరల్ వీడియో నోట్ : కొన్ని రకాల యోగాసనాలు నిపుణుల పర్యవేక్షణలోనే సాధన చేయాలి. అలాగే గుండెజబ్బులు, ఆస్త్మా, మోకాళ్ల నొప్పులతో బాధపడేవారు కొన్ని ఆసనాలకు మాత్రమే పరిమితం కావాల్సి ఉంటుంది.యోగా నిపుణుడు ద్వారా నియమ,నిబంధనలపై అవగాహన పెంచుకుని యోగా సాధన మొదలు పెట్టండి.. ఆరోగ్యాన్ని కాపాడుకోండి!! ఇదీ చదవండి: Air India Incident భారీ విరాళం ప్రకటించిన యూఏఈ వైద్యుడు -
130 కిలోల అధిక బరువు..ఎన్నాళ్లో బతకదన్నారు..! కట్చేస్తే..
అధిక బరువు సమస్య అనేది అలాంటి ఇలాంటిది కాదు. వచ్చిందంటే తగ్గదు.. అన్నంతగా వేధిస్తుంది. దీన్ని తగ్గించుకోవడం అంత ఈజీ కాదు. అలా అని అసాధ్యం కూడా కాదు. స్లిమ్గా మారాలి, ఆరోగ్యకరంగా ఉండాలనే స్ట్రాంగ్ మైండ్సైట్తో శరీరంపై ఫోకస్ పెట్టి తగ్గినవారెందరో ఉన్నారు. అదే సమయంలో సత్ఫలితాలను పొందలేక ఢీలా పడ్డవాళ్లు కూడా ఉన్నారు. కొన్నిసార్లు మనం సిన్సియర్గా బరువు తగ్గాలని చేసిన ప్రయత్నాలన్ని అస్సలు వర్కౌట్ కావు. అసలు అలా ఎందుకు జరుగుతుందన్నది క్షణ్ణంగా ఆలోచిస్తేనే..అధిక బరువు సమస్య నుంచి బయటపడగలం లేదంటే అంతే సంగతులు. అచ్చం అలానే చేసింది ఈ 53 ఏళ్ల సారా జేన్ క్లార్క్. ఆమె ఎంత బరువు ఉండేది తెలిస్తే విస్తుపోతారు. ఆమెలాంటి వాళ్లు తగ్గాలంటే బరువు తగ్గించే ఇంజెక్షన్ల సాయంతోనే సాధ్యం. కానీ ఆమె వాటి జోలికి పోకుండానే బరువు తగ్గి చూపించింది. ఎలాగంటే..?..సారా జేన్ క్లార్క్ టీనేజ్ వయసులోనే 130 కిలోల అధిక బరువుతో బాధపడేది. ఆమె ఉదయం క్యాడ్బరీ చాక్లెట్లు, కోకా కోలాతో మొదలయ్యేది. చక్కెర లేని పదార్థాలను ముట్టుకునేదే కాదు. అంతలా స్వీట్లకు బానిసైంది. అయితే కాలేజ్లో ఆమె స్నేహితులంతా నువ్వు లావుగా లేకపోతే ఎంతో అందంగా ఉండేదానివి అన్న మాటలు సారాను విపరీతంగా బాధించేవి. 25 ఏళ్లేక మరింత లావైపోయి..పీరియడ్స్ ఆగిపోయి వృద్ధాప్యానికి చేరువైన వ్యక్తుల మాదిరిగా ఆమెను అనారోగ్య సమస్యలు చుట్టుముట్టాయి. సారా పరిస్థితిని చూసి వైద్యులు కనీసం 40 ఏళ్లు వచ్చే వరకు కూడా బతకడం కష్టమే అని చెప్పేశారు. ఆ మాటలే ఆమెపై పవర్ఫుల్ మంత్రంలా పనిచేశాయి. అప్పడే ఆమె ఎలాంటి క్రాష్ డైట్..వెయిట్ లాస్ ఇంజెక్షన్ల జోలికి వెళ్లకుండానే బరువు తగ్గి చూపించాలని స్ట్రాంగ్గాఐదు నియమాలు..రోజూ 30 నిమిషాల నడక, అధికంగా నీరు తీసుకోవడం. అలాగే ఎలాంటి ఆర్డర్లు వేయకుండా అన్ని పనులు చేసుకోవడంప్రాసెస్ చేసిన ఆహారాలను నివారించడంతీసుకునే ఆహారంలో అధికంగా ఫుడ్ ఉన్నట్లయితే అస్సలు ముట్టుకోకుండా ఉండటంబరువు తగ్గే క్రమంలో ప్రతి చిన్న విజయాన్ని సెలబ్రేట్ చేసుకునేలా మైండ్సైట్లో మార్పుకాలక్రమేణ ఈ రూల్స్ అద్భుతమైన ఫలితాలను అందుకునేలా చేసి కేవలం 16 నెలల్లో..అనూమ్యంగా 44 కిలోల బరువు తగ్గిపోయింది. అందంగా మారడమే గాక ఆరోగ్యంలో కూడా మంచి మార్పులు సంతరించుకున్నాయి. ఆ తర్వాత పెళ్లై ఇద్దరు పిల్లులు పుట్టాక కూడా..అదే పద్ధతిని కొనసాగించింది. అలా సారా డబుల్ ఎక్స్ఎల్ సైజ్ నుంచి ఎల్ సైజ్తో స్లిమ్గా మారిపోయింది. పైగా తన 40వ పుట్టిన రోజుని గ్రాండ్గా జరుపుకుంది కూడా. అంతేగాదు ఆరోగ్య స్ప్రూహను కొనసాగిస్తూ..అందరికి అవగాహన కల్పించేలా 5K రన్ వంటి మారథాన్లలో పాల్గొంటోంది. ప్రస్తుతం ఆమె 62 కిలోల బరువుతో ఆరోగ్యంగా ఉంది.అలా చేస్తే మనకు మనం నచ్చం..బరువు తగ్గించే ఇంజెక్షన్ల క్రేజ్ ఉన్నా..వాటిపట్ల జాగ్రత్త వహించాలంటోంది. ఇంజెక్ట్ చేసుకుని మనల్ని మనం ఎలా ప్రేమించుకోగలం. బరువు తగ్గాకా.. అబ్బా స్లిమ్గా మారిపోయే అనే గొప్ప అనుభూతి కలుగుతుందా..? అని ప్రశ్నిస్తోంది. ఆరోగ్యకరమైన నియమాలను మనకు సాధ్యమైనవి ఎంపిక చేసుకుని తూచా తప్పకుండా పాటించండి చాలు..అద్భుతాలు సృష్టించొచ్చు అని నమ్మకంగా చెబుతోంది. View this post on Instagram A post shared by Sarah Jane Clark (@stepbystepwithsarahjaneinsta) (చదవండి: లావణ్య బెల్లీ డ్యాన్స్కు..నటి ప్రియాంక చోప్రా సైతం ఫిదా..) -
Cancer Risk ఈ ఫుడ్స్తో ముప్పే..!డాక్టర్ వార్నింగ్
మన ఆహార అలవాట్లు, జీవన శైలి అలవాట్లే మన ఆరోగ్యాన్ని నిర్ధారిస్తాయి. ప్రాసెస్ చేసిన మాంసాహారం నుంచి చక్కెర పానీయాల వరకు మనం తీసుకునే రోజువారీ ఆహారాలు కేన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయి. ఈ విషయాన్ని కాలిఫోర్నియాలోనిగ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ ,ఐయిమ్స్, హార్వర్డ్ , స్టాన్ఫోర్డ్లో శిక్షణ పొందిన డాక్టర్ సౌరభ్ సేథి వెల్లడించారు. కేన్సర్ ముప్పును పెంచే అత్యంత హానికరమని భావించే ఆహారాలను సేథి ఇటీవల సోషల్ మీడియాలో పంచుకున్నారు. ప్రస్తుత సమాజంలో అత్యంత ప్రమాదకర వ్యాధుల్లో కేన్సర్ కూడా ఒకటి. వంశపారంపర్య కారణాలతోపాటు, ఆహారం. దురవ్యసనాలు, జంక్ ఫుడ్, ప్రాసెస్ చేసిన ఆహారం, అనారోగ్యకరమైన ఆహారం కూడా కాలక్రమేణా కేన్సర్ ప్రమాదాన్ని నిశ్శబ్దంగా పెంచుతాయి. అయితే అల్ట్రా-ప్రాసెస్డ్ మాంసాహారం, చక్కెర పానీయాలు, డీప్-ఫ్రైడ్ ఆహారాలు,కాల్చిన మాంసాహారం ఆల్కహాల్ , అల్ట్రా-ప్రాసెస్డ్ ఆహారాలు కేన్సర్ ముప్పును మరింత పెంచుతాయని డా. సేథిఅల్ట్రా-ప్రాసెస్డ్, గ్రిల్డ్ మాంసాహారందీర్ఘకాలిక ఆరోగ్యం కావాలనుకుంటే మన ఆహారంలో తొలగించాల్సిన కొన్ని ప్రధాన ఆహారాలు ఇవేనని డాక్టర్ సేథి తన పోస్ట్లో అన్నారు.ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రాసెస్ చేసిన మాంసాలను గ్రూప్ 1 కేన్సర్ కారకాలుగా వర్గీకరించింది. ఈ ఆహారాన్ని కూడా ప్రమాదకరమైన కేన్సర్ కారకాలైన పొగాకు , ఆస్బెస్టాస్ జాబితాలో చేర్చింది. అలాగే డా. సేథి కూడా ప్రాసెస్ చేసిన మాంసాహారం కేన్సర్ కారకరమన్నారు. మాంసాన్ని ఎక్కువగా కాల్చటం లేదా నల్లగా వచ్చే వరకు గ్రిల్ చేయటం ప్రమాకరమన్నారు. ఇలాంటి సాసేజ్లు, బేకన్, హామ్ సలామీ వంటి ప్రాసెస్ చేసిన ఆహారాల్లో, అధిక ఉష్ణోగ్రతల వద్ద మాంసాన్ని గ్రిల్ చేయడం లేదా బార్బెక్యూ చేయడం వల్ల హెటిరోసైక్లిక్ అమైన్స్, పాలీసైక్లిక్ అరోమాటిక్ హైడ్రోకార్బన్లు ఉత్పత్తి అవుతాయని, ఇవి శరీరంలోని డీఎన్ఏ కణాలను డ్యామేజ్ చేస్తాయని ఆమె చెప్పారు. ఇవి శరీరంలో క్యాన్సర్ కారక సమ్మేళనాలుగా మారతాయి. ఇలా ఎక్కువ సార్లు జరిగితే సెల్స్ శరీరంలో పెరగటానికి కారణం అవుతుందని హెచ్చరించారు. View this post on Instagram A post shared by Saurabh Sethi (@doctor.sethi) చక్కెర పానీయాలుకూల్ డ్రింక్స్, సోడాలు, తీపి రసాలు , ఎనర్జీ డ్రింక్స్ లాంటి చక్కెర పానీయాలు రక్తంలో చక్కెర . ఇన్సులిన్ స్థాయిలలో పెరుగుదలకు కారణమవుతాయి, ఇది దీర్ఘకాలిక మంట ,బరువు పెరగడానికి దారితీస్తుంది. ఇది రెండూ కేన్సర్ కారకాలు. అధిక చక్కెర తీసుకోవడం కూడా కేన్సర్ కణాల పెరుగుదలకు ఆజ్యం పోస్తుంది. కనుక వీటికి చాలా దూరంగా ఉండాలని, దీని బదులుగా నీరు, తియ్యని టీలు లేదా సహజంగా రుచిగల పానీయాలను ఎంచుకోవాలని సిఫార్సు చేశారు..డీప్ ఫ్రైడ్, ప్రాసెస్డ్ పదార్థాలు, ఆహారాలుఫ్రెంచ్ ఫ్రైస్, ఫ్రైడ్ చికెన్ , పకోరాస్ వంటివి తినేటపుడు బాగానే ఉంటాయి. కానీ వీటి వల్ల చాలా అనర్థం.అధిక ఉష్ణోగ్రతల వద్ద మరిగించిన నూనెలను మళ్లీ మళ్లీ ఉపయోగించి తయారుచేస్తారు. ఈ ప్రక్రియలో అక్రిలామైడ్ వంటి హానికరమైన సమ్మేళనాలు ఉత్పత్తి అవుతాయి, ఇవి DNA నష్టం , ఆక్సీకరణ ఒత్తిడికి కారణమవుతాయి. వీటికిప్రత్యామ్నాయాలుగా బేకింగ్, రోస్టింగ్ లేదా ఎయిర్-ఫ్రైయింగ్ను డాక్టర్ సేథి సిఫార్సు చేశారు.చదవండి: హాటెస్ట్ కర్రీ చాలెంజ్.. ఈ బ్రో తిప్పలు చూడండి!ఆల్కహాల్: హార్మోన్ సంబంధిత కేన్సర్లుమద్యం సేవించటం వల్ల శరీరంలో హార్మోన్ల పనితీరు దెబ్బతింటుంది. ఫలితంగా బ్రెస్ట్ కేన్సర్, లివర్ కేన్సర్ వంటివి వచ్చే ప్రమాదం పెరుగుతుంది. ఆల్కహాల్ శరీరంలో ఎసిటాల్డిహైడ్గా విచ్ఛిన్నమవుతుంది - ఇది DNAను దెబ్బతీసే, రోగనిరోధక శక్తిని దెబ్బతీసే మరియు పోషక శోషణను తగ్గించే విషపూరిత సమ్మేళనం. శరీరం న్యూట్రిషన్లను గ్రహించటానికి అవరోధంగా మారడం ద్వారా డీఎన్ఏ రిపేర్ ప్రక్రియ దెబ్బతిని కేన్సర్ డెవలప్ అయ్యే ప్రమాదాలు పెరుగుతాయని డా. సేథి హెచ్చరించారు.అల్ట్రా-ప్రాసెస్డ్ ఆహారాలుప్యాకేజ్డ్ స్నాక్స్, ఇన్స్టంట్ నూడుల్స్, ప్రాసెస్ చేసిన తృణధాన్యాలు రడీ టూ ఈట్ పదార్థాల్లో తరచుగా అదనపు చక్కెరలు, ట్రాన్స్ ఫ్యాట్లను కలిగి ఉంటాయి. ఇవి తక్కువ పోషక విలువలతో కూడి ఉండటమే కాదు, పేగు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి, వాపుకు దోహదం చేస్తాయి , ఊబకాయాన్ని పెంచుతాయి. ఇవన్నీ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయి.ఇదీ చదవండి: హాట్సాఫ్ డాక్టర్ ! క్షణం ఆలస్యమైనా.!కేన్సర్ ప్రమాదాన్ని తగ్గించుకునేందు ఏం తినాలి?ప్రపంచ ఆరోగ్య సంస్థల ప్రకారం, ఫైబర్ అధికంగా ఉండే, యాంటీ ఇన్ఫ్లమేటరీ హోల్ ఫుడ్స్ ఆహారాన్ని తీసుకోవాలి. ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవర్చుకోవాలి.పాలకూర, కాలే మరియు బ్రోకలీ వంటి ఆకుకూరలుఓట్స్, బ్రౌన్ రైస్ , క్వినోవా వంటి తృణధాన్యాలుకాయధాన్యాలు, చిక్పీస్ , బీన్స్తో సహా చిక్కుళ్ళు , ఇతర పప్పులునట్స్,గింజలు,, అవకాడోల నుండి ఆరోగ్యకరమైన కొవ్వులుగట్ ఆరోగ్యం కోసం పెరుగు , కంజి వంటి పులియబెట్టిన ఆహారాలు, , కొబ్బరి నీళ్లు నోట్ : కేన్సర్ వ్యాధికి అనేక కారణాలుంటాయి. వీటిల్లో మన ఆహార అలవాట్లు, వృత్తిపరమైన సమస్యలు, జెనెటిక్గా వచ్చేవి ఉంటాయి. కేన్సర్ ముప్పు పెరగకుండా ఉండాలంటే కచ్చితంగా కొన్ని రకాల ఆహారాలకు, అలవాట్లకు దూరంగా ఉండాలి. అలాగే కేన్సర్ వ్యాధి నిర్ధారణ, స్థాయిని బట్టి , నిపుణుల సలహామేరకు చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. ఏ వ్యాధికైనా ముందస్తు గుర్తింపు చాలా కీలకం అనేది గుర్తంచుకోవాలి. -
ఒత్తిడిని చిత్తు చేసి...ఆల్ ఇండియా స్థాయిలో విజేతగా నిలిచింది
‘సమస్య నీలోనే ఉన్నప్పుడు...దానికి పరిష్కారం కూడా నీలోనే ఉంటుంది’... ఇది తత్వం కాదు. నిజం. ‘నీట్’కు ప్రిపేర్ అవుతున్న క్రమంలో అవిక ఒత్తిడి తట్టుకోలేక ఏడ్చేది. కన్నీళ్లు తుడుచుకున్నాక... ఒత్తిడిని దూరం చేసే దారి కనిపించింది. ఇక ఎప్పుడూ ఆమె ఏడవ లేదు. ఇప్పుడు ఆల్ ఇండియా స్థాయిలో విజేతగా నిలిచింది.‘చిన్నప్పటి నుంచి నేను డాక్టర్ కావాలనుకునేదాన్ని’ అంటున్న పదిహేడు సంవత్సరాల అవిక అగర్వాల్ జాతీయ వైద్య ప్రవేశ పరీక్ష ‘నీట్’లో 5వ ర్యాంక్ సాధించింది. వైద్యుల కుటుంబంలో పుట్టిన అవిక ఆ వృత్తి విలువను ప్రత్యక్షంగా చూసింది.ఫరిదాబాద్కు చెందిన అవిక పదవతరగతి వరకు ఢిల్లీలో చదివింది. వృత్తి జీవితాన్ని, వ్యక్తిగత జీవితాన్ని సమన్వయం చేసుకుంటూ ఎప్పుడూ ప్రశాంతచిత్తంతో కనిపించే తల్లిదండ్రులను చూడడం తనకు ఇష్టం.‘వారు ఎంతోమందిని బాధ నుంచి విముక్తి చేశారు. జీవితంపై ఆశ కల్పించారు’ అంటుంది తల్లిదండ్రుల గురించి. తల్లిదండ్రులను చూసి డాక్టర్ కావాలనుకున్న అవిక పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న క్రమంలో ఒత్తిడిని తట్టుకోలేక ఏడ్చిన సందర్భాలు ఉన్నాయి. కొద్దిరోజుల్లోనే ఆ ఒత్తిడికి పరిష్కారాన్ని కూడా కనిపెట్టింది. తనకు ఇష్టమైన టేబుల్ టెన్నిస్ ఆడడం ద్వారా ఒత్తిడి నుంచి బయటపడేది.యుద్ధంలోనే కాదు పరీక్షల యుద్ధంలోనూ వ్యూహం(స్ట్రాటజీ) అనేది ముఖ్యం. ‘మేజర్, మైనర్ గోల్స్గా నా స్ట్రాటజీని విభజించుకున్నాను. నీట్ అనేది నా మేజర్ గోల్. మైనర్ గోల్...ప్రతిరోజూ ఇంటికి వెళ్లిన తరువాత విన్న పాఠాలను మననం చేసుకోవడం. డౌట్స్ లేకుండా చూసుకోవడం. క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయడం’ అంటుంది అవిక. (చదవండి: మోడ్రన్ బామ్మ..! ఆమె చేసే వర్కౌట్లు చూస్తే షాకవుతారు!) -
నటి స్నేహ ఫిట్నెస్ సీక్రెట్..! ఆ డైట్ బాగా పనిచేస్తోంది..కానీ అది మాత్రం..
టాలీవుడ్ నటి స్నేహ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తమిళం నుంచి వచ్చినా..తెలుగు ప్రేక్షకుల అశేష ఆదరాభిమానాలు పొందిన నటి. ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీలతో అలరించిన హీరోయిన్గా మంచి పేరు తెచ్చుకుంది. నాలుగు పదుల వయసులో కూడా అంతే అందం గ్లామర్తో తన అభిమానులను కట్టిపడేస్తోంది స్నేహ. అంతలా వన్నెతరగని లావణ్యంతో కట్టిపడేసే స్నేహ ఫిట్నెస్ సీక్రెట్ ఏంటో చూద్దామా..!.తమిళంలో పున్నాగై అరిసిగా పిలిచే స్నేహ వెయిట్లాస్ ట్రైనింగ్ తర్వాతే తాను చాలా స్ట్రాంగ్ ఉన్నట్లు భావిస్తున్నాని పేర్కొంది. తాను ఆహారపరంగా చాలా క్లీన్ అండ్ నీట్గా తింటానని చెబుతోంది. అంతేగాదు రోజులో ఎన్ని కేలరీలు తీసుకుంటాననే దానిపై పూర్తి ఫోకస్ పెడాతానంటోంది. నెలకు ఒక్కసారి తప్ప చక్కెర తీసుకునే ఛాన్సే లేదంటోంది. ఆహారం అనేది పిండిపదార్థం, ఖనిజాలు, ఫైబర్, ప్రోటీన్ల మిశ్రమం అందువల్ల సమతుల్యంగా తీసుకోవడం అనేది అత్యంత ముఖ్యం అని చెబుతోంది. అంతేగాదు ఎక్కువ నీళ్లు తీసుకుంటానని అంటోంది. శుభ్రమైన నీరు, చక్కటి ఆహారం తన దినచర్యలో భాగమని అంటోంది. ఉప్పు, మసాలా చాలా తక్కువగా తీసుకుంటానంటోంది. ఇక వ్యాయామాల పరంగా..యోగా, ఏరోబిక్ వంటి అన్ని వర్కౌట్లు చేస్తానంటోంది. View this post on Instagram A post shared by Sneha (@realactress_sneha) నిపుణుల సూచన..చక్కెర కలిగిన ఆహారాలు రక్తంలోని చక్కెర స్థాయిలను, ఇన్సులిన్ స్థాయిలను పెంచుతాయి. పైగా తిన్న వెంటనే కొవ్వు నిల్వ, ఆకలిని పెంచుతుంది. ముఖ్యంగా సోడాలు, కాఫీలు, ప్యాక్ చేసిన ఆహారాలు, కడుపు నిండినట్లు ఉంటాయి గానీ, సరైనా ఆహార ఎంపికలు కావని చెబుతున్నారు వైద్యులు. ఎవ్వరైన చక్కెరను తీసుకోవడం తగ్గిస్తే..రోజువారీ కేలరీల్లో దాదాపు 200–500 కేలరీలు తగ్గినట్లేనట. అంటే వ్యక్తి వారానికి 0.5 నుంచి 1 కిలో బరువు తగ్గడానికి దారితీస్తుంది. ఇది సమగ్ర ఆరోగ్య విధానానికి సరైనది చెబుతున్నారు. అలాగే బరువు అదుపులో ఉండటం అనేది మంచి ఆహారపు అలవాట్లు, శారీర శ్రమ, మంచి నిద్ర, ఒత్తిడి నిర్వహణ వంటివే కీలకపాత్ర పోషిస్తాయని చెబుతున్నారు. ఇక నూనె, ఉప్పు, మసాలాలు తగ్గించడం అనేది మంచి జీర్ణక్రియకు ఇది సరైన పద్ధతని అన్నారు. పండ్లు, కూరగాయలు, ఇంట్లో వండిన భోజనం తదితరాల నుంచే శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయి. ఫలితంగా హైడ్రేటెడ్గా ఉండటమే కాకుండా బరువు కూడా అదుపులోనే ఉంటుందని చెబుతున్నారు నిపుణులు. గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. మరిన్ని వివరాల కోసం వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం(చదవండి: మోడ్రన్ బామ్మ..! ఆమె చేసే వర్కౌట్లు చూస్తే షాకవ్వుతారు) -
మోడ్రన్ బామ్మ..! ఆమె చేసే వర్కౌట్లు చూస్తే షాకవుతారు!
తొమ్మిది పదుల వయసులో చాలా చలాకీగా ఓ బామ్మ వ్యాయామాలు చేసేస్తోంది. ఆ క్రమంలోనే ఆమె ఒక్కసారిగా నెటిజన్లను ఓ రేంజ్లో ఆకర్షించింది. యంగ్గా ఉండేవాళ్లు సైతం చేయలేని వ్యాయమాలను ఈ బామ్మ 90ల వయసులో సునాయాసంగా చేసి ఆశ్చర్యపరుస్తోంది. ఆ ఏజ్లో ఉండే కీళ్ల సమస్యలు, కాళ్ల నొప్పులు వంటివి ఏమి లేవు ఆమెకు. పైగా వృద్ధాప్యాన్ని ఇంతలా ఆరోగ్యకరంగా నిర్వహించుకోవచ్చని చాటిచెప్పింది. జీవితం అనేది ఆస్వాదించడానికేనని, అది మన చేతుల్లోనే ఉంది అని క్లియర్గా చెప్పింది. ఇంతకీ ఎవరా బామ్మ అంటే..చైనాకు చెందిన ఈ బామ్మ పేరు లీ. ఆమెకు పుష్ అప్, సిట్ అప్లు చేయడం వెన్నతో పెట్టిన విద్య అన్నట్లు వేస్తుందామె. ఇరవై, ముప్పైలలో ఉండే యువత సైతం చేయడానికి ఇబ్బండిపడే కష్టతరమైన వర్కౌట్లన్ని బామ్మ లీ హుషారుగా చేసేస్తుంది. ఆమె హునాన్ ప్రావిన్స్లోని జియాంగ్వా యావో అటానమస్ కౌంటీలో నివసిస్తోంది. నిజానికి ఆ ప్రాంతంలో నిరంతరం వర్షాలు పడుతూనే ఉంటాయి. అయితే ఆ వర్షం కూడా ఆమె ఉత్సాహాన్ని నియంత్రించలేకపోయింది. అంటే ఆమె తన వ్యాయామాలు ఇంట్లోనే చేసుకునేలా చక్కగా సర్దుబాటు చేసుకుంది. క్రమం తప్పకుండా వ్యాయామాలు చేయడం ఆమె అభిరుచి అని చెప్పొచ్చు. అంతలా నిబద్ధతతో చేస్తోందా బామ్మ. పైగా ఆమె ప్రతిరోజూ 200 పుష్-అప్లు, 100 సిట్-అప్ల మిస్అవ్వకుండా చూసుకుంటుందట. జూన్ ప్రారంభంలో యావో ఎత్నిక్ మైనారిటీ మెడిసిన్ ఫెస్టివల్ సందర్భంగా ఆ బామ్మ తన ఆరోగ్యకర అలవాట్లు వెలుగులోకి వచ్చి ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. అంతేగాదు ఆమె తన దీర్ఘాయువు సీక్రెట్ని కూడా షేర్ చేసుకుంది. ప్రతి రాత్రిపూట పాదాలను వేడినీళ్లలో ఉంచే అవాట్లతో కాళ్ల నొప్పులను తగ్గించుకున్నానంటోంది. మంచి ఆహారపు అలవాట్లతో జుట్టు నెరిసిపోకుండా చూసుకుంటుందట. ఇక తన చలాకి కదలికలకు కారణం 1959లో చాంగ్షాలోని కళాశాల నుండి పట్టభద్రురాలైన వెంటనే కిండర్ గార్టెన్ టీచర్గా పనిచేయడమేనని అంటోందామె. ఎందుకంటే పిల్లలు కదలికలు చాలా అద్భుతంగా ఉంటాయి. వారిలో ఉండే చురుకుదనం తనకెంతో ఇష్టమని అంటోంది. అలానే యాక్టివ్గా జీవితాంతం ఉండాలనే ఆకాంక్ష..ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టేలా చేసిందని అంటోంది బామ్మ లీ.వయస్సుతో పాటు మన శరీర కదలికలు తగ్గుతాయి..దాన్ని గమనించి మంచి ఆరోగ్య అలవాట్లు, జీవనశైలిని సరిచేసుకుంటే.. వృద్ధాప్యంలో ఎవ్వరిపై ఆధారపడకుండా..ఆరోగ్యకరమైన జీవితాన్ని ఆశ్వాదించగలమని చెబుతోంది ఈ బామ్మ. నెటిజన్లు సైతం ఆమె కథని విని..ఆమె మాములు బామ్మ కాదంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.(చదవండి: UK: సీక్రెట్ ఇంటెలిజెన్స్ సర్వీస్కు సారథిగా ఆమె..! 115 ఏళ్ల చరిత్రలో..) -
చిన్న ప్రాణితో.. ప్రాణానికే ముప్పు: ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
పోలో మ్యాచ్ ఆడుతూ తేనెటీగ కుట్టడం, దాన్ని మింగిన తర్వాత పారిశ్రామికవేత్త , సోనా కామ్స్టార్ ఛైర్మన్ సంజయ్ కపూర్ గుండెపోటుతో మరణించిన ఘటన చాలా మందిని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఇంత చిన్న కారణం అంత ప్రాణాంతకంటా ఎలా మరిందనేది చర్చకు దారితీసింది. అలాంటి సంఘటనలు ఎలా ప్రాణాంతకంగా మారతాయనేది నిపుణులు ఏమంటున్నారో ఇక్కడ చూద్దాం.తేనెటీగ కుట్టడం-అనాఫిలాక్సిస్ తేనెటీగ కుట్టడం సాధారణంగా చాలా మందికి హానికరం కాదు, కానీ అలెర్జీ ఉన్నవారికి అవి తీవ్రమైన ప్రమాదాలను కలిగిస్తాయని వైద్యులు చెబుతున్నారు. ఇది చాలా అరుదైనదే, కానీ తీవ్రమైన పరిస్థితులలో, తేనెటీగ కుడితే అనాఫిలాక్సిస్ అనే రియాక్షన్ ప్రాణాంతకం కావచ్చు. హిస్టామిన్తో సహా రసాయనాలు శరీరంలోకి వేగంగా విడుద లైనప్పుడు గుండెపోటు సంభవిస్తుంది. ఫలితంగా రక్తనాళాలు విస్తృతంగా వ్యాకోచించడం, రక్తపోటు అకస్మాత్తుగా తగ్గడం, వాపువస్తుంది. ముఖ్యంగా వాయుమార్గాల చుట్టూ ఉన్న ప్రాంతంలో నోరు లేదా గొంతులో కుట్టినా, అనుకోకుండా తేనెటీగను మింగినా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తుతాయి. హృదయనాళ వ్యవస్థపై ఒత్తిడి గుండెపోటుకు దారితీస్తుంది.తేనెటీగ కుట్టినప్పుడు ‘అనాఫిలాక్సిస్’ (Anaphylaxis) అనే తీవ్రమైన ఎలెర్జీకి కారణమవుతుంది. ఒక విధంగా చెప్పాలంటే అనాఫిలాక్సిస్ అనేది ప్రాణాంతకమైన ఎలర్జీ. కొన్ని సెకన్లలోనే ముప్పు ఏర్పడవచ్చు.కొంతమందికి ఇలా కూడా కావచ్చుగొంతు లేదా నాలుక మందం, వాపుశ్వాస తీసుకోవడంలో ఇబ్బంది సడెన్గా బీపీ డౌన్ షాక్ లేదా గుండె ఆగిపోవడంకొన్ని సందర్భాల్లో, ముఖ్యంగా కుట్టడం శ్వాసమార్గం, లేదా వాయునాళాన్ని ప్రభావితం చేసినప్పుడు, అలెర్జీ లేని వ్యక్తులకు కూడా ప్రాణాంతకం కావచ్చు. అనాఫిలాక్సిస్ కౌనిస్ సిండ్రోమ్ను ప్రేరేపిస్తుంది. తీవ్రమైన అలెర్జీ ప్రతిచర్య కరోనరీ ధమనులలో దుస్సంకోచాలను కలిగించేఅరుదైన పరిస్థితి.ఇది గుండెపోటుకు దారితీస్తుంది. ఇదే సంజయ్ కపూర్ మరణంలో కూడా జరిగి ఉండవచ్చని నిపుణుల అభిప్రాయం.ఎలాంటి సందర్బాల్లో ఇలా జరగవచ్చుచీమలు, తేనెటీగలు, కందిరీగలు, జెల్లీ ఫిష్ కుట్టడం, అలాగే గడ్డి కోస్తున్నపుడు, పాయిజన్ ఐవీ, ర లింపెట్ తీసుకోవడం, మిల్లెట్ అలెర్జీ, షెల్ఫిష్ తిన్నపుడు , విష ప్రయోగం లాంటి సందర్బాల్లో ఇలా జరగవచ్చని వైద్య నివేదికల ద్వారా తెలుస్తోంది.తేనెటీగ కుట్టినపుడు, అత్యసర పరిస్థితుల్లో ఏమి చేయాలితక్షణం వైద్య చికిత్స అవసరం. ఎపిపెన్ వంటి ఆటో-ఇంజెక్టర్ ద్వారా ఎపినెఫ్రిన్ (అడ్రినలిన్) ఇవ్వాలి. అనాఫిలాక్సిస్కు చికిత్స లో ఇది మొదటి స్టెప? తరువాత అత్యవసర వైద్య సంరక్షణ అవసరం. రోగి పరిస్థితి, లక్షణాలనుబట్టి అత్యవసర సేవలకు కాల్ చేయడం, అవసరమైతే ఆక్సిజన్ , CPR అందించడం చాలా కీలకం. దీంతోపాటు తీవ్రమైన అలెర్జీలు ఉన్న వాళ్లు, అత్యవసర మందులను తమతో తీసుకెళ్లాలి. అలాగే వాటిని ఎలా ఉపయోగించాలో వారి చుట్టూ ఉన్నవారికి తెలియజేయడం చాలా అవసరమని డాక్టర్ రషీద్ అన్నారు. ఎలర్జీ మొదలై, అకస్మాత్తుగా కుప్పకూలిపోతూ, ప్రతీ సెకనూ చాలా కీలకమన్నారు.తీవ్రమైన అలెర్జీ, తీసుకోవలసిన చర్యలువెంటనే అత్యవసర సేవలకు కాల్ చేయాలినాడి ,శ్వాసను తనిఖీ చేయాలిప్రతిస్పందించకపోతే, CPR చేయాలి.అందుబాటులో ఉంటే ఎపినెఫ్రిన్ ఆటో-ఇంజెక్టర్ (ఎపిపెన్)ఇవ్వాలి.వ్యక్తిని వాంతి చేసుకోకుండా ఉండేలా చూడాలి.వ్యక్తి స్పృహలో ఉండి తేలికపాటి లక్షణాలు (వాపు లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటివి) చూపిస్తే, వారిని ప్రశాంతంగా , నిటారుగా కూర్చోబెట్టాలి.ఇలాంటి సంఘటనలను నివారించడం ఎలా? ఇలాంటివి అరుదైనవే అయినప్పటికీ, ఒక్కోసారి ఊహించని ప్రమాదాలు ప్రాణాలకే మప్పు తెస్తాయి. అచ్చం సంజయ్ కపూర్ ఉదంతంలోలాగా. బహిరంగ ప్రదేశాల్లో క్రీడల సమయంలో, ముఖ్యంగా కీటకాలు ఎక్కువగా ఉండే ప్రాంతాలలో మౌత్గార్డ్ లేదా ఫేస్మాస్క్ ధరించాలి.తేనెటీగలు చక్కెర సువాసనలకు ఆకర్షితులవుతాయి కాబట్టి, బహిరంగ ప్రదేశాలలో దాచని తీపి పానీయాలు తాగకుండా ఉండాలి.ఒకవేళ ఏదైనా అలెర్జీ ఉంటే, ఎపిపెన్ను ఎపుడూ దగ్గర పెట్టుకోవాలి. దానిని ఎలా ఉపయోగించాలో పక్క వాళ్లకి తప్పకుండా తెలియజేయాలి. అనాఫిలాక్సిస్ లక్షణాలను, త్వరగా ఎలా స్పందించడం ఊహించని, ప్రమాదకర పరిస్థితులలో కూడా ఒక ప్రాణాన్ని కాపాడవచ్చు. -
తరచూ అనారోగ్యమా?.. ఇలా చేస్తే చాలంటున్న అధ్యయనం
సాక్షి, హైదరాబాద్: జబ్బులు రాకుండా ఉంటే ఎంత బాగుండు అని.. అవి వచ్చిన ప్రతిసారి అనుకుంటూ ఉంటాం. కానీ అందుకు ఏం చేయాలో మాత్రం తెలియక ఇబ్బంది పడుతూంటాం. వ్యాయామాలు చేస్తూంటాం. రకరకాల ప్రయత్నాలూ కొనసాగిస్తూంటాం. అయితే.. మీరు తినే ఆహారంలో మార్పులు చేసుకోవడం ద్వారా నిజంగానే జబ్బులు రాకుండా చేసుకోవచ్చునని అంటున్నారు శాస్త్రవేత్తలు. ఎలాగూ చూసేయండి.. “Let food be thy medicine and medicine be thy food.” అంటాడు గ్రీకు తత్వవేత్త హిపొక్రేట్స్. మీరు తినే ఆహారమే మీకు మందు కావాలి. మందే మీ ఆహారం కావాలని స్థూల అనువాదం. ఎప్పుడో వేల సంవత్సరాల క్రితం నాటి హిపొక్రేట్స్ మాట ఇప్పుడు మరోసారి బాగా పాపులర్ అవుతోంది. మనకొచ్చే జబ్బులకు ఆహారం ద్వారానే చికిత్స అందించేందుకు ఒక పక్క ప్రయత్నాలు జరుగుతుంటే.. ఇంకోపక్క అసలు జబ్బులే రాకుండా ఉండేందుకు ఆహారం ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకునేందుకు అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం ఒకటి ఒక అధ్యయనం నిర్వహించింది. యునైటెడ్ కింగ్డమ్లో నలభై లేదా అంతకంటే ఎక్కువ వయసున్న సుమారు 1.24 లక్షల మందికి సంబంధించిన ఆహార అలవాట్లను, వారి ఆరోగ్యాన్ని ఏళ్ల తరబడి పరిశీలించిన తరువాత వీరు తేల్చిందేమిటంటే.. ఆహారం ద్వారా ఫ్లేవనాయిడ్లు ఎక్కువగా తీసుకోవడం వల్ల జబ్బులు రాకుండా ఉంటాయి అని!. ఇంకేముంది.. ఎంచక్కా ఫ్లేవనాయిడ్స్ ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకుందామని డిసైడ్ అయిపోయారా?. ఆగండాగండి.. ఓ చిన్న ట్విస్ట్ ఉందిక్కడ. ఏంటంటే.. మీరు ఎంత ఎక్కువ మోతాదులో ఫ్లేవనాయిడ్స్ తీసుకుంటున్నారు అన్నది ముఖ్యం కాదు. ఎన్ని రకాలవి తీసుకుంటున్నారన్నది కీలకమని శాస్త్రవేత్తలు గుర్తించారు. మరో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. ఫ్లేవనాయిడ్లు ఎక్కువగా ఉన్న ఆహారాలకు.. దీర్ఘాయిష్షును అందించే, వ్యాధులను నిరోధించే లక్షణం ఉన్నట్లు చాలాకాలంగా తెలియడం!. మరి తాజా అధ్యయనం ఏం తేల్చిందంటే.. ‘‘ఫ్లేవనాయిడ్లు ఎక్కువగా తీసుకుంటే గుండెజబ్బులు వచ్చే అవకాశాలు తగ్గుతాయని, మధుమేహం, పార్కిన్సన్స్ వంటి నాడీ సంబంధిత సమస్యలూ నిరోధించవచ్చునని ముందే తెలుసు. కానీ.. రాశి కంటే వాసి ముఖ్యమని.. వెరైటీ ఇంకా కీలకమని మాత్రం తాజా అధ్యయనం స్పష్టం చేసింది’’ అంటారు బెల్ఫాస్ట్ యూనివర్శిటీ పోషకాహార శాస్త్రవేత్త అడెన్ కాసిడీ. తమ అధ్యయనంలో మూడింట రెండు వంతుల మంది గ్రీన్, బ్లాక్ టీల నుంచి ఫ్లేవనాయిడ్లు అందాయని, ఆపిల్స్, రెడ్వైన్, ద్రాక్ష, బెర్రీ పళ్లు, డార్క్ చాకొలేట్, కమలా ఫలాలు ఇతర ఆహార మార్గాలని ఆయన వివరించారు. ఎక్కువ వెరైటీల ఫ్లేవనాయిడ్లను ఆహారం ద్వారా తీసుకున్న వారికి మృత్యుభయం, వ్యాది సమస్యలు తక్కువగా ఉన్నట్లు తమ విశ్లేషణలో తేలిందని చెప్పారు. రోజూ 500 మిల్లీగ్రాముల ఫ్లేవనాయిడ్లు తీసుకున్న వారు వ్యాధుల ద్వారా మరణించే ప్రమాదం 16 శాతం వరకూ తక్కువని ఈ అధ్యయనంలో పాల్గొన్న కోవాన్ యూనివర్శిటీ (ఆస్ట్రేలియా) శాస్త్రవేత్త బెంజిమన్ పార్మెంటర్ తెలిపారు. గుండెజబ్బులు, శ్వాసకోశ సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశాలు పది శాతం వరకూ తక్కువ అని వివరించారు. కేవలం రెండంటే రెండు కప్పుల గ్రీన్/బ్లాక్ టీల ద్వారా 500 మిల్లీగ్రాముల ఫ్లేవనాయిడ్లు శరీరానికి అందుతాయి!. రకరకాల ఫ్లేవనాయిడ్లు తీసుకున్న వారికి మధుమేహం, కేన్సర్ వంటివి వచ్చే అవకాశాలు 6 నుంచి 20 శాతం వరకూ తక్కువగా ఉన్నట్లు తేలింది. కొసమెరుపు.. రోజూ రంగు రంగుల పండ్లు, కాయగూరలు తింటూ ఉంటే చాలు.. వెరైటీ ఫ్లేవనాయిడ్లు మీ శరీరంలోకి చేరి మిమ్మల్ని వ్యాధులకు దూరంగా ఉంచుతాయి!.-గిళియారు గోపాలకృష్ణ మయ్యా. -
Plane Crash: పాపం బాధితులు ఆ ఫోబియాతో..!
అహ్మదాబాద్లో జరిగిన ఘోర విమాన ప్రమాదం ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టించింది. అందులో ప్రయాణించే ప్రయాణికులే గాక, ఆ ఘటనలో మెడికల్ కాలేజ్ విద్యార్థులు, పక్కనే ఉన్న టీ స్టాల్లో పనిచేసే వ్యక్తుల తోసహా అందరూ ఈ ప్రమాదంలో మృతి చెందారు. అంతా క్షణాల్లో బూడిదైపోయారు. ఈ ప్రమాద ఘటన యావత్తు దేశాన్ని దిగ్బ్రాంతికి గురయ్యేలా చేసింది. అయితే ఇలాంటి ఘెర విమాన ప్రమాదం బారినపడి ప్రాణాలతో బయటపడ్డ మృత్యుంజయులెందరో ఉన్నారు. కానీ వారంతా మానసికంగా కోలుకోవడం అంత ఈజీ కాదట. చావుని చాలా దగ్గరగా చూసి రావడంతో విమానం అన్న, ఆ శబ్దం విన్నా..హడిలిపోతారని చెబుతున్నారు నిపుణులు.చాలామటుకు ఆయా బాధితులు ఏవియోఫోబియా లేదా ఏరోఫోబియాతో బాధపడుతుంటారట. మళ్లీ విమానం ఎక్కే సాహసం చేయరట. ఎంత కష్టమైన కార్లు, లేదా రైళ్ల ద్వారా రాకపోకలు సాగిస్తారట. కొందరైతే ప్రయాణాలే చేయరట. ఇలానే ఓ మహిళ 2010లో ఓ విమాన ప్రమాదం బారినపడి తండ్రిని కోల్పోయింది. దాంతో ఆమె దాదాపు 10 ఏళ్ల వరకు విమానంలో ప్రయాణమే చేయలేదట. మరి ఇంతలా భయబ్రాంతులకు గురిచేసే ఆ విమాన ప్రమాద భయాన్ని ఎలా అధిగమించి ఇదివరకటిలో హాయిగా జీవించాలంటే..కొన్ని మానసిక ఆరోగ్య చిట్కాలు పాటించాలంటున్నారు నిపుణులు. అవేంటో సవివరంగా చూద్దామా..!.విమాన ప్రమాదం బారినపడిన బాధితులు విమాన ప్రయాణం అనే పదం ప్రస్తావిస్తేనే భయాందోళనకు గురై వణికిపోతుంటారట. విమానం చూడటం, సంబంధిత విమాన టికెట్ అన్న భయపడతారట. సాధారణంగా ఏ వ్యక్తి అయిన తీవ్రంగా ప్రభావితమవ్వడం, భయానికి గురవ్వడం జరుగుతంది. అయితే కొందరిలో ఆ భయం తీవ్ర రూపం దాల్చి ఏవియోఫోబియా లేదా ఏరోఫోబియా బారిన పడతారట.అలాంటి వ్యక్తులకు మొదట ఆందోళనకు సంబంధించిన మందులు ఇచ్చి పరిస్థితిని అదుపులోకి తీసుకురావాలని చెబుతున్నారు నిపుణులు. ఆ తర్వాత విమాన ప్రయాణం భయంకరమైనది కాదు అని తెలసుకునేలా కుటుంబసభ్యుల మద్ధుతు తోపాటు కౌన్సిలర్ల సాయం తీసుకోవాలి. విమాన భయం అధిగమించేందుకు..భయం పోయేలా 4-7-8 పద్ధతిలో శ్వాస వ్యాయామలు చేయిస్తారు. నాడీ వ్యవస్థ స్థిమిత్తంగా ఉండేలా చేసి, భయానికి సంబంధించిన ఆలోచనలు దరిచేరనివ్వకుండా చూస్తారు. విమనాలు, వాటికి సంబంధించిన ఆడియోలను వారితో షేర్ చేసుకుంటూ..ఎంత ఆహ్లాదంగా ఉంటుందో వివరించడం వంటివి చేస్తారు. తాను అనుభవించిన చేదు అనుభవాలు తాత్కలికమే విషయం గ్రహించేలా చేస్తారు. తరుచుగా ఆగి ఉన్నవిమానం వద్దకు తీసుకువెళ్లడం, అందులో కూర్చొనేలా చేసి..ఆయా బాధితుల్లో దాగున్న భయాన్ని పూర్తిగా పోగొడతారు. ఆ తర్వాత వర్చువల్ రియాలిటీ ఎక్స్పోజర్ థెరపీ (VRET)తో..విమానం ఎగిరే వివిధ దశలను (టేకాఫ్, టర్బులెన్స్ అండ్ ల్యాండింగ్) అనుభూతి చెందేలా వీఆర్ హెడ్సెట్ని ఉపయోగిస్తారు. ఆసమయంలో బాధితులు వ్యక్తికరించే వారి భావోద్వేగాలను గమనిస్తూ..కౌన్సిలర్ బాధితులకి ధైర్యాన్ని అందించేలా సహాయం చేస్తుంటాడు. అలా వాళ్లు నెమ్మదిగా ఆ భయాన్ని అధిగమించి తిరిగి విమాన ప్రయాణం చేయడానికి చాలా సమయమే పడుతుందని చెబుతున్నారు నిపుణులు. ఆ భయం నుంచి బయటపడటానికి ఆయా వ్యక్తుల మానసికి పరిస్థితి ఆధారంగా..కనీసం ఆరు నుంచి పదేళ్లు పడుతుందని చెబుతున్నారు. దేన్నైనా లైట్గా తీసుకునేవారు..సానుకూల దృక్పథంతో ఉండేవారు సులభంగా ఈ విమాన ప్రమాద భయాన్ని జయించగలరని చెబతున్నారు నిపుణులు.(చదవండి: అంతటి ప్రమాదంలోనూ చెక్కుచెదరని భగవద్గీత..! వీడియో వైరల్) -
సింగిల్ స్పెషాలిటీ ఆస్పత్రుల జోరు
దేశీయంగా సింగిల్ స్పెషాలిటీ హెల్త్కేర్ చెయిన్లు గణనీయంగా వృద్ధి చెందుతున్నాయి. ఏటా 24 శాతం వృద్ధి రేటుతో 2028 నాటికి ఈ మార్కెట్ పరిమాణం 9 బిలియన్ డాలర్ల స్థాయికి చేరనుంది. ప్రస్తుతం ఇది 4 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉంది. 20 శాతం పైగా ఎబిటా మార్జిన్లు, 30 శాతం పైగా ఆర్వోసీఈలు (పెట్టుబడిపై రాబడులు), రెండేళ్ల వ్యవధిలోనే బ్రేక్–ఈవెన్ సాధించే అవకాశాలు మొదలైనవి ఈ పరిశ్రమ వృద్ధికి దోహదపడనున్నాయి. ఎవెండస్ క్యాపిటల్ నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. గత దశాబ్దకాలంలో ఈ సెగ్మెంట్ .. భారీ స్థాయిలో ప్రైవేట్ ఈక్విటీ పెట్టుబడులను ఆకర్షించింది. సుమారు 3.7 బిలియన్ డాలర్ల పైగా పెట్టుబడులు వచ్చాయి. హాస్పిటల్స్లోకి వచి్చన మొత్తం పెట్టుబడుల్లో ఇది సుమారు 35 శాతం. ఇలా వచి్చన పెట్టుబడుల్లో దాదాపు 70 శాతం భాగం ఐవీఎఫ్, ఐకేర్, తల్లి..బిడ్డ సంరక్షణ, డయాలిసిస్, ఆంకాలజీ వంటి స్పెషాలిటీ ఆస్పత్రుల ఏర్పాటుకు దోహదపడ్డాయి. గత మూడేళ్లుగా దంత సంరక్షణ, యూరాలజీ/నెఫ్రాలజీ, స్కిన్..హెయిర్ కేర్ వంటి స్పెషాలిటీ విభాగాల్లోని ప్రముఖ సంస్థల్లోకి కూడా చెప్పుకోతగ్గ స్థాయిలో పెట్టుబడులు వస్తున్నాయి. ఈ విభాగాల్లో డిమాండ్–సరఫరా మధ్య భారీగా వ్యత్యాసం నెలకొనడం ఇందుకు కారణం.కన్సాలిడేషన్కి అవకాశం.. న్యూఢిల్లీ: నివేదిక ప్రకారం తక్కువ స్థాయి పెట్టుబడి, నిర్దిష్టమైన సేవలకు పరిమితం కావడం తదితర అంశాల వల్ల ఈ విభాగం ఇటు ఇన్వెస్టర్లకు, అటు వ్యవస్థాపకులకు ఆకర్షణీయంగా ఉంటోంది. ఇక ఈ స్పెషాలిటీల్లో అగ్రగాములుగా ఉంటున్న సంస్థలు అధిక వృద్ధి సాధన కోసం ఇతర సంస్థలను విలీనం చేసుకోవడం, కొనుగోలు చేయడంపై దృష్టి పెడుతున్నాయి. ఇందుకోసం కాస్త పెద్ద మొత్తాన్నే వెచి్చంచేందుకు సిద్ధంగా ఉంటున్నాయి. పరిశ్రమలో కన్సాలిడేషన్ చోటు చేసుకునే అవకాశాలను ఇది సూచిస్తోంది.మార్కెట్ క్యాప్ పెరుగుదల.. అగ్ర శ్రేణి సంస్థలు నిధుల సమీకరణ కోసం పబ్లిక్ మార్కెట్ వైపు చూస్తున్నాయి. దీనితో మరిన్ని కంపెనీలు స్టాక్ ఎక్సే్చంజీల్లో లిస్టింగ్ బాట పట్టనున్నాయి. వీటి సంఖ్య పెరిగే కొద్దీ లిస్టెడ్ సింగిల్ స్పెషాలిటీ చెయిన్స్ మార్కెట్ క్యాప్ ప్రస్తుతమున్న 3.9 బిలియన్ డాలర్ల నుంచి 2030 ఆర్థిక సంవత్సరం నాటికి 18 బిలియన్ డాలర్లకు చేరే అవకాశం ఉంది. ఇన్వెస్టర్లకు నమ్మకం పెరుగుతుండటం, ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉండటం వంటి అంశాల వల్ల దేశీయంగా సింగిల్ స్పెషాలిటీ హెల్త్కేర్ విభాగంలో గణనీయంగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. పేషంట్ ఎక్స్పీరియన్స్ను మెరుగుపర్చగలిగే సామర్థ్యాలు, సమర్ధవంతంగా కార్యకలాపాలను విస్తరించగలిగే వీలు, ఇన్వెస్టర్లకు పెట్టుబడులపై మెరుగైన రాబడులను అందించే అవకాశం ఉండటం వల్ల ఈ విభాగం ఆకర్షణీయంగా ఉంటోందని ఎవెండస్ క్యాపిటల్ మేనేజింగ్ డైరెక్టర్ అన్షుల్ గుప్తా తెలిపారు. ప్రస్తుతం సింగిల్ స్పెషాలిటీ హాస్పిటల్స్ చెయిన్లు .. మెట్రోలు, ప్రథమ శ్రేణి నగరాలకే పరిమితమవుతున్నాయి. ద్వితీయ శ్రేణి మార్కెట్లలో అంతరాలు నెలకొన్న నేపథ్యంలో ఇకపై ఆ ప్రాంతాల్లో వృద్ధికి అవకాశం ఉందని గుప్తా చెప్పారు. క్రిత దశాబ్ద కాలంలో ఏ విధంగానైతే మలీ్ట–స్పెషాలిటీ విభాగం విస్తరించిందో అదే విధంగా పబ్లిక్ మార్కెట్లలో ఈ హాస్పిటల్స్ చెయిన్స్ లిస్టింగ్ సందడి కూడా పెరుగుతుందని పేర్కొన్నారు. ఇందుకోసం ఆయా సంస్థలు పటిష్టమైన వ్యూహాలను సమర్ధవంతంగా అమలు చేయాల్సి ఉంటుందన్నారు. సంపన్న దేశాల్లో ఈ తరహా మోడల్స్ విజయవంతమయ్యాయని గుప్తా చెప్పారు. -
Give blood..Give Hope : లేదంటే ప్రాణాలు పోతాయ్!
World Blood Donor Day ప్రతి ఏడాదికీ ఓ థీమ్ ఉన్నట్లే ఈ ఏడాది 2025 ప్రపంచ రక్తదాతల దినోత్సవ థీమ్‘‘రక్తమివ్వండి... నమ్మకం ఇవ్వండి (గివ్ బ్లడ్... గివ్ హోప్ (Give blood..Give Hope) అని. దీని అర్థం ఏమిటంటే... ‘రక్తం మనందరిలోనూ ఉండే మనందరినీ కలుపుతుంది. రక్తదానం చేయడం ద్వారా సాటి మనిషి ప్రాణాలకు మనం విలువ ఇస్తున్నామనీ, ఆపదలో ఉన్నవారి ప్రాణాల్ని కా పాడటానికి మేం సంసిద్ధమనే సందేశం ద్వారా తోటివారిలో నమ్మకం పెంచాలన్నదే ఈ ఏడాది థీమ్. మనందరినీ మానవులుగా కలిపేది మన రక్తమే. బ్లడ్ డొనేషన్ ద్వారా రక్తాన్ని ఇస్తే తోటివారికి నమ్మకాన్ని ఇచ్చినట్టే... వాళ్ల ప్రాణానికి మన ప్రాణాన్ని అడ్డు వేస్తామన్న భరోసాని నింపినట్టే అన్నది ఈ ఏడాది థీమ్ ఆంతర్యం. కాంపోనెంట్లుగా విడదీసిన రక్తంతో ప్రయోజనాలివే... ఒక వ్యక్తి నుంచి సేకరించిన మొత్తం రక్తాన్ని అంటే హోల్ బ్లడ్ను ఎర్ర రక్తకణాలు, తెల్లరక్తకణాలు, ప్లాస్మా, ప్లేట్లెట్లు వంటివి... ఎవరికైనా ప్రమాదం జరిగిన వ్యక్తికి ఎక్కిస్తే... అప్పటికి అతడికి అవసరం లేని కాంపోనెంట్స్ కూడా అతడి శరీరంలోకి వెళ్లి వృథా అయిపోతాయి. అయితే బాధితులకు నిర్దిష్టంగా రక్తంలోని ఏ అంశం కావాలో దాన్నే (అదే కాం΄పోనెంట్ను) ఎక్కించే ఆధునిక పరిజ్ఞానం, సదుపాయాలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. ఉదాహరణకు... అగ్నిప్రమాదానికి లోనైన ఒక వ్యక్తికి ప్లాస్మా ఎక్కువగా అవసరం. ఇక రక్తహీనత ఎక్కువగా ఉన్న వ్యక్తికి పూర్తి రక్తం కంటే పాకెట్ ఆర్బీసీ ఎక్కువగా అవసరం. అలాగే డెంగీలాంటి వ్యాధి సోకి ప్లేట్లెట్ల సంఖ్య బాగా తగ్గిన వారికి కేవలం ప్లేట్లెట్లు ఎక్కించాలి. ఇలా... రక్తాన్ని వేర్వేరు కాంపోనెంట్లుగా విడదీయగల సామర్థ్యం ఉన్న బ్లడ్బ్యాంకుల్లో రక్తదానం చేస్తే అప్పుడు ఒకరి నుంచి సేకరించిన హోల్బ్లడ్ను వివిధ అవసరాలు ఉన్న వారికి ఎక్కించి ఒకరికంటే ఎక్కువమందికి ఒకే రక్తం ఉపయోగపడేలా చేయవచ్చు. అందుకే రక్తదానం చేయదలచిన దాతలు నేరుగా ఏదైనా బ్లడ్బ్యాంకుకు వెళ్లడం కంటే.... రక్తాన్ని వివిధ కం΄ోనెంట్లుగా విడదీయగల సామర్థ్యం ఉన్న బ్లడ్బ్యాంకులో రక్తదానం చేయడం చాలా మంచిది.సేకరణ ఇలా... దాతల నుంచి రక్తం సేకరణ కార్యక్రమాన్ని ఇరు రాష్ట్రాలలోని దాదాపు అన్ని ముఖ్యమైన ఆసుపత్రులతో పాటు ప్రభుత్వ, వైద్యవిధాన పరిషత్, జిల్లా ఆసుపత్రులు, ఇండియన్ రెడ్క్రాస్ సంస్థ (ఐఆర్సీఎస్), లయన్, రోటరీ వంటి సంస్థలు, కొన్ని స్వచ్ఛంద సంస్థలకు చెందిన బ్లడ్బ్యాంకులు చేస్తుంటాయి. రక్తంలోని ఎర్రరక్తకణాలు, తెల్లరక్తకణాలు, ప్లాస్మా , ప్లేట్లెట్స్ వంటి అంశాలను వేర్వేరుగా విడదీసే ‘కాంపోనెంట్ సపరేషన్ యూనిట్లు’ కూడా చాలానే ఉన్నాయి. అయితే ఇలా రక్తంలోని కాంపోనెంట్లను వేటికవి విడదీసే వాటికంటే మొత్తం రక్తాన్ని సేకరించే బ్లడ్బ్యాంకులే ఎక్కువ. కాబట్టి మనం దానం చేసిన రక్తం పలువురికి ఉపయోగపడాలనుకునేవారు ‘కాం΄ోనెంట్ సపరేషన్ యూనిట్లు’ ఉన్న రక్తనిధుల్లో రక్తదానం చేయడం మరింత మేలు చేసే అంశం. పలువురికి ఉపయోగపడే విషయం. మానవ దేహంలో ప్రాణం నిలవడానికి అవసరమైన నిరంతర ప్రవాహమే రక్తం. మొదటి కణాలకు తాజా రక్తం అందించాక... జీవక్రియల తర్వాత మలిన వ్యర్థాలను తగిన వ్యవస్థల ద్వారా విసర్జింపజేస్తూ... మళ్లీ తాజా రక్తంలోపోషకాలూ, ఆక్సిజన్ నింపి... ఈ సైకిల్ నిరంతరం కొనసాగేలా చేస్తుండే ప్రధానమైన అంశం రక్తం. ఆ రక్తం కాసేపు అందకపోతే కీలకమైన మెదడు కణం నుంచి మామూలు దేహ కణం వరకు ఏదైనా చనిపోతుంది. ఇదీ చదవండి : AI 171 plane crash : కన్నీరుమున్నీరవుతున్న వైద్యుడి వీడియో వైరల్ఇంతటి ఈ కీలకమైన రక్తాన్ని కృత్రిమంగా తయారు చేయడం సాధ్యం కాదు. ప్రమాదాల్లో గాయపడ్డవారిని రక్షించేందుకు వారికి అవసరమైన రక్తాన్ని అందించి భర్తీ చేయడం అవసరం. అలా భర్తీ చేయడం కోసం దాతలు స్వచ్ఛందంగా రక్తాన్ని ఇవ్వడమూ అవసరం. ఇలా రక్తదానం ప్రాధాన్యాన్ని తెలియజెప్పడం కోసం ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ఆధ్వర్యంలో ప్రతి ఏడాదీ జూన్ 14ను ‘‘స్వచ్ఛంద రక్తదాన దినం’గా నిర్వహిస్తుంటారు. రక్తదానం పట్ల ప్రజల్లో ఎన్నెన్నో అపోహలు ఉన్నాయి. రక్తదానం చేసే వ్యక్తులు బలహీనమైపోరన్నది ఓ ప్రధానమైన అపోహ. ఇది ఏమాత్రం నిజం కాదు. వాస్తవానికి ఓ వ్యక్తిలో 5 నుంచి 6 లీటర్ల రక్తం ఉంటుంది. అందులో ఆరోగ్యకరమైన వ్యక్తి నుంచి కేవలం 350 మి.లీ. రక్తం మాత్రమే సేకరిస్తారు. ఇది కేవలం 21 రోజుల్లో పూర్తిగా భర్తీ అవుతుంది. అయినాగానీ ఓసారి ఓ వ్యక్తి నుంచి రక్తం సేకరిస్తే మరో మూడు నెలల పాటు అతడినుంచి రక్తం సేకరించరు. అంటే... ఆరోగ్యరకమైన వ్యక్తి ప్రతి 90 రోజులకు ఓమారు రక్తదానం చేయవచ్చు. 18–60 ఏళ్ల మధ్యనున్న ఆరోగ్యకరమైన వ్యక్తులు ఎవరైనా రక్తం ఇవ్వవచ్చు. దీంతో ఎలాంటి బలహీనతా రాదు. అందుకే ఈ ఏడాది థీమ్ ప్రకారం రక్తదానాన్నిప్రోత్సహిస్తూ... ‘‘రక్తమివ్వండీ... మానవతపై ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని నింపండి’’.చదవండి: Air India Plane Crash: కలల ఇంట్లోకి రాకముందే..అందని తీరాలకు!రక్త సంబంధం చివరగా... చాలా సందర్భాల్లో అవసరమైనంత రక్తం ఉండదు. అంటే రక్తానికి ఉండే డిమాండ్ కంటే సప్లై చాలా తక్కువగా ఉంటుంది. అందుకే ఏదైనా ఒక ఆఫీసు నుంచి గానీ లేదా ప్రత్యేకమైన సందర్భాన్ని పురస్కరించుకుని ఒక కార్యాలయంలోని ఔత్సాహికులుగానీ రక్తాన్ని దానం చేయదలచుకుంటే అందరూ ఒకేసారి రక్తదానం చేయడం కంటే... దశల వారీగా రోజుకు కొంతమంది చొప్పున రక్తదానం చేస్తుండటం మంచిది. దీనివల్ల రక్త సరఫరా మరీ ఎక్కువగా కాకుండానూ, మరీ తగ్గకుండా కాన్స్టాంట్గా అందుతూ ఉంటుంది. మన వద్ద ఆసుపత్రి పడకల సామర్థ్యం (బెడ్ స్ట్రెంగ్త్) ఆధారంగా కూడా రక్తం డిమాండ్ను లెక్కవేస్తారు. అంటే ఒక ఆసుపత్రిలోని ఒక్కో పడకకు కనీసం 7 యూనిట్ల రక్తం అవసరమని అంచనా. అయినా ఇప్పటికి దొరుకుతున్నది కేవలం 75 శాతమే. రోడ్డు ప్రమాదాలు, ఇతరత్రా కేసుల్లో 70% మరణాలు కేవలం రక్తం అందకపోవడం వల్లనే సంభవిస్తున్నాయి. అందుకే ప్రభుత్వ బ్లడ్బ్యాంకులు, మంచి పేరున్న స్వచ్ఛంద సంస్థలకు చెందిన రక్తనిధులకు, అందునా రక్తాన్ని వేర్వేరు కాంపోనెంట్లుగా విడదీయగల సామర్థ్యం ఉన్న రక్తనిధి కేంద్రాలకు (బ్లడ్బ్యాంకులకు) రక్తదానం చేయాలన్నది నిపుణులు ఇస్తున్న పిలుపు.డాక్టర్ ఎ. గౌతమ్ మెడికల్ అండ్ హిమటో ఆంకాలజిస్ట్ – యాసీన్ -
AMA తొలి భారతీయ ప్రెసిడెంట్గా శ్రీనివాస్ ముక్కామల రికార్డ్, ఎవరీ ‘బాబీ’
భారత సంతతికి చెందిన డాక్టర్ ముక్కామల శ్రీనివాస్ (Srinivas Mukkamala) అమెరికా వైద్యసంఘం ( AMA-American Medical Association) తొలి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 179 సంవత్సరాల చరిత్రలో తొలిసారి ఎన్నికైన భారతీయ అధ్యక్షుడిగా శ్రీనివాస్ “బాబీ” ముక్కామల రికార్డు సృష్టించారు. ఇటీవలి AMA వార్షిక సమావేశంలో ఆయన180వ అధ్యక్షుడిగా అధికారికంగా ఎన్నికయ్యారు. ఇది అమెరికా వైద్య చరిత్రలో ఒక మైలురాయి అని అందరూ ప్రశంసిస్తున్నారు.ముక్కామల మిచిగాన్లోని ఫ్లింట్లో అనుభవజ్ఞుడైన ENT స్పెషలిస్ట్. రెండు దశాబ్దాలకు పైగా క్లినికల్ అనుభవం ఉన్న నిపుణుడు. ఆంధ్రప్రదేశ్ నుండి వలస వచ్చిన తల్లిదండ్రులకు 1972లో జన్మించారు. మెక్లారెన్ ఫ్లింట్ , హర్లీ మెడికల్ సెంటర్ వంటి అనేక ప్రముఖ ఆసుపత్రులతో ఆయనకు సంబంధం ఉంది. ఆయన మిచిగాన్ విశ్వవిద్యాలయ మెడిసిన్లో పట్టభద్రుడు. ఓటోలారిన్జాలజీ రంగంలో ఆయనకు మంచి పేరు ఉంది.మరిన్ని ఎన్ఆర్ఐ వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి!స్వయంగా కేన్సర్ సర్వైవర్గత సంవత్సరం, ముక్కామలకు మెదడులోని టెంపోరల్ లోబ్లో 8-సెంటీమీటర్ల కణితి కనిపించింది. రోగ నిర్ధారణ జరిగిన మూడు వారాల తర్వాత హై-రిస్క్ సర్జరీ చేయించుకున్నారు. ఈ ఆపరేషన్లో 90 శాతం కణితిని విజయవంతంగా తొలగించారు.ఆరోగ్య సంరక్షణ పట్ల అతని నిబద్ధతను బలోపేతం చేసేలా తాజా నియామకం ప్రాధాన్యతను సంతరించుకుంది. తనకు ప్రపంచ స్థాయి చికిత్స అందినప్పటీ లక్షలాది మందికి ఇలాంటి చికిత్సలో ఆలస్యం జరుగుతోందనీ, ఆర్థిక పరిమితులు, అనిశ్చితులను ఎదుర్కొంటున్నారని ముక్కామలకు హైలైట్ చేశారు. అలాగే చాలా మంది రోగులు తమ బీమా కవరేజీ వస్తుందా, లేదా మందులకు ఎంత ఖర్చవుతుంది, ఔషధానికి ,నిపుణుడిని చూడటానికి ఎంతకాలం వేచి ఉండాలో అనే భయాలు వెంటాడుతున్నాయని అన్నారు. ఈ అనుభవం ఆరోగ్య సంరక్షణ వ్యవస్థపై తన దృష్టికోణాన్ని పూర్తిగా మార్చిందని శ్రీనివాస్ వెల్లడించారు. వైద్యుల హక్కులు, వనరుల కోసం పోరాడే వేదికగాఆధునిక టెక్నాలజీ వినియోగం ద్వారా ఆరోగ్య సేవల్లో విప్లవాత్మక మార్పులకు మార్గం వేయనుందనీ, సమగ్ర ఆరోగ్య సంరక్షణకు, సమానత్వానికి ప్రాధాన్యత ఇస్తూ AMA ప్రాధాన్యతను పెంచుతుందని హామీ ఇచ్చారు. అలాగే AMA ప్రజారోగ్యంలో విస్తృతమైన సంస్కరణల కోసం ప్రయత్నిస్తున్న సమయంలో ముక్కామల అధ్యక్ష పదవిని చేపట్టడం విశేషం. అల్ట్రా-ప్రాసెస్డ్ ఆహారాల ప్రమాదాలు, సరైన పోషకాహారం ప్రాముఖ్యత గురించిఅవగాహన పెంచడానికి అసోసియేషన్ ఇటీవల ఒక విధానాన్ని స్వీకరించింది.ఇదీ చదవండి: అమెరికాలో వాల్మార్ట్లో అమ్మానాన్నలతో : ఎన్ఆర్ఐ యువతి వీడియో వైరల్గతంలో ఏఎంఏ ఫౌండేషన్ నుంచి ఎక్సలెన్స్ ఇన్ మెడిసిన్ లీడర్షిప్ అవార్డు (Excellence in Medicine Leadership Award )ను ఆయన అందుకున్నారు. 2009లో ఏఎంఏ కౌన్సిల్ ఆన్ సైన్స్ అండ్ పబ్లిక్ హెల్త్కు సభ్యుడిగా ఎన్నికయ్యారు. 2017 నుంచి 2021 వరకు ఏఎంఏ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సభ్యుడిగా వ్యవహరించారు. డాక్టర్ బాబీ తల్లిదండ్రులు 1970ల్లో ఇండియా నుంచి అమెరికాకు వలస వెళ్లారు. -
సంజయ్ మరణానికి కారణం ఓ తేనెటీగ : వైద్యులు ఎంత శ్రమించినా.!
అహ్మదాబాద్లో జరిగిన విషాదకరమైన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం ఎన్నో కంపెనీల్లో అంతులేని శోకాన్ని నింపింది. ఒక్కో కుటుంబానికి ఒక్కో విషాద గాథ. ఎన్నో ఆశలతో విమానం ఎక్కిన వందలమంది క్షణాల్లోనే ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాదం ఇలా ఉండగానే బిజినెస్ ప్రపంచంలో మరో విషాదం చోటు చేసుకుంది. సోనా కామ్స్టార్కు చెందిన ఉంజయ్ కపూర్ అకస్మాత్తుగా కన్నుమూశారు. విమాన ప్రమాదంపై తీవ్ర విచారాన్ని వ్యక్తం చేసిన కొన్ని గంటల తరువాత గుండెపోటుతో ఆయన తుది శ్వాస విడిచారు. అయితే ఆయన మరణం ఎలా జరిగిందో తెలిస్తే షాకవ్వక మానరు. మరణం ఎటువైపు ఎలా ముంచుకు వస్తుందో తెలియదు అనడానికి ఈ సంజయ్ మరణం నిదర్శనంగా నిలుస్తోంది. పోలో క్రీడలో ప్రసిద్ధుడు, వ్యాపారవేత్త బాలీవుడ్ నటి కరిష్మా కపూర్ మాజీ భర్త సంజయ్ కపూర్, 53 ఏళ్ల వయసులో గుండెపోటుతో యునైటెడ్ కింగ్డమ్లో మరణించారు. పోలో ఆడుతున్నప్పుడు, ఒక తేనెటీగ సంజయ్ నోటిలోకి దూరిపోయింది. పొరపాటున దాన్ని మింగడంతో అది గుండెపోటుకు దారితీసిందని చెబుతున్నారు. తక్షణమే వైద్య సహాయం అందించినప్పటికీ ఫలితం లేకపోయిందని. నిపుణులు కూడా పరిస్థితిని పరిష్కరించలేకపోయారట.భారతదేశ ఆటోమోటివ్ రంగంలో ప్రముఖ వ్యాపారవేత్త, కపూర్ ఆటోమోటివ్ మార్గదర్శకుడు సురీందర్ కపూర్ కుమారుడు సోనా కామ్స్టార్ చైర్మన్ సంజయ్ కపూర్ ఆకస్మిక మరణం బిజినెస్ వర్గాలను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఎయిరిండియా ప్రమాదంపై తన విచారాన్ని వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసి, అంతలోనే ఆయన కన్నుమూయడంతో కుటుంబ సభ్యులు, సన్నిహితులు శోకసంద్రంలో మునిగిపోయారు.ప్రమాదంపై ఆయన ట్వీట్ అహ్మదాబాద్లో జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదంపై కపూర్ సోషల్ మీడియా ద్వారా విచారం వ్యక్తం చేశారు. "అహ్మదాబాద్లో జరిగిన విషాదకరమైన ఎయిర్ ఇండియా ప్రమాదం భయంకరమైన వార్త. బాధిత కుటుంబాలందరికీ నా సానుభతి. ఈ క్లిష్ట సమయంలో ధైర్యాన్ని, శక్తిని పొందాలని కోరుకుంటున్నాను"ఎవరీ సంజయ్ కపూర్గురుగ్రామ్లో ఉన్న ప్రముఖ ప్రపంచ ఆటో విడిభాగాల తయారీదారు సోనా కామ్స్టార్ అధినేత సంజయ్ కపూర్. ఆటోమోటివ్ కాంపోనెంట్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ACMA) అధ్యక్షుడిగా కూడా పనిచేశారు . అలాగే కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (CII) తయారీ మండలికి సహ-అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. తాను చదువుకున్న డెహ్రాడూన్లోని ది డూన్ స్కూల్ బోర్డులో సభ్యుడిగా ఉన్నారు. బకింగ్హామ్ విశ్వవిద్యాలయం నుండి HRలో BBA పూర్తి చేసిన తరువాత హార్వర్డ్ బిజినెస్ స్కూల్ ఓనర్-ప్రెసిడెంట్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్లో చేరారు. సంజయ్ 2003లో తన తండ్రి కంపెనీలో పగ్గాలు చేపపట్టి ప్రపంచ బ్రాండ్గా దాన్ని తీర్చిదిద్దారు. సోనా కామ్స్టార్ అనే కంపెనీకి సంజయ్ ఛైర్మన్గా ఉన్నారు. -
41 కాదు 24 ఏళ్లే : వయసు తగ్గించుకున్న లండన్ డాక్టర్ సీక్రెట్ ఇదే!
ఆధునిక కాలంలో బరువును తగ్గించుకోవడం కాదు.. వయసును తగ్గించుకోవడం ట్రెండ్గా మారింది. ఈ విషయంలో లండన్కు చెందిన 41 ఏళ్ల వైద్యుడు వార్తల్లో నిలుస్తున్నాడు. తన అసలు వయసుతో తెలిస్తే జీవసంబంధమైన వయస్సు 24 సంవత్సరాలు అని పేర్కొన్నాడు. ప్రస్తుతం ఈ డాక్టర్ స్టోరీ నెట్టింట సందడిగా మారింది. పదండి మరి ఆ వివరాలుతెలుసుకుందాం.మిలియనీర్ టెక్ వ్యవస్థాపకుడు బ్రయాన్ జాన్సన్, ప్రాజెక్ట్ బ్లూప్రింట్ పేరుతో కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి తన వయసును తగ్గించుకోవడంలో విజయవంతమయ్యాడు. తాజాగా లండన్కు చెందిన Hum2n longevity క్లినిక్ వ్యవస్థాపకుడు 41 ఏళ్ల డాక్టర్ ఎనాయత్ తన క్రోనోలాజికల్ ఏజ్ కంటే బయో ఏజ్ 24 సంవత్సరాలని ప్రకటించుకున్నాడు. 18 నెలల క్రితం తీసుకున్న పరీక్షల ఆధారంగా తన వయస్సు 17 సంవత్సరాలు తగ్గిందని తెలిపాడు. ఇందుకోసం డాక్టర్ ఎనాయత్ ఏడేళ్లుగా ఔరా రింగ్, హూప్ స్ట్రాప్ వంటి పరికరాల ద్వారా క్రమం తప్పకుండా రక్తం, మూత్రం, మైక్రోబయోమ్ పరీక్షలతో పాటు తన ఆరోగ్యాన్ని నిత్యం పరిశీలించుకున్నాడు. ఫలితాల ఆధారంగా అతను సప్లిమెంట్లతో సహా ఆయుష్సును పెంచే జీవన శైలిని పాటించాడు. ప్రధాంగా బీకాంప్లెక్స్, ఫోలేట్, మెగ్నీషియం, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాల వంటి సప్లిమెంట్లు తన బయో ఏజ్ను తగ్గించాయని చెప్పడం గమనార్హం. "ఈ సప్లిమెంట్లు నా జీవసంబంధమైన వయస్సు వెనక్కి మళ్లడానికి మద్దతు ఇచ్చాయని బిజినెస్ ఇన్సైడర్తో అన్నారు. ఆయన చెప్పిన వివరాల ప్రకారం..విటమిన్ బి కాంప్లెక్స్మిథైలేషన్ జన్యు లోపం కారణంగా హోమోసిస్టీన్ స్థాయిలు పెరగడం వల్ల రక్తం గడ్డకట్టడం, గుండెపోటు, స్ట్రోక్ వచ్చే ప్రమాదం పెరుగుతుందని తెలిపారు. ఇవి ఈ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి. సాధారణంగా, డైటీషియన్లు ఆహారం ద్వారా పోషకాలను పొందాలని, కొన్ని పోషకమైన ఆహారాలు లోపం లేదా తీసుకోలేక పోవడం వంటి సందర్భాలలో అవసరమైనప్పుడు మాత్రమే వాటిని తీసుకోవాలని సిఫార్సు చేస్తారు. చేపలు, పౌల్ట్రీ, చిక్కుళ్ళు ,ఆకుకూరలు వంటి బి విటమిన్లు అధికంగా ఉన్న ఆహారాలు హోమోసిస్టీన్ స్థాయిలను తగ్గించడంలో కూడా సహాయపడతాయి.అయితే బీవిటమిన్లు మెరుగైన మానసిక స్థితి, చిత్తవైకల్య నివారణకు అనుసంధానించబడి ఉండవచ్చు, కానీ ఈ ఫలితాలను నిర్ధారించడానికి మరిన్ని అధ్యయనాలు అవసరంఅంటున్నారు నిపుణులు."మిథైలేషన్-సంబంధిత జన్యు లోపం లేకుండా కూడా, ముఖ్యంగా అధిక ఒత్తిడి, పేలవమైన నిద్ర లేదా ఇంటెన్సివ్ శిక్షణ కాలంలో మిథైలేటెడ్ బి కాంప్లెక్స్ తీసుకోవడాన్ని నేను ఇప్పటికీ పరిశీలిస్తాను, ఎందుకంటే ఇవి బి విటమిన్ల డిమాండ్ను పెంచుతాయి" అని డాక్టర్ ఎనాయత్ అన్నారు.మెగ్నీషియండాక్టర్ ఎనాయత్ ఆహారం తీసుకోవడం ద్వారా సహజంగా తక్కువ మెగ్నీషియం స్థాయిలు ఉన్నందున మెగ్నీషియం బిస్గ్లైసినేట్ తీసుకుంటాడు. మెరుగైన శోషణ కోసం, దాని స్థాయిలను పెంచడానికి సహాయ పడేలా దీన్ని ఎంపిక చేసుకున్నాడు. ముఖ్యంగా ఎముకల ఆరోగ్యం, రక్తంలో చక్కెర నియంత్రణ, కండరాల పనితీరుకు మెగ్నీషియం చాలా అవసరం. చిక్కుళ్ళు, ఆకుకూరల్లో ఇది లభిస్తుంది.మెగ్నీషియం తీసుకోవడం కండరాల నొప్పులను తగ్గించడంలో సహాయపడుతుందని, నిద్రను మెరుగు పరుస్తుందని, తద్వారా తాను చాలా సులభంగా నిద్రపోతానని డాక్టర్ ఎకాయత్ చెప్పారు.ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు డాక్టర్ ఎనాయత్ ప్రతిరోజూ ఒమేగా-3 సప్లిమెంట్ తీసుకుంటాడు. చేపలు, వాల్నట్లు, చియా విత్తనాలలో లభించే ఒమేగా-3లు గుండె ఆరోగ్యానికి మద్దతు ఇస్తాయి. వాపును, రక్తపోటును తగ్గిస్తాయి. కొవ్వు చేపలను వారానికొకసారి తినడం హృదయ సంబంధ వ్యాధుల నుండి రక్షించడానికి నిరూపించబడినప్పటికీ, సప్లిమెంట్ రూపం ప్రయోజనాలు అంత స్పష్టంగా లేవు. అయితే, కొన్ని పరిశోధనలు ఒమేగా-3 సప్లిమెంట్లు యాంటీ-ఏజింగ్ ప్రభావాలను కలిగి ఉండవచ్చని సూచిస్తున్నాయి. ఇటీవలి అధ్యయనంలో ఒమేగా-3లు రోజూ తీసుకున్న పాల్గొనేవారు తక్కువ జీవసంబంధమైన వయస్సు తగ్గినట్టు గుర్తించారు. నోట్: ఆరోగ్యకరమైన జీవనశైలి అంటే పోషకమైన ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామం, తగినంత నిద్ర, ఒత్తిడి నిర్వహణ బయోలాజికల్ ఏజ్ను తగ్గించడంలో సహాయపడుతుంది. కానీ ఇలాంటి ప్రయోగాలు చేసేటపుడు నిపుణుల పర్యవేక్షణచాలా అవసరం అని గుర్తించాలి. -
అధునాతన కేన్సర్ కేర్ బ్లాక్ ప్రారంభం
టాటా మెమోరియల్ సెంటర్తో (టీఎంసీ) కలిసి ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో హోమీ బాబా క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ (HBCHRC)లో కొత్త భవంతి నిర్మాణ పనులను ప్రారంభించినట్లు ఐసీఐసీఐ బ్యాంక్ ప్రకటించింది. సుమారు 3.9 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో, అత్యుత్తమ మెడికల్ టెక్నాలజీతో ఏర్పాటయ్యే ఈ అధునాతన కేంద్రం నిర్మాణానికి రూ. 550 కోట్ల పైగా మొత్తానికి కమిట్మెంట్తో ఐసీఐసీఐ బ్యాంకు నిధులను సమకూరుస్తోంది. ఎనిమిది అంతస్తుల ఐసీఐసీఐ ఫౌండేషన్ బ్లాక్ ఫర్ చైల్డ్ అండ్ బ్లడ్ క్యాన్సర్ కొత్త బిల్డింగ్ అందుబాటులోకి వచ్చాక ఏటా 3,000 మంది పేషంట్లకు సేవలందించేందుకు ఉపయోగపడుతుంది. ప్రస్తుతం విశాఖపట్నంలోని HBCHRC వార్షిక సామర్థ్యం 6,200 పేషంట్లుగా ఉంది. తూర్పు భారతదేశంలోనే అత్యుత్తమ స్పెషలైజ్డ్ క్యాన్సర్ చికిత్సా కేంద్రాల్లో ఒకటిగా నిల్చేలా రూపొందిస్తున్న ఈ కొత్త భవనంలో 215 పైగా పడకలు ఉంటాయి. అన్ని అనుమతులకు లోబడి 2027 నాటికి ఇది పూర్తవుతుందని అంచనా. ఐసీఐసీఐ బ్యాంక్ సీఎస్ఆర్ విభాగమైన ఐసీఐసీఐ ఫౌండేషన్ ఫర్ ఇన్క్లూజివ్ గ్రోత్ దీన్ని అమలును పర్యవేక్షిస్తుంది. ఐసీఐసీఐ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సందీప్ బాత్రా, టాటా మెమోరియల్ సెంటర్ (ముంబై) డైరెక్టర్ సుదీప్ గుప్తా సమక్షంలో ఐసీఐసీఐ బ్యాంక్ చైర్మన్ ప్రదీప్ కుమార్ సిన్హా కొత్త భవనం శంకుస్థాపన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. (చదవండి: Different Dowry Case: కట్నంగా బైక్, నగదుతోపాటు కిడ్నీ కూడా ఇవ్వాల్సిందే..) -
నడుము చుట్టూ నలుపా? అబ్బాయిలూ ఈ చిట్కాలు మీకు కూడా!
బాగా బిగుతుగా ఉండే దుస్తులను ధరించడం వల్ల శారీరంగా అసౌకర్యంతో పాటు, ఆరోగ్య సమస్యలు కూడా ఉన్నాయి. టైట్ జీన్స్ వల్ల మహిళలు, పురుషుల్లో సమస్యలు తప్పవు. అలాగే టైట్గా ఉండే బ్రాలు, ప్యాంటీలువల్ల ఆయా ప్రదేశాల్లో ర్యాషెస్ రావడంతోపాటు నల్లని మచ్చలు ఏర్పడతాయి. చర్మ వ్యాధులకు దారి తీస్తాయి. మరి ఇలా కాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసా? ఎలాంటి చిట్కాలు పాటించాలి?పురుషుల్లో నడుము చుట్టూ బెల్టు పెట్టుకునే చోట లేదా మహిళల్లోనైతే వారు లోపలి లంగా లేదా సెల్వార్ నాడా కట్టుకునే చోట నల్లగా మచ్చపడే అవకాశం ఉంది. అందుకే మరీ గట్టిగా లాగిగానీ లేదా మరింతగా బిగించిగానీ కట్టకపోవడం మంచిది. ఇక్కడ మరీ బిగుతుగా కాకుండా మరీ వదులుగా కాకుండా తగినంత సౌకర్యంగా ఉండేలా బెల్ట్/నాడా కట్టుకోవడం మంచిది. నలుపు పోవడానికి చిన్న చిట్కాలు... ∙మనం చేసే పని (వృత్తి)లో భాగంగా మరీ ఎక్కువ సేపు అదేపనిగా నిలబడి ఉండటమూ / కూర్చొని ఉండటం సరికాదు. ప్రతి గంటకు ఒకసారి కనీసం 5-10 నిమిషాల΄ పాటైనా అటూ ఇటూ నడుస్తూ ఉండాలి. దీనివల్ల అన్ని భాగాల్లో లాగే నడుము ప్రాంతంలో కూడా రక్తప్రసరణ చక్కగా జరుగుతుంది. దీనివల్ల నలుపు తగ్గడానికి ఆస్కారం ఉంటుంది. క్యాలరీలు తక్కువగా ఉండి, పీచు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం మంచిది. ఈ ఫైబర్ వల్ల శరీరానికి మంచి బిగువు వస్తుంది. ఇలా బిగువుగా ఉండే వారిలో చర్మం మంచి మిలమిలలతో ఆరోగ్యంగా ఉంటుంది. ఇటు మహిళలైనా, అటు పురుషులైనా పడుకునే సమయంలో కాళ్ల కింద తలగడ పెట్టుకుని, అవి పడక నుంచి 10 అంగుళాల పైన ఉండేలా జాగ్రత్త తీసుకుంటే నడుము చుట్టూ ఉన్న నల్ల మరకల నివారణకు తోడ్పడటమే కాకుండా, గుండెకూ తగినంత రక్తప్రసరణ సులువుగా అవుతుంటుంది. బిగుతైన దుస్తులను ధరించడం వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలను, చర్మవ్యాధులను తగ్గించడం చాలా సులభం. కేవలం వాటికి బదులు మంచి గాలి ఆడేందుకు వీలుగా ఉండే దుస్తులు ధరించడం మంచిది. అయితే ఇలాంటి టైట్ ఫిటింగ్ ఫ్యాషన్ను వదులుకోడానికి ఇష్టపడని యువత ఒక జాగ్రత్తను పాటించడం మంచిది. అదేమిటంటే... మరీ ఎక్కువ బిగుతైన దుస్తులకు బదులుగా ఒంటికి నప్పేలా ఉండటంతో పాటు, హానికరం కానంత మేరకు మాత్రమే.నివారణ...బిగుతైన దుస్తులను ధరించడం మంచిది. ఇక అండర్గార్మెంట్స్, సాక్స్ విషయానికి వస్తే... చర్మానికి అంటుకుపోయేంత బిగువుగా కాకుండా, కాస్తంత గాలి ఆడేందుకు వీలుగా ఉండేవి వాడటం మేలు. ఇక్కడ నైలాన్ వంటి వాటికి బదులుగా కాటన్వి ఎంపిక చేసుకోవడం చాలావరకు మేలు చేసే అంశం. -
రోగ నిర్ధారణతో బ్రెయిన్ ట్యూమర్ ఆటకట్టు
హైదరాబాద్: ప్రాణాంతకమైన బ్రెయిన్ ట్యూమర్ (మెదడులో కణతులు) వ్యాధి ఆట కట్టించాలంటే సరైన నిర్ధారణ, చికిత్సలే కీలకమని హైదరాబాదులోని ప్రముఖ మల్టీస్పెషాలిటీ హాస్పిటల్ ఆలీవ్ హాస్పిటల్ న్యూరాలజీ నిపుణులు పేర్కొన్నారు. ప్రపంచ బ్రెయిన్ ట్యూమర్ దినోత్సవం సందర్భంగా ఈ వ్యాధిపై పౌరులకు అవగాహన కల్పించేలా కార్యక్రమాన్నినిర్వహించారు. ఆరోగ్య సంరక్షణలో విశ్వసనీయత, మెరుగైన ఆరోగ్య ఫలితాలను సాధిస్తూ, రోగుల ప్రాణాలను కాపాడటానికి అంకితభావంతో వైద్య సేవలు అందించేందుకు ఆలివ్ హాస్పిటల్ కృషి చేస్తొంది. జీవితాన్నితల కిందులు చేసే బ్రెయిన్ ట్యూమర్ల వ్యాధిపైప్రజలలో అవగాహన పెంచడం, ముందస్తుజాగ్రత్తలతో పలు సూచనలు చేస్తున్నారు. క్యాన్సర్, క్యాన్సర్ కాని మెదడు కణితులు ఏటా వేలాది మంది భారతీయులను ప్రభావితం చేస్తున్నాయి. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ICMR) డేటా ప్రకారం, దేశంలో ప్రతి ఏడాది 40,000 కంటే ఎక్కువ మందిలో కొత్తగా మెదడు కణితులు గుర్తించబడుతున్నాయి. తరచూ తలనొప్పి, దృష్టిలోపాలు, జ్ఞాపకశక్తికోల్పోవడం వంటి నిర్దిష్ట లక్షణాల ఫలితంగా అనేక ఇతర కణితులు గుర్తించబడకుండా పోతున్నాయని నిపుణులు వివరించారు. ఈ సందర్భంగా “ఆలివ్ హాస్పిటల్ గత ఏడాదిలోనే బ్రెయిన్ ట్యూమర్ కన్సల్టేషన్లలో 20% పెరుగుదలను నమోదు చేసిందనీ గుర్తుచేశారు. ఆసుపత్రిలోని న్యూరాలజీ, న్యూరోసర్జరీ యూనిట్లు అధునాతన MRI డయాగ్నస్టిక్స్, స్టీరియోటాక్టిక్ సర్జికల్ పరికరాలు, న్యూరాలజీ , పాలియేటివ్ కేర్, పునరావాస మద్దతుతో కూడిన మల్టీడిసిప్లినరీ కేర్ మోడల్ తో పూర్తిగా అధునాతన పరిజ్ఞానంతో వైద్య సేవలు అందించేందుకు సిద్ధంగా ఉంది.‘మెదడు కణితులు మోసపూరితమైనవి; లక్షణాలు ఎప్పుడూ బయటపడవు. అప్పుడప్పుడు ఇది నిరంతర తలనొప్పిలేదా ప్రవర్తనలో వివరించలేని మార్పువంటి సాధారణమైన దానితో ప్రారంభమవుతుంది. తమ శరీరాలపైశ్రద్ధ వహించాలని, ముందుగానే తమను తాము తనిఖీ చేసుకునేలా ఆలీవ్ హాస్పిటల్ ప్రోత్సహిస్తోంది. రోగాన్నిగుర్తించడం వల్ల సంరక్షణ నాణ్యత పెరుగుతుందనీ, రోగి యొక్క జీవన నాణ్యత పెరుగుతోంది. వ్యాధిని నయం చేయడంతో పాటుగా, రోగులు, వారి కుటుంబాలకు చికిత్స, ఆరోగ్య సంరక్షణ ప్రయాణంలో ప్రతి అడుగులో తోడుగా ఉంటుంది అని ఆలివ్ హాస్పిటల్ లోని సీనియర్ న్యూరాలజిస్ట్ డాక్టర్ మొహమ్మద్ మహమూద్ అలీ అన్నారు. క్లినికల్ సూక్ష్మ నైపుణ్యాలతోపాటుగా, రోగి, వారి కుటుంబాలకు భావోద్వేగ, మానసిక భారాన్నికూడా పెంచుతుందని అర్థం చేసుకోవాలి. ఆలివ్ హాస్పిటల్ సకాలంలో నాడీ మూల్యాంకన చేసి వ్యాధిని కచ్చితత్వంతో గుర్తిస్తుంది. మెదడు కణితుల ప్రారంభ దశను కొన్నిసూచనల ద్వారా గుర్తించే వీలు ఉందని, దీంతో అధిక ప్రమాదకరమైన పరిస్థితుల నుంచి బయటపడే వీలుంటుందని వైద్యులు పేర్కొన్నారు. జూన్ 8న నిర్వహించే ప్రపంచ బ్రెయిన్ ట్యూమర్ డే సంద్భరంగా వ్యాధిపైఉన్న అపోహలను తొలగించడానికి, న్యూరో హెల్త్ పై అవగాహన కల్పించడానికి కృషి చేస్తున్నట్లుగా అలీ హాస్పిటల్ న్యూరో విభాగం వైద్యులు వివరించారు.ఆలివ్ హాస్పిటల్ గురించి: ఆరోగ్య సంరక్షణకు భరోసానిస్తూతెలంగాణ రాష్ట్ర స్థాయిలో ఆలివ్ హాస్పిటల్స్కృషి చేస్తుంది. ఆధునాతన వైద్య సదుపాయాలు, నాణ్యత, నిబద్ధతతో కూడిన సమగ్ర ఆరోగ్య సంరక్షణయే లక్ష్యంగా 2010 నుంచి వైద్య సేవలు అందిస్తోంది. మానవాళికి ప్రపంచ స్థాయి ఆరోగ్య సంరక్షణను అందుబాటులోకి తీసుకురావడం కోసం సాధారణ వైద్య సంస్థగా మొదలుపెట్టి.. ఆనాటి కాలంలోనే రోగి సంరక్షణలో అత్యుత్తమ ప్రతిభతో ఆలివ్ హాస్పిటల్ తెలంగాణలోని ప్రముఖ మల్టీస్పెషాలిటీ ఆసుపత్రులలో ఒకటిగా నిలిచింది. 210 పడకలతో, అత్యాధునిక మల్టీస్పెషాలిటీ హెల్త్కేర్ సౌకర్యం వివిధ స్పెషాలిటీలలో విస్తృత శ్రేణి వైద్య సేవలను అందిస్తుంది. కార్డియాక్ కేర్, ఎమర్జెన్సీసర్వీసెస్, న్యూరో కేర్, కిడ్నీకేర్, యూరాలజీ, ఆర్థోపెడిక్స్, జాయింట్ రీప్లేస్ మెంట్స్, గైనకాలజికల్ సర్వీసెస్, అడ్వాన్స్డ్ డయాగ్నస్టిక్స్, ఇంటర్వెన్షనల్ సర్వీసెస్ వంటి రంగాలలో అనేక అధునాతన విధానాలలో మార్గదర్శకత్వం వహించింది. అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్నిఉపయోగించి, సమర్థులైన వైద్యులతో వైద్యం అందించడానికి కట్టుబడి ఉంది. దేశంలో ఆరోగ్య సంరక్షణ నాణ్యత ప్రమాణాలను కలిగి నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ఫర్ హాస్పిటల్స్– హెల్త్కేర్ నుండి జాతీయ స్థాయిలో గుర్తింపును కలిగి ఉంది. -
టైట్... నాట్ రైట్ : వీర్యకణాల సమస్యనుంచీ సవాలక్ష!
స్కిన్ టైట్ దుస్తులు చాలా అందంగా అమరిపోతాయి. అవి ధరించినవారు చూడటానికీ చాలా చలాకీగా, డైనమిక్ లుక్తో కనిపిస్తుంటారు. ఇవన్నీ సరే. లుక్స్పరంగానూ ఓకే. కానీ అంతటి స్కిన్ టైట్ ఫ్యాషన్ వల్ల ఒనగూరే నష్టాల మాటేమిటి? చాలా తక్కువ మందికి మాత్రమే ఇలాంటి టైట్ ఫిటింగ్స్తో ఉండే నష్టాల గురించి తెలుసు. ఎప్పుడూ బాగా టైట్ జీన్స్తో ఉండే పురుషుల్లో చర్మ సమస్యలు రావడమే కాదు... వాళ్లలో వీర్యకణాల సంఖ్య, కదలికలూ తగ్గుతాయంటే ఆశ్చర్యపడాల్సిందేమీ ఉండదు. అందుకే ‘‘టైట్... నాట్ రైట్... ఇట్స్ ఎ బిగ్ ఫైట్ విత్ హెల్త్ అండ్ టు బి ఫిట్’’ అంటూ హెచ్చరిస్తున్నారు డాక్టర్లు. ఇలాంటి టైట్ ఫ్యాషన్ దుస్తులు లేదా ఇతరత్రా యాక్సెసరీస్తో వచ్చే సమస్యలపై అవగాహన పెంపొందించుకోడానికి ఉపయోగపడేదే ఈ కథనం. అవి టైట్ ఫ్యాషన్ దుస్తులా, లేదా మరోటా అనే దానికంటే ముందుగా అవి సౌకర్యంగా ఉన్నాయా అన్నది ముఖ్యం. అంతకంటే చూసుకోవాల్సిన ముఖ్యమైన అంశం మరోటి ఉంది. అదే ఆ దుస్తులు లేదా ఆ ఫ్యాషన్ ఆరోగ్యకరమా కాదా అన్నది. ఫ్యాషన్ దుస్తులతో మంచి డైనమిక్ లుక్ ఉన్నప్పటికీ దాంతో వచ్చే కొన్ని రకాల అనర్థాలేమిటో చూద్దాం. ఒంటికి పట్టినట్లుగా ఉండే టీ–షర్ట్తో చాలామంచి డైనమిక్ లుక్ వస్తుంది. చూడ్డానికి అవి ధరించిన వ్యక్తులు కూడా ఒబేసిటీతో అనిపించకుండా సన్నగా, బక్కపలచగా కనిపిస్తుండటంతో వారి కదలికల్లో చురుకుదనం కనిపిస్తుంటుంది. అయితే బిగుతైన టీ–షర్ట్స్ చాలా సమస్యలను తెచ్చిపెడతాయి. అవి... ఫంగల్ ఇన్ఫెక్షన్లతో బాహుమూలాల్లో నలుపు : ఒంటికి పట్టేసినట్లుగా ఉండటం వల్ల గాలి ఆడక టీనియా కార్పోరిస్, టీనియా వెర్సికోలర్ వంటి ఫంగల్ ఇన్ఫెక్షన్లు వస్తాయి. ఇలాంటివి చాలా సందర్భాల్లో ప్రధానంగా బాహుమూలాల్లోనే ఎక్కువగా కనిపిస్తుంటాయి. దేహంలోని మిగతాచోట్ల ఉండే చర్మంతో పోల్చినప్పుడు బాహుమూలాల్లోని చర్మం నల్లగా కనిపించడానికి బిగుతైన దుస్తుల వల్ల అక్కడ పిగ్మెంటేషన్ ఏర్పడటమే ముఖ్య కారణం. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ : బిగుతైన దుస్తుల వల్ల ఛాతీ, వీపును పట్టేసినట్లుగా ఉండటంతో కొంతమందిలో ఇది మొటిమల (పింపుల్స్)కు దారితీయవచ్చు. మరికొందరిలో సెగగడ్డలు (హీట్ బాయిల్స్) కూడా రావచ్చు. ఉరఃపంజరం చుట్టూ ఉండే కండరాల్లో నొప్పి కూడా రావచ్చు. పొట్ట చుట్టూ బాగా బిగుతుగా ఉండటం వల్ల కడుపులో స్రవించే గ్యాస్ట్రిక్ ఆమ్లాలు పైకి తన్నడం వల్ల ఛాతీలో మంట, కడుపులోంచి పైకి తన్నినట్లుగా ఉండే ఫీలింగ్ (రిఫ్లక్స్ ఈజోఫేజైటిస్) వంటివి సాధారణం. బిగుతైన ప్యాంట్లు (టైట్ ప్యాంట్స్ / టమ్మీ టక్కర్ క్లాత్స్)...ఇటీవల చాలామంది ఇవ్వాళ్టి ట్రెండ్లో భాగంగా బిగుతైన ΄్యాంట్లు (టైట్ డెనిమ్స్) ధరిస్తుండటం మామూలే. ఇందులో హై వెయిస్ట్ జీన్స్, మిడ్ వెయిస్ట్ డెనిమ్, లో–వెయిస్ట్ జీన్స్, టమ్మీ టక్కర్స్ అని ఇలా చాలా రకాలే ఉంటున్నాయి. అయితే ఇవి చాలా ఆరోగ్య సమస్యలకూ కారణమయ్యే అవకాశాలున్నాయి. అవి... చర్మానికి : టైట్ ఫిట్స్ బిగుతుగా ఉండటం వల్ల గాలి సరిగా ఆడక, చెమట విపరీతంగా పట్టడం వల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్స్, చెమటకాయల వంటి ప్రీక్లీ హీట్ సమస్యలు, పిగ్మెంటేషన్ (చర్మం రంగుమారడం), నడుము చుట్టూరా నల్లటి మచ్చలా ఏర్పడటం, సెగగడ్డలు రావడం జరగవచ్చు. అలాగే ప్యాంట్ విడవగానే ఒత్తిడి వల్ల మచ్చలు ఏర్పడటం ఒరుసుకు΄ోయినట్లుగా కావడం, ఎర్రగా దద్దుర్లు రావడం (ప్రెషర్ అర్టికేరియా) జరగవచ్చు . ప్యాంటు క్లాత్ చర్మానికి ఆని ఉన్నచోట దురదలు రావడం, ఎర్రగా మారడం జరగవచ్చు. కండరాలకు : తీవ్రమైన వెన్నునొప్పి రావచ్చు. ఇది నడుము చుట్టూ ఉన్న టైట్నెస్ వల్ల జరిగే పరిణామం. టైట్గా ఉండే ట్రౌజర్స్ వల్ల టీనియా క్రూరిస్ వంటి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రావచ్చు. ఇవి ప్రధానంగా గజ్జల్లో, గ్రోయిన్స్లో, పిరుదుల మీద వచ్చే అవకాశాలు ఎక్కువ. నరాలకు : కొన్ని సందర్భాల్లో ట్రౌజర్ బిగుతు వల్ల నరాలు ఒత్తుకుపోతే తుంటి ఎముక కీళ్లలో ‘మెరాల్జియా పారెస్థటికా’ అనే సమస్య రావచ్చు. ఇందులో తొడకు తిమ్మిరి రావడం, స్పర్శ కోల్పోవడం / స్పర్శాజ్ఞానం తగ్గడం వంటివి జరగవచ్చు. వీర్యకణాల సంఖ్య తగ్గడం : బిగుతైన ప్యాంట్లు పురుషుల్లో వీర్యకణాలసంఖ్యను గణనీయంగా తగ్గిస్తాయి. వాటి సంఖ్య మిల్లీలీటర్కు 60 లక్షల నుంచి 20 లక్షలకు పడిపోతే పురుషుల్లో వ్యంధ్యత్వ (ఇన్ఫెర్టిలిటీ) సమస్య కూడా వచ్చే అవకాశాలు లేకపోలేదు. కడుపునొప్పి : బిగుతు దుస్తులు యాసిడ్ రిఫ్లక్స్ కండిషన్ను ప్రేరేపించి కడుపునొప్పి, గుండెలో మంట వంటి కండిషన్లకు దారితీసే అవకాశాలెక్కువ. బిగుతు దుస్తులతో మరిన్ని అనర్థాలుమన దేశపు మహిళల్లో భారతీయ సంస్కృతిలో భాగంగా చీర కట్టుకునే వారిలో లోపలి లంగా (పెట్టికోట్) బాగా బిగుతుగా ఉన్నా లేదా సెల్వార్ తాలూకు బొందు బాగా టైట్గా కట్టినా... అక్కడి చర్మానికి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కనిపించే అవకాశాలు ఎక్కువ. అలాంటప్పుడు చర్మం అంతా ఈ ఇన్ఫెక్షన్ వల్ల దోక్కుపోయినట్లుగా అనిపించవచ్చు. ఇక కాలి కింది భాగంలో బిగుతైన సాక్స్ వంటివి వాడేవారికి ఎక్జిమా వచ్చినట్లుగా కనిపిస్తుంది. బిగుతైన షూస్ / సాక్స్తో... ∙అథ్లెట్స్ ఫుట్ : బాగా బిగుతుగా ఉండే బూట్లు (షూస్) లేదా మేజోళ్ల (సాక్స్) ను అదేపనిగా ఎక్కువసేపు ధరించి ఉండటం వల్ల కాలివేళ్ల మధ్య ఫంగల్ ఇన్ఫెక్షన్లు రావచ్చు. వీటినే అథ్లెట్స్ ఫుట్ అంటారు. హ్యామర్ టో : బాగా బిగుతైన షూస్ అదేపనిగా «దరిచడం వల్ల ‘హ్యామర్ టో’ అనే కండిషన్ వస్తుంది. షూ ముందు భాగం బాగా సన్నగా ఉండటం వల్ల కాలివేళ్లన్నీ దగ్గరకు చేసినట్లుగా కుంచించుకుపోయి ఈ పరిస్థితికి దారితీస్తుంది. బ్యునియన్ : ఈ కండిషన్లో కాలి బొటనవేలు ఒక పక్కకు నొక్కుకుపోయి దాని చివర ఎముక బయటకు తన్నినట్లుగా వెలుపలికి వస్తుంది. ఇలా జరగడాన్ని బ్యునియన్ అంటారు. డయాబెటిక్ ఫుట్ : చక్కెర వ్యాధి ఉన్నవారిలో బిగుతైన పాదరక్షల వల్ల ‘డయాబెటిక్ ఫుట్’ అనే కండిషన్ వస్తుంది. నిర్లక్ష్యం చేసిన కొందరిలో ఇది గ్యాంగ్రీన్ (చర్మం కుళ్లిపోవడం) అనే కండిషన్కు దారితీసే ముప్పు కూడా లేకపోలేదు. డయాబెటిక్ ఫుట్ వచ్చినవారు తమకు తగినపాదరక్షలను ఎంపిక చేసుకుని, చక్కెరను ఎప్పుడూ నియంత్రణలో ఉంచుకోవాలి. వీళ్లు... కాళ్లు కడుక్కున్న తర్వాత అవి పూర్తిగా పొడిగా మారాక గానీ.. పాదరక్షలు ధరించకూడదు. పైగా ఇలాంటి వారు తరచూ తమ పాదాలను చెక్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే చక్కెరవ్యాధి ఉన్నవారిలో స్పర్శజ్ఞానం తక్కువగా ఉండటం వల్ల జరగాల్సిన అనర్థం జరిగిపోయాక గాని వారికి జరిగిన నష్టమేమిటో తెలియకపోవచ్చు. అందుకే ఫ్యాషన్ పరంగా బిగుతైన దుస్తులు బాగానే ఉన్నప్పటికీ వాటి ఎంపికలో కాస్తంత విజ్ఞతతోనూ, మంచి వివేచనతోనూ తగినంత విచక్షణనూ పాటించడం మేలు.చికిత్సలు... తమకు వచ్చిన ఫంగల్ ఇన్ఫెక్షన్ను బట్టి తగిన యాంటీఫంగల్ క్రీమ్లతో చికిత్స అవసరం కావచ్చు. అదే హ్యామర్టో, బునియన్ లాంటి కండిషన్లకు ఒక్కోసారి శస్త్రచికిత్స కూడా చేయాల్సి రావచ్చు. బిగుతైన మహిళల లో–తొడుగులు (బ్రాలు)... అనర్థాలు... మహిళలు వాడే లో తొడుగుల (బ్రాల) బిగుతు... తమకు సౌకర్యంగా ఉన్న మేరకే ఉండాలి. అంతకంటే మించితే అవి కొన్ని సమస్యలు దారితీయవచ్చు. అవి... భుజాల నొప్పి, మెడ నొప్పి, వెన్ను నొప్పిశ్వాసతీసుకోవడంలో సమస్య (ఇది ఛాతీని పట్టేసినట్లుగా ఉండటం వల్ల కలుగుతుంది)రొమ్ము సమస్యలు. బాగా బిగుతైన బ్రాల వల్ల మెడ ఎముక (కాలర్బోన్) నొప్పి రావచ్చు అనర్థాలు... బాగా బిగుతుగా ఉండే లోదుస్తుల (అండర్గార్మెంట్స్)తో...చాలా బిగుతుగా ఉండే డ్రాయర్లు, అండర్గార్మెంట్లతో ఫంగల్ ఇన్ఫెక్షన్లు, మూత్రసంబంధమైన ఇన్ఫెక్షన్లు, వ్యంధ్యత్వం వంటి సమస్యలువస్తాయి. ఇదీ చదవండి: Akhil -Zainab: పెళ్లి తరువాత తొలిసారి జంటగా : డాజ్లింగ్ లుక్లో అఖిల్- జైనబ్టైలు, కాలర్లు... ‘టై’ అనేది గొంతు చుట్టూ బిగుతుగా చుట్టుకు΄ోయి ఉంటుందన్న విషయం తెలిసిందే. అయితే దాన్ని కట్టుకోడానికి వీలుగా కాలర్ దగ్గర బటన్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇలా చాలాసేపు టై కట్టుకునే ఉండటం వల్ల కొందరిలో బటన్తో మెడ చుట్టూ ఉండే చర్మం నొక్కుకుపోవచ్చు. అక్కడి కండరాలూ, రక్తనాళాలూ చాలా కొద్దిమేర అయినప్పటికీ ఎంతోకొంత ప్రతికూల ప్రభావాలకు లోనుకావచ్చు. ఇలాంటి బిగుతైన ‘టై’, ‘నాట్’ ల కారణంగా కనిపించే ప్రభావాలివి....ఇవీ అనర్థాలు... ∙పిగ్మెంటేషన్ సమస్యలు: బిగుతైన టైలు, కాలర్ల వల్ల మెడ వద్ద పిగ్మెంటేషన్ సమస్య రావచ్చు. అంటే అక్కడి చర్మం రంగు మారవచ్చు. కొన్నిసార్లు చర్మం మందంగానూ మారవచ్చు. ఇలా చర్మం రంగు మారడం, చర్మం మందంగా మారిపోవడాన్ని ఎమిలాయిడోసిస్, అకాంథోసిస్ నైగ్రికేన్ అంటారు. ఫంగల్ ఇన్ఫెక్షన్లు: బిగుతైన కాలర్ల వల్ల గాలి ఆడకపోవడం వల్ల టీనియా కార్పోరిస్, టీనియా వెర్సికోలర్ వంటి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ముప్పు కూడా ఉంటుంది. చదవండి: దాదాపు 200 ఏళ్ల నాటి కండోమ్ : ఎగబడుతున్న జనంస్కిన్ ట్యాగ్స్ (పులిపిరులు) : బిగుతుగా ఉన్న చోట దుస్తులు చర్మంతో నిత్యం ఒరుసుకుపోవడం వల్ల కొన్ని సందర్భాల్లో పులిపిరులు వాటిలో ఇరుక్కుని ఇబ్బంది పడే అవకాశముంటుంది. -డా. స్వప్నప్రియ,సీనియర్ డర్మటాలజిస్ట్ -
NIRAMAI Health Analytix క్యాన్సర్ అవగాహన పెరిగేలా!
బ్రెస్ట్–క్యాన్సర్కు సంబంధించిన జాగ్రత్తలు, నవీన సాంకేతికత గురించి వివిధ సదస్సుల ద్వారా మహిళలకు అవగాహన కలిగిస్తోంది గీతా మంజునాథ్ (Geetha Manjunath). తన వ్యక్తిగత ప్రయాణం నుంచి మొదలు హెల్త్కేర్ సిస్టమ్లో ఎదురయ్యే సవాళ్లు, ప్రాణాలను కాపాడటంలో సాంకేతిక పరిజ్ఞానం ప్రాధాన్యత... ఇలా ఎన్నో విషయాలను మంజునాథ్ ప్రేక్షకులతో పంచుకుంటుంది.రొమ్ము క్యాన్సర్ను ముందుగానే గుర్తించేందుకు వీలు కల్పించే హెల్త్ టెక్ కంపెనీ ‘నిరామై హెల్త్ ఎనలటిక్స్’కు (NIRAMAI Health Analytix) గీతా మంజునాథ్ ఫౌండర్, సీయీవో. ‘ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్’ నుంచి కంప్యూటర్ సైన్స్లో పీహెచ్డీ, కెల్లాగ్ స్కూల్ ఆఫ్ మెనేజ్మెంట్ నుంచి మేనేజ్మెంట్ డిగ్రీ చేసింది. మెషిన్ లెర్నింగ్, క్లౌడ్ కంప్యూటింగ్లలో గీతకు దశాబ్దాల అనుభవం ఉంది.ఇదీ చదవండి: Akhil -Zainab: పెళ్లి తరువాత తొలిసారి జంటగా : డాజ్లింగ్ లుక్లో అఖిల్- జైనబ్భారతదేశంలో రొమ్ము క్యాన్సర్ స్క్రీనింగ్ను విప్లవాత్మకంగా మార్చాలనే NIRAMAI లక్ష్యానికి ఈ వ్యక్తిగత విషాదం ఉత్ప్రేరకంగా మారింది. మంజునాథ్ ఇద్దరు దగ్గరి కుటుంబ సభ్యులిద్దరికీ చివరి దశలో రొమ్ము క్యాన్సర్ నిర్ధారణ అయింది. ఆరు నెలల్లోపే, సమీప బంధువులు, భారతి ,లక్ష్మి ఇద్దరూ, నాల్గవ దశలో నిర్ధారణ అయి ప్రాణాలు కోల్పోయారు. ఇది ఆమెను మానసికంగా తీవ్రంగా దెబ్బతింది. కృత్రిమ మేధస్సులో తన నైపుణ్యాన్ని కార్యాచరణగా మార్చుకుంది. బెంగళూరులో జరిగిన ‘షీస్పార్క్స్’ సదస్సులో రొమ్ము క్యాన్సర్ స్క్రీనింగ్ కోసం రూపొందించిన ఏఐ ఆధారిత వైద్య పరికరం థర్మాలిటిక్స్ గురించి వివరించింది. ‘‘భారతదేశంలో, దాదాపు 50శాతం మంది మహిళలు రెండు-ఐదు సంవత్సరాలలోపు మరణిస్తున్నారు. అయినారొమ్ము క్యాన్సర్ను ముందుగానే గుర్తిస్తే పూర్తిగా నయం చేయవచ్చు. ఇది అన్ని క్యాన్సర్లలో అత్యంత నయం చేయదగినది’ అంటుంది గీతా మంజునాథ్. -
Yoga ఆసనాలతో ఆరోగ్యయోగం
సీతంపేట: అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకుని యోగా అసోసియేషన్ ఆధ్వర్యంలో అక్కయ్యపాలెం పోర్టు స్టేడియంలో ఆదివారం ‘యోగాంధ్ర’ ఉత్సాహంగా సాగింది. వయో వృద్ధులు, విభిన్న ప్రతిభావంతులు, యూసీడీ మహిళలు, విద్యార్థులు, యోగా అసోసియేషన్ ప్రతినిధులు ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. యోగా శిక్షకుల సూచనలకు అనుగుణంగా వివిధ ఆసనాలు వేశారు. యోగాసనాలతో పాటు ఓం శాంతి ఆధ్వర్యంలో ధ్యానం చేశారు. 78 ఏళ్ల సీనియర్ సిటిజన్ ఉమామహేశ్వరరావు క్లిష్టమైన యోగసనాలు వేసి అందరినీ ఆకట్టుకున్నారు. జూన్ 21న విశాఖ వేదికగా జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవంలో నగర ప్రజలు స్వచ్ఛందంగా భాగస్వామ్యమై విజయవంతం చేయాలని అధికారులు పిలుపునిచ్చారు. పలుశాఖల జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు -
230 -110 కిలోలకు అద్నాన్ సామి :‘ఆపరేషన్కాదు,వాక్యూమ్ క్లీనర్’
ప్రముఖ గాయకుడు, సంగీత దర్శకుడు అద్నాన్ సామి భారీకాయంతో ఉండేవాడు. అలాంటిది ఉన్నట్టుండి భారీగా బరువు తగ్గి.. అంటే ఫిట్ అండ్ స్మార్ట్ లుక్లో కనిపించాడు. 230 కిలోల నుంచి 110 కిలోలకు తగ్గిపోయాడు. కఠోర శ్రమ, ఆహార నియమాలతో ఏకంగా 120 కిలోల బరువు తగ్గి, అద్భుతమైన లుక్లో అందర్ని ఆశ్చర్యపర్చాడు. అయితే అంత బరువును ఆయన ఎలా తగ్గించకోగలిగాడు. ఎలాంటి ఆహార అలవాట్లను పాటించాడు. ఆపరేషన్ లాంటిదేమైనా చేయించుకున్నాడా? పదండి ఆ వివరాలు తెలుసుకుందాంవిలక్షణ స్వరం, పాటలతో సంగీతాభిమానులను ఆకర్షించిన గాయకుడు అద్నాన్ సామి. అద్నాన్ సామి అనూహ్యంగా బరువు తగ్గడం నిజంగా హాట్టాపిక్. 230 కిలోలున్న వ్యక్తి 120 కిలోల బరువు తగ్గడం అంటే మాటలు కాదు. మిరాకిల్ ఎలా జరిగిందీ, తన వెయిట్ లాస్ జర్నీ గురించి ఆసక్తికరమైన విషయాలు ఇటీవల పంచుకున్నాడు. బారియాట్రిక్ సర్జరీ ,లైపోసక్షన్ లాంటి ఎలాంటి శస్త్రచికిత్స చేయించుకోకుండా ఈ బరువు తగ్గడం విశేషం.జూన్ 1 నాటి ‘ఆప్ కి అదాలత్ ఎపిసోడ్లో స్వయంగా తన అద్భుతమైన వెయిట్ లాస్, ఫిట్నెస్ సీక్రెట్స్ను పంచుకున్నారు.120 కిలోల వెయిట్ లాస్ మంచి జీవనశైలి, ఆహార అలవాట్లతోనే ఈ ఫీట్ సాధించారు.230 భారీ కాయం నుంచి ప్రస్తుతం ఆయన వెయిట్ 110 కిలోలకు చేరింది. అయితే బరువు తగ్గడానికి ఏదైనా శస్త్రచికిత్స చేయించుకున్నారా అని షోలో అడిగినప్పుడు, అద్నాన్ ఏమన్నారంటే.. "చాలా ఊహాగానాలు ఉన్నాయి, కొంతమంది నేను బేరియాట్రిక్ శస్త్రచికిత్స చేయించుకున్నానని, మరికొందరు లైపోసక్షన్ అని అన్నారు. అయితే విషయం ఏంటంటే.. లైపోసక్షన్ అనేది సూదితో నిర్దిష్ట ప్రాంతాల నుండి కొవ్వును తొలగించే ప్రక్రియ, సాధారణంగా స్పాట్ రిడక్షన్ కోసం." “నా బరువు 230 కిలోలు. నా విషయంలో, కొవ్వు మొత్తాన్ని తొలగించడానికి నాకు వాక్యూమ్ క్లీనర్ అవసరం ఏర్పడింది!” అని చలోక్తి విసిరారు. అదే పెద్ద ప్రేరణహ్యూస్టన్లోని న్యూట్రిషనిస్ట్ సలహా మేరకు అధికప్రోటీన్ ఫుడ్ ఎక్కువగా తీసుకున్నారు. సుగర్, ఆయిల్, రైస్, బ్రెడ్, మద్యానికి పూర్తిగా ఉన్నారు.కఠినమైన ఆహారం, వ్యాయామంతో ఒక నెలలోనే 20 కిలోల బరువు తగ్గడంతో పట్టుదల మరింత పెరిగింది. ఒక్క నెలలో 20 కిలోలు తగ్గడం నిజంగా సంతోషాన్నిచ్చిందని తెలిపారు. ఒకసారి షాపింగ్ సందర్బంగా XL లో టీ-షర్టు చాలా బాగా నచ్చిందట. కానీ అప్పటిక ఆయన 9XL. దీంతో నిరాశ చెందాడు. అంతేకాదు ఆషర్టులో నీచేయి కూడా పట్టదు అని తల్లి అన్నారట. అంతే ఆ క్షణమే బరువుగా తగ్గాలని నిర్ణయించు కున్నా.. అంటూ తన అనుభవాన్ని పంచుకున్నారు. కొంచెం బరువు తగ్గినప్పుడల్లా , అదే షర్టును వేసుకోవడం, రెండుమూడుస్లార్లు చూసుకోవడం ఇదే పని. అలాఒక రోజు, సరిగ్గా సరిపోయినపుడు. తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో నాన్నకు ఫోన్ చేసి మరీ ఆనందంతో ఎగిరి గంతేశాను అని గుర్తు చేసుకున్నారు. ఆరు నెలల్లో చనిపోతావ్ అన్నా పెద్దగా పట్టించుకోలేదుబరువు తగ్గాలనుకుంటున్న సమయంలో అద్నామ్ తండ్రికి. ప్రాంకియాటిక్ కేన్సర్ సోకింది. ఈ సందర్భంగా హాస్పిటల్ వెళ్తే ఇంత బరువు ప్రమాదకరం, ఇలానే కొనసాగితే ఆరు నెలలో చనిపోతావ్ అని ఒక వైద్యుడు అద్నాన్ను హెచ్చరించారట. అయినా పెట్టించుకోలేదు. పైగా బేకరీకి వెళ్లి ఫుల్గా లాగించేశడట. ఇది చూసి అనారోగ్యంతో బాధపడుతున్న తండ్రి ఆరోగ్యాన్ని కాపాడుకోమంటూ ఆవేదనతో కన్నీటితో చేసిన అభ్యర్థన, లైఫ్స్టైల్ మార్చుకోమని చేసిన హెచ్చరిక అతనిలో పట్టుదల పెంచింది. చివరికి అనుకున్నది సాధించారు. అలాగే తిరిగి బరువు పెరగకుండా ఉండటానికి కఠినమైన దినచర్యను పాటిస్తున్నానని చెప్పారు. కష్టపడి బరువు తగ్గాను.. జీవితంలో షార్ట్కట్లు ఏమీ ఉండవు అని చెప్పారు. -
Weight Loss వేగంగా బరువు తగ్గాలంటే..
చిన్నా, పెద్దా తేడా లేకుండా చాలామందిని వేధిస్తున్న సమస్య అధిక బరువు. అధిక బరువుతో అనేక ఆరోగ్య సమస్యలు చుట్టుముడతాయి. ఎత్తు, వయసుకి తగ్గట్టుగా బరువు ఉండటం చాలా అవసరం. ఆరోగ్యకరమైన రోజువారీ అలవాట్లు శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. బీపీ గుండె జబ్బులు, మధుమేహం లాంటి జబ్బులను దూరంగా ఉంచుతాయి. కాబట్టి ఆరోగ్యంగా, చక్కటి శరీరాకృతితో ఆకర్షణీయంగా ఉండాలంటే దినచర్య సవ్యంగా ఉండాల్సిందే. కొన్ని ముఖ్యమైన సూత్రాలు సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి. లేలేత సూర్యకిరణాలు మన శరీరానికి తాకిడే, చక్కటి డి విటమిన్ అందుతుంది. యోగా, నడక లాంటి వ్యాయామం చేయాలి. ఇది రక్త ప్రవాహం సాఫీగా సాగిపోవడానికి మేలుచేస్తుంది. అంతేకాదు రోజంగా ఉత్సాహంగా ఉండేలా చేస్తుంది. నిర్దిష్ట సమయాల్లోనే భోజనం చేయాలి. అదీ సమతుల ఆహారాన్ని తీసుకోవాలి. ఉపాహారం అస్సలు వాయిదా వేయొద్దు. రాత్రి నిద్రకు ముందు అతిభోజనం వద్దు.సరిపడినన్ని నీళ్లు తాగాలి.స్మార్ట్ఫోన్లు, టీవీలకు ఎక్కువగా అతుక్కుపోకుండా జాగ్రత్తపడాలి. ముఖ్యంగా రోజుకు 10వేల అడుగులు వేస్తే బరువు తగ్గడం ఈజీ అవుతుంది. నిమిషానికి 80 అడుగులు నడిస్తే సాధారణం. నిమిషానికి 100 అడుగులు నడుస్తుంటే మధ్యస్థంనిమిషానికి 120 అడుగులు నడిస్తే.. అది వేగవంతమైన చురుకైన నడక. ఇది అత్యంత ప్రభావవంతమైనది. కేలరీలను బర్న్ చేయడంలో సహాయపడుతుంది. ఇది వారి వారి ఆరోగ్య పరిస్థితి, సామర్థ్యం ఆధారంగా నిర్ధారించుకోవాలి. రాత్రికి రాత్రికే బరువు తగ్గాలనే అత్యాశతో అవగాహన లేని షార్ట్ కట్ పద్దతులు, లేని పోని డైటింగ్లను ఆశ్రయించకూడదు ఇది ఒక్కోసారి ప్రమాదం కూడా. శరీర తత్వాన్ని అవగాహన చేసుకొని ఓపిగ్గా ప్రయత్నిస్తే విజయం సాధించడం తథ్యం. నోట్: ఏదైనా అనారోగ్య సమస్యలుంటే వైద్యులను సంప్రదించడం ఉత్తమం. -
తొలి నెలసరి వాయిదా వెయ్యొచ్చా?
ఇటీవలి కాలంలో కూతుళ్లు ఉన్న తల్లులలోఒక ఆందోళన కనిపిస్తోంది. అదేంటంటే పదేళ్ల వయసుకే కూతుళ్ళు రజస్వల కావడం. ఇది వారి భవిష్యత్తు, ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది.. అనే భయాన్ని దూరం చేయాలనుకుంటున్నారు. తమ గురించి తమకు ఏ మాత్రం తెలియని అమ్మాయిల్లో తొలి నెలసరి ఆలస్యంగా రావాలని తల్లులు ప్రయత్నిస్తున్నారు, ఇది మంచి పరిణామం అంటున్నారు నిపుణులు.కూతుళ్ళ తొలి నెలసరి ఆలస్యంగా రావడాన్ని తల్లులు ప్రయత్నించవచ్చా... ఈ విషయం గురించి ఇటీవల రిబెక్కా కిండెర్మన్ అనే ఆస్ట్రేలియాలోని గోల్డ్ కోస్ట్ ప్రాంతానికి చెందిన తల్లి తన 10, 12 ఏళ్ళ కుమార్తెలకు నెలసరి ఆలస్యం కావాలన్న లక్ష్యంతో కుటుంబ ఆహారం నుండి స్క్రీన్ టైం చూసే వరకు అన్నీ మార్చేసింది. ఆమె ఈ విషయంపై చేసిన ఇన్ స్ట్రాగామ్ రీల్ (@bec&kinderman) 1.6 మిలియన్ల వీక్షణలు, 57,000కు పైగా లైకులు పొందింది.‘పిల్లల మెదడు ఇంకా పూర్తిగా అభివృద్ధి చెందకముందే, వారిపై ఇంటర్నెట్లో కనిపించే విషయాలు ఒత్తిడి తెచ్చే అవకాశం ఉంది. అందుకే ఈ వయస్సులోనే పెద్దవాళ్లలా మారకుండా, చిన్న పిల్లలుగా ఉండేలా చేయాలనుకుంటున్నాను,‘ అంటారు ఆమె. ఈ తల్లి చేస్తున్న ప్రయత్నం గురించి మనమూ ఆలోచించాలి. మన కూతుళ్ళ భవిష్యత్తు ఆరోగ్యం గురించి జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది.అమెరికాలో బాలికలు మొదటిసారి నెలసరి అయ్యే సగటు వయస్సు 11.9 సంవత్సరాలు. 11 ఏళ్లకు ముందే నెలసరి ్ర΄ారంభమయ్యే బాలికల శాతం16 గా ఉంది. ఇండియాలోనూ ఈ శాతం ఇదే విధంగా ఉంది.నెలసరి.. బ్రెస్ట్ క్యాన్సర్ ముప్పు..12 ఏళ్ల వయస్సు ముందు నెలసరి వచ్చే బాలికలకు బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం 23 శాతం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా, ఎండోమెట్రియల్, ఓవరియన్ క్యాన్సర్లకు కూడా ఇది కారణంగా ఉండే ప్రమాదం ఉంది.గతంలో ఇలా ఉండేది కాదు. రచయిత ఎలెనా బ్రిడ్జర్స్ తెలిపిన ప్రకారం, గిరిజన సమాజాలలో బాలికలు సుమారు 17 ఏళ్ల వయస్సులో తొలి నెలసరి పొందేవారు, తగిన అండాశయాల విడుదల 19 ఏళ్ల వయస్సులో మొదలయ్యేది.ప్రాంచీన కాలంలో మానవ మేధస్సు, శరీరం ముందు నుంచీ వయోజన భావోద్వేగాలను ఎదుర్కొనేవి. కానీ నేటి బాలికలు ఇప్పుడే పీరియడ్లు, బాల్య గర్భధారణను ఎదుర్కొంటున్నారు,‘ అని ఆమె చెప్పారు. ఈ పరిస్థితిని ‘ఎవల్యూషనరీ మిస్మ్యాచ్‘గా అభివర్ణిస్తూ, బ్రిడ్జర్స్ ఇలా అన్నారు: ‘ఇప్పుడు రి పొడక్టివ్ ప్యూబర్టి చైతన్యం అతి త్వరగా వస్తోంది, కానీ మానసికంగా, శారీరకంగా పరిపక్వత రావడం లేదు.‘రసాయనాలు కీలకంప్యూబర్టి ముందే మొదలవడం వల్ల గర్భస్రావం, నెలసరి సమస్యలు, ఆందోళన, డిప్రెషన్, పీసీఓఎస్ వంటి సమస్యల ప్రమాదం పెరుగుతుందని పరిశోధనలు సూచిస్తున్నాయి.ఆహారం, ఒత్తిడి, రసాయనాలు వంటి పర్యావరణ అంశాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. దీన్ని దష్టిలో ఉంచుకుని కిండెర్మన్ తన పిల్లలను సంపూర్ణ సహజ జీవనశైలిలో పెంచుతున్నారు.ఆమె కుటుంబం ఎక్కువగా ఆర్గానిక్ ఆహారాన్ని తీసుకుంటుంది, పంటలపై ఉండే పెస్టిసైడ్ మిగులు తొలగిస్తారు, ఇంట్లో రసాయనాల్లేని పరిసరాలను కల్పిస్తారు. ‘సువాసన కోసం పిల్లలు ఉపయోగించే పరిమళ ద్రవ్యాలు హార్మో¯Œ లను ప్రభావితం చేస్తాయి, అందుకే మేం ఇంట్లోనే ఎసెన్షియల్ ఆయిల్స్తో పరిమళాలు తయారు చేస్తాం,‘ అని చెబుతున్నారు.న్యూజిలాండ్కు చెందిన నికీ స్కిన్నర్ (@nourished&and&vibrant) కూడా తన 7, 4 సంవత్సరాల కుమార్తెల కోసం ఇదే దిశగా చర్యలు తీసుకుంటున్నారు.‘ఇది సహజ అభివృద్ధిని కృత్రిమంగా నియంత్రించడమేం కాదు,‘వాతావరణ అంశాలు నెలసరి ముందే రావడానికి కారణమవుతున్నాయని తెలుసుకొని, వాటిని నియంత్రించగలిగినంతవరకు నేను తల్లిగా జాగ్రత్త పడుతున్నాను..‘ అంటారు ఆమె.నిపుణుల మాటలలో...నాచురోపతి వైద్యురాలు లారా బ్రిడెన్ చెప్పిన ప్రకారం, 8 సంవత్సరాల వయస్సుకు నెలసరి రావడం అసాధారణమైన విషయం. 11 ఏళ్ల లోపల నెలసరి రావడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. ఇన్సులిన్ రెసిస్టెన్స్, , బ్రెస్ట్ క్యాన్సర్ వంటి అనేక సమస్యలతో నెలసరికి సంబంధం ఉంది. మెటబాలిక్ డిస్ఫంక్షన్ వల్ల ఇలా జరిగే అవకాశాలు ఎక్కువ. ఆహారం, పర్యావరణ మార్పులు, వ్యాయామం లేకపోవడం, ఎపిగెనెటిక్ ప్రభావాలు ... ఇవన్నీ నెలసరి ముందుగా రావడానికి కారణాలు. బ్రిడ్జర్స్ హెచ్చరిస్తూ ‘నెలసరి ఆలస్యం చేయాలనే లక్ష్యం తల్లిదండ్రులకు, పిల్లలకు ఒత్తిడిని కలిగించవచ్చు. అది ఆరోగ్యానికి హానికరమైన చర్యలకూ దారితీయవచ్చు‘ అని కూడా అంటున్నారు.మాట్లాడటానికి భయపడవద్దు..కిండెర్మర్ అండ్ స్కిన్నర్ తమ కుమార్తెలతో జరిపిన సంభాషణలు కూతుళ్లు ఉన్న తల్లులకు తప్పక ఉపయోగపడతాయి.‘మీ పిల్లలు నెలసరి వస్తే భయపడకూడదు. అది ఒక ప్రకృతి సహజమైన చర్యగా సానుకూలంగా తీసుకోవాలి. పిల్లలకు పూర్తి అవగాహన ఇవ్వాలని ప్రయత్నిస్తున్నాం‘ అంటున్నారు. పిల్లల చిన్నప్పటి నుంచే వారి శారీరక, మానసిక ఆరోగ్య విధానాలలో జాగ్రత్తలు తీసుకుంటే తల్లుల్లోనూ ఆందోళన తగ్గుతుంది. – నిర్మలారెడ్డిజీవనశైలి మార్పులే కారణంమా వద్దకు 8, 10 ఏళ్ల వయసున్న అమ్మాయిల్ని రజస్వల అయ్యింది అని తల్లులు తీసుకొస్తుంటారు. ఆందోళన పడుతుంటారు. ఆ పిల్లలకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియని వయసు. పాల్ట్రీ ఉత్పత్తులు, జంక్ ఫుడ్, ప్యాకేజ్డ్ ఫుడ్, వాతావరణం, క్రీడల వంటి శారీరక వ్యాయామం లేకపోవడం.. వంటి వాటి వల్ల చిన్నవయసులోనే రజస్వల కావడం ఇటీవల జరుగుతోంది. కొన్ని సార్లు వారి జీన్స్, ఎండోక్రైౖ మ్స్ పనితీరులో లోపాల వల్ల కూడా ఇలాంటి సమస్యలు వస్తున్నాయి. జీవనశైలి సరిగా ఉండేలా చూసుకోవడంతో పాటు, రెగ్యులర్ చెకప్స్, నిపుణుల సూచనలు పాటిస్తూ, అవగాహన పెంచుకుంటే సమస్య తగ్గుతుంది. – డాక్టర్ శిరీష, గైనకాలజిస్ట్, హైదరాబాద్ -
Yoga కడుపు ఉబ్బరమా..? ఉందిగా యోగా
కడుపు ఉబ్బరం చాలా మందిలో కనిపించే ఒక సాధారణ సమస్య. ఇది చాలా అసౌకర్యాన్ని కలిగిస్తుంది. క్రమంగా జీర్ణ సమస్యలు, మానసిక రుగ్మతలు, నిద్ర లేమి వంటి సమస్యలకు దారితీస్తుంది. సహజంగానే ఈ సమస్యను నివారించు కోవచ్చు. ఎందుకు వస్తుంది?కడుపులో ఏర్పడే కొన్నిరకాల రసాయనాల ద్వారా ఇలా జరుగుతుంది. సాధారణంగా కడుపు ఉబ్బరం అనేది మలబద్ధకం ద్వారా వస్తుంది. ఎలాంటి మందులు వాడకుండా కడుపు ఉబ్బరాన్ని కొన్ని యోగాసనాల ద్వారా తగ్గించుకోవచ్చుకటి చక్రాసనం...పేరుకు తగ్గట్లుగానే ఈ ఆసనం వెన్నెముకకు సంబంధించినది. నేలపై నిల్చొని వీపును రెండు పక్కలా తిప్పుతూ ఉండాలి. ఈ సమయంలో చేతులను భుజాలకు రెండు వైపులా స్ట్రెచ్ చేస్తూ చా΄ాలి. ఇలా రెండువైపులా కనీసం 10 రౌండ్లు, 2 నిమిషాల వరకు చేయాలి.చదవండి: లగ్జరీ కారు గిఫ్ట్ ఇచ్చిన బిలియనీర్ కొడుకులు: మెట్రోకు జై కొట్టిన ‘అమ్మ’సైడ్ యాంగిల్ పోజు: కాళ్లను స్ట్రెచ్ చేసి, ఒకవైపుగా వంగాలి. ఇంకో కాలును వెనక్కి చాపాలి. వంగిన కాలుమీద చేతిని ఉంచి మరో చేతిని నిటారుగా పైకి చూపిస్తూ, బాడీని వీలైనంత వరకు వంచాలి. మొదట్లో 15–20 సెకన్ల నుంచి ప్రారంభించి క్రమంగా 2 నిమిషాల వరకు చేయడం అలవాటు చేసుకోవాలి.ఇదీ చదవండి: వీటికి చాలా దూరంగా ఉండాలి...ఫుడ్ @ 60ఫ్రాగ్ పోజ్: ముందుగా వజ్రాసన భంగిమలో మీ కాళ్లను వెనుకకు మడిచి యోగా మ్యాట్పై కూర్చోవాలి. మీ చేతులను పిడికిలిగా చేసి, వాటిని ఉదరం దగ్గర పెట్టుకుని మెల్లగా ముందుకు వంగాలి. ఈ ఆసనం కూడా మొదట్లో 15–20 సెకన్ల నుంచి ్ర΄ారంభించి క్రమంగా 2 నిమిషాల వరకు చేయాలి. -
వీటికి చాలా దూరంగా ఉండాలి...ఫుడ్ @ 60
వయసు పెరిగే కొద్దీ శరీర అవసరాలు కూడా మారుతాయి. ముఖ్యంగా 60 ఏళ్ల తర్వాత. మనసు తీపి, వేయించిన వంటకాలు వంటి వివిధ రకాల రుచుల వైపు ఆకర్షిస్తుంది. కానీ ఈ వయస్సులో, మీ ఆహారం శరీరానికి శక్తిని అందించేలా, జీర్ణక్రియను సులభతరం చేసేలా, రోజంతా మిమ్మల్ని శక్తివంతంగా, తేలికగా భావించేలా ఉండాలి. మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, మీరు మీ ఆహారం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం చాలా ముఖ్యం. పోషకాహారం మిమ్మల్ని శారీరకంగా ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా మానసికంగా సంతోషంగా, శక్తివంతంగా ఉంచుతుంది.వేపుళ్లకు దూరం...60 ఏళ్ల తర్వాత శరీర జీర్ణశక్తి క్రమంగా తగ్గుతుంటుంది. ఈ స్థితిలో సమోసా, కచోరి, పూరీ, భుజియా వంటి వేయించిన, భారీ ఆహార పదార్థాలను జీర్ణం చేసుకోవడం కష్టమవుతుంది. ఈ ఆహారం కడుపుపై భారంగా ఉండటమే కాకుండా గ్యాస్, ఆమ్లత్వం, అలసటను కూడా కలిగిస్తుంది. శరీరంలో నిరంతరం బరువుగా ఉన్నప్పుడు, నిద్ర, మానసిక స్థితి, శక్తి స్థాయులు కూడా ప్రభావితమవుతాయి. వృద్ధులు ప్రతిసారీ టీతో పాటు క్రిస్పీ లేదా వేయించినవి ఏదైనా తినాలని కోరుకుంటారు. కానీ ఈ అలవాటు క్రమంగా హానికరంగా మారుతుంది.సరైన ఎంపిక...నూనెతో చేసిన ఆహారానికి బదులుగా జీలకర్ర, ఇంగువ చేర్చి కూరగాయలతో చేసిన తేలికపాటి సలాడ్స్ తినవచ్చు. ఇవి రుచికరంగా ఉండటమే కాకుండా, శరీరాన్ని తేలికగా, సమతుల్యంగా ఉంచుతాయి.చదవండి: డాడీ అంత పాపులర్ కాదు కానీ.. ఫ్యాషన్ వరల్డ్లో స్పెషల్ లేడీ! స్వీట్లు, పిండి పదార్థాలకు దూరం...ఈ వయస్సులో స్వీట్లు, పిండితో చేసిన వస్తువులు స్లో పాయిజన్గా భావించాలి. బిస్కెట్లు, కేకులు, పిండితో చేసిన టోస్ట్, మిల్క్ కేక్, హల్వా లేదా పేడా వంటి స్వీట్లు రుచికరంగా కనిపిస్తాయి కానీ వాటిలో పోషకాలు ఏవీ ఉండవు. ఇవి రక్తంలో చక్కెరను త్వరగా పెంచుతాయి. మలబద్ధకానికి కారణమవుతాయి. దీర్ఘకాలంలో మధుమేహం, కీళ్ల నొప్పులు, అలసటకు దారితీస్తాయి. భోజనం తర్వాత స్వీట్లు తినడం మంచిదే అనిపిస్తుంది. కానీ ఇప్పుడు ఈ అలవాటు హానికరం కావచ్చు. ఈ అలవాటును పూర్తిగా తొలగించుకోకుండానే మనం మెరుగైన ప్రత్యామ్నాయాలను అందించగలం.మంచి ఎంపిక...స్వీట్లు తినాలపిస్తే భోజనం తర్వాత బెల్లం–నువ్వుల లడ్డు, రాగి లడ్డు, 1–2 ఖర్జూరం లేదా అర టీస్పూన్ గుల్కంద్ తినవచ్చు. కాలానుగుణంగా లభించే చిరు ధాన్యాలతో తయారు చేసిన రోటీలు, కూరగాయలతో శనగ పిండి టోస్ట్, నెయ్యితో పోహా కూడా మంచి ఎంపికలు.చల్లని– పుల్లని పదార్థాలకు దూరం...రోజువారీ భోజనంలో కారంగా ఉండే ఊరగాయలు, చల్లని పదార్థాలు, ప్యాక్ చేసిన పానీయాలను చేర్చడం ఈ రోజుల్లో సర్వసాధారణమై΄ోయింది. కానీ ఇది మీ శరీరంలో వాపు, అధిక రక్తపోటు, వాతం వంటి సమస్యలను పెంచుతుంది. మార్కెట్లో లభించే కారంగా, నూనెతో కూడిన ఊరగాయలలో అధిక సోడియం ఉంటుంది. ఇది శరీరంలో నీటిని నిలుపుకునేలా చేస్తుంది. రక్త΄ోటు అసమతుల్యతకు కారణమవుతుంది. అదేవిధంగా ఫ్రిజ్లో దీర్గకాలం ఉంచిన కోల్డ్ లస్సీ, కూల్ డ్రింక్స్, ప్యాక్డ్ జ్యూస్లు జీర్ణక్రియను దెబ్బతీస్తాయి. శరీరం పొడిబారడం, గ్యాస్, అలసటను కలిగిస్తాయి.ఇదీ చదవండి: లగ్జరీ కారు గిఫ్ట్ ఇచ్చిన బిలియనీర్ కొడుకులు: మెట్రోకు జై కొట్టిన ‘అమ్మ’మంచి ప్రత్యామ్నాయాలు... వీటికి బదులుగా తక్కువ నూనె, సుగంధ ద్రవ్యాలతో ఇంట్లో తయారుచేసిన నిమ్మకాయ లేదా గూస్బెర్రీ ఊరగాయ, పుదీనా–కొత్తిమీర చట్నీ, జీలకర్రతో మజ్జిగ లేదా వేడి సూప్ చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. వేడి సూప్లు, ఉడికించిన కూరగాయలు, నిమ్మకాయ–పుదీనా నీరు లేదా మరిగించిన జీలకర్ర–కొత్తిమీర నీటిని ΄ానీయంగా తీసుకోవడం వల్ల శరీరం చల్లబడుతుంది. జీర్ణక్రియ పనితీరు మెరుగ్గా ఉంటుంది. -
World Food Safety Day 2025 ఆహార భద్రతకు 5 శక్తివంతమైన ప్రయోజనాలు
World Food Safety Day 2025 సాధారణంగా కలుషిత ఆహారం, నీళ్ల ద్వారా బ్యాక్టీరియా, వైరస్, పరాన్నజీవులు, రసాయనాలు శరీరంలోకి ప్రవేశిస్తాయి. ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలకు కారణం అవుతాయి. ఈ సమస్య అంతా వంట గది నుంచే మొదలవుతుంది. ఈ సమస్యకు అడ్డుకట్ట వేయాలంటే..? ప్రతి యేటా సురక్షితం కాని ఆహారం తినడం వల్ల 60 కోట్ల మంది అనారోగ్యానికి గురవుతున్నారని నివేదికలు తెలియజేస్తున్నాయి. నేడు ఫుడ్ సేఫ్టీ దినోత్సవ సందర్భంగా కొన్ని సురక్షితమైన అలవాట్ల గురించి తెలుసుకుందాం...చేతులను తరచూ శుభ్రం చేసుకోవాలి. వాడిన పాత్రలను, వాడాలనుకున్న పాత్రలను తప్పనిసరిగా కడిగాకనే తిరిగి ఉపయోగించాలి. ముడి పదార్థాలను, వండిన పదార్థాలను వేరుగా ఉంచడం వల్ల క్రాస్–కాలుష్యాన్ని నివారించ వచ్చు. పూర్తిగా ఉడికించాలి. ముఖ్యంగా మాంసం, మాంసాహారం, సముద్రపు ఆహారం.. బాగా ఉడికించిన తర్వాతనే తీసుకోవాలి. ఆహారాన్ని సరైన పద్ధతుల్లో నిల్వ చేయాలి. అతి చల్లని, అతి వేడి పదార్థాలను తీసుకోవడం నివారించాలి. సురక్షితమైన నీరు, ముడి పదార్థాలను ఉపయోగించాలి. పదార్థాల తాజాదనాన్ని చెక్ చేసి, తీసుకోవాలి. ఇది పిల్లలు, గర్భిణీ స్త్రీలు, బలహీనమైన రోగనిరోధక శక్తి ఉన్నవారిలో చాలా ముఖ్యం.ఆహార భద్రతకు 5 శక్తివంతమైన ప్రయోజనాలుఆహారాన్ని శుభ్రంగా వుంచుకోవడం అన్నది 200 కంటే ఎక్కువ ఆహార సంబంధిత వ్యాధులను దూరంగా ఉంచుతుంది.ఆరోగ్యకరమైన ఆహారం ద్వారా జీవితకాలాన్ని పొడిగించుకోవచ్చు. తాజా ఆహారం వల్ల ఆహార నష్టం, వ్యర్థాలను తగ్గించవచ్చు. సురక్షితమైన ఆహారం ప్రతి ఒక్కరి హక్కు. ఇంట్లో/రెస్టారెంట్లలో ఆహారాన్ని ఎక్కడ తీసుకున్నా ఆరోగ్యకరమైన దాని పట్ల తప్పక దృష్టి పెట్టాలి. -
స్లిమ్గా మారిన నర్సు..బ్రేక్ఫాస్ట్గా గిన్నెడు పెరుగు..
ఈ వెయిట్ లాస్ స్టోరీ వింటే అవాక్కవ్వుతారు. బాబోయ్ ఇవేం ఫుడ్ అలవాట్లు.. అనిపిస్తుంది. ఆమె ఆరోగ్యకరమైన అలవాట్లతోనే స్లిమ్గా మారింది, కానీ బరువు తగ్గాలనుకునే వారు తీసుకోకూడని హెవీ ఫుడ్స్తోనే ఆమె బరువు తగ్గడం విశేషం. నోటిని కట్టడి చేయకుండా.. కడుపు నిండుగా తింటూ బరువు తగ్గి చూపించింది. పైగా అనారోగ్యకరమైన జంక్ ఫుడ్స్కి దూరంగా ఉంటూ..హాయిగా రుచికరమైన ఆహారం తింటూనే బరువు తగ్గడం ఎలాగో చూపించింది. మరి ఆమె వెయిట్ లాస్ జర్నీ ఎలా జరిగిందో సవివరంగా చూద్దామా.!.కెనడాకు చెందిన మెలనీ కోజ్(21) తన పనివేళల కారణంగా బర్గర్లు, ఫ్రైస్, ప్రాసెస్ చేసిన ఆహారాలు ఎక్కువగా తీసుకునేదట. దాంతో అధిక బరువు సమస్యను ఎదుర్కొందట. చిన్న వయసులోనే అంత బరువు ఉండటంతో చాలా ఇబ్బందులు పడేది కూడా. పైగా వయసుకి మించిన అధిక బరువు ప్రమాదమని హెచ్చరించడంతో బరువు తగ్గేందుకు ఉప్రక్రిమించిందట. అందుకోసం పలు రకాల వర్కౌట్లు, యోగా, వ్యాయమాలు వంటివి ఎన్నింటినో చేసి.. దాదాపు రెండేళ్లు పూర్తిగా విఫలమైంది. ఇక లాభం లేదనుకుని..డైట్లోనే ఏదైనా మార్పు చేయాలి.. లేదంటే కష్టమే బరువు తగ్గడం అని అర్థమైంది మెలోనికి. దాంతో న్యూట్రిషియన్ కోర్సులో చేరి ఆరోగ్యకరమైన ఆహారం అంటే ఏంటో సవివరంగా తెలుసుకుంది. ఇక అప్పటి నుంచి అధిక ప్రోటీన్తో కూడిన ఆహారాలు తినడం ప్రారభించింది. ముఖ్యంగా ఉదయం బ్రేక్ఫాస్ట్గా అధిక ప్రోటీన్తో కూడిన గిన్నెడు పెరుగు తోపాటు తాజా పండ్లను జోడించి తీసుకునేదట. ఇది కడుపు నిండిన అనుభూతి కలిగించి చాలాసేపటి వరకు ఫుడ్ తినాలనే కోరికను నివారించేదట. అలాగే అనారోగ్యకరమైన చిరుతిండ్లన్నింటికి పూర్తిగా దూరంగా ఉండేదట. దాంతో తన బరువులో అనుహ్యమైన మార్పుల మొదలయ్యాయట. అలా 44 కిలోలక వరకు తగ్గానని, ప్రస్తుతం 69 కిలోలు ఉన్నట్లు తెలిపింది. అయితే తన డైట్లో తక్కువ ఫ్యాట్ కలిగిన చీజ్, చికెన్, చేపలు వంటి ఉన్నాయట. అలాగే తనకు ఇష్టమైన స్వీట్స్ కూడా తినేదాన్ని అంది. అది కూడా హెల్దీ స్వీట్స్ తప్ప..ప్రాసెస్ చేసినవి కావట. ప్రస్తుతం ఈ నర్స్ వెయిట్ లాస్ స్టోరీ నెట్టింట తెగ వైరల్గా మారింది. అధిక ప్రోటీన్తో కూడిన ఆహారం బరువు తగ్గిస్తుందా..ఇది కడుపు నిండిన అనుభూతిని ఇచ్చి.. అధికంగా ఫుడ్ తీసుకోవాలనే ఆలోచనను నివారిస్తుంది. అలాగే మంచి బలాన్ని అందించి..బరువు తగ్గాలనే లక్ష్యంపై ఫోకస్ పెట్టేలా చేస్తుంది. తద్వారా కేలరీలు తక్కువగా ఉంటాయి. పైగా జీవక్రియ కూడా మెరుగుపడుతుంది. ఇక్కడ గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే..చక్కటి జీవనశైలి, మంచి ఆహారపు అలవాట్లు ఉంటే..కఠినమైన డైట్ల జోలికి పోనవసరం లేదని చెబుతున్నారు నిపుణులు. సరైన విధంగా తీసుకుంటే..ఆహారమే ఆరోగ్యం అని, అతిగా తీసుకుంటే విషంగా మారి అనర్థాలకు కారణమవుతుందని చెప్పారు. పూర్తిగా చెడు ఆహారపు అలవాట్లను నివారించి హెల్దీ ఫుడ్కి ప్రాముఖ్యత ఇస్తే బరువు తగ్గడం అనేది మన చేతుల్లోనే ఉంటుందట. గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాల కోసం వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: రొటీన్ వాకింగ్ కంటే అలా చేస్తే..బోలెడన్ని ప్రయోజనాలు.. !) -
రొటీన్ వాకింగ్ కంటే అలా చేస్తే..బోలెడన్ని ప్రయోజనాలు.. !
వాకింగ్ అంటే అందరు కామన్గా చేసేదే. అయితే ఈ వాకింగ్ మాత్రం చాలా విభిన్నమైనది. సంప్రదాయ వాకింగ్ కంటే మంచి ఫలితాలను పొందగలగుతారట. దీన్ని జపనీస్ వాకింగ్ అనిపిలుస్తారు. మరి ఆ నడక వ్యాయామం విశేషాలేంటో చూద్దామా..!. జనీస్ వాకింగ్ వ్యాయామం అంటే..దీన్ని ఇంటర్వెల్ వాకింగ్ ట్రైనింగ్ (ఐడబ్ల్యూటీ) లేదా జపనీస్ వాకింగ్ అని కూడా పిలుస్తారు. ఇది ప్రత్యామ్నాయ విరామాలను కలిగి ఉంటుంది. మూడు నిమిషాల వేగవంతమైన నడక, మరో మూడు నిమిషాలు స్లో వాకింగ్. ఇలా కనీసం ఐదు విరామాల సెట్తో కూడిని వాకింగ్ చేస్తారు. మంచిదేనా అంటే..ఇలా వేగవంతంగా, మళ్లీ చాలా నెమ్మదిగా చేసే వాకింగ్ విధానం గణనీయమైన ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుందట. శారీరక ధృఢత్వాన్ని మెరుగుపరచడంలో, కండర బలాన్ని, గ్లైసెమిక్ నియంత్రణను అందిస్తుందట. వ్యాయామం చేయలేకపోతున్నా అని బాధపడేవారికి.. ఇది మరింత మేలు. అన్ని వయసుల వారికే కాదు వృద్ధులు సైతం హాయిగా ఈ విధానంలో వాకింగ్ చెయ్యొచ్చట. అంతేగాదు ఇది మంచిదేనా? కాదా అని జపనీస్ నిపుణులు సుమారు 63 సంవత్సరాల వయస్సు గల దాదాపు 200 మందిపై అధ్యయనాన్ని నిర్వహించగా మెరుగైన ఫలితాలను కనిపంచాయి. అందువల్ల ఇది సురక్షితమైనదని నమ్మకంగా చెబుతున్నారు నిపుణులు. అయితే బాగా వేగంగా వాకింగ్ చేసేటప్పుడు గాయాలు అయ్యే ప్రమాదం లేకపోలేదనేది కొందరి పరిశోధకులు వాదన. కలిగే లాభాలు..రక్తపోటు తగ్గుతుందిరక్తంలో గ్లూకోజ్ స్థాయిలు మెరుగ్గా ఉంటాయి. బాడీమాస్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. కండరాలను బలోపేతం చేస్తుంది. ఎలా చేయాలంటే..ఈ ఇంటర్వెల్ వాకింగ్ ట్రైనింగ్ అనేది సరిగా సాధనం చేయడంపైనే మెరుగైన ఫలితాలు అనేవి ఉంటాయట. మొదట సాధారణ వేగంతో నడిచి..ఆ తర్వాత ఓ 20 నుంచి 30 సెకన్లు వేగంగా నడవాలట. మళ్లీ బ్రేక్ ఇచ్చి స్లోగా ఇలా ..కనీసం మూడు నుంచి ఐదు సెట్ల చొప్పున చేయాలట. ప్రారంభంలో 30 నిమిషాలు కేటాయించి.. ఆ తర్వాత నెమ్మదిగా ఈ విధానాన్ని పెంచుకోవాలట. అదీ కూడా మన బాడీ తత్వానికి అనుగుణం చేయాలట. ముఖ్యంగా సౌకర్యవంతమైన బూట్లను ధరించి చేయాలట. అంతేగాదు ఒకవేళ ఈ క్రమంలో తలనొప్పి, వికారం వంటివి వచ్చినట్లయితే వెంటనే ఆపేయాలని సూచిస్తున్నారు నిపుణులు. చాలామటుకు దీన్ని పిట్నెస్ నిపుణుల సమక్షంలో ఈ విధానాన్ని ప్రయత్నించడం మంచిదని చెప్పారు నిపుణులు. గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాల కోసం వ్యక్తిగత నిపుణులు లేదా వైద్యులను సంప్రదించడం మంచిది.(చదవండి: ఆటో డ్రైవర్ స్టోరీ..! చిన్న ఐడియాతో నెలకు ఏకంగా రూ. 5 లక్షలు పైనే..) -
ఐస్ బాత్ థెరపీ ట్రెండ్..! నిపుణులు ఏమంటున్నారంటే..
నగరవాసం అంటేనే కొత్త కొత్త అనుభూతులు, అనుభవాలతో సహవాసం.. విశ్వవ్యాప్తంగా రాకపోకలు సాగించే మహానగరాల్లో కొత్త విశేషాలకు కొరత ఎప్పుడూ ఉండదు. అంతేకాదు కొత్త విషయాలకు నగరవాసులు ఎప్పుడూ ఆకర్షితులే.. వాటిలోని వింత అనుభవాలను చవిచూడాల ఎప్పుడూ ఉవి్వళ్లూరుతూ ఉంటారు. ఇలాంటి నయా ట్రెండ్స్కు తామేమీ తక్కువ కాదన్నట్లు భావిస్తుంటారు. అందుకే ఏ విషయంలోనైనా భాగ్యనగరవాసులు ముందుంటారు.. అలాంటి మరో కొత్త విశేషమే నగరానికి పరిచయమైంది. అదే ఐస్ బాత్. ఈ పేరిట ఇటీవలే ఓ ట్రెండ్ పరిచయమైంది. ఐస్ బాత్ థెరపీ నగరంలోని ఆరోగ్య, ఫిట్నెస్ ప్రియులకు నూతన ట్రెండ్గా మారింది. ఈ థెరపీ ద్వారా శరీరానికి మాత్రమే కాదు.. మానసికంగానూ అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయని దీన్ని అందిస్తున్న నిపుణులు చెబుతున్నారు. సమంత, విరాట్ కోహ్లీ, విజయ్ దేవరకొండ, అనమ్ మీర్జా, విష్ణు మంచు వంటి ప్రముఖులు ఐస్ బాత్ తో వారి అనుభవాలను సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. ఇది అనేకమందిలో ఈ థెరపీ పట్ల ఆసక్తిని పెంచుతోంది. మరి కొందరు సైతం ఐస్బాత్ను ఒక ఈవెంట్లా నగరంలోని కేఫ్స్, క్లబ్స్.. వంటి విభిన్న ప్రదేశాల్లో నిర్వహిస్తున్నారు. స్నాన విశేషాలివీ.. ఐస్ బాత్ అనేది చల్లటి నీటిలో, సాధారణంగా 10 నుంచి 15 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలో, 10 నుండి 15 నిమిషాల పాటు శరీరాన్ని ముంచడం. దీనినే క్రయోథెరపీ లేదా కోల్డ్–వాటర్ ఇమ్మర్షన్ టెక్నిక్/కోల్డ్ ప్లంజ్ థెరపీ అని కూడా పిలుస్తారు. ఈ ప్రక్రియ శరీరంలోని రక్తనాళాలను సంకోచింపజేస్తుంది. తద్వారా వాపు, నొప్పి తగ్గుతుంది. కొన్ని ఇబ్బందుల నుంచి శరీరం త్వరగా కోలుకోవడంలో సహాయపడుతుంది. ఈ చికిత్స విచిత్రంగా అనిపించవచ్చు, కానీ ఇది చాలా ప్రతిఫలదాయకంగా ఉంటుంది. ప్రారంభ షాక్ తర్వాత, శరీరం అలవాటుపడుతుంది. ఆరోగ్య ప్రయోజనాలివీ.. ఈ ఐస్బాత్ సేవలు అందిస్తున్నవారు చెబుతున్న వివరాల ప్రకారం.. దీని ద్వారా కండరాల నొప్పి, వాపు తగ్గుతుంది. చల్లటి నీటిలో శరీరం ఉన్నప్పుడు రక్తప్రసరణ మెరుగై, ఎండార్ఫిన్లు విడుదలై, మానసిక ఒత్తిడి తగ్గుతుంది. క్రమం తప్పని ఐస్ బాత్తో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇది చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. చల్లటి నీటి ప్రమేయంతో నాడీ వ్యవస్థను సక్రమం చేస్తుంది. ఇది డోపమైన్ స్థాయిలను పెంచుతుంది. అత్యంత చల్లటి నీటిలో ఒక మునక డోపమైన్ ఉత్పత్తిని 250% వరకూ పెంచుతుంది. తద్వారా సహజమైన మానసిక ఆరోగ్యాన్ని ఇస్తుంది.. ఇబ్బంది కలిగించే చలిని ఎదుర్కోవడం మెదడుని అసౌకర్యాన్ని స్వీకరించడానికి, స్థితిస్థాపన క్రమశిక్షణను పెంపొందించడానికి సహాయపడుతుంది. వ్యక్తిగతంగా మెచ్చి.. స్వదేశానికి తెచ్చి.. ‘మారథాన్ రన్నర్స్, క్రీడాకారులకు కఠినమైన శిక్షణ తర్వాత అలసట దూరం కావడానికి ఈ థెరపీ ఉపయోగపడుతుంది. ఈ క్రమంలో ఇది బాగా ప్రాచుర్యం పొందింది. ఇప్పుడు విభిన్న వర్గాల వారు ఆరోగ్యం కోసం దీన్ని ఎంచుకుంటున్నారు. మార్షల్ ఆర్ట్స్పై ఆసక్తితో థాయిలాండ్లోని ఎలైట్ ఫైట్ క్లబ్లో సభ్యులుగా శిక్షణ పొందుతున్న సమయంలో ఈ ఐస్ బాత్ థెరపీ గురించి తెలిసింది. నగరంలో దీనిని ప్రవేశపెట్టాలని నార్సింగిలో ఓ సెంటర్తో పాటు మొబైల్ ఐస్ బాత్ థెరపీ అందుబాటులోకి తీసుకొచ్చాం. ప్రారంభకులకు 90 సెకన్ల నుంచి అత్యధికంగా 3 నిమిషాలు మాత్రమే సూచిస్తాం. ఆ తర్వాత వారి వారి ఇష్టం, సామర్థ్యాలను బట్టి వ్యవధి పెంచుకోవచ్చు. వ్యక్తిగతంగా 18 నిమిషాల వరకూ ఐస్ బాత్ చేయగలను. జాగ్రత్తలు తప్పనిసరి.. ఐస్బాత్ ఈవెంట్లో పాల్గొనాలని అనుకున్నప్పుడు తప్పనిసరిగా ముందస్తు వైద్య సలహా తీసుకోవాలి. అధిక లేదా తక్కువ రక్తపోటు, గుండె సంబంధిత రుగ్మతలు, నాడీ సంబంధిత పరిస్థితులు, మధుమేహం లేదా వాసు్కలర్, ఏవైనా ఇతర సమస్యలు ఉన్నవారికి ఇది నప్పదు. ఐస్ బాత్ వ్యవధి ఒక నిమిషం నుంచి 2 నిమిషాలు వరకూ సరిపోతుందని, అయితే కొన్ని సెషన్ల తర్వాత వ్యక్తులు వారి వారి శరీర తత్వాన్ని బట్టి వ్యవధిని పెంచుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ప్రారంభకులకు, సంవత్సరానికి 3–4 సెషన్లు సరిపోతాయి. శరీరం ప్రతిస్పందనను బట్టి ఆరోగ్య లక్ష్యాల ఆధారంగా ఫ్రీక్వెన్సీని పెంచవచ్చు. ప్రస్తుతం సెషన్ సెటప్ ఫెసిలిటేటర్ నైపుణ్యాన్ని బట్టి రూ.2,000 నుంచి రూ.8,000 వరకూ ఉంది. (చదవండి: అత్యంత వృద్ధ డాక్టర్గా రికార్డు..! ఇప్పటికీ వైద్య సేవలోనే..! ఏజ్లో సెంచరీ కొట్టాలంటే..) -
102 ఏళ్ల డాక్టర్..ఇప్పటికీ వైద్య సేవలోనే..! చిరకాలం బతకాలంటే..
ఎవ్వరైన రిటైర్మెంట్ ఏజ్ వరకు పనిచేస్తారు. ఆ తర్వాత పదవీవిరణ చేసి..రెస్ట్ తీసుకుంటారు. ఇది సర్వసాధారణం. కానీ ఈ శతాధికుడు విరామం ఎరుగని వైద్యుడు. ఇప్పటికీ డాక్టర్గా ప్రాక్టీస్ చేస్తూ..స్ఫూర్తిగా నిలుస్తున్నారు. నేటి యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు. రెండొవ ప్రపంచకాలం నాటి ఈ వృద్ధ డాక్టర్ అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ అందిపుచ్చుకుంటూ అంతకంతకు పురోగమిస్తున్నారు. యువకుడి మాదిరిగా చురుగ్గా అన్నిపనులు చురుగ్గా చేసుకుంటారాయన. అంతేగాదు సుదీర్ఘకాలం ఆరోగ్యంగా బతకాలంటే ఆ పనులు చేయొద్దని సూచనలిస్తున్నారాయన.అతడే. అమెరికాలో క్లీవ్ల్యాండ్కు చెందిన న్యూరాలజిస్ట్ డాక్టర్ హోవార్డ్ టక్కర్. ఆయనకు 102 ఏళ్లు. ఇప్పటికీ డాక్టర్గా ప్రాక్టీస్ చేస్తూ..ఎందరో వైద్య విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్నారు. అంతేగాదు టక్కర్ అత్యంత వృద్ధ ప్రాక్టీస్ డాక్టర్(Worlds Oldest Practicing Doctor)గా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ను కూడా దక్కించుకున్నాడు. 1922లో జన్మించిన డాక్టర్ టక్కర్ మహా మాంద్యం, రెండో ప్రపంచ యుద్ధం, కోవిడ్-19 మహమ్మారితో సహా ఒక శతాబ్ద నాటి చారిత్రక సంక్షోభాలకు నిలువెత్తు సాక్ష్యం ఆయన. విశేషం ఏంటంటే..ఇప్పటివరకు పూర్తి ఆరోగ్యంతోనే ఉన్నారు డాక్టర్ టక్కర్. తాను ఇంతవరకు ఎలాంటి భయానక వ్యాధులతో బాధపడలేదన్నారు. అయితే 80లలో మాత్రం మెడ సమస్యతో కొన్నాళ్లు ఇబ్బంది పడ్డానని, అయితే సునాయాసంగా ఆ సమస్యను జయించానని చెప్పారు. తన జీవితానుభవంతో నేర్చుకున్న ఆ నాలుగు పాఠాలే తన దీర్ఘాయువు రహస్యంగా విశ్వసిస్తారాయన. అంతేగాదు పదవీవిరమణ గురించి కూడా అస్సలు ఆలోచించరట. ఎందుకంటే దీర్ఘాయువు ప్రధాన శత్రువే పదవీ విరమణ అని నొక్కి చెబుతున్నారాయన. మరి టక్కర్ దీర్ఘాయువు రహస్యం ఏంటో తెలుసుకుందాం..👉 ఈ వృద్ధ డాక్టర్ తన జీవితాంతం వ్యాయామాన్ని స్కిప్ చేయలేదన్నారు. ఈత కొట్టడం దగ్గర నుంచి జాగింగ్, స్కీయింగ్, జిమ్, ట్రెడ్మీల్ వరకు అన్నింటి ని చేస్తారట ఆయన.👉 అలాగే ఉద్యోగానికి పదవీవిరమణ ఇవ్వొద్దు..ఏదో ఒక వ్యాపకంతో ఉండండి. చేయగలిగిన ఉద్యోగం ఏదో ఒకటి చేయండి అని అంటున్నారు. లేదంటే మెదడు పిచ్చి పిచ్చి ఆలోచనలతో పాడవ్వుతుందట. తద్వారా అనారోగ్యాల బారినపడతామట. 👉 ఎల్లప్పుడూ పనిజీవితం, కుటుంబ జీవితంలో సంతోషంగా ఉండేందుకు ప్రయత్నించండి. అలాగే ఎల్లప్పుడూ సానుకూలత, ఆశావాదానికే ప్రాముఖ్యత ఇవ్వండి. 👉 భవిష్యత్తు గురించి చిత్తించకుండా చేసే పనిలో సంతోషాన్ని వెతకండి. అలాగే కుటుంబసభ్యులు, స్నేహితులతో సంతోషంగా గడపండి. 👉 ఈ వృద్ధ డాక్టర్ వ్యక్తిగత జీవితానికి వస్తే..మానసిక నిపుణురాలైన సారా అనే మహిళను పెళ్లి చేసుకున్నారు. ఆ దంపతులకు నలుగురు పిల్లలు, పదిమంది మనవరాళ్లు ఉన్నారు. అయితే ఇప్పటికీ తన భార్యతో గొడపడటం, ప్రేమించడం వంటివి చేస్తానన్నారు.👉 చివరగా ప్రతిఒక్కరు తమ జీవిత లక్ష్యాలను ఏర్పరుచుకోవాలన్నారు. ప్రతి ఉదయం సాధారణంగా సాగిపోకూడదన్నారు. అప్పుడే జీవితానికి సార్థకత ఉంటుందని చెప్పారు. 👉 అలాగే ఆయన సాధ్యమైనంత వరకు స్మార్ట్ఫోన్, ఇంటర్నెట్ని వినియోగిస్తారు. సోషల్ మీడియా స్టార్గా మాత్రం ఉండనున్నారు. ఎందుకంటే స్వానుభవాలే..గొప్ప పాఠాలనేది ఆయన అభిమతం. 👉 వీటన్నింటి తోపాటు ధూమపానం, మద్యపానం సేవించొద్దని అన్నారు. తాను జీవితాంతం వాటి జోలికిపోలేదన్నారు. అలాగే మితంగానే ఆహారం తీసుకుంటానని చెప్పారు. 👉 అంతేగాదు డాక్టర్ టక్కర్ "జీవితమే ప్రాణాంతక వ్యాధి , దానికి విరుగుడు జీవించడమే" అని చమత్కారంగా చెప్పారు. ఈ వృద్ధ డాక్టర్ మాములు గ్రేట్ కాదు. అద్భుతమైన జీవిత పాఠాలు, ఆరోగ్య విధానం గురించి బహు చక్కగా వివరించారు డాక్టర్ టక్కర్. (చదవండి: ఆక్సియమ్ స్పేస్ మిషన్లో ఈసారి సరస్వతి దేవి వాహనం..) -
హృదయం అద్దమనీ.. పగిలితే అతకదనీ..
ఇష్టమైన వ్యక్తి చనిపోతే చూసి తట్టుకోలేక గుండె పట్టుకొని కూలిపోవడం వంటి దృశ్యాలు సినిమాల్లో చూస్తూ ఉంటాం. అయితే ఇలాంటి ఘటనలు నిజ జీవితంలో జరిగేవే అంటున్నారు వైద్య నిపుణులు. నిజ జీవితంలోనూ ప్రియమైన వ్యక్తుల అకాల మరణం, అనారోగ్యం పాలైన విషయం తెలుసుకున్న సందర్భాల్లో తీవ్ర ఒత్తిడి, దుఃఖం, ఆవేదన వెంటాడతాయని, ఇలాంటి ప్రతికూల భావోద్వేగాలు గుండె పనితీరుపై ప్రభావం చూపుతాయి. ఈ పరిస్థితినే బ్రోకెన్ హార్ట్ సిండ్రోమ్ అని పిలుస్తారని వారంటున్నారు. ఇంతకీ బ్రోకెన్ హార్ట్ అంటే ఏంటి? దాని పరిణామాలు మనిషి ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయి? - సాక్షి, అమరావతిటకోట్సుబో కార్డియో మయోపతి.. బ్రోకెన్ హార్ట్ ను వైద్య పరిభాషలో టకోట్సుబో కార్డియో మయోపతిగా పేర్కొంటారు. సాధారణంగా పురుషులతో పోలిస్తే మహిళల్లో ఈ సమస్య అధికం. అయితే మరణాల విషయంలో మహిళలతో పోలిస్తే పురుషుల్లోనే రెట్టింపు ఉన్నట్లు పరిశోధకులు చెబుతున్నారు. ఈ విషయమై ఇటీవల అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ఓ జర్నల్ను ప్రచురించింది. 1.99 లక్షల మంది రోగులపై అధ్యయనం 2016–2020 మధ్యలో అమెరికాలో 1,99,890 బ్రోకెన్ హార్ట్ సిండ్రోమ్ మరణాలు సంభవించాయి. వీటిపై పరిశోధకులు సుదీర్ఘ అధ్యయనం చేశారు. ఈ క్రమంలో పురుషుల్లో మరణాల రేటు ఎక్కువగా ఉన్నట్టు గుర్తించారు. మొత్తం మరణాల రేటు 6.5 శాతంగా నమోదుకాగా, పురుషుల్లో 11.2, మహిళల్లో 5.5 శాతం మరణాలు సంభవించాయని అధ్యయనంలో వెల్లడించారు. ఆ వయస్కులవారికే అధికం సాధారణంగా బ్రోకెన్ హార్ట్ సిండ్రోమ్ ప్రభావం 61 ఏళ్లు పైబడినవారిపైనే అధికం. 31–45 సంవత్సరాల వయసు గల వారితో పోలిస్తే 46–60 సంవత్సరాల వారిలో సమస్య 2.6 నుంచి 3.25 రెట్లు ఎక్కువ. టకోట్సుబో కార్డియో మయోపతి అనేది ప్రతికూల భావోద్వేగం, తీవ్రఒత్తిడితో కూడిన గుండె జబ్బు అని పరిశోధకులు వెల్లడించారు. సమస్య తలెత్తితే.. బ్రోకెన్ హార్ట్ కారణంగా..గుండెలో కొంత భాగం తాత్కాలికంగా పెద్దదిగా మారుతుంది. రక్త ప్రసరణ నిలిచిపోతుంది. గుండె దడ, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు కనిపిస్తాయి.భావోద్వేగ మద్దతు అవసరం కావాల్సినవాళ్లు, అత్యంత ఆప్తులు దూరమైన సందర్భాల్లో కొందరు తీవ్ర భావోద్వేగానికి గురవుతుంటారు. అలాంటి సందర్భాల్లో కొన్ని సార్లు గుండెపోటు సంభవిస్తుంది. ఇలాంటివారికి భావోద్వేగపరమైన మద్దతు అందించాలి. ఒత్తిడి నుంచి బయటపడేలా సహకారం అందించాలి. – డాక్టర్ ప్రభాకర్ రెడ్డి, గుండె, ఊపిరితిత్తుల శస్త్రచికిత్సల నిపుణుడు, జీజీహెచ్, కర్నూలు -
లాస్ట్ మీల్ ఎన్నింటికి తింటున్నారు..? నటి కరీనా కపూర్ ఏకంగా..
సాయంత్రం కాస్త ఎర్లీగా భోజనం తినేయమని చెబుతుంటారు నిపుణులు. అదే ఆరోగ్యకరమని పదే పదే నొక్కి చెబుతుంటారు. ఇటీవల ప్రముఖ బాలీవుడ్ నటి కరీనా కపూర్ సైతం అదే మాట అన్నారు. తాను కూడా అలానే తింటానని చెప్పారు కూడా. పైగాఅదే తన ఫిట్నెస్ సీక్రెట్ అని చెప్పారామె. ఆరోగ్యప్రదాత సూర్యుడి గమనం ఆధారంగానే మన జీవక్రియ పనిచేస్తుందని..దానికనుగుణంగా తింటేనే మంచిదని చెబుతున్నారు నిపుణులు కూడా. సెలబ్రిటీలు సైతం ఫాలో అవుతున్న ఈ హెల్దీ ట్రిక్ గురించి సవివరంగా చూద్దామా..!.నాలుగు పదుల వయసులో ఉన్న కరీనా కపూర్ సైతం సౌందర్యపరంగానే కాకుండా ఫిట్నెస్ పరంగా చాలా మంచి జీవశైలికి పేరుగాంచిన నటి. ఈ ఏజ్లో కూడా యువ హీరోయిన్లకు తీసిపోని విధంగా కట్టిపడేసే గ్లామర్ కరీనా సొంతం. ఆమె చాలా క్రమశిక్షణాయతమైన జీవనశైలిని ఫాలో అవుతానని పలు ఇంటర్వ్యూలో స్వయంగా చెప్పారామె. పోషకాహారంతో కూడిన డైట్, బాడీకి తగిన వర్కౌట్లు, త్వరిత గతిన నిద్రకు ఉపక్రమించడం వంటి మంచి అలవాట్లనే అనుసరిస్తారామె. అయితే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన చివరి మీల్ కచ్చితంగా సాయంత్రం 6.30 కల్లా పూర్తి అయిపోయేలా చూసుకుంటానన్నారామె. ఈ విషయం అందర్నీ ఆశ్చర్యపరిచింది. అంత త్వరగానే అని అనుకున్నారు కూడా. కానీ కరీనా మాత్రం ఆరోగ్యకరంగా ఉండాలంటే ఇది తప్పనిసరని చెబుతోంది.అలానే మంచిదా అంటే.. సూర్యదోయం వేళ మన శరీరం చాలా చురుకుగా ఉంటుందట. ఆ సమయంలోనే మన జీవక్రియలు యాక్టివ్గా ఉంటాయట. అంటే పగలు మనం ఎలాంటి ఫుడ్ తీసుకున్నా..సులభంగా అరిగిపోతుందట. పైగా మనం మేల్కోనే ఉంటాం కాబట్టి సులభంగా ఆ ఎనర్జీ అంతా బర్న్ అయిపోతుందట. ఇక సూర్యాస్తమయ వేళ్లకు మన శరీరంలోని జీవక్రియలు నెమ్మదిస్తాయి. కాబట్టి ఆ టైంలో జీర్ణమవ్వడానికి అధిక సమయం తీసుకునే ఫుడ్కి దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. పైగా అది కూడా సూర్యస్తమయంలోపే ఫినిష్ చేస్తే మంచిదట. దానివల్ల మనం పడుకునే సమయానికి అరిగిపోయి..త్వరితగతిన మేల్కొనడానికి ఉపకరిస్తుంది. మన శరీరధర్మానికి అత్యంత అనువైన జీవన విధానం ఇదేనని నిపుణులు నొక్కి చెబుతున్నారు. మన పూర్వీకులు దీన్ని బాగా అనుసరించేవారని చెబుతున్నారు. ఇలా సాయంత్రం 6.30 కల్లా భోజనం తినేస్తామో..అప్పుడు మనం దాదాపు 12 నుంచి 14 గంటలు అడదడపా ఉపవాసం ఉన్నట్లువతుంది. పైగా ఉదయమే చక్కటి లెమన్ విత్ హనీ వాటర్తో రోజుని మొదలుపెట్టి, నచ్చిన ప్రూట్ సలాడ్ వంటి పోషకాహారాలను బ్రేక్ఫాస్ట్గా తీసుకుంటే మంచిదట. ఈ విధానంలో మనం సాయంత్రం సమయాల్లో స్నాక్స్ దూరంగా ఉండటం జరుగుతుందని చెబుతున్నారు నిపుణులు. ఆరోగ్య ప్రయోజనాలు..జీర్ణక్రియ మెరుగ్గా ఉంటుందికడుపు ఉబ్బరం లేదా గ్యాస్ సమస్య ఉండదుఇలా ముందుగా తింటే ఇన్సులిన్ సెన్సిటివిటీ మెరుగుపడుతుందని పరిశోధనలో తేలింది కూడాదీనివల్ల విశ్రాంతి సమయంలో ఎక్కువ కేలరీలు బర్న్ అవుతాయిబరువు అదుపులో ఉంటుందినిద్ర నాణ్యత కూడా మెరుగుపడుతుందటరోజంతా చురుగ్గా ఉంటారట మరీ అంత తొందరగా తినలేకపోయినా..కనీసం సాయంత్రం 7.30 గంటల లోపు భోజనం ఫినిష్ చేస్తే మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేసి..సత్ఫలితాలను పొందండి మరి..గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రేమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం(చదవండి: జస్ట్ 10 నిమిషాలు ఆ వ్యాయామం చేస్తే చాలట! నాసా స్టడీ) -
జస్ట్ 10 నిమిషాలు అదొక్కటి చాలు! నాసా స్టడీ
అందరూ ఆరోగ్యంపై ఫోకస్ పెట్టాలి అనుకుంటారు. కానీ మధ్యలోనే వదిలేసేవాళ్లు కొందరైతే, మరికొంతమంది మన వల్ల కాదు అని చేతులేత్తుస్తుంటారు. అస్సలు హెల్దీగా ఉండాలంటే..అది చాలా తేలిగ్గా తెలివిగా చేసే పని అంటోంది నాసా. అందరూ బిజీ షెడ్యూల్తో శారీర ఆరోగ్యంపై దృష్టి పెట్టడం కష్టంగా మారింది. పైగా వర్కౌట్లు కొన్ని రోజుల తర్వాత విపరీతమైన వొళ్లు నొప్పులుగా అనిపించి స్కిప్ చేసేస్తుంటారు. దాంతో చాలామంది కంటిన్యూ లేదా దైనందిన జీవితంలో ఆ వ్యాయామాలను భాగం చేసుకోలేక విఫలమవుతుంటారు. అలాంటివాళ్లు ఒక్క పదినిమిషాలు ఈ వ్యాయమానికి కేటాయించండి చాలు అని చెబుతోంది నాసా పరిశోధన. ఇది ఎంత ప్రభావవంతమైన ప్రయోజనాలందిస్తుందో తెలిస్తే ఆశ్చర్యపోతారని అంటోంది. పైగా మధ్యలో వదిలేయరు, అది మీ జీవితంలో ఓ భాగమైపోతుందని నమ్మకంగా చెబుతోంది. మరీ ఆ వ్యాయామం ఏంటంటే..ఎక్కువ పని ఒత్తిడి, కుటుంబ బాధ్యతలతో సతమతమయ్యే వారికి ఈ వ్యాయామం చాలా బాగా ఉపయోగపడుతుందని చెబుతోంది నాసా. ఇది ఒక చిన్న ట్రాంపోలిన్పై చేసే జంపింగ్ లాంటి వ్యాయామం. పిల్లలు అమిత ఇష్టంగా చేసే జంపింగ్ క్రీడ. ఇది గనుక చేస్తుంటే తెలియకుండానే ఒక విధమైన ఆనందం..పైగా అమితోత్సాహంతో మరింతగా చేస్తారట కూడా. ఇది తెలియకుండానే బాడీలోని కేలరీలను తగ్గిస్తుందట. ఇందుకోసం కావాల్సిందల్లా..మినీ-ట్రాంపోలిన్ ఉంటే చాలు. దీంతో జంపింగ్ జాక్లు చేస్తుంటే..బరువు అదుపులో ఉండటమేగాక..బాడీ కూడా ఫిట్గా ఉంటుందని చెబుతున్నారు. పోనీ ఈ జంపింగ్ కుదరకపోతే..ఓ 30 నిమిషాలు మీకు నచ్చిన మ్యూజిక్తో నచ్చినట్లుగా గంతులు వేయండి. ఓ పద్ధతి అవసరం లేదు బాడీ అంతా ఊగేలా ఎంజాయ చేస్తూ నచ్చినట్లుగా డ్యాన్స్ చేయండి. దాన్ని ఒక అలవాటుగా చేసుకోండి చాలు అని చెబుతోంది నాసా. ఇది పరుగు, జాగింగ్ కంటే కూడా అత్యంత ప్రభావవంతంగా ఉంటుందట. కచ్చితంగా మెరుగైన ఫలితాలు పొందగలరని చెబుతోంది నాసా పరిశోధన. ఇది శరీరంపై అధిక ఒత్తడిని కలిగించదు. అదీగాక ఎవ్వరైనా హాయిగా సులభంగా చేయగలిగేవే ఈ వ్యాయమాలని పేర్కొంది నాసా. ఆరోగ్య లాభాలు..సరదాగా ఉండే ఈ వ్యాయమాం కిల్లర్ ఫుల్ బాడీ వ్యాయామంకీళ్లపై సున్నితంగా ఉంటుంది. అయితే మోకాళ్లు, చీలమండలంపై కఠినంగా ఉంటుంది. శోషరస వ్యవస్థ మెరుగ్గా ఉండేలా చేస్తుంది. పైగా ఇది మంచి కార్డియో వర్కౌట్ల పనిచేస్తుంది. ఆరోగ్యానికి బెస్ట్ వ్యాయామం కూడా.గమనిక: ఈ కథనం కేవలం అవగాహన కోసం మాత్రేమే ఇచ్చాం. పూర్తి వివరాల కోసం వ్యక్తిగత వైద్యులను లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం.(చదవండి: ఆ విషయాలు గురించి అస్సలు మాట్లాడను! హాట్టాపిక్గా హర్ష్గోయెంకా ప్రసంగం) -
Obesity పోషకలోపం.. ఊబకాయం!
డబుల్ బర్డెన్ ఆఫ్ మాల్న్యూట్రిషన్తో బాధపడుతున్న తెలంగాణ యువతపురుషులతో పోలిస్తే మహిళల్లో పెరుగుతున్న స్థూలకాయం అధిక బరువుతో ఇబ్బందిపడుతున్న 18.8% మంది అతివలు ధనవంతుల ఇళ్లలో స్థూలకాయం... పేదల్లో పోషకాహార లోపం చదువుకోని/చదువుకున్న తల్లులు ఉన్న ఇళ్లలోనూ స్పష్టమైన తేడా యంగ్ లైవ్స్ సర్వే–2023లో కలవరపెట్టే గణాంకాలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో 22 ఏళ్ల యువతలో ఒకవైపు స్థూలకాయం పెరుగుతుండగా మరోవైపు పోషకాహార లోపం కూడా తీవ్రంగా కనిపిస్తోంది. దీన్ని నిపుణులు ‘డబుల్ బర్డెన్ ఆఫ్ మాల్న్యూట్రిషన్’గా పేర్కొంటున్నారు. తెలంగాణ యువత ఆరోగ్య పరిస్థితులు ప్రమాదకరంగా మారుతున్నట్లు ‘యంగ్ లైవ్స్’రౌండ్–7 సర్వే (2023–24) ఫలితాలు హెచ్చరిస్తున్నాయి. ఈ సర్వే ప్రకారం 22 ఏళ్ల యువతలో 19 శాతం మంది అధిక బరువు/ఒబేసిటీతో ఉండగా 29 శాతం మంది తక్కువ బరువుతో ఉన్నారు. 2016తో పోలిస్తే స్థూలకాయం రెండింతలైంది. అయితే ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే పురుషులతో పోలిస్తే మహిళల్లో స్థూలకాయం ఎక్కువగా (18.8%) కనిపిస్తోంది. పురుషుల్లో ఇది 14 శాతంగా ఉంది. మధుమేహం, గుండెజబ్బుల వంటి ప్రమాదాలకు దీన్ని కేంద్రంగా నిపుణులు గుర్తించారు. ఇప్పటికే 22.7% మహిళలు హై కార్డియోవ్యాసు్కలర్ రిస్్కలో ఉన్నారని హెచ్చరిస్తున్నారు. ఇంతకంటే ఆందోళనకరమైన విషయం ఏమిటంటే పోషకాహార లోపంతో బాధపడుతున్న వారి సంఖ్య కూడా తెలంగాణలో 29 శాతంగా ఉన్నట్లు సర్వే తేల్చింది. అందులో గ్రామీణ యువతలో తక్కువ బరువు ఉన్నవారి శాతం 30.9% కాగా.. పట్టణాల్లో ఇది 23.8% శాతంగా ఉంది. ఎస్సీ, ఎస్టీ వర్గాల్లో, తల్లులు తక్కువ చదువుకున్న కుటుంబాల్లో ఈ పరిస్థితి మరింత ఎక్కువగా ఉందని సర్వే పేర్కొంది.మానసిక ఒత్తిడిలో యువత తెలంగాణలో వివిధ కారణాల వల్ల యువతలో 2023 నాటికి 71.3 శాతం మోస్తరు స్థాయి ఒత్తిడికి గురవుతున్నారని సర్వేలో వెల్లడైంది. పెద్దల్లో ఇది 68 శాతంగా ఉంది. వారిలో పురుషులు 66.7 శాతంగా ఉంటే మహిళలు 75.9 శాతంగా ఉన్నారు. ఇక 22.6% మందిలో మితమైన ఆందోళన, 17.47% మందిలో మితమైన డిప్రెషన్ లక్షణాలు బయటపడ్డాయి. మహిళలకంటే పురుషులు తక్కువ మానసిక సమస్యలకు గురవుతున్నట్లు గణాంకాల ద్వారా తేలింది. పట్టణ యువతలో వాటి ప్రభావం మరింత ఎక్కువగా ఉండటం గమనార్హం. కోవిడ్ తరువాత భావోద్రేకం లక్షణాలు 1.5 శాతం పెరిగినట్లు సర్వే తేల్చింది. కరోనా తర్వాత ఆరోగ్యంగా ఉండాలనే అభిలాష ప్రజల్లో పెరిగిందని.. గతంలో 23 శాతం మందే ఐదు రకాల ఆహార పదార్థాలు తీసుకోగా ఇప్పుడు వారి సంఖ్య 37 శాతానికి చేరినట్లు పేర్కొంది.అక్కడలా.. ఇక్కడిలా..’సామాజిక, ఆర్థిక స్థితిగతులు కూడా వ్యక్తిగత ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్నట్లు సర్వేలో తేలింది. సామాజికంగా దిగువస్థాయి వర్గాల్లో పోషకాహార లోపం ఎక్కువగా ఉండగా ఆరోగ్యంపై సరైన అవగాహన, వైద్యం లేకపోవడం వల్ల ఈ సమస్య ఏటా ఎక్కువవుతోంది. అదే సమయంలో ధనవంతుల ఇళ్లలో ఊబకాయ సమస్య ఎక్కువగా ఉంటుండగా పోషకాహార లోపంతో బాధపడే వారి సంఖ్య చాలా తక్కువ అని తేలింది. 2016లో ధనవంతుల ఇంటి యువతలో స్థూలకాయం 30.6% ఉండగా.. పేదల్లో ఇది 14.0% మాత్రమే. అలాగే పేదల్లో తక్కువ బరువుతో 36.1 శాతం మంది ఉండగా ధనవంతుల్లో అది 21.5 శాతంగా ఉంది. -
Plastic Water bottles : అవసరమా.. ఆకర్షణీయమా!
ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరికీ హస్తభూషణంగా మారింది వాటర్ బాటిల్. మన చేతుల్లో ఉండే వస్తువుల్లో ముఖ్యమైనదిగా ఈ బాటిల్స్ మారాయి. పనిలో పనిగా గుళ్ల నుంచి జిమ్ వరకూ, స్కూల్ బ్యాగ్ నుంచి కార్ కోల్డ్ బాక్స్ వరకూ ప్రతిచోటా ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ సర్వసాధారణం అయ్యాయి. జెన్ జీ భాషలో చెప్పాలంటే ఒక ‘లైఫ్స్టైల్ స్టేట్మెంట్’గా అయిపోయింది. ప్లాస్టిక్ బాటిళ్లు విభిన్న డిజైన్లలో లభ్యమవుతుండటంతో మార్కెట్లో విపరీతంగా అమ్ముడవుతున్నాయి. మరీ ముఖ్యంగా ప్రస్తుతం స్కూల్స్ పునఃప్రారంభం అవుతున్న నేపథ్యంలో నగరంలో అధిక సంఖ్యలో ఈ ప్లాస్టిక్ బాటిల్స్ అమ్మకాలు జరుగుతున్నాయి. అయితే ఈ బాటిళ్ల వల్ల కలిగే ఆనారోగ్య, పర్యావరణ సమస్యలు వెంటాడుతున్నాయి. దీనిపై విస్తృత ప్రచారం ఉన్నప్పటికీ డిజైన్స్కి ఆకర్షితులవుతూ.. వివిధ రకాల రోగాలకు చేరువవుతున్నారు. –సాక్షి, సిటీబ్యూరో ప్లాస్టిక్ బాటిల్స్ ఇప్పుడు మార్కెట్లో అందుబాటులో ఉండటమే కాకుండా, రకరకాల రంగులు, డిజైన్లు, కార్టూన్ క్యారెక్టర్లు, గ్లిట్టర్ ఎఫెక్ట్స్తో అందరి మనసు దోచేస్తున్నాయి. ప్రత్యేకించి చిన్నపిల్లలు అవి చూసి వాటిపై మక్కువ పెంచుకుంటున్నారు. నగరంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా స్కూల్స్ పునః ప్రారంభమవుతున్న నేపథ్యంలో పిల్లల కోసం బాటిల్స్ కొనుగోలు ఎక్కువగా జరుగుతోంది. దీంతో పాటు మార్కెట్లో పిల్లల కోసం వివిధ మోడళ్లు అందుబాటులో ఉండటంతో కొందరు ఒకటికి మించి బాటిళ్లను వినియోగిస్తున్నారు. తల్లిదండ్రులు కూడా తక్కువ ధరకు వస్తున్నాయనే ఉద్దేశంతో పిల్లలు అడిగినట్లు రెండు మూడు రకాలు కొని పెడుతున్నారు. ఇదీ చదవండి: Obesity పోషకలోపం.. ఊబకాయం!ప్లాస్టిక్ అనేది సహజంగా కుళ్లని పదార్థం. ప్లాస్టిక్ బాటిల్స్ ఒకసారి భూమిలో పడితే దాదాపు 450 ఏళ్ల పాటు మట్టిలో కలిసిపోవు. హైదరాబాద్ నగరంలో ప్రతి రోజు వేల సంఖ్యలో వినియోగించిన బాటిల్స్ పారేస్తున్నారు. వీటిలో మళ్లీ రీసైకిల్ అవ్వడం చాలావరకూ జరగకపోవడం వల్ల, ఈ ప్లాస్టిక్ వాడకం అత్యధిక వ్యర్థంగా మారుతోంది. నగర శుభ్రతపై కూడా ప్రభావం చూపుతోంది. పర్యావరణానికి భారంగా ప్లాస్టిక్.. పిల్లల కోసం బాటిల్ కొంటే, దాని శక్తినీ, దుష్ర్పభావాలనూ అంచనా వేయాలి. మెటీరియల్ ఎలా ఉందో తెలుసుకోవాలి. అందం మాత్రమే కాకుండా ఆరోగ్యం అనే కోణాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. ఇక స్కూల్స్, కంపెనీలు కూడా ప్లాస్టిక్ బాటిల్స్ వినియోగాన్ని తగ్గించేందుకు స్పష్టమైన మార్గదర్శకాలు అమలు చేయాల్సిన అవసరముందని నిపుణులు, సామాజికవేత్తలు నినదిస్తున్నారు. ప్లాస్టిక్ బాటిల్ ఇప్పుడు ఒక హస్తభూషణం అవుతున్నా, దీని వెనుక ఆరోగ్యాన్ని, భవిష్యత్తును పణంగా పెట్టుకోవడం దురదృష్టకరం. మన చేతిలో ఉన్న బాటిల్ కాస్త బాధ్యతతో ఎంచుకుంటే, మన ఆరోగ్యాన్ని రక్షించడమే కాదు, భూమిని కూడా కాపాడిన వాళ్లమవుతామని ప్రకృతి ప్రేమికులు సూచిస్తున్నారు. స్టైలిష్ డిజైన్ల పేరిట ప్రమాదం.. బిస్ ఫినాల్–ఏ (బీపీఏ), మైక్రోప్లాస్టిక్స్ వంటి రసాయనాలు కొన్ని తక్కువ నాణ్యత గల ప్లాస్టిక్ బాటిల్స్లో ఉండే అవకాశముంది. ఇవి నీటిలో కలిసిపోయి మానవ శరీరంలోకి చేరినప్పుడు, హార్మోనల్ డిసార్డర్స్, మానసిక అభివృద్ధి సమస్యలు, తక్కువ నిరోధక శక్తి వంటి అనారోగ్యాలను కలిగించే ప్రమాదం ఉంది. ముఖ్యంగా చిన్న పిల్లల ఆరోగ్యానికి ఇది ఓ మౌన సంకటమే. వాస్తవానికి తల్లిదండ్రులకు దీనిపై అవగాహన లేకపోవడంతో స్టైలిష్ డిజైన్ల పేరిట ప్రమాదాన్ని కొనుగోలు చేస్తున్నారు.చదవండి: రూ. 20 వేలతో ష్యాషన్ బ్రాండ్..కోట్ల టర్నోవర్ : దోస్తుల సక్సెస్ స్టోరీప్రత్యామ్నాయాల వైపు చూపు.. మెటల్ బాటిల్స్ (స్టీల్, కాపర్) మునుపటి కాలంలో ఎక్కువగా వాడేవారు. ఇవి ఆరోగ్యానికి మంచివి, మైక్రోప్లాస్టిక్స్ సమస్య ఉండదు. దీర్ఘకాలికంగా వాడవచ్చు. కానీ ప్లాస్టిక్ బాటిల్స్లో ఉన్న డిజైన్ వైవిధ్యం, తక్కువ ధర, తక్కువ బరువు వల్ల ప్రజలు వాటిపైనే ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. ఈ స్థితిలో డిజైనర్లకు, తయారీదారులకు కూడా నూతన బాధ్యత ఉంది.. ఆరోగ్యానికి హానీ లేకుండా, ఆకర్షణీయమైన డిజైన్లతో మెటల్ బాటిల్స్ తయారుచేయడం మాత్రమే దీనికి ఏకైక పరిష్కారం. వీలుంటే గ్లాస్ బాటిల్లు వినియోగించడం మరింత ఉత్తమం. -
అందరూ ఆమె బతకదన్నారు..! కానీ ఇవాళ ఆమె లుక్ చూస్తే..
కొందరు చావు అంచులు దాక వెళ్లొచ్చి..బతికొస్తుంటారు. అలా ఆయురారోగ్యాలతో ఉన్నావారెందరో. ఒకరకంగా వారంతా ఆ అనారోగ్యం మేల్కొలుపుతో ఆరోగ్యవంతమైన జీవితం గడిపి స్ఫూర్తిగా నిలుస్తుంటారు. అలాంటి కోవకు చెందిందే ఈ డాక్టర్. అంతటి భయానక పరిస్థితి నుంచి బయటపడ్డ ఆమె లుక్ను చూస్తే కంగుతింటారు. ఈమెనే అనారోగ్యం బారినపడింది అనే సందేహం కలుగమానదు. ప్రస్తుతం ఆమె వృద్ధాప్యాన్ని తిప్పికొట్టి.. దీర్ఘాయువుతో ఎలా ఉండాలో చిట్కాలు చెబుతున్నారామె. మరీ ఆ డాక్టర్ ఆసక్తికర గాథ ఏంటో చూద్దామా..!.లండన్కి చెందిన 53 ఏళ్ల లైఫ్స్టైల్ వైద్య నిపుణురాలు డాక్టర్ అల్కా పటేల్ని చూస్తే 23 ఏళ్ల అమ్మాయిలా ఉంటుంది. ఆమె జీవ సంబంధమైన వయసు కేవలం 23 ఏళ్లేనని ఆమెనే స్వయంగా చెబుతున్నారు. మనలో కొందరూ ఏజ్ పరంగా చాలా పెద్దవాళ్లైన లుక్చూస్తే చిన్నవాళ్లలా ఉంటారు. అలా మనం కూడా ఉండొచ్చని అల్కా అంటున్నారు. మంచి ఆహారపు అలవాట్లు, సరైన జీవనశైలితో ఆరోగ్యాన్నే కాదు మన ఏజ్ని కూడా తగ్గించుకోవచ్చు అంటున్నారామె. ఒకప్పుడామె..ఆమె రెంబు దశాబ్దాలకు పైగా జనరల్ ప్రాక్టీషనర్ సేవలందించిన డాక్టర్ ఆమె. ఎక్కువ సమయం తన పేషెంట్ల బాగోగుల, కుటుంబ బాధ్యతలకు కేటాయించి తన ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేశారామె. దాంతో సడెన్గా తన 39వ పుట్టనరోజున ఎడతెరగని జ్వరం బారినపడింది. సాధారణ జ్వరం కాస్త సివియర్ అయిపోయింది. నెమ్మదిగా అవయవాలన్నీ పనిచేయడం మానేశాయి. అసలు ఆమె ఏ వ్యాధితో బాధపడుతుందో వైద్యులకే అంతు చిక్కలేదు. ఇక లాభం లేదని అవయవాలు పనిచేసేలా కొన్ని శస్త్ర చికిత్సలు కూడా చేశారు. అయినా ప్రయోజనం లేకుండా పోయింది. ఆమె పరిస్థితి ఎంత ఘోరంగా అయిపోయిదంటే..తన పిల్లలకు అమ్మగా తానేం చేయకుండానే చనిపోతాననే బెంగతో జీవచ్ఛవంలా అయిపోయింది. ఒకరకంగా ఆ అనారోగ్యం అల్కాకు తన ఆరోగ్యంపై ఫోకస్ పెట్టేలా చేసింది. ఎలాగైన తన పిల్లల కోసం ఈ అంతుచిక్కని వ్యాధిని ఎలాగైనా జయించాలనే ధైర్యాన్ని కూడగట్టుకుంది. అలా నెమ్మదిగా..తగినంత విశ్రాంతి, పోషకాహారంపై దృష్టిపెట్టి తనను తాను బాగుచేసుకుంది. ఆ తర్వాత మరింత ఆరోగ్యంగా ఉండేలా..వృద్ధాప్యాన్ని తిప్పికొట్టేలా ఆహారంపై ఫోకస్ పెట్టారు అలా ఆమె యవ్వనంగా మారడమే గాక పూర్తి ఆరోగ్యవంతమైన వ్యక్తిగా జీవించడం ప్రారంభించారు. ఆ అనారోగ్యమే తన కళ్లు తెరిపించిందని అంటారామె. పైగా ఇవాళ ఆమె దీర్గాయువు నిపుణురాలిగా సేవలందిస్తున్నారు కూడా. ఇక ఆమె ఆరోగ్యకరమైన వృద్ధాప్యాన్ని నిర్వహించడం కోసం ఆరింటిని తప్పనిసరిగా పాలోకండని సూచిస్తున్నారామె. అవేంటంటే..సూర్యకాంతిలో గడపటం: ప్రతిరోజు ఉదయం కనీసం ఒక్క నిమిషం సూర్యకాంతిలో గడపటం. ఓ పదిసెకన్లు కళ్లు మూసుకుని మీకోసం మీతో గడపాలట.వాకింగ్: గుండె ఆరోగ్యం, శక్తిని పెంచడానికి ఓ 20 సెకన్ల పాటు నడవాలట. హైడ్రేటెడ్ ఉండటం: ప్రతి 30 నిమిషాలకు నీళ్లు తాగేలా శ్రద్ధ పెట్టడంపొగడ్తలు, గర్వంగా ఫీలైన క్షణాలు: మిమ్మల్ని మెచ్చకున్న వ్యక్తులను గుర్తుచేసుకోండి. అలాగే మీకు మద్దతు, సహయం చేసేవారిని ప్రశంసించడం అలవాటు చేసుకోవాలటవర్కౌట్లు: శరీరంలో మంచి కదలికలు ఉండటం కోసం ఓం 50 సెకన్ల పాటు వాటికి సంబంధించిన వ్యాయామాలు చేయలటబ్రీథింగ్ వ్యాయామాలు: నాడీ వ్యవస్థను శాంతపరిచేలా ప్రతి రోజు ఒక గంట శ్వాసకు సంబంధించిన వ్యాయామాలు చేయడం తదితరాలతో వ్యాయమాన్ని తిప్పికొట్టి ఆరోగ్యవంతంగానే కాకుండా నిత్య యవ్వనాన్ని సొంత చేసుకోగలమని చెబుతున్నారు డాక్టర్ అల్కా పటేల్.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాల కోసం వ్యక్తిగత వైద్యలు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: World Bicycle Day: 70 ఏళ్ల వ్యాపారవేత్త ఫిట్నెస్కి ఫిదా అవ్వాల్సిందే! ఇప్పటకీ 40 కి.మీలు సైకిల్) -
వయసు 70 ఏళ్లు.. ఇప్పటికీ 40 కి.మీ. సైకిల్పైనే..
చిన్న వ్యాపారమే నడుపుతున్నా.. రయ్రయ్మని.. బైక్ లేదా కార్లలలో వెళ్తుంటారు. పైగా అది స్టేటస్ సింబల్గా పలువురి అభిప్రాయం కూడా. అలాంటి ఈ రోజుల్లో ఓ తాతా గారు వ్యాపారవేత్తగా చెలామణి అవుతున్నా.. ఇప్పటికీ సాధారణ సైకిల్పైనే తన ఫ్యాక్టరీకి వెళ్తుంటాడు. అది కూడా ఏకంగా 30 కిలోమీటర్లు పైనే తొక్కుతూ వెళ్లడం విశేషం. ఇవాళ వరల్డ్ సైక్లింగ్ డే సందర్భరంగా అంతలా ఫిట్నెస్ ప్రాముఖ్యత ఇచ్చి సైక్లిల్పైనే రాకపోకలు సాగిస్తున్న ఆ తాతగారు గురించి తెలుసుకుందామా..!అతడే 70 ఏళ్ల సురేష్ జరివాలా. ఆయన్ను సైక్లింగ్ లెజెండ్గా పేర్కొన్నవచ్చు. ఆయన రోజు ఉదయం 5.45 గంటలకు ప్రారంభమవుతుంది. స్వతహాగా వస్త్ర వ్యాపారవేత్త అయినా ఆయన ఫిట్నెస్కి వీరాభిమాని. వ్యాపారిగా తన కెరీర్ని ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు సైకిల్పైనే రాకపోకలు సాగిస్తున్నాడు. మెరిసే కార్లు, బైక్లు ఆయన దరిచేరలేకపోయాయి లేదా ఆయన్ను ఆకర్షించడంలో విఫలమయ్యాయి అని చెప్పొచ్చు. ఎందుకంటే సూరత్లో ఫ్యాక్టరీ ఉన్నప్పుడూ.. సైకిల్పైనే వెళ్లేవాడు. ఆ తర్వాత 1982లో ఫ్యాక్టరీ అంక్లేశ్వర్కు మారినా.. అతని తీరు మారకపోవడం విశేషం. నిజానికి సూరత్ని సలాబత్పురా నుంచి అంకలేశ్వర్ రావాలంటే కచ్చితంగా కారు లేదా బైక్ ఉంటేనే వెళ్లడం సాధ్యం. ఎందుకంటే ఈ తాతగారు సూరత్లోని తన ఇంటి నుంచి స్టేషన్కి మూడు కిలోమీటర్లు సైకిల్పై ప్రయాణించి.. అక్కడ నుంచి రైలులో ప్రయాణించి అంకలేశ్వర్కు చేరుకుంటారు. ఆ తర్వాత అక్కడ స్టేషన్ నుంచి ఫ్యాక్టరీకి మరో నాలుగు కి.మీ సైకిల్ తొక్కాల్సి ఉంటుంది. అయినా సరే ఆయన సైక్లింగ్ వదిలేయలేదు. దాదాపు మూడు దశాబ్దాలుగా ఆయన ఇదే జీవన విధానాన్ని అనుసరిస్తున్నారు. 1990లలో రూ. 2000 పెట్లి అట్లాస్ కంపెనీ సైకిల్ కొనుకున్నారు. ఇప్పటికీ దానిపైనే ప్రయాణించడం చూస్తే.. ఆ సైకిల్ని ఆయన ఎంతలా అపురూపంగా చూసుకుంటున్నారనేది స్పష్టంగా తెలుస్తోంది. ఇక ఆయనది ఉమ్మడి కుటుంబం. మొత్తం 22 మంది కుటుంబ సభ్యులు ఉంటారు. జరివాలాకు నలుగురు సోదరులు. వారిలో చిన్నవాడు ఆయనే. పెద్ద అన్న వయసు 80 ఏళ్లు. చిన్న మనవడికి మూడేళ్లు. ఆయన క్రమశిక్షణతో కూడిన ఆరోగ్యకరమైన జీవిన విధానం తమకు స్ఫూర్తి, ఆరాధ్యనీయమైనదని చెబుతున్నారు కుటుంబసభ్యులు. ఆయనను అనుసరించడానికి ప్రయత్నిస్తున్నామని, కానీ మావల్ల సాధ్యం కావడం లేదని అంటున్నారు వారంతా. ఇంత బిజీ లైఫ్లో కూడా ఆయన రోజూ 10వేల అడుగులపైగా వాకింగ్ చేస్తాడట. మారథాన్, రన్నింగ్ రేస్ వంటి అన్నింటిల్లోనూ పాల్గొటాడట. మరో విశేషం ఏంటంటే.. మహారాష్ట్రలోని షిర్డీకి సుమారు 300 కిలోమీటర్లు సైకిల్పైనే వెళ్తాడట సురేష్ జరివాలా. ఆయన జీవిన విధానం పర్యావరణ హితంగానూ ఆరోగ్యప్రదంగానూ ఉంది. చెప్పాలంటే క్రమశిక్షణాయూతంగా జీవించడానికి ఉదాహరణ సురేష్ జరివాలా జీవన విధానం. కనీసం ఆయనలా అంతలా చేయలేకపోయినా..పర్యావరణానికి మేలు కలిగించేలా, ఆరోగ్యగా ఉండేలా జీవించడానికి కొద్ది ప్రయత్నమైనా చేద్దామా..!(చదవండి: 'డయాబెటిక్ రైస్' అంటే..? బాలీవుడ్ నటుడు గోవింద్ వైఫ్ సైతం..) -
'డయాబెటిక్ రైస్' అంటే..? ఇది మధుమేహాన్ని నియంత్రించగలదా..
ఇటీవల కాలంలో అందరిని వేధిస్తున్న తీపి వ్యాధి మధుమేహం. దీని కారణంగా ఏం తినాలన్నా..బాబోయ్ షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయేమో అన్న అనుమానం వెంటాడుతుంటుంది చాలామందిలో. దాన్ని క్యాష్ చేసుకునేలా మార్కెట్ డయాబెటిస్ వాళ్లకు ఉపయోగపడే రైస్, కూరగాయాలు, స్వీట్లు అంటూ మార్కెట్లో ఇబ్బడిముబ్బడిగా వచ్చేస్తున్నాయి. వాస్తవానికి చాలామందికి కూడా రైస్తో భోజనం కానిస్తే కానీ కడుపునిండిన ఫీల్ రాదు. ఇలానే అంటున్నారు బాలీవుడ్ ప్రముఖ హీరో గోవింద్ భార్య సునీతా అహుజా సైతం. ఆమె కూడా హాయిగా అన్నం తింటేనే ఆ అనుభూతే వేరు అంటున్నారు. కానీ తాను కూడా డయాబెటిస్తో పేషెంటేనని, అందుకని రైస్ని ఇలా తీసుకుంటానంటూ తన డైట్కి సంబంధించిన ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారామె. అంతేగాదు మనకిష్టమైన రైస్నే వదులకోకుండా ఆరోగ్యకరంగా ఎలా తీసుకోవాలో కూడా చెప్పారామె. మరి నిపుణులు దీని గురించి ఏమంటున్నారో సవివరంగా చూద్దామా..!.సెలబ్రిటీ సునీతా ఆహుజా తన ఆహారపు అలవాట్ల గురించి చెబుతూ..తాను నేపాలీగా ఎక్కువ వైట్రైస్ తినేందుకే ఇష్టపడతానని అన్నారు. అయితే మధుమేహం ఉంది కాబట్టి డయాబెటిక్ రైస్కి ప్రాధాన్యత ఇస్తానన్నారామె. దాంతోపాటు రోటీలు కూడా తీసుకుంటానని అన్నారు. ‘డయాబెటిక్ రైస్’ అంటే..ఈ ‘డయాబెటిక్ రైస్’ఇటీవలకాలంలో బాగా ప్రజాదరణ పొందింది. ఇది మధుమేహంతో బాధపడుతున్న వారికి ప్రత్యామ్నాయమైన రైస్ అని చెప్పొచ్చు. ఇవి రక్తంలో చక్కెర నియంత్రణ కోసం ఉపయోగిస్తారు. వీటిలో గ్లైసెమిక్ ఇండెక్స్ (GI) తక్కువగా ఉంటుంది. సాదారణ బియ్యం కంటే..వీటిలోనే గ్లూకోజ్ స్థాయిలను నెమ్మదిగా పెరుతాయి. అందువల్ల వీటికే మొగ్గు చూపుతున్నారు చాలామంది. అవేంటంటే..నల్ల బియ్యంఎర్ర బియ్యంగోధుమ బియ్యందంపుడు బియ్యంతక్కువ GI బాస్మతి బియ్యంమిల్లెట్ ఆధారిత బియ్యంప్రాసెస్ చేసిన తక్కువ-కార్బ్ బియ్యంవాటిల్లో గ్లైసెమిక్ సూచిక..తెల్ల బియ్యం: GI 70–89 (ఎక్కువ)గోధుమ బియ్యం: GI 50–60 (తక్కువ)ఎర్ర బియ్యం: GI దాదాపు 55 (తక్కువ)దంపుడు బియ్యం: GI 38–50 (అత్యల్పం )మిల్లెట్స్: GI దాదాపు 40–55 (అత్యల్పం)డయాబెటిక్ బియ్యంతో కలిగే లాభాలు..భోజనం తర్వాత రక్తంలో గ్లూకోజ్ పెరుగుదల తక్కువగా ఉంటుంది. సంతృప్తిని పెంచడం, భాగం నియంత్రణకు సహాయపడుతుందిదీర్ఘకాలికంగా రక్తంలో చక్కెర నియంత్రణను మెరుగుపరగలదుశుద్ధి చేయబడిన తెల్ల బియ్యంతో పోలిస్తే, తృణధాన్యాలు లేదా తక్కువ GI బియ్యం గ్లూకోజ్ ప్రతిస్పందనను మాడ్యులేట్ చేయడంలో బెస్ట్నిపుణులు ఏమంటున్నారంటే..ఇక వైద్య నిపుణులు సైతం "డయాబెటిక్ బియ్యం"లో కార్బోహైడ్రేట్ కంటెంట్ తక్కువ అని చెబుతున్నారు. అదే సమయంలో ఇది ఆరోగ్యకరమని అతిగా తీసుకుంటే మాత్రం.. దీనివల్ల కూడా రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగిపోయే అవకాశం లేకపోలేదని హెచ్చరించారుగ్లైసెమిక్ ప్రభావాన్ని తగ్గించడానికి ఎల్లప్పుడూ స్టార్చ్ లేని కూరగాయలు, ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులతో కలిసి తీసుకోవాలని అన్నారు. దీంతోపాటు ఇతర ప్రాసెస్ చేసిన ఆహారాలను కూడా నివారించాలని సూచించారు. చివరగా తక్కువ-GI, అధిక-ఫైబర్ బియ్యం రకాలు చక్కెర నిర్వహణను గణనీయంగా మెరుగుపరుస్తాయని నమ్మకంగా చెప్పారు. గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించండి. (చదవండి: ‘ఎలక్ట్రో కన్వల్సివ్ థెరపీ’ అంటే..? ఈ చికిత్స ఎందుకోసం అంటే..) -
అమ్మలపై హింస-పిల్లలకు చెప్పలేనంత నరకం : న్యూ స్టడీ
తల్లి ఇంట్లో నిశ్శబ్దంగా బాధపడటం చూసినప్పుడు పిల్లల మనస్సులో ఏమి జరుగుతుందో ఎప్పుడైనా ఆలోచించారా? ఆమె మూగ వేదన పిల్లలపై శాశ్వత ప్రభావాన్ని చూపుతుందని మీకు తెలుసా? ఇది అనేక మంది పిల్లల్లో బయటికి కనిపించని వేదన. అమ్మను నాన్న ఎందుకు కొడుతున్నాడో అర్థం కాక, నాన్న మద్యానికి ఎందుకు బానిసగా మారిపోయాడో తెలియక, నాన్న పెట్టే హింసను అమ్మ ఎందుకు భరిస్తుందో చిట్టి బుర్రకు అర్థంకాక సతమతమయ్యే పిల్లలు గుండెల్లోని గాయాల ప్రభావం మాత్రం చాలా గట్టిగా, సుదీర్ఘంగా ఉంటుంది. ఇది చాలామంది పిల్లల అనుభవం కూడా. తాజాగా టీనేజర్ మానసిక ఆరోగ్యం వారి తల్లి ఇంట్లో భరించే హింస ఎంత తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది అనే దానిపై ఒక అధ్యయనం కొన్ని హృదయ విదారకమైన అంశాలను శాస్త్రీయంగా వెలుగులోకి తీసుకొచ్చింది.ఎదుగుతున్న పిల్లలపై తల్లిదండ్రుల ప్రభావం చాలా ఉంటుంది. ముఖ్యంగా తల్లి మానసిక స్థితి, ఇంట్లో ఆమె స్థానం, ఆమె ఎదుర్కొనే గృహ హింస పిల్లల ఎదుగుదలను, మానసిక వికాసాన్ని ప్రభావితం చేస్తుంది. దీనిపై ఇండియాలోని కొన్ని రాష్ట్రాల్లో తల్లీ బిడ్డలపై ఆసక్తికర అధ్యయనం జరిగింది.ఈ అధ్యయనం భారతదేశంలోని కౌమారదశలోని పిల్లల మానసిక ఆరోగ్యంపై గృహ హింస ఎదుర్కొనే తల్లి అనుభవాల ప్రభావాన్ని పరిశీలించింది. PLOS One అనే మెడికల్ జర్నల్లో ప్రచురించిన ఈ స్టడీలో , తల్లులు గృహ హింసను ఎదుర్కొన్నప్పుడు, వారి కౌమారదశలో ఉన్న పిల్లలు ఆందోళన, నిరాశ ,ఇతర సాధారణ మానసిక రుగ్మతల బారిన పడే అవకాశం ఎక్కువగా ఉందని వెల్లడించింది. దేశంలోని ఏడు రాష్ట్రాలలో 2,784 తల్లి-బిడ్డ జంటల నుండి వచ్చిన డేటా ఆధారంగా, ఇంట్లో హింస మహిళలను మానసిక వేదనకు గురి చేయడం మాత్రమే కాదు, భవిష్యత్తరం మానసిక శ్రేయస్సును కూడా దెబ్బతీసింది. నిశ్శబ్దంగా చాప కింద నీరులా వారిని పట్టి పీడిస్తుందని అధ్యయనం తెలిపింది.అధ్యయనం ఏమి కనుగొంది?గత ఏడాది పిల్లలున్న మహిళలపై గృహ హింస (DV) 36.8 శాతం ఉందని అధ్యయనం కనుగొంది. శారీరక లేదా లైంగిక వేధింపులను ఎదుర్కొన్న తల్లుల టీనేజ్ పిల్లలు అనేక మానసిక రుగ్మతలతో బాధపడే అవకాశం గణనీయంగా ఎక్కువగా ఉంది. ముఖ్యంగా శారీరక వేధింపులను ఎదుర్కొనే తల్లులున్న పిల్లలలో నిరాశ ప్రమాదాన్ని రెట్టింపుచేశాయని పేర్కొంది. కొట్టడం, తిట్టడం లాంటి వాటిని ప్రత్యక్షంగా చూడకపోయినా, భావోద్వేగం, వాతావరణం పిల్లల మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయని అధ్యయనం హైలైట్ చేసింది.ఎలా విశ్లేషించారు:కొట్టడం, చెంపదెబ్బ కొట్టడం, కొట్టడం వంటి శారీరక వేధింపులుతిట్టడం, అవమానించడం, బెదిరింపులుభర్త బలవంతం లేదా దాడితో సహా ఇతర లైంగిక వేధింపులుమానసిక ఆరోగ్యాన్ని ఎలా అంచనా వేశారు?12–17 సంవత్సరాల వయస్సు గల కౌమారదశలో ఉన్నవారిని ఈ క్రింది రుగ్మతలను గుర్తించే డయాగ్నస్టిక్ టూల్ ద్వారా పరీక్షించారు.ఆందోళన (GAD, సోషల్ ఫోబియా, PTSD) డిప్రెషన్ (మేజర్ డిప్రెసివ్ డిజార్డర్, డిస్టిమియా)సాధారణ మానసిక రుగ్మతలు (CMDలు), ఆందోళన నిరాశ . 5.3 శాతం మందికి ఆందోళన రుగ్మతలు, 3.2 శాతం మందికి డిప్రెషన్ మరియు 7.4 శాతం మందికి CMDలు ఉన్నట్టు ఈ స్టడీ గుర్తించింది.భారతదేశంలో ఎందుకు ముఖ్యం?భారతదేశంలో, ఉమ్మడి కుటుంబాల్లో మహిళలపై గృహ హింస, శారీరక వేధింపులు చాలా ఎక్కువ. కట్నం తేలేదనో, మగ బిడ్డ పుట్టలేదనో, అందంగా లేదనో.. ఒకవిధంగా చెప్పాలంటే ఈ కారణాలకు లెక్కేలేదు. అలాగే మగబిడ్డ పుట్టే వరకు గర్భ నిరోధకాలను నిలిపివేయడం లేదా తల్లిదండ్రుల ఇళ్లకు బలవంతంగా పంపడం వంటి అనేకరకాల వేధింపులను అధ్యయనం గుర్తించింది. ఇవి పైకి మామూలుగా కనిపించినప్పటికీ, మహిళలు, వారి పిల్లలు ఇద్దరిపైనా దీర్ఘకాలిక ఒత్తిడిని తెస్తుందని తెలిపింది. అంతేకాదు ఈ కారణంగా ఉద్భవించిన శారీరక, మానసిక సమస్యలు, భావోద్వేగ బాధలకు గుర్తింపుగానీ, తగిన చికిత్స కానీ జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. పిల్లల్లో ఎలాంటి ప్రభావం దీర్ఘకాలిక నిరాశ,ఆందోళన ముప్పుఆరోగ్యకరమైన సంబంధాలను ఏర్పరచుకోవడంలో ఇబ్బందిపేలవమైన పనితీరు, చదువులో శ్రద్ధలేకపోవడం, పాఠశాల మానేయడంఆత్మహత్య ఆలోచనల ప్రమాదం ఎక్కువఈ ప్రభావాలు యుక్తవయస్సు, ఆపైన కూడా కొనసాగవచ్చు ఎవరెవరు ఏం చేయాలి? సామాజిక-ఆర్థిక స్థితి, లింగం, విద్య లాంటి అంశాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత కూడా, గృహ హింస, లైంగిక వేధింపులు బలమైన ప్రమాద కారకాలుగా ఉన్నాయని అధ్యయనం గుర్తించింది. దీనిపై అత్యవసర చర్యలు తీసుకోవాలని స్టడీ పిలుపునిచ్చింది. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విధాన నిర్ణేతలు తగిన చర్యలు చేపట్టాలని తెలిపింది. తల్లిదండ్రుల సంబంధాలు, వ్యవహారం పిల్లలను ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసుకోవాలి. వారి మానసిక ఆరోగ్య సమస్యల కోసం స్క్రీనింగ్ చేయాలి. అలాగే అధికారులు గృహ హింస నివారణ కార్యక్రమాలను బలోపేతం చేయాలి. పాఠశాలలు,సమాజాలలో మానసిక ఆరోగ్య మద్దతును ఏకీకృతం చేయాలి. -
‘ఎలక్ట్రో కన్వల్సివ్ థెరపీ’ అంటే ..?
సినిమాల్లో ఈ థెరపీని భయంకరంగా చూపిస్తారు. ఎవరినైనా హింసించడానికి దాన్ని వాడుకుంటున్నట్టుగా చూపుతారు. అంతేకాదు... కొన్ని హాస్య సన్నివేశాల్లోనూ నవ్వించడానికీ దాంతో కామెడీ యాక్టర్లకు షాక్ ఇస్తున్నట్టు చూపి, నవ్వు తెప్పించడానికి వాడతారు. ఇక వార్తా కథనాల్లో ఎదుటి పార్టీవారికీ, ప్రత్యర్థులకు షాక్ ఇచ్చినప్పుడు ‘షాక్ ట్రీట్మెంట్’ అనే పదాన్ని విచ్చలవిడిగా వాడుతుంటారు. అలా దానిపై ఎన్నో అనుమానాలూ, అపోహాలూ కల్పిస్తారు. కానీ నిజానికి అదో మంచి ట్రీట్మెంట్. బాధితులకు షాక్ తగినట్లుగా తెలియనివ్వని చికిత్స. మరెంతో మందికి మానసిక చికిత్సల కోసం, అనేక మందికి ప్రాణరక్షణ కోసం వాడే థెరపీ. దాదాపు ఎనిమిది దశాబ్దాల నుంచి అనేక మందికి ప్రాణరక్షణ ఇచ్చిన చికిత్సా ప్రక్రియ. ఎంతో మందిని రక్షించిన ఆ చికిత్స పేరే ఎలక్ట్రిక్ షాక్ ట్రీట్మెంట్. వైద్య పరిభాషలో ‘ఎలక్ట్రో కన్వల్సివ్ థెరపీ’అని పిలుస్తూ సంక్షిప్తంగా ‘ఈసీటీ’ అనే ఈ చికిత్సపై ఉండే అపోహలూ, అపార్థాలు తొలగించి, ఈ చికిత్స ప్రక్రియపై మంచి అవగాహన కల్పించేందుకే ఈ కథనం. సినిమాల్లో, అలాగే కొన్ని టీవీ సీరియల్స్లో ఎంతగానో భయంగొలిపేలా చూపే ఈ షాక్ ట్రీట్మెంట్ నిజజీవితంలో ఎంత మాత్రమూ భయం గొలిపే చికిత్స కాదు. దీనిపై ఎంతగా అపార్థాలు నెలకొన్నాయంటే బాధితుడికి ఎలక్ట్రిక్ షాక్ ఇవ్వాలంటూ డాక్టర్లు చెబితే... అతడి బంధువులూ, స్నేహితులూ ఆందోళనకు గురయ్యేంతగా ఇది అపోహలకు గురయ్యింది. కొన్ని రకాల మానసిక సమస్యలతో బాధపడుతున్న అనేకమందిని తిరిగి సాధారణ స్థితికి రావడానికి ‘ఎలక్ట్రో కన్వల్సివ్ థెరపీ’ ఎంతగానో ఉపయోగపడింది. ప్రతి ఏటా దాదాపు లక్షల సంఖ్యలోని బాధితులకు వారి సమస్యలను నయం చేస్తూ, అనేక రకాలుగా స్వస్థత చేకూర్చే ఈ చికిత్స ప్రక్రియ అందుబాటులోకి రావడమూ చాలా నాటికీయంగా జరిగింది. అది సివియర్ డిప్రెషన్, కెటటోనియా లాంటి ఎన్ని రకాల సమస్యలనుంచి విముక్తి కల్పిస్తుందనే విషయంతోపాటు అసలు అది ఓ చికిత్సగా ఆవిర్భవించిన తీరుతెన్నులూ... ఈ విశేషాలన్నింటి గురించీ తెలుసుకుందాం...షాక్ ట్రీట్మెంట్ ఓ చికిత్సగా ఆవిర్భవించిన తీరిది... అసలు కరెంటు షాక్ ద్వారా కొన్ని మానసిక వ్యాధులను నయం చేయవచ్చని ఎలా తెలిసిందన్నదే అబ్బురాన్ని కలిగించే విషయం. తొలుత 1934లో డాక్టర్ మెడూనా అనే శాస్త్రవేత్త మానసిక సమస్యలు ఉన్న బాధితులకు క్యాంఫర్ను ఇంజెక్షన్ రూపంలో ఇచ్చాడు. అలా ఇవ్వడం ద్వారా బాధితుడికి మూర్చ (ఫిట్స్ / కన్వల్సెన్స్)ను కలిగించి, మానసిక సమస్యలను నయం చేయడానికి ప్రయత్నించాడు.ఇప్పుడు మరింత సమర్థంగా మాడిఫైడ్ ఈసీటీ రూపంలో ... ఇటీవల పెరిగిన వైద్యవిజ్ఞానంతో చాలా తక్కువ డోసులో మత్తు మందుతోపాటు తక్కువ మోతాదులో కరెంట్ ఇవ్వడం ఆధునిక మాడిఫైడ్ ఈసీటీలో జరుగుతుంది. శాస్త్రవిజ్ఞానం ఎంతో పెరిగిన ఇటీవల కాలంలో బాధితులకు ఇప్పుడు మత్తు కూడా చాలా తక్కువ మోతాదులో (షార్ట్ యాక్టింగ్) అలాగే చాలా సురక్షితంగా కూడా ఇస్తున్నారు. కండరాలుకు తగినంత విశ్రాంతి కలిగించే మందులు ఇవ్వడం ద్వారా ఎలక్ట్రో కన్వల్సివ్ చికిత్స (ఈసీటీ) చేయడం జరుగుతుంది. ఇందులో బాధితులకు తమకు కరెంట్ షాక్ ఇస్తున్న విషయమూ తెలికుండానే... వారికి అసలేమీ జరగదలేదని అనిపించేలా... కేవలం 15 నుంచి 20 నిమిషాల్లో ఈ ప్రక్రియను పూర్తిచేయడం సాధ్యమవుతోంది. నిద్రలోకి వెళ్లి మళ్లీ లేచినప్పుడు మాత్రమే బాధితులకు తమకేదో చికిత్స చేశారనే విషయం తెలుస్తుందిగానీ.... ఇందులో నిజానికి ఎలాంటి బాధా ఉండదు. ఈసీటీ ఇచ్చిన తర్వాత సుమారు 2 గంటల పాటు వైద్యులు సదరు మానసిక సమస్యల బాధితుల్ని తమ పర్యవేక్షణలోనే ఉంచుకుని (తాము వాడిన మందుల ప్రభావం తగ్గేంతవరకు) ఆ తర్వాత ఇంటికి పంపిస్తారు. అంటే ఈసీటీకి ప్రస్తుతం అత్యంత సులువైన, ప్రమాదరహితమైన ఔట్పేషెంట్ పద్ధతిలోనే చికిత్స జరుగుతుందన్నమాట. మన సమాజంలో నిజానికి మానసిక సమస్యలు వాటి కారణాలు గురించి చాలా తక్కువ అవగాహనే ఉంది. ఇప్పటికీ చాలా కుటుంబాల్లోని సభ్యులకు ఏదైనా మానసిక సమస్య ఉందంటే... వారు దాన్ని బయటకు చెప్పడానికి ఇష్టపడరు. చాలా గోప్యంగా ఉంచడానికే మొగ్గుచూపుతారు. ఇది సరైన పద్ధతి కాక΄ోయినా... దురదృష్టవశాత్తు ఇంకా ఇప్పటికీ ఇలాంటి ఆలోచన ధోరణే ప్రజల్లో / సమాజంలో కొనసాగుతోంది. నిజానికి మన దేహంలో ఆధునిక శాస్త్రీయ పరిజ్ఞానానికి ఇంకా పూర్తి స్థాయిలో అంతుచిక్కనిదీ లేదా చాలా తక్కువగా తెలిసిన విషయం ఏదైనా ఉందంటే అది మన మెదడు గురించే. మెదడు నిర్మాణం, జీవక్రియలూ అత్యంత సంక్లిష్టంగా ఉండటం వల్ల ఇలా జరుగుతూ... ఈ అంశం మన మెదడు తాలూకు సంక్లిష్టతను తెలియజేస్తుంది. అందుకే మానసిక సమస్యల తాలూకు కారణాలు తెలుసుకోవడం చాలా సంక్లిష్టమైన కఠినమైన విషయంగా మారింది. ఇప్పుడిప్పుడు మెదడుకు సంబంధించిన చాలా రహస్యాలు మెల్లమెల్లగా తెలిసివస్తున్నాయి. ఈసీటీ ప్రక్రియ... మెదడులోని అనేక స్థాయుల్లో చాలారకాల మాలిక్యులార్ బయోకెమికల్, ఎండోక్రైన్, స్ట్రక్చరల్, జెనెటిక్ మార్పులను కలగజేస్తుంది. తద్వారా ఈ ప్రక్రియ వ్యాధిని నయం చేయడానికి కారణమవుతోంది. ఎలక్ట్రో కన్వల్సివ్ ప్రక్రియ(ఈసీటీ) ఎలా పనిచేస్తుందంటే...నిజానికి ఈసీటీ చికిత్స ఎంత సురక్షితమైనదో చెప్పడానికి తార్కాణమేమిటంటే... గర్భవతుల్లో (ప్రెగ్నెన్సీలో)అలాగే ప్రసవం అయ్యాకకొత్తగా తల్లులైన మహిళల్లో వచ్చే పోస్ట్పార్టమ్ సైకోసిస్కు చికిత్సఇచ్చేటప్పుడు ఆ బాలెంతకూ...అంతేకాదు...గర్భంలో ఉన్నశిశువుకుసైతం ఈసీటీఅనేది చాలాసురక్షితమైన ప్రక్రియ అనితేలింది. ఈ నేపథ్యంలోసమాజంలో ఈ చికిత్సపై ఉన్న అపోహలు తొలగించుకోవడం అన్నది ఎంతో ముఖ్యమైన విషయం.ఈసీటీతో ఏయే సమస్యలుఉన్నవారికి చికిత్స అందిస్తారంటే...తీవ్రమైన వ్యాకులత, కుంగుబాటు (డిప్రెషన్) వంటి సమస్యలు ఉన్నవారికి. ఆత్మహత్య చేసుకోవాలని తీవ్రంగా అనుకుంటున్నవారికీ, ఆత్మహత్యలకు ప్రయత్నించేవారికీ (సూసైడల్ టెండెన్సీస్ ఉన్నవారికీ) ఆహారాన్ని తిరస్కరించేవారికి. బైపోలార్ డిప్రెషన్ ఉన్న బాధితులకు మందులతో పైన పేర్కొన్న వ్యాధులు నయంకాని సందర్భాల్లో... స్కీజోఫ్రీనియా వంటి మానసిక సమస్యలు ఉన్నవారికి. కెటటోనియా అనే మానసిక సమస్యలో (ఈ పరిస్థితిలో బాధితులు పూర్తిగా ఓ శిలాప్రతిమలా బిగుసుకుని ఉండిపోతారు. నిజానికి ఈ స్థితి అనేక మానసిక వ్యాధుల కారణంగా కలుగుతుంది. కెటటోనియా స్థితి నుంచి బాధితులను మామూలు స్థితికి తీసుకురావడానికి షాక్థెరపీ బాగా ఉపయోగపడుతుంది. తొలినాళ్లలో కాస్త ముతకగా... ఆ తర్వాతమెరుగ్గాతొలినాళ్లలో బాధితులకు మత్తు మందు ఇవ్వకుండానే ఎలక్ట్రో కన్వల్సివ్ థెరపీ (ఈసీటీ)ని ఇచ్చేవారు. దాంతో బాధితుల్లో మూర్చలు కలిగినప్పుడు వారికి గాయాలు కావడం, ఒళ్లు నొప్పులు రావడం, ఎముకలు గాడితప్పడం (డిస్ లొకేట్ కావడం), ముఖ్యంగా దవడ ఎముక (జా డిజ్లొకేషన్) వంటివి ఎక్కువగా కనిపించేవి. అయితే తొలిసారిగా 1940లో బెనెట్ అనే శాస్త్రవేత్త మత్తుమందు ఇచ్చి ఈ చికిత్స ఇవ్వడం వల్ల పైన పేర్కొన్న సమస్యలేవీ రావనీ, దాంతో కొద్దిగా మత్తు ఇవ్వడం ద్వారా ఇతరత్రా సమస్యలేమీ లేకుండా చాలా సురక్షితంగా ఈ చికిత్సను అందించడం సాధ్యమేనని కనుగొన్నాడు.ఈసీటీపై అపోహలూ వాస్తవాలు అపోహ:ఈసీటీ ప్రక్రియ మెదడును గాయపరుస్తుంది. వాస్తవం : ఈసీటీ వల్ల మెదడు నిర్మాణానికి గానీ, లేదా ఇతరత్రాగానీ ఎలాంటి గాయాలూ కావనీ, మెదడులో ఏ రకమైన ప్రమాదకరమైన మార్పులూ కలగవంటూ అనేక పరిశోధనల్లో స్పష్టంగా తేలింది. అపోహ:ఈసీటీ వల్ల మతిమరపు వస్తుంది.వాస్తవం : ఈసీటీ వల్ల బాధితుల జ్ఞాపపశక్తిపై దాదాపుగా ఎలాంటి ప్రభావమూ పడదని చెప్పవచ్చు. ఒకవేళ పడినా అది చాలా చాలా తక్కువ. ఈసీటీ ఇచ్చే ముందు తాత్కాలికంగా ఇచ్చే మందు మోతాదు కూడా చాలా తక్కువ. అయితే ఈ మత్తు నుంచి బయటకు వచ్చే ముందర బాధితుల్లో కాస్త అయోమయ స్థితి కనిపించవచ్చు. ఇదే ఇలాంటి దురభిప్రాయానికి కారణమవుతోంది. అంతేతప్ప జ్ఞాపకశక్తి పూర్తిగా తగ్గదు. అయితే చాలా కొద్దిమందిలో మాత్రం ఎలక్ట్రిక్ షాక్ ఇచ్చినప్పుడు తాత్కాలికంగా జ్ఞాపకశక్తి తగ్గినప్పటికీ అది కేవలం ఆరు నుంచి ఎనిమిది వారాల పాటు మాత్రమే. ఈసీటీ వల్ల శాశ్వతమైన జ్ఞాపకశక్తి లోపం దాదాపుగా ఉండదనే చెప్పవచ్చు. అపోహ: ఈసీటీ వల్ల మెదడులోనికి ఒక్కోసారి ప్రమాదకరమైన రీతిలో కరెంట్ ప్రవహించవచ్చు. వాస్తవం : ఇది పూర్తిగా అవాస్తవం. అప్పుడున్న అత్యాధునిక పరికరాల వల్ల కరెంట్ ఇచ్చే ప్రక్రియ పూర్తిగా సురక్షితం. దాంతో ఇది పూర్తిగా ప్రమాదరహితమైన వైద్యం ప్రక్రియ అని చెప్పవచ్చు. పైగా ఈసీటీలకు వాడే వోల్టేజీ కూడా చాలా తక్కువ. అపోహ: ఈసీటీకి వల్ల మెదడు దెబ్బతిని కొన్ని మానసిక వ్యాధులు రావచ్చు. వాస్తవం : ఇది పూర్తిగా అవాస్తవం. ఈసీటీతో కొన్ని మానసిక సమస్యలు తగ్గడమే తప్ప కొత్తగా ఎలాంటి మానసిక వ్యాధులూ రావని స్పష్టంగా చెప్పవచ్చు. అపోహ: కరెంట్ షాక్ ఇస్తారు కాబట్టి ఇది చాలా ప్రమాదకరమైనది. వాస్తవం : ఇది పూర్తిగా ప్రమాదరహితం. అయితే ఎలక్ట్రో కన్వల్సివ్ ట్రీట్మెంట్లో ఇచ్చే మత్తుమందు (అనస్థీషియా) వల్ల ఇతరత్రా శస్త్రచికిత్సలో ఉండే రిస్క్ మాత్రమే ఇందులోనూ ఉంటుంది. అంతేతప్ప ఇందులో ఎలాంటి అదనపు ముప్పూ ఉండదు. అయితే అనస్థీషియా ఇచ్చేందుకు ఇతరత్రా జబ్బుల్లో ఇచ్చినప్పుడు చూసినట్టుగానే బాధితులకు దాన్ని తట్టుకునే ఫిట్నెస్ ఉందే లేదో చూసుకోవాలి. గుండెజబ్బులు, ఇతర శారీరక సమస్యలు ఉన్నాయేమో గమనించాలి. అప్పుడే అనస్థీషియాతో వచ్చే సమస్యలను గుర్తించి వాటిని నివారించవచ్చు. ఈసీటీ ఇచ్చే సమయంలో పల్స్ ఆక్సీమీటర్ అనే సాధనంతో గుండె, ఊపిరితిత్తులు మొదలైన శారీరక వ్యవస్థలను గమనిసూ ఉంటే ఇరత శరీరక సమస్యలపై పడే ప్రమాదాలను నివారించవచ్చు.ఈసీటీ ఇవ్వడం ఎప్పుడు సరికాదంటే...నిజానికి కొన్ని రకాల సమస్యలు ఎంతకీ తగ్గకుండా ఉన్నప్పుడు... ఒకవేళ అవి ఈసీటీ ఇవ్వడం వల్ల తగ్గేవైతే... అలాంటి సందర్భాల్లో మందులు మార్చి చూడటం కంటే ఈసీటీతోనే మంచి ఫలితాలు ఉంటాయంటూ వైద్యపరిశోధకులు, వైద్యులు గుర్తించారు. అయితే ఈసీటీ అన్నది పూర్తిగా ప్రమాదరహితమైన ప్రక్రియే అయినప్పటికీ ఈ చికిత్సకూ కొన్ని పరిమితులు ఉన్నాయి. అవేమిటంటే... మెదడులో సెరిబ్రోస్పినల్ ఫ్లుయిడ్ కలిగించే ఒత్తిడి ఉన్నప్పుడు ఈసీటీ వాడకూడదు. ఇటీవల ట్రాన్స్క్రేనియల్ మాగ్నెటిక్ స్టిమ్యులైజేషన్ అనే ప్రక్రియ వల్ల కూడా ఈసీటీతో ఉండే ప్రయోజనాలే కలుగుతాయని కొత్త పరిశోధనలతో తేలింది. కాబట్టి ఇదే ఈసీటీనే ఇంకాస్త అధునాతంగా ఇవ్వడంపై కూడా ఇంకా పరిశోధనలు కొనసాగుతున్నాయి. డాక్టర్ శ్రీనివాస్ ఎస్ఆర్ఆర్వైహెచ్వోడీ ఆఫ్ సైకియాట్రీ –సీనియర్ సైకియాట్రిస్ట్ఎంజీఎం ప్రభుత్వ ఆసుపత్రి, వరంగల్ (చదవండి: ఆ మూడు తినదగినవి కావు..కానీ అవే ఆరోగ్యం..! బిగ్బీకి కూడా నచ్చవట..) -
World Bicycle Day 2025 డయాబెటిస్కు, ఊబకాయానికి చెక్
World Bicycle Day 2025 నేడు ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్ని దేశాల్లో అందరికీ అందుబాటులో ఉన్న అత్యంత చౌకైన వాహనం సైకిల్. ఒకప్పుడు సైకిల్ ఉందంటే ధనిక కుటుంబంగా భావించే పరిస్థితి. పల్లెటూరు నుంచి పట్టణాలకు వెళ్ళాలన్నా, సినిమాలకు వెళ్ళాలన్నా సైకిల్నే వాడేవారు. కొత్తగా పెళ్లయిన జంటలు, అక్కా చెల్లెళ్ళు, అన్నాదమ్ములు, స్నేహితులు ఇలా ఎంతోమంది సరదాగా ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్ళాలంటే సైకిలే ఆధునిక ప్రయాణ సాధనం. అటువంటి సైకిల్ కొంతకాలంగా తన ప్రభావాన్నీ, ప్రాధాన్యాన్నీ కోల్పోతోంది. మోటార్ సైకిళ్ళు, కార్లు వంటి వాహనాలు సైకిళ్ల స్థానాన్ని ఆక్రమించాయి. అయితే నార్డిక్ దేశాల్లో నేటికీ రవాణా సాధనంగా సైకిల్కి అత్యంత ప్రాధాన్యం ఉండటం గమనార్హం. ఇదీ చదవండి: బొక్కలిరుగుతాయ్.. అమెరికా టూరిస్ట్కు చేదు అనుభవం, వీడియో వైరల్మోటారు వాహనాల వాడకం కాలుష్య కారకం కాబట్టి సైకిల్ను వాడాలని స్వీడన్ ప్రజల్లో చైతన్యం తెచ్చింది. అలాగే ప్రతి సంవత్సరం జూన్ 3వ తేదీన ‘అంతర్జాతీయ సైకిల్ దినోత్సవం’ జరిపే విధంగా ఐక్యరాజ్య సమితిపై ఒత్తిడి తెచ్చింది. ఫలితంగా 2018 నుంచి ఈ దినోత్సవాన్ని జరుపుతున్నారు. ఈ ఏడాది ‘సైకిల్ ద్వారా ఆరోగ్యం, సమానత్వం, స్థిరత్వాన్ని ప్రోత్సహించడం’ అనే థీమ్ను ఎన్నుకున్నారు. చదవండి: World Bicycle Day: మొదటి వాహనముకు వందనం!నేడు సైకిల్ వాడకంలో ప్రపంచంలోనే ముందున్న దేశం ‘నెదర్లాండ్స్’. సైకిల్ తొక్కడం ఓ మంచి వ్యాయామం. కనీస శారీరక శ్రమ లేకపోవడం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఎందరో వివిధ రకాల రోగాల బారిన పడుతున్నారు. చిన్న చిన్న దూరాలకు కూడా మోటార్ సైకిళ్ళు, కార్లు వినియోగించడం సరికాదు. నడవడమో లేక సైకిల్పై వెళ్లిరావడమో అలవాటు చేసుకోవాలి. పట్టణ ప్రాంతాల్లో ‘సైకిల్ ట్రాక్’లు ఏర్పాటు చేయాలి. ‘సైక్లింగ్‘ ఒక ఫ్యాషన్గా మారాలి. ఊబకాయం, డయాబెటిస్ వంటి సమస్యలు పరిష్కారానికీ; ఊపిరితిత్తుల ఆరోగ్యానికీ, మంచి నిద్రకీ, అధిక రక్తపోటు నియంత్రణకూ సైకిల్ తొక్కడం మంచి తరుణోపాయం. – ఐ.ప్రసాదరావు, ఉపాధ్యాయుడు, కాకినాడ.(నేడు ప్రపంచ సైకిల్ దినోత్సవం) -
చల్ మేరే దిల్..! క్రేజ్ సంతరించుకుంటున్న సైకిల్
ఇప్పుడంటే మోటారు సైకిల్, కార్లు సర్వసాధారణం అయ్యాయిగాని.. ఒక జనరేషన్ వెనక్కి వెళితే సైకిల్ అనేది స్టేటస్ సింబల్గా ఉండేది. ఊర్లో అక్కడక్కడా కనిపించేవి. పెళ్లిళ్లలో మగ పెళ్లివారు సైకిల్ బహుమానంగా ఇవ్వాల్సిందేనని అడిగి మరీ తీసుకునేవారు. ఆ పరిస్థితుల నుంచి మధ్యలో కొంత కాలం విరామం వచ్చింది. ప్రస్తుతం మళ్లీ సైకిల్కు క్రేజ్ పెరుగుతోంది. ఆరోగ్యం, శారీరక వ్యాయామం, ఒత్తిడి నుంచి రిలాక్సేషన్, కాలుష్య నివారణ, పెట్రోల్ వినియోగం తగ్గించడం వంటి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని గ్రహించిన పట్టణ యువత తిరిగి సైక్లింగ్ వైపు మొగ్గుచూపుతోంది. జూన్ 3 ప్రపంచ సైక్లింగ్ డే సందర్భంగా సాక్షి ప్రత్యేక కథనం. ఆకారంలో మార్పు.. ధరల్లో వ్యత్యాసం..సైకిల్ తయారు చేసిన తొలినాళ్లలో దాని ఆకారం ఇప్పుడున్నట్లు లేదు. ముందు చక్రం పెద్దదిగాను, వెనుక చక్రం చిన్నదిగాను ఉండేది. కాలక్రమేణా దాని రూపం మారుతూ వచ్చింది. సైకిల్ ధర అప్పట్లో రూ.వందల్లో ఉండేది. ప్రస్తుతం మోడల్ బట్టి వేలల్లో అమ్మకాలు చేస్తున్నారు. 1980లో సుమారు రూ.500 నుంచి రూ.800 మధ్యలో లభించేది. అది కాస్త 2000 సంవత్సరం వచ్చే సరికి సుమారుగా రూ.3 వేల నుంచి రూ.4500 వరకూ పెరిగింది. ప్రస్తుతం పాత తరం వినియోగించే మోడల్స్ ఉత్పత్తి నిలిచిపోయింది. 1950 నుంచి దాదాపు 2000 సంవత్సరం వరకు సైకిల్ విరివిగా వినియోగించేవారు. హెర్క్యులస్, హీరో, అట్లాస్ వంటి సైకిల్ కంపెనీలు భారత దేశంలో గుర్తింపు పొందిన కంపెనీలు. దాదాపు రెండు దశాబ్దాల కాలం పాటు దీని వినియోగానికి విరామం ఏర్పడింది. అనంతరం కొత్త మోడళ్ల సైకిళ్లు అందుబాటులోకి వచ్చాయి. సామాన్యులు తొక్కే సైకిల్ ప్రారంభ ధర రూ.5 వేల నుంచి ప్రారంభమవుతున్నాయి. చిన్న పిల్లల సైకిళ్లు సుమారు రూ.3 వేల నుంచి రూ.పది వేలకుపైబడిన ధరల్లో అమ్ముడుపోతున్నాయి. చిన్న పిల్లలు, మహిళలు, పురుషులు, సైక్లింగ్ చేసేవాళ్లు, ఇలా వేర్వేరు కేటగిరీలు, విభిన్నమైన మోడళ్లలో సైకిళ్లు అందుబాటులో ఉన్నాయి. ఎన్నో ఉపయోగాలు.. సైకిల్ తొక్కువడం వల్ల ఆరోగ్య పరంగా, పర్యావరణ పరంగానూ అనేక ఉపయోగాలు ఉన్నాయి. ప్రస్తుత కాలంలో ప్రజలు అన్నిటికంటే ఆరోగ్యానికే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. క్యాన్సర్, మధుమేహం, స్థూలకాయం, గుండె జబ్బులు, అధిక రక్తపోటు, ఒత్తిడి, దీర్ఘకాలిక రోగాలకు సైక్లింగ్తో చెక్ పెట్టవచ్చని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. నగరవాసులు బిజీ లైఫ్లో ఉద్యోగులు, వ్యాపారులు, గృహిణిలు, ఇతర రంగాల వారికి తమతమ పనుల్లో శారీరక శ్రమ తగ్గిపోతోంది. దీంతో సైక్లింగ్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. మోటారు సైకిళ్లు, కార్లకు బదులుగా సైకిళ్లను వినియోగిస్తే కాలుష్య నివారణతో పాటు, ఆర్థికంగానూ, ఆరోగ్య పరంగానూ ఉపయోగకరంగా ఉంటుంది. నగరంలో సైక్లింగ్ కోసం ప్రభుత్వం ప్రత్యేకించి ఓఆర్ఆర్, కేబీఆర్ పార్క్, తదితర ప్రదేశాల్లో సైకిల్ ట్రాక్స్ నిర్మించింది. దేశంలో సైకిల్ చరిత్ర ఇలా.. భారత దేశంలో 1890ల్లో యూరోపియన్ దేశస్తులు సైకిల్ తొక్కడం ప్రారంభించారు. ఉన్నత, ఎగువ మధ్యతరగతి కుటుంబాలు స్టేటస్ సింబల్గా వినియోగించేవారు. 1920–1935 మధ్య కాలంలో ప్రపంచ సైకిల్ యాత్రలు ప్రారంభమ్యాయి. బ్రిటిష్, నవాబుల పరిపాలనలో సమాచార సరఫరా, తపాలా, పోలీసులు, సైన్యం సైతం వివిధ అవసరాలకు సైకిళ్లనే వినియోగించేవారు. తొలి నాళ్లలో కార్మికులు హెర్క్యులస్ సైకిళ్లు వినియోగిస్తే.. ఉన్నత వర్గాలు రాలీ, జేమ్స్ సైకిళ్లను వినియోగించేవారట. ఫిట్నెస్ మోటివేట్ అవుతుంది.. సైక్లింగ్ చేయడం వల్ల ఫిట్నెస్ మోటివేట్ అవుతుంది. వీలు చిక్కినప్పుడల్లా స్నేహితులంతా కలసి సైక్లింగ్ చేస్తాం. ఫలితంగా రొటీన్ లైఫ్కు భిన్నంగా ఉంటుంది. ఒత్తిడి నుంచి రిలాక్సేషన్ లభిస్తుంది. కాలుష్యం, ట్రాఫిక్ సమస్యలను నియంత్రించవచ్చు. – నేహ, మణికొండ పర్సనల్ టైం సైక్లింగ్.. తొమ్మిదేళ్ల నుంచి సైక్లింగ్ చేస్తున్నాను. ఉదయం 5.30 గంటల నుంచి 8 గంటల వరకూ సైక్లింగ్ చేస్తాం. ఇంటికి చేరుకుని కుటుంబం, పిల్లలు ఇతర పనుల్లో బిజీ అయిపోతాం. నాకంటూ దొరికే పర్సనల్ టైం సైక్లింగ్. ఔట్ సైడ్ నేచర్ ఎలా ఉంటుందో తెలుసుకోవచ్చు. ప్రాణం ప్రశాంతంగా ఉంటుంది. 70 కిలోమీటర్ల వరకూ వెళ్తుంటాను. 500 కిలోమీటర్లు సైక్లింగ్ చేయాలన్నది నా లక్ష్యం. 35 మంది మహిళలు కలిసి వెళ్తుంటాం. అంతా మంచి మిత్రులైపోయాం. – వందన లోకేష్ యుగంధర్, మణికొండ (చదవండి: womens safety: ఆపదలో అండగా...!ఈ స్మార్ట్ డివైజ్తో భద్రంగా ఉండొచ్చు..) -
ఆ మూడు తినదగినవి కావు..కానీ అవే ఆరోగ్యం..! బిగ్బీకి కూడా నచ్చవట..
కొన్ని రకాల కూరగాయలు అందరు ఇష్టపడరు. దాని రుచి రీత్యా తినేందుకు మక్కువ చూపించరు. బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ కూడా ఓ షోలో తనకు కూడా కొన్ని కూరగాయలు నచ్చవని చెప్పారు. పైగా ఆయన చాలా చమత్కారంగా ఆ కూరగాయలను తినదగినవి కావు..కానీ తింటేనే ఆరోగ్యం అని అన్నారు. మరీ బిగ్ బీ సైతం ఇష్టపడి ఆ కూరగాయాలు ఏవి..?. వాటివల్ల కలిగే లాభాలేంటి తదితరాల గురించి సవివరంగా చూద్దామా..!.బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్ తనకు కూడా కొన్ని కూరగాయలంటే అస్సలు ఇష్టం ఉండదని అన్నారు. అవేంటో షేర్ చేసుకున్నారు కూడా. అయితే వాటిని అందరూ తప్పక తీసుకోవాల్సిందేనని, ఆరోగ్యంగా ఉండాలంటే తప్పదు మరీ అని నవ్వేశారు. ఆ కూరగాయలే పనస, గుమ్మడి కాయ, కాకరకాయ. పనస: దీన్ని కూరగానూ, పండుగానూ కూడా తీసుకుంటారు. ఇందులో పోటాషియం సమృద్ధిగా ఉంటుందట. గుండె కండరాలతో సహా మొత్తం కండరాల పనితీరుని నిర్వహించడంలో కీలకంగా ఉంటుంది. అంతేగాదు శరీరంలోని సోడియం నియంత్రణను నిర్థారిస్తుంది. అలాగే ఆర్థరైటిస్ ఆస్టియోపోరోసిస్తో బాధపడుతున్న వ్యక్తులు దీన్ని తప్పనిసరిగా తీసుకోవాలని చెబుతున్నారు. ఇందులో ఎముకలకు అవసరమైన కాల్షియం కూడా అధికంగా ఉంటుందట. ఐరన్ మూలం కూడా.ముఖ్యంగా రక్తహీనతతో పోరాడటానికి, జీవక్రియను పెంచడానికి ఉపకరిస్తుందట. ఇందులో మెగ్నీషియం, విటమిన్ సీ, రాగి వంటివి కూడా ఉంటాయట. ఇవి రక్త నాణ్యతను మెరుగుపరచడంలో సహాయపడతాయని చెబుతున్నారు నిపుణులు.గుమ్మడికాయగుమ్మడికాయలలో కేలరీలు తక్కువ, పోషకాలు పుష్కలం, ఇందులో విటమిన్ ఏ, సీ, పొటాషియం, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయట. ఇది బీటా-కెరోటిన్కి అద్భుతమైన మూలం. కొల్లాజెన్ ఉత్పత్తికి మద్దతిస్తుంది. పొటాషియం, సోడియం ప్రభావాలను సమతుల్యం చేసి రక్తపోటుని నియంత్రిస్తుంది. ఇది బరువు తగ్గాలనుకునేవారికి ఇది అద్భుతమైన ఆహారం కూడా. దీనిలో ఉండే అధిక ఫైబర్ జీర్ణక్రియను మెరుగ్గా ఉంచుతుంది. అలాగే రక్తంలోని చక్కెర స్థాయిలను నిర్వహించడంలో సహాయపడుతుందట. కాకరకాయఇందులో విటమిన్ ఏ,సీలు, ఫోలేట్, పొటాషియం, ఐరన్ తదితర కీలకమైన పోషకాలు ఉంటాయి. రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలోనూ, మధుమేహ నిర్వహణలో సహాయపడుతుంది. దీనిలోని అధిక ఫైబర్ కంటెంట్ జీర్ణక్రియకు సహాయపడుతుంది, మలబద్ధకాన్ని నివారిస్తుంది. ఇందులో విటమిన్ సీ సమృద్ధిగా ఉంటుంది., ఇది రోగనిరోధక శక్తిని పెంచి ఇన్ఫెక్షన్లతో పోరాడే సామర్థ్యాన్ని పెంచుతుంది.అలాగే ఇది ఫ్రీ రాడికల్స్తో పోరాడేలా చేసి కొల్లాజెన్ ఉత్పత్తికి మద్దతు ఇస్తుంది. తద్వారా ఆరోగ్యకరమైన చర్మాన్ని పొందేలా చేస్తుంది. ఇందులో కేలరీలు తక్కువగా ఉన్నప్పటికీ ఫైబర్ అధికంగా ఉంటుంది, సంతృప్తిని ప్రోత్సహించి, బరువుని అదుపులో ఉంచుతుంది. దాంతోపాటు కాలేయ పనితీరుకు మద్దతు ఇచ్చి..శరీరాన్ని నిర్విషీకరణ చేయడంలో సహాయపడుతుంది.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాల కోసం వ్యక్తిగత నిపుణులను లేదా వైద్యులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: చప్పట్లు కొడితే శబ్దం ఎందుకొస్తుందో తెలుసా..? పరిశోధనలో షాకింగ్ విషయాలు) -
పదహారేళ్ల పడుచు పిల్లలా 85 ఏళ్ల బామ్మ..!
బాలీవుడ్లో ప్రఖ్యాత నటి, నాట్యకళాకారిణిగా ఒక ప్రత్యేక గుర్తింపుని కలిగి ఉన్న హీరోయిన హెలెన్. 80లలో ప్రసిద్ధ ఐకానిక్ పాటల్లో నర్తించి ప్రేకక్షకులను మంత్రముగ్దులను చేసేది. ఇప్పటికి ఆ పాటలు చెవిన పడగానే..నాటి కుర్రకారుని ఉర్రూతలూగించిన అందాల నటి హెలెన్ కళ్లముందు కదలాడుతుంది. అంతలా బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకుందామే. ఇప్పుడామె ఎనిమిది పదుల వయసుకి చేరుకుని బామ్మలా ఉన్నా కూడా..అంతే జోష్ హుషారుతో ఉంటారామె. అచ్చం 85 ఏళ్ల అమ్మాయి అనేలా ఉంటుంది ఆమె ఉత్సాహం చూస్తే. కాలక్రమేణ వచ్చే వృద్ధాప్యానికి చెక్పెట్టి..యవ్వనంగా బతకడం ఎలా అనేందుకు ఆమెనే ఓ ఉదాహరణ. మరి అంతలా ఆమె ఎవర్గ్రీన్ ఎనర్జీ వెనకున్న ఫిట్నెస్ సీక్రెట్ ఏంటో చూద్దామా..!.సెలబ్రిటీ ఫిట్నెస్ ట్రైనర్ యాస్మిన్ కరాచీవాలా నటి హెలెన్కి సంబంధించిన వీడియో ఒకటి ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. దాంతో ఒక్కసారిగా హెలెన్ మరింత ఫేమస్ అయ్యిపోయారు. ఆ ఏజ్లో కూడా ఇంత ఎనర్జీనా అని నెటిజన్లు విస్తుపోతున్నారు. 85 ఏళ్ల వయసులో పడుచుపిల్లలా చెంగుచెంగుమని తిరుగుతున్న ఆమె యాక్టివిటీని చూసి.. వృద్ధాప్యం చిన్నబుచ్చికుని దూరంగా వెళ్లిపోయాందా అన్న అనుమానం కలుగుతోందంటున్నారు నెటిజన్లు. ఆ వీడియోలో ..నటి హెలెన్ తనను తాను పరిచయం చేసుకుంటూ..బలంగా, చరుగ్గా ఉండాలంటే పైలేట్స్ వ్యాయామాలు మన దినచర్యలో భాగం కావాలని చెబుతున్నట్లు కనిపిస్తుంది. తాను 85 ఏళ్ల అమ్మాయినే బామ్మను మాత్రం కాను అని నవ్వుతూ చెబుతున్నారామె. ఇప్పుడు కూడా మీరు ఈ కఠినతరమైన పైలేట్స్ వ్యాయామాలు చేస్తారా అని ఫిట్నెస్ ట్రైనర్ యాస్మిన్ ప్రశ్నించగా..ఓ చేద్దాం అని నటి హెలెన్ అన్నారు. వెంటనే పైలేట్స్ బాల్ మీద పడుకుని..శ్వాసను సమన్వయం చేస్తూ వ్యాయామాలు ఈజీగా చేశారామె. అలాగే ఎవరి సాయం లేకుండా ఈజీగా లేవడం, నిలబడటం వంటివి చేయగలరు. ఆఖరికి స్టెప్స్పై కూడా చకచక నడిచేస్తారామె. అంతేగాదు హాయిగా జంపింగ్, రన్నింగ్ కూడా చేస్తారామె. తన ఈ ఉత్సాహానికి కారణం పైలేట్స్ తన దినచర్యలో భాగమవ్వడమేనని అన్నారు. అంతేగాదు ఆ వీడియో చివరలో ఓ మై డార్లింగ్ అనే పాటకు ఉత్సాహంగా డ్యాన్స్ చేయడం హైలెట్గా నిలిచింది. ఆమె వృద్ధాప్యాన్ని ఆరోగ్యకరంగా నిర్వచించడానికి స్ఫూర్తిగా నిలిచారు . View this post on Instagram A post shared by We The Women Asia (@wethewomenasia) వృద్ధులు తప్పకుండా చేయాల్సిన పైలేట్స్ వ్యాయామాలు..సింగిల్ లెగ్ పుల్ అండ్ డబుల్ లెగ్ పుల్ - ఈ వ్యాయామాలు కోర్ కండరాలను బలోపేతం చేస్తాయి. శరీరం సమతుల్యత, స్థిరత్వానికి చాలా అవసరం.సైడ్-లైయింగ్ సిరీస్ - ఇది మన కదలికలను మెరుగుపరుస్తుందిమోడిఫైడ్ ప్లాంక్ - కీళ్లపై ఒత్తిడి పెట్టకుండా బలాన్ని పెంచుతుంది.వాల్ పైలేట్స్ - ఈ వ్యాయామాలను గోడ సాయంతో చేయవచ్చు.తొడ మడతలు - ఈ వ్యాయామాన్ని కుర్చీ సహాయంతో చేయవచ్చు . పైగా వృద్ధులు ఈజీగా నడిచేందుకు హెల్ప్ అయ్యే మంచి వ్యాయామం ఇది.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. ఇలాంటి వ్యాయామాలు చేసే ముందు ఫిట్నెస్ నిపుణుల సలహాలు, సూచనలతో చేయడం ఉత్తమం.(చదవండి: వందేళ్ల అందాల బామ్మ..మేకప్ పాఠాలు! క్యూకడుతున్న ప్రసిద్ధ బ్రాండ్లు) -
విటమిన్–డి లోపిస్తే మానసిక వ్యాధుల ముప్పు
న్యూఢిల్లీ: మనుషుల ఆరోగ్యానికి విటమిన్–డి ఎంత ముఖ్యమో తెలిసిందే. ప్రధానంగా అప్పుడే పుట్టిన శిశువుల్లో ఈ విటమిన్ తగినంతగా లేకపోతే వారిలో మానసిక అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని అ్రస్టేలియాలోని యూనివర్సిటీ ఆఫ్ క్వీన్స్లాండ్, డెన్మార్క్లోని అర్హాస్ యూనివర్సిటీ, స్టేట్ సీరమ్ ఇనిస్టిట్యూట్తో కలిసి లాన్సెట్ సంస్థ నిర్వహించిన తాజా అధ్యయనంలో తేలింది. ఈ వివరాలను సైకియాట్రీ పత్రికలో ప్రచురించారు. డి విటమిన్ లోపంతో జన్మించే శిశువుల్లో ఆటిజం, అటెన్షన్ డెఫిషిట్–హైపర్ యాక్టివ్ డిజార్డర్(ఏడీహెచ్డీ), స్కిజోఫ్రినియా వంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నట్లు పరిశోధకులు గుర్తించారు. విటమిన్–డి, మానసిక సమస్యల మధ్య సంబంధాల విషయంలో ఎక్కువ మందిపై నిర్వహించిన సర్వే ఇదే కావడం గమనార్హం. సర్వేలో భాగంగా 71,000 మందిని పరీక్షించారు. వారి డి విటమిన్ స్థాయిలను అధ్యయనం చేశారు. వీరిలో చాలామంది బాల్యంలో మానసిక అనారోగ్య సమస్యలు ఎదుర్కొన్నవారే.శరీరంలో తగినంత డి విటమిన్ స్థాయిలు లేకుండా జని్మంచినవారిలో ఆరు రకాల మానసిక అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నట్లు క్వీన్స్లాండ్ బ్రెయిన్ ఇనిస్టిట్యూట్ ప్రతినిధి జాన్ మెక్గ్రాత్ చెప్పారు. మేజర్ డిప్రెసివ్ డిజార్డర్, బైపోలార్ డిజార్డర్, స్కిజోఫ్రినియా, ఏడీహెచ్డీ, ఆటిజం స్పెక్ట్రం డిజార్డర్(ఏఎస్డీ), అనొరెక్సియా నెర్వోసా వంటి సమస్యలు ఏర్పడుతున్నట్లు వివరించారు. శిశువులు, చిన్నారుల్లో డి విటమిన్ తక్కువగా ఉంటే స్కిజోఫ్రినియా, ఏఎస్డీ, ఏడీహెచ్డీ ముప్పు అధికంగా ఉంటుందని తెలిపారు. మహిళలు గర్భంతో ఉన్నప్పుడు డి విటమిన్ మాత్రలు తీసుకుంటే పుట్టే శిశువులకు ముప్పు తగ్గుతుందని సూచించారు. అలాగే పుట్టిన శిశువులకు తగినంత డి విటమిన్ అందేలా చూడాలని చెప్పారు. శిశువుల్లో మెదడు అభివృద్ధికి విటమిన్–డి అత్య ంత కీలకమని జాన్ మెక్గ్రాత్ వివరించారు. ప్రపంచ వ్యాప్తంగా గర్భిణుల్లో విటమిన్–డి స్థా యిలు తక్కువగా ఉండడం సర్వసాధారణంగా మారిపోయినట్లు గుర్తించామని పేర్కొన్నారు. పుట్టబోయే శిశువులు ఆరోగ్యంగా ఉండాలంటే గర్భిణులు తగినంత డి విటమిన్ తీసుకోవాలని డాక్టర్ హిమానీ నరులా ఖన్నా చెప్పారు. నిత్యం 600 నుంచి 2,000 ఇంటర్నేషనల్ యూనిట్స్(ఐయూ) డి విటమన్ తీసుకోవాలని సూచించారు. వైద్యుల సలహాతో 4,000 ఐయూ వరకు తీసుకోవచ్చని వివరించారు. శరీరంపై 10 నుంచి 30 నిమిషాలపాటు సూర్యకాంతి పడేలా చూసుకోవాలని పేర్కొన్నారు. చేపలు, గుడ్లతోపాటు పాల ఉత్పత్తుల్లో విటమిన్–డి అధికంగా ఉంటుంది. గర్భిణులకు కేవలం ఆహారంతోనే తగినంత విట మిన్–డి లభించకపోవచ్చు. అందుకే మా త్రల రూపంలో అదనంగా తీసుకోవాలని డాక్టర్ హిమానీ నరులా ఖన్నా చెప్పారు. పేద, తక్కువ ఆదాయం కలిగిన దేశాల్లో డి విటమిన్ లోపం అధికంగా కనిపిస్తోంది. విటమిన్ సప్లిమెంట్స్ కూడా అందుబాటులో ఉండడం లేదు. ఒకవేళ అందుబాటులో ఉన్నప్పటికీ వాటి ఖరీదు భారీగా ఉండడం ప్రజలకు సమస్యగా మారింది. ధనిక దేశాల్లోనూ డి విటమిన్ లోపంతో ఎంతోమంది బాధపడుతున్నారు. ఎండలోకి వెళ్లకపోవడం, పోషకాహారం తీసుకోకపోవడం ఇందుకు కారణాలు. శిశువుల్లో ఆటిజం, ఏడీహెచ్డీ, స్కిజోఫ్రినియా లాన్సెట్ అధ్యయనంలో వెల్లడి గర్భిణులు తగినంత విటమిన్ తీసుకుంటే శిశువులకు తగ్గుతున్న రిస్క్ -
Opal Suchata: 72 ఏళ్ళ కల ఇది..! ఆ కాంక్షతోనే గెలిచా..
ఓపల్ సుచాతా.. మోడల్, థాయ్లాండ్.. తొలి మిస్ వరల్డ్... ఇప్పుడు 72వ మిస్ వరల్డ్! థాయ్లాండ్కి చెందిన ఆమె కేన్సర్ ఫ్రీ ప్రపంచం కోసం పాటుపడుతోంది! దానికో కారణం ఉంది. పదహారవ ఏట ఆమెకు బ్రెస్ట్ ట్యూమర్ సర్జరీ అయింది. అది తన జీవనోద్దేశాన్ని, లక్ష్యాన్నే మార్చింది అంటున్న ఓపెల్ సుచాతా గురించి మరిన్ని విషయాలు ఆమె మాటల్లోనే..‘‘నేను పుట్టి పెరిగింది థాయ్లాండ్లోని ఫుకెట్లో. మా ఊరూ హైదరాబాద్లాగే పర్ల్ సిటీ! హైస్కూల్ కోసం బ్యాంకాక్కి మూవ్ అయ్యాను. సైకాలజీ, ఆంత్రోపాలజీ నాకు ఇష్టమైన సబ్జెక్ట్స్. ప్రస్తుతం నేను అంబాసిడర్ కావాలనే ధ్యేయంతో ఇంటర్నేషనల్ రిలేషన్స్ చదువుతున్నాను.. మా కుటుంబ విషయానికి వస్తే అమ్మ, పెద్దమ్మలు, అత్తలు .. అందరూ స్ట్రాంగ్ పర్సన్సే. ఒకరకంగా చెప్పాలంటే నేను స్ట్రాంగ్ విమెన్ మధ్యలో పెరిగాను. ఆ వాతావరణమే నాకు స్ఫూర్తి. ఆ స్ట్రెంతే నా పదహారవ ఏట బ్రెస్ట్లో డిటెక్ట్ అయిన ట్యూమర్తో ఫైట్ చేసేలా చేసింది. అది క్యాన్సర్ ట్యూమర్ కాదు. అయినా చాలా భయపడ్డాను. ఆ భయాన్నుంచి ఓ ఉద్దేశం కోసం ప్రయాణించేలా చేసింది నా చుట్టూ ఉన్న మహిళల స్ట్రెంతే! సర్జరీ తర్వాత ఈ హర్డిల్ని గనుక దాటగలిగితే నా జీవితాన్ని బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ కార్యక్రమాలకు అంకితం చేయాలనుకున్నాను. లక్కీగా దాటాను. దాంతో అనుకున్నట్టుగానే ‘ఓపల్ ఫర్ హర్’ప్రాజెక్ట్తో బ్రెస్ట్క్యాన్సర్ అవేర్నెస్ క్యాంపెయిన్ ను స్టార్ట్ చేశాను. మహిళా సాధికారతకూ పాటుపడుతున్నాను. ఈ బ్యూటీ పాజెంట్లో నేను పాల్గొనడానికి ప్రేరణ కూడా అదే. బ్యూటీ విత్ ఎ పర్పస్ అనే రౌండ్తో ఈ మిస్ వరల్డ్ బ్యూటీ పాజెంట్ మన కథను ప్రపంచానికి వినిపించే అవకాశాన్ని కల్పిస్తోంది. అందుకే ఈ పాజెంట్లో పాల్గొన్నాను. నా కథను షేర్ చేసుకుని, నాప్రాజెక్ట్ ద్వారా నేను చేస్తున్న కార్యక్రమాలను వివరించి బ్రెస్ట్ క్యాన్సర్ మీద మహిళలకే కాదు జెండర్స్కి అతీతంగా అందరికీ అవగాహన కల్పించాలనుకున్నాను.తోటి కంటెస్టంట్లందరి ఆలోచనలూ పంచుకుంటానుమిస్ వరల్డ్ హోదాలో నేను ప్రపంచమంతా పర్యటించగలిగే అవకాశం దక్కినందుకు సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా ప్రపంచమంతటా నా ప్రాజెక్టుల గురించి చెప్పుకోగలను. అయితే నాకు నా తోటి కంటెస్టంట్లందరి ఆలోచనలూ,ప్రాజెక్టులూ కూడా చాలా నచ్చాయి. నాకు వీలున్నంతవరకు నేను అందరి ఆలోచనలూ,ప్రాజెక్టులనూ కూడా అన్ని వేదికలమీదా పంచుకుంటాను.క్రౌన్తో మా దేశానికి వెళుతున్నందుకు సంతోషంగా ఉందినా బ్యూటీ పాజెంట్ జర్నీ నా పద్దెనిమిదవ ఏట మొదలైంది. మొదటిసారి నేను గెలవలేదు. తర్వాత రెండేళ్లకు మళ్లీ నేషనల్ బ్యూటీ పాజెంట్లో పాల్గొన్నాను. గెలిచాను. మిస్ వరల్డ్కి ఎంపికయ్యాను. బ్యూటీ విత్ ఎ పర్పస్తో విన్ అయ్యి.. మిస్ వరల్డ్ క్రౌన్ తో మీ ముందుకు వచ్చాను. నిజానికి ఇది మా దేశం 72 ఏళ్లుగా కంటున్న కల. ఆ కల నా ద్వారా సాకారం అయినందుకు, నేను మిస్ వరల్డ్ క్రౌన్తో మా దేశానికి వెళ్లగలుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ పాజెంట్ నా లెర్నింగ్ అన్ లెర్నింగ్ప్రాసెస్కు ఓ వేదికైంది. భిన్నదేశాలు, విభిన్నమైన సంస్కృతి, సంప్రదాయాలకు చెందిన నా తోటి కంటెస్టెంట్స్ నుంచి చాలా నేర్చుకున్నాను. ఎక్సే్చంజ్ ఆఫ్ వ్యూస్, ఒపీనియన్స్, నాలెడ్జ్ షేరింగ్తో కొత్త విషయాలను తెలుసుకోగలిగాను. నా ఆలోచనా తీరూ మారింది. నా పర్సెప్షన్ బ్రాడ్ అయింది.అన్నీ అద్భుతంతెలంగాణ రావడం ఇదే మొదటిసారి. ఇక్కడి మహిళలు చాలా వైబ్రెంట్గా ఉన్నారు. వాళ్ల కట్టుబొట్టు తీరు, ఇక్కడి ఫుడ్, కల్చర్, ఆతిథ్యం అన్నీ అద్భుతం. నేను జ్యూయలరీ ఫ్యాన్ ని. అందుకే నాకు హైదరాబాద్ బాగా నచ్చింది. ముత్యాలే కాదు సంప్రదాయ, ఫ్యాషన్ జ్యుయలరీకి ఫ్యూజన్ లా ఉందీప్రాంతం. నేను చూసిన ఈ అద్భుతాన్ని మా వాళ్లకు చెప్పాలనుకుంటున్నాను. అంతేకాదు, ఇక్కడ నన్ను ఇన్ స్పైర్ చేసిన కథలు చాలా ఉన్నాయి. వాటినీ మావాళ్లకు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మాటల కన్నా చేతలతోనే అవతలి వాళ్లకు ప్రేరణగా నిలవాలనుకుంటాను. మన పక్కనున్న వాళ్లకు ఓ భరోసాగా నిలవాలనుకుంటాను. నన్ను నేను అలా మలచుకోవడానికే ప్రయత్నిస్తాను’’ అని చెప్పింది ఈ మిస్ వరల్డ్.– సరస్వతి రమఫొటోలు: ఎస్.ఎస్. ఠాకూర్ -
కీలు మారాక 'ఫీల్ ఎలా ఉంది'?
చాలా ఏళ్ల కిందట ఇటీవల మోకాలి దగ్గర ఉన్న కీళ్లు అరిగితే... తీవ్రమైన మోకాళ్ల నొప్పులతో బాధపడేవారు. పాత నొప్పులంటూ చెబుతూ జీవితాంతం బాధపడేవారు. కదలడానికి కూడా కష్టపడుతూ, నడవడానికి నానా యాతన పడుతూ జీవితాన్ని వెళ్లబుచ్చేవారు. కానీ గత కొన్ని దశాబ్దాలుగా మోకాలి కీళ్ల మార్పిడి శస్త్రచికిత్సలు చాలా వేగంగా ప్రాచుర్యం పొందడంతో ఈ శస్త్రచికిత్సలు చేయించుకునేవారు ఎక్కువగా ఉంటున్నారు. నిజానికి మోకాలి కీళ్ల మార్పిడి శస్త్రచికిత్స ఒక ఎత్తైతే... ఆ తర్వాత పాటించాల్సిన జాగ్రత్తలూ, సూచనలూ మరో ఎత్తు. వీటిని ఎంత సమర్థంగా అమలు చేస్తే... నడక అంత వేగంగానూ అంత మెరుగ్గానూ జరుగుతుంది. మోకాలి కీళ్ల మార్పిడి శస్త్రచికిత్స అనంతరం తీసుకోవాల్సిన జాగ్రత్తలూ, పాటించాల్సిన సూచనలపై అవగాహన కోసం ఈ కథనం.మోకాలి కీళ్ల మార్పిడి చికిత్సలో భాగంగా డాక్టర్లు సాధారణంగా బాధితులకు రెండు రకాల శస్త్రచికిత్సలు చేస్తుంటారు. మొదటిది పూర్తి మోకాలి మార్పిడి శస్త్రచికిత్స (కంప్లీట్ నీ– రీప్లేస్మెంట్ సర్జరీ), రెండోది... పాక్షిక మోకాలి కీలు మార్పిడి శస్త్రచికిత్స (పార్షియల్ నీ – రీప్లేస్మెంట్ సర్జరీ). వీటిల్లో పాక్షిక మోకాలి మార్పిడి శస్త్రచికిత్సలో కోలుకోవడం అన్నది చాలా త్వరితంగా... అంటే రెండు నుంచి నాలుగు వారాల్లో జరుగుతుంది. అదే పూర్తి మోకాలి కీలు మార్పిడి శస్త్రచికిత్స తర్వాత కోలుకోడానికి నాలుగు నుంచి ఆరు వారాల వ్యవధి అవసరం. బాధితుల అవసరాన్ని బట్టి ఈ రెండింటిలో ఒకదాన్ని డాక్టర్లు సూచిస్తారు. ఈ రెండింటి ప్రభావాలూ, మన్నిక ఒకేలా ఉంటాయి. పోలికలు వద్దు... పైన పేర్కొన్న కాల వ్యవధులను చాలామంది వ్యక్తులను పరిశీలించి... ఓ సగటు సమయాన్ని పేర్కొనడం కోసం చెప్పేవి మాత్రమే. వారి వారి శరీర తత్త్వాన్ని బట్టీ, అలాగే రోగనిరోధక వ్యవస్థ తాలూకు చురుకుదనం, వారి సాధారణం ఆరోగ్యం, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలూ వీటన్నింటి ఆధారంగా కోలుకునే సమయం ఒకరి నుంచి మరొకరికి మారవచ్చు. శస్త్రచికిత్స తర్వాత నొప్పి వస్తుండే వ్యవధి కూడా ఒకరి నుంచి మరొకరికి వేరుగా ఉండవచ్చు. అందుకే మోకాలి కీలు మార్పిడి జరిగిన ఇతర వ్యక్తులతో ΄ోల్చుకోవడం సరికాదు. దీనివల్ల మానసిక ఆందోళన పెరగడం, దాంతో వ్యాధి నిరోధక వ్యవస్థ మందగించడం వల్ల గాయం తగ్గడానికి పట్టే సమయం పెరగవచ్చు. అందుకే మరొకరితో ΄ోల్చుకోవడం ఎట్టిపరిస్థితుల్లోనూ వద్దు. శస్త్రచికిత్సకు ముందున్న స్టిఫ్నెస్ : శస్త్రచికిత్సకు ముందు మోకాలి దగ్గర కదలికలు చాలా పరిమితంగా మాత్రమే ఉన్నవారికి ఆ తర్వాత కదలికలు పెరుగుతాయి. అయితే మునుపు అంతగా స్టిఫ్గా లేనివారితో పోలిస్తే ఇలా స్టిఫ్గా ఉన్నవారిలో కదలికలు అంతగా పెరగకపోవచ్చు. నొప్పి తీవ్రత ఎక్కువ తక్కువలు : నొప్పి తక్కువగా ఉన్నవారు ఫిజియో వ్యాయామాలను సమర్థంగా చేయగలుగుతారు అందుకే వారిలో మెరుగదల గణనీయంగా ఉండవచ్చు. నొప్పి విపరీతంగా ఉన్నవారిలోనూ, వ్యాయామల సమయంలో నొప్పిని అంతగా భరించలేనివారిలో వ్యాయామాలు అంత ఎక్కువగా లేకపోవడం వల్ల పూర్తిస్థాయి నార్మల్ కదలికలు రాకుండా కేవలం పరిమితంగా మాత్రమే మెరుగుదల కనిపించవచ్చు. ఇలా నొప్పి ఎక్కువగా ఉండేవారు దాన్ని భరించాల్సిన అవసరం లేదు. డాక్టర్ను సంప్రదించి నొప్పి వాళ్ల ఆధ్వర్యంలో నివారణ మందులు వాడుతూ వ్యాయామాలు చేస్తూ తాము కోరుకున్న స్థాయి మెరుగుదలను పొందవచ్చు.మెరుగుదల ఆధారపడే అంశాలివే... శస్త్రచికిత్స తర్వాత కాలి కదలికలు మామూలుగా మారడం లేదా మోకాలి దగ్గర నార్మల్గా ఉండటం అన్నవి కొన్ని అంశాల మీద ఆధారపడి ఉంటుంది. వాటిలో ప్రధానమైనవి... శస్త్రచికిత్సలో ఏ టెక్నిక్ వాడారనే అంశం : శస్త్రచికిత్సలో ఏ తరహా టెక్నిక్ వాడారనే అంశంతో పాటు శస్త్రచికిత్స సమయంలోనే లోపల ఉన్న అవరోధాలనూ, వైకల్యాలను, ఇతరత్రా సమస్యలను ఏ మేరకు రిపేర్ చేశారనే అంశాలపై కూడా శస్త్రచికిత్స తర్వాతి మెరుగుదల ఆధారపడి ఉంటుంది. కృత్రిమ మోకాలు తాలూకు డిజైన్ : కృత్రిమంగా లోపల అమర్చే భాగాన్ని ప్రోస్థెసిస్’ అంటారు. ఈ ప్రోస్థెటిక్ డిజైన్ను బట్టి కూడా మెరుగుదల ఉంటుంది. ఇప్పుడు కొత్తగా అందుబాటులోకి వస్తున్న డిజైన్లు మోకాలి కీళ్ల దగ్గర కదలికలు ఫుల్ రేంజ్లో చాలా ఎక్కువగా (గరిష్ఠంగా) ఉండేలా డిజైన్ చేసినవి అందుబాటులోకి వస్తున్నాయి.ఈ జాగ్రత్తలు తప్పనిసరి... శస్త్రచికిత్స సమయంలో పెట్టే గాటు వద్ద కొందరికి స్పర్శ తెలియకపోవడం (నంబ్నెస్) లాంటి లక్షణాలు కనిపిస్తే మరికొందరిలో అక్కడ ముట్టుకోనివ్వకపోవడం (హైపర్సెన్సిటివిటీ) లాంటి లక్షణం కనిపించవచ్చు. అందుకే బాధితులలో కనిపించే లక్షణం ఏదైనా దాని గురించి ఆందోళన వద్దు. దాని గురించి ఇతర బాధితుల లేదా శస్త్రచికిత్స జరిగినవారితో మీ భావాలు పంచుకోకుండా కేవలం మీ డాక్టర్తో మాట్లాడటమే మంచిది. శస్త్రచికిత్స గాయం దగ్గర ఇలా స్పర్శ తెలికుండా ఉన్న కొందరిలో గాటు పెట్టిన భాగం పొడిగా ఉండటంతో పాటు అక్కడ దురద వస్తుండటం జరగవచ్చు. ఇలాంటప్పడు అక్కడ పైపూతగా రాసే మాయిష్చరైజర్ (టాపికల్ మాయిష్చరైజర్) రాయడం మంచిది.మోకాలి కీలు మార్పిడి శస్త్రచికిత్స తర్వాత... చేయాల్సినవీ... చేయకూడనివి... మోకాలి కీలు మార్పిడి శస్త్రచికిత్స తర్వాత గాయం నయం కావడం గానీ లేదా మెరుగుదల గానీ, కృత్రిమ కీలు చాలా రోజులు మన్నికతో ఉండటానికి గానీ పాటించాల్సిన సూచనలలో ప్రధానమైవి...చేయాల్సినవి... బరువు అదుపులో ఉంచుకోవడం (స్థూలకాయం వల్ల కృత్రిమ కీలుపై బరువు పడటం వల్ల మన్నిక తగ్గే అవకాశమున్నందున బరువును అదుపులో ఉంచుకోవడం అవసరం). కృత్రిమ కీలు వద్ద తగినంత కదలికలూ, కీలుకు అవసరమైన బలం సమకూరడంతో పాటు అది చాలాకాలం మన్నికతో ఉండటం కోసం క్వాడ్రసెప్, హ్యామ్స్ట్రింగ్ కండరాలకు బలం చేకూరే వ్యాయామాలు చేయడం. క్రమం తప్పకుండా ఈత (స్విమ్మింగ్), సైక్లింగ్, నడక (వాకింగ్) వ్యాయామాలు. ఇక్కడ పేర్కొన్న వ్యాయామాల్లో బాధితులకు అనువుగా ఉన్నవాటిని రోజుకు 30 నుంచి 45 నిమిషాల పాటు వారంలో కనీసం ఆరు రోజుల పాటు చేస్తుండాలి.చేయకూడనివి... పరుగు (రన్నింగ్), ఆటలాడటం వంటి వ్యాయామాలు వద్దు. దీనివల్ల అమర్చిన కృత్రిమ కీలుపై భారం ఎక్కువగా పడి అక్కడ గాయం రేగవచ్చు. మోకాళ్లు పూర్తిగా ముడుచుకునేలా గుంజీళ్లు తీయడం వంటి వ్యాయామాలూ, అలాగే గొంతుక్కూర్చోవడం, బాసిపట్లు వేసి కూర్చోవడం వద్దు. కృత్రిమ కీలు ప్రోస్థెసిస్)లోని పాలీ ఇథిలీన్ / ప్లాస్టిక్ స్పేసర్ భాగం కొంత సున్నితమైనది. కాబట్టి నడక, కఠిన వ్యాయామాలు, రఫ్గా ఉపయోగించడం వంటి సందర్భాల్లో కొంత విచక్షణ పాటించి జాగ్రత్తగా చూసుకోవడం మేలు.నరాలకు సంబంధించిన సమస్యలుగానీ లేదా నడకలో నొప్పిగాని ఉంటే వాకర్ లేదా వాకింగ్ స్టిక్ వంటి ఉపకరణాల సహాయం తీసుకోవడం మంచిది. చివరగా... కృత్రిమ కీలు కొత్తగా శరీరంలోకి వచ్చి చేరిన భాగమైనందువల్ల మిగతా అవయవాల లాగే దాని గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకుని జాగ్రత్తగా ఉండాలి. ఈలోపు జ్వరం, గాయం దగ్గర తీవ్రమైన నొప్పి రావడం లేదా ఎర్రగా మారడం వంటి లక్షణాలు కనిపిస్తుంటే తక్షణం డాక్టర్ను సంప్రదించాలి. అలాగే చెవి, గొంతు, మూత్రసంబంధ ఇన్ఫెక్షన్లు కనిపించినా వెంటనే డాక్టర్ను కలవాలి. అంతే తప్ప సొంత చికిత్స రూపంలో యాంటీబయాటిక్స్ వాడటం సరికాదు. పైన పేర్కొన్న సూచనలతో కృత్రిమ కీలును దాదాపు 15 నుంచి 20 ఏళ్లు మన్నేలా జాగ్రత్త పడవచ్చు. శస్త్రచికిత్స సమయంలో పెట్టే గాటు వద్ద కొందరికి స్పర్శ తెలియకపోవడం (నంబ్నెస్) లాంటి లక్షణాలు కనిపిస్తే మరికొందరిలో అక్కడ ముట్టుకోనివ్వక΄ోవడం (హైపర్సెన్సిటివిటీ) లాంటి లక్షణం కనిపించవచ్చు. అందుకే బాధితులలో కనిపించే లక్షణం ఏదైనా దాని గురించి ఆందోళన వద్దు. శస్త్రచికిత్స గాయం దగ్గర ఇలా స్పర్శ తెలికుండా ఉన్న కొందరిలో గాటు పెట్టిన భాగం పొడిగా ఉండటంతోపాటు అక్కడ దురద వస్తుండటం జరగవచ్చు. ఇలాంటప్పడు అక్కడ పైపూతగా రాసే మాయిష్చరైజర్ (టాపికల్ మాయిష్చరైజర్) రాయడం మంచిది. డాక్టర్ ప్రవీణ్ మేరెడ్డి,సీనియర్ కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్. (చదవండి: పచ్చి క్యాబేజ్ సలాడ్లు తింటున్నారా..? నిపుణుల స్ట్రాంగ్ వార్నింగ్) -
Covid-19 ‘హ్రస్వ దృష్టి’ సంక్షోభంలో ప్రపంచం
2020లో లక్షలాది మంది ప్రాణాలను బలిగొన్న కోవిడ్-19 వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి ప్రభుత్వ అధికారులు లాక్డౌన్ ప్రకటించారు. కార్యాలయాలను, పాఠశాలలను మూసివేశారు. వినియోగదారు అనుకూల ఇంట ర్ఫేస్ జూమ్, ఇదే విధమైన వీడియో–కాన్ఫరెన్సింగ్ ప్లాట్ఫా మ్ల కారణంగా, ఇంటి నుండి పని చేసే కొత్త సంస్కృతి పుట్టింది. లాక్డౌన్ అనిశ్చితి, విద్యా కార్యకలాపాలను కోల్పోతామనే భయంతో చిన్నపిల్లలు, పసిపిల్లలు రోజుకు చాలా గంటలు తమ ఇళ్లలోనే ఉండి ఆన్లైన్ తరగతులకు హాజరయ్యారు. ఫలితంగా పిల్లలు హ్రస్వ దృష్టి (మయోపియా, Myopia) బారినపడ్డారు.మొదట్లో చైనా, ఆ తరువాత ప్రపంచంలోని ఇతర ప్రాంతాలలోని నేత్ర వైద్య నిపుణులు 2020 నాటికి, చిన్న పిల్లల్లో ఆందోళన కలిగించే స్థాయి వేగంతో హ్రస్వ దృష్టి వ్యాపిస్తోందని కనుగొన్నారు. దీంతో ప్రమాద హెచ్చరికలు మోగాయి. చైనాలో ఆరేళ్ల వయస్సు పిల్ల లలో మయోపియా వ్యాప్తిలో 400 శాతం పెరుగుదలను గుర్తించారు. ముఖం నుండి 30 సెం.మీ. కంటే తక్కువ దూరంలో పుస్తకాలను ఉంచుకోవడం, 30 నిమిషాల కంటే ఎక్కువసేపు నిరంతరం చదవడం అనేవి చిన్న పిల్లలలో హ్రస్వ దృష్టి పెరగడానికి ప్రధాన ప్రమాద కారకాలు. చదవడం, రాయడం ప్రభావితం కానప్ప టికీ, ఉపాధ్యాయుడు బ్లాక్బోర్డ్పై రాసిన అక్షరాలను, సుదూర వస్తువులను చూడలేకపోవడమే హ్రస్వదృష్టిగా సాధారణంగా వ్యవహరిస్తుంటారు. 1960లలో పట్టణ, గ్రామీణ జనాభా రెండింటినీ విస్తృతంగా సర్వే చేసిన చీఫ్ డాక్టర్ ఐఎస్ జైన్ ముఖ్య మైన విషయాన్ని వెల్లడించారు. గ్రామీణ జనాభాలో (2.77 శాతం), పాఠశాల పిల్లల్లో (4.79 శాతం), చండీ గఢ్ పట్టణ జనాభాలో (6.9 శాతం), పీజీఐ వైద్యులలో (33 శాతం) మందిలో హ్రస్వ దృష్టి వ్యాప్తి క్రమంగా పెరగడానికి కంటికి దగ్గరలో పని చేయడం, అధిక అక్ష రాస్యత రేట్లు, ఆదాయ స్థాయులు కారణమని ఆయన అన్నారు. ఇటీవల, ఉత్తర భారతదేశంలో పాఠశాలకు వెళ్లే పట్టణ పిల్లలలో 21 శాతం మందికి హ్రస్వ దృష్టి ఉన్నట్లు గుర్తించారు. ఇది 50 ఏళ్లలో 4 రెట్లు ఎక్కువ.పెరుగుతున్న హ్రస్వ దృష్టిపై కోవిడ్-19 క్వారంటైన్ ప్రభావం తూర్పు, ఆగ్నేయాసియాలో ముందుగా ఎక్కువగా కనిపించినప్పటికీ, తక్కిన ప్రపంచంలో ఎవరూ దానినుంచి తప్పించుకోలేదు. ఒక అధ్యయనం ప్రకారం, డిజిటల్ పరికరాల్లో రోజుకు సగటున ఒక గంట గడిపిన పిల్లలలో 46 శాతం మంది హ్రస్వదృష్టితో ఉన్నారు. నాలుగు గంటలు గడిపిన వారిలో 76 శాతం మంది ఉన్నారు. తక్కువ బహిరంగ కార్యకలాపాలు, మసక గది వెలుతురు, అధిక పని దీనికి కారణం.గత 10 సంవత్సరాలలో, డిజిటల్ పరికరాల వాడకం నాలుగు రెట్లు పెరిగింది. ఇటీవల ప్రతిష్ఠాత్మక మైన ‘జామా’ జర్నల్లో ‘3 లక్షల కంటే ఎక్కువ మంది పాఠశాల పిల్లలు పాల్గొన్న శాస్త్రీయ అధ్యయనాల ఆధా రంగా, రోజుకు కనీసం నాలుగు గంటల వరకు డిజిటల్ స్క్రీ¯Œ లపై గడిపే వారిలో, ప్రతి గంటకూ హ్రస్వ దృష్టి అభివృద్ధి చెందే అవకాశాలు 21 శాతం పెరిగాయని’ ఓ విశ్లేషణ ప్రచురితమయ్యింది. హ్రస్వదృష్టి బారిన పడిన అన్ని రకాల రోగుల్లో దాదాపు 8 శాతం మంది జీవితంలో తరువాత అంధత్వాన్ని ఎదుర్కొంటున్నారు. 2050 నాటికి ప్రపంచ జనాభాలో సగం మంది మయో పిక్ రోగులే అవుతారని డాక్టర్ హోల్డెన్, ఆయన సహ చరులు చేసిన అంచనాలు నిజమైతే ఈ వ్యవహారం ఒక పెద్ద ప్రజారోగ్య సమస్యగా మారవచ్చు. కంటి కండరాలను సడలించే అట్రోపిన్ కంటి చుక్కలను ఉపయోగిస్తే అవి చిన్న పిల్లలలో కనుగుడ్డు వ్యాప్తి చెందటాన్ని నిరోధిస్తాయని, అంతే కాకుండా హ్రస్వదృష్టి పెరగడాన్ని కూడా అవి తగ్గిస్తాయని సింగపూర్కు చెందిన డాక్టర్ చువా, ఆయన సహచరులు ఇరవై సంవత్సరాల క్రితమే నిరూపించారు. డాక్టర్ రోహిత్ సక్సేనా నేతృత్వంలో జరిగిన దేశవ్యాప్త అధ్య యనం ప్రకారం, రెండేళ్ల కాలంలోనే భారతీయ పిల్ల లలో కరిగిపోయే అట్రోపిన్ చుక్కలు (0.01 శాతం) ఉపయోగించినప్పుడు అవి హ్రస్వదృష్టి పెరుగుదలను తగ్గించాయని తేలింది. సూర్యరశ్మికి గురికావడం వల్ల రెటీనాలో డోపమైన్ స్థాయులు పెరుగుతాయి. ఇది హ్రస్వ దృష్టి బారిన పడ కుండా కాపాడుతుంది. కోవిడ్–19 సమయంలో ప్రతి రోజూ రెండు గంటలు బయట గడపడం అనేది పిల్ల లలో హ్రస్వ దృష్టి వ్యాప్తిని అరికడుతుందని టర్కీకిచెందిన డాక్టర్లు ధ్రువీకరించారు. బహిరంగ కార్యకలా పాలు రోజుకు 2 గంటలు మించి ఉంటే అట్రోపిన్ (బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ నిరోధకం) మరింత ప్రభావవంతంగా ఉంటుందని చండీగఢ్లోని డాక్టర్లు కనుగొన్నారు. అనుభవపూర్వకమైన, సమగ్ర అభ్యాసంపై దృష్టి సారించిన ‘జాతీయ విద్యా విధానం–2020’, పట్టణ భారతదేశంలో స్థల పరిమితుల సాకును చూపి, 2008 విద్యా హక్కు చట్టంలో తప్పనిసరి చేసిన ముఖ్యమైన ఆట స్థలం అవసరాన్ని తొలగించింది. అయితే ఉపా ధ్యాయులు పిల్లలను రోజుకు రెండుసార్లు కనీసం ఒక గంట బయట నడవడానికి అనుమతించాలి.-అమోద్ గుప్తాఎమెరిటస్ ప్రొఫెసర్,పీజీఐఎమ్ఈఆర్, చండీగఢ్ -
పొగతాగడం మానేస్తే ఎన్ని లాభాలో తెలుసా? దెబ్బకి మానేస్తారు!
పొగాకు వినియోగం అనేక రకాలుగా జరుగుతుంటుంది. ఉదాహరణకు సిగరెట్, బీడీ, చుట్ట, హుక్కా, పైప్, వేపింగ్... ఇలాంటి పొగ పీల్చేవీ; వాటికి తోడు జర్దా, ఖైనీలంటూ ముసుగులో పొగాకు నమిలేవీ ముక్కుతో పీల్చే నశ్యం వంటివి... ఇలా ఎన్నెన్నో రూపాల్లో పొగాకు వినియోగం జరుగుతుంటుంది. వీటితో ఎన్ని రకాల క్యాన్సర్లు వస్తాయో తెలుసుకుంటే పొగాకు గురించి తలచుకుందామన్నా భయమేస్తుంది. పొగలో ఉండే విషాలివే... పొలోనియమ్ : రేడియోధార్మిక పదార్థాల్లోని రేడియో యాక్టివ్ మెటీరియల్ క్యాన్సర్కు కారణమవుతుందన్న విషయం తెలిసిందే. సిగరెట్ పొగలో ఈ రేడియో ధార్మిక పదార్థం ఉంటుంది. అది క్యాన్సర్ కారకం. బెంజీన్ : మనం రోజూ వాడే పెట్రోలు, గ్యాస్లలోంచి వెలువడే అత్యంత వ్యర్థపదార్థమిది. ఫార్మాల్డిహైడ్ : సిగరెట్ పొగలోని ఫార్మాల్డిహైడ్ అనే రసాయనాన్ని మృతదేహాలను సంరక్షించేందుకు వాడతారు. అనేక జువాలజీ ల్యాబ్లలో జీవుల మృతదేహాలను గాజుకుప్పెల్లో భద్రపరిచేందుకు వాడే రసాయన పదార్థం ఫార్మాల్డిహైడ్ ద్రావణమే. వినైల్ క్లోరైడ్ : ప్లాస్టిక్ పైపులు, ప్లాస్టిక్ పదార్థాలు తయారు చేయడానికి వినైల్ క్లోరైడ్ వాడతారు. సిగరెట్ తాగడం అంటే ఈ ప్లాస్టిక్ను దేహంలోకి తీసుకోవడమే. ఇది కూడా క్యాన్సర్కు కారణమయ్యే అంశాల్లో ఒకటి. ఎన్ని రకాల క్యాన్సర్లు వస్తాయంటే... నోటి ద్వారా పొగపీల్చే ΄ పొగాకుతో నోటి (ఓరల్) క్యాన్సర్లు, గొంతు (ఓరో ల్యారింగ్స్, ఓరో ఫ్యారింగ్స్, హై΄ోఫ్యారింగ్స్) క్యాన్సర్లు, పొగ నేరుగా వెళ్లే ప్రమాదకరమైన ఊపిరితిత్తుల క్యాన్సర్లు ప్రధానంగా వచ్చే అవకాశముంది. దీంతో పాటు పరోక్షంగా కడుపు క్యాన్సర్లు, పెద్దపేగు క్యాన్సర్లు, బ్లాడర్ క్యాన్సర్లతో పాటు మరీ ముఖ్యంగా ్ర΄ోస్టేట్ గ్రంథికి వచ్చే క్యాన్సర్లు ముఖ్యం. పొగ కారణంగా వచ్చే క్యాన్సర్లు దేహంలోని ఏ భాగాన్నీ వదిలిపెట్టవంటే అది అతిశయోక్తి కాదు. పొగాకు తెచ్చిపెట్టే మరికొన్ని వ్యాధులు.. ΄ పొగతాగడం కేవలం క్యాన్సర్లనే కాకుండా... చాలా రకాల వ్యాధులనూ ప్రేరేపిస్తుంది. గుండె΄ోటు, రక్త΄ోటు, పక్షవాతంతో ΄ాటు మధుమేహమూ వచ్చేలా చేస్తుందీ అలవాటు. మామూలు వారితో పోలిస్తే పొగతాగే అలవాటు ఉన్నవారిలో టైప్–2 డయాబెటిస్ వచ్చేందుకు అవకాశాలు 30 నుంచి 40 శాతం మేరకు ఎక్కువ. ఇదీ చదవండి: నిద్ర ముంచుకు రావాలంటే.. బెస్ట్ యోగాసనాలుధూమపానం మానేస్తే కలిగే ప్రయోజనాలివి... ఆహారం రుచి తెలియడం వాసన గ్రహించే శక్తి సాధారణ స్థాయికి రావడం ∙చెమట, శ్వాస, జుట్టు, బట్టలు తాజా వాసనతో ఉండటం, పళ్లు, గోళ్లు పచ్చబారకుండా ఉండటంమెట్టెక్కేటప్పుడు, దిగే సమయంలో, చిన్న చిన్న పనులకు ఆయాసం లేకుండా తేలిగ్గా చేయగలగడం. దీర్ఘకాలిక ప్రయోజనాలు...సిగరెట్ మానేసిన తొమ్మిది నెలల్లో దగ్గు, ఆయాసం తగ్గుతాయి. ఊపిరితిత్తులు బలపడతాయి. దేహంలో ఇన్ఫ్లమేషన్, ఇన్ఫెక్షన్స్ ముప్పు తగ్గుతుంది. పొగతాగడం మానేసిన ఏడాది తర్వాత కరోనరీ హార్ట్ డిసీజ్ వచ్చే అవకాశాలు గణనీయంగా తగ్గుతాయి. అందుకే ఈరోజు నుంచే పొగతాగడమే కాదు... ΄పొగాకును ఏ రూపంలో వినియోగిస్తున్నా మానేయడమే మంచిది. ఇదీ చదవండి: World Anti Tobacco Day: 1, 2, 3 కేన్సర్ దాకా అవసరమా మిత్రమా!ఇంట్లోని కుటుంబ సభ్యుల్లో ఒకరు సిగరెట్ తాగినా అది ఇంటిల్లిపాదీ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. పక్కనుండేవారు తాగే సిగరెట్ పొగను ఇతరులు పీల్చాల్సి వస్తుండటాన్ని ‘ప్యాసివ్ స్మోకింగ్’ అంటారు. నేరుగా ΄ పొగతాగడం వల్ల కలిగే హాని ఎంతో ప్యాసివ్ స్మోకింగ్ వల్ల కూడా అంతే హాని జరుగుతుందని పరిశోధనల్లో తేలింది. ఒక అధ్యయనంలో తేలిన విషయం ఏమిటంటే... ప్రతి ఏడాదీ ప్యాసివ్ స్మోకింగ్ వల్ల 34వేలమంది ఊపిరితిత్తుల క్యాన్సర్తోనూ, 46,000 మంది గుండెజబ్బులతోనూ మృత్యువాత పడుతున్నారని తేలింది. అంతేకాదు... ఇంట్లో ఇతరులు తాగే సిగరెట్తో కలిగే ఈ ప్యాసివ్ స్మోకింగ్ ప్రభావం వల్ల ఇంట్లోని పొగతాగని ఇతర కుటుంబ సభ్యులకు... ఆస్తమా, నిమోనియా, బ్రాంకైటిస్, తలనొప్పి, దగ్గు వంటి అనారోగ్యాలు కలుగుతున్నా యని స్పష్టమైంది.డా. బట్టు చైతన్య, సీనియర్ కన్సల్టెంట్ పల్మునాలజిస్ట్ -
Yoga 9 ఏళ్లకే గిన్నిస్ రికార్డు‘యోగం’
యోగాసనాలు వేయడం పూర్తిగా నేర్చుకోవాలంటే చాలా కాలం పడుతుంది. యోగా హెల్త్కు మంచిదని మనకు తెలుసు కదా. యోగాను తప్పకుండా గురువు దగ్గరే నేర్చుకోవాలి. అయితే రేయాంశ్ సురాని అనే బాలుడు తొమ్మిదేళ్లకే యోగా గురువుగా మారాడు. గిన్నిస్ బుక్లో చోటు కూడా సంపాదించాడు. ఇది చాలా ఇన్స్పయిర్ చేసే విషయం మనకు. మన దేశానికి చెందిన రేయాంశ్ సురాని (Reyansh Surani) తల్లిదండ్రులతో కలిసి దుబాయిలో ఉంటున్నాడు. నాలుగేళ్ల వయసులో నానమ్మ, తాతయ్య యోగాసనాలు వేయడం చూశాడు. తనూ వారిని అనుసరించడం మొదలుపెట్టాడు. దీంతో వారు యోగాసనాలు నేర్పించారు. ఆ తర్వాత తల్లిదండ్రులతో కలిసి మన దేశంలోని రిషికేశ్ వచ్చి యోగా కోర్సులో చేరాడు. అక్కడ నెల రోజులు ఉండి శ్రద్ధగా యోగాసనాలు నేర్చుకున్నాడు. రోజూ ఉదయం 7 నుంచి సాయంత్రం ఏడున్నర దాకా యోగా క్లాసులోనే గడిపేవాడు. అక్కడ వారిని చూసి తను కూడా యోగా శిక్షకుడిగా మారాలని భావించాడు. చదవండి: మెకంజీ షాక్, ప్రియురాలితో రెండో పెళ్లికిముందే జాగ్రత్తపడుతున్న జెఫ్ బెజోస్ అందుకోసం సుమారు 200 గంటల కోర్సు చేశాడు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా లెక్క చేయలేదు. ఆ తర్వాత పూర్తిస్థాయిలో యోగా శిక్షకుడిగా మారాడు. ఆ సమయానికి అతని వయసు 9 ఏళ్లు. దీంతో 2021 జులైలో ‘ప్రపంచంలో అతి చిన్న వయసున్న యోగా శిక్షకుడు’గా గిన్నిస్ ప్రతినిధులు రికార్డు అందించారు. గాలిలో నిలబడి యోగాసనాలు వేయడాన్ని సైతం రేయాంశ్ సాధన చేశాడు. దీంతోపాటు ‘The Avid World of Reyansh' పేరుతో 2022లో ఓ పుస్తకం రాశాడు. ప్రస్తుతం అతనికి 13 ఏళ్లు. యోగాలో మరింత సాధన చేసి, ఉత్తమ శిక్షకుడిగా పేరు తెచ్చుకోవాలని ఆశపడుతున్నాడు. ఇదీ చదవండి: World Anti Tobacco Day: 1, 2, 3 కేన్సర్ దాకా అవసరమా మిత్రమా! -
Fitness: '2 పర్ 20 వాకింగ్ రూల్' అంటే..?
మనదేశంలో ఏటా మధుమేహంతో పడుతున్న వారి సంఖ్య వేలల్లో ఉందని నివేదికలు చెబుతున్నాయి. చిన్నా పెద్ద అనే తారతమ్యం లేకుండా అందరు ఈ వ్యాధితోనే బాధపడుతున్నారు. షుగర్ నియంత్రణలో ఉండాలంటే వర్కౌట్లు తప్పనిసరి కానీ ఈ బిజీ లైఫ్లో వ్యాయమాలు చేయడం అంటే అంత ఈజీ కాదు. మరీ అలాంటప్పడు వ్యాయమాలు చేయకుండానే చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉండాలంటే ఈ ‘2 పర్ 20’ రూల్ని పాటిస్తే చాలని చెబుతున్నారు నిపుణులు. మరీ ఆ రూల్ ఏంటి, ఎలా షుగర్ని నియంత్రిస్తుందో చూద్దామా..మనం ఎక్కువసేపు కూర్చొని ఉండటంతో కాళ్లలోని కండరాలు నిరుపయోగంగా మారతాయి. ఎందుకంటే రక్తం గ్లూకోజ్ని శోషించడం నెమ్మదిస్తుంది. అదే భోజనం తర్వాత చక్కెర స్థాయిలు అమాంతం పెరిగిపోతాయి. అందువల్ల ప్రతి 20 నిమిషాలకు ఒకసారి లేచి నిలబడి నడిస్తే..కండరాల కార్యకలాపాలు బలోపేతంగా ఉండి, గ్లూకోజ్ శోషణ రక్తప్రసరణ మెరుగ్గా ఉంటుందని చెబుతున్నారు నిపుణులు. ఫలితంగా ఇన్సులిన్ స్థాయిలు 25% తగ్గుతాయని, ఇన్సులిన్ సమస్యలు ఉత్ఫన్నం కావని నొక్కి చెబుతున్నారు నిపుణులు. ఎవరికి మంచిదంటే..ఈ విధానం ప్రీడయాబెటిక్ వ్యక్తులు లేదా డయాబెటిస్ ప్రారంభ దశలో ఉన్నవారికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే చాలామంది కార్యాలయాల్లో కూర్చొని ఉద్యోగాలు చేసేవాళ్లే గాక వ్యాయమానికి తగినంత సమయం కేటాయించలేనేవారే. అందువల్ల ఆయా వ్యక్తలకు ఈ రూల్ని అనుసరిస్తే మంచి పలితాలను పొందుతారని నమ్మకంగా చెబుతున్నారు నిపుణులు. అలాగే రోజులో చిన్నపాటి కదలికలు పెద్ద ప్రభావాన్ని చూపిస్తాయని అంటున్నారు. కనీసం 30 సెకన్లు కూర్చోవడానికి విరామం ఇచ్చి..అటు ఇటు నాలుగు అడుగుల వేస్తేనే మంచి ప్రభావాన్ని పొందగలమని అన్నారు. అయితే ఇది మెరుగైన హృదయ ఆరోగ్యం, కండరాల బలం వంటి నిర్మాణాత్మక వ్యాయామ ప్రయోజనాలను అందించకపోయినా..2 పర్ 20 వాకింగ్ రూల్' బిజీగా ఉండే వ్యక్తులకు, వ్యాయామం చేయడం కుదరదు అనుకున్న వ్యక్తులకు ఇది బెస్ట్ అని చెబుతున్నారు. దాంతోపాటు సమతుల్య ఆహారం, హైడ్రేటెడ్గా ఉండేలా చూసుకోవడం వంటి జాగ్రత్తలు కూడా పాటించాలని చెబుతున్నారు. మెరుగైన గ్లైసెమిక్ నియంత్రణకు ఇది బెస్ట్ అని ధీమాగా చెబుతున్నారు వైద్య నిపుణులు.(చదవండి: S Jaishankar: చాలా ఏళ్లుగా ఆ అలవాటు ఉంది'! వర్క్ లైఫ్ బ్యాలెన్స్పై జైశంకర్ మాట) -
అరుదైన ఆపరేషన్.. మెడలోంచి మెదడులోకి 8 సెం.మీ మేకు!
లక్నో: అరుదైన శస్త్రచికిత్సలో, కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీ (KGMU) వైద్యులు ఒక బాలుడి మెడలో గుచ్చుకున్న డైరెక్ట్గా మేకు మెదడులోకి దిగిపోయింది. ఎనిమిది సెంటీమీటర్ల పొడవున్న ఇనుప మేకును తొలగించడానికి 10 గంటల పాటు ఆపరేషన్ నిర్వహించడం విశేషంగా నిలిచింది.. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్లో చోటుచేసుకుంది. బలరాంపూర్ జిల్లాకు చెందిన ఏడేళ్ల బాలుడు ఆడుకుంటూ ఇనుప మేకుపై పడిపోయాడు. సుమారు 8 సెంటీమీటర్ల పొడవైన ఆ మేకు అతడి మెడను చీల్చుకుంటూ, అత్యంత సున్నితమైన మెదడు భాగంలో దిగబడింది. ఆడుకుంటూ ప్రమాదవశాత్తూ కిందపడిన బాలుడి మెడకు గుచ్చుకున్న మేకు మెదడులోకి దిగబడింది. అత్యంత సున్నితమైన మెదడు భాగంలోకి దిగబడిన మేకును వైద్యులు పది గంటలపాటు శ్రమించి, విజయ వంతంగా వెలికి తీశారు. ఇదీ చదవండి: Miss world 2025 పెరిగిన ఇమేజ్!బాధిత బాలుడిని కుటుంబసభ్యులు లక్నోలోని కింగ్ జార్జి మెడికల్ యూనివర్సిటీ (కేజీఎంయూ) కు తీసుకువచ్చారు. చాలా ప్రమాదకరమైన కేసుగా నిర్ధారణకు వచ్చిన ఆస్పత్రి నిపుణుల బృందం మైక్రో సర్జికల్ సాంకేతికతను, న్యూరో నేవిగేషన్ వ్యవస్థను వాడుకుంటూ అత్యంత జాగ్రత్తగా రక్త నాళాలు దెబ్బతినకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. దాదాపు 10 గంటలపాటు సాగిన అత్యంత సంక్లిష్టమైన ఈ సర్జరీ విజయవంతమైంది. బాలుడు నెమ్మదిగా కోలుకున్నాడని, ప్రమాదం నుంచి బయటపడ్డాడని వైద్యులు తెలిపారు. అరుదైన ఈ ఆపరేషన్ వివరాలు త్వరలో అంతర్జాతీయ మెడికల్ జర్నల్లో ప్రచురితం కానున్నాయని చెప్పారు. చదవండి: అమెరికా నుంచి 1,080 మంది భారతీయుల బహిష్కరణ -
Heat : మహిళల్లో పెరుగుతున్న యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లు (UTI)
హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్ దాటడంతో.. మహిళల్లో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లు (urinary tract infection) (యూటీఐ) పెరుగుతున్నాయి. బయట విపరీతమైన వేడి, డీహైడ్రేషన్, జీవనశైలి అలవాట్ల నేపథ్యంలో ఇలాంటి ఇన్ఫెక్షన్లు తరచు సంభవిస్తున్నవారు ఆరోగ్యాన్ని ఆయా సీజన్లలో జాగ్రత్తగా చూసుకోవాలని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ (ఏఐఎన్యూ)కు చెందిన మహిళా యూరాలజిస్ట్ డాక్టర్ సారికా పాండ్యా తెలిపారు.“ఈ సీజన్లో ప్రతి 10 మంది మహిళల్లో ముగ్గురికి యూటీఐ బారిన పడుతున్నారు. ఇదే సంవత్సరం మిగిలిన సీజన్లతో పోలిస్తే ఇది ఎక్కువగానే ఉంది” అని డాక్టర్ సారిక చెప్పారు.వేసవితో సంబంధమేంటిశారీరకంగా చూసినప్పుడు మహిళలకు మూత్రనాళం చిన్నగా ఉండడంతో వారికి యూటీఐ వచ్చే అవకాశం ఎక్కువ. అయితే వేసవిలో ముప్పు కారకాలు మరింత అధికంగా ఉంటాయి. “డీహైడ్రేషన్ ప్రధాన కారణం. మహిళలకు చెమటలు ఎక్కువగా పడుతుంటాయి, అదే సమయంలో తగినంత నీళ్లు తాగరు. దానివల్ల మూత్రం బాగా చిక్కగా అవుతుంది. ఇది ఒకరకమైన తేమ వాతావరణాన్ని సృష్టించి, బ్యాక్టీరియా పెరిగేందుకు కారణమవుతుంది. ఈతకొలనులో ఎక్కువసేపు తడి దుస్తులతో ఉండడం, బాగా బిగుతుగా ఉండే దుస్తులు ధరించడం, ప్రయాణాలు లేదా బయటకు వెళ్లినప్పుడు మూత్రం వచ్చినా ఎక్కువసేపు ఆపుకోవడం వల్ల యూటీఐ లాంటి ఇన్ఫెక్షన్లు పెరుగుతాయి” అని డాక్టర్ పాండ్యా వివరించారు.గమనించాల్సిన లక్షణాలు“యూటీఐ లక్షణాలలో ముఖ్యంగా మూత్రవిసర్జన సమయంలో మంటపుట్టడం, తరచు మూత్రానికి వెళ్లాలనిపించడం, మూత్రం దుర్వాసన రావడం, పొత్తికడుపులో అసౌకర్యం, నీరసం లాంటివి ఉంటాయి. ఈ లక్షణాలు ఏమైనా ఒక రోజుకంటే ఎక్కువ ఉంటే సొంత మందులు వాడకుండా వెంటనే వైద్యుల వద్దకు వెళ్లాలి. ముందస్తు లక్షణాలను నిర్లక్ష్యం చేస్తే కిడ్నీ ఇన్ఫెక్షన్లు వస్తాయి. ముఖ్యంగా మధుమేహ బాధితులు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు మరింత జాగ్రత్తపడాలి” అని ఆమె చెప్పారు.వేసవిలో జీవనశైలి సమస్యలువేసవికాలంలో కొన్నిరకాల ప్రవర్తనల వల్ల యూటీఐ ముప్పు పెరుగుతందని డాక్టర్ సారికా పాండ్యా అన్నారు. “ప్రధానంగా.. ఈతదుస్తుల్లో ఎక్కువసేపు ఉండిపోతే బ్యాక్టీరియా పెరుగుతంది. బిగుతుగా ఉండే దుస్తులు ధరిస్తే ముఖ్యంగా లోపలి భాగాల్లోవేడి, చెమట ఎక్కువవుతాయి. మహిళలు బయట ఉండే మరుగుదొడ్లు ఉపయోగించరు. మూత్రాన్నిఎక్కువసేపు ఆపుకోవడం ప్రమాదకరమైన అలవాటు. కాటన్ లోదుస్తులు ధరించడం, తరచు మూత్రానికి వెళ్లడం, ముఖ్యంగా లైంగిక చర్య తర్వాత, అలాగే ఎక్కువసేపు బయట ఉన్న తర్వాత వెళ్లడం అవసరం” అని వివరించారు.నీళ్లు తాగడం, పరిశుభ్రత, ఆహారంయూటీఐని నివారించడానికి సులభమైన మార్గం.. నీళ్లు తాగడమేనని డాక్టర్ పాండ్యా చెప్పారు. “తాగగలిగినన్ని ద్రవాలు తాగండి. దానివల్ల మూత్రం రంగు సాధారణంగా ఉంటుంది. తీపి పానీయాలు, కెఫిన్ వాడకూడదు. అవి తాగితే బాగున్నట్లు అనిపిస్తుంది గానీ, బ్లాడర్ను అవి ఇరిటేట్ చేస్తాయి. ఆహారంలో కూడా యూటీఐని నియంత్రించేవి తీసుకోవాలి. క్రాన్బెర్రీ జ్యూస్ లేదా టాబ్లెట్ల వల్ల బ్లాడర్ గోడలకు బ్యాక్టీరియా అతుక్కోకుండా ఉంటుంది. అవి రాకుండా ఆపుతాయి. ఒకసారి లక్షణాలు మొదలయ్యాక వాటిమీద ఆధారపడకూడదు” అన్నారు. చికిత్స, దీర్ఘకాల నిర్వహణతరచు ఇన్ఫెక్షన్లు వచ్చే మహిళలకు తక్కువ మోతాదులో యాంటీబయాటిక్స్, మెనోపాజ్ దశ దాటిన మహిళలకు వెజైనల్ ఈస్ట్రోజన్ ఇస్తామని, అలాగే.. తగిన సమయానికి మూత్రవిసర్జన చేయడం చాలా ముఖ్యమని డాక్టర్ సారిక తెలిపారు. కొందరికి లైంగిక చర్య తర్వాత యాంటీబయాటిక్స్ వేసుకోవడం, లేదా సొంత మందులతో కొంత ఉపశమనం ఉండచ్చు. కానీ వైద్యుల పర్యవేక్షణలోనే మందులు వాడాలి. యాంటీబయాటిక్స్తో తగ్గించడం కంటే దీర్ఘకాలం పాటు రాకుండా చూసుకోవడం, శరీర లక్షణాలు గమనించడం ముఖ్యం” అని ఆమె సూచించారు.అవగాహన ముఖ్యంయూటీఐల విషయంలో చాలామందిక అవగాహన ఉండట్లేదని, పైగా అపోహలు ఉంటున్నాయని డాక్టర్ సారికా పాండ్యా తెలిపారు. “హైదరాబాద్లో చాలామంది మహిళలు లైంగికచర్య వల్లే యూటీఐ వస్తుందనుకుంటున్నారు. ఇంటి చిట్కాలతో దాన్ని కడిగేయొచ్చని కూడా భావిస్తున్నారు. మరికొందరు దానిగురించి బయటకు మాట్లాడేందుకు ఇబ్బంది పడుతున్నారు. పాఠశాలలు, క్లినిక్ల లాంటిచోట్ల ప్రజలకు అవగాహన కల్పించడం ముఖ్యం. మనం పోషకాహారం గురించి, రుతుక్రమ శుభ్రత గురించి మాట్లాడినట్లే యూరినరీ ఆరోగ్యం గురించి చర్చను కూడా సాధారణం చేయాలి” అని చెప్పారు. -
మామిడి జీడితో అద్భుతమైన ప్రయోజనాలు కానీ వాళ్లకు డేంజర్
ఇపుడు మామిడి కాయలు, మామిడి పళ్ల సీజన్ నడుస్తోంది. సాధారణంగా తియ..తీయ్యటి మామిడి పండును చక్కగా ఆరగిస్తాం. టెంకను వదలకుండా శుభ్రంగా రసాన్ని పీల్చి పిప్పి చేసేదాకా వదలం కదా.. మరి మామిడి పండులోని జీడి గురించి ఎపుడైనా ఆలోచించారా? పనికి రాదనుకొని బయట పారేసే జీడితో ఆరోగ్య ప్రయోజనాలున్నాయని తెలుసా? ఇందులో సూక్ష్మపోషకాలు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. దీన్ని పురాతన కాలం నుండి అనేక ఆయుర్వేద మందులు, కొన్ని చికిత్సలలో కూడా ఉపయోగిస్తారు. అంతేకాదు మామిడిలోని పిక్క, లేదా గింజతో నూనె కూడా తయారు చేస్తారు. ఈ నూనెలో ముఖ్యమైన కొవ్వు ఆమ్లాలు, ఫైబర్, ఖనిజాలు, విటమిన్ల అధికంగా ఉంటాయి. ఈ నూనెతో చర్మం, జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఉపయోగించవచ్చు. మ్యాంగో సీడ్స్ ఆరోగ్య ప్రయోజనాలుమామిడి కాయ టెంకలోని విత్తనాన్ని జీడి లేదా పుడక అంటారు. ఈ జీడిలో యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ యాంటీమైక్రోబయల్, లక్షణాలంటాయి. విటమిన్లు , ఖనిజాలతో సమృద్ధిగా లభిస్తాయి. రోగనిరోధకవ్యవస్థకు: యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉన్న మామిడి గింజల పొడి, రోగనిరోధక శక్తిని అందిస్తుంది.యాంటీ డయాబెటిక్, బరువు తగ్గేందుకు : మామిడి గింజలు, ముఖ్యంగా ఆఫ్రికన్ మామిడి గింజల సారం, రక్తంలో చక్కెరను నియంత్రించడంలో, కొలెస్ట్రాల్ను తగ్గించడంలో , బరువు తగ్గడంలో సహాయపడుతుంది.జీర్ణ ఆరోగ్యం: మామిడి గింజలు విరేచనాలు వంటి జీర్ణ సమస్యలకు చక్కటి పరిష్కారంగా తోడ్పడతాయి. దంత ఆరోగ్యానికి టూత్ పౌడర్ను తయారు చేసుకొని ఉపయోగించవచ్చు.చర్మం, జుట్టు : ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలకు, మొటిమలు,తదిర చర్మ సమస్యలకు మామిడి గింజల నూనెను ఉపయోగించవచ్చు. మెరిసిన జుట్టు సమస్యకు చెక్ పెట్టవచ్చునని నిపుణులు చెబుతున్నారు. జుట్టు నల్లగా, పొడవుగా, హెల్దీగామారుతుంది. ఫేస్ క్లెన్సర్: మామిడి జీడి, టమాటాతో తయారు చేసిన స్క్రబ్, చర్మాన్ని ఎక్స్ఫోలియేట్ చేయడానికి, బ్లాక్హెడ్స్, మొటిమలు, మచ్చలను నయం చేయడానికి, ముఖంపై ఏర్పడ్డ రంద్రాలను ఫిల్ చేయడానికి, ఎరుపును తగ్గించడానికి ఉపయోగపడుతుందికాలేయ ఆరోగ్యానికి: మామిడి గింజలు కాలేయాన్ని నిర్విషీకరణ చేయడంలో సహాయపడతాయి. కాలేయంలోని టాక్సిన్స్ను తొలగించి, పనితీరును మెరుగుపరుస్తాయి. అవి విషాన్ని తొలగించడంలో సహాయపడతాయి.దంతాలకు: మామిడికాయలో జీడి పొడి దంతాలకు మేలు చేస్తుంది. రెగ్యూలర్గా బ్రష్ చేసుకుంటే దంతాల ఆరోగ్యం మెరుగుపడుతుంది. మామిడి గింజలను శిశువులకు సహజ దంతాలను తొలగించే సాధనంగా ఉపయోగించవచ్చు. ఈ పొడిని యాలకుల పొడితో కలిపి రోజుకు మూడు సార్లు తీసుకుంటే విరేచనాలు తగ్గుతాయి. పోషక విలువలు: మామిడి గింజలు విటమిన్లు A, C, D, E, K, B విటమిన్ల (B1, B2, B3, B5, B6, B7, B9, B12) మంచి మూలం.మామిడి గింజలను ఎలా వాడాలి?మామిడి గింజల పొడి: విత్తనాలనుబాగా ఎండలో ఎండబెట్టి మెత్తగా పొడి చేసుకోవాలి. ఈ పొడిని స్మూతీలు, జ్యూస్లు లేదా నీటిలో కలపవచ్చు. జీర్ణక్రియకు సహాయపడటానికి, కడుపు సమస్యలను తగ్గించడానికి మామిడి గింజల పొడిని తేనె లేదా నీటితో కలిపి తీసుకుంటారుటీ: ఎండెబెట్టి పొడి చేసిన మామిడి గింజల పొడిని టీ తయారు చేసుకోవచ్చు.ఆరోగ్య సప్లిమెంట్లు: మామిడి గింజల సారాన్ని ఆహార పదార్ధంగా తీసుకోవచ్చు, క్యాప్సూల్ లేదా టాబ్లెట్ రూపంలో లభిస్తుంది. కొంతమంది వీటిని మామిడి కాయ నిల్వ పచ్చడిలో కూడా కలుపుతారు.నోట్: మామిడి గింజలు అనేక ప్రయోజనాలను అందిస్తున్నప్పటికీ, వాటిని మితంగా తీసుకోవడం ముఖ్యం. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకు మామిడి గింజలను అస్సలు తీసుకోకూడదని చెబుతారు నిపుణులు. అలాగే మామిడి గింజల పొడిని ఎక్కువ మోతాదులో తీసుకుంటే టానిన్లు, ఫైటేట్లు, సాపోనిన్లు జీర్ణక్రియకు హాని చేయవచ్చు. వీటిని ఆహారంలో చేర్చుకునే ముందు లేదా చర్మ లేదా జుట్టు సంరక్షణకు వినియోగించేముందు, వైద్యుడిని లేదా బ్యూఐటీ ఎక్స్పర్ట్ని సంప్రదించడం మంచిది. -
అటు పీడీసీ మందుల దందా ఇటు నకిలీల జోరు!
కర్నూలు(హాస్పిటల్): పీడీసీ(ప్రాపగండ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ) మందులను కొన్ని మెడికల్ షాపుల్లో విక్రయిస్తున్నారు. వాటిపై భారీగా ఎంఆర్పీలు ముద్రించి.. డిస్కౌంట్లు సైతం భారీగా ఇస్తున్నట్లు హంగామా చేస్తున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో మూడు వేలకు పైగా రిటైల్, హోల్సేల్ మెడికల్ షాపులు ఉన్నాయి. ఇందులో కర్నూలు నగరంలోనే అధికంగా ఉన్నాయి. ఇక్కడి నుంచే హోల్సేల్ దుకాణాల ద్వారా జిల్లాలోని నలుమూలల్లో ఉండే రిటైల్ దుకాణాలకు మందులు వెళ్తుంటాయి. అయితే ఇటీవల కాలంలో సొంతంగా మందులు తయారు చేయించుకుని విక్రయించే విధానం తెరపైకి వచ్చింది. అంటే మార్కెట్లో లభించే బ్రాండెడ్ మందులే గాకుండా మందులు తయారు చేసే కంపెనీలతో మాట్లాడుకుని వారికి అవసరమైన ఔషధాలను తయారు చేయించుకుని విక్రయించుకునే అవకాశం వచ్చింది. నాణ్యత అనుమానమే! పీడీసీ(ప్రాపగండ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ) మందులను ఆయా ఫార్మాకంపెనీలతో మాట్లాడుకుని తయారు చేయించుకోవచ్చు. వాటిపై ఎంఆర్పీలు అవి తయారు చేయించుకునే వారి ఇష్టం. వాటిపై ఎంతైనా వేసుకోవచ్చు. ఎంతంటే బ్రాండెడ్ మందుల కంటే అధికంగా ఉండేటంత. ఏదైనా ఔషధాన్ని కనిపెట్టాలంటే సదరు ఫార్మా కంపెనీ ఎన్నో సంవత్సరాలు కష్టపడి తయారు చేస్తుంది. ఈ మేరకు కొన్ని నిర్ణీత సంవత్సరాల పాటు ఆ మందుకు పేటెంట్ తీసుకుంటుంది. ఆ పేటెంట్ కాలం ముగిసిన తర్వాత ఆ మందు ఫార్ములా తీసుకుని ఎవ్వరైనా తయారు చేసుకోవచ్చు. ఇతర బ్రాండెడ్ కంపెనీలతో పాటు ఊరు పేరు తెలియని కంపెనీలు కూడా మందులు తయారు చేసి జనంపైకి వదులుతున్నాయి. ఈ మేరకు భారీగా మందులపై ఎంఆర్పీలు ముద్రించి దోచుకుంటున్నాయి. ప్రస్తుత పోటీ ప్రపంచంలో కొన్ని ప్రధాన దుకాణాల్లో మందుల కొనుగోలుపై 10 శాతం డిస్కౌంట్ ఇస్తున్నారు. కానీ వైద్యులకు అటాచ్డ్గా ఉన్న మందుల దుకాణాల్లో లభించే ఈ పీడీసీ మందులపై ఎలాంటి డిస్కౌంట్స్ ఉండవు. పైగా సదరు డాక్టర్ రాసిన మందులు అక్కడ మాత్రమే లభిస్తాయి. అయితే ఈ మందులు ఎంత మేరకు పనిచేస్తాయి. వాటి నాణ్యత ఎంత అనేది ప్రతి దాన్ని ల్యాబ్లో పరీక్షిస్తే గానీ తెలియని పరిస్థితి. అ‘ధన’పు లాభాలు ఉదాహరణకు ఒక బ్రాండెడ్ ఔషధం ధర రూ.300లు ఉందంటే...అందులో కంపెనీకి సంబంధించి తయారీ ఖర్చులు, ప్రచార ఖర్చులు, మార్కెటింగ్ ఖర్చులు అన్నీ కలిపి ఉంటాయి. కానీ పీడీసీ కంపెనీకి ఇలాంటి ఖర్చులేమీ ఉండవు. ఆ మందులపై భారీగా తగ్గింపు ఉండాలి. అంటే ఆ ఔషధం రూ.100లోపు ఉండాలి. కానీ పీడీసీ విషయంలో మాత్రం ఆ మందు ధర రూ.400 నుంచి రూ.600 వరకు ఉంటోంది. దీనిని బట్టి ఈ మందులపై ఎంతమేరకు లాభం ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఒకప్పుడు హోల్సేల్ ఏజెన్సీలు ఉన్న వారు ఇలాంటి మందులను వైద్యులున్న మెడికల్ షాపులకు పంపేవారు. ఇప్పుడు నేరుగా వైద్యులే ఏజెన్సీలు ఏర్పాటు చేసుకుని ఆ అదనపు లాభాలు కూడా వారే పొందుతున్నారు. కేసులు నమోదు చేశాం మార్కెట్లో లభించే అన్ని మందుల కంపెనీలు అనుమతి తీసుకునే తయారు చేస్తాయి. వాటిపై ఎంఆర్పీలు ఆయా కంపెనీలు ఇష్టం. ఎంఆర్పీలు, డిస్కౌంట్లను ప్రశ్నించలేం. ఎంఆర్పీ కంటే ఎక్కువ విక్రయిస్తే కేసులు నమోదు చేస్తాం. పీడీసీ మందుల నాణ్యతపై తరచూ శాంపిల్స్ తీసి పంపిస్తున్నాం. ఇందులో ఇటీవల నంద్యాలలో రెండు, ఆదోనిలో ఒక శాంపిల్ సబ్ స్టాండర్డ్(నాణ్యతా ప్రమాణాలు లేనివి) అని నివేదికలు వచ్చాయి. ఈ మేరకు ఆయా దుకాణాలు, కంపెనీలపై కేసులు నమోదు చేశాం. –రమాదేవి, ఔషధ నియంత్రణ శాఖ ఏడీ, కర్నూలుఇలా చేయాలి.. నకిలీ మందుల మోసాలను అరికట్టేందుకు సదరు కంపెనీలు ఇటీవల మందుల స్ట్రిప్పై క్యూఆర్ కోడ్ను ముద్రిస్తున్నాయి. ఈ క్యూ ఆర్ కోడ్ను స్కాన్ చేస్తే అవి నకిలీవా అసలువా అనేది తెలిసిపోతుంది.నకి‘లీలలు’ ఒకవైపు పీడీసీ మందుల దందా జోరుగా సాగుతున్న వేళ ఇమిటేషన్ డ్రగ్స్(నకిలీ) కొత్త వ్యాపారాన్ని ప్రారంభమైంది. మార్కెట్లో బాగా పేరున్న బ్రాండ్ల మందులను అచ్చుగుద్దినట్లు తయారు చేసి విక్రయిస్తున్నారు. గతంలో జాన్సన్ కంపెనీకి చెందిన అ్రల్టాసెట్ మాత్రలను విజయవాడ కేంద్రంగా తయారు చేసి తెలుగు రాష్ట్రాల్లో విక్రయించి పట్టుబడ్డారు. మూడు రోజుల క్రితం హైదరాబాద్లో ఓ వ్యక్తి అబాట్ కంపెనీ తయారు చేసిన థైరోనామ్ అనే థైరాయిడ్ టాబ్లెట్లను నకిలీవి తయారు చేసి విక్రయిస్తూ పట్టుబడ్డాడు.ఇటీవల కర్నూలులో ఓ దుకాణంలో సిస్టోపిక్ కంపెనీ గ్యాస్ట్రబుల్ కోసం తయారు చేసిన సైరా–డి అనే క్యాప్సుల్ను నకిలీగా తయారు చేశారు. ఎంఆర్పీ మాత్రం తప్పుగా ముద్రించి పట్టుబడ్డాడు. ఇటీవల కాలంలో నకిలీ మందుల వ్యాపారం కూడా జోరుగా సాగుతోంది. అచ్చుగుద్దినట్లు బ్రాండ్ను పోలి ఉండటంతో సామాన్య ప్రజలతో పాటు వ్యాపారులు కూడా గుర్తించలేని విధంగా ఆ మందులు ఉంటున్నాయి.భారీగా ఆఫర్లు పీడీసీ మందుల క్రయ విక్రయాలు ఎక్కువ కావడం, పోటీ పెరగడంతో ప్రస్తుతం వాటిపై భారీ డిస్కౌంట్లు అందిస్తున్నారు. డాక్టర్ అటాచ్డ్ కౌంటర్లలో ఈ మందులు ఎంఆర్పీకి ఇస్తుండగా, కొన్ని కార్పొరేట్ మందుల దుకాణాలు, స్థానిక ఏజెన్సీలు నేరుగా రిటైల్ దుకాణాలు ఏర్పాటు చేసి భారీగా డిస్కౌంట్లు ప్రకటిస్తున్నాయి. ఈ మేరకు కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల, మెడికల్ కాలేజీ, రాజ్విహార్, పాతబస్టాండ్, వెంకటరమణ కాలనీ, కొత్తబస్టాండ్ వంటి ప్రాంతాల్లో షాపు బోర్డుపైనే 25శాతం వరకు డిస్కౌంట్లు ప్రకటిస్తున్నారు. పీడీసీ మందులు విక్రయించే దుకాణాలకు సైతం సదరు ఏజెన్సీలు భారీగా ఆఫర్లు ఇస్తున్నాయి. పది స్ట్రిప్పులు కొంటే పది ఫ్రీ అంటూ ఆఫర్లు ఇచ్చేస్తున్నారు. -
పచ్చి క్యాబేజ్ సలాడ్లు తింటున్నారా..? నిపుణుల స్ట్రాంగ్ వార్నింగ్
ఇటీవల కాలంలో అందిరిలోనూ ఆరోగ్య స్ప్రుహ ఎక్కువైంది. ప్రతి ఒక్కరూ పోషకాహారంపై దృష్టి పెడుతున్నారు. అలాగే బరువు అదుపులో ఉంచుకునే యత్రం చేస్తున్నారు. అందులో భాగంగా మార్నింగ్ సమయంలో పచ్చి కూరగాయ సలాడ్లు, స్మూతీలు వంటివి తీసుకుంటున్నారు. అలానే ఇక్కడొక మహిళ బరువు తగ్గే ప్రయత్నంలో భాగంగా సలాడ్లు తీసుకునేది. ఆ తర్వాత కొద్దిరోజులకే అనారోగ్య పాలైంది. ఆమె ఎందికిలా అనారోగ్య సమస్యలు వస్తున్నాయని..పరీక్షించగా అసలు విషయం తెలిసి వైద్యలు కంగుతిన్నారు. అంతేగాదు దయ చేసి పచ్చి కూరగాయలు తినేందుకు ప్రయత్నించొద్దని గట్టి వార్నింగ్ ఇచ్చారు. అలా పచ్చిగా తీసుకోవడం వల్ల ఎదురయ్యే అనర్థాల గురించి సవివరంగా వెల్లడించారు. మరీ అవేంటో సవివరంగా తెలుసుకుందామా..!.35 ఏళ్ల మహిళ తరుచుగా తలనొప్పి సమస్యలతో బాధపడుతున్నానంటూ ఆస్పత్రికి వచ్చింది. బరువు తగ్గే క్రమంలో స్ట్రిక్టడైట్ ఫాలో అయ్యి ఇలా ఇబ్బంది పడుతుందా అనే దిశగా ఆ మహిళను విచారించారు. అయితే ఆ మహిళ స్ప్రుహతప్పి పడిపోవడం, మూర్చ వంటి పలు సమస్యలను ఎదుర్కొనడంతో రక్త పరీక్షలు వంటి వివిధ వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ పరీక్షల్లో ఆమె మెదులో గాయంతో బాధపడుతున్నట్లు నిర్థారణ అయ్యింది. దానికి కారణమేంటని..చూసిన వైద్యుడి ఆరోగ్య చరిత్రలో తలకు గాయమైన దాఖాలాలు లేవు. దీంతో ఆమె ప్రతి రోజు ఎలాంటి ఫుడ్ తీసుకుంటారని ప్రశ్నించగా..ఆమె పచ్చి క్యాబేజీ, పాలకూర వంటి కూరగాయలను తీసుకుంటానని చెప్పింది. దీని కారణంగానే ఆమె బ్రెయిన్ సిస్ట్తో బాధపడుతుందని వైద్యులు నిర్థారణకు వచ్చి ఆమె ట్రీట్మెంట్ ఇచ్చారు. ఇలా జరగడానికి కారణం..ఈ పరిస్థితిని న్యూరోసిస్టిసెర్కోసిస్ లేదా బ్రెయిన్ వార్మ్ అని పిలుస్తారు. దీనికారణంగా పిల్లలు, పెద్దలు తరుచుగా మూర్చ వంటి సమస్యలను ఎదుర్కొంటారు. మరీ ఈ మహిళ ఈ పరిస్థితి బారిన పడటానికి ప్రధాన కారణం బ్రేక్ ఫాస్ట్గా సలాడ్లో తీసుకునే పచ్చి కాయగూరలేనని చెప్పారు. పచ్చి కాయగూరలు తీసుకోవడం మంచిది కాదా..? అంటే..ముమ్మాటికి మంచిది కాదనే అంటున్నారు వైద్యులు. వీటిల్లో బద్దె పురుగులు(టేప్వార్మ్ ) ఉంటాయట. మన నీటితో చక్కగా వాష్ చేశాం అనుకుంటాం గానీ.. అవి ఆకు మడతల్లో ఉండిపోతాయి. అంటే వాటికి సంబంధించిన లార్వాలు వంటివి పచ్చి కూరగాయల్లో ఉండిపోతాయట. ఎప్పుడైతే సలాడ్ పేరుతో పచ్చిగా తింటామో అవి నేరుగా మన కడుపులోకి నేరుగా వెళ్లిపోతాయి. దీంతో బ్రెయిన్ సిస్ట్ వంటి సమస్యలు ఉత్ఫన్నమవుతాయని అన్నారు. మనం ఇలా పచ్చి కూరగాయలు తినగానే ఆ టేప్వార్మ్ సంబంధిత లార్వాలు రక్తప్రవాహంలోకి వెళ్లి..అక్కడ నుంచి మెదడు ప్రయాణించి తిత్తులుగా ఏర్పడతాయన్నారు. అంటే వాపు లేదా ద్రవం రూపంలో పేరుకుపోతాయట. దీంతో సదరు వ్యక్తికి తర్చుగా మూర్చలు, తలనొప్పి వంటి సమస్యలు వస్తాయని చెబుతున్నారు.చికిత్స..యాంటీబయాటిక్, స్టిరాయిడ్లతో ఈ సమస్యను నివారిస్తామని తెలిపారు వైద్యులు. అయితే ఒక్కోసారి ఈ లార్వా గనుక చనిపోయినా..సమస్యలు మరింత తీవ్రంగా ఉంటాయని అన్నారు. బాధితుడు తలనొప్పి వంటి వాటిని తేలిగ్గా తీసుకోకుండా..సకాలంలో వైద్యుడిని సంప్రదిస్తే..ఈ సమస్య నుంచి త్వరితగతిని బయటపడగలరని చెప్పారు. అలాగే ఒక్కోసారి ఈ టేప్ వార్మ్ లార్వా ప్రేగులలో కూడా అసౌకర్యాన్ని కలిగిస్తుందని చెప్పారు. తద్వారా చేతులు, కాళ్లలో వాపు వంటి సమస్యలు వస్తాయట.క్యాబేజీలోనే ఎక్కువ..!క్యాబేజీ బ్యాక్టీరియాకు నిలయమా..? అంటే..అది పెరిగే నేల, కడగడానికి ఉపయోగించే నీరు తదితరాలపై ఆధారపడి ఉంటుంది. అయితే క్యాబేజ్ని నీటితో వాష్ చేసినప్పటికీ టేప్ వార్మ్ లార్వాలు ఆకుమడతల్లో ఉండిపోతాయి. అందువల్ల వీటిని వేడినీటిలో కొద్దిసేపు ఉడికించి.. సలాడ్గా తీసుకుంటే ప్రమాదం ఉండదని చెబుతున్నారు వైద్యుల. ఈ టేప్ వార్మ్ లార్వాలు తక్కువ ఉడికించే కూరగాయలు, మాంసంలో అలానే ఉండిపోతాయట. అందుకని తగు మోతాదులో ఉడికిస్తే ఎటువంటి సమయం ఉండదని చెబుతున్నారు నిపుణులు. గమనిక: ఈ కథనం కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. మరిన్ని వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం.(చదవండి: పెళ్లి బరాత్తో దద్దరిల్లిన వాల్స్ట్రీట్..! వీడియో వైరల్) -
‘మా ఆయన సంసారానికి పనికి రాడు సార్’..!
నమస్తే డాక్టరు గారు. నాకు సంవత్సరం క్రితం పెళ్ళయింది. నా భర్త సాఫ్ట్వేర్ ఇంజినీర్. వర్క్ ఫ్రం హోం చేస్తారు. చాలామంచి వ్యక్తి. మా అత్తయ్య వాళ్లకి ఒక్కడే కొడుకు, పెళ్ళికి ముందు ఎలాంటి ప్రేమ వ్యవహారాలు లేవు. ఎలాంటి చెడు అలవాట్లు కూడా లేవు. ఎంతో ఇష్టపడి నన్ను పెళ్ళి చేసుకున్నారు. కానీ ఒకటే సమస్య మా మధ్య ఎలాంటి శారీరక సంబంధం లేదు. మొదట్లో ప్రయత్నం చేశారు. కానీ ఫెయిల్ అయ్యారు. అప్పటి నుండి ఆత్మన్యూనతా భావంతో ఉంటున్నారు. నాతో ఫ్రీగా ఉండరు. సరదాగా మాట్లాడరు. నేను ప్రేమగా దగ్గరికి వెళ్తే ముడుచుకుపోతారు. తాను సంసారానికి పనికిరానని, నన్ను వేరే పెళ్ళి చేసుకోమని అంటున్నారు. మా అత్త మామలకు చేప్తే హైదరాబాద్ వెళ్ళి యూరాలజిస్ట్కి చూపించారు. ఆయన అన్ని పరీక్షలు చేసి అంతా బాగానే ఉంది. మందులు కూడా అవసరం లేదు. సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళమని చెప్తారు. భార్యాభర్తల మధ్య మామూలుగా జరగాల్సిన సంసారానికి కూడా ట్రీట్మెంట్ ఉంటుందంటారా? కౌన్సిలింగ్తో ఇలాంటి సమస్యలు తగ్గించవచ్చా? అసలు మా వారికి ఎలాంటి సమస్య ఉందంటారు? ఆయనంటే నాకు చాలా ఇష్టం. తనని నేను వదులుకోలేను. నన్నేం చేయమంటారో చెప్పండి. – ఓ సోదరి, గుడివాడమీ ఉత్తరాన్ని చదివాక మీ భర్త ఎంతో మంచి వ్యక్తి, కానీ ఒక సున్నితమైన సమస్యను ఎదుర్కొంటున్నారు అని అర్థమైంది. ఇది చాలామంది పురుషుల్లో కనిపించే ఒక సాధారణ సమస్య. దీన్ని ‘సైకోజెనిక్ ఎరెక్టయిల్ డిస్ఫంక్షన్‘ అంటారు. మనస్సులో ఉండే ఒత్తిడి, భయం, ఆత్మవిశ్వాసం లోపించడం వల్ల సమస్య కలగొచ్చు. ఒకటి రెండుసార్లు ఫెయిల్యూర్ జరిగిన తర్వాత, భయంతో... బిడియంతో దూరంగా ఉండటం మొదలవుతుంది. తర్వాత డిప్రెషన్కి గురి అవుతారు. తాము ఇక సంసార జీవితానికి పనికిరామని అనుకుంటారు. యురాలజిస్ట్ చెప్పినట్లు ఒక మంచి సైకియాట్రిస్ట్ని కలవండి. అతని ఒత్తిడికి కారణం కనుక్కుంటారు. ముందు తనలో ఆత్మ విశ్వాసం పెరిగేలా కౌన్సెలింగ్ చేస్తారు. ఆ తర్వాత ‘డ్యూయల్ సెక్స్ థెరపీ’ అనే ఒక మానసిక చికిత్స ద్వారా మీ ఇద్దరి మధ్య మానసిక, శారీరక ఆకర్షణ పెరిగేలా కొన్ని ప్రత్యేకమైన పద్ధతుల్లో చికిత్స చేస్తారు. దీంట్లో అనుభవం ఉన్న మానసిక వైద్యుడు లేదా క్లినికల్ సైకాలజిస్ట్ ద్వారా మాత్రమే ఈ థెరపీ చేయించండి. ఈ చికిత్స కోసం భార్య భర్తలిద్దరూ అటెండ్ కావాల్సి ఉంటుంది.ఈ చికిత్స ఆయనలోని ఒత్తిడిని తగ్గించేందుకు క్రమంగా మానసికంగా దగ్గర అవుతూ, తర్వాత శారీరకంగా దగ్గర అవడానికి సహాయపడుతుంది. అవసరమైతే కోరిక, పటిష్టత పెరిగేందుకు కొన్ని మంచి మందులు కూడా సైకియాట్రిస్టులు మీ వారికి ఇస్తారు. ప్రతిరోజు కొద్దిసేపు వాకింగ్, వ్యాయామం, బ్రీతింగ్ ఎక్సర్ సైజులు, యోగా కూడా చేస్తే మానసిక ఒత్తిడి త్వరగా తగ్గుతుంది. మీరు ప్రేమగా ఓపికగా వేచి ఉండండి. అదే ఆయనకి పెద్ద ఔషధంలా పని చేసి ఆయనకి మానసికంగా ఎంతో బలాన్ని ఇస్తుంది. ఆల్ ది బెస్ట్! - డా. ఇండ్ల విశాల్ రెడ్డి సీనియర్ సైకియాట్రిస్ట్, విజయవాడమీ సమస్యలు, సందేహాలు పంపవలసిన మెయిల్ ఐడీsakshifamily3@gmail.com