breaking news
BRS
-
సీఎం రేవంత్పై కేటీఆర్ తీవ్ర విమర్శలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం అనంతరం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన మూడు గంటల ప్రసంగంపై తీవ్ర విమర్శలు చేశారు. కేటీఆర్ మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి మూడు గంటల ప్రసంగంలో సరుకు లేదు, సబ్జెక్ట్ లేదు అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి పర్ఫెక్ట్ గా సెట్ అయ్యే మోడల్ చోర్ మోడల్. మూసి సుందరీకరణకు 16 వేల కోట్ల రూపాయలతో చేయొచ్చు. దానికి లక్ష కోట్లు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. గవర్నర్ ప్రసంగంపై బీఆర్ఎస్ చెప్పాల్సింది అభినందన కాదు, అభిశంసన.వీధి రౌడీ మాదిరి మాట్లాడిన రేవంత్ రెడ్డి వెంటనే క్షమాపణలు చెప్పాలి. స్పీకర్కు ఇంగితం ఉంటే ముఖ్యమంత్రి వ్యాఖ్యలను రికార్డ్స్ నుంచి తొలగించాలి. రేవంత్ రెడ్డి కన్ను తెలంగాణ భూములపై ఉంది. రియల్ ఎస్టేట్ బ్రోకర్ ముఖ్యమంత్రి అయితే ఇలానే ఉంటుందని కేటీఆర్ విమర్శించారు. -
రాజకీయాలు కంటే వివాదాలే ఎక్కువ..!
వికారాబాదు జిల్లా: తాండూరు మాజీ ఎమ్మెల్యే రోహిత్రెడ్డి వివాదాలకు కేరాఫ్ అడ్రెస్గా మారారు. బీఆర్ఎస్ హయాంలో ఎమ్మెల్యేగా ఉన్న ఆయన ఏదో ఒక అంశంపై మీడియాలో కేంద్ర బిందువుగా నిలుస్తూ వచ్చారు. 2016 నుంచి మొదలైన కేసుల పరంపర ఏటా పెరుగుతూ వస్తున్నాయి. మూడేళ్ల క్రితం బెంగళూరు ఫామ్హౌస్లో డ్రగ్స్ కేసుకు సంబంధించి ఈడీ అధికారులు నోటీసులు ఇవ్వడం.. 2022లో మొయినాబాద్ ఫామ్ హౌస్లో ఎమ్మెల్యేల ఎర.. మున్సిపల్ ఎన్నికల సమయంలో కౌంటింగ్ కేంద్రం వద్ద పోలీసు అధికారులతో గొడవ వంటి అనేక కేసులు ఆయనపై ఉన్నాయి. తాజాగా మొయినాబాద్ ఫామ్ హౌస్లో పలు రాష్ట్రాలకు చెందిన తాజా, మాజీ ప్రజా ప్రతినిధులతో డ్రగ్స్ పార్టీ నిర్వహిస్తూ ఈగల్ టీమ్కు పట్టుబటడం రోహిత్రెడ్డి వ్యవహారం మరోసారి చర్చకు దారి తీసింది. ఇందర్చెడ్ గ్రామానికి చెందిన రోహిత్రెడ్డి 2008లో క్రీయాశీలక రాజకీయాల్లోకి వచ్చారు. 2009లో మన పార్టీ నుంచి తాండూరు అసెంబ్లీ స్థానానికి పోటీ చేసి 270 ఓట్లతో ఘోరపరాజయం పొందారు. తర్వాత 2011లో టీఆర్ఎస్ పారీ్టలో చేరారు. నాటి నుంచి అందులోనే కొనసాగుతూ వచ్చారు. 2014లో పార్టీ టికెట్ ఆశించి భంగపడ్డారు. అప్పట్లో నాటి మంత్రి పట్నం మహేందర్రెడ్డికి, రోహిత్రెడ్డికి అనేక వివాదాలు ఉండేవి. ఈ క్రమంలో ఆయన్ను పారీ్టలో నుంచి బహిష్కరించారు. 2018లో కాంగ్రెస్ టికెట్ సాధించి పట్నం మహేందర్రెడ్డిపై స్వల్ప ఆధిక్యతతో విజయం సాధించారు. గెలిచిన రోహిత్రెడ్డి ఆరు నెలలకే బీఆర్ఎస్ గూటికి చేరారు. వివాదాలతో హైలెట్ 2018లో ఎమ్మెల్యేగా విజయం సాధించిన నాటి నుంచి రోహిత్రెడ్డి వివాదాలతో హైలెట్గా నిలుస్తూ వచ్చారు.. బెంగుళూరు కేంద్రంగా సాగిన డ్రగ్స్ కేసులో.. సోదరుడు రితీష్రెడ్డి పబ్లో చేసిన గొడవతో.. పట్టభద్రుల ఎన్నికల సమయంలో దొంగ ఓట్ల వివాదం.. 2023లో తాండూరులో నిర్వహించిన రాజశ్యామల యాగం సమయంలో పోలీసు సిబ్బందితో రీల్స్ చేయడంపై విమర్శలు ఎదుర్కొన్నారు. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కూడా పోలీసు అధికారులతో గొడవ పడ్డారు. ఇలా ఆయనపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. వారం రోజుల పాటు అజ్ఞాతంలోకి వెళ్లి కోర్టు నుంచి బెయిల్ పొందన తర్వాత బయటకు వచ్చారు. ప్రతి సోమవారం తాండూరు పట్టణ పోలీస్ స్టేషన్కు వచ్చి నగరంలో ఉంటున్నారు. రోహిత్రెడ్డి ఇలా ప్రతిసారీ ఏదో ఒక అంశంలో కేంద్ర బిందువుగా నిలుస్తూ వార్తల్లో ఉంటున్నారు. -
Updates : తెలంగాణ అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల వాకౌట్
సాక్షి,హైదరాబాద్: అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల వాకౌట్మూసి అభివృద్ధిపై ప్రభుత్వం ఇచ్చిన సంతృప్తికరంగా లేనందున BRS వాకౌట్మూసి- డీపీఆర్ లేదు అని ప్రకటన చేశారు -మంత్రి డీపీఆర్ రెడీగా ఉన్నదని ప్రకటించారు.మూసిపై డీపీఆర్ ఉంటే అసెంబ్లీలో టేబుల్ చేయాలి.ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న వాళ్లకు నోటీసులు ఎందుకు ఇచ్చారు?మూసి అభివృద్ధిపై ప్రభుత్వానికి క్లారిటీ లేదు - కేటీఆర్లక్షన్నర కోట్ల దోపిడీకి మేము దూరం - మూసి అభివృద్ధికి కాదు.మొక్కజొన్న రైతుకు మద్దతుగా హరీష్ 8 లక్షల ఎకరాల్లో మొక్కలు రైతులు పండించారు.మద్దతు ధర లేక రైతులు నష్ట పోతున్నారు వర్షాల కారణంగా రైతులు నష్ట పోతున్నారు 25 శాతం పంట దళారుల చేతికి వెళ్లిందిపంటల బీమా అమలు చేయడం లేదు వడగండ్ల వానతో రైతులు నష్ట పోయారు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వరు..వెంటనే ఇవ్వాలి 2400 మద్దతు ధర..500 బోనస్ వెంటనే ప్రభుత్వం ఇవ్వాలని హరీష్ రావు డిమాండ్ తెలంగాణ అసెంబ్లీ వద్ద ఉద్రిక్తతమొక్కజొన్న రైతులకు మద్దతుగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చేపట్టిన నిరసనఅసెంబ్లీ ప్రవేశ ద్వారం వద్ద ధర్నా చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించేందుకు ప్రయత్నించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుబీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అడ్డుకున్న మార్షల్స్ ఈ సమయంలో తోపులాట జరిగి మాజీ మంత్రి హరీష్ రావు చేతికి గాయం మొక్కజొన్న రైతులకు మద్దతుగా గన్పార్క్ వద్ద బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరసనమొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలి మొక్క జొన్నకు 500 బోనస్ ప్రకటించాలి మొక్క జొన్న రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ నిరసన -
డ్రగ్స్ టెస్ట్కు సీఎం వస్తారు... మీ నేతలను తీసుకురండి
సాక్షి, హైదరాబాద్: పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రంలో మాదకద్రవ్యాల విక్రయాలు విచ్చలవిడిగా జరిగాయని ఎమ్మెల్సీ, టీపీసీసీ అధ్యక్షుడు బి.మహేశ్కుమార్ గౌడ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చాక్లెట్ల రూపంలో కొకైన్ ఎక్కడపడితే అక్కడ దొరికిందని ఆరోపించారు. డ్రగ్స్తో యువత భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మార్చేశారని, చిన్నపిల్లలు కూడా మాదకద్రవ్యాలకు అలవాటు పడ్డారని, తల్లిదండ్రులు పిల్లలను రక్షించుకునేందుకు ఎంతో ఆందోళన చెందారన్నారు. ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ చేసిన ప్రసంగంపై మంగళవారం శాసనమండలిలో కృతజ్ఞత తీర్మానాన్ని మహేశ్ గౌడ్ ప్రవేశపెట్టారు. మరో సభ్యుడు అద్దంకి దయాకర్ ఈ తీర్మానాన్ని బలపర్చారు. ఈ సందర్భంగా మహేశ్ గౌడ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో ఐదు పూర్తిస్థాయిలో అమలయ్యాయని, ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారన్నారు. మరో మూడేళ్ల సమయం ఉందని, ఈ లోపు ప్రతి హామీని అమలు చేస్తామని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో వంద సీట్లు తగ్గకుండా విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ముహూర్తం ఖరారు చేస్తా.. ఇటీవల మొయినాబాద్ ఫామ్హౌస్లో పరిస్థితి చూస్తే పరిస్థితి ఆందోళనకరంగా కనిపించిందని మహేశ్ గౌడ్ పేర్కొన్నారు. ప్రజాప్రతినిధిగా చట్టసభలకు ఎన్నికైన వాళ్లే మాదకద్రవ్యాలు వాడుతూ బహిరంగంగా దొరకడం సిగ్గుచేటన్నారు. అలాంటి వారిపై చర్యలు తీసుకుంటుంటే బీఆర్ఎస్ నాయకులు సోషల్ మీడియాలో విమర్శలు చేయడం దారుణమని మండిపడ్డారు. బాధ్యత గల ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి, పార్లమెంటు సభ్యుడిగా ఉన్న వ్యక్తి బహిరంగంగా డ్రగ్స్ తీసుకోవడంతో సమాజానికి ఏం సందేశం ఇవ్వదలుచుకున్నారో అర్థం కావడం లేదని దుయ్యబట్టారు. ఇంత ఘోరం జరిగినా ఆ పార్టీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం దారుణమన్నారు. ఇంతలో బీఆర్ఎస్ సభ్యులు కలగజేసుకునే ప్రయత్నం చేయగా, మహేశ్ గౌడ్ తీవ్రంగా స్పందించారు. బీఆర్ఎస్ అధినేత, ప్రతిపక్షనేత కేసీఆర్ను, యువనేత కేటీఆర్ను అసెంబ్లీకి తీసుకొచ్చి డ్రగ్స్ టెస్టు చేయించాలని డిమాండ్ చేశారు. రేపే ముహూర్తం ఖరారు చేస్తున్నట్లు ప్రకటించారు. ఆయన వస్తే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని ఒప్పించి పరీక్ష చేయిస్తామన్నారు. అంతేకాకుండా బీఆర్ఎస్ బీఫామ్పై పోటీ చేసిన వాళ్లందరికీ డ్రగ్స్ టెస్టు చేయించాలని, కాంగ్రెస్ సభ్యులంతా కూడా ఈ పరీక్షలు చేయించుకుంటారని సవాలు విసిరారు. రాష్ట్రంలో సామాన్యులు బతికే పరిస్థితి లేకుండా చేశారని, అందుకే రేవంత్రెడ్డి డ్రగ్స్రహిత రాష్ట్రంగా మార్చేందుకు ఈగల్ టీమ్ ఏర్పాటు చేసి పరిస్థితిని అదుపులోకి తెస్తున్నారన్నారు. అనంతరం ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ మాట్లాడుతూ పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చివేశారని ఆగ్రహించారు. ప్రజలను మోసం చేశారు: మధుసూదనాచారి అమలు కాని హామీలిచ్చి కాంగ్రెస్ ప్రజలను మోసం చేసిందని మండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి విమర్శించారు. రెండేళ్లు గడిచినా హామీల అమలును దాటవేస్తూ ప్రభుత్వం కాలయాపన చేస్తోందని మండిపడ్డారు. మహిళలకు రూ.2,500, కళ్యాణలక్ష్మి కింద తులం బంగారం, బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అంటూ కామారెడ్డి డిక్లరేషన్, రైతులకు ఇచ్చిన హామీలు ఇలా అన్నింటా కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందన్నారు. స్వయం ఉపాధి రుణాలు అంటూ గతేడాది చేసిన ఆర్భాటం ఇప్పుడు జాడలేదని దుయ్యబట్టారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యార్థులకు పూర్తిస్థాయిలో ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తామని చెప్పి చేతులెత్తేసిందన్నారు. యూరియా కోసం రైతులు కిలోమీటర్ల కొద్దీ లైన్లలో నిలబడాల్సిన పరిస్థితి వచ్చిందని దుయ్యబట్టారు. కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాలు మోసపోయాయని, ఏవర్గం కూడా సంతోషంగా లేదని వ్యాఖ్యానించారు. -
కేటీఆర్ X మంత్రులు
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల రెండోరోజు మంగళవారం అధికార, ప్రతిపక్ష సభ్యుల సవాళ్లు, ప్రతిసవాళ్లకు శాసనసభ వేదికైంది. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మాట్లాడే సమయంలో విపక్ష బీఆర్ఎస్, అధికార కాంగ్రెస్ సభ్యుల మధ్య మాటల యుద్ధం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వర్సెస్ మంత్రులు అన్నట్టుగా సభ సాగింది. కేటీఆర్.. కాంగ్రెస్ ఆరు గ్యారంటీలకు చట్టబద్ధతను ప్రశ్నిస్తూ, ఆ ఆరు అంశాలను ప్రస్తావిస్తూ, ప్రభుత్వం అన్ని విధాలా విఫలమైందని ధ్వజమెత్తారు. కేటీఆర్కు.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్బాబు, సీతక్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి తీవ్రస్థాయిలో కౌంటర్ ఇచ్చారు. కేటీఆర్ ప్రశ్నల వర్షం సుమారు 1.40 గంటల పాటు మాట్లాడిన కేటీఆర్.. గవర్నర్ ప్రసంగంలోని అంశాలతో పాటు రెండున్నరేళ్ల ప్రభుత్వ పనితీరుపై తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలులో ప్రభు త్వం విఫలమైనందుకు ధన్యవాదాలు తెలపాలా? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన రేషన్కార్డుల విషయంలో మంత్రులు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ఉత్తమ్కుమార్రెడ్డికి మధ్య సమన్వయ లోపం ఉందని వ్యాఖ్యానించారు. 6 గ్యారంటీలకు చట్టబద్ధత అన్న సీఎం సంతకానికి విలువలేకుండా పోయిందని విమర్శించారు. ఎందుకు చట్టబద్ధత కల్పించలేదని ప్రశ్నించారు. దీనిపై సిట్ వేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి, సీఎం సంతకానికి జీరో వాల్యూ అంటూ ఎద్దేవా చేశారు. ప్రతి విమర్శలతో మంత్రుల ఫైర్ కేటీఆర్ ప్రసంగానికి పలుమార్లు అడ్డుపడిన మంత్రులు.. ప్రతి విమర్శలకు దిగారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ఉచిత విద్యుత్, సన్నబియ్యం, మహిళలకు ఉచిత ప్రయాణం, ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా వంటి పథకాలను ప్రస్తావించారు. గవర్నర్ ప్రసంగాన్ని చదివి ఉపన్యాసా లు ఇవ్వాలని మంత్రి శ్రీధర్బాబు హితవు పలికా రు. గోబెల్స్ సదస్సులో రూ.లక్షల కోట్లు పెట్టుబడు లు వచ్చాయని చెప్తున్నా, టీజీఐఐసీ గణాంకాలు అందుకు భిన్నంగా ఉన్నాయన్న కేటీఆర్ వ్యాఖ్యల పై స్పందిస్తూ.. ఎంఓయూలు కుదిరినా అవి ఆచరణలోకి వచ్చేందుకు సమయం పడుతుందంటూ వివరణ ఇచ్చారు. మంత్రి కోమటిరెడ్డి.. తెల్లరేషన్కార్డులు, సన్న బియ్యం వంటి అంశాలను ప్రస్తావిస్తూ కేటీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశా రు. మిస్ వరల్డ్ పోటీల సందర్భంగా మిస్ బ్రిటన్ చేసిన ఆరోపణలను కేటీఆర్ ప్రస్తావించడంపై మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. డిప్యూటీ సీఎం భట్టి..సీతక్కకు మద్దతుగా మాట్లాడారు. అనర్హత పిటిషన్లపై కేటీఆర్ మాట్లాడినప్పుడు మంత్రి పొంగులేటి..కేటీఆర్ అహంకారంతో మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు. ఫస్ట్ హాఫ్ డిజాస్టర్!‘శోభాకృత నామ, క్రోదీకృత నామ సంవత్సరాలు పోయాయి. విశ్వావసునామ సంవత్సరం 19న పోతోంది. రేపు పరాభవ నామ సంవత్సరంలో అడుగుపెడుతున్నాం. ఈ రెండున్నరేళ్ల కాంగ్రెస్ పాలనలో ప్రజలకు మిగిలింది పరిహాసమే. ప్రతి సంవత్సరం పరిహాసనామ సంవత్సరమే. ఉగాదులు వస్తున్నయి.. పోతున్నయి. గ్యారంటీలు మాత్రం రావడం లేదు. గవర్నర్ ప్రసంగంలో గ్యారంటీలు, డిక్లరేషన్ల ఊసే లేదు. మూడో బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నా రు. ప్రభుత్వ అర్ధభాగం గడిచిపోయింది. ఫస్ట్ హాఫ్ డిజాస్టర్. సినిమా పేరు అభయహస్తం.. లోపల కథ చూస్తే భస్మాసుర హస్తం అని ప్రజలకు అర్థమైంది. మూడు ముక్కల్లో చెప్పాలంటే హామీలు ఎగ్గొట్టు.. కట్టిన వాటిని కూలగొట్టు.. ఉన్న పథకాలను చెడ గొట్టు..అన్నట్టుగా కాంగ్రెస్ రెండున్నరేళ్ల పాలన ఉంది..’ అంటూ బీఆర్ఎస్ సభ్యుడు కేటీ రామారావు ధ్వజమెత్తారు. రైతు భరోసా, మహాలక్ష్మీ, గృహజ్యోతి, చేయూత, యువ వికాసం, ఇందిరమ్మ ఇళ్లను ఉద్దేశించి..ఈ ఆరు గ్యారంటీల (అభయ హస్తం) ఫైలు ఎక్కడికి పోయిందని ప్రశ్నించారు. ఆ ఫైలు ఆచూకీ కోసం సిట్ వేయాలని డిమాండ్ చేశారు. మంగళవారం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై శాసనసభలో జరిగిన చర్చలో ఆయన పాల్గొన్నారు. మీ ప్రభుత్వానికే జీరో వేల్యూ ‘ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించే ఫైలుపై సీఎం రేవంత్ తొలి సంతకం చేయడం ప్రభుత్వ చిత్తశుద్ధి, సంకల్పానికి నిదర్శనమని 2023 డిసెంబర్ 15న కాంగ్రెస్ ప్రభుత్వంలో చేసిన తన తొలి ప్రసంగంలో నాటి గవర్నర్ తమిళిసై పేర్కొన్నారు. సీఎం సంతకం చేసిన ఆ ఫైల్ ఎక్కడ పోయింది? ఎఫ్ఎస్ఎల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో కాలిపోయిందా? తొలి కేబినెట్లోనే ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కల్పిస్తామని రాహుల్గాంధీ హామీ ఇచ్చారు. ఇప్పటికే 50–60 కేబినెట్ సమావేశాలు జరిగినా అతీగతీ లేదు. కొంతమంది ఆస్తులకు జీరో వేల్యూ చేసినట్టు సీఎం రేవంత్ అన్నారు. సీఎం సంతకానికి, ఆయన సంతకం చేసిన ఫైల్కి, మీ గ్యారంటీల కార్డుకి, మీ డిక్లరేషన్లకి, విశ్వసనీయత కోల్పోయిన మీ ప్రభుత్వానికే జీరో వేల్యూ..’ అని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ప్రతి కుటుంబానికి రూ.2.5 లక్షల లబ్ధి ఎక్కడ? ‘ఆరు గ్యారంటీలతో ఏటా ప్రతి కుటుంబానికి రూ.2.50 లక్షల లబ్ధి కలుగుతుందని హామీ ఇచ్చారు. ఏటా రూ.2.75 లక్షల కోట్లను కేటాయించాల్సి ఉంటుంది. ఆ మేరకు ఖర్చు చేశారా? రూ.2.5 లక్షల లబ్ధి పొందిన ఒక్క కుటుంబాన్నైనా చూపించగలరా? నేనే రాజు నేనే మంత్రి.. అని మిడిసిపడ్డ వారెవరూ సంపదలను, పదవులను మూటగట్టుకుని పోలేదని భాగవతంలో బలి చక్రవర్తి అన్నారు..’ అని కేటీఆర్ గుర్తు చేశారు. ఇటీవల ‘నేనే రాజు..నేనే మంత్రి’ అని సీఎం రేవంత్ వ్యాఖ్యానించడంపై పరోక్ష విమర్శలు చేశారు. ఎవరికి ధన్యవాదాలు తెలపాలి? ‘ధన్యవాద తీర్మానంపై చర్చలో ఎవరికి ధన్యవాదాలు చెప్పాలి? రూ.4 వేల పెన్షన్ కోసం నిరీక్షిస్తున్న 46 లక్షల మందికా? రూ.6 వేల పెన్షన్ కోసం నిరీక్షిస్తున్న దివ్యాంగులకా? యూరియా బస్తాల కోసం లాఠీ దెబ్బలు తింటున్న 72 లక్షల మంది రైతులకా? డీఏలు, పీఆర్సీ, బెనిఫిట్స్ అందని 10 లక్షల మంది ఉద్యోగులు, పెన్షనర్లు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకా? నెలకు రూ.2,500 కోసం నిరీక్షిస్తున్న కోటి 65 లక్షల మంది ఆడపడుచులకా? విషాహారంతో చస్తున్న లక్షలాది మంది విద్యార్థులు ధన్యవాదాలు చెప్పాలా?..’ అని కేటీఆర్ నిలదీశారు. 420 వరల్డ్ కప్ పెడితే గెలిచేది కాంగ్రెస్సే.. ‘ఇండియా టీ 20 వరల్డ్ కప్ గెలిచింది. 420 వరల్డ్ కప్ పెడితే గెలిచేది కాంగ్రెస్సే. నేను కర్ణుడిలాంటి వాడిని అని ఇటీవల సీఎం అన్నారు. ఎన్నికలయ్యాక కుంభకర్ణుడు అయ్యారు. ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరి గినా తెలంగాణలో గొప్ప పాలన చేస్తున్నామంటూ ప్రజాధనంతో ప్రకటనలు ఇస్తున్నారు. పీసీ సర్కారు మాయాజాలాన్ని ఈ సర్కారు మరిపించింది. అట్టర్ ఫ్లాప్ సినిమాకి సంబరాలు చేస్తారా?. ఢిల్లీకి పోయి నిధులు తెస్తారనుకుంటే ఇచ్చి వస్తున్నారు. బాకీలు.. బకాయిలు.. డైవర్షన్లు.. కమీషన్లు! చెప్పుకోవడానికి ఏం ఉంది? బాకీలు..బకాయిలు.. డైవర్షన్లు.. కమీషన్లు. బుల్డోజర్ల చప్పుళ్లు..బూతుల మోతలు. ఆల్టైమ్ రికార్డు అప్పులు.. క్యూలైన్లో చెప్పులు. 420 హామీల ఎగనామాలు.. మూడున్నర కోట్ల మందికి పంగనామాలు. నోటిఫికేషన్లు నిల్.. లూటిఫికేషన్లు ఫుల్లు. చెక్డ్యామ్ల పేలి్చవేతలు..అడుగడుగున అణచివేత. క్రెడిట్ చౌర్యం.. భూముల బేరం. స్కాముల కళకళ.. స్కీముల వెలవెల. రైతన్నలకు బేడీలు.. నిరుద్యోగులపై లాఠీలు. ఫిరాయింపుల కంపు.. బస్సు చార్జీల వాయింపు. ఫుడ్ పాయిజనింగ్ చావులు.. ఫుట్బాల్ సరదాలు. గల్లీల్లో చెత్తకుప్పలు.. ఢిల్లీలో విమానయాత్రలు. మాటలు ధడేల్.. చేతలు తుఫేల్. దరఖాస్తులు.. దండాలు.. దఫ్తర్లు..’ అంటూ కేటీఆర్ ధ్వజమెత్తారు. ఇంకో 4 రోజులైతే ట్రిలియన్ డాలర్లు వచ్చేవి..! ‘గవర్నర్ ప్రసంగంలో రాష్ట్ర ఐటీ ఎగుమతులు రూ.3.13 లక్షల కోట్లకు, ఐటీ ఉద్యోగాలు 9.39 లక్షలకు చేరుకున్నట్టు పేర్కొన్నారు. అయితే 2023–24లోనే 9.46 లక్షల ఐటీ ఉద్యోగాలున్నాయి. మరి కాంగ్రెస్ వచ్చాక 7 వేల ఉద్యోగాలు తగ్గాయా? ఐటీ ఎగుమతులు రూ.3.60 లక్షల కోట్లకు చేరాయని మంత్రి శ్రీధర్బాబు చెప్పినట్టు పత్రికల్లో వచ్చింది. తప్పుదోవ పట్టించిన ఐటీ శాఖ కార్యదర్శిని తీసి చెత్తబుట్టలో పారేయండి. గోబెల్స్ (గ్లోబల్) సమ్మిట్లో రూ.5.75 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని ప్రభుత్వం పేర్కొంది. కానీ టీజీఐఐసీ వెబ్సైట్ ప్రకారం 2022–23లో 3,010, 2023–24లో 4 వేలు కొత్త పరిశ్రమలు వస్తే కాంగ్రెస్ వచ్చాక 2024–25లో 2,050, 2025–26లో 1,026కి ఎందుకు తగ్గాయి? 2031 కల్లా ఒక ట్రిలియన్ డాలర్ల ఎకానమీ చేస్తామన్నారు. గ్రాఫిక్స్ మాయాజాలంతో రూ.100 కోట్లు పెట్టి డేరా నగర్లో గ్లోబల్ సమ్మిట్ నిర్వహించి రూ.5.75 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించగలినప్పుడు.. సమ్మిట్ ఇంకో నాలుగు రోజులు నడిపిస్తే అక్కడే ట్రిలియన్ డాలర్ల ఎకానమీ సాధ్యమయ్యేది. కోటిమంది మహిళలను కోటీశ్వరులను చేస్తామన్నారు. రూ.కోటి కోట్లు సమకూరితే రాష్ట్రం 100 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ అవుతుంది. పెట్టుబడులు వెల్లువెత్తినట్టు చెబుతున్నారు. పారిశ్రామికవేత్తల కణతపై తుపాకులు పెడితే వారు రాష్ట్రం నుంచి వెళ్లిపోతున్నారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడం తర్వాత. ముందు వారికి నెలకు రూ.2,500 ఇచ్చేందుకు బడ్జెట్లో నిధులు పెట్టాలి. రూ.లక్ష కోట్ల వడ్డీ లేని రుణాలు ఇస్తామని ఇవ్వలేదు..’ అంటూ కేటీఆర్ విమర్శించారు. ఎంఓయూలపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఫార్మా సిటీ స్థలాలపై కోర్టుకు ఒకటి.. బయటకు ఇంకొకటి ‘ఫార్మాసిటీ కోసం మా ప్రభుత్వం 14వేల ఎకరాలను సేకరిస్తే అప్పుడు భట్టి రైతులకు వెనక్కి ఇస్తామన్నారు. ఇప్పుడు ఫ్యూచర్ సిటీ అంటున్నారు. ప్రభు త్వం చెప్పుతున్నట్టు అక్కడ ఎమ్మెల్యేలు, ఎంపీలు, జర్నలిస్టులకు ఇళ్లు, జూపార్క్, స్టేడియం కట్టడం కుదరదు. ఫార్మాసిటీకి ఆ స్థలాలను వాడతామని ప్రభు త్వం కోర్టుకు చెప్పింది. బయట ఇంకొకటి అంటున్నారు..’ అని తప్పుబట్టారు. ‘హైదరాబాద్లో జరిగిన మిస్ వరల్డ్ పోటీలప్పుడు మిస్ బ్రిటన్ దేశం వదిలి పారిపోయింది. ఆమెను వ్యభిచారిణిలాగా భావన కలిగేలా వ్యవహరించారని సన్ మ్యాగజైన్లో వచ్చింది. మిస్ బ్రిటన్కు వేధింపులు ఘటనపై సిట్ ఏర్పాటు చేయాలి’ అని కేటీఆర్ డిమాండ్ చేశారు. ధనిక రాష్ట్రాన్ని చేతుల్లో పెడితే జీరో చేశారు ‘రాష్ట్ర సొంత పన్నుల ఆదాయంలో దేశంలోనే నంబర్ వన్గా చేసి ధనిక రాష్ట్రాన్ని మీ చేతుల్లో పెట్టాం. ఈ రోజు ఆదాయం అంచనాలు తప్పుతున్నాయి. బడ్జెట్ అంచనాలు బోల్తా కొడుతున్నాయి. కరోనా కాలం తరహాలో తిరోగమనం చూస్తున్నాం. రియల్ ఎస్టేట్ ఢమాల్ అన్నది. డే ఎకానమీ ఢమాల్ అన్నది. ఇప్పుడు నైట్ ఎకానమీ తెస్తారట. మేము దిగేసరికి రూ.3.47 లక్షలతో తలసరి ఆదాయంలో నంబర్ వన్గా ఉండగా, ఈ రోజు అదీ తగ్గింది. జీఎస్టీ, వాహనాల రిజిస్ట్రేషన్లు, స్టాంపులు రిజిస్ట్రేషన్ల ఆదాయం పడిపోయింది. మందుగమనం ఒక్కటే జోరుగా ఉంది. 2023 డిసెంబర్ నుంచి ఈ రాష్ట్రంలో జీరో వేల్యూ మిషన్ ప్రారంభమైంది. అన్నీ ఫాల్.. మీరేమో జాకీలు పెట్టి రైజింగ్ అంటున్నారు. నీరో చక్రవర్తి గురించి విన్నాం. జీరో చక్రవర్తిని చూస్తున్నాం..’ అని కేటీఆర్ విమర్శించారు. మాజీ సీఎంలు చంద్రబాబు, రాజశేఖర్రెడ్డిలను ప్రస్తావించి తెలంగాణ తెచ్చిన కేసీఆర్ పేరును విస్మరిస్తున్నారని విమర్శించారు.మీదే ఫ్లాప్ సినిమా!‘శాసనసభకు 2023లో జరిగిన ఎన్నికల్లో ఫ్లాప్ అయింది మీరు. లోక్సభ ఎన్నికల్లో పూర్తిగా ఫ్లాప్ అయ్యారు. మల్ల సర్పంచ్, మున్సిపల్ ఎన్నికల్లో ఫ్లాప్ అయ్యారు. అన్నిసార్లు ఫ్లాప్ అయ్యి మమ్మల్ని ఫ్లాప్ అంటారు ఏంటి?’ అని బీఆర్ఎస్ నేత కేటీఆర్పై శాసనసభా వ్యవహారాల మంత్రి డి.శ్రీధర్బాబు మండిపడ్డారు. తీరు మార్చుకుంటే రాబోయే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో మెరుగయ్యే అవకాశం ఉంటదని హితవు పలికారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మంగళవారం శాసనసభలో జరిగిన చర్చలో సర్కారుపై కేటీఆర్ చేసిన విమర్శలపై ఘాటుగా స్పందించారు. ఎవరో రాసిన స్క్రిప్్టను చదువుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ జాతీయ పార్టీ అని, అధిష్టానాన్ని కలిసేందుకు ఎన్నిసార్లు అయినా ఢిల్లీకి వెళ్తామని అన్నారు. ‘రాష్ట్ర ప్రయోజనాల కోసం మేం ఎన్నిసార్లు అయినా ప్రధానిని, మంత్రులను కలుస్తాం. రాష్ట్ర ప్రజల అబివృద్ధి. సంక్షేమానికి నిధులు ఇచ్చేందుకు తప్పకుండా ఢిల్లీకి పోతాం. మీరు ప్రాంతీయ పార్టీ (బీఆర్ఎస్)గా ఉండి ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి మీరు ఎన్నిసార్లు బీజేపీ ప్రధానమంత్రి వద్దకు పోలేదు?..’ అని శ్రీధర్బాబు నిలదీశారు. ఫార్మాసిటీ కోసం సేకరించిన భూముల్లో కాలుష్య రహిత గ్రీన్ ఫార్మా తీసుకురావడమే లక్ష్యంగా పెట్టుకున్నామని, ఆ పరిశ్రమలు వస్తే వాటికి అనుబంధంగా నివాస, వినోద, క్రీడా, ఐటీ రంగ సదుపాయాలూ వృద్ధి చెందుతాయన్నారు. గ్రీన్ఫార్మా పరిశ్రమలనే ఏర్పాటు చేస్తామని కోర్టుకు చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. ఎంవోయూలపై శ్వేతపత్రం ప్రకటిస్తాం.. ‘గ్లోబల్ సమ్మిట్లో రూ.5.75లక్షల కోట్ల పెట్టుబడులకి ఎంవోయూలు ఎందుకు చేసుకున్నారని కేటీఆర్ అంటున్నారు. ఎంవోయూలు చేసుకోకపోతే బాగుండుననేది వారి ఆలోచనగా కనపడుతోంది. కేటీఆర్ కూడా దావోస్కు వెళ్లారు. ఆయనకు అన్నీ తెలుసు. ఎంవోయూల్లో 30–40 శాతమే సఫలీకృతం అవుతాయని మన సీఎంకు మహారాష్ట్ర సీఎం తెలియజేశారు. త్వరలో వీటిపై శ్వేతపత్రం ప్రకటిస్తాం. మహిళలను లక్షాధికారులను చేస్తామని దివంగత సీఎం రాజశేఖరరెడ్డి అన్నారు. దానికి కొనసాగింపుగానే వారిని కోటీశ్వరులను చేయాలని సంకల్పించాం. ఈ విజన్ను కూడా హేళనగా, చులకనగా మాట్లాడడం సరికాదు. తెలంగాణ ఏర్పాటుకు సోనియాగాంధీ నిర్ణయం తీసుకోకుంటే ఈ రోజు బీఆర్ఎస్ వారు ఇక్కడ ఉండేవారా? సోషల్ మీడియాలో గోబెల్స్ ప్రచారంలో బీఆర్ఎస్కు మించిన దిట్ట లేరు. ఐటీ ఉద్యోగాలు తగ్గిన విషయం పరిశీలిస్తాం. ఐటీ ఎగుమతుల విలువలో సంఖ్యాపరంగా తప్పులుంటే సరిచేసుకుంటాం..’ అని మంత్రి అన్నారు. దళితుడిని సీఎం చేశారా?: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ‘హామీలు అమలు కావడం లేదని ఆరోపించడం సరికాదు. దళితుడిని సీఎం చేస్తామనని..భూమి లేని పేదలకు మూడెకరాల భూమి ఇస్తామని మీ లెక్క హామీలిచ్చి విస్మరించలేదు. మీరు చేసిన అప్పులకు అసలు, వడ్డీలు కడుతూ పథకాలు అమలు చేస్తున్నాం..’ అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మండిపడ్డారు. ఆరు గ్యారంటీలతో ఒక్కో కుటుంబానికి రూ.2.5 లక్షల లబ్ధి కలుగుతుందని హామీ ఇచ్చింది వాస్తవమేనని, ఒక్కో కుటుంబానికి ఎన్ని లక్షలు వారి ఖాతాల్లో జమ చేశామో లెక్కలతో సహా వివరిస్తానన్నారు. 53–54లక్షల కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రాష్ట్రంలో 1.15 కోట్ల కుటుంబాలుంటే 1.06 కోట్ల కుటుంబాలకు సన్న బియ్యం, మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించినట్టు గుర్తుచేశారు. రైతుల ఖాతాల్లో 9 రోజుల్లో రూ.9 వేల కోట్ల రైతు భరోసా వేశామన్నారు. సన్న ధాన్యం పండించిన రైతులకు క్వింటాల్కి రూ.500 బోనస్ ఇస్తున్నామని, రూ.12 వేలు రైతు భరోసా, బోనస్ కలిపి ఒక్కో ఎకరానికి రూ.25 వేలు చొప్పున రైతులకు లబ్ధి చేకూరుతోందని చెప్పారు. మహిళలంటే కోపం ఎందుకు ?: సీతక్క మహిళలంటే మీకు ఎందుకంత వ్యతిరేకత అని కేటీఆర్పై మంత్రి సీతక్క ధ్వజమెత్తారు. తరతరాలుగా అణచివేతకు గురైన మహిళలు స్వశక్తితో ఎదుగుతుంటే సహకరించాలని హితవు పలికారు. వైఎస్ ప్రభుత్వం తెచ్చిన అభయహస్తం పథకం నిధులను గత బీఆర్ఎస్ ప్రభుత్వం వాడుకుందని ఆరోపించారు. ‘పదేళ్లలో ఎన్ని ఇళ్లు ఇచ్చారు? ధనిక రాష్ట్రంలో ఉద్యోగాలు ఎందుకు ఇవ్వలేదు? దళితులకు భూములు ఎందుకు పంచలేదు?’ అని నిలదీశారు. దళితుడిని సీఎం చేసిందుకా? బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లలో ఒక్క తెల్లరేషన్కార్డు ఇవ్వలేదని మంత్రి కోమటిరెడ్డి విమర్శించారు. దళితుడిని సీఎం చేస్తామని హామీ ఇచ్చి చేసినందుకు మీకు ధన్యవాదాలు చెప్పాలా? సన్న బియ్యం ఇస్తున్నందుకు, యంగ్ ఇండియా స్కూల్స్ నిర్మాణం, ఆరీ్టసీలో మహిళలకు ఉచిత ప్రయాణాలు, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు చేపట్టినందుకు తమ ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పాలన్నారు. మా హక్కులను రక్షించాలి.. తలసాని కేటీఆర్ మాట్లాడుతుంటే మంత్రులు పదేపదే జోక్యం చేసుకోవడం సభా మర్యాదలకు భంగం కలిగించడమేనని బీఆర్ఎస్ సభ్యుడు తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. తమ హక్కులను సభాపతి రక్షించాలని విజ్ఞప్తి చేశారు.అలా ఎలా సార్?‘అధ్యక్షా మీరు కూడా.. మాపార్టీ టికెట్ మీద గెలిచిన ఎమ్మెల్యే ఆ పార్టీ టికెట్ మీద ఎంపీగా పోటీ చేస్తే ఎలా సార్?, ఆయనను ఆడ కూర్చోబెడితే..’అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మంగళవారం శాసనసభలో ఇటీవల స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ తీసుకున్న నిర్ణయాన్ని ప్రస్తావించారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం సందర్భంగా పలు అంశాలపై మాట్లాడిన ఆయన.. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్పై అనర్హత పిటిషన్ను ఇటీవల స్పీకర్ కొట్టివేయడాన్ని ప్రస్తావించారు. ‘మీరు నిర్ణయం తీసుకున్నారు. దాంతో మాకు విభేదం లేదు.. నా ప్రార్థన..’అని కేటీఆర్ ఇంకా ఏదో చెప్పబోతుండగా స్పీకర్ అడ్డు తగిలారు. ‘కోర్టులో జడ్జి తీర్పు ఇస్తే నచ్చకపోతే పైకోర్టుకు పోతాం. మీరు కూడా జడ్జిమెంట్ చదవకుండానే ఎన్నో అభియోగాలు చేసిన్రు. అయినా నేను మీడియా ముందుకు రాలేదు. జడ్జిమెంట్ పూర్తిగా చదివితే మాట్లాడాలి. మీకు చెపుతున్నా..ఈ ప్రశ్నించేదానిని తగ్గించుకుంటే మంచిగుంటది..’అని అన్నారు. దీనిపై కేటీఆర్ స్పందిస్తూ.. ‘మీరు తీసుకున్న నిర్ణయం తప్పు అయినా ప్రశ్నించే అధికారం సభ్యుడిగా నాకుంటది. మీరు జ్యుడీషియరీ నేను కాదనడం లేదు. ప్రజాస్వామ్యంలో నిలదీయడం, అడగడం మా బాధ్యత..’అని అన్నారు. మంత్రి పొంగులేటి ఆగ్రహం కేటీఆర్ వ్యాఖ్యలపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్ అహంకారంతో మాట్లాడుతున్నారని అన్నారు. ‘జడ్జి స్థానంలో ఉన్న మిమ్మల్ని, మీ జడ్జిమెంట్ను కూడా ప్రశ్నించే స్థాయిలో మాట్లాడుతున్నారంటే..వారు ఏ రకమైన అహంకారంతో మాట్లాడుతున్నారో గమనించాలి. అసెంబ్లీ, పార్లమెంటుతో పాటు గ్రామ పంచాయతీ, మునిసిపల్ ఎన్నికల్లో నాలుగుసార్లు ఎందుకు ఓడిపోయారో ఇప్పటికైనా మీరు గమనించాలి. పార్టీలు మారడాన్ని పోత్సహించిందే మీరు..’అని బీఆర్ఎస్పై ధ్వజమెత్తారు. మంత్రి మాటలకు కేటీఆర్ స్పందిస్తూ.. ‘హైకోర్టు తీర్పు ఇస్తే సుప్రీంకోర్టుకు, సుప్రీంకోర్టు తీర్పు ఇస్తే రివిజన్కు వెళ్లే హక్కు ఉంటుంది. హరియాణలో ఆయారాం గయారాం విధానాన్ని తీసుకొచ్చిందే కాంగ్రెస్ పార్టీ..’అని చెప్పారు. స్పీకర్ స్థానంలో ఉన్న వారు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని అన్నారు. ‘ఇష్టమున్నట్లు మాట్లాడుతున్నా, మీరు అడ్డుకోవడం లేదు. మీరు మారాలి. బడివె అని సీఎం అంటే కూడా స్పందించలేదు. గ్రహణం కొన్ని గంటలే ఉంటుంది. ఏదీ శాశ్వతం కాదు..’అని వ్యాఖ్యానించారు. -
సీపీ సతీమణి ఏకే 47 గన్ తో 10 రౌండ్ల కాల్పులు
-
కూలేశ్వరం వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్
-
10 ఏళ్లు మినిస్టర్ చేశావ్.. అసెంబ్లీలో KTR సెటైర్లకు సీతక్క స్ట్రాంగ్ కౌంటర్
-
పైలెట్ రోహిత్ రెడ్డికి బీఆర్ఎస్ షోకాజు నోటీసులు
సాక్షి,తెలంగాణ భవన్: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్రెడ్డికి బీఆర్ఎస్ షోకాజు నోటీసులు జారీ చేసింది. డ్రగ్స్ వినియోగం ఆరోపణలపై షోకాజు నోటీసులు పంపింది. ఏడురోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. గడువు సమయంలో వివరణ ఇవ్వకపోతే చర్యలు తీసుకుంటామని షోకాజు నోటీసుల్లో పేర్కొంది. మరోవైపు మొయినాబాద్ డ్రగ్స్ వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. డీసీపీ యోగేష్ నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేస్తూ ఆదేశాలు జారీ చేసిందిరంగారెడ్డి జిల్లా మొయినాబాద్లోని మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్రెడ్డి ఫాంహౌస్లో డ్రగ్స్ పార్టీ కేసుకు సంబంధించిన రిమాండ్ రిపోర్టులో పలు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు పేర్కొన్న వివరాల ప్రకారం.. మత్తు కిక్కు కోసమే టీడీపీ ఎంపీ పుట్టా మహేశ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే రోహిత్రెడ్డి, వారి మిత్రులు మద్యంలో కొకైన్ కలుపుకొని తాగారు. పార్టీని రంజుగా ఎంజాయ్ చేసేందుకే ఖరీదైన పలు బ్రాండ్ల మద్యంతోపాటు కొకైన్ తెప్పించుకున్నారు. పోలీసుల సోదాల అనంతరం పార్టీలో పాల్గొన్న వారికి యూరిన్ టెస్ట్లు, అనంతరం రక్త పరీక్షలు నిర్వహించగా పుట్టా మహేశ్, రోహిత్రెడ్డి, రితేశ్రెడ్డి, అర్జున్రెడ్డి, కౌశిక్ రవి, నమిత్ శర్మలకు పాజిటివ్ వచ్చింది.నమిత్ శర్మ మూడు రకాల డ్రగ్స్ తీసుకున్నట్లు రక్త పరీక్షల్లో నిర్ధారణ అయింది. పార్టీలో వాడిన కొకైన్ను తానే తెచ్చానని కౌశిక్ రవి పోలీసుల ఎదుట అంగీకరించాడు. సిమ్లాలో గుర్తుతెలియని వ్యక్తుల నుంచి డ్రగ్స్ పార్టీ కోసమే కొకైన్ను ఒక్కో గ్రాము రూ. 15,000 చొప్పున చెల్లించి కొనుగోలు చేసినట్లు కౌశిక్ అంగీకరించాడు. -
రేవంత్ చేతకాని తనం వల్ల తెలంగాణకు అన్యాయం
-
తెలంగాణ 'బడ్జెట్'కు వేళాయె
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లో ప్రభుత్వం 2026–27 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ను ప్రవేశపెట్టి సభ ఆమోదం పొందనుంది. ఉదయం 11:45 గంటలకు సమావేశాలు ప్రారంభం కానుండగా.. రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం సభ మంగళవారానికి వాయిదా పడనుంది. తర్వాత శాసనసభా వ్యవహారాల సలహా కమిటీ (బీఏసీ) సమావేశమవుతుంది. ఇందులో సమావేశాల ఎజెండాను ఖరారు చేస్తారు. ఈ నెలాఖరు వరకు బడ్జెట్ సమావేశాలు జరుగుతాయని సమాచారం. ఈ నెల 20న బడ్జెట్ను ప్రవేశ పెడతారని, 30 లేదా 31వ తేదీన ద్రవ్య వినిమయ బిల్లును ప్రవేశపెట్టడం ద్వారా వచ్చే ఆర్థిక సంవత్సర బడ్జెట్కు అసెంబ్లీ ఆమోదం తెలుపుతుందని తెలుస్తోంది. కాగా అసెంబ్లీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని గవర్నర్ శుక్లా సోమవారం ఆవిష్కరించనున్నారు. ఉదయం 11:27 నుంచి 11.37 నిమిషాల మధ్య ఈ కార్యక్రమం ఉంటుందని అసెంబ్లీ వర్గాలు వెల్లడించాయి. ఉగాది, రంజాన్ రోజుల్లో సెలవు విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం అసెంబ్లీలో చర్చను ప్రతిపాదించనుంది. మంగళ, బుధవారాల్లో చర్చ అనంతరం తీర్మానాన్ని ఆమోదించనున్నారు. మరుసటి రోజు ఉగాది కారణంగా సభ జరగదు. మళ్లీ 20న ఉభయ సభలు సమావేశం కానుండగా, అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్ భట్టి విక్రమార్క, మండలిలో శాసనసభా వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. ఆ తర్వాతి రోజు రంజాన్ కావడంతో మళ్లీ 23న సభ ప్రారంభమై వారం రోజుల పాటు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ అధ్యక్షతన సోమవారం జరిగే బీఏసీ సమావేశంలో సభ ఎన్ని రోజులు జరగాలి? బిల్లుల ప్రతిపాదన లాంటి అంశాలతో కూడిన ఎజెండా ఖరారు కానుంది. ఇలావుండగా సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు అసెంబ్లీ కమిటీ హాల్లో సీఎం రేవంత్రెడ్డి అధ్యక్షతన సీఎల్పీ సమావేశం జరగనుంది. తొలిసారి ఒకే ప్రాంగణంలో.. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత తొలిసారి రాష్ట్ర శాసనసభ, శాసనమండలి ఒకే ప్రాంగణంలో కొలువు దీరనున్నాయి. ఇప్పటివరకు జూబ్లీహాల్ వేదికగా జరుగుతున్న మండలి సమావేశాలు ఈసారి పునరుద్ధరించిన పాత అసెంబ్లీ భవనంలో జరగనున్నాయి. రాష్ట్ర విభజన తర్వాత ఈ భవనాన్ని ఏపీ అసెంబ్లీ సమావేశాల నిర్వహణ కోసం కేటాయించగా, ఏపీ అసెంబ్లీ అమరావతికి వెళ్లిన తర్వాత ఆ భవనం ఖాళీగా ఉంటోంది. దీంతో ఈ భవనాన్ని పునరుద్ధరించి అందులో మండలి సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం పునరుద్ధరణ పనులు పూర్తి కావడంతో ఈ భవనంలో మండలి సమావేశాల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రజల ముందుకు అభివృద్ధి, ప్రణాళికలు బడ్జెట్ సమావేశాలు ఈసారి వాడివేడిగా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత రెండేళ్ల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించడంతో పాటు వచ్చే ఏడాదికి సంబంధించిన తమ ప్రణాళికలను ప్రజల ముందుంచాలని ప్రభుత్వం భావిస్తోంది. వీలును బట్టి మూసీ పునరుజ్జీవంతో పాటు తెలంగాణ ఉద్యమకారుల అంశంపై చర్చ జరపాలని యోచిస్తోంది. మరోవైపు పలు బిల్లులను కూడా ప్రవేశపెట్టనుంది. కేసీఆర్ హాజరయ్యే అవకాశం ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్.. పలు అంశాలపై ప్రభుత్వాన్ని తూర్పారబట్టేందుకు సిద్ధమవుతోంది. బడ్జెట్ సమావేశాలకు ఆ పార్టీ అధినేత, ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ హాజరవుతారని సమాచారం. తమ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్లోకి వెళ్లిన ఎమ్మెల్యేలపై అనర్హత కేసులో అసెంబ్లీ స్పీకర్ ఇచ్చిన తీర్పుపై బీఆర్ఎస్ తీవ్ర అసహనంతో ఉంది. సాక్ష్యాధారాలు స్పష్టంగా ఉన్నప్పటికీ స్పీకర్ తీసుకున్న నిర్ణయం సరైంది కాదనే భావనలో ఉన్న ప్రధాన ప్రతిపక్షం.. ఈ సమావేశాల్లో స్పీకర్పై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు గల సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తోంది. అయితే బలం సరిపోతుందా లేదా అన్న దానిపై ఊగిసలాడుతున్నట్టు సమాచారం. దీంతో ఇందుకు సంబంధించిన నిబంధనలు మార్చి, అవిశ్వాసం ప్రతిపాదించే సభ్యుల సంఖ్యను తగ్గించాలని కోరుతూ ప్రైవేటు మెంబర్ బిల్లును పెట్టాలని బీఆర్ఎస్ ఆలోచిస్తున్నట్టు సమాచారం. ఈ బిల్లు పెట్టేందుకు 12 మంది సభ్యులు సరిపోతారని తెలుస్తోంది. అయితే ఈ బిల్లును సభలో ప్రతిపాదించి చర్చ చేసే అధికారం ప్రభుత్వానికి మాత్రమే ఉండడంతో ఏం చేయాలన్న దానిపై బీఆర్ఎస్ నేతలు సమాలోచనలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇదిలావుండగా గత రెండేళ్ల కాలంలో జరిగిన బడ్జెట్ కేటాయింపులు, వాటి ఖర్చులో డొల్లతనంతో పాటు ఆరు గ్యారంటీల అమలు, రైతు భరోసా, కాళేశ్వరం ప్రాజెక్టు వినియోగం, కృష్ణా నదీజలాల్లో ప్రభుత్వ నిర్లక్ష్యం, మూసీ పునరుద్ధరణ పేరుతో పేదల ఇళ్లు కూల్చడం, ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో ఇళ్ల కూల్చివేత తదితర అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు బీఆర్ఎస్ సిద్ధమవుతోంది. ప్రభుత్వ వైఫల్యాలే బీజేపీ ఎజెండా బీజేపీ కూడా అధికార పక్షాన్ని నిలదీసేందుకు సిద్ధమైంది. బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలను చర్చించేందుకు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్రావు నేతృత్వంలో ఆదివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సమావేశమయ్యారు. హైడ్రాతో పాటు మూసీ పునరుద్ధరణ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం పేదలు, మధ్యతరగతి వర్గాల ఇళ్లను కూల్చివేయడంపై ప్రభుత్వాన్ని నిలదీయాలని నిర్ణయించారు. పలు కీలకాంశాలను ప్రస్తావించాలని, రాష్ట్ర ప్రజల్లో నెలకొన్న ఆందోళనలను, వారి ఆకాంక్షలను అధికార పక్షం దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించారు. మరోవైపు ఎంఐఎం, సీపీఐ కూడా ఈ సమావేశాల్లో తమ వాణిని విన్పించేందుకు సిద్ధమయ్యాయి. నిర్వహణ, భద్రత, వసతులపై సమీక్ష అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో స్పీకర్ ప్రసాద్కుమార్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశాల నిర్వహణ, కల్పించాల్సిన వసతులు, భద్రతా ఏర్పాట్లపై చర్చించారు. గతంలో మాదరిగానే ఈ సమావేశాలకూ రాష్ట్ర ప్రభుత్వం, అధికారులు సహకరించాలని స్పీకర్ కోరారు. సభ లోపల, బయట ప్రశాంత వాతావరణం ఉండేలా, అనుకోని ఘటనలు, అవాంఛనీయ పరిస్థితులు తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పోలీస్ ఉన్నతాధికారులకు సూచించారు. సభ జరుగుతున్న సమయంలో ధర్నాలు, ఆందోళనలకు అవకాశం ఇవ్వకూడదని ఆదేశించారు. అన్ని శాఖల అధికారులు అందుబాటులో ఉండాలని, సభ్యులు అడిగిన ప్రశ్నలకు వీలైనంత త్వరగా సమాచారం ఇవ్వాలని కోరారు. మండలి చైర్మన్ మాట్లాడుతూ.. అసెంబ్లీ, మండలి ఒకే ప్రాంగణంలో జరుగుతున్నందున అవసరమైన అదనపు ఏర్పాట్లు చేయాలని సూచించారు. మంత్రి శ్రీధర్బాబు మాట్లాడుతూ సభ సజావుగా జరగడానికి అవసరమైన పూర్తి సహాయ సహకారాలను ప్రభుత్వం పక్షాన అందిస్తామని చెప్పారు. సమన్వయం కోసం ప్రతి శాఖ నుంచి ఓ ప్రత్యేక అధికారిని నియమించనున్నట్టు తెలిపారు. కాగా ఈ సమావేశంలో శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్ ముదిరాజ్, రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, సీఎస్ కె.రామకృష్ణారావు, మండలి కార్యదర్శి వి.నరసింహాచార్యులు, శాసనసభ కార్యదర్శి రేండ్ల తిరుపతి, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
‘మూసీ’.. కాంగ్రెస్ భూ ఆక్రమణ పథకం : కేటీఆర్
సాక్షి, హైదరాబాద్/బండ్లగూడ: గత బీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం రూ.16వేల కోట్లతో ఒక్క ఇల్లూ కూల్చకుండా మూసీని అభివృద్ధి చేసే ప్రణాళికలు సిద్ధం చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు. ఇప్పటికే ఉప్పల్, నాగోల్ ప్రాంతాల్లో 6 కి.మీ. మేర విజయవంతంగా అభివృద్ధి చేశామన్నారు. రేవంత్రెడ్డి ప్రభుత్వం రూ.లక్షన్నర కోట్ల అంచనాలతో సామాన్యుల ఇళ్లను కూల్చివేస్తూ విధ్వంసానికి పాల్పడుతోందని ధ్వజమెత్తారు. శనివారం హిమాయత్ సాగర్ వేదికగా ‘మూసీ పునరుజ్జీవం– పవర్ పాయింట్ ప్రజెంటేషన్ వర్సెస్ పబ్లిక్ పాయింట్‘కార్యక్రమాన్ని కేటీఆర్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎలాంటి ప్లానింగ్ రిపోర్టు లేకుండా సోషల్ ఇంపాక్ట్ స్టడీ, ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ స్టడీ వంటి నివేదికలు లేకుండా, ప్రజలతో చర్చలు నిర్వహించకుండా వేలాదిమంది ఇళ్లను కూలగొడతామని కాంగ్రెస్ ప్రభుత్వం భయాందోళనకు గురిచేస్తోందని మండిపడ్డారు. ‘అభివృద్ధికి మేము ఏమాత్రం వ్యతిరేకం కాదు. అవినీతికి, కాంగ్రెస్ భూదాహానికి, రేవంత్ రెడ్డి లక్షల కోట్ల అవినీతి ప్రణాళికలకు మాత్రం వ్యతిరేకం. రేవంత్ రెడ్డి అవినీతిని అడ్డుకుంటాం. పార్టీలకు అతీతంగా హైదరాబాద్ నగర ప్రజలను కాపాడుకుంటాం. బాధితుల వెంట బీఆర్ఎస్ ఉంటుంది’అని కేటీఆర్ చెప్పారు. రెండేళ్లపాటు మూసీ బాధితులు సమష్టిగా ప్రభుత్వంపై పోరాడితే, తమ ప్రభుత్వం వచ్చాక కాంగ్రెస్ బుల్డోజర్ రాజ్యాన్ని పారదోలి అందరి ఇళ్లు, భూములను కాపాడతామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం వద్ద డబ్బుల్లేవన్నారు.. ఇచ్చిన హామీలకు, అభివృద్ధికి ప్రభుత్వం వద్ద డబ్బులు లేవని, విపరీతంగా అప్పులు ఉన్నాయని చెబుతున్న రేవంత్ రెడ్డి.. మూసీ కోసం వేల కోట్లు ఖర్చు పెడతానంటున్నాడని కేటీఆర్ ఎద్దేవాచేశారు. ‘రూ.లక్షన్నర కోట్లతో మూసీని అభివృద్ధి చేస్తామంటున్నారు... అందాల పోటీలకు, ఫుట్బాల్ ఆటలకు వందల కోట్లు ఖర్చు పెడుతూ, మింగ మెతుకు లేదు కానీ మీసాలకు సంపెంగ నూనె లెక్క రేవంత్ తీరు తయారైంది. గత ప్రభుత్వంలో కేసీఆర్ పీపీటీ ప్రజెంటేషన్ ద్వారా నదుల నీటి వినియోగం, ప్రాజెక్టుల నిర్మాణం గురించి వివరిస్తే, రేవంత్ రెడ్డి పీపీటీ ద్వారా ఎవరి ఇల్లు ఎట్లా కూలగొట్టాలి, ఎవరి భూములు ఎట్లా లాక్కోవాలి అనే విధ్వంసం గురించి పీపీటీ ఇచ్చాడు’అని విమర్శించారు. రూ.లక్షన్నర కోట్లు ఎందుకు? నిజాం కట్టించిన అద్భుతమైన జంట జలాశయాలను ఖరాబ్ చేసింది కాంగ్రెస్ పార్టీయేనని, దశాబ్దాలపాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాల పాలన ఫలితంగానే మూసీ సర్వనాశనమైందని కేటీఆర్ ధ్వజమెత్తారు. మూసీని మురికి కుప్పగా మార్చిన పాపానికి రేవంత్రెడ్డి ముక్కు నేలకి రాసి, ప్రజలకు క్షమాపణ చెప్పి పాపాన్ని కడుక్కోవాలని హితవు పలికారు. వందల కిలోమీటర్ల నమామి గంగే పథకానికి కేవలం రూ.42 వేల కోట్లు వ్యయమైతే, 55 కి.మీ. మూసీకి రూ.లక్షన్నర కోట్లు ఎందుకు ఖర్చవుతుందో రేవంత్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ రాష్ట్రాన్ని, ఈ నగరాన్ని ప్రేమించే పార్టీగా, వ్యక్తులుగా మూసీ అభివృద్ధిని ఏమాత్రం అడ్డుకోబోమన్నారు. మూసీ పేరుతో రూ.వేల కోట్ల సొమ్మును దోచుకుంటామంటే మాత్రం కచ్చితంగా అడ్డుకుంటామని చెప్పారు. గాంధీ మునిమనుమడు తుషార్ గాంధీ ఆయన పేరుతో మూసీలో దోపిడీ చేయొద్దని విజ్ఞప్తి చేసినా రేవంత్రెడ్డి పట్టించుకోవడం లేదని కేటీఆర్ అన్నారు. ఎవరూ అడ్డుకోవద్దని మహాత్మా గాంధీ విగ్రహాన్ని పెట్టే కుట్ర చేస్తున్నాడని చెప్పారు. ఒక్క ఇల్లు కూలగొట్టకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం 6 కి.మీ. మూసీని విజయవంతంగా అభివృద్ధి చేసిందని, అయినా కాంగ్రెస్ మాదిరి ప్రచారం చేసుకోలేకపోయామన్నారు.మా అంచనా వ్యయం 16 వేల కోట్లు గోదావరి నుంచి నీళ్లు తీసుకొచ్చి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మూసీలోకి మంచినీళ్లను వదలాలని గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసిందని కేటీఆర్ తెలిపారు. దాని కోసం కేవలం రూ.1100 కోట్లతో కొండపోచమ్మ నుంచి నీళ్లు తెచ్చే అవకాశం ఉందన్నారు. కానీ ఇదే కార్యక్రమానికి రూ. 10 వేల కోట్లకు అంచనాలు పెంచిన రేవంత్ రెడ్డి కొత్త ప్లాన్ ద్వారా అవినీతి కోసం ప్రయత్నిస్తున్నాడని ఆరోపించారు. మూసీని సమగ్రంగా అభివృద్ధి చేయడానికి తమకు వచ్చిన అంచనా వ్యయం రూ. 16 వేల కోట్లు మాత్రమే కాగా, రేవంత్ రెడ్డి మాత్రం ఇవన్నీ పక్కన పెట్టి రూ.లక్షల కోట్లు ఖర్చు పెట్టడానికి ప్రయతి్నస్తున్నారన్నారు. బఫర్ జోన్తో భయపెట్టి.. ప్రభుత్వం బఫర్ జోన్ పేరు చెప్పి ప్రజలను భయపెట్టి వారి ఇళ్లను కూలుస్తోందని కేటీఆర్ విమర్శించారు. ‘డబ్బులు ఉన్న వాళ్లకే బఫర్ జోన్లు ఉంటాయా? రేవంత్ రెడ్డి సొంత ఇల్లు రెడ్డికుంట బఫర్ జోన్లో ఉంది కదా., దాని గురించి ఎందుకు మాట్లాడరు? వాళ్ల సోదరుడి ఇల్లు హైదరాబాద్లో బఫర్ జోన్లో ఉంది. మంత్రుల ఫామ్హౌస్లు, ఇళ్లు బఫర్ జోన్లో ఉన్నా.. వాటిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు’అని పేర్కొన్నారు. 20 ఏళ్ల కింద కట్టుకున్న అపార్ట్మెంట్లు, ఇళ్లను కూలగొడతా అంటున్న రేవంత్ రెడ్డి, ఇప్పుడు మూసీ బఫర్ జో¯న్లో కడుతున్న రియల్ ఎస్టేట్ సంస్థల అపార్ట్మెంట్లను మాత్రం ముట్టుకోలేకపోతున్నారని దుయ్యబట్టారు.3,300 ఎకరాలపై కన్నేసి.. రేవంత్ 3,300 ఎకరాల భూమిపై కన్నేసి మూసీ ప్రణాళికను తెరపైకి తెచ్చాడని కేటీఆర్ ఆరోపించారు. ఈ మొత్తం భూముల విలువ రూ.1,50,000 కోట్లని, ఇందుకోసమే రియల్ ఎస్టేట్ వ్యాపార ఆధారిత మూసీని రూపొందిస్తున్నారన్నారు. డిజైన్ చేసే కంపెనీకే రూ.160 కోట్లు ఇచ్చారంటే, ఎంత అవినీతి జరుగుతున్నదో అర్థం చేసుకోవచ్చని చెప్పారు. రేవంత్రెడ్డికి కాంగ్రెస్ ప్రభుత్వమే తీసుకొచ్చిన 2013 భూసేకరణ చట్టం ప్రకారం ఇవ్వాల్సిన పరిహారం ఎంత ఉందో కూడా అవగాహన లేదని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు వివేకానందగౌడ్, లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, స్వామి గౌడ్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు. -
బీఆర్ఎస్లోకి జీవన్రెడ్డి..?
జగిత్యాల: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల అనంతరం పార్టీ అధిష్టానం పట్ల తీవ్ర అసంతృప్తిలో ఉన్న కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్రెడ్డి.. బీఆర్ఎస్లోకి వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. కాంగ్రెస్కు గుడ్ బై చెప్పి.. కారు ఎక్కేందుకు జీవన్రెడ్డి పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 20లోపే కాంగ్రెస్ రాజీనామా చేయాలనే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఉగాది పండుగ లోపే కొత్త నిర్ణయం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆయన సన్నిహిత వర్గాల ద్వారా తెలుస్తోంది. దీనిపై ఇప్పటికే కార్యకర్తలతో జీవన్రెడ్డి మాట్లాడారని, ఈ క్రమంలోనే ఆయన అనుచరుల సోషల్ మీడియా డీపీలు కూడా మారిపోవడంతో రాజీనామా వార్తలకు మరింత బలం చేకూరుస్తుంది. అదే సమయంలో జీవన్రెడ్డి సోషల్ మీడియా గ్రూపుల డీపీలు, ప్రొఫైల్స్ కూడా మారిపోతున్నాయి. తాను కాంగ్రెస్లో సీనియర్గా ఉండి కూడా ఆ పార్టీలో ప్రాధాన్యత లేకపోవడాన్ని జీవన్రెడ్డి జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రధానంగా ఎమ్మెల్యే సంజయ్ వర్గానికి కాంగ్రెస్ అధిక ప్రాధాన్యత ఇచ్చి.. ఆయన్ను పెద్దగా పట్టించుకోకపోవడంతో జీవన్రెడ్డి వేరే స్టెప్ తీసుకోవడానికి సిద్ధమవుతున్నారు. ప్రధానంగా జగిత్యాలలో కాంగ్రెస్ మున్సిపల్ చైర్పర్సన్ గెలుపుపై విచారం వ్యక్తం చేశారు. ఛైర్మన్ స్థానం దక్కినందుకు సంతోష పడలా లేక బాధ పడాలా అర్థం కావడం లేదన్నారు. సమిండ్ల శ్రీనివాస్ అనే వ్యక్తి ఎమ్మెల్యే సంజయ్ ని కలిసిన కొద్ది రోజుల్లోనే ఛైర్పర్సన్ పదవిలో కూర్చోవడమేంటని విచారం వ్యక్తం చేశారు కూడా. ఇదే జీవన్రెడ్డిలో అసంతృప్తి జ్వాలలు పుట్టడానికి ప్రధాన కారణమైంది. ఈ పరిణామాల నేపథ్యంలో కార్యకర్తలతో సుదీర్ఘ మంతనాల తర్వాతే జీవన్రెడ్డి పార్టీ మారే యోచనకు వచ్చారనే చర్చ నడుస్తోంది. జగిత్యాలలో భారీ సభ ఏర్పాటు చేసి బీఆర్ఎస్ కండువా కప్పుకోవడానికి ఇప్పటికే జీవన్రెడ్డి రంగం సిద్ధం చేసుకున్నారట. ఈ విషయంపై త్వరలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. -
మూసీ సుందరీకరణకు బీఆర్ఎస్ వ్యతిరేకం కాదు
-
రేవంత్ రెడ్డి కాదు.. గోబెల్స్ రెడ్డి : హరీష్
సాక్షి,హైదరాబాద్: సీఎం రేవంత్రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘రేవంత్రెడ్డికాదు.. గోబెల్స్ రెడ్డి’ అని దుయ్యబట్టారు. మూసీ సుందరీకరణకు బీఆర్ఎస్ వ్యతిరేకం అంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. బీఆర్ఎస్ మూసీ సుందరీకరణకు వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. శుక్రవారం తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు.మూసి సుందరీకరణకు మేం ఎప్పుడూ వ్యతిరేకం కాదు. మూసీ సుందరీకరణ ముసుగులో రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. డీపీఆర్ లేకుండానే 10 వేల 17 ఇళ్లు కూలగొట్టేందుకు ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చింది. హైడ్రా పేరుతో ఇప్పటికే లక్షకు పైగా ఇళ్లు కూల్చారు. లక్ష జీవితాలను మూసీలో ముంచేస్తారా? మూసీని శుద్ధి చేస్తావా?. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తావా?.రియల్ ఎస్టేట్ దందా కోసమే మూసీ మీద పడ్డారు. మూసీ సుందరీకరణకు బీఆర్ఎస్ వ్యతిరేకం కాదు. మూసీ సుందరీకరణ కోసం 3,279 ఎకరాల భూ సేకరణ అవసరమా..!.మూసీ బ్యూటీఫికేషన్ పేరుతో లూటీఫికేషన్ చేస్తున్నారు’అని ఆరోపించారు. -
సుప్రీంకోర్టులో ముగిసిన తెలంగాణ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు
న్యూఢిల్లీ,సాక్షి: సుప్రీంకోర్టులో ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు ముగిసింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై నిర్ణీత గడువులోగా నిర్ణయం తీసుకోవాలని చెప్పినా స్పీకర్ నిర్ణయం తీసుకోవడం లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి,కేటీఆర్, బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు.ఆ పిటిషన్పై ఇవాళ విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు జస్టిస్ సంజయ్ కరోల్,జస్టిస్ అగస్టిన్ జార్జ్ మసీహ్ ధర్మాసనం తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్కు ఆదేశాలు జారీ చేసింది.తాజాగా 10 మంది ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ స్పీకర్ ఇచ్చారు. స్పీకర్ ఆదేశాలను వెంటనే అధికారికంగా పబ్లిష్ చేయాలని సుప్రీం ధర్మాసనం ఆదేశించింది. ఆ తరువాత పిటీషనర్లకు కావాల్సిన డాక్యుమెంట్లను నాలుగు రోజుల్లో ఇవ్వాలని సూచించింది. అంతకుముందు గత విచారణలోనే సుప్రీంకోర్టు స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే ధిక్కరణ చర్యలు తప్పవని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నిన్ననే దానం నాగేందర్, కడియం శ్రీహరి పార్టీ మారలేదని తన నిర్ణయం ప్రకటించారు. అయితే ఈ నిర్ణయాన్ని బీఆర్ఎస్, బీజేపీ తప్పు పట్టాయి.దానం నాగేందర్ కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థిగా అఫిడవిట్ దాఖలు చేసిన ఆధారాలు సహా అనేక సాక్ష్యాలు ఉన్నప్పటికీ, స్పీకర్ వాటిని పట్టించుకోలేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. స్పీకర్ తీర్పు పట్ల అసంతృప్తి వ్యక్తం చేసిన బీఆర్ఎస్, బీజేపీ ఈ అంశాన్ని సుప్రీంకోర్టు విచారణ ముందు ప్రస్తావించాయి. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు ముగిసినట్లు ప్రకటించింది. -
ఫిరాయింపుల్లో ప్రథమ ముద్దాయి రాహుల్గాంధీ
సాక్షి, హైదరాబాద్: పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ దాఖలు చేసిన పిటిషన్లపై అసెంబ్లీ స్పీకర్ ఇచ్చిన తీర్పు అత్యంత అప్రజాస్వామికం, దారుణమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ ఆడిస్తున్న ఆటలో భాగంగానే స్పీకర్ ప్రసాద్కుమార్ పిటిషన్లు డిస్మిస్ చేశారన్నారు. అసెంబ్లీ స్పీకర్పై రాహుల్గాంధీ నుంచి తీవ్రమైన ఒత్తిడి ఉందని చెప్పారు. తెలంగాణ నుంచి వస్తు న్న డబ్బు సంచుల కోసం ఇలాంటి అనైతిక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఫిరాయింపుల వ్యవహారాన్ని కాంగ్రెస్ పార్టీ నడిపించిందని, స్పీకర్ చేతుల్లో నిర్ణయాధికారం లేదన్నారు. పార్టీ ఫిరాయింపుల్లో ప్రథమ ముద్దాయి రాహుల్గాంధీ అని, ప్రజాస్వామ్యం, భారత రాజ్యాంగంపై కాంగ్రెస్ చేస్తున్న దాడిలో ప్రధాన నేరస్తుడు రాహుల్గాంధీ అని కేటీఆర్ విమర్శించారు. ఆయన అనుమతి లేకుండా అనర్హత పిటిషన్లు డిస్మిస్ చేసేంత సాహసం స్పీకర్ చేయలేరన్నారు. మాజీ మంత్రులు జోగు రామన్న, పువ్వాడ అజయ్, ఎమ్మెల్యే కేపీ వివేకానంద, ఎమ్మెల్సీ తాతా మధు, పార్టీ నేతలు కర్నె ప్రభాకర్, డాక్టర్ ఆనంద్, ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ తదితరులతో కలిసి కేటీఆర్ బుధవారం తెలంగాణభవన్లో మీడియాతో మాట్లాడారు. ‘పార్టీ ఫిరాయింపులపై స్పీకర్ తీసుకున్న నిర్ణయంపై రాహుల్గాంధీ సమాధానం చెప్పాలి. ఈ నిర్ణయంతో రాహుల్ గాంధీ జోకర్గా నిలిచిపోయారు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడితే వెనువెంటనే సభ్యత్వం కోల్పోయేలా చట్టం తెస్తామని ప్రకటించిన రాహుల్గాంధీకి ఏమాత్రం సిగ్గూ, గౌరవం ఉన్నా స్పీకర్ నిర్ణయంపై స్పందించాలి’అని కేటీఆర్ డిమాండ్ చేశారు. వెలుగుమట్ల కూల్చివేతలపై వదిలిపెట్టం ఖమ్మం జిల్లా వెలుగుమట్లలోని భూదాన్ భూముల్లో పేదల ఇళ్ల కూల్చివేత అంశాన్ని అసెంబ్లీ ఉభయ సభల్లో ప్రశ్నించి తీరుతామని కేటీఆర్ అన్నారు. ‘ఖమ్మం జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రుల బినామీలు భూ మాఫియాగా ఏర్పడి పేదల మీద దాడి చేసి బయటకు పంపుతున్నారు. వెలుగుమట్లతోపాటు రాష్ట్రంలో కూలగొడుతున్న ప్రతీ ఇంటికి తిరిగి పట్టా ఇచ్చేంత వరకు వదిలిపెట్టం. ఇళ్లు కోల్పోయి ఏడుస్తున్న బాధితులను పెయిడ్ ఆర్టిస్టులు అంటూ మృగాల్లా మాట్లాడుతున్నారు. మంత్రుల ఆదేశాలతో ఖమ్మం ఏసీపీ బాధితులపైనే కేసులు పెడుతున్నారు’అని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పీకర్, రాహుల్నుసన్మానించాలి‘ఒక పార్టీ బీ ఫామ్ మీద ఎమ్మెల్యేగా గెలిచి రాజీనామా చేయకుండానే మరో పార్టీ బీ ఫామ్ మీద ఎంపీగా ఎలా పోటీ చేస్తారు. ఇంత అద్భుత నిర్ణయం తీసుకున్న స్పీకర్ను, ఆయన వెనుక ఉన్న రాహుల్గాందీని బహిరంగ సభ వేదికపై సత్కరించాలి’అని కేటీఆర్ వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. ‘అన్ని సాక్ష్యాలు ప్రజల ముందు ఉన్నా, విచారణ చేయాల్సిన అవసరం ఏముంది. ఫిరాయింపుల సంస్కృతి గురించి ఇకపై మాట్లాడే నైతిక హక్కు రాహుల్గాం«దీ, కాంగ్రెస్ పార్టీకి లేదు. పార్టీ ఫిరాయింపుల అంశంపైన దానం నాగేందర్, కడియం శ్రీహరిలు చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదం. కడియం శ్రీహరికి బీఆర్ఎస్ ఇచ్చిన గౌరవం, వచి్చన పదవులపై ఆయనే ప్రశ్నించుకోవాలి. మురికి మాటలు మాట్లాడుతున్న కడియం శ్రీహరి బీఆర్ఎస్లో కొనసాగుతున్నట్టు చేస్తున్న ప్రకటనలు ఆయన నైతిక పతనానికి అద్దం పడుతున్నాయి’అని కేటీఆర్ విమర్శించారు. -
పార్టీ మారలేదు
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్లో చేరారని పేర్కొంటూ ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరిపై దాఖలైన అనర్హత పిటిషన్లను శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ కొట్టేశారు. ఎమ్మెల్యే దానం నాగేందర్పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి, బీజేపీ శాసనసభా పక్షం నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి అనర్హత పిటిషన్లు దాఖలు చేశారు. మరో ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ పిటిషన్ దాఖలు చేశారు. వీటిపై ఇటీవల విచారణ పూర్తి చేసిన స్పీకర్ బుధవారం ఉదయం 10 గంటలకు తన తుది తీర్పును ప్రకటించారు. వాస్తవానికి తమ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్లో చేరిన మొత్తం 10 మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలంటూ పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పిటిషన్లు దాఖలు చేశారు. అయితే 8 మంది ఎమ్మెల్యేలపై దాఖలైన పిటిషన్లను గతంలోనే డిస్మిస్ చేసిన స్పీకర్ తాజాగా.. దానం, కడియంకు సంబంధించి తీర్పు వెలువరించారు. వారు పార్టీ మారలేదని స్పష్టం చేశారు. కాగా స్పీకర్ నిర్ణయంతో దానం, కడియంపై కచ్చితంగా అనర్హత వేటు పడుతుందని భావించిన బీఆర్ఎస్ అసంతృప్తి వ్యక్తం చేసింది. స్పీకర్ ట్రిబ్యునల్ నుంచి తీర్పు కాపీ అందిన తర్వాత తమ తదుపరి కార్యాచరణ ఉంటుందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి.. రాష్ట్రంలో 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ 39 స్థానాలకే పరిమితమైంది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. అయితే 2024 లోక్సభ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు 10 మంది కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు ఆరోపణలు వచ్చాయి.టి.ప్రకాశ్గౌడ్ (రాజేంద్రనగర్), పోచారం శ్రీనివాస్రెడ్డి (బాన్సువాడ), దానం నాగేందర్ (ఖైరతాబాద్), కాలే యాదయ్య (చేవెళ్ల), డాక్టర్ ఎం.సంజయ్కుమార్ (జగిత్యాల), కడియం శ్రీహరి (స్టేషన్ ఘన్పూర్), తెల్లం వెంకట్రావు (భద్రాచలం), బండ్ల కృష్ణమోహన్రెడ్డి (గద్వాల), అరెకపూడి గాంధీ (శేరిలింగంపల్లి), గూడెం మహీపాల్ రెడ్డి (పటాన్చెరు) వీరిలో ఉన్నారు. అయితే దానం నాగేందర్ 2024 లోక్సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. మరోవైపు స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కుమార్తె కావ్యకు బీఆర్ఎస్ వరంగల్ ఎంపీ టికెట్ ఇవ్వగా ఆమె చివరి నిమిషంలో కాంగ్రెస్లో చేరి ఎంపీగా గెలుపొందారు. ఈ ఎన్నికల్లో కడియం కావ్య తరఫున కడియం శ్రీహరి ప్రచారం చేసినట్లు బీఆర్ఎస్ ఆరోపించింది. మొత్తం 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారారంటూ భారత రాజ్యాంగంలోని పదవ షెడ్యూల్ (ఫిరాయింపుల నిరోధక చట్టం)లోని పేరా 2(1) ప్రకారం వారిని అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ 2024 జూలైలో శాసనసభ స్పీకర్ వద్ద వేర్వేరుగా అనర్హత పిటిషన్లు దాఖలు చేసింది. కోర్టుల్లో బీఆర్ఎస్ సుదీర్ఘ న్యాయపోరాటం తాము దాఖలు చేసిన అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోవడంలో స్పీకర్ ఆలస్యం చేస్తున్నారని పేర్కొంటూ బీఆర్ఎస్ 2024 డిసెంబర్లో హైకోర్టును ఆశ్రయించింది. దీంతో నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని సింగిల్ బెంచ్ స్పీకర్ను ఆదేశించింది. అయితే స్పీకర్కు కాల పరిమితి విధించడం తగదంటూ ఆ ఉత్తర్వులను హైకోర్టు డివిజన్ బెంచ్ రద్దు చేసింది. డివిజన్ బెంచ్ ఆదేశాలను సవాలు చేస్తూ బీఆర్ఎస్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. డివిజన్ బెంచ్ తీర్పును రద్దు చేసిన సుప్రీంకోర్టు.. 3 నెలల్లో అన్ని పిటిషన్లు పరిష్కరించాలని ఆదేశించింది దీంతో 2025 ఆగస్టులో 10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసిన స్పీకర్ దశల వారీగా విచారణ జరిపారు. అయితే నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలనే ఆదేశాలను స్పీకర్ పాటించక పోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు.. 2025 నవంబర్ 17న ఆయనకు కోర్టు ధిక్కరణ నోటీసు జారీ చేసింది. ఈ నేపథ్యంలో పదింటిలో ఏడు పిటిషన్లు డిస్మిస్ చేసినట్లు 2026 జనవరి 16న సుప్రీంకోర్టుకు సమాచారం ఇచ్చారు. ఆ తర్వాత జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్కుమార్పై దాఖలైన పిటిషన్ను కొట్టివేసిన స్పీకర్.. తాజాగా కడియం, దానంలకు అనర్హత వర్తించదని పేర్కొంటూ పిటిషన్లు డిస్మిస్ చేశారు. -
ఆరు గ్యారంటీల చట్టబద్ధతకు ప్రైవేట్ బిల్లు : కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలకు మొదటి కేబినెట్ సమావేశంలోనే చట్టబద్ధత కల్పిస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు కావొ స్తున్నా అమలు చేయడం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. కాంగ్రెస్ వైఖరిని ఎండగట్టేందుకు సోమవారం నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్ఎస్ ప్రవేశపెట్టే ప్రైవేట్ మెంబరు బిల్లుకు అధికార పార్టీ మద్దతు ఇవ్వాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ నగర శివారులోని గోల్కొండ రిసార్టులో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సంయుక్తంగా నిర్వహించిన అవగాహన కార్యక్రమం ముగిసిన అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ‘కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న మూడో వార్షిక బడ్జెట్కు అత్యంత ప్రాధాన్యం ఉంది. ప్రభుత్వ పదవీకాలం సగం పూర్తయినా హామీల అమలు జరగడం లేదు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ హామీల వైఫల్యం, మోసాన్ని ఎండగట్టేందుకు అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించాం. రెండేళ్లుగా అసెంబ్లీ కమిటీలు లేకుండానే ప్రభుత్వం సమావేశాలను బలవంతంగా నడిపిస్తోంది. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పదవిని మా పార్టీకి ద్రోహం చేసి వెళ్లిన వ్యక్తికి ఇచ్చారు. సెలెక్ట్, స్టాండింగ్, పిటిషన్స్ తదితర 14 అసెంబ్లీ కమిటీలు పెండింగ్లో ఉన్నాయి. డిప్యూటీ స్పీకర్, చీఫ్విప్ లాంటి పదవులు భర్తీ చేయకుండా మందబలంలో బుల్డోజర్ టాక్టిక్స్ను ప్రభుత్వం ప్రయోగిస్తోంది. అసెంబ్లీ ఉభయ సభల్లో అబద్ధాలు, అసత్యాలతో అంకెలను తారుమారు చేస్తూ తూతూమంత్రంగా సమావే శాలు నిర్వహిస్తోంది’అని కేటీఆర్ మండిపడ్డారు. అసెంబ్లీలో కాంగ్రెస్ను నిలదీసేందుకే.. ‘ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించి అసెంబ్లీలో నాటకాలు ఆడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బలంగా నిలదీయడానికే అవగాహన సమావేశాలు బీఆర్ఎస్ ఏర్పాటు చేసింది. రైతుబంధు, ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో ఇళ్ల కూల్చివేత, మూసీ బాధితులు తదితర అంశాలతోపాటు ప్రజలకు ఇచ్చిన హామీలపై ప్రభుత్వాన్ని నిలదీస్తాం. అసెంబ్లీలో ప్రభుత్వం చేస్తున్న అంకెల గారడీని, లేని అప్పులను ఉన్నవిగా చూపిస్తున్న కాంగ్రెస్ అబద్ధాలను అంకెలతో సహా ఎండగడతాం. భవిష్యత్లోనూ బీఆర్ఎస్ శాసన మండలి, శాసనసభ సభ్యుల నడుమ మా పార్టీ సమన్వయం కోసం మరిన్ని కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ఆరు గ్యారంటీలు, హామీల అమలుకు నిధులు లేవని చెబుతున్న ప్రభుత్వం మూసీ ప్రక్షాళన పేరిట భారీ అవినీతికి తెరలేపింది. మేము సుందరీకరణకు కాకుండా దాని పేరిట జరుగుతున్న అవినీతిని వ్యతిరేకిస్తున్నాం. ఢిల్లీకి నిధులు పంపేందుకే రేవంత్రెడ్డి మూసీ ప్రక్షాళన ప్రాజెక్టును చేపడుతున్నాడు. రేవంత్రెడ్డి చెబుతున్న మాటలకు ఎంత మాత్రం విలువ లేదు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను పట్టపగలు నాశనం చేసిన సీఎం ‘నైట్ ఎకానమీ’గురించి మాట్లాడుతున్నాడు. రేవంత్రెడ్డి పాలన పిచ్చోడి చేతిలో రాయిలా మారింది. రెండున్నరేళ్లలో కాంగ్రెస్ ఒక్క ఇళ్లు కట్టినా నేను రాజీనామా చేస్తాను అని చేసిన ప్రకటనకు కట్టుబడి ఉన్నా. బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన ఇళ్లు, ఫైఓవర్లు, ప్రాజెక్టులకు రంగులు పూసి రేవంత్ తమ ఘనతగా చెప్పుకుంటున్నాడు’అని కేటీఆర్ విమర్శించారు. ముగిసిన అవగాహన కార్యక్రమం అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఒక రోజు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కేటీఆర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, శాసనమండలిలో ప్రతిపక్ష నేత ఎస్.మధుసూదనాచారి తదితరులు ప్రసంగించారు. పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్లు హరీశ్రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్యాదవ్, పార్టీ ప్రధాన కార్యదర్శి రావుల చంద్రశేఖర్రెడ్డి వివిధ అంశాలపై ప్రసంగించారు. -
సింఘ్వీ, వేం ఎన్నిక ఏకగ్రీవమే!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ నుంచి రాజ్యసభకు అభిషేక్ మను సింఘ్వీ, వేం నరేందర్రెడ్డి ఎన్నిక ఏకగ్రీవం కానుంది. కాంగ్రెస్ పార్టీ వారిద్దరినీ రాజ్యసభ అభ్యర్థులుగా ఎంపిక చేయగా గురువారం శాసనసభ ప్రాంగణంలో ఎన్నికల అధికారి ఉపేందర్రెడ్డికి నామినేషన్ పత్రాలను సమర్పించారు. తగినంత సంఖ్యాబలం లేనందున బీఆర్ఎస్ రాజ్యసభ ఎన్నికల బరిలో ఎవరినీ పోటీకి నిలపలేదు. సాయి అనే వ్యక్తి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసినప్పటికీ 10 మంది ఎమ్మెల్యేలు బలపరచాలనే నిబంధనను పాటించని కారణంగా ఆయన అభ్యర్థిత్వం శుక్రవారం స్రూ్కటినీలో తిరస్కరణకు గురవుతుందని అసెంబ్లీ వర్గాలు తెలిపాయి. దీంతో రాష్ట్రం నుంచి రాజ్యసభకు పార్టీ హైకమాండ్ ప్రతిపాదించిన సింఘ్వీ రెండోసారి, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్నేహితుడు వేం నరేందర్రెడ్డి రాజ్యసభలో అడుగుపెట్టడం లాంఛనం కానుంది. సీఎం, మంత్రులు వెంట రాగా నామినేషన్లు దాఖలు కాంగ్రెస్ పార్టీ తరఫున రాష్ట్రం నుంచి రాజ్యసభ అభ్యర్థులుగా ఎంపికైన అభిషేక్ మను సింఘ్వీ, వేం నరేందర్రెడ్డి ఉదయం 10:30 గంటలకు మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి శాసనసభకు వచ్చి నామినేషన్లు దాఖలు చేశారు. మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అసెంబ్లీకి రాగా ఆయనతో కలిసి వెళ్లి మరో సెట్ నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారి ఉపేందర్రెడ్డికి అందజేశారు.సింఘ్వీ మూడు సెట్ల నామినేషన్లు దాఖలు చేయగా వేం నరేందర్రెడ్డి నాలుగు సెట్లు దాఖలు చేశారు. మిత్రపక్షంగా ఉన్న ఎంఐఎం నుంచి నామినేషన్ల దాఖలు కార్యక్రమానికి హాజరైన ఎంఐఎం ఎమ్మెల్యేలు అహ్మద్ బిన్ బలాలా, జుల్పికర్ అలీ ఒక సెట్ నామిషన్ పత్రాలపై సంతకాలు చేశారు. ఊహించినట్లుగానే బీఆర్ఎస్ రాజ్యసభ బరిలో అభ్యర్థిని దించలేదు. రాజ్యసభ సభ్యత్వాన్ని పొందేందుకు అవసరమైన 40 మంది శాసనసభ్యుల బలం లేకపోవడంతో పోటీ చేయలేదని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. రెండోసారి రాజ్యసభకు అదృష్టం: సింఘ్వీ నామినేషన్ దాఖలు అనంతరం వేం నరేందర్రెడ్డితో కలిసి గాంధీ భవన్కు వచ్చిన అభిషేక్ మను సింఘ్వీకి పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన టీపీసీసీ చీఫ్ మహేశ్కుమార్గౌడ్ను కలిశారు. అనంతరం సింఘ్వీ తెలంగాణ తరఫున రాజ్యసభకు రెండోసారి వెళ్లనుండటాన్ని అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. రెండోసారి తెలంగాణ నుంచి ఎంపీగా తనను ఎంపిక చేసిన కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే, అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాం«దీ, కేసీ వేణుగోపాల్కు ధన్యవాదాలు తెలిపారు.వేం నరేందర్రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ నుంచి రాజ్యసభకు వెళ్లడం ఆనందంగా ఉందని.. ఇప్పటివరకు ఎలా పనిచేశానో, భవిష్యత్తులోనూ అలాగే పనిచేస్తానన్నారు. రాష్ట్రానికి రావాల్సిన హక్కులు, నిధుల కోసం పోరాడుతానని పేర్కొన్నారు. తనను రాజ్యసభకు ఎంపిక చేసిన రేవంత్రెడ్డి, మహేశ్గౌడ్కు ధన్యవాదాలు తెలిపారు. కాగా, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కుమారుడి పెళ్లికి హాజరయ్యేందుకు హైదరాబాద్ వచ్చిన పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను సింఘ్వీ, వేం నరేందర్రెడ్డిలతో కలిసి సీఎం రేవంత్రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. -
‘మూసీ నది బ్యూటిఫికేషన్ కాదు.. లూటిఫికేషన్’
సాక్షి,హైదరాబాద్: మూసీ నది బ్యూటిఫికేషన్ కాదు.. లూటిఫికేషన్’అని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. గురువారం కేటీఆర్ నాగోల్ మూసీ పరీవాహక ప్రాంతంలో పర్యటించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ‘రేవంత్ బుల్డోజర్లకు అడ్డంగా నిలబడుతాం. పేదల ఇళ్ళు కాపాడుతాం. మూసీ పేరుతో రేవంత్ రెడ్డి చేస్తోన్న లూటీని అడ్డుకుంటాం. పేము కట్టిన ఇళ్ళకు పెయింటర్ బాబు రంగులు మార్చుతున్నాడు. రేవంత్ హాయంలో ఒక్క ఇల్లు కట్టినట్లు చూపిస్తే.. శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటాను. రేవంత్ .. చేతకాకుంటే మాకు అప్పజెప్పు ఒక్క ఇల్లు కూల్చకుండా మూసీ ప్రక్షాళన చేసి చూపిస్తాం.మూసీ సుందరీకరణకు పునాది వేసిందే కేసీఆర్. మూసీ ప్రక్షాళనపై అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీస్తాం. పేదలు కన్నీరు కార్చిన ప్రభుత్వాలు మనుగడలేదు. 16వేల కోట్లతో పోయేదాన్ని లక్షా 50వేల కోట్లకు రేవంత్ పెంచారు. రెండేళ్ళు అయినా మూసీ సుందరీకరణపై డీపీఆర్ లేదు.కూల్చకుండా కూడా అభివృద్ధి చేయొచ్చని కేసీఆర్ నిరూపించారు. కోస్గిలో రేవంత్ రెడ్డి ఇల్లు చెరువులో ఉంది. రేవంత్ రెడ్డి సోదరుడు ఇల్లు దుర్గం చెరువులో ఉంది. పొంగులేటి, వివేక్, కేవీపీ, పట్నం మహేందర్ రెడ్డి ఇల్లు బఫర్లో ఉన్నాయి. ఒక్క ఇల్లు కూల్చకుండా ఆరు కోట్ల రూపాయలతో మూసీ సుందరీకరణ చేశాం. 30కోట్లతో ఉప్పల్ లో శిల్పారామాన్ని కూడా నిర్మించా’మని స్పష్టం చేశారు. -
పూటకో బదిలీతో దెబ్బతింటున్న పాలన
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను పూటకోమారు బదిలీ చేయడంతో పాలన దెబ్బతింటోందని శాసనసభలో బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్లీడర్ హరీశ్రావు విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేతకాని పాలనకు ఉన్నతాధికారుల బదిలీలు నిదర్శనంగా నిలుస్తున్నాయన్నారు. తెలంగాణభవన్లో బుధవారం హరీశ్రావు మీడియాతో మాట్లాడారు. ఇప్పటివరకు ఐదుసార్లు జరిగిన బదిలీలతో విభాగాధిపతులు సగటున ఎనిమిది నెలలు కూడా తమకు అప్పగించిన స్థానాల్లో పనిచేయడం లేదన్నారు. విద్యుత్ శాఖలో రెండేళ్లలో ఐదుగురు ప్రత్యేక కార్యదర్శులు మారిన విషయాన్ని ప్రస్తావిస్తూ బదిలీలతో విద్యుత్ శాఖ అవినీతిమయంగా మారిందని మండిపడ్డారు. రాష్ట్రానికి గుండెకాయ లాంటి గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్తోపాటు సింగరేణి, పౌర సంబంధాలు, పాఠశాల విద్యాశాఖ, పంచాయతీరాజ్ తదితర విభాగాల్లో నలుగురు చొప్పున ఉన్నతాధికారులు మారిన విషయాన్ని గుర్తు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో ఐదు విడతల్లో 140 మంది ఐఏఎస్ అధికారులు బదిలీ కాగా, 20 జిల్లాల కలెక్టర్లు మారారన్నారు. రంగారెడ్డి జిల్లాలో రెండేళ్లలో నలుగురు కలెక్టర్లు మారారని చెప్పారు. తరచూ బదిలీలపై రాష్ట్రానికి నష్టం విభాగాధిపతులుగా ఉండే సీనియర్ ఐఏఎస్లతోపాటు జిల్లా కలెక్టర్లను తరచూ మార్చడంతో రాష్ట్రానికి నష్టం జరుగుతోందని హరీశ్రావు ఆందోళన వ్యక్తం చేశారు. తమకు నచ్చని అధికారులను బదిలీలు చేస్తూ, తమకు వ్యక్తిగతంగా అనుకూలంగా పనిచేసే వారికే సీఎం, మంత్రులు పోస్టింగులు ఇస్తున్నారని చెప్పారు. యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూళ్లలో ఐదు శాతం ఎక్సెస్కు టెండర్లు కట్టబెట్టడంలో జరుగుతున్న అక్రమాలను త్వరలో బయటపెడతానని ప్రకటించారు. ఇంజనీరింగ్ శాఖలో రిటైర్డ్ అధికారులు కీలక పదవుల్లో ఉండటం వల్ల ఎక్కువ అవినీతి జరుగుతోందని హరీశ్రావు ఆరోపించారు. కలెక్టర్ల సమావేశంలో సీఎం రేవంత్ బెదిరింపు ధోరణిలో మాట్లాడటం సరికాదన్నారు. సీఎం అక్రమాలకు సహకరించని అధికారులను బదిలీ చేస్తున్నారని, సీఎం తప్పుల్లో భాగస్వాములు అయ్యేందుకు అనేక మంది అధికారులు ముందుకు రావడం లేదని తెలిపారు. లగచర్ల ఆందోళనల సందర్భంగా అనేక హామీల ఎగవేతకు వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్ను బదిలీ చేశారని తెలిపారు. పార్టీ విప్ ఉల్లంఘించి ఓటేసిన కౌన్సిలర్లపై అనర్హత వేటు వేయడంలో చూపిన దూకుడు పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో ఎందుకు లోపించిందన్నారు. అక్రమ మైనింగ్ పరిశీలనకు బీఆర్ఎస్ బృందం హైదరాబాద్ శివారులోని నియోపోలిస్లో సీఎం రేవంత్రెడ్డి మేనల్లుడు అక్రమ మైనింగ్ చేస్తున్నాడని, కోట్లాది రూపాయల లీజు, రాయల్టీ ఎగవేతకు పాల్పడ్డారని హరీశ్రావు ఆరోపించారు. నిబంధనల ఉల్లంఘనలపై బీఆర్ఎస్ ప్రతినిధి బృందం గురువారం అక్రమ మైనింగ్ జరిగే ప్రాంతంతోపాటు నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసిన క్రషర్లను పరిశీలిస్తుందన్నారు. రాజ్యసభ ఎన్నికల్లో పోటీపై ప్రస్తుతానికి పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని హరీశ్రావు వెల్లడించారు. -
‘రాజ్యసభ’కు బీఆర్ఎస్ దూరం ?
సాక్షి, హైదరాబాద్: రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల్లో భాగంగా రాష్ట్రం నుంచి ఖాళీ అవుతున్న రెండు స్థానాలకు గురువారంతో నామినేషన్ల దాఖలుకు గడువు ముగుస్తుంది. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ ఈ ఎన్నికకు దూరంగా ఉండాలని సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. మరోవైపు నామినేషన్ల ప్రక్రియ ముగిసేంత వరకు పార్టీ అభ్యర్థిని బరిలోకి దించే అంశంలో గోప్యత పాటించాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. తెలంగాణలో 120 మంది శాసనసభ్యులు ఉండగా ఇద్దరు మాత్రమే పోటీ చేస్తే ఎన్నిక ఏకగ్రీవమవుతుంది. సిట్టింగ్ ఎంపీ అభిషేక్ మను సింఘ్వీతోపాటు మరో అభ్యర్థిని అధికార కాంగ్రెస్ పార్టీ పోటీలో నిలుపుతోంది. అయితే బీఆర్ఎస్ మూడో అభ్యర్థిని బరిలోకి దించితే ఎన్నిక అనివార్యం అవుతుంది. ముగ్గురు అభ్యర్థులు పోటీ చేస్తే కనీసం 40 ఓట్లు సాధించే అభ్యర్థులు రాజ్యసభ ఎన్నికల్లో విజయం సాధిస్తారు. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 39 మంది బీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. బీఆర్ఎస్ నుంచి గెలిచిన కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేల మరణంతో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. దీంతో అసెంబ్లీలో బీఆర్ఎస్ బలం 37 స్థానాలకు పడిపోయింది. మరో 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారినట్టుగా ఆరోపణలు ఎదుర్కొంటుండగా, వారిపై అనర్హత వేటు కోరుతూ బీఆర్ఎస్ స్పీకర్ ట్రిబ్యునల్ను ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అసెంబ్లీలో బీఆర్ఎస్ బలం 27 మందికే పరిమితమైంది. అయితే రాజ్యసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిని నిలిపితే పర్యవసానాలు ఎలా ఉంటాయనే కోణంలో పార్టీలో చర్చ జరుగుతోంది. ఒకవేళ పార్టీ అభ్యర్థిని పోటీలో నిలిపితే తాము బీఆర్ఎస్లోనే కొనసాగుతున్నామని చెబుతున్న పది మంది ఎమ్మెల్యేలు ఎటు వైపు ఓటు వేస్తారనే ఆసక్తి నెలకొంది. మూడో అభ్యర్థిని పోటీలో పెడితే ఉన్న 27 మంది ఎమ్మెల్యేల్లో ఎవరైనా క్రాస్ ఓటింగ్కు పాల్పడితే పార్టీ ప్రతిష్ట దెబ్బతింటుందనే ఆందోళన కూడా బీఆర్ఎస్ వర్గాల్లో కనిపిస్తోంది. అయితే ఈ విషయంలో పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నట్టు బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. బుధవారం తెలంగాణ భవన్లో జరిగిన మీడియా ఇష్టాగోష్టిలో బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు స్పందించారు. రాజ్యసభ ఎన్నిక బరిలో బీఆర్ఎస్ అభ్యర్థిని నిలపడంపై పార్టీ పరంగా ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని వ్యాఖ్యానించారు. అదే సమయంలో చివరి నిమిషం వరకు తమ పార్టీ వ్యూహం గోప్యంగా ఉంటుందని వ్యాఖ్యానించారు. -
TS: ఫిరాయింపు ఎమ్మెల్యేలపై విచారణ
-
లిక్కర్ కేసుతో బీఆర్ఎస్ నష్టపోయింది
సాక్షి, హైదరాబాద్: ఢిల్లీ మద్యం పాలసీ కేసులో సీబీఐ కోర్టు ఇచ్చిన తీర్పుతో కవితకు న్యాయం జరిగిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు వ్యాఖ్యానించారు. ‘అయితే మద్యం కుంభకోణం అనే సాకుతో ఢిల్లీలో కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని కూల్చారు. ఈ కేసు మూలంగా అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ సైతం రాజకీయంగా నష్టపోయింది..’ అని కేటీ ఆర్ శుక్రవారం ‘ఎక్స్’ వేదికగా పేర్కొ న్నారు.‘మద్యం పాలసీ కేసు తరహాలోనే మా నాయ కులపై నమోదైన ప్రతి కేసు అబద్ధం, రాజకీయ ప్రేరేపితం, కల్పితమని త్వరలో తేలిపోతుంది. అసత్యాలతో కూడిన, కుట్రపూ రిత కేసులను, ఆరోపణలను మీడియా ట్రయల్స్ ద్వారా మరింత పెద్దవి చేసి, ప్రజ లను తప్పుదోవ పట్టించడానికి, మా ప్రతిష్టను దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నారు. దురదృష్టవశాత్తూ సాక్ష్యాల కంటే ఆరోపణలకే ప్రాధా న్య తనిస్తూ న్యాయ ప్రక్రియ కంటే మీడియా కథనాలే మిన్న అనే ధోరణి ఈ ’నవ భారతం’లో బాగా పెరిగిపోయింది. కానీ చివరకు న్యాయమే గెలుస్తుంది..’ అని కేటీఆర్ స్పష్టం చేశారు. -
బీఆర్ఎస్పై భారీ ఎఫెక్ట్!
సాక్షి, హైదరాబాద్: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసుకు సంబంధించి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితపై సీబీఐ నమోదు చేసిన అభియోగాలను కోర్టు కొట్టివేయడంతో..ఆ కేసు రాష్ట్రంలో మరోసారి చర్చనీయాంశమయ్యింది. కేసు పూర్వాపరాలను, కవితపై ఆరోపణలు, అరెస్టు తదితర పరిణామాల అనంతరం రాష్ట్రంలో చోటుచేసుకున్న రాజకీయ మార్పులు కూడా చర్చనీ యాంశమవుతున్నాయి.ముఖ్యంగా ఈ కేసు కారణంగా బీఆర్ ఎస్ భారీ కుదుపులకు లోనైందని, రాజకీయంగా నష్టపోయిందంటూ ఆ పార్టీ నేతలు గుర్తు చేసుకుంటున్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. జాతీయ రాజకీయాల్లో అడుగు పెట్టేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలకు అడ్డుకట్ట వేసేందుకు, ఎన్నికల్లో దెబ్బతీసేందుకే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈ కేసును తెరపైకి తెచ్చిందనే విమర్శలు అప్పట్లో వచ్చాయి. అనేక కీలక పరిణామాలు..లిక్కర్ కేసులో కవితను ఈడీ, సీబీఐ విచారించడంతో మొద లైన వివాదం పార్టీలో ఇంటా బయటా అనేక పరిణామాలు, రాజకీయ మలుపులకు దారి తీసింది. మద్యం పాలసీ కేసులో ముడుపులు ఆరోప ణలతో కవితను 2024 మార్చిలో అరెస్టు చేసి తీహార్ జైలుకు తరలించారు. ఇది బీఆర్ఎస్పై తీవ్ర ప్రభావం చూపించిందని ఆ పార్టీ నేతలు అంటున్నారు. అదే ఏడాది ఏప్రిల్, మేలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒక్క సీటు కూడా గెలవక పోవడానికి కవితపై వచ్చిన ముడుపుల ఆరోపణలు, ఆమె అరెస్టే కారణమంటూ పార్టీ లోపలా బయటా విమర్శలు వెల్లువెత్తాయి. బీఆర్ఎస్ అధికారంలో ఉండగానే..రాష్ట్ర్టంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో ఢిల్లీ మద్యం పాలసీ అంశం తెరమీదకు వచ్చింది. 2021లో అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ ప్రభుత్వం 2021–22 కొత్త ఎక్సైజ్ పాలసీని అమల్లోకి తెచ్చింది. రిటైల్ మద్యం విక్రయాలను పూర్తిగా ప్రైవేటు సంస్థలకు అప్పగించేలా ఈ విధానం ప్రవేశ పెట్టారు. అయితే లైసెన్సుల కేటాయింపులో అవకతవకలు జరిగాయని, ముడుపులు చేతులు మారాయనే ఆరోపణలు వచ్చాయి. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ దీనిపై సీబీఐ విచారణకు సిఫారసు చేయగా, ఈడీ కూడా మనీలాండరింగ్ కేసు నమోదు చేసి ఆర్థిక లావాదేవీలపై దర్యాప్తు ప్రారంభించింది. ఆప్ నేతలకు ముడుపులు ఇచ్చారనే కోణంలో..‘సౌత్ గ్రూప్’ పేరిట దక్షిణాది రాష్ట్రాలకు చెందిన కొందరు నేత లు ఆప్ నేతలకు ముడుపులు ఇచ్చి లైసెన్సులు పొందారనే కోణంలో విచారణ జరిగింది. ఇందులో నాటి తెలంగాణ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూతురు, అప్పటి ఎమ్మెల్సీ కవిత కూడా ముడుపులు ఇచ్చినట్లు ఈడీ అభియోగాలు నమోదు చేసింది. ఈ నేపథ్యంలో హైదరా బాద్, ఢిల్లీలో ఈడీ, సీబీఐ వేర్వేరుగా కవితను పలుమార్లు విచారించాయి. తనపై రాజ కీయ ప్రేరేపిత కేసు నమోదైందని కవిత వాదించారు. 2024 మార్చిలో కవిత అరెస్టు అయ్యారు. 2024 చివరలో ఈడీ, సీబీఐ చార్జిషీట్లు దాఖలు చేశాయి. సుమారు ఐదు నెలల పాటు జైలు జీవితం తర్వాత కవిత బెయిలుపై బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. -
ప్రతి పేదవాడికీ న్యాయం చేస్తాం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నుంచి ఇప్పటివరకు జరిగిన పార్లమెంట్, ఉప ఎన్నికలు, పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టం కట్టడాన్ని జీర్ణించుకోలేక ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వంపై విష ప్రచారం చేస్తున్నారని మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి ఆరోపించారు. ఫామ్హౌస్లో కూర్చుని కేసీఆర్ కుట్రలు చేస్తుంటే..బావ, బావమరిది హరీశ్రావు, కేటీఆర్ తెలంగాణ సమాజంపైన, ప్రభుత్వంపైన విషం కక్కుతున్నారని తీవ్ర విమర్శలు చేశారు. కాళేశ్వరంలో దోచుకున్న, దాచుకున్న సొమ్ములో కొంత భాగాన్ని బయటకు తీసి పేదలకు ఇళ్లు కట్టించి పాప పరిహారం చేసుకోవాలని కేసీఆర్, కేటీఆర్, హరీశ్రావుకు సూచించారు.గురువారం సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంపీలు బలరాంనాయక్, రామసహాయం రఘురాంరెడ్డి, ఎమ్మెల్యేలు రాజేందర్రెడ్డి, మాధవరెడ్డితో కలసి ముగ్గురు మంత్రులు మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ, 2023 జూలై 15న వెలుగుమట్లలో బీఆర్ఎస్ ప్రభుత్వమే పేదల ఇళ్లను కూలగొట్టించిందని చెబుతూ అప్పటి కూల్చివేత సంఘటనల ఫొటోలను మీడియాకు చూపారు. వెలుగుమట్లలో ఇళ్ల కూల్చివేతలపై బీఆర్ఎస్ నాయకులు చేసిన ఆరోపణలపై మీడియా ప్రశ్నించగా, మంత్రి పొంగులేటి పైవిధంగా స్పందించారు.హైకోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా అక్కడ అక్రమంగా ఉన్న ఇళ్లను తొలగించారన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే అన్యాయం చేశారని ఆరోపించారు. వెలుగుమట్లలో ఇల్లు కోల్పోయే పేదలకు ఇళ్లు తిరిగి కట్టిస్తామని హామీ ఇచ్చి బీఆర్ఎస్ గాలికి వదిలేసిందన్నారు. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం పేదోడి ప్రభుత్వమని, పేదలే ఇందిరమ్మ ప్రభుత్వానికి పేటెంట్ అని మంత్రి వ్యాఖ్యానించారు. వెలుగుమట్లలో ఇల్లు కోల్పోయే ప్రతి పేదవాడికి న్యాయం చేస్తామన్నారు. ‘వెలుగుమట్లలో అర్హులైన పేదలందరికీ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సూచనల మేరకు ఇంటి స్థలం, ఇళ్లు ఇస్తాం. ఏ ఒక్క పేదవాడికి అన్యాయం జరగకుండా చూస్తాం’అన్నారు. పేదల కష్టాలు తీర్చేందుకు జలయజ్ఞం ప్రారంభించారు తన పాదయాత్రలో భాగంగా పేదల కష్టాలను నేరుగా తెలుసుకున్న దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి..వారి కష్టాలు తీరాలంటే గోదావరి, కృష్ణా పరీవాహక ప్రాంతాల్లో ప్రాజెక్టుల నిర్మాణంతో రైతన్నకు సమృద్ధిగా సాగునీరు ఇవ్వాలని నిర్ణయించారని మంత్రి పొంగులేటి గుర్తు చేశారు. జలయజ్ఞంతో ప్రాణహిత–చేవెళ్ల సహా అనేక ప్రాజెక్టుల నిర్మాణానికి శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు.మార్చి 16 నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాలకు ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్, బావ బావమరుదులు హరీశ్రావు, కేటీఆర్ వచ్చి మాట్లాడాలి. తమ తప్పులు ఎక్కడ బయటపడతాయోనన్న భయంతోనే బీఆర్ఎస్ నాయకులు అసెంబ్లీలో ఉండకుండా సాకులతో బయటకు పోతున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రతిపక్షానికి మాట్లాడే అవకాశం ఇవ్వలేదని..కానీ తాము కచ్చితంగా అవకాశం ఇస్తామని, సభకు వచ్చి మంచి సలహాలు, సూచనలు ఇవ్వాలని పొంగులేటి కోరారు. ⇒ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ..బీఆర్ఎస్ ప్రభుత్వం నీటి ప్రాజెక్టుల విషయంలో ఉత్తర తెలంగాణకు పూర్తిగా అన్యాయం చేసిందన్నారు. కాళేశ్వరంపై సీబీఐ విచారణ ఎందుకు జరపడం లేదని కేంద్రంలోని బీజేపీని ప్రశ్నించారు. ⇒ మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ బీఆర్ఎస్ అవినీతికి పాల్పడినందువల్లే దేశంలోనే అత్యంత ధనిక ప్రాంతీయ పార్టీగా మారిందని విమర్శించారు. సుమారు వెయ్యి కోట్ల రూపాయల ఫిక్స్డ్ డిపాజిట్లు , ఎలక్ట్రోరల్ బాండ్లు దీనికి నిదర్శనమన్నారు. -
ఇళ్ల కూల్చివేతల పాపం ఆ ముగ్గురు మంత్రులదే: కేటీఆర్
ఖమ్మం: ఖమ్మం శివారు వెలుగుమట్ల రెవెన్యూ ప్రాంతంలోని భూదాన్ భూముల్లో మంత్రుల కన్నుపడిన కారణంగానే కూల్చివేతలు చేపట్టారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ఈరోజు(గురువారం, ఫిబ్రవరి 26వ తేదీ) బాధితుల్ని పరామర్శించడానికి వెళ్లిన కేటీఆర్.. ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డారు. ‘ఇళ్ల కూల్చివేతలపాపం ఆ ముగ్గురు మంత్రులదే. భూదాన్ భూములపై ముగ్గురు మంత్రుల కన్నుపడింది. అవసరమైతే సుప్రీంకోర్టు కూడా వెళ్తాం. కేసీఆర్ ఆదేశాలతోనే నేను ఇక్కడికి వచ్చాను. అసెంబ్లీలో భూదాన్ అంశాన్ని లేవనెత్తుతాం. కూలగొట్టిన చోటే గృహప్రవేశాలు చేయిస్తా’ అని కేటీఆర్ వారికి హామీ ఇచ్చారు. ‘2014 ఏప్రిల్లో భూదాన్ బోర్డు ద్వారా 1895 మందికి అంటే దాదాపు 1900 మందికి 100 గజాల చొప్పున పట్టాలు ఆనాడు భూదాన్ బోర్డు ఇవ్వడం జరిగింది. ఇవాళ మేము అక్కడికి వెళ్తే బాధితులు వెలుగుమట్లలో పట్టాలు చూపెడతా ఉన్నారు. విచిత్రం ఏమంటే ఇవాళ ఆ పట్టాలు ఫ్రాడ్ అని చెప్పి, ఫోర్జరీ అని చెప్పి అధికారులు చెప్తా ఉన్నారు.రెండూన్నర ఏళ్ల కిందట ఏ మాటలైతే మభ్యపెట్టి ఖమ్మం జిల్లాలో మరి ఓట్లు కొల్లగొట్టారో ఇవాళ అవన్నీ మర్చిపోయారు. ఇవాళ ఇందిరమ్మ రాజ్యం అంటే ఇళ్లు కూలగొట్టడమే ఇందిరమ్మ రాజ్యమా?, పేదవాడి హక్కులు ఉన్న పేదవాడికి వాడి దగ్గర మరి పట్టాలు ఉన్నా...నోటికాడి ముద్ద లాక్కొని వాళ్లను మెడలు పట్టి గెంటేస్తున్నారు’ అని కేటీఆర్ మండిపడ్డారు.కాగా, మంగళవారం ఉద్రిక్తత నడుమ వందల సంఖ్యలో ఇళ్లను కూల్చివేశారు. తెల్లవారుజాము నుండే అధికారులు భారీ పోలీసు బందోబస్త్ నడుమ జేసీబీలు, బుల్డోజర్లతో చేరుకుని సుమారు 400 ఇళ్లను కూల్చివేశారు. కలెక్టరేట్ సమీపాన పదేళ్లుగా నివాసం ఉంటున్న వారిని ఖాళీ చేయించి సామగ్రితో పునరావాస కేంద్రాలకు తరలించారు. అయితే దీనిపై బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాము ఎప్పట్నుంచో ఉండే ఇళ్లను కూల్చివేయడం దారుణమంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
ఒక్కో కౌన్సిలర్కి రూ. 3 కోట్లు ఆఫర్ చేశారు: కేటీఆర్
హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా క్యాతన్పల్లిలో అధికార పార్టీకి తమ నేతలు లొంగలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. తమ ఒక్కో కౌన్సిలర్కు రూ. 3 కోట్లు ఆఫర్ చేశారని కేటీఆర్ అన్నారు. తమ నేతలపై అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టారన్నారు. క్యాతన్పల్లి, ఖానాపూర్లో మళ్లీ ఎన్నికలు పెట్టాలని కేటీఆర్ సవాల్ చేశారు. క్యాతన్పల్లి స్పష్టమైన మెజార్టీతో గెలిచామన్నారు. ఇక పొత్తు ధర్మం పాటిస్తున్న సీపీఐకి ధన్యవాదాలు తెలియజేశారు. మరో రెండేళ్లలో తమ ప్రభుత్వం వస్తుందని ధీమా వ్యక్తం చేశారు కేటీఆర్.కాగా, క్యాతన్పల్లి మున్సిపాలిటీలో మొత్తం 22 వార్డులకు గాను బీఆర్ఎస్ అత్యధికంగా 10 స్థానాలను గెలుచుకుని అతిపెద్ద పార్టీగా నిలిచింది. అధికార కాంగ్రెస్ పార్టీ 7 స్థానాలను దక్కించుకుంది. అయితే మంచిర్యాల జిల్లాలోని క్యాతన్పల్లి మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నికలు తీవ్ర ఉద్రిక్తతల మధ్య వాయిదా పడుతూ, రాజకీయ పార్టీల మధ్య పోటీ కొనసాగుతోంది. బీఆర్ఎస్, సీపీఐ కూటమి కలిసి ఎక్కువ వార్డులు గెలిచినప్పటికీ, కాంగ్రెస్ కూడా గణనీయమైన స్థానాలు సాధించింది. ఈ కారణంగా చైర్మన్ పదవి ఎవరికీ దక్కుతుందనే అంశం ఇంకా తేలలేదు, ఎన్నికల ప్రక్రియలో వివాదాలు, వాయిదాలు చోటు చేసుకుంటున్నాయి. -
Mancherial: బాల్క సుమన్ అరెస్ట్.. క్యాతన్ పల్లిలో హై టెన్షన్
-
బాల్క సుమన్ అరెస్టును ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
సాక్షి,హైదరాబాద్: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్టును ఆ పార్టీ నేతలు ఖండిస్తున్నారు. క్యాతనపల్లిలో కాంగ్రెస్ అప్రజాస్వామిక, అహంకార చర్యలను అడ్డుకున్నందుకు మాజీ శాసనసభ్యులు, దళిత నాయకుడు బాల్క సుమన్ అరెస్టు చేసి నిర్బంధించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం’ అని మాజీ మంత్రి హరీష్ రావు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఆ ట్వీట్లో ‘బీఆర్ఎస్కి పూర్తి మెజారిటీ వచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీ పట్టపగలు ప్రజాస్వామ్యాన్ని పరిహసించిన తీరు చూసి యావత్ తెలంగాణ అసహ్యించుకుంటున్నది. అధికార బలం, పోలీసు బలం, ధన బలంతో చట్టాలను తుంగలో తొక్కడం కాంగ్రెస్ అరాచక వైఖరికి పరాకాష్ట. రాష్ట్రమంతా కాంగ్రెస్ మార్కు గూండాగిరి రాజ్యమేలుతున్నది. మున్సిపల్ ఎన్నికల వేళ కాంగ్రెస్ మురుగు రాజకీయాల వాసన కమ్ముకున్నది. హంగ్ వచ్చిన చోటల్లా ప్రతిపక్ష నాయకులను సంత భేరం చేస్తూ, కిడ్నాపులకు తెగబడుతూ ప్రజా తీర్పును కాలరాస్తున్న తీరుకు నిదర్శనాలు ఎన్నో. జనగాంలో దళిత మహిళా కౌన్సిలర్ బీఆర్ఎస్ కు మద్దతుగా చెయ్యి ఎత్తితే రిటర్నింగ్ ఆఫీసర్ సాక్షిగా కాంగ్రెస్ గూండాలు చేసిన దాడిని సమాజం కళ్లారా చూసింది. తమ కళ్ళెదుట ఒక దళిత మహిళా నాయకురాలిపై కాంగ్రెస్ నాయకులు దాడికి తెగబడితే అధికారులు, పోలీసులు కళ్లప్పగించి చోద్యం చూశారే తప్ప అడ్డుకోలేదు. రక్షణ కల్పించక పోగా నిస్సిగ్గుగా కాంగ్రెస్ గూండాలకు కొమ్ముకాయడం కాంగ్రెస్ పాలనలో ప్రజస్వామ్య వ్యవస్థలు పతనమైపోతున్న తీరుకు నిదర్శనం. ఒక్క క్యాతనపల్లే కాదు తొర్రూరు, జనగాం, ఇబ్రహీంపట్నం, జహీరాబాద్ సహా హంగ్ వచ్చిన ప్రతి చోటా ప్రజా తీర్పును గౌరవించకుండా చైర్మన్ పీఠాలను అడ్డదారుల్లో దక్కించుకుంటున్నారు. రాష్ట్రంలో భూములను కబ్జా చేసినట్లే, రాజకీయ పీఠాలను కూడా కబ్జా చేస్తున్నారు. బాల్క సుమన్ ను భేషరతుగా విడుదల చేయాలని, ప్రజాస్వామిక వాతావరణంలో క్యాతన్ పల్లి చైర్మన్ ఎన్నిక జరిగేలా బాధ్యత వహించాలని తెలంగాణ ఎన్నికల కమిషన్ను డిమాండ్ చేస్తున్నాం.’అని పేర్కొన్నారు. క్యాతనపల్లిలో కాంగ్రెస్ అప్రజాస్వామిక, అహంకార చర్యలను అడ్డుకున్నందుకు మాజీ శాసనసభ్యులు, దళిత నాయకుడు బాల్క సుమన్ ను అరెస్టు చేసి నిర్బంధించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.క్యాతన్ పల్లిలో @BRSparty కి పూర్తి మెజారిటీ వచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీ పట్టపగలు ప్రజాస్వామ్యాన్ని… pic.twitter.com/h9VQ7Nmh4I— Harish Rao Thanneeru (@BRSHarish) February 18, 2026 -
మాది యోధుల జాతి.. నీది ద్రోహుల జాతి: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: ‘తెలంగాణలో రెండే జాతులు ఉన్నాయి. ఒకటి తెలంగాణ పోరాట యోధుల జాతి, మరొకటి తెలంగాణ ద్రోహుల జాతి. మాది ఫైటర్స్ జాతి, వారిది ద్రోహుల జాతి..’అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ఘాటుగా వ్యాఖ్యానించారు. తెలంగాణ జాతి గౌరవాన్ని ప్రశ్నించే వారికి చరిత్రే సమాధానం ఇస్తుందని అన్నారు. ‘జాతి అంటే ఏమిటో లాఠీ దెబ్బలు తిన్నవారికి, జైళ్లు చూసినవారికి, ఉద్యమాల్లో రక్తం చిందించిన వారికే తెలుస్తుంది. ఉద్యమాల ఉగ్గుపాలు తాగిన వారికే తెలంగాణ అస్తిత్వం అర్థమవుతుంది..’అని చెప్పారు. మంగళవారం బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కె.చంద్రశేఖర్రావు జన్మదిన వేడుకలు పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్లో భారీ ఎత్తున నిర్వహించారు. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్, సికింద్రాబాద్ పార్లమెంట్ బీఆర్ఎస్ ఇన్చార్జి తలసాని సాయికిరణ్ యాదవ్ ఆధ్వర్యంలో 72 కిలోల భారీ కేక్ను కేటీఆర్ కట్ చేశారు. పార్టీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడారు. ఇటీవల కేసీఆర్పై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేసిన విమర్శలపై ఆయన పేరెత్తకుండా ఘాటుగా స్పందించారు. ద్రోహులకు జాతి నిర్వచనం ఎట్లా తెలుస్తది? ‘కొంతమంది ఆనవాళ్లు చెరిపేస్తామని మాట్లాడుతున్నారు. జాతి మీద, జాతి గౌరవం మీద ఎవరు పడితే వాళ్లు మాట్లాడుతున్నారు. కానీ కేసీఆర్ ఒక శిఖరం. తెలంగాణనే కేసీఆర్ ఆనవాలు. ఈ రాష్ట్రమే కేసీఆర్ ఆనవాలు. దాన్ని ఎట్లా చెరిపేస్తావు? తెలంగాణ మట్టితో మమేకమైన వాడికి, ఉద్యమాల ఉగ్గుపాలు తాగిన వాడికి, ఆత్మగౌరవ పోరాటంలో కలిసి నడిచిన వాళ్లకి మాత్రమే జాతి అంటే ఏంటో, జాతి గౌరవం అంటే ఏంటో తెలుస్తుంది. సకల జనులు స్వరాష్ట్ర సమరంలో తెగించి కొట్లాడుతున్నప్పుడు, ప్రాణాలకు తెగించి మన నాయకుడు నిరాహార దీక్ష చేస్తున్నప్పుడు, సమైక్యాంధ్ర వాదుల సంచులు మోసిన సన్నాసులకు జాతి తెలవదు, నీతి తెలవదు. ఆ రోజు తుపాకులు తీసుకుని ఉద్యమకారుల మీద దాడికి వెళ్లిన ద్రోహులకు జాతి నిర్వచనం ఎట్లా తెలుస్తది? రక్తంలో పౌరుషం ఉంటే, డీఎన్ఏలో ఉద్యమం ఉంటే, ఆత్మాభిమానం అనేది ఎక్కడన్నా నీ శరీరంలో ఉంటే నీకు జాతి అంటే ఏందో, జాతి చరిత్ర అంటే ఏందో తెలుస్తది..’అంటూ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కేసీఆర్ తెలంగాణ జాతి మొత్తానికి హీరో ‘కేసీఆర్.. ఏ జాతికి నువ్వు జాతి పిత? ఏ జాతి నీది అని మాట్లాడుతున్నాడు? రాజ్యతంత్రం నడిపిన రాణి రుద్రమ్మ జాతి మాది. జల్, జంగల్, జమీన్ అని కొట్లాడిన కొమురం భీమ్, అస్తిత్వం కోసం అమరులైన సమ్మక్క సారలమ్మ, పరాయి పాలనపై పోరాడి తెలంగాణ అస్తిత్వాన్ని నిలిపిన సర్వాయి పాపన్న, దొడ్డి కొమురయ్య, చాకలి ఐలమ్మ, భాగ్యరెడ్డి వర్మ, తుర్రేబాజ్ ఖాన్, కాళోజీ, దాశరథి వంటి మహనీయుల జాతి మాది. 1952లో ‘గైర్ ముల్కీ గో బ్యాక్‘ అని నెత్తుటి త్యాగాలు చేసిన విద్యార్థి అమరవీరుల జాతి మాది. 69లో కర్కశ కాంగ్రెస్కు వ్యతిరేకంగా పోరాటంలో అసువులు బాసిన 369 మంది యువ కిశోరాల జాతి మాది. మలిదశ ఉద్యమంలో ఢిల్లీ మెడలు వంచిన తెలంగాణ జాతి మాది. మేము మీలా ఢిల్లీకి సలాం కొట్టి బతికే సామంతులం కాదు. మాది సామంతుల జాతి కాదు..స్వతంత్రుల జాతి. గిరి గీసి కొట్లాడే తెగువ ఉన్న కేసీఆర్ జాతి మాది. కేసీఆర్ తాను జాతి పితనని ఎన్నడూ చెప్పుకోలేదు. ప్రజలే ఆయన్నలా పిలుచుకున్నారు. నా తండ్రి తెలంగాణకు హీరో, తెలంగాణ జాతి మొత్తానికి హీరో..’అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. మళ్లీ ముఖ్యమంత్రిని చేయడమే బర్త్డే గిఫ్ట్ ‘తెలంగాణ కోసం కేసీఆర్ జెండా ఎత్తిన కాలంలో రాష్ట్రంలో తెలుగుదేశం, వందేళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్, జాతీయ పార్టీ బీజేపీ వంటి మూడు బలమైన రాజకీయ శక్తులు ఉన్నాయి. మీడియా పవర్ లేదు, మనీ పవర్ లేదు, మజిల్ పవర్ లేదు, కుల బలం లేదు. ఉన్నదల్లా తెలంగాణ జాతికి న్యాయం చేయాలనే సంకల్పం మాత్రమే. ఆ సంకల్పమే కేసీఆర్ను మొండి ధైర్యంతో ముందుకు నడిపించింది. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది. కేసీఆర్ లాంటి మహా నాయకుడిని మళ్ళీ ముఖ్యమంత్రిని చేయడమే ఆయనకు మనం ఇచ్చే చిరుకానుక..’అని కేటీఆర్ అన్నారు. కేక్ను కట్ చేసి మాజీ మంత్రి హరీశ్రావుకు తినిపించారు. మాజీ మంత్రులు శ్రీనివాస్గౌడ్, లక్ష్మారెడ్డి, దాసోజు శ్రవణ్కుమార్, పాడి కౌశిక్ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
కన్నీళ్లు పెట్టుకున్న ఎర్రబెల్లి..!
మహబూబాబాద్: మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత ఎర్రబెల్లి దయాకర్రావు కన్నీళ్లు పెట్టుకున్నారు. తొర్రూరు మున్సిపల్ ఎన్నికల ఉద్రిక్తల నేపథ్యంలో ఎర్రబెల్లి దయాకర్రావును పీఎస్కు తరలించారు పోలీసులు. దీనిలో భాగంగా పోలీస్ స్టేషన్ ఆవరణలో మీడియాతో మాట్లాడారు ఎర్రబెల్లి దయాకర్ రావు. మీడియతో మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. చైర్మన్ ఎన్నిక తీరును ఎర్రబెల్లి తప్పుబటట్టారు ‘ కష్టపడి పనిచేసిన కార్యకర్తలక నేనేం సమాధానం చెప్పాలి. రాజ్యాంగానికి విరుద్ధంగా కాంగ్రెస్ పని చేస్తుంది. . నా జీవితంలో ఇలాంటి పరిస్థితులు చూడలేదు. ప్రజలు మాకు పట్టం కడితే ప్రభుత్వం అన్యాయం వ్యవహరించింది. నన్ను, నా భార్యను ఎందుకు అరెస్ట్ చేశారు? అని ఆవేదన వ్యక్తం చేశారు.కాగా, మహబూబాబాద్ జిల్లాలో తొర్రూరు మున్సిపాలిటీ ఎన్నికలు అత్యంత ఉత్కంఠభరితంగా జరిగాయి. బీఆర్ఎస్ 9 వార్డులను కైవసం చేసుకోగా, కాంగ్రెస్ 7 వార్డులను దక్కించుకుంది. బీజేపీకికానీ, ఇతరులకు కానీ ఇక్కడ విజయం సాధించలేద. దాంతో బీఆర్ఎస్, కాంగ్రెస్ల మధ్య పోరు ఖాయమైంది. ఈ తరుణంలోనే చివరి నిమిషంలో ఒక కౌన్సిలర్ కాంగ్రెస్ వైపు మొగ్గు చూపడంతో సమీకరణాలు మారాయి. బీఆర్ఎస్కు మెజార్టీ ఉన్నప్పటికీ ఒక కౌన్సిలర్ కాంగ్రెస్లోకి వెళ్లడంతో పరిస్థితి తారుమారైంది. ఈ క్రమంలోనే చైర్మన్ పీఠం చేజారిపోవడంతో ఎర్రబెల్లి దయాకర్రావు భావోద్వాగానికి లోనై కన్నీళ్లు పెట్టుకున్నారు. చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ కౌన్సిలర్ల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ప్రధానంగా తొర్రూర్ మున్సిపాలిటీ వార్డ్ కౌన్సిలర్లతో ఎర్రబెల్లి దయాకర్ రావును మున్సిపాలిటీకి అనుమతించలేదు పోలీసులు. ఎర్రబెల్లిని అనుమతించకపోవడంతో రోడ్డుపైన బేటాయించిన ఎర్రబెల్లి దయాకర్ రావు ధర్నా చేశారు. ఆపై ఎర్రబెల్లి దయాకర్ రావును అరెస్టు చేశారు. ఈ క్రమంలో లాఠీచార్జి వంటి ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. -
కేసీఆర్కు వైఎస్ జగన్ బర్త్ డే విషెస్
సాక్షి,తాడేపల్లి: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఆయురారోగ్యాలతో జీవించాలంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.Heartiest birthday greetings to former CM Telangana, Shri K. Chandrashekar Rao Garu. Praying for your health, peace, and long life. pic.twitter.com/KLHCpcZEGx— YS Jagan Mohan Reddy (@ysjagan) February 17, 2026 -
హంగ్ మున్సిపాలిటీలపై బీఆర్ఎస్ ప్రత్యేక నజర్
హైదరాబాద్: హంగ్ మున్సిపాలిటీలపై బీఆర్ఎస్ ప్రత్యేక దృష్టి పెట్టింది. బీఆర్ఎస్ దక్కించుకున్న 17 మున్సిపాలిటీలకు గాను 8 హంగ్ మున్సిపాలిటీలపై సీనియర్ నేతలను అక్కడ ఇంచార్జ్లుగా నియమించింది. దీనిలో భాగంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. కాంగ్రెస్ గూండాగిరీ అంటూ ధ్వజమెత్తారు. కాంగ్రెస్ అరాచకాలను అడ్డుకుని ఎన్నికైన వారిని సాఫీగా సాగేలా చూసుకోవడమే లక్ష్యమన్నారు. దీనిలో భాగంగా స్థానిక పార్టీ నేతలు ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలతో కేటీఆర్ మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అరాచకాల పైన పార్టీ మొత్తం అండగా ఉందని భరోసా ఇచ్చారు. కిడ్నాప్ల, దాడులు, అక్రమ ఓట్లతో పదవుల కొల్లగొట్టే కుట్ర చేశారన్నారు. దిగజారిన శాంతిభద్రతలకు నేడు జరిగిన పరిణామాలే సాక్ష్యమన్నారు. కాంగ్రెస్ తొత్తులగా ఉన్న పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
తీవ్ర ఉత్కంఠ రేపుతున్న తొర్రూరు మున్సిపల్ ఎన్నిక
-
తోర్రూరులో కొట్టుకున్న బీఆర్ఎస్.. కాంగ్రెస్
-
ట్విస్ట్.. ఒకే కారులో బీఆర్ఎస్ ఎమ్మెల్యే, బీజేపీ ఎంపీ
సాక్షి,హైదరాబాద్: సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ మున్సిపాలిటీ ఛైర్మన్ ఎన్నికల్లో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఒకే కారులో బీఆర్ఎస్ ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి, బీజేపీ ఎంపీ రఘునందన్ రావు మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు. ఇద్దరూ ఎక్స్ అఫిషియో ఓటు వినియోగించుకునేందుకు వచ్చారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాల అనంతరం కాంగ్రెస్లో చేరిన బీఆర్ఎస్ కౌన్సిలర్, అలాగే బీఆర్ఎస్లో చేరిన ఇండిపెండెంట్ సభ్యుడు పార్టీ బలాన్ని పెంచారు. దీంతో బీఆర్ఎస్ బలం 14కి చేరింది. కాంగ్రెస్ బలం మాత్రం 12 వద్ద నిలిచింది. ఈ సమీకరణలతో పాటు ఎక్స్ అఫిషియో ఓట్లు కూడా బీఆర్ఎస్కు అనుకూలంగా మారాయి. ఫలితంగా మున్సిపల్ పీఠాన్ని బీఆర్ఎస్ దక్కించుకునే అవకాశాలు బలపడుతున్నాయి.స్థానికంగా ఈ పరిణామం పెద్ద రాజకీయ చర్చలకు దారితీస్తోంది. కాంగ్రెస్ పార్టీ ఎక్స్ అఫిషియో ఓట్లను పరిగణలోకి తీసుకోవడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తుండగా, బీఆర్ఎస్ మాత్రం రాజ్యాంగబద్ధంగా తమకే అధికారం ఉందని వాదిస్తోంది. -
ఫోర్.. నెవర్ బిఫోర్
మున్సిపల్ కార్పొరేషన్లలో మేయర్ పీఠం కోసం మూడు ప్రధాన రాజకీయ పార్టీలు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నాయి. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా గెలిచిన పాలమూరుతోపాటు బీజేపీ కంటే తక్కువ స్థానాలు వచ్చినప్పటికీ ఎంఐఎం, బీఆర్ఎస్ల మద్దతు, స్వతంత్రులు, ఎక్స్ అఫీషియో ఓట్ల సహకారంతో కరీంనగర్, నిజామాబాద్లలో కూడా పాగా వేసేందుకు కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తోంది. ముఖ్యంగా కరీంనగర్లో బీజేపీ దూకుడుకు అడ్డుకట్ట వేసేందుకు బీఆర్ఎస్, కాంగ్రెస్లు ఒక్కటి కావడం గమనార్హం. మరోవైపు పాలమూరులో కాంగ్రెస్–ఎంఐఎంలు కలిసి మేయర్ పీఠాన్ని దక్కించుకోనుండగా, కొత్తగూడెంలో సీపీఐకి అవకాశం దక్కనుంది. రాష్ట్రంలోని నాలుగు కార్పొరేషన్లలో పరిస్థితి ఇది.బీజేపీకి అధిక డివిజన్లు వచ్చినా..66 డివిజన్లు ఉన్న కరీంనగర్ కార్పొరేషన్లో బీజేపీకి 30 డివిజన్లు దక్కాయి. నలుగురు స్వతంత్రులు, ఎంపీ బండి సంజయ్ ఓటుతో ఆ పార్టీ బలం 35కు చేరింది. కానీ, ఇక్కడ బీజేపీని కట్టడి చేసేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్లు అవగాహనకు వచ్చినట్టు తెలుస్తోంది. వీరికి మజ్లిస్, స్వతంత్రులు కూడా తోడయ్యారు. దీంతో కాంగ్రెస్ (14), బీఆర్ఎస్ (9), స్వతంత్రులు (4), మజ్లిస్ (3), ఏఐఎఫ్బీ (2) తోపాటు ఎమ్మెల్యేలు కమలాకర్ (బీఆర్ఎస్), కవ్వంపల్లి సత్యనారాయణ (కాంగ్రెస్)ల ఎక్స్అఫీషియో ఓట్లతో ఆ కూటమి బలం 34కు చేరింది. ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే... బీజేపీ గూటికి వెళ్లిన స్వతంత్రుల్లో ఒకరు కాంగ్రెస్ కూటమికి రావడంతో కూటమి బలం 35కు పెరిగితే, బీజేపీ బలం 34కు తగ్గింది. బీజేపీ నుంచి మరో ఇద్దరు కూడా వస్తారనే ప్రచారం జరుగుతుండడంతో కమలం శిబిరం కలవరపాటుకు గురవుతోంది.కొత్తగూడెంలో కామ్రేడ్లుచెరో 22 డివిజన్లలో గెలిచిన కాంగ్రెస్, సీపీఐల మధ్య అధికార పంపిణీ ఒప్పందం కుదరడంతో ఇక్కడ ఆ రెండు పార్టీలు కలిసి మేయర్, డిప్యూటీ మేయర్ స్థానాలను దక్కించుకోనున్నాయి. తొలి రెండున్నరేళ్లు సీపీఐకి, మలి రెండున్నరేళ్లు కాంగ్రెస్కు మేయర్ పదవి ఇచ్చేలా ఇరు పార్టీల మధ్య అవగాహన కుదిరింది.పాలమూరులో మేయర్ ఎవరో..!మహబూబ్నగర్ కార్పొరేషన్ కాంగ్రెస్ పరం కావడం ఖాయంగానే కనిపిస్తోంది. అయితే..మేయర్ అభ్యర్థిత్వంపై ఈ పార్టీలో అభిప్రాయభేదాలు వచ్చాయి. ఇక్కడ మ్యాజిక్ ఫిగర్కు 31 ఓట్లు కావాల్సి ఉండగా, కాంగ్రెస్ గెలుపొందిన 29తోపాటు ఎమ్మెల్యే ఎక్స్ అఫీషియో ఓటు, ముగ్గురు ఎంఐఎం, నలుగురు స్వతంత్రుల మద్దతుతో ఆ పార్టీ బలం 37కు చేరింది. బీఆర్ఎస్ 15, బీజేపీ 8 మంది చొప్పున బలం ఉన్నా ఏమీ చేయలేని పరిస్థితి. అయితే, ఇక్కడ కాంగ్రెస్ నుంచి మేయర్ అభ్యర్థి ఎవరన్న దానిపై ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో కొందరు కార్పొరేటర్లు క్యాంపు నుంచి శనివారం రాత్రే పాలమూరుకు చేరుకోవడం హాట్ టాపిక్గా మారింది.నిజామాబాద్ కాంగ్రెస్దే...!ఇందూరు కార్పొరేషన్ కాంగ్రెస్ పరమయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మ్యాజిక్ ఫిగర్కు అవసరమైన మేరకు ఆ పార్టీ బలం సమకూర్చుకుంది. ఇక్కడ బీజేపీకి 28 డివిజన్లు రాగా, మ్యాజిక్ ఫిగర్కు మూడు తగ్గాయి. ఎంపీ అర్వింద్, ఎమ్మెల్యేలు ధన్పాల్ సూర్యనారాయణ, పైడి రాకేశ్రెడ్డిలు ఎక్స్ అఫీషియో ఓట్లు వేస్తే ఆ మేరకు బలం చేకూరనుంది. కానీ కాంగ్రెస్ నుంచి గెలిచిన 17 మంది, ఎంఐఎం 14 మందితోపాటు బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఒక కార్పొరేటర్, ఎమ్మెల్యే భూపతిరెడ్డి, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ల ఎక్స్ అఫీషియో ఓట్లతో కాంగ్రెస్ కూటమి బలం 34కు చేరనుంది. దీంతో మేయర్ పీఠం కాంగ్రెస్కు, డిప్యూటీ మేయర్ ఎంఐఎంకు దక్కడం లాంఛన ప్రాయమే కానుంది. ⇒ నల్లగొండ, మంచిర్యాల, రామగుండం కార్పొరేషన్లు కాంగ్రెస్ పరం కావడం కూడా లాంఛన ప్రాయమే. -
హంగు.. కొత్త రాజకీయ రంగు
రాష్ట్రంలో మున్సిపాలిటీల ముఖచిత్రం మారిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. స్థానిక పరిస్థితులు, రాజకీయ సమీకరణాలకు అనుగుణంగా ఒక్కో మున్సిపాలిటీలో అనూహ్య పొత్తులు, అవగాహనలు కుదురుతున్నాయి. మూడు ప్రధాన రాజకీయ పక్షాలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు ఒక్కో చోట ఒక్కో తీరుగా వ్యవహరిస్తుండడంతో అర్బన్ రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది. కొన్నిచోట్ల కాంగ్రెస్–బీఆర్ఎస్, మరికొన్ని చోట్ల బీఆర్ఎస్–బీజేపీ, ఒక్కోచోట కాంగ్రెస్–బీజేపీ కలుస్తుండడం, స్వతంత్రులు కూడా అక్కడి పరిస్థితులను బట్టి అధికారం వైపు వెళుతుండడం, మజ్లిస్, ఏఐఎఫ్బీలు కాంగ్రెస్ పక్షం వహిస్తుండడంతో ఒక్కో చోట రాజకీయం ఒక్కో రకంగా మారుతోంది. మ్యాజిక్ ఫిగర్కు అవసరమైన స్థానాలు ఏ పార్టీకి దక్కని 36 పురపాలికల్లో గత రెండు రోజులుగా మారిన రాజకీయ సమీకరణలను బట్టి సోమవారం జరిగే మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్ల ఎన్నిక రసవత్తరంగా మారనుంది. కొన్ని చోట్ల లాటరీ వరకు వెళ్లనుండగా, మరికొన్ని చోట్ల వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తం మీద కాంగ్రెస్కు స్పష్టమైన మెజారిటీ వచ్చిన వాటితోపాటు మరో 20 స్థానాలు ఆ పార్టీ పరమయ్యే చాన్స్ ఉంది. హంగ్ పరిస్థితులు ఏర్పడిన వాటిలో బీఆర్ఎస్కు నాలుగైదు, బీజేపీకి ఒకట్రెండు మున్సిపాలిటీలు దక్కనున్నాయని తెలుస్తోంది. – సాక్షి, హైదరాబాద్/ నెట్వర్క్⇒ మహబూబాబాద్: ఈ మున్సిపాలిటీలో మ్యాజిక్ ఫిగర్కు 19 మంది సభ్యులు కావాలి. కాంగ్రెస్ నుంచి 13, బీఆర్ఎస్ నుంచి 12 మంది గెలిచారు. కాంగ్రెస్కు ముగ్గురు సీపీఎం, బీఆర్ఎస్కు ముగ్గురు సీపీఐ సభ్యులు మద్దతిస్తున్నారు. వీరు కాకుండానే ఇంకా మ్యాజిక్ ఫిగర్కు కావాల్సిన మరో ముగ్గురి కోసం స్వతంత్రులకు అధికార కాంగ్రెస్ గాలం వేసింది. ఈ ప్రయత్నాలు సఫలం కావడంతో ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీనే పీఠం దక్కించుకోనుంది. అయితే, చైర్మన్గా కాంగ్రెస్లో చేరిన ఇండిపెండెంట్ అయ్యే అవకాశం ఉంది. ⇒ తొర్రూరు: ఇక్కడ మ్యాజిక్ ఫిగర్కు కావాల్సిన 9 మంది బీఆర్ఎస్ నుంచి గెలుపొందారు. ఇక్కడ ఆ పార్టీకే మున్సిపల్ పీఠం దక్కే మెజారిటీ వచ్చింది. కానీ కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. వరంగల్ ఎంపీ కడియం కావ్య, పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డిలను రంగంలోకి దింపుతోంది. ఇద్దరినీ ఎక్స్ అఫీషియో సభ్యులుగా నమోదు చేయించింది. దీంతో ఇరు పార్టీల బలం తొమ్మిదికి చేరనుంది. ఇక్కడ కూడా టాస్ అనివార్యం కానుంది. ⇒ ఆసిఫాబాద్: ఈ మున్సిపాలిటీలో మ్యాజిర్ ఫిగర్ 11. ఇక్కడ కాంగ్రెస్కు ఏడుగురు, బీఆర్ఎస్కు 9 మంది కౌన్సిలర్లు ఉన్నారు. నలుగురు స్వతంత్రులు కాంగ్రెస్లో చేరగా ఈ మున్సిపాలిటీ ఆ పార్టీ పరం కానుంది. ⇒ ఖానాపూర్: ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ 7. ఇక్కడ బీజేపీ, బీఆర్ఎస్లకు 4 చొప్పున రాగా, కాంగ్రెస్ నుంచి ముగ్గురు కౌన్సిలర్లు గెలిచారు. ఒక స్వతంత్రుడు కాంగ్రెస్లో చేరడంతో వారి బలం 4కు చేరింది. ఇప్పుడు మూడు పార్టీల బలం సమంగా ఉంది. అయితే, ఎక్స్ అఫీషియో సభ్యుడిగా ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు (కాంగ్రెస్) నమోదు కావడం, బీజేపీ, బీఆర్ఎస్ల నుంచి ఒక్కో స్వతంత్రుడు కాంగ్రెస్ వైపునకు వచ్చారన్న ప్రచారంతో ఈ మున్సిపాలిటీ హస్తగతం కావొచ్చు.లేదంటే 3 పార్టీలు అధికారాన్ని పంచుకునే ప్రతిపాదనపై చర్చలు జరుగుతున్నాయి. ⇒ ఆదిలాబాద్: మ్యాజిక్ ఫిగర్కు నాలుగు తక్కువగా 21 వార్డుల్లో విజయం సాధించిన బీజేపీని నిలువరించడమే కర్తవ్యంగా బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎంలు కూటమి కట్టాయి. తమ పార్టీల నుంచి కాకుండా స్వతంత్రుడిని చైర్మన్ చేయాలని నిర్ణయించాయి. దీంతో కాంగ్రెస్ (11), బీఆర్ఎస్ (6), ఎంఐఎం (6)తో పాటు స్వతంత్రుల మద్దతుతో ఈ మున్సిపాలిటీ పీఠంపై ఇండిపెండెంట్ కూర్చునే అవకాశాలున్నాయి. ⇒ భైంసా: ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ 14. ఇక్కడ ఎంఐఎం 12 వార్డులు గెలిచింది. కాంగ్రెస్ నుంచి ఒకరు కలిపితే ఆ పార్టీ బలం 13కు చేరనుంది. బీజేపీ నుంచి ఆరుగురు గెలిచారు. ఆ పార్టీకి ఐదుగురు స్వతంత్రులు మద్దతిస్తున్నారు. ఎమ్మెల్యే, ఎంపీ ఎక్స్ అఫీషియో ఓట్లతో బీజేపీ బలం కూడా 13కు చేరింది. మరో ఇద్దరు స్వతంత్రులు ఎంఐఎం వ్యతిరేక వర్గంగా ఉన్నారు. వీరు ఎవరికీ మద్దతిచ్చే ప్రసక్తే లేదని చెబుతున్నారు. ఈ ఇద్దరు స్వతంత్రుల మనసు మారకపోతే ఏ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ వచ్చే అవకాశం లేదు. ⇒ కాగజ్నగర్: ఈ మున్సిపాలిటీలో మ్యాజిక్ ఫిగర్ 16. ఇక్కడ కాంగ్రెస్కు 9 మంది, బీఆర్ఎస్కు 11 మంది కౌన్సిలర్లు ఉన్నారు. బీజేపీ నుంచి గెలిచిన ఐదుగురు, స్వతంత్రులు కలిపి కాంగ్రెస్కు మద్దతివ్వనుండడంతో ఈ మున్సిపాలిటీ కూడా కాంగ్రెస్ ఖాతాలోకే వెళ్లనుంది. ⇒ క్యాతనపల్లి: ఇక్కడ మ్యాజిక్ ఫిగర్కు అవసరమైన 12 స్థానాలకుగాను ఎన్నికలకు ముందే పొత్తు పెట్టుకున్న బీఆర్ఎస్, సీపీఐలు కలిసి నడుస్తున్నాయి. బీఆర్ఎస్(10), సీపీఐ(4)ల మద్దతుతో ఈ స్థానం బీఆర్ఎస్ పరం కానుంది. ⇒ బెల్లంపల్లి: ఈ మున్సిపాలిటీలో మ్యాజిక్ ఫిగర్ 18 కాగా, ఇక్కడ పార్టీల బలాబలాలు మారిపోతున్నాయి. కాంగ్రెస్ నుంచి గెలిచిన 14 మందిలో ఇద్దరు బీఆర్ఎస్ పక్షం చేరడంతో ఆ పార్టీ బలం 12కు తగ్గింది. అయితే, నలుగురు ఇండిపెండెంట్లతో మళ్లీ 16కు పెరిగింది. ఇక, 14 మంది కౌన్సిలర్లు గెలిచిన బీఆర్ఎస్ పక్షాన ఇద్దరు కాంగ్రెస్ కౌన్సిలర్లు చేరడంతో ఆ పార్టీ బలం కూడా 16కు చేరింది. దీంతో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, ఎమ్మెల్యే గడ్డం వినోద్లు ఈ మున్సిపాలిటీలో ఓటు హక్కు వినియోగించుకోవడం ద్వారా కాంగ్రెస్ జెండానే ఎగురవేయాలనే వ్యూహంతో ఉన్నారు. బీఆర్ఎస్ కౌన్సిలర్లతో కూడా వారు టచ్లో ఉన్నట్టు సమాచారం. ⇒ బోధన్ : ఈ మున్సిపాలిటీలో మ్యాజిక్ ఫిగర్ 20. కాంగ్రెస్ నుంచి గెలిచిన 17 మంది, ఎంఐఎం నుంచి గెలిచిన 12 మంది మద్దతుతో ఇక్కడ కాంగ్రెస్ పాగా వేయనుంది. మున్సిపల్ చైర్మన్ విషయంలో ఎంఐఎం కొంత విభేదించినా చివరకు కాంగ్రెస్ ఇష్టానికే చైర్మన్ అభ్యరి్థత్వాన్ని వదిలేయడంతో కథ సుఖాంతమైంది. ⇒ కామారెడ్డి: ఈ మున్సిపాలిటీలో బీజేపీకి చెక్ పెట్టేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్లు పావులు కదుపుతున్నాయి. ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ కోసం 25 మంది సభ్యుల బలం కావాల్సి ఉండగా, బీజేపీకి 16 మందితో పాటు ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ఉన్నారు. ఇక్కడ కాంగ్రెస్కు 19, బీఆర్ఎస్ 11 మంది సభ్యుల బలం ఉంది. దీంతో ఇరు పార్టీలు చర్చలు జరుపుతున్నాయి. కాంగ్రెస్కు చైర్మన్, బీఆర్ఎస్కు వైస్చైర్మన్ దక్కే అవకాశాలున్నాయి. ⇒ అలంపూర్: ఇక్కడ మ్యాజిక్ ఫిగర్కు ఆరుగురి బలం కావాలి. బీఆర్ఎస్కు ఐదు, కాంగ్రెస్కు ఐదు వచ్చాయి. ఎమ్మెల్యే విజయుడు ఎక్స్ అఫీషియో ఓటుతో గులాబీ జెండా ఎగరనుంది.⇒ జనగామ: ఈ మున్సిపాలిటీలో మ్యాజిక్ ఫిగర్ 16. కాంగ్రెస్కు 12, బీఆర్ఎస్కు 13 మంది కౌన్సిలర్లు ఉన్నారు. సీపీఎం కూడా కాంగ్రెస్కు మద్దతిస్తోంది. దీంతో ఆ పార్టీ బలం 13కు చేరుతుంది. నలుగురు స్వతంత్రులు గెలవగా.. ఇద్దరు బీఆర్ఎస్, ఒకరు కాంగ్రెస్ క్యాంపులో ఉన్నారు. జనగామలోనే ఉన్న మరో కౌన్సిలర్ కాంగ్రెస్కు మద్దతిస్తారు. ఇక్కడ ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఎంపీ చామల కిరణ్ (కాంగ్రెస్), ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి(బీఆర్ఎస్) నమోదు చేసుకున్నారు. దీంతో ఇరు పార్టీల బలం 16కు చేరుతుంది. ఈ నేపథ్యంలో జనగామ టాస్ వరకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. ⇒ అలియాబాద్: ఈ మున్సిపాలిటీలో మ్యాజిక్ ఫిగర్ 11. కాంగ్రెస్కు 8, బీఆర్ఎస్కు 7 కౌన్సిలర్లు గెలిచారు. ఇక్కడ బీఎస్పీతోపాటు ఒక స్వతంత్ర అభ్యర్థి కాంగ్రెస్ క్యాంపులో ఉన్నారు. ముగ్గురు బీజేపీ సభ్యులు కాంగ్రెస్, బీఆర్ఎస్లలో ఎవరికీ మద్దతివ్వడం లేదు. చైర్మన్ పదవి అడుగుతున్నారు. బీఆర్ఎస్ కౌన్సిలర్లను చీల్చే పనిలో కాంగ్రెస్ ఉంది. ఏం జరుగుతుందో సోమవారమే స్పష్టత రానుంది. ⇒ ఎల్లంపేట: ఈ మున్సిపాలిటీలో మ్యాజిక్ ఫిగర్ 13. కాంగ్రెస్కు 8 మంది, బీఆర్ఎస్కు 12 మంది బలం ఉంది. ఇక్కడ ఎమ్మెల్యే మల్లారెడ్డి (బీఆర్ఎస్) ఎక్స్ అఫీషియో సభ్యుడిగా నమోదు చేసుకున్నారు. దీంతో బీఆర్ఎస్ బలం 13కు చేరనుంది. ఈ మేరకు స్పష్టత ఉన్నా, బీఆర్ఎస్లో చీలిక తెస్తున్నామని కాంగ్రెస్ అంటోంది. ఈ నేపథ్యంలో ఎల్లంపేట పీఠం ఎవరికి దక్కుతుందో సోమవారమే తేలనుంది. ⇒ పరిగి: ఈ మున్సిపాలిటీలో మ్యాజిక్ ఫిగర్కు 10 మంది సభ్యులు కావాలి. కాంగ్రెస్కు 8, బీఆర్ఎస్కు 8 మంది బలం ఉంది. ఇద్దరు స్వతంత్రులు చెరో పక్షం చేరారు. దీంతో ఇరు పార్టీలకు బలం చేరింది. ఇక్కడ ఎమ్మెల్యే టీఆర్ఆర్ (కాంగ్రెస్) ఎక్స్ అఫీషియో నమోదు చేసుకోవడంతో ఆయన ఓటుతో ఈ మున్సిపాలిటీ కాంగ్రెస్ ఖాతాలో చేరనుంది. ⇒ మొయినాబాద్ : ఈ మున్సిపాలిటీ మ్యాజిక్ ఫిగర్ 14. ఇందులో కాంగ్రెస్ 10, బీఆర్ఎస్ 7 గెల్చుకున్నాయి. ఇక్కడ స్వతంత్రులు ఐదుగురు గెలిచారు. వీరిలో మ్యాజిక్ ఫిగర్కు అవసరమైనంత మంది స్వతంత్రులు కాంగ్రెస్ గూటికి చేరారు. వీరి సహకారంతో మొయినాబాద్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పరం కానుంది. ⇒ వికారాబాద్: ఈ మున్సిపాలిటీ మ్యాజిక్ ఫిగర్ 18 కాగా, కాంగ్రెస్ నుంచి 17 మంది గెలిచారు. స్వతంత్రుల మద్దతులో ఎక్స్ అఫీషియో ఓటు అవసరం లేకుండానే కాంగ్రెస్ జెండా ఎగరనుంది. ⇒ వర్ధన్నపేట: ఈ మున్సిపల్ పీఠం కోసం 7గురు సభ్యుల బలం అవసరం. ఇందులో కాంగ్రెస్ గెలిచిన ఐదింటితోపాటు మరో స్వతంత్రుడు కలిపితే అధికార పార్టీ పక్షాన ఆరుగురు అయ్యారు. బీఆర్ఎస్ ఆరుగురు కౌన్సిలర్లను గెలిచింది. దీంతో ఎక్స్ అఫీషియో సభ్యుడిగా ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ఓటుతో ఈ మున్సిపాలిటీ కూడా కాంగ్రెస్ పరం కానుంది. ⇒ కేసముద్రం: ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ కోసం 9 మంది బలం కావాలి. కాంగ్రెస్, బీఆర్ఎస్లకు 8 చొప్పున స్థానాలు వచ్చాయి. ఇక్కడి నుంచి మహబూబాబాద్ లోక్సభ సభ్యుడు బలరాం నాయక్ ఎక్స్ అఫీషియో ఓటరుగా నమోదు చేసుకున్నారు. ఈయన ఓటుతో కేసముద్రం పురపాలికపై కాంగ్రెస్ జెండా ఎగరనుంది. ⇒ జహీరాబాద్: ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ 19 కాగా, బీఆర్ఎస్ 15, బీజేపీ 3 కలిసినా మ్యాజిక్ ఫిగర్ రాదు. 14 మంది కాంగ్రెస్ నుంచి గెలిచారు. వీరికి ఇద్దరు ఎంఐఎం, ముగ్గురు ఇండిపెండెంట్లు మద్దతివ్వనుండడంతో పాటు ఎంపీ సురేశ్ షెట్కార్ ఎక్స్ అఫీషియో సభ్యుడిగా రానుండడంతో ఈ మున్సిపాలిటీ కాంగ్రెస్ పరమయ్యే అవకాశాలున్నాయి. ⇒ గద్వాల: ఈ మున్సిపాలిటీలో మ్యాజిక్ ఫిగర్ 19. కాంగ్రెస్కు 16, బీఆర్ఎస్ 11, బీజేపీ నుంచి 7గురు, ఎంఐఎం నుంచి ఒక్కరు, ఇద్దరు స్వతంత్రులు గెలిచారు. ఎంఐఎం, స్వతంత్రుల మద్దతుతో కాంగ్రెస్ పార్టీ బలం 19కి చేరుతోంది. అయితే, ఇక్కడ బీజేపీ, బీఆర్ఎస్లు అవగాహన కుదర్చుకున్నారు. రెండు పార్టీల బలం 18కి చేరుతోంది. కాంగ్రెస్ శిబిరంలో ఉన్న ఇద్దరు స్వతంత్రులను తమ వైపునకు తిప్పుకునేందుకు ఏకంగా చైర్మన్ పదవిని ఆఫర్ చేస్తున్నాయి. పరిస్థితి ఎలా ఉంటుందో అనే ఆలోచనతో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి, ఎంపీ మల్లురవిలు ఎక్స్ అఫీషియో ఓట్లు నమోదు చేసుకున్నారు. మరో ట్విస్ట్ ఏమిటంటే... ఇక్కడ బీఆర్ఎస్ నుంచి గెలిచిన 11 మందిలో పలువురు సరిత వర్గీయులే. దీంతో గద్వాల రాజకీయం ఆసక్తికరంగా మారింది. ⇒ నారాయణపేట: ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ 13. కాంగ్రెస్ 7, ఎంఐఎం రెండు కలిపితే 9 మంది అవుతున్నారు. బీజేపీకి 11తోపాటు ఎంపీ అరుణ ఎక్స్ అఫీషియో ఓటు, స్వతంత్రుడితో ఆ పార్టీ బలం 13కి చేరింది. కానీ, ఇక్కడ బీఆర్ఎస్ (2), ఏఐఎఫ్బీ (1)తో పాటు ఎమ్మెల్యే పరి్ణకారెడ్డి ఎక్స్ అఫీషియో ఓటు కాంగ్రెస్కు వస్తే ఆ పార్టీ బలం కూడా 13కు చేరనుంది. కానీ, గద్వాలతో ముడిపెట్టిన బీజేపీ.. బీఆర్ఎస్ను కాంగ్రెస్ వైపునకు వెళ్లకుండా కట్టడి చేస్తోంది. కాంగ్రెస్ తనవంతు ప్రయత్నాలను విరమించలేదు. అనూహ్యం జరగకపోతే ఈ మున్సిపాలిటీ బీజేపీ పరమయ్యే అవకాశాలే ఎక్కువ. ⇒ అమరచింత: ఈ మున్సిపాలిటీలో మ్యాజిక్ ఫిగర్ ఆరు కాగా, మూడు ప్రధాన పార్టీలు మూడు చొప్పున గెలుపొందాయి. ఒకరు సీపీఎం నుంచి గెలిచారు. సీపీఎం కాంగ్రెస్కు మద్దతివ్వడంతో ఆ పార్టీ బలం నాలుగుకు చేరింది. కానీ, ఇక్కడ బీఆర్ఎస్, బీజేపీలు కలిసి పీఠం పంచుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. తొలుత ఎవరు చైర్మన్ కావాలన్న పీఠముడి వీడితే అమరచింత బీజేపీ, బీఆర్ఎస్ కూటమిదే. ⇒ జమ్మికుంట: ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ 16 కాగా, బీఆర్ఎస్ 12 స్థానాలు గెలిచింది. ముగ్గురు స్వతంత్రులు, ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఓటుతో ఆ చైర్మన్ పీఠాన్ని దక్కించుకోవాలని బీఆర్ఎస్ ప్రయతి్నంచింది. కానీ, 10 మంది కౌన్సిలర్లు గెలిచిన కాంగ్రెస్ పక్షానికి బీఆర్ఎస్ కౌన్సిలర్ ఒకరు చేరడంతో బీఆర్ఎస్ బలం తగ్గింది. ఆ కౌన్సిలర్తోపాటు ముగ్గురు ఇండిపెండెంట్లు, ఒక ఏఐఎఫ్బీ సభ్యుడి మద్దతుతో కాంగ్రెస్ బలం 15కు చేరనుంది. మ్యాజిక్ ఫిగర్కు రెండు పక్షాలకు ఒక ఓటు తగ్గుతుండడంతో ఏం జరుగుతుందోననే ఆసక్తి నెలకొంది. ⇒ ఇస్నాపూర్: ఈ మున్సిపాలిటీలో మ్యాజిక్ ఫిగర్ 14 కాగా, బీఆర్ఎస్ నుంచి గెలిచిన 12 మంది, ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి (ఎక్స్ అఫీషియో), ఒక ఇండిపెండెంట్తో కలిసి మ్యాజిక్ ఫిగర్ వస్తోంది. కానీ, ఇక్కడ ముగ్గురు ఇండిపెండెంట్లు కాంగ్రెస్కు మద్దతిస్తున్నారు. 10 మంది కాంగ్రెస్ కౌన్సిలర్లు ఉన్నారు. ఇక్కడ బీజేపీకి ఒక్క కౌన్సిలర్ లేకపోయినా ఎంపీ రఘనందన్రావు ఎక్స్ అఫీషియో ఓటు నమోదు చేసుకున్నారు. ఆయన ఏం చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ⇒ మెదక్, నర్సాపూర్ : హంగ్ ఏర్పడిన ఈ రెండు మున్సిపాలిటీల్లో మ్యాజిక్ ఫిగర్ కోసం బీజేపీ, కాంగ్రెస్ కౌన్సిలర్లు అవగాహన కుదుర్చుకుంటున్నారు. మెదక్లో కాంగ్రెస్, నర్సాపూర్లో బీజేపీకి చైర్మన్ పదవులు ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. ⇒ రాయికల్: ఈ మున్సిపాలిటీలో మ్యాజిక్ ఫిగర్ 7 కాగా, బీఆర్ఎస్, బీజేపీల నుంచి గెలిచిన ఆరుగురికి తోడు స్వతంత్ర అభ్యర్థి జట్టుకట్టి ఈ మున్సిపాలిటీని దక్కించుకునేలా అవగాహన కుదిరింది. ⇒ దేవరకద్ర: ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ ఏడు కాగా, కాంగ్రెస్ నుంచి ఆరుగురు కౌన్సిలర్లు గెలిచారు. అదే పార్టీ రెబెల్ ఒకరు పార్టీలోకి వచ్చారు. బీఆర్ఎస్ నుంచి మరొకరు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. దీంతో ఎమ్మెల్యే ఎక్స్ అఫీషియో ఓటు అవసరం లేకుండా ఈ మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెండా ఎగరనుంది. ⇒ ఇంద్రేశం: ఈ మున్సిపాలిటీలో మేజిక్ ఫిగర్ 10 కాగా, ఎన్నికల్లో గెలిచిన 9 మందితోపాటు స్వతంత్ర కౌన్సిలర్ కూడా ఒకరు మద్దతివ్వనుండడంతో అక్కడ గులాబీ జెండా ఎగరనుంది. ⇒ కోహిర్: ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ 9 కాగా, గెలిచిన 8 మంది కౌన్సిలర్లతోపాటు మరో ఇండిపెండెంట్, ఒక ఎంఐఎం కౌన్సిలర్తో కలిసి కాంగ్రెస్ పార్టీ ఈ మున్సిపాలిటీని దక్కించుకోనుంది. ⇒ జిన్నారం: ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ 11 కాగా, బీఆర్ఎస్ (8), బీజేపీ (4) మధ్య బేరసారాలు జరుగుతున్నాయి. బీజేపీకి వైస్ చైర్మన్ ఇచ్చేందుకు ఒప్పందం కుదిరినట్టు తెలుస్తోంది. ⇒ మెట్పల్లి: ఇక్కడ బీఆర్ఎస్, కాంగ్రెస్లు కలిసి బీజేపీకి చెక్ పెడుతున్నాయి. ఇక్కడ మ్యాజిక్ ఫిగర్కు అవసరమైన 14కుగాను బీఆర్ఎస్(6), కాంగ్రెస్ (6)తో పాటు నలుగురు స్వతంత్రులు కలిసి పాలకమండలి ఏర్పాటు చేసేలా ఒప్పందం కుదిరింది. దీంతో 10 చోట్ల గెలిచిన బీజేపీ ప్రేక్షక పాత్ర వహించాల్సి వస్తోంది. ⇒ జగిత్యాల: మ్యాజిక్ ఫిగర్కు అవసరమైన 26 స్థానాలకు గాను కాంగ్రెస్ పార్టీ 23 గెలిచింది. ఇక్కడ స్వతంత్రులుగా పోటీ చేసిన కాంగ్రెస్ రెబెల్స్ 15 మంది గెలుపొందారు. వీరికి నాయకత్వం వహిస్తున్న కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్రెడ్డితో ఆ పార్టీ అగ్రనాయకత్వం చర్చలు ఫలించడంతో జగిత్యాల పీఠంపై కాంగ్రెస్ జెండా ఎగరనుంది. ⇒ వేములవాడ: ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ 15. 13 మంది కాంగ్రెస్ కౌన్సిలర్లకుతోడు స్వతంత్రులు, ఒక బీఆర్ఎస్ కౌన్సిలర్ కూడా తోడయ్యారు. దీంతో ఈ మున్సిపాలిటీ కాంగ్రెస్ వశం కానుంది.ఆమనగల్లులో ఏమవుతుందో?బీఆర్ఎస్కు చెక్పెట్టే యోచనలో కాంగ్రెస్, బీజేపీఎక్స్ అఫీషియో ఓట్లతో చైర్మన్ పీఠం కైవసం చేసుకునేందుకు పావులుఆమనగల్లు: రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు మున్సిపాలిటీలో 15 వార్డులు ఉండగా, వీటిలో అధికార కాంగ్రెస్ కేవలం ఒక్క వార్డు మాత్రమే గెలుచుకుంది. ఆరు వార్డుల్లో బీజేపీ గెలుపొందగా, బీఆర్ఎస్ 8 వార్డులు గెలుచుకుంది. క్షేత్రస్థాయి రాజకీయ పరిస్థితుల దృష్ట్యా శత్రువుకు శత్రువు మిత్రుడు అన్నట్టు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ... రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్కు మద్దతు పలికినట్టు విశ్వసనీయంగా తెలిసింది. చైర్మన్ పదవిని కాంగ్రెస్కు అప్పగించి, వైస్ చైర్మన్ పదవితో సర్దుకునే ప్రయత్నం బీజేపీ చేస్తోంది. ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, నాగర్కర్నూలు ఎంపీ మల్లురవి ఎక్స్ అఫీషియో ఓట్లతో ఈ పీఠాన్ని ఆ రెండు పార్టీలు కైవసం చేసుకోనున్నట్టు చర్చ జరుగుతోంది. -
కరీంనగర్ మేయర్పై వీడిన సస్పెన్స్?.. చక్రం తిప్పిన నేతలు
సాక్షి, కరీంనగర్: నగరపాలక సంస్థ మేయర్ ఎన్నికలో సంచలనం జరగుబోతుందా అంటే దాదాపు అవుననే సమాధానాలు వస్తున్నాయి. కరీంనగర్ మేయర్ స్థానం చేజిక్కించుకోవడం కోసం సీఎం రేవంత్, మంత్రి శ్రీధర్ బాబు చక్రం తిప్పినట్లు తెలుస్తోంది. దీనికోసం తమ ప్రధాన ప్రత్యర్థైన బీఆర్ఎస్ కార్పోరేటర్ల మద్ధతు మంత్రి కోరుతున్నట్లు సమాచారం. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ తో సహా పలువురు ఇండిపెండెంట్ల తో కలిసి మేయర్ పీఠం చేజిక్కించుకునేందుకు కాంగ్రెస్ ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో మెుత్తం 66 డివిజన్లు ఉన్నాయి. ముగ్గురు కోఆఫ్షన్ మెంబర్స్తో కలిసి మెుత్తం ఆసంఖ్య 69 స్థానాలకు చేరుకుంది. అయితే మేయర్ పీఠానికి మ్యాజిక్ ఫిగర్ 35 స్థానాలు. ఇందులో బీజేపీ 30 స్థానాలు గెలువగా, కాంగ్రెస్ 14 సీట్లు సాధించింది. దీంతో బీఆర్ఎస్, ఎంఐఎం, స్వతంత్రులతో కలిసి కాంగ్రెస్ మ్యాజిక్ ఫిగర్ అందుకునేలా ప్లాన్ వేసింది. దీనికి గానూ ఒక్కో కార్పోరేటర్ సీటుకు రూ.1.5 కోట్ల నుంచి రూ. 3కోట్ల వరకూ బేరసారాలు జరిగినట్లు తెలుస్తోంది. అదే విధంగా మేయర్ పదవికోసం కాంగ్రెస్ నుంచి నలుగురు అభ్యర్థులు ఆశావాహులుగా ఉండగా మరో ఇండిపెండెంట్ అభ్యర్థిగా మేయర్ పీఠం ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్కు డిప్యూటీ మేయర్ ఆఫర్ చేసినట్లు సమాచారం. అయితే మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక రేపు ఫిబ్రవరి 16న జరగనుంది. దీంతో మేయర్ ఎంపికపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.ఇదీ చదవండి:ప్రజా తీర్పును కాలరాస్తే.. వారిని తిరగనివ్వను’ -
బీఆర్ఎస్ నేతలను కిడ్నాప్ చేస్తున్నారు: కేటీఆర్
సాక్షి హైదరాబాద్: ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో హంగ్ వచ్చిన ప్రతిచోటా కాంగ్రెస్ అరాచకాలు సృష్టిస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కొన్ని చోట్ల బీఆర్ఎస్ కౌన్సిలర్లను బెదిరిస్తున్నారని, కిడ్నాప్ చేస్తున్నారని ఆరోపించారు. హైదరాబాద్లో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం కాంగ్రెస్. సీపీఐ అలయెన్స్లో ఉన్నాయని సింగరేణిలో కొన్నిచోట్ల బీజేపీ, సీపీఐ సైతం కలిసి పనిచేస్తున్నాయని కేటీఆర్ తెలిపారు. సింగరేణిలో జరుగుతున్న దోపిడిని అరికట్టడానికే కొన్నిచోట్ల సీపీఐకి మద్ధతిచ్చామన్నారు. సింగరేణిలో జరుగుతున్న అవినీతిపై ఎట్టిపరిస్థితుల్లో బీఆర్ఎస్ పోరాటం చేస్తుందన్నారు. -
మూడు ముక్కలాట!
సాక్షి, హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్ల విలక్షణ తీర్పు రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలను సంకటంలో పడేసింది. 36 మున్సిపాలిటీల్లో హంగ్ ఫలితాలు రావడంతో పాలకమండళ్లను ఏర్పాటు చేసే అంశం ఆయా పార్టీల మధ్య మూడు ముక్కలాటగా మారింది. పరస్పరం కత్తులు దూసుకొనే కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్లు సహకరించుకుంటేనే కనీసం 15 మున్సిపాలిటీల్లో పాలకమండళ్లు కొలువుతీరే పరిస్థితి నెలకొనడం పార్టీలకు అగ్నిపరీక్షగా మారింది.ఒకవేళ ప్రధాన రాజకీయ పక్షాలు సహకరించుకోకుంటే ‘గోడ దూకుళ్లు’ మాత్రమే ఆయా మున్సిపాలిటీల్లో పీటముడి వీడేందుకు ఏకైక ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్నాయి. మరో 12 మున్సిపాలిటీల్లో స్వతంత్రుల సాయంతో, ఇంకో 5 మున్సిపాలిటీల్లో స్వతంత్రులతోపాటు ఎంఐఎం, ‘లెఫ్ట్’పార్టీల సాయంతో పాగా వేసేందుకు అధికార పార్టీకి అవకాశం ఉండటంతో ఆ దిశగా కాంగ్రెస్ పావులు కదుపుతోంది. ముడిపడిన మున్సిపాలిటీలివే.. హంగ్ ఫలితాలు వచి్చన మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పాగా వేయాలంటే 15 మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ మద్దతు తప్పనిసరి కానుంది. ఈ జాబితాలో మెట్పల్లి, రాయికల్, అలంపూర్, కామారెడ్డి, జమ్మికుంట, కాగజ్నగర్, మెదక్, నర్సాపూర్, ఎల్లంపేట, ఖానాపూర్, ఇంద్రేశం, జిన్నారం, అమరచింత, వర్ధన్నపేట, కేతనపల్లి ఉన్నాయి. కేతనపల్లిలో ఇరు పార్టీలు చైర్మన్, వైస్చైర్మన్ల పంపకాలపై అవగాహనకు వచ్చేందుకు అవకాశాలు ఉండగా మెట్పల్లి, రాయికల్, కామారెడ్డి, జమ్మికుంట, కాగజ్నగర్, మెదక్, నర్సాపేర్, ఎల్లంపేట, నారాయణపేట, ఖానాపూర్, ఇంద్రేశం, జిన్నారం, అమరచింత మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్తో బీజేపీ కలిస్తే సులువుగా చైర్మన్, వైస్ చైర్మన్ పదవులు చేజిక్కించుకొనే అవకాశం ఉంది. మెట్పల్లి, రాయికల్, కామారెడ్డి, నారాయణపేట, ఆదిలాబాద్లలో బీజేపీకి ఎక్కువ స్థానాలు రాగా మిగిలిన చోట్ల బీజేపీ కంటే బీఆర్ఎస్కు ఎక్కువ కౌన్సిలర్ స్థానాలు వచ్చాయి. కానీ రాజకీయంగా ఏ రెండు పార్టీలు కలిసినా మూడో పార్టీకి లబ్ధి కలుగుతుందనే అంచనాతో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ వెనుకంజ వేస్తున్నాయి. గైర్హాజరు... గోడ దూకుళ్లు ప్రధాన పార్టీలు మూడు దిక్కులుగా ఉన్న పరిస్థితుల్లో మిగిలిన ప్రత్యామ్నాయాలపైనా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అధికారికంగా అవగాహన కుదుర్చుకోకపోయినా స్థానిక నేతల మధ్య జరిగే చర్చలను బట్టి ఒక పార్టీ గెలుపు కోసం మరో పార్టీ గైర్హాజరైతే ఎలా ఉంటుందనే కోణంలోనూ చర్చలు జరుగుతాయని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.అయితే అలా గైర్హాజరు కావడం ద్వారా మేజిక్ ఫిగర్లో మార్పులు వస్తే ఇబ్బందులు వస్తాయని.. నేరుగా మద్దతివ్వడమే పరిష్కారమని అంటున్నాయి. ఈ రెండు మార్గాలు కుదరని పక్షంలో మరో పార్టీకి చెందిన కౌన్సిలర్లను లాక్కోవడమే మార్గంగా కనిపిస్తోంది. ఒకవేళ అలా జరిగితే అధికార పార్టీకే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇప్పటికే పలు చోట్ల స్వతంత్రులు కాంగ్రెస్లో చేరడమో లేదా మద్దతు ప్రకటించడమో జరిగిపోయింది. అయితే ఇందుకోసం రూ. లక్షల నుంచి రూ. కోట్ల వరకు బేరసారాలు జరుగుతున్నట్లు సమాచారం. స్వతంత్రుల సాయం తీసుకుంటే.. రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా కేవలం స్వతంత్రుల మద్దతుతో కాంగ్రెస్ 12 మున్సిపాలిటీలను గెలిచే అవకాశం ఉందని ఫలితాలు చెబుతున్నాయి. జనగామ, ఆసిఫాబాద్, బెల్లంపల్లి, మొయినాబాద్, ఇస్నాపూర్, కోహిర్, పరిగి, పోచంపల్లి, జగిత్యాల, వేములవాడ, దేవరకద్ర, వికారాబాద్ మున్సిపాలిటీల్లో స్వతంత్రులుగా గెలిచిన వారు కాంగ్రెస్ వైపు వస్తే ఆ స్థానాలు అధికార పార్టీ వశం అవుతాయి. ఆ దిశగా ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. మరోవైపు ఒక్క ఎక్స్ అఫీషియో ఓటుతో కేసముద్రం మున్సిపాలిటీని కూడా గెలుచుకోవచ్చు. దీంతో అధికార పార్టీ ఖాతాలో ఈ 13 మున్సిపాలిటీలు చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. వాటితోపాటు గద్వాల, మహబూబాబాద్, నారాయణపేట, జహీరాబాద్, బోధన్లలో స్వతంత్రులతోపాటు లెఫ్ట్, ఎంఐఎంలు సహకరిస్తే ఆయా పీఠాలు కూడా అధికార పార్టీకి లభిస్తాయి. ఇక ఆలియాబాద్లో మ్యాజిక్ ఫిగర్కు మూడు స్థానాలు తక్కువ పడగా ఒక స్వతంత్ర, ఒక బీఎస్పీ కౌన్సిలర్ను కాంగ్రెస్ తన వైపునకు తిప్పుకుంది. ఈ నేపథ్యంలో మరొకరు అవసరం కాగా బీజేపీకి చెందిన ఓ కౌన్సిలర్కు వైస్చైర్మన్ పదవిని ఆఫర్ చేస్తున్నట్లు సమాచారం. ఈ మున్సిపాలిటీ కూడా కాంగ్రెస్ ఖాతాలోనే చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కూడా ఇక్కడ పాగా వేసేందుకు ప్రయత్నాలు చేస్తుండటం గమనార్హం. సీఎం వద్దకు వడ్డేపల్లి కౌన్సిలర్లు వడ్డేపల్లి మున్సిపాలిటీలో సంచలన విజయం సాధించిన ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ (ఏఐఎఫ్బీ)కు చెందిన 8 మంది కౌన్సిలర్లు శనివారం సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని కలిసి కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించారు. దీంతో వడ్డేపల్లి మున్సిపాలిటీ అధికార కాంగ్రెస్ పార్టీ ఖాతాలో చేరినట్టయింది. స్థానిక నేత వడ్డేపల్లి శ్రీనివాస్ నేతృత్వంలో సీఎంను కలిసిన వారిలో కౌన్సిలర్లు కుర్వ పావని, శారద, మంజుల, యుగేందర్రెడ్డి, దేవమ్మ, విజయభాస్కర్, జయశ్రీ, ఎరుకల తిమ్మప్ప ఉన్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ చీఫ్ మహేశ్కుమార్గౌడ్, మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ మల్లు రవి, రాష్ట్ర ప్రణాళికా కమిషన్ వైస్ చైర్మన్ జి. చిన్నారెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి ఎస్. సంపత్కుమార్ పాల్గొన్నారు. -
‘ప్రజా తీర్పును కాలరాస్తే.. వారిని తిరగనివ్వను’
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మేయర్ ఎన్నికల వ్యవహారం మరింత హీట్ పుట్టిస్తున్న సమయంలో బీజేపీ ఎంపీ, కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మూడు ప్రధాన పార్టీలు కుట్రలు చేసి కరీంనగర్లో బీజేపీకి మేయర్ పదవి రాకుండా కుట్రలు చేస్తున్నాయని ధ్వజమెత్తారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుంచి మీడియాతో మాట్లాడిన బండి సంజయ్.. ప్రజా తీర్పును కాలరాసి ఏమైనా కుట్రలు చేస్తే ఆ తర్వాత పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్, బీఆర్ఎస్లను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. కుట్రలు చేస్తే కరీంనగర్ నుంచి యుద్ధం. కాంగ్రెస్, బీఆర్ఎస్ చిల్లర రాజకీయాలు చేస్తున్నాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్ కరీంనగర్ మేయర్ ఎలా దక్కించుకుంటాయి?, బీజేపీకి మేయర్ పదవి రాకుండా మూడు పార్టీలు కుట్రలకు పాల్పడుతున్నాయి. కరీంనగర్ వేదికగా మూడు పార్టీల బండారం బయటపడుతోంది. బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు, ప్రజాతీర్పును కాలరాస్తే.. కాంగ్రెస్, బీఆర్ఎస్లను తిరగనివ్వను’ అని తీవ్రంగా హెచ్చరించారు.కాగా, కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మొత్తం 66 డివిజన్లకు గాను బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. BJP 30 డివిజన్లలో గెలిచి అతిపెద్ద పార్టీగా నిలిచింది. కానీ స్పష్టమైన మెజారిటీ ఏ పార్టీకి రాలేదు. కాంగ్రెస్ 14, బీఆర్ఎస్ 9, ఎంఐఎం 3 డివిజన్ల చొప్పున గెలిచాయి. ఇండిపెండెంట్లు 8 సీట్లు గెలవగా, ఫార్వర్డ్ బ్లాక్ రెండు డివిజన్లలో గెలిచింది. బీజేపీ అతిపెద్ద పార్టీగా ఉన్నందున, ఇండిపెండెంట్లు మరియు చిన్న పార్టీల మద్దతుతో మేయర్ పీఠాన్ని దక్కించుకునే అవకాశం ఎక్కువగా ఉంది. -
కాంగ్రెస్పై వ్యతిరేకతకు స్పష్టమైన సంకేతం
సాక్షి, హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతకు స్పష్టమైన సంకేతమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారక రామారావు వ్యాఖ్యానించారు. అధికార పార్టీ ‘సామ, భేద, దాన, దండోపాయాలు‘అన్నీ ప్రయోగించినా ప్రజల మనసు గెలవలేకపోయిందన్నారు. డబ్బు, మద్యం, అధికార యంత్రాంగ దురి్వనియోగం పరాకాష్టకు చేరినా ఓటర్లు భయపడలేదని స్పష్టం చేశారు. శుక్రవారం మున్సిపల్ ఫలితాల నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇది కాంగ్రెస్కు హెచ్చరిక ‘123 చోట్ల ఎన్నికలు జరిగితే 15 స్థానాల్లో ప్రత్యక్షంగా గెలిచాం. 30 చోట్ల హంగ్ పరిస్థితి నెలకొన్నది. మరో 10–15 చోట్ల బీఆర్ఎస్ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉంది. ఓవరాల్గా చూసుకుంటే 117 స్థానాల్లో బలమైన ఫలితాలు సాధించాం. అధికారంలో లేని పార్టీగా ఇదే ప్రజాభిప్రాయం. స్థానిక సంస్థల ఎన్నికలు సాధారణంగా అధికార పార్టీకి వన్సైడ్ అవుతాయి. మంచి పరిపాలన ఉంటే 80–90 శాతం స్థానాలు గెలుస్తారు. కానీ ఇక్కడ పరిస్థితి ఉల్టా ఉంది. ఇది కాంగ్రెస్కు హెచ్చరిక. మొన్న పంచాయతీ ఎన్నికల్లో రెండేళ్లు కూడా నిండకముందే కాంగ్రెస్కు ప్రజలు బుద్ధి చెప్పారు. 4 వేల పైచిలుకు గ్రామాల్లో బీఆర్ఎస్ సర్పంచ్లు గెలిచారు. ఇప్పుడు పట్టణాల్లో కూడా బీఆర్ఎస్నే ప్రధాన ప్రత్యామ్నాయంగా నిలబెట్టారు. తెలంగాణలో కాంగ్రెస్ను గద్దె దించే శక్తి బీఆర్ఎస్కే ఉందని ఈ ఫలితాలు తేల్చాయి. హంగ్ వచ్చిన చోట్ల ఏ వైఖరి అవలంబించాలనే విషయంలో పార్టీ అధ్యక్షుడు కేసీఆర్తో చర్చించి, స్థానిక నాయకత్వ అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకుని నిర్ణయం తీసుకుంటాం..’అని కేటీఆర్ చెప్పారు. కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కు ‘రాష్ట్రంలో కాంగ్రెస్, కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నా ఇద్దరూ కలిసి రాజకీయాలు చేస్తున్నారు. వారిని అడ్డుకునేందుకు అవసరమైతే లౌకిక శక్తులతో కలిసి పనిచేస్తాం. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాతో కలిసి చెన్నూరు, క్యాతనపల్లి ప్రాంతాల్లో పోటీ చేసి విజయాన్ని సాధించాం. చాలామంది వచ్చారు..పోయారు నేనే రాజు, నేనే మంత్రి అనుకునే వారు చాలామంది వచ్చారు, పోయారు. ప్రజల చైతన్యాన్ని తక్కువ అంచనా వేస్తే గాలి తీసుకుపోతుంది. ఇందిరాగాం«దీ, ఎన్టీ రామారావులనూ ఓడించిన దేశమిది. మీ ప్రభుత్వంపై అంత నమ్మకం ఉంటే పార్టీ మారిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు రండి. ప్రజల తీర్పే అసలు ఇండికేటర్..’అని కేటీఆర్ సవాల్ చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో పార్టీకి అండగా నిలిచిన నాయకులు, కార్యకర్తలు, ఓటర్లందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ప్రజా సమస్యలపై భవిష్యత్తులో పోరాటం మరింత తీవ్రం చేస్తామని అన్నారు. సింగరేణి కంపెనీలో రూ.6 వేల కోట్ల కుంభకోణం జరిగిందని, దానిపై మేము పోరాడుతున్నామని చెప్పారు. -
పురంలో పైచేయి
సాక్షి, హైదరాబాద్: పురపాలక ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ సత్తా చాటింది. రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు జరిగిన ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో గెలుపొందింది. మొత్తం 66 మున్సిపాలిటీలు, రామగుండం, నల్లగొండ, మంచిర్యాల కార్పొరేషన్లలో విజయకేతనం ఎగురవేసింది. మరో ఐదారు మున్సిపాలిటీలు, మరో కార్పొరేషన్ను కూడా దక్కించుకునే దిశగా పావులు కదుపుతోంది. ఇక ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ రెండో స్థానంలో నిలిచింది.ఆ పార్టీకి రాష్ట్రవ్యాప్తంగా 13 పురపాలికల్లో విజయం సాధించింది. బీజేపీ, ఎంఐఎం విషయానికి వస్తే ఏ ఒక్క మున్సిపాలిటీలోనూ పూర్తి స్థాయిలో విజయం సాధించలేకపోయాయి. అయితే కరీంనగర్ కార్పొరేషన్లో మంచి ఫలితాలు సాధించిన కమలం పార్టీ.. పీఠాన్ని సొంతంగా కైవసం చేసుకోవడంలో వెనుకబడింది.ఇక దాదాపు 36 మున్సిపాలిటీలతో పాటు మహబూబ్నగర్, కరీంనగర్, నిజామాబాద్, కొత్తగూడెం కార్పొరేషన్లలో హంగ్ ఏర్పడింది. ఎంఐఎం, సీపీఐ, సీపీఎం అభ్యర్థులతో పాటు స్వతంత్రులు పలు వార్డు స్థానాల్లో విజయం సాధించారు. కొత్తగూడెం కార్పొరేషన్లో కాంగ్రెస్తో తలపడిన సీపీఐ ఆ పార్టీకి దీటుగా విజయాలను సాధించినా మ్యాజిక్ ఫిగర్ను మాత్రం దక్కించుకోలేకపోయింది. ఇక అనూహ్యంగా గద్వాల జిల్లా వడ్డేపల్లి మున్సిపాలిటీలో ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ (ఏఐఎఫ్బీ) బలపర్చిన తెలంగాణ జాగృతి అభ్యర్థులు ఎక్కువ చోట్ల గెలుపొందడం గమనార్హం. 51 శాతం స్థానాల్లో స్పష్టమైన మెజారిటీ మున్సిపాలిలు, కార్పొరేషన్ల పరిధిలోని వార్డులు, డివిజన్ల వారీగా చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా సగం కంటే ఎక్కువ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగానే విజయం సాధించింది. మొత్తం 2,996కు గాను 2,995 వార్డులు, డివిజన్లకు జరిగిన ఎన్నికల్లో (మక్తల్లో అభ్యర్థి చనిపోవడంతో అక్కడ ఎన్నిక నిర్వహించలేదు) ఆ పార్టీకి 1,538 స్థానాలు లభించాయి. అంటే దాదాపు 51 శాతం వార్డులు, డివిజన్లలో అధికార పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. గతంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో (2020) కేవలం 580 వార్డులు, డివిజన్లను మాత్రమే గెలుచుకున్న కాంగ్రెస్.. గతం కంటే ఏకంగా 900కు పైగా స్థానాలను అదనంగా దక్కించుకుంది.బీఆర్ఎస్ విషయానికి వస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఆ పార్టీ 781 డివిజన్లు, వార్డుల్లో విజయం సాధించింది. అంటే మొత్తం వార్డులు, డివిజన్లలో ప్రధాన ప్రతిపక్ష పార్టీకి 26 శాతం స్థానాలు లభించాయి. గత మున్సిపల్ ఎన్నికల్లో 1,767 స్థానాల్లో గెలుపొందిన గులాబీ పార్టీ ఈ ఎన్నికల్లో దాదాపు 1,000 స్థానాలను కోల్పోవడం గమనార్హం. అయితే రెండు సందర్భాల్లోనూ అధికార పార్టీలే మెరుగైన ఫలితాలు సాధించడం కూడా గమనించ వలసిన విషయం. ఇక బీజేపీకి గత ఎన్నికల్లో 311 చోట్ల విజయం సాధించగా, ఈసారి ఆ పార్టీకి 3335 స్థానాలు దక్కాయి. అంటే మొత్తం వార్డులు, డివిజన్లలో 11.3 శాతం గెలుపొందింది. మరోవైపు సీపీఐ, సీపీఎం, ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థులు, స్వతంత్రులు కలిపి 331 (11.3 శాతం) చోట్ల విజయం సాధించారు. అయితే గత ఎన్నికలతో పోలిస్తే సీపీఎం, ఎంఐఎం స్థానాలు గణనీయంగా తగ్గిపోవడం గమనార్హం. రెండుచోట్ల మినహా కాంగ్రెస్ జోరు ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం, మహబూబ్నగర్, కరీంనగర్ జిల్లాల్లో కాంగ్రెస్ మంచి ఫలితాలను సాధించింది. ఉమ్మడి ఖమ్మంలోని అన్ని మున్సిపాలిటీలనూ స్వీప్ చేయగా, నల్లగొండలో కేవలం ఒక్క మున్సిపాలిటీ మినహా 16 చోట్ల విజయ కేతనం ఎగురవేసింది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలోని మూడు మున్సిపాలిటీలతో పాటు ఉమ్మడి పాలమూరు జిల్లాలోని మెజార్టీ స్థానాలు, కరీంనగర్ కార్పొరేషన్ మినహా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని మున్సిపాలిటీలు, రామగుండం కార్పొరేషన్న్ను దక్కించుకోగలిగింది.ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, నిజామాబాద్ జిల్లాల్లోనూ మెరుగైన ఫలితాలే సాధించినప్పటికీ ఉమ్మడి మెదక్లో కొంత డీలా పడింది. ఆ తర్వాత హైదరాబాద్ శివార్లలోని మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల మున్సిపాలిటీల్లోనూ కొంత వెనుకబడింది. ఇక్కడ గులాబీ పరిమళం ఉమ్మడి మెదక్, హైదరాబాద్ శివార్లలో బీఆర్ఎస్కు సానుకూల ఫలితాలు రావడం గమనార్హం. అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ ఆ పార్టీకి ఈ రెండు చోట్లనే ఎక్కువ స్థానాలు రాగా, 26 నెలల తర్వాత జరిగిన ఎన్నికల్లోనూ కొంచెం అటూ ఇటుగా అవే ఫలితాలు వచ్చాయి. అయితే అప్పటి ఎన్నికల తరహాలోనే గ్రామీణ తెలంగాణ జిల్లాల్లోని పట్టణ ప్రాంతాల్లో బీఆర్ఎస్కు ఫలితాలు రావడం గమనార్హం. కరీంనగర్ కార్పొరేషన్తో పాటు నారాయణపేట, నిర్మల్, ఖానాపూర్, కాగజ్నగర్ తదితర మున్సిపాలిటీలు, నిజామాబాద్, మహబూబ్నగర్ కార్పొరేషన్లలో ఆ పార్టీకి చెప్పుకోదగిన స్థానాలు లభించాయి.కమలం పార్టీ విషయానికొస్తే ఈ ఎన్నికకల్లో నామమాత్రపు ప్రభావాన్ని మాత్రమే చూపగలిగింది. కొన్ని చోట్ల పార్టీ ఎమ్మెల్యేలున్నప్పటికీ ఓటమి చవి చూడాల్సి వచి్చంది. వార్డుల వారీగా వచి్చన సంఖ్యలో గతంతో పోల్చుకుంటే పెద్దగా మార్పు లేకపోవడం, పట్టణ ప్రాంతాల్లో పార్టీ బలపడుతుందనే సంకేతాలు కరీంనగర్, నిజామాబాద్ మినహా పురపాలికల్లో పెద్దగా కనిపించకపోవడం గమనార్హం. 40 చోట్ల హంగ్! గతంలో ఎన్నడూ లేని విధంగా 36 మున్సిపాలిటీలు, 4 కార్పొరేషన్లలో హంగ్ ఏర్పడింది. అంటే వీటిల్లో సొంతంగా ఎవరూ మేయర్, చైర్పర్సన్లను దక్కించుకునే అవకాశం లేదు. కొత్తగూడెం కార్పొరేషన్లో మ్యాజిక్ ఫిగర్కు 31 డివిజన్లు అవసరం కాగా, సీపీఐ, కాంగ్రెస్లకు చెరి 22 స్థానాలు మాత్రమే లభించాయి. ఇక నిజామాబాద్లో కూడా మ్యాజిక్ ఫిగర్కు అవసరమైన 31 స్థానాల కంటే మూడు స్థానాలు వెనుకబడిన బీజేపీ 28 స్థానాలు దక్కించుకుంది. ఇక్కడ ఎంఐఎం (13), కాంగ్రెస్ (18)లకు కలిపి మ్యాజిక్ ఫిగర్ లభించడం గమనార్హం. కార్పొరేషన్లలో ఇలా.. నల్లగొండ, మంచిర్యాల, రామగుండం, మహబూబ్నగర్, కొత్తగూడెం, నిజామాబాద్, కరీంనగర్ కార్పొరేషన్లకు ఎన్నికలు జరగ్గా 3 కార్పొరేషన్లలో కాంగ్రెస్ విజయం సాధించింది. నల్లగొండ, మంచిర్యాల, రామగుండం కార్పొరేషన్లలో మ్యాజిక్ ఫిగర్ సాధించిన ఆ పార్టీ అక్కడ మేయర్ పీఠం దక్కించుకోవడం ఖాయమైపోయింది. సీపీఐతో హోరాహోరీ తలపడిన కొత్తగూడెంలో మ్యాజిక్ ఫిగర్కు 9 స్థానాలు తక్కువైనా ఆరుగురు ఇండిపెండెంట్లు గెలవడం, ఎంపీ, రాజ్యసభ సభ్యులు కూడా ఉండడం, అవసరమైతే ఎమ్మెల్సీలను కూడా ఎక్స్అఫీషియోలుగా రంగంలోకి దించడం, ఏదీ కుదరకపోతే సీపీఐతో స్నేహపూర్వక ఒప్పందం చేసుకుని పదవులు, పదవీకాలం పంచుకోవడం లాంటి వ్యూహాలతో మేయర్ పీఠంపై కూర్చునేందుకు కాంగ్రెస్ పావులు కదుపుతోంది. కరీంనగర్లో బీజేపీకి మెజార్టీ రావడంతో అక్కడ ఆ పార్టీ అభ్యర్థే మేయర్ కానున్నారు. ఇక పీసీసీ అధ్యక్షుడి సొంత జిల్లా అయిన నిజామాబాద్లో ఎంఐఎం సహకారంతో మేయర్ కుర్చీ దక్కించుకునే దిశలో కాంగ్రెస్ పావులు కదుపుతోంది. క్యాంపులు షురూ..! ఏకంగా 40 మున్సిపాలిటీలు/కార్పొరేషన్లలో హంగ్ పరిస్థితులు ఏర్పడిన నేపథ్యంలో క్యాంపు రాజకీయాలకు తెరలేచింది. ఈనెల 16వ తేదీ వరకు గెలిచిన కౌన్సిలర్లు, కార్పొరేటర్లను కాపాడుకోవాల్సి ఉండడంతో దాదాపు అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో అన్ని పార్టీలు క్యాంపులు నిర్వహించేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. ఎక్స్అఫీషియో సభ్యుల నమోదుకు నేటి వరకు గడువు మున్సిపాలిటీల్లో ఎక్స్ అఫీషియో సభ్యులుగా పేర్లు నమోదు చేసుకోవడానికి ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, లోక్సభ సభ్యులు. రాజ్యసభ సభ్యులు శనివారం సాయంత్రం లోగా పేర్లు నమోదు చేసుకోవాల్సి ఉంది. అలా నమోదు చేసుకున్నవారికే.. ఈనెల 16వ తేదీన నిర్వహించే మేయర్, డిప్యూటీ మేయర్, చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నికల్లో ఓటు వేయడానికి అర్హత ఉంటుంది. కార్పొరేషన్లలో ఇలా.. నల్లగొండ, మంచిర్యాల, రామగుండం, మహబూబ్నగర్, కొత్తగూడెం, నిజామాబాద్, కరీంనగర్ కార్పొరేషన్లలో మూడు చోట్ల కాంగ్రెస్ గెలిచింది. నల్లగొండ, మంచిర్యాల, రామగుండంలో మేయర్ పీఠం దక్కించుకోవడం ఖాయమైంది. సీపీఐతో హోరాహోరీ తలపడిన కొత్తగూడెంలో మ్యాజిక్ ఫిగర్కు 9 స్థానాలు తక్కువైనా ఆరుగురు ఇండిపెండెంట్లు గెలవడం, ఎంపీ, రాజ్యసభ సభ్యులూ ఉండడం, అవసరమైతే ఎమ్మెల్సీలను కూడా ఎక్స్అఫీషియోలుగా రంగంలోకి దించడం, లేదంటే సీపీఐతో స్నేహపూర్వక ఒప్పందం చేసుకుని మేయర్ పీఠంపై కూర్చునేందుకు కాంగ్రెస్ పావులు కదుపుతోంది.కరీంనగర్లో బీజేపీకి మెజార్టీ రావడంతో అక్కడ ఆ పార్టీ అభ్యర్థే మేయర్ కానున్నారు. ఇక పీసీసీ అధ్యక్షుడి సొంత జిల్లా అయిన నిజామాబాద్లో ఎంఐఎం సహకారంతో మేయర్ కుర్చీ దక్కించుకునే దిశలో కాంగ్రెస్ పావులు కదుపుతోంది. మహబూబ్నగర్లో కాంగ్రెస్ మ్యాజిక్ ఫిగర్ 31కి ఒక్క స్థానం దూరంలో ఉంది.రాష్ట్రవ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో జరిగిన ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్ పార్టీకి అఖండ విజయాన్ని కట్టబెట్టిన ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ విజయం లక్షలాది కాంగ్రెస్ కార్యకర్తల శ్రమ ఫలితం. పార్టీపై వారికి ఉన్న అపారమైన అభిమానానికి ఇది నిదర్శనం. అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజలు ఈ తీర్పు ద్వారా సంపూర్ణ ఆమోదం తెలిపారు. - రేవంత్రెడ్డి, ముఖ్యమంత్రిమున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీ సామ, భేద, దాన, దండోపాయాలన్నీ ప్రయోగించినా ప్రజలమనసు గెలవలేకపోయింది. ఈ ఫలితాలు ప్రభుత్వంపై ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతకు స్పష్టమైన సంకేతం. రాష్ట్రంలో కాంగ్రెస్, కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నా ఇద్దరూ కలిసి రాజకీయాలు చేస్తున్నారు. వారిని అడ్డుకునేందుకు అవసరమైతే లౌకిక శక్తులతో కలిసిపనిచేస్తాం - కేటీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్మున్సిపల్ ఎన్నికల్లో మా పార్టీ గెలిచే అవకాశాలున్న చోట కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం కుట్ర పన్ని ఓడించాయి.ఈ మూడు పార్టీల మధ్య ఫెవిక్విక్ బంధం మరింత బలోపేతమైందని ఈ ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే తమ మనుగడకుప్రమాదమన్న అక్కసుతో మజ్లిస్, అర్బన్ నక్సలైట్లు, కమ్యూనిస్టులు వ్యూహాత్మకంగా ఓడించే ప్రయత్నం చేశారు. - రాంచందర్రావు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు -
మున్సిపల్ రిజల్ట్పై BRS క్రిశాంక్ కామెంట్స్
-
కలిసొచ్చే లౌకిక పార్టీలను కలుపుకుని పోతాం : కేటీఆర్
సాక్షి,తెలంగాణ భవన్: కొత్తగూడెం కార్పొరేషన్ హంగ్ నేపథ్యంలో బీఆర్ఎస్ ట్విస్ట్ ఇచ్చింది. సీపీఐకి బీఆర్ఎస్ బహిరంగ మద్దతు ప్రకటించింది. మున్సిపల్ ఎన్నికల ఫలితాలు విడుదల నేపథ్యంలో వర్కింగ్ ప్రెసిడెంట్,మాజీ మంత్రి కేటీఆర్ తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు.మున్సిపల్ ఎన్నికల్లో మంచి ఫలితాలు వచ్చాయి. మున్సిపాలిటీల్లో 2,500 స్థానాల్ని గెలుచుకోబోతున్నాం. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు విరోచిత పోరాటం చేశారు. కలిసొచ్చే లౌకిక పార్టీలను కలుపుకుని పోతాం.కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉంది. మున్సిపల్ ఎన్నికల ఫలితాలతో కాంగ్రెస్ నేతల నోళ్లు మూతపడ్డాయి. కొన్ని చోట్ల మా కౌన్సిలర్లను బలవంతంగా లాక్కెళ్లారు. ఎలాగైనా గెలవాలని కాంగ్రెస్ నేతలు కుట్రలు చేశారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్కు మంచి ఫలితాలొచ్చాయి. కాంగ్రెస్ ప్రభుత్వం మద్యం,డబ్బుతో ఓటర్లను ప్రలోభపెట్టింది.సింగరేణిలో జరుగుతున్న కుంభకోణణాన్ని బయటపెట్టాం. కొత్తగూడెం సింగరేణి బెల్ట్లో భాగం. కొత్తగూడెంలో సీపీఐకి మద్దతు ఇస్తాము. ఇదే విషయంపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావుతో మాట్లాడాం. కాంగ్రెస్,బీజేపీని అడ్డుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లౌకిక పార్టీలతో బీఆర్ఎస్ కలిసి పని చేస్తుంది. కాంగ్రెస్,బీజేపీ కుయుక్తులు పన్నుతున్నాయి.కాంగ్రెస్ను గద్దె దించే శక్తి ,బీజేపీ అడ్డుకునే శక్తి బిఆర్ఎస్ పార్టీకే ఉంది. మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ ఫలితాలు సంతృప్తినిచ్చాయి.హైదరాబాద్ కార్పోరేషన్ , ఎంపీటీసీ,జెడ్పీటీ ఎన్నికల్లో ఇదే ఉత్సాహం కనబరుస్తాం. ఈ దేశం చాల గొప్పది, ఇందిరా గాంధీ, ఎన్టీఆర్ లాంటి వారే ఓడిపోయారు. రెండేళ్లలో కాంగ్రెస్ పాలనలో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత కనిపిస్తుంది. ప్రధాన ప్రతిపక్షంగా బిఆర్ఎస్ సఫలం అవుతుంది. 2029లో కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం ఖాయం.అధికార పార్టీ చాలా రకాలుగా సామ దాన దండోపాయలు ప్రదర్శించినా..ప్రజల మనస్సులు గెలుచుకోలేదు. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పి 40శాతం సర్పంచులు గెలిపించారు. నోరు మూసుకునేలా పురపోరులో ఫలితాలు సాధించాం.750 వరకు వార్డుల్లో BRS గెలుస్తుంది. వీరోచిత పోరాటం చేశాం.అధికారులను అడ్డం పెట్టుకొని కొన్ని వార్డుల్లో గెలిచి ప్రయత్నం చేస్తున్నారు.15 మున్సిపాల్టీలను సింగిల్ గా కైవసం చేసుకున్నాం.. మరో 15 మున్సిపాలిటీల్లో కూడా ఇతరుల సాయంతో అవకాశం ఉంది. మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీ డబ్బులు, మద్యం, అక్రమాలు తారా స్తాయికి చేరాయి.రేపు రేపు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరు బిఆర్ఎస్ గెలుస్తుందని చెప్పాల్సి వస్తుంది. ప్రతి ఒక్కరు గులాబీ జెండా పట్టుకొని తిరగాల్సి వస్తుంది.కాంగ్రెస్,బీజేపీ కలిసి పని చేస్తున్నట్లు అందరు చూస్తున్నారు.సింగరేణిలో దోపిడీపై ప్రశ్నిస్తే కాంగ్రెస్,బీజేపీ నుంచి సమాధానం లేదు. కాంగ్రెస్,బీజేపీలను నిరోధించే శక్తి బీఆర్ఎస్కే ఉంది. మున్సిపల్ ఎన్నికల్లో మా నాయకులు,కార్యకర్తలు విరోచితంగా పోరాడారు. గద్వాలలో అధికారులను అడ్డం పెట్టుకుని గెలిచారు’అని కేటీఆర్ ధ్వజమెత్తారు. -
సిరిసిల్లలో కారు జోరు BRS లో ఫుల్ జోష్
-
కాంగ్రెస్ గెలిచినా.. తగ్గని BRS క్రేజ్
-
‘తెలంగాణకు బీఆర్ఎసే శ్రీరామరక్ష’
హైదరాబాద్: తెలంగాణ ప్రజలకు అన్నీ అర్థమవుతున్నాయని, అన్నీ గమనిస్తున్నారని, రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రానికి బీఆర్ఎస్ మాత్రమే శ్రీరామరక్ష అని అన్నారు. శేరిలింగపల్లి నియోజకవర్గం నుంచి విజయ్కుమార్రెడ్డి బీఆర్ఎస్లో చేరడాన్ని కేటీఆర్ స్వాగతించారు. దీనిలో భాగంగా మాట్లాడుతూ శేరిలింగంపల్లి ఎమ్మెల్యే పార్టీ మారినా, కార్యకర్తలు మాత్రం బీఆర్ఎస్లోనే ఉన్నారన్నారు. ఎమ్మెల్యే లేనప్పటికీ హైదరాబాద్ మొత్తంలో శేరిలింగంపల్లి నియోజకవర్గంలోనే బిఆర్ఎస్ బలంగా ఉందన్నారు కేటీఆర్.‘ఈ రాష్ట్రానికి కాంగ్రెస్, బిజెపి చేసింది ఏం లేదు. వెట్టి పనికైనా, మట్టి పనికైనా మనోడే ఉండాలి అని పెద్దలు చెప్తారు. అందుకే ఈ రాష్ట్రానికి శ్రీ రామ రక్ష బిఆర్ఎస్ మాత్రమే. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ప్రజలకు ఒకే ఒక విషయం చెప్పాను. ఓటు ఎవరికి వెయ్యాలి, ఎందుకు వెయ్యాలో ఆలోచన చెయ్యండని. గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్లో ఎగిరేది మాత్రం గులాబీ జెండానే. గ్రేటర్ హైదరాబాద్ లో కొందరు నాయకులు పార్టీ మారిన, కార్యకర్తలు మాత్రం బిఆర్ఎస్ లోనే ఉన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బిఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయం. హైదరాబాద్ లో లా అండ్ ఆర్డర్ లేదు. కేసీఆర్ హయంలో శాంతి భద్రతలు అద్భుతంగా ఉండేవి’ అని పేర్కొన్నారు. -
‘సీఎం రేవంత్కు మున్సిపల్ ఎన్నికల్లో ఓటమి భయం పట్టుకుంది’
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో ఓటమి భయంతో సీఎం రేవంత్రెడ్డి ఇంతటి దౌర్జన్యకాండకు దిగారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ముగిసిన తరుణంలో బీఆర్ఎస్ శ్రేణులకు కృతజ్ఞతలు తెలుపుతూ ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.ఆ ట్వీట్లో మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ ఎన్ని అరాచకాలు చేసినా వీరోచితంగా పోరాడిన గులాబీ సైనికులందరికీ పేరుపేరునా హృదయపూర్వక అభినందనలు. ఆదిలాబాద్ నుంచి ఆలంపూర్ వరకూ పురపాలక సమరంలో మీరు కనబరిచిన పోరాట స్ఫూర్తి బీఆర్ఎస్ కొండంత బలాన్నిచ్చింది, పార్టీలో ఆకాశమంత ఆత్మవిశ్వాసాన్ని నింపింది. రెండేళ్ల పాలనలో ఘోరమైన పరిపాలనా వైఫల్యాలను మూటగట్టుకున్న ముఖ్యమంత్రి రేవంత్ ఓటమి భయంతోనే ఈ ఎన్నికల్లో ఇంతటి దౌర్జన్యకాండకు దిగారు. కాంగ్రెస్ పార్టీకి పంచాయతీ ఎన్నికల్లో మొదలైన పరాభవం, పట్టణాల్లోనూ తప్పదనే ఆందోళనతోనే అడుగడుగునా రేవంత్ రెడ్డి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు.అక్రమంగా లూటీచేసిన వేలకోట్ల ప్రజాధనంతో, ప్రజాతీర్పునే మార్చాలన్న ఈ కుట్రలను తెలంగాణ సమాజం చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదు. పోలీసుశాఖను అడ్డం పెట్టుకుని బీఆర్ఎస్ శ్రేణులపై సాగించిన వేధింపుల పర్వానికి, దాడులకు రేవంత్ రెడ్డి భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. ప్రజలకిచ్చిన హామీలను, మొత్తంగా పరిపాలనను గాలికి వదిలేసి రాష్ట్రాన్ని సంక్షోభంలోకి నెట్టిన పాపం రేవంత్ రెడ్డిని ప్రతినిత్యం వెంటాడుతూనే ఉంటది’ అని పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ ఎన్ని అరాచకాలు చేసినా వీరోచితంగా పోరాడిన గులాబీ సైనికులందరికీ పేరుపేరునా హృదయపూర్వక అభినందనలు.. ఆదిలాబాద్ నుంచి ఆలంపూర్ వరకూ పురపాలక సమరంలో మీరు కనబరిచిన పోరాట స్ఫూర్తి బీఆర్ఎస్ కు కొండంత బలాన్నిచ్చింది, పార్టీలో ఆకాశమంత…— KTR (@KTRBRS) February 11, 2026 -
ఓటర్లకు BRS అభ్యర్థి డబ్బులు పంపిణీ
-
కార్పొరేషన్ కహానీ
రాష్ట్రవ్యాప్తంగా 7 మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో ఎన్నికలు జరుగుతున్నాయి. మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్గా అప్గ్రేడ్ అయిన జాబితాలో మంచిర్యాల, కొత్తగూడెం, నల్లగొండ, మహబూబ్నగర్ ఉన్నాయి. ఇక్కడ కార్పొరేషన్ ఎన్నికలు తొలిసారి జరుగుతున్నాయి.. కరీంనగర్, నిజామాబాద్, రామగుండం గతం నుంచి కార్పొరేషన్లుగా కొనసాగుతున్నాయి. ఎంఐఎం కరీంనగర్, నిజామాబాద్, మహబూబ్నగర్, నల్లగొండలో పోటీలో ఉంది. దీంతో ప్రధాన పార్టీల గెలుపోటములపై మజ్లిస్ ప్రభావం చూపనుంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యే ఫైట్ సాక్షి ప్రతినిధి, నల్లగొండ: నీలగిరి కార్పొరేషన్పై మూడు ప్రధాన పార్టీలు గురిపెట్టాయి. అయితే గట్టి పోటీ మాత్రం కాంగ్రెస్–బీఆర్ఎస్ మధ్యే కొనసాగుతోంది. ఇటీవల కార్పొరేషన్గా మారిన నల్లగొండలో మొదటిసారిగా ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికల్లో గెలుపు కోసం అభ్య ర్థులు భారీగా ఖర్చు చేస్తున్నారు. బీజేపీ మజ్లిస్ మూడో స్థానం కోసం పోటీ పడాల్సిన పరిస్థితులు ఉన్నాయి.బీజేపీ– కాంగ్రెస్ హోరాహోరీ సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ నగరపాలక సంస్థలో బీజేపీ, కాంగ్రెస్ మధ్యహోరాహోరీ పోరు నడుస్తోంది. ఇక్కడ పార్టీల మధ్య ఎలాంటి పొత్తులు లేవు. అయితే ఫలితాల అనంతరం మాత్రం పొత్తులు నెలకొనే పరిస్థితులు ఉంటాయనే అంచనా ఉంది. బీజేపీ, కాంగ్రెస్, ఎంఐఎం, బీఆర్ఎస్ విడివిడిగా పోటీ చేస్తున్నాయి. బీజేపీకి మ్యాజిక్ ఫిగర్ రానిపక్షంలో కాంగ్రెస్, ఎంఐఎం పార్టీల మధ్య అవసరాన్ని బట్టి పొత్తులు కుదిరే అవకాశముంది. కమలం – హస్తం..సాక్షిప్రతినిధి,కరీంనగర్: కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో ప్రధాన పోటీ బీజేపీ, కాంగ్రెస్ మధ్యనే ఉంది. అయితే కొన్ని డివిజన్ల పరిధిలో మాత్రం బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ల నడుమ త్రిముఖపోటీ నెలకొంది. మరికొన్ని చోట్ల కాంగ్రెస్, బీజేపీ, రెబెల్స్ మధ్య పోటీ ఉంది. ఎంఐఎం కూడా 15 డివిజన్లలో అభ్యర్థులను బరిలో దింపింది. ఈ కార్పొరేషన్ పరిధిలో హంగ్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ గోదావరిఖని: రామగుండం కార్పొరేషన్ పరిధిలో ప్రధాన పోటీ కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్యనే ఉంది. ఇప్పటికే ఒక డివిజన్ ఏకగ్రీవం కాగా, అది కూడా కాంగ్రెస్కే దక్కింది. మెజారిటీ డివిజన్లలో కూడా కాంగ్రెస్ అభ్యర్థులదే పైచేయిగా ఉంది. మొదటి సారిగా బీజేపీ అధిక డివిజన్లలో పోటీ చేస్తోంది.‘గూడెం’లో కాంగ్రెస్ వర్సెస్ సీపీఐ సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: కొత్తగూడెం మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్గా అప్గ్రేడ్ అయ్యాక తొలిసారి ఎన్నికలు జరుగుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల సమయంలో మిత్రపక్షాలుగా ఉన్న కాంగ్రెస్, సీపీఐ వైరివర్గాలుగా మారి కొత్తగూడెంలో నువ్వా, నేనా అన్నట్టు పోటీ పడుతున్నాయి. కాంగ్రెస్, సీపీఎంతో జత కట్టి 58 డివిజన్ల నుంచి బరిలోకి దిగింది. సీపీఐ, టీడీపీతో పొత్తు కుదుర్చుకొని 57 స్థానాల నుంచి పోటీ చేస్తోంది. రెండు పార్టీల రెబెల్స్పై ఆశలు పెట్టుకున్న బీఆర్ఎస్ చివరకు ఒంటరిగానే బరిలో నిలిచింది. మంచిర్యాలలో కాంగ్రెస్..బీఆర్ఎస్ మధ్యే సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: మంచిర్యాల కార్పొరేషన్లో ప్రధాన పోటీ కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య ఉండగా, పలు డివిజన్లలో బీజేపీ కూడా ప్రభావం చూపుతోంది. కార్పొరేషన్గా మారాక మొదటిసారి ఎన్నికలు జరుగుతుండడంతో మేయర్ పీఠం ఏ పార్టీకి దక్కుతుందనే ఉత్కంఠ రేపుతోంది. నగరంలో అన్నిపార్టీలకు బీసీల మద్దతే కీలకంగా మారింది. అన్ని పార్టీలు మహిళలకు రిజర్వు అయిన స్థానాలతో పాటు జనరల్ స్థానాల్లోనూ అధికంగా బీసీలకే బీఫాంలు ఇచ్చాయి. పాలమూరు.. త్రిముఖ పోరు సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సొంత ఇలాకా కావడం.. మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్గా పాలమూరు ఆవిర్భవించిన తర్వాత తొలిసారిగా ఎన్నికలు జరుగుతుండడంతో ప్రధాన పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ప్రధానంగా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థుల మధ్య త్రిముఖ పోరు నెలకొంది. కొన్ని డివిజన్లలో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య, మరి కొన్నింటిలో కాంగ్రెస్, బీజేపీ మధ్య హోరాహోరీ పోటీ నడుస్తోంది. ఎంఐఎం అభ్యర్థులు 16 డివిజన్లలో పోటీలో ఉన్నారు. వీరికి అనుకూల పరిస్థితులు ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఒక డివిజన్ ఏకగ్రీవం కాగా, అది కాంగ్రెస్ ఖాతాలో చేరింది. -
కాంగ్రెస్కు మళ్లీ ఓటేస్తే ఆగమే: కేటీఆర్
సాక్షి ప్రతినిధి, వరంగల్/మహబూబాబాద్/భూపాలపల్లి/గూడూరు: ‘అబద్ధపు హామీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. సోనియాగాందీ, రాహుల్ గాందీల మీద ఒట్టేసి హామీలిచ్చి గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి ఆ తర్వాత వాటిని గాలికి వదిలేశారు. ప్రజలు, ప్రతిపక్షాలు అభివృద్ధి,సంక్షేమం గురించి నిలదీస్తే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. అబద్దపు హామీలు, మాటలు నమ్మి ఓట్లేస్తే మళ్లీ ఆగమైతం..’అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే కల్యాణలక్ష్మి డబ్బులకు తోడు తులం బంగారం కలిపి ఇస్తామని చెప్పడంతోపాటు అనేక ఇతర హామీలిచ్చి నెరవేర్చలేని రేవంత్ రెడ్డికి పాలన చేయడం చేతకావడం లేదని విమర్శించారు. రెండేళ్ల తర్వాత ఎగిరేది గులాబీ జెండానే అని ధీమా వ్యక్తం చేశారు. సోమవారం ఉమ్మడి వరంగల్లోని భూపాలపల్లి, పరకాల, మహబూబాబాద్ మున్సిపాలిటీలలో కార్నర్ మీటింగ్ల ద్వారా ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చడం చేతగాని రేవంత్రెడ్డి కేవలం కేసీఆర్ను తిట్టడమే లక్ష్యంగా పెట్టుకున్నారని, కేసీఆర్ను తిట్టినోళ్లు ఎక్కడ దాక్కున్నా వదిలిపెట్టమని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రం తెచ్చిన నాయకుడిగా ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న కేసీఆర్ ఆనవాళ్లను చెరిపేయడం ఎవరితరం కాదన్నారు. ఓటుకు నోటు కేసులో ఆధారాలు ఉండకూడదని ఫోరెన్సిక్ ల్యాబ్లో నిప్పు పెట్టి తగులబెట్టారని కేటీఆర్ మండిపడ్డారు. తెలంగాణలో మళ్లీ అభివృద్ధి పరుగులు పెట్టాలన్నా.. కాంగ్రెస్ వాళ్లకు బుద్ధి చెప్పాలన్నా 11న జరిగే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి బీఆర్ఎస్ను గెలిపించాలని ఆయన కోరారు. కాంగ్రెస్ గెలిస్తే..జిల్లాలు ఉండవు ప్రభుత్వం ప్రజలకు దగ్గరకు చేర్చాలనే ఆలోచనతో గత ముఖ్యమంత్రి కేసీఆర్ మారుమూల మానుకోట, భూపాలపల్లిని జిల్లాలుగా మార్చారు. ప్రజలకు కలెక్టర్, ఇతర అధికారులను దగ్గర చేర్చారు.. కానీ ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి జిల్లాలు తీసివేస్తారటా.. మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే జిల్లాలుండవు.. ఏది కావాలో ఆలోచించి ప్రజలు ఓటు వేయాలని కేటీఆర్ అన్నారు. వెనకటి రోజులు తెస్తానని చెబుతున్న సీఎం రేవంత్ రెడ్డి మాటలు నిజం చేస్తున్నారన్నారు. వెనకటి రోజులు అంటే యూరియా కోసం చెప్పుల క్యూ పెట్టడమా.. కరెంట్ లేని రాత్రులు గడపడమా.. అని విమర్శించారు. ఆయా కార్యక్రమాల్లో శాసన మండలి డిప్యుటీ చైర్మన్ బండా ప్రకాష్, మాజీ మంత్రి సత్యవతిరాథోడ్, మాజీ ఎమ్మెల్యేలు గండ్ర వెంకటరమణారెడ్డి, దాస్యం వినయ్భాస్కర్, శంకర్నాయక్, చల్లా ధర్మారెడ్డి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాళ్లు గండ్ర జ్యోతి, మాలోతు కవిత, పాల్గొన్నారు. మరుగుజ్జుకు కేటీఆర్ ఆర్థిక హామీ.. మహబూబాబాద్ మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారానికి సోమవారం నర్సంపేట మీదుగా వస్తున్న మాజీ మంత్రి కేటీఆర్.. భీరవెళ్లి భరత్ కుమార్రెడ్డి కోరిక మేరకు మార్గమధ్యలో గూడూరులోని రెవెన్యూ కార్యాలయానికి సమీపంలో గల ఓ చాయ్ కొట్టు వద్ద ఆగారు. కేటీఆర్ చాయ్ తాగుతూ ఎదురుగా కనిపిస్తున్న ఓ చిన్న బాలుడి లాంటి వ్యక్తిని చూసి దగ్గరికి పిలిచి అతడిని ఎన్ని సంవత్సరాలుంటాయి నీకు అని అడిగాడు. అక్కడే ఉన్న భరత్కుమార్రెడ్డి ‘సార్.. ఇతని పేరు ధారావత్ వినోద్కుమార్. 30ఏళ్లు ఉంటాయి. డిగ్రీ చదువుకొని ఇంటి వద్ద ఖాళీగా ఉంటున్నాడు’అని చెప్పాడు. అది విన్న కేటీఆర్ ఏమైనా చిరువ్యాపారం చేసుకుంటావా? అని అతన్ని అడగ్గా, చేసుకుంటా సార్ అన్నాడు. భరత్కుమార్రెడ్డిని చూపుతూ ‘ఇతను నీకు తెలుసా’అని అడగ్గా తెల్సు సార్ అన్నాడు. వెంటనే ‘ఈయనకు రూ.2లక్షలు పంపిస్తా.. నీకు ఇస్తాడు. ఇంటి వద్ద ఏదైనా కిరాణం పెట్టుకో’అన్నాడు. -
బీజేపీ తెచ్చిందేమీ లేదు.. బీఆర్ఎస్కు అర్హత లేదు
సాక్షి, హైదరాబాద్: పన్నెండేళ్లలో రాష్ట్రానికి అదనంగా ఒక్క రూపాయి ఇవ్వని బీజేపీ ఇప్పుడు నిధులు తెస్తామంటే నమ్మాలా? అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రశ్నించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న ఆ పార్టీ రాష్ట్రానికి ఒరగబెట్టిందేమీ లేదని అన్నారు. కేంద్ర మంత్రులుగా ఉన్న కిషన్రెడ్డి, బండి సంజయ్లు ఏ ఒక్క పథకం కిందనైనా అదనంగా నిధులు తీసుకుని వచ్చారా? అని నిలదీశారు. పదేళ్లు వార్డు సభ్యుని నుంచి సీఎం వరకు అన్ని పదవులు అనుభవించిన బీఆర్ఎస్కు సమస్యల పరిష్కారం కోసం మరోసారి ఓటు వేయాలని అడిగే అర్హత లేదని అన్నారు. మున్సిపాలిటీల్లో సమస్యలకు బీఆర్ఎస్ కారణమని, ప్రజల సంక్షేమం, అభివృద్ధికి కట్టుబడి ఉన్న తమ ప్రభుత్వాన్ని పట్టణ ప్రాంత ప్రజలు ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. మునిసిపల్ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాల పనితీరును విశ్లేషించి ఓటు వేయాలని కోరారు. కళ్లముందున్న గతం, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని తీర్పునివ్వాలని పిలుపునిచ్చారు. 116 మునిసిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు జరుగుతున్న ఎన్నికల్లో త్రిముఖ పోటీ నెలకొన్నదని చెప్పారు. సోమవారం సీఎం తన నివాసంలో సలహాదారు వేం నరేందర్రెడ్డి, టీపీసీసీ మీడియా, కమ్యూనికేషన్ చైర్మన్ సామా రామ్మోహన్రెడ్డి, టీపీసీసీ నేత నీలం మధుతో కలిసి మీడియాతో మాట్లాడారు. బీజేపీ ఒక్క ప్రాజెక్టు అయినా కేటాయించిందా? ‘2014 ఎన్నికల ముందు మోదీ పాలమూరు సభలో రంగారెడ్డి– పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తామన్నారు. 12 సంవత్సరాలు గడిచినా రాలేదు. మొన్న ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు వచ్చారు. ఆ విషయం ప్రస్తావిరని భావించా. కానీ దాని ఊసెత్తకుండా మోదీని చూసి ఓటేయండని అడిగారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ ఆదిలాబాద్ పర్యటనకు వచ్చినప్పుడు.. ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టును 152 మీటర్ల ఎత్తులో కట్టుకోవడానికి అనుమతిస్తామంటూ చెప్తారని ఆశించా. అదేమీ లేకుండా మహారాష్ట్రలో భూమి మునిగితే తెలంగాణ కనీసం నష్టపరిహారం ఇవ్వలేదంటూ రాష్ట్రాన్ని అవమానించారు. హైదరాబాద్లో వరద సమయంలో బండి సంజయ్ ఆటోకు ఆటో, బండికి బండి, ఇంటికి ఇల్లు అని ప్రచారం చేశారు. వారి మాట నమ్మి ప్రజలు దాదాపు 50 డివిజన్లలో గెలిపించారు. ఎన్నికలయ్యాక..మీకు ఇన్సూరెన్స్ ఉంది అన్నీ వస్తాయని చెప్పారు. సత్రంలో భోజనం ఉచితమే.. దానికి నెల్లూరు పెద్దారెడ్డి సిఫారసు లేఖలా ఉంది బండి సంజయ్ తీరు. తాజాగా కేంద్రం నుంచి నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తామని నమ్మించే యత్నం చేస్తున్నారు. 12 ఏళ్లుగా అదనంగా ఒక్క రూపాయి ఇవ్వని వారిని ఇప్పుడు నమ్మొచ్చా? రాజ్యాంగబద్ధంగా, ఎవరి ప్రమేయం లేకుండా వచ్చే నిధులను తాము ఇచ్చినట్లు చెప్పుకోవడమేమిటి? కేంద్రం తన విచక్షణతో రాష్ట్రానికి ఒక్క ప్రాజెక్టు అయినా కేటాయించిందా? రాష్ట్రం నుంచి ఎన్నికైన 8 మంది బీజేపీ ఎంపీలు ఒక్కరైనా మోదీ దృష్టికి తీసుకెళ్లారా?..’అని ముఖ్యమంత్రి నిలదీశారు. ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టినట్లు మాట్లాడతారా? ‘కిషన్రెడ్డి, బండి సంజయ్, అర్వింద్ తెలంగాణ ఆత్మగౌరవాన్ని మోదీకి, ఢిల్లీకి తాకట్టు పెట్టినట్లు మాట్లాడడం ఏమి న్యాయం? మూసీకి, మెట్రోకు, సమ్మక్క సారక్కకు, ఇతర దేవాలయాలకు ప్రత్యేకంగా నిధులు తెచ్చారా? వరంగల్ విమానాశ్రయం కోసం వందల కోట్లు ఖర్చు చేసి భూములు కేంద్రానికి ఇచ్చాం. పక్కనున్న ఏపీలో ఆరేడు విమానాశ్రయాలు ఉంటే.. తెలంగాణకు ఒక్కటి మాత్రమే ఉంది. ఇప్పుడు మోదీని చూసి ఓట్లు వేయాలంటున్నారు. మోరీల్లో చెత్త తీయడానికి మోదీ వస్తారా? అసదుద్దీన్ను భూతంగా చూపించి ఎంతకాలం మత రాజకీయాలు చేస్తారు? బీజేపీకి అసదుద్దీన్ లైఫ్లైన్గా మారారు..’అని రేవంత్ విమర్శించారు. బీఆర్ఎస్ను యాసిడ్ పోసి కడగాలి ‘బీఆర్ఎస్ అధినేత, ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ అసెంబ్లీకి రారు. వచ్చిన వారు అభివృద్ధి కోసం కాకుండా సభను అడ్డుకోవడానికి వస్తారు. సభల్లో వారిద్దరు అహంకారం, విద్వేషంతో గంజాయి, కొకైన్ తీసుకున్న వారిలా మాట్లాడుతున్నారు. మునిసిపల్ ఎన్నికల్లో ఈ పార్టీ వారికి ఓటు వేస్తే వారు మునిసిపాలిటీలకు రారు. అభివృద్ధి పట్టించుకోరు. ఇప్పుడున్న సమస్యలన్నింటికీ కేసీఆర్, కేటీఆర్, హరీశ్రావు కారణం కాదా? ఇప్పుడు మూడోసారి మళ్లీ ప్రజలను మోసం చేయాలని ప్రయత్నిస్తున్నారు. టెలిఫోన్ ట్యాపింగ్ ద్వారా వందల కోట్లు వసూలు చేశారు. బీజేపీ, బీఆర్ఎస్లది 2023 వరకు విడదీయలేని అనుబంధం. నోట్ల రద్దు, రైతు వ్యతిరేక నల్లచట్టాలు, ట్రిపుల్ తలాక్కు మద్దతిచ్చారు. అందుకే ఇప్పుడు కేసీఆర్, కేటీఆర్, హరీశ్ అరెస్టు కాకుండా బీజేపీ కాపాడుతోంది. బీఆర్ఎస్ను యాసిడ్ పోసి కడిగితే తప్ప రాష్ట్రానికి పట్టిన పీడ వదలదు. బీఆర్ఎస్ అనే మొక్కను మళ్లీ మొలవనివ్వొద్దు..’అని సీఎం వ్యాఖ్యానించారు. మేం రెండేళ్లలో ఎన్నో చేశాం.. ‘మేం అధికారంలోకి రాగానే ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు మొదటి తారీఖునే వచ్చేలా చేశాం. ఆరోగ్యశ్రీ పరిమితి రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచాం. మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాం. ఆర్టీసీకి రూ.9 వేల కోట్లు చెల్లించి లాభాల బాటలోకి తెచ్చాం. రైతు రుణమాఫీ చేశాం. రైతు భరోసా రూ.9 వేల కోట్లు చెల్లించాం. సన్నాలకు రూ.500 బోనస్ ఇస్తున్నాం. పేదలకు నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశాం. ఇల్లు కట్టుకునే పేదలకు రూ.5 లక్షలు అందిస్తున్నాం.70 వేల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు భర్తీ చేశాం. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ, రెసిడెన్షియల్ స్కూళ్లు నిర్మిస్తున్నాం. ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేస్తున్నాం. వందేళ్ళలో ఎప్పుడూ లేని విధంగా బీసీ కులగణన చేసి చూపించాం. నలభై ఏళ్ల ఎస్సీ వర్గీకరణ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాం. ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి. తెలంగాణ సమాజానికి ఏది మేలు చేస్తుందో ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోండి..’అని రేవంత్ కోరారు. -
‘ఫోరెన్సిక్ ల్యాబ్ అగ్ని ప్రమాదం వెనుక రేవంత్ హస్తం’
మెదక్: సీఎం రేవంత్రెడ్డిపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫోరెన్సిక్ ల్యాబ్ అగ్నిప్రమాదం వెనుక రేవంత్ హస్తం ఉందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు హరీష్ రావు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మెదక్లో ప్రజలనుద్దేశించి మాట్లాడిన హరీష్.. రేవంత్పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ‘ఓటుకు నోటు కేసులో రేవంత్ జైలుకు పోవడం ఖాయం. అందుకే ఫోరెన్సిక్ ల్యాబ్ను దగ్ధం చేసిండు. జైలుకు పోకుండా ఉండేందుకు సాక్ష్యాలు మాయం చేసిండు. ఆ అగ్ని ప్రమాదం ప్రమాదవశాత్తు జరిగింది కాదు.. రేవంత్ డైరెక్షన్లో జరిగిన ప్రమాదం అది. ఓటుకు నోటు కేసులో దొరికిపోయిన దొంగ. జైలుకు పోయే సమయం దగ్గరకు వచ్చింది అందుకే సాక్ష్యాలు మాయం చేసేందుకు హైదరాబాద్లో ఫోరెన్సిక్ ల్యాబ్ ను దగ్దం చేసిండు. పోలీసుల సహకారంతో ఈ కుట్ర పన్నిండు. హైదరాబాద్లో పేదల బతుకులు కూల్చిండు. జైలుకు పోకుండా ఉండేందుకు సాక్ష్యాలను మాయం చేసిండు. రేవంతు డైరెక్షన్ లో పోలీసులు చేసిన దహనకాండ. ఓటుకు నోటు కేసులో రేవంతుకు శిక్ష పడక తప్పడు, జైలుకు పోక తప్పదు. రెండున్నరేండ్ల కాలంలో కాంగ్రెస్ చేసింది గుండు సున్నా. మిర్యాలగూడ, భూపాలపల్లి, నిజామాబాద్ పోయిండు ముఖ్యమంత్రి..కానీ మెదక్కు వచ్చేందుకు ముఖం లేదు. ఏడుపాయల అమ్మవారి మీద ఒట్టు వేసి మాట తప్పిండు కాబట్టి ఆయనకు భయంరుణమాఫీ మాట తప్పి మోసం చేసిండు. రైతు బంధు ఎగ్గొట్టిండు. ఎరువుల కరువు తెచ్చిండు రేవంత్. రేవంత్ బూతులు మాట్లాడటం తప్ప ఒక్క మంచి పని చేయలేదు. రంజాన్ తోఫా కూడా ఇవ్వడం లేదు. షాదీ ముబారక్ చెక్కులు రావడం లేదు. తులం బంగారం దిక్కు లేదు. కేసీఆర్ గారు మైనార్టీ గురుకులాలు కట్టారు. షాదీ ఖానా ఏర్పాటు చేశారు. కేసీఆర్ గారు బిఆర్ఎస్ పార్టీని సెక్యూలర్ పార్టీగా నిలబెట్టారు. హిందూ ముస్లింలను అన్నదమ్ములుగా చూసింది బీఆర్ఎస్. తెల్లారితే మమ్మల్ని తిట్టడమే పనిగా పెట్టుకున్నారు. కేసీఆర్ను తిడితే, హరీశ్ రావును తిడితే పేదల కడుపు నిండుతుందా?, ఇక్కడి ఎమ్మెల్యే చాలా గొప్పోడు. ఎన్నికల సమయంలో 25 గంటల కరెంటు ఇస్తా అన్నడు. కనీసం 12 గంటలు కూడా రావడం లేదు. ఆటో డ్రైవర్లకు ఏడాదికి 12వేలు అని గుండు కొట్టిండు. ఉద్యోగస్థులకు డీఏ లేదు, పీఆర్సీ లేదు. రిటైర్డ్ ఉద్యోగులకు రిటైర్ బెన్ఫిట్స్ లేవు. అన్ని వర్గాల ప్రజలను దారుణంగా మోసం చేసిండు రేవంత్ రెడ్డి’ అని ధ్వజమెత్తారు హరీష్రావు. -
కాంగ్రెస్ది భస్మాసుర హస్తం
తాండూరు/ నర్సంపేట/వర్ధన్నపేట/తొర్రూరు: ‘ముఖ్యమంత్రిని రైతు భరోసా ఇస్తా అంటివి కదా అని అడిగితే లాగులో తొండలు విడుస్తా అంటడు. మహిళలకు రూ.2 వేలు ఏమాయె అంటే గుడ్లు పీకి గోటీలు ఆడుతా అంటుండు. తులం బంగారం ఎప్పుడంటే పేగులు తీసి మెడలేసుకుంటా అంటుండు. ఇంతకు రేవంత్రెడ్డి ముఖ్యమంత్రా లేక బోటీ కొట్టేటోడా అర్థం కావడం లేదు. ఇక నుంచి ఆయన్ను లాగుల తొండల్రెడ్డి అనాలేమో’అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఆదివారం మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉమ్మడి వరంగల్ జిల్లా నర్సంపేట, వర్ధన్నపేట, తొర్రూరుతోపాటు వికారాబాద్ జిల్లా తాండూరులో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయా చోట్ల జరిగిన రోడ్ షో, కార్నర్ మీటింగ్లలో కేటీఆర్ మాట్లాడుతూ రేవంత్రెడ్డి, కాంగ్రెస్ పార్టీది అభయ హస్తం కాదని అది భస్మాసుర హస్తమని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టి రెండేళ్లు దాటుతున్నా ఆరు గ్యారంటీలు, 420 హామీలు అమలుకు నోచుకోవడం లేదన్నారు. కామారెడ్డికి ఎన్నికల ప్రచారానికి వెళితే ఓ పెద్దమ్మ మాట్లాడుతూ.. రూ.4 వేలు పింఛన్ తీసుకునేవారు కాంగ్రెస్కు, బీఆర్ఎస్ హయాంలో రూ.2 వేలు పెన్షన్ తీసుకున్నోళ్లు కారు గుర్తుకు ఓటేయాలని తాండూరు ప్రజలకు చెప్పమని పంపించిందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సోనియాగాం«దీపై ఒట్టేసి రైతులకు ఎకరాకు రూ.15 వేలు రైతు భరోసా ఇస్తామని హామీ ఇచ్చారని.. ఫిబ్రవరి వచ్చినా రైతులకు పెట్టుబడి సాయం అందలేదన్నారు. రేవంత్రెడ్డి పాలనలో రైతులు యూరియా కోసం చెప్పులు క్యూలో పెట్టే పరిస్థితులు ఎదుర్కొంటున్నారన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలి ఎన్నికలకు ముందు పచ్చి అబద్ధాల వాగ్దానాలు చేసి గెలిచిన తర్వాత రాష్ట్ర ప్రజలను సీఎం రేవంత్రెడ్డి ఇబ్బందులకు గురి చేస్తున్నాడని కేటీఆర్ దుయ్యబట్టారు. రేవంత్రెడ్డి ప్రభుత్వం ఢిల్లీకి పైసలు పంపడంలో మాత్రమే సక్సెస్ అవుతున్నదని, రాష్ట్ర ప్రజలను అన్ని రకాలుగా మోసం చేస్తోందన్నారు. దొంగ, పోలీస్ కలిసి వర్ధన్నపేట ప్రజలను మోసం చేశారని సీఎం రేవంత్రెడ్డి, ఎమ్మెల్యే కేఆర్ నాగరాజునుద్దేశించి విమర్శించారు. తెలంగాణ జాతిపిత కేసీఆర్పైనే కేసులు మోపుతున్నారని, నన్నేమైనా అంటే పడతానని..మా అయ్య జోలికి వస్తే మూడు భాషల్లో తిడతానన్నారు. ఎన్నికలు వచ్చినపుడు పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించవద్దన్నారు. ఆయా కార్యక్రమాల్లో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్రెడ్డి, అరూరి రమేశ్, నన్నపునేని నరేందర్, రోహిత్రెడ్డి, తాండూరు మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి పట్లోళ్ల నర్సింలు పాల్గొన్నారు. -
నీలగిరి.. నువ్వానేనా?
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ఒకప్పుడు జిల్లా అంతటా వామపక్ష రాజకీయాలు బలంగా ఉంటే జిల్లా కేంద్రమైన నీలగిరి మాత్రం కాంగ్రెస్కు కంచుకోటగా ఉంది. ఇక్కడ మున్సిపల్ రాజకీయాలు మొదలైనప్పటి నుంచి 13 సార్లు ఎన్నికలు జరిగితే ఎనిమిది సార్లు కాంగ్రెస్ పార్టీనే మున్సిపాలిటీపై తమ జెండా ఎగురవేసింది. 1951లో 8 వార్డులతో నీలగిరి మున్సిపాలిటీగా ఏర్పడగా, గత నెల 14వ తేదీన 48 డివిజన్లతో నల్లగొండ కార్పొరేషన్గా ఆవిర్భవించింది. 1953లో మున్సిపాలిటీకి మొదటిసారి ఎన్నికలు జరగ్గా, 2020లో చివరి ఎన్నికలు జరిగాయి. ప్రస్తుతం 14వసారి ఎన్నికలు జరుగుతుండగా, కార్పొరేషన్ అయ్యాయి మాత్రం ఇవి తొలిసారి. ఇప్పటివరకు మున్సిపల్ చైర్మన్ పదవిని 8 సార్లు కాంగ్రెస్ కైవసం చేసుకోగా, బీజేపీ రెండుసార్లు, టీడీపీ రెండుసార్లు, బీఆర్ఎస్ ఒకసారి దక్కించుకుంది. మొదటి చైర్మన్గా చిత్తలూరి వెంకట నర్సింహారావు (కాంగ్రెస్) 1961 వరకు సేవలు అందించగా, చివరి చైర్మన్గా 2024 నుంచి 2025 వరకు బుర్రి శ్రీనివాస్రెడ్డి సేవలు అందించారు. తొలి మేయర్ పీఠంపై ప్రధాన పార్టీల దృష్టి కార్పొరేషన్ అయ్యాక జరిగే ఈ ఎన్నికల్లో మేయర్ పీఠం జనరల్ మహిళకు రిజర్వు అయింది. దీంతో నల్లగొండ తొలి మేయర్ పీఠం దక్కించుకునేందుకు ప్రధాన పార్టీలు దృష్టి సారించాయి. అధికార కాంగ్రెస్ పక్కా వ్యూహంతో ముందుకు సాగుతుండగా, బీఆర్ఎస్ కూడా అదే ధ్యేయంతో నడుస్తోంది. బీజేపీ కూడా మేయర్ పీఠం దక్కించుకునేందుకు కసరత్తు చేస్తున్నా, గట్టి పోటీ మాత్రం కాంగ్రెస్, బీఆర్ఎస్ల మధ్యే కనిపిస్తోంది. ముందుగానే అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ అన్ని పార్టీల కంటే ముందే నల్లగొండ కార్పొరేషన్లో 48 డివిజన్లకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ప్రకటించారు. మేయర్ అభ్యర్థిగా బుర్రి చైతన్య శ్రీనివాస్రెడ్డి పేరును ఖరారు చేశారు. ఆ తర్వాతే బీఆర్ఎస్ రెండు విడతల్లో 42 మందిని ప్రకటించింది. ఆ తర్వాత మరో ఐదుగురి పేర్లను ప్రకటించింది. అయితే మేయర్ అభ్యర్థిని అధికారికంగా ప్రకటించకపోయినా చకిలం వసంతలక్ష్మి పేరును ఖరారు చేసినట్టు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఇక బీజేపీ మేయర్ అభ్యర్థి ఎవరన్నది కూడా ప్రచారంలో చెప్పడం లేదు. ఏ పార్టీ ఏం చెబుతుందంటే.... » ముందునుంచే కాంగ్రెస్ ప్రచారంలో దూసుకుపోతోంది. మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. నామినేషన్లు పూర్తయ్యాక ప్రతి రోజు నగరంలోని ఏడెనిమిది డివిజన్లలో పర్యటిస్తున్నారు. రోడ్ షోలు, ర్యాలీలు నిర్వహిస్తూ విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. రూ. 2 వేల కోట్లకు పైగా వెచి్చంచి పట్టణంలో అభివృద్ధి చేశామని, ప్రజలు తమను గెలిపించాలని కోరుతున్నారు. మరిన్ని నిధులు తెచ్చి నల్లగొండను స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేస్తామని చెబుతున్నారు. » పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో నల్లగొండలో ఎక్కువ అభివృద్ధి తామే చేశామని, దానిని చూసి తమను గెలిపించాలని బీఆర్ఎస్ చెబుతోంది. మాజీమంత్రి జగదీశ్రెడి, మాజీ ఎమ్మెల్యేలు భూపాల్రెడ్డి, కిషోర్, ఎమ్మెల్సీ కోటిరెడ్డి ప్రచారం నిర్వహిస్తున్నారు. బీఆర్ఎస్ హయాంలోనే కేసీఆర్ నల్లగొండను దత్తత తీసుకొని వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశారని చెబుతోంది. పట్టణంలో రోడ్ల విస్తరణ, సెంట్రల్ లైటింగ్, ఫ్లైఓవర్ల నిర్మాణం, ఐటీ హబ్ వంటికి తామే చేశామని చెబుతోంది. » నల్లగొండ అభివృద్ధికి కేంద్రం నుంచి అధిక నిధులు తెస్తామని, తమ అభ్యర్థులను గెలిపించాలని బీజేపీ చెబుతోంది. గతంలో బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు పెద్దఎత్తున అభివృద్ధి చేసిందని పేర్కొంటోంది. కేంద్రం ఇచ్చే నిధులతోనే పట్టణాల్లో అభివృద్ధి జరుగుతోందని చెబుతోంది. -
పదేళ్లు దోపిడీ చేసినందుకు ఓటు వేయాలా?
వైరా/మధిర: ‘మున్సిపల్ ఎన్నికల్లో ఓటు వేసి గెలిపించాలని బీఆర్ఎస్ నాయకులు అడుగుతున్నారు.. పదేళ్ల పాటు రాష్ట్రాన్ని దోచుకున్నందుకు వారికి ఓట్లేయాలా. రూ.8 లక్షల కోట్ల అప్పుల్లో రాష్ట్రాన్ని ముంచినందుకు ఓట్లేయాలా’అని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రశ్నించారు. ఖమ్మం జిల్లా వైరా, మధిర మున్సిపాలిటీల్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం ఆయన రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభల్లో భట్టి మాట్లాడుతూ బీఆర్ఎస్ పదేళ్ల పాలన కాలంలో పేదలకు ఒక్క ఇల్లు కానీ, ఇంటి స్థలం కానీ ఇవ్వలేదని ఆరోపించారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలే ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయగా.. మళ్లీ ఇప్పుడు తాము వచ్చాకే మొదటి దశలో 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసి రూ.22,500 కోట్ల నిధులు వె చ్చిస్తున్నామని తెలిపారు. బీఆర్ఎస్ పాలనలో పేదలు రేషన్ కార్డుల కోసం తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరిగితే పట్టించుకోలేదన్నారు. అప్పుడు ఇచ్చిన దొడ్డు బియ్యం పేదలకు ఉపయోగపడలేదని చెప్పారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలోని 1.05 కోట్ల కుటుంబాలకు గాను 1.02 కోట్ల కుటుంబాలకు సన్న బియ్యం అందిస్తున్నామని తెలిపారు. అంతేకాక ఆరోగ్యశ్రీ పరిమితి రూ.10 లక్షలకు పెంపు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇవ్వడంతో పాటు మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేలా రూ.27 వేల కోట్ల వడ్డీలేని రుణాలు పంపిణీ చేశామని వెల్లడించారు. ఈ కార్యక్రమాల్లో వైరా ఎమ్మెల్యే రాందాస్నాయక్, రాష్ట్ర హస్తకళల సంస్థ చైర్మన్ నాయుడు సత్యం, డీసీసీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
యూరియాపై బీఆర్ఎస్ బూటకపు ప్రచారం
సాక్షి, హైదరాబాద్: యూరియా విషయంలో బీఆర్ఎస్ పార్టీ రాజకీయ లబ్ధి కోసం రైతాంగాన్ని రెచ్చగొట్టే దిగజారుడు ప్రచారం చేస్తోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఒక ప్రకటనలో ధ్వజమెత్తారు. రైతులు యూరియా కోసం క్యూ లైన్లలో నిలబడుతున్నారని బీఆర్ఎస్ పదే పదే చేస్తున్న ప్రచారం పూర్తిగా అసత్యమని స్పష్టం చేశారు. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రైతులను ఏ విధంగా ఇబ్బందులకు గురిచేశారో రాష్ట్ర రైతాంగానికి బాగా తెలుసని, తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు సంవత్సరాల్లో వ్యవసాయ రంగానికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నదీ కూడా రైతులు గమనిస్తున్నారని మంత్రి తెలిపారు.సిద్దిపేట, గజ్వేల్ ప్రాంతాల్లో యూరియా కోసం క్యూ లైన్లలో రైతులు నిలబడి ఇబ్బందులు పడిన ఘటనలు, క్యూ లైన్లలో రైతులు మరణించిన దుర్ఘటనలు కూడా బీఆర్ఎస్ నేతలు మర్చిపోయారని విమర్శించారు. వరి బోనస్ గురించి మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్ నేతలకు ఉందా అని ప్రశ్నిస్తూ, ‘వరి వేస్తే ఉరి’అన్న మాటలు గుర్తు చేశారు.గత వానాకాలంలో కేంద్రం నుంచి సకాలంలో ఎరువులు అందక రైతులు ఇబ్బంది పడితే, ఆ పరిస్థితిని రాజకీయ లబ్ధికి వాడుకున్నారని, అయినప్పటికీ పంచాయతీ ఎన్నికల్లో రైతులు బీఆర్ఎస్కు తగిన గుణపాఠం చెప్పారన్నారు. పత్తి రైతుల కోసం కేంద్రం తీసుకొచ్చిన ‘కపాస్ కిసాన్ యాప్’విజయవంతమవడంతో అదే తరహాలో యూరియా యాప్ను అమలు చేస్తున్నామని తెలిపారు. యాప్ అమలులో ఉన్న జిల్లాల రైతులను అడిగి తెలుసుకోవాలని, అక్కడ ఎలాంటి ఇబ్బందులు లేవని తుమ్మల స్పష్టం చేశారు. -
‘బీజేపీ, బీఆర్ఎస్ రెండూ బొమ్మ-బొరుసులే’
భూపాలపల్లి: ఫోన్ల ట్యాపింగ్తో బ్లాక్ మెయిల్ చేసి వేల కోట్లు సంపాదించారని సీఎం రేవంత్రెడ్డి విమర్శించారు. ఫోన్ల ట్యాపింగ్ కేసుల నుంచి తప్పించుకోవడానికి బీఆర్ఎస్కు బీజేపీకి సహకరిస్తోందని ధ్వజమెత్తారు. బీజేపీ, బీఆర్ఎస్లు రెండూ బొమ్మ-బొరుసు లాంటి పార్టీలని మండిపడ్డారు. ఇక భూపాలపల్లి జిల్లాను రద్దు చేస్తారనే వార్తలపై సీఎం రేవంత్ స్పందించారు. భూపాలపల్లి జిల్లాను రద్దు చేస్తారని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. చిన్న గ్రామం నుంచి జిల్లా కేంద్రంగా భూపాలపల్లి మారింది. కాంగ్రెస్ అభివృద్ధితోనే భూపాలపల్లి ఈ స్థాయికి చేరింది. భూపాలపల్లి ఎక్కడికి పోదు.. తప్పుడు ప్రచారం నమ్మొద్దు. మరొకవైపు మెడికల్ బోర్డు రద్దు అవుతుందనే విషం ప్రచారం కూడా మొదలుపెట్టారు. మెడికల్ బోర్డు రద్దు ఆలోచన ప్రభుత్వ దృష్టిలో లేదు. తప్పుడు ప్రచారం చేసేవారిపై కఠిన చర్యలు తప్పవు’ అని సీఎం రేవంత్ హెచ్చరించారు. -
‘కేసీఆర్ కాదు..తెలంగాణకు అసలైన జాతిపితను నేనే’
సాక్షి,నల్గొండ: తెలంగాణ జాతిపిత బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కాదని, తానే అసలైన జాతిపిత అంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నల్గొండ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కోమటిరెడ్డి ‘సాక్షి’తో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కేసీఆర్ జాతిపిత కాదు.జాతిపిట్ట. అసలైన జాతిపితను నేనే. తెలంగాణ కోసం మంత్రి పదవి త్యాగం చేశా. అసెంబ్లీకి రాని కేసీఆర్ జీతం తీసుకోవద్దు. ఇప్పటి వరకు కేసీఆర్ తీసుకున్న జీతం వెంటనే వెనక్కి ఇవ్వాలి’అని డిమాండ్ చేశారు. -
కేసీఆర్ది ఉద్యమ చరిత్ర.. రేవంత్ది ద్రోహ చరిత్ర
జిన్నారం (పటాన్చెరు)/గజ్వేల్: తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ది ఉద్యమ చరిత్ర అయితే, ముఖ్యమంత్రి రేవంత్ది ద్రోహ చరిత్రని మాజీమంత్రి హరీశ్రావు అన్నారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో సంగారెడ్డి జిల్లా జిన్నారంలో శనివారం జరిగిన కార్నర్ మీటింగ్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ రేవంత్ అని మండిపడ్డారు. రాష్ట్రానికి సీఎంగా ఉంటూ.. ఆంధ్రప్రదేశ్కు మన నీళ్లు తాకట్టు పెడుతున్న ద్రోహి అని విమర్శించారు.చంద్రబాబుతో దోస్తీ కట్టి రాష్ట్రాన్ని మోసం చేస్తున్నారని తీవ్రంగా మండిపడ్డారు. రేవంత్రెడ్డి మాటలు నమ్మి మోసపోవద్దని ఓటర్లకు సూచించారు. అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్కు మున్సిపల్ ఎన్నికల్లో ఓటుతో తగిన బుద్ధి చెప్పాలని హరీశ్ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్టీ కోఆర్డినేటర్ ఆదర్శ్రెడ్డి, బీఆర్ఎస్ అభ్యర్థులు, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.కాంగ్రెస్, బీఆర్ఎస్ల మధ్య ఘర్షణసిద్దిపేట జిల్లా గజ్వేల్లోని ఆర్అండ్ఆర్ కాలనీలో శనివారం కాంగ్రెస్, బీఆర్ఎస్ శ్రేణుల మధ్య ఘర్షణ ఉద్రిక్తతకు దారితీసింది. ఈ కాలనీలోని ఏటిగడ్డకిష్టాపూర్లో బీఆర్ఎస్ ఎన్నికల ప్రచార సభకు మాజీ మంత్రి హరీశ్రావు వస్తున్నారనే సమాచారంతో ఆ కాలనీకి చెందిన కాంగ్రెస్ నాయకులు ఆయనను అడ్డుకోవడానికి ప్రయత్నించారు. దీంతో అక్కడే ఉన్న బీఆర్ఎస్ నాయకులు పోటీగా నినాదాలు చేశారు.ఈ ఘటన నేపథ్యంలో హరీశ్రావు ఆర్అండ్ఆర్ కాలనీకి రాకుండానే తూప్రాన్కు వెళ్లిపోయారు. దీంతో బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్రెడ్డి, ఎమ్మెల్సీ యాదవరెడ్డిలు ఇక్కడికి చేరుకొని సభను కొనసాగించే ప్రయత్నం చేస్తుండగా... కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు పరస్పరం చెప్పులు విసురుకుంటూ బాహాబాహీకి దిగారు. ఏసీపీ నర్సింహులు, గజ్వేల్ ఇన్స్పెక్టర్ రవికుమార్ ఆధ్వర్యంలో పోలీసులు లాఠీఛార్జి చేసి ఇరువర్గాలను చెదరగొట్టారు. -
కాంగ్రెస్ పాలనలో స్కామ్లే.. స్కీమ్లు లేవు
సిరిసిల్ల: రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో స్కామ్లే తప్ప.. కొత్త స్కీమ్లు లేవని.. ఆరు గ్యారంటీల పేరిట ప్రజలను కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సిరిసిల్ల, వేములవాడ పట్టణాల్లో శుక్రవారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు చేస్తున్న అన్యాయాలపై విరుచుకుపడ్డారు.కాంగ్రెస్ పార్టీ దొంగమాటలతో అధికారంలోకి వచ్చి అడ్డగోలు హామీలు ఇచ్చి పదవి ఎక్కిన తర్వాత ప్రజల్ని మోసం చేస్తుందన్నారు. వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఎన్నికల సందర్భంగా వంద రోజుల్లో అమలు చేస్తానని హామీలతో రాసిచ్చిన బాండ్పేపర్ను ప్రజలకు కేటీఆర్ చూపించారు. తనకు ఓటు వేయకుంటే చనిపోతానని, నాలుగుసార్లు ఓడిపోయానని చెప్పి సానుభూతి డైలాగులతో మభ్యపెట్టిన ఆది శ్రీనివాస్ ఆ తర్వాత హామీల అమలు నుంచి అభివృద్ధి వరకు అడ్రస్ లేకుండా పారిపోయాడన్నారు. కాంగ్రెస్కు ఓటేస్తే.. మోసాలకు మద్దతిచ్చినట్టే... ఒకవేళ ఇన్ని రకాల మోసాల తర్వాత, ద్రోహాల తర్వాత కూడా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే ప్రజలకు మేము చేస్తున్నదే సరైందని, ప్రజలు కాంగ్రెస్కు అనుకూలంగా తీర్పు ఇస్తున్నారని రేవంత్రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తుందని కేటీఆర్ చెప్పారు. హామీల అమలుపై భవిష్యత్లోనూ దృష్టి పెట్టే అవకాశమే ఉండదని హెచ్చరించారు. కాంగ్రెస్ చెప్పిన హామీలు రూ.4 వేల పెన్షన్ నుంచి మొదలుకొని రైతు భరోసా, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ , తులం బంగారం రావాలన్నా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేయాలన్నారు. దేవుడి పేరు చెప్పి ఓట్లు పార్లమెంట్ నియోజకవర్గం నుంచి రెండుసార్లు ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా చేసిందేమీ లేదని కేటీఆర్ చెప్పారు. రూ.15 లక్షలు ప్రతి ఇంటికి ఇస్తానని చెప్పిన మోదీ ఆ తర్వాత ఇచ్చిన హామీలన్నింటినీ పక్కన పెట్టారని విమర్శించారు. ప్రతీసారి ఎన్నికలు రాగానే దేవుడి పేరు చెప్పి కులం, మతం పేరు చెప్పి బీజేపీ ఓట్లు వేయించుకుంటుందన్నారు. ఈసారి కూడా బీజేపీ దొంగమాటలకు మోసపోవద్దని కోరారు. ఈ మున్సిపల్ ఎన్నికల్లో వేసే ఓటుతో మరోసారి కేసీఆర్ తిరిగి ముఖ్యమంత్రిని చేసుకునే ప్రస్థానం ప్రారంభం కావాలన్నారు. సిరిసిల్ల, వేములవాడల్లో జరిగిన ప్రచార సభల్లో బీఆర్ఎస్ నాయకులు చల్మెడ లక్ష్మీనరసింహారావు, కొండూరి రవీందర్రావు, తోట ఆగయ్య, తుల ఉమ, గూడూరి ప్రవీణ్, జిందం చక్రపాణి పాల్గొన్నారు. -
కాంగ్రెస్-బీఆర్ఎస్ వర్గాల మధ్య ఘర్షణ.. మేడ్చల్లో ఉద్రిక్తత
మేడ్చల్: కాంగ్రెస్-బీఆర్ఎస్ వర్గాల మధ్య మేడ్చల్లోని ఆలియాబాద్లో ఘర్షణ చోటు చేసుకుంది. ఇరు పార్టీలకు చెందిన కార్యకర్తల మధ్య మాటామాటా పెరిగి ఉద్రిక్తతకు దారి తీసింది. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే మల్లారెడ్డి వాహనం ధ్వంసమైంది. మల్లారెడ్డి అనుచరుడు పరమేష్పై డీసీసీ అధ్యక్షుడు వజ్రేష్ అనుచరులు దాడికి దిగారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారిపోయింది. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగానే వీరి మధ్య వాగ్వాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇరు వర్గాలు ఒకరికి ఒకరికి ఎదురుపడిన నేపథ్యంలోనే వారి మధ్య ఘర్షణ వాతావారణం చోటు చేసుకున్నట్లు సమాచారం. -
వారిది ఫెవికాల్ బంధం
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ‘బీజేపీ– బీఆర్ఎస్ది ఫెవికాల్ బంధం. రెండింటి మధ్య చీకటి ఒప్పందం ఉంది. బీఆర్ఎస్ నేతల నుంచి ప్రొటెక్షన్ మనీ పేరిట మామూళ్లు వసూలు చేసి.. రూ.లక్షల కోట్లు దోచుకున్న కేసీఆర్, కేటీఆర్, హరీశ్రావులపై బీజేపీ ఎలాంటి కేసులు నమోదు చేయడం లేదు..’అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. గురువారం కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గంలోని గుమ్లాపూర్లో ‘ప్రజాపాలన– ప్రగతిబాట’బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. తొలుత రామడుగు మండలంలో అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్ (ఏటీసీ), గంగాధరలో డిగ్రీ కాలేజీ, రామడుగు దత్తోజీపేటలో సోలార్ ప్లాంట్ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం సభలో ప్రసంగించారు. అరెస్టు చేయరు..విచారణ సాగదు ‘2014లో మోదీ పాలమూరుకు వచ్చినప్పుడు పాలమూరు– రంగారెడ్డి పథకానికి జాతీయ హోదా ఇస్తానని చెప్పి ఇప్పటివరకు ఇవ్వలేదు. కాళేశ్వరం, మెట్రో, మూసీ, రీజినల్ రింగ్రోడ్డు అనుమతులు వేటికీ మోక్షం లేదు. మొన్నటి పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ అవయవ దానం తరహాలో ఓట్లు దానం చేసి 8 స్థానాల్లో బీజేపీని గెలిపించింది. కాళేశ్వరం కేసీఆర్కు ఏటీఎం కార్డు అయిందన్న మోదీ, అమిత్షాలు ఆ ప్రాజెక్టులో అవినీతి జరిగిందని కేంద్రానికి నివేదిక పంపినా పట్టించుకోరు.. కేసీఆర్, హరీశ్లను అరెస్టు చేయరు.. సీబీఐ విచారణ ముందుకు సాగదు. ఫార్ములా ఈ రేసులో అక్రమాలపై కేటీఆర్ను అరెస్టు చేయరు. కేసీఆర్ అసెంబ్లీకి రాకుండా జీతం తీసుకుంటున్నాడు. కేసీఆర్తో పాటు కేటీఆర్, హరీశ్లు పిల్లి శాపనార్థాలు పెడుతూ ప్రభుత్వంపై విషం చిమ్ముతున్నారు. సంతోష్ రావు మిడ్మానేరులో భూములు, ఇసుక, కంకర, గాలి, నీరు దేన్నీ వదలకుండా దోచుకున్నాడు..’అని రేవంత్రెడ్డి ఆరోపించారు పాల పిట్టల్లా ఆడపడుచులు ‘2004లో ఇదే కరీంనగర్ గడ్డ మీద సోనియాగాంధీ తెలంగాణ ఇస్తామని మాటిచ్చారు. ఏపీ, కేంద్రంలో అధికారం కోల్పోయినా ఇచ్చి న మాటకు కట్టుబడి 60 ఏళ్ల తెలంగాణ ప్రజాకాంక్షను నెరవేర్చిన ఘనత సోనియాది. ప్రజలు కేసీఆర్కు పదేళ్లు అధికారమిస్తే.. ఆస్తులు, కాంట్రాక్టులు, టీవీలు, పేపర్లు, ఫామ్హౌస్లు కూడబెట్టారు. 2004 నుంచి 2014 వరకు మేము తెలంగాణలో 25 లక్షల ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తే.. 2014 నుంచి 2023 వరకు బీఆర్ఎస్ ఒక్క డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కూడా ఇవ్వలేదు. రైతు కష్టాలు చూసి చలించి ఉచిత కరెంటు ఇచ్చిన ఘనత వైఎస్ రాజశేఖరరెడ్డిదే. అసలు ఉచిత కరెంటు అంటేనే కాంగ్రెస్ పేటెంట్. రాజీవ్ ఆరోగ్యశ్రీ లాంటి ప్రతిష్టాత్మక పథకాలు తెచ్చింది కాంగ్రెస్. ఇప్పుడు సన్న బియ్యం, రైతు రుణమాఫీ, రైతుబీమా, రైతు భరోసా, మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం తదితర పథకాలు అమలు చేస్తోంది. గతంలో బతుకమ్మ చీరల్లో కుంభకోణాలకు పాల్పడ్డారు. వాటిని ఎవరూ కట్టుకోలేదు. మేం ఇచ్చిన ఇందిరమ్మచీరలు కట్టుకుని నా ఆడపడుచులుపాల పిట్టల్లా కనిపిస్తున్నారు..’అని సీఎం వ్యాఖ్యానించారు. అన్నిచోట్లా కాంగ్రెస్ జెండా ఎగరాలి ‘రాష్ట్రంలోని 123 మున్సిపాలిటీలకు రూ.17,442 కోట్లు ఇస్తే.. అందులో పాత కరీంనగర్ జిల్లాలోని మున్సిపాలిటీలకు రూ.2,778 కోట్లు ఇచ్చాం. మరిన్ని పనులు సజావుగా జరగాలంటే మీ కౌన్సిలర్, కార్పొరేటర్ కాంగ్రెస్ వాళ్లే అయి ఉండాలి. అన్ని మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ జెండా ఎగరాలి. 8 ఏండ్లు మేమే అధికారంలో ఉంటాం. గతంలో వేములవాడకు వెళితే పదవులు పోతాయన్న అపవాదును మేం అధిగమించాం. అక్కడే సభ పెట్టి రూ.150 కోట్ల పనులకు శ్రీకారం చుట్టాం. కొండగట్టు, ధర్మపురి ఆలయాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం. 2027లో జరగనున్న గోదావరి పుష్కరాల సందర్భంగా బాసర నుంచి భద్రాచలం వరకు ప్రతి పుణ్యక్షేత్రాన్ని అభివృద్ధి చేసేందుకు రూ.5 వేల కోట్లు వెచ్చిస్తా. కరీంనగర్ ఔటర్ రింగు రోడ్డు, వరంగల్ ఔటర్ రింగు రోడ్డులకు మధ్యలో డంపింగ్ యార్డు ఏర్పాటు చేస్తాం. బండి, గుండులను మోదీ గుర్తుపట్టడు బీజేపీ తెలంగాణకు గాడిద గుడ్డు తప్ప ఏమీ ఇవ్వలేదు. కేంద్ర మంత్రి బండి సంజయ్కు ఢిల్లీ నుంచి నిధులు తేవడం చేతకాదు. అసలు బండి, గుండులను మోదీ గుర్తే పట్టడు. కరీంనగర్ కార్పొరేషన్ను చేజిక్కించుకునేందుకు బీజేపీ, బీఆర్ఎస్ చేతులు కలిపేందుకు సిద్ధమయ్యాయి. కానీ ఢిల్లీ నుంచి మోదీ, అమిత్షాలు వచ్చినా ఆ పార్టీ ఒక్క మున్సిపాలిటీ కూడా గెలవకుండా కాంగ్రెస్ సత్తా చూపిస్తాం..’అని సీఎం అన్నారు. జిల్లా ఇన్చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మంత్రులు శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్, విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యేలు మేడిపల్లి సత్యం, రాజ్ఠాకూర్, విజయరమణా రావు, కవ్వంపల్లి సత్యనారాయణ సభలో పాల్గొన్నారు. -
కాంగ్రెస్కు ఓటేస్తే మరోసారి మోసపోయినట్లే..
సిరిసిల్ల: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేస్తే మరోసారి మోసపోయినట్లేనని, ఆరు గ్యారంటీల పేరిట 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన రేవంత్రెడ్డి రెండేళ్లలో ఒక్క హామీని నెరవేర్చలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారక రామారావు విమర్శించారు. మున్సిపల్ ఎన్నికల తర్వాత రైతుబంధు వేస్తానని సీఎం చెబుతున్నారని, కానీ ఇప్పటికి ఎన్ని పంట కాలాలు గడిచాయి? ఎన్నిసార్లు రైతుబంధు వేశారో చెప్పాలని అన్నారు. రైతుబంధు డబ్బులు వారి ఖాతాల్లో వేయడానికి మున్సిపల్ ఎన్నికలు ఎలా అడ్డు వస్తున్నాయని ప్రశ్నించారు. ఎన్నికలు అయిపోయేంత వరకుఆశ చూపించి, మరోసారి మోసం చేయడానికే రేవంత్రెడ్డి ఈ మాట చెబుతున్నారని ఆరోపించారు. గురువారం సిరిసిల్ల జిల్లా కేంద్రంలో నిర్వ హించిన మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు.. కేసీఆర్ను తిట్టడం దేనికి? ‘ముఖ్యమంత్రికి చేతిలో అధికారం, అవకాశం ఉన్న ప్పుడు చేతనైతే ప్రజలకు మంచి చేయాలి..ఇచ్చిన హామీలు అమలు చేయాలి. కానీ గత సీఎం కేసీఆర్ను తిట్టవలసిన అవసరం ఏముంది? ప్రతి అంశంలో అడ్డగోలుగా మాట్లాడడం, అబద్ధాలు ఆడటం తప్పించి, ఈ రెండేళ్లలో ఒక్కటంటే ఒక్క మంచి పని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేయలేదు. కేసీఆర్ ఏర్పాటు చేసిన చిన్న జిల్లాలను తీసివేయాలని ఈ ప్రభుత్వం కుట్ర పన్నుతోంది. ప్రజలు ఈ విషయాన్ని గుర్తించి ఓటేయాలి. గత పదేళ్లపాటు ప్రజలకు అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఇచి్చన పార్టీకి, రెండేళ్లలో ఉన్న సంక్షేమ పథకాలను ఎత్తివేసిన కాంగ్రెస్ పార్టీకి మధ్య ఎన్నికలు జరుగుతున్నాయి’అని కేటీఆర్ చెప్పారు. ఒక్కరికైనా తులం బంగారం ఇచ్చారా? కాంగ్రెస్ పార్టీ కల్యాణలక్ష్మీ కింద రూ.లక్షతో పాటు తులం బంగారం ఇస్తామని హామీ ఇచ్చింది. ఒక్కరికైనా రేవంత్రెడ్డి తులం బంగారం ఇచ్చారా? (బంగారం కొనలేదని, నా భార్య నన్ను తిడుతోందంటూ కేటీఆర్ నవ్వులు పూయించారు) నేతన్నల బతుకులను బజారున పడేశారు.బతుకమ్మ చీరలతో ఉపాధి పొందిన కార్మికులు ఇప్పుడు దిక్కులు చూస్తున్నారు. 12 ఏళ్లలో ఏమీ చేయలేని బీజేపీ నేతలు గుడిముందు బిచ్చగాళ్లలాగా.. దేవుడి పేరు చెప్పి ఓట్లు అడుక్కుంటున్నారు’అని కేటీఆర్ అన్నారు. ప్రచారంలో భాగంగా సిరిసిల్లలోని పలు వార్డుల్లో ఆయన పర్యటించారు. చిన్నారిని బుజ్జగిస్తూ, ఆడిస్తూ.. సిరిసిల్లలో ఒకటో వార్డు జ్యోతినగర్లో నిర్వహించిన భేటీలో ఓ మహిళ వద్ద ఉన్న చిన్నారిని కేటీఆర్ తీసుకుని బుజ్జగించి, ఆడించారు. -
26 నెలల్లో ఫోన్ట్యాపింగ్పై ఏ చర్యలు తీసుకున్నారో చెప్పాలి
సాక్షి, హైదరాబాద్ : బీఆర్ఎస్ పాలనలో సీఎం కుటుంబం, మంత్రులు, ఎమ్మెల్యేల అవినీతిపై దర్యాప్తు చేస్తామని హామీనిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ గత 26 నెలల పాలనలో ఏం చేసిందో చెప్పాలని కేంద్రమంత్రి జి.కిషన్రెడ్డి డిమాండ్ చేశారు. ఇప్పటికే 26 నెలలు పాలన పూర్తయినా ఫోన్ ట్యాపింగ్ వంటి తీవ్రమైన అంశంలో నిజమైన బాధ్యులపై ఎలాంటి కఠిన చర్యలు లేవన్నారు. దీనికి కాంగ్రెస్–బీఆర్ఎస్ మధ్య ఉన్న రాజకీయ అవగాహన ఒప్పందమే కారణమని చెప్పారు. ఢిల్లీ స్థాయిలో రాహుల్గాంధీ, మల్లికార్జున ఖర్గే– కేసీఆర్ మధ్య ఒప్పందం, అవగాహన కుదిరింది కాబట్టే తెలంగాణలో ఎన్ని అవినీతి, అక్రమాలకు పాల్పడ్డా ఎవరి మీదా చర్యలు తీసుకునే పరిస్థితి లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ 26 నెలల్లో మున్సిపాలిటీలకు ఎన్ని నిధులు విడుదల చేశారో ప్రకటించాలని డిమాండ్ చేశారు. బీజేపీ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం ఓ ఫంక్షన్ హాల్లో ‘సేవ్ తెలంగాణ–సపోర్ట్ బీజేపీ’ కార్యక్రమంలో భాగంగా కిషన్రెడ్డి మాట్లాడుతూ గత 12 ఏళ్లుగా ఎంఐఎం కనుసన్నల్లో నడుస్తున్న బానిస ప్రభుత్వాల పాలన తెలంగాణలో కొనసాగుతోందని ఆరోపించారు. ముస్లిం ఓట్లు, ఎంఐఎం మద్దతుకోసం దారుసలాం, ఒవైసీ బ్రదర్స్కు రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారన్నారు. కాంగ్రెస్ది కూడా ప్రజా ప్రభుత్వం కాదని మజ్లిస్ కనుసన్నల్లో మెదిలే బానిస ప్రభుత్వమని మండిపడ్డారు. మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అప్పుల కుప్పగా మార్చడంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పోటీపడు తున్నా యన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో రెండేళ్లుగా హడావుడి చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం, చివరకు తీసుకున్న ఏకైక చర్య ఏమిటంటే ఓ డీఎస్పీ స్థాయి అధికారిని సీఐగా డిమోట్ చేయడమేనన్నారు. ఈ 26 నెలల్లో రేవంత్రెడ్డి ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్లు, దర్యాప్తుల పేరుతో సీరియల్స్ కొనసాగి ంచినప్పటికీ, సాధించిన ‘గొప్ప విజయం’ఇదొక్కటేనని ఎద్దేవా చేశారు. -
రేవంత్ సర్టిఫికెట్ను వెనక్కి తీసుకోండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి నాయకత్వ కోర్సులో ఇచ్చిన సర్టిఫికెట్ను వెనక్కి తీసుకో వాలని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హార్వర్డ్ యూనివర్సిటీకి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన హార్వర్డ్ వర్సిటీ అధ్యక్షుడు అలన్ గార్బర్, డీన్ వెయిన్స్టీన్కు గురువారం ఈ–మెయిల్ పంపించారు. దేశంలో రేవంత్ మినహా ఏ ఇతర ముఖ్యమంత్రిపైనా 89 క్రిమినల్ కేసులు లేవన్నారు. ఓటుకు నోటు కేసులో ఏసీబీకి పట్టుబడి సుమారు 50 రోజులు రేవంత్ జైలులో గడిపిన విషయాన్ని అందులో ప్రస్తావించారు.‘సీఎంగా కుల, మత విభజనలపై ఆధార పడి రాజకీయాలు చేస్తూ, ప్రత్యర్థులు, వారి కుటుంబ సభ్యులపై అనుచితమైన, అసభ్యకరమైన వ్యా ఖ్యలు చేస్తున్నారు. రాజకీయ ప్రత్యర్థులను వేధించేందుకు తప్పుడు కేసులను ఆయుధాలుగా వినియోగిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా సుమారు 400 సంవత్సరాలుగా నైతికత కలిగిన నాయకు లను తయారు చేస్తోందని చెప్పుకునే హార్వర్డ్ కెన్నెడీ స్కూల్, ఇంత వివాదాస్పదమైన నేపథ్యం ఉన్న రాజకీయ నాయకుడికి సర్టిఫికెట్ ఇవ్వడం ఎలా సాధ్యమైంది.రేవంత్రెడ్డికి ఈ కోర్సులో ప్రవేశం కల్పించే సమయంలో ఎలాంటి నేపథ్య పరిశీలన జరగనట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఫీజుల కోసం వివాదాస్పద వ్యక్తులకు ఎగ్జిక్యూటివ్ కోర్సులను ‘‘అమ్ముకుంటూ’’, ప్రతిష్టాత్మక విద్యా సంస్థ ఈ స్థాయికి దిగజారడం నాకు సిగ్గుగా అనిపిస్తోంది. రేవంత్రెడ్డికి ఇచ్చిన నాయకత్వ కోర్సు సర్టిఫికెట్ను తక్షణమే రద్దు చేయాలని నేను డిమాండ్ చేస్తున్నాను’ అని ప్రవీణ్కుమార్ తన మెయిల్లో పేర్కొన్నారు. -
సమాజం అసహ్యించుకునేలా రేవంత్ భాష
సాక్షి, హైదరాబాద్: ‘ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి భాష సభ్య సమాజం అసహ్యించుకునేలా, తెలంగాణ ప్రతిష్టను దిగజార్చేలా ఉంది. ఆయన ప్రవర్తన తెలంగాణ సంస్కృతికే మాయని మచ్చ. దీనిపై మేధావులు, బుద్ధిజీవులు మౌనం వహించడం రాష్ట్రానికి ప్రమాదకరం. చరిత్రలో రేవంత్రెడ్డి బూతుల సీఎం గానే మిగిలిపోతారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చిన జాతిపిత కేసీఆర్ను చూసి ఓర్వలేక రేవంత్ విషం కక్కుతున్నారు’ అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్లీడర్ హరీశ్రావు ఘాటు వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆయన తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ.. తన రెండున్నరేళ్ల పాలనలో ప్రజలకు చేసిందేమీ లేక, తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే రేవంత్ వికృత భాషను ఆశ్రయిస్తున్నారని ధ్వజమెత్తారు.అమెరికా పర్యటన తర్వాత రేవంత్ చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే చాలా ఆవేదన కలుగుతోందని చెప్పారు. తెలంగాణ సాధించిన వ్యక్తిగా, ప్రజల ఆకాంక్షను నిజం చేసిన జాతిపితగా తెలంగాణ సమాజం కేసీఆర్ను పిలుచుకుంటోందని, దీన్ని చూసి రేవంత్రెడ్డికి ఎందుకంత కడుపునొప్పి అని హరీశ్రావు ప్రశ్నించారు. ‘ప్రతి ముఖ్యమంత్రికి ఆ రాష్ట్ర చరిత్రలో ఒక పేజీ ఉంటుంది. కానీ రేవంత్ రెడ్డి మాత్రం తెలంగాణ చరిత్రలో బూతుల ముఖ్యమంత్రిగా నిలిచిపోతాడు. కేసీఆర్ త్యాగాన్ని, కృషిని తక్కువ చేసి చూపించే ప్రయత్నం మాత్రమే రేవంత్రెడ్డి చేస్తున్నాడు’ అని మండిపడ్డారు.నెలకో స్కామ్ కేలండర్ ఇచ్చారుజాబ్ కేలండర్ ఇస్తానని నిరుద్యోగులను మోసం చేసిన రేవంత్.. నెలకో కుంభకోణంతో స్కామ్ కేలండర్ అమ లు చేస్తున్నారని హరీశ్రావు ఎద్దేవా చేశారు. ‘జనవరిలో పౌర సరఫరాల స్కామ్, ఫిబ్రవరిలో ఎన్టీపీసీ ఫ్లైయాష్ స్కామ్, మార్చిలో శాండ్ స్కామ్, ఏప్రిల్లో ఆర్టీసీ స్కామ్, మేలో బామ్మర్దికిచ్చిన అమృత్ టెండర్ల స్కామ్, జూన్లో ఫోర్త్ సిటీ స్కామ్, జూలైలో లగచర్ల, హెచ్సీయూల్యాండ్ స్కామ్, ఆగస్టులో పీజీ మెడికల్ సీట్ల స్కామ్, సెప్టెంబర్లో హిల్ట్పి ఇండస్ట్రియల్ స్కామ్, అక్టోబర్లో పవర్ స్కామ్, నవంబర్లో సింగరేణి స్కామ్, డిసెంబర్లో కేఎల్ఎస్ఆర్ స్కామ్ చేశారు’ అని ఆరోపించారు.మిర్యాలగూడ సభలోనూ రేవంత్ పచ్చి అబద్ధాలు మాట్లాడారన్నారు. తన కుర్చీని కాపాడుకునేందుకు బీజేపీతో చీకటి ఒప్పందం చేసు కున్నారని ఆరోపించారు. ‘బీజేపీ జాతీయనేతలు వచ్చి ఆర్ఆర్ ట్యాక్స్ అని అవినీతి గురించి మాట్లాడతారు తప్ప, ఎలాంటి విచారణ చేయరు. పొంగులేటి ఇంటిపై, భట్టి విక్రమార్క ఇంటిపై ఐటీ, ఈడీ దాడులు జరిగితే ఆ వివరాలు ఎందుకు బయటకు రావడం లేదు? ఇది కాంగ్రెస్–బీజేపీ చీకటి ఒప్పందానికి నిదర్శనం కాదా?’ అని హరీశ్రావు పేర్కొన్నారు. -
కేసీఆర్ మళ్లీ సీఎం అయితే సూపర్.. ఇదే జనం మాట: కేటీఆర్
సాక్షి,రాజన్న: మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి కేటీఆర్ విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, సీఎం రేవంత్రెడ్డిని రెండేళ్లలో అభివృద్ధి ఏం చేశారని ప్రశ్నిస్తే మహిళకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించామని అంటున్నారు. ఉచిత ప్రయాణం అంటే స్త్రీలకు ఫ్రీ ఇచ్చి, పురుషులకు రెట్టింపు చార్జీ వసూలు చేయడమేనా? అని ప్రశ్నించారు. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతోంది. అభ్యర్థులను గెలిపించుకునేందుకు ఆయా పార్టీల ముఖ్యనేతలు రంగంలోకి దిగారు. అభ్యర్థుల్ని గెలిపించుకునే బాధ్యతల్ని బుజాన వేసుకున్నారు. ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. గురువారం కేటీఆర్ సిరిసిల్ల మున్సిపల్ ఒకటవ వార్డు జ్యోతి నగర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో పెన్షన్లు నాలుగు వేలకు పెంచుతామని చెప్పారు. పెంచలేదు. ఎన్నికల తరువాత రైతుబంధు అంటున్నారు. రైతు బంద్కి ఎన్నికలకు ఏం సంబంధం..? ఫ్రీ స్కూటి ఇస్తానని, ఇవ్వకుండా లూటీ చేస్తున్నారు. నాపై కోపంతో సిరిసిల్ల జిల్లా తీసేస్తారట.మళ్ళీ కేసిఆర్ ముఖ్యమంత్రి అయితే బాగుంటుందని అంటున్నారు. జ్యోతినగర్ అభివృద్ధి విషయంలో ఏమైనా తప్పు జరిగితే క్షమించండి. కేసీఆర్ కిట్ తీసివేశారు, కేసీఆర్ పేరు ఉందని తీసేస్తారా..? అవసరమైతే ఇందిరమ్మ కిట్ అని పేరుపెట్టి, కొనసాగించాలి.కొత్త సంక్షేమ పథకాలు ఇవ్వడం కాదు, ఉన్న పథకాలు తీసేశారు.ఇక్కడి బీఆర్ఎస్ అభ్యర్దిని గెలిపించండి, జ్యోతినగర్ ను దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తాను.హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక పట్టించుకోని ప్రభుత్వానికి బుద్ది చెప్పే అవకాశం ఇదే’అని వ్యాఖ్యానించారు. -
తెలంగాణలో మరో స్కాం?.. ఆధారాలతో బయటపెట్టిన కేటీఆర్!
సాక్షి,తెలంగాణ భవన్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. దివాళా తీసిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి బినామీ కంపెనీకి వేలకోట్లు ప్రాజెక్టులు కట్టబెడుతున్నారని అన్నారు.బుధవారం తెలంగాణ భవన్లో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. గత రెండు సంవత్సరాలుగా ప్రధాన ప్రతిపక్ష పార్టీగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన స్కాం లు బయట పెడుతున్నాం. మూసి పేరిట లక్ష యాభై వేల కోట్ల స్కాంను, లగచర్ల స్కాం, హిల్ట్ పాలసీ స్కాంను బయట పెట్టాం. అలాగే అమృత్ స్కాంను కూడా బయట పెట్టాం. సింగరేణిలో భారీ కుంభకోణం తెరలేపితే బయట పెట్టాము. గత వారం రోజులుగా మమ్ముల్ని వరుసగా విచారణకు పిలుస్తుంటే మాకు డౌట్ వచ్చింది కానీ తవ్వితే ఒక స్కాం బయటకు వచ్చింది. దివాళా తీసిన ఓ ఇన్ఫ్రా సంస్థకు కాంట్రాక్ట్లు ఇచ్చారు. ఇది ముఖ్యమంత్రి బినామీ కంపెనీ. ఈ బినామీ కంపెనీకి వేలకోట్లు ప్రాజెక్టులు ఇస్తున్నారు. 2018 సెప్టెంబర్ 27 సదరు కంపెనీపై ఐటీ దాడులు జరిగాయి. ఈ దాడుల్లో ఇన్ఫ్రా కంపెనీపై అనుమానం వచ్చిందిరేవంత్ సీఎం కాకముందు ఆ కంపెనీ పేరుతో రిజస్ట్రరయిన కారులోనే తిరిగారు. 2023లో ఆ కంపెనీ దివాళా తీసింది. రేవంత్ ముఖ్యమంత్రిగా అదే కంపెనీకి వేలకోట్లు ప్రాజెక్ట్లు కట్టబెట్టారు. దివాళా తీసిన కంపెనీకి ప్రాజెక్ట్లు ఎలా ఇస్తారు? ఇది క్విడ్ ప్రో కాదు. సిబ్బందికి జీతాలు ఇవ్వలేని కంపెనీకి రూ.6వేల కోట్ల పప్రాజెక్ట్ పనులు ఇవ్వడం ఏంటి?. అదే కంపెనీ అవకతవకలపై విచారణ జరిపించాలని సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాల్ని కేటీఆర్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. -
కడియం అనర్హతపై నేడు విచారణ
సాక్షి, హైదరాబాద్: స్టేష న్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడి యం శ్రీహరిపై బీ ఆర్ఎస్ దాఖలు చేసిన అనర్హత పి టిషన్పై శాస నసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ట్రిబ్యునల్ బుధవారం విచారణ జరపనుంది. స్పీకర్ చాంబర్లో ఉదయం 11 గంటలకు జరిగే విచారణలో భాగంగా పిటిషనర్గా ఉన్న బీఆర్ఎస్ విప్, ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ వాంగ్మూలాన్ని నమోదు చేస్తారు.కడియం శ్రీహరి పార్టీ ఫిరాయింపులకు పాల్పడినట్లు ఏవైనా ఆ ధారాలు ఉంటే సమర్పించాలని స్పీకర్ ఆదేశించారు. విచారణకు సంబంధించిన షెడ్యూలు కాపీని వివేక్, కడియం శ్రీహరికి పంపుతూ అసెంబ్లీ కార్యదర్శి రేండ్ల తిరుపతి మంగళవా రం పంపించారు. ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హత పిటిషన్లపై ఈ నెల 18న స్పీకర్ విచారణ చేపట్టనున్నారు. -
పదేళ్లఅభివృద్ధి.. రెండేళ్ల వైఫల్యం
సాక్షి, హైదరాబాద్ : మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్ల ఘట్టం ముగియడంతో ప్రచార పర్వంపై బీఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో దృష్టి కేంద్రీకరించాలని, ప్రచార ఆర్భాటం లేకుండా స్థానిక నేతలు, కార్యకర్తలను సమన్వయం చేస్తూ ఎన్నికల ప్రచారం చేయాలని నిర్ణయించింది. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో జరిగిన స్థానిక అభివృద్ధి, రెండేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రధాన ఎజెండాగా తీసుకుని ప్రజల వద్దకు వెళ్లాలని నిర్ణయించింది. ఇప్పటికే మున్సిపల్ ఎన్నికల్లో సమన్వయం కోసం వార్ రూమ్ ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రచార పర్యవేక్షణ బాధ్యత పార్టీ సమన్వయకర్త లకు అప్పగించింది.116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పోరేష న్లకు కలిపి మొత్తం 125 మంది సమన్వయకర్తలుగా నియమించింది. అవసర మైన చోట మరికొంత మందిని కూడా సమన్వయ కర్తలుగా నియమించడంపై కసరత్తు జరుగుతోంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు, అసెంబ్లీలో బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావులు అవసరమైన చోట కార్నర్ మీటింగ్లు, రోడ్ షోల్లో పాల్గొనే అవకాశముందని బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. క్యాంప్ను వీడిన కొడంగల్ బీఆర్ఎస్ అభ్యర్థులునామినేషన్ల ఉపసంహరణ ఘట్టం మంగళవారం మధ్యాహ్నం మూడు గంటలకు ముగిసింది. ఈ నేపథ్యంలో పార్టీ అభ్యర్థులు బరి నుంచి తప్పుకుని కాంగ్రెస్ ఏకగ్రీవా లకు సహకరించకుండా ఉండేందుకు బీఆర్ఎస్ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. సీఎం రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలో కోస్గి, కొడంగల్, మద్దూరు మున్సి పాలిటీల్లో ఒత్తిళ్లు తీవ్ర స్థాయిలో వచ్చినట్లు పార్టీ నేతలు తెలిపారు. దీంతో పార్టీ అభ్యర్థులను కాపాడు కునేందుకు బీఆర్ఎస్ పార్టీ మూడు మున్సిపాలిటీ ల్లోని అభ్యర్థులను రెండు రోజులుగా ఓ రహస్య ప్రదేశానికి తరలించారు. మంగళవారం మధ్యాహ్నం నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం ముగిసిన తర్వాత బీఆర్ఎస్ అభ్యర్థులు క్యాంప్ను వీడి తమ ఇళ్లకు చేరుకుని ప్రచారాన్ని ప్రారంభించారు.ఉభయ కమ్యూనిస్టులతో స్థానిక పొత్తులుకాంగ్రెస్ పార్టీకి మిత్రపక్షంగా ఉన్న సీపీఐతోపాటు సీపీఎం పార్టీతోనూ బీఆర్ఎస్ పలు చోట్ల అవగా హన కుదుర్చుకుంది. మహబూబాబాద్, భువన గిరి, చౌటుప్పల్, క్యాతనపల్లి, బెల్లంపల్లితో పాటు నల్గొండ, మంచిర్యాల, కొత్తగూడెం కార్పొరేషన్ల పరిధిలో స్థానిక రాజకీయ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఒకటీ అరా స్థానాలను ఉభయ కమ్యూ నిస్టు పార్టీలకు బీఆర్ఎస్ కేటాయించింది. సీపీఐ ఎమ్మెల్యే ఉన్న కొత్తగూడెంలో సీపీఐ, సీపీఎం బీఆర్ఎస్తో అవగాహన కుదుర్చుకున్నాయి.ఒకటీ అరా వార్డులు ఏకగ్రీవంకాంగ్రెస్ నుంచి ఎదురైన బెదిరింపులు, ఒత్తిళ్లతో ఒకటీ అరా వార్డుల్లో తమ పార్టీ అభ్యర్థులు బరి నుంచి తప్పుకున్నట్లు బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. రామగుండం, మహబూబ్నగర్ మున్సి పల్ కార్పొరేషన్ల పరిధిలోని ఒక్కో వార్డులో బీఆర్ ఎస్ అభ్యర్థులు చివరి నిమిషంలో పోటీ నుంచి తప్పుకుని కాంగ్రెస్ ఏకగ్రీవాలకు మార్గం సుగమం చేశారు. యాదగిరిగుట్ట, పరకాల, చౌటుప్పల్, మెదక్ మున్సిపాలిటీల్లో ఒక్కో వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థులు తమ నామినేషన్ విత్డ్రా చేసుకోవడంతో కాంగ్రెస్ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నిక య్యారు. యాదగిరిగుట్ట మున్సిపాలిటీ పరిధిలో ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య పదో వార్డు అభ్యర్థిని బెదిరించి పోటీ నుంచి వైదొలిగేలా చేశారని బీఆర్ఎస్ ఆరోపించింది. -
బీఆర్ఎస్ అంటే భూ రాక్షసుల సమితి
కరీంనగర్: బీఆర్ఎస్ అంటే భూ రాక్షసుల పార్టీ అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్కుమార్ పేర్కొన్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో కనబడ్డ జాగాలన్నీ కబ్జా చేసి దోచుకుతిన్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ను గెలిపిస్తే ఇళ్లను కూడా కబ్జా చేసి పుస్తెల తాడును కూడా దోచుకుంటారని హెచ్చరించారు. మంగళవారం కరీంనగర్లోని కోతిరాంపూర్ చౌరస్తాలో నిర్వహించిన స్ట్రీట్ కార్నర్ మీటింగ్లో సంజయ్ పాల్గొన్నారు. మాజీ మేయర్ సునీల్రావుతోపాటు 9, 39, 40 డివిజన్ల అభ్యర్థులు బండారు గాయత్రి, పసుపులేటి శివానందం, కాసర్ల లక్ష్మీ నర్సవ్వ హాజరయ్యారు. ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వద్ద నయాపైసా లేదని, నన్ను కోసినా డబ్బులు రావని సాక్షాత్తు సీఎం రేవంత్ రెడ్డే చెప్పారని గుర్తుచేశారు. కాంగ్రెస్ను గెలిపిస్తే మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల అభివృద్ధికి ఎక్కడి నుంచి నిధులు తెస్తారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కరీంనగర్ అభివృద్ధి కోసం రూ.1,500 కోట్లు తీసుకొచ్చానని, వివరాలతో బుక్లెట్ కొట్టించి ఇంటింటికీ పంపుతున్నానని సంజయ్ చెప్పారు. ఈ వివరాలు తప్పైతే తనపై కేసు పెట్టుకోవచ్చని సవాల్ విసిరారు. ‘నేను రెండోసారి గెలిచినంక కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్లాల్ కట్టర్ను కరీంనగర్ తీసుకొచి్చనంక రూ.50 కోట్ల నిధులు వచ్చినయ్. స్మార్ట్ సిటీలో అక్కడ ఉన్న చెత్తను అప్పటికప్పుడు బయోమైనింగ్ చేసినందుకు రూ.18 కోట్లు కేంద్ర నిధులు రెడీగా ఉన్నయ్. కానీ నాడు బీఆర్ఎస్, నేడు కాంగ్రెస్ ఇద్దరూ ప్రత్యామ్నాయ స్థలం ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారు’అని సంజయ్ ఆరోపించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు మూడో స్థానం కోసమే పోటీ పడుతున్నాయన్నారు. కరీంనగర్ అభివృద్ధి కోసం నిధులు తెచ్చి యుద్ధం చేసే బీజేపీకి కత్తి ఇస్తారా? డాంబికాలు చెప్పి మోసం చేసే కాంగ్రెస్, బీఆర్ఎస్కు పట్టం కడతారా? ఆలోచించాలని కోరారు. -
కడియం శ్రీహరికి స్పీకర్ నోటీసులు
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యేల ఫిరాయింపు ఫిర్యాదుల వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ మంగళవారం నోటీసులు జారీ చేశారు. బుధవారం తమ ఎదుట విచారణకు రావాలని అందులో పేర్కొన్నారు. కడియం శ్రీహరి కారు పార్టీ మీద నెగ్గి కాంగ్రెస్లోకి ఫిరాయించారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద స్పీకర్కు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో రేపు ఉదయం 11గం. జరగబోయే విచారణకు రావాల్సిందిగా వివేకాకు కూడా నోటీసులు జారీ అయ్యాయి. కడియం, వివేకా వాదనలను స్పీకర్ విననున్నారు.మొత్తం పది మంది ఎమ్మెల్యేల ఫిరాయింపు పిటిషన్లు తన ముందుకు రాగా.. ఇప్పటికే ఏడుగురికి స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చారు. వాళ్లెవరూ పార్టీ మారలేదని.. బీఆర్ఎస్లోనే కొనసాగుతున్నట్లు తీర్పు ఇచ్చారు. దానం నాగేందర్ పిటిషన్ ఇంకా విచారణ దశలోనే ఉంది. ఇకప్పుడు కడియం శ్రీహరి పిటిషన్ విచారణ జరగబోతోంది. మరో ఎమ్మెల్యే సంజయ్ వ్యవహారంపై స్పీకర్ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. -
సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ
ఢిల్లీ : తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. బీఆర్ఎస్ సోషల్ మీడియా కార్యకర్త నల్లబాలుపై హైకోర్టు తీర్పును సవాల్ చేసిన తెలంగాణ ప్రభుత్వానికి షాక్ తగిలింది. సీఎం రేవంత్కు వ్యతిరేకంగా పోస్టలు పెట్టారనే ఆరోపణలపై నల్లబాలుపై నమోదు చేసిన మూడు కేసులను హైకోర్టు కొట్టివేయగా, దానిని సుప్రీంకోర్టులో సవాల్ చేసింది తెలంగాణ ప్రభుత్వం. అయితే హైకోర్టు తీర్పును అభినందిస్తున్నామని, మార్గదర్శకాలు ఇవ్వడంలో తప్పేం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం వేసిన పిటిషన్ను కొట్టేసింది సుప్రీంకోర్టుఅసలు ఏం జరిగిందంటే.. సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా సోషల్ మీడియా పోస్టులు పెట్టారని బీఆర్ఎస్ కార్యకర్త నల్లబాలుపై మూడు ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు పోలీసులు. వాటిని తెలంగాణ హైకోర్టు కొట్టివేయడమే కాకుండా పలు మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ మార్గదర్శకాలు ఇబ్బందికరంగా ఉన్నాయంటూ ఆ తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేసింది తెలంగాణ ప్రభుత్వం. దీనిపై ఈరోజు(సోమవారం, ఫిబ్రవరి 2వ తేదీ) విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. ఆ కేసులో హైకోర్టుఇచ్చిన తీర్పును అభినందించింది. మార్గదర్శకాలను ఇవ్వడంలో తప్పులేదంటూ పేర్కొంది ధర్మాసనం. ఈ కేసును తెలంగాణ ప్రభుత్వం తరఫున న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదించారు. -
నాలుగున్నర గంటలు.. కేసీఆర్ను ప్రశ్నించిన సిట్
సాక్షి, హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసును దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ను ఆదివారం ప్రశ్నించింది. నందినగర్లో ఉన్న ఆయన నివాసంలో మధ్యాహ్నం 3.30 గంటల నుంచి నాలుగున్నర గంటలపాటు వివిధ అంశాలపై విచారించింది. దీనికోసం కేసీఆర్ నివాసంలోకి మొత్తం 15 మందితో కూడిన సిట్ బృందం వెళ్లింది. అక్కడి రెండో అంతస్తులోని ఓ గదిలో నగర సంయుక్త సీపీ ఎస్ఎం విజయ్కుమార్ నేతృత్వంలో కేసు దర్యాప్తు అధికారిగా ఉన్న జూబ్లీహిల్స్ ఏసీపీ పి.వెంకటగిరి, ఐపీఎస్ అధికారి నారాయణరెడ్డి, నాన్ కేడర్ ఎస్పీ ఎం.రవీందర్రెడ్డి, అదనపు ఎస్పీ కేఎస్ రావు, ఏసీపీ సీహెచ్ శ్రీధర్లు కేసీఆర్ను ప్రశ్నించారు. సిట్ అధికారులు తమ వెంట ఇప్పటి వరకు దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన అంశాలతో కూడిన ఫైళ్లు, ఎల్రక్టానిక్ ఉపకరణాలు, వీటితోపాటు కేసుకు సంబంధించి ఇప్పటి వరకు సేకరించిన ఆధారాలు, నిందితులు, సాక్షుల వాంగ్మూలాల పత్రాలను రెండు ట్రంక్ పెట్టెల్లో తీసుకెళ్లారు. విచారణ ముగించుకొని రాత్రి తిరిగి వెళుతున్న సమయంలో సిట్ బృందం వీటిని తమ వెంట తీసుకెళ్లింది. బంజారాహిల్స్లోని ఐసీసీసీకి వెళ్లిన అధికారులు సిట్ చీఫ్గా ఉన్న నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్తో భేటీ అయ్యారు. కేసీఆర్ విచారణ తీరుతెన్నుల్ని ఆయనకు వివరించడంతోపాటు భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. కేసీఆర్ విచారణ నేపథ్యంలోపోలీసులు నందినగర్లో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. అనేక అంశాలపై ప్రశ్నలు గత వారంలో సిట్ అధికారులు కేసీఆర్కు రెండుసార్లు నోటీసులు ఇచ్చారు. మొదటి నోటీసు తర్వాత కేసీఆర్ సమయం కోరుతూ ఎర్రవల్లికి రావాలంటూ లేఖ రాశారు. ఈ అభ్యర్థనను తిరస్కరిస్తూ సిట్ మరో నోటీసులు జారీ చేసింది. నందినగర్లో విచారణకు సిద్ధమంటూ ఆయన శనివారం ప్రకటించారు. ఈ హఠాత్పరిణామాన్ని ఊహించని సిట్ అధికారులు అప్పటికప్పుడు ప్రశ్నావళిని సిద్ధం చేయడానికి ఉపక్రమించారు. దీంతో రాత్రంతా కూర్చున్న సిట్ బృందం కేసీఆర్ను అడగాల్సిన ప్రశ్నలు సిద్ధం చేసింది. ప్రభాకర్రావు, రాధాకిషన్రావు నియామకాలు, వీరి ఉద్యోగ విరమణ తర్వాత ఎక్స్టెన్షన్ ఇవ్వడం తదితరాలపై ప్రశ్నించింది. అప్పట్లో రాధాకిషన్రావు, భుజంగరావు పలుమార్లు ప్రగతి భవన్కు వెళ్లిరావడం, ట్యాపింగ్కు ఎంపిక చేసుకున్న ఫోన్ నంబర్లు, కొందరు బీఆర్ఎస్ నేతల ఫోన్లూ ట్యాప్ కావడం, వ్యాపారుల ఫోన్లపై నిఘా, బీఆర్ఎస్ పార్టీకి ఎలక్టోరల్ బాండ్లు రావడం తదితర అంశాలపై ప్రశ్నలు అడిగింది. సిట్ సిద్ధం చేసుకున్న ప్రశ్నలు, అనుబంధ ప్రశ్నలతో కలిపి నాలుగున్నర గంటల విచారణ సాగింది. అయితే కేసీఆర్ విచారణ నేపథ్యంలో సిట్ అధికారులు ఆ గదిలోకి ఎవరినీ అనుమతించలేదు. న్యాయవాదులకూ అనుమతి లేదని స్పష్టం చేసిన పోలీసులు కేసీఆర్ ఒక్కరినే ఉంచి ప్రశ్నించారు. ఈ విచారణ మొత్తాన్ని వీడియో రికార్డింగ్ చేసిన అధికారులు కేసీఆర్ వాంగ్మూలాన్నీ నమోదు చేసుకొని వెళ్లారు. రాత్రి 10 గంటల ప్రాంతంలో నందినగర్లోని నివాసం నుంచి ఎర్రవల్లికి కేసీఆర్ బయలుదేరి వెళ్లారు. ఆయన కాన్వాయ్ వెంట పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. -
ఉద్విగ్నం.. ఉత్కంఠ
సాక్షి, హైదరాబాద్/బంజారాహిల్స్: ఉద్విగ్న వాతావరణం నడుమ ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ సిట్ ఎదుట విచారణకు హాజరయ్యారు. విచారణకు కేసీఆర్ వస్తారో లేదోననే ఉత్కంఠకు తెరదించుతూ ఎర్రవల్లి నివాసం నుంచి ఆదివారం ఉదయం 11.30 గంటలకు బయలుదేరి హైదరాబాద్లోని నందినగర్కు మధ్యాహ్నం 2.30 గంటలకు చేరుకున్నారు. ఎర్రవల్లి నుంచి రాజీవ్ రహదారి మీదుగా హైదరాబాద్కు బయలుదేరిన కేసీఆర్ వెంట వందకు పైగా వాహనాలు అనుసరించాయి. రహదారుల వెంట బారులు తీరిన పార్టీ శ్రేణులు కేసీఆర్ వాహనంపై పూల వర్షం కురిపించారు. తనను చూసేందుకు వచ్చిన పార్టీ శ్రేణులు, అభిమానులకు అభివాదం చేస్తూ కేసీఆర్ ముందుకు సాగారు. సుమారు 3 గంటల ప్రయాణం తర్వాత.... ఎర్రవల్లి నుంచి నందినగర్కు చేరుకోవడానికి కేసీఆర్ కాన్వాయ్కు సుమారు 3 గంటలు పట్టింది. కేసీఆర్కు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వాగతం పలికి నివాసంలోకి తోడ్కొని వెళ్లారు. పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు, మాజీ ఎంపీ సంతోశ్తోపాటు పార్టీ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ ఉదయం నుంచే నందినగర్ నివాసంలో వేచి ఉండటంతోపాటు సిట్ విచారణకు అవసరమైన ఏర్పాట్లను పర్యవేక్షించారు. సిట్ బృందం వేచి చూస్తున్న గదిలోకి కేసీఆర్ తన న్యాయవాదులు గండ్ర మోహన్రావు, రామచంద్రరావుతో కలిసి వెళ్లారు. పోలీసు దిగ్బంధంలో బంజారాహిల్స్ నందినగర్లోని కేసీఆర్ నివాసంతోపాటు తెలంగాణ భవన్ వద్ద ఆదివారం భారీ ఎత్తున పోలీసులు మోహరించారు. శనివారం అర్ధరాత్రి నుంచే పోలీసులు కేన్సర్ ఆస్పత్రి చౌరస్తా, తెలంగాణ భవన్ పరిసర ప్రాంతాల్లో పోలీస్ పికెట్లు ఏ ర్పాటు చేశారు. మొత్తంగా 750 మంది పోలీసులు బందో బస్తు నిర్వహించారు. మొత్తం 52 పికెట్లు, నలుగురు డీసీపీ లు, ఆరుగురు ఏసీపీలు, 30 మంది సీఐలు, 60 మంది ఎస్ ఐలు, కానిస్టేబుళ్లు, ఉమెన్ కానిస్టేబుళ్లతోపాటు టాస్్కఫోర్స్ పోలీసులు పెద్ద ఎత్తున ఈ బందోబస్తులో పాల్గొన్నారు. నినాదాలతో హోరెత్తిన నందినగర్ నందినగర్లోని కేసీఆర్ నివాసానికి చేరుకునేందుకు పెద్ద సంఖ్యలో వివిధ ప్రాంతాల నుంచి బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు తరలివచ్చారు. అయితే ఆయన నివాసానికి చేరుకోకముందే పలుచోట్ల పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. సాయంత్రం 3 గంటల ప్రాంతంలో పోలీసుల కళ్లుగప్పి కొంతమంది యువకులు బసవతారకం కేన్సర్ ఆస్పత్రి వైపు నుంచి కేసీఆర్ ఇంటి వైపు పరుగులు తీస్తుండగా, అప్పటికే అక్కడ బందోబస్తులో ఉన్న పోలీసులు వారిని బలవంతంగా అరెస్టు చేసి తరలించారు. పార్టీ కేడర్, నేతలకు కేసీఆర్ అభివాదం సుమారు నాలుగున్నర గంటల సిట్ విచారణ రాత్రి ఎనిమిది గంటల సమయంలో ముగిసింది. సిట్ అధికారులు ని్రష్కమణ తర్వాత తెలంగాణ భవన్లో ఉదయం నుంచి వేచి ఉన్న పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున నందినగర్ నివాసానికి చేరుకున్నారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కేసీఆర్ను కలివారు. బయట భారీ సంఖ్యలో వేచి ఉన్న కేడర్కు కేసీఆర్, కేటీఆర్ అభివాదం చేశారు. నందినగర్ నివాసం ఎదుట గుమికూడిన పార్టీ శ్రేణులు సీఎం సీఎం అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశాయి. పార్టీ ముఖ్య నేతలతో భేటీ అనంతరం కేసీఆర్ ఆదివారం రాత్రి తిరిగి ఎర్రవల్లి నివాసానికి బయలుదేరి వెళ్లారు. -
బీఆర్ఎస్ రాష్ట్ర వ్యాప్త నిరసనలు
సాక్షి, హైదరాబాద్/బంజారాహిల్స్ : బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్కు ఫోన్ ట్యాపింగ్ కేసులో ‘సిట్’నోటీసులు జారీ చేయడానికి నిరసనగా ఆ పార్టీ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా నిరసన తెలిపాయి. 12 వేలకు పైగా గ్రామాలు, మండల, నియోజకవర్గ, జిల్లా కేంద్రాల్లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు జరిగాయి. ఊరూరా సీఎం రేవంత్రెడ్డితోపాటు, ప్రభుత్వ దిష్టి»ొమ్మలు దహనం చేశా రు. నల్ల జెండాలతో ర్యాలీలు, బైక్ ర్యాలీలు, ధర్నా లు, రాస్తారోకోలు తదితర నిరసన కార్యక్రమాల్లో మాజీ మంత్రులు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు పాల్గొన్నారు. నిరసన కార్యక్రమాల నేప థ్యంలో పలుచోట్ల పోలీసులు, బీఆర్ఎస్ శ్రేణుల నడుమ వాగ్వాదం, తోపులాటలు చోటు చేసుకున్నాయి. నిరసనకారులను పోలీసులు పలుచోట్ల అదుపులోకి తీసుకొని స్టేషన్లకు తరలించారు. సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్యాదవ్ను కేసీఆర్ నివాసానికి కూతవేటు దూరంలో ఆపేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ నందినగర్కే రావాలని పట్టుబట్టడం కక్ష సాధింపు రాజకీయాలకు నిదర్శనమన్నారు. రేవంత్ దిష్టిబొమ్మకు ఉరి తెలంగాణ భవన్కు ర్యాలీగా చేరుకున్న పార్టీ నేతలు మన్నె క్రిశాంక్, కిశోర్గౌడ్ తదితరులు సీఎం దిష్టి»ొమ్మను దహనం చేశారు. కొందరు కార్యకర్తలు సీఎం వ్యతిరేక నినాదాలు చేస్తూ రేవంత్ దిష్టి»ొమ్మకు ఉరి వేసి తెలంగాణ భవన్కు వేలాడదీశారు. సచివాలయం వద్ద పార్టీ శ్రేణులు సీఎం దిష్టి»ొమ్మను దహనం చేశారు. తెలంగాణ భవన్లో గాయకులు మిట్టపల్లి సురేందర్, మానుకోట ప్రసాద్, మద్దెల సందీప్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పాటలు పాడారు. మంత్రుల నివాస సముదాయం ముట్టడి బీఆర్ఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్, ఉపాధ్యక్షుడు తుంగ బాలు నే తృత్వంలో మంత్రుల నివాస సముదాయాన్ని ము ట్టడించారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని బంజారాహిల్స్ పోలీస్స్టేషన్కు తరలించారు. బీఆర్ఎస్ నేతల ఆగ్రహం తమ పార్టీ అధినేత కేసీఆర్ను విచారణ పేరిట రేవంత్ ప్రభుత్వం వేధింపులకు గురి చేస్తోందని బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. శాసనమండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి, మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్రెడ్డి, ఎమ్మెల్సీలు దేశపతి శ్రీనివాస్, శంభీపూర్ రాజు, దాసోజు శ్రవణ్, నవీన్కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే కేపీ వివేకానంద, పార్టీ నేతలు ఎర్రోళ్ల శ్రీనివాస్, దేవీప్రసాద్ తదితరులు వేర్వేరుగా మీడియా సమావేశా లు నిర్వహించి ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. సీఎం ఇంటి ముందు భారీగా పోలీసుల మోహరింపు బీఆర్ఎస్ కార్యకర్తలు నగరంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టిన నేపథ్యంలో జూబ్లీహిల్స్లోని సీఎం రేవంత్రెడ్డి ఇంటి ఎదుట భారీగా పోలీసులను మోహరించారు. ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ఆధ్వర్యంలో సీఎం రేవంత్రెడ్డి ఇంటి ముట్టడికి యత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. -
‘రేవంత్ రెడ్డి..సిట్టూ.. లట్టు.. పొట్టు అంటూ టైం పాస్ చేస్తున్నారు’
సాక్షి,హైదరాబాద్: సిట్ అంటే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ కాదని.. సిట్ అంటే సీఎం ‘సీఎం ఇన్స్ట్రక్షన్ టీమ్’ అంటూ బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ సిట్ విచారణపై మాజీ మంత్రి హరీష్ రావు ఎద్దేవా చేశారు.తెలంగాణ ఫోన్ ట్యాపింగ్పై నందినగర్ నివాసంలో కేసీఆర్ను సిట్ అధికారుల విచారణ కొనసాగుతుంది. ఈ క్రమంలో కేసీఆర్ సిట్ విచారణపై హరీష్ రావు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఆ ట్వీట్లో..సిట్ పేరిట జరుగుతోంది దర్యాప్తు కాదు, ప్రతిపక్ష నేతపై ప్రతీకార దాడి నోటీసుల వెనుక చట్టం లేదు, కేవలం రాజకీయ ప్రతీకారం,రేవంత్ రెడ్డి అహంకారం మాత్రమే ఉంది. సిట్ పేరిట సుప్రీంకోర్టు స్పష్టమైన మార్గదర్శకాలను బహిరంగంగా ఉల్లంఘించారు. నోటీసులు ఇవ్వడంలో కనీస చట్టపరమైన విధానాలే పాటించలేదు.కేసీఆర్ ఎక్కడ ఉంటున్నారో ఈ రాష్ట్రానికి తెలియదా? ఇంటలిజెన్స్ వ్యవస్థ మొత్తం ఎర్రవెల్లి చుట్టే ఉన్నా నందినగర్ గోడలకు నోటీసులు అంటించడం మీ చౌక బారు రాజకీయానికి నిదర్శనం. పదేళ్లు రాష్ట్రాన్ని నడిపిన ముఖ్యమంత్రికి ఇదేనా కాంగ్రెస్ పాలన ఇచ్చే మర్యాదా? ప్రజలు ఎన్నుకున్న ప్రతిపక్ష నేతపై రేవంత్ ప్రభుత్వం వ్యవహరించి తీరు ప్రజాస్వామ్యానికి అవమానకరం.పాలన చేతకాక, హామీలు నెరవేర్చలేక, ప్రజా సమస్యలకు సమాధానం చెప్పలేక ప్రతిపక్షంపై కక్ష తీర్చుకోవడమే కాంగ్రెస్ ఏకైక అజెండా అయ్యింది. ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతను పక్కదారి పట్టించేందుకు, వరుస కుంభకోణం నుంచి దృష్టి మళ్లించేందుకు సిట్ పేరుతో నోటీసులు జారీ చేయడం రేవంత్ రెడ్డి చిల్లర, చౌకబారు రాజకీయాలకు పరాకాష్ట. ఇలాంటి రాజకీయ వేధింపులతో మున్సిపల్ ఎన్నికల్లో లబ్ధి పొందవచ్చని భావించడం రేవంత్ రెడ్డి రాజకీయ దివాలా కోరుతనానికి నిదర్శనం.చరిత్రను సృష్టించినవాడు కేసీఆర్ అయితే, ఆ చరిత్రను మలినం చేయాలని చూస్తున్న చరిత్రహీనుడు రేవంత్ రెడ్డి. సిట్ అంటే సిట్ కాదు. ఇది CIT సిట్..‘సీఎం ఇన్స్ట్రక్షన్ టీమ్’. విదేశాల్లో ఉన్న సీఎం ఫోన్ చేసి ఏది చెబితే ఇక్కడ అది పాటిస్తున్నారు పోలీసులు. సిట్ స్వతంత్రంగా పని చేయడం లేదు, సీఎం కార్యాలయం నుండి వచ్చే ఆదేశాలకే పని చేస్తోంది. సిట్ అంటే సిట్ స్టాండ్ అంటే స్టాండ్. చట్టాన్ని ఉల్లంఘిస్తూ, రాజ్యాంగాన్ని అవమానిస్తున్నారు.మీరు ఇచ్చిన నోటీసులు చట్ట బద్దం కావు మీరు అనుసరించిన విధానం రాజ్యాంగం బద్దం కాదు. అయినా సరే.. మాజీ ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నాయకుడిగా, బాధ్యతాయుతమైన భారత పౌరుడిగా కెసిఆర్ దర్యాప్తుకు సహకరిస్తున్నారు. అధికారం మదంతో సిట్ పేరిట నువ్వు చేస్తున్న డ్రామాలు నీ వికృత వైఖరికి, నీ పరిపాలనా చేతగానితనానికి నిదర్శనం. కేసీఆర్ దర్యాప్తుకు పూర్తిగా సహకరిస్తున్నా.. పోలీసులు ఎందుకు అతి చేస్తున్నట్లు?. మా నాయకులు, కార్యకర్తలను ఎక్కడిక్కడ అరెస్టులు చేశారు, అదుపులోకి తీసుకున్నారు.గజ్వేల్ నుండి హైదరాబాద్ దాకా వేలాది మంది పోలీసులను మోహరించారు. బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలను ఇబ్బందులకు గురి చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరిస్తున్నాం. రెండేళ్లుగా చేసింది లేదు, చెప్పుకునేందుకు ఏదీ లేదు అందుకే రేవంత్ రెడ్డి..సిట్టూ.. లట్టు.. పొట్టు అంటూ టైం పాస్ చేస్తున్నడు. దర్యాప్తు పేరు చెప్పి ముందే తీర్పు రాయడం కాంగ్రెస్ రాజకీయ సంస్కృతి. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం ప్రశ్నించాలి. కానీ కాంగ్రెస్ పాలనలో ప్రశ్నిస్తే నోటీసులు, మాట్లాడితే అరెస్టులు. ఇది కాంగ్రెస్ న్యూ డెమోక్రసీ మోడల్ రైతుల కష్టాలు పట్టవు, యువతకు ఉద్యోగాలు ఇవ్వరు, అవ్వా తాతలకు పింఛన్లు పెంచరు. ఆరు గ్యారెంటీల అమలు చేయరు కానీ.. ప్రతిపక్షాలను టార్గెట్ చేస్తున్నారు. కేసీఆర్కు నోటీసులు ఇవ్వడం ద్వారా కాంగ్రెస్ తన భయాన్ని బహిరంగంగా ప్రకటించింది. భయపడే ప్రభుత్వాలే ప్రతిపక్షాన్ని టార్గెట్ చేస్తాయి. చరిత్ర సృష్టించిన నాయకుడిని,కేసులు పెట్టి చిన్నబుచ్చగలమని అనుకోవడం కాంగ్రెస్ భ్రమ. చరిత్రను చెరిపేయలేరు. ప్రజల గుండెల్లో ఉన్న కేసీఆర్ పేరును తుడిచేయలేరు’ అని పేర్కొన్నారు. -
కాంగ్రెస్ వైఫల్యాలపై రేపు బీజేపీ చార్జిషీట్
సాక్షి, హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రెండేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై బీజేపీ సోమవారం చార్జిషీట్ విడుదల చేయనుంది. నగర, పట్టణ ప్రాంతాల్లో నెలకొన్న సమస్యలు, విద్య, వైద్య వ్యవస్థల్లో వైఫల్యాలు, నిరుద్యోగ భృతి హామీ, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ వంటివి అమలు చేయకపోవడం తదితర అంశాలను అభియోగపత్రంలో ప్రముఖంగా ప్రస్తావించనున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. కాంగ్రెస్ ప్రభుత్వం 30 శాతం కమీషన్ సర్కార్గా మారిందని.. ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తూ ఆర్థిక అరాచకానికి పాల్పడుతోందని.. ఒక వర్గం వారికి అనుకూలంగా వ్యవహరిస్తూ హిందూ వ్యతిరేకిగా మారిందని ఆరోపిస్తూ ఆయా అంశాలను పొందుపరచనున్నట్లు తెలిసింది. సేవ్ తెలంగాణ, ఓట్ ఫర్ బీజేపీ నినాదంతో... మున్సిపల్ ఎన్నికలకు సేవ్ తెలంగాణ–ఓట్ ఫర్ బీజేపీ అనే ప్రధాన నినాదంతోపాటు కాంగ్రెస్ పాలనలో మార్పు రాలే... తెలంగాణ బతుకులు మారలే, పట్టణ ప్రగతి బీజేపీతోనే పురోగతి అనే నినాదాలతో ప్రజల్లోకి వెళ్లాలని పార్టీ రాష్ట్ర నాయకత్వం నిర్ణయించింది. 2021 జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 150 డివిజన్లకుగాను 48 డివిజన్లలో గెలిచేందుకు అనుసరించిన వ్యూహాన్నే ప్రస్తుత మున్సిపల్ ఎన్నికల్లోనూ అమలు చేయనుంది.జాతీయ నేతలు, కేంద్ర మంత్రుల సుడి గాలి పర్యటనలు, ముఖ్యనేతల రోడ్ షోలు, చార్జిషీట్ల విడుదలతో ప్రచారాన్ని హోరెత్తించనుంది. ఒక్కోరోజు ఒక్కో మున్సిపాలిటీలోని అన్ని స్థానాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు పూర్తిస్థాయి ప్రచారం (కార్పెట్ బాంబింగ్ తరహాలో)నిర్వహించేలా ప్రణాళికలు రూపొందిస్తోంది. ప్రజలకిచ్చిన హామీల అమల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ వైఫల్యాలతోపాటు ఆయా పార్టీలపై వచ్చిన అవినీతి ఆరోపణలే ప్రచారాస్త్రంగా మొత్తంగా పురపాలిక ఎన్నికల కోసం ఒక మేనిఫెస్టోను.. ఒక్కో కార్పొరేషన్, ఒక్కో మున్సిపాలిటీకి వేర్వేరుగా మేనిఫెస్టోలను ప్రకటించనుంది. స్థానికంగా ఎక్కడికక్కడ చార్జిషీట్లను విడుదల చేయనున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. శనివారం బీజేపీ కార్యాలయంలో జరిగిన బ్రేక్ఫాస్ట్ మీటింగ్ సందర్భంగా మున్సిపల్ ఎన్నికల ఇన్చార్జీలకు బీజేపీ అధ్యక్షుడు ఎన్.రాంచందర్రావు, ఎన్నికల ఇన్చార్జీలు బీఫారాలు అందించారు. 4న పాలమూరుకు నితిన్ నబీన్... ఎన్నికల ప్రచారంలో భాగంగా మొత్తం నాలుగు పెద్ద బహిరంగ సభలు, ఎక్కడికక్కడ రోడ్డు షోలను బీజేపీ నిర్వహించనుంది. ఈ నెల 4న ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా బూత్ స్థాయి కార్యకర్తల సమావేశానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. జాతీయ అధ్యక్షుడిగా నియమితులయ్యాక తొలిసారి తెలంగాణ పర్యటనకు వస్తున్న ఆయన.. అక్కడి మున్సిపల్ ఎన్నికల బహిరంగ సభలో ప్రసంగించనున్నట్లు తెలిసింది. ఈ నెల 8న నిర్మల్లో నిర్వహించే మరో బహిరంగ సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాల్గొననున్నట్లు సమాచారం. మున్సిపల్ ఎన్నికల్లో మొత్తంగా 3, 4 కార్పొరేషన్లు, సగానికిపైగా మున్సిపాలిటీల్లో గెలిచి సత్తా చాటాలని కమలనాథులు ఉవి్వళ్లూరుతున్నారు. -
సర్వేలు.. సమన్వయం
సాక్షి, హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న బీఆర్ఎస్ క్షేత్రస్థాయిలో పార్టీ యంత్రాంగాన్ని సమన్వయం చేయడంపై దృష్టి కేంద్రీకరించింది. అభ్యర్థుల ఎంపిక మొదలు కుని అసంతృప్తుల బుజ్జగింపు, అధికార పార్టీ ఒత్తిళ్లను అధిగమించడం, కేడర్ను సమీకరించి ప్రచా రం తదితరాల్లో సమన్వయానికి పెద్దపీట వేస్తోంది. ఫోన్ ట్యాపింగ్ అంశంలో పార్టీ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్రావు, సంతోష్లకు నోటీసులు, విచారణ పేరిట హడావుడి జరుగుతున్నా ఎన్నికల్లో పార్టీ పనితీరుపై ప్రభావం పడకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇప్పటికే అభ్యర్థుల ఎంపిక కోసం సర్వేలను ప్రామాణికంగా తీసుకున్న బీఆర్ఎస్ మరోమారు సర్వే చేసి అందుకు అనుగుణంగా ప్రచార వ్యూహాన్ని అమలు చేయాలని భావిస్తోంది. వార్రూమ్.. సమన్వయకర్తలు ఎన్నికల్లో పార్టీ నేతలు, యంత్రాంగాన్ని సమన్వయం చేసేందుకు బీఆర్ఎస్ వార్రూమ్ ఏర్పాటు చేసింది. మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, పార్టీ ప్రధాన కార్యదర్శి రావుల చంద్రశేఖర్రెడ్డి ప్రస్తుతం వార్రూమ్ ఇన్చార్జీలుగా వ్యవహరిస్తున్నారు. ఒకట్రెండు రోజుల్లో 9 మంది నేతలతో వార్రూమ్ను విస్తరించి ఉమ్మడి జిల్లాల వారీగా బాధ్యతలు అప్పగించనున్నారు. అభ్యర్థుల ఎంపిక, అసంతృప్తుల బుజ్జగింపు, ప్రచారం తదితరాలను సమన్వయం చేసేందుకు 116 మున్సిపాలిటీలు, ఏడు కార్పొరేషన్లకు 125 మంది నేతలను సమన్వయకర్తలుగా నియమించారు. జిల్లా కలెక్టర్లకు ఫారమ్–ఏ పంపిన కేసీఆర్ జిల్లాలు, అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా కొందరు పార్టీ నేతలకు బీ ఫామ్లు జారీ చేసే అధికారాన్ని ఇస్తూ ఫారమ్–ఏను కేసీఆర్ సంబంధిత జిల్లా కలెక్టర్లకు పంపించారు. కేసీఆర్ పేర్కొన్న నేతలు మాత్రమే పార్టీ ఎంపిక చేసిన అభ్యర్థులకు బీ ఫారం జారీ చేస్తారు.బీ ఫారాల జారీలో ఎక్కడైనా సమస్య తలెత్తితే ఫారమ్–సీ కూడా కేసీఆర్ కలెక్టర్లకు అందజేసిన జాబితాలో ఉన్న నేతలు మాత్రమే జారీ చేస్తారు. ఇప్పటికే చాలా మున్సిపాలిటీల్లో అభ్యర్థుల ఎంపిక కొలిక్కి రాగా, మూడో తేదీ మధ్యాహ్నం మూడు గంటల్లోగా పెండింగులో ఉన్న అభ్యరి్థత్వాలను కూడా ఖరారు చేసి బీ ఫారాలు ఇస్తారు. కాంగ్రెస్ ఏకగ్రీవ ప్రయత్నాలకు అడ్డుకట్టనామినేషన్ల స్రూ్కటినీ, ఉపసంహరణ సందర్భంగా పార్టీ ఎంపిక చేసిన అభ్యర్థులు జారిపోకుండా బీఆర్ఎస్ అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. సీఎం రేవంత్రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్, మద్దూరు తదితర మున్సిపాలిటీల్లో తమ అభ్యర్థులను పోటీ నుంచి తప్పించి ఏకగ్రీవం చేసుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తోందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. బెదిరింపులు, ప్రలోభాలకు అభ్యర్థులు లోనవకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. దీనికోసం వార్రూమ్ నుంచి అభ్యర్థులకు అవసరమైన సహాయం అందించేలా కసరత్తు జరుగుతోంది. కాగా, ఎన్నికల ప్రచారానికి ఆరు రోజులు మాత్రమే గడువు ఉండటంతో కేటీఆర్, హరీశ్రావు రావాలంటూ అభ్యర్థుల నుంచి విన్నపాలు అందుతున్నాయి. కేసీఆర్ ఆదేశాల మేరకు కేటీఆర్, హరీశ్ ప్రచార షెడ్యూలు ఉంటుందని పార్టీ వర్గాలు చెప్పాయి. వీరిద్దరి ప్రచార షెడ్యూల్పై సస్పెన్స్ తొలగించి స్పష్టత ఇవ్వాలని పార్టీ నేతలు కోరుతున్నారు. -
నోటీసు చట్టబద్దంగా లేదు.. 'అయినా విచారణకు రెడీ'
సాక్షి, హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరు కావాలంటూ సిట్ జారీ చేసిన నోటీసుల తీరుపై బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. నందినగర్లోని ఇంటి గోడపై అంటించిన నోటీసు చట్టబద్ధంగా లేదన్నారు. తనకు నోటీసు జారీ చేసే అధికారం సిట్కు లేదన్నారు. తన వాంగ్మూలాన్ని ఎర్రవల్లి నివాసంలోనే నమోదు చేయాల్సిన చట్టపరమైన బాధ్యత సిట్పై ఉందన్నారు. అయినా మాజీ ముఖ్యమంత్రిగా, శాసనసభలో ప్రతిపక్ష నేతగా, బాధ్యతాయుత పౌరుడిగా దర్యాప్తునకు సహకరిస్తానని ప్రకటించారు. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్ నందినగర్ నివాసంలో వాంగ్మూలం ఇచ్చేందుకు అందుబాటులో ఉంటానని పేర్కొన్నారు. ఈ మేరకు సిట్ విచారణ అధికారిగా ఉన్న జూబ్లీహిల్స్ డివిజన్ ఏసీపీ వెంకటగిరికి శనివారం కేసీఆర్ సుదీర్ఘ లేఖ రాశారు. సుప్రీం తీర్పుల ఉల్లంఘన కిందకే.. ‘సీఆర్పీసీ సెక్షన్ 160 ప్రకారం 65 ఏళ్ల వయసు దాటిన నా వాంగ్మూలాన్ని నేను నివసిస్తున్న చోటే నమోదు చేయాలి. నేను కొన్నేళ్లుగా సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోనే నివసిస్తున్నా. భవిష్యత్తులో నాకు పంపే నోటీసులు ఎర్రవల్లి చిరునామాకే పంపాలని జనవరి 29న మీకు లేఖ రాశాను. నా లేఖకు ప్రతిస్పందనగా గుర్తు తెలియని కొందరు వ్యక్తులు మీ సంతకంతో ఉన్నట్లుగా పేర్కొంటున్న లేఖను జనవరి 30న హైదరాబాద్ నందినగర్లోని ఇంటి గోడకు అంటించారు. మీ ఆదేశాల మేరకు ఈ లేఖ పంపితే దానిపై నేను తీవ్ర అభ్యంతరం తెలుపుతున్నాను. ఈ విధమైన చర్యలు రాజ్యాంగం, చట్టం పట్ల మీకు గౌరవం లేదనే భావనను కలిగిస్తున్నాయి. వాట్సాప్ లేదా గోడపై నోటీసులు అంటించడం వంటి పద్ధతులు చెల్లవని సుప్రీంకోర్టు అనేక తీర్పులు ఇచి్చంది’అని కేసీఆర్ లేఖలో పేర్కొన్నారు. నోటీసు జారీ చేసే అధికారం మీకు లేదు ‘చట్టవిరుద్దంగా ఇచ్చిన నోటీసును నేను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. రాజ్యాంగ నిబంధనల ప్రకారం నేను మీ పోలీస్ స్టేషన్ లేదా అనుబంధ స్టేషన్ల పరిధిలో నివసించడం లేదు. కాబట్టి నాకు నోటీసు జారీ చేసే మీకు అధికారం లేదు. నోటీసులు వ్యక్తిగతంగా అందజేయాలనే సుప్రీంకోర్టు మార్గదర్శకాలను విస్మరించడం కోర్టు ధిక్కరణ కిందకే వస్తుంది. ఎన్నికల అఫిడవిట్లో ఉన్న చిరునామా ఆధారంగా ఎర్రవల్లి నివాసంలో విచారణకు అంగీకరించడం లేదని జనవరి 30న నాకు పంపిన లేఖలో పేర్కొన్నారు. సెక్షన్ 160 ప్రకారం నోటీసు ఇచ్చే సమయంలో వ్యక్తి వాస్తవంగా నివసిస్తున్న స్థలానికే ప్రాధాన్యత ఉంటుంది. నేను కొన్నేళ్లుగా ఎర్రవల్లిలోనే ఉంటున్నందున నా నివాసంలోనే విచారణ జరపాల్సిన బాధ్యత మీపై ఉంది’అని కేసీఆర్ పేర్కొన్నారు. నేడు నందినగర్కు కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ అంశంలో క్రైమ్ నెం.243/2024 దర్యాప్తునకు సంబంధించి సిట్ ఎదుట హాజరు కావాల్సిందిగా జూబ్లీహిల్స్ ఏసీపీ ఈనెల 29న కేసీఆర్కు నోటీసులు అందజేశారు. అయితే మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మరో రోజున హాజరవుతానని కేసీఆర్ అదేరోజు ఏసీపీకి లేఖ రాశారు. అయితే రాజ్యాంగ నిబంధనల ప్రకారం తాను ఉంటున్న ఎర్రవల్లి నివాసంలోనే విచారణ జరపాలని కేసీఆర్ కోరారు. ఈ నేపథ్యంలో ఈ నెల 30న కేసీఆర్కు ఏసీపీ మరో నోటీసు జారీ చేస్తూ ఎర్రవల్లిలో విచారణ కుదరదని, నందినగర్ నివాసానికి రావాలని స్పష్టం చేశారు. ఈ నోటీసులపై కేసీఆర్ స్పందిస్తూ ఆదివారం ఏసీపీకి మరో లేఖ రాశారు. చట్టపరమైన అంశాలను పక్కన పెట్టి నందినగర్ నివాసంలో వాంగ్మూలం ఇస్తానని చెప్పారు. విచారణకు హాజరయ్యేందుకు ఎర్రవల్లి నివాసం నుంచి కేసీఆర్ ఆదివారం ఉదయం నందినగర్కు చేరుకోనున్నారు. -
ఇంకా ఎన్ని ట్విస్టులు ఉంటాయో!
తెలంగాణాలో ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ తీరు ఒక డ్రామాగా మారిపోతోంది. గొంగట్లో తింటూ వెంట్రుకలు ఏరుతున్నట్లుగా ఉంది. ఫోన్ ట్యాపింగ్ అనేది సమర్థనీయం కాదు కానీ.. ఇది బీఆర్ఎస్ పాలనలో మాత్రమే జరిగిందన్నట్టుగా వ్యవహరించడం సమస్యకు మూలమవుతోంది. ట్యాపింగ్ గుట్టు పోలీస్ అధికారులందరికీ తెలిసిన విషయమే. సంఘ విద్రోహశక్తుల విషయంలో టెలిఫోన్ ట్యాపింగ్ వాడటం అన్నది చాలాకాలంగా జరుగుతున్నదే. ఇందుకోసం చట్టాలు కూడా ఉన్నాయి. అయితే కొందరు రాజకీయ నాయకులు ప్రత్యర్థులపై నిఘా పెట్టేందుకు దుర్వినియోగం చేస్తున్నారన్నది అభియోగం. ఆసక్తికరంగా ఈ పని చేసేది కూడా పోలీసు అధికారుల పర్యవేక్షణలోనే. ప్రభుత్వం ఏదైనా, ముఖ్యమంత్రి, కీలక మంత్రి ప్రత్యర్థుల ఫోన్లు ట్యాప్ చేయాలని కోరితే అధికారులు ఎందుకు నిరాకరించడం లేదు? లిఖిత పూర్వక ఆదేశాలు ఇవ్వాలని అడుగుతున్నారా? ఇలాంటి సందేహాలు సామాన్యులకు రావచ్చు. అధికారంలో ఉన్న రాజకీయ నేతలను ప్రసన్నం చేసుకునే పనిలో ఉండే పోలీసు అధికారులకు అలాంటి ఆలోచనలు రాకపోవడమే బాధాకరం. తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో కొందరు మాజీ పోలీసు అధికారులు కూడా అరెస్టు అయ్యారు. మాజీ మంత్రులు హరీశ్రావు, తారక రామారావు, మాజీ ఎంపీ సంతోష్ తదితరులు విచారణకు హాజరయ్యారు కూడా. తాజాగా సిట్ మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు కూడా నోటీసు ఇచ్చింది. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మరో తేదీ నిర్ణయించాలని ఆయన కోరారు. అలాగే హైదరాబాద్లోని నందినగర్ లో కాకుండా ఎర్రవెల్లిలోని ఫామ్హౌస్లో విచారణ చేయాలన్న కేసీఆర్ విజ్ఞప్తిని సిట్ అధికారులు తోసిపుచ్చారు. ఈ కేసులో ఎన్ని ట్విస్టులు ఉంటాయో చూడాల్సిందే. కేటీఆర్ను పోలీసు అధికారులు అడిగిన కొన్ని కీలకమైన ప్రశ్నలలో బీఆర్ఎస్కు కోట్ల రూపాయల ఎన్నికల బాండ్లు ఎలా వచ్చాయి అన్నది కూడా ఉంది. నిజానికి ఈ ప్రశ్న వేయడం వల్ల వచ్చే కొత్త సమాచారం ఏమీ ఉండదు. ఫోన్ ట్యాపింగ్ చేసి బెదిరించారా? అని అడిగితే ఎవరైనా అవునని చెబుతారా? బెదిరించడం వల్లే కోట్ల రూపాయల విరాళాలు వస్తున్నాయని అనుకుంటే, మిగిలిన రాజకీయ పక్షాలకు ముఖ్యంగా అధికారంలో ఉన్న పార్టీలకు కూడా అది వర్తిస్తుంది కదా!. కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి అత్యధికంగా రూ.6,000 కోట్ల విరాళాలు ఎలా వచ్చాయి? కాంగ్రెస్ పార్టీకి రూ.900 కోట్లు మాత్రమే ఎందుకు వచ్చాయని అడిగితే జవాబు ఏమి ఉంటుంది? నిజంగానే ఎవరినైనా బెదిరించి విరాళం పొందితే వారు పోలీసులకు ఫిర్యాదు చేయకపోతే అది కేసు అవ్వడం కష్టం కదా! ఒక వేళ చేసినా వాటిని రుజవు చేయడం అంత తేలిక కాకపోవచ్చు. అసలు సమస్య ఏమిటంటే ఈ విధంగా విరాళాలు తీసుకోవడంలోనే లోపం ఉంది. ఆ పద్ధతిని మార్చే అధికారం పోలీసులకు ఉండదు! ఫోన్ చేసి మాట్లాడితే బెదిరింపు అవుతుందా అన్నది ఒక ప్రశ్న. ఏపీలో తెలుగుదేశం మీడియా.. అప్పటి ముఖ్యమంత్రి జగన్కు సంబంధించిన వారి సంస్థ అని ఒక కంపెనీపై పలు వ్యతిరేక కథనాలు ఇచ్చేది. కాని ఆ సంస్థ అప్పట్లో విపక్షంలో ఉన్న టీడీపీకి సుమారు రూ.40 కోట్ల విరాళం ఇచ్చింది. అదెలా జరిగింది? కూటమి అధికారంలోకి వచ్చాక ఆ కంపెనీకి యథాప్రకారం ప్రభుత్వం కాంట్రాక్టులు ఇస్తోంది. టీడీపీ మీడియా ఆ కంపెనీపై నెగిటివ్ వార్తలు రాయడం నిలిపివేసింది. మరి ఇందులో మతలబు ఏంటి? అందుకే బీజేపీ, కాంగ్రెస్, టీడీపీలకు వచ్చిన విరాళాల మాటేమిటి అని కేటీఆర్ ప్రశ్నించారు. అధికారంలో ఉన్న వారెవ్వరూ ఫోన్ ట్యాపింగ్కు లిఖిత పూర్వకంగా ఆదేశాలు ఇవ్వరు. నమ్మకంగా ఉండే అధికారులతో అనధికారికంగా జరుగుతుంటాయి. ఫోన్ ట్యాపింగ్ వల్ల సంచలన విషయాలు బయటపడిన సందర్భాలు కూడా ఉన్నాయి. 2015లో టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓటు వేయడానికి ఒక నామినేటెడ్ ఎమ్మెల్యేకి రూ.ఏభై లక్షలు ఇచ్చారన్న అభియోగాలు వచ్చాయి. ఈ ఉదంతం బయటపడడానికి, అప్పట్లో విభజిత ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు కూడా ఆ కొనుగోలు లావాదేవీకి భరోసా ఇస్తూ ‘‘మనవాళ్లు భ్రీఫ్డ్ మీ’’ అని ఫోన్ చేసిన ఆడియో టేప్ బయటకు రావడానికి ఫోన్ ట్యాపింగ్ కూడా కారణం కావచ్చు. ఈ కేసులో ఫోన్ ట్యాపింగ్ను సమర్థించాలా? వ్యతిరేకించాలా? అయితే చంద్రబాబు నాయుడు తనపై కేసు రాకుండా చేసుకోవడానికి కేసీఆర్పై ఏపీలో ఫోన్ ట్యాపింగ్పై ఎదురు కేసులు పెట్టి హడావుడి చేశారు. చివరికి బీజేపీ పెద్దలు కొందరు రాజీ చేశారు. ఆ కేసు ఛార్జ్షీట్లో చంద్రబాబు పేరు పలుమార్లు ఉన్నా నిందితుడుగా నమోదు కాలేదు. మరి పోలీసు అధికారులు దీన్నెలా సమర్ధించుకుంటారు? అంటే అధికారంలో ఉన్న రాజకీయవేత్తల ఆదేశాలకు అనుగుణంగానే పనిచేస్తున్నారు తప్ప నిబధనల ప్రకారం కాదని అర్థం అవుతుంది కదా!. ప్రస్తుతం కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ కేసును టేకప్ చేసింది. ఓటుకు నోటు కేసులో తనను అరెస్టు చేశారన్న కారణంతోనే రేవంత్ కక్ష కట్టి ఇలా చేస్తున్నారని బీఆర్ఎస్ విమర్శిస్తోంది. కేటీఆర్ వేసిన కొన్ని ప్రశ్నలు ఆసక్తికరమైనవని. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఫోన్లు ట్యాప్ కావడం లేదా అని ఆయన అడిగారు. కొందరు మంత్రులే తమ ఫోన్లు ట్యాప్ అయ్యాయని ప్రకటించారని కేటీఆర్ చెప్పారు. తన వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ కొందరు సినీ హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేశానని లీక్ ఇచ్చారని, ఆ తర్వాత పోలీసులే అలాంటిది లేదని ఎలా తెలిపారని ఆయన ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్కు సంబంధించి గత చరిత్ర చూస్తే 1988లో కర్ణాటక ముఖ్యమంత్రి రామకృష్ణ హెగ్డే ఈ ఆరోపణలపై రాజీనామా చేశారు. ఆ తర్వాత ఎవరిపై అభియోగాలు వచ్చినా ఏమీ కాలేదు. కాకపోతే కొన్నాళ్లు రాజకీయ దుమారం సాగుతుంటుంది. కర్ణాటకలో బీజేపీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప ప్రభుత్వం ఆనాటి విపక్ష నేత సిద్దరామయ్యతో సహా పలువురి ఫోన్లు ట్యాప్ చేసిందన్న విమర్శలు వచ్చాయి. అలాగే మరో సీఎం కుమారస్వామి తమ ఫోన్లు ట్యాప్ చేయించారని తిరుగుబాటు ఎమ్మెల్యేలు ఆరోపించారు. తాజాగా కర్ణాట గవర్నర్ ఫోన్ను కాంగ్రెస్ ప్రభుత్వం ట్యాప్ చేస్తోందంటూ విపక్ష బీజేపీ ఆరోపించింది. దీనిపై కర్ణాటక శాసనసభలో తీవ్ర దుమారం చెలరేగింది. తమిళనాడులో ఎంజీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తన మంత్రివర్గ సభ్యులపై నిఘా పెట్టడానికి అధికారులతో సంప్రదింపులు జరిపారట. కేంద్ర ప్రభుత్వంపై కూడా ఈ ఆరోపణలు ఉన్నాయి. రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో రాష్ట్రపతి జ్ఞాని జైల్సింగ్తో విబేధాలు వచ్చినప్పుడు ఫోన్ బగ్గింగ్ జరిగిందన్న అనుమానాులు ఉన్నాయని అప్పట్లో కీలకంగా పనిచేసిన ఒక అధికారి తన పుస్తకంలో రాశారు. టైమ్స్ ఆఫ్ ఇండియా తదితర కొన్ని జాతీయ పత్రికలలో వచ్చిన వ్యాసాలు చదవితే టాపింగ్, బగ్గింగ్కు సంబంధించిన పలు విశేషాలు కనిపిస్తాయి. ప్రధానిగా చంద్రశేఖర్ ఉన్నప్పుడు ఆయన కార్యాలయంలోనే బగ్గింగ్ జరిగిందన్న ప్రచారం కూడా ఉందట. ఏపీలో 23 మంది ఎమ్మెల్యేల కొనుగోలులో ఒక సీనియర్ పోలీసు అధికారి పాత్రపై పలు ఆరోపణలు వచ్చాయి. అప్పట్లో చంద్రబాబు ప్రభుత్వం టెలిఫోన్ ట్యాపింగ్ చేస్తోందంటూ వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి హైకోర్టుకు కూడా వెళ్లారు. కాగా జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైకోర్టు న్యాయమూర్తుల ఫోన్లు ట్యాప్ అయ్యాయంటూ టీడీపీ మీడియా ఒక పచ్చి అబద్ధపు కథనాన్ని సృష్టించింది. దానిపై ఏ విచారణ అయినా చేసుకోవచ్చని జగన్ ప్రభుత్వం హైకోర్టుకు తెలపడం విశేషం. ఆ తర్వాత ఆ కేసు మందుకు వెళ్లినట్లు లేదు. ఇంత ధైర్యంగా చెప్పిన ప్రభుత్వం జగన్దే కావచ్చు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తెలంగాణ ఫోన్ ట్యాపింగ్పై ఆధారాలు ఉన్నా ఎందుకు అరెస్టు చేయడం లేదని అంటున్నారు. అది ఆయన బీఆర్ఎస్పై కోపంతో అన్నారా? లేక నిజంగానే ఆధారాలు ఉన్నాయో తెలియదు. అది కరెక్టయితే తన చేతిలో ఉన్న హోం శాఖ ద్వారా ఎందుకు చేయించలేదన్న ప్రశ్న వస్తుంది. ఫోన్ ట్యాపింగ్ అన్నది అధికారంలో ఉన్నవారికి ఒక ఆయుధంగా మారకుండా చేయగలిగితే మంచి విషయమే అవుతుంది. ::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
Phone Tapping Case: కేసీఆర్కు మరోసారి సిట్ నోటీసులు
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్కు మరోసారి సిట్ నోటీసులు జారీ చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణను ఎర్రవల్లిలోని తన ఫామ్ హౌస్లో నిర్వహించాలని కోరిన బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ విజ్ఞప్తిని సిట్ తిరస్కరిచింది. నివాసంలో కేసీఆర్ను విచారించనుంది. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం కేసీఆర్కు సిట్ నోటీసులు ఇచ్చింది. ఫిబ్రవరి 1 మధ్యాహ్నం 3గంటలకు హైదరాబాద్ నందినగర్ నివాసంలో విచారణ చేపడతామని తెలిపింది. విచారణకు హాజరు కావాలని కేసీఆర్కు సిట్ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. -
పోలీసులను క్షమాపణ కోరిన కౌశిక్ రెడ్డి
-
బావమరిది కోసం ఈ కుంభకోణం..! మౌనవ్రతంలో కాంగ్రెస్ మంత్రులు
-
ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై ఐపీఎస్ అధికారుల సంఘం ఫైర్
సాక్షి,హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డిపై ఐపీఎస్ అధికారుల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. కరీంనగర్ సీపీ గౌస్కు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసిందిఇటీవల ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి కరీంనగర్ సీపీ గౌస్పై సంచలన ఆరోపణలు చేశారు. సీపీ గౌస్ మత మార్పిడులపై పాల్పడుతున్నారని అన్నారు. ఆ వ్యాఖ్యలపై ఐపీఎస్ అధికారుల సంఘం ఖండించింది. కౌషిక్రెడ్డి చేసిన వ్యాఖ్యలు నిరాధారం. కౌశిక్రెడ్డిపై చర్యలు తీసుకోవాలి’అని స్పష్టం చేసింది. గురువారం కరీంనగర్ జిల్లాలోని వీణవంక స్థానిక సమ్మక్క సారాలమ్మ జాతరకు వెళ్తున్న పాడి కౌశిక్రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కుటుంబంతో కలిసి వెళ్తున్న తమని పోలీసులు అడ్డుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ పాడి కౌశిక్ రెడ్డి హుజూరాబాద్ రోడ్డుపై బైఠాయించారు. ఈ క్రమంలో పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే సమయంలో కరీంనగర్ సీపీ గురించి మతపరమైన వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యల్ని కొద్ది సేపటి క్రితం ఐపీఎస్ అధికారుల సంఘం ఖండించింది. క్షమాపణ చెప్పాలని, లేదంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. -
రోజులు లెక్కపెట్టుకోండి..!! పోలీసులకు పాడి కౌశిక్ రెడ్డి వార్నింగ్
-
విచారణకు రండి.. 'రెడీ'.. కానీ మరో రోజు
సాక్షి, హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో శుక్ర వారం విచారణకు హాజరుకావాలని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) జారీ చేసిన నోటీసులపై మాజీ సీఎం, బీఆర్ఎస్ అధ్యక్షుడు చంద్రశేఖర్రావు స్పందించారు. సిట్ విచారణకు హాజరయ్యేందుకు సుముఖత వ్యక్తం చేశారు. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి అనేక మందికి అధికార పత్రాలు జారీ చేయడంలో నిమగ్నమైనందున సిట్కు అనుకూలమైన మరో తేదీన విచారణ జరపాలని కోరారు. మాజీ సీఎంగా, శాసనసభలో ప్రతిపక్ష నేతగా, బాధ్యతగల పౌరుడిగా దర్యాప్తునకు తన పూర్తి సహకారం ఉంటుందని తెలిపారు. ఈ మేరకు సిట్ విచారణ అధికారిగా ఉన్న జూబ్లీహిల్స్ డివిజన్ ఏసీపీ పి.వెంకటగిరికి గురువారం ఆయన లేఖ రాశారు. పార్టీ అధ్యక్షుడిగా బిజీగా ఉన్నా.. ‘ఈ నెల 30న శుక్రవారం సిట్ ఎదుట విచారణకు రావాల్సిందిగా నన్ను కోరారు. కానీ ప్రస్తుతం 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించిన ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. నామినేషన్ల దాఖలుకు శుక్రవారం చివరి తేదీ కావడంతో పార్టీ ప్రాతిపదికన జరుగుతున్న ఈ ఎన్నికల్లో పార్టీ అధ్యక్షుడిగా అనేక మందికి అధికార పత్రాలు జారీ చేయడంలో నేను పూర్తిగా నిమగ్నమై ఉన్నా. కాబట్టి మీకు అనుకూలమైన మరో ఇతర తేదీలో అయినా సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం ఎర్రవల్లిలోని నా నివాసంలో విచారణ నిర్వహించగలరు..’అని కేసీఆర్ ఆ లేఖలో పేర్కొన్నారు. నిబంధనల మేరకు ఎర్రవల్లిలోనే.. ‘క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 160లోని నిబంధనల ప్రకారం ç65 సంవత్సరాలకు పైబడిన పురుషుడు పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరు కావలసిన అవసరం లేదు. అటువంటి వ్యక్తిని అతడు నివసిస్తున్న స్థలంలోనే విచారణ చేయాలనే నిబంధనలున్నాయి. కాబట్టి ఎర్రవల్లిలోని నా నివాసంలో మీరు విచారణ నిర్వహించవచ్చు..’అని కేసీఆర్ తెలిపారు. మున్సిపోల్స్పై దృష్టి పెట్టకుండా ఇబ్బంది పెట్టేందుకే.. – హరీశ్రావుతో సమావేశంలో కేసీఆర్ మున్సిపల్ ఎన్నికలపై దృష్టి కేంద్రీకరించకుండా బీఆర్ఎస్ అగ్ర నాయకత్వాన్ని ఇబ్బంది పెట్టడం లక్ష్యంగానే రేవంత్ ప్రభుత్వం సిట్ విచారణను తెరమీదకు తెచ్చిందని కేసీఆర్ అభిప్రాయపడినట్టు తెలిసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్కు సిట్ నోటీసుల నేపథ్యంలో ఎర్రవల్లి నివాసంలో ఆయనతో మాజీ మంత్రి హరీశ్రావు భేటీ అయ్యారు. రెండురోజుల క్రితం సిట్ విచారణకు హాజరైన మాజీ ఎంపీ సంతోష్కుమార్ కూడా ఈ భేటీలో పాల్గొన్నట్లు తెలిసింది. సిరిసిల్ల పర్యటనలో ఉన్న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు కూడా ఈ సమావేశంలో పాల్గొనాల్సి ఉన్నా కేసీఆర్ ఆదేశాల మేరకు హాజరుకాలేదు. కాంగ్రెస్కు భయం పట్టుకుంది ‘పంచాయతీ ఎన్నికల ఫలితాలతో కాంగ్రెస్ ఖంగుతింది. మున్సిపల్ ఎన్నికల్లోనూ తిరిగి అవే ఫలితాలు ఎదురవుతాయనే భయం పట్టుకుంది. కాంగ్రెస్ రెండేళ్ల పాలన వైఫల్యాలు, కుంభకోణాలతో ప్రజలు విసిగిపోయారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ అగ్ర నాయకత్వాన్ని కట్టడి చేసి కేడర్ మనో స్థైర్యం దెబ్బతీయడం ద్వారా మున్సిపల్ ఎన్నికల గండాన్ని దాటేందుకు కాంగ్రెస్ ఎత్తుగడలు వేస్తోంది. ఈ ప్రయత్నాలను వ్యూహాత్మకంగా ఎదుర్కొందాం. విచారణకు హాజరవడం ద్వారా ప్రభుత్వ కుట్రలను తిప్పి కొడదాం..’అని కేసీఆర్ వ్యాఖ్యానించినట్లు సమాచారం. కాగా కేసీఆర్కు నోటీసులు జారీ చేయడాన్ని ఖండిస్తూ మాజీ మంత్రులు వేముల ప్రశాంత్రెడ్డి, జగదీశ్రెడ్డి, కొప్పుల ఈశ్వర్, నిరంజన్రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్రావుతో పాటు పలువురు నేతలు వేర్వేరు ప్రకటనలు జారీ చేశారు. -
Phone Tapping: ఇది రేవంత్ ఆడుతున్న రాక్షస రాజకీయ క్రీడ
-
మైక్రో బ్రూవరీల నుంచి భారీగా వసూళ్లు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మైక్రో బ్రూవరీలకు అనుమతుల్లో ముఖ్య నేతతో పాటు ఇటీవలి కాలంలో ఆయనకు తోడు, నీడగా ఉంటున్న ఓ వ్యక్తి భారీ వసూళ్లకు పాల్పడుతున్నారని బీఆర్ఎస్ శాసనసభా పక్షం డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు ఆరోపించారు. ముఖ్య నేతతో పాటు కేబినెట్ మంత్రి ఒకరు కూడా ఈ అవినీతి పర్వంలో భాగస్వామిగా ఉన్నాడని చెప్పారు. బుధవారం తెలంగాణ భవన్లో విలేకరులతో ఆయన ఇష్టాగోష్టిగా మాట్లాడారు. రాష్ట్రంలో మైక్రో బ్రూవరీల ఏర్పాటుకు ఆసక్తి చూపుతూ 110 దరఖాస్తులు అందగా, 25 బ్రూవరీలకు అనుమతులు ఇస్తున్నారని హరీశ్రావు తెలిపారు. ఇందులో 21 మైక్రో బ్రూవరీలు ముఖ్యనేత కోటాలో, మరో 4 మంత్రి కోటాలో మంజూరవుతున్నాయని వెల్లడించారు. ఈ క్రమంలో ఇటీవల ముఖ్య నేత కుటుంబం వెంట తిరుమలకు వెళ్లిన ఓ వ్యక్తి దళారీగా వ్యవహరిస్తూ మైక్రో బ్రూవరీల దరఖాస్తుదారుల నుంచి వసూళ్లు చేస్తున్నాడని చెప్పారు. ఒక్కో దరఖాస్తుదారుడి నుంచి లైసెన్సు ఫీజు కాకుండా రూ.1.80 కోట్లు అక్రమంగా వసూలు చేస్తుండగా అందులో ముఖ్య నేత వాటాగా రూ.1.50 కోట్లు, దళారీ వాటా రూ.30 లక్షల చొప్పున వసూలు చేస్తున్నాడని ఆరోపించారు. మద్యం దుకాణాలకు ఒకటి కంటే ఎక్కువ దరఖాస్తులు వచ్చిన సందర్భంలో లాటరీ పద్ధతిలో ఎంపిక చేసిన ప్రభుత్వం.. మైక్రో బ్రూవరీల లైసెన్సుల మంజూరులో పారదర్శకత ఎందుకు పాటించడం లేదని ప్రశ్నించారు. వాటాల పంపకాల్లో తేడాల వల్లే..‘రాష్ట్రంలో మద్యం సరఫరా సంస్థలకు 17 నెలలుగా రూ.4,500 కోట్లు పెండింగులో ఉన్నాయి. పెండింగు బకాయిలు ఇవ్వకపోవడంతో మద్యం సరఫరా నిలిపివేస్తామని పలు బహుళ జాతి కంపెనీలు హెచ్చరిస్తూ లేఖలు రాస్తూ ఈ మెయిల్స్ పంపుతున్నాయి. గతంలో మేం రెండు శాతం రాయితీతో పక్షం రోజుల్లోనే బిల్లులు చెల్లించాం. ప్రస్తుతం వాటాల్లో తేడాలు రావడంతో మద్యం సరఫరా కంపెనీల బిల్లులు పెండింగులో పెట్టారు. గతంలో హాలోగ్రామ్ టెండర్ల వ్యవహారంలో ముఖ్యనేతతో పాటు మంత్రి కుమారుడి నడుమ సాగిన పోరాటం ఒక నిజాయితీ కలిగిన ఐఏఎస్ అధికారి స్వచ్ఛంద పదవీ విరమణకు దారి తీసింది..’ అని హరీశ్రావు చెప్పారు. మంజీర నదిపై ఉన్న సింగూరు, ఘనపురం ప్రాజెక్టు పరిధిలో మరమ్మతుల పేరిట 70 వేల ఎకరాల్లో క్రాప్ హాలిడే ప్రకటించారని, కానీ సంగారెడ్డి శివారులోని పదుల సంఖ్యలోని బీరు కంపెనీలకు నిరంతరం నీటి సరఫరా చేస్తు న్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం రైతులకంటే మద్యం కంపెనీల ప్రయోజనాలే ముఖ్యమని భావిస్తోందని విమర్శించారు. గీత కార్మికులను ఆదుకుంటామని సీఎం హామీ ఇచ్చి ఏడాదిన్నరైనా అమలుకు నోచుకోలేదన్నారు. -
బీఆర్ఎస్లో చేరిన మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్
సాక్షి,తెలంగాణ భవన్: వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ సొంత గూటికి చేరారు. కేటీఆర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్లో చేరారు. తెలంగాణ భవన్లో కార్యకర్తల సమక్షంలో కేటీఆర్ బీఆర్ఎస్ కండువా కప్పి ఆరూరిని పార్టీలోకి ఆహ్వానించారు. గత సోమవారం బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన రమేష్.. బీఆర్ఎస్ అధిష్టానం ఆహ్వనం మేరకు త్వరలోనే పలువురు నాయకులు, అనుచరులు, అభిమానులతో కలిసి గులాబీ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. చెప్పినట్లుగా ఇవాళ బీఆర్ఎస్లో చేరారు. వర్ధన్నపేట మున్సిపల్ ఎన్నికల వేళ అరూరి రమేశ్ తిరిగి బీఆర్ఎస్ పార్టీలో చేరనుండటంతో రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది.2024, మార్చిలో బీఆర్ఎస్ను వీడి బీజేపీలో చేరిన రమేష్ అదే ఏడాది జరిగిన లోక్సభ ఎన్నికల్లో వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత రాజకీయంగా ఆశించిన స్థాయి ప్రాధాన్యం లభించకపోవటం, పార్టీలో క్రియాశీలక ప్రాధాన్యం తగ్గిపోవడం ఆయన అసంతృప్తికి కారణమైనట్టు తెలుస్తోంది. -
ఫిరాయింపుల ఎపిసోడ్లో బిగ్ ట్విస్ట్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఫిరాయింపుల ఎపిసోడ్లో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. పెండింగ్లో ఉన్న ముగ్గురు ఎమ్మెల్యేల్లో ఒకరైన.. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్కు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ బుధవారం నోటీసులు జారీ చేశారు. ఈ నెల 30వ తేదీన తన ఎదుట విచారణకు హజరు కావాలని నోటీసుల్లో ఆయన పేర్కొన్నారు. కారు గుర్తుపై గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించారంటూ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అయితే స్పీకర్ చర్యలకు తీసుకోవడం లేదంటూ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఈ క్రమంలో కోర్టు డెడ్లైన్లు, వార్నింగ్లతో స్పీకర్ గడ్డం ప్రసాద్ విచారణ చేపట్టారు. ఇప్పటికే ఏడుగురిని విచారించిన స్పీకర్.. వాళ్లు పార్టీ మారినట్లు ఆధారాల్లేవంటూ పిటిషన్లు కొట్టేస్తూ తీర్పు ఇచ్చారు. అరికపూడి గాంధీ, గూడెం మహిపాల్ రెడ్డి, బండ్ల కృష్ణ మోహన్, ప్రకాష్ గౌడ్, తెల్లం వెంకట్రావు, పోచారం శ్రీనివాస్ రెడ్డి, కాలే యాదయ్యలకు క్లీన్ చిట్ ఇచ్చారు.ఈ క్రమంలో మిగిలిన ముగ్గురు డాక్టర్ సంజయ్, దానం నాగేందర్, కడియం శ్రీహరిలను విచారణ జరపాల్సి ఉంది. అయితే హఠాత్తుగా ఎమ్మెల్యే దానం నాగేందర్కు తాజాగా నోటీసులు ఇచ్చారు. అలాగే దానం నాగేందర్ పై అనర్హత పిటిషన్ వేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి సైతం స్పీకర్ నోటీసులు ఇచ్చారు. వీరిద్దరు ఈ నెల 30న విచారణకు హాజరుకావాలని వేర్వేరుగా ఇచ్చిన నోటీసులలో పేర్కొన్నారు. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల విషయంలో చేస్తున్న జాప్యంపై ఈనెల 19వ తేదిన స్పీకర్ కు సుప్రీంకోర్టు కోర్టు ధిక్కర నోటీసులు జారీ చేసింది. ఈ పిటిషన్లపై చర్యలు తీసుకోకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించించింది. ఈ నేపథ్యంలో నాగేందర్కు స్పీకర్ నోటీసులు ఇవ్వడం ఆసక్తిగా మారింది. దానం నాగేందర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా కొనసాగుతూనే 2024 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బీ ఫామ్ పై ఎంపీగా పోటీ చేయడం తెలిసిందే. -
ABNపై చర్యలు తీసుకోవాలి మండలి చైర్మన్కు BRS ఫిర్యాదు
-
సజ్జనార్ Vs RS ప్రవీణ్ కుమార్ ముదురుతున్న వివాదం
-
గవర్నర్ వద్దకు BRS నేతలు..
-
ఈరోజు సిట్ ముందుకు BRS మాజీ ఎంపీ సంతోష్ రావు
-
సొంతగూటికి అరూరి రమేశ్
సాక్షి, వరంగల్: వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్ తిరిగి సొంత గూటికి చేరుకోనున్నారు. బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి సోమవారం రాజీనామా చేసిన రమేశ్.. బీఆర్ఎస్ అధిష్టానం ఆహ్వనం మేరకు త్వరలోనే పలువురు నాయకులు, అనుచరులు, అభిమానులతో కలిసి గులాబీ పార్టీలో చేరనున్నారు. వర్ధన్నపేట మున్సిపల్ ఎన్నికల వేళ అరూరి రమేశ్ తిరిగి బీఆర్ఎస్ పార్టీలో చేరనుండటంతో రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది.2024, మార్చిలో బీఆర్ఎస్ను వీడి బీజేపీలో చేరిన రమేశ్ అదే ఏడాది జరిగిన లోక్సభ ఎన్నికల్లో వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత రాజకీయంగా ఆశించిన స్థాయి ప్రాధాన్యం లభించకపోవటం, పార్టీలో క్రియాశీలక ప్రాధాన్యం తగ్గిపోవడం ఆయన అసంతృప్తికి కారణమైనట్టు తెలుస్తోంది. -
బీఆర్ఎస్ మాజీ ఎంపీ సంతోష్కు సిట్ నోటీసులు
హైదరాబాద్: రాష్ట్ర స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ) కేంద్రంగా చోటు చేసుకున్న ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) మరో కీలక నిర్ణయం తీసుకుంది. బీఆర్ఎస్ మాజీ ఎంపీ సంతోష్రావు సిట్ నోటీసులు ఇచ్చింది. ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి సంతోష్కు సిట్ నోటీసులు ఇచ్చింది. రేపు(మంగళవారం, జనవరి 27వ తేదీ) విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొంది. ఈ కేసులో ఇప్పటికే కేటీఆర్, హరీశ్రావుకు నోటీసులు జారీ చేసి విచారించగా తాజాగా బీఆర్ఎస్ మాజీ ఎంపీ సంతోష్కు సోమవారం(జనవరి 26వ తేదీ) నోటీసుల ఇచ్చింది. మంగళవారం మధ్యాహ్నం మూడు గంటలకు జూబ్లీహిల్స్ పీఎస్ విచారణకు హాజరు కావాలని స్పష్టం చేసింది. సీఆర్సీసీ 160 కింద నోటీసులు ఇచ్చింది. సిట్ నోటీసులపై సంతోష్రావు స్పందించారు. రేపు సిట్ విచారణకు హాజరై పోలీసులు అడిగే ప్రశ్నలకు సమాధానం ఇస్తానన్నారు సంతోష్రావు.కాగా, ఈ కేసుకు సంబంధించి బీఆర్ఎస్ నాయకులు కుల సమీకరణల్లో భాగంగానే డీఐజీ హోదాలో ఉన్న టి.ప్రభాకర్రావును 2016లో ఎస్ఐబీ చీఫ్గా నియమించారని సిట్ ఆరోపిస్తోంది. 2017లో పి.రాధాకిషన్రావును బీఆర్ఎస్ పార్టీ పెద్దలే హైదరాబాద్ టాస్క్ఫోర్స్ డీసీపీగా ఎంపిక చేశారని పేర్కొంటోంది. ఈయన 2020 ఆగస్టులో పదవీ విరమణ చేసినప్పటికీ కుల ప్రాతిపదికన ఆయనకు బీఆర్ఎస్ ప్రభుత్వం రెండుసార్లు ఓఎస్డీగా అవకాశం ఇచ్చిందనేది సిట్ వాదన. ప్రభాకర్రావు ఆదేశాల మేరకు హైదరాబాద్ నగరంపై పట్టు కొనసాగడానికే బీఆర్ఎస్ నేతలు ఇలా చేశారని సిట్ చెబుతోంది. -
‘ఇంతకీ ఆ ఎమ్మెల్యేది ఏ పార్టీ’
సాక్షి,చేవెళ్ల: ధైర్యం ఉంటే బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్లో చేరిన చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్యపై చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. చేవెళ్ల మాజీ ఎంపీపీ విజయ్ భాస్కర్ రెడ్డి ఆయన అనుచరులు కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా కాంగ్రెస్పై కేటీఆర్ విమర్శలు గుప్పించారు. ‘కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మేనిఫెస్టోను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తుంగలో తొక్కారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకుండా, అధికారంలోకి వచ్చిన తర్వాత పరిపాలనను పక్కన పెట్టారు. మేం అప్పుడు చెప్పాం.. ఇప్పుడూ చెబుతున్నాం. కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చి మోసం చేస్తుందని. ఇప్పుడు అది నిజమైంది.రేవంత్ రెడ్డి రెండు సంవత్సరాల కాలంలో వృద్ధుల నుంచి ఆడబిడ్డల వరకు, విద్యార్థులు, ప్రభుత్వ ఉద్యోగులు ఇలా ప్రతి వర్గాన్ని మోసం చేశారు. శాసనసభ స్పీకర్ ధృతరాష్ట్రుని పోలి కళ్ళకు గంతలు కట్టుకొని నిజాలు చూడలేకపోతున్నారు. చేవెళ్ల నాయకుడు కాలె యాదయ్య కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నా, స్పీకర్ మాత్రం ఆయనను ఇంకా బీఆర్ఎస్ సభ్యుడిగానే గుర్తిస్తున్నారు. యాదయ్య స్వయంగా తాను కాంగ్రెస్లో ఉన్నానని చెబుతున్నా స్పీకర్ మాత్రం ఒప్పుకోవడం లేదు. కాంగ్రెస్కు ధైర్యం ఉంటే తమ పార్టీలో చేరిన యాదయ్యపై చర్యలు తీసుకొని ఎన్నికలకు రావాలి’ అని సవాల్ విసిరారు.రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ‘కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే మళ్ళీ అదే మోసం కొనసాగుతుంది. కేసీఆర్ వస్తేనే రాష్ట్రం బాగుపడుతుంది. ప్రజలకు న్యాయం జరుగుతుంది’అని స్పష్టం చేశారు. -
BRS సంచలన ప్రకటన.. బాయ్ కాట్ ABN
-
ఏబీఎన్ క్షమాపణ చెప్పాల్సిందే: BRS
సాక్షి హైదరాబాద్: ఇటీవల జరిగిన ఓ టీవీ ఛానెల్ డిబేట్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీపై ఏబీఎన్ ఛానెల్ ప్రతినిధి వైఖరిని బీఆర్ఎస్ ఖండించింది. ప్రత్యేక చర్చ సందర్భంగా MLC రవీందర్ రావుపై ఏబీఎన్ ప్రతినిధి చేసిన వ్యాఖ్యలు సరికాదని తెలిపింది. పాత్రికేయ విలువలకు ప్రజాస్వామ్యా స్పూర్తికి ఇది విరుద్ధం అని పేర్కొంది. కనుక తక్షణమే ఎమ్ఎల్సీకి, ఏబీఎన్ ప్రతినిధులు క్షమాపణ చెప్పాలని పేర్కొంది. ఇక నుంచి ఏబీఎన్ ప్రతినిధులను బీఆర్ఎస్ సమావేశాలకు అనుమతించేది లేదని కీలక నిర్ణయం తీసుకుంది. -
అవసరమైతే న్యాయ పోరాటం!
సాక్షి, హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో ‘సిట్’ విచారణకు హాజరైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, అసెంబ్లీలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు శనివారం పార్టీ అధ్యక్షుడు కేసీఆర్తో భేటీ అయ్యారు. ఎర్రవల్లి నివాసంలో శనివారం మధ్యాహ్నం జరిగిన ఈ భేటీలో ‘సిట్’విచారణ తీరు తెన్నులను ఇద్దరు నేతలు పార్టీ అధినేత కేసీఆర్కు వివరించారు. పార్టీ ముఖ్య నేతల పర్యటనలు, మంత్రులుగా తీసుకున్న నిర్ణయాలు, పలువురు వ్యక్తుల పేర్లను ప్రస్తావిస్తూ వారితో సంబంధాలు, పరిచయాల గురించి పోలీసులు తమను ప్రశ్నించారని వివరించారు. పార్టీకి ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో విరాళాలు ఇచ్చిన సంస్థల వివరాలపై ఆరా తీసినట్లుగా కేసీఆర్కు తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ విచారణతో సంబంధం లేని అంశాలను సిట్ అధికారులు అడిగిన వైనాన్ని కూడా కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. భవిష్యత్తులోనూ ఇదే తరహాలోనే సంబంధం లేని విషయాల్లో విచారణల పేరిట ప్రభుత్వం హడావుడి చేసి గందరగోళం సృష్టించే ప్రయత్నాలు చేస్తుందనే అభిప్రాయాన్ని కేసీఆర్ వ్యక్తం చేసినట్లు తెలిసింది. సిట్ విచారణకు సహకరిస్తూనే పోలీసులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే న్యాయ పోరాటం కూడా చేయాలనే అభిప్రాయం ఈ భేటీలో వ్యక్తమైంది. మున్సిపల్ ఎన్నికలపై కేసీఆర్ సూచనలు మున్సిపల్ ఎన్నికల సన్నాహాల్లో భాగంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు ఉమ్మడి జిల్లాల వారీగా కీలక నేతలతో సమావేశాలు నిర్వహించారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంతో పాటు రిజర్వేషన్లకు అనుగుణంగా అభ్యర్థుల ఎంపిక, ప్రచార పర్వం, అవసరమైన చోట ఇతర పార్టీల నుంచి చేరికలు వంటి అంశాలపై ఇద్దరు నేతలు దిశా నిర్దేశం చేశారు. ఇదిలా ఉంటే పార్టీ పరంగా మున్సిపల్ ఎన్నికలను పర్యవేక్షించేందుకు జిల్లాలు, మున్సిపాలిటీల వారీగా ఇన్చార్జిలను నియమించాలని కేసీఆర్ ఆదేశించారు. పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలకు మున్సిపాలిటీల వారీగా పర్యవేక్షక బాధ్యతలు అప్పగించనున్నారు. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను కూడా ఇన్చార్జిలు పర్యవేక్షించడంతో పాటు నాయకులు, కేడర్ నడుమ క్షేత్ర స్థాయిల్లో సమన్వయం కోసం పనిచేస్తారు. మున్సిపల్ ఎన్నికలపై కేసీఆర్ ఆదేశాల మేరకు ఎర్రవల్లిలో భేటీ అనంతరం శనివారం రాత్రి హైదరాబాద్లో కేటీఆర్, హరీశ్రావు కొందరు పార్టీ ముఖ్య నేతలతో భేటీ అయ్యారు. మున్సిపాలిటీల వారీగా నియమించాల్సిన ఇన్చార్జిల జాబితాపై కసరత్తు పూర్తి చేశారు. భేటీ అనంతరం ఈ జాబితాను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విడుదల చేశారు. -
బొగ్గు కుంభకోణంపై భట్టికి హరీశ్ రావు మాస్ కౌంటర్
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో రేవంత్ రెడ్డిని విచారించాలి
-
KTR: ఫోన్ ట్యాపింగ్ కేసులో కొనసాగుతున్న సిట్ విచారణ
-
ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే సిట్ నోటీసులు ఇస్తారా?: హరీష్ రావు
-
కేటీఆర్ కు సిట్ నోటీసులు
-
MP మల్లు రవి. క్షమాపణ చెప్పాలి: KTR
-
ప్రభాకర్రావు, శ్రవణ్లతో సంబంధం ఏంటి?
సాక్షి, హైదరాబాద్: అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) మంగళవారం బీఆర్ఎస్ కీలక నేత, మాజీ మంత్రి టి.హరీశ్రావును ప్రశ్నించింది. కొన్ని కీలకాంశాలపై ప్రధానంగా దృష్టి పెట్టి ప్రశ్నలు అడిగింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు, ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్రావు, ఆరో నిందితుడిగా ఉన్న ఓ మీడియా చానెల్ అధినేత శ్రవణ్రావులతో జరిగిన సంప్రదింపులు, సమాచార మారి్పడి ప్రధాన అంశాలుగా అధికారులు ప్రశ్నలు సంధించారు. ఇదే కేసులో రెండో నిందితుడిగా ఉన్న ఎస్ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్రావు వాంగ్మూలం ఆధారంగానూ కొంత వివరణ కోరారు. ప్రభాకర్రావుతో శ్రవణ్ సన్నిహితంగా మెలిగారు. 2023లో జరిగిన ఆయన ఫ్యామిలీ ఫంక్షన్కూ శ్రవణ్ హాజరయ్యారు. అక్కడే ప్రభాకర్రావు ద్వారా శ్రవణ్రావుకు ప్రణీత్రావు పరిచయం అయ్యాడు. ఆ తర్వాత పలుమార్లు ఎస్ఐబీ కార్యాలయానికి వెళ్లిన శ్రవణ్రావు అక్కడే ప్రణీత్రావును కలిశారు. శ్రవణ్ తనకు ఉన్న పరిచయాలను వినియోగించి రాజకీయ, వ్యాపార రంగాలకు చెందిన వ్యక్తుల సమాచారం సేకరించేవారని, వీరిలో నాటి ప్రతిపక్షానికి మద్దతుగా ఉన్న వారిని గుర్తించి, ఆ వివరాలను ప్రణీత్కు అందించారన్నది సిట్ ఆరోపణ. ఈ నేపథ్యంలో ప్రభాకర్రావు, శ్రవణ్లతో సంబంధం ఏంటి? అని హరీశ్రావును ప్రశ్నించింది. వివిధ కోణాల్లో ప్రశ్నలు ఈ ముగ్గురితో 2023 ఎన్నికల నేపథ్యంలో ప్రభాకర్రావు, శ్రవణ్రావు, ప్రణీత్రావుతో హరీశ్రావు సంప్రదింపులు జరిపారని, వీరి మధ్య ఫోన్ కాల్స్, ఎస్సెమ్మెస్లు, వాట్సాప్ సందేశాలు జరిగినట్లు సిట్ గుర్తించింది. ఫోన్ ట్యాపింగ్ కోసం శ్రవణ్రావుతో పాటు హరీశ్రావు ఎంపిక చేసిన వారినే టార్గెట్గా చేసుకున్నారని పోలీసులు ఆరోపిస్తున్నారు. ఈ కోణంలో మాజీ మంత్రిని ప్రశ్నించారు. ఆ ఎన్నికల్లో అధికార బీఆర్ఎస్కు లబ్ధి చేర్చాలని భావించిన నాటి మంత్రి హరీశ్రావు ఓ కీలక సమావేశానికి సిఫార్సు చేశారని అనుమానిస్తున్న సిట్ ఆ కోణంలోనూ పలు ప్రశ్నలు అడిగింది. ఎన్నికల సందర్భంగా ప్రతిపక్షాలకు చెందిన నగదును పట్టుకోవడంతో పాటు అధికార పక్షం నగదు రవాణాలోనూ కీలకంగా వ్యవహరించారనే ఆరోపణల నేపథ్యంలో ఆ కోణంలోనూ ప్రశ్నించారని తెలిసింది. ఏమీ లేదు.. అంతా తూచ్!: హరీశ్రావు తన న్యాయవాదితో కలిసి జూబ్లీహిల్స్ ఠాణా వద్దకు చేరుకున్నారు. అయితే న్యాయవాదిని అనుమతించని పోలీసులు కేవలం హరీశ్రావుతోపాటు ఆయన వ్యక్తిగత భద్రతా సిబ్బందిని మాత్రమే లోపలకు పంపారు. ఉదయం 10.57 గంటలకు లోనికి వెళ్లిన హరీశ్రావు సాయంత్రం 6.25 గంటలకు బయటకు వచ్చారు. ఏడున్నర గంటల పాటు విచారణ కొనసాగింది. కేసు దర్యాప్తు అధికారిగా ఉన్న ఏసీపీ పి.వెంకటగిరి, సంయుక్త పోలీసు కమిషనర్ విజయ్కుమార్, డీసీపీ రితిరాజ్ తో కూడిన బృందం ఆయన్ను విచారించింది. విచారణ ముగిసి బయటకు వచి్చన హరీశ్రావు మీడియాను ఉద్దేశించి ‘ఏమీ లేదు.. అంతా తూచ్..ఉత్తిదే’అంటూ వెళ్లిపోయారు.అరెస్టులు.. అస్వస్థత.. ఉద్రిక్తత మంగళవారం ఉదయం తన ఇంటి నుంచి తెలంగాణ భవన్కు వచి్చ, సిట్ ఎదుట హాజరైన హరీశ్రావు.. విచారణ తర్వాత కూడా అక్కడికి వెళ్లారు. ఆయా ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అయినా బీఆర్ఎస్ శ్రేణులు, నాయకులు పెద్ద సంఖ్యలో జూబ్లీహిల్స్ ఠాణా వద్దకు చేరుకున్నారు. అక్కడ రహదారిపై ఆందోళనకు దిగడంతో నిరసనకారుల్ని పోలీసులు అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో ఘర్షణ వాతావరణం నెలకొంది. దీంతో బీఆర్ఎస్ నేత, ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ సహా మరికొందరు అస్వస్థతకు గురయ్యారు. మంగళవారం సాయంత్రం బీఆర్ఎస్ మహిళా నేతలు, కార్యకర్తల అరెస్టు సందర్భంలోనూ ఠాణా వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. -
జూబ్లీహిల్స్ పీఎస్ ఎదుట ఉద్రిక్తత
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ పీఎస్ ఎదుట ఉద్రిక్తత నెలకొంది. పోలీసులకు, బీఆర్ఎస్ శ్రేణులకు మధ్య తోపులాట జరిగింది. పోలీసులకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ శ్రేణులు నినాదాలు చేశాయి. బీఆర్ఎస్ కార్యకర్తలను పోలీసులు చెదరగొడుతున్నారు.కాగా, ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్రావును సిట్ ప్రశ్నిస్తోంది. ఐదు గంటలుగా హరీష్ను విచారిస్తున్నారు. హరీష్ రావు ఆరోగ్యం పై న్యాయవాదులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హరీష్ విచారణకు న్యాయవాదులను అనుమతించాలని డిమాండ్ చేస్తున్నారు. హరీష్ రావు విచారణ వీడియో విడుదల చేయాలని కోరారు. డీఎస్పీ స్థాయి అధికారి వెంకటగిరి నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల బృందం.. హరీష్ను ప్రశ్నిస్తోంది. తనకు క్లియరెన్స్ ఇస్తూ హైకోర్టు, సుప్రీం కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ కాపీల ఉత్తర్వులను సిట్కు హరీష్రావు అందజేశారు. -
MLA Vivekananda: రాజకీయ కక్ష సాధింపే..!
-
జూబ్లీ పీఎస్ కు హరీష్ రావు ఐదుగురు అధికారులతో విచారణ
-
బీఆర్ఎస్ నేత హరీశ్రావుకు నోటీసులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ) కేంద్రంగా చోటు చేసుకున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) దూకుడు పెంచింది. ఇప్పటివరకు పలువురు మాజీ, ప్రస్తుత అధికారులు, రాజకీయ నేతలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకే నోటీసులు జారీ చేసిన సిట్..తాజాగా సోమవారం బీఆర్ఎస్ కీలక నేత, మాజీమంత్రి టి.హరీశ్రావును సాక్షిగా పరిగణిస్తూ సీఆర్పిసీలోని సెక్షన్ 160 కింద నోటీసులు ఇచ్చింది. బీఆర్ఎస్ హయాంలో కీలకంగా వ్యవహరించిన నేతలు, కేసీఆర్ కుటుంబీకులకు ఈ కేసులో నోటీసులు జారీ చేయడం ఇదే తొలిసారి. మంగళవారం ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ పోలీసుస్టేషన్లో ఉన్న సిట్ కార్యాలయంలో హాజరుకావాలని ఆ నోటీసుల్లో సిట్ స్పష్టం చేసింది.సోమవారం రాత్రి కోకాపేటలోని హరీశ్రావు నివాసానికి అధికారులు వెళ్ళిన సమయంలో ఆయన అందుబాటులో లేరు. సిద్దిపేటలో ఉండటంతో ఇంట్లో ఉన్న వారికి అందజేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో సహకరించాలని కోరారు. ఇప్పటివరకు సిట్ చేసిన దర్యాప్తు, నిందితుల విచారణ, వాంగ్మూలాల నమోదు...ఇలా అనేకచోట్ల హరీశ్రావు పేరు ప్రస్తావనకు వచ్చింది. న్యాయస్థానంలో దాఖలు చేసిన నివేదికల్లోనూ అధికారులు ఆయన పేరు పొందుపరిచారు. ఈయన ఆదేశాల మేరకు కొందరి ఫోన్లు ట్యాప్ అయ్యాయని సిట్ అనుమానిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా సిద్దిపేటలో ఉన్న హరీశ్రావు నోటీసుల విషయం తెలిసి హైదరాబాద్కు బయలుదేరినట్లు తెలిసింది. త్వరలో మరికొందరికి కూడా..! 2024 మార్చి 10న పంజగుట్ట పోలీసుస్టేషన్లో నమోదైన ఫోన్ ట్యాపింగ్ కేసు తర్వాత సిట్కు బదిలీ అయింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్రావు ముందస్తు బెయిల్ పిటిషన్ సుప్రీంకోర్టు విచారణలో ఉంది. ఇటీవల ఈ పిటిషన్ను విచారించిన కోర్టు తదుపరి విచారణను మార్చి 10కి వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో హరీశ్రావుకు నోటీసులు జారీ చేసిన సిట్.. రానున్న రోజుల్లో మరికొందరు కీలక నేతలకు నోటీసులు జారీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. గతంలో చక్రధర్ గౌడ్ అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు హరీశ్రావుపై పంజగుట్ట పోలీసుస్టేషన్లోనే ఓ కేసు నమోదైంది. అందులో చక్రధర్ తన ఫోన్ ట్యాప్ అయిందని, హరీశ్రావు ఆదేశాల మేరకే అది జరిగిందని ఆరోపించారు. అయితే ఈ కేసును ఇటీవలే సుప్రీంకోర్టు కొట్టేసింది. తెలంగాణ భవన్ నుంచి సిట్ విచారణకు ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ నుంచి నోటీసులు అందిన నేపథ్యంలో మాజీ మంత్రి హరీశ్రావు మంగళవారం తెలంగాణ భవన్ నుంచి బయలుదేరి సిట్ కార్యాలయానికి వెళ్తారు. ఉదయం 9 గంటలకు ఆయన తన నివాసం నుంచి తెలంగాణ భవన్కు చేరుకుంటారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు కూ డా అదే సమయానికి పార్టీ కార్యాలయానికి చేరుకుంటారు. -
మా జెండా గద్దె జోలికి వస్తే నీ గద్దె కూలుతుంది: హరీశ్రావు
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ జెండా గద్దె జోలికి వస్తే నీ గద్దె కూలుతుంది జాగ్రత్త అని సీఎం రేవంత్రెడ్డిని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్లీడర్ హరీశ్రావు హెచ్చరించారు. బీఆర్ఎస్ జెండా ప్రజల గుండెల్లో పుట్టిన పార్టీ అని తమ పార్టీ జెండా గద్దెల్లో లేదని, ప్రజల గుండెల్లో ఉందని వ్యాఖ్యానించారు. తెలంగాణ భవన్లో సోమవారం పార్టీ నేతలతో కలిసి హరీశ్రావు మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘కాంగ్రెస్ను భూస్థాపితం చేయడమే తన లక్ష్యం అంటూ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించి నేషనల్ ఫ్రంట్ కూడా ఏర్పాటు చేశారు. టీడీపీ మీద ప్రేమ చూపుతున్న రేవంత్ అందులో నుంచి బయటకు వచ్చి ద్రోహం చేశాడు. బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పోరాడితే రేవంత్ మాత్రం బీజేపీ, చంద్రబాబుతో కలిసి ఉంటున్నాడు. కాంగ్రెస్ భూస్థాపితం అయితేనే ఎన్టీఆర్ ఆత్మకు శాంతి’అని పేర్కొన్నారు. సీబీఐ విచారణకు ఇస్తే అన్ని వివరాలు ఇస్తాం.. సింగరేణి సంస్థలో టెండర్లు, కాంట్రాక్టు సైట్ విజిట్ సర్టిఫికెట్ల జారీ సీఎం రేవంత్రెడ్డి, ఆయన సన్నిహితులు, సమీప బంధువుల కనుసన్నల్లో జరుగుతున్నాయని హరీశ్రావు ఆరోపించారు. సీఎంకు నిజాయితీ ఉంటే సింగరేణి టెండర్ల కుంభకోణంపై సీబీఐ విచారణ జరిపించాలని, అప్పుడు తాము అన్ని వివరాలు ఇస్తామని చెప్పారు. ‘కోల్ ఇండియా, వెస్ట్రన్ కోల్ ఫీల్డ్స్ సహా దేశంలో ఎక్కడా లేని రీతిలో 2024లో రేవంత్ ప్రభుత్వం సింగరేణిలో సైట్ విజిట్ విధానం తెచ్చింది. ఈ విధానంలో మొదటి కాంట్రాక్టు రేవంత్ బావమరిది సృజన్ రెడ్డి కంపెనీ శోధా కన్స్ట్రక్షన్స్కు తొలి టెండర్ దక్కింది. మరోవైపు గతానికి భిన్నంగా టెండర్లను 7 నుంచి 10 శాతం మేర అదనపు ధరలకు అప్పగిస్తున్నారు. బీఆర్ఎస్ హయాంలో కాంపిటీటివ్ బిడ్డింగ్లో కట్టబెట్టిన టెండర్లను కూడా రద్దు చేసి అధిక ధరలకు కట్టబెడుతున్నారు. వెంకటేశ్ఖని, శ్రీరాంపూర్ తదితర చోట్ల ఈ తరహా అక్రమాలు జరిగాయి. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ నుంచి సింగరేణికి గతంలో బల్క్గా సరఫరా అయ్యే డీజిల్ విధానాన్ని రద్దు చేసి కమీషన్ల కోసం కాంట్రాక్టర్లకు అప్పగించారు’అని హరీశ్రావు ఆరోపించారు. బొగ్గు టెండర్లను రద్దు చేయాలి ‘రెండేళ్లుగా సింగరేణి సంస్థను ఇన్చార్జి సీఎండీతో నడిపిస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారు. డిప్యూటీ సీఎం భట్టి ప్రకటించినట్లుగా కేవలం నైనీ బ్లాక్ టెండర్లతో సహా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన అన్ని బొగ్గు టెండర్లను రద్దు చేయాలి. సైట్ విజిట్ విధానంతోపాటు డీజిల్ విధానాన్ని కూడా రద్దు చేయాలి. రేవంత్, బీజేపీ నడుమ చీకటి ఒప్పందం లేకుంటే సీబీఐ విచారణకు ఆదేశించాలని కేంద్ర మంత్రి కిషన్రెడ్డిని డిమాండ్ చేస్తున్నా. సింగరేణి టెండర్ల విషయంలో సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి కోమటి రెడ్డి నడుమ వాటాల పంచాయతీలో ఐఏఎస్ అధికారులు, జర్నలిస్టులు బలి పశువులు అయ్యారు’అని హరీశ్రావు మండిపడ్డారు. మీడియా సమావేశంలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు. -
అర్హులే కానీ.. 'కారు'
సాక్షి, హైదరాబాద్: గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిరుపేద ఎల్లయ్య దళితబంధు కింద కారు కొనుక్కుని క్యాబ్ డ్రైవర్గా జీవనోపాధి పొందుతున్నాడు. వారిది నిరుపేద కుటుంబమే. సొంతిల్లు లేకపోవటంతో ఇందిరమ్మ పథకం కింద ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్నారు. కానీ, కారు ఉందన్న కారణంతో ఆయనకు ఇందిరమ్మ ఇంటి ఆర్థిక సాయం పొందేందుకు అర్హత లేదనే అనుమానం కింద ప్రత్యేక జాబితాలో చేర్చారు. రోజువారీ ప్రయాణ అవసరాలకు కారు కొనుక్కోవటాన్ని, ఉపాధి రూపంలో క్యాబ్ నడుపుకోవటానికి కారు పొందటాన్ని ఒకేగాటిన కట్టడం ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ల పథకంలో పెద్దచర్చకు దారి తీస్తోంది. పథకాన్ని ప్రారంభించేటప్పుడు అర్హతలు, అనర్హతల విషయంలో పేర్కొన్న అంశాల విషయంలో లోతుగా అధ్యయనం చేయకపోవటం గందరగోళాన్ని సృష్టిస్తోంది. ఇందులో క్యాబ్ డ్రైవర్ల అంశం కీలకంగా మారింది. ప్రస్తుతం హైదరాబాద్లో క్యాబ్ సేవలు విస్తృతమవుతున్నాయి. వేల మంది దీన్ని ఉపాధిగా మార్చుకున్నారు. ఉన్న ఊళ్లో పూట గడవటం కష్టంగా మారిన చాలామంది దీనివైపు మొగ్గుచూపుతున్నారు. గత ప్రభుత్వం దళిత బంధు ఆర్థిక సాయాన్ని అందజేసిన సమయంలో వేల మంది దళిత యువకులు దాన్ని క్యాబ్ కార్ల కొనుగోలుకు వినియోగించుకున్నారు. అప్పట్లో ఈ పథకానికి నిరుపేదలుగా అర్హత పొందిన వారు ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ల పథకానికి వచ్చేసరికి ‘అనర్హులు’గా మారిపోయారు. ‘కారు’తోనే కిరికిరి... ఇందిరమ్మ పథకం లబ్ధి పొందే అర్హత జాబితాలో సొంత కారు ఉండకూడదన్న నిబంధన ఉంది. కారు కొనే ఆర్థిక స్తోమత ఉంటే నిరుపేదలు కాదన్న మూలసూత్రం ఆధా రంగా దీన్ని చేర్చారు. జీవనోపాధి కోసం క్యాబ్ కారు ఉన్న వారిని కూడా ఇందులో చేర్చారు. లబ్ధిదారు కుటుంబ సభ్యుల పేరుతో కారు ఉండటంతో ఇలా పరిగణించారు. దీంతో ఇప్పుడు వేలాది మంది సొంత క్యాబ్ డ్రైవర్లు లబోదిబో మంటున్నారు. అసలు గందరగోళం ఇలా... సొంత కారైనా, క్యాబ్ కారైనా... కారు ఉంటే ఇందిరమ్మ ఇంటికి అర్హత రాదు అని ముందే స్పష్టం చేసి ఉంటే అయోమయం ఉండేది కాదు. ఈ విషయాన్ని ముందు చెప్పలేదు. దీంతో క్యాబ్ డ్రైవర్లుగా పనిచేస్తున్న వేల మంది ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేశారు. క్షేత్రస్థాయి పరిశీలనలో, క్యాబ్ డ్రైవర్ల పేదరికాన్ని పరిశీలించి సిబ్బంది వారిలో చాలామందిని అర్హులుగా తేల్చారు. దీంతో, వారికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయి. ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించుకున్నారు. వారికి ఇందిరమ్మ ఇంటి ఆర్థిక సాయం డబ్బులు చెల్లించేప్పుడు ఆధార్కార్డు ఆధారంగా వెరిఫికేషన్లో కారు అంశం తెరపైకి వచ్చింది. దీంతో వారికి బిల్లులు చెల్లించలేదు. అర్హత విషయంలో అనుమానాలున్న వారిని ప్రత్యేకంగా ఓ జాబితా రూపొందించి అందులో చేర్చారు. ఈ క్యాబ్తో ముడిపడిన వారి పేర్లను కూడా ఆ జాబితాలో చేర్చారు. ఒకసారి అర్హులుగా తేల్చి ఇళ్లను మంజూరు చేసి, బిల్లులు చెల్లించే సమయంలో అనర్హులుగా పేర్కొంటున్నారు. వీరు సంబంధిత ఎమ్మెల్యేలను ఆశ్రయించడంతో.. వారిని అర్హులుగా పరిగణించాలంటూ ఎమ్మెల్యేలు ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తున్నారు. స్పష్టత ఇవ్వకపోవటంతో... నిరుపేదగా ఒక ప్రభుత్వ పథకంలో లబ్ధి పొందిన వారు మరో ప్రభుత్వ పథకంలో లబ్ధికి అర్హులు కాదన్న అంశాన్ని స్పష్టంగా తేల్చి ఉంటే ఈ గందరగోళం ఏర్పడేది కాదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గత ప్రభుత్వం అమలు చేసిన దళితబంధు కింద లబ్ధి పొందినందున వారి ఆర్థిక పరిస్థితి మెరుగయ్యే అవకాశం ఉన్నందున, వారికి కాకుండా ఆమాత్రం కూడా ఆసరా లేని నిరుపేదలకే ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామని స్పష్టం చేసి ఉండాల్సిందని అంటున్నారు. -
BRS నాయకుడిపై ఎమ్మెల్యే రాజాసింగ్ PA దాడి
-
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్కు సుప్రీంకోర్టు నోటీసులు
సాక్షి, న్యూఢిల్లీ: బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కోర్టు ధిక్కారణకు పాల్పడ్డారంటూ బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం స్పీకర్కు నోటీసులు జారీ చేసింది. అదే కేసులో కేటీఆర్ దాఖలు చేసిన ప్రధాన పిటిషన్తో మహేశ్వర్ రెడ్డి పిటిషన్ను జత చేయాలని సూచించింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 6కు వాయిదా వేసింది. గత వారం ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో స్పీకర్ తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి ఫిరాయించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మొత్తం 10 మంది ఎమ్మెల్యేల్లో చివరి ముగ్గురు ఎమ్మెల్యేలకు సంబంధించిన అనర్హత పిటిషన్ల విచారణను అసెంబ్లీ స్పీకర్ ఇంకా ముగించకపోవడంపై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఇదే చివరి అవకాశమని.. మిగిలిన అనర్హత పిటిషన్లపై రెండు వారాల్లోగా నిర్ణయం తీసుకోవాల్సిందేనంటూ అల్టి మేటం జారీ చేసింది.ఈ అంశంపై నిర్ణయం తీసుకోవడానికి 8 వారాల గడువు ఇవ్వాలంటూ స్పీకర్ కార్యాలయం చేసిన విజ్ఞప్తిని తోసిపుచ్చింది. స్పీకర్ తీసుకోబోయే నిర్ణయాలతోపాటు ఇప్పటివరకు జరిగిన పురోగతిపై తదుపరి విచారణ నాటికి నివేదిక సమర్పించాలని స్పష్టం చేసింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్రెడ్డి, కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ చేపట్టిన జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మసీతో కూడిన సుప్రీం ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. అంతకుముందు ఈ పిటిషన్లపై విచారణ సందర్భంగా ఇరుపక్షాలు వాడీవేడిగా మిగతా వాదనలు వినిపించాయి.గడువు కోరిన ప్రభుత్వ న్యాయవాదులు బీఆర్ఎస్ నేతలు తమ పిటిషన్లలో ప్రతివాదులుగా పేర్కొన్న తెలంగాణ ప్రభుత్వం, స్పీకర్ కార్యాలయం తరఫున సీనియర్ న్యాయవాదులు ముకుల్ రోహత్గీ, అభిషేక్ మను సింఘ్వీ, నిరంజన్రెడ్డి వాదనలు వినిపించారు. ‘స్పీకర్ కంటి శస్త్రచికిత్స చేయించుకున్నారు. రెండు రోజులపాటు ఆస్పత్రిలో ఉన్నారు. అలాగే అసెంబ్లీ సెక్రటరీ జనరల్ కూడా మారారు. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. అందువల్ల పిటిషన్ల విచారణలో జాప్యం జరిగింది. ఇప్పటికే కొన్ని అంశాలను పరిష్కరించాం. మరికొన్నింటిపై తీర్పును రిజర్వ్ చేశాం. మిగిలిన వాటిని పూర్తి చేయడానికి మరో 8 వారాల సమయం ఇవ్వండి’అని ముకుల్ రోహత్గీ ధర్మాసనాన్ని కోరారు. రెండు వారాల్లో పురోగతి చూపిస్తే నాలుగు వారాల సమయం ఇస్తామని చెబుతూ విచారణను వాయిదా వేసింది. -
CM Revanth: పాలమూరుకు అన్యాయం BRS పాలనలోనే!
-
తుగ్లక్ సర్కార్కు ప్రజాక్షేత్రంలోనే బుద్ధి చెబుతాం
సాక్షి, హైదరాబాద్: అధికారంలోకి వచ్చిన రెండేళ్లు పూర్తైనా ఒక్క ఫ్లైఓవర్ అయినా కట్టారా అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు ప్రశ్నించారు. నాటి వైఎస్సార్ హయాం నుంచి బీఆర్ఎస్ పాలన దాకా ఏనాడూ సికింద్రాబాద్ అస్తిత్వాన్ని దెబ్బ తీసే ప్రయత్నాలు జరగలేదని.. కానీ, ఇప్పుడు రేవంత్ ఆ పని చేస్తున్నాడని కేటీఆర్ మండిపడ్డారు. శనివారం తలసాని శ్రీనివాస్ యాదవ్ నేతృత్వంలో సికింద్రాబాద్ బచావో యాత్ర జరగాల్సి ఉంది. అయితే అర్ధరాత్రి ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు సమాచారం అందించారు. అయినప్పటికీ బీఆర్ఎస్ శ్రేణులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు చేరుకునే ప్రయత్నాలు చేయగా.. పోలీసులు అడ్డుకున్నారు. దీంతో తెలంగాణ భవన్ వద్ద కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ‘‘తుగ్లక్ పేరు పుస్తకాల్లో చదువుకున్నాం.. ఇప్పుడు చూస్తున్నాం. TS నుంచి TG గా మారిస్తే ఎవరికి లాభం జరిగింది. తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చివేశారు. తెలంగాణ తల్లిని రూపుమాపి.. కాంగ్రెస్ తల్లిని ప్రతిష్టించారు. కాకతీయ కళాతోరణం తీసివేస్తున్నారు. అపసవ్య దిశలో పాలన సాగుతోంది. సికింద్రాబాద్, హైదరాబాద్ మధ్య విడదీయలేని బంధం ఉంది. సికింద్రాబాద్ అస్తిత్వాన్ని దెబ్బ తీయాలనుకోవడం మంచిది కాదు. వైఎస్ఆర్ ఆనాడు ఎంసీహెచ్ను విస్తరించినా.. హైదరాబాద్ అస్థిత్వాన్ని ముట్టుకోలేదు. బీఆర్ఎస్ పాలనలో హైదరాబాద్ అస్థిత్వాన్ని దెబ్బతీసేవిధంగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. 2016లో జిల్లాలు ఎర్పాటు అయ్యి పాలన సెట్ అవుతున్న సందర్భంలో జిల్లాలను తొలగించాలని అనుకోవడం తుగ్లక్ చర్యే. తుగ్లక్ సర్కార్కు ప్రజాక్షేత్రంలోనే బుద్ధి చెబుతాం. సికింద్రాబాద్ ప్రజల మనోభావాల్ని బీఆర్ఎస్ గౌరవిస్తుంది. మేం అధికారంలోకి వచ్చాక జిల్లాగా ఏర్పాటు చేస్తాం. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు అయ్యింది. ఆరు గ్యారెంటీలు అటకెక్కించారు. జంట నగరాల్లో ఒక్క ఫ్లైఓవర్ అయినా కట్టారా?. కనీసం.. ఒక్క రోడ్డు వేయలేదు. రేవంత్కు తెలిసింది ఒక్కటే.. విధ్వంసం. శాంతి ర్యాలీనీ అడ్డుకోవడం దుర్మార్గపు చర్య. మా పార్టీకి చెందిన 8 వేల మంది కార్యకర్తలను అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయినవారిని బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అధికారం ఎవరికి శాశ్వతం కాదు అనేది రేవంత్ గుర్తు పెట్టుకోవాలి. లేకుంటే.. కాంగ్రెస్ పార్టీ శాశ్వతంగా తెలంగాణ ద్రోహిగా మిగిలిపోతుంది అని కేటీఆర్ అన్నారు. -
సికింద్రాబాద్ బచావోకు బ్రేకులు.. తెలంగాణ భవన్ వద్ద హైడ్రామా
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ సర్కార్ సికింద్రాబాద్ పేరును మార్చేసి పెద్ద కుట్రకు తెర తీస్తోందని బీఆర్ఎస్ ఆరోపిస్తున్నది తెలిసిందే. ఈ క్రమంలో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇవాళ చేపట్టాల్సిన సికింద్రాబాద్ బచావో ర్యాలీకి బ్రేకులు పడ్డాయి. ఉదయం నుంచే బీఆర్ఎస్ నేతల్ని ఎక్కడికక్కడే నిలువరిస్తున్న పోలీసులు.. ఈ ఉదయం తలసానిని కూడా అడ్డుకున్నారు. ఈ క్రమంలో తెలంగాణ భవన్ వద్ద నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. బీఆర్ఎస్ ర్యాలీ నేపథ్యంలో.. జంట నగరాల్లోని నేతలను పోలీసులు ఎక్కడికక్కడే నిలువరించారు. పలువురిని గృహ నిర్భందం చేశారు. ఈ క్రమంలో పోలీసుల చర్యను ఖండిస్తూ తెలంగాణ భవన్ వద్ద తలసాని మీడియాతో మాట్లాడారు. ‘‘రైల్వే స్టేషన్ నుంచి ఎంజీరోడ్డు దాకా సికింద్రాబాద్ బచావో పేరిట శాంతి ర్యాలీకి పోలీసులు అనుమతిచ్చారు. నల్ల జెండాలు, కండువాలతో ర్యాలీ చేయాలనుకున్నాం. నిన్న పోలీసులు మా ర్యాలీ రూట్ మ్యాప్ పరిశీలించారు. అయితే లష్కర్ సాధన సమితికి అనుమతి రద్దు చేస్తున్నట్లు రాత్రి 10.40 నిమిషాలకు మెసేజ్ పెట్టారు. నిన్ననే సమాచారం అందించి ఉంటే.. కోర్టుకు వెళ్లేవాళ్లం. మా ప్రాంతం పేరు లేకుండా.. మా అస్తిత్వం దెబ్బతీసే విధంగా చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే మల్కాజిగిరి, హైదరాబాద్, సైబరాబాద్ కార్పొరేషన్లు అంటున్నారు. మాకు సికింద్రాబాద్తో ఉన్నది మట్టి సంబంధం. ఇప్పటికే వేల మందిని అరెస్ట్ చేశారు. తాత్కాలికంగా శాంతిర్యాలీ అడ్డుకుని మీరు పైశాచిక ఆనందం పొందవచ్చు. న్యాయపరంగా కోర్టుకు వెళ్లి ర్యాలీ నిర్వహించి తీరతాం అని తలసాని అన్నారు. తలసానిని బయటకు పోనివ్వకుండా.. తెలంగాణ భవన్ వద్ద మీడియాతో మాట్లాడిన అనంతరం తలసాని బయటకు వచ్చారు. అయితే ఆయన్ని ఎటూ పోనివ్వకుండా పోలీసులు తమ వాహనాలను అడ్డుపెట్టారు. తాను ఇంటికి వెళ్తానని తలసాని చెప్పినా పోలీసులు వినలేదు. తమ వాహనంలో దిగబెడతామంటూ ఆయన చెప్పారు. దీంతో ఆయన మళ్లీ తెలంగాణ భవన్లోకే వెళ్లిపోయారు. ఈ క్రమంలో అక్కడ భారీగా పోలీసులు మోహరించారు. -
ఇదే చివరి అవకాశం
సాక్షి, న్యూఢిల్లీ: బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి ఫిరాయించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మొత్తం 10 మంది ఎమ్మెల్యేల్లో చివరి ముగ్గురు ఎమ్మెల్యేలకు సంబంధించిన అనర్హత పిటిషన్ల విచారణను అసెంబ్లీ స్పీకర్ ఇంకా ముగించకపోవడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇదే చివరి అవకాశమని.. మిగిలిన అనర్హత పిటిషన్లపై రెండు వారాల్లోగా నిర్ణయం తీసుకోవాల్సిందేనంటూ అల్టి మేటం జారీ చేసింది.ఈ అంశంపై నిర్ణయం తీసుకోవడానికి 8 వారాల గడువు ఇవ్వాలంటూ స్పీకర్ కార్యాలయం చేసిన విజ్ఞప్తిని తోసిపుచ్చింది. స్పీకర్ తీసుకోబోయే నిర్ణయాలతోపాటు ఇప్పటివరకు జరిగిన పురోగతిపై తదుపరి విచారణ నాటికి నివేదిక సమరి్పంచాలని స్పష్టం చేసింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్రెడ్డి, కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్లపై శుక్రవారం విచారణ చేపట్టిన జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మసీతో కూడిన సుప్రీం ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. అంతకుముందు ఈ పిటిషన్లపై విచారణ సందర్భంగా ఇరుపక్షాలు వాడీవేడిగా మిగతా వాదనలు వినిపించాయి. గడువు కోరిన ప్రభుత్వ న్యాయవాదులు బీఆర్ఎస్ నేతలు తమ పిటిషన్లలో ప్రతివాదులుగా పేర్కొన్న తెలంగాణ ప్రభుత్వం, స్పీకర్ కార్యాలయం తరఫున సీనియర్ న్యాయవాదులు ముకుల్ రోహత్గీ, అభిõÙక్ మను సింఘ్వీ, నిరంజన్రెడ్డి వాదనలు వినిపించారు. ‘స్పీకర్ కంటి శస్త్రచికిత్స చేయించుకున్నారు. రెండు రోజులపాటు ఆస్పత్రిలో ఉన్నారు. అలాగే అసెంబ్లీ సెక్రటరీ జనరల్ కూడా మారారు. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. అందువల్ల పిటిషన్ల విచారణలో జాప్యం జరిగింది. ఇప్పటికే కొన్ని అంశాలను పరిష్కరించాం. మరికొన్నింటిపై తీర్పును రిజర్వ్ చేశాం. మిగిలిన వాటిని పూర్తి చేయడానికి మరో 8 వారాల సమయం ఇవ్వండి’అని ముకుల్ రోహత్గీ ధర్మాసనాన్ని కోరారు. కావాలనే జాప్యం చేస్తున్నారు: బీఆర్ఎస్ తరఫు లాయర్లు ప్రభుత్వం తరఫు న్యాయవాదుల వాదనలను పిటిషనర్లు పాడి కౌశిక్రెడ్డి, కేటీఆర్ తరఫు వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది దామా శేషాద్రి నాయుడు తీవ్రంగా ఆక్షేపించారు. ఇది ముమ్మాటికీ కోర్టు ధిక్కరణేనని ఆయన వాదించారు. ‘రెండు వారాల్లో తేల్చేస్తామని గతంలోనే కోర్టుకు హామీ ఇచ్చారు. కానీ మూడు నెలలైనా అతీగతీ లేదు. ఒక ఎమ్మెల్యే బీఆర్ఎస్ నుంచి గెలిచి ఆ తర్వాత అధికార పార్టీ కండువా కప్పుకున్నారు. ఆ తర్వాత ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడేమో ఇంకా బీఆర్ఎస్లోనే ఉన్నానని చెబుతున్నారు.ఇది పచ్చి మోసం. ఇది ఓపెన్ అండ్ షట్ కేస్. దీనికి విచారణ పేరుతో కాలయాపన చేయడం సరికాదు. ట్రిబ్యునల్ (స్పీకర్) ఈ రోజు వరకు కేసును కనీసం తాకలేదు’అని శేషాద్రి నాయుడు కోర్టు దష్టికి తెచ్చారు. స్పీకర్ కార్యాలయం కావాలనే జాప్యం చేస్తోందని ఆయన ఆరోపించారు. ఇరుపక్షాల వాదనల అనంతరం ధర్మాసనం స్పందిస్తూ.. రెండు వారాల్లో మిగిలిన ముగ్గురు ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, సంజయ్ కుమార్లకు సంబంధించి దాఖలైన అనర్హత పిటిషన్లపై తీసుకున్న చర్యలను తెలియజేస్తూ అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. అయితే కనీసం నాలుగు వారాల గడువైనా ఇవ్వాలని స్పీకర్ తరఫు న్యాయవాదులు కోరగా రెండు వారాల్లో పురోగతి చూపిస్తే నాలుగు వారాల సమయం ఇస్తామని చెబుతూ విచారణను వాయిదా వేసింది. -
CM Revanth : ఇదేనా నీ 40 ఏళ్ల రాజకీయ చరిత్ర
-
తెలంగాణ స్పీకర్కు సుప్రీం కోర్టు అల్టిమేటం
సాక్షి, ఢిల్లీ: తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ను ఉద్దేశించి సుప్రీం కోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఫిరాయింపుల వ్యవహారాన్ని తేల్చేందుకు తగిన సమయం ఇచ్చినా నిర్ణయం తీసుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇదే చివరి అవకాశమని.. ఇకనైనా నిర్ణయం తీసుకోకుంటే పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది.ఫిరాయింపుల ఆరోపణలతో బీఆర్ఎస్ వేసిన పిటిషన్లను జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ల ధర్మాసనం శుక్రవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా.. ఇప్పటికే ఏడుగురి విషయంలో స్పీకర్ ఓ నిర్ణయం తీసుకున్నారని స్పీకర్ తరఫున అభిషేక్ సంఘ్వీ వాదనలు వినిపించారు. మరో ముగ్గురిని విచారణ జరపాల్పి ఉందని నివేదించారు. ‘‘ఏడుగురు ఎమ్మెల్యేల పిటిషన్లపై విచారణ జరిపి నిర్ణయం తీసుకున్నాం. స్పీకర్కు కంటి సర్జరీ జరిగింది. అసెంబ్లీ సెక్రటరీ జనరల్ మారారు. అందువల్ల విచారణ కొంత ఆలస్యమైంది. నాలుగు వారాల సమయం ఇవ్వండి విచారణ పూర్తి చేస్తాం’’ అని కోర్టుకు తెలిపారు. బీఆర్ఎస్ తరఫున సీనియర్ న్యాయవాది దామా శేషాద్రి నాయుడు వాదనలు వినిపిస్తూ.. ‘‘పదిమంది ఎమ్మెల్యేలు పార్టీ మారారు. ఒక ఎమ్మెల్యే ఏకంగా అధికార పార్టీ నుంచి పోటీ చేశారు. కానీ తాను పార్టీ మారలేదని అంటున్నారు. ఈ వాదనలో న్యాయమేమైనా ఉందా?. స్పీకర్ వారిని ఇప్పటికీ విచారించడం లేదు. మూడు నెలలకు పైగా గడిచిపోయాయి. ప్రతిసారి విచారణకు గడువు పెంచమని అడుగుతున్నారు’’ అని వాదించారు. ఈ తరుణంలో బీఆర్ఎస్ తరఫు లాయర్ వాదనలతో ధర్మాసనం ఏకీభవించింది.. ‘‘ఇప్పటికే తగిన సమయం ఇచ్చాం.. ఈ పాటికే నిర్ణయం తీసుకోవాల్సి ఉండేది. ఇదే చివరి అవకాశం. మిగిలిన ముగ్గురు ఎమ్మెల్యేలపై నిర్ణయం తీసుకోండి. లేకుంటే పరిణామాలు ఉంటాయి’’ అని స్పీకర్కు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. మిగిలిన ఎమ్మెల్యేల విచారణను నాలుగు వారాల గడువు కావాలని సింఘ్వీ కోరారు. అయితే రెండు వారాల్లోపురోగతి చూపిస్తే.. నాలుగు వారాల సమయం ఇస్తామని ధర్మాసనం వ్యాఖ్యానించింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. తమ పార్టీ సింబల్పై గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించారని, వాళ్లపై స్పీకర్ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని బీఆర్ఎస్ పార్టీ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించిన సంగతి తెలిసిందే. గత విచారణలో మూడు నెలల్లోపు స్పీకర్ ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిందేనని కోర్టు స్పష్టం చేసింది. అయితే.. ఈ ఆదేశాలానుసారం తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ ఇప్పటికే ఓ నిర్ణయం తీసుకున్నారు. ఆ పది మందిలో ఏడుగురిపై దాఖలైన పిటిషన్లను కొట్టేశారు. టెక్నికల్లీ వాళ్లు పార్టీ మారలేదని.. బీఆర్ఎస్లోనే కొనసాగుతున్నారని తేల్చేశారు. ఇంక మిగిలిన ముగ్గురి భవితవ్యంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మిగిలిన ముగ్గురు ఎమ్మెల్యేల్లో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ వివరణ ఆల్రెడీ ఇచ్చారు. అయితే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిలైతే ఇంకా స్పీకర్ ఎదుట హాజరై కనీస వివరణ కూడా ఇచ్చుకోలేదు. తమకు గడువు ఇవ్వాలన్న విజ్ఞప్తులపైనా స్పీకర్ ఇప్పటిదాకా ఎలాంటి బదులు ఇవ్వకపోవడం గమనార్హం. ఈ తరుణంలో.. ఇప్పుడు సుప్రీం కోర్టు అల్టిమేటంతో ఎమ్మెల్యేలను స్పీకర్ విచారించాల్సిన పరిస్థితి ఎదురైంది. -
TG: ఇద్దరు ఎమ్మెల్యేలపై తీర్పు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల పంచాయితీ ఎంతకూ తెగడం లేదు. పది మంది ఎమ్మెల్యేలలో.. ఐదుగురిపై దాఖలైన పిటిషన్లను శాసనసభ స్పీకర్ ఇదివరకే కొట్టేసిన సంగతి తెలిసిందే. ఇవాళ అదీ సంక్రాంతి పండుగపూట.. మరో ఇద్దరి వ్యవహారంపై తీర్పు ఇవ్వబోతున్నారు. తమ పార్టీ సింబల్పై నెగ్గిన ఎమ్మెల్యేలు కాలె యాదయ్య(చేవెళ్ల), పోచారం శ్రీనివాసరెడ్డి(బాన్సువాడ)లు ఫిరాయింపులకు పాల్పడ్డారంటూ బీఆర్ఎస్ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్లపై స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ మరికాసేపట్లో తీర్పు ఇవ్వనున్నారు. ఇంతకు ముందులాగే పిటిషన్లు డిస్మిస్ చేస్తారా?.. అనర్హత వేటేమైనా వేస్తారా?.. నిర్ణయం ఎలా ఉండబోతోందో చూడాలి. అయితే.. మిగిలిన ముగ్గురు ఎమ్మెల్యేల్లో సంజయ్(జగిత్యాల) కాకుండా దానం నాగేందర్(ఖైరతాబాద్), కడియం శ్రీహరి(స్టేషన్ ఘన్పూర్) ఇప్పటిదాకా స్పీకర్ను కలిసి వివరణ ఇచ్చుకోలేదు. దీంతో వీళ్ల విషయంలో ఎలాంటి తీర్పు ఉంటుందనే ఆసక్తి కొనసాగుతోంది. అంతకు ముందు.. గత నెలలో(డిసెంబర్ 17న) ఆరికెపూడి గాంధీ(శేరిలింగంపల్లి), తెల్లం వెంకట్రావు(ఖమ్మం), గూడెం మహిపాల్ రెడ్డి(పటాన్చెరు), బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి(గద్వాల్), టి. ప్రకాశ్ గౌడ్(రాజేంద్రనగర్) పిటిషన్లను స్పీకర్ కొట్టిపారేశారు. ఈ ఐదుగురు సాంకేతికంగా ఇంకా బీఆర్ఎస్ సభ్యులుగానే కొనసాగుతున్నారని తీర్పు సందర్భంగా స్పష్టం చేశారాయన. అయితే స్పీకర్ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబడుతున్న బీఆర్ఎస్.. ఈ అంశంలో విచారణ ముగిశాక కోర్టును ఆశ్రయించే అవకాశం కనిపిస్తోంది. -
Talasani : మా ఆత్మగౌరవంపై దెబ్బ కొడితే చూస్తూ ఊరుకోం
-
‘వచ్చే ఎన్నికల్లో వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే’
పాలమూరు: అబద్ధాలు చెప్పి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. రెండేళ్లలో ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయలేదని ధ్వజమెత్తారు కేటీఆర్. ఈరోజు( సోమవారం, జనవరి 12వ తేదీ) మహబూబ్నగర్ జిల్లాల పాలమూరులో పర్యటించిన కేటీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్ల కాలంలో ఏ వర్గానికీ న్యాయం చేయలేదన్నారు. ‘రెండేళ్లలో ఏ వర్గానికి ప్రభుత్వం న్యాయం చేయలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక 14 పరిశ్రమలు ఎందుకు పారిపోయాయి. మూటలు కట్టి డబ్బులను ఢిల్లీకి తరలిస్తున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదు. మనం సబ్జెక్ట్ మాట్లాడితే.. రేవంత్ బూతులు మాట్లాడుతున్నారు. సంస్కారం అడ్డొస్తుందని మేం తిట్టడం లేదు. అడ్డిమారి గుడ్డిదెబ్బలో రేవంత్రెడ్డి సీఎం అయ్యారు. వచ్చే ఎన్నికల్లో వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. కాంగ్రెస్ సొంత పార్టీ నేతలే ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు’ అని ఆరోపించారు. -
అన్ని వర్గాలను మోసం చేస్తున్నాడు: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్/బండ్లగూడ: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నిజాయితీ కలిగిన మోసగాడు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మోసం చేసేవారికే ప్రజలు అధికారం కట్టబెడతారని ముందే చెప్పి అధికారంలోకి వచ్చిన రేవంత్రెడ్డి.. ఇప్పుడు సరిగ్గా తెలంగాణలోని అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తున్నారని చెప్పారు. రెట్టింపు పెన్షన్లు, రైతుబంధు, దళితబంధు, రెండు లక్షల ఉద్యోగాలు, పీఆర్సీ ఇలా అనేక కార్యక్రమాలను ప్రకటించి, ఒక్కటీ అమలు చేయడం లేదన్నారు. రేవంత్రెడ్డి రైతులు, రైతు కూలీలు, కౌలుదారులు, విద్యార్థులు, మహిళలు, వృద్ధులు, ప్రభుత్వ ఉద్యోగులు ఇలా అందరిని మోసం చేశారని కేటీఆర్ అన్నారు. రేవంత్కు తెలుగు, హిందీ, ఉర్దూ, ఇంగ్లిష్ భాషలు రావు కానీ ఆయనకు వచ్చిన ఏకైక భాష బూతుల భాష అని ఎద్దేవా చేశారు. బండ్లగూడ మాజీ మేయర్ లతాప్రేమ్గౌడ్, వారి అనుచరులు ఆదివారం తెలంగాణభవన్లో కార్తీక్రెడ్డి ఆధ్వర్యంలో కేటీఆర్ సమక్షంలో పార్టీలో చేరారు. వీరికి కేటీఆర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మాజీమంత్రి సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ నిరుద్యోగులు, విద్యార్థులకు ఇచ్చిన మాట ప్రకారం రెండు లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. ‘కేసీఆర్ కనిపిస్తే ధైర్యం వస్తది అని ప్రజలు అనుకుంటున్నారు. రాష్ట్రంలో వ్యాపారాలు తగ్గడానికి, పరిస్థితులు దిగజారడానికి సన్నాసి రేవంత్రెడ్డి ప్రభుత్వమే కారణం. కాంగ్రెస్లో చేరిన ఫిరాయింపు ఎమ్మెల్యేల పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ ఏమి అభివృద్ధి చూసి కాంగ్రెస్లో చేరిండో నియోజకవర్గ ప్రజలకు చెప్పాలి’అని కేటీఆర్ అన్నారు. బీజేపీ బలం గాలివాటమే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి బీజేపీ ఎప్పటికీ ప్రత్యామ్నాయం కాబోదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. 24 నెలల కాంగ్రెస్ పార్టీ అసమర్థ పాలనకు, గత పది సంవత్సరాల్లో జరిగిన అద్భుతమైన అభివృద్ధికి మధ్య ప్రజలు బేరీజు వేసుకుంటున్నారని, కచ్చితంగా మరోసారి బీఆర్ఎస్ వైపు నిలిచేందుకు ప్రజలు సంసిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఆదివారం ఆదిలాబాద్, మెదక్ జిల్లాల అధ్యక్షులు, పార్టీ ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులతో జరిగిన పురపాలక ఎన్నికల సన్నాహక సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. రెండు జిల్లాల్లో పార్టీ అనుసరించాల్సిన మున్సిపల్ ఎన్నికల వ్యూహం, ఇతర అంశాలపై కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పురపాలక ఎన్నికల్లో సమష్టిగా కలిసి కొట్లాడి కాంగ్రెస్పై ఘన విజయం సాధించేలా ప్రయత్నం చేయాలని సూచించారు. బీజేపీకి క్షేత్రస్థాయిలో బలం లేదని, జూబ్లీహిల్స్ ఉపఎన్నిక మొదలు సర్పంచ్ల వరకు ప్రతి ఎన్నికల్లో బీఆర్ఎస్ వైపు ప్రజలు నిలబడ్డారన్నారు. రాష్ట్రంలో రెండు సంవత్సరాల కింద జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ సాధించిన విజయం గాలివాటమే అని చెప్పారు. ఆనాడు దేశంలోని రాజకీయ పరిస్థితులతోనే బీజేపీ గెలిచిందే తప్ప, ఆ పార్టీకి తెలంగాణలో క్షేత్రస్థాయి బలం లేదన్నారు. అసెంబ్లీలో పోటీచేసిన ప్రతి ఒక్క బీజేపీ సీనియర్ నేతలు ఘోరమైన ఓటమి పాలయ్యారని, పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం గాలివాటంగా గెలిచారని చెప్పారు. ఆదిలాబాద్, మెదక్ జిల్లాల్లోని మున్సిపాలిటీలలో ఉన్న స్థానిక పరిస్థితులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు ఈ సమావేశంలో పాల్గొని అనేక అంశాలపై పార్టీ శ్రేణులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. -
సిట్ దూకుడు.. సీఎం సోదరుడు, ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలకు నోటీసులు
సాక్షి, హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసు కీలక మలుపులు తీసుకుంటోంది. ఈ కేసు దర్యాప్తులో సిట్ దూకుడు పెంచింది. తాజాగా ఇద్దరు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలతో పాటు సీఎం రేవంత్రెడ్డి సోదరుడు కొండల్ రెడ్డికి సైతం నోటీసులు జారీ చేసింది. రేపు(గురువారం) తమ ఎదుట హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు జైపాల్ యాదవ్, చిరుమర్తి లింగయ్యలకు నోటీసులు జారీ అయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ వ్యవహారంలో మాజీ అధికారులను దఫదఫాలుగా ప్రశ్నించిన సిట్.. రాజకీయ నేతలను సైతం సిట్ విచారించడం మొదలుపెట్టింది. మొన్నీమధ్యే ఎమ్మెల్సీ నవీన్ రావును సుదీర్ఘంగా ప్రశ్నించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో ఇద్దరు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలను ప్రశ్నించబోతుండడం విశేషం. అయితే.. కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యను అధికారులు గతంలోనే విచారించారు. ఈ కేసులో మరో నిందితుడు, స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ) మాజీ అదనపు ఎస్పీ మేకల తిరుపతన్న ఫోన్లో లింకు దొరికిన నేపథ్యంలో.. ఆ ఆధారాలను ముందుపెట్టి ఈ మాజీ ఎమ్మెల్యేలను ప్రశ్నించారు. అయితే.. తాజాగా ఈ కేసులో సిట్ను తెలంగాణ ప్రభుత్వం మార్చింది. హైదరాబాద్ సీపీ సజ్జనార్ నేతృత్వంలో 9 మంది అధికారుల బృందానికి ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తును అప్పగించింది. అప్పటి నుంచి పొలిటికల్ లీడర్లను ప్రశ్నించడం మొదలైంది. ఇక సీఎం రేవంత్ సోదరుడు కొండల్ రెడ్డికి సైతం సిట్ నుంచి పిలుపు వచ్చింది. ప్రతిపక్ష నేతగా ఉన్న టైంలో రేవంత్రెడ్డి కుటుంబ సభ్యుల ఫోన్లు కూడా ట్యాపింగ్కు గురైనట్లు సిట్ గుర్తించింది. ఈ క్రమంలోనే ఆయనను సైతం తమ ఎదుట హాజరు అయ్యి తాము అడిగే ప్రశ్నకు సమాధానాలు ఇవ్వాలని సిట్ కోరినట్లు సమాచారం. మరోవైపు ఈ కేసులో మాజీ మంత్రి హరీష్రావును విచారించాలన్న సిట్ ప్రయత్నం ఫలించలేదు. ఆయనపై దాఖలైన ఎఫ్ఐఆర్ను గతంలో తెలంగాణ హైకోర్టు కొట్టేయగా, తాజాగా ఆ తీర్పును ఇటు సుప్రీం కోర్టు సమర్థించడంతో ఊరట లభించినట్లైంది. ఇక.. ఈ కేసులో ప్రధాన నిందితుడు, స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ చీఫ్ ప్రభాకర్రావును సిట్ రెండు దఫాలుగా కస్టోడియల్ ఎంక్వైరీ జరిపింది. ఆ విచారణకు సంబంధించిన నివేదికను ఈ నెలాఖరులోపే దర్యాప్తు బృందం కోర్టుకు సమర్పించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు విచారణ రాజకీయ మలుపు తీసుకోవడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. -
క్వార్టర్స్లో నెగ్గాం.. సెమీస్, ఫైనల్లోనూ మనదే గెలుపు
సాక్షి, ఖమ్మం: ఎగవేతలు, కూల్చివేతలతో కాంగ్రెస్ పాలన కొనసాగుతోందని.. అందుకే ఆ పార్టీని తరిమి కొట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. ఖమ్మంలో బుధవారం నిర్వహించిన నూతన సర్పంచ్ల అభినందన సభలో ఆయన మాట్లాడుతూ.. రేవంత్ సర్కార్పై ధ్వజమెత్తారు. క్వార్టర్ ఫైనల్లో(సర్పంచ్ ఎన్నికలను ఉద్దేశించి..) మంచి ఫలితాలు వచ్చాయి. సెమీ ఫైనల్ లో మంచి ఫలితాలు వస్తాయి. చివరికి ఫైనల్ లో విజయం మనదే. వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. యూరియా బస్తాలు దొరకడం లేదని రైతన్నలు చెబుతున్నారు. పాలిచ్చే గేదెను వదులుకొని.. తన్నే దున్నపోతు ను గెలిపించారని నేను వారితో చెప్పా. అయిపోయింది ఏదో అయిపోయింది.. వచ్చేది బీఆర్ఎస్ అని రైతులు నాతో చెప్పారు. రైతులు ఎంత క్లారిటీగా ఉన్నారో అర్థమైంది.బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో యూరియా కష్టాల్లేవ్. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి రాగానే లైన్లలో చెప్పులు కనిపిస్తున్నాయి. షాపుల్లో లేని యూరియా యాప్ల్లో ఎలా వస్తుంది?.. కాంగ్రెస్ పాలనలో ఎగవేతలు, కూల్చివేతలు. లక్ష కోట్ల బడ్జెట్ అన్నారు.. ఏమైంది?. కౌలు రైతులకు ఇస్తామన్న డబ్బులు ఇచ్చారా?. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇచ్చారా?. రెండేళ్లలో ఏం అభివృద్ధి జరిగింది?.. కూల్చివేతలు, ఎగవేతలే కనిపిస్తున్నాయి. ఇది సర్వభ్రష్ట ప్రభుత్వం.. ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేయాలని కేసీఆర్ పని చేశారు. ఇప్పుడు ఇదే జిల్లా నుంచి ముగ్గురు మంత్రులు ఉన్నారు. కనీసం రైతులకు యూరియా ఇప్పించలేని పరిస్థితిలో ఉన్నారు. కమీషన్ల కోసమే ఆ మగ్గురు పని చేసేది. 30 శాతం ట్యాక్స్ నడిపిస్తున్నారు వాళ్లు. ఆరు గ్యారెంటీలు భద్రంగా పెట్టుకొండనీ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆనాడు ఎన్నికల ప్రచారం లో చెప్పారు. ఇప్పుడు రెండేళ్లు అయిన గ్యారెంటీలు అమలు కాలేదు. దీనికి భట్టి ఏమి సమాధానం చెబుతారు?..ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ ఓటమికి రంగం సిద్ధమైంది. సర్పంచ్ ఎన్నికల్లో 40 శాతం పదవులు గెలుచుకున్నాం. ఇక్కడే రెండేళ్లలోనే ప్రభుత్వంపై ఎంత వ్యతిరేకత వచ్చిందో తెలుస్తోంది. త్వరలో జగరబోయే కార్పొరేషన్, మున్సిపల్ ఎన్నికల్లో ఓటమి తప్పదు. ఖమ్మం నుంచి 7 నుంచి 8 స్థానాలు గెలుస్తాం అని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. -
అబద్ధపు హామీలతో మోసం
జనగామ: ‘వరంగల్ రైతు డిక్లరేషన్లో రైతుబంధును రూ.15 వేలకు పెంచుతానన్నారు. కౌలుదారులకు కూడా ఇస్తానన్నారు. ప్రతి పంటకు రూ.500 బోనస్ ఇస్తానన్నారు. రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తానని నిరుద్యోగులకు హామీ ఇచ్చారు. ఇవన్నీ అబద్ధాలు. అలాంటి హామీలు ఇచ్చి మోసం చేసిన రాహుల్గాందీనే నడిబజారులో ఉరితీయాలి..’అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీమంత్రి కె.తారక రామారావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాహుల్గాంధీ లీడర్ కాదని, దేశంలో ఏకైక స్క్రిప్టు చదివే రీడర్ అని విమర్శించారు. స్క్రిప్టులో ఏమున్నా చదివేసే అవగాహన లేని నేత అంటూ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందా? ఊడుతుందా? తెలియని పరిస్థితి ఉందన్నారు. సీఎంకు కూడా మూటలు మోసిన అనుభవం తప్ప మరేమీ లేదని, ఏమీ తెలియదని వ్యాఖ్యానించారు. జనగామ జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్హాల్లో మంగళవారం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి అధ్యక్షతన జరిగిన జిల్లాలో గెలుపొందిన బీఆర్ఎస్ సర్పంచుల అభినందన సభలో కేటీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. రేవంత్కు పిచ్చి ముదిరి పాకానపడింది ‘రాష్ట్రంలో చెక్డ్యాంలు పటాకులు పేలినట్లు పేలుతున్నాయి. రేవంత్రెడ్డి ప్రభుత్వం కూడా అట్లనే ఉంది. రాష్ట్రంలో పాలిచ్చే బర్రెను కాదనుకుని, వెనకనుంచి తన్నే గేదెను తెచ్చుకున్నామని ప్రజలు మథనపడుతున్నారు. గోదావరి ఎక్కడుందో కూడా రేవంత్కు తెలియదు. భాక్రానంగల్ ప్రాజెక్టు తెలంగాణలో ఉందని చెబుతున్న రేవంత్రెడ్డి..రాష్ట్రాన్ని ఎలా నడిపిస్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండేళ్లు అవుతోంది.. ప్రజలకు చేసిన వాగ్దానాలు ఎంతవరకూ నెరవేర్చారో ఒక్కసారి ఆలోచించాలి. ఎనకటి రోజులు తెస్తానన్న రేవంత్, రాబందు కాలం తీసుకువచ్చారు. తెలంగాణను అభివృద్ధి చేసిన నాయకుడిని (కేసీఆర్)ఉరి తీయాలంటారా?. ఇంటింటికీ నీళ్లు ఇచ్చి, ఆసరా పెన్షన్లు, రైతుబంధు, రైతుబీమా, సాగునీటి ప్రాజెక్టులతో తెలంగాణను దేశంలో అగ్రస్థానంలో నిలబెట్టిన కేసీఆర్ను ఉరి వేయాలని రేవంత్రెడ్డి అనడం చూస్తుంటే ఆయనకు పిచ్చి ముదిరి పాకాన పడిందని అర్థమవుతోంది. ఆ మాటకొస్తే హామీలు ఇచ్చి మోసం చేసిన రాహుల్గాం«దీనే ఉరి తీయాలి. తన సొంత సెక్యూరిటీని కూడా ప్రజల ముందే కొట్టే ముఖ్యమంత్రి ఎక్కడా దొరకడు. తెలంగాణ తెచ్చిన మొనగాడు కేసీఆర్ చెప్పు దూళికీ రేవంత్ సరిపోడు. కేసీఆర్ ఒక్క ప్రెస్మీట్కే ఆయన ఆగమాగం అవుతున్నాడు. ఇక అసెంబ్లీలో మాట్లాడితే అక్కడే గుండె ఆగిపోయి సచ్చిపోతారు..’అని కేటీఆర్ విమర్శించారు. కార్యక్రమంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, శాసనమండలి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
అటు సీఎం.. ఇటు మాజీ సీఎం!
మహబూబ్నగర్: ప్రస్తుతం పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ సాగుతోంది. అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ క్రమంలో బీఆర్ఎస్ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో భారీ బహిరంగ సభకు సన్నద్ధమవుతోంది. ఈ సభకు ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ హాజరుకానున్నారు. ఇందులో భాగంగానే ఉమ్మడి పాలమూరుకు చెందిన ఆ పార్టీ ముఖ్య నేతలు మంగళవారం ప్రాజెక్టుల బాట పట్టారు. సంక్రాంతి తర్వాత కేసీఆర్ సభ ఉండనున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సైతం మహబూబ్నగర్నే ఎంచుకున్నట్లు తెలుస్తోంది. తొలుత వచ్చేనెల మూడో తేదీన జడ్చర్ల నియోజకవర్గంలో ట్రిపుల్ ఐటీ ప్రారంభోత్సవానికి రానున్నట్లు ఆ పార్టీ నేతలు ప్రకటించారు. అయితే అంతకన్నా ముందుగానే మహబూబ్నగర్ నియోజకవర్గంలో పర్యటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. నగరంలో సుమారు రూ.1,200 కోట్లతో చేపట్టనున్న అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ, తాగునీటి శుద్ధీకరణ తదితర అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు సమాచారం. ఈనెల 10న ఓటర్ల తుది జాబితా ప్రకటించనుండగా.. ఆ తర్వాత పురపాలికలకు సంబంధించి ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి పాలమూరు నుంచే ఇటు కాంగ్రెస్.. అటు బీఆర్ఎస్ ఎన్నికల శంఖారావం మోగించనున్నట్లు తెలుస్తోంది. -
ప్రశ్నిస్తే నాపై కక్షగట్టి పార్టీ నుంచి బహిష్కరించారు: కవిత
-
తెలంగాణ భవన్ వద్ద టెన్షన్ వాతావరణం
సాక్షి, హైదరాబాద్: కృష్ఝా జలాలపై తెలంగాణలో పొలిటికల్ హీట్ నడుస్తోంది. ఈ అంశంపై అసెంబ్లీలో ఇవాళ ప్రభుత్వం స్వల్పకాలిక చర్చ జరుపుతుండగా.. దానికి కౌంటర్గా మరో పవర్ పాయింట్ ప్రజంటేషన్కు బీఆర్ఎస్ సిద్ధమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. కాంగ్రెస్ శ్రేణులు నిరసనలకు సిద్ధం కావడంతో బీఆర్ఎస్ అధికార కార్యాలయం తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. శనివారం తెలంగాణ భవన్ వద్ద కాంగ్రెస్ శ్రేణులు నిరసనకు సిద్ధమయ్యాయి. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు విషయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం అన్యాయం చేసిందని ఆరోపిస్తున్నారు. అయితే అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా తెలంగాణ భవన్ వద్ద భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరికాసేపట్లో కేటీఆర్, హరీష్రావు ఆధ్వర్యంలో తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కీలక సమావేశం జరుగనుంది. హరీష్రావు పవర్ పాయింట్ ప్రజంటేషన్ చేస్తారని ప్రచారం నడుస్తోంది. కృష్ఝా జలాల పంపిణీ అంశంపై ప్రభుత్వం స్వల్పకాలిక చర్చ(షార్ట్ డిస్కషన్) ఇవాళ నిర్వహిస్తోంది. మధ్యాహ్నాం 12 గంటల సమయంలో సభలో మంత్రి ఉత్తమ్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇవ్వనున్నారు. ఈ మేరకు స్పెషల్ స్క్రీన్ను ఇప్పటికే ఏర్పాటు చేశారు.సభలో తమకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని.. తమకూ పవర్పాయింట్ ప్రజంటేషన్కు అవకాశం ఇవ్వాలని, అలాగే యూరియా సహా ఇతర అంశాలపై చర్చించాలన్న డిమాండ్లకు ప్రభుత్వం అంగీకరించకపోవడంతో బీఆర్ఎస్ ఈ సెషన్ను బహిష్కరించింది. అయితే బీఆర్ఎస్లోనే అన్యాయం జరిగిందని.. తప్పులు బయటపడతాయనే సమావేశాలను బహిష్కరించిందని.. దమ్ముంటే సభకు రావాలని కాంగ్రెస్ కౌంటర్ ఇస్తోంది. మంత్రి ఉత్తమ్ పవర్పాయింట్ ప్రజంటేషన్పై హరీష్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘కాంగ్రెస్ ప్రభుత్వం ద్వంద్వ వైఖరి అవలంభిస్తోంది. సంప్రదాయాలను కాంగ్రెస్ నేతలు తుంగలో తొక్కారు. మార్పు పేరుతో రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారు’’ అని అన్నారు. -
మూసీ కాలుష్యాన్ని మించిన విషం
సాక్షి, హైదరాబాద్: మూసీ సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని తాను కృత నిశ్చయంతో ఉంటే, విపక్ష బీఆర్ఎస్ అసత్యాల ప్రచారంతో అవినీతి బురద జల్లుతోందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ. 1.50 లక్షల కోట్ల కాంట్రాక్టులు ఇచ్చామని, రూ.25 కోట్ల కమీషన్లు తినేశామని ప్రచారం చేయడం దుర్మార్గమని అన్నారు. వాళ్ల కడుపులో విషం మూసీ కాలుష్యం కన్నా ప్రమాదకరమని మండిపడ్డారు.కాలి బూడిదయ్యేంత విషపు కళ్లతో చూస్తున్నారని వ్యాఖ్యానించారు. శుక్రవారం శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో మూసీ పునరుజ్జీవంపై పలువురు లేవనెత్తిన ప్రశ్నలపై చర్చ సందర్భంగా సీఎం మాట్లాడారు. అసలు మూసీ ప్రక్షాళన ఇష్టమా? కాదా? చెప్పాలని నిలదీశారు. ప్రక్షాళనకు సహకరిస్తే సూచనలు ఇవ్వాలని, వ్యతిరేకం అయితే ఆ కడుపు మంటకు కారణమేంటో చెప్పాలని అన్నారు. డీపీఆర్లు వచ్చిన తర్వాతే అంచనాలు ‘బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో చేసిందేంటో చెప్పాలి. కాంట్రాక్టులు ఇవ్వడం, కమీషన్లు పట్టడం, లిçఫ్టులు, పంపులు పెట్టడం, ఇళ్లలో కనకవర్షం కురిపించుకోవడం, జన్వాడ, మొయినాబాద్లో ఫామ్హౌస్లు కట్టుకోవడమే కదా చేసింది. తమను వాళ్లలా ఊహించుకుని బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. మూసీ ప్రక్షాళనకు అంతర్జాతీయ కన్సల్టెన్సీ తోడ్పాటు తీసుకుంటున్నాం. అది డీపీఆర్లు ఇచి్చన తర్వాతే అంచనాలు వెల్లడిస్తాం. ముందే చెప్పడానికి నేను 80 వేల పుస్తకాలు చదవలేదు. వాళ్ళంత పరిజ్ఞానం లేదు. దుర్గంధ భరితమైన మూసీ పక్కన నివసించాలని ఎవరికీ ఉండదు.ఎంతో కష్టాల్లో ఉన్న నిరుపేదలే అక్కడ ఉంటారు. అలాంటి వారికి మంచి కాలనీలు కట్టించాలని, వారి పిల్లలకు చదువులు చెప్పించాలని ప్రభుత్వం ఆలోచిస్తుంటే, విపక్షం మాత్రం వాళ్లు అక్కడే ఉండాలని కోరుకుంటోంది. విపక్ష నేతలు వర్షాలు ఉన్నప్పుడు మూసీ ప్రాంతంలోని ఇళ్ళల్లో ఎందుకు పడుకోలేదు?. ఇప్పుడైనా సగం కాలిపోయి, కుళ్ళిపోయిన శవాలున్న మూసీ ప్రాంతంలో పడుకోవాలి. నన్ను రియల్ ఎస్టేట్ బ్రోకర్ అంటున్నారు. అది ఒక పరిశ్రమ.. అభివృద్ధి చెందితే ఉపాధి అవకాశాలు పెరుగుతాయి..’అని సీఎం చెప్పారు. మూసీలో నిరంతరం స్వచ్ఛమైన నీరు ‘మూసీ కాలుష్యం కారణంగా నల్లగొండ జిల్లా ప్రజలు శిక్ష అనుభవిస్తున్నారు. కంపెనీల కలుíÙత జలాల నుంచి జంతువుల కళేబరాల వరకు మూసీలో కలుస్తున్నాయి. ఈ నేపథ్యంలో మూసీ నది ప్రక్షాళనే ప్రభుత్వ లక్ష్యం. ప్రక్షాళనతో ప్రపంచ స్థాయిలో గుర్తింపు వచ్చేలా చేస్తాం. లండన్ థేమ్స్ నదిని, న్యూయార్క్ జపాన్, సౌత్ కొరియా, సింగపూర్ లాంటి దేశాల్లో ఇలాంటి ప్రక్షాళన పనులు పరిశీలించాం.మూసీ ప్రక్షాళనకు ప్రణాళికలు సిద్ధం చేశాం. 20 టీఎంసీల గోదావరి జలాలు తరలించి 15 టీఎంసీలు తాగు నీటి అవసరాలకు, 5 టీఎంసీలు మూసీలో నిరంతరం స్వచ్చమైన నీరు పారించేందుకు ఉపయోగిస్తాం. మార్చి 31 లోగా అంచనాలు సిద్ధం చేసి టెండర్లు పిలుస్తాం. ఆసియా అభివృద్ధి బ్యాంకు రూ. 4 వేల కోట్ల రుణం ఇచ్చేందుకు ముందుకొచి్చంది. గండిపేట నుంచి గౌరెల్లి వరకు 55 కి.మీ ఎలివేటెడ్ కారిడార్ నిర్మించాలని భావిస్తున్నాం. ఓల్డ్ సిటీ ఎప్పటికీ ఒరిజినల్ సిటీయే. దాన్ని నిర్లక్ష్యం చేయం. మూసీ ప్రక్షాళనకు అందరూ సహకరించాలి..’అని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. బుల్డోజర్లకు అడ్డు పడతాం: హరీశ్రావు బీఆర్ఎస్ శాసనసభా పక్ష ఉప నేత హరీశ్రావు ఈ అంశంపై చర్చలో పాల్గొన్నారు. మూసీ ప్రక్షాళన పేరుతో పేదల ఇళ్ళు కూలగొడితే తమ పార్టీ సహించదని, బుల్డోజర్లకు అడ్డుపడతామని అన్నారు. మూసీలో ఇప్పటివరకు ఎన్ని ఇళ్ళు తొలగించారో, ఎంతమందికి ప్రత్నామ్నాయం చూపారో, ఇంకెన్ని ఇళ్ళు కూల్చాలనుకుంటున్నారో చెప్పాలని నిలదీశారు. మూసీ పునరుజ్జీవం వల్ల నిరాశ్రయులైన వారికి ఇప్పటివరకు ఎంత చెల్లించారో చెప్పాలని కోరారు. 2013 భూసేకరణ చట్టం కింద డబ్బులు ఇచ్చారా లేదా తెలపాలన్నారు. ఇటీవల వర్షాలు కురిసినప్పుడు మూసీ గేట్లు ఉద్దేశపూర్వకంగా ఎత్తివేసినట్టు తమ దృష్టికి వచి్చందని, ప్రభుత్వమే దీనికి అనుమతించినట్టు తెలిసిందని, ఇందులో వాస్తవం ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. సమగ్ర ప్రక్షాళన అవసరం: అక్బరుద్దీన్ ఓవైసీ మూసీ ప్రక్షాళనకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు సంబంధించి సమగ్ర వివరాలను సభ ముందుంచాలని ఎంఐఎం పక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ డిమాండ్ చేశారు. మూసీ నది ప్రారంభమయ్యే దగ్గర్నుంచి, అది ముగిసే వరకూ ప్రక్షాళన పనులు జరగాలని సూచించారు. హైదరాబాద్లో చారిత్రక కట్టడాలు ఉన్నాయని, వీటితో పాటు నగర సంస్కృతిని కాపాడాలని కోరారు. మైక్ కట్తో బీఆర్ఎస్ నిరసన సీఎం ప్రసంగం తర్వాత స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్..బీఆర్ఎస్ సభ్యురాలు సబితా ఇంద్రారెడ్డికి మాట్లాడే అవకాశం ఇచ్చారు. హరీశ్రావుకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని ఆమె కోరడంతో స్పీకర్ అభ్యంతరం తెలిపారు. ఆ తర్వాత సునీతా లక్ష్మారెడ్డికీ ఇదే పరిస్థితి ఎదురైంది. తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్యాదవ్కు మాట్లాడే అవకాశం ఇచ్చారు. మూసీ పునరుద్ధరణకు సహకరిస్తామని, నిర్వాసితులకు ఇచ్చే పరిహారం గురించి చెప్పాలని తలసాని అన్నారు. తమకు కడపులో విషం ఉందని సీఎం అనడం సరికాదన్నారు. సభా వ్యవహారాల మంత్రి శ్రీధర్బాబు జోక్యం చేసుకుని.. ముఖ్యమంత్రి ఎవరినీ ఉద్దేశించి వ్యాఖ్యానించలేదని అన్నారు.అనంతరం హరీశ్రావుకు అవకాశం ఇవ్వగా..సభలో తమ హక్కులు కాపాడాలని ఆయన కోరారు. మూసీ కంపుకన్నా ముఖ్యమంత్రి మాటల కంపు ఎక్కువ ఉందంటూ విమర్శించారు. దీంతో హరీశ్రావు మైక్ను స్పీకర్ నిలిపివేశారు. దీనిపై నిరసన వ్యక్తం చేస్తూ బీఆర్ఎస్ నేతలు సభ నుంచి వాకౌట్ చేశారు. కాగా యూరియా కొరతపై బీఆర్ఎస్, ఇతర అంశాలపై పలువురు ఇచి్చన వాయిదా తీర్మానాలను తిరస్కరిస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు. సీఎంపై హరీశ్రావు చేసిన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించినట్టు తెలిపారు. మూసీ పునరుజ్జీవంపై జరిగిన చర్చలో ఎమ్మెల్యేలు బాలూ నాయక్, శంకరయ్య, మల్రెడ్డి రంగారెడ్డి, పాయల్ శంకర్ తదితరులు కూడా పాల్గొన్నారు. -
బీఆర్ఎస్ బాయ్కాట్
సాక్షి, హైదరాబాద్: శాసనసభ స్పీకర్ ఏకపక్ష వైఖరి, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అప్రజాస్వామిక ప్రవర్తనకు నిరసనగా అసెంబ్లీ సమావేశాలు బహిష్కరిస్తున్నట్టు బీఆర్ఎస్ ప్రకటించింది. శుక్రవారం అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో భాగంగా మూసీ పునరుజ్జీవంపై జరిగిన చర్చలో సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆ పార్టీ సభ నుంచి వాకౌట్ చేసింది. అనంతరం శాసనసభ లాబీలోని ప్రతిపక్ష నేత కేసీఆర్ చాంబర్లో ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. పార్టీ శాసనసభా పక్షం డిప్యూటీ ఫ్లోర్ లీడర్లు హరీశ్రావు, తలసాని శ్రీనివాస్యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, ఇతర ఎమ్మెల్యేలు ప్రభుత్వ వైఖరిపై అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు.సభలో జరిగిన పరిణామాలను ప్రతిపక్ష నాయకుడు, పార్టీ అధినేత కేసీఆర్కు వివరించారు. ప్రభుత్వ తీరును ఎండగట్టేలా ప్రస్తుత సమావేశాలు ముగిసేంత వరకు అసెంబ్లీని బహిష్కరించడమే సరైనదనే అభిప్రాయం ఈ భేటీలో వ్యక్తమైంది. పార్టీలకతీతంగా సభ్యుల హక్కులను రక్షించాల్సిన స్పీకర్ ఏకపక్షంగా వ్యవహరించడాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఖండించారు. స్పీకర్ వైఖరితోపాటు ప్రభుత్వ తీరుపై నిరసన తెలపాలని నిర్ణయించారు. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేస్తూ అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్పార్కులోని అమరుల స్తూపం వద్దకు చేరుకున్నారు. సుమారు గంట పాటు నిరసన తెలిపారు. అసెంబ్లీ శీతాకాల సమావేశాలను బీఆర్ఎస్ బహిష్కరిస్తున్నట్లు పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు ప్రకటించారు. అసలేం జరిగింది.. ప్రశ్నోత్తరాల సందర్భంగా మూసీ నది పునరుజ్జీవంపై చర్చ సందర్బంగా అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ నడుమ మాటల యుద్ధం నడిచింది. మూసీ సుందరీకరణ కోసం చేసే ఖర్చుపై శ్వేతపత్రం విడుదల చేయాలని హరీశ్రావు డిమాండ్ చేశారు. ఇళ్ల కూలి్చవేతలు, నిర్వాసితులకు పరిహారం, ప్రాజెక్టు అంచనాలు, మల్లన్నసాగర్ నుంచి గోదావరి జలాల తరలింపు అంశాలపై స్పష్టత ఇవ్వాలని కోరారు. ఈ దశలో జోక్యం చేసుకున్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి గంటకు పైగా మాట్లాడారు. అయితే సీఎం ప్రసంగంపై వివరణ కోరేందుకు తాము అడిగినా ఎంఐఎంకు స్పీకర్ అవకాశం ఇవ్వడాన్ని బీఆర్ఎస్ తప్పు పట్టింది.హరీశ్రావు పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తుతూ స్పీకర్ సభకు కస్టోడియన్గా తమ హక్కులు కాపాడాలని కోరారు. తమ గొంతు నొక్కుతూ హక్కులకు భంగం కలుగుతున్నపుడు స్పీకర్కు తమకు రక్షణగా నిలవాలన్నారు. ఈ దశలో హరీశ్రావు మైక్ను కట్ చేసిన స్పీకర్.. మంత్రి శ్రీధర్బాబుకు అవకాశం ఇచ్చారు. శ్రీధర్బాబు వివరణతో సంతృప్తి చెందని బీఆర్ఎస్ సభ్యులు తమకు అవకాశం ఇవ్వాలని పట్టుబట్టడంతో డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తలసాని శ్రీనివాస్ యాదవ్కు అవకాశం ఇచ్చారు. సభా సాంప్రదాయాలు కాపాడుతూ హరీశ్రావుకు మైక్ ఇవ్వాలని ఆయన కోరారు.హరీశ్రావు మాట్లాడుతూ.. ‘మేము అడిగిన ఏ ఒక్క పాయింట్కు కూడా సీఎం దగ్గర క్లారిఫికేషన్ లేదు. పైగా మాకు మైక్ ఇవ్వకుండా, మా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు. నిరసన తెలపడం సభ్యుడి హక్కు. మాకు మైక్ ఇవ్వకపోవడం ముమ్మాటికీ సరికాదు. మూసీ నది కంపు కంటే ముఖ్యమంత్రి గారి మాటల కంపు ఎక్కువగా ఉంది. సభా నాయకుడి హోదాలో ఉండి ఆయన మాట్లాడుతున్న భాష వినడానికే చాలా కష్టంగా, అసహ్యంగా ఉంది..’ అనడంతో స్పీకర్ మరోమారు మైక్ కట్ చేశారు. దీంతో బీఆర్ఎస్ సభ్యులు వాకౌట్ చేశారు. ఏడు సమావేశాల్లో ఇదే తొలిసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2023 డిసెంబర్లో కొలువుదీరిన మూడో శాసనసభ ఇప్పటివరకు ఏడు మార్లు సమావేశమైంది. ప్రభుత్వ విధానాలను విమర్శిస్తూ బీఆర్ఎస్ పలుమార్లు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసినా..మొత్తం సమావేశాలను బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకోవడం మాత్రం ఇదే తొలిసారి. కాగా శనివారం ఉదయం పది గంటలకు తెలంగాణ భవన్లో జరిగే భేటీలో బీఆర్ఎస్ శాసనసభా పక్షం తదుపరి కార్యాచరణ ప్రకటించనుంది. నదీజలాల్లో తెలంగాణ వాటా, పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చే అవకాశమున్నట్టు బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. రేవంత్ రాజ్యాంగాన్ని ఖూనీ చేస్తున్నారు: హరీశ్రావు గన్పార్కు వద్ద మాట్లాడిన హరీశ్రావు.. మూసీ ప్రక్షాళనకు ముందు సీఎం నోరు ప్రక్షాళన చేయాలని వ్యాఖ్యానించారు. మూసీ కాలుష్యం కంటే సీఎం మాటల కంపు ఎక్కువైందన్నారు. ‘రాహుల్గాంధీ దేశమంతా రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని తిరుగుతుంటే ఇక్కడ రేవంత్ మాత్రం అసెంబ్లీ సాక్షిగా రాజ్యాంగాన్ని ఖూనీ చేస్తున్నారు. శాసనసభ నడుస్తున్న తీరు ప్రజాస్వామ్య విలువలకు పూర్తి విరుద్ధంగా ఉంది. బీఏసీ సమావేశంలో మమ్మల్ని గంటన్నర సేపు వెయిట్ చేయించి అవమానించారు. సభను 7 రోజుల పాటు నడపాలని, ఆ తర్వాత మళ్లీ సమావేశమై తదుపరి షెడ్యూల్ నిర్ణయిద్దామని స్పష్టంగా అనుకున్నాం. కానీ సభలో ప్రవేశపెట్టిన మినట్స్లో మాత్రం సభ ఎన్ని రోజులు నడపాలనేది స్పీకర్ నిర్ణయానికే వదిలేస్తున్నాం అని తప్పుడు సమాచారం పొందుపరిచారు.స్పీకర్ సభను కస్టోడియన్లా కాకుండా ఏకపక్షంగా నడుపుతున్నారు. సీఎంను విమర్శించొద్దంటూ స్పీకర్ మాకు రూల్స్ చెప్పడం ఎక్కడి పద్ధతి? ప్రతిపక్షం మాట్లాడకూడదంటే అసలు సభ ఎందుకు? సభలో సీఎం బాడీ షేమింగ్ చేస్తూ మాట్లాడుతున్నారు. ఒక సీఎంలా కాకుండా వీధి రౌడీలా ప్రవర్తిస్తున్నారు. కేసీఆర్పై సీఎం వాడిన భాషను తీవ్రంగా ఖండిస్తున్నాం. అవినీతికి అధికారికంగా రేట్లు నిర్ణయించి వసూలు చేస్తున్న రేవంత్కు మా గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు..’ అని హరీశ్రావు మండిపడ్డారు. అసెంబ్లీని గాం«దీభవన్లా నడిపిస్తున్నారని తలసాని ధ్వజమెత్తారు. మూసీపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్షం గొంతు నొక్కుతూ అధికార పార్టీ దాడి చేస్తోందని, స్పీకర్ మౌనంగా ఉంటూ సభ నడిపించే విధానాన్ని మర్చిపోయారని మాజీ మంత్రి జగదీశ్రెడ్డి విమర్శించారు. -
సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు బీఆర్ఎస్ హరీష్ రావు కౌంటర్
-
మాకూ ‘పవర్ పాయింట్’ అవకాశం ఇవ్వాలి
సాక్షి, హైదరాబాద్: శాసనసభలో ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలని భావిస్తే, ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్కు కూడా అదే అవకాశం కల్పించాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కె.తారక రామారావు డిమాండ్ చేశారు. సభలోకి అడుగుపెట్టిన తర్వాత ముఖ్యమంత్రి, సాధారణ సభ్యుడు అనే తేడా ఉండదని, సభ్యులందరికీ సమాన హక్కులే ఉంటాయన్నారు. తెలంగాణ భవన్లో గురువారం కేటీఆర్ మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ‘ప్రభుత్వం తన వాదన చెబితే, మేం మా వాదన చెప్పుకుంటాం. అంతే తప్ప మేమేమీ అదనంగా అడగడం లేదు. గత పదేళ్లలో తెలంగాణ వ్యవసాయాన్ని, సాగునీటిని ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్లామో సభలో వివరించేందుకు సిద్ధంగా ఉన్నాం’అని కేటీఆర్ చెప్పారు. 2016 మార్చి 31న అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ శాసనసభలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ బాయ్కాట్ చేసిందని గుర్తు చేశారు. అప్పుడు దాన్ని పార్లమెంటరీ సంప్రదాయాలకు విరుద్ధమని విమర్శించిన కాంగ్రెస్, ఈరోజు అదే విధానాన్ని ఎలా సమర్థిస్తుందని ప్రశ్నించారు. దీనిపై స్పీకర్కు లేఖ ఇచ్చామని, ఆయన నిర్ణయాన్ని గౌరవిస్తామని చెప్పారు. అవగాహన లేకుండా ఉపన్యాసాలా? నదీ జలాలు, సాగునీటి వ్యవస్థపై కనీస అవగాహన లేని ముఖ్యమంత్రి శాసనసభలో ఉపన్యాసాలు ఇవ్వబోతున్నారంటూ కేటీఆర్ ఎద్దేవా చేశారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా భాక్రానంగల్ ప్రాజెక్ట్ తెలంగాణలో ఉన్నట్లు ముఖ్యమంత్రి చెప్పడం ఆయన అజ్ఞానానికి నిదర్శనమన్నారు. ఆ ప్రాజెక్ట్ హిమాచల్ ప్రదేశ్లో ఉందన్న విషయం కూడా తెలియని స్థితిలో ఉన్న సీఎం నుంచి గోదావరి, కృష్ణా జలాలపై పాఠాలు వినాలా? అని ప్రశ్నించారు. దేవాదుల ప్రాజెక్ట్ ఏ బేసిన్లో ఉందో కూడా ఆయనకు తెలియదని విమర్శించారు. సుంకిశాల ప్రాజెక్ట్ కూలిపోయినా సమాధానం చెప్పలేని పరిస్థితి ఉందన్నారు. ‘మేం మీ దగ్గర ఏం నేర్చుకోవాలి? చెక్డ్యాంలు ఎలా ఫెయిల్ చేయాలో నేరి్పస్తారా? మేడిగడ్డ ఎలా పేల్చామో చెబుతారా? సుంకిశాల ఎలా కూల్చామో వివరిస్తారా? వట్టెం పంప్ హౌస్ ఎలా ముంచామో చూపిస్తారా? లేక కృష్ణా నదిపై తెలంగాణకు ఉన్న హక్కులన్నింటినీ కేఆర్ఎంబీకి ఎలా ధారాదత్తం చేశారో పవర్ పాయింట్లో చూపిస్తారా?’అని కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పాలమూరును పక్కన పెట్టారు పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్లుగా పక్కన పెట్టిందని కేటీఆర్ ఆరోపించారు. ముఖ్యమంత్రి తరచూ ‘పండబెట్టి తొక్కుతాం’అంటారని, ఇప్పుడు నిజంగానే ఆ ప్రాజెక్ట్ను పండుకోబెట్టి పాలమూరు రైతాంగాన్ని తొక్కుతున్నారని మండిపడ్డారు. ఏం చేశారని ప్రజల ముందుకు వెళ్తారని నిలదీశారు. ప్రజాస్వామ్యాన్ని నిజంగా గౌరవించే ప్రభుత్వం అయితే, శాసనసభలో ప్రధాన ప్రతిపక్షానికి సమాన అవకాశాలు కల్పించాల్సిందేనని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పాలనలో తిరోగమనమే.. కేలండర్లు మారుతున్నాయే తప్ప, కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆశలతో ఓటేసిన ప్రజల జీవితాల్లో మాత్రం ఎలాంటి మార్పు కనిపించడం లేదని కేటీఆర్ ధ్వజమెత్తారు. రెండేళ్లుగా తెలంగాణ అభివృద్ధి బాటలో కాకుండా తిరోగమనం వైపు సాగుతోందన్నారు. కేటీఆర్ తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నూతన సంవత్సర డైరీని కేటీఆర్ ఆవిష్కరించిన అనంతరం పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. రాష్ట్రం ఏర్పడకముందు, కేసీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టకముందున్న పరిస్థితులు తిరిగి వస్తున్నాయని చెప్పారు. పండుగ వాతావరణం ఉన్నప్పటికీ రాష్ట్రవ్యాప్తంగా రైతులు యూరియా కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. పారీ్టకి కార్యకర్తలే అసలైన బలమని, గులాబీ జెండా తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిందని కేటీఆర్ అన్నారు. -
25 ఏళ్ల సంబురం.. విచారణల పర్వం
సాక్షి, హైదరాబాద్: భారత్ రాష్ట్ర సమితిలో కీలక ఘట్టాలకు 2025 సాక్షిగా నిలిచింది. 2001లో ఉద్యమ పార్టీగా అవతరించిన బీఆర్ఎస్ ఈ ఏడాది 25 ఏళ్లు పూర్తి చేసుకుని ఘనంగా రజతోత్సవాలను జరుపుకుంది. అయితే అధినేత కేసీఆర్ సహా విపక్ష పార్టీ నాయకులు పలు కేసుల్లో విచారణ ఎదుర్కోవాల్సి వచ్చింది. కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత సస్పెన్షన్ వ్యవహారంతో పార్టీ కొంత కుదుపునకు గురైంది. పార్టీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఓటమి చవి చూసినా...ఏడాది చివర్లో జరిగిన పంచాయతీ ఎన్నికలు గులాబీ దళానికి భారీ ఊరటనిచ్చాయి. ఇదే ఊపుతో 2026లో పార్టీ పునరుజ్జీవం దిశగా కార్యక్రమాలు చేపట్టేందుకు సన్నద్ధమవుతోంది. బీఆర్ఎస్కు సంబంధించి ఈ ఏడాది చోటు చేసుకున్న కొన్ని కీలక పరిణామాల వివరాలు..» ఏడాది ఆరంభంలోనే..అంటే జనవరి 9న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ‘ఫార్ములా ఈ’ కేసులో ఏసీబీ విచారణకు హాజరయ్యారు. అదే నెల 16న ఇదే కేసుకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఎదుట హాజరయ్యారు. జూన్ 16న మరోసారి ఏసీబీ ఆయన్ను ప్రశ్నించింది. సెప్టెంబర్ 9న ఏసీబీ ప్రభుత్వానికి ఇచ్చిన ప్రాసిక్యూషన్ రిపోర్టులో కేటీఆర్ను ప్రధాన నిందితుడిగా పేర్కొంది. కాగా నవంబర్ 20న కేటీఆర్ ప్రాసిక్యూషన్కు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అనుమతి ఇచ్చారు. » ఏప్రిల్ 27న వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ రజతోత్సవ సభ నిర్వహించింది. 2023లో అధికారం కోల్పోయిన తర్వాత పెద్దయెత్తున నిర్వహించిన ఈ బహిరంగ సభలో పార్టీ శ్రేణులు పెద్దయెత్తున పాల్గొన్నాయి. అధినేత కేసీఆర్ వారికి దిశానిర్దేశం చేశారు. ఉద్యమ పార్టీ మొదలుకుని పదేళ్లు అధికారంలో కొనసాగడం వరకు బీఆర్ఎస్ ప్రస్థానాన్ని వివరించిన ఆయన గులాబీ దళంలో కొత్త జోష్ నింపారు.» బీఆర్ఎస్ రజతోత్సవాల నిర్వహణ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ కేసీఆర్కు ఎమ్మెల్సీ కవిత రాసిన లేఖ లీక్ కావడం పార్టీలో అంతర్గత విభేదాలను బహిర్గతం చేసింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలను కారణంగా చూపుతూ కవితను సెప్టెంబర్ 2న బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేశారు. కాగా సెప్టెంబర్ 3న పార్టీ సభ్యత్వానికి, ఎమ్మెల్సీ పదవికి కవిత రాజీనామా చేశారు.» కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన పీసీ ఘోష్ కమిషన్ ఎదుట కేసీఆర్, హరీశ్రావు విచారణకు హాజరై వివరణ ఇచ్చారు. జూన్ 11న కమిషన్ ముందు 115వ సాక్షిగా హాజరైన కేసీఆర్.. ప్రాజెక్టు రీ–డిజైన్ అవసరం, ఇందుకు సంబంధించిన నిర్ణయాలు వివరించారు. ఎమ్మెల్యే హరీశ్రావును కూడా కమిషన్ విచారించింది.» బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్లో చేరినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న 10 మంది ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ న్యాయ పోరాటం కొనసాగుతోంది. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై గత ఏడాది దాఖలు చేసిన అనర్హత పిటిషన్లపై హైకోర్టు, సుప్రీంకోర్టు, స్పీకర్ ట్రిబ్యునల్ ఎదుట బీఆర్ఎస్ వాదనలు వినిపించింది. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో వాదనలు విన్న స్పీకర్ ట్రిబ్యునల్ .. డిసెంబర్ మూడో వారంలో ఐదుగురు ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ ఇచ్చిన అనర్హత పిటిషన్ చెల్లదంటూ తీర్పు ఇచ్చింది.» పార్టీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ (జూబ్లీహిల్స్) అనారోగ్యంతో మరణించడంతో నవంబర్ 11న ఉప ఎన్నిక జరిగింది. గోపీనాథ్ భార్య సునీత పార్టీ తరఫున పోటీ చేసి ఓటమి చెందారు.» డిసెంబర్లో మూడు విడతలుగా జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పార్టీ కొంత మెరుగైన ఫలితాలు సాధించింది. గ్రామీణ ప్రాంతాల్లో బీఆర్ఎస్ తన పట్టును నిలుపుకుందనే అభిప్రాయం వ్యక్తమైంది. సుమారు 4 వేలకు పైగా గ్రామ పంచాయతీల్లో పార్టీ మద్దతుదారులు సర్పంచ్లుగా గెలుపొందారు. పంచాయతీ ఎన్నికలు ఇచ్చిన ఉత్సాహంతో పరిషత్ ఎన్నికలకు బీఆర్ఎస్ పార్టీ యంత్రాంగాన్ని సన్నద్ధం చేస్తోంది. ‘పాలమూరు’ ప్రాజెక్టు వంటి అంశాలపై పోరాటాలకు వ్యూహ రచన చేస్తోంది.సమన్వయ లేమి.. అంతర్గత విభేదాలుఅయితే వరుసగా మూడుసార్లు గెలిచి హైదరాబాద్లో హిందుత్వ బ్రాండ్ అంబాసిడర్ అని పిలిపించుకున్న టి.రాజాసింగ్.. చివరకు రాజీనామా వరకు వెళ్లేలా పార్టీలో పరిణామాలు చోటుచేసుకున్నాయి. పార్టీ నాయకత్వంపై, కేంద్రమంత్రి కిషన్రెడ్డిపై నేరుగా విమ ర్శలు, ఆరోపణలతో రాజాసింగ్ బీజేపీలో కొనసాగలేని పరిస్థితికి చేరుకున్నారు. పార్టీ ముఖ్యనేతల మధ్య సమన్వయ లేమి, అంతర్గత విభేదాలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎవరికి వారే అన్నట్టుగా సొంత ప్రతిష్టను, సత్తాను చాటుకునే ప్రయత్నంలో పార్టీ సమష్టి బాధ్యత, కలిసికట్టుగా ముందుకెళ్లడం అనేది విస్మరించారనే విమర్శలు వచ్చాయి. ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఘోరఓటమి పార్టీకి, నాయకులు, కార్యకర్తలకు ఇబ్బందికర పరిణామంగా మారింది. అయితే ఈ ఏడాది చివర్లో జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో పార్టీ మద్దతుతో 1,000 మంది దాకా (స్వతంత్రుల్ని కూడా కలుపుకొని) సర్పంచ్లు గెలిచారని పార్టీ ప్రకటించింది. 2019లో గెలిచిన సర్పంచ్ స్థానాలతో పోల్చితే ఇవి సంఖ్యాపరంగా ఎక్కువైనా రాష్ట్రంలో, మరీ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పార్టీ బలం పెరిగిందని చెబుతున్న స్థాయిలో ఇవి లేవనే అభిప్రాయం వ్యక్తమవుతుండటం గమనార్హం. ఈ ఏడాది కూడా పార్టీలో అంతర్గత కుమ్ములాటలు కొనసాగాయి. ముఖ్యనేతలు సైతం బహిరంగ విమర్శలు చేసుకున్నారు. -
బీఆర్ఎస్ డిప్యూటీ ప్లోర్ లీడర్ల నియామకం
హైదరాబాద్: తెలంగాణ శాసనసభ, శాసనమండలికి సంబంధించి బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ల నియామకం చేపట్టింది. శాసనసభ బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్లుగా హరీష్రావు,. సబితాఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్లన నియమించగా, శాసనమండలి డిప్యూటీ ఫ్లోర్ లీడర్లుగా రమణ, పోచంపల్లి శ్రీనివాస్రెడ్డిలను బీఆర్ఎస్ నియమించింది. ఇక మండలిలో బీఆర్ఎస్ విప్గా దేశపతి శ్రీనివాస్ను నియమించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తుది నిర్ణయం మేరకే వీరిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. -
ఈసారి ఎదురుదాడే!
సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదీ జలాల పంపిణీ, పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుల విషయంలో పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్, రెండేళ్ల నుంచి అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీల హయాంలో ఏం జరిగిందనే వాస్తవాలను అసెంబ్లీ వేదికగా ప్రజలకు వివరించాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తన మంత్రివర్గ సహచరులు, ప్రభుత్వ విప్లకు సూచించారు. వాస్తవాలు తమకే అనుకూలంగా ఉన్నందున, ప్రజలకు ఆ వాస్తవాలను వివరించడంలో ఎట్టి పరిస్థితుల్లోనూ వెనుకపడొద్దని చెప్పారు. ఈసారి జరిగే సమావేశాల్లో అధికార పక్షంగా అటాక్ (దాడి) మోడ్లోకి రావాలంటూ దిశానిర్దేశం చేశారు. సోమవారం తొలిరోజు అసెంబ్లీ వాయిదా పడిన తర్వాత తన చాంబర్లో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు, ప్రభుత్వ విప్లతో ఆయన దాదాపు 35 నిమిషాల పాటు సమావేశమయ్యారు. శాసనసభలో వ్యవహరించాల్సిన తీరు, ప్రతిపక్షాలకు దీటుగా ఇవ్వాల్సిన సమాధానాలపై మార్గదర్శనం చేశారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం..‘పాలమూరు–రంగారెడ్డి, కృష్ణా నదీజలాల పంపిణీ విషయంలో మనమే కేసీఆర్ను సవాల్ చేశాం. అసెంబ్లీకి వస్తే అన్నీ చర్చిద్దామంటూ ఆహ్వానించాం. ఇప్పుడు ఆయన వస్తాడో రాడో తెలియదు. ఒకవేళ వస్తే కథలు చెప్తారు. ఆ కథలే వాస్తవాలుగా ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తారు. అలా జరగడానికి వీల్లేదు. ప్రజలకు ఆ భావన కలగకూడదు. బీఆర్ఎస్ అబద్ధాలను మనం సమర్థంగా తిప్పికొట్టాలి. ఇందుకు అందరూ సిద్ధం కావాలి..’ అని సీఎం చెప్పారు. అబద్ధాలు, అన్యాయం వారి విధానం బీఆర్ఎస్ చేసే రాజకీయం అందరికీ తెలుసునని, అబద్ధాలు ఆడి ప్రజలను నమ్మించడమే కాకుండా అన్యాయంగా వ్యవహరించడం వారి విధానమని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించినట్టు తెలిసింది. ‘ఉనికిని కాపాడుకునేందుకు ఆ పార్టీ పడరాని పాట్లు పడుతోంది. అందుకే గతంలో మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అసెంబ్లీలో పవర్పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చేందుకు అవకాశం ఇవ్వకుండా, ఇప్పుడు వాళ్లకు అవకాశం కావాలని అడుగుతోంది. బీఆర్ఎస్ చెప్పాలనుకున్నది చెప్పనివ్వకుండా ప్రభుత్వం అడ్డుకుందనే భావనను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకే ఈ డిమాండ్ మొదలుపెట్టారు. పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు కృష్ణా నది కింద ఉన్న ప్రాజెక్టులను బీఆర్ఎస్ ప్రభుత్వం ఏనాడూ పట్టించుకోలేదన్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడమేకాకుండా, అసెంబ్లీలోనూ తీవ్రస్థాయిలో ఎండగట్టాలి. సుప్రీంకోర్టుకు ఇచ్చిన డాక్యుమెంట్లలో 7.1 టీఎంసీలు మాత్రమే చాలని ఏ విధంగా పేర్కొన్నారో నిలదీయాలి. కల్వకుర్తి, నెట్టెంపాడు, కోయిల్సాగర్, బీమా ప్రాజెక్టులు గత కాంగ్రెస్ హయాంలోనే ప్రారంభమై దాదాపు పూర్తి కావొచ్చినా.. వాటిని కూడా మొత్తం పూర్తి చేయకుండా పాలమూరు జిల్లాపై బీఆర్ఎస్ సర్కారు కక్ష పూరితంగా వ్యవహరించిన అంశాన్ని ఎండగట్టాలి. పూర్తి అథారిటీ, లెక్కలతో జవాబులివ్వాలి పూర్తి అథారిటీ (సాధికారికంగా), లెక్కలతో సహా బీఆర్ఎస్కు దిమ్మతిరిగే సమాధానం ఇవ్వాలి. ప్రతిపక్షాలను ధీటుగా ఎదుర్కొనేందుకు అందరూ సిద్ధం కావాలి. బీఆర్ఎస్తో సహా ఏ పార్టీ సభ్యుడు అడిగిన ఎలాంటి సందేహానికైనా జవాబిచ్చేలా ఉండాలి. సబ్జెక్టుల వారీగా సిద్ధం కావాలి. ప్రతి అంశంపై నోట్స్ తయారు చేసుకోవాలి. ప్రతిపక్షాలు అడిగే ప్రతి ప్రశ్నకూ సమాధానం ఇవ్వాలి. సమగ్రంగా చర్చలో పాల్గొనాలి. పాయింట్ ఆఫ్ ఆర్డర్ల విషయంలోనూ అప్రమత్తంగా ఉండడం ద్వారా ప్రతిపక్షాలను కట్టడి చేయాలి. 2వ తేదీ నుంచి జరిగే సమావేశాలకు ఎమ్మెల్యేలు ఎవరూ గైర్హాజరు కాకూడదు. ఈ మేరకు మంత్రులు, విప్లు సమన్వయం చేయాలి. కృష్ణా జలాలపై చర్చ జరగనున్నందున నది పరీవాహక ప్రాంతం పరిధిలోనికి వచ్చే ఎమ్మెల్యేలు ధీటుగా సమాధానమిచ్చేందుకు సిద్ధం కావాలి..’ అని సీఎం సూచించినట్టు సమాచారం. -
గడ్డం పెంచినోళ్లంతా గబ్బర్ సింగ్ కాలేరు
సాక్షి, హైదరాబాద్: ‘గడ్డం పెంచినోళ్లంతా గబ్బర్ సింగ్ కాలేరు. మీసాలు పెంచడం చాలా సులభం.. కానీ పాలన చేయడమే కష్టం. గడ్డం, మీసం లేదని రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలు నన్ను ఉద్దేశించి కాదు. బహుశా వాళ్ల పార్టీ నేతలు రాహుల్ గాందీ, రాజీవ్ గాంధీని ఉద్దేశించి చేశాడనుకుంటా. నేను ఆంధ్రాలో చదవడాన్ని తప్పు పడుతున్న ముఖ్యమంత్రి అల్లుడిని మాత్రం అక్కడ నుంచే తెచ్చుకున్నారు..’అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ఎద్దేవా చేశారు. శాసనసభ సమావేశాల నేపథ్యంలో సోమవారం అసెంబ్లీ లాబీలో మీడియాతో ఆయన ఇష్టాగోష్టిగా మాట్లాడారు. శాసనసభలో ప్రతిపక్ష నేత, మాజీ సీఎం కేసీఆర్కు సీఎం రేవంత్ అభివాదం చేయడంపై స్పందించారు. ‘తెలంగాణ తెచ్చిన నాయకుడిగా కేసీఆర్ అంటే ప్రతి ఒక్కరికీ గౌరవం ఉంటుంది. సభలో కేసీఆర్ను కలిసేంత సంస్కారం ఉంటే చాలు. ఇదే సంస్కారం బయట మాటల్లో కూడా ఉంటే బాగుంటుంది. రాజకీయ ప్రత్యర్ధులు ఒకరినొకరు పలకరించుకునేంత సానుకూల వాతావరణం ఉంటే మంచిదే..’అని వ్యాఖ్యానించారు. చంద్రబాబుకు కోపం వస్తుందనే ‘పాలమూరు’ను పడుకోబెట్టారు ‘ఏ ప్రభుత్వం అయినా తాగునీటి అవసరాల పేరుతోనే ప్రాజెక్టులు ప్రారంభించి అనుమతులు తెచ్చుకోవడం పరిపాటి. ఈ విషయాన్ని ఎవరూ అధికారికంగా బయట పెట్టరు. పాలమూరు ప్రాజెక్టులో రంధ్రాన్వేషణ చేస్తే రాష్ట్రానికే తప్ప రాజకీయంగా మాకు ఎలాంటి నష్టం జరగదు. కృష్ణా జలాల్లో 299 టీఎంసీలకు ఒప్పుకున్నది నాటి కాంగ్రెస్ ప్రభుత్వమే. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తయితే కేసీఆర్కు పేరు వస్తుందని, తన పాత బాస్ చంద్రబాబుకు కోపం వస్తుందనే ఉద్దేశంతోనే పనులు చేయకుండా పడుకోబెట్టారు. కేసీఆర్ ప్రెస్మీట్ పెడితే అల్లాడుతున్న వారు ఆయన అసెంబ్లీకి రావాలని డిమాండ్ చేయడం హాస్యాస్పదం. నదులు, బేసిన్ల గురించి అవగాహన లేని సీఎం, మంత్రులు నీటిపారుదల శాఖపై జరిగే చర్చకు కేసీఆర్ రావాలని అంటున్నారు. ఇప్పుడు కేసీఆర్ సభకు వస్తున్నారని తెలిసి చర్చకు ప్రిపేర్ అవుతున్నారు. మేడిగడ్డ బరాజ్ పేల్చివేతలపై ఇంజనీర్లు ఫిర్యాదు చేసినా ఎందుకు చర్యలు చేపట్టలేదు?’అని కేటీఆర్ ప్రశ్నించారు. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ లేదని చెప్పగలరా? ‘శాంతి భద్రతల పరిరక్షణ కోసం నెహ్రూ కాలం నుంచే గూఢచారి వ్యవస్థ ఉంది. ప్రస్తుతం నిఘా వ్యవస్థ ఫోన్ ట్యాపింగ్ చేయడం లేదని ముఖ్యమంత్రి చెప్పగలరా?. గతంలో ఇంటిలిజెన్స్ చీఫ్గా పనిచేసిన ప్రస్తుత డీజీపీకి కూడా నిఘా వ్యవస్థపై పూర్తి అవగాహన ఉంది. సీఎంకు నిఘా వ్యవస్థ సమాచారం మాత్రమే ఇస్తుంది, సమాచారణ సేకరణ ఎలా చేసిందో చెప్పదు. ‘సిట్’లు, విచారణలతో ఇప్పటివరకు ఒక్క ఆరోపణ అయినా నిజమని తేల్చిందా? ప్రభుత్వ వైఫల్యాల నుంచి దృష్టిని మళ్లించే ప్రయత్నాలను అర్ధం చేసుకున్న ప్రజలు పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ మద్దతుదారులకు ఓటు వేసి కాంగ్రెస్కు పాలన చేతకాదని తేల్చి చెప్పారు..’అని కేటీఆర్ అన్నారు. పార్టీ నుంచి వెళ్లిన వారికి డోర్లు క్లోజ్ ‘పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలను తిరిగి పార్టీలోకి తీసుకునేది లేదు. పార్టీ నుంచి వెళ్లిన మాజీ ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, సైదిరెడ్డి వారి నియోజకవర్గాల్లో కనీసం ఒకటి రెండు సర్పంచ్ స్థానాలు కూడా గెలిపించుకోలేక పోయారు. పాలకుర్తి, బోథ్, జహీరాబాద్ లాంటి నియోజకవర్గాల్లో పార్టీ మద్దతుదారులు మెజారిటీ స్థానాల్లో సత్తా చాటారు. అందువల్లే కాంగ్రెస్ మున్సిపల్ ఎన్నికలు పెట్టేందుకు భయ పడుతోంది..’అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. -
పాలమూరుపై తగ్గేదేలే!
సాక్షి, హైదరాబాద్: పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతలు పథకంపై అసెంబ్లీ వేదికగా చర్చ జరగనున్న నేపథ్యంలో పార్టీ పరంగా వినిపించాల్సిన వాదనపై బీఆర్ఎస్ కసరత్తు చేస్తోంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి కొత్త అంశాన్ని ప్రభుత్వం తెరమీదకు తెస్తుండటంతో దానిని సమర్థవంతంగా తిప్పి కొట్టేందుకు అనుసరించాల్సిన వ్యూహానికి పదును పెడుతోంది. సోమవారం సాయంత్రం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు, మాజీ మంత్రులు హరీశ్రావు, ప్రశాంత్రెడ్డి, జగదీశ్రెడ్డితో పాటు మరికొందరు పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నందినగర్ నివాసంలో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కె.చంద్రశేఖర్రావుతో సుదీర్ఘంగా భేటీ అయ్యారు.విశ్వసనీయ సమాచారం ప్రకారం..పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుతో పాటు కృష్ణా జలాల్లో తెలంగాణ వాటాకు సంబంధించి ప్రభుత్వం ఎలాంటి వాదన వినిపిస్తుందనే అంశంపై చర్చ జరిగింది. ‘పాలమూరు–రంగారెడ్డి పథకం కింద తాగునీటి కోసం 7.15 టీఎంసీలతో పనులు చేసేందుకు అనుమతి ఇవ్వాలని గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కోరిందని చెప్పేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమవుతోంది. కాబట్టి తాగునీటి ప్రాజెక్టుగా పేర్కొనడం వెనుక ఉన్న వాస్తవ ఉద్దేశాలను విడమరిచి చెప్పాలి..’ అని కేసీఆర్ సూచించారు. ప్రభుత్వం ‘పాలమూరు’ను తాగునీటి ప్రాజెక్టుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తే..దాని నేపథ్యాన్ని కూడా బలంగా వినిపించాలని ఆయన ఆదేశించినట్లు తెలిసింది.అలాగే పాలమూరు ఎత్తిపోతలు పథకం డీపీఆర్, బీఆర్ఎస్ హయాంలో సాధించిన అనుమతులు, ప్రస్తుత ప్రభుత్వ వైఫల్యాలను అసెంబ్లీ వేదికగా ఎండగట్టాలని సూచించినట్లు సమాచారం. కాగా అనుమతుల ప్రక్రియను దృష్టిలో పెట్టుకుని తాగునీటి ప్రాజెక్టు పేరిట పనులు చేపట్టడం సర్వసాధారణంగా జరిగే ప్రక్రియ అనే వాదన వినిపించేందుకు అవసరమైన సమాచారాన్ని బీఆర్ఎస్ నేతలు సేకరిస్తున్నారు. కేంద్రం వైఖరిని కూడా ప్రశ్నించాలిరాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులకు కేంద్రం నుంచి సహకారం లేకపోవడాన్ని ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్.. ఇదే అంశాన్ని అసెంబ్లీలోనూ ప్రస్తావించనుంది. పర్యావరణ అనుమతుల జారీకి కేంద్ర పర్యావరణ శాఖ నిరాకరించిందనే వార్తల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ అసమర్థతను ఎత్తిచూపాలని కేసీఆర్ ఆదేశించారు. కాగా నారాయణపేట–కొడంగల్ ఎత్తిపోతలు పథకానికి డీపీఆర్ ఇవ్వకుండానే ప్రస్తుత ప్రభుత్వం టెండర్లు పిలవడం, పనులు మొదలు పెట్టడాన్ని ప్రస్తావించి అధికార పక్షాన్ని ఇరకాటంలోకి నెట్టాలనే యోచనలో బీఆర్ఎస్ నేతలు ఉన్నట్టు తెలుస్తోంది. సర్కారు ప్రకటనను బట్టి కార్యాచరణపాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతలు పథకానికి సంబంధించి అసెంబ్లీలో ప్రభుత్వం చేసే ప్రకటన ఆధారంగా తదుపరి కార్యాచరణపై దృష్టి పెట్టాలని కేసీఆర్ ఆదేశించారు. ఇప్పటికే మూడు ఉమ్మడి జిల్లాలు మహబూబ్నగర్, రంగారెడ్డి, నల్లగొండ పరిధిలో బహిరంగ సభల నిర్వహణకు బీఆర్ఎస్ సన్నాహాలు చేస్తోంది. మరోవైపు అసెంబ్లీలో ప్రభుత్వం చేసే ప్రకటనను బట్టి అవసరమైతే సుప్రీంకోర్టులోనూ పార్టీ పరంగా కేసు దాఖలు చేయాలని ఆ పార్టీ యోచిస్తున్నట్లు తెలిసింది. కృష్ణా నదిపై ఏపీ చేపడుతున్న ప్రాజెక్టులు, అనుమతులు, నదీ జలాల్లో తెలంగాణ వాటా, ట్రిబ్యునళ్ల తీర్పులు తదితరాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించి క్రోడీకరించాలని బీఆర్ఎస్ అధినేత ఆదేశించినట్లు తెలిసింది. -
మీ చేతకానితనంతోనే రాష్ట్రానికి నష్టం
సాక్షి, హైదరాబాద్: అబద్ధాల పునాదులపైనే బీఆర్ఎస్ రాజకీయం చేస్తోందని నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డి ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ చేతకానితనంతో తెలంగాణకు తీరని నష్టం కలిగిందని, ఇప్పుడు ఆ చేతకానితనాన్ని దాచిపెట్టి కాంగ్రెస్ను బద్నాం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు 45 టీఎంసీలు కేటాయించాలంటూ కాంగ్రెస్ ప్రభుత్వం కోరిందని మాజీ మంత్రి హరీశ్రావు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారు.ఉత్తమ్ ఈ ప్రాజెక్టు గురించి సోమవారం అసెంబ్లీ లాబీల్లో విలేకరులతో ఇష్టాగోష్టి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ నేతలు, ముఖ్యంగా హరీశ్రావు చెపుతున్న వాటిలో 100 శాతం అబద్ధాలేనని అన్నారు. వారి మాటలు వింటుంటే గోబెల్స్ ఆత్మ క్షోభిస్తుందని, తాను నేర్పిన విద్యను తన కంటే ఎక్కువగా వాడుకుంటున్నారని పైన ఉన్న ఆయన అనుకుంటున్నాడేమోనని ఎద్దేవా చేశారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు 90 టీఎంసీల కేటాయింపులతో 12 లక్షల ఎకరాల ఆయకట్టు లక్ష్యంగా ఎంత ఖర్చయినా సరే ఈ దఫాలోనే పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. గందరగోళ పరుస్తున్నారన్నారు..వాస్తవానికి పాలమూరు ప్రాజెక్టుకు చేయాల్సిన 90 టీఎంసీల కేటాయింపుల్లో 45 టీఎంసీలు కృష్ణా నుంచి, 45 టీఎంసీలు గోదావరి నుంచి మళ్లించడం ద్వారా తీసుకుంటామని 2022, ఆగస్టు 18న అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం జీవో విడుదల చేసిందని ఉత్తమ్ చెప్పారు. అయితే, 45 టీఎంసీల గోదావరి నీటి విషయం ట్రిబ్యునల్లో పెండింగ్లో ఉన్నందున అది కోర్టు పరిధిలోకి వస్తుందని, ఈ కారణంతోనే తాము 90 టీఎంసీల తుది కేటాయింపులు చేయలేమని కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) స్పష్టం చేసిందని వివరించారు.ఈ పరిస్థితుల్లో తమకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వచ్చే 45 టీఎంసీల కృష్ణా జలాలను మొదటి దశలో కేటాయించాలని, తర్వాతి దశలో మిగిలిన 45 టీఎంసీలను కేటాయించాలని కోరుతూ సీడబ్ల్యూసీకి లేఖ రాశామే తప్ప ఎక్కడా కేటాయింపులను 45 టీఎంసీలకు తగ్గించాలని కోరలేదని స్పష్టంచేశారు. అసలు తెలంగాణ ప్రాజెక్టుకు నీటి కేటాయింపులు తగ్గించాలన్న కాగితంపై మంత్రిగా తానెందుకు సంతకం చేస్తానని ప్రశ్నించారు. కానీ, హరీశ్రావు మాత్రం తమ లేఖను చూపిస్తూ తనకు అనుకూలంగా ఉన్న వాక్యాలను మాత్రమే చదివి ప్రజలను గందరగోళ పరుస్తున్నారన్నారు. హరీశ్రావు తానే ఇరిగేషన్ మాస్టర్ అనుకుంటున్నాడని, అంత అహంకారం ఆయనకు ఎందుకని ప్రశ్నించారు. వేగం వద్దని చెప్పిందెవరు?‘ట్రిబ్యునల్ పరిధిలో ఉన్న 45 టీఎంసీల కేటాయింపు కోరుతూ ఈ విషయాన్ని వివాదం చేసింది ఎవరు? పాలమూరు ప్రాజెక్టును తాగునీటి అవసరాల కోసమే కడుతున్నామని, 7.15 టీఎంసీలు సరిపోతాయని సుప్రీంకోర్టుకు చెప్పిందెవరు? 2015లో ప్రాజెక్టు నిర్మించే జీవోను విడుదల చేసి 2022 సెప్టెంబర్ వరకు డీపీఆర్ సమర్పించనిదెవరు? ప్రాజెక్టు సోర్సును జూరాల నుంచి శ్రీశైలంకు మార్చి ఈ ప్రాజెక్టును అంతర్రాష్ట్ర జలవివాదాల్లోకి నెట్టిందెవరు? కాళేశ్వరం ప్రాజెక్టు సామర్థ్యాన్ని రోజుకు 2 టీఎంసీల నుంచి 3 టీఎంసీలకు పెంచి, పాలమూరు సామర్థ్యాన్ని 2 టీఎంసీల నుంచి ఒక్క టీఎంసీకి తగ్గించిందెవరు? అసలు పాలమూరు ప్రాజెక్టు పనుల్లో వేగం అవసరం లేదని, నిదానంగా చేయాలని ఇంజనీర్లకు బహిరంగంగానే చెప్పిందెవరు?’ అని ఉత్తమ్ ప్రశ్నించారు. 67 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి పని చేశాంపాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు కోసం తాము 90 శాతం పనులు చేస్తే గత రెండేళ్లలో తట్టెడు మట్టి ఎత్తిపోయలేదని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను కూడా ఉత్తమ్ తప్పుబట్టారు. రూ.70 వేల కోట్ల అంచనాలకు పెంచి ప్రాజెక్టు కోసం బీఆర్ఎస్ హయాంలో కేవలం రూ.27 వేల కోట్లు ఖర్చు పెట్టి 90 శాతం పనులెలా పూర్తవుతాయని ప్రశ్నించారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.7 వేల కోట్లు ఖర్చు పెట్టామని, 67 లక్షల క్యూబిక్మీటర్ల మట్టి పని, 7 లక్షల క్యూబిక్మీటర్ల కాంక్రీట్ పని చేశామని, 9 కిలోమీటర్ల పొడవైన కాల్వలు తవ్వామని చెప్పారు. తాము వచ్చిన తర్వాతే నార్లాపూర్–ఏదులకు సోర్సు గుర్తించామని చెప్పారు. -
అసెంబ్లీ 7 రోజులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ శీతాకాల సమావేశాలను వారం రోజుల పాటు నిర్వహించాలని సోమవారం జరిగిన అసెంబ్లీ బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. అవసరమయ్యే పక్షంలో మళ్లీ బీఏసీ సమావేశం నిర్వహించి మరో వారం పాటు పొడిగించాలని భావిస్తున్నట్లు తెలిసింది. అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ అధ్యక్షతన సోమవారం బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశం జరిగింది. స్పీకర్ చాంబర్లో ఆయన అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు శాసనసభా వ్యవహారాల మంత్రి శ్రీధర్బాబు, మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టి.హరీశ్రావు, వేముల ప్రశాంత్రెడ్డి, బీజేపీ శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి, ఎంఐఎం పక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ, సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుతో పాటు అసెంబ్లీ కార్యదర్శులు రెండ్ల తిరుపతి, నరసింహాచార్యులు పాల్గొన్నారు. ఎన్ని రోజులు నిర్వహిద్దాం..? శాసనసభ నిర్వహణ తీరుతెన్నులతో పాటు సభను ఎన్ని రోజుల పాటు జరపాలనే అంశంపై సమావేశంలో సుదీర్ఘంగా చర్చ జరిగింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. కనీసం 15 రోజుల పాటు నిర్వహించాలని బీఆర్ఎస్ పట్టుబట్టింది. బీజేపీ, ఎంఐఎం నేతలు కూడా సభను వీలైనన్ని ఎక్కువ రోజులు నిర్వహించాలని కోరారు. అయితే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పాటించిన సభా సంప్రదాయాలను కొనసాగిస్తున్నామని ప్రభుత్వం వాదించగా, బీజేపీ, ఎంఐఎం సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం.కాగా సమావేశాలు వారం రోజుల పాటు నిర్వహించి, అవసరమైన పక్షంలో మరో వారం పొడిగిస్తామని స్పీకర్ ప్రకటించారు. అయితే జనవరి 2, 3, 5 తేదీల్లో మరో 3 రోజులు మాత్రమే సమావేశాలు నిర్వహించేందుకు ప్రభుత్వం సుముఖంగా ఉన్నట్లు తెలిసింది. ఈ 3 రోజుల పాటు జరిగే సమావేశాలకు సంబంధించిన షెడ్యూలు ఖరారు చేసి సభ్యులకు అందజేయనున్నారు. ఎజెండాపైనా సుదీర్ఘ చర్చ సమావేశాల్లో చర్చించాల్సిన అంశాలకు సంబంధించిన ఎజెండాపై కూడా బీఏసీలో సుదీర్ఘంగా చర్చ జరిగింది. కృష్ణా నదీ జలాల్లో తెలంగాణ వాటా, పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంతో పాటు ఉపాధి హామీ పథకం పేరు మార్పుపై చర్చను అధికార పక్షం ప్రతిపాదించినట్లు తెలిసింది. అయితే 15 అంశాలపై చర్చించాలని బీఆర్ఎస్, 23 అంశాలపై చర్చించాలని బీజేపీ ప్రతిపాదించాయి.అయితే ప్రస్తుత సమావేశాల్లో బీఆర్ఎస్ ఇచ్చిన జాబితాలోని ఒకటి, రెండు అంశాలపై మాత్రమే చర్చించేందుకు ప్రభుత్వం అంగీకరించినట్లు తెలిసింది. నదీ జలాలపై చర్చ సందర్భంగా అధికార పక్షానికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్కు అవకాశం ఇస్తే తమకు కూడా అవకాశం ఇవ్వాలని బీఆర్ఎస్ కోరింది. ఈ మేరకు స్పీకర్కు పార్టీ నేతలు లిఖిత పూర్వకంగా లేఖను సమర్పించారు. ప్రతిరోజూ క్వశ్చన్ అవర్ ఉండాలి: హరీశ్రావు బీఏసీ భేటీ ముగిసిన తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు హరీశ్రావు, వేముల ప్రశాంత్రెడ్డి మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ‘నదీ జలాలపై పీపీటీ కోసం స్పీకర్ను కోరాం. ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. సభ నిర్వహణపై మా అభిప్రాయాలను చెప్పాం. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో కేవలం ఆరు రోజులు మాత్రమే ప్రశ్నోత్తరాలు నడిచాయి. సమావేశాలు జరిగినన్ని రోజులు క్వశ్చన్ అవర్ నిర్వహించాలని కోరాం. అలాగే 2025లో కేవలం 15 రోజులు మాత్రమే సభ నడిచిందనే విషయాన్ని దృష్టికి తీసుకెళ్లాం. శాసనసభ కమిటీల ఏర్పాటు, ప్రోటోకాల్ ఉల్లంఘనల గురించి ప్రస్తావించాం. ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డికి సమాచారం లేకుండా బాల్కొండలో అధికారికంగా క్రిస్మస్ వేడుకలు నిర్వహించడాన్ని స్పీకర్ దృష్టికి తీసుకెళ్లాం..’అని హరీశ్రావు తెలిపారు. బీఆర్ఎస్ ప్రతిపాదించిన అంశాలు ఇవే..! యూరియా కొరత, రుణమాఫీ, రైతు భరోసా, పంట బోనస్, రైతు ఆత్మహత్యలు.. వంద రోజుల్లో ఆరు గ్యారంటీల అమల్లో వైఫల్యం, ఫ్యూచర్ సిటీ పేరిట భూములు ధారాదత్తం, కొత్త థర్మల్ ప్రాజెక్టుల్లో అవినీతి, బీసీలకు 42% రిజర్వేషన్లలో ప్రభుత్వ తప్పిదాలు, జాబ్ కేలండర్..ఉద్యోగ నోటిఫికేషన్లలో ఆలస్యం, ఉద్యోగుల సమస్యల పరిష్కారం, పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, హిల్ట్ పాలసీ, గురుకుల విద్యా సంస్థల్లో సమస్యలు, జీహెచ్ఎంసీలో మున్సిపాలిటీల విలీనం, హైడ్రా, ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ మార్పు, శాంతిభద్రతలు, ఫీజు రీయింబర్స్మెంట్పై చర్చించాలని బీఆర్ఎస్ కోరింది. -
‘పాలమూరు’కు బీఆర్ఎస్ ద్రోహాన్ని ఎండగట్టాలి
సాక్షి, హైదరాబాద్: పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి బీఆర్ఎస్ చేసిన అన్యాయాన్ని ఆధారాలతో ఎండగట్టాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి ఆదేశించారు. జూరాల ప్రాజెక్టు నుంచి నీళ్లను తరలించడానికి 2013లో ఈ ప్రాజెక్టును నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపాదించగా, జూరాల ప్రాజెక్టు పూర్తిగా తెలంగాణ ఆధీనంతో ఉండటంతో ఎలాంటి సమస్యలు వచ్చేవి కావని గుర్తుచేశారు. జూరాలకు వచ్చే నీళ్లను వచ్చినట్టు పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా తరలించుకోవడానికి అవకాశం ఉండేదన్నారు. జూరాలకు బదులు శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నీళ్లను తరలించడానికి పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును నాటి సీఎం కేసీఆర్ రీడిజైన్ చేసి రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేశారని మండిపడ్డారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు, కృష్ణా జలాల అంశంపై నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డితో కలిసి ఆదివారం ఆయన సమీక్ష నిర్వహించారు. కాళేశ్వరం వేగం పాలమూరుపై చూపలేదు.. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అనుసరించిన వేగాన్ని పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో అనుసరించలేదని గత బీఆర్ఎస్ సర్కారును సీఎం రేవంత్ ఎండగట్టారు. శ్రీశైలం ఉమ్మడి ప్రాజెక్టు కావడంతో పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకి అనుమతులు, నీటి కేటాయింపుల విషయంలో ఏపీ అభ్యంతరాలు వ్యక్తం చేస్తోందన్నారు. జూరాల నుంచే ప్రాజెక్టును చేపట్టి ఉంటే ఇప్పటికే నిర్మాణం పూర్తయ్యేదని, అంచనా వ్యయం కూడా పెరిగేది కాదని చెప్పారు. రాష్ట్ర పునరి్వభజన చట్టంలో 2014కి ముందు ప్రతిపాదించిన/నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు కల్పించిన రక్షణ సైతం పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు వర్తించేదన్నారు.ఈ ప్రాజెక్టుకి కేటాయించిన 90 టీఎంసీల్లో గోదావరి జలాల మళ్లింపు ద్వారా లభ్యతలోకి వచ్చిన 45 టీఎంసీలూ ఉన్నాయని, వాటిని ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు పునఃకేటాయింపులు జరిపే అంశం కృష్ణా ట్రిబ్యునల్–2 పరిధిలో పెండింగ్లో ఉందని గుర్తు చేశారు. మైనర్ ఇరిగేషన్లో పొదుపు చేసిన మిగిలిన 45 టీఎంసీలతో ప్రాజెక్టుకి తొలి దశ అనుమతులు ఇవ్వాలని కేంద్రాన్ని కోరామని, ఏడాదిలోగా ట్రిబ్యునల్ విచారణ పూర్తైతే.. మిగిలిన 45 టీఎంసీల కేటాయింపులూ వస్తాయని స్పష్టం చేశారు. పూర్తిగా 90 టీఎంసీలను వాడుకోవాలనే సంకల్పంతో తమ ప్రభుత్వం ఉందన్నారు. ఈ ప్రాజెక్టును పూర్తి చేసే ఉద్దేశం గత బీఆర్ఎస్ సర్కారుకు లేదని ఆరోపించారు. ఇప్పుడూ తప్పుడు ఆరోపణలతో అడ్డంకులు సృష్టిస్తోందని మండిపడ్డారు. రాష్ట్రానికి తీవ్ర నష్టం పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో కృష్ణా బేసిన్లోని పెండింగ్ ప్రాజెక్టులను సైతం ఎందుకు పూర్తి చేయలేకపోయారని సీఎం రేవంత్రెడ్డి ప్రశ్నించారు. 2014కు ముందు పెండింగ్లో ఉన్న కల్వకుర్తి, నెట్టెంపాడు, బీమా, కోయిల్సాగర్, ఎస్ఎల్బీసీ, డిండి ప్రాజెక్టులు 2023లో బీఆర్ఎస్ అధికారం నుంచి దిగే నాటికి అలానే పెండింగ్లో ఉండిపోయాయన్నారు. బీఆర్ఎస్ చేసిన ద్రోహంతోనే కృష్ణా జలాల విషయంలో రాష్ట్రానికి తీవ్ర నష్టం జరిగిందన్నారు. శ్రీశైలం నుంచి ఏపీ 2004–14 మధ్య తరలించుకున్న నీళ్లతో పోల్చితే 2014–23 మధ్య తరలించుకున్న నీళ్లు చాలా ఎక్కువని గుర్తుచేశారు.ఏపీ అక్రమంగా చేపట్టిన పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపు, రాయలసీమ ఎత్తిపోతల వంటి ప్రాజెక్టులకు కేసీఆర్ పూర్తిగా సహకరించారని ఆరోపించారు. ఇలాంటి వివరాలతో అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్ఎస్ను ఎండగట్టడానికి నివేదికలు సిద్ధం చేయాలని నీటిపారుదల శాఖను ఆదేశించారు. కృష్ణా జలాలపై బీఆర్ఎస్ చేసిన ద్రోహంతోపాటు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక తీసుకున్న దిద్దుబాటు చర్యలను వివరిస్తూ జనవరి 1న మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలని సీఎం నిర్దేశించారు. -
ఉపఎన్నిక వస్తే.. నేనే గెలుస్తా
హైదరాబాద్: ఖైరతాబాద్లో ఉప ఎన్నిక వస్తే తప్పకుండా గెలుస్తానని ఎమ్మెల్యే దానం నాగేందర్ ధీమా వ్యక్తం చేశారు. కార్యకర్తలే తన బలమని, వారి వల్లే ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచానని, ఈ స్థాయిలో ఉన్నానని అన్నారు. శనివారం హిమాయత్నగర్ డివిజన్లోని విఠల్వాడిలో ఉన్న మేల్కొటె పార్క్ను కార్పొరేటర్ మహాలక్ష్మి రామన్గౌడ్తో కలిసి సందర్శించారు. అక్కడ జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి హెచ్ఎండీఏ డీఈ విశ్వనాథ్ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం జరిగిన కార్యకర్తల సమావేశంలో ఖైరతాబాద్ డీసీసీ నూతన అధ్యక్షుడు రోహిత్ను టీపీసీసీ ఉపాధ్యక్షుడు వినోద్రెడ్డితో కలిసి సన్మానించారు. ఈ సందర్భంగా దానం మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని గెలిపించడం, ఓడించడం అనేది ప్రజలు చూసుకుంటారన్నారు. సీఎంను ఉద్దేశించి బీఆర్ఎస్ నాయకులే ఏకవచనంతో మాట్లాడారని, ముఖ్యమంత్రి పదవికి గౌరవం ఇవ్వాలని, అది మరిచి విమర్శలు చేస్తే ప్రతి విమర్శలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుందని స్పష్టం చేశారు. కేటీఆర్ వ్యక్తిగత విమర్శలు మానుకొని, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిపై చర్చకు రావాలన్నారు. ఇద్దరు రాష్ట్ర మంత్రులు అవినీతికి పాల్పడుతున్నారని కేంద్ర హోం శాఖ సహాయమంత్రి బండి సంజయ్ ఆరోపిస్తున్నారని, ఆయన పరిధిలోనే దర్యాప్తు సంస్థలు ఉన్నాయని, ఆధారాలు ఉంటే విచారణ చేపట్టాలని సవాల్ విసిరారు.


