breaking news
Wanaparthy
-
పత్తిపై.. కపాస్ కత్తి
●నారాయణపేట: భారత పత్తి సంస్థ (సీసీఐ) కొత్త నిబంధనలతో పత్తి రైతులకు కొత్త కష్టాలు ఆరంభమయ్యాయి. పత్తి కొనుగోలులో తీసుకొచ్చిన కొత్త నిబంధనలు పత్తి రైతుల్లో ఆందోళన కలిగిస్తోంది. ఇకపై పత్తి అమ్మకాలకు ‘కపాస్ కిసాన్’ యాప్లోనే స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. ఇది స్మార్ట్ఫోన్ లేని, చదువు రాని వృద్ధ రైతులకు తలనొప్పిగా మారింది. యాప్ వాడకం, వివరాల నమోదుకు ఇతరులపై ఆధారపడాల్సి వస్తోంది. జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు అవగాహన కల్పిస్తున్నా.. ఈ యాప్పై రైతులు ఆవేదన వ్యక్తపరుస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోని మార్కెట్ యార్డులలో హెల్ప్డె స్క్లు ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు చెబుతుండగా.. గ్రామస్థాయిలో రైతులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని, ప్రతి రైతు వేదికలో హెల్ప్డెస్క్ ఏర్పాటు చేయాలని రైతులు కోరుతున్నారు. కాగా.. ఉమ్మడి జిల్లాకు కేటాయించిన 29 సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో తొలిసారిగా నారాయణపేట జిల్లా ధన్వాడ సమీపంలోని భాగ్యలక్ష్మి కాటన్ మిల్లులో బుధవారం తొలి సీసీఐ కొనుగోలు కేంద్రాన్ని మంత్రి వాకిటి శ్రీహరి ప్రారంభించారు. వ్యాపారుల్లో ఆందోళన సీసీఐ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడంలో సీసీఐ అధికార యంత్రాంగం ఉమ్మడి పాలమూరులోని ఒక్కో జిల్లాలో ఒక్కో తీరుతో వ్యవహరిస్తోందని వ్యాపారులు ఆరోపిస్తున్నారు. నారాయణపేట, మహబూబ్నగర్ జిల్లాలో ఎల్1, ఎల్2, ఎల్3 మిల్లులు కేటాయించారు. నాగర్కర్నూల్ జిల్లాలో బేల్స్ వారీగా కేటాయింపు చేశారు. అయితే ఏ మండలం రైతులు ఆ మండలంలో ఉండే కాటన్ మిల్లులో విక్రయించేందుకు వీలుగా అవకాశం క ల్పించాలని రైతులు మొరపెట్టుకుంటున్నారు. ఎల్–1 నిండిన తర్వాతే ఎల్–2 మిల్లుకు కేటాయించడం.. ఆ యాప్లో కనిపిస్తుందనే నిబంధన పెట్టడంతో అటు రైతులు.. ఇటు మిల్లర్లు సైతం ఆందోళన చెందుతున్నారు. 8 శాతానికి మించితే.. రైతులు తేమ శాతం 8 నుంచి 12 మధ్యలో ఉన్న పత్తిని తీసుకురావాల్సి ఉంటుంది. అత్యధికంగా 8 శాతం తేమ ఉంటే రూ.8,110 మద్దతు ధర లభిస్తుంది. అంతకు మించి పెరిగే ఒక్కొక్క శాతానికి రూ.81 ధర తగ్గుతుంది. తేమ శాతం 9 ఉంటే రూ.7,929– 8,028, 10 శాతం ఉంటే రూ.7,849– 7,947, 11 శాతం ఉంటే రూ.7,769– 7,866, 12 శాతం ఉంటే రూ.7,689– 7,785 మద్దతు ధరగా నిర్ధారించారు. అంత కంటే ఎక్కువ తేమ శాతం ఉంటే పత్తి ప్రైవేట్లో అమ్ముకోవాల్సిన పరిస్థితి దాపురిస్తోంది. వినియోగం ఇలా.. కపాస్ కిసాన్ యాప్ ద్వారా పత్తి విక్రయానికి ముందు రైతులు తాము సాగు చేస్తున్న పంట వివరాలను ఆయా ప్రాంత వ్యవసాయ విస్తరణాధి కారులు (ఏఈఓ) వద్ద నమోదు చేసుకోవాలి. పంట వివరాలను నమోదు చేసుకునే సమయంలో ఓటీపీ కోసం ఫోన్ నంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ ఫోన్ నంబర్ తప్పుగా నమోదై ఉంటే దానిని ఏఈఓతో సరిచేయించుకోవాలి. స్మార్ట్ఫోన్ లోని ప్లే స్టోర్లో కపాస్ కిసాన్ యాప్ను డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోవాలి. ఈ యాప్ ద్వారానే రైతులు తాము ఏ రోజు పత్తిని విక్రయించాలనుకుంటున్నారో మాతృభాషలో స్లాట్ బుక్ చేసుకోవాలి. పత్తిని విక్రయించే మార్కెట్ లేదా మిల్లు ఎంపిక చేయాలి. విక్రయించే పత్తి పరిమాణాన్ని క్వింటాళ్లలో నమోదు చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే జిల్లాలో ఒక సీసీఐ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించాం. మక్తల్, నారాయణపేట మార్కెట్ యార్డు పరిధిలోని మిగతా కాటన్ మిల్లులోనూ వారం రోజుల్లో సీసీఐ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం. రైతులు సీసీఐ కేంద్రాల్లోనే పత్తి విక్రయించి లబ్ధిపొందాలి. – బాలమణి, డీఎంఓ, నారాయణపేట సీసీఐ కొనుగోలు కేంద్రాల ఏర్పాటులోనూ గందరగోళం నిబంధనలపై రైతులు, అమ్మకాలపై వ్యాపారుల్లో ఆందోళన ఉమ్మడి జిల్లాకు 29 కేటాయింపు.. పేటలో తొలికేంద్రం ప్రారంభం మార్కెట్ యార్డులలో హెల్ప్ డెస్క్ల ఏర్పాటు -
జిల్లాలో 400 కొనుగోలు కేంద్రాలు
ఖిల్లాఘనపురం: రైతులకు ఇబ్బందులు కలగకుండా జిల్లాలో 400 వరిఽ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు రెవెన్యూ అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్ తెలిపారు. గురువారం మండల కేంద్రంలోని రైతువేధికలో ధాన్యం కొనుగోలుపై కేంద్రాల నిర్వాహకులు, ఏఈఓలకు అవగాహన కార్యక్రమం నిర్వహించగా.. ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. గత అంచనాల ప్రకారం జిల్లాలో 20 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కేంద్రాలకు వచ్చే అవకాశం ఉందని.. అందుకు అనుగుణంగా ఐకేపీ, సింగిల్విండోల ద్వారా కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కోటి గన్నీ బ్యాగులు అవసరం ఉండగా.. ఇప్పటికే 60 లక్షల సంచులు సిద్ధంగా ఉన్నాయని, త్వరలోనే 40 వేల బ్యాగులు వస్తాయని తెలిపారు. గతంలో ధాన్యం రవాణా విషయంలో ఇబ్బందులు ఎదురైనట్లు రైతులు, అధికారులు చెప్పారని.. ఈసారి పునరావృతం కాకుండా ముందుగానే లారీలు కేటాయిస్తామని చెప్పారు. ప్రతి కొనుగోలు కేంద్రంలో రోజు ఓ లారీ కచ్చితంగా అందుబాటులో ఉండేలా చూస్తామన్నారు. కేంద్రాల నిర్వహణలో తేడాలు జరిగినా, రైతులను ఇబ్బందులకు గురిచేసినా చర్యలు తప్పవని హెచ్చరించారు. టార్పాలిన్లు, తాగునీరు, తూకపు, తేమ గుర్తించే యంత్రాలు సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. ఏఈఓలు రైతులకు అవసరమైన టోకన్లు రాయాలని, గ్రామాలకు కేటాయించిన రైస్మిల్లుకు మాత్రమే ధాన్యం తరలించాలని ఆదేశించారు. ఽసన్న, దొడ్డు రకం ధాన్యాన్ని కచ్చితంగా గుర్తించాలని చెప్పారు. కార్యక్రమంలో పౌరసరఫరాల సంస్థ డీఎం జగన్మోహన్, సింగిల్విండో మండల చైర్మన్ మురళీధర్రెడ్డి, వైస్ చైర్మన్ క్యామ రాజు, మండల వ్యవసాయ అధికారి మల్లయ్య, తహసీల్దార్ సుగుణ, ఏపీఎం నాగరాజు తదితరులు పాల్గొన్నారు. రామన్పాడుకు 1,076 క్యూసెక్కుల వరద మదనాపురం: మండలంలోని రామన్పాడు జలాశయానికి గురువారం జూరాల ఎడమ కాల్వ నుంచి 1,030 క్యూసెక్కులు, కుడి కాల్వ నుంచి 46 క్యూసెక్కులు, మొత్తం 1076 క్యూసెక్కుల వరద చేరినట్లు ఏఈ వరప్రసాద్ తెలిపారు. ప్రస్తుతం జలాశయంలో పూర్తిస్థాయి నీటిమట్టం సముద్ర మట్టానికిపైన 1,021 అడుగులు ఉండగా.. ఎన్టీఆర్ కాల్వకు 875 క్యూసెక్కులు, కుడి, ఎడమ కాల్వలకు 55 క్యూసెక్కులు, వివిధ ఎత్తిపోతల పథకాలకు 872 క్యూసెక్కులు, తాగునీటి అవసరాలకు 20 క్యూసెక్కుల నీటిని వినియోగించినట్లు వివరించారు. -
ప్రజలకు నిరంతరం సేవలందించాలి
● కేసుల దర్యాప్తులో ప్రమాణాలు పాటించాలి ● ఎస్పీ రావుల గిరిధర్ కొత్తకోట రూరల్: శాంతిభద్రతల పరిరక్షణే ప్రధాన ధ్యేయంగా ప్రజల నమ్మకాన్ని గెలుచుకొనేలా ఉత్సాహంగా, నిబద్ధతతో విధులు నిర్వర్తించాలని ఎస్పీ రావుల గిరిధర్ సూచించారు. గురువారం పట్టణ సమీపంలోని ఓ ఫంక్షన్హాల్లో జిల్లాలోని డీఎస్పీలు, సీఐలు, అన్ని పోలీస్స్టేషన్ల ఎస్ఐలతో నిర్వహించిన సమీక్షలో ఆయన పాల్గొని పెండింగ్ కేసులు, అందుకుగల కారణాలు, దర్యాప్తు, గ్రేవ్, నాన్ గ్రేవ్ కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. సంబంధిత పత్రాలు, ఎఫ్ఎస్ఎల్ నివేదికలు, మెడికల్ సర్టిఫికెట్ త్వరగా తెప్పించి కేసులు ఛేదించాలని సూచించారు. ఎస్ఐలు తమ పరిధిలోని గ్రామాల్లో క్రమం తప్పకుండా సందర్శించి ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకోవాలన్నారు. గ్రామ పోలీసు అధికారులు తమకు కేటాయించిన గ్రామాలపై పూర్తి అవగాహనతో ఉండి ముందస్తు సమాచార సేకరణపై దృష్టి సారించాలని సూచించారు. ఆన్లైన్, సైబర్ మోసాలపై ప్రజలను నిరంతరం అప్రమత్తం చేయాలని, గుర్తు తెలియని నంబర్ల నుంచి వచ్చే వీడియో కాల్స్, డిజిటల్ అరెస్టులు, పోలీస్ పేరుతో వచ్చే మోసపూరిత కాల్స్ను నమ్మకూడదని కోరారు. సైబర్ మోసానికి గురైన మొదటి గంటలోపు టోల్ఫ్రీ నంబర్ 1930కు సమాచారం ఇవ్వాలని లేదా https://www. cybercrime.gov.in/ పోర్టల్లో ఫిర్యాదు నమోదు చేయాలని ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ప్రతి గ్రామం, వీధి, పరిశ్రమలు, పవిత్ర స్థలాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. డయల్ 100 ఫిర్యాదులకు త్వరగా స్పందిస్తూ ప్రజల నమ్మకాన్ని మరింతగా పెంపొందించుకోవాలన్నారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం, గ్యాంబ్లింగ్, గేమింగ్, మట్కా తదితర వాటిని పూర్తిగా రూపుమాపేందుకు కృషి చేయాలని కోరారు. సమీక్షలో డీఎస్పీ వెంకటేశ్వరరావు, డీసీఆర్బీ డీఎస్పీ ఉమామహేశ్వరావు, వనపర్తి, కొత్తకోట, ఆత్మకూర్ సీఐలు కృష్ణయ్య, రాంబాబు, శివకుమార్, స్పెషల్ బ్రాంచ్ సీఐ నరేష్, డీసీఆర్బీ, ఐటీ కోర్, కమ్యూనికేషన్, ఫింగర్ ప్రింట్స్ విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
కిక్కు తగ్గింది..!
● ముగిసిన మద్యం దుకాణాల టెండర్ల స్వీకరణ ● ఈ నెల 27న కలెక్టరేట్లలో లక్కీడిప్ మహబూబ్నగర్ క్రైం: ఉమ్మడి జిల్లాలో ఈసారి జరిగిన మద్యం టెండర్ల ప్రక్రియలో జోష్ తగ్గింది. వ్యాపారులు దుకాణాల కోసం తీవ్రంగా పోటీ పడిన పరిస్థితి కనిపించలేదు. రెండుసార్లు గడువు పెంచినా కూడా వ్యాపారుల నుంచి ఊహించిన స్థాయిలో స్పందన రాలేదు. గత రెండేళ్ల కిందట జరిగిన దరఖాస్తుల స్వీకరణతో పోల్చితే ఈసారి చాలా వరకు తగ్గాయి. ఉమ్మడి జిల్లాలోని 227 మద్యం దుకాణాలకు మొత్తం 5,536 టెండర్లు రావడం జరిగింది. చివరి రోజు గురువారం మొత్తం 251 దరఖాస్తులు రాగా ఇందులో మహబూబ్నగర్లో 69, వనపర్తిలో 75, నారాయణపేటలో 43, నాగర్కర్నూల్లో 81, గద్వాలలో 46 దరఖాస్తులు ఉన్నాయి. ఇక ఉమ్మడి జిల్లా నుంచి టెండర్ల ద్వారా ప్రభుత్వానికి రూ.166.08 కోట్ల ఆదాయం సమకూరింది. కాగా.. ఈ నెల 27న ఆయా జిల్లాల కలెక్టరేట్లలో లక్కీడిప్ ద్వారా దుకాణాలు కేటాయించనున్నారు. 2023తో పోలిస్తే ఈ సారి 3,038 టెండర్లు తక్కువగా వచ్చాయి. జిల్లాల వారీగా ఇలా.. జిల్లా చివరిరోజు మొత్తం సమకూరిన వచ్చిన టెండర్లు ఆదాయం టెండర్లు (రూ.కోట్లలో..) మహబూబ్నగర్ 69 1,634 49.02 నాగర్కర్నూల్ 81 1,518 45.54 నారాయణపేట 43 853 25.59 జోగుళాంబ గద్వాల 46 774 23.22 వనపర్తి 75 757 22.71 దాఖలైన టెండర్లు 5,536 -
ఉద్యోగుల పర్యవేక్షణ మా పరిధి..
టీ–హబ్లో ఉద్యోగులు, సిబ్బంది పనితీరు పర్యవేక్షణ, నియామకం తదితర అంశాలు మాత్రమే మా పరిధిలో ఉంటాయి. యంత్రాలు, నమూనాల సేకరణ, పరీక్షలు, రిపోర్టులు అందించడం వైద్య, ఆరోగ్యశాఖ విభాగం అధికారుల పర్యవేక్షణలోకి వస్తాయి. – డా. రంగారావు, సూపరింటెండెంట్, జీజీహెచ్ టీ–హబ్లో కెమిస్ట్రీ యంత్రం మరమ్మతుకు గురికావడంతో కంపెనీ టెక్నీషియన్లకు సమాచారం ఇచ్చాం. వారు పరిశీలించి మిషన్లోని ఓ పార్ట్ను మార్చాలని సూచించారు. రెండు, మూడురోజుల్లో బాగు చేయించి వినియోగంలోకి తీసుకొస్తాం. – డా. శ్రీనివాసులు, జిల్లా వైద్యాధికారి ● -
వసతుల కల్పనకే నిధులు మంజూరు
వనపర్తి: ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మౌలిక వసతుల కల్పన, మరమ్మతులకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని.. వినియోగించుకొని పనులు వేగంగా పూర్తి చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలల ప్రిన్సిపాళ్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల కోడ్ అమలులోకి రాకముందే పనులు ప్రారంభించి ఈ ఏడాది చివరి కల్లా పూర్తి చేయాలని ఆదేశించారు. విద్యార్థుల్లో మనోధైర్యం నింపడం కూడా బాధ్యతని, అప్పుడప్పుడు విద్యార్థులతో మమేకమై వారిలో ఆత్మవిశ్వాసాన్ని, చిన్న చిన్న విషయాలకు కుంగిపోకుండా భావ వ్యక్తీకరణ నైపుణ్యాలు పెంపొందించాలని సూచించారు. కేవలం పాఠాలే కాకుండా మానసిక ఆత్మస్థైర్యాన్ని పెంపొందించడం కూడా కీలకమన్నారు. అపార్ ఐడీ పునరుద్ధరణలో వేగం పెంచాలని, విద్యార్థులు చదువు మధ్యలో మానేయకుండా విధిగా కళాశాలలకు వచ్చేలా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఇంటర్ వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించేలా వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలన్నారు. సమావేశంలో డీఐఈఓ ఎర్ర అంజయ్య, జిల్లా విద్యాధికారి అబ్దుల్ ఘనీ, వైద్యాధికారి డా. శ్రీనివాసులు, ఈడబ్ల్యూఐడీసీ ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు. -
పవర్.. ఫుల్
ఆత్మకూర్: జూరాల జల విద్యుత్ కేంద్రాల్లో ఈ ఏడాది 610 మి.యూ. లక్ష్యానికిగాను అక్టోబర్ 22వ తేదీ నాటికి 882 మిలియన్ యూనిట్ల ఉత్పత్తి సాధించి ప్రాజెక్టు చరిత్రలోనే ఎన్నడూ లేనంతగా చేపట్టి రికార్డు సృష్టించారు. 2022–23లో నవంబర్ చివరి నాటికి 640 మిలియన్ యూనిట్ల లక్ష్యానికిగాను 876 మి.యూ.గా నమోదైంది. ఈ ఏడాది విద్యుదుత్పత్తి ఇంకా కొనసాగుతూనే ఉంది. మే నెలలో కురిసిన ముందస్తు వర్షాలకే విద్యుదుత్పత్తి ప్రారంభించారు. ఎగువన ఉన్న కర్ణాటక, మహారాష్ట్రలో వర్షాలు భారీగా కురవడంతో ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాల నుంచి జూరాలకు వరద చేరుతుండటంతో అత్యధిక విద్యుదుత్పత్తి సాధ్యమైందని అధికారులు చెబుతున్నారు. వరదపైనే ఆధారం.. ఎగువన ఉన్న కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాలు నిండిన తర్వాత వచ్చే వరద జూరాల జలాశయానికి చేరుతుంది. వరద చేరితేనే ఇక్కడ విద్యుదుత్పత్తికి ఆస్కారం ఉంది. ఈ ఏడాది ముందస్తుగా జలాశయానికి వరద చేరడంతో విద్యుదుత్పత్తి ప్రారంభమై నిరంతరాయంగా కొనసాగుతోంది. మొరాయించిన మూడో యూనిట్.. జూరాల ఎగువ జల విద్యుత్ కేంద్రంలోని మూడో యూనిట్లో సాంకేతిక లోపం తలెత్తగా చైనాకు చెందిన సాంకేతిక నిపుణులు రెండేళ్లుగా మరమ్మతు చేపట్టారు. ఈ ఏడాది ఆగస్టు మూడో వారంలో బాగు కావడంతో విద్యుదుత్పత్తి మరింత పెరిగింది. ● జూరాల దిగువ జల విద్యుత్ కేంద్రంలో ఆరు యూనిట్లు ఉండగా ఒక్కో యూనిట్ నుంచి రోజుకు 40 మెగావాట్ల విద్యుదుత్పత్తి అవుతుంది. 40 మెగావాట్ల ఉత్పత్తి 9,600 యూనిట్లకు సమానం. ఒక మిలియన్ యూనిట్ విద్యుదుత్పత్తికిగాను 0.78 టీఎంసీల నీటిని వినియోగిస్తారు. ● ఈ ఏడాది దిగువ జల విద్యుత్ కేంద్రంలో 290 మి.యూ. లక్ష్యానికిగాను ఈ ఏడాది 447 మి.యూ.. ఎగువ జల విద్యుత్ కేంద్రంలో 6 యూనిట్ల నుంచి 320 మి.యూ. లక్ష్యానికిగాను 435 మి.యూ. ఉత్పత్తి చేపట్టారు. 2014–15 నుంచి 2024–25 వరకు ఎగువన 3,039 మి.యూ., దిగువన 2,531 మి.యూ., మొత్తం 5,570 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి జరిగింది. 610 మిలియన్ యూనిట్లకుగాను.. 882 మి.యూనిట్లకు మించి... ప్రాజెక్టు చరిత్రలోనే అత్యధికం 2022–23లో 876 మిలియన్ యూనిట్లు -
కలెక్టర్ల అభిమతం ప్రజాభీష్టం కావాలి
వనపర్తి టౌన్: కలెక్టర్ల అభిమతం ప్రజాభీష్టమైతే మేలు చేకూరుతుందని.. ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయం ప్రజలకు చేరువవుతుందని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు, ఏఐసీసీ కార్యదర్శి డా. జిల్లెల చిన్నారెడ్డి అన్నారు. బుధవారం జిల్లాకేంద్రంలో ఎస్ఆర్ శంకరన్ స్ఫూర్తివేదిక ఆధ్వర్యంలో ఎస్ఆర్ శంకరన్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆయన హాజరై విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎస్ఆర్ శంకరన్ అధికారిగా ఉన్న కాలంలో ఆయన నిర్ణయాలకు మంత్రులు సైతం ఎదురు చెప్పేందుకు భయపడేవారని, ఇందుకు ప్రజామోదమైన ఆయన ఎజెండానే కారణమని తెలిపారు. ఉన్నతాధికారులు ఆయన మాదిరిగా సాధారణ జీవితానికి ప్రాధాన్యమిస్తూ ప్రజలకు ఉపయోగపడే నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ శంకరన్ సారథ్యంలోనే నక్సలైట్లతో శాంతి చర్చలు జరిపారని గుర్తు చేశారు. బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు శంకరన్నే కారణమని.. ఐఏఎస్ అధికారిగా పదవీ విరమణ పొందిన తర్వాత తనకు వచ్చే పింఛన్ డబ్బులను సైతం నిరుపేద దళిత, గిరిజనుల ప్రగతికి ఖర్చు చేశారని తెలిపారు. నేటితరం అధికారులందరికీ స్ఫూర్తిదాతగా, ఆదర్శప్రాయుడిగా నిలిచారని కొనియాడారు. ప్రజా సైన్స్ వేదిక రాష్ట్ర కన్వీనర్ డా.మురళీధర్, రిటైర్డ్ ఎంఈఓ, న్యాయవాది రాఘవరెడ్డి, సాహితీ కళావేదిక జిల్లా అధ్యక్షుడు శంకర్గౌడ్, ఎస్ఆర్ శంకరన్ స్ఫూర్తివేదిక కన్వీనర్, న్యాయవాది శశిభూషణ్, ప్రజా వాగ్గేయకారుడు రాజారాంప్రకాశ్ పాల్గొన్నారు. -
నిఘా అవసరం
చెక్పోస్టులను తొలగించడం వల్ల దూర ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలు ఎక్కువసేపు నిలిచే అవకాశం ఉండదు. ఇదే అదనుగా ఇతర రాష్ట్రాల నుంచి అక్రమ రవాణా జరగడానికి ఆస్కారం ఉంది. ఉమ్మడి పాలమూరు జిల్లాకు ఏపీ, కర్ణాటక రాష్ట్రాలు సరిహద్దులుగా ఉండటంతో అక్రమ గోవుల తరలింపు, గంజాయి, మద్యం, కలప, ఇసుక ధాన్యాలు వంటి అక్రమ వ్యాపారాలకు అవకాశం కలుగుతుంది. ప్రభుత్వం రాష్ట్రంలో సన్న వడ్లకు బోనస్ ఇస్తోంది. ఈ సమయంలో ఆయా రాష్ట్రాల నుంచి దళారులు జిల్లాకు వడ్లను తీసుకొచ్చి విక్రయాలు చేసే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో అధికారులు నిఘా తీవ్రతరం చేసి అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం చాలా ఉంటుంది. -
కొనుగోలు కేంద్రాల్లో వసతులు కల్పించాలి
కొత్తకోట రూరల్: వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు కావాల్సిన అన్ని మౌలిక వసతులు కల్పించాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్ ఆదేశించారు. బుధవారం మండలంలోని పాలెం రైతువేదికలో నిర్వహించిన వరి కొనుగోలు కేంద్రాల నిర్వాహకుల శిక్షణకు హాజరై పలు సూచనలు చేశారు. సన్న, దొడ్డు రకం ధాన్యాన్ని గుర్తించడంపై అవగాహన కలిగి ఉండాలన్నారు. వర్షాలకు ధాన్యం తడవకుండా సరిపడా టార్పాలిన్లు, గన్నీ బ్యాగులు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే నిర్దేశించిన మిల్లులకు తరలించాలని చెప్పారు. రైతులకు ఇబ్బందులు కలిగించకుండా కొనుగోలు ప్రక్రియ చేపట్టాలని సూచించారు. సమావేశంలో జిల్లా పౌరసరఫరాల సంస్థ డీఎం జగన్మోహన్, ఆర్డీఓ సుబ్రమణ్యం, వ్యవసాయ అధికారులు, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
చెక్పోస్టులు ఎత్తేశారు!
పాలమూరు: రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు రాష్ట్రంలో సరిహద్దులో ఉన్న ఆర్టీఏ చెక్పోస్టులు రద్దు చేస్తున్నట్లు, బుధవారం సాయంత్రం 5 గంటల నుంచే ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని అధికారులు ఆదేశాలిచ్చారు. దీంతో ఉమ్మడి జిల్లాలోని ఆంధ్రప్రదేశ్ సరిహద్దు కోసం ఏర్పాటు చేసిన జోగుళాంబ గద్వాల జిల్లా జల్లాపురం ఆర్టీఏ చెక్పోస్టు, కర్ణాటక కోసం నారాయణపేట జిల్లా కృష్ణా మండలం దగ్గర ఏర్పాటు చేసిన రెండు చెక్పోస్టులను ఎత్తేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. జీఎస్టీ అమల్లోకి వచ్చాక రాష్ట్రాల సరిహద్దుల్లో వస్తువుల తనిఖీ, పన్ను వసూళ్ల అవసరం తగ్గిపోయింది. ఈ నేపథ్యంలో చెక్పోస్టులను తొలగించాలని రాష్ట్ర కేబినెట్ ఇటీవల నిర్ణయం తీసుకోగా ప్రస్తుతం అమల్లోకి వచ్చింది. ● జిల్లాలోని ఆర్టీఏ చెక్పోస్టులు అక్రమ వసూళ్లకు కేంద్రంగా మారాయని తాజాగా ఏసీబీ జరిపిన దాడుల్లో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అధికారులు నేరుగా ముడుపులు తీసుకోకుండా ప్రైవేట్ ఏజెంట్లను నియమించుకుని మరీ లారీ డ్రైవర్ల ముక్కు పిండి వసూలు చేసినట్లు తనిఖీల్లో బహిర్గతమైంది. ఇటీవల కృష్ణా చెక్పోస్టులో ఏసీబీ బృందం దాడులు నిర్వహిస్తుండగానే మరోవైపు లారీ డ్రైవర్లు వచ్చి టేబుల్పై డబ్బులు పెట్టడాన్ని చూసి తనిఖీకి వచ్చిన ఏసీబీ అధికారులు అవాక్కయ్యారు. తాజాగా తీసుకున్న నిర్ణయంతో ఇక నుంచి ముడుపుల వ్యవహారానికి తెరపడినట్లే. ఉమ్మడి జిల్లాలో అలంపూర్, కృష్ణా వద్ద చెక్పోస్టులు బుధవారం సాయంత్రం నుంచే మూసివేసినట్లు డీటీసీ ప్రకటన అధికారులు, సిబ్బందిని ఆర్టీఏ కార్యాలయాల్లో సర్దుబాటు -
శిక్షణ ఎవరికి ఇవ్వాలి?
● అధికారులపై కలెక్టర్ ఆగ్రహం ● ఏఓ, ముగ్గురు ఏఈఓలకు షోకాజ్ నోటీసులు ఇవ్వాలని ఆదేశం అమరచింత: వరి కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు హాజరుకాకపోతే శిక్షణ ఎవరికి ఇస్తారంటూ జిల్లా వ్యవసాయశాఖ అధికారి ఆంజనేయులుగౌడ్పై కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం మండలంలోని పాంరెడ్డిపల్లి రైతువేదికలో వరి కొనుగోళ్లపై కేంద్రాల నిర్వాహకులకు శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. కలెక్టర్తో పాటు వ్యవసాయశాఖ, పీఏసీఎస్, ఐకేపీ శాఖల అధికారులు హాజరయ్యారు. శిక్షణకు ఎంతమంది నిర్వాహకులు హాజరయ్యారనే విషయాన్ని హాజరు పట్టికను పరిశీలించి తెలుసుకున్నారు. పలు కేంద్రాల నిర్వాహకులు, ఆపరేటర్లు రాకపోవడంతో ఇక్కడ ఏం జరుగుతుందని అధికారులను ప్రశ్నించారు. శిక్షణకు రాకపోతే తేమశాతం ఎలా గుర్తిస్తారు, వరి ధాన్యం ఎలా కొంటారని నిలదీశారు. శిక్షణకు కేంద్రాల నిర్వాహకులను కాకుండా రైతులను ఎలా పిలిచారంటూ అసహనం వ్యక్తం చేశారు. శిక్షణకు హాజరుకాని వారితో పాటు ఏఓ అరవింద్తో పాటు ముగ్గురు ఏఈఓలకు వెంటనే షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. మరోమారు శిక్షణ కార్యక్రమం నిర్వహించాలని సూచించారు. సమావేశంలో పీఏసీఎస్ అధ్యక్షుడు గాడి కృష్ణమూర్తి, గృహ నిర్మాణశాఖ డీఈ విఠోబా, జిల్లా సహకారశాఖ అధికారి రాణి, పౌరసరఫరాలశాఖ అధికారి కాశీవిశ్వనాథ్, ఏడీఏ దామోదర్, తహసీల్దార్లు రవికుమార్యాదవ్, చాంద్పాషా తదితరులు పాల్గొన్నారు. ఫ్రైడే.. డ్రైడే నిర్వహించాలి.. వనపర్తి: జిల్లాలో ఇంకా వర్షాలు కురుస్తున్నందున నవంబర్ 15 వరకు ఫ్రైడే ఫ్రైడే కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో వైద్య, ఆరోగ్యశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించి మాట్లాడారు. జిల్లాలో అబా కార్డుల నమోదు ప్రక్రియను వేగవంతం చేసి పురోగతి సాధించాలన్నారు. అదేవిధంగా డెంగీ పరీక్షలు కూడా కొనసాగించాలని సూచించారు. ఏఎన్ఎంలతో ఎన్సీడీ స్క్రీనింగ్ పరీక్షలు చేయించాలని ఆదేశించారు. క్యాన్సర్ స్క్రీనింగ్ కార్యక్రమాన్ని కూడా జిల్లాలో ప్రారంభించేందుకు తగిన ఏర్పాటు చేయాలని సూచించారు. ఎంసీహెచ్లో ప్రెజర్ ఆక్సిజన్, ఇంక్యుబేటర్ ప్రారంభించేందుకు సన్నాహాలు చేయాలన్నారు. సమావేశంలో జిల్లా వైద్యాధికారి డా. శ్రీనివాసులు, ప్రోగ్రాం అధికారులు సాయినాథ్రెడ్డి, రామచందర్రావు, మెడికల్ ఆఫీసర్లు తదితరులు పాల్గొన్నారు. -
అవుట్ పోస్ట్ ఏర్పాటుతో మరింత భద్రత
అమరచింత: జూరాల ప్రాజెక్టు వద్ద పోలీస్ అవుట్పోస్ట్ ఏర్పాటుతో ప్రజలతో పాటు డ్యాం భద్రతపై దృష్టి సారించే అవకాశం ఉంటుందని ఎస్పీ రావుల గిరిధర్ అన్నారు. మండలంలోని పీజేపీ క్యాంపు సమీపంలో ఉన్న సత్యసాయి వాటర్ స్కీం పక్కన పోలీస్ అవుట్ పోస్టు భవన నిర్మాణ పనులను బుధవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. రూ.కోటితో ఆధునిక సాంకేతికతతో భవనాన్ని నిర్మించనున్నట్లు వెల్లడించారు. అంతర్రాష్ట్ర సరిహద్దులో అవుట్ పోస్టును ఏర్పాటు చేయడంతో నేరాలను నియంత్రించడంతో పాటు అక్రమ రవాణాను అరికట్టే అవకాశం ఉంటుందని తెలిపారు. పనులు నాణ్యతగా వేగంగా పూర్తి చేయాలన్నారు. అనంతరం అమరచింత పోలీస్స్టేషన్ను తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. నేరాల నియంత్రణలో పోలీసులు ముందుండాలని, క్రైం రేట్ను తగ్గించాలని, వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని ఎస్ఐని ఆదేశించారు. స్టేషన్ ఆవరణను ఆహ్లాదకరంగా ఉంచాలని సూచించారు. సీసీ కెమెరాలు అన్ని గ్రామాలతో పాటు పట్టణంలో ఏర్పాటు చేసుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఎస్పీ వెంట ఆత్మకూర్ సీఐ శివకుమార్, ఎస్ఐ స్వాతి ఉన్నారు. పట్టుదలతో లక్ష్యసాధన సులభమే.. వనపర్తి: పట్టుదలతో కృషి చేస్తే నిర్దేశించుకున్న లక్ష్యాన్ని సాధించడం సులభమేనని ఎస్పీ రావుల గిరిధర్ అన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా బుధవారం జిల్లాకేంద్రంలో నిర్వహించిన అండర్–14 ఉమ్మడి జిల్లా సైకిల్రేస్ పోటీల్లో సత్తా చాటిన గోపాల్పేటకు చెందిన మనస్వీ, జ్ఞాపికను ఆయన అభినందించి బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విద్యార్థులు విద్యతో పాటు క్రీడాల్లోనూ రాణించాలని సూచించారు. పోలీస్ ఉద్యోగం చేస్తున్నవారి పిల్లల్లో ధైర్యసాహసాలు అధికంగా ఉంటాయని.. తల్లిదండ్రులే గురువులుగా మారి మెళకువలు నేర్పించాలన్నారు. కార్యక్రమంలో ఏఆర్ ఏఎస్పీ వీరారెడ్డి, డీసీఆర్బీ డీఎస్పీ ఉమామహేశ్వర్రావు, వనపర్తి డీఎస్పీ వెంకటేశ్వరరావు, రిజర్వ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. -
ఉర్సు ఐక్యతకు చిహ్నం..
వనపర్తి రూరల్: గ్రామాల్లో నిర్వహించే ఉర్సు, గ్రామ దేవతల పండుగలు ప్రజల ఐక్యతను చాటి చెబుతాయని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డా. చిన్నారెడ్డి, ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. సోమవారం పెబ్బేరులోని హజ్రత్ షేఖ్ అలీషా తాతయ్య ఉర్సులో వారు వేర్వేరుగా పాల్గొని చాదర్ సమర్పించి ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పల్లెల్లో సర్వమత సమ్మేళనంగా అందరూ అన్ని పండుగలను జరుపుకొంటారని, దీంతో కొత్త వ్యక్తుల మధ్య సైతం స్నేహ బంధం ఏర్పడుతుందని తెలిపారు. అనంతరం భక్తులకు అన్న ప్రసాదాన్ని పంచిపెట్టారు. వారి వెంట మార్కెట్ కమిటీ చైర్పర్సన్ ప్రమోదిని, ఉపాధ్యక్షుడు విజయవర్ధన్రెడ్డి, నాయకులు శ్రీనివాస్గౌడ్, రంజిత్కుమార్, సురేందర్గౌడ్, వెంకటేష్సాగర్, యాపర్ల రాంరెడ్డి, యుగంధర్రెడ్డి, వెంకట్రామారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
అమరుల త్యాగం చిరస్మరణీయం
వనపర్తి: దేశ సరిహద్దులో సైనికుడు ఎంత కీలకమో.. రాష్ట్ర భద్రతలో పోలీసులు కూడా అంతే ముఖ్యమని, పోలీసు అమరుల త్యాగం భావితరాలకు స్ఫూర్తిగా నిలుస్తోందని ఎస్పీ రావుల గిరిధర్ అన్నారు. మంగళవారం జిల్లా పోలీసు పరేడ్ మైదానంలో పోలీసు అమరుల సంస్మరణ దినోత్సవం (ఫ్లాగ్డే) ఘనంగా నిర్వహించారు. ఎస్పీ రావుల గిరిధర్ పోలీసుల గౌరవ వందనం స్వీకరించి అధికారులు, సిబ్బందితో కలిసి అమరవీరుల స్తూపానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించి రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం అమరుల కుటుంబ సభ్యులను పేరుపేరున పరామర్శించి శాలువాతో సన్మానించి చిరు కానుకలు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజా అవసరాలు, రక్షణ కోసం ఏర్పడ్డ వ్యవస్థ పోలీసుశాఖ అన్నారు. సమాజంలో శాంతిస్థాపన కోసం అసాంఘిక శక్తులు జరిపిన పోరులో అసువులు బాసిన పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని.. వారి స్ఫూర్తితో శాంతిభద్రతల పరిరక్షణకు ముందుకు సాగుతున్నామని తెలిపారు. అక్టోబర్ 21 నుంచి 31వ తేదీ వరకు జిల్లాలోని అన్ని పోలీస్స్టేషన్లలో పోలీసు అమరవీరుల సంస్మరణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఇందులో భాగంగా ఆన్లైన్లో ఓపెన్ హౌస్ కార్యక్రమాలు నిర్వహించి పోలీసు విధులు, సాంకేతిక వినియోగం, ప్రజారక్షణలో పోలీసుల పాత్ర, ఫ్రెండ్లీ పోలీసింగ్ తదితర విషయాలను విద్యార్థులకు తెలియజేస్తామని చెప్పారు. విద్యార్థులకు ఆన్లైన్లో వ్యాసరచన, షార్ట్ ఫిలిం, ఫోటోగ్రఫీ పోటీలు, రక్తదాన శిబిరాలు, సైకిల్ ర్యాలీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో జిల్లా సాయుద దళ అదనపు ఎస్పీ వీరారెడ్డి, డీఎస్పీ వెంకటేశ్వరరావు, డీసీఆర్బీ డీఎస్పీ ఉమామహేశ్వరరావు, జిల్లా పోలీసు కార్యాలయం ఏఓ సునందన, వనపర్తి, కొత్తకోట, ఆత్మకూర్ సీఐలు కృష్ణయ్య, రాంబాబు, శివకుమార్, స్పెషల్ బ్రాంచ్ సీఐ నరేష్, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు అప్పలనాయుడు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఎస్పీ రావుల గిరిధర్ -
పెట్టుబడి కూడా వచ్చేలా లేదు..
అన్ని పంటలతో పోలిస్తే మిర్చికి పెట్టుబడి ఎక్కువ. కాలం కలిసొస్తే ఇబ్బందులు తీరుతాయనే ఆశతో నష్టం, లాభం చూడకుండా ప్రతి ఏటా మిర్చి సాగు చేస్తున్నా. పోయిన ఏడాది అనావృష్టితో దిగుబడి సరిగా రాలేదు. ధర కూడా లేకపోవడంతో చాలా నష్టపోయా. ఈ ఏడాదైనా కలిసిరాకపోతుందా అని 4 ఎకరాల్లో మిర్చి సాగు చేశా. ఇటీవల కురిసిన వర్షాలకు తెగుళ్లు సోకడంతో పెట్టుబడులు భారీగా పెట్టాల్సి వచ్చింది. పంట పూతకు వచ్చే సమయంలో వర్షాలు తగ్గకపోవడంతో పంట పూర్తిగా నాశనమైంది. ప్రభుత్వం ఆదుకోవాలి. – రాజశేఖర్, అయ్యవారిపల్లి, చిన్నంబావి, వనపర్తి అధిక వర్షాలతో తెగుళ్లు పెరిగాయి.. ఈసారి కురిసిన అధిక వర్షాలకు మిర్చి పంటలో మొదలు కుళ్లు (కాలర్ రాట్), విల్ట్ తెగులు వచ్చింది. ఎండు తెగులు(విల్ట్ తెగులు) నివారణకు కాపర్ ఆక్సి క్లోరైడ్ను లీటర్ నీటికి 3 గ్రాముల చొప్పున కలిపి మొక్క మొదట్లో వేరు దగ్గర మందు నీళ్లు పోయాలి. ఈ సమయంలో బూడిద తెగులు కూడా ఎక్కువగా కనిపిస్తోంది. బూడిద తెగులు నివారణ కోసం అమిస్టార్ ఫంగిసైడ్ను లీటర్ నీటికి 1 ఎంఎల్ చొప్పున లేదా సాఫ్ ఫంగిసైడ్ను లీటర్కు 2 గ్రాముల చొప్పున కలుపుకుని పిచికారీ చేయాలి. – ఆదిశంకర్, శాస్త్రవేత్త, కృషి విజ్ఞాన కేంద్రం, పాలెం ● -
కమీషన్.. అందేనా?
●కమీషన్ డబ్బులు రాలే.. ఐకేపీ ద్వారా పాంరెడ్డిపల్లి, కొంకన్వానిపల్లి, చంద్రప్పతండాలో కేంద్రాలు ఏర్పాటుచేసి వరి ధాన్యం సేకరించి గోదాములకు తరలించాం. మా సంఘానికి క్వింటాకు రూ.32 కమీషన్ చెల్లిస్తామన్నారు. వానాకాలం, యాసంగి సీజన్లో ధాన్యం కొనుగోలు చేసి ప్రభుత్వానికి అందించాం. ఇప్పటి వరకు కమీషన్ డబ్బులు అందలేదు. – కె.పద్మ, గ్రామ సంఘం అధ్యక్షురాలు, పాంరెడ్డిపల్లి మిగిలేవి 45 శాతమే.. అధికారుల ఆదేశాల మేరకు ప్రతి సీజన్లో వరి కొనుగోలు కేంద్రాల నిర్వహణ బాధ్యత చేపడుతున్నాం. ప్రభుత్వం చెల్లించే కమీషన్ డబ్బుల్లో తమ సంఘం కేవలం 45 శాతం మాత్రమే వినియోగించుకోవాల్సి వస్తోంది. వచ్చిన డబ్బులను సమాఖ్య అభివృద్ధితో పాటు సేవలు అందించిన వారికి ఇవ్వాలి. – వెంకటమ్మ, మండల సమాఖ్య అధ్యక్షురాలు, ఈర్లదిన్నె ఉన్నతాధికారులకు నివేదించాం.. 2023–24 సంవత్సరం వానాకాలం, యాసంగికి సంబంధించిన కమీషన్ డబ్బులు ఇదివరకే చెల్లించాం. 2024–25 సీజన్ కొనుగోలుకు సంబంధించిన వివరాలను పౌరసరఫరాలశాఖ ఉన్నతాధికారులకు నివేదించాం. రాష్ట్రవ్యాప్తంగా చెల్లింపులు జరగాల్సి ఉంది. వచ్చిన వెంటనే వారి వారి ఖాతాల్లో జమ చేస్తాం. – ఖీమ్యానాయక్, రెవెన్యూ అదనపు కలెక్టర్ అమరచింత: జిల్లాలోని వరి కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు 2024–2025 వానాకాలం, యాసంగి కమీషన్ సుమారు రూ.15.99 కోట్లు ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. ధాన్యం కొనుగోలు నుంచి గోదాములకు తరలించే వరకు ఎదురయ్యే ఇబ్బందులను అధిగమిస్తూ ఇచ్చిన లక్ష్యాన్ని పూర్తి చేస్తున్నా.. కమీషన్ డబ్బులు సకాలంలో అందకపోవడంతో మహిళా సంఘాల సభ్యులు కొనుగోళ్లుకు ముందుకురాని పరిస్థితులు నెలకొన్నాయి. కాగా 2023–2024 వానాకాలం, యాసంగి కొనుగోళ్ల కమీషన్ డబ్బులు సుమారు రూ.9 కోట్లు ఇటీవల ప్రభుత్వం విడుదల చేసింది. క్వింటా కొనుగోలుపై ప్రభుత్వం రూ.32 చెల్లిస్తుండటంతో ఐకేపీతో పాటు మెప్మా, పీఏసీఎస్ సంఘాలు రైతులకు ఇబ్బందులు కలగకుండా రైతుల పొలాల వద్దే ధాన్యం సేకరిస్తూ ఇటు అన్నదాతలకు, అటు ప్రభుత్వానికి సహకరిస్తున్నారు. ఐకేపీ మహిళా సంఘాలకు మంజూరైన కమీషన్ డబ్బుల్లో కేవలం 45 శాతం మాత్రమే వినియోగించుకునే సదుపాయం కల్పించడంతో కొనుగోళ్లపై వారు అనాసక్తి కనబరుస్తున్నారు. వరి కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకుఅందని డబ్బులు రెండు సీజన్లకుగాను రూ.15 కోట్ల పైచిలుకు బకాయి జిల్లావ్యాప్తంగా 368 కొనుగోలు కేంద్రాలు మహిళా సంఘాల ఎదురుచూపులు -
కేంద్రాల నిర్వాహకులకు పకడ్బందీ శిక్షణ
వనపర్తి: కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు వరి ధాన్యం సేకరణపై బుధ, గురువారం పకడ్బందీ శిక్షణ ఇవ్వాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని తన ఛాంబర్లో 2025–26 వానాకాలం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, నిర్వాహకులకు శిక్షణ తదితర అంశాలపై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండలస్థాయిలో మండల వ్యవసాయ అధికారులు, ఏఈఓల ఆధ్వర్యంలో ఎఫ్ఏక్యూ ప్రమాణాలు కలిగిన ధాన్యం గుర్తించడం, తేమశాతాన్ని నిర్ధారించడం, సన్న, దొడ్డు రకాల గుర్తింపై అవగాహన కల్పించాలన్నారు. అదేవిధంగా పంట చేతికొచ్చే సమయానికి అనుకూలంగా కేంద్రాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. మండలాల వారీగా గత సీజన్లో ఏర్పాటుచేసిన సన్న, దొడ్డు రకం ధాన్యం కేంద్రాల వివరాలను పరిశీలించి ఈసారి ఏర్పాటు చేయబోయే కేంద్రాలపై పలు సూచనలు చేశారు. సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి ఆంజనేయులు గౌడ్, డీసీఓ రాణి, గ్రామీణాభివృద్ధిశాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
గురుకుల స్కూళ్లకు కొమురంభీం పేరు పెట్టాలి
వనపర్తిటౌన్: రాష్ట్రంలోని గిరిజన గురుకుల పాఠశాలల పేర్లను కొమురంభీం పేరుతో పిలిచేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని హిందూవాహిని ఉమ్మడి పాలమూరు విభాగ్ కన్వీనర్ అభిలాష్ డిమాండ్ చేశారు. ఈ మేరకు శివాజీ స్ఫూర్తి కేంద్రంలో ఆదివారం నిర్వహించిన ముఖ్యకార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నిజాం నవాబులు చేసిన దోపిడీ, దౌర్జన్యాలను వ్యతిరేకిస్తూ వీరోచితంగా పోరాడి ప్రాణాలర్పించి శ్రీజల్–జంగిల్–జమీన్శ్రీ నినాదంతో 1928 నుంచి 1940 వరకూ రణభేరి మోగించిన కొమరంభీం త్యాగనిరతి మరువలేమన్నారు. తెలంగాణ కోసం తన ప్రాణాలు అర్పించిన పోరాట యోధుడి పేరు, ధైర్య సాహసాలు కలిగిన మహోన్నత వ్యక్తుల పేర్లు చరిత్రలో పదిలంగా ఉండటంతో పాటుగా, ఆయన త్యాగాలను స్మరించుకునేందుకు గిరిజన గురుకులాల పాఠశాలలకు కొమరంభీం పేరు పెట్టాలన్నారు. కొమరంభీం త్యాగ ఫలితాలను పాఠ్య పుస్తకాల్లో పొందిపర్చి భావితరాలకు అందజేయాలని అభిప్రాయపడ్డారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కొమరంభీం పేరు పెట్టకపోతే రాష్ట్రవ్యాప్తంగా హిందూవాహిని ఆధ్వర్యంలో నిరసనలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ అరుణ్గౌడ్, కోకన్వీనర్ శ్రీకాంత్, నవీన్, శరత్, రాఘవేంద్రరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మద్యం దుకాణాల టెండర్ల గడువు పెంపు
● ఈ నెల 23 వరకు దరఖాస్తుల స్వీకరణ ● 27న లక్కీడిప్ ద్వారా దుకాణాల కేటాయింపు మహబూబ్నగర్ క్రైం: మద్యం దుకాణాల దరఖాస్తుల స్వీకరణకు గడువు పెంచుతూ రాష్ట్ర ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ కమిషనర్ శనివారం అర్ధరాత్రి తర్వాత ఉత్తర్వులు జారీ చేశారు. సెప్టెంబర్ 26 నుంచి ఈ నెల 18 వరకు దరఖాస్తుల స్వీకరించగా ఉమ్మడి జిల్లాలో 227 దుకాణాలకు 5,183 దరఖాస్తులు వచ్చాయి. అయితే 2023 సంవత్సరంలో చేసిన టెండర్ల ప్రక్రియ కంటే ఈసారి దరఖాస్తులు గణనీయంగా తగ్గడంతో మరోసారి గడువు పెంచారు. ఈ నెల 23 వరకు టెండర్ల ప్రక్రియ నిర్వహించి ఈ నెల 27న కలెక్టరేట్లో లక్కీ డిప్ ద్వారా దుకాణాల కేటాయింపు చేయనున్నారు. మద్యం వ్యాపారులకు మరో మూడు రోజులపాటు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కలిసి వచ్చింది. దీంతో ఉమ్మడి జిల్లాలో కొంత మేర టెండర్లు పెరగవచ్చని ఎకై ్సజ్ అధికారులు భావిస్తున్నారు. -
పండుగ సంతోషం నింపాలి.. విషాదం కాదు
వనపర్తి: దీపావళి పండుగను జిల్లా ప్రజలందరూ ఆనందంగా, సురక్షితంగా జరుపుకోవాలని ఎస్పీ రావుల గిరిధర్ ఆకాంక్షించారు. పండుగ ఉత్సాహంలో భద్రతను విస్మరించకుండా.. టపాసులు కాల్చేటప్పుడు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలన్నారు. పెద్దల పర్యవేక్షణలోనే పిల్లలు టపాసులు కాల్చాలని, రహదారులపై లేదా ఇళ్ల ముందు గుంపులుగా టపాసులు కాల్చవద్దని కోరారు. సింథటిక్ దుస్తులు ధరించకుండా, నూలు దుస్తులు ధరించాలని, టపాసులు వెలిగించిన వెంటనే దూరంగా వెళ్లాలని, వెలగని వాటిని మళ్లీ ముట్టిచేందుకు ప్రయత్నించకూడదని సూచించారు. నీరు, ఇసుక బకెట్ సమీపంలో ఉంచుకోవాలని, టపాసుల గోదాంలు, విక్రయ కేంద్రాలు భద్రతా నిబంధనలు తప్పక పాటించాలన్నారు. ట్రాఫిక్ నియమాలు పాటిస్తూ వాహనాలు నడపాలని, మద్యం తాగి డ్రైవింగ్ చేయరాదని హెచ్చరించారు. వెలగని టపాసులను నీటిలో వేయడం ద్వారా ప్రమాదాన్ని నివారించవచ్చన్నారు. పర్యావరణ హితం కోసం ఎకో ఫ్రెండ్లీ టపాసులు వాడాలని, అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు వెంటనే 100 లేదా 101 నంబర్లకు సమాచారం ఇవ్వాలని సూచించారు. దీపావళి వెలుగులు మన జీవితాల్లో ఆనందాన్ని నింపాలని, అజాగ్రత్త వల్ల చీకటి తెచ్చుకోవద్దని, భద్రతతో పండుగ జరుపుకుంటేనే నిజమైన దీపావళి సార్థకమవుతుందన్నారు. ఎస్పీ రావుల గిరిధర్ -
ఏసీబీ తనిఖీల్లో అవినీతి గుట్టురట్టు
మహబూబ్నగర్ క్రైం: ఒకవైపు ఏసీబీ అధికారుల బృందం ఆర్టీఏ చెక్పోస్టులో తనిఖీలు చేస్తుంటే.. మరోవైపు లారీ డ్రైవర్లు ఒక్కొక్కరుగా అక్కడ ఏం జరుగుతుందో అని కూడా పట్టించుకోకుండా జేబులో నుంచి డబ్బులు తీసి టేబుల్పై పెట్టి వెళ్తున్నారు.. ఈ దృశ్యాలన్నింటిని ఏసీబీ అధికారులు వీడియో తీయడం విశేషం. రాష్ట్రవ్యాప్తంగా సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న ఆర్టీఏ చెక్పోస్టుల్లో ఏసీబీ అధికారుల బృందం సోదాలు చేయగా నారాయణపేట జిల్లా కృష్ణా ఆర్టీఏ చెక్పోస్టులో మహబూబ్నగర్ ఏసీబీ డీఎస్పీ సీహెచ్ బాలకృష్ణ ఆధ్వర్యంలో ఇద్దరు సీఐలు, పది మంది బృందం కలిసి శనివారం అర్ధరాత్రి 12.30 నుంచి ఆదివారం ఉదయం 6 గంటల వరకు విస్తృతంగా సోదాలు నిర్వహించారు. దాదాపు ఆరు గంటలపాటు సాగిన తనిఖీల్లో అనేక అక్రమ అంశాలను గుర్తించారు. ఇటీవల ప్రభుత్వం జీఓ 58 ప్రకారం ఆర్టీఏ చెక్పోస్టులు ఎత్తివేయాలని నిర్ణయం తీసుకున్న క్రమంలో మూడు నెలలపాటు చెక్పోస్టుల దగ్గర ఎలాంటి కలెక్షన్స్ చేయకుండా ఆన్లైన్లో చలాన్స్ చెల్లించడం ఇతర అంశాలపై లారీ డ్రైవర్లతోపాటు అన్ని రకాల డ్రైవర్లకు అవగాహన కలిగించడంతోపాటు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని సూచించింది. కానీ, కృష్ణా చెక్పోస్టులో అలాంటి అంశాలు కాకుండా లారీ డ్రైవర్ల నుంచి మామూళ్లు వసూలు చేస్తున్నారు. చెక్పోస్టులో సరైన లైటింగ్ లేకపోవడం, ఉన్న రెండు సీసీ కెమెరాలు సైతం సక్రమంగా పనిచేయడం లేదని, ప్రధానంగా వసూళ్ల కోసం ప్రైవేట్ వ్యక్తులను పెట్టుకున్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఏసీబీ బృందం తనిఖీలు చేస్తున్న సమయంలో చెక్పోస్టులో ఏఎంవీఐ ప్రవీణ్కుమార్ విధుల్లో ఉన్నారు. చెక్పోస్టులో ఎలాంటి రశీదులు లేకుండా అనధికారమైన డబ్బులు రూ.30,450 గుర్తించారు. నివేదిక అందిస్తాం.. కృష్ణా చెక్పోస్టులో చేసిన తనిఖీలపై ఏసీబీ డీఎస్పీ సీహెచ్ బాలకృష్ణ శ్రీసాక్షిశ్రీకి వివరాలు వెల్లడించారు. ఆకస్మికంగా చేసిన తనిఖీల్లో అనేక అక్రమ అంశాలను గుర్తించామని, ఈ చెక్పోస్టుపై డీటీవోతోపాటు ఇతర ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం ఉన్నట్లు గుర్తించామని వీటన్నింటిపై ప్రత్యేక నివేదిక తయారు చేసి డీజీకి అందజేస్తామని తెలిపారు. దీనిపై సంబంధిత అధికారులు శాఖాపరమైన చర్యలు తీసుకుంటారని డీఎస్పీ పేర్కొన్నారు. కృష్ణా ఆర్టీఏ చెక్పోస్టులో రూ.30 వేల అనధికార డబ్బు గుర్తింపు ఒక్కో లారీకి ఒక్కో రేటు చొప్పున డబ్బు వసూలు తనిఖీల సమయంలోనూ డబ్బులు టేబుల్పై పెట్టి వెళ్లిన లారీ డ్రైవర్లు ప్రభుత్వానికి పూర్తిస్థాయి నివేదిక అందజేస్తాం : ఏసీబీ డీఎస్పీ సీహెచ్ బాలకృష్ణ ఒక్కో లారీకి ప్రత్యేక రేటు కృష్ణా ఆర్టీఏ చెక్పోస్టు దగ్గర సరిహద్దు దాటే లారీలకు స్థానిక అధికారులు ఒక్కో లారీకి ప్రత్యేక రేట్లు నిర్ణయించారు. 14 టైర్ల లారీ, బొగ్గు లారీ, బూడిద లారీ, ఇసుక, బియ్యం ఇలా ఒక్కో దానికి నిర్ణయించిన ధరల ప్రకారం చెక్పోస్టు దగ్గరకు లారీ వచ్చిన తర్వాత పక్కనే నిలిపి వచ్చి ముందే నిర్ణయించిన ధరల ప్రకారం డబ్బులు టేబుల్ మీద పెట్టి వెళ్లాలి. ఇలా రోజువారి కలెక్షన్ రూ.వేలల్లో ఉంటుంది. ఇక సరైన డాక్యుమెంట్స్, ఓవర్ లోడ్ ఇతర వాటికి అధిక మొత్తంలో రేట్లు నిర్ణయించారు. -
వీరులారా.. వందనం
ఉమ్మడి జిల్లాలో అమరులైన 39 మంది పోలీసులు ● సమాజ రక్షణ కోసం ప్రాణత్యాగం ● బాధిత కుటుంబాలకు అండగా పోలీస్ శాఖ ● ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలు ● రేపు పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం ఇక్కడి నుంచే ప్రకటన శాంతిభద్రతల పరిరక్షణ కోసం నక్సలైట్ల కాల్పుల్లో మృతిచెందిన కుటుంబాలకు ప్రభుత్వం గతంలో ఎక్స్గ్రేషియా చెల్లించేది కాదు. అయితే 1997లో లక్ష్మాపూర్ ఘటనలో మృతి చెందిన వారిని పరామర్శించేందుకు అప్పటి హోంమంత్రి మాధవరెడ్డి మహబూబ్నగర్ జిల్లా ఆస్పత్రికి వచ్చారు. ఈ క్రమంలో పోలీస్ కుటుంబాలు మంత్రి దృష్టికి తమ సమస్యలు తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన మంత్రి రూ.1.50 లక్షలు అమరవీరుల కుటుంబ సభ్యులకు ఇచ్చేలా ఎస్పీకి అధికారం కల్పించగా.. ఇప్పటికీ కొనసాగుతూ వస్తోంది. ప్రస్తుతం ఈ ఎక్స్గ్రేషియా రూ.10 లక్షలకు పెంచారు. అలాగే ఒక ప్లాటు, రైల్వే ప్రయాణం, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తున్నారు. విధి నిర్వహణలో అమరులైన పోలీస్ సిబ్బంది కుటుంబ సభ్యులకు మహబూబ్నగర్లోని హౌసింగ్బోర్డు కాలనీ సమీపంలో ఇళ్ల స్థలాలు కేటాయించారు. మహబూబ్నగర్ క్రైం/ కొల్లాపూర్: విధి నిర్వహణలో అసువులు బాసినవీరులు వారు.. ఉగ్రవాదుల నుంచి దేశాన్ని రక్షించే క్రమంలో తమ ప్రాణాలను సైతం లెక్క చేయని నిర్భయులు.. ఎక్కడ బాంబు పేలినా.. ఎక్కడ తుపాకులు గర్జించినా.. వెనకా ముందు చూడకుండా దూసుకుపోతారు.. శత్రువులతో జరిగే పోరాటంలో తుదిశ్వాస వరకు పోరాడుతారు. అలాంటి పోరాటాల్లో ప్రాణాలు కోల్పోయిన పోలీస్ అమరవీరుల జ్ఞాపకాలు పదికాలాలపాటు పదిలంగా దాచే ప్రయత్నం చేస్తోంది పోలీస్ శాఖ. ఏటా ఒకరోజు వారిని స్మరించుకునే ఏర్పాట్లు చేసింది. కర్తవ్య నిర్వహణలో వెన్నుచూపని ఆ ధీరులను స్మరించుకోవడానికి ప్రతిఏటా అక్టోబర్ 21న పోలీస్ అమరవీరుల దినోత్సవం చేపడుతారు. ఈ క్రమంలోనే మంగళవారం పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం.. ఎల్లప్పుడూ అండగా ఉంటాం.. అమరవీరుల కుటుంబ సభ్యులను కేవలం అమరవీరుల సంస్మరణ దినోత్సవం రోజు కాకుండా ఎప్పుడు సమస్య వస్తే అప్పుడు ఆదుకోవడానికి శాఖ సిద్ధంగా ఉంటుంది. వారికి ఇవ్వాల్సిన ఇళ్ల పట్టాల విషయంలో ఉన్న పెండింగ్ పనులు పూర్తిచేసి అందజేయడం జరిగింది. వారి కుటుంబ సమస్యలతోపాటు పిల్లల చదువులకు సంబంధించిన విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాం. జిల్లాలో రెండు అమరవీరుల కుటుంబాలు ఉన్నాయి. – జానకి, ఎస్పీ, మహబూబ్నగర్ -
వెలుగుల దీపావళి
వనపర్తి టౌన్: దీపావళి పండుగను పురస్కరించుకొని జిల్లా కేంద్రంలో పూలు, ప్రమీద, బాణాసంచా దుకాణాలు ప్రజలతో కిక్కిరిశాయి. మండల కేంద్రాలతో పాటుగా పట్టణ ప్రాంతాల్లో పండుగ సామగ్రి కొనుగోలు చేయడానికి వచ్చిన వాహనదారులతో రోడ్లన్నీ నిండిపోయాయి. ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. పూజ సామగ్రి, బాణసంచా కొనుగోలు చేయడానికి దుకాణాల వద్ద ప్రజలు చాలా సేపు వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. జిల్లా కేంద్రంలో ఆదివారం సంత కావడం, పండుగ సరుకులు కొనేందుకు ప్రజలు తరలిరావడంతో మార్కెట్ పరిసరాల్లో కనీసం నడవడానికి కూడా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. పలు ఆలయాలను విద్యుదీపాలతో అలంకరించారు. ప్రతి ఇంట ముందు దీపం వెలిగించడానికి మట్టి ప్రమీదలు తీసుకోవడానికే ప్రజలు ఆసక్తి చూపడంతో వాటికి డిమాండ్ భారీగా పెరిగింది. దీపావళికి దూర ప్రాంతాల నుంచి సొంత గ్రామాలకు వచ్చే ప్రయాణికులతో బస్సులన్నీ కిక్కిరిసిపోయాయి. జిల్లా కేంద్రంలోని గాంధీచౌక్, హనుమాన్టేకిడి, శంకర్గంజ్, కమాన్ చౌరస్తాల్లో పాదాచారులతో పాటు ద్విచక్రవాహనాలతో సందడి నెలకొంది. రూపాయి నుంచి రూ.4వేల వరకు టపాసుల దుకాణాల్లో ఒక్క రూపాయి విలువ కలిగిన బాణాసంచా నుంచి రూ. 4వేల విలువ కలిగినవి కూడా అందుబాటులో ఉంచారు. చిచ్చుబుడ్డీలు, కాకరవత్తులు, వంకాయ బాణాలు, భూ చక్రాలు, తుపాకులు, రాకెట్, లక్ష్మి టపాసులు, వన్షాట్, 10 షాట్స్, 25 షాట్స్, 1000 షాట్స్, తదితర టపాసులను వ్యాపారస్తులు సిద్ధం చేసిన స్టాల్స్లో ఉంచారు. స్టాల్స్ వద్ద అకస్మత్తుగా ప్రమాదాలు జరిగితే నివారించేందుకు సెప్టీ సిలిండర్, నీళ్లు అందుబాటులో ఉంచారు. ఆదివారం ఉదయం నుంచే బాణాసంచా దుకాణాల వద్ద విక్రయాల జోరు కొనసాగింది. ఏదైనా ప్ర మాదం జరిగితే అన్ని టపాసు ల షాపులకు మంటలు అంటుకునే ప్రమాదం ఉందని, స్టాల్స్ ఏర్పాటు చేసిన డాక్టర్ బాలక్రిష్టయ్య క్రీడా ప్రాగంణంలో ఫైర్ ఇంజిన్ అందుబాటులో ఉంచాలని ప్రజలు కోరుతున్నారు. పూలు, ప్రమీదలు కొనుగోళ్లతో మార్కెట్ బిజీబిజీ బాణాసంచాల దుకాణాల్లో కిక్కిరిసిన ప్రజలు ప్రయాణికులతో రద్దీగా బస్సులు -
కలగానే వాకింగ్ ట్రాక్లు
అమరచింత: జిల్లాలో కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీల్లో వాకింగ్ ట్రాక్ల ఏర్పాటు నత్తనడకన సాగుతోంది. దీంతో వాకర్లకు సరైన వేదిక లేకపోవడంతో ప్రధాన రహదారులపై ఉదయం, సాయంత్రం వేళలో వాకింగ్ కోసం వెళ్తూ తరచూ రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నారు. దీంతో వాకర్లు స్థానికంగా వాకింగ్ చేసుకునేందుకు ప్రభుత్వం వాకింగ్ ట్రాక్లను ఏర్పాటు చేయాలని సంకల్పించింది. దీంతో కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీల్లో వాకింగ్ ట్రాక్ల నిర్మాణం కోసం మున్సిపల్ బడ్జెట్ నుంచి కొంత మేరకు నిధులు వెచ్చించి వాటిని పూర్తి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసింది. మూడేళ్ల క్రితం జిల్లాలోని అమరచింత, ఆత్మకూర్, పెబ్బేర్, కొత్తకోట మున్సిపాలిటీల్లో ప్రతిపాదనలు రూపొందించి సీఎండీ కార్యాలయానికి నివేదికలు పంపి, మున్సిపల్ కౌన్సిల్ తీర్మానాల్లో నిధులు మంజూరు చేసుకున్నారు. ఆయా మున్సిపాలిటీల్లో పాఠశాల మైదానాలు, పార్కుల స్థలాల్లో వాకింగ్ ట్రాక్లను నిర్మించేందుకు నిర్ణయించారు. ప్రమాదాల నివారణ కోసం... తరుచూ వాకింగ్ కోసం రహదారులపై వెళ్తున్న వ్యక్తులు రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నారు. దీంతో ప్రాణాలను సైతం కోల్పోతున్నారు. ప్రతినిత్యం అరగంట పాటు కాలినడక ఉంటే మనిషి ఆరోగ్యంగా ఉంటాడని వైద్యులు సూచిస్తుండటంతో ఈ మధ్య కాలంలో గ్రామాల్లో సైతం నడకకు ప్రజలు అలవాటు పడుతున్నారు. కొత్తగా ఏర్పడిన ఆత్మకూర్ మున్సిపాలిటీలో మాత్రమే వాకింగ్ ట్రాక్ పనులు స్థానిక జాతర మైదనంలో మొదలయ్యాయి. సుమారు రూ.20 లక్షలతో వాకింగ్ ట్రాక్ నిర్మాణ పనులు చేపట్టినట్లు మాజీ మున్సిపల్ చైర్పర్సన్ గాయత్రి వెల్లడించారు. గత పాలకవర్గం ఎప్పటికప్పుడు పనులను పర్యవేక్షిస్తూ ఇప్పటి వరకు 80శాతం పనులు పూర్తిచేశారు. వచ్చే రెండు నెలల లోపు వాకింగ్ ట్రాక్ నిర్మాణ పనులు పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటున్నారు. వాకింగ్ ట్రాక్ల నిర్మాణ క్రమంలో వాకింగ్ కోసం వస్తున్న వాకర్లకు నాణ్యమైన గాలి అందాలని చుట్టూ పచ్చని చెట్లు, గడ్డి పెంచడం వంటివి చేపడుతున్నారు. బేంచీలు, కుర్చీలు, ఓపెన్ జిమ్ సైతం అందుబాటులో ఉండేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. కొత్త మున్సిపాలిటీల్లో ముందుకు సాగని పనులు ఆత్మకూర్లో 80 శాతం పూర్తి రహదారులపై వాకింగ్ వెళ్లి ప్రమాదాలకు గురవుతున్న వాకర్లు అమరచింతలో రూ.50 లక్షల ప్రతిపాదనలతో వాకింగ్ ట్రాక్కు నిధులు కేటాయించగా.. ఇప్పటి వరకు స్థల పరిశీలనలు, కొలతల వరకే పనులు చేపట్టి నిర్మాణ పనులను గాలికోదిలేశారు. పెబ్బేరు మున్సిపాలిటీల్లో పార్క్ల స్థలంలో నడిచేందుకు అనువుగా ఉండే ట్రాక్ల నిర్మాణ పనులు సుమారు రూ.10 లక్షలతో చేపట్టగా, ఆత్మకూర్లో రూ.20 లక్షలతో వీటిని పూర్తి చేయనున్నారు. కేవలం అమరచింత, కొత్తకోట, పెబ్బేర్ మున్సిపాలిటీల్లో తూతూమంత్రంగా వాకింగ్ ట్రాక్ నిర్మాణ పనులు జరుగుతుండటం విశేషం. పట్టణంలోని జెడ్పీఉన్నత పాఠశాల మైదానంలో రూ.50 లక్షలతో వాకింగ్ ట్రాక్ నిర్మిస్తామన్నారు. రెండు మూడు పర్యాయాలు ఏఈలు వచ్చి కొలతలు చేశారు. కానీ ఇంత వరకు వాకింగ్ ట్రాక్ పనులు ఎందుకు మొదలు పెట్టలేదో అర్థం కావడం లేదు. వాకింగ్ ట్రాక్ పనులు చేపట్టాలని ఇటీవల మైదానాన్ని సందర్శించిన మంత్రి వాకిటి శ్రీహరిని కోరాం. దీంతో ఆయన స్పందించి వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. – తిరుమలేష్, వాకర్, అమరచింత అమరచింత మున్సిపాలిటీ అభివృద్ధికి రూ.15 కోట్లలో మంజూరయ్యాయి. వాటిలో కొంత వినియోగించి పట్టణంలో వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయాలని మంత్రి వాకిటి శ్రీహరికి నివేదిక అందించనున్నాం. మంత్రి ఆదేశాల మేరకు జెడ్పీ ఉన్నత పాఠశాల మైదానంలో వాకింగ్ ట్రాక్ కోసం స్థలాన్ని పరిశీంచి ఏర్పాటుకు చర్యలు తీసుకుంటాం. – నాగరాజ్, మున్సిపల్ కమిషనర్, అమరచింత -
స్వేచ్ఛను హరించొద్దు
మీడియాపై దాడులు చేయడమంటే పత్రికా స్వేచ్ఛను హరించడమే. ప్రభుత్వాలు మీడియాపై క్షక్ష సాధింపు చర్యలు మానుకోవాలి. రాజ్యాంగంలో మీడియాకు స్వతంత్ర హక్కు కల్పించింది. అవినీతిని ప్రశ్నిస్తున్న సాక్షి పేపర్ ఎడిటర్పై కుట్రతో కేసులు బనాయించడం, భయబ్రాంతులకు గురిచేయడం ప్రజాస్వామ్య విరుద్ధం. ప్రజలు, ప్రజాస్వామ్యం సంరక్షణ కోసం పాటుబడే మీడియాపై ఆంక్షలు తగవు. – బాల్యనాయక్, జర్నలిస్టు సంఘం నాయకుడు రాజ్యాంగం కల్పించిన హక్కును ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కాలరాస్తుంది. మీడియాపై గతంలో ఎప్పుడూ లేని విధంగా కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. సాక్షి ఎడిటర్ ధనంజయరెడ్డిపై చంద్రబాబు కక్షపూరితంగా వ్యవహరిస్తూ కేసులు పెట్టడం సరికాదు. భవిష్యత్లో మూల్యం చెల్లించుకుంటారు. – వెంకటన్నగౌడ్, బీసీ పొలిటికల్ జేఏసీ రాష్ట్ర నాయకుడు ● -
విష సంస్కృతికి బీజం
ఏపీ ప్రభుత్వం చేస్తున్న అక్రమాలపై వార్తలు రాశారన్న కారణంతో సాక్షి ఎడిటర్, పాత్రికేయులపై కేసులు నమోదు చేయడం సిగ్గుచేటు. రాజ్యాంగ విలువలు కాపాడాల్సిన ప్రభుత్వమే కక్ష సాధింపు చర్యలకు దిగడం సరైంది కాదు. మీడియాపై దాడులు విష సంస్కృతికి బీజం వేస్తుంది. – అరవిందస్వామి బీసీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాక్షి ఎడిటర్ ధనంజయరెడ్డిపై చంద్రబాబు సర్కార్ చేస్తున్న దాడులు సరికాదు. పత్రిక స్వేచ్ఛను కాపాడే బాధ్యతను తీసుకోవాల్సిన ప్రభుత్వాలే పాత్రికేయులపై కేసులు పెట్టడాన్ని పౌర సమాజం ఖండించాలి. కూటమి ప్రభుత్వం కక్ష సాధింపులకు దిగడం హేమమైన చర్య. అక్రమంగా పెట్టిన కేసులను భేషరత్గా ఉపసంహరించుకోవాలి. – పవన్కుమార్, పీడీఎస్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ● -
హరిత దీపావళికి సహకరించాలి
వనపర్తి విద్యావిభాగం: దీపావళి పండుగను పురస్కరించుకొని గాలి కాలుష్యం చేసే బాణాసంచాకు దూరంగా ఉండి హరిత దీపావళికి సహకరించాలని జిల్లా ఇండస్ట్రీయల్ డెవలప్మెంట్ సెంటర్ (ఐడీసీ) జనరల్ మేనేజర్ జ్యోతి కోరారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల (కో ఎడ్యుకేషన్)లో ఏర్పాటు చేసిన ఎకో బజార్కు శనివారం ముఖ్య అతిథిగా హాజరైన ఆమె కళాశాల క్యాంపస్లో ఏర్పాటు చేసిన వివిధ రకాల స్టాళ్లను సందర్శించారు. అలాగే అమ్మకానికి ఉన్న వివిధ రకాల సహజ ఉత్పత్తుల గురించి విద్యార్థులతో తెలుసుకున్నారు. కళాశాల టీచింగ్, నాన్టీచింగ్తో పాటు కళాశాల విద్యార్థులు, వారి వారి గ్రామాల్లో గ్రామస్తులు ప్రతి ఒక్కరూ పర్యావరణ హితమైన వస్తువుల వాడకాన్ని ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ రఘునందన్, క్యాంపస్ ఎకో బజార్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ ఉమ, లెక్చరర్లు ధామ్సింగ్, రామకృష్ణ, మూర్తి, మల్లికార్జున్, స్వప్న, నాగలక్ష్మి, వెంకటస్వామి, విద్యార్థులు పాల్గొన్నారు. చట్టాలు అందరికీ సమానం ఆత్మకూర్: చట్టాలు అందరికీ సమానమే అని జూనియర్ సివిల్ కోర్టు న్యాయమూర్తి శిరీష అన్నారు. శనివారం మండలంలోని బాలకిష్టాపూర్లోని కస్తూర్బా పాఠశాలలో న్యాయవిజ్ఞాన సదస్సును నిర్వహించి విద్యార్థులకు చట్టాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా బాల్యవివాహాలు, ఉన్నత చదువులతో లాభాలు, పోక్సో చట్టం, ర్యాగింగ్ తదితర విషయాల గురించి క్లుప్తంగా వివరించారు. కేజీబీవీ ఎస్ఓ స్వప్న, ఉపాధ్యాయులు, న్యాయవాదులు, విద్యార్థులు పాల్గొన్నారు. శనేశ్వరాలయానికి పోటెత్తిన భక్తులు బిజినేపల్లి: నందివడ్డెమాన్ శనేశ్వరాలయానికి శనివారం భక్తులు పోటెత్తారు. తమ ఏలినాటి శని నివారణ కోసం జైష్ఠ్యాదేవి సమేత శనేశ్వరుడికి తిల తైలాభిషేకాలు, అర్చనలు చేశారు. ముందుగా అర్చక బృందం శనేశ్వరుడిని ప్రత్యేకంగా అలంకరించి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు రాజేశ్, ప్రభాకరాచారి, అర్చకులు శాంతికుమార్, ఉమామహేశ్వర్ పాల్గొన్నారు. ఓపెన్ టెన్త్, ఇంటర్లో అడ్మిషన్లు గద్వాల: ఓపెన్ టెన్త్ మరియు ఇంటర్మీడియట్లో 2025–26వి ద్యాసంవత్సరంలో చదివేందుకు ఆసక్తి గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ బీఎం సంతోష్ ప్రకటనలో తెలిపారు. ఓపెన్ టెన్త్ మరియు ఇంటర్ విధానం ద్వారా విద్యను అభ్యసించేందుకు తెలంగాణ ఓపెన్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించే ఓపెన్ టెన్త్ మరియు ఇంటర్ గొప్ప అవకాశం అని తెలిపారు. జిల్లాలో 2025–26 విద్యాసంవత్సరానికి గాను 1780మంది అభ్యర్థులు చదువుకునేందుకు అవకాశం కల్పించినట్లు ఇప్పటి వరకు 1065 అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. మిగిలిన సీట్లకు సంబంధించి ఆసక్తి గల అభ్యర్థులు ఈనెల 23వ తేదీలోపు దరఖాస్తులను చేసుకోవాలని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 17సెంటర్లు ఉన్నాయని ఆసక్తి గల విద్యార్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. -
ప్రశ్నిస్తే కేసులా..
సాక్షి, నెట్వర్క్: ప్రభుత్వాలు, ప్రజలకు మధ్య వారధిగా పనిచేసే మీడియా ప్రభుత్వాలు చేస్తున్న తప్పులను ఎత్తి చూపితే అక్రమ కేసులు పెట్టి వేధింపులకు గురి చేయడం సరికాదని జర్నలిస్ట్, ప్రజా సంఘాల నాయకులు శనివారం ఆందోళన వ్యక్తం చేశాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి సర్కార్ పాలనా వైఫల్యాలను ఎండగడుతన్న సాక్షి పత్రిక ఎడిటర్ ధనంజయరెడ్డిపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామని ముక్తకంఠంతో నివదించారు. -
ప్రశాంతం
‘బీసీ’ బంద్ ● పోటాపోటీగా బంద్లో పాల్గొన్న రాజకీయ పార్టీలు ● జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే బైక్ ర్యాలీకాంగ్రెస్కు బీసీలపై చిత్తశుద్ధి లేదని, అందుకే కోర్టులో దావా వేస్తారని తెలిసే 42 శాతం రిజర్వేషన్ వర్తింపజేస్తామని జీఓ ఇచ్చారని బీజీపీ జిల్లా అధ్యక్షుడు డి. నారాయణ ఆరోపించారు. బీసీ బంద్ కార్యక్రమంలో నాయకులతో కలిసి పాల్గొన్నారు. కాంగ్రెస్ రిజర్వేషన్లకు అనుకూలంగానే ఉంటే జనాభా ప్రాతిపదికన రేవంత్రెడ్డి కేబినేట్లో ఎనిమిది మంది మంత్రులు ఉండాల్సి ఉండగా.. ఎందుకు ముగ్గురే ఉన్నారని ప్రశ్నించారు. వనపర్తి: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బీసీ సంఘాల జేఏసీ పిలుపునిచ్చిన రాష్ట్ర బంద్ శనివారం జిల్లాలో ప్రశాతంగా ముగిసింది. ముక్తకంఠంతో అన్ని బీసీ, ఇతర సంఘాలు, రాజకీయ పార్టీలు సైతం బంద్లో పాల్గొనటంతో ప్రజలు, వ్యాపారులు, ఆర్టీసీ, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల యాజమాన్యం బంద్కు సంపూర్ణ మద్దతు తెలుపుతూ.. సహకారం అందించారు. మధ్యాహ్నం వరకు చిన్నపాటి హోటళ్లు కూడా తెరుచుకోలేదు. మధ్యాహ్నం తర్వాత పెట్రోల్ పంపులు, ఆర్టీసీ బస్సులు, టీ హోటళ్లు కొనసాగించారు. బస్సుల రాకపోకలు నిలిచిపోవటంతో జిల్లా కేంద్రం నుంచి కొల్లాపూర్, కొత్తకోట, పెబ్బేరు ప్రాంతం వెళ్లే ఉద్యోగులు సొంత వాహనాలతో పాటు ఇతర ప్రజలు ప్రైవేటు వాహనాలను ఆశ్రయించి విధులకు హాజరయ్యారు. తెల్లవారుజామున 3 గంటల నుంచే.. తెల్లవారుజాము మూడు గంటలకే బీసీ సంఘాల నాయకులు, అఖిలపక్ష నాయకులు ఆర్టీసీ డిపో ఎదుట బైఠాయించి, బస్సులను బయటకు రాకుండా అడ్డుకున్నారు. బంద్కు సహకరించాలని అధికారులను కోరారు. డిపో వద్దే ఉదయం తొమ్మిది గంటల వరకు గేట్లు తెరుచుకోనివ్వకుండా నిరసన వ్యక్తం చేశారు. పోటాపోటీగా.. బంద్లో అధికార కాంగ్రెస్తో పాటు బీఆర్ఎస్, బీజేపీ, కమ్యూనిస్టు పార్టీలు సైతం పాల్గొని ఎవరికి వారు వేర్వేరు పద్ధతుల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి కాంగ్రెస్ నాయకులతో కలిసి జిల్లా కేంద్రంలో భారీ మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ పెద్దలు బీసీ రిజర్వేషన్లపై ద్వంద వైఖరి ప్రదర్శిస్తున్నారని, బీసీ రిజర్వేషన్ బిల్లును పరోక్షంగా అడ్డుకుంటూనే.. ప్రత్యక్షంగా ప్రజల మధ్య రిజర్వేషన్లకు అనుకూలమనే ప్రకటనలు చేయడం శోచనీయమన్నారు. -
డీసీసీ అధ్యక్ష పీఠానికి పోటాపోటీ
వనపర్తి: కాంగ్రెస్పార్టీ జిల్లా అధ్యక్ష పీఠానికి పోటీ గతంలో ఎన్నడూ లేనివిధంగా పెరిగింది. పార్టీ అధిష్టానం ఈసారి పాత ఎంపిక విధానానికి స్వస్తిపలికి జిల్లాల వారీగా ఏఐసీసీ స్థాయి నాయకులతో పరిశీలన.. నేతలు, కార్యకర్తల అభిప్రాయ సేకరణ చేపట్టి డీసీసీ అధ్యక్ష పీఠం కట్టబెట్టే ప్రయత్నం చేస్తోంది. పుదుచ్చేరి మాజీ ముఖ్యమంత్రి, ఏఐసీసీ పరిశీలకుడు వి.నారాయణస్వామితో పాటు మాజీ ఎమ్మెల్సీ అమీర్ అలీఖాన్, జొజ్జ సంధ్యారెడ్డి, కోటేశ్వర్రావు, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డా. జి.చిన్నారెడ్డి ఇటీవల జిల్లాలో పర్యటించారు. డీసీసీ అధ్యక్ష పదవి ఆశిస్తున్న వారి నుంచి దరఖాస్తులు స్వీకరించడంతో పాటు వారితో వ్యక్తిగతంగా మాట్లాడి పార్టీ బలోపేతానికి తీసుకుంటున్న చర్యలు, భవిష్యత్ కార్యాచరణ తదితర అంశాలపై చర్చించారు. అనంతరం జిల్లా ముఖ్య నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించి అభిప్రాయ సేకరణ చేశారు. దరఖాస్తు చేసుకున్న వారిలో జిల్లా కేంద్రానికి చెందిన నాయకులు అత్యధికులు ఉండగా.. ఇతర ప్రాంతాలకు చెందిన కొందరు ఉన్నట్లు తెలుస్తోంది. జిల్లాకేంద్రంతో పాటు దేవరకద్ర, మక్తల్ నియోజకవర్గ ప్రాంతాల నాయకులతో రెండ్రోజుల పాటు వేర్వేరుగా సమావేశాలు నిర్వహించి ముఖ్య నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలతో జిల్లా పార్టీ పగ్గాలు ఎవరికి ఇవ్వాలనే విషయంపై సమాలోచనలు చేసినట్లు సమాచారం. సీఎం ఆశీస్సులున్న వారికేనన్న చర్చ.. జిల్లాకేంద్రానికి చెందిన ఓ ముఖ్య నాయకుడికి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మద్దతు ఉందని.. సదరు వ్యక్తికే డీసీసీ అధ్యక్ష పీఠం దక్కే ఛాన్స్ ఎక్కువగా ఉందనే చర్చ స్థానిక కాంగ్రెస్ శ్రేణుల్లో వినిపిస్తోంది. కాగా.. రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డా. జి.చిన్నారెడ్డి, ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డికి సన్నిహితులుగా ఉన్న నాయకులు పదవి కోసం పోటాపోటీగా దరఖాస్తులు సమర్పించారు. పలువురు నాయకులు గతంలో పార్టీ, ప్రజల కోసం చేసిన సేవా కార్యక్రమాల పేపర్ ప్రతులను సైతం దరఖాస్తుతో పాటు సమర్పించినట్లు తెలుస్తోంది. డీసీసీ అధ్యక్ష పీఠాన్ని ఆశిస్తూ చేసిన దరఖాస్తులను జిల్లా పరిశీలకులు పీసీసీకి అందజేస్తారు. పీసీసీ స్థాయిలో చర్చించి నాయకులు, కార్యకర్తల్లో ఎక్కువ మంది కోరిన వ్యక్తి.. ఐదేళ్లుగా పార్టీకి చేసిన సేవలు, భవిష్యత్లో కలిగే లాభాలను బేరీజు వేసుకొని ఎంపిక చేయనున్నారు. ఈ నెల 22న రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల అధ్యక్షుల పేర్లను పీసీసీ ప్రకటించాలని నిర్ణయించినా.. పోటీ ఎక్కువగా ఉన్నందున ఆలస్యం కావచ్చనే చర్చలు పార్టీ క్యాడర్లో విపిస్తున్నాయి. డీసీసీ అధ్యక్ష పీఠం ఎవరికి దక్కుతుందో తెలుసుకునేందుకు మరో వారం వేచిచూడక తప్పదు. ఏఐసీసీ పరిశీలకులకు 16 దరఖాస్తులు -
వేరుశనగ సాగుకు ఊతం
ఉచిత విత్తన పంపిణీకి ప్రభుత్వాలు శ్రీకారం వనపర్తి: దక్షిణాదిలో అత్యధికంగా వేరుశనగ సాగు చేసే ప్రాంతంగా పాలమూరు గుర్తింపు పొందింది. ఇక్కడ సాగుచేసే నాణ్యమైన వేరుశనగకు విదేశీ మార్కెట్లోనూ డిమాండ్ ఉన్న విషయం విధితమే. ఏటా రూ.కోట్ల విలువజేసే వంట నూనెలను ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నట్లు పలుమార్లు ప్రభుత్వాలు నివేదికలను వెల్లడించాయి. మన ప్రాంతానికి కావాల్సిన వంట, ఇతర నూనెలను మనమే కావాల్సిన మేర ఉత్పత్తి చేసుకోవాలనే సదుద్దేశంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నూనెగింజల సాగును ప్రోత్సహించేందుకు రైతులకు వేరుశనగ విత్తనాలను ఉచితంగా పంపిణీ చేసేందుకు నిర్ణయించి జాతీయ నూనెగింజల ఉత్పత్తి పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ పథకానికి రాష్ట్రంలో వేరుశనగ ఎక్కువగా సాగుచేసే ఏడు జిల్లాలను ఎంపిక చేయగా.. అందులో ఐదు జిల్లాలు ఉమ్మడి పాలమూరులోనే ఉండటం గమనార్హం. ఉమ్మడి పాలమూరుతో పాటు వికారాబాద్, నల్గొండ జిల్లాలు ఉన్నాయి. ప్రతి జిల్లాలో మూడు నుంచి నాలుగు మండలాలను ఎంపిక చేసి వేరుశనగ సాగుపై ఆసక్తి కనబర్చే చిన్నా, సన్నకారు రైతులను గుర్తించి ప్రభుత్వం తరుఫున ఎక్కువ నూనెశాతం ఉండే నూతన విత్తనాలను ఉచితంగా పంపిణీ చేసే కార్యక్రమానికి రాష్ట్ర వ్యవసాయశాఖ శ్రీకారం చుట్టింది. పాలమూరు రైతులకు ఉచిత వేరుశనగ విత్తనాల పంపిణీ తీపి కబురుగానే చెప్పవచ్చు. ఏటా యాసంగిలోనే సాగు.. జిల్లాలో ఏటా వానాకాలంలో వరి, యాసంగిలో వేరుశనగ సాగు చేయడం కొన్నేళ్లుగా ఇక్కడి రైతులకు అలవాటు. కానీ ఇటీవల సాగునీటి లభ్యత పెరగడం, అడవి పందుల బెడద అధికం కావడంతో అధిక భాగం వానాకాలం, యాసంగిలోనూ వరిసాగు చేయడం ప్రారంభించారు. దీంతో గత నాలుగైదేళ్లలో వేరుశనగ సాగు గణనీయంగా తగ్గిందని చెప్పవచ్చు. 2017–18 యాసంగిలో అత్యధికంగా సుమారు 60 వేల ఎకరాల్లో వేరుశనగ సాగు చేస్తే.. గతేడాది యాసంగిలో 19 వేల ఎకరాల్లో మాత్రమే సాగైనట్లు వ్యవసాయశాఖ గణాంకాలు చెబుతున్నాయి. వరి మాదిరిగా వేరుశనగకు సరైన మార్కెటింగ్ అవకాశాలు కల్పిస్తే.. జిల్లాలో సాగు విస్తీర్ణం మరింత పెరిగే అవకాశం ఉంది. జిల్లాలో మూడు మండలాలు ఎంపిక.. ఈ పథకానికి జిల్లాలోని పాన్గల్, పెద్దమందడి, పెబ్బేరు మండలాలను ఎంపిక చేయగా.. మంగళవారం పెద్దమందడి మండలం బలిజపల్లిలో పలువురు రైతులకు ఇక్రిసాట్ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన కదిరి లేపాక్షి, జీజేసీ–32, గిర్నాల్ రకం విత్తనాలు 490 క్వింటాళ్లు పంపిణీ చేశారు. ఆయా రైతులు పండించిన ఉత్పత్తులతో జిల్లా పరిధిలోని వివిధ ప్రాంతాల్లో సీడ్హబ్, సీడ్ స్టోరీజీలను ఏర్పాటుచేసి నూనెగింజల ఉత్పత్తిని మరింత పెంచేందుకు వ్యవసాయశాఖ అధికారులు కృషి చేయాల్సి ఉంటుంది. గతంలోనూ.. జిల్లాలోని ఖాసీంనగర్లో ఇక్రిసాట్ శాస్త్రవేత్తలు వేరుశనగ విత్తన బండాగారం ఏర్పాటుచేసి అధిక దిగుబడులిచ్చే విత్తనాలతో సత్ఫలితాలు సాధించారు. ప్రభుత్వం దృష్టి సారించకపోవడంతో కాలక్రమేణ రైతులు వేరుశనగ సాగును తగ్గించి వరి సాగుకు ఆసక్తి చూపించారు. నాలుగు రకాల పంటల సాగు.. జిల్లా రైతులు ఇప్పటి వరకు వేరుశనగతో పాటు నువ్వులు, ఆముదం, సోయాబిన్ వంటి నూనెగింజలు మాత్రమే సాగు చేస్తుండగా.. మొత్తం నూనెగింజల సాగులో వేరుశనగ 90 శాతం ఉంటుంది. ఏటా భారీ మొత్తంలో వంటనూనెలు దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది. ఈ పరిస్థితిని మార్చాలనే ఉద్దేశంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నూనెగింజల సాగును ప్రోత్రహించేందుకు పూనుకున్నాయి. మన ప్రాంతానికి కావాల్సిన వంట, ఇతర రకాల నూనెలను మనమే తయారు చేసుకునేందుకు ఆయిల్పాంతో పాటు వేరుశనగ సాగును పెంచేందుకే ఉచిత విత్తనాల పంపిణీకి శ్రీకారం చుట్టింది. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలి. సాధారణ వేరుశనగ కే–6 రకం కంటే ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తున్న వేరుశనగ విత్తన రకాల్లో 50 నుంచి 60 శాతం ఎక్కువ నూనెశాతం ఉంటుంది. – ఆంజనేయులుగౌడ్, జిల్లా వ్యవసాయశాఖ అధికారి రాష్ట్రవ్యాప్తంగా ఏడు జిల్లాలు ఎంపిక.. అందులో ఉమ్మడి పాలమూరులోని ఐదు జిల్లాలు జిల్లాలో మూడు మండలాలు ఎంపిక ఇక్రిసాట్ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన అధిక దిగుబడినిచ్చే విత్తనాలు అందజేత -
పట్టాలెక్కిన ఆనందం
పీయూలో కనులపండువగా స్నాతకోత్సవం మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీ 4వ స్నాతకోత్సవ కార్యక్రమం గురువారం కనులపండువగా జరిగింది. ఉదయం 11 గంటలకు కార్యక్రమం ప్రారంభం కాగా.. పీయూ లైబ్రరీ ఆడిటోరియం వద్ద గవర్నర్ జిష్ణుదేవ్వర్మ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఆడిటోరియం హాల్లో ఈసీ మెంబర్స్ సమావేశంలో పాల్గొని.. స్నాతకోత్సవం జరిగే లైబ్రరీ ఆడిటోరియంలోకి వచ్చారు. ఈ కార్యక్రమానికి గౌరవ అతిథిగా హాజరైన మన్నె సత్యనారాయణరెడ్డికి వీసీ శ్రీనివాస్ యూనివర్సిటీ చాన్స్లర్, గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అనుమతితో గౌరవ డాక్టరేట్ ప్రదానం చేశారు. ఆ తర్వాత గోల్డ్మెడల్స్ స్వీకరిస్తున్న విద్యార్థులు, పీహెచ్డీ అవార్డులు అందుకోనున్న విద్యార్థులతో ప్రమాణం చేయించారు. ముందుగా పీహెచ్డీ పూర్తిచేసిన 12 మందికి అవార్డులు, డాక్టరేట్, తర్వాత యూజీ, పీజీలో టాపర్లుగా నిలిచిన వారికి గోల్డ్మెడల్స్ అందించారు. వీసీ శ్రీనివాస్ మాట్లాడుతూ పాలమూరు యూనివర్సిటీ ఒక సాధారణ పీజీ కళాశాలగా ప్రారంభమై 2008లో పూర్తిస్థాయిలో యూనివర్సిటీగా అవతరించి ప్రతి సంవత్సరం మరింత అభివృద్ధిని సాధిస్తుందని పేర్కొన్నారు. 171 ఎకరాల్లో ఉన్న యూనివర్సిటీలో మహబూబ్నగర్లోని యూనివర్సిటీలో 5 కళాశాలలు ఉండగా గద్వాల, కొల్లాపూర్, వనపర్తిలో పీజీ సెంటర్లు కొనసాగుతున్నాయన్నారు. ప్రారంభంలో కేవలం 5 కోర్సులతో ప్రారంభమైన యూనిర్సిటీ ఇప్పుడు 24 కోర్సులు అందుబాటులోకి వచ్చాయన్నారు. కొత్తగా ఇంజినీరింగ్, లా కళాశాలలు ప్రారంభించి నాణ్యమైన విద్యను అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఎఫ్సెట్ ద్వారా లా లో మొత్తం 100 శాతం (ఎల్ఎల్బీలో 60, ఎల్ఎల్ఎంలో 20) సీట్లు భర్తీ చేశామన్నారు. రీసెర్చ్లో 9 సబ్జెక్టులు ఉండగా.. 12 మందికి డాక్టరేట్ పట్టాలు అందిస్తున్నామని, మరో 25 మంది రీసెర్చ్లో ఉన్నారన్నారు. యూజీ, పీజీ స్థాయిలో సీబీసీఎస్ (చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టం) అమలు పరుస్తున్నామని, ఇప్పటి వరకు 50 సెమినార్లు, 7 రోజులు ఫ్యాకల్టీ డెవలప్మెంట్ కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. మూక్స్, స్వయం పోర్టల్స్లో ఇప్పటికే 2 వేలకుపైగా విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారన్నారు. పీయూలో విద్యార్థులకు పూర్తిస్థాయిలో వసతులు కల్పిస్తున్నామని, హాస్టళ్లు, లైబ్రరీ, స్పోర్ట్స్, ల్యాబ్స్ వంటి సౌకర్యాలు ఉన్నాయని వీసీ అన్నారు. నూతనంగా రూ.13.2 కోట్లతో రీసెర్చి ఫెసిలిటీ భవనం నిర్మాణం జరుగుతుందని, రూ.35 కోట్లతో ఇంజినీరింగ్ కళాశాల, రూ.15 కోట్లతో లా కళాశాల నిర్మాణానికి అనుమతులు వచ్చాయన్నారు. ఇటీవల కొత్త బాలికల హాస్టల్ ప్రారంభించామని, ఇందులో 300 మంది విద్యార్థులకు వసతులు కల్పిస్తున్నామన్నారు. రూ.5 కోట్లతో సీవేజ్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ నిర్మిస్తున్నామన్నారు. పీఎం ఉషా స్కీం ద్వారా రూ.100 కోట్ల నిధులు వచ్చాయని, ఎన్ఈపీలో భాగంగా సమర్థ్ పోర్టల్ను ఉపయోస్తూ అడ్మినిస్ట్రేషన్ పరమైన మార్పులు తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. పీయూలో 70 శాతం ఈకో ఫ్రెండ్లీ వాతావరణం, గ్రీనరీ ఉండటం వల్ల విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉందన్నారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మాట్లాడుతూ యూనివర్సిటీలో చదువుకున్న విద్యార్థులు సమాజానికి టార్చ్బేరర్గా నిలవాలని, సమాజాన్ని, దేశాన్ని మార్చేందుకు తమవంతు కృషి చేయాలన్నారు. స్నాతకోత్సవం అనేది కేవలం పట్టాల ప్రదానోత్సవం మాత్రమే కాదని.. అది విద్యార్థి కృషి, ఉపాధ్యాయుల సేవ, తల్లిదండ్రుల త్యాగాలను స్మరించుకునే సందర్భం అన్నారు. విద్య యొక్క అసలు లక్ష్యం ఉద్యోగం పొందడమే కాదని.. అది వ్యక్తిత్వం, విలువలు, జీవన నైపుణ్యాలను అభివృద్ధి చేయడం అన్నారు. పీయూలో చాలా అభివృద్ధి జరిగిందని, ఇక్కడ చేస్తున్న అనేక కార్యక్రమాలు ఆకర్షణీయంగా ఉన్నాయన్నారు. ముఖ్యంగా మిలియన్ ట్రీ ప్లాంటేషన్, యూనివర్సిటీ విద్యార్థులు గ్రామాలను దత్తత తీసుకోవడం, కనెక్ట్ విత్ చాన్స్లర్ వంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరంగా ఉన్నా యన్నారు. తెలంగాణలో ఏ యూనివర్సిటీ సాధించలేని విధంగా పీయూ పీఎం ఉషా స్కీం ద్వారా రూ.100 కోట్లు సాధించడం ఒక మైలురాయిగా నిలుస్తుందన్నారు. యూనివర్సిటీ ఈ సంవత్సరం న్యాక్ రెండోసారి వెళ్లడం మంచి పరిణామం అని, ఉన్నత విద్యకు కృషి చేసే యూనివర్సిటీలు ఆధునిక దేవాలయాలుగా నిలుస్తున్నాయన్నారు. ఇలాంటి యూనివర్సిటీలు రీసెర్చి, ఇంక్యూబేషన్ సెంటర్లుగా మారి విద్యార్థుల ద్వారా కొత్త స్టార్టప్లు ఏర్పాటు కోసం కృషి చేయాలన్నారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు.. పీయూలో ఇటీవల లా, ఇంజినీరింగ్ కళాశాలలు ఏర్పాటు చేయడం శుభపరిణామం అని గవర్నర్ అన్నారు. ఇంజినీరింగ్లో డాటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషన్ లర్నింగ్ వంటి ఆధునిక కోర్సులు ప్రారంభించిన మొదటి సంవత్సరంలో 100 శాతం అడ్మిషన్లు సాధించడం అభినందిచదగ్గ విషయమన్నారు. ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎంలో ఇంటలెక్చువల్ ప్రాపర్టీ సబ్జెక్టులతో ఇక్కడి విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా మారుతుందన్నారు. ప్రధాని నరేంద్రమోదీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ–2020తో విద్యార్థులకు చదువుతోపాటు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వచ్చేందుకు ఎంతో దోహదపడుతుందని తెలిపారు. స్నాతకోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించిన వీసీ శ్రీనివాస్, రిజిస్ట్రార్ రమేష్బాబు అభినందించారు. ఈ నేలలో పుటిన బిడ్డగా పాలమూరు యూనివర్సిటీ వేదికపై మాట్లాడేందుకు అవకాశం ఇవ్వడాన్ని గొప్ప గౌరవంగా భావిస్తున్నట్లు ఎంఎస్ఎన్రెడ్డి అన్నారు. ఒకప్పుడు వలసల జిల్లాగా ఉన్న పాలమూరు ఇప్పుడు విద్య, ఆరోగ్యం, పరిశ్రమ రంగాల్లో ఎంతో అభివృద్ధి సాధిస్తుందన్నారు. విద్యార్థుల విజయం కేవలం వ్యక్తిగత పురోగతితో కాదని, సమాజానికి తిరిగి ఇచ్చే సేవతో కొలవాలని పేర్కొన్నారు. పీయూ బ్రాండ్ అంబాసిడర్, నిజాయితీ, కరుణ, ధైర్యం వారి యొక్క లక్ష్యంగా మారాలన్నారు. విద్యార్థుల సాంకేతికత పరిశోధనలను, ఆవిష్కరణలు సమాజానికి ఉపయోగపడేలా ఉండాలని, సేవా దృక్పథంతో పనిచేసి దేశాభివృద్ధికి కృషి చేయాలన్నారు. స్నాతకోత్సవం పూర్తయిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ పాలమూరు యూనివర్సిటీ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని, పీయూలో ఆడిటోరియం నిర్మాణానికి రూ.12 కోట్లు విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు. మన్నె సత్యనారాయణరెడ్డికి గౌరవ డాక్టరేట్ ప్రదానం మరో 83 మందికి గోల్డ్ మెడల్స్, 12 మందికి పీహెచ్డీల బహూకరణ పీయూ మరింత అభివృద్ధి చెంది, నాణ్యమైన విద్య అందించాలి: గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆడిటోరియం నిర్మాణానికి రూ.12 కోట్లు ప్రకటించిన ఎంఎస్ఎన్ రెడ్డి -
చేనేత వస్త్రాలకు
పెరుగుతున్న ఆదరణ అమరచింత: చేనేత వస్త్రాలకు రోజురోజుకు ఆదరణ పెరుగుతోందని నాబార్డ్ సీజీఎం ఉదయ భాస్కర్ అన్నారు. గురువారం హైదరాబాద్లోని అమృత్ మహాల్లో అమరచింత చేనేత వస్త్ర తయారీ సంఘం ఆధ్వర్యంలో కొత్తగా ఏర్పాటు చేసిన బ్రాంచ్ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. అమరచింత చేనేత ఉత్పత్తుల సంఘం ఏర్పాటై అంచలంచెలుగా ఎదుగుతూ ఆన్లైన్ మార్కెటింగ్ ద్వారా దేశ విదేశాల్లో కార్యకలాపాలు సాగిస్తోందని తెలిపారు. రాష్ట్ర రాజధానిలో సైతం తమ ఉత్పత్తులను విక్రయించుకునేందుకు ప్రత్యేక షోరూం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. చేనేత కార్మికులు కంపెనీలో భాగస్వాములుగా ఉంటూ వచ్చిన లాభాలను సమానంగా పంచుకొని వ్యాపారాలు, ఉత్పత్తులను పెంచుకోవడం సంతోషంగా ఉందని తెలిపారు. కార్యక్రమంలో టెస్కో ఎండీ వైకే రావు, ఫౌండేషన్ ఫర్ ఎంఎస్ఎంఈ అడ్వైజర్ శ్రవణ్కుమార్శర్మ, అమరచింత చేనేత ఉత్పత్తుల సంఘం కంపెనీ సీఈఓ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
సమర్థవంతంగా విధుల నిర్వహణ : ఎస్పీ
వనపర్తి: విధుల్లో నిబద్ధతతో పాటు ఆరోగ్య పరిరక్షణ అవసరమని, పోలీసులు సమర్థవంతంగా విధులు నిర్వర్తించాలని ఎస్పీ రావుల గిరిధర్ కోరారు. గురువారం జిల్లా పోలీసు కార్యాలయ సమావేశ మందిరంలో అన్ని పోలీస్స్టేషన్ల ఏఎస్సైల ప్రత్యేక శిక్షణా కార్యక్రమం నిర్వహించగా.. ఎస్పీ పాల్గొని విధుల్లో సమర్థత, న్యాయపరమైన దృక్పథం, ప్రజాసేవలో బాధ్యతలపై అవగాహన కల్పించారు. ఏఎస్ఐలు పోలీసు వ్యవస్థలో కీలక స్తంభాలని, నిబద్ధత, సమయపాలన, నిజాయితీ పోలీస్స్టేషన్ సమర్థతను నిర్ణయిస్తాయన్నారు. క్రైం రిజిస్టర్, ఎఫ్ఐఆర్లు, పంచనామాలు, సాక్షుల విచారణ వంటి బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాలని, స్టేషన్ నిర్వహణలో ఎస్సైకి సహకరించాలని సూచించారు. ప్రజల భద్రత, న్యాయసేవలో ఆదర్శంగా నిలవాలని, కఠిన కేసులను సవాలుగా స్వీకరించి చాకచక్యంగా పరిష్కరించాలన్నారు. శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉంటేనే విధుల్లో సమర్థత పెరుగుతుందని, నిత్య వ్యాయామం, సమతుల ఆహారం, సానుకూల దృక్పథంతో సేవ కొనసాగించాలని కోరారు. కార్యక్రమంలో డీసీఆర్బీ డీఎస్పీ ఉమామహేశ్వరరావు, డీసీఆర్బీ ఎస్ఐ తిరుపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ధాన్యం కొనుగోలుపై అవగాహన ఉండాలి
వనపర్తి: నాణ్యమైన వరి ధాన్యం సేకరించేలా కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా పౌరసరఫరాలశాఖ, సంస్థ ఆధ్వర్యంలో 2025–26 వానాకాలం ధాన్యం కొనుగోలుకు సంబంధించి సన్నాహక సమావేశం నిర్వహించగా.. కలెక్టర్తో పాటు డీసీసీబీ చైర్మన్ మామిళ్లపల్లి విష్ణువర్ధన్రెడ్డి, రెవెన్యూ అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్ హాజరయ్యారు. ఎఫ్ఏక్యూ ప్రమాణాల ప్రకారం నాణ్యమైన ధాన్యాన్ని గుర్తించడంపై ఏఓలు, ఏఈఓలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. నాణ్యమైన వరి ధాన్యం గుర్తించేందుకు కేంద్రాల నిర్వాహకులకు సోమ, మంగళవారం శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు. నిర్దేశించిన తేమశాతం ఉండేలా, తాలు లేకుండా ధాన్యం కొనుగోలు చేసేలా సూచనలు చేయాలన్నారు. గత సీజన్లో రవాణా కాంట్రాక్టర్ల నుంచి ఎదురైన ఇబ్బందులను గుర్తు చేస్తూ ఈసారి అలాంటి పరిస్థితులు తలెత్తొద్దని ఆదేశించారు. కేటాయించిన మిల్లులకే ధాన్యం తరలించాలని, ఈ విషయంలో మిల్లర్లు కూడా కొనుగోలు కేంద్రాల నిర్వాహకులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. అదేవిధంగా మిల్లర్లు రైతులను ఇబ్బందులకు గురిచేసే పరిస్థితులు రాకుండా జాగ్రత్త పడాలన్నారు. ధాన్యం మిల్లుకు చేరిన వెంటనే ట్రక్ షీట్లను వాట్సాప్ ద్వారా పంపి రైతులకు వెంటనే నగదు చెల్లించేందుకు కృషి చేయాలని సూచించారు. మిల్లర్లకు ఏవైనా సమస్యలుంటే పరిష్కార మార్గం చూపించడానికి కృషి చేస్తామన్నారు. డీసీసీబీ చైర్మన్ మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోళ్లలో గతంలో జరిగిన తప్పులు పునరావృతం కాకుండా చూసుకోవాలని తెలిపారు. టార్పాలిన్లు, గన్నీ బ్యాగులు, క్లీనర్లు సరిపడా అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఎట్టి పరిస్థితుల్లో రైతులకు నష్టం వాటిల్లకుండా చూడాలని కోరారు. ధాన్యం కొనుగోలు సజావుగా సాగేలా ప్రతి ఒక్కరు సహకరించాలన్నారు. సమావేశంలో జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి కాశీ విశ్వనాథ్, డీఎం జగన్మోహన్, డీఆర్డీఓ ఉమాదేవి, డీసీఓ రాణి, డీటీఓ మానస, డీఎంఓ స్వరణ్సింగ్, వనపర్తి, మదనాపురం మార్కెట్ చైర్మన్లు శ్రీనివాస్గౌడ్, ప్రశాంత్, పాక్స్ సీఈవోలు, ఐకేపీ ఏపీఎంలు పాల్గొన్నారు. ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం పెండింగ్లో ఉన్న ఫారం 6, 7, 8 దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరిస్తున్నామని కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. గురువారం రాష్ట్ర ఎన్నికల సంఘం సీఈఓ సుదర్శన్రెడ్డి అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా.. జిల్లా నుంచి కలెక్టర్, రెవెన్యూ అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్, ఆర్డీఓ సుబ్రమణ్యం పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ.. మృతిచెందిన ఓటర్లను జాబితా నుంచి తొలగించామని తెలిపారు. సమావేశంలో డిప్యూటీ కలెక్టర్లు రంజిత్రెడ్డి, శ్రావ్య, తహసీల్దార్ రమేష్రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
సజావుగా ధాన్యం కొనుగోలుకు సన్నాహాలు
వనపర్తి: రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వరి ధాన్యం కొనుగోలుకు తగిన ఏర్పాట్లు చేపట్టనున్నట్లు కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. బుధవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర పౌర సరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి, వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అన్ని జిల్లాల కలెక్టర్లు, సంబంధిత అధికారులతో ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ ఆదర్శ్ సురభి, రెవెన్యూ అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్ పాల్గొని వివరాలు వెల్లడించారు. ఈ నెల చివరి వారంలో ధాన్యం విక్రయానికి వచ్చే అవకాశం ఉందని.. ఆలోగా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. జిల్లావ్యాప్తంగా సుమారు 400 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి కొనుగోలు ప్రక్రియ చేపడతామన్నారు. అనంతరం కలెక్టర్ సంబంధిత అధికారులతో సమావేశమయ్యారు. గతంలో ఇబ్బందులు తలెత్తిన కేంద్రాల్లో సమస్యలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. కేంద్రాల్లో కనీస సౌకర్యాలు కల్పించాలని, రైతులకు ఇబ్బందులు కలుగకుండా చూడాలని సూచించారు. తూకపు, తేమ కొలిచే యంత్రాలు సరిగా ఉన్నాయో లేదో చూసుకోవాలని, టార్పాలిన్లు, గన్నీబ్యాగులు అందుబాటులో ఉంచుకోవాలని, లారీలు, కూలీల కొరత తలెత్తకుండా చూడాలన్నారు. రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయడంలో ఏవైనా సాంకేతిక సమస్యలు తలెత్తితే వెంటనే పరిష్కరించాలని కోరారు. సమావేశంలో డిప్యూటీ కలెక్టర్లు రంజిత్రెడ్డి, శ్రావ్య, జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి కాశీ విశ్వనాథ్, డీఎం జగన్మోహన్, డీఆర్డీఓ ఉమాదేవి, డీసీఓ రాణి, డీటీఓ మానస, వ్యవసాయ అధికారి ఆంజనేయులుగౌడ్ పాల్గొన్నారు. -
ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే..
సీసీఎల్ఏ ఆదేశాల మేరకు రెండ్రోజులుగా జిల్లాలోని 22ఏ(1) పరిధిలోని భూములు, ఆస్తుల వివరాలను సేకరించి నవీకరణ చేస్తున్నాం. లెక్క పూర్తిగా తేల్చిన తర్వాత జిల్లా వివరాలను సీసీఏల్ఏకు నివేదిస్తాం. ప్రభుత్వ భూములు, ఆస్తులు ఏవైనా పరాధీనంలో ఉంటే స్వాధీనం చేసుకునేందుకు ఈ వివరాలు ఉపయోగపడనున్నాయి. గతంలో రెండుసార్లు చేసినా.. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మరోమారు పాత, కొత్త రికార్డులను పరిశీలించి కేటగిరీల వారీగా లెక్కతేలనుంది. – సుబ్రమణ్యం, ఆర్డీఓ ● -
ప్రజల భద్రత బాధ్యత : ఎస్పీ
వనపర్తి: ప్రజల భాగస్వామ్యం, మహిళా సంఘాలు, విద్యార్థులు, మీడియాతో సమన్వయం పెంచుకోవాలని ఎస్పీ రావుల గిరిధర్ పోలీసు అధికారులు, సిబ్బందికి సూచించారు. బుధవారం జిల్లా పోలీసు కార్యాలయం నుంచి జిల్లాలోని అన్ని పోలీస్స్టేషన్ల ఇన్స్పెక్టర్లు, ఎస్హెచ్ఓలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. ఇటీవల డీజీపీ చేసిన సూచనలు ప్రతి ఒక్కరూ పాటించాలన్నారు. చట్టాన్ని అమలు చేయడంతో పాటు ప్రజల్లో పోలీసింగ్పై నమ్మకం పెంపొందించాలని, ప్రజల విశ్వాసమే నిజమైన కొలమానమని తెలిపారు. యూనిఫాం ధరించడం గౌరవమని.. ప్రజలకు భద్రత, న్యాయం అందించడం బాధ్యతని చెప్పారు. అవినీతికి పాల్పడే వారితో పోలీసుశాఖ ప్రతిష్ట దెబ్బతింటుందన్న విషయాన్ని గమనించాలన్నారు. కుటుంబ వివాదాలు వచ్చినప్పుడు శాంతి, సర్దుబాటు దిశగా మార్గనిర్దేశం చేయాలని సూచించారు. సమావేశంలో ఏఆర్ అదనపు ఎస్పీ వీరారెడ్డి, డీసీఆర్బీ డీఎస్పీ ఉమామహేశ్వరరావు, ఎస్బీ సీఐ నరేష్, రిజర్వ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు, సీసీఎస్ ఎస్ఐ రామరాజు, డీసీఆర్బీ ఎస్ఐ తిరుపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఫొటోగ్రఫీ, షార్ట్ఫిల్మ్, వ్యాసరచన పోటీలు.. పోలీసు అమరవీరుల వారోత్సవాల సందర్భంగా విద్యార్థులకు ఫొటోగ్రఫీ, షార్ట్ఫిల్మ్, వ్యాసరచన పోటీలు నిర్వహిస్తున్నందున ఈ నెల 23లోగా జిల్లా పోలీస్ కార్యాలయంలో ఫొటోలు, వీడియోలు అందజేయాలని ఎస్పీ రావుల గిరిధర్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ముగ్గురు విజేతలను ఎంపిక చేసి బహుమతులు అందజేయడంతో పాటు రాష్ట్రస్థాయికి ఎంపిక చేస్తామని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు సెల్నంబర్ 87126 70597 సంప్రదించాలని సూచించారు. -
ఆటలతో ఆరోగ్యం పదిలం
వనపర్తిటౌన్: ఆటలతో ఆరోగ్యం పదిలమని.. నిత్య జీవితంలో క్రీడలు, వ్యాయామం భాగం కావాలని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి కోరారు. బుధవారం జిల్లాకేంద్రంలోని బాలకిష్టయ్య క్రీడా ప్రాంగణంలో అండర్–14, 17 బాల బాలికలకు ఎస్జీఎఫ్ ఆధ్వర్యంలో ఖో–ఖో, కబడ్డీ, వాలీబాల్, చెస్, అథ్లెటిక్స్ క్రీడలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. క్రీడల్లో గెలుపోటములు సహజమని.. ఓటమి చెందిన విద్యార్థులు మరోమారు ప్రయత్నం చేసి విజయం సాధించేందుకు పట్టుదలతో ముందుకెళ్లాలని చెప్పారు. విద్యార్థులు చదువుతోపాటు క్రీడలపై ప్రత్యేక దృష్టి సారిస్తే దేశ విదేశాల్లోనూ ప్రతిభ చాటి జిల్లాకు గుర్తింపు తీసుకురావాలని ఆకాంక్షించారు. వనపర్తి వ్యవసాయ మార్కెట్యార్డ్ ఛైర్మన్ శ్రీనివాస్గౌడ్, కాంగ్రెస్పార్టీ పట్టణ అధ్యక్షులు చీర్ల విజయ్చందర్ పాల్గొన్నారు. -
ఓట్ల చోరీతో అధికారంలోకి వచ్చిన బీజేపీ
● ఏఐసీసీ పరిశీలకుడు, పుదుచ్చేరి మాజీ ముఖ్యమంత్రి నారాయణస్వామి స్నాతకోత్సవ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. గురువారం ఉదయం 11 గంటలకు లైబ్రరీ ఆడిటోరియం వేదికగా జరిగే కార్యక్రమానికి గవర్నర్ విష్ణుదేవ్ వర్మ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో ప్రొటోకాల్ ప్రకారం వివిధ డిపార్ట్మెంట్ అధికారుల సహకారంతో ఏర్పాట్లు చేశాం. కార్యక్రమంలో ఎంఎస్ఎన్రెడ్డి గౌరవ డాక్టరేట్, 83 మంది విద్యార్థులకు బంగారు పతకాలు, 12 మందికి పీహెచ్డీ పట్టాలు అందుకోనున్నారు. – జీఎన్ శ్రీనివాస్, వీసీ పీయూ ●ఆత్మకూర్/కొత్తకోట: అబద్దాలు, దొంగ ఓట్లతో కేంద్రంలో బేజేపీ అధికారంలోకి వచ్చిందని.. ఓట్ల చోరీ పాలన ఇక సాగదని ఏఐసీసీ పరిశీలకుడు, పుదుచ్చేరి మాజీ ముఖ్యమంత్రి నారాయణస్వామి అన్నారు. బుధవారం కొత్తకోట, ఆత్మకూర్లో జరిగిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. బిహార్ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని బీజేపీ ప్రభుత్వం పెద్దఎత్తున కుట్రలు చేస్తోందని.. ఓట్ల చోరీకి పాల్పడేందుకు పూనుకుంటోందని ఆరోపించారు. కాంగ్రెస్పార్టీ జిల్లా అధ్యక్షుడి ఎంపిక కోసం అభిప్రాయాలు సేకరించేందుకు సమావేశాలు నిర్వహిస్తున్నామని.. నాయకులు, కార్యకర్తల అభిప్రాయాలను సేకరించి ఈ నెల 22న ఏఐసీసీకి నివేదిక అందిస్తామన్నారు. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని తుది నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. పదేళ్లలో జరగని అభివృద్ధి చేసి చూపాం.. రాష్ట్రంలో పదేళ్లలో జరగని అభివృద్ధిని 20 నెలల వ్యవధిలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేసి చూపామని రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. ఆత్మకూర్లో జరిగిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత బీఆర్ఎస్ పాలనలో పేదలు రేషన్ కార్డుల కోసం ఎదురు చూశారని.. ఆ కలను తమ ప్రభుత్వం నెరవేర్చిందని, ప్రతి కుటుంబానికి సన్నబియ్యంతో పాటు సంక్షేమ ఫలాలు అందుతున్నాయని తెలిపారు. నియోజకవర్గంలో ఇప్పటి వరకు రూ.400 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని, బీఆర్ఎస్, బీజేపీ నాయకులు ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు తమవెంటే ఉన్నారని చెప్పారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్పార్టీ బలపర్చిన అభ్యర్థులే గెలవనున్నారని వెల్లడించారు. పారదర్శకంగా డీసీసీ అధ్యక్షుడి ఎంపిక.. డీసీసీ అధ్యక్షుడి ఎంపిక పారదర్శకంగా, అందరి అభిప్రాయం మేరకు, అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని జరుగుతోందని, తుది నిర్ణయం ఏఐసీసీ తీసుకుంటుందని దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్రెడ్డి తెలిపారు. కొత్తకోటలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్గాంధీ ఓటు చోరీకి సంబంధించి ఆధారాలు బయటపెట్టినా ఎన్నికల సంఘం చర్యలు తీసుకోకుండా బీజేపీ కనుసన్నల్లో పని చేస్తోందన్నారు. అంతేగాకుండా బీసీ రిజర్వేషన్లను అడ్డుకోవడంలో ప్రధాన ముద్దాయిలు బీఆర్ఎస్, బీజేపీలేనని ధ్వజమెత్తారు. కొత్తకోటలో జరిగిన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ అమీర్ అలీఖాన్, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్, ఆత్మకూర్లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర గీతకార్మిక సంఘం చైర్మన్ కేశం నాగరాజుగౌడ్, మార్కెట్ చైర్మన్ రహ్మతుల్లా, విండో అధ్యక్షుడు కృష్ణమూర్తి, నాయకులు అయ్యూబ్ఖాన్, గంగాధర్గౌడ్, పరమేష్, తులసీరాజ్, నల్గొండ శ్రీను, మహేందర్రెడ్డి, అరుణ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
సా..గుతున్న పనులు
ఎనిమిదేళ్లు గడుస్తున్నా పూర్తికాని డీ–8 కాల్వ నిర్మాణం ● అసంపూర్తిగా మైనర్ కాల్వలు ● 227 స్ట్రక్చర్లకుగాను.. 95 మాత్రమే పూర్తి ● త్వరగా పూర్తి చేయాలని కోరుతున్న రైతులు ●నీరందేలా చూడాలి.. ప్రస్తుతం వర్షాలు అధికంగా కురుస్తుండటంతో సాగు నీరు అందుతోంది. మిగతా రోజుల్లో పరిస్థితి అధ్వానంగా ఉంటోంది. మా పొలం 30వ కిలోమీటర్ వద్ద ఉంది. ఇక్కడికి నీరు రావాలంటే ముందు రైతులకు తూములు తక్కువగా తెరిచి ఉంచడంతో పాటు లైనింగ్ పనులు సక్రమంగా చేస్తేనే చేరుతుంది. ఉన్నతాధికారులు స్పందించి పనులు పూర్తిస్థాయిలో త్వరగా చేపట్టాలి – సోమ్లానాయక్, రేకులపల్లితండా, కోడేరు స్ట్రక్చర్లు నిర్మించాలి.. మాకు మేజర్–2 కాల్వ నుండి సాగునీరు అందుతుంది. నీరు వచ్చే దగ్గర కేవలం రెండు గూనలు మాత్రమే ఏర్పాటు చేశారు. వాటి నుంచి కొన్నిసార్లు అధికంగా, మరికొన్నిసార్లు తక్కువగా రావడంతో కాల్వకు గండ్లు పడుతున్నాయి. గూనలు కాకుండా స్ట్రక్చర్ ఏర్పాటు చేయాలి. – చంద్రశేఖర్, మాజీ వైఎస్ ఎంపీపీ, గోపాల్పేట ఏడాది సమయం కావాలి.. ఏటా పంటలు పూర్తయ్యాక పనులు చేయడానికి అవకాశం ఉండటంతో కేవలం రెండు నెలల సమయం మాత్రమే లభిస్తుంది. దీంతో పనులు ముందుకు సాగడం లేదు. ఎలాగైనా రైతులను ఒప్పించి ఒక పంట కాలాన్ని నిలిపివేస్తే పూర్తిస్థాయిలో చేపడతాం. ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు సహకరిస్తే ఒక సీజన్లో అన్ని స్ట్రక్చర్లు, బ్రిడ్జిలు, ఇతర పనులన్నీ పూర్తవుతాయి. – మధుసూదన్రావు, ఈఈ, నీటిపారుదలశాఖ చాకల్పల్లి సమీపంలో పారుతున్న డీ–8 మేజర్–2 కాల్వ గోపాల్పేట: కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా జిల్లాలోని రైతులకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో ఎనిమిదేళ్ల కిందట ప్యాకేజీ 29లో భాగంగా ప్రధాన కాల్వకు 11.6 కిలోమీటర్ల వద్ద డీ–8 కాల్వ పనులు ప్రారంభించినా.. నేటికీ పూర్తి కాలేదు. అధికారులు ఏటా కాంట్రాక్టర్తో కొంతమేర పనులు చేపడుతున్నాగానీ పూర్తి కావడం లేదు. డి–8 కాల్వ నిర్మాణంలో భాగంగా ఏడు మేజర్ కాల్వలు, 17 మైనర్ కాల్వలు నిర్మించాల్సి ఉండగా.. ఇప్పటి వరకు మేజర్ కాల్వలు అక్కడక్కడా కొన్ని పనులు మినహా దాదాపు పూర్తయ్యాయి. మైనర్ కాల్వలు ఇప్పటి వరకు ఆరు మాత్రమే పూర్తయ్యాయి. పనులు సరిగా చేపట్టడం లేదని ముందు టెండర్ దక్కించుకున్న కంపెనీని తొలగించి మరో ఏజెన్సీకి అప్పగించారు. సింగిల్లైన్ రోడ్ బ్రిడ్జి (ఎస్ఎల్ఆర్బీ), డబుల్లైన్ రోడ్ బ్రిడ్జి (డీఎల్ఆర్బీ)లు తదితర నిర్మాణాలు కలిపి మొత్తం 227కు పైగా స్ట్రక్చర్లు నిర్మించాల్సి ఉండగా.. గతేడాది అక్టోబర్ వరకు 70 పూర్తికాగా, ఈ ఏడాది ఇప్పటి వరకు 95 పూర్తి చేశారు. మిగతావి వచ్చే ఏడాది వరకు పూర్తి చేయిస్తామని అధికారులు చెబుతున్నారు. ఇదీ పరిస్థితి.. జిల్లాలో డీ–8 కాల్వ 34.4 కిలోమీటర్లు విస్తరించి ఉండగా.. 23 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించాల్సి ఉంటుంది. గోపాల్పేట, రేవల్లి, పాన్గల్, వనపర్తి మండలాలతో పాటు నాగర్కర్నూల్ జిల్లా కోడేరు మండలంలోని కొన్ని గ్రామాలకు నీరందిస్తోంది. మేజర్–1 కాల్వ ద్వారా లక్ష్మీదేవిపల్లి, చెన్నారం, మేజర్–2 ద్వారా ఏదుట్ల, గోపాల్పేట, మేజర్–3 ద్వారా రేమద్దుల, తిర్మలాపూర్, అప్పాయిపల్లి, వనపర్తి మండలాలకు సాగునీరు అందుతోంది. మేజర్–4 కాల్వ ద్వారా కిష్టాపూర్, కిష్టాపూర్ తండా, గోప్లాపూర్, దావాజిపల్లి, దత్తాయిపల్లి, చందాపూర్ గ్రామాలకు నీరు అందుతోంది. మేజర్–6 కాల్వ ద్వారా రాజాపూర్, శాఖాపూర్, మాధవరావుపల్లి గ్రామాలకు సాగునీరు అందుతుందని అధికారులు చెబుతున్నారు. ఇటీవల అధికంగా కురిసిన వర్షాలతో రాజాపూర్, సింగాయిపల్లి గ్రామాలకు నీరు అందుతోందని.. లేకుంటే ఈ రెండు గ్రామాలకు నీరు పారక ఇబ్బందులు పడుతున్నామని ఆయా గ్రామాల రైతులు చెబుతున్నారు. అధికారులు తగిన చర్యలు తీసుకొని కాల్వలు బాగు చేయాలని కోరుతున్నారు. -
ఎంఈఓ, జీహెచ్ఎం సస్పెన్షన్
● ఉత్తర్వులు జారీ చేసిన ఆర్జేడీ వనపర్తిటౌన్: జిల్లాలోని కొత్తకోట ఎంఈఓ కృష్ణయ్య, మిరాసిపల్లి స్కూల్ కాంప్లెక్స్ జీహెచ్ఎం శ్రీనివాస్రెడ్డిని సస్పెండ్ చేస్తూ మంగళవారం ఆర్జేడీ విజయలక్ష్మి ఉత్తర్వులు జారీ చేశారు. వీరిద్దరు పాఠశాలల పర్యవేక్షణను పట్టించుకోకుండా నిర్లక్ష్యం ప్రదర్శించారని, విధులకు హాజరుకాని ఉపాధ్యాయులకు వేతనాలు ఎందుకు చెల్లించాల్సి వచ్చిందని ఈ నెల 6న ఆర్జేడీ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. వారిచ్చిన సమాధానానికి సంతృప్తి చెందకపోవడంతో పాటు జిల్లా విద్యాధికారి అబ్దుల్ ఘనీ ఇచ్చిన నివేదిక ఆధారంగా సస్పెండ్ చేసినట్లు సమాచారం. దరఖాస్తుల ఆహ్వానం వనపర్తిటౌన్: అంబేడ్కర్ ఓవర్సిస్ పథకంలో భాగంగా 2025–26 విద్యాసంవత్సరం విదేశీ విశ్వవిద్యాలయాల్లో పోసు్ట్రగాడ్యుయేషన్ చేయాలనుకునే విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ ఆదర్శ్ సురభి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. షెడ్యూల్డ్ కులాల అభివృద్ధిశాఖ ద్వారా రూ.20 లక్షల ఉపకార వేతనం అందుతుందని.. అర్హులైన విద్యార్థులు నవంబర్ 19వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. ‘పది’ విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలి పాన్గల్: పదోతరగతి విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించి ఉత్తమ ఫలితాలు సాధించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని జిల్లా విద్యాధికారి అబ్దుల్ ఘనీ కోరారు. మంగళవారం మండలంలోని మాందాపూర్, చింతకుంట ఉన్నత పాఠశాలలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పదోతరగతి విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించి పరీక్షలపై పలు సూచనలు, సలహాలిచ్చారు. ప్రత్యేక తరగతులను సద్వినియోగం చేసుకొని సబ్జెక్టుల వారీగా సందేహాలను నివృత్తి చేసుకోవాలని సూచించారు. సమయం వృథా చేయకుండా లక్ష్యానికి అనుగుణంగా చదివితే ఉత్తమ ఫలితాలు సాధించవచ్చన్నారు. ఆయన వెంట మండల విద్యాధికారి ఆనంద్, జీహెచ్ఎం సేక్యానాయక్, ఉపాధ్యాయ బృందం ఉన్నారు. నేటి నుంచి జిల్లాస్థాయి క్రీడా పోటీలు వనపర్తిటౌన్: జిల్లాకేంద్రంలోని బాలకిష్టయ్య క్రీడా ప్రాంగణంలో జిల్లాస్థాయి క్రీడాపోటీలు బుధవారం నుంచి 18వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు ఎస్జీఎఫ్ కార్యదర్శి బి.కుమార్ మంగళవారం తెలిపారు. బుధవారం అండర్–17 బాల బాలికలకు ఖోఖో, అండర్–14 బాల బాలికలకు వాలీబాల్, 16న అండర్–17 కబడ్డీ, అండర్–14 ఖోఖో, 17వ తేదీన అండర్–14, 17 చెస్ పోటీలు ఉంటాయన్నారు. చెస్ పోటీల్లో ప్రతి పాఠశాల నుంచి ఇద్దరు బాల బాలికలు పాల్గొనే అవకాశం ఉందని చెప్పారు. 18వ తేదీన ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా చెస్పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అదేవిధంగా రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు ఉమ్మడి పాలమూరు జట్టులో స్థానం సాధించిన వేణు, దామోదర్ను ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అభినందించారు. కార్యక్రమంలో పీడీలు, పీఈటీలు పాల్గొన్నారు. -
ఆటలకు అందలం
● పీయూలో క్రీడలకు ప్రాధాన్యమిస్తున్న అధికారులు ● సింథటిక్ నిర్మాణంతో అథ్లెటిక్స్కు అనేక అవకాశాలు ● ఇండోర్ స్టేడియం, బాస్కెట్ బాల్ కోట్ నిర్మాణంతో ప్రయోజనం ● ప్రస్తుతం కొనసాగుతున్న పలు ఇంటర్ యూనివర్సిటీ పోటీలకు ఎంపికలు ● సౌత్జోన్లో 1,050, ఆలిండియా పోటీల్లో పాల్గొన్న 350 మంది విద్యార్థులు మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీ పరిధిలోని పలు డిగ్రీ, పీజీ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. క్రీడల్లో మక్కువ ఉండి పీయూలో అడ్మిషన్ పొందిన విద్యార్థులకు ఇక్కడ ఉండే క్రీడా వసతులతో ఎంతో ప్రయోజనం పొందనున్నారు. ప్రతి సంవత్సరం సౌత్ జోన్, ఆలిండియా ఇంటర్ యూనివర్సిటీ పోటీల్లో పాల్గొనే విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి ప్రోత్సహిస్తున్నారు. అంతేకాకుండా జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రస్థాయిలో జరిగే క్రీడా పోటీల్లో పాల్గొనే విద్యార్థులకు వచ్చే సర్టిఫికెట్తో స్పోర్ట్స్ కోటా సైతం లభించనుంది. దీంతో చాలామంది విద్యార్థులు క్రీడలపై ఆసక్తి కనబరుస్తున్నారు. వరంగా వసతులు.. హైదరాబాద్ తర్వాత సింథటిక్ ట్రాక్ ఉన్న ఏకై క జిల్లాగా పాలమూరు ఖ్యాతి గడించింది. ఇక్కడ అంతర్జాతీయ ప్రమాణాలతో 400 మీటర్ల ట్రాక్తో పాటు 100 నుంచి 1500 మీటర్ల వరకు వివిధ స్థాయి క్రీడలు నిర్వహించవచ్చు. ఫీల్డ్ ఈవెంట్స్లో హైజంప్, లాంగ్జంప్, జావెలిన్ త్రో, షార్ట్పుట్, డిస్కస్త్రో, పోల్వాల్ట్తో పాటు ఒక ఫుట్బాల్ గ్రౌండ్ కూడా నిర్మించారు. సుమారు 2 వేల మంది జనాలు కూర్చొని క్రీడలను వీక్షించేందుకు వీలుగా గ్యాలరీ సైతం ఏర్పాటు చేస్తున్నారు. వీటితోపాటు ఇండోర్ స్టేడియంలో టేబుల్ టెన్నిస్, షటిల్, చెస్, క్యారమ్స్తోపాటు జిమ్ కూడా అందులో అందుబాటులో ఉంది. దీంతో విద్యార్థుల ఫిట్నెస్ కోసం ఎంతో ఉపయోగపడనుంది. జాతీయ క్రీడల్లో ప్రాతినిధ్యం.. పీయూ నుంచి ప్రాతినిధ్యం వహించి జాతీయ స్థాయి పోటీల్లో పలువురు విద్యార్థులు ప్రతిభచాటారు. హారికాదేవి 2018లో ఆలిండియా స్థాయి అథ్లెటిక్స్ 100 మీటర్లలో మూడో స్థానంలో నిలిచింది. 2019లో మహేశ్వరి స్టెపుల్ చేజ్తో ఆలిండియా రెండో స్థానం సాధించింది. 2020లో హారికాదేవి ఆలిండియా అథ్లెటిక్స్ 200 మీటర్లలో 2వ స్థానం, ఆలిండియా 100 మీటర్లలో 2వ స్థానంలో నిలిచింది. 2020లో మహేశ్వరి ఖేలో ఇండియాలో 3000 మీటర్ల స్టెపుల్ చేజ్లో 2వ స్థానం, 2020లో హారికాదేవి ఖేలో ఇండియాలో 100 మీటర్ల అథ్లెటిక్స్లో 4వ స్థానంలో నిలిచారు. విష్ణువర్ధన్ గత నాలుగు సంవత్సరాలు జాతీయ స్థాయి ఆర్చరీలో వివిధ స్థాయిల్లో ప్రాతినిధ్యం వహించారు. డేవిడ్ కృపాల్రే గత నాలుగేళ్లు ఎస్జీఎఫ్ఐ క్రికెట్లో జాతీయ స్థాయిలో ప్రతిభచాటారు. 2024లో భరత్ ఆర్చరీలో ఆలిండియా స్థాయిలో సత్తాచాటారు. మొత్తంగా ఇప్పటి వరకు పీయూ తరపున సౌత్జోన్ పోటీల్లో 1,050, ఆలిండియా పోటీల్లో 350 మంది విద్యార్థులు పాల్గొన్నారు. సద్వినియోగం చేసుకోవాలి.. పీయూలో క్రీడాకారులను ప్రోత్సహించే విధంగా అన్ని సదుపాయాలు ఉన్నాయి. సింథటిక్ ట్రాక్, ఇండోర్ స్టేడియం వంటివి ఉండటం జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడల్లో పాల్గొనే వారికి ఎంతో ప్రయోజనకరం. పోటీల్లో పాల్గొనే వారికి శిక్షణ ఇవ్వడంతోపాటు ప్రతిభచాటిన వారికి ప్రోత్సాహకాలు అందిస్తున్నాం. పీయూ పరిధిలోని డిగ్రీ, పీజీ కళాశాలల విద్యార్థులు సౌత్జోన్, ఇంటర్ యూనివర్సిటీ పోటీల్లో ఎంపికయ్యే విధంగా ప్రోత్సహిస్తున్నాం. జాతీయ స్థాయి క్రీడాల్లో పాల్గొన్న వారికి ఇచ్చే సర్టిఫికెట్లతో ఉద్యోగాల్లో రిజర్వేషన్ సైతం పొందేందుకు ఆస్కారం ఉంటుంది. – శ్రీనివాస్, ఫిజికల్ డైరెక్టర్, పీయూ -
పీసీసీదే తుది నిర్ణయం
ఏఐసీసీ పరిశీలకుడు, పుదుచ్చేరి మాజీ ముఖ్యమంత్రి వి.నారాయణస్వామి వనపర్తి/వనపర్తి టౌన్: కాంగ్రెస్పార్టీ జిల్లా అధ్యక్షుల నియామకంలో తుది నిర్ణయం పీసీసీదేనని ఏఐసీసీ పరిశీలకుడు, పుదుచ్చేరి మాజీ ముఖ్యమంత్రి వి.నారాయణస్వామి అన్నారు. మంగళవారం జిల్లాలో పర్యటించిన ఆయన ఉదయం జిల్లాకేంద్రంలోని డీసీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం అనంతరం దాచ లక్ష్మయ్య ఫంక్షన్హాల్లో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కొత్త.. పాత అనే తేడా లేకుండా అందరూ కలిసికట్టుగా పనిచేసి పార్టీని బలోపేతం చేయాలని సూచించారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, సోనియాగాంధీ, రాహుల్గాంధీ ఆదేశాల మేరకు గతమెన్నడూ లేని విధంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల ఎన్నికను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని పకడ్బంధీగా నిర్వహించాలని ఇతర ప్రాంతాల నుంచి ఏఐసీసీ పరిశీలకులను అధిష్టానం పంపించిందన్నారు. పార్టీ కోసం ఏళ్లుగా శ్రమించిన వారికి ప్రాధాన్యత క్రమంలో పదవులు వరిస్తాయని తెలిపారు. పార్టీ నాయకులు, కార్యకర్తల అభీష్టం మేరకే డీసీసీ అధ్యక్షుల ఎంపికకు పార్టీ అధిష్టానం నూతన విధానాన్ని ఎంచుకుందన్నారు. ఆసక్తిగల వారి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామని.. వారికి పార్టీ కార్యకర్తల్లో ఉన్న పేరు, పని చేసిన తీరుతెన్నులు తెలుసుకొని పీసీసీకి అందజేస్తామని.. ఈ నెల 22న తుది నిర్ణయం తీసుకుని డీసీసీ అధ్యక్షులను నియమిస్తారని చెప్పారు. కాంగ్రెస్లో మార్పు మొదలైంది.. రాహుల్గాంధీ ఆలోచనల మేరకు పార్టీలో మార్పు మొదలైందని.. 46 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి విధానాలు ఎన్నడూ చూడలేదని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి అన్నారు. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా అధిష్టానం కొత్త విధానాలను తీసుకొస్తుందని తెలిపారు. కనీసం పదేళ్ల పాటు పార్టీ కోసం పనిచేసిన, అనుభవం ఉన్నవారిని డీసీసీ అధ్యక్షుడిగా ఎంపిక చేయాలనేది తన అభిప్రాయమని కార్యకర్తలు, నాయకులు, పరిశీలకుల సమక్షంలో వెల్లడించారు. పరిశీలకుల నిర్ణయానికి కట్టుబడి ఉంటాం.. డీసీసీ అధ్యక్షుడి ఎంపిక విషయంలో పెద్దలు, ఏఐసీసీ పరిశీలకుల నిర్ణయానికి కట్టుబడి ఉంటామని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి స్పష్టం చేశారు. ఎమ్మెల్యే ఎన్నికల కంటే ముందు పార్టీలో ఉన్న వారికే.. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ తరుఫున పోటీచేసే అవకాశం కల్పిస్తామని, వారికే ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. డీసీసీ అధ్యక్షుడి ఎన్నిక ప్రజాస్వామ్యంగా జరిగేందుకు క్షేత్రస్థాయిలోని పరిస్థితులను పరిగణలోకి తీసుకోవాలని కోరారు. సముద్రంలాంటి కాంగ్రెస్పార్టీలో చిన్నపాటి భేదాభిప్రాయాలు ఉండటం సాధారణమేనని తెలిపారు. -
నూనెగింజల సాగును ప్రోత్సహించాలి
కొత్తకోట రూరల్: జిల్లాలో సాగుచేసిన వేరుశనగకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉందని.. వరితో పోలిస్తే వేరుశనగ సాగుకు తక్కువ పెట్టుబడి, అధిక లాభాలు పొందవచ్చని కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. మంగళవారం పెద్దమందడి మండలం బలిజపల్లి రైతువేదికలో జిల్లా వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో జాతీయ నూనెగింజల ఉత్పత్తి పథకం కింద రాయితీ వేరుశనగ విత్తనాల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై రైతులకు సబ్సిడీపై కదిరి లేపాక్షి రకం వేరుశనగ విత్తనాలు పంపిణీ చేశారు. అక్కడికి వచ్చిన పలువురు రైతులతో మాట్లాడి పెట్టుబడి, దిగుబడి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. రైతులు పంట మార్పిడి విధానం అవలంబించాలని, ఎప్పుడూ ఒకే రకం పంట కాకుండా నూనెగింజల సాగును కూడా చేపట్టాలని సూచించారు. వనపర్తి వేరుశనగకు అప్లోటాక్సిన్ అనే శీలింద్రం లేకపోవడంతో డిమాండ్ ఎక్కువగా ఉంటుందన్నారు. ప్రభుత్వం రాయితీపై అందిస్తున్న వేరుశనగ విత్తనాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి ఆంజనేయులుగౌడ్, తహసీల్దార్ పాండునాయక్, ఎంపీడీఓ, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
బాధితులకు అండగా నిలవాలి
● ఆధునిక సాంకేతికతపై అవగాహన అవసరం ● ఎస్పీ రావుల గిరిధర్ వనపర్తి: పోలీస్స్టేషన్కు వచ్చే బాధితులకు పోలీసులు అండగా ఉన్నారనే నమ్మకం, భరోసా కల్పిస్తూ, వారితో మర్యాదగా వ్యవహరించాలని ఎస్పీ రావుల గిరిధర్ సూచించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా మంగళవారం జిల్లాకేంద్రంలోని పట్టణ పోలీస్స్టేషన్ను సందర్శించగా అధికారులు పూలమొక్క అందజేసి స్వాగతం పలికారు. పోలీసులు గౌరవ వందనం సమర్పించిన అనంతరం ఆవరణలో మొక్క నాటి నీరు పోశారు. తర్వాత ఠాణా పరిసరాలు, రికార్డులు, రిసెప్షన్, లాకప్, మెన్ బ్యారక్, టెక్నికల్ గదిని పరిశీలించారు. పెండింగ్ కేసులు, దర్యాప్తు, ఎక్కువగా ఎలాంటి నేరాలు జరుగుతున్నాయనే వివరాలను ఎస్ఐ హరిప్రసాద్ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. వీపీఓలు రోజు గ్రామాల్లో పర్యటించి ప్రజలతో స్నేహపూర్వక సంబంధాలు కొనసాగించాలన్నారు. బ్లూకోర్ట్, స్టేషన్ రైటర్స్, సెక్షన్ ఇన్చార్జ్ పెట్రోకార్స్, రిసెప్షన్లాంటి వర్టికల్స్ కచ్చితంగా అమలు చేయాలని, గంజాయి, మట్కా, పేకాట వంటి అసాంఘిక కార్యకలాపాలు కొనసాగకుండా పర్యవేక్షించాలని ఆదేశించారు. రాత్రిళ్లు గస్తీ నిర్వహిస్తూ నేరాల అదుపునకు కృషి చేయాలన్నారు. వాహన తనిఖీలు చేపడుతూ రోడ్డు ప్రమాదాలను అరికట్టాలని, దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న కేసులపై ప్రత్యేక దృష్టి సారించి త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. ఆయన వెంట డీఎస్పీ వెంకటేశ్వరరావు, సీఐ కృష్ణ య్య, డీసీఆర్బీ ఎస్ఐ తిరుపతిరెడ్డి, పట్టణ 2వ ఎస్ ఐ శశిధర్, పోలీసు సిబ్బంది తదితరులు ఉన్నారు. -
సీఎంఆర్ గడువులోగా అప్పగించాలి
వనపర్తి: ఎఫ్సీఐకి అప్పగించాల్సిన సీఎంఆర్ను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ ఎన్.ఖీమ్యానాయక్ ఆదేశించారు. మంగళవారం ఉదయం కలెక్టరేట్లోని తన ఛాంబర్లో పౌరసరఫరాలశాఖ అధికారులు, రైస్మిల్లర్లతో సమావేశమై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 2024–25 వానాకాలం సీజన్లో జిల్లాలోని మిల్లర్ల నుంచి 95,909 మెట్రిక్ టన్నుల సీఎంఆర్ అప్పగించాల్సి ఉండగా.. ఇప్పటి వరకు 80,815 మె.ట. అందిందన్నారు. యాసంగి సీజన్కు సంబంధించి 1,57,796 మెట్రిక్ టన్నులకుగాను ఇప్పటి వరకు 61,710 మె.ట. మాత్రమే అప్పగించారని.. ఇంకా 96,697 మె.ట. బియ్యం మిల్లర్ల నుంచి రావాల్సి ఉందని చెప్పారు. గత వానాకాలం సీజన్కు సంబంధించి ఎఫ్సీఐకి అప్పగించాల్సిన బియ్యం గడువును నవంబర్ 12 వరకు పొడిగించినందున యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారు. మిల్లుల వారీగా పెండింగ్ వివరాలు వెల్లడించిన అదనపు కలెక్టర్ గడువులోపు అప్పగించాలని లేనిపక్షంలో బ్లాక్లిస్ట్లో ఉంచుతామని హెచ్చరించారు. మిల్లలను తనిఖీ చేసి వరి ధాన్యం ఉందా లేదా తనిఖీ చేస్తామని చెప్పారు. ఎఫ్సీఐ, పౌరసరఫరాలశాఖకు ఇచ్చే బియ్యంలో నాణ్యత ప్రమాణాలు కచ్చితంగా పాటించాలని.. నాసిరకంగా ఉంటే తిప్పిపంపుతామని తెలిపారు. సీఎంఆర్ సకాలంలో అందించకుంటే మిల్లులను బ్లాక్లిస్ట్లో చేర్చడమేగాక యజమానులపై రెవెన్యూ రికవరీ యాక్ట్ అమలుచేసి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి విశ్వనాథ్, పౌరసరఫరాల సంస్థ డీఎం జగన్మోహన్ తదితరులు పాల్గొన్నారు. రెవెన్యూ అదనపు కలెక్టర్ ఎన్.ఖీమ్యానాయక్ -
బాల్యానికి ‘బంధనం’
జిల్లాలో ఈ ఏడాది 30 బాల్య వివాహాలకు అడ్డుకట్ట ● సకాలంలో స్పందించిన అధికారులు ● వివాహమైన తర్వాత తెలుసుకొనిఒకరిపై కేసునమోదు ● వందరోజుల అవగాహనకార్యక్రమానికి అధికారులు సన్నద్ధం ● గ్రామ, మండలస్థాయిలో కమిటీల ఏర్పాటుకు కసరత్తు వనపర్తి: బాలికల ఉజ్వల భవిష్యత్కు బాల్య వివాహాలు బంధనంగా మారుతున్నాయి. అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని, బాధ్యులకు గరిష్టంగా రెండేళ్ల జైలు శిక్ష, రూ.లక్ష వరకు జరిమానా వంటి చర్యలుంటాయని తెలిసినా.. కొందరు తల్లిదండ్రులు విఫల ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. జిల్లా బాలల సంరక్షణ విభాగం అధికారుల లెక్కల ప్రకారం.. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు 30 బాల్య వివాహాలను అడ్డుకున్నారు. ఒక బాల్య వివాహం జరిగిన విషయం ఆలస్యంగా తెలియడంతో కేసు నమోదు చేసి సదరు బాలికకు ప్రభుత్వ సంరక్షణలో విద్యాబుద్దులు చెప్పిస్తున్నారు. ప్రపంచ బాలికా దినోత్సవాన్ని పురస్కరించుకొని జస్ట్ రైట్ సంస్థ కొన్ని స్వచ్ఛంద సంస్థలను ఎంచుకొని అక్టోబర్ 11 నుంచి 2026, జనవరి 26 వరకు వందరోజుల పాటు ప్రత్యేక అవగాహన కార్యక్రమాల నిర్వహణకు శ్రీకారం చుట్టింది. జిల్లాలో ఈ కార్యక్రమాన్ని ఆర్డీఎస్ సంస్థ నిర్వహిస్తుండగా.. బాలికలు తమ హక్కులను వినియోగించుకోవడంలో వెనుబడిన ప్రాంతాలను ఎంపిక చేసుకొని బాల్యవివాహాల నిర్మూలన, బడిబయటి పిల్లలను పాఠశాలలో చేర్పించనున్నారు. సోమవారం కలెక్టరేట్లో ‘ఇచ్చట బాల్య వివాహాలు నిర్వహించబడవు’ అని రాసి ఉన్న వాల్పోస్టర్లను కలెక్టర్ ఆదర్శ్ సురభితో ఆవిష్కరింపజేసి వీటిని ప్రతి గ్రామంలోని ఆలయాలు, చర్చీలు, ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేయనున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. అమ్మాయికి 18 ఏళ్లు, అబ్బాయికి 21 ఏళ్లు నిండిన తర్వాతే వివాహం చేయాలనే నిబంధనను భారత ప్రభుత్వం తీసుకొచ్చిన విషయం తెలిసిందే. చిన్న వయస్సులో గర్భం దాల్చడంతో అనారోగ్య సమస్యలు, శిశు మరణాలు, గర్భస్రావం, రక్తపోటు, పోషకాహార లోపం, రక్తహీనత తదితర ఇబ్బందులు ఎదురవుతాయి. కానీ కొందరు తల్లిదండ్రులు తమ పిల్లలు ప్రేమ వివాహాల వైపు ఎక్కడ ఆకర్శితులవుతారోనని, ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోలేక చిన్న వయసులో, చదువుకునే సమయంలో వివాహాలు చేసి బరువు దించుకోవాలనే ఆలోచనతో బాల్య వివాహాలకు పూనుకుంటున్నట్లు తెలుస్తోంది. -
బాణాసంచా విక్రయానికి అనుమతి తప్పనిసరి
వనపర్తి: దీపావళి సందర్భంగా బాణాసంచా విక్రయించే వారు సంబంధిత పోలీస్ అధికారి అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని ఎస్పీ రావుల గిరిధర్ సూచించారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. పండుగను జిల్లా ప్రజలు ఆనందంగా, సురక్షితంగా జరుపుకోవాలని కోరారు. అక్రమంగా బాణాసంచా నిల్వచేసినా, తయారుచేసినా, దుకాణాలు నెలకొల్పినా, భద్రతా ప్రమాణాలు పాటించకపోయినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తహసీల్దార్, ఫైర్ విభాగం, పోలీసుశాఖ సూచించిన ప్రదేశాల్లో మాత్రమే లైసెన్స్ ఉన్న వ్యాపారులు దుకాణాలు ఏర్పాటు చేసి తగిన జాగ్రత్తలు పాటిస్తూ విక్రయించాలన్నారు. రద్దీ ప్రదేశాలు, విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు, పెట్రోల్ బంకులు, వివాదాస్పద స్థలాల్లో ఏర్పాటు చేయొద్దని కోరారు. నిర్దేశిత రుసుం చెల్లించి విద్యుత్, అగ్నిమాపక, పుర అధికారుల అనుమతి కూడా తీసుకోవాలన్నారు. ఎస్పీ ప్రజావాణికి 10 వినతులు ప్రజావాణి ఫిర్యాదులపై పోలీసు అధికారులు, సిబ్బంది తక్షణమే స్పందించాలని ఎస్పీ రావుల గిరిధర్ ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయములో జరిగిన ప్రజావాణిలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారులతో వినతులు స్వీకరించి వారితో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సదరు ఫిర్యాదులపై చర్యలు తీసుకొని బాధితులకు న్యాయం చేయాలని ఆయా పోలీస్స్టేషన్ల అధికారులకు సూచించారు. మధ్యాహ్నం భోజన విరామ సమయం వరకు మొత్తం 10 వినతు లు వచ్చినట్లు ఎస్పీ కార్యాలయ సిబ్బంది తెలిపారు. -
నెలాఖరు నాటికి కేంద్రాల ఏర్పాటు
వనపర్తి: జిల్లాలో 2025–26 వానాకాలం వరి ధాన్యం కొనుగోలుకుగాను నెలాఖరు నాటికి కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు రెవెన్యూ అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్ తెలిపారు. సోమవారం ధాన్యం కొనుగోళ్ల సన్నద్ధతపై హైదరాబాద్ నుంచి రాష్ట్ర పౌరసరఫరాలశాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర అన్ని జిల్లాల రెవెన్యూ అదనపు కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా జిల్లా నుంచి అదనపు కలెక్టర్తో పాటు జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి కాశీ విశ్వనాథం, పౌరసరఫరాలసంస్థ డీఎం జగన్మోహన్, డీఆర్డీఓ పీడీ ఉమాదేవి పాల్గొని వివరాలు వెల్లడించారు. అనంతరం సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. నెలాఖరు నాటికి పంటలు కోతలు ప్రారంభమయ్యే అవకాశం ఉందని.. ఆలోగా కేంద్రాలు ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కేంద్రాల్లో కావాల్సిన సామగ్రితో పాటు గన్నీ బ్యాగులు, ధాన్యం శుభ్రం చేసే, బరువు, తేమ కొలిచే యంత్రాలతో పాటు డిజిటల్ కాలిపర్స్ అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. ధాన్యం తడవకుండా కావాల్సినన్ని టార్పాలిన్లు సమకూర్చుకోవాలని, సన్న, దొడ్డు రకం ధాన్యం సేకరణకు వేర్వేరు కొనుగోలు కేంద్రాలు ఏర్పాట్లు చేయాలని కోరారు. కేంద్రాల నిర్వాహకులకు శిక్షణనిచ్చేందుకు ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో డీసీఓ రాణి, డీటీఓ మానస, డీఏఓ ఆంజనేయులుగౌడ్, మార్కెటింగ్ అధికారి స్వరణ్సింగ్, ఇతర అధికారులు పాల్గొన్నారు. రెవెన్యూ అదనపు కలెక్టర్ ఎన్.ఖీమ్యానాయక్ -
‘అధికార’ వార్..!
కాంగ్రెస్లో అంతర్గత పోరు అన్నీ మహబూబ్నగర్ వాళ్లకేనంటూ.. మహబూబ్నగర్ జిల్లాలోని మూడు నియోజకవర్గాల కీలక నేతల మధ్య తొలి నుంచీ అంతర్గత విభేదాలు నెలకొన్నాయి. కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లా గ్రంథాలయ చైర్మన్, ముడా చైర్మన్ పదవులు మహబూబ్నగర్ నియోజకవర్గానికి దక్కాయి. రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ పదవి సైతం ఈ సెగ్మెంట్కు చెందిన ఒబేదుల్లా కొత్వాల్కు కేటాయించారు. ఈ క్రమంలో అన్ని పదవులు మహబూబ్నగర్ నియోజకవర్గ నేతలే తన్నుకుపోతున్నారనే అభిప్రాయం జడ్చర్ల నాయకుల్లో ఉంది. దేవరకద్రకు చెందిన సీతాదయాకర్రెడ్డి తెలంగాణ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్పర్సన్గా నియామకమైనప్పటికీ.. మహబూబ్నగర్కే పెద్దపీట వేస్తున్నారనే అభ్రిపాయం ఈ సెగ్మెంట్ నేతల్లోనూ వ్యక్తమవుతోంది. మా సెగ్మెంట్లోనూ పెత్తనం చెలాయిస్తున్నారని.. డీసీసీ అధ్యక్షుడిగా ఉన్న దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్రెడ్డి జిల్లాకేంద్రంలో పార్టీ కార్యక్రమాలు నిర్వహించడాన్ని ఇక్కడి నాయకులు జీర్ణించుకోలేకపోతున్నట్లు తెలుస్తోంది. తమ నియోజకవర్గంలోనూ ఆయన పెత్తనం సాగుతోందని స్థానిక ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి అనుచరుల్లో నెలకొంది. దీనిపై యెన్నం ఎక్కడా స్పందించకున్నా.. డీసీసీ అధ్యక్షుడు జీఎమ్మార్ ఆధ్వర్యంలో జరిగిన పలు కార్యక్రమాలకు హాజరుకాకపోవడం, అంటీముట్టనట్లుగా వ్యవహరించడంపై పార్టీలో చర్చ జోరుగా సాగుతోంది. గద్వాల, వనపర్తిలోనూ లుకలుకలు.. వనపర్తి జిల్లాలో ప్రస్తుతం డీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రాజేంద్రప్రసాద్ మరోసారి తనకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అనుచరుడు లక్కాకుల సతీష్, ప్రణాళిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి వర్గానికి చెందిన కిరణ్కుమార్ పోటీలో ఉన్నారు. వీరితో పాటు శాట్ చైర్మన్ శివసేనారెడ్డి సైతం డీసీసీ అధ్యక్ష పదవిని ఆశిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో ఆయా నేతల వర్గాల మధ్య వైరం మరింత ముదిరినట్లు తెలుస్తోంది. జోగుళాంబ గద్వాల జిల్లాలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి, జెడ్పీ మాజీ అధ్యక్షురాలు సరిత మధ్య విభేదాలు తారస్థాయికి చేరగా.. ఆయా వర్గాలకు చెందిన నేతలు డీసీసీ పదవికి పోటీ పడుతున్నారు. ఇక్కడ ఏఐసీసీ నాయకుడు సంపత్కుమార్ మద్దతు కీలకం కాగా.. చివరి వరకు ఏం జరుగుతుందనే ఉత్కంఠ నెలకొంది. ఇదిలా ఉండగా.. మహబూబ్నగర్ జిల్లాలోని ముగ్గురు ఎమ్మెల్యేలు తమ మధ్య ఎలాంటి అంతర్గత విభేదాలు లేవని.. పార్టీ విధానాల ప్రకారం సమష్టి నిర్ణయాలతోనే ముందుకు సాగుతున్నామని చెబుతున్నారు. కానీ వారివారి ముఖ్య అనుచరులతో పాటు పార్టీ శ్రేణుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇటు ‘ఢీ’ సీసీ.. అటు ‘చేరిక’పంచాయితీ మాటల తూటాలను పేలుస్తున్న నేతలు మహబూబ్నగర్లో తారాస్థాయికి విభేదాలు ? గద్వాల, వనపర్తి జిల్లాల్లోనూ కుతకుత -
వంతెన నిర్మాణంపూర్తి చేస్తాం : ఎమ్మెల్యే
మదనపురం: మండలంలోని ఊకచెట్టు వాగుపై వంతెన నిర్మాణాన్ని నెల రోజుల్లో పూర్తి చేస్తామని దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్రెడ్డి అన్నారు. సోమవారం మండల కేంద్రంలో నమూనా ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించిన అనంతరం ఊకచెట్టు వాగులో నిర్మించిన వంతెన అప్రోచ్రోడ్ పనులకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వం అనేక పథకాలు అమలుచేస్తూ పేదలను ఆదుకుంటుందని చెప్పారు. బీఆర్ఎస్ పాలనలో ప్రజలకు తీరని అన్యాయం జరిగిందని.. యువతకు ఉద్యోగావకాశాలు కల్పించకుండా మోసం చేసిందని మండిపడ్డారు. వంతెన నిర్మాణాన్ని కూడా పట్టించుకోలేదని.. ప్రస్తుత ప్రభుత్వం మిగిలిన పనుల పూర్తికి రూ.6 కోట్లు మంజూరు చేసిందని వివరించారు. వంతెన నిర్మాణం పూర్తయితే అమరచింత, ఆత్మకూర్, చిన్నచింతకుంట, మదనాపురం, కొత్తకోట మండల ప్రజల రాకపోకలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. మార్కెట్ కమిటీ చైర్మన్ పల్లెపాగ ప్రశాంత్, వైస్ చైర్మన్ తిరుపతిరెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు నాగన్న, మహేష్ పాల్గొన్నారు. ఓటు చోరీకి వ్యతిరేకంగా సంతకాల సేకరణ.. ఏఐసీసీ, టీపీసీసీ ఆదేశాల మేరకు సోమవారం మండల కేంద్రంలోని కాంగ్రెస్పార్టీ కార్యాలయంలో ఓట్ చోరీకి వ్యతిరేకంగా సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఓటు చోరీ అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు, అనంతరం చిన్నచింతకుంట మండలం అమ్మాపూర్కు చెందిన పలువురు బీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తలు ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్పార్టీలో చేరగా కండువాలు కప్పి ఆహ్వానించారు. నారాయణస్వామికి స్వాగతం పలికిన నాయకులు వనపర్తి: డీసీసీ అధ్యక్షుడి ఎన్నిక నేపథ్యంలో మంగళవారం పార్టీ ముఖ్య నాయకులతో సమావేశమయ్యేందుకు ఏఐసీసీ పరిశీలకుడు, పుదుచ్చేరి మాజీ సీఎం నారాయణస్వామి సోమవారం రాత్రి జిల్లాకేంద్రానికి చేరుకున్నారు. ఆయనకు రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డా. జి.చిన్నారెడ్డి, నాయకులు చీర్ల చందర్, శంకరప్రసాద్, వెంకటేష్, కృష్ణబాబు, యాదయ్య, పాకనాటి కృష్ణ, కోట్ల రవి తదితరులు పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. మంగళవారం ఉదయం విలేకరుల సమావేశం, మధ్యాహ్నం తర్వాత ముఖ్య నాయకుల సమావేశంలో పాల్గొని అభిప్రాయ సేకరణ చేపట్టనున్నారు. -
భవిష్యత్కు భరోసా
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్నత విద్యకు కేంద్ర బిందువుగా మారిన పీయూ ఎంతోమంది పేద విద్యార్థుల జీవితాలను నిలబెట్టేందుకు వరప్రదాయినిగా మారింది. ఇంటర్ తర్వాత చేరే ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ మొదలుకొని.. డిగ్రీ తర్వాత పీజీ స్థాయి కోర్సులు చదివిన ఎంతో మంది విద్యార్థులు వివిధ స్థాయిల్లో ఉద్యోగాల్లో చేరి జీవితంలో ఉన్నతంగా రాణిస్తున్నారు. యూనివర్సిటీలో పోటీ పరీక్షలకు అవసరమైన అన్ని వసతులు కల్పించడంతో విద్యార్థులు జీవితంలో స్థిరపడి ఇక్కడి నుంచి వెళ్తున్నారు. సాధారణంగా యూనివర్సిటీలో స్టడీ సర్కిల్ ద్వారా తరగతులు బోధించేందుకు అటు ప్రభుత్వం, ఇటు విద్యార్థి నుంచి ఎలాంటి డబ్బులు తీసుకోకుండా కేవలం యూనివర్సిటీ అధికారులు ప్రత్యేకంగా నిధులు కేటాయించి శిక్షణ ఇప్పిస్తున్నారు. దీంతో మంచి ఫలితాలు వస్తున్నాయి. పోటీ పరీక్షలకు సన్నద్ధం.. యూనివర్సిటీలో పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థుల కోసం ప్రత్యేక లైబ్రరీ, అవసరమైన పుస్తకాలు ఎప్పటికప్పుడు అధికారులు అందుబాటులో ఉంచుతున్నారు. వీటితో పాటు పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే విద్యార్థులకు అధికారులు ప్రత్యేక స్టడీ సర్కిల్ సైతం నిర్వహించారు. ఉదయం, సాయంత్రం వేళల్లో కళాశాల తరగతులు లేని సమయంలో స్టడీ సర్కిల్ కొనసాగించారు. దీంతో గతేడాది వెలువడిన పలు పోటీ పరీక్షల ఫలితాల్లో చాలామంది పీయూ విద్యార్థులు ఉత్తీర్ణత పొంది ఉద్యోగాలు సాధించారు. 2018– 19 విద్యా సంవత్సరంలో 160 మంది స్టడీ సర్కిల్ ద్వారా శిక్షణ పొందితే 35 మంది విద్యార్థులు ఉద్యోగాలు సాధించారు. 2019– 20లో 143 మంది శిక్షణ పొందగా... 21 మంది ఉద్యోగాలు పొందారు. 2020– 21లో కోవిడ్ కారణంగా శిక్షణ జరగలేదు. ఇక 2021– 22లో 135 మంది శిక్షణ తీసుకుంటే 25 మంది, 2022– 23లో 197 మంది శిక్షణ తీసుకుంటే 107 మంది విద్యార్థులు కానిస్టేబుల్, డీఎస్సీ, గ్రూప్–4 వంటి ఉద్యోగాలు సాధించడం గమనార్హం. అలాగే పలు ప్రైవేట్ సంస్థలు, విదేశాల్లోనూ కొందరు ఉద్యోగాలు పొందారు. మరో 3 రోజులు. పీయూలో చదువుకున్న పలువురు విద్యార్థులకు ప్రభుత్వ ఉద్యోగాలు స్టడీ సర్కిల్లో శిక్షణ పొంది.. వివిధ స్థాయిల్లో కొలువులు ప్రైవేట్తోపాటు దేశ, విదేశాల్లోనూ పూర్వ విద్యార్థుల రాణింపు -
అందరి ప్రోత్సాహంతో..
ఫిజిక్స్ విభాగంలో వాటర్సాలబుల్ రీఏజెంట్స్ పై పరిశోధన పూర్తి చేశాం. దానికి పేటెంట్ కూడా వచ్చింది. పరిశోధన పూర్తి చేయడానికి మా గైడ్ చంద్రకిరణ్తో పాటు అధికారులు అందరు ఎంతో సహకరించారు. పరిశోధన పూర్తి అయిన వెంటనే కాన్వకేషన్ నిర్వహించి డాక్టరేట్లు అందించడం చాలా సంతోషంగా ఉంది. – స్వాతి, పీహెచ్డీ గ్రహీత సంతోషంగా ఉంది పండ్ల తొక్కలు డీగ్రేషన్ చేయడం, కాలుష్య రహితంగా, ఫ్రూట్ జ్యూ స్కు సంబంధించి క్లాసిఫికేషన్పై పరిశోధన చేశాం. గైడ్ టీచర్ మధుసూదన్రెడ్డి ఇతర అధికారులు ఎంతో సహకరించారు. అందుకు ప్రతి ఫలంగా కాన్వకేషన్లో డాక్టరేట్ అందుకుంటున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. భవిష్యత్తు పరిశోధనలు సమాజానికి ఉపయోగపడే విధంగా కృషి చేస్తాం. – ఏ.చేతన, పీహెచ్డీ గ్రహీత పరిశోధనలకు పేటెంట్ వచ్చింది ప్రస్తుతం కాన్వకేషన్లో ఇద్దరు స్కాలర్స్ డాక్టరేట్ తీసుకుంటున్నారు. సమాజ హితానికి తక్కువ ఖర్చుతో ఎక్కువ ఉత్పత్తి వచ్చే అంశాలపై పరిశోధనలు చేశాం. అందుకోసం పేటెంట్లు సైతం వచ్చాయి. భవి ష్యత్ ప్రయోగాలు కూడా ప్రజలకు ఉపయో గపడేలా విధంగా నిర్వహిస్తాం. – ఎన్.చంద్రకిరణ్, అధ్యాపకుడు, ఫిజిక్స్ డిపార్ట్మెంట్ సమాజ హితానికే.. పీయూలో వివిధ డిపార్ట్మెంట్ల నుంచి ఎక్కువ సంఖ్యలో రీసెర్చి స్కాల ర్స్ రావడం గొప్ప విష యం. ఇద్దరు స్కాలర్స్ మా ఆధ్వర్యంలో రీసెర్చి పూర్తి చేశారు. వారి పరిశోధనలు పూర్తిగా సమాజం, ప్రజల అవసరాలను తీర్చేలా జరిగాయి. వారికి కాన్వకేషన్లో డాక్టరేట్లను ప్రదానం చేయడం గొప్ప విషయం. – మధుసూదన్రెడ్డి, అధ్యాపకుడు మైక్రోబయాలజీ -
పరిశోధనలకు పట్టం
●పీయూ 4వ స్నాతకోత్సవాన్ని నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 16న జరిగే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చాన్స్లర్, గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ హాజరుకానున్న నేపథ్యంలో అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేపడుతున్నారు. ఈ క్రమంలో యూజీ, పీజీ విద్యార్థులతోపాటు పీహెచ్డీ పూర్తి చేసిన 12 మంది రీసెర్చి స్కాలర్స్కు కూడా డాక్టరేట్ ప్రదానం చేయనున్నారు. ఇంత ఎక్కువ సంఖ్యలో పీహెచ్డీ పూర్తి చేసిన వారికి పట్టాలు ప్రదానం చేయడం ఇదే మొదటిసారి. ఇందులో ఎక్కువగా మైక్రోబయోలజీ విభాగంలో 5, కెమిస్ట్రీ విభాగంలో 5, కామర్స్ విభాగంలో 1, బిజినెస్ మేనేజ్మెంట్ విభాగంలో ఒకరు ఉన్నారు. ఈ క్రమంలో సంబంధిత డిపార్ట్మెంట్లలో ఎక్కువ మంది రెగ్యులర్ అధ్యాపకులు ఉండడంతో ఎక్కువ రీసెర్చి పేపర్లు వెలువడ్డాయి. దీంతో స్కాలర్స్కు డాక్టరేట్ ప్రదానం చేయనున్నారు. ‘మన్నె’కు గౌరవ డాక్టరేట్.. పీయూలో ఇప్పటి వరకు మొత్తం మూడు సార్లు స్నాతకోత్సవం నిర్వహించగా.. నాలుగోసారి జరిగే కార్యక్రమంలో మొట్టమొదటిసారి గౌవర డాక్టరేట్ను ప్రదానం చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ప్రధానంగా ఓ రంగంలో విశేష కృషి చేసిన వారికి మాత్రమే ఈ డాక్టరేట్ను ప్రదానం చేసేందుకు ఆస్కారం ఉంటుంది. ఈ క్రమంలో ఎంఎస్ఎన్ ల్యాబోరేటరీస్ అధినేత మన్నె సత్యనారాయణరెడ్డికి మొదటిసారి గౌవర డాక్టరేట్ ఇవ్వనున్నారు. ఈ మేరకు ఆయన పాలమూరు జిల్లా వాసి కావడం, రాష్ట్రంలో పలు ఫార్మతోపాటు ఇతర కంపెనీలు ఏర్పాటు చేసి యువతకు పెద్దఎత్తున ఉపాధి, ఉద్యోగావకాశాలు కల్పిస్తున్న నేపథ్యంలో ఆయనకు గౌరవ డాక్టరేట్ ఇచ్చేందుకు అధికారులు నిర్ణయించారు. స్నాతకోత్సవంలో గవర్నర్ చేతులమీదుగా పీహెచ్డీ పూర్తి చేసిన 12 మంది రీసెర్చి స్కాలర్స్ డాక్టరేట్.. మన్నె సత్యనారాయణరెడ్డి గౌరవ డాక్టరేట్ అందుకోనున్నారు. పీహెచ్డీ పట్టా పొందనున్న వారి వివరాలిలా.. పలు అంశాలపై పరిశోధనలు చేసిన పీయూ రీసెర్చ్ స్కాలర్స్ స్నాతకోత్సవంలో 12 మందికి డాక్టరేట్లు పీయూ చరిత్రలో మొట్టమొదటిసారి మన్నె సత్యనారాయణరెడ్డికి గౌరవ డాక్టరేట్ గవర్నర్ రాక నేపథ్యంలో విస్తృత ఏర్పాట్లు స్కాలర్: రాజశ్రీనాథ్ (మైక్రోబయాలజీ) పరిశోధన అంశం: స్టడీ ఆన్ మైక్రోబియాల్ లిపస్ అండ్ ప్రొటెస్ కల్టివబుల్ అండ్ మెటాజినీవబుల్ అప్రొచ్ స్కాలర్: శ్రీనివాసరావు మేకల (మైక్రోబయాలజీ) పరిశోధన అంశం: అల్లివేషన్ ఆఫ్ డ్రోట్ స్ట్రెస్ ఇన్ క్యాప్సియం అనం ఎల్.అండ్ సౌఫోసిస్ టెట్రాగోనాలోబా బై యూసింగ్ ప్లాంట్ గ్రోత్ ప్రమోటింగ్ బ్యాక్టీరియా స్కాలర్: విజయ్కుమార్ (మైక్రోబయాలజీ) పరిశోధన అంశం : బయోరిమేడేషన్ స్టడీస్ ఆన్ ఫిజికో–కెమికల్ ఆన్ మైక్రోబయాలాజికల్ అనాలసిస్ ఆఫ్ వాటర్ ఫర్ రీస్టోరేషన్ ఆఫ్ పెద్ద చెరువు, మహబూబ్నగర్ స్కాలర్: చేతన (మైక్రోబయాలజీ) పరిశోధన అంశం: ప్రొడెక్షన్ ఆఫ్ పెక్టెనసిస్ ఫ్రం ఆస్పర్ గిల్లాస్ నిజర్ ఫర్ ప్రూట్ జ్యూస్ క్లారిఫికేషన్ రైపింగ్ అండ్ పీలింగ్ డీగ్రేడేషన్ స్కాలర్: సంజీవ్కుమార్ (మైక్రోబయాలజీ) పరిశోధన అంశం : ఫార్మలేషన్ ఆండ్ ఎలివేషన్ ఆఫ్ పాలిబయో న్యూక్లోప్లాంట్ ఆన్ సెలెక్టెడ్ క్రాప్ ప్లాంట్స్ స్కాలర్: కె.సంధ్య (కెమిస్ట్రీ) పరిశోధన అంశం : ఎన్విరాన్మెంటల్లీ బిగిన్స్ బయో సింథసిస్ ఆన్ పెల్లాడియం నానో పార్టికల్స్ ఆన్ ఇట్స్ యూస్ ఇన్ ఎన్విరాన్మెంటల్ రెమిడేషన్ ఆన్ బయోమెడికల్ అప్లికేషన్ స్కాలర్: డి.వెంకటేష్ (కెమిస్ట్రీ) పరిశోధన అంశం: ిసంథసిస్ క్యారెక్టరైజేషన్ ఫొటో క్యాటలిటిక్ ఆరండ్ ఫోరోమెటిక్ సెన్సింగ్ స్టడీస్ ఆప్ జి–సీ3ఎన్4 సపోర్టెడ్ మెటల్ ఆకై ్సడ్ నానోపార్టికల్స్ స్కాలర్: రుకియాభాను (కెమిస్ట్రీ) పరిశోధన అంశం: గ్రీన్ సింథసిస్ ఆఫ్ గోల్డ్ పెల్లాడియం ఆన్ సిల్వర్ నానోపార్టికల్స్ యూజింగ్ ప్లాంట్ ఎక్స్ట్రాక్ట్ క్యారెక్టరైజేషన్ అండ్ అప్లికేషన్ స్కాలర్: టి.స్వాతి (కెమిస్ట్రీ) పరిశోధన అంశం: ప్రిపరేషన్ స్ట్రక్చరల్ క్యారెక్టరైజేషన్ అండ్ అప్లికేషన్ ఆఫ్ ట్రాన్సిట్ స్పీసెస్ ఆఫ్ డీమ్యాప్ ఆండ్ సింథసిస్ ఆన్ సమ్ ఇంపార్టెంట్ స్కాఫోల్డ్స్ బై ఎంప్లయింగ్ ఆక్వోయిస్ ఫేస్ క్నొవేంగిల్ కండీషన్ అండ్ మల్టీ కంపోనెంట్ రియాక్షన్ స్కాలర్: జి.విజయలక్ష్మి (కెమిస్ట్రీ) పరిశోధన అంశం: ఆక్వియాస్ ఫేస్ గ్రీన్ ట్రాన్స్ఫర్మేషన్ ఎంప్లయింగ్ లివేస్ బేస్ అడెక్ట్ ఆఫ్ డీమ్యాప్ యాజ్ న్యూగ్రీన్ రీ ఏజెంట్స్ ఆన్ స్టీరియో స్పెసిఫిక్ సింథసిస్ ఆఫ్ మెడిసినల్లీ యాక్టిక్ 1,8–న్యాప్తిరిడైన్ డిప్రివేటివ్ స్కాలర్: ఎంఆర్.సంధ్యారాణి (బిజినెస్ మేనేజ్మెంట్) పరిశోధన అంశం: ఏ స్టడీ ఆన్ ఇంపాక్ట్ ఆఫ్ మోటివేషన్ ఆన్ ఎంప్లాయిస్ రీటెన్షన్ విత్ రిఫరెన్స్ టూ సెలెక్ట్ ఇట్ కంపెనీస్ ఇన్ హైదరాబాద్ స్కాలర్: రితిక బజాజ్ (కామర్స్) పరిశోధన అంశం: పర్ఫామెన్స్ ఆఫ్ తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్టు కార్పొరేషన్ ఏ స్టడీ ఆఫ్ సెలెక్ట్ బస్ డిపోస్ ఇన్ హైదరాబాద్ -
‘చేయి’ తడపాల్సిందే..!
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకానికి ఇసుక కొరత గుదిబండగా మారింది. ఈ విషయాన్ని గ్రహించిన సర్కారు తొలుత జోగుళాంబ గద్వాల, ఆ తర్వాత ఉమ్మడి పాలమూరులోని మిగతా జిల్లాల్లో ఇందిరమ్మ ఇళ్లకు తుమ్మిళ్ల నుంచి ఉచితంగా ఇసుక అందజేసేలా కార్యాచరణ చేపట్టింది. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఫలితం కానరావడం లేదు. నదిలో నీటి ప్రవాహం బాగా ఉంది.. అందుకే అధికారిక రీచ్లోనూ ఇసుక తవ్వకాలు చేపట్టలేకపోతున్నారని అనుకుంటే పొరపాటే. తొలుత వర్షాలతో.. తాజాగా ‘చేయి’ తడపాల్సిందేనంటూ అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడి హుకుంతో ఇసుక తవ్వకాలు, రవాణా నిలిచిపోయింది. ఫలితంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు ముందుకు సాగని పరిస్థితి నెలకొంది. అడుగడుగునా అడ్డంకులు.. జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గ పరిధిలోని రాజోళి మండలం తుమ్మిళ్లలో తుంగభద్ర నది నుంచి ఫ్లెడ్జింగ్ పద్ధతిన ఇసుక తోడి ‘మన ఇసుక వాహనం’ ద్వారా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఉచితంగా అందజేసేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ మేరకు నదిలో నీరు ఉన్న సమయంలోనూ కార్గో శాండ్ బోట్స్ డ్రైజింగ్ మెకానిజం పద్ధతిన ఇసుక తవ్వేలా ఈ ఏడాది జూన్లో టెండర్లు నిర్వహించింది. మూడు పాయింట్ల ద్వారా వచ్చే ఏడాది జూన్ 21 వరకు 7.25 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక తీసేందుకు ఓ కాంట్రాక్టర్ ఒప్పందం కుదుర్చుకొని జూలై 3న తవ్వకాలు ప్రారంభించారు. లబ్ధిదారులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న మేరకు.. అధికారులు సూచించిన రూట్ మ్యాప్ ప్రకారం తుమ్మిళ్ల నుంచే టిప్పర్ల ద్వారా ఇసుక రవాణా చేస్తున్నారు. అయితే తొలి నుంచీ అడ్డంకులు ఎదురవుతూనే ఉన్నాయి. జోగుళాంబ గద్వాల జిల్లాలో సుమారు 7 వేల ఇళ్లకు ఇసుక అందించాల్సి ఉంది. 45 రోజుల క్రితం సరఫరా మొదలైనప్పటికీ.. ఇప్పటి వరకు 650 ఇళ్లకు మాత్రమే అందజేశారు. వర్షాలతో సరఫరాకు అడ్డంకులు ఏర్పడగా.. దాన్ని అధిగమించేలోపు మరోసారి బ్రేక్ పడింది. ఇవ్వాల్సిందే.. లేదంటే నడవనివ్వం ‘ఇందిరమ్మ ఇంటికై నా.. ఇతర అవసరాలకై నా.. ఏదైనా సరే.. పర్సంటేజీ ఇవ్వాల్సిందే.. ఒక్కో టిప్పర్కు రూ.6 వేలు చెల్లించాల్సిందే’నని అలంపూర్ నియోజకవర్గానికి చెందిన ఓ ‘అధికార’ నేత తేల్చిచెప్పడంతో ఇసుక తవ్వకాలు, రవాణాకు బ్రేక్ పడినట్లు తెలుస్తోంది. రెండు రోజుల క్రితం తుమ్మిళ్ల రీచ్ వద్దకు అధికార పార్టీకి చెందిన పలువురు నాయకులు వెళ్లి వాహనాలను అడ్డుకున్నారు. తమ గ్రామంలో రోడ్లు దెబ్బతింటున్నాయంటూ వాహనాలను నిలిపివేశారు. ఈ క్రమంలో నియోజకవర్గ ముఖ్య నేత నుంచి పర్సంటేజీ ఇవ్వని పక్షంలో ఒక్క వాహనాన్ని కూడా తిరగనిచ్చేది లేదంటూ సదరు కాంట్రాక్టర్కు వార్నింగ్ వచ్చినట్లు సమాచారం. ఇసుక కాంట్రాక్టర్కు ‘అధికార’ పార్టీ నేత హుకుం ఒక్కో టిప్పర్కు రూ.6 వేల చొప్పున డిమాండ్ పట్టించుకోకపోవడంతో రోడ్లు దెబ్బతింటున్నాయంటూ అడ్డంకులు తుమ్మిళ్లలో 2 రోజులుగా నిలిచిన ఇసుక రవాణా ఆందోళనలో లబ్ధిదారులు.. సీఎం పేషీకి చేరిన ‘పంచాయితీ’ డ్రైవర్ల ఆందోళన.. ఇసుక లోడ్తో వాహనాలు నిలిచిపోగా టైర్లు దెబ్బతింటున్నాయని.. రెండు రోజులుగా తిండి, నీరు లేక ఇబ్బంది పడుతున్నామంటూ డ్రైవర్లు ఆదివారం ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో కొందరు యువకులు రీచ్ వద్దకు చేరుకుని గతంలో ఎలాంటి అనుమతులు లేకుండా కొందరు ఇసుకను కొల్లగొట్టారని ఉదహరించారు. అప్పుడు ఈ నాయకులు ఎక్కడికి వెళ్లారని.. అప్పుడు దెబ్బతిన్న రోడ్లు ఇప్పటిదాకా వేయకపోతే ఎందుకు ప్రశ్నించడం లేదని ధ్వజమెత్తారు. ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక అందిస్తే మంచిదేనని.. మాకు ఎలాంటి అభ్యంతరాలు లేవని తెలిపారు. అనుమతులు ఉన్నా.. అధికార పార్టీ నాయకులు వారి స్వార్థం కోసం అడ్డుకుంటూ గ్రామం పేరు చెడగొడుతున్నారంటూ వాహనాలను పంపించారు. దీనిపై సామాజిక మాధ్యమాల్లో వీడియోలు వైరల్గా మారగా.. ‘అధికార’ నేత నిర్వాకం చర్చనీయాంశమైంది. అసలు వస్తదో.. రాదో.. మొదటి విడతలో భాగంగా ఇందిరమ్మ ఇంటి నిర్మాణం కోసం ఆన్లైన్లో ఇసుక బుక్ చేస్తే.. రావడానికి నెల రోజులు పట్టింది. దీంతో నిర్మాణం నెమ్మదిగా సాగింది. తుమ్మిళ్ల రీచ్ పక్కనే ఉన్నా.. చాలా రోజులు ఎదురు చూడాల్సి వచ్చింది. ఏవేవో సాకులు చెబుతున్నారు. రాజకీయ కారణాలతోనే ఆలస్యమవుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రెండో దశలో ఇసుక కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు చెబుతున్నారు. అసలు వస్తదో.. రాదో, వస్తే.. ఎప్పుడొస్తదో.. తెలియని పరిస్థితి ఉంది. దీంతో ఏం చేయాలో తోచడం లేదు. – సోమేష్, రాజోళి -
రాయితీ.. అనాసక్తి !
సబ్సిడీపై వ్యవసాయ యంత్ర సామగ్రి పంపిణీకి శ్రీకారం వనపర్తి: సుమారు పదేళ్ల తర్వాత రాష్ట్ర ప్రభుత్వం రైతులకు రాయితీపై వ్యవసాయ యంత్ర పరికరాల పంపిణీకి శ్రీకారం చుట్టింది. నెలాఖరు వరకు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించినా.. క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. రాయితీలో కేంద్ర ప్రభుత్వం 60 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం భరిస్తాయి. ఆరు నెలల కిందటే రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించినా.. యంత్ర సామగ్రి ధరలు మారడం, జీఎస్టీ స్లాబ్లు, దరఖాస్తు ప్రక్రియలో మార్పులు చోటు చేసుకోవడంతో మరోమారు ఆగస్టు 4 నుంచి 15వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునేందుకు వ్యవసాయశాఖ అనుమతినిచ్చింది. అయినా రైతుల నుంచి ఆశించిన మేర స్పందన లేదని తెలుస్తోంది. జిల్లా రైతులకు రాయితీపై వ్యవసాయ పరికరాలు అందించేందుకు రూ.1.50 కోట్లు కేటాయించాలని జిల్లా యంత్రాంగం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపగా.. రూ.77.13 లక్షలు మంజూరు చేసింది. రాయితీ పరికరాల కోసం రైతులు ఎదురుచూస్తున్నా.. చాలాకాలం పాటు పథకం నిలిచిపోవడం, ప్రస్తుత ప్రభుత్వం తిరిగి ప్రారంభించినా అధికారులు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించకపోవడంతో ఆశించిన మేర వేగం పుంజుకోవడం లేదు. జిల్లాలో 2.80 లక్షల ఎకరాల సాగు.. జిల్లావ్యాప్తంగా 1.50 లక్షల మంది రైతులుండగా.. అందులో 65 శాతం చిన్న, సన్నకారు రైతులే. ఈ ఏడాది అత్యధికంగా 2.30 లక్షల పైచిలుకు ఎకరాల్లో వరి సాగుకాగా.. మరో 50 వేల ఎకరాల్లో ఇతర పంటలు సాగు చేశారు. కాగా జిల్లాకు కేవలం 894 రాయితీ యూనిట్లు కేటాయించడం కొంత చిన్నచూపనే చెప్పాలి. రాయితీ ఇలా.. వ్యవసాయ యంత్ర పరిసరాలు ఎస్సీ, ఎస్టీ, మహిళా రైతులకు 50 శాతం, ఇతర రైతులకు 40 శాతం రాయితీపై అందించాలని ప్రభుత్వం నిబంధనలు రూపొందించింది. యూనిట్ విలువలో రాయితీ మొత్తం మినహా.. మిగతా డబ్బును రైతు డీడీ రూపంలో వ్యవసాయశాఖకు చెల్లించాల్సి ఉంటుంది. అందుబాటులోకి రాని యాప్.. రైతులు దరఖాస్తు చేసుకునేందుకు ప్రత్యేక యాప్ను రూపొందిస్తున్నట్లు వ్యవసాయశాఖ ఉన్నతాధికారులు చెప్పినా.. స్థానిక సంస్థల ఎన్నికల హడావుడితో నేటికీ కార్యరూపం దాల్చలేదు. దీంతో స్థానిక అధికారులు ఈ ప్రక్రియపై ఏ చేయాలనే సందిగ్ధంలో ఉన్నట్లు తెలుస్తోంది. నెలాఖరు వరకు యంత్ర సామగ్రి అందడం కష్టమేనన్న వాదన రైతుల నుంచి వినిపిస్తోంది. జిల్లాకు రూ.77.13 లక్షలు కేటాయింపు 894 యూనిట్లు ఇచ్చేందుకు అధికారుల ప్రణాళికలు క్షేత్రస్థాయిలో కనిపించని అవగాహన కార్యక్రమాలు ఆశించిన మేరఅందని దరఖాస్తులు -
అధిక వర్షం.. పంట నష్టం
వీపనగండ్ల సమీపంలోని మామిడి తోటలో నిలిచిన వర్షపు నీరు ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మండలంలోని పలు గ్రామాల్లో రైతులు సాగు చేసిన పంటలు, పండ్ల తోటలకు నష్టం వాటిల్లుతోంది. పొలాల్లో వర్షపు నీరు నిలిచి మొక్కజొన్న, మినుపు తదితర పంటలు దెబ్బతినగా.. మామిడి తోటలకు చీడపీడలు, తెగుళ్లు సోకుతున్నాయి. వీటి నివారణకుగాను పురుగు మందుల కొనుగోలుకే రూ.వేలు వెచ్చించాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. – వీపనగండ్ల -
స్పందన కరువు..!
మద్యం టెండర్లకు ఆసక్తి చూపని వ్యాపారులు ●పదిహేను రోజుల్లో కేవలం రెండు దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. చివరి రోజుల్లో దరఖాస్తుల సంఖ్య ఆశించిన మేర పెరగొచ్చు. శనివారం మంచిరోజు ఉన్నందున రాష్ట్రస్థాయి అధికారులు దరఖాస్తుల స్వీకరణకు అవకాశం కల్పించారు. సులభతరమైన సింగిల్ పేజీ దరఖాస్తు పత్రాన్ని పూరించి డీడీతో పాటు కార్యాలయంలో సమర్పించాల్సి ఉంటుంది. ఈ నెల 18వ తేదీ సాయంత్రం 5 గంటలోపు కార్యాలయానికి వచ్చిన దరఖాస్తులన్నింటినీ స్వీకరిస్తాం. – శ్రీనివాస్, ఈఎస్, వనపర్తి వనపర్తి: నూతన ఎకై ్సజ్ పాలసీతో ఆదాయం సమకూరుతుందని ప్రభుత్వం చేసిన ప్రయత్నం అనుకున్నదొక్కటి.. అయ్యిందొక్కటి అన్న చందంగా మారిందనే వాదనలు విపిస్తున్నాయి. రెండేళ్ల కాలపరిమితితో మద్యం విక్రయాలకు లక్కీడిప్ పద్ధతిన దుకాణాల కేటాయింపు, లక్కీడిప్లో పాల్గొనేందుకు దరఖాస్తుతో పాటు తిరిగి చెల్లించని రూ.2 లక్షల డీడీని జత చేయాల్సి ఉంటుందనే విషయం తెలిసిందే. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఆ మొత్తాన్ని రూ.3 లక్షలకు పెంచడం, రియల్ వ్యాపారం కుదేలవడం తదితర కారణాలతో దరఖాస్తుల దాఖలుకు వ్యాపారులు ఆసక్తి చూపడం లేదు. ఇదివరకు మద్యం దుకాణాలు నిర్వహించిన వారు మాత్రమే మరోమారు దరఖాస్తు చేసుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. జిల్లాలో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమై 15 రోజులు కావస్తుండగా.. శుక్రవారం సాయంత్రం వరకు కొత్తకోటలోని దుకాణం నంబర్ 27, 30కి ఒక్కో దరఖాస్తు మాత్రమే దాఖలు కావడం గమనార్హం. ఇటీవల ఎకై ్సజ్శాఖ డిప్యూటీ కమిషనర్ విజయభాస్కర్రెడ్డి జిల్లాలో పర్యటించి దరఖాస్తుల పెంపునకు వ్యాపారులను ఆకర్షించే పద్ధతులపై ఈఎస్, ముగ్గురు ఎస్హెచ్ఓలు, ఇతర సిబ్బందికి పలు సూచనలు, సలహాలిచ్చారు. జిల్లాలోని మొత్తం 36 దుకాణాల్లో మద్యం విక్రయాలు, వ్యాపారులకు దక్కిన లాభాలు, ప్రభుత్వానికి జమ చేసిన మొత్తం తదితర వివరాలను జిల్లా ఎకై ్సజ్శాఖ కార్యాలయంలో ప్రదర్శించారు. రూ.26.82 కోట్ల ఆదాయం.. 2025, నవంబర్ 30తో ముగియనున్న గత మద్యం పాలసీతో జిల్లా నుంచి దరఖాస్తుల రూపేణా.. జిల్లా తరుఫున ప్రభుత్వానికి రూ.26.82 కోట్ల ఆదాయం సమకూరింది. అధికారుల లెక్కల ప్రకారం.. 1,341 దరఖాస్తులు రాగా, ఒక్కో దరఖాస్తుకు రూ.2 లక్షల తిరిగి చెల్లించని డబ్బులు ప్రభుత్వానికి అందాయి. కానీ ఈసారి దరఖాస్తుల సంఖ్య తగ్గే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నా.. గడువులోగా వస్తాయనే ధీమాలో ఎకై ్సజ్ అధికారులు ఉన్నారు. జిల్లాలో 36 దుకాణాలు 15 రోజుల్లో కేవలం రెండు దరఖాస్తులు దాఖలు ముహూర్తం కోసం ఎదురుచూపులు దరఖాస్తు ఫీజు రూ.లక్ష పెంచడం, రియల్ వ్యాపారం పడిపోవడమే కారణమా..? స్థానిక ఎన్నికల వాయిదాతో మరింత డీలా ఒక వ్యక్తి ఎన్ని దుకాణాలకై నా దరఖాస్తు చేసుకోవచ్చు. నిర్ణీత రుసుం చెల్లించి దరఖాస్తు సమర్పించాలి. 2011 జనాభా లెక్కల ప్రకారం.. జిల్లాలో ప్రస్తుతం 36 మద్యం దుకాణాలు రూ.55 లక్షలు, రూ.60 లక్షల స్లాబ్లో ఉన్నాయి. ఏడాదిలో ఆరుసార్లు వార్షిక లక్ష్యాన్ని చేరుకునేందుకు అవకాశం కల్పిస్తారు. ఆర్డినరీ మద్యంపై 27 శాతం, ప్రీమియం, బీర్లపై 20 శాతం మార్జిన్ చెల్లింపులు ఉంటాయి. దరఖాస్తులు సమర్పించేందుకు శనివారం మంచిరోజు ఉందనే కారణంతో ఉన్నతాధికారులు సెలవు దినమైన రెండో శనివారం కూడా జిల్లా ఎకై ్సజ్శాఖ కార్యాలయంలో దరఖాస్తులు స్వీకరించేలా ఉత్తర్వులు జారీ చేశారు. దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైన నాటి నుంచి శుక్రవారం వరకు 15 రోజుల్లో రెండు దరఖాస్తులు రాగా.. శనివారం మంచిరోజుగా భావించిన మద్యం వ్యాపారులు ఒకేరోజు 18 దరఖాస్తులు జిల్లా ఎకై ్సజ్శాఖ కార్యాలయంలో అందజేసినట్లు ఈఎస్ శ్రీనివాస్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలో మొత్తం 36 దుకాణాలుండగా.. ఇప్పటి వరకు 11 దుకాణాలకుగాను 20 దరఖాస్తులు వచ్చాయని పేర్కొన్నారు. మరో 25 దుకాణాలకు ఇప్పటి వరకు కనీసం ఒక్క దరఖాస్తు కూడా రాలేదు. దరఖాస్తుల స్వీకరణకు ఈ నెల 18 వరకు అవకాశం ఉంది. -
ఓటు చోరీని ప్రజల్లోకి తీసుకెళ్లాలి
కొత్తకోట: ఓటు చోరీ అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని ఎమ్మెల్యే జి.మధుసూదన్రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం పుర కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఓటు చోరీకి వ్యతిరేకంగా నిర్వహించిన సంతకాల సేకరణ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఓటు చోరీకి పాల్పడి దేశంలో బీజేపీ గద్దెనెక్కిందని, వ్యవస్థలను దుర్వినియోగం చేస్తోందని, మోదీ పాలనలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని ఆరోపించారు. లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్గాంధీ ఓటు చోరీకి సంబంధించిన ఆధారాలు బయటపెట్టినా కేంద్ర ఎన్నికల సంఘం ఎలాంటి చర్యలు తీసుకోకుండా బీజేపీ కనుసన్నల్లో పని చేస్తోందన్నారు. ప్రజాస్వామ్యంలో ఓటుకు అత్యంత ప్రాధాన్యం ఉందని, ప్రజలు తమ ఓటు హక్కు ద్వారా ప్రభుత్వాలను నిర్ణయిస్తారని, బీజేపీ ఓటు చోరీ చేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిందని తెలిపారు. బీసీ రిజర్వేషన్లను అడ్డుకోవడంలో ప్రధాన ముద్దాయిలు బీఆర్ఎస్, బీజేపీ పార్టీలని ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో చేసిన బిల్లు గవర్నర్ దగ్గర పెండింగ్లో ఉందని, దీనిని ఆపింది బీజేపీ ప్రభుత్వం కాదా అని ప్రశ్నించారు. అనంతరం కూరగాయల మార్కెట్, సంతబజార్ ఏర్పాటుకు స్థలాన్ని పరిశీలించారు. -
చెరుకు రైతుల సమస్యలు పరిష్కరించాలి
ఆత్మకూర్: చెరుకు రైతుల సమస్యలు పరిష్కరించాలని కృష్ణవేణి చెరుకు రైతుసంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు రాజన్న కోరారు. శనివారం స్థానిక మార్కెట్యార్డులో జరిగిన ఉమ్మడి జిల్లా చెరుకు రైతుల సర్వసభ్య సమావేశానికి హాజరై మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం పత్తికి మద్దతు ధర రూ.8,150 నిర్ణయించిందని.. అలాగే చెరుకు పంటకు టన్నుకు రూ.6 వేల మద్దతు ధర ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చెరుకు రైతుకు టన్నుకు రూ.వెయ్యి బోనస్ చెల్లించాలని, నిర్ణయించిన ధరకే కోతలు చేపట్టాలని, రవాణా విషయంలో ఇబ్బందులు తొలగించాలని కోరారు. ఫ్యాక్టరీ యాజమాన్యం రాయితీలు కొనసాగించాలని, పంట విక్రయించిన 14 రోజుల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని, సీడీసీ నిధులతో గ్రామాల్లో రహదారుల మరమ్మతు చేపట్టాలన్నారు. కోతల సమయంలో కార్మికుల కొరత లేకుండా చూడాలని, అధిక దిగుబడుల కోసం రైతులకు అవగాహన కార్యక్రమాలు, విజ్ఞాన యాత్రలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. నాయకులు మాసూం, వాసారెడ్డి, వెంకటేశ్వర్రెడ్డి, సంజీవరెడ్డి, రవి, నారాయణ, రాజశేఖర్రెడ్డి, శివుడు, చంద్రసేనారెడ్డి, తిరుపతయ్య, లింగన్న, రంగారెడ్డి, రాజు, నాగేంద్రం, ప్రశాంత్రెడ్డి పాల్గొన్నారు. -
ఆధునిక హంగులు
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీ ఆటుపోట్లను దాటుకుంటూ.. ఆధునిక పద్ధతులు అవలంభిస్తూ వినూత్నంగా ముందుకెళ్తోంది. ప్రస్తుత వైస్ చాన్స్లర్ జీఎన్ శ్రీనివాస్ బాధ్యతలు చేపట్టిన తర్వాత పీయూలో పరిపాలన కొత్త పుంతలు తొక్కుతోంది. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సమర్థ్ స్కీం పోర్టల్ ద్వారా సిబ్బందికి ఆన్లైన్ అటెండెన్స్, వర్క్లోడ్, పే స్లిప్ల వంటివి అందిస్తున్నారు. వీటితోపాటు పీయూలో వినియోగిస్తున్న నీటి పునర్వినియోగం కోసం నూతనంగా సీవేజ్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ నిర్మిస్తున్నారు. అలాగే అడ్మినిస్ట్రేషన్ భవనంపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసి విద్యుత్ను ఆదా చేయడంతోపాటు పర్యావరణ పరిరక్షణలో తమవంతు భాగస్వామ్యం అవుతున్నారు. కీలకంగా సీవేజ్ ప్లాంట్.. యూనివర్సిటీలో గత కొన్నేళ్లుగా తీసుకువస్తున్న మార్పుల్లో కీలకమైంది సీవేజ్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్. రూ.5 కోట్ల వ్యయంతో సింథటిక్ ట్రాక్ కిందభాగంలో దీనిని నిర్మిస్తున్నారు. యూనివర్సిటీలో పలు హాస్టల్స్, కళాశాలలు నుంచి వచ్చే డ్రెయినేజీ నీటిని ఇక్కడ ఉండే పెద్ద మూడు ట్యాంకుల్లోకి మళ్లించి నీటితోపాటు ఇతర వ్యర్థాలను శుద్ధి చేసే విధంగా సీవేజ్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ పనిచేస్తుంది. ఇందులో శుద్ధి చేసిన నీటిని తిరిగి చెట్లు, తోటలు, గార్డెన్లకు, ఘన పదార్థాల వ్యర్థాలను బయో ఫర్టిలైజర్గా వినియోగిస్తున్నారు. చెట్లకు ఇతర అవసరాల కోసం ఎరువులుగా ఉపయోగించనున్నారు. దీని ద్వారా పీయూ వ్యర్థాల పునర్వినియోగంలో టాప్లో నిలువస్తుంది. న్యాక్ ర్యాంకింగ్లో మెరుగైన స్కోరింగ్ వచ్చే అవకాశం ఉంటుంది. విద్యుత్ ఆదా.. యూనివర్సిటీలోని అన్ని విభాగాల్లో సోలార్ విద్యుత్ వినియోగించేలా అధికారులు చర్యలు చేపట్టారు. ముఖ్యంగా రూ.3 కోట్లతో అడ్మినిస్ట్రేషన్ భవనం పైభాగంలో సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేయించారు. వీటి ద్వారా యూనివర్సిటీలోని పలు విభాగాలకు సోలార్ విద్యుత్ను అందించేందుకు ఏర్పాట్లు చేస్తు న్నారు. ప్రస్తుతం ఇది ప్రభుత్వం అందించే సాధారణ విద్యుత్తో కలుపుకొని అన్ని విభాగాలకు అందిస్తున్నారు. దీని ద్వారా యూనివర్సిటీకి తక్కువ కరెంట్ బిల్లు వస్తుందని అధికారులు చెబుతున్నారు. అయితే ఇది కొన్ని విభాగాలకు సరిపోవడం లేదని, దీనిని పూర్తిస్థాయిలో విస్తరించనున్నట్లు పేర్కొంటున్నారు. ఆన్లైన్ విధానంలో టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది, విద్యార్థుల వివరాలు విద్యుదుత్పత్తి కోసం సోలార్ ప్యానెల్స్ బిగింపు రూ.5 కోట్లతో సీవేజ్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఏర్పాటు నీటి పునర్వినియోగం, వ్యర్థాలతో బయో ఫర్టిలైజర్స్ తయారీ పీయూలో టీచింగ్, నాన్టీచింగ్ సిబ్బందికి సెలవుల మంజూరు, వేతనాల పే స్లిప్లు, విద్యార్థి అడ్మిషన్, అటెండెన్స్, స్కిల్స్ తదితర అంశాలను పొందుపర్చుకోవడం, వివిధ కార్యక్రమాలు, హాస్పిటల్స్ తదితర అంశాలను మ్యానువల్ పద్ధతిలో జరిగేవి. దీనిని ఆన్లైన్ విధానంలోకి తీసుకొచ్చి సమగ్రంగా యూనివర్సిటీతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరికి అందించేందుకు అధికారులు ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. పీఎం ఉషా స్కీం నిధులను అందిస్తున్న ప్రతి ప్రభుత్వ విద్యా సంస్థకు కేంద్రం సమర్థ్ పోర్టల్ను ఉచితంగా అందిస్తుంది. ఈ స్కీంలో భాగంగా యూనివర్సిటీ సిబ్బందికి ప్రత్యేకంగా సమర్థ్ యాప్ ద్వారా ప్రత్యేక సేవలను అందించేందుకు అధికారులు ఇటీవల ట్రయల్స్ నిర్వహించారు. ఇందులో రెగ్యులర్ అధ్యాపకులు రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయగా.. కాంట్రాక్టు అధ్యాపకుల వివరాలను ఈ పోర్టల్ దరఖాస్తు చేసుకునేందుకు వెసులుబాటు కల్పించారు. అనంతరం నాన్టీచింగ్ సిబ్బంది, విద్యార్థులనూ ఇందులో చేర్చనున్నారు. తద్వారా పీయూకు సంబంధించిన ప్రతి ఫైల్ కూడా ఈ–పోర్టల్ ద్వారా ఆన్లైన్లో ఫైలింగ్ నిర్వహించి.. ఫైల్ స్టేటస్ ఎక్కడ.. ఏ అధికారి వద్ద ఉందో తెలుసుకునే అవకాశం లభిస్తుంది. -
దేశ ఉన్నతిలో యువత పాత్ర కీలకం
ఖిల్లాఘనపురం: యువత పంచ పరివర్తన నియమాలు పాటిస్తూ దేశ ఉన్నతికి తోడ్పడాలని ఆర్ఎస్ఎస్ జోగుళాంబ గద్వాల జిల్లా సహ పరివాహ యుగంధర్జీ అన్నారు. రారష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఏర్పడి వందేళ్లు పూర్తవుతున్న సందర్భంగా శనివారం మండల కేంద్రంలో శతాబ్ధి ఉత్సవాలు నిర్వహించారు. పట్టణ వీధుల్లో పద సంచాలన చేసిన అనంతరం పద్మశాలి కళ్యాణ మండపంలో నిర్వహించిన సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. సామాజిక సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ, స్వదేశి, సౌర నియమాలు, కుటుంబ ప్రబోధన అనే పంచ పరివర్థన నియమాలు ప్రతి ఒక్కరూ పాటించాలన్నారు. దేశంలోని యువతలో దేశభక్తి పెంపొందించేందుకు ఆర్ఎస్ఎస్ కృషి చేస్తోందని తెలిపారు. సంఘం ఏర్పడి 100 సంవత్సరాలు అవుతున్నందున పూర్వ స్వయం సేవకులను మరోమారు చైతన్యం చేస్తున్నామని.. దేశంపై భక్తిభావం కలిగి ఉండటం ప్రతి ఒక్కరి బాధ్యతన్నారు. పద సంచాలన్ సమయంలో వీధుల్లో పలువురు ప్రజలు స్వయం సేవకులపై పూలు చల్లారు. మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామాల స్వయం సేవకులు భారీసంఖ్యలో పాల్గొన్నారు. మండల స్వయం సేవకులు విక్రం, బుచ్చిబాబుగౌడ్, వేణు, సాయినాథ్, గోపాల్ ముదిరాజ్, అశోక్గౌడ్, భాస్కర్, మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో స్వయం సేవకులు -
వంతెన పనులకు నిధులు మంజూరు
మదనాపురం: మండల పరిధిలోని ఊకచెట్టువాగుపై అసంపూర్తిగా ఉన్న వంతెన పనులు త్వరలోనే పునః ప్రారంభం కానున్నాయని.. అప్రోచ్ వర్కులు, మిగతా పనులకుగాను ప్రభుత్వం రూ.6 కోట్లు మంజూరు చేసిందని దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్రెడ్డి తెలిపారు. శుక్రవారం ఇందుకు సంబంధించిన జీఓ కాపీని హైదరాబాద్లో ఆర్అండ్బీ చీఫ్ సెక్రెటరీ వికాస్రాజ్ అందజేసినట్లు వివరించారు. ప్రయాణికులు, వాహనాదారుల సౌకర్యార్థం పనులు త్వరగా పూర్తి చేయాలని నిర్ణయించామని.. సోమవారం నుంచే పునః ప్రారంభమవుతాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. వంతెన నిర్మాణం కోసం ప్రత్యేక నిధులు తీసుకొచ్చిన ఎమ్మెల్యేకు స్థానిక కాంగ్రెస్ నాయకులు, మండల ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. -
క్రీడాపర్తిగా తీర్చిదిద్దేందుకు కృషి
● వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి వనపర్తి విద్యావిభాగం: విద్యాపర్తిగా పేరుగాంచిన వనపర్తి జిల్లాను ఇకపై క్రీడాపర్తిగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి తెలిపారు. శుక్రవారం జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో నిర్వహించిన ఎస్జీఎఫ్ అండర్–14, అండర్–17 బాల, బాలికల కబడ్డీ, వాలీబాల్ పోటీల ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై విజేతలకు బహుమతులు అందజేసి మాట్లాడారు. జిల్లాలోని 15 మండలాల నుంచి 730 మంది క్రీడాకారులు పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబర్చడం గర్వకారణమన్నారు. క్రీడల్లో గెలుపోటములు సహజమని.. ఓడిన క్రీడాకారులు పట్టుదలతో గెలుపునకు కృషి చేయాలని సూచించారు. నియోజకవర్గంలో క్రీడా మౌలిక వసతుల కల్పనకు రూ.50 కోట్లు, జిమ్, స్విమ్మింగ్పూల్ నిర్మాణానికి రూ.15 కోట్లు, క్రీడా పాఠశాల నిర్మాణానికి ప్రభుత్వం అనుమతి మంజూరు చేసిందన్నారు. విద్యతో పాటు క్రీడలపై దృష్టి సారించి దేశ విదేశాల్లో జిల్లా ప్రతిభను చాటాలని విద్యార్థులకు సూచించారు. కార్యక్రమంలో విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. -
బాలికల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి
వనపర్తి: బాలికల ఎదుగుదల, అభ్యున్నతికి ప్రభుత్వం ఎన్నో అవకాశాలు కల్పిస్తోందని రిటైర్డ్ ఐఆర్ఎస్ అధికారి, కలెక్టర్ తల్లి నర్సమ్మ తెలిపారు. శుక్రవారం మర్రికుంట కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయంలో నిర్వహించిన ‘స్పూర్తి’ కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరై విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. విద్యార్థినులు చదువు మధ్యలో ఆపేసి బాల్య వివాహాలకు తావు ఇవ్వొద్దని.. ఉన్నత విద్యను అభ్యసించాలని సూచించారు. తద్వారా సమాజంలో తమ కాళ్లపై తాము నిలబడటానికి అవకాశం ఉంటుందన్నారు. అమ్మాయిలు సమాజంలో ఇతరులకు ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. అనంతరం ఉపాధ్యాయ బృందం నర్సమ్మను శాలువాతో సత్కరించారు.రామన్పాడులో తగ్గిన నీటిమట్టం మదనాపురం: మండలంలోని రామన్పాడు జలాశయంలో శుక్రవారం సముద్రమట్టానికి పైన 1018 అడుగుల నీటిమట్టం ఉన్నట్లు ఏఈ వరప్రసాద్ తెలిపారు. జూరాల ఎడమ కాల్వ నుంచి 1,030 క్యూసెక్కుల వరద జలాశయానికి చేరుతుండగా.. సమాంతర కాల్వలో నీటి సరఫరా లేదన్నారు. ఇదిలా ఉండగా జలాశయం నుంచి ఎన్టీఆర్ కాల్వకు 875 క్యూసెక్కులు, కుడి, ఎడమ కాల్వలకు 55 క్యూసెక్కులు, తాగునీటి అవసరాలకు 20 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నట్లు వివరించారు. 14న తెలంగాణ బంద్ వనపర్తిటౌన్: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు అందాల్సిన 42 శాతం రిజర్వేషన్లపై హైకోర్టు ఇచ్చిన స్టేకు నిరసనగా బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ఈ నెల 14న తెలంగాణ బంద్కు పిలుపునిచ్చారని సంఘం రాష్ట్ర కార్యదర్శి ఆరవింద్స్వామి పిలుపునిచ్చారు. శుక్రవారం జిల్లాకేంద్రంలోని జాతీయ బీసీ సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన అనంతరం స్టే విధించడం దేశచరిత్రలోనే మొదటిసారని, ఇది బీసీలకు అవమానకరమని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీ సంఘాల నాయకులు, ప్రజలు అధికసంఖ్యలో పాల్గొని బంద్ను విజయవంతం చేయాలని పేర్కొన్నారు. సంఘం జిల్లా ప్రధానకార్యదర్శి ముకుంద నాయుడు, ఉపాధ్యక్షుడు చిట్యాల రాములు, చిన్నంబావి మండల అధ్యక్షుడు రామకృష్ణ, లోకేష్ పాల్గొన్నారు. నేటి నుంచి ఆరాధనోత్సవాలు అమరచింత: మండలంలోని నాగల్కడ్మూర్లో ఉన్న దేవేంద్రచార్యుల మఠంలో శనివారం నుంచి మూడురోజుల పాటు ఆరాధనోత్సవాలు వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు నిర్వాహకుడు నర్సింహచారి శుక్రవారం తెలిపారు. ఏటా స్వామివారి ఆరాధనోత్సవాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. దేవేంద్రాచార్యులు భక్తుల సమక్షంలో 1952లో జీవ సమాధి అయ్యారని.. నాటి నుంచి మఠంలో నిత్య పూజలు కొనసాగుతున్నాయని చెప్పారు. ఆరాధనోత్సవాలకు శ్రీ గాయత్రీ పీఠం పీఠాధిపతి డా. శ్రీకాంతేంద్రస్వామి హాజరవుతున్నట్లు వివరించారు. రోజువారీ కార్యక్రమాల వివరాలను వెల్లడించారు. కార్యక్రమాల వివరాలిలా.. శనివారం ఉదయం 5 గంటలకు సుప్రభాత సేవ, 6 గంటలకు గంగా తీర్థ సేకరణతో ఆరాధనోత్సవాలు ప్రారంభం. 12న మహా చండీయాగం, రుద్రాభిషేకం, రాత్రి అఖండ భజన, 13న స్వామివారి ఉరేగింపు, డోలోత్సవం, అన్నప్రసాద వితరణ. -
మా పిల్లల చదువు సంగతేంటి
● డీఈఓతో బెస్ట్ అవైలబుల్ విద్యార్థుల తల్లిదండ్రుల వాదన వనపర్తిటౌన్: ప్రభుత్వం డబ్బులు చెల్లించకపోవడంతో తమ పిల్లలను యాజమాన్యం రానివ్వడం లేదని బెస్ట్ అవైలబుల్ పాఠశాలకు ఎంపికై న విద్యార్థుల తల్లిదండ్రులు డీఈఓ అబ్ధుల్ ఘనీతో మొరపెట్టుకున్నారు. శుక్రవారం డీఈఓ కార్యాలయంలో జిల్లా విద్యాధికారి, ఎస్సీ కార్పొరేషన్ అధికారి మల్లికార్జున్తో వారు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... జిల్లాలో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు 120 మంది విద్యార్థులు చదువుతున్నారన్నారు. ప్రభుత్వం డబ్బులు చెల్లించకపోవడంతో దసరా సెలవులు ముగిసిన తర్వాత యాజమాన్యం పిల్లలను పాఠశాలకు రానివ్వడం లేదని.. చొరవ చూపకుంటే వారి భవిష్యత్ అగమ్యగోచరంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. స్పందించిన అధికారులు వెంటనే పట్టణంలోని రేడియంట్ పాఠశాల యాజమాన్య సభ్యుడు భాస్కర్తో ఫోన్లో మాట్లాడారు. నిధులు విడుదల కాకుండా విద్యార్థులను బలవంతంగా పాఠశాలకు పంపితే తాము ఆత్మహత్య చేసుకోకతప్పదని హెచ్చరించారు. ఇదే దశలో తల్లిదండ్రులు కలగజేసుకొని సమస్యను పరిష్కరించకపోతే ఉద్యమిస్తామని అధికారులతో చెప్పడంతో కాసేపు గందరగోళం నెలకొంది. పాఠశాల యాజమాన్యం 5 రోజులు గడువు కోరిందని.. ఆలోగా స్పందించకుంటే కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లడంతో పాటు బెస్ట్ అవైలబుల్ స్కూల్ గుర్తింపు ఉన్న పాఠశాలకు నోటీసులు జారీచేసి చర్యలు తీసుకుంటామని సూచించారు. -
మానసిక ధృడత్వంతోనే మెరుగైన ఫలితాలు
వనపర్తిటౌన్: విద్యార్థులు మానసికంగా ధృడత్వంగా ఉంటేనే చదివిన పాఠాలు గుర్తుంటాయని.. తద్వారా మెరుగైన ఫలితాలు సాధిస్తారని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ న్యాయమూర్తి వి.రజని అన్నారు. శుక్రవారం జిల్లాకేంద్రంలోని తెలంగాణ మైనార్టీ బాలికల జూనియర్ కళాశాలలో జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించగా.. ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఉన్నతస్థాయికి చేరాలంటే మానసిక, శారీరక ధృడత్వం అవసరమని, పౌష్టికాహారం తీసుకోవాలని సూచించారు. బాల్య వివాహాలు, బాలకార్మిక వ్యవస్థ, ఉచిత నిర్బంధ విద్య, పోక్సో చట్టాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. విద్యార్థులు టైంటేబుల్ ఏర్పాటు చేసుకొని చదివితే మానసిక ఒత్తిడికి గురికాకుండా ఉంటారని సైకియాట్రిస్ట్ పుష్పలత సూచించారు. అదేవిధంగా స్థానిక ఉర్దూ మీడియం పాఠశాలలో ప్రజ్వల సంస్థ ద్వారా ఉపాధ్యాయులకు చట్టాలపై అవగాహన కల్పించారు. పోక్సో, మోటారు వెహికల్, బాల్య వివాహాల చట్టాలను వివరించారు. కార్యక్రమంలో డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ కృష్ణయ్య, తెలంగాణ మైనార్టీ బాలికల జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ హవేలారాణి, సైకాలజిస్ట్ సారా, ఆర్ఎంఓ జావిద్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
అదనపు బాధ్యతలు ఉండటంతో..
పాఠశాలలను పర్యవేక్షించాల్సిన బాధ్యత స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎం, ఎంఈఓ ది. రెండు జిల్లాల బాధ్యతలు ఉండటంతో కొత్తకోట మండలానికి వెళ్లలేదు. స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయుడు, ఎంఈఓ ఎప్పుడూ నా దృష్టికి తీసుకురాలేదు. ఆర్జేడీ ఆకస్మిక తనిఖీలో ఈ విషయం తెలిసింది. ఇద్దరు ఉపాధ్యాయులను సస్పెండ్ చేయడంతో పాటు ఎంఈఓ, స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎంకు ఆర్జేడీ నుంచి షోకాజ్ నోటీసులు అందాయి. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తదుపరి చర్యలు ఉంటాయి. – అబ్దుల్ ఘనీ, జిల్లా విద్యాధికారి ● -
‘స్థానిక’ ఆశలపై నీళ్లు
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్/ సాక్షి, నాగర్కర్నూల్: స్థానిక సంస్థల ఎన్నికలకు హైకోర్టు తీర్పుతో తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఇప్పటికే విడుదలైన ఎన్నికల నోటిఫికేషన్పై హైకోర్టు స్టే విధించడంతో ఎన్నికల నిర్వహణ నిలిచిపోనుంది. దీంతో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదలతో పోటీకి సిద్ధమైన ఆశావహుల్లో అయోమయం, నైరాశ్యం నెలకొంది. తాజా పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందోనన్న దానిపై ఆశావహులు ఎదురుచూస్తున్నారు. కరువైన స్పందన.. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఎన్నికల కమిషన్ గత నెల 29న షెడ్యూల్ విడుదల చేసింది. రెండు విడతల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు, మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేసింది. ఈ క్రమంలోనే గురువారం నుంచి తొలివిడత ప్రాదేశిక ఎన్నికలకు నామినేషన్ల పర్వం సైతం మొదలైంది. అయితే బీసీ రిజర్వేషన్ల అమలు అంశంపై కోర్టులో పెండింగ్లో ఉండటంతో మొదటి రోజు నామినేషన్లకు అభ్యర్థులు ఆసక్తి చూపలేదు. తొలిరోజున ఉమ్మడి జిల్లావ్యాప్తంగా జెడ్పీటీసీ స్థానానికి ఒకే ఒక్క నామినేషన్ దాఖలైంది. అలాగే ఎంపీటీసీ స్థానాల్లో కేవలం 13 నామినేషన్లను అభ్యర్థులు దాఖలు చేశారు. నాగర్కర్నూల్ జిల్లా చారకొండ జెడ్పీటీసీ స్థానానికి సంబంధించి కాంగ్రెస్ తరపున చందులాల్ నామినేషన్ వేశారు. ఈ ఒక్క నామినేషన్ మినహా ఉమ్మడి జిల్లాలో ఎక్కడా జెడ్పీటీసీ స్థానానికి నామినేషన్ రాలేదు. అలాగే నాగర్కర్నూల్ జిల్లాలో ఎంపీటీసీ స్థానాలకు మూడు నామినేషన్లు రాగా, ఇందులో కాంగ్రెస్ తరఫున ఒకటి, ఇండిపెండెంట్ అభ్యర్థిగా మరొకరు నామినేషన్ పత్రాలను సమర్పించారు. వనపర్తి జిల్లా పెబ్బేరు మండలంలో కాంగ్రెస్ తరపున రెండు నామినేషన్లు, గోపాల్పేట మండలంలో ఇండిపెండెంట్గా ఒకరు నామినేషన్ వేశారు. నారాయణపేట జిల్లాలో ఐదు ఎంపీటీసీ స్థానాలకు నామినేషన్లు వచ్చాయి. మహబూబ్నగర్ జిల్లా రాజాపూర్ ఎంపీటీసీ స్థానానికి బీజేపీ తరపున ఒక నామినేషన్ దాఖలైంది. జోగుళాంబ గద్వాల జిల్లాలో మల్దకల్ మండలం తాటికుంట ఎంపీటీసీ స్థానానికి కాంగ్రెస్ తరపున ఒక నామినేషన్ దాఖలైంది. హైకోర్టు తీర్పుతో ఎన్నికల నోటిఫికేషన్ను రద్దు చేసిన ఈసీ గ్రామాల్లో ఆశావాహుల్లో తీవ్ర నిరాశ ఉదయం సందడి.. సాయంత్రం నిశ్శబ్ద వాతావరణం ఆరు వారాల తరువాతే ‘స్థానిక’ ఎన్నికలపై స్పష్టత ఉమ్మడి జిల్లాలో ఒక జెడ్పీటీసీ, 13 ఎంపీటీసీ స్థానాలకు నామినేషన్లుస్థానిక సంస్థల ఎన్నికలకు హైకోర్టు బ్రేక్ వేసిన నేపథ్యంలో ప్రధాన పార్టీల కేడర్, ఆశావహుల్లో తీవ్ర నైరాశ్యం నెలకొంది. పంచాయతీ పాలకవర్గాలు, జెడ్పీటీసీ, ఎంపీటీసీల పదవీకాలం పూర్తయ్యి ఏడాదిన్నర కాలం గడిచింది. సుదీర్ఘకాలంగా ఎన్నికలకు కోసం ఆశావహులు ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తూ జీవో విడుదల చేయడంతో బీసీ వర్గాలకు దక్కే స్థానాల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. ఎన్నికల నోటిఫికేషన్ సైతం విడుదల కావడంతో పెద్ద సంఖ్యలో ఆశావహులు ఎన్నికలకు సన్నద్ధమవుతున్నారు. బీసీ వర్గాలకు రిజర్వేషన్ల పెంపు, రిజర్వేషన్ల కేటాయింపుతో ఆయా స్థానాల్లో పోటీ చేసి తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సన్నాహాలు మొదలుపెట్టారు. తాజాగా ఎన్నికల నిర్వహణ నిలిచిపోనుండటం ఆశావహులు, ప్రధాన పార్టీల కేడర్లో నైరాశ్యం నింపింది. కోర్టు తీర్పు ప్రకారం కనీసం నెల రోజుల తర్వాతే ఎన్నికల నిర్వహణపై స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. ప్రభుత్వం హామీ ఇచ్చినట్టుగా బీసీలకు రిజర్వేషన్లపై కోర్టులో తేలే వరకు వేచి చూస్తారా.. లేక పాత రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికలు నిర్వహిస్తారా.. అన్న దానిపైనే ఆసక్తి నెలకొంది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందోనన్న చర్చ కొనసాగుతోంది. -
నిబంధనల మేరకే తనిఖీలు
వనపర్తి: కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా ఈవీఎం, వీవీ ప్యాట్ గోదామును ప్రతినెలా తనిఖీ చేసి సమగ్ర నివేదికను సమర్పిస్తున్నట్లు కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. గురువారం జిల్లాకేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయం వెనుక ఉన్న ఈవీఎం, వీవీప్యాట్ గోదాంను రెవెన్యూ అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్, ఆర్డీఓ సుబ్రమణ్యంతో కలిసి పరిశీలించారు. సీసీ కెమెరాల భద్రతా వ్యవస్థను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గోదాం వద్ద కట్టుదిట్టమైన భద్రత ఉందని వివరించారు. ఆయన వెంట వివిధ రాజకీయ పార్టీల నాయకులతో పాటు తహసీల్దార్ రమేష్రెడ్డి, ఇతర అధికారులు ఉన్నారు. నామినేషన్ స్వీకరణ కేంద్రాల పరిశీలన.. వనపర్తి ఎంపీడీఓ కార్యాలయం, చిట్యాల గ్రామపంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ స్వీకరణ కేంద్రాలను గురువారం ఉదయం జిల్లా ఎన్నికల అధికారి, ఆద ర్శ్ సురభి సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు వనపర్తి రూరల్: పెబ్బేరు ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన జెడ్పీటీసీ ఆర్వో కేంద్రాన్ని గురువారం రెవెన్యూ అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్, డీపీఓ రఘునాథ్రెడ్డి తనిఖీ చేసి ఏర్పాట్లను పరిశీలించారు. వారి వెంట ఎంపీడీఓ రోజారెడ్డి తదితరులు ఉన్నారు. -
క్రమశిక్షణతోనే లక్ష్య సాధన సాధ్యం
వనపర్తిటౌన్: క్రమశిక్షణతోనే ఎంచుకున్న ఉన్నత లక్ష్య సాధన సాధ్యమవుతుందని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ న్యాయమూర్తి వి.రజని తెలిపారు. ఈ నెల 11న అంతర్జాతీయ బాలికల దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం జిల్లాకేంద్రంలోని కస్తూర్భాగాంధీ బాలికల వసతిగృహంలో న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించగా.. ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. లక్ష్య ఛేదనలో పట్టుదల ఎంత ముఖ్యమో క్రమశిక్షణ సైతం అంతే ముఖ్యమని చెప్పారు. మహిళలు, చిన్నారులు, ఎస్సీ, ఎస్టీలు, వయోవృద్ధులు, మతిస్థిమితం కోల్పోయిన వారికి, సామూహిక విపత్తు, మానవ అక్రమ రవాణా బాధితులకు ఉచిత న్యాయసాయం అందిస్తామని చెప్పారు. బాల్య వివాహాలు, బాల కార్మిక వ్యవస్థ, నిర్భంద విద్య, పోక్సో చట్టాలపై అవగాహన కల్పించారు. ఉచిత న్యాయ సలహాల కోసం టోల్ఫ్రీ నంబర్ 15100 సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ కృష్ణయ్య, ప్రధానోపాధ్యాయురాలు లోహిత, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
శంకర సముద్రానికి పెరిగిన వరద
కొత్తకోట రూరల్: మండలంలోని కానాయపల్లి శివారులో ఉన్న శంకరసముద్రం జలాశయానికి ఇటీవల కురుస్తున్న వర్షాలతో వరద చేరడంతో అధికారులు రెండు గేట్లు తెరిచి దిగువకు నీటిని వదులుతున్నారు. గురువారం జలాశయానికి ఎగువ నుంచి 100 క్యూసెక్కుల వరద రాగా.. 5 గేట్లలో రెండింటిని ఫీటు మేర పైకెత్తి 450 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలినట్లు ఏఈ మనోజ్కుమార్ వివరించారు. వరద తగ్గుముఖం పట్టే వరకు ఉన్నతాధికారుల ఆదేశానుసారం ముందస్తు చర్యలు చేపడతామని తెలిపారు. రెండుగేట్లను ఎత్తిన అధికారులు -
పాలమూరులో భారీ వర్షం
సాక్షి నెట్వర్క్: ఉమ్మడి పాలమూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో గురువారం సాయంత్రం నుంచి రాత్రి వరకు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. మహబూబ్నగర్, నవాబుపేట, దేవరకద్ర మండలాల్లో 4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి.నవాబుపేట మండలం రుద్రారంలో వాగు నిండి గ్రామంలోకి నీరు ప్రవహించడంతో ఇళ్లలోకి భారీగా వరద వచ్చి చేరింది. చెన్నారెడ్డిపల్లికి రాకపోకలు నిలిచిపోయాయి. వనపర్తి జిల్లాలో కాజ్వే ఉధృతంగా ప్రవహించడంతో మదనాపురం–ఆత్మకూరు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. నారాయణపేట జిల్లా పళ్ల ప్రాంతానికి చెందిన కందుకూరు పద్మ(35) పొలం పనులకు వెళ్లగా.. అక్కడ పిడుగు పడటంతో మృత్యువాతపడింది. -
నామినేషన్ల ప్రక్రియకు సర్వం సిద్ధం
వనపర్తి: స్థానిక సంస్థల ఎన్నికల ప్రకటన జారీచేసి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభించేందుకు సర్వం సిద్ధం చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. బుధవారం సాయంత్రం రాష్ట్ర ఎన్నికల అధికారి రాణి కుముదిని కలెక్టర్లు, ఎస్పీలు, అధికారులతో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్పై వీడియో కాన్ఫరెనన్స్ నిర్వహించగా.. జిల్లా నుంచి కలెక్టర్, ఎస్పీ రావుల గిరిధర్ పాల్గొని వివరాలు వెల్లడించారు. స్థానిక సంస్థల ఎన్నికలు సజావుగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు.జెడ్పీటీసీల నామినేషన్ల స్వీకరణకు 8 ఆర్ఓ కేంద్రాలు ఎంపీడీఓ కార్యాలయాల్లో, ఎంపీటీసీల నామినేషన్ల స్వీకరణకు 21 కేంద్రాలు గ్రామపంచాయతీ కార్యాలయాల్లో ఏర్పాటు చేశామని చెప్పారు. ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించేందుకు ఎఫ్ఎస్టీ, సర్వైలియన్ స్టాటిస్టిక్ బృందాలు పని చేస్తున్నాయన్నారు. సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ యాదయ్య, ఆర్డీఓ సుబ్రమణ్యం, డీఎస్పీ వెంకటేశ్వరరావు, డీఆర్డీఓ ఉమాదేవి, డీపీఓ రఘునాథ్రెడ్డి, నోడల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ ఆదర్శ్ సురభి -
వ్యాపారులను ఆకర్షించేదెలా?
● ఉద్యోగులతో ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ సమీక్ష వనపర్తి: మద్యం టెండర్ల స్వీకరణ ప్రక్రియను ఎకై ్సజ్శాఖ జిల్లాల వారీగా ప్రారంభించిన విషయం పాఠకులకు విధితమే. రెండువారాలు గడిచినా జిల్లాలోని 36 దుకాణాలకు మంగళవారం వరకు కనీసం ఒక్క టెండర్ కూడా దాఖలు కాలేదు. బుధవారం ఉమ్మడి జిల్లా ఎకై ్సజ్శాఖ డిప్యూటి కమిషనర్ విజయభాస్కర్రెడ్డి జిల్లా పర్యటనకు వచ్చారు. ఈఎస్ శ్రీనివాస్తో పాటు ముగ్గురు ఎస్హెచ్ఓలు, ఇతర సిబ్బందితో సుమారు గంటపాటు సమీక్ష నిర్వహించారు. మరో పదిరోజుల్లో గడువు ముగియనుందని.. ప్రస్తుత మద్యం వ్యాపారులతో మాట్లాడి టెండర్లు దాఖలు చేయించే ప్రయత్నం చేయాలని సూచించినట్లు తెలిసింది. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ కొత్త పాలసీ వచ్చే వరకు పూర్తవుతున్నందున వ్యాపారులు రింగై కొద్దిపాటి టెండర్లు దాఖలు చేసే ప్రయత్నంలో ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో అధికారులు ప్రభుత్వ ఖజానాకు ఆదాయం పెంచే ప్రయత్నంలో భాగంగా మద్యం వ్యాపారంలోకి కొత్తవారిని ఆకర్శించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. బుధవారం రెండు దరఖాస్తులు.. రెండువారాల తర్వాత బుధవారం ఎకై ్సజ్శాఖ డిప్యూటీ కమిషనర్ అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్న సమయంలో కొత్తకోటలోని ఎస్సీ కేటగిరికి రిజర్వ్ చేసిన దుకాణం–27కు ఒకటి, జనరల్కు రిజర్వ్ చేసిన దుకాణం–30కి ఒకటి ఒకేరోజు మొత్తంగా రెండు టెండర్లు దాఖలైనట్లు ఈఎస్ శ్రీనివాస్ వివరించారు. -
రుణం అధికంగా పొందే అవకాశం..
లోక కల్యాణ మేళాలో కొత్తగా వీధి విక్రయదారులను గుర్తించి బ్యాంకు ద్వారా రుణాలు ఇప్పిస్తాం. దీంతోపాటు వీధి విక్రయదారుల సంఘాలు ఏర్పాటు చేసి బ్యాంకు ఖాతాలు తెరిపించడంతో అధికంగా రుణం పొందే అవకాశం ఉంది. ప్రస్తుతం మహిళా సంఘాలకు ప్రభుత్వం ఇస్తున్న రుణాల మాదిరిగా భవిష్యత్లో వీరి పొదుపును దృష్టిలో ఉంచుకొని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు రుణాలు పొందే అవకాశం ఉంది. సంఘాల ఏర్పాటుపై వీధి విక్రయదారులకు అవగాహన కల్పిస్తున్నాం. – బాలరాజు, జిల్లా కో–ఆర్డినేటర్, మెప్మా ● -
చిరు వ్యాపారులకు చేయూత
‘లోక కల్యాణ మేళా’తో రుణాలు సంఘాల ఏర్పాటుపై దృష్టి.. ప్రతి సంఘంలో 5 నుంచి 10 మంది వీధి విక్రయదారులు ఉండేందుకు అవకాశం కల్పించడంతో మున్సిపాలిటీలో వీధి విక్రయదారుల పొదుపు సంఘాల ఆవిర్భావానికి అంకురార్పణ జరిగినట్లయింది. ఇప్పటికే జిల్లావ్యాప్తంగా 150కి పైగా సంఘాలు ఏర్పాటైనట్లు మెప్మా అధికారులు తెలిపారు. జిల్లాలోని ఐదు పురపాలికల్లో 6,463 మంది వీధి విక్రయదారులు బ్యాంకుల్లో రుణాలు పొంది క్రమం తప్పకుండా నెలవారీగా కిస్తులు చెల్లిస్తూ తిరిగి రుణాలు పొందుతున్నారని వివరించారు. గ్రూప్లో ఉన్న ప్రతి సభ్యుడు ప్రతి నెల బ్యాంకులో రూ.100 నుంచి రూ.200 వరకు పొదుపు జమ చేయాల్సి ఉంటుంది. గ్రూప్ రుణాలు.. ఇప్పటి వరకు వీధి విక్రయదారులకు వ్యక్తిగతంగా బ్యాంకు రుణాలిచ్చిన అధికారులు ప్రస్తుతం మహిళా సంఘాల మాదిరిగా వీధి విక్రయదారుల సంఘాలకు బ్యాంకుల నుంచి రుణాలిప్పించడానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. గతంలో వ్యక్తిగతంగా రూ.10 వేల నుంచి మొదలు రూ.20 వేలు వరకు తిరిగి చెల్లించిన వారికి రూ.50 వేల వరకు రుణం ఇచ్చారు. ఇలా వ్యక్తిగతంగా కాకుండా ఒకేసారి గ్రూప్నకు రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు రుణం మంజూరు చేసే వీలుందని అధికారులు వెల్లడిస్తున్నారు. ఇందుకోసం మెప్మా ఆర్పీలు తమ క్లస్టర్ పరిధిలో రుణం పొంది సకాలంలో తిరిగి చెల్లిస్తున్న వారి జాబితాను సిద్ధం చేసి పాత, కొత్త వారిని కలిపి సంఘాల ఏర్పాటుకు సన్నద్ధమవుతున్నారు. అమరచింత: కేంద్ర ప్రభుత్వం పీఎం స్వనిధి ద్వారా వీధి విక్రయదారులకు బ్యాంకు రుణాలు అందించి వ్యాపార అభివృద్ధికి తోడ్పాటునందిస్తోంది. ప్రస్తుతం ‘లోక కల్యాణ మేళా’లో భాగంగా ఇప్పటి వరకు రుణం పొందని వీధి విక్రయదారులను గుర్తించి వారికి కూడా బ్యాంకుల ద్వారా రుణాలిప్పించేందుకు అధికారులు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ మేళా సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు కొనసాగాల్సి ఉండగా.. లక్ష్యాన్ని చేరుకునేందుకు ఈ నెల 17 వరకు పొడిగించారు. ఈ కార్యక్రమంలో భాగంగా మెప్మా కో–ఆర్డినేటర్లు పురపాలికల్లో బ్యాంకు రుణాలు పొందని వీధి విక్రయదారులను గుర్తించే కార్యక్రమంలో నిమగ్నమయ్యారు. కరోనా సమయంలో చిరు వ్యాపారులకు చేయూతనందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆత్మ నిర్భర్ భారత్ పథకంలో భాగంగా బ్యాంకుల్లో రుణాలిప్పించి ఆదుకుంది. రూ.పది వేల నుండి ప్రారంభించి ప్రస్తుతం వ్యక్తిగతంగా రూ.20 వేలు, రూ.50 వేల వరకు రుణం తీసుకొని తమ వ్యాపారాలను లభివృద్ధి చేసుకుంటూ కుటుంబాలను పోషించుకునే అవకాశం కల్పించింది. మొదటి విడతగా రూ.15 వేలు సంఘాల ఏర్పాటుకూ కసరత్తు జిల్లాలోని పురపాలికల్లో 6,463 మంది వీధి విక్రయదారులు ఈ నెల 17 వరకు అవగాహన సదస్సులు -
కష్టపడి చదివితేనే ఉన్నత శిఖరాలకు..
● పోక్సో చట్టం, గుడ్, బ్యాడ్ టచ్పై అవగాహన ఉండాలి ● ఎస్పీ రావుల గిరిధర్ కొత్తకోట రూరల్: విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ లక్ష్యాన్ని నిర్దేశించుకొని కష్టపడి చదవి ఉన్నతస్థాయికి ఎదిగి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు, మాతృభూమికి మంచి పేరు తీసుకురావాలని ఎస్పీ రావుల గిరిధర్ కోరారు. బుధవారం మండలంలోని పామాపురం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై విద్యార్థులకు సైబర్ నేరాలు, బాల్య వివాహాలు, పోక్సో చట్టం, గుడ్, బ్యాడ్ టచ్పై అవగాహన కల్పించారు. సమాజంలో చిన్నారులపై జరిగే నేరాలను అరికట్టేందుకు ఉపాధ్యాయులు విద్యార్థులకు గుడ్, బ్యాడ్ టచ్ గురించి వివరించాలన్నారు. పాఠశాలలో ఉపాధ్యాయులు, ఇంటి వద్ద తల్లిదండ్రులు పిల్లలను పర్యవేక్షించాలని సూచించారు. ఉపాధ్యాయులు బాధ్యతగా వ్యవహరించి పోక్సో చట్టంపై అందరికీ అవగాహన కల్పించాలని, చక్కటి వనపర్తి నిర్మాణానికి కృషి చేయాలని కోరారు. సైబర్ నేరాలు, ఆన్లైన్ మోసాలపై అవగాహన కల్పిస్తూ విద్యార్థులు, వారి కుటుంబ సభ్యులను అప్రమత్తం చేయాలన్నారు. డిజిటల్ అరెస్ట్ పేరుతో ఆన్లైన్లో వీడియో కాల్స్ చేసి పోలీసులమంటే నమ్మొద్దని చెప్పారు. కార్యక్రమంలో సీఐ రాంబాబు, కొత్తకోట, పెబ్బేరు, శ్రీరంగాపురం ఎస్ఐలు బి.ఆనంద్, యుగంధర్రెడ్డి, హిమబిందు, వైద్యాధికారులు ఆసియాబేగం, శ్రీనివాసులు, ప్రధానోపాధ్యాయుడు రవి, ఉపాధ్యాయ బృందం, గ్రామస్తులు పాల్గొన్నారు. -
పేదలకు మెరుగైన వైద్యసేవలు
అమరచింత: ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే పేదలకు మెరుగైన వైద్యసేవలు అందించాలని జిల్లా వైద్యాధికారి డా. శ్రీనివాసులు కోరారు. మంగళవారం మండల కేంద్రంలోని డీఎంఆర్ఎం ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో నిర్వహించిన ఆరోగ్య మహిళ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రులు, పీహెచ్సీలు, బస్తీ, పల్లె దవాఖానాల్లో ఉచిత వైద్య శిభిరాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. కంటి, దంత తదితర వైద్య పరీక్షలతో పాటు క్షయ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారని.. ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. శిభిరాలకు వస్తున్న రోగులకు జబ్బుల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించడంతో పాటు తగిన వైద్యసేవలు అందిస్తున్నామన్నారు. అనంతరం పీహెచ్సీ సిబ్బంది పనితీరుతో పాటు ఏఎన్ఎం, ఆశ కార్యకర్తల పనితీరును వైద్యాధికారి డా. ఫయాజ్ను అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రిలో ప్రసవించిన మహిళను పరీక్షించి ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రజలకు నమ్మకం కలిగేలా సాధారణ ప్రసవాలు చేస్తున్నామని చెప్పారు. ఆయన వెంట డా. శ్రావ్యా, డా. మానస, సీహెచ్ఓ సురేష్కుమార్, హెల్త్ సూపర్వైజర్ ఆదిలక్ష్మి తదితరులు ఉన్నారు. -
మహనీయుడు వాల్మీకి మహర్షి
వనపర్తి: దేశానికి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందించిన మహనీయుడు వాల్మీకి మహర్షి అని రెవెన్యూ అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్ కొనియాడారు. మంగళవారం కలెక్టరేట్లో బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో వాల్మీకి మహర్షి జయంతి నిర్వహించగా.. ఆయన హాజరై వాల్మీకి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మహాకవి వాల్మీకి హిందూ ధర్మానికి అతి ముఖ్యమైన రామాయణాన్ని రచించారని, ఈ గ్రంథం ద్వారా సమాజానికి అనేక విలువలు అందించారన్నారు. ప్రపంచం ఉన్నంత వరకు రామాయణ, వాల్మీకి చరిత్ర ఉంటుందని, ఇతిహాసాల్లో మొదటిది రామాయణమన్నారు. నేటి యువత మహనీయుల జీవితాలను ఆదర్శంగా తీసుకొని వారి ఆశయాల సాధనకు కృషి చేయాలని కోరారు. కలెక్టరేట్ ఏఓ భానుప్రకాష్, బీసీ సంక్షేమశాఖ అధికారులు, ఇతర అధికారులు, సిబ్బంది, వాల్మీకి సంఘం నాయకులు, ఇతర ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు. రెవెన్యూ అదనపు కలెక్టర్ ఎన్.ఖీమ్యానాయక్ -
పీహెచ్సీల్లో ప్రసవాల సంఖ్య పెరగాలి
పాన్గల్: గ్రామాల్లోని గర్భిణుల పేర్లు నమోదు చేసుకొని ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే ప్రసవాలు చేయించుకునేలా అవగాహన కల్పిస్తూ కాన్పుల సంఖ్య పెంపునకు వైద్య సిబ్బంది, ఆశ కార్యకర్తలు కృషి చేయాలని జిల్లా అదనపు వైద్యాధికారి డా. శ్రీనివాసులు కోరారు. మంగళవారం మండల కేంద్రంలోని పీహెచ్సీలో నిర్వహించిన ఆశా కార్యకర్తల నెలవారీ సమీక్లకు ఆయన హాజరై మాట్లాడారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అప్రమత్తంగా ఉంటూ నివారణకు తగిన చర్యలు చేపడుతూ ప్రజలను చైతన్యం చేయాలన్నారు. క్షయ, కుష్టు తదితర జాతీయ కార్యక్రమాలపై అవగాహన కల్పిస్తూ ఏ రోజు వివరాలు అదేరోజు నమోదు చేయాలని సూచించారు. విధుల్లో అలసత్వం ప్రదర్శించే వైద్యసిబ్బందిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో పీహెచ్సీ వైద్యుడు డా. చంద్రశేఖర్, ఎంఎల్హెచ్పీ వైద్యులు డా. నాగరాజు, డా. మైథిలి, నిహారిక, వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. -
ధర్మమార్గాన్ని చూపిన వాల్మీకి..
రామాయణ మహాకావ్యంతో ధర్మ మార్గాన్ని చూపిన మహనీయుడు వాల్మీకి అని ఎస్పీ రావుల గిరిధర్ కొనియాడారు. మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన వాల్మీకి జయంతిలో ఆయన పాల్గొని చిత్రపటానికి పూజలు చేసి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నీతి మార్గంలో నడవడమే వాల్మీకికి మనం ఇచ్చే నిజమైన నివాళులన్నారు. ఆయన రచించిన రామాయణం మనిషి జీవనానికి మార్గదర్శక గ్రంథమని.. నేటి యువత వాల్మీకి చూపిన సత్యం, ధర్మం, నీతి మార్గంలో నడుస్తూ సమాజానికి సేవ చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఏఆర్ అదనపు ఎస్పీ వీరారెడ్డి, డీసీఆర్బీ డీఎస్పీ ఉమామహేశ్వరావు, కార్యాలయ ఏఓ సునందన, స్పెషల్ బ్రాంచ్ సీఐ నరేష్, రిజర్వ్ సీఐలు అప్పలనాయుడు, శ్రీనివాస్, జిల్లా పోలీసు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. -
ఎన్నికల్లో సత్తా చాటుదాం : సీపీఎం
అమరచింత: స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని గ్రామాల్లో పార్టీ అభ్యర్థులు బరిలో నిలిచి గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతామని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు జీఎస్ గోపి తెలిపారు. మంగళవారం మండలంలోని చంద్రనాయక్తండా, పాంరెడ్డిపల్లి, కొంకన్వానిపల్లిలో పార్టీ కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. నిరంతరం ప్రజా సమస్యలపై పోరాడుతున్న తమకు ఎన్నికల్లో మద్దతు ఇవ్వాలని కోరారు. సమస్యలపై పోరాడే నాయకులను గెలిపించుకోవడంతో గ్రామాలు, పట్టణాలు అభివృద్ధి చెందుతాయన్నారు. ఎన్నికల సమయంలో లేనిపోని హామీలిచ్చి గెలిచిన తర్వాత సంపాదనే ధ్యేయంగా భావిస్తున్న బుర్జువ పార్టీలకు ఎన్నో పర్యాయాలు అవకాశం ఇచ్చి ప్రజలు విసిగి పోయారని.. వారు కోరుకునే పాలన సీపీఎంకే సాధ్యమని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయలేకపోతోందని.. ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో పేదలకు అవకాశం ఇవ్వకపోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ప్రభుత్వ విధానాలను ప్రజలకు వివరిస్తూ గెలుపే లక్ష్యంగా ముందకు వెళ్లాలని కోరారు. సమావేశంలో పార్టీ నాయకులు వెంకటేష్, అజయ్, రమేష్, రాఘవేంద్ర, శ్రీను, శంకర్, అంజిరెడ్డి, మొగిలన్న, హర్యానాయక్, బాలకృష్ణ పాల్గొన్నారు. హంస ధాన్యం క్వింటా రూ.1,789 దేవరకద్ర: పట్టణంలోని వ్యవసాయ మార్కెట్యార్డులో మంగళవారం హంసధాన్యం క్వింటాల్ రూ. 1,789 ధర పలికింది. ప్రస్తుతం సీజన్ లేకపోవడంతో కేవలం 200 బస్తాల హంస ధాన్యం మాత్రమే అమ్మకానికి వచ్చింది. బుధవారం మార్కెట్ యార్డులో బహిరంగ వేలం ద్వారా ఉల్లి కొనుగోళ్లు చేపట్టనున్నారు. అయితే కొన్ని వారాలుగా ఉల్లి ధరలు నిలకడగా ఉన్నాయి. ఈ వారం ధరలు పెరుగుతాయా లేదా అనే విషయం వేలం ద్వారా తెలియనుంది. -
ఆర్టీసీకి ‘పండుగే’!
దసరా పండుగ రోజుల్లో మహబూబ్నగర్ ఆర్టీసీ రీజియన్కు రికార్డుస్థాయిలో ఆదాయం వచ్చింది. పండుగ వేళ ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆర్టీసీ మహబూబ్నగర్ రీజియన్లోని డిపోల నుంచి అదనపు బస్సు సర్వీసులను నడిపారు. ముఖ్యంగా ఆయా డిపోల నుంచి హైదరాబాద్ రూట్లో ఎక్కువ బస్సులను నడిపించారు. ఈ రూట్లోనే మహబూబ్నగర్ ఆర్టీసీ రీజియన్కు అధిక ఆదాయం వచ్చింది. సెప్టెంబర్ 20వ తేదీ నుంచి ఈనెల 6వ తేదీ వరకు మహబూబ్నగర్ ఆర్టీసీ రీజియన్కు రూ.33కోట్ల 64లక్షల 90వేల ఆదాయం సమకూరింది. 53,07,651 కిలోమీటర్లు బస్సులు తిరగగా 63,19,755 మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చారు. గతేడాది కంటే ఈ ఏడాది బస్సులు 8 లక్షల కిలోమీటర్లు అధికంగా తిరిగి రూ.4 కోట్ల అధిక ఆదాయాన్ని పొందింది. ఆయా రోజుల్లో రాష్ట్రస్థాయిలో మహబూబ్నగర్ రీజియన్ 104 శాతం ఆక్యుపెన్సీ రేషియో సాధించి మొదటి స్థానంలో నిలవడం విశేషం. ఇటీవల రాఖీ పండుగ రోజుల్లో కూడా మహబూబ్నగర్ రీజియన్లో ఓఆర్లో రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలిచింది. ఓఆర్, ఆదాయ వివరాలు డిపోల వారీగా (రూ.లలో..) ఆర్టీసీకి దసరా పండుగ కలిసొచ్చింది. జీవనోపాధి కోసం పట్టణానికి వెళ్లిన వేలాది కుటుంబాలు పండుగ నేపథ్యంలో సొంతూళ్లకు చేరుకున్నారు. ఆనందోత్సాహాలతో వేడుకలు నిర్వహించుకొని తిరిగి వెళ్లిపోయారు.ఈక్రమంలో వారికి ఏ ఇబ్బంది లేకుండా ఆర్టీసీ ప్రత్యేక అదనపు సర్వీసులు నడిపింది. ఉత్తమ సర్వీసులతో ప్రయాణికుల మన్ననలు పొందడంతో పాటు.. రూ.కోట్లలో ఆదాయం ఆర్జించింది మహబూబ్నగర్ రీజియన్. ఆక్యుపెన్సీ రేషియోలోనూ రాష్ట్రంలోనే మొదటిస్థానంలో నిలిచింది. – స్టేషన్ మహబూబ్నగర్ సమష్టి కృషితోనే.. అన్ని డిపోల డ్రైవర్లు, కండక్టర్లు, సూపర్వైజర్లు, ఇతర ఉద్యోగులు సమష్టి కృషి అంకితభావంతో పనిచేయడం వల్ల ఆక్యుపెన్సీ రేషియోలో 104 శాతం సాధించి రాష్ట్రంలోనే మహబూబ్నగర్ రీజియన్ మొదటిస్థానంలో నిలవడం సంతోషంగా ఉంది. దసరా పండుగ రోజుల్లో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా బస్టాండ్లలో పర్యవేక్షణ నిర్వహించాం. ఆర్టీసీ పట్ల ఆదరణ చూపించిన ఉమ్మడి జిల్లాలోని ప్ర యాణికులకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. – పి.సంతోష్కుమార్, రీజినల్ మేనేజర్ దసరా నేపథ్యంలో మహబూబ్నగర్ రీజియన్కు రూ.33.64 కోట్ల ఆదాయం ఆక్యుపెన్సీ రేషియోలో రాష్ట్రంలోనే మొదటిస్థానం పండుగ రోజుల్లో ప్రయాణికుల కోసం ప్రత్యేక అదనపు సర్వీసులు 63 లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చిన వైనం -
దరఖాస్తుల ఆహ్వానం
వనపర్తి: ఉత్తమ ఉపాధ్యాయులు–2025 అవార్డులకుగాను జిల్లాలోని ప్రభుత్వ ఉర్దూ మీడియం పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మైనార్టీ సంక్షేమాభివృద్ధిశాఖ అధికారి అఫ్జలుద్దీన్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ, హైస్కూల్లో పనిచేస్తున్న అర్హులైన ఉపాధ్యాయులు ఈ నెల 14 వరకు జిల్లా మైనార్టీ సంక్షేమశాఖ కార్యాలయంలో దరఖాస్తులను సమర్పించాలని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు ఫోన్నంబర్ 08545–232500ను కార్యాలయ పనిదినాల్లో సంప్రదించాలని సూచించారు.ఎన్నికలు సజావుగా జరిగేలా చూడాలిపాన్గల్: స్థానిక సంస్థల ఎన్నికలు సజావుగా జరిగేలా చూడాలని డీఆర్డీఓ ఉమాదేవి కోరారు. మంగళవారం మండల కేంద్రంలోని బాలుర, బాలికల ఉన్నత పాఠశాలల్లో పీఓ, ఏపీఓల శిక్షణకు ఆమె హాజరై మాట్లాడారు. కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనలు పాటిస్తూ ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా ప్రత్యేక చొరవ తీసుకోవాలన్నారు. శిక్షణలో సూచించిన అన్ని అంశాలను తప్పక పాటించాలని సూచించారు. ఎన్నికల నిబంధనలపై ఆర్పీలకు అవగాహన కల్పించాలని కోరారు. శిక్షణలో 34 మంది పీఓలు, 61 మంది ఏపీఓలు పాల్గొన్నారు. సమావేశంలో తహసీల్దార్ సత్యనారాయణరెడ్డి, ఎంపీడీఓ గోవిందరావు, ఎంఈఓ ఆనంద్, ఆర్ఐలు మహేష్, తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు.సంత స్థల సమస్య పరిష్కరించాలివనపర్తి రూరల్: ప్రభుత్వం, ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ప్రత్యేక చొరవచూపి పెబ్బేరు సంత స్థల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని బీసీ పొలిటికల్ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు రాచాల యుగంధర్గౌడ్ కోరారు. మంగళవారం పెబ్బేరులోని ప్రెస్క్లబ్లో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. పెబ్బేరు గ్రామపంచాయతీ నుంచి పురపాలికగా మారిన తర్వాత చాలా సమస్యలతో సతమతమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. సంత ద్వారా వారానికి రూ.6.36 లక్షల మేర వచ్చే ఆదాయంతో పట్టణాభివృద్ధి చేపట్టేవారని, స్థల వివాదం కోర్టులో ఉండటంతో అభివృద్ధి కుంటుపడిందన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆవరణలో 30 పడకల ఆస్పత్రి నిర్మాణానికి నాలుగు నెలల కిందట ఎమ్మెల్యే శంకుస్థాపన చేసినా.. నేటికీ కాంట్రాక్టర్ పనులు ప్రారంభించలేదని, ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. పట్టణంలో రెండేళ్ల కిందట ప్రారంభించిన వనపర్తి–పెబ్బేరు రహదారి విస్తరణ పనులు నేటికీ అసంపూర్తిగా ఉన్నాయని.. త్వరగా పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో నాయకులు వీవీ గౌడ్, ధరేంద్రసాగర్, దేవర శివ, అంజన్న, జితేందర్, రాఘవేందర్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.స్థానిక ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి గెలుపే లక్ష్యంకొత్తకోట: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి స్థానంలో పార్టీ అభ్యర్థి విజయం సాధించేలా కార్యకర్తలు, నాయకులు కృషి చేయాలని బీజేపీ దేవరకద్ర నియోజకవర్గ ఇన్చార్జ్ కొండా ప్రశాంత్రెడ్డి కోరారు. మంగళవారం మండల కేంద్రంలో నిర్వహించిన పార్టీ ముఖ్య నాయకుల సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. అధికార కాంగ్రెస్పార్టీ వైఫల్యాలను గ్రామాల్లో ప్రజలకు వివరించాలని సూచించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల వరకు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు ప్రత్యామ్నాయంగా గ్రామీణ ప్రాంతాల్లోనూ బీజేపీ పూర్తిస్థాయిలో బలపడాలని.. అందుకు నాయకులు, కార్యకర్తలు శ్రమించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మహబూబ్నగర్ జిల్లా ఉపాధ్యక్షుడు భరత్భూషణ్, జిల్లా కౌన్సిల్ సభ్యుడు కోటేశ్వర్రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు నర్సింహ, సీనియర్ నాయకులు సాయిరాం, పబ్బ నరేందర్గౌడ్, స్టార్ బాలు, దాబా శ్రీనివాస్రెడ్డి, రాఘవేందర్గౌడ్, చిన్న, మూర్తి, రాజమౌళి, వివిధ గ్రామాల ముఖ్య నాయకులు, ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు. -
కార్మికుల బకాయి వేతనాలు చెల్లించాలి
ఖిల్లాఘనపురం: కార్మికుల బకాయి వేతనాలు ప్రభుత్వం వెంటనే చెల్లించాలని తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి పి.సురేష్ డిమాండ్ చేశారు. మంగళవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో విధులు నిర్వర్తిస్తున్న కాంట్రాక్ట్ కార్మికుల సమస్యల వినతిపత్రాన్ని వైద్యులు డా. మాధవి, డా. పుష్పలతకు వినతిపత్రం అందజేశారు. అనంతరం మాట్లాడుతూ.. జీఓ నంబర్ 60ని తుంగలో తొక్కి కార్మికులకు ఇస్తున్న అరకొర వేతనం రూ.11,250 నుంచి కోత విధిస్తూ రూ.9,500 మాత్రమే చెల్లిస్తున్నారన్నారు. అక్రమాలకు పాల్పడుతూ కార్మికుల పొట్టకొడుతున్న వెంకటయ్య సెక్యూరిటీ సర్వీస్ ఏజన్సీ లైసెన్స్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా పెండింగ్లో ఉన్న నాలుగు నెలల వేతనాలను వెంటనే విడుదల చేయాలన్నారు. కార్మికులు భీమన్న, నాగయ్య, మునీందర్, వెంకటేష్, సాయికృష్ణ, నజ్మా, ప్రియాంక, పద్మ పాల్గొన్నారు. -
సమీకృత న్యాయస్థాన భవనంతో మేలు
వనపర్తిటౌన్: నూతన న్యాయస్థాన భవన సముదాయంతో కక్షిదారులు, ప్రజలకు ఎంతోలాభం చేకూరనుందని వనపర్తి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు డి.కిరణ్ కుమార్ అన్నారు. 20 ఎకరాల్లో 10+2 కోర్టు(పోక్సో, ఫ్యామిలీ కోర్టు కాంప్లెక్స్) భవన సముదాయాన్ని నిర్మించనున్నట్లు పేర్కొన్నారు. రూ. 81కోట్లతో నిర్మించనున్న న్యాయస్థానానికి వర్చువల్గా 5వ, తేదీన శిలాఫలకాన్ని ఆవిష్కరించిన తెలంగాణ ప్రధాన న్యాయమూర్తి జస్టీస్ ఆపరేష్ కుమార్ సింగ్ను సోమవారం వనపర్తి బార్ అసోసియేషన్ సభ్యులు హైదరాబాద్లో కలిసి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు జస్టీస్ ఆపరేష్ కుమార్ సింగ్ను సన్మానించారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వెంకటరమణ, సీనియర్ న్యాయవాదులు గోపాల్రెడ్డి, కె.తిరుపతయ్య, ఎండీ నిరంజన్ బాబా, నాచనల్లి రాజు, రామన్న గారి వెంకటేశ్వరరెడ్డి, నరేందర్ బాబు, ఎంఏ కలీం, తరుణ్, మల్లేష్ యాదవ్, సా యి కృష్ణ, పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు. -
పీఓల పాత్ర కీలకం
ఖిల్లాఘనపురం/గోపాల్పేట: త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో పీఓల పాత్ర కీలకమని జిల్లా అదనపు కలెక్టర్ (లోకల్బాడీ) యాదయ్య అన్నారు. సోమవారం ఖిల్లాఘనపురం, గోపాల్ పేట మండల కేంద్రాల్లో పీఓ, ఏపీఓలకు ఎన్నికల నిర్వహణపై శిక్షణ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఆయన టీఓటీలతో మాట్లాడారు. శిక్షణకు వచ్చిన పీఓ, ఏపీఓలకు ఎన్నికలకు సంబంధించిన పోస్టల్ బ్యాలెట్ ఫారం, బ్యాలెట్ బాక్సు నిర్వహణ తదితర అన్ని విషయాల గురించి అవగాహన కల్పించాలని ఆదేశించారు. ఎంపీడీఓ సునీత, ఎంఈఓ జయశంకర్ మాట్లాడుతూ సోమవారం ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పీఓ, ఏపీఓలకు మాత్రమే శిక్షణ ఇచ్చామని, మంగళవారం సర్పంచుల ఎన్నికలకు సంబంధించిన పీఓ, ఏపీఓలకు శిక్షణ ఇస్తామన్నారు. కార్యక్రమంలో ఎంపీఓ రాజు, టీఓటీలు తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలి
అమరచింత: రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి కేశం.నాగరాజ్గౌడ్ అన్నారు. మండలంలోని ఈర్లదిన్నె, నాగల్కడ్మూర్, పాంరెడ్డిపల్లె, మస్తీపురం గ్రామాలలో సోమవారం కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అందిస్తున్న ఇందిరమ్మ ఇళ్లను పేదలకు అందించి ఇంటి నిర్మాణ పనులు పూర్తయ్యేలా చూడాలని కోరారు. స్థానిక ఎన్నికల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ అభ్యర్థులను నిర్ణయించేది కాంగ్రెస్ పార్టీ అధిష్టానమని, అక్కడి నుంచి అభ్యర్థుల ఎంపిక జరుగుతుందన్నారు. పార్టీ బలపర్చిన అభ్యర్థులను గెలిపించుకోవాలని కోరారు. సమావేశంలో డీసీసీ ప్రధాన కార్యదర్శి ఆయూబ్ ఖాన్, కాంగ్రెస్ పార్టీ మండల, పట్టణ అధ్యక్షులు అరుణ్ కుమార్, మహేందర్ రెడ్డి, నాయకులు చుక్క ఆశిరెడ్డి, వెంకటేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పోస్టర్లు, కరపత్రాల ముద్రణలో నిబంధనలు పాటించాలి
వనపర్తి: స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రచార పోస్టర్లు, కరపత్రాల ముద్రణలో ఎన్నికల కమిషన్ నిబంధనలు తప్పకుండా పాటించాలని అదనపు కలెక్టర్ (రెవెన్యూ) ఎన్.ఖీమ్యానాయక్ ప్రింటింగ్ ప్రెస్ యజమానులను ఆదేశించారు. స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ త్వరలో జారీ కానున్న నేపథ్యంలో సోమవారం జిల్లాలోని ప్రింటింగ్ ప్రెస్ యజమానులతో సమావేశం నిర్వహించి ప్రచార సందర్భంగా కరపత్రాలు, పోస్టర్ల ముద్రణలో ప్రింటింగ్ ప్రెస్ యజమానులు పాటించాల్సిన నియయాలపై అవగాహన కల్పించారు. ప్రచార సామగ్రి అయిన పోస్టర్లు, కరపత్రాల్లో ఎక్కడ కులం, మతపరమైన అంశాలను ప్రస్తావించరాదని, అదేవిధంగా వ్యక్తిగత విమర్శలు లేకుండా చూసుకోవాలని సూచించారు. పబ్లిషర్ నుంచి ఫారం ఏ లో డిక్లరేషన్ తీసుకోవాలని, ఫారం ఏ, బీ తో పాటు ముద్రించిన 4 కరపత్రాలను జతపరచి మండల కార్యాలయానికి లేదా కలెక్టరేట్కు పంపించాలన్నారు. ముద్రించిన కరపత్రం లేదా వాల్పోస్టర్పై ప్రింటింగ్ ప్రెస్ పేరు, చిరునామా ఖచ్చితంగా పేర్కొనాలని, ఎన్ని పేజీలు ముద్రించారు, అందుకు తీసుకున్న పైకం ఎంత అనే వివరాలు ఫారం–బీ లో చూపెట్టాలన్నారు. కార్యక్రమంలో జిల్లా పౌర సంబంధాల అధికారి పి.సీతారాం, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, సెక్షన్ సూపరింటెండెంట్ మదన్మోహన్, ప్రింటింగ్ ప్రెస్ యజమానులు పాల్గొన్నారు. నిష్పక్షపాతంగా ఎన్నికల విధులు నిర్వహించాలి పాన్గల్: స్థానిక సంస్థలు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో పాల్గొనే అధికారులు, సిబ్బంది తమ విధులను నిష్పక్షపాతంగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ (రెవెన్యూ) ఖీమ్యానాయక్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో ఎన్నికల విధులు నిర్వహించే పీఓ, ఏపీఓలకు నిర్వహించిన శిక్షణ తరగతులను జేసీ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఓటు వేసేందుకు వచ్చే ఓటర్లకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ఎటువంటి రాజకీయ ఒత్తిడిలకు గురికాకుండా వివాదరహితంగా పోలింగ్ ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. ప్రిసైడింగ్ అధికారి, సహాయ ప్రిసైడింగ్ అధికారులు పోలింగ్ కేంద్రాల పనితీరు, డిస్ట్రిబ్యూషన్, బ్యాలెట్ పేపర్లు, బ్యాలెట్ బాక్స్లు తెరవడం, బాక్స్లను సీజ్ చేయడం వంటి అంశాలపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఎన్నికల విధుల్లో అలసత్వం వహిస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శిక్షణలో టెండర్ బ్యాలెట్, చాలెంజింగ్ ఓట్లపై ఆర్పీలు అవగాహన కల్పించారు. శిక్షణకు 34 మంది పీఓలు, 61 మంది ఏపీఓలు హాజరయ్యారు. రెండు రోజుల పాటు నిర్వహించే శిక్షణలో రెండో రోజు పంచాయతీ ఎన్నికలపై శిక్షణ ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. సమావేశంలో డీఆర్డీఓ ఉమాదేవి, తహసీల్దార్ సత్యనారాయణరెడ్డి, ఎంపీడీఓ గోవింద్రావు, ఏపీఓ కుర్మయ్య, ఆర్ఐలు మహేష్, తిరుపతయ్య, సిబ్బంది మల్లేష్, శివరామ్ పాల్గొన్నారు. -
టన్ను చెరుకుకు రూ.6 వేల ధర ఇవ్వాలి
అమరచింత: కేంద్ర ప్రభుత్వం క్వింటాల్ పత్తికి రూ.7వేల మద్దతు ధర ఇచ్చినట్లుగానే టన్ను చెరుకుకు రూ.6 వేల మద్దతు ధర ప్రకటించాలని కృష్ణవేణి చెరుకు రైతు సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు రాజన్న డిమాండ్ చేశారు. దీంతో పాటు ఈ సంవత్సరం చెరుకు రైతులకు కృష్ణవేణి చెరుకు ఫ్యాక్టరీ ఇస్తున్న సబ్సిడీలను వచ్చే ఏడాది కూడా వర్తింపచేయాలని కోరారు. చెరుకు రైతుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సోమవారం రైతులతో కలిసి ఫ్యాక్టరీ జీఎం వీపీ రామరాజుకు వినతిపత్రం అందించారు. అనంతరం ఫ్యాక్టరీ సిబ్బందితో కలిసి సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తమ సంఘం వినతి మేరకు కృష్ణవేణి చెరుకు ఫ్యాక్టరీ యాజమాన్యం గతేడాది నుంచి చెరుకు రైతులకు పంటలపై సబ్సిడీలను అందిస్తుందని తెలిపారు. ప్రస్తుతం ఇస్తున్న సబ్సిడీలను 2026–2027 సీజన్లో కూడా వర్తింపచేయాల్సిన అవసరం ఉందన్నారు. పెరిగిన ధరల ప్రకారం కంపెనీ ఇస్తున్న బోనస్తో కలిపి టన్ను చెరుకుకు రూ.ఆరు వేల మద్దతు ధరను ఇవ్వాలన్నారు. చెరుకు రైతులకు ఇబ్బంది లేకుండా ఫ్యాక్టరీ యాజమాన్యం కార్మికులను ముందస్తుగా రప్పించి, పంట కోతలు పూర్తి చేసి వెంటనే డబ్బులను చెల్లించాలని డిమాండ్ చేశారు. రైతు సమస్యలను పరిష్కరిస్తామని, సబ్సిడీలను వచ్చే సంవత్సరం కూడా కొనసాగిస్తామని ఫ్యాక్టరీ జీఎం హామీ ఇవ్వడం హర్షణీయమన్నారు. కార్యక్రమంలో కృష్ణవేణి చెరుకు రైతు సంఘం ఉమ్మడి జిల్లా నాయకులు వాసారెడ్డి, వెంకటేశ్వర్రెడ్డి, నారాయణ, రాజశేఖర్, చంద్రసేనారెడ్డి, రంగారెడ్డి, శాలిమియా, మహేంద్రచారి, వీరన్న, రవి, రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పోలింగ్ ప్రక్రియపై అప్రమత్తంగా ఉండాలి
అమరచింత: ఎన్నికల నిర్వహణలో అతిముఖ్యమైన పోలింగ్ ప్రక్రియ రోజు అప్రమత్తంగా ఉంటూ ఓటరు తన ఓటు హక్కును సద్వినియోగించుకునే విధంగా చూడాలని పీఓ, ఏపీఓలకు జెడ్పీ డిప్యూటీ సీఈఓ రామేశ్వర్రావు సూచించారు. ఎన్నికల నిర్వహణపై మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్తగా ఓటు హక్కును సద్వినియోగం చేసుకునేందుకు వచ్చిన వారిని నిషితంగా పరిశీలించి, వారి వయస్సుపై అనుమానం ఉంటే సంబంధిత అధికారులకు తెలియ పర్చాలన్నారు. వృద్ధులు, దివ్యాంగుల వ్యవహారంలో సానుకూలంగా ఉండి వారు ఓటు హక్కును సద్వినియోగించుకునే విధంగా చూడాల్సి న అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో మండల ప్రత్యే ్డక అధికారి అప్జలుద్దీన్, తహసీల్దార్ రవికుమార్ యాదవ్, ఎంపీడీఓ శ్రీనివాసులు, ఎంఈఓ భాస్కర్ సింగ్, ఎంపీఓ నరసింహులు తదితరులు పాల్గొన్నారు. జెడ్పీ డిప్యూటీ సీఈఓ రామేశ్వర్రావు -
స్థానిక సంస్థల ఎన్నికల్లో కోర్టు తీర్పు కీలకం
వనపర్తి రూరల్: స్థానిక సంస్థల ఎన్నికల్లో కోర్టు తీర్పు కీలకం కానుందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ మండల అఽధ్యక్షుడు మాణిక్యం అధ్యక్షతన స్థానిక సంస్థల ఎన్నికలపై సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్యకర్తల ఏకాభిప్రాయంతోనే అభ్యర్థుల ఎంపిక ఉంటుందని వివరించారు. పార్టీ పట్ల విధేయత, నాయకుడి పట్ల విశ్వాసం ఉన్న వారికి ప్రాధాన్యత ఉంటుందన్నారు. నియోజక వర్గంలో మెజార్టీ సీట్లు గెలుస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో భానుప్రకాష్రావు, విజయ్కుమార్, మతీన్, రఘువర్ధన్ రెడ్డి, రవిప్రకాష్రెడ్డి, ధర్మానాయక్, మాదవరెడ్డి, నందిమల్ల అశోక్, నరసింహ, టీక్యా నాయక్, చిట్యాల రాము, ధర్మశాస్త్రి, కృష్ణా నాయక్, మోతిలాల్నాయక్ పాల్గొన్నారు.చిన్నారుల ఎదుగుదలపై ప్రత్యేక దృష్టివనపర్తి రూరల్: అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే చిన్నారుల ఎదుగుదలపై అంగన్వాడీ టీచర్లు ప్రత్యేక దృష్టి సారించాలని సీడీపీఓ హజీరాబేగం సూచించారు. పోషణ మాసం సందర్భంగా సోమవారం మండలంలోని చిమనగుంటపల్లి అంగన్వాడీ కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆమె మాట్లాడుతూ.. బరువు తక్కువగా ఉన్న చిన్నారులను గుర్తించి వారి ఎదుగుదలకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా పౌష్టికాహారం అంధించడంతో పాటు వారు తీసుకుంటున్న ఆరోగ్య జాగ్రత్తలపై ఎప్పటికప్పుడు పరిశీలించాలని ఆదేశించారు. గర్భిణులకు రక్తహీనతపై అవగాహన కల్పించాలన్నారు. ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, బాలింతలకు అందజేస్తున్న పౌష్టికాహారాన్ని సక్రమంగా పంపిణీ చేయాలని సూచించారు.సుప్రీంకోర్టు సీజేఐపై దాడి హేయమైన చర్యగద్వాల: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గవాయ్పై సోమవారం కోర్టుహాలులో జరిగిన దాడి హేయమైన చర్య అని, ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ప్రజాసంఘాలు, దళిత, ఉపాధ్యాయ, బహుజన సంఘాల నాయకులు తెలిపారు. సోమవారం జిల్లా కేంద్రంలోని స్థానిక అంబేడ్కర్చౌరస్తాలో నిరసన తెలిపారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ ఓ కేసు విచారణలో జరుగుతున్న వాదనల క్రమంలో ఓ మతాన్ని వంటపట్టించుకున్న ఓ మతోన్మాది అయిన న్యాయవాది దేశంలోనే అత్యున్నత న్యాయస్థాన ప్రధాన న్యాయమూర్తిపై దాడికి యత్నించడం క్షమించరానిదని ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు వంటిదన్నారు. దాడికి యత్నించిన న్యాయవాదిని చట్టప్రకారం కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు మోహన్, వాల్మీకి, హనుమంతు, ప్రభాకర్, నాగర్దొడ్డి వెంకట్రాములు, పల్లయ్య, రాజు, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. -
ఎర్ర మట్టి అక్రమ తరలింపు
● చోద్యం చూస్తున్న మైనింగ్, రెవెన్యూ, పోలీసు అధికారులు ● తండావాసుల ఫిర్యాదుతో వెలుగులోకి.. ●మట్టి తవ్వకానికి ఎవరికి అనుమతులు ఇవ్వలేదు. సర్వే నంబర్ 34లో ప్రభుత్వ భూమి ఉండడంతో కొందరికి అసైన్మెంటు పట్టాలు ఇచ్చాం, అందులో కొంత భాగం మిగులు భూమి కూడా ఉంది. దీంతో పాటు కొంత పట్టా భూములు కూడా ఉన్నాయి. దీనిపై సమగ్ర విచారణ జరిపి ప్రభుత్వ భూమిలోనా లేక పట్టా భూమిలో తవ్వారా అనే విషయాలు పరిశీలించి తగు చర్యలు తీసుకుంటాం. – సత్యనారాయణరెడ్డి, తహసీల్దార్ పాన్గల్: మండలంలోని కిష్టాపూర్తండా సమీపంలోని సర్వే నంబర్ 34లో ఎలాంటి అనుమతులు లేకుండా కొందరు ఇష్టానుసారంగా ఎర్రమట్టిని తరలిస్తున్నా మైనింగ్, రెవెన్యూ, పోలీసులు అధికారులు తమకేమి పట్టనట్లు వ్యవహరిస్తున్నారని తండావాసులు ఆరోపిస్తున్నారు. కొన్ని రోజుల నుంచి మిషన్లు పెట్టి టిప్పర్ల ద్వారా మట్టిని తరలిస్తూ సొమ్ము చేసుకోవడంతో పాటు పర్యావరణానికి భంగం కలిగించడం, ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నా అధికారులు చర్యలు తీసుకోకుండా చోద్యం చూస్తున్నారని తండావాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి నిత్యం టిప్పర్ల ద్వారా మట్టిని తరలిస్తూ రోడ్లను ధ్వంసం చేస్తుండడంపై మండల అధికారులు, పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు స్పందించకపోవడంతో సోమవారం తండావాసులు జిల్లా మైనింగ్, ఎస్పీకి ఫిర్యాదు చే యడంతో అక్రమ మట్టి దందా వెలుగులోకి వ చ్చింది. తండావాసుల ఫిర్యాదు మేరకు జిల్లా అధికారులు మట్టి తవ్వే ప్రాంతాన్ని ఆకస్మికంగా సందర్శించి, వివరాలు సేకరించినట్లు సమాచారం. -
కార్మిక చట్టాలు పకడ్బందీగా అమలు చేయాలి
వనపర్తి రూరల్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక చట్టాలు యజమాన్యాల కుట్రలో నిర్వీర్యం కాకుండా పకడ్బందీగా అమలు చేయాలని తెలంగాణ మెడికల్ కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్(ఏఐటీయూసీ) రాష్ట్ర కార్యదర్శి పీ.సురేష్ డిమాండ్ చేశారు. సోమవారం ఆయన జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలో పనిచేస్తున్న కాంట్రాక్టు పారిశుద్ధ్య, సెక్యూరిటీ కార్మికుల ఉమ్మడి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ మెడికల్ కళాశాలలో పని చేస్తున్న కాంట్రాక్టు పారిశుద్ధ్య, సెక్యూరిటీ కార్మికులకు లేబర్ జీఓ కాకుండా పీఆర్సీ జీఓ 60 అమలు చేయడంతో కార్మికులకు రూ. 15,600 వేతనాలు పెంచుతున్నట్లు ప్రభుత్వ కాగితాల్లో అంకెలు చూపుతున్నా, దొడ్డి దారిన యజమాన్యాలకు అనుకూలంగా సర్క్యులర్ జారీ చేసి క్షేత్రస్థాయిలో కార్మికులకు తీరని అన్యాయం చేశారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏజెన్సీల కాలపరిమితి ముగిసిందని, ప్రస్తుత ప్రభుత్వం రూ.26 వేలు కనీస వేతనం నిర్ణయించి జీఓ విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. పాలకుల ఉదాసీన వైకరి ఫలితంగా 2012 నుంచి నేటి వరకు కనీస వేతన జీఓ 68, 43లు సవరణకు నోచుకోలేదని, దీంతో కార్మికులు తీవ్రమైన ఆర్థిక శ్రమ దోపిడీకి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కార్మికులు ఎస్ వరుణ్, మన్నెమ్మ, చెన్నమ్మ, సుధ, శోభ, శారద, లావణ్య, శివలీల, రాజేశ్వరి, నారమ్మ, బొజ్జమ్మ, తదితరులు పాల్గొన్నారు. -
పొంచి ఉన్న ప్రమాదం
ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు ప్రధాన ఎడమ కాల్వ వెంట రామన్పాడు రిజర్వాయర్ వరకు ఉన్న కాల్వపై నిర్మించిన వంతెనలు శిథిలావస్థకు చేరుకున్నాయి. కాల్వ వెంట ఉన్న కచ్చా రహదారిపై ఆటోలు, ట్రాక్టర్లు, ద్విచక్ర వాహనాలు నిత్యం రాకపోకలు సాగిస్తుంటాయి. మూలమళ్ల–నందిమళ్ల సమీపంలో ఉన్న ఎడమ కాల్వ వద్ద వంతెన దిమ్మెలు కూలి ప్రమాదకరంగా మారింది. ఎప్పుడు ఎలాంటి ప్రమాదం జరుగుతుందోనని ఆయా గ్రామస్తులు ఆందోళనకు గురవుతున్నారు. అధికారులు, పాలకులు పట్టించుకొని కాల్వ వెంట ఉన్న శిథిల వంతెనల మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు. – అమరచింత -
నేతన్న.. నిరాశ !
●ఏడాది పూర్తయినా అమలుకు నోచుకోని రుణమాఫీ స్థానిక యూనియన్ బ్యాంక్లో రూ.75 వేల చేనేత రుణం తీసుకున్నా. క్రమం తప్పకుండా చెల్లించడం, లేదా ఏటా వడీ చెల్లించి పునరుద్ధరించుకుంటూ వస్తున్నాం. ప్రభుత్వం చేనేత రుణమాఫీ వర్తింపజేస్తామని ప్రకటించడంతో వడ్డీ డబ్బులు చెల్లించలేదు. రుణం పునరుద్ధరించుకోవాలని.. లేని పక్షంలో ప్రతినెల రూ.750 వడ్డీ చెల్లించమంటూ బ్యాంకు మేనేజర్ వత్తిడి చేస్తున్నారు. – కొంకతి శకుంతలమ్మ, నేత కార్మికురాలు, అమరచింత మా కుటుంబం చేనేతపై ఆధారపడి జీవిస్తోంది. కుటుంబ పోషణతో పాటు చీరల తయారీకి కావాల్సిన ముడి సరుకుల కోసం బ్యాంకులో రూ.75 వేల రుణం తీసుకున్నాం. ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీ నేటికీ వర్తించకపోవడంతో రుణం చెల్లించాలని బ్యాంకు ఖాతా లావాదేవీలు నిలిపివేశారు. ఖాతా పునః ప్రారంభం కోసం వడ్డీ డబ్బులు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నాం. – గుండాల బుచ్చన్న, నేత కార్మికుడు, అమరచింత రాష్ట్ర ప్రభుత్వం చేనేత రుణమాఫీ ప్రకటించి ఏడాది పూర్తయినా నేటికీ ఆ నిధులు మంజూరు చేయకపోవడంతో నేతన్నలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చాలీచాలని వేతనాలతో కుటుంబాలను నెట్టుకొస్తున్న చేనేత కార్మికులపై బ్యాంకు మేనేజర్ వేధింపులు అధికమవుతున్నాయి. ప్రభుత్వం త్వరితగతిన రుణమాఫీ ప్రక్రియ పూర్తిచేసి నేతన్నలను ఆదుకోవాలి. – వగ్గు రామలింగం, ఉపాధ్యక్షుడు, అమరచింత చేనేత సహకార సంఘం జిల్లాలో 338 మంది చేనేత కార్మికులకు రుణమాఫీ వర్తించనుంది. సుమారు రూ.2.21 కోట్లు కార్మికులకు అందనున్నాయి. పూర్తి వివరాలతో డీసీఎల్ కమిటీ ఆమోదం తర్వాత రాష్ట్ర కమిటీకి నివేదించాం. ప్రభుత్వం నుంచి నిధులు విడుదలైతే కార్మికుల ఖాతాల్లో నేరు గా రుణమాఫీ డబ్బులు జమ అవుతాయని కార్మికులకు వివరిస్తున్నాం. రుణాల పునరుద్ధరణ వ్యవహారం తమ పరిధి కాదని మా వద్దకు వస్తున్న నేతన్నలకు వివరిస్తున్నాం. – గోవిందయ్య, ఏడీ, చేనేత జౌళిశాఖ, గద్వాల అమరచింత: రైతుల మాదిరి నేత కార్మికులకు కూడా రూ.లక్ష రుణమాఫీ వర్తింపజేస్తున్నామని గతేడాది ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా ప్రకటించారు. ఏడాది పూర్తయినా ఇప్పటి వరకు వర్తింపజేయకపోవడం.. బ్యాంకు సిబ్బంది రుణాలు తిరిగి చెల్లించాలంటూ వత్తిడి పెంచడంతో నేత కార్మికులు ఆందోళన చెందుతున్నారు. చేనేత, జౌళిశాఖ అధికారులు రుణమాఫీ అర్హుల జాబితాను సదరు బ్యాంకర్ల నుంచి సేకరించి పూర్తి నివేదికను రాష్ట్ర కమిటీకి అప్పగించినా.. నేటికీ కార్మికుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమకాలేదు. ఇటీవల తీసుకున్న రుణం తిరిగి చెల్లించని కారణంగా అమరచింత యూనియన్ బ్యాంకు మేనేజర్ చేనేత కార్మికుల లావాదేవీలు నిలిపివేయడంతో కార్మికులు బ్యాంకు ఎదుట ఆందోళన చేపట్టారు. రుణమాఫీ గురించి జౌళిశాఖ అధికారులను అడిగితే ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తామని చెప్పిందని.. వచ్చిన వెంటనే రుణమాఫీ వర్తిస్తుందని చెప్పుకొస్తున్నారు. ప్రతి నెల రూ.వెయ్యి వడ్డీ చెల్లించాల్సి వస్తోందని.. లేదంటే బ్యాంకు ఖాతా లావాదేవీలు నిలిపివేస్తున్నారని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం సానుకులంగా స్పందించి రుణమాఫీ నిధులు వెంటనే విడుదల చేయాలని కోరుతున్నారు. జిల్లాలో 338 మంది కార్మికులు అర్హులుగా గుర్తింపు రుణగ్రస్తుల వివరాలు సేకరించినా.. ఫలితం శూన్యం రూ.2.21 కోట్ల మాఫీపై వీడని చిక్కుముడి రుణాలు చెల్లించాలంటూ బ్యాంకు సిబ్బంది వత్తిడి జిల్లాలోని అమరచింత, ఆత్మకూర్, పెద్దమందడి, కొత్తకోటలో నేత కార్మికులు తమ వృత్తిని కొనసాగిస్తూ కుటుంబాలను పోషించుకుంటున్నారు. పెద్దమందడిలోని వెల్టూర్, ఖిల్లాఘనపురంలోని సోలీపురం గ్రామంలో మాత్రం ఉన్ని మగ్గాలు కొనసాగుతుండగా.. మిగిలిన ప్రాంతాల్లో మగ్గాలపై జరి చీరలు తయారు చేస్తున్నారు. జిల్లాలో 1,090 మంది నేత కార్మికులు ఉండగా.. జియో ట్యాగింగ్ కలిగిన మగ్గాలు 338 ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. ప్రతి మగ్గానికి 3 కార్మికుల చొప్పున సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి. అమరచింత చేనేత సహకార సంఘం సభ్యులు 309 మంది స్థానిక యూనియన్ బ్యాంక్, ఆత్మకూర్లోని డీసీసీబీ బ్యాంకులో చేనేత రుణాలు పొందారు. ఆత్మకూర్ మండలంలోని తిప్పడంపల్లిలో ఐదుగురు, కొత్తకోటలో 24 మంది నేతన్నలు రుణాలు తీసుకున్నట్లు అధికారుల లెక్కలు వెల్లడిస్తున్నాయి. రుణాలు పొందిన కార్మికుల వివరాలను డీసీఎల్ కమిటీ ఆమోదించి రాష్ట్ర కమిటీకి పంపి 5 నెలలు గడుస్తున్నా రుణమాఫీ నిధులు మంజూరుగాకపోవడంతో నేతన్నలు ఆందోళనకు గురవుతున్నారు. 2017 నుంచి చేనేత రుణం తీసుకున్న వారి వివరాలతో పాటు మొత్తం ఎంత మేర మాఫీ అవుతుందన్న విషయాలను సైతం జౌళిశాఖ అధికారులు వివరించారు. జిల్లావ్యాప్తంగా 338 మంది చేనేత కార్మికులు రుణం పొందారని.. రూ.2.21 కోట్ల రుణమాఫీ నేతన్నలకు అందనున్నట్లు తెలిపారు. -
పాలమూరు బిడ్డలు మట్టిలో మాణిక్యాలు
వనపర్తి రూరల్: కమ్యూనిస్టు ఉద్యమాలను నిర్మించడంలో, వాటిని కొనసాగించడంలో, భావితరాలకు ఉద్యమాల బాట వేయడంలో పాలమూరు బిడ్డలు మట్టిలో మాణిక్యాలుగా తయారయ్యారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ అన్నారు. ఆదివారం మండలంలోని చిట్యాలలో ఉన్న ఓ కన్వెన్షన్ హాల్లో సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు ఎండీ జబ్బార్ అధ్యక్షతన పుట్టా వరలక్ష్మి సంస్మరణ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయనతో పాటు రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, పలువురు రాష్ట్ర ,కేంద్ర కమిటీ సభ్యులు పాల్గొని ఆమే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళుల ర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కామ్రేడ్ వరలక్ష్మి విద్యార్థి దశ నుంచే ఉద్యమ బాటపట్టి విద్యార్థి ఉద్యమంలో చురుగ్గా పనిచేస్తున్న పుట్టా ఆంజనేయులుకు తోడునీడగా ఉండేందుకు నిర్ణయించుకొని జీవిత సహచరి కావడం గొప్ప విషయమన్నారు. వందలాది మంది మహిళలు లక్ష్మీదేవమ్మ, వరలక్ష్మిలుగా తయారు కావాలని ఆకాంక్షించారు. -
సీఎం చొరవతోనే కేంద్రీయ విద్యాలయం మంజూరు
వనపర్తిటౌన్: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రత్యేక చొరవతోనే జిల్లాకు కేంద్రీయ విద్యాలయం మంజూరైనట్లు రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు డా. జిల్లెల చిన్నారెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాకు కేంద్రీయ విద్యాలయం కోసం సీఎంను కోరగా.. ఆయన కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపి మంజూరయ్యేలా కృషి చేశారని పేర్కొన్నారు. ఈ మేరకు సీఎంకు ధన్యవాదాలు తెలుపడంతో పాటు విద్యాలయ నిర్మాణానికి ప్రభుత్వ స్థలం కేటాయింపు, నిధుల మంజూరు త్వరితగతిన జరిగేందుకు కృషి చేస్తానని తెలిపారు.అమ్మవారికి ప్రత్యేక పూజలువనపర్తి రూరల్: పెబ్బేరులోని కన్యకాపరమేశ్వరి ఆలయాన్ని ఆదివారం రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి దర్శించుకొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు పూజల అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేయగా.. ఆలయ కమిటీ సభ్యులు శాలువాతో సన్మానించారు.రూ.13.20 లక్షలు పలికిన అమ్మవారి చీరలువనపర్తి రూరల్: మండలంలోని చిట్యాల రామలింగేశ్వరస్వామి ఆలయం వద్ద ప్రతిష్టించిన దుర్గాదేవికి దేవి శరవన్నవరాత్రి ఉత్సవాల్లో అలంకరించిన చీరల వేలాన్ని శనివారం రాత్రి ఆలయ కమిటీ సభ్యులు నిర్వహించారు. గ్రామంలోని భక్తులు వేలంలో పాల్గొని రూ.13.20 లక్షలకు దక్కించుకున్నారు. అందులో ఒక చీరను తిరుపతిరావు అనే భక్తుడు రూ.2.05 లక్షలు పాటపాడి దక్కించుకున్నారు.11న పీయూలో జాబ్మేళామహబూబ్నగర్ మున్సిపాలిటీ: పురుష అభ్యర్థులకు ఈ నెల 11న పీయూ క్యాంపస్లో మెగా జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు ప్లేస్మెంట్ అధికారి అర్జున్కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎమ్మెస్సీ కెమిస్ట్రీ, మైక్రో బయాలజీ, ఎం–ఫార్మసీ, బీ–ఫార్మసీ, బీటెక్ (మెకానికల్, ఎలక్ట్రికల్, కెమికల్, ఇన్స్ట్రుమెంటేషన్), బీఎస్సీ కెమిస్ట్రీ, ఇంటర్, ఐటీఐ 2021 నుంచి 2025 మధ్య ఉత్తీర్ణులైన వారు అర్హులన్నారు. ఆసక్తి గలవారు ఈ నెల 8లోగాhttps://forms.gle/ctBZNQ1ByU5B6xKB6 రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. పూర్తి వివరాలకు సెల్ నం.98494 45877ను సంప్రదించాలని సూచించారు. టీజీసీహెచ్సీ, జాతీయ బల్క్ డ్రగ్ తయారీదారుల సమాఖ్య సహకారంతో ఈ నెల 11 ఉదయం 10 గంటల నుంచి పీయూలోని పీజీ కళాశాల సెమినార్ హాల్లో ఎంపికలు నిర్వహిస్తామన్నారు. ఎంపికై న వారు ఆయా కంపెనీల్లో క్యూసీ, క్యూ, కెమిస్ట్, మెషిన్ ఆపరేటర్లుగా పనిచేయాల్సి ఉంటుందన్నారు. -
న్యాయఫలాలు అందరికీ అందాలి
● మెరుగైన వసతులతోనే న్యాయసేవలు ● జిల్లాకేంద్రంలో రూ.81 కోట్లతో న్యాయస్థానాల సముదాయం నిర్మాణానికి శంకుస్థాపన ● వర్చువల్గా ప్రారంభించిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆపరేష్కుమార్ సింగ్ వనపర్తిటౌన్: న్యాయసేవలు సామాన్యుల దరి చేరేందుకు న్యాయమూర్తులు, న్యాయవాదులు మెరుగైన పాత్ర పోషించాలని తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆపరేష్కుమార్ సింగ్ అన్నారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని వైద్యకళాశాల సమీపంలో రూ.81 కోట్లతో 20 ఎకరాల విస్తీర్ణంలో కోర్టు సముదాయం నిర్మాణానికి వర్చువల్గా శంకుస్థాపన చేసి శిలా ఫలకాన్ని ఆవిష్కరించగా.. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ మాధవి, జస్టిస్ అనిల్ జూకంటి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ.. న్యాయవాదులు కక్షిదారులకు న్యాయ ఫలాలు చేరువ చేసేందుకు తగిన చొరవ చూపాలని సూచించారు. ప్రజలకు న్యాయవ్యవస్థపై బలమైన విశ్వాసం ఉందని... దానిని పదిలపర్చడంలో న్యాయవాదులు ముందుండాలన్నారు. మెరుగైన వసతులతో కూడిన న్యాయస్థానాల ద్వారా అందరికీ న్యాయ ఫలాలు దక్కాలని ఆకాంక్షిస్తున్నట్లు వెల్లడించారు. అనంతరం కోర్టు ఆవరణలో నిర్వహించిన సమావేశంలో జస్టిస్ అనిల్కుమార్ జూకంటిి మాట్లాడుతూ... న్యాయవ్యవస్థలో ప్రజలందరికీ న్యాయం చేకూర్చడానికి మౌలిక వసతుల ఏర్పాటు అవసరమన్నారు. కోర్టు సముదాయ నిర్మాణంలో అందరి కృషి ఉందని.. జిల్లాలో లీగల్ లిటరసీ కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. జస్టిస్ మాధవి మాట్లాడుతూ.. తాను ఉమ్మడి పాలమూరు జిల్లా ఆడబిడ్డనే అని చెబుతూ, వనపర్తిలో సంస్థానాధీశుల కాలం నుంచే న్యాయస్థానాలు ఏర్పాటు చేసి ప్రజలకు న్యాయసేవలు అందించే వ్యవస్థ ఉందని గుర్తుచేశారు. కొత్త భవనాల నిర్మాణంలో వనపర్తి బార్ అసోసియేషన్ సభ్యులు, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు జిల్లెల చిన్నారెడ్డి, మాజీ మంత్రి నిరంజన్రెడ్డి కృషి ఉందన్నారు. -
మరో కొత్త రహదారి
ఫ్యూచర్ సిటీ నుంచి మన్ననూర్ వరకు అనుసంధానంఎలివేటెడ్ కారిడార్ నిర్మాణ విషయాన్ని సీఎం రేవంత్రెడ్డి కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లగా.. సానుకూలంగా స్పందించారు. ఫ్యూచర్ సిటీ నుంచి ఆకుతోటపల్లి వరకు ఇప్పటికే గ్రీన్ ఫీల్డ్ రహదారి నిర్మాణానికి టెండర్ల ప్రక్రియ పూర్తయింది. ఆకుతోటపల్లి నుంచి బ్రాహ్మణపల్లి వరకు కొత్త గ్రీన్ఫీల్డ్ రోడ్డు కోసం అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. ఈ రహదారి నిర్మాణం జరిగితే హైదరాబాద్– శ్రీశైలం మధ్య సుమారు 40 కి.మీ. దూరం తగ్గుతుంది. – వంశీకృష్ణ, ఎమ్మెల్యే, అచ్చంపేట అచ్చంపేట: హైదరాబాద్– శ్రీశైలం జాతీయ రహదారి–765 త్వరలోనే నాలుగు వరుసలుగా మారనుంది. రావిర్యాల– ఆమనగల్– మన్ననూర్ గ్రీన్ఫీల్డ్ రహదారితోపాటు శ్రీశైలం జాతీయ రహదారిలోని అమ్రాబాద్ టైగర్ రిజర్వు ఫారెస్టులో వన్యప్రాణులకు ఇబ్బంది కలగకుండా మన్ననూర్– శ్రీశైలం మధ్య నాలుగు వరుసల ఎలివేటెడ్ కారిడార్ నిర్మించాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి గత నెల 9న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కోరగా.. ఆయన సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం గేట్ నుంచి ఆమనగల్, కొట్ర, డిండి, హాజీపూర్ (బ్రాహ్మణపల్లి) వరకు నాలుగు వరుసల రహదారి ఏర్పాటుకు సర్వే నిర్వహించి.. హద్దులు కూడా నిర్ణయించారు. ఈ రహదారి విస్తరణకు మూడేళ్ల క్రితమే కేంద్రం గ్రీన్సిగ్నల్ ఇచ్చినప్పటికీ నిధులు మాత్రం మంజూరు కాలేదు. ఇప్పుడు కొత్త గ్రీన్ ఫీల్డ్ రహదారితో ఇబ్బందులు తొలగనున్నాయి. ఆకుతోటపల్లి– మన్ననూర్.. శ్రీశైలం, నాగార్జునసాగర్ జాతీయ రహదారులకు అనుసంధానంగా ఫ్యూచర్ (ఫోర్త్) సిటీని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. రెండు జాతీయ రహదారుల మధ్య నిర్మించనున్న గ్రీన్ఫీల్డ్ రోడ్డు ఎంతో కీలకం కానుంది. రావిర్యాల ఓఆర్ఆర్ ఎగ్జిట్ 13 నుంచి మీర్ఖాన్పేట వరకు.. అక్కడి నుంచి రీజినల్ రింగ్ రోడ్డు ఆమనగల్ (ఆకుతోటపల్లి) వరకు ప్రతిపాదించిన 330 అడుగుల రతన్టాటా గ్రీన్ఫీల్డ్ రహదారికి ఇప్పటికే టెండర్ల ప్రక్రియ పూర్తయింది. మొదటి దశలో రావిర్యాల నుంచి మీర్ఖాన్పేట్ వరకు రూ.1,665 కోట్లతో చేపట్టనున్న 19.20 కి.మీ. రోడ్డును రిత్విక్ సంస్థ, రెండో దశలో మీర్ఖాన్పేట్ నుంచి ఆమనగల్ వరకు చేపట్టనున్న 22.3 కి.మీ. రోడ్డును ఎల్అండ్టీ సంస్థ రూ.2,365 కోట్లకు దక్కించుకున్నాయి. భూ సేకరణ, టెండర్ ప్రక్రియ చేపట్టిన ప్రభుత్వం.. తాజాగా ఇటు నుంచి మన్ననూర్ వరకు కొత్త రోడ్డును విస్తరించే ప్రతిపాదనలు సిద్ధం చేసింది. భారత్ ఫ్యూచర్ సిటీలో భాగంగా నిర్మిస్తున్న రావిర్యాల– ఆమనగల్ (ఆకుతోటపల్లి), ఆర్ఆర్ఆర్ గ్రీన్ఫీల్డ్ రహదారి నుంచి అచ్చంపేట మండలం బ్రాహ్మణపల్లి (మన్ననూర్) వరకు కొత్త రోడ్డు ఏర్పాటు కానుంది. ఇందుకు సంబంధించిన డిజైన్ను సంబంధిత అధికారులు సిద్ధం చేస్తున్నారు. జూపల్లి– చారకొండ మధ్య నుంచి భైరాపూర్, డిండి తూర్పుభాగం మీదుగా గువ్వలోనిపల్లి, రాయిచేడ్, బుడ్డతండా, బ్రాహ్మణపల్లి వరకు ప్రతిపాదిత ఎలివేటెడ్ కారిడార్ సుమారు 50 కి.మీ. దూరం అవుతుంది. ప్రతిపాదిత రోడ్డు ఏర్పాటైతే హైదరాబాద్– శ్రీశైలం మధ్య 40 కి.మీ. దూరం తగ్గడంతోపాటు రెండు గంటల వ్యవధిలో చేరుకోవచ్చు. ప్రస్తుతం ఉన్న హైదరాబాద్– శ్రీశైలం హైవేలోని తుక్కుగూడ, కందుకూరు, కడ్తాల్, ఆమనగల్, కల్వకుర్తి, నాగర్కర్నూల్, కొల్లాపూర్, నంద్యాల వరకు తిరుపతి మార్గంగా, రావిర్యాల నుంచి మన్ననూర్ వరకు శ్రీశైలం రహదారులు వేరు కానున్నాయి. కొత్త రహదారితో ట్రాఫిక్ సమస్య తీరనుందని ప్రభుత్వం భావిస్తోంది. ఎలివేటెడ్ కారిడార్కు సుముఖత.. హైదరాబాద్– శ్రీశైలం జాతీయ రహదారిలో నాలుగు వరుసల ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించినట్లు సమాచారం. రూ.7,700 కోట్ల అంచనాలతో చేపట్టే ఎలివేటెడ్ కారిడార్ పూర్తయితే శ్రీశైలం రహదారి రూపురేఖలు మారిపోనున్నాయి. ఈ మార్గంలో ఏపీలోని కృష్ణపట్నం రేవుతోపాటు మార్కాపురం, కంభం, కనిగిరి, నెల్లూరు, తిరుపతికి రాకపోకలు సులువు అవుతాయి. ఇప్పటికే పలు ప్రతిపాదనలు రూపొందించగా.. 62.5 కి.మీ., ఎలివేటెడ్ కారిడార్లో 56.2 కి.మీ., అటవీ మార్గం, 6.3 కి.మీ. అటవీయేతర ప్రాంతం. స్వల్ప మార్పులతో ఎన్హెచ్ఏఐ అధికారులు మన్ననూర్, వటువర్లపల్లి వద్ద ఎక్కి, దిగేందుకు ర్యాంపుల నిర్మాణానికి ప్రతిపాదనలు తయారు చేశారు. అచ్చంపేట మండలం బ్రాహ్మణపల్లి నుంచి అమ్రాబాద్ మండలం మన్ననూర్ మీదుగా శ్రీశైలం ప్రాజెక్టు వరకు నాలుగు వరుసలతో 30 అడుగల ఎత్తులో ఈ రహదారిని నిర్మించాలనే ప్రతిపాదనలు ఉన్నాయి. ఈగలపెంట (కృష్ణగిరి)– సున్నిపెంట మధ్య ఉన్న డ్యాంపై ఐకానిక్ వంతెన నిర్మించనున్నారు. దీంతో తెలంగాణ– ఆంధ్రప్రదేశ్ మధ్య గంట ప్రయాణ సమయం, 9 కి.మీ. దూరం తగ్గే అవకాశం ఉంది. అయితే కేంద్ర అటవీశాఖ అనుమతుల కోసం ఎన్హెచ్ఏఐ అధికారులు ప్రయత్నిస్తున్నారు. రావిర్యాల– ఆమనగల్– మన్ననూర్ నాలుగు వరుసల గ్రీన్ఫీల్డ్ రోడ్డుకు ప్రతిపాదనలు మన్ననూర్– శ్రీశైలం మార్గంలో ఎలివేటెడ్ కారిడార్ హైదరాబాద్– శ్రీశైలం మార్గంలో 40 కి.మీ. తగ్గనున్న దూరం -
‘చట్టాలు ఎవ్వరికీ చుట్టాలు కావు’
అమరచింత: చట్టాలు ఎవరికీ చుట్టాలు కావని, తప్పు చేసిన ప్రతి ఒక్కరిని శిక్షించేందుకే చట్టాలు అమలు చేస్తున్నారని ఆత్మకూర్ జూనియర్ సివిల్ జడ్జి శిరీష అన్నారు. గాంధీ జయంతిని పురస్కరించుకొని మండలంలోని పాంరెడ్డిపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఆవరణలో శనివారం న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన జూనియర్ సివిల్ జడ్జి మాట్లాడుతూ.. సమాజంలో వయోవృద్ధులపై సానుభూతి చూపాలని, వారి సంక్షేమం కోసం కుటుంబ సభ్యులు పాటుపడాలని కోరారు. 18 ఏళ్ల లోపు బాల బాలికలు వాహనాలు నడపడం చట్టరీత్యా నేరమన్నారు. చట్టాన్ని కాదని మైనర్లు వాహనాలు నడిపితే రూ.25 వేల జరిమానాతో పాటు మూడేళ్ల పాటు జైలు శిక్షను తల్లిదండ్రులకు విధిస్తారని హెచ్చరించారు. బాల్య వివాహలతో కలిగే నష్టాల గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలన్నారు. 14 ఏళ్ల వయస్సు గల వారిని పనిలో పెట్టుకోవడం నేరమని, నిబంధనలు ఉల్లఘిస్తే యజమానులకు జైలు శిక్షతో పాటు జరిమానాలు ఉంటాయన్నారు. ప్రజలకు ఉచితంగా న్యాయ సలహాలు అందించేందుకు 15100 టోల్ ఫ్రీ నంబర్ను సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో న్యాయవాదులు తిప్పారెడ్డి, గంగాధర్గౌడ్, జీకే రాములు, అశోక్కుమార్, ముక్తేశ్వర్, రాంచందర్, ఎస్ఐ స్వాతి తదితరులు పాల్గొన్నారు. -
ప్రిసైడింగ్ అధికారుల శిక్షణకు ఏర్పాట్లు చేయాలి
వనపర్తి: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో భాగంగా ప్రిసైడింగ్ అధికారులకు శిక్షణ ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో పీఓ, ఏపీఓలకు అక్టోబర్ 6న నిర్వహించనున్న ఒకరోజు శిక్షణ కార్యక్రమంపై ఎంపీడీఓలు, తహసీల్దార్లతో వెబ్ ఎక్స్ ద్వారా సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ నిర్వహణలో కీలక పాత్ర వహించే ప్రిసైడింగ్ ఆఫీసర్లకు శిక్షణ ఇచ్చేందుకు సరైనా శిక్షణ గదులు, మైక్ సిస్టం, పవర్ పాయింట్ ద్వారా అవగాహన కల్పించేందుకు ఏర్పాట్లు ముందుగానే చేసుకోవాలని సూచించారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణ కోసం పీఓలకు సోమవారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు శిక్షణ కార్యక్రమం నిర్వహించాలని సూచించారు. పీఓలకు ఈ ట్రైనింగ్ కార్యక్రమం చాలా కీలకమని, ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు నిబంధనలు అవగాహన చేసుకొని సన్నద్ధత కావాల్సి ఉంటుందన్నారు. పీఓలకు శిక్షణ సమయంలో వారి విధులకు సంబంధించిన హ్యాండ్ బుక్ అందజేయాలని, నిబంధనలతో పాటు బ్యాలెట్ బాక్స్ నిర్వహణ హ్యాండ్స్ ఆన్ శిక్షణ ఇవ్వాలని సూచించారు. శిక్షణకు వచ్చే పీఓలకు పోస్టల్ బ్యాలెట్ ఫారం 14 కూడా అందజేయాలన్నారు. పోలింగ్ కేంద్రంలో ఏం జరిగినా పీఓలదే బాధ్యత అని, జాగ్రత్తగా వ్యవహారించాలని వారికి తెలియజేయాలని పేర్కొన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ ఖీమ్యానాయక్, అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు యాదయ్య, ఆర్డీఓ సుబ్రహ్మణ్యం, డీపీఓ రఘునాథ్, డిప్యూటీ సీఈఓ రామ మహేశ్వర్, డీఈఓ అబ్దుల్ఘని, ఏఓ భాను, అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
‘సంక్షేమమే అభ్యర్థులను గెలిపిస్తుంది’
ఆత్మకూర్: పదేళ్లలో బీఆర్ఎస్ పాలకులు చేయలేని అభివృద్ధిని 18 నెలల వ్యవధిలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేసి చూపించారని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రహ్మతుల్లా అన్నారు. శనివారం ఆత్మకూర్లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ ఆశావాహుల జాబితాను సేకరించారు. కాగా జెడ్పీటీసీగా పోటీ చేసేందుకు ఎనిమిది మంది ముందుకు వచ్చారు. మండల అధ్యక్షుడు పరమేష్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు తులసీరాజ్, హుస్సేన్మియ్యా, బాలకృష్ణారెడ్డి, విజయలక్ష్మి, మచ్ఛేందర్గౌడ్, ప్రతాప్రెడ్డి, రాఘవేందర్ పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. అనంతరం రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలే అభ్యర్థులకు శ్రీరామ రక్ష అని, ఎవరికీ బీఫాం ఇచ్చినా అందరూ కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. జాబితాను అధిష్టానికి పంపిస్తామని త్వరలోనే అభ్యర్థులను ప్రకటిస్తామని గెలుపే లక్ష్యంగా ముందుకెళ్లాలని దిశా నిర్దేశం చేశారు. కార్యక్రమంలో నాయకులు పరమేష్, తులసీరాజ్, నల్గొండ శ్రీను తదితరులు ఉన్నారు. -
నేడు సామూహిక కోర్టు భవనానికి శంకుస్థాపన
వనపర్తి టౌన్: జిల్లా న్యాయస్థాపన సామూహిక భవనానికి ఆదివారం తెలంగాణ హై కోర్టు ప్రధాన న్యాయమూర్తి వర్చువల్గా, ఇతర న్యాయమూర్తులు అనిల్ జూకంటి, మాధవిలే ప్రత్యక్షంగా శంకుస్థాపన చేయనున్నారని వనపర్తి బార్ అసిసోసియేషన్ అధ్యక్షుడు డి.కిరణ్కుమార్ తెలిపారు. ఈ మేరకు శనివారం న్యాయస్థానంలోని బార్ కౌన్సిలర్ కౌన్సిల్ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 20 ఎకరాల్లో రూ.81 కోట్లతో మెడికల్ కళాశాల సమీపంలో ఈ భవనానికి భూమిపూజ చేస్తారని, ఇది వనపర్తి జిల్లాకు గర్వకారణమని పేర్కొన్నారు. నూతన భవనాల వినియోగంలోకి వస్తే న్యాయ సేవలు ప్రజలకు ఒకే ఆవరణలో అందే అవకాశం ఉంటుందన్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాష్ట్రంలోని పలువురు ప్రముఖులు హాజరు కావడంతో పాటుగా జిల్లాలోని న్యాయమూర్తులు హాజరవుతారని చెప్పారు. కార్యక్రమంలో న్యాయవాదులు భరత్కుమార్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. రేపు ప్రజావాణి రద్దు వనపర్తి: స్థానిక సంస్థల ఎన్నికల నియమావళి అమలులో ఉన్న నేపథ్యంలో సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం రద్దు చేసినట్లు కలెక్టర్ ఆదర్శ్సురభి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ, స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తై, కోడ్ ముగిసే వరకు ప్రజావాణి కార్యక్రమం ఉండదని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని జిల్లాలోని ప్రజలంతా గమనించి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఫిర్యాదులు ఇచ్చేందుకు ఎవరూ రావొద్దని సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటుతాం అమరచింత: స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని గ్రామాల్లో పోటీచేస్తూ గెలుపే లక్ష్యంగా సీపీఎం ఎన్నికల బరిలో ఉంటుందని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు జీఎస్ గోపి అన్నారు. మండల కేంద్రంలోని జీఎస్ భవన్లో శనివారం జరిగిన మండల సీపీఎం నాయకుల సమావేశంలో ఆయన పాల్గొని స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నిరంతరం ప్రజా సమస్యలపై పోరాడుతున్న ప్రజలు ఎన్నికల సమయంలో తమకు మద్దతు ఇవ్వాలని కోరారు. సమస్యలపై ప్రశ్నించే సీపీఎం నాయకులను గెలిపించుకోవడం ద్వారా గ్రామాలు, పట్టణాలు అభివృద్ధి చెందుతాయన్నారు. ఎన్నికల సమయంలో లేనిపోని హామీలు ఇస్తూ గెలిచిన అనంతరం కేవలం సంపాదనే లక్ష్యంగా భావిస్తున్న బూర్జువా పార్టీలకు ఎన్నో పర్యాయాలు అవకాశం ఇచ్చి ప్రజలు విసిగి పోయారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయకుండా చేతులెత్తేసిందని దుయ్యబట్టారు. సమావేశంలో వెంకటేష్, అజయ్, రమేష్, రాఘవేంద్ర, శ్రీను, శంకర్ తదితరులు పాల్గొన్నారు. వసంతోత్సవంతో ముగిసిన దేవి శరన్నవరాత్రులు కొత్తకోట రూరల్: పట్టణంలోని శ్రీవాసవి కన్యకాపరమేశ్వరి ఆలయంలో 11 రోజులుగా దేవి శరన్నవరాత్రులను అంగరంగ వైభవంగా నిర్వహించారు. శనివారం వసంతోత్సవం సందర్భంగా అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రథంపై పట్టణ పురవీధుల గుండా మేళతాళాలు బాజాభజంత్రీలతో ఊరేగించారు. ఈ సందర్భంగా ప్రదర్శించిన సంప్రదాయ నృత్యాలు, బతుకమ్మలు చూపరులను ఆకట్టుకున్నాయి. కర్ణాటకకు చెందిన కళాకారుడు వీరనాట్యం ప్రదర్శించారు. వారు ఖడ్గాలు, వీరడోలు ధరించి నిప్పులు చెరిగే మంటల నడున ఇనుప చువ్వలతో నిమ్మకాయలు, కొబ్బరికాయలను చిదిమేస్తూ చేసిన నృత్యాన్ని భక్తులు తిలకించారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం పట్టణ అధ్యక్షుడు భీమా చంద్రకాంత్, గౌరవ అధ్యక్షుడు భీమా ప్రభాకర్, శ్రీనివాసులు, నాగరాజు, శంకర్, సత్యం, విజయ్, పట్టణ అధ్యక్షురాలు జయలక్ష్మి, రాధిక, భారతి, జ్యోతి, అనిత, స్వర్ణలత, మంజుల, శైలజ తదితరులు ఉన్నారు. -
కష్టపడిన వారికే మొదటి ప్రాధాన్యం
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లావ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించబోతోందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి, ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి దామోదర రాజనర్సింహ ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వం పట్ల ప్రజలు సానుకూలంగా ఉన్నారని చెప్పారు. శనివారం ఆయన ఉమ్మడి జిల్లాలోని ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలతో హైదరాబాద్లోని తన నివాసంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, ఉమ్మడి జిల్లాలోని ఎమ్మెల్యేలు వీర్లపల్లి శంకర్, పర్ణికారెడ్డి, రాజేశ్రెడ్డి, మధుసూదన్రెడ్డి, మేఘారెడ్డి, యెన్నం శ్రీనివాస్రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి హాజరయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అవలంభించాల్సిన వ్యూహాలు, అభ్యర్థుల ఎంపిక, ప్రచార శైలి, ప్రజల్లోకి ప్రభుత్వ పథకాలను తీసుకెళ్లడం, ప్రతిపక్షాల విమర్శలకు ఎప్పటికప్పుడు ధీటుగా బదులివ్వడం, సోషల్ మీడియాలో జరిగే అసత్య ప్రచారాలను ఎదుర్కొని ప్రజలకు నిజాలు తెలియజేసే అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర రాజనర్సింహ కాంగ్రెస్ నేతలకు పలు సూచనలు చేశారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ, పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలకు, నాయకులకు టికెట్ల కేటాయింపులో మొదటి ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. టికెట్ల కేటాయింపు విషయంలో పార్టీ నాయకులు, కార్యకర్తల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలని, పార్టీ నాయకుల మధ్య సమన్వయలోపం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రతి ఇంటికి చేరేలా చూడాలన్నారు. సోషల్ మీడియా వేదికగా ప్రతిపక్షాలు చేస్తున్న తప్పుడు ఆరోపణలను బలంగా తిప్పికొడుతూ ప్రజలకు వాస్తవాలు తెలిపేలా కార్యకర్తలను సమాయత్తం చేయాలని మంత్రి సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అందరూ కీలకంగా వ్యవహరించాలి ఉమ్మడి జిల్లా నేతలతో ఇన్చార్జి మంత్రి దామోదర రాజనర్సింహ -
ముందుకు సాగట్లే..
● బిల్లులు అందక నిలిచిన పనులు ● కొత్త మున్సిపాలిటీల్లో కనిపించని పురోగతి ● ఒక్కో వైకుంఠధామం నిర్మాణానికి రూ.కోటి ●పట్టణంలో నిర్మిస్తున్న వైకుంఠధామ నిర్మాణ పనులు గత ప్రభుత్వ హయాంలో ప్రారంభమయ్యాయి. అమరచింతలో 70 శాతం పనులు పూర్తి చేశారు. స్నానాల గదులు, వెయిటింగ్ గది, పార్కింగ్ పనులు జరగాల్సి ఉంది. బిల్లులు చెల్లించలేదని పనులను కాంట్రాక్టర్ నిలిపివేశాడని తెలిసింది. విషయాన్ని ఉన్నతాధికారులకు విన్నవించడం జరిగింది. – నాగరాజు, మున్సిపల్ కమిషనర్, అమరచింత అమరచింత: గత ప్రభుత్వం కొత్తగా ఏర్పాటైన మున్సిపాలిటీల్లో అధునాతన హంగులతో నూతన వైకుంఠధామాలను నిర్మించడానికి నిధులు మంజూరు చేసింది. ఒక్కో వైకుంఠధామం కోసం రూ.కోటి కేటాయించారు. టెండర్ ప్రక్రియను చేపట్టి కాంట్రాక్టర్కు పనులు అప్పగించింది. కాంట్రాక్టర్లు పనులు ప్రారంభించినా.. సరైన సమయానికి బిల్లులు అందకపోవడంతో నిర్మాణ పనులు నిలిపివేశారు. దీంతో ఆయా మున్సిపాలిటీల్లో నిర్మాణ పనులు 65 నుంచి 70 శాతం వరకు పూర్తి కాగా.. మిగిలిన పనులు అటకెక్కాయి. వీటికి తోడు కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరడంతో నిర్మాణ పనులు పూర్తిగా మరుగునపడినట్టయింది. పెద్ద పట్టణాల్లో స్థలం లేకపోవడంతో భవిష్యత్లో మృతదేహాల ఖననానికి ఇబ్బందులు ఏర్పడకుండా ఉండేందుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసి పనులు వేగంగా పూర్తి చేయాలని కోరుతున్నారు. సౌకర్యాలు.. కొత్తగా నిర్మించే వైకుంఠధామాల్లో మృతదేహాలను ఖననం చేసేందుకు వచ్చిన వారికి సౌకర్యాలను కల్పించేందుకు ప్రణాళికతో పనులు చేస్తున్నారు. వీటిలో వెయిటింగ్ గదులు, సెక్యూరిటీ గది, ఆఫీస్ రూంతో పాటు సీటింగ్ గ్యాలరీ ఏర్పాటు చేస్తారు. రెండు బర్నింగ్ ప్లాంట్లు, పూజా మండపం, టాయిలెట్లు, స్నానపు గదులను సిద్ధం చేయాలి. అంతే కాకుండా ఆహ్లాదం కోసం పచ్చదనం, వైకుంఠధామం మధ్యలో పార్కును ఏర్పాటు చేస్తారు. వీటి చుట్టు ప్రహరీ లేదా పెన్సింగ్ను కల్పించి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూడాలని ప్రభుత్వం సంకల్పించింది. జిల్లాలో ఇలా.. జిల్లాలోని అమరచింత, కొత్తకోట, పెబ్బేరు, ఆత్మకూర్ మున్సిపాలిటీల్లో రెండేళ్ల కిందట వైకుంఠధామ నిర్మాణాలకు బీఆర్ఎస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కానీ ఆలస్యంగా పనులు ప్రారంభించిన కాంట్రాక్టర్లు బిల్లులు రాలేదన్న నెపంతో పూర్తిగా నిలిపివేశారు. కొత్తకోట, అమరచింత, ఆత్మకూర్ పట్టణాల్లో 75 శాతం నిర్మాణ పనులు జరిగాయని, పెబ్బేరులో మాత్రం 30 శాతం సైతం పనులు జరగలేదని సంబంధిత అధికారులు తెలిపారు. కాని వాస్తవ పరిస్థితులు మాత్రం ఇందుకు భిన్నంగా ఉన్నాయి. ఆయా మున్సిపాలిటీల్లో యాభై శాతం పనులు మాత్రమే జరిగాయని తెలుస్తోంది. -
వైభవం.. వేంకటేశ్వరస్వామి కల్యాణం
కొత్తకోట రూరల్: కొత్తకోట సమీపంలోని వెంకటగిరి గుట్టపైనున్న వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఆశ్వజ మాసం శుక్లపక్షం దశమి సందర్భంగా గురువారం వేంకటేశ్వరస్వామి కల్యాణోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. భూలక్ష్మీ వేంకటేశ్వరస్వామి ఉత్సవమూర్తులను అర్చకులు పట్టువస్త్రాలతో అందంగా అలంకరించి వేదమంత్రోచ్ఛారణలతో కల్యాణం జరిపించారు. పండితులు తలంబ్రాలు పోయగా.. ఆడపడుచులు అమ్మవారికి వడిబియ్యం పోశారు. అనంతరం స్వామి, అమ్మవార్లను పల్లకీలో ఉంచి ప్రత్యేక పూజలు చేసి గోవింద నామస్మరణతో ఆలయం చుట్టూ ఊరేగించారు. ఈ వేడుకను తిలకించడానికి పరిసర గ్రామాల భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. ఆలయ నిర్వాహకులు తీర్థ ప్రసాదాలు అందజేయడంతో పాటు అన్నదానం చేశారు. కార్యక్రమంలో అర్చకులు సింగరా ఆచార్యులుతో పాటు నిర్వాహకులు వేముల శ్రీనివాస్రెడ్డి, నరోత్తంరెడ్డి, శ్రీనివాసులుశెట్టి, జగదీశ్వర్రెడ్డి, తిరుపతయ్య, భాస్కర్, రాంబాబు, రాములుయాదవ్, ప్రశాంత్రెడ్డి, బాలవర్ధన్రెడ్డి, రమేష్ బాబు, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
వేడుకగా విజయదశమి
వనపర్తి● జిల్లాకేంద్రంలో బేతాళుడి సంరక్షణలో ఆయుధాలతో ఊరేగింపుగా వచ్చిన రాజా కృష్ణదేవరావు ● శమీ వృక్షానికి ప్రత్యేక పూజలు శనివారం శ్రీ 4 శ్రీ అక్టోబర్ శ్రీ 2025వనపర్తిటౌన్: జిల్లాలో గురువారం విజయదశమి వేడుకలను ప్రజలు భక్తిశ్రద్ధలతో ఆనందోత్సవాల నడుమగా జరుపుకొన్నారు. దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ముగియడంతో గురువారం అమ్మవారిని రాజరాజేశ్వరిదేవి, అపరాజితదేవిగా ఆరాధించారు. శమీ పూజకు ముందు, అనంతరం ఆలయాలు, మండపాలు భక్తులతో కిటకిటలాడాయి. పట్టణాలు, గ్రామాల్లోని ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం సామూహికంగా భజనలు చేస్తూ మేళతాళాల నడుమ ఊరేగింపుగా శమీ వృక్షాల వద్దకు చేరి పూజలు నిర్వహించి ఒకరికొకరు జమ్మి పంచుకొని పండుగ శుభాకాంక్షలు చెప్పుకోవడం కనిపించింది. పండుగ రోజు మధ్యాహ్నం వరకు పూజ సామగ్రి, పూలు, పండ్లు, నిత్యావసరాల సరుకుల దుకాణాలు కొనుగోలుదారులతో రద్దీగా మారాయి. జిల్లాకేంద్రంలో ప్రత్యేక ఆకర్షణగా.. వనపర్తి సంస్థానాధీశుల వారుసుడు రాజా కృష్ణాదేవరావు రాజ భవనంలో దుర్గాదేవికి.. అర్చకులు నాటి రాజవంశీయుల ఆయుధాలకు వేదమంత్రోచ్ఛారణలతో పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీరామ పట్టాభిషేకం పారాయణంతో ముగించారు. రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు డా. చిన్నారెడ్డి, ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, పలువులు మాజీ ప్రజాప్రతినిధులు పూజల్లో పాల్గొన్నారు. అనంతరం అక్కడి నుంచి దేవుడి విగ్రహాన్ని పల్లకీలో, విశ్వ బ్రహ్మణులు తయారు చేసిన బేతాళుడి విగ్రహం సంరక్షణలో నాటి ఆయుధాలను కలవృత్తుల పెద్దల సమక్షంలో మేళతాళాలు, బాణాసంచ పేలుళ్ల నడుమ పట్టణ వీధుల్లో ఊరేగింపుగా నల్లచెరువు మినీ ట్యాంక్బండ్పై ఉన్న శమీ వృక్షం వద్దకు చేరుకున్నారు. అక్కడ పూజలు జరిపించి జమ్మిని ప్రజలకు అందజేశారు. ఈ వేడుకకు పట్టణ ప్రజలు భారీగా తరలిరావడంతో ఆ ప్రాంతం కిక్కిరిసిపోయింది. వారిని కట్టడి చేసేందుకు పోలీసులు శ్రమించాల్సి వచ్చింది. పాతబజార్లోని మసీద్ సమీపంలో ఎండీ అనిస్ ఆధ్వర్యంలో ముస్లింలు రాజా వంశీయులకు స్వాగతం పలికే ఆచారాన్ని కొనసాగిస్తూ హిందూ ముస్లింలు పండు గ శుభాకాంక్షలు తెలుపుతూ ఐక్యతను చాటారు. ట్యాంక్బండ్పై రాత్రి 10 గంటల వరకు ప్రజలు కు టుంబ సభ్యులతో కలిసి ఉత్సాహంగా గడిపారు. బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా రావణ దహనం కార్యక్రమం నిర్వహించారు. టపాసులతో రూపొందించిన రావణుడిని దహనం చేయగా చూసేందుకు పట్టణ ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారు. ప్రజాప్రతినిధులు, పలువురు పట్టణ ప్రముఖులు హాజరయ్యారు. -
గాంధీజీ జీవితం స్ఫూర్తిదాయకం
వనపర్తి: సన్మార్గంలో ప్రయాణిస్తూ నమ్మిన సిద్ధాంతాలు, విలువలను నిబద్ధతతో ఆచరించడంతో గాంధీజీ కీర్తి ప్రతిష్టలు విశ్వవ్యాప్తమయ్యాయని.. స్వాతంత్య్ర సాధనలో ఆయన కృషి మరువలేనిదని ఎస్పీ రావుల గిరిధర్ కొనియాడారు. జిల్లా పోలీసు కార్యాలయంలో గురువారం నిర్వహించిన మహాత్మాగాంధీ జయంతి వేడుకలో ఆయన పాల్గొని గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. భారతావని స్వేచ్ఛా స్వాతంత్య్రం కోసం ఆయన ఎంచుకున్న శాంతి, అహింస మార్గం భారతీయులకే కాదు.. యావత్ ప్రపంచానికి మార్గదర్శకంగా నిలిచిందన్నారు. దేశాభివృద్ధికి నిస్వార్థంగా అందరం సేవలు అందించాలని.. ఆయన జీవితం అందరికీ స్ఫూర్తిదాయకమని, ఆయన ఆశయాలు కొనసాగించడమే మనమిచ్చే ఘన నివాళులన్నారు. కార్యక్రమంలో సీఐ కృష్ణయ్య, సీసీఎస్ ఎస్ఐ జయన్న, స్పెషల్ బ్రాంచ్ ఎస్ఐ రామేశ్వర్రెడ్డి, షీటీమ్ ఎస్ఐ అంజద్, రిజర్వ్ సబ్ సీఐ మొగ్దుంబారీ, జిల్లా పోలీసు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఎస్పీ రావుల గిరిధర్ -
పులకించిన కొండారెడ్డిపల్లి
వంగూరు: దసరా పండుగను పురస్కరించుకుని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి గురువారం స్వగ్రామం కొండారెడ్డిపల్లికి రావడంతో గ్రామంలో సంబరాలు అంబరాన్నంటాయి. గురువారం మధ్యాహ్నం 3.30 గంటలకు హెలీకాప్టర్లో సీఎం కొండారెడ్డిపల్లికి చేరుకోగా.. ఎమ్మెల్యే వంశీకృష్ణ, రైతు కమిషన్ సభ్యులు కేవీఎన్ రెడ్డి, బాలాజీసింగ్, గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికారు. అక్కడి నుంచి ఆంజనేయస్వామి ఆలయం వరకు ప్రచార రథంపై వెళ్తుండగా బతుకమ్మ, కోలాటాలతో గ్రామస్తులు అభివాదం చేశారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ముఖ్యమంత్రి ఇంటికి చేరుకున్నారు. సాయంత్రం 5.30 గంటలకు సోదరులు తిరుపతిరెడ్డి, జగదీశ్వర్రెడ్డి, కొండల్రెడ్డి, కృష్ణారెడ్డి ఇతర కుటుంబ సభ్యులు, గ్రామస్తులతో కలిసి కోటమైసమ్మను దర్శించుకొని, భాజాభజంత్రీలతో భారీ ర్యాలీగా వెళ్లి జమ్మి చెట్టుకు పూజలు చేశారు. అనంతరం రాత్రి 8 గంటలకు రోడ్డు మార్గాన కొడంగల్కు బయలుదేరి వెళ్లారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి అభిమానులు వేలాదిగా తరలివచ్చారు. ఈ సందర్భంగా ఎస్పీ వైభవ్ రఘునాథ్ గైక్వాడ్ ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో.. స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందుకు కలెక్టర్ బదావత్ సంతోష్తోపాటు ఇతర అధికారులు ముఖ్యమంత్రి పర్యటనలో కనిపించలేదు. ఏర్పాట్లను మొత్తం గ్రామస్తులే చూసుకున్నారు. కేవలం భద్రతా ఏర్పాట్లను మాత్రమే పోలీసు అధికారులు పర్యవేక్షించారు. స్వగ్రామంలో సీఎం రేవంత్రెడ్డి దసరా వేడుకలు కుటుంబ సభ్యులతో కలిసి జమ్మి వేడుకలకు హాజరు ఘన స్వాగతం పలికిన ప్రజలు భారీగా తరలివచ్చిన అభిమానులు -
అహింసతో దేనినైనా సాధించవచ్చు..
సత్యం, అహింసతో దేనినైనా సాధించవచ్చని నిరూపించిన జాతిపిత మహాత్మాగాంధీ అడుగుజాడల్లో నడిచి ఆయన కలలుగన్న భారతదేశాన్ని నిర్మించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టరేట్ ఏఓ భానుప్రకాష్ అన్నారు. గురువారం కలెక్టరేట్లో నిర్వహించిన మహాత్మాగాంధీ జయంతి వేడుకలకు ఆయనతోపాటు జిల్లా అధికారులు పాల్గొని గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏఓ మాట్లాడుతూ.. స్వేచ్ఛా వాయువులతో జాతి అభివృద్ధి చెందాలని మహాత్మాగాంధీ చేసిన త్యాగాలను ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలన్నారు. గాంధీ జయంతి, విజయదశమి ఒకేరోజు రావడం ఆనందదాయకమని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా క్రీడలు, యువజన సర్వీసుల అధికారి సుధీర్రెడ్డి, జిల్లా మైనార్టీ సంక్షేమశాఖ అధికారి అఫ్జలుద్దీన్, కలెక్టరేట్ సిబ్బంది, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
ఆధ్యాత్మిక ఆనందం.. యాత్ర దానం
వినూత్న సేవా కార్యక్రమానికి ఆర్టీసీ శ్రీకారం ● పేదలు, అనాథలు పుణ్యక్షేత్రాల దర్శనానికి అవకాశం ● దాతలు ముందుకు వస్తే బస్సుల కేటాయింపు ● విభిన్న మార్గాల్లో సంస్థకూ సమకూరనున్న ఆదాయం తెలంగాణ ఆర్టీసీ నూతనంగా శ్రీకారం చుట్టిన యాత్ర దానం నిరుపేదలకు ఆధ్యాత్మిక ఆనందాన్ని పంచుతుంది. సేవాభావంతో ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు, కార్పొరేట్ సంస్థలు, ఇతర వ్యక్తులు ఎవరైనా సహకరించి విరాళాలు ఇస్తే అనాథలు, వికలాంగులు, వృద్ధులు, నిరుపేద విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుంది. ఇళ్లలో జరుపుకొనే వేడుకలకు సమాంతరంగా ఇలాంటి సేవా కార్యక్రమాలకు దానం ఇవ్వడానికి ముందుకు రావాలి. – సంతోష్కుమార్, ఆర్ఎం, మహబూబ్నగర్ నారాయణపేట రూరల్: ప్రతి మనిషికి పుణ్యక్షేత్రాలు సందర్శించాలనేది ఓ కల.. వాటిని నిజం చేసుకునేందుకు ఎంతోమంది పరితపిస్తుంటారు. ముఖ్యంగా తమ ఇష్టదైవాలను దర్శించుకుని దేవుని ఆశీర్వాదం పొందాలని కోరుకుంటారు. అయితే పేదరికం ఎంతోమందికి ఈ కల నెరవేరకుండా అడ్డుపడుతుంది. ఫలితంగా జీవితకాలంలో సైతం తమ ఇష్టదైవాలను దర్శించుకోలేక ఎంతోమంది నిరుపేదలు తీవ్ర మనోవేదనకు గురవుతుంటారు. ఇలాంటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని తెలంగాణ ఆర్టీసీ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలో యాత్ర దానం పేరిట దాతల సహకారంతో అనాథలు, పేదలు పలు ఆధ్యాత్మిక, పర్యాటక ప్రదేశాలను సందర్శించేలా ప్రణాళిక సిద్ధం చేశారు. అదేవిధంగా ఆర్టీసీకి సైతం ఇది ఒక ఆదాయ వనరుగా మారనుంది. పథకం అమలు ఇలా.. ఎంతోమంది తమ పుట్టినరోజు వేడుకలు, వివాహ వార్షికోత్సవాలు, పండుగలు, ఇతర శుభకార్యాలు జరుపుకొనే వారు డబ్బులను వృథా చేయకుండా పేదలకు యాత్ర దానం కల్పించి ఆధ్యాత్మిక ఆనందం పొందవచ్చు. ప్రజాప్రతినిధులు, కార్పొరేట్, స్వచ్ఛంద సంస్థలు ఇలా ఎవరైనా ఆర్టీసీకి విరాళాలు అందిస్తే అనాథలు, నిరాశ్రయులైన వృద్ధులు, దివ్యాంగులు, నిరుపేద విద్యార్థులను ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రదేశాలకు విహారయాత్రకు తీసుకువెళ్తారు. ● దాతలు ప్రత్యేకంగా ఏ పుణ్యక్షేత్రానికి, పర్యాటక ప్రాంతానికి యాత్ర దానం చేయాలనుకున్నారో ముందుగా సంబంధిత ఆర్టీసీ డిపో మేనేజర్లను సంప్రదించాలి. అధికారులు యాత్రకు సంబంధించిన దూరాన్ని లెక్కించి కిలోమీటర్ల ఆధారంగా డబ్బులు, ఇతర వివరాలు తెలియజేస్తారు. ● యాత్రకు సంబంధించిన ప్యాకేజీ డబ్బులను దాతలు ఒక్కరే భరించవచ్చు. లేదా మిత్రుల భాగస్వామ్యంతోనైనా చెల్లించవచ్చు. అందించిన డబ్బుల ఆధారంగా అధికారులు అవసరమైన బస్సు ఏర్పాటు చేస్తారు. దాత వివరాలు, ఫోన్ నంబర్ ఇవ్వాలి. టీజీఎస్ఆర్టీసీ వెబ్సైట్లోనూ నమోదు చేయాలి. దాతలు యాత్రకు వెళ్లే వారి పేర్లను సైతం సూచించవచ్చు. లేదా ఆర్టీసీనే నిరుపేదలు, వృద్ధులు, విద్యార్థులను ఎంపిక చేసి తీసుకువెళ్తుంది. డిపో డీఎం సెల్ నంబర్ మహబూబ్నగర్ సుజాత 99592 26286 షాద్నగర్ ఉష 99592 26287 నాగర్కర్నూల్ యాదయ్య 99592 26288 వనపర్తి దేవేందర్గౌడ్ 99592 26289 గద్వాల సునీత 99592 26290 అచ్చంపేట ప్రసాద్ 99592 26291 కల్వకుర్తి సుహాసిని 99592 26292 నారాయణపేట లావణ్య 99592 26293 కొల్లాపూర్ ఉమాశంకర్గౌడ్ 90004 05878 బస్సుల స్థాయికి చార్జీలు ఇలా.. కి.మీ., ఎక్స్ప్రెస్ డీలక్స్ సూపర్ లగ్జరీ (రూపాయలలో..) 201– 300 38,782 32,587 29,752 301– 400 38,782 38,782 35,002 401– 500 44,977 44,977 40,252 బస్సులో సీట్లు 50 40 34 -
స్వగ్రామంలో గద్వాల అదనపు కలెక్టర్..
ఖిల్లాఘనపురం: నిత్యం కార్యాలయంలో విధుల్లో బిజీగా ఉండే గద్వాల అదనపు కలెక్టర్ వి.లక్ష్మీనారాయణ దసరా పండుగను తన సొంత గ్రామం మండలంలోని అప్పారెడ్డిపల్లిలో గ్రామస్తుల నడుమ సంతోషంగా జరుపుకొన్నారు. గురువారం గ్రామంలోని ఆంజనేయస్వామి ఆలయంలో కుటుంబ సభ్యులు, గ్రామస్తులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించి భజన కార్యక్రమంలో పాల్గొన్నారు. సాయంత్రం అక్కడే మహిళలు నిర్వహించిన బతుకమ్మ సంబరాల్లో పాల్గొని అక్కడి నుంచి గ్రామంలోని చెన్నకేశవస్వామి ఆలయం వరకు ఊరేగింపుగా వెళ్లి గ్రామ పెద్దలతో కలిసి శమీ పూజ నిర్వహించారు. పాత మిత్రులు, పెద్దలతో సరదాగా గడిపి యోగక్షేమాలు తెలుసుకున్నారు. -
వసతులు కల్పించాలి..
మండల కేంద్రంలో నిర్మించిన క్రీడా ప్రాంగణంలో వసతులు కల్పించాలి. వాలీబాల్ కోర్టును ఏర్పాటు చేసినట్లు చెబుతున్న అధికారులు నెట్తో పాటు బాల్స్ను ఇవ్వడం లేదు. ఊరికి దూరంగా ఏర్పాటు చేయడంతో అక్కడికి వెళ్లి ఆడలేని పరిస్థితి నెలకొంది. – చిన్నపాగ భాను, వాలీబాల్ క్రీడాకారుడు, పాన్గల్ పట్టణంలో కరువు.. పట్టణంలోని పది వార్డుల్లో ఎక్కడా క్రీడా మైదానాలు ఏర్పాటు చేయలేదు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న చిన్నపాటి ఖాళీ స్థలాల్లో క్రీడా మైదానాలు అంటూ సూచిక బోర్డులు ఏర్పాటు చేసి నిధులు దండుకున్నారు. కబడ్డీ, వాలీబాల్ ఆడే క్రీడాకారులకు సరైన మైదానాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. – బాలకృష్ణ, అమరచింత -
అయ్యో.. అయ్యయ్యో!
‘స్థానిక’ రిజర్వేషన్లలో పంచాయితీ ● ఎస్టీలు లేని చోట ఎస్టీకి.. ఎస్సీలు లేని చోట ఎస్సీకి.. ● పలు గ్రామాల్లో కిరికిరి.. కొన్ని చోట్ల అనివార్యంగా పదవులు ● నాగర్కర్నూల్ జిల్లాలో ఆ 4 గ్రామాల్లో ‘ప్రత్యేక’ పరిస్థితి ● ఎస్టీలు లేకున్నా సర్పంచ్ స్థానాలు ఆ వర్గానికే రిజర్వ్డ్ ● 2019లో జరగని ఎన్నికలు.. ఈ సారీ స్వయం పాలనకు దూరమేనా..? ఎస్సీలు లేని చోట ఎస్సీలకు.. ఎస్టీలు లేని చోట ఎస్టీలకు.. ఇలా ‘స్థానిక’ ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్లు ఖరారు చేయడం ఉమ్మడి జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ప్రధానంగా పలు గ్రామాల్లో సర్పంచ్, వార్డు పదవులకు కేటాయించిన రిజర్వేషన్లలో ఆ వర్గానికి చెందిన ఓటర్లే లేకపోవడంతో గందరగోళం నెలకొంది. మరోవైపు కొన్ని పల్లెల్లో ఒకరు, ఒకట్రెండు కుటుంబాలు ఉన్న సామాజిక వర్గాలకు అనివార్యంగా పదవులు దక్కనున్నాయి. ఇదేక్రమంలో ఎన్నో ఆశలతో బరిలో నిలిచేందుకు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్న వివిధ పార్టీల్లోని ముఖ్య నేతల అనుచరులకు భంగపాటే ఎదురైంది. తారుమారైన రిజర్వేషన్లు దేవరకద్రతో పాటు అన్ని నియోజకవర్గాల్లోనూ ఆయా నాయకుల ఆశలపై నీళ్లు చల్లగా.. వారిలో నైరాశ్యం అలుముకుంది. – సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్ -
తెలంగాణ పండుగ బతుకమ్మ
వనపర్తి: తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టే పండుగ బతుకమ్మ అని కలెక్టర్ ఆదర్శ్ సురభి, ఎస్పీ రావుల గిరిధర్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్ ఆవరణలో సెర్ప్, మెప్మా, జిల్లా సంక్షేమ శాఖలు సంయుక్తంగా బతుకమ్మ వేడుకలు నిర్వహించాయి. ఈ వేడుకలకు కలెక్టర్, ఎస్పీ హాజరై తీరొక్క పూలతో తయారుచేసిన బతుకమ్మలకు ప్రత్యేక పూజలు చేశారు. మహిళలు, చిన్నారులతో కలిసి బతుకమ్మ చుట్టూ ఆడి అందరిని ఉత్సాహపర్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సంస్కృతి సాంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనమైన జిల్లాలో బతుకమ్మ సంబరాలు వాడవాడల ఘనంగా జరుగుతున్నాయన్నారు. ప్రతి ఒక్కరూ పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని పండగ శుభాకాంక్షలు తెలియజేశారు. వివిధ శాఖల ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు నిర్వహించగా ఉత్తమ బతుకమ్మలను ప్రదర్శించిన వారికి బహుమతులు అందజేశారు. మొదటి బహుమతి మెప్మా, రెండో బహుమతి పురపాలక, మూడో బహుమతి వ్యవసాయశాఖ, నాలుగో బహుమతి కలెక్టరేట్కు దక్కింది. వేడుకల్లో వివిధ శాఖల జిల్లా అధికారులు, మహిళలు, చిన్నారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
క్రీడా మైదానం.. నిరుపయోగం
● కనిపించని క్రీడాసామగ్రి ● బీఆర్ఎస్ పాలనలో ఆగమేఘాల మీద ఏర్పాటు ● నీరుగారుతున్న లక్ష్యం.. పట్టించుకోని అధికార యంత్రాంగం ● నిరుత్సాహంలో యువత, విద్యార్థులు అమరచింత: గ్రామీణ ప్రాంతాల్లో క్రీడలకు జీవం పోయడంతో పాటు పల్లె క్రీడాకారుల నైపుణ్యాలను జిల్లా, రాష్ట్ర, జాతీయస్థాయికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి గ్రామపంచాయతీలో క్రీడా మైదానం ఏర్పాటు చేసింది. ఇందుకోసం ప్రభుత్వం స్థలం కేటాయించడంతో పాటు రూ.5 లక్షలు మంజూరు చేసి యుద్ధప్రాతిపదికన పూర్తి చేసింది. కాని చాలా గ్రామాల్లో క్రీడా మైదానాలు గ్రామాలకు దూరంగా గుట్టల ప్రదేశాల్లో ఉండటంతో నిరుపయోగంగా మారాయి. కొన్ని గ్రామాల్లో పాఠశాల మైదానాల్లో ఏర్పాటు చేయడంతో విద్యార్థులకు కాస్త ఉపయోగంగా ఉన్నాయి. గ్రామాలకు దూరంగా ఉన్న క్రీడా మైదానాల నిర్వహణ లేకపోవడంతో నిరుపయోగంగా ఉన్నాయి. రాళ్లు రప్పలు తేలిన ప్రదేశాల్లో వీటికి సంబంధించిన సూచిక బోర్డులు ఏర్పాటు చేసిన అధికారులు ఆ ప్రాంతాల్లో ఆటలు ఎలా ఆడుతారనే సంగతే మరిచారు. జిల్లావ్యాప్తంగా అన్ని మండలాల్లోని గ్రామాల్లో ఉన్న క్రీడా మైదానాల పరిస్థితి ఇదేవిధంగా ఉండటంతో ప్రస్తుతం ప్రభుత్వమైనా వీటిని వినియోగంలోకి తీసుకొచ్చి క్రీడాకారులకు ఉపయోగపడేలా సౌకర్యాలు కల్పించాలని ప్రజలు కోరుతున్నారు. ఫ క్రీడా మైదానాల్లో కబడ్డీ, వాలీబాల్, ఖోఖో కోర్టులను ఏర్పాటుచేసి వీటికి సంబంధించిన సామగ్రిని బిగించగా.. ప్రస్తుతం కనిపించకుండా పోయాయి. క్రీడాకారుల కోసం అన్నిరకాల క్రీడాసామగ్రి కిట్ను ఆయా గ్రామపంచాయతీలకు అప్పగించారు. అవి సైతం ఎక్కడా కనిపించడం లేదని క్రీడాకారులు ఆరోపిస్తున్నారు. కొన్ని గ్రామాల్లో ప్రభుత్వ స్థలాలు లేకపోవడం.. స్థల దాతలు ముందుకురాకపోవడంతో నిర్మాణాలు చేపట్టలేదు. పిచ్చి మొక్కలు, చెత్త చెదారం.. నిర్వహణ లేకపోవడంతో క్రీడా మైదానాల్లో పిచ్చి మొక్కలు ఏపుగా పెరగడంతో పాటు చెత్తా చెదారంతో నిండిపోయాయి. మరికొన్ని చోట్ల వ్యాయామం కోసం ఏర్పాటు చేసిన పరికరాలు సైతం కనిపించడం లేదు. గ్రామ సమీపంలో ఏర్పాటు చేయకపోవడంతో క్రీడాకారులు వీటిని వినియోగించుకునే పరిస్థితి లేక నిరుపయోగంగా మారాయి. వినియోగంలోకి తీసుకొస్తాం.. గ్రామాల్లోని క్రీడా మైదానాల్లో సామగ్రి సమకూరుస్తాం. క్రీడాకారులకు ఉపయోగపడేలా తీర్చిదిద్దుతాం. కొన్ని గ్రామాల్లో వసతులు లేవని తెలిసింది. ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులతో మాట్లాడి సమస్యలు తెలుసుకొని పూర్తిస్థాయిలో మరమ్మతులు చేపట్టి క్రీడాకారులు వినియోగించుకునేలా చర్యలు తీసుకుంటాం. – రఘునాథ్రెడ్డి, ఇంచార్జి డీపీఓ -
రిటర్నింగ్ అధికారులదే కీలకపాత్ర
వనపర్తి: స్థానిక సంస్థల ఎన్నికలు పారదర్శంగా నిర్వహించడంలో రిటర్నింగ్ అధికారులదే కీలకపాత్రని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. మంగళవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో రిటర్నింగ్ అధికారులతో సమావేశం నిర్వహించి వారి బాధ్యతలపై దిశా నిర్దేశం చేశారు. జిల్లాలో రెండు విడతల్లో ఎన్నికలు జరుగుతాయని, అక్టోబర్ 9న మొదటి విడత, అక్టోబర్ 13న రెండోవిడత ఎన్నికల ప్రకటన విడుదల చేసే బాధ్యత రిటర్నింగ్ అధికారులదే అన్నారు. ఎన్నికల ప్రకటనను ఆర్ఓ కార్యాలయం, కలెక్టరేట్ నోటీసుబోర్డుపై ప్రదర్శించాల్సి ఉంటుందని తెలిపారు. నామినేషన్ ప్రక్రియను వీడియో తీయాలని, పత్రంలో అభ్యర్థి ఏమైనా తప్పులు చేసినా, సంతకాలు లేకున్నా, తగిన ధ్రువపత్రాలు జత చేయకున్నా గుర్తించి సరి చేయించాలని, సాధ్యమైనంత వరకు తిరస్కరించకుండా చూడాలని ఆదేశించారు. ఏదైనా ధ్రువపత్రం జతచేయని పక్షంలో నిర్దిష్ట సమయంలో అభ్యర్థికి నోటీస్ జారీ చేయాలని, సకాలంలో ధ్రువీకరణ పత్రం సమర్పించని పక్షంలో మాత్రమే తిరస్కరించాలని ఆదేశించారు. నామినేషన్ వేసేందుకు అభ్యర్థి వెంట గదిలోకి ముగ్గురు కన్నా ఎక్కువ మంది వెళ్లడానికి వీలు లేదని వివరించారు. గుర్తింపు పొందిన పార్టీల గుర్తులు బి–ఫారం ఇచ్చిన అభ్యర్థులకు మాత్రమే కేటాయించి స్వతంత్ర అభ్యర్థులకు అభ్యర్థి పేరు తెలుగు అక్షరాలకు అనుగుణంగా కేటాయించాల్సి ఉంటుందన్నారు. ఎన్నికల నియమావళి ప్రతి పేజీని చదువుకొని అనుమానాలు నివృత్తి చేసుకోవాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు యాదయ్య, ఎన్.ఖీమ్యానాయక్, ఆర్డీఓ సుబ్రమణ్యం, రిటర్నింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. నోడల్ అధికారులు సమర్థవంతంగా పనిచేయాలి.. స్థానిక సంస్థల ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు నోడల్ అధికారులు సమర్థవంతంగా పని చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. మంగళవారం ఉదయం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నోడల్ అధికారులతో సమావేశం నిర్వహించి దిశా నిర్దేశం చేశారు. జిల్లాలో ఎన్నికల నియమావళి ప్రకారం నోడల్ అధికారులను నియమించినట్లు చెప్పారు. ప్రతి అధికారి కి బాధ్యతలపై అవగాహన కల్పించి అప్పగించారు. కలెక్టర్ ఆదర్శ్ సురభి -
ఆయుధ పూజ నిర్వహించిన ఎస్పీ
వనపర్తి: శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణలో జిల్లా పోలీసులు సఫలీకృతం కావాలని, దుర్గాదేవి అనుగ్రహంతో విజయం వరించాలని ఎస్పీ రావుల గిరిధర్ అన్నారు. దుర్గాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకొని మంగళవారం సాయుధ దళ పోలీసు కార్యాలయంలో ఎస్పీ, ఆయన సతీమణి అపర్ణ, అధికారులు, సిబ్బందితో కలిసి ఆయుధాలు, వాహనాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. విధి నిర్వహణలో వినియోగించే ఆయుధాలు, వాహనాలకు ఎలాంటి ఆటంకం, అవరోధం కలగకుండా ఉండాలని బ్రాహ్మణులు వేదమంత్రోచ్ఛారణలతో పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. దుర్గామాత కరుణా కటాక్షాలు జిల్లా పోలీసులకు ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షిస్తూ ఆయుధాలు, వాహనాలకు పూజలు నిర్వహించామన్నారు. కార్యక్రమంలో సాయుధ దళ అదనపు ఎస్పీ వీరారెడ్డి, డీఎస్పీ వెంకటేశ్వరరావు, సీఐలు కృష్ణయ్య, రాంబాబు, స్పెషల్ బ్రాంచ్ సీఐ నరేష్, రిజర్వ్ సీఐలు శ్రీనివాస్, అప్పలనాయుడు, రిజర్వ్ ఎస్ఐలు వినోద్, సురేందర్, మొగ్దుంబారి, జిల్లాలోని ఎస్ఐలు తదితరులు పాల్గొన్నారు. -
మద్యం టెండర్ల ‘ఖాతా’ ప్రారంభం
● నాగర్కర్నూల్ జిల్లాలో మూడు టెండర్లు దాఖలు ● మిగిలిన జిల్లాల్లో నమోదు కాని టెండర్లు మహబూబ్నగర్ క్రైం: ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఉన్న 227 మద్యం దుకాణాలకు టెండర్లు ఆహ్వానించగా మంగళవారం నాగర్కర్నూల్ ఈఎస్ పరిధిలో మూడు టెండర్లు దాఖలయ్యాయి. నాగర్కర్నూల్లో సర్కిల్ పరిధిలో ఉన్న రెండు దుకాణాలకు, కల్వకుర్తిలో ఒక దుకాణానికి టెండర్లు వచ్చాయి. అయితే ఈనెల 26 నుంచి ఉమ్మడి జిల్లాలో ఉన్న మద్యం దుకాణాలకు టెండర్ల ప్రక్రియ ప్రారంభం కాగా ఇప్పటి వరకు మూడు మాత్రమే వచ్చాయి. మహబూబ్నగర్, నారాయణపేట, వనపర్తి, గద్వాల జిల్లాలో ఇంకా ఖాతా ఒపెన్ కాలేదు. ఈనెల 18 వరకు టెండర్ల స్వీకరణకు గడువు ఉన్న క్రమంలో మద్యం వ్యాపారులు ఆలస్యం చేస్తున్నారు. చివరి వారం రోజుల్లో టెండర్ల వేగం పుంజుకుంటుంది. రెండేళ్ల కాలపరిమితిలో వచ్చే మద్యం వ్యాపారులకు స్థానిక ఎన్నికలతో పాటు మున్సిపల్, పంచాయతీ ఎన్నికలు కలిసి రానున్నాయి. దీంతో గతం కంటే ఈసారి టెండర్ల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. -
తెలంగాణ సంస్కృతికి చిహ్నం బతుకమ్మ
వనపర్తి: తెలంగాణ సంస్కృతికి చారిత్రక చిహ్నం బతుకమ్మ అని.. ఈ వేడుకలు ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందుతున్నాయని ఎస్పీ రావుల గిరిధర్ అన్నారు. ఇలాంటి వేడుకలు సాంప్రదాయాలను కాపాడటమే కాకుండా కుటుంబ బంధాలను మరింత బలపరుస్తాయని తెలిపారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో అంగరంగ వైభవంగా బతుకమ్మ సంబరాలు నిర్వహించగా ఎస్పీ, ఆయన సతీమణి, తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు బండి అపర్ణతో కలిసి పాల్గొని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ఎక్కడైనా దేవుళ్లకు పూలతో కొలుస్తామని.. కానీ పువ్వులనే దేవతగా కొలిచే సాంప్రదాయం ఒక తెలంగాణలో మాత్రమే ఉందన్నారు. సిబ్బంది తమ కుటుంబ సభ్యులతో కలిసి వేడుకల్లో పాల్గొన్నందుకు సంతోషం కలిగిందని తెలిపారు. జిల్లాలోని అన్ని పోలీస్స్టేషన్ల అధికారులు, సిబ్బంది, మహిళ అధికారులు, వారి కుటుంబసభ్యులతో వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. మహిళా ఉద్యోగులు రంగురంగుల పూలతో అందంగా పేర్చిన బతుకమ్మలను ఒకేచోట చేర్చి ఆడిపాడుతూ సందడి చేశారు. డీఎస్పీ వెంకటేశ్వరరావు, కార్యాలయం ఏఓ సునందన, వనపర్తి, కొత్తకోట, ఆత్మకూర్ సీఐలు కృష్ణయ్య, రాంబాబు, శివకుమార్, స్పెషల్ బ్రాంచ్ సీఐ నరేష్, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు అప్పలనాయుడు, శ్రీనివాస్, మహిళా ఎస్ఐలు స్వాతి, రాణి, రజిత, దివ్య. హిమబిందు, మహిళా పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ● జిల్లా కలెక్టరేట్లో సోమవారం జరిగిన బతుకమ్మ ఉత్సవాల్లో కార్యాలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
యువత మత్తుబారిన పడొద్దు
వనపర్తి: జిల్లా యువత మాదక ద్రవ్యాల బారిన పడకుండా తగిన చర్యలు చేపట్టాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లాస్థాయి మాదక ద్రవ్యాల నియంత్రణ కమిటీ సమావేశంలో ఆయనతో పాటు డీఎస్పీ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాల అక్రమ రవాణాను పూర్తిగా అరికట్టాలన్నారు. గంజాయి, ఇతర మత్తు పదార్థాల వినియోగంతో కలిగే చెడు ప్రభావాలపై గ్రామాలు, విద్యాసంస్థల్లో ముఖ్యంగా ఇంటర్మీడియట్, పాలిటెక్నిక్, ఇంజినీరింగ్, డిగ్రీ కళాశాలల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ఈ విషయంలో పోలీసు, ఎకై ్సజ్ తదితర అన్నిశాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు. డీఎస్పీ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. జిల్లాలో మాదక ద్రవ్యాల రవాణాను కట్టడి చేసేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. బెల్ట్ దుకాణాలు, కల్లు దుకాణాలపై పర్యవేక్షణ కొనసాగిస్తున్నట్లు చెప్పారు. అనుమానితులు, వాహనాలపై నిఘా ఉంచామని, పట్టుబడితే కేసులు నమోదు చేస్తున్నామన్నారు. జిల్లాలో మాదక ద్రవ్యాల రవాణా, వినియోగాన్ని పూర్తిగా నిర్మూలించేందుకు కృషి చేస్తున్నట్లు వివరించారు. సమావేశంలో ఆర్డీఓ సుబ్రమణ్యం, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
సరస్వతీ నమస్తుభ్యం..
సరస్వతి నమస్తుభ్యం.. జిల్లాలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఎనిమిదోరోజు సోమవారం కొత్తకోటలోని వాసవి కన్యకాపరమేశ్వరి, అంబాభవాని ఆలయాల్లో అమ్మవార్లను అర్చకులు సరస్వతీదేవిగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం ఆలయాల్లో చిన్నారులకు అక్షరాభ్యాసం అనంతరం మహిళలు కుంకుమార్చన పూజలు చేశారు. భక్తులు అధికసంఖ్యలో పాల్గొని అమ్మవార్లను దర్శించుకొన్నారు. – కొత్తకోట యూరియా కోసం ఆందోళన వద్దు పాన్గల్: రైతులు యూరియాను అవసరం మేరకు వినియోగించాలని డీసీసీబీ చైర్మన్ మామిళ్లపల్లి విష్ణువర్ధన్రెడ్డి అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని రైతువేదికలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం మహాజన సభ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. యూరియా కోసం రైతులు ఆందోళన చెందాల్సిన పని లేదని.. పుష్కలంగా అందిస్తున్నా నేటికీ రద్దీ తగ్గడం లేదన్నారు. కొందరు రైతులు సింగిల్విండో ద్వారా యూరియా పొంది పక్క మండలాల్లోని వారి బంధువులకు సరఫరా చేస్తుండటంతో మండలంలోనే రద్దీ ఎక్కువగా ఉంటోందని తెలిపారు. ఈ నెల మొదటి వారంలో పట్టాదారు పాసు పుస్తకం, ఆధార్కార్డు జిరాక్స్లు అందజేసినా నేటికీ యూరియా ఇవ్వలేదని పలువురు రైతులు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. మండలంలో గతేడాది 11 వేల బస్తాలు పంపిణీ చేస్తే ఈ ఏడాది ఇప్పటికే 36 వేల బస్తాలు సరఫరా చేశామని వివరించారు. సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోవర్ధన్సాగర్, విండో వైస్ చైర్మన్ కుర్వ బాలయ్య, సీఈఓ భాస్కర్గౌడ్, విండో డైరెక్టర్లు సాయి ప్రసాద్గౌడ్, బాలరాజు, జైపాల్రెడ్డి, రైతులు పాల్గొన్నారు. -
మూడు దశల్లో ‘పంచాయతీ’
గ్రామ పంచాయతీకి సంబంధించి తొలి విడతలో అక్టోబర్ 17 నుంచి 31 వరకు 16 మండలాల పరిధిలోని 410 జీపీలతోపాటు 3,514 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. రెండో విడతలో అక్టోబర్ 21 నుంచి నవంబర్ 4 వరకు 28 మండలాల్లోని 611 జీపీలతోపాటు 5,546 వార్డులకు.. చివరి దశలో అక్టోబర్ 25 నుంచి నవంబర్ 8 వరకు 33 మండలాల పరిధిలోని 657 జీపీలతోపాటు 6,008 వార్డు స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. వనపర్తి, జోగుళాంబ గద్వాల జిల్లాల్లో మాత్రం తొలి విడతలో పోలింగ్ నిర్వహించడం లేదు. రెండు, మూడో విడతల్లోనే ఆ రెండు జిల్లాల్లో ఎన్నికల ప్రక్రియ పూర్తి కానుంది. కాగా.. పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఎన్నికలు జరిగిన రోజే ఓట్ల లెక్కింపు చేపడుతారు. కాగా.. పంచాయతీ ఎన్నికలకు గాను 2,363 పోలింగ్ కేంద్రాలు కేటాయించారు. -
తొలివిడత వనపర్తి నియోజకవర్గ మండలాలకే..
వనపర్తి: జిల్లాలో మొత్తం 15 మండలాలు ఉండగా.. తొలి విడతలో వనపర్తి నియోజకవర్గంలోని ఎనిమిది మండలాల పరిధిలోని 8 జెడ్పీటీసీ, 71 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. రెండోవిడతలో కొల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని మూడు మండలాలు, మక్తల్ నియోజకవర్గంలోని రెండు మండలాలు, దేవరకద్ర నియోజకవర్గంలోని రెండు మండలాలు మొత్తం ఏడు మండలాల పరిధిలోని 7 జెడ్పీటీసీ, 62 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేలా జిల్లా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. నవంబర్ 11న 15 జెడ్పీటీసీ, 133 ఎంపీటీసీ స్థానాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు చేపట్టి అదేరోజు ఫలితాలు వెల్లడించనున్నారు. గ్రామపంచాయతీ ఎన్నికలు రాష్ట్రవ్యాప్తంగా మూడు విడతల్లో జరగనుండగా.. జిల్లాలో రెండో విడతలో 135 గ్రామపంచాయతీలు, మూడో విడతలో 133 గ్రామపంచాయతీల్లో ఎన్నికలు జరగనున్నాయి. తొలివిడత ఎన్నికలు జరిగే మండలాలు : వనపర్తి, ఖిల్లాఘనపురం, పెద్దమందడి, గోపాల్పేట, రేవల్లి, ఏదుల, శ్రీరంగాపురం, పెబ్బేరు రెండో విడతలో ఎన్నికలు నిర్వహించే మండలాలు : పాన్గల్, వీపనగండ్ల, చిన్నంబావి, కొత్తకోట, మదనాపురం, ఆత్మకూరు, అమరచింత రిజర్వేషన్ మహిళలు జనరల్ మొత్తం స్థానాలు జనరల్ 16 25 41 బీసీ 23 33 56 ఎస్సీ 9 15 24 ఎస్టీ 3 9 12 స్థానిక ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 42 శాతం బీసీ రిజర్వేషన్పై ఇప్పటికే హైకోర్టులో కేసు కొనసాగుతుండగా.. తుది తీర్పు అక్టోబర్ 8న వెలువడనుంది. ఎన్నికల షెడ్యూల్ విడుదలైనా.. కోర్టు తీర్పు ఆధారంగా ఎన్నికలు వాయిదా పడే అవకాశం ఉందని అధికార, ప్రతిపక్ష పార్టీల నాయకులు బాహాటంగా చర్చించుకుంటున్నారు. అధికార పార్టీ నేతలు సైతం అనుచరులకు వాయిదా విషయంపై సంకేతాలు ఇవ్వడం గమనార్హం. -
మోగిన నగారా..
● 2 విడతల్లో ప్రాదేశిక.. 3 దఫాల్లో పంచాయతీ సమరం ● అక్టోబర్ 9 నుంచి నవంబర్ 11 వరకు కొనసాగనున్న ప్రక్రియ ● ఉమ్మడి జిల్లాలో 77 జెడ్పీటీసీ.. 800 ఎంపీటీసీ స్థానాలు ● 1,678 గ్రామ పంచాయతీలు.. 15,068 వార్డులకు ఎన్నికలు ● గ్రామాల్లో రాజకీయ సందడి.. గెలుపే లక్ష్యంగా పార్టీల కసరత్తు ఆశావహుల జోరు.. నేతల బేజారు స్థానిక ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో రాజకీయ సందడి మొదలైంది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించడంతో ఆ వర్గానికి చెందిన నాయకులు ఉత్సాహంలో ఉన్నారు. వీరితోపాటు రిజర్వేషన్లు అనుకూలంగా వచ్చిన మండలాలు, గ్రామాల్లోని మిగతా వర్గాలకు సంబంధించిన ఆశావహులు ఎక్కువ సంఖ్యలో తమకే అవకాశం ఇవ్వాలని పట్టుబడుతున్నారు. వారికి సర్దిచెప్పలేక ముఖ్య నేతలు ఇబ్బంది పడుతున్నట్లు సమాచారం. ఇదేక్రమంలో రిజర్వేషన్ల తారుమారుతో భంగపడిన ఆశావహులది మరో సమస్యగా మారినట్లు తెలుస్తోంది. చాలా మండలాల్లో పాత, కొత్త నాయకుల పంచాయితీలు మళ్లీ తెరపైకి వస్తున్నాయి. అధికార పార్టీ కాంగ్రెస్లో ఈ పరిస్థితి నెలకొనగా.. ముఖ్య నేతలు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. కాంగ్రెస్తోపాటు బీఆర్ఎస్, బీజేపీ నేతలు గ్రామాల్లో విస్తృత పర్యటనలకు రంగం సిద్ధం చేసుకుంటుండడంతో రాజకీయ వాతావరణం వేడెక్కనుంది. పల్లె పోరుకు సై.. -
పారదర్శకంగా ఎన్నికల నిర్వహణ
వనపర్తి: స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. సోమవారం సాయంత్రం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని జిల్లా ఎన్నికల అధికారులు, పోలీస్ అధికారులతో ఎన్నికల ప్రవర్తన నియమావళిపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా జిల్లా నుంచి కలెక్టర్ పాల్గొని వివరాలు వెల్లడించారు. జిల్లాలో సోమవారం ఉదయం నుంచి ఎన్నికల నియమావళి అమలులోకి వచ్చిందని.. 24, 48, 72 గంటల్లో తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. జిల్లాలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు రెండు విడతల్లో జరగనుండగా.. మొదటి విడతలో 8 జడ్పీటీసీలు, 71 ఎంపీటీసీలు, రెండోవిడతలో 7 జెడ్పీటీసీ, 62 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. గ్రామపంచాయతీ ఎన్నికలు సైతం రెండు విడతల్లో నిర్వహించనుండగా.. మొదటి విడతలో 135, రెండోవిడతలో 133 గ్రామపంచాయతీల్లో జరుగుతాయని తెలిపారు. బ్యాలెట్ బాక్సులు, పోలింగ్ సిబ్బంది విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేవని, ఎఫ్ఎస్టీ, ఎస్ఎస్టీ బృందాలను నియమిస్తూ ఆదేశాలు జారీ చేసినట్లు తెలియజేశారు. ఇప్పటికే రిటర్నింగ్ అధికారులకు శిక్షణ పూర్తి చేశామని చెప్పారు. వీడియో కాన్ఫరెన్స్లో ఎస్పీ రావుల గిరిధర్, అదనపు కలెక్టర్లు ఎన్.ఖీమ్యానాయక్, యాదయ్య, నోడల్ అధికారులు, ఎస్హెచ్ఓలు పాల్గొన్నారు. -
చట్టాలు అందరికీసమానమే
ఆత్మకూర్: చట్టాలకు పేద, ధనిక అనే తేడా ఉండదని.. అందరికీ సమానమని న్యాయమూర్తి శిరీష తెలిపారు. సోమవారం పట్టణంలోని మున్సి్ఫ్ మెజిస్ట్రేట్ కోర్టు ఆవరణలో నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సుకు ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమెతో పాటు న్యాయవాదులు వివిధ రకాల కేసులు, చట్టాల గురించి క్లుప్తంగా వివరించారు. క్షణికావేశంలో నేరాలకు పాల్పడి కేసులు నమోదు చేసుకొని కోర్టుల చుట్టూ తిరిగి విలువైన సమయం వృథా చేసుకోవద్దని సూచించారు. కార్యక్రమంలో న్యాయవాదులు, లోక్ అదాలత్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ‘అక్రమ కేసులు ఎత్తివేయాలి’ ఆత్మకూర్: పోలీసులు ఉద్దేశపూర్వకంగా నమోదు చేసిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం పట్టణంలో స్థానిక బీఆర్ఎస్ నాయకులతో కలిసి సీఐ శివకుమార్తో సమావేశమై కేసు వివరాలను అడిగి తెలుసుకున్నారు, అనంతరం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. ఈ నెల 4, 5 తేదీల్లో ఇరువర్గాలకు చెందినవారు శాంతియుతంగా నిరసన తెలిపారని, అన్నాదమ్ముల్లా కలిసి జీవిస్తున్న వారి మధ్య విభేధాలు సృష్టించే విధంగా పోలీసుల చర్యలు ఉండటం విచారకరమని ఆందోళన వ్యక్తం చేశారు. అక్రమంగా నమోదు చేసిన కేసులను వెంటనే ఎత్తి వేయాలని సీఐను కోరారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ బంగారు శ్రీనివాసులు, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రవికుమార్, మార్కె ట్ కమిటీ మాజీ వైస్చైర్మన్ వేణుగోపాల్రెడ్డి, నాయకులు చెన్నయ్య, రామకృష్ణ, జానకిరాం, మాసన్న, కొత్తబోయ శేఖర్, రియాజ్అలీ, భీమన్న, ముబీన్ తదితరులు పాల్గొన్నారు. వైభవంగా సామూహిక అక్షరాభ్యాసం ఎర్రవల్లి: బీచుపల్లి పుణ్యక్షేత్రంలోని జ్ఞాన సరస్వతి ఆలయంలో మూలా నక్షత్రాన్ని పురస్కరించుకొని సోమవారం సామూహిక అక్షరాభ్యాసం కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ముందుగా ఆలయంలో అర్చకులు ఉదయం సుప్రభాతసేవ, పంచామృత అభిషేకం, కుంకుమార్చనలు, మహానైవేద్య నీరాజనం వంటి పూజా కార్యక్రమాలను చేశారు. జిల్లా నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో బీచుపల్లికి చేరుకొని భక్తిశ్రద్ధలతో సరస్వతీదేవిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయంలో అర్చకులు భువనచంద్ర, దినకరన్ ఆధ్వర్యంలో వేదమంత్రాల నడుమ 65 మంది చిన్నారులకు తల్లిదండ్రుల సమక్షంలో సామూహికంగా అక్షరాభ్యాసం చేయించారు. భక్తులకు ఆలయ పాలక మండలి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. కార్యక్రమంలో ఆలయ మేనేజర్ సురేందర్రాజు, పాలక మండలి సభ్యులు, అర్చకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. -
కాంగ్రెస్ బకాయి కార్డు ఉద్యమం
కాంగ్రెస్ దోఖాను ప్రజలకు గుర్తుచేయడానికే ‘కాంగ్రెస్ బకాయి కార్డు’ ఉద్యమాన్ని ప్రారంభించామని కేటీఆర్ అన్నారు. స్థానిక ఎన్నికలకు ఓట్లు అడగడానికి వచ్చే కాంగ్రెస్ నాయకులను ప్రజలు ఈ బాకీ కార్డు చూపించి నిలదీయాలన్నారు. కాంగ్రెస్కు ఓటేసి మోసపోయిన తెలంగాణ ప్రజలు నేడు గోస పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ పాలనలో కనుమరుగైన యూరియా బస్తాల క్యూలైన్లు ఈ ప్రభుత్వ అసమర్థత వల్ల మళ్లీ వచ్చాయని, లైన్లలో నిలబడి రైతులు ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. యూరియా ఇవ్వకుండా, రైతుబంధు వేయకుండా, వడ్లకు బోనస్ చెల్లించకుండా రేవంత్రెడ్డి రైతులను అరిగోస పెడుతున్నారని విమర్శించారు. తెలంగాణలో నడుస్తున్నది కాంగ్రెస్– బీజేపీ జాయింట్ వెంచర్ ప్రభుత్వం అని సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్రం దివాలా తీసిందని చెబుతూ తెలంగాణ పరువును బజారుకీడుస్తున్నారని, హామీలపై నిలదీస్తే ‘నన్ను కోసుకు తింటారా?’ అని మాట్లాడటం ఆయన అవివేకానికి నిదర్శనమన్నారు. మాట తప్పిన రేవంత్రెడ్డిని ఎన్నికల్లో రాజకీయంగా బొంద పెట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఇచ్చిన హామీలను గాలికొదిలేసి, అడ్డగోలు మాటలతో తెలంగాణ పరువు తీస్తున్న రేవంత్ సర్కార్కు స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలన్నారు. ● అచ్చంపేటలో ఎవరో పార్టీ వీడారని బాధపడాల్సిన అవసరం లేదని, ప్రజల అభిమానం ఉన్న నాయకుడిని కేసీఆర్ త్వరలోనే పంపిస్తారని కేటీఆర్ భరోసా ఇచ్చారు. తిరిగి కేసీఆర్ సీఎం కావాలంటే అచ్చంపేటలో గులాబీ జెండా ఎగరాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీలు చల్లా వెంకట్రామిరెడ్డి నవీన్కుమార్రెడ్డి, ఎమ్మెల్యే విజయుడు, మాజీమంత్రులు శ్రీనివాస్గౌడ్, నిరంజన్రెడ్డి, లక్ష్మారెడ్డి, రాష్ట్ర నేత ఆర్ఎస్ ప్రవీణ్కుమార్, మాజీ ఎమ్మెల్యేలు జైపాల్రెడ్డి, హర్షవర్ధన్రెడ్డి, ఆల వెంకటేశ్వర్రెడ్డి, నాయకులు మనోహర్, శ్రీకాంత్భీమ, నర్సింహగౌడ్, రమేష్రావు తదితరులు పాల్గొన్నారు. -
కృష్ణమ్మ ఉగ్రరూపం
ఎర్రవల్లి: ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు జూరాల ప్రాజెక్టుకు అధికంగా వరద వచ్చి చేరుతోంది. జూరాల నుంచి 39 గేట్ల ద్వారా 5.20 లక్షల క్యూసెక్కులకు పైగా నీరు దిగువకు వదిలారు. దీంతో బీచుపల్లి పుణ్యక్షేత్రం వద్ద కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. వరద తీవ్రత పెరగడం పుష్కరఘాట్లు నీట మునిగాయి. శివాలయం అతిసమీపంలో వరద ప్రవహిస్తుంది. నదీతీర గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి కృష్ణానది పరివాహక ప్రాంతంలో, గ్రామాల్లో నివసించే ప్రజలు వరద ఉధృతిపై అప్రమత్తంగా ఉండాలని డీఎస్పీ మొగిలయ్య అన్నారు. ఆదివారం బీచుపల్లి పుష్కరఘాట్ వద్ద కృష్ణానది వరద ప్రవాహాన్ని ఆయన పరిశీలించారు. పుష్కరఘాట్ల వద్దకు, నీటిలోకి భక్తులు ఎవరూ వెళ్లవద్దని, పరివాహక ప్రాంతాల్లో నివసించే మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని అన్నారు. గొర్రెలు, పశువుల కాపరులు మేత కోసం నది సమీపంలోకి ఎట్టి పరిస్థితుల్లో తీసుకు వెళ్లవద్దని, ముసురు వర్షాల వల్ల వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయని, వాహనదారులు తగు జాగ్రత్తలు పాటించాలన్నారు. ప్రజలకు ఏమైనా అత్యవసరమైతే వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించి సహాయం పొందాలని ఆయన సూచించారు. ఆయన వెంట సిఐ రవిబాబు, ఎస్సై రవినాయక్ ఉన్నారు. బీచుపల్లి బ్రిడ్జి వద్ద ఉధృతంగా వస్తున్న కృష్ణమ్మ -
యూరియా పంపిణీలో అవకతవకలతోనే ఇబ్బందులు
కొత్తకోట రూరల్: యూరియా పంపిణీ విధానంలో అవకతవకల కారణంగానే రైతులు ఇబ్బందులు పడుతున్నారని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బండారి శాంతి కుమార్ అన్నారు. ఆదివారం మండలంలోని కనిమెట్టలో బీజేపీ నాయకుడు రాజేందర్రెడ్డి నివాసంలో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించిన అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడారు. దేశంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రతినెలా నాలుగో ఆదివారం మన్ కీ బాత్ ద్వారా ప్రజలకు చేరవేస్తున్నారని అన్నారు. దేశంలో జరిగే ఘటనలు, కొత్త విషయాలను ప్రధాని ప్రజలతో పంచుకోవడం విశేషమన్నారు. ఇలాంటి కార్యక్రమాలను పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు వీక్షించాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు పెంచడాన్ని బీజేపీ స్వాగతిస్తుందని.. అయితే మతం పేరుతో రిజర్వేషన్లు ఇవ్వకూడదని అన్నారు. ముస్లింలకు 10శాతం రిజర్వేషన్లు ఇవ్వడాన్ని బీజేపీ వ్యతిరేకిస్తుందన్నారు. యూరియాను కేంద్ర ప్రభుత్వం సరఫరా చేస్తుందని.. పంపిణీ విధానంలోనే అవకతవకలు చోటుచేసుకుంటున్నాయని అన్నారు. రాష్ట్రంలో యూరియా కొరత లేదని స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కామారెడ్డిలో చెప్పిన మాటలను గుర్తుచేశారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు డి.నారాయణ, రాష్ట్ర నాయకులు ఎగ్గని నరసింహులు, అయ్యగారి ప్రభాకర్రెడ్డి, దళితమోర్చా రాష్ట్ర నాయకులు రాసమోని సాయిరాం, కోటేశ్వర్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, చందు, తిరుపతి పాల్గొన్నారు. -
పండుగపూట పస్తులేనా..
జీపీ కార్మికులకు మూడు నెలలుగా అందని వేతనాలు ●కుటుంబ పోషణ భారమైంది.. నెలనెలా వేతనాలు అందక పోవడంతో కుటుంబ పోషణ భారంగా మారింది. ప్రతినెలా వంట సరుకుల కోసం చేసిన అప్పులను సైతం తీర్చలేని పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం నిత్యం తమతో పనులు చేయించుకుంటుందే తప్ప వేతనాలు మాత్రం సక్రమంగా అందించడం లేదు. పండుగ పూట సైతం పస్తులు ఉండక తప్పడం లేదు. – మల్లేష్, పంచాయతీ కార్మికుడు, నాగల్కడ్మూర్ వేతనాల కోసం ఆందోళన.. పంచాయతీ కార్మికులకు మూడు నెలల నుంచి వేతనాలు అందకపోవడంతో ఆందోళనకు గురవుతున్నారు. వేతనాలను క్రమం తప్పకుండా చెల్లించాలంటూ కార్మికుల పక్షాన ఆందోళనలు నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధం చేశాం. సకాలంలో వేతనాలు ఇవ్వకుంటే సమ్మె చేపడతాం. – సి.రాజు, టీయూసీఐ జిల్లా ఉపాధ్యక్షుడు, మస్తీపురం ఉన్నతాధికారులకు నివేదించాం.. జిల్లాలో పంచాయతీ కార్మికులకు చెల్లించాల్సిన వేతనాల గురించి ఉన్నాతాధికారులకు నివేదించాం. రాష్ట్రవ్యాప్తంగా ఇదే సమస్య ఉంది. ప్రభుత్వం నిధులను మంజూరుచేసిన వెంటనే కార్మికుల వ్యక్తిగత బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తాం. – రఘునాథ్రెడ్డి, ఇన్చార్జి డీపీఓ అమరచింత: గ్రామపంచాయతీలను పరిశుభ్రంగా ఉంచడంలో ముందుంటున్న పారిశుద్ధ్య కార్మికులకు నెలనెలా వేతనాలు అందక ఇబ్బందులు పడుతున్నారు. పండుగపూట పస్తులు తప్పడం లేదంటూ ఆవేదనకు గురవుతున్నారు. పెండింగ్లో ఉన్న మూడు నెలల వేతనాలు చెల్లించాలంటూ పంచాయతీ కార్మికులు ఆందోళన బాట పట్టినా ప్రభుత్వం మాత్రం అలసత్వం ప్రదర్శిస్తోంది. పంచాయతీల్లో నిధుల కొరత కారణంగా కార్మికులు నెలల తరబడి వేతనాల కోసం ఎదురుచూడాల్సి వస్తోంది. సర్పంచుల పదవీకాలం ముగిసినప్పటి నుంచి వీరికి వేతన వెతలు అధికమయ్యాయి. ఇంటి పోషణ కోసం ప్రతినెలా అప్పులు చేస్తున్నామని.. వాటిని సకాలంలో తీర్చలేని కారణంగా మరోమారు అప్పులు సైతం దొరకని పరిస్థితులు నెలకొన్నాయని పలువురు వాపోతున్నారు. ప్రతినెలా పంచాయతీ కార్మికుల బ్యాంకు ఖాతాలో నెల వేతనం జమ చేయాల్సి ఉండగా.. మూడు నెలలుగా వేతనాలు అందకపోవడంతో ఆందోళనకు గురవుతున్నారు. జిల్లాలో 1,200 మంది కార్మికులు.. జిల్లాలోని 255 గ్రామపంచాయతీల్లో పారిశుద్ధ్య పనులతో పాటు తాగునీటి సరఫరా తదితర పనులు చేస్తున్న కార్మికులు మొత్తం 1,200 మంది ఉన్నారు. వీరికి ప్రతినెలా రూ. 9,500 చొప్పున గౌవర వేతనం ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. అయితే గతంలో ఆరు నెలలకో పర్యాయం కార్మికుల వేతనాలకు సంబంధించిన బిల్లులను ఎస్టీఓలకు పంపించడంతో ఇబ్బందులు ఎదురయ్యాయి. ఈ క్రమంలో కార్మికులకు ప్రతినెలా వేతనం అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం నేరుగా బ్యాంక్ ఖాతాల్లో జమ చేసేందుకు ఉపక్రమించింది. అయినప్పటికీ పారిశుద్ధ్య కార్మికులకు వేతన తిప్పలు తప్పడం లేదు. గ్రామాలను శుభ్రంగా ఉంచేందుకు కృషిచేస్తున్న వీరికి నెలనెలా వేతనాలు అందకపోవడంతో అవస్థలు పడుతున్నారు. ప్రతినెలా జీతం కోసం ఎదురుచూపులు కుటుంబ పోషణ కోసం తప్పని అప్పులు ఆందోళన కార్యక్రమాలు చేపట్టినా ఫలితం శూన్యం -
కాంగ్రెస్, బీజేపీ దొందూ దొందే
అచ్చంపేట రూరల్: రాష్ట్రాన్ని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు బొందపెట్టే ప్రయత్నం చేస్తున్నాయని.. ఆ రెండు పార్టీలు దొందూ దొందేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారకరామారావు అన్నారు. ఆదివారం అచ్చంపేటలో నాగర్కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన బీఆర్ఎస్ జనగర్జన బహిరంగ సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలోని ప్రాజెక్టులకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చి.. 90 శాతం పనులు పూర్తిచేస్తే.. మిగిలిన 10 శాతం పనులను కూడా పూర్తి చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్నారు. ఒకవేళ ప్రాజెక్టులను పూర్తిచేస్తే కేసీఆర్కు పేరు వస్తుందనే దురుద్ధేశంతోనే ప్రభుత్వం పనులు చేపట్టడం లేదని దుయ్యబట్టారు. ఆల్మట్టి ఎత్తు పెరిగితే కొడంగల్ లిఫ్ట్, పాలమూరు ఎత్తిపోతలు, శ్రీశైలం డ్యాం నిరుపయోగంగా మారుతాయన్నారు. గతంలో రాజోలి బండ కోసం 2001లో కేసీఆర్ పాదయాత్ర చేసినప్పుడు సుంకేసుల తూములను బాంబులతో పేలుస్తామన్న రాయలసీమ ఎమ్మెల్యేకు, వెయ్యి బాంబులతో మొత్తం బ్యారేజ్ను తునాతునకలు చేస్తామని కేసీఆర్ ధీటుగా బదులిచ్చారని గుర్తుచేశారు. అలాంటి దమ్ము, తెగువ ప్రస్తుత సీఎం రేవంత్రెడ్డికి లేదా అని ప్రశ్నించారు. దక్షిణ తెలంగాణను ఎండబెట్టే కుట్రలపై ఢిల్లీలో ఉన్న రాహుల్గాంధీ, ఇక్కడ ఉన్న రేవంత్రెడ్డి ఎందుకు నోరు మెదపడం లేదని నిలదీశారు. ప్రాజెక్టుతో ఏ సంబంధం లేని జైపాల్రెడ్డి పేరు పెట్టడం విడ్డూరంగా ఉందన్నారు. కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్తో అచ్చంపేట నియోజకవర్గంలోని 90 వేల ఎకరాలకు బీఆర్ఎస్ ప్రభుత్వం సాగునీళ్లిచ్చిందన్న కేటీఆర్, మరో 70 వేల ఎకరాలకు నీళ్లిచ్చేందుకు రూ.1,350 కోట్లతో అచ్చంపేట లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని కూడా మంజూరు చేసిందన్నారు. అచ్చంపేట బిడ్డ అని చెప్పుకొనే రేవంత్రెడ్డి ఆ పథకాన్ని పూర్తి చేయకుండా పక్కన పెట్టారని మండిపడ్డారు. హామీలు మరిచిన కాంగ్రెస్కు బాకీ కార్డుతో బుద్ధి చెప్పాలి స్థానిక ఎన్నికల్లో ఆ రెండు పార్టీలను బొందపెట్టాలి అసమర్థత వల్లే యూరియా కోసం క్యూలైన్లు మళ్లీ వచ్చాయి అచ్చంపేట జనగర్జన బహిరంగ సభలో కేటీఆర్ వ్యాఖ్యలు -
శతాబ్దాల చరిత్ర.. పాన్గల్ ఖిల్లా
వనపర్తి: శతాబ్దాల చరిత్ర, ఎన్నో వీరగాథల ఘనతకు నిలువెత్తు సాక్ష్యంగా నిలిచిన పాన్గల్ ఖిల్లాలో వెలుగులోకి రాని ఎన్నో రహస్యాలు నిక్షిప్తమై ఉన్నాయి. సుమారు 11వ శతాబ్దానికి ముందే కల్యాణి చాళుక్యుల కాలంలో ఈ దుర్గం నిర్మించినట్లు ఖిల్లాపై ఉన్న శాసనాలతో చరిత్రకారులు వెల్లడిస్తున్నారు. వనపర్తి జిల్లాకేంద్రానికి 12 కిలోమీటర్ల దూరంలోని పాన్గల్ ఖిల్లా ప్రస్తుత నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గం పరిధిలో ఉంది. శత్రువుల దాడుల నుంచి కాపాడుకునేందుకు నాటి రాజులు సముద్రమట్టానికి సుమారు 1600 అడుగుల ఎత్తయిన గుట్టపై కోట నిర్మించారు. గుర్రపునాడా ఆకారంలో తూర్పున ప్రధాన ముఖద్వారంతో చుట్టూ శుత్రుదుర్భేద్యమైన రాతికట్టడం, బురుజులతో దుర్గం నిర్మించారు. ప్రస్తుతం చాలా వరకు శిథిలావస్థకు చేరినా.. ఏటా తొలి ఏకాదశినాడు ప్రజలు గుట్టపైకి చేరుకొని అక్కడి అమ్మవారి విగ్రహానికి ప్రత్యేక పూజలు చేస్తారు. శిల్పకళా సంపద.. పాన్గల్ ఖిల్లా శిఖరాగ్రానికి, కోట ప్రాంతానికి వెళ్లేందుకు తూర్పు దిక్కున ప్రస్తుతం ఉన్న బాలపీర్ల సమీపంలో దారి ఉంది. గుట్టపైకి ఎక్కుతున్న సమయంలో ఏడు ప్రధాన ముఖద్వారాలను దాటాల్సి ఉంటుంది. ప్రతి ముఖద్వారం భారీ ఆకారంలో రాతి కట్టడంతో దర్శనమిస్తుంది. కట్టడంపై సింహాలను వేటాడుతున్న శిల్పాలు, ఎత్తయిన జంతువుల శిల్పాలను చూడవచ్చు. శిథిలావస్థలో మసీదు, ఆలయ నిర్మాణాలు.. ఎంతో ఎత్తయిన పాన్గల్ ఖిల్లాపై పురాతన గణపతి, అమ్మవారి ఆలయాలతోపాటు మినార్లతో కనిపించే మసీదు నిర్మాణాలు శిథిలావస్థలో కనిపిస్తాయి. కల్యాణి చాళుక్యుల తర్వాత మసునూరి నాయకులు, బహుమనీ సుల్తానులు, కుతుబ్షాహీలు, బరాద్ షాహీలు, మొఘలులు, అసఫ్ జహీల్ ఈ దుర్గాన్ని యుద్ధంలో సొంతం చేసుకుని పాలన సాగించినట్లు చరిత్ర చెబుతోంది. 1600 అడుగుల ఎత్తులో.. సముద్రమట్టానికి సుమారు 1600 అడుగుల ఎత్తులోని పాన్గల్ గుట్టపై రామగుండం బావిలో ఏడాది పొడవునా నీరు ఉంటుంది. గత 30, 40 ఏళ్ల క్రితం ఏటా తొలి ఏకాదశినాడు గుట్టపైకి వెళ్లే భక్తులు ఈ గుండంలో ఈత కొడుతూ.. స్నానాలు ఆచరించేవారు. ఇది ప్రస్తుతం ఉపయోగంలో లేదు. దేవిగుట్ట అనే ప్రాంతంలో కొలువైన అమ్మవారి పురాతన శిలా విగ్రహానికి భక్తులు నేటికీ ఏటా ఒకసారి గుట్టపైకి వెళ్లి పూజలు చేస్తారు. చెక్కుచెదరని యుద్ధ ఫిరంగులు శతాబ్దాల నాటి యుద్ధ ఫిరంగులు పాన్గల్ ఖిల్లాపై ఇప్పటికీ చెక్కు చెదరకుండా, కనీసం తుప్పు కూడా పట్టకుండా ఉన్నాయి. ఖిల్లాలో ఎత్తయిన ప్రాంతంలో ఒకటి, తూర్పు ద్వారం వైపు మరో ఫిరంగి ఉన్నాయి. పాన్గల్ గుట్టపై ముక్తరామేశ్వర ఆలయం ఉన్నట్లు శాసనాలు ఉన్నాయి. కుతుబ్షాల కాలంలో నిర్మించిన బావిని ఇటీవల కాలం వరకు పాన్గల్ గ్రామంలో కుమ్మరి వీధి ప్రాంత ప్రజలు ఉపయోగించిట్లు స్థానికులు చెబుతారు. పులివేట వీరగల్లు ప్రతిమలు వీరగల్లులో పులివేట, పందివేట శిల్పాలు ప్రసిద్ధం. పులు లు, అడవి పందుల నుంచి ప్రజలను రక్షించడానికి గ్రామా ల్లోని వీరులు పోరాడి, అమరులైనప్పుడు.. ప్రజలు వీరుల జ్ఞాపకంగా వీరశిలలను పొలిమేరలలో ఏర్పాటు చేసేవారు. ఈ శిల్పాలను చూసినవారు ఆ ఊరివీరుల శౌర్యాన్ని గుర్తు చేసుకొని కీర్తించేవారు. కోటలో అనేక కట్టడాలు, ఫిరంగులతోపాటు ఎన్నో శిల్పాలు, వీరగల్లు విగ్రహాలున్నాయి. కోటలోకి వెళ్తుంటే ముళ్లగవిని అనే ప్రదేశం దగ్గర దాదాపు నాలుగు అడుగులున్న పులివేట వీరగల్లును కొత్త తెలంగాణ చరిత్ర బృందం పరిశోధకులు కనుగొన్నారు. కుడివైపు సిగ, తలపై పాగా, మెడలో కంటె, వీరకాసెతో కనిపిస్తున్న వీరుడు రెండు చేతుల బల్లెంతో పులిని చంపుతున్న దృశ్యం ఒక రాతిపలక మీద ఉల్బణ శిల్పంగా చెక్కి ఉంది. ఈ వీరగల్లును క్రీ.శ.13, 14వ శతాబ్దాల నాటి శైలిలో చెక్కారు. అరుదుగా కనిపించే, ప్రతిష్టించే ఈ పులివేట వీరగల్లు ప్రతిమ ఇదే మండలం బుసిరెడ్డిపల్లిలో కూడా ఉంది. ఇది అరుదైన వీరగల్లు అని.. ఇలాంటివి తెలంగాణలో నిజామాబాద్, భువనగిరి, ఖమ్మం, వరంగల్, నిర్మల్ జిల్లాల్లోనూ ఉన్నట్లు గుర్తించారు. ఈ శిల్పాలను భద్రపరచడమో.. లేదా ఏదేని మ్యూజియానికి చేర్చాలని కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వినర్ రామోజు హరగోపాల్, సభ్యులు బైరోజు చంద్రశేఖర్, శ్యాంసుందర్, స్థానిక ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలి చారిత్రక ప్రాధాన్యమున్న పాన్గల్ ఖిల్లాను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు మంత్రి జూపల్లి కృష్ణారావు, అధికారులు కృషి చేయాలి. కోటపై ఉన్న అనేక చారిత్రక కట్టడాలు ధ్వంసం అవుతున్నాయి. వనపర్తి జిల్లాకు తలమానికంగా నిలిచే కోటను భావితరాల వారికి తెలిసేందుకు పర్యాటక కేంద్రంగా మారిస్తే.. ఈ ప్రాంతం అభివృద్ది చెందుతుంది. – కుమ్మరి చంద్రయ్య, పాన్గల్ అభివృద్ధి చేస్తాం ఎంతో చారిత్రక ప్రాధాన్యమున్న పాన్గల్ ఖిల్లాను మంత్రి జూపల్లి సహకారంతో పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తాం. ఇప్పటికే ఖిల్లాకు సంబంధించిన నివేదికలను పంపించాం. పర్యాటక శాఖ అధికారులు ఖిల్లాను సందర్శించి వివరాలను సేకరించారు. మరోమారు ఈ విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లి చారిత్రక కట్టడాలు కనుమరుగవకుండా కాపాడుతూ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తాం. – హైమావతి, మాజీ ఎంపీటీసీ, పాన్గల్ -
పీహెచ్సీల్లో ప్రసవాల సంఖ్య పెంచాలి
పాన్గల్: ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచేందుకు సిబ్బంది కృషి చేయాలని డీఎంహెచ్ఓ డా. శ్రీనివాసులు అన్నారు. శనివారం స్థానిక పీహెచ్సీలో కొనసాగుతున్న స్వస్త్ నారీ సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి ప్రత్యేక వైద్య శిభిరాల రికార్డులను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. మహిళల ఆరోగ్య పరిరక్షణే ధ్యేయంగా ప్రత్యేకంగా నిర్వహిస్తున్న వైద్య శిభిరాలపై గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించి సద్వినియోగం చేసుకునేలా సిబ్బంది చూడాలన్నారు. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని.. వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు గ్రామాల్లో అందుబాటులో ఉండి నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలతో పాటు ప్రజలను చైతన్యం చేయాలని సూచించారు. కార్యక్రమంలో పీహెచ్సీ వైద్యుడు డా. చంద్రశేఖర్ పాల్గొన్నారు. -
బాపూజీ ఆశయ సాధనకు కృషి చేయాలి
వనపర్తి: జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం ఆవరణలో శనివారం ఉదయం జిల్లా బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు డా. జిల్లెల చిన్నారెడ్డి, కలెక్టర్ ఆదర్శ్ సురభి, ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ముఖ్యఅతిథులుగా హాజరై బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా డా. చిన్నారెడ్డి మాట్లాడుతూ.. కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయ సాధనకు రాష్ట్రంలోని ప్రతి పౌరుడు కృషి చేయాలన్నారు. ప్రత్యేక రాష్ట్ర సాధనకు పోరాడిన మహనీయులను తెలంగాణ సమాజం ఎప్పటికీ స్మరించుకుంటూ, వారి అడుగుజాడల్లో నడుస్తుందని తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి మాట్లాడుతూ.. ఉద్యమకారుడు అనే పదానికి నిలువెత్తు నిర్వచనం ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ అన్నారు. స్వాతంత్య్ర ఉద్యమం నుంచి మొదలు మలిదశ తెలంగాణ ఉద్యమం వరకు పలు ప్రజా పోరాటాల్లో పాల్గొన్న ధీర చరిత్ర ఆయనకు ఉందని తెలిపారు. కలెక్టర్ ఆదర్శ్ సురభి మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పాటుకు పరితపించిన ప్రముఖుల్లో కొండా లక్ష్మణ్ బాపూజీ ఒకరని, ఆయన జీవితం అందరికీ స్ఫూర్తిదాయకమని, ఆయన ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు ఖీమ్యానాయక్, యాదయ్య, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్గౌడ్, ప్రజాప్రతినిధులు రాజేంద్రప్రసాద్, బీసీ సంక్షేమశాఖ అధికారి ముజాహిద్దీన్, జిల్లా అధికారులు, పద్మశాలి సంఘం నాయకులు, సామాజికవేత్త రాజారాంప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. -
పురం.. అభివృద్ధి పథం
పురపాలికల వారీగా ఇలా.. పురపాలిక వార్డులు జనాభా (వేలల్లో..) అమరచింత 10 15 ఆత్మకూర్ 10 18 కొత్తకోట 15 25 పెబ్బేరు 12 21 అమరచింత: జిల్లాలోని కొత్త పురపాలికలు ఒక్కోదానికి సీడీఎంఏ నిధులు రూ.15 కోట్లు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఇటీవల జీఓ జారీ చేసింది. రాష్ట్రంలో కాంగ్రెస్పార్టీ అధికారంలోకి వచ్చిన రెండేళ్ల తర్వాత ఎమ్మెల్యేలు ప్రత్యేక చొరవతో నిధులు మంజూరు చేయించుకునేందుకు చేసిన ప్రయత్నాలు ఎట్టకేలకు ఫలించాయి. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిధులు లేక నిలిచిన నిర్మాణాలతో పాటు కొత్తగా చేపట్టాల్సిన అభివృద్ధి పనులకు ఎంతమేర డబ్బులు అవసరమవుతాయనే వివరాలతో పుర కమిషనర్లు అంచనాలు సిద్ధం చేసి మంత్రి వాకిటితో పాటు ఎమ్మెల్యేలు జి.మధుసూదన్రెడ్డి, మేఘారెడ్డికి అందించారు. వారు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని కలిసి పట్టుబట్టి నిధులు తీసుకొచ్చేందుకు చేసిన ప్రయత్నాలు ఎట్టకేలకు ఫలించాయి. జిల్లాలోని కొత్త పురపాలికలైన అమరచింత, ఆత్మకూర్, కొత్తకోట, పెబ్బేరుకు ఒక్కో దానికి రూ.15 కోట్ల చొప్పున మంజూరు చేయించుకున్నారు. పుర ఎన్నికల ప్రకటన వెలువడక ముందే టెండర్లు పూర్తి చేయాల్సి ఉండటంతో సంబంధిత అధికారులు వార్డుల్లో చేపట్టాల్సిన పనుల కోసం వార్డు అధికారుల ద్వారా సమాచారం సేకరిస్తున్నారు. చేపట్టాల్సిన పనులు.. మంజూరైన నిధులతో డ్రెయినేజీలు (వరదనీరు పారేందుకు) నిర్మించనున్నారు. వార్డుల్లో అసంపూర్తిగా ఉన్న సీసీ రహదారులు పూర్తి చేస్తారు. అదేవిధంగా అర్బన్ పార్క్లు అభివృద్ధి చేస్తూ జంక్షన్ల వద్ద సుందరీకరణ పనులు చేపట్టనున్నారు. వీటితో పాటు స్వచ్ఛత కోసం రహదారులకు ఇరువైపులా ఉన్న దెబ్బతిన్న మురుగు కాల్వలను నిర్మించాల్సి ఉంది. సమీకృత ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణాలతో పాటు టౌన్హాల్ నిర్మించాల్సి ఉందని పుర అధికారులు వివరించారు. పుర ఎన్నికల ప్రకటన వెలువడక ముందే చేపట్టాల్సిన పనులకు టెండర్లను ఆహ్వానించాల్సి ఉందని తెలిపారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తర్వాత పనులు చేపట్టేందుకు అవకాశం ఉండకపోవడంతో వేగవంతంగా టెండర్ల ప్రక్రియను పూర్తి చేయడానికి అధికారులు సిద్ధమవుతున్నారు. కొత్త పురపాలికలకు సీడీఎంఏ నిధులు మంజూరు ఒక్కో మున్సిపాలిటీకి రూ.15 కోట్లు డ్రెయినేజీలు, పార్క్లు, సీసీ రహదారుల నిర్మాణాలపై దృష్టి ఎన్నికల ప్రకటనకు ముందే టెండర్ల ప్రక్రియ పూర్తి చేసేందుకు అధికారుల సన్నాహాలు గుర్తించిన పనులకే ప్రాధాన్యం.. పట్టణంలో ప్రజల భాగస్వామ్యంతో గుర్తించిన పనులకే మొదటి ప్రాధాన్యం ఇస్తూ పూర్తి చేయనున్నాం. పార్కులు, జంక్షన్ల అభివృద్ధి, డ్రెయినేజీలు, సీసీ రహదారులు నిర్మించేందుకు తగిన ప్రణాళికలతో ముందుకు సాగుతున్నాం. – నాగరాజు, పుర కమిషనర్, అమరచింత -
‘బీసీ రిజర్వేషన్లు సాహసోపేత నిర్ణయం’
వనపర్తి: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీఓ విడుదల చేయడం అభినందనీయమని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. శనివారం జిల్లాకేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ సభలో ఇచ్చిన హామీ మేరకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసి గవర్నర్కు పంపించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. బీఆర్ఎస్, బీజేపీలకు చెందిన బీసీ వ్యతిరేకవాదులు అసెంబ్లీలో చేసిన తీర్మానానికి సహకరించకుండా అడ్డుకుంటున్నారన్నారు. బీసీ రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం తెలపాలని కోరుతూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఢిల్లీలో ధర్నా చేసినా బీఆర్ఎస్, బీజేపీ నాయకులు మద్దతు తెలుపలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 2011 జనాభా లెక్కల ప్రకారం జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ బీసీలకు 42 శాతం కేటాయించినట్లు చెప్పారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలన్నారు. జిల్లాలోని బీసీ కుల సంఘాల నాయకులు సంఘటితంగా ఉండాలని.. కొందరు దుర్మార్గులు చేస్తున్న కుట్రలను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్, బీసీ పొలిటికల్ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు యుగంధర్గౌడ్, పెబ్బేరు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీనివాస్గౌడ్, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు వాకిటి ఆదిత్య, పార్టీ మండల అధ్యక్షుడు రవికిరణ్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బి.కృష్ణ, మాజీ కౌన్సిలర్లు, వివిధ మండలాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
తీరొక్క పువ్వేసి చందమామ..
బతుకమ్మకు పూజలు నిర్వహిస్తున్న రెవెన్యూ అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్ జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో శనివారం సాయంత్రం జిల్లా రెవెన్యూశాఖ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. తీరొక్క పూలతో తయారుచేసిన బతుకమ్మకు రెవెన్యూ అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్ పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలు ప్రకృతితో మమేకమయ్యే పండుగ బతుకమ్మ అన్నారు. రెవెన్యూ, క్రీడలు, ప్రణాళిక, ఆర్అండ్బీ, పౌరసరఫరాలు, ఎంప్లాయిమెంట్శాఖ ఉద్యోగులు ఆడిపాడారు. కార్యక్రమంలో ఏఓ భానుప్రకాష్, ఆర్డీఓ సుబ్రమణ్యం, డీవైఎస్ఓ సుధీర్రెడ్డి, డి–సెక్షన్ సూపరింటెండెంట్ మదన్, ఏడీ లాండ్ సర్వే బాలకృష్ణ, ఇతర అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. – వనపర్తి -
మిషన్ భగీరథ కార్మికుల సమ్మె
కొత్తకోట రూరల్: మండలంలోని గుంపుగట్టు (కానాయపల్లి) పంపుహౌజ్లో విధులు నిర్వర్తిస్తున్న మిషన్ భగీరథ ఔట్సోర్సింగ్ కార్మికులు 10 నెలల బకాయి వేతనాలు చెల్లించాలంటూ శుక్రవారం తాగునీటి సరఫరాల నిలిపివేసి సమ్మెకు దిగారు. విషయం తెలుసుకున్న మిషన్ భగీరథ ఎస్ఈ రమణ, డీఈ, ఇతర అధికారులు అక్కడకు చేరుకొని కార్మికులతో చర్చించారు. పెరిగిన వేతనాలు నెలకు రూ.12 వేల చొప్పున చెక్కు రూపంలో 29వ తేదీన చెల్లిస్తామనే షరతుతో సమ్మె విరమిస్తామని స్పష్టం చేశారు. అనంతరం సబ్ కాంట్రాక్టర్ లింగారెడ్డి హామీ మేరకు తాత్కాలికంగా సమ్మె విరమించారు. 8 ఏళ్లుగా విధులు నిర్వర్తిస్తున్న తమకు 10 నెలలుగా వేతనాలు, 5 ఏళ్ల బోనస్, పీఎఫ్, ఈఎస్ఐ బకాయిలు చెల్లించలేదని వివరించారు. సమస్యలు పరిష్కరించకపోతే దీర్ఘకాలిక సమ్మె తప్పదని హెచ్చరించారు. ఆందోళనలో కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు జి.శేఖర్, కార్మికులు కురుమూర్తి, వెంకటేష్, విజయ్, సాయికుమార్, నిరంజన్, వెంకటయ్య, బాబు, గోవర్ధన్, వెంకటేష్, సంతోష్, ఈశ్వరమ్మ, నిర్మలమ్మ, వంశి, వినయ్ తదితరులు పాల్గొన్నారు. -
అమ్మాయి చదువు కుటుంబానికి వెలుగు
● మహిళల అభివృద్ధికి పాటుపడాలి ● సైబర్ నేరగాళ్లతో అప్రమత్తంగా ఉండాలి ● కలెక్టర్ ఆదర్శ్ సురభి, ఎస్పీ రావుల గిరిధర్ వనపర్తి: ఇంట్లో అమ్మాయి చదువుకుంటే ఆ కుటుంబం మొత్తం బాగుపడుతుందని.. బాల్య వివాహాలను అరికట్టి మహిళల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ పాటుపడాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి, రావుల గిరిధర్ కోరారు. శుక్రవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా గ్రామీణాభివృద్ధిశాఖ, సెర్ప్ ఆధ్వర్యంలో ‘మన కోసం.. మన పిల్లల కోసం‘ అనే నినాదంతో జిల్లా సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించగా వారు ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. సమాజంలో బాల్య వివాహాలను అరికట్టే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. మహిళలు అభివృద్ధి చెందడమే లక్ష్యంగా యూనిసెఫ్ సహకారంతో సెర్ప్ ఆధ్వర్యంలో ప్రభుత్వం స్నేహ (సేఫ్టీ న్యూట్రిషన్ ఎంపవర్మెంట్ హెల్త్ అడోలెసెన్స్) అనే కార్యక్రమాన్ని ప్రారంభించిందని చెప్పారు. బాల్య వివాహాన్ని నిర్వహించిన కుటుంబసభ్యులే కాకుండా ప్రోత్సహించిన వారు కూడా శిక్షార్హులని చెప్పారు. అదేవిధంగా బాలికలకు గుడ్ టచ్.. బ్యాడ్ టచ్పై అవగాహన కల్పించాలన్నారు. ప్రతి ఒక్కరూ సైబర్ నేరగాళ్లతో అప్రమత్తంగా ఉండాలని.. సైబర్ బారినపడి మోసపోకుండా జాగ్రత్త పడాలని సూచించారు. ఎస్పీ రావుల గిరిధర్ మాట్లాడుతూ.. సమాజ గతిని మార్చే శక్తి సెర్ప్ వారిదని, సభ్యులు స్వయం సహాయక బృందాల ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. స్నేహ కార్యక్రమంలో భాగంగా ఎస్ఐలు అన్ని మండలాల్లో సమన్వయంతో పనిచేసి అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. తద్వారా జిల్లాలో బాల్య వివాహాలు, పోక్సో కేసులు నివారించగలమన్నారు. ఈ సందర్భంగా పొక్సో కేసుపై అవగాహన కల్పించేందుకు పోలీస్శాఖ నిర్వహించిన స్కిట్ కార్యక్రమం అందరినీ ఆకట్టుకుంది. సమావేశంలో డీఎస్పీ వెంకటేశ్వర్లు, వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డా. శ్రీనివాసులు, డీఆర్డీఓ ఉమాదేవి, డీడబ్ల్యూఓ సుధారాణి, డీఐఈఓ ఎర్ర అంజయ్య, మహిళా సమాఖ్య అధ్యక్షురాలు స్వరూప, సెర్ప్ సిబ్బంది, పోలీసుశాఖ సిబ్బంది పాల్గొన్నారు. -
ఐలమ్మ ఆదర్శం..
తెలంగాణ సాయుధ పోరాటానికి ఊపిరి పోసి తన ప్రాణాలను త్యాగం చేసి ఉద్యమస్ఫూర్తి నింపిన వీర వనిత చాకలి ఐలమ్మ అని ఎస్పీ రావుల గిరిధర్ అన్నారు. శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన చాకలి ఐలమ్మ జయంతి కార్యక్రమంలో ఆయన పాల్గొని ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. భూములను ఆక్రమించుకున్న నిజాం రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడిన వీర వనిత అని, తెలంగాణ చరిత్రలో చిరస్మరణీయ స్థానం సంపాదించారని కొనియాడారు. సామాజిక న్యాయం, పేదల హక్కుల కోసం పోరాడిన ఆమె ధైర్య సాహసాలు, పోరాట స్పూర్తి ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమన్నారు. ఈ తరం వారికి ఆమె ఆదర్శమని, ఆమె ఆశయాలను కొనసాగించడం మనందరి బాధ్యతని తెలిపారు. కార్యక్రమంలో ఏఆర్ అదనపు ఎస్పీ వీరారెడ్డి, డీసీఆర్బీ డీఎస్పీ ఉమామహేశ్వర్రావు, కార్యాలయ ఏఓ సునందన, స్పెషల్ బ్రాంచ్ సీఐ నరేష్, సీఐలు అప్పలనాయుడు, శ్రీనివాస్, పోలీసు కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
జిల్లాలో ప్రారంభమైన దరఖాస్తుల స్వీకరణ
● గోపాల్పేట మండలం చెన్నారం మద్యం దుకాణం హైదరాబాద్లోని లింగంపల్లికి బదలాయింపు ● గత మద్యం పాలసీ దరఖాస్తులతో రూ.26.58 కోట్ల ఆదాయం ● ఈసారి రూ.50 కోట్ల వరకు ఆదాయం వస్తుందని అధికారుల అంచన వనపర్తి: గత ప్రభుత్వ హయాంలో రెండేళ్ల కిందట నిర్వహించిన మద్యం పాలసీ గడువు నవంబర్ 30తో ముగియనుంది. ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్ కొత్త మద్యం పాలసీకి సంబంఽధించిన దరఖాస్తుల స్వీకరణ శుక్రవారం నుంచి ప్రారంభించగా.. అక్టోబర్ 18 వరకు కొనసాగనుంది. ఒక్కో దుకాణానికి టెండర్ దాఖలుకు రూ.3 లక్షల డీడీ రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. గత మద్యం పాలసీలో జిల్లావ్యాప్తంగా 37 దుకాణాలకు టెండర్లు నిర్వహించి లక్కీడిప్ విధానంలో కేటాయించారు. ఈసారి గోపాల్పేట మండలం చెన్నారం గ్రామంలో ఉన్న దుకాణంలో విక్రయాలు ఆశించిన మేర లేవని ఎకై ్సజ్ అధికారులు హైదరాబాద్లోని లింగంపల్లిలో ఏర్పాటుకు అనుమతిచ్చారు. ప్రస్తుతం జిల్లాలో 36 దుకాణాలకే దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. రికార్డుస్థాయిలో విక్రయాలు.. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు, గ్రామదేవతల ఉత్సవాలు, పండుగలతో పాటు సాధారణ మద్యం విక్రయాలు రికార్డుస్థాయికి చేరాయి. ఒక్క వనపర్తి జిల్లాలోనే రెండేళ్ల కాలంలో ఏకంగా సుమారు రూ.వెయ్యి కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. ఆశించిన మేర లక్ష్యాన్ని పూర్తిచేసి ప్రభుత్వ ఖజానాకు తమవంతుగా ఆదాయం సమకూర్చామనే సంబరం ఎకై ్సజ్ అధికారుల్లో కనిపిస్తోంది. గత మద్యం పాలసీలో రెండేళ్ల కాల పరిమితికిగాను ఒక్కో దరఖాస్తుకు రూ.2 లక్షల డీడీ జత చేయాల్సి ఉండేది. ఈ నగదు తిరిగి చెల్లించకపోవడంతో ప్రభుత్వానికి రూ.26.58 కోట్ల ఆదాయం సమకూరింది. ప్రస్తుత మద్యం పాలసీలో రెండేళ్ల కాలానికి ఒక్కో దరఖాస్తుకు రూ.3 లక్షలు చెల్లించాల్సి ఉంది. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించనున్న నేపథ్యంలో మద్యం దుకాణాల టెండర్లు భారీగా వచ్చే అవకాశాలు ఉన్నట్లు స్థానికంగా చర్చ వినిపిస్తోంది. ఈ లెక్కన దరఖాస్తుల ఆదాయం గతంతో పోలిస్తే రెండింతలు అయ్యే అవకాశం ఉంది. ఎకై ్సజ్ అధికారులు సైతం రూ.50 కోట్ల ఆదాయం దరఖాస్తులపై ఆశిస్తున్నట్లు సమాచారం. మరో రెండు నెలల పాటు మద్యం విక్రయాలతో వచ్చే ఆదాయాన్ని రెండళ్ల సరాసరి అమ్మకాల మొత్తానికి కలుపాల్సి ఉంటుంది. -
‘కల్యాణలక్ష్మి’ పేదలకు వరం
కొత్తకోట రూరల్: కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు పేద కుటుంబాలకు వరమని దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్రెడ్డి అన్నారు. శుక్రవారం కొత్తకోట ఎంపీడీఓ కార్యాలయంలోని ప్రొ. జయశంకర్ సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు అందజేసి మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని అమలుచేస్తూ ప్రజల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తోందన్నారు. ప్రతి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తూ పేదల సొంతింటి కలను నిజం చేస్తోందని తెలిపారు. అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని.. హామీలు ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో తహసీల్దార్ వెంకటేశ్వర్లు, ఇన్చార్జ్ ఎంపీడీఓ సుదర్శన్, మార్కెట్ కమిటీ చైర్మన్ పి.ప్రశాంత్, పి.కృష్ణారెడ్డి, ఎన్జే బోయేజ్, మాజీ సర్పంచ్ శేఖర్రెడ్డి, సీడీసీ మాజీ చైర్మన్ చంద్రశేఖర్రెడ్డి, మేసీ్త్ర శ్రీనివాసులు, వేముల శ్రీనివాస్రెడ్డి, బీచుపల్లియాదవ్, మాసన్న, మోహన్రెడ్డి, సంద వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. -
సమస్యలు సృష్టిస్తే చర్యలు తప్పవు
● రెవెన్యూ అదనపు కలెక్టర్ ఎన్.ఖీమ్యానాయక్ వనపర్తి: రవాణా, లేబర్ ఛార్జీలు పెంచాలంటూ మన ఇసుక వాహన ట్రాక్టర్ల యజమానులు అర్ధాంతరంగా ఇసుక రవాణాను నిలిపివేశారు. ఈ విషయమై శుక్రవారం కలెక్టరేట్లోని తన చాంబర్లో మన ఇసుక వాహనం ట్రాక్టర్ల అసోసియేషన్ సభ్యులతో రెవెన్యూ అదనపు కలెక్టర్ ఎన్.ఖీమ్యానాయక్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పొరుగు జిల్లాల కంటే ఈ జిల్లాలో కిలోమీటరుకు రవాణా ఛార్జీ ఎక్కువగానే చెల్లిస్తున్నామని.. అయినప్పటికీ ఇంకా పెంచాలని రవాణా నిలిపివేయడం ఏమిటని ప్రశ్నించారు. మహబూబ్నగర్, గద్వాల జిల్లాలో కిలోమీటర్కు రూ.70 ఉంటే.. ఇక్కడ రూ.80 చెల్లిస్తున్నామన్నారు. ప్రస్తుతం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు కొనసాగుతున్నాయని.. ఇసుక లేకుంటే ఎలా పూర్తవుతాయని, లబ్ధిదారులకు బిల్లులు ఎలా చెల్లిస్తారని ప్రశ్నించారు. వెంటనే ఇసుక రవాణా ప్రారంభించాలని ఆదేశించారు. సమావేశంలో పాల్గొన్న సభ్యులు మాట్లాడుతూ.. వర్షాలు కురుస్తుండటంతో ఇసుక రీచ్లలో దొరకడం లేదని, లోపలికి వెళ్తే ట్రాక్టర్ బయటికి రావడం కష్టమవుతుందన్నారు. ఇసుక లోడింగ్కు లేబర్ ఛార్జీ ప్రభుత్వం రూ.350 ఇస్తుండగా.. తాము రూ.500 ఇవ్వనిదే ఎవరూ రావడం లేదని వివరించారు. స్పందించిన అదనపు కలెక్టర్ సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తానని.. ఇసుక రవాణా మాత్రం వెంటనే ప్రారంభించాలన్నారు. అందుకు అసోసియేషన్ సభ్యులు సమ్మతించారు. సమావేశంలో మైనింగ్ ఏడీ గోవిందరాజులు, జిల్లా రవాణాశాఖ అధికారి మానస, సెక్షన్ సూపరింటెండెంట్ మదన్మోహన్ పాల్గొన్నారు. -
ఐలమ్మ జీవితం స్ఫూర్తిదాయకం
వనపర్తి: తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన వీరనారి చాకలి ఐలమ్మ అని.. ఆమె జీవితం అందరికీ స్ఫూర్తిదాయకమని కలెక్టర్ ఆదర్శ్ సురభి, వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లో బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన చాకలి ఐలమ్మ జయంతి కార్యక్రమంలో వారు పాల్గొని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అన్నివర్గాల హక్కుల సాధనకు పోరాడిన ధీరవనిత అని కొనియాడారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ఆమె ప్రదర్శించిన ధైర్య సాహసాలు, చైతన్యం నేటితరానికి స్ఫూర్తిదాయకమని, బడుగు బలహీనవర్గాల సంక్షేమానికి అహర్నిశలు కృషి చేశారన్నారు. కార్యక్రమంలో ఇన్చార్జ్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ యాదయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్గౌడ్, బీసీ సంక్షేమశాఖ అధికారి ముజాహిద్దీన్ఖాన్, సామాజికవేత్త రాజారాంప్రకాష్, రజక సంఘం జిల్లా నాయకుడు బండలయ్య, ఎస్సీ, ఎస్టీ మానిటరింగ్ కమిటీ సభ్యులు వెంకటేష్, రాజు, ప్రజాసంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
ఏళ్లుగా నిలిచిన డిస్పెన్సరీ సేవలు
● వైద్య సేవలకు దూరమవుతున్న కార్మికులు ● దశాబ్దాలుగా హామీలకే పరిమితమైన వైనం ● పాలకులు, అధికారులు దృష్టిసారిస్తే మేలు వనపర్తిటౌన్: కార్మికులకు ఉచితంగా వైద్యసేవలు అందించే ఈఎస్ఐ ఏర్పాటు హామీ ఏళ్లుగా అమలుకు నోచుకోవడం లేదు. ఆరోగ్య సేవల నిమిత్తం వేతనం నుంచి నిర్దిష్ట రుసుంను పురపాలిక, బీడీ, ఇతర కార్మికుల వేతనాల నుంచి ప్రతినెల కోత విధిస్తారు. కార్మికులు, వారి కుటుంబ సభ్యులు అనారోగ్యం బారినపడితే ఈఎస్ఐ ఆస్పత్రిలో మెరుగైన వైద్యం పొందేందుకు అవకాశం ఉంటుంది. కానీ జిల్లాకేంద్రంలో ఈఎస్ఐ ఆస్పత్రి ఏర్పాటు ఏళ్లుగా పాలకుల హామీగానే మిగిలిపోతున్న తరుణంలో తాజాగా నెల క్రితం ఎమ్మెల్యే మేఘారెడ్డి మంజూరు చేయిస్తామని ప్రకటించడంతో కార్మిక వర్గాల్లో ఆశలు చిగురిస్తున్నాయి. డిస్పెన్సరీకే దిక్కులేదు.. గత కొన్నేళ్ల కిందట స్థానిక పుర కార్మికుల కోసం అప్పటి పాలకులు డిస్పెన్సరీని మంజూరు చేశారు. 2000 సంవత్సరం వరకు కార్మికులు డిస్పెన్సరీలోనే వైద్యసేవలు పొందారు. ఆ తర్వాత డిస్పెన్సరీ అనుమతి పొందిన ఆస్పత్రి యాజమాన్యం అనారోగ్యం రీత్యా అనుమతిని పునరుద్ధరించుకోకపోవడంతో వైద్యసేవలు నిలిచిపోయాయి. అప్పటి పాలకులు, అధికారులు దృష్టి సారించకపోవడంతో నేటికీ కార్మికులు వైద్య సేవలకు దూరమవుతున్నారు. జిల్లాకేంద్రంలో పదుల సంఖ్యలో ప్రైవేట్ ఆస్పత్రులున్నా.. డిస్పెన్సరీ సేవలు అందించడంలో ప్రజాప్రతినిధులు చొరవ చూపకపోవడంతో కార్మికుల ఆరోగ్య భద్రతపై నీలినీడలు అలుముకున్నాయి. ఈఎస్ఐ కార్డులు అంతంతే.. కార్మికులకు ఈఎస్ఐ కార్డులు జారీ చేయడంలోనూ పుర అధికారులు, ఇతర రంగాల కార్మికుల యాజమాన్యాలు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నాయి. అవగాహన ఉన్న కార్మికులు మినహా మిగతా వారు ఈఎస్ఐ నంబర్లు ఆన్లైన్లో ఉన్నాయని చెబుతున్నా వాటిని ఎలా సద్వినియోగం చేసుకోవాలనే దానిపై స్పష్టత కొరవడింది. పురపాలికలోని ఓ ఔట్సోర్సింగ్ ఉద్యోగికి తెలిసిన ఏజెన్సీకి ఈఎస్ఐ కన్సల్టెన్సీగా అవకాశం ఇచ్చినా.. ఆ ఏజెన్సీ అవసరమైన కార్మికులు ఫోన్చేస్తే తప్ప అధికారులతో సమన్వయం చేసుకొని కార్డుల జారీకి చొరవ చూపడం లేదన్న ఆరోపణలున్నాయి. బీడీ కార్మికులు 6 వేలు ఎమ్మెల్యే మేఘారెడ్డి ప్రకటించినట్లుగా జిల్లాకు ఈఎస్ఐ ఆస్పత్రి మంజూరైతే అన్నిరంగాల కార్మికులకు మేలు చేకూరనుంది. సాధారణ వైద్యసేవల నుంచి మొదలు శస్త్ర, వైకల్య చికిత్సలు సైతం ఇక్కడే అందనున్నాయి. దీంతో కార్మికులకు దూరభారం, రవాణా ఖర్చులు, వ్యయ ప్రయాసలు తప్పుతాయి. ఈఎస్ఐ ఆస్పత్రి ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వ అంగీకారంతో పాటు కేంద్ర కార్మిక మంత్రిత్వశాఖ నుంచి అనుమతి పొందాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసి కార్మిక, వైద్య, ఆరోగ్యశాఖ ఆస్పత్రి ఏర్పాటుకు భవన పరిశీలన చేపడితేనే అప్పుడు అడుగులు పడినట్లు అవుతుంది. ప్రస్తుతానికి సాధారణ వైద్యసేవలకు డిస్పెన్సరీ ఏర్పాటుకు ప్రయత్నిస్తే ఉపయుక్తంగా ఉంటుంది.


