-
వీడియోలు, ప్రకటనలపై ప్రత్యేక దృష్టి
● పార్లమెంట్ ఎన్నికల వ్యయ పరిశీలకుడు సౌరభ్ వనపర్తి: సామాజిక మాధ్యమాల వేదికగా ఓటర్లను ప్రభావితం చేసే వీడియోలు, ప్రకటనలపై దృష్టి సారించాలని నాగర్కర్నూల్ పార్లమెంట్ ఎన్నికల వ్యయ పరిశీలకుడు సౌరభ్ ఆదేశించారు. శనివారం జిల్లాకు వచ్చిన ఆయన అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్తో కలిసి కలెక్టరేట్లో సంబంధిత అధికారులతో సమావేశమయ్యారు. ఎన్నికలకు సంబంధించిన ప్రకటనలు, వీడియోలు ఎవరికి అనుకూలంగా ఉన్నాయో గుర్తించి వారి లెక్కల్లో జమ చేయాలన్నారు. పెయిడ్ న్యూస్ గుర్తించాలని, ప్రకటనలు ఏ విధంగా గుర్తిస్తున్నారనే విషయాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. సమీకృత కంట్రోల్ రూమ్ను, ఎఫ్ఎస్టీ, ఎస్ఎస్టీ బృందాల పనితీరును పరిశీలించారు. సి–విజిల్ యాప్, టోల్ ఫ్రీ నంబర్ 1950కి వచ్చిన ఫిర్యాదులు, పరిష్కరించిన వాటి సంఖ్య, అందుకు తీసుకున్న సమయాన్ని ఆన్లైన్లో చూశారు. అనంతరం అకౌంట్స్ బృందంతో సమావేశం నిర్వహించారు. ఎన్నికల నియమావళి కచ్చితంగా అమలు చేయాలని, షాడో రిజిస్టర్ను ఎప్పటికప్పుడు పరిశీలించి తమ వద్ద ఉన్న రికార్డులతో సరిచూసుకోవాలని ఆదేశించారు. పోటీలో ఉన్న అభ్యర్థుల ఖర్చు, ఎన్నికల వ్యయ లెక్కింపుపై దృష్టి సారించాలన్నారు. బ్యాంకు లావాదేవీలపై ప్రత్యేక నిఘా ఉంచాలని, అనుమానిత లావాదేవీలను గుర్తించాలని కోరారు. రూ.10 లక్షల కన్నా ఎక్కువ డబ్బు ఏదైనా బ్యాంకు నుండి విత్డ్రా అయ్యిందా? బ్యాంకు నుంచి డబ్బు సరఫరా చేసే వాహనాల్లో సరైన లెక్కలు, సంబంధించిన క్యూఆర్ కోడ్ ఉందా అనేది చూడాలన్నారు. ఏఓ భాను ప్రకాష్, డీపీఆర్ఓ సీతారాంనాయక్ పాల్గొన్నారు. -
ఎంత చేసినా తక్కువే..
పాలమూరుకు శత్రువంచన చేరి దెబ్బతీయాలని చూస్తున్నారు.. పాలమూరు బిడ్డ సీఎంగా ఉండొద్దు.. ఈ ప్రభుత్వాన్ని పడగొడ్తామని అంటున్నారు. పార్టీలు, జెండాలు, ఎజెండాలకతీతంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే అవకాశం ముఖ్యమంత్రిగా నాకు వచ్చింది. కానీ ఇక్కడి వారే శత్రువంచన చేరి దెబ్బతీయాలని చూస్తున్నారని మండిపడ్డారు. డీకే అరుణ ఏమంటా ంది.. రేవంత్రెడ్డి నా మీద పగబట్టిండు. నన్ను ఓడగొట్టాలని చూస్తున్నా డు. నేను మాత్రం కాంగ్రెస్ను ఓడగొట్టే వరకు ఊరుకోను. . ఖతం చేస్తా అంటది. కాంగ్రెస్ నీకు ఏం అన్యాయం చేసింది? పాన్గల్ నుంచి జెడ్పీటీసీగా, గద్వాల ఎమ్మెల్యేగా, ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిని చేసినందుకు కాంగ్రెస్ను ఓడగొట్టాల్నా? దేశం, రాష్ట్రంలో నిన్ను గుర్తు పడుతోంది కాంగ్రెస్తోనే కదా. సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: ‘నేను అమెరికాలో చదువుకునో, రాజకీయ వారసత్వంతోనో ముఖ్యమంత్రిని కాలేదు. నల్లమలలోని కొండారెడ్డిపల్లిలో పుట్టిన నేను వనపర్తిలోని జెడ్పీ స్కూలులో, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదివా. వనపర్తిలోని ప్రతి గల్లీ, ప్రతీ విధితో నాకు గత 40 ఏళ్లుగా అనుబంధం ఉంది. ఇక్కడే పోలీస్ ఉద్యోగం చేసిన మా అన్న భూపాల్రెడ్డి చాలామందికి తెలుసు. ఇంటర్ చదువుతున్నప్పుడు యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు చిన్నారెడ్డికి రాజీవ్గాంధీ ఎమ్మెల్యే టికెట్ ఇస్తే.. చిన్నన్న గెలుపు కోసం వనపర్తి, కొత్తకోటలోని గల్లీల్లో గోడల మీద రాతలు రాసినోడిని. మీ చెమటతో ఉమ్మడి జిల్లాలో 14 అసెంబ్లీ స్థానాలకు గానూ 12 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించి తెలంగాణలో రెండో సీఎంగా నన్ను కూర్చోబెట్టారు. పాలమూరు బిడ్డలు నాటిన మొక్క నేడు వృక్షంలా మారి ముఖ్యమంత్రిగా ఎదిగాడు. మీ ఆదరణకు ఈ జన్మలో ఎంత చేసినా తక్కువే.’ అని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి అన్నారు. మహబూబ్నగర్ లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి చల్లా వంశీచంద్రెడ్డికి మద్దతుగా దేవరకద్ర అసెంబ్లీ నియోజకవర్గ పరిధి వనపర్తి జిల్లా కొత్తకోటలో శనివారం కాంగ్రెస్ నిర్వహించిన రోడ్షో, జనజాతర కార్నర్ మీటింగ్కు జనం పోటెత్తారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ.. ఈ జనసందోహాన్ని చూస్తుంటే కృష్ణానది పరవళ్లు తొక్కుతూ సునామీలాగా వచ్చి కొత్తకోటను కప్పేసినట్టుగా ఉందన్నారు. ‘మీ ఆదరణకు నా మనసు తన్వయత్వాన్ని పొందుతోంది. మీ అభిమానానికి, మీరిచ్చిన ఆశీర్వాదానికి ఈ జన్మలో ఏం చేసినా, ఎంత ఇచ్చినా తక్కువే. ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకునే. పాలమూరు బిడ్డగా ఇక్కడి ప్రజల వలసలు ఆపేందుకు, పచ్చని పంటలు పండించేందుకు నా ఆరాటం ఆగదు.’ అని అన్నారు. మాట్లాడుతున్న రేవంత్రెడ్డి.. చిత్రంలో మహబూబ్నగర్, నాగర్కర్నూల్ ఎంపీ అభ్యర్థులు వంశీచంద్రెడ్డి, మలు ్లరవి, ఎమ్మెల్యే మధుసూదన్రెడ్డి, జితేందర్రెడ్డిM>…{VðS-‹Ü¯]l$ VðSÍ-í³…^é-ÌS¯]l-yýl…-ేæ ™èl´ëµ.. కాంగ్రెస్ పార్టీ నాకు కొడంగల్లో ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది. ఓడిపోయినా.. మల్కాజిగిరి నుంచి పోటీ చేసి ఎంపీగా గెలిచినా. కాంగ్రెస్ అధ్యక్షుడిగా అయ్యా.. ఇప్పుడు సీఎం అయ్యాను. గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న నన్ను కాంగ్రెస్ సీఎం చేసింది. అందుకు కాంగ్రెస్ అభ్యర్థిని ఎంపీగా గెలిపించండి.. అభివృద్ధికి పాటుపడతా అంటే అది నేను చేసిన తప్పా.. నేరమా? ఢిల్లీకి రాజైనా తల్లికి బిడ్డనే కదా.. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని అనుకుంటున్నా. ఉమ్మడి పాలమూరులో 14 అసెంబ్లీ నియోజకవర్గాల అభివృద్ధికి ప్రణాళికలు వేయాలని చిన్నారెడ్డికి బాధ్యతలు అప్పగించినం. మాదిగల వర్గీకరణ, ముదిరాజ్లను బీసీ–డీ నుంచి బీసీ–ఏకి మార్చడం, వాల్మీకి బోయలను ఎస్టీలో చేర్చేందుకు కాంగ్రెస్ కృషి చేస్తుంది. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్ట్కు జాతీయ హోదా రావాలంటే మహబూబ్నగర్, నాగర్కర్నూల్ కాంగ్రెస్ అభ్యర్థులు వంశీచంద్రెడ్డి, మల్లురవిని గెలిపించాలి. -
జీవితంలో విద్యార్థి దశ కీలకం
వనపర్తిటౌన్: ప్రతి విద్యార్థి జీవితంలో ఉపాధ్యాయులు, అధ్యాపకుల పాత్ర ఎంతో కీలకమైందని ప్రిన్సిపల్ అండ్ సెషన్స్ కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎంఆర్ సునీత అన్నారు. శనివారం జిల్లాకేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డా. ఎస్.సురేష్ అధ్యక్షతన జరిగిన కళాశాల వార్షికోత్సవానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరై జ్యోతి వెలిగించి మాట్లాడారు. విద్యతోనే ఉజ్వల భవిష్యత్ ఉందని.. ప్రతి వ్యక్తికి విద్యార్థి దశ ఎంతో కీలకమైందని తెలిపారు. గురువులు శ్రమించి విద్యార్థులకు తమ జ్ఞానాన్ని ధార పోస్తారని.. సద్వినియోగం చేసుకున్న విద్యార్థులు ఉన్నత శిఖరాలు అధిరోహిస్తారన్నారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా విద్యార్థులు కష్టపడి చదివి తల్లిదండ్రులు, అధ్యాపకులు, జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. మహిళా డిగ్రీ కళాశాలలో అనుభవజ్ఞులైన అధ్యాపకులు ఉండటం విద్యార్థినుల అదృష్టమని కొనియాడారు. అంతకుముందు కళాశాల ప్రిన్సిపాల్ కళాశాలలో ఉన్న కోర్సులు, విశిష్ట సేవలు, విద్యార్థులు సాధించిన విజయాల నివేదిక చదివి వినిపించారు. అనంతరం కళాశాల ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్ డా. వెంకటప్రసాద్, అధ్యాపక బృందం ప్రధాన న్యాయమూర్తిని శాలువా, పుష్పగుచ్ఛంతో సన్మానించారు. అలాగే ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థినులు ప్రదర్శించిన నృత్య ప్రదర్శనలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో అధ్యాపక బృందం తదితరులు పాల్గొన్నారు. -
విద్యార్థులు ఉన్నతంగా ఎదగాలి
వనపర్తిటౌన్: సాంకేతిక విద్యలో విద్యార్థులు దేశం గర్వించేస్థాయికి ఉన్నతంగా ఎదగాలని హైదరాబాద్ జేఎన్టీయూ ప్రొఫెసర్ ఇందిరారాణి, అడిషనల్ ఎస్పీ రామదాసు తేజావత్ అన్నారు. శనివారం జిల్లాకేంద్రంలోని ఓ గార్డెన్స్లో నిర్వహించిన వనపర్తి ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాల ప్రఽథమ వార్షికోత్సవానికి వారు ముఖ్యఅతిథులుగా హాజరై మాట్లాడారు. వనపర్తిలో స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలోనే సాంకేతిక విద్య అందుబాటులోకి వచ్చిందని.. ఇక్కడ దేశ విదేశాలకు చెందిన విద్యార్థులు సైతం విద్యనభ్యసించారని గుర్తుచేశారు. ఆధునిక సాంకేతికతను వినియోగించుకుని దేశ భద్రతలో యువత పాత్ర మెరుగుపడేలా చొరవ చూపాలని ఆకాంక్షించారు. జిల్లాలో ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటై ఏడాది పూర్తి చేసుకోవడం అభినందనీయమని కొనియాడారు. సాంకేతిక విద్యతో విద్యార్థుల్లో సృజనాత్మక శక్తి మరింత పెరుగుతుందని చెప్పారు. అనంతరం విద్యార్థుల నృత్య ప్రదర్శనలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డా. ఎన్వీఎస్ రాజు, ప్రభుత్వ కో–ఎడ్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డా. శ్రీనివాసులు, డా. సీహెచ్ ఆశాజ్యోతి, విద్యార్థులు తదిరులు పాల్గొన్నారు. -
బీఆర్ఎస్, బీజేపీ హామీలు నమ్మొద్దు
పెబ్బేరు రూరల్: బీఆర్ఎస్, బీజేపీ నేతలు ఇచ్చే మోసపూరిత హామీలు నమ్మి మోసపోవద్దని, నాగర్కర్నూల్ పార్లమెంట్ కాంగ్రెస్పార్టీ అభ్యర్థి మల్లు రవిని భారీ మెజార్టీతో గెలిపించాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు జి.చిన్నారెడ్డి కోరారు. శనివారం శ్రీరంగాపురం రంగనాయకస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం డీసీసీ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్యాదవ్తో కలిసి మండల కేంద్రంతో పాటు వెంకటాపురం, నాగరాల, నాగసానిపల్లి, తాటిపాముల, కంభాళాపురం, జానంపేట, శేరుపల్లిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ని ఆదరించి, అహంకార బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దింపారని, అదేవిధంగా పార్లమెంట్ ఎన్నికల్లోనూ బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దింపి కేంద్రంలో కాంగ్రెస్కు అధికారం కట్టబెట్టాలని కోరారు. రాములుయాదవ్, ఎద్దుల విజయవర్ధన్రెడ్డి, గౌని బుచ్చారెడ్డి, కృష్ణ, గణేష్గౌడ్, కదిరె రాములు పాల్గొన్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- నేడు నీట్ యూజీ
- ఐరాసలో జగన్ విజన్
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
Advertisement