సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: మహబూబ్నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డికి ప్రభుత్వ విప్గా అవకాశం దక్కింది. ఈమేరకు గురువారం రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఉత్తర్వులు జారీచేశారు. ఉమ్మడి జిల్లాలో మహబూబ్నగర్ ఎమ్మెల్యేకు కీలకమైన విప్ పదవి వరించడంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఉమ్మడి జిల్లాకు చెందిన రేవంత్రెడ్డి ముఖ్యమంత్రి కాగా, మంత్రులుగా జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరిలకు అవకాశం దక్కింది. ప్రణాళికా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా జి.చిన్నారెడ్డి ఉన్నారు. తాజాగా మహబూబ్నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డికి ప్రభుత్వ విప్గా అవకాశం రావడంతో ఆయన సైతం కేబినెట్ సత్సమాన ర్యాంకులో వ్యవహరించనున్నారు. 2012 ఉప ఎన్నికలో యెన్నం మహబూబ్నగర్ అసెంబ్లీ స్థానం నుంచి బీజేపీ తరపున మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2023 ఎన్నికల్లో మహబూబ్నగర్ నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసి రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారు.
బీఆర్ఎస్ హయాంలో ఇద్దరికీ..
ఉమ్మడి జిల్లాలో బీఆర్ఎస్ పాలనలో ఇద్దరు మంత్రులతో పాటు మరో ఇద్దరు ప్రభుత్వ విప్లుగా వ్యవహరించారు. బీఆర్ఎస్ హయాంలో గతంలో మంత్రులుగా శ్రీనివాస్గౌడ్, నిరంజన్రెడ్డితో పాటు ప్రభుత్వ విప్లుగా ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్రెడ్డి, గువ్వల బాలరాజు వ్యవహరించారు. 2016లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా కాంగ్రెస్ నుంచి గెలుపొందిన కూచుకుళ్ల అనంతరం బీఆర్ఎస్లో చేరారు. 2019లో బీఆర్ఎస్ ఆయనకు ప్రభుత్వ విప్గా అవకాశం కల్పించింది.
కురుమూర్తి స్వామి
ఆశీస్సులు ఉండాలి
చిన్నచింతకుంట: కురుమూర్తిస్వామి ఆశీస్సులు రాష్ట ప్రజలపైన ఎల్లప్పుడు ఉండాలని దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్రెడ్డి ఆకాంక్షించారు. గురువారం ఆయన చిన్నచింతకుంట మండలం అమ్మాపురం కురుమూర్తి స్వామిని కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. అనంతరం ఆలయంలో నిర్వహించిన పంచాంగ శ్రావణంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కురుమూర్తిస్వామి ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని.. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అడిగిన వెంటనే నిధులు మంజూరు చేశారని వివరించారు. స్వామి వారి ఆశీస్సులు ముఖ్యమంత్రి, రాష్ట ప్రజలపైన ఉండాలన్నారు. కార్యక్రమంలోఅరవింద్కుమార్రెడ్డి, గోవర్ధన్రెడ్డి, మార్కెట్ చైర్మన్లు ప్రశాంత్కుమార్, కథలప్ప, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు నరేందర్రెడ్డి, రాఘవేందర్రెడ్డి, సర్పంచ్ రంజిత్, తదితరులు పాల్గొన్నారు.


