Jammu Kashmir
-
ముగ్గురు జైషే ఉగ్రవాదుల హతం
త్రాల్: జమ్మూకశ్మీర్లోని పుల్వామా జిల్లా, త్రాల్ ప్రాంతంలోని నాదిర్ గ్రామంలో భద్రతా దళాలతో జరిగిన కాల్పుల్లో ముగ్గురు జైషే మహ్మద్ ఉగ్రవాదులు మృతి చెందారు. గురువారం తెల్లవారుజామున జరిగిన ఎన్కౌంటర్లో మరణించిన ముగ్గురు ఉగ్రవాదులను ఆసిఫ్ అహ్మద్ షేక్, అమీర్ నజీర్ వని, యావర్ అహ్మద్ భట్గా గుర్తించారు. వీరందరూ పుల్వామా జిల్లా వాసులే. ఆ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నట్లు నిర్దిష్ట సమాచారం అందుకున్న భద్రతా దళాలు కార్డన్, సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. ఉగ్రవాదుల జాడ కోసం భద్రతాదళాలు డ్రోన్లను ఉపయోగించాయి. ఉగ్రవాదులను గుర్తించిన అనంతరం.. లొంగిపోవాలని కోరాయి. అయితే, భద్రతా సిబ్బందిని చూసిన వెంటనే, ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. మూడు గంటల పాటు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు మృతి చెందారు. ఆ ప్రాంతంలో ఇంకా ఉగ్రవాదులు ఉండొచ్చని భద్రతా దళాలు భావిస్తున్నాయి. దీంతో ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి. జమ్మూకశ్మీర్లో 48 గంటల్లో జరిగిన రెండో ఎన్కౌంటర్ ఇది. మంగళవారం షోపియాన్ జిల్లాలోని కెల్లర్ ప్రాంతంలో జరిగిన ఆపరేషన్లో ముగ్గురు లష్కరే తోయిబా ఉగ్రవాదులు హతమయిన సంగతి తెలిసిందే.లొంగిపోవాలని తల్లి వేడుకున్నా...మరణించిన ఉగ్రవాదుల్లో ఒకరైన అమీర్ నజీర్ ఎన్కౌంటర్కు ముందు తల్లితో మాట్లాడిన వీడియో ఒకటి బయటికి వచ్చింది. ఎన్కౌంటర్కు ముందు చివరి క్షణాల్లో నజీర్ తను దాక్కున్న ప్రదేశం నుంచి తల్లికి వీడియో కాల్ చేశాడు. తన తల్లితో, సోదరితో మాట్లాడాడు. అనవసరంగా ప్రాణాలు పోగొట్టుకోవద్దని, భద్రతాదళాలకు లొంగి పోవాలని నజీర్ను తల్లి వేడుకుంది. ఏకే 47 పట్టుకుని ఉన్న నజీర్ లొంగిపోవడానికి నిరాకరించాడు. ‘సైన్యాన్ని నా ముందుకు రానివ్వండి. అప్పుడు చూస్తా’ అని బదులిచ్చి కాల్ కట్ చేశాడు. -
పాక్ అణ్వాయుధాలను మీరే పర్యవేక్షించాలి
శ్రీనగర్: అత్యంత దుష్ట దేశమైన పాకిస్తాన్ వద్ద అణ్వాయుధాలు ఉండడం ప్రపంచానికి ఎప్పటికైనా ప్రమాదకరమేనని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తేల్చిచెప్పారు. వాటిని అంతర్జాతీయ అణుశక్తి సంస్థ(ఐఏఈఏ) పర్యవేక్షణలోకి తీసుకురావాలని అన్నారు. పాక్ అణ్వాయుధాలు ఐఏఈఏ పరిధిలో ఉంటేనే ప్రపంచ భద్రతకు ముప్పు వాటిల్లదని స్పష్టంచేశారు. ఆపరేషన్ సిందూర్ తర్వాత రాజ్నాథ్ సింగ్ తొలిసారిగా గురువారం జమ్మూకశ్మీర్లో పర్యటించారు. పహల్గాం ఉగ్రవాద దాడి మృతులతోపాటు పాకిస్తాన్పై దాడిలో ప్రాణత్యాగం చేసిన జవాన్లకు నివాళు లర్పించారు. శ్రీనగర్లోని బాదామీబాగ్ కంటోన్మెంట్లో సైనికులను ఉద్దేశించి మాట్లాడా రు. పాక్ అణు బెదిరింపులను భారత్ ఏమాత్రం లెక్కచేయలేదని గుర్తుచేశారు. ఉగ్రవాదాన్ని అంతం చేసే విషయంలో మన పట్టుదలను దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చని అన్నారు. భారత్పై అణ్వాయుధాలు ప్రయోగిస్తామని పాక్ ఎన్నోసార్లు బెదిరించిందని తెలిపారు. పాక్ నిజస్వరూపం ప్రపంచం మొత్తం చూసిందని పేర్కొన్నారు. ధూర్త దేశం చేతిలో అణ్వాయుధాలు ఉండడం సరైనదేనా? అని ప్రపంచ దేశాలను రాజ్నాథ్ ప్రశ్నించారు. అందుకే పాక్ అణ్వాయుధాలను ఐఏఈఏ పరిధిలోకి తీసుకురావాలని స్పష్టంచేశారు. ఉగ్రవాదంపై మన పోరాటంలో ‘ఆపరేషన్ సిందూర్’ అతిపెద్ద చర్య అని వెల్లడించారు. ఉగ్రవాదాన్ని నిర్మూలించే విషయంలో ఎంతదూరమైన వెళ్తామని నిరూపించామని పేర్కొన్నారు. -
జమ్మూకశ్మీర్ లో కొనసాగుతున్న ఉగ్రవేట
-
జమ్ముకశ్మీర్లో ఎన్కౌంటర్.. ఉగ్రవాది హతం
శ్రీనగర్: ఉగ్రవాదుల ఏరివేతే లక్ష్యంగా జమ్ముకశ్మీర్లో భద్రతా బలగాలు ముందుకు సాగుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా జమ్ము కశ్మీర్లోని అవంతి పొరా ప్రాంతంలో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఒక ఉగ్రవాది హతమైనట్టు అధికారులు వెల్లడించారు.వివరాల ప్రకారం.. జమ్ము కశ్మీర్లోని అవంతి పొరా ప్రాంతంలో గురువారం తెల్లవారుజామున భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య కాల్పులు జరిగాయి. ఇందులో పోలీసులు, భద్రతా బలగాలు సంయుక్తంగా పాల్గొన్నాయి. ఈ దాడుల్లో ఒక ఉగ్రవాది చనిపోయినట్టు అధికారులు తెలిపారు. ఇక, నాడర్, థ్రాల్ ప్రాంతంలో ఈ కాల్పులు చోటు చేసుకున్నాయని పోలీసులు వెల్లడించారు. గత 48 గంటల్లో కశ్మీర్లో ఇది రెండో ఎన్కౌంటర్ ఘటన అని వారు పేర్కొన్నారు.#WATCH | J&K | Encounter underway at Nader, Tral area of Awantipora. Police and security forces are carrying out the operation. Details awaited. (Visuals deferred by unspecified time) pic.twitter.com/sn92x3MfiN— ANI (@ANI) May 15, 2025 -
షెల్లింగ్ లేదు, కాల్పులు లేవు
జమ్మూ/శ్రీనగర్/చండీగఢ్: భారత్–పాకిస్తాన్ కాల్పుల విరమణ అనంతరం ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు జమ్మూకశ్మీర్, నియంత్రణ రేఖ, అంతర్జాతీయ సరిహద్దు చాలా ప్రశాంతంగా ఉంది. 19 రోజుల్లో మొదటిసారిగా షెల్లింగ్, కాల్పులు జరగకుండా ఉన్నాయని ఆర్మీ తెలిపింది. ఏప్రిల్ 22న పహల్గాం దాడి తర్వాత కాల్పుల విరమణ ఉల్లంఘనలలో మొదటిసారి పూర్తిగా విరామం కనిపించింది. కాల్పుల విరమణ ఒప్పందం జరిగిన కొన్ని గంటల తర్వాత, శనివారం రాత్రి, పాకిస్తాన్ జమ్మూకశ్మీర్లోని నియంత్రణ రేఖ, అంతర్జాతీయ సరిహద్దు మీదుగా వరుస క్షిపణి, డ్రోన్ దాడులను ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే ఆదివారం మాత్రం ఎలాంటి హింసాత్మక ఘటనలు నమోదు కాలేదు. పూంచ్లోని సురాన్కోట్లో సాధారణ పరిస్థితులు తిరిగి నెలకొన్నాయి. పహల్గాం దాడి తరువాత ఏప్రిల్ 23 నుంచి మే 6 వరకు, నియంత్రణ రేఖ వెంబడి అనేక కాల్పుల ఘటనలు నమోదయ్యాయి. రెండు రోజుల కిందట సూరన్కోట్లో భారీ కాల్పులు జరిగాయి. దీనితో నివాసితులు భయాందోళనకు గురయ్యారు. దాడి తరువాత, నివాసితులు పట్టణం నుంచి పారిపోయారు. కొందరు సమీపంలోని కొండ గ్రామాలు మరియు బంకర్లలో ఆశ్రయం పొందారు. మరికొందరు జమ్మూలోని సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. పరిస్థితి ఇప్పుడు మెరుగుపడటంతో, ప్రజలు త్వరలో పూంచ్లోని తమ ఇళ్లకు తిరిగి రావాలని ఆశిస్తున్నారు. శ్రీనగర్, పఠాన్కోట్, రాజౌరి, అఖ్నూర్, జమ్మూ, కుల్గాం, శ్రీ గంగానగర్, బుద్గాంలలో సాధారణ పరిస్థితికి అద్దం పడుతూ అనేక దృశ్యాలు ఆన్లైన్లో కనిపించాయి. సరిహద్దు ప్రాంతాలకే కాకుండా, చండీగఢ్తో సహా ఇతర ప్రాంతాల్లో ఆంక్షలు ఎత్తివేయడంతో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. రోజువారీ జీవితం తిరిగి ప్రారంభమైందని, పరిస్థితి ఇప్పుడు స్థిరంగా ఉందని చండీగఢ్ డిప్యూటీ కమిషనర్ తెలిపారు. దుకాణాలు, ఇతర వాణిజ్య సంస్థలు సాధారణ సమయాల ప్రకారం తెరిచి ఉండటానికి పోలీసులు అనుతించారు. అయితే పౌరులు ఎలాంటి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయకుండా ఉండాలని డిప్యూటీ కమిషనర్ హెచ్చరించారు. పగటి పూట ఎలాంటి సమస్యలు లేవని, రాత్రి 7.30 గంటల తరువాత దుకాణాలు మూసివేస్తుండటంతో సాధారణ జనజీవనానికి ఇబ్బందేమీ లేదని, ప్రజల జీవనోపాధి కూడా ప్రభావితం కావడం లేదని జైసల్మేర్కు చెందిన ఓ వ్యక్తి వివరించారు. -
మధ్యవర్తిత్వం ప్రసక్తే లేదు
న్యూఢిల్లీ/న్యూయార్క్/వాషింగ్టన్: రావణకాష్టంగా రగిలిపోతున్న, దశాబ్దాలుగా ఎటూ తేలకుండా సందిగ్ధత, సంఘర్షణలకు కారణమైన జమ్మూకశ్మీర్ అంశంలో మూడో వ్యక్తి జోక్యం అక్కర్లేదని భారత్ పునరుద్ఘాటించింది. కశ్మీర్ విషయంలో మధ్యవర్తిత్వం వహించేందుకు ఆసక్తి కనబరుస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై భారత్ ఆదివారం స్పందించింది. ‘‘కశ్మీర్పై మాకు స్పష్టమైన విధానం ఉంది. చర్చలంటూ జరిగితే పాక్ ఆక్రమిత కశ్మీర్ను భారత్కు అప్పగించడం గురించే. అంతకంటే మాట్లాడేది ఏదీ లేదు. ఉగ్రవాదుల అప్పగింత గురించి పాక్ మాట్లాడదల్చుకుంటే సిద్ధంగా ఉన్నాం. అంతకు మించి మాట్లాడటానికి మరో టాపికేమీ లేదు. ఇతర అంశాలపై ఇతరుల మధ్యవర్తిత్వం ఆశించట్లేము. ఇతరులు మధ్యవర్తిత్వం చేయాల్సిన అవసరం కూడా మాకు లేదు’’ అని ప్రకటించింది. జేజేలు అంటూనే జోక్యానికి యత్నం కాల్పుల విరమణకు ముందడుగు వేసి అత్యంత యుక్తితో వ్యవహరించిన శక్తివంతమైన భారత్, పాక్ అగ్రనాయకత్వాలను చూసి ఎంతో గరి్వస్తున్నానని ఓవైపు పొగుడుతూనే మరోవైపు కశ్మీర్ అంశంలో మధ్యవర్తిగా నిలబడతానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన అసలు ఉద్దేశ్యాన్ని బయటపెట్టారు. ఈ మేరకు ఆదివారం ఆయన ‘ట్రూత్ సోషల్’లో ఒక పోస్ట్చేశారు. ‘‘ ప్రస్తుత ఉద్రిక్తతలను తగ్గించుకోకపోతే వినాశనం తప్పదని భవిష్యత్ దర్శనం చేసి కాల్పుల విరమణకు మొగ్గుచూపిన భారత్, పాక్ నాయకత్వాలను చూస్తే నాకెంతో గర్వంగా ఉంది. అయితే దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉండి పోయిన కశ్మీర్ అంశానికి పరిష్కారం కనుగొనేందుకు మీ రెండు దేశాలతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నా’’ అంటూ ట్రంప్ వ్యాఖ్యానించారు. ట్రంప్ జోక్యాన్ని స్వాగతించిన పాక్ మధ్యవర్తిగా నిలబడేందుకు సిద్ధంగా ఉన్నానని ట్రంప్ చేసిన ప్రకటనపై పాకిస్తాన్ స్పందించింది. ‘‘ కాల్పుల విరమణ అంశంలో మధ్యవర్తిగా వ్యవహరించి నిర్మాణాత్మక పాత్ర పోషించినందుకు అమెరికాను అభినందిస్తున్నాం. ఇక జమ్మూకశ్మీర్ వివాద పరిష్కారానికి కృషిచేస్తానని ట్రంప్ ప్రకటన చేయడం ఎంతో సంతోషకరం. ఆయన సుముఖత వ్యక్తంచేయడాన్ని మేం అభినందిస్తున్నాం’’ అని పాకిస్తాన్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొంది. -
కుక్క తోక వంకరే!.. నీచ బుద్ధిని మరోసారి చాటుకుంది..
పాకిస్తాన్ తీరుపై టీమిండియా మాజీ క్రికెటరుల వీరేందర్ సెహ్వాగ్, శిఖర్ ధావన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఒప్పందం కుదిరిన కాసేపటికే దాయాది మరోసారి తమ నీచ బుద్ధిని బయటపెట్టుకుందని మండిపడ్డారు. కుక్క తోక వంకర అనే సామెత వీరికి సరిగ్గా సరిపోతుందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.ఆపరేషర్ సిందూర్కాగా పహల్గామ్ ఉగ్రదాడితో జమ్మూకశ్మీర్లో ముష్కరులు మరోసారి కల్లోలం సృష్టించిన విషయం తెలిసిందే. ప్రశాంతమైన బైసరన్ లోయలో అమాయక పర్యాటకులపై కాల్పులు జరిపి ఇరవై ఆరు మందిని ఉగ్రవాదులు పొట్టనబెట్టుకున్నారు. పురుషులే లక్ష్యంగా కాల్పులకు తెగబడి ఆడబిడ్డల నుదిటి సిందూరం చెరిగిపోయేలా పాశవిక దాడికి పాల్పడ్డారు.ఇందుకు ఆపరేషర్ సిందూర్ పేరిట భారత్ గట్టి బదులిచ్చింది. పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఉన్న తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది. అయితే, ఉగ్రవాదులకు వ్యతిరేకంగా భారత్ చేపట్టిన దాడులను సహించలేకపోయిన పాకిస్తాన్ సైన్యం.. రంగంలోకి దిగింది.సరిహద్దుల వెంబడి కాల్పులకు తెగబడటంతో పాటు సామాన్యులు, భారత సైనిక స్థావరాలే లక్ష్యంగా దాడులు చేయగా.. భారత సైన్యం ఇందుకు దీటుగా బదులిచ్చింది. పాక్ పప్పులు ఉడకనీయకుండా గాల్లోనే డ్రోన్లు, క్షిపణులను పేల్చివేసింది. అంతేకాదు కరాచీ, లాహోర్, ఇస్లామాబాద్ల నుంచి తమను టార్గెట్ చేసిన వారికి బుద్ధి వచ్చేలా విజయవంతంగా ఎదురుదాడులు చేసింది.కాళ్ల బేరానికి వచ్చి.. ఆపై మరోసారిఈ నేపథ్యంలో కాళ్ల బేరానికి వచ్చిన పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందానికి రావాలంటూ భారత్ను కోరింది. అమెరికాతో మధ్యవర్తిత్వం చేయించి.. భారత్ను ఒప్పించింది. ఈ క్రమంలో శాంతి సాధన లక్ష్యంగా భారత్ ఇందుకు అంగీకరించింది. అయితే, విరమణ ఒప్పందం జరిగిన కాసేపటికే పాక్ మరోసారి తన వక్రబుద్ధిని బయటపెట్టింది.కుక్క తోక ఎప్పటికీ వంకరేసరిహద్దుల వెంట దాడులకు దిగింది. జమ్మూకశ్మీర్, పంజాబ్, రాజస్తాన్ వంటి తదితర చోట్ల డ్రోన్లతో దాడికి దిగగా.. భారత్ వాటిని తిప్పికొట్టింది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ తీరును ఉద్దేశించి.. ‘‘కుక్క తోక ఎప్పటికీ వంకరే’’ అన్నట్లు బుద్ధులు ఎక్కడకు పోతాయి అన్న అర్థంలో వీరేందర్ సెహ్వాగ్ ట్వీట్ చేశాడు.నీచ స్వభావాన్ని మరోసారి చాటుకుందిఅయితే, ఇందుకు పాక్ నెటిజన్లు వీరూ భాయ్ను అసభ్యకరరీతిలో ట్రోల్ చేస్తుండగా.. భారతీయ నెటిజన్లు వారికి చురకలు అంటిస్తున్నారు. మరోవైపు.. శిఖర్ ధావన్ స్పందిస్తూ.. ‘‘తుచ్చమైన బుద్ధి గల దేశం.. తన తుచ్చమైన చేష్టలను మరోసారి ప్రపంచానికి చూపిస్తోంది’’ అంటూ పాక్ తన నీచ స్వభావాన్ని మరోసారి చాటుకుంది అన్న అర్థంలో ఘాటుగా వ్యాఖ్యానించాడు.ఇదిలా ఉంటే.. భారత్- పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో ఐపీఎల్-2025ని వారం పాటు వాయిదా వేస్తున్నట్లు బీసీసీఐ శుక్రవారం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, పరిస్థితులు అనుకూలిస్తే షెడ్యూల్ ప్రకారమే మే 25న ఫైనల్ నిర్వహించేలా బోర్డు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించి ఆదివారం జరిగే సమావేశంలో ఓ నిర్ణయానికి రానున్నట్లు తెలుస్తోంది. ఇక టీమిండియా మాజీ ఓపెనర్ వీరేందర్ సెహ్వాగ్ ఐపీఎల్ హర్యాన్వీ కామెంటేటర్గా ఉన్న విషయం తెలిసిందే. చదవండి: IND vs ENG: ఇంగ్లండ్తో టెస్టు సిరీస్.. స్వింగ్ కింగ్కు పిలుపు? భారత జట్టు ఇదే? -
పాక్ దాడుల్లో సీనియర్ అధికారి మృతి.. సీఎం ఒమర్ అబ్దుల్లా ఆవేదన
శ్రీనగర్: భారత్,పాకిస్థాన్ మధ్య తీవ్రమైన దాడులు కొనసాగుతున్నాయి. పాక్ దాడులను భారత్ తిప్పికొడుతోంది. మరోవైపు.. దాయాదా పాకిస్తాన్.. భారత్ సరిహద్దుల్లో పౌరులు, ఆలయాలే టార్గెట్గా దాడులకు తెగబడింది. తాజాగా పాక్ జరిపిన కాల్పుల్లో జమ్ముకశ్మీర్ ప్రభుత్వ అధికారి రాజ్కుమార్ థప్పా ప్రాణాలు కోల్పోయారు.వివరాల ప్రకారం.. సరిహద్దుల్లో కాల్పులే కాకుండా డ్రోన్లతో దాడులు చేస్తోంది పాకిస్తాన్. ఈ దాడుల్లో శనివారం ఉదయం జమ్ముకశ్మీర్ ప్రభుత్వ అధికారి రాజ్కుమార్ థప్పా ప్రాణాలు కోల్పోయారు. రాజౌరీ పట్టణంలో ఉంటున్న ఆయన ఇంటిపై పాక్ ఫిరంగులు పడటంతో ఆయన మృతి చెందారు. రాజ్కుమార్ జిల్లా డెవలప్మెంట్ కమిషనర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.Deeply saddened to hear about the tragic loss of Dr. Raj Kumar Thapa, KAS who was posted as ADDC Rajouri in the Pakistani terror attack. Our heartfelt condolences go out to the bereaved family, friends, and loved ones of the victim.Om Shanti! pic.twitter.com/mmZoS1rJWY— IAS Fraternity 🇮🇳 (@IASfraternity) May 10, 2025ఈ ఘటనపై జమ్ము కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా స్పందించారు. రాజ్కుమార్ మృతిపై సీఎం ఒమర్ ట్విట్టర్ వేదికగా..‘రాజౌరీని లక్ష్యంగా చేసుకున్న పాక్ జరిపిన దాడుల్లో రాజ్కుమార్ మృతి చెందారు. నిబద్ధత కలిగిన ఓ ఆఫీసర్ను మనం కోల్పోయాం. ఒక్కరోజు ముందే నేను అధ్యక్షత వహించిన ఆన్లైన్ సమావేశంలో రాజ్కుమార్ పాల్గొన్నారు. ఇంతలోనే రాజౌరీలోని ఆయన ఇంటిపై జరిగిన దాడిలో ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. దిగ్భ్రాంతికి గురిచేసిన ఘటనపై స్పందించేందుకు మాటలు రావడం లేదు. ఇది మాకెంతో నష్టం’ అని వ్యాఖ్యలు చేశారు.ఇదిలా ఉండగా.. శుక్రవారం రాత్రి నుంచే సరిహద్దు రాష్ట్రాల్లో కొన్నిచోట్ల పాకిస్తాన్ దాడులు చేసింది. దీంతో, విద్యుత్తు సరఫరా నిలిపివేసి ‘బ్లాకౌట్’ పాటించారు. శ్రీనగర్, పఠాన్ కోట్ ప్రాంతాల్లో ఉదయం కూడా పేలుళ్ల శబ్దాలు వచ్చినట్లు స్థానికులు పేర్కొన్నారు. డ్రోన్లతో పాక్ చేసిన దాడులను భారత్ సమర్థవంతంగా తిప్పికొట్టింది. సరిహద్దు ప్రాంతాల్లో అధికారులు సైరన్లు మోగిస్తూ ప్రజలను అప్రమత్తం చేశారు. విద్యుత్ సరఫరాను నిలిపేశారు. -
జమ్మూకశ్మీర్పై కొనసాగుతున్న పాక్ కాల్పులు
పూంచ్/జమ్మూ: జమ్మూకశ్మీర్లోని వివిధ ప్రాంతాల్లో గురువారం రాత్రి నుంచి శుక్రవారం తెల్లవారుజామున వరకు పాక్ జరిపిన కాల్పుల్లో ఇద్దరు పౌరులు చనిపోయారు. ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. మరణించినవారిలో ఒక మహిళ, ఒక పురుషుడు ఉండగా.. ఇరు కుటుంబాలకు చెందినవారు గాయపడ్డారు. కాల్పుల్లో గ్రామస్తుని మృతి పూంచ్, రాజౌరీ జిల్లాల్లోని ఫార్వర్డ్ ప్రాంతాల్లో శుక్రవారం తెల్లవారుజామున పాక్ జరిపిన కాల్పుల్లో ఓ వ్యక్తి మృతి చెందాడు. అతని భార్యతో సహా మరో ముగ్గురు గాయపడ్డారు. మృతుడిని లోరాన్ ప్రాంతానికి చెందిన మహ్మద్ అబ్రార్గా గుర్తించారు. మెంధర్లోని చలేరి ప్రాంతానికి చెందిన లయాఖత్ హుస్సేన్ గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. శుకవ్రారం తెల్లవారుజామున 3.50 గంటల నుంచి 4.45 గంటల మధ్య భారీ పేలుళ్లు సంభవించడంతో అధికారులు వెంటనే సైరన్లు మోగించారు. కశ్మీర్లోని కుప్వారా, బారాముల్లా జిల్లాలతో పాటు రాజౌరీ, పూంచ్, జమ్మూ జిల్లాల్లోని ప్రాంతాలపై రాత్రికి రాత్రే కాల్పులు, షెల్లింగ్ జరిగాయి. ఈ కాల్పుల్లో భారీగా ఆస్తి నష్టం వాటిల్లిందని, పలు ఇళ్లు, వందలాది వాహనాలు ధ్వంసమయ్యాయని అధికారులు తెలిపారు. పాకిస్తాన్ దాడుల నేపథ్యంలో జమ్మూ ప్రాంతంలోని అన్ని పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలను మూసివేశారు. సీనియర్ పోలీసు అధికారులు భద్రతా చర్యలను పర్యవేక్షించారు. నియంత్రణ రేఖ వెంబడి ఉన్న ప్రాంతాల ప్రజలను జమ్మూతో పాటు పూంచ్, రాజౌరీ జిల్లాల్లోని సురక్షిత ప్రాంతాలకు తరలించామని, శిబిరాల్లో ఉంచామని అధికారులు తెలిపారు. ఉరి సెక్టార్లో మహిళ మృతి ఉరి సెక్టార్లోని నియంత్రణ రేఖ (ఎల్వోసీ) సమీప ప్రాంతాల్లో పాక్ దళాలు గురువారం రాత్రి జరిపిన కాల్పుల్లో ఓ మహిళ మృతి చెందారు. ఆమె కుటుంబ సభ్యులు ఇద్దరు గాయపడ్డారు. ఉత్తర కశ్మీర్లోని బారాముల్లా జిల్లా ఉరి సెక్టార్లోని సిలికోట్, బోనియార్, కమల్కోట్, మొహ్రా, గింగ్లే ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని భారీ షెల్లింగ్ జరిగిందని అధికారులు తెలిపారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తుండగా మొహ్రా సమీపంలో కారును షెల్ ఢీకొనడంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించగా నర్గీస్ బేగం అనే మహిళ మృతి చెందారు. షెల్లింగ్తో పలు భవనాలు ధ్వంసమయ్యాయి. ఇక శుక్రవారం ఉరి సెక్టార్లోని టూర్నా పోస్టులో ఉన్న గౌహలన్, చోటాలీ ప్రాంతాల్లో పాక్ బలగాలు కాల్పులు జరిపాయి. భారత పోస్టులు, పౌర ప్రాంతాలపై విచక్షణారహితంగా కాల్పులు జరిపాయి. అయితే ఈ ప్రాంతాల్లో ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం లేదు. -
తెలుగు జవాన్ వీర మరణంపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
సాక్షి, తాడేపల్లి: జమ్మూకశ్మీర్లో తెలుగు జవాన్ మురళీ నాయక్ వీర మరణంపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. దేశ భద్రతలో తన ప్రాణాలను ఫణంగా పెట్టి వీరమరణం పొందిన మురళీనాయక్ త్యాగాన్ని మరువలేమన్నారు. మురళీనాయక్ కుటుంబీకులకు వైఎస్ జగన్ తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. మురళీ నాయక్ కుటుంబాన్ని వైఎస్ జగన్ ఫోన్లో పరామర్శించారు. ధైర్యంగా ఉండాలని కోరారు.భారత్-పాకిస్తాన్ యుద్ధంలో తెలుగు జవాను వీర మరణం పొందారు. శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల మండలం కళ్లి తండాకు చెందిన మురళీ నాయక్ పాకిస్థాన్ తుపాకులకు బలయ్యారు. అగ్నివీర్ పథకం కింద మూడు సంవత్సరాల క్రితం ఆర్మీ లో చేరిన మురళీ నాయక్... నాసిక్లో శిక్షణ పొంది అస్సాంలో పనిచేశారు. పాకిస్తాన్తో యుద్ధం నేపథ్యంలో జమ్మూకశ్మీర్లో విధులు నిర్వహిస్తున్నారు.Deeply pained by the martyrdom of our brave Telugu Jawan, Murali Nayak, from Penukonda, Satyasai district, in the India-Pakistan battlefield in J&K.His supreme sacrifice for the nation will forever inspire us.My heartfelt condolences to his family.We stand with them in this… pic.twitter.com/HfoFixNnZd— YS Jagan Mohan Reddy (@ysjagan) May 9, 2025దేశ సరిహద్దు ప్రాంతంలో విధులు నిర్వహిస్తుండగా.. పాకిస్థాన్ చేసిన కాల్పులకు మురళీ నాయక్ వీర మరణం పొందారు. మురళీ నాయక్ అవివాహితుడు. ఒక్కగానొక్క కొడుకు మృతి చెందడంతో మురళీ నాయక్ తల్లిదండ్రులు శ్రీరాం నాయక్, జ్యోతీబాయి కన్నీరు మున్నీరుగా విలపించారు. మురళీ నాయక్ స్వగ్రామం కళ్లి తండాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. వీర మరణం పొందిన మురళీ నాయక్ మృతదేహం రేపు స్వగ్రామం చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
పాక్ సైన్యం కర్కశ కాల్పులు
జమ్మూ/శ్రీనగర్/పూంచ్: ఉగ్రస్థావరాలపై భారత్ దాడి తర్వాత బరితెగించిన పాకిస్తాన్ సైన్యం సరిహద్దువెంట కన్నుమిన్నుకానక కర్కశంగా కాల్పులకు తెగబడింది. గతంలో ఎన్నడూలేనంతగా కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లుపొడుస్తూ తూటాల వర్షం కురిపించింది. మంగళవారం అర్ధరాత్రి నుంచి జమ్మూకశ్మీర్లోని పూంచ్æ జిల్లాలో సరిహద్దు వెంట డజన్ల కొద్దీ గ్రామాలపై పాకిస్తాన్ సైనికులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. సాధారణ నివాస ప్రాంతాలపై జరిపిన కాల్పుల్లో నలుగురు చిన్నారులు సహా 15 మంది ప్రాణాలు కోల్పోయారు. 57 మందికి బుల్లెట్ గాయాలయ్యాయి. గాయాలపాలైన కొందరిని ఆస్పత్రిలో చేరి్పంచారు. వారిలో కొందరు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. మరణించిన వారిలో బల్విందర్ కౌర్ అలియాస్ రూబీ(33), మొహ్మద్ జైన్ ఖాన్(10), జోయా ఖాన్(12), మొహ్మద్ అక్రమ్(40), అమ్రిక్ సింగ్(55), మొహ్మద్ ఇక్బాల్(45), రంజీత్ సింగ్(48), షకీలా బీ(40), అమీర్జీత్ సింగ్(47), మరియం ఖటూన్(7), విహాన్ భార్గవ్(13), మొహ్మద్ రఫీ(40), ఒక లాన్స్ నాయక్లను గుర్తించారు. పూంచ్ జిల్లాతోపాటు బాలకోటె, మెన్ధార్, మాన్కోటె, కృష్ణ ఘతి, గుల్పార్, కెర్నీ సెక్టార్లలో పాక్ రేంజర్ల భారీ స్థాయిలో మోర్టార్లతో కాల్పులు జరిపారు. చారిత్రక ప్రాధాన్యమున్న పూంచ్ కోట, ఆలయాలు, గురుద్వారాలపైనా బుల్లెట్ల వర్షం కురిసింది. బారాముల్లా జిల్లాలోని ఉరీ సెక్టార్లో ఐదుగురు మైనర్లుసహా పది మంది గాయపడ్డారు. కుప్వారా జిల్లాలోని కర్నాహ్ సెకాŠట్ర్లో బాంబుల శకలాలు పడి మంటలు అంటుకుని పలు ఇళ్లు దగ్ధమయ్యాయి. బుధవారం మధ్యాహ్నందాకా ఈ కాల్పులు ఆగలేదు. ఈ కాల్పుల్లో ఇళ్లు, దుకాణాలు, వాహనాలు, బస్టాండ్లు ధ్వంసమయ్యాయి. జనావాసాలపై తుపాకులు ఎక్కుపెట్టడాన్ని మాజీ జమ్మూకశ్మీర్ డీజీపీ ఎస్పీ వేద్ తీవ్రంగా తప్పుబట్టారు. బోర్డర్కు ఆవల డజన్ల మంది మృతి పాక్ రేంజర్ల కాల్పులకు భారత సైన్యం దీటుగా బదులిచ్చింది. భారత సైన్యం కాల్పుల్లో సరిహద్దుకు ఆవల పెద్ద సంఖ్యలో మరణాలు సంభవించినట్లు ఇండియన్ ఆర్మీ బుధవారం ప్రకటించింది. దాయాది ఆర్మీ పోస్ట్లను ధ్వంసం చేసింది. ముందు జాగ్రత్తగా సరిహద్దు జిల్లాలైన జమ్మూ, సాంబా, కథువా, రాజౌరీ, పూంఛ్లలో అన్ని పాఠశాలలు, కళాశాలలు, ఇతర విద్యాసంస్థలను బుధవారం మూసేశామని డివిజనల్ కమిషనర్ రమేశ్ కుమార్ చెప్పారు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత సరిహద్దు వెంట పాక్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడం ఇది వరుసగా 13వ రోజు. పూంఛ్–రాజౌరీలోని భీంబర్ గలీలో పాక్ కాల్పులు కొనసాగిస్తోందని భారతఆర్మీలో అడిషనల్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ తెలిపింది. కాల్పుల బారిన పడకుండా అధికారులు సరిహద్దు ప్రాంతాల్లోని వేలాది మంది స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. -
ఆపరేషన్ సిందూర్.. అర్ధరాత్రి ఎప్పుడేం జరిగింది..
శ్రీనగర్: పహల్గాం ఉగ్రదాడి ఘటనతో భారత్, పాక్ల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల వేళ పాక్ను భారత్ దెబ్బకొట్టింది. ఉగ్రదాడికి భారత్ ప్రతీకార చర్యల్లో భాగంగా మంగళవారం అర్ధరాత్రి 1:44 గంటలకు ‘ఆపరేషన్ సిందూర్’ (Operation Sindoor) పేరుతో పాకిస్థాన్ (Pakistan)లోని ఉగ్రస్థావరాలపై భారత సైన్యం (Indian Army) మెరుపు దాడులు చేపట్టింది. భారత ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ బలగాలు సంయుక్తంగా ఈ దాడిని నిర్వహించాయి. మిస్సైళ్లతో లక్ష్యాలపై విరుచుకుపడ్డాయి. పాక్ ఆక్రమిత కశ్మీర్తో పాటు పాకిస్థాన్లోని ఉగ్ర మౌలిక సదుపాయాలను ధ్వంసం చేశాయి. పూర్తి కచ్చితత్వంతో దాడులు చేసినట్లు పేర్కొంది.ఆపరేషన్ సిందూర్ ఇలా.. 1:44 AM ఆపరేషన్ సిందూర్ ప్రారంభం1:45 AM మొత్తం 9 ఉగ్ర స్థావరాలపై ఏక కాలంలో దాడులు.1:45 AM ఉగ్ర స్థావరాలపై మిసైల్స్తో దాడులు.2:00 AM న్యాయం జరిగిందంటూ ట్విట్టర్ పోస్టులో భారత ఆర్మీ ప్రకటన..2:25 AM భారత్ దాడికి ప్రతీకారం తీర్చుకుంటామన్న పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్.2:30 AM శ్రీనగర్కు విమాన సర్వీసులు రద్దు.3:00 AM ధర్మశాల, లేహ్, జమ్ము, అమృతసర్ విమానాశ్రయాలు మూసివేత.4:00 AM ఎల్వోసీ వెంట ఉన్న గ్రామాలపై పాక్ ఆర్మీ కాల్పులుభారత ప్రభుత్వం ప్రకటన అనంతరం ఇండియన్ ఆర్మీ స్పందించింది. ‘న్యాయం జరిగింది’ అని ఎక్స్లో పోస్టు చేసింది. మెరుపు దాడులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. భారత్ దాడులతో పాక్ అప్రమత్తమైంది. లాహోర్, సియాల్కోట్ ఎయిర్పోర్ట్లను 48 గంటల పాటు మూసివేసింది. -
‘పహల్గాం ఉగ్రదాడి గురించి కేంద్రానికి ముందే తెలుసు’.. ఖర్గే సంచలన ఆరోపణలు
రాంచీ: పహల్గాం ఉగ్రదాడిపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖర్జున్ ఖర్గే సంచలన ఆరోపణలు చేశారు.జార్ఖండ్ రాష్ట్రం రాంచీలో కాంగ్రెస్ పార్టీ సంవిధాన్ బచావో ర్యాలీ నిర్వహించింది. ఈ ర్యాలీలో సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మల్లిఖార్జున్ ఖర్గే మాట్లాడారు.పహల్గాం ఉగ్రదాడిపై కేంద్రానికి మూడురోజుల ముందే సమాచారం అందింది. నిఘూవర్గాల హెచ్చరికలతో ప్రధాని మోదీ కశ్మీర్ పర్యటన రద్దు చేసుకున్నారు. పర్యాటకులకు మాత్రం భద్రత కల్పించలేకపోయారు’అని ఆరోపించారు. Watch: Congress President Shri @kharge addresses the Samvidhan Bachao Rally in Ranchi, Jharkhand. https://t.co/wRfrg2XD99— Congress (@INCIndia) May 6, 2025 -
ఆనకట్టల కట్టడి
సింధూ, దాని పరీవాహక నదుల నుంచి పాకిస్తాన్కు ఇకపై చుక్క నీరు కూడా వదిలేది లేదన్న భారత్, ఆ దిశగా పూర్తిస్థాయి కార్యాచరణకు రంగంలోకి దిగింది. ఆ నదులపై అన్ని జలాశయాల సామర్థ్యాలను పూర్తిస్థాయిలో పెంచే దిశగా చర్యలు తీసుకుంటోంది. వాటిలో పేరుకుపోయిన మట్టి, ఇసుక తదితరాలను పూర్తిగా తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది. తద్వారా అన్ని ప్రాజెక్టుల్లోనూ నీటి నిల్వ సామర్థ్యం గరిష్ట స్థాయికి చేరేలా చూడాలని అధికారులకు సూచించింది. జమ్మూ కశ్మీర్లో చినాబ్ నదిపై ఉన్న కీలక బాగ్లిహార్, సలాల్ జల విద్యుత్కేంద్రాల్లో ఆ దిశగా గురువారం లాంఛనంగా మొదలైన పూడికతీత పనులు సోమవారం పూర్తిస్థాయికి చేరాయి. పనుల్లో భాగంగా రెండు డ్యాముల్లో అవసరమైన గేట్లను గురువారం నుంచి శనివారం దాకా పాక్షికంగా ఎత్తడంతో పాక్లోని సరిహద్దు ప్రాంతాలు నీటమునిగాయి. సింధూ జల ఒప్పందం నిలిపివేత నేపథ్యంలో ఈ విషయమై పాక్కు ముందస్తు సమాచారం ఇవ్వలేదు. 1960ల్లో ఒప్పందం అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇలా జరగడం ఇదే తొలిసారి. ఒప్పందాన్ని బూచిగా చూపుతూ పూడిక పనులను పాక్ ఎప్పటికప్పుడు అడ్డుకుంటూ వచ్చింది. ఇప్పుడిక ఆ ప్రాజెక్టుల్లోని పూడిక మొత్తాన్నీ తొలగించి పూర్తిస్థాయిలో నీటిని నింపనున్నారు. అప్పటిదాకా చినాబ్ నదీజలాలు పాక్కు పూర్తిగా నిలిచిపోయినట్టే!. సింధూ ఒప్పందం ప్రకారం చినాబ్ జలాలు పాక్కే చెందుతాయి. వాటి ప్రవాహాన్ని భారత్ అడ్డుకోవడానికి వీల్లేదు.మూడింటి నుంచి నీళ్లు బంద్జమ్మూ కశ్మీర్లో సింధూ, దాని పరీవాహక నదులపై ఆరుకు పైగా జలాశయాల్లో పూడికతీతను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలన్న ఆదేశాల నేపథ్యంలో స్థానిక ప్రభుత్వ విభాగాలు పూర్తిస్థాయిలో రంగంలోకి దిగాయి. ప్రభుత్వరంగ ఎన్హెచ్పీసీ లిమిటెడ్ సారథ్యంలో పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. బాగ్లిహార్, సలాల్తో పాటు జీలం నది మీది కిషన్గంగ జలాశయాల నుంచి పాక్కు నీటి విడుదలను ఆదివారం నుంచి నిలిపేశారు. దాంతో పాక్లోని పంజాబ్ తదితర ప్రాంతాలకు సాగునీరు నిలిచిపోయింది. సలాల్ ప్రాజెక్టును 1987లో, బాగ్లిహార్ను 2008లో నిర్మించారు. అప్పటినుంచీ వాటిలో పూడికతీత చేపట్టడం ఇదే తొలిసారి. సలాల్ 690 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేస్తుంది. బాగ్లీహార్ సామర్థ్యం 900 మెగావాట్లు. పూడిక నేపథ్యంలో వాటిలో విద్యుదుత్పాదన చాలాకాలంగా సామర్థ్యం కంటే తక్కువగా జరుగుతూ వస్తోంది.10 వేల మెగావాట్ల విద్యుత్జమ్మూ కశ్మీర్లో సింధూ, ఉప నదులపై మొదలు పెట్టిన ఆరు ప్రాజెక్టులు పాక్ అభ్యంతరాల నేపథ్యంలో చాన్నాళ్లుగా నిలిచిపోయాయి. తాజా పరిస్థితుల నేపథ్యంలో వాటి నిర్మాణాన్ని తక్షణం పునఃప్రారంభించాలని కేంద్రం నిర్ణయించింది. సవాల్కోట్ (1,856 మెగావాట్లు), కిర్తాయ్ 1, 2 (1,320 ఎంవీ), పాకాల్దుల్ (1,000 ఎంవీ)తో పాటు 2,224 మెగావాట్ల సామర్థ్యంతో కూడిన మరో ప్రాజెక్టులు వీటిలో ఉన్నాయి. ఇవన్నీ పూర్తయితే ఏకంగా 10 వేల మెగావాట్ల అదనపు విద్యుత్తో పాటు సాగు, తాగునీటి అవసరాలకు మరిన్ని జలవనరులు అందుబాటులోకి వస్తాయి. సింధూ ఒప్పందం కింద ఇలాంటి పనులకు పాక్కు ఆర్నెల్ల నోటీసు ఇవ్వాల్సి ఉండేది. దాన్ని నిలిపివేసిన నేపథ్యంలో భారత్ తాజా చర్యలను అడ్డుకునేందుకు పాక్కు పెద్దగా మార్గాలేమీ లేవు. మధ్యవర్తి అయిన ప్రపంచబ్యాంకు కూడా పెద్దగా చేసేదేమీ లేదు. ఇరు దేశాలనూ చర్చలకు ప్రోత్సహించడం తప్ప ఒప్పందం అమలుకు ఆదేశించడం వంటి అధికారాలేవీ దానికి లేవు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
బాంబులు గుర్తింపు.. జమ్ముకశ్మీర్లో జైళ్లకు భద్రత పెంపు
శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో ఉన్న జైళ్లపై ఉగ్ర దాడికి కుట్ర జరుగుతున్నట్టు సమాచారం. జైళ్లపై ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. తాజాగా పూంజ్ జిల్లాలో ఉగ్రవాదులు అమర్చిన ఐదు ఐఈడీ బాంబులను భద్రతా బలగాలు గుర్తించాయి. వాటిని నిర్వీర్యం చేశాయి. ఈ నేపథ్యంలో జమ్ముకశ్మీర్, శ్రీనగర్లో భద్రతను ప్రభుత్వం పెంచింది. జైళ్ల భద్రతపై ఉన్నతాధికారులతో సీఐఎస్ఎఫ్ డైరెక్టర్ సమీక్ష నిర్వహించారు. కాగా, 2023 నుంచి CISF జైళ్ల భద్రతను పర్యవేక్షిస్తోంది. కాగా, కశ్మీర్ జైళ్లలో ఉన్న హైప్రొఫైల్ ఉగ్రనాయకులను విడిపించేందుకు భారీ కుట్ర పన్నినట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు పసిగట్టాయి. ఈక్రమంలో శ్రీనగర్ సెంట్రల్ జైల్, కోట్ బాల్వాల్ జైల్, జమ్మూలోని జైళ్లకు భారీఎత్తున భద్రత కల్పించారు. ఇప్పటికే పహల్గాం ఉగ్రదాడి దర్యాప్తులో భాగంగా చాలామంది స్లీపర్ సెల్స్, ఓవర్ గ్రౌండ్ వర్కర్లను తీసుకొచ్చి ఈ జైళ్లలో ఉంచారు. వీరితోపాటు ఆర్మీ వాహనంపై దాడి కేసులో నిందితులైన నిస్సార్, ముష్తాక్ సహచరులను జాతీయ దర్యాప్తు సంస్థ ప్రశ్నిస్తోంది. ఈనేపథ్యంలో జైళ్లపై దాడి జరగొచ్చనే సమాచారం నిఘా వర్గాలకు చేరింది.ఇదిలా ఉండగా.. పహల్గాం ఉగ్ర దాడి నేపథ్యంలో భారత్, పాక్ మధ్య తలెత్తిన ఉద్రిక్తతలు ఏమాత్రం చల్లారడం లేదు. దాయాది కవ్వింపు చర్యలు ఆగడం లేదు. నియంత్రణ రేఖ వెంబడి పాక్ సైన్యం వరుసగా కాల్పులకు తెగబడింది. జమ్ము కశ్మీర్లో కుప్వారా, పూంచ్, రాజౌరీ, మేంధార్, నౌషేరా, సుందర్బనీ, అఖ్తర్ తదితర 8 ప్రాంతాల్లో కాల్పులు చోటుచేసుకున్నాయి. వాటిని సైన్యం గట్టిగా తిప్పికొట్టింది.దీర్ఘకాల సెలవులు రద్దుఉద్రిక్తతల నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఆర్డినెన్స్ ఫ్యాక్టరీల సిబ్బందికి దీర్ఘకాల సెలవులు రద్దు చేస్తూ మ్యునీషియన్స్ ఇండియా లిమిటెడ్ (ఎంఐఎల్) ఆదేశాలు జారీ చేసింది. ఎంఐఎల్ పరిధిలో 12 ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలున్నాయి. సైన్యానికి అవసరమైన ఆయుధాలు వాటిలో తయారవుతాయి. ఆయుధ ఉత్పత్తి లక్ష్యాన్ని చేరుకోవడానికే సెలవులు రద్దు చేసినట్లు ఎంఐఎల్ అధికారి ఒకరు చెప్పారు. -
జమ్ముకశ్మీర్లో ప్రమాదం.. భారత జవాన్లు మృతి
శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో భారత ఆర్మీకి చెందిన ముగ్గురు జవాన్లు మృతిచెందారు. వివరాల ప్రకారం.. జమ్ముకశ్మీర్లోని రాంబన్ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. రాంబన్ జిల్లాలో ఆదివారం మధ్యాహ్నం ఆర్మీ వాహనం లోయలో పడిపోయింది. ఈ ఘటనలో ముగ్గురు జవాన్లు మృతిచెందారు. ఆర్మీ వాహనం 700 అడుగుల లోత్తైన లోయలో పడిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. ఆర్మీ వాహనం జమ్ము నుంచి కశ్మీర్కు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఘటనా స్థలానికి చేరుకున్న బలగాలు అక్కడ సహాయక చర్యలు చేపట్టాయి. Ramban, Jammu and Kashmir: An accident took place at Battery Chasma on NH44, involving an Army vehicle that rolled into a deep gorge. Police, SDRF, Civil Quarter, and Army teams responded promptly, and a rescue operation is currently underway pic.twitter.com/lZm3yg6JQT— IANS (@ians_india) May 4, 2025Two Army personnel lost their lives after their vehicle plunged into a deep gorge in the Battery Chashma area of #Ramban district.More details awaited. pic.twitter.com/sqp6gdi2gK— The Grameen Express (@grameenexpress) May 4, 2025 -
బాబర్ ఆజం, మహ్మద్ రిజ్వాన్లకు షాక్.. అకౌంట్లు బ్లాక్
పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్పై భారత్ కఠిన చర్యలు చేపట్టింది. సింధు జలాల ఒప్పందం రద్దు సహా దాయాదిపై అనేక ఆంక్షలు విధించింది. అదే విధంగా పాకిస్తాన్కు చెందిన సామాజిక మాధ్యమాల ఖాతాల విషయంలోనూ కీలక నిర్ణయం తీసుకుంది.ఇప్పటికే పాక్ యూట్యూబ్ చానెళ్లు, ట్విటర్ను నిషేధించిన భారత్.. క్రీడాకారుల సోషల్ మీడియా అకౌంట్లపై కూడా దృష్టి సారించింది. ఇందులో భాగంగా ఇప్పటికే జావెలిన్ త్రోయర్, ప్యారిస్ ఒలింపిక్స్-2024 స్వర్ణ పతక విజేత అర్షద్ నదీమ్ (Arshad Nadeem) ఖాతాను దేశంలో నిలిపివేసింది.బాబర్ ఆజం, మహ్మద్ రిజ్వాన్లకు షాక్ఇక పాకిస్తాన్ స్టార్ క్రికెటర్లు బాబర్ ఆజం (Babar Azam), కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ (Mohammed Rizwan)లకు కూడా తాజాగా షాక్ తగిలింది. వీరిద్దరి ఇన్స్టాగ్రామ్ ఖాతాలను భారత్లో నిలిపి వేశారు. వీరి అకౌంట్లను ఓపెన్ చేయాలని చూస్తే.. ‘‘ఈ అకౌంట్ ఇండియాలో అందుబాటులో లేదు. చట్టపరమైన అభ్యర్థనల నేపథ్యంలో దీనిపై ఆంక్షలు ఉన్నాయి’’ అనే సందేశం కనిపిస్తోంది.కాగా పహల్గామ్ దాడి తర్వాత షోయబ్ అక్తర్, షాహిన్ షా ఆఫ్రిది, హ్యారిస్ రవూఫ్, షాహిద్ ఆఫ్రిది, వసీం అక్రం, వకార్ యూనిస్, బసిత్ అలీ తదితర క్రికెటర్ల అకౌంట్లను కూడా భారత్లో బ్లాక్ చేశారు. అదే విధంగా ఇతర సెలబ్రిటీలు మహీరా ఖాన్, ఫవాద్ ఖాన్, అలీ జాఫర్, హనియా ఆమిర్ ఖాతాలను కూడా నిలిపివేశారు.భారత్లో నిషేధంఇక పాకిస్తాన్ ఆటగాళ్లు ప్రస్తుతం పాకిస్తాన్ సూపర్ లీగ్తో బిజీగా ఉన్నారు. ఐపీఎల్-2025తో పోటీ పడి చేతులు కాల్చుకున్న పాక్ క్రికెట్ బోర్డుకు.. పహల్గామ్ దాడి తర్వాత మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే అంతంత మాత్రమైన వ్యూయర్షిప్ ఉన్న ఈ లీగ్ ప్రసారాలను భారత్లో నిషేధించారు.కాగా జమ్మూ కశ్మీర్లోని పహల్గామ్లో గల ప్రశాంతమైన బైసరన్ లోయలో ఉగ్రవాదులు ఇటీవల పాశవిక దాడికి తెగబడిన విషయం తెలిసిందే. బైసరన్ అందాలు చూసేందుకు వచ్చిన 26 మంది పర్యాటకులను కాల్చి చంపేశారు. దీంతో... అమాయక ప్రజల ప్రాణాలు తీసిన ఉగ్రవాదులు, వారికి మద్దతు ఇస్తున్న వారిపై భారత్ కఠిన చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ముందుగా దాయాదికి బుద్ధిచెప్తోంది.చదవండి: ఆసియా కప్, బంగ్లాదేశ్ పర్యటనను రద్దు చేసుకోనున్న టీమిండియా..? -
భారత్, పాక్ మధ్య యుద్ధమే.. ఫరూక్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు
శ్రీనగర్: పహల్గాం ఉగ్ర దాడి నేపథ్యంలో భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధం ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ తరుణంలో నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు చేశారు. రెండు దేశాల మధ్య యుద్ధం జరిగే అవకాశం లేకపోలేదని చెప్పుకొచ్చారు. అలాగే, ఈ ఘటనకు భద్రత, నిఘా లోపాలు కూడా ఒక కారణమని అన్నారు.పహల్గాం ఘటనపై తాజాగా ఫరూక్ అబ్దుల్లా స్పందిస్తూ ఉగ్రవాదుల చర్యను తీవ్రంగా ఖండించారు. ఈ క్రమంలో ఫరూక్ అబ్దుల్లా మాట్లాడుతూ..‘పాకిస్తాన్ ఈ ప్రాంతాన్ని అస్థిరపరిచేందుకు ప్రయత్నిస్తోంది. రేపటి రోజు ఎలా ఉండబోతోందో ఎవరికీ తెలియదు. భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగే అవకాశం లేకపోలేదు. ఇరు దేశాలు యుద్ధానికి సిద్ధమవుతున్నాయి. అలా జరగకుండా ఉండాలంటే పహల్గాం ఉగ్ర దాడి జరగడానికి కారణమైన ఉగ్రవాదులను పట్టుకోవాలి. అలాగే, ఈ ఘటన వెనక ఉన్న వారిని వీలైనంత తొందరగా పట్టుకోవాలి. అప్పుడే యుద్ధాన్ని నివారించే దిశగా ప్రయత్నాలు జరుగుతాయి. భద్రత, నిఘా లోపాలు కూడా ఉగ్ర దాడి జరిగేందుకు ఒక కారణమని అనడంలో సందేహం లేదు’ అంటూ వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉండగా.. అంతకుముందు.. పహల్గాం ఘటనపై జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా స్పందిస్తూ.. ఉగ్రవాదుల బారి నుంచి అతిథుల(పర్యాటకులు)ను కాపాడటంలో తాను విఫలమయ్యానని రాష్ట్ర శాసనసభ వేదికగా ప్రకటించారు. బైసరన్లో ఇంత పెద్ద స్థాయిలో దాడి చేయడం మాత్రం 21 ఏళ్లలో ఇదే తొలిసారి. మృతి చెందిన వారి కుటుంబ సభ్యులకు ఎలా క్షమాపణలు చెప్పాలో తెలియడం లేదు. రాష్ట్రానికి వచ్చిన పర్యాటకులను సురక్షితంగా తిరిగి పంపాల్సిన బాధ్యత మాదే. నేను ఆ పనిచేయలేకపోయాను. పహల్గాం ఘటన తర్వాత ఏ ముఖం పెట్టుకొని రాష్ట్ర హోదాను డిమాండ్ చేయాలి. నా రాజకీయాలు అంత చౌకబారువి కాదు. గతంలో రాష్ట్ర హోదా అడిగాం.. భవిష్యత్తులో కూడా అడుగుతాం. కానీ, 26 మంది చనిపోయారు.. ఇప్పుడు రాష్ట్ర హోదా ఇవ్వండి అని కేంద్రాన్ని అడగడం సిగ్గుచేటు. ప్రజలు మాకు మద్దతు ఇస్తే.. ఉగ్రవాదం అంతమవుతుంది’ అని పేర్కొన్నారు. -
కశ్మీర్లో స్లీపర్సెల్స్ యాక్టివ్.. ఇంటెలిజెన్స్ హెచ్చరిక
శ్రీనగర్: జమ్ముకశ్మీర్లోని పహల్గాం దాడి ఘటనతో అక్కడ భారత ఆర్మీ హైఅలర్ట్లో ఉంది. మరోవైపు.. కశ్మీర్లో మరిన్ని ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించడంతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. ఈ నేపథ్యంలో 48 టూరిస్టు కేంద్రాలను జమ్ముకశ్మీర్ ప్రభుత్వం మూసివేసింది.వివరాల ప్రకారం.. పహల్గాం దాడి అనంతరం కశ్మీర్ లోయలో స్లీపర్సెల్స్ యాక్టివేట్ అయినట్లు నిఘావర్గాలు తెలిపాయి. దీంతో, కశ్మీర్లో మరిన్ని ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. ఈ నేపథ్యంలో జమ్ముకశ్మీర్ ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. అనంతరం, కశ్మీర్లో ఉన్న 48 టూరిస్టు కేంద్రాలను ప్రభుత్వం మూసివేసింది. కశ్మీర్ వ్యాప్తంగా ఉన్న మొత్తం 87 టూరిస్టు కేంద్రాల్లో వీటిని మూసివేస్తున్నట్లు పేర్కొన్న అధికారులు వెల్లడించారు.ఇదిలా ఉండగా.. పహల్గాం ఉగ్రదాడి ఘటనపై జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఆవేదన వ్యక్తం చేశారు. పర్యాటకులను పాశవికంగా హతమార్చిన ఘటనపై చర్చించేందుకు జమ్ముకశ్మీర్ శాసనసభ సోమవారం ప్రత్యేకంగా సమావేశమైంది. ఉగ్రదాడి మృతులకు సంతాపసూచకంగా సభ రెండు నిమిషాలు మౌనం పాటించింది. ఉగ్రవాదుల దుశ్చర్యను ఖండించింది. పాశవికదాడిపై తీవ్ర దిగ్భ్రాంతిని, ఆవేదనను వ్యక్తం చేస్తూ ఏకగ్రీవంగా ఓ తీర్మానాన్ని ఆమోదించింది.దానికి ముందు సీఎం ఒమర్ అబ్దుల్లా మాట్లాడుతూ..‘బైసరన్లో ఇంత పెద్ద స్థాయిలో దాడి చేయడం మాత్రం 21 ఏళ్లలో ఇదే తొలిసారి. మృతి చెందిన వారి కుటుంబ సభ్యులకు ఎలా క్షమాపణలు చెప్పాలో తెలియడం లేదు. రాష్ట్రానికి వచ్చిన పర్యాటకులను సురక్షితంగా తిరిగి పంపాల్సిన బాధ్యత మాదే. నేను ఆ పనిచేయలేకపోయాను. పహల్గాం ఘటన తర్వాత ఏ ముఖం పెట్టుకొని రాష్ట్ర హోదాను డిమాండ్ చేయాలి. నా రాజకీయాలు అంత చౌకబారువి కాదు. గతంలో రాష్ట్ర హోదా అడిగాం.. భవిష్యత్తులో కూడా అడుగుతాం. కానీ, 26 మంది చనిపోయారు.. ఇప్పుడు రాష్ట్ర హోదా ఇవ్వండి అని కేంద్రాన్ని అడగడం సిగ్గుచేటు. ప్రజలు మాకు మద్దతు ఇస్తే.. ఉగ్రవాదం అంతమవుతుంది’ అని పేర్కొన్నారు. -
జమ్మూకశ్మీర్ అసెంబ్లీలో సీఎం ఒమర్ అబ్దుల్లా ఉద్వేగభరిత ప్రసంగం
-
మీరంతా పనికిరాని వాళ్లనేగా అర్థం: షాహిద్ ఆఫ్రిది వివాదాస్పద వ్యాఖ్యలు
పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహిద్ ఆఫ్రిది (Shahid Afridi) వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. పహల్గామ్ ఉగ్రదాడి (Pahalgam Incident) నేపథ్యంలో భారత ఆర్మీని కించపరిచే విధంగా మాట్లాడాడు. తమ సైన్యం వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు భారత్ పాకిస్తాన్పై నిందలు వేస్తోందని ఆరోపించాడు.బైసరన్ లోయలోభారత్లో చిన్న టపాసు పేలినా పాక్నే నిందిస్తున్నారని.. దమ్ముంటే ఆధారాలతో నిరూపించాలంటూ ఓ షోలో ఆఫ్రిది అతి చేశాడు. కాగా అందమైన కశ్మీరంలో ఉగ్రవాదులు ఇటీవల కల్లోలం సృష్టించిన విషయం విదితమే. జమ్మూకశ్మీర్లోని పహల్గామ్లో గల ప్రశాంత బైసరన్ లోయలో కాల్పులకు తెగబడి.. 26 మంది పర్యాటకులను చంపేశారు.కఠిన చర్యలకు ఉపక్రమంచిన భారత్ఈ నేపథ్యంలో పాకిస్తాన్కు భారత్ గట్టి షాకులు ఇచ్చింది. సింధు జలాల ఒప్పందం సహా పలు విషయాల్లో పాక్ను కోలుకోలేని దెబ్బకొట్టేలా ముందుకు సాగుతోంది. ఆ దేశ ట్విటర్, సినిమాలపై నిషేధం విధించింది. అంతేకాదు.. తాజాగా పాక్కు చెందిన 16 యూట్యూబ్ చానెళ్లను బ్యాన్ చేసింది.మీరంతా పనికిరాని వాళ్లనేగా అర్థంఈ క్రమంలో షాహిద్ ఆఫ్రిది స్పందిస్తూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడు. ‘‘భారత్లో చిన్న పటాకా పేలినా వాళ్లు పాకిస్తాన్నే నిందిస్తారు. కశ్మీర్లో 8 లక్షల మందితో కూడిన పటిష్టమైన సైన్యం ఉంది. అయినా సరే ఇదెలా జరిగింది?.. మీరంతా పనికిరాని వాళ్లనేగా దీని అర్థం.ప్రజలకు కనీస భద్రత కల్పించడం కూడా మీకు చేతకావడం లేదు. ఘటన జరిగిన గంటలోపే మీడియా మొత్తం బాలీవుడ్ వైపే గురిపెట్టింది. వారి మాట తీరు నాకు ఆశ్చర్యం కలిగించింది.తమకు తాము విద్యావంతులమని చెప్పుకొంటారు. కానీ వారి ఆలోచనా విధానం ఇంత వరకే పరిమితం. ఇండియాలో ఇద్దరు టాప్ క్రికెటర్లు ఉన్నారు. భారత క్రికెట్కు అంబాసిడర్లుగా కొనసాగారు. కానీ వాళ్లు కూడా నేరుగా పాకిస్తాన్ వైపే వేలు చూపిస్తూ నిందిస్తున్నారు. దమ్ముంటే ఆధారాలతో నిరూపించాలి’’ అని షాహిద్ ఆఫ్రిది రెచ్చగొట్టే విధంగా మాట్లాడాడు.ఇదిలా ఉంటే.. పాక్ మాజీ స్పిన్నర్ డానిష్ కనేరియా మాత్రం పహల్గామ్ ఘటన నేపథ్యంలో తమ దేశ నాయకత్వ తీరుపై మండిపడ్డాడు. ఉగ్రదాడిని వెంటనే ఖండించకపోవడం అనుమానాలకు తావిచ్చిందని పేర్కొన్నాడు. ఇక పాక్ ఉప ప్రధాని ఉగ్రవాదులను స్వాతంత్ర్య సమరయోధులతో పోల్చడాన్ని తీవ్రంగా తప్పుబట్టాడు. డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ తన వ్యాఖ్యల ద్వారా ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్నది తామేనని నేరుగానే అంగీకరించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ముక్తకంఠంతో ఖండించారుఇక పహల్గామ్ ఉగ్రదాడిని భారత క్రీడాలోకం ముక్తకంఠంతో ఖండించిన విషయం తెలిసిందే. టీమిండియా దిగ్గజ క్రికెటర్లు సచిన్ టెండుల్కర్, విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ తదితరులు బాధితులకు, వారి కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. బాధితులకు న్యాయం చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.అదే విధంగా.. మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ మాట్లాడుతూ.. పాక్ క్రికెట్తో సంబంధాలన్నీ తెంచుకోవాలని బీసీసీఐకి సూచించాడు. ప్రతి ఏడాది ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడటం ఉగ్రవాదులకు అలవాటై పోయిందని.. ప్రభుత్వం కఠిన చర్యలతో ఉగ్రవాదాన్ని తుడిచిపెట్టేయాలని కోరాడు.చదవండి: మా గురించి మీకేం తెలుసు?.. మాకు అలాంటి పిచ్చిలేదు: సంజనా ఫైర్ -
ఫలితాలు, విదేశీ అంశాలపై కన్ను
ముంబై: దేశీ స్టాక్ మార్కెట్లు ఈ వారం పలు అంశాల ఆధారంగా కదలనున్నాయి. ప్రధానంగా గత వారం జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో టూరిస్టులపై ఉగ్రదాడి కారణంగా భారత్, పాకిస్తాన్ మధ్య తలెత్తిన ఉద్రిక్తతలు ప్రభావం చూపనున్నాయి. దీంతో రెండు దేశాల మధ్య రాజకీయ, భౌగోళిక ఆందోళనలు సెంటిమెంటుకు కీలకంగా నిలవనున్నట్లు విశ్లేషకులు ప్రస్తావించారు. ఇవికాకుండా అమెరికా, చైనా మధ్య టారిఫ్ల సంక్షోభానికి సైతం ప్రాధాన్యత ఉన్నట్లు తెలియజేశారు. ఈ నేపథ్యంలో గత వారం చివర్లో మార్కెట్లు ఉన్నట్టుండి బలహీనపడ్డాయి. ఫలితంగా ఎన్ఎస్ఈ ప్రధాన ఇండెక్స్ నిఫ్టీ 23,800కు ఎగువన నిలవగలిగితేనే సాంకేతికంగా బుల్లిష్ ధోరణి కొనసాగే వీలున్నట్లు నిపుణులు అభిప్రాయపడ్డారు. కాగా.. ఈ వారం ట్రేడింగ్ నాలుగు రోజులకే పరిమితంకానుంది. మహారాష్ట్ర డే సందర్భంగా గురువారం(మే 1న) మార్కెట్లు పనిచేయవు. ఇంధన, సిమెంట్ కంపెనీలు ఇప్పటికే గత ఆర్థిక సంవత్సర(2024–25) ఫలితాల సీజన్ ప్రారంభమై జోరందుకుంది. ఈ బాటలో ఈ వారం మరికొన్ని దిగ్గజాలు క్యూ4(జనవరి–మార్చి) పనితీరుతోపాటు పూర్తి ఏడాది ఫలితాలు ప్రకటించనున్నాయి. జాబితాలో ఇంధన రంగ పీఎస్యూలు ఇండిఆయన్ ఆయిల్ కార్పొరేషన్(ఐవోసీ), భారత్ పెట్రోలియం కార్పొరేషన్(బీపీసీఎల్)సహా.. సిమెంట్ దిగ్గజాలు అంబుజా, అల్ట్రాటెక్, టాటా గ్రూప్ దిగ్గజం ట్రెంట్, ద్విచక్ర వాహన దిగ్గజం టీవీఎస్ మోటార్, బజాజ్ ఫైనాన్స్ తదిరాలున్నాయి. గత వారం చివర్లో డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ క్యూ4, పూర్తి ఏడాది ఫలితాలు వెలువరించింది. ఈ ప్రభావం నేటి(సోమవారం) ట్రేడింగ్లో రిలయన్స్ కౌంటర్పై కనిపించనున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. ఇతర అంశాలు గత వారం ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు ఇండెక్స్ వెనకడుగు వేసింది. మరోవైపు దేశీ స్టాక్స్లో ఎఫ్పీఐలు భారీగా ఇన్వెస్ట్ చేశారు. వెరసి డాలరుతో మారకంలో దేశీ కరెన్సీ రూపాయి బలపడింది. అమెరికా, చైనా మధ్య టారిఫ్ల సంక్షోభం కారణంగా పసిడి ధరలు మండుతున్నప్పటికీ ముడిచమురు ధరలు దిగివస్తున్నాయి. బ్రెంట్ చమురు 65 డాలర్ల సమీపంలో కదులుతోంది. రూపాయి పుంజుకోవడం, చమురు చల్లబడటం దేశీ ఆర్థిక వ్యవస్థకు సానుకూల అంశాలుగా మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి. ఈ వారం భారత్, పాకిస్తాన్ మధ్య తలెత్తిన ఉద్రిక్తతలు, అంతర్జాతీయ టారిఫ్ల సంక్షోభం సెంటిమెంటును ప్రభావితం చేయనున్నట్లు రెలిగేర్ బ్రోకింగ్ రీసెర్చ్ సీనియర్ వీపీ అజిత్ మిశ్రా పేర్కొన్నారు. ఇవికాకుండా దేశీయంగా పలు కార్పొరేట్ దిగ్గజాలు క్యూ4 ఫలితాలు ప్రకటించనుండటంతో ఇన్వెస్టర్లు వీటిపై దృష్టి పెట్టనున్నట్లు మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ వెల్త్ మేనేజ్మెంట్ రీసెర్చ్ హెడ్ సిద్ధార్థ ఖేమ్కా తెలియజేశారు. మరోవైపు ఎఫ్పీఐలు కొనుగోళ్లకు ఆసక్తి చూపుతుండటం సానుకూల అంశమని జియోజిత్ ఇన్వెస్ట్మెంట్స్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజిస్ట్ వీకే విజయకుమార్ పేర్కొన్నారు. సానుకూలం2024 అక్టోబర్ మొదలు దేశీ స్టాక్స్లో పెట్టుబడుల ఉపసంహరణకే పెద్దపీట వేస్తున్న విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) ఇటీవల కొనుగోళ్ల యూటర్న్ తీసుకోవడం గమనార్హం! దీంతో గత 7 ట్రేడింగ్ రోజుల్లో ఎఫ్పీఐలు నగదు విభాగంలో నికరంగా రూ. 27649 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. గత వారం రూ. 17,425 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేశారు. ఫలితంగా భారత్, పాక్ ఉద్రిక్తతల నడుమ చివరి రెండు రోజుల్లో మార్కెట్లు నీరసించినప్పటికీ నికరంగా గత వారం లాభపడ్డాయి. బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ 659 పాయింట్లు(0.84 శాతం) పుంజుకుని 79,213 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 188 పాయింట్లు(0.8 శాతం) ఎగసి 24,039 వద్ద స్థిరపడింది. అయితే బీఎస్ఈ మిడ్క్యాప్ మరింత అధికంగా 1.3 శాతం బలపడగా, స్మాల్క్యాప్ 0.12 శాతమే లాభపడింది.ఐఐపీవైపు చూపుమార్చి నెలకు పారిశ్రామికోత్పత్తి(ఐఐపీ) గణాంకాలు నేడు విడుదలకానున్నాయి. ఫిబ్రవరిలో ఐఐపీ వృద్ధి గత 6 నెలల్లోనే కనిష్టంగా 2.9 శాతానికి పరిమితమైంది. జనవరిలో నమోదైన 5.2 శాతంతో పోలిస్తే భారీగా క్షీణించింది. ఇక ఏప్రిల్ నెలకు హెచ్ఎస్బీసీ ఇండియా తయారీ పీఎంఐ వారాంతాన(మే 2న) విడుదలకానుంది. అంతర్జాతీయ అంశాల విషయానికివస్తే మార్చి నెలకు 29న యూఎస్ ఉపాధి గణాంకాలు వెల్లడికానున్నాయి. ఏప్రిల్కు చైనా తయారీ పీఎంఐ గణాంకాలు, ఏప్రిల్కు యూఎస్ పీసీఈ ధరల ఇండెక్స్ 30న వెలువడనున్నాయి. మే 1న బ్యాంక్ ఆఫ్ జపాన్ వడ్డీ రేట్ల నిర్ణయాలు, రిటైల్ ధరలు ప్రకటితంకానున్నాయి. ఈ బాటలో యూఎస్ తయారీ పీఎంఐ, వ్యవసాయేతర ఉపాధి, నిరుద్యోగిత గణాంకాలు 2న వెల్లడికానున్నాయి. -
భారత్ దెబ్బ అదుర్స్.. పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఎమర్జెన్సీ!
దాయాది దేశం పాకిస్తాన్కు భారత్ ‘జీలం ఝలక్’ ఇచ్చింది. మున్ముందు సినిమా ఎలా ఉంటుందో తెలిపేలా ఓ ట్రైలర్ చూపించింది. పాకిస్థాన్ అధికార వర్గాలకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా భారత్ శనివారం హఠాత్తుగా జీలం నదిలోకి నీటిని విడుదల చేసింది. దీంతో పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే) రాజధాని ముజఫరాబాద్ వద్ద ఒక్కసారిగా నదిలో నీటి మట్టం పెరిగి వరద పోటెత్తింది.నది పొంగి పొర్లుతుండటంతో హతియన్ బాలా వద్ద ‘నీటి అత్యయిక పరిస్థితి’ (ఎమర్జెన్సీ) ప్రకటించారు. హతియన్ బాలా ప్రాంతం ముజాఫరాబాద్ నగరానికి 40 కిలోమీటర్ల దూరంలో జీలం ఒడ్డున ఉంటుంది. నీటిమట్టం ప్రమాదకర స్థాయిలో ఉందంటూ స్థానిక మసీదుల్లోని మైకుల ద్వారా ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. ఘరీ దుపట్టా, మజ్హాయ్ వంటి జీలం నది ఒడ్డు ప్రాంతాల గ్రామాల్లో నివసించే ప్రజలు అకస్మాత్తుగా నీటిమట్టం పెరగడంతో భీతి చెందారు. Flood alert in PoK's Muzaffarabad as Jhelum River water levels surge. Locals allege India released water w/o informing Pak. auth. Sharp rise in water from Chakothi to Muzaffarabad sparks flood fears. Pak. claims India's move aims to suspend IWT post-Pahalgam attack. #Pakistan pic.twitter.com/Y9v4HwJQUD— Epic Pravin (@EpicPravin) April 27, 2025మన కశ్మీర్లోని అనంతనాగ్ జిల్లా నుంచి పాక్ ఆక్రమిత కశ్మీర్లోని చకోతీ ప్రాంతం గుండా ప్రవహిస్తూ నీటిమట్టం ఒక్కసారిగా పెరిగింది. 20 నుంచి 30 అడుగుల ఎత్తున నీళ్లు ప్రవహిస్తున్నాయని,1990 దశకం తర్వాత ఈ స్థాయిలో వరద రావడం ఇదే మొదటిసారని స్థానికులు చెబుతున్నారు. కాగా, భారత్ చర్య అంతర్జాతీయ నిబంధనలను, జల ఒప్పందాలను పూర్తిగా ఉల్లంఘించడమేనని పాక్ ఆరోపించింది. ఈ ఘటనపై భారత్ వైపు నుంచి ఎలాంటి స్పందనా లేకపోవడం విశేషం!. దీనివల్ల రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం ఉందని పలువురు భావిస్తున్నారు.Major Flooding in Jhelum: #Pakistan Declares EmergencyAfter stopping the water, now India releases excess water in the Jhelum River, allegedly without warning.Muzafrabad in Pok flooded.This is just a glimpse!#PakistanBehindPahalgam pic.twitter.com/QdIjf1v2oj— India Strikes YT 🇮🇳 (@IndiaStrikes_) April 26, 2025అయితే కరువు... లేకపోతే వరద!పహల్గాంలో ఉగ్రవాదుల దాడి తర్వాత సింధు జలాల ఒప్పందం అమలును భారత్ నిలిపివేసిన సంగతి తెలిసిందే. సీమాంతర ఉగ్రవాదానికి పాక్ మద్దతు విడనాడే వరకు ఒప్పందం అమలు సస్పెన్షన్లో ఉంటుందని భారత ప్రభుత్వం ప్రకటించింది. ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంతో 1960లో భారత్, పాక్ నడుమ సింధు నదీ జలాల ఒప్పందం కుదిరింది. పాకిస్థాన్లో 90% సేద్యం సింధు జలాలపై ఆధారపడుతుంది. హైడ్రలాజికల్ డేటాను ఎప్పటికప్పుడు సరైన సమయంలో పాకిస్తాన్కు అందజేయాలనేది ఈ ఒప్పందంలో మన దేశం నెరవేర్చాల్సిన ఓ కీలక బాధ్యత. వరద హెచ్చరికలను ముందుగానే తెలియజేయడం, నీటి వినియోగ వివరాలు, హిమనీనదాలు (గ్లేసియర్స్) కరిగే తీరుతెన్నుల సమాచారాన్ని పొరుగుదేశంతో పంచుకోవడం భారత్ విధి. ఒప్పందం అమలును భారత్ తాజాగా నిలిపివేయడంతో ఇప్పుడిక ఈ బాధ్యతలకు బ్రేక్ పడింది. సింధు నది, దాని ఉపనదుల్లో ఏయే సమయాల్లో ఏమేరకు నీటి నిల్వలున్నాయనే సమాచారాన్ని భారత్ ఇవ్వకపోతే పాక్ పరిస్థితి... నీరు లేక నేల ఎండిపోయి... ‘పడితే కరువు బారిన పడటం లేదంటే వరద ముంచెత్తడం’ అన్నట్టు తయారవుతుంది. Floods in Muzaffarabad, POK today after India released waterpic.twitter.com/vF4ClKxVgW— Ghar Ke Kalesh (@gharkekalesh) April 26, 2025ఇక, సింధు నది జలాల ఒప్పందాన్ని భారత్ ఇప్పటికే రద్దు చేసింది. దీనిపై పాక్ ప్రభుత్వం తీవ్రంగా స్పందిస్తోంది. నదీ జలాలను మళ్లించినా, అడ్డుకున్నా దీనిని ‘యుద్ధ చర్య’గా భావిస్తామని చెప్పింది. ఈ నేపథ్యంలోనే జీలం నదిలో వరదలు రావడం గమనార్హం. ఈ నేపథ్యంలో ముజఫరాబాద్లోని రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ (SDMA) ఆపరేషన్స్ డైరెక్టర్ ముజఫర్ రాజా స్పందిస్తూ.. భారత ఆక్రమిత కాశ్మీర్లోని ఒక ఆనకట్ట నుండి నీటిని విడుదల చేసినట్లు ధృవీకరించారు. విద్యుత్ ప్రాజెక్టు ఆనకట్ట యొక్క స్పిల్వేలు తెరవబడ్డాయి, ఫలితంగా ఒక మోస్తరు వరద పరిస్థితి ఏర్పడింది అని ఆయన అన్నారు, స్థానిక నివాసితులు తమ భద్రత కోసం నదికి దూరంగా ఉండాలని కోరారు.-జమ్ముల శ్రీకాంత్.BREAKING🇮🇳🇵🇰 Local sources report that flooding in the Jhelum River, located in northern India and eastern Pakistan, occurred after India released water without prior notification. pic.twitter.com/vD4VPlsyr5— The Global Beacon (@globalbeaconn) April 26, 2025 -
అటారీ–వాఘా సరిహద్దు మూసివేత..
రాజస్తాన్: జమ్మూకశ్మీర్లో ఉగ్రదాడి..భారత్, పాకిస్తాన్ల మధ్య రాజుకున్న ఉద్రిక్తతలు.. సరిహద్దుల మూసివేత సామాన్యులకు ఎన్నో అవ స్థలు తెచ్చిపెట్టాయి. రాజస్తాన్లోని బర్మేర్కు చెందిన షైతాన్ సింగ్ అనే యువకుడికి పాకిస్తాన్లోని సింధు ప్రావిన్స్కు చెందిన కేసర్ కన్వర్తో నాలుగేళ్ల క్రితమే పెళ్లి నిశ్చయమైంది. వరుడికి, అతడి కుటుంబీలకు వీసా దొరక్క పెళ్లి ఇప్పటిదాకా జరగలేదు. ఫిబ్రవరి 28న వీసాలు మంజూరయ్యాయి. ఈ నెల 30వ తేదీన సింధ్ ప్రావిన్స్లోని అమర్కోట్లో వధువు ఇంట్లో వివాహ వేడుక జరగాల్సి ఉంది. ఇందుకోసం సరిహద్దులకు రెండువైపులా ఉన్న కుటుంబాలు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. ఇంతలోనే చోటుచేసుకున్న అనూహ్య పరిణామాలతో బుధవారం అట్టారీ–వాఘా సరిహద్దును అధికారులు మూసివేశారు. విషయం తెలియని షైతాన్ సింగ్ కుటుంబం ఊరేగింపుగా అటారీ–వాఘా బోర్డర్ పాయింట్కు చేరుకుంది. అక్కడ ఆర్మీ అధికారులు అసలు విషయం చెప్పడంతో అంతా షాకయ్యారు. ‘ఎప్పటి నుంచో ఈ రోజు కోసం ఎదురుచూస్తున్నాం. కానీ, ఇలా జరిగింది’అంటూ షైతాన్ సింగ్ ఆవేదన చెందారు. ‘మమ్మల్ని ఆహ్వానించేందుకు బోర్డర్ పోస్ట్ వద్దకు చేరుకున్న మా బంధువులు చేసేది లేక తిరిగి వెళ్లిపోయారు’అని అతడి సోదరుడు చెప్పారు. ఉగ్రదాడుల కారణంగా తమ బంధుత్వాలు కూడా దెబ్బతింటున్నాయని అతడు పేర్కొన్నాడు. అయితే, ఈ కుటుంబానికి మరో చిన్న ఆశ మిగులుంది. అదేంటంటే, వీరి వీసాల గడువు మే 12వ తేదీ వరకు ఉండటం. అప్పటికల్లా తిరిగి సరిహద్దులు తెరుచుకుంటాయని, పెళ్లి జరుగుతుందని ఆశతో వీరున్నారు. కాగా, భారత, పాకిస్తాన్ సరిహద్దులకు సమీప ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో ఉంటున్న సోధా రాజ్పుట్ వర్గం ప్రజల మధ్య వివాహ సంబంధాలు దశాబ్దాలుగా కొనసాగుతున్నాయి. -
జోక్ కాదు.. పాక్ క్రికెట్తో సంబంధాలన్నీ తెంచుకోండి: గంగూలీ
పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ (Sourav Ganguly) కీలక వ్యాఖ్యలు చేశాడు. పాకిస్తాన్ క్రికెట్తో సంబంధాలన్నీ తెంచుకోవాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI)కి సూచించాడు. కాగా జమ్మూకశ్మీర్లోని పహల్గామ్లో ఉగ్రవాదులు మంగళవారం పాశవిక దాడికి తెగబడిన విషయం తెలిసిందే.ప్రశాంతమైన బైసరన్ లోయలో 26 మంది పర్యాటకులను లష్కర్-ఎ-తొయిబా ఉగ్రవాదులు కాల్చి చంపారు. ఈ క్రమంలో భారత్- పాక్ మధ్య మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇదిలా ఉంటే.. 2008 తర్వాత టీమిండియా ఒక్కసారి కూడా పాకిస్తాన్ పర్యటనకు వెళ్లలేదన్న విషయం తెలిసిందే. ఆ తర్వాత పాక్ 2013లో భారత పర్యటనకు వచ్చింది.అనంతరం దాయాది దేశాల పరిస్థితుల్లో ఎలాంటి మార్పులు లేకపోవడంతో ఇరుజట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్లు నిలిచిపోయాయి. అయితే, ఐసీసీ ఈవెంట్లు, ఆసియా కప్ టోర్నీల్లో మాత్రం భారత్- పాక్ (Ind vs Pak) ముఖాముఖి తలపడుతున్నాయి. కానీ తాజాగా పహల్గామ్ ఘటన నేపథ్యంలో సంబంధాలు పూర్తిగా తెగిపోయే పరిస్థితి వచ్చింది.సంబంధాలు తెంచుకోవాలిఈ నేపథ్యంలో బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ మాట్లాడుతూ.. ‘‘అవును.. వందకు వంద శాతం పాకిస్తాన్తో అన్ని సంబంధాలు తెంచుకోవాలి. కఠిన చర్యలు చేపట్టాలి. ప్రతి ఏడాది ఇలాంటి ఘటనలు జరగడాన్ని తేలికగా తీసుకోవద్దు. ఇదేమీ జోక్ కాదు. ఉగ్రవాదాన్ని సహించకూడదు. టెర్రరిజంను తుడిచిపెట్టేయాలి’’ అని పేర్కొన్నాడు.ఇక బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా ఇప్పటికే పాక్తో భవిష్యత్తులోనూ ద్వైపాక్షిక సిరీస్లు ఉండబోవని స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఐసీసీ నిబంధనలకు అనుగుణంగా ప్రస్తుతం దాయాదితో ఆడుతున్నామని.. అయితే, పరిస్థితులన్నింటినీ ఐసీసీ కూడా గమనిస్తోందని తెలిపారు. భారత ప్రభుత్వం చెప్పినట్లే తాము నడుచుకుంటామని స్పష్టం చేశారు.ముక్తకంఠంతో ఖండించిన క్రీడా లోకంకాగా పహల్గామ్ ఉగ్రదాడి ఘటనను భారత క్రీడా లోకం ముక్తకంఠంతో ఖండించిన విషయం తెలిసిందే. ‘‘బాధిత కుటుంబాలు ఊహించలేని కష్టాలు ఎదుర్కొంటున్నాయి. ఈ కష్టకాలంలో భారత్తో పాటు యావత్ ప్రపంచం వారికి అండగా నిలుస్తోంది. ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి ప్రగాఢ సంతాపం తేలియజేస్తున్నా. న్యాయం జరగాలని ప్రార్థిస్తున్నా’’ అని టీమిండియా దిగ్గజం సచిన్ టెండూల్కర్ అన్నాడు.ఇక విరాట్ కోహ్లి సైతం.. ‘‘ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు శాంతి, బలం చేకూరాలని ప్రార్థిస్తున్నా. బాధిత కుటుంబాలకు సానుభూతి తెలుపుతున్నా. ఇలాంటి క్రూరమైన చర్యకు న్యాయం జరగాలని కోరుకుంటున్నా’’ అని పేర్కొన్నాడు.మరోవైపు.. ‘‘అమాయకులైన పర్యాటకులపై దాడి హేయమైన చర్య. దీనికి రాబోయే కాలంలో మన ధైర్యవంతమైన సైనికులు గట్టి బదులిస్తారు. జమ్మూకశ్మీర్లో శాంతికి భంగం కలగించాలనుకునే వారి ప్రణాళికలు ఎప్పటికీ విజయవంతం కావు’’ అని బాక్సర్ విజేందర్ సింగ్ తన స్పందన తెలియజేశాడు.భారత బ్యాడ్మింటన్ స్టార్ పూసర్ల వెంకట సింధు స్పందిస్తూ.. ‘‘పహల్గామ్ ఉగ్ర దాడి బాధితుల కోసం నా హృదయం తపిస్తోంది. ఎలాంటి కారణమైనా.. ఇంత క్రూరత్వాన్ని సమర్థించదు. బాధితుల దుఖం మాటల్లో చెప్పలేనిది. కానీ వారు ఒంటరి వారు కాదు. వారి వెంట యావత్ దేశం ఉంది. క్లిష్ట సమయంలో ఒకరికొకరు అండగా నిలుద్దాం. శాంతి పునరుద్ధరణ తప్పక జరుగుతుంది’’ అని పేర్కొంది.చదవండి: PSL 2025 Live Suspended: పాకిస్తాన్కు భారీ షాక్!.. అసలే అంతంత మాత్రం.. ఇప్పుడు ఇక.. -
బాధాతప్త హృదయాలతో వీడ్కోలు.. పాక్ సరిహద్దులో భావోద్వేగ దృశ్యాలు
న్యూఢిల్లీ: పహల్గాం దాడికి పాల్పడింది ఉగ్రవాదులు. ఆ దాడికి మాకు ఏంసంబంధం అండి? ప్రాణాలు రక్షించుకునేందుకు చికిత్స కోసం వచ్చిన మేం. పాక్ వైపు తరలి పోతున్నాం. ఇంతకాలం మాకు స్థానికులు ఇచ్చే అతిథ్యం మా జీవితాల్లో మరిచిపోలేం. కానీ, గత రెండు రోజులుగా వాళ్లు మాతో సరిగ్గా వ్యవరించడంలేదు’’ అని కొందరు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ‘‘ దాడికి పాల్పడింది ఉగ్రవాదులు. శిక్షించాల్సింది వాళ్లనే. కానీ, ఏం తప్పు చేయని మమ్మల్ని ఎందుకు శిక్షిచడం? అని పాక్ పౌరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాక్లో పుట్టడమే మేం చేసిన నేరమా? అంటూ పలువురు భావోద్వేగంగా మాట్లాడుతున్నారు. దౌత్యపరమైన చర్చల ద్వారా శాంతి చర్చలకు ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నారు. పాక్ నుంచి ప్రతీ నెలా వందల మంది చికిత్స కోసం భారత్కు ప్రత్యేక వీసా మీద వస్తుంటారు. ఇందులో వివిధ రకాల జబ్బులు, అనారోగ్య కారణాలతో వచ్చేవాళ్లే ఎక్కువ. మరీ ముఖ్యంగా పసిపిల్లల చికిత్స కోసం భారత్ ఎక్కువ వీసాలు మంజూరు చేస్తుంటుంది.ఇప్పటికే పాక్ పౌరులు భారత్ను విడిచిపెట్టిపోవాలని భారత ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో అన్ని రాష్ట్రాల సీఎంకు ఫోన్లో మాట్లాడిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా, వీలైనంత త్వరగా వాళ్లను గుర్తించి వెనక్కి పంపించేయాలని ఆదేశించారు.ఇదిలా ఉంటే.. పాక్ భారత్ల మధ్య ఉద్రికత్తలను తగ్గించడానికి.. దౌత్యానికి తాము సిద్ధమంటూ ఇరాన్ ప్రకటించింది. అదే సమయంలో.. ఐక్యరాజ్య సమితి కూడా సమయమనం పాటించాలని ఇరు దేశాలకు పిలుపు ఇచ్చింది. -
ముష్కరుల వేటలో భారత్కు సహకరిస్తాం
వాషింగ్టన్: జమ్మూకశ్మీర్లోని పహల్గాంలో 26 మంది హిందువులను పొట్టనబెట్టుకున్న ముష్కరుల వేటలో భారత్కు తమ దేశం పూర్తిగా సహకరిస్తుందని అమెరికా నేషనల్ ఇంటెలిజెన్స్ చీఫ్ తులసీ గబ్బార్డ్ స్పష్టం చేశారు. దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ఆమె శుక్రవారం ‘ఎక్స్’ వేదికగా సానుభూతి ప్రకటించారు. దాడికి కారకులైన ఉగ్రవాదులను పట్టుకునేందుకు భారత్కు సాయంగా నిలుస్తామని అమెరికా విదేశాంగ శాఖ ఇప్పటికే ప్రకటించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుధ వారం ప్రధాని మోదీకి ఫోన్ చేశారు. దారు ణాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. -
ఇద్దరు ఆదిల్ల కథ
శ్రీనగర్: ఇద్దరూ కశ్మీరీలే. ఇద్దరి పేరూ ఒకటే. కానీ ఒక ఆదిల్ మతోన్మాదంతో పాక్ ముష్కర ముఠాలో భాగమై స్వదేశీయులపైనే కాల్పులకు తెగబడ్డాడు. కశ్మీర్ ప్రతిష్టకే మాయని మచ్చలా మిగిలాడు. మరో ఆదిల్ ఆ తూటాలకు ధైర్యంగా ఎదురొడ్డి నిలిచాడు. పర్యాటకులను కాపాడే ప్రయత్నంలో ప్రాణాలర్పించాడు. మొదటివాడు పహల్గాంలో పర్యాటకులపై దాడికి తెగబడ్డ ఏడుగురు లష్కరే తొయిబా ఉగ్రవాదుల్లో ఒకడైన ఆదిల్ హుసేన్ ఠోకర్ అలియాస్ ఆదిల్ గురీ. వారిని ప్రతిఘటించిన సయీద్ ఆదిల్ హుసేన్ షా స్థానిక పోనీవాలా. కశ్మీర్ (Kashmir) పర్యాటకానికి చెడ్డపేరు రాకుండా అడ్డుకునేందుకు చివరిదాకా పోరాడిన అతని ధైర్యసాహసాలను దేశమంతా ముక్త కంఠంతో ప్రశంసిస్తోంది.టీనేజీలోనే... 20 ఏళ్లు దాటిన ఆదిల్ ఠోకర్ స్వగ్రామం దక్షిణ కశ్మీర్లోని బిజ్బెహరా ప్రాంతంలోని గురీ. టీనేజర్గా ఉండగానే 2018లో పాక్ బాట పట్టాడు. అధికారిక పత్రాలతోనే వెళ్లినా కొద్ది రోజులకే పాక్లోనే ‘మాయమైపోయాడు’. పాక్కు చెందిన నిషేధిత లష్కరే తొయిబా ఉగ్ర సంస్థలో చేరినట్టు నిఘా వర్గాలు గుర్తించాయి. తోటి ముష్కరులతో కలిసి 2024లో నియంత్రణ రేఖ గుండా భారత్లోకి చొరబడ్డట్టు నిర్ధారించుకున్నాయి. అప్పటినుంచీ జమ్మూలోని దోడా, కిష్త్వార్ తదితర ప్రాంతాల్లో ఆదిల్ ఠోకర్ మారణహోమం సృష్టిస్తున్నాడు. లోయలో ఏడాదిన్నరగా జరిగిన పలు ఉగ్ర ఘటనల్లో కూడా అతని హస్తమున్నట్టు తేలింది. పహల్గాం దాడిలో పాల్గొన్న ఏడుగురిలో ఐదుగురు పాకిస్తానీలు కాగా ఇద్దరు కశ్మీరీ ఉగ్రవాదులు. ఠోకర్ వారిలో ఒకడని దాడిలో చనిపోయిన ఓ వ్యక్తి భార్య నిర్ధారించింది. పోలీసులు తమకు చూపిన ఫొటోల ద్వారా అతన్ని గుర్తు పట్టింది. ‘‘నా భర్త తలను తూటాలతో ఛిద్రం చేసింది ఇతనే. దాడి తర్వాత తోటి ఉగ్రవాదులతో కలిసి అడవిలోకి మాయమయ్యాడు’’ అని వివరించింది. దేశమంతా జేజేలు గుర్రాలను నడుపుకునే 30 ఏళ్ల ఆదిల్ హుసేన్ షాది పహల్గాం (Pahalgam). కర్కశ దాడికి వేదికైన బైసారన్ మైదానాల్లోకి రోజూ గుర్రాలపై పర్యాటకులను చేరవేస్తుంటాడు. దాడి వేళ తోటి స్థానికుల్లా తనకెందుకు లెమ్మని అనుకోలేదు. ముష్కరులు కేవలం హిందువులనే లక్ష్యం చేసుకుంటున్నా, తనకు ఎలాంటి ప్రమాదమూ లేదని తెలిసినా ఊరుకోలేదు. తనవంటివారికి జీవనాధారమైన పర్యాటకులను కాపాడేందుకు చివరిదాకా ప్రయత్నించాడు.చదవండి: ఆ క్షణంలోనే చనిపోయేవాడిని.. అందుకే బతికివున్నా..ఒక ఉగ్రవాది నుంచి తుపాకీ లాక్కోబోయాడు. ఆ ప్రయత్నంలో కాల్పులకు బలయ్యాడు. మూడు తూటాలు ఆదిల్ ఛాతీని ఛిద్రం చేశాయి. తన పిల్లలందరిలోనూ ఆదిలే అత్యంత దయా స్వభావి అంటూ తండ్రి సయీద్ హైదర్ షా కన్నీటి పర్యమంతమయ్యాడు. ఆదిల్ అంత్యక్రియలకు జనం భారీగా పోటెత్తారు. జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా (Omar Abdullah) కూడా పాల్గొని ఘనంగా నివాళులర్పించారు. -
పాక్ ఆటగాడికి ఆహ్వానం.. నీరజ్ చోప్రాపై ట్రోలింగ్!.. మా అమ్మ ఏం చేసింది?
పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో తనపై వస్తున్న విమర్శలపై భారత స్టార్ జావెలిన్ త్రోయర్, ఒలింపిక్ పసిడి పతక విజేత నీరజ్ చోప్రా (Neeraj Chopra) స్పందించాడు. తనకు తన దేశం, దేశ ప్రయోజనాలే ప్రథమ ప్రాధాన్యమని స్పష్టం చేశాడు. ఓ అథ్లెట్గా మరో అథ్లెట్ను తన పేరిట జరిగే ఈవెంట్కు రమ్మన్నానే తప్ప.. మరో ఉద్దేశం లేదని పేర్కొన్నాడు.నో చెప్పిన అర్షద్అసలేం జరిగిందంటే.. కాగా మే నెల (24)లో బెంగళూరులోని శ్రీ కంఠీరవ స్టేడియంలో ‘నీరజ్ చోప్రా క్లాసిక్ జావెలిన్ ఈవెంట్’ జరుగనుంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ స్టార్ ఆటగాడు, ప్యారిస్ ఒలింపిక్స్లో స్వర్ణం నెగ్గిన అర్షద్ నదీమ్ (Arshad Nadeem)ను ఈ టోర్నీలో పాల్గొనాల్సిందిగా నీరజ్ చోప్రా ఆహ్వానించాడు.అయితే, తాను ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్షిప్నకు సన్నద్ధమయ్యే క్రమంలో ఈ ఈవెంట్కు రాలేకపోతున్నానని అర్షద్ తెలిపాడు. ఇదిలా ఉంటే.. పహల్గామ్లో మంగళవారం పర్యాటకులపై ఉగ్రదాడి జరగగా.. భారత క్రీడా లోకం ముక్తకంఠంతో ఈ పాశవిక చర్యను ఖండించిన విషయం తెలిసిందే.‘‘జమ్మూకశ్మీర్లో జరిగిన ఉగ్రదాడితో హృదయం విదారకంగా మారింది. బాధితులు, వారి కుటుంబాల కోసం ప్రార్థిస్తున్నా’’ అని నీరజ్ చోప్రా ట్వీట్ చేశాడు. అయితే, కొంతమంది నెటిజన్లు అతడిని ట్రోల్ చేశారు. ముఖ్యంగా పాక్కు చెందిన అర్షద్ నదీమ్ను ఈవెంట్కు ఆహ్వానించడాన్ని తప్పుబడుతూ ద్రోహి అంటూ నీరజ్ను నిందించారు. విద్వేష విషం చిమ్ముతున్నారుఈ నేపథ్యంలో నీరజ్ చోప్రా స్పందిస్తూ.. ‘‘సాధారణంగా నేను చాలా తక్కువగా మాట్లాడతాను. అయితే, నాకు తప్పుగా అనిపించిన విషయాలకు వ్యతిరేకంగా మాట్లాడటంలో మాత్రం వెనుకడుగు వేయను. ముఖ్యంగా దేశం పట్ల నా ప్రేమపై సందేహాలు, నా కుటుంబ గౌరవమర్యాదలకు భంగం వాటిల్లే పరిస్థితే వస్తే అస్సలు రాజీపడను.అర్షద్ నదీమ్ను ఈవెంట్కు ఆహ్వానించడం గురించి పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. విద్వేష విషం చిమ్ముతున్నారు. అసభ్యంగా తిడుతున్నారు. మా కుటుంబాన్ని కూడా వదలడం లేదు.ఓ అథ్లెట్గా మరో అథ్లెట్ అయిన అర్షద్కు నేను ఆహ్వానం పంపాను. అంతేగానీ అందులో వేరే ఉద్దేశాలు ఏమీ లేవు. నీరజ్ చోప్రా క్లాసిక్ ఈవెంట్లో భాగంగా అత్యుత్తమ అథ్లెట్లను దేశానికి రప్పించి.. ప్రత్యేక గుర్తింపు తీసుకురావాలన్న ఉద్దేశంతో మాత్రమే ఇలా చేశాం.ఇందుకు సంబంధించి సోమవారమే అంటే.. పహల్గామ్ ఘటన కంటే ముందే సదరు అథ్లెట్లకు ఆహ్వానాలు చేరిపోయాయి. ఆ తర్వాత 48 గంటలకు ఘటన జరిగింది. నా వరకు నా దేశం, నా దేశ ప్రయోజనాలే అత్యంత ముఖ్యం. అన్నింటికంటే వాటికే నా మొదటి ప్రాధాన్యం ఉంటుంది.మా అమ్మ తప్పేముంది?బాధితులు, వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. దేశం మొత్తం వారికి అండగా ఉంటుంది. జరిగిన ఘటనతో నా మనసు ఎంతో బాధపడింది. అంతకంటే ఎక్కువ ఆగ్రహాన్నీ తెప్పించింది. మన దేశం ఇందుకు తగిన సమాధానం చెప్పి.. బాధితులకు న్యాయం చేస్తుందని విశ్వసిస్తున్నా.ఓ క్రీడాకారుడిగా చాలా ఏళ్లుగా దేశానికి ప్రాతినిథ్యం వహిస్తున్నా. అందుకు ఎంతో గర్విస్తున్నా కూడా. కానీ దేశం పట్ల నా ప్రేమను సందేహిస్తూ ఇలాంటి కామెంట్లు రావడం మనసును బాధించింది.నన్ను, నా కుటుంబానికి టార్గెట్ చేస్తున్నవాళ్లు.. మాది ఓ సాధారణ కుటుంబం అనే విషయం అర్థం చేసుకోవాలి. నా మీద మీడియాలో కూడా కొన్ని అసత్య ప్రచారాలు జరుగుతున్నాయి. నేను స్పందించననే భ్రమలో ఉన్నారేమో.మీరు చేసే అబద్ధపు ప్రచారాలు ఎన్నటికీ నిజం కావు. మా అమ్మను ఎందుకు వివాదంలోకి లాగుతున్నారో అర్థం కావడం లేదు. దాదాపు ఏడాది క్రితం తను ఓ తల్లిగా స్పందిస్తూ అమాయకంగా, స్వచ్ఛమైన మనసుతో మాట్లాడిన మాటలను కూడా వక్రీకరిస్తున్నారు.ఆరోజు మా అమ్మను ఎంతో మంది ప్రశంసించారు. మరి ఈరోజు అదే మనుషులు ఎందుకు ఇలా తనను కించపరిచేలా మాట్లాడుతున్నారు. నేను మరింత కఠినంగా శ్రమించి దేశానికి మరింత గొప్ప పేరు తెచ్చేందుకు ఎల్లవేళలా కృషి చేస్తా. జై హింద్ ’’ అంటూ సుదీర్ఘ నోట్ షేర్ చేశాడు. దేశం పట్ల తన ప్రేమను శంకించేవారికి ఇలా గట్టిగానే కౌంటర్ ఇచ్చాడు.కాగా టోక్యో ఒలింపిక్స్లో స్వర్ణం గెలిచిన నీరజ్.. ప్యారిస్లో రజతంతో సరిపెట్టుకున్నాడు. ఇక ప్యారిస్లో అర్షద్ రికార్డు స్థాయిలో 2.97 మీటర్ల దూరం విసిరి పసిడి పతకం అందుకున్నాడు. కాగా నీరజ్- అర్షద్ టోక్యో, ప్యారిస్ విశ్వక్రీడల సమయంలో కలిసి ఫొటోలు దిగుతూ.. క్రీడాస్ఫూర్తికి నిదర్శనంగా నిలిచారు.ఇక ప్యారిస్లో నీరజ్ తృటిలో స్వర్ణం చేజార్చుకున్నా.. అర్షద్ గెలవడం కూడా తమకు సంతోషాన్నిచ్చిందని నీరజ్ తల్లి పేర్కొన్నారు. అర్షద్ కూడా తన కుమారుడి లాంటి వాడేనని.. అతడిని దేవుడు చల్లగా చూడాలని ఆకాంక్షించారు. అయితే, తాజా ఘటనల నేపథ్యంలో నీరజ్తో పాటు అతడి తల్లిని కొంతమంది దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.చదవండి: కోటీశ్వరుడినయ్యా.. నేను స్టార్ అనుకుంటే వచ్చే ఏడాది కనిపించడు: సెహ్వాగ్ -
పాకిస్తాన్ ఉప ప్రధాని వ్యాఖ్యలు.. మండిపడ్డ పాక్ మాజీ క్రికెటర్
పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్ ఉప ప్రధాని ఇషాక్ దార్ చేసిన వ్యాఖ్యలపై ఆ దేశ క్రికెటర్ డానిష్ కనేరియా (Danish Kaneria) స్పందించాడు. ఇషాక్ మాటలను బట్టి తాము ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్నట్లు పాక్ అంగీకరించినట్లు స్పష్టమైందన్నాడు. కాగా జమ్మూకశ్మీర్లోని పహల్గామ్లో ఉగ్రవాదులు మంగళవారం పాశవిక చర్యకు పాల్పడిన విషయం తెలిసిందే.బైసరన్ లోయలో పర్యాటకులపై కాల్పులు జరిపిన తీవ్రవాదులు.. 26 మంది ప్రాణాలు తీశారు. ఈ ఘటన నేపథ్యంలో ప్రపంచ దేశాలు ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తూ భారత్కు సంఘీభావం ప్రకటించాయి. పాకిస్తాన్ కూడా పహల్గామ్ దాడిని ఖండించింది.స్వాతంత్ర్య సమరయోధులా?అయితే, పాక్ ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ (Ishaq Dar) మాత్రం అనుచిత వ్యాఖ్యలు చేశాడు. ఇస్లామాబాద్లో మీడియాతో మాట్లాడుతూ.. జమ్మూ కశ్మీర్లోని పహల్గామ్లో దాడులు చేసిన ఉగ్రవాదులను స్వాతంత్ర్య సమరయోధులుగా అభివర్ణించాడు. దీంతో ఇషాక్ దార్ వ్యాఖ్యలపై భారతీయ నెటిజన్లు భగ్గుమంటున్నారు.నేరుగా ఒప్పుకోవడమేఈ క్రమంలో పాక్ మాజీ స్పిన్నర్ డానిష్ కనేరియా కూడా ఇషాక్ దార్ తీరుపై ఘాటుగా స్పందించాడు. ఎక్స్ వేదికగా అతడి వ్యాఖ్యలకు సంబంధించిన ఫొటోను షేర్ చేస్తూ.. ‘‘పాకిస్తాన్ ఉప ప్రధానే స్వయంగా ఉగ్రవాదులను స్వాతంత్ర్య సమరయోధులు అని పిలుస్తుంటే.. ఇంతకంటే ఘోరం మరొకటి ఉండదు.ఇది కేవలం సిగ్గుచేటు మాత్రమే కాదు.. తమ దేశం ఉగ్రవాదానికి దన్నుగా ఉందని నేరుగా ఒప్పుకోవడమే అవుతుంది’’ అని కనేరియా ట్వీట్ చేశాడు. కాగా పాకిస్తాన్ తరఫున అంతర్జాతీయ క్రికెట్ ఆడిన కనేరియా.. జట్టులో ఉన్నపుడు తాను ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నానని గతంలో చాలాసార్లు వెల్లడించాడు.అవమానాలు ఎదుర్కొన్నాహిందువును అయిన కారణంగా తనను సహచర క్రికెటర్లు వేరుగా చూస్తూ.. హేళన చేస్తూ ఇబ్బందులు పెట్టేవారని తెలిపాడు. పాకిస్తాన్ దిగ్గజ పేసర్ షోయబ్ అక్తర్ కూడా కనేరియా జట్టులో ఉండటం చాలామందికి నచ్చేదికాదని పేర్కొనడం గమనార్హం.ఇక అంతర్జాతీయ క్రికెట్లో 61 టెస్టులు, 18 వన్డేలు ఆడిన 44 ఏళ్ల కనేరియా.. ఆయా ఫార్మాట్లలో 261, 15 వికెట్లు తీశాడు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డుతో విభేదాల నేపథ్యంలో ప్రస్తుతం యూకేలో అతడు నివాసం ఉంటున్నట్లు సమాచారం.కాగా పహల్గామ్లో ఉగ్రదాడి జరగగానే కనేరియా స్పందించాడు. పాకిస్తాన్ హస్తం గనుక లేకపోతే.. పాక్ ప్రభుత్వం, ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఎందుకు వెంటనే ఈ దాడిని ఖండించలేదని ప్రశ్నించాడు. పాక్ ప్రభుత్వమే ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చి పెంచి పోషిస్తోందని ఆరోపించాడు.చదవండి: PSL 2025 Live Suspended: పాకిస్తాన్కు భారీ షాక్!.. అసలే అంతంత మాత్రం.. ఇప్పుడు ఇక..When the Deputy Prime Minister of Pakistan calls terrorists “freedom fighters,” it’s not just a disgrace — it’s an open admission of state-sponsored terrorism. pic.twitter.com/QlS1UDzq20— Danish Kaneria (@DanishKaneria61) April 24, 2025 -
మీరేం సాధించారు?.. మరో 78 వేల ఏళ్లైనా ఇదే పరిస్థితి: గావస్కర్ ఫైర్
పహల్గామ్ ఉగ్రదాడి ఘటన (Pahalgam Incident) నేపథ్యంలో భారత క్రికెట్ దిగ్గజం సునిల్ గావస్కర్ (Sunil Gavaskar) చేసిన వ్యాఖ్యలు వైరల్గా మారాయి. డెబ్బై ఎనిమిదేళ్లుగా ఒక్క మిల్లీ మీటర్ భూమి కూడా చేతులు మారలేదని.. మరో 78 వేల ఏళ్లు గడిచినా పరిస్థితి ఇలాగే ఉంటుందని ఆయన అన్నారు. మరి అలాంటప్పుడు శాంతియుత జీవనం గడపకుండా.. అమాయకుల ప్రాణాలు తీస్తే వచ్చే లాభమేమిటంటూ తీవ్రవాదులకు చురకలు అంటించారు.బైసరన్ లోయలోఉగ్రవాదులు, వారికి మద్దతుగా నిలిచే వారు ఇకనైనా వాస్తవాన్ని గుర్తించి.. ఇలాంటి పిరికిపంద చర్యలను చాలించాలని గావస్కర్ సూచించారు. కాగా జమ్మూ కశ్మీర్లోని పహల్గామ్లో పర్యాటకులపై మంగళవారం ఉగ్రదాడి జరిగిన విషయం విదితమే. జమ్మూకశ్మీర్లో ‘మినీ స్విట్జర్లాండ్’గా పేరుగాంచిన బైసరన్ లోయలో ఉగ్రవాదులు జరిపిన భీకర దాడిలో 26 మంది మృతి చెందారు. బాధితులకు అండగాఈ నేపథ్యంలో తీవ్రవాదుల చర్యను క్రీడాలోకం ముక్తకంఠంతో ఖండించింది. ఇలాంటి క్లిష్ట సమయంలో మనమంతా ఒక్కటిగా ఉండి... బాధితులకు అండగా నిలవాల్సిన అవసరముందని పలువురు క్రీడాకారులు అభిప్రాయపడ్డారు.క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లి, బుమ్రా, సూర్యకుమార్ యాదవ్, మహ్మద్ సిరాజ్, సురేశ్ రైనా, హర్భజన్ సింగ్, పార్థివ్ పటేల్, శుభ్మన్ గిల్, కేఎల్ రాహుల్, అనీల్ కుంబ్లే, రవిశాస్త్రి, శ్రీవత్స గోస్వామి, టీమిండియా హెడ్కోచ్ గౌతమ్ గంభీర్, స్టార్ బాక్సర్ విజేందర్ సింగ్, స్టార్ షట్లర్ పీవీ సింధు, సైనా నెహ్వాల్, జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా, షూటర్ అభినవ్ బింద్రా, బాక్సర్ నిఖత్ జరీన్, పీఆర్ శ్రీజేశ్ తదితరులు ఉగ్రవాదుల దాడిని ఖండించారు. అంతేకాదు.. పాకిస్తాన్తో క్రీడా సంబంధాలు ఎప్పటికీ పునరుద్ధరించకూడదని పలువురు ప్లేయర్లు పేర్కొన్నారు. ఇక ఈ ఘటనపై సునిల్ గావస్కర్ టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ.. ‘‘ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన బాధితులు, వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. భారతీయులందరిపై దీని ప్రభావం ఉంటుంది.మరో 78 వేల ఏళ్లు గడిచినా ఇదే పరిస్థితిదుశ్చర్యలకు పాల్పడేవారిని, వారికి మద్దతునిచ్చే వారిని నేను ఒకే ఒక్క ప్రశ్న అడగాలనుకుంటున్నా.. ఇలాంటి పనుల వల్ల మీరు ఏం సాధించారు? ఇకపై ఏం సాధిస్తారు?గత 78 ఏళ్లుగా ఒక్క మిల్లీ మీటర్ భూభాగం కూడా చేతులు మారలేదు. మరో 78 వేల ఏళ్లు గడిచినా పరిస్థితిలో ఎలాంటి మార్పూ రాదు. మరి అలాంటపుడు శాంతియుతంగా జీవిస్తూ.. దేశాభివృద్ధిపైన దృష్టి పెట్టడం మంచిది కదా! దయచేసి ఇకనైనా పిరికిపంద చర్యలు మానుకుని.. బుద్ధిగా ఉండండి’’ అని ఉగ్రవాదులకు హితవు పలికారు.చదవండి: PSL: పాకిస్తాన్కు భారీ షాక్!.. అసలే అంతంత మాత్రం.. ఇప్పుడు ఇక.. -
PSL: పాకిస్తాన్కు భారీ షాక్!.. అసలే అంతంత మాత్రం.. ఇప్పుడు ఇక..
పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. అసలే అంతంత మాత్రంగా కొనసాగుతున్న పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL) ప్రసారాలు భారత్లో బంద్ అయిపోయాయి. పాక్ బోర్డుకు చెందిన పీఎస్ఎల్ టోర్నీని భారత్లో ప్రసారం చేస్తున్న ‘ఫ్యాన్ కోడ్’ మొబైల్ స్ట్రీమింగ్ సంస్థ ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకుంది. పహల్గావ్ ఘటన నేపథ్యంలో భారత్లో ఇకపై పీఎస్ఎల్ టోర్నీ ప్రసారం చేయమని ప్రకటించింది. భారతీయుల మనోభావాలను గౌరవిస్తూ పీఎస్ఎల్లో మిగిలిన మ్యాచ్లను ప్రసారం చేయరాదని నిర్ణయం తీసుకున్నట్లు ‘ఫ్యాన్ కోడ్’ వెల్లడించింది. మరోవైపు పీఎస్ఎల్ టోర్నీ కోసం పాకిస్తాన్లో ఉండి మ్యాచ్ల ప్రసారానికి సంబంధించిన వేర్వేరు సాంకేతిక విభాగాల్లో పని చేస్తున్న భారతీయులను వెనక్కి పంపాలని ఆ దేశ ప్రభుత్వం కూడా నిర్ణయించింది. భారత్కు చెందిన దాదాపు రెండు డజన్ల మంది పీఎస్ఎల్లో ఇంజినీర్లు, ప్రొడక్షన్ మేనేజర్లు, కెమెరామెన్లు, ప్లేయర్ ట్రాకింగ్ ఎక్స్పర్ట్లుగా పని చేస్తున్నారు. రెండు రోజుల్లోగా వీరంతా దేశం వీడాలని పాక్ ప్రభుత్వం ఆదేశించింది. నిషేధం కొనసాగుతుంది: బీసీసీఐమరోవైపు- టీమిండియా- పాకిస్తాన్ క్రికెట్ జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్లపై ఉన్న నిషేధం ఇక ముందు కూడా కొనసాగుతుందని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా స్పష్టం చేశారు. భవిష్యత్తులో కూడా ఇరు జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్లు ఉండవని ఆయన పునరుద్ఘాటించారు. భారత్, పాక్ మధ్య 2013లో చివరిసారిగా ద్వైపాక్షిక సిరీస్ జరిగింది. అయితే ఆ తర్వాత ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు బాగా దెబ్బ తినడంతో ఆ తర్వాత ఎలాంటి సిరీస్ను నిర్వహించలేదు. ఐసీసీ టోర్నీల్లో మాత్రం రెండు జట్లూ తలపడుతూ వస్తున్నాయి. తాజాగా కశ్మీర్లోని పహల్గాంలో పాక్ తీవ్రవాదుల చేతుల్లో 26 మంది భారత పర్యాటకులు మరణించిన నేపథ్యంలో క్రికెట్ మ్యాచ్లపై మళ్లీ చర్చ మొదలైంది. ‘పాక్తో క్రికెట్ సిరీస్ల విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి మేం పూర్తిగా కట్టుబడి ఉన్నాం. వారు చెప్పిందే మేం వింటాం. కాబట్టి ఇకపై కూడా పాక్తో ద్వైపాక్షిక సిరీస్లు ఆడే అవకాశం లేదు.ఐసీసీతో ఒప్పందాల కారణంగానే వేర్వేరు టోర్నీల్లో ఆ జట్టుతో తలపడాల్సి వస్తోంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితులపై అవగాహన ఉన్న ఐసీసీ కూడా ఈ విషయాన్ని గమనిస్తోంది. ఇకపై ఏదైనా ఐసీసీ టోర్నీ వచ్చినపుడు తగిన విధంగా స్పందిస్తాం’ అని రాజీవ్ శుక్లా వివరించారు. ఇటీవల జరిగిన చాంపియన్స్ ట్రోఫీకి పాకిస్తాన్ ఆతిథ్యం ఇచ్చినా... టీమిండియా అక్కడికి వెళ్లలేదు. తటస్థ వేదిక దుబాయ్లోని అన్ని మ్యాచ్లు ఆడింది. పాక్ను లీగ్ దశలో ఓడించడం సహా టోర్నీ చాంపియన్గా నిలిచింది. చదవండి: IPL 2025: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్గా -
భారత్, పాక్ మధ్య యుద్ధం తప్పదా?.. సంచలన నివేదిక
భారత్, పాక్.. రెండు దేశాలూ ఒకదాని గురించి మరొకటి అంచనాలు వేయడంలో పొరపాట్లు జరిగినా లేదా రెండిట్లో ఏదో ఒక దేశం అకారణంగా అతిగా స్పందించినా... సాధారణ శతృత్వం కాస్తా అణుయుద్ధానికి దారి తీయవచ్చు! 1980, 1990ల నాటి అమెరికన్ ఇంటెలిజెన్స్ నివేదికలు ఈ ఉపద్రవాన్నే సూచిస్తున్నాయి. కశ్మీర్లోని పహల్గాంలో 26 మంది పర్యాటకులను ఉగ్రవాదులు బలిగొన్న నేపథ్యంలో భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు మిన్నంటుతున్నాయి. ఇదే తరుణంలో విడుదలైన అమెరికన్ ఇంటెలిజెన్స్ రహస్య నివేదికలు మరిత ఆందోళన రేకెత్తిస్తున్నాయి. డీక్లాసిఫై అయిన ఇంటెలిజెన్స్ నివేదికల పత్రాలను అమెరికాలోని నేషనల్ సెక్యూరిటీ ఆర్కైవ్ మంగళవారం (ఈ నెల 22న) బహిర్గతం చేసింది.నివేదికల ప్రకారం భారత్, పాక్ నడుమ యుద్ధం సంభవించే అవకాశాలు స్వల్పమే అయినప్పటికీ పరస్పరం అంచనాలు వేయడంలో ఆయా దేశాలు పొరబడినా లేదా ఉభయ దేశాల్లో ఏదో ఒకటి అహేతుకంగా ప్రతిస్పందించడమో, అసమంజస నిర్ణయాలు తీసుకోవడమో జరిగినా సంప్రదాయ వైరం కాస్తా అణుయుద్ధంగా పరిణమించవచ్చు. ప్రస్తుతం భారత్ వద్ద సుమారు 160 న్యూక్లియర్ వార్ హెడ్లు, పాక్ అమ్ములపొదిలో 165 అణు వార్ హెడ్లు ఉండవచ్చని ఫెడరేషన్ ఆఫ్ అమెరికన్ సైంటిస్ట్స్ అంచనా. ఆధునిక క్షిపణి వ్యవస్థలు అణుయుద్ధ ముప్పును ‘వేగవంతం’ చేస్తున్నాయి. పాక్ క్షిపణి ‘షహీన్’ ఏడు నిమిషాల్లో న్యూఢిల్లీని చేరగలదు. అలాగే భారత్ క్షిపణి ‘ప్రళయ్’ ఆరు నిమిషాల లోపే ఇస్లామాబాద్ మీద దాడి చేయగలదు. మరో ముఖ్యాంశం... ‘నో ఫస్ట్ యూజ్’ పాలసీకి తాము కట్టుబడినట్టు భారత్ గతంలో ప్రకటించింది. ఈ ‘నో ఫస్ట్ యూజ్ న్యూక్లియర్ డాక్ట్రిన్’ ప్రకారం... భారత భూభాగంపైనో, భారత సైనిక దళాలపైనో అణుదాడి జరిగితేనే మన దేశం ప్రతీకార అణుదాడులకు ఉపక్రమిస్తుంది. అంతేతప్ప భారత్ తనంతట తానుగా, ముందుగా అణ్వాయుధాలను ఏ దేశంపైనా ప్రయోగించదు. ‘ఇండియాస్ రియాక్షన్ టు న్యూక్లియర్ డెవలప్మెంట్స్ ఇన్ పాకిస్థాన్’ శీర్షికతో ఉన్న 1981 నాటి అమెరికన్ స్పెషల్ నేషనల్ ఇంటెలిజెన్స్ ఎస్టిమేట్ (ఎస్ఎన్ఐఈ) ప్రకారం... తమ భద్రతకు తీవ్రంగా ముప్పు వాటిల్లుతుందని భావిస్తేనే భారత్ ముందస్తుగా పాక్ అణు కేంద్రాలపై దాడులు చేస్తుంది. ఇక ‘నో ఫస్ట్ యూజ్ అణు విధానం లాంటి స్వీయ నియంత్రణ, కట్టుబాట్లు మన పొరుగు దేశానికి లేవు. 2019లో భారత యుద్ధ విమానాలు పాక్ భూభాగంలోకి చొచ్చుకెళ్లి బాలాకోట్ వద్ద బాంబులు వేసి ఉగ్రవాద శిబిరాలను నాశనం చేశాయి. అలాంటి సాధారణ, సంప్రదాయ దాడి సందర్భాల్లో పరిస్థితులను అర్థం చేసుకోకుండా పాకిస్థాన్ ఒకవేళ అసంబద్ధంగా ప్రవర్తిస్తే జరిగేది... అణుయుద్ధమే!.ఇండియాతో మరో యుద్ధం తలెత్తితే తమ దేశం మొత్తం కాకపోయినా తమ మిలిటరీ నాశనమవుతుందని పాక్ సైనిక నాయకత్వం భయపడినట్టు 1993 నాటి సెంట్రల్ ఇంటలిజెన్స్ ఏజెన్సీ (సీఐఏ) రహస్య నివేదిక ఒకటి వెల్లడించింది. ‘ఇండియా-పాకిస్థాన్: ప్రాస్పెక్ట్స్ ఫర్ వార్ ఇన్ ద నైంటీస్’ శీర్షికతో ఉన్న ఈ నివేదిక... భారత్-పాక్ మధ్య యుద్ధం జరిగే అవకాశాలు 20% (ఐదింట ఒక వంతు) ఉన్నట్టు అప్పట్లో అంచనా వేసింది.- జమ్ముల శ్రీకాంత్.Conflict with India could destroy Pak military, if not the entire state : declassified CIA docs.Recently declassified paper predicted a spectacular terror attack could increase chances of conflict, Pak would fear destruction of the state.https://t.co/PfOwuRym9A pic.twitter.com/StP3TDJPZi— Manu Pubby (@manupubby) April 24, 2025పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత ప్రభుత్వం దౌత్యపరమైన ఆంక్షలతో పాక్ను ఉక్కిరి బిక్కిరి చేసింది. అందులో సింధు జలాల ఒప్పందం నిలిపివేతతో ప్రధాన చర్చనీయాంశమైంది. భారత్ చర్యలకు ప్రతిగా.. పాక్ కూడా భారత్పై పలు ఆంక్షలను విధిస్తున్నట్లు గురువారం ప్రకటించింది. -
పహల్గాం దాడిలో హమాస్ నేతల ప్లాన్.. POKలో ఏం జరిగింది?
ఢిల్లీ: జమ్ముకశ్మీర్లోని పహల్గాం ఉగ్రదాడి ఘటనపై కొన్ని అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ దాడి వెనుక హమాస్ కుట్ర ఉందని అనుమానం వ్యక్తమవుతోంది. ఈ మేరకు భారత్లోని ఇజ్రాయెల్ రాయబారి రూవెన్ అజార్ చెప్పుకొచ్చారు. ఆయన వ్యాఖ్యలకు బలం చేకూరేలా మరిన్ని వ్యాఖ్యలు చేశారు.పహల్గాంలో ఉగ్రదాడి ఘటనపై తాజాగా రూవెన్ అజార్ స్పందిస్తూ..‘హమాస్ నాయకులు ఇటీవల పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ (PoK) సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ జైష్-ఎ-మహమ్మద్ ఉగ్రవాదులతో సమావేశమైనట్టు మాకు సమాచారం ఉంది. పహల్గాంలో దాడికి వీటి మధ్య సంబంధం ఉందనే అనుమానం కలుగుతోంది. ఎందుకంటే.. గతంలో ఇజ్రాయెల్పై అక్టోబరు 7, 2023 హమాస్ నరమేధానికి, పహల్గామ్లో పర్యాటకులపై ఉగ్రదాడికి సారూపత్య ఉంది. ఈ రెండు ఘటనలలో అమాయక పౌరులే లక్ష్యంగా ఉన్నారు.అక్టోబర్ 7న ఇజ్రాయెల్లోకి చొరబడిన హమాస్ ముష్కరులు సంగీత కచేరీలో పాల్గొన్న 1,400 మందికి పైగా పౌరులను హత్య చేశారు. ఉగ్రవాదులు అన్ని స్థాయిల్లో పరస్పరం సహకరించుకుంటున్నారు.. వారు ఒకరికొకరు అనుకరిస్తూ ఒకేలా మారుతున్నారు. ఈ ప్రమాదాలను ఎదుర్కొనడానికి నిఘా సంస్థలు కలిసి పనిచేస్తున్నాయని నాకు నమ్మకం ఉంది’ అని పేర్కొన్నారు.ఇదే సమయంలో భారత ప్రభుత్వం తీసుకున్న కఠినమైన చర్యలు, హెచ్చరికలు నాకు ఎంతో ధైర్యం కలిగించాయి. దోషులను వేటాడుతాం అని ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇవ్వడం అభినందనీయం. ఉగ్రవాదానికి మద్దతిస్తున్న దేశాలను ప్రపంచం బహిష్కరించాల్సిన అవసరం ఉంది. ఉగ్రవాదులకు అనేక దేశాలు నిధులు, ఇంటెలిజెన్స్ సమాచారం, ఆయుధాల రూపంలో మద్దతు ఇస్తున్నాయి. ఇది ఆమోదయోగ్యం కాదు అంటూ ఘాటు విమర్శలు చేశారు.Watch: On the Pahalgam terror attack, Reuven Azar, Ambassador of Israel to India, says, "You have a similar situation in which people were going to a music festival and were massacred, and people here were going on vacation and they were massacred. It’s the same death cult, the… pic.twitter.com/5obbvzh89V— IANS (@ians_india) April 24, 2025ఇదిలా ఉండగా.. పహల్గాం ఉగ్ర దాడిపై అగ్గిమీద గుగ్గిలమవుతున్న భారత్.. పాక్పై ముప్పేట దాడికి దిగింది. బుధవారం పలు ఆంక్షలను విధించిన మన దేశం గురువారం మరింతగా విరుచుకుపడింది. ఉగ్రమూకలకు ఆశ్రయమిస్తున్న పాకిస్తాన్కు అందిస్తున్న అన్ని రకాల వీసా సేవలను నిలిపేసింది. ఆ దేశ దౌత్యవేత్తకు సమన్లు జారీ చేసింది. పాక్కు చెందిన ఎక్స్ ఖాతాలను నిలిపేసింది. ఆ దేశానికి వివిధ కారణాలతో వెళ్లిన భారతీయులు వెంటనే తిరిగిరావాలని ఆదేశించింది. పాకిస్తాన్కు చెందిన నటుడి చిత్రం విడుదలను ఆపేసింది. అటారీ-వాఘా సరిహద్దును మూసివేసిన నేపథ్యంలో గురువారం రిట్రీట్ వేడుకను బీఎస్ఎఫ్ నామమాత్రంగా నిర్వహించింది. పాక్ గార్డులతో కరచాలనాన్ని రద్దు చేసింది. రిట్రీట్ సందర్భంగా సరిహద్దు గేట్లను తెరవలేదు. మిగిలిన అన్ని డ్రిల్స్ను యథావిధిగా నిర్వహించామని బీఎస్ఎఫ్ ఒక ప్రకటనలో వెల్లడించింది. -
నేడు కశ్మీర్కు రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ శుక్రవారం జమ్ముకశ్మీర్ వెళ్లనున్నారు. పహల్గాం ఉగ్ర దాడి బాధితులను ఆయన పరామర్శించనున్నారు. అనంతనాగ్ వైద్య కళాశాలలో చికిత్స పొందుతున్న బాధితులతో రాహుల్ మాట్లాడతారని కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. అమెరికా పర్యటనను అర్ధంతరంగా ముగించుకుని తిరిగి వచ్చిన రాహుల్ గురువారం సీడబ్ల్యూసీ భేటీలో పాల్గొన్నారని తెలిపాయి. అనంతరం అఖిల పక్ష సమావేశంలోనూ ఆయన పాలుపంచుకున్నారు. సీడబ్ల్యూసీ తీర్మానం.. మృతులకు ఘన నివాళిఇదిలా ఉండగా.. జమ్ముకశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్ర దాడి ముమ్మాటికీ భావోద్వేగాలను రెచ్చగొట్టే చర్యేనని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) ప్రకటించింది. ఈ దారుణ ఘటనను తీవ్రంగా ఖండించింది. ఈ ఘటనకు పాకిస్తానే సూత్రధారి. ఈ ఉగ్రవాద చర్య మన గణతంత్ర విలువలపై ప్రత్యక్ష దాడి. దేశవ్యాప్తంగా భావోద్వేగాలను రెచ్చగొట్టడానికి హిందువులను ఉద్దేశపూర్వకంగా లక్ష్యంగా చేసుకుంది. ఇటు వంటి తీవ్రమైన రెచ్చగొట్టే చర్యలను, సీమాంతర ఉగ్రవాదా న్ని సమష్టిగా, దృఢసంకల్పంతో ఎదుర్కోవాలని పునరుద్ఘాటి స్తున్నాం అంటూ సీడబ్ల్యూసీ పేర్కొంది.నిఘా వైఫల్యాలపై విశ్లేషణ అవసరం..ప్రభుత్వ నిఘా వైఫల్యాన్ని ఈ సందర్భంగా సీడబ్ల్యూసీ ఎత్తి చూపింది. ‘పహల్గాం మూడంచెల భద్రతా వ్యవస్థ కలిగి ఉండే శత్రుదుర్బేధ్యమైన అత్యంత భద్రత కలిగిన ప్రాంతం. కేంద్ర హోం శాఖ పరిధిలోని ఒక కేంద్రపాలిత ప్రాంతం. అలాంటి ప్రాంతంలో ఇంతటి తీవ్ర దాడి చోటుచేసుకుంది. ఈ సమయంలో నిఘా వైఫల్యాలు, భద్రతా లోపాలపై సమగ్ర విశ్లేషణ చేపట్టాల్సిన అవసరం విస్తృత ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఎంతో అవస రం. బాధిత కుటుంబాలకు నిజంగా న్యా యం జరిగే ఏకైక మార్గం ఇదే’ అని సీడబ్ల్యూసీ పేర్కొంది. అలాగే, లక్షలాది మంది పాల్గొనే అమర్నాథ్ యాత్రకు పటిష్టమైన భద్రత ఏర్పాటు చేయాలి. పర్యాటకంపై ఆధారపడ్డ కశ్మీర్ ప్రజల జీవనోపాధిని కాపాడాలి’ అని కేంద్రానికి సూచించింది.రాజకీయ ప్రయోజనాలొద్దు..ప్రజల్లో విభజన బీజాలు నాటేందుకు పహల్గాం దాడిని బీజేపీ అధికారిక, అనుకూల సోషల్ మీడియా వేదికలు వాడుకోవడం దారుణమని సీడబ్ల్యూసీ తెలిపింది. కాగా, పహల్గాం దాడిలో అసువులు బాసిన వారికి నివాళులర్పించేందుకు శుక్రవారం పార్టీ శ్రేణులు అన్ని రాష్ట్రాలు, జిల్లాల్లో క్యాండిల్మార్చ్ నిర్వహిస్తాయని అనంతరం కేసీ వేణుగోపాల్ ప్రకటించారు. -
గణతంత్ర విలువలపై ప్రత్యక్ష దాడి
సాక్షి, న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్ర దాడి ముమ్మాటికీ భావోద్వేగాలను రెచ్చగొట్టే చర్యేనని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) ప్రకటించింది. ఈ దారుణ ఘటనను తీవ్రంగా ఖండించింది. ‘‘ఈ ఘటనకు పాకిస్తానే సూత్రధారి. ఈ ఉగ్రవాద చర్య మన గణతంత్ర విలువలపై ప్రత్యక్ష దాడి. దేశవ్యాప్తంగా భావోద్వేగాలను రెచ్చగొట్టడానికి హిందువులను ఉద్దేశపూర్వకంగా లక్ష్యంగా చేసుకుంది. ఇటు వంటి తీవ్రమైన రెచ్చగొట్టే చర్యలను, సీమాంతర ఉగ్రవాదా న్ని సమష్టిగా, దృఢసంకల్పంతో ఎదుర్కోవాలని పునరుద్ఘాటి స్తున్నాం’’ అంటూ సీడబ్ల్యూసీ పేర్కొంది. గురువారం ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో సీడబ్ల్యూసీ అత్యవసర సమావేశం జరిగింది. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్ర నేతలు సోనియా గాంధీ, రాహుల్, ప్రియాంకతోపాటు, కేసీ వేణుగోపాల్ తదితరులు సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా నేతలు ఒక క్షణం మౌనం పాటించి మృతులకు నివాళులర్పించారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన సీడబ్ల్యూసీ, అనంతరం ఉగ్రవాద దాడిని ఖండిస్తూ తీర్మానాన్ని ఆమోదించింది. నిఘా వైఫల్యాలపై విశ్లేషణ అవసరం..ప్రభుత్వ నిఘా వైఫల్యాన్ని ఈ సందర్భంగా సీడబ్ల్యూసీ ఎత్తి చూపింది. ‘పహల్గాం మూడంచెల భద్రతా వ్యవస్థ కలిగి ఉండే శత్రుదుర్బేధ్యమైన అత్యంత భద్ర త కలిగిన ప్రాంతం. కేంద్ర హోం శాఖ పరిధిలోని ఒక కేంద్రపాలిత ప్రాంతం. అలాంటి ప్రాంతంలో ఇంతటి తీవ్ర దాడి చోటుచేసుకుంది. ఈ సమయంలో నిఘా వైఫల్యాలు, భద్రతా లోపాలపై సమగ్ర విశ్లేషణ చేపట్టాల్సిన అవసరం విస్తృత ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఎంతో అవస రం. బాధిత కుటుంబాలకు నిజంగా న్యా యం జరిగే ఏకైక మార్గం ఇదే’అని సీడబ్ల్యూసీ పేర్కొంది. ‘‘లక్షలాది మంది పాల్గొనే అమర్నాథ్ యాత్రకు పటిష్టమైన భద్రత ఏర్పాటు చేయాలి. చేయాలి. పర్యాటకంపై ఆధారపడ్డ కశ్మీర్ ప్రజల జీవనోపాధిని కాపాడాలి’’ అని కేంద్రానికి సూచించింది. రాజకీయ ప్రయోజనాలొద్దు..ప్రజల్లో విభజన బీజాలు నాటేందుకు పహల్గాం దాడిని బీజేపీ అధికారిక, అనుకూల సోషల్ మీడియా వేదికలు వాడుకోవడం దారుణమని సీడబ్ల్యూసీ తెలిపింది. కాగా, పహల్గాం దాడిలో అసువులు బాసిన వారికి నివాళులర్పించేందుకు శుక్రవారం పార్టీ శ్రేణులు అన్ని రాష్ట్రాలు, జిల్లాల్లో క్యాండిల్మార్చ్ నిర్వహిస్తాయని అనంతరం కేసీ వేణుగోపాల్ ప్రకటించారు. -
కశ్మీర్లో ఎన్కౌంటర్.. జవాను వీరమరణం
జమ్మూ: జమ్మూ కశ్మీర్లోని ఉధంపూర్లో గురువారం చోటు చేసుకున్న ఎన్కౌంటర్లో ఆర్మీ ప్రత్యేక విభాగం జవాను ఒకరు అసువులు బాశారు. ఉగ్రవాదుల కదలికలపై విశ్వసనీయ సమాచారం అందుకున్న బలగాలు డుడు–బసంత్గఢ్ ప్రాంతంలో కూంబింగ్ చేపట్టాయి. ఈ సందర్భంగా తారసపడిన ఉగ్రమూకలు బలగాలపైకి అకస్మాత్తుగా కాల్పులకు దిగాయి. ఘటనలో హవల్దార్ ఝంటు అలీ షేక్ నేలకొరిగారు. అనంతరం కూడా ఎదురు కాల్పులు కొనసాగాయి. ఈ సందర్భంగా బలగాలు నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నాయి. కాగా, గత 24 గంటల్లో చోటుచేసుకున్న మూడో ఎన్కౌంటర్ ఇది. బుధవారం బారాముల్లాలోని ఉడి నాలా వద్ద జరిగిన భీకర ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదుల హతమవ్వడం తెల్సిందే. -
Pahalgam Attack: రాజకీయ ఏకాభిప్రాయం కోసం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు
-
48 గంటల్లో మారిన కశ్మీర్ సీన్.. ‘వాళ్లేం తప్పు చేశారు?’
భూతల స్వర్గంగా పేరున్న కశ్మీరానికి దేశం నలుమూలల నుంచే కాదు.. యావత్ ప్రపంచ దేశాల నుంచి పర్యాటకులు క్యూ కట్టేవారు. పచ్చని గడ్డి మైదానాలు.. దూరంగా ఫైన్ చెట్ల మధ్య నుంచి కనిపించే మంచుపర్వతాలు చూపరులను ఎంతో ఆకట్టుకునే ఏప్రిల్-జూన్ సీజన్ మరేంతో ప్రత్యేకంగా ఉండేది. అలాంటి సీజన్ ఇలా బోసిపోయి ఉంటుందని అక్కడి టూరిస్ట్ గైడులు, వ్యాపారులు కలలో కూడా ఊహించి ఉండరు!. పహల్గాం ఉగ్రదాడితో.. కశ్మీర్ పర్యాటకాన్ని చీకట్లు కమ్మేశాయి. మంగళవారం మధ్యాహ్నాం ఉగ్రదాడి జరగ్గా.. బుధవారం ఉదయం నుంచే పర్యాటకులు శరవేగంగా ఆ ప్రాంతాన్ని వీడుతున్నారు. శ్రీనగర్ వెళ్లే విమానాలు ఖాళీగా బోసిపోయి కనిపిస్తుండగా.. అక్కడి నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే విమానాలు మాత్రం ప్రయాణికులతో కిక్కిరిసిపోయి కనిపిస్తున్నాయి. ఇళ్ల రైలు ప్రయాణాల సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రయాణాలు కన్ఫర్మ్ కాగా.. హోటల్స్, లాడ్జిలు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, కార్లు, రోడ్లు ఇలా ఎక్కడపడితే అక్కడ ఎదురు చూస్తూ కనిపిస్తున్నారు పర్యాటకులు. 48 గంటలు.. ఎంత మారిపోయిందో?పహల్గాం ఉగ్రదాడి జరిగి సరిగ్గా రెండు రోజులు గడిచింది. ఈ రెండు రోజులు మొత్తం జమ్ము కశ్మీర్ పర్యటకం స్తంభించిపోయింది. జమ్ము కశ్మీర్కు మణిహారంగా భావించే దాల్ సరస్సు చుట్టుపక్కల ఒక్క పర్యాటకుడు కూడా కనిపించలేదంటే ఆశ్యర్యపోనక్కర్లేదు. నిత్యం టూరిస్టులతో బిజీబిజీగా గడిపే షికారాలు.. మూలనపడ్డాయి. అలాగే.. దాడి జరిగిన బైసరన్ లోయ పూర్తిగా సైన్యం అదుపులో ఉండిపోయింది. ఇక మిగతా పర్యాటక ప్రాంతాల పరిస్థితి కూడా దాదాపుగా అంతే ఉంది. పర్యాటకులు లేక వెలవెలబోతున్నాయి. జీవనాధారం దెబ్బ తింటుందనే.. పహల్గాం దాడి.. తదనంతర పరిణామాలు జమ్ము కశ్మీర్కు మళ్లీ పాత కల్లోల రోజులను గుర్తు చేస్తున్నాయి. వాస్తవానికి ఏప్రిల్ మే జూన్ నెలల జమ్ము పర్యాటకానికి ఎంత కీలకం. అలాంటి సమయంలో.. అదీ పర్యాటకుల మీద జరిగిన ఉగ్రదాడి కశ్మీర్ను ఉలిక్కిపడేలా చేసింది. ప్రశాంతమైన వాతావరణాన్ని చెడగొట్టిన చీడపురుగుల్ని వెతికి నలిపేయాలంటూ పద్మశ్రీ గులాం రసూల్ఖాన్ కోరుతున్నారు. ‘‘ఇక్కడి జనాలకు పర్యాటకమే జీవనాధారం. అలాంటిది దెబ్బ తింటే వాళ్లు ఎలా బతుకుతారు?’’ అని ప్రశ్నిస్తున్నారాయన. ఈ క్రమంలో టూరిస్టులకు కొందరు వ్యాపారులు ధైర్యం చెబుతూ.. బతిమాలుతున్న దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. రగిలిపోయిన కశ్మీర్ ప్రజలుఆర్టికల్ 370 రద్దు తర్వాత.. కశ్మీర్లో తీవ్ర స్థాయిలో నిరసనలు జరిగింది బుధవారమే. గత 35 ఏళ్లలో ఏప్రిల్ 23వ తేదీన కశ్మీర్ తొలిసారిగా మొత్తం మూత పడింది. సాధారణ ప్రజలు, వర్తకులంతా రోడ్డెక్కి ఉగ్ర చర్యను ఖండించారు. ఇది తమ ఆత్మపై జరిగిన దాడిగా భావించి ఆందోళనకు దిగారు. స్వచ్ఛందంగా బంద్లో పాల్గొనాలని, నిరసన ర్యాలీలో కలిసి రావాలని మసీదుల్లోని మైకుల ద్వారా విజ్ఞప్తులు చేశారు. హిందుస్థాన్ జిందాబాద్, ఐ యామ్ ఇండియన్ అంటూ ఉగ్రచర్యను తీవ్రంగా ఖండిస్తూ నినాదాలు చేశారు. పర్యాటకులకు సాయంజమ్ము కశ్మీర్ టూరిజం విభాగం ధైర్యం చెబుతున్నప్పటికీ.. పర్యాటకులు మాత్రం కశ్మీర్ను వీడడం ఆపడం లేదు. ఈ క్రమంలో అక్కడి వ్యాపారులు, డ్రైవర్లు స్వచ్ఛందంగా పర్యాటకులకు సాయంగా నిలుస్తున్నారు. ఉచితంగా ఆహార పొట్లాలను, మంచి నీటిని అందిస్తున్నారు. ఉగ్రదాడి తర్వాత స్వస్థలాలకు వెళ్లే క్రమంలో చిక్కుకుపోయిన వాళ్లకు ఉచితంగా వసతి, భోజన సదుపాయం కల్పిస్తున్నారు. మరికొందరు డ్రైవర్లు వాళ్లను రైల్వే స్టేషన్లు, ఎయిర్పోర్టులలో ఉచితంగా దించుతున్నారు. ఎంతో కొంత డబ్బు ఇవ్వడానికి పర్యాటకులు ప్రయత్నిస్తున్నా.. వాళ్లు వద్దని చెబుతున్న వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ సాయాన్ని కూడా కొందరు విమర్శిస్తుండగా.. ఎక్కువ మంది అభినందిస్తున్నారు. View this post on Instagram A post shared by Molitics (@moliticsindia)‘‘మేమూ మనుషులమే. ఇది పర్యాటకమో.. మా ఆదాయానికో సంబంధించింది కాదు. సరదాగా కుటుంబాలతో వచ్చిన ఆ పర్యాటకులు చేసిన తప్పేంటి?. ఈ దాడికి పాల్పడిన వాళ్లను సైన్యం వదిలిపెట్టకూడదు. అవసరమైతే మేమూ సైన్యానికి మా వంతు సాయం అందిస్తాం. ఇది డబ్బో, వ్యాపారానికో సంబంధించింది కాదు. మానవత్వానికి సంబంధించింది. అలాంటిది.. మానవత్వం మీద దాడి జరిగింది మరి’’ అని కొందరు కశ్మీరీలు భావోద్వేగంగా చెబుతున్నారు.కొసమెరుపు.. బెంగళూరుకు చెందిన ఇంటీరియర్ డిజైనర్ వినితా చైతన్య.. దాల్ సరస్సులో షికారా ప్రయాణాన్ని తాజాగా సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఒకవైపు టూరిస్టులు ఆ వైపు వెళ్లేందుకు జంకుతుంటే.. ఆమె మాత్రం ఆ ప్రయాణం రద్దు చేసుకోవడం ఇష్టం లేక ఆస్వాదించానంటూ ఓ వీడియోను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. View this post on Instagram A post shared by Vinita Chaitanya (@vinitachaitanya) -
పహల్గాం హీరో అతడే.. ఉగ్రవాదులతో పోరాడిన పోనీవాలా
న్యూఢిల్లీ: ఒక జంటది హనీమూన్. కొందరిది పెళ్లి రోజు. ఇంకొందరికి ఎన్నో ఏళ్ల కల. పహల్గాం మారణకాండ 26 కుటుంబాల్లో తీరని విషాదం నింపింది. ఒక్కొక్క పర్యాటకున్నీ పేరు, వ్యక్తిగత వివరాలు అడిగి మరీ ముష్కరులు బలి తీసుకున్న తీరు హృదయాలను కలచివేస్తోంది. దాదాపుగా అందరినీ ఆధార్ కార్డులు చూపించాలని, ఖురాన్ పంక్తులు అప్పజెప్పాలని అడిగి మరీ కాల్చేశారు.మృతుల్లో ఇద్దరు మినహా అంతా హిందువులే. వారిలో మహారాష్ట్రకు చెందిన వారు ఆరుగురు, గుజరాత్, కర్నాటక నుంచి ముగ్గురేసి, పశి్చమబెంగాల్ నుంచి ఇద్దరు, ఆంధ్రప్రదేశ్, హరియాణా, ఉత్తరాఖండ్, యూపీ, బిహార్, పంజాబ్, కేరళ, ఒడిశా, మధ్యప్రదేశ్, అరుణాచల్ప్రదేశ్ నుంచి ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు. వీరితో పాటు ఒక నేపాలీ పర్యాటకునితో పాటు స్థానికుడు కూడా దాడిలో మరణించారు.హార్స్ రైడింగ్కని బయటికొచ్చి...ఉగ్ర కాల్పులకు బలైన వారిలో యూపీలోని కాన్పూర్కు చెందిన శుభం ద్వివేది అనే 31 ఏళ్ల వ్యాపారవేత్త కూడా ఉన్నాడు. ఆయనకు గత ఫిబ్రవరిలోనే పెళ్లైంది. భార్య, తల్లిదండ్రులు, సోదరి, ఆమె అత్తామామలు, బావమరిది తదితరులతో కలిసి సరదాగా గడిపేందుకు బైసారన్ వెళ్లాడు. మంగళవారం కుటుంబీకులంతా హోటల్కే పరిమితం కాగా భార్యతో కలిసి శుభం హార్స్ రైడింగ్కు వెళ్లాడు. ఉగ్రవాదులు అతన్ని కూడా పేరడిగారు. కల్మా చదవమన్నారు. రాదనడంతో నేరుగా తలపై కాల్చి భార్య కళ్లముందే పొట్టన పెట్టుకున్నారు.CM Omar Abdullah, joined by thousands, offered funeral prayers for Syed Adil Hussain—killed in the Pahalgam militant attack that left 26 tourists dead—at his native village on Wednesday.Photos KM / @UmarGanie1 pic.twitter.com/nXCD0vbsnh— The Kashmir Monitor (@Kashmir_Monitor) April 23, 2025👉కేరళలోని ఎడప్పల్లికి చెందిన రామచంద్రన్ (65) కూడా కాల్పులకు బలయ్యాడు. పర్యాటకప్రియుడైన ఆయన భార్య, ఇటీవలే దుబాయ్ నుంచి వచ్చిన కూతురు, ఆమె పిల్లలతో కలిసి కశ్మీర్ వెళ్లాడు. వాళ్ల కళ్లముందే ఉగ్రవాదులు ఆయన్ను కాల్చేశారు. ఆయన్ను కూడా ఖురాన్ పంక్తులు చదవాలని అడిగి, తాను ముస్లింను కాదని చెప్పగానే చంపేశారు.👉ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్కు చెందిన దినేశ్ మిరానియా అనే వ్యాపారవేత్త పెళ్లి రోజును సరదాగా జరుపుకునేందుకు కుటుంబీకులతో కలిసి పహల్గాం వచ్చారు. భార్యాపిల్లల కళ్లముందే ఉగ్ర తూటాలకు బలయ్యారు.👉కశ్మీర్ వెళ్లాలన్నది ఒడిశాకు చెందిన ప్రశాంత్ సత్పతి (41) కల. నెలల తరబడి డబ్బు కూడబెట్టి మరీ బైసారన్ వెళ్లాడు. భార్య, 9 ఏళ్ల కొడుకు కళ్లముందే నిస్సహాయంగా మృత్యువాత పడ్డాడు.పోరాడిన పోనీవాలా.. ఉగ్రవాదుల నుంచి పర్యాటకులను కాపాడేందుకు సయ్యద్ ఆదిల్ హుస్సేన్ షా (30) అనే స్థానిక పోనీవాలా వీరోచితంగా ప్రయత్నించాడు. ఉగ్ర వాదుల నుంచి తుపాకులను లాక్కునే ప్రయత్నంలో వారి కాల్పులకు బలయ్యాడు. ఆదిల్ గొప్ప ధైర్య సాహసాలు ప్రదర్శించాడంటూ జమ్మూ కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా ప్రస్తుతించారు. బుధవారం అతని అంత్యక్రియల్లో పాల్గొని నివాళులర్పించారు. -
కర్మీర్ పర్యాటక రంగానికి కోలుకోలేని దెబ్బ
శ్రీనగర్/న్యూఢిల్లీ: పహల్గాంలో ఉగ్రవాదుల దాడి.. జమ్మూకర్మీ ర్ పర్యాటక రంగంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. జమ్మూకశ్మీర్ పర్యటనకు ప్లాన్ చేసుకున్నవారంతా ఇప్పుడు రిజర్వేషన్లు రద్దు చేసుకుంటున్నారు. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లోని ట్రావెల్ ఏజెన్సీల్లో దాదాపు 90శాతం రిజర్వేషన్లు రద్దయ్యాయి. గతంలో కర్మీర్లో ఉగ్రదాడులు జరిగాయి. కానీ ఈ దాడుల్లో ఇంతకు ముందెన్నడూ పర్యాటకులను గుర్తించి చంపలేదు. పహల్గాం సంఘటన తర్వాత మాత్రం మొత్తం పర్యాటక పరిశ్రమ, భాగస్వాములందరినీ ప్రభావితం చేసింది. కర్మీర్లో దాదాపు 80శాతం రిజర్వేషన్స్ రద్దయ్యాయి. జమ్మూకర్మీర్కు దాదాపు 90 శాతం బుకింగ్లను పర్యాటకులు రద్దు చేసుకున్నట్లు ఢిల్లీలోని పలు ట్రావెల్ ఏజెన్సీలు తెలిపాయి. వచ్చే నెలలో కర్మీర్లో పర్యటించడానికి రిజర్వేషన్లు చేసుకున్నారని, ఇప్పుడు ఇప్పుడు రద్దు చేయాలని కోరుతున్నారని వెల్లడించాయి. కర్మీర్లో ప్రముఖ పర్యాటక ప్రాంతాలైన గుల్మార్గ్, హజన్ వ్యాలీ, తులిప్ గార్డెన్స్ ఎక్కువగా బుక్ అయ్యాయని, ఇప్పుడు అవన్నీ రద్దయ్యాయని తెలిపారు. అక్కడకు వెళ్లి ప్రాణాలను పణంగా పెట్టబోమని, రిఫండ్ చేయాలని కోరుతున్నారని ఏజెన్సీల నిర్వాహకులు చెబుతున్నారు. అయితే కొంతమంది పర్యాటకులు కర్మీర్కు బదులుగా వేరే ప్రాంతాలకు మార్చుకుంటున్నారని ఢిల్లీలోని ట్రావెల్ ఏజెన్సీలు నివేదించాయి. ‘‘కొన్ని కుటుంబాలు బస్సు, విమాన టిక్కెట్ల నుంచి హోటళ్ల వరకు అన్నీ ముందుగానే బుక్ చేసుకున్నారు. అయితే ఉగ్రదాడి వార్త తెలిసిన మరుక్షణం నంచే రద్దు చేయాలని మాకు కాల్స్ రావడం ప్రారంభించాయి’’అని ఓ ట్రావెల్స్ యజమాని తెలిపారు. జమ్ముకర్మీర్ పర్యటనకు కీలక కేంద్రంగా ఉన్న కోల్కతాలోనూ అనేక మంది రిజర్వేషన్లను రద్దు చేసుకున్నారు. తమ రిజర్వేషన్లను రద్దు చేయాలని లేదా వాయిదా వేయాలని క్లయింట్ల నుంచి నిరంతరాయంగా కాల్స్ వస్తున్నాయని టూర్ ఆపరేటర్లు చెబుతున్నారు. అయితే.. జమ్మూకర్మీర్కు బుకింగ్ చేయడం నిలిపేయాలని ఆదేశాలు వచ్చినట్లు మరికొన్ని ట్రావెల్ ఏజెన్సీలు తెలిపాయి. అన్ని రవాణా, బుకింగ్లను నిలిపివేయాలని ట్రావెల్ అసోసియేషన్ ఆఫ్ శ్రీనగర్ తమను ఆదేశించిందని, తదుపరి నోటీసు వచ్చే వరకు జమ్మూకర్మీర్ పర్యటనలకోసం కొత్త బుకింగ్లు చేయబోమని ప్రకటించాయి. ఇప్పట్లో కర్మీర్కు పర్యాటకులు రావడం కష్టమే... ‘పర్యటనలు రద్దు చేసుకుని పర్యాటకులు వెళ్లిపోతున్నారు. మరో నెల రోజుల ప్యాకేజీలను కూడా రద్దు చేశారు. ఇలాంటి ఘటనల తరువాత కూడా పర్యాటకులు ఇక్కడ ఉంటారని, వెంటనే ఇక్కడికి వస్తారని ఆశించలేం. గత కొన్నేళ్లుగా చేసిన మంచి పనులన్నీ వృథాగా పోయాయి. కర్మీర్కు మళ్లీ పర్యాటకులను రప్పించడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది’శ్రీనగర్కు చెందిన ట్రావెల్ ఆపరేటర్ ఐజాజ్ అలీ తెలిపారు. నష్టాన్ని తగ్గిస్తాం: కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ పహల్గాం దాడి నేపథ్యంలో జమ్ముకర్మీర్లో పర్యాటక రంగంపై పడే నష్టాన్ని తగ్గించేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నామని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తెలిపారు. జమ్మూకర్మీర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పర్యాటక శాఖ కార్యదర్శితో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని, పరిస్థితిని పర్యవేక్షిస్తున్నామని వెల్లడించారు. ఎక్కడికక్కడ భద్రత... భయంతో చాలామంది పర్యాటకులు వెళ్లిపోతుండగా.. చాలా కొద్దిమంది ఉండేందుకు సుముఖత చూపుతున్నారు. ‘దాడి గురించి వినగానే భయం వేసింది. ముంబైకి తిరిగి వెళ్లాలనుకున్నాం. కానీ హోటల్ సిబ్బంది మేం సురక్షితంగా, సౌకర్యవంతంగా ఉండేలా చేశారు. మాకు ఎలాంటి భయం లేదు. ఎక్కడికక్కడ భద్రత ఉంది. పహల్గాం సందర్శించాలి అనుకుంటున్నాం. పరిస్థితి బాగుంటే రేపు అక్కడికి వెళ్తాం. బయటకు వచ్చి చూడగా ఎక్కడ చూసినా పోలీసులు, సైన్యం ఉండడంతో టూరిస్టులు సేఫ్గా ఫీలవుతున్నారు. ఇప్పుడు భయం తగ్గుముఖం పడుతోంది’అని మహారాష్ట్రకు చెందిన ఓ పర్యాటకురాలు చెబుతున్నారు. -
ఉరి, పుల్వామా కంటే ఘోరమైన దాడి ఇది: ఒవైసీ
న్యూఢిల్లీ: ఉరి, పుల్వామాలలో జరిగిన దాడుల కంటే.. జమ్ము కశ్మీర్ పహల్గాం(Pahalgam)లో తాజాగా జరిగిన ఉగ్ర దాడి అత్యంత ఘోరమైందని, అది తనను ఎంతగానో బాధించిందని ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ(Asaduddin Owaisi) అన్నారు. నిఘా వ్యవస్థ వైఫల్యం వల్లే దాడి జరిగిందన్న ఆయన.. ఘటనకు మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.‘‘పహల్గాంలో.. మతం ఏంటని అడిగిన తర్వాతే ఉగ్రవాదులు అమాయక ప్రజలను విచక్షణారహితంగా చంపారు. ఇది గతంలో జరిగిన ఉరి, పుల్వామా ఉగ్రదాడుల కంటే ఘోరమైంది. ఈ దాడిని మేం ఖండిస్తున్నాం. ఇది కచ్చితంగా నిఘా వ్యవస్థ వైఫల్యమే. జమ్ములో ఉగ్రవాదంపై కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న నిరోధక విధానం పనిచేస్తుందో లేదో పరిశీలించుకోవాలి. ఈ ప్రభుత్వం ఉగ్రవాదులకు తగిన గుణపాఠం చెప్పి.. బాధిత కుటుంబాలకు న్యాయం జరిగేలా చూస్తుందని ఆశిస్తున్నాం’’ అని విలేకరులతో అన్నారాయన.దక్షిణ జమ్ము కశ్మీర్లోని అనంత్నాగ్ జిల్లా పహల్గాంలోని బైసరన్ లోయలో ఘోరం జరిగింది. సైనిక దుస్తుల్లో వచ్చిన ఉగ్రవాదులు.. మైదానంలో కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతున్న పర్యాటకులను చుట్టుముట్టి తుపాకులతో దారుణంగా కాల్చి చంపారు. ఐడీ కార్డులను పరిశీలించి.. పేరు, మతం ఆధారంగా వేరు చేసి మరీ దాడి చేశారు. ఈ దాడిలో 26 మంది అక్కడికక్కడే మరణించగా.. తీవ్రంగా గాయపడి మరికొందరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వాళ్లలో ఇద్దరు తాజాగా మరణించడంతో మృతుల సంఖ్య 28కి చేరింది. అయితే.. బాడీ కేమ్ ద్వారా దాడి దృశ్యాలను పాక్లోని తమ హ్యాండర్లకు ఉగ్రవాదులు చేరవేసినట్లు భద్రతా సంస్థలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే ఉగ్రవాదుల ఫొటోలు, ఊహా చిత్రాలు విడుదల చేసి.. జమ్ము వ్యాప్తంగా గాలింపు కొనసాగిస్తోంది. -
పహల్గాం ఉగ్రదాడిలో విస్తుపోయే విషయాలు
ప్రభుత్వాధికారులను, వారి కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకునే పహల్గాం దాడి జరిగిందా? కాల్చి చంపే ముందు ఉగ్రవాదులు టూరిస్టుల ఐడీ కార్డులను ఎందుకు చెక్ చేశారు?. పైగా మృతుల్లో ఐబీ, నేవీ, ఎయిర్ఫోర్స్ విభాగాల ఉద్యోగులే అధికంగా ఉండడం.. ఈ అనుమానాలకు మరింత బలం చేకూరుస్తోంది. పహల్గాం ఉగ్రదాడిలో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి.కశ్మీర్ గడ్డపై నరమేధానికి ఉగ్రవాదులు ఈ పర్యాటక ప్రాంతాన్నే ఎంచుకోవడం వెనుక భద్రతాధికారులు పలు కారణాలు చెబుతున్నారు. పహల్గాం పట్టణానికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న బైసరన్ వ్యాలీ(baisaran valley)కి కశ్మీర్ ‘మినీ స్విట్జర్లాండ్’గా పేరుంది. శీతాకాలంలో మంచు దుప్పటి పర్చుకునే ఈ ప్రాంతం.. మిగతా కాలంలో పచ్చిక బయళ్లతో, ఫైన్ చెట్లతో.. యూరప్ అల్పైన్ లోయలను తలపిస్తుంటుంది. అందుకే దేశం నలుమూలల నుంచి పర్యాటకలకు వేసవిలో ఈ ప్రాంతానికి క్యూ కడుతుంటారు. పైగా ల్యూలియన్ సరస్సుకు బైసరన్ వ్యాలీ బేస్గా ఉండడంతో పాటు ట్రెక్కింగ్ కోసం సాహస యాత్రికులు ఈ ప్రాంతానికి క్యూ కడుతుంటారు.అయితే పహల్గాం(pahalgam) బైసరన్ లోయకు ఉన్న ప్రత్యేకతలే.. ఉగ్రవాదులు సులువుగా చొరబడి అమాయకులపై దాడి చేయడానికి వీలు కలిపించింది. ఇక్కడి పచ్చదనం పాడు కాకూడదన్న ఉద్దేశంతో మోటార్ వెహికిల్స్ను అనుమతించరు. పహల్గాం టౌన్ నుంచి ఐదు కిలోమీటర్ల పాటు కాలినడకన లేదంటే పొట్టి గుర్రాలను(Pony) పర్యాటకులు ఆశ్రయించాల్సి ఉంటుంది. పర్యావరణ సమతుల్యతను కాపాడుకోవడం కోసం తీసుకున్న ఈ చర్యలు ఈ ప్రాంతాన్ని ఒంటరిని చేసేశాయి. తద్వారా అత్యవసర పరిస్థితుల్లో లేదంటే ఊహించని సంఘటనల సమయంలో చర్యలకు జాప్యం కలిగేలా చేశాయి. ప్రభుత్వాధికారులే లక్ష్యంగా.. పక్కా ప్లాన్తోనే బైసరన్ వ్యాలీలో ఉగ్రదాడి జరిగినట్లు స్పష్టమవుతోంది. మంగళవారం మధ్యాహ్నా సమయంలో (2.45గం.-3గం. ప్రాంతంలో) సైన్యం దుస్తుల్లో సమీప అడవుల నుంచి వచ్చిన బృందం.. టూరిస్టులపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపింది. బాడీక్యామ్లు ధరించిన ముగ్గురు టెర్రరిస్టులు పర్యాటకులను ఒక చోటా చేర్చి.. వివరాలను ఆరా తీసి మరి కాల్చి చంపి ఆ దృశ్యాలను రికార్డు చేశారు. టూరిస్టులు పారిపోతున్న టైంలో స్నైఫర్ ఫైర్ చేశారు. అయితే ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. ఆరుగురు ఉగ్రవాదులు దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ దాడిలో 26 మంది మరణించగా, అనేక మంది గాయపడ్డారు. బైరసర్ వ్యాలీ దగ్గర వాహనాలు లేకపోవడంతో క్షతగాత్రుల తరలింపు మరింత ఆలస్యమైంది. భద్రతా బలగాలు కూడా కాస్త ఆలస్యంగానే అక్కడికి చేరుకున్నట్లు తెలుస్తోంది. ఈలోపు దట్టమైన అడవుల్లోకి ఉగ్రవాదులు పారిపోగలిగారు. జమ్ము కశ్మీర్లోనే అంత్యంత ప్రశాంతమైన పర్యాటక ప్రాంతంగా పేరు ఉన్న బైసరన్ వ్యాలీ.. నిన్నటి దాడితో ఆ పేరుపై నీలినీడలు కమ్ముకునేలా చేసుకుంది.ఎమోషనల్ పోస్టులుపహల్గాం ఉగ్రదాడి గురించి తెలిశాక.. చాలా మంది(సెలబ్రిటీలతో సహా) సోషల్ మీడియాలో బైసరన్ వ్యాలీ అనుభూతుల్ని పంచుకుంటున్నారు. గతంలో తాము అక్కడికి వెళ్లిన సందర్భంలో దిగిన చిత్రాలను షేర్ చేస్తూ.. ఉగ్రదాడిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ప్రశాంతమైన ఆ నేల నెత్తురోడడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉగ్రవాదంపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కేంద్రాన్ని కోరుతున్నారు. 👉: (ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)#baisaranvalley. Kashmir. Had been there 2 years before with family. Can’t imagine today this tragic incidence has happened at the same place. My heart goes out to the victims, their families and all those tourist civilians who lost their life🙏 pic.twitter.com/MabmrYmG5F— Rakesh Banerjee (@RakeshB41201077) April 22, 2025 Most people refer to Baisaran Valley in Pahalgam as "Mini Switzerland" but I prefer to call it by its own name Baisaran. After all, it’s Kashmir, not Switzerland. Why would I compare such a breathtaking place in Kashmir to another country? Baisaran has its own unique charm.. pic.twitter.com/MDLDXl41L7— batukh (@Samaandar_) March 13, 2025 -
పహల్గాం దాడి సూత్రధారి సైఫుల్లా సాజిద్.. పాక్ ఆర్మీ హస్తం?
శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. అనంత్ నాగ్ జిల్లా పహల్గాంలో ముష్కరులు జరిపిన కాల్పుల్లో 28 మంది పర్యాటకులు మృతి చెందారు. అయితే, పహల్గాం దాడి వెనుక సూత్రధారి సైఫుల్లా సాజిద్ ఉన్నట్టు తెలిసింది. దాడులకు పాల్పడింది తామేనని లష్కర్-ఏ-తోయిబా ముసుగు సంస్థ ది రిసిస్టెంట్ ఫ్రంట్ ప్రకటించుకుంది. అంతకుముందు సైఫుల్..లా ముజాహిదీలు కశ్మీర్లో దాడులు చేస్తారని ముందుగానే ప్రకటించాడు. త్వరలో కశ్మీర్ తమ గుప్పిట్లోకి వస్తుందన్న సైఫుల్లా చెప్పుకొచ్చాడు. దానికి సంబంధించిన వీడియోలు బయటకు వచ్చాయి.మరోవైపు.. ఈ దాడుల వెనుక పాకిస్థాన్ హస్తం కూడా ఉన్నట్టు సమాచారం. ఇటీవల పాక్ ఆర్మీ చీఫ్ చేసిన వ్యాఖ్యలు ఇందుకు ఆధారంగా ఉన్నాయి. పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ అసీమ్ మునీర్ మాట్లాడుతూ.. కశ్మీర్ను పాకిస్థాన్ ఎప్పటికీ మర్చిపోదని, కశ్మీరీలను ఒంటరిగా వదిలిపెట్టబోము. ఇస్లామాబాద్కు కశ్మీర్ అంటే గొంతుకు వెళ్లే రక్తనాళం వంటిది. ప్రతీ విషయంలో మనం హిందువులకంటే విభిన్నమైన వారిమని మన పూర్వీకులు నమ్మారు. మన మతం విభిన్నం.మన ఆచారాలు, సంస్కృతులు, ఆలోచనలు, ఆశయాలు పూర్తిగా భిన్నం. అదే రెండు దేశాల సిద్ధాంతానికి పునాది. మనం రెండు విభిన్న దేశాలు, ఒకటి కాదు అని నమ్మారు కాబట్టే ఈ సిద్ధాంతం పుట్టింది. అందుకే పాకిస్థాన్ చరిత్రను మరిపోవద్దని మీ పిల్లలకు కచ్చితంగా చెప్పాలి. ఈ దేశాన్ని ఏర్పాటు చేయడానికి మన పూర్వీకులు చాలా త్యాగాలు చేశారు. మనం కూడా చేశాం. ఈ దేశ చరిత్రను మరిచిపోవద్దని ప్రతిఒక్కరినీ కోరుతున్నాను అంటూ వ్యాఖ్యలు చేశారు.మరోవైపు.. పహల్గాం దాడి ఘటనపై జమ్ముకశ్మీర్ మాజీ డీజీపీ శేష్ పాల్ వైద్ స్పందిస్తూ.. అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై హమాస్ చేసిన దాడి తరహాలో ఉంది. రెండు రోజుల క్రితం పాక్ ఆర్మీ చీఫ్ అసీమ్ మునీస్ భారత్పై చాలా అనుచిత వ్యాఖ్యలు చేశారు. అవేవో యాదృచ్ఛికంగా అన్నమాటలు కావు. ఎందుకంటే ఉగ్రవాదులు పర్యటకుల మతాన్ని అడిగి, ఎవరైతే ముస్లింలు కారో వారిని మాత్రమే చంపారు. హమాస్ దాడిని ఇజ్రాయెల్ ఎలా తిప్పికొట్టిందో, భారత్కు అలానే చేయాలి.#WATCH | #PahalgamTerroristAttack | Jammu, J&K | Former J&K DGP Shesh Paul Vaid says, "This is the Pulwama 2 moment of India. This was a Hamas-style attack on 7 October on Israel. It's not a coincidence that Asim Munir (Pakistan Army chief) uttered illogical words two days back,… pic.twitter.com/7LeIjL2cse— ANI (@ANI) April 23, 2025వాస్తవానికి ఈ ఉగ్రదాడిని పాకిస్థాన్ సైన్యం ప్రారంభించింది. ఎందుకంటే దాడి చేసింది ఉగ్రవాదులు కాదు. ఉగ్రవాదుల ముసుగులో పాకిస్థాన్ సైన్యంలోని ఎస్ఎస్జీ (స్పెషల్ సర్వీస్ గ్రూప్) కమాండోలు ఈ దాడులకు పాల్పడ్డారు. ఇది ఒక పక్కా ప్రణాళిక ప్రకారం జరిగిన దాడి. ఇక మనం చాలా అప్రమత్తంగా ఉండాల్సిందే. వాస్తవానికి ఈ ఉగ్రదాడి అంతా పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ ఆదేశాలతోనే జరుగుతోంది. పైగా ఈ తరహా దాడులను మరింత తీవ్రతరం చేయాలని ఆయన అనుకుంటున్నారు. అతను తానేంటో నిరూపించుకోవాలని ఆరాటపడుతున్నాడు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. -
పహల్గాం ఉగ్రదాడి: జమ్ములో 56 మంది విదేశీ ఉగ్రవాదులు
పహల్గాం ఉగ్రదాడి.. కేంద్రం సీరియస్.. అప్డేట్స్భారత్లో ఉన్న పాక్ పౌరులు వెంటనే వెళ్లిపోవాలి: విక్రమ్ మిస్రీవిదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ మీడియా సమావేశంపాక్ పౌరులను భారత్లోకి అనుమతించేది లేదుపహల్గాం దాడివెనుక పాక్ హస్తం ఉందిమా దగ్గర పూర్తి ఆధారాలున్నాయిఉగ్రదాడిని తీవ్రంగా పరిగణిస్తున్నాంఇండస్ వాటర్ ఒప్పందాన్ని నిలిపేస్తున్నాంఅటారీ-వాఘా సరిహద్దు చెక్పోస్టును మూసివేస్తున్నాంపాక్ తీవ్రవాద స్థావరాలపై భారత్ దాడికి దిగే అవకాశం?“పాక్ ఆక్రమిత్ కాశ్మీర్” (పిఓకే) లో పాక్ తీవ్రవాద స్థావరాలపై భారత్ దాడికి దిగే అవకాశం?“పాక్ ఆక్రమిత కాశ్మీర్” లో 110 నుంచి 125 మంది క్రియాశీలకంగా ఉన్న తీవ్రవాదులుసుమారు 42 “లాంచ్ పాడ్స్” (తీవ్రవాద స్థావరాలు) క్రియాశీలకంగా ఉన్నట్లు సమాచారంఉత్తర కాశ్మీర్ లో క్రియాశీలకంగా ఉన్న 35 మంది తీవ్రవాదులుజమ్మూలో కూడా క్రియాశీలకంగా ఉన్న సుమారు 100 మంది తీవ్రవాదులు. పహల్గాం ఉగ్రదాడిపై ప్రధాని సీరియస్సౌదీ పర్యటన కుదించుకుని వచ్చేసిన ప్రధాని మోదీపాక్ గగనతలంలోకి వెళ్లకుండా మరో మార్గంలో ప్రయాణం. ఫ్లైట్ ట్రాకింగ్ వెబ్సైట్లో ఉన్న దృశ్యాలతో వెల్లడైన విషయం పాక్ నుంచి ముప్పు ఉండొచ్చనే అనుమానాల నడుమ దారి మళ్లింపు ఎయిర్ పోర్టులోనే కీలక సమావేశం నిర్వహణకేంద్ర విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్తో భేటీప్రధాని అధ్యక్షతన భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ భేటీ మరికాసేపట్లో ఉగ్రదాడిలో నేవీ అధికారి మృతి.. కలచివేస్తోన్న నవవధువు కన్నీటి వీడ్కోలు పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన నేవీ అధికారి వినయ్ నర్వాల్ వారం క్రితం వివాహం చేసుకుని భార్యతో కలిసి హనీమూన్కి వచ్చిన అధికారి ఉగ్రదాడిలో మృతి చెందిన ఆయనకు ప్రభుత్వ అధికార లాంఛనాలతో అంత్యక్రియలు కలచి వేస్తోన్న నవ వధువు రోదన Indian Navy Lieutenant Vinay Narwal's wife bids an emotional farewell to her husband, who was killed in the #Pahalgam terror attackThe couple got married on April 16. 💔💔 pic.twitter.com/a83lpg3A40— Venisha G Kiba (@KibaVenisha) April 23, 2025జమ్ములో అత్యధికంగా ఎల్ఈటీ ఉగ్రవాదులు! జమ్ము కశ్మీర్లో 56 మంది విదేశీ ఉగ్రవాదులు అత్యధికంగా లష్కరే తాయిబా(LeT) సభ్యులు ఉన్నారన్న నిఘా వర్షాలు పహల్గాం దాడులు తమ పనేనని ప్రకటించుకున్న ఎల్ఈటీ విభాగం అసిఫ్ ఫౌజీ, సులేమాన్ షా, అబు తల్హా గుర్తింపు ప్రధాన సూత్రధారి సైఫుల్లా సాజిద్? ముజాహిదీలు కశ్మీర్లో దాడి చేస్తారని తరచూ ప్రకటించిన సాజిద్ సాయంత్రం కేబినెట్ కీలక సమావేశంపహల్గాం నుంచి ఢిల్లీకి బయల్దేరిన కేంద్ర హోం మంత్రి అమిత్ షాసాయంత్రం ప్రధాని మోదీ అధ్యక్షతన కేబినెట్ సమావేశంకేబినెట్ భేటీలో కీలక నిర్ణయం ప్రకటించే అవకాశం పహల్గాం ఘటనకు దీటుగా జవాబిస్తాం: రాజ్నాథ్ సింగ్ పహల్గాం ఉగ్రదాడి ఘటనపై మీడియాతో మాట్లాడిన కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పిరికిపంద చర్యగా అభివర్ణించిన రాజ్నాథ్ ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదు : రాజ్నాథ్ఉగ్రవాదాన్ని తుదిముట్టించాలనేది భారత్ విధానం : రాజ్నాథ్ఉగ్రదాడికి పాల్పడిన దోషులను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టబోం.: రాజ్నాథ్పహల్గామ్ ఘటనకు దీటుగా జవాబిస్తాం: రాజ్నాథ్#WATCH | #PahalgamTerrorAttack | Delhi: Raksha Mantri Rajnath Singh says, "Yesterday, in Pahalgam, targeting a particular religion, terrorists executed a cowardly act, in which we lost many innocent lives... I want to assure the countrymen that the government will take every… pic.twitter.com/VhNHD0kO2E— ANI (@ANI) April 23, 2025 ఉగ్ర రక్కసిపై గళమెత్తిన కశ్మీర్.. ఆరేళ్లలో తొలిసారి బంద్! పహల్గాం దాడిని ఖండిస్తూ వీధుల్లోకి వచ్చిన జనం శ్రీనగర్ సహా కశ్మీర్లోని అనేక ప్రాంతాల్లో స్వచ్ఛందంగా బంద్ గతంలో సర్వసాధారణంగా ఉండగా.. ఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీర్లో తొలిసారి బంద్ ఉగ్రదాడి.. పాకిస్థాన్ హైకమిషన్ వద్ద భద్రత కట్టుదిట్టం పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ఢిల్లీలో భద్రత కట్టుదిట్టం పాకిస్థాన్ హైకమిషన్ వద్ద గట్టి సెక్యూరిటీ పక్షపాత రాజకీయాలకు ఇది సమయం కాదు: ఖర్గే పహల్గాం ఉగ్రదాడి మన దేశ ఐక్యత, సమగ్రతపై ప్రత్యక్ష దాడిగా పేర్కొన్న కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో పెకిలించివేసేందుకు కేంద్రంతో సహకరించేందుకు కాంగ్రెస్ కట్టుబడి ఉందని ట్వీట్ జమ్మును వీడుతున్న పర్యాటకులుపహల్గాం దాడి నేపథ్యంలో జమ్ము కశ్మీర్ను వీడుతున్న పర్యాటకులుఉదయం నుంచి 20 విమానాల్లో పైగా తిరుగు ప్రయాణం కిక్కిరిసిపోతున్న రైల్వే స్టేషన్లుకాట్రా నుంచి ప్ర త్యేక రైళ్లుఆరు గంటల్లో కశ్మీర్ను వీడిన 3,300 మంది పర్యాటకులుపర్యాటకులు వీడుతుండడంపై ఆవేదన వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాIt’s heartbreaking to see the exodus of our guests from the valley after yesterday’s tragic terror attack in Pahalgam but at the same time we totally understand why people would want to leave. While DGCA & the Ministry of Civil Aviation are working to organise extra flights,… pic.twitter.com/5O3i5U1rBh— Omar Abdullah (@OmarAbdullah) April 23, 2025 భద్రతా బలగాల అదుపులో పలువురు అనుమానితులు ఉగ్రవాదుల్లో ఇద్దరు కశ్మీరీలే!పహల్గాం ఉగ్రదాడిలో పాల్గొన్న ఉగ్రవాదుల గుర్తింపుఇద్దరు కశ్మీరీలేనని అనుమానిస్తున్న భద్రతా ఏజెన్సీలు2018లో కశ్మీర్ను వదిలి పాక్ వెళ్లిపోయిన అదిల్ గురి, అషన్ఇటీవలే మరో నలుగురితో కలిసి కశ్మీర్లో చొరబడినట్లు అనుమానంఅదిల్, అషన్ గురించి సమాచారం సేకరిస్తున్న భద్రతా బలగాలుపాక్ మద్దతుదారుల నుంచి వీళ్లకు మందు గుండు సామాగ్రి, ఏకే 47లునిల్వ ఆహారం, డ్రైఫూట్స్ ఉంచుకున్నట్లు అనుమానాలుమతాలవారీగా టూరిస్టులను వేరు చేసిన ఉగ్రవాదులుపాయింట్ బ్లాక్ రేంజ్లో టూరిస్టులను కాల్చేసిన టెర్రరిస్టులుహెల్మెట్ మౌంటెడ్ బాడీ కేమ్లతో రికార్డు చేసి పాక్కు చేరవేసి ఉండొచ్చనే అనుమానాలు పాక్ కవ్వింపు చర్యలుపాక్ దొంగ నాటకాలుపహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాక్ కవ్వింపు చర్యలుసరిహద్దు వెంట భారీగా సైన్యం మోహరింపుకశ్మీర్ సరిహద్దులకు యుద్ధ విమానాల తరలింపుకరాచీ నుంచి లాహోర్, రాల్పిండికి యుద్ధ విమానాలుపహల్గాం దాడితో తమకేం సంబంధం లేదని ప్రకటించిన పాక్ ప్రభుత్వందాడి ఘటనను ఖండిస్తూ.. మరణించినవారి కుటుంబాలకు సానుభూతి ప్రకటనమమ్మల్ని నిందించొద్దు అంటూ పాక్ రక్షణ మంత్రి వ్యాఖ్యలుభారత్లో పలు రాష్ట్రాల్లో గొడవలు జరుగుతున్నాయని.. అంతర్గత తిరుగుబాటులే పహల్గాం దాడికి కారణమంటూ ప్రకటనఉగ్రవాదులకు సాయం చేసింది పాక్ ఐఎస్ఐనే పరిహారం ప్రకటించిన జమ్ము ప్రభుత్వంపహల్గాం ఉగ్రదాడి బాధితులకు పరిహారం ప్రకటించిన జమ్ము కశ్మీర్ ప్రభుత్వంమృతులకు రూ.10 లక్షలు, తీవ్రంగా గాయపడినవాళ్లకు రూ.2 లక్షలు, స్వల్పంగా గాయపడిన వాళ్లకు రూ.1 లక్షదాడికి నిరసనగా కశ్మీర్ బంద్కు పిలుపు ఇచ్చిన ప్రజా సంఘాలు పహల్గాం ఊచకోతను ఖండిస్తూ సుప్రీం కోర్టు ఏకగ్రీవ తీర్మానంపహల్గాం ఉగ్రఘటన.. సుప్రీం కోర్టు న్యాయమూర్తుల నివాళి మతిలేని చర్యగా అభివర్ణించిన సర్వోన్నత న్యాయస్థానంఉగ్రదాడి మృతులకు సంతాపంగా మౌనం పాటించిన సుప్రీం కోర్టు న్యాయమూర్తులు, న్యాయవాదులు, సిబ్బంది ఈ దారుణ ఘటనను ఖండించిన సుప్రీం కోర్టు బార్ అసోసియేషన్ ఉగ్రవాదుల ఏరివేతకు కేంద్రం ఆపరేషన్?కశ్మీర్, పీవోకేలో ఉగ్రవాదుల ఏరివేతకు కేంద్రం ఆపరేషన్?ప్రధాని మోదీ, రక్షణ మంత్రి వరుస సమావేశాలుహోం మంత్రి అమిత్ షా క్షేత్రస్థాయి పర్యటనకశ్మీర్ పరిస్థితులను ప్రధాని మోదీకి వివరించిన జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్తో త్రివిధ దళాధిపతుల సమావేశంకేంద్రం ఆదేశాల అమలుకు సిద్ధమంటున్న త్రివిధ దళాధిపతులుపహల్గాం ఉగ్రదాడి ప్రధానాంశంగా.. సాయంత్రం కేంద్ర కేబినెట్ సమావేశంసమావేశం అనంతరం కీలక నిర్ణయం ప్రకటించే అవకాశం పహల్గాంలో కూంబింగ్పహల్గాంలో కొనసాగుతున్న కూబింగ్ఉగ్రవాదుల కోసం కొనసాగుతున్న వేటఒకవైపు.. క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్న బలగాలుమరోవైపు డ్రోన్ల సాయంతో కొనసాగుతున్న గాలింపుఉగ్రవాదుల ఊహా చిత్రాలు విడుదలపహల్గాం దాడికి పాల్పడ్డ ఉగ్రవాదుల ఊహా చిత్రాలు విడుదలముగ్గురి చిత్రాలను విడుదల చేసిన కేంద్రంఅందులో అసిఫ్ అనే ఉగ్రవాదిబాడీ క్యామ్ ధరించి దాడులకు పాల్పడ్డ ఉగ్రవాదులుమొత్తం ఏడుగురు దాడికి పాల్పడినట్లు చెబుతున్న ప్రత్యక్ష సాక్షులుకానీ, దాడికి పాల్పడింది ముగ్గురి నుంచి నలుగురే?దాడులకు పాల్పడింది తామేనంటూ ప్రకటించిన లష్కరే తోయిబా విభాగం ది రెసిస్టెంట్ ఫ్రంట్ పహల్గాం దాడిపై కేంద్రం సీరియస్రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశంప్రస్తుత పరిస్థితిని వివరించిన త్రివిధ దళాధిపతులుప్రతిచర్యకు సిద్ధమని ప్రకటనసాయంత్రం ఆరు గంటలకు కేబినెట్ కీలక సమావేశంమరోవైపు భద్రతా ఉన్నతాధికారులతో ప్రధాని మోదీ భేటీ పలు నగరాల్లో హైఅలర్ట్దేశవ్యాప్తంగా పలు నగరాల్లో హైఅలర్ట్ కశ్మీర్ పహల్గాం దాడితో అప్రమత్తమైన కేంద్రంఢిల్లీ, ముంబై సహా పలు నగరాలకు భద్రతాపరమైన హెచ్చరికలు జారీ చేసిన హోం శాఖ బైసరన్కు అమిత్ షాపహల్గాం బైసరన్కు కేంద్ర హోం మంత్రి అమిత్ షాకాల్పులు జరిపిన ప్రాంతంలో పర్యటించిన షాప్రతి చర్య తప్పదని, ఉగ్రవాదులపై కఠిన చర్యలు ఉంటాయని బాధిత కుటుంబాలకు హోం మంత్రి హామీ నేటి ఐపీఎల్ మ్యాచ్లో సంఘీభావంపహల్గాం ఉగ్రదాడికి సంఘీభావం తెలుపుతున్న ప్రముఖులుఐపీఎల్ క్రికెటర్ల సంఘీభావంఇవాళ హైదరాబాద్ ఉప్పల్లో ఐపీఎల్ మ్యాచ్దాడికి సంఘీభావంగా నల్ల బ్యాడ్జీలు ధరించనున్న ప్లేయర్స్ఒక నిమిషం మౌనం పాటించనున్న ఆటగాళ్లుచీర్గర్ల్స్ ఉండబోరని ప్రకటించిన బీసీసీఐ రంగంలోకి ఎన్ఐఏపహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో రంగంలోకి దిగిన జాతీయ దర్యాప్తు సంస్థ బృందంహోటల్స్, లాడ్జిలను జల్లెడ పడుతున్న అధికారులుదాడి తర్వాత అడవుల్లోకి పరారైనట్లు చెబుతున్న ప్రత్యక్ష సాక్షులుఅయినప్పటికీ పహల్గాంను అదుపులోకి తీసుకుని తనిఖీలు చేపడుతున్న భద్రతా బలగాలుప్రత్యక్ష సాక్షులను ప్రశ్నిస్తున్న ఎన్ఐఏ టీం పలు రాష్ట్రాల్లో పాక్ వ్యతిరేక నిరసనలుపహల్గాం ఉగ్రదాడిని ఖండిస్తూ దేశవ్యాప్త నిరసనలు రోడ్డెక్కిన ప్రజలుపాక్, ఉగ్రవాద వ్యతిరేక నినాదాలతో ర్యాలీలుఉగ్రవాదం నశించాలంటూ ఫ్లకార్డులతో ప్రదర్శన పహల్గాం ఉగ్రదాడిలో((Pahalgam Terror attack) మరణించిన మృతులకు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా నివాళులర్పించారు. బుధవారం ఉదయం శ్రీనగర్ కంట్రోల్ రూంలో సైనిక గౌరవ వందనం నడుమ మృతదేహాలపై పుష్ప గుచ్ఛాలను ఉంచారాయన. అనంతరం దాడిలో గాయపడి అనంత్నాగ్ ఆస్పత్రిలో క్షతగాత్రులను ఆయన పరామర్శించారు. #WATCH | Union Home Minister Amit Shah pays tributes to the victims of the Pahalgam terror attack, in Srinagar, J&K pic.twitter.com/tPRSj4ewUg— ANI (@ANI) April 23, 2025మంగళవారం రాత్రే శ్రీనగర్కు చేరుకున్న హోం మంత్రి అమిత్ షా(Amit Shah).. వివిధ భద్రతా బలగాల ఉన్నతాధికారులతో సమావేశమై పరిస్థితిని సమీక్షించిన సంగతి తెలిసిందే. ఈ సమీక్షలో జమ్ముకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్సిన్హా కూడా పాల్గొన్నారు. ఈ ఉదయం మృతదేహాలకు ఆయన నివాళి అర్పించిన అనంతరం.. ప్రత్యేక విమానాల్లో మృతదేహాలను స్వస్థలాలకు తరలించనున్నారు. మరోవైపు.. పహల్గాం ఘటనకు కారకులైన ఉగ్రవాదుల కోసం వేట కొనసాగుతోంది. అడవుల్లోకి పారిపోయిన ముష్కరుల కోసం డ్రోన్లతో భద్రతా బలగాలు గాలిస్తున్నాయి.జమ్మూకశ్మీర్లోని పహల్గాంలో మంగళవారం ఉగ్రవాదులు తెగబడ్డారు. ప్రకృతి అందాలను చూసి పరవశిస్తోన్న వారిపై పాశవికంగా దాడి చేసి 28 మందిని పొట్టన పెట్టకున్నారు. ఈ ఉగ్రవాద దాడి ఘటనపై ప్రపంచం మొత్తం స్పందించింది. అమాయకులపై జరిగిన ఈ హేయ చర్యను ప్రపంచ నాయకులు ఖండించారు. అమెరికా నుంచి రష్యా వరకు, ఇటలీ నుంచి ఇజ్రాయెల్ వరకు ప్రధాన నేతలు ఈ దాడిని తీవ్రంగా తప్పుబడుతూ, భారత్కు బలమైన సంఘీభావాన్ని ప్రకటించారు. -
జమ్ముకశ్మీర్లో ఎన్కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం
శ్రీనగర్: కశ్మీర్ లోయలో ఉగ్రదాడి ఘటన వేళ బారాముల్లాలో తాజాగా ఎన్కౌంటర్ జరిగింది. భారత సైన్యం జరిపిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమైనట్టు సమాచారం. ఈ క్రమంలో ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు సైన్యం ప్రకటించింది.వివరాల ప్రకారం.. బారాముల్లలో బుధవారం ఉదయం ఎన్కౌంటర్ జరిగింది. భారత సరిహద్దుల నుంచి చొరబాటుకు యత్నిస్తున్న ఇద్దరు ఉగ్రవాదులను సైన్యం హతమార్చింది. ఈ సందర్బంగా ఉగ్రవాదుల నుంచి భారీ స్థాయిలో మందుగుండు సామగ్రి, ఇతర ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు సైన్యం ప్రకటించింది. దీంతో, యూరి సెక్టార్లో కూంబింగ్ కొనసాగుతోంది. J&K | Heavy exchange of fire between security forces and terrorists, two terrorists have been eliminated, infiltration bid foiled by the security forces in the ongoing Operation in Baramulla. Large quantity of weapons, ammunition and other war-like stores have been recovered from… pic.twitter.com/OS3opx8lLg— ANI (@ANI) April 23, 2025 -
కశ్మీర్ ఉగ్రదాడిలో ఇద్దరు ఏపీవాసులు మృతి
శ్రీనగర్/విశాఖపట్నం: జమ్ముకశ్మీర్లోని పహల్గాం సమీప బైసరన్లో జరిగిన ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి వివరాలు బయటకు వస్తున్నాయి. ఈ ఘటనలో విశాఖ వాసి చంద్రమౌళిని ముష్కరులు దారుణంగా హత్య చేసినట్టు తెలిసింది. ఉగ్రవాదులు.. చంద్రమౌళిని వెంటాడి మరీ కాల్చినట్లు సమాచారం.వివరాల ప్రకారం.. పహల్గాంలో మంగళవారం ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారిలో విశాఖ వాసి ఉన్నారు. విశాఖ వాసి చంద్రమౌళిని ఉగ్రవాదులు కాల్చి చంపారు. అతడిని వెంటాడి మరీ కాల్చినట్లు సమాచారం. చంపొద్దని వేడుకున్నా.. మోదీకి చెప్పుకోవాలంటూ విచక్షణా రహితంగా కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. చంద్రమౌళి మృతదేహాన్ని సహచర టూరిస్టులు గుర్తించారు. ఇక, చంద్రమౌళి.. రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి అని తెలిసింది. చంద్రమౌళి బంధువు DSP నాగేశ్వర్ రావు తాజాగా సాక్షితో మాట్లాడుతూ.. ఈ నెల 18న చంద్రమౌళి కశ్మీర్కు బయలుదేరి వెళ్లారు. ఆరుగురు కలిసి విహారయాత్రకి వెళ్లారు. ఇలాంటి దుర్ఘటన చాలా బాధాకరం. ఉగ్రవాద చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ మధ్య గ్రాండ్గా చంద్రమౌళి పుట్టినరోజు వేడుకలు జరిపాం. ఇప్పటికీ మా వదినకి ఆయన చనిపోయిన విషయం తెలియదు. ఉగ్రవాద దాడిలో మృతి చెందిన చంద్రమౌళి సమీప బంధువు కుమార్ రాజా తాజాగా మాట్లాడుతూ..‘ఈనెల 16న ట్రావెల్ ఏజెంట్స్ ద్వారా కశ్మీర్ టూర్కి వెళ్లారు. మొత్తం ఆరుగురు వెళ్లారు. ఈనెల 25 నాటికి తిరిగి రావాల్సి ఉంది. చంద్రమౌళి ఫ్యామిలీతో పాటు అప్పన్న, శశిధర్ ఫామిలీలు వెళ్లాయి. చంద్రమౌళి తప్పించుకునే ప్రయత్నం చేశారు.. కానీ, ముష్కరులు హతమార్చారు. మిగిలిన ఐదుగురు క్షేమంగా ఉన్నట్లు చెప్పారు. మృతదేహం ఇవాళ రాత్రి విశాఖకు తరలిస్తారు. ఆయన ఇద్దరు కుమార్తెలు అమెరికా ఉన్నారు. వారిద్దరూ రేపు.. విశాఖకు చేరుకుంటారు. ఎల్లుండి అంత్యక్రియలు జరుగుతాయి. నెల్లూరు వాసి మృతి..కశ్మీర్లోని పహాల్గామ్లో జరిగిన ఉగ్రదాడిలో కావలికి చెందిన సోమిశెట్టి మధుసూదన్ రావు మృతిచెందాడు. నిన్న జరిగిన ఉగ్రదాడిలో మధుసూదన్ని కాల్చి చంపిన ఉగ్రవాదులు. బెంగళూరులో సాఫ్ట్వేర్గా పనిచేస్తున్న మధుసూదన్. బెంగళూరులో స్థిరపడ్డ మధుసూదన్ కుటుంబ సభ్యులతో విహారయాత్రకు వెళ్ళగా ఈ విషాదకర ఘటన నెలకొంది. కావలి కుమ్మరి వీధిలో సోమిశెట్టి తిరుపాలు పద్మ దంపతుల కుమారుడుగా గుర్తింపు. మృతుడు మధుసూదనన్కు భార్య ఇద్దరు పిల్లలు. నేడు ప్రత్యేక విమానంలో మృతదేహాన్ని చెన్నైకి తరలింపు.. సాయంత్రానికి కావలికి చేరుకోనున్న మధుసూదన్ మృతదేహాం. అతడి తల్లిదండ్రులు హార్ట్ పేషంట్స్ కావడంతో విషయం గోప్యంగా ఉంచిన బంధువులు. -
ఢిల్లీ చేరుకున్న మోదీ.. ఎయిర్పోర్టులోనే ధోవల్తో సమీక్ష!
సాక్షి, ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీ చేరుకున్నారు. కాశ్మీర్లో ఉగ్ర దాడి నేపథ్యంలో ప్రధాని మోదీ.. సౌదీ అరేబియా పర్యటన అర్థాంతరంగా ముగించుకుని భారత్కు పయనమయ్యారు. విమానాశ్రయంలో ప్రధాని మోదీని కలిసి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ ప్రస్తుత పరిస్థితి వివరించారు. ఉగ్రవాదులకు బుద్ధి చెప్పేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ చర్చించనున్నారు. ఇక, ఢిల్లీ చేరుకున్న వెంటనే ప్రధాని మోదీ.. ఎయిర్పోర్టులోనే కశ్మీర్ ఉగ్రదాడిపై సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమీక్ష సమావేశానికి కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్, ఉన్నతాధికారులు హాజరయ్యారు. నేడు పహల్గాంకు అమిత్ షాఘటనాస్థలాన్ని సందర్శించాలన్న ప్రధాని మోదీ ఆదేశంతో హోంమంత్రి అమిత్ షా హుటాహుటిన మంగళవారం రాత్రి శ్రీనగర్కు చేరుకున్నారు. భద్రతా సంస్థల ఉన్నతాధికారులతో సమావేశమై పరిస్థితులను సమీక్షించారు. ఆయన వెంట జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్సిన్హా కూడా ఉన్నారు. బుధవారం అమిత్ షా పహల్గాంకు వెళ్లనున్నారు. ఉగ్రవాదుల దుశ్చర్యపై భారత పర్యటనలో ఉన్న అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ. వాన్స్ సహా పలువురు నేతలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. Prime Minister Narendra Modi arrives in Delhi after cutting short his Saudi Arabia visit in view of the #PahalgamTerroristAttack in Kashmir.NSA Ajit Doval accompanies him. (Source - ANI/DD) pic.twitter.com/PeA7CWRAes— ANI (@ANI) April 23, 2025 -
కశ్మీర్ ఉగ్రదాడిలో నేవీ అధికారి మృతి.. నవవధువు ఆవేదన
శ్రీనగర్: జమ్ము కశ్మీర్లో ఉగ్ర ఉన్మాదం మరోసారి ఒళ్లువిరుచుకుంది. పర్యాటకులపై తూటాల వర్షం కురిసింది. ఉగ్ర ముష్కరులు విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో నేవీ అధికారి లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ (26) కూడా మరణించారు. ఈ విషయాన్ని రక్షణశాఖ అధికారులు ధృవీకరించారు.మినీ స్విట్జర్లాండ్గా పేరొందిన పహల్గాంలోని బైసారన్ ప్రాంతంలో మంగళవారం మధ్యాహ్నం జరిగిన ఉగ్ర దాడిలో 26 మంది పర్యాటకులు మృతిచెందారు. మరో 20 మందికి పైగా గాయపడ్డారు. మృతుల్లో ఇద్దరు విదేశీయులున్నారు. వారిలో ఒకరు నేపాలీ కాగా మరొకరిది యూఏఈ. మరో ఇద్దరు స్థానికులు కాగా మిగతావారు కర్నాటక, మహారాష్ట్ర, గుజరాత్, యూపీ, బీహార్, హర్యానాకు తదితర రాష్ట్రాలకు చెందినవారు.భర్తను కోల్పోయిన నవవధువుపెళ్లయి కాళ్లకు పారాణి ఆరకముందే ఆ నవవధువు జీవితం తలకిందులైంది. భర్తను ఉగ్రవాదులు పొట్టనపెట్టుకోవడంతో ఆ నవవధువు తన భర్త మృతదేహాన్ని పట్టుకుని దిక్కులు పిక్కటిల్లేలా ఏడ్చింది. ఈ మారణకాండలో బలైపోయిన నేవీ అధికారి లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ (26)గా గుర్తించారు. హర్యానాకు చెందిన వినయ్, కొచ్చిలో విధులు నిర్వహిస్తున్నారు. ఏప్రిల్ 16న వివాహం చేసుకున్న ఆయన, హనీమూన్ కోసమో, లేదా సెలవును ఎంజాయ్ చేసేందుకో కశ్మీర్కు వచ్చారు. పెళ్లై కనీసం వారం రోజులు కూడా గడవకముందే, ఆనందంగా గడపాల్సిన సెలవు ఆయన జీవితంలో చివరిది కావడంతో కుటుంబంలోనే కాదు, దేశవ్యాప్తంగా విషాదం అలుముకుంది. ఈ విషయాన్ని రక్షణశాఖ అధికారులు ధృవీకరించారు. ఈ క్రమంలో నవ వధువు రోదిస్తూ..‘మాకు పెళ్లయి కేవలం ఆరు రోజులే అవుతోంది. ఘటన జరిగినప్పుడు మేమిద్దరం పానీపూరీని ఆస్వాదిస్తున్నాం. హఠాత్తుగా ఒక ఉగ్రవాది మా వద్దకు వచ్చాడు. నీ భర్త ముస్లిం కాదు కదా అని అన్నాడు. వెంటనే ఆయన తలకు తుపాకీ గురిపెట్టి కాల్చి వెళ్లిపోయాడు. రక్తపు మడుగులో ఉన్న నా భర్తను ఎవరైనా కాపాడండి’ అంటూ ఏడుస్తున్న హృదయ విదారక వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. 🚨Vinay Narwal, a 26-year-old Indian Navy officer from #Karnal, #Haryana📅 16 April – Lieutenant Vinay got married.📅 19 April – The couple traveled to Kashmir for the their honeymoon📅 22 April – Lieutenant Vinay was tragically killed in a terrorist attack in #Pahalgam https://t.co/n8ElIenhaE pic.twitter.com/6w0qprTnm8— Haryana Development Index (@InfrageoHaryana) April 23, 2025 -
జమ్ముకశ్మీర్లో క్లౌడ్ బరస్ట్.. వరద బీభత్సంతో భయానక వాతావరణం
శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. క్లౌడ్ బరస్ట్ కారణంగా కుండపోత వర్షం కురిసింది. రెండు రోజులుగా ఆగకుండా కురుస్తున్న కుండపోత వానల కారణంగా భారీగా కొండచరియలు విరిగిపడుతున్నాయి. వర్షాల కారణంగా ఇప్పటి వరకు ముగ్గురు మృతిచెందగా.. సుమారు 100 మందిని సహాయక బృందాలు కాపాడాయి. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.వివరాల ప్రకారం.. జమ్ముకశ్మీర్లో భారీ వర్షాలు భీభత్సం సృష్టిస్తున్నాయి. ఎడతెరిపిలేని వర్షాల కారణంగా రాంబన్ జిల్లాలో దాదాపు 40 ఇళ్లు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. కొండ చరియలు విరిగి పడడంతో ప్రధాన మార్గాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. బాగ్నా గ్రామంలో ఇల్లు కూలిపోవడంతో ముగ్గురు మరణించారని సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (SSP) రాంబన్ కుల్బీర్ సింగ్ ధృవీకరించారు. మృతులను మొహమ్మద్ అకిబ్ (14), మొహమ్మద్ సాకిబ్ (9), మోహన్ సింగ్ (75) గా గుర్తించారు. వీరందరూ బాగ్నా పంచాయతీ నివాసితులు.#JammuKashmir | Heavy rainfall in several parts of Bhalessa, Doda#Rainfall pic.twitter.com/8rDEyL8X3l— DD News (@DDNewslive) April 20, 2025 #Ramban | Flash floods triggered by heavy rains hit a village near the Chenab River in Dharamkund, J&K.#JammuKashmir #Dharamkund pic.twitter.com/mrcL9RX7Ja— DD News (@DDNewslive) April 20, 2025మరోవైపు.. చాలా చోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోందని అధికారులు పేర్కొన్నారు. సుమారు 100మందిని సహాయక బృందాలు రక్షించినట్లు అధికారులు తెలిపారు. శిథిలాల కింద వాహనాలు చిక్కుకుపోయినట్లు చెబుతున్నారు. పశ్చిమాసియాలోని ప్రత్యేకమైన వాతవరణ పరిస్థితుల వల్లే జమ్మూలో భారీ వర్షాలు, తుఫాను సంభవించిందని వాతావరణ శాఖ తెలిపింది. ఐదేళ్లలో ఇంత భారీ స్థాయిలో వర్షాలు, బలమై గాలులు వీయడం ఇదే మొదటిసారని పేర్కొంది.#Srinagar #Jammu National Highway is closed for traffic due to landslides & mudslides at multiple locations between Ramban and Banihal.The situation is extremely bad,as several vehicles have been damaged by landslides. Since last evening, #Banihal has received 71 mm of rainfall pic.twitter.com/zPj6hEgAl1— Indian Observer (@ag_Journalist) April 20, 2025ఇదిలా ఉండగా.. భారీ వర్షాల నేపథ్యంలో ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా స్పందిస్తూ.. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలన్నారు. అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్లొద్దని సూచించారు. రాంబన్లో కొండ చరియలు విరిగిపడడం వల్ల తీవ్ర ఆస్తి నష్టం సంభవించిందన్నారు. విపత్తు ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని అన్నారు. ఇక, జిల్లా అంతటా రెండు హోటళ్ళు, అనేక దుకాణాలు, నివాస నిర్మాణాలు దెబ్బతిన్నాయి. రహదారులన్నీ బురదతో నిండిపోయాయి. మహిళలు, పిల్లలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.जम्मू कश्मीर मे बादल फटने से भयंकर तबाहीहजारों लोगों की जान पर आफतजम्मू -श्रीनगर नेशनल हाईवे भारी बारिश और लैंडस्लाइड के कारण बंद करना पड़ा हाईवे पर कीचड़ भरा मालवा आने से इसके नीचे कई गाड़ियां दब गई है#JammuKashmir #jammusrinagarhighway #landslide #rain #ramban pic.twitter.com/wH16tknzWt— Ravi Pandey🇮🇳 (@ravipandey2643) April 20, 2025Five vehicles half buried under debris in T2 Ramban#LANDSLIDE #CLOUDBURST #ramban pic.twitter.com/ucMCDsXvRf— Gulistan News (@GulistanNewsTV) April 20, 2025Flood like situation on Jammu - Srinagar National Highway. Avoid a journey till 22 April.Most affected areas: Banihal, Panthyal, and adjacent areas. pic.twitter.com/QUpZMzx8fX— Kashmir Weather (@Kashmir_Weather) April 20, 2025 -
సరిహద్దుల్లో చొరబాట్లను నిలువరించి.. ఆర్మీ జేసీవో వీరమరణం
జమ్మూ: జమ్మూకశ్మీర్లోని అంతర్జాతీయ సరిహద్దుల వద్ద చొరబాటుదార్లతో జరిగిన ఎదురుకాల్పుల్లో ఆర్మీ జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్(జేసీవో)వీర మరణం పొందారు. అఖ్నూర్ సెక్టార్లోని కేరి భట్టాల్ ప్రాంతంలో శుక్రవారం రాత్రి ఘటన చోటుచేసుకుంది. అత్యాధునిక ఆయుధాలు ధరించిన ఉగ్రవాదులు ఒక ప్రవాహం వద్ద సరి హద్దులు దాటేందుకు యత్నించారు. బలగాలు చేస్తున్న హెచ్చరికలను వారు ఖాతరు చేయలేదు. ఈ సందర్భంగా భీకర ఎదురు కాల్పులు కొనసాగాయి. ఘటనలో జేసీవో సుబేదార్ కుల్దీప్ చాంద్ తీవ్రంగా గాయపడ్డారు. అనంతరం ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారని అధికారులు తెలిపారు. సైన్యం దీటుగా స్పందించగా తోకముడిచిన తీవ్రవాదులు ఆక్రమిత కశ్మీర్లోకి పలాయనమయ్యారు. సుబేదార్ కుల్దీప్ సింగ్ హిమాచల్ ప్రదేశ్కు చెందిన వారు. కాగా, బలగాలను భారీగా తరలించి, ఆ ప్రాంతాన్ని దిగ్బంధించామని అధికా రులు వివరించారు. భారత్, పాక్ బ్రిగేడియర్ కమాండర్ స్థాయి అధికారుల ఫ్లాగ్ మీటింగ్ జరిగిన రెండు రోజులకే ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. ఇదే ప్రాంతంలో ఫిబ్రవరి 11వ తేదీన ఉగ్ర వాదులు అమర్చిన మందుపాతర పేలి ఇద్దరు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. కాగా, ముష్కరులతో జరిగిన పోరులో నేలకొరిగిన కుల్దీప్ సింగ్ చాంద్కు జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది ఘనంగా నివాళులర్పించారు. ఆయన త్యాగం వెల కట్టలేదన్నారు.ఇద్దరు ఉగ్రవాదులు హతంభారీగా మంచుకురుస్తున్న కిష్టవార్ జిల్లాలో కొనసాగుతున్న ఆపరేషన్లో ఇద్దరు ఉగ్రవా దులు హతమైనట్లు శనివారం అధికారులు తెలిపారు. దీంతో, ఛత్రు ప్రాంతంలో మూడు రోజుల వ్యవధిలో ముగ్గురు ఉగ్రవాదులను ఏరివేసినట్లయిందన్నారు. టాప్ కమాండర్ సైఫుల్లా సహా ఈ ముగ్గురూ పాక్ కేంద్రంగా పనిచేసే జైషే మహ్మద్కు చెందిన వారేన న్నారు. వీరి వద్ద అత్యాధుని ఎం–4 కార్బైన్, ఏకే సిరీస్ రైఫిళ్లను, భారీగా పేలుడు సామగ్రి ని స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ నెల 9వ తేదీన చేపట్టిన గాలింపు చర్యలు కొనసా గిస్తున్నామని స్పష్టం చేశారు. ఉధంపూర్ జిల్లాలోని బసంత్గఢ్, రామ్నగర్ ప్రాంతాల్లో నూ బుధవారం నుంచి ఉగ్రవాదుల కోసం గాలింపు మొదలైందని చెప్పారు. -
సరిహద్దుల్లో ఎలక్ట్రానిక్ నిఘా వ్యవస్థ
జమ్మూ: దేశ సరిహద్దుల పరిరక్షణకు ఎలక్ట్రానిక్ సర్వైలెన్స్ సిస్టమ్ను మోహరిస్తున్నట్లు హోం మంత్రి అమిత్ షా తెలిపారు. జమ్మూకశ్మీర్లోకి ఉగ్రవా దుల అక్రమచొరబాట్లను తిప్పికొట్టేందుకు, సరిహ ద్దుల్లో అండర్గ్రౌండ్ టన్నెళ్లను గుర్తించేందుకు సాంకేతికతను వినియోగిస్తున్నామన్నారు. సరిహ ద్దుల కు ఆవలి వైపు ఎలాంటి అనుమా నాస్పద కదలి కలున్నా ఈ నిఘా వ్యవస్థ కనిపెట్టి తక్షణమే స్పందిస్తుందన్నారు. జమ్మూకశ్మీర్లో మూడు రోజుల పర్యటనకు సోమవారం ఇక్కడికి ఆయన చేరుకు న్నారు. ఈ సందర్భంగా కథువా జిల్లాలో అంతర్జాతీయ సరిహద్దుల్లో ఉన్న ‘వినయ్’ బోర్డర్ పో స్టును సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడున్న బీఎస్ఎఫ్ జవాన్లతో మాట్లాడారు. అత్యంత సవాళ్లతో కూడిన పరిస్థితుల మధ్య విధులను సమర్థమంతంగా నిర్వహిస్తున్న జవా న్లను ఆయన ప్రశంసించారు. వానలు, భీకరమైన చలి, ఎండలను సైతం లెక్కచేయకుండా 365 రోజు లూ బోర్డర్ పోస్టుల్లో విధులు కొనసాగిస్తూ శత్రువుల కదలికలపై ఓ కన్నేసి ఉంచుతున్నారంటూ ప్రశంసించారు. ఇక్కడికి వచ్చి చూసిన వారికే జవాన్ల కష్టం ఏమిటో తెలుస్తుందంటూ వ్యాఖ్యానించారు. అమరుల సంతానానికి ఉద్యోగాలుఅనంతరం మంత్రి అమిత్ షా రాజ్భవన్లో ఉగ్రవాదులతో పోరాటంలో నేలకొరిగిన 10 మంది పోలీసులు, ఒక ఇంజనీర్ కుటుంబ సభ్యులతో మాట్లాడారు. వారికి సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా కారుణ్య ప్రాతిపదికన మందికి ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు. ఇటీవల కథువా జిల్లాలో పాక్ ఉగ్రవాదులతో జరిగిన పోరులో నేలకొరిగిన నలుగురు పోలీసు కుటుంబాల వారు కూడా వీరిలో ఉన్నారు. వీరమరణం పొందిన జశ్వంత్ సింగ్ కుమారుడు 12 ఏళ్ల యువరాజ్ సింగ్ కూడా కారుణ్య నియామక పత్రం అందుకున్నాడు. మేజర్ అయ్యాక ఇతడి నియామ కానికి అనుకూలమైన చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి కోరారు. -
జమ్ము కశ్మీర్లో ఎల్జీ సిన్హా Vs సీఎం ఒమర్.. కేంద్రానికి వార్నింగ్
శ్రీనగర్: జమ్మూకశ్మీర్ పరిపాలనా సర్వీస్(జేకేఏఎస్)కు చెందిన 48 మంది అధికారులను లెఫ్టినెంట్ గవర్నర్(ఎల్జీ)మనోజ్ సిన్హా బదిలీ చేయడం వివాదాస్పదంగా మారింది. పరిపాలనా సంబంధమైన అంశాల్లో ఇప్పటికే రాజ్భవన్, ఒమర్ అబ్దుల్లా ప్రభుత్వం మధ్య కొనసాగుతున్న విభేదాలకు ఇది ఆజ్యం పోసినట్లయింది. దీన్ని సీరియస్గా తీసుకున్న సీఎం అబ్దుల్లా కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఎల్జీ సిన్హా, చీఫ్ సెక్రటరీ అటల్ దుల్లూకు లేఖలు రాశారు. అందులో పలు అంశాలను ప్రస్తావించారు.ఈ సందర్బంగా లేఖలో.. ఎన్నికైన ప్రభుత్వ అధికారాన్ని కాదని ఎల్జీ జారీ చేసిన ఉత్తర్వులకు ఎలాంటి చట్టబద్ధత లేదని అందులో పేర్కొన్నారు. ట్రాన్సాక్షన్ ఆఫ్ బిజినెస్ రూల్స్కు వెంటనే ఖరారు చేయాలని కోరారు. అధికారులను ఏకపక్షంగా బదిలీ చేయడంపై సమీక్ష చేపట్టాలని ఎల్జీకి రాసిన లేఖలో సీఎం ఒమర్ అబ్దుల్లా పేర్కొన్నారు. సీఎం అనుమతి లేకుండా అఖిల భారత సర్వీసేతర అధికారులను బదిలీ చేయవద్దని చీఫ్ సెక్రటరీని కోరారు. ఈ అంశంపై చర్చించేందుకు శుక్రవారం డిప్యూటీ సీఎం సురీందర్ చౌదరి నివాసంలో జరిగిన అత్యవసర భేటీలో సీఎం ఒమర్తోపాటు ఎన్సీ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా పాల్గొన్నారు. హోం మంత్రి అమిత్ షా పర్యటన వేళ ఈ పరిణామాలు చోటుచేసుకోవడం గమనార్హం.ఈ క్రమంలోనే ‘ఇప్పటికే అనేకసార్లు చెప్పాం. ఇదే చిట్టచివరి విజ్ఞప్తి. ఇక మా సహనాన్ని పరీక్షించొద్దు’అని నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ)ప్రతినిధి, ఎమ్మెల్యే జడిబల్ తన్వీర్ సాదిఖ్ అనంతరం మీడియా ఎదుట వ్యా ఖ్యానించారు. తమ సహకార వైఖరిని, మౌ నాన్ని బలహీనతగా భావించరాదని పేర్కొ న్నారు. ఈ సమావేశంలో వక్ఫ్ బిల్లును పార్లమెంట్ ఆమోదించడాన్ని ఖండిస్తూ తీర్మానించిందని, అదేవిధంగా, ప్రజలిచ్చిన తీర్పును గౌరవించాలంటూ ఎల్జీకి హితవు పలుకుతూ మరో తీర్మానం చేసిందని ఆయన తెలిపారు. పరిధిని అతిక్రమించలేదు: ఎల్జీ అధికార పార్టీ ఎమ్మెల్యేల అత్యవసర సమావేశం చేసిన తీర్మానంపై ఎల్జీ సిన్హా దీటుగా స్పందించారు. ‘జమ్మూ కశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని 2019లో పార్లమెంట్ ఆమోదించింది. ఈ చట్టం పరిధిని అతిక్రమించి నేను ఎలాంటి చర్యలు తీసుకోలేదనే విషయాన్ని స్పష్టం చేయదల్చుకున్నా. నా పరిధి, నా పరిమితులు నాకు బాగా తెలుసు. అంతకుమించి ఎన్నడూ ఏమీ చేయలేదు’అని న్యూస్18కిచ్చిన ఇంటర్వ్యూలో ఆయన స్పష్టం చేశారు. -
హద్దు మీరిన పాక్ సైన్యం... బుద్ధి చెప్పిన భారత జవాన్లు
జమ్మూ: పాకిస్తాన్ సైన్యం మరోసారి హద్దు మీరింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ భారత భూభాగంపై కాల్పులు జరిపింది. అప్రమత్తమైన భారత సైన్యం గట్టిగా బదులివ్వడంతో పాక్ సైన్యం తోకముడిచింది. జమ్మూకశ్మీర్లోని పూంచ్ జిల్లాలో నియంత్రణ రేఖ(ఎల్ఓసీ) వద్ద ఈ ఘటన జరిగినట్లు భారత సైనిక అధికార ప్రతినిధి బుధవారం వెల్లడించారు. మంగళవారం మధ్యాహ్నం 1.10 గంటలకు ఎల్ఓసీ వద్ద కృష్ణా ఘాటీ సెక్టార్లో తొలుత మందుపాతర పేలుడు సంభవించిందని, ఆ తర్వాత పాక్ భూభాగం నుంచి ఎలాంటి హెచ్చరికలు లేకుండానే కాల్పులు మొదలయ్యాయని అన్నారు. అక్కడే విధుల్లో ఉన్న భారత సైన్యం వెంటనే అప్రమత్తమై ఎదురు కాల్పులు జరిపిందని తెలిపారు. భారత సైన్యం నుంచి తీవ్రమైన ప్రతిఘటన ఎదురుకావడంతో చేసేది లేక పాక్ సైన్యం వెనక్కి తగ్గిందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఎల్ఓసీ వద్ద పరిస్థితి నియంత్రణలోనే ఉందని స్పష్టంచేశారు. ఎల్ఓసీ వెంట భారత సైన్యం పట్టు కొనసాగుతోందని తెలియజేశారు. అయితే, ఈ కాల్పుల ఘటనలో పాక్ సైన్యానికి ఏమైనా ప్రాణనష్టం వాటిల్లిందా? అనేది బయటపెట్టలేదు. ఐదుగురు పాక్ జవాన్లు గాయపడినట్లు సైనిక వర్గాలు వెల్లడించాయి. -
జమ్ములో కొనసాగుతున్న ఉగ్ర వేట.. నలుగురు పోలీసుల వీరమరణం
శ్రీనగర్: జమ్ముకశ్మీర్లోని కథువా జిల్లాలో ఉగ్రవాదుల వేట కొనసాగుతోంది. ఇప్పటికే ఇద్దరు ముష్కరులను మట్టుబెట్టగా.. మరికొందరి కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. మరోవైపు ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో నలుగురు పోలీసులు వీరమరణం చెందారు. డీఎస్పీ అధికారి సహా మరో ముగ్గురు సిబ్బందికి ఆస్పత్రిలో చికిత్స అందుతోంది.రాజ్బాగ్ ప్రాంతంలోని జఖోలె గ్రామం వద్ద గురువారం ఈ ఎన్కౌంటర్ జరిగింది. పాక్ భూభాగం నుంచి దొంగచాటుగా చొరబడిన ఉగ్రవాదుల ఏరివేతకు చేపట్టిన కార్డన్ ఆపరేషన్ సుదీర్ఘ ఎదురు కాల్పులకు దారి తీసింది. ఇంకా నలుగురు ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు.ఇదిలా ఉంటే.. ఆదివారం సాయంత్రం కథువా జిల్లా హిరానగర్ సెక్టార్లో జమ్మూకశ్మీర్ స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ (ఎస్వోజీ)కి ఎదురుపడ్డ ఉగ్రవాదుల గ్రూపు తప్పించుకుపోయింది. ఘటనాప్రాంతంలో ఎం4 కార్బైన్ తపాకులు నాలుగు, గ్రనేడ్లు 2, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ఒకటి, ఐఈడీ సామగ్రి అక్కడ లభించాయి. శనివారం వీరు లోయమార్గం గుండా, లేదా కొత్తగా నిర్మించిన సొరంగం గుండా చొరబడి ఉంటారని భావిస్తున్నారు. అప్పటి నుంచి డ్రోన్లు, హెలికాప్టర్లు, బుల్లెట్ప్రూఫ్ వాహనాలు, జాగితాలతో వేటాడుతూనే ఉన్న ఎస్వోజీ అక్కడికి 30 కిలోమీటర్ల దూరంలో గురువారం వారి జాడను పసిగట్టింది. ఈ సందర్భంగా చోటుచేసుకున్న ఎదురుకాల్పుల్లో తుపాకీ కాల్పులు, బాంబు పేలుళ్లతో సుఫైన్ గ్రామ సమీప దట్టమైన అటవీ ప్రాంతం దద్దరిల్లుతోంది. పోలీసులకు తోడు ఆర్మీ, సీఆర్పీఎఫ్ను కూడా ఉన్నతాధికారులు అక్కడికి తరలించారు. -
కశ్మీర్లో భీకర ఎన్కౌంటర్
జమ్మూ: జమ్మూకశ్మీర్లోని కథువా జిల్లాలో చోటుచేసుకున్న భీకర ఎన్కౌంటర్లో ముగ్గురు పోలీసులు వీరమరణం పొందగా మరో ఇద్దరు గాయపడ్డారు. ఘటనలో ఇద్దరు ఉగ్రవాదులు కూడా హతమయ్యారు. పాక్ భూభాగం నుంచి దొంగచాటుగా చొరబడిన ఐదుగురు ఉగ్రవాదుల ఏరివేతకు చేపట్టిన కార్డన్ ఆపరేషన్ సుదీర్ఘ ఎదురు కాల్పులకు దారి తీసింది. రాజ్బాగ్ ప్రాంతంలోని జఖోలె గ్రామం వద్ద గురువారం ఈ ఎన్కౌంటర్ జరిగింది. ఆదివారం సాయంత్రం కథువా జిల్లా హిరానగర్ సెక్టార్లో జమ్మూకశ్మీర్ స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ (ఎస్వోజీ)కి ఎదురుపడ్డ ఉగ్రవాదుల గ్రూపు తప్పించుకుపోయింది. ఘటనాప్రాంతంలో ఎం4 కార్బైన్ తపాకులు నాలుగు, గ్రనేడ్లు 2, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ఒకటి, ఐఈడీ సామగ్రి అక్కడ లభించాయి. శనివారం వీరు లోయమార్గం గుండా, లేదా కొత్తగా నిర్మించిన సొరంగం గుండా చొరబడి ఉంటారని భావిస్తున్నారు. అప్పటి నుంచి డ్రోన్లు, హెలికాప్టర్లు, బుల్లెట్ప్రూఫ్ వాహనాలు, జాగితాలతో వేటాడుతూనే ఉన్న ఎస్వోజీ అక్కడికి 30 కిలోమీటర్ల దూరంలో గురువారం వారి జాడను పసిగట్టింది. ఈ సందర్భంగా చోటుచేసుకున్న ఎదురుకాల్పుల్లో తుపాకీ కాల్పులు, బాంబు పేలుళ్లతో సుఫైన్ గ్రామ సమీప దట్టమైన అటవీ ప్రాంతం దద్దరిల్లుతోంది. పోలీసులకు తోడు ఆర్మీ, సీఆర్పీఎఫ్ను కూడా ఉన్నతాధికారులు అక్కడికి తరలించారు. -
Kashmir: హురియత్ దుకాణం బంద్.. వేర్పాటువాదుల నోటికి తాళం
న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్లో హురియత్(Hurriyat) దుకాణం మూతపడనుంది. ఇక్కడి జనం వేర్పాటువాదానికి స్వస్తిపలికి, భారత రాజ్యాంగంపై తమ విధేయతను ప్రకటిస్తున్నారు. కశ్మీర్లో చోటుచేసుకుంటున్న ఈ పరిణామాలు వేర్పాటువాదానికి ముగింపు పలికేలా కనిపిస్తున్నాయి. హురియత్ కాన్ఫరెన్స్లోని భాగస్వామ్య పార్టీలైన జమ్ము అండ్ కశ్మీర్ పీపుల్స్ మూవ్మెంట్ (జేకేపీఎం), జే అండ్ కే డెమోక్రటిక్ పొలిటికల్ మూవ్మెంట్ (జేకేకేపీఎం) ఇకపై వేర్పాటువాదంతో తమకున్న అన్ని సంబంధాలను తెంచుకుంటున్నట్లు ప్రకటించాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు.ఇది భారతదేశ ఐక్యతను బలోపేతం చేస్తుందని అమిత్ షా పేర్కొన్నారు. జేకేపీఎంకు షాహిద్ సలీం నాయకత్వం వహిస్తుండగా, జేకేడీపీఎంకు న్యాయవాది షఫీ రేషి సారధ్యం వహిస్తున్నారు. ఇటీవల షాహిద్ సలీం తాను, తన సంస్థ వేర్పాటువాద భావజాలానికి దూరం అయ్యామని, భారతదేశ రాజ్యాంగంపై విధేయతను కలిగి ఉంటానని ప్రతిజ్ఞ చేస్తున్నానని ఒక ప్రకటనలో తెలిపారు. Separatism has become history in Kashmir.The unifying policies of the Modi government have tossed separatism out of J&K. Two organizations associated with the Hurriyat have announced the severing of all ties with separatism.I welcome this step towards strengthening Bharat's…— Amit Shah (@AmitShah) March 25, 2025ఎన్డీటీవీ అందించిన కథనంలోని వివరాల ప్రకారం సలీం, రేషి నిర్ణయాలను స్వాగతించిన కేంద్ర హోం మంత్రి షా(Union Home Minister Shah) మాట్లాడుతూ వారు తీసుకున్ననిర్ణయం భారతదేశ ఐక్యతను బలోపేతం చేస్తుందని, ప్రధాని మోదీ ప్రభుత్వంలోని సమైక్యత విధానాలు జమ్ముకశ్మీర్లో వేర్పాటువాదాన్ని అంతం చేశాయని అన్నారు. ఈ విషయాన్ని ఆయన తన ‘ఎక్స్’ ఖాతాలో రాశారు. శాంతియుతమైన సమగ్ర భారతదేశాన్ని నిర్మించాలనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కలకు అందిన అతి పెద్ద విజయం ఇది అని అమిత్ షా పేర్కొన్నారు.ఇది కూడా చదవండి: మందుబాబులకు పండుగ.. ఒకటికి మరొకటి ఫ్రీ.. రూ. 200 డిస్కౌంట్ -
రంజాన్ వేళ కశ్మీర్లో అర్ధనగ్న ఫ్యాషన్ షో.. సీఎం ఒమర్కు ఝలక్!
శ్రీనగర్: పవిత్ర రంజాన్ మాసం వేళ జమ్ము కశ్మీర్లో అర్ధనగ్న ఫ్యాషన్ షో తీవ్ర దుమారం రేపుతోంది. ఫ్యాషన్ షోలో మహిళలు, పురుషులు పొట్టి పొట్టి దుస్తులతో తెల్లటి మంచుపై ర్యాంప్ వాక్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో పర్యాటకంపై ప్రచారం పేరుతో ఈ అశ్లీల ప్రదర్శన ఏమిటని విపక్షాలు, ప్రజలు.. ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.ఈ నేపథ్యంలో కశ్మీర్లో నిర్వహించిన ఫ్యాషన్ షో కార్యక్రమంపై సీఎం ఒమర్ అబ్దుల్లా స్పందించారు. పవిత్ర రంజాన్ మాసంలో ఇలాంటి ఫ్యాషన్ షో జరగడం పట్ల ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు. ప్రజల కోపాన్ని తాము అర్థం చేసుకున్నట్లు చెప్పారు. తన కార్యాలయం స్థానిక అధికారులతో సంప్రదింపులు జరుపుతోంది. ఈ పరిణామంపై 24 గంటల్లోగా నివేదిక ఇవ్వాలని అధికారులకు ఆదేశించారు. నివేదిక తర్వాత చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.మరోవైపు.. ఈ ఫ్యాషన్ షో వ్యవహారం అటు జమ్ము కశ్మీర్ అసెంబ్లీని సైతం తాకింది. రంజాన్ వేళ ఇలాంటి కార్యక్రమాలు ఎలా నిర్వహిస్తారని ప్రతిపక్ష నేతలు ఒమర్ ప్రభుత్వంపై మండిపడ్డారు. దీంతో, అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. A fashion show in Gulmarg has ignited controversy in J&K, with critics calling it "obscene" for being held during Ramzan. pic.twitter.com/4P77B8mtbf— Briefly (@Brieflybynewj) March 10, 2025ఇదిలా ఉండగా.. అంతకుముందు ఉత్తర కశ్మీర్ గుల్మార్గ్లోని ప్రముఖ స్కై రిసార్టులో ఆదివారం ప్రభుత్వ అధికారుల ఆధ్వర్యంలో ఫ్యాషన్ షో నిర్వహించారు. ఇందులో పాల్గొన్నవారు రెచ్చగొట్టే తరహాలో దుస్తులు ధరించారని స్థానిక మత పెద్దలతో పాటు హురియత్ కాన్ఫరెన్స్ చీఫ్ మిర్వాయిజ్ ఉమర్ ఫారూక్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది దారుణంగా ఉందని విమర్శించారు. ఫ్యాషన్ షోకు సంబంధించిన చిత్రాలు, వీడియో తమను దిగ్భ్రాంతికి గురి చేశాయని అన్నారు. సూఫీ, సాధు సంస్కృతి, ప్రజల మతపరమైన దృక్పథానికి పేరుగాంచిన లోయలో దీన్ని ఎలా సహించాలి? ఇందులో పాల్గొన్న వారిని వెంటనే జవాబుదారీగా చేయాలి అని మండిపడ్డారు.#Watch: Noisy scenes in J&K #assembly over #Kathua killings, #Gulmarg fashion show pic.twitter.com/R80BG1YQ7A— Greater Kashmir (@GreaterKashmir) March 10, 2025 -
పసికూనలకు రక్షణ..లా
పసిపిల్లలకు భయం ఎక్కువ. ఆ భయాన్ని వాడుకునే నీడలు ఎక్కువ. నీడలు వారిని బంధిస్తాయి వారితో చెడు పనులు చేస్తాయి వారి పసితనాన్ని అశుభ్రం చేస్తాయి.నీడలు ఈ పనికి దేవుణ్ణో, దెయ్యాన్నో తోడు తెచ్చుకుంటాయి. తల్లిదండ్రులు స్వయంగా తీసుకెళ్లి అమాయకత్వంతోనో మూర్ఖత్వంతోనో పిల్లల్ని ఈ నీడలకు అప్పగిస్తారు. పిల్లలు పులి నోటికి చిక్కుతారు. న్యాయం ఎప్పుడోగాని ఉదయించదు. జమ్ము–కశ్మీర్లో మంత్రాల పేరు చెప్పి పిల్లలను లైంగికంగా వేధించిన బాబాకుశిక్ష విధిస్తూ న్యాయమూర్తి ఉద్వేగంగా కవిత రాశారు. భయం లేని వేకువకై ప్రార్థించారు.జనవరి, 2021.మదనపల్లె ఘటన అందరికీ గుర్తుంది. మూఢ విశ్వాసం నెత్తికెక్కి ఇద్దరు ఎదిగొచ్చిన కుమార్తెల ఉసురు తీశారు తల్లిదండ్రులు. చనిపోయాక వారు సత్యయుగంలో జన్మిస్తారట. అందుకోసమని బతికుండగానే సమాధి చేశారు.ప్రాణం పోయడం దైవం. ప్రాణం తీయడం దెయ్యం.అక్టోబర్, 2024.చత్తిస్గఢ్లోని శక్తి జిల్లా.తల్లి తన ఇద్దరు కుమార్తెలతో కలిసి ఇద్దరు కుమారులను గొంతు పిసికి చంపేసింది. తర్వాత ఉజ్జయినీ నుంచి తెచ్చుకున్న ఒక ‘గురువు’ ఫొటో పెట్టుకొని ఆ చనిపోయిన కుమారులనుప్రాణాలతో లేచేందుకు మంత్రాలు చదవడం మొదలెట్టింది. ఇదంతా ఆమె తంత్ర సాధనలో భాగమట.కడుపున పుట్టిన వారినే కాటేసే గుడ్డితనమే అంధ విశ్వాసం.జూన్, 2024.తమిళనాడులోని అలియలూరు జిల్లా.లేక లేక మనవరాలు పుడితే ఆ పుట్టిన శకునం బాగ లేదని స్వయంగా తాతే ఆ పసికూన ప్రాణాలు తీశాడు. ఆ శకునం కుటుంబానికి హానికారక సూచన కనుక ఈ పని చేశాడట.చేతులతో పూజ చేయడం భక్తి. అదే చేతులతో పీక పిసకడం మూఢ భక్తి.ఫిబ్రవరి 18, 2025.జమ్ము–కశ్మీర్లోని సొపోర్ నగర కోర్టులో చీఫ్ జ్యూడిషియల్ మెజిస్ట్రేట్ మీర్ వజాహత్ ఒక 123 పేజీల తీర్పును వెలువరించారు. ఆ తీర్పు అంతా మూఢ విశ్వాసాల వల్ల చిన్నపిల్లల మీద సాగుతున్న దౌర్జన్యాల పట్ల, అకృత్యాల పట్ల ఆవేదన. కారణం? ఆ తీర్పు ఏజాజ్ అహ్మద్ అనే దొంగబాబా పసిపిల్లల మీద సాగించే అకృత్యాల మీద కావడం. ఈ ఘోరాన్ని ఆ బాబా ఏళ్ల తరబడి కొనసాగిస్తూ ఉండటం. విషయం తెలియకనే తల్లిదండ్రులు అందులో భాగం కావడం.ఏం జరిగింది?జమ్ము–కశ్మీర్లో ‘పీర్ బాబా’గా పేరుబడ్డ ఏజాజ్ షేక్ దగ్గరకు చాలా మంది తమ దైనందిన బాధల నుంచి విముక్తి కోసం వచ్చేవారు. అనారోగ్యం, ఆర్థిక బాధలు, తగవులు... వీటికి విరుగుడు కోసం ఆయన దగ్గరకు మంత్ర తంత్రాలకు వచ్చేవారు. అయితే ఇక్కడే ఆ బాబా ఒక చిట్కా పాటించేవాడు– ‘మీ కష్టాలు పోవడానికి దైవ సహాయం కంటే ‘జిన్ను’ (భూతం)ల సాయం మంచిది. జిన్నులతో మాట్లాడి పరిష్కారం చేస్తాను. అయితే జిన్నులు పెద్దల కంటే పిల్లలతో మాట్లాడటానికి ఇష్టపడతాయి. మీరు మీ పిల్లల్ని (అబ్బాయిల్ని) తెచ్చి నాకు అప్పగిస్తే తంత్రాలు ముగిశాక మళ్లీ మీకు అప్పగిస్తాను’ అనేవాడు. అమాయక/ఆశబోతు తల్లిదండ్రులు ఈ మాటలు నమ్మి తమ పిల్లల్ని బాబా దగ్గరకు తీసుకెళ్లేవాళ్లు. పదేళ్లలోపు మగపిల్లలుఈ బాబా చేతిలో బాధితులుగా మారిన వారందరూ పదేళ్ల లోపు అబ్బాయిలే. బాబా వారిని పూజ పేరుతో నగ్నంగా మార్చి అసహజ లైంగిక కార్యకలాపాలకు పాల్పడేవాడని ప్రాసిక్యూషన్ నిరూపించగలిగింది. పిల్లల్ని భయపెట్టేందుకు బాబా తనలోనే ‘జిన్’ ఉందని, అది అన్ని కష్టాల నుంచి దూరం చేస్తుందని, కోరికలు నెరవేరుస్తుందని చెప్పి లైంగిక వాంఛలు తీర్చుకునేవాడు. కొందరు పిల్లలు నాలుగైదు ఏళ్లపాటు ఇతని వల్ల బాధ పడ్డారు. భయం వల్ల, ఆ బాబా స్కూల్ టీచర్ కూడా కావడం వల్ల నోరు మెదపలేక తల్లిదండ్రులు బాబా దగ్గరికెళ్దామంటే వారు మొండికేయడం మొదలెట్టారు. అప్పుడు గాని పెద్దలకు అనుమానం రాలేదు. ఒక బాలుడు తెగించి తండ్రికి జరిగేది చెప్పడంతో బండారం బయటపడింది.శిక్ష పడింది2016లో బాబా అకృత్యాలు బయటపడి బేడీలు పడ్డాయి. అప్పటి నుంచి జైలులో శిక్ష అనుభవిస్తున్న బాబాకు ఫిబ్రవరి 18న న్యాయమూర్తి మీర్ వజాహత్ 14 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, లక్ష రూపాయల జరిమానా విధించారు. అంతేకాదు భక్తి, విశ్వాసాలను జనం బలహీనతగా ఎంచి దొంగ వేషగాళ్లు పసిపిల్లలను కబళించడంపై న్యాయమూర్తి తీవ్రమైన ఆవేదన, ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి బాబాలు మొత్తం విశ్వాస ప్రపంచానికి విఘాతం కలిగిస్తారన్నారు. ఈ విషయంలో తల్లిదండ్రులు చాలా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయన ఈ మొత్తం కేసు మీద ఒక లోతైన, సంకేతపూర్వకమైన కవిత రాశారు. ఎంత కదిలిపోతే ఇంత గాఢమైన కవిత వస్తుందనే ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతోంది. జస్టిస్ మీర్ వజాహత్ రాసిన కవితవిశ్వాసపు గుసగుసలు... భయవిహ్వల పెనుకేకలువెలుగు దుస్తులు ధరించి నిలిచిన వాడుకారు చీకటిలో దారి చూపుతానని మాటిచ్చాడుగుసగుసగా మంత్రాలు జపిస్తూ తన పవిత్ర హస్తాలతోఅంగలార్చే నేలలో విశ్వాసపు బీజాన్ని నాటాడుసాంత్వనకై వెదుకుతూ అభయానికై తపిస్తూవి΄్పారిన నేత్రాలతో చేరవచ్చిందొక పసితనంకానీ ఆ వెలుగుల మాటున చీకటి నీడలుగడ్డకట్టిన మంచులా వణికించిన గుసగుసలు‘భూతమంటే భయమేలే కానీ నాపై నమ్మకముంచునిన్ను బయటపడేసే తాళంచెవి నా దగ్గరుంది’పవిత్ర వేషంలో మాటలే సంకెళ్లుఇక గొంతు దాటని రోదన... విశ్వాసం గల్లంతుచెప్పినట్టు, తాకినట్టు, దయగా చూసినట్టుమాయామంత్రాల మత్తుగాలి... ఆశలను బూడిద చేస్తూకానరాని వలయాల్లో సుళ్లు తిరిగిన ఉత్త మాటలుఇక మిగిలింది కలవర పెట్టే పీడకలలుఏళ్లు గడిచిపోతాయి... పుళ్లు సలుపుతూనే ఉంటాయికాని ఆ నొప్పి వెనుక దాగి వెంటాడే ఆనాటి గుసగుసలుచీలికలైనదేదీ అతుకు పడనే లేదునిబద్ధమై ఉండాల్సిన ఆత్మ గాలివాటుగా పరిభ్రమిస్తూకాని నిజం తలెత్తుకుని నిలబడుతుందిజాతకాలు తలకిందులవుతాయిన్యాయానికి ఎదురు నిలవక నీడలు చెదిరిపోతాయిగాయాల ఆనవాళ్లు మాసిపోవేమోలే కానీభయం లేని వేకువలో భళ్లున తెల్లారుతుంది -
ఉగ్ర లింకులున్న ముగ్గురు ఉద్యోగుల తొలగింపు
జమ్మూ: ఉగ్ర మూకలతో సంబంధాలున్నట్లు తేలడంతో పోలీసు కానిస్టేబుల్ సహా ముగ్గురు ఉద్యోగులను జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా శనివారం విధుల నుంచి తొలగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. వీరిలో పోలీస్ కానిస్టేబుల్ ఫిర్దౌస్ అహ్మద్ భట్, స్కూల్ టీచర్ అష్రాఫ్ భట్, అటవీ శాఖ ఉద్యోగి నిసార్ అహ్మద్ ఖాన్ ఉన్నారు. నిసార్ అహ్మద్ ఖాన్ 2000వ సంవత్సరంలో నేషనల్ కాన్ఫరెన్స్కు చెందిన మంత్రి హత్య కేసులో అరెస్టయ్యాడు. ఇతడికి హిజ్బుల్ ముజాహిదీన్తో సంబంధాలున్నట్లు తేలింది. అదేవిధంగా, 2005లో స్పెషల్ పోలీస్ అధికారి(ఎస్పీవో)గా నియమితుడై, 2011లో కానిస్టేబుల్గా ప్రమోషన్ పొందిన ఫిర్దౌస్కు ఉగ్రలింకులున్నట్లు తేలడంతో గతేడాది సస్పెండ్ చేశారు. ఆయుధాలు, డ్రగ్స్ సరఫరా చేసే ఇతడు ప్రస్తుతం కొట్ భల్వాల్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. అనంత్నాగ్ జిల్లాలో దాడులకు పథక రచన చేస్తుండగా మరో ఇద్దరు ఉగ్రవాదులతోపాటు పట్టుకున్నారు. రియాసికి చెందిన అష్రాఫ్ భట్ రెహ్బార్–ఇ–తలీం టీచర్గా 2008లో చేరాడు. ఇతడికి లష్కరేతోయిబాతో సంబంధాలున్నాయి. పాక్ కేంద్రంగా పనిచేసే మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది మహ్మద్ కాసిమ్ ఆదేశాల మేరకు ఉగ్ర కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఇతడిని పోలీసులు 2022లో అరెస్ట్ చేశారు. -
‘పుల్వామా’ అమరులకు ప్రధాని మోదీ ఘన నివాళులు
న్యూఢిల్లీ/హల్దా్వనీ: జమ్మూకశ్మీర్లోని పుల్వామాలో 2019 ఫిబ్రవరి 14వ తేదీన జరిగిన ఉగ్రదాడిలో అమరులైన సీఆర్పీఎఫ్ జవాన్లకు ప్రధాని మోదీ శుక్రవారం నివాళులర్పించారు. దేశం పట్ల వారు అచంచలమైన విశ్వాసాన్ని కనబరిచారని కొనియాడారు. వారి త్యాగాలను భవిష్యత్తు తరాలు గుర్తుంచుకుంటాయని ప్రధాని మోదీ ‘ఎక్స్’లో పేర్కొన్నారు. ఉగ్రవాదులను ఏరిపారేసేందుకు మోదీ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని హోం మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. పుల్వామా ఉగ్ర ఘటనలో అసువులు బాసిన జవాన్లకు ఆయన ఘనంగా నివాళులర్పించారు. వీరి త్యాగాల వల్లే మన దేశ సరిహద్దులు భద్రంగా ఉన్నాయన్నారు. మానవీయతకే అతిపెద్ద శత్రువైన ఉగ్రవాదంపై పోరుకు నేడు ప్రపంచమే ఏకమైందని శుక్రవారం హోం మంత్రి అమిత్ షా ‘ఎక్స్’లో తెలిపారు. పుల్వామాలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్ని ఆత్మాహుతి దళ బాంబర్ వాహనంతో ఢీకొట్టడంతో 40 మంది జవాన్లు అసువులు బాసిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు ప్రతీకారంగా వైమానికదళం యుద్ధ విమానాలు పీవోకేలోని బాలాకోట్ ఉగ్ర స్థావరాన్ని నేలమట్టం చేశాయి. -
‘హోదా’ పునరుద్ధరణకిదే సమయం
శ్రీనగర్: జమ్మూకశ్మీర్కు రాష్ట్ర హోదా త్వరలోనే వస్తుందని ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్ర హోదా పునరుద్ధరణకు సమయం ఆసన్నమైనట్లుగా భావిస్తున్నానని ఆయన పేర్కొన్నారు. గురువారం ఆయన పీటీఐ ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలను వెల్లడించారు. ‘కేంద్ర హోం మంత్రితో ఏడాది క్రితమే ఈ విషయం చర్చించాను. రాష్ట్ర హోదాను పునరుద్ధరించేందుకు ఇదే సరైన సమయం’అని ఆయన వివరించారు. ‘ఇటీవల హోం మంత్రి అమిత్ షాతో ఢిల్లీలో ఈ విషయమై చర్చ సానుకూలంగా జరిగింది. త్వరలోనే రాష్ట్ర హోదా పునరుద్ధరణ ప్రకటన వెలువడుతుందని ఆశిస్తున్నా. ఈ అంశాన్ని చట్టపరమైన ముగింపు లభించాలని కోరుకుంటున్నా’అని అబ్దుల్లా చెప్పారు. సీఎంగా పగ్గాలు చేపట్టాక కేంద్రం, జమ్మూకశ్మీర్ మధ్య అంతరం తగ్గిందన్న విషయమై ఆయన స్పందిస్తూ..కొన్ని ఘటనల వల్లే దూరం పెరుగుతుందని చెప్పారు. ఇటీవల బారాముల్లా జిల్లా సొపోర్, కథువా జిల్లా బిల్లావర్లో జరిగిన రెండు హత్యలు నివారించదగినవని చెప్పారు. వీటిపై కేంద్రం పారదర్శకంగా దర్యాప్తు చేయించి, బాధ్యులను తగు విధంగా శిక్షించాలన్నారు. కశ్మీర్లో సాధారణ పరిస్థితులను నెలకొల్పేందుకు చేస్తున్న ప్రయత్నాలకు ఇటువంటి పరిణామాలు అవరోధంగా మారుతాయని వ్యాఖ్యానించారు. భద్రత, పోలీసు విభాగాలు కేంద్ర పాలిత ప్రాంతంలో ఎన్నికైన ప్రభుత్వానికి జవాబుదారీ కానప్పటికీ, ఇటువంటివి చోటుచేసుకోకుండా చూడాల్సిన సమష్టి బాధ్యత ఉందని వివరించారు. ఈ విషయంపైనా హోం మంత్రితో మాట్లాడానని వెల్లడించారు. ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొంటున్నట్లు అనుమానమున్న 26 ఏళ్ల వ్యక్తి పోలీసులు వేధిస్తున్నారంటూ ఈ నెల 4న ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ మరునాడే, సొపోర్లోని చెక్పోస్ట్ వద్ద ఆగకుండా వెళ్తున్న ట్రక్కు డ్రైవర్ ఆర్మీ జరిపిన కాల్పుల్లో చనిపోయాడు.100 రోజుల పాలనపై.. ‘ప్రజలు మమ్మల్ని ఎన్నుకున్నది వంద రోజులు కోసం కాదు, ఐదేళ్లూ పాలించడానికే. మా పని మమ్మల్ని చేయనివ్వండి. జమ్మూకశ్మీర్లో పాలన అంటే మామూలు విషయం కాదు. 2009–2015లోనూ తేలిగ్గా లేదు. ఇప్పుడూ అంతే. ఎవరికైనా ఈ ఇబ్బంది తప్పేది కాదు. ఇది కేంద్ర పాలిత ప్రాంతం. ఈ పరిస్థితుల్లో ఎలా పనిచేయాలో నేర్చుకుంటున్నాం. లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాకూ ఇది కొత్తే. ఆయనా నేర్చుకుంటున్నారు’అని ఒమర్ అబ్దుల్లా వివరించారు.కేంద్రం నుంచి ఒత్తిళ్లు.. కేంద్ర ప్రభుత్వం నుంచి ఎదురయ్యే ఒత్తిళ్లపై ఆయన మాట్లాడుతూ..ఇక్కడ తమకు రాజకీయ పరమైన ఒత్తిళ్లకంటే వాతావరణ పరమైన సవాళ్లే ఎక్కువగా ఉన్నాయంటూ నవ్వారు. ఫిబ్రవరిలోనే ఎండలు మార్చి, ఏప్రిల్లో మాదిరిగా మండిపోతున్నాయి. రానున్న వేసవిలో నీటి కొరత తీవ్రం కానుందంటూ ఒమర్ అబ్దుల్లా ఆందోళన వ్యక్తం చేశారు. ‘వేడి ఎక్కువగా ఉంది. అయితే, అది కేంద్రం, లెఫ్టినెంట్ గవర్నర్ నుంచీ, ఎవరైనా అధికారీ నుంచీ కాదు. వేడి వాతావరణం కారణంగా ఈసారి నీటి సమస్య తలెత్తనుంది. ఇతరత్రా సమస్యల కంటే దీనిని తీర్చడమెలాగన్నదే మాకు అతిపెద్ద సవాల్ కానుంది’అని ఆయన వివరించారు. ఇటువంటి సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై అన్ని విభాగాల అధికారులతో సమావేశం కానున్నామన్నారు. వచ్చే రోజుల్లో మంచు, వాన కురిస్తే బాగుంటుందని ప్రార్థిస్తున్నానన్నారు. -
Ranji Trophy QFs: అంకిత్ శతకం.. అఖీబ్ నబీ ‘పాంచ్’ పటాకా
కోల్కతా: కెప్టెన్ అంకిత్ కుమార్ (206 బంతుల్లో 136; 21 ఫోర్లు) సెంచరీతో కదంతొక్కడంతో ముంబైతో జరుగుతున్న రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్లో హరియాణా జట్టు దీటుగా బదులిస్తోంది. సహచరుల నుంచి పెద్దగా సహకారం లభించకపోయినా... అంకిత్ కుమార్ ఒంటరి పోరాటం చేశాడు. ఫలితంగా ఆదివారం ఆట ముగిసే సమయానికి హరియాణా తొలి ఇన్నింగ్స్లో 72 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 263 పరుగులు చేసింది.లక్షయ్ దలాల్ (34), యశ్వర్ధన్ దలాల్ (36) ఫర్వాలేదనిపించారు. ముంబై బౌలర్లలో షమ్స్ ములానీ, తనుశ్ కొటియాన్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. అంతకుముందు ఓవర్నైట్ స్కోరు 278/8తో ఆదివారం రెండో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన డిఫెండింగ్ చాంపియన్ ముంబై చివరకు 88.2 ఓవర్లలో 315 పరుగులకు ఆలౌటైంది.తనుశ్ కొటియాన్ (173 బంతుల్లో 97; 13 ఫోర్లు) తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. హరియాణా బౌలర్లలో అన్షుల్ కంబోజ్, సుమిత్ కుమార్ చెరో 3 వికెట్లు తీశారు. చేతిలో 5 వికెట్లు ఉన్న హరియాణా ప్రస్తుతం... ముంబై తొలి ఇన్నింగ్స్ స్కోరుకు ఇంకా 52 పరుగులు వెనుకబడి ఉంది. రోహిత్ శర్మ (22 బ్యాటింగ్), అనూజ్ (5 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు.రాణించిన హర్ష్ దూబే, ఆదిత్య విదర్భ పేసర్ ఆదిత్య థాకరే (4/18) సత్తా చాటడంతో తమిళనాడుతో జరుగుతున్న క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో విదర్భ జట్టు మంచి స్థితిలో నిలిచింది. నాగ్పూర్ వేదికగా జరుగుతున్న ఈ పోరులో ఆదివారం ఆట ముగిసే సమయానికి తమిళనాడు తొలి ఇన్నింగ్స్లో 46 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. 18 ఏళ్ల సిద్ధార్థ్ (89 బంతుల్లో 65; 10 ఫోర్లు, 2 సిక్స్లు) అర్ధశతకం సాధించగా... తక్కినవాళ్లు విఫలమయ్యారు.మొహమ్మద్ అలీ (4), నారాయణ్ జగదీశన్ (22), సాయి సుదర్శన్ (7), భూపతి కుమార్ (0), విజయ్ శంకర్ (22) విఫలమయ్యారు. అంతకుముందు ఓవర్నైట్ స్కోరు 264/6తో రెండో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన విదర్భ... చివరకు 121.1 ఓవర్లలో 353 పరుగులకు ఆలౌటైంది. సీనియర్ బ్యాటర్ కరుణ్ నాయర్ (243 బంతుల్లో 122; 18 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీ అనంతరం అవుట్ కాగా... హర్ష్ దూబే (69; 9 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్ ఆడాడు.తమిళనాడు బౌలర్లలో విజయ్ శంకర్, సోను యాదవ్ చెరో 3 వికెట్లు పడగొట్టారు. చేతిలో నాలుగు వికెట్లు ఉన్న తమిళనాడు జట్టు... ప్రత్యర్థి తొలి ఇన్నింగ్స్ స్కోరుకు ఇంకా 194 పరుగులు వెనుకబడి ఉంది. కెపె్టన్ సాయి కిశోర్ (6 బ్యాటింగ్), ప్రదోశ్ రంజన్ పాల్ (18 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. అఖీబ్ నబీ ‘పాంచ్’ పటాకా పేస్ బౌలర్ అఖీబ్ నబీ ఐదు వికెట్లతో మెరిపించడంతో... కేరళతో జరుగుతున్న రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్లో జమ్మూ కశ్మీర్ జట్టు మెరుగైన స్థితిలో నిలిచింది. పుణే వేదికగా జరుగుతున్న పోరులో ఆదివారం రెండో రోజు ఆట ముగిసే సమయానికి కేరళ జట్టు 63 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. జలజ్ సక్సేనా (78 బంతుల్లో 67; 6 ఫోర్లు, 3 సిక్స్లు) టాప్ స్కోరర్ కాగా... సల్మాన్ నజీర్ (49 బ్యాటింగ్; 8 ఫోర్లు), నిదీశ్ (30) రాణించారు.ఇన్నింగ్స్ మూడో ఓవర్లో రెండు వికెట్లు పడగొట్టిన అఖీబ్ను ఎదుర్కునేందుకు కేరళ బ్యాటర్లు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. అంతకుముందు ఓవర్నైట్ స్కోరు 228/8తో రెండో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన జమ్మూకశీ్మర్ జట్టు చివరకు 95.1 ఓవర్లలో 280 పరుగులకు ఆలౌటైంది. యుధ్వీర్ సింగ్ (26), అఖీబ్ నబీ (32) కీలక పరుగులు జోడించారు. కేరళ బౌలర్లలో ని«దీశ్ 6 వికెట్లతో అదరగొట్టాడు. ప్రస్తుతం చేతిలో ఒక వికెట్ మాత్రమే ఉన్న కేరళ జట్టు... ప్రత్యర్థి తొలి ఇన్నింగ్స్ స్కోరుకు ఇంకా 80 పరుగులు వెనుకబడి ఉంది. సల్మాన్ నజీర్ క్రీజులో ఉన్నాడు.మెరిసిన మనన్, జైమీత్బ్యాటర్లు రాణించడంతో సౌరాష్ట్రతో జరుగుతున్న జరుగుతున్న క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో గుజరాత్ భారీ స్కోరు దిశగా సాగుతోంది. రాజ్కోట్ వేదికగా జరుగుతున్న పోరులో ఆదివారం ఆట ముగిసే సమయానికి గుజరాత్ 95 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 260 పరుగులు చేసింది. మనన్ హింగ్రాజియా (219 బంతుల్లో 83; 8 ఫోర్లు, 1 సిక్స్), జైమీత్ పటేల్ (147 బంతుల్లో 88 బ్యాటింగ్; 9 ఫోర్లు) అర్ధశతకాలతో మెరిశారు.అంతకుముందు సౌరాష్ట్ర జట్టు తొలి ఇన్నింగ్స్లో 216 పరుగులకు ఆలౌట్ కాగా... ప్రస్తుతం చేతిలో 6 వికెట్లు ఉన్న గుజరాత్ 44 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. జైమీత్తో పాటు వికెట్ కీపర్ ఉరి్వల్ పటేల్ (29 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. -
జమ్ము మిస్టరీ మరణాలపై కేంద్రం ప్రకటన
మిస్టరీగా మారిన జమ్ము కశ్మీర్ వరుస మరణాల(Mysterious Deaths)పై కేంద్రం కీలక ప్రకటన చేసింది. అంతుచిక్కని అంటువ్యాధితో మరణిస్తున్నారనే వాదనను కేంద్రం తోసిపుచ్చింది. అయితే విషపూరిత పదార్థాల వల్లే వరుస మరణాలు సంభవించాయని, ఈ వ్యవహారంపై కుట్ర కోణం సహా అన్ని కోణాల్లో దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోందని గురువారం ప్రకటించింది.రాజౌరీ(Rajouri) జిల్లాలోని ఓ గ్రామంలో నెలవ్యవధిలో 17 మంది వరుసగా ఒకే తరహా లక్షణాలతో జబ్బుపడి మరీ చనిపోయారు. చనిపోయిన వాళ్లలో చిన్నపిల్లలే(13) ఎక్కువగా ఉన్నారు. వాళ్ల మరణాలకు విషపూరిత పదార్థాలే కారణమని కేంద్రం నిర్ధారించింది. అయితే ఆ టాక్సిన్ ఏంటన్నదానిపై మాత్రం ఇంకా స్పష్టత రావాల్సి ఉందని పేర్కొంది. ఈ మేరకు కేంద్ర సైన్స్&టెక్నాలజీ మంత్రి(స్వతంత్ర) డాక్టర్ జితేంద్ర సింగ్ గురువారం ఓ జాతీయ మీడియాతో మాట్లాడారు.‘‘లక్నోలోని సీఎస్ఐఆర్(CSIR) ల్యాబ్ నిర్వహించిన ప్రాథమిక పరీక్షల్లో.. ఇది వైరల్, బ్యాక్టీరియా ఇన్ఫెక్షనో కాదని తేలింది. మృతదేహాల నుంచి సేకరించిన నమునాల్లో విషపదార్థాలు ఉన్నట్లు తేలింది. అయితే ఆ విషపదార్థాలు ఏంటన్న దానిని నిర్ధారించుకునే పనిలో శాస్త్రవేత్తలు ఉన్నారు. వారం, పదిరోజుల్లో దీనిపై స్పష్టమైన ప్రకటన రానుంది’’ అని ఆయన తెలిపారు. ఇక అన్నికోణాల్లో ఈ అంశంపై దర్యాప్తు జరుగుతోంది. ఇందులో ఏదైనాకుట్ర ఉందని తేలితే.. బాధ్యులెవరైనా వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు అని అన్నారాయన. ఇదిలా ఉంటే.. ఐటీఆర్ (టాక్సికాలజీ రీసెర్చ్) నిర్వహించిన విశ్లేషణలోనూ ఇంతకు ముందు విషపూరిత పదార్థాలు ఉన్నట్లు గుర్తించింది.డిసెంబర్ 7 నుంచి జనవరి 19వ తేదీల మధ్యలో రాజౌరీలోని బధాల్ అనే కుగ్రామంలో ఈ వరుస మరణాలు(Serial Deaths) సంభవించాయి. జ్వరం, ఒళ్లు నొప్పులు, అలసట, విపరీతంగా చెమటలు పోయడం, స్పృహ కోల్పోవడం తదితర లక్షణాలతో ఆస్పత్రుల్లో చేరారు. పైగా మూడు కుటుంబాలకే చెందిన వ్యక్తులు వరుసగా జబ్బు చేసి మరణించడం గమనార్హం. పైగా ఆ కుటుంబాలకు చెందిన బంధువులు చుట్టుపక్కల నాలుగు గ్రామాల్లో విస్తరించి ఉన్నారు. అయితే అనూహ్యంగా వాళ్లలో కూడా కొందరు ఇదే రీతిలో జబ్బు పడ్డట్లు సమాచారం. అందులోనూ కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.దీంతో బుధవారం అక్కడి అధికారులు బధాల్ గ్రామాన్ని కంటైన్మెంట్ జోన్గా ప్రకటించారు. సుమారు 40 మందిని ఐసోలేషన్కు తరలించారు. ఇక ప్రజల్లో ఆందోళన నెలకొన్న దృష్ట్యా.. బహిరంగా జనం గుమిగూడటంపై ఆంక్షలు అమలు చేస్తున్నారు. వరుస మరణాలతో జమ్ము కశ్మీర్లో హెల్త్ ఎమర్జెన్సీ(Health Emergency) ప్రకటిస్తారనే వదంతులు చక్కర్లు కొట్టాయి. అయితే వైద్య ఆరోగ్య అధికారులు మాత్రం వాటిని కొట్టిపారేశారు. ఆ అవసరం లేదని స్పష్టత ఇచ్చారు. నమునాల్లో న్యూరోటాక్సిన్స్ ఉన్నట్లు తేలడంతో.. కుట్ర కోణం తెర మీదకు వచ్చింది. నిజాలు నిగ్గుతేల్చేందుకు కశ్మీర్ పోలీస్ శాఖ సిట్ను ఏర్పాటుచేసింది. మంగళవారం బధాల్కు వెళ్లిన ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా.. త్వరలోనే అన్ని నిజాలు బయటకు వస్తాయని ప్రకటించారు. మరోవైపు.. వరుస మరణాల నేపథ్యంలో అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం.. అన్ని కోణాల్లో దర్యాప్తు చేసేందుకు 11 మందితో కూడిన ప్రత్యేక బృందాన్ని కశ్మీర్కు పంపింది. -
కశ్మీర్లో ఎన్కౌంటర్ నేల కొరిగిన ఆంధ్రా జవాను
శ్రీనగర్/బంగారుపాళ్యం: జమ్మూకశ్మీర్లోని సొపోర్ జిల్లాలో ఉగ్రవాదులతో జరిగిన ఎదురుకాల్పుల్లో ఆంధ్రప్రదేశ్కు చెందిన ఒక జవాను ప్రాణాలు కోల్పోయారు. ఆదివారం జలూర గుజ్జర్పటి ప్రాంతంలో ఉగ్రవాదుల స్థావరాన్ని జవాన్లు చుట్టుముట్టారు. ఈ సందర్భంగా పంగల కార్తీక్(32) అనే జవాను బుల్లెట్ గాయాలతో తీవ్రంగా గాయపడ్డారు. వైద్యం కోసం తరలిస్తుండగానే ఆయన తుదిశ్వాస విడిచారని అధికారులు సోమవారం తెలిపారు. ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టిన బలగాలు ముష్కరుల కోసం కూంబింగ్ కొనసాగిస్తున్నాయన్నారు. కార్తీక్ వీరమరణంపై శ్రీనగర్ కేంద్రంగా పనిచేసే ఆర్మీ విభాగం చినార్ కార్ప్స్ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ‘విధి నిర్వహణలో ప్రాణాలను అర్పించిన కార్తీక్ యొక్క అత్యున్నత త్యాగానికి చినార్ కార్ప్స్ సెల్యూట్ చేస్తోంది చినార్ వారియర్స్ కార్తీక్ అపారమైన పరాక్రమానికి, త్యాగానికి వందనం చేస్తోంది. ఆయన కుటుంబానికి సానుభూతి తెలుపుతోంది. వారికి సంఘీభావంగా నిలుస్తుంది’అని ‘ఎక్స్’లో తెలిపింది. కాగా, కార్తీక్ది ఏపీలోని చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం ఎగువరాగిమాను పెంట గ్రామం. వరద మందడి, సెల్వి దంపతుల రెండో కుమారుడైన కార్తీక్ పదేళ్ల క్రితం ఆర్మీలో చేరారు. ఈయన చనిపోయిన విషయం తెలియడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మంగళవారం రాత్రికల్లా మృతదేహం గ్రామానికి రావచ్చని చెబుతున్నారు. -
అలా చేయడం బీజేపీతో కలిసిన్నట్టు కాదు: ఒమర్ అబ్దుల్లా
శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో అభివృద్ధి కోసం కేంద్రంతో కలిసి పనిచేయాలనుకుంటున్నట్టు చెప్పారు ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా. కేంద్రంతో నిర్మాణాత్మక సంబంధాలను కొనసాగించడమే తమ లక్ష్యమని అన్నారు. ఇదే సమయంలో ఇలా చేయడం బీజేపీ పార్టీతో కలిసినట్టు కాదు అని క్లారిటీ ఇచ్చారు. కేంద్రంలో ఎవరు ఉన్నా తాము ఇలాగే ముందుకెళ్తామని స్పష్టం చేశారు.సీఎం ఒమర్ అబ్దుల్లా కన్వాల్లో జాతీయ చానెల్తో మాట్లాడారు. ఈ సందర్భంగా ఒమర్.. రాష్ట్ర ప్రయోజనాల కోసమే నేను ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాను కలిశాను. నేను కేంద్రం తీరు పట్ల సానుకూలంగా ఏమీ లేను. ప్రభుత్వంతో కలిసి పనిచేయడం అంటే వారు చేసే ప్రతిదాన్ని నేను అంగీకరిస్తున్నాను అని కాదు. బీజేపీ చేసే పనిని నేను అంగీకరిస్తున్నానని దీని అర్థం కాదు. జమ్ముకశ్మీర్కు సంబంధించిన అంశాలపై మాత్రమే కేంద్రంతో అనుకూలంగా ఉంటున్నాం. అంతమాత్రాన మేము బీజేపీకి మద్దతు ఇచ్చినట్టు కాదు.రాష్ట్రం పురోగతి సాధించాలంటే కేంద్రం అవసరం ఎంతో ముఖ్యం. అభివృద్ధి జరగడం, రాష్ట్ర హోదా పునరుద్ధరించడం మా ముందున్న లక్ష్యాలు. పార్టీలు ముఖ్యం కాదు.. కావాల్సింది అభివృద్దే. అవసరం లేని చోట నేను కేంద్రంతో పోరాటం ఎంచుకోవాలా? అని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం పట్ల వ్యతిరేక ధోరణితో ఉంటే రాష్ట్రానికే నష్టం జరుగుతుంది అని చెప్పుకొచ్చారు.ఇదిలా ఉండగా.. గత సంవత్సరం నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ జమ్ము కశ్మీర్ ఎన్నికల్లో భారీ మెజారిటీతో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఒమర్ అబ్దుల్లా ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టారు. అనంతరం, రెండుసార్లు అమిత్ షాను కలిశారు. ఇటీవల సోనామార్గ్లో జరిగిన సొరంగం ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని మోడీని కలిశారు. దీంతో, ఒమర్..బీజేపీతో సన్నిహితంగా ఉంటున్నారనే వార్తలు చక్కర్లు కొట్టాయి. ఈ నేపథ్యంలో ఒమర్ తాజాగా చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. -
ప్రధాని మోదీపై ఒమర్ అబ్దుల్లా ప్రశంసలు
శ్రీనగర్:కశ్మీర్లో ఎన్నికలు నిర్వహిస్తామన్న హామీని నెరవేర్చినందుకు ప్రధాని మోదీ(PM Modi)పై కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా(Omar Abdulla) ప్రశంసలు కురిపించారు. సోమవారం జెడ్మోర్ టన్నెల్ను ప్రధాని మోదీ ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో ఒమర్అబ్దుల్లా మాట్లాడారు.‘ఇక్కడ ఎన్నికలు నిర్వహిస్తామని మీరిచ్చిన హామీని నెరవేర్చారు.ప్రజలు వారికి కావాల్సిన వారిని ఎన్నుకున్నారు. దీంతో నేను సీఎం హోదాలో ఇక్కడ మాట్లాడుతున్నాను.దీంతో పాటు కశ్మీర్కు రాష్ట్ర హోదా ఇస్తానన్న హామీని కూడా మీరిచ్చారు. త్వరలో ఈ హామీని కూడా మీరు నెరవేరుస్తారని నేను ఆశిస్తున్నాను’అని ఒమర్ అబ్దుల్లా ఆశాభావం వ్యక్తం చేశారు. జమ్ము కశ్మీర్లోని గాందర్బల్ జిల్లాలో నిర్మించిన జడ్-మోడ్ సొరంగాన్ని భారత ప్రధాని మోదీ సోమవారం ప్రారంభించారు. శ్రీనగర్- లేహ్ జాతీయ రహదారిపై 2,400 కోట్ల రూపాయలతో ఈ టన్నెల్ను నిర్మించారు. ఇది 6.4 కిలో మీటర్ల పొడవుండే ఈ సొరంగంతో ఏడాదిలో ఏ సీజన్లోనైనా లద్దాఖ్ను రోడ్డు మార్గం ద్వారా ఈజీగా చేరుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక, 2015లో ప్రారంభమైన నిర్మాణ పనులు గతేడాది పూర్తయ్యాయి. -
Jammu Kashmir: మాట ఇస్తే నిలబెట్టుకుంటా!
సోనామార్గ్: ‘‘మోదీ మాటిచ్చాడంటే తప్పడు. నెరవేర్చి తీరతాడు. అన్ని పనులనూ సరైన సమయంలో సక్రమంగా పూర్తి చేసి చూపిస్తా’’ అని ప్రధాని నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. జమ్మూకశ్మీర్లో వ్యూహాత్మకంగా కీలకమైన 6.5 కిలోమీటర్ల పొడవైన నూతన సొరంగాన్ని సోమవారం ఆయన ప్రారంభించారు. నిర్మాణ దశలో జెడ్–మోర్హ్ టన్నెల్గా పిలిచిన ఈ సొరంగానికి సోనామార్గ్గా నామకరణం చేశారు. జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత మోదీ ఇక్కడికి రావడం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. ‘‘మోదీ మాటిస్తే నెరవేరుస్తాడు. కేంద్రంలో మా ప్రభుత్వం తొలిసారి కొలువుతీరాకే అత్యంత సంక్లిష్టమైన ఈ సొరంగ పనులు మొదలయ్యాయి. మేం మొదలు పెట్టిన పనులను మేమే పూర్తి చేశాం. మూడోసారి అధికారంలోకి రాగానే సొరంగం నిర్మాణం పూర్తి చేశాం. గతంలో చలికాలంలో 3 నుంచి 4 నెలలు భారీ మంచు, కొండచరియలు విరిగిపడటం, హిమపాతం వంటి ప్రతికూల వాతావరణంతో ఈ ప్రాంతం గుండా రాకపోకలకు తీవ్ర ఇబ్బందులుండేవి. ఇప్పుడు ఏ సీజన్లోనైనా శ్రీనగర్, సోనామార్గ్, లేహ్ మధ్య రాకపోకలు సాగించవచ్చు. లద్దాఖ్ ప్రాంతానికి ఇకపై ఎలాంటి ప్రయాణ ఇబ్బందులు లేకుండా సాఫీగా చేరుకోవచ్చు’’ అని ప్రధాని చెప్పుకొచ్చారు. కశ్మీర్లో మార్పు తెచ్చేందుకు నిరంతరం కృషి చేస్తున్నాం ‘‘ మా ప్రభుత్వ కృషి వల్లే కశ్మీర్ లోయలో పరిస్థితుల్లో మార్పులు వస్తున్నాయి. ఆంక్షల చట్రంలో నలిగిన శ్రీనగర్లోని లాల్చౌక్లో ఇప్పుడు ఎంతో మార్పులు చూస్తున్నాం. ఇప్పుడు ఐస్క్రీమ్ కోసం కుటుంబాలు రాత్రిపూట కూడా లాల్చౌక్కు వెళ్తున్నాయి. కళాకారులైన నా స్నేహితులు ఇక్కడి పోలో వ్యూ పాయింట్ను నేడు ముఖ్య వ్యాపార కూడలిగా మార్చేశారు. శ్రీనగర్లో జనం ఎంచక్కా కుటుంబంతో కలిసి సినిమాలకూ వెళ్లగలుగుతున్నారు. ఇంతటి పెను మార్పులు గతంలో ఏ ప్రభుత్వ హయాంలోనూ జరగలేదు. కొన్ని నెలల క్రితం శ్రీనగర్లో ఏకంగా అంతర్జాతీయ మారథాన్ జరిగింది. ఆరోజు మారథాన్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి సైతం పాల్గొన్నారు. ఆ వీడియో వైరల్ అయింది. ఢిల్లీలో కలిసినప్పుడు ఆయన్ను మనస్ఫూర్తిగా అభినందించా’’ అని అన్నారు. నూతన శకమిది ‘‘ఇది జమ్మూకశ్మీర్కు నిజంగా నూతన శకం. జమ్మూకశ్మీర్ భారత్కు కిరీటం. అదెప్పుడూ మరింత అందంగా, సుసంపన్నంగా ఉండాలి. జమ్మూకశ్మీర్లో శాంతియుత వాతావరణం వెల్లివిరుస్తోంది. అదిప్పుడు స్పష్టంగా కనిపిస్తోంది. కశ్మీర్ తన సొంత అభివృద్ధి అధ్యయనాన్ని లిఖించుకుంటోంది’’ అని అన్నారు. టన్నెల్ను ప్రారంభించాక మోదీ ఓపెన్టాప్ వాహనంలో సొరంగంలోకి వెళ్లి పరిశీలించారు. అక్కడి నిర్మాణ కార్మికులతో మాట్లాడి వారిని అభినందించారు. టన్నెల్ నిర్మాణ సమయంలో గత ఏడాది అక్టోబర్ 20న కార్మికులపై ఉగ్రదాడి సందర్భంగా చనిపోయిన ఏడుగురికి మోదీ నివాళులరి్పంచారు. సున్నా డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతను సైతం లెక్కచేయకుండా టన్నెల్ ప్రారంభోత్సవానికి సోనామార్గ్, గగన్గిర్, గుండ్, కంగన్ గ్రామాల నుంచి వేలాది మంది స్థానికులు రావడం విశేషం. దిల్, దిల్లీ మధ్య దూరం చెరిపే నేత మోదీపై ఒమర్ పొగడ్తలు కార్యక్రమంలో పాల్గొన్న జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా మోదీనుద్దేశించి మాట్లాడుతూ పొగడ్తల్లో ముంచెత్తారు. ‘‘ దిల్కు, దిల్లీకి మధ్య దూరాల ను చెరిపేసే నేత మీరు. ఇచ్చిన వాగ్దానాలను నెరవేరుస్తున్నారు. గత 15రోజుల్లోనే మీరు పాల్గొంటున్న రెండో కార్యక్రమం ఇది. జనవరి ఆరున జమ్మూ కోసం ప్రత్యేకంగా రైల్వేడివిజన్ ఏర్పాటుచేశారు. జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పి నాలుగు నెలల్లోనే ఆ హామీ నెరవేర్చారు. ఇక ఈ ప్రాంతానికి మళ్లీ రాష్ట్రహోదా ఇస్తామన్న హామీనీ త్వరలో నెరవేరుస్తారని బలంగా విశ్వసిస్తున్నాం. సోనామార్గ్ టన్నెల్ వంటి ప్రాజెక్టుల పూర్తితో జమ్మూకశ్మీర్కు ఢిల్లీకి మధ్య దూరాలు తగ్గి అనుసంధానత పెరుగుతోంది’’ అని ఒమర్ అన్నారు. రూ.2,716 కోట్ల వ్యయంతో.. రూ.2,716 కోట్ల వ్యయంతో సముద్రమట్టానికి 8,650 అడుగుల ఎత్తులో ఈ సొరంగాన్ని నిర్మించారు. గందేర్బల్ జిల్లాలో శ్రీనగర్–లేహ్ జాతీయ రహదారిపై గగన్గిర్, సోనామార్గ్ గ్రామాల మధ్యలో ఒకేసారి ఇరువైపుల వాహనాలు వెళ్లేలా టన్నెల్ నిర్మాణం పూర్తిచేశారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణికులు సొరంగంలో చిక్కుకుపోతే బయట పడేందుకు వీలుగా సొరంగానికి సమాంతరంగా 7.5 మీటర్ల వెడల్పుల్లో ఎమర్జెన్సీ ఎగ్జిట్ ద్వారాలను నిర్మించారు. టన్నెల్ ప్రారంభ కార్యక్రమంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, సీఎం ఒమర్, జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా సైతం పాల్గొన్నారు. #WATCH | Jammu & Kashmir: Prime Minister Narendra Modi inaugurates the Z-Morh tunnel in Sonamarg today. CM Omar Abdullah and LG Manoj Sinha, Union Minister Nitin Gadkari are also present. (Source: DD/ANI)#KashmirOnTheRise pic.twitter.com/GF7rwZaVn1— ANI (@ANI) January 13, 2025 #WATCH | Sonamarg, Jammu & Kashmir: After inaugurating the Z-Morh tunnel, Prime Minister Narendra Modi inspects the tunnel. CM Omar Abdullah, LG Manoj Sinha and Union Minister Nitin Gadkari are also present. (Source: DD/ANI) #KashmirOnTheRise pic.twitter.com/FbOP7COfzm— ANI (@ANI) January 13, 2025 -
ఆర్టికల్ రద్దుతో సంబంధమే లేదు.. మోదీకి ఒమర్ అబ్దుల్లా ఝలక్
శ్రీనగర్: జమ్ము కశ్మీర్లో ప్రధాని మోదీ పర్యటన వేళ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కీలక వ్యాఖ్యలు చేశారు. జమ్ము కశ్మీర్లో ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆర్టికల్-370 రద్దుతో సంబంధమే లేదన్నారు. 370 రద్దు కంటే ముందే అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్టు ఆయన చెప్పుకొచ్చారు. అభివృద్ధికి, ఆర్టికల్ రద్దుకు లింక్ పెట్టొద్దు అంటూ ఘాటు విమర్శలు చేశారు.తాజాగా సీఎం ఒమర్ అబ్దుల్లా మీడియాతో మాట్లాడుతూ..‘జమ్ము కశ్మీర్లోని మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ఆర్టికల్ 370తో ముడిపెట్టవద్దు. దీనికి రాజకీయాలతో సంబంధం లేదు. ఈ ప్రాజెక్టులు ఏవీ ఆగస్టు 5, 2019 తర్వాత ప్రారంభించినవి కావు. అంతకంటే ముందుగానే ఇవి ప్రణాళిక చేయబడ్డాయి. ఆర్టికల్ 370 రద్దుతో సంబంధం లేకుండా జరిగిన అభివృద్ధి ఇది. ఈ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు అల్లర్లు జరిగిన ప్రాంతాల్లో లేవు అని చెప్పుకొచ్చారు.ఇదే సమయంలో జమ్ము కశ్మీర్లో 2008, 2010, 2016లో ప్రముఖంగా కనిపించిన రాళ్ల దాడులు, నిరసనలు వంటి కార్యకలాపాలు ఇప్పుడు గణనీయంగా తగ్గాయి. దీన్ని నేను అంగీకరిస్తున్నాను. అయితే, ఇది కొంతవరకు ప్రభుత్వం తీసుకున్న కఠిన నిర్ణయాల కారణంగా ఇది జరిగింది. సీఐడీ విభాగాన్ని ఆయుధంగా మార్చడం, ఉద్యోగులను తొలగించడం, వ్యక్తులను బ్లాక్లిస్ట్ చేయడం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధం. మార్పును ప్రజలు అంగీకరించాలి. వారు మనస్పూర్తిగా అంగీకరిస్తే అది ప్రశంసనీయం అంటూ కామెంట్స్ చేశారు. దీంతో, ముఖ్యమంత్రి ఒమర్ వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. "Let's not link the infrastructure projects in J&K to the politics surrounding Article 370. Most of these projects are not located in any areas that saw activities like stone-pelting and protests": CM Omar Abdullah@OmarAbdullah pic.twitter.com/gbODYR3KdH— Rahul Kanwal (@rahulkanwal) January 13, 2025ఇదిలా ఉండగా.. జమ్ముకశ్మీర్లోని గాందర్బల్ జిల్లాలో నిర్మించిన జడ్-మోడ్ సొరంగాన్ని భారత ప్రధాని మోదీ నేడు ప్రారంభించనున్నారు. శ్రీనగర్- లేహ్ జాతీయ రహదారిపై 2,400 కోట్ల రూపాయలతో ఈ టన్నెల్ను నిర్మించారు. ఇది 6.4 కిలో మీటర్ల పొడవుండే ఈ సొరంగంతో ఏడాదిలో ఏ సీజన్లోనైనా లద్దాఖ్ను రోడ్డు మార్గం ద్వారా ఈజీగా చేరుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక, 2015లో ప్రారంభమైన నిర్మాణ పనులు గతేడాది పూర్తి అయ్యాయి. -
లోయలో పడ్డ ఆర్మీ వాహనం.. నలుగురు సైనికులు దుర్మరణం
శ్రీనగర్: జమ్ము కశ్మీర్లో ఘోర ప్రమాదం జరిగింది. ఆర్మీ ట్రక్కు లోయలో పడిపోవడంతో నలుగురు సైనికులు మృతి చెందారు. ఇద్దరు సైనికులు ప్రమాదం జరిగిన కాసేపటికే చికిత్స పొందుతూ కన్నుమూయగా, చికిత్స పొందుతున్న మరో ముగ్గురిలో ఇద్దరు చనిపోయారు. దాంతో చనిపోయిన సైనికుల సంఖ్య 4కు చేరింది. ఈ విషయాన్ని ఆర్మీ అధికారులు ధృవీకరించారు. శనివారం ఉదయం బాందీపుర(Bandipore) జిల్లా సదర్ కూట్ పయెన్ ప్రాంతంలో సైనికులతో ఓ ట్రక్కు వెళ్తోంది. అయితే ఒక్కసారిగా అదుపు తప్పి దొర్లుకుంటూ పక్కనే ఉన్న లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఐదుగురు సైనికులు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వాళ్లను ఆస్పత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమించి మొత్తంగా నలుగురు సైనికులు చనిపోయినట్లు సీనియర్ ఆర్మీ అధికారులు స్పష్టం చేశారు.#WATCH | Bandipora, Jammu and Kashmir: Dr Masarat Iqbal Wani, Medical Superintendent of District Hospital Bandipora says, "5 injured were brought here, out of which 2 were brought dead, 3 injured who were in critical condition have been referred to Srinagar for further… https://t.co/8RBwynIEvt pic.twitter.com/UVYr8vTiVk— ANI (@ANI) January 4, 2025ఇదిలా ఉంటే.. జమ్ము కశ్మీర్లో ఈ తరహా ప్రమాదాలు కొత్తేం కాదు. గతేడాది డిసెంబర్లో ఫూంచ్ జిల్లాలో ఇదే తరహాలో ఆర్మీ వాహనం పడిపోయి ఐదుగురు సైనికులు మృతి చెందారు. అంతకు ముందు.. నవంబర్ నెల 4వ తేదీన రాజౌరీ(Rajaouri)లో జరిగిన యాక్సిడెంట్లో ఓ జవాన్ చనిపోయాడు. అదే నెల 2వ తేదీన ఓ కారు రెయిసి జిల్లాలో లోయలో పడిపోయి నెలల పసికందు, తల్లి సహా ముగ్గురు మృతిచెందారు. -
ఇంట్లో చెలరేగిన మంటలు.. ఆరుగురి సజీవదహనం
శ్రీనగర్: జమ్ము కశ్మీర్లో ఘోర అగ్నిప్రమాద ఘటన చోటుచేసుకుంది. అగ్నిప్రమాదం కారణంగా ఇంట్లో నిద్రిస్తున్న ఆరుగురు సజీవ దహనమయ్యారు. మరో నలుగురికి తీవ్ర గాయాలు కావడంతో వారి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.వివరాల ప్రకారం.. కథువాలోని ఓ ఇంట్లో బుధవారం తెల్లవారుజామున మంటలు చెలరేగాయి. మంటల్లో చిక్కుకుని ఇంట్లో నిద్రిస్తున్న ఆరుగురు సజీవదహనమయ్యారు. ఈ ప్రమాదం కారణంగా మరో నలుగురు తీవ్రంగా గాయపడటంతో ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. -
Omar Abdullah: బీజేపీకి దగ్గరవుతున్నారా?
రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరనేది బాగా వాడుకలో ఉన్న నానుడి. జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్పరెన్స్ అగ్రనేత ఒమర్ అబ్దుల్లా తాజా ప్రకటనలు ఇదే తరహాలో ఉన్నాయి. కాషాయ పార్టీకి ఆయన దగ్గరవుతున్న సూచనలు కన్పిస్తున్నాయి. ఈవీఎంల ట్యాంపరింగ్ వ్యవహారంపై ఆయన చేసిన వాఖ్యలు బీజేపీతో సామీప్యతను సంతరించుకోవడంతో ఈ వాదనకు బలం చేకూరుతోంది. ఇదంతా కాకతాళీయంగా జరిగింది కాదన్న అభిప్రాయాలు ప్రత్యర్థుల నుంచి వ్యక్తమవుతున్నాయి.మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఈవీఎంల ట్యాంపరింగ్పై కాంగ్రెస్ చేసిన ఆరోపణలకు బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా కౌంటర్ ఇచ్చారు. ఆయన మాట్లాడిన తర్వాత రోజే ఒమర్ అబ్దుల్లా కూడా మాట్లాడారు. అయితే స్వపక్షమైన కాంగ్రెస్ పార్టీని తప్పుబడుతూ ఆయన వ్యాఖ్యలు చేయడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఎన్నికల్లో విజయాలను తమ ఖాతాలో వేసుకుని, అపజయాలను మాత్రం ఈవీఎంలపైకి నెట్టేయడం సరికాదన్న చందంగా ఒమర్ అబ్దుల్లా వ్యాఖ్యానించారు. సరిగ్గా అమిత్ షా ఏదైతే అన్నారో అలాగే కశ్మీర్ సీఎం స్పందించారు. ఇప్పుడు ఇదే రాజకీయ వర్గాల్లో హాట్టాపిక్గా మారింది.రాహుల్ గాంధీకి అమిత్ షా కౌంటర్లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ 100 ఎంపీ సీట్లు గెలిచినప్పుడు సంబరాలు చేసుకున్నారని, ఈ దశాబ్దంలోనే ఉత్తమ పనితీరు కనబరిచామని పొంగిపోయారని రాహుల్ గాంధీని ఉద్దేశించి అమిత్ షా కమెంట్ చేశారు. ‘లోక్సభ ఎన్నికల్లో తాను గెలిచాను కాబట్టి ఈవీఎంలు బాగా పనిచేశాయని రాహుల్ గాంధీ నమ్ముతున్నారు. జార్కండ్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఈవీఎంలు కరెక్ట్గానే పనిచేస్తున్నాయని అనుకున్నారు. మహారాష్ట్రలో ప్రజలు ఓడించేసరికి ఈవీఎంలు వారికి చెడుగా కన్పిస్తున్నాయి. పని చేతగానివాడు పనిముట్లను నిందించిట్టుగా రాహుల్ గాంధీ వ్యవహారం ఉంద’ని అమిత్ షా అన్నారు.కాంగ్రెస్ను తప్పుబట్టిన ఒమర్ అబ్దుల్లామరుసటి రోజు ఒమర్ అబ్దుల్లా కూడా ఇదే లైన్లో మాట్లాడారు. గెలిచినప్పుడు ఒకలా, ఓడిపోయినప్పుడు మరో విధంగా కాంగ్రెస్ పార్టీ మాట్లాడడం తగదని హితవు పలికారు. ఈవీఎంలతోనే లోక్సభ ఎన్నికల్లో 100 స్థానాలు గెలిచిన కాంగ్రెస్ మహారాష్ట్ర ఫలితాల తర్వాత మాట మార్చడాన్ని ఆయన తప్పుబట్టారు. ప్రజాతీర్పుపై విశ్వాసం లేనట్టుగా మాట్లాడం మానుకోవాలని, ఓటమికి ఈవీఎంలను బాధ్యులు చేయడం కరెక్ట్ కాదన్నారు. ఒమర్ అబ్దుల్లా వ్యాఖ్యలకు కాంగ్రెస్ కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. సీఎం అయ్యాక ఆయన ఎందుకు యూటర్న్ తీసుకోవాల్సి వచ్చిందో అంటూ ప్రశ్నించింది.చదవండి: EVMలపై పోరు.. ధోరణి మారింది ఎందుకో?బీజేపీపై సీఎం అబ్దుల్లా ప్రశంసలుఅయితే ఇక్కడితో ఆగిపోకుండా బీజేపీపై ప్రశంసలు కురిపించారు కశ్మీర్ సీఎం అబ్దుల్లా. సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్ ఎంతో మంచిదని, కొత్త పార్లమెంటు భవనం నిర్మించడం అద్భుతమైన ఆలోచన అంటూ కాషాయపార్టీని పొగిడారు. ఈవీఎంల ట్యాంపరింగ్ ఆరోపణలపై కాంగ్రెస్ పార్టీని తప్పుబడుతూ బీజేపీ అధికార ప్రతినిధిలా మాట్లాడుతున్నారన్న వాదనను ఒమర్ అబ్దుల్లా కొట్టిపారేశారు. జమ్మూకశ్మీర్కు మంచి చేయాలన్న ఉద్దేశంతోనే కేంద్ర ప్రభుత్వంతో సత్సంబంధాలను కొనసాగిస్తున్నానని, రాష్ట్ర ప్రయోజనాలే తనకు ముఖ్యమని చెప్పుకొచ్చారు. కాగా, జమ్మూకశ్మీర్కు రాష్ట్రహోదా పునరుద్దరణ కోసం అమిత్షాను బుధవారం ఢిల్లీలో సీఎం అబ్దుల్లా కలవనున్నారు. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో వీరిద్దరి భేటీపై ఆసక్తి నెలకొంది. -
కసబ్ కేసు విచారణ కూడా న్యాయంగానే జరిగింది: సుప్రీం కోర్టు
న్యూఢిల్లీ: వేర్పాటువాది యాసిన్మాలిక్ కేసు విచారణ సందర్భంగా.. గురువారం అత్యున్నత న్యాయస్థానం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 26/11 ముంబై దాడుల ఉగ్రవాది అజ్మల్ కసబ్ కేసు విచారణ కూడా న్యాయంగానే జరిగింది కదా అని పేర్కొంది. యాసిన్ మాలిక్ వ్యక్తిగతంగా తమ ఎదుటు హాజరు కావాలని ఆదేశించిన జమ్మూకశ్మీర్ కోర్టు ఆదేశాలను.. సీబీఐ సుప్రీం కోర్టులో సవాల్ చేసింది. దీనిపై ఇవాళ విచారణ సందర్భంగా.. సుప్రీం పై వ్యాఖ్యలు చేసింది.ఉగ్రవాదులకు నిధులు సమకూర్చిన కేసులో తీహార్ జైలులో జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు. అయితే.. 1990లో శ్రీనగర్ శివారులో నలుగురు ఎయిర్ఫోర్స్ సిబ్బంది హత్య కేసు, 1989లో రుబయా సయీద్ (అప్పటి హోంమంత్రి ముఫ్తీ మహమ్మద్ సయీద్) కిడ్నాప్ కేసులో యాసిన్ మాలిక్ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. ఈ రెండు కేసులకు సంబంధించిన విచారణ నిమిత్తం.. జమ్ము శ్మీర్ కోర్టు వ్యక్తిగతంగా అతన్ని హాజరుపర్చాలని ఆదేశించింది. అందకు తాను సిద్ధంగా ఉన్నట్లు మాలిక్ సమ్మతి తెలియజేశాడు. అయితే..ప్రస్తుత పరిస్థితుల్లో అతడు జమ్మూకశ్మీర్ వెళ్లడం మంచిది కాదని, అది జమ్ములో అలజడి సృష్టించే అవకాశం ఉందని సీబీఐ తరఫున న్యాయవాదులు సుప్రీం కోర్టులో అభ్యంతరం వ్యక్తం చేశారు.సీబీఐ తరఫున తుషార్ మెహతా.. మాలిక్ను జమ్ము కశ్మీర్ తీసుకెళ్లాలని అనుకోవడం లేదు అని వాదించారు. అయితే.. జమ్ములో ఇంటర్నెట్ కనెక్ట్ సమస్య ఉందని గుర్తు చేస్తూ.. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అతన్ని(మాలిక్) క్రాస్ ఎగ్జామినేషన్ చేసే అవకాశం ఉండదు కదా? అని జస్టిస్ ఏఎస్ ఒకా ప్రశ్నించారు. అయితే అతని విచారణను ఢిల్లీకే మార్చాలని మెహతా కోరారు. అతనొక వేర్పాటువాది అని, వ్యక్తిగతంగా హాజరైతే జిమ్మిక్కులు ప్రదర్శించే అవకాశం ఉందని వాదించారు. ఈ వ్యాఖ్యలపై జస్టిస్ ఒకా అభ్యంతరం వ్యక్తం చేశారు. మన దేశంలో కసబ్ లాంటి ఉగ్రవాదికి కూడా విచారణ న్యాయంగానే అందింది కదా అని అన్నారు. అయితే.. జైల్లోనే కోర్టు ఏర్పాటు చేసి విచారణ జరపాలని, దానికి న్యాయమూర్తిని ఎలా ఎంపిక చేస్తారో పరిశీలిస్తామని బెంచ్ పేర్కొంది. అలాగే.. అయితే ఈ విచారణ కోసం హాజరయ్యే సాక్షుల భద్రతకు సంబంధించి కేంద్రాన్ని వివరణ కోరుతూ తదుపరి విచారణ గురువారానికి వాయిదా వేసింది. -
కశ్మీర్ అసెంబ్లీలో ఆఖరి రోజూ ఆగని ఆందోళనలు
శ్రీనగర్: జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఆఖరి రోజైన శుక్రవారం కూడా ఆందోళనల మధ్యే కొనసాగింది. లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరుగుతున్న చర్చకు బీజేపీ సభ్యులు అడ్డుపడ్డారు. కశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని పునరుద్ధరించాలంటూ అసెంబ్లీ చేసిన తీర్మానాన్ని వెనక్కి తీసుకోవాలంటూ నినాదాలతో హోరెత్తించారు. గొడవకు దిగిన ఎమ్మెల్యేలను స్పీకర్ ఆదేశాలతో మార్షల్స్ బలవంతంగా బయటకు తీసుకెళ్లారు. లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చకు సమాధానమిస్తూ శుక్రవారం సీఎం ఒమర్ అబ్దుల్లా.. జమ్మూకశ్మీర్కు పూర్తి రాష్ట్ర హోదా పునరుద్ధరణ ప్రక్రియను కేంద్రం త్వరలోనే ప్రారంభిస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. కేంద్ర పాలిత ప్రాంత హోదాతో పరిమిత అధికారాలతో అభివృద్ధిని, శాంతిభద్రతలను సాధించలేమని చెప్పారు. సమావేశాల సందర్భంగా అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన బీజేపీ శాసనసభా పక్షం నేత సునీల్ శర్మతోపాటు ఆ పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలపై ఎన్సీ ఎమ్మెల్యే సజ్జాద్ షహీన్, మరొకరు హక్కుల తీర్మానం ప్రవేశపెట్టారు. వీటిని పరిశీలించి చర్యలు తీసుకుంటానని స్పీకర్ రథేర్ చెప్పారు. అనంతరం సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. -
జమ్మూ కశ్మీర్ అసెంబ్లీలో మరోసారి ఉద్రిక్తత
-
జమ్ము కశ్మీర్ శ్రీనగర్లో భారీ ఉగ్రదాడి
శ్రీనగర్: జమ్ము కశ్మీర్లో మళ్లీ ఉగ్రదాడి జరిగింది. ఆదివారం శ్రీనగర్ సండే మార్కెట్లోని టూరిస్ట్ సెంటర్ ఆఫీస్(TRC)పై ఉగ్రవాదులు గ్రనేడ్లు విసిరారు. ఈ దాడిలో పది మందికి(12 మంది) పైగా తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం అందాల్సి ఉంది. శ్రీ నగర్ నగరానికి గుండెకాయగా చెప్పుకునే లాల్ చౌక్ను ఆనుకున్న రోడ్డులోనే సండే మార్కెట్ పేరిట వారాంతపు సంత నిర్వహిస్తారు. మార్కెట్ కారణంగా టీఆర్సీ గ్రౌండ్లో విపరీతమైన జన రద్దీ నెలకొంది. ఇదే అదనుగా భావించిన ఉగ్రవాదులు మైదానంలోకి గ్రనేడ్లు విసిరినట్లు స్థానిక మీడియా చానెల్స్ కథనాలు ఇస్తున్నాయి. దాడి జరిగిన వెంటనే పారామిలిటరీ బలగాలు ఆ ప్రాంతాన్ని తమ స్వాధీనంలోకి తీసుకున్నాయి. క్షతగాత్రుల్ని ఆస్పత్రులకు చేర్చాయి. ప్రస్తుతం అక్కడ ఉగ్రవాదుల కోసం గాలింపు కొనసాగుతోంది. లష్కరే తాయిబా గ్రూప్కు చెందిన టాప్ కమాండర్ ఒకరిని.. ఖన్యార్ ప్రాంతంలో భారత సైన్యం మట్టుపెట్టింది. ఆ మరుసటి రోజే ఈ దాడి జరగడం గమనార్హం. #BREAKINGGrenade attack in Srinagar's busy Sunday market injures 5 civiliansIncident occurred near the heavily-guarded Tourist Reception Centre (TRC)Comes a day after security forces neutralized top Lashkar-e-Taiba commander in downtown #Srinagar. Security forces on site… pic.twitter.com/iaWl1NJNL9— Nabila Jamal (@nabilajamal_) November 3, 2024ఇదిలా ఉంటే.. ఈ మధ్యకాలంలో అక్కడ వరుసగా ఉగ్రవాద కదలికలు పెరిగాయి. గత వారం రోజులుగా మూడు ఎన్కౌంటర్లు జరిగాయి. అంతకు ముందు నుంచే సైనిక వాహనాలపైనా దాడులు జరుగుతున్నాయి. దీంతో భద్రతా బలగాలు కూంబింగ్ కట్టుదిట్టం చేశాయి. ఒకవైపు సైనికులు.. మరోవైపు అమాయక ప్రజలు సైతం ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో వరుస ఉగ్రదాడి ఘటనలపై కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆందోళన వ్యక్తం చేశారు. జమ్ము కశ్మీర్లో టెర్రరిస్టుల దాడులు దురదృష్టకరమని , సరిహద్దుల్లో ఎలాంటి భద్రతా లోపం లేదని.. ఉగ్రవాదులకు భద్రతా దళాలు తగిన సమాధానం ఇస్తున్నాయని చెప్పారు.ఇదీ చదవండి: కశ్మీర్ ఓటమి.. కమలం పార్టీ కీలక నిర్ణయం -
బీజేపీ కీలక నిర్ణయం.. పార్టీ జమ్ముకశ్మీర్ చీఫ్ మార్పు
జమ్ము: జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు ముగియగానే అక్కడి పార్టీ నాయకత్వం విషయంలో బీజేపీ కీలక నిర్ణయం తీసుకుంది.పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షుడిని మార్చింది. జమ్ముకశ్మీర్ పార్టీ కొత్త అధ్యక్షుడిగా సత్శర్మను నియమించింది. ఇప్పటివరకు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా కొనసాగిన రవీందర్రైనాను పార్టీ జాతీయ కార్యవర్గంలోకి తీసుకున్నారు.ఈ మేరకు బీజేపీ నేషనల్ జనరల్ సెక్రటరీ అరుణ్సింగ్ దివారం(నవంబర్ 3)ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నియామకం తక్షణం అమలులోకి వస్తుందని ఉత్వర్వుల్లో పేర్కొన్నారు.సత్శర్మను సెప్టెంబర్లోనే రాష్ట్ర పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా రెండు నెలల్లోనే అధ్యకక్షుడిని చేయడం గమనార్హం. ఇదీ చదవండి: 10 రోజుల్లో యోగి రాజీనామా చేయకుంటే.. -
జమ్ము కశ్మీర్లో ఉగ్రవాదుల కాల్పులు.. రెండు వారాల్లో నాలుగోసారి..
శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో మరోసారి కాల్పుల ఘటన చోటుచేసుకుంది. వలస కార్మికులే టార్గెట్ ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఈ క్రమంలో ఇద్దరు కార్మికులు తీవ్రంగా గాయపడటంతో వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు.జమ్ముకశ్మీర్లోని బుద్గామ్లో శుక్రవారం సాయంత్రం ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. వలస కార్మికులను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరపడంతో ఇద్దరు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో, గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. దాడిలో గాయపడిన ఇద్దరిని ఉత్తరప్రదేశ్కు చెందిన ఇద్దరు వలస కార్మికులు ఉస్మాన్ మాలిక్ (20), సోఫియాన్ (25)గా గుర్తించారు. అయితే, వారిద్దరికీ ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు.ఇదిలా ఉండగా.. గత రెండు వారాల్లో కశ్మీర్ లోయలో వలస కార్మికులపై నాలుగో సారి దాడి జరిగింది. అక్టోబరు 20న గందర్బల్ జిల్లాలోని సొరంగం నిర్మాణ స్థలంలో ఉగ్రవాదులు దాడులు చేశారు. ఉగ్రదాడిలో స్థానిక వైద్యుడు, బీహార్కు చెందిన ఇద్దరు కార్మికులతో సహా ఏడుగురు మృతిచెందిన విషయం తెలిసిందే. -
ఉగ్రవాదంపై రాజీలేని పోరు: అమిత్ షా
న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీర్, ఈశాన్య భారతం, నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో సాపేక్షంగా శాంతిని నెలకొల్పినట్టు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించారు. ఉగ్రవాదం, చొరబాట్లు, మతపరమైన ఉద్రిక్తతలను సృష్టించే కుట్రలపై పోరాటం కొనసాగుతుందన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా సోమవారం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పోలీసు అమరుల త్యాగం వృథా కాదన్నారు. ‘‘స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి దేశ భద్రత కోసం 36,438 మంది పోలీసులు ప్రాణత్యాగం చేశారు. గతేడాదే 216 మంది ప్రాణాలు కోల్పోయారు’’ అని ఆవేదన వ్యక్తం చేశారు. వారి త్యాగానికి దేశం ఎప్పటికీ రుణపడి ఉంటుందన్నారు. కొత్త నేర న్యాయ చట్టాలతో భారత న్యాయ వ్యవస్థ ప్రపంచంలోనే అత్యంత ఆధునికంగా మారిందన్నారు. పోలీసు సిబ్బంది, కుటుంబీకులు ఇక ఏ ఆయుష్మాన్ ఆసుపత్రిలోనైనా ఉచిత చికిత్స పొందవచ్చని హోం మంత్రి తెలిపారు. ‘‘సీఏపీఎఫ్ సిబ్బంది కోసం 13 వేల ఇళ్ల నిర్మాణానికి అనుమతులిచ్చాం. వచ్చే మార్చి నాటికి 11,276 ఇళ్లు సిద్ధమవుతాయి’’ అని వెల్లడించారు. విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీసు సిబ్బందికి ఆయన నివాళులర్పించారు. -
పాక్ సర్కార్కు ఫరూఖ్ అబ్దుల్లా వార్నింగ్
శ్రీనగర్: జమ్ము కశ్మీర్లోని గందేర్బల్లోని గుండ్ ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడిని నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా తీవ్రంగా ఖండించారు. భారతదేశంలో ఉగ్రవాదం వ్యాప్తి చేయటాన్ని పాకిస్తాన్ ఆపేయాలని అన్నారు. భారత్తో సత్సంబంధాలు కావాలంటే పాకిస్తాన్ ఉగ్రవాద చర్యలకు స్వస్తి చెప్పాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. జమ్ము కశ్మీర్ ఎప్పటికీ పాకిస్థాన్గా మారదని తెలిపారు. పాకిస్తాన్ తన గడ్డపై ఉగ్రవాదాన్ని పెంచిపోషించడం విరవించకుంటే తీవ్ర పరిణామాలుంటాయని వార్నింగ్ ఇచ్చారు.‘‘భారత్తో సత్సంబంధాలు కావాలంటే ఉగ్రవాద చర్యలకు స్వస్తి పలకాలని పాక్ నాయకత్వానికి చెప్పాలనుకుంటున్నా. జమ్ము కశ్మీర్ ఎప్పటికీ పాకిస్థాన్గా మారదు. కశ్మీర్ ప్రజలుగా మేము గౌరవంగా జీవించి.. విజయం సాధిస్తాం. 75 ఏళ్లుగా ఉగ్రవాదం లేని పాకిస్థాన్ను సృష్టించలేకపోతే ఇప్పుడు అది ఎలా సాధ్యమవుతుంది?. ఉగ్రవాదాన్ని అంతం చేసే సమయం వచ్చింది. లేకపోతే ఫలితాలు చాలా తీవ్రంగా ఉంటాయి...కశ్మీర్ అమాయకులను చంపితే ఇరు దేశాల మధ్య చర్చలు ఎలా జరుగుతాయి?. ఉగ్రవాదులు చేసిన దాడి చాలా దురదృష్టకరం. వలస వచ్చిన పేద కార్మికులు, ఒక డాక్టర్ ప్రాణాలు కోల్పోయారు. దీనివల్ల ఉగ్రవాదులకు ఏం ప్రయోజనం వస్తుంది? ఉగ్రవాదులు కశ్మీర్లో పాకిస్తాన్ను సృష్టించగలరని భావిస్తున్నారా.. మేము ఉగ్రవాదాన్నే అంతం చేయడానికి ప్రయత్నిస్తున్నాం’’ అని అన్నారు.ఈ దాడికి కనీసం ఇద్దరు ఉగ్రవాదులు పాల్పడినట్లు తెలుస్తోంది. ఇద్దరు కార్మికులు అక్కడికక్కడే మరణించగా, మరో నలుగురు, ఓ డాక్టర్ తీవ్రంగా గాయపడి మృతి చెందారు. మరోవైపు ఉగ్రదాడిపై దర్యాప్తు చేసేందుకు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) కశ్మీర్కు చేరుకుంది. -
కశ్మీర్లో స్థానికేతరులపై ముష్కరుల కాల్పులు
శ్రీనగర్: జమ్మూకశ్మీర్లో ఉగ్రమూకలు మళ్లీ పేట్రేగిపోయాయి. శ్రీనగర్–లేహ్ జాతీయ రహదారిపై టన్నెల్ నిర్మాణ పనుల ప్రాంతంలో ఉన్న ఒక వైద్యుడు, ఐదుగురు స్థానికేతర కార్మికులను చంపేశారు. గందేర్బల్లోని గుండ్ ప్రాంతంలో ఆదివారం సాయంత్రం ఘటన చోటుచేసుకుంది. పనులు చేస్తున్న స్థానిక, స్థానికేతర కార్మికులు, ఇతర సిబ్బందిపై ఇద్దరు ఉగ్రవాదులు యథేచ్ఛగా కాల్పులకు తెగబడినట్లు సమాచారం. కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన ఇద్దరు అక్కడికక్కడే చనిపోగా, మరో ఐదుగురు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారని అధికారులు తెలిపారు. గాయపడిన మరో ఐదుగురు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారన్నారు. మృతులను డాక్టర్ షెహనవాజ్, ఫహీమ్ నజిర్, కలీం, మహ్మద్ హనీఫ్, శశి అబ్రోల్, అనిల్ శుక్లా, గుర్మిత్ సింగ్లుగా గుర్తించారు. ముష్కరులను పట్టుకునేందుకు భద్రతా బలగాలు ఆప్రాంతాన్ని దిగ్బంధించి, గాలింపు చేపట్టాయి. కశ్మీర్ ఐజీ వీకే బిర్డి తదితర అధికారులు ఘటనాస్థలికి చేరుకుని, పరిస్థితిని సమీక్షించారు. ఘటనను కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఖండించారు. ఉగ్రమూకలను వదిలేది లేదని స్పష్టం చేశారు. కాల్పుల ఘటనను సీఎం ఒమర్ అబ్దుల్లా ఖండించారు. ఘటనలో మృతుల సంఖ్య పెరగొచ్చని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కాగా, శుక్రవారం బుల్లెట్ గాయాలతో ఉన్న బిహార్కు చెందిన కార్మికుడి మృతదేçహాన్ని షోపియాన్ జిల్లాలో గుర్తించామని అధికారులు తెలిపారు. -
జమ్మూకశ్మీర్ రాష్ట్రహోదా తీర్మానానికి ఎల్జీ ఓకే
శ్రీనగర్: జమ్మూకశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతానికి రాష్ట్ర హోదాను పునరుద్ధరించాలంటూ ఒమర్ అబ్దుల్లా కేబినెట్ చేసిన తీర్మానానికి లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఆమోదముద్రవేశారు. గురువారం సమావేశమై కేబినెట్ ఆమోదించిన తీర్మానానికి ఎల్జీ ఆమోదం తెలిపినట్లు అధికారిక వర్గాలు శనివారం వెల్లడించాయి. జమ్మూకశ్మీర్ ప్రజల గుర్తింపు, రాజ్యాంగబద్ధ హక్కులను తిరిగి పొందేందుకు పాత గాయాలను మాన్పే పూర్తిరాష్ట్ర హోదా పొందే ప్రక్రియలో ఈ తీర్మానం తొలి అడుగు అని ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. జమ్మూకశ్మీరీల ప్రత్యేక గుర్తింపే నూతన ప్రభుత్వం అనుసరించనున్న విధాననిర్ణయాలకు భూమిక అని ఆయన అన్నారు. నవంబర్ నాలుగోతేదీన అసెంబ్లీ సమావేశాలు జరపనున్నారు. రాష్ట్ర పునరుద్ధరణకు సంబంధించిన విషయాలపై ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులతో చర్చించేందుకు సీఎం ఒమర్ త్వరలో ఢిల్లీకి వెళ్లనున్నారు. అయితే రద్దయిన 370 ఆరి్టకల్ను తిరిగి తీసుకొచ్చే విషయంలో ఎలాంటి తీర్మానాలు జరగకపోవడాన్ని విపక్షాలు తీవ్రంగా తప్పుబట్టాయి. కొలువుతీరిన కొద్దిరోజులకే ఒమర్ సర్కార్ అప్పుడే కేంద్రప్రభుత్వానికి లొంగిపోయిందని ఆగ్రహం వ్యక్తంచేశాయి. -
రాష్ట్ర హోదా త్వరగా రావాలి
శ్రీనగర్: కేంద్రపాలిత ప్రాంతం జమ్మూ కశ్మీర్కు తొలి సీఎంగా బుధవారం బాధ్య తలు స్వీకరించిన కొద్దిసేపటికే పీటీఐ వీడియోస్తో ఒమర్ అబ్దుల్లా ముఖాముఖి మాట్లాడారు. జమ్మూకశ్మీర్కు త్వరలోనే రాష్ట్ర హోదా వస్తుందని ఆశాభావం వ్యక్తంచేశారు. ‘‘ కాంగ్రెస్ పార్టీతో కలిసి రాష్ట్ర హోదా సాధనకు కృషిచేస్తాం. త్వరలోనే రాష్ట్ర హోదా దక్కొచ్చని భావిస్తున్నాం. ఖాళీగా ఉన్న మంత్రిపదవుల భర్తీ కోసం కాంగ్రెస్తో చర్చలు జరుపుతున్నాం. కాంగ్రెస్తో బేధాభి ప్రాయా లు అబద్ధం. నిజంగానే సఖ్యత చెడితే ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక వంటి అగ్రనేతలు మా ప్రమాణ స్వీకార కార్య క్రమానికి రారుకదా. ప్రభు త్వంలో చేరాలా వద్దా అనేది వాళ్ల ఇష్టం. శాసనమండలి కూడా లేని జమ్మూ కశ్మీర్లో తక్కువ మంది మంత్రులతో ప్రభు త్వాన్ని నడపాలని భావిస్తున్నాం. గతంలోలాగా 40, 45 మంది మంత్రులుండే కాలం పోయింది. 2018 నుంచి ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం కశ్మీర్లో లేదు. తమ సమస్యల్ని పట్టించుకున్న నాథుడే లేడని ప్రజలు నిరాశలో కుంగిపోయారు. అందుకే కొత్తగా ఏర్పడిన మా ప్రభుత్వ తక్షణ కర్తవ్యం వారి సమస్యలను పరిష్కరించడమే. కేంద్రపాలిత ప్రాంతంగా కశ్మీర్ను పాలించడం కొత్త రకం సవాల్. అందివచ్చిన తొలి అవకాశాన్ని దుర్వినియోగం చేసుకోవడం పెద్ద నేరంతో సమానం. గత తప్పిదాలు చేయబోను. కేజ్రీవాల్సహా దేశంలో పరిపా లనా అనుభవం ఉన్న కీలక వ్యక్తులు అందరి నుంచి పాఠాలు నేర్చుకుంటా’’ అని ఒమర్ వ్యాఖ్యానించారు. -
J&K: సీఎంగా ఒమర్ అబ్దుల్లా ప్రమాణం
Updates కేంద్ర పాలిత ప్రాంతం జమ్మూకశ్మీర్ తొలి ముఖ్యమంత్రిగా నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ) ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా ప్రమాణం చేశారు.శ్రీనగర్లోని షేర్–ఇ–కశ్మీర్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్(ఎస్కేఐసీసీ)లో జరిగిన ఈ కార్యక్రమంలో లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా సీఎంగా ఒమర్తో ప్రమాణం చేయించారు.#WATCH | Omar Abdullah takes oath as the Chief Minister of Jammu and Kashmir.The leaders from INDIA bloc including Lok Sabha LoP Rahul Gandhi, Congress leader Priyanka Gandhi Vadra, JKNC chief Farooq Abdullah, Samajwadi Party chief Akhilesh Yadav, PDP chief Mehbooba Mufti, AAP… pic.twitter.com/IA2ttvCwEJ— ANI (@ANI) October 16, 2024 ఒమర్ అబ్దుల్లా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి.. కాంగ్రెస్ పార్టీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ, ఇండియా కూటమి నేతలు.. సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, డీఎంకే ఎంపీ కనిమొళి కరుణానిధి, ఎన్న్సీపీ-ఎస్స్పీ ఎంపీ సుప్రియా సూలే, సీపీఐ నేత డీ. రాజా హాజరయ్యారు.అంతకు ముందు.. జమ్ము కశ్మీర్ ముఖ్యమంత్రిగా ఒమర్ అబ్దుల్లా ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యేందుకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే శ్రీనగర్ చేరుకున్నారు. #WATCH | Congress President Mallikarjun Kharge reaches Srinagar to attend the swearing-in ceremony of Omar Abdullah as the Chief Minister of Jammu and Kashmir. pic.twitter.com/3OCIoQKqMP— ANI (@ANI) October 16, 2024 ఒమర్ అబ్దుల్లా ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొనేందుకు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ శ్రీనగర్ చేరుకున్నారు. Rahul Gandhi, Priyanka Gandhi arrive in Srinagar to attend swearing-in ceremony of Omar AbdullahRead @ANI Story | https://t.co/u7dPfwgpJc#RahulGandhi #OmarAbdullah #PriyankaGandhi #SwearingInCeremony #JKChiefMinister pic.twitter.com/SRTlRKJ6N8— ANI Digital (@ani_digital) October 16, 2024 జమ్ము కశ్మీర్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారోత్సవానికి ముందు.. నేషనల్ కాన్ఫరెన్స్ వైస్ ప్రెసిడెంట్ ఒమర్ అబ్దుల్లా బుధవారం మీడియాతో మాట్లాడారు. ‘‘ భారత ప్రభుత్వంతో సహకారంతో పనిచేయడానికి ఉత్సాహంగా ఎదురుచూస్తున్నా. అయితే ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి సీఎంగా స్వంత హక్కు ఉంది. నేను విచిత్రమైన సవాళ్లను కలిగి ఉన్నా. పూర్తి ఆరేళ్ల పదవీకాలం పూర్తి చేసిన చివరి ముఖ్యమంత్రిని నేను. ఇప్పుడు నేను జమ్ము కశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతానికి తొలి ముఖ్యమంత్రిని అవుతాను. జమ్ము కశ్మీర్కు రాష్ట్ర హోదాను పునరుద్ధరించడం ద్వారా మా పాలన మొదలవుతుంది’’ అని అన్నారు.ఈ కార్యక్రమానికి హాజరు కావడానికి ఇప్పటికే ఇండియా కూటమి నేతలు.. సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, డీఎంకే ఎంపీ కనిమొళి కరుణానిధి, ఎన్న్సీపీ-ఎస్స్పీ ఎంపీ సుప్రియా సూలే, సీపీఐ నేత డీ. రాజా చేరుకున్నారు. Samajwadi Party chief Akhilesh Yadav, DMK MP Kanimozhi Karunanidhi, NCP-SCP MP Supriya Sule and CPI leader D Raja in Srinagar to attend the swearing-in ceremony of J&K CM-designate Omar AbdullahOmar Abdullah to take oath as J&K CM today. (Pics: Akhilesh Yadav's social media… pic.twitter.com/TO4tSGzFmn— ANI (@ANI) October 16, 2024ఆర్టీకల్ 370 ఆర్టీకల్ రద్దు అనంతరం మొదటిసారిగా ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎన్సీ, కాంగ్రెస్ కూటమి విజయం సాధించడం తెలిసిందే. -
జమ్మూలో ఈవీఎంలు మంచివేనా: కిషన్రెడ్డి ప్రశ్న
సాక్షి,హైదరాబాద్:హర్యానాలో ఈవీఎంల అక్రమాలు జరిగితే జమ్మూలో ఎందుకు జరగలేదని,కాంగ్రెస్ గెలిచిన రాష్ట్రాల్లో ఈవీఎం ట్యాంపరింగ్ ఆరోపణలు ఎందుకు రావడం లేదని కేంద్రమంత్రి,జమ్మూకశ్మీర్ ఇంఛార్జ్ కిషన్రెడ్డి ప్రశ్నించారు.తెలంగాణ బీజేపీ కార్యాలయంలో కిషన్రెడ్డి శుక్రవారం(అక్టోబర్11) మీడియాతో చిట్చాట్గా మాట్లాడారు.‘ఓట్లు జమ్మూలో ఒక రకంగా పోలరైజ్ అయ్యాయి. కశ్మీర్లో మరోరకంగా పోలరైజ్ అయ్యాయి. హర్యానా ఎగ్జిట్ పోల్స్ రాగానే మంత్రి వర్గ కూర్పు పై రాహుల్, సోనియా దగ్గర క్యూ కట్టారు. ఆర్టికల్ 370 పునరుద్ధరణ చేసే అవకాశం లేదు.ఆర్టికల్ 370పై కాంగ్రెస్ మాట్లాడే ధైర్యం చేయడం లేదు. జమ్మూ కశ్మీర్లో ఆరుగురు కాంగ్రెస్ నుంచి గెలిస్తే ఆ ఆరు మంది ముస్లింలే.బీజేపీ నుంచి గెలిచిన 29 మంది హిందువులే. 19 మంది కొత్తవాళ్ళు. భద్రత విషయంలో కేంద్రప్రభుత్వ విధానంలో మార్పు లేదు. జమ్మూలో టెర్రరిజం పై మరింత జాగ్రత్తగా ఉంటాం. జమ్మూలో సరిహద్దు కేంద్ర ప్రభుత్వ పరిధిలోనే ఉంటుంది. ఈ ఎన్నికల్లో ఒక్క రాయి విసిరిన సంఘటన జరగలేదు.భారతదేశంలో పాకిస్థాన్ ఐఎస్ఐ యాక్టివిటీ తగ్గింది.పెద్ద నోట్ల రద్దుకు పాకిస్తాన్లో దొంగ నోట్ల ముద్రణ ఒక కారణం. పాకిస్తాన్కు ఇతర దేశాల మద్దతు లేకుండా చేయడంలో భారత్ సక్సెస్ అయ్యింది.ఒక్క చైనా మాత్రమే పాకిస్తాన్కు మద్దతు పలుకుతోంది. ఇదీ చదవండి: ఆదాయం ఎందుకు తగ్గింది -
J&K: ఎన్సీ శాసనసభాపక్షనేతగా ఒమర్ అబ్దుల్లా
శ్రీనగర్: జమ్ము కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో జమ్ము కశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ -కాంగ్రెస్ కూటమి ఘన విజయం సాధించింది. తాజాగా నేషనల్ కాన్ఫరెన్స్ శాసనసభాపక్షనేతగా ఎన్సీ నేత, మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని గురువారం ఎన్సీ సీనియర్ నేత ఫరూక్ అబ్దుల్లా వెల్లడించారు. ఎన్సీ శాసనసభాపక్షనేతగా ఎన్నికైన అనంతరం మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా మీడియాతో మాట్లాడారు.‘‘ఈరోజు నేషనల్ కాన్ఫరెన్స్ లెజిస్లేచర్ పార్టీ సమావేశం జరిగింది. అందులో నేను లెజిస్లేచర్ పార్టీ నాయకుడిగా ఎన్నుకోబడ్డాను. పార్టీ ఎమ్మెల్యేలందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ప్రభుత్వం ఏర్పాటుకు సంబంధించి చర్చలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ మద్దతు ప్రకటించింది.#WATCH | Srinagar, J&K: JKNC vice president Omar Abdullah says, "Today in the meeting of the National Conference Legislature Party, I have been elected as the leader of the Legislature Party. I express my gratitude to the MLAs. Talks are going on to get the letter of support from… pic.twitter.com/uM86jG9rc9— ANI (@ANI) October 10, 2024అదేవిధంగా 4 స్వతంత్ర ఎమ్మెల్యేలు కూడా ఎన్సీ ప్రభుత్వాన్ని ఏర్పాటు తమ మద్దతు ప్రకటించారు. ప్రస్తుతం ఎన్సీ 42 ఎమ్మెల్యేలు, స్వతంత్ర ఎమ్మెల్యేలు నలుగురిని కలుపుకొని మొత్తం 46 మంది ఎమ్మెల్యేలను కలిగి ఉన్నాం. కాంగ్రెస్ నుంచి మద్దతు లేఖ అందిన వెంటనే మేము జమ్ము కశ్మీర్ ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని రాజ్భవన్కు వెళ్తాం’ అని అన్నారు. -
Jammu Kashmir election results: కశ్మీర్ లోయలో ఎర్రజెండా
జమ్మూకశ్మీర్ రాజకీయ ముఖచిత్రం నెమ్మదిగా మారుతోంది. కానీ స్థిరంగా ఉన్నది ఒకే ఒక నాయకుడు మహమ్మద్ యూసఫ్ తరిగామి. పచ్చని కశ్మీరీ లోయలో ఎర్రజెండాను రెపరెపలాడిస్తున్న సీపీఎం వెటరన్ లీడర్. కుల్గాం జిల్లాలో 1996 నుంచి సీపీఎంను విజయపథాన నడిపిస్తున్న నేత. జమాతే వెన్నుదన్నుతో మతం పేర ఓట్లడిగిన స్వతంత్ర అభ్యర్థి సయార్ అహ్మద్ రేషిని తన అభివృద్ధితో ఓడించారు. – సాక్షి, నేషనల్ డెస్క్ నిజానికి తరిగామి ఆయన ఇంటిపేరు కాదు.. ఊరి పేరు అసలే కాదు. షేక్ అబ్దుల్లా ముఖ్యమంత్రిగా ఉన్న 1979లో యూసఫ్ను అరెస్టు చేశారు. ఆయన అరెస్టు గురించి ఓ జర్నలిస్టు సీఎంను ప్రశ్నించగా.. ‘ఓ జో తరిగామ్ వాలా?’అంటూ ప్రస్తావించారు. అప్పటినుంచి తరిగామి ఆయన ఇంటిపేరుగా మారిపోయింది. ఆయన ఎన్నికల అఫిడవిట్లో కూడా తరిగామి ఉంటుంది. దక్షిణ కశ్మీర్లో ఉన్న కుల్గాం.. 1996 నుంచి సీపీఎం పారీ్టకి మంచి పట్టున్న ప్రాంతం. కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ.. రాష్ట్రాన్ని ఏ పార్టీ అయినా పరిపాలించనీ. కుల్గామ్ మాత్రం తరిగామీదే. అందుకే మంగళవారం ఆయన గెలుపొందిన తరువాత ‘హక్ కా హామీ తరిగామీ’అంటూ కుల్గామ్ వీధులన్నీ మారుమోగాయి. గట్టిపోటీని తట్టుకుని..ఈ ఎన్నికల్లో కుల్గాంలో గట్టిపోటీ నేలకొంది. నిషేధిత జమాతే ఇస్లామీ బలపరిచిన అభ్యర్థి సయార్ అహ్మద్ రేషితో తరిగామి తలపడ్డారు. మత తీవ్రవాదానికి పేరుగాంచిన జమాత్ 1980 తర్వాత ఈ ప్రాంతంలో ఎన్నికల ప్రక్రియలో పాల్గొనడం ఇదే తొలిసారి. అంతకుముందు దాదాపు మూడు దశాబ్దాల పాటు ఎన్నికల ప్రజాస్వామ్యాన్ని బహిష్కరించింది. దీన్ని కేంద్రం 2019లో నిషేధించింది. 2024 జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన 10 మంది జమాత్ మద్దతు గల స్వతంత్ర అభ్యర్థుల్లో రేషి ఒకరు. నేషనల్ కాన్ఫరెన్స్, జమ్మూకశ్మీర్ పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ, సీపీఎం పార్టీలతో కూడిన పీపుల్స్ అలయన్స్ ఫర్ గుప్కర్ డిక్లరేషన్ (పీఏజీడీ) తమ అభ్యరి్థగా తరిగామికి మద్దతు ఇచి్చంది. 85 స్థానాలకు ఎన్నికలు జరగ్గా ఒక్క కుల్గాంలోనే సీపీఎం పోటీ చేసింది. జమాత్ సైద్ధాంతిక ఆకర్షణతో రేషి రంగంలోకి దిగారు. తాను ఓడిపోతే.. ఇస్లాం ఓడిపోయినట్టేనంటూ ప్రచార ర్యాలీలో చెప్పారు. కానీ తరిగామి తన అభివృద్ధి మంత్రంతోనే ముందుకెళ్లారు. ఆరి్టకల్ 370 పునరుద్ధరణకు కట్టుబడి ఉన్నామని తరిగామి ప్రాతినిధ్యం వహించిన (పీఏజీడీ) చెబుతూ వచి్చంది. తన హయాంలో చేపట్టిన అభివృద్ధి పనుల గురించి మాత్రమే ప్రచారంలో తరిగామి వివరించారు. నియోజకవర్గంలోని రోడ్లు, పాఠశాలలు, ఆసుపత్రుల వంటి మౌలిక సదుపాయాలను మరింత మెరుగుపర్చాల్సి ఉందన్నారు. ప్రత్యర్థి రేషి ప్రచారం ఇందుకు విరుద్ధంగా ఉంది. కేవలం ఆరి్టకల్ 370 చుట్టే తిరిగింది. అంతిమంగా, ఇస్లాం మతతత్వానికి వ్యతిరేకంగా కమ్యూనిస్ట్ తరిగామి విజయం సాధించారు. కుల్గాంలో తరిగామి విజయం ప్రజాస్వామ్యం, లౌకికత్వం విజయమని సీపీఎం పార్టీ కొనియాడింది. జైలు జీవితం.. గృహ నిర్భందం.. 1949లో జని్మంచిన తరిగామి.. అబ్దుల్ కబీర్ వని ప్రభావంతో చిన్న వయసులోనే రాజకీయాల్లోకి ప్రవేశించారు. 18 ఏళ్ల వయసులో అనంత్ నాగ్ కాలేజీలో సీట్లను పెంచాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు చేపట్టిన ఆందోళనలో పాల్గొన్నారు. ఆ తర్వాత 1960, 1970 దశకాల్లో జమ్ముకశ్మీర్ లో జరిగిన పలు విద్యారి్థ, రైతు ఉద్యమాల్లో పాలు పంచుకన్నారు. 1979లో పాకిస్తాన్ మాజీ ప్రధాని జులి్ఫకర్ అలీ భుట్టో ఉరిశిక్ష తర్వాత కశ్మీర్లో అల్లర్లు చెలరేగాయి. ఈ సందర్భంగా ఆయన జైలుకు వెళ్లారు. వివాదాస్పద ప్రజా భద్రతా చట్టం (పీఎస్ఏ) కింద నిర్భందానికి గురైన వామపక్ష నాయకుల్లో తరిగామి ఒకరు. 2019లో ఆరి్టకల్ 370ని రద్దు చేసి జమ్మూకశ్మీర్ను కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించినప్పుడు తరిగామిని శ్రీనగర్లో 35 రోజుల పాటు గృహనిర్భందలో ఉంచారు. నిర్భందంలో ఉన్న సమయంలో అనారోగ్యంతో బాధపడుతున్న తరిగామిని ఎయిమ్స్కు తరలించేందుకు ఆయన సహచరుడు సీతారాం ఏచూరి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. -
బీజేపీ గెలుపు కాదు.. కాంగ్రెస్ ఓటమి: ఆప్ సెటైర్లు
ఢిల్లీ: హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. ఎగ్జిట్ పోల్స్ను తలకిందులు చేస్తూ.. అనూహ్యంగా బీజేపీ హ్యాట్రిక్ గెలుపు సొంతం చేసుకుంది. అయితే.. హర్యానా ఫలితాలపై ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. సెటైర్లు వేశారు. హర్యానాలో బీజేపీ గెలుపును అంగీకరించలేనని అన్నారు. బీజేపీ విజయం అనటం కంటే.. కాంగ్రెస్ ఓటమే అధికమని అన్నారు. అధికార బీజేపీ పార్టీకి 39 శాతం ఓట్ల వస్తే.. 61 శాతం ఓట్లు వ్యతిరేకంగా వచ్చాయని గుర్తు చేశారు.‘‘ఎన్నికల్లో మొత్తం పోలైన ఓట్లలో 50 శాతం కంటే ఎక్కువ బీజేపీకి వస్తే నేను ఆ పార్టీ విజయాన్ని అంగీకరించేవాడిని. కానీ, అలా జరగలేదు. హర్యానాలో ఓట్లు బీజేపీకి గెలుపు కోసం పడలేదు. బీజేపీకి వ్యతిరేకంగా ఓట్లు వచ్చాయి. 39 శాతం ఓట్లు బీజేపీకి పడ్డాయి. అదే బీజేపీకి 61 శాతం వ్యతిరేకంగా ప్రజలు ఓటు వేశారు. ఇది బీజేపీ గెలుపు కాదు.. కాంగ్రెస్ ఓటమి’’ అని అన్నారు. మరోవైపు.. జమ్ము కశ్మీర్లో నేషనల్ కాన్ఫరెన్స్తో కలిసి కాంగ్రెస్ ఎన్నికల్లో కూటమిగా బరిలో దిగిందని, అందుకే బీజేపీని ఓడించగలిగిందని అన్నారు. ‘‘ జమ్ము కశ్మీర్లో ఇండియా కూటమి ఒక యూనిట్గా పోరాటం చేసింది. నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ కలిసి కూటమిగా బరిలో దిగటంతో బీజేపీ ఓడిపోయింది. కానీ, హర్యానాలో దురదృష్టవశాత్తు.. ఇండియా కూటమి పార్టీలు ఒంటరిగా బరిలో దిగటంతో ఫలితం కాంగ్రెస్కు వ్యతిరేకంగా వచ్చింది’’ అని అన్నారు.చదవండి: బీజేపీలో చేరిన కేరళ తొలి మహిళా ఐపీఎస్ -
కశ్మీర్కు రాష్ట్ర హోదాపైనే తొలి తీర్మానం: ఒమర్ అబ్దుల్లా
శ్రీనగర్:తమ ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే జమ్మూ-కశ్మీర్కు రాష్ట్ర హోదా ఇవ్వాలనే తీర్మానాన్ని ప్రధానికి సమర్పిస్తామని నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ)నేత ఒమర్అబ్దుల్లా అన్నారు.నియోజకవర్గాల పునర్విభజన,రాష్ట్ర హోదా వరుసగా ఉంటాయన్నారు.కొందరు నేతలు జమ్ముకశ్మీర్ను ఢిల్లీతో పోల్చడంపై ఒమర్ మండిపడ్డారు. కశ్మీర్ను ఢిల్లీతో పోల్చొద్దన్నారు.దేశ రాజధానికి రాష్ట్ర హోదా ఇస్తామని ఎవరూ చెప్పలేదన్నారు.కానీ కశ్మీర్కు రాష్ట్ర హోదాను పునరుద్ధరిస్తామని ప్రధాని,హోంమంత్రి హామీ ఇచ్చారని చెప్పారు.2019 వరకు జమ్మూకశ్మీర్ రాష్ట్రంగానే ఉందన్న విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. కశ్మీర్లో శాంతిని నెలకొల్పి అభివృద్ధికి బాటలు వేయాలంటే రాష్ట్ర హోదా తప్పనిసరి అని పేర్కొన్నారు. -
హరియాణాలో హ్యాట్రిక్
హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్యంగా బీజేపీ హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలన్నింటినీ తలకిందులు చేస్తూ.. 48 సీట్లతో సొంతంగా మెజారిటీ సాధించింది. గెలుపు తమదేననే ధీమాతో వెళ్లిన కాంగ్రెస్ అంతర్గత కుమ్ములాటల నష్టాన్ని నివారించలేకపోయింది. మరోవైపు ఆర్టికల్ 370 రద్దు తర్వాత తొలిసారిగా జమ్మూకశ్మీర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్– కాంగ్రెస్ కూటమి విజయాన్ని సొంతం చేసుకుంది. సీపీఎంతో కలిసి కూటమికి 49 స్థానాలు లభించాయి. హరియాణా ప్రజలు తప్పుడు ప్రచారాన్ని తిరస్కరించారు. అభివృద్ధికి గ్యారంటీని గెలిపించారు. భగవద్గీత బోధించిన నేలపై సత్యం, అభివృద్ధి, సుపరిపాలనకు దక్కిన విజయమిది. ఏ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసినా దీర్ఘకాలం పాటు ప్రజలు మద్దతిస్తూ వచ్చారు. అక్కడ కాంగ్రెస్కు ‘నో ఎంట్రీ’చూపించారు. అధికారాన్ని జన్మహక్కుగా భావించే కాంగ్రెస్కు మళ్లీ అవకాశమివ్వడం చాలా అరుదు. వరుసగా మూడోసారి బీజేపీకి మెజారిటీ ఇచ్చిన హరియాణా ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు. కూటములు కడుతూ భాగస్వాములపై ఆధారపడే కాంగ్రెస్ పార్టీ పరాన్నజీవి. ఒక్కోసారి ఆ పార్టీలనే మింగేస్తుంటుంది.జమ్మూకశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించడం భారత రాజ్యాంగం, ప్రజాస్వా మ్యం సాధించిన విజయం. మంచి ఫలితాలు సాధించిన నేషనల్ కాన్ఫరెన్స్కు అభినందనలు. బీజేపీ సాధించిన ఫలితాలను చూసి గర్వంగా ఉంది. మా పార్టీపై నమ్మకముంచి, ఓటేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు – బీజేపీ కార్యాలయంలో మోదీచండీగఢ్: పదేళ్ల ప్రభుత్వ వ్యతిరేకతను పటాపంచలు చేస్తూ, ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ బీజేపీ మూడోసారీ హరియాణాలో అధికార పగ్గాలు చేపట్టేందుకు సిద్ధమైంది. జాట్లనే నమ్ముకున్న కాంగ్రెస్ చతికిలపడితే ఓబీసీ, దళితులు, బ్రాహ్మణుల ఓట్లను సమీకరించి బీజేపీ జయకేతనం ఎగరేసింది. దీంతో లోక్సభ ఎన్నికల్లో తగ్గిన ఎంపీ సీట్లతో కుదుపులకు లోనైన కమలనాథుల విజయరథ జైత్రయాత్ర.. హరియాణాలో మాత్రం సాఫీగా సాగింది.మంగళవారం ఉదయం కౌంటింగ్ మొదలయ్యాక ఆరంభ రౌండ్లలో కాంగ్రెస్ ఆధిక్యత స్పష్టంగా కనిపించింది. తర్వాత ఉదయం 10, 11 గంటల సమయం దాటగానే ఫలితాల సరళిలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. కాంగ్రెస్ ఆధిక్యత క్రమంగా తగ్గుతూ బీజేపీ పుంజుకుంది. అది అలాగే తుదికంటా కొనసాగి కమలనాథులకు విజయాన్ని కట్టబెట్టింది. మంగళవారం వెల్లడైన హరియాణా శాసనసభ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ 48 సీట్లను కైవసం చేసుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది. కాంగ్రెస్ పార్టీ 37 స్థానాలతో సరిపెట్టుకుంది. అయితే బీజేపీకి 39.94 శాతం ఓట్లు పడగా దాదాపు అదే స్థాయిలో కాంగ్రెస్కు 39.09 శాతం ఓట్లు పడ్డాయి. కాంగ్రెస్ కంటే కేవలం 0.85 శాతం ఓట్ల ఆధిక్యతతో బీజేపీ ఏకంగా 11 సీట్లను ఎక్కువ గెల్చుకోవడం గమనార్హం. చాలా చోట్ల అత్యల్ప తేడాతో కాంగ్రెస్ ఓడినట్లు వార్తలొచ్చాయి. ఈవీఎంలలో అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ ఆరోపించగా వాటిని నిరాధార ఆరోపణలుగా కేంద్ర ఎన్నికల సంఘం కొట్టిపారేసింది. ఇండియన్ నేషనల్ లోక్దళ్(ఐఎన్ఎల్డీ) పార్టీ కేవలం రెండు చోట్ల గెలిచింది. స్వతంత్రులు మూడు స్థానాల్లో నెగ్గారు. దుష్యంత్ చౌతాలా సారథ్యంలోని జననాయక్ జనతా పార్టీ(జేజేపీ) ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపలేకపోయింది. సొంతంగా బరిలో దిగిన ఆమ్ ఆద్మీ పార్టీ కేవలం 1.79 శాతం ఓట్లతో గెలుపు బోణీ కొట్టలేక ఉసూరుమంది. మల్లయోధురాలి గెలుపు పట్టు బీజేపీ నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీ(లాద్వా), కాంగ్రెస్ నేత భూపీందర్ సింగ్ హూడా(గర్హీ సాంప్లా–కిలోయీ) విజయం సాధించారు. ఒలింపిక్స్లో స్వర్ణం కొద్దిలో చేజార్చుకున్న మల్లయోధురాలు వినేశ్ ఫొగాట్ ఎన్నికల్లో మాత్రం విజయాన్ని తొలి ప్రయత్నంలోనే ఒడిసిపట్టుకున్నారు. ఇటీవల కాంగ్రెస్ కండువా కప్పుకున్న ఈమె జూలానా నియోజకవర్గంలో విజయకేతనం ఎగరేశారు. హిసార్లో కాంగ్రెస్ అభ్యర్థి రామ్నివాస్ రాణాపై దేశంలోనే అత్యంత ధనిక మహిళ సావిత్రి జిందాల్ స్వతంత్య్ర అభ్యరి్థగా పోటీచేసి గెలిచారు.జేజేపీ నేత, మాజీ ఉపముఖ్యమంత్రి దుష్యంత్ చౌతాలా, హరియాణా కాంగ్రెస్ చీఫ్ ఉదయ్ భాన్, మాజీ సీఎం భజన్లాల్ మనవడు, బీజేపీ నేత భవ్య బిష్ణోయ్ ఓటమిని చవిచూశారు. భవ్య ఓడిపోయిన అదమ్పూర్ స్థానం గత ఐదు దశాబ్దాలుగా బిష్ణోయ్లకు కంచుకోటగా ఉంది. ఐఎన్ఎల్డీ నేత అభయ్ సింగ్ చౌతాలా సైతం ఓడిపోయారు. ఎగ్జిట్ పోల్స్ను తలకిందులు చేసిన బీజేపీ తన కేబినెట్ మంత్రులను మాత్రం గెలిపించుకోలేకపోయింది. అసెంబ్లీ స్పీకర్, బీజేపీ నేత జ్ఞాన్చంద్ గుప్తా, ఎనిమిది మంది మంత్రులు ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో 15 శాతం ఓట్లతో 10 స్థానాల్లో గెలిచిన జననాయక్ జనతా పార్టీ ఈసారి పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. 13 మందిమహిళల విజయం 90 స్థానాలున్న అసెంబ్లీలోకి ఈసారి 13 మంది మహిళలు అడుగుపెట్టబోతున్నారు. వినేశ్ ఫొగాట్, సావిత్రి జిందాల్సహా 13 మంది గెల్చారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో 8 మంది మహిళా అభ్యర్థులు గెలిచారు. బీజేపీ నుంచి ఐదుగురు, కాంగ్రెస్ నుంచి ఏడుగురు మహిళలు విజయం సాధించారు. ప్రభుత్వ పథకాలకు ప్రజామోదం: సీఎం సైనీ పార్టీని విజయతీరాలకు చేర్చినందుకు ఓటర్లకు బీజేపీ నేత, ముఖ్యమంత్రి సైనీ కృతజ్ఞతలు తెలిపారు. ‘‘ మోదీ నాయకత్వంలో ప్రభుత్వ విధానాలకు ప్రజలు పట్టంకట్టారు. ప్రభుత్వ పథకాలకు ప్రజామోదం దక్కిందనడానికి ఈ ఫలితాలే నిదర్శనం. ఈ గెలుపు ఘనత పూర్తిగా మోదీజీదే’ అని సీఎం అన్నారు. -
హర్యానా ప్రజలకు నా సెల్యూట్: ప్రధాని మోదీ
ఢిల్లీ: జమ్ము కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో జమ్ము కశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్- కాంగ్రెస్ పార్టీ కూటమి ఘన విజయం సాధించింది. మొత్తం 90 సీట్లకు కాంగ్రెస్ కూటమి 49 స్థానాల్లో గెలుపొందింది. బీజేపీ 29 స్థానాల్లో గెలిచి రెండో స్థానంలో నిలిచింది. హర్యానాలో బీజేపీ ఘన విజయం సాధించింది. హర్యానా, జమ్ము కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. బీజేపీ మూడో గెలుపు అందించిన సందర్భంగా హర్యానా ప్రజలకు సెల్యూట్ చేస్తున్నానని అన్నారు.‘‘భారతీయ జనతా పార్టీకి మరోసారి స్పష్టమైన మెజారిటీని అందించినందుకు హర్యానా ప్రజలకు సెల్యూట్ చేస్తున్నా. ఇది అభివృద్ధి, సుపరిపాలన రాజకీయాల విజయం. హర్యానా ప్రజల ఆశయాలను నెరవేర్చుతాం. జమ్ము- కశ్మీర్లో బీజేపీ పనితీరుపై గర్వంగా ఉంది. ‘నేషనల్ కాన్ఫరెన్స్’కు అభినందనలు. ఆ పార్టీ ప్రదర్శన మెచ్చుకోదగినది’’ అని అన్నారు.PM Narendra Modi tweets, "I salute the people of Haryana for giving a clear majority to the Bharatiya Janata Party once again. This is the victory of the politics of development and good governance. I assure the people here that we will leave no stone unturned to fulfil their… pic.twitter.com/EHVXMjgbTD— ANI (@ANI) October 8, 2024 PM Narendra Modi tweets, "... I am proud of the BJP’s performance in Jammu and Kashmir. I thank all those who have voted for our Party and placed their trust in us. I assure the people that we will keep working for the welfare of Jammu and Kashmir. I also appreciate the… pic.twitter.com/Vo3vpnWDo2— ANI (@ANI) October 8, 2024 జమ్ము కశ్మీర్ ప్రజలకు కృతజ్ఞతలు: అమిత్ షా‘‘జమ్ము కశ్మీర్ ప్రజలు ఈ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని అత్యధిక ఓట్లతో ఆశీర్వదించారు. బీజేపీ ఇప్పటివరకు కశ్మీర్ చరిత్రలో అత్యధిక సీట్లను అందించారు. ఇందుకు నేను హృదయపూర్వకంగా జమ్ము కశ్మీర్ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఈ ఎన్నికల కోసం అవిశ్రాంతంగా పని చేసిన బీజేపీ పార్టీ కార్యకర్తలందరినీ అభినందిస్తున్నా. జమ్ము కశ్మీర్లో శాంతియుత ఎన్నికలు జరుగుతాయని ప్రధాని మోదీ గతంలోనే వాగ్దానం చేశారు. ఈ క్రమంలోనే తొలిసారి పారదర్శకంగా ఎన్నికలు జరిగాయి. ఈ చరిత్రాత్మక ఎన్నికలను విజయవంతంగా నిర్వహించడంపై కేంద్ర ఎన్నికల సంఘం, జమ్ము కశ్మీర్ పాలనాయంత్రాంగం, భద్రత బలగాలు, పౌరులకు అభినందనలు...కాంగ్రెస్ హయాంలో జమ్ము కశ్మీర్లో ఉగ్రపాలనే సాగేది. అయితే బీజేపీ పాలనలో ప్రజాస్వామ్య పండుగను ఘనంగా చేసుకున్నాం. బీజేపీ హర్యానాలో భారీ విజయం సాధించింది. ప్రధాని మోదీ ప్రభుత్వంపై రైతులు, పేదలు, వెనుకబడిన వర్గాలు, సైనికులు, యువత నమ్మకానికి నిదర్శనం’’ అని ఎక్స్లో పేర్కొన్నారు.Union Home Minister Amit Shah tweets "The people of Jammu and Kashmir have blessed the BJP with the highest percentage of votes in this assembly election and have given the BJP the highest number of seats in its history so far. For this, I express my heartfelt gratitude to the… pic.twitter.com/gyVt8c2G1o— ANI (@ANI) October 8, 2024 -
హర్యానాలో బీజేపీ హ్యాట్రిక్.. కూటమిదే కశ్మీర్
ఢిల్లీ: హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ మరోసారి ఘన విజయం సాధించింది. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల్లో బీజేపీ మ్యాజిక్ ఫిగర్ (46 స్థానాలు) దాటింది. కాంగ్రెస్ పార్టీ రెండో స్థానంలో నిలిచింది. దీంతో బీజేపీ మూడోసారి హర్యానాలో అధికారం చేపట్టనుంది. బీజేపీ భారీ విజయం సాధించటంతో హైకమాండ్ మళ్లీ హర్యానాకు సీఎంగా నయాబ్ సింగ్ సైనీకి ప్రకటించింది. ఇక.. ఇక్కడి ఆప్, జేజేపీ పార్టీలు ఒక్కసీటు కూడా గెలువలేదు. మంగళవారం ఓట్ల లెక్కింపులో ఒక సయయంలో బీజేపీ పలు స్థానాల్లో వెనకంజలో ఉన్నా.. అనూహ్యంగా ఫలితాలు బీజేపీకి ఏకపక్షంగా వచ్చాయి. దీంతో ఎగ్జిట్ పోల్స్ అంచనాలను బీజేపీ అనుకూలమైన తాజా ఫలితాల తలకిందులు చేశాయి.ప్రస్తుతం సీఎం హర్యానా సైనీ.. ఆరు నెలల ముందే సీఎం పీఠంపై కూర్చున్నా.. పార్టీని హర్యానాలో గెలిపించుకున్నారు. ఆశలు లేని స్థాయి నుంచి అనూహ్యంగా బీజేపీ విజయం సాధించింది. 1966 నుంచి హర్యానాలో ఏ పార్టీ కూడా వరసగా మూడు సార్లు అధికారం చేటపట్టలేదు. తాజాగా బీజేపీ ముచ్చటగా మూడోసారి గెలిచి ఆ ఆనవాయితీని బ్రేక్ చేసింది. హర్యానాలోబీజేపీ: గెలుపు-48కాంగ్రెస్: గెలుపు- 37ఇతరులు:గెలుపు-5 ఇప్పటివరకు ఎన్నికల సంఘం వెల్లడించిన అధికారిక ఫలితాలు..జమ్ము కశ్మీర్లో కాంగ్రెస్ కూటమి విజయంజమ్ము కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో జమ్ము కశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్- కాంగ్రెస్ కూటమి ఘన విజయం సాధించింది. ఇప్పటివరకు వెలువడిన మ్యాజిక్ ఫిగర్ స్థానాలను కూటమి గెలుపొందింది. ఇక్కడ బీజేపీ రెండో స్థానంలో నిలిచింది. ఆమ్ ఆద్మీ పార్టీ ఒక స్థానంలో విజయం సాధించింది. కాంగ్రెస్ కూటమిలో భాగస్వామ్య పార్టీగా ఉన్న సీపీఎం స్థానంలో గెలుపు. కాంగ్రెస్ ఆరు స్థానాల్లో విజయం సాధించింది.ఇక.. పీడీపీ కేవలం మూడు స్థానాలకు పరిమితమైంది. జమ్ము రీయన్లో కూటమికి బీజేపీ గట్టి పోటీ ఇచ్చింది. జమ్ము కశ్మీర్ ముఖ్యమంత్రిగా ఎన్సీ నేత ఒమర్ అబ్దుల్లా అవుతారని ఫరూఖ్ అబ్దుల్లా పేర్కొన్నారు.జమ్ముకశ్మీర్లోనేషనల్ కాన్ఫరెన్స్ - 42 సీట్లుబీజేపీ - 29కాంగ్రెస్ - 06పీడీపీ - 03సీపీఎం - 01ఆప్ - 01జేపీసీ - 01స్వతంత్రులు - 07మొత్తం స్థానాలు: 90 -
జమ్ము కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లానే: ఫరూఖ్ అబ్దులా
శ్రీనగర్: జమ్ము కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో జమ్ము కశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ పార్టీల కూటమి దూసుకుపోతోంది. ఇప్పటివరకు వరకు ఏడు స్థానాల్లో గెలుపు నమోదు చేసుకొని 45 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఆధిక్యంలో మ్యాజిక్ దాటి ముందుకు వెళ్లుతోంది. దీంతో నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా నివాసం వద్ద కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నాయి. ఈ సందర్భంగా జమ్ము కశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూఖ్ అబ్దుల్లా మీడియాతో మాట్లాడారు. ‘‘ ప్రజలు వారి తీర్పును ఇచ్చారు. జమ్ము కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లానే అవుతారు. పదేళ్ల తర్వాత ప్రజలు మాకు తమ అవకాశం ఇచ్చారు. మేము ప్రజల అంచనాలను అందుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నా. #WATCH | Srinagar, J&K | National Conference chief Farooq Abdullah says, "After 10 years the people have given their mandate to us. We pray to Allah that we meet their expectations...It will not be 'police raj' here but 'logon ka raj' here. We will try to bring out the innocent… pic.twitter.com/j4uYowTij4— ANI (@ANI) October 8, 2024ఇక.. ఇక్కడ ‘పోలీసుల రాజ్యం ఉండదు. ప్రజల రాజ్యం ఉంటుంది. మేము జైలులో ఉన్న అమాయకులను బయటకు తీసుకురావడానికి ప్రయత్నిస్తాం.. హిందువులు, ముస్లింల మధ్య విశ్వాసాన్ని పెంపొందించుతాం. ఇక.. హర్యానాలో కాంగ్రెస్ గెలవకపోవడం బాధాకరం. ఇక్కడ పార్టీలో అంతర్గత వివాదాల కారణంగానే ఇలాంటి ఫలితం వచ్చినట్లు భావిస్తున్నా’ అని అన్నారు.ఆగస్టు 5న తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలు ఆమోదించడం లేదనే విషయం ఈ ఫలితాల ద్వారా అర్థమైందని మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా అన్నారు. బుడ్గామ్ నియోజకవర్గంలో ఒమర్ అబ్దుల్లా ఘన విజయం సాధించారు.చదవండి: హర్యానాలో ఆప్ ఓటమికి 10 కారణాలు -
Watch Live: హర్యానా, జమ్ముకశ్మీర్ ఎన్నికల ఫలితాలు
-
బీజేపీ వెనుకంజకు అసలు కారణం ఇవే.. రుద్రరాజు కీలక వ్యాఖ్యలు
-
జమ్ము కశ్మీర్: ‘ఆమె మద్దతిస్తే.. తీసుకుంటాం’
శ్రీనగర్: జమ్ము కశ్మీర్లో అసెంబ్లీ ఫలితాలు హంగ్ దిశగా వెలువడతాయని ఎగ్జిట్ పోల్స్ ప్రకటించాయి. ఈ నేపథ్యంలో జమ్ము కశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ నేత ఫరూఖ్ అబ్దుల్లా కీలక వ్యాఖ్యలు చేశారు. జమ్ము కశ్మీర్ ప్రభుత్వ ఏర్పాటుకు అవసరం లేకున్నా పీడీపీ మద్దతు ఇస్తానంటే తాము అంగీకరిస్తామని తెలిపారు. ఇప్పటికే ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ కూటమిగా పోటీ చేసిన విషయం తెలిసిందే. కాంగ్రెస్-నేషనల్ కాన్ఫరెన్స్ కూటమికి మద్దతు ఇచ్చేందుకు మెహబూబా ముఫ్తీకి చెందిన పీడీపీ సిద్ధంగా ఉందని వస్తున్న వార్తలపై సోమవారం ఫరూఖ్ అబ్దుల్లా మీడియాతో మాట్లాడారు.‘‘జమ్ము కశ్మీర్లో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరం లేకపోయినా మద్దతు ఇస్తానంటే తీసుకుంటాం. ఎందుకంటే అందరం కలిసికట్టుగా ముందుకు వెళ్లాలి. ఈ రాష్ట్రాన్ని కాపాడేందుకు మనమందరం కృషి చేయాలి. జమ్ము కశ్మీర్ ప్రస్తుతం చాలా కష్టాల్లో ఉంది. అయితే ఎన్నికల తర్వాత పొత్తుపై నేను మెహబూబా ముఫ్తీతో మాట్లాడలేదు. నేను ఆమెకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నా.#WATCH | Srinagar: JKNC chief Farooq Abdullah says, "Even if we don't need it, we will take the support (from PDP) because if we have to go ahead, we have to do it together. We all have to make an effort to save this state. This state is in a lot of difficulties..." pic.twitter.com/apwy9ZSry1— ANI (@ANI) October 7, 2024 ..మేమందరం కలిసి ఈ రాష్ట్రాన్ని నిర్మించడానికి ప్రయత్నిస్తాం. అయితే ప్రస్తుతానికి నేను ముఫ్తీతో మాట్లాడలేదు. ఆమె మద్దతు ఇస్తానన్న విషయాన్ని పేపర్లలో మాత్రమే చదివాను. ఎగ్జిట్ పోల్స్ గురించి నేను ఉత్సాహంగా లేను. ఎందుకంటే అవి సరైనవి కావోచ్చు. తప్పు కూడా కావచ్చు. ఓట్ల లెక్కింపు తర్వాత అసలు నిజం వెల్లడి అవుతుంది. కాంగ్రెస్- నేషనల్ కాన్ఫరెన్స్ కూటమి ప్రభుత్వం ఏర్పడుతుందని ఆశిస్తున్నాం. మా ప్రభుత్వ ఏర్పాటుకు ఎదురుచూస్తున్నాం’’ అని అన్నారు.చదవండి: హర్యానా: ‘సీఎం సైనీ మంచి వ్యక్తి.. కానీ’ -
కలిసిరాని కాలం.. టీమిండియా స్టార్ బౌలర్కు గాయం
టీమిండియా యువ బౌలర్ ఉమ్రాన్ మాలిక్కు కాలం కలిసి రావడం లేదు. భారత జట్టులో పునరాగమనం చేయాలని ఆశపడుతున్న అతడిని గాయాల బెడద వెంటాడుతోంది. ముఖ్యంగా రెడ్బాల్ టోర్నీలో ఆడి తనను తాను నిరూపించుకోవాలన్న ఈ జమ్మూ కశ్మీర్ ఎక్స్ప్రెస్కు వరసగా చేదు అనుభవాలే ఎదురవుతున్నాయి.ఉమ్రాన్ స్థానంలో ఎవరు?ఇప్పటికే దులిప్ ట్రోఫీ-2024కు దూరమైన ఉమ్రాన్ మాలిక్.. రంజీ ట్రోఫీ తాజా ఎడిషన్ ఆరంభ మ్యాచ్లకు దూరం కానున్నట్లు తెలుస్తోంది. తుంటినొప్పితో అతడు బాధపడుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలో... అక్టోబరు 11 నుంచి మొదలుకానున్న ఈ ఫస్ట్ క్లాస్ టోర్నీ ఆడబోయే కశ్మీర్ జట్టులో ఉమ్రాన్ స్థానాన్ని ఇతర బౌలర్తో భర్తీ చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వసీం బషీర్ లేదంటే.. ఉమర్ నజీర్కు ఆ అదృష్టం దక్కనున్నట్లు తెలుస్తోంది.కాగా ఐపీఎల్-2022లో సన్రైజర్స్ హైదరాబాద్ తరఫున అద్భుత ప్రదర్శన కనబరిచిన ఉమ్రాన్ మాలిక్ టీమిండియా సెలక్టర్ల నుంచి పిలుపు అందుకున్నాడు. ఐర్లాండ్తో 2022 నాటి టీ20 సిరీస్ సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. ఇప్పటి వరకు టీమిండియా తరఫున 10 వన్డేలు, 8 టీ20లు ఆడి.. ఆయా ఫార్మాట్లలో 13, 11 వికెట్లు కూల్చాడు.వరుస గాయాలుగతేడాది వెస్టిండీస్ పర్యటనలో భాగంగా వన్డే మ్యాచ్లో టీమిండియాకు ప్రాతినిథ్యం వహించిన ఉమ్రాన్ మాలిక్.. ఆ తర్వాత జట్టులో స్థానం దక్కించుకోలేకపోయాడు. ఐపీఎల్-2024లోనూ నిరాశపరిచాడు. దేశవాళీ క్రికెట్లోనైనా రాణించాలనుకుంటే ఇలా వరుసగా గాయాలపాలవుతున్నాడు.కాగా ఇటీవల దులిప్ ట్రోఫీ-2024 ఆడిన ఇండియా-సి జట్టుకు ఉమ్రాన్ మాలిక్ ఎంపికయ్యాడు. అయితే, డెంగ్యూ జ్వరం కారణంగా.. రుతురాజ్ గైక్వాడ్ సారథ్యంలోని ఈ జట్టుకు దూరమయ్యాడు. రంజీలతోనైనా రీ ఎంట్రీ ఇవ్వాలనుకున్న ఈ రైటార్మ్ పేసర్ను తాజాగా తుంటినొప్పి వేధిస్తోంది. ఇదిలా ఉంటే.. ఉమ్రాన్ మాలిక్ ఇప్పటి వరకు 12 ఫస్ట్క్లాస్ మ్యాచ్లు ఆడి 16 వికెట్లు పడగొట్టాడు.చదవండి: వరల్డ్కప్ ఫైనల్లో పంత్ మాస్టర్ ప్లాన్.. అలా మేము గెలిచాం: రోహిత్ శర్మ -
ఎగ్జిట్పోల్స్.. జమ్ము కశ్మీర్లో విజయం ఎవరిదంటే?
సాక్షి, ఢిల్లీ: జమ్ము కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలపై దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్పోల్స్(90 స్థానాలు) ఆసక్తికర ఫలితాలను వెల్లడించాయి. మూడు విడతల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగగా అక్టోబర్ ఎనిమిదో తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. జమ్ము కశ్మీర్లో మ్యాజిక్ ఫిగర్ 46. జమ్ము కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలపై ఎగ్జిట్పోల్స్ ఇలా..మెగా ఎగ్జిట్పోల్స్ ప్రకారం..నేషనల్ కాన్ఫరెన్స్:33బీజేపీ: 27కాంగ్రెస్: 12పీడీపీ: 08ఇతరులు: 10 #JammuAndKashmir #Elections2024 #HaryanaElections2024#HaryanaElection #JammuKashmir #Exitpoll #ExitpollFirst EXIT-POLL by Electoral Edge for the J&K Assembly Polls 2024 :- NC : 33 - BJP : 27- INC : 12- PDP : 08- OTH : 10 pic.twitter.com/OCxFdPK6dv— Himanshu Singh (@Himans304) October 5, 2024దైనిక్ భాస్కర్ ప్రకారం..నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ కూటమి: 35-40బీజేపీ: 20-25పీడీపీ: 04-07ఇతరులు: 12-16.పీపుల్స్ పల్స్ ప్రకారం.. నేషనల్ కాన్ఫరెన్స్: 33-35కాంగ్రెస్: 13-15బీజేపీ: 23-27పీడీపీ: 7-11ఇతరులు: 04-05.రిపబ్లిక్ మ్యాట్రిజ్ ప్రకారం..నేషనల్ కాన్ఫరెన్స్: 15 కాంగ్రెస్: 12బీజేపీ: 25పీడీపీ: 28.ది కశ్మీరియల్ ప్రకారం..నేషనల్ కాన్ఫరెన్స్: 26-30కాంగ్రెస్: 08-14బీజేపీ: 24-29పీడీపీ: 06-09ఇతరులు: 10-20Exit polls by @TheKashmiriyat show a tight race. If BJP secures 30 seats, they could form the government with support from independents and regional parties like AiP, AP etc. Expect a closely contested outcome. pic.twitter.com/rR5VDVZcEE— Muzzafar مظفر 🇵🇸 (@MuzzafarCh) October 5, 2024 -
Peoples Pulse Exit Polls 2024: జమ్ము కశ్మీర్లో బిగ్ ట్విస్ట్.. గెలుపు ఎవరిదంటే?
జమ్ము కశ్మీర్కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు, రాష్ట్ర హొదా తొలగింపు తర్వాత తొలిసారిగా జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలపై దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. మూడు విడతలలో ముగిసిన ఈ ఎన్నికల ఫలితాలు అక్టోబర్ 8న వెలువడనున్నాయి. జమ్ము కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలపై పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ సర్వే నిర్వహించింది. క్షేత్రస్థాయిలో పర్యటించిన సంస్థ బృందం ఎన్నికల ఫలితాలపైనే కాకుండా కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలపై కూడా రాష్ట్ర ప్రజల అభిప్రాయాలని సేకరించింది.సర్వే అంచనాల ప్రకారం ఈ ఎన్నికల్లో ఏ పార్టీ కూడా సొంతంగా మ్యాజిక్ ఫిగర్ 46 స్థానాలు పొందే అవకాశాలు లేవు. అయితే జమ్ము కశ్మీర్లో కలిసి పోటీ చేసిన నేషనల్ కాన్ఫరెన్స్-కాంగ్రెస్ పార్టీలకు వచ్చే సీట్లతో ఆ కూటమి ప్రభుత్వం ఏర్పాటుచేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో జేకేఎన్సీ-కాంగ్రెస్ కూటమి 46-50 స్థానాలు, బీజేపీ 23-27 స్థానాలు, జేకేపీడీపీ 7-11 స్థానాలు, ఏఐపీ 0-1, ఇతరులు 4-5 స్థానాలు గెలిచే అవకాశాలున్నట్లు సర్వేలో తేలింది. జేకేఎన్సీ-కాంగ్రెస్ కూటమిలో జేకేఎన్ఎస్ 33-35, కాంగ్రెస్ 13-15 స్థానాలు గెలవవచ్చు. జేకేఎన్సీ 29 శాతం, కాంగ్రెస్ 14 శాతం, బీజేపీ 24 శాతం, జేకేపీడీపీ 16 శాతం, ఏఐపీ 5 శాతం, ఇతరులు 12 శాతం ఓట్లు పొందవచ్చని సర్వేలో తేలింది. కలిసి పోటీ చేసిన జేకేఎన్సీ-కాంగ్రెస్ కూటమికి 43 శాతం ఓట్లు వచ్చే అవకాశాలున్నాయి. ఈ సర్వే ఫలితాల్లో మూడు శాతం ప్లస్ ఆర్ మైనస్ మార్జిన్ ఉండే అవకాశాలున్నాయి. జమ్ము కశ్మీర్ ముఖ్యమంత్రిగా ఎవరికి ప్రాధాన్యతిస్తారని సర్వేలో కోరగా జేకేఎన్సీ నేత, మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాకు సుమారు 28 శాతం మంది మద్దతిచ్చారు. ఆయన అనుభవం రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడుతుందనే అభిప్రాయాన్ని ఓటర్లు వెలిబుచ్చారు. ఒమర్ అబ్దుల్లా తండ్రి, రాష్ట్ర సీనియర్ నేత, మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లాకు సుమారు 2 శాతం మందే మద్దతిచ్చారు. జేకేపీడీపీ అధినేత, మాజీ సీఎం మెహబూబా ముఫ్తీకి, ఏఐపీ అధినేత లోక్సభ సభ్యులు ఇంజినీర్ రషీద్కు చెరో 8 శాతం మద్దతు సర్వేలో కనిపించింది.కాంగ్రెస్-జేకేఎన్సీ మధ్య పొత్తు ఈ ఎన్నికల్లో కీలకంగా పనిచేసింది. దాదాపు 46 శాతం మంది కాంగ్రెస్-జేకేఎన్సీ కూటమి తమ ప్రయోజనాలకు ఉత్తమంగా ఉపయోగపడుతుందని విశ్వసించారు. హిందువుల ఏకీకరణతో ప్రయోజనం పొందాలని చూసిన బీజేపీకి జమ్మూ ప్రాంతంలో లబ్ది చేకూరింది. జమ్మూలో కాంగ్రెస్ పేవలమైన ప్రచారం కూడా బీజేపీకి కలిసివచ్చింది. అధిక ప్రచారంతో నిత్యం వార్తల్లో ఉన్న అవామీ ఇత్తేహాద్ పార్టీ (ఏఐపీ) ఒక్క సీటుకే పరిమితం కావచ్చు. పీపుల్స్ కాన్ఫరెన్స్, అప్నీ పార్టీ వంటి చిన్న పార్టీలను కలుపుకొని మొత్తం మీద ఇతరులకు దాదాపు 4 నుండి 5 సీట్లు రావచ్చని సర్వేలో తేలింది. అసెంబ్లీ ఎన్నికల్లో నిరుద్యోగం ప్రధాన సమస్యగా ఉందని సర్వేలో వెల్లడైంది. ఉపాధి కల్పన, ఆర్థికాభివృద్ధి పరంగా ఈ ప్రాంతం ఎదుర్కొంటున్న సవాళ్లను ఓటర్లు ఎత్తి చూపారు. నిత్యవసర వస్తువుల ధరలతో పాటు విద్యుత్ చార్జీల పెరుగుదల, ఆశించిన అభివృద్ధి లేకపోవడం ఎన్నికల్లో కీలకాంశాలుగా మారాయి. అభివృద్ధిలో కొంత మెరుగ్గా ఉందని 30 శాతం మంది అభిప్రాయపడినా, 40 శాతం కంటే ఎక్కువ మంది గత 5-6 సంవత్సరాలలో అభివృద్ధికి సంబంధించి ఎటువంటి మార్పు కనిపించలేదని చెప్పారు. 22 శాతం మంది అభివృద్ధి మరింత దిగజారిందన్నారు. ఇటీవల శాంతిభద్రతలు గణనీయంగా మెరుగుపడ్డాయని 30 శాతం మంది చెప్పగా, మిగతావారు పెదవి విరిచారు. జమ్ము కశ్మీర్ పురోగతిపై కేంద్ర ప్రభుత్వం పలు హామీలు ఇస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో భద్రతకు సంబంధించి ప్రజల్లో తీవ్ర అసంతృప్తి కనిపించింది. మౌలిక సదుపాయల కల్పన, ఆరోగ్య పరిరక్షణ, విద్యాపరంగా అభివృద్ధిపై ప్రజల్లో ఆందోళన కనిపించింది.నరేంద్ర మోదీ ప్రభుత్వం 2019 ఆగస్టులో జమ్ము కశ్మీర్కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు చేయడం, రాష్ట్ర హోదాను తొలగించి లడఖ్ను వేరు చేస్తూ రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా ప్రకటించడంపై అత్యధిక ప్రజలు ఆగ్రహంగా ఉన్నట్టు సర్వేలో స్పష్టమైంది. రాష్ట్ర హోదాను తిరిగి కల్పించాలని 67 శాతం మంది గట్టిగా కోరారు. జమ్ము కశ్మీర్లో 2014 తర్వాత దాదాపు దశాబ్ద కాలం అనంతరం అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుండటంతో రాజకీయంగా అనేక ఆసక్తికరమైన అంశాలున్నాయి. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో బీజేపీ, జేకేపీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడింది. అనేక రాజకీయ పరిణామాల మధ్య ఈ సంకీర్ణ ప్రభుత్వం 2018లో రద్దయ్యింది. 2022లో నియోజకవర్గాల పునర్విభజన అనంతరం అసెంబ్లీ స్థానాల సంఖ్య 83 నుండి 90 పెరగడంతో రాజకీయంగా ఇది కీలకంగా మారింది. బీజేపీ ఆశలు పెట్టుకున్న జమ్మూ ప్రాంతంలో సీట్లు 37 నుండి 43కు పెరగగా, కశ్మీర్ లోయలో సీట్లు 46 నుండి 47కు పెరిగాయి. పీపుల్స్ పల్స్, డిజిటల్ వార్త సంస్థ సౌత్ ఫస్ట్ సంస్థలు సంయుక్తంగా జమ్ము కశ్మీర్ ప్రజల మనోభావాలను తెలుసుకునేందుకు పీపీఎస్ విధానంలో 25 నియోజకవర్గాలను ఎంపిక చేసుకొని సర్వే నిర్వహించాయి. శాస్త్రీయమైన పద్దతిలో ప్రతి అసెంబ్లీ సెగ్మంట్ నుండి నాలుగు పోలింగ్ స్టేషన్లను ఎంపిక చేసుకున్నారు. ప్రతి పోలింగ్ స్టేషన్లో ఎలక్ట్రోల్ రోల్స్ నుండి అన్ని ప్రాంతాల్లో కులం, మతం, వయస్సు, పురుషులు, మహిళలు సరిసమాన నిష్పత్తిలో ఉండేలా ఎంపిక చేసుకొని మొత్తం 2016 శాంపిల్స్ సర్వే కోసం సేకరించడం జరిగింది.సర్వే కోసం తయారు చేసిన నిర్మాణాత్మకమైన ప్రశ్నాపత్రంతో సంస్థ తరఫున రీసెర్చ్ స్కాలర్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు క్షేత్రస్థాయిలో ఓటర్లను ముఖాముఖిగా కలుసుకొని వారి అభిప్రాయాలను సేకరించింది. జమ్ము కశ్మీర్ ఎన్నికల సర్వే నివేదికను పీపుల్స్ పల్స్ డైరెక్టర్ ఆర్. దిలీప్ రెడ్డి నేతృత్వంలో పీపుల్స్ పల్స్ సీనియర్ పరిశోధకులు జి. మురళీకృష్ణ, ఐ.వి. మురళీకృష్ణశర్మ రూపొందించారు.-ఆర్.దిలీప్ రెడ్డి,డైరెక్టర్, పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ. -
PM Narendra Modi: కుటుంబ పార్టీలు రాజ్యాంగానికి శత్రువులు
జమ్మూ: కుటుంబ పార్టీలైన కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్, పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ(పీడీపీ) భారత రాజ్యాంగానికి అతిపెద్ద శత్రువులని ప్రధాని నరేంద్ర మోదీ మండిపడ్డారు. ఓటు బ్యాంక్ కోసం సమాజంలో అణగారిన వర్గాల హక్కులను కాలరాశాయని, రాజ్యాంగ స్ఫూర్తిని హత్య చేశాయని నిప్పులు చెరిగారు. ఆ మూడు పార్టీలు జమ్మూకశ్మీర్కు తీవ్ర గాయాలు చేశాయని ఆరోపించారు. జమ్మూకశీ్మర్ ప్రజలు తమ బిడ్డల బంగారు భవిష్యత్తు, శాంతి కోసం అవినీతి, ఉగ్రవాదం, వేర్పాటువాదం లేని మంచి ప్రభుత్వం కోసం ఎదురు చూస్తున్నారని చెప్పారు. శనివారం జమ్మూలోని ఎంఏఎం స్టేడియంలో ఎన్నికల ప్రచార సభలో ప్రధాని మోదీ ప్రసంగించారు. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో మూడు కుటుంబ పార్టీలకు గట్టిగా బుద్ధి చెప్పాలని ఇక్కడి ప్రజలు నిర్ణయించుకున్నారని పేర్కొన్నారు. అవినీతి, అక్రమాలు, అరాచకాలు, ఉగ్రవాదం, వేర్పాటువాదం, రక్తపాతం, ఉద్యోగాల్లో వివక్షను జనం కోరుకోవడం లేదని తేలి్చచెప్పారు. బీజేపీ ప్రభుత్వం రావాలన్నదే వారి ఆకాంక్ష అని స్పష్టంచేశారు. మొదటి రెండు దశల పోలింగ్ ఓటర్ల మనోగతాన్ని ప్రతిబింబిస్తోందని వెల్లడించారు. బీజేపీ పూర్తి మెజార్టీతో సొంతంగా అధికారంలోకి రావడం తథ్యమని ధీమా వ్యక్తంచేశారు. పాకిస్తాన్ భాషలో మాట్లాడుతున్న కాంగ్రెస్ను ప్రజలు క్షమిస్తారా అని మోదీ ప్రశ్నించారు. హరియాణాలో కాంగ్రెస్ వస్తే అస్థిరతే: మోదీ హిస్సార్: హరియాణాలో పొరపాటున కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అస్థిరత తప్పదని ప్రధాని మోదీ హెచ్చరించారు. ఆ పార్టీలో అంతర్గత పోరాటం సాగుతోందని, ముఖ్యమంత్రి పదవి కోసం నేతలంతా పోటీ పడుతున్నారని చెప్పారు. బాపు(భూపీందర్ సింగ్), బేటా(దీపేందర్ సింగ్) పోటీలో ఉన్నారని తెలిపారు. శనివారం హరియాణాలోని హిసార్లో ఎన్నికల ప్రచార ర్యాలీలో మోదీ మాట్లాడారు. -
ఉగ్రవాదాన్ని ఎగదోస్తే తీవ్ర పరిణామాలే
ఐక్యరాజ్యసమితి: జమ్మూకశ్మీర్ అంశాన్ని ఐక్యరాజ్యసమితిలో ప్రస్తావించిన పాకిస్తాన్కు భారత్ గట్టిగా బదులిచ్చింది. భారత్కు వ్యతిరేకంగా సీమాంతర ఉగ్రవాదాన్ని ఎగదోస్తే తీవ్ర పరిణామాలను స్వయంగా ఆహ్వానించినట్లే అవుతుందన్న సంగతి తెలుసుకోవాలని హితవు పలికింది. ప్రపంచవ్యాప్తంగా జరిగిన పలు ఉగ్రవాద దాడులపై పాకిస్తాన్ వేలిముద్రలు ఉన్నాయని స్పష్టంచేసింది. ఐక్యరాజ్యసమితి సాధారణ సభలో శుక్రవారం భారత దౌత్యవేత్త భవిక మంగళానందన్ మాట్లాడారు. ఇదే సభలో తాజాగా పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ మాట్లాడుతూ జమ్మూకశ్మీర్ అంశాన్ని ప్రస్తావించారు. ఆర్టికల్ 370పై మాట్లాడారు. దీనిపై భవిక మంగళానందన్ ఘాటుగా స్పందించారు. సైన్యం పెత్తనం కింద నలుగుతూ ఉగ్రవాదాన్ని ఉత్పత్తి చేసే దేశమైన పాకిస్తాన్ ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ గురించి మాట్లాడడం ఏమటని నిలదీశారు. ఎన్నికల్లో విచ్చలవిడిగా రిగ్గింగ్లు జరిగే దేశం ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతోందని ఎద్దేవా చేశారు. భారతదేశ భూభాగాన్ని కబళించేందుకు పాక్ కుట్రలు పన్నుతోందని ఆరోపించారు. జమ్మూకశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికలకు ఆటంకాలు సృష్టించడానికి ఉగ్రవాదాన్ని నమ్ముకుంటోందని ధ్వజమెత్తారు. ఉగ్రవాదానికి, మాదక ద్రవ్యాల వ్యాపారానికి, చీకటి నేరాలకు మారుపేరైన పాకిస్తాన్కు భారత్ గురించి నోరువిప్పే అర్హత లేదని భవిక మంగళానందన్ పరోక్షంగా హెచ్చరించారు.పాకిస్తాన్ సీమాంతర ఉగ్రవాదాన్ని పొరుగు దేశాలపై ఒక ఆయుధంగా ప్రయోగిస్తోందన్న సంగతి ప్రపంచం మొత్తానికి తెలుసని పేర్కొన్నారు. తమ దేశ పార్లమెంట్పై, ఆర్థిక రాజధాని ముంబై నగరంపై, మార్కెట్లపై, యాత్రా మార్గాలపై దాడులు చేసిన నీచ చరిత్ర పాకిస్తాన్ ఉందని నిప్పులు చెరిగారు. అలాంటి ధూర్త దేశం హింస గురించి నీతులు చెప్పడం సిగ్గుచేటు అని మండిపడ్డారు. అల్ఖైదా ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్కు ఆశ్రయం ఇచ్చిన దేశం ఏమిటో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని అన్నారు. -
పాక్కు ఘాటుగా బదులిచ్చిన భారత్
పొరుగు దేశం పాకిస్థాన్ తన వక్రబుద్ధిని మార్చుకోవడం లేదు. ఐక్యరాజ్య సమితి వేదికగా మన దేశంపై మరోసారి అక్కసు వెళ్లగక్కింది. అయితే ఈ ఆరోపణలను భారత్ గట్టిగా తిప్పికొట్టింది.ఉగ్రవాదం విషయంలో పాకిస్థాన్, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ గురించి మాట్లాడటమేంటో? అని మన దేశపు దౌత్యవేత్త భవిక మంగళానందన్ ప్రశ్నించారు.‘‘ఈ ప్రపంచ వేదిక దురదృష్టవశాత్తూ అవాస్తవాలను వినాల్సి వచ్చింది. పాక్ ప్రధాని భారత్ గురించి ప్రస్తావించడంపై ఇవాళ మేం స్పందిస్తున్నాం. సుదీర్ఘకాలంగా పొరుగు దేశాలపై సీమాంతర ఉగ్రవాదాన్ని పాక్ ఒక ఆయుధంగా ఉపయోస్తోంది. ఆ విషయం అందరికీ తెలుసు. అలాంటి దేశం హింస గురించి మాట్లాడటం వంచనే అవుతుంది.ఎన్నికల్లో రిగ్గింగ్ చేసే దేశం.. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతోంది. వాస్తవమేంటంటే.. ఆ దేశం మా భూభాగాన్ని కోరుకుంటోంది. జమ్ముకశ్మీర్లో ఎన్నికలకు అవాంతరం కలిగించేందుకు నిరంతరం ఉగ్రవాదాన్ని ఉపయోగిస్తోంది. మిలిటరీ సాయంతో నడుస్తూ.. ఉగ్రవాదం విషయంలో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపుపొందిన పాక్, అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ గురించి మాట్లాడటమా?’’ అని భవిక అన్నారు. Watch: India exercises its Right of Reply at the 79th session of the @UN General Assembly debate.@DrSJaishankar @MEAIndia pic.twitter.com/c6g4HAKTBg— India at UN, NY (@IndiaUNNewYork) September 28, 2024 ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ 79వ సెషన్లో సాధారణ చర్చ సందర్భంగా.. పాక్ ప్రధాని షెబాజ్ షరీఫ్ జమ్మూకశ్మీర్ అంశాన్ని లేవనెత్తడంతో పాటు ఆర్టికల్ 370 గురించి మాట్లాడారు. దాదాపు 20 నిమిషాల పాటు చేసిన ప్రసంగంలో తమ దేశంలోని సమస్యలను వదిలేసిన షరీఫ్.. కేవలం కశ్మీర్ గురించే సుదీర్ఘంగా మాట్లాడారు. పాలస్తీనా ప్రజల మాదిరిగానే జమ్ము ప్రజలు కూడా స్వేచ్ఛ, నిర్ణయాధికారం కోసం పోరాడుతున్నారని అన్నారు. అలాగే.. ఆర్టికల్ 370 రద్దును ప్రస్తావిస్తూ.. శాంతిస్థాపన కోసం 2019 ఆగస్టులో భారత్ ఏకపక్షంగా, చట్టవిరుద్ధంగా చేపట్టిన చర్యలను వెనక్కి తీసుకోవాలన్నారు. ఐరాస భద్రతా తీర్మానాలకు అనుగుణంగా కశ్మీర్ సమస్యపై శాంతియుత పరిష్కారం కోసం చర్చలు జరపాలన్నారు. -
జమ్మూకశ్మీర్కు రాష్ట్రహోదాపై రాహుల్ కీలక వ్యాఖ్యలు
జమ్మూ: జమ్మూకశ్మీర్ రాష్ట్ర హోదా కోసం పార్లమెంటుతో పాటు వీధుల్లోనూ పోరాడతామని లోక్సభ ప్రతిపక్షనేత రాహుల్గాంధీ అన్నారు.జమ్మూలో బుధవారం(సెప్టెంబర్25) జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో రాహుల్ మాట్లాడారు.‘జమ్మకశ్మీర్ను లెఫ్టినెంట్ గవర్నర్తో పరిపాలించాలని బీజేపీ అనుకుంటోంది.ఎల్జీ పరిపాలన ఉన్నంత కాలం జమ్మూకశ్మీర్ ప్రజలకు నష్టం తప్ప ఏమీ ఉండదు.రాష్ట్రహోదా సాధించడంతో పాటు ఇక్కడి స్థానిక పరిశ్రమలను కాపాడతాం.లోయలోని సామాన్యులకు మేలు చేస్తాం. ముందు జమ్మూకశ్మీర్కు రాష్ట్రహోదా ఇస్తారనుకున్నాం. కానీ బీజేపీ ముందు ఎన్నికలకు వెళ్లింది.ఎన్నికల తర్వాత బీజేపీ గనుక రాష్ట్రహోదా ఇవ్వకపోతే కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఇండియా కూటమి ప్రభుత్వం ఆ పనిచేస్తుంది’అని రాహుల్ మాటిచ్చారు. -
జమ్మూ కాశ్మీర్ లో రెండో దశ పోలింగ్..
-
జమ్మూకశ్మీర్లో ముగిసిన రెండో విడత పోలింగ్..
Elections Live Updates..👉జమ్ము కశ్మీర్లో పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది.#WATCH | Budgam, J&K: National Conference (NC) MP, Aga Syed Ruhullah Mehdi says, "...We got a good response during campaigning in both phases...We are hopeful of getting better results in this phase..." pic.twitter.com/pPjelXEFIt— ANI (@ANI) September 25, 2024 👉శ్రీనగర్లో పోలింగ్ కేంద్రాన్ని సందర్శించిన విదేశీ పర్యాటకులు, వారిని అడ్డుకున్న స్థానిక ఎన్నికల సిబ్బంది, పోలీసులు. #WATCH | J&K Assembly elections | A delegation of diplomats from various countries visits polling stations across Srinagar to witness the polling process in the second phase. Visuals from a polling station at S.P. College, Chinar Bagh - the fourth polling station that they have… pic.twitter.com/7QvyEHtrp0— ANI (@ANI) September 25, 2024👉ఉదయం 11 గంటల వరకు 24.10 శాతం పోలింగ్ నమోదైంది. 👉 ఓటు వేసేందుకు భారీ సంఖ్యలో తరలివచ్చిన ఓటర్లు.J&K Assembly elections | Voters in queues at a polling station in Ganderbal Assembly constituency.JKNC vice president Omar Abdullah is contesting from here, facing a contest from PDP's Bashir Ahmad Mir.(Pics Source: ECI) pic.twitter.com/8rvH7Pl1eK— ANI (@ANI) September 25, 2024 👉పోలింగ్ కేంద్రాల వద్ద భారీ క్యూ లైన్లు #WATCH | Ganderbal, J&K: People queue up at a polling station in Kangan Assembly constituency to vote in the second phase of the Assembly elections today.Eligible voters in 26 constituencies across six districts of the UT are exercising their franchise today. pic.twitter.com/aBe1JqvPmh— ANI (@ANI) September 25, 2024 👉ఓటు వేసేందుకు బారులు తీరిన జనం.. #WATCH | J&K Assembly elections | Long queues of voters at a polling station in Reasi constituency, as polling gets underway. Eligible voters in 26 constituencies across six districts of the UT are exercising their franchise today.BJP has fielded Kuldeep Raj Dubey who faces a… pic.twitter.com/mQUSpBFbkf— ANI (@ANI) September 25, 2024 #WATCH | J&K: People queue up at a polling station in Srinagar to vote in the second phase of the Assembly elections today. Eligible voters in 26 constituencies across six districts of the UT are exercising their franchise today. pic.twitter.com/iSUrcqZEvV— ANI (@ANI) September 25, 2024 👉ఓటర్లకు మోదీ సందేశం..అసెంబ్లీ ఎన్నికలపై ప్రధాని మోదీ స్పందిస్తూ.. ప్రతీ ఒక్కరూ తమ ఓటు హక్కు వినియోగించుకోండి. ప్రజాస్వామ్యాన్ని కాపాడటంతో తమ వంతు బాధ్యతగా ఓటు వేయండి. మొదటి సారి ఓటు హక్కు వినియోగించుకుంటున్న వారికి కంగ్రాట్స్. Prime Minister Narendra Modi tweets, "Today is the second phase of voting for the assembly elections in Jammu and Kashmir. I appeal to all voters to cast their vote and play their important role in strengthening democracy. On this occasion, I congratulate all the young friends… pic.twitter.com/zdr03sCFgL— ANI (@ANI) September 25, 2024 👉వైష్టో దేవీ అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటు వేసేందుకు ఓటర్లు క్యూలైన్లో నిలుచున్నారు.#WATCH | Katra, J&K | People queue up at a polling station in Shri Mata Vaishno Devi assembly constituency of Katra to vote in the second phase of Assebly elections today. Eligible voters in 26 constituencies across six districts of the UT are exercising their franchise today. pic.twitter.com/eLzwmfmfqU— ANI (@ANI) September 25, 2024 👉పలువురు బీజేపీ అభ్యర్థులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. #WATCH | J&K Assembly elections: People await their turn to cast vote as voting for the second phase of elections begins. Voting being held in 26 constituencies across six districts of the UT today.Visuals from Govt middle school in Shri Mata Vaishno Devi assembly constituency… pic.twitter.com/lFo17cfqBK— ANI (@ANI) September 25, 2024#WATCH | J&K Assembly elections: People queue up outside a polling station in Balhama, Srinagar to vote as polling for the second phase of elections begins. Voting being held in 26 constituencies across six districts of the UT today. pic.twitter.com/q5wxemTJ5B— ANI (@ANI) September 25, 2024 #WATCH | Katra, J&K | BJP candidate from Shri Mata Vaishno Devi assembly constituency, Baldev Raj Sharma casts his vote. pic.twitter.com/Zx4QDQemfA— ANI (@ANI) September 25, 2024👉బీజేపీ చీఫ్ రవీందర్ రైనా మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ భారీ మెజార్టీ విజయం సాధిస్తుంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. మా పార్టీలో ఎవరైనా ముఖ్యమంత్రి కావొచ్చు. నేను పార్టీలో ఒక సాధారణ కార్యకర్తను మాత్రమే. నేషన్ ఫస్ట్ అనే భావనతో మేము పనిచేస్తున్నాం. ఈరోజు శాంతియుత వాతావరణంలో ఎన్నికలు జరుగుతున్నాయి. మోదీ, అమిత్ షా కృషితో రికార్డు స్థాయిలో ఓటింగ్ చూస్తారు. #WATCH | Nowshera, J&K: When asked if he would be the CM if BJP wins, J&K BJP chief and Nowshera candidate Ravinder Raina says, "BJP should register a thumping majority in J&K and the party should form the government. Anyone could be the CM...I am an ordinary worker of the party… pic.twitter.com/UJWUzOVCne— ANI (@ANI) September 25, 2024 👉జమ్ము కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా నేడు రెండో విడతలో 26 నియోజకవర్గాల్లో పోలింగ్ ప్రారంభమైంది. 👉26 నియోజకవర్గ 239 మంది అభ్యర్థుల బరిలో నిలిచారు. దాదాపు 25 లక్షల మంది ఓటర్లు రెండో విడతలో ఓటు వేయనున్నారు. Voting for the second phase of Assembly elections in Jammu & Kashmir begins. Eligible voters across 26 constituencies in six districts of the UT are casting their vote today. 239 candidates, including National Conference vice president Omar Abdullah, are in fray in today’s… pic.twitter.com/gGGQhkdG1V— ANI (@ANI) September 25, 2024 👉సెకండ్ ఫేజ్ ఎన్నికల్లో కశ్మీర్ లోయలో మూడు జిల్లాల్లో, జమ్మూ డివిజన్లో మూడు జిల్లాల్లో ఈ రోజు పోలింగ్ జరుగుతోంది.👉పోలింగ్కు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా 3,502 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటుచేశారు. వీటిల్లో 1,056 పట్టణ ప్రాంతాల్లో, 2,446 గ్రామీణ ప్రాంతాల్లో నెలకొల్పారు.👉ఈ దఫాలో మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, జమ్ముకశ్మీర్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు తారిఖ్ హమీద్ కరా, బీజేపీ జమ్ము కశ్మీర్ చీఫ్ రవీందర్ రైనాలు తమ అదృష్టం పరీక్షించుకోనున్నారు. ఒమర్ ఈసారి గందేర్బల్, బుద్గామ్ చోట్ల నుంచి బరిలో నిలిచిన సంగతి తెలిసిందే. -
‘కామ్ కీ బాత్’ ఏనాడూ చెప్పలేదు
సురాన్కోట్(జమ్మూకశీ్మర్)/శ్రీనగర్: జమ్మూకశీ్మర్ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీపై లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ విమర్శల బాణాలు ఎక్కుపెట్టారు. దేశాన్ని పట్టిపీడిస్తున్న నిరుద్యోగ సమస్య, ధరల కట్టడిని మోదీ నిర్లక్ష్యం చేశారని ఎండగట్టారు. సోమవారం పూంఛ్ జిల్లాలోని సురాన్కోట్ శాసనసభ నియోజకవర్గంలో, శ్రీనగర్లో ఎన్నికల ప్రచార ర్యాలీల్లో రాహుల్ ప్రసంగించారు. ‘‘నెలకోసారి ‘మన్ కీ బాత్’ముచ్చట్లతో మోదీ మోతెక్కిస్తారు. కానీ ఏనాడూ తాను పూర్తిచేయాల్సిన కీలక బాధ్యతలను ప్రస్తావించరు. బాధ్యతలను విస్మరించారు. ఉద్యోగాల కల్పన, ధరల కట్టడి వంటి చేయాల్సిన పనులపై ‘కామ్ కీ బాత్’ఏనాడూ చెప్పరు. గతంలో 56 అంగుళాల ఛాతి అంటూ గొప్పలు చెప్పుకుని తిరిగిన ఆనాటి మోదీ ఇప్పుడు లేరు. ఎందుకంటే ఆయన మూడ్ను లోక్సభ ఎన్నికల తర్వాత విపక్షాల ‘ఇండియా’కూటమి మార్చేసింది. ప్రధాని మోదీ సైకాలజీని మా కూటమి దెబ్బకొట్టింది’’అని రాహుల్ అన్నారు. కశ్మీర్ను ఢిల్లీ సర్కార్ కాదు, స్థానికులే పాలించాలి జమ్మూకశీ్మర్ను ఢిల్లీ ప్రభుత్వం కాకుండా స్థానికులే పాలించాలని రాహుల్ అన్నారు. జమ్మూకశ్మీర్ను కేంద్రపాలిత ప్రాంతంగా చేసి మోదీ సర్కార్ నేరుగా పరిపాలిస్తున్న నేపథ్యంలో రాహుల్ ఈ వ్యాఖ్యలుచేశారు. ‘‘కేంద్రపాలిత ప్రాంతా(యూటీ)లను రాష్ట్రాలుగా మార్చారుగాగానీ రాష్ట్రాన్ని యూటీగా మార్చడం భారత చరిత్రలో ఎన్నడూ జరగలేదు. పూర్తిస్థాయి రాష్ట్రమైన జమ్మూకశీ్మర్ను యూటీగా మార్చి ఇక్కడి పౌరుల హక్కులను కాలరాశారు’’అని అన్నారు. ఈ కార్యక్రమంలో నేషనల్ కాన్ఫెరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా సైతం పాల్గొన్నారు. వాళ్లు చేయకుంటే మేమే చేస్తాం ‘‘జమ్మూకశీ్మర్కు మళ్లీ రాష్ట్ర హోదా కోసం కేంద్రప్రభుత్వంతో పోరాడతాం. అయినా వాళ్లు ఇవ్వకపోతే మేం కేంద్రంలో అధికారంలోకి వచ్చాక మేమే హోదా ఇస్తాం. యూటీకాకమునుపు స్థానికులే కశీ్మర్ను పాలించేవారు. ఇక్కడి వారి భవిష్యత్తు, ప్రయోజనాలకనుగుణంగా నిర్ణయాలు జరిగేవి. ఇప్పుడు ‘బయటి’వ్యక్తులు మీ గొంతుక వినకుండానే సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇక్కడి ప్రభుత్వాన్ని ఢిల్లీ నడిపిస్తోంది. మేం మీ ప్రభుత్వాన్ని జమ్మూకశీ్మరే నడపాలని కోరుకుంటున్నాం. మీ సమస్యలను పార్లమెంట్ వేదికగా ఎలుగెత్తి చాటేందుకు మీ గొంతుకనవుతా’’అని స్థానికులనుద్దేశించి రాహుల్ అన్నారు. జమ్మూకశీ్మర్ అసెంబ్లీ ఎన్నికల్లో రెండో దఫాలో 26 స్థానాలకుగాను సెపె్టంబర్ 25న జరగబోయే పోలింగ్కు ప్రచారం సోమవారంతో ముగిసింది. కుల గణన అనడానికే మోదీ జంకుతున్నారు కుల గణన అనడానికి కూడా ప్రధాని మోదీ జంకుతున్నారని రాహుల్ వ్యాఖ్యానించారు. మోదీ, బీజేపీని విమర్శిస్తూ రాహుల్ సోమవారం సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో హిందీలో పలు పోస్ట్లుచేశారు. ‘‘బీజేపీ పూర్తిగా బహుజనుల వ్యతిరేక పారీ్టగా తయారైంది. వాళ్లు ఎన్ని పుకార్లు పుట్టించినా, అబద్ధాలు వ్యాపింపజేసినా మేం మాత్రం రిజర్వేషన్లకు ఎలాంటి ముప్పు రానివ్వం. సమగ్ర కులగణన జరిగేదాకా మేం ఊరుకోం. సమాజంలోని ప్రతి వర్గానికి హక్కులు, వాటా, న్యాయం దక్కేలా చూస్తాం. అవసరమైతే 50 శాతం రిజర్వేషన్ల పరిమితి ఎత్తేసి ఎక్కువ రిజర్వేష్లను కలి్పస్తాం. మోదీజీ కనీసం కులగణన అనడానికి కూడా భయపడుతున్నారు. బహుజనులకు న్యాయం దక్కడమనేది రాజకీయ అంశంకాదు అది నా జీవిత లక్ష్యం’’అని రాహుల్ అన్నారు. -
‘హంగ్’ రావొద్దనే... కాంగ్రెస్తో పొత్తుపై ఒమర్
శ్రీనగర్: జమ్మూకశ్మీర్లో ఎన్నికల అనంతరం హంగ్ పరిస్థితి రాకుండా ప్రజలకు ఒక అవకాశం కల్పించేందుకే కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నట్లు నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ) ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దులా వివరించారు. ప్రభుత్వం ఏర్పాటు కాదేమోనన్న అనుమానాలు అక్కర్లేదని ఆయన కుండబద్దలు కొట్టారు. దాల్ సరస్సులో ఆదివారం షికారా(పడవ)లతో చేపట్టిన ర్యాలీలో అబ్దుల్లా మాట్లాడారు. ఎన్నికల తర్వాత జమ్మూకశ్మీర్లో హంగ్ ఏర్పడాలని బీజేపీ కోరుకుంటోందని, తద్వారా లెఫ్టినెంట్ గవర్నర్ పాలనను పొడిగించాలని చూస్తోందని ఆరోపించారు. అయితే, ప్రజలు బీజేపీకి ఆ అవకాశం ఇవ్వబోరని చెప్పారు. కశ్మీర్ లోయలో ప్రచారంతో ఫలితం ఉండదని ముందుగానే గ్రహించిన బీజేపీ నేతలు జమ్మూలో మాత్రమే పర్యటిస్తున్నారని ఒమర్ వ్యాఖ్యానించారు. బీజేపీ తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే జమ్మూకశ్మీర్లో మూడు కుటుంబాల పాలన అంటూ విమర్శలు చేస్తోందన్నారు. -
పాక్కు మోదీ అంటే భయం..: అమిత్ షా
మెంఢర్: ‘‘ప్రధాని నరేంద్ర మోదీ అంటే పాకిస్తాన్ భయపడుతోంది. అందుకే జమ్మూకశీ్మర్లో సరిహద్దులు ప్రశాంతంగా ఉన్నాయి’’ అని కేంద్ర హోం మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. సరిహద్దుల్లో ఎలాంటి దుస్సాహసానికి పాల్పడినా భారత్ సమాధానం ఎంత తీవ్రంగా ఉంటుందో పాక్కు తెలుసన్నారు. సరిహద్దుల్లోని పూంఛ్ జిల్లాలో శనివారం ఎన్నికల ప్రచార ర్యాలీల్లో మంత్రి మాట్లాడారు. కేంద్ర పాలిత ప్రాంతంలోని యువకులకు తుపాకులు, రాళ్ల స్థానంలో ల్యాప్టాప్లను అందించడం ద్వారా ఇక్కడ తీవ్రవాదాన్ని తుడిచిపెట్టామన్నారు. 1990ల్లో తరచూ చోటుచేసుకున్న సీమాంతర ఉగ్రవాదం నేడు కనిపిస్తోందా అని ప్రజలను ప్రశ్నించారు. ‘‘గతంలో ఇక్కడి పాలకులు పాకిస్తాన్ను చూసి భయపడేవారు. ఇప్పుడు మోదీని చూసి పాక్కు భయం పట్టుకుంది. కాల్పులకు దిగేందుకు సాహసించడం లేదు. జమ్మూకశీ్మర్లో 1990ల్లో మొదలైన ఉగ్రవాదానికి 2014 నాటికి 40 వేల మంది బలయ్యారు. దాన్ని ఆపడంలో ఆ మూడు (అబ్దుల్లా, ముఫ్తీ, నెహ్రూ) కుటుంబాలు విఫలమయ్యాయి. పైపెచ్చు, ఉగ్రవాదాన్ని రెచ్చగొట్టాయి. జమ్మూకశ్మీర్లో ప్రజాస్వామ్యం వేళ్లూనడానికి వాళ్లు ఎప్పుడూ ప్రయతి్నంచలేదు. ఆ మూడు కుటుంబాల పాలనకు ముగింపు పలికేలా అసెంబ్లీ ఎన్నికల్లో తీరి్పవ్వండి’’ అని అమిత్ షా పిలుపునిచ్చారు.ఉగ్రవాదంతో ఎవరికీ లాభం లేదు ‘ఉగ్రవాదం వల్ల ఎవరికీ ప్రయోజనం లేదు. తుపాకులను మన పిల్లలకు అందజేద్దాం. మన యువతను ఆర్మీ, పోలీసు విభాగాల్లోకి పంపేందుకు ప్రయతి్నద్దాం. ఇందుకోసం సరిహద్దు ప్రాంతాల్లో ప్రత్యేకంగా రిక్రూట్మెంట్ డ్రైవ్లను ఏర్పాటు చేస్తాం’’ అని అమిత్ షా ప్రకటించారు. ‘‘కేంద్రంలో 2014లో బీజేపీ ప్రభుత్వమే ఏర్పడకుంటే ఇక్కడ పంచాయతీరాజ్ ఎన్నికలు జరిగేవే కావు, 30 వేల మంది పంచాయతీ సభ్యుల ఎన్నికయ్యే వారే కాదు. ప్రజలపై ఎన్సీ, పీడీపీ, కాంగ్రెస్ పారీ్టల మూడు కుటుంబాల పెత్తనం మరింత పెరిగి ఉండేది’’ అని అమిత్ షా దుయ్యబట్టారు. గుజరాత్కు చెందిన ఒక నేత నియంత్రణ రేఖకు అతి సమీపంలోని మెంఢర్కు వచ్చి ఉండేవారే కాదని తన పర్యటనను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. 1947లో సరిహద్దులను కాపాడిన పహాడీలు, బకర్వాలాలు, గుజ్జర్లను చూసి జాతి గరి్వస్తోందన్నారు. -
జమ్ము ఎన్నికల వేళ.. పాక్ మంత్రి వ్యాఖ్యల దుమారం
ఢిల్లీ: జమ్ము కశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికల వేళ ఆర్టికల్ 370 అంశంపై పాకిస్తాన్ జోక్యం చేసుకుంది. జమ్ము కశ్మీర్లో ఆర్టికల్ 370 పునరుద్ధరణపై పాక్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ, జమ్ము కశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ కూటమి ఒకే విధమైన ఆలోచనతో ఉన్నాయని ఆ దేశ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ అన్నారు. మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఖవాజా ఆసిఫ్ మట్లాడుతూ.. ‘‘జమ్ము కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్-నేషనల్ కాన్ఫరెన్స్ కూటమి విజయం సాధించి అధికారంలోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ కూటమి ఆర్టికల్ 370 పునరుద్ధరణను ఎన్నికల అంశంగా మార్చారు. ఆర్టికల్ 370, 35A పునరుద్ధరణ కోసం జమ్ము కశ్మీర్లో పాకిస్తాన్ , నేషనల్ కాన్ఫరెన్స్-కాంగ్రెస్ కూటమి ఒకే అభిప్రాయంతో ఉన్నాయి’’ అని అన్నారు. ఎన్నికల జమ్ము కశ్మీర్ స్వయం ప్రతిపత్తిపై పాక్ జోక్యం చేసుకొని ఇటువంటి వ్యాఖ్యలు చేయటం దుమారం రేపుతున్నాయి. ఇక.. ఇప్పటి వరకు పాక్ మంత్రి వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ స్పందించలేదు.Pakistan’s Defence Minister @KhawajaMAsif on Hamid Mir’s Capital Talk on Geo News says, “Pakistan and @JKNC_ - @INCIndia alliance are on the same page in Jammu & Kashmir to restore Article 370 and 35A”. Will @RahulGandhi & @OmarAbdullah react. pic.twitter.com/x9dYev2PHM— RP Singh National Spokesperson BJP (@rpsinghkhalsa) September 19, 2024 ఇప్పటికే నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ తాము అధికారంలోకి వస్తే.. ఆర్టికల్ 370ని పునరుద్ధరిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చింది. అయితే, ఈ విషయంపై కాంగ్రెస్ పూర్తిగా మౌనంగా ఉంది. కాంగ్రెస్ మేనిఫెస్టోలో కూడా ఈ అంశం ప్రస్తావన లేకపోవటం గమనార్హం. కానీ, ముందు నుంచి జమ్ము కశ్మీర్కు పూర్తి రాష్ట్ర హోదాను పునరుద్ధరించడానికి కాంగ్రెస్ కట్టుబడి ఉందని హామీ ఇస్తూ వస్తోంది. ఆర్టికల్ 370 పునరుద్ధరణ హామీ విషయంలో నేషనల్ కాన్ఫరెన్స్తో పాటు మెహబూబా ముఫ్తీ పీడీపీ తన మేనిఫెస్టోలలో పెట్టింది.పాక్ మంత్రి చేసిన వ్యాఖ్యలు బీజేపీ.. కాంగ్రెస్పై తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది. కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ భారత ప్రయోజనాలకు విఘాతం కలిగించే వారి వైపే ఉంటుందని ఆరోపణలు చేసింది. ‘‘ఉగ్రవాద రాజ్యమైన పాకిస్తాన్, కశ్మీర్ విషయంలో కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ కూటమి వైఖరిని సమర్థిస్తుంది. రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ఎల్లప్పుడూ భారతదేశ ప్రయోజనాలకు విరుద్ధమైన వారి వైపు కనిపిస్తారు’ అని బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవీయ ఎక్స్లో విమర్శించారు. -
ప్రశాంతంగా జమ్ము తొలిదశ పోలింగ్
శ్రీనగర్//జమ్మూ: జమ్మూకశ్మీర్ అసెంబ్లీకి బుధవారం తొలిదశ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 61 శాతం పోలింగ్ నమోదైంది. 2019లో ఆరి్టకల్ 370 రద్దు చేసి, రాష్ట్ర హోదాను తొలగించి కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చాక.. తొలిసారిగా కశ్మీర్ అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్నాయి. ఓటర్లు ఉత్సాహంగా పోలింగ్లో పాల్గొన్నారు. జమ్మూకశ్మీర్లో గత ఏడు లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే అత్యధిక పోలింగ్ శాతమని చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ పి.కె.పోల్ వెల్లడించారు. మారుమూల ప్రాంతాల నుంచి నివేదికలు అందాక, పోస్టల్ బ్యాలెట్లను కూడా కలుపుకొంటే పోలింగ్ శాతం మరింత పెరగవచ్చని తెలిపారు. జమ్మూకశ్మీర్ అసెంబ్లీలో మొత్తం 90 స్థానాలుండగా.. బుధవారం తొలి విడతలో 24 సీట్లలో పోలింగ్ జరిగింది. 23 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. కశ్మీర్ లోయలో 16 సీట్లకు, జమ్మూలో 8 సీట్లకు బుధవారం పోలింగ్ జరిగింది. ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ బూత్ల బయట ఓటర్లు క్యూ కట్టారు. సాయంత్రం ఆరు గంటలకు పోలింగ్ ముగిసింది. 61 శాతం పోలింగ్ నమోదైందని పి.కె.పోల్ ప్రకటించారు. సెపె్టంబరు 25న రెండో దశ, అక్టోబరు 1న మూడో విడత ఎన్నికలు జరగనున్నాయి. హరియాణాతో కలిసి అక్టోబరు ఎనిమిదో తేదీన ఓట్ల లెక్కింపు జరుగుతుంది. -
కశ్మీర్లో నేడే తొలి దశ
శ్రీనగర్/జమ్మూ: జమ్మూ కశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికల పోరు కీలక దశకు చేరింది. 7 జిల్లాల పరిధిలో 24 అసెంబ్లీ స్థానాలకు బుధవారం తొలి విడతలో పోలింగ్ జరగనుంది. వీటిలో 8 స్థానాలు జమ్మూలో, 16 కశ్మీర్ ప్రాంతంలో ఉన్నాయి. 90 మంది స్వతంత్రులతో కలిపి మొత్తం 219 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వారి భవితవ్యాన్ని 23 లక్షల పై చిలుకు ఓటర్లు బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తం చేయనున్నారు. జమ్మూ కశ్మీర్లో పదేళ్ల అనంతరం అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుండటం విశేషం. పైగా జమ్మూ కశ్మీర్కు రాష్ట్ర హోదాను, ప్రత్యేక ప్రతిపత్తి కలి్పస్తున్న ఆరి్టకల్ 370ని రద్దు చేశాక జరుగుతున్న తొలి అసెంబ్లీ ఎన్నికలివి. దాంతో ప్రజల తీర్పు ఎలా ఉండనుందోనని ఆసక్తి నెలకొంది. ఉగ్ర ముప్పు నేపథ్యంలో సీఏపీఎఫ్, స్థానిక పోలీసులతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో పోలింగ్ బూత్లకు, సిబ్బందికి అదనపు భద్రత కల్పిస్తున్నారు. సెపె్టంబర్ 25, అక్టోబర్ 1న రెండు, మూడో విడతతో పోలింగ్ ప్రక్రియ ముగుస్తుంది. ఫలితాలు అక్టోబర్ 8న వెల్లడవుతాయి. పారీ్టలన్నింటికీ ప్రతిష్టాత్మకమే ప్రధాన ప్రాంతీయ పారీ్టలు నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ), పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ (పీడీపీ)తో పాటు కాంగ్రెస్, బీజేపీ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. వేర్పాటువాద జమాతే ఇస్లామీ, అవామీ ఇత్తెహాద్ పార్టీ, డీపీఏపీ కూడా బరిలో ఉన్నాయి. కాంగ్రెస్, ఎన్సీ పొత్తు పెట్టుకున్నా మూడుచోట్ల స్నేహపూర్వక పోటీ చేస్తున్నాయి. మరో చోట ఎన్సీ రెబెల్ బరిలో ఉన్నారు. కశ్మీర్పై కాషాయ జెండా ఎగరేయజూస్తున్న బీజేపీనీ రెబెల్స్ బెడద పీడిస్తోంది. అసెంబ్లీ నియోజకవర్గాల పునర్ వ్యవస్థీకరణలో హిందూ ప్రాబల్య జమ్మూ ప్రాంతంలో సీట్లు 37 నుంచి 43కు పెరిగాయి. ముస్లిం ప్రాబల్య కశ్మీర్లో ఒక్క సీటే పెరిగింది.బరిలో ప్రముఖులు: మొహమ్మద్ యూసుఫ్ తరిగమీ (సీపీఎం) కుల్గాం నుంచి వరుసగా ఐదో విజయంపై కన్నేశారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి గులాం అహ్మద్ మీర్దూరు నుంచి మూడోసారి గెలుపుపై ఆశలు పెట్టుకున్నారు. నేషనల్ కాన్ఫరెన్స్ నేత సకీనా (దమ్హాల్ హాజిపురా), పీడీపీ నేతలు సర్తాజ్ మద్నీ (దేవ్సర్), అబ్దుల్ రెహా్మన్ వీరి (షంగుస్–అనంత్నాగ్), మెహబూబా ముఫ్తీ కూతురు ఇల్తిజా (శ్రీగుఫ్వారా–బిజ్బెహరా), వహీద్ పరా (పుల్వామా) తదితర ప్రముఖులు తొలి విడతలో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.ప్రధాన సమస్యలు ఇవే...→ నిరుద్యోగం, అణచివేత, మానవ హక్కుల ఉల్లంఘన వంటివి జమ్మూ కశ్మీర్ ప్రజలు ఎదుర్కొటున్న ప్రధాన సమస్యలు. → పూర్తిస్థాయి రాష్ట్ర హోదా లభిస్తేనే సమస్యలు తీరి తమ ప్రయోజనాలు నెరవేరతాయని వారు భావిస్తున్నారు. దాంతో దాదాపుగా పారీ్టలన్నీ దీన్నే ప్రధాన హామీగా చేసుకున్నాయి. → ఆర్టికల్ 370ని తిరిగి తెస్తామని కూడా ఎన్సీ వంటి పార్టీలు చెబుతున్నాయి. విద్య, వివాహాలు, పన్నులు, సంపద, అడవుల వంటి పలు అంశాలను రాష్ట్ర ప్రభుత్వ నియంత్రణలోకి తెస్తామంటున్నాయి. → ఇటీవలి లోక్సభ ఎన్నికల్లో కశ్మీరీలు భారీ సంఖ్యలో ఓటువేశారు. అసెంబ్లీ ఎన్నికల్లోనూ అదే ధోరణి కొనసాగుతుందని భావిస్తున్నారు. -
Amit Shah: ఉగ్రవాదాన్ని పాతిపెడతాం
గులాబ్గఢ్/కిష్ట్వార్: మళ్లీ కోలుకోనంతగా ఉగ్రవాదాన్ని బీజేపీ ప్రభుత్వం పాతాళంలోకి పాతిపెట్టనుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. జమ్మూకశ్మీర్లోని కిష్ట్వార్ జిల్లాలోని పెదర్–నగ్సేని నియోజకవర్గ పరిధిలో సోమవారం గులాబ్గఢ్లో జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో అమిత్ ప్రసంగించారు. ‘‘1990దశకం నుంచి ఉగ్రవాదంతో కష్టాలుపడుతున్న జమ్మూ కశ్మీర్ ప్రజలకు ఈరోజు మాట ఇస్తున్నా. మళ్లీ ఈ గడ్డపై కనిపించనంత లోతుల్లో ఉగ్రవాదాన్ని మా ప్రభుత్వం పాతిపెడుతుంది. ఇక్కడ తమ ప్రభుత్వం ఏర్పాటైతే జైళ్ల నుంచి ఉగ్రవాదులను విడుదలచేస్తామని నేషనల్ కాన్ఫెరెన్స్(ఎన్సీ) కాంగ్రెస్ పార్టీలు హామీ ఇచ్చాయి. మచియాల్ మాత సాక్షిగా చెబుతున్నా. భారతగడ్డపై ఉగ్రవాదాన్ని వ్యాప్తిచేసే సాహసం ఇంకెవ్వరూ చేయరు. ఉగ్రవాదులను ఎదుర్కొనేందుకు గ్రామ రక్షణ గార్డులు, స్పెషల్ పోలీస్ అధికారులకు పాతరకం .303 రైఫిళ్ల స్థానంలో అధునాతన ఆయుధాలిచ్చాం. ఎక్కడి నుంచైనా ఇక్కడికి ఉగ్రవాదులొస్తే వారి కథ ఇక్కడి మంచుకొండల్లో ముగిసిపోతుంది’’ అని అన్నారు. ఈ సందర్భంగా ఎన్సీ, కాంగ్రెస్లపై అమిత్ విమర్శలుచేశారు. ‘‘ డోగ్రాల చివరి రాజు మహారాజా హరిసింగ్ను వీళ్లు అవమానించారు. కశ్మీరీ పండిట్లు బలవంతంగా వెళ్లిపోవడానికి కారణం వీళ్లే. వీళ్లు మహిళ హక్కులను లాగేసుకున్నారు. అవసరమైన వర్గాలకు రిజర్వేషన్ ఫలాలు దక్కకుండా చేశారు’’ అని ఆరోపించారు. ‘‘ రువ్వేందుకు రాళ్లు పట్టుకున్న యువతకు జైళ్లు సిద్ధంగా ఉన్నాయి. అలాగే ల్యాప్టాప్లు, త్రివర్ణపతాకం పట్టుకున్న యువతకు ఉద్యోగాలు సిద్ధంగా ఉన్నాయి’ అని షా అన్నారు. రాహుల్ కశ్మీర్లో ఐస్క్రీమ్ తినొచ్చురామ్బాన్లో జరిగిన ర్యాలీలోనూ అమిత్ మాట్లాడారు. ‘‘ కశ్మీర్ను ఎన్డీఏ సర్కార్ సురక్షితమైన ప్రాంతంగా మార్చేసింది. అయితే ఇటీవల రాహుల్ ఇక్కడి కొచ్చి లాల్చౌక్లో ఐస్క్రీమ్ తిన్నారు. బైక్ నడిపారు. పైగా మా ప్రభుత్వాన్నే విమర్శిస్తున్నారు. రాహుల్ బాబా.. మీరు మమ్మల్ని విమర్శిస్తున్నారుగానీ ఇంతటి రక్షణ వాతావరణం మా వల్లే సాధ్యమైంది. మీ ప్రభుత్వాల్లో ఇది అసాధ్యం’’ అని అన్నారు. కాంగ్రెస్ హయాంలో హోం మంత్రిగా ఉండి కూడా లాల్చౌక్ ప్రాంతానికి వెళ్లాలంటేనే భయపడేవాడినని కాంగ్రెస్ నేత సుశీల్కుమార్ షిండే చేసిన వ్యాఖ్యలను అమిత్ గుర్తుచేశారు. ‘‘ షిండే గారూ.. ఇప్పుడు పిల్లాజెల్లాతో వచ్చేయండి. ఎంచక్కా లాల్చౌక్లో వాకింగ్ చేయండి. మీకు హాని చేసేందుకు ఎవరూ సాహసించరు’’ అని అమిత్ అన్నారు. -
వారసత్వ రాజకీయాలే పెనుశాపం
జమ్మూ: జమ్మూకశ్మిర్లో ఉగ్రవాదం చివరి శ్వాస పీల్చుకుంటోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ప్రకృతి సౌందర్యానికి మారుపేరైన జమ్మూకశ్మిర్ను ఇక్కడి వారసత్వ రాజకీయాలు దారుణంగా దెబ్బతీశాయని, పెనుశాపంగా మారి ప్రజల భవిష్యత్తును నాశనం చేశాయని మండిపడ్డారు. వారసత్వ రాజకీయ పారీ్టలు సొంత బిడ్డల సంక్షేమమే తప్ప ప్రజల బాగోగులు ఏనాడూ పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. నూతన నాయకత్వాన్ని పైకి ఎదగనివ్వలేదని ఆరోపించారు. వారసత్వ రాజకీయాలకు పోటీగా నూతన నాయకత్వాన్ని ప్రవేశపెడుతున్నామని వెల్లడించారు. 2014లో తాము కేంద్రంలో అధికారంలోకి రాగానే ఇక్కడ నాయకత్వ నిర్మాణంపై దృష్టి పెట్టామన్నారు. శనివారం జమ్మూ ప్రాంతంలోని దోడా జిల్లాలో భారీ ఎన్నికల ప్రచార సభలో ప్రధాని మోదీ ప్రసంగించారు. రాబోయయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను అద్భుతమైన మెజారీ్టతో గెలిపించాలని ప్రజలను కోరారు. నేషనల్ కాన్ఫరెన్స్, పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ, కాంగ్రెస్ లాంటి పారీ్టలు మళ్లీ అధికారంలోకి వస్తే అధోగతేనని తేలి్చచెప్పారు. జమ్మూకశ్మిర్కు రాష్ట్ర హోదా పునరుద్ధరిస్తామని మరోసారి హామీ ఇచ్చారు. దేశానికి స్వాతంత్య్రం వచి్చనప్పుటి నుంచి జమ్మూకశ్మిర్ విదేశీ శక్తులకు టార్గెట్గా మారిందన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికలు ఈ ప్రాంత భవిష్యత్తును నిర్దేశించబోతున్నాయని స్పష్టంచేశారు. గత నాలుగు దశాబ్దాల్లో దోడా జిల్లాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మొట్టమొదటి ప్రధాని నరేంద్ర మోదీ కావడం విశేషం. సభలో ఆయన ఇంకా ఏం మాట్లాడారంటే... యువ నాయకత్వానికి పెద్దపీట వేశాం ‘‘ఉగ్రవాద భూతం వల్ల జమ్మూకశ్మిర్ యు వత తీవ్రంగా నష్టపోయారు. ఇక్క డ అధికారం వెలగబెట్టిన పారీ్టలు ప్రజలను తప్పు దోవ పట్టిస్తూ కుటుంబ స్వామ్యాన్ని పెంచి పోషించాయి. యు వతను రాజకీయాల్లో ప్రోత్సహించలే దు. 2000 సంవత్సరం నుంచి పంచా యతీ ఎన్నికలు నిర్వహించలేదు. 2014 తర్వాత బ్లాక్ డెవలప్మెంట్ కౌన్సిల్, జిల్లా డెవలప్మెంట్ కౌన్సిల్ ఎన్నికలు జరగలేదు. మేము అధికారంలోకి వ చ్చాక ఆయా ఎన్నికలు నిర్వహించాం. యువ నాయకత్వానికి పెద్దపీట వేశాం. వెండితెరపై మళ్లీ జమ్మూకశ్మిర్ అందాలు ఉగ్రవాద బాధితురాలు షగున్ పరిహర్కు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ టిక్కెట్ కేటాయించాం. ఉగ్రవాదాన్ని పూర్తిగా పెకిలించాలన్న మా అంకితభావానికి ఇదొక ఉదాహరణ. 2018 నవంబర్లో షగున్ తండ్రిని, బంధువును ఉగ్రవాదులు కాలి్చచంపారు. జమ్మూకశ్మిర్ను ఉగ్రవాద రహితంగా, పర్యాటకుల స్వర్గధామంగా మార్చాలన్నదే మా లక్ష్యం. అంతర్జాతీయ సినిమా షూటింగ్లు ఇక్కడ జరిగే పరిస్థితి రావాలి. వెండితెరపై జమ్మూకశ్మీర్ అందాలు మళ్లీ కనిపించేలా చర్యలు తీసుకుంటున్నాం. ఆరి్టకల్ 370ను మళ్లీ తీసుకొస్తారట! కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ ఎన్నికల మేనిఫెస్టో, బీజేపీ హామీల మధ్య తేడాలను ప్రజలు గమనించాలి. ఆరి్టకల్ 370ను మళ్లీ తీసుకొస్తామని ఆ మూడు పారీ్టలు చెబుతున్నాయి. అంటే ప్రజల హక్కులను మళ్లీ దోచుకుంటారట! రిజర్వేషన్లు, ఓటు హక్కును రద్దు చేస్తారట! ఆర్టికల్ 370తోపాటు ఆరి్టకల్ 35ఏ పునరుద్ధరిస్తే ఆడబిడ్డలను తీరని అన్యాయం జరుగుతుంది. మూడు పార్టీల మేనిఫెస్టో అమల్లోకి వస్తే పాఠశాలలు మళ్లీ అగి్నకి ఆహూతవుతాయి. బీజేపీ నేతలను అరెస్టు చేయడమే కాంగ్రెస్ ఎజెండానా? కాంగ్రెస్ పారీ్టకి ఏమాత్రం నిజాయతీ లేదు. అధికారంలోకి రావడానికి అవినీతి, వారసత్వ రాజకీయాలు, ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడడం ఆ పారీ్టకి అలవాటే. అమెరికాలో భారతీయ జర్నలిస్టుపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేశారు. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడుల గురించి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నోరువిప్పుతారా? అని శామ్ పిట్రోడాను ప్రశ్నించింనందుకు గదిలో బంధించి దారుణంగా కొట్టారు. ఇలా చేయడం మన దేశ గౌరవాన్ని పెంచుతుందా? కాంగ్రెస్ రాజకుటుంబం అత్యంత అవినీతిమయమైన కుటుంబం. వారసత్వ రాజకీయాలు చేస్తున్న ఆ కుటుంబం పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. లోక్సభ ఎన్నికల్లో ఇండియా కూటమికి మరో 20 సీట్లు వచ్చి ఉంటే బీజేపీ నేతలను జైలుకు పంపించేవాళ్లమని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. అంటే వారి ఎజెండా అదేనా? మమ్మల్ని జైల్లో పెట్టడానికే కాంగ్రెస్కు అధికారం కావాలా? ప్రజల సంక్షేమం, అభివృద్ధికి అక్కర్లేదా?’’ అని ప్రశ్నించారు. -
ప్రేమ దుకాణం అంటూనే దాడులా?: ప్రధాని మోదీ
ఢిల్లీ: జమ్ము కశ్మీర్ ఎన్నికల ప్రచారంలో.. కాంగ్రెస్ పార్టీని లక్ష్యంగా చేసుకుని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు ప్రధాని నరేంద్ర మోదీ. దోడాలో బహిరంగ సభలో ప్రసంగించిన ఆయన.. క్రూరత్వాన్ని ఆస్వాదించడంలో కాంగ్రెస్ తారాస్థాయికి చేరిందని మండిపడ్డారు.‘‘వాళ్లు(కాంగ్రెస్) నోరు తెరిస్తే ప్రేమ దుకాణం అంటున్నారు. కానీ, అమెరికాలో ఏం చేశారు?. ఓ జర్నలిస్ట్పై కిరాతకంగా దాడి చేశారు. ఓ భరతమాత ముద్దుబిడ్డకు అమెరికాలో అవమానం జరిగింది. స్వేచ్ఛ హక్కు కోసం పాటుపడే వీరులుగా తమను తాము అభివర్ణించుకుంటున్నవాళ్లు.. వాస్తవంలో అవతలివాళ్లను నోరు మెదపనివ్వట్లేదు. ప్రశ్నిస్తే.. దాడులతో పేట్రేగిపోతున్నారు’’ అని మోదీ ప్రసంగించారు.ఇటీవల డల్లాస్లో ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ చీఫ్ శ్యామ్ పిట్రోడాను ఇంటర్వ్యూ చేసే క్రమంలో.. ఓ జాతీయ మీడియా సంస్థకు చెందిన కరస్పాండెంట్పై దాడి జరిగింది. తాను బంగ్లాదేశ్లో హిందువులే టార్గెట్గా జరుగుతున్న దాడులపై పిట్రోడాను ప్రశ్నించానని, ఈలోపు కొందరు కాంగ్రెస్ వాళ్లు తనతో దురుసుగా ప్రవర్తించారని, తన ఫోన్ లాక్కొని ఇంటర్వ్యూ వీడియోను డిలీట్ చేశారని రోహిత్ శర్మ అనే ఆ రిపోర్టర్ ఆరోపించారు. రాహుల్ గాంధీ అమెరికా పర్యటనకు సరిగ్గా మూడు రోజుల ముందే ఈ ఘటన చోటు చేసుకుంది.ఇదీ చదవండి: ‘ఆర్థిక మంత్రికి అహంకారం ఎక్కువా?’ఈ ఘటననే ఇవాళ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ ప్రస్తావించారు. ఇదే సభలో కూటమిపైనా ప్రధాని విసుర్లు విసిరారు. వారసత్వ రాజకీయాలతో యువత తీవ్రంగా నష్టపోతోందని, అసలు కాంగ్రెస్కు ఈ ప్రాంతమంటే లెక్కేలేదని అన్నారాయన. బీజేపీని గెలిపిస్తే.. కల్లోలిత ప్రాంతంగా పేరున్న జమ్ములో అభివృద్ధి బాటలు వేస్తామన్నారు. ఇదిలా ఉంటే.. సుమారు నాలుగు దశాబ్దాల తర్వాత దోడే జిల్లాలో పర్యటించిన ప్రధాని మోదీనే కావడం గమనార్హం. #WATCH | Doda, J&K: Prime Minister Narendra Modi says "...This time's assembly election in Jammu and Kashmir is between three families and the youth of Jammu and Kashmir. One family belongs to Congress, one family belongs to the National Conference and one family belongs to… pic.twitter.com/7KOp8H6M9Y— ANI (@ANI) September 14, 2024 -
మా గొంతు ఎవ్వరూ నొక్కలేరు
శ్రీనగర్: ‘జమ్మూకశ్మీర్ ప్రజలు శాంతిని ఆకాంక్షిస్తున్నారు. అదీ వారి అభీష్టం ప్రకారమే. కేంద్రం ఆంక్షలకు లోబడి మాత్రం కాదు’ అని ఆవామీ ఇత్తెహాద్ పార్టీ(ఏఐపీ) చీఫ్, లోక్సభ ఎంపీ షేక్ అబ్దుల్ రషీద్ అలియాస్ ఇంజనీర్ రషీద్ స్పష్టం చేశారు. ఉగ్ర నిధుల కేసులో తిహార్ జైల్లో ఉన్న ఆయనకు ఇటీవల సుప్రీంకోర్టు బెయిలివ్వడంతో విడుదలైన విషయం తెలిసిందే. గురువారం ఐదేళ్ల తర్వాత మొట్టమొదటిసారిగా శ్రీనగర్ చేరుకున్న ఎంపీ రషీద్.. విమానాశ్రయంలో కాలు మోపిన వెంటనే మోకాళ్లపై వంగి నుదుటితో నేలను తాకి, బయటకు వచ్చారు. తన కోసం ఎదురుచూస్తున్న కార్యకర్తలనుద్దేశించి మాట్లాడారు. ‘మా కంటే వేరెవరికీ కశ్మీర్లో శాంతితో అవసరం లేదని ప్రధాని మోదీకి చెప్పదల్చుకున్నా. అయితే, మేం పెట్టే షరతులకు లోబడే శాంతి నెలకొనాలి తప్ప కేంద్రం విధించే ఆంక్షలకు లోబడి కాదు. మాక్కావాల్సింది గౌరవంతో కూడిన శాంతి ఒక్కటే. శ్మశాన నిశ్శబ్దంతో కూడిన శాంతి కాదు’ అని అన్నారు. ‘సత్యం మాతోనే ఉంది. నరేంద్ర మోదీ, అమిత్ షా.. ఎవరైనా కానీ మా గొంతు నొక్కలేరు. మేం యాచించడం లేదు. మనుషుల్లా చూడండని కోరుతున్నాం. ఆర్టికల్ 370 రద్దు, రాష్ట్రాన్ని కేంద్ర పాలిత ప్రాంతాలుగా విడగొడుతూ మోదీ ప్రభుత్వం 2019 ఆగస్ట్ 5న తీసుకున్న నిర్ణయాన్ని మేం ఒప్పుకోం. ఇంజనీర్ రషీద్ను తిహార్ జైలుకు పంపినా, మరెక్కడికి పంపినా విజయం మాదే’ అని చెప్పారు.ఇండియా కూటమికి మద్దతిస్తాం..అయితేజమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా కూటమికి తాము మద్దతిస్తామని రషీద్ చెప్పారు. అయితే, ఇండియా కూటమికేంద్రంలో అధికారంలోకి వస్తే రాజ్యాంగంలోని ఆర్టికల్ 370ను పునరుద్ధరిస్తామని ముందుగా హామీ ఇవ్వాలన్నారు. అలాంటి హామీ ఇస్తే మా కార్యకర్తలు ప్రతి ఒక్కరూ ఆ కూటమి అభ్యర్థులకే ఓటేస్తామని ప్రతిజ్ఞ చేస్తారన్నారు. భారత్ ప్రపంచ శక్తిగా ఎదగాలన్న కల నెరవేరాలంటే ముందుగా కశ్మీర్ అంశాన్ని పరిష్కరించాలని సూచించారు.‘మేం భారత్ శత్రువులం కాదు, అదే సమయంలో పాకిస్తాన్కు మిత్రులమూ కాదు’ అని వ్యాఖ్యానించారు. ‘ఆర్టికల్ 370ని సాధించుకోవాలనే వారు ఇళ్లలో కూర్చుని ప్రకటనలిస్తే చాలదు. లాల్చౌక్లో నిరసనలు చేపట్టి, లాఠీచార్జీలను ఎదుర్కొనేందుకు సిద్ధమవ్వాలి. నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ నేతలు ఆ పని చేయలేదు’ అని వ్యాఖ్యానించారు. -
పీఓకే ప్రజలారా.. భారత్లో కలవండి
జమ్మూ/బనిహాల్: జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం రామ్బాన్ నియోజకవర్గంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ ఎన్నికల ర్యాలీలో మాట్లాడారు. ‘‘ ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూకశ్మీర్లో భద్రతా పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఇక్కడి యువత పిస్టల్, రివాల్వర్ పట్టుకోవడం వదిలేసి ల్యాప్టాప్ పట్టుకుంటున్నారు. కంప్యూటర్లు వినియోగిస్తున్నారు. బీజేపీకి మద్దతు పలికితే తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసి ఇక్కడ మరింత అభివృద్ధిని సాకారం చేస్తాం. ఇక్కడి అభివృద్ధిని చూసి పాక్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే) ప్రజలు సైతం భారత్తో కలిసిపోతే బాగుంటుంది అని ఖచ్చితంగా అనుకుంటారు. నాదీ గ్యారెంటీ’’ అని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా పాక్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే) అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. పీఓకే ప్రజలను భారత్లో విలీనానికి పిలుపునిచ్చారు. ‘‘ పీఓకే ప్రజలకు నేను చెప్పేదొకటే. పాకిస్తాన్ మిమ్మల్ని విదేశీయుల్లా భావిస్తోంది. పాక్ ప్రభుత్వం స్వయంగా ఈ విషయం ఒప్పుకుందికూడా. ఇటీవల పాక్ అదనపు సొలిసిటర్ జనరల్ ఒక విషయంలో సమర్పించిన అఫిడవిట్లో పీఓకే అనేది ఎప్పటికీ పాక్కు విదేశీ భూభాగమే అని స్పష్టంగా పేర్కొన్నారు. మిమ్మల్ని భారత్ తన సొంత మనుషుల్లా చూసుకుంటుంది. అందుకే రండి. మాతో కలవండి’’ అని రాజ్నాథ్ పిలుపునిచ్చారు. ఉగ్రవాదం ఆపేస్తే చర్చలకు సిద్ధంజమ్మూకశ్మీర్లో పాక్ ఉగ్రవాదాన్ని ఎగదోయడం పూర్తిగా ఆపేస్తే ఆ దేశంతో చర్చలకు భారత్ సిద్ధమని రాజ్నాథ్ ప్రకటించారు. ‘‘ ఉగ్రవాదానికి మద్దతు పలకడం అనే చెడ్డపనిని పాక్ ఆపేయాలి. పొరుగు దేశాలతో సత్సంబంధాల మెరుగు కోసం ప్రతి దేశం ప్రయత్నిస్తుంది. ఎందుకంటే మనం మన మిత్రుడిని మార్చుకోగలంగానీ పొరుగు దేశాన్ని కాదుకదా. పాక్తో బంధం బలపడాలనే కోరుకుంటున్నాం. ముందుగా పాక్ ఉగ్రవాదాన్ని వీడాలి. ఉగ్రవాదాన్ని కశ్మీర్లో ఆపినప్పుడే చర్చలు పట్టాలెక్కుతాయి. ఇక్కడ ఉగ్రవాదం కోరల్లో చిక్కుకున్న వారిలో 85 శాతం మంది ముస్లింలే ఉన్నారు. ఉగ్రఘటనల్లో ముస్లింలే ఎక్కువగా ప్రాణాలు కోల్పోతున్నారు. అందుకే ఉగ్రవాదం బాటలో పయనించి ప్రాణాలు పోగొట్టుకోకండి’’ అని రాజ్నాథ్ హితవు పలికారు. -
అఫ్జల్ గురుకు పూల మాల వేయాలా?: రాజనాథ్ సింగ్
శ్రీనగర్: జమ్ము కశ్మీర్లో నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ ఉగ్రవాదుల పట్ల సానుభూతి చూపుతోందని కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ మండిపడ్డారు. జమ్ము కశ్మీర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ఆదివారం ఓ ర్యాలీలో పాల్గొని మాట్లాడారు.‘నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ ఉగ్రవాదుల పట్ల సానూభూతి ప్రదర్శిస్తోంది. ఇటీవల పార్టీకి చెందిన నేత ఒమర్ అబ్దుల్లా పార్లమెంట్ మీద దాడి చేసిన దోషి అఫ్జల్ గురుకు మరణశిక్ష విధించటం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదన్నారు. నేను ఒమర్ అబ్దులా అడుగుతున్నా.. అఫ్జల్ గురుకు ఉరిశిక్ష బదులుగా పూలమాల వేయమంటారా?. ఆ పార్టీ జమ్ము కశ్మీర్కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్న పునరుద్ధరిస్తామని చెబుతోంది. ...కానీ, గత ఐదేళ్లలో రాష్ట్రంలో 40వేల ఉద్యోగాలు కల్పించాం. జమ్ము కశ్మీర్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడితే.. పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)లోని ప్రజలు భారత్లో భాగం కోరుకునే స్థాయిలో మేము కశ్మీర్ను అభివృద్ధి చేస్తాం. పీవోకేలోని ప్రజలను పాకిస్తాన్ విదేశీలుగా చూస్తే.. భారత్ తమ సొంతవారిగా చూస్తుంది’ అని అన్నారు. ఇక.. జమ్ము కశ్మీర్లో సెప్టెంబర్18, సెప్టెంబర్ 25, అక్టోబర్ 1 తేదీల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనుండగా, అక్టోబర్ 4న ఫలితాలు వెలువడనున్నాయి. జమ్ము కశ్మీర్లో 90 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.చదవండి: అఫ్జల్ గురు ఉరిశిక్ష వల్ల ప్రయోజనం లేదు: ఒమర్ అబ్దుల్లా -
అఫ్జల్ గురు ఉరిశిక్ష వల్ల ప్రయోజనం లేదు: ఒమర్ అబ్దుల్లా
శ్రీనగర్: జమ్ము కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల వేళ నేషనల్ కాన్ఫరెన్స్ నేత, మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా కీలక వ్యాఖ్యలు చేశారు. 2001లో పార్లమెంట్పై దాడికి పాల్పడిన ఘటనలోని దోషి అఫ్జల్గురుకు మరణశిక్ష విధించటంలో ఎటువంటి ప్రయాజనం లేదని అన్నారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు.‘అఫ్జల్ గురుకు ఉరిశిక్ష విధించటంపై జమ్ము కశ్మీర్ ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు. రాష్ట్ర ప్రభుత్వ అనుమతితో శిక్ష విధించాల్సి ఉండేది. అఫ్జల్ గురుకు ఉరిశిక్ష వేయటంపై వల్ల ఎలాంటి ప్రయోజనం చేకూరులేదని నమ్ముతున్నా. ఉరిశిక్ష విధించడాన్ని నేను వ్యతిరేకిస్తాను. ఎందుకంటే కోర్టులు సైతం వందశాతం సరైన తీర్పులు వెల్లడిస్తాయని భావించలేము. మాకు సాక్ష్యాలను పదేపదే చూపించారు. ఇలా ఉరి శిక్ష విధించటాన్ని మాత్రం ఇతర దేశాలు సమర్థించలేదు’ అని అన్నారు. అసెంబ్లీ ఎన్నికలవేళ ఒమర్ అబ్దుల్లా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఒమర్ అబ్దుల్లా అసెంబ్లీ ఎన్నికల్లో గందర్బాల్, బుద్గామ్ రెండు నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నారు. ఈ రెండు స్థానాలలోను విజయం సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. జమ్ము కశ్మీర్లో సెప్టెంబర్18, సెప్టెంబర్ 25, అక్టోబర్ 1 తేదీల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనుండగా, అక్టోబర్ 4న ఫలితాలు వెలువడనున్నాయి. జమ్ము కశ్మీర్లో 90 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.డిసెంబర్13, 2001న పార్లమెంట్పై దాడి చేసిన అఫ్జల్ గురుకు మరణశిక్ష విధించాలంటూ సెప్టెంబర్ 26, 2006న సుప్రీం కోర్టు తీర్పు వెల్లడించింది. అనంతరం రాష్ట్రపతి క్షమాభిక్షకు ప్రయత్నించినప్పటికీ అప్పటి భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అఫ్జల్ గురు కుటుంబం అభ్యర్థనను తిరస్కరించారు.దీంతో ఫిబ్రవరి 9, 2013న ఢిల్లీలోని తిహార్ జైలులో అఫ్జల్ గురుకి మరణశిక్ష అమలుచేశారు. -
ఢిల్లీ నేతలకు నేనంటే ద్వేషం : ఒమర్
శ్రీనగర్: జమ్మూకశీ్మర్లో ఎన్నికల వేళ బీజేపీ అగ్రనాయకత్వంపై నేషనల్ కాన్ఫెరెన్స్ పార్టీ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా పరోక్ష విమర్శలు చేశారు. శుక్రవారం గాందర్బల్ అసెంబ్లీ స్థానంలో ఎన్నికల ప్రచారంలో ఒమర్ మాట్లాడారు. ‘‘ ఢిల్లీలో ఉన్న నేతలకు నేనంటే ద్వేషం. ఎన్నికల్లో ఓడించి నా నోరు మూయించాలని చూస్తున్నారు. పని గట్టుకుని స్వతంత్య అభ్యర్థులను నాపై పోటీకి నిలుపుతున్నారు. నన్ను ఓడించి చట్టసభల్లో నా గొంతు వినపడకుండా చేయాలని కుట్ర పన్నారు. ఢిల్లీ నేతలపై నేను పోరాడుతున్నది నా కోసమో, నా కుటుంబం కోసమో కాదు. జమ్మూకశ్మీర్ పౌరుల కోసం. నేనేం మాట్లాడిన ప్రజల గొంతుక వినిపిస్తా’’ అని ఒమర్ అన్నారు. -
పార్టీల ‘పహాడీ’ రాజకీయాలు
జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను తేల్చడంలో ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాల వారి ఓట్లే కీలకంగా మారే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. జమ్మూ కశ్మీర్లో ప్రబల శక్తిగా ఎదిగేందుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నాల ఫలితంగా స్థానిక రాజకీయాల్లో ఎస్సీ, ఎస్టీ అసెంబ్లీ స్థానాలదే మున్ముందు కీలక పాత్రగా మారవచ్చని అంటున్నారు. జమ్మూ కశ్మీర్లో దశాబ్ద కాలం అనంతరం అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. సెప్టెంబర్ 18, 25, అక్టోబర్ ఒకటో తేదీల్లో మూడు విడతల్లో పోలింగ్ జరగనుంది. జమ్మూ కశ్మీర్కు రాష్ట్ర హోదాను, ఆ ప్రాంతానికి ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్ 370ను రద్దు చేశాక జరుగుతున్న తొలి ఎన్నికలివి. దాంతో ఫలితాలపై అందరి దృష్టి నెలకొని ఉంది. ఈ పదేళ్లలో స్థానిక రాజకీయ ముఖచిత్రం సమూలంగా మారిపోయిందనే చెప్పాలి. కాంగ్రెస్ మాజీ దిగ్గజం గులాం నబీ ఆజాద్ డీపీఏపీతో పాటు పీపుల్స్ కాన్ఫరెన్స్, అప్నీ పార్టీ వంటి నయా రాజకీయ పక్షాలు పుట్టుకొచ్చాయి. 2022లో చేపట్టిన నియోజకవర్గాల పునర్ వ్యవస్థీకరణ ద్వారా అసెంబ్లీ స్థానాల సంఖ్య 87 నుంచి 90కి పెరిగింది. ఇదేమీ పెద్ద పెరుగుదలగా కనిపించకపోయినా, ముస్లిం మెజారిటీ కశ్మీర్తో పోలిస్తే హిందూ ప్రాబల్య జమ్మూ ప్రాంతంలో ఎక్కువ సీట్లు పెరిగేలా మోదీ సర్కారు జాగ్రత్త పడింది.మొత్తం 90 అసెంబ్లీ స్థానాల్లో 9 ఎస్సీలకు, 7 ఎస్టీలకు రిజర్వ్ చేశారు. దాంతో జమ్మూ కశ్మీర్ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే గుజ్జర్లు, పహాడీ తదితర సామాజిక వర్గాల ప్రాధాన్యం మరింత పెరిగింది. గత ఫిబ్రవరిలో దాదాపు 16 లక్షల మంది పహాడీ జాతులను కొత్తగా ఎస్టీ జాబితాలో చేరుస్తూ మోదీ సర్కారు వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంది. ఇది అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ లబ్ధి కోసం చేపట్టిన ఫక్తు రాజకీయ చర్య అని విపక్షాలు అప్పుడే విమర్శించాయి. ఎందుకంటే సంచార పశు పోషక జాతులైన గుజ్జర్లూ, బాకర్వాల్లు సాంప్రదాయికంగా కాంగ్రెస్ మద్దతుదారులు. వారిని తనకేసి తిప్పుకోవడం సులువు కాదన్నది బీజేపీ భావన. అందుకే ఉరీ, కర్నాహ్, బారాముల్లా వంటి ప్రాంతాల్లో సంఖ్యాధికులైన పహాడీల ఓట్లపై పార్టీ కొంతకాలంగా కన్నేసింది. వీరు నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ), పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ (పీడీపీ) వంటి స్థానిక పక్షాలను బలపరుస్తుంటారు. ఎస్టీ జాబితాలో చేరిన కారణంగా వాళ్లకిప్పుడు బుధాన్, సూరజ్ కోటే, రాజౌరీ వంటి ఎస్టీ రిజర్వుడు అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసే అవకాశం కలిగింది. ఇది వారి ఓట్లను తమవైపు మళ్లిస్తుందని బీజేపీ ఆశ పడుతోంది. పహాడీలతో పాటు వాల్మీకి తెగవారిని తమవైపు తిప్పుకునేందుకు బీజేపీ శాయశక్తులా ప్రయత్నిస్తోంది. వాల్మీకులకు తాజాగా ఎస్టీ హోదా కల్పించారు. ప్రతి ఓటూ కీలకమే అయిన జమ్మూ కశ్మీర్లో ఏ అవకాశాన్నీ వదలరాదని బీజేపీ పట్టుదలగా ఉంది. 9 ఎస్టీ స్థానాల్లో ఐదు పీర్ పంజల్ బెల్ట్లోని రాజౌరీ – పూంచ్ ప్రాంతంలోనే ఉన్నాయి. ఇవన్నీ తన ఖాతాలోనే పడతాయని అంచనా వేస్తోంది.గుర్రుగా గుజ్జర్లుపహాడీ, వాల్మీకి జాతులకు ఎస్టీ హోదా ఇవ్వడంతో గుజ్జర్లలో ఆగ్రహజ్వాలలు ఎగసిపడుతున్నాయి. 15.6 లక్షలకు పైగా ఉన్న వీరు ఇప్పటిదాకా జమ్మూ కశ్మీర్లో 10 శాతం ఎస్టీ రిజర్వేషన్లకు పూర్తి హక్కుదారులు. వాటినిప్పుడు పçహాడీ, వాల్మీకులతో పంచుకోవాల్సి వస్తుండటంపై వారిలో ఆగ్రహం వ్యక్తమవుతోంది. అలాగని ఈ వర్గాలు నమ్ముకున్న కాంగ్రెస్ కూడా 16 లక్షల జనాభా ఉన్న పçహాడీ, వాల్మీకులను కాదని వీరికి మద్దతుగా పూర్తిస్థాయిలో గళం విప్పే పరిస్థితుల్లో లేదు. మారిన రిజర్వేషన్ల అనంతరం జమ్మూకశ్మీర్ రాజకీయాలపై ఎస్సీ, ఎస్టీల ప్రభావం ఏ మేరకు ఉంటుందనేది అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో తేటతెల్లం కానుంది.– సాక్షి, నేషనల్ డెస్క్ -
మోదీ ప్రజలకు భయపడుతున్నారు: రాహుల్ గాంధీ
శ్రీనగర్: ప్రతిపక్షాల‘ఇండియా కూటమి’ ప్రధాని నరేంద్ర మోదీని మానసికంగా ఓడించిందని కాంగ్రెస్ ఎంపీ, లోక్సభలో విపక్షనేత రాహుల్ గాంధీ అన్నారు. లోక్సభ ఎన్నికల్లో ఇండియా కూటమి ఇచ్చిన మెరుగైన ప్రదర్శనతో మోదీ విశ్వాసం కోల్పోయారని అన్నారు. బుధవారం రాహుల్ గాంధీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా జమ్ము కశ్మీర్లో ఓ ర్యాలీలో పాల్గొని మాట్లాడారు.‘‘ప్రధాని మోదీ బహిరంగంగా తనను దేవుడు గొప్ప ఉద్దేశమే కోసం భూమిపైకి పంపించాడని, తాను ఒక దైవాంశ సంభూతుడిగా చెప్పుకున్నారు. మిగతా భారతీయులంతా తనలా కాదని అన్నారు. ఈ ఎన్నికల సందర్భంగా మాత్రం తాను ప్రజలతో మాట్లాడుతానని, వారి ఇష్టానుసారం నడుచుకుంటానని అన్నారు. గతంలో మోదీ దేశవ్యాప్త కులగణన సాధ్యం కాదన్నారు. కానీ, ప్రతిపక్షాల డిమాండ్లో వెనక్కి తగ్గారు. ప్రస్తుతం ఆర్ఎస్ఎస్ కూడా తన మాట మార్చుకుంది. పార్లమెంట్లో మోదీ ముందు నేను కూర్చోవటంతో ఆయనలో ఉన్న విశ్వాసం మొత్తం పోయింది. ప్రతిపక్షాల ఇండియా కూటమి బీజేపీ వ్యతిరేకంగా సమిష్టిగా పోరాటం చేసింది. ఇటీవల మోదీ ప్రభుత్వం తీసుకువస్తున్న నిర్ణయాలను ప్రతిపక్షాలు వ్యతిరేకించాయి. దీంతో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం దాని విధానాలను మార్చుకుంది. దేశంలోని ప్రజలను చూసి నరేంద్ర మోదీ భయపడుతున్నారు. మోదీ, బీజేపీని అధికారం నుంచి దింపేందుకు ఇంకా కొద్ది సమయం మాత్రమే మిగిలి ఉంది. మేము అందరినీ సోదరభావంతో సమానంగా చూస్తాం. అన్ని జాతులు, కులాలు, రైతులు, కార్మికులు, చిరు వ్యాపారులు అందరినీ గౌరవిస్తాం. జమ్ము కశ్మీర్లో కూడా అందరూ సమానంగా గౌరవం పొందాలని మేము కోరుకుంటున్నాం’’ అని అన్నారు.ఇక.. నేషనల్ కాన్ఫరెన్స్ 51 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ 32 స్థానాల్లో పోటీ చేయనున్నాయి. జమ్ము కశ్మీర్లో సెప్టెంబర్18, సెప్టెంబర్ 25, అక్టోబర్ 1 తేదీల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనుండగా, అక్టోబర్ 4న ఫలితాలు వెలువడనున్నాయి. జమ్ము కశ్మీర్లో 90 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. -
జమ్ము కశ్మీర్ ఎన్నికలు.. కాంగ్రెస్ అభ్యర్థుల రెండో జాబితా
ఢిల్లీ: జమ్ము కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థుల రెండో జాబితాను విడుదల చేసింది. ఈ మేరకు సోమవారం ప్రకటనలో తెలిపింది. సెంట్రల్ శాల్టెంగ్ స్థానం నుంచి జమ్ము కశ్మీర్ పీసీసీ చీఫ్ తారిక్ హమీద్ కర్రాను బరిలోకి దించింది కాంగ్రెస్. అదేవిధంగా రియాసీ-ముంతాజ్ ఖాన్, శ్రీ మాతా వైష్ణోదేవీ- భూపేందర్ జమ్వాల్, రాజౌరీ (ఎస్టీ)- ఇఫ్తికార్ అహ్మద్, ఠాణామండీ (ఎస్టీ)- షాబీర్ అహ్మద్ ఖాన్, సురాన్కోట్ (ఎస్టీ)- మొహమ్మద్ షానవాస్ ఛౌదరీ పోటీ చేస్తారని తెలిపింది. Congress releases a list of 6 candidates for the upcoming Assembly elections in J&K. pic.twitter.com/mx8NdsRdgk— ANI (@ANI) September 2, 2024 ఇక ఇప్పటి వరకు కాంగ్రెస్ మొత్తం 15 మంది అభ్యర్థులను ప్రకటించింది. నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ పార్టీలో కూటమిగా పోటీ చేస్తున్నాయి. ఇప్పటికే ఇరుపార్టీల మధ్య సీట్ల పంపకం కూడా ఖరారు అయింది. నేషనల్ కాన్ఫరెన్స్ 51 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ 32 స్థానాల్లో పోటీ చేయనున్నాయి. జమ్ము కశ్మీర్లో సెప్టెంబర్18, సెప్టెంబర్ 25, అక్టోబర్ 1 తేదీల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనుండగా, అక్టోబర్ 4న ఫలితాలు వెలువడనున్నాయి. జమ్ము కశ్మీర్లో 90 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. -
మెహబూబా వారసురాలు...కంచుకోటను నిలబెట్టేనా?
కశ్మీర్లో పీపుల్స్ డెమొక్రాటిక్ పార్టీ (పీడీపీ)కి కంచుకోటగా పేరుపడ్డ శ్రీగుఫ్వారా–బిజ్బెహరా నియోకజవర్గంపై ఇప్పుడందరి దృష్టి కేంద్రీకృతమైంది. జమ్మూకశ్మీర్ అసెంబ్లీకి తొలిదశలో.. సెప్టెంబరు 18న పోలింగ్ జరగనున్న 24 నియోజకవర్గాల్లో బిజ్బెహరా ఒకటి. పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ ఈసారి పోటీకి దూరంగా ఉండటంతో బిజ్బెహరా నుంచి ఆమె కూతురు ఇల్తిజా బరిలోకి దిగారు. దక్షిణ కశ్మీర్లోని అనంత్నాగ్ జిల్లాలో ఉన్న ఈ నియోజకవర్గంలో కేవలం ముగ్గురే పోటీపడుతున్నారు. మాజీ ఎమ్మెల్సీలు బషీర్ అహ్మద్ షా (నేషనల్ కాన్ఫరెన్స్), సోఫీ మొహమ్మద్ యూసుఫ్ (బీజేపీ)లతో రాజకీయాలకు కొత్తయిన ఇల్తిజా తలపడుతున్నారు. 37 ఏళ్ల ఇల్తిజా విజయం సాధిస్తే.. 1996 నుంచి పీడీపీకి కంచుకోటగా బిజ్బెహరాపై పీడీపీ, ముఫ్తీ కుటుంబం పట్టు మరింత పెరుగుతుంది. మాజీ సీఎం, పీడీపీ వ్యవస్థాపకుడు ముఫ్తీ మొహమ్మద్ సయీద్ తన సుదీర్ఘ రాజకీయ ఇన్నింగ్స్కు బిజ్బెహరా నుంచే శ్రీకారం చుట్టారు. 1962లో గులామ్ సాధిక్ నేతృత్వంలోని నేషనల్ కాన్ఫరెన్స్ చీలికవర్గం నుంచి 1962లో బిజ్బెహరా ఎమ్మెల్యేగా సయీద్ విజయం సాధించారు. ఇల్తిజా తల్లి మెహబూబా ముఫ్తీ కూడా బిజ్బెహరా నుంచే రాజకీయ అరంగేట్రం చేశారు. కాంగ్రెస్ పార్టీ టికెట్పై గెలిచారు. తండ్రి ముఫ్తీ మొహమ్మద్ సయీద్ కాంగ్రెస్ను వీడి పీడీపీని స్థాపించడంతో మెహబూబా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. సీనియర్ ముఫ్తీకి నమ్మకస్తుడైన అబ్దుల్ రెహమాన్ భట్ బిజ్బెహరా నుంచి వరుసగా నాలుగుసార్లు గెలిచారు. చివరిసారిగా జమ్మూకశ్మీర్కు 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ భట్ బిజ్బెహరాలో నెగ్గారు. ఈసారి సీనియర్ నాయకుడైన భట్పై నమ్మకంతో ఆయనకు షాంగుస్– అనంత్నాగ్ పశి్చమ సీటును పీడీపీ కేటాయించింది.ఎన్సీ ప్రత్యేక దృష్టి పీడీపీ కోటను బద్ధలు కొట్టాలని నేషనల్ కాన్ఫరెన్స్ పట్టుదలగా ఉంది. ఎన్సీ అభ్యర్థి బషీర్ అహ్మద్ షా తండ్రి అబ్దుల్గనీ షా 1977–1990 దాకా బిజ్బెహరాకు ప్రాతినిధ్యం వహించారు. పలుమార్లు ఓటమి పాలైనా ఎన్సీ ఇక్కడ బషీర్నే నమ్ముకుంటోంది. 2009–1014 మధ్య కాంగ్రెస్తో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని నడిపినపుడు బషీర్ను ఎమ్మెల్సీని చేసింది. పీడీపీ– ఎన్సీ మధ్య సంకుల సమరంలో ఓట్లు చీలి తాము లాభపడతామని బీజేపీ అభ్యర్థి యూసుఫ్ భావిస్తున్నారు. బీజేపీలో చేరడం నిషిద్ధంగా పరిగణించే కాలంలో కమలదళం తీర్థం పుచ్చుకున్న యూసుఫ్ను పీడీపీ–బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడినపుడు ఎమ్మెల్సీని చేశారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
జమ్ముపై బీజేపీ.. కాశ్మీర్ పై కాంగ్రెస్ గెలుపెవరిది..?
-
తూచ్ పదహారే..!
సాక్షి, న్యూఢిల్లీ: జమ్మూకశీ్మర్ అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల ప్రకటన బీజేపీలో తీవ్ర అసంతృప్తికి దారితీసింది. తొలుత అధిష్టానం 44 మందితో జాబితా విడుదల చేసింది. ఆ జాబితాపై జమ్మూలో కమలం శ్రేణులు భగ్గుమన్నాయి. ఇతర పారీ్టల నుంచి వచి్చన వారికే టిక్కెట్లు ఇచ్చారంటూ పార్టీ కార్యాయంలో ఆందోళనకు దిగారు. వారికి సమాధానం చెప్పలేక పార్టీ అధ్యక్షుడు తన కార్యాలయంలోకి వెళ్లి తలుపులు వేసుకోవాల్సి వచి్చంది. చివరికి ఆ జాబితాను రద్దు చేసి..16 మంది పేర్లతో మరో జాబితాను వెలువరించింది. రగడ రాజుకుందిలా..! పదేళ్ల తర్వాత జమ్మూకశీ్మర్ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుండటం తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం బీజేపీ అధిష్టానం మొత్తం మూడు జాబితాలు విడుదల చేసింది. మూడు దశలకు కలిపి మొత్తం 44 మంది పేర్లను ప్రకటించింది. ఈ ప్రకటన వెలువడగానే జమ్మూలోని పార్టీ కార్యాలయంలో బీజేపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. పార్టీ కోసం జెండాలు మోసిన వారిని కాదని, ఇతర పారీ్టల నుంచి వచి్చన ‘పారాచూట్’లకు టికెట్లు ఇచ్చారంటూ ఆందోళకు దిగారు. 18 ఏళ్లుగా పార్టీ కోసం పనిచేస్తున్న తనను పక్కనబెట్టి, ఇటీవలే పారీ్టలోకి వచి్చన ఓ వ్యక్తికి టికెట్ ఇవ్వడమేంటని బీజేపీ ఎస్సీ మోర్చా అధ్యక్షుడు జగదీశ్ భగత్ నిలదీశారు. అసంతృప్తులకు సమధానం చెప్పుకోలేక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రవీంద్ర రైనా తన క్యాబిన్లోకి వెళ్లి తలుపులు వేసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. సెపె్టంబర్ 18న జరగనున్న తొలి దశ ఓటింగ్పై మాత్రమే దృష్టి సారించామని, ప్రతి కార్యకర్తతో తాను వ్యక్తిగతంగా మాట్లాడుతానని వివరించారు. తామంతా ఒక కుటుంబమని చెప్పారు.వెనక్కి తగ్గిన అధిష్టానం కార్యకర్తల ఆందోళన విషయంపై ఆదివారం సాయంత్రం పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశమై ఈ విషయం చర్చించింది. తొలుత విడుదల చేసిన 44 మంది పేర్లను పార్టీ అధికారిక వాట్సాప్ గ్రూప్ల నుంచి తొలగించింది. రెండు గంటల తర్వాత తొలి దశలో పోటీ చేయనున్న 15 మంది అభ్యర్థులను ప్రకటించింది. ఆ తర్వాత కొంకర్నాగ్ నుంచి చౌదరి రోషన్ హుస్సేన్ ఒకే ఒక్క పేరుతో మరో జాబితా విడుదల చేసింది. ఇందులో ముగ్గురు మాజీ ఎమ్మెల్యేలతోపాటు మహిళా అభ్యర్థి షగున్ పరిహార్ పేరుంది. పరిహార్ సోదరులు బీజేపీలో కొనసాగుతున్నారు. షగున్ తండ్రి అజిత్ పరిహార్, అజిత్ సోదరుడు అనిల్ పరిహార్లను 2018లో ఉగ్రవాదులు పొట్టనబెట్టుకున్నారు. తొలిదశ పోలింగ్ కోసం నామినేషన్లకు ఈనెల 27 ఆఖరు తేదీ. కశీ్మర్లోని 90 అసెంబ్లీ స్థానాలకు సెపె్టంబర్ 18, 25, అక్టోబర్ 1వ తేదీల్లో మూడు దశల్లో పోలింగ్ జరగనుంది. ఫలితాలు అక్టోబర్ 4న వెలువడనుండటం తెలిసిందే. -
ఢిల్లీ నుంచి పాలించాలనుకోవడం అవివేకం
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్కు రాష్ట్ర హోదాను పునరుద్ధరించాలనే డిమాండ్ను రాహుల్ గాంధీ పునరుద్ఘాటించారు. ఢిల్లీ నుంచి జమ్మూకశ్మీర్ను పాలించాలనుకోవడం అవివేకమన్నారు. గత వారం ఆ రాష్ట్ర పర్యటన సందర్భంగా విద్యార్థినులతో రాహుల్ గాంధీ ముఖాముఖి మాట్లాడారు. ఆ వీడియోను కాంగ్రెస్ పార్టీ సోమవారం విడుదల చేసింది. ఈ వీడియోలో రాహుల్ గాంధీ జమ్ముకశ్మీర్లో జరగబోయే ఎన్నికల గురించి మాట్లాడుతూ, ఒక రాష్ట్రం నుంచి రాష్ట్ర హోదాను తొలగించడం భారత చరిత్రలో ఇదే మొదటిసారన్నారు. అది చేసిన విధానం తమకు నచ్చలేదని, రాష్ట్ర హోదాను తిరిగి పొందడం, అందులో జమ్మూకశ్మీర్, లద్దాఖ్ ప్రజలకు ప్రాతినిధ్యం ఉండటం తమ ప్రధాన లక్ష్యమని రాహుల్ తెలిపారు. ఢిల్లీ నుంచి కశ్మీర్ను, జమ్మూను నడపాలనుకోవడంలో అర్థం లేదని ఆయన కొట్టిపారేశారు. ‘‘ప్రధాని నరేంద్ర మోదీ ఎవరి మాటా వినరు. మొదటి నుంచి తాము చెప్పింది కరెక్ట్ అనుకుంటారు. అదే అసలు సమస్య. తనది తప్పని చూపించినా ఒప్పుకోరు. అలాంటి వ్యక్తులు నిత్యం ఏదో ఒక సమస్యను సృష్టిస్తారు. తాము చెప్పిందే కరెక్ట్ అనుకోవడం బలం కాదు.. బలహీనత. ఆత్మన్యూనత నుంచే ఇలాంటివి వస్తాయి’’అని రాహుల్ విద్యార్థులతో వ్యాఖ్యానించారు. మళ్లీ.. పెళ్లి మాట.. నవ్వులు ఇక రాహుల్గాంధీ నిత్యం ఎదుర్కొనే అత్యంత పెద్ద ప్రశ్నను విద్యార్థినుల నుంచి మరోసారి ఎదుర్కొన్నారు. సంభాషణలో భాగంగా పెళ్లి చేసుకోవాలనే ఒత్తిడి గురించి విద్యార్థినులను ఆయన అడగ్గా.. వెంటనే వారు రాహుల్ను అదే ప్రశ్న అడిగారు. అయితే తాను 20, 30 సంవత్సరాల నుంచి ఎదుర్కొంటున్నా ఆ ఒత్తిడిని అధిగమించానని చె ప్పారు. పెళ్లి చేసుకుంటారా? అని మరో విద్యార్థిని అడగ్గా.. ‘ఇప్పటికైతే ఆలోచన చేయలేదు.. భవిష్యత్లో చెప్పలేను’అని సమాధానమిచ్చారు. చేసుకుంటే మాత్రం మమ్మల్ని ఆహ్వానించండంటూ విద్యార్థినులంతా ఒకేసారి కోరారు. ‘తప్పకుండా’అని చెప్పడంతో విద్యార్థినుల నవ్వులతో ప్రాంతమంతా సందడిగా మారిపోయింది. యూట్యూబ్ ఛానల్లో వీడియో... ఇదే వీడియోను రాహుల్గాంధీ తన వ్యక్తిగత యూట్యూబ్ చానల్లోనూ పోస్టు చేశారు. వివిధ కళాశాలల్లో లా, ఫిజిక్స్, జర్నలిజం, పొలిటికల్ సైన్స్ వంటి సబ్జెక్టులను చదువుతున్న విద్యార్థుల సమస్యలను, ఆకాంక్షలను తాను లోతుగా అర్థం చేసుకున్నానని రాహుల్ ఆ పోస్టులో పేర్కొన్నారు. కోల్కతా ఘటన నేపథ్యంలో మహిళలపై వేధింపుల గురించి కూడా విద్యార్థినులతో మాట్లాడానని, ఇటువంటి ఘటనలు వ్యవస్థాగత సమస్యలను ఎలా ప్రతిబింబిస్తాయి, ప్రాంతాలకతీతంగా మహిళల భద్రత, గౌరవాన్ని ఎలా ప్రభావితం చేస్తాయని విద్యార్థులు తమ ఆందోళనలను పంచుకున్నారని వెల్లడించారు. కశ్మీర్ మహిళలకు గొప్ప శక్తి, నిలదొక్కుకునే ధైర్యం, వివేకం ఉన్నాయని, ఒక్కసారి వారికి అవకాశం ఇస్తే అద్భుతాలు చేసి చూపుతారని కొనియాడారు. వారికి గౌరవం, భద్రతతోపాటు సమాన అవకాశాలు ఇవ్వాల్సిన అవసరం ఉందని రాహుల్ నొక్కి చెప్పారు. -
మోదీ సారథ్యంలో కశ్మీర్లో బీజేపీ ప్రచారం
జమ్మూ: జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనే స్టార్ క్యాంపెయినర్ల జాబితాను బీజేపీ సోమవారం విడుదల చేసింది. ప్రధాని మోదీ సారథ్యంలో చేపట్టే మొదటి విడత ఎన్నికల ప్రచారంలో హోం మంత్రి అమిత్ షా, రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, యూపీ సీఎం యోగి తదితర 40 మంది కీలక నేతలు పాల్గొననున్నారు. ఈ జాబితాను ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ప్రధాన కార్యాలయం ఇన్చార్జి అరుణ్ సింగ్ ఎన్నికల కమిషన్కు అందజేశారు. నిర్ణీత గడువులోగా సవరించిన మరో జాబితా అందజేస్తే తప్ప, మూడు దశలకు కూడా స్టార్ క్యాంపెయినర్ల జాబితా ఇదే ఉంటుందని ఆయన ఈసీకి వివరించారు. జమ్మూకశ్మీర్లో సెప్టెంబర్ 18, 25వ తేదీలతోపాటు నవంబర్ ఒకటో తేదీన మూడు విడతలుగా ఎన్నికలు జరుగనుండటం తెలిసిందే. -
జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా
-
జమ్ము కశ్మీర్ ఎన్నికలు.. బీజేపీ అభ్యర్థుల జాబితా విడుదల
శ్రీనగర్: జమ్ము కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ మొదటి అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. సోమవారం ఈ మేరకు ఓ ప్రకటనలో పేర్కొంది. మొదట తొలి జాబితాలో భాగంగా మొత్తం 44 మంది అభ్యర్థుల పేర్లను బీజేపీ ప్రకటించింది. అనంతరం కొంత సమయం తర్వాత ఆ జాబితాను బీజేపీ ఉపసంహరించుకుంది. మళ్లీ తిరిగి కేవలం 15 మంది అభ్యర్థుల పేర్లతో మరో జాబితాను విడుదల చేసింది.BJP releases amended list of 15 candidates for upcoming J&K Assembly elections pic.twitter.com/yUzU6lYrTB— ANI (@ANI) August 26, 2024 జమ్ము కశ్మీర్లో సెప్టెంబర్18, సెప్టెంబర్ 25, అక్టోబర్ 1 తేదీల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనుండగా, అక్టోబర్ 4న ఫలితాలు వెలువడనున్నాయి. జమ్ము కశ్మీర్లో 90 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.BJP withdraws first list of 44 candidates released for upcoming J&K Assembly Elections; BJP to amend and release the list of candidates again pic.twitter.com/X9tqVoZ9Zv— ANI (@ANI) August 26, 2024 -
Jammu Kashmir: ఉగ్రవాదులను తరిమికొడుతున్న గ్రామీణులు
జమ్ముకశ్మీర్లో ఇటీవలి కాలంలో తరచూ ఉగ్రదాడులు చోటుచేసుకుంటున్నాయి. ఈ నేపధ్యంలో అటు భద్రతా బలగాలు, ఇటు పోలీసులు అప్రమత్తమయ్యారు. తాజాగా వివిధ గ్రామాలకు చెందిన ప్రజలు కూడా ఉగ్రవాదులను తరిమికొట్టే పనిలో పడ్డారు.జమ్ముకశ్మీర్లోని మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో ఉగ్రవాదులతో పోరాడేందుకు విలేజ్ సెక్యూరిటీ గ్రూప్ (వీడీజీ) సభ్యులు రంగంలోకి దిగారు. ఉగ్రవాదులకు బుద్ధి చెప్పేందుకు సామాన్య ప్రజలకు కూడా పోలీసులు ఆధునిక ఆయుధాలు అందజేస్తున్నారు. గ్రామస్తులను పోలీస్ స్టేషన్కు పిలిచి ఎస్ఎల్ఆర్ (సెల్ఫ్ లోడింగ్ రైఫిల్)లను పోలీసులు ఇస్తున్నారు. మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో ఉగ్రవాదులు దాడికి ప్రయత్నించినపక్షంలో వారికి గ్రామస్తులు ధీటుగా సమాధానం ఇస్తున్నారు. గత కొన్ని రోజులుగా వీడీజీ సభ్యులతో పాటు మైనార్టీ వర్గాలకు చెందిన వారిని ఆయా ప్రాంతాల్లోని పోలీస్ స్టేషన్లకు పిలిపించి వారికి ఎస్ఎల్ఆర్ రైఫిళ్లను అందజేస్తున్నారు.ఉగ్రవాదులతో ధైర్యంగా పోరాడేందుకు మానసికంగా సిద్ధమయ్యేలా గ్రామస్తుల్లో ధైర్యం, మనోధైర్యాన్ని వీడీజీ సభ్యులు పెంచుతున్నారు. ఈ సందర్భంగా ధార్ సక్రికి చెందిన చైన్ సింగ్, జస్వంత్ సింగ్, గబ్బర్, రొమేష్ కుమార్, విజయ్ కుమార్ తదితరులు మాట్లాడుతూ ఉగ్రవాదులు తమ గ్రామాల్లోని పలువురిని చంపేశారన్నారు. ఆ తర్వాత గ్రామ భద్రతా కమిటీలు తమకు త్రీ నాట్ త్రీ రైఫిల్స్ అందజేశాయన్నారు. -
కశ్మీర్ ఎన్నికల కోసం బీజేపీ బిగ్ ప్లాన్
ఢిల్లీ: జమ్ము కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ బిగ్ స్కెచ్ గీసింది. ఈ క్రమంలో మాజీ ప్రధాన కార్యదర్శి రామ్మాధవ్ను మళ్లీ తెర మీదకు తెచ్చింది. ఆయన్ని జమ్ము కశ్మీర్ ఎన్నికల ఇన్చార్జీగా నియమిస్తూ అధికారిక ప్రకటన చేసింది. 2014 ఎన్నికల్లో జమ్ము కశ్మీర్లో బీజేపీని అధికారంలోకి(సంకీర్ణం) తీసుకురావడంలో రామ్ మాధవ్ కీలక పాత్ర పోషించారు. రామ్ మాధవ్ దాదాపు ఆరేడు సంవత్సరాల పాటు బీజేపీకి జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ప్రస్తుతం ఆయన ఆర్ఎస్ఎస్ జాతీయ కార్యవర్గ సభ్యుడిగా ఉన్నారు. అయితే.. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎలాగైనా అధికారంలోకి రావాలనే లక్ష్యంతో అక్కడి రాజకీయాలపై అనుభం ఉన్న రామ్మాధవ్ను బీజేపీ మళ్లీ రంగంలోకి దించింది. ఇదిలా ఉంటే.. తెలుగు రాష్ట్రంకు చెందిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు ఎన్నికల ఇన్చార్జీగా రామ్మాధవ్ బాధ్యతలు నిర్వహించనున్నారు. ఎన్నికల ఇన్చార్జీగా రామ్మాధవ్ కీయాశీలక రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వటం బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతున్నట్లు తెలుస్తోంది. -
జమ్ముకశ్మీర్లో ఎన్సీ- కాంగ్రెస్ పొత్తు?
జమ్ముకశ్మీర్లో త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో తలపడేందుకు నేషనల్ కాన్ఫరెన్స్-కాంగ్రెస్లు పొత్తు కుదుర్చుకోనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల తరహాలోనే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లోనూ పొత్తు కుదుర్చుకోవాలని ఇరు పార్టీలు తహతహలాడుతున్నాయి.కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్ముకశ్మీర్లో జరగనున్న తొలి అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ కోసం ఎన్నికల సంఘం సమాయత్తమవుతోంది. వివిధ పార్టీలు కూడా రాజకీయ సమీకరణలు ప్రారంభించాయి. తాజాగా నేషనల్ కాన్ఫరెన్స్- కాంగ్రెస్లు కూటమిగా ఏర్పడేందుకు ఉండే అవకాశాలపై చర్చించేందుకు శ్రీనగర్లో చర్చలు ప్రారంభించాయి. వీరి మధ్య సయోధ్య కుదిరితే మరో నాలుగైదు రోజుల్లో పొత్తులపై ప్రకటన వెలువడనున్నదని సమాచారం. ఇరుపక్షాల హైకమాండ్ ఆదేశాల మేరకు చర్చల ప్రక్రియ ప్రారంభించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. కాగా డీలిమిటేషన్ కారణంగా చాలా అసెంబ్లీ నియోజకవర్గాల సమీకరణలు మారిపోయాయి. దీంతో సిట్టింగ్-గేటింగ్ ఫార్ములా అనుకూలంగా ఉండదు. ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని సీట్ల కేటాయింపుపై ఇరు పార్టీలు తగిన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. -
గులాం నబీ అజాద్కు షాక్.. కాంగ్రెస్ గూటికి తాజ్ మొహియుద్దీన్!
శ్రీనగర్: జమ్ము కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు మాజీ సీఎం గులాం నబీ ఆజాద్.. డెమొక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీకి షాక్ తగిలింది. ఈ పార్టికి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి తాజ్ మొహియుద్దీన్ కాంగ్రెస్లో చేరనున్నట్టు ప్రకటించారు. ‘‘కొన్ని రోజుల్లో నేను కాంగ్రెస్ పార్టీలో చేరుతాను. ఆజాద్ సాబ్ నాకు పార్టీలో చాలా గౌరవం ఇచ్చారు. ఆజాద్ కూడా మళ్లీ కాంగ్రెస్లోకి రావాలని కోరుకుంటున్నా. అప్పుడు నేను పూర్తి స్థాయిలో సంతోషంగా ఉంటాను. నాకు కాంగ్రెస్ పార్టీతో సుమారు 45 ఏళ్ల అనుబంధం ఉంది. నేను మళ్లీ నా సోంత గూటికి చేరుకోబోతున్నా. అయితే నేను నా కార్యకర్తల అభిప్రాయాలను బట్టి ఈ నిర్ణయం తీసుకున్నా. వారంతా నేను కాంగ్రెస్లో చేరాలని ఏకగ్రీవంగా నిర్ణయించారు. అందుకే నేను మళ్లీ కాంగ్రెస్తో చేరనున్నాను’’ అని అన్నారు. ఉత్తర కాశ్మీర్లోని బారాముల్లా జిల్లాలోని ఉరీ అసెంబ్లీ సెగ్మెంట్ మాజీ ఎమ్మెల్యే అయిన మొహియుద్దీన్ 2022 ఆగస్టులో ఆజాద్కు మద్దతుగా కాంగ్రెస్కు రాజీనామా చేశారు. అనంతరం ఆజాద్ పెట్టిన డెమొక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీలో చేరారు.గులాం నబీ ఆజాద్కు చెందిన డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీ(డీపీఏఈప) కాంగ్రెస్లో విలీనం అవుతుందని కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. శనివారం తాజ్ మొహియుద్దీన్ కాంగ్రెస్ చేరనున్నట్లు ప్రకటించటంతో ఊహాగానాలు మరింతి ఎకక్కువ అయ్యాయి. అయితే ప్రచారానన్ని డీపీఏపీ అధికార ప్రతినిధి సల్మాన్ నిజామీ ఖండించారు.గులాం నబీ ఆజాద్ కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టినప్పటి నుంచి ఆయనకు ఏ కాంగ్రెస్ నాయకుడు నేరుగా లేదా టెలిఫోన్ ద్వారా సంప్రదించలేదని స్పష్టం చేశారు. ఈ పుకార్లు పూర్తిగా నిరాధారమైనవి, అబద్ధం మాత్రమే అని అన్నారు. గందరగోళాన్ని సృష్టించి తమ పార్టీని విచ్ఛిన్నం చేయడాని ఇలాంటి ప్రచారం జరుగుతోందని తెలిపారు. ఈ ట్రాప్లో పార్టీ నాయకులు కార్యకర్తలు చిక్కుకోవద్దని విజ్ఞప్తి చేశారు.ఇక.. జమ్మూకశ్మీర్లో సెప్టెంబర్ 18, సెప్టెంబర్ 25, అక్టోబర్ 1న, హరియాణాలో అక్టోబర్ 1న అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని, రెండు రాష్ట్రాల్లో అక్టోబర్ 4న ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని ఈసీ వెల్లడించిన సంగతి తెలిసిందే. జమ్మూకశ్మీర్లో మొదటి దశలో 24 సీట్లకు, రెండో దశలో 26 సీట్లకు, మూడో దశలో 40 సీట్లకు ఎన్నికలు జరుగుతాయి. ఇక్కడ చివరిసారిగా 2014 నవంబర్-డిసెంబర్లో ఐదు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. -
Election Commission of India: మోగింది ఎన్నికల భేరీ
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్లో దశాబ్ద కాలం తర్వాత అసెంబ్లీ ఎన్నికలు జరుగబోతున్నాయి. ఆర్టీకల్ 370ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన అనంతరం తొలిసారిగా ఎన్నికల సందడి ప్రారంభం కాబోతోంది. జమ్మూకశ్మీర్తోపాటు హరియాణా శాసనసభ ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం ప్రకటించింది. 90 స్థానాలున్న జమ్మూకశ్మీర్ అసెంబ్లీకి మూడు దశల్లో, 90 స్థానాలున్న హరియాణా అసెంబ్లీకి ఒక దశలో ఎన్నికలు నిర్వహించనున్నట్లు ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) రాజీవ్ కుమార్ మీడియా సమావేశంలో వెల్లడించారు. జమ్మూకశ్మీర్లో సెపె్టంబర్ 18, సెపె్టంబర్ 25, అక్టోబర్ 1న, హరియాణాలో అక్టోబర్ 1న ఎన్నికలు జరుగుతాయని, రెండు రాష్ట్రాల్లో అక్టోబర్ 4న ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని తెలియజేశారు. జమ్మూకశ్మీర్లో మొదటి దశలో 24 సీట్లకు, రెండో దశలో 26 సీట్లకు, మూడో దశలో 40 సీట్లకు ఎన్నికలు జరుగుతాయి. ఇక్కడ చివరిసారిగా 2014 నవంబర్–డిసెంబర్లో ఐదు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. జమ్మూకశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికలను సాధారణంగా ఐదు దశల్లో నిర్వహిస్తుంటారు. ఇటీవల లోక్సభ ఎన్నికలు ఏడు దశల్లో జరిగాయి. దీనిపై విమర్శలు వచ్చాయి. అందుకే జమ్మూకశ్మీర్లో తక్కువ సమయంలోనే ఎన్నికలు నిర్వహిస్తామంటూ ఇచి్చన హామీని నిలబెట్టుకుంటున్నామని రాజీవ్ కుమార్ చెప్పారు. ఈసారి కేవలం మూడు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు పూర్తి చేయబోతున్నామని తెలిపారు. జమ్మూకశ్మీర్లో భద్రతా అవసరాల వల్లే.. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను మరికొన్ని రోజుల్లో ప్రకటిస్తామని రాజీవ్ కుమార్ చెప్పారు. జమ్మూకశ్మీర్లో భద్రతా అవసరాలను దృష్టిలో పెట్టుకొని మహారాష్ట్ర ఎన్నికల షెడ్యూల్ను వాయిదా వేసినట్లు వివరించారు. 2019లో హరియాణా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు దాదాపు ఒకే సమయంలో జరిగాయి. ఈ ఏడాది, వచ్చే ఏడాది ఆరంభంలో మహారాష్ట్ర, జార్ఖండ్, ఢిల్లీ శాసనసభ ఎన్నికలు సైతం జరగాల్సి ఉందని, వీటిలో రెండు రాష్ట్రాలకు కలిపి ఒకసారి ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించినట్లు రాజీవ్ కుమార్ పేర్కొన్నారు. జమ్మూకశ్మీర్, హరియాణాలో పోలింగ్ పూర్తయిన తర్వాత మిగిలిన రాష్ట్రాల షెడ్యూల్ ప్రకటిస్తామన్నారు. మీడియా సమావేశంలో రాజీవ్ కుమార్తోపాటు ఎన్నికల సంఘం కమిషనర్లు జ్ఞానేశ్ కుమార్, సుఖ్బీర్సింగ్ సంధూ పాల్గొన్నారు. జమ్మూకశ్మీర్లో ప్రత్యేక ప్రతిపత్తి కలి్పస్తున్న ఆర్టీకల్ 370ని రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమరి్థంచిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది సెపె్టంబర్ 30వ తేదీలోగా జమ్మూకశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని న్యాయస్థానం ఆదేశించింది. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది.ముగ్గురు జెంటిల్మెన్ మళ్లీ వచ్చేశారు ముగ్గురు పెద్దమనుషులు(జెంటిల్మెన్) మళ్లీ వచ్చేశారని మీడియా సమావేశంలో సీఈసీ రాజీవ్ కుమార్ చమత్కరించారు. తన సహచర కమిషనర్లు జ్ఞానేశ్ కుమార్, సుఖ్బీర్ సింగ్ సంధూను విలేకరులకు పరిచయం చేశారు. లోక్సభ ఎన్నికల సమయంలో సోషల్ మీడియాలో ‘లాపతా జెంటిల్మెన్’ అంటూ ట్రోలింగ్ నడిచింది. ‘లాపతా లేడీస్’ చిత్రాన్ని ప్రస్తావిస్తూ కేంద్ర ఎన్నికల సంఘంలోని ముగ్గురు సభ్యులు కనిపించకుండాపోయారని, లోక్సభ ఎన్నికల్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నాయని, రాజకీయ నాయకులు ఎన్నికల కోడ్ను ఉల్లంఘిస్తున్నారని నెటిజన్లు విమర్శలు గుప్పించారు. జూన్ 3న విలేకరుల సమావేశంలో రాజీవ్ కుమార్ మాట్లాడుతూ... లాపతా జెంటిల్మన్లు త్వరలో తిరిగివస్తారని చెప్పారు. తాము ఎక్కడికీ వెళ్లలేదని, ఇక్కడే ఉంటున్నామని పేర్కొన్నారు. -
రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ నేడు
సాక్షి,న్యూఢిల్లీ: లోక్సభ ఎన్నికల తర్వాత ఎన్నికల కమిషన్(ఈసీ) శుక్రవారం(ఆగస్టు 16) మళ్లీ ఎన్నికల నగారా మోగించనుంది. మధ్యాహ్నం 3 గంటలకు రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను ఎన్నికల కమిషన్(ఈసీ) మీడియా సమావేశంలో ప్రకటించనుంది. హర్యానా, జమ్ము కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల తేదీలను ఈసీ ప్రకటించనుంది. కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించిన తర్వాత జమ్ముకు అసెంబ్లీకి తొలిసారి జరిగే ఎన్నికలు ఇవే కావడం గమనార్హం. -
జమ్మూకశ్మీర్ స్పెషల్ డీజీపీగా నళిన్ ప్రభాత్
న్యూఢిల్లీ: సీనియర్ ఐపీఎస్ అధికారి నళిన్ ప్రభాత్కు కేంద్ర ప్రభుత్వం జమ్మూకశ్మీర్లో కీలక బాధ్యతలు అప్పగిస్తోంది. తరచూ ఉగ్రదాడులతో అత్యంత ఉద్రిక్తంగా మారిన జమ్మూకశ్మీర్లో పరిస్థితులను చక్కదిద్దడమే లక్ష్యంగా ఆయనను జమ్మూకశ్మీర్ స్పెషల్ డీజీపీగా ఎంపికచేసింది. వచ్చే నెల 30న ప్రస్తుత పోలీస్బాస్ ఆర్ఆర్ స్వాయిన్ రిటైరైన వెంటనే అక్టోబర్ ఒకటిన ప్రభాత్ డీజీపీగా బాధ్యతలు స్వీకరిస్తారని కేంద్రం ఒక ప్రకటనలో పేర్కొంది. 1992 బ్యాచ్ ఆంధ్రప్రదేశ్ కేడర్కు చెందిన ప్రభాత్ ఇప్పటికే పలు విభాగాల్లో పనిచేసి అద్భుత ప్రతిభ కనబరిచి విశేష అనుభవం గడించారు. మూడు పోలీస్ గ్యాలంట్రీ మెడళ్లు, ఒక పరాక్రమ్ పతకం సాధించారు. 55 ఏళ్ల ప్రభాత్కు వామపక్ష తీవ్రవాదం, ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాల్లో సుదీర్ఘ అనుభవం ఉంది. గతంలో ఆంధ్రప్రదేశ్లో నక్సలిజాన్ని అణిచివేసేందుకు ఉద్దేశించిన గ్రేహౌండ్స్ దళాలకూ ఆయన సారథ్యం వహించారు. గతంలో సీఆర్పీఎఫ్లో ఐజీగా, కశ్మీర్ ప్రాంతంలో అదనపు డీజీగా సేవలందించారు. -
కల్నల్ మన్ప్రీత్కు కీర్తిచక్ర
న్యూఢిల్లీ: కశ్మీర్ లోయలో ఉగ్రవాదులతో పోరులో వీరమరణం పొందిన కల్నల్ మన్ప్రీత్సింగ్, జమ్మూకశ్మీర్ డీఎస్పీ హుమయూన్ ముజ్జామిల్ భట్కు కేంద్ర ప్రభుత్వం కీర్తిచక్ర అవార్డ్ను ప్రకటించింది. రైఫిల్మన్ రవికుమార్ (మరణానంతరం), మేజర్ మల్ల రామగోపాల్ నాయుడు, (మరణానంతరం)లనూ కీర్తిచక్రతో ప్రభుత్వం గౌరవించింది. శాంతిసమయంలో ప్రకటించే రెండో అత్యున్నత గ్యాలెంట్రీ అవార్డ్కు ఈసారి నలుగురికి ఎంపికచేశారు. అనంత్ నాగ్ అడవుల్లో ఆర్మీ బృందానికి నాయకత్వం వహిస్తూ ప్రాణాలను లెక్కచేయకుండా ఉగ్రవాదులను నేరుగా ఎదుర్కొని ఒక ఉగ్రవాదిని కల్నల్ మన్ప్రీత్ హతమార్చారు. తర్వాత నక్కిన ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఆయన ప్రాణాలు కోల్పోయారని ప్రభుత్వం ఒక ప్రకటనలో పేర్కొంది. త్రివిధ దళాల సర్వసైన్యాధ్యక్ష హోదాలో రాష్ట్రపతి ముర్ము బుధవారం మొత్తం 103 గ్యాలంట్రీ అవార్డులను ప్రకటించారు. కీర్తిచక్రతోపాటు 18 మందికి శౌర్య చక్ర, ఒకరికి బార్ టు సేనా మెడల్, 63 మందికి సేనా మెడల్, 11 మందికి నావో సేనా మెడల్, ఆరుగురికి వాయుసేనా మెడల్ ప్రకటించారు. ఒక ప్రెసిడెంట్ తట్రక్షక్ మెడల్, మూడు తట్రక్షక్ మెడళ్లనూ తీర గస్తీ దళాలకు ప్రకటించారు. -
కశ్మీర్లో ఎన్కౌంటర్.. నేలకొరిగిన ఇద్దరు జవాన్లు
శ్రీనగర్: జమ్మూకశ్మీర్లోని అనంత్నాగ్ జిల్లాలో శనివారం ఉగ్రవాదులతో జరిగిన ఎదురుకాల్పుల ఘటనలో ఇద్దరు జవాన్లు నేలకొరగ్గా మరో నలుగురు జవాన్లు సహా ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఉగ్రవాదుల కదలికలపై నిఘా సమాచారం అందుకున్న భద్రతా బలగాలు కొకెర్నాగ్ ప్రాంతం అహ్లాన్ గగర్మండులో 10 వేలఅడుగుల ఎత్తులోని అటవీప్రాంతంలో కార్డన్ సెర్ఛ్ చేపట్టాయి. తనిఖీలు జరుపుతున్న బలగాలపై ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులకు దిగారు. ఈ సందర్భంగా ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఘటనలో ఆరుగురు జవాన్లు, ఇద్దరు పౌరులు గాయపడ్డారు. క్షతగాత్రుల్లో ఇద్దరు జవాన్లు అమరులైనట్లు అధికారులు వెల్లడించారు. మిగతా వారు చికిత్స పొందుతున్నారన్నారు. తప్పించుకుపోయిన ఉగ్రమూకల కోసం గాలింపు కొనసాగుతోందని వివరించారు. నలుగురు ఉగ్రవాదుల స్కెచ్ విడుదల జూలై 8వ తేదీన కథువా జిల్లాలోని మచెడిలో భద్రతా బలగాలపై దాడికి పాల్పడిన నలుగురు ఉగ్రవాదుల ఊహాచిత్రాలను పోలీసులు విడుదల చేశారు. స్థానికులు ఇచి్చన సమాచారం ఆధారంగా ఊహా చిత్రాలను రూపొందించారు. ఆచూకీ తెలిపిన వారికి రూ.20 లక్షల రివార్డు ప్రకటించారు. అప్పటి ఘటనలో ఒక జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్ సహా ఐదుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. -
తక్షణమే అసెంబ్లీ ఎన్నికలు జరపండి
శ్రీనగర్: జమ్మూకశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికలను వెంటనే నిర్వహించాలని ఆ కేంద్ర పాలిత ప్రాంతానికి చెందిన రాజకీయ పార్టీలు ప్రధానంగా డిమాండ్ చేశాయి. గురువారం శ్రీనగర్లో ఎన్నికల కమిషన్ ఇక్కడి రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించింది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ సారథ్యంలోని బృందం షేర్–ఇ–కశ్మీర్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్(ఎస్కేఐసీసీ)లో నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ), పీపుల్స్ డెమొక్రాటిక్ పార్టీ(పీడీపీ), బీజేపీ, కాంగ్రెస్, జమ్మూకశ్మీర్ పాంథర్స్ పార్టీ(జేకేపీపీ) తదితర పార్టీల ప్రతినిధులతో సమావేశమైంది. సీఈసీతోపాటు కమిషనర్లు జ్ఞానేశ్ కుమార్, ఎస్ఎస్ సంధుల బృందం ఎన్నికల నిర్వహణపై రాజకీయ పార్టీల అభిప్రాయాలను తెలుసుకున్నారు. అనంతరం ఈసీ అధికారులు మీడియాతో మాట్లాడారు. కేంద్ర పాలితప్రాంతమైన జమ్మూకశ్మీర్లో తక్షణమే అసెంబ్లీ ఎన్నికలు జరపాలన్న డిమాండ్ను ప్రధానంగా అన్ని రాజకీయ పార్టీలు వినిపించాయని వెల్లడించారు. జమ్మూకశ్మీర్లో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించేందుకు నిష్పాక్షికంగా, పారదర్శకతతో ఎన్నికలు నిర్వహించాలని కూడా పార్టీల ప్రతినిధులు కోరారన్నారు. అనంతరం ఈసీ బృందం ఎన్నికల అధికారులు, పోలీస్ సూపరింటెండెంట్లతోపాటు చీఫ్ సెక్రటరీ, పోలీస్ డైరెక్టర్ జనరల్తో సమీక్ష సమావేశం జరిపింది. ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపై వారితో చర్చించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సెప్టెంబర్ 30వ తేదీలోగా కశ్మీర్ అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించాలని ఎన్సీ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా డిమాండ్ చేశారు. -
అక్టోబర్లో కశ్మీర్కు తిరిగి రాష్ట్ర హోదా
శ్రీనగర్: జమ్మూకశ్మీర్కు అక్టోబర్లో రాష్ట్ర హోదా పునరుద్ధరణతోపాటు అసెంబ్లీ ఎన్నికలు ఉంటాయని కేంద్ర సామాజిక న్యాయం, సాధికారిత శాఖ సహాయ మంత్రి రాందాస్ అథవాలె చెప్పారు. శ్రీనగర్లో గురువారం ఆయన మీడియాతో మాట్లా డారు. ‘మహారాష్ట్ర, హరియాణా, జార్ఖండ్ రాష్ట్రాల అసెంబ్లీలకు అక్టోబర్లో ఎన్నికలు జరగనున్నాయి. వీటితోపాటు జమ్మూకశ్మీర్ అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతాయి. అప్పుడే జమ్మూకశ్మీర్కు రాష్ట్ర హోదా పునరుద్ధరణ ప్రకటన వెలువడే అవకాశాలు కూడా ఉన్నాయి’అని మంత్రి అథవాలె వివరించారు. జమ్మూకశ్మీర్ రాష్ట్ర హోదాను పునరుద్ధరిస్తామంటూ గతంలో ఆర్టికల్ 370 రద్దు సమయంలోనే హోం మంత్రి అమిత్ షా ప్రకటించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. -
Union Minister G Kishan Reddy: కశ్మీర్ అసెంబ్లీకి సెప్టెంబర్లో ఎన్నికలు
ఆర్ఎస్పురా: జమ్మూకశ్మీర్ అసెంబ్లీకి సెప్టెంబర్లో ఎన్నికలు జరుగుతా యని కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి వెల్లడించారు. ఈ కేంద్ర పాలిత ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు ఇకపైనా కొనసాగాలంటే బీజేపీకే అధికారమివ్వాలని ఆయన ప్రజలను కోరారు. ఆర్టికల్ 370 రద్దుకు ఐదేళ్లయిన సందర్భంగా సోమవారం జమ్మూ శివారులోని బానా సింగ్ స్టేడియంలో మహోత్సవ్’ ర్యాలీనుద్దేశించిమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడారు. -
ఆర్టికల్ 370 రద్దుకు ఐదేళ్లు.. జమ్ముకశ్మీర్లో భద్రత కట్టుదిట్టం
జమ్ముకశ్మీర్లో ఆర్టికల్ 370ని రద్దుచేసి నేటికి (ఆగస్టు 5) ఐదేళ్లు పూర్తయ్యాయి. ఈ నేపధ్యంలో రాష్ట్రంలో ఎటువంటి అల్లర్లు జరగకుండా ఉండేందుకు భద్రతను మరింతగా పెంచారు. భద్రతా దళాలు అణువణువునా పహారా కాస్తున్నాయి.2019 ఆగస్టు 5న జమ్ముకశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని కేంద్ర ప్రభుత్వం రద్దుచేసింది. దీనికితోడు జమ్ముకశ్మీర్కు రాష్ట్ర హోదాను రద్దు చేసి, రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా మార్చింది. ఆర్టికల్ 370 రద్దుకు ఐదేళ్లు పూర్తయిన నేపధ్యంలో జమ్మూ జిల్లాలోని అఖ్నూర్లో భద్రతను మరింతగా పెంచారు. ఈ ప్రాంతంలో రాకపోకలు సాగిస్తున్న వాహనాలపై నిఘా సారిస్తున్నారు.ఈ సందర్భంగా దక్షిణ జమ్మూ ఎస్పీ అజయ్ శర్మ మాట్లాడుతూ రాష్ట్రంలో ఇటీవలి కాలంలో పెరుగుతున్న ఉగ్రవాద కార్యకలాపాల దృష్ట్యా తాము మరింత అప్రమత్తంగా ఉన్నామన్నారు. కాగా దేశంలో లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత జమ్ముకశ్మీర్లో పలు ఉగ్రదాడులు జరిగాయి. వీటిలో కథువాలో ఆర్మీ కాన్వాయ్పై దాడి, దోడా, ఉదంపూర్లలో భద్రతా బలగాలు- ఉగ్రవాదుల మధ్య జరిగిన ఎన్కౌంటర్ ప్రధానమైనవి. -
ఆపరేషన్ ఆలౌట్ ఉగ్రమూకలను ఏరిపారేస్తున్న ఆర్మీ
-
నేటి నుంచే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు సోమవారం ప్రారంభం కానున్నాయి. వచ్చే నెల 12వ తేదీ వరకు 19 రోజులపాటు కొనసాగుతాయి. సోమవారం ఉదయం 11 గంటలకు సమావేశాలు ప్రారంభం కానుండగా, తొలి రోజు పశ్చిమ బెంగాల్లోని అసన్సోల్ నియోజకవర్గం నుంచి గెలిచిన శత్రుఘ్న సిన్హా లోక్సభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. అనంతరం ప్రశ్నోత్తరాలు నిర్వహిస్తారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024–25 సామాజిక, ఆర్థిక సర్వే నివేదికను పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు. ప్రస్తుత సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం 6 బిల్లులను పార్లమెంట్లో ప్రవేశపెట్టనుంది. జమ్మూకశీ్మర్ బడ్జెట్కు పార్లమెంట్ ఆమోదం తెలిపే అవకాశాలున్నాయి. ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం లోక్సభలో కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెడతారు. ఈసారి వాడీవేడిగానే చర్చలు 2024 సార్వత్రిక ఎన్నికల అనంతరం పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టేందుకు నరేంద్ర మోదీ ప్రభుత్వం ఓ వైపు సన్నాహాలు చేస్తుండగా, మరోవైపు వివిధ కీలక అంశాలపై కేంద్రాన్ని నిలదీసేందుకు విపక్షాలు సన్నద్ధమవుతున్నాయి. నీట్–యూజీ పేపర్ లీకేజీ, యూపీఎస్సీ పరీక్షల్లో అవకతవకలు, రైల్వే భద్రత, డిప్యూటీ స్పీకర్ పదవి, నిరుద్యోగం, అగి్నవీర్ పథకం, ఆర్థిక వ్యవస్థ, కేంద్ర దర్యాప్తు సంస్థల దురి్వనియోగం, మణిపూర్లో శాంతి భద్రతలు వంటి అంశాలపై ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని నిర్ణయానికొచ్చాయి. ప్రత్యేక హోదాపై గళం విప్పిన వైఎస్సార్సీపీ కేంద్ర ప్రభుత్వం ఆదివారం ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. కేంద్ర మంత్రులు రాజ్నా«థ్ సింగ్, కిరణ్ రిజిజు, జేపీ నడ్డా నేతృత్వంలో నిర్వహించిన ఈ భేటీకి ఆర్జేడీ, జేడీయూ, బీజేడీ, టీడీపీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, డీఎంకే, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ, శివసేన తదితర 44 పార్టీల సభాపక్ష నేతలు హాజరయ్యారు. బడ్జెట్ సమావేశాల్లో ఉభయ సభల కార్యకలాపాలు సజావుగా సాగేందుకు అన్ని రాజకీయ పారీ్టలు సహకరించాలని కేంద్ర మంత్రులు కోరారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా అంశాన్ని వైఎస్సార్సీపీ రాజ్యసభాపక్ష నేత విజయసాయిరెడ్డి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ పాలనలో ప్రతిపక్ష నేతలపై దమనకాండ సాగుతోందని ఆరోపించారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు. ఇదే సమయంలో బిహార్కు ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ జేడీ(యూ), ఒడిశాకు ప్రత్యేక హోదా కలి్పంచాలని బిజూ జనతాదళ్(బీజేడీ) సైతం తమ డిమాండ్లను ప్రభుత్వం ముందుంచాయి. నీట్–యూజీ పేపర్ లీకేజీ అంశంపై పార్లమెంట్లో మాట్లాడేందుకు విపక్షాలకు అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ తరఫున హాజరైన గౌరవ్ గొగోయ్ కోరారు. లోక్సభలో కాంగ్రెస్కు డిప్యూటీ స్పీకర్ పదవి కట్టబెట్టాలని డిమాండ్ చేశారు. ఆరు బిల్లులివే.. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం ఆరు కొత్త బిల్లులు ప్రవేశపెట్టనుంది. 90 ఏళ్ల క్రితం నాటి ఎయిర్క్రాఫ్ట్ చట్టం స్థానంలో భారతీయ వాయుయాన్ విధేయక్–2024ను తీసుకొస్తోంది. విమానయాన రంగంలో సులభతర వాణిజ్యానికి పెద్దపీట వేయనున్నారు. అలాగే ఫైనాన్స్ బిల్లు, విపత్తు నిర్వహణ(సవరణ) బిల్లు, బాయిలర్స్ బిల్లు, కాఫీ(ప్రోత్సాహం, అభివృద్ధి) బిల్లు, రబ్బర్(ప్రోత్సాహం, అభివృద్ధి) బిల్లును కేంద్రం ప్రవేశపెట్టనుంది. హోదాపై టీడీపీ మౌనమెందుకో?: జైరాం అఖిలపక్ష సమావేశంపై కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ ‘ఎక్స్’లో స్పందించారు. ‘‘రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష భేటీలో ఆంధ్రప్రదేశ్, బిహార్కు ప్రత్యేక హోదా కలి్పంచాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, జేడీ(యూ) డిమాండ్ చేశాయి. విచిత్రంగా తెలుగుదేశం పార్టీ మాత్రం ఈ అంశంపై మౌనం దాల్చింది’’ అని పేర్కొన్నారు. -
జమ్ము కశ్మీర్లో ఉగ్రవాదంపై కేంద్రానిదే బాధ్యత: ఒమర్ అబ్దుల్లా
శ్రీనగర్: జమ్ము కశ్మీర్లో ఉగ్రవాదం అంతం కాబోతోందని కేంద్ర చెబుతోంది, కానీ అలా జరగుతున్నట్లు తమకు కనిపించటంలేదని నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) నేత ఒమర్ అబ్దుల్లా అన్నారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు. ‘జమ్ము కశ్మీర్లో ఇటీవల దోడా జిల్లాలో జరిగిన ఉగ్రవాద ఘటన మొదటి కాదు. నిజం ఏమింటే.. గత ఏడాది నుంచి ఇక్కడ ఉగ్రవాద దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. జమ్ములోని పలు ప్రాంతాల్లో కూడా ఉగ్రదాడులు జరుగుతున్నాయి. ఇక్కడ చోటు చేసుకుంటున్న ఆందోళనకర పరిస్థితులకు కేంద్ర ప్రభుత్వం, పోలీసులు బాధ్యత వహించాలి. ఇప్పటివరకు 55 మంది సైనికులు మృతి చెందారు. ఇలాంటి పరిస్థితులో అసలు ప్రభుత్వం ఏం చేస్తోందని డిమాండ్ చేస్తున్నాం. కేంద్రం మాత్రం తరచూ జమ్ము కశ్మీర్లో ఉగ్రవాదం తగ్గుతోందని చెబుతోంది. కానీ, ఇక్కడి పరిస్థితిని చూస్తే ఉగ్రవాదం ఇంకా కొనసాగుతున్నట్లే కనిపిస్తోంది. అదీకాక ఉగ్రవాదాన్ని అరికట్టడానికి ఏమాత్రం చర్యలు తీసుకోవటం లేదు. కేంద్రం చర్యలు తీసుకోవాలి’ అని అన్నారు.ఇటీవల జమ్ము కశ్మీర్ ఉగ్రవాదం పెరగడానికి ఇక్కడి ప్రాంతీయ పార్టీల రాజకీయాలే కారణమని డిజీపీ ఆర్ఆర్ స్వైన్ సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. డీజీపీ చేసిన వాఖ్యలను మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా తీవ్రంగా ఖండించారు. ‘డీజేపీ రాజకీయ స్టేట్మెంట్లు ఇస్తున్నారు. రాజకీయాలను రాజకీయ నాయకులకు వదిలిపెట్టాలి. ఆయన జమ్ము కశ్మీర్లో ఉగ్రవాదం ఎలా కరికట్టాలో చర్యలు తీసుకోవటంలో దృష్టి పెట్టాలి. డీజీపీగా ఆయన పని.. ఆయన చేస్తే.. మా పని మేము చేస్తాం’అని ఒమర్ అబ్దుల్లా అన్నారు. -
‘జమ్ము కశ్మీర్లో కల్లోలానికి ఉగ్రవాదుల యత్నం’
శ్రీనగర్: జమ్ము కశ్మీర్లోని కుప్వారా జిల్లా కేరాన్ సెక్టార్ సరిహద్దుల్లో చొరబాటుకు హత్నించిన ముగ్గురు ఉత్రవాదులను ఆదివారం భారత ఆర్మీ మట్టుబెట్టింది. ఈ ఘటనపై తాజాగా కేరాన్ సెక్టర్ బ్రిగేడియర్ ఎన్ఆర్ కుల్కర్ణి మాట్లాడారు.‘జూలై 13,14 తేదీల్లో రాత్రి సమయంలో ఉగ్రవాదుల చొరబాటు యత్నించటంతో దాడులు జరిపాం. ముఖ్యంగా ఈ ప్రాంతంలో నెలకొన్న శాంతి పరిస్థితులకు భంగం కలిగించేందుకు ఉగ్రవాదులు ప్రయత్నం చేస్తున్నట్లు మాకు నిఘా సమాచారం ఉంది. ..అమర్నాథ్ యాత్ర సందర్భంగా ఇక్కడ కల్లోలం సృష్టించాలని ఉగ్రవాదులు యత్నించారు. ఉగ్రవాద దాడులకు సంబంధించి.. జూలై 12నే మాకు ఇంటెలిజెన్స్ నుంచి మాకు సమాచారం అందింది. దట్టమైన అడవుల నుంచి కేరాన్ సెక్టార్ గుండా విదేశీ ఉగ్రవాదులు చొరబడతారన్న సమాచారం ఉంది. ఆ సమాచారాన్ని జమ్ము కశ్మీర్ పోలీసులు ధృవీకరించారు. జూలై 13, 14 తేదీ రోజుల్లో రాత్రి మేము చాలా అప్రమత్తంగా ఉన్నాం. .. ఆర్మీ, బీఎస్ఎఫ్, జమ్ము కశ్మీర్ పోలీసు సయుక్తగా ఉగ్రవాదుల చొరబడే చోట దాడులు చేశాం. అయితే చికటి ఉండటంతో ఉగ్రవాదులు తప్పించుకొని పారిపోయారు. టెర్రరిస్టుల వద్ద భారీ ఆయుధాలు ఉన్నాయి. బాగా శిక్షణ పొందిన ఉగ్రవాదులు చొరబడటానికి యత్నించారు. ఇక.. మేము జరిపిన కాల్పుల్లో ముగ్గురు విదేశీ ఉగ్రవాదులు హతమయయ్యారు. వారి వద్ద నుంచి ఆయుధాలు స్వాధీనం చేసుకున్నాం’అని ఎన్ఆర్ కుల్కర్ణి తెలిపారు. -
విడాకుల పిటిషన్: మాజీ సీఎం భార్యకు సుప్రీం నోటీసులు
ఢిల్లీ: జమ్ము కశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా దాఖలు చేసిన విడాకుల పిటిషన్లో ఆయన భార్య పాయల్ అబ్దుల్లాకు సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. గతంలో తన భార్యతో విడాకులను కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ను నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఓమర్ అబ్దుల్లా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించగా తిరస్కరించింది. దీంతో ఆయన సుప్రీం కోర్టు ఆశ్రయించగా.. జస్టిస్ సుధాన్షు ధులియా, జస్టిస్ అహ్సానుదిన్ అమానుల్లా ధర్మాసనం విచారణ జరిపి ఆరు వారాల్లో సమాధానం ఇవ్వాలని ఆయన భార్యకు నోటీసులు జారీ చేసింది.ఒమర్ అబ్దుల్లా ఇప్పటికే 15 ఏళ్ల నుంచి విడిగా ఉంటున్నారని ఆయన తరఫు న్యాయవాది కపిల్ సిబల్ కోర్టుకు తెలియజేశారు. ఇన్ని ఏళ్లపాటు విడిగా ఉన్న వారి వివాహం బంధం సజీవంగా లేదని కోర్టుకు దృష్టికి తీసుకువెళ్లారు. ఈ కేసు ఆర్టికల్ 142ను ఉపయోగించి తన క్లైంట్ ఒమర్ అబ్దుల్లాకు విడాకులు మంజూరు చేయాలని కోర్టును కోరారు.2016తో తనకు తన భార్య నుంచి విడాకులు కావాలని ఒమర్ అబ్దుల్లా ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించగా.. ఆయన చెప్పిన కారణాలు సరైనవి కాదని, నిరూపించాడానికి అవకాశం లేదని విడాకుల పిటిషన్ను తిరస్కరిచింది. అనతరం ఆయన ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించగా.. ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించటంతో ఒమర్ అబ్దుల్లా సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు.ఒమర్ అబ్దుల్లా, పాయల్ ఢిల్లీలోని ఒబేరాయ్లో పని చేస్తున్న సమయంలో తొలిసారి కలిశారు. అనంతరం వారు 1, సెప్టెంబర్ 1994న పెళ్లి చేసుకోగా ఇద్దరు పిల్లలు పుట్టారు. ఒమర్ అబ్దుల్లా 2009 నుంచి విడిగానే ఉంటున్నారు. -
జమ్ము కశ్మీర్లో చొరబాటుకు హత్నం.. ముగ్గురు ఉగ్రవాదులు హతం
శ్రీనగర్: జమ్ముకశ్మీర్ సరిహద్దుల్లో ముగ్గరు టెర్రరిస్టులు హతమైనట్లు భారత ఆర్మీ వెల్లడించింది. జమ్ము కశ్మీర్లోని కుప్వారా జిల్లా సరిహద్దుల్లో ఉగ్రవాదుల ఏరివేత ఆపరేషన్ను ఆర్మీ చేపట్టింది. ఈ క్రమంలో నియంత్రణ రేఖ వెంబడి చొరబాటుకు ప్రయత్నించిన టెర్రరిస్టులపై సైనికులు కాల్పులు జరిపింది. ఈ కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు మృతి చెందినట్లు ఆర్మీ అధికారులు తెలిపారు.‘జమ్ము కశ్మీర్ కెరాన్ సెక్టార్లో ఉగ్రవాద ఏరివేత ఆపరేషన్లో ముగ్గురు టెర్రరిస్టులు మృతి చెందారు. వారి వద్ద లభించినట్లు ఆయుధాలను స్వాధనం చేసుకున్నాం’ అని ఆర్మీ చినార్ కార్ప్స్ ‘ఎక్స్’ లో పేర్కొంది.OP DHANUSH II, KERAN #Kupwara03x Terrorists have been eliminated in the ongoing anti-infiltration operation on the #LoC in Keran Sector, alongwith recovery of weapons and other war-like stores. The operation is continuing #Kashmir@adgpi@NorthernComd_IA— Chinar Corps🍁 - Indian Army (@ChinarcorpsIA) July 14, 2024ఈ రోజు(ఆదివారం) భద్రతా బలగాలు ధనుష్-2 అనే కోడ్ పేరుతో కుప్వారాలోని కేరన్ సెక్టర్లో ఉగ్రవాదుల ఏరివేత ఆపరేషన్ చేపట్టారు. ఈ ఆపరేషన్ కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. ఇక.. మృతి చెందిన ఉగ్రవాదులు ఏ ఉగ్రసంస్థకు చెందినవారనే విషయం తెలియాల్సి ఉంది. -
కశ్మీర్ ఎల్జీకి మరిన్ని అధికారాలు
న్యూఢిల్లీ/శ్రీనగర్: జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్(ఎల్జీ)కి కేంద్రం మరిన్ని అధికారాలు కట్టబెట్టింది. పోలీసు శాఖ, అఖిల భారత సర్వీసుల అధికారులు, వివిధ కేసుల విచారణ అనుమతులు వంటి కీలక అంశాలపై అధికారాలను కల్పించింది. ఈ మేరకు జమ్మూకశ్మీర్ పునర్ వ్యవస్థీకరణ చట్టం–2019కు హోం శాఖ సవరణలు చేపట్టింది. ఆర్టికల్ 370 రద్దు, రాష్ట్రాన్ని జమ్మూకశ్మీర్, లద్దాఖ్ అనే రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజిస్తూ కేంద్రం ఈ చట్టం చేసింది. ఇప్పటి వరకు పోలీసు, జైళ్లు, శాంతిభద్రతలు, అఖిల భారత సర్వీసులు, ఏసీబీలకు సంబంధించిన నిర్ణయాలపై జమ్మూకశ్మీర్ ఆర్థిక శాఖ నుంచి ఆమోదం పొందాకనే ఎల్జీ వద్దకు వచ్చేవి. తాజా నిబంధనల ప్రకారం..ఆయా సర్వీసులకు సంబంధించిన ఫైళ్లు ఇకపై చీఫ్ సెక్రటరీ నుంచి నేరుగా ఎల్జీ వద్దకే చేరుతాయి. అడ్వకేట్ జనరల్, ఇతర న్యాయాధికారుల నియామక అధికారాలు కూడా తాజాగా ఎల్జీకే దఖలు పడ్డాయి.అధికారాలను హరించేందుకే..కేంద్రం నిర్ణయంపై జమ్మూకశ్మీర్లోని రాజకీయ పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఎన్నికయ్యే ప్రభుత్వం అధికారాలను హరించేందుకే కేంద్రం ప్రయత్నిస్తోందని నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ), పీపుల్స్ డెమోక్రాటిక్ పార్టీ(పీడీపీ)లు ఆరోపించాయి. జమ్మూకశ్మీర్లో సెప్టెంబర్ 30వ తేదీలోగా అసెంబ్లీ ఎన్నికలు చేపట్టి, రాష్ట్రం హోదాను పునరుద్ధరించాలని కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించడం తెల్సిందే. -
కశ్మీర్ ఉగ్రవాదుల చేతికి అమెరికా తుపాకులు
న్యూఢిల్లీ: అఫ్గానిస్తాన్ నుంచి 2021లో నిష్క్రమించిన సందర్భంగా అమెరికా సేనలు అక్కడే వదిలేసిన అత్యాధునిక తుపాకులు పాకిస్తాన్ మీదుగా జమ్మూకశ్మీర్ ఉగ్రవాదుల చేతికందాయని నిపుణులు చెబుతున్నారు. జమ్మూకశ్మీర్లో ఉగ్రదాడి ఘటనల్లో వీటిని విరివిరిగా వాడటంపై విశ్లేషకులు ఆందోళన వ్యక్తంచేశారు. వీటిల్లో ముఖ్యంగా ఎం4 కార్బైన్ అసాల్ట్ రైఫిల్ ప్రధానమైంది. అత్యంత తేలిగ్గా ఉంటూ, మేగజీన్ను సులువుగా మారుస్తూ సునాయాసంగా షూట్చేసే వెలుసుబాటు ఈ రైఫిల్లో ఉంది. దాదాపు 600 మీటర్ల దూరంలోని లక్ష్యాలనూ గురిచూసి కొట్టొచ్చు. నిమిషానికి 700–970 బుల్లెట్ల వర్షం కురిపించే సత్తా ఈ రైఫిల్ సొంతం. ఇంతటి వినాశకర రైఫిళ్లు కశ్మీర్ ముష్కరమూకల చేతికి రావడంతో దూరం నుంచే మెరుపు దాడులు చేస్తూ సునాయాసంగా తప్పించుకుంటున్నారని రక్షణ రంగ నిపుణుడు లెఫ్టినెంట్ జనరల్ సంజయ్ కులకర్ణి అసహనం వ్యక్తంచేశారు. 2017 నవంబర్లో జైషే మొహమ్మద్ చీఫ్ మసూద్ అజర్ బంధువు రషీద్ను సైన్యం మట్టుబెట్టినపుడు అక్కడ తొలిసారిగా ఎం4 రైఫిల్ను సైన్యం స్వాధీనంచేసుకుంది. 2018లో, 2022లో ఇలా పలు సందర్భాల్లో ఉగ్రవాదుల ఎన్కౌంటర్ ఘటనాస్థలిలో ఈ రైఫిళ్లను భారత ఆర్మీ గుర్తించింది. జూలై 8వ తేదీన కథువాలో ఐదుగురు జవాన్లను పొట్టనబెట్టుకున్న ఉగ్రదాడిలోనూ ఇవే రైఫిళ్లను వాడారని తెలుస్తోంది.