కశ్మీర్‌లో స్లీపర్‌సెల్స్‌ యాక్టివ్‌.. ఇంటెలిజెన్స్‌ హెచ్చరిక | Sleeper Cells Activated After Pahalgam Attack, 48 Resorts And Tourist Sites Shut Down In Kashmir Due To Security Concerns | Sakshi
Sakshi News home page

కశ్మీర్‌లో స్లీపర్‌సెల్స్‌ యాక్టివ్‌.. ఇంటెలిజెన్స్‌ హెచ్చరిక

Apr 29 2025 10:57 AM | Updated on Apr 29 2025 11:50 AM

Security concerns 48 Resorts And Tourist Sites Shut Down In Kashmir

శ్రీనగర్‌: జమ్ముకశ్మీర్‌లోని పహల్గాం దాడి ఘటనతో అక్కడ భారత ఆర్మీ హైఅలర్ట్‌లో ఉంది. మరోవైపు.. కశ్మీర్‌లో మరిన్ని ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్‌ వర్గాలు హెచ్చరించడంతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. ఈ నేపథ్యంలో 48 టూరిస్టు కేంద్రాలను జమ్ముకశ్మీర్‌ ప్రభుత్వం మూసివేసింది.

వివరాల ప్రకారం.. పహల్గాం దాడి అనంతరం కశ్మీర​్‌ లోయలో స్లీపర్‌సెల్స్‌ యాక్టివేట్‌ అయినట్లు నిఘావర్గాలు తెలిపాయి. దీంతో, కశ్మీర్‌లో మరిన్ని ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్‌ వర్గాలు హెచ్చరించాయి. ఈ నేపథ్యంలో జమ్ముకశ్మీర్‌ ప్రభుత్వం అలర్ట్‌ అయ్యింది. అనంతరం, కశ్మీర్‌లో ఉన్న 48 టూరిస్టు కేంద్రాలను ప్రభుత్వం మూసివేసింది. కశ్మీర్‌ వ్యాప్తంగా ఉన్న మొత్తం 87 టూరిస్టు కేంద్రాల్లో వీటిని మూసివేస్తున్నట్లు పేర్కొన్న అధికారులు వెల్లడించారు.

ఇదిలా ఉండగా.. పహల్గాం ఉగ్రదాడి ఘటనపై జమ్ముకశ్మీర్‌ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా ఆవేదన వ్యక్తం చేశారు. పర్యాటకులను పాశవికంగా హతమార్చిన ఘటనపై చర్చించేందుకు జమ్ముకశ్మీర్‌ శాసనసభ సోమవారం ప్రత్యేకంగా సమావేశమైంది. ఉగ్రదాడి మృతులకు సంతాపసూచకంగా సభ రెండు నిమిషాలు మౌనం పాటించింది. ఉగ్రవాదుల దుశ్చర్యను ఖండించింది. పాశవికదాడిపై తీవ్ర దిగ్భ్రాంతిని, ఆవేదనను వ్యక్తం చేస్తూ ఏకగ్రీవంగా ఓ తీర్మానాన్ని ఆమోదించింది.

కశ్మీర్లో 48 టూరిస్ట్ 4 ప్రాంతాల మూసివేత

దానికి ముందు సీఎం ఒమర్‌ అబ్దుల్లా మాట్లాడుతూ..‘బైసరన్‌లో ఇంత పెద్ద స్థాయిలో దాడి చేయడం మాత్రం 21 ఏళ్లలో ఇదే తొలిసారి. మృతి చెందిన వారి కుటుంబ సభ్యులకు ఎలా క్షమాపణలు చెప్పాలో తెలియడం లేదు. రాష్ట్రానికి వచ్చిన పర్యాటకులను సురక్షితంగా తిరిగి పంపాల్సిన బాధ్యత మాదే. నేను ఆ పనిచేయలేకపోయాను. పహల్గాం ఘటన తర్వాత ఏ ముఖం పెట్టుకొని రాష్ట్ర హోదాను డిమాండ్‌ చేయాలి. నా రాజకీయాలు అంత చౌకబారువి కాదు. గతంలో రాష్ట్ర హోదా అడిగాం.. భవిష్యత్తులో కూడా అడుగుతాం. కానీ, 26 మంది చనిపోయారు.. ఇప్పుడు రాష్ట్ర హోదా ఇవ్వండి అని కేంద్రాన్ని అడగడం సిగ్గుచేటు. ప్రజలు మాకు మద్దతు ఇస్తే.. ఉగ్రవాదం అంతమవుతుంది’ అని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement