కశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు సైనికులు మృతి | Indian Soldiers Encounter With Terrorists Kulgam, Check Out Story For More Details | Sakshi
Sakshi News home page

కశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు సైనికులు మృతి

Aug 9 2025 9:37 AM | Updated on Aug 9 2025 10:39 AM

Indian Soldiers Encounter With Terrorists Kulgam

శ్రీనగర్‌: జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేతకు ఆపరేషన్ అకాల్ కొనసాగుతోంది. ఇందులో భాగంగా జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు సైనికులు మృతి చెందారు. మరో ఇద్దరు సైనికులు గాయపడ్డారు. దీంతో, వారిని ఆసుపత్రికి తరలించారు.

వివరాల ప్రకారం.. జమ్ముకశ్మీర్‌లో ఆపరేషన్ అకాల్ తొమ్మిదో రోజుకు చేరుకుంది. ఈ క్రమంలో కుల్గాం జిల్లాలో ఉగ్రవాదులను ఏరివేసేందుకు భద్రతా బలగాల ప్రయ‍త్నించాయి. శుక్రవారం రాత్రి ఎదురుకాల్పుల్లో భాగంగా ఉగ్రవాదుల కాల్పుల్లో ఇద్దరు భారత సైనికులు మృతి చెందగా.. మరో ఇద్దరు గాయపడ్డారు. ఘటనా స్థలంలో భద్రత బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎదురు కాల్పులు  కొనసాగుతున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement