భూకంపంతో జమ్ము కశ్మీర్ ఒక్కసారిగా ఉలిక్కి పడింది. సోమవారం ఉదయం భూ ప్రకంపనలు లఢాఖ్లోని లేహ్తో పాటు కశ్మీర్ ప్రజలను వణికించాయి. ఇళ్లలో, కార్యాలయాల్లో ఉన్నవారు బయటకు పరుగులు తీశారు. ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం సంభవించలేదని సమాచారం.
నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ ప్రకారం, ఈ భూకంపం ఉదయం 11:51 గంటలకు సంభవించింది. లేహ్ ప్రాంతంలో భూకంపం కేంద్రం నమోదు కాగా.. 171 కిలోమీటర్ల లోతులో భూకంపం పుట్టింది. రిక్టర్ స్కేల్పై 5.7 తీవ్రత నమోదైంది. ఈ ప్రకంపనలు జమ్ము కశ్మీర్ రీజియన్ అంతటా ప్రభావం చూపాయి. అప్రమత్తమైన అధికారులు జాగ్రత్తలు పాటించాలని ప్రజలకు సూచించారు.
Earthquake tremors felt in Jammu and Kashmir. https://t.co/JvDujditvy
— AsiaWarZone (@AsiaWarZone) January 19, 2026
అత్యంత సున్నితమైన హిమాలయ ప్రాంతం భూకంపాలకు నెలవు కూడా. అయితే ఆదివారం.. అఫ్ఘనిస్తాన్లో 4.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఇవాల్టి ప్రకంపనలు తాత్కాలికంగానే ఉన్నప్పటికీ, ఆఫ్టర్షాక్స్ వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.


