Gold
-
ఇక బంగారం కొనడం ఈజీ.. EGR గురించి తెలుసా?
భారతీయులకు బంగారంపై మక్కువ కొంత ఎక్కువ. అయితే బంగారంలో పెట్టుబడి పెట్టడం అంత సులభం కాదు. ఫిజికల్ గోల్డ్ కొనుగోలు చేస్తే దాని నిల్వ, భద్రత, స్వచ్ఛత వంటి సమస్యలు ఎదురవుతాయి. ఈ సమస్యలను పరిష్కరించేందుకు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇండియా (ఎన్ఎస్ఈ).. ఎల్రక్టానిక్ గోల్డ్ రిసీట్స్ (ఈజీఆర్) అనే కొత్త విధానాన్ని ప్రారంభించింది.ఈజీఆర్ అంటే ఏమిటి?ఈజీఆర్ అనేది సెబీ గుర్తింపు పొందిన వాల్ట్ మేనేజర్ వద్ద జమ చేసిన భౌతిక బంగారానికి బదులుగా జారీ చేసే ఒక ఎలక్ట్రానిక్ రసీదు. ఇవి డీమ్యాట్ రూపంలో ఉండే సెక్యూరిటీస్ కాబట్టి, స్టాక్ల మాదిరిగా ఎక్స్చేంజ్లో సులభంగా కొనుగోలు, అమ్మకాలు చేయవచ్చు. అంటే, బంగారం ఇప్పుడు డిజిటల్ రూపంలో కూడా ట్రేడ్ చేయగలిగేలా మారిందన్నమాట.EGRలు ఎలా పనిచేస్తాయి?ప్రతి ఈజీఆర్ వెనుక నిజమైన ఫిజికల్ గోల్డ్ ఉంటుంది. ఉదాహరణకు.. ఎన్ఎస్ఈ ఒక 1000 గ్రాముల బంగారు గడ్డిని EGRగా మార్చింది. దీని ద్వారా భౌతిక బంగారం.. డిజిటల్ ఆస్తిగా మారుతుంది. పెట్టుబడిదారులు ఈ EGRలను స్టాక్ల మాదిరిగా ట్రేడ్ చేయవచ్చు. పెట్టుబడిదారులు తమ EGRలకు తగిన పరిమాణంలో భౌతిక బంగారాన్ని కూడా పొందవచ్చు.EGR ప్రయోజనాలుబంగారాన్ని భద్రపరచడం కోసం బ్యాంక్ లాకర్ అవసరం లేదుదొంగతనం లేదా నష్టం ఉండదుబంగారం స్వచ్ఛతపై సందేహం ఉండదు (ఎందుకంటే ఇది ప్రమాణిత సంస్థల ద్వారా ద్రువీకరిస్తారు)చిన్న మొత్తాల్లో కూడా పెట్టుబడి పెట్టవచ్చుమార్కెట్లో సులభంగా కొనుగోలు/అమ్మకం చేయవచ్చుఇదీ చదవండి: బంగారం ధరల పతనం.. గోల్డ్ కొనేందుకు సరైన సమయం! -
బంగారం ధరల పతనం.. గోల్డ్ కొనేందుకు సరైన సమయం!
పసిడి ప్రియులకు శుభవార్త, ఎందుకంటే గోల్డ్ రేటు గత కొన్ని రోజుల నుంచి తగ్గుతూనే ఉంది. ఈ రోజు (మంగళవారం) కూడా పసిడి ధరలు ఇదే బాటలో అడుగులు వేసాయి. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరల్లో స్వల్ప మార్పు జరిగాయి. ఈ కథనంలో గోల్డ్ లేటెస్ట్ రేట్లు ఎలా ఉన్నాయో చూసేద్దాం.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
రూ.1200 తగ్గిన గోల్డ్: కొత్త ధరలు ఇవే..
ఈ రోజు (సోమవారం) ఉదయం దేశంలోని ప్రధాన నగరాల్లో స్థిరంగా ఉన్న బంగారం ధరలు, సాయంత్రానికి తగ్గుముఖం పట్టాయి. దీంతో గోల్డ్ రేట్లలో స్వల్ప, మార్పులు జరిగాయి. ఈ కథనంలో లేటెస్ట్ ధరలు ఎలా ఉన్నాయనే వివరాలు తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడలలో ఉదయం 1,38,350 రూపాయల వద్ద ఉన్న 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం, సాయంత్రానికి రూ.1,200 తగ్గి, రూ.1,37,150 వద్దకు చేరింది. అంటే గంటల వ్యవధిలో ధరల తారుమారు జరిగినట్లు స్పష్టంగా అర్థమవుతోంది. ఇక 24 క్యారెట్ల తులం బంగారం విషయానికి వస్తే.. దీని ధర 1,50,930 రూపాయల నుంచి 1,49,620 రూపాయల (రూ.1310 తగ్గింది) వద్దకు వచ్చింది.దేశ రాజధాని ఢిల్లీ నగరంలో కూడా బంగారం ధరలు తగ్గాయి. ఇక్కడ 22 క్యారెట్ల 1200 రూపాయలు తగ్గడంతో తులం గోల్డ్ రేటు 1,37,300 రూపాయల వద్ద నిలిచింది. 24 క్యారెట్ల ధర రూ.1460 తగ్గి 149770 రూపాయల వద్దకు చేరింది. దీన్నిబట్టి చూస్తే.. ఒక రోజు కూడా పూర్తికాక ముందే.. ధరల్లో ఎంత మార్పు వచ్చిందో గమనించవచ్చు.చెన్నైలో బంగారం ధరల్లో ఎలాంటి మార్పు లేదు. కాబట్టి 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,40,000 (తులం), 24 క్యారెట్ల ధర రూ.1,52,730 (10 గ్రామ్స్) వద్దనే ఉన్నాయి. కాగా వెండి ధరల్లో కూడా ఎలాంటి మార్పు లేదు. కాబట్టి సిల్వర్ రేటు రూ.2.70 లక్షల వద్ద ఉంది.ఇదీ చదవండి: 'బంగారం 8000 డాలర్లకు': జర్మన్ బ్యాంక్ అంచనా! -
'బంగారం 8000 డాలర్లకు': జర్మన్ బ్యాంక్ అంచనా!
బంగారం ధరల్లో ఊహకందని మార్పు జరుగుతున్న సమయంలో జర్మనీకి చెందిన ప్రముఖ అంతర్జాతీయ పెట్టుబడి బ్యాంకు (డాయిష్ బ్యాంక్) ఓ సంచనల ప్రకటన చేసింది. ఇది పసిడి ప్రియులలో భయాన్ని కలిగించింది.డాయిష్ బ్యాంక్ ప్రకారం.. ప్రపంచ సెంట్రల్ బ్యాంక్ రిజర్వులలో బులియన్ వాటా ప్రస్తుతం ఉన్న సుమారు 30% నుంచి 40%కి పెరగవచ్చని సమాచారం. దీన్నిబట్టి చూస్తే రాబోయే ఐదేళ్లలో (2031 నాటికి) బంగారం ధరలు ఔన్సుకు 8,000 డాలర్లకు చేరవచ్చు. అంటే 80% పెరుగుదల ఉంటుందని అంచనా.దేశాలు తమ రిజర్వులను.. యూఎస్ డాలర్ నుంచి బులియన్ వైపు మళ్లిస్తున్నందున, రోజురోజుకు విచ్ఛిన్నమవుతున్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వల్ల బంగారం అతిపెద్ద లబ్ధిదారులలో ఒకటిగా మారవచ్చు. కాబట్టి బంగారం రానున్న రోజుల్లో మరింత ప్రియం అవుతుంది.పాశ్చాత్య దేశాల ఆంక్షల నుంచి రక్షణ పొందటానికి.. ముఖ్యంగా వర్ధమాన మార్కెట్లలోని కేంద్ర బ్యాంకులు తమ నిల్వలకు మరింత బంగారాన్ని జోడించనున్నాయి. 2008 ఆర్థిక సంక్షోభం తర్వాత కేంద్ర బ్యాంకులు 225 మిలియన్ ఔన్సులకు పైగా బంగారాన్ని తమ నిల్వలకు చేర్చాయని డాయిష్ బ్యాంక్ పేర్కొంది. ఇదే కాలంలో.. ప్రపంచ నిల్వలలో యూఎస్ డాలర్ల వాటా 2000ల ప్రారంభంలో 60% కంటే ఎక్కువగా ఉండగా, ప్రస్తుతం అది సుమారు 40%కి పడిపోయింది.బంగారం కొనుగోళ్లు ఇకపై చైనా, రష్యా, భారత్, టర్కీ వంటి ప్రధాన దేశాలకే పరిమితం కాలేదని డాయిష్ బ్యాంక్ తెలిపింది. కజకిస్తాన్, సౌదీ అరేబియా, ఖతార్, ఈజిప్ట్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వంటి దేశాలకు కూడా కొనుగోళ్లు విస్తరిస్తున్నాయి. ఈ పరిస్థితులు బంగారం ధరలను భారీ పెంచనున్నాయి.ఈ అంచనా ప్రకారం.. భారతదేశంలో కూడా బంగారం ధరలు గణనీయంగా పెరుగుతాయు. ప్రస్తుతం మన దేశంలో గోల్డ్ రేటు రూ.1,50,930 వద్ద ఉండగా.. ఇది భవిష్యత్తులో రూ.2.5 లక్షలకు చేరే అవకాశం ఉందని అంచనా. ఇదే నిజమైతే బంగారం కొనాలంటే భారీగా ఖర్చు చేయాల్సి ఉంటుందనేది వాస్తవం.ఇదీ చదవండి: అందుకే అమెరికన్స్ ఉద్యోగాలు వదిలేస్తారు! -
ఒక్కరోజులోనే కుప్పకూలిన బంగారం ధరలు..తులం ఎంతంటే..
-
భారీగా తగ్గిన బంగారం ధరలు: కొత్త రేట్లు ఇవే!
గత కొన్నిరోజులు బెంబేలెత్తించిన బంగారం ధరలు.. క్రమంగా తగ్గుతూ, ఒక్కసారిగా భారీ పతనం చవిచూశాయి. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో పసిడి ధరల్లో స్వల్ప మార్పులు జరిగాయి. ఈ కథనంలో తాజా గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయనే వివరాలు తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడలలో 24 క్యారెట్ల తులం బంగారం రేటు రూ.2,350 తగ్గి, రూ.1,50,380 వద్దకు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రేటు 2,150 రూపాయలు తగ్గి, రూ.1,37,850 వద్ద నిలిచింది. ఇదే ధరలు బెంగళూరు, ముంబైలలో కూడా ఉంటాయి.ఢిల్లీలో కూడా గోల్డ్ రేటు తగ్గింది. 24 క్యారెట్ల బంగారం రేటు 2450 రూపాయలు తగ్గింది. దీంతో దేశ రాజధాని నగరంలో తులం పసిడి ధర రూ.1,50,430 వద్దకు చేరింది. 22 క్యారెట్ల రేటు 2150 రూపాయలు తగ్గి, 1,38,000 రూపాయల వద్ద నిలిచింది.చెన్నైలో బంగారం ధరల విషయానికి వస్తే.. ఇక్కడ 24 క్యారెట్ల తులం రేటు రూ.1,51,860 (రూ.1960 తగ్గింది) వద్ద, 22 క్యారెట్ల తులం ధర రూ. 1,39,200 (రూ.1800 తగ్గింది) వద్ద ఉన్నాయి. దీన్ని బట్టి చూస్తే.. పసిడి ధరలు క్రమంగా పడిపోతున్నట్లు తెలుస్తోంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)ఇదీ చదవండి: డిగ్రీ కోసం రూ.కోటి.. 500 ఉద్యోగాలకు అప్లై చేసినా జాబ్ రాలేదు! -
కాసింత చల్లబడిన బంగారం వేడి!
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. -
రూ.3 వేలు తగ్గి మళ్లీ పెరిగిన బంగారం ధర తులం ఎంతంటే
-
పసిడి ధరల పతనం.. ఊహకందని రీతిలో ఇలా!
భారతదేశంలో గత కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన గోల్డ్ రేటు.. ఈ రోజు భారీ పతనాన్ని చవి చూసింది. దీంతో ఒక్కసారిగా పసిడి ధరలలో మార్పులు జరిగాయి. ఈ కథనంలో దేశంలోని ప్రధాన నగరాల్లో గోల్డ్ రేటు ఎలా ఉంది?, సిల్వర్ ధరల్లో ఏమైనా మార్పు కనిపించిందా? అనే విషయాలను తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడ నగరాల్లో 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.2780 తగ్గి 1,50,930 రూపాయల వద్దకు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు 2550 రూపాయలు తగ్గి రూ.1,38,350 వద్దకు చేరింది. ఇదే ధరలు బెంగళూరు, ముంబై నగరాల్లో కూడా కొనసాగుతాయి.చెన్నైలో గోల్డ్ రేటు వరుసగా రూ.1420, రూ.1300 తగ్గింది. దీంతో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రేటు 153820 రూపాయల వద్ద, 22 క్యారెట్ల తులం పసిడి ధర రూ.141000 వద్ద నిలిచాయి. ఈ ధరలు నిన్నటి (మంగళవారం)తో పోలిస్తే చాలా తక్కువ.ఇక దేశ రాజధాని నగరం ఢిల్లీ విషయానికి వస్తే.. ఇక్కడ కూడా బంగారం ధరలు పతనమయ్యాయి. దీంతో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రేటు రూ. 1,51,080 (రూ.2780 తగ్గింది) వద్ద ఉంది. 22 క్యారెట్ల తులం గోల్డ్ ధర రూ.1,38,500 (రూ.2550 తగ్గింది) వద్ద ఉంది.వెండి ధరలు ఇలాబంగారం మాత్రమే కాకుండా.. వెండి ధరలు కూడా తగ్గాయి. దీంతో తెలుగు రాష్ట్రాల్లో సిల్వర్ రేటు రూ.2.65 లక్షలు (రూ.5000 తగ్గింది) వద్ద, ఢిల్లీలో రూ.2.60 లక్షల వద్ద నిలిచింది.ఇదీ చదవండి: అమ్మానాన్నలతో గడపాలని.. OpenAIకి రాజీనామా! -
వచ్చేది పెను సంక్షోభమే: కియోసాకి అలర్ట్
ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లకు చిరపరిచితమైన పేరు రాబర్ట్ కియోసాకి (Robert Kiyosaki). 'రిచ్ డాడ్ పూర్ డాడ్' (Rich Dad Poor Dad)పుస్తకంతో ఆర్థిక పాఠాలు నేర్పిన ఆయన, తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. 2026-27 మధ్య కాలంలో ప్రపంచం ఒక భారీ ఆర్థిక సంక్షోభాన్ని, బహుశా ఒక గొప్ప ఆర్థిక మాంద్యాన్ని (Great Depression) ఎదుర్కోబోతోందని ఆయన హెచ్చరించారు.సంక్షోభంలో చిక్కుకుంటారా.. లాభపడతారా?తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా కియోసాకి స్పందిస్తూ.. రాబోయే ఈ భారీ క్రాష్లో ప్రజలు రెండు రకాలుగా మిగిలిపోతారని పేర్కొన్నారు. ఒక వర్గం వారు ఆర్థికంగా చితికిపోతే, మరో వర్గం వారు అదృష్టవంతులుగా మారి భారీగా లాభపడతారని ఆయన విశ్లేషించారు.సంక్షోభాల్లోనే ధనవంతుడినయ్యాను..గతంలో జరిగిన ఆర్థిక పతనాలను గుర్తు చేసుకుంటూ.. "1987, 2000, 2008, 2015, 2019, 2022 సంవత్సరాల్లో వచ్చిన సంక్షోభాల్లో నేను పేదవాడిని కాలేదు, ఇంకా ధనవంతుడిని అయ్యాను. రాబోయే 2026-27 క్రాష్లో కూడా నేను మరింత సంపదను పెంచుకోవాలని ప్లాన్ చేస్తున్నాను" అని కియోసాకి ధీమా వ్యక్తం చేశారు.ఆస్తులు చౌకగా దొరికే సమయం ఇదే!ఆర్థిక మాంద్యం సమయంలో సామాన్యులు భయపడి ఆస్తులు అమ్ముకుంటే, తెలివైన వారు పెట్టుబడులు పెడతారని కియోసాకి సూచించారు. "మార్కెట్ పతనం (Crash) అయినప్పుడు, గొప్ప ఆస్తులన్నీ తక్కువ ధరకే 'సేల్'లో లభిస్తాయి. ఆ సమయంలో వాటిని కొనుగోలు చేయడం ద్వారానే ధనవంతులు కావచ్చు" అని ఆయన వివరించారు. ఈ అవకాశాన్ని వాడుకొని అందరూ ఆర్థికంగా ఎదగాలని, ఎవరూ నష్టపోకూడదని ఆయన ఆకాంక్షించారు.అయితే కియోసాకి అంచనాలు భారతీయ ఇన్వెస్టర్లకు ఒక హెచ్చరిక వంటివి. ఒకవైపు ప్రపంచ మార్కెట్ల ప్రభావం భారతదేశంపై పడే అవకాశం ఉండగా, మరోవైపు బంగారం (Gold), వెండి (Silver) లేదా రియల్ ఎస్టేట్ (Real Estate) వంటి రంగాల్లో పెట్టుబడులు పెట్టే వారికి ఇది గొప్ప అవకాశంగా మారవచ్చు. కానీ, తగిన ఆర్థిక ప్రణాళిక లేకుండా మార్కెట్లోకి వెళ్లడం ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.ఇదీ చదవండి: స్టాక్ మార్కెట్లోకి దూసుకొస్తున్న ‘జెన్-జీ’IN THIS COMING CRASh possibly a Grest Drpression…. Will you be “FU’CD UP or LU’CD UP.”So far….in the crashes of 1987, 2000, 2008, 2015, 2019, 2022 I got richer not poorer.And again in coming giant crash of 2026-27….I plan on growing richer not poorer.I wish the same for…— Robert Kiyosaki (@theRealKiyosaki) April 28, 2026 -
బంగారం ఇక అలంకారం కాదు.. ఆస్తి
పసిడి కొనుగోళ్లలో ఆభరణాల వినియోగమే పెద్ద మొత్తంలో ఉంటోంది. కానీ, ఈ ధోరణిలో క్రమంగా మార్పు వస్తోంది. బంగారం ధరలు ఇటీవలి కాలంలో బాగా ర్యాలీ చేయడం తెలిసిందే. దీంతో వినియోగం కంటే పసిడిపై పెట్టుబడులకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2025–26) దేశంలో మొత్తం బంగారం కొనుగోళ్లలో పెట్టుబడుల వాటా 40 శాతానికి చేరుకుంటుందని రేటింగ్ సంస్థ కేర్ఎడ్జ్ అంచనా వేసింది. ఇక ఆభరణాల వినియోగం వాటా 60 శాతం లోపునకు దిగొస్తుందని పేర్కొంది. మన దేశంలో బంగారం కొనుగోళ్లలో దీర్ఘకాలం నుంచి ఆభరణాల వాటా 70 శాతంగా ఉంటుంటే, మిగిలిన 30 శాతం పెట్టుబడుల నుంచి ఉంటోంది. అంతర్జాతీయంగా చూస్తే మాత్రం ఆభరణాల వాటా పసిడి కొనుగోళ్లలో 50 శాతమే కావడం గమనార్హం. నిర్మాణాత్మక మార్పు.. దేశంలో బంగారం కొనుగోళ్లలో వస్తున్న నిర్మాణాత్మక మార్పునకు ఇది నిదర్శనమని కేర్ఎడ్జ్ డైరెక్టర్ అఖిల్ గోయల్ పేర్కొన్నారు. ప్రపంచంలో పసిడి వినియోగంలో భారత్ రెండో స్థానంలో ఉండడం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా బంగారం వినియోగంలో చైనా, భారత్ కలసి సగం వాటా కలిగి ఉండడం విశేషం. ‘‘భౌగోళిక రాజకీయ అనిశ్చితులు, బంగారం ధరల్లో కదలికలు, పోర్ట్ఫోలియోలో వైవిధ్యానికి పెరుగుతున్న ప్రాధాన్యం అన్నవి పసిడిపై పెట్టుబడుల డిమాండ్కు మద్దతుగా నిలుస్తాయి. 2026–27లో మొత్తం బంగారం వినియోగంలో పెట్టుబడి వాటా 35–40 శాతానికి చేరుతుంది. ఇక 60 శాతం ఆభరణాల వాటా అన్నది ప్రపంచ సగటు 50 శాతం కంటే ఎక్కువే’’అని అఖిల్ గోయల్ తెలిపారు. గోల్డ్ ఈటీఎఫ్లకు ఆదరణ.. పెట్టుబడుల్లో అధిక శాతం గోల్డ్ ఈటీఎఫ్ల రూపంలో ఉంటున్నట్టు కేర్ఎడ్జ్ నివేదిక తెలిపింది. ఒక్క గోల్డ్ ఈటీఎఫ్ల కొనుగోళ్లే 37.5 టన్నులు ఉంటాయని.. గత పదేళ్లలో మొత్తం పెట్టుబడుల కంటే ఇది ఎక్కువని పేర్కొంది. ఆ తర్వాత బంగారం కాయిన్లు, కడ్డీల రూపంలోఉంటోంది. స్వల్పకాల స్పెక్యులేటివ్ అవసరాలు కాకుండా.. డిమాండ్ ధోరణుల్లో నిర్మాణాత్మక మార్పుల నేపథ్యంలో బంగారం అధిక ధరల శ్రేణిలో కొనసాగనున్నట్టు కేర్ఎడ్జ్ తెలిపింది. ధరలు గరిష్ట స్థాయిలో ఉన్నప్పటికీ 2025లో ఆభరణాల వినియోగం బలంగా ఉందని, 10 శాతం పెరిగి రూ.4.8 లక్షల కోట్లకు చేరుకుందని వెల్లడించింది. ఆభరణాల కొనుగోళ్ల విలువ మాత్రం 15 శాతం తగ్గడం గమనార్హం. 2026లో ధరలు గరిష్ట స్థాయిల్లోనే ఉండొచ్చని కేర్ఎడ్జ్ అంచనా వేసింది.‘‘సంస్థాగత జ్యుయలరీ సంస్థలు గత ఆర్థిక సంవత్సరంలో 35 శాతం ఆదాయ వృద్ధిని నమోదు చేశాయి. ధరలు పెరిగినప్పటికీ వినియోగదారుల నుంచి ఆభరాణాలకు డిమాండ్ స్థిరంగా ఉంటోంది. కంపెనీల స్థూల మార్జిన్లు 170–200 బేసిస్ పాయింట్లు పెరుగుతాయని అంచనా. 2026–27లో స్థూల మార్జిన్లు 14–14.5 శాతానికి పరిమితం కావొచ్చు. ఎబిట్డా మార్జిన్లు 6.5–7 శాతం మేర ఉండొచ్చు’’అని తెలిపింది. వెండికి యువతరం కొనుగోలుదారుల నుంచి ఆసక్తి పెరుగుతున్నప్పటికీ సమీప కాలంలో బంగారాన్ని అది భర్తీ చేయలేదని పేర్కొంది. -
కొనసాగుతున్న బంగారం ధరల పతనం... గోల్డ్ కొన్నవారికి వరుస షాక్స్
-
బంగారం, వెండి ధరల్లో మార్పు: ఏడు రోజుల్లో ఇలా..
భారతదేశంలో గత వారం రోజులుగా బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో గోల్డ్ రేట్లలో స్వల్ప మార్పు జరిగాయి. ఈ కథనంలో ఏడు రోజుల్లో (ఏప్రిల్ 19 నుంచి 25 వరకు) పసిడి ధరలు ఎంత తగ్గాయి?, ప్రస్తుతం బంగారం ధరలు ఎలా ఉన్నాయనే విషయాలను తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడ నగరాల్లో ఏప్రిల్ 19 (ఆదివారం) 1,55,780 రూపాయల వద్ద ఉన్న 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేటు శనివారం (ఏప్రిల్ 25) నాటికి 1,54,040 రూపాయల వద్దకు చేరింది. 22 క్యారెట్ల గోల్డ్ రేటు ఏడు రోజుల్లో 1,42,800 రూపాయల నుంచి రూ.1,41,200 వద్దకు చేరింది.దేశ రాజధాని నగరంలో 24 క్యారెట్ల తులం బంగారం ధర వారం రోజుల్లో 1,55,930 రూపాయల దగ్గర నుంచి రూ.1,54,190 వద్దకు చేరింది. 22 క్యారెట్ల గోల్డ్ రేటు 1,42,950 రూపాయల నుంచి 1,41,350 రూపాయల వద్దకు చేరింది.చెన్నైలో బంగారం ధరలు తగ్గాయి. గత ఆదివారం (ఏప్రిల్ 19) రోజు రూ.1,56,660 వద్ద ఉన్న 24 క్యారెట్ల తులం పసిడి.. ఏప్రిల్ 25 నాటికి 1,54,910 రూపాయల వద్దకు చేరింది. 22 క్యారెట్ల గోల్డ్ రేటు 143600 రూపాయల వద్ద నుంచి 142000 రూపాయల వద్దకు చేరింది. దీన్ని బట్టి చూస్తే ధరలు ఎంతలా తగ్గాయో స్పష్టంగా తెలుస్తుంది.వెండి ధరలు ఇలా..బంగారం బాటలోనే.. వెండి కూడా అడుగులు వేసింది. ఏప్రిల్ 19న రూ.2.80 లక్షల వద్ద ఉన్న సిల్వర్ ఏప్రిల్ 25 (శనివారం) నాటికి రూ.2.70 లక్షల వద్దకు చేరింది. దేశంలోని ఇతర నగరాలతో పోలిస్తే.. ఢిల్లీలో వెండి రేటు కొంత తక్కువగా ఉన్నట్లు స్పష్టమవుతోంది.ఇదీ చదవండి: భారీగా బంగారం అమ్మేసిన రష్యా.. ఎందుకో తెలుసా? -
భారీగా బంగారం అమ్మేసిన రష్యా!
గ్లోబల్ మార్కెట్లో బంగారం ధరలు భారీగా పెరిగిపోతుంటే.. ప్రపంచంలోని చాలా దేశాలు మరింత ఎక్కువ గోల్డ్ కొనుగోలు చేయడానికికి పూనుకుంటున్నాయి. ఇలాంటి సమయంలో రష్యా ఏకంగా 22 టన్నుల బంగారం విక్రయించింది.2026 ప్రారంభం నుంచి రష్యా సుమారు 22,000 కేజీల గోల్డ్ విక్రయించింది. దీంతో ఏప్రిల్ 1 నాటికి దేశంలోని బంగారు నిల్వలు 0.7 మిలియన్ ట్రాయ్ ఔన్సులు తగ్గి 74.1 మిలియన్ ట్రాయ్ ఔన్సులకు చేరినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఈ విక్రయానికి ప్రధాన కారణం దేశ ఆర్థిక పరిస్థితి.పాశ్చాత్య దేశాల ఆంక్షలురష్యా - ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత పాశ్చాత్య దేశాలు రష్యాపై ఆంక్షలు విధించాయి. ఈ ఆంక్షల వల్ల రష్యా ఆదాయ వనరులు తగ్గిపోయాయి, ముఖ్యంగా చమురు.. గ్యాస్ రంగం తీవ్ర ప్రభావం ఎదుర్కొంది. ఫలితంగా ప్రభుత్వ ఖర్చులు పెరిగి, ఆదాయం తగ్గిపోవడంతో బడ్జెట్ లోటు భారీగా పెరిగింది.లోటు బడ్జెట్!2026 మార్చి నెలాఖరు నాటికి రష్యా బడ్జెట్ లోటు 61.2 బిలియన్ డాలర్లకు (సుమారు రూ. 5.8 లక్షల కోట్లు) పెరిగిన నేపథ్యంలో బంగారం విక్రయించాల్సి వచ్చింది. బడ్జెట్ లోటు సంవత్సరానికి అంచనా వేసిన మొత్తం లోటుకంటే కూడా చాలా ఎక్కువ. ఈ లోటును తగ్గించడానికి ప్రభుత్వం బంగారాన్ని అమ్మడం ప్రారంభించింది. అయితే.. రష్యా బంగారం అమ్మినప్పటికీ, అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు చాలా ఎక్కువగా ఉండటం వల్ల దేశ బంగారు నిల్వల మొత్తం విలువ పెరిగింది. ఇది ఒక ఆసక్తికరమైన అంశం. అంటే పరిమాణం తగ్గినా, విలువ పెరగడం జరిగింది.ఏటా 300 టన్నుల బంగారం ఉత్పత్తిప్రపంచంలో ఎక్కువ బంగారం ఉత్పత్తి చేసే దేశాల్లో.. రష్యా కూడా ఒకటి. ప్రతి ఏటా ఈ దేశం 300 టన్నుల బంగారం ఉత్పత్తి చేస్తుంది. అయితే ప్రస్తుతం ఆ దేశ ఆర్ధిక పరిస్థితిలో జరిగిన మార్పుల కారణంగా.. రష్యా 22 టన్నుల బంగారం విక్రయించాల్సి వచ్చిందని తెలుస్తోంది.ఇదీ చదవండి: దశాబ్దాల చరిత్ర.. రూ.221 కోట్లకు అమ్ముడైన బంగ్లా! -
భారీగా తగ్గిన బంగారం ధర.. తులం ఎంతంటే..?
-
ప్రభుత్వాసుపత్రిలో దారుణం.. శవంపై బంగారం మాయం
సాక్షి, జగిత్యాల: జగిత్యాల జిల్లా కేంద్రంలోని గవర్నమెంట్ హాస్పిటల్లో దారుణం జరిగింది. చనిపోయిన వృద్ధురాలికి ఉన్న బంగారు కమ్మలు మాయమయ్యాయి. కొడిమ్యాల మండలం నాచుపల్లికి చెందిన వృద్ధురాలు అనారోగ్యంతో బాధపడుతోంది. దీంతో ఆమెను బంధువులు.. ఐసీయూలో చేర్చారు.చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం వృద్ధురాలు ఉదయం మృతి చెందింది. వృద్ధురాలి మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లిన తర్వాత కమ్మలు కనిపించలేదు. ఆసుపత్రి సిబ్బందిపై వృద్ధురాలి బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సిబ్బందే తీసేశారంటూ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఆసుపత్రి వద్ద బంధువులు ఆందోళనకు దిగారు. -
పసిడి ప్రియులకు గుడ్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధర..
-
'2026లో సురక్షితమైన ఆస్తులు ఇవే': కియోసాకి
రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి (Robert Kiyosaki) చాలా సంవత్సరాలుగా ఆర్ధిక పరమైన అంశాలు, పెట్టుబడులకు సంబంధించిన విషయాలు చెబుతూనే ఉన్నారు. ఇప్పుడు 2026లో సురక్షితమైన ఆస్తుల గురించి వివరించారు.కియోసాకి ప్రకారం.. అమెరికా డాలర్ వంటి ప్రభుత్వ డబ్బు “నిజమైన సంపద కాదు”, ఎందుకంటే ప్రభుత్వం అవసరమైతే ఎక్కువ డబ్బు ముద్రించగలదు. ఇలా డబ్బు ముద్రించడం వల్ల దాని విలువ తగ్గిపోతుందని ఆయన అంటున్నారు. అందుకే ఆయన దీనిని “ఫేక్ మనీ” అని అంటారు.ప్రస్తుతం అమెరికా జాతీయ రుణం చాలా ఎక్కువగా ఉందని, రోజుకి బిలియన్ల డాలర్ల రుణం పెరుగుతుందని.. దీని వల్ల ఆర్థిక వ్యవస్థ భవిష్యత్తులో ప్రమాదంలో పడవచ్చని కియోసాకి అభిప్రాయం.కియోసాకి చెప్పిన సురక్షితమైన ఆస్తులుబంగారం (Gold)వెండి (Silver)చమురు (Oil)ఆహారం (Food)బిట్కాయిన్ (Bitcoin)ఈథీరియం (Ethereum)కియోసాకి అభిప్రాయం ప్రకారం.. పరిమితంగా ఉండే వనరులు విలువైనవి. ఎందుకంటే వాటిని అంత సులభంగా తయారు చేయలేము. కాబట్టి వీటి విలువ క్రమంగా పెరుగుతుందని విశ్వసిస్తారు.బంగారం, వెండిబంగారం ధర ఈ ఏడాది ప్రారంభం నుంచి భారీగా పెరిగింది. ప్రపంచంలో ఆర్ధిక అనిశ్చితి పెరిగినప్పుడు వీటి విలువ పెరుగుతుంది. కాబట్టి దీనిపై పెట్టె పెట్టుబడులు ప్రజలను ధనవంతులను చేస్తుంది. లేదా కష్టకాలంలో ఆర్ధిక పరమైన ఇబ్బందుల నుంచి విముక్తి కల్పిస్తుంది.క్రిప్టో కరెన్సీకియోసాకి బిట్కాయిన్, ఈథీరియంను భవిష్యత్తు డిజిటల్ ఆస్తులుగా చూస్తున్నారు. ఇవి కూడా ప్రభుత్వ నియంత్రణలో లేవు కాబట్టి సంప్రదాయ డబ్బుకు ప్రత్యామ్నాయంగా ఉంటాయని ఆయన భావిస్తున్నారు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. ఇందులో పెట్టుబడి పెట్టడం అంటే కొంత రిస్క్ కూడా ఎదుర్కోవాలి ఉంటుంది.చమురు, ఆహారంచమురు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు మౌలిక అవసరం. యుద్ధాలు లేదా సరఫరా సమస్యలు దెబ్బతింటే ధరలు పెరుగుతాయి. అదే విధంగా ఆహార ధరలు కూడా ఇంధన ధరలపై ఆధారపడి ఉంటాయి. అందుకే ఇవి కూడా 'అవసరమైన ఆస్తులు' అని కియోసాకి అభిప్రాయం.కియోసాకి చెప్పిన ఈ మాటలతో కొందరు ఏకీభవించగా.. మరికొందరు విమర్శించారు. ఎందుకంటే ఆయన చెప్పిన ప్రతి అంచనా నిజం కాలేదు కాబట్టి. దీనిని దృష్టిలో ఉంచుకుని కొంతమంది ఆర్ధిక నిపుణులు ఒకే రకమైన పెట్టుబడులపై పూర్తిగా ఆధారపడకూడదని సూచిస్తారు.ఇదీ చదవండి: ప్రయాణం ప్రత్యేకం.. ఈ మార్గాల్లో డబుల్ డెక్కర్ రైళ్లు! -
ఉలుకు పలుకు లేని ధరలు
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
అందుకే.. గోల్డ్ రేటు తగ్గింది!
గత కొంత కాలంగా.. పెరుగుతూ ఉన్న గోల్డ్ రేటు ఈ రోజు (ఏప్రిల్ 20) కొంత తగ్గుముఖం పట్టింది. అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం ధరలు ఒక శాతం కంటే ఎక్కువగా పడిపోయాయి. దీనికి కారణం ఏమిటి?, ఇతర లోహాల పరిస్థితి ఏమిటి? అనే విషయాలు ఈ కథనంలో చూసేద్దాం.పసిడి ధరలు తగ్గడానికి ప్రధాన కారణం.. అమెరికా డాలర్ బలపడటం. సాధారణంగా డాలర్ విలువ పెరిగితే.. ఇతర కరెన్సీల్లో బంగారం కొనుగోలు చేసే వారు మరింత వెచ్చించాల్సి ఉంటుంది. కాబట్టి డిమాండ్ తగ్గి ధరలు పతనమవుతాయి.భారతదేశంలో ఇలా..భారతదేశంలో కీలకమైన పండుగల సమయంలో బంగారం కొనుగోళ్లు సాధారణంగా ఎక్కువగా ఉంటాయి. కానీ ఈసారి అక్షయ తృతీయ సందర్భంగా ధరలు చాలా ఎక్కువగా ఉండటంతో జువెలరీ డిమాండ్ తగ్గింది. అయితే పెట్టుబడి రూపంలో బంగారం కొనుగోలు కొంత పెరిగింది. ఇతర లోహాల విషయానికి వస్తే, వెండి ధర 1.7% తగ్గింది. ప్లాటినం, పల్లాడియం కూడా స్వల్పంగా తగ్గాయి.ప్రపంచ రాజకీయ ఉద్రిక్తతలు..మరోవైపు.. ప్రపంచ రాజకీయ ఉద్రిక్తతలు మార్కెట్లపై ప్రభావం చూపించాయి. ముఖ్యంగా అమెరికా - ఇరాన్ మధ్య శాంతి చర్చలు సరిగ్గా ముందుకు సాగకపోవడం, మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు పెరగడం వల్ల చమురు ధరలు పెరిగాయి. చమురు సరఫరా అంతరాయం కలగవచ్చనే భయం పెట్టుబడిదారుల్లో కనిపించింది. దీని వల్ల స్టాక్ మార్కెట్లు కూడా ఒడిదుడుకులకు లోనయ్యాయి.అమెరికా ఒక ఇరానియన్ కార్గో షిప్ను స్వాధీనం చేసుకోవడం, దానికి ప్రతీకారం తీసుకుంటామని ఇరాన్ హెచ్చరించడం వంటి పరిణామాలు పరిస్థితిని మరింత తీవ్రం చేశాయి. ఇప్పటికే అమలులో ఉన్న తాత్కాలిక ఒప్పందం కూడా ఎక్కువకాలం నిలవకపోవచ్చనే అనుమానాలు పెరిగాయి. అంతే కాకుండా.. ఇరాన్ తదుపరి చర్చల్లో పాల్గొనబోమని ప్రకటించడం కూడా అనిశ్చితిని పెంచింది.ద్రవ్యోల్బణ భయం!అమెరికా ఫెడరల్ రిజర్వ్ అధికారి క్రిస్టోఫర్ వాలర్ మాట్లాడుతూ.. ఈ యుద్ధ పరిస్థితులు తాత్కాలికంగా ద్రవ్యోల్బణం పెంచవచ్చని చెప్పారు. అయితే పరిస్థితి త్వరగా సద్దుమణిగితే భవిష్యత్తులో వడ్డీ రేట్లు తగ్గించే అవకాశం ఉందని సూచించారు.ఇదీ చదవండి: TCS నాసిక్ కేసు: వెలుగులోకి ఊహకందని విషయాలు! -
ఇవి తెలియకుండా బంగారం కొంటే మీకే నష్టం!
భారతీయులకు బంగారం కేవలం ఆభరణం మాత్రమే కాదు, అది ఒక సెంటిమెంట్.. ఆపదలో ఆదుకునే ఆర్థిక భరోసా. అయితే, మీరు కష్టపడి సంపాదించిన డబ్బుతో కొనే బంగారం ఎంతవరకు స్వచ్ఛమైనది? ఆకర్షణీయమైన ఆఫర్ల వెనుక దాగున్న నాణ్యత లోపాలను ఎలా గుర్తించాలి? అనే సందేహం కలుగుతుందా? బంగారం కొనుగోలు చేసేటప్పుడు బీఐఓఎస్ హాల్మార్కింగ్, ఆరు అంకెల హెచ్యూఐడీ నంబర్ ప్రాధాన్యతను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. మెరిసేదంతా బంగారం కాదని గుర్తుంచుకోండి. మీ పెట్టుబడికి పూర్తి రక్షణ కల్పించే పక్కా బిల్లు రహస్యాలు, ఆధునిక పరీక్షల గురించి మరిన్ని వివరాలు చూద్దాం.హాల్మార్కింగ్: ఈ మూడు గుర్తులు ఉన్నాయా?ప్రస్తుతం విక్రయించే ప్రతి బంగారు ఆభరణంపై బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) నిబంధనల ప్రకారం హాల్మార్కింగ్ తప్పనిసరి. మీరు కొనే నగపై ఈ మూడు గుర్తులు ఉన్నాయో లేదో పరీక్షించండి.బీఐఎస్ లోగో: త్రిభుజాకారంలో ఉండే ఈ గుర్తు ఆ ఆభరణం ప్రభుత్వం నిర్దేశించిన నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా ఉందని ధ్రువీకరిస్తుంది.బంగారం స్వచ్ఛతను క్యారెట్లలో సూచిస్తారు.22K916: అంటే అది 22 క్యారెట్ల బంగారం, అందులో 91.6% స్వచ్ఛత ఉంటుంది.18K750: వజ్రాలు లేదా ఇతర విలువైన రాళ్లు పొదిగిన నగలకు సాధారణంగా 75% స్వచ్ఛత కలిగిన ఈ బంగారాన్ని వాడతారు.హెచ్యూఐడీ నంబర్ (హాల్మార్క్ యూనిక్ ఐడెంటిఫికేషన్): ఇది అత్యంత ముఖ్యమైనది. ప్రతి ఆభరణానికి ఆరు అంకెలతో కూడిన ప్రత్యేక ఆల్ఫాన్యూమరిక్ కోడ్ (ఉదా: AZ1234) ఉంటుంది.బీఐఎస్ కేర్ యాప్తో డిజిటల్ వెరిఫికేషన్మీరు కొన్న నగ అసలైనదో కాదో తెలుసుకోవడం ఇప్పుడు చాలా సులభం. మీ స్మార్ట్ఫోన్లో ప్రభుత్వ అధికారిక బీఐఎస్ కేర్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. యాప్లోని ‘Verify HUID’ సెక్షన్లోకి వెళ్లి నగపై ఉన్న ఆరు అంకెల కోడ్ను ఎంటర్ చేయండి. వెంటనే ఆ నగను ఏ జ్యువెలర్ రిజిస్టర్ చేశారు? ఏ హాల్మార్కింగ్ సెంటర్ పరీక్షించింది? నగ స్వచ్ఛత ఎంత? వంటి వివరాలన్నీ స్క్రీన్పై కనిపిస్తాయి. షాపు వారు ఇచ్చే ట్యాగ్తో ఈ వివరాలను సరిపోల్చుకోండి.క్యారెట్ మీటర్, మ్యాగ్నెట్ టెస్ట్నగలను కట్ చేయకుండానే వాటిలోని లోహాల శాతాన్ని (బంగారం, వెండి, రాగి) తెలుసుకోవడానికి ఎక్స్ఆర్ఎఫ్ (X-Ray Fluorescence) మెషీన్లు వాడతారు. చాలా మంది పెద్ద వ్యాపారుల వద్ద ఇవి ఉంటాయి. కేవలం 30 సెకన్లలోనే ఇది రిజల్ట్ ఇస్తుంది. నగలను మీ ముందే స్కాన్ చేయమని అడగడం మీ హక్కు.మ్యాగ్నెట్ పరీక్ష: బంగారం అయస్కాంత పదార్థం కాదు. ఒకవేళ నగ అయస్కాంతానికి ఆకర్షితమైతే అందులో ఇనుము, నికెల్ లేదా కోబాల్ట్ వంటి ఇతర లోహాల కల్తీ ఉందని అర్థం.ట్యాక్స్ ఇన్వాయిస్ తప్పనిసరికొనుగోలు చేసిన తర్వాత వివరణాత్మకమైన టాక్స్ ఇన్వాయిస్ తీసుకోవడం మర్చిపోవద్దు. ఆ బిల్లులో వివరాలు స్పష్టంగా ఉండాలి.ప్రతి వస్తువు హెచ్యూఐడీ నంబర్.బంగారం బరువు, దాని స్వచ్ఛత.ఆ రోజు ఉన్న మార్కెట్ రేటు.తయారీ ఖర్చులు, జీఎస్టీ.ఇదీ చదవండి: డిమాండ్ భళా.. నిర్మాణాలు డీలా! -
సరిగా కొంటేనే.. బంగారం!
ధర ఎంతన్నా ఉండనివ్వండి. బంగారమనేది మన సంస్కృతి సంప్రదాయాల్లో భాగం. తరతరాలుగా పుత్తడికి ప్రాధాన్యం పెరుగుతోందే తప్ప తగ్గటం లేదు. ఇంటింటా ఆభరణాల రూపంలో మురిపిస్తూనే, ఆర్థికంగా కూడా భరోసాను కల్పించే సాధనంగా పనికొస్తోంది. అయితే, అంతర్జాతీయ పరిణామాల దెబ్బతో ఒకసారి అయిదు వేలు పెరిగితే, ఇంకోసారి పదివేలు పడిపోయి.. బంగారం రేట్లు సృష్టిస్తున్న గందరగోళం అంతా ఇంతా కాదు.ఇలాంటి పరిస్థితుల్లో ఇటీవల ఎమోషనల్ కారణంతోనో, పెట్టుబడి కోసమో ఆభరణాలు, నాణేల రూపంలో కొనుక్కుని పెట్టుకున్న వారిలోను, కొనుక్కోవాలనుకుంటున్న వారిలోనూ ఆందోళన నెలకొంటోంది. ఈ నేపథ్యంలో క్రమంగా పుత్తడిని చూసే తీరు మారుతోంది. కేవలం ఆభరణంగానో లేదా భావోద్వేగాలతో ముడిపడిన ఆస్తిగానో చూడటం కాకుండా పెట్టుబడి కోణంలో చూసే ధోరణి పెరుగుతోంది. యువ ఇన్వెస్టర్లు తమ సౌకర్యార్థం, లిక్విడిటీ కోసం క్రమంగా ఈటీఎఫ్లు, డిజిటల్ గోల్డ్ వైపు మళ్లుతున్నారు. పుత్తడిని ఎమోషనల్గా కొనుక్కోవడం కాకుండా వ్యూహాత్మకంగా ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇదే సరైన విధానమన్నది విశ్లేషకుల మాట.తయారీ.. తరుగుతో కోత..మార్కెట్లో మెరుగైన ప్రత్యామ్నాయాలు అందుబాటులో ఉన్నప్పటికీ, చాలా మంది ఇన్వెస్టర్లు జ్యుయలరీ రూపంలో కొన్న బంగారాన్ని కూడా పెట్టుబడిగానే పరిగణిస్తుంటారు. అనుబంధం, సంప్రదాయాలపరంగా ఆభరణాలు, నాణేల రూపంలో బంగారానికి ఎంతో విలువ ఉన్నప్పటికీ, ఆర్థిక కోణంలో చూస్తే మాత్రం భౌతికరూపంలోని పసిడి కొనుగోలు విధానంలో లోటుపాట్లు ఎక్కువ. తయారీ చార్జీల కారణంగా వీటి విలువ కొనుక్కోగానే 10–15 శాతం తగ్గిపోతుంది. రూ. 1 లక్ష విలువ చేసే బంగారు ఆభరణాన్ని కొన్నప్పుడు, సాధారణంగా రూ. 10,000 నుంచి రూ. 15,000 వరకు మేకింగ్ చార్జీల కింద పోతుంది. అంటే మనం వాస్తవానికి రూ. 85,000–90,000 విలువ చేసిన బంగారమే కొన్నట్లవుతుంది. ఇక మళ్లీ రీసేల్ చేయాలంటే తరుగు అంటూ తీసేస్తారు. దీంతో సదరు బంగారు ఆభరణంపై వచ్చే రాబడి మరింత తగ్గిపోయినట్లవుతుంది. ఇదిగాకుండా వీటిని సురక్షితంగా భద్రపర్చుకోవడం మరో ఎత్తు. ఇక తిరిగి విక్రయించినప్పుడు, రేట్లు భారీగా పెరిగితే తప్ప, రీసేల్ విలువ తక్కువే వస్తుంది. ఆ రకంగా పెట్టుబడుల కోణంలో చూస్తే ఇది అంత లాభసాటి వ్యవహారంగా ఉండదు.పసిడిపై మళ్లీ ఫోకస్దేశ, విదేశ పరిణామాలతో ఇటీవలి కాలంలో పసిడికి మళ్లీ ప్రాధాన్యం పెరిగింది. అంతర్జాతీయంగా పెరుగుతున్న ఆర్థిక అనిశి్చతి, ఈక్విటీలు తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవుతుండటం, కరెన్సీ బలహీనపడుతుండటంలాంటి అంశాలు మళ్లీ బంగారంపై ఇన్వెస్టర్లలో ఆసక్తిని పెంచుతున్నాయి. సాధారణంగా ఇలాంటి పరిస్థితుల్లో పసిడి సురక్షితమైన పెట్టుబడి సాధనం పాత్రను పోషిస్తుంది. మిగతా ఆర్థిక సాధనాలు ఒడిదుడుకులకు లోనవుతున్నప్పుడు ఇది స్థిరత్వాన్ని అందిస్తుంది. ఇదీ... నయా రూట్ఇలాంటివన్నీ చూశాకేనేమో... ఇపుడు పుత్తడిలో పెట్టుబడులు పెట్టే విధానంలో గణనీయంగా మార్పులొచ్చాయి. గోల్డ్ ఎక్సే్చంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్) ప్రత్యామ్నాయంగా తెరపైకి వచ్చాయి. పసిడి ధరలకు అనుగుణంగా ఉండే ఈ ఈటీఎఫ్లను షేర్లలాగానే స్టాక్ ఎక్స్ఛేజీల్లో కొనుక్కోవచ్చు. అమ్ముకోవచ్చు. వీటిని కావాల్సినప్పుడు కొనుక్కుని, అమ్ముకునేందుకు (లిక్విడిటీ) వీలు, పారదర్శకత ఉంటుంది. భౌతికంగా భద్రపర్చుకోవాల్సిన అవసరం తగ్గుతుంది. ఇంత వెసులుబాటు ఉన్నందుకే ఇన్వెస్టర్లు వీటివైపు చూడటం పెరుగుతోంది. ఇక కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన సావరీన్ గోల్డ్ బాండ్స్ (ఎస్జీబీ) కూడా గతంలో వచ్చాయి. పసిడి ధరను ట్రాక్ చేసే ఈ బాండ్లపై వార్షికంగా అదనంగా 2.5 శాతం వడ్డీ కూడా ఇవ్వడంతో పాటు క్యాపిటల్ గెయిన్స్ నుంచి కూడా మినహాయింపు లభించేలా వీటిని తీర్చిదిద్దారు. ప్రస్తుతం ఈ విధానంలో కొన్ని మార్పులు వచి్చ, కొత్త బాండ్ల జారీ ఆగినప్పటికీ, గతంలో జారీ చేసినవి అలాగే కొనసాగుతున్నాయి. పోర్ట్ఫోలియోకి భద్రతపోర్ట్ఫోలియోను సమతూకంతో ఉంచడంలో పసిడి చాలా కీలక పాత్ర పోషిస్తుంది. పసిడి పెట్టుబడుల విషయంలో క్రమశిక్షణతో వ్యవహరిస్తే చాలా ఉపయోగకరం. ఈక్విటీల తరహాలో భారీ రిటర్నుల కోసం కాకుండా, స్థిరత్వానికి, డైవర్సిఫికేషన్ కోసం ఇది ఉపయోగపడుతుంది. సాధారణంగా 10–15 శాతం పసిడికి, సుమారు 60 శాతం ఈక్విటీలకి, 25 శాతం డెట్ సాధనాలకు కేటాయిస్తే పోర్ట్ఫోలియో సమగ్రంగా ఉంటుంది. దీనివల్ల ఆర్థిక అనిశ్చితి నెలకొన్నప్పుడు రిసు్కలు తగ్గుతాయి. గోల్డ్ ఈటీఎఫ్లు లిక్విడిటీతో పాటు స్వల్పకాలిక అవసరాల కోసం, పోర్ట్ఫోలియోలో పరిస్థితులకు తగ్గట్లుగా మార్పులు, చేర్పులు చేసుకునేందుకు ఉపయోగపడతాయి.నాణేలు, ఆభరణాలతో ప్రతికూలం..మేకింగ్ చార్జీల రూపంలో కొనగానే 10–15%తరుగుతో రీసేల్ విలువలోనూ కోతఆభరణం కొనుగోలు ధర: రూ. 1,00,000మేకింగ్ చార్జీలు : రూ. 10,000 15,000వాస్తవంగా బంగారం ధర: రూ.85,000-90,000పోర్ట్ఫోలియో కేటాయింపు ఇలా..ఈక్విటీ 60 శాతండెట్ 25 శాతంపసిడి 10-15 శాతంఇదీ చదవండి: ‘న్యూడిఫై’ యాప్లతో కాసుల వేట! -
అక్షయ తృతీయ ఆఫర్స్.. కిక్కిరిసిన బంగారం షాపులు
-
డిజిటల్ గోల్డ్కు అక్షయ తృతీయ మెరుపులు
న్యూఢిల్లీ: అక్షయ తృతీయ సందర్భంగా ఈసారి ఆభరణాలు, నాణేలతో పాటు డిజిటల్ రూపంలో కూడా బంగారం కొనుగోళ్లపై కూడా గణనీయంగా ఆసక్తి నెలకొనే అవకాశం ఉందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. డిజిటల్ గోల్డ్ని మరింత సులభతరంగా, పారదర్శకంగా కొనుగోలు చేసే అవకాశాలు ఉండటం ఇందుకు దోహదపడుతుందని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కమోడిటీస్ విభాగం రీసెర్చ్ హెడ్ నవనీత్ దమానీ, అనలిస్ట్ మానవ్ మోదీ ఒక నివేదికలో తెలిపారు.పసిడి ప్రస్తుతం అంతర్జాతీయంగా సంక్లిష్టమైన పరిస్థితులు ఎదుర్కొంటోందని పేర్కొన్నారు. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, గ్లోబల్ వృద్ధి మందగించడం, మానిటరీ పాలసీ అంచనాల్లో మార్పులు తదితర అంశాల కారణంగా 2026లో బులియన్ మార్కెట్ ఒడిదుడుకులకు లోనవుతోందని తెలిపారు. మధ్య మధ్యలో కరెక్షన్కి లోనైనప్పటికీ సురక్షిత పెట్టుబడి సాధనాలకు డిమాండ్ నెలకొనడంతో పసిడి, వెండి వరుసగా 10, 5 శాతం మేర పెరిగాయని వివరించారు. -
721 టన్నుల బంగారం దిగుమతి
న్యూఢిల్లీ: బంగారం దిగుమతులు గత ఆర్థిక సంవత్సరంలో (2025–26) కొత్త రికార్డులకు చేరాయి. 71.98 బిలియన్ డాలర్ల (రూ.6,69,414 కోట్లు) విలువైన బంగారం దిగుమతి అయింది. 2024–25 సంవత్సరంలో 58 బిలియన్ డాలర్ల దిగుమతులతో పోల్చి చూస్తే 24 శాతం పెరిగాయి. పరిమాణం పరంగా చూస్తే తగ్గుదల కనిపిస్తోంది. 2024–25లో 759.09 టన్నుల బంగారం దేశంలోకి దిగుమతి కాగా, గత ఆర్థిక సంవత్సరంలో 4.76 తక్కువగా 721.03 టన్నులకు పరిమితమయ్యాయి. బంగారం ధర గణనీయంగా పెరగడంతో, విలువ అధికంగా ఉన్నప్పటికీ పరిమాణం తగ్గినట్టు వాణిజ్య శాఖ గణాంకాల ఆధారంగా స్పష్టమవుతోంది. 2023–24లో 45.54 బిలియన్ డాలర్లు, 2022–23లో 35 బిలియన్ డాలర్ల విలువైన బంగారం దిగుమతులు నమోదయ్యాయి. చైనా తర్వాత భారత్ రెండో అతిపెద్ద పసిడి వినియోగ మార్కెట్గా ఉండడం గమనార్హం. ప్రధానంగా ఆభరణాల నుంచే ఎక్కువ డిమాండ్ ఉంటోంది. → వెండి దిగుమతుల విలువ సైతం గత ఆర్థిక సంవత్సరంలో 150 % పెరిగి 12 బిలియన్ డాలర్లుగా ఉంది. పరిమాణం పరంగానూ 42 % పెరిగి 7,335 టన్నుల మేర ఉంది. → బంగారం కిలో ధర 2024–25లో 76,617 డాలర్లుగా ఉంటే, 2025–26లో 99,825 డాలర్లకు చేరడం దిగుమతుల విలువ పెరిగేందుకు దారితీసింది. → అత్యధికంగా స్విట్జర్లాండ్ నుంచి 40 శాతం మేర బంగారం దిగుమతి కాగా, యూఏఈ నుంచి 16%, దక్షిణాఫ్రికా నుంచి 10% చొప్పున వచ్చింది. దేశ మొత్తం దిగుమతుల్లో పసిడి వాటా 5 శాతంగా ఉంటుంది. → స్విట్జర్లాండ్ నుంచి బంగారం దిగుమతులు అంతక్రితం ఆర్థిక సంవత్సరంతో పోల్చితే 11.36 శాతం పెరిగి 24.27 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. -
ఈ ఆభరణాలూ సువర్ణాలే!
ప్రపంచం ఏమైనా సరే, యుద్ధాలు వచ్చినా, ఆర్థిక మాంద్యం తలుపు తట్టినా మన మధ్యతరగతిని వణికించేవి రెండు మాత్రమే! మొదటిది ఇంధన ధరలు, రెండోది బంగారం ధరలు. ఇప్పుడు బంగారం ధర ఆకాశానికెక్కి, అందని నక్షత్రంలా మెరుస్తోంది. బంగారం కేవలం లోహం మాత్రమే కాదు, తరతరాల సంప్రదాయం కూడా! నేటి ట్రెండ్, రేపటి భద్రత. ‘ఏమైనా సరే, నగలు కొనాల్సిందే!’ అనుకునే వారికి రంగు రంగుల్లో దొరికే బంగారు మిశ్రమ లోహాలు సహా పలు ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. అక్షయ తృతీయ సందర్భంగా బడ్జెట్లోనే మెరిపించే బంగారు మార్గాల గురించిన ప్రత్యేక కథనం...బంగారానికి ప్రత్యామ్నాయ లోహాలు...బంగారం అంటే భారతీయులకు తగని మోజు. ముఖ్యంగా భారతీయులకు బంగారం చూసినప్పుడల్లా దాని మెరుపు మాయలో పడిపోవటం అలవాటు. కాని ఇప్పుడు దానిని తాకగానే, బడ్జెట్ ఒక్కసారిగా సీరియస్ అయి ఇబ్బంది పెడుతుంది. అందుకే ఇప్పుడు మార్కెట్లో ఒక కొత్త కథ మొదలైంది. ‘బంగారం మాత్రమే కాదు, మేమూ ఉన్నాం’ అని చెప్పే లోహాలు ఫ్యాషన్ రంగంలోకి అడుగుపెట్టాయి. పెరుగుతున్న ధరలు, రోజురోజుకీ మారుతున్న ఫ్యాషన్ ట్రెండ్స్, తేలికగా ఉండే డిజైన్లపై పెరుగుతున్న ఆసక్తి, ఇలా ఇవన్నీ కలిసి బంగారానికి ప్రత్యామ్నాయ ఆభరణాలుగా మారి చిన్న చిన్న తారల్లా తళుక్కుమంటున్నాయి.పైగా ఇవి సరసమైన ధరల్లో దొరుకుతుండటమే కాకుండా, స్టయిల్లో కూడా తగ్గేదే లేదంటూ సూపర్ మోడల్స్లా మెరిసిపోతున్నాయి. దీంతో అన్ని వయసుల వారూ వీటిపై ఆసక్తి చూపుతున్నారు. ఒకప్పుడు బంగారం మాత్రమే వివాహాది శుభకార్యాలకు తప్పనిసరి ఎంపికగా ఉండేది. ఇప్పుడు ఆ ఎంపికల ప్రపంచం పెద్దదైంది. అందుకే ఇప్పుడు ఈ ‘న్యూ హీరోస్’ గురించి తెలుసుకోవడం కూడా ఒక చిన్న ఫ్యాషన్ అడ్వెంచర్లాంటిదే!ప్లాటినమ్ – లగ్జరీ లెజెండ్ జ్యూలరీ ప్రపంచంలో ఒక సైలెంట్ కింగ్ ప్లాటినమ్. ఎక్కువ హడావిడి చేయకుండా, తన క్లాస్తోనే అందరినీ ఆకట్టుకుంటుంది. సహజంగా వెండిలాంటి తెల్లటి మెరుపుతో కనిపించే ఈ లోహం చాలా బలమైంది. కాలం గడిచినా తన అందాన్ని కోల్పోదు. అందుకే ‘ఒకసారి కొనిస్తే, సంవత్సరాలు గడిచినా కొత్తదానిలానే మెరిసిపోతుంది’ అంటారు. చరిత్రలో కూడా ప్లాటినమ్ రాజరికపు కథలతో నిండిపోయింది. ఒకప్పుడు ఇది చాలా అరుదుగా దొరికే లోహం కావడం వల్ల రాజులు, ధనవంతులు మాత్రమే దీనితో నగలు చేయించుకునేవారు.ఆ కాలంలో ప్లాటినమ్ ధర కేవలం డబ్బుతో కాదు, ప్రతిష్ఠతో కూడా కొలిచేవారు. ఇప్పటికీ పెళ్లి ఉంగరాలు, ఎంగేజ్మెంట్ రింగ్స్, ప్రీమియం జ్యూలరీలో ప్లాటినమ్ను ఒక శాశ్వత బం«ధానికి గుర్తుగా భావిస్తారు. స్క్రాచ్లు వచ్చినా, వేడి, చెమట, నీరు ఏదైనా సరే తన మెరుపును అలాగే నిలబెట్టుకుంటుంది. అందుకే మెడికల్ పరికరాలు, ఆధునిక సాంకేతిక పరికరాల తయారీ రంగాల్లో కూడా ప్లాటినమ్ కీలక పాత్ర పోషిస్తోంది. ధరలో సాధారణంగా బంగారంతో సమానంగా, కొన్నిసార్లు కొంచెం ఎక్కువ ధరలో లభిస్తుంది. వెండి – బంగారానికి దగ్గరి బంధువుప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా లభించే విలువైన లోహం వెండి. ఇది బంగారానికి దగ్గరి బంధువు లాంటిది. మెరుపులో ఏమాత్రం తగ్గదు, కానీ ఖర్చులో మాత్రం మనసుకు కాస్త హాయినిస్తుంది. బంగారం కంటే ఎక్కువగా అందుబాటులో ఉండటం వల్ల వెండి తక్కువ ధరలో సులభంగా దొరుకుతుంది. అయితే వెండి కథ కేవలం ఫ్యాషన్ తోనే మొదలైపోలేదు; దానికి గొప్ప చరిత్ర, సంప్రదాయం కూడా ఉన్నాయి.పురాతన కాలంలో రాజులు, సంపన్నులు వెండి పాత్రల్లోనే భోజనం చేసేవారు. ఆరోగ్యానికి మంచిదని, నీటిని శుభ్రంగా ఉంచుతుందని నమ్మకం ఉండేది. అందుకే ఇప్పటికీ చాలా ఇళ్లలో చిన్నపిల్లలకు వెండి గ్లాస్, వెండి చెంచా వాడే సంప్రదాయం కొనసాగుతోంది. అంతేకాదు, వెండి సహజంగా బ్యాక్టీరియాను తగ్గించే లక్షణం కలిగి ఉంటుంది. అందుకే పాతకాలంలో చిన్న గాయాలకు కూడా వెండి పూత వాడేవారు. అలాగే పండుగల సమయంలో, ముఖ్యంగా శుభకార్యాల్లో వెండి నాణేలను కానుకగా ఇవ్వడం శుభప్రదంగా భావిస్తారు. ఇక పరిశ్రమల ప్రపంచంలో కూడా వెండి ఒక ట్రెండీ హీరోనే. ఇప్పుడు ఫ్యాషన్ రంగంలోనూ అడుగుపెట్టి రోజువారీ నగలు, స్టయిలిష్ అండ్ సింపుల్ గొలుసులు, మోడ్రన్ జ్యూలరీ డిజైన్ల రూపంలో అందరి చేతుల్లో మెరిసిపోతోంది. సింపుల్గా చెప్పాలంటే సంప్రదాయం, ఆరోగ్యం, స్టయిల్, అందుబాటు ఈ నాలుగు కలిసి వెండిని ఒక స్మార్ట్ చాయిస్గా నిలబెడుతున్నాయి.పలేడియమ్ – సైలెంట్ స్టార్పలేడియమ్ ప్లాటినమ్ కుటుంబానికి చెందిన అరుదైన లోహం. అందుబాటు కొంచెం తక్కువే, కానీ స్టయిల్లో మాత్రం ఫుల్ మార్కులు కొట్టేస్తుంది. మొదట్లో ఇది పెద్దగా ఫ్యాషన్ లో కనిపించలేదు. కాని, ఇప్పుడు వెడ్డింగ్ రింగ్స్, ప్రీమియం డైలీ వేర్ జ్యూలరీలో ఇది సైలెంట్గా ట్రెండ్ సెట్ చేస్తోంది. సహజంగా తెల్లటి మెరుపుతో ఉండటం వల్ల ప్రత్యేక కోటింగ్ అవసరం లేకుండా సింపుల్గా మెరిసిపోతుంది. మెయింటెనెన్స్ తక్కువ, బరువు తక్కువ, లుక్ మాత్రం హై–ఎండ్. ఇదే దీని అసలు స్టయిల్ సీక్రెట్. 19వ శతాబ్దంలో శాస్త్రవేత్తలు దీనిని కనుగొన్నారు.ఆ తర్వాత కాలక్రమేణా జ్యూలరీ ప్రపంచం దాని ప్రత్యేకతను గుర్తించింది. ముఖ్యంగా వైట్ గోల్డ్కు ఒక సులువైన ప్రత్యామ్నాయంగా దీనిని భావిస్తున్నారు. ధర విషయానికి వస్తే, పలేడియమ్కు కూడా కొంచెం మూడ్ స్వింగ్స్ ఉన్నాయి. కొన్ని రోజులు బంగారంతో పోలిస్తే తక్కువ ధరలో ఉంటుంది, మరికొన్ని రోజులు ‘నేను కూడా లగ్జరీనే!’ అని అంటుంది. బడ్జెట్కి పెద్ద షాక్ ఇవ్వకుండా లగ్జరీ ఫీలింగ్ ఇచ్చే స్మార్ట్ ఎంపికగా పలేడియమ్ నిలుస్తోంది.టైటానియమ్ – ఫ్యూచర్ మెటల్ టైటానియమ్ అంటే మోడర్న్ జ్యూలరీ ప్రపంచంలోకి కొత్తగా అడుగుపెట్టిన హీరోయిన్. బరువు తక్కువ, బలం ఎక్కువ. ఇదే దీని అసలైన స్టయిల్. చేతిలో పెట్టుకున్నప్పుడు లైట్గా అనిపించినా, మన్నికలో మాత్రం స్టీల్కే చాలెంజ్ చేస్తుంది. అందుకే స్పోర్టీ లుక్ కోరుకునే వారికి టైటానియమ్ బెస్ట్ చాయిస్. అయితే, టైటానియమ్ మొదట విమానాలు, రాకెట్ల తయారీలో ఉపయోగించారు.అక్కడ తన దారుఢ్యాన్ని నిరూపించుకున్న తర్వాతే ఇది ఫ్యాషన్ ప్రపంచంలోకి అడుగుపెట్టింది. ఇప్పుడు మెన్స్ జ్యూలరీ, స్మార్ట్ వాచ్ స్ట్రాప్స్, ఫ్యాషన్ యాక్సెసరీస్లో ఇది ఫుల్ స్పీడ్తో ట్రెండ్ అవుతోంది. ఇది తుప్పు పట్టదు, స్క్రాచ్లు తక్కువగా పడతాయి, మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ. పైగా సెన్సిటివ్ స్కిన్ ఉన్నవారికి కూడా సేఫ్. దీంతో, అలెర్జీ సమస్యలు తక్కువగా ఉంటాయి. అందుకే రోజువారీ వాడకానికి చక్కగా సరిపోతుంది. ఇది బంగారంతో పోలిస్తే చాలా తక్కువ ధరలో లభిస్తుంది.బంగారం రంగుల రహస్యం.. బంగారం అంటే ముందుగా గుర్తుకు వచ్చేది దాని పసుపు రంగు మెరుపు. అయితే, బంగారం కేవలం ఒక రంగు కథ మాత్రమే కాదు, అది ఒక రంగుల పండుగ. శతాబ్దాలుగా మనుషులను ఆకట్టుకుంటూ వచ్చిన ఈ విలువైన లోహం, కాలంతో పాటు కొత్త కొత్త అవతారాలు తీసుకుంటూ ఫ్యాషన్ లో కొత్త ట్రెండ్స్ను సృష్టిస్తోంది. పసుపు నుంచి తెలుపు, గులాబీ, ఆకుపచ్చ, ఇంకా నీలం, నలుపు వరకు ఇలా ప్రతి రంగు వెనుక ఒక ప్రత్యేక కథ, ప్రత్యేక మిశ్రమం, ప్రత్యేక స్టయిల్ దాగి ఉంది.యెల్లో గోల్డ్ – సంప్రదాయానికి చిరునామా..బంగారం అసలైన రూపం యెల్లో గోల్డ్. ఇది శతాబ్దాలుగా సంపద, రాజసం, శుభం అనే భావాలకు ప్రతీకగా నిలిచింది. 24 క్యారెట్ల బంగారం అత్యంత శుద్ధమైన రూపం. దాదాపు 99.9 శాతం బంగారం ఉంటుంది. కానీ అది చాలా మృదువుగా ఉండటం వల్ల ఆభరణాల తయారీలో 22 క్యారెట్లు, 18 క్యారెట్లు లాంటి మిశ్రమాలను ఎక్కువగా వాడుతారు. పెళ్లి నగలు, గొలుసులు, సంప్రదాయ ఆభరణాలు తదితరమైన వాటన్నింటికీ ఇప్పటికీ ఇది మొదటి ఎంపిక. అలెర్జీ సమస్యలు తక్కువగా ఉండటం, మెరుపు ఎక్కువ కాలం నిలవడం, సింపుల్గా మెయింటైన్ చేయగలగడం దీని ప్రధాన ప్లస్ పాయింట్స్. అయితే ఎక్కువ క్యారెట్ల బంగారం కొంచెం సాఫ్ట్గా ఉండటం వల్ల సులభంగా గీతలు పడే అవకాశం ఉంటుంది. అయినా కూడా ‘క్లాసిక్ లుక్’ అంటే ఇప్పటికీ యెల్లో గోల్డ్నే.వైట్ గోల్డ్ – స్టయిల్కు సిల్వర్ టచ్ వైట్ గోల్డ్ అంటే మోడ్రన్ ఫ్యాషన్ కు సింబల్. సాధారణ పసుపు బంగారానికి భిన్నంగా, బంగారంలో నికెల్, పలేడియమ్ లేదా వెండిలాంటి ఇతర తెల్లటి లోహాలను కలిపి ఈ ప్రత్యేక రంగు బంగారాన్ని తయారు చేస్తారు. తర్వాత దీనిపై రోడియమ్ అనే మెటల్తో కోటింగ్ వేయడం వల్ల ఇది మరింత ప్రకాశవంతంగా, ప్లాటినమ్లా మెరిసే లుక్ను ఇస్తుంది. చరిత్రలో చూస్తే, 1920ల కాలంలో ప్లాటినమ్ చాలా ఖరీదుగా ఉండటంతో, తక్కువ ఖర్చులో అందించడానికి వైట్ గోల్డ్ ప్రాచుర్యం పొందింది.అప్పటి నుంచి ఇప్పటివరకు ఇది మోడ్రన్ జ్యూలరీలో ఒక ముఖ్యమైన ట్రెండ్గా కొనసాగుతోంది. ఇది స్ట్రాంగ్గా ఉండటం, స్క్రాచ్లు తక్కువగా కనిపించడం దీని ప్రత్యేకత. అయితే రోడియం కోటింగ్ కొంతకాలానికి తగ్గిపోవచ్చు కాబట్టి అప్పుడప్పుడు మళ్లీ కోటింగ్ చేయాల్సి ఉంటుంది. అయినా కూడా స్లీక్, స్మార్ట్, మోడ్రన్ లుక్ కోసం వైట్ గోల్డ్ బెస్ట్ చాయిస్.గ్రీన్ గోల్డ్ – అందాల ఆకుపచ్చ మెరుపుగ్రీన్ గోల్డ్ కొంచెం డిఫరెంట్ అండ్ రేర్. బంగారంలో ఎక్కువ శాతం వెండి కలిపితే ఆకుపచ్చ రంగు వస్తుంది. పాత కాలంలో దీనిని ‘ఎలెక్ట్రం’ అని పిలిచేవారు. ఇది మార్కెట్లో ఎక్కువగా కనిపించదు. కాని, ఫ్యాషన్లో చాలా పాత ట్రెండ్. ప్రాచీన రాజులు, కళాకారులు ప్రత్యేక ఆభరణాల కోసం ఈ మిశ్రమాన్ని వాడేవారు, ఎందుకంటే ఇది బంగారంతో పోలిస్తే కాస్త భిన్నంగా కనిపించేది.కొన్నిసార్లు రాగిలాంటి లోహాలను కూడా బంగారంలో కొద్దిగా కలిపి మరింత స్ట్రెంగ్త్ ఇస్తారు. ఇది కాస్త నేచురల్ గ్రీన్ టచ్లా సాఫ్ట్గా కనిపిస్తుంది. కాలక్రమేణా ఇందులో ఉన్న వెండి కారణంగా రంగు కొంచెం డార్క్ కావచ్చు, అదే దానికి ఒక యూనిక్ క్యారెక్టర్ను ఇస్తుంది. భారతీయ దుస్తులైనా, వెస్ట్రన్ ఔట్ఫిట్లైనా ఏ స్టయిల్కైనా ఇది మ్యాచ్ అవుతుంది. కొంచెం డిఫరెంట్, క్లాసీ లుక్ కావాలని అనుకునే వారికి గ్రీన్ గోల్డ్ ఒక బెస్ట్ చాయిస్.రోజ్ గోల్డ్ – ప్రేమకు గులాబీ మెరుపు స్టయిల్లో సాఫ్ట్నెస్ ఇచ్చేదే ఈ రోజ్ గోల్డ్. దీని రంగు కాస్త రొమాంటిక్ లుక్ ఇస్తుంది. బంగారంలో రాగి ఎక్కువగా కలిపితే ఈ అందమైన గులాబీ టోన్ వస్తుంది. అందుకే దీనిని ‘పింక్ గోల్డ్’ అని, పాతకాలంలో ‘రష్యన్ గోల్డ్’ అని పిలిచేవారు, ఎందుకంటే 19వ శతాబ్దంలో రష్యాలో ఇది మొదట ప్రాచుర్యం పొందింది. చరిత్రలో రాజ కుటుంబాలు, ప్రత్యేక సందర్భాల ఆభరణాల్లో ఈ రంగును ఉపయోగించేవారు.ఇది సాఫ్ట్గా కనిపించినా, రాగి కారణంగా ఇతర గోల్డ్ రకాల కంటే కొంచెం బలంగా ఉంటుంది. పైగా దీని రంగు కాలక్రమేణా తగ్గిపోకుండా స్థిరంగా ఉంటుంది. అన్నిరకాల చర్మానికి ఈ రంగు సూట్ అవ్వడం వల్ల యువతలో ఇది ఒక ఫ్యాషన్ ట్రెండ్గా మారింది. ముఖ్యంగా ఎంగేజ్మెంట్ రింగ్స్, గిఫ్ట్ జ్యూలరీ, డైలీ వేర్ ఆభరణాల్లో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. రొమాంటిక్గా, ట్రెండీగా కనిపించాలనుకునే వారు రోజ్ గోల్డ్ ఎంచుకోవటం మంచిది.బ్లూ గోల్డ్ – అరుదైన నీలి మెరుపుజ్యూలరీలో రేర్ స్టార్ బ్లూ గోల్డ్. బంగారంలో ఇండియమ్ లేదా ఐరన్ వంటి లోహాలను కలిపి, నియంత్రిత ప్రక్రియలో ఆక్సిడేషన్ చేయడం వల్ల దీనికి నీలి రంగు వస్తుంది. ఈ షేడ్ గాఢంగా కాకుండా, మెటాలిక్ టచ్తో సాఫ్ట్గా మెరుస్తూ కనిపిస్తుంది. ఈ రకం బంగారం ఎక్కువగా ఆధునిక కాలంలోనే అభివృద్ధి చెందింది, ముఖ్యంగా ప్రత్యేక డిజైన్లు, ఆర్టిస్టిక్ జ్యూలరీ కోసం దీనిని ఉపయోగించేవారు. ఇది మార్కెట్లో అసలు కనిపించదు; ఎక్కువగా స్టేట్మెంట్ జ్యూలరీ, కలెక్షన్ పీసెస్, ప్రత్యేక ఆర్డర్ డిజైన్లలో మాత్రమే కనిపిస్తుంది. తయారీ ప్రక్రియ క్లిష్టంగా ఉండటం, నైపుణ్యం అవసరం కావడం వల్ల దీని ధర కూడా ఎక్కువే. బ్లూ గోల్డ్ ఎక్కువగా కలెక్షన్ ఐటమ్స్ లేదా ప్రత్యేక సందర్భాల కోసం మాత్రమే తయారు చేస్తారు, అందుకే బ్లూ గోల్డ్ ఒక లగ్జరీ స్టేటస్గా నిలుస్తోంది.బ్లాక్ గోల్డ్ –బోల్డ్ స్టయిల్ బ్లాక్ గోల్డ్ అంటే బోల్డ్ స్టేట్మెంట్. ఇది సహజంగా ఏర్పడే రంగు కాదు. ప్రత్యేక టెక్నాలజీ, కోటింగ్ లేదా ట్రీట్మెంట్ ద్వారా తయారు చేసే మిశ్రమం. రోడియం ప్లేటింగ్, ఆక్సిడేషన్ లేదా లేజర్ ట్రీట్మెంట్ వంటి ఆధునిక పద్ధతులతో బంగారానికి ఈ నలుపు రంగు అందిస్తారు. ముఖ్యంగా మోడ్రన్ జ్యూలరీ ట్రెండ్స్ పెరిగిన తర్వాత ఎక్కువగా పురుషుల జ్యూలరీ, హై ఫ్యాషన్ డిజైన్లు, స్టేట్మెంట్ రింగ్స్, బ్రేస్లెట్స్లో ఇది కనిపిస్తుంది. జ్యూలరీతో అటెన్షన్ గ్రాబ్ చేయాలంటే బ్లాక్ గోల్డ్ ఒక ట్రెండీ ఆప్షన్.కొత్త డిజైన్లు..బంగారం ధరలు రోజు రోజుకీ పైకి ఎగబాకుతున్నాయని, స్టయిల్లో తగ్గాల్సిన అవసరం లేదు. ఆభరణాలు కొనుగోలు చేసేటప్పుడు కొంచెం స్మార్ట్గా డిజైన్స్ ఎంపిక చేసుకుంటే, తక్కువ ఖర్చులోనే అందమైన నగలను పొందుతూ అందం, ఆనందం రెండింటినీ ఆస్వాదించవచ్చు.అవతారాలు ఎత్తే ఆభరణంఒకే నగను మూడు విధాలుగా మార్చుకునే డిజైన్లు ఇప్పుడు చాలా పాపులర్. పెద్ద హారం నుంచి చిన్న చైన్గా, లేదా లాంగ్ నెక్లెస్ను రెండు చిన్న నెక్లెస్లుగా మార్చుకోవచ్చు. ఒకసారి కొనుగోలు చేసి, మూడు సందర్భాల్లో వివిధ విధాలుగా వాడుకోవచ్చు.పాతకు కొత్త రూపం పాతకాలపు ఆభరణాలను కొత్తగా మార్చి, ఆధునిక డిజైన్స్ తో కలిపి తయారు చేయడం ఇప్పుడు ట్రెండ్గా మారుతోంది. దీంతో పాత బంగారం అమ్మి కొత్తవి కొనాల్సిన అవసరం లేకుండా, వాటినే కొత్తగా మార్చుకోవచ్చు. పెళ్లి కూతురి నగలలో కూడా కొత్త ఆకృతులు, కొత్త కలయికలు కనిపిస్తున్నాయి. అందుకే, ఇప్పుడు బంగారం కేవలం సంప్రదాయం మాత్రమే కాదు, సృజనాత్మకతకు కొత్త వేదిక.హాలో టెక్నిక్ ఈ టెక్నిక్ ఒక చిన్న మ్యాజిక్లాంటిది. నగ లోపల ఖాళీగా ఉండేలా తయారు చేస్తారు. బయట నుంచి చూస్తే మాత్రం పెద్దగా, ఘనంగా కనిపిస్తుంది. 40 గ్రాముల్లా కనిపించే నెక్లెస్ అసలు బరువు 20 నుంచి 25 గ్రాములే ఉండొచ్చు. పాతకాలపు భారీ టెంపుల్ జ్యూలరీ కూడా ఇప్పుడు ఈ కొత్త వెర్షన్ లో వస్తోంది. అంటే స్టయిల్ డబుల్, ఖర్చు హాఫ్.రెండు మెరుపులు బంగారాన్ని ఇతర లోహాలతో కలిపి తయారు చేసే మిక్స్డ్ మెటల్ డిజైన్స్ ఇప్పుడు ఫ్యాషన్ లో టాప్లో ఉన్నాయి. ఒకే నగలో రెండు రంగుల మెరుపు కనిపించడం వల్ల అది కొత్తగా, మోడర్న్గా కనిపిస్తుంది. ఖర్చు తగ్గుతుంది, డిజైనర్ లుక్ కూడా వస్తుంది.పూత పరి^è యాలుఈ టెక్నిక్లో నగ పూర్తిగా బంగారంతో కాకుండా, పైపైన మాత్రమే బంగారం పొర వేస్తారు. దీంతో అది గోల్డ్లా మెరిసిపోతుంది, కానీ ధర మాత్రం చాలా తక్కువగా ఉంటుంది. వన్ గ్రాము గోల్డ్ లాంటివే కనిపిస్తాయి, కానీ అసలు బంగారం కాదు. పార్టీలు, ఫంక్షన్ లలో గ్రేస్ చూపించడానికి ఇది సూపర్ చాయిస్.తక్కువలో ఎక్కువ అందం. ఇప్పటి యువత ఎక్కువ నగలు ధరించడం కన్నా, ఒకే నగతో ప్రత్యేకంగా కనిపించాలని కోరుకుంటున్నారు. ఒక చిన్న గొలుసు, ఒక అందమైన ఉంగరం, ఒక జత చెవిపోగులు. ఇవే ఇప్పుడు పూర్తి అలంకరణగా మారుతున్నాయి. సాదాసీదాగా, కానీ ఆకర్షణీయంగా కనిపించడం – అందానికి ఇదే నేటి కొత్త మంత్రం.సంప్రదాయం చిన్న ప్యాక్లో జ్యూలరీలో ‘లైట్ ఈజ్ రైట్’ అనే ట్రెండ్ సూపర్ హిట్గా మారింది. పెద్దగా కనిపించే హారం అయినా, చెవి రింగులు అయినా లోపల స్మార్ట్గా తక్కువ బంగారంతో డిజైన్ చేసి, బయటకు మాత్రం బీడ్స్, రంగురంగుల స్టోన్స్ , మెరిసే ముత్యాలు జోడించి ఫుల్ రిచ్ లుక్ తీసుకొస్తున్నారు. చేతిలో పెట్టుకుంటే బరువు తక్కువగా ఉంటుంది, కానీ చూసినవారికి మాత్రం ‘ఇది ఎంత గ్రాండ్గా ఉంది!’ అనిపించేలా మెరుస్తుంది.కాలం మారుతోంది, ఖర్చులు పెరుగుతున్నాయి, బంగారం ధర రోజూ కొత్త రికార్డులు సృష్టిస్తోంది. అయినా మన ఇంట్లో ఒక మాట మాత్రం మారదు. ‘బంగారం కొంటేనే భద్రత’ అనే నమ్మకం. అందుకే, బంగారం ఎప్పటికీ ప్రత్యేకమే! ∙ దీపిక కొండి -
గోల్డ్ ధర.. గుండె దడ!
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
బంగారం, వెండికి అమ్మకాల సెగ!
అమ్మకాల ఒత్తిడికి పసిడి, వెండి నష్టపోయాయి. ఢిల్లీ మార్కెట్లో వెండి కిలోకి రూ.5,700 తగ్గి (2.2 శాతం) రూ.2.53 లక్షలకు, బంగారం 10 గ్రాములకు రూ.1,600 (1 శాతం) నష్టపోయి రూ.1,56,200 స్థాయిలకు దిగొచ్చాయి. కాల్పుల విరమణ పరిణామాలకు సంబంధించి వారాంతంలో వచ్చే తాజా అప్డేట్లకు ముందు ఇన్వెస్టర్లు అప్రమత్తత పాటించినట్టు ఎల్కేపీ సెక్యూరిటీస్ కమోడిటీ సీనియర్ అనలిస్ట్ జతిన్ త్రివేది తెలిపారు.తాజా సానుకూల సంకేతాలేవీ లేకపోవడంతో బంగారం స్థిరీకరణ దశలో కొనసాగినట్టు చెప్పారు. హార్ముజ్ జలసంధితి పూర్తిగా తెరుస్తునట్లు ఇరాన్ ప్రకటించడంతో అంతర్జాతీయ మార్కెట్లో పసిడి, వెండి దూసుకెళ్లాయి. గోల్డ్ ఔన్స్కు 2 శాతం పెరిగి 4,900 డాలర్ల పైకి చేరింది. సిల్వర్ ఔన్స్కు 5 శాతానికి పైనే పెరిగి 83 డాలర్ల వద్ద ట్రేడయ్యింది. సానుకూల పరిణామాలు కనిపిస్తున్నప్పటికీ గరిష్ట స్థాయిల్లో బంగారం నిలదొక్కుకోవడం లేదని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ కమోడిటీస్ సీనియర్ ఎనలిస్ట్ సౌమిల్ గాంధీ తెలిపారు. -
అక్షయ తృతీయ ముందు మహిళలకు గుడ్ న్యూస్...
-
పండుగ పసిడి.. తిరుగులేని రాబడి!
భారతీయ సంస్కృతిలో అక్షయ తృతీయకు ప్రత్యేక స్థానం ఉంది. ఈ పవిత్ర దినాన పసిడిని కొనుగోలు చేయడం అదృష్టాన్ని, శాశ్వత సంపదను తెస్తుందని కోట్లాది మంది నమ్ముతారు. అయితే, ఈ సంప్రదాయం వెనుక బలమైన ఆర్థిక ప్రయోజనం కూడా దాగి ఉందని గత తొమ్మిదేళ్ల గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. కేవలం సెంటిమెంట్తోనే కాకుండా, లాభదాయకమైన పెట్టుబడి వ్యూహంగా కూడా బంగారం తన సత్తాను చాటుతోంది. ముఖ్యంగా గత తొమ్మిదేళ్ల కాలంలో పసిడి సుమారు రూ. 29,000 నుండి రూ. 1,54,000 స్థాయికి చేరుకుని, పెట్టుబడిదారులకు ఏకంగా 435 శాతం భారీ రాబడిని అందించింది.12 ఏళ్లలో అక్షయ తృతీయ రాబడులు ఇలా..గత 12 ఏళ్ల అక్షయ తృతీయ బంగారం రాబడులను పరిశీలిస్తే, 2015లో 11 శాతం, 2017లో 3 శాతం తగ్గుదలతో కొంత నిరాశపరిచినప్పటికీ, ఆ తర్వాత నుండి పసిడి ప్రస్థానం అప్రతిహతంగా కొనసాగుతోంది. ముఖ్యంగా 2020లో 47 శాతం భారీ రాబడిని అందించిన బంగారం, ఈ ఏడాది (2026) ఏకంగా 60 శాతం వృద్ధిని నమోదు చేసి సరికొత్త రికార్డు సృష్టించింది. 2023లో 18 శాతం, 2024లో 22 శాతం, 2025లో 31 శాతంగా ఉన్న రాబడులు, ప్రతి ఏడాది రెట్టింపు ఉత్సాహంతో పెరుగుతూ పసిడిపై పెట్టుబడి అత్యంత లాభదాయకమని మరోసారి నిరూపించాయి.ఏడాదిలో 60 శాతం పెరుగుదలగత ఏడాది కాలంలో బంగారం చూపిన జోరు ఇన్వెస్టర్లను ఆశ్చర్యానికి గురిచేసింది. 2025 అక్షయ తృతీయ (ఏప్రిల్ 30) నాటి ధరలతో పోలిస్తే, ప్రస్తుతం పసిడి ధరలు 60 శాతం పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న అనిశ్చితి, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు గోల్డ్ మార్కెట్కు గతేడాది అండగా నిలిచాయి. పెట్టుబడిదారులకు వరుసగా తొమ్మిదో ఏడాది కూడా ఘనమైన లాభాలను అందిస్తూ, సురక్షితమైన పెట్టుబడి సాధనంగా బంగారం తన పట్టును నిలుపుకుంది. ధంతేరాస్తో పాటు అక్షయ తృతీయ భారతీయులకు అతిపెద్ద కొనుగోలు పండుగగా కొనసాగుతోంది.2026 సంవత్సరం బంగారం కొనుగోలుదారులకు కొంత గందరగోళంగా ప్రారంభమైనప్పటికీ, బులియన్ మార్కెట్ భవిష్యత్తు మాత్రం ఆశాజనకంగానే కనిపిస్తోంది. ఇటీవల యూఎస్-ఇరాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో మార్చి గరిష్టాల నుండి ధరలు 10 శాతం మేర తగ్గుముఖం పట్టాయి. ద్రవ్యోల్బణ భయాలు, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల తగ్గింపుపై జాప్యం వంటి కారణాలు మార్కెట్ సెంటిమెంట్ను ప్రభావితం చేశాయి. అయినప్పటికీ, ఈ ఏడాది ఇప్పటివరకు బంగారం 15 శాతం వృద్ధిని నమోదు చేయడం గమనార్హం. ధరల్లో వచ్చిన ఈ తాత్కాలిక తగ్గుదల (పుల్ బ్యాక్) కొనుగోలుదారులకు ఒక మంచి అవకాశమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.మళ్లీ వచ్చే పండుగకి రూ.1.80 లక్షలు!మున్ముందు బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయంగా ఎదురయ్యే ఆటంకాలు పసిడి ధరలో పదునైన పెరుగుదలకు దారితీస్తాయని, ఏడాది కాలంలోనే తులం (10 గ్రాములు) బంగారం ధర రూ.1,80,000 మార్కును తాకవచ్చని నిర్మల్ బాంగ్ కమోడిటీస్ రీసెర్చ్ హెడ్ కునాల్ షా విశ్లేషించారు. అదేవిధంగా, అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు ధర 5,500 డాలర్ల స్థాయికి చేరవచ్చని, తద్వారా దేశీయంగా ధరలు రూ.1,70,000 నుండి రూ. 1,85,000 మధ్య ఉండొచ్చని యాక్సిస్ సెక్యూరిటీస్ నిపుణులు భావిస్తున్నారు. -
వరుసగా మూడో రోజు పెరిగిన గోల్డ్ రేటు.. అక్షయ తృతీయ ముందు మహిళలకు షాక్
-
అక్షయ తృతీయ ముందు దెబ్బకొట్టిన గోల్డ్ రేట్...
-
గోల్డ్ ఈటీఎఫ్లు మెరిశాయ్
న్యూఢిల్లీ: బంగారం ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (గోల్డ్ ఈటీఎఫ్లు)కు మార్చి త్రైమాసికంలో ఇన్వెస్టర్ల నుంచి బలమైన ఆదరణ కనిపించింది. రూ.31,561 కోట్ల తాజా పెట్టుబడులను ఇవి ఆకర్షించాయి. అంతకుముందు ఏడాది ఇదే త్రైమాసికంలో వచ్చిన పెట్టుబడులతో పోల్చితే ఆరు రెట్లు అధికం కావడం గమనార్హం. అంతేకాదు 2025–26 డిసెంబర్ త్రైమాసికంలో వచ్చిన రూ.23,132 కోట్ల పెట్టుబడులతో పోల్చి చూసినా 36 శాతం పెరిగినట్టు తెలుస్తోంది. మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ (యాంఫి) విడుదల చేసిన డేటా ప్రకారం.. మార్చి నెలలో మాత్రం పెట్టుబడుల రాక బలహీనపడింది.మార్చి నెలలో కేవలం రూ.2,266 కోట్ల పెట్టుబడులు గోల్డ్ ఈటీఎఫ్ల్లోకి వచ్చాయి. ఈ ఏడాది జనవరిలో రూ.24,040 కోట్లు, ఫిబ్రవరిలో రూ.5,255 కోట్లతో పోల్చితే గణనీయంగా తగ్గినట్టు స్పష్టమవుతోంది. బంగారం ధరలు గత రెండేళ్లలో పెద్ద ఎత్తున ర్యాలీ చేయడం తెలిసిందే. ఫలితంగా ఇన్వెస్టర్లు గోల్డ్ ఈటీఎఫ్లవైపు మొగ్గు చూపడం పెరిగింది. దీంతో పెద్ద మొత్తంలో పెట్టుబడులు వీటిల్లోకి వచ్చాయి. ఇటీవలి గరిష్ట స్థాయిల నుంచి బంగారం, వెండి ధరలు అమ్మకాల ఒత్తిడికి కొంత తగ్గిన నేపథ్యంలో, ఈటీఎఫ్ పెట్టుబడులపై ఇది ప్రభావం చూపించనట్టు తెలుస్తోంది. రూ.1.71 లక్షల కోట్ల ఆస్తులు గోల్డ్ ఈటీఎఫ్ల నిర్వహణ ఆస్తులు (ఏయూఎం) మార్చి చివరికి రూ.1.71 లక్షల కోట్లకు చేరాయి. 2025 మార్చి చివరికి వీటి విలువ రూ.58,888 కోట్లతో పోల్చితే మూడు రెట్లు పెరిగాయి. గోల్డ్ ఈటీఎఫ్ల ఫోలియోలు (ఒక ఈటీఎఫ్లో ఒక ఇన్వెస్టర్ పెట్టుబడికి గుర్తింపు సంఖ్య) గత ఆర్థిక సంవత్సరంలో 54.28 లక్షలు పెరిగాయి. దీంతో మొత్తం గోల్డ్ ఈటీఎఫ్ల ఫోలియోలు 1.24 కోట్లకు చేరాయి. ‘‘జనవరిలో పోర్ట్ఫోలియో రీబ్యాలన్స్ (మార్పులు, చేర్పులు), రిస్క్ తీసుకునే ధోరణి ఫలితంగా గోల్డ్ ఈటీఎఫ్ల్లోకి పెట్టుబడులు అధికంగా వచ్చాయి.దీంతో తర్వాతి నెలల్లో పెట్టుబడులు బలహీనంగా కనిపిస్తున్నాయి. అయినప్పటికీ మార్చి నెలలో సానుకూల పెట్టుబడులు నమోదవడం అన్నది మార్కెట్లు, భౌగోళిక రాజకీయ అనిశ్చితుల్లో బంగారాన్ని వైవిధ్యమైన పెట్టుబడి సాధనంగా ఇన్వెస్టర్లు చూస్తున్నారనేదానికి సంకేతం’’అని మారి్నంగ్స్టార్ ఇన్వెస్ట్మెంట్ రీసెర్చ్ ఇండియా సీనియర్ అనలిస్ట్ నేహల్ మెష్రామ్ పేర్కొన్నారు. బంగారంతో పోల్చితే ఈక్విటీల వ్యాల్యూషన్లు ఆకర్షణీయంగా మారినందున మార్చి నెలలో గోల్డ్ ఈటీఎఫ్ల్లో పెట్టుబడులు తగ్గడానికి కారణమని ద వెల్త్ కంపెనీ మ్యూచువల్ ఫండ్ సీఐవో (డెట్) ఉమేష్ శర్మ చెప్పారు. -
ఊహించని దెబ్బ కొట్టిన బంగారం.. కొనాలనుకునే వారికి బిగ్ షాక్..
-
ఒక్కసారిగా తిరగబడిన బంగారం ధరలు
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. నిన్నటి మార్కెట్లో తగ్గిన ధరలు ఈరోజు ఒక్కసారిగా పెరిగాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
వార్ ఎఫెక్ట్.. పతనం వైపు బంగారం ధరలు!
పెరుగుదల దిశగా అడుగులు వేసిన గోల్డ్ రేటు ఈ రోజు (సోమవారం) తగ్గుదల వైపు పయనించింది. దీంతో బంగారం ధర కొంతమేర తగ్గింది. దీనికి కారణం యూఎస్ డాలర్ బలపడటం, ద్రవ్యోల్బణంపై పెరుగుతున్న ఆందోళనలు అని తెలుస్తోంది. అమెరికా - ఇరాన్ మధ్య జరిగిన శాంతి చర్చలు విఫలమవడం కూడా బంగారం ధరలు పెరుగుదలకు మరో కారణం అయింది.శాంతి చర్చలు విఫలమైన తర్వాత, ఉద్రిక్తతలు పెరిగాయి. అమెరికా - ఇరాన్ పోర్టుల నుంచి బయలుదేరే నౌకలను అడ్డుకుంటామని ట్రంప్ ప్రకటించగా, ఇరాన్ కూడా ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించింది. ఈ పరిణామాలు అంతర్జాతీయ మార్కెట్లలో అస్థిరతను పెంచాయి. ఈ సంఘటనల వల్ల ముడి చమురు ధరలు ఒక్కసారిగా పెరిగి బ్యారెల్కు 100 డాలర్లు దాటాయి.చమురు ధరలు పెరగడం అంటే రవాణా ఖర్చులు, ఉత్పత్తి వ్యయాలు పెరగడం. దీని వల్ల ద్రవ్యోల్బణం మరింత పెరిగే అవకాశం ఉంది. ఇదే జరిగితే కేంద్ర బ్యాంకులు.. ముఖ్యంగా అమెరికా ఫెడరల్ రిజర్వ్, వడ్డీ రేట్లు తగ్గించడానికి ఇష్టపడవు. వడ్డీ రేట్లు ఎక్కువగా ఉంటే, బంగారం వంటి ఆస్తులపై పెట్టుబడులు తగ్గుతాయి. అందువల్ల బంగారం ధరలు పడిపోయే అవకాశం ఉంది.2026 ప్రారంభంలో భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఆ తరువాత క్రమంగా తగ్గుముఖం పట్టాయి. అయితే కియోసాకి వంటి విశ్లేషకులు గోల్డ్ రేటు మళ్లీ పెరిగే అవకాశం ఉందని, పెట్టుబడిదారులు కూడా ఇందులో పెట్టుబడి పెడితే ధనవంతులవుతారని చెబుతున్నారు. -
బంగారం ధరల్లో భారీ మార్పు: అంతలోనే ఇంతలా..
బంగారం ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు జరుగుతూ వారాంతంలో కొంత పెరిగింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో గోల్డ్ రేట్లలో మార్పు జరిగింది. ఈ కథనంలో వారం రోజుల్లో బంగారం ధరలు పెరిగాయా?, తగ్గాయా?, అనే విషయం తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడ నగరాల్లో ఏప్రిల్ 5 (ఆదివారం) 1,50,930 రూపాయల వద్ద ఉన్న తులం 24 క్యారెట్ల బంగారం ధర, ఈ రోజుకు (ఏప్రిల్ 11) రూ.1,52,840 వద్దకు చేరింది. అంటే వారం రోజుల్లో గోల్డ్ రేటు పెరుగుతూ.. తగ్గుతూ, మొత్తం మీద 1910 రూపాయలు పెరిగింది. 22 క్యారెట్ల రేటు వారం రోజుల్లో 1,38,350 రూపాయల నుంచి 1,40,100 రూపాయల (రూ.1750 పెరిగింది) వద్దకు చేరింది.చెన్నైలో గోల్డ్ రేటు వారం రోజుల్లో పెరుగుదల దిశగానే అడుగులు వేసింది. ఏప్రిల్ 5న 1,52,180 రూపాయల వద్ద ఉన్న తులం 24 క్యారెట్ల బంగారం ధర, ఈ రోజుకు (ఏప్రిల్ 11) రూ.1,53,820 వద్దకు చేరింది. 22 క్యారెట్ల రేటు వారం రోజుల్లో 1,39,500 రూపాయల నుంచి 1,41,000 రూపాయల (రూ.1500 పెరిగింది) వద్దకు చేరింది.ఢిల్లీలో కూడా ధరల పెరుగుదల కనిపించింది. ఏప్రిల్ 5న దేశ రాజధాని నగరంలో 1,51,080 రూపాయల వద్ద ఉన్న తులం 24 క్యారెట్ల బంగారం ధర, ఈ రోజుకు (ఏప్రిల్ 11) రూ.1,52,990 వద్దకు చేరింది. 22 క్యారెట్ల రేటు వారం రోజుల్లో 1,38,500 రూపాయల నుంచి 1,40,250 రూపాయల (రూ.1750 పెరిగింది) వద్దకు చేరింది. -
బంగారం ధరల్లో మార్పు.. అమాంతం తగ్గిన రేటు!
శుక్రవారం ఉదయం.. తెలుగు రాష్ట్రాల్లో భారీగా పెరిగిన బంగారం ధరలు సాయంత్రానికే ఒక్కసారిగా తగ్గుముఖం పట్టాయి. దీంతో గోల్డ్ రేటులో స్వల్ప తగ్గుదల కనిపించింది. ఈ కథనంలో లేటెస్ట్ పసిడి ధరలు ఎలా ఉన్నాయనే వివరాలు తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడలలో ఉదయం రూ.1,40,250 వద్ద ఉన్న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర సాయంత్రానికి 1,39,650 రూపాయల వద్దకు చేరింది. దీన్నిబట్టి చూస్తే గంటల వ్యవధిలోనే రేటు రూ.600 తగ్గినట్లు స్పష్టమవుతోంది. 24 క్యారెట్ల బంగారం రూ.1,53,000 నుంచి రూ.152350 వద్దకు చేరింది.ఢిల్లీలో కూడా బంగారం ధరల్లో భారీ మార్పు జరిగింది. దేశ రాజధానిలో 24 క్యారెట్ల తులం బంగారం 1,53,150 రూపాయల నుంచి రూ.1,52,500 వద్దకు చేరింది. 22 క్యారెట్ల రేటు 1,40,400 రూపాయల నుంచి 1,39,800 రూపాయల వద్దకు చేరింది.చెన్నైలో మాత్రం బంగారం ధరల్లో ఎలాంటి మార్పు లేదు. కాబట్టి 22 క్యారెట్ల తులం రేటు 1,41,250 రూపాయల వద్ద, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు 1,54,090 రూపాయల వద్ద ఉంది. అంటే ఈ రోజు ఉదయం ధరలకు, సాయంత్రం ధరలకు ఎలాంటి తేడా లేదు.వెండి ధరలువెండి ధరలు ఈ రోజు పెరుగుదల దిశగా పయనించాయి. దీంతో కేజీ సిల్వర్ ధర హైదరాబాద్లో 2.65 లక్షలు. కాగా ఢిల్లీలో కేజీ వెండి ధర రూ.2.60 లక్షలు వద్ద ఉంది. -
బంగారం అమ్మేసుకుంటున్న దేశాలు..
ప్రపంచవ్యాప్తంగా మారుతున్న భౌగోళిక రాజకీయ పరిస్థితులు, యుద్ధ మేఘాలు దేశాల పసిడి నిల్వలపై ప్రభావం చూపిస్తున్నాయి. ఒకప్పుడు సురక్షితమైన పెట్టుబడిగా భావించిన బంగారాన్ని ఇప్పుడు కొన్ని దేశాలు తమ ఆర్థిక అవసరాల కోసం, ముఖ్యంగా యుద్ధ వ్యయాల కోసం విక్రయిస్తుండటం గమనార్హం. ఈ నేపథ్యంలో వివిధ దేశాల పసిడి నిల్వల తాజా పరిస్థితిపై ప్రత్యేక కథనం..యుద్ధం తెచ్చిన మార్పులేంటి?ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకులు సాధారణంగా తమ విదేశీ మారక ద్రవ్య నిల్వలను పటిష్టం చేసుకోవడానికి బంగారాన్ని కొనుగోలు చేస్తాయి. అయితే, 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఒక ఆసక్తికరమైన ధోరణి కనిపిస్తోంది. భారత్, చైనా వంటి దేశాలు పసిడి నిల్వలను పెంచుకుంటుంటే, యుద్ధంలో చిక్కుకున్న కొన్ని దేశాలు మాత్రం నిల్వలను అమ్ముకుంటున్నాయి.బంగారం అమ్ముతున్న దేశాలు ఇవే..ఇటీవలి నివేదికల ప్రకారం.. మూడు ప్రధాన దేశాలు తమ పసిడి నిల్వలను విక్రయించడం లేదా తగ్గించుకోవడం చేస్తున్నాయి.రష్యా: ఉక్రెయిన్తో సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న యుద్ధం కారణంగా రష్యా తన పసిడి నిల్వలను విక్రయించక తప్పడం లేదు. యుద్ధ వ్యయాలను భరించడానికి, పాశ్చాత్య దేశాల ఆంక్షల నుంచి బయటపడటానికి రష్యా 2025 నుండి నిరంతరంగా బంగారాన్ని విక్రయిస్తోంది. ఫిబ్రవరి 2026 నాటికి రష్యా పసిడి నిల్వలు నాలుగేళ్ల కనిష్ట స్థాయికి (సుమారు 2,327 టన్నులకు) పడిపోయినట్లు తెలుస్తోంది.టర్కీ: ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల నేపథ్యంలో తన కరెన్సీ 'లిరా' విలువ పడిపోకుండా కాపాడుకోవడానికి టర్కీ సుమారు 60 టన్నుల బంగారాన్ని విక్రయించినట్లు సమాచారం. దీని విలువ దాదాపు 8 బిలియన్ డాలర్లు.పోలాండ్: గతంలో పసిడి కొనుగోళ్లలో అగ్రస్థానంలో ఉన్న పోలాండ్, ఇప్పుడు తన రక్షణ బడ్జెట్ కోసం నిల్వలను వినియోగించుకోవాలని యోచిస్తోంది.భారత్ పరిస్థితి ఇలా..ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి ఉన్నప్పటికీ, భారత రిజర్వ్ బ్యాంక్ (RBI) మాత్రం పసిడి నిల్వలను భారీగా పెంచుకుంటోంది. భారత రిజర్వ్ బ్యాంక్ వద్ద ప్రస్తుతం 880.18 టన్నుల పసిడి నిల్వలు ఉన్నాయి. దీని విలువ ఫిబ్రవరి 2026 నాటికి రికార్డు స్థాయిలో 131.63 బిలియన్ డాలర్లకు చేరింది.ర్యాంకుదేశంనిల్వలు (టన్నుల్లో)నిల్వల విలువ (బిలియన్ డాలర్లలో)1అమెరికా81331,250+2జర్మనీ33505623ఇటలీ24524204ఫ్రాన్స్24374085రష్యా23273806చైనా23073877స్విట్జర్లాండ్10401758జపాన్8461429భారత్88013110నెదర్లాండ్స్612102 -
ETFలో ఇన్వెస్ట్ చేసినవారికి పండగే... భారీగా పెరిగిన గోల్డ్, సిల్వర్
-
మళ్లీ పసిడి ధరల మంట! తులం ఎంతంటే..
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
చల్లారిన పసిడి వేడి! తులం ఎంతంటే..
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
మళ్లీ పెరిగిన వెండి, బంగారం ధరలు
-
గంటల వ్యవధిలో.. మారిపోయిన గోల్డ్, సిల్వర్ రేటు!
బంగారం ధరలు ఈ మధ్య కాలంలో కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే మారిపోతున్నాయి. ఈ రోజు కూడా అదే పరిస్థితి నెలకొంది. ఉదయం ఉన్న రేటు, సాయంత్రానికి మారిపోయింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో కూడా గోల్డ్ రేట్లలో చాలా మార్పులు జరిగాయి. ఈ కథనంలో లేటెస్ట్ గోల్డ్ రేటు ఎలా ఉందనే విషయం ఈ కథనంలో చూసేద్దాం.హైదరాబాద్, విజయవాడ నగరాల్లో ఈ రోజు (ఏప్రిల్ 6) ఉదయం రూ.1,36,700 వద్ద ఉన్న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర.. సాయంత్రానికి 1,38,100 రూపాయల వద్దకు చేరింది. ఇదే సమయంలో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.1,49,130 నుంచి రూ.1,50,660 వద్దకు చేరింది. దీన్నిబట్టి చూస్తే పసిడి ధర గంటల వ్యవధిలో ఎంతలా మారిపోయిందో స్పష్టంగా అర్థమవుతోంది. ఇదే ధరలు బెంగళూరు, ముంబై నగరాల్లో కూడా కొనసాగుతాయి.చెన్నైలో బంగారం ఉదయం అమాంతం తగ్గి.. సాయంత్రానికి పెరిగింది. దీంతో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు 1,50,660 రూపాయల దగ్గర నుంచి 1,52,620 రూపాయల వద్దకు, 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,38,100 నుంచి రూ.1,39,900 వద్దకు చేరింది.ఢిల్లీలో కూడా బంగారం ధరల్లో భారీ మార్పులు జరిగాయి. దీంతో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 150810 రూపాయలుగా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రేటు 1,38,250 వద్ద ఉంది.వెండి ధరలుబంగారం ధరలు మాత్రమే కాకుండా వెండి ధరల్లో కూడా స్వల్ప మార్పులు జరిగాయి. ఉదయం ధరలు స్థిరంగా ఉండటం చేత రూ.2.55 లక్షల వద్ద ఉన్న సిల్వర్ రేటు.. సాయంత్రానికి రూ.5000 పెరిగింది. దీంతో కేజీ వెండి రేటు రూ.2.60 లక్షల వద్దకు చేరింది. దీన్నిబట్టి చూస్తే వెండి రేటు మళ్లీ దూసుకెళ్తుందా అనే అనుమానం కలుగుతోంది. -
ఆ ముప్పు ముంచుకొచ్చింది: కియోసాకి హెచ్చరిక
ప్రముఖ ఆర్థిక వ్యాఖ్యాత, 'రిచ్ డాడ్ పూర్ డాడ్' పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి సంచలన వ్యాఖ్యలు చేశారు. 2026 నాటికి ప్రపంచం ఆర్థికంగా పెను ముప్పును ఎదుర్కోబోతోందని హెచ్చరిస్తూ ఆయన ఒక పోస్ట్ను షేర్ చేశారు. ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభానికి 1974లో జరిగిన కొన్ని కీలక పరిణామాలే కారణమని ఆయన విశ్లేషించారు."బ్యాడ్ న్యూస్.. చరిత్ర ముంచుకొచ్చింది" అంటూ రాబర్ట్ కియోసాకి 2026 ఆర్థిక స్థితిగతులపై ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా 1974లో జరిగిన రెండు ప్రధాన మార్పులు నేటి వినాశకర పరిస్థితులకు కారణమయ్యాయని ఆయన పేర్కొన్నారు.పెట్రో డాలర్ వ్యవస్థ - చమురు యుద్ధాలు1974 వరకు అమెరికా డాలర్కు బంగారాన్ని హామీగా ఉంచేవారని, కానీ ఆ ఏడాది నుంచి డాలర్ 'పెట్రో డాలర్'గా మారిందని కియోసాకి గుర్తుచేశారు. అంటే, బంగారం స్థానంలో చమురు (Oil) డాలర్కు వెన్నుముకగా మారింది. ఆ కారణంగానే 2026లో చమురు కోసం ప్రపంచ దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. చమురు ధరలు పెరగడం వల్ల ద్రవ్యోల్బణం ఆకాశాన్ని తాకుతోంది. నిత్యావసర వస్తువుల ధరలు సామాన్యుడికి అందనంత ఎత్తుకు చేరుతున్నాయి.పెన్షన్ వ్యవస్థలో మార్పు - రిటైర్మెంట్ భయం1974లో అమెరికాలో 'ERISA' చట్టం వచ్చిందని, దీనివల్ల ఉద్యోగులకు జీవితాంతం వచ్చే గ్యారెంటీ పెన్షన్లు పోయి.. 401k, IRA వంటి రిస్క్తో కూడిన పథకాలు వచ్చాయని ఆయన విమర్శించారు. కోట్లాది మంది బేబీ బూమర్స్ (వృద్ధులు) తమ పదవీ విరమణ తర్వాత రూపాయి ఆదాయం లేక ఇబ్బంది పడబోతున్నారని ఆయన జోస్యం చెప్పారు. సోషల్ సెక్యూరిటీ, మెడికేర్ వంటి వ్యవస్థలు దివాళా తీసే స్థితిలో ఉన్నాయని, దీనివల్ల లక్షలాది మంది వృద్ధులు నిరాశ్రయులయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు.అప్పుల ఊబిలో అమెరికాప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అప్పులు పెరిగిపోయాయని, ముఖ్యంగా అమెరికా చరిత్రలోనే అతిపెద్ద రుణగ్రస్త దేశంగా మారిందని కియోసాకి ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాలల్లో ఆర్థిక విద్య (Financial Education) నేర్పకపోవడమే ఈ దుస్థితికి కారణమని ఆయన దుయ్యబట్టారు.మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకోవాలంటే..ఈ సంక్షోభం నుండి బయటపడటానికి రాబర్ట్ కియోసాకి మూడు ప్రధాన సూత్రాలను ప్రతిపాదించారు. నిజమైన సంపదను పొదుపు చేయండి. కేవలం కాగితపు కరెన్సీని నమ్ముకోకుండా బంగారం (Gold), వెండి (Silver), బిట్కాయిన్ (Bitcoin)లలో పెట్టుబడి పెట్టాలని ఆయన సూచించారు.యూట్యూబ్ వంటి వేదికల్లో మంచి గురువులను ఎంచుకుని, డబ్బును ఎలా నిర్వహించాలో నేర్చుకోవాలని కోరారు. అయితే, మోసగాళ్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. మీ ఆర్థిక భవిష్యత్తును ఇతరుల చేతుల్లో పెట్టకండి. మీరే బాధ్యత తీసుకుని సంపన్నమైన భవిష్యత్తును నిర్మించుకోండి.ఇదీ చదవండి: బంగారం ధరలు: వారమంతా పరుగులు.. ఇప్పుడేమో ఇలా.."1974లో మొదలైన భవిష్యత్తు ఇప్పుడు మన ముందు నిలిచింది. ఓడిపోయిన వారు మీ భవిష్యత్తును నిర్ణయించేలా అవకాశం ఇవ్వకండి." అని కియోసాకి తన పోస్ట్ను ముగించారు.BAD NEWS: History has ARRIVED.1974 was a future changing year. 1974 marked two massive changes in our world’s future.Our problem is….in 2026, our future is here.The two 1974 future changing events were:1974 the US dollar became the Petro dollar. Rather than backed by…— Robert Kiyosaki (@theRealKiyosaki) April 4, 2026 -
దేవుని సొమ్ముకే ఎసరు.. ఆలయాల్లో బంగారం మాయం!
తిరువనంతపురం: శబరిమల తరహాలోనే కేరళలోని పలు ప్రసిద్ధ దేవాలయాల్లో స్వామివారి ఆభరణాలు కనుమరుగవుతున్నాయి. తాజాగా సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) ద్వారా వెలుగులోకి వచ్చిన నిజాలు భక్తులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి. సరైన పర్యవేక్షణ, రికార్డుల నిర్వహణ లేకపోవడంతో గుడిలోని దేవుని సొమ్ముకే రక్షణ లేకుండా పోయింది.కొచ్చికి చెందిన ఆర్టీఐ కార్యకర్త కె. గోవిందన్ నంబూతిరి దాఖలు చేసిన దరఖాస్తుకు.. కొచ్చిన్ దేవస్వం బోర్డు పరిధిలోని త్రిస్సూర్ గ్రూప్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ ఇచ్చిన సమాధానాలతో ఈ విస్తుపోయే వాస్తవాలు బయటపడ్డాయి. గతంలో శబరిమల ఆలయంలో వెలుగుచూసిన ఆరోపణల మాదిరిగానే.. ఇప్పుడు త్రివేండ్రంలోని శ్రీవరాహం ఆలయం, కొచ్చిన్ దేవస్వం బోర్డు పరిధిలోని పుల్లు భగవతి ఆలయం, త్రిపుణితుర పూర్ణత్రయీశన్ ఆలయాల నుంచి స్వామివారి బంగారం మాయమైనట్లు అధికారికంగా నిర్ధారణ అయింది.ఏ గుడిలో ఎంత మాయమైందంటే..పుల్లు భగవతి ఆలయం: కొచ్చిన్ దేవస్వం బోర్డు త్రిస్సూర్ గ్రూప్ కిందకు వచ్చే ఈ గుడిలో ఏకంగా 40.50 గ్రాముల బరువున్న ఏడు బంగారు గొలుసులు అదృశ్యమయ్యాయి.శ్రీవరాహం ఆలయం: ఇక్కడ 7.750 గ్రాముల బరువున్న రెండు పురాతన బంగారు గొలుసులు కనిపించలేదు. త్రిపుణితుర పూర్ణత్రయీశన్ ఆలయం: ఈ ప్రసిద్ధ ఆలయంలో స్వామివారి కిరీటం నుంచి 663 మిల్లీగ్రాముల బంగారం మాయమైంది.నిర్వహణలో డొల్లతనంపలు దేవస్వం బోర్డు ఆలయాల్లో స్వామివారి ఆభరణాలకు (తిరువాభరణం) సంబంధించి కనీస రిజిస్టర్లను కూడా సరిగ్గా నిర్వహించడం లేదని ఈ ఆర్టీఐ నివేదిక ద్వారా వెల్లడయ్యింది. అధికారుల బాధ్యతారాహిత్యానికి, నిల్వల ట్రాకింగ్లో ఉన్న లోపాలకు ఇది నిదర్శనంగా నిలుస్తోంది. కాగా శబరిమల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ‘స్వదేశ్ దర్శన్’ పథకం కింద మంజూరు చేసిన నిధుల వినియోగంపై కూడా నంబూతిరి కీలక వివరాలు వెల్లడించారు. ఆర్టీఐ పత్రాల ప్రకారం.. కేంద్రం రూ.46.53 కోట్లు మంజూరు చేయగా, ఇప్పటివరకు కేవలం రూ.36.27 కోట్లు మాత్రమే వినియోగించినట్లు తెలుస్తోంది.ఇది కూడా చదవండి: పాక్లో ‘పెట్రో’ మంట: ప్రధాని మాస్టర్ ప్లాన్ ఇదే! -
గోల్డ్ రేటు: వారం రోజుల్లో ఎంత పెరిగిందంటే?
వారం రోజులుగా బంగారం ధరల హెచ్చు తగ్గులు కొనసాగుతూ ఉన్నాయి. అయితే వారాంతంలో గోల్డ్ రేటు స్థిరంగా ఉంది. ఈ కథనంలో ఏడు రోజుల్లో పసిడి ధరల్లో ఎలాంటి మార్పులు జరిగాయి, ధరలు ఎక్కడకు చేరాయి అనే వివరాలు వివరంగా తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడలలో మార్చి 29న 1,48,090 రూపాయల వద్ద ఉన్న 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఈ రోజుకి (శనివారం) 1,50,930 రూపాయల వద్దకు చేరింది. అంటే వారం రోజుల్లో 2840 రూపాయల పెరుగుదలను నమోదు చేసింది. 22 క్యారెట్ల తులం రేటు 1,35,750 రూపాయల దగ్గర నుంచి 1,38,350 రూపాయల (రూ.2600 పెరిగింది) వద్ద నిలిచింది.చెన్నైలో స్వచ్ఛమైన తులం బంగారం (24 క్యారెట్స్) ధర 1,49,020 రూపాయల దగ్గర నుంచి రూ.1,52,180 వద్ద (రూ.3160 పెరిగింది) నిలిచింది. 22 క్యారెట్ల రేటు ఏడు రోజుల్లో 1,36,600 రూపాయల దగ్గర నుంచి రూ.1,39,500 (రూ.2900 పెరిగింది) వద్దకు చేరింది.ఢిల్లీలో కూడా బంగారం ధరలు వారం రోజుల్లో అమాంతం పెరిగాయి. మార్చి 29న 1,48,220 రూపాయల వద్ద ఉన్న 24 క్యారెట్ల తులం గోల్డ్ రేటు.. ఏప్రిల్ 4 నాటికి 1,51,080 రూపాయలు (రూ.2860 పెరిగింది) పెరిగింది. 22 క్యారెట్ల బంగారం ధర 135900 రూపాయల నుంచి 138500 రూపాయల వద్దకు చేరింది. దీన్నిబట్టి చూస్తే బంగారం ధరలు వారం రోజుల్లో భారీగా పెరిగినట్లు స్పష్టంగా తెలుస్తోంది. -
చుక్కలు చూపిస్తున్న బంగారం ధరలు!
-
బంగారం vs వెండి: పెట్టుబడికి ఏది బెస్ట్?
ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అనిశ్చితి పెరిగినప్పుడు, పెట్టుబడిదారులు సాధారణంగా బంగారాన్ని ఒక సురక్షితమైన పెట్టుబడిగా భావిస్తారు. యుద్ధాలు, రాజకీయ ఉద్రిక్తతలు, ఆర్థిక సంక్షోభాలు వంటి సందర్భాల్లో బంగారం ధరలు పెరగడం అనేది సర్వ సాధారణం. అయితే.. ఈ సంవత్సరం (ఇరాన్ - అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం) పరిస్థితి కొంత భిన్నంగా ఉంది. ప్రపంచంలో ఉద్రిక్త పరిస్థితులు ఉన్నప్పటికీ, బంగారం ధరలు పెరగకపోవడం పెట్టుబడిదారులను కొంత ఆశ్చర్యానికి గురిచేసింది.యుద్ధం సమయంలో బంగారం ధరలు పెరగకపోవడం వల్ల.. పెట్టుబడిదారులలో ఒక అనుమానం మొదలైంది. బంగారం కంటే వెండి మంచి పెట్టుబడిగా మారుతుందా?. దీనికి కారణం సిల్వర్ రేటు అమాంతం పెరగడమే.గోల్డ్-సిల్వర్ రేషియోఇక పెట్టుబడిదారుల ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలంటే.. ముందుగా గోల్డ్-సిల్వర్ రేషియో గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. ఈ రేషియో ఒక యూనిట్ బంగారం ధరకు సమానంగా ఉండే వెండి పరిమాణాన్ని సూచిస్తుంది. ప్రస్తుతం ఈ రేషియో 60 కంటే ఎక్కువగా ఉండటం వల్ల, వెండి.. బంగారంతో పోలిస్తే చవకగా ఉందని అర్థమవుతోంది.నిజానికి వెండి అనేది కేవలం ఒక విలువైన లోహం మాత్రమే కాదు. దీనిని పరిశ్రమల్లో కూడా కూడా విరివిగా ఉపయోగిస్తారు. ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్, సౌరశక్తి, ఇతర తయారీ రంగాలలో వెండికి మంచి డిమాండ్ ఉంది. ఈ కారణంగా.. ఆర్థిక పరిస్థితులు మెరుగ్గా ఉన్నప్పుడు వెండి ధరలు వేగంగా పెరిగే అవకాశం ఉంటుంది. అందువల్ల కొంతమంది నిపుణులు వెండిపై పెట్టుబడి చాలా ఉత్తమం అని అంటున్నారు.వెండిపై పెట్టుబడి - జాగ్రత్త!ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఏమిటంటే.. వెండిలో పెట్టుబడి పెట్టడం పూర్తిగా సేఫ్ అని చెప్పలేము. ఎందుకంటే ధరలు పెరుగుతూ, తగ్గుతూ ఉంటాయి. ఇటీవల వెండి ధరలు గణనీయంగా పెరిగినప్పటికీ.. ఒక్కసారిగా భారీగా పడిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇది పెట్టుబడిదారులకు పెద్ద నష్టాలను కలిగించే అవకాశం ఉంది. అందువల్ల, వెండిపై పెట్టుబడి పెట్టే విషయంలో తప్పకుండా జాగ్రత్త వహించాలి.బంగారం విలువను కోల్పోదు!ఇక బంగారం విషయానికి వస్తే.. ఇది చాన్నాళ్లుగా, ఇప్పటికీ ఒక విశ్వసనీయమైన, సురక్షిత పెట్టుబడిగా పరిగణించబడుతుంది. ముఖ్యంగా ఆర్థిక అస్థిరత, కరెన్సీ విలువ తగ్గడం వంటి పరిస్థితుల్లో బంగారం స్థిరత్వాన్ని అందిస్తుంది. కాబట్టి బంగారం ఎప్పుడూ.. దాని విలువను కోల్పోదు.సమతుల్యత ఉత్తమం!పెట్టుబడిదారులు ఎప్పుడూ కూడా.. ఒక లోహాన్ని పూర్తిగా వదిలి మరొకదానిలో పెట్టుబడి పెట్టడం సరైన నిర్ణయం కాదు. బంగారం స్థిరత్వాన్ని అందిస్తే, వెండి వృద్ధి అవకాశాలను అందిస్తుంది. కాబట్టి.. పెట్టుబడిదారులు తమ రిస్క్ సామర్థ్యాన్ని బట్టి బంగారం, వెండి మధ్య సమతుల్యతను పాటిస్తూ పెట్టుబడి పెట్టడం ఉత్తమం.ఇదీ చదవండి: ఉద్యోగం కోసం ఆఫీసుకు పోతే..: టెకీకి ఎదురైన అనుభవం! -
అమాంతం తగ్గిన గోల్డ్ రేటు.. ఒక్కరోజులోనే ఇలా..
నాలుగైదు రోజులుగా భారీగా పెరుగుతున్న బంగారం ధరలకు ఒక్కసారిగా బ్రేక్ పడింది. ఈ రోజు ఉదయం ఓ మోస్తరుగా తగ్గిన గోల్డ్ రేటు.. సాయంత్రానికి భారీగా తగ్గింది. ఇది పసిడి ప్రియులకు ఒకింత ఆనందాన్ని కలిగింది. ఈ కథనంలో దేశంలోని ప్రధాన నగరాల్లోని బంగారం ధరల గురించి వివరంగా తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడ నగరాల్లో ఉదయం రూ.1,38,800 వద్ద ఉన్న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర సాయంత్రానికి రూ.1,36,550 వద్దకు చేరింది. 24 క్యారెట్ల తులం గోల్డ్ రేటు 1,51,420 రూపాయల నుంచి 148970 రూపాయల వద్దకు చేరింది. దీన్నిబట్టి చూస్తే గంటల వ్యవధిలోనే పసిడి ధరలు ఎంతలా పతనమయ్యాయో అర్థం చేసుకోవచ్చు. ఇదే ధరలు బెంగళూరు, ముంబై నగరాల్లో కూడా కొనసాగుతాయి.ఢిల్లీలో బంగారం ధరల విషయానికి వస్తే.. 24 క్యారెట్ల తులం బంగారం ధర 149120 రూపాయల వద్ద ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రేటు 136700 రూపాయల వద్ద ఉంది. ఉదయం ఈ ధరలు వరుసగా రూ.151570, రూ. 138950 వద్ద ఉన్నాయి.చెన్నైలో కూడా సాయంత్రానికి బంగారం ధరల్లో మార్పులు జరిగాయి. ఈ నగరంలో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.1,50,000 వద్ద ఉంది. 22 క్యారెట్ల రేటు 137500 రూపాయల వద్ద ఉంది.వెండి ధరలుబంగారం ధరలు మాదిరిగానే.. వెండి ధరలు కూడా తగ్గాయి. కేజీ రేటు రూ.10000 తగ్గడంతో సిల్వర్ రూ.2.55 లక్షల వద్దకు చేరింది. ఈ రేటు ఢిల్లీలో 2.50 లక్షల రూపాయల వద్ద ఉంది. దేశంలోని ఇతర ప్రధాన నగరాలతో పోలిస్తే దేశ రాజధాని నగరంలో వెండి రేటు కొంత తక్కువే.ఇదీ చదవండి: ఒరాకిల్ భారీ లేఆఫ్స్.. ఉద్యోగులకు ప్రయోజనాలు! -
బంగారం, వెండి పెట్టుబడులకు కొత్త నిబంధనలు
దేశంలో బంగారం, వెండిపై పెట్టుబడులకు సంబంధించి ఏప్రిల్ 1 నుండి కీలక మార్పులు అమల్లోకి వచ్చాయి. సెబీ (SEBI) తీసుకున్న కొత్త నిర్ణయాలు, పన్ను విధానాల్లో మార్పులు మీ లాభాలపై నేరుగా ప్రభావం చూపనున్నాయి. ఆ మార్పులేంటో ఓసారి పరిశీలిద్దాం.అంతర్జాతీయ ధరలకు స్వస్తి! ఇప్పటి వరకు గోల్డ్, సిల్వర్ ఈటీఎఫ్ల (ETF) ధరలను అంతర్జాతీయ ప్రమాణాల (LBMA) ఆధారంగా నిర్ణయించేవారు. కానీ ఏప్రిల్ 1 నుండి సెబీ (SEBI) కొత్త నిబంధనలను అమలు చేస్తోంది. ఇకపై వీటి ధరలు భారతీయ ఎక్స్ఛేంజీల 'దేశీయ స్పాట్ ధర' (Domestic Spot Price) ఆధారంగానే నిర్ణయిస్తారు. దీనివల్ల అంతర్జాతీయ మార్కెట్ హెచ్చుతగ్గులు, కరెన్సీ మార్పిడి రేట్ల ప్రభావం మన పెట్టుబడులపై తక్కువగా ఉంటుంది. పెట్టుబడిదారులు భారత మార్కెట్ వాస్తవ ధరకే లావాదేవీలు జరపవచ్చు.గోల్డ్ బాండ్స్పై పన్ను పోటుఫిజికల్ గోల్డ్ కంటే సురక్షితమైనదిగా భావించే సావరిన్ గోల్డ్ బాండ్ల (SGB)విషయంలో ప్రభుత్వం పన్ను నిబంధనలను కఠినతరం చేసింది. ఇప్పటి వరకు సావరిన్ గోల్డ్ బాండ్లపై పన్ను మినహాయింపులు ఉండటంతో వీటిని ఉత్తమ పెట్టుబడిగా భావించేవారు. అయితే, కొత్త నిబంధనల ప్రకారం వీటిపై కూడా 'మూలధన లాభాల పన్ను' వర్తిస్తుంది.అయితే బాండ్లను జారీ చేసిన సమయంలో నేరుగా కొనుగోలు చేసి, మెచ్యూరిటీ వరకు ఉంచుకునే వారికి పన్ను మినహాయింపు కొనసాగుతుంది. అదే సెకండరీ మార్కెట్ (స్టాక్ మార్కెట్) ద్వారా బాండ్లను కొనుగోలు చేసిన వారు మాత్రం ఇకపై స్వల్పకాలిక లేదా దీర్ఘకాలిక మూలధన లాభాల ఆధారంగా పన్ను చెల్లించాల్సి ఉంటుంది.డిజిటల్ గోల్డ్పై ప్రభుత్వ నిఘాడిజిటల్ గోల్డ్ లేదా సావరిన్ గోల్డ్ బాండ్లలో పెట్టుబడి పెట్టే ప్రయోజనాలను పూర్తిగా పన్ను వలయం కిందకు తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. ఫిజికల్ గోల్డ్ మాదిరిగానే డిజిటల్ పెట్టుబడులపై కూడా పారదర్శకమైన పన్ను విధానాన్ని తీసుకురావడమే దీని వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం. -
దుర్గగుడి సిబ్బంది మాయాజాలం
ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ): అమ్మలగన్న అమ్మ.. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ కానుకలకు రెక్కలొచ్చాయి. అమ్మవారికి భక్తులు ఎంతో భక్తితో సమర్పించే బంగారు కానుకలను తరలిస్తున్న ఘటన సోమవారం రాత్రి వెలుగు చూసింది. రోల్డ్ గోల్డ్ పేరిట రూ.1.25 లక్షల విలువైన బంగారు వస్తువుల్ని ఆలయ సిబ్బంది పక్కదారి పట్టిస్తూ ట్రస్ట్ బోర్డు సభ్యులకు రెడ్హ్యాండెడ్గా దొరికిపోయారు.ఈ వ్యవహారాన్ని ఆలయ అధికారులు గోప్యంగా ఉంచేందుకు ప్రయత్నించడం చర్చనీయాంశమైంది. ఘటనకు కారణమైన ఉద్యోగితోపాటు మరికొందరికి ఆలయ అధికారులు మెమోలు జారీ చేశారు. మంగళవారం దేవదాయ శాఖ గోల్డ్ వెరిఫికేషన్ అధికారి ఈ ఘటనపై విచారణ చేపట్టారు. మహా మండపం ఆరో అంతస్తులోని కానుకల లెక్కింపు ప్రాంతంతో పాటు సోమవారం నాటి సీసీ కెమెరా ఫుటేజీని సైతం పరిశీలించారు. దీనిపై దేవదాయ శాఖ కమిషనర్కు నివేదిక అందజేస్తామని ఆయన పేర్కొన్నారు. 20 రోజులకు ఒకసారి లెక్కింపు శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానంలో 20 రోజులకొకసారి కానుకల లెక్కింపు జరుగుతుంది. హుండీలలో నగదుతో పాటు భక్తులు బంగారు, వెండి వస్తువులను కానుకగా సమరి్పస్తుంటారు. వీటిలో గ్రాము బరువు గల మంగళ సూత్రాలు, నాణేలు హుండీలో వస్తుంటాయి. కానుకల లెక్కింపు సమయంలో ఆలయ సిబ్బంది వాటిని వేరుచేసి దేవస్థానం లాకర్లో భద్రపరుస్తుంటారు. కొందరు రోల్డ్గోల్డ్ ఆభరణాలను సైతం హుండీలో వేస్తుంటారు. ఆలయ సిబ్బంది, పోలీసులు, ఎస్పీఎఫ్ సిబ్బంది వాటిని గుర్తించి దగ్ధం చేస్తుంటారు. గోల్డ్ను రోల్డ్గోల్డ్లో కలిపేసి సోమవారం జరిగిన హుండీ లెక్కింపులో రోల్డ్గోల్డ్ వస్తువులతో పాటు బంగారు రేకుతో తయారు చేసిన మంగళసూత్రాలు, నాణేలను ఆలయ సిబ్బంది గుర్తించారు. అధికారులెవరికి అనుమానం రాకుండా బంగారు ఆభరణాలను రోల్డ్గోల్డ్ వస్తువుల్లో కలిపివేయడాన్ని ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యుడు గుర్తించారు. కొన్ని దఫాలుగా కానుకల లెక్కింపులో సదరు ఉద్యోగి తీరుపై అనుమానంతో నిఘా పెట్టారు. సోమవారం రోల్డ్గోల్డ్ వస్తువులలో బంగారు ఆభరణాలు, వస్తువులను వేయడంతో పక్కా ఆధారాలతో ఆ ఉద్యోగిని పట్టుకున్నారు.ఈ వ్యవహారం బయటకు రాకుండా కొందరు ఉద్యోగులు ప్రయత్నించినట్టు సమాచారం. మంగళవారం ఈ వ్యవహారం వెలుగులోకి రావడంతో ఆలయ వర్గాలు కలవరపడ్డాయి. కొన్ని నెలల క్రితం భక్తులు అమ్మవారికి సమర్పించిన ఆభరణాల్లో డైమండ్స్, విలువ కలిగిన రాళ్లను సైతం ఆలయ సిబ్బంది మాయం చేశారని జోరుగా ప్రచారం జరిగింది. బంగారాన్ని కరిగించే సమయంలో రాళ్లను పగులగొట్టి బంగారాన్ని వేరు చేశామని చెప్పడం గమనార్హం. మట్టీ మాయమవుతోంది ప్రతి 20 రోజులకు ఒకసారి జరిగే కానుకల లెక్కింపులో వచ్చిన రోల్డ్గోల్డ్ వస్తువులను మహా మండపం దిగువన ఆలయ సిబ్బంది, పోలీసు, సెక్యూరిటీ, ఎస్పీఎఫ్ సిబ్బంది సమక్షంలో పెట్రోల్ పోసి దగ్ధం చేస్తారు. అయితే.. రోల్డ్గోల్డ్ వస్తువులను దగ్ధం చేసిన మట్టిని గుర్తు తెలియని వ్యక్తులు తెల్లారేసరికి మాయం చేస్తున్నారు. ఈ మట్టి బంగారం శుద్ధిచేసే వారి వద్దకు చేరుతోంది. అంటే రోల్డ్గోల్డ్ ముసుగులో అసలైన బంగారు వస్తువుల్ని కూడా దగ్ధం చేసి.. మట్టిలో కరిగిపోయిన బంగారాన్ని మాయం చేస్తున్నట్టు తెలుస్తోంది. అప్రైజర్పై చర్యలు దుర్గగుడి గోల్డ్ అప్రైజర్ డి.షమ్మీపై చర్యలు తీసుకుంటూ ఆలయ ఈవో శీనానాయక్ మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. తాత్కాలికంగా తొలగించినట్లు పేర్కొన్నారు. విధుల్లో అలసత్వంగా కారణంగా దేవస్థాన ప్రతిష్టకు భంగం కలిగిందని భావించి చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. ]సీసీ కెమెరాలు, అధికారులు ఉన్నా..దుర్గగుడిలో కానుకల లెక్కింపును 50కి పైగా సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తుంటారు. లెక్కింపు జరుగుతున్నంత సేపు ఆలయ ముఖ్య అధికారులు, సిబ్బంది అక్కడే ఉన్నా చాకచక్యంగా బంగారు వస్తువులను రోల్డ్గోల్డ్ పేరిట బయటకు తరలించడం వెనుక ఆలయ అధికారుల పాత్ర, భద్రతా సిబ్బంది పాత్ర ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
బంగారం ధరలు.. ఊహకందని మార్పులు!
ఇటీవల కాలంలో బంగారం ధరలు గంటల వ్యవధిలోనే ఊహకందని విధంగా మారిపోతున్నాయి. ఉదయం ఒక రేటు ఉంటే.. సాయంత్రానికి మరో రేటు ఉంది. ఈ రోజు కూడా ఇదే బాటలు గోల్డ్ రేటు అడుగులు వేసింది. ఈ కథనంలో దేశంలోని ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఎలా ఉన్నాయో వివరంగా తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడ నగరాల్లో 136850 రూపాయల వద్ద ఉన్న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర, సాయంత్రానికి 137050 రూపాయల వద్దకు చేరింది. అంటే ఉదయం నుంచి సాయంత్రానికి ధర రూ.200 పెరిగింది. 24 క్యారెట్ల ధర రూ. 149290 నుంచి 149510 రూపాయల వద్దకు చేరింది. ఇదే ధరలు బెంగళూరు, ముంబై నగరాల్లో కూడా కొనసాగుతాయి.ఢిల్లీలో కూడా ధరలు పెరిగాయి. 24 క్యారెట్ల ధర 10 గ్రాముల బంగారం ధర 149660 రూపాయల వద్దకు చేరగా.. 22 క్యారెట్ల తులం గోల్డ్ రేటు 137200 రూపాయాల వద్దకు చేరింది. ఈ రేట్లు ఉదయానికి, సాయంత్రానికి చాలా తేడా ఉన్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది.అయితే.. చెన్నై నగరంలో మాత్రం బంగారం ధరల్లో ఎలాంటి మార్పు లేదు. కాబట్టి 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రేటు 136700 రూపాయల వద్ద, 24 క్యారెట్ల తులం పసిడి ధర 149130 రూపాయల వద్ద ఉంది.వెండి ధరలుకేజీ వెండి ధర రూ.250000 వద్ద ఉంది. ఈ రోజు (మంగళవారం) కేజీ సిల్వర్ రేటు రూ.5000 తగ్గడంతో రూ.2.5 లక్షల వద్ద నిలిచింది. అయితే ఢిల్లీలో వెండి రేటు రూ.5000 పెరిగింది. దీంతో అక్కడ కేజీ సిల్వర్ ధర రూ.2.5 లక్షల వద్ద ఉంది. -
బంగారం ఒక్కరోజులో మళ్లీ భగ్గుమంది! వెండి మాత్రం..!
-
గంటల వ్యవధిలో.. ఊహకందని గోల్డ్ రేటు!
సోమవారం ఉదయం తగ్గిన బంగారం ధరలు.. సాయంత్రానికి పెరుగుదల దిశగా అడుగులు వేసింది. వెండి రేటు కూడా గరిష్టంగా రూ.5000 పెరిగింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో గోల్డ్, సిల్వర్ రేట్లలో స్వల్ప మార్పులు జరిగాయి. ఈ కథనంలో కొత్త ధరలు ఎలా ఉన్నాయో వివరంగా తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడ నగరాలలో ఉదయం రూ.1,35,000 వద్ద ఉన్న 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు సాయంత్రానికి రూ.1,35,900 వద్దకు చేరింది. దీన్ని బట్టి చూస్తే గంటల వ్యవధిలో రూ.900 పెరిగినట్లు స్పష్టమవుతోంది. 24 క్యారెట్ల తులం రేటు 1,47,280 రూపాయల దగ్గర నుంచి 1,48,260 రూపాయల (రూ.980 పెరిగింది) వద్దకు చేరింది. ఇదే ధరలు బెంగళూరు, ముంబై నగరాల్లో కూడా కొనసాగుతాయి.చెన్నైలో కూడా గోల్డ్ రేట్లలో మార్పులు జరిగాయి. దీంతో 24 క్యారెట్ల తులం బంగారం ధర 1,48,370 రూపాయల నుంచి 1,50,220 రూపాయల వద్దకు చేరింది. 22 క్యారెట్ల తులం పసిడి రేటు 1,36,050 రూపాయల వద్ద ఉంది.ఢిల్లీలో ఉదయం 1,35,150 రూపాయల వద్ద ఉన్న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర.. సాయంత్రానికి 1,36,050 రూపాయల వద్దకు చేరింది. 24 క్యారెట్ల తులం గోల్డ్ రేటు 147430 రూపాయల దగ్గర నుంచి రూ.148410 వద్దకు చేరింది. ఇదంతా కేవలం గంటల వ్యవధిలో జరిగిన మార్పు.వెండి ధరఈ రోజు (సోమవారం) ఉదయం రూ.2.50 లక్షల వద్ద స్థిరంగా ఉన్న వెండి రేటు.. సాయంత్రానికి రూ.5000 పెరిగింది. దీంతో కేజీ రేటు రూ.2.55 లక్షల వద్దకు చేరింది. అయితే ఢిల్లీలో మాత్రం కేజీ వెండి రేటు రూ.2.45 లక్షల వద్ద ఉంది. -
భారీగా పడిపోయిన బంగారం ధరలు! కొనుగోలుదారులకు పండగ..
-
యుద్ధం ఆగదు.. వాళ్లంతా నష్టపోక తప్పదు: కియోసాకి
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఆర్థిక నిపుణుడు, 'రిచ్ డాడ్ పూర్ డాడ్' (Rich Dad Poor Dad) రచయిత రోబర్ట్ కియోసాకి మరోసారి ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై సంచలన హెచ్చరికలు చేశారు. తాజా ‘ఎక్స్’ పోస్ట్లో ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వాలు అడ్డగోలుగా ముద్రిస్తున్న డబ్బును 'ఫేక్ మనీ'గా అభివర్ణించిన ఆయన (Robert Kiyosaki), రాబోయే రోజుల్లో సంప్రదాయ పెట్టుబడులు నష్టపోక తప్పదని హెచ్చరించారు.డాలర్ విలువ పతనం - పెరుగుతున్న అప్పులుప్రభుత్వాలు తమ ఇష్టానుసారం కరెన్సీని ముద్రిస్తుండటం వల్ల దేశాల జాతీయ అప్పులు (National Debt) విపరీతంగా పెరుగుతున్నాయని కియోసాకి పేర్కొన్నారు. దీనివల్ల ద్రవ్యోల్బణం ఆకాశాన్ని తాకుతుందని, డాలర్లను పొదుపు చేసేవారు కాలక్రమేణా తమ సంపదను కోల్పోతారని ఆయన విశ్లేషించారు. ముఖ్యంగా అమెరికా బాండ్లు సురక్షితమైనవనేది ఒక "పెద్ద అబద్ధం" అని ఆయన కుండబద్దలు కొట్టారు.చమురు సెగ.. అంతం లేని యుద్ధంప్రస్తుతం ఇరాన్ కేంద్రంగా సాగుతున్న ఉద్రిక్తతలను ఆయన ఒక 'పవిత్ర యుద్ధం'గా అభివర్ణించారు. ఈ వివాదాలు త్వరలో ముగిసేవి కావని, దీని ఫలితంగా అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు నిరంతరం పెరుగుతూనే ఉంటాయని, అది మరింత ద్రవ్యోల్బణానికి దారితీస్తుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.పాత పద్ధతులకు కాలం చెల్లింది!సాధారణంగా ప్రజలు నమ్మే "చక్కగా చదువుకో, మంచి ఉద్యోగం సంపాదించు, పన్నులు కట్టు, 401k లేదా మ్యూచువల్ ఫండ్లలో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేయి" అనే సూత్రం ఇప్పుడు పనికిరాదని కియోసాకి కొట్టిపారేశారు. ఈ పద్ధతిని అనుసరించేవారే భవిష్యత్తులో ఎక్కువగా నష్టపోతారని ఆయన అభిప్రాయపడ్డారు. చివరికి ఎంబీఏ (MBA) వంటి ఉన్నత డిగ్రీలు కూడా ప్రస్తుత ఆర్థిక సంక్షోభం ముందు పనికిరావని ఆయన వ్యాఖ్యానించడం గమనార్హం.2026కు సురక్షితమైన ఇన్వెస్ట్మెంట్లు ఇవే..ఏవైతే ముద్రించడానికి వీలుపడవో అవే నిజమైన ఆస్తులని కియోసాకి నమ్ముతారు. ఆయన ప్రకారం 2026లో పెట్టుబడిదారులను కాపాడేవి బంగారం, వెండి (Real Gold & Silver), చమురు (Oil), ఆహార ధాన్యాలు (Food), క్రిప్టో కరెన్సీ (Bitcoin & Ethereum) మాత్రమే."మీ మెదడులో మీరు నింపుకునే ఆర్థిక విద్య (Financial Education) మాత్రమే మిమ్మల్ని కాపాడుతుంది. దేనిని నమ్మాలో మీరే ఆలోచించుకోండి" అంటూ ఆయన ఇన్వెస్టర్లకు సూచించారు. INVESTOR SECRET: “lf you want to be a rich investor you have to see the future.”Seeing the future today is EASY for two reasons.1: The National Debt will only go up because governments will only keep printing fake money. That means inflation will keep going up which…— Robert Kiyosaki (@theRealKiyosaki) March 30, 2026 -
ఐదేళ్లలో బంగారం మార్క్.. నిపుణుల కొత్త అంచనా!
పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ మేఘాలు, అంతర్జాతీయ రాజకీయ ఉద్రిక్తతల కారణంగా బంగారం ధరల్లో చాలా మార్పులు జరిగాయి. చాలామంది పెట్టుబడిదారులు విలువైన లోహాలపై పెట్టుబడులు పెడుతున్నారు. ఈ తరుణంలో ఫండ్స్ఇండియా గ్రూప్ సీఈఓ అక్షయ్ సప్రూ భవిష్యత్ పరిణామాల గురించి విశ్లేషించారు.భౌగోళిక రాజకీయ పరిణామాలను నియంత్రించడం చాలా కష్టం. ఇలాంటి సంఘటనలు గతంలో కూడా చాలా జరిగాయి. భవిష్యత్తులోనూ జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి సంఘటనల కారణంగా.. పెట్టుబడిదారుడి తత్వం దారి తప్పకూడదని అక్షయ్ పేర్కొన్నారు. ఇన్వెస్టర్లు ప్రస్తుతం పాత పద్దతులను వదిలిపెట్టి.. కొత్త విధానాలను అనుసరిస్తున్నారని అన్నారు.బంగారం ర్యాలీ చాలా వరకు పూర్తయింది. రాబోయే ఐదేళ్లలో.. ఇది గత సైకిల్ మాదిరిగా రాబడులను అందించకపోవచ్చు. మీ పోర్ట్ఫోలియోలో బంగారం ఇప్పటికే 5-10 శాతం ఉంటే, ఆ కేటాయింపును కొనసాగించవచ్చు, కానీ పెట్టుబడిని గణనీయంగా పెంచడం మంచిది కాదు. గోల్డ్ సిప్లను కొనసాగించవచ్చు, కానీ కొత్తగా చేసే ఏకమొత్తం పెట్టుబడుల విషయంలో జాగ్రత్త వహించాలి. వెండి విషయానికొస్తే, దాని అధిక అస్థిరత, నిలకడలేని రాబడుల కారణంగా సాధారణంగా చాలామంది దానికి ప్రాధాన్యత ఇవ్వరు అని అక్షయ్ సప్రూ పేర్కొన్నారు.2030 నాటికి గోల్డ్ రేటుఇప్పుడు రూ.1,48,000 వద్ద బంగారం ధర 2030 నాటికి రూ.1.68 లక్షల నుంచి రూ. 2.25 లక్షల మధ్యకు చేరుకుంటుందని మరికొందరు నిపుణులు అంచనా వేస్తున్నారు. గోల్డ్ రేటు పెరగడానికి ప్రధాన కారణం సెంట్రల్ బ్యాంకుల భారీ కొనుగోళ్లు మాత్రమే కాకుండా ప్రపంచ దేశాల్లో ఏర్పడే ఆర్థిక అనిశ్చితి అని చెబుతున్నారు.ఇదీ చదవండి: 'ఏఐ ఎంత ఎదిగినా.. వీళ్ల ఉద్యోగానికి డోకా లేదు' -
బంగారం అమ్మే సరైన సమయం ఇదే.. లాభం డబుల్ చేసే ట్రిక్!
-
ఫ్యాషన్ షోలో నగధగలు..అలరించిన మోడల్స్ (ఫోటోలు)
-
వారంలో తారుమారు.. బంగారం ధరల్లో ఇంత మార్పా!
బంగారం ధరలు ఈ నెల ప్రారంభం నుంచి బాగా తగ్గుతూ వచ్చినప్పటికీ.. గత రెండు రోజులుగా పెరుగుతున్నాయి. గత ఆదివారం (మార్చి 22) 1,45,970 రూపాయల వద్ద ఉన్న 24 క్యారెట్ల గోల్డ్.. ఈ రోజుకు రూ.1,48,090 వద్దకు చేరింది. దీన్ని బట్టి చూస్తే పసిడి ధరలు వారంలో ఎంతలా మారిపోయాయి అర్థం చేసుకోవచ్చు. ఈ కథనంలో ఈ వారం.. గోల్డ్ రేట్లు ఇలా పెరిగాయనే వివరాలు తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడలలో మార్చి 22న (ఆదివారం) 1,45,970 రూపాయల వద్ద ఉన్న 24 క్యారెట్ల గోల్డ్.. ఈ రోజుకు (శనివారం) రూ.1,48,090 వద్దకు చేరింది. 22 క్యారెట్ల గోల్డ్ రేటు 1,33,800 రూపాయల నుంచి 135750 రూపాయల వద్దకు చేరింది. వారం రోజుల్లో పసిడి ధర గణనీయంగా పెరిగినట్లు పరిస్థితులు చెబుతున్నాయి.చెన్నైలో గత ఆదివారం (మార్చి 22) 1,45,850 రూపాయల వద్ద ఉన్న 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర.. ఈ రోజుకు (మార్చి 28) రూ. 1,49,020 వద్దకు చేరింది. 22 క్యారెట్ల రేటు 1,36,200 రూపాయల దగ్గర నుంచి 1,36,600 రూపాయల వద్దకు చేరింది.ఢిల్లీలో బంగారం ధరల విషయానికి వస్తే.. మార్చి 22న 1,46,120 రూపాయల వద్ద ఉన్న 24 క్యారెట్ల తులం గోల్డ్ రేటు ఈ రోజుకి (శనివారం) 1,48,220 రూపాయల వద్దకు చేరింది. 22 క్యారెట్ల గోల్డ్ రేటు 1,33,950 రూపాయల దగ్గర నుంచి రూ. 1,35,900 వద్దకు చేరింది.వెండి ధరలువెండి విషయానికి వస్తే.. కేజీ వెండి రేటు గత ఆదివారం ఎలా ఉందో (రూ.2.5 లక్షలు), శనివారం నాటికి (రూ.2.5 లక్షలు) అదే మార్క్ దగ్గర ఉంది. అయితే వారం మధ్యలో ధరల్లో మార్పులు సంభవించినప్పటికీ.. చివరికి రూ.2.5 లక్షల వద్దనే నిలిచింది.ఇదీ చదవండి: బ్యాంకు కస్టమర్లకు అలర్ట్.. ఏప్రిల్లో సగం సెలవులే! -
ఒక్కసారిగా షాకిచ్చిన గోల్డ్..! రాత్రికి రాత్రే భారీ మార్పు..
-
వెండి మళ్లీ వెనక్కి
న్యూఢిల్లీ: వెండి, బంగారం మరోసారి అమ్మకాల ఒత్తిడికి కుదేలయ్యాయి. శుక్రవారం ఢిల్లీ మార్కెట్లో కిలో వెండి రూ.11,250 నష్టపోయి రూ.2.3 లక్షలకు దిగొచ్చింది. బంగారం సైతం 10 గ్రాములకు రూ.1,900 తగ్గి రూ.1,47,800 స్థాయికి చేరింది. శ్రీరామనవమిని పురస్కరించుకుని గురువారం బులియన్ మార్కెట్లు పనిచేయలేదు. చమురు ధరలు గరిష్ట స్థాయిల్లో ఉండడం, అంతర్జాతీయ పరిణామాలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్ను ప్రభావితం చేస్తున్నట్టు విశ్లేషకులు చెబుతున్నారు.అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ఔన్స్కు 37 డాలర్లు లాభపడి 4,416 డాలర్ల స్థాయి వద్ద, వెండి ఔన్స్కు స్వల్ప లాభంతో 68.12 డాలర్ల స్థాయిలో ట్రేడయ్యాయి. ‘‘చమురు ధరలు బలహీనపడడంతో బంగారం ధర 4,420 డాలర్ల వరకు వెళ్లింది. కానీ, తర్వాత చమురు ధరల పెరుగుదలతో దిగొచ్చింది’’అని మిరే అసెట్ షేర్ఖాన్ కమోడిటీస్ హెడ్ ప్రవీణ్సింగ్ తెలిపారు. యూఎస్ ద్రవ్యోల్బణం డేటా సమీప కాలంలో బులియన్ ధరలను ప్రభావితం చేయొచ్చన్నారు. -
కియోసాకి హెచ్చరిక: అదే నిజమైతే.. లక్షలాది మంది పేదలవుతారు!
సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ.. ఆర్ధిక వ్యవహారాలకు సంబంధించిన సూచనలు ఇచ్చే కియోసాకి.. తాజాగా ఒక ట్వీట్ చేశారు. ఇందులో 2026 క్రాష్?, అని పేర్కొంటూనే.. 1500వ సంవత్సరంలో నోస్ట్రాడమస్, 2026లో ప్రపంచాన్ని ఒక విపత్తు తాకుతుందని చెప్పారని వెల్లడించారు. ఈ ట్వీట్ చేసిన కొన్ని గంటల వ్యవధిలోనే క్షమాపణలు అంటూ మరో ట్వీట్ చేశారు. కియోసాకి ఎందుకిలా చేశారు?, దీనికి గల కారణం ఏమిటనేది ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.మొదటి ట్వీట్''1500వ సంవత్సరంలో నోస్ట్రాడమస్, 2026లో ప్రపంచాన్ని ఒక విపత్తు తాకుతుందని చెప్పారు. 1950లో ఎడ్గార్ కేస్ కూడా 2026లో ఒక భారీ పతనం సంభవిస్తుందని అంచనా వేశారు. మీరేమనుకుంటున్నారు?.. 2026లో ఒక భారీ పతనం సంభవిస్తే, మీరు ధనవంతులు అవుతారా లేక పేదవారు అవుతారా?, నేను ధనవంతుడిని కావాలని అనుకుంటున్నాను'' అని కియోసాకి ట్వీట్ చేశారు.2026 CRASH?FUTURISTS:Nostradamus in 1500 said disaster would hit the world in 2026.Edgar Cayce in 1950 also predicted a massive crash occurring in 2026.What do you think?You may want to tune into YouTube videos for more details on these two famous futurist predictions.…— Robert Kiyosaki (@theRealKiyosaki) March 27, 2026రెండో ట్వీట్క్షమించండి అని పేర్కొంటూ.. మొదటి పోస్ట్లో, 2026లో ప్రపంచ ఆర్థిక సంక్షోభం ప్రారంభమవుతుందని భవిష్యత్ శాస్త్రవేత్తలైన నోస్ట్రాడమస్ (1500) మరియు ఎడ్గార్ కేసీ (1940) చేసిన అంచనాను నేను వెల్లడించాను. ఆ తరువాత ఒక స్నేహితుడు నన్ను సంప్రదించాడు.. 2026 సంక్షోభ సమయంలో నేను ధనవంతుడిని అవుతానని చెప్పినందుకు అతను నాపై కోపంగా ఉన్నాడని పేర్కొన్నారు.అతని సమస్య ఏమిటంటే.. మీలో చాలామంది అనుసరించినట్లుగా అతను నా పోస్ట్ను ఎప్పుడూ అనుసరించలేదు. అంతే కాకుండా.. ఒక సంక్షోభంలో ధనవంతులు కావాలని మీరు, నేను ప్రణాళిక వేసుకున్న విషయం అతనికి తెలియదు.నన్ను అనుసరించే అందరికీ.. నేను S&P 500, యూఎస్ బాండ్లు, మ్యూచువల్ ఫండ్స్, ఈటీఎఫ్లు వంటి స్టాక్స్లో పెట్టుబడి పెట్టనని, లేదా నగదును పొదుపు చేయనని ఇప్పటికే తెలుసు. ప్రభుత్వం, బ్యాంకులు లేదా వాల్ స్ట్రీట్ ముద్రించే దేనిలోనూ నేను పెట్టుబడి పెట్టను. అంతే కాకుండా.. నన్ను అనుసరించే వారికి నేను KISS (కీప్ ఇట్ సూపర్ సింపుల్) సూత్రాన్ని పాటిస్తానని కూడా తెలుసు.MY APOLOGIES:In my previous X I quoted futurists Nostradamus’ 1500 and Edgar Caycees 1940 prediction that a global economic crisi would begin in 2026. A friend contacted me. He was upset with me because I stated I was going to richer during the 2026 crisis.His problem was…— Robert Kiyosaki (@theRealKiyosaki) March 27, 2026నేను పశువులను పెంచి అమ్ముతాను, టెక్సాస్, నార్త్లోని నా చమురు బావుల నుంచి చమురును అమ్ముతాను, అప్పుతో కొనుగోలు చేసిన 1500 అద్దె యూనిట్లను నెలవారీగా అద్దెకు ఇస్తాను, నేను అసలైన బంగారం, వెండి, బిట్కాయిన్, మరియు ఎథేరియంలను పొదుపు చేస్తాను. మీలో చాలా మందిలాగే, నా దగ్గర కూడా మొదట్లో డబ్బు లేదు. కానీ చిన్న చిన్న ఆస్తులను కొని సంవత్సరాల తరబడి ఉంచుకున్నాను, వాటిని ఎప్పుడూ అమ్మలేదు. మీలో చాలా మందికి నేను నా మొదటి 6 బిట్కాయిన్లను $600కి కొన్నానని తెలుసు, నా దగ్గర ఉన్న డబ్బంతా అదే, మరియు నేను కొన్ని రోజుల పాటు ఏమీ తినలేదు.ఇక చివరగా.. నోస్ట్రాడమస్, ఎడ్గార్ కేస్ చెప్పినట్లు 2026లో ప్రపంచ ఆర్థిక సంక్షోభం వస్తుందా?, రాదా అని నాకు తెలియదు. కానీ ఒకవేళ అది నిజమైతే.. నా మాట విన్న మీరు, నేను ధనవంతులమవుతామని నాకు గట్టి నమ్మకం ఉంది. అదే సమయంలో లక్షలాది మంది పేదలుగా మిగిలిపోతారు.ఇదీ చదవండి: గరిష్టాల నుంచి డౌన్.. రూ.1.60 లక్షలు తగ్గిన వెండి!భవిష్యత్తును చూడగలిగే పెట్టుబడిదారులే ధనవంతులవుతారు. నాకు నిజమైనవి (విలువైన లోహాలు) ఇష్టం. నకిలీవి (కరెన్సీ) అంటే ద్వేషం. నువ్వేం చేయబోతున్నావు?. ఆలోచించి.. ఏమీ చేయని లక్షలాది మందిలా ఉండకు. అలోచించి నిర్ణయం తీసుకో అని కియోసాకి ట్వీట్ చేశారు. -
మన బంగారాన్ని ప్రభుత్వం సీజ్ చేయొచ్చా?
భారతీయ కుటుంబాలకు బంగారం అంటే కేవలం ఒక ఆభరణం మాత్రమే కాదు, అది ఒక సెంటిమెంట్.. కష్టకాలంలో ఆదుకునే ఒక గొప్ప భరోసా. కానీ ఇప్పుడున్న ఉద్రిక్త యుద్ధ వాతావరణంలో దేశవ్యాప్తంగా ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. మన ఇళ్లలో, బీరువాల్లో, లాకర్లలో భద్రంగా దాచుకున్న బంగారాన్ని బయటకు తీయాలని నిపుణులు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే అవకాశం ఉందన్న అంశం తెర మీదకొచ్చింది. అసలు ఎందుకు మన బంగారంపై ప్రభుత్వానికి లేదా ఆర్థిక నిపుణులకు అంత ఆసక్తి? సుమారు 10 ట్రిలియన్ డాలర్ల విలువైన బంగారం భారతీయుల ఇళ్లలో, దేవాలయాల్లో నిద్రాణంగా ఉందని అంచనా. ఈ భారీ సంపదను దేశ ఆర్థిక వ్యవస్థలోకి ఎలా తీసుకురావాలి? అసలు వ్యక్తుల నుంచి బంగారం సేకరించడం సాధ్యమేనా? దీనికి చట్టాలు ఏం చెబుతున్నాయి? ఈ విషయాలన్నీ ఈరోజు వీడియోలో వివరంగా తెలుసుకుందాం.ఇటీవల మాజీ కేంద్ర మంత్రి పీపీ చౌదరి వంటి ఆర్థిక నిపుణులు ఒక కీలక ప్రతిపాదన చేశారు. భారతీయుల వద్ద ఉన్న బంగారాన్ని "డెడ్ అసెట్" (అంటే నిద్రాణమైన ఆస్తి) అన్నారు. అంటే అది బీరువాలో లేదా బ్యాంకులో ఉంటే కేవలం భద్రతను ఇస్తుంది తప్ప, దేశ అభివృద్ధికి ఏ విధంగానూ ఉపయోగపడదు. ఒకవేళ ఇదే బంగారాన్ని బ్యాంకింగ్ వ్యవస్థలోకి లేదా ఫైనాన్షియల్ అసెట్స్గా మార్చగలిగితే, దేశ ఆర్థిక వ్యవస్థ రూపురేఖలే మారిపోతాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. దీనివల్ల బంగారం దిగుమతులు తగ్గి, డాలర్తో పోలిస్తే రూపాయి విలువ బలపడే అవకాశం ఉంటుంది.ప్రతి ఏటా మీకు వడ్డీ చాలామందికి వచ్చే సందేహం.. "నా బంగారంపై నాకే కదా హక్కు ఉంటుంది, ప్రభుత్వం ఎలా తీసుకుంటుంది?" అని. నిజానికి, ప్రభుత్వం మీ దగ్గర ఉన్న బంగారాన్ని బలవంతంగా లాక్కోదు. దానికి బదులుగా "గోల్డ్ మోనిటైజేషన్ స్కీమ్స్" వంటి పథకాలను ప్రవేశపెడుతుంది. దీని ప్రక్రియ ఎలా ఉంటుందంటే మీరు మీ దగ్గర ఉన్న బంగారాన్ని (బిస్కెట్లు లేదా పాత ఆభరణాలు) బ్యాంకులో డిపాజిట్ చేస్తారు. ఆ బంగారాన్ని కరిగించి, దాని స్వచ్ఛతను బట్టి మీకు బాండ్లు లేదా డిపాజిట్ సర్టిఫికేట్లు ఇస్తారు. దీనిపై మీకు ప్రతి ఏటా మీకు వడ్డీ లభిస్తుంది. గడువు ముగిసిన తర్వాత, మీరు అప్పటి మార్కెట్ ధర ప్రకారం నగదును లేదా తిరిగి బంగారాన్ని పొందవచ్చు. అంటే, ఇక్కడ మీ బంగారం మీదే అయి ఉంటుంది, కానీ అది ఫిజికల్ రూపంలో కాకుండా డిజిటల్ లేదా పేపర్ రూపంలో మారుతుంది.భారతదేశంలో ఒక వ్యక్తి ఎంత బంగారం ఉంచుకోవచ్చనే దానిపై స్పష్టమైన నిబంధనలు ఉన్నాయి. ఆదాయపు పన్ను చట్టం ప్రకారం, మీరు కొనుగోలు చేసిన బంగారానికి సరైన ఆధారాలు బిల్లులు రూపంలో ఉంటే, ఎంత బంగారమైనా ఉంచుకోవచ్చు. కానీ అదే ఆదాయ ఆధారాలు చూపలేనప్పుడు కొన్ని పరిమితులు వర్తిస్తాయి అవి ఏంటంటే, ఒక వివాహిత మహిళ తన వద్ద 500 గ్రాముల వరకు బంగారం ఉంచుకోవచ్చు. అలాగే అవివాహిత మహిళ 250 గ్రాముల వరకు ఉంచుకోవచ్చు. ఇదే విధంగా పురుషులు కేవలం 100 గ్రాముల వరకు మాత్రమే పరిమితి కలిగి ఉంటారు.ఐటీ దాడుల వేళ పరిస్థితి ఏంటి?ఐటీ దాడులు జరిగినప్పుడు ఈ పరిమితి లోపు ఉన్న బంగారాన్ని అధికారులు సీజ్ చేయరు. అంతకు మించి ఉండి, ఆదాయ వనరులు చూపకపోతే చట్టపరమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రస్తుతం బంగారం ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. వెండి ధరలు కూడా రికార్డు స్థాయికి చేరుకుంటున్నాయి. భారత్ తన అవసరాల కోసం విదేశాల నుంచి టన్నుల కొద్దీ బంగారాన్ని దిగుమతి చేసుకుంటోంది. దీనికోసం భారీగా విదేశీ మారక ద్రవ్యం (Forex) ఖర్చవుతోంది. ఒకవేళ మన ఇళ్లలో ఉన్న బంగారమే మార్కెట్లోకి వస్తే, దిగుమతులు తగ్గి దేశానికి ఎంతో లాభం చేకూరుతుంది.అందుకే నిపుణులు పదే పదే "పాలసీ షిఫ్ట్" కావాలని కోరుతున్నారు. బంగారాన్ని కేవలం బీరువాలో దాచుకోవడం కంటే, దానిని ఒక పెట్టుబడిగా మార్చుకోవడం వల్ల వ్యక్తిగతంగా మనకు వడ్డీ వస్తుంది, దేశానికి ఆర్థిక బలం చేకూరుతుంది. అయితే, మన దేశంలో ఉన్న సెంటిమెంట్ దృష్ట్యా, పాత ఆభరణాలను కరిగించడానికి ఎవరూ ఇష్టపడరు. అందుకే, ప్రభుత్వం మరింత ఆకర్షణీయమైన పథకాలను తీసుకురావాలని నిపుణులు సూచిస్తున్నారు. -వెబ్డెస్క్ -
4 గంటల్లోనే బంగారం ధరలు భారీగా పెరిగాయి..
-
సిల్వర్ హిట్.. బంగారం ధగధగలు
న్యూఢిల్లీ: గత కొన్ని రోజులుగా అమ్మకాల ఒత్తిడికి లోనైన పసిడి, వెండి బుధవారం దేశీ మార్కెట్లో మంచి ర్యాలీని చూశాయి. వెండి కిలోకి ఏకంగా రూ.11,250 ర్యాలీ చేసి రూ.2.41 లక్షలకు చేరుకుంది. బంగారం వరుసగా రెండో రోజూ కొనుగోళ్లతో మెరిసింది. 10 గ్రాములకు రూ.4,900 పెరిగి రూ.1,49,700 స్థాయిని అందుకుంది.భౌగోళిక రాజకీయ సెంటిమెంట్ కాస్త మెరుగుపడడం ఫలితంగా చమురు ధరలు దిగిరావడం బంగారం, వెండి ధరలు కోలుకునేందుకు దోహదపడినట్టు హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ కమోడిటీ సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ఔన్స్కు 2 శాతం పెరిగి 4,556 డాలర్లకు, స్పాట్ వెండి ఔన్స్కు 2 శాతం లాభపడి 72.67 డాలర్ల వద్ద ట్రేడయ్యాయి. -
ఆర్థిక వ్యవస్థలోకి ‘బంగారం’ తేవాలి
న్యూఢిల్లీ: దేశంలో గృహాలు, ఆలయాల్లో ఉన్న 10 ట్రిలియన్ డాలర్ల విలువైన బంగారాన్ని ఆర్థిక వ్యవస్థలోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని మాజీ కేంద్ర మంత్రి పీపీ చౌధరి అన్నారు. భౌతిక బంగారాన్ని నిల్వ (స్టోర్) రూపంలో ఉంచడం వల్ల అది ఆర్థిక వృద్ధికి పెద్దగా ఉపయోగపడటం లేదని అభిప్రాయపడ్డారు. పార్లమెంటరీ స్థాయి సంఘం (ఆర్థిక) సభ్యుడైన చౌధరి, బంగారానికి బదులు ఆర్థిక సాధనాల వైపు వినియోగదారులను మళ్లించాలని సూచించారు. దీనివల్ల బంగారం దిగుమతులపై ఆధారపడడం తగ్గుతుందని, కరెంటు ఖాతా లోటుపై ఒత్తిడి దిగొస్తుందని అన్నారు. అసోచామ్ నిర్వహించిన ఒకకార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన ఈ అభిప్రాయలను వ్యక్తం చేశారు. ఇదే కార్యక్రమంలో పాల్గొన్న నేషనల్ స్టాక్ ఎక్సే్చంజ్ చీఫ్ బిజినెస్ డెవలప్మెంట్ ఆఫీసర్ శ్రీరామ్ కృష్ణన్.. దేశంలోని గృహాలు, దేవాలయాల వద్ద సుమారు 50,000 టన్నుల బంగారం ఉందని, దీని విలువ 10 ట్రిలియన్ డాలర్లుగా ఉంటుందని తెలిపారు. ఈ బంగారం అంతా అధికారిక ఆర్థిక వ్యవస్థకు బయటే ఉందని చెప్పారు. ఎల్రక్టానిక్ గోల్డ్ రిసీట్స్ (ఈజీఆర్) ద్వారా బంగారాన్ని డీమ్యాట్ చేసి షేర్ల మాదిరి ట్రేడ్ చేయడానికి దేశంలో అవసరమైన సాంకేతికత, వేదికలు ఉన్నాయని కృష్ణన్ తెలిపారు. అయితే, ఈజీఆర్ సమయంలో బంగారం డిపాజిట్పై విధించే 3 శాతం జీఎస్టీ ప్రధాన అడ్డంకిగా ఉన్నట్టు చెప్పారు. దీనిపై తాము పరిష్కారాన్ని సూచించినట్టు తెలిపారు. ఈజీఆర్ అన్నది సెబీ ఆమోదిత పథకం. వినియోగదారులు తమవద్దనున్న భౌతిక బంగారాన్ని డిపాజిట్ చేసి, స్టాక్ ఎక్సే్ఛంజ్ల్లో షేర్ల మాదిరి ట్రేడ్ చేసుకోవచ్చు. -
ఇరాన్పై అమెరికా యుద్ధం.. బంగారం కొనుగోలు చేయొచ్చా?
వాష్టింగన్: ఇరాన్పై యుద్ధం రోజుకో మలుపు తిరుగుతోంది. అయితే, ఈ ఒడిదుడుకుల్లో బంగారం కొనుగోలు చేయాలా? వద్దా? అనే ప్రశ్నల పరంపరం కొనసాగుతోంది. ఈ క్రమంలో బంగారం కొనుగోళ్లు అమ్మకాలపై నిపుణులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న వరుస ప్రకటనలతో బంగారం పెట్టుబడి దారుల్లో అనిశ్చితి నెలకొన్నట్లు తెలుస్తోంది. ఇరాన్పై దాడుల్ని ముగించేలా ట్రంప్ సంకేతాలు పంపించారు. దీంతో బంగారం ధర ఒక్కసారిగా 4శాతం పెరిగింది. కానీ దీని వెనుక ఉన్న అస్థిరత పెట్టుబడిదారులను గందరగోళంలోకి నెడుతోంది. అమెరికా అధ్యక్షుడు హర్మూజ్ జలసంధి అంశంలో ఇరాన్ తమకు ఓ బహుమతి ఇచ్చిందని చెప్పారు. ఈ ప్రకటనతో ఇరాన్పై యుద్ధం అంశంలో శాంతి చర్చలు ప్రారంభమయ్యే అవకాశం ఉందని మార్కెట్లో ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఫలితంగా బంగారం ధర ఔన్స్కి 4,550 డాలర్లను దాటిందిదీంతో తొమ్మిది రోజుల వరుస నష్టాల తర్వాత ఒక్కసారిగా బంగారం ధరలు పెరగడం పెట్టుబడిదారులను ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ ఏడాది జనవరిలో గరిష్ట స్థాయి ఔన్స్ బంగారం 5,626 డాలర్ల ధర దాదాపు 20శాతానికి పడిపోయింది. ఈ క్షీణత కారణంగా బంగారంలో పెట్టుబడులు సురక్షితమేనా అన్న ప్రశ్నను ఎదుర్కొంటున్నారుబెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న మార్కెట్ నిపుణులు నవీన్ పీఎంటీ బంగారం పెరుగుదలని ‘హెడ్లైన్ రిస్క్ వోలాటిలిటీ’గా అభివర్ణించారు. ‘మార్కెట్ యుద్ధ భయాల నుంచి శాంతి వైపు అడుగులు పడేలా చేస్తోంది. ఇది నిజమైన నమ్మకం కాదు ఒక రీలీఫ్ ర్యాలీ మాత్రమే’ అని వ్యాఖ్యానించారు. ఆగ్మాంట్ రీసెర్చ్ హెడ్ డాక్టర్ రెనిషా భిన్న అభిప్రాయాల్ని వ్యక్తం చేశారు. భౌగోళిక ఉద్రిక్తతలు సాధారణంగా బంగారాన్ని పెంచుతాయి. కానీ ఈసారి లిక్విడిటీ ఒత్తిడి కారణంగా పెట్టుబడిదారులు బంగారం అమ్మి నగదు సమకూర్చుకుంటున్నారు’ అని పేర్కొన్నారు. వడ్డీ రేట్లు, ద్రవ్యోల్బణం ప్రభావంచమరు ధరలు పెరగడం వల్ల ద్రవ్యోల్బణం పెరుగుతోంది. దీని కారణంగా వడ్డీ రేట్లు ఎక్కువ కాలం ఉన్న స్థాయిలోనే కొనసాగుతాయని అంచనా. ఇది బంగారంపై ఒత్తిడి పెంచుతోంది.కేంద్ర బ్యాంకుల ధోరణిగత రెండు సంవత్సరాల్లో కేంద్ర బ్యాంకులు భారీగా బంగారం కొనుగోలు చేశాయి. ఇప్పుడు ధరలు ఎక్కువగా ఉండటంతో కొంత విరామం తీసుకుంటున్నాయి. అయినప్పటికీ, దీర్ఘకాలంలో డాలర్పై ఆధార పడటాన్ని తగ్గించి బంగారం కొనుగోళ్లు కొనసాగిస్తాయని నిపుణులు చెబుతున్నారు.ప్రస్తుత అస్థిరత బంగారం స్వభావాన్ని మార్చడం లేదు. తాత్కాలికంగా లిక్విడిటీ ఒత్తిడి కారణంగా బంగారం రిస్క్ ఆస్తిలా ప్రవర్తించినా, పరిస్థితులు స్థిరపడిన తర్వాత ఇది మళ్లీ ద్రవ్యోల్బణం, కరెన్సీ విలువ తగ్గుదల, వ్యవస్థాపక ప్రమాదాలకు వ్యతిరేకంగా రక్షణగా నిలుస్తుంది. ట్రంప్ వ్యాఖ్యలతో బంగారం ధరలు తాత్కాలికంగా పెరిగినా, దీర్ఘకాలంలో ఇది పెట్టుబడిదారులకు రక్షణా ఆస్తిగానే కొనసాగుతుంది. కానీ తక్షణ లిక్విడిటీ ఒత్తిడి, వడ్డీ రేట్లు, ద్రవ్యోల్బణం వంటి అంశాలు ధరలలో మార్పులు కొనసాగుతాయి. -
కోలుకున్న పసిడి... అక్కడే వెండి
న్యూఢిల్లీ: దేశీ మార్కెట్లో 4 రోజుల వరుస నష్టాల నుంచి పసిడి బయటపడింది. మంగళవారం 10 గ్రాములకు రూ.1,200 పెరిగి రూ.1.44లక్షలకు (పన్నులు సహా) చేరుకుంది. వెండి ధర మాత్రం పెద్దగా మార్పు లేకుండా కిలోకి రూ.2.30 లక్షల వద్దే ఉన్నట్టు ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ తెలిపింది. అంతర్జాతీయంగా కమోడిటీ మార్కెట్లలో రికవరీకితోడు, కనిష్ట స్థాయిల్లో కొనగోళ్ల మద్దతుతో బంగారం ధర పెరిగినట్టు ట్రేడర్లు పేర్కొన్నారు.అంతర్జాతీయంగా స్పాట్ మార్కెట్లో పసిడి ఔన్స్కు 17 డాలర్ల వరకు పెరిగి 4,423 డాలర్ల వద్ద ట్రేడయ్యింది. వెండి సైతం 1% పుంజుకుని ఔన్స్కు 69.86 డాలర్ల స్థాయిని చేరుకుంది. ‘9 రోజుల క్షీణత తర్వాత స్పాట్ గోల్డ్ ఔన్స్కు 4,420 డాలర్ల వద్ద స్థిరంగా కొనసాగుతోంది. ఇరాన్ పై దాడులను 5 రోజుల పాటు నిలిపివేస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించడంతో అప్రమత్తతతో కూడిన ఆశావహధోరణి కనిపించింది’ అని మిరే అసెట్ షేర్ఖాన్ కమోడిటీస్ హెడ్ ప్రవీణ్ సింగ్ తెలిపారు. -
ఇక ఆరంభం.. తారుమారైన గోల్డ్ రేటు!
వారం రోజులుగా భారీగా తగ్గుతున్న బంగారం ధరలకు ఒక్కసారిగా బ్రేక్ పడింది. దీంతో పసిడి ధరల పరుగు మళ్లీ మొదలైంది. ఈ కథనంలో దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయి?, ఉదయం ధరలకు.. సాయంత్రం ధరలకు మధ్య వ్యత్యాసం ఎలా ఉంది? అనే వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడలలో.. ఈ రోజు (మార్చి 24) ఉదయం 1,40,350 రూపాయల వద్ద ఉన్న తులం బంగారం ధర.. సాయంత్రానికి 1,42,910 రూపాయల (రూ.2560 పెరిగింది) వద్దకు చేరింది. 22 క్యారెట్ల ధర 1,28,650 రూపాయల నుంచి 1,31,000 రూపాయల (రూ.2560 పెరిగింది) వద్దకు చేరింది.ఢిల్లీలో కూడా బంగారం ధరల్లో స్వల్ప మార్పులు జరిగాయి. తులం 24 క్యారెట్ల రేటు రూ.1,40,500 నుంచి రూ.143060 వద్దకు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు 128800 రూపాయల నుంచి రూ.131150 వద్దకు చేరింది. దీన్నిబట్టి చూస్తే.. గోల్డ్ రేటు గంటల వ్యవధిలో ఎంతలా మారిందో స్[స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు.చెన్నై విషయానికి వస్తే.. ఈ నగరంలో 24 క్యారెట్ల తులం బంగారం రూ.970 తగ్గి.. 144560 రూపాయలు వద్ద, 22 క్యారెట్ల రేటు 900 రూపాయలు తగ్గి, రూ.132500 వద్దకు చేరింది. మొత్తం మీద పడిపోతున్నాయన్న బంగారం ధరలు మళ్లీ పుంజుకున్నాయి.వెండి ధరలు ఇలాబంగారం బాటలోనే వెండి అన్నట్లు.. ఉదయం కేజీపైన రూ.10000 తగ్గి రూ.2.40 లక్షల వద్ద ఉన్న సిల్వర్.. సాయంత్రానికి రూ.2.50 లక్షలకు చేరుకుంది. అంటే వెండి కూడా పెరుగుదలవైపు అడుగులు వేస్తున్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది. -
పసిడి ప్రేమికులకు పండగ.. బంగారం, వెండి ధరలు భారీగా పతనం..!
-
గంటల వ్యవధిలో కుప్పకూలిన పసిడి.. కొత్త ధరలు ఇవే!
భారతదేశంలో బంగారం ధరలు భారీగా తగ్గాయి. ఉదయం రూ.5000 తగ్గిన రేటు.. సాయంత్రానికి రూ.10 వేలకు చేరింది. అంటే తులం గోల్డ్ రేటు రూ. పదివేలు తగ్గిందన్నమాట. దీంతో ధరల్లో చాలా వ్యత్యాసం కనిపించింది. ఈ కథనంలో తాజా ధరలు ఏ నగరంలో.. ఎలా ఉన్నాయనే వివరాలు చూసేద్దాం.హైదరాబాద్, విజయవాడలలో 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 10,320 తగ్గి.. రూ.1,35,650 వద్దకు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు 9450 రూపాయలు తగ్గి రూ. 1,23,450 వద్దకు చేరింది. దీన్నిబట్టి చూస్తే.. పసిడి ధరలు ఎంత వరకు పతనమైందో స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు.చెన్నైలో కూడా గోల్డ్ రేటు బాగా తగ్గింది. దీంతో ఉదయం ధరల కంటే.. సాయంత్రం ధరలు చాలా తగ్గుముఖం పట్టింది. దీంతో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.1,39,200 వద్దకు (రూ.9380 తగ్గింది). 22 క్యారెట్ల తులం రేటు రూ.1,27,600 వద్ద (రూ.8600 తగ్గింది) నిలిచింది.ఢిల్లీలో బంగారం ధరల విషయానికి వస్తే.. ఇక్కడ 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.1,35,800 (రూ.10,320 తగ్గింది) వద్ద ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు 9450 రూపాయలు తగ్గి 1,24,500 రూపాయల వద్ద నిలిచింది. వెండి ధరల్లో మాత్రం ఎటువంటి మార్పు లేదు. కేజీ సిల్వర్ ధర రూ.2.30 లక్షల వద్ద కొనసాగుతోంది.ఇదీ చదవండి: బంగారం ధరలు ఎందుకింతగా పడిపోతున్నాయ్! -
బంగారం ధరలు ఎందుకింతగా పడిపోతున్నాయ్!
సాధారణంగా యుద్దాలు జరిగినప్పుడు బంగారం, వెండి వంటి విలువైన లోహాల ధరలు అమాంతం పెరుగుతాయి. దశాబ్దాలుగా జరుగుతున్న ప్రక్రియ కూడా ఇదే. కానీ ప్రస్తుతం ఈ పరిస్థితి తలకిందులైపోయిందని కోబేస్సీ లెటర్ చేసిన ట్వీట్ ద్వారా వెల్లడైంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.ప్రస్తుతం బంగారం, వెండి వంటి విలువైన లోహాల మార్కెట్ పరిస్థితి చాలా భిన్నంగా ఉంది. ఓ వైపు ఇరాన్ - ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం జరుగుతున్న సమయంలో బంగారం ధరలు భారీగా పడిపోయాయి. కేవలం మూడు గంటల వ్యవధిలోనే ఈ రెండు లోహాల మార్కెట్ విలువలో సుమారు రెండు ట్రిలియన్ డాలర్ల మేర తగ్గుదల చోటుచేసుకోవడం విశేషం.యుద్ధమేఘాలు కమ్ముకున్నప్పుడు.. బంగారం ధరలు పెరగాలి. అయితే.. ఇప్పుడు గోల్డ్ రేటు తగ్గడానికి కారణం బాండ్ మార్కెట్లో వచ్చిన మార్పులు. అమెరికా 10 సంవత్సరాల ట్రెజరీ బాండ్లపై వడ్డీ రేట్లు గణనీయంగా పెరగడం పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షించింది. బంగారం వంటి వడ్డీ ఇవ్వని ఆస్తులతో పోలిస్తే, బాండ్లు ఇప్పుడు ఆదాయం అందించే సురక్షిత మార్గంగా మారాయి. అందువల్ల చాలా మంది పెట్టుబడిదారులు బంగారం నుంచి తమ పెట్టుబడులను తీసుకుని బాండ్లలో పెట్టడం ప్రారంభించారు.Something very strange is happening in precious metals right now:In just 3 hours, gold and silver just erased a combined -$2 TRILLION in market cap.Meanwhile, oil prices have erased their gains on the day and US stock market futures are nearly green.Since the Iran War… pic.twitter.com/zP43wSr9wE— The Kobeissi Letter (@KobeissiLetter) March 23, 2026ఇంకో ముఖ్యమైన అంశం ఏమిటంటే.. అమెరికన్ డాలర్ బలపడటం. యుద్ధ పరిస్థితుల్లో డాలర్ కూడా సురక్షిత ఆస్తిగా పరిగణించబడుతుంది. డాలర్ విలువ పెరిగితే, బంగారం ధరలు సాధారణంగా తగ్గుతాయి. ఇదే సమయంలో మార్కెట్లో లీవరేజ్ అధికంగా ఉండటం పరిస్థితిని మరింత తీవ్రమైంది చేసింది. ప్రస్తుతం లోహాల మార్కెట్లలో ఏదో జరుగుతోందని.. కోబేస్సీ లెటర్ వెల్లడించింది.గత కొన్ని నెలలుగా బంగారం, వెండి ధరలు వేగంగా పెరగడంతో, చాలా మంది ట్రేడర్లు అధిక రిస్క్ తీసుకుని పెట్టుబడులు పెట్టారు. ధరలు ఒక్కసారిగా పడిపోవడం ప్రారంభమైనప్పుడు, స్టాప్ లాస్ ఆర్డర్లు అమల్లోకి వచ్చాయి, మార్జిన్ కాల్స్ వచ్చాయి, పెట్టుబడిదారులు తమ పొజిషన్లను బలవంతంగా విక్రయించాల్సి వచ్చింది. దీనివల్ల ధరలు మరింత వేగంగా క్షీణించాయి.భారతదేశంలో కూడా ఈ ప్రభావం స్పష్టంగా కనిపించింది. బంగారం, వెండి ధరలు గణనీయంగా తగ్గాయి. ఇతర లోహాలు కూడా ఇదే దిశగా కదిలాయి. దీన్నిబట్టి చూస్తే.. మార్కెట్లు ఎప్పుడూ సాంప్రదాయ సిద్ధాంతాల ప్రకారం ప్రవర్తించవు. పరిస్థితులు మారినప్పుడు సురక్షితమైనవిగా భావించే ఆస్తులు కూడా ప్రమాదంలో పడే అవకాశం ఉంది. వడ్డీ రేట్లు, డాలర్ బలం, లిక్విడిటీ వంటి అంశాలు మార్కెట్ దిశను నిర్ణయించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని స్పష్టమవుతోంది. -
బంగారం ధర భారీగా తగ్గుతుందా?: నిపుణుల అంచనా..
ఎప్పుడైనా ప్రపంచ యుద్దాలు లేదా అంతర్జాతీయ ఉద్రిక్తతలు తలెత్తినప్పుడు స్టాక్ మార్కెట్లు కుప్పకూలిపోతాయి. ఈ సమయంలో బంగారం, వెండి వంటి లోహాలకు విలువ ఒక్కసారిగా పెరిగిపోతుంది. అయితే ప్రస్తుతం.. గోల్డ్, సిల్వర్ రేటు దీనికి విరుద్ధంగా ఉంది.అమెరికా, ఇజ్రాయెల్ - ఇరాన్ యుద్ధం జరుగుతున్నా సమయంలో బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టడానికి కారణం.. డాలర్ విలువ బలపడటమే అని నిపుణులు చెబుతున్నారు. డాలర్ విలువ ఎప్పుడైతే పెరుగుతుందో.. ఆ సమయంలో పసిడికి డిమాండ్ కొంత తగ్గుతుంది. అంతే కాకుండా.. బంగారం రేటు పెరుగుతున్న సమయంలో పెట్టుబడిదారులు కూడా కొనుగోళ్లకు వెనుకడుగు వేస్తారు. కాబట్టి డిమాండ్ తగ్గుతుంది. డిమాండ్ తగ్గితే ధరలు పతనమవుతాయి.వారం రోజుల్లో రూ.13 వేలు డౌన్!బంగారం ధరలు ఊహకు అందని విధంగా తగ్గుతూ ఉన్నాయి. మార్చి 15న (ఆదివారం) హైదరాబాద్, విజయవాడలలో 1,59,660 రూపాయల వద్ద ఉన్న 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు శనివారం 1,45,970 రూపాయల వద్దకు చేరింది. అంటే వారం రోజుల్లో తగ్గిన రేటు రూ. 13,690 తగ్గింది. 22 క్యారెట్ల తులం బంగారం విషయానికి వస్తే.. దీని ధర రూ.1,46,350 నుంచి రూ.1,33,800 వద్దకు చేరింది.బంగారం ధరలు తగ్గుతాయా?బంగారం ధరలు తగ్గుతాయా? అనే ప్రశ్నకు సరైన సమాధానం చెప్పడం కష్టమే. ఎందుకంటే గోల్డ్ రేటు పెరుగుదల, తగ్గుదల అనేది అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. అయితే ప్రస్తుత పరిస్థితుల మాదిరిగానే.. ధరలు తగ్గితే, గోల్డ్ రేటు పతనమవుతుందని చెప్పవచ్చు. కానీ కియోసాకి వంటి నిపుణులు బంగారం ధర పెరుగుతుందనే చెబుతున్నారు. -
వారం రోజుల్లో రూ.13 వేలు తగ్గిన బంగారం: కొత్త ధరలు ఇలా..
బంగారం ధరలు ఊహకు అందని విధంగా తగ్గుతూ ఉన్నాయి. ఈ రోజు కూడా భారీ తగ్గడంతో పసిడి ప్రియులలో సంతోషం నెలకొంది. ఇంకా తగ్గే అవకాశం ఉందా? అన్నట్లు కొందరు వేచి చూస్తున్నారు. ఈ కథనంలో వారం రోజుల్లో గోల్డ్ రేటులో ఎంత వ్యత్యాసం ఉండనే విషయాలను తెలుసుకుందాం.మార్చి 15న (ఆదివారం) హైదరాబాద్, విజయవాడలలో 1,59,660 రూపాయల వద్ద ఉన్న 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు ఈ రోజుకు (శనివారం) 1,45,970 రూపాయల వద్దకు చేరింది. అంటే వారం రోజుల్లో తగ్గిన రేటు రూ. 13,690 తగ్గింది. 22 క్యారెట్ల తులం బంగారం విషయానికి వస్తే.. దీని ధర రూ.1,46,350 నుంచి రూ.1,33,800 వద్దకు చేరింది.చెన్నైలో గోల్డ్ రేటు ఎలా ఉంది అనే విషయానికి వస్తే.. ఇక్కడ 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు 1,47,600 రూపాయల నుంచి 136200 రూపాయల వద్దకు చేరింది. 24 క్యారెట్ల రేటు 161020 రూపాయల నుంచి 1,48,580 రూపాయల వద్దకు చేరింది. దీన్ని బట్టి చూస్తే పసిడి ధరలు వారం రోజుల్లో ఎంత తగ్గిందనే విషయం స్పష్టమవుతోంది.దేశ రాజధాని నగరం ఢిల్లీ విషయానికి వస్తే.. ఇక్కడ కూడా వారం రోజుల్లో గోల్డ్ రేటు గణనీయంగా తగ్గింది. మార్చి 15న రూ.1,59,810 వద్ద ఉన్న తులం 24 క్యారెట్ల గోల్డ్ రేటు, మార్చి 21 నాటికి రూ.1,46,120 వద్దకు చేరింది. 22 క్యారెట్ల రేటు 1,46,500 రూపాయల దగ్గర నుంచి రూ. 1,33,950 వద్దకు చేరింది. -
తగ్గుతున్న బంగారం ధరలు: మళ్లీ పెరుగుతాయా?
ఇరాన్.. అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం కొనసాగుతున్నప్పటికీ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిసాయి. బంగారం ధరలు గత కొంత కాలంగా తగ్గుతూ.. ఈ రోజు స్వల్పంగా పెరిగాయి. ఈ విలువైన లోహాల ధరలు పడిపోతూనే ఉంటాయా? లేక మళ్లీ పెరుగుతాయా? అనే సందేహం చాలామందిలో కలిగింది. ఈ కథనంలో ఆ వివరాలు తెలుసుకుందాం.ఈ రోజు (మార్చి 20) బంగారం ధర 0.6% పెరగగా, వెండి ధర 1.7% ఎందుకు తగ్గింది. ఇటీవలి తగ్గుదలల తర్వాత, సాంకేతిక కొనుగోళ్లు మార్కెట్కు మద్దతు ఇవ్వడంతో శుక్రవారం బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. బలమైన అమెరికన్ డాలర్ ఒత్తిడి, వడ్డీ రేట్లపై యూఎస్ ఫెడరల్ రిజర్వ్ నుండి వస్తున్న సంకేతాల కారణంగా, గోల్డ్ వరుసగా మూడవ వారం కూడా పతనం దిశగా పయనించింది. అదే సమయంలో, మార్కెట్లో బలహీనమైన డిమాండ్ను ప్రతిబింబిస్తూ వెండి ధరలు తగ్గాయి.భౌగోళిక రాజకీయ పరిణామాలు, చమురు ధరల కదలికలు, భారతదేశం.. చైనాలలో భౌతిక డిమాండ్లో మార్పులతో సహా ప్రపంచ కారకాలు బంగారం, వెండి ధరలను గణనీయంగా ప్రభావితం చేస్తున్నాయి. ఇటీవలి తగ్గుదలల తర్వాత వ్యాపారులు కొనుగోళ్లు జరపడం, ధరలు సాంకేతిక మద్దతు జోన్లను నిలబెట్టుకోవడంతో బంగారం ధరలు పెరిగాయి. అయితే, భౌతిక డిమాండ్ తగ్గడం మరియు కొనసాగుతున్న అమ్మకాల కార్యకలాపాల కారణంగా వెండి ధరలు పడిపోయాయి.ఆసియా ట్రేడింగ్ సమయంలో స్పాట్ గోల్డ్ 0.6% పెరిగి ఔన్సుకు 4,675.23 డాలర్లకు చేరుకుంది. గత సెషన్లో దాదాపు రెండు నెలల కనిష్ట స్థాయికి పడిపోయిన ఈ లోహం కోలుకుంది. వెండి 1.7% తగ్గి ఔన్సుకు 71.66 డాలర్లకు చేరింది. ఇతర లోహాలు మిశ్రమ కదలికలను కనబరిచాయి. ప్లాటినం 0.2% పెరిగి 1,974.45 డాలర్లకు చేరగా, పల్లాడియం 1% పెరిగి 1,461.36 డాలర్లకు చేరింది.బంగారం ధరల పెరుగుదల ఎప్పుడుబంగారం వంటి విలువైన లోహాల విలువ ఎలాంటి సమయంలో అయినా భారీగా క్షిణించే అవకాశం ఉండదు. స్టాక్ మార్కెట్లు కుప్పకూలిపోవచ్చు, ఆర్ధిక మాంద్యం రావచ్చు. అలంటి సమయంలో కూడా మీకు బంగారం, వెండి వంటివి చాలా ఉపయోగపడతాయని రాబర్ట్ కియోసాకి వంటి నిపుణులు చెబుతున్నారు. -
నిన్న ₹7,000 పతనం.. ఇవాళ మళ్లీ పెరిగిన బంగారం ధర!
-
గోల్డ్ లోన్ తీసుకునే ముందు ఈ జాగ్రత్తలు తప్పనిసరి నష్టం తప్పదు
-
ఆ బుడగ పేలిందా!! 'రిచ్ డాడ్' సూత్రాన్ని గుర్తుచేసుకోండి..
అంతర్జాతీయ ఆర్థిక మార్కెట్లలో తీవ్ర అలజడి నడుస్తున్న నేపథ్యంలో, 'రిచ్ డాడ్ పూర్ డాడ్' పుస్తక రచయిత, ప్రముఖ ఆర్థిక వ్యాఖ్యాత రాబర్ట్ కియోసాకి మరోసారి సంచలన హెచ్చరిక జారీ చేశారు. త్వరలోనే చరిత్రలోనే అతిపెద్ద ఆస్తుల బుడగ (బబుల్ బస్ట్) పగిలిపోతుందని, దాని తర్వాత బంగారం, వెండి, బిట్కాయిన్, ఈథేరియం ధరలు ఆకాశాన్ని తాకుతాయని ఆయన పేర్కొన్నారు.కియోసాకి తన అధికారిక ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో పోస్ట్ చేసిన తాజా సందేశంలో, "బబుల్ పగిలే 'పిన్' ఏదైనా ఈవెంట్ త్వరలోనే జరగనుంది. అది ఏ సంఘటన అయినా.. ఇప్పుడే బిట్కాయిన్, బంగారం, వెండి, ఈథేరియం ఎక్కువగా సేకరించాలి" అని సూచించారు. క్రాష్ తర్వాత ఒక సంవత్సరంలో బంగారం ఒక ఔన్స్కు 35,000 డాలర్లు, వెండి 200 డాలర్లు, బిట్కాయిన్ ఒక్కో కాయిన్ 750,000 డాలర్లు, ఈథేరియం 95,000 డాలర్లకు చేరుతాయని ఆయన ధీమాగా అంచనా వేశారు."మీ లాభం అమ్మేటప్పుడు కాదు.. కొనేటప్పుడే వస్తుంది" అనే తన 'రిచ్ డాడ్' సూత్రాన్ని గుర్తు చేస్తూ, ఇప్పుడు కొనుగోలు చేసి భవిష్యత్తులో ధనవంతులు కావాలని, లేకపోతే చాలామంది పేదలవుతారని హెచ్చరించారు. ప్రస్తుతం బిట్కాయిన్ ధర సుమారు 74,000–75,000 డాలర్ల మధ్య ఉండగా, ఈథేరియం 2,300–2,400 డాలర్ల స్థాయిలో ట్రేడ్ అవుతోంది. -
గోల్డ్ రూ.21 వేలు, వెండి లక్షన్నర పతనం.. తులం బంగారం ఎంతంటే..!
-
పసిడి ప్రియులకు ఊరట.. తులం ఎంతంటే..
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
సాయంత్రానికి సగం తగ్గిన గోల్డ్ రేటు!
రోజురోజుకి తగ్గుతున్న గోల్డ్ రేటు ఈ రోజు (మంగళవారం) కొంత పెరిగింది. అయితే 24 గంటలు కూడా గడవకముందే.. పెరిగిన రేటులో సగం తగ్గిపోయింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లోని పసిడి ధరల్లో స్వల్ప మార్పులు జరిగాయి. బంగారం లేటెస్ట్ ధరల గురించి మరిన్ని వివరాలు ఇక్కడ చూసేద్దాం.హైదరాబాద్, విజయవాడలలో ఉదయం 1,45,400 రూపాయల వద్ద ఉన్న తులం 22 క్యారెట్ల బంగారం ధర సాయంత్రానికి రూ.1,44,900 వద్దకు చేరింది. అంటే గంటల వ్యవధిలో రూ.500 తగ్గిందన్నమాట. 24 క్యారెట్ల ధర 1,58,620 రూపాయల నుంచి రూ.1,58,080 వద్దకు చేరింది. ఇదే ధరలు బెంగళూరు, ముంబైలలో కూడా కొనసాగుతాయి.ఢిల్లీలో లేటెస్ట్ గోల్డ్ రేటు విషయానికి వస్తే.. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 158230 వద్ద, 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రేటు 145050 రూపాయల వద్ద ఉంది. ఈ ధరలు ఉదయం ఉన్న ధరల కంటే తక్కువ కావడం గమనార్హం.చెన్నైలో గోల్డ్ రేటులో ఎలాంటి మార్పు లేదు. ధరలు ఉదయం ఎలా ఉన్నాయో, సాయంత్రానికి కూడా అలాగే ఉన్నాయి. కాబట్టి ఇక్కడ 22 క్యారెట్ల తులం బంగారం రేటు 1,46,500 రూపాయల వద్ద, 24 క్యారెట్ల 10 గ్రాముల రేటు రూ.1,59,820 వద్ద ఉంది. -
కియోసాకి హెచ్చరిక.. చరిత్రలో అతిపెద్ద బబుల్ బస్ట్!
సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ పెట్టుబడికి సంబంధించిన సూచనలు, సలహాలు ఇచ్చే రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి తాజాగా మరో ట్వీట్ చేసారు. చరిత్రలోనే అతిపెద్ద 'బబుల్ బస్ట్' ఉందని హెచ్చరించారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.చరిత్రలోనే అతిపెద్ద 'బబుల్ బస్ట్' (ఒక ఆస్తి విలువ.. అసలు విలువ కంటే చాలా ఎక్కువగా పెరగడం) జరుగుతుంది. అయితే ఇది ఎప్పుడు జరుగుతుందనేది నాకు తెలియదు, అని కియోసాకి పేర్కొన్నారు. ''అది జరుగుతుందా లేదా అన్నది ప్రశ్న కాదు. అది ఎప్పుడు జరుగుతుంది అన్నదే ప్రశ్న'' అని అన్నారు.బబుల్ బస్ట్ సంఘటన జరిగినప్పుడు.. ఒక ఏడాది తరువాత గోల్డ్ ధర ఔన్సుకు 35,000 డాలర్లకు చేరుకుంటుందని నేను అంచనా వేస్తున్నాను. వెండి ధర ఔన్సుకు 200 డాలర్లకు, బిట్కాయిన్ ధర 7,50,000 డాలర్లకు, ఇథీరియం ధర 95,000 డాలర్లకు చేరుకుంటుంటుందని కియోసాకి వెల్లడించారు.ఆర్ధిక సంక్షోభం వచ్చినప్పుడు మార్కెట్లు కుప్పకూలిపోతాయి. అలాంటి సమయంలో మీరు జాగ్రత్తగా పెట్టిన పెట్టుబడులు (గోల్డ్, సిల్వర్, బిట్కాయిన్, ఇథీరియం) మిమ్మల్ని కాపాడతాయి. కాబట్టి అలోచించి ఇన్వెస్ట్ చేయండి. ధనవంతులు కావడానికి ఇదే సరైన సమయమా? అంటూ కియోసాకి ట్వీట్ ముగించారు.BIGGEST BUBBLE BUSTI do not know what pin, what event will pop the biggest bubbles in histor. What ever the event, the pin is near.It’s not IF. It’s WHEN.When the bubbles go bust I predict gold will hit $35,000 an ounce one year after the gold bubble goes pop..I predict…— Robert Kiyosaki (@theRealKiyosaki) March 16, 2026 -
బంగారం, డాలర్ కాదు : దీని దూకుడు మామూలుగా లేదు!
ఇరాన్ పై అమెరికా- ఇజ్రాయెల్ ఫిబ్రవరి 28న మొదలు పెట్టిన దాడులు 18వ రోజుకు చేరుకున్నాయి. సాధారణంగా యుద్ధం, లేదా సంక్షోభ సమయాల్లో చమురు, బంగారం, అమెరికన్ డాలర్ బాగా పెరుగుతాయి. అలాగే స్టాక్మార్కెట్లు కూడా పెట్టుబడుదారుల ప్యానిక్ అమ్మకాలతో కుప్పకూలుతాయి. కానీ ప్రస్తుత ఇరాన్ యుద్ధ సమయంలో మాత్రం మార్కెట్ సమీకరణాలు మారుతున్నాయి. బంగారం, డాలర్ను మించి దూసుకుపోతోంది. అదేంటో తెలుసుకుందాం ఈ కథనంలో మారుతున్న పెట్టుబడి ధోరణికి అనుగుణంగా ఇరాన్ యుద్ధం మొదలైనప్పటి నుండి బిట్కాయిన్ విలువ 74 వేల డాలర్ల మార్కును దాటింది. అంటే సుమారు 10 శాతం వృద్ధిని నమోదు చేసింది. బంగారం ఔన్సుకు దాదాపు 5,035 డాలర్ల వద్ద ఉంది. గతంలో బిట్కాయిన్ పెట్టుబడులు చాలా రిస్క్తో కూడుకున్న వ్యవహారంగా భావించేవారు. కానీ ప్రస్తుత భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల మధ్య, ఇది సేఫ్గా మారుతుండటం విశేషం.బిట్ కాయన్పై ఎందుకింత ఆసక్తి?INRGrid స్టేబుల్ వ్యవస్థాపకుడు అనుజ్ చౌదరి అభిప్రాయం ప్రకారం.. బిట్కాయిన్ను బ్యాంకులు లేదా ప్రభుత్వాలతో సంబంధం లేకుండా తక్షణమే సరిహద్దులు దాటించి తరలించ వచ్చు. యుద్ధం వంటి సమయాల్లో బ్యాంకింగ్ వ్యవస్థలు స్తంభించినా, బిట్కాయిన్ నియంత్రణ పెట్టుబడిదారుల చేతుల్లోనే ఉంటుంది. బంగారం లేదా సాంప్రదాయ మార్కెట్ల వలె కాకుండా, బిట్కాయిన్ 24/7 ట్రేడ్ అవుతుంది. ముఖ్యంగా సంప్రదాయ మార్కెట్లు మూసి ఉన్నప్పుడు, భౌగోళిక రాజకీయ పరిణామాలకు అనుగుణంగా పెట్టుబడిదారులు తక్షణమే స్పందించడానికి వీలు కల్పిస్తుంది. వేగంగా మారుతున్న ప్రపంచ సంఘటనల సమయంలో ఇదొక ప్రాధాన్య సాధనంగా నిలుస్తుంది.ఇదీ చదవండి: ఇజ్రాయెల్ ప్రకటన : ఇరాన్కు మరో ఎదురుదెబ్బ?!ఇన్వెస్ట్పీడియా నివేదిక ప్రకారం, ఇరాన్పై దాడులు మొదలైనప్పటి నుంచీ ఐషేర్స్ బిట్కాయిన్ ట్రస్ట్ ,ఫిడిలిటీ వైజ్ ఆరిజిన్ బిట్కాయిన్ ఫండ్తో సహా బిట్కాయిన్కు 1.1 బిలియన్ డాలర్లకు మించి పెట్టుబడులు వచ్చాయంటేనే బిట్కాయన్ క్రేజ్ను అర్థం చేసుకోవచ్చు.బిట్కాయిన్ నిజంగా సురక్షితమేనా?ఇరాన్ యుద్ధం సద్దుమణిగే సూచనలు కనిపించకపోవడంతో, కొంతమంది పెట్టుబడిదారులు క్రిప్టో పెట్టుబడుల వైపు మళ్లవచ్చు. అయితే, ఒక రక్షణ సాధనంగా (హెడ్జ్గా) బిట్కాయిన్ను బంగారంతో పోల్చడంపై నిపుణుల అభిప్రాయాలు విభిన్నంగా ఉన్నాయి. బిట్ కాయిన్లో పెట్టుబడులు అంత సులువు కాదు. దీనిపై నిపుణులు ఈ విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. బంగారం భౌతికంగా అందుబాటులో ఉంటుంది కానీ దాన్ని జప్తు చేసే అవకాశం ఉంటుంది. అదే సమయంలో బిట్కాయిన్ డిజిటల్గా ఉండటం వల్ల దాన్ని ఎవరూ సీజ్ చేయలేరు. కానీ అయితే, దీని ధరల్లో ఉండే తీవ్రమైన హెచ్చుతగ్గుల (Volatility) చాలా తీవ్ర స్థాయిల్లో ఉంటుంది. అందుకే లాభనష్టాలను బేరీజు వేసుకోనొ ఇన్వెస్టర్లు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, ఇజ్రాయెల్-పాలస్తీనా వివాదం, లేదా కోవిడ్-19 సంక్షోభం వంటి భౌగోళిక-రాజకీయ సంక్షోభాల సమయంలో క్రిప్టోకరెన్సీ పెరగవచ్చు. అయినా వ్యాపారులు/ పెట్టుబడిదారులు బిట్కాయిన్ను నమ్మదగిన సురక్షిత ఆశ్రయ ఆస్తిగా పరిగణించ కూడదని మార్కెట్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనికి తోడు కేంద్ర బ్యాంకులు బిట్కాయిన్ను కొనుగోలు చేసే అవకాశం లేనందున, రిజర్వ్ ఆస్తిగా దాని పాత్ర పరిమితం. మరోవైపు, గత కొన్నేళ్లుగా అన్ని ప్రధాన కేంద్ర బ్యాంకులు తమ బంగారు నిల్వలను పెంచుకున్నాయనేది గమనించాలి. -
మళ్లీ బంగారం కొనే టైమొచ్చింది..! ఐదో రోజు పతనమైన గోల్డ్ రేట్
-
కట్నం ఇవ్వొద్దు.. తీసుకోవద్దు
వరకట్నం.. వివాహ సమయంలో వధువు కుటుంబం నుంచి వరుడి కుటుంబా నికి నగదు, బంగారం, ఆస్తుల రూపేణ బదిలీ చేసే ఒక సామాజిక దురాచారం. ఆడపడుచు కుటుంబా నికి ఇబ్బందిగా మారిన దీనిని రూపుమాపేందుకు ప్రభుత్వాలు చట్టాలెన్ని చేసినా క్షేత్రస్థాయిలో అమలుకు మాత్రం నోచుకోని దుస్థితి. ఈ క్రమంలో సామాజిక బాధ్యతగా గుర్తించిన ఆదివాసీ తెగలు వరకట్నం నిషేధం వైపు మొగ్గు చూపుతున్నాయి. కట్నం ఇవ్వొ ద్దు.. తీసుకోవద్దు అని గ్రామాల్లో తీర్మానాలతో పాటు అమలుకు శ్రీకారం చుడుతున్నాయి. ‘హైరి కీవల్ సిల్లే’ ‘కట్నం ఇదే కాద్ తోద్’ వంటి తీర్మానాలతో ముందడుగు వేస్తున్న ఆయా తెగలపై ఈ వారం సండే స్పెషల్. కట్నం ఇడే కాద్ తోద్.. అంటున్న ‘కొలాం’సాత్నాల: వరకట్న సమస్య కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తుందని కొలాం తెగ ఆందోళన వ్యక్తం చేస్తోంది. పెళ్లి అనేది పవిత్ర బంధమని.. దానిని డబ్బు, ఆస్తులతో కొలవకూడదని భావించింది. ఇకపై వరకట్నం ఇవ్వొద్దు.. తీసుకోవద్దని నిర్ణయించింది. ఇందులో భాగంగా సాత్నాల మండలంలోని టెంబ్రీగూడలో పటేళ్లు, కులస్తులు ఇటీవల సమావేశమయ్యారు. సాత్నాల, బేల, జైనథ్, ఇంద్రవెల్లి మండలాల్లోని ఆయా గ్రామాలకు చెందిన దాదాపు 150 పాల్గొన్నారు. వరకట్నం అనేది తమ సంస్కతిలో భాగం కాదని నిషేధించాలని తీర్మానం చేశారు. ఆడంబరాలకు వెళ్లి అప్పుల పాలు కావద్దన్నారు. పెళ్లిళ్లు సాంప్రదాయబద్ధంగా ఉండాలని, రూ.లక్షలు ఖర్చయ్యే రెడీమేడ్ మండపాలకు దూరంగా ఉండడంతో పాటు మద్యపానం నిషేధించాలన్నారు. డీజేలు వంటి వాటి జోలికి వెళ్లకుండా పిప్రి వాయిద్యాలతో ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు. పెళ్లిలో చదివింపుల్లో భాగంగా వస్తువులు కాకుండా నగదు రూపంలో అందిస్తే కుటుంబాలనికి ఆసరాగా ఉంటుందని తీర్మానించారు.ఆడబిడ్డ పెళ్లికి ఊరంతా సాయంసిరికొండ: ఈ రోజుల్లో ఆడపిల్ల పెళ్లంటే ఆ కుటుంబంపై ఆర్థిక భా రం చెప్పనవసరం లేదు. కట్నా లు, కానుకలు, ఆర్భాటాలు వంటివి చెప్పుకుంటే పోతే పెద్ద లిస్టే అవుతోంది. అలాంటిది తమ గూడెంలో అమ్మాయి పెళ్లిని ఆర్భాటం లేకుండా సంప్రదాయబద్ధంగా నిర్వహించాలని ఊరి పెద్దలు భావించారు. ఈనెల 9న సమావేశమయ్యారు.‘హైరి కీవల్ సిల్లే’ వరకట్నం నిషేధించడంతో పాటు పెళ్లి కూతురు కుటుంబానికి తలా కొంత ఆర్థికంగా చేదోడుగా నిలవాలని నిర్ణయించారు. వెంటనే అమలులోకి తెచ్చారు సిరికొండ మండలంలోని కోసుపటేల్ గూడవాసులు.కొలాం సంస్కృతిలో లేదువరకట్నం అనేది కొలాం సంస్కృతిలో లేదు. ఆడపిల్లల పెళ్లిళ్లు చేసిన తల్లిదండ్రులకు ఆర్థిక ఇబ్బందులు రాకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నాం. – దేశ్ముఖ్ లేతు, టెంబ్రీగూడ పటేల్తల్లిదండ్రులకు భారం కావద్దని..ఆడపిల్లల తల్లిదండ్రులకు భారం కాకూడదనే ఉద్దేశంతో వరకట్నాన్ని నిషేధించాం. ఇకపై కొలాం సమాజంలో జరిగే వివాహాలు సాదాసీదాగా, సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తాం. వరకట్న నిర్మూలనలో సమాజంలో సమానత్వం పెరిగి, పేద కుటుంబాలపై ఆర్థిక భారం తగ్గుతుంది. – కొడప సోనేరావు, కొలాం సంఘ రాష్ట్ర అధ్యక్షుడుకట్నమియ్యలే.. మొన్ననే నా బిడ్డ పునేశ్వరి లగ్గం చేసిన. ఉట్ను ర్ మండలం సుద్దగూడ కు ఇచ్చిన. వరకట్నం మాత్రం ఇయ్యలే. నేను కూలీ పని చేస్తుంటా. బిడ్డ పెండ్లీడుకు రావడంతో గుబులు పడ్డా. అయితే గ్రా మస్తులంతా కలిసి వరకట్నం నిషేధించడంతో పాటు లగ్గానికి రూ.20 వేలు సాయం కూడా చేశారు. – పెందుర్ జంగుబాయి,కోసుపటేల్ గూడవరకట్నం నిషేధించాం..మా గూడెంలో అంతా పేదవారే. ఆడపిల్ల తల్లిదండ్రులు పెళ్లి చేయలంటే చాలా కష్టంగా మారింది. దీంతో మేము ఇటీవల సమావేశమయ్యాం. వరకట్నం నిషేధించాం. అలాగే అమ్మాయి కుటుంబానికి తలా కొంత జమ చేసి రూ.20 వేలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం.– కుమురం రావుజీ, పటేల్, కోసుపటేల్గూడపెళ్లింటికి.. ఆర్థిక చేయూతఇంద్రవెల్లి: ఆదివాసీ, గోండు తెగల్లోనూ చాలామంది వరకట్నాలకు దూరంగా ఉంటున్నారు. అలాగే అమ్మాయి, అబ్బాయి పెళ్లి ఎవరిదైనా ఆయా గ్రామాల్లో కులస్తులు కానుకలు ఇవ్వకుండా ఆర్థిక సాయం అందజేస్తున్నారు. పెళ్లింటికి చేదోడుగా నిలుస్తున్నారు. మండలంలోని వడగామ్ గ్రామంలో కనక కోసేరావ్ పెళ్లి రెండు రోజుల క్రితం జరిగింది. ఈమేరకు గ్రామస్తులంతా కలిసి రూ.25 వేలు అందించారు. కేస్లాపూర్ గ్రామానికి చెందిన పెళ్లి కూతురు ఆత్రం రోష్ణకు గ్రామస్తులు రూ.26 వేలు అందించారు. మండలంలోని పిప్రి గ్రామంలో ఆదివారం పెళ్లి పీటలు ఎక్కనున్న ఆత్రం సుజాతకు గ్రామస్తుల ఆధ్వర్యంలో రూ.7,100 అందించారు. ఇలా ఆదివాసీలు తలా కొంత నగదు సేకరించి పెళ్లి కుటుంబాలకు అందించి ఆర్థికంగా మద్ధతిస్తున్నారు. -
బంగారం ధరల రివర్స్!.. వారం రోజుల్లో..
బంగారం ధరలు చాలా వరకు తగ్గుముఖం పట్టాయి. గడచిన వారం రోజుల్లో గోల్డ్, సిల్వర్ రేటు గణనీయంగా తగ్గింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో, పసిడి ధరలలో స్వల్ప మార్పులు జరిగాయి. ఈ కథనంలో వారం రోజుల్లో గోల్డ్ రేట్లలో జరిగిన మార్పు గురించి, నేటి ధరల గురించి తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడలలో మార్చి 9(సోమవారం)న 1,61,680 రూపాయల వద్ద ఉన్న 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు, ఈ రోజుకి (మార్చి 15) 1,59,660 రూపాయల వద్దకు చేరింది. అంటే వారం రోజుల్లో గోల్డ్ రేటు రూ. 2020 తగ్గిందన్న మాట. 22 క్యారెట్ల గోల్డ్ విషయానికి వస్తే.. వారం రోజుల్లో 1,48,200 రూపాయల దగ్గర నుంచి రూ. 1,46,350 వద్దకు (రూ.1850 తగ్గింది) చేరింది.ఢిల్లీలో కూడా గోల్డ్ రేటు వారం రోజుల్లో గణనీయంగా తగ్గింది. మార్చి 9న.. అంటే సోమవారం రోజు 1,61,830 రూపాయల వద్ద ఉన్న 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర.. నేటికి (మార్చి 15) రూ.1,59,810 వద్దకు చేరింది. దీన్నిబట్టి చూస్తే ఏడు రోజుల్లో రూ.2020 తగ్గింది. 22 క్యారెట్ల పసిడి రేటు 1,48,350 రూపాయల నుంచి రూ.1850 తగ్గి 1,46,500 రూపాయల వద్దకు చేరింది.చెన్నైలో 10 గ్రాముల 24 క్యారెట్ల ధర వారం రోజుల్లో 1,63,090 రూపాయల దగ్గర నుంచి 1,61,020 రూపాయల దగ్గరకు చేరింది. వారం రోజుల్లో రూ. 2070 తగ్గిందన్నమాట. తులం 22 క్యారెట్ల బంగారం రేటు 1,49,500 రూపాయల నుంచి రూ. 1,47,600 వద్దకు (రూ.1900 తగ్గింది) చేరింది.వెండి ధరలుబంగారం ధరలు మాత్రమే కాకుండా వెండి ధరలు కూడా బాగా తగ్గాయి. మార్చి 9న రూ.2.90 లక్షల వద్ద ఉన్న కేజీ సిల్వర్ రేటు నేటికి (మార్చి 15) రూ.2.80 లక్షలకు చేరింది. వారం మధ్యలో రేట్ల పెరుగుదల, తగ్గుదల ఉన్నప్పటికీ.. మొత్తం మీద కేజీ రేటు 10,000 రూపాయలు తగ్గిందని తెలుస్తోంది. -
మహిళలకు ఇదే లక్కీ ఛాన్స్.. రెండు రోజుల్లో ఎంత తగ్గిందంటే..!
-
మరోసారి తగ్గిన బంగారం, వెండి ధరలు!
దేశంలో బంగారం ధరలు వరుసగా తగ్గుముఖం పట్టాయి. ఈ రోజు (మార్చి 14) పసిడి ధర గరిష్టంగా రూ.1030 తగ్గింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో గోల్డ్ రేట్లలో స్వల్ప మార్పులు జరిగాయి. బంగారం బాటలోనే నేను కూడా అన్నట్టు.. వెండి అడుగులు వేసింది. దీంతో కేజీ సిల్వర్ రేటు రూ.5000 తగ్గింది. ఈ కథనంలో లేటెస్ట్ గోల్డ్, సిల్వర్ ధరలను గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. -
సాయంత్రానికి మళ్లీ తగ్గిన ధర.. లేటెస్ట్ గోల్డ్ రేటు ఇదే!
భారతదేశంలో బంగారం ధరలు క్రమంగా తగ్గుతున్నాయి. ఈ రోజు (మార్చి 13) 24 గంటలు గడవక ముందే గోల్డ్ రేటు మరోమారు తగ్గింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో గోల్డ్ రేటు మారిపోయింది. ఈ కథనంలో పసిడి ధరలు ఏ నగరం ఎలా ఉన్నాయనే విషయాలను తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడలలో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1530 తగ్గి.. రూ.1,60,690 వద్ద ఉంది. 22 క్యారెట్ల పసిడి ధర 1400 రూపాయలు తగ్గి.. రూ. 147300 వద్ద నిలిచింది. ఇదే ధరలు ముంబై, బెంగళూరు ప్రాంతాల్లో కూడా కొనసాగుతాయి.ఢిల్లీలో కూడా 24 క్యారెట్ల బంగారం ధర, 22 క్యారెట్ల పసిడి ధర వరుసగా రూ. 1530, రూ.1400 తగ్గింది. దీంతో తులం గోల్డ్ రేటు వరుసగా రూ. 1,60,840 & రూ. 1,47,450 వద్ద ఉన్నాయి.చెన్నైలో మాత్రం గోల్డ్ రేటులో ఎలాంటి మార్పు లేదు. ఉదయం ఎంత ధర ఉందో, సాయంత్రానికి కూడా అదే ధర వద్ద నిలిచింది. దీంతో తులం 24 క్యారెట్ల బంగారం ధర రూ. 162560 వద్ద, 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 1,49,000 వద్ద నిలిచింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
మార్కెట్లు క్రాష్.. కియోసాకి సంచలన ట్వీట్!
చమురు ధరల పెరుగుదల.. స్టాక్ మార్కెట్ క్రాష్ వంటివి జరుగుతున్న సమయంలో రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి ఓ సంచలన ట్వీట్ చేశారు. ఇందులో..పెట్టుబడిదారులు తమ డబ్బును ఉపసంహరించుకోవడంతో, ప్రైవేట్ క్రెడిట్ ఫండ్లు భయాందోళనకు గురవుతున్నాయని పేర్కొన్నారు.ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో.. కొన్నిసార్లు పెద్ద మార్పులు జరుగుతాయి. స్టాక్ మార్కెట్ క్రాష్, బ్యాంకులు.. ఫైనాన్షియల్ సంస్థలు కష్టాల్లో పడటం వంటివి. ఇలాంటి సమయంలో పెట్టుబడిదారులు భయంతో తమ డబ్బును వెనక్కి తీసుకోవడం వంటి పరిస్థితులు ఏర్పడతాయి. దీనిని ఆర్థిక క్రాష్ లేదా మాంద్యం అని అంటారు. కొందరు ఆర్థిక నిపుణులు ఈ పరిస్థితిని కొత్త మాంద్యం లేదా డిప్రెషన్ ప్రారంభమవుతోందని కూడా చెబుతారు.ప్రజలు తమ పెట్టుబడులను అమ్మేస్తారు లేదా బ్యాంకుల్లో ఉన్న డబ్బును తీసుకుంటారు. దీన్ని బ్యాంక్ రన్ అని అంటారు. అయితే ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే.. డబ్బు ఎప్పుడూ పూర్తిగా మాయం కాదు. అది ఒక చోటు నుంచి మరో చోటుకు మారుతుంది. అంటే బ్యాంకుల నుంచి బయటకు వెళ్లే డబ్బు, మరో ఆస్తి లేదా పెట్టుబడి వైపు వెళ్తుంది.CRASH ACCELERATES:Private credit funds are panicked as investors withdraw their money.Major big name banks and brand name financial institutions are in trouble.Jim Rickards formally declares the US in the New Depression.What are you going to do?If you have followed my X…— Robert Kiyosaki (@theRealKiyosaki) March 13, 2026కొంతమంది పెట్టుబడిదారులు ఈ మార్పులను ముందుగానే అర్థం చేసుకుని తెలివిగా తమ డబ్బును.. చమురు, వెండి, బంగారం, డిజిటల్ కరెన్సీలు అయిన బిట్కాయిన్, ఈథీరియం వంటి వాటిలో పెట్టుబడిగా పెడుతుంటారు. ఎందుకంటే ఆర్థిక అనిశ్చితి సమయంలో ఈ ఆస్తులు కొన్నిసార్లు విలువను నిలుపుకుంటాయి.ఇదీ చదవండి: స్టాక్ మార్కెట్లో నష్టపోయారా?.. కియోసాకి సూచనలుమార్కెట్ పెరుగుతున్నప్పుడు మాత్రమే కాకుండా.. పడిపోయే సమయంలో కూడా తెలివైన పెట్టుబడిదారులు లాభాలు పొందగలరని. కానీ దీనికి సరైన సమాచారం, విశ్లేషణ & ఆలోచన అవసరం. భయంతో నిర్ణయాలు తీసుకుంటే నష్టాలు కలగవచ్చు. కాబట్టి ఆర్థిక సంక్షోభ సమయంలో భయపడకుండా పరిస్థితిని అర్థం చేసుకోవాలి. డబ్బు ఎక్కడికి వెళ్తోంది, ఏ రంగాలు ఎదుగుతున్నాయి, ఏ పెట్టుబడులు భద్రంగా ఉంటాయి? అనే విషయాలను తెలుసుకోవాలి. అప్పుడు మాత్రమే మనం ఆర్థికంగా స్థిరంగా ఉండగలుగుతాము. -
Gold: మళ్లీ పెరిగిన బంగారం ధర... ఒక్క రోజులో జంప్..
-
2026లో అతిపెద్ద ఆర్ధిక సంక్షోభం!.. కియోసాకి హెచ్చరిక
ఒకవైపు ఇరాన్ - అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం, మరోవైపు భారీగా పతనమవుతున్న మార్కెట్లు. ఇలాంటి సమయంలో రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత 'రాబర్ట్ కియోసాకి' చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అతిపెద్ద స్టాక్ మార్కెట్ పతనం వస్తుందని ఇందులో హెచ్చరించారు.చరిత్రలో అతిపెద్ద స్టాక్ మార్కెట్ పతనం గురించి నేను రిచ్ డాడ్స్ ప్రాఫసీ (2013)లో హెచ్చరించాను. అది రాబోతోంది. 2008లో ప్రపంచం ఒక పెద్ద ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంది. దీనిని గ్రేట్ ఫైనాన్షియల్ క్రైసిస్ అని పిలుస్తారు. ఆ సమయంలో చాలా బ్యాంకులు & ఆర్థిక సంస్థలు కూలిపోయాయి. ముఖ్యంగా అమెరికాలోని పెద్ద పెట్టుబడి బ్యాంక్ అయిన లెమాన్ బ్రదర్స్ దివాళా తీసింది. భవిష్యత్తులో ఇంకా పెద్ద సంక్షోభం వచ్చే అవకాశం ఉందని కియోసాకి పేర్కొన్నారు.కియోసాకి అభిప్రాయం ప్రకారం.. 2026లో మరో పెద్ద ఆర్థిక సంక్షోభం సంభవించే అవకాశం ఉంది. ఈ పతనం ముఖ్యంగా ప్రపంచంలోని అతిపెద్ద ఆస్తి నిర్వహణ సంస్థలలో ఒకటైన 'బ్లాక్ రాక్'తో సంబంధం ఉన్న.. ప్రైవేట్ క్రెడిట్ వ్యవస్థ కారణంగా రావచ్చని ఆయన భావిస్తున్నారు.REPEATING A WARNINGIn Rich Dad’s Prophecy (2013) I warned the biggest stock market crash in history….was STILL coming.In 2026, I hope I am wrong…. Yet I am afraid that crash is now arriving.Why did I make that prediction?Because the cause of the 2008 crash, the GFC,…— Robert Kiyosaki (@theRealKiyosaki) March 10, 2026ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు భారీ అప్పుల్లో ఉన్నాయని, ఆ అప్పులను తిరిగి చెల్లించడం చాలా కష్టం అవుతుందని ఆయన చెబుతున్నారు. ముఖ్యంగా రిటైర్ అయిన వృద్ధుల సేవింగ్స్ ప్రమాదంలో పడే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. కాబట్టి ప్రస్తుతం.. డబ్బును కాపాడుకోవాలంటే.. బంగారం, వెండి, బిట్కాయిన్, ఎథెరియం, ఆయిల్ వెల్స్ వంటి సహజ వనరులలో పెట్టుబడులు పెట్టడం ఉత్తమం అని చెబుతున్నారు.నాకు వెండి అంటే చాలా ఇష్టమని రాబర్ట్ కియోసాకి పేర్కొన్నారు. ఎందుకంటే తక్కువ డబ్బుతో కూడా వెండిని కొనుగోలు చేయవచ్చని ఆయన అభిప్రాయం. కాబట్టి మీరు కూడా కేవలం 10 డాలర్లతో వెండి నాణేలు లేదా చిన్న ముక్కలు కొనుగోలు చేయండి. అవసరమైతే ఒక రోజు తినడం ఆపేసి.. వెండిపై పెట్టుబడి పెట్టండి. తప్పకుండా మీరు ధనవంతులు అవుతారని, జాగ్రత్త వహించండి, అని కియోసాకి తన ట్వీట్ పూర్తి చేశారు. -
Gold Prices: మహిళలు గుడ్ న్యూస్.. మళ్లీ పడిపోయిన పసిడి ధరలు..
-
పసిడి ప్రియులకు శుభవార్త.. మరింత తగ్గిన బంగారం, వెండి!
భారతదేశంలో బంగారం, వెండి ధరలు మరోమారు తగ్గుముఖం పట్టాయి. తులం గోల్డ్ రేటు గరిష్టంగా రూ.1960 తగ్గింది. కేజీ వెండి రేటు రూ.5000 తగ్గింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో పసిడి ధరలలో స్వల్ప మార్పులు ఏర్పడ్డాయి. ఈ కథనంలో గోల్డ్, సిల్వర్ రేట్లు ఏ నగరంలో ఎలా ఉన్నాయనే వివరాలు వివరంగా తెలుసుకుందాం. -
గోల్డ్ మార్కెట్ లో భారీ ట్విస్ట్.. ఒక్కరోజులోనే అమాంతం పెరిగిన బంగారం ధరలు..
-
బాతు కడుపులో బంగారం.. యజమానిలో అంతులేని సంతోషం
-
పాత బంగారు లోకం
సాక్షి, బిజినెస్ డెస్క్: వరుస యుద్ధాల ప్రభావంతో బంగారం ధరలు రికార్డుల మీద రికార్డులు కొడుతున్నాయి. పసిడి ప్రియులకు షాక్ ఇస్తూ ఆభరణాల ధరలు కొండెక్కి కూర్చున్నాయి. మునుపెన్నడూ లేని విధంగా ఒక తులం బంగారం ధర రూ.1.7 లక్షల మార్కును దాటేయడంతో సామాన్యుడి గుండె గుభేల్ మంటోంది. కానీ, ధరలు ఇంకా పెరుగుతాయన్న భయంతో వినియోగదారులు ముందు జాగ్రత్త పడుతున్నారు.మధ్యతరగతి జనం ఇప్పుడు కొత్త నగలు కొనడానికి బదులు, ఇంట్లో ఉన్న పాత బంగారాన్నిజువెలరీ షాపుల్లో ఇచ్చి (ఎక్స్ఛేంజ్) కొత్తవి చేయించుకుంటున్నారు. లాకర్లలో దాచిన పాత నగలను బయటకు తెచ్చి కొత్త నగలుగా మార్చుకుంటున్నారు. పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారం ధర ఇంకా పెరుగుతుందనే భయంతో అవసరాల కోసం ముందుగానే కొనుగోళ్లు చేయడం మొదలెట్టారు. పాత పసిడికి కొత్త మెరుగులు దిద్దుకుంటున్నారు. ప్రస్తుతం జరుగుతున్న బంగారం అమ్మకాల్లో సగానికి పైగా గోల్డ్ ఎక్స్ఛేంజ్ ద్వారానే సాగుతున్నట్లు జువెలరీ వ్యాపారులు చెబుతున్నారు. ప్యూర్ వద్దు.. లైట్ ముద్దు! పెరిగిన ధర వద్ద బంగారు ఆభరణాలు కొనడం సామాన్యుడికి కలగా మారింది. దీని ప్రభావం ముఖ్యంగా జీతభత్యాలపై ఆధారపడే మధ్యతరగతి పై ఎక్కువగా పడుతోంది దీంతో మార్కెట్లో మరో కొత్త ట్రెండ్ మొదలైంది. తక్కువ బరువు, తక్కువ ధరలో లభించే 18 క్యారెట్ల నగలకు డిమాండ్ విపరీతంగా పెరిగింది. డైమండ్స్లో కూడా 9 క్యారెట్, 14 క్యారెట్ వంటి తక్కువ రేంజ్ ఆభరణాలు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. సహజ వజ్రాల రేటు భరించలేని మధ్యతరగతి వినియోగదారులు తక్కువ ధరకే మెరిసే ల్యాబ్ గ్రోన్ డైమండ్స్వైపు మళ్లుతున్నారు. ల్యాబ్–గ్రోన్ డైమండ్స్ ధరలు సహజ డైమండ్స్ కంటే చాలా తక్కువ గ్లోబల్ డైమండ్ మార్కెట్లో ప్రస్తుతం 12 శాతం ఉన్న ల్యాబ్ గ్రోన్ డైమండ్ల వాటా 2029 నాటికి 16 శాతానికికి చేరుతుందని నిపుణుల అంచనా.ఇన్వెస్ట్మెంట్ అంటే ‘కాసే’ కేవలం అలంకరణకే కాకుండా, పెట్టుబడి కోసం చూసేవారు ఇప్పుడు గోల్డ్ కాయిన్స్పైనే మొగ్గు చూపుతున్నారు. భవిష్యత్తులో ధరలు మరింత పెరిగితే ఇవే లాభాలను ఇస్తాయని నమ్ముతున్నారు. రేటు పెరిగినా ఇన్వెస్టర్లు బంగారు నాణేలు కొనడానికి ప్రాధాన్యమిస్తున్నారు. ‘రేట్లు ఎంత పెరిగినా బంగారంపై భారతీయులకు ఉన్న నమ్మకం వేరు. అది కేవలం ఆభరణం మాత్రమే కాదు.. ఒక భద్రత’ – అరుణ్ నారాయణ్, సీఈఓ టైటాన్ జువెలరీ -
యుద్ధ ప్రభావం ఉన్నా గోల్డ్, సిల్వర్ రేట్ పడిపోవడానికి కారణం ఏమిటి..?
-
ఇంద్రకీలాద్రిపై భారీ చోరీ.. 15 తులాల బంగారం ఎత్తుకెళ్లిన దుండగులు
విజయవాడ కనక దుర్గమ్మ అమ్మవారి ఇంద్రకీలాద్రి కొండపై చోరీ జరిగింది. ఓ భక్తురాలి వద్ద 15 లక్షల విలువైన బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయి. హైదరాబాద్ నుంచి విజయవాడకు పెళ్లికి వచ్చిన మహిళా భక్తురాలు నగలు పొగొట్టుకుంది. ఇవాళ కుంభాభిషేకం సందర్భంగా భక్తులు భారీగా తరలివచ్చారు. అదే సమయంలో దర్శనానికి వెళ్లిన ఆమె బ్యాగ్లో ఉన్న బంగారు చోరీకి గురైంది.దీంతో విజయవాడలోని వన్ టౌన్ పోలీసులకు మహిళా భక్తురాలు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆలయ పరిసరాల్లోని సీసీ కెమెరాలను పరిశీలించారు. కుంభాభిషేకం ఏర్పాట్లలో భాగంగా ఆలయ ప్రాంగణంలో టెంట్లు ఏర్పాటు చేశారు. దీంతో సీసీ కెమెరాలకు అడ్డంగా టెంట్స్ ఉండడంతో దొంగను గుర్తించడం పోలీసులకు కష్టంగా మారింది. -
మరింత తగ్గిన గోల్డ్ రేటు: లేటెస్ట్ ధరలు ఇలా..
మార్చి 2 నుంచి భారతదేశంలో బంగారం ధరలు వరుసగా తగ్గుతూనే ఉన్నాయి. ఈ రోజు ఉదయం స్వల్పంగా తగ్గిన గోల్డ్ రేటు, సాయంత్రానికి ఇంకొంత తగ్గుముఖం పట్టింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు స్వల్ప మార్పులకు లోనయ్యాయి. ఈ కథనంలో తాజా ధరలు ఎలా ఉన్నాయనేది తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడలలో ఉదయం రూ. 1,48,600 వద్ద ఉన్న 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేటు.. సాయంత్రానికి 1,47,700 రూపాయల వద్దకు చేరింది. 24 క్యారెట్ల తులం బంగారం ధర 1,62,110 రూపాయల నుంచి రూ. 1,61,130 వద్దకు చేరింది. ఇదే ధరలు బెంగళూరు, ముంబై నగరాల్లో కూడా కొనసాగుతాయి.ఢిల్లీలో కూడా బంగారం ధరల్లో చాలా వ్యత్యాసం కనిపించింది. ఉదయం రూ. 1,48,750 వద్ద ఉన్న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర, సాయంత్రానికి 1,47,850 రూపాయల వద్ద నిలిచింది. 24 క్యారెట్ల రేటు 1,62,260 రూపాయల వద్ద నుంచి రూ. 1,61,280 వద్దకు చేరింది.చెన్నైలో మాత్రం.. గోల్డ్ రేటులో ఎలాంటి మార్పు లేదు. 22 క్యారెట్ల తులం గోల్డ్ రేటు రూ. 1,49,600 వద్ద, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,63,200 వద్దనే ఉన్నాయి.అమెరికా, ఇజ్రాయెల్ - ఇరాన్ యుద్ధం ప్రారంభైనప్పుడు భారీగా పెరిగిన బంగారం ధరలు, ఇప్పుడు నేలచూపులు చూస్తున్నాయి. దీంతో ఐదు రోజులుగా పసిడి ధరలు తగ్గుతూనే ఉన్నాయి. హైదరాబాద్, విజయవాడలలో మార్చి 2న రూ. 1,70,510 వద్ద ఉన్న 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు ఈ రోజుకు (మార్చి 6) 1,61,130 రూపాయల వద్దకు చేరింది. దీన్ని బట్టి చూస్తే బంగారం ధరలు ఎంత తగ్గాయో స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. -
బంగారంపై భారీ డిస్కౌంట్.. అమ్మేసుకుంటున్న వ్యాపారులు
మిడిల్ ఈస్ట్లో కొనసాగుతున్న యుద్ధం ప్రభావంతో దుబాయ్లో బంగారాన్ని భారీ తగ్గింపుతో అమ్ముకుంటున్న పరిస్థితి నెలకొంది. యుద్ధ పరిస్థితుల కారణంగా విమాన రవాణా తీవ్రంగా ప్రభావితమవడంతో, కీలకమైన బులియన్ ట్రేడింగ్ హబ్ అయిన దుబాయ్ నుంచి బంగారం సరఫరా దెబ్బతింది.విమానాలపై ఆంక్షలు, పెరిగిన షిప్పింగ్, బీమా ఖర్చుల నేపథ్యంలో చాలా మంది కొనుగోలుదారులు కొత్త ఆర్డర్లను ఇవ్వడానికి వెనుకంజ వేస్తున్నారు. వెంటనే డెలివరీకి హామీ లేకపోవడంతో అదనపు ఖర్చులు చెల్లించడానికి ఆసక్తి చూపడం లేదు. ఈ పరిస్థితుల్లో నిల్వ, నిధుల ఖర్చులను భరించాల్సిన పరిస్థితి తలెత్తకుండా ఉండేందుకు వ్యాపారులు లండన్ గ్లోబల్ బెంచ్మార్క్ ధరతో పోలిస్తే ఔన్స్కు సుమారు 30 డాలర్ల వరకు తగ్గింపుతో బంగారాన్ని అందిస్తున్నట్లు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి.ఈ వారం మధ్య నుంచి కొంతమేర బంగారం విమానాల్లో లోడ్ చేసి దుబాయ్ నుంచి పంపించినప్పటికీ, శుక్రవారం నాటికి చాలా సరుకు రవాణా ఆలస్యమైందని ఎకనమిక్ టైమ్స్ కథనం పేర్కొంది.యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ముఖ్యంగా దుబాయ్.. ఆసియా దేశాలకు బంగారం శుద్ధి చేసి ఎగుమతి చేసే ప్రధాన కేంద్రంగా ఉంది. అలాగే స్విట్జర్లాండ్, యూకే, కొన్ని ఆఫ్రికా దేశాల నుంచి వచ్చే బంగారం కూడా దుబాయ్ ద్వారా రవాణా అవుతుంది. అయితే టెహ్రాన్కు, అమెరికా-ఇజ్రాయెల్కు మధ్య కొనసాగుతున్న యుద్ధం కారణంగా ఇరాన్ క్షిపణి దాడుల నేపథ్యంలో గగనతలం పాక్షికంగా మూతపడింది.ఇది చదివారా? 👉 స్తంభించిన దుబాయ్ రియల్ ఎస్టేట్!సాధారణంగా బంగారాన్ని ప్రయాణికుల విమానాల కార్గో విభాగాల్లో తరలిస్తారు. ప్రస్తుతం యూఏఈ నుంచి విమానాల సంఖ్య గణనీయంగా తగ్గిపోవడంతో ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించాల్సి వస్తోంది. అయితే భూసరిహద్దులు దాటేటప్పుడు భద్రతా సమస్యలు ఉండటంతో సౌదీ అరేబియా లేదా ఒమాన్ విమానాశ్రయాలకు భూభాగం మీదుగా అధిక విలువ గల సరుకులను తరలించడానికి వ్యాపారులు ఆసక్తి చూపడం లేదు. -
బాతు పొట్టలో గ్రా. 10 గోల్డ్ , ఉబ్బితబ్బిబ్బైన యజమాని
బాల్యంలో చదువుకున్న ‘బంగారు బాతు గుడ్డు’ కథ గుర్తుందా. చైనాలోని ఒక వ్యక్తికి ఎదురైన అనుభవం గురించి తెలుసుకుంటే మాత్రం తప్పకుండా మరోసారి గుర్తు రాక మానదు. అసలు స్టోరీ ఏంటీ అంటే. చైనాకు చెందిన ఒక కుటుంబానికి ఊహించని అదృష్టం వరించింది. తాము పెంచుకున్న బాతును విందుకోసం వధించారు. అనూహ్యంగా దాని పొట్టలో బంగారాన్ని గుర్తించి ఆశ్చర్యపోయారు. దీని విలువ రూ.1.6 లక్షలు ఉంటుందని అంచనా. మెయిన్ల్యాండ్ మీడియా అవుట్లెట్ జిన్వెన్ఫాంగ్ నివేదించిన ప్రకారం, ఆ ముక్కలు మొత్తం 10 గ్రాముల బరువు కలిగి ఉన్నాయి. వాటి అంచనా విలువ దాదాపు 12,000 యువాన్లు, అంటే దాదాపు రూ. 1.6 లక్షలు. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ప్రకారం, ఈ సంఘటన ఫిబ్రవరిలో హునాన్ ప్రావిన్స్లోని లాంగ్హుయ్ కౌంటీలో జరిగింది. లియు అనే గ్రామస్థుడు, బాతును వధించిన తర్వాత దానిని శుభ్రం చేస్తున్నప్పుడు చిన్న చిన్న బంగారు ముక్కల్ని గమనించాడు. దీంతో ఇది నిజంగా బంగారమేనా అని నిర్ధారించుకునేందుకు, ఇంట్లోనే బర్నింగ్ టెస్ట్ నిర్వహించాడు. నిజమైన బంగారమే అని తెలిసి సంతోషంగా ఉబ్బితబ్బిబ్బైనాడు. రాబోయే అదృష్టానికి సంకేతంగా లియు తండ్రి అభిప్రాయపడగా, ఇది కొత్తేమీ కాదనీ, ఇంత పెద్ద మొత్తంలో లభించడం మాత్రం ఇదే తొలిసారని కొడుకు లియూ చెప్పాడు.(రూ. 250 కోట్ల భరణం ఆఫర్ : జోరుగా మంతనాలు చేస్తున్న విజయ్)అయితే బాతులు, ఇతర పక్షులు ఆహారం తీసుకునేటప్పుడు చిన్న రాళ్ళు, ఇసుక లేదా గ్రిట్ మింగడం చాలా కామన్. అలా ఒకప్పుడు బంగారు తవ్వకాలతో ముడిపడి ఉన్న నది దగ్గర ఆహారం తీసుకుంటుండగా ఈ బాతు పొట్టలోకి బంగారం చేరి ఉంటుందని విశ్వసిస్తున్నారు.అ యితే ప్రస్తుతం బాతు పొట్టలో దొరికిన బంగారం ఎవరిది అని నిర్ణయించడం కష్టమంటున్నారు అధికారులు. 1970-1990ల మధ్య కాలంలో, ఈ నది దగ్గర బంగారం కోసం వేట చాలా జోరుగా సాగేది. అయితే, తరువాత ప్రభుత్వం ఈ ప్రాంతంలో ప్రైవేట్ బంగారు తవ్వకాలను నిషేధించింది.ఇదీ చదవండి: కెనడాలో భారతీయ ఇన్ఫ్లుయెన్సర్ నాన్సీ దారుణ హత్య -
పసిడి ప్రియులకు శుభవార్త.. మరింత తగ్గిన గోల్డ్ రేటు!
మార్చి 2నుంచి భారతదేశంలో బంగారం ధరలు వరుసగా తగ్గుతూనే ఉన్నాయి. ఈ రోజు ఉదయం స్వల్పంగా తగ్గిన గోల్డ్ రేటు, సాయంత్రానికి ఇంకొంత తగ్గుముఖం పెట్టింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు స్వల్ప మార్పులకు లోనయ్యాయి. ఈ కథనంలో తాజా ధరలు ఎలా ఉన్నాయనేది తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడలలో ఉదయం రూ. 1,49,900 వద్ద ఉన్న 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేటు.. సాయంత్రానికి 1,49,300 రూపాయల వద్దకు చేరింది. 24 క్యారెట్ల తులం బంగారం ధర 1,63,530 రూపాయల నుంచి రూ. 1,62,880 వద్దకు చేరింది. ఇదే ధరలు బెంగళూరు, ముంబై నగరాల్లో కూడా కొనసాగుతాయి.ఢిల్లీలో కూడా బంగారం ధరల్లో చాలా వ్యత్యాసం కనిపించింది. ఉదయం రూ. 1,50,050 వద్ద ఉన్న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర, సాయంత్రానికి 1,49,450 రూపాయల వద్ద నిలిచింది. 24 క్యారెట్ల రేటు 1,63,680 రూపాయల వద్ద నుంచి రూ. 1,63,030 వద్దకు చేరింది.ఇక చెన్నైలో మాత్రం.. గోల్డ్ రేటులో ఎలాంటి మార్పు లేదు. 22 క్యారెట్ల తులం గోల్డ్ రేటు రూ. 151200 వద్ద, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 164950 వద్దనే ఉన్నాయి.ఇదీ చదవండి: ఇంటర్ చదివి.. రూ.300 కోట్ల బిజినెస్! -
Gold: వరుసగా నాలుగో రోజు పతనమైన బంగారం ధర
-
ఇది మీ దగ్గర ఉంటే.. 10 ఏళ్లలో మీరే కోటేశ్వరులు
-
దుబాయ్ దాటని బంగారం..
పశ్చిమాసియాలో యుద్ధ ఉద్రిక్తతల ప్రభావం ప్రపంచ బంగారం (Gold) వ్యాపారంపై పడుతోంది. బులియన్ హబ్గా పేరుగాంచిన దుబాయ్ (Dubai) నుంచి విమానాలను సామూహికంగా రద్దు చేయడంతో వ్యాపారులు బంగారం, వెండి రవాణాలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ప్రపంచ బంగారం మార్కెట్లో కీలక కేంద్రంగా నిలిచిన యూఏఈ (United Arab Emirates) ఆసియా దేశాలకు బులియన్ను శుద్ధి చేసి ఎగుమతి చేయడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా స్విట్జర్లాండ్, లండన్ నుంచి రవాణా అయ్యే బంగారం కూడా దుబాయ్ మార్గం ద్వారానే ఆసియాకు చేరుతుంది. అయితే ఇరాన్ (#Iranwar) చేపట్టిన క్షిపణి దాడుల నేపథ్యంలో యూఏఈ తన గగనతలాన్ని పాక్షికంగా మూసివేయగా, దుబాయ్ విమానాలు నిలిచిపోయాయి. ఫలితంగా ప్రయాణికుల విమానాల కార్గో హోల్డ్లలో తరలించే బంగారం, వెండి రవాణా పూర్తిగా నిలిచిపోయింది.దుబాయ్కు, వివిధ దేశాలకు మధ్య లోహ రవాణాను నిరవధికంగా నిలిపివేసినట్లు పలువురు వాణిజ్య, లాజిస్టిక్స్ సంస్థల ప్రతినిధులు వెల్లడించారు. తుది గమ్యస్థానాలకు చేరాల్సిన సరుకులను ఇతర మార్గాలకు మళ్లించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే అధిక విలువ గల బులియన్ను రోడ్డు మార్గంలో ఇతర విమానాశ్రయాలకు తరలించడం ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు.సాధారణంగా ట్రేడింగ్ హబ్ల మధ్య బంగారాన్ని ప్రయాణికుల విమానాల ద్వారా తరలిస్తారు. ఇందుకు ఒక్క ట్రిప్కు ఔన్సుకు ఒక డాలర్ కంటే తక్కువ ఖర్చు అవుతుంది. ఒక విమానంలో తీసుకెళ్లగల బంగారం పరిమాణానికి బరువుతో కాకుండా విలువ ఆధారంగా పరిమితి ఉంటుంది. బీమా సంస్థలు కూడా ఒక విమానంలో తరలించే కొన్ని టన్నుల విలువైన లోహానికే అండర్రైటింగ్ చేస్తాయి.ఈ అంతరాయం తాత్కాలికమే అవుతుందని భావిస్తున్నప్పటికీ, యూఏఈ నుంచి విమానాల నిలిపివేత కొనసాగితే భారత్ సహా ఇతర ప్రధాన మార్కెట్లలో సరఫరా సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. సౌదీ అరేబియాలో బులియన్ ప్రీమియంలు గణనీయంగా పెరగడం సరఫరాపై ఆందోళనలను ప్రతిబింబిస్తోందని మెటల్స్ ఫోకస్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ఫిలిప్ న్యూమాన్ తెలిపారు.విమాన ట్రాకింగ్ వేదిక ఫ్లైట్రేడర్24 సమాచారం ప్రకారం.. ఇరాన్ తొలి ప్రతీకార దాడి తర్వాత ప్రపంచవ్యాప్తంగా 12,300కిపైగా విమానాలు రద్దయ్యాయి. ప్రపంచంలోనే అతిపెద్ద అంతర్జాతీయ ఎయిర్లైన్గా పేరొందిన ఎమిరేట్స్ బుధవారం రాత్రి వరకు దుబాయ్ నుంచి విమానాలను నిలిపివేయగా, ఇతిహాద్ ఎయిర్వేస్ గురువారం వరకు కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేసింది.గతంలో కూడా ఇలాంటి పరిస్థితులు బంగారం వ్యాపారులను కష్టాల్లోకి నెట్టాయి. 2020లో కరోనా మహమ్మారి ప్రారంభ సమయంలో ప్రయాణ ఆంక్షల కారణంగా లండన్, న్యూయార్క్ నగరాల మధ్య బంగారం రవాణా దెబ్బతింది. ఆ సమయంలో జేపీమోర్గాన్ ఛేస్ వంటి బ్యాంకులకు అపూర్వమైన మధ్యవర్తిత్వ అవకాశాలు లభించాయి. -
గంటల వ్యవధిలో.. తారుమారైన గోల్డ్ రేటు!
బంగారం ధరలు ఎప్పుడు, ఎలా? మారిపోతున్నాయో.. ఊహకందకుండా పోతోంది. ఉదయం ఉన్న రేటు, సాయంత్రానికి మారిపోతోంది. ఈ రోజు పరిస్థితి అలాగే ఉంది. ఈ కథనంలో లేటెస్ట్ గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయి?, ఏ నగరం ఎక్కువగా ఉన్నాయి?, ఏ నగరంలో కొంత తక్కువగా ఉంది? అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడలలో ఉదయం రూ. 1,69,880 వద్ద ఉన్న 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రేటు సాయంత్రానికి 1,70,510 రూపాయల వద్దకు చేరింది. 22 క్యారెట్ల రేటు 1,55,650 రూపాయల దగ్గర నుంచి రూ. 1,56,300 వద్దకు చేరింది. ఇదే ధరలు ముంబై, బెంగళూరు ప్రాంతాల్లో కూడా కొనసాగుతాయి.చెన్నైలో ఉదయం 156660 రూపాయల వద్ద ఉన్న 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు సాయంత్రానికి అదే రేటు వద్ద కొనసాగింది. 24 క్యారెట్ల గోల్డ్ రేటు (రూ.170840) విషయంలో ఎలాంటి మార్పు లేదు.ఢిల్లీలో ఈ రోజు ఉదయం 155880 రూపాయల వద్ద ఉన్న 22 క్యారెట్ల గోల్డ్ రేటు 156450 రూపాయల వద్దకు చేరింది. 24 క్యారెట్ల తులం బంగారం రేటు 1,69,950 రూపాయల వద్ద నుంచి 1,70,660 వద్ద నిలిచింది.ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం కారణంగా.. బంగారం ధరల్లో చాలా మార్పులు సంభవిస్తున్నాయి. రానున్న రోజుల్లో గోల్డ్ రేటు మరింత పెరిగే అవకాశం ఉందని రాబర్ట్ కియోసాకి వంటి నిపుణులు సైతం చెబుతున్నారు. -
హైదరాబాద్లో మరో గోల్డ్ పాయింట్ సెంటర్
బంగారం, వెండి వ్యాపార రంగంలో ఒకటైన ముత్తూట్ పప్పచన్ గ్రూప్ అనుబంధ సంస్థ.. ముత్తూట్ ఎగ్జిమ్ (ప్రై) లిమిటెడ్ హైదరాబాద్లోని హిమాయత్ నగర్లో తన కొత్త గోల్డ్ పాయింట్ కేంద్రాన్ని ప్రారంభించినట్లు ప్రకటించింది. దీంతో దేశవ్యాప్తంగా సంస్థకు 95వ శాఖ కాగా, హైదరాబాద్లో 6వది, తెలంగాణలో 9వ కేంద్రం ద్వారా సేవలు అందిస్తోంది.ఈ కొత్త గోల్డ్ పాయింట్ కేంద్రం ద్వారా హిమాయత్ నగర్ పరిసర ప్రాంతాల వినియోగదారులకు పారదర్శక, శాస్త్రీయ, బాధ్యతాయుత బంగారం రీసైక్లింగ్ సేవలు మరింత సులభంగా అందుబాటులోకి రానున్నాయి. వినియోగదారులు తమ పాత, ఉపయోగించిన బంగారు ఆభరణాలను సురక్షితంగా విక్రయించవచ్చు. మొత్తం మూల్యాంకన ప్రక్రియను కస్టమర్లు ప్రత్యక్షంగా వీక్షించే విధంగా పారదర్శక విధానాన్ని సంస్థ అమలు చేస్తోంది. రూ.10,000 వరకు విలువైన బంగారానికి తక్షణ నగదు చెల్లింపు లభిస్తుంది. అంతకుమించిన మొత్తాలు IMPS, NEFT లేదా RTGS ద్వారా సురక్షితంగా నగదు బదిలీ చేస్తారు. -
భగ్గుమన్న బంగారం.. కియోసాకి ‘బ్లాస్ట్ ఆఫ్’ ట్వీట్
ప్రసిద్ధ ఆర్థిక రచయిత రాబర్ట్ కియోసాకి (Robert Kiyosaki) మరోసారి సాంప్రదాయ కరెన్సీలపై ఆందోళన వ్యక్తం చేస్తూ బంగారం, వెండి, బిట్కాయిన్పై ఆశావాద వ్యాఖ్యలు చేశారు. రిచ్ డాడ్ పూర్ డాడ్ (Rich Dad Poor Dad) పుస్తక రచయిత అయిన కియోసాకి తన తాజా సోషల్ మీడియా పోస్టులో బంగారం ఒకే రోజులో 128 డాలర్లు పెరిగిందని పేర్కొన్నారు. ఇదే క్రమంలో వెండి (Silver), బిట్కాయిన్ (Bitcoin) త్వరలో భారీగా ఎగిసిపడతాయని (బ్లాస్ట్ ఆఫ్) అభిప్రాయపడ్డారు.బంగారం ధరలుబంగారం ధరలు ఒక్కరోజులోనే భారీగా పెరగడం మార్కెట్లలో చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా ఇలాంటి పెరుగుదలలు అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి, ద్రవ్యోల్బణ భయాలు, వడ్డీ రేట్ల మార్పులు, భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతలు, డాలర్ బలహీనత వంటి కారణాలతో చోటుచేసుకుంటాయి. ఈ నేపథ్యంలో పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తులవైపు మళ్లడం సాధారణం.వెండి, బిట్కాయిన్పై..కియోసాకి ప్రకారం వెండి కూడా బంగారం తరహాలోనే వేగంగా పెరిగే అవకాశం ఉంది. వెండి పారిశ్రామిక వినియోగం, విలువ నిల్వ అనే రెండు కోణాల్లో ప్రాధాన్యం కలిగి ఉండటంతో, మార్కెట్ చలనం సమయంలో ఎక్కువ ఒడిదుడుకులు చూపుతుంది. అలాగే బిట్కాయిన్ను డిజిటల్ గోల్డ్గా పేర్కొంటూ, కేంద్రీకృత ఆర్థిక వ్యవస్థలపై అనిశ్చితి పెరిగితే క్రిప్టోకరెన్సీలకు మద్దతు పెరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.GOLD booms $128 in one day.Better news is silver and Bitcoin to blast off.Hang on.— Robert Kiyosaki (@theRealKiyosaki) March 2, 2026 -
వార్ ఎఫెక్ట్.. భారీగా పడిపోయిన బంగారం, వెండి ధరలు
-
ఊహకందని స్థాయికి చేరిన బంగారం ధర!
బంగారం తగ్గుతుందని సంబరపడేలోపే.. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం మొదలైపోయింది. దీంతో పసిడి ధరలు అమాంతం పెరిగిపోయాయి. గత ఆదివారం (ఫిబ్రవరి 22) రూ. 1,59,280 వద్ద ఉన్న గోల్డ్ రేటు (ఫిబ్రవరి 28) శనివారం నాటికి రూ. 1,68,710 వద్దకు చేరింది. ఈ కథనంలో వారం రోజుల్లో గోల్డ్ రేటు ఏ నగరంలో ఎలా ఉందనే వివరాలు వివరంగా తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడలలో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు.. వారం రోజుల్లో రూ. 1,59,280 నుంచి రూ. 1,68,710 వద్దకు (రూ.9430 పెరిగింది) చేరింది. 22 క్యారెట్ల తులం పసిడి రేటు రూ. 1,46,000 నుంచి రూ. 1,54,650 వద్దకు చేరింది. అంటే వారం రోజుల్లో 8650 రూపాయలు పెరిగిందన్నమాట. ఈ రోజు (మార్చి 1) ధరలు తెలుగు రాష్ట్రాల్లో గరిష్టంగా రూ. 1,73,080 వద్దకు చేరాయి.చెన్నైలో గోల్డ్ రేటు వారం రోజుల్లో భారీగా పెరిగింది. ఫిబ్రవరి 22న రూ.1,60,150 వద్ద ఉన్న తులం 24 క్యారెట్ల బంగారం ధర రూ. 9490 పెరిగి.. ఫిబ్రవరి 28 నాటికి 1,69,640 రూపాయల వద్దకు చేరింది. 22 క్యారెట్ల బంగారం విషయానికి వస్తే.. ఇది 10 గ్రాములు 1,46,800 రూపాయల నుంచి రూ. 1,55,500 వద్దకు చేరింది. అంటే ఏడు రోజుల్లో 8700 రూపాయలు పెరిగిందన్నమాట.ఫిబ్రవరి 22న 1,59,430 రూపాయల వద్ద ఉన్న 24 క్యారెట్ల తులం బంగారం ధర ఫిబ్రవరి 28నాటికి రూ. 9430 పెరిగి.. 1,68,860 రూపాయల వద్దకు చేరింది. 22 క్యారెట్ల గోల్డ్ రేటు 1,46,150 రూపాయల దగ్గర నుంచి రూ. 1,54,800 వద్దకు చేరింది. వారం రోజుల్లో రూ. 8650 పెరిగింది. -
లోన్స్ లో 'గోల్డ్' టాప్
బంగారం రుణాలు భారత్లో సరికొత్త రికార్డులను నమోదు చేస్తున్నాయి. కొత్తగా మంజూరైన రిటైల్ లోన్స్లో దాదాపు మూడింట ఒకవంతు వాటాతో ఈ విభాగం అగ్రస్థానం కైవసం చేసుకుంది. పసిడి ధర పరుగు తీస్తుండడంతో తాకట్టు ద్వారా అందుకునే రుణ మొత్తమూ పెరుగుతోంది. దీంతో జనం గోల్డ్లోన్స్ వైపు మొగ్గు చూపుతున్నారు. దేశవ్యాప్తంగా కొత్తగా 2025 అక్టోబర్–డిసెంబర్ కాలంలో రూ.8.17 లక్షల కోట్ల గోల్డ్లోన్స్ మంజూరయ్యాయి. ఇదే కాలంలో పర్సనల్ లోన్స్, హోమ్, ఆటో, కంన్జ్యూమర్ డ్యూరబుల్, టూ వీలర్ లోన్స్ కలిపి కస్టమర్లు మొత్తం రూ.8.03 లక్షల కోట్ల రుణం అందుకున్నారు. విలువపరంగా పసిడి రుణాలు ఈ ఐదు విభాగాల కంటే అధికంగా నమోదు కావడం విశేషం. గత ఏడాది జూలై–సెప్టెంబర్లో కొత్తగా తీసుకున్న పసిడి రుణాలు రూ.6.04 లక్షల కోట్లు. దీనిని బట్టి రుణ మార్కెట్లో పుత్తడి ఏ స్థాయిలో ట్రెండ్ సెట్టర్గా నిలిచిందో అర్థం చేసుకోవచ్చు. ఇక డిసెంబర్ నాటికి కస్టమర్లు మొత్తం రూ.43 లక్షల కోట్ల హోమ్ లోన్స్ అందుకున్నారు. బంగారం రుణాలు రూ.16.2 లక్షల కోట్లకు చేరుకున్నాయి. ఆశ్చర్యం కలిగించే విషయం ఏమంటే గోల్డ్లోన్స్ రెండేళ్లలో రెండింతలు కావడమే. – సాక్షి, స్పెషల్ డెస్క్అత్యధికులు లక్ష లోపే..తాకట్టు పెట్టిన బంగారం ద్వారా కస్టమర్లు అందుకున్న సగటు రుణం 2025 అక్టోబర్–డిసెంబర్లో రూ.1.9 లక్షలకు చేరింది. రెండేళ్ల క్రితం ఇది కేవలం రూ.1.1 లక్షలు మాత్రమే. అంటే సగటు లోన్ మొత్తం 72% పైగా పెరిగిందన్నమాట. ఇక రూ.లక్ష లోపు రుణం తీసుకున్న వారి సంఖ్య 51.1% ఉంది. కొత్త కస్టమర్లలో సగం మంది బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల (ఎన్బీఎఫ్సీ) ద్వారా గోల్డ్లోన్ స్వీకరించారు. ప్రభుత్వ బ్యాంకుల నుంచి 32.7%, ప్రైవేట్ బ్యాంకుల ద్వారా 8.5% మంది రుణం పొందారు. వినియోగదారుల్లో 36–45 వయసున్నవారు దాదాపు మూడింట ఒకవంతు ఉన్నారు. 56% మంది రుణగ్రహీతలు పురుషులు కాగా మిగిలినవారు స్త్రీలు. భారత్లో పసిడి రుణాలు ఇలా..2025 డిసెంబర్ నాటికి మొత్తం గోల్డ్లోన్స్ రూ.16.2 లక్షల కోట్లు ఏడాదిలో రుణ విలువ వృద్ధి 44.1%ఖాతాల సంఖ్య 9.07 కోట్లుగత ఏడాది అక్టోబర్–డిసెంబర్లో కొత్తగా మంజూరైన రుణం రూ.8.17 లక్షల కోట్లు -
యుద్ధం ఎఫెక్ట్.. ఒక్కసారిగా పెరిగిన గోల్డ్, సిల్వర్ రేటు!
ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా ఇరాన్పై దాడి చేయడం మొదలుపెట్టేశాయి. దీంతో పెట్టుబడిదారుల్లో భయం పెరిగిపోయింది. ఈ తరుణంలో అందరూ సురక్షితంగా భావించే బంగారం, వెండి ధరలు ఆల్ టైమ్ రికార్డ్ స్థాయికి చేరుకున్నాయి. ఈ కథనంలో లేటెస్ట్ గోల్డ్ రేటు.. దేశంలోని ఏ నగరంలో ఎలా ఉందో వివరంగా తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడ నగరాల్లో తులం 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 7140 పెరిగి రూ. 1,68,170 వద్దకు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 6550 పెరిగి రూ. 1,54,650 వద్దకు చేరింది. ఇదే ధరలు బెంగళూరు, ముంబై నగరాల్లో కూడా ఉన్నాయి.చెన్నైలో కూడా ధరలు పెరిగాయి. దీంతో 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 1,69,640 (రూ. 7090 పెరిగింది). 22 క్యారెట్ల రేటు రూ. 1,55,500 (రూ. 6500 పెరిగింది) వద్ద ఉంది.ఢిల్లీ విషయానికి వస్తే.. దేశ రాజధాని నగరంలో 24 క్యారెట్ల తులం గోల్డ్ రేటు రూ. 7140 పెరిగి, రూ. 1,68,860 వద్ద నిలిచింది. ఇదే సమయంలో 22 క్యారెట్ల 10 గ్రాముల రేటు రూ. 6550 పెరిగి రూ. 1,54,800 వద్ద నిలిచింది.వెండి ధరలుబంగారం బాటలోనే వెండి అన్నట్లు.. వెండి రేటు కూడా అమాంతం పెరిగిపోయింది. దీంతో హైదరాబాద్, విజయవాడ మొదలైన నగరాల్లో కేజీ సిల్వర్ రేటు రూ. 3.20 లక్షలు చేరింది. ఢిల్లీలో మాత్రం కేజీ వెండి రేటు రూ. 2.95 లక్షల వద్ద నిలిచింది.ఇదీ చదవండి: అమెరికాను విడిచిపెడుతున్న లక్షలాది మంది ప్రజలు! -
10th పేపర్ లీక్.. 80 గ్రాముల బంగారం టోకరా
బెంగళూరు: కర్ణాటకలో ఓ టీచర్ పరీక్ష పేపర్ లీక్ చేస్తానని విద్యార్థికి ఆశ చూపి 80 గ్రాముల బంగారం కాజేసింది. ఈ వివరాలు సదరు విద్యార్థి తల్లిదండ్రులకు తెలియడంతో ఆ స్టూడెంట్ భయంతో ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల వివరాల ప్రకారం.. ధార్వాడ్లోని విద్యారణ్య పాఠశాలలో SSLV ( 10 వతరగతి) పరీక్ష పత్రాన్ని లీక్ చేస్తానని ఆ విద్యార్థికి, టీచర్ ఆశచూపింది. దీనికి గాను మెుదటగా డబ్బు ఇవ్వాలని డిమాండ్ చేసింది. అయితే విద్యార్థి దగ్గర డబ్బు లేవని చెప్పడంతో ఇంట్లో ఉన్న బంగారం తేవాలని చెప్పింది. దానికి విద్యార్థి తొలుత భయపడ్డాడు. అయితే తను ఆ నగలు తిరిగి ఇచ్చేస్తానని భయపడాల్సిన అవసరం ఏమి లేదని విద్యార్థికి నచ్చజెప్పింది.దీంతో ఆ విద్యార్థి పరీక్షల్లో ఉత్తీర్ణున్ని అయితాననే ఆశతో ఇంట్లో ఉన్న 80 గ్రాముల బంగారం దాదాపు రూ. 12 లక్షలు విలువ తీసుకొచ్చి ఆ టీచర్కు ఇచ్చాడు. కొద్దిరోజులకు తిరిగి ఇవ్వాలని కోరడంతో ఆ టీచర్ అతనిని తీవ్ర పరిణామాలుంటాయని బెదిరించింది. అయితే ఇంతలోనే బంగారం పోయిన సంగతి ఆ ఇంట్లో వారు గమనించారు. దీంతో ఆ పిల్లాడిని నిలదీయగా అతన అసలు విషయం చెప్పాడు. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.అయితే ఈ ఘటన వివరాలు పోలీసులకు తెలియడంతో ఆ విద్యార్థి భయంతో ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రస్తుతం అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని ఎటువంటి ప్రాణాపాయం లేదని డాక్టర్లు తెలిపారు. అయితే విషయం తెలుసుకున్నపోలీసులు ఆ టీచర్పై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఇలా మరేవరైనా విద్యార్థుల వద్ద నగదు కాజేసిందా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. -
పెళ్లి సీజన్లో ఊరట.. 22, 24 క్యారెట్ల బంగారం ధరలు తగ్గింపు
-
నటి రన్యారావు తెచ్చిన బంగారం ఎన్ని కేజీలో తెలుసా..?
బంగారం స్మగ్లింగ్ కేసులో అరెస్టైన కన్నడ నటి రన్యారావు ఇప్పట్లో విడుదలయ్యే ఛాన్స్ లేదని తెలుస్తోంది. విదేశాల నుంచి ఒక ఏడాదిలోనే 127 కిలోల బంగారాన్ని అక్రమంగా తీసుకువచ్చినట్లు తాజాగా ఈడీ అధికారులు గుర్తించారు. దాని మార్కెట్ రూ.102 కోట్లుగా పీఎంఎల్ఏ న్యాయస్థానంలో ఈడీ తమ అభియోగపత్రంలో పేర్కొంది. 2025లో కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో సోదా చేయగా ఆమె వద్ద అక్రమంగా రవాణ చేస్తున్న రూ.12 కోట్ల విలువ చేసే బంగారం లభించింది. దీంతో ఆమెను అరెస్ట్ చేసి విచారణ జరపగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. బంగారం ద్వారా అక్రమంగా కూడబెట్టిన డబ్బు మొత్తాన్ని చెల్లించకపోతే ఆస్తులు జప్తు చేస్తామని డీఆర్ఐ అధికారులు హెచ్చరించిన విషయం తెలిసిందే. సుమారు 10నెలలకు పైగా పరప్పన అగ్రహార జైల్లో ఆమె ఉంది.బెయిల్ కోసం పలుమార్లు పిటీషన్ పెట్టుకున్నప్పటికీ కోర్టులు కొట్టివేస్తూ వస్తున్నాయి.రన్యా రావు 2023 నుంచి 2025 వరకు దుబాయ్కు ఏకంగా 56 సార్లు ప్రయాణించినట్లు డీఆర్ఐ దర్యాప్తులో స్పష్టమైంది. దుబాయ్ పర్యటనలో భాగంగా భారత్ నుంచి తరుణ్తో కలిసి 20 సార్లు ప్రయాణించింది. ఇది గుర్తించిన అధికారులు విచారించగా నటి పొంతన లేని సమాధానాలు ఇచ్చింది. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు ఆమె నివాసంలో సోదాలు నిర్వహించారు. దీంతో అసలుగుట్టు బయటపడింది. -
బంగారం, వెండి కొనాలనుకునేవారికి షాక్.. ఇవాళ ధరలు ఎలా ఉన్నాయంటే..!
-
భారీగా తగ్గిన వెండి.... దూసుకుపోతున్న బంగారం.. ఈరోజు రేట్లు ఎలా ఉన్నాయంటే?
-
4 రోజులుగా షాకిస్తున్న గోల్డ్ రేట్స్... రూ.7 వేల పైనే పెరిగిన బంగారం ధర..
-
14 కోట్ల చీటీ మోసం.. కట్టుబట్టలు తప్ప ఇంకేమీ లేవు..!
చిత్తూరు జిల్లా: కొంత మంది పేదలు, మధ్య తరగతి వాసుల అవసరాలను ఆసరాగా చేసుకుని అనధికారికంగా చీటీలు నిర్వహిస్తున్నారు. తర్వాత ఐపీ పెడుతున్నారు. దీంతో బాధిత కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. తాజాగా శనివారం పలమనేరు పట్టణం బజారు వీధికి చెందిన వెంకట్రావు అనే బంగారు వ్యాపారి రూ.14 కోట్లకు ఐపీ పెట్టాడు. అనధికారికంగా 400 మందికి రూ.90 కోట్ల వరకు మోసం చేసినట్టు సమాచారం. గతంలోనూ నలసానపల్లికి చెందిన దంపతులు, గంటావూరుకు చెందిన ఒక మహిళ, జీడుమాకులపల్లికి చెందిన మహిళ చీటీలు వేసి ఆపై ఐపీ పెట్టిన విషయం తెలిసిందే. ఇప్పటికీ నియోజకవర్గంలో ఇలాంటి అనధికారిక చీటీలు నడిపేవారు వందల్లో ఉన్నారు. ఎప్పుడు ఎవరు ఐపీ పెడాతారోనన్న భయం డబ్బులు కట్టిన వారిని వెంటాడుతోంది.పక్కా ప్లాన్తో మోసంకొన్నాళ్లు ఫైనాన్స్ వ్యాపారంలో ఉన్న వారు, ప్రభుత్వ టీచర్లు, రియల్టర్లు, మాజీ ప్రభుత్వ ఉద్యోగులు, సమాజంలో కాస్త పలుకుబడి ఉన్న వారు చీటీల వ్యాపారంలోకి దిగుతున్నారు. ముందుగా ఏజెంట్ చీటీలని, ఆపై నాన్ ఏజెంట్ చీటీలని చీటీలో పాట పాడిన వారికి టేబుల్ క్యాష్ ఇస్తూ నమ్మకాన్ని పొందుతారు. ఆపై చీటీ ఎత్తిన వారికి ఆ డబ్బు మావద్దే ఉంటే నూటికి రూ.3 వడ్డీ ఇస్తామంటూ నెలనెలా వడ్డీ ఇస్తున్నారు. మరికొందరు బంగారు దుకాణాలను నడుపుతూ భారీ మొత్తంలో నగలు కొనే వారికి వడ్డీ ఆశ చూపుతున్నారు. నగలు ఇంట్లో పెడితే ఏమీ రాదని, తమ వద్ద ఉంచితే వచ్చే వడ్డీని ప్రతినెలా చీటీలు కట్టుకుని డబ్బు సంపాదించుకోవచ్చని నమ్మిస్తున్నా రు. ఇలా పెద్ద మొత్తం అయిన తర్వాత ఐపీ పెడుతున్నారు. మరికొందరు ఆలయాలు, దేవుళ్ల పేరిట చీటీ లు నిర్వహించి భారీగా మోసాలు చేస్తున్నారు. నిర్వాహకులకు చిట్ఫండ్ రిజిస్ట్రేషన్లు లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేయలేక, కోర్టులకు వెళ్లలేక బాధితులు లబోదిబోమంటున్నారు.తాజాగా జరిగిన మోసం ఎలాగంటే...బజారు వీధిలో బంగారు దుకాణాన్ని పెట్టుకున్న వెంకట్రావు గతంలో అక్షర తపస్మాన్ కార్యక్రమంలో వేమనపల్లిలో వలంటీర్గా పని చేసేవాడు. ఆపై పట్టణానికి చెందిన ఓ ప్రముఖ ఫైనాన్స్ సంస్థలో రోజువారి కలెక్షన్లు చేసేవాడు. ఆపై కేవలం లక్షతో చిరు వ్యాపారులకు ఫైనాన్స్ వ్యాపారం ప్రారంభించి గత 20 ఏళ్లుగా చీటీల వ్యాపారంలోకి దిగాడు. ఎంతో నమ్మకంతో ఉంటూ చీటీలను నిర్వహిస్తూ వచ్చి గతఏడాదిగా పక్కా ప్లాన్తో జనాన్ని మోసం చేసేందుకు ప్లాన్ చేసుకున్నాడని సమాచారం. ఇందులో భాగంగా తన ఆస్తిపాస్తులను ఇతరులకు విక్రయించి తనవద్ద కట్టుబట్టలు తప్ప ఇంకేమీ లేదని కోర్టుకు తెలిపినట్టు సమాచారం. తన బంగారు దుకాణంలో బంగారు కొన్న వాళ్ల బంగారాన్ని వెంకట్రావే తీసుకొని వాటిని ఇదే పట్టణంలోని కనకదుర్గ గోల్డ్ ఫైనాన్స్లో తనఖా పెట్టి రూ.కోట్లలో రుణాలు పొందిన విషయం ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తోంది. నియోజకవర్గంలో ఇప్పటిదాకా 110 అనధికార చీటీలు నిర్వహిస్తున్నట్టు తెలిసింది. ముఖ్యంగా ఇందులో నిర్వాహకులుగా ప్రభుత్వ ఉపాధ్యాయులు, రిటైర్డ్ ఉద్యోగులు, వ్యాపారులు, రియల్టర్లు, రాజకీయనేతలుండడం కొసమెరుపు. -
వారం రోజుల్లో పసిడి జంప్.. ఎంతలా పెరిగిందంటే?
బంగారం, వెండి ధరలు కొంత కాలంగా పెరుగుతూ, తగ్గుతూ ముందుకు సాగుతున్నాయి. ఈ వారం (ఫిబ్రవరి 15 నుంచి ఫిబ్రవరి 21) రోజుల్లో గోల్డ్ రేటులో గణనీయమైన మార్పు ఏర్పడింది. ఈ కథనంలో ఏడు రోజుల్లో పసిడి ధరలు ఎంతలా మారాయనే విషయాలు తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడలలో ఫిబ్రవరి 15న 1,57,750 రూపాయల వద్ద ఉన్న 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రేటు శనివారం నాటికి (ఫిబ్రవరి 21) 1,59,280 రూపాయల వద్దకు చేరింది. అంటే వారం రోజుల్లో 1530 రూపాయలు పెరిగిందన్న మాట. 22 క్యారెట్ల గోల్డ్ రేటు వారం రోజుల్లో 1,44,600 నుంచి 1,46,000 వద్దకు (రూ.1400 పెరిగింది) చేరింది.ఢిల్లీలో 24 క్యారెట్ల తులం గోల్డ్ రేటు వారం రోజుల్లో 1,57,900 రూపాయల నుంచి రూ. 1,59,430 వద్దకు (రూ.1530 పెరిగింది) చేరింది. 22 క్యారెట్ల ధర 1,44,750 రూపాయల నుంచి రూ. 1,46,150 వద్దకు (1400 రూపాయలు పెరిగింది) చేరింది.చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు 1,58,840 రూపాయల నుంచి 1,60,150 రూపాయల వద్దకు చేరింది. 22 క్యారెట్ల రేటు 1,45,600 రూపాయల నుంచి రూ. 1,46,800 వద్దకు (రూ. 1200 పెరిగింది) చేరింది.వెండి ధరలుబంగారం మాదిరిగానే వెండి ధరలు కూడా మారాయి. గత ఆదివారం (ఫిబ్రవరి 15) రూ. 2.80 లక్షల వద్ద ఉన్న సిల్వర్ రేటు.. ఈ రోజుకు (శనివారం) పెరుగుతూ.. తగ్గుతూ.. రూ. 2.90 లక్షలకు చేరింది.ఇదీ చదవండి: బంగారం రూ.2 లక్షలకు? -
అది బంగారాన్ని మించిపోతుంది..: కియోసాకి
బిట్ కాయిన్ ధర కీలక మద్దతు స్థాయికి చేరువ కావడంతో మార్కెట్లో ఆందోళన పెరిగింది. బిట్ కాయిన్ ధర ఇటీవల 60,000 డాలర్ల వద్ద ఉన్న దిగువ అంచును తాకింది. ఈ పరిణామంతో పలువురు పెట్టుబడిదారులు మరింత పతనం సంభవిస్తుందని అంచనా వేస్తున్న వేళ, ప్రముఖ ఇన్వెస్టర్, ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ (Rich Dad Poor Dad) రచయిత రాబర్ట్ కియోసాకి (Robert Kiyosaki) మాత్రం విభిన్న నిర్ణయం తీసుకున్నారు.ధరలు పడిపోతున్న సమయంలోనే సుమారు 67,000 డాలర్ల వద్ద మరో పూర్తి బిట్ కాయిన్ను కొనుగోలు చేసినట్లు ఆయన వెల్లడించారు. ఈ నిర్ణయానికి రెండు ప్రధాన కారణాలు ఉన్నాయని తెలిపారు. అమెరికా ప్రభుత్వ రుణభారం పెరుగుతున్న నేపథ్యంలో డాలర్పై ఒత్తిడి అధికమవుతుందని, దాని ఫలితంగా భారీ స్థాయిలో డబ్బు ముద్రణ ప్రారంభమయ్యే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. దీనినే ఆయన “బిగ్ ప్రింట్”గా పేర్కొన్నారు.ఇక బిట్ కాయిన్ ప్రత్యేకత దాని పరిమిత సరఫరా అని కియోసాకి గుర్తుచేశారు. గరిష్టంగా 21 మిలియన్ నాణేలు మాత్రమే ఉండేలా రూపొందించిన ఈ డిజిటల్ ఆస్తి సరఫరాను ఏ కేంద్ర అధికారం పెంచలేనని తెలిపారు. ప్రతి కొత్త బిట్ కాయిన్ ముందే నిర్ణయించిన వేగంతోనే మార్కెట్లోకి ప్రవేశిస్తుందని, తుది నాణేల మైనింగ్కు దగ్గరపడే కొద్దీ దాని కొరత మరింత స్పష్టమవుతుందని పేర్కొన్నారు.దీర్ఘకాలంగా కరెన్సీ బలహీనతకు వ్యతిరేకంగా బంగారాన్ని సురక్షిత ఆశ్రయంగా భావిస్తున్నన్నప్పటికీ, ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో బిట్ కాయిన్ బంగారాన్ని మించిపోవచ్చని కియోసాకి వాదిస్తున్నారు. పెరుగుతున్న ప్రభుత్వ రుణాలు, కేంద్ర బ్యాంకుల విధానాల నేపథ్యంలో కొరత గల ఆస్తుల ప్రాధాన్యం మరింత పెరుగుతుందని ఆయన విశ్లేషించారు.Although Bitcoin is crashing I bought one more whole Bitcoinfor $67k.Why? Two reasons: # 1: Because the Big Print will begin when the US debt crashes the dollar and “The Marxist Fed” begins printing trillions in fake dollars.#2: The magical 21 millionth Bitcoin is…— Robert Kiyosaki (@theRealKiyosaki) February 20, 2026 -
నగరం మీది ప్రేమతో... 21 కిలోల బంగారం విరాళం
టోక్యో: స్వాతంత్య్రోద్యమ సమయంలో, 1962లో చైనాతో యుద్ధం సమయంలో మన దేశంలో చాలామంది మహిళలు బంగారు ఆభరణాలను ప్రభుత్వానికి విరాళంగా అందజేశారు. అలాగే ఇప్పుడు జపాన్లోనూ ఓ అజ్ఞాత వ్యక్తి తను నివాసముంటున్న ఒసాకా నగరం మీద ప్రేమతో ఏకంగా 21 కిలోల బంగారాన్ని విరాళంగా ఇచ్చేశాడు! వాటి విలువ ఏకంగా రూ.32 కోట్ల పై చిలుకు! నగరంలో పూర్తిగా పాతబడిపోయిన తాగునీటి, డ్రైనేజీ పైపుల వ్యవస్థను వాటి సాయంతో సమూలంగా పునరుద్ధరించాల్సిందిగా ఆయన కోరాడు. ఒసాకా మేయర్ హిదేయుకి యొకోయామా గురువారం ఈ విషయాన్ని వెల్లడించారు. ‘‘ఒసాకాలో 90 శాతానికి పైగా నీటి పైపులు లీకేజీలమయమే. దీనిపై నగర వాటర్వర్క్స్ బ్యూరో ఇప్పటికే పలుమార్లు ఆందోళన వెలిబుచ్చింది కూడా. వాటి పునరుద్ధరణకు భారీ నిధులు కావాలి. కానీ నగరానికి అంత బడ్జెట్ లేదు. ఈ సమయంలో అద్భుతం జరిగింది. అజ్ఞాత దాత ఒకరు గత నవంబర్లో ఏకంగా 21 కిలోల బంగారు కడ్డీలు విరాళమిచ్చారు. ఆయనకు ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా తక్కువే! పైపుల పునరుద్ధరణ సహా ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు వాటిని సది్వనియోగం చేస్తాం’’అని ఆయన ప్రకటించారు. సదరు అజ్ఞాత దాత గతంలో మున్సిపల్ వాటర్ వర్క్స్ కోసం లక్షల రూపాయల నగదు ఇచ్చారని తెలిపారు. సమస్యల నగరం 30 లక్షల జనాభా ఉన్న ఒకాసా జపాన్లో మూడో అతి పెద్ద నగరం. దేశ ఆర్థిక రాజధానిగా కూడా చెప్పుకోవచ్చు. ఒకప్పుడు దేశ రాజధానిగానూ కొనసాగింది. అత్యంత పురాతన నగరం కూడా. ఇక్కడి మంచి నీరు, డ్రైనేజీ పైపులు కూడా అంతే పురాతనమైనవి. పైపులు పూర్తిగా తుప్పు పట్టి పనికి రాకుండా పోయాయి. వాటి లీకేజీలు స్థానికుల భద్రతను నిత్యం ప్రమాదంలోకి నెడుతున్నాయి. వీటికి తోడు నగరంలో రోడ్లపై సింక్ హోల్స్ (భారీ గుంతలు) కూడా సర్వసాధారణంగా మారాయి. గతేడాది అలాంటి ఓ భారీ సింక్ హోల్ ఏకంగా ఒక క్యాబ్నే మింగేసింది. ఆ దుర్ఘటనలో దాని డ్రైవర్ దుర్మరణం పాలయ్యాడు. కానీ నిధుల లేమి కారణంగా మంచినీటి, డ్రైనేజీ పైపుల మారి్పడి వ్యవహారం ఓ పట్టాన ముందుకు సాగడం లేదు. -
సాయంత్రానికి పెరిగిన రేటు.. బంగారం ధరలు ఇలా..
శుక్రవారం ఉదయం స్వల్పంగా తగ్గిన గోల్డ్ రేటు.. సాయంత్రానికి మారిపోయింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో గోల్డ్ రేట్లు మారిపోయాయి. ఈ కథనంలో ప్రస్తుత పసిడి ధరలు ఎలా ఉన్నాయో వివరంగా తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడలలో ఉదయం రూ. 1,43,150 వద్ద ఉన్న 22 క్యారెట్ల గోల్డ్ రేటు సాయంత్రానికి రూ. 1,44,250 వద్ద నిలిచింది. 1,56,170 రూపాయల వద్ద ఉన్న 24 క్యారెట్ల పసిడి ధర రూ. 1,57,370 వద్దకు చేరింది. బెంగళూరు, ముంబై నగరాల్లో కూడా ఇదే ధరలు ఉన్నాయి.ఢిల్లీలో 1,43,330 వద్ద ఉన్న తులం 22 క్యారెట్ల ధర 1,44,400 వద్ద నిలిచింది. 24 క్యారెట్ల రేటు 1,56,320 రూపాయల వద్ద నుంచి రూ. 1,57,520 వద్దకు చేరింది. అయితే చెన్నైలో.. బంగారం ధరల్లో ఎలాంటి మార్పు లేదు. 22 క్యారెట్ల రేటు రూ.1,44,200 వద్ద, 24 క్యారెట్ల రేటు 157310 రూపాయల వద్ద ఉంది.వెండి ధరలువెండి ధరల్లో ఎలాంటి మార్పు లేదు. దీంతో కేజీ సిల్వర్ రేటు రూ. 2.70 లక్షల వద్ద ఉంది. నిన్న (గురువారం) రూ.10 వేలు పెరిగిన రేటు.. ఈ రోజు (శుక్రవారం) స్థిరంగా ఉంది.ఇదీ చదవండి: బంగారం రూ.2 లక్షలకు? -
బంగారం రూ.2 లక్షలకు?
ఇప్పుడిప్పుడే బంగారం ధరలు తగ్గుతున్నాయని పసిడి ప్రియులు సంబరపడుతున్నారు. ఈ తరుణంలో గోల్డ్ రేటు మళ్లీ రూ. 2 లక్షలకు చేరుకుంటుందని నిపుణులు చెబుతున్నారు. దీనికి కారణం అమెరికా, ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలను, ఫెడరల్ రిజర్వ్ రేటు తగ్గింపుపై కొనసాగుతున్న అనిశ్చితి వంటివి కారణాలు అని వెల్లడించారు.అమెరికా - ఇరాన్ మధ్య ఉన్న రాజకీయ ఉద్రిక్తతలు గ్లోబల్ మార్కెట్లపై ప్రత్యక్ష ప్రభావం చూపుతున్నాయి. సాధారణంగా యుద్ధ వాతావరణం లేదా రాజకీయ అస్థిరతలు ఏర్పడినప్పుడు.. పెట్టుబడిదారులు ప్రత్యామ్నాయ పెట్టుబడులవైపు చూస్తారు. ఇలాంటి సమయంలో.. బంగారం, వెండి వంటి సురక్షితమైన ఆస్తులలో పెట్టుబడులు పెడతారు. ఇదే జరిగితే.. గోల్డ్, సిల్వర్ రేట్లు అమాంతం పెరుగుతాయి.ఇక మరో అంశం.. వడ్డీ రేట్లు. ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గిస్తుందా? లేదా?.. అనేది చాలాకాలంగా పెట్టుబడిదారుల్లో నిలిచిపోయిన ఒక ప్రశ్న. వడ్డీ రేట్లు తగ్గితే.. బంగారం వంటి ఆస్తులు మరింత ఆకర్షణీయంగా మారుతాయి. ఎందుకంటే వడ్డీ వచ్చే పెట్టుబడులపై లాభం తగ్గినప్పుడు, పెట్టుబడిదారులు బంగారం వంటి ప్రత్యామ్నాయాల వైపు మొగ్గు చూపుతారు.రాజకీయ ఉద్రిక్తతలు ఒక్కసారిగా పెరిగితే.. ధరలు ఎగిసే అవకాశం ఉంది. అదే విధంగా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేటు తగ్గింపు ప్రకటిస్తే కూడా బంగారం, వెండి ధరలు పెరిగే అవకాశం ఉంది. అయితే దీనికి సంబంధించిన ఒక స్పష్టమైన నిర్ణయం వచ్చే వరకు.. మార్కెట్లో పెద్ద మార్పులు కనిపించకపోవచ్చు.ప్రస్తుతం తగ్గిన ధరలు!2026 జనవరిలో రూ. 1.80 లక్షలకు చేరిన తులం బంగారం.. ప్రస్తుతం రూ. 1.50 లక్షల వద్దకు చేరింది. దీన్నిబట్టి చూస్తే.. ఇంత తక్కువ వ్యవధిలో రేటు ఎంత తగ్గిందో చూడవచ్చు. వెండి రేటు కూడా దాదాపు భారీగా తగ్గి కేజీ రేటు రూ. 2.70 లక్షలకు చేరింది. -
బ్యాంక్ లాకర్లోని బంగారం పోతే.. పరిహారం ఎంత?
ఢిల్లీలోని కీర్తి నగర్లోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) బ్రాంచ్లో ఒక మహిళ & ఆమె అత్త బ్యాంకు లాకర్లో ఉంచిన బంగారు ఆభరణాలు పోయాయని ఆరోపించడంతో, కస్టమర్లలో భయాందోళనలు చెలరేగాయి. దొంగతనం జరిగిందనే పుకార్లు వెలుగులోకి వచ్చాయి. దీంతో పెద్ద ఎత్తున కస్టమర్లు బ్యాంకు వద్దకు చేరుకున్నారు. దొంగతనం జరిగింది అనేది కేవలం పుకారు మాత్రమే అని పోలీసులు వెల్లడించారు.ఈ తరుణంలో.. బ్యాంక్ లాకర్లో ఉన్న బంగారం మాయమైతే.. దానికి ఎవరు బాధ్యత వహిస్తారు?, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూల్స్ ఏం చెబుతున్నాయి? అనే ప్రశ్నలు పుట్టుకొచ్చాయి. దీనికి సమాధానం ఈ కథనంలో తెలుసుకుందాం.ఇంట్లో రక్షణ ఉండదని చాలామంది తమ వద్ద ఉన్న బంగారం, ఇతర ఖరీదైన డాక్యుమెంట్స్ వంటివి బ్యాంక్ లాకర్లో దాచుకుంటారు. ఒకవేళా బ్యాంక్ లాకర్లో ఉన్న బంగారం మాయమైతే.. దానికి ఆ బ్యాంకు బాధ్యత వహించదు. ఎందుకంటే.. బ్యాంకులు తమ వస్తువులను భద్రపరచుకోవడానికి లాకర్ సౌకర్యం అందిస్తాయి. ఆ లాకర్లో ఏమి ఉంచారనే దానికి సంబంధించిన రికార్డ్ కూడా బ్యాంకు దగ్గర ఉండదు.రిజర్వ్ బ్యాంక్ నిబంధనల ప్రకారం.. బ్యాంకు సరైన భద్రత కల్పించని పక్షంలో (సీసీ టీవీ పనిచేయకపోవడం, సిబ్బంది తప్పిదం, బ్యాంకు ఉద్యోగుల మోసం) నష్టపరిహారం పొందుతారు. అయితే ఇక్కడ గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే.. మీరు కోల్పోయిన మొత్తం నష్టపరిహారంగా వస్తుందనుకోవడం పొరపాటే.2022 ఆర్బీఐ నిబంధనల ప్రకారం.. బ్యాంక్ తప్పిదం వల్ల నష్టం జరిగితే.. లాకర్ అద్దెకు 100 రెట్లు పరిహారం లభిస్తుంది. అంటే లాకర్ అద్దె ఏడాదికి 5000 రూపాయలు ఉంటే.. రూ. 5 లక్షలు పరిహారం లభిస్తుందన్న మాట. లాకర్లో కోట్ల విలువైన వస్తువులున్నా అదే ఫార్ములా ప్రకారం నష్టపరిహారం లభిస్తుంది. ఒకవేళా ప్రకృతి వైపరీత్యాల నష్టం జరిగితే ఎలాంటి నష్టపరిహారం లభించదు. అటువంటి పరిస్థితులలో బ్యాంకులు ఎటువంటి బాధ్యత వహించవు.లాకర్ ఉపయోగించేవారు తెలుసుకోవాల్సిన విషయాలుబ్యాంక్ లాకర్లో వస్తువులను దాచుకోవాలనుకునేవారు.. లాకర్ అగ్రిమెంట్ గురించి పూర్తిగా తెలుసుకోవాలి. లాకర్లో ఏ వస్తువులు ఉంచారో.. వాటికి సంబంధించిన ఫోటోలు మీ దగ్గర ఉంచుకోవాలి. ఖరీదైన వస్తువులకు తప్పకుండా బీమా చేయించుకోవాలి. నష్టం జరిగిన వెంటనే బ్యాంకుకు, పోలీసులకు సమాచారం అందించాలి. -
వెండి రూ. 5,000 డౌన్
న్యూఢిల్లీ: పసిడి, వెండిలో అమ్మకాల ఒత్తిడి కొనసాగింది. ఫలితంగా మంగళవారం ఢిల్లీ మార్కెట్లో వెండి మరో రూ.5,000 నష్టపోయి (2 శాతం) రూ.2,45,000 స్థాయికి దిగొచ్చింది. అటు బంగారం సైతం 10 గ్రాములకు రూ.2,200 నష్టంతో (1.4 శాతం) రూ.1,57,000కు పరిమితమైంది. అంతర్జాతీయంగా స్పాట్ మార్కెట్లో వెండి ఔన్స్కు 1.65 డాలర్లు (2.15 శాతం) తగ్గి 74.96 డాలర్ల వద్ద, పసిడి ఔన్స్కు ఒక శాతం నష్టపోయి 4,938.70 డాలర్ల వద్ద ట్రేడయ్యాయి.‘‘స్పాట్ బంగారం ధరలు వరుసగా రెండో రోజు నష్టపోయాయి. అమెరికా–ఇరాన్ చర్చలకు ముందు ఇన్వెస్టర్లు అప్రమత్తత పాటించారు’’అని మిరే అసెట్ షేర్ఖాన్ కమోడిటీస్ హెడ్ ప్రవీణ్ సింగ్ తెలిపారు. చైనా కొత్త సంవత్సరం సెలవులు కావడంతో కొనుగోళ్ల ఆసక్తి తగ్గినట్టు.. పసిడికి 5,000 డాలర్ల పైన అమ్మకాల ఒత్తిడి ఎదురైనట్టు హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ కమోడిటీ విభాగం సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ తెలిపారు. మెటల్స్లో లిక్విడిటీ తగ్గిందని.. స్పెక్యులేషన్ పెరగనంత వరకు ధరలు ఒక పరిమిత శ్రేణిలోనే కొనసాగొచ్చన్నారు. -
'భారీ క్రాష్ మొదలైంది'.. కియోసాకి హెచ్చరిక!
స్టాక్ మార్కెట్ ఒడిదుడుకుల్లో ఉన్న సమయంలో.. ప్రముఖ ఇన్వెస్టర్, ప్రసిద్ధ 'రిచ్ డాడ్ పూర్ డాడ్' (Rich Dad Poor Dad) పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి ఒక ట్వీట్ చేశారు. ఇందులో నేను మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను అంటూనే.. భారీ క్రాష్ మొదలైందని అన్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.2013లో ప్రచురించిన రిచ్ డాడ్స్ ప్రాఫసీలో.. భవిష్యత్తులో అతిపెద్ద స్టాక్ మార్కెట్ క్రాష్ జరుగుతుందని హెచ్చరించాను. నేను చెప్పినట్లే.. ఆ పెద్ద ఆర్థిక సంక్షోభం సమీపంలో ఉంది. మార్కెట్ క్రాష్ అనేది కొందరికి ప్రమాదం అయినా.. స్టాక్స్ కొనుగోలు చేయాలని వేచి చూసేవారికి గొప్ప అవకాశం.ఈ సందర్భంగా కియోసాకి.. గోల్డ్, సిల్వర్ గురించి చెబుతూనే బిట్కాయిన్, ఎథెరియం గురించి కూడా పేర్కొన్నారు. బిట్కాయిన్ విలువ తగ్గిపోతున్నప్పుడు, నేను మరింత కొనుగోలు చేస్తానని అన్నారు. నా దృష్టిలో ఇవే (బంగారం, వెండి, బిట్కాయిన్, ఎథెరియం) నిజమైన ఆస్తులని పేర్కొన్నారు.I Am Warning You: In Rich Dad’s Prophecy published 2013 I warned of the biggest stock market crash in history still coming.That giant crash is now imminent.The good news is those of you who followed my rich dad’s warning and prepared….the coming crash will make you richer…— Robert Kiyosaki (@theRealKiyosaki) February 17, 2026ఆర్థిక సంక్షోభాలు ఎప్పుడూ నష్టాలనే కాకుండా.. అవకాశాలను అందిస్తుంది. భయపడే వారు నష్టపోవచ్చు, కానీ ఆర్థిక జ్ఞానం కలిగి, దీర్ఘకాల దృష్టితో పెట్టుబడులు పెట్టే వారు మాత్రం.. తప్పకుండా ధనవంతులు అవుతారు. ఎప్పుడైతే మార్కెట్ నష్టాలను చవి చూస్తుందో.. చాలామంది తమ స్టాక్ అమ్మేయడానికి సిద్ధపడతారు. అలాంటి సమయంలో వాటిని కొనుగోలు చేసేవారు సంపన్నులవుతారు.ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. పెట్టుబడి అనేది ఒక వ్యక్తి ఆర్థిక దృష్టికోణం మాత్రమే. ఇందులో లాభనష్టాలు సహజమే. కాబట్టి ఇన్వెస్ట్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించాలి. అవసరమైతే ఆర్ధిక పరిస్థితిని విశ్లేషించడం లేదా నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.ఇదీ చదవండి: డేంజర్లో ఉద్యోగాలు!.. 2026లో ఇదే జరుగుతుందా? -
బంగారం ధర రూ.లక్ష కంటే తక్కువకు..?
బంగారం కొనాలంటేనే భయపడుతున్న సమయంలో.. నిపుణులు పసిడి ప్రియులకు శుభవార్త చెప్పారు. తులం గోల్డ్ రేటు లక్ష రూపాయల కంటే తక్కువకు చేరుకుంటుందని పేర్కొన్నారు. గ్లోబల్ మార్కెట్లో కూడా ఔన్సు ధర 3000 డాలర్లకు చేరుకుంటుందని వెల్లడించారు. రష్యా అమెరికాతో వ్యాపారం చేయడం ప్రారంభిస్తే ఇది సాధ్యమవుతుందని అన్నారు.2025లో భారీగా పెరిగిన గోల్డ్ రేటు.. 2026 జనవరిలో కూడా అదే రీతిగా ముందుకు సాగింది. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో 10 గ్రాముల ధర రూ.1.80 లక్షల స్థాయికి చేరింది. కాగా గత వారంలో ఎంసీఎక్స్ బంగారం ధర రూ. 1.56 లక్షల (10 గ్రామ్స్) వద్ద నిలిచింది. దీన్నిబట్టి చూస్తే.. ఇప్పుడు పరిస్థితులు కొంత చక్కబడ్డాయని, బంగారం ధరలు స్వల్ప తగ్గుదలను నమోదు చేశాయని తెలుస్తోంది.మార్కెట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. రష్యా అమెరికాతో డాలర్లలో (USD) వ్యాపారం చేయడానికి తిరిగి వస్తున్నట్లు సమాచారం. అంతే కాకుండా.. రష్యన్ అంతర్జాతీయ డాక్యుమెంట్ క్రెమ్లిన్.. అమెరికాతో ఆర్థిక భాగస్వామ్యాన్ని అన్వేషిస్తోందని సూచిస్తోంది. ఈ పరిణామంలో అత్యంత ఆసక్తికరమైన భాగం మాస్కో యుఎస్ డాలర్ ఆధారిత వాణిజ్య ఒప్పందానికి తిరిగి రావడం. ఇది రష్యాతో సహా బ్రిక్స్ దేశాల డీ-డాలరైజేషన్ ప్రయత్నాలకు పెద్ద దెబ్బ అవుతుంది.ఇదీ చదవండి: వెండి ధర ఇంకా ఎంత పెరుగుతుందంటే..?రష్యా అంతర్జాతీయ వాణిజ్యాన్ని డాలర్లతో నిర్వహిస్తే.. డాలర్ విలువ భారీగా పెరిగే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో కేంద్ర బ్యాంకులు బంగారం కొనుగోలు చేయడం కొంత తగ్గిస్తాయి. ఇవన్నీ బంగారం రేటును గణనీయంగా తగ్గించడంలో దోహదపడతాయి.భారతదేశంలో నేటి బంగారం ధరలుఇండియన్ మార్కెట్లో ఈ రోజు (ఫిబ్రవరి 16) బంగారం ధరలు రూ. 1000 కంటే ఎక్కువ తగ్గాయి. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లోని పసిడి ధరల్లో మార్పులు జరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 1.56 లక్షల వద్ద, 22 క్యారెట్స్ తులం బంగారం ధర రూ. 1.43 లక్షల వద్ద ఉన్నాయి. -
కస్టమర్ల రూ. 4 కోట్ల బంగారం కొట్టేసిన బ్యాంకు మేనేజర్
బ్యాంకులో అందులోనూ ప్రభుత్వరంగ బ్యాంకులో ఉంటే మన సొమ్ము, భద్రం అనుకుంటాం. తాజాగా ఆన్లైన్ జూదం (Gambling)కోసం కస్టమర్ల కోట్ల రూపాయల విలువ చేసే బంగారాన్ని తస్కరించిన వైనం ఆందోళన రేపింది. బెంగళూరులో జరిగిన ఈ మోసానికి సంబంధించిన వివరాలుఇలా ఉన్నాయి.బెంగళూరులోని ఒక ప్రభుత్వ రంగ బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్గా పనిచేస్తున్న కిరణ్ కుమార్ (34), కస్టమర్ల లాకర్ల నుండి సుమారు 2.7 కిలోల బంగారు ఆభరణాలను దొంగిలించాడు. ఈ బంగారాన్ని తాకట్టు పెట్టి ఆన్లైన్ జూదానికి వినియోగించాడు. జనవరి 2న కొంతమంది కస్టమర్లు తమ లాకర్లను తనిఖీ చేసినప్పుడు తమ ఆభరణాలు కొన్ని మాయమైనట్లు గుర్తించారు. దీంతో వారు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.వినియోగదారుల ఫిర్యాదు మేరకు బ్యాంకు అధికారులు నిర్వహించిన అంతర్గత తనిఖీలో మొత్తం 24 ప్యాకెట్లలో బంగారం మాయమైనట్టు తేలింది. బ్రాంచ్ మేనేజర్ లేని సమయంలో తన వద్ద ఉన్న తాళాలతో లాకర్లను తెరిచి ఈ మోసానికి పాల్పడ్డాడు. 2025 జూన్ - 2026 జనవరి మధ్య కాలంలో నిందితుడు కిరణ్ తక్కువ మొత్తంలో బంగారాన్ని దొంగిలిస్తూ వచ్చాడు. అలా క్రమంగా మొత్తం 2,793 గ్రాముల బంగారం (దాదాపు రూ. 4 కోట్లు) మాయం చేశాడు. ఇలా కొట్టేసిన బంగారాన్ని ప్రైవేట్ రుణదాతలకు తనఖా పెట్టి, ఆడబ్బును బెట్టింగ్లో వాడేవాడు. ఇందులో 3 ప్యాకెట్లు పూర్తిగా ఖాళీ అవ్వగా, 21 ప్యాకెట్లలో కొంత మేర బంగారం పోయింది.దొంగిలించిన బంగారాన్ని కొన్ని ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థల్లో తాకట్టు పెట్టినట్లు నిందితుడు ఒప్పుకున్నాడు. మిగిలిన బంగారాన్నిరికవరీ చేసేందుకు పోలీసులుప్రయత్నిస్తున్నారు. ఇప్పటివరకు 1.2 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నామని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (సౌత్) లోకేష్ జగలసర్ అన్నారు. నిందితుడిపై క్రిమినల్ కేసు నమోదు చేశామన్నారు. ఇదీ చదవండి: ప్రపంచంలోనే అరుదైన పక్షి, ముట్టుకుంటే మటాషే!నోట్: బంగారాన్ని తాకట్టు పెట్టే కస్టమర్లు బ్యాంకు ఖాతాదారులు అప్రమత్తంగా ఉండాలని డిసిపి కోరారు. తమ లాకర్ పత్రాలను క్రమం తప్పకుండా తనిఖీ చేసుకోవాలనీ బ్యాంకు లావాదేవీల్లో పారదర్శకత ఉండేలా చూసుకోవడం చాలా అవసరమని, ఇదే మోసాలనుంచి కస్టమర్లను రక్షిస్తుందని డిసిపి లోకేష్ జగలాసర్ సూచించారు. -
ఆర్థిక భవిష్యత్తు: బంగారం కొనాలా.. వద్దా?
కొన్ని రోజులకు ముందు భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు మెల్లగా తగ్గుముఖం పడుతున్నాయి. రేట్లు పెరుగుతున్నప్పుడు.. ఏ ధరకైనా కొనేయాలని ఎగబడిన కొంతమంది జనం.. ఇప్పుడు తగ్గుతున్నాయి కదా అని వేచి చూస్తున్నారు. ఇంకా తగ్గే అవకాశం ఉందేమో అని ఆలోచిస్తున్నారని ప్రముఖ ఇన్వెస్టర్, మార్కెట్ మాస్ట్రోలో డైరెక్టర్ 'అంకిత్ యాదవ్' తన ట్వీట్ ద్వారా వెల్లడించారు.ధరలు పెరిగినప్పుడు ఉత్సాహం చూపించారని, రేటు తగ్గుతున్నప్పుడు ప్రజలు మౌనం పాటిస్తున్నారని అన్నారు. ఇది మార్కెట్లో సహజమైన అంశం. అయితే ఇది పూర్తి స్థాయి క్రాష్ అని నిర్దారించలేము. ఇదొక స్లోడౌన్ దశ మాత్రమే.వెండి ధర భవిష్యత్తులో 100 డాలర్లు లేదా 120 డాలర్ల వరకు వెళ్లే అవకాశం ఉంది. దీనికి ప్రపంచ ఆర్థిక పరిస్థితులు, డాలర్ బలహీనత, ద్రవ్యోల్బణం వంటి అంశాలు ప్రధాన కారణమవుతాయి.ప్రపంచం మొత్తం.. ప్రస్తుతం భారీ రుణభారంతో ఉంది. ముఖ్యంగా అమెరికా అప్పులు మళ్లీ పెరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఫెడరల్ రిజర్వ్కు (Fed) అందుబాటులో ఉన్న ఎంపికలు చాలా తక్కువ. ఇలాంటి సమయంలో వారు ఎక్కువ లిక్విడిటీ అందించడం, అంటే మరింత డబ్బు ముద్రించడానికి సిద్దపడే అవకాశం ఉంది. ఇదే జరిగితే డాలర్ విలువ బలహీనపడే అవకాశం ఉంటుంది.డాలర్ విలువ ఎప్పుడైతే పడిపోతుందో.. బంగారం, వెండి ధరలు అమాంతం పెరుగుతాయి. కాబట్టి ఇప్పటికే బంగారం లేదా వెండి కలిగి ఉన్నవాళ్లు దాన్ని నిల్వ చేసుకోండి. ఇది మీ ఆర్థిక భవిష్యత్తుకు చాలా ఉపయోగపడుతుంది.ఇదీ చదవండి: వెండి ధర ఇంకా ఎంత పెరుగుతుందంటే..?ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన మరో విషయం ఏమిటంటే కొత్తగా గోల్డ్, సిల్వర్ కొనాలనుకుంటే.. తప్పకుండా ఓసారి ఆలోచించాల్సిందే. ఎందుకంటే.. ప్రస్తుతం ధరలు చౌకగా లేవు. ఎప్పుడైనా ఎక్కువ ధర వద్ద పెట్టుబడి పెట్టడం వల్ల మూలధన నష్టం వచ్చే ప్రమాదం ఉంటుంది. కాబట్టి త్వరగా ధనవంతులు కావాలని తొందరపడకూడదు. కొంత ఓపిగ్గా ఎదురు చూడండి అని.. అంకిత్ యాదవ్ వివరించారు.🚨 Big update: Gold & Silver 🩶💛✅Globally, gold and silver are slowly coming out of the high‑volatility phase. The craze to buy silver at any price is clearly cooling off – one small slowdown or mini‑crash and people’s attention has already shifted.While prices were rising…— Ankit Yadav (@ankit_investing) February 14, 2026 -
అమెరికా-ఇరాన్ యుద్ధం?.. స్టాక్ మార్కెట్లలో టెన్షన్!
అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధం సంభవించే అవకాశంపై అంతర్జాతీయ మార్కెట్లలో ఆందోళన నెలకొంది. గత సంవత్సరం ‘మిడ్ నైట్ హామర్ ఆపరేషన్’తో పోలిస్తే, ఈసారి అమెరికా మరింత వ్యూహాత్మక సైనిక చర్యలకు సిద్ధమవుతోంది. ఈ ప్రాంతంలో యూ.ఎస్. విమాన వాహక నౌక బృందాన్ని మోహరించినప్పటి నుంచి, స్థానిక యూఎస్ శిబిరాల్లో కూడా సన్నాహాలు కట్టుదిట్టంగా జరుగుతున్నాయి.అమెరికా దళాలు వారాలపాటు సైనిక కార్యకలాపాలకు సన్నద్ధమవుతున్నాయని సైనిక వర్గాలు అంతర్జాతీయ మీడియాకు అనామకంగా తెలియజేశాయి. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఊ అనడమే ఆలస్యం.. రంగంలోకి దిగి ఇరాన్పై దాడులు ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.శాంతి చర్చలు ఫలించేనా?ఇక ఇరాన్-అమెరికా మధ్య రెండో విడత శాంతి చర్చలు జెనీవాలో జరగనుండగా, ఈ నెల 17న ఈ చర్చలు ఒమన్ మధ్యవర్తిత్వంతో జరుగుతాయని భావిస్తున్నారు. ఇరాన్ తన అణు పరీక్షలను ఆపకపోతే “సైనిక చర్యలు తప్పవు” అని ట్రంప్ ఇప్పటికే హెచ్చరించారు. అయితే, ఇరాన్ తన అణు, క్షిపణి కార్యక్రమాలను ఆపే ఎటువంటి ప్రణాళికలు లేవని ప్రకటించింది. అంతే కాకుండా, మధ్యప్రాచ్యంలోని అమెరికా స్థావరాలపై దాడి జరిగితే, ప్రతీకారం తప్పనిసరిగా జరిగుతుందని హెచ్చరిస్తోంది. ఇలా పరిస్థితులు తీవ్రమైతే, ఈ ప్రాంతంలో యుద్ధం విస్తరించే అవకాశం ఉంది. దీంతో ప్రపంచం అంతటా ముడి చమురు, బంగారం, స్టాక్ మార్కెట్లు ప్రభావితమవుతాయి.చమురు ధరలు పెరిగే అవకాశంఇదిలా ఉండగా, ఇరాన్పై ఆర్థిక ఆంక్షలను కఠినతరం చేయాలని ఇజ్రాయెల్, అమెరికా నిర్ణయించాయి. ఇరాన్-చైనా చమురు అమ్మకాలపై అమెరికా దృష్టి సారించింది. ప్రస్తుతం ఇరాన్ చమురు అమ్మకాలలో 80 శాతం చైనాకు జరుగుతున్నాయి. దీన్ని నివారించగలిగితే ఇరాన్ ఆర్థికంగా మరింత నాశనం అవుతుందని ఇరు దేశాలు అభిప్రాయపడుతున్నాయి. చైనాపై మరిన్ని సుంకాలు విధించే అవకాశాన్ని కూడా పరిశీలిస్తున్నారు. అదే జరిగితే, అరుదైన లోహాల ఎగుమతిపై చైనా మళ్లీ ఆంక్షలు విధిస్తుంది. ఇది యూఎస్-చైనా సంబంధాలను మరింత దిగజార్చుతుంది. ప్రధాన చమురు ఉత్పత్తిదారు అయిన ఇరాన్ నుంచి ముడి చమురు ఆగిపోతే మార్కెట్లో చమురు ధరలు పెరిగే అవకాశం ఉంది.బంగారం, వెండి ధరలపై ప్రభావంగత వారం హెచ్చుతగ్గులకు గురైన బంగారం, వెండి ధరలకు రాబోయే రోజుల్లో ఇరాన్-అమెరికా శాంతి చర్చలు కీలకం. అమెరికాలో ద్రవ్యోల్బణ గణాంకాలు విడుదల కావడంతో బంగారానికి కొత్త డిమాండ్ ఏర్పడింది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర ఔన్స్ కు 5,041 డాలర్ల వద్ద ముగిసింది. ఇరాన్-అమెరికా ఉద్రిక్తతల భయాల మధ్య ధరలు మరింత పెరుగుతాయని మార్కెట్లు అంచనా వేస్తున్నాయి. -
‘బంగారం బాట’లో యువ భారతం
న్యూఢిల్లీ: బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్నా... యువ భారతం బంగారంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారు. దేశవ్యాప్తంగా 18–39 ఏళ్ల మధ్య వయసు కలిగిన 5,000 మంది నుంచి సేకరించిన అభిప్రాయాలతో ‘స్మిట్టెన్ పల్స్ఏఐ’ ఒక నివేదిక విడుదల చేసింది. సర్వేలో పాల్గొన్నవారిలో 62 శాతం మంది పెట్టుబడుల్లో తొలి ప్రాధాన్యతం బంగారానికి ఇచ్చారు. గతంలో బంగారం కొనాలంటే ఇంటి పెద్దల సలహా తీసుకునేవారు. కానీ ఇప్పుడు 66.7% మంది యువత స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. అయిదు గ్రాముల లోపే పసిడి కొన్నామని 62% మంది వెల్లడించారు. 2 గ్రాముల లోపు కొనుగోలు చేసిన వాళ్లు 27.5% మంది కాగా.. 2–5 గ్రాముల మధ్య కొనుగోలు చేసిన వాళ్లు 34.4% మంది ఉన్నారు. → తమ మొదటి జీతం/సంపాదనతో తొలిసారి 24% మంది పసిడిని కొనుగోలు చేశారు. కేవలం పెట్టుబడిగా పసిడిని కొనుగోలు చేసినట్లు 23.9% మంది వెల్లడించారు. ఆర్థిక అనిశ్చితి సందర్భాల్లో, బ్యాంకు సేవింగ్స్, మ్యూచువల్ ఫండ్స్, ఈక్విటీలతో పోలిస్తే 65.7% మంది బంగారమే అత్యంత సురక్షితమైన సాధనంగా భావిస్తున్నామని తెలిపారు. సుమారు 65.7% మంది స్టాక్స్, మ్యూచువల్ ఫండ్ల (ఎంఎఫ్) కంటే పసిడినే అత్యంత సురక్షిత పెట్టుబడి మార్గంగా భావిస్తున్నారని సర్వేలో తేలింది. → ఒకవేళ రూ.25,000 నగదు రూపంలో ఉంటే.., పసిడి కొంటామని 61.9% మంది పేర్కొన్నారు. మ్యూచువల్ ఫండ్లకు 16.6%, డిపాజిట్లు 13%, షేర్లు 6.6%, క్రిప్టో 1.9% మంది ఆసక్తి చూపారు. రత్నాలు, ఆభరణ ఎగుమతులు డీలా గత నెల(జనవరి)లో రత్నాలు, బంగారు ఆభరణ ఎగుమతులు డీలా పడ్డాయి. 2025 జనవరితో పోలిస్తే 6% క్షీణించి 2,239 మిలి యన్ డాలర్లకు పరిమితమయ్యాయి. 2025 జనవరిలో ఇవి 2,376 మిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. రత్నాలు, ఆభరణ ఎగుమతుల ప్రో త్సాహక సమితి(జీజేఈపీసీ) వివరాలివి. ప్రపంచ వాణిజ్య సవాళ్లు, కీలక మార్కెట్లలో టారిఫ్ ఒత్తిళ్లు ప్రభావం చూపాయి. ఈ బాటలో ప్రస్తు త ఆర్థిక సంవత్సరం(2025–26) తొలి 10 నెల ల(ఏప్రిల్ 2025–జనవరి 2026)నూ ఇవి నామమాత్ర వెనకడుగు వేశాయి. 0.6% తగ్గి 23,186 మిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. గతే డాది(2024–25) ఇదే కాలంలో ఇవి 23,335 మిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ప్రధా నంగా దేశీ ఆభరణ ఎగుమతులకు ప్రధాన మార్కెట్గా నిలిచే యూఎస్కు షిప్మెంట్స్ 45% నీరసించడం ప్రభావం చూపింది. -
బంగారం ధరల తారుమారు.. వారం రోజుల్లో ఇలా..
బంగారం ధరలు వారం రోజులుగా పెరుగుతూ, తగ్గుతూ నేడు (శనివారం) స్వల్ప పెరుగుదలను నమోదు చేశాయి. ఈ కథనంలో ఏడు రోజుల్లో.. గోల్డ్ రేటు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది?, సిల్వర్ రేటు ఎలా ఉంది అనే విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడ నగరాల్లో.. ఫిబ్రవరి 8న రూ. 1,56,600 వద్ద ఉన్న 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర నేటికి 1,57,750 రూపాయల వద్దకు చేరింది. అంటే వారం రోజుల్లో రూ. 1150 పెరిగిందన్నమాట. 22 క్యారెట్ల తులం గోల్డ్ రేటు 1,43,550 రూపాయల దగ్గర నుంచి రూ. 1,44,600 వద్దకు (1050 రూపాయలు పెరిగింది) చేరింది. ఇదే ధరలు బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో కూడా ఉన్నాయి.ఢిల్లీలో 24 క్యారెట్ల తులం బంగారం రేటు వారం రోజుల్లో 1,56,750 రూపాయల దగ్గర నుంచి రూ. 1,57,900 వద్దకు (1150 రూపాయలు పెరిగింది) చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 1,43,700 నుంచి 1,44,750 రూపాయలకు (1050 రూపాయలు పెరిగింది) చేరింది.చెన్నైలో ధరల విషయానికి వస్తే.. ఇక్కడ ఫిబ్రవరి 8న 1,57,310 రూపాయల వద్ద ఉన్న 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు.. ఈ రోజుకి (శనివారం) 1,58,840 రూపాయల (రూ. 1530 పెరిగింది) వద్దకు చేరింది. 22 క్యారెట్ల బంగారం విషయానికి వస్తే.. 10 గ్రాముల రేటు 1,44,200 రూపాయల దగ్గర నుంచి రూ. 1,45,600 (1400 రూపాయలు పెరిగింది) వద్దకు చేరింది.సిల్వర్ ధరలుగత ఆదివారం (ఫిబ్రవరి 8) కేజీ సిల్వర్ రేటు రూ. 2.85 లక్షల దగ్గర ఉండేది. ఆ ధర ఇప్పుడు రూ. 2.80 లక్షలకు చేరింది. అంటే వారం రోజుల్లో కేజీ మీద రూ. 5000 తగ్గిందన్నమాట. సిల్వర్ ధరలు ఒక్కో నగరం ఒక్కో విధంగా ఉంటుంది. అయితే ఢిల్లీలో.. రేటు కొంత తక్కువగా ఉంటుంది.ఇదీ చదవండి: వెండి ధర ఇంకా ఎంత పెరుగుతుందంటే..? -
తొలి ఎంపిక బంగారమే.. సర్వేలో కీలక విషయాలు!
మారుతున్న కాలానికి అనుగుణంగా పెట్టుబడి మార్గాలు ఎన్ని వచ్చినా.. యువత మాత్రం ఇప్పటికీ బంగారం పైనే గట్టి నమ్మకం పెట్టుకుంటున్నారు. దేశంలోని జనరేషన్ జెడ్ (జెన్ జీ), మిలీనియల్స్ పెట్టుబడుల ధోరణిపై స్మిట్టన్ పల్స్ ఏఐ నిర్వహించిన తాజా సర్వేలో కొన్ని ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. సుమారు 5,000 మంది యువత (18-39 ఏళ్లు) అభిప్రాయాలను సేకరించిన ఈ నివేదిక ప్రకారం.. సురక్షితమైన పెట్టుబడిగా 62 శాతం మంది బంగారం వైపే మొగ్గు చూపుతున్నారు.ఆర్థిక అనిశ్చితి నెలకొన్న సమయంలో సేవింగ్స్ అకౌంట్లు, ఈక్విటీల కంటే బంగారమే తమకు ధీమా ఇస్తుందని 65.7 శాతం మంది అభిప్రాయపడ్డారు. ఒకవేళా రూ.25,000 పెట్టుబడి పెట్టాల్సి వస్తే.. పెట్టుబడి మొత్తాన్ని కింది విధంగా విభజించనున్నట్లు సర్వేలో వెల్లడైంది.➤బంగారం: 61.9 శాతం➤మ్యూచువల్ ఫండ్లు: 16.6 శాతం➤ఫిక్స్డ్ డిపాజిట్లు: 13 శాతం➤స్టాక్ మార్కెట్: 6.6 శాతం➤క్రిప్టో కరెన్సీ: 1.9 శాతంగతంలో బంగారం కొనుగోలు అంటే.. కుటుంబం అంతా కలిసి తీసుకునే పెద్ద నిర్ణయంగా ఉండేది. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. 66.7 శాతం కొనుగోళ్లు పూర్తిగా వ్యక్తిగత నిర్ణయాల ఆధారంగానే జరుగుతున్నాయి. కుటుంబ సభ్యుల ప్రమేయం తగ్గుతోంది. 61.9 శాతం మంది తాము చేసిన ఇటీవలి కొనుగోలు 5 గ్రాముల లోపే ఉందని తెలిపారు. అందులో 27.5 శాతం మంది 2 గ్రాముల కంటే తక్కువ పరిమాణంలోనే కొనుగోలు చేశారు. జెడ్ జీ యువత తమ మొదటి జీతం (24.3 శాతం) అందగానే గోల్డ్ కొనుగోలు చేయాలని భావిస్తారు.డిజిటల్ ప్లాట్ఫారమ్లు అందుబాటులోకి వచ్చిన తరువాత.. ఫిజికల్ గోల్డ్ కొనుగోలుకు కూడా యువత ప్రాధాన్యత ఇస్తోంది. పెద్ద గోల్డ్ బ్రాండెడ్ షోరూమ్లలో 38.3%, స్థానిక జ్యువెలరీ దుకాణాలలో 34.7 శాతం, ఆన్లైన్/యాప్స్ ద్వారా బంగారం కొనుగోలు చేసేందుకు 5.2 శాతం యువత ఆసక్తిగా చూపుతున్నారు.ఇదీ చదవండి: వెండి ధర ఇంకా ఎంత పెరుగుతుందంటే..?బంగారం కొంటున్నారు. కానీ కొనేటప్పుడు ప్రధానంగా ప్యూరిటీ విషయంలో 49.4 శాతం మంది ఆందోళన వ్యక్తం చేస్తుండగా, మేకింగ్ ఛార్జీలు (21 శాతం), రీసేల్ వాల్యూ (17 శాతం)పై మరికొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అంతే కాకుండా బంగారం కొన్న తర్వాత 67.1 శాతం మంది ఏదో ఒక సమయంలో బాధపడినట్లు సర్వేలో వెల్లడయ్యాయి.కొనుగోలులో కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ బంగారంపై ఉన్న క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. రాబోయే 12 నుంచి 24 నెలల్లో కచ్చితంగా బంగారం కొంటామని 52.7 శాతం మంది యువత ధీమా వ్యక్తం చేశారు. ఎక్కువ పెట్టుబడిగా కాకుండా.. క్రమ పద్ధతిలో, చిన్న మొత్తాల్లో బంగారం కొనుగోలు చేయడమే ట్రెండ్ అని ఈ సర్వే స్పష్టం చేస్తోంది. -
పతనమైన పసిడి విలువ.. కారణాలు..
మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (ఎంసీఎక్స్)లో బంగారం ధరలు తాజాగా భారీగా పతనమయ్యాయి. భారతీయ మార్కెట్లో బంగారం ధరలు ఇటీవల గరిష్ట స్థాయుల్లో ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. ముఖ్యంగా నిన్నటి మార్కెట్ సెషన్లో ఎంసీఎక్స్లో గోల్డ్ ఫ్యూచర్స్ సుమారు 6% నుంచి 9% వరకు పడిపోయి లోయర్ సర్క్యూట్ను తాకడం ఇన్వెస్టర్లను ఆందోళనకు గురిచేసింది. దీనికి గల ప్రధాన కారణాలు కింద చూద్దాం.ట్రంప్ విధానాలు.. డాలర్ బలోపేతంఅమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత అనుసరిస్తున్న వాణిజ్య విధానాలు, సుంకాల విధింపు హెచ్చరికలు అంతర్జాతీయ మార్కెట్లో అమెరికన్ డాలర్ విలువను పెంచాయి. డాలర్ ఇండెక్స్ పెరగడం వల్ల విదేశీ ఇన్వెస్టర్లకు బంగారం కొనుగోలు భారంగా మారుతుంది. ఇది సహజంగానే ధరలపై ఒత్తిడిని పెంచుతుంది.అంతర్జాతీయ అనిశ్చితి.. భౌగోళిక ఉద్రిక్తతలుఅమెరికాకు.. ఇరాన్, వెనిజువెలా వంటి దేశాలకు ఉన్న ఉద్రిక్తతలు కొంతమేర సద్దుమణగడం, దౌత్యపరమైన చర్చలు మొదలవ్వడం వల్ల సురక్షితమైన పెట్టుబడిగా భావించే బంగారంపై డిమాండ్ తాత్కాలికంగా తగ్గింది. ఇన్వెస్టర్లు రిస్క్ తీసుకోవడానికి సిద్ధపడి ఈక్విటీ మార్కెట్ల వైపు మళ్లడం కూడా ఈ పతనానికి ఒక కారణం.మార్జిన్ పరిమితుల పెంపుఎంసీఎక్స్, అంతర్జాతీయంగా కామెక్స్ వంటి ఎక్స్ఛేంజీలు బంగారం ట్రేడింగ్పై మార్జిన్ రిక్వైర్మెంట్లను పెంచాయి. దీనివల్ల ట్రేడర్లు ఎక్కువ నగదును డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. లేదంటే.. వారు తమ పొజిషన్లను ఉపసంహరించుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో మార్కెట్లో లిక్విడేషన్ పెరిగి ధరలు దిగివచ్చాయి.రూపాయి ప్రభావంభారత రూపాయి విలువలో మార్పులు దేశీయంగా బంగారం ధరలను ప్రభావితం చేస్తున్నాయి. డాలర్తో పోలిస్తే రూపాయి బలహీనపడటం వల్ల దిగుమతి చేసుకునే బంగారం ఖరీదవుతుంది. అయితే, ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో చోటుచేసుకున్న భారీ కరెక్షన్ వల్ల దేశీయంగా ధరలు తగ్గుముఖం పట్టాయి.ఇన్వెస్టర్లు ఏం చేయాలి?ప్రస్తుత పతనం అనేది కేవలం టెక్నికల్ కరెక్షన్ మాత్రమేనని గుర్తుంచుకోవాలని ఎంసీఎక్స్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. దీర్ఘకాలంలో బంగారం పట్ల సానుకూల ధోరణి కొనసాగుతుందని భావిస్తున్నారు. ధరలు తగ్గినప్పుడు కొనుగోలు చేయడం తెలివైన వ్యూహం కావొచ్చని సూచిస్తున్నారు.ఇదీ చదవండి: రెరా బిల్డర్లకే కొమ్ముకాస్తోంది: సుప్రీంకోర్టు -
మూడు పతకాలూ మనవే
న్యూఢిల్లీ: స్వదేశంలో భారత షూటర్ల పతకాల వేట కొనసాగుతోంది. ఆసియా షూటింగ్ చాంపియన్ షిప్లో గురువారం సీనియర్ పురుషుల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ ఈవెంట్లో భారత్ క్లీన్స్వీప్ చేసింది. వ్యక్తిగతవిభాగంలో స్వర్ణ, రజత, కాంస్య పతకాలతోపాటు టీమ్ ఈవెంట్లో పసిడి పతకాన్ని సొంతం చేసుకుంది. ఫైనల్లో ఐశ్వర్య ప్రతాప్ సింగ్ తోమర్ 362 పాయింట్లతో ప్రపంచ రికార్డు స్కోరును సాధించాడు. స్వర్ణ పతకాన్ని నెగ్గాడు. భారత్కే చెందిన నీరజ్ కుమార్ 361.8 పాయింట్లతో రజతం కైవసం చేసుకోగా... అఖిల్ షెరాన్ 343.5 పాయింట్లతో కాంస్య పతకాన్ని దక్కించుకున్నాడు. ఐశ్వర్య ప్రతాప్, నీరజ్, అఖిల్లతో కూడిన భారత బృందం 1769 పాయింట్లతో టీమ్ విభాగంలో స్వర్ణ పతకాన్ని గెల్చుకుంది. జూనియర్ పురుషుల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ ఈవెంట్లో భారత షూటర్లు అడ్రియన్ కర్మాకర్ 353.2 పాయింట్లతో స్వర్ణ పతకాన్ని... మానవేంద్ర సింగ్ షెఖావత్ 338.6 పాయింట్లతో కాంస్య పతకాన్ని నెగ్గారు. అడ్రియన్ కర్మాకర్, మానవేంద్ర సింగ్, ప్రిన్స్లతో కూడిన భారత బృందం టీమ్ విభాగంలో 1741 పాయింట్లతో బంగారు పతకాన్ని సాధించింది. ఈ మెగా ఈవెంట్లో ఇప్పటి వరకు భారత షూటర్లు 38 స్వర్ణాలు, 16 రజతాలు, 16 కాంస్యాలతో కలిపి 70 పతకాలు సాధించారు. -
బంగారం కంటే ఖరీదైన చెట్టు... కిలో ..రూ. కోటి
-
ఫేక్లొద్దు.. రాబర్ట్ కియోసాకి హెచ్చరిక!
ప్రఖ్యాత ఆర్థిక రచయిత, వ్యాపారవేత్త రాబర్ట్ కియోసాకి తన పేరుతో సోషల్ మీడియాలో ప్రసారం అవుతున్న ఏఐ ఆధారిత నకిలీ (డీప్ఫేక్) వీడియోల గురించి హెచ్చరించారు. ప్రసిద్ధ ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ (Rich Dad Poor Dad) పుస్తక రచయిత అయిన కియోసాకి, తాను గతంలో “రియల్ ఎస్టేట్ గైస్ సెమినార్ అట్ సీ” టీ-షర్ట్ ధరించిన విషయం నిజమేనని తెలిపారు. అయితే యూట్యూబ్లో ప్రస్తుతం కనిపిస్తున్న, అదే టీ-షర్ట్ ధరించి ఉన్నట్లు చూపిస్తున్న కొన్ని వీడియోలు ఏఐ ద్వారా సృష్టించిన నకిలీవని స్పష్టం చేశారు. ఆ వీడియోల్లో ఉన్న సందేశాలు కూడా అసత్యమని ఆయన పేర్కొన్నారు.“టీ-షర్ట్ నిజమే, సెమినార్ కూడా నిజమే. కానీ వీడియోలు, సందేశాలు ఏఐతో సృష్టించిన నకిలీలు” అని కియోసాకి (Robert Kiyosaki) సోషల్ మీడియాలో వెల్లడించారు. డీప్ఫేక్ సాంకేతికత కృత్రిమ మేధస్సు (AI)ను ఉపయోగించి నిజమైన వ్యక్తి మాట్లాడుతున్నట్లుగా కనిపించే నకిలీ వీడియోలను రూపొందిస్తుంది. ఇటీవలి కాలంలో ఈ సాంకేతికతను ఉపయోగించి ప్రముఖుల పేరుతో మోసపూరిత పెట్టుబడి ప్రకటనలు రూపొందించే ఘటనలు పెరుగుతున్నాయి. ఈ తరహా నకిలీ వీడియోలు రూపొందిస్తున్న వారిపై కియోసాకి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇలాంటి పనులకంటే సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలని సూచించారు.అదేవిధంగా, ఈ సందర్భాన్ని ఉపయోగించి ఆయన తన ఆర్థిక దృక్పథాన్ని మరోసారి ప్రస్తావించారు. ప్రభుత్వ ఫియాట్ కరెన్సీని “నకిలీ డబ్బు”గా పేర్కొంటూ, బంగారం, వెండి, రియల్ ఎస్టేట్, బిట్కాయిన్, ఈథిరియం వంటి “నిజమైన ఆస్తుల్లో” పెట్టుబడి పెట్టాలని ఆయన సూచించారు.ఏఐ సాంకేతికత వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో, నిజమైన సమాచారాన్ని నకిలీ కంటెంట్ నుండి వేరు చేయడం సాధారణ ప్రజలకు కష్టతరమవుతోంది. అందువల్ల పెట్టుబడులకు సంబంధించిన వీడియోలు లేదా ప్రకటనలను అధికారిక వనరుల ద్వారా ధ్రువీకరించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.FYI: if you see YouTube videos with me wearing a Real Estate Guys Seminar at Sea T-shirt on….the T - shirt is real and so is the seminar.The problem is the videos are AI Fakes. So are the messages.Why someone waste their time doing fake AI videos is beyond me.To those…— Robert Kiyosaki (@theRealKiyosaki) February 11, 2026 -
Video: బంగారం కంటే ఖరీదైన చెట్టు.. కిలో.. రూ. కోటి
-
‘బంగారు ప్రయాణం’లో రహస్యాలు!
బంగారం షాపులో నగదు చెల్లించి నచ్చిన నగను కొనుక్కుంటాం. అద్దాల షోరూమ్లో విద్యుత్ కాంతుల మధ్య తళతళలాడే ఆ బంగారు ఆభరణాలను చూసి మురిసిపోతాం. కానీ, ఆ మెరుపు వెనుక.. వందల మంది కార్మికుల చెమట చుక్కలు ఉన్నాయని ఎంతమందికి తెలుసు? ఆ హొయల వెనుక.. వేల అడుగుల లోతులో పేలే బాంబుల మోత, ఊపిరాడని గనుల్లో ఉక్కపోత ఉందని చాలా మందికి తెలియదు కదా.. ఒక చిన్న ఉంగరం మన వేలికి చేరడానికి ముందు అది ఒక కఠినమైన శిల. ఆ శిల నుంచి స్వచ్ఛమైన పసిడిని ఒడిసి పట్టుకోవడానికి ప్రకృతితో చేసే యుద్ధమే ఈ ‘బంగారు ప్రయాణం’. బంగారాన్ని గనుల్లో నుంచి ఎలా వెలికితీస్తారో.. ఆభరణాల రూపంలోకి ఎలా మారుస్తారో తెలుసుకుందాం.అన్వేషణ, మైనింగ్బంగారం ఎక్కడ ఉందో గుర్తించడం మొదటి దశ. దీన్ని ప్రోస్పెక్టింగ్ అంటారు. భూగర్భంలో బంగారం నిల్వలు ఉన్నాయని శాస్త్రవేత్తలు నిర్ధారించిన తర్వాత మైనింగ్ ప్రారంభమవుతుంది. బంగారం భూమిపై పొరల్లోనే ఉన్నప్పుడు పెద్ద గుంతలు తవ్వి వెలికితీస్తారు. దీన్ని ఓపెన్ పిట్ మైనింగ్ అంటారు. బంగారం చాలా లోతులో ఉన్నప్పుడు సొరంగాలు తవ్వి, పేలుళ్ల సాయంతో ముడి ఖనిజాన్ని బయటకు తీస్తారు. దీన్ని అండర్గ్రౌండ్ మైనింగ్ అంటారు.ముడి ఖనిజాన్ని పొడి చేయడంగనుల నుంచి సేకరించిన పెద్ద రాళ్లను క్రషర్స్ యంత్రాల్లో వేసి చిన్న ముక్కలుగా మారుస్తారు. ఆ తర్వాత వాటిని చిన్న స్పటికాల పరిమాణంలోకి, ఆపై మెత్తటి పౌడర్లాగా పిండి చేస్తారు. ఈ పొడిలోనే అతి సూక్ష్మమైన బంగారు రేణువులు దాగి ఉంటాయి.బంగారం వేరు చేయడంపొడి చేసిన మట్టి నుంచి బంగారాన్ని వేరు చేయడానికి ప్రధానంగా కొన్ని పద్ధతులను ఉపయోగిస్తారు.సైనైడ్ లీచింగ్: ఈ పౌడర్కు సోడియం సైనైడ్ ద్రావణాన్ని కలుపుతారు. ఇది బంగారాన్ని ద్రవ రూపంలోకి మారుస్తుంది. ఆ తర్వాత జింక్ పౌడర్ లేదా యాక్టివేటెడ్ కార్బన్ ఉపయోగించి బంగారాన్ని తిరిగి ఘన రూపంలోకి మారుస్తారు.గ్రావిటీ సెపరేషన్: బంగారం బరువు ఎక్కువగా ఉండటం వల్ల నీటి ప్రవాహం ద్వారా తేలికపాటి మట్టిని కొట్టుకుపోయేలా చేసి బంగారు రేణువులను కిందకు చేరేలా చేస్తారు.స్మెల్టింగ్పైన తెలిపిన ప్రక్రియలో వచ్చిన బంగారాన్ని (దీన్ని డోర్ అని పిలుస్తారు) దాదాపు 1064 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద కరిగిస్తారు. ఈ దశలో బంగారం నుంచి ఇతర లోహాలు వేరవుతాయి. ఇక్కడ వచ్చే పసిడి 100% స్వచ్ఛంగా ఉండదు. ఇందులో వెండి లేదా రాగి కలిసి ఉంటాయి. వీటిని బార్స్ రూపంలోకి మారుస్తారు.శుద్ధీకరణ(రిఫైనింగ్)చివరి దశలో బంగారాన్ని పూర్తిస్థాయిలో శుద్ధి చేయడానికి మిల్లర్ ప్రక్రియ లేదా వోల్విల్ ప్రక్రియ వాడతారు. ఈ ప్రక్రియల్లో క్లోరిన్ గ్యాస్ను ఉపయోగించి ఇతర మలినాలను తొలగిస్తారు. దీని ద్వారా 99.9% (24 క్యారెట్) స్వచ్ఛమైన బంగారం లభిస్తుంది.ఆభరణాల తయారీచివరిగా ఈ స్వచ్ఛమైన బంగారానికి కొంత మోతాదులో రాగి లేదా వెండిని కలిపి (సాధారణంగా 22 క్యారెట్లు) నచ్చిన ఆభరణాలుగా మలుస్తారు.ఒక గ్రాము బంగారాన్ని పొందడానికి దాదాపు ఒక టన్ను ముడి ఖనిజాన్ని ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది. అందుకే బంగారం అంత విలువైనది!ఇదీ చదవండి: భవిష్యత్తులో పవర్ఫుల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇదే.. -
బంగారం కంటే ఖరీదైన చెట్టు.. కిలో రూ. కోటి
బంగారం ఖరీదైనదే కానీ ఈ చెట్టు మాత్రం బంగారాన్ని మించిపోయింది. కిలోకు కోటి రూపాయలు పలికే ఒకే ఒక్క మొక్క గురించి ఎప్పుడైనా విన్నారా? అది అగర్వుడ్. ఆగ్నేయాసియాలో పెరిగే అక్విలేరియా జాతి చెట్లలో అరుదుగా ఏర్పడే ఈ కలప.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన సహజ వనరుల్లో ఒకటి. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ప్రతి చెట్టులా ఇది ఉండదు. సాధారణంగా ఈ చెట్లు వాసనలేని తెల్ల కలపతో ఉంటాయి. కానీ ఒక ప్రత్యేకమైన ఫంగస్ సోకినప్పుడు లేదా చెట్టు గాయపడినప్పుడు, అది తనను తాను రక్షించుకోవడానికి ముదురు, జిగట రసాన్ని విడుదల చేస్తుంది. ఆ రసమే కాలక్రమంలో సువాసనగల నల్ల అగర్వుడ్గా మారుతుంది.అన్ని అక్విలేరియా చెట్లు అగర్వుడ్ని ఉత్పత్తి చేయవు. సహజంగా కేవలం 2 నుంచి 7 శాతం చెట్లలో మాత్రమే ఈ ప్రక్రియ జరుగుతుంది. అది కూడా ఒక్క రోజులో కాదు.. 10 నుంచి 30 సంవత్సరాల పాటు ఎదురు చూడాల్సిందే. ఈ అరుదైన, సుదీర్ఘమైన ప్రక్రియ కారణంగానే అగర్వుడ్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కలపగా గుర్తింపు పొందింది. ఇందులో కూడా అత్యంత నాణ్యమైన రకాన్ని 'క్యారా' అంటారు. దీని ధర గ్రాముకు రూ.8.5 లక్షల వరకు చేరుతుంది. షాంఘైలో జరిగిన ఒక వేలంలో 2 కిలోల క్యారా కలప ఏకంగా రూ.154 కోట్లకు అమ్ముడైనట్లు రికార్డులు చెబుతున్నాయి. అంటే ఒక్క చిన్న ముక్కే కోట్ల విలువ కలిగి ఉంటుందంటే నిజంగా ఆశ్చర్యపోవాల్సిందే..అగర్వుడ్ని ప్రపంచంలో చాలా ఖరీదైన పెర్ఫ్యూమ్లు తయారు చేయడానికి ఎక్కువగా ఉపయోగిస్తారు. ముఖ్యంగా దుబాయ్, పారిస్ లాంటి నగరాల్లో లగ్జరీ సెంట్స్ కోసం దీనికి ఎక్కువ డిమాండ్ ఉంటుంది. హిందూ, బౌద్ధ, ఇస్లామిక్ మతపరమైన ఆచారాల్లో అగర్వుడ్ ధూపానికి ప్రత్యేక స్థానం ఉంది. దాని సువాసన మనసుకు ప్రశాంతత ఇస్తుందని నమ్ముతారు. ఆయుర్వేదం, చైనీస్ వైద్యంలో ఒత్తిడి, నిద్రలేమి తదితర సమస్యలకు దీనిని ఉపయోగిస్తారు.భారతదేశంలోని అస్సాం రాష్ట్రం మంచి అగర్వుడ్కి ప్రసిద్ధి. కానీ ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరగడంతో అక్విలేరియా చెట్లు తగ్గిపోతున్నాయి. అందుకే అగర్వుడ్ అమ్మకంపై కఠిన నియమాలు పెట్టారు. లైసెన్స్ ఉన్నవాళ్లు మాత్రమే దీనిని అమ్మగలరు. ఇప్పుడు సహజ అగర్వుడ్ చాలా ఖరీదైన, విలాసవంతమైన వస్తువుగా మారింది. బంగారం నేలలో దొరుకుతుంది. కానీ అగర్వుడ్ తయారవ్వడానికి ప్రకృతి ఎన్నో సంవత్సరాలు తీసుకుంటుంది. -
బంగారమే బిగ్ బాస్
న్యూఢిల్లీ: గోల్డ్, వెండి ఈటీఎఫ్లోకి రికార్డు స్థాయిలో పెట్టుబడులు వచ్చాయి. జనవరిలో రూ.24,040 కోట్లు గోల్డ్ ఈటీఎఫ్ల్లోకి రాగా, వెండి ఈటీఎఫ్లు రూ.9,463కోట్లను ఆకర్షించాయి. గత డిసెంబర్లో గోల్డ్ ఈటీఎఫ్ల్లోకి వచ్చిన రూ.11,647 కోట్లతో పోల్చితే రెట్టింపునకు పైగా పెరిగాయి. అంతేకాదు ఒక నెలలో ఈక్విటీ ఫండ్స్కు మించి బంగారం ఈటీఎఫ్లు పెట్టుబడులను ఆకర్షించడం కూడా చరిత్రలో ఇదే మొదటిసారి. మరోవైపు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడుల పట్ల ఇన్వెస్టర్లలో ఆసక్తి సన్నగిల్లుతూ.. బంగారం, వెండిపైకి మనసు మళ్లుతోంది. జనవరిలో ఈక్విటీ ఫండ్స్ నికరంగా రూ.24,028 కోట్లను ఆకర్షించాయి. డిసెంబర్లో వచ్చిన పెట్టుబడులు రూ.28,054 కోట్లతో పోల్చి చూస్తే 14 శాతం తగ్గినట్టు తెలుస్తోంది. ఈక్విటీ ఫండ్స్లోకి పెట్టుబడుల రాక తగ్గడం వరుసగా ఇది రెండో నెల. గతేడాది నవంబర్లో ఈక్విటీ ఫండ్స్ రూ.29,911 కోట్ల పెట్టుబడులను ఆకర్షించడం గమనార్హం. దీంతో పోల్చితే డిసెంబర్లో 6 శాతం తగ్గాయి. ఇక గతేడాది అక్టోబర్లో వచ్చిన పెట్టుబడులు రూ.24,690 కోట్లుగా ఉన్నాయి. మొత్తం మీద ఈక్విటీ పెట్టుడుల రాక మూడు నెలల కనిష్టానికి చేరింది. కమోడిటీల వైపు అడుగులు.. గత కొన్ని నెలలుగా ఈక్విటీ మార్కెట్లు ఎలాంటి రాబడులు ఇవ్వకపోగా.. బంగారం, వెండి మంచి ర్యాలీ చేస్తున్నాయని.. దీంతో కొంత మేర పెట్టుబడులు కమోడిటీల్లోకి మళ్లినట్టు వీఎస్ఆర్కే క్యాపిటల్ డైరెక్టర్ స్వప్నిల్ అగర్వాల్ తెలిపారు. ఇక నుంచి ఈక్విటీ పథకాల్లోకి పెట్టుబడుల రాక క్రమంగా మెరుగుపడొచ్చని అభిప్రాయపడ్డారు. స్టాక్స్ విలువలు ఆకర్షణీయంగా ఉండడం, స్థిరీకరణ ముగియడంతో ఈ ఏడాది ఈక్విటీలు బలమైన పనితీరు చూపించొచ్చని, దీంతో ఇన్వెస్టర్ల నుంచి పెట్టుబడులు పుంజుకోవచ్చని అంచనా వేశారు. ⇒ ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్ (ఈఎల్ఎస్ఎస్/ పన్ను ఆదా ఫండ్స్) పథకాల నుంచి రూ.594 కోట్లను ఇన్వెస్టర్లు ఉపసంహరించుకున్నారు. ⇒ మరోవైపు డెట్ మ్యూచువల్ ఫండ్స్లోకి నికరంగా రూ.74,827 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. డిసెంబర్లో ఇదే విభాగం రూ.1.32 లక్షల కోట్లను కోల్పోవడం గమనార్హం. ⇒ హైబ్రిడ్ ఫండ్స్లోకి (ఈక్విటీ, డెట్ కలసిన) రూ.17,356 కోట్లు.. మల్టీ అసెట్ ఫండ్స్లోకి (ఈక్విటీ, డెట్, బంగారం, వెండి కలసిన) రూ.10,485 కోట్లు చొప్పున వచ్చాయి. ⇒ మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమ నిర్వహణలోని అన్ని రకాల పెట్టుబడుల విలువ (ఏయూఎం) జనవరి చివరికి రూ.81.01 లక్షల కోట్లకు పెరిగింది. సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో ఈక్విటీ పథకాల్లోకి జనవరిలోనూ రికార్డు స్థాయిలో రూ.31,000 పెట్టుబడులు వచ్చాయి. గోల్డ్, వెండికి డిమాండ్.. గోల్డ్ ఈటీఎఫ్లోకి రూ.24,040 కోట్లు రావడంతో.. ఫండ్స్ నిర్వహణలోని మొత్తం గోల్డ్ ఈటీఎఫ్ ఆస్తుల విలువ రూ.1.84 లక్షల కోట్లకు చేరింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే గోల్డ్ ఈటీఎఫ్ల్లోకి రూ.61,000 కోట్లు రావడం గమనార్హం. మరోవైపు వెండి ఈటీఎఫ్ల్లోకి డిసెంబర్లో రూ.9,463 కోట్లు రావడంతో.. వెండి ఈటీఎఫ్ల నిర్వహణ ఆస్తుల విలువ రూ. 1.16 లక్షల కోట్లకు పెరిగింది. డిసెంబర్లో వచ్చిన 3,962 కోట్లతో పోల్చి చూస్తే ఒక్క నెలలోనే 139 శాతం పెరిగాయి. -
తడబడిన వెండి ఎగసిన పసిడి
న్యూఢిల్లీ: అమ్మకాల ఒత్తిడికి వెండి నష్టపోగా.. కొనుగోళ్ల మద్దతుతో పసిడి ధరలు పెరిగాయి. ఢిల్లీ మార్కెట్లో మంగళవారం వెండి కిలోకి రూ.7,500 నష్టపోయి రూ.2,64,500 లక్షలకు (పన్నులు కలుపుకుని) పరిమితమైంది. బంగారం 10 గ్రాములకు రూ.2,200 పెరిగి రూ.1,60,700 వద్ద (పన్నులు సహా) స్థిరపడింది. జ్యుయలర్లు, ఇన్వెస్టర్ల నుంచి స్థిరమైన కొనుగోళ్లు వరుసగా రెండో రోజు పసిడి ధరలు పెరగడానికి కారణమని ట్రేడర్లు తెలిపారు. బంగారం, వెండి ధరలు ఒక శ్రేణి పరిధిలో చలించొచ్చని.. ఈ మార్కెట్లు సమీప కాలానికి స్థిరీకరణ దశలోకి ప్రవేశించినట్టు హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ కమోడిటీస్ విభాగం సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్లో వెండి ఔన్స్కు ఒక డాలర్కు పైగా నష్టపోయి రూ.82.16 డాలర్ల స్థాయిలో ట్రేడ్ అయింది. బంగారం స్వల్ప నష్టంతో ఔన్స్ 5,052 డాలర్ల స్థాయిలో కదలాడింది. అమెరికాలో రిటైల్ విక్రయాలు, నిరుద్యోగ డేటా కోసం ఇన్వెస్టర్లు వేచి చూస్తున్నట్టు ఎల్కేపీ సెక్యూరిటీస్ కమోడిటీ రీసెర్చ్ వైస్ ప్రెసిడెంట్ జతీన్ త్రివేది తెలిపారు. -
మళ్లీ పెరిగిన బంగారం, వెండి: కొత్త ధరలు ఇలా..
భారతదేశంలో బంగారం ధరలు ఎప్పటికప్పుడు మారిపోతూ ఉన్నాయి. ఈ రోజు (మంగళవారం) ఉదయం స్థిరంగా ఉన్న గోల్డ్ రేటు సాయంత్రానికి స్వల్ప పెరుగుదలను నమోదు చేసింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో పసిడి ధరల్లో మార్పులు మార్పులు జరిగాయి. ఈ కథనంలో లేటెస్ట్ రేట్లు ఎలా ఉన్నాయనే విషయాలు తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడలలో ఉదయం రూ.1,57,910 (24 క్యారెట్స్ 10 గ్రామ్స్), రూ. 1,44,750 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్) వద్ద ఉన్న గోల్డ్ రేటు సాయంత్రానికి వరుసగా రూ. 1,58,780 (రూ. 870 పెరిగింది) & రూ. 1,45,550 (రూ. 800 పెరిగింది) వద్ద నిలిచాయి. ఇదే ధరలు బెంగళూరు, ముంబైలలో కూడా కొనసాగుతుంది.చెన్నైలో అయితే గోల్డ్ రేటు స్వల్పంగా తగ్గింది. దీంతో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,59,060 రూపాయల వద్ద, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 1,45,800 రూపాయల వద్ద నిలిచింది.ఇదీ చదవండి: వెండి ధర ఇంకా ఎంత పెరుగుతుందంటే..?ఢిల్లీలో కూడా గోల్డ్ రేటు పెరిగింది. ఉదయం స్థిరంగా ఉన్న బంగారం ధర సాయంత్రానికి పెరిగింది. దీంతో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 158930 రూపాయల (రూ. 870 పెరిగింది) వద్ద, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 1,45,700 రూపాయల (రూ. 800 పెరిగింది) వద్ద నిలిచింది.వెండి ధరలుఉదయం కేజీ వెండి రేటు రూ. 2.90 లక్షల వద్ద ఉండేది. అయితే సాయంత్రానికి ఆ రేటు రూ. 3లక్షలకు చేరింది. అంటే కేజీ ధర గంటల వ్యవధిలో రూ. 10వేలు పెరిగిందన్నమాట. -
బంగారం ధర.. ఒక్కసారిగా ఎందుకు పెరిగిందంటే?
ఇటీవల కాలంలో బంగారం ధరల్లో భారీ హెచ్చుతగ్గులు కనిపించాయి. చైనా ట్రేడర్ల పాత్ర దీనికి కారణమని, అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్ పేర్కొన్నారు. ఈ విషయాలను ఆయన ఫాక్స్ న్యూస్లో ప్రసారమైన సండే మార్నింగ్ ఫ్యూచర్స్ కార్యక్రమంలో వెల్లడించారు.చైనాలో బంగారం ట్రేడింగ్.. కొంచెం నియంత్రణ తప్పిన స్థాయికి చేరిందని బెస్సెంట్ అన్నారు. దీనివల్ల అక్కడి అధికారులు మార్జిన్ నిబంధనలను కఠినతరం చేయాల్సి వచ్చిందని, ఈ పరిణామాలు బంగారం ధరలు ఒక్కసారిగా పెరిగి, ఆ తర్వాత అకస్మాత్తుగా పడిపోయేలా చేసిందని అన్నారు.బంగారం ధరలు పెరగడానికి కారణాలుబంగారం ధరలు రికార్డు స్థాయికి చేరడానికి పలు కారణాలు ఉన్నాయి. ఇందులో పెట్టుబడులు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, అమెరికా ఫెడరల్ రిజర్వ్ స్వతంత్రతపై ఉన్న ఆందోళనలు ప్రధానమైనవి. ఇదే సమయంలో డౌ జోన్స్ ఇండస్ట్రియల్ అవరేజ్ సూచీ 50,000 మార్క్ను తొలిసారి దాటింది. ఇది అమెరికా ఆర్థిక వ్యవస్థపై, కార్పొరేట్ లాభాలపై పెట్టుబడిదారుల విశ్వాసాన్ని మరింత పెంచేసింది.భారతదేశంలో బంగారం ధరలుఇండియన్ మార్కెట్లో ఈ రోజు (సోమవారం) బంగారం ధరలు పెరిగాయి. దీంతో 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 1,55,000 దాటేసింది. 22 క్యారెట్ల తులం గోల్డ్ రేటు రూ. 1,44,000 క్రాస్ చేసింది. వెండి ధరలు మళ్లీ రూ. 3 లక్షలకు (కేజీ) చేరింది. -
భార్య కోసం ప్రతి ఏడాది మూడు కిలోలు బంగారమా..!?
బంగారం ధరలు ఏ రేంజ్లో ఉన్నాయో తెలిసిందే. రోజు రోజుకి ధరలు గుభ గుయ్యిమనేలా కొండపైకి ఎక్కి కూర్చొంటున్నాయి. సామాన్యులు కొనాలి అన్న ఆలోచనే మనసులోకి రానివ్వలేనంతగా భయపెడుతోంది దాని ధర. మరోవైపు వెండి ధర కూడా అలానే అమాంతం పెరిగిపోయింది. ఇప్పుడిదంతా ఎందుకంటే..ఇంతలా బంగారం ధర దద్దరిల్లిపోతుంటే..ఇక్కడొక వ్యక్తి భార్య కోసం ప్రతి ఏడాది ఏకంగా మూడు కిలోల బంగారం కొంటాడంట. మూడు కిలలు అంటే ఇప్పుడున్న గోల్డ్ ధరల ప్రకారం..ఎంత ఖర్చు అవుతుందో ఆలోచిస్తేనే..నోటమాటరాదు కదా..!. మరి అలాంటిది అంతలా ఎవడ్రాబాబు బంగారం కొంటుంది అంటే..భారత సంతతికి చెందిన బిలియనీర్ సతీష్ సన్పాల్ భార్య తబిందా సన్పాల్, నెట్ఫ్లిక్స్లో తన రాబోయే రియాలిటీ షో 'దేశీ బ్లింగ్' ట్రైలర్ను విడుదల చేసింది. ఈ షో దుబాయ్లోని ఉన్నత వర్గ భారతీయ ప్రవాసులపైనా, వారి విలాసవంతమైన జీవనశైలిని హైలెట్ చేస్తుంది. ఈ సిరీస్లో నటీనటులు కరణ్ కుంద్రా, తేజస్వి ప్రకాష్తో పాటు డాన్యూబ్ గ్రూప్ వ్యవస్థాపకుడు, చైర్మన్ రిజ్వాన్ సజన్, అనక్స్ హోల్డింగ్ వ్యవస్థాపకుడు సతీష్ సన్పాల్ వంటి ప్రముఖ వ్యాపారవేత్తలు కూడా ఉన్నారు. ఈ షో ధనవంతులు ఆడంబర జీవితాన్ని వారి విలాసవంతమైన వైభవాన్ని కళ్లకు కట్టినట్లుగా చూపిస్తుంది. ఆ ట్రైలర్లో బారత సంతతికి చెందిన బిలియనీర్ సతీష్ సన్పాల్ భార్య తబిందా సన్పాల్ తన భర్తకు బంగారంపై ఉన్న ప్రేమను గురించి వెల్లడిస్తుంది. తన భర్త సతీష్కు బంగారం కొనడం అంటే చాలా ఇష్టమని, ప్రతి ఏడాది తన కోసం మూడు కొలోల బంగారం కొంటాడని పేర్కొంది. అంటే ప్రస్తుతం ధర బట్టి..కిలో బంగారం సుమారు రూ. 1.5 కోట్లు పలుకుతుంది. అంటే మూడు కిలోల బంగారం రూ. 4.5 కోట్లు పైమాటే పలుకుతుంది..!.ఎవరీ సతీష్ సన్పాల్.. ?సతీష్ సన్పాల్ భారతదేశంలో జన్మించిన అనక్స్ హోల్డింగ్ చైర్మన్. అతని కంపెనీ దుబాయ్ రియల్ ఎస్టేట్, ఆర్థిక మార్కెట్లు, హాస్పిటాలిటీ, మీడియా వంటి అనేక రంగాలలో భాగస్వామ్యం ఉంది. అతను బ్రిటిష్-పాకిస్తానీ మహిళ అయిన తబిందా సన్పాల్ను వివాహం చేసుకున్నారు. వారికి ఇసాబెల్లా అనే ఒక ఏడాది కుమార్తె ఉంది. ఆయన గతేడాది ప్రారంభంలో తన కుమార్తెకు కస్టమ్ పింక్ రోల్స్ రాయిస్ను బహుమతిగా ఇచ్చి వార్తల్లో నిలిచాడు. ఇక సన్పాల్ ఒక ఇంటర్వ్యూలో తాను భారతదేశంలోని జబల్పూర్లో జన్మించానని, కేవలం రూ. 80 వేలు జేబులో పెట్టుకుని దుబాయ్కి వచ్చినట్లు తెలిపాడు. ఇక తబిందా కూడా అదే ఇంటర్వ్యూలో తాను ముస్లీం కావడంతో మొదట్లో తన కుటుంబం సతీష్ని పెళ్లి చేసుకోవడాన్ని అంగీకరించలేదని, అయితే ఆయన సాధించిన విజయం చూసి అభిప్రాయం మార్చుకుందని అంటుంది. అందుకు సతీష్ వెంటనే డబ్బు దేవుడు కాదని, అలా అని దేవుడి కంటే తక్కువ కూడా కాదని నవ్వుతూ అన్నాడు. View this post on Instagram A post shared by Luxe Life | لوكس لايف (@luxelifedubai) (చదవండి: 'భారతీయ పేరెంటింగ్'పై మ్యాట్రిమోని యాప్ సీఈవో ఫైర్..! భావోద్వేగపరంగా..) -
బంగారానికి బదులుందా? బెటర్ ఇన్వెస్ట్మెంట్ ఏది?
ప్రముఖ ఇన్వెస్టర్, ప్రసిద్ధ ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ (Rich Dad Poor Dad) పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి పెట్టుబడుల విషయమై తన అభిప్రాయాలను మరోసారి స్పష్టం చేశారు. బంగారం, వెండి, బిట్కాయిన్.. మూడింటినీ కలిపి పెట్టుబడులు పెట్టడం మంచిదేనని చెప్పిన ఆయన, ఒక్క ఆస్తినే ఎంచుకోవాల్సి వస్తే మాత్రం తాను బిట్కాయిన్కే ప్రాధాన్యం ఇస్తానన్నారు.ఇటీవల చేసిన వ్యాఖ్యల్లో, బిట్కాయిన్కు ఉన్న పరిమిత సరఫరానే దాని అతిపెద్ద బలమని కియోసాకి వివరించారు. బంగారం ధర పెరిగినప్పుడు మరిన్ని గనులు తవ్వడం ద్వారా సరఫరా పెరిగే అవకాశం ఉందని, తాను స్వయంగా గోల్డ్ మైనర్ కావడంతో ఇది తనకు తెలుసని అన్నారు.“బంగారం ధర పెరిగితే మరిన్ని గనులు తవ్వుతారు. అంటే సరఫరా పెరుగుతుంది. కానీ బిట్కాయిన్ విషయంలో అలా కాదు. దాని డిజైన్ ప్రకారం గరిష్టంగా 21 మిలియన్ బిట్కాయిన్లే ఉంటాయి” అని కియోసాకి (Robert Kiyosaki) తెలిపారు. బిట్కాయిన్ ప్రోటోకాల్ ప్రకారం 21 మిలియన్లకు మించి ఒక్క బిట్కాయిన్ కూడా సృష్టించలేమని, ఆ స్థాయికి మెల్లగా చేరుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు. ఈ విధమైన నిర్మాణాత్మక కొరత బిట్కాయిన్ను ప్రత్యేకంగా నిలబెడుతుందని అన్నారు.ఇది చదివారా? కియోసాకీకి కోపమొచ్చింది!“21 మిలియన్ల తర్వాత కొత్త బిట్కాయిన్లు రావు. ఇది అద్భుతమైన డిజైన్. అందుకే దీర్ఘకాలంలో బిట్కాయిన్ ధర పెరుగుతుందని నేను నమ్ముతున్నాను” అని కియోసాకి వ్యాఖ్యానించారు. తాను బిట్కాయిన్ను ప్రారంభ దశలోనే కొనుగోలు చేశానని, అదే సమయంలో గోల్డ్ మైనింగ్, చమురు తవ్వకాలు వంటి సంప్రదాయ పెట్టుబడులను కూడా కొనసాగిస్తున్నానని తెలిపారు.ఫియాట్ కరెన్సీలపై తనకు నమ్మకం లేదని, ద్రవ్యోల్బణం, ఆర్థిక అనిశ్చితుల నుంచి రక్షణనిచ్చే “హార్డ్ అసెట్స్”కే తాను మద్దతు ఇస్తానని కియోసాకి మరోసారి స్పష్టం చేశారు. అయితే నిపుణులు మాత్రం, కేవలం కొరత మాత్రమే ధరలు పెరగడానికి హామీ ఇవ్వదని, డిమాండ్, నియంత్రణలు, మార్కెట్ ఊగిసలాటలు కూడా కీలక పాత్ర పోషిస్తాయని అభిప్రాయపడుతున్నారు.అయినప్పటికీ, బిట్కాయిన్ను బంగారానికి ప్రత్యామ్నాయంగా చూసే ఇన్వెస్టర్ల సంఖ్య పెరుగుతోందని కియోసాకి వ్యాఖ్యలు సూచిస్తున్నాయి.I am often asked:Which is a better investment?Gold or Bitcoin.Obviously I would say both for diversification of assets and add silver.Yet if I had to choose only one asset I would choose Butcoin.Why?Because gold is in theory infinite. When the price of gold rises…— Robert Kiyosaki (@theRealKiyosaki) February 9, 2026


