breaking news
Gold
-
పసిడి రూ. 1,300 అప్
న్యూఢిల్లీ: అంతర్జాతీయ సంకేతాలకు అనుగుణంగా దేశీయంగా పసిడి ధరలు పెరిగాయి. ఆలిండియా సరాఫా అసోసియేషన్ ప్రకారం న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత గల బంగారం 10 గ్రాముల ధర రూ. 1,300 పెరిగి రూ. 1,32,900కి చేరింది. అటు వెండి సైతం కేజీకి రూ. 3,500 పెరిగి రూ. 1,83,500 పలికింది. అంతర్జాతీయ మార్కెట్లలో స్పాట్ గోల్డ్ ధర ఒక దశలో సుమారు 15.10 డాలర్లు పెరిగి 4,223.76 డాలర్లకు చేరింది. -
బంగారం ధరల్లో ఇంత మార్పా!: గంటల వ్యవధిలోనే..
బంగారం ధరలు ఈ రోజు (డిసెంబర్ 2) మరోమారు తగ్గాయి. దీంతో పసిడి ధరలు మరింత తగ్గుముఖం పట్టాయి. ఈ కథనంలో హైదరాబాద్, విజయవాడ, ఢిల్లీ నగరాల్లోని లేటెస్ట్ గోల్డ్ రేట్ల గురించి వివరంగా తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడ, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఉదయం రూ. 250 తగ్గిన 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు.. సాయంత్రానికి 550 రూపాయలకు చేరింది. అంటే గంటల వ్యవధిలో 300 రూపాయలు తగ్గింది. దీంతో రేటు రూ. 1,19,050 (22 క్యారెట్స్ 10గ్రా) వద్ద నిలిచింది. 24 క్యారెట్ల 10 గ్రామ్స్ బంగారం ధర రూ. 610 తగ్గింది (ఉదయం రూ. 280 మాత్రమే తగ్గింది). దీంతో సాయంత్రానికి 24 క్యారెట్ల 10 గ్రామ్స్ గోల్డ్ రేటు రూ. 1,29,870 వద్ద నిలిచింది.ఢిల్లీలో కూడా బంగారం ధరలు మరింత తగ్గాయి. సాయంత్రానికి 24 క్యారెట్ల 10 గ్రామ్స్ పసిడి ధర 610 రూపాయలు తగ్గి రూ. 1,30,020 వద్ద నిలిచింది. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు 550 రూపాయలు తగ్గి రూ. 1,19,200 వద్ద నిలిచింది.చెన్నైలో బంగారం ధరలలో ఎటువంటి మార్పు లేదు. రేటు ఉదయం ఎలా ఉందో.. సాయంత్రానికి అలాగే ఉంది. 24 క్యారెట్ల 10 గ్రామ్స్ పసిడి ధర 320 రూపాయలు తగ్గి రూ. 1,31,350 వద్ద నిలిచింది. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు 300 రూపాయలు తగ్గి రూ. 1,20,400 వద్ద నిలిచింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
Gold Prices: శాంతించిన బంగారం ధరలు.. ఇవాళ తులం ఎంతుందుంటే..!
-
ఎగసి అలసిన పసిడి.. తులం ఎంతంటే..
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) తీవ్ర ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
ఆగని పసిడి పరుగు.. ఒకే రోజు రూ.3 వేలు పెరుగుదల
న్యూఢిల్లీ: బంగారం, వెండి ధరలు మరోసారి భగ్గుమన్నాయి. ఢిల్లీ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత పసిడి ధర సోమవారం 10 గ్రాములకు రూ.3,040 పెరిగి రూ.1,33,200కు చేరింది. ఇటీవలే నమోదైన జీవితకాల గరిష్ట ధర రూ.1,34,800కు చేరువైంది. మరో రూ.600కు పైగా పెరిగితే పసిడి ధరల్లో కొత్త రికార్డు నమోదు కానుంది. ప్రస్తుతం వివాహాల సీజన్ నడుస్తుండడంతో డిమాండ్ స్థిరంగా కొనసాగుతున్నట్టు, ఇది ధరలకు మద్దతునిస్తున్నట్టు విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు వెండి ధర సైతం వరుసగా ఐదో రోజు ర్యాలీ చేసింది. కిలోకి రూ.5,800 పెరిగి రూ.1,77,000కు చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర ఔన్స్కు 42 డాలర్లు ఎగసి (ఒక శాతం) 4,262.52 డాలర్ల స్థాయిని అందుకుంది. వెండి ధర (స్పాట్ మార్కెట్) ఔన్స్కి 3 శాతానికిపైగా ర్యాలీ చేసి 59 డాలర్లకు చేరింది. గత వారం రోజుల్లోనే వెండి ధర 16.7 శాతం పెరగడం గమనార్హం. అంతేకాదు 2025లో వెండి ధర రెట్టింపైంది. 2024 డిసెంబర్ 31న ఔన్స్ ధర 28.97 డాలర్ల వద్ద ఉంది. ‘‘యూఎస్ డాలర్ బలహీనపడడం, యూఎస్ ఫెడ్ వచ్చే వారంలో వడ్డీ రేట్లు తగ్గిస్తుందన్న అంచనాలు పెరగడం, సెంట్రల్ బ్యాంకుల నుంచి పసిడి కొనుగోళ్లు బలంగా కొనసాగుతుండడం ధరలను మరింత గరిష్టాల దిశగా నడిపిస్తోంది’’అని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ కమోడిటీ విభాగం సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ తెలిపారు. -
బంగారం ధరలు తగ్గుతాయా.. 46ఏళ్ల తరువాత రికార్డ్!
పండుగలు, పెళ్లిళ్లు మొదలైన శుభకార్యాలు వచ్చాయంటే.. బంగారం కోనేస్తుంటారు. కొన్నేళ్లుగా ఇది ఆనవాయితీగా వస్తోంది. దీంతో పసిడికి డిమాండ్ పెరిగిపోయింది, ధరలు కూడా పెరుగుదల దిశగా పరుగులు పెడుతూ ఉన్నాయి. ప్రస్తుతం గోల్డ్ రేటు జీవితకాల గరిష్టాలను చేరుకుని, సామాన్యులకు అందనంత ఎత్తుకు చేరిపోయింది. రాబోయే రోజుల్లో గోల్డ్ రేట్లు ఎలా ఉండనున్నాయో ఇక్కడ పరిశీలిద్దాం.2025 డిసెంబర్ 9, 10 తేదీల్లో యూఎస్ ఫెడరల్ రిజర్వ్ సమీక్ష జరగనుంది. ఈసారి కూడా 25 బేసిస్ పాయింట్ల వరకు వడ్డీ రేటు తగ్గే అవకాశం ఉంది. ఇదే జరిగితే బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఫెడ్ వడ్డీ రేటు తగ్గితే.. బంగారం ధర పెరుగుతుంది. ఈ వడ్డీ రేటులో ఎలాంటి మార్పు లేకపోతే.. గోల్డ్ రేటు తగ్గే అవకాశం ఉంది.2025 ప్రారంభం నుంచి బంగారం ధరలు పెరుగుతూ.. తగ్గుతూ వస్తున్నాయి. అయితే ఆగష్టు నుంచి నవంబర్ వరకు బంగారం ధరలు పెరుగుదల దిశగా పరుగులు పెడుతున్నాయి. ఈ నెలలో (డిసెంబర్) పెడ్ వడ్డీ రేట్లు తగ్గి.. బంగారం ధరలు పెరిగితే, 1979 తరువాత గోల్డ్ రేటు పెరుగుదల విషయంలో రికార్డ్ బ్రేక్ చేసినట్లే అవుతుంది. ఇదే జరిగితే 46ఏళ్ల తరువాత సరికొత్త రికార్డ్ క్రియేట్ అవుతుంది.1979లో బంగారం ధరలు ఎందుకు పెరిగాయంటే?1979లో అంతర్జాతీయ అనిశ్చితులు, ఆర్థిక అస్థిరత, రాజకీయ సంక్షోభాలు, ద్రవ్యోల్బణ భయం వంటి కారణాల రేటు 120 శాతం కంటే ఎక్కువ పెరిగింది.1979 తరువాత 2022, 2023లలో 14 శాతం, 2024లో 21 శాతం మేర బంగారం ధరలు పెరిగాయి. 2025లో గోల్డ్ రేటు 60 శాతం పెరుగుదలను అందుకుంది. దీన్నిబట్టి చూస్తే.. 46 సంవత్సరాల తరువాత బంగారం ధరలు పెరిగాయని స్పష్టంగా అర్థమవుతోంది.నేటి ధరలు ఇలా..గోల్డ్ రేటు ఈ రోజు (డిసెంబర్ 01) గరిష్టంగా రూ. 980 పెరిగింది(చెన్నైలో). దీంతో బంగారం ధర రూ. 1,30,630 వద్దకు చేరుకుంది. హైదరాబాద్, విజయవాడలలో 24 గ్యారేట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 660 పెరిగి రూ. 1,30,480 వద్ద నిలిచింది. 22 క్యారెట్స్ గోల్డ్ రేటు రూ. 600 పరైగింది. దీంతో 10 గ్రాముల 22క్యారెట్ల పసిడి ధర రూ. 1,19,600 వద్దకు చేరుకుంది. ప్రస్తుత పరిస్థితులను గమనిస్తుంటే.. గోల్డ్ రేటు మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.ఇదీ చదవండి: చెప్పినవే చేస్తాను.. విజేతగా మారాలంటే? -
చెప్పినవే చేస్తాను.. విజేతగా మారాలంటే?
రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత, అమెరికన్ వ్యాపారవేత్త 'రాబర్ట్ కియోసాకి'.. ఎప్పటికప్పుడు పెట్టుబడికి సంబంధించిన అనేక విషయాలను వెల్లడిస్తూ ఉంటారు. ఇప్పుడు తాజాగా.. మనీ టిప్ 2 పేరుతో.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలినప్పుడు విజేతగా ఎలా ఉండాలో అనే విషయం గురించి పేర్కొన్నారు.కియోసాకి తన ట్వీట్ ప్రారంభంలో.. 100 డాలర్లకు ఎంత కొంటారు? అని చెబుతూ.. 1900లో వంద డాలర్లకు, ఎనిమిది నెలలకు సరిపోయే సామాగ్రి వచ్చేది. కానీ ఇప్పుడు పరిస్థితి దిగజారిపోయింది అన్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలినప్పుడు విజేతగా ఎలా ఉండాలంటే.. ఓడిపోయేవారిగా ఉండటం మానేయండని పేర్కొన్నారు.ఓడిపోయినవారు ఎప్పుడూ పాత ఆలోచనలు పట్టుకుంటారు. విజేతలా ఆలోచించడం ప్రారంభించండి. డబ్బును పట్టుకోవడం మానేసి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలినప్పుడు విజేతగా మారండి. 1996లో ప్రచురించబడిన రిచ్ డాడ్ పూర్ డాడ్లో.. నేను “పొదుపు చేసేవారు ఓడిపోతారు” అని హెచ్చరించాను.ఇదీ చదవండి: 'ప్రపంచం పేదరికంలో ఉన్నా.. మీరు ధనవంతులు కావచ్చు'నేను చెప్పేవాటినే పాటిస్తుంటాను. నేను 1965 నుండి వెండిని ఆదా చేస్తున్నాను. 1972 నుండి బంగారం, 2019 నుంచి బిట్కాయిన్. 2023 నుంచి ఎథీరియం ఆదా చేస్తున్నానని కియోసాకి తన ట్వీట్ ద్వారా వెల్లడించారు. ఇటీవల నేను నా 4.5 మిలియన్ డాలర్ల ఇంటిని 2000లో కొనుగోలు చేసిన 4,50,000 డాలర్ల బంగారంతో కొనుగోలు చేసానని అన్నారు. త్వరలో టిప్ 3 వస్తుంది అని ట్వీట్ ముగించారు.HOW MUCH WILL $100 BUY?1900: $100 would buy 8 months of groceries.1960: $100 was worth $372000: $100 worth $62025: $100 worth $3.80Money tip # 2: On how to be a winner as the global economy crashes is:“Stop Being a Loser.”Losers are losers because they…— Robert Kiyosaki (@theRealKiyosaki) November 30, 2025 -
వారంలో ఇంత తేడానా!.. భారీగా పెరిగిన గోల్డ్ రేటు
బంగారం ధరలు పెరుగుతూ.. తగ్గుతూ.. రూ.1.30 లక్షలు దాటేసింది. కేవలం ఈ వారం రోజుల్లో (నవంబర్ 23 నుంచి 29 వరకు) గోల్డ్ రేటు గరిష్టంగా రూ. 3,980 పెరిగింది. ఈ కథనంలో ఏడు రోజుల్లో బంగారం ధరల్లో వచ్చిన మార్పుల గురించి వివరంగా తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడ, బెంగళూరు, ముంబై నగరాల్లో.. ఈ వారం రోజుల్లో ఊహకందని మార్పులు జరిగాయి. నవంబర్ 23న రూ. 1,25,840 వద్ద ఉన్న 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేటు.. ఈ రోజుకి (నవంబర్ 29) రూ. 1,29,820 వద్దకు చేరింది. అంటే రూ. 3980 పెరిగిందన్నమాట. 22 క్యారెట్ల గోల్డ్ విషయానికి వస్తే.. రూ. 1,15,350 వద్ద ఉన్న 10 గ్రాముల పసిడి ధర రూ. 1,19,000 వద్దకు చేరింది. దీన్నిబట్టి చూస్తే.. రేటు 3650 రూపాయలు పెరిగింది.చెన్నై విషయానికి వస్తే.. ఇక్కడ 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 1.30 లక్షలు దాటేసింది. అంటే వారం రోజుల్లో బంగారం ధరలు రూ. 3,810 పెరిగింది. 22 క్యారెట్ల పసిడి ధరలు రూ. 1,16,300 నుంచి రూ. 1,19,800 వద్దకు (రూ.3500 పెరిగింది) చేరాయి.ఢిల్లీలో కూడా గోల్డ్ రేటు పెరిగింది. గత ఆదివారం (నవంబర్ 23) రూ. 1,25,990 వద్ద ఉన్న 24 క్యారెట్ల బంగారం రేటు శనివారం (నవంబర్ 29) నాటికి రూ. 1,29,970 వద్దకు (రూ. 3,980 పెరిగింది) చేరింది. 22 క్యారెట్ల బంగారం ధర రూ. 1,15,500 నుంచి రూ. 1,19,150 వద్దకు (రూ. 3,650 పెరిగింది) చేరింది. -
'ప్రపంచం పేదరికంలో ఉన్నా.. మీరు ధనవంతులు కావచ్చు'
సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ.. పెట్టుబడికి సంబంధించిన అనేక విషయాలను వెల్లడించే రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి, తాజాగా ఒక ట్వీట్ చేసారు. ఇందులో ''ప్రపంచం పేదరికంలో ఉన్నప్పుడు మీరు ధనవంతులు కావచ్చు'' అని వెల్లడించారు.''జపాన్ క్యారీ ట్రేడ్ ముగిసింది. బబుల్ మార్కెట్లు తగ్గబోతున్నాయి. నా మంత్రానికి కట్టుబడి.. బంగారం, వెండి, బిట్కాయిన్ & ఎథెరియం కొనండి. గ్లోబల్ మార్కెట్స్ కుప్పకూలిపోతున్నప్పుడు ఎలా ధనవంతులు కావాలో నేను రాబోయే ట్వీట్లలో వెల్లడిస్తాను. అవును: ప్రపంచం పేదరికంలో ఉన్నప్పుడు మీరు ధనవంతులు కావచ్చు. జాగ్రత్త వహించండి.'' అని రాబర్ట్ కియోసాకి తన ఎక్స్ ఖాతాలో వెల్లడించారు.ఇదీ చదవండి: కియోసాకి ఆర్ధిక సూత్రాలు: ధనవంతులయ్యే మార్గాలుకియోసాకి ప్రకారం.. తక్కువ వడ్డీకి అప్పు తీసుకుని ప్రపంచ మార్కెట్లలో పెట్టుబడి పెట్టే.. జపాన్ క్యారీ ట్రేడ్ ఇప్పుడు పనిచేయడం తగ్గిపోతోంది. దీని ప్రభావంగా ప్రపంచ స్టాక్ మార్కెట్లు పడుతుందని, బంగారం, వెండి వంటివాటితో పెట్టుబడి పెట్టండి. స్టాక్ మార్కెట్లలో అల్లకల్లోలం ఏర్పడినా.. ప్రపంచం పేదరికంలో ఉన్నా.., మీరు తప్పకుండా ధనవంతులు అవుతారు.Japan “Carry Trade” ended.Watch out below. Bubble Markets about to deflate.Standing by my mantra…buy gold, silver, Bitcoin, and Ethereum.More recommendations on how to get rich while world collapses will follow in future Tweets.Yes: you can get richer while world gets…— Robert Kiyosaki (@theRealKiyosaki) November 29, 2025 -
Gold Rate: మళ్లీ పెరిగిన బంగారం ధర
-
అంతులేని వేగం.. ఆగేదెప్పుడో!
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) తీవ్ర ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
బంగారు నగలపై ఓవర్డ్రాఫ్ట్.. వివరాలివే..
కొంతకాలంగా అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు పరుగులు పెడుతున్నాయి. ద్రవ్యోల్బణం, భౌగోళిక రాజకీయ అనిశ్చితి నేపథ్యంలో అనేక మందికి బంగారం కేవలం ఆభరణంగా కాకుండా అత్యంత విశ్వసనీయమైన పెట్టుబడి సాధనంగా మారింది. అత్యవసర ఆర్థిక అవసరాల కోసం తమ బంగారాన్ని అమ్మివేయడం లేదా తాకట్టు పెట్టడం సర్వసాధారణం. అయితే అత్యవసరంగా డబ్బు అవసరమైనప్పుడు బంగారాన్ని సాధారణ పద్ధతిలో తాకట్టు పెట్టకుండా, అమ్ముకోకుండానే దాన్ని ఉపయోగించుకునే అద్భుతమైన మార్గం ఉంటే? అవును, అదే బంగారు నగలపై ఓవర్డ్రాఫ్ట్ (Overdraft on Gold Jewellery) సదుపాయం. పెరుగుతున్న బంగారం ధరల నేపథ్యంలో అనేక ప్రముఖ బ్యాంకులు తమ వినియోగదారులకు ఈ ప్రత్యేక సౌకర్యాన్ని అందిస్తూ వారి ఆర్థిక అవసరాలకు భరోసా కల్పిస్తున్నాయి.గోల్డ్ ఓవర్డ్రాఫ్ట్ ఫెసిలిటీ అంటే?బంగారు నగలపై ఓవర్డ్రాఫ్ట్ సౌకర్యం అనేది ఒక రకమైన సురక్షితమైన రుణం (Secured Loan). ఇది వ్యక్తిగత రుణం లాంటిది కాకుండా, ఒక క్రెడిట్ లైన్లాగా పనిచేస్తుంది. సాధారణంగా గోల్డ్ లోన్లో ఒకేసారి మొత్తం డబ్బు తీసుకుని దానిపై వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. కానీ ఓవర్డ్రాఫ్ట్ సదుపాయంలో మీ బంగారు ఆభరణాల విలువను బట్టి బ్యాంక్ నిర్దిష్ట పరిమితి(Limit)తో రుణాన్ని మంజూరు చేస్తుంది. వినియోగదారుడు ఈ పరిమితి నుంచి అతనికి అవసరమైన మేరకు ఎప్పుడైనా, ఎంతైనా డబ్బును డ్రా చేసుకునే సౌలభ్యం ఉంటుంది.మీరు డ్రా చేసుకున్న అసలు మొత్తంపై (Utilised Amount) మాత్రమే వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. మంజూరైన మొత్తం పరిమితిపై కాదు. ఈ సౌకర్యం సాధారణంగా ఒక సంవత్సరం లేదా అంతకంటే ఎక్కువ కాలం పాటు చెల్లుబాటు అవుతుంది. మీ సౌలభ్యాన్ని బట్టి క్రమానుగతంగా రుణం తిరిగి చెల్లించవచ్చు.వినియోగదారులకు ఉపయోగాలుబంగారు నగలపై ఓవర్డ్రాఫ్ట్ సౌకర్యం ద్వారా వినియోగదారులకు కీలక ప్రయోజనాలు ఉన్నాయి. యూజర్లు డ్రా చేసుకున్న మొత్తానికే వడ్డీ లెక్కిస్తారు. ఉదాహరణకు, మీకు రూ.5 లక్షల పరిమితి మంజూరైతే అందులో రూ.2 లక్షలు మాత్రమే వాడుకుంటే ఆ రూ.2 లక్షలపై మాత్రమే వడ్డీ చెల్లించాలి.ఓవర్డ్రాఫ్ట్ ఖాతాలో నిధులు జమ చేయడం ద్వారా తీసుకున్న రుణాన్ని ఎప్పుడైనా, ఎన్నిసార్లైనా పాక్షికంగా లేదా పూర్తిగా తిరిగి చెల్లించవచ్చు. నెలవారీ ఈఎంఐ (EMI) లాంటి కఠిన నిబంధనలు ఉండవు.వ్యాపార అవసరాలు, వైద్య ఖర్చులు లేదా ఇతర అత్యవసరాల కోసం తక్షణమే నిధులు పొందవచ్చు.గోల్డ్ లోన్ లేదా గోల్డ్ ఓవర్డ్రాఫ్ట్లకు వ్యక్తిగత రుణాల కంటే వడ్డీ రేట్లు సాధారణంగా తక్కువగా ఉంటాయి.బంగారు ఆభరణాలు సురక్షితంగా బ్యాంకు వాల్ట్లో ఉంటాయి. వాటిని అమ్ముకోవాల్సిన అవసరం లేదు.బంగారం విలువను ఎలా లెక్కిస్తారు..బంగారు నగలపై ఓవర్డ్రాఫ్ట్ సౌకర్యాన్ని పొందడానికి వినియోగదారులు సాధారణంగా కొన్ని అర్హతలు కలిగి ఉండి ధ్రువపత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. సాధారణంగా 18 క్యారెట్ల (Carat) నుంచి 24 క్యారెట్ల మధ్య స్వచ్ఛత కలిగిన బంగారు ఆభరణాలపై బ్యాంకులు ఓడీ ఇస్తాయి. వినియోగదారుడికి కావలసిన పరిమితిని బట్టి తగినంత బరువున్న బంగారాన్ని సమర్పించాల్సి ఉంటుంది.బ్యాంక్ నియమించిన వాల్యుయేటర్ బంగారు ఆభరణాల స్వచ్ఛతను, బరువును నిర్ధారించి వాటి ప్రస్తుత మార్కెట్ విలువను లెక్కిస్తారు. ఈ విలువలో 70% నుంచి 75% వరకు ఓవర్డ్రాఫ్ట్ పరిమితిని మంజూరు చేస్తారు.ఛార్జీలుబంగారు నగలపై ఓవర్డ్రాఫ్ట్ (OD) సౌకర్యాన్ని వినియోగించుకునేటప్పుడు వినియోగదారులు చెల్లించాల్సిన ప్రధాన ఛార్జీల్లో వడ్డీ రేటు ముఖ్యమైనది. ఓడీ పరిమితి నుంచి తీసుకున్న అసలు మొత్తానికి మాత్రమే లెక్కిస్తారు. ఈ వడ్డీ సాధారణంగా రోజువారీగా లెక్కిస్తారు. బ్యాంకును అనుసరించి సంవత్సరానికి 8% నుంచి 15% మధ్య మారుతూ ఉంటుంది.కొన్ని బ్యాంకులు ప్రాసెసింగ్ ఫీజు వసూలు చేస్తున్నాయి. ఇది బ్యాంక్ ఓవర్డ్రాఫ్ట్ దరఖాస్తును ప్రాసెస్ చేయడానికి, అకౌంట్ను సెటప్ చేయడానికి వసూలు చేసే ఏకమొత్తం ఛార్జీ. ఈ ఫీజు సాధారణంగా మంజూరైన మొత్తం ఓవర్డ్రాఫ్ట్ పరిమితిలో 0.5% నుంచి 1.5% వరకు ఉంటుంది.వాల్యుయేషన్ ఛార్జీలు.. బ్యాంక్ నియమించిన వాల్యుయేటర్ బంగారు ఆభరణాల స్వచ్ఛతను, బరువును తనిఖీ చేసి దాని ప్రస్తుత మార్కెట్ విలువను నిర్ణయిస్తారు. ఈ సర్వీసు కోసం వసూలు చేసే ఫీజునే వాల్యుయేషన్ ఛార్జీలు అంటారు. అలాగే రుణ ఒప్పందాలను చట్టబద్ధం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల మేరకు స్టాంప్ డ్యూటీ ఛార్జీని వినియోగదారులే భరించాల్సి ఉంటుంది.ఓవర్డ్రాఫ్ట్ సదుపాయాన్ని అందిస్తున్న బ్యాంకులు1. ఫెడరల్ బ్యాంక్: డిజి గోల్డ్ ఓవర్ డ్రాఫ్ట్ పథకం2. సీఎస్బీ బ్యాంక్: ఓవర్ డ్రాఫ్ట్ గోల్డ్ లోన్ స్కీమ్3. తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్ (TMB): టీఎంబీ గోల్డ్ ఓవర్ డ్రాఫ్ట్ స్కీమ్4. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Union Bank of India): బంగారు ఆభరణాలపై ఎస్ఓడీ (Secured Overdraft on Gold Ornaments - SOD).ఇదీ చదవండి: ఇండియాలో ‘గూగుల్ మీట్’ డౌన్ -
సిల్వర్ ఈటీఎఫ్ల మెరుపులు
’’అలుపెరుగకుండా పరుగుతీస్తున్న బంగారం బాటలోనే వెండిలో కూడా పెట్టుబడులు చేపట్టేందుకు మూడేళ్ల క్రితం దేశీయంగా ఎక్సే్ఛంజ్ ట్రేడెడ్ ప్రొడక్టు (ఈటీపీ)లకు తెరతీశారు. వీటిలో ఈటీఎఫ్లు ప్రధాన భాగం. దీంతో 2022లో వెండి ఈటీఎఫ్లు ఊపిరిపోసుకున్నాయి. తొలి దశలో ఇన్వెస్టర్లు పెట్టుబడులకు అంతగా ఆసక్తి చూపకపోయినప్పటికీ ఏడాదిన్నర కాలంగా ఇవి జోరందుకున్నాయి. దీంతో 2007లోనే ప్రారంభమైన పసిడి ఈటీఎఫ్లను వెనక్కి నెడుతూ వెండి ఈటీఎఫ్లు భారీస్థాయిలో పెట్టుబడులను ఆకట్టుకుంటున్నాయి. వివరాలు చూద్దాం.. – సాక్షి, బిజినెస్ డెస్క్ ప్రపంచంలోనే అత్యంత విలువైన లోహా లు బంగారం, వెండిలో పెట్టుబడులకు వీలుగా రూపొందించిన ఎక్సే్ఛంజ్ ట్రేడెడ్ ఫండ్స్(ఈటీఎఫ్లు)కు ఆదరణ పెరుగుతోంది. ప్రపంచ దేశాలలో బంగారం వినియోగంలో భారత్, చైనాలు టాప్ ర్యాంకులో నిలుస్తుంటే.. వస్తురూపేణా (ఫిజికల్) వెండి కొనుగోళ్లకు సైతం భారత్ రెండో ర్యాంకులో నిలుస్తోంది. దేశీయంగా ఇటీవల ఈటీఎఫ్ల ప్రవేశంతో ప్రధానంగా వెండిలో పెట్టుబడులు అధికమయ్యాయి.పసిడి ధరల ర్యాలీతో పోలిస్తే కొద్ది నెలలుగా వెండి వెనుకబాటు దీనికి కారణమైనట్లు బులియన్ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే ఇటీవల కొద్ది నెలలుగా సౌర విద్యుదుత్పత్తితోపాటు.. ఎల్రక్టానిక్స్, ఎలక్ట్రిక్ వాహన తయారీ, వినియోగానికి పెరుగుతున్న డిమాండ్ వెండి ధరలకు జోష్నివ్వనున్న అంచనాలు ఇన్వెస్టర్లకు ప్రోత్సాహాన్నిస్తున్నట్లు తెలియజేశాయి. ఫలితంగా ఇటీవల వెండిలో ఫిజికల్ కొనుగోళ్లు, ఈటీఎఫ్ల ద్వారా పెట్టుబడులు ప్రవహిస్తున్నట్లు వివరించాయి. 200 శాతం జూమ్ 2022తో పోలిస్తే సిల్వర్ ఈటీఎఫ్లలో పెట్టుబడులు వార్షిక ప్రాతిపదికన 200 శాతం దూసుకెళ్లాయి. న్యూయార్క్ సిల్వర్ ఇన్స్టిట్యూట్ వివరాల ప్రకారం ఈ కాలంలో దేశీ ఇన్వెస్టర్ల హోల్డింగ్స్ 18 రెట్లు ఎగశాయి. ఈ బాటలో గత 18 నెలల్లో పెట్టుబడులు భారీగా జంప్చేశాయి. తాజాగా వెండి హోల్డింగ్స్ 5.8 కోట్ల ఔ న్స్లు (1,800 టన్నులు)ను దాటాయి. 2024 చివరితో పోలిస్తే ఇది 51 శాతం అధికం! పెట్టుబడుల దూకుడు మూడేళ్ల క్రితం(2022 తొలి త్రైమాసికం) వెండి ఈటీఎఫ్లు ప్రవేశపెట్టినప్పుడు హోల్డింగ్స్ 2.1 మిలియన్ ఔన్స్లు (65 టన్నులు) మాత్రమే. తదుపరి పెట్టుబడులు ఊపందుకోవడంతో 2024 చివరి క్వార్టర్కల్లా 3.8 కోట్ల ఔన్స్ల (1,183 టన్నులు)కు చేరాయి. ఇది వార్షికంగా 200 శాతం వృద్ధికాగా.. ఒక్క 2024లోనే 2.51 కోట్ల ఔన్స్ల (782 టన్నులు) పెట్టుబడులు జత కలిశాయి. ఆపై వెండి ఈటీఎఫ్లు మరింత జోరందుకున్నాయి. పసిడి వెనుకడుగు వెండి ఈటీఎఫ్లతో పోలిస్తే ఇన్వెస్టర్లు పసిడి ఈటీఎఫ్లలో పెట్టుబడులకు అంతగా ఆసక్తి చూపడం లేదు. ఇందుకు బంగారం కాయిన్లు, ఆభరణాల(ఫిజికల్) కొనుగోళ్లకు ప్రాధాన్యత ఇవ్వడం ప్రభావం చూపుతోంది. ఫలితంగా 2007లో ప్రారంభమైన గోల్డ్ ఈటీఎఫ్ల హోల్డింగ్స్ 2 మిలియన్ ఔన్స్ల(64 టన్నులు)కు చేరినట్లు తెలియజేశాయి. 2024లో గోల్డ్ ఈటీఎఫ్లలో కేవలం 0.5 మిలియన్ ఔన్స్లు(15 ట న్నులు) జమయ్యాయి. అయితే 2024కల్లా గత నాలుగేళ్ల కాలంలో ఇవి 27.4 టన్నుల నుంచి 54.5 టన్నులకు పుంజుకున్నాయి. 2025లో కొనుగోళ్లు మరింత పెరిగాయి. కాగా.. ఈ ఏడాది(2025)లో ఇప్పటివరకూ వెండి ధరలు 75 శాతం దూసుకెళ్లగా.. పసిడి 55 శాతం బలపడిన విషయం విదితమే.పసిడి రూ. 3,500 జూమ్⇒ ఢిల్లీలో రూ. 1,28,900కి గోల్డ్ ⇒ వెండి కూడా రూ. 5,800 అప్ న్యూఢిల్లీ: పసిడి ధరలు మరోసారి పరు గు తీశాయి. న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో మంగళవారం 99.9% స్వచ్ఛత గల పది గ్రాముల బంగారం ధర రూ. 3,500 పెరి గి రూ. 1,28,900కి చేరింది. వెండి ధర కూడా కిలోకి రూ. 5,800 పెరిగి రూ. 1,60,800కి చేరింది. మరోవైపు, ఎంసీఎక్స్ ఫ్యూచర్స్ మార్కెట్లో డిసెంబర్ డెలివరీ పసిడి కాంట్రాక్టు ధర రూ. 1,458 ఎగిసి ఒక దశలో రూ. 1,25,312 వద్ద ట్రేడయ్యింది. వెండి కూడా రూ. 2,583 మేర ఎగిసి రూ. 1,57,065 వద్ద ట్రేడయ్యింది. న్యూయార్క్ కామెక్స్లో పసిడి డిసెంబర్ కాంట్రాక్టు ధర ఔన్సుకి (31.1 గ్రాములు) 47.8 డాలర్లు పెరిగి 4,142 డాలర్ల స్థాయిని తాకింది. సిల్వర్ ఫ్యూచర్స్ రేటు 1.94 శాతం పెరిగి 51.30 డాలర్ల వద్ద ట్రేడయ్యింది. -
బంగారం... ఎందుకీ హెచ్చుతగ్గులు?
బంగారం ధరలు కొన్నిసార్లు విపరీతంగా పెరుగుతుంటాయి. కొన్ని సార్లు అమాంతం తగ్గిపోతుంటాయి. ఇలా పెరుగుతూ.. తగ్గుతూ తులం గోల్డ్ రేటు రూ. 1.20 లక్షలు దాటేసింది. ఇంతకీ గోల్డ్ రేటు పెరగడానికి కారణం ఏమిటి?, ధరలు తగ్గడానికి దోహదపడే అంశాలు ఏమిటనేది.. ఇక్కడ తెలుసుకుందాం.గోల్డ్ రేటు పెరగడానికి ప్రధాన కారణాలుద్రవ్యోల్బణం: ద్రవ్యోల్బణం పెరిగితే.. కరెన్సీ విలువ తగ్గుతుంది. ఈ సమయంలో ప్రజలు తమ డబ్బును కాపాడుకోవడానికి బంగారంపై పెట్టుబడి పెడతారు. దీనివల్ల గోల్డ్ కొనేవారి సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. దీంతో పసిడి ధర అమాంతం పెరుగుతుంది.ప్రపంచ రాజకీయ ఉద్రిక్తతలు & ఆర్థిక అస్థిరత: ప్రపంచ యుద్దాలు, రాజకీయ పరిణామాలు, ఆర్ధిక సంక్షోభాలు పెరిగినప్పుడు.. సురక్షితమైన పెట్టుబడి కోసం పెట్టుబడిదారులు బంగారం కొనుగోలు చేయడానికి మొగ్గుచూపుతారు. ఇది కూడా బంగారం ధర పెంచడానికి కారణమవుతుంది.రూపాయి / డాలర్ విలువ: రూపాయి విలువ లేదా డాలర్ విలువ తగ్గినప్పుడు కూడా ప్రజలు బంగారంపైన పెట్టుబడి పెడతారు. ఈ సమయంలో ఆయాదేశాలు దిగుమతి చేసుకునే బంగారం విలువ పెరుగుతుంది. దీంతో కొనుగోలుదారులు కూడా బంగారం కొనుగోలు చేయడానికి కొంత ఎక్కువ మొత్తం వెచ్చించాల్సి వస్తోంది.పండుగ సీజన్స్: ముఖ్యంగా భారతదేశంలో బంగారం ధరలు పెరగడానికి ప్రధాన కారణం పండుగ సీజన్స్ అనే చెప్పాలి. ఎందుకంటే దీపావళి, ధనత్రయోదశి వంటి పండుగల సమయంలో బంగారం కొంటే మంచిదని భావించే చాలామంది ఫాల్స్ కొనుగోలు చేస్తుంటారు. పెళ్లిళ్ల సీజన్ కూడా పసిడి ధరల పెరుగుదలకు కారణమవుతుంది.సెంట్రల్ బ్యాంకుల కొనుగోలు: ప్రపంచ బ్యాంకులు బంగారం నిల్వలు పెంచితే మార్కెట్లో.. గోల్డుకు డిమాండ్ పెరుగుతుంది. డిమాండ్ పెరిగితే.. ధరలు తప్పకుండా పెరుగుతాయి.బంగారం ధరలు తగ్గడానికి కారణాలుఆర్థిక పరిస్థితులు: ప్రపంచ ఆర్ధిక పరిస్థితి మెరుగుపడినప్పుడు పెట్టుబడిదారులు బంగారానికి ప్రత్యామ్నాయంగా.. స్టాక్ మార్కెట్, బాండ్స్ వంటి అధిక రిటర్న్స్ ఇచ్చే వాటిమీద పెట్టుబడి పెడతారు. దీనివల్ల గోల్డ్ కొనేవారి సంఖ్య తగ్గుతుంది. దీంతో ధరలు కూడా తగ్గుతాయి.డాలర్ విలువ: డాలర్ విలువ పెరిగినప్పుడు.. పెట్టుబడిదారులు బంగారంపై ఆసక్తి చూపరు. దీంతో గోల్డ్ రేటు తగ్గుతుంది. డాలర్ విలువ తగ్గినప్పుడు బంగారం ధర పెరుగుతుంది. ఇది తప్పకుండా గుర్తుంచుకోవాల్సిన విషయం.వడ్డీ రేట్లు: యూఎస్ ఫెడరల్ రిజర్వ్ లేదా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్లను పెంచితే.. డిపాజిట్లు, బాండ్స్ వైపు తిరుగుతారు. ఇది గోల్డ్ మీద ఆసక్తిని తగ్గిస్తుంది. ధరలు ఆటోమాటిక్గా తగ్గుతాయి.సెంట్రల్ బ్యాంకులు: సెంట్రల్ బ్యాంకులు తమ వద్ద ఉన్న బంగారం నిల్వలను అమ్మినప్పుడు కూడా గోల్డ్ రేటు తగ్గుతుంది.సీజన్: పండుగలు, పబ్బాలు లేనప్పుడు చాలామంది సాధారణ ప్రజలు బంగారం కొనాలనే ఆలోచన చేయరు. కాబట్టి ఇలాంటి సమయంలో బంగారం ధరలు తగ్గుతాయి.''ఒక్కమాటలో చెప్పాలంటే.. పసిడికి డిమాండ్ పెరిగితే, ధరలు పెరుగుతాయి. డిమాండ్ తగ్గితే.. ధరలు కూడా తగ్గుతాయి.''ఇదీ చదవండి: జీవితంలో ఎదగాలంటే.. బఫెట్ చెప్పిన సూత్రాలు -
భార్యపై ప్రేమ: నాణేలు కూడబెట్టి..
ఇటీవల కాలంలో భార్య, భర్తకు.. భర్త, భార్యకు గిఫ్ట్స్ ఇచ్చిపుచ్చుకోవడం, సర్ప్రైజ్ ఇవ్వడం సర్వ సాధారణం అయిపోయింది. అయితే కొంతమంది భిన్నంగా ఆలోచిస్తారు. దీనికి కారణం వారి ఆర్ధిక స్తోమత కావచ్చు.. లేదా ఇంకేదైనా కారణం కూడా కావొచ్చు. ఇలాంటి సంఘటనే ఉత్తరప్రదేశ్లో వెలుగులోకి వచ్చింది.ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లోని అహిర్వాన్ ప్రాంతానికి చెందిన 22ఏళ్ల అభిషేక్ యాదవ్.. పాన్ షాప్ నడుపుకుంటూ ఉండేవాడు. ఇతడు ఏడాది క్రితమే పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి తరువాత తన భార్యకు బంగారు గొలుసు ఇచ్చి సర్ప్రైజ్ చేయాలనుకున్నాడు. అయితే అతని ఆర్ధిక పరిస్థితి కారణంగా ఒకేసారి గొలుసు కొనలేడు. కాబట్టి డబ్బు కూడబెట్టాలనుకున్నాడు. అప్పటి నుంచి నాణేలను పోగు చేయడం ప్రారంభించాడు. ఏడాది పొడువునా రూ.10, రూ. 20నాణేలను కూడబెట్టాడు.మొత్తం కూడబెట్టిన నాణేల బస్తాలను.. బంగారు ఆభరణాల దుకాణానికి తీసుకెళ్లాడు. బస్తాలను కౌంటర్లో దగ్గర పెట్టాడు. ఇది చూసిన షాప్ యజమాని మహేష్ వర్మ మొదట ఆశ్చర్యపోయాడు. ఇన్ని నాణేలను బ్యాంకు కూడా తీసుకోదని వర్మ.. అభిషేక్తో చెప్పాడు. కానీ కొంతసేపటి తరువాత అంగీకరించాడు. మొత్తం నాణేలను లెక్కపెడితే.. రూ. 1.05 లక్షలు ఉన్నాయి. దీనిని లెక్కపెట్టడానికి రెండు గంటల సమయం పట్టిందని పేర్కొన్నారు.ఇదీ చదవండి: షఫాలీ వర్మ కొత్త స్పోర్ట్స్ కారు: ధర ఎంతో తెలుసా?అభిషేక్ యాదవ్ తన భార్య కోసం కొన్న గొలుసు రూ. 1.25 లక్షలు. కానీ అతడు తెచ్చిన డబ్బును మహేష్ వర్మ తీసుకుని, మిగిలిన డబ్బును వాయిదాల పద్దతిలో కట్టించుకోవడానికి అంగీకరించాడు. మొత్తానికి యాదవ్ తన భార్య కోసం.. బంగారు గొలుసు కొనేసాడు.A Kanpur Paan sellar saves ₹20 Coins daily to buy ₹1 Lakh Gold Chain as a surprise Gift for his Wife.JEWELLER : I was SHOCKED. It took more than two hours to count all the coins 😳MAN : I’ll present it to her when she returns from her Maayka ♥️ pic.twitter.com/Dr0nMX6htj— News Algebra (@NewsAlgebraIND) November 23, 2025 -
‘క్రాష్ మొదలైంది.. బంగారం, వెండి కొనుగోలుకిదే సమయం’
పెట్టుబడులు, ఆర్థిక విషయాలపై ఎప్పకప్పుడు వ్యాఖ్యానించే ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ (Rich Dad Poor Dad) పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి తాజాగా మరో హెచ్చరికను జారీ చేశారు. "చరిత్రలో అతిపెద్ద క్రాష్" ప్రారంభమైందంటూ సోషల్ ప్లాట్ ఫామ్ ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు.2013లో తాను ప్రచురించిన పుస్తకం రిచ్ డాడ్స్ ప్రొఫెసీని ప్రస్తావిస్తూ దశాబ్దం క్రితం తాను అంచనా వేసిన ప్రపంచ మాంద్యం ఇప్పుడు బయటపడుతోందని, ఇది ఒక్క అమెరికాను మాత్రమే కాకుండా యూరప్, ఆసియాను కూడా ప్రభావితం చేస్తుందని చెప్పారు.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో వేగవంతమైన పురోగతి ఉద్యోగాలను ఊడ్చేస్తుందని, ఇది జరిగితే వాణిజ్య, నివాస రియల్ ఎస్టేట్ రెండింటిలోనూ భారీ పతనం తప్పదని రాబర్ట్ కియోసాకి (Robert Kiyosaki) నమ్ముతున్నారు.బంగారం, వెండి.. కొనాల్సిందిప్పుడే.. తన దీర్ఘకాల పెట్టుబడి అభిప్రాయాలను పునరుద్ఘాటిస్తూ, కియోసాకి బంగారం (Gold), వెండి, బిట్ కాయిన్, ఎథేరియం హోల్డింగ్స్ ను పెంచుకోవాల్సిన సమయం ఆసన్నమైందని తన ఫాలోవర్లకు సూచించారు. ముఖ్యంగా ఈ పరిస్థితిలో వెండి కొనడం ఉత్తమం, సురక్షితమని పేర్కొన్నారు. ప్రస్తుతం ఒక ఔన్స్కు 50 డాలర్ల వద్ద ఉన్న వెండి (Silver Price) త్వరలో 70 డాలర్లకి పెరుగుతుందని, 2026 నాటికి అయితే 200 డాలర్లకు చేరుకుంటుందని అంచనా వేశారు.ఇది చదివారా? బిట్కాయిన్ క్రాష్: కియోసాకి షాకింగ్ ప్రకటనధనవంతులవుతారు!"శుభవార్త ఏమిటంటే, లక్షలాది మంది తమ సంపదను పోగుట్టుకుంటున్నా... మీరు సిద్ధంగా ఉంటే... ఈ క్రాష్ మిమ్మల్ని ధనవంతులను చేస్తుంది"అని కియోసాకి రాసుకొచ్చారు. ఈ క్రాష్ నుంచి సంపన్నులు అయ్యేందుకు మరిన్ని మార్గాలను రానున్న ట్వీట్లలో వివరిస్తానన్నారు.BIGGEST CRASH IN HISTORY STARTINGIn 2013 I published RICH DADs PROPHECY predicting the biggest crash in history was coming.Unfortunately that crash has arrived.It’s not just the US. Europe and Asia are crashing.AI will wipe out jobs and when jobs crash office and…— Robert Kiyosaki (@theRealKiyosaki) November 23, 2025 -
పెరిగిన బంగారం ధరలు: ప్రధాన కారణం ఇదే!
బంగారం ధరలు గత కొన్ని రోజులుగా తగ్గుతూ.. పెరుగుతూ ఉన్నాయి. ఈ రోజు (నవంబర్ 22) గోల్డ్ రేటు కొంత ఎక్కువగానే పెరిగింది. దీంతో పసిడి ధరలు పెరుగుదల దిశగా పరుగులు తీశాయి. ఇంతకీ ధరలు ఎందుకు ఇంతలా పెరుగుతున్నాయనే విషయాన్ని ఇక్కడ తెలుసుకుందాం.భారతదేశంలో పెళ్లిళ్ల సీజన్ ఇప్పటికే ప్రారంభమైంది. ఇది బంగారం ధరలు పెరగడానికి ప్రధాన కారణం అయింది. మన దేశంలో పెళ్లి అంటేనే చాలామంది ఆడంబరంగా జరుగుపుకుంటారు. ఇలాంటి సమయంలో గోల్డ్ కొనేవాళ్ల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. ఈ ఏడాది డిసెంబర్ 14నాటికి సుమారు 48 లక్షల వివాహాలు జరగనున్నాయని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (CAIT) అంచనా.ఈ ఏడాది 48 లక్షల వివాహాలు జరుగుతున్నాయంటే.. బిజినెస్ కూడా రూ. 6.5 లక్షల కోట్లు ఉంటుందని CAIT తన నివేదికలో వెల్లడించింది. ఇందులో 15 శాతం (సుమారు రూ. 97,500 కోట్లు) గోల్డ్ బిజినెస్ ఉంటుంది. అంటే ఈసారి రూ. 97,500 కోట్ల విలువైన బంగారం సేల్.. ఈ పెళ్లిళ్ల సీజన్లో జరుగుతుందని చెబుతున్నారు. దీన్ని బట్టి చూస్తే పసిడికి డిమాండ్ పెరుగుతుంది. తద్వారా ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది.ఈ రోజు ధరలు ఇలానిన్న (నవంబర్ 21) స్వల్పంగా తగ్గిన గోల్డ్ రేటు.. ఈ రోజు సమంత పెరిగింది. దీంతో బంగారం ధర గరిష్టంగా.. 1,860 రూపాయలు పెరిగి, రూ. 125840 (24 క్యారెట్స్ 10 గ్రామ్స్) వద్దకు చేరింది. 22 క్యారెట్స్ 10 గ్రామ్స్ పసిడి రేటు 1700 రూపాయలు పెరిగి.. రూ.115350 వద్ద నిలిచింది.ఇదీ చదవండి: అప్పుడు రూ.30 లక్షలు.. ఇప్పుడు లక్షల కోట్ల కంపెనీ! -
డిజిటల్ గోల్డ్ను నియంత్రించం
న్యూఢిల్లీ: డిజిటల్ బంగారం లేదా ఈ–బంగారం వంటి ఉత్పత్తులను నియంత్రించాలనుకోవడం లేదని సెబీ చైర్మన్ తుహిన్ కాంత పాండే స్పష్టం చేశారు. ఇవి తమ పరిధిలోకి రావన్నారు. రీట్, ఇని్వట్–2025 జాతీయ స్థాయి సమావేశంలో పాల్గొనేందుకు వచి్చన సందర్భంగా మీడియాతో మాట్లాడారు. మ్యూచువల్ ఫండ్స్ అందించే గోల్డ్ ఎక్సే్ఛంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (గోల్డ్ ఈటీఎఫ్లు) లేదా ట్రేడింగ్కు వీలయ్యే ఇతర బంగారం సెక్యూరిటీలనే సెబీ నియంత్రిస్తున్నట్టు చెప్పారు. నియంత్రణల పరిధిలో లేని డిజిటల్ గోల్డ్ లేదా ఈ–గోల్డ్లో లావాదేవీలతో రిస్క్ ఉందంటూ.. వీటికి దూరంగా ఉండాలంటూ ఇటీవలే సెబీ హెచ్చరిక జారీ చేయడం గమనార్హం. ‘‘ఆ తరహా డిజిటల్ గోల్డ్ ఉత్పత్తులు సెబీ నియంత్రించే బంగారం ఉత్పత్తులకు భిన్నమైనవి. వాటిని సెక్యూరిటీలుగా లేదా కమోడిటీ డెరివేటివ్లుగా నోటిఫై చేయలేదు. అవి పూర్తిగా సెబీ నియంత్రణల వెలుపల పనిచేస్తున్నాయి. అటువంటి డిజిటల్ బంగారం సాధనాలతో ఇన్వెస్టర్లు గణనీయమైన రిస్్కను ఎదుర్కోవాల్సి రావచ్చు’’అని సెబీ తన ప్రకటనలో పేర్కొంది. భౌతిక బంగారానికి ప్రత్యామ్నాయమంటూ కొన్ని ఆన్లైన్ ప్లాట్ఫామ్లు డిజిటల్ గోల్డ్పై ప్రచారం చేస్తున్నట్టు సెబీ దృష్టికి రావడంతో ఈ హెచ్చరిక జారీ చేసింది. దీంతో డిజిటల్ గోల్డ్ను ఆఫర్ చేసే ప్లాట్ఫామ్లు తమను సైతం సెబీ నియంత్రణల పరిధిలోకి తీసుకురావాలని డిమాండ్ చేశాయి. -
తారుమారైన బంగారం ధరలు: సాయంత్రానికే..
బంగారం ధరలలో రోజురోజుకి ఊహకందని మార్పులు జరుగుతున్నాయి. ఈ రోజు (నవంబర్ 21) ఉదయం పెరిగిన గోల్డ్ రేటు.. సాయంత్రానికి తగ్గుముఖం పట్టాయి. అంటే గంటల వ్యవధిలో పసిడి ధరలు తారుమారయ్యాయి.విజయవాడ, హైదరాబాద్, బెంగళూరు, ముంబై నగరాల్లో బంగారం ధరలు ఉదయం రూ. 1,14,100 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్), రూ. 1,24,480 (24 క్యారెట్స్ 10 గ్రామ్స్) వద్ద ఉన్నాయి. ఈ ధరలు సాయంత్రానికి వరుసగా రూ. 1,13,800 (రూ. 250 తగ్గింది), రూ. 1,24,130 (రూ. 280 తగ్గింది) వద్దకు చేరాయి.ఢిల్లీలో కూడా ఉదయం పెరిగిన గోల్డ్ రేటు.. సాయంత్రానికి తగ్గింది. ఉదయం 24 క్యారెట్ల 10 గ్రామ్స్ ధర రూ. 200 (రూ. 1,24,630), 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రేటు రూ. 220 (రూ. 1,14,250) పెరిగింది. ఈ ధరలు సాయంత్రానికి వరుసగా రూ. 280 (రూ. 1,24,130), రూ. 250 (రూ. 1,13,800) తగ్గింది.చెన్నైలో బంగారం ధరలు ఉదయం ఎలా ఉన్నాయో.. సాయంత్రానికి అలాగే ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ధరలు రూ. 1,14,600 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్), రూ. 1,25,020 (24 క్యారెట్స్ 10 గ్రామ్స్) వద్ద ఉన్నాయి.ఇదీ చదవండి: అప్పుడు రూ.30 లక్షలు.. ఇప్పుడు లక్షల కోట్ల కంపెనీ! -
బంగారం ధరల్లో ఊహించని మార్పు!: గంటల వ్యవధిలో..
బంగారం ధరలు తగ్గుతూ.. పెరుగుతూ కొనసాగుతున్నాయి. ఈ రోజు (గురువారం) ఉదయం స్వల్పంగా తగ్గిన గోల్డ్ రేటు.. సాయంత్రానికి మరోమారు తగ్గింది. దీంతో పసిడి ధరలలో మరోమారు మార్పులు జరిగాయి. ఈ కథనంలో లేటెస్ట్ గోల్డ్, సిల్వర్ రేట్లు ఎలా ఉన్నాయో చూసేద్దాం.ఉదయం హైదరాబాద్, విజయవాడలలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 170 మాత్రమే తగ్గింది. సాయంత్రానికి ఈ ధర రూ. 600లకు చేరింది. అంటే సాయంత్రానికి మరో 450 రూపాయలు తగ్గిందన్నమాట. కాగా 22 క్యారెట్ల 10 గ్రామ్స్ రేటు రూ. 550 తగ్గింది (ఉదయం రూ. 150 మాత్రమే తగ్గింది). ప్రస్తుతం బంగారం ధరలు వరుసగా రూ. 1,24,260 (24 క్యారెట్స్), రూ. 1,13,900 (22 క్యారెట్స్) ఉన్నాయి.ఢిల్లీలో 24 క్యారెట్లు, 22 క్యారెట్ల బంగారం ధరల్లో ఉదయం సాయంత్రానికి తేడా ఉంది. ఉదయం నుంచి సాయంత్రానికే గరిష్టంగా రూ. 600 తగ్గింది. దీంతో ఇక్కడ 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 1,14,050 కాగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల రేటు రూ. 1,24,410 వద్ద ఉంది.ఇదీ చదవండి: లక్షకు రెండు లక్షలు!: బంగారంలాంటి లాభాలుచెన్నైలో మాత్రం బంగారం ధరలలో ఎటువంటి మార్పు లేదు. ఉదయం ఎంత రేటు ఉందో.. సాయంత్రానికి అంతే ఉంది. కాబట్టి ఇక్కడ 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 1,15,000 కాగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల రేటు రూ. 1,25,460 వద్ద ఉంది. అయితే వెండి ధరల్లో సాయంత్రానికి ఎటువంటి మార్పు లేదు. -
లక్షకు రెండు లక్షలు!: బంగారంలాంటి లాభాలు
ఒక మనిషి ఆర్థికంగా ఎదగాలంటే.. తప్పకుండా పొదుపు చేయాలి. ఈ పొదుపును సరైన మార్గంలో పెట్టుబడిగా పెడితే.. ఊహకందని లాభాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. అయితే ఇన్వెస్ట్ చేయడానికి స్టాక్ మార్కెట్, ఫిక్స్డ్ డిపాజిట్, గోల్డ్, సిల్వర్, బిట్కాయిన్, రియల్ ఎస్టేట్ వంటి చాలామార్గాలు ఉన్నాయి.ఐదేళ్ల క్రితం లక్ష రూపాయలు పెట్టుబడిగా పెట్టి ఉంటే.. ఇప్పుడు ఎంత ఆదాయం వచ్చేది అనే విషయాన్ని వెల్త్ మోజో.. తన ఎక్స్ ఖాతాలో వెల్లడించింది.ఐదేళ్ల క్రితం రూ.లక్ష పెట్టుబడి, ఈరోజు దాని విలువ సుమారుగా..నిఫ్టీ 50: రూ. 1.8 లక్షలునిఫ్టీ నెక్స్ట్ 50: రూ. 2.2 లక్షలుమిడ్క్యాప్ ఇండెక్స్: రూ. 2.7 లక్షలుస్మాల్ క్యాప్ ఇండెక్స్: రూ. 3.1 లక్షలుబంగారం: రూ. 1.9 లక్షలువెండి: రూ. 2.0 లక్షలుఫిక్స్డ్ డిపాజిట్: రూ. 1.35 లక్షలురియల్ ఎస్టేట్: రూ. 1.15 లక్షల నుంచి రూ. 1.25 లక్షలుబిట్కాయిన్: రూ. 12 లక్షల నుంచి రూ. 15 లక్షలుదీన్నిబట్టి చూస్తే ఐదు సంవత్సరాల క్రితం లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టిన వ్యక్తికి.. ఇప్పుడు సుమారు రూ. 2 లక్షలు వస్తుందన్నమాట. అంటే లక్ష రూపాయలకు, మరో లక్ష లాభం. కాగా బంగారం వెండి ధరలు కూడా ఐదేళ్లలో ఊహకందని రీతిలో పెరిగాయి.ఇదీ చదవండి: నా దృష్టిలో అది నిజమైన డబ్బు: మిగతాదంతా ఫేక్..If you had invested ₹1,00,000 five years ago, here’s what it would roughly be worth today:📊 Nifty 50: ~₹1.8L🚀 Nifty Next 50: ~₹2.2L📈 Midcap Index: ~₹2.7L🔥 Smallcap Index: ~₹3.1L🪙 Gold: ~₹1.9L🥈 Silver: ~₹2.0L🏦 Fixed Deposit: ~₹1.35L🏢 REITs/InvITs:…— Wealthmojo™ (@wealthmojo1) November 18, 2025 -
పసిడి రూ. 3,900 డౌన్
న్యూఢిల్లీ: వచ్చే నెలలో అమెరికా ఫెడరల్ రిజర్వ్ కీలక వడ్డీ రేట్లను తగ్గించడంపై ఆశలు సన్నగిల్లిన నేపథ్యంలో పసిడి ధరలు మంగళవారం గణనీయంగా తగ్గాయి. దేశీయంగా ఢిల్లీ బులియన్ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత గల 10 గ్రాముల పసిడి రేటు రూ. 3,900 క్షీణించింది. రూ. 1,25,800కి తగ్గింది. వెండి రేటు కూడా కేజీకి రూ. 7,800 తగ్గి రూ. 1,56,000కు దిగి వచ్చింది.అమెరికాలో వడ్డీ రేట్ల తగ్గింపుపై ఆశలు సన్నగిల్లడం, ఈ వారం కీలక డేటా విడుదల అనంతరం ఫెడ్ రిజర్వ్ తీసుకోబోయే చర్యల గురించి ఇన్వెస్టర్లు నిరీక్షిస్తుండటంతో పసిడి, వెండి అమ్మకాల ఒత్తిడికి లోనైనట్లు ఆగ్మంట్ హెడ్ (రీసెర్చ్) రెనిషా చైనాని తెలిపారు. దేశీయంగా మల్టీ కమోడిటీ ఎక్సే్చంజ్ (ఎంసీఎక్స్లో) డిసెంబర్ ఫ్యూచర్స్ కాంట్రాక్టుకు సంబంధించి పసిడి రేటు క్రితం ముగింపు రూ. 1,22,927తో పోలిస్తే ఒక దశలో సుమారు రూ. 2,165 క్షీణించి రూ. 1,20,762కి తగ్గింది. వెండి ఫ్యూచర్స్ కూడా డిసెంబర్ కాంట్రాక్టు రూ. 3,660 మేర (సుమారు 2.36 శాతం) పతనమై రూ. 1,51,652 వద్ద ట్రేడయ్యింది. అంతర్జాతీయ మార్కెట్లు చూస్తే కామెక్స్ గోల్డ్ డిసెంబర్ ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ ఔన్సుకి సుమారు 65 డాలర్లు (1.60 శాతం) క్షీణించి 4,009.5 డాలర్లకు తగ్గింది. గత నాలుగు సెషన్లలో పుత్తడి ధర ఏకంగా 204.1 డాలర్లు (సుమారు 4.84 శాతం) క్షీణించింది. అలాగే డిసెంబర్ కాంట్రాక్టు వెండి రేటు 2.38 శాతం క్షీణించి 49.50 డాలర్ల వద్ద ట్రేడయ్యింది. -
ఐదు రోజుల్లో రూ. 5వేలు!.. బంగారం ధరల్లో భారీ మార్పు
అమెరికా డాలర్ బలపడటం, వచ్చే నెలలో అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేటును తగ్గిస్తుందనే ఆశలు సన్నగిల్లడం వంటి కారణాల వల్ల ప్రపంచ మార్కెట్లలో.. మంగళవారం బంగారం ధరలు పడిపోయాయి.భారతదేశంలో నేడు (మంగళవారం) 24 క్యారెట్ల బంగారం ధర రూ. 123660 (10 గ్రామ్స్), 22 క్యారెట్ల ధర రూ. 1,13,350 వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే.. ఈ రోజు ధరలు వరుసగా రూ. 1740 & రూ. 1600 తక్కువ. పసిడి ధరలు ఇంకా తగ్గే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.నవంబర్ 13న రూ. 1,28,620 లక్షల వద్ద ఉన్న 24 క్యారెట్ల బంగారం ధర.. ఈ రోజు (నవంబర్ 18) రూ. 1,23,660 వద్దకు చేరింది. దీన్నిబట్టి చూస్తే.. కేవలం ఐదు రోజుల్లో రూ. 4960 తగ్గిందని తెలుస్తోంది. అంటే ఐదు రోజుల్లో దాదాపు 5000 రూపాయలు తగ్గిందన్నమాట.వెండి విషయానికి వస్తే.. రూ. 1.83 లక్షల (నవంబర్ 13) వద్ద ఉన్న సిల్వర్ రేటు.. నేటికి రూ. 1.70 లక్షలకు చేరింది. అంటే వెండి రేటు కూడా ఐదు రోజుల్లో రూ. 13వేలు తగ్గిందన్నమాట.అమెరికా డాలర్ విలువలో హెచ్చుతగ్గులు, ఫెడ్ వడ్డీ రేట్లు బంగారం ధరలను ప్రభావితం చేస్తాయి. ఫెడ్ వడ్డీ రేటు పెరిగినప్పుడు.. గోల్డ్ రేటు తగ్గుతుంది. ఫెడ్ వడ్డీ రేటు తగ్గినప్పుడు.. పసిడి ధరలు పెరుగుతాయి. బంగారం ధరలు పెరుగుదల, తగ్గుదలల మీద.. రాజకీయ, భౌగోళిక కారణాలు.. ఆర్ధిక వ్యవస్థలు ప్రభావం చూపిస్తాయని నిపుణులు చెబుతున్నారు.ఇదీ చదవండి: నా దృష్టిలో అది నిజమైన డబ్బు: మిగతాదంతా ఫేక్.. -
బంగారం ధరలు ఢమాల్!
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) తీవ్ర ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. నిన్నటి మాదిరిగానే మంగళవారం కూడా తులం బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
ఇస్త్రీ పెట్టెలో రూ.1.55 కోట్ల బంగారం
హైదరాబాద్: షార్జా నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి నుంచి డైరెక్టరేట్ ఆఫ్ రెవె న్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు రూ.1.55 కోట్ల బంగారాన్ని పట్టు కున్న సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాలు ఇలా ఉన్నాయి.. ఈ నెల 14న షార్జా నుంచి వచ్చిన ప్రయాణికుడి గురించి ముందస్తు సమా చారం ఉన్న డీఆర్ఐ అధికారులు అతడి బ్యాగేజీలో ఉన్న ఇస్ట్రీపెట్టె (ఐరన్ బాక్స్)ను విప్పి చూడగా మొత్తం 11 బంగారు బిస్కెట్లు బయటపడ్డాయి. ఆ బంగారం విలువ రూ.1.55 కోట్లు ఉంటుందని అధికారులు నిర్ధారించారు. క్యారియర్గా ఆ బంగారాన్ని తీసుకొచ్చిన వ్యక్తి దానిని ఎవరికోసం తెచ్చాడన్న విషయంపై దర్యాప్తు చేయగా, ఏపీలోని ప్రొద్దుటూరుకు చెందిన వ్యక్తి కోసం తీసుకువచ్చినట్లు అధికారులు గుర్తించారు. దీంతో ఆదివారం ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఒకే రోజు రెండోసారి.. మరింత తగ్గిన గోల్డ్ రేటు!
బంగారం ధరలు ఉదయం గరిష్టంగా రూ. 770 తగ్గింది. అయితే సాయంత్రానికి మరో 810 రూపాయలు తగ్గింది. దీంతో ఈ రోజు (శుక్రవారం) గోల్డ్ రేటు 1580 రూపాయలు తగ్గిందన్నమాట. దీంతో 10 గ్రాముల పసిడి ధర రూ. 1,27,040 వద్దకు చేరింది. ప్రస్తుతం దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడ, బెంగళూరు, ముంబై నగరాల్లో ఉదయం రూ.118400 వద్ద ఉన్న 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు.. సాయంత్రానికి రూ. 1,16,450 వద్దకు చేరింది. అంటే ఈ రోజు 24 గంటలు కాకముందే రూ. 1450 తగ్గిందన్న మాట. (ఉదయం 700 రూపాయలు మాత్రమే తగ్గింది, ఇప్పడు మరో 750 రూపాయలు తగ్గి.. మొత్తం రూ. 1450 తగ్గింది).24 క్యారెట్ల గోల్డ్ విషయానికి వస్తే, రూ. 1580 తగ్గడంతో 10 గ్రాముల ధర రూ. 127040 వద్దకు చేరింది. (24 క్యారెట్ల గోల్డ్ రేటు ఉదయం 770 రూపాయలు తగ్గింది. సాయంత్రానికి మరో 810 రూపాయలు తగ్గడంతో రెండూ కలిపి మొత్తం రూ. 1580 తగ్గింది).ఢిల్లీలో కూడా బంగారం ధర ఒకే రోజు రెండోసారి తగ్గింది. దీంతో 24 క్యారెట్ల ధర రూ. 1580 తగ్గడంతో 10 గ్రాముల రేటు రూ. 127190 వద్ద నిలిచింది. 22 క్యారెట్ల 10 గ్రాముల రేటు రూ. 1450 తగ్గి.. 1,16,600 రూపాయల వద్దకు చేరింది.ఇక చెన్నైలో విషయానికి వస్తే.. ఇక్కడ కూడా బంగారం ధరలు సాయంత్రానికి మరింత తగ్గుముఖం పట్టాయి. 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 1750 తగ్గడంతో రూ. 128070 వద్ద, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 1600 తగ్గి.. 117400 రూపాయల వద్దకు చేరింది.ఇదీ చదవండి: సొంత డబ్బుతో కాదు.. అప్పు చేసి ఇల్లు కొనండి!: రాబర్ట్ కియోసాకి -
అంతలోనే ఇంత తేడానా.. మారిపోయిన బంగారం, వెండి ధరలు!
బంగారం ధరలు ఊహకందని రీతిలో పెరుగుతూ.. పసిడి ప్రియుల మదిలో గుబులు పుట్టిస్తున్నాయి. ఈ రోజు (నవంబర్ 13) ఉదయమే గరిష్టంగా రూ. 2290 పెరిగిన 10 గ్రాముల గోల్డ్ రేటు.. సాయంత్రానికి రూ. 3110కు చేరింది. అంటే ఉదయం నుంచి సాయంత్రానికే.. బంగారం రేటు రూ. 820 పెరిగింది. వెండి ధర కూడా కేజీపై మరో రూ. 1000పెరగడంతో.. రూ. 1.83 లక్షలకు చేరింది.రూ.10 వేలు పెరిగిన వెండిగురువారం ఉదయం వెండి రేటు రూ. 9000 పెరిగింది. సాయంత్రానికి మరో 1000 రూపాయలు పెరగడంతో.. మొత్తం రూ. 10,000 పెరిగింది. దీంతో కేజీ వెండి రేటు ఈ రోజు రూ. 1,83,000 వద్దకు చేరింది. గత వారంలో స్థిరంగా ఉన్న వెండి రేటు మళ్లీ పెరుగుదల దిశగా.. పరుగులు పెడుతోంది. ఈ ధరలు ఇలాగే కొనసాగితే.. కేజీ వెండి ధర రూ. 2 లక్షలకు చేరుకోవడానికి మరెన్నో రోజులు పట్టదని స్పష్టమవుతోంది.బంగారం ధరలు ఇలాఇక బంగారం ధరల విషయానికి వస్తే.. అసలే విపరీతంగా పెరుగుతున్న పసిడి ధర ఇప్పుడు రోజుకు రెండు సార్లు పెరగడంతో.. కొనుగోలుదారులలో ఆందోళన కలుగుతోంది. హైదరాబాద్, విజయవాడ, బెంగళూరు, ముంబై నగరాల్లో ప్రస్తుతం.. 22 క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ. 2850 పెరిగి రూ. 1,17,900 వద్ద నిలిచింది. 24 క్యారెట్ల 10 గ్రాముల రేటు రూ. 3110 పెరిగి రూ. 1,24,620 వద్దకు చేరింది.చెన్నైలో కూడా గోల్డ్ రేటు సాయంత్రానికే తారాస్థాయికి చేరింది. ఇక్కడ 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 3260 పెరిగి రూ. 1,29,820 వద్ద నిలిచింది. 22 క్యారెట్ల 10 గ్రామ్స్ పసిడి ధర రూ. 3000 పెరిగి రూ. 1,19,000 వద్దకు చేరింది.ఇదీ చదవండి: వెండి ధర అక్కడికి!.. కియోసాకి ట్వీట్చివరగా దేశ రాజధాని నగరం ఢిల్లీ విషయానికి వస్తే.. ఇక్కడ 22 క్యారెట్ల 10 గ్రామ్స్ గోల్డ్ రేటు రూ. 2850 పెరిగి రూ. 118050 వద్దకు చేరగా.. 24 క్యారెట్స్ 10 గ్రామ్స్ బంగారం ధర రూ. 3110 పెరిగి.. రూ. 128770కు చేరింది. మొత్తం మీద దేశ వ్యాప్తంగా బంగారం ధరలు సాయంత్రానికే తారుమారయ్యాయి.నిపుణులు ఏం చెబుతున్నారంటే?బంగారం, వెండి ధరలు మరింత పెరుగుతాయని చాలామంది నిపుణులు చెబుతూనే ఉన్నారు. బంగారం సురక్షితమైన ఆస్తి కాబట్టి ఎక్కువమంది పెట్టుబడి పెట్టడం లేదా కొనుగోలు చేయడంతో పసిడికి డిమాండ్ పెరిగిపోయింది. వెండిని ఆభరణాల కోసం మాత్రమే కాకుండా.. పారిశ్రామిక రంగాల్లో కూడా విరివిగా ఉపయోగించడం వల్ల దీని ధర కూడా అమాంతం పెరిగిపోయింది. సిల్వర్ రేటు పెరుగుతుంది.. ధర పెరగకముందే కోనేయండి అంటూ రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి సైతం చెబుతున్నారు. -
బంగారం ఇప్పట్లో భారీగా తగ్గుతుందా?
బంగారం ధరలు ఇప్పటికే భారీగా పెరిగిపోయాయి. కొన్ని రోజులుగా కొంత తగ్గుముఖం పట్టినట్లుగా కనిపించినా మళ్లీ తారాస్థాయికి చేరాయి. ఈ నేపథ్యంలో ఇప్పట్లో బంగారం ధరలు తగ్గుతాయా.. కొనగలమా అని సామాన్య కొనుగోలుదారులు ఎదురు చూస్తున్నారు. ఈనేపథ్యంలో ప్రముఖ వెల్త్ మేనేజ్మెంట్ సంస్థ ఎమ్కే వెల్త్ మేనేజ్ మెంట్ (Emkay Wealth) బంగారం ధరలకు సంబంధించి కీలక అంచనాలు వెల్లడించింది.భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, కరెన్సీ మార్పులు, సంస్థాగత డిమాండ్ బంగారాన్ని “సురక్షిత స్వర్గధామ” ఆస్తిగా మరింత బలపరిచాయి. ఎమ్కే వెల్త్ మేనేజ్మెంట్ ప్రకారం.. బంగారం ప్రస్తుతం దృఢమైన సాంకేతిక పునాదిలో ఉంది. సంస్థ అప్సైడ్ లక్ష్యాలను ఔన్స్కు 4,368 డాలర్ల నుంచి 4,600 డాలర్లుగా, అలాగే మద్దతు స్థాయిలను 3,890 డాలర్ల నుంచి 3,510 డాలర్ల వద్దగా నిర్దేశించింది.కాగా ప్రస్తుతం (12 నవంబర్ 2025 నాటికి) బంగారం ఔన్స్ ధర సుమారు 4,100 డాలర్ల వద్ద ఉంది. అదే తెలుగు రాష్ట్రాల్లో 24 క్యారెట్ల మేలిమి బంగారం 10 గ్రాముల ధర రూ.1,25,510 లుగా, 22 క్యారెట్ల పసిడి రేటు రూ.1,15,050 లుగా కొనసాగుతోంది.బంగారం పెరుగుదలకు ప్రాధాన కారణాలుడాలర్ బలహీనత: గత సంవత్సరం యూఎస్ డాలర్ ప్రధాన కరెన్సీలతో పోలిస్తే 8% క్షీణించడం వల్ల, డాలర్ కాకుండా ఇతర కరెన్సీలలో ఉన్న పెట్టుబడిదారులకు బంగారం సాపేక్షంగా చౌకగా మారింది.ద్రవ్యోల్బణ అనిశ్చితి: అధిక ద్రవ్యోల్బణం, ఆర్థిక అసమతుల్యత భయాలు బంగారాన్ని ద్రవ్యోల్బణ కవచంగా బలపరిచాయి.సెంట్రల్ బ్యాంక్ డైవర్సిఫికేషన్: డాలర్పై ఆధారాన్ని తగ్గించే క్రమంలో, వర్ధమాన, అభివృద్ధి చెందుతున్న దేశాలు తమ రిజర్వుల్లో బంగారం వాటాను పెంచుతున్నాయి.ఈటీఎఫ్ ఇన్ఫ్లోలు: 2025లో రికార్డు స్థాయి 65 బిలియన్ డాలర్ల మేర ఈటీఎఫ్ల ప్రవాహాలు బంగారంపై రిటైల్, సంస్థాగత విశ్వాసాన్ని ప్రతిబింబిస్తున్నాయి.భౌగోళిక రాజకీయ అస్థిరత: తూర్పు ఐరోపా, మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు సురక్షిత-స్వర్గధామ ఆస్తులపై డిమాండ్ను నిలబెట్టాయి. -
అంతా కాకపోయినా కొంత ఊరట! తులం ఎంతంటే..
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) తీవ్ర ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. నిన్న తులంపై సుమారు రూ.2,250 పెరిగిన బంగారం ధరలు బుధవారం కొంతవరకు తగ్గాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
బంగారం మాయలో పడొద్దు!
పెళ్లిళ్ల సీజన్ కావడంతో ప్రస్తుతం చాలా కుటుంబాల్లో బంగారంపై చర్చ జరుగుతుంది. పెళ్లి కుటుంబాల్లో బంగారం కొనుగోలు అనివార్యం. అయితే పసిడిపై పెట్టుబడి పెట్టాలనుకునేవారు కూడా ఇదే అదనుగా పుత్తడిని కొనుగోలు చేస్తుంటారు. అంతర్జాతీయ అనిశ్చితులు, ద్రవ్యోల్బణం భయాల మధ్య బంగారం ధరలు ఇటీవల ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ నేపథ్యంలో తమ సంపదను కాపాడుకోవడానికి, ద్రవ్యోల్బణాన్ని అధిగమించడానికి చాలా మంది పెట్టుబడిదారులు బంగారంపై దృష్టి సారిస్తున్నారు. అయితే బంగారంలో పెట్టుబడి అంటే నేరుగా ఆభరణాలు లేదా కాయిన్స్ కొనుగోలు చేయాలని కొందరు భావిస్తున్నారు. కానీ, కేవలం ‘బంగారం’ అనే భావనతో భౌతిక రూపంలో పెట్టుబడి పెట్టడం వల్ల ఊహించని నష్టాలు, ఇబ్బందులు ఎదురవుతాయని గుర్తుంచుకోవాలి. మరి.. ఈ మెరిసే లోహంలో సురక్షితంగా, లాభదాయకంగా పెట్టుబడి పెట్టాలంటే సరైన మార్గం ఏమిటో తెలుసుకుందాం.భౌతిక బంగారం కొనుగోలుతో..బంగారం కొనుగోలు అనేది తరతరాలుగా వస్తున్న ఒక అలవాటు. అయితే, దీన్ని ఒక పెట్టుబడి సాధనంగా చూసినప్పుడు నేరుగా బంగారం కొనుగోలు చేయడం (ఫిజికల్ గోల్డ్) అనేక ప్రతికూలతలను కలిగి ఉంటుంది. ఆభరణాలు కొన్నప్పుడు బంగారం అసలు ధరతో పాటు అధికంగా 8% నుంచి 30% వరకు తయారీ ఛార్జీలు, తరుగు రూపంలో కొంత చెల్లించాల్సి వస్తుంది. ఈ ఖర్చు పెట్టబడుల నుంచి లాభాన్ని తగ్గిస్తుంది.బంగారాన్ని కొనుగోలు చేసేటప్పుడు దాని స్వచ్ఛత (క్యారెట్) విషయంలో అనుమానాలు, మోసాలు జరిగే అవకాశం ఉంది. హాల్మార్క్ ఉన్నప్పటికీ చిన్న దుకాణాల్లో నాణ్యతను తనిఖీ చేయడం కష్టం. భౌతిక బంగారాన్ని ఇంట్లో ఉంచుకుంటే దొంగతనం జరిగే ప్రమాదం ఉంది. బ్యాంక్ లాకర్లలో ఉంచినా అద్దె, ఇతర ఛార్జీలు చెల్లించాల్సి వస్తుంది. ఇది పెట్టుబడిపై రాబడిని తగ్గిస్తుంది.అత్యవసర పరిస్థితుల్లో బంగారాన్ని త్వరగా సరైన ధరకు అమ్మడం కష్టం కావచ్చు. కొన్నిసార్లు కొనుగోలు చేసిన ధర కంటే తక్కువకు అమ్ముకోవాల్సి వస్తుంది. కొనుగోలు చేసేటప్పుడు జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. ఇది పెట్టుబడిదారునికి అదనపు భారం. బంగారు ఆభరణాలు ఖర్చు లేదా అలంకారం కిందకు వస్తాయి తప్ప పూర్తిస్థాయి పెట్టుబడి కిందకు రావని గమనించాలి.గోల్డ్ ఈటీఎఫ్లుబంగారంపై పెట్టుబడి పెట్టాలనుకునే వారికి భౌతిక బంగారానికి ప్రత్యామ్నాయంగా సులభంగా, పారదర్శకంగా ఉండే మార్గాలు అందుబాటులో ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది గోల్డ్ ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (Gold ETFs). గోల్డ్ ఈటీఎఫ్లు అంటే ఎలక్ట్రానిక్ రూపంలో ఉన్న గోల్డ్ యూనిట్లు అని అర్థం. ఇవి బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE) లేదా నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE)లో షేర్ల వలె ట్రేడ్ అవుతాయి. ఒక గోల్డ్ ఈటీఎఫ్ యూనిట్ సాధారణంగా ఒక గ్రాము బంగారానికి సమానం.గోల్డ్ ఈటీఎఫ్ల్లో ఎలా ఇన్వెస్ట్ చేయాలి?ముందుగా ఏదైనా బ్రోకరేజ్ సంస్థ వద్ద డీమ్యాట్, ట్రేడింగ్ ఖాతాను తెరవాలి. ఇది షేర్లు కొనుగోలు చేయడానికి అవసరం.వివిధ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీలు (AMC) అందించే గోల్డ్ ఈటీఎఫ్ల్లో (ఉదా: నిప్పన్ ఇండియా గోల్డ్ ఈటీఎఫ్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ గోల్డ్ ఈటీఎఫ్..) ఒకదాన్ని ఎంచుకోవాలి.ట్రేడింగ్ ప్లాట్ఫామ్లో మీకు కావలసిన గోల్డ్ ఈటీఎఫ్ పేరును ఎంటర్ చేసి షేర్లను కొనుగోలు చేసినట్లే యూనిట్లను కొనుగోలు చేయవచ్చు.ఒకేసారి పెద్ద మొత్తంలో లేదా క్రమంగా చిన్న మొత్తాల్లో (సిప్ మాదిరిగా) కొనుగోలు చేయవచ్చు.గోల్డ్ ఈటీఎఫ్ల వల్ల ప్రయోజనాలుగోల్డ్ ఈటీఎఫ్లు అనేక రకాల ప్రయోజనాలను అందించి, భౌతిక బంగారంపై మెరుగైన పెట్టుబడి సాధనంగా నిలుస్తాయి. ప్రతి ఈటీఎఫ్ యూనిట్ 99.5% స్వచ్ఛత కలిగిన భౌతిక బంగారం కలిగి ఉంటుంది. నాణ్యత గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇందులో తయారీ ఛార్జీలు, తరుగు వంటివి ఉండవు. కేవలం కొద్దిపాటి బ్రోకరేజ్, ఫండ్ నిర్వహణ ఛార్జీలు (సాధారణంగా 0.5% లోపు) మాత్రమే ఉంటాయి. ఇది లాభాలను పెంచుతుంది.స్టాక్ ఎక్స్ఛేంజ్లో రోజులో ఎప్పుడైనా అమ్ముకోవచ్చు, కొనుగోలు చేయవచ్చు. తక్షణమే నగదుగా మార్చుకోవచ్చు. ఈటీఎఫ్లు ఎలక్ట్రానిక్ రూపంలో డీమ్యాట్ ఖాతాలో నిల్వ చేయబడతాయి కాబట్టి, దొంగతనం అయ్యే ప్రమాదం లేదు. లాకర్ ఖర్చులు ఉండవు. కేవలం ఒక యూనిట్ (సుమారు ఒక గ్రాము బంగారానికి సమానం) నుంచే పెట్టుబడి ప్రారంభించవచ్చు. దీనివల్ల సాధారణ మధ్యతరగతి పెట్టుబడిదారులు కూడా సులభంగా ఇన్వెస్ట్ చేయవచ్చు.ఇదీ చదవండి: ఉద్యోగంతో ఊడిగం చేయాల్సిందేనా..! -
వామ్మో.. బంగారం ఊసు ఎత్తకపోవడమే బెటర్!
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) తీవ్ర ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. సోమవారంతో పోలిస్తే మంగళవారం బంగారం ధరలు భారీగా పెరిగాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
కేరళ ఎన్బీఎఫ్సీలా మజాకా..
సాక్షి, స్పెషల్ డెస్క్: ఒక్కో కుటుంబంలో ఎంత బంగారం ఉంటుంది. సామాన్యుల దగ్గరైతే తులాల్లో ఉంటుంది. సంపన్నులైతే కిలోల్లో. మరి మన కేరళలోని నాన్–బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీల (ఎన్బీఎఫ్సీ) వద్ద ఉన్న పసిడి ఎంతో తెలుసా? జస్ట్ 381 టన్నులు. ఈ కంపెనీలన్నీ ఒక దేశమైతే.. నిల్వల పరంగా ఈ దేశం ప్రపంచంలో 16వ స్థానంలో ఉండేదంటే ఆశ్చర్యంవేయక మానదు. అనేక యూరోపియన్ దేశాల కంటే ఈ నిల్వలు అధికంగా ఉండడం విశేషం. విదేశీ మారక ద్రవ్య ఆస్తులలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వంటి కేంద్ర బ్యాంకులు బంగారాన్ని టన్నుల కొద్దీ కొనుగోలు చేసి అట్టిపెట్టుకుంటాయి.అయితే కేంద్ర బ్యాంకులు కలిగి ఉన్న పసిడి నిల్వల పరిమాణంలో అంతర్జాతీయంగా భారత్ 7వ స్థానంలో ఉంది. 2025 సెపె్టంబర్ నాటికి ఆర్బీఐ వద్ద 880.18 టన్నుల పుత్తడి ఉంది. కేరళకు చెందిన నాన్–బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీల వద్ద కస్టమర్లు తాకట్టు పెట్టిన బంగారం ఏకంగా 381 టన్నులకు చేరుకుంది. అంటే ఆర్బీఐ వద్ద పోగైన పసిడిలో 43.28% అన్నమాట. ప్రపంచంలో బంగారం వినియోగంలో అతిపెద్ద కస్టమర్గా భారత్ నిలిచింది. భారతీయుల వద్ద 25,000 టన్నుల పైచిలుకు పసిడి ఉన్నట్టు నివేదికలు చెబుతున్నాయి. ఇక దేశీయ రుణ మార్కెట్లో 2,950–3,350 టన్నుల పుత్తడి పూచీకత్తుగా ఖజానాలలో దాచినట్టు అంచనా. వెనుకంజలో పెద్ద దేశాలు కేరళకు చెందిన నాన్–బ్యాంకింగ్ ఫైనాన్షియర్లు ఒక దేశమైతే.. పోర్చుగల్తో అమీతుమీ తేల్చుకునే స్థాయిలో పోటీపడేది. 382.66 టన్నులతో పోర్చుగల్ 15వ స్థానంలో ఉంది. అంతేకాదు అనేక యూరోపియన్ దేశాల అధికారిక నిల్వలను కేరళ ఎన్బీఎఫ్సీలు మించిపోవడం విశేషం. ఈ గోల్డ్ లోన్ కంపెనీల వారీగా చూస్తే ముత్తూట్ ఫైనాన్స్ 208 టన్నుల నిల్వలతో అప్రతిహతంగా అగ్రస్థానంలో కొనసాగుతోంది. కేరళ స్టేట్ ఫైనాన్షియల్ ఎంటర్ప్రైజెస్ (కేఎస్ఎఫ్ఈ) 67.22 టన్నులు, మణప్పురం ఫైనాన్స్ 56.4, ముత్తూట్ ఫిన్కార్ప్ 43.69, ఇండెల్ మనీ వద్ద సుమారు 6 టన్నుల పుత్తడి ఉంది. ఈ సంస్థల వద్ద ఉన్న మొత్తం నిల్వలు 381 టన్నులు దాటిపోయాయి. అయితే యూకే 310.29, స్పెయిన్ 281.58, ఆస్ట్రియా వద్ద 279.99 టన్నులు ఉంది. బ్రెజిల్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా సైతం కేరళ ఎన్బీఎఫ్సీల కంటే వెనుకంజలోనే ఉన్నాయి. బంగారం పొదుపు సాధనమేకాదు హోదాకు చిహ్నం. అవసరానికి ఆదుకునే ఆపన్నహస్తం. అందుకే భారత్లో బంగారు రుణాల వ్యాపారం దశాబ్దాలుగా ఆర్థికంగా శక్తివంతంగా మారింది. తృతీయ, ఆ తర్వాతి స్థాయి నగరాలు, చిన్నపట్టణాలు, పల్లెల్లో బంగారు రుణాలే తక్షణ అవసరాలకు మొదటి ప్రాధాన్యత. వ్యాపారం, పిల్లల చదువుకయ్యే ఫీజులు, ఇంటి అవసరాలు, అత్యవసరాలు.. కారణం ఏదైనా తొలుత గుర్తొచ్చేది ఇంట్లో ఉన్న బంగారమే. 24 క్యారెట్ల పసిడి ధర 10 గ్రాములకు రూ.1.24 లక్షలు దాటింది.పుత్తడి ఈ స్థాయిలో ప్రియం కావడంతో బంగారం మరింత ఆకర్షణీయంగా మారింది. గ్రాముకు రూపాయి లభ్యత పెరిగింది. ప్రజలు తమ ఆభరణాలను తాకట్టు పెడుతుండటంతో మార్కెట్లోకి మరింత బంగారం వస్తోంది. ద్రవ్య కొరత రుణగ్రహీతలను బంగారం ఆధారిత క్రెడిట్ కోసం మళ్లేలా చేస్తోంది. కంపెనీలు కస్టమర్ల నుంచి ఆధార్ కార్డు తీసుకుని నిమిషాల్లో రుణం ఇస్తున్నాయి. అంతరాన్ని పూరిస్తున్నాయి..బంగారం ధరల పెరుగుదల భారత మార్కెట్కు.. ప్రధానంగా తక్కువ ఆదాయ వర్గాలకు వరంగా మారింది. అన్సెక్యూర్డ్ లోన్స్పై పరిమితుల కారణంగా బ్యాంకుల నుంచి అప్పు దొరకడం అంత సులభం కాదు. కానీ బంగారు రుణాలు ఆ అంతరాన్ని పూరిస్తున్నాయి. భారత్లోని బంగారు రుణాల్లో వ్యవస్థీకృత సంస్థల వాటా 37%. మిగిలిన 63% వాటాను చిన్న ఫైనాన్షియర్లు, స్థానిక వడ్డీ వ్యాపారుల వంటి నియంత్రణ లేని అవ్యవస్థీకృత రంగం కైవసం చేసుకుంది. అయితే రుణం తిరిగి చెల్లించని పక్షంలో కస్టమర్లు తాకట్టు పెట్టిన బంగారాన్ని నిర్దేశిత కాలం తర్వాత కంపెనీలు వేలం వేస్తాయి. తాకట్టు పెట్టిన దాంట్లో వేలం వేసిన పసిడి వాటా గతంలో 2.5% ఉండేది. ఇప్పుడు ఇది ఒక శాతానికి వచి్చంది.⇒ మన దేశంలో ఖజానాల్లో పూచీకత్తుగా ఉన్న బంగారం 2,9503,350 టన్నులు⇒ కేరళ ఎన్బీఎఫ్సీల వద్ద కస్టమర్లు తాకట్టు పెట్టిన పసిడి 381 టన్నులు⇒ భారతీయుల వద్ద ఉన్న బంగారం 25,000 టన్నులు⇒ 2025 సెపె్టంబర్ నాటికి ఆర్బీఐ వద్ద బంగారం నిల్వలు 880.18 టన్నులు⇒ కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న పసిడిలోఅంతర్జాతీయంగా భారత్ స్థానం -
డిసెంబర్ నాటికి బంగారం ధరలు ఇలా..
పండుగ సీజన్, డాలర్ విలువ తగ్గడం, స్టాక్ మార్కెట్లు కుప్పకూలడం వంటి కారణాల వల్ల ఆగష్టు, సెప్టెంబర్ నెలల్లో బంగారం ధరలు భారీగా పెరిగాయి. అయితే ప్రస్తుతం గోల్డ్ రేటు స్వల్ప తగ్గుదలను నమోదు చేస్తోంది. వెండి కూడా అదే బాటలో నడుస్తోంది. డిసెంబర్ నెలలో పసిడి ధరలు మరింత తగ్గే సూచనలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.ప్రపంచ ఆర్థిక పరిణామాలు బంగారం ధరలను ప్రభావితం చేసే అవకాశం ఉందని.. మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్లోని కమోడిటీ రీసెర్చ్ సీనియర్ విశ్లేషకుడు మానవ్ మోదీ అన్నారు. అమెరికా ఫెడ్ రేటు 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన తరువాత.. బంగారం 4000 డాలర్ల మార్కు దగ్గర కదలాడాయి. డిసెంబర్లో కూడా ఫెడ్ రేటు తగ్గే అవకాశం ఉంది. కాబట్టి బంగారం ధర తగ్గే సూచనలు ఉన్నాయని ఆయన అన్నారు.చైనాలో, బంగారు రిటైలర్లకు వ్యాట్ ఆఫ్సెట్లను తొలగించడం, మినహాయింపులను 13 శాతం నుంచి 6 శాతానికి తగ్గించడం వలన ప్రధాన బ్యాంకులు కొత్త రిటైల్ ఖాతాలను స్తంభింపజేయడానికి దారితీశాయి. ఇది ప్రపంచంలోని అగ్ర బంగారు మార్కెట్లో డిమాండ్ను తగ్గించే ప్రమాదం ఉంది. ఇదే సమయంలో అమెరికా తన కీలకమైన ఖనిజాల జాబితాలో యురేనియం, రాగి, వెండిని కూడా చేర్చింది. కాబట్టి గోల్డ్ డిమాండ్ తగ్గే అవకాశం ఉంది.నేటి బంగారం, వెండి ధరలు ఇలా..నవంబర్ 10న మన దేశంలో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 1,23,220 వద్ద.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 1,12,950 వద్ద ఉన్నాయి. మొత్తం మీద ఈ నెల (నవంబర్) ప్రారంభం నుంచి గోల్డ్ రేటు తగ్గుతూ.. పెరుగుతూ ఉందని స్పష్టమవుతోంది.వెండి ధరల విషయానికి వస్తే.. ఈ రోజు (సోమవారం) సిల్వర్ రేటు రూ. 2000 పెరిగింది. దీంతో కేజీ వెండి ధర రూ. 1.67 లక్షలకు చేరింది. అంటే ఒక గ్రామ్ వెండి రేటు 167 రూపాయల దగ్గర ఉంది. గత నెలలో రూ. 2 లక్షలు దాటేసిన సిల్వర్ ధర.. ఇప్పుడిప్పుడే కొంత తగ్గుతూ ఉంది.ఇదీ చదవండి: బంగారం: ఇప్పుడు కొనాలా.. ఇంకొన్ని రోజులు వేచి చూడాలా? -
ఉద్యోగులకు బంగారు కా(కీ)నుకలు..
ఉద్యోగులకు యాజమాన్యాలు బహుమతులు ఇవ్వడం కార్పొరేట్ రంగంలో సర్వసాధారణం. మంచి పనితీరు ప్రదర్శించిన ఉద్యోగులను వివిధ రకాల కానుకలిచ్చి ప్రోత్సహిస్తుంటాయి కంపెనీలు. అయితే చైనాలో ఓ కంపెనీ తమ ఉద్యోగులకు ఇచ్చిన బహుమతులు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. ఇంతకీ ఆ కంపెనీ ఏం కానుకలు ఇచ్చింది.. ఆశ్చర్యం ఎందుకు అన్నది మనమూ చూద్దామా..ప్రపంచవ్యాప్తంగా కన్స్యూమర్ 360 డిగ్రీల కెమెరాలకు ప్రసిద్ధి చెందిన ‘ఇన్స్టా 360’ అనే సంస్థ ఇటీవల అక్టోబర్ 24న చైనాలో ప్రోగ్రామర్స్ డేను పురస్కరించుకుని ఉద్యోగులకు వినూత్న బహుమతులు ప్రదానం చేసింది. కంప్యూటర్ కీ బోర్డులో అమర్చుకునేలా స్వచ్ఛమైన బంగారంతో చేసిన కీక్యాప్స్ను కానుకలుగా ఇచ్చింది.కంపెనీ ఈ సంవత్సరం 21 గోల్డ్ కీక్యాప్లను బహుమతిగా ఇచ్చింది. వీటిలో అత్యంత విలువైనది స్పేస్ బార్ కీ క్యాప్. దీని బరువు 35.02 గ్రాములు కాగా విలువ సుమారు 320,000 యువాన్లు. భారత కరెన్సీలో చెప్పాలంటే దాదాపు రూ. 39 లక్షలు. ఇన్స్టా360 సంస్థ ఉద్యోగులకు గోల్డ్ కీ క్యాప్లను బహుమతులుగా ఇవ్వడం ఇదే తొలిసారి కాదు. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ కథనం ప్రకారం.. కంపెనీ గత నాలుగేళ్లలో మొత్తం 55 గోల్డ్ కీక్యాప్లను ప్రదానం చేసింది.బంగారం లాంటి కంపెనీఇన్స్టా360 ప్రదానం చేస్తున్న కానుకల కారణంగా చైనా టెక్ పరిశ్రమ వర్గాల్లో ఆ కంపెనీకి "గోల్డ్ ఫ్యాక్టరీ" అనే మారుపేరు వచ్చింది. ఈ కంపెనీ ఇలా బంగారు వస్తువులు కానుకలుగా ఇవ్వడం ఏదో ఏడాదికొక్కసారి మాత్రమే అనుకునేరు.. ఇన్స్టా360కి సంబంధించిన ఏ విశేష సందర్భం వచ్చినా ఏదో రూపంలో పసిడి కానుకలు ఇవ్వడమే పరిపాటి.కంపెనీ పదేళ్ల వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని గత జూలైలో ఉద్యోగులు, ఇంటర్న్లందరికీ "గోల్డ్ బ్లైండ్ బాక్స్" ను అందించింది. ఇందులో 0.36 గ్రాముల స్వచ్ఛమైన బంగారుతో రూపొందించిన స్టిక్కర్లున్నాయి. ఇక కంపెనీలో ఉద్యోగులెవరైనా కొత్తగా వివాహం చేసుకున్నా లేదా పిల్లలకు జన్మనిచ్చినా వాళ్లకు ఒక గ్రాము స్వచ్ఛమైన బంగారు నాణెం బహూకరిస్తారు. ఇటీవలి సంవత్సరం ముగింపు వేడుకలో 50 గ్రాముల బంగారు బార్ను గ్రాండ్ ప్రైజ్గా అందించడం విశేషం.బంగారాన్నే ఉద్యోగులకు కానుకగా ఇవ్వడం వెనుక ఉద్దేశాన్ని ఇన్స్టా360 వ్యవస్థాపకుడు లియు జింగ్కాంగ్ వివరించారు. సంస్థ బంగారాన్ని దాని నగదు విలువ కోసం కాకుండా దాని "స్థిరత్వం" కోసం ఎంచుకుంటుందని పేర్కొన్నారు. ఒక సంస్థ స్థిరత్వం ప్రతిభావంతులైన వ్యక్తులపై ఆధారపడి ఉంటుందని ఆయన నొక్కిచెప్పారు. ప్రతి కీస్ట్రోక్ "రాయిని బంగారంగా మార్చే స్పర్శ" అని గోల్డ్ కీక్యాప్స్ రిమైండర్గా పనిచేస్తాయని అన్నారు.ఇదీ చదవండి: బంగారం ‘కొండంత’ లక్ష్యంతో కొంటున్నా: కియోసాకి -
పసిడి, వెండి.. ధరల తుపాను
దేశంలో బంగారం, వెండి ధరలు తుపానులా పెరిగాయి. గత కొన్ని రోజులుగా హెచ్చుతగ్గులతో ఊగిసలాడుతున్న పసిడి ధరలు (Today Gold Rate) ఆదివారంతో పోలిస్తే సోమవారం భారీగా ఎగిశాయి. మరోవైపు వెండి ధరల్లో కూడా ఒక్కసారిగా దూసుకెళ్లాయి. ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు మదుపరులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు (Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
బంగారం: ఇప్పుడు కొనాలా.. ఇంకొన్ని రోజులు వేచి చూడాలా?
దసరా, దీపావళి వంటి పండుగలు ముగిసినప్పటికీ.. పసిడికి ఏ మాత్రం డిమాండ్ తగ్గడం లేదు. గత నెలతో పోలిస్తే.. ఈ నెలలో గోల్డ్ రేటు కొంత తగ్గడం కూడా బంగారం కొనుగోళ్లు పెరగడానికి కారణమయ్యాయి. అయితే ఇప్పుడు పెళ్లిళ్ల సీజన్ ప్రారంభమైపోయింది. కాబట్టి గోల్డ్ ఇప్పుడు కొనాలా?, ఇంకొన్ని రోజులు వేచి చూడాలా? అని చాలామందిలో ఓ సందేహం ఏర్పడింది.2025 నవంబర్ 1నుంచి డిసెంబర్ 14వరకు భారతదేశంలో సుమారు 48 లక్షల వివాహాలు జరగనున్నాయని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ వెల్లడించింది. ఈ సీజన్లో సుమారు రూ. 6.5 లక్షల కోట్ల వ్యాపారం జరుగుతుందని తన నివేదికలో పేర్కొంది. ఇందులో ప్రధానంగా గోల్డ్ అమ్మకాలు భారీగా ఉంటాయని స్పష్టం చేసింది.మన దేశంలో పెళ్లిళ్లకు భారీగా ఖర్చు చేస్తారు. ఇక పెళ్లి అనగానే బంగారం కొనుగోలు తప్పకుండా ఉంటుంది. స్థాయిని బట్టి.. ప్రతి ఒక్కరూ గోల్డ్ కొనడం జరుగుతుంది. దీంతో పసిడి అమ్మకాలు గణనీయంగా పెరుగుతాయి. ఈ సమయంలో బహుశా బంగారం ధరలు పెరిగే అవకాశం ఉంటుంది.ఇక బంగారం ఇప్పుడు కొనాలా?, ఇంకొన్ని రోజులు వేచి చూడాలా? అనే విషయానికి వస్తే.. గోల్డ్ కొనుగోలు చేయడం అనేది ఒక వ్యక్తి బడ్జెట్ మీద ఆధారపడి ఉంటుంది. అయితే ఇది పెళ్లిళ్ల సీజన్.. ధరలు ఇప్పుడు ఎక్కువగా ఉంటాయి, తరువాత తగ్గుతాయి.. అనుకోవడంలో ఎలాంటి ఖచ్చితత్వం లేదు. ఎందుకంటే పెళ్లిళ్ల సీజన్ తరువాత తప్పకుండా తగ్గుతాయని ఊహించలేము. పెరిగే అవకాశాలు కూడా ఉండొచ్చు. దీనికి ప్రధాన కారణం డిమాండ్. అంటే.. బంగారం అనేది సురక్షితమైన ఆస్తి కాబట్టి కొనుగోలు చేసేవాళ్లు కొంటూనే ఉంటారు. డిమాండుకు తగ్గ సరఫరా ఉన్నప్పుడు.. ధరలు తగ్గొచ్చు, డిమాండ్ ఎక్కువగా ఉండి, సరఫరా తక్కువ ఉంటే?, ధరలు పెరుగుతాయు. కాబట్టి చేతిలో డబ్బు ఉన్నప్పుడు, బంగారం కొనాలని నిర్ణయించుకున్నప్పుడు.. కొనేయడమే ఉత్తమం.శనివారం మన దేశంలో బంగారం ధరల విషయానికి వస్తే.. 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 1,22,020 వద్ద.. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 1,11,850 వద్ద ఉంది. శుక్రవారం ధరలతో పోలిస్తే.. శనివారం ధరల్లో ఎలాంటి మార్పు లేదని తెలుస్తోంది.ఇదీ చదవండి: 2019లో భర్తకు విడాకులు.. ఆరేళ్లుగా లక్షల కోట్లు విరాళం -
బంగారం ‘కొండంత’ లక్ష్యంతో కొంటున్నా: కియోసాకి
ప్రముఖ ఇన్వెస్టర్, ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి.. రాబోయే మార్కెట్ క్రాష్ గురించి మరోసారి అలారం మోగించారు. బంగారం, వెండి, బిట్ కాయిన్, ఎథేరియం వంటి హార్డ్ ఆస్తులపై తన బుల్లిష్ దృక్పథాన్ని మరింత రెట్టింపు చేశారు.తాజాగా ‘ఎక్స్’ (గతంలో ట్విట్టర్) లో ఒక పోస్ట్ పెట్టారు. యూఎస్ రుణం, ద్రవ్య విధానం, ఫెడరల్ రిజర్వ్పై తన అభిప్రాయాలను పంచుకుంటూ ట్రెజరీ ముద్రించినది "నకిలీ డబ్బు" అని అభివర్ణించారు. తాను బంగారం, వెండి, బిట్ కాయిన్, ఎథీరియం ఆస్తులను ఎందుకు అమ్మడం లేదు.. ఇంకా కొంటున్నాడో వివరించారు.కియోసాకి అంచనాలో భవిష్యత్తులో బంగారం ఔన్సుకు 27,000 డాలర్లకు చేరుకుంటుంది. బిట్ కాయిన్ 2026 నాటికి 250,000 డాలర్లకు పెరుగుతుంది. వెండి 100 డాలర్లకు చేరుతుంది. ఇక ఎథేరియం 60,000 డాలర్లను తాకుతుంది. యు.ఎస్. ప్రభుత్వం రుణ భారాన్ని విస్తరించడం కొనసాగిస్తున్నందున ఈ ఆస్తులు సాంప్రదాయ పొదుపును అధిగమిస్తాయని రాసుకొచ్చారు.తాను గ్రేషమ్, మెట్కాఫ్ల డబ్బు నియమాలను అనుసరిస్తానని చెప్పొకొచ్చారు. "దురదృష్టవశాత్తు, యు.ఎస్. ట్రెజరీ, ఫెడ్ చట్టాలను ఉల్లంఘిస్తున్నాయి. తమ బిల్లులు చెల్లించడానికి నకిలీ డబ్బును ముద్రిస్తున్నాయి. ఫెడ్, ట్రెజరీ చేస్తున్నది మనం చేస్తే జైలులో ఉంటాం " అన్నారు.‘చరిత్రలో ఎన్నడూ లేని విధంగా నేడు అమెరికా ప్రపంచంలోనే అతిపెద్ద అప్పులున్న దేశంగా నిలుస్తోంది. అందుకే "పొదుపు చేసేవారు నష్టపోతారు" అని నేను చాలాకాలంగా హెచ్చరిస్తున్నా’ అన్నారు. అందుకే బంగారం, వెండి, బిట్కాయిన్, ఎథీరియంలను అవి క్రాష్ అయినప్పుడు కూడా కొంటున్నానని వివరించారు.CRASH COMING: Why I am buying not selling.My target price for Gold is $27k. I got this price from friend Jim Rickards….and I own two goldmines.I began buying gold in 1971….the year Nixon took gold from the US Dollar.Nixon violated Greshams Law, which states “When fake…— Robert Kiyosaki (@theRealKiyosaki) November 9, 2025 -
డిజిటల్ గోల్డ్తో జాగ్రత్త.. సెబీ హెచ్చరిక
డిజిటల్ గోల్డ్ను విక్రయించే సంస్థలు, ఆయా ఉత్పత్తులు నియంత్రణ పరిధిలో లేవని మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తెలిపింది. కాబట్టి, డిజిటల్ గోల్డ్ కొనుగోలు చేయడం రిస్క్తో కూడుకున్న వ్యవహారమని, జాగ్రత్త వహించాలని హెచ్చరించింది. సెబీ నియంత్రించే పసిడి ఉత్పత్తులతో పోలిస్తే ఇవి భిన్నమైనవని పేర్కొంది.డిజిటల్ గోల్డ్ లేదా ఈ–గోల్డ్ ప్రోడక్టుల్లో పెట్టుబడులకు ఇన్వెస్టర్ ప్రొటెక్షన్ యంత్రాంగంపరమైన హామీ ఉండబోదని వివరించింది. ప్రస్తుతం పసిడికి డిమాండ్ భారీగా పెరగడం, ఆన్లైన్లో అత్యంత తక్కువగా రూ. 10 నుంచి కూడా ఇన్వెస్ట్ చేయొచ్చంటూ పలు సంస్థలు ఊరిస్తుండటం తదితర పరిణామాల నేపథ్యంలో సెబీ హెచ్చరిక ప్రాధాన్యం సంతరించుకుంది.ఎక్స్ఛేంజీల్లో ట్రేడయ్యే కమోడిటీ డెరివేటివ్ కాంట్రాక్ట్లు, గోల్డ్ ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్), ఎల్రక్టానిక్ గోల్డ్ రిసీట్స్ మొదలైన సాధనాల ద్వారా నియంత్రణ సంస్థ పరిధిలో పసిడిలో పెట్టుబడులు పెట్టేందుకు అవకాశాలు ఉన్నాయని సెబీ తెలిపింది.ఏమిటీ గోల్డ్ ఈటీఎఫ్లు?గోల్డ్ ఈటీఎఫ్లు బంగారంపై పెట్టుబడి పెట్టే డిజిటల్ మార్గం. ఇవి భౌతిక బంగారాన్ని కొనకుండా, స్టాక్ మార్కెట్ ద్వారా బంగారం ధరలపై పెట్టుబడి పెట్టే అవకాశం కల్పిస్తాయి. గోల్డ్ ఈటీఎఫ్ (Gold ETF) అంటే గోల్డ్ ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్. ఇది మ్యూచువల్ ఫండ్ల తరహాలో పనిచేస్తుంది. ఇది స్టాక్ ఎక్స్ఛేంజ్లో ట్రేడయ్యే ఒక ఫండ్. బంగారం ధరల ఆధారంగా దీని విలువ మారుతూ ఉంటుంది. దీంతో భౌతిక బంగారం కొనకుండా డిజిటల్ రూపంలో బంగారంపై పెట్టుబడి పెట్టవచ్చు.ముఖ్యమైన ప్రయోజనాలుభౌతిక బంగారానికి ఉన్న భద్రతా సమస్యలు గోల్డ్ ఈటీఎఫ్లకు ఉండవు.స్టాక్ మార్కెట్లో ఎప్పుడైనా కొనుగోలు లేదా అమ్మకం చేయవచ్చు.గోల్డ్ ఈటీఎఫ్లపై తక్కువ మొత్తాలతో కూడా పెట్టుబడి ప్రారంభించవచ్చు.లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ వర్తిస్తుంది. ఇది మ్యూచువల్ ఫండ్లకు సమానం.భౌతికంగా నిల్వ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి స్టోరేజ్ ఖర్చులు ఉండవు.పెట్టుబడి ఎలా పెట్టాలంటే..గోల్డ్ ఈటీఎఫ్లపై పెట్టుబడి పెట్టాలంటే డీమాట్ ఖాతా (Demat Account) అవసరం. స్టాక్ బ్రోకర్ ద్వారా గోల్డ్ ఈటీఎఫ్లు కొనుగోలు చేయవచ్చు. నిర్దిష్ట ఏఎంసీ అంటే అసెట్ మేనేజ్మెంట్ కంపెనీలు ఈ ఫండ్లను నిర్వహిస్తాయి. -
బంగారం, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ఊరట
దేశంలో బంగారం ధరలు గత కొన్ని రోజులుగా హెచ్చుతగ్గులతో ఊగిసలాడుతున్నాయి. అయితే శుక్రవారంతో పోలిస్తే శనివారం బంగారం ధరలు (Today Gold Rate) స్థిరంగా కొనసాగుతున్నాయి. మరోవైపు వెండి ధరల్లో కూడా ఎలాంటి మార్పు లేదు. ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
బంగారం.. బీకేర్ఫుల్
మంచిర్యాల జిల్లా: కార్తికమాసంతో పెళ్లిళ్ల సీజన్ పునఃప్రారంభమైంది. ఉమ్మడి జిల్లాలోని యువతీ యువకులు వివాహం చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు. సంబంధాలు కుదిరిన వారు బంగారు ఆభరణాలు కొనుగోలు చేయడం అనివార్యం. నెల రోజుల క్రితం 24 క్యారెట్లు 10 గ్రాముల బంగారం ధర రూ.1.33 లక్షలకు ఎగబాకి దడపుట్టించగా ప్రస్తుతం ఆ ధర రూ.1.24 లక్షలకు పడిపోయి కాస్త ఉపశమనం కలిగించింది. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ షురూ కావడంతో బంగారం, వెండి ఆభరణాల కొనుగోళ్లకు గిరాకీ పెరుగుతోంది. ఈక్రమంలో కొనుగోలుదారులు తగిన జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏమాత్రం ఎమరుపాటుగా వ్యవహరించినా నష్టపోక తప్పదు. నిశిత పరిశీలన, నిర్ధారణ, అప్రమత్తంగా ఉండటం అనివార్యమైన అంశాలుగా వినియోగదారులు గుర్తించాలని మంచిర్యాల జిల్లా లీగల్ మెట్రాలజీ అధికారి విజయ్కుమార్ సూచిస్తున్నారు. పాటించాల్సిన అంశాలను ‘సాక్షి’కి వివరించారు.ఇవి పరిశీలించాలి బంగారం తూకం వేసేందుకు జ్యూవెల్లరీ షాపుల్లో వేయింగ్ మిషన్ వినియోగిస్తారు. దానిని ప్రతీ సంవత్సరం లీగల్ మెట్రాలజీ అధికారులు పరిశీలించి సీలు వేస్తారు. ఆ మిషన్పై సీలు ఉందా.. అందుకు సంబంధించిన సర్టిఫికెట్ షాపు యజమానులు కలిగి ఉన్నారా? తెలుసుకోవాలి. అనుమానం వస్తే షాపు యాజమానిని అడిగి నిర్ధారణ చేసుకోవాలి.వేయింగ్ మిషన్తో తూకంలో అనుమానం కలిగితే వెయిట్స్తో తూకం వేయించాలిఏదేనీ ఆర్నమెంట్ కొనుగోలు చేసినపుడు బంగారంతో పాటు రాగి, వెండి, పచ్చలు, రాళ్లు, వజ్రం ఉ ండవచ్చు. బిల్లు ఇచ్చేటప్పుడు ఆ ఆర్నమెంట్లో ఏ మేం ఉన్నాయి.. ఎంత శాతం ఉన్నాయో వివరా లు తప్పనిసరిగా బిల్లు రశీదులో నగల వ్యాపారి పొందుపర్చాలి.అలా వివరాలు లేకపోతే నమోదు చేయించుకోవాలి. జీఎస్టీ నంబర్ ఉన్న రశీదు తీసుకోవాలి.కొనుగోలు చేసిన ఆభరణం వెనకాల హగ్ మార్క్ గుర్తు ఉందా లేదా అనేది పరిశీలించుకోవాలి.షాపు ముందు ధరల పట్టిక ప్రదర్శించాలి జ్యువెల్లరీ షాపులో అమ్మకానికి పెట్టిన బంగారం, వెండి ధరలు ఏరోజుకారోజు తప్పనిసరిగా దుకాణం ముందు ప్రదర్శించాలి.రెడీమేడ్ బంగారు ఆభరణాలలో వినియోగించే స్టోన్స్, సిల్వర్, కాపర్ ధర కూడా పట్టికలో విధిగా పొందుపర్చాలి.మేకింగ్ చార్జీ ఆర్నమెంట్ రకాల ప్రకారంగా తేడా ఉంటుంది. చార్జీల అంశం లీగల్ మెట్రాలజీ నిబంధనల పరి«ధిలోకి రావు.అందువల్ల జ్యువెల్లరీ షాపుల నిర్వాహకులు కొనుగోలు దారుల నుంచి ఇష్టారాజ్యంగా చార్జీలు వసూలు చేసే అవకాశాలు ఉంటాయి. ఈ విషయంలో కొనుగోలుదారు సొంత నిర్ణయం తీసుకోవాలి.వేస్టేజీ చార్జీ ఎంత అనేది తప్పనిసరిగా అడిగి తెలుసుకోవాలి.ఉమ్మడి జిల్లాలో ఉమ్మడి జిల్లాలో ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్, మంచిర్యాల, ఉట్నూర్, ఖానాపూర్, కాగజ్నగర్, చెన్నూర్, బెల్లంపల్లి ముఖ్యమైన ప్రాంతాలు ఉన్నాయి. వీటి పరిధిలో దాదాపు 100 వరకు జ్యువెల్లరీ సేల్స్ షాపులు ఉన్నాయి. వాటి ద్వారా ఏటా రూ.కోట్లలో బంగారం, వెండి ఆభరణాల క్రయ విక్రయాలు జరుగుతున్నాయి.నమ్మకంతోనే కొనుగోళ్లు జ్యువెల్లరీ షాపుల్లో బంగారం, వెండి కొనుగోళ్లు చా లామట్టుకు నమ్మకంతోనే జరుగుతున్నా యి. స దరు షాపు యజమానుల నిజాయతీపై ఆ ధారపడి అమ్మకాలు సాగుతున్నాయి. మారుతున్న పరిస్థితుల్లో ఈతరం యువతీ యువకులు మాల్స్ ను ఆశ్రయిస్తుండగా తల్లిదండ్రులు మాత్రం వంశపారం పర్యంగా వస్తున్న జ్యువెల్లరీ షాపుకు వెళ్లి కొ నుగోలు చేయడానికి ఇష్టపడుతుండటం గమనార్హం.శుభ ముహూర్తాలు ఇవే... వివాహాలకు శుభ గడియలు వచ్చేశాయి. ఈ నెల 3వ తేదీ నుంచి 17 వరకు, తిరిగి ఫిబ్రవరి 20 నుంచి మార్చి 11వ తేదీ వరకు దివ్యమైన పెళ్లి ముహూర్తాలు ఉన్నట్లు వేద పండితులు చెబుతున్నారు. ఆతర్వాత ఉగాదికి కొత్త పంచాంగం వచ్చాక కానీ శుభముహూర్తాలు ఉండనున్నాయి.బంగారం మార్పిడిలో మోసాలకు అవకాశం వివాహాది శుభకార్యాలకు చాలా మట్టుకు పాత బంగారం అప్పజెప్పి కొత్త బంగారం తీసుకునే క్రమంలో మోసం జరిగే అవకాశాలు అధికంగా ఉన్నాయి. పాత బంగారం, వెండి ఆభరణాలకు తరుగు అధికంగా తీసి వినియోగదారులను మోసం చేస్తారు. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కొలతల్లో, తరుగు విషయంలో ఏమాత్రం అనుమానం వచ్చినా మరోషాపుకు వెళ్లి తూకం వేయించి నిర్ధారించుకోవాలి. -
బంగారం vs రియల్ ఎస్టేట్: ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ బెస్ట్?
డబ్బు ఉంటే.. పెట్టుబడి పెట్టడానికి లెక్కలేనన్ని మార్గాలు కనిపిస్తాయి. అయితే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ వద్దనుకునేవారిలో చాలామంది.. బంగారం, రియల్ ఎస్టేట్ రంగాల్లో పెట్టుబడి పెట్టడానికి ఆసక్తి చూపుతారు. ఇంతకీ ఇన్వెస్ట్ చేయడానికి బంగారం ఉత్తమమైనదా?, లేక రియల్ ఎస్టేట్ మంచి మార్గమా? అనే విషయాలు ఇక్కడ తెలుసుకుందాం.బంగారంబంగారంపై పెట్టుబడి సురక్షితమైన మార్గాల్లో ఒకటిగా భావిస్తారు. దీనికి కారణం.. చిన్న మొత్తంలో గోల్డ్ ఎప్పుడైనా కొనుగోలు చేయవచ్చు, అవసరమైనప్పుడు అమ్ముకోవచ్చు. దీనికి ప్రత్యేకించి ఎలాంటి డాక్యుమెంట్స్ అవసరం లేదు.సావరిన్ గోల్డ్ బాండ్లు కొనుగోలు చేయడం ద్వారా కూడా బంగారంపై పెట్టుబడి పెట్టవచ్చు. వీటిని రిజర్వ్ బ్యాంక్ ఇండియా (RBI) ద్వారా.. భారత ప్రభుత్వం తరఫున జారీ చేస్తారు. ప్రస్తుతం ఇవి అందుబాటులో లేదు. కానీ ఇందులో పెట్టే పెట్టుబడి భారీ లాభాలను అందిస్తుంది. ఇవి కాకుండా గోల్డ్ ETFలను కొనుగోలు చేయవచ్చు.బంగారంపై మీరు పెట్టే పెట్టుబడు.. ధరల కదలికపై ఆధారపడి ఉంటుంది. అంటే గోల్డ్ రేటు పెరిగితే లాభాలను పొందుతారు. గోల్డ్ రేటు తగ్గితే.. గోల్డ్ విక్రయించేటప్పుడు తక్కువ ధరకు విక్రయించాల్సి వస్తుంది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా.. పసిడిపై పెట్టే పెట్టుబడి నష్టాలను కలిగించే అవకాశం లేదని స్పష్టమవుతోంది.రియల్ ఎస్టేట్రియల్ ఎస్టేట్ రంగంలో కూడా ఎక్కువ లాభాలు వస్తాయి. ఈ కారణంగానే కొందరు ఇందులో ఇన్వెస్ట్ చేస్తుంటారు. భూములు, ఇళ్లు మొదలైనవాటిపై పెట్టే పెట్టుబడి కొన్ని రోజులకు రెట్టింపు లాభాన్ని తీసుకొస్తుంది. అయితే లాభం కోసం కొన్ని రోజులు వేచి చూడాలి.భూములపై పెట్టుబడిపెట్టే సమయంలో.. వాటికి సరైన డాక్యుమెంట్స్ ఉన్నాయా? లేదా అని చూసుకోవాలి. డాక్యుమెంట్స్ సరిగ్గా లేకుంటే.. ఊహకందని నష్టాలను చవిచూడాల్సి వస్తుంది. అయితే.. బంగారం అమ్మినట్లు, భూమిని వెంటనే అమ్ముకోలేరు. అమ్ముకోవడానికి కూడా కొంత సమయం వేచి చూడాలి. అప్పుడే మీరు మంచి లాభాలను పొందవచ్చు. దీనికి స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్, జీఎస్టీ, బ్రోకరేజ్ వంటి ఖర్చులు కూడా ఉంటాయి.ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ బెస్ట్?నిజానికి బంగారం, రియల్ ఎస్టేట్ రంగాలలో పెట్టె పెట్టుబడి మంచిదే. అయితే పెట్టుబడి పెట్టేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. బంగారం ఆభరణాల రూపంలో కొనాలా.., బిస్కెట్లు, కడ్డీల రూపంలో కొనుగోలు చేయాలా? అనే విషయాలను ముందుగానే తెలుసుకోవాలి.రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడి పెట్టేటప్పుడు కూడా.. ఎక్కడ కొనుగోలు చేయాలి, వాటికి సరైన డాక్యుమెంట్స్ ఉన్నాయా? అనే విషయాలతోపాటు.. మీ బడ్జెట్ ఎంత? అనే విషయాలను ముందుగానే బేరీజు వేసుకుని ముందడుగు వేయాలి. పెట్టుబడి విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే.. ఏ రంగంలో అయినా నష్టాలను చవిచూడక తప్పదు. అవసరమైన కొన్ని సందర్భాల్లో నిపుణుల సలహాలు తీసుకోవాలి.ఇదీ చదవండి: ఇల్లు కొనడానికి ఈఎంఐ: టెకీ సలహా.. -
లేచి పడిన పసిడి.. తులం ఎంతంటే..
దేశంలో బంగారం ధరలు గత కొన్ని రోజులుగా హెచ్చుతగ్గులతో ఊగిసలాడుతున్నాయి. క్రితం రోజుతో పోలిస్తే నిన్న పసిడి ధర పెరిగింది. గురువారంతో పోలిస్తే శుక్రవారం బంగారం ధరలు (Today Gold Rate) దిగొచ్చాయి. మరోవైపు వెండి ధరల్లో ఎలాంటి మార్పు లేదు. ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
39 టన్నుల బంగారం: అందుకే డిమాండ్!
భారీగా పెరిగిన బంగారం ధరలు ఇప్పుడిప్పుడే తగ్గుతున్నాయి. నేడు (నవంబర్ 06) 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 1.21 లక్షల వద్ద ఉంది. రేటు పెరగడానికి ప్రధాన కారణం.. పండుగ సీజన్ మాత్రమే కాదు. వివిధ దేశాల బ్యాంకులు ఎక్కువ మొత్తంలో పసిడి కొనుగోలు చేయడం కూడా.. అని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ చెబుతోంది.2025 సెప్టెంబర్ నెలలో కేంద్ర బ్యాంకులు గరిష్టంగా 39 టన్నుల (39,000 కేజీలు) బంగారం కొనుగోలు చేశాయని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ పేర్కొంది. ఈ ఏడాది మొత్తంలో గోల్డ్ కొనుగోళ్లు సెప్టెంబర్లో జరిగినట్లు సమాచారం. కాగా.. ఈ సంవత్సరం ఇప్పటి వరకు కేంద్ర బ్యాంకులు కొనుగోలు చేసిన బంగారం 634 టన్నులు కావడం గమనార్హం.సెప్టెంబర్ 2025లో.. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ బ్రెజిల్ 15 టన్నుల గోల్డ్ కొనుగోలు చేయగా.. బ్యాంక్ ఆఫ్ గ్వాటిమాలా 6 టన్నులు కొనుగోలు చేసింది. రష్యా బ్యాంక్ 3 టన్నులు, నేషనల్ బ్యాంక్ ఆఫ్ కజికిస్థాన్ 8 టన్నుల బంగారం కొనేసింది. టర్కీ బ్యాంక్ మాత్రం 2 టన్నుల పసిడి కొనుగోలు చేసినట్లు వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ పేర్కొంది. కేంద్ర బ్యాంకులు భారీగా బంగారం కొనుగోలు చేయడంతో.. పసిడికి డిమాండ్ అమాంతం పెరిగిందని గోల్డ్ కౌన్సిల్ వెల్లడించింది.ఇదీ చదవండి: ధరలు పెరుగుతాయ్.. వెండికి ఫుల్ డిమాండ్!తగ్గుతున్న గోల్డ్ రేటు - కారణాలుసెంట్రల్ బ్యాంకుల విషయాన్ని పక్కనపెడితే.. పెట్టుబడిదారులు కూడా బంగారం సురక్షితమైన పెట్టుబడి కాబట్టి ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇది కూడా గోల్డ్ ధరలను పెంచేసింది. అయితే ప్రస్తుతం గోల్డ్ రేటు కొంత తగ్గుముఖం పట్టింది. దీనికి కారణం.. అమెరికా డాలర్ బలపడం, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు పెరగడం, ద్రవ్యోల్బణం తగ్గడం, రాజకీయ పరిస్థితులు అని తెలుస్తోంది. -
బంగారం కొనబోతే.. పసిడి ప్రియులకు నిరాశ
దేశంలో బంగారం ధరలు గత కొన్ని రోజులుగా హెచ్చుతగ్గులతో ఊగిసలాడుతున్నాయి. ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో బుధవారంతో పోలిస్తే గురువారం బంగారం ధరలు (Today Gold Rate) పెరిగాయి. మరోవైపు వెండి ధరలు కూడా కూడా ఎగిశాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
భవిష్యత్తు బంగారు లోహం!
ఏడాది కాలంగా బంగారం, వెండి ధరలు అసాధారణ రీతిలో దూసుకుపోతున్నాయి. ధరల ర్యాలీతో సంతోషిస్తున్న పెట్టుబడిదారులు ఇప్పుడు కీలక దశలో ఉన్నట్లు కొందరు నిపుణులు చెబుతున్నారు. రానున్న కాలంలో బంగారం, వెండి పెరుగుదల ఇలాగే కొనసాగుతుందా.. లేదా అనే అనుమానం వ్యక్తం కావడమే ఇందుకు కారణం. ఈ తరుణంలో కామొడిటీ మార్కెట్లో పెట్టుబడి పెట్టేవారికి కాపర్(రాగి) ఆకర్షణీయంగా కనిపిస్తున్నట్లు కొందరు భావిస్తున్నారు. పారిశ్రామిక డిమాండ్, సరఫరా కొరత కారణంగా కాపర్ ధరలు సైతం కొంతకాలంగా పెరుగుతున్నాయి. దాంతో కాపర్ ‘భవిష్యత్తు బంగారం’(లాభాల పరంగా)గా మారుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.కాపర్ ధరలు గడచిన ఏడాది కాలంలో దాదాపు 25 శాతం పెరిగాయని కొన్ని రిపోర్టులు చెబుతున్నాయి. ప్రస్తుతం కేజీ కాపర్ ధర సుమారు రూ.750గా ఉంది. ఇది 2026లో రూ.1500-రూ.1800 వరకు పెరిగే అవకాశం ఉందని కొందరు అంచనా వేస్తున్నారు.అసలు బంగారం, వెండి ధరలు ఎందుకు పెరిగాయి?బంగారం, వెండి ధరలు ఇటీవల కాలంలో భారీగా పెరగడానికి అనేక అంతర్జాతీయ, దేశీయ అంశాలు దోహదపడ్డాయి. ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం పెరిగినప్పుడు ప్రజలు తమ డబ్బు విలువను కాపాడుకోవడానికి సురక్షితమైన పెట్టుబడి మార్గాల కోసం చూస్తారు. చరిత్రలో బంగారం ద్రవ్యోల్బణానికి వ్యతిరేకంగా పనిచేసే సాధనంగా ఉంది. దీనివల్ల డిమాండ్ పెరిగి ధరలు అధికమయ్యాయి.అనేక దేశాల కేంద్ర బ్యాంకులు భౌగోళిక రాజకీయ అనిశ్చితి, ఆర్థిక అస్థిరత నేపథ్యంలో తమ నిల్వలను పెంచుకోవడానికి భారీ మొత్తంలో బంగారాన్ని కొనుగోలు చేశాయి.సాధారణంగా యూఎస్ డాలర్ విలువ తగ్గినప్పుడు డాలర్ ఆధారిత బంగారం ఇతర కరెన్సీలు ఉన్న కొనుగోలుదారులకు చౌకగా మారుతుంది. తద్వారా డిమాండ్ పెరుగుతుంది.రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, మిడిల్ ఈస్ట్ దేశాల్లో సంక్షోభం వంటి సంఘటనలు ప్రపంచ మార్కెట్లలో అనిశ్చితిని పెంచాయి. దీనితో పెట్టుబడిదారులు భద్రంగా ఉండే బంగారం వైపు మళ్లారు.ఎలక్ట్రానిక్స్, సోలార్ ప్యానెల్స్, ఎలక్ట్రిక్ వాహనాలు (EVs) వంటి పరిశ్రమల నుంచి వెండికి పారిశ్రామిక డిమాండ్ పెరుగుతుంది.కాపర్ (రాగి) ధరల పెరుగుదలకు కారణాలు..ఒకప్పుడు కేవలం పారిశ్రామిక లోహంగా మాత్రమే పరిగణించబడిన కాపర్ ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ మెటల్గా మారుతుంది. కొన్ని నివేదికల ప్రకారం కాపర్ లోహం గత రెండు దశాబ్దాల్లో దాదాపు 700 శాతం పెరిగింది. ఇది పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షిస్తోంది.ప్రపంచవ్యాప్తంగా గనుల్లో ఉత్పత్తి సమస్యలు, స్థానిక ఆందోళనలు, కొత్త గనుల అభివృద్ధిలో జాప్యం కారణంగా కాపర్ సరఫరా గణనీయంగా తగ్గింది. దీనికి తోడు పెరిగిన డిమాండ్ ధరలను మరింత పెంచింది.ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పురోగమిస్తుండడం, భారీ స్థాయి మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, భవన నిర్మాణ రంగం నుంచి కాపర్కు డిమాండ్ బలపడుతోంది.భవిష్యత్తు అంచనామార్కెట్ నిపుణులు, మైనింగ్ దిగ్గజాలు రాగిని ‘తదుపరి బంగారం’గా పేర్కొంటున్నారు. కాపర్ ధరలు భవిష్యత్తులో మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.ఎలక్ట్రిక్ వాహనాలు: ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో రాగి కీలక పాత్ర పోషిస్తుంది. ఒక సంప్రదాయ కారు కంటే ఒక ఎలక్ట్రిక్ కారుకు దాదాపు నాలుగు రెట్లు ఎక్కువ కాపర్ అవసరం అవుతుంది. ఈవీల అమ్మకాలు పెరిగే కొద్దీ కాపర్ డిమాండ్ అపారంగా పెరుగుతుంది.క్లీన్ ఎనర్జీ: పునరుత్పాదక ఇంధన వనరుల్లో ముఖ్యంగా సోలార్, పవన విద్యుత్ మౌలిక సదుపాయాల విస్తరణకు కాపర్ అవసరం అనివార్యం. కేబుల్స్, ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ సరఫరా వ్యవస్థల్లో రాగి కీలకమైన లోహం.డిజిటలైజేషన్: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), డేటా సెంటర్లు, 5G టెక్నాలజీ, ఇతర ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన రంగాల్లో కాపర్కు డిమాండ్ పెరుగుతోంది.కాపర్ వినియోగించే పరిశ్రమలుపరిశ్రమవినియోగంవిద్యుత్, ఎలక్ట్రానిక్స్వైర్లు, కేబుల్స్, మోటార్లు, జనరేటర్లు, ట్రాన్స్ఫార్మర్లు, ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డులు (PCBs)నిర్మాణ రంగం హీటింగ్, వెంటిలేషన్, ఎయిర్ కండిషనింగ్ వ్యవస్థలు, పైపులు, రూఫింగ్రవాణాఎలక్ట్రిక్ వాహనాలు (EVs), రైల్వేలు, విమానయాన రంగంపునరుత్పాదక శక్తిసోలార్ ప్యానెల్స్, విండ్ టర్బైన్లు, బ్యాటరీలుపారిశ్రామిక యంత్రాలుఉష్ణ మాపకాలు(Heat Exchangers), పంపులుగమనిక: పెట్టుబడికి సంబంధించి ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు నిపుణుల సలహా తప్పనిసరని గమనించాలి.ఇదీ చదవండి: అలసిన పసిడి ధరలు.. తులం ఎంతంటే.. -
అలసిన పసిడి ధరలు.. తులం ఎంతంటే..
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) భారీగా పెరిగి ఇటీవల కాలంలో తీవ్ర ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. మంగళవారంతో పోలిస్తే బుధవారం బంగారం ధరలు తగ్గాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
బిగ్రిలీఫ్: ఈరోజు బంగారం ధరలు ఎంతంటే..
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) భారీగా పెరిగి ఇటీవల కాలంలో తీవ్ర ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. సోమవారంతో పోలిస్తే మంగళవారం బంగారం ధరలు తగ్గాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
స్వచ్ఛమైన బంగారం ఉత్పత్తి చేసే దేశాలు
భారతదేశంతో పాటు.. చాలా దేశాలలో బంగారానికి భారీ డిమాండ్ ఉంది. అయితే ప్రపంచంలో స్వచ్ఛమైన బంగారం తయారు చేసే దేశాల సంఖ్య చాలా తక్కువే. ఈ కథనంలో ఆ దేశాల గురించి తెలుసుకుందాం.చైనాప్రపంచంలో ఎక్కువ బంగారాన్ని ఉత్పత్తి చేసే దేశాల్లో ఒకటైన చైనా.. స్వచ్ఛమైన బంగారం తయారు చేసే దేశాల జాబితాలో కూడా ఒకటి. ఇక్కడ లేటెస్ట్ టెక్నాలజీలను ఉపయోగించడం ద్వారా.. 99.9 శాతం ప్యూర్ గోల్డ్ తయారు చేస్తుంది. బంగారాన్ని బయటకు తీసిన దగ్గర నుంచి.. శుద్దీకరణ వరకు అనేక దశలలో ఎలెక్ట్రోలిటిక్ రిఫైనింగ్ అనే పద్దతులను ఉపయోగిస్తుంది. తద్వారా శుద్ధమైన బంగారం తయారు చేస్తుంది.స్విట్జర్లాండ్స్విట్జర్లాండ్ కేవలం అందమైన దేశం మాత్రమే కాదు.. అత్యంత స్వచ్ఛమైన బంగారం తయారు చేసే దేశం కూడా. ఈ దేశంలో తవ్వకం ద్వారా లభించే గోల్డ్ చాలా తక్కువ. అయితే.. ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకున్న ముడి బంగారాన్ని.. ఇక్కడున్న శుద్ధి కర్మాగారాల సాయంతో 99.9 శాతం స్వచ్ఛమైనదిగా తయారు చేస్తారు. గోల్డ్ బార్లను ప్రాసెస్ చేసి తిరిగి ఎగుమతి చేస్తుంది.ఆస్ట్రేలియాస్వచ్ఛమైన బంగారం ఉత్పత్తి చేసే దేశాల జాబితాలో.. ఆస్ట్రేలియా కూడా ఒకటి. ఇక్కడ తవ్వకాల ద్వారా అధిక బంగారం లభ్యమవుతుంది. గనుల నుంచి ముడి పదార్థంగా లభించిన బంగారాన్ని ప్రాసెస్ చేసి.. 99.9 శాతం స్వచ్ఛమైన గోల్డ్ రూపంలోకి మారుస్తారు. ప్యూర్ గోల్డ్ తయారు చేయడానికి కావలసిన టెక్నాలజీ ఈ దేశంలో అందుబాటులో ఉంది.యునైటెడ్ స్టేట్స్అమెరికాలోని నెవాడా, అలాస్కా, క్యాలిఫోర్నియా, కొలరాడో వంటి ప్రాంతాల్లో బంగారం విరివిగా లభిస్తుంది. ఇక్కడ ముడి పదార్థంగా లభించే బంగారాన్ని.. వివిధ దశల్లో రసాయన పద్దతులను ఉపయోగించి శుద్ధి చేస్తారు. తరువాత నాణేలు, కడ్డీల రూపంలోకి మార్చి ఎగుమతులు చేయడం జరుగుతుంది. యూఎస్ బంగారు ఉత్పత్తులు స్థిరమైన స్వచ్ఛత & కఠినమైన పరీక్షకు ప్రసిద్ధి చెందాయి.కెనడాకెనడా పశ్చిమ ప్రాంతాలలోని బంగారు గనుల నుంచి ముడి పదార్థాలను తవ్వి తీస్తారు. సయనైడ్ లీచింగ్ పద్దతి తరువాత బంగారం వెలుపలికి తీసి.. ఎలెక్ట్రోలిటిక్ రిఫైనింగ్ పద్దతుల ద్వారా శుద్ధి చేస్తారు. ఇక్కడ తయారైన బంగారానికి ప్రపంచంలోని చాలా దేశాల్లో డిమాండ్ ఉంది.ఇదీ చదవండి: బంగారం ధరల్లో ఊహించని మార్పులురష్యాస్వచ్ఛమైన బంగారం ఉత్పత్తి చేసే దేశాల్లో ఒకటైన రష్యా.. ప్రస్తుతం ఎక్కువ బంగారం ఉత్పత్తి చేస్తున్న దేశాల జాబితాలో ఆరవ స్థానంలో ఉంది. రష్యాలో బంగారాన్ని వెలికితీసేందుకు ప్రధానంగా సయనైడ్ లీచింగ్, గ్రావిటీ సెపరేషన్ పద్ధతులను ఉపయోగిస్తారు. బంగారం ఉన్న రాయిని బాగా పొడిచేసి, సోడియం సయనైడ్ ద్రావణంతో కలిపి సయనైడ్ లీచింగ్ ద్వారా ద్రవ రూపంలో వెలికితీస్తారు. తరువాత కార్బన్ పుల్ లేదా జింక్ ప్రిసిపిటేషన్ పద్ధతులు ద్వారా బంగారం తిరిగి ఘనరూపంలో మారుస్తారు. ఇలా అనేక పద్దతుల ద్వారా 99.9 శాతం స్వచ్ఛమైన బంగారం తయారు చేస్తారు. -
బంగారం ధరలు మళ్లీ రివర్స్.. ఒక్క గ్రాము..
పసిడి ధరలు గత కొన్ని రోజులుగా హెచ్చుతగ్గులతో ఊగిసలాడుతున్నాయి. ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో ఆదివారంతో పోలిస్తే సోమవారం బంగారం ధరలు (Today Gold Rate) కాస్త పెరిగాయి. మరోవైపు వెండి ధరలు మాత్రం భారీగా ఎగిశాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
'బంగారం ధరల్లో ఊహించని మార్పులు'
డాలర్ విలువ పెరగడం, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు తగ్గడం, యూఎస్ ఫెడరల్ రిజర్వ్ రేటు తగ్గింపు వంటివన్నీ బంగారం ధరలు తగ్గడానికి ప్రధాన కారణమయ్యాయి. దీంతో గోల్డ్ రేటు వరుసగా రెండోవారం కూడా తగ్గుతూనే ఉంది. డిసెంబర్ నాటికి ఈ రేట్లు మరింత తగ్గే అవకాశం ఉందని అంచనా.రూ. 1,25,000 దాటేసిన 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేటు క్రమంగా తగ్గుతూ.. ఈ రోజు (నవంబర్ 02) రూ. 1,23,000 వద్ద నిలిచింది. ధరల తగ్గుదల ఇదే విధంగా కొనసాగుతుందని నిపుణులు చెబుతున్నారు. గ్లోబల్ మార్కెట్లో గరిష్ట స్థాయి నుంచి ఔన్సుకు 4,000 డాలర్ల స్థాయికి చేరిందని.. స్మాల్ కేస్ ఇన్వెస్ట్మెంట్ మేనేజర్ అండ్ వెల్త్ ట్రస్ట్ క్యాపిటల్ సర్వీసెస్ వ్యవస్థాపకురాలు & సీఈఓ స్నేహ జైన్ అన్నారు.ధరలు తగ్గడానికి కారణమైన అంశాలుఅక్టోబర్ ప్రారంభంలో బంగారం కొంతకాలం జీవిత కాల గరిష్టాలను తాకిన తర్వాత ఈ తగ్గుదల నమోదైంది. ఈ వారం పరిణామాలు బంగారం విషయంలో చాలావరకు ప్రతికూలంగా ఉన్నాయని రిటైల్ బ్రోకింగ్ & డిస్ట్రిబ్యూషన్ సీఈఓ అండ్ పీఎల్ క్యాపిటల్ డైరెక్టర్ సందీప్ రైచురా అన్నారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గాయి, ట్రంప్-జిన్పింగ్ చర్చలు సానుకూలంగా ఉన్నాయి. భారతదేశంలో పండుగ సీజన్ కూడా ముగిసింది. ఈ అంశాలన్నీ స్వల్పకాలంలో బంగారంపై ప్రతికూల ప్రభావాన్ని చూపాయని ఆయన పేర్కొన్నారు.ఊహకందని మార్పులురెండు వారాల పాటు ఒడిదుడుకుల తర్వాత వెండి ధరలు తిరిగి స్థిరత్వాన్ని ప్రదర్శించాయి. అక్టోబర్ నెలలో రూ. 2 లక్షలు దాటేసిన సిల్వర్ రేటు రూ. 1.66 లక్షలకు చేరింది. ఈ ధర మరింత తగ్గుతుందని వెల్త్ట్రస్ట్ క్యాపిటల్ సర్వీసెస్కు చెందిన జైన్ పేర్కొన్నారు. కాగా భవిష్యత్తులో రేట్ల తగ్గుదల అనేది.. స్థూల ఆర్థిక డేటాపై ఆధారపడి ఉంటాయని ఫెడ్ చైర్మన్ జెరోమ్ పావెల్ చేసిన వ్యాఖ్యలు లోహాల ర్యాలీని చల్లబరిచాయని వెంచురాలోని కమోడిటీస్ & సీఆర్ఎం హెడ్ ఎన్ఎస్ రామస్వామి అన్నారు. మొత్తం మీద పసిడి ధరలలో ఊహకందని మార్పులు జరిగే అవకాశం ఉందని ఆయన స్పష్టం చేశారు.తగ్గిన దిగుమతి ధరలుకేంద్ర ప్రభుత్వం బంగారం, వెండి బేస్ దిగుమతి ధరలను తగ్గించింది. బంగారం దిగుమతి ధర 10 గ్రాములకు 42 డాలర్లకు తగ్గింది. వెండి దిగుమతి ధర కేజీకి 107 డాలర్లకు తగ్గింది. ఈ నిర్ణయం ప్రపంచ మార్కెట్లో ధరల హెచ్చుతగ్గుల దృష్ట్యా తీసుకున్నది. దీని ఉద్దేశం దేశీయ మార్కెట్లో ధరలను స్థిరంగా ఉంచడం, వాణిజ్యాన్ని ప్రోత్సహించడం. తద్వారా ధరలలో వ్యత్యాసం కనిపిస్తోంది.ఇదీ చదవండి: పెళ్లిళ్ల సీజన్: రూ.6.5 లక్షల కోట్ల బిజినెస్! -
అదిగో భారీ క్రాష్.. ‘రిచ్ డాడ్’ వార్నింగ్!
‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ (Rich Dad Poor Dad) పుస్తక రచయిత, ప్రముఖ ఇన్వెస్టింగ్ గురూ రాబర్ట్ కియోసాకి పెట్టుబడుల గురించి మరోసారి హెచ్చరించారు. అంతర్జాతీ మార్కెట్ల ఒడిదొడుకుల నేపథ్యంలో ‘భారీ క్రాష్ మొదలంది’ అంటూ ‘ఎక్స్’లో (గతంలో ట్విట్టర్) పోస్ట్ పెట్టారు.లక్షల మంది ఇన్వెస్టర్లు ఆర్థికంగా వినాశనానికి గురవుతారని అంచనా వేశారు. సాంప్రదాయ ఆర్థిక వ్యవస్థలు హాని కలిగిస్తున్నాయని ఆయన నొక్కిచెప్పారు. వెండి (silver), బంగారం (gold) వంటి విలువైన లోహాలు, బిట్ కాయిన్, ఎథేరియం లాంటి క్రిప్టోకరెన్సీలు తిరోగమనం సమయంలో రక్షణ కవచాలుగా ఉపయోగపడతాయని సూచించారు.‘భారీ క్రాష్ మొదలంది. కోట్ల కొద్దీ పెట్టుబడులు తుడిచిపెట్టుకుపోతాయి. మిమ్మల్ని మీరే రక్షించుకోవాలి. బంగారం, వెండి, బిట్ కాయిన్, ఎథేరియం పెట్టుబడులే మిమ్మల్ని కాపాడేదది’ అంటూ తన ట్వీట్లో రాబర్ట్ కియోసాకి రాసుకొచ్చారు.కియోసాకి (Robert Kiyosaki) ఇలా హెచ్చరించడం ఇదే మొదటిసారి కాదు. 2025 ప్రారంభం ఫిబ్రవరిలో కూడా ఇలాగే "చరిత్రలో అతిపెద్ద స్టాక్ మార్కెట్ క్రాష్" రాబోతోందంటూ అంచనా వేస్తూ ఇన్వెస్టర్లను అప్రమత్తం చేసే ప్రయత్నం చేశారు.MASSIVE CRASH BEGININING: Millions will be wiped out. Protect yourself. Silver, gold, Bitcoin, Ethereum investors will protect you. Take care— Robert Kiyosaki (@theRealKiyosaki) November 1, 2025 -
బంగారం ధర మళ్లీ తగ్గినా..
పసిడి ధరలు గత కొన్ని రోజులుగా హెచ్చుతగ్గుదలతో ఊగిసలాడుతున్నాయి. ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో శుక్రవారంతో పోలిస్తే శనివారం బంగారం ధరలు (Today Gold Rate) కాస్త తగ్గాయి. మరోవైపు వెండి ధరలు మాత్రం ఎగిశాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
Sabarimala Theft Case.. మాజీ అధికారి అరెస్ట్
తిరువనంతపురం: కేరళలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమలలో బంగారం చోరీ కేసు సంచలనంగా మారింది. ఈ కేసులో మరో కీలక మలుపు చోటుచేసుకుంది. తాజాగా ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు మాజీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సుధీష్ కుమార్ను ఈ కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)అధికారులు.. సుధీష్ కుమార్ను అదుపులోకి తీసుకుని, విచారించిన దరిమిలా ఈ అరెస్ట్ జరిగింది.ఆలయ ద్వారం వద్దనున్న శిల్పాలకు పూత పూసిన పొరలు బంగారంతో తయారు చేసినవని తెలిసినప్పటికీ, సుధీష్ కుమార్ అధికారిక పత్రాలలో వాటిని రాగి పొరలుగా తప్పుగా నమోదు చేసినట్లు దర్యాప్తు అధికారులు కనుగొన్నారని ఎన్డీటీవీ తన కథనంలో పేర్కొంది. ప్రధాన నిందితుడు ఉన్నికృష్ణన్ పొట్టి మహసర్ (అధికారిక రికార్డు)ను ట్యాంపరింగ్ చేసి, బంగారాన్ని దొంగిలించేందుకు సుధీష్ కుమార్ సహాయం చేశాడని సిట్ నిర్ధారించింది. 2019లో శబరిమల ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా వ్యవహరించిన సుధీష్ నాడు ఉన్నికృష్ణన్ పొట్టిని దాతగా ఆమోదించారు. దీనికితోడు దేవస్వం బోర్డు ఆ బంగారు పొరలను రాగి పలకలుగా చెప్పాలంటూ ఉన్నికృష్ణన్ పొట్టిని కోరిందని సిట్ గుర్తించింది. అధికారులు శిల్పాలను ట్యాంపరింగ్ చేసినప్పుడు కూడా, సుధీష్ వాటిని రికార్డులలో రాగి పొరలుగా పేర్కొన్నారు.అయితే పొట్టికి ఆ షీట్లు అందకపోయినా, సుధీష్ అతని పేరును రికార్డులలో రాశారని చూపించే ఆధారాలను సిట్ స్వాధీనం చేసుకుంది. సుధీష్ మరో నిందితుడు మురారి బాబుకు ఈ బంగారం చోరీలో సహాయం చేశాడని కూడా దర్యాప్తు అధికారులు కనుగొన్నారు. సుధీష్ కుమార్ను అధికారులు (ఈరోజు) శనివారం కోర్టు ముందు హాజరుపరచనున్నారు. తదుపరి విచారణ కోసం అతనిని తిరిగి కస్టడీకి కోరే అవకాశం ఉందని సమాచారం. -
పసిడి ధరలు రివర్స్.. 22 క్యారెట్ల బంగారం ఏకంగా..
పసిడి ధరలు గత కొన్ని రోజులుగా హెచ్చుతగ్గుదలతో ఊగిసలాడుతున్నాయి. ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో గురువారంతో పోలిస్తే శుక్రవారం బంగారం ధరలు (Today Gold Rate) ఒక్కసారిగా రివర్స్ అయ్యాయి. మరోవైపు వెండి ధరలు నిలకడగా కొనసాగుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
ఒంటినిండా నగలు ధరిస్తే.. రూ. 50వేలు జరిమానా!
బంగారు నగలు ఉంటే.. ఎవరికైనా ధరించుకోవాలని, ఓ నలుగురికి చూపించుకోవాలని ఉంటుంది. అయితే ఇలాంటి ఆడంబరాలకు స్వస్తి పలకడానికి.. ఉత్తరాఖండ్లోని జౌన్సర్-బావర్ గిరిజన ప్రాంతంలోని కంధర్ గ్రామ నివాసితులు ఒక వింత నిర్ణయం తీసుకున్నారు. దీనిని ఉల్లంఘించిన వారికి రూ. 50వేలు జరిమానా విధించనున్నట్లు పేర్కొన్నారు.ఆడంబరాలను అరికట్టడానికి మాత్రమే కాకుండా.. ఆర్ధిక అసమానతలను తగ్గించడానికి గ్రామ పెద్దలు తీసుకున్న నిర్ణయాన్ని అక్కడి మహిళలు కూడా స్వాగతించారు. ఇకపై అక్కడి మహిళలు వివాహాది శుభకార్యాలకు వెళ్లినా.. కేవలం చెవిపోగులు, ముక్కుపుడక, మంగళసూత్రం మాత్రమే ధరించాలి. ఇవి కాదని ఎవరైనా ఇతర బంగారు నగలను ధరిస్తే.. వారికి రూ. 50,000 జరిగిమానా విధించనున్నట్లు గ్రామపెద్దలు హెచ్చరించారు.బంగారం ధరలు రోజురోజుకి పెరుగుతూనే ఉన్నాయి. డబ్బున్నవారు గోల్డ్ కొనుగోలు చేస్తారు. పేదరికంలో ఉన్నవారికి ఇది సాధ్యం కాదు. బంగారం కొనాలని అప్పులు చేస్తే.. ఆర్థికంగా కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కుటుంబంలో అప్పులు పెరుగుతాయని కంధర్ గ్రామపెద్దలు.. కొత్త నిర్ణయం తీసుకున్న సందర్భంగా వివరించారు.వివాహం అనేది ఒక పవిత్రమైన ఆచారం. అది ప్రదర్శించడానికి వేదిక కాదు. ఆడంబరాలు/ప్రదర్శనలు అనే గోడలను కూల్చివేసినప్పుడే.. నిజమైన సమానత్వం సాధించబడుతుందని అక్కడి నివాసితులు నమ్ముతున్నారు. కొత్తగా తీసుకున్న నిర్ణయం.. ధనిక & పేద కుటుంబాల మధ్య పోల్చుకోవడం కొంత తగ్గుతుంది. అనవసరమైన ఖర్చులను అరికట్టవచ్చు. ఇది సామాజిక ఐక్యతను పెంపొందించడానికి కూడా ఉపయోగపడుతుందని చెబుతున్నారు.ఇదీ చదవండి: 'ఆలస్యం చేయొద్దు.. వేగంగా కొనండి': రాబర్ట్ కియోసాకి -
కాపర్కు పెరుగుతున్న డిమాండ్..
దేశీయంగా కాపర్కు డిమాండ్ బలపడుతోంది. గత ఆర్థిక సంవత్సరంలో (2024–25) 1,878 కిలో టన్నులకు చేరుకుంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో డిమాండ్ 1,718 కిలో టన్నులతో పోల్చి చూసినప్పుడు 9.3 శాతం పెరిగింది. ఇంటర్నేషనల్ కాపర్ అసోసియేషన్ ఇండియా (ఐసీఏ ఇండియా) ఈ వివరాలను నివేదిక రూపంలో విడుదల చేసింది.ఆర్థికంగా పురోగమిస్తుండడం, కీలక రంగాల్లో కాపర్ వినియోగం పెరుగుతుండడం డిమాండ్కు మద్దతుగా నిలుస్తున్నట్టు తెలిపింది. భారీ స్థాయి మౌలిక ప్రాజెక్టులు, భవన నిర్మాణాలు, ఎలక్ట్రిక్ వాహనాలు, సోలార్ విద్యుత్ సామర్థ్యాల విస్తరణ వంటివి డిమాండ్ను అధికం చేస్తున్నాయని పేర్కొంది. ముఖ్యంగా గత ఆర్థిక సంవత్సరంలో భవన నిర్మాణ రంగం నుంచి కాపర్కు డిమాండ్ 11 శాతం పెరగ్గా, మౌలిక సదుపాయాల రంగం నుంచి 17 శాతం అధికంగా ఉన్నట్టు తెలిపింది.‘‘భారత్లో ఆర్థిక, పారిశ్రామిక పురోగతికి అనుగుణంగా కాపర్ డిమాండ్ పెరుగుతోంది. పునరుత్పాదక ఇంధన వనరులు, సుస్థిర రవాణా పరిష్కారాలు, మౌలిక వసతుల అభివృద్ధి కాపర్ డిమాండ్ను పెంచుతున్నాయి. దేశ అభివృద్ధికి కీలక వనరుగా కాపర్ తనవంతు పాత్రను తెలియజేస్తోంది’’అని ఐసీఏ ఇండియా తెలిపింది.అయితే వికసిత్ భారత్ ఆకాంక్షకు అనుగుణంగానే ప్రస్తుత కాపర్ డిమాండ్ ఉందా? అని ప్రశ్నించుకోవాలని ఏసీఏ ఇండియా ఎండీ మయాంక్ కర్మార్కర్ పేర్కొన్నారు. కాపర్ నిల్వలను అభివృద్ధి చేసుకోవడం, దేశీ సరఫరా వ్యవస్థలను బలోపేతం చేసుకోవడం ద్వారా భవిష్యత్ డిమాండ్ను చేరుకోవచ్చని సూచించారు.భవిష్యత్తు బంగారంబంగారం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. రోజుకో కొత్త ధరకు చేరుతూ సామాన్యులకు అందనంత దూరంగా జరిగిపోతోంది పసిడి. ఇన్వెస్టర్లు సైతం స్వర్ణంపై సంపూర్ణ విశ్వాసం పెట్టలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో ‘భవిష్యత్ బంగారం’గా మరో లోహం ఆశలు పూయిస్తోంది. అదే ‘రాగి’ (Copper). మల్టీ నేషనల్ మైనింగ్ సంస్థ వేదాంతా గ్రూప్ చైర్మన్ అనిల్ అగర్వాల్ కాపర్ను 'తదుపరి బంగారం'గా అభివర్ణించారు. ఇది క్లీన్ ఎనర్జీ, ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన రంగాలలో ఎక్కువగా ప్రాముఖ్యతను పొందుతోందని పేర్కొన్నారు. ఎలక్ట్రిక్ వాహనాలు, పునరుత్పాదక శక్తి మౌలిక సదుపాయాలు, ఏఐ, రక్షణ పరికరాలలో కాపర్కు పెరుగుతున్న డిమాండ్ను ఆయన ప్రస్తావించారు. కెనడాలోని బారిక్ గోల్డ్ సంస్థ తన పేరులో గోల్డ్ పదాన్ని తొలగించి కేవలం 'బారిక్'గా మార్చడం గ్లోబల్ స్థాయిలో కాపర్ గనులపై దృష్టి మారే సంకేతంగా ఆయన పేర్కొన్నారు.The world's second largest gold producer, Barrick Gold is rebranding to just Barrick. That is because it sees its future in copper.Copper is the new super metal which is being heavily used in every advanced technology, whether EVs, renewable energy infrastructure, AI or defence… pic.twitter.com/YUDC5Rid4r— Anil Agarwal (@AnilAgarwal_Ved) April 17, 2025 -
బంగారం ఇక పనికిరాదు.. బాబా వంగా సంచలనం
-
బంగారం జాక్పాట్! తులం ఎంతకు తగ్గిందంటే..
పసిడి ధరల పతనం కొనసాగుతోంది. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు తగ్గుదల బాట పట్టాయి. ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో బుధవారంతో పోలిస్తే గురువారం బంగారం ధరలు (Today Gold Rate) భారీగా దిగివచ్చాయి. మరోవైపు వెండి ధరలు కూడా క్షీణించాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
సముద్ర తీరంలో కనక వర్షం.. ఒక్కసారిగా ఎగబడ్డ జనం
-
బంగారం ధరల తుపాను! తులం ఎంతంటే..
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) భారీగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో ఇటీవల పసిడి ధరలు ఊగిసలాడుతున్నాయి. మంగళవారంతో పోలిస్తే బుధవారం బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
ఆర్బీఐ ఖజానాలో బంగారం ధగధగలు
ఆర్బీఐ వద్ద పసిడి నిల్వలు ధగధగా మెరిసిపోతున్నాయి. సెప్టెంబర్ చివరికి ఆర్బీఐ వద్ద పసిడి నిల్వలు 880.18 మెట్రిక్ టన్నులకు పెరిగాయి. గత 12 నెలల్లోనే 25.45 మెట్రిక్ టన్నుల మేర పసిడి నిల్వలను ఆర్బీఐ పెంచుకుంది. ఇందులో 575.82 మెట్రిక్ టన్నుల బంగారం దేశీయంగా నిల్వ చేసుకోగా, మిగిలినది విదేశాల్లోని వాల్టుల్లో భద్రపరిచింది.బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ వద్ద 290.37 టన్నుల బంగారం నిల్వ ఉంది. 13.99 టన్నుల మేర బంగారం డిపాజిట్ల రూపంలో కలిగి ఉంది. ఆర్బీఐ వద్ద విదేశీ మారకం నిల్వల్లో బంగారం వాటా 13.92 శాతానికి పెరిగింది. ఈ ఏడాది మార్చినాటికి ఇది 11.70 శాతంగా ఉండడం గమనార్హం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025–26) తొలి ఆరు నెలల కాలంలో 600 కిలోల బంగారాన్ని ఆర్బీఐ కొనుగోలు చేసింది.అంతర్జాతీయంగా వాణిజ్య, భౌగోళికపరమైన తీవ్ర అనిశ్చితులు నెలకొన్న తరుణంలో, డాలర్ రిస్క్ను తగ్గించుకునేందుకు ఆర్బీఐ ఇటీవలి సంవత్సరాల్లో తన విదేశీ మారకం నిల్వల్లో బంగారానికి వెయిటేజీ పెంచుకోవడం గమనార్హం. సెప్టెంబర్ చివరికి మొత్తం విదేశీ మారకం నిల్వలు 700 బిలియన్ డాలర్లకు చేరాయి. సరిగ్గా ఏడాది క్రితం ఇవి 705.78 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి.ఇదీ చదవండి: ఇంట్లో కూర్చొని లక్షలు సంపాదించే బిజినెస్ ఐడియాలు -
గోల్డ్ ఢమాల్..
న్యూఢిల్లీ: అమెరికా–చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడంతో పసిడి ధర భారీగా పడిపోయింది. ఆలిండియా సరాఫా అసోసియేషన్ ప్రకారం ఢిల్లీ బులియన్ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత గల పది గ్రాముల బంగారం రేటు ఏకంగా రూ. 4,100 క్షీణించి రూ. 1,21,800కి దిగి వచ్చింది. అంతర్జాతీయంగా కూడా కీలకమైన 4,000 డాలర్ల దిగువకి పడిపోయిన పుత్తడి ధర (ఔన్సుకి – 31.1 గ్రాములు) మరింతగా తగ్గింది.సురక్షితమైన పెట్టుబడి సాధనంగా పసిడికి డిమాండ్ తగ్గడంతో అమ్మకాలు వేగవంతమయ్యాయని, మూడు వారాల కనిష్ట స్థాయికి ధర నెమ్మదించిందని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ సీనియర్ అనలిస్ట్ (కమోడిటీస్) సౌమిల్ గాంధీ తెలిపారు. మరోవైపు, వెండి ధర కూడా కేజీకి ఏకంగా రూ.6,250 మేర క్షీణించి రూ. 1,45,000 స్థాయికి పడిపోయింది.ఇక అంతర్జాతీయంగా చూస్తే స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 94.37 డాలర్లు (2.37 శాతం) క్షీణించి 3,887.03 డాలర్లకు తగ్గింది. అంతకు ముందు సెషన్లోనే 132.02 డాలర్లు తగ్గి 4,000 మార్కు దిగువన క్లోజయ్యింది. ఫ్యూచర్స్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్లో డిసెంబర్ కాంట్రాక్ట్ పసిడి ధర ఒక దశలో సుమారు రూ. 1,778 క్షీణించి రూ. 1,19,179 వద్ద ట్రేడయ్యింది. మరోవైపు, పసిడిలో కరెక్షన్ కొనసాగే అవకాశం ఉందని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ అభిప్రాయపడ్డారు. ఈ ఏడాది 50 శాతానికి పైగా పెరిగిన నేపథ్యంలో మరో 5–10 శాతం క్షీణించవచ్చని పేర్కొన్నారు. బుధవారం వెల్లడయ్యే అమెరికా ఫెడ్ రిజర్వ్ పాలసీపై అందరూ ప్రధానంగా దృష్టి పెట్టారని మిరే అసెట్ షేర్ఖాన్ కమోడిటీస్, కరెన్సీస్ హెడ్ ప్రవీణ్ సింగ్ తెలిపారు. -
షట్టర్ కట్ చేసి.. నిజామాబాద్ లో భారీ చోరీ
-
బంగారం, వెండి ధరల్లో ఊహించని మార్పు!
భారతదేశంలో బంగారం, వెండి ధరలు వరుసగా తగ్గుతున్నాయి. ఈ రోజు (అక్టోబర్ 28) కూడా ఇదే బాటలో కొనసాగింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో గోల్డ్ రేట్లలో స్వల్ప మార్పులు జరిగాయి. నేడు చెన్నైలో పసిడి ధర గరిష్టంగా రూ. 1630 తగ్గింది. హైదరాబాద్ ముంబై నగరాల్లో రూ. 820 తగ్గింది. ఈ కథనంలో బంగారం ధర ఏ ప్రాంతంలో ఎలా ఉందనే విషయం తెలుసుకుందాం..(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
ఒకే రోజు రెండుసార్లు తగ్గిన గోల్డ్ రేటు: కారణాలివే!
భారీగా పెరిగిన బంగారం ధరలు.. క్రమంగా తగ్గుతూనే ఉన్నాయి. ఈ రోజే (అక్టోబర్ 27) గోల్డ్ రేటు రెండోసారి తగ్గింది. ఉదయం గరిష్టంగా రూ. 1050 తగ్గిన రేటు.. సాయంత్రానికి మరో రూ. 1290 తగ్గింది (మొత్తం రూ. 2340 తగ్గింది). దీంతో మరోమారు పసిడి ధరల్లో స్వల్ప మార్పులు జరిగాయి. ప్రస్తుత ధరలకు సంబంధించిన వివరాల విషయానికి వస్తే..హైదరాబాద్, విజయవాడ మొదలైన ప్రాంతాల్లో 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 2340 తగ్గి.. రూ. 1,23,280 వద్ద ఉండగా.. 22 క్యారెట్ల రేటు రూ. 2150 రూపాయలు తగ్గి రూ. 1,13,000 వద్దకు చేరింది. ఇదే ధరలు బెంగళూరు, ముంబై నగరాల్లో కూడా కొనసాగుతాయి.ఢిల్లీలో కూడా గోల్డ్ రేటు గణనీయంగా తగ్గింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 2340 తగ్గి రూ. 1,23,430 వద్ద ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల రేటు రూ. 2150 తగ్గి రూ. 1,13,150 వద్దకు చేరింది.చెన్నైలో బంగారం ధరలలో ఎటువంటి మార్పు లేదు. కాబట్టి ఇక్కడ గోల్డ్ రేటు ఉదయం ఎలా ఉందో.. సాయంత్రానికి కూడా అలాగే ఉంది. (24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 540 తగ్గి.. రూ. 1,24,910 వద్ద.. 22 క్యారెట్ల 10 గ్రామ్స్ గోల్డ్ రేటు 500 తగ్గి.. రూ. 1,14,500 వద్ద నిలిచింది).గోల్డ్ రేటు తగ్గడానికి ప్రధాన కారణాలు➤అమెరికా డాలర్ బలపడం: డాలర్ విలువ పెరిగితే.. బంగారంపై పెట్టుబడులు తగ్గుతాయి. ఎందుకంటే బంగారం డాలర్లోనే ట్రేడ్ అవుతుంది.➤వడ్డీ రేట్లు పెరగడం: అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు పెంచితే, ఇన్వెస్టర్లు బంగారం కంటే బాండ్లు లేదా ఇతర వడ్డీ ఇచ్చే ఆస్తుల్లో పెట్టుబడి పెడతారు.➤ద్రవ్యోల్బణం తగ్గడం: ద్రవ్యోల్బణం తగ్గితే, బంగారాన్ని సురక్షిత పెట్టుబడిగా భావించేవారు సంఖ్య తగ్గుతుంది.➤రాజకీయ పరిస్థితులు: ప్రపంచ రాజకీయ పరిస్థితులు కొంత స్థిరంగా ఉండడం వల్ల, బంగారం ధరలపై ఒత్తిడి తగ్గుతుంది.➤చైనాలో డిమాండ్ తగ్గడం: బంగారాన్ని అధికంగా కొనుగోలు చేసే దేశాల జాబితాలో చైనా, భారత్ ముందు వరుసలో ఉంటాయి. అయితే చైనాలో ఆర్థిక మందగమనం వల్ల డిమాండ్ కొంత తగ్గింది.ఇదీ చదవండి: 'ఆలస్యం చేయొద్దు.. వేగంగా కొనండి': రాబర్ట్ కియోసాకి -
‘బంగారం, వెండి క్రాష్ అంటూ భయపెడుతున్నారు’
ప్రముఖ ఇన్వెస్టర్, ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ (Rich Dad Poor Dad) పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి (Robert Kiyosaki) బిట్కాయిన్, బంగారం(Gold), వెండి పెట్టుబడులకు సంబంధించి తాజాగా మరో ట్వీట్ చేశారు. ఇన్వెస్టర్లను ఆకర్షించడానికి చాలా మంది యూట్యూబ్ జాకీలు భయాన్ని వ్యాప్తి చేస్తున్నారని ఆరోపించారు.రాబర్ట్ కియోసాకి తన తాజా ‘ఎక్స్’ (గతంలో ట్విట్టర్) పోస్ట్లో "ఫియర్ క్లిక్ బైటింగ్" గురించి విమర్శించారు. వ్యూస్, సబ్స్కైబర్లను పెంచుకోవడానికి ఆన్ లైన్ కంటెంట్ క్రియేటర్లు ఆర్థిక మార్కెట్ల గురించి ముఖ్యంగా బిట్ కాయిన్, బంగారం, వెండి గురించి భయంకరమైన అంచనాలను పోస్ట్ చేస్తున్నారన్నారు."చాలా మంది యూట్యూబ్ జాకీలు... 'ఫియర్ క్లిక్ బైట్స్' తో మిమ్మల్ని ఆకర్షిస్తున్నారు.. 'బిట్ కాయిన్ క్రాష్ కాబోతోంది.. లేదా బంగారం, వెండి పతనం కానున్నాయి' వంటి అంచనాలను చెబుతున్నారు. తర్వాత 'నా వెబ్ సైట్ కు సబ్ స్క్రైబ్ చేయండి' అంటూ అడుక్కుంటున్నారు. ఎంత మోసం?" అంటూ కియోసాకి రాసుకొచ్చారు.నిజమైన ఆస్తులను కలిగి ఉండటంపై తన నమ్మకాన్ని మరోసారి పునరుద్ఘాటించిన కియోసాకి, ఆ మార్కెట్లలో భవిష్యత్తులో ఏదైనా తిరోగమనం వస్తే మరింత కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. "వాళ్లు చెబుతున్నట్లు ఒకవేళ బిట్కాయిన్, ఎథేరియం, బంగారం, వెండి వంటివి క్రాష్ అయితే ఆ తగ్గిన ధరలకు మరింత ఎక్కువ కొనుగోలు చేస్తాను" అన్నారు.ఇదీ చదవండి: షేర్ల విక్రయాలు – పన్ను మినహాయింపు"అసలు సమస్య నకిలీ డబ్బు, అసమర్థ నాయకులు.. లక్షల కోట్లలో ఉన్న జాతీయ రుణం." అని పేర్కొన్న రాబర్ట్ కియోసాకి యూఎస్ డాలర్ "ఫేక్ మనీ" అని చాలాకాలంగా హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో మరోసారి రియల్ మనీ అని చెప్పే బంగారం, వెండి, బిట్ కాయిన్, ఎథేరియం వంటివాటిని పోగుచేసుకోవాలని తన ఫాలోవర్లకు సూచించారు.FEAR CLICK BAITING:Many You Tube jockeys, vs old time Radio Disc Jockies….lure you in with “Fear Click Baits.” They state such predictions as “Bitcoin to crash.” Or “Gold and silver to crash.”Then they say “ Subscribe to my website.” How phoney. How fake?”If the…— Robert Kiyosaki (@theRealKiyosaki) October 27, 2025 -
పసిడి పతనం.. కొనుగోలుదారులకు మంచి తరుణం
పసిడి ధరల పతనం కొనసాగుతోంది. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు తగ్గుదల బాట పట్టాయి. ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో ఆదివారంతో పోలిస్తే సోమవారం బంగారం ధరలు (Today Gold Rate) భారీగా దిగివచ్చాయి. మరోవైపు వెండి ధరలు మాత్రం ఎలాంటి మార్పు లేకుండా నిలకడగా కొనసాగాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
పెయింట్ కోసమే రూ.13 లక్షలు.. ఈ బైక్ ధర ఎంతో తెలుసా?
సాధారణంగా సుజుకి హయబుసా ధర కొంత ఎక్కువగానే ఉంది. అలాంటి ఈ బైకును బంగారంతో తయారు చేస్తే.. దాని ధర ఇంకెంత ఉంటుందో.. ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇటీవల దుబాయ్లో జరిగిన ఒక మోటార్ ఈవెంట్లో బంగారు హయాబుసా కనిపించింది.బంగారు హయాబుసాకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీని ధర అక్షరాలా రూ.1.67 కోట్లు అని సమాచారం. ఈ బైకులో చాలా వరకు గోల్డ్ బాడీవర్క్ జరిగి ఉండటాన్ని గమనించవచ్చు. ఇందులో వజ్రాలను కూడా ఉపయోగించారు. కాగా బోల్టులు కూడా బంగారమే కావడం గమనార్హం.ఇక్కడ కనిపించే బైకుకు వేసిన గోల్డ్ లీఫ్ పెయింట్ కోసం మాత్రమే రూ. 13.3 లక్షలు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. ఈ పెయింట్ వర్క్ మొత్తాన్ని.. ప్రపంచంలోని అగ్రశ్రేణి ఆటోమోటివ్ కళాకారులలో ఒకరైన మిస్టర్ డానీ పూర్తిచేశారు.ఇదీ చదవండి: అమెరికన్ కంపెనీ కీలక నిర్ణయం: 63వేల కార్లపై ఎఫెక్ట్!గోల్డ్ హయబుసా వెనుక టైరు.. పరిమాణంలో బుగట్టి కారు కంటే పెద్దదిగా ఉంది. కాగా ఇది 400 హార్స్ పవర్ ప్రొడ్యూస్ చేసే ఇంజిన్ కలిగి ఉంది. ప్రస్తుతం ఈ వీడియో ఆటోమొబైల్ ఔత్సాహికులను తెగ ఆకట్టుకుంటోంది. పలువురు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Tharesh Kumar (@tharesh_kumar) -
ధరలు తగ్గిన మురిపెం కొంత సేపే! మళ్లీ ఇలా..
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) భారీగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో ఇటీవల గడిచిన రెండు సెషన్ల్లో ధరలు కొంత తగ్గుముఖం పట్టాయి. అంతలోనే శుక్రవారంతో పోలిస్తే శనివారం బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
ఇవి జరిగితేనే.. బంగారం ధరలు తగ్గుతాయి!
బంగారం ధరలు భారీగా పెరిగి.. వారం రోజుల నుంచి కొంత తగ్గుముఖం పడుతున్నాయి. అక్టోబర్ 22న.. ఒకేరోజు గోల్డ్ రేటు గరిష్టంగా రూ. 4690 తగ్గింది. కాగా ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో పసిడి ధరలు రూ.1,24,370 (24 క్యారెట్స్ 10 గ్రా), రూ.1,14,000 (22 క్యారెట్స్ 10 గ్రా) వద్ద ఉన్నాయి. ఈ ధరలు ఇంకా తగ్గాలంటే.. ఎలాంటి పరిణామాలు జరగాలనే విషయాన్ని నిపుణులు అంచనా వేశారు.గోల్డ్ రేటు అంతర్జాతీయ మార్కెట్లలో గణనీయంగా తగ్గాలంటే.. యుద్దాలు ఆగాలి, అమెరికా విధించిన సుంకాలు తగ్గాలి, ఆర్థికాభివృద్ధి పెరిగినప్పుడే.. బంగారం ధరలు దిగివచ్చే అవకాశం ఉంటుందని.. టాటా అసెట్ మేనేజ్మెంట్ కమొడిటీస్ ఫండ్ మేనేజర్ 'తపన్ పటేల్' తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.అంతర్జాతీయ మార్కెట్లలో ఈ వారం బంగారం ధరలు 3 శాతం తగ్గడంతో పసిడి కొనుగోలుదారులు ఊపిరి పీల్చుకుంటున్నట్లు కనిపిస్తోంది. గోల్డ్ ధరలు సుమారు తొమ్మిది వారాలుగా పెరుగుతూనే ఉన్నాయి. ఈ వారంలో మాత్రమే ధరల పతనం నమోదైంది. దీంతో గోల్డ్ రేటు ఔన్సుకు 4118.68 డాలర్ల వద్దకు చేరుకుంది.బంగారం పెరగడానికి కారణాలుగోల్డ్ రేటు పెరగడానికి కారణాలు చాలానే ఉన్నాయి. ఇందులో ప్రధానంగా డిమాండుకు తగ్గ సరఫరా లేకపోవడం అని తెలుస్తోంది. డిమాండ్ పెరగడానికి కారణం.. పెట్టుబడిదారుల గోల్డ్ మీద ఎక్కువగా ఇన్వెస్ట్ చేయడమే. బంగారం సురక్షితమైన పెట్టుబడి, కాబట్టి దీనిపై పెట్టుబడులు పెరిగాయి. ఇవి కాకుండా అంతర్జాతీయ పరిణామాలు కూడా బంగారం ధరలను అమాంతం పెంచేస్తున్నాయి.ఇదీ చదవండి: 'ఆలస్యం చేయొద్దు.. వేగంగా కొనండి': రాబర్ట్ కియోసాకి -
ఆరోజు మా అమ్మ బంగారు గాజులు, నెక్లెస్లు దానం చేసింది.. మరి ఇప్పుడు?
పారిశ్రామిక దిగ్గజంఆనంద్ మహీంద్రా(Anand Mahindra) ఎప్పటికప్పడూ ఆసక్తికర ట్వీట్లతో ప్రజకు చేరువుగా ఉంటారు. ఆసక్తికరమైన ట్రావెల్స్, స్ఫూర్తిని కలిగించే విషయాలతో చైత్యన్యపరిచేలా ఉంటాయా ఆయన ట్వీట్స్. ఈసారి కూడా అలాంటి ఆసక్తికరమైన, ఆలోచింపచేసే ట్వీట్ని నెట్టింట షేర్ చేశారు. ఆ ట్వీట్ సారాంశం వింటే..ఇది నిజమే కదా..కచ్చితంగా ఇలా సాధ్యమేనా అనే సందేహం మెదులుతుంది మదిలో..అదేంటంటే..1962లో చైనాతో జరిగిన యుద్ధంలో దేశానికి మద్దతుగా భారతీయ మహిళలు నిస్వార్థంగా బంగారు ఆభరణాలు ఇచ్చిన సంఘటన గురించి చెప్పుకొచ్చారు ఆనంద్ మహీంద్రా. అంతేగాదు అందుకు సంబంధించిన తన బాల్య జ్ఞాపకాన్ని కూడా షేర్ చేశారు. టాప్ పది దేశాల్లో కంటే బంగారం భారతీయ మహిళల వద్దే ఉంది అన్న ట్వీట్కి ప్రతిస్పందనగా ఆయన ఇలా రాసుకొచ్చారు పోస్ట్లో. బంగారం ఏఏ దేశాల వద్ద ఎక్కువగా ఉంది అనే జాబితాను వివరిస్తూ..యూఎస్ఏ: 8,133 టన్నులుజర్మనీ: 3,351 టన్నులుఇటలీ: 2,451 టన్నులుఫ్రాన్స్: 2,437 టన్నులురష్యా: 2,332 టన్నులుచైనా: 2,279 టన్నులుస్విట్జర్లాండ్: 1,039 టన్నులుజపాన్: 845 టన్నులునెదర్లాండ్స్: 612 టన్నులుపోలాండ్: 448 టన్నులునాడు 1962లో, చైనాతో యుద్ధం జరగుతున్న సమయంలో రక్షణ ప్రయత్నాల నిమిత్తమై జాతీయ రక్షణ నిధిని కోరింది. మన దేశాన్ని రక్షించుకునేందేకు ప్రజలంతా తమ ఆభరణాలను, బంగారాన్ని దానంగా ఇవ్వాలని పౌరులకు విజ్ఞప్తి చేసింది. నేడు వేల కోట్ల ధర పలుకుతున్న బంగారాన్ని అప్పుడు దేశ రక్షణ కోసం సేకరించడం నాకు ఇంకా గుర్తు ఉంది అంఊ తన బాల్య జ్ఞాపకాన్ని గుర్తు చేసుకున్నారు. సరిగ్గా నాకు అప్పుడు ఏడేళ్లు. ముంబైలో మా అమ్మ పక్కన నిలబడి ఉండగా..ఆమె ఇది విని నిశబ్ధంగా తన బంగారు గాజులు, నెక్లెస్లలో కొన్నింటిని సేకరించి, వాటిని ఒక గుడ్డ థైలాలో ఉంచి, ట్రక్కుపై ఉన్న స్వచ్ఛంద సేవకులకు అందజేసిన ఘటన ఇప్పటికీ ఇంకా గుర్తుంది. ఇవాళ ఆ స్థాయిలో స్ఫూర్తి, స్వచ్ఛంద చర్యలు జరుగుతాయా అని ప్రశ్నించారు. అంతేగాదు నాకు ఆ జ్ఞాపకం జాతీయ స్థితిస్థాపకత అనేది విధాన సాధనాలపై మాత్రమే కాకుండా, ప్రజల సమిష్టి సంకల్పంపై ఆధారపడి ఉంటుందనే విషయాన్ని గుర్తు చేస్తుంటుంది. అని రాశారు." అని పోస్ట్లో రాసుకొచ్చారు.(చదవండి: Diwali 2025: ఆ గ్రామంలో దీపావళి ప్రాభవమే వేరు!) -
పసిడి ధరలు రివర్స్! తులం బంగారం ఒక్కసారిగా..
పసిడి ప్రియుల ఆశలు ఆవిరయ్యాయి. గత కొన్ని రోజులుగా తగ్గుదల బాట పట్టిన బంగారం ధరలు ఒక్కసారి రివర్స్ అయ్యాయి. ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో గురువారంతో పోలిస్తే శుక్రవారం బంగారం ధరలు (Today Gold Rate) ఎగిశాయి. మరోవైపు వెండి ధరలు మాత్రం వరుసగా నాలుగో రోజు కూడా భారీగా దిగివచ్చాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
భారతీయ మహిళల వద్ద ఇంత బంగారం ఉందా?
భారతీయులు అలంకార ప్రియులనే విషయాన్ని చరిత్ర కారులు కొన్నేళ్ల క్రితమే తమ రచనల్లో పేర్కొన్నారు. అలంకారమంటే.. కేవలం కట్టు, బొట్టు మాత్రమే కాదు.. ఆభరణాలు కూడా. భారతీయులు ధరించినన్ని నగలు.. ప్రపంచంలోనే చాలా దేశాల ప్రజలు ధరించరనే విషయం ఇప్పటికే చాలామంది వెల్లడించారు. ఇప్పుడు వరల్డ్ అప్డేట్స్ తన ఎక్స్ ఖాతాలో ఇదే విషయాన్ని వెల్లడించింది.బంగారం అంటే.. ఒకప్పుడు కేవలం అలంకారం. ఈ రోజు అది అలంకారం మాత్రమే కాదు, ఒక మనిషి ఆర్ధిక స్థితి కూడా. వరల్డ్ అప్డేట్స్ ప్రకారం సుమారు 10 దేశాల్లో ఉన్న బంగారం కంటే.. ఇండియాలోని మహిళల దగ్గరే ఎక్కువ ఉందని పేర్కొంది.➤భారతీయ మహిళల దగ్గరున్న బంగారం: 25,488 టన్నులు➤యూఎస్ఏ: 8,133 టన్నులు➤జర్మనీ: 3,351 టన్నులు➤ఇటలీ: 2,451 టన్నులు➤ఫ్రాన్స్: 2,437 టన్నులు➤రష్యా: 2,332 టన్నులు➤చైనా: 2,279 టన్నులు➤స్విట్జర్లాండ్: 1,039 టన్నులు➤జపాన్: 845 టన్నులు➤నెదర్లాండ్స్: 612 టన్నులు➤పోలాండ్: 448 టన్నులుBreaking:🇮🇳Indian women hold more Gold than 10 countries combined. - 🇮🇳 Indian Women: 25,488 tonnes- 🇺🇸 USA: 8,133 tonnes- 🇩🇪 Germany: 3,351 tonnes- 🇮🇹 Italy: 2,451 tonnes- 🇫🇷 France: 2,437 tonnes- 🇷🇺 Russia: 2,332 tonnes- 🇨🇳 China: 2,279 tonnes- 🇨🇭 Switzerland: 1,039… pic.twitter.com/64cyZNePUh— World updates (@itswpceo) October 21, 2025 -
నక్క తోక తొక్కిన ‘గోల్డ్ బాండ్లు’.. రూ.100కు రూ.325
ముంబై: సావరిన్ గోల్డ్ బాండ్స్ (SGB) 2017–18 సిరీస్ IVలో పెట్టుబడిపెట్టినవారు ఇప్పుడు పండుగ చేసుకుంటున్నారు. ఎందుకంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) గ్రాముకు రూ.12,704 తుది రిడంప్షన్ ధరను ప్రకటించింది. అంటే 8 సంవత్సరాల కాలంలో 325 శాతం రాబడిని వస్తోందన్నమాట.వాస్తవానికి అక్టోబర్ 2017లో గ్రాముకు రూ.2,987 వద్ద జారీ చేసిన బాండ్లు ఇప్పుడు రూ. 9,717 లాభాన్ని ఇచ్చాయి. దీనికి ఆర్నెళ్లకోసారి చెల్లించే 2.5% వార్షిక వడ్డీ అదనం. 2025 అక్టోబర్ 17, 20, 22 తేదీల్లో ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ ప్రచురించిన బంగారం సగటు ముగింపు ధర (999 స్వచ్ఛత) ఆధారంగా రిడంప్షన్ ధరను నిర్ణయించారు.దిగుమతులను తగ్గించడంతోపాటు.. బంగారంపై పెట్టుబడులను డిజిటల్వైపు మళ్లించే లక్ష్యాలతో తీసుకొచ్చిందే సావరీన్ గోల్డ్ బాండ్ పథకం. పసిడిపై పెట్టుబడులను డిజిటల్ రూపంలోకి మళ్లించడంలో కేంద్రం ఒక విధంగా సక్సెస్ అయింది. కానీ, బంగారం దిగుమతులు మాత్రం తగ్గలేదు.ఎస్జీబీలకు (Sovereign Gold Bonds ) ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. ప్రభుత్వ హామీతో కూడిన సాధనం కావడంతో పెట్టుబడులకు ఎక్కువ మంది ఆసక్తి చూపించారు. దీంతో ఎస్జీబీల రూపంలో ప్రభుత్వంపై చెల్లింపుల భారం పెరిగిపోయింది. దీంతో సావరిన్ గోల్డ్ బాండ్ల జారీని ప్రభుత్వం నిలిపేసింది.సావరిన్ గోల్డ్ బాండ్లు అందుబాటులో లేనప్పటికీ డిజిటల్ గోల్డ్లో పెట్టుబడులు పెట్టాలనుకునేవారికీ ఇప్పటికీ ఇతర మార్గాలు ఉన్నాయి. అవే గోల్డ్ ఈటీఎఫ్లు (Gold Exchange Traded Funds - Gold ETFs). వీటిని మ్యూచువల్ ఫండ్ సంస్థలు జారీ చేస్తాయి. వీటిలో పెట్టిన పెట్టుబడులు స్టాక్ ఎక్స్చేంజ్లలో షేర్లలా ట్రేడ్ అవుతాయి. గోల్డ్ ఈటీఎఫ్ ధర బంగారం మార్కెట్ ధరకు నేరుగా అనుసంధానమై ఉంటుంది. బంగారం ధర పెరిగితే, ఈటీఎఫ్ యూనిట్ విలువ కూడా పెరుగుతుంది. -
'ఆలస్యం చేయొద్దు.. వేగంగా కొనండి': రాబర్ట్ కియోసాకి
నిజమైన డబ్బును మాత్రమే పొదుపు చేయండి. ఫేక్ కరెన్సీని పొదుపు చేయడం వల్ల ధనవంతులు కాలేరని సూచించే రిచ్ డాడ్ పూర్ డాడ్ రచయిత 'రాబర్ట్ కియోసాకి' (Robert Kiyosaki) ఇప్పుడు తాజాగా సోషల్ మీడియా వేదికగా మరో రెండు ట్వీట్స్ చేశారు.''గోల్డ్, సిల్వర్, బిట్కాయిన్ క్రాష్ అవుతున్నాయి. అయితే బట్కాయిన్ విలువ ఈ నెలలో పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం బిట్కాయిన్లకు డిమాండ్ పెరిగిపోతోంది. ప్రపంచ వ్యాప్తంగా సుమారు 20 మిలియన్ల మంది బిట్కాయిన్లను కొనుగోలు చేశారు. వీటి సంఖ్య 21 మిలియన్స్ మాత్రమే. కాబట్టి కొనుగోలును వేగవంతం అవుతుంది. దయచేసి ఆలస్యం చేయకండి'' అని కియోసాకి పేర్కొన్నారు.Why I am buying Bitcoin.Bitcoin is first truly scarce money… only 21 million ever to be mined.World close 20 million now.Buying will accelerate.FOMO realPlease do not be late.Take care— Robert Kiyosaki (@theRealKiyosaki) October 22, 2025''ప్రస్తుతం అమెరికా అప్పు పెరుగుతూనే ఉంది. జాతీయ అప్పు 37 ట్రిలియన్ డాలర్ల వద్ద ఉంది. వేల సంవత్సరాలుగా నిజమైన డబ్బు అంటే.. బంగారం, వెండి అని నాకు తెలుసు. నేడు ఈ జాబితాలోకి బిట్కాయిన్ & ఎథెరియం కూడా చేరాయి. కాబట్టి డబ్బు సేవ్ చేయడంలో తెలివిగా వ్యవహరించండి. అయితే జాగ్రత్త వహించండి'' అని కియోసాకి స్పష్టం చేశారు.బంగారం, వెండి, బట్కాయిన్2025 అక్టోబర్ 17వరకు భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఆ తరువాత తగ్గుముఖం పట్టాయి. దీంతో రూ. 13,000 దాటిన గోల్డ్ రేటు రూ. 12,500 వద్దకు చేరింది. ఇదే సమయంలో రూ. 2.03 లక్షలకు చేరిన వెండి రేటు.. రూ. 17,4000 వద్దకు వచ్చింది. అయితే ఈ ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.ఇదీ చదవండి: యూఏఈ రూల్: ఎంత బంగారానికి డిక్లేర్ అవసరం..ఇక బట్కాయిన్ విషయానికి వస్తే.. గత వారంలో కొంత తగ్గుముఖం పట్టిన బట్కాయిన్ విలువ.. నేడు 1.87 శాతం పెరిగి రూ. 96,18,503.80 వద్దకు చేరింది. దీన్నిబట్టి చూస్తే.. బట్కాయిన్ విలువ మళ్లీ ఊపందుకున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలాగే కొనసాగితే.. రాబర్ట్ కియోసాకి చెప్పిన మాటలు నిజమయ్యే అవకాశం కూడా ఉంది.CLICK BAIT??? Don’t get sucked in to anyone who counts on “click bait.”FOR EXAMPLE: I now see “click bait” titles screaming “gold, silver, Bitcoin crashing” or Butcoin to $2 million this month. Then the podcaster then says “To support my channel “click and subscribe”Give…— Robert Kiyosaki (@theRealKiyosaki) October 23, 2025 -
కొనసాగుతున్న క్రాష్.. బంగారం, వెండి మళ్లీ డౌన్
బంగారం, వెండి ధరల పతనం కొనసాగుతోంది. క్రితం రోజున భారీగా పడిపోయిన పసిడి ధరలు (Today Gold Rate) నేడు కూడా దిగొచ్చాయి. ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో బుధవారంతో పోలిస్తే గురువారం బంగారం ధరలు మోస్తరుగా తగ్గాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
Gold Price Drop: ఒక్కసారిగా పడిపోయిన బంగారం ధర
-
గోల్డ్ ఢమాల్: భారీగా తగ్గిన బంగారం ధరలు
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) భారీగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో మంగళవారంతో పోలిస్తే బుధవారం బంగారం ధరలు తగ్గాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.కారణాలివేనా..? అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు కలిగిన యూఎస్, చైనా మధ్య నెలకొన్న టారిఫ్ వార్ విషయంలో సానుకూల చర్చలు, ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు ఇండెక్స్ విలువ పుంజుకోవడం, యూఎస్ ప్రభుత్వ షట్డౌన్ వంటి అంశాలు పసిడి, వెండి తదితర విలువైన లోహాలపై ప్రతికూల ప్రభావం చూపుతున్నట్లు బులియన్ వర్గాలు పేర్కొన్నాయి. వచ్చే వారం చైనా, యూఎస్ ప్రెసిడెంట్ల మధ్య సమావేశం జరగనుండటం సానుకూల అంశంగా తెలియజేశాయి.మరోవైపు ఇటీవల ప్రపంచవ్యాప్తంగా పసిడి, వెండి ఈటీఎఫ్లకు ఇన్వెస్టర్ల నుంచి భారీస్థాయిలో పెట్టుబడులు ప్రవహించడం మెటల్స్లో భారీ ర్యాలీకి కారణమైంది. టెక్నికల్గా ఓవర్బాట్ పొజిషన్కు చేరడంతోపాటు.. ట్రేడర్లు, ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణలో భాగంగా అమ్మకాలు చేపట్టడం విలువైన లోహాలలో కరెక్షన్కు దారితీస్తున్నట్లు నిపుణులు వివరించారు. (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
బంగారం, వెండి క్రాష్..!
సాక్షి, బిజినెస్ డెస్క్: కొద్ది నెలలుగా అప్రతిహతంగా పెరుగుతూ వస్తున్న బంగారం, వెండి ధరలు ఉన్నట్టుండి కుప్పకూలాయి. అంతర్జాతీయ మార్కెట్లలో గత 12 ఏళ్లలోలేని విధంగా పసిడి ఔన్స్(31.1 గ్రాములు) 6.3 శాతం పతనంకాగా.. వెండి మరింత అధికంగా 2021 తదుపరి 8.7 శాతం పడిపోయింది. వెరసి యూఎస్ కామెక్స్లో ఔన్స్ పసిడి ధర 4,082 డాలర్లకు చేరగా.. వెండి ఔన్స్ 47.89 డాలర్లను తాకింది. దీంతో దేశీయంగా బంగారం 10 గ్రాములు కనీసం రూ. 6,000 తగ్గవలసి ఉన్నట్లు బులియన్ వర్గాలు పేర్కొన్నాయి.దేశీయంగా ఇటీవల బంగారం 10 గ్రాములు రూ. 1,34,800ను తాకగా.. వెండి రూ. 1,85,000కు చేరిన విషయం విదితమే. అయితే డాలరుతో మారకంలో రూపాయి కదలికలు, దిగుమతి సుంకం మదింపు తదుపరి ధరలు నిర్ణయమయ్యే సంగతి తెలిసిందే. ఈ బాటలో పలాడియం, ప్లాటినం ధరలు సైతం అంతర్జాతీయ మార్కెట్లో 7 శాతం చొప్పున పతనం కావడం గమనార్హం! కాగా.. 2025 డిసెంబర్ ఫ్యూచర్స్ పసిడి రాత్రి 10.30 ప్రాంతంలో 5.5 శాతం (237 డాలర్లు) క్షీణించి 4,122 డాలర్ల వద్ద కదులుతోంది. ఇంట్రాడేలో గరిష్టంగా 4,393 డాలర్లకు చేరగా.. 4,095 డాలర్ల వద్ద కనిష్టాన్ని చవిచూసింది. ఇక వెండి డిసెంబర్ ఫ్యూచర్స్ 7.36 శాతం పడిపోయి 47.60 డాలర్ల వద్ద కదులుతోంది. ఒక దశలో 51.61 డాలర్ల వద్ద గరిష్టాన్ని, 47.14 డాలర్ల వద్ద కనిష్టాన్ని తాకింది. కారణాలేటంటే? అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు కలిగిన యూఎస్, చైనా మధ్య నెలకొన్న టారిఫ్ వార్ విషయంలో సానుకూల చర్చలు, ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు ఇండెక్స్ విలువ పుంజుకోవడం, యూఎస్ ప్రభుత్వ షట్డౌన్ వంటి అంశాలు పసిడి, వెండి తదితర విలువైన లోహాలపై ప్రతికూల ప్రభావం చూపుతున్నట్లు బులియన్ వర్గాలు పేర్కొన్నాయి. వచ్చే వారం చైనా, యూఎస్ ప్రెసిడెంట్ల మధ్య సమావేశం జరగనుండటం సానుకూల అంశంగా తెలియజేశాయి.మరోవైపు ఇటీవల ప్రపంచవ్యాప్తంగా పసిడి, వెండి ఈటీఎఫ్లకు ఇన్వెస్టర్ల నుంచి భారీస్థాయిలో పెట్టుబడులు ప్రవహించడం మెటల్స్లో భారీ ర్యాలీకి కారణమైంది. టెక్నికల్గా ఓవర్బాట్ పొజిషన్కు చేరడంతోపాటు.. ట్రేడర్లు, ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణలో భాగంగా అమ్మకాలు చేపట్టడం విలువైన లోహాలలో కరెక్షన్కు దారితీస్తున్నట్లు వివరించారు. -
టపాసులా పేలిన బంగారం ధరలు
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) భారీగా పెరుగుతున్నాయి. సోమవారంతో పోలిస్తే మంగళవారం బంగారం ధరలు మరింత అధికమయ్యాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
యూఏఈ రూల్: ఎంత బంగారానికి డిక్లేర్ అవసరం..
భారతీయులకు బంగారం అంటే చాలా ఇష్టం. ఈ కారణంగానే ఎప్పటికప్పుడు, ఎక్కడికి వెళ్లినా గోల్డ్ కొనేస్తూ ఉంటారు. ఇంకొందరైతే గోల్డ్ కొనుగోలు చేయడానికి ప్రత్యేకించి.. అరబ్ దేశాలకు వెళ్తున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. అయితే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) నిబంధనల ప్రకారం.. భారతీయ ప్రయాణికుల వద్ద ఎంత విలువైన బంగారం ఉంటే డిక్లేర్ చేయాలి అనే విషయాన్ని తెలుసుకుందాం.భారతీయులు యూఏఈ (UAE)కి ప్రయాణించే సమయంలో తమ వద్ద ఉన్న బంగారం విలువ రూ.13.5 లక్షల(AED 60,000)కు మించి ఉంటే, దానికి డిక్లేర్ (declare) చేయాల్సి ఉంటుంది. అంటే, మీరు వెంట తీసుకెళ్లే బంగారం విలువ.. ఈ పరిమితికి మించి ఉంటే, సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వాలి.పరిమితికి మించి బంగారం తీసుకెళ్లడానికి లీగల్గా ఎలాంటి అనుమతి ఉండదు. కాబట్టి దీనికి ట్యాక్స్, డ్యూటీ చెల్లించాల్సి ఉంటుంది. వివాహాలు, పండుగలు లేదా గిఫ్ట్ రూపంలో.. సాంప్రదాయకంగా బంగారు ఆభరణాలను తీసుకెళ్లే భారతీయ పర్యాటకులు, NRIలు, వ్యాపార ప్రయాణికులు ఆ విషయాన్ని తప్పకుండా గమనించాలి.ఇదీ చదవండి: గోల్డ్ వార్నింగ్ సిగ్నెల్: శ్రీధర్ వెంబు ట్వీట్బంగారం అక్రమ రవాణాను తగ్గించేందుకు, ట్యాక్స్ ఎగవేతను అడ్డుకునేందుకు ఈ నిబంధనను అమలు చేస్తున్నారు. డిక్లేర్ చేయకుండా ఎక్కువ బంగారం తీసుకెళితే, దానిని సీజ్ చేయవచ్చు. లేదా మీకు భారీ జరిమానా పడవచ్చు లేదా జైలుశిక్షను కూడా అనుభవించాల్సి ఉంటుంది. -
గోల్డ్ వార్నింగ్ సిగ్నెల్: శ్రీధర్ వెంబు ట్వీట్
పెరుగుతున్న బంగారం ధరలు.. ఆర్ధిక శ్రేయస్సు కంటే, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఒత్తిడిని సూచిస్తుందని జోహో కార్పొరేషన్ సహ వ్యవస్థాపకుడు మరియు సీఈఓ శ్రీధర్ వెంబు హెచ్చరించారు. దీనికి సంబంధించిన ఒక ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఐఎమ్ఎఫ్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ గీతా గోపీనాథ్ రాసిన కథనంపై స్పందిస్తూ.. యూఎస్ మార్కెట్లపై చేసిన అంచనాతో తాను ఏకీభవిస్తున్నానని శ్రీధర్ వెంబు చెప్పారు. ''అమెరికా స్టాక్ మార్కెట్ స్పష్టంగా కనిపిస్తున్నాయి. బంగారం కూడా ఒక పెద్ద హెచ్చరిక సంకేతాన్ని సూచిస్తోంది. నేను బంగారాన్ని పెట్టుబడిగా భావించను, దానిని ఆర్థిక ప్రమాదానికి బీమాగా భావిస్తున్నాను. వ్యవస్థలోని అన్ని రుణాలను తిరిగి చెల్లించడానికి AI కృషి చేస్తుందని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను'' అని ఆయన ట్వీట్ చేశారు.గీతా గోపీనాథ్ ఏమన్నారంటే?వాణిజ్య ఉద్రిక్తతల మధ్య అమెరికన్ స్టాక్ మార్కెట్ ఇటీవల బాగా దెబ్బతింది. డాట్ కామ్ క్రాష్ తరువాత జరిగిన దానికంటే.. స్టాక్ మార్కెట్ కరెక్షన్ మరింత తీవ్రమైంది. టారిఫ్ యుద్ధాలు.. సమస్యను మరింత తీవ్రతరం చేస్తాయి. అంతర్లీన సమస్య అసమతుల్య వాణిజ్యం కాదు అసమతుల్య వృద్ధి. అమెరికాలోనే కాకుండా ప్రపంచంలోని మరిన్ని దేశాలు/ప్రాంతాల్లో అధిక వృద్ధి మరియు రాబడి అవసరం.పెట్టుబడిదారులు చాలావరకు సురక్షితమైన ఆస్తిగా బంగారాన్ని కొనుగోలు చేస్తున్నారు. దీంతో డిమాండ్ పెరిగిపోతోంది. దీనివల్ల ప్రపంచ మార్కెట్లలో అస్థిరత పెరగడం మాత్రమే కాకుండా.. ఆర్థిక స్థిరత్వంలో కొత్త ఆందోళనలు పుడుతున్నాయి. ఈ తరుణంలో 2026 జనవరి నాటికి 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 1.50 లక్షలకు చేరుకుంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.ఇదీ చదవండి: తారాస్థాయికి చేరిన బంగారం, వెండి: ధరలు పెరగడానికి కారణాలు!కేంద్ర బ్యాంకు కొనుగోళ్లు.. ముఖ్యంగా చైనా, జపాన్లలో బలమైన డిమాండ్ కారణంగా ప్రపంచ, దేశీయ మార్కెట్లలో బంగారం ధరలు భారీగా పెరుగుతాయని, ఆల్ ఇండియా జెమ్ & జ్యువెలరీ డొమెస్టిక్ కౌన్సిల్ (GJC) వ్యవస్థాపక సభ్యుడు & మాజీ చైర్మన్ అనంత పద్మనాబన్ పేర్కొన్నారు.I agree with Dr Gita Gopinath.The US stock market is in a clear and massive bubble.The degree of leverage in the system means that we cannot rule out a systemic event like the global financial crisis of 2008-9. Gold is also flashing a big warning signal. I don't think of… https://t.co/7xVPL3FXDq— Sridhar Vembu (@svembu) October 18, 2025 -
బంగారాన్ని దోచేస్తున్నారు.. జాగ్రత్త అక్కా!
-
రిచ్ అవ్వాలంటే కూడబెట్టాల్సింది ఆ ‘ఫేక్ డబ్బు’ కాదు..
ప్రముఖ ఇన్వెస్టర్, ప్రసిద్ధ పర్సనల్ ఫైనాన్స్ పుస్తకం ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ (Rich dad Poor dad) రచయిత రాబర్ట్ కియోసాకి అమెరికా ద్రవ్య విధానాన్ని తీవ్రంగా విమర్శించారు. బంగారం, వెండి, బిట్ కాయిన్ వంటి పెట్టుబడుల పెరుగుదల అనేది వ్యవస్థల వైఫల్యానికి సంకేతమని అని ఆయన హెచ్చరించారు. అమెరికా బేబీ బూమర్ (1946-1964 మధ్య పుట్టినవారు)తరగతికి ఈ ద్రవ్యోల్బణం తీవ్ర ప్రభావం చూపించబోతుందని ఆయన భావిస్తున్నారు."ధనవంతులు ఇంకా ధనవంతులు అవుతారు" అంటూ కియోసాకి (Robert Kiyosaki) తాజాగా ‘ఎక్స్’ (ట్విటర్)లో ఓ పోస్ట్ చేశారు. "కానీ ద్రవ్యోల్బణం పేద మధ్యతరగతి ప్రజల జీవితాన్ని మరింత కష్టతరం చేస్తుంది." ధరలు పెరుగుతున్నప్పుడు, ఫియట్ మనీ లేదా "నకిలీ డబ్బు" సామాన్య అమెరికన్ల ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బంగారం, వెండి, బిట్ కాయిన్, ఎథీరియం వంటి "నిజమైన డబ్బు" లో ఆదా చేయాలని ప్రజలకు సూచించారు.అక్టోబర్ లో బంగారం ధరలో జరిగిన నాటకీయ ర్యాలీని అనుసరించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం, బంగారం ప్రపంచవ్యాప్తంగా ఔన్సుకు 4,250 డాలర్లు, భారతదేశంలో 10 గ్రాములకు రూ.1.31 లక్షల వద్ద (అక్టోబర్ 18 నాటికి) ట్రేడ్ అవుతోంది. వెండి కూడా దూసుకెళ్తోంది. అయితే బిట్ కాయిన్ మార్కెట్ గందరగోళం మధ్య 1,21,000 డాలర్ల నుండి 108,000 డాలర్లకు పడిపోయింది.1947 లో జన్మించిన రాబర్ట్ కియోసాకి, తన లాంటి బేబీ బూమర్ తరగతికి ఈ ద్రవ్యోల్బణం బలమైన హానిని కలిగించే అవకాశం ఉందని చెప్పారు. "ద్రవ్యోల్బణం ద్వారా మనం పూర్తిగా తుడిచిపెట్టకుపోతామని" ఆయన హెచ్చరించారు. "మీ అమ్మ, నాన్నలు వీధుల్లోకి రావచ్చు ఎందుకంటే ద్రవ్యోల్బణం వారి సామాజిక భద్రతను తుడిచిపెట్టబోతోంది." అన్నారు.THE RICH get RICHER: while I am personally happy gold, silver, Bitcoin, Ethereum are going up…. My concern is the price of life…. AKA…inflation….makes life harder on the poor and middle class.Please do your best to not be a victim of a broken and corrupt monetary system.…— Robert Kiyosaki (@theRealKiyosaki) October 17, 2025 -
బంగారం, వెండి కొనేవాళ్లకు ‘పండగే’
గత కొన్ని రోజులుగా ఆగకుండా దూసుకెళ్తున్న పసిడి ధరలు (Gold Price) ఎట్టకేలకు దిగివచ్చాయి. ధనత్రయోదశి (Dhanteras) రోజున కొనుగోలుదారులకు భారీ ఉపశమనాన్ని కలిగించాయి. దాదాపు వారం రోజుల తర్వాత బంగారం ధరలు భారీగా తగ్గాయి. వెండి ధరలు (Silver Price) కూడా భారీగా దిగివచ్చాయి. వరుసగా మూడో రోజూ పతనమయ్యాయి. శుక్రవారంతో పోలిస్తే శనివారం బంగారం, వెండి ధరలు ఎంత తగ్గాయి.. దేశంలోని వివిధ నగరాల్లో ప్రస్తుతం వాటి ధరలు ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.. (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
‘బంగారం ఓ కొనేస్తున్నారా? ఆ రిస్క్ మాత్రం తప్పదు’
బంగారం ధరలు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. అక్టోబర్ 17న తారాస్థాయికి పెరిగాయి. స్పాట్ గోల్డ్ ఔన్సుకు 4,379 డాలర్లని తాకి, తరువాత 4,336 డాలర్ల వద్ద ట్రేడవుతుండగా, డిసెంబర్ యూఎస్ గోల్డ్ ఫ్యూచర్స్ 1% పెరిగి 4,349 డాలర్ల వద్ద ట్రేడ్ అయ్యాయి. ఈ పెరుగుదల గత ఐదేళ్లలో బంగారం సాధించిన అతిపెద్ద వారపు లాభంగా నమోదైంది. కేవలం ఈ ఒక్క వారంలోనే 8% పెరుగుదల నమోదైంది. ఇది 2020 మార్చి తర్వాత అతి పెద్ద వృద్ధి.భారతదేశంలో కూడా బంగారం (gold price) ధరలు రికార్డు స్థాయిలో ఉన్నాయి. హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,21700కి చేరింది. అదే సమయంలో 24 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.1,32,770గా ఉంది. ఈ నేపథ్యంలో పెట్టుబడిదారులు బంగారాన్ని “సురక్షిత స్వర్గధామం”గా చూస్తున్నారు. బంగారం ఎక్కువగా కొనేస్తూ దాని మీదే ఎక్కువ పెట్టుబడి పెట్టేస్తున్నారు.దిద్దుబాటు వస్తే..అయితే, అందరూ ఈ పెరుగుదలపై సంబరాలు చేసుకుంటున్నారనే గమనించాల్సిన అవసరం లేదు. ఫైనాన్షియల్ నిపుణుడు అక్షత్ శ్రీవాస్తవ కొన్ని కీలక హెచ్చరికలు జారీ చేశారు. "మీరు 100% బంగారంలో పెట్టుబడి పెట్టినవారైతే, ఇప్పుడు పరిస్థితి బాగున్నట్లే అనిపించొచ్చు. కానీ తిరిగి పెట్టుబడి పెట్టే సమయం వచ్చినప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది?" అంటూ ‘ఎక్స్’ (ట్విటర్)లో ఓ పోస్ట్ పెట్టారు.ఆయన పునఃపెట్టుబడి ప్రమాదం (Reinvestment Risk)పై దృష్టి సారిస్తున్నారు. బంగారంలో లాభాల ఆశతో చాలామంది దీన్ని కలవరిస్తూ ఉండొచ్చు కానీ మార్కెట్ దిద్దుబాటు (correction) వచ్చినప్పుడు, దీని ప్రభావం ఈక్విటీల కన్నా తీవ్రమై ఉండే అవకాశం ఉంది అంటున్నారు.ఆస్తుల వైవిధ్యం అవసరంశ్రీవాస్తవ సూచన ఏమిటంటే.. పెట్టుబడులు ఒకే ఆస్తిలో కాకుండా ఈక్విటీలు, క్రిప్టో, రియల్ ఎస్టేట్, బంగారం వంటి వివిధ ఆస్తుల్లో విభజించాలి. మరో ముఖ్యమైన అంశం.. బంగారంలో తిరుగులేని పెరుగుదల వల్ల, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ SIPల నుండి పెట్టుబడిదారులు నిధులను తీసివేయొచ్చు. ఇది దేశీయ స్టాక్ మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపవచ్చు. దీని ఫలితంగా ఉత్పాదక ఆర్థిక కార్యకలాపాలు మందగించవచ్చు.బంగారంపై పెట్టుబడుల విషయంలో ప్రభుత్వ జోక్యం అవసరమని శ్రీవాస్తవ సూచిస్తున్నారు. బంగారంపై అధిక పన్నులు, లేదా ఈక్విటీ పెట్టుబడులకు పన్ను రాయితీలు వంటి మార్గాల ద్వారా సమతుల్యతను ఉంచాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడుతున్నారు. -
ధన త్రయోదశి రోజున బంగారంపై పెట్టుబడా?
ప్రతి సంవత్సరం దీపావళి పండుగ సందర్భంగా వచ్చే ధన త్రయోదశి (ధన్తేరాస్) రోజున బంగారం కొనడం భారతదేశంలో ఒక శుభప్రదమైన సంప్రదాయం. ఈ రోజున పసిడిని కొనుగోలు చేయడం ద్వారా సంవత్సరం పొడవునా సంపద సమకూరుతుందని ప్రజలు బలంగా నమ్ముతారు. అయితే ఈ ఏడాది కాలంలో బంగారం, వెండి ధరలు సామాన్యులు కొనలేనంత భారీగా పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లో అనిశ్చితి, రూపాయి విలువ పతనం, సెంట్రల్ బ్యాంకుల కొనుగోళ్లు, ద్రవ్యోల్బణం వంటి అంశాలు బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరుకోవడానికి ప్రధాన కారణాలుగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో నేరుగా బంగారు ఆభరణాలు కొనడం కంటే మెరుగైన, ఆర్థికపరంగా లాభదాయకమైన పెట్టుబడి మార్గాలను ఎంచుకోవడం ఉత్తమం.నేరుగా ఆభరణాలు కొంటే..ధరలు భారీగా పెరగడంతో ఆభరణాల రూపంలో బంగారం కొనుగోలు చేయాలనుకోవడం చాలా మందికి ఆర్థిక భారంగా ఉంటుంది. రికార్డు స్థాయిలో ఉన్న ధరల కారణంగా చిన్న వస్తువు కొనుగోలుకు కూడా ఎక్కువ మొత్తంలో చెల్లించాలి. బంగారు ఆభరణాల తయారీలో తరుగు రూపంలో కొంత మొత్తాన్ని అదనంగా చెల్లించాలి. వీటికి తయారీ ఛార్జీలు (Making Charges) అదనం. బంగారం ధర, తయారీ ఛార్జీలపై జీఎస్టీ వర్తిస్తుంది. అత్యవసర పరిస్థితుల్లో ఆభరణాలు అమ్మినప్పుడు తయారీ ఛార్జీలు, తరుగు కారణంగా కొనుగోలు ధర కంటే తక్కువ ధరకే విక్రయించాల్సి వస్తుంది.ఈ ఛార్జీలు, నష్టాల నేపథ్యంలో బంగారంలో పెట్టుబడి పెట్టడానికి నిపుణులు మెరుగైన ప్రత్యామ్నాయ మార్గాలు సూచిస్తున్నారు. బంగారంపై ఇన్వెస్ట్ చేయడానికి భౌతిక బంగారాన్ని నిల్వ చేయాల్సిన అవసరం లేకుండా సురక్షితమైన, పారదర్శకమైన, తక్కువ ఖర్చుతో కూడుకున్న కొన్ని మార్గాలు అందుబాటులో ఉన్నాయి.గోల్డ్ ఈటీఎఫ్లుగోల్డ్ ఈటీఎఫ్లు అనేవి స్టాక్ ఎక్స్ఛేంజ్ల్లో షేర్ల మాదిరిగా ట్రేడ్ చేయబడే ఫండ్లు. ఇవి దేశీయ భౌతిక బంగారం ధరను ట్రాక్ చేస్తాయి. వీటిని లైవ్ మార్కెట్ నుంచి తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. దీనివల్ల తయారీ ఛార్జీలు, జీఎస్టీ వంటి అదనపు ఛార్జీలు ఉండవు. స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ వేళల్లో ఎప్పుడైనా సులభంగా కొనుగోలు చేయవచ్చు, అమ్మవచ్చు. భౌతిక బంగారంలాగా దొంగిలించబడుతుందనే భయం ఉండదు. రియల్ టైమ్ మార్కెట్ ధరలకు అనుగుణంగా వీటి ధరలు ఉంటాయి. వీటిని కొనుగోలు చేయడానికి డీమ్యాట్, ట్రేడింగ్ ఖాతా అవసరం.డిజిటల్ గోల్డ్PhonePe, Paytm వంటి యాప్ల ద్వారా 99.9% స్వచ్ఛమైన బంగారాన్ని కొద్ది మొత్తంలో డిజిటల్ రూపంలో కొనుగోలు చేయవచ్చు. ఈ బంగారం మీ తరపున భౌతిక రూపంలో లాకర్లో నిల్వ చేస్తారు. అయితే అమ్మాలనుకుంటే మాత్రం జీఎస్టీ వర్తిస్తుందని గుర్తుంచుకోవాలి. ఈ విధానంలో చాలా తక్కువ డబ్బుతో కూడా కొంత మొత్తంలో కొనుగోలు చేయవచ్చు. భౌతికంగా నిల్వ చేయాలనే ఆందోళన అవసరం లేదు. అయితే దీనికి కొనుగోలు పరిమితులు ఉంటాయి. ఈ పెట్టుబడి RBI లేదా SEBI నియంత్రణలో ఉండదని గమనించాలి.ఇదీ చదవండి: లక్షల కోట్ల వ్యాపార సామ్రాజ్యం కుప్పకూలింది.. ఏం జరిగిందంటే.. -
శబరిమల బంగారం కేసు.. ప్రధాన నిందితుడు అరెస్ట్
తిరువనంతపురం: శబరిమల(Sabarimala) ఆలయంలో విగ్రహాల బంగారం తాపడం విషయంలో ఇప్పటికే పలు ట్విస్టులు చోటుచేసుకుంది. ఈ వ్యవహారంలో తాజాగా ప్రధాన నిందితుడైన ఉన్నికృష్ణన్ పొట్టిని(Unnikrishnan Potti) ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు శుక్రవారం అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో శుక్రవారం మధ్యాహ్నం కోర్టు ముందు ఉన్నికృష్ణన్ను హాజరుపరచనున్నారు.కాగా, బెంగళూరుకు చెందిన వ్యాపారవేత్త ఉన్నికృష్ణన్ పొట్టిని ఆయన ఇంట్లో (పులిమత్లో) అదుపులోకి తీసుకున్నట్లు (సిట్) అధికారులు తెలిపారు. అనంతరం, తిరువనంతపురంలోని క్రైమ్ బ్రాంచ్ కార్యాలయంలో విచారించారని సిట్ వర్గాలు తెలిపాయి. శుక్రవారం మధ్యాహ్నం కోర్టు ముందు ఆయన్ను హాజరుపరచనున్నారు. తదుపరి విచారణ కోసం సిట్ ఆయన్ను కస్టడీకి కోరే అవకాశం ఉంది. మరోవైపు.. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అసిస్టెంట్ ఇంజనీర్ కె.సునీల్ కుమార్ను ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు అధ్యక్షుడు పీఎస్ ప్రశాంత్ గతంలో సస్పెండ్ చేశారు. కాగా, ఈ వివాదంలో ప్రమేయం ఉన్నట్లు అనుమానిస్తున్న రిటైర్డ్ అధికారులకు షోకాజ్ నోటీసులు పంపనున్నట్లు తెలిపారు. పది రోజుల్లోగా నివేదిక ఇవ్వాల్సిందిగా ఆదేశించారు.#WATCH | Thiruvananthapuram, Kerala | Unnikrishnan Potti, the prime accused in the Sabarimala gold theft case, has been arrested after over ten hours of questioning by the Special Investigation Team (SIT). The arrest was officially recorded at 2:30 a.m. on Friday. Unnikrishnan… pic.twitter.com/AMqUBpLric— ANI (@ANI) October 17, 2025జరిగింది ఇదీ.. శబరిమలలో గర్భగుడి ముందున్న ద్వారపాలక విగ్రహాలపై బంగారు పూత పూసిన రాగి తాపడాలను 2019లో మరమ్మతుల నిమిత్తం తొలగించడం జరిగింది. వాటిని సరిచేయించి కొత్త బంగారు పూత తాపడాలను అందిస్తానని ఉన్నికృష్ణన్ అనే దాత తీసుకెళ్లారు. ఈ పనిని చెన్నైలోని ఓ సంస్థకు అప్పగించారు. 2019లో వాటిని తొలగించే సమయంలో తాపడాల బరువు 42.8 కిలోలుగా ఉన్నట్లు రికార్డుల్లో ఉంది. అయితే, ఆ తాపడాలను తమ వద్దకు తెచ్చినప్పుడు బరువు 38.28 కిలోలు మాత్రమే ఉందని సదరు కంపెనీ పేర్కొంది.అంతేగాక, ఆలయం నుంచి తాపడాలను తొలగించిన దాదాపు 40 రోజుల తర్వాత వాటిని చెన్నైలోని కంపెనీకి అందించినట్లు సమాచారం. ఈ పరిణామాలపై ఇప్పటికే హైకోర్టు పలు అనుమానాలు వ్యక్తంచేసింది. ఉన్నట్లుండి తాపడాల బరువు 4.524 కేజీలు తగ్గడాన్ని తీవ్రంగా పరిగణించింది. వీటిని తిరిగి అమర్చినప్పుడు ఎందుకు బరువును సరిచూడలేదని ప్రశ్నించింది. అలాగే ముందుస్తు అనుమతి తీసుకోకుండా ద్వారపాలక విగ్రహల బంగారు తాపడాలను మరమ్మతుల నిమిత్తం తొలగించడం పైనా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంపై క్రిమినల్ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేయాలని రాష్ట్ర పోలీసులను ఆదేశించింది. అలాగే ఈ వివాదంపై ఇప్పటికే న్యాయస్థానం సిట్ ఏర్పాటు చేసి, నెలలోగా నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. -
Gold Rates: వణికిస్తున్న బంగారం
-
‘ఇంతింతై వటుడింతై’ అన్నట్టుగా పసిడి, వెండి ధరలు
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) భారీగా పెరుగుతున్నాయి. మంగళవారంతో పోలిస్తే బుధవారం బంగారం ధరలు మరింత అధికమయ్యాయి. అక్టోబర్ 18న ధన త్రయోదశికి ముందు పసిడి ధరల ఇలా భారీగా పెరగడం వినియోగదారుల్లో ఆందోళన కలిగిస్తుంది. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. ఇదీ చదవండి: యూఏఈలో 6జీ కనెక్టివిటీ టెస్ట్ విజయవంతం(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
పసిడి పండుగ..
న్యూఢిల్లీ: పండుగ సీజన్ సందర్భంగా కొనుగోళ్లు వెల్లువెత్తడంతో పసిడి మరో కొత్త మైలురాయి దాటింది. మంగళవారం దేశ రాజధాని న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల పుత్తడి ధర మరో రూ. 2,850 పెరిగి ఏకంగా రూ. 1.30 లక్షలను అధిగమించింది. ఆలిండియా సరాఫా అసోసియేషన్ ప్రకారం 99.9 శాతం స్వచ్ఛత గల 10 గ్రాముల పసిడి ధర రూ. 1,30,800కి చేరింది. ఇక 99.5 శాతం స్వచ్ఛత గల బంగారం ధర కూడా అంతే పెరిగి రూ. 1,30,200కి చేరింది. మరోవైపు, వెండి సైతం కేజీకి రూ. 6,000 ఎగిసి సరికొత్త జీవిత కాల గరిష్టమైన రూ. 1,85,000ని తాకింది.పండుగ, పెళ్లిళ్ల సీజన్ సందర్భంగా జ్యుయలర్లు, రిటైలర్ల నుంచి డిమాండ్ గణనీయంగా పెరగడం, డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 12 పైసలు క్షీణించి 88.80కి పడిపోవడం వంటి అంశాలు పసిడి పెరుగుదలకు కారణమని ట్రేడర్లు తెలిపారు. అటు ఫ్యూచర్స్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్సే్చంజీలో (ఎంసీఎక్స్) డిసెంబర్ కాంట్రాక్టు రూ. 2,301 పెరిగి రూ. 1,26,930కి చేరింది. ఫిబ్రవరి కాంట్రాక్టు సైతం రూ. 2,450 ఎగిసి రూ. 1,28,220 రికార్డు స్థాయిని తాకింది. పుత్తడికి దీటుగా వెండి డిసెంబర్ కాంట్రాక్టు కూడా కేజీకి రూ. 8,055 పెరిగి రూ. 1,62,700 స్థాయిని తాకింది. అంతర్జాతీయంగా కామెక్స్లో గోల్డ్ రేటు ఔన్సుకి (31.1 గ్రాములు) 1% పెరిగి ఆల్టైమ్ గరిష్టమైన 4,190 డాలర్లను తాకింది. భౌగోళిక–రాజకీయ, ఆర్థిక అనిశ్చితులు, రేట్ల కోత అంచనాలు, ఈటీఎఫ్లలో పెట్టుబడుల ప్రవాహం, సెంట్రల్ బ్యాంకుల కొనుగోళ్ల కారణంగా ఈ ఏడాది ఇప్పటివరకు బంగారం ధర 60% పెరిగి కీలకమైన 4,100 డాలర్ల మార్కును దాటిందని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్విసెస్ అనలిస్ట్ మానవ్ మోదీ చెప్పారు. అంతర్జాతీయంగా సరఫరా కొరత వల్ల వెండి ఔన్సు ధర కూడా 52 డాలర్లను దాటిందన్నారు. వెండి ధర దేశీయంగా రూ.1,94,639కి, అంతర్జాతీయంగా 59.89 డాలర్లకు పెరగవచ్చని ఎమ్కే గ్లోబల్ ఫైనాన్షియల్ సర్విసెస్ రీసెర్చ్ అనలిస్ట్ రియా సింగ్ తెలిపారు. -
Gold Price: భారీగా పెరిగిన బంగారం ధరలు
-
ముందుంది మొసళ్ల పండుగ! ఈరోజు కేజీ వెండి రూ.2 లక్షలు!
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) భారీగా పెరుగుతున్నాయి. సోమవారంతో పోలిస్తే మంగళవారం బంగారం ధరలు మరింత అధికమయ్యాయి. అక్టోబర్ 18న దంతేరాస్కు ముందు పసిడి ధరల ఇలా భారీగా పెరగడం వినియోగదారుల్లో ఆందోళన కలిగిస్తుంది. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
బంగారం, వెండిలో పెట్టుబడి అవకాశం.. కోటక్ నుంచి గోల్డ్, సిల్వర్ ఫండ్
కోటక్ మహీంద్రా ఏఎంసీ కొత్తగా గోల్డ్ సిల్వర్ ప్యాసివ్ ఫండ్ ఆఫ్ ఫండ్స్ (ఎఫ్వోఎఫ్) పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ న్యూ ఫండ్ ఆఫర్ (ఎన్ఎఫ్వో) అక్టోబర్ 20తో ముగుస్తుంది. కనీసం రూ. 100 నుంచి ఇందులో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇది ప్రధానంగా కోటక్ గోల్డ్ ఈటీఎఫ్ (Gold ETF), కోటక్ సిల్వర్ ఈటీఎఫ్ (Silver ETF)యూనిట్లలో ఇన్వెస్ట్ చేస్తుంది.బంగారం, వెండిలో పెట్టుబడి అవకాశాన్ని కల్పిస్తూ, దీర్ఘకాలికంగా మూలధన వృద్ధి ప్రయోజనాలను అందించడం ఈ ఫండ్ లక్ష్యమని సంస్థ ఎండీ నీలేష్ షా తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్ బ్యాంకులు బంగారం నిల్వలను పెంచుకుంటున్నాయని, పరిశ్రమల్లో వెండి వాడకం పెరుగుతోందని ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలో రెండింటి వృద్ధి ప్రయోజనాలను పొందేందుకు ఈ ఫండ్ అనువుగా ఉంటుందని పేర్కొన్నారు. ఇన్వెస్కో ఇండియా కన్జంప్షన్ ఫండ్ దేశీయంగా వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో ఇండియా కన్జంప్షన్ ఫండ్ని (Invesco India Consumption Fund) ప్రవేశపెట్టింది ఇన్వెస్కో మ్యూచువల్ ఫండ్. ఈ ఫండ్ అక్టోబర్ 17 వరకు అందుబాటులో ఉంటుంది. కనీసం రూ. 1,000 నుంచి ఇన్వెస్ట్ చేయొచ్చు. రోజువారీ సిప్ రూపంలో అయితే కనీసం రూ. 100, నెలవారీ అయితే రూ. 500 నుంచి పెట్టుబడులు పెట్టొచ్చు.వినియోగం థీమ్తో ప్రయోజనం పొందే కంపెనీల ఈక్విటీ, ఈక్విటీ సంబంధ సాధనాల్లో కనీసం 80% ఇన్వెస్ట్ చేస్తుంది. మనీష్ బొద్దార్, అమిత్ గణాత్రా ఫండ్ మేనేజర్లుగా ఉంటారు. ట్యాక్స్ శ్లాబులు మార్చడం, జీఎస్టీ సంస్కరణలు మొదలైనవి వినియోగానికి మరింతగా ఊతమిస్తాయని సంస్థ సీఈవో సౌరభ్ నానావటి తెలిపారు. -
బంగారం, వెండి కొనాల్సింది అప్పుడే..
బంగారం, వెండి కొనే విషయంలో భారతీయ మహిళలను చూసి నేర్చుకోవాలంటున్నారు ప్రముఖ కమోడిటీ ఇన్వెస్టర్ జిమ్ రోజర్స్. పెట్టుబడి పాఠాలకు సంబంధించి ఆయన రాసిన పుస్తకం ‘స్ట్రీట్ స్మార్ట్స్: అడ్వెంచర్స్ ఆన్ ది రోడ్ అండ్ ఇన్ ది మార్కెట్స్’ (Street Smarts: Adventures on the Road and in the Markets) చాలా ప్రసిద్ధి చెందింది.ఇటీవల జిమ్ రోజర్స్ (Jim Rogers) బిజినెస్ టుడేకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తాను బంగారం, వెండిని కలిగి ఉన్నానని, కానీ వాటిని అమ్మే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. ప్రస్తుత ధరల వద్ద కొత్తగా కొనుగోలు చేసే ఆలోచన తనకు లేకపోయినా, ధరలు తగ్గితే మరింత కొనడానికి ఆసక్తిగా ఉన్నానని తెలిపారు.రోజర్స్ పెట్టుబడి తత్వం ఇదే..తాను మార్కెట్ భవిష్యత్తు గురించి లెక్కలు వేస్తూ కూర్చోనని, ఎప్పుడైతే వస్తువుల ధరలు పడిపోతాయో అప్పుడే ఎక్కువగా కొనుగోలు చేస్తానని జిమ్ రోజర్స్ చెప్పుకొచ్చారు. బంగారం (gold), వెండి (silver) వంటి విలువైన లోహాలు తన వద్ద ఉన్నాయని, అవి తన పిల్లలకు మిగలాలని ఆశిస్తున్నానని చెప్పారు. ఇటీవల వెండి ధరలు దూసుకుపోతున్న తరుణంలో తానూ కొంత వెండి కొనుగోలు చేసినట్టు పేర్కొన్నారు.ప్రపంచంలోని చాలా దేశాలు భారీగా డబ్బును ముద్రిస్తున్నాయి. అప్పుల్లో కూరుకుపోయాయి. ఈ నేపథ్యంలో బంగారం వంటి లోహాలు కరెన్సీ డీ-వాల్యుయేషన్ నుండి తమను తాము రక్షించుకునేందుకు మంచి మార్గమని రోజర్స్ చెప్పారు. ‘భారతీయ మహిళలు శతాబ్దాలుగా బంగారం, వెండి కొనుగోలు చేస్తున్నారు. వారికి ఉన్న తెలివితేటలు నేనూ నేర్చుకుంటున్నాను’ అని ఉదహరించారు.మార్కెట్లపై దృష్టిచైనా మార్కెట్లో కొంత ఈక్విటీ ఎక్స్పోజర్ ఉన్నప్పటికీ, తన ఇతర పోర్ట్ఫోలియోలో చాలా భాగం విక్రయించానన్నారు. ఇటీవల స్టాక్ మార్కెట్లు బలంగా ఉండటాన్ని చూస్తే, తన అభిప్రాయం ప్రకారం ఇది అమ్మే సమయం అని చెప్పారు. జిమ్ రోజర్స్ తరచూ మార్కెట్లో వేచి చూసే పెట్టుబడిదారుల సరసన నిలబడతారు. వారు చెబుతున్నది స్పష్టం.. ధరలు పడితేనే కొనండి, ఎప్పుడూ ట్రెండ్ను అనుసరించవద్దు. బంగారం, వెండిలో దీర్ఘకాలికంగా పెట్టుబడి పెట్టాలన్నది ఆయన సలహా.ఇదీ చదవండి: ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ నుంచి 10 శక్తివంతమైన డబ్బు పాఠాలు -
నం.1, 2 లోహాలు.. ఎందులో వాడుతున్నారంటే..
బంగారం, వెండి ధరలు ఇటీవలి కాలంలో అసాధారణ రీతిలో పెరుగుతున్నాయి. ఇటీవల కేజీ వెండి ధర ఏకంగా రూ.1.95 లక్షలకు చేరింది. తులంగా బంగారం రూ.1.20 పైమాటే. ఈ పెరుగుదలకు ప్రధానంగా ఆర్థిక అంశాలు దోహదపడుతున్నాయి. ద్రవ్యోల్బణం పెరుగుదల, దీనికి విరుగుడుగా సురక్షిత పెట్టుబడి సాధనాలుగా బంగారం, వెండిపై మదుపరుల దృష్టి మళ్లడం ఒక ముఖ్య కారణం. అంతర్జాతీయంగా డాలర్ విలువ బలహీనపడటం, ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకులు భారీగా బంగారం నిల్వలను కొనుగోలు చేస్తుండడం వంటివి కూడా ఈ ధరల పెరుగుదలకు ఇంధనంగా పనిచేస్తున్నాయి. అయితే కేవలం ఆర్థిక కారకాలు, ఆభరణాల తయారీ మాత్రమే కాకుండా ఈ లోహాలకు అనేక పారిశ్రామిక, అత్యాధునిక రంగాల్లో పెరుగుతున్న డిమాండ్ కూడా ధరల పెరుగుదలలో కీలక పాత్ర పోషిస్తోంది.బంగారం, వెండి రెండూ విద్యుత్ వాహకత, తుప్పు నిరోధకత, సులభంగా సాగే (ductility), రేకులుగా మలిచే గుణం (malleability) వంటి ప్రత్యేక లక్షణాలను కలిగి ఉన్నాయి. ఈ లక్షణాల కారణంగా వీటి వినియోగం కేవలం పెట్టుబడులు లేదా ఆభరణాల తయారీకే పరిమితం కాకుండా అత్యంత ముఖ్యమైన పారిశ్రామిక, సాంకేతిక రంగాల్లో విస్తరిస్తోంది.బంగారం వినియోగంబంగారాన్ని అత్యధికంగా ఆభరణాల తయారీలో వినియోగించినప్పటికీ దాని ప్రత్యేక లక్షణాల కారణంగా అనేక అత్యాధునిక రంగాల్లో దీనికి ప్రాధాన్యత ఉంది.ఎలక్ట్రానిక్స్, ఉపకరణాల తయారీబంగారం అత్యుత్తమ విద్యుత్ వాహకాల్లో ఒకటి. తుప్పు పట్టదు కాబట్టి దీన్ని మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లు, కంప్యూటర్లు, జీపీఎస్ యూనిట్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాల తయారీలో వాడుతున్నారు. ముఖ్యంగా కనెక్టర్లు, స్విచ్లు, రిలేలు, సర్క్యూట్ బోర్డులలోని కీలకమైన భాగాలలో దీర్ఘకాలిక విద్యుత్ కనెక్షన్ల కోసం బంగారాన్ని ఉపయోగిస్తున్నారు.ఏరోస్పేస్, అంతరిక్ష పరిశోధనఉపగ్రహాలు, అంతరిక్ష నౌకలు, రాకెట్ల్లోని కీలకమైన ఎలక్ట్రానిక్ విడిభాగాలను రక్షించడానికి, విద్యుత్ ప్రసారం కోసం బంగారాన్ని వాడుతున్నారు. అంతరిక్షంలోని అత్యంత కఠినమైన వాతావరణంలో కూడా ఇది అద్భుతమైన పనితీరును కనబరుస్తుంది. అధిక ఉష్ణోగ్రతలను నియంత్రించడానికి బంగారాన్ని పూతగా కూడా ఉపయోగిస్తారు.వైద్య పరికరాలుబంగారం జీవసంబంధితంగా స్థిరంగా ఉంటుంది (శరీరంలో సులభంగా చర్యలకు గురికాదు). తుప్పు పట్టదు. నాన్-అలెర్జిక్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఈ కారణంగా దంతవైద్యంలో క్రౌన్స్, బ్రిడ్జెస్ వంటి వాటికి ఉపయోగిస్తారు. గుండెకు సంబంధించిన కొన్ని శస్త్రచికిత్సా పరికరాలు, అతిపెద్ద వైద్య ఇమేజింగ్ పరికరాల్లో బంగారాన్ని వాడుతున్నారు.నానోటెక్నాలజీబంగారు నానోపార్టికల్స్కు వైద్య రంగంలో మెరుగైన సామర్థ్యం ఉంది. వీటిని క్యాన్సర్ చికిత్స, డ్రగ్ డెలివరీ సిస్టమ్స్ (మందులను లక్షిత ప్రాంతానికి చేర్చడం), జీవసంబంధిత సెన్సార్ల (Biosensors) తయారీలో పరిశోధన కోసం ఉపయోగిస్తున్నారు.గ్లాస్, కిటికీలుకొన్ని భవనాల అద్దాలు, కిటికీలపై సన్నని బంగారు పూతను ఉపయోగిస్తున్నారు. ఈ పూత వేడిని నిరోధించి, లోపల ఉష్ణోగ్రతను చల్లగా ఉంచడానికి సహాయపడుతుంది. తద్వారా విద్యుత్ వినియోగాన్ని తగ్గిస్తుంది.వెండి వినియోగంవెండి కూడా బంగారంతో సమానంగా విస్తృత పారిశ్రామిక అనువర్తనాలను కలిగి ఉంది. ఇది అన్ని లోహాల్లో అత్యుత్తమ విద్యుత్, ఉష్ణ వాహకతను కలిగి ఉంది.సోలార్ ప్యానెల్స్, విద్యుత్ బ్యాటరీలుప్రపంచవ్యాప్తంగా పునరుత్పాదక ఇంధన వనరుల వాడకం పెరుగుతున్న నేపథ్యంలో సౌరశక్తి (Solar Energy) రంగంలో వెండి వినియోగం కీలక పాత్ర పోషిస్తోంది. ఫోటోవోల్టాయిక్ సెల్స్లో విద్యుత్తును సేకరించి సరఫరా చేయడానికి వెండి పేస్ట్లను (Silver Paste) వాడుతున్నారు. ఎలక్ట్రిక్ వాహనాల్లో ఉపయోగించే కొన్ని రకాల బ్యాటరీల్లో కూడా వెండిని వాడుతున్నారు.ఎలక్ట్రానిక్స్, కండక్టర్లువెండి అత్యుత్తమ విద్యుత్ వాహకతను కలిగి ఉండటం వల్ల అధిక పనితీరు గల ఎలక్ట్రానిక్ ఉపకరణాలలో సర్క్యూట్ బోర్డులు, స్విచ్లు, ఫ్యూజులు, కనెక్టర్లలో దీన్ని ఉపయోగిస్తారు. ముఖ్యంగా అధిక విశ్వసనీయత అవసరమయ్యే పరికరాలలో దీని వినియోగం తప్పనిసరి అవుతోంది.పారిశ్రామిక రసాయనాలు, ఉత్ప్రేరకాలువెండిని రసాయన పరిశ్రమల్లో ఉత్ప్రేరకాలుగా (Catalysts) వాడుతున్నారు. ఉదాహరణకు, ఫార్మాల్డిహైడ్ ఉత్పత్తిలో (ఇది అనేక ప్లాస్టిక్ల తయారీలో ముఖ్యమైనది) ఇది ప్రముఖంగా ఉపయోగపడుతుంది.నీటి శుద్ధి, వైద్య రంగంవెండికి బలమైన యాంటీమైక్రోబియల్ (సూక్ష్మజీవులను నాశనం చేసే) లక్షణాలు ఉన్నాయి. ఈ కారణంగా దీన్ని నీటి శుద్ధి పద్ధతుల్లో, కొన్ని వైద్య ఉపకరణాలు, కట్టులు (Bandages) తయారీలో వాడుతున్నారు. ఆసుపత్రి పరికరాలపై క్రిమిసంహారక పూతగా కూడా వెండిని ఉపయోగిస్తున్నారు.ఫొటోగ్రఫీసాంప్రదాయ ఫిల్మ్ ఫొటోగ్రఫీలో ఫిల్మ్, పేపర్పై కాంతిని గుర్తించడానికి వెండి హాలైడ్లను విస్తృతంగా వాడుతున్నారు. డిజిటల్ ఫొటోగ్రఫీ రాకతో ఈ వినియోగం తగ్గినప్పటికీ ప్రత్యేక ఫొటోగ్రఫీ రంగాలలో ఇంకా ఉపయోగిస్తున్నారు.ఇదీ చదవండి: జరిమానా చెల్లించి, తప్పు అంగీకరిస్తే కేసు మూసివేత!బంగారం, వెండి వాటి ప్రత్యేక భౌతిక, రసాయన లక్షణాలు ఆధునిక సాంకేతిక ప్రపంచంలో వాటి వినియోగాన్ని అనివార్యంగా మార్చాయి. ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్, సోలార్ ఎనర్జీ, ఏరోస్పేస్, వైద్య పరికరాలు వంటి కీలక రంగాలలో పెరుగుతున్న డిమాండ్ ఈ లోహాల ధరల పెరుగుదలకు ఒక బలమైన పారిశ్రామిక కోణాన్ని జోడిస్తోంది. భవిష్యత్తులో సాంకేతిక ఆవిష్కరణలు పెరిగే కొద్దీ ఈ అమూల్యమైన లోహాల వినియోగం, వాటి విలువ మరింత పెరిగే అవకాశం ఉంది. -
రూ.1.95 లక్షల వద్ద వెండి: దూసుకెళ్తున్న బంగారం!
భారతదేశంలో బంగారం ధరలు మరోసారి పెరిగాయి. ఈ రోజు (అక్టోబర్ 13) గోల్డ్ రేటు గరిష్టంగా రూ. 320 పెరిగింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో పసిడి ధరలలో స్వల్ప మార్పులు ఏర్పడ్డాయి. ఈ కథనంలో ఈ రోజు తెలుగు రాష్ట్రాలతో పాటు.. చెన్నై, ఢిల్లీలలో గోల్డ్ రేటు ఎలా ఉందో చూసేద్దాం.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
బంగారాన్నే నమ్ముతా: జోహో సీఈఓ శ్రీధర్ వెంబు
బంగారం ధరలు రోజురోజుకూ పెరుగుతూ ఆకాశాన్ని తాకుతున్నాయి. అదే సమయంలో క్రిప్టో కరెన్సీకి కూడా క్రేజ్ పెరుగుతోంది. అయితే స్వదేశీ సాంకేతిక ఆవిష్కరణలతో వార్తల్లో నిలుస్తున్న జోహో (Zoho)వ్యవస్థాపకుడు, సీఈవో శ్రీధర్ వెంబు.. తాను బంగారాన్నే(Gold) నమ్ముతా అంటున్నారు.క్రిప్టో క్రేజ్ లేదా తాజా మార్కెట్ ట్రెండ్లకు లోనుకాకుండా బంగారాన్ని సంపదకు విశ్వసనీయమైన నిల్వగా కొనసాగిస్తున్నారు. కరెన్సీ క్షీణతకు రక్షణగా బంగారాన్ని భావించే శిబిరంలో 25 సంవత్సరాలుగా కొనసాగుతున్నట్లు ఆయన స్పష్టం చేశారు.ఈమేరకు శ్రీధర్ వెంబు (Sridhar Vembu) ‘ఎక్స్’(ట్విటర్)లో ఓ పోప్ట్ పెట్టారు. తనకు క్రిప్టోకరెన్సీలపై ఆసక్తి లేదని, బంగారాన్ని స్థిరమైన, కాలాతీత పెట్టుబడిగా చూస్తానని పేర్కొన్నారు. లిన్ ఆల్డెన్ అనే స్థూల ఆర్థిక వ్యూహకర్త చేసిన విశ్లేషణలో కూడా ఇదే భావనను సమర్థిస్తుందని ప్రస్తావించారు. ఆమె పరిశోధన ప్రకారం, అమెరికా ట్రెజరీ బాండ్లు, స్టాక్స్,రియల్ ఎస్టేట్ వంటి ఆస్తులు ద్రవ్యోల్బణాన్ని అనుసరించే బంగారాన్ని దీర్ఘకాలంలో అధిగమించలేకపోయాయి.ఆల్డెన్ చెప్పినట్లు, కేవలం 4 శాతం స్టాకులే మార్కెట్ రాబడికి ముఖ్య కారణమవుతాయి. రియల్ ఎస్టేట్ కూడా పన్నులు, నిర్వహణ ఖర్చులు, ద్రవ్యోల్బణం వంటి అంశాల వల్ల బంగారంతో పోలిస్తే తక్కువ పనితీరు చూపించింది.ఇదిలా ఉండగా, 2025లో ట్రంప్ విధించిన వాణిజ్య సుంకాలు, అమెరికా-చైనా ఉద్రిక్తతలు, ద్రవ్యోల్బణ భయాలు వంటివి బంగారం ధరలు ఔన్స్కు 4,000 డాలర్లు (రూ. 3.57 లక్షలు) దాటేలా చేశాయి. ఈ పరిణామాలు వెంబు నమ్మకాన్ని మరింత బలపరుస్తున్నాయి.ఇదీ చదవండి: ఆ ఇన్వెస్ట్మెంట్ ఫార్ములా చచ్చింది.. కొత్తది వచ్చింది: రాబర్ట్ కియోసాకిశ్రీధర్ వెంబు లాజిక్ స్పష్టంగా ఉంది. బంగారం తక్షణ లాభాల కోసం కాదు, ఇది దీర్ఘకాలిక ఆర్థిక భద్రత కోసం. “బంగారం ఓర్పునకు సంబంధించినది” అని చెబుతూ, ఆధునిక హైప్తో నిండిన పెట్టుబడి ప్రపంచంలో ఆయన దృఢమైన వైఖరి విశిష్టంగా నిలుస్తోంది.I have long been in the "gold as insurance against currency debasement" camp, for over 25 years now. Over the long term, gold has held its purchasing power in terms of commodities like petroleum, and gold has held its own against broad stock market indexes. No, I am not… pic.twitter.com/dyfnCFa7T6— Sridhar Vembu (@svembu) October 12, 2025 -
రాబర్ట్ కియోసాకి హెచ్చరిక: ఈ ఏడాదే అతిపెద్ద క్రాష్!
ఎక్స్ వేదికగా పెట్టుబడికి సంబంధించిన విషయాలను పేర్కొంటూ ఉండే.. రిచ్ రాడ్ పూర్ డాడ్ రచయిత 'రాబర్ట్ కియోసాకి' (Robert Kiyosaki) మరో ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో.. ఈ ఏడాది అతిపెద్ద క్రాష్ జరుగుతుందని హెచ్చరించారు.ప్రపంచ చరిత్రలో అతిపెద్ద క్రాష్ జరుగుతుందని.. నేను ముందే ఊహించాను. ఆ క్రాష్ ఈ ఏడాది జరుగుతుంది. బేబీ బూమ్ రిటైర్మెంట్లు తుడిచిపెట్టుకుపోబోతున్నాయి. కియోసాకి ప్రకారం.. ఈ ఏడాది స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలను పొందే అవకాశం ఉందని, ఇదే అతిపెద్ద క్రాష్ అని స్పష్టంగా అర్థమవుతోంది. స్టాక్ మార్కెట్లు భారీగా నష్టపోవడానికి టారిఫ్స్ ప్రభావం, ఆర్ధిక మాంద్యం, అంతర్జాతీయ అనిశ్చితి మొదలైనవి ప్రధాన కారణాలు.డబ్బు కూడబెట్టొద్దు, నిజమైన ఆస్తులలో పెట్టుబడి పెట్టండని హెచ్చరిస్తూనే ఉన్నాను. చాలా సంవత్సరాలుగా.. నేను సేవర్స్ ఓడిపోయేవారు అని చెబుతూనే ఉన్నాను. చాలా సంవత్సరాలుగా నేను బంగారం, వెండి, బట్కాయిన్ వంటి వాటిలో పెట్టుబడి పెట్టాలని సూచించాను. వాటి ధరలు ఇప్పుడు ఏ స్థాయిలో ఉన్నాయో అందరికీ తెలుసు.ఇప్పుడు ఎథెరియంలను సేవ్ చేయమని చెబుతున్నాను. ఈ రోజు నేను వెండి & ఎథెరియం ఉత్తమమైనవని నమ్ముతున్నాను. ఎందుకంటే వీటి విలువ పెరుగుతూనే ఉంటుంది. వీటిని ముఖ్యంగా పరిశ్రమల్లో ఉపయోగిస్తారు. దీనివల్ల డిమాండ్ పెరుగుతుంది. దయచేసి వెండి, ఎథెరియం లాభాలు & నష్టాలను మాత్రమే కాకుండా.. ఉపయోగాన్ని కూడా అధ్యయనం చేయండి. మీ సొంత ఆర్థిక జ్ఞానంతో పెట్టుబడి పెట్టండి. ఎప్పటికప్పుడు మీ సొంత ఆర్థిక తెలివితేటలను పెంచుకుంటుంటే.. తప్పకుండా ధనవంతులు అవుతారు. జాగ్రత్తపడండి అంటూ కియోసాకి ట్వీట్ చేశారు.ఇదీ చదవండి: 'రేటు మరింత పెరగకముందే.. కొనేయండి': రాబర్ట్ కియోసాకిపెరుగుతున్న వెండి ధరలుబంగారం ధరలు మాదిరిగానే.. వెండి ధరలు అమాంతం పెరుగుతున్నాయి. ప్రస్తుతం భారతదేశంలో కేజీ వెండి రూ. 190000 వద్దకు చేరింది. ఈ సందర్భంగా ''వెండి 50 డాలర్లు దాటేసింది, తరువాత 75 డాలర్లకు?.. సిల్వర్, ఎథిరియం హాట్, హాట్'' (ధరలు భారీగా ఉన్నాయని) అంటూ కియోసాకి ట్వీట్ చేశారు. దీన్నిబట్టి చూస్తే.. వెండి కూడా మరింత పెరుగుతుందని తెలుస్తోంది.REMINDER: I predicted the biggest crash in world history was coming in my book Rich Dad’s Prophecy. That crash will happen this year. Baby Boom Retirements are going to be wiped out. Many boomers will be homeless or living in their kids basement. Sad.REMiNDER: I have…— Robert Kiyosaki (@theRealKiyosaki) October 11, 2025 -
కరువునేలలో పసిడి పంట
తుగ్గలి (కర్నూలు జిల్లా): కరువు నేలల్లో పసిడి పంట పండనుంది. స్వాతంత్య్రం తర్వాత దేశంలో తొలిసారి ప్రైవేటు గోల్డ్ మైనింగ్ కంపెనీ బంగారం నిక్షేపాల వెలికితీతకు సిద్ధమైంది. నాలుగు దశాబ్దాల పాటు చేసిన సర్వేలు, పరిశోధనలు ఫలించడంతో ఈ నెలాఖరున పట్టాలెక్కనుంది. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరి, పగిడిరాయి, బొల్లవానిపల్లి, జీ.ఎర్రగుడి పరిసర ప్రాంతాల్లో 597.82 హెక్టార్లలో బంగారం నిక్షేపాలు ఉన్నట్లు శాస్త్రవేత్తలు సర్వేల్లో గుర్తించారు. ఆ నిక్షేపాలను వెలికితీసేందుకు జియో మైసూర్ సర్వీసెస్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్ సంస్థ ముందుకొచ్చింది. కంపెనీలో 70 శాతం వాటాతో త్రివేణి ఎర్త్మూవర్స్, ప్రాకార్, లాయిడ్స్ మెటల్స్ ప్రధాన వాటాదారు. డెక్కన్ గోల్డ్ మైన్స్ 27.27 శాతం వాటా కలిగి ఉంది. ప్రధాన వాటాదారు మైనింగ్ దిగ్గజం బి. ప్రభాకరన్ ఈ ప్రాజెక్టు బాధ్యతలు పర్యవేక్షించనున్నారు.40 ఏళ్లకు పైగా సర్వేలు, పరిశోధనలుఈ ప్రాంతంలో 40 ఏళ్లకు పైగా పలు సంస్థలు సర్వేలు, పరిశోధనలు చేశాయి. మొదట జీఎస్ఐ, ఎమ్మీసీఎల్ సంస్థలు సర్వే చేశాయి. ఆ తర్వాత 1994 నుంచి జియో మైసూర్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సర్వే చేపట్టింది. బంగారం నిక్షేపాలు ఉన్నట్లు నిర్ధారించుకున్న సంస్థ ప్రభుత్వ అనుమతులు కోరడంతో 2013లో అనుమతులు వచ్చాయి. పలు పరిశోధనల అనంతరం సంస్థ నిర్ధారించుకున్న తర్వాత 2023 సెపె్టంబరు 2న ప్రాసెసింగ్ ప్లాంట్ నిర్మాణానికి కంపెనీ ప్రతినిధులు భూమి పూజచేశారు. మొదట చిన్నప్లాంట్ ఏర్పాటుచేసి అందులో ప్రాసెసింగ్ ట్రయల్ నిర్వహిస్తూనే మరో రూ.200 కోట్లతో పెద్ద ప్లాంట్ నిర్మాణం పూర్తిచేశారు. బంగారం ఉత్పత్తికి సిద్ధందాదాపు రూ.500 కోట్లతో చేపట్టిన ఈ ప్రాజెక్టు అక్టోబరు నెలాఖరు నుంచి గానీ, నవంబరు ప్రారంభం నుంచి కానీ బంగారం ఉత్పత్తి చేసేందుకు సిద్ధమైనట్లు ప్రధాన వాటాదారు బి. ప్రభాకరన్ ఓ ప్రకటనలో వెల్లడించారు. ప్రారంభంలో ఏడాదికి 500 కిలోలు ఉత్పత్తి చేయనున్నారు. అన్ని చట్టబద్ధమైన అనుమతులతో క్రమంగా ఏడాదికి సుమారు 1,000 కిలోల బంగారం ఉత్పత్తి చేసేందుకు కంపెనీ సమాయత్తమవుతోంది. అలాగే, ప్రభుత్వ అనుమతులతో ఇక్కడే 24 క్యారెట్ల బంగారం ప్రాసెసింగ్ చేయనున్నారు. 597.82 హెక్టార్లలో బంగారు నిక్షేపాలు నిజానికి.. ఈ ప్రాంతంలో 597.82 హెక్టార్లలో బంగారు నిక్షేపాలు ఉన్నట్లు ఎప్పుడో గుర్తించారు. జియో మైసూర్ సర్వీసెస్ కంపెనీ దాదాపు 30 ఏళ్ల క్రితం ఎకరా రూ.4,500 చొప్పున రైతుల నుంచి లీజుకు తీసుకుని సర్వేలు, పరిశోధనలు, డ్రిల్లింగ్ చేపట్టింది. ఆ తర్వాత లీజు మొత్తం పెంచుతూ వచ్చింది.బంగారం వెలికితీతకు ఎకరా రూ.12 లక్షల చొప్పున రైతుల నుంచి ఇప్పటివరకు 283 ఎకరాలు కొనుగోలు చేసింది. మిగిలిన భూములకు ఎకరాకు ఏడాదికి రూ.18 వేలు చొప్పున చెల్లిస్తోంది. కంపెనీలో ఇప్పటివరకు దాదాపు 600 మందికి ఉపాధి లభించింది. మున్ముందు మరింత మందికి ఉపాధి కల్పిస్తామని కంపెనీ నిర్వాహకులు చెబుతున్నారు. సామాజిక సేవా కార్యక్రమాలు.. మరోవైపు.. జియో మైసూర్ కంపెనీ బంగారం నిక్షేపాలు వెలికితీస్తూనే సామాజిక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. జొన్నగిరి, పగిడిరాయిలో పాఠశాలలకు మినరల్ వాటర్ సరఫరా చేస్తోంది. పాఠశాలలకు అవసరమైన సదుపాయాలకు కృషిచేస్తోంది. చెన్నంపల్లి, పీ.కొత్తూరు, బొల్లవానిపల్లి విద్యార్థులు ఉన్నత చదువుకు పక్క గ్రామాల్లో ఉన్న పాఠశాలలకు వెళ్లేందుకు రవాణా సౌకర్యం కల్పిoచింది. ఉత్పత్తి బాగా జరిగితే విద్య, వైద్యంతో పాటు మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ప్లాంట్ ప్రతినిధులు వివరించారు. -
ఇంతలా పెరిగితే కొనేదెలా.. తారాస్థాయికి చేరిన బంగారం ధరలు!
హమ్మయ్య బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి అనుకునేలోపే.. మళ్లీ ఊపందుకున్నాయి. నేడు (అక్టోబర్ 11) గోల్డ్ రేటు గరిష్టంగా రూ. 930 పెరిగింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లోని పసిడి ధరలలో స్వల్ప మార్పులు జరిగాయి. ఈ కథనంలో ఏ నగరం బంగారం ధర ఎక్కువగా ఉంది?, ఏ నగరంలో తక్కువగా ఉంది అనే విషయాలు వివరంగా తెలుసుకుందాం.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
రుణమే.. బంగారమాయెనే!
బంగారం ధరలు ఊహించని విధంగా పెరిగిపోతున్న తరుణంలో వాటిపై రుణం తీసుకునేందుకు వినియోగదారులు ఆసక్తి చూపిస్తున్నారు. అతి తక్కువ వడ్డీకి రుణ సాయం లభిస్తుండడంతో ఎక్కువ మంది పసిడి రుణాలవైపు అడుగులు వేస్తున్నారు. దీంతో సంఘటిత రంగంలో (ఆర్బీఐ కింద నమోదైన బ్యాంక్లు, ఎన్బీఎఫ్సీలు) బంగారం రుణాల మార్కెట్ 2026 మార్చి నాటికి రూ.15 లక్షల కోట్లకు చేరుకుంటుందని రేటింగ్ సంస్థ ఇక్రా అంచనా వేసింది.నిజానికి 2027 మార్చి నాటికి సంఘటిత పసిడి రుణాల మార్కెట్ ఈ స్థాయికి చేరుకుంటుందని 2024 సెప్టెంబర్లో ఇక్రా అంచనా వేయగా.. ఇప్పుడు ఏడాది ముందుగానే ఇది సాధ్యపడుతుందని పేర్కొంది. 2027 మార్చి నాటికి రూ.18 లక్షల కోట్లకు చేరుకోవచ్చని పేర్కొంది. 2025 మార్చి నాటికి మొత్తం మీద బంగారం రుణాల మార్కెట్ రూ.11.8 లక్షల కోట్లుగా ఉన్నట్టు తెలిపింది. ‘బంగారం ధరలు స్థిరంగా పెరుగుతుండడం వల్లే మా అంచనాను సవరించాల్సి వచ్చింది. ధరలు కొత్త గరిష్టాలకు చేరుకోవడంతో బంగారం రుణాల మార్కెట్ అంచనాలకు మించి వేగంగా వృద్ధి చెందుతోంది. ఈ విభాగంలో బ్యాంకులు తమ ఆధిక్యాన్ని బలోపేతం చేసుకుంటున్నాయి. వృద్ధిలో ఎన్బీఎఫ్సీలను వెనక్కి నెట్టేస్తున్నాయి’ అని ఇక్రా తన నివేదికలో పేర్కొంది. బ్యాంకుల ఆధిపత్యం..సంఘటిత బంగారం రుణ మార్కెట్లో బ్యాంకులు మరింత బలంగా మారుతున్నాయి. 2025 మార్చి నాటికి తమ వాటాను 82 శాతానికి పెంచుకున్నట్టు ఇక్రా తెలిపింది. 2019–20 నుంచి 24–25 కాలంలో బ్యాంకుల వాటా ఏటా 26% చొప్పున కాంపౌండెడ్గా పెరిగినట్టు వెల్లడించింది. ఇదే కాలంలో బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల (ఎన్బీఎఫ్సీల) వాటా ఈ మార్కెట్లో ఏటా 20% వృద్దిని చూసినట్టు తెలిపింది. బ్యాంకుల రుణ పోర్ట్ఫోలియోలోనూ కీలక మార్పును ఈ నివేదిక ప్రస్తావించింది. 2025 మార్చి నాటికి రిటైల్/వ్యక్తిగత పసిడి రుణాలు బ్యాంకుల మొత్తం పసిడి రుణాల్లో 18%కి చేరాయని, ఏడాది ముందు ఇవి 11%గానే ఉన్నట్టు తెలిపింది. బంగారంపై తీసుకునే సాగు, ఇతర అవసరాలకు ఉద్దేశించిన రుణాలు 70% నుంచి 63%కి తగ్గినట్టు పేర్కొంది. ఎన్బీఎఫ్సీల నిర్వహణలోని బంగారం రుణ ఆస్తుల విలువ 2025–26లో 30–35 శాతం పెరగొచ్చని ఇక్రా అంచనా వేసింది. బంగారం ధరలు పెరిగిపోవడం, అన్సెక్యూర్డ్ రుణాల్లో వృద్ధి తగ్గడాన్ని ప్రస్తావించింది. 2025 జూన్ నాటికి ఎన్బీఎఫ్సీల నిర్వహణలోని బంగారం రుణాల విలువ రూ.2.4 లక్షల కోట్లుగా ఉండొచ్చని తెలిపింది.వడ్డీ రేట్లు ఇలా..బంగారం రుణాలపై బ్యాంకులు వసూలు చేస్తున్న ఆరంభ వడ్డీ రేటు 8 శాతం (వార్షిక)గా ఉంది. వ్యక్తిగత రుణాల్లో ఇంత తక్కువ రేటుకు మరే రుణం కూడా లభించడం లేదు. ఎన్బీఎఫ్సీలు మాత్రం బంగారం రుణాలపై 12 శాతం నుంచి వడ్డీ రేటును వసూలు చేస్తున్నాయి. దీంతో కస్టమర్లు బ్యాంకుల్లో బంగారంపై రుణం తీసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. పైగా ఎన్బీఎఫ్సీలతో పోల్చినప్పుడు బ్యాంకులపై ఎక్కువ మందిలో విశ్వాసం ఉండడం కూడా ఒక కారణంగా కనిపిస్తోంది. బంగారం, ఆధార్, పాన్ డాక్యుమెంట్లతో వెళితే అరగంట, గంట–గంటలోపే బ్యాంకుల్లో రుణం మంజూరవుతుంది.సిల్వర్ రూ.8,500 జంప్వెండి ధర రాకెట్ వేగాన్ని తలపిస్తోంది. ఢిల్లీ మార్కెట్లో శుక్రవారం కిలోకి రూ.8,500 ఎగసి రూ.1,71,500 స్థాయికి చేరింది. ముఖ్యంగా గత మూడు పనిదినాల్లోనే వెండి కిలోకి రూ.17,500 పెరగడం డిమాండ్ను తెలియజేస్తోంది. ప్రధానంగా పెట్టుబడిదారుల నుంచి ఎక్కువ డిమాండ్ కనిపిస్తోంది. మరోవైపు బంగారం ధర (99.9 శాతం స్వచ్ఛత) 10 గ్రాములకు రూ.600 నష్టపోయి రూ.1,26,000 వద్ద స్థిరపడింది. సురక్షిత సాధనాల్లో పెట్టుబడులకు ఇన్వెస్టర్లు మొగ్గు చూపించడం, సెంట్రల్ బ్యాంకుల కొనుగోళ్లు ధరల పెరుగుదలకు మద్దతుగా నిలుస్తున్నట్టు హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ రీసెర్చ్ అనలిస్ట్ దిలీప్ పార్మర్ తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ వెండి ధర ఔన్స్కు 51 డాలర్లకు చేరుకోగా, స్పాట్ గోల్డ్ ఔన్స్కు 17 డాలర్ల మేర పెరిగి 3,993 డాలర్ల వద్ద ట్రేడయ్యింది.ఇదీ చదవండి: ఇళ్ల ధరలు ఎంత పెరిగాయంటే.. -
గోల్డ్ ఇలా పెట్టుబడి పెడితే మీరే కోటిశ్వరుడు
-
ఒక్కసారిగా తగ్గిన గోల్డ్ రేటు: రూ.2 లక్షలకు చేరువలో వెండి!
అక్టోబర్ ప్రారంభం నుంచి భారీగా పెరుగుతున్న బంగారం ధరలకు ఒక్కసారిగా బ్రేక్ పడింది. నేడు (శుక్రవారం) గోల్డ్ రేటు గరిష్టంగా రూ. 1860 తగ్గింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లోని బంగారం ధరల్లో స్వల్ప మార్పులు జరిగాయి. ఈ కథనంలో గోల్డ్ రేటు.. ఏ నగరం ఎంత ఉంది అనే విషయం తెలుసుకుందాం.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
‘ఆ ఇన్వెస్ట్మెంట్ ఫార్ములా చచ్చింది.. కొత్తది వచ్చింది’
రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి సాంప్రదాయ 60/40 పెట్టుబడి వ్యూహాన్ని తీవ్రంగా విమర్శించారు. ఈ వ్యూహం ప్రకారం 60 శాతం డబ్బును ఈక్విటీల్లో (స్టాక్స్), 40 శాతం డబ్బును బాండ్లలో (స్థిర ఆదాయ పెట్టుబడులు) పెట్టాలి. దీర్ఘకాలిక, స్థిరమైన ఆదాయాన్ని కల్పించగలదని భావించి, ఈ వ్యూహాన్ని ఎన్నో దశాబ్దాలుగా ఆర్థిక ప్రణాళికదారులు ఒక "మ్యాజిక్ ఫార్ములా"గా వర్ణిస్తూ వచ్చారు.అయితే, కియోసాకి అభిప్రాయం (Rich Dad Poor Dad author Robert Kiyosaki) ప్రకారం, ఈ 60/40 విధానం 1971లోనే పనికిరానిది అయిపోయింది. అంటే, అప్పటి అమెరికా అధ్యక్షుడు నిక్సన్ బంగార ప్రమాణం నుంచి డాలర్ను వదిలించాక ఇది అసంబద్ధం అయింది.రాబర్ట్ కియోసాకి తన ‘ఎక్స్’ (గతంలో ట్విట్టర్) ఖాతాలో ఒక పోస్ట్ చేశారు. "మొత్తానికి, ఫైనాన్షియల్ ప్లానర్ల మ్యాజిక్ మంత్రదండం – 60/40 చనిపోయింది" అంటూ పోస్ట్ను మొదలు పెట్టిన కియోసాకి "ఆ బీఎస్ నిష్పత్తి నిక్సన్ బంగారు ప్రమాణం నుంచి డాలర్ను తీసేసిన 1971లోనే చనిపోయింది. దాన్నుంచి ఇప్పటివరకు, ఆర్థిక ప్రణాళికదారులు దీన్ని పదవీ విరమణ భద్రత కోసం మేజిక్ కార్పెట్ రైడ్ లా ప్రచారం చేస్తూ వచ్చారు" అని రాసుకొచ్చారు.అమెరికా ప్రభుత్వం ప్రపంచంలో అతిపెద్ద రుణగ్రహీత అని, అమెరికన్ డాలర్ ఒక “నకిలీ” కరెన్సీగా మారిందని కియోసాకి పేర్కొన్నారు. "యూఎస్ డాలర్ నకిలీ. ఇది మార్క్సిస్ట్ ఫెడ్ నియంత్రణలో ఉన్న, దివాలా తీసిన అమెరికన్ ప్రభుత్వ ఐఓయూ మాత్రమే. అలాంటి దేశం నుంచి బాండ్లు కొంటారా? ఆర్థిక భద్రత ఎక్కడుంది?" అంటూ ప్రశ్నించారు.కొత్త ఫార్ములా..మొత్తానికి వాస్తవం తెలిసొచ్చిందని, మోర్గాన్ స్టాన్లీ లాంటి సంస్థలు ఇప్పుడు మరో ప్రత్యామ్నాయ వ్యూహం 60/20/20 పోర్ట్ఫోలియోను ప్రోత్సహిస్తున్నాయని వివరించారు. ఈ వ్యూహం ప్రకారం.. 60 శాతం స్టాక్స్ లేదా ఇతర పెట్టుబడులు, 20 శాతం బాండ్లు, 20 శాతం బంగారం (లేదా ఇతర భద్రతా ఆస్తులు)పై పెట్టుబడి పెడతారు. ఇది పెట్టుబడిదారులకు పదవీ విరమణలో మరింత భద్రత కలిగిస్తుందని ఆయా సంస్థలు చెబుతున్నాయన్నారు.నేను వీటికే ప్రాధాన్యమిస్తా..ఎవరెన్ని చెప్పినప్పటికీ తాను ఎప్పటికీ నిజమైన ఆస్తులు అంటే, బంగారం, వెండి నాణేలు, బిట్కాయిన్, ఎథెరియం వంటి క్రిప్టో కరెన్సీలు, రుణంతో కొనుగోలు చేసిన రియల్ ఎస్టేట్ నుంచి అద్దె ఆదాయం, చమురు బావులు, పశువులపై వచ్చే రాబడికే ప్రధాన్యత ఇస్తానన్నారు. ఇవన్నీ ఆదాయం అందించే "రియల్ అసెట్స్" అని చెబుతూ, వాటిలో పెట్టుబడి పెట్టాలని సూచించారు.ఇదీ చదవండి: నా బంగారం.. ఇంకా పెరుగుతుందోచ్: ‘రిచ్ డాడ్’ రాబర్ట్"నేను ఇప్పటికీ వీటినే ఇష్టపడతాను. నాకు ఇవే 30 సంవత్సరాల క్రితం ఆర్థిక స్వాతంత్ర్యం ఇచ్చాయి" అన్నారు. ఇంకో ముఖ్యమైన జీవన పాఠం కూడా ఆయన పంచుకున్నారు. "ఫైనాన్షియల్ ప్లానర్ల మ్యాజిక్ వాండ్ అయిన 60/40 ఫార్ములాని నేను ఎప్పుడూ ఉపయోగించలేదు. మీకు ఉత్తమంగా పనికొచ్చే పెట్టుబడి వ్యూహం ఏదో దాన్ని కనుక్కోండి" అంటూ సూచించారు.FINALLY the BS “magic wand” of Financial Planner’s….the BS of 60/40 is dead.FYI: 60/40 meant investors invest 60% in stocks and 40 % in bonds.That BS ratio died in 1971 the year Nixon took the dollar off the gold standard.For years, financial planners have touted the…— Robert Kiyosaki (@theRealKiyosaki) October 9, 2025 -
తులం బంగారం రూ.లక్షా 28 వేల 200
నిజామాబాద్ రూరల్: బంగారం, వెండి ధరల పరుగు ఆగడం లేదు. మంగళవారం తులం బంగారం రూ. 1,25,400 ఉండగా బుధవారం రూ. 1,28,200కు చేరుకొని రికార్డు సృష్టించింది. తులం వెండి ధర రూ.1610కి చేరింది. దీపావళి పండుగ దాటేసరికి బంగారం ధర రూ. లక్షా 50 వేలకు చేరుకోవచ్చని బంగారు దుకాణాదారులు అభిప్రాయపడుతున్నారు. శుభకార్యాలు, పెళ్లిళ్ల కోసం పెద్ద మొత్తంలో కొనుగోలు చేయాల్సిన ప్రజలు ధరల పెరుగుదలతో తక్కువ బంగారంతోనే సరిపుచ్చుకుంటున్నారు. దీంతో కొనుగోళ్లు మందగించాయని దుకాణాదారులు చెప్తున్నారు.రూ.లక్షా 50వేలు దాటుతుంది..ఇంటర్నేషనల్ మార్కెట్లో బంగారం ధర హెచ్చు తగ్గులు ఉండడంతోనే బంగారం రేటు పెరుగుతోంది. రానున్న రోజు ల్లో తులం బంగారం ధర రూ. లక్షా50వేలకు దాటేలా కనిపిస్తోంది. ఇలా ఉంటే సామాన్యుడికి చాలా ఇబ్బందే.– లక్ష్మణచారి, వర్తకుడు, నగరవాసి -
ఇలా అయితే ఎలా 'బంగారం': మరింత పెరిగిన ధరలు
బంగారం ధరలు రోజురోజుకి భారీగా పెరుగుతూనే ఉన్నాయి. ఈ రోజు (అక్టోబర్ 09) కూడా గరిష్టంగా రూ. 220 పెరిగింది. పెరుగుతున్న గోల్డ్ రేట్లు.. పసిడి ప్రియులలో కొంత ఆందోళన కలిగిస్తోంది. ఇదిలాగే కొనసాగితే పసిడి ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ కథనంలో దేశంలోని ప్రధాన నగరాల్లో గోల్డ్, సిల్వర్ ధరలు ఎలా ఉన్నాయో చూసేద్దాం.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
బంగారం చెలగాటం.. డాలర్కు సంకటం!
ఈ భూమిపై బంగారాన్ని అన్నింటి కంటే ఎక్కువగా ప్రేమించే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే.. ఆయనే రాబర్ట్ కియోసాకి. ప్రసిద్ధ పర్సనల్ ఫైనాన్స్ పుస్తకం ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ (Rich Dad Poor Dad) రచయిత అయిన ఆయన ఎప్పుడూ బంగారం, వెండి లోహాలపై పెట్టుబడులు పెడుతుంటారు. తనను అనుసరించేవాళ్లనూ పెట్టమని ప్రోత్సహిస్తుంటారు.బంగారం ధర అంతకంతకూ పెరిగిపోతూ రోజుకో కొత్త గరిష్టాన్ని తాకుతోంది. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (ఎంసీఎక్స్) లో 10 గ్రాములకు రూ .1,22,780 జీవితకాల గరిష్ట స్థాయికి చేరుకుంది. అంతర్జాతీయంగా ఔన్స్కు 4,000 డాలర్లను అధిగమించింది. దీంతో ఎప్పటిలాగే రాబర్ట్ కియోసాకి వెంటనే సోషల్ మీడియాలోకి వచ్చేశారు. విలువైన లోహాలుక, డిజిటల్ ఆస్తులపై తన బుల్లిష్ వైఖరిని పునరుద్ఘాటించారు."యూఎస్ డాలర్ అంతం?"నా బంగారం, వెండి, బిట్ కాయిన్, ఎథేరియం స్టాక్కు విలువ ఇంకా పెరుగుతోంది.యూఎస్ డాలర్ను నమ్ముకున్నోళ్లంతా నష్టబాధితులు.విజేతగా ఉండండి.జాగ్రత్త" అంటూ తన ‘ఎక్స్’ (గతంలో ట్విట్టర్) లో పోస్ట్ చేశారు.బంగారం, వెండి, బిన్ కాయిన్ల విలువలు పెరిగిపోతున్న తరుణంలో రాబర్ట్ కియోసాకి (Robert Kiyosaki) సాంప్రదాయ పొదుపులపై ఆయన సందేహం వ్యక్తం చేశారు. అమెరికా డాలర్లను పొదుపు చేసేవారు నష్టపోతారు అంటూ హెచ్చరించారు.ఇదీ చదవండి: ఈ దీపావళికి బంగారం కొనడం మరింత కష్టం!END of US Dollar? Adding to my gold, silver, Bitcoin, and Ethereum stack.Savers of US dollars are losers. Be a winner. Take care.— Robert Kiyosaki (@theRealKiyosaki) October 8, 2025 -
పసిడి ప్రియుల నడ్డి విరిగినట్టే! పెరిగిన తులం ధర
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఊగిసలాడుతున్నాయి. అయితే మంగళవారంతో పోలిస్తే బుధవారం బంగారం ధరలు భారీగా పెరిగాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
బంగారం @ 4,000
న్యూఢిల్లీ: కనకం రోజుకో కొత్త రికార్డులతో ఆకాశమే హద్దుగా పరుగులు తీస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లో తొలిసారి 4,000 డాలర్ల (ఔన్స్కు) కీలక మైలురాయిని దాటింది. కామెక్స్ ఫ్యూచర్స్లో 4,014 డాలర్ల స్థాయిని నమోదు నమోదు చేసింది. దీంతో అంతర్జాతీయ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ గోల్డ్మన్ శాక్స్ 2026 చివరికి 4,900 డాలర్లకు చేరుకోవచ్చని ప్రకటించింది. 4,300 డాలర్ల గత అంచనాలను భారీగా పెంచింది. పసిడి ఎక్సే్ఛంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (గోల్డ్ ఈటీఎఫ్లు)లోకి అదే పనిగా వస్తున్న పెట్టుబడులు, కేంద్ర బ్యాంకుల కొనుగోళ్ల నేపథ్యంలో ఈ అంచనాకు వచ్చింది. ప్రైవేటు రంగం వైవిధ్యం కోసం గోల్డ్ ఈటీఎఫ్లను ఆశ్రయిస్తుండడాన్ని సైతం పరిగణనలోకి తీసుకుంది. సెంట్రల్ బ్యాంక్లు 2025లో నెలకు 80 టన్నులు, 2026లో నెలకు 70 టన్నుల మేర బంగారం కొనుగోలు చేయొచ్చని అంచనా వేసింది. ముఖ్యంగా వర్ధమాన దేశాల సెంట్రల్ బ్యాంకులు ఈ దిశగా కీలక పాత్ర పోషిస్తున్నట్టు పేర్కొంది. ఇక యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్ల కోతపై అంచనాలు సైతం బంగారంలో బుల్లిష్ సెంటిమెంట్కు కారణంగా తెలిపింది. 2026 మధ్య నాటికి ఫెడ్ 100 బేసిస్ పాయింట్ల మేర రేట్లను తగ్గించొచ్చని.. ఇది బంగారం తదితర ఆస్తులకు డిమాండ్ను పెంచుతుందని పేర్కొంది. ఈ ఏడాది గోల్డ్ ఈటీఎఫ్ల్లోకి పెట్టుబడులు 17 శాతం పెరగడాన్ని మెహతా ఈక్విటీస్ కమోడిటీ విభాగం వైస్ ప్రెసిడెంట్ రాహుల్ కళంత్రి సైతం గుర్తు చేశారు. అమెరికాలో ఆర్థిక అనిశ్చితులు, ఫ్రాన్స్ తదితర దేశాల్లో రాజకీయ అలజడులు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు సైతం సురక్షిత సాధనంగా బంగారానికి డిమాండ్ను పెంచుతున్నట్టు చెప్పారు. దేశీయంగా రూ.1.24 లక్షలు ఢిల్లీ మార్కెట్లో పుత్తడి ధర (99.9 శాతం స్వచ్ఛత) మంగళవారం సరికొత్త ఆల్టైమ్ గరిష్టం రూ.1,24,000ను నమోదు చేసింది. 10 గ్రాములకు రూ.700 లాభపడింది. వెండి కిలోకి రూ.3,400 లాభపడి రూ.1,54,000కు చేరుకుంది. -
బంగారం ధరల తుపాను.. ఒక్కరోజే భారీగా..
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఊగిసలాడుతున్నాయి. అయితే సోమవారంతో పోలిస్తే మంగళవారం బంగారం ధరలు భారీగా పెరిగాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. ఇదీ చదవండి: మహీంద్రా బొలెరోకు కొత్త హంగులు..(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
శబరిమల ‘స్వర్ణ కుంభకోణం’: సిట్ దర్యాప్తునకు హైకోర్టు ఆదేశం
కొచ్చి: కేరళలోని ప్రసిద్ధ శబరిమల అయ్యప్ప స్వామి ఆలయ బంగారు తాపడం పనుల్లో జరిగిన భారీ అక్రమాలపై కేరళ హైకోర్టు తీవ్రంగా స్పందించింది. ఈ కుంభకోణంపై సమగ్ర దర్యాప్తు నిర్వహించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్)ఏర్పాటు చేయాలని సోమవారం ఆదేశాలు జారీ చేసింది.ఆలయ ద్వారపాలకుల విగ్రహాల బంగారు తాపడంలో బంగారం బరువు తగ్గడం, ఆభరణాల నిర్వహణలో జరిగిన అక్రమాలపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘స్వర్ణ కుంభకోణం’పై ఏర్పాటైన సిట్కు కేరళ పోలీస్ అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఏడీజీపీ) హెచ్ వెంకటేష్ నేతృత్వం వహిస్తారు. ఈ కుంభకోణంలో అవినీతి పాల్పడింది కేవలం ఉన్నికృష్ణన్ పొట్టి మాత్రమే కాదని, దేవాలయ ఆస్తులను నిర్వహించే దేవస్వం బోర్డు అధికారుల ప్రమేయం కూడా ఉందని కోర్టు వ్యాఖ్యానించింది.ఈ కేసులో ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ) కింద శిక్షార్హమైన పలు నేరాలు జరిగినట్లు ప్రాథమికంగా తెలుస్తోందని కోర్టు పేర్కొంది.సిట్ ఈ కుంభకోణంపై అత్యంత నిజాయితీతో, గోప్యంగా దర్యాప్తు నిర్వహించాలని, అసలు దోషులను బయటికి తీసుకురావాలని హైకోర్టు ఆదేశించింది. ఈ వివాదానికి బలం చేకూర్చే ఒక కీలక అంశాన్ని హైకోర్టు ఈ సందర్భంగా ప్రస్తావించింది. 2019 డిసెంబర్ 9న ఉన్నికృష్ణన్ పొట్టి, ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు (టీడీబీ) అధ్యక్షుడికి పంపిన ఒక ఈ మెయిల్ను కోర్టు పరిశీలించింది. శబరిమల గర్భగుడి, ద్వారపాలకుల విగ్రహాల బంగారు పనులు పూర్తయిన తర్వాత తన వద్ద కొంత అదనపు బంగారు పలకలు మిగిలాయని పొట్టి ఆ ఈ మెయిల్లో పేర్కొన్నారు. ఆ అదనపు బంగారాన్ని ఒక పేద అమ్మాయి పెళ్లి కోసం వినియోగించడంపై దానిలో అభిప్రాయం కోరారు. ఈ ఈ మెయిల్ చూస్తుంటే పొట్టి వద్ద మిగులు బంగారం ఉన్నట్లు స్పష్టమవుతోందని, అందుకే ఈ అంశంపై పూర్తి స్థాయి దర్యాప్తు అవసరమని కోర్టు పేర్కొంది. ఆలయ పవిత్రతను కాపాడేందుకు దేవాలయ ఆస్తుల నిర్వహణలో పారదర్శకతను తీసుకువచ్చేందుకు సిట్ దర్యాప్తు కీలకంగా మారనుంది. -
Kerala: అసెంబ్లీకి ‘స్వర్ణ తాపడం’ వివాదం.. గందరగోళం మధ్య సభ వాయిదా
తిరువనంతపురం: శబరిమల స్వర్ణ తాపడం వివాదం కేరళ అసెంబ్లీని మరింత వేడెక్కించింది. శబరిమల ఆలయంలోని గర్భగుడిలో తాపడానికి ఉపయోగించిన బంగారు షీట్లు అదృశ్యమయ్యాయనే ఆరోపణలతో ప్రతిపక్షాలు సభలో గందరగోళం సృష్టించాయి. దీంతో సోమవారం శాసనసభలో హై డ్రామా నడిచింది. ఈ గందరగోళం నడుమ స్పీకర్ ఏఎన్ షంషీర్ ప్రశ్నోత్తరాల సమయాన్ని రద్దు చేసి, సభను తాత్కాలికంగా వాయిదా వేశారు.సభలో తొలుత ప్రతిపక్ష నేత వీడీ సతీశన్ శబరిమల స్వర్ణ తాపడం అంశాన్ని లేవనెత్తారు. గర్భగుడిలో తాపడానికి ఉపయోగించిన బంగారు షీట్లు అదృశ్యమయ్యాయని ఆరోపిస్తూ, ఇందుకు బాధ్యత వహిస్తూ దేవస్వం(దేవాదాయశాఖ) మంత్రి, ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు అధ్యక్షుడు వీఎన్ వాసవన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. స్పీకర్ వెంటనే కలుగజేసుకుని ప్రశ్నోత్తరాల సమయంలో షెడ్యూల్ చేసిన ప్రశ్నలను అడగాలని అన్నారు. ఈ నేపధ్యంలో ప్రతిపక్ష సభ్యులు సభలో నిరసన వ్యక్తం చేశారు.‘అయ్యప్పన్ బంగారం చోరీ, దోపిడీదారులు ఆలయాన్నే స్వాహా చేశారు’ లాంటి నినాదాలతో కూడిన ప్లకార్డులు, బ్యానర్లను ప్రతిపక్ష సభ్యులు తమ చేత పట్టుకుని, స్పీకర్ పోడియంను చుట్టుముట్టారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో, అక్కడున్న మంత్రులు, పాలకవర్గ సభ్యులు తమ సీట్ల నుండి లేచి నిలుచున్నారు. ఆర్థిక మంత్రి కేఎన్ బాలగోపాల్ ప్రతిపక్ష సభ్యుల చర్యలను ఖండించారు. సభలో ఈ విధంగా అంతరాయం కలిగించడం సరైనది కాదన్నారు. స్పీకర్ జోక్యం చేసుకుని, ఈ విధంగా కార్యకలాపాలను అడ్డుకోవడం సభను అగౌరవపరచడమేనన్నారు.సభ్యులు తమ చేతుల్లోని ప్లకార్డులను దించాలని ఆయన ఆదేశించారు. అయినా ప్రతిపక్ష సభ్యులు తమ నిరసనలను కొనసాగించారు. ఈ గందరగోళం నడుమ స్పీకర్ షంషీర్ ప్రశ్నోత్తరాల సమయాన్ని రద్దు చేసి, సభను వాయిదా వేశారు. ఒక్క నోటీసు కూడా ఇవ్వకుండా సభలో ఎందుకు అంతరాయం కలిగిస్తున్నారని ఆయన ప్రశ్నించారు. గత వారంలో ప్రతిపక్షం ఇదే అంశంపై వాయిదా తీర్మానం ప్రవేశపెట్టడానికి ప్రయత్నించింది. అయితే స్పీకర్ ఈ అంశం కేరళ హైకోర్టు పరిశీలనలో ఉందని పేర్కొంటూ, దానిని తోసిపుచ్చారు. కాగా రాబోయే రోజుల్లో శబరిమల స్వర్ణ తాపడం వివాదంపై తమ నిరసనలను తీవ్రతరం చేయనున్నట్లు ప్రతిపక్ష సభ్యులు ప్రకటించారు. -
అనిశ్చితులకు బంగారం సరికొత్త కొలమానం
ప్రపంచ అనిశ్చితులకు సరికొత్త కొలమానంగా బంగారం ధరలు వ్యవహరిస్తుట్టు ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా పేర్కొన్నారు. ఇటీవలి కాలంలో ముడి చమురు ధరలు ఎలా ఉండేవో బంగారం ధరలు కూడా అలాగే మారినట్టు చెప్పారు. ద్రవ్యపరంగా నేడు ప్రతి దేశం ఎన్నో ఒత్తిళ్లను ఎదుర్కొంటున్నట్టు చెప్పారు. ప్రస్తుతమున్న వాణిజ్య విధాపరమైన వాతావరణం కొన్ని ఆర్థిక వ్యవస్థల వృద్ధికి నష్టం కలిగించనున్నట్టు తెలిపారు.ఈ పరిస్థితుల్లో కొన్ని స్టాక్ మార్కెట్లు కరెక్షన్ను చూడొచ్చని అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయ ఆర్థిక వృద్ధి అవకాశాలను ఎన్నో అంశాలు ప్రభావితం చేస్తున్నాయంటూ.. ఈక్విటీ మార్కెట్లు సైతం ఆత్మవిశ్వాసంతో కనిపిస్తున్నట్టు చెప్పారు. అంతర్జాతీయంగా పలు మార్కెట్లలో ర్యాలీ వెనుక టెక్నాలజీ స్టాక్స్ పాత్రను ప్రస్తావిస్తూ.. త్వరలో దిద్దుబాటు చోటుచేసుకోవచ్చన్నారు.‘భౌగోళిక రాజకీయపరమైన ఉద్రిక్తతలు మునుపటి దశాబ్దంలో చమురు ధరల పెరుగుదలకు కారణమయ్యాయి. ఆ తర్వాత ఒక శ్రేణికి పరిమితమయ్యాయి. కొన్ని ఆర్థిక వ్యవస్థల్లో చమురు అవసరాలు తగ్గడం ఇందుకు కారణం. గతంలో ప్రపంచ అనిశ్చితులను చమురు ధరలు ఎలా అయితే కొలమానంగా పనిచేశాయో.. ఇప్పుడు బంగారం ధరలు తీరు కూడా అలాగే ఉంది’ అని మల్హోత్రా వివరించారు.ఇదీ చదవండి: తయారీ రంగంలో వృద్ధికి వ్యూహాలు -
స్టాక్ మార్కెట్ కుప్పకూలబోతోందా?: బఫెట్పై.. కియోసాకి ఆగ్రహం
రిచ్ డాడ్ పూర్ డాడ్ రచయిత రాబర్ట్ కియోసాకి.. వారెన్ బఫెట్ ఇటీవల బంగారం & వెండిని ప్రశంసించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఎప్పుడూ స్టాక్ మార్కెట్, ఫండ్స్ వాణి వాటిలో పెట్టుబడి పెట్టాలని చెప్పే వారెన్ బఫెట్.. ఇప్పుడు బంగారం, వెండిపై పెట్టుబడి పెట్టాలని సూచిస్తున్నారు. బఫెట్ కొత్త వైఖరి సాంప్రదాయ స్టాక్లు, బాండ్లకు పొంచి ఉన్న సంక్షోభాన్ని సూచిస్తుందని రాబర్ట్ కియోసాకి తీవ్రంగా స్పందించారు.స్టాక్ మార్కెట్ మసకబారుతోందా?కొన్నేళ్లుగా.. వారెన్ బఫెట్ బంగారం & వెండి వంటివి ఉత్పాదకత లేని ఆస్తులుగా పరిగణించారు. 2011లో బెర్క్షైర్ హాత్వే వాటాదారులకు రాసిన లేఖలో కూడా అయన బంగారం ఎక్కువగా ఉపయోగపడేది కాదని, అది లాభాలను తీసుకురాదని వ్యాఖ్యానించారు. వ్యాపారాలు, వ్యవసాయ భూములు, ఇండెక్స్ నిధులను నిజమైన రాబడిని చెబుతూ.. నమ్మకమైన పెట్టుబడులుగా పేర్కొన్నారు. కానీ ఆయనే ఇప్పుడు బంగారం & వెండిని ఆమోదించడం చాలా మందిని ఆశ్చర్యపరిచింది.బఫెట్ ఒకప్పుడు బంగారాన్ని ఎగతాళి చేసినప్పటికీ, ఇప్పుడు దానిని పెట్టుబడిదారులకు స్వర్గధామంగా ప్రశంసిస్తున్నాడు. ఇది బఫెట్ దృక్పథంలో గణనీయమైన మార్పును సూచిస్తుందని కియోసాకి అన్నారు. అంతే కాకుండా.. బఫెట్ మాట విని కొంత బంగారం, వెండి, బిట్కాయిన్ కొనాల్సిన సమయం వచ్చిందని ఆయన పేర్కొన్నారు. వారెన్ బఫెట్కు అత్యంత విజయవంతమైన ఇన్వెస్టర్గా పేరుంది. ఆయన ఎక్కువగా స్టాక్మార్కెట్లో పెట్టుబడులను ప్రోత్సహిస్తుంటారు. దీంతో ఆయన్ను, ఆయన ఆలోచనలకు మంది అనుసరిస్తూ ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది స్టాక్ మార్కెట్లోకి వస్తున్నారు. ఇప్పుడు మారిన బఫెట్ వైఖరితో స్టాక్ మార్కెట్ నుంచి వైదొలిగి బంగారం, వెండి వైపు పయనిస్తే స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు తగ్గి కుప్పకూలలే ప్రమాదముందా అంటూ కియోసాకి సందేహం వ్యక్తం చేస్తున్నారు.ఇదీ చదవండి: ఇదే జరిగితే.. ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్గా మస్క్!డబ్బు దాచుకోవడం వల్ల పేదవాళ్లు అవుతారని, డబ్బును బంగారం, వెండి, బిట్కాయిన్ వంటి వాటిలో ఇన్వెస్ట్ చేయడం వల్ల.. మీ పెట్టుబడి పెరుగుతుందని రాబర్ట్ కియోసాకి చాన్నాళ్లుగా చెబుతూనే ఉన్నారు. వెండిపై పెట్టుబడి.. మీకు ఐదు రేట్లు లాభాలను తీసుకొస్తాయని ఆయన ఇటీవలే అన్నారు.I WANT TO VOMIT: getting nauseus, listening to Buffet tout the virtues of gold and silver…. after he ridiculed gold and silver for years. That means the stock and bond market are about to crash. Depression ahead?Even though Buffet shit on gold and silver investors like me…— Robert Kiyosaki (@theRealKiyosaki) October 1, 2025 -
Gold: 2 లక్షలకు తులం బంగారం
-
పండుగ వేళ అమాంతం తగ్గిన బంగారం ధరలు: వెండి మాత్రం..
భారీగా పెరుగుతూ ఉన్న బంగారం ధరలకు ఒక్కసారిగా బ్రేక్ పడింది. విజయదశమి సందర్భంగా గోల్డ్ రేట్లు తగ్గుముఖం పట్టాయి. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లోని పసిడి ధరలలో మార్పులు జరిగాయి. వెండి ధరలు మాత్రం అమాంతం పెరిగిపోయాయి. ఈ కథనంలో నేటి (అక్టోబర్ 02) గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైస్ ఎలా ఉందో తెలుసుకుందాం.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
పసిడి మరో కొత్త రికార్డు
న్యూఢిల్లీ: పసిడి ధరల పెరుగుదల కొనసాగుతోంది. గురువారం సైతం ఢిల్లీ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత పసిడి 10 గ్రాములకు రూ.1,100 పెరిగి మరో కొత్త జీవితకాల గరిష్ట స్థాయి రూ.1,21,000ను నమోదు చేసింది.వెండి ధర కిలోకి రూ.1,50,500 వద్ద ఫ్లాట్గా ట్రేడయ్యింది. అమెరికా ప్రభుత్వం షట్డౌన్ కావడం పసిడి ధరలపై ప్రభావం చూపించింది. అమెరికా లేబర్ మార్కెట్లో బలహీనత నేపథ్యంలో ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గిస్తుందన్న అంచనాలు మద్దతునిచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ఔన్స్కు ఒక శాతానికి పైగా పెరిగి 3,895 డాలర్లకు చేరింది. -
వడివడిగా పసిడి పరుగు
రాయవరం: ‘ఏవండీ దసరా పండుగకు నెక్లెస్ కొంటారా..’ అంటూ గారాలు పోతున్న భార్యల వైపు భర్తలు బేల చూపులు చూడాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే బంగారం ధర చూస్తే బేర్మనే పరిస్థితి నెలకొంది. ఇప్పుడు 10 గ్రాముల బంగారం ధర రూ.1.20 లక్షల మార్కుకు చేరుకుంది. బంగారం ధరలు కళ్లెం లేని గుర్రంలా దౌడు తీస్తున్నాయి. కదం తొక్కుతున్న కాంచనానికి ప్రభుత్వాలు అడ్డుకట్ట వేయలేకపోతున్నాయి. పుత్తడితో పాటుగా తానూ ఏమీ తక్కువ తినలేదన్నట్లుగా వెండి ధరలు కూడా విర్రవీగుతున్నాయి. స్వర్ణం వైపు చూడాలంటేనే సామాన్య, మధ్య తరగతి ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ప్రస్తుతం వివాహాల సీజన్ తిరిగి ప్రారంభం కావడంతో వివాహాలు నిర్వహించే సామాన్య, మధ్య తరగతి ప్రజలు బంగారం కొనాలంటేనే భయం భయంగా షాపుల వైపు అడుగులు వేయాల్సిన పరిస్థితి నెలకొంది.ఇంతింతై వటుడింతై అన్నట్లుగా... పసిడి, వెండి ధరలు ఇంతింతై వటుడింతై అన్న చందంగా పెరుగుతున్నాయి. ఒకదానికొకటి పోటీ పడి మరీ పెరుగుతున్నాయి. జనవరి నెలలో 10 గ్రాముల బంగారం రూ.80 వేల వరకు పలకగా, జూలై నాటికి రూ.లక్షకు చేరుకుంది. ఆగస్టు, సెపె్టంబర్ నెలల్లో రోజుకు రూ.1,000 నుంచి రూ.1,500 వరకు పెరుగుతూ ప్రస్తుతం 10 గ్రాముల బంగారం రూ.1.20 వేలకు చేరుకుంది. ఆగస్టు, సెపె్టంబరు నెలలో సుమారు 10 గ్రాములకు రూ.20 వేల వరకు పెరిగింది. ఇదిలా ఉంటే వెండి కూడా బంగారం బాటలోనే నడుస్తోంది. ఈ ఏడాది జనవరిలో కేజీ వెండి ధర రూ.92 వేలు పలుకగా, జూన్లో రూ.1.10 లక్షలు, జూలైలో రూ.1.11 లక్షలు, ఆగస్టులో రూ.1.11 లక్షలు ఉన్న కేజీ వెండి ధర నేడు రూ.1.50 లక్షలకు చేరింది. వెండిపై పెట్టుబడి పెట్టిన వారికి అదే తరహాలో లాభాలు వచ్చాయి. బంగారంతో పాటుగా వెండి ధర కూడా పరుగులు తీస్తూనే ఉంది. త్వరలోనే కేజీ రూ.2 లక్షలకు చేరుతుందన్న ఊహాగానాలున్నాయి. మదుపరుల ముందుచూపే కారణమా? పసిడి, వెండి ధరలు పెరుగుదలకు బులియన్ మార్కెట్ విశ్లేషకులు పలు రకాల కారణాలు పేర్కొంటున్నారు. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం, ఇజ్రాయిల్, గాజా మధ్య జరుగుతున్న యుద్ధంతో పాటుగా ఇటీవల అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధిస్తున్న సుంకాల ప్రభావంతో పసిడి ధర రోజు రోజుకు పరుగులు తీస్తోంది. దీనికితోడు బంగారంపై పెట్టుబడి సురక్షితంగా భావిస్తున్న మదుపరులు భారీగా కొనుగోలు చేస్తున్నారు. ఒక్క భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉండడం బంగారం, వెండి ధరల పెరుగుదలకు కారణంగా వర్తకులు భావిస్తున్నారు. ‘తూర్పు’లో పరిస్థితి ఇదీ.. కరోనా తర్వాత బంగారం వ్యాపారం బాగా తగ్గిపోయినట్లుగా వ్యాపారులు చెబుతున్నారు. అంతకుముందు వారానికి ఆరు రోజులు వ్యాపారం సాగగా, ఇప్పుడు వారానికి నాలుగు రోజులు మాత్రమే వ్యాపారం సాగుతున్నట్లుగా వ్యాపారులు చెబుతున్నారు. పెద్ద షాపుల్లో రోజుకు 500 గ్రాముల వరకు అమ్మకాలు జరుగుతుండగా, చిన్న షాపుల్లో 20 గ్రాముల నుంచి 50 గ్రాముల వరకు అమ్మకాలు సాగుతున్నాయి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో చిన్నా, పెద్దా కలిపి 2,500 వరకు బంగారం విక్రయాల షాపులున్నాయి. ఉమ్మడి జిల్లాలో కరోనాకు ముందు రోజుకు 20 కేజీల చొప్పున బంగారం అమ్మకాలు జరగ్గా, ప్రస్తుతం 15 నుంచి 18 కేజీల వరకు అమ్మకాలు సాగుతున్నాయి. సీజన్ బట్టి ఈ అమ్మకాలు అటూఇటూగా ఉంటాయి. బంగారంతో పాటుగా వెండి అమ్మకాలు కూడా తగ్గాయి. ఆరు నెలల క్రితం వెండి కిలో రూ.50వేలు ఉండగా, ఆరు నెలల కాలంలో రూ.1.50 లక్షలకు చేరింది. చైనా, జపాన్ వంటి దేశాల్లో వెండిని ఎల్రక్టానిక్స్, సాంకేతిక అవసరాలకు ఉపయోగించడం, ప్రపంచ వ్యాప్తంగా బంగారం, వెండిపై పెట్టుబడి పెట్టడంతో బంగారం, వెండి ధరలు ఊహించని పెరుగుదల కని్పంచి ఆల్టైమ్ రికార్డుకు వాటి ధరలు చేరుకున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు. లాభాలు కళ్ల చూస్తున్న బడాబాబులుబంగారం ధర పెరగడంతో బడా బాబులు లాభాలు కళ్ల జూస్తున్నారు. ధర పెరుగుతుందన్న ముందుచూపుతో పలువురు మదుపరులు బంగారంపై పెట్టుబడులు పెట్టారు. వడ్డీ వ్యాపారం చేసే వారు కూడా బంగారంపై పెట్టుబడి పెట్టేందుకే మొగ్గు చూపారు. దీంతో 100 గ్రాముల వంతున బిస్కెట్లు కొన్నారు. మరికొందరు 50 నుంచి 70 కాసుల మధ్య వడ్డాణం వంటి వస్తువుల్ని తయారు చేయించుకున్నారు. ప్రస్తుతం ధర రూ.లక్ష దాటడంతో వీరందరిలో జోష్ నెలకొంది. పెట్టిన పెట్టుబడుల్లో 30 నుంచి 40 శాతం వరకు లాభాలను చూశారు. -
పండుగ పూట పెట్టెతో సహా గోల్డ్ కొట్టేసింది..! వీడియో వైరల్
బంగారం ధరలు రోజురోజుకి ఆకాశాన్నంటుతున్నాయి.కనీవినీ ఎరుగని రీతిలో పెరుగుతూ సామాన్యుడికి అందని ద్రాక్షగా మిగిలిపోతోంది పసిడి. గ్రాము బంగారం కొనాలంటే జనం బెంబేలెత్తుతున్న పరిస్ఙతి. ఈ క్రమంలో ట్విటర్లో ఒక వీడియో తెగ వైరల్ అవుతోంది.ఉత్తరప్రదేశ్లోని బులంద్షహర్లోని ఒక జ్యుయల్లరీ దుకాణంలో ఒక మహిళ తన చేతివాటి చూపించింది. బంగారం షాపింగ్ చేస్తున్నట్టుగానే నటిస్తూ లక్షలు విలువ చేసే నగను పెట్టెతో సహా దాచేసింది. కానీ విషయం షాపులోనే ఉన్న కెమెరానుంచి మాత్రం తప్పించు కోలేక పోయింది. ఒక ట్విటర్ యూజర్ దీనికి సంబంధించిన వీడియోను షేర్ చేశారు. బంగారం ధరలు గ్రాముకు రూ 12 వేలు దాటేసింది. ఇలాంటి దొంగతనాలు బాగా పెరిగే అవకాశం ఉంది... ఆభరణాలు కొనుగోలు చేసేవారు ఎప్పుడూ లేనంతగా అప్రమత్తంగా ఉండాలి! అనే క్యాప్షన్తో ఈ వీడియోను పోస్ట్ చేశారు. 🚨 With gold prices soaring past ₹12k/gram, theft cases are bound to spike...Jewellers must stay more alert than ever!#UttarPradesh | Bulandshahr: Woman caught on camera stealing..stuffs an entire jewellery box inside her saree 👇 pic.twitter.com/5FRxWAQrA0— Nabila Jamal (@nabilajamal_) October 1, 2025 -
అంతులేకుండా పెరుగుతున్న పసిడి ధరలు
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఊగిసలాడుతున్నాయి. అయితే మంగళవారంతో పోలిస్తే బుధవారం బంగారం ధరలు భారీగా పెరిగాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. ఇదీ చదవండి: కీలక వడ్డీ రేట్లు యథాతథం.. ఆర్బీఐ(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
22 కాదు.. 24 కాదు.. 18 వైపే మొగ్గు!
బంగారం ధరలు రికార్డు స్థాయిలో పెరుగుతున్న నేపథ్యంలో భారతదేశంలో వినియోగదారుల కొనుగోలు వైఖరిలో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి. సంప్రదాయబద్ధంగా భారతీయులు 22 క్యారెట్ల (ఆభరణాలు), 24 క్యారెట్ల (బార్లు, కాయిన్స్) బంగారాన్ని కొనుగోలు చేయడానికి మొగ్గు చూపేవారు. అయితే ధరల పెరుగుదలతో ముఖ్యంగా మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వర్గాల్లో కొనుగోలు నిర్ణయాలు ప్రభావితమవుతున్నాయి.కొనుగోలు వైఖరిలో మార్పులు18 క్యారెట్ వైపు మొగ్గుబంగారం అధిక ధరల కారణంగా కొంతమంది వినియోగదారులు 22 క్యారెట్ల బంగారానికి బదులుగా తక్కువ క్యారెట్ (ఉదాహరణకు 18 క్యారెట్) ఆభరణాలను కొనుగోలు చేయడానికి మొగ్గు చూపుతున్నారు. 18K బంగారంలో స్వచ్ఛత తక్కువగా (75% బంగారం) ఉన్నప్పటికీ దాని ధర తక్కువగా ఉంటుంది. దీనితో అత్యవసరాలకు, శుభకార్యాలకు ముందుగా కేటాయించిన బడ్జెట్లో ఆభరణాలు కొనుగోలు చేయడం సాధ్యమవుతుంది.ఆభరణాల డిమాండ్లో స్వల్ప తగ్గుదలపెళ్లిళ్లు, పండుగల సీజన్లో డిమాండ్ కొనసాగుతున్నప్పటికీ, అధిక ధరల వల్ల ఆభరణాల మొత్తం డిమాండ్లో స్వల్ప మందగమనం కనిపిస్తోంది. వినియోగదారులు ఆభరణాల బరువును తగ్గించుకోవడం లేదా తేలికపాటి, రోజువారీ వినియోగానికి సరిపోయే డిజైన్లను ఎంచుకోవడం చేస్తున్నారు.బంగారంపై మోజు ఎందుకంటే..బంగారం రికార్డు ధరలు ఉన్నప్పటికీ దేశవ్యాప్తంగా కొన్నిచోట్ల భౌతిక బంగారం (బార్లు, కాయిన్స్) రూపంలో పెట్టుబడులు పెరిగాయి. చాలామంది భారతీయులు బంగారాన్ని కేవలం ఆభరణంగా కాకుండా ద్రవ్యోల్బణం నుంచి రక్షణ కల్పించే సురక్షితమైన ఆస్తి (సేఫ్ హెవెన్ అసెట్)గా భావిస్తారు. కొంతమంది భౌతిక బంగారం కొనుగోలు, నిల్వ సమస్యలు, అధిక ధరలు, మేకింగ్ ఛార్జీలను నివారించడానికి గోల్డ్ ఈటీఎఫ్లు (ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్), డిజిటల్ గోల్డ్ వంటి పెట్టుబడి సాధనాలపై ఆసక్తి పెంచుకుంటున్నారు.ధరలు పెరగడానికి కారణాలుబంగారం ధరల పెరుగుదల కేవలం దేశీయ డిమాండ్ పైనే కాకుండా, ప్రధానంగా అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. పసిడిని సురక్షితమైన పెట్టుబడిగా భావించే అంతర్జాతీయ పెట్టుబడిదారులు మార్కెట్లో అనిశ్చితి ఉన్నప్పుడు ఈ రంగంలో పెట్టుబడులు పెంచుతారు.భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు (Geopolitical Tensions)ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో కొనసాగుతున్న యుద్ధాలు, సంఘర్షణలు, రాజకీయ అస్థిరత పెట్టుబడిదారుల్లో అభద్రతా భావాన్ని పెంచుతాయి. ఈ అనిశ్చితి కారణంగా వారు స్టాక్ మార్కెట్ల నుంచి బంగారం వైపు మళ్లుతారు.ద్రవ్యోల్బణం (Inflation) భయాలుద్రవ్యోల్బణం పెరిగినప్పుడు డబ్బు విలువ తగ్గుతుంది. అయితే అలాంటి సమయంలో బంగారం విలువ అంతర్జాతీయంగా నిలకడగా ఉండటమే కాకుండా పెరుగుతుంది కూడా. అందుకే ద్రవ్యోల్బణం పెరుగుతున్నప్పుడు పెట్టుబడిదారులు తమ కొనుగోలు శక్తిని కాపాడుకోవడానికి బంగారాన్ని కొనుగోలు చేస్తారు.సెంట్రల్ బ్యాంకుల కొనుగోళ్లుప్రపంచవ్యాప్తంగా చైనా, రష్యా వంటి దేశాల కేంద్ర బ్యాంకులు (Central Banks) ఇటీవల తమ బంగారు నిల్వలను భారీగా పెంచుకుంటున్నాయి. ఇవి మార్కెట్లో భారీ కొనుగోలుదారులుగా ఉండటం వల్ల పసిడికి డిమాండ్ పెరిగి ధరలు పెరుగుతాయి.యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్ల తగ్గింపు సంకేతాలుయూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గిస్తుందనే అంచనాలు ఉన్నప్పుడు డాలర్ విలువ పడిపోతుంది. డాలర్ బలహీనపడటం వల్ల ఇతర కరెన్సీల వారికి బంగారం చౌకగా లభిస్తుంది. ఫలితంగా డిమాండ్ పెరుగుతుంది.గ్లోబల్ ఆర్థిక మాంద్యం భయాలుప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగమనం లేదా మాంద్యంలోకి వెళ్లే ప్రమాదం ఉందనే అంచనాలు పెట్టుబడిదారులను రిస్క్ లేని బంగారం వంటి ఆస్తుల వైపు మళ్లేలా చేస్తాయి.ఇదీ చదవండి: పండుగ వేళ ఆర్డర్లున్నా డెలివరీ కష్టతరం! -
భారత్లో కూడా ఇవాళ భారీగా గోల్డ్ రేట్లు పెరిగే అవకాశం
-
బిగ్షాక్: పండగపూట దారుణంగా పెరిగిన ధరలు
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఊగిసలాడుతున్నాయి. అయితే సోమవారంతో పోలిస్తే మంగళవారం బంగారం ధరలు దారుణంగా పెరిగాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
బయటపడుతున్న.. బంగారం బండారం!
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: బంగారం వ్యాపారానికి కేరాఫ్ అడ్రస్గా నిలిచే నరసన్నపేటలో ఇటీవల కాలంలో పలు అక్రమాలు వెలుగుచూస్తున్నాయి. ఇది ఒక్క పేటకే పరిమితం కాకుండా.. జిల్లా అంతటా పలు షాపుల్లో అక్రమాలు కొనసాగుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. నరసన్నపేటలో ఆ మధ్య నకిలీ హాల్మార్క్ బంగారం పెద్ద ఎత్తున దొరికింది. ఇప్పుడేమో జీఎస్టీ అధికారుల దాడులతో జీరో వ్యాపారం జరుగుతున్నట్టు స్పష్టమవుతోంది. ప్రభుత్వానికి ట్యాక్స్ ఎగ్గొట్టి వినియోగదారులను కొల్లగొడుతున్నట్లు తెలుస్తోంది. తీగ లాగితే డొంకంతా కదిలినట్టు ఇప్పుడిది నరసన్నపేటకే పరిమితం కాకుండా జిల్లా అంతటా నడుస్తున్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మాటల గారడీ.. ధర పెరిగినా ప్రజలకు బంగారంపై మోజు తగ్గడం లేదు. తులం బంగారం రూ.లక్షా 25 వేలు దాటినా వెనక్కి తగ్గడం లేదు. రోజురోజుకూ అమ్మకాలు పెరుగుతూనే ఉన్నాయి. బంగారానికి ఉన్న డిమాండ్ను కొందరు వ్యాపారులు క్యాష్ చేసుకుంటున్నా రు. ప్రజల్ని అమాయకులను చేసి బురిడీ కొట్టిస్తున్నారు. నాలుగు మంచి మాటలు చెప్పి బుట్టలోకి లాగేస్తున్నారు. ఈ క్రమంలో జరుగుతున్న మోసాల్లో బయటికొచ్చినవి కొన్నే. వెలుగులోకి రానివెన్నో. అలాగని అందరూ అలాంటి వారు కాదు. కొందరు నిజాయితీగా వ్యాపారం చేసి, వినియోగదారుల మన్ననలు, నమ్మకం పొందుతున్నారు. దొంగ బంగారం ఆరోపణలు.. ఇప్పటికే దొంగతనం బంగారం, నాణ్యత తక్కువ ఉన్న ఆభరణాలు, ట్యాక్స్ చెల్లించని బంగారం విక్రయిస్తుంటారన్న ప్రచారం ఉంది. గతంలో దొంగ బంగారాన్ని పోలీసులు రికవరీ చేసిన సందర్భాలు ఉన్నాయి. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం తదితర ప్రాంతాల నుంచి వచ్చి కూడా ఇక్కడ రికవరీ చేశారు. 24 క్యారెట్ అని 22 క్యారెట్, 22 క్యారెట్ పేరిట 18 క్యారెట్ బంగారం ఇస్తున్నారన్న వాదనలు ఉన్నాయి. బిల్లులపై స్పష్టంగా రాయడం లేదని ఆ మధ్య ఒక అధికారి హెచ్చరించినట్టు తెలిసింది. మొత్తానికి మోసమనేది కొన్నిచోట్ల జరుగుతోంది. జీరో వ్యాపారం.. మోసాలతో పాటు జీరో వ్యాపారం జోరుగా సాగుతున్నట్టుగా తాజాగా జరిగిన జీఎస్టీ అధికారుల సోదాలతో తెలుస్తోంది. కోయంబత్తూరు, చెన్నై, ముంబై తదితర నగరాల నుంచి బిల్లులు లేకుండా కొనుగోలు చేసిన బంగారాన్ని ఇక్కడ వినియోగదారులకు కట్టబెడుతున్నట్టు సమాచారం. ఒక్క వినియోగదారులకే కాకుండా పలు షాపులకు కూడా సరఫరా చేస్తున్నట్టు తెలుస్తోంది. స్థానికంగా మాత్రం ఆ జీఎస్టీ లెక్కలు ఎవరికీ అర్ధం కాకుండా వేస్తున్నారు. కొందరికైతే జీఎస్టీ లేకుండా బంగారం విక్రయిస్తున్నారు. జీఎస్టీ లేకుండా బంగారం కావాలంటే బిల్లులు ఉండవని చెప్పేస్తున్నారు. ఈ తరహా కొనుగోళ్లలోనే మోసాలు జరుగుతున్నాయి. బిల్లుల్లేని బంగారంలో మోసాలకు పాల్పడుతున్నారు. తిరిగి అమ్మేటప్పుడు నిలదీయాలంటే బిల్లులు ఉండాలి. అవి లేనప్పుడు వినియోగదారుడు ఏం అడగగలడని వ్యాపారులు దగా చేస్తున్నారు. నకిలీ హాల్మార్క్ మోసాలు.. ప్రత్యేకంగా తయారు చేసిన లేజర్ మిషనరీతో నకిలీ హాల్మార్క్ వేసి బంగారం విక్రయిస్తున్నారు. ఆ నకిలీ హాల్మార్క్ బయటపడకుండా ఉండేందుకు నెట్లో ఉన్న వేరే వారి హెచ్యూఐడీ నంబర్లు వేస్తున్నారు. సాధారణంగా హెచ్ఐయూడీ నెంబర్ను గూగుల్ సెర్చ్ చేస్తే మొత్తం వివరాలన్నీ వచ్చేస్తాయి. ఆ రకంగా వెలుగు చూడకూడదని వేరే వారి హెచ్ఐయూడీ నంబర్ను ఉపయోగించి సొంతంగా ఏర్పాటు చేసుకున్న మిషన్తో హాల్మార్క్ వేసి వ్యాపారం సాగించేస్తున్నారు. ఆ మధ్య నరసన్నపేటలో ఇదే మోసం వెలుగుచూసింది. వాస్తవంగా ఈ రకమైన మోసం జిల్లాలో చాలాచోట్ల జరుగుతోందని సమాచారం. ఆకస్మిక తనిఖీల్లో అక్కడ బండారం బయటపడింది. దీంతో మనం కొనుగోలు చేస్తున్న బంగారంలో నాణ్యతెంతో ? అన్న అనుమానం వినియోగదారుల్లో నెలకొంది. -
బంగారం సరికొత్త రికార్డు
-
10 కేజీల బంగారంతో డ్రెస్..! ఎక్కడంటే..
బంగారం రేటు ఏ రేంజ్లో ఉందో తెలిసిందే. కొనాలంటే.. గుండెల్లో గుబులు తెప్పించేలా ధర పలుకుతోంది. సామాన్యుడు సైతం బెంబేలేత్తెలా ఉంది. అలాంటిది అక్కడ ఏకంగా స్వచ్ఛమైన బంగారంతో దుస్తులు రూపొందించారట. పైగా దాని ధర వింటే కచ్చితంగా నోరెళ్లబెడతారు. మరి ఆ కథకమామీషు ఏంటో చకచక చదివేయండి మరి...సౌదీ అరేబియాకు చెందిన ప్రముఖ ఆభరణాల సంస్థ అల్ రోమైజాన్ గోల్డ్ అండ్ జ్యువెలరీ కంపెనీ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బంగారు దుస్తులను రూపొందించి సరి కొత్త చరిత్ర సృష్టించింది. 'దుబాయ్ డ్రెస్' పేరుతో రూపొందించిన ఈ gold dress గిన్నిస్ వరల్డ్ రికార్డులకెక్కింది. పూర్తిగా 21 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారంతో తయారు చేశారు. దీని మొత్తం బరువు 10.0812 కిలోగ్రాములు కాగా, మార్కెట్ విలువ సుమారు రూ. 11 కోట్లు పైనే ఉంటుందని అంచనా. కేవలం బంగారం ధర కారణంగానే కాకుండా కళాత్మకంగా రూపొందించిన విధానం కూడా ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అల్ రోమైజాన్ గోల్డ్ జ్యువెలరీ కంపెనీ ఈ డ్రెస్ని బంగారు కిరీటం(398 గ్రాములు), నెక్లెస్ (8,810.60 గ్రాములు,) చెవిపోగులు (134.1 గ్రాములు), తల అలంకరణ (738.5 గ్రాములు) బంగారంతో భాగాలుగా రూపొందించింది. ఆ తర్వాత ఈ భాగాలను మొత్తం కలిపి దుస్తుల రూపంలో ప్రత్యేకంగా ధరించేలా డిజైన్ చేసింది. ఇందులో కేవలం బంగారమే కాకుండా రంగురంగుల విలువైన రత్నాలను కూడా ఉపయోగించింది జ్యువెలరీ కంపెనీ. క్లిష్టమైన ఈ డిజైన్ని అత్యంత నాజుగ్గానూ, ఎమిరేట్స్ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబించేలా రూపొందించింది. ఇందులోని ప్రతి నమునా చరిత్రకు అర్థంబట్టేలా తీర్చిదిద్దారు నిర్వాహకులు. ఈ డ్రెస్ ఆధునికత, చరిత్ర తోపాటు సృజనాత్మకతను ప్రతిబింబిస్తోంది. ఈ దుస్తుల డిజైన్ ప్రధాన ఉద్ధేశ్యం బంగారం, ఆభరణాల వ్యాపారానికి ప్రపంచ గమ్యస్థానంగా ఉన్న దుబాయ్ను మరింతగా బలపరచడమేనని సదరు జ్యువెలరీ నిర్వాహకులు చెబుతున్నారు. ఈ దుస్తులు షార్జాలో జరుగుతున్న 56వ వాచ్ అండ్ జ్యువెలరీ మిడిల్ ఈస్ట్ షోలో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. అంతర్జాతీయ స్థాయిలో ప్రతిష్ఠాత్మకంగా జరుగుతున్న ఈ ఎగ్జిబిషన్లో 500కిపైగా ప్రదర్శకులు పాల్గొంటారు. అందులో ఇటలీ, భారతదేశం, టర్కి, అమెరికా, రష్యా, యునైటెడ్ కింగ్డమ్, జపాన్, చైనా, సింగపూర్, హాంకాంగ్, మలేషియా దేశాల జ్యువెలరీ డిజైన్లర్లు , తయారీదారులు పాల్గొంటారు. కాగా, ఈ షోలో తొలిసారిగా ఆస్ట్రేలియా, మయన్మార్, పాకిస్తాన్ దేశాల డిజైనర్లు, తయారీదార్లు కూడా పాల్గొనడం విశేషం.(చదవండి: అందరికీ ఒకటే రక్తం!) -
బంగారం, వెండిపై పెట్టింది అప్పుడే అంత అయింది!
ప్రసిద్ధ పర్సనల్ ఫైనాన్స్ పుస్తకం ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ (Rich Dad Poor Dad) రచియిత రాబర్ట్ కియోసాకి ఎప్పుడూ బంగారం, వెండి, బిట్ కాయిన్ల గురించే మాట్లాడుతుంటారు. వాటి మీదే పెట్టుబడులు పెట్టాలని తన ఫాలోవర్లకు సూచిస్తుంటారు. తన ప్రాధాన్యతల నమూనాగా రూపొందించిన పోర్ట్ ఫోలియో అంటే బంగారం, వెండి, బిట్కాయిన్లపై పెట్టిన పెట్టుబడులు 2025 లో ఇప్పటివరకు దాదాపు 40 శాతం పెరిగాయి.ఆర్థిక అనిశ్చితుల నేపథ్యంలో బంగారం, వెండి, బిట్కాయిన్లపై పెట్టిన పెట్టుబడులే "నిజమైన డబ్బు" అని రాబర్ట్ కియోసాకి (Robert Kiyosaki) చెప్పే మాటకు ప్రాధాన్యత పెరిగింది. ఫిన్ బోల్డ్ రీసెర్చ్ విశ్లేషణ ప్రకారం.. సంవత్సరం ప్రారంభంలో బంగారం, వెండి, బిట్ కాయిన్.. ఈ మూడు ఆస్తులలో సమానంగా విభజించి 1,000 డాలర్లు పెట్టుబడి పెట్టారనుకుంటే ఆ పోర్ట్ ఫోలియో సెప్టెంబర్ 23 నాటికి 1,372.43 కు పెరిగింది.ఏది ఎంతలా పెరిగిందంటే..బంగారం (Gold) 43.06 శాతం లాభంతో ఔన్స్ కు 2,658 డాలర్ల నుంచి 3,754 డాలర్లకు పెరిగింది. వెండి మరింత బలమైన పనితీరును అందించింది. ఔన్స్ కు 29.57 డాలర్ల నుండి 43.89 డాలర్లకు అంటే 47.5 శాతం ఎగిసింది. ఇక బిట్ కాయిన్ 21.17% పెరిగింది. 94,388 డాలర్ల నుండి 113,080 డాలర్లకు చేరింది. వెండి అత్యధిక పనితీరు చూపినా మొత్తం మూడు ఆస్తులు పోర్ట్ ఫోలియో బలానికి అర్థవంతంగా దోహదపడ్డాయని ఫిన్ బోల్డ్ పేర్కొంది.ఇదీ చదవండి: ప్రపంచంలోనే రెండో ధనవంతుడు.. ఉన్నదంతా ఇచ్చేస్తున్నాడు! -
బిగ్రిలీఫ్.. బంగారం ధరలు యూటర్న్!
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఊగిసలాడుతున్నాయి. అయితే మంగళవారంతో పోలిస్తే బుధవారం బంగారం ధరలు తగ్గాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
గంటల వ్యవధిలో తారుమారైన బంగారం ధరలు
మంగళవారం ఉదయం గరిష్టంగా రూ. 1,260 పెరిగిన గోల్డ్ రేటు.. సాయంత్రానికి రూ. 2,620లకు చేరింది. దీంతో పసిడి ప్రియులు ఒక్కసారిగా షాకయ్యారు. దేశంలోని ప్రధాన నగరాల్లో కూడా గోల్డ్ రేటు అమాంతం పెరిగిపోయింది, వెండి కూడా బంగారం బాటలోనే పయనించింది. ఈ కథనంలో తాజా గోల్డ్, సిల్వర్ ధరలను చూసేద్దాం..👉హైదరాబాద్, విజయవాడలలో 10 గ్రాముల 24 క్యారెట్స్ గోల్డ్ రేటు రూ.2,620 పెరిగి.. రూ.1,15,690 వద్దకు, 22 క్యారెట్ల 10 గ్రామ్స్ బంగారం ధర రూ.2,400 పెరిగి.. రూ. 1,06,050 వద్దకు చేరింది.👉ఢిల్లీలో కూడా బంగారం ధరలు పెరిగాయి. ఇక్కడ 10 గ్రాముల 24 క్యారెట్స్ గోల్డ్ రేటు.. రూ.2,620 పెరిగి రూ.1,15,840 వద్దకు, 22 క్యారెట్ల 10 గ్రామ్స్ బంగారం ధర రూ.2,400 పెరిగి.. రూ.1,06,200 వద్దకు చేరింది.👉చెన్నై విషయానికి వస్తే.. ఇక్కడ 10 గ్రాముల 24 క్యారెట్స్ గోల్డ్ రేటు రూ.2,300 పెరిగి రూ.1,16,080 వద్దకు, 22 క్యారెట్ల 10 గ్రామ్స్ బంగారం ధర రూ.2,100 పెరిగి రూ.1,06,400 వద్దకు చేరింది.ఇదీ చదవండి: మరో ఐదేళ్లలో బంగారం రూ.2 లక్షలకు!: కారణాలు ఇవే..వెండి ధరలువెండి ధర రూ. 2000 పెరిగింది. దీంతో కేజీ వెండి రేటు రూ. 1,50,000కు చేరింది. ఉదయం రూ. 1000 పెరిగిన సిల్వర్ రేటు.. సాయంత్రానికి మరో వెయ్యి రూపాయలు (మొత్తం రూ. 2000) పెరిగింది. -
బిగ్షాక్: ఒకేరోజు భారీగా పెరిగిన బంగారం ధర.. ఎంతంటే..
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఊగిసలాడుతున్నాయి. అయితే సోమవారంతో పోలిస్తే మంగళవారం బంగారం ధరలు భారీగా పెరిగాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
ఫారో కంకణం కరిగించేశారు!
కైరో: దాదాపు 3,000 ఏళ్లుగా చెక్కు చెదరకుండా ఉండి అలనాటి ఈజిప్ట్ ఫారో రాజుల ఘనతను చాటిన స్వర్ణకంకణం చోరీ కథ చివరకు విషాదంగా ముగిసింది. ఈజిప్ట్ లోని ప్రఖ్యాత మ్యూజియంకు సంబంధించిన పునరుద్ధరణ ల్యాబ్లో తస్కరణకు గురైన కంకణాన్ని వెతికిపట్టుకునేందుకు రంగంలోకి దిగిన ఈజిప్ట్ దర్యాప్తు సంస్థ అధికారులు, పోలీసులుకు చివరకు ముద్ద బంగారమే లభించింది. సీసీకెమెరాల లేని ల్యాబ్లో కంకణం చోరీకి గురయ్యాక పలువురు అక్రమ పురాతన వస్తువుల డీలర్ల చేతులు మారి చివరకు స్వర్ణకారుల చేతుల్లో పడి కరిగిపోయింది. తొలుత చోరీ చేరిన దొంగ మొదలు చివరిసారిగా కొనుగోలుచేసిన వ్యక్తిదాకా ఎవరికీ దాని చారిత్రక నేపథ్యం, అమూల్యమైన అంతర్జాతీయ మార్కెట్ విలువ తెలియదు. దీంతో సాధారణ బంగారు కడియంగా భావించి దానిని కరిగించి ముడి బంగారాన్ని బయటకుతీశారు. ఇటలీలో ఒక పురాతన వస్తు ప్రదర్శన కోసం కైరో నగరంలోని తహ్రీర్ స్క్వేర్లోని ప్రఖ్యాత మ్యూజియం నుంచి ఈ కంకణాన్ని తెప్పించగా సెపె్టంబర్ 9వ తేదీన చోరీకి గురైన విషయం తెల్సిందే. క్రీస్తు పూర్వం 1,076 సంవత్సరం నుంచి క్రీస్తు పూర్వం 723 సంవత్సరాల కాలంలో ఈజిప్ట్ ను పరిపాలించిన రాజవంశానికి చెందిన అమేనీమోప్ ఫారో రాజుకు చెందిన ఈ కంకణంను అమేనీమోప్ ఆన్ఆర్టీ–4 ఛాంబర్లో గతంలో కనుగొన్నారు. మధ్యలో లాపిస్ లజూలీ మణిపూస పొదిగిన ఈ కంకణం అత్యంత అరుదైంది. చోరీ కేసులో నలుగురిని పోలీసులు అరెస్ట్చేశారు. చేతులు మారిన నగదునూ స్వా«దీనంచేసుకున్నారు.అసలేమైంది? భద్రంగా ‘సేఫ్’లో దాచిన కంకణాన్ని ల్యాబ్లో పునరుద్ధరణ పనులు చూసే ఒక మహిళా నిపుణురాలు దొంగలించింది. ఆమె కైరోలోని ఒక వెండి దుకాణం యజమానికి అత్యల్ప ధరకు విక్రయించింది. దీనిని ఆ వెండి దుకాణదారు మరో బంగారం దుకాణం యజమానికి కేవలం 3,800 డాలర్లకు విక్రయించాడు. దీనిని అతను 200 డాలర్ల లాభానికి అంటే 4,000 డాలర్లకు మరో బంగారం దుకాణయజమానికి అమ్మేశాడు. ఇతను కంకణాన్ని కరిగించి వచి్చన బంగారంతో తన కస్టమర్లకు కావాల్సిన స్వర్ణాభరణాలు చేసి ఇచ్చి డబ్బు సంపాదించాడు. కంకణం కోసం బయల్దేరిన పోలీసులకు కంకణానికి బదులు ఈ నలుగురు నేరస్తులు చిక్కారని ఈజిప్ట్ పర్యాటక, పురాతత్వ శాఖ మంత్రి షెరీఫ్ ఫతీ చెప్పారు. ‘‘కంకణం మాత్రమే కాదు ఈజిప్ట్ లో మరెన్నో చారిత్రక వస్తువులకు సరైన భద్రత లేదు. మ్యూజియంలలో సీసీటీవీలు సరిగా పనిచేయవు. రక్షణ ఏర్పాట్లను పటిష్టంచేయకపోతే అమూల్యసంపద ఇలాగే అదృశ్యమయ్యే ప్రమాదం ఉంది’’ అని ఈజిప్ట్ మహిళా పురాతత్వవేత్త మోనికా హనా ఆవేదన వ్యక్తంచేశారు. ఈమె ఈజిప్ట్ నుంచి విదేశాలకు అక్రమంగా తరలిపోయి అక్కడి మ్యూజియంలలో ప్రత్యక్షమైన పలు వస్తువులను తిరిగి తీసుకొచ్చేందుకు ఉద్యమిస్తున్నారు. ఈమె అరబ్ అకాడమీ ఫర్ సైన్స్, టెక్నాలజీ, మారిటైమ్ ట్రాన్స్పోర్ట్ యూనివర్సిటీలో డీన్గా సేవలందిస్తున్నారు. -
మరో ఐదేళ్లలో బంగారం రూ.2 లక్షలకు!: కారణాలు ఇవే..
భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ఆర్థిక అనిశ్చితులు, ట్రంప్ సుంకాలు వంటి అంశాలు బంగారం ధరలు భారీగా పెరగడానికి కారణమయ్యాయి. దీంతో ప్రస్తుతం 10 గ్రాముల 24 క్యారెట్స్ గోల్డ్ రేటు రూ. 1,13,070 వద్దకు చేరింది. అయితే ఈ ధర ఐదేళ్లకు ముందు.. 2020లో రూ. 51,000 మాత్రమే అని తెలుస్తోంది. దీన్ని బట్టి చూస్తే పసిడి ధరలు ఎంతలా పెరిగాయో స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు.బంగారం ధర ఐదేళ్లలో (2020 - 2025 మధ్య) డబుల్ అయింది. గోల్డ్ డిమాండ్ తగ్గే సూచనలు కనిపించకపోవడంతో.. రాబోయే ఐదు సంవత్సరాలలో ఇది రూ. 2 లక్షలకు చేరుకుంటుందా?, దీనిపై నిపుణులు ఏం చెబుతున్నారంటే..బంగారంపై పెట్టుబడులు ఎక్కువ కావడం.. గోల్డ్ రేటు పెరుగుదలకు కారణమవుతోంది. రాబోయే రోజుల్లో గోల్డ్ రేటు మరింత పెరిగే అవకాశం ఉందని.. బులియన్ మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. భారతదేశంలో ఈటీఎఫ్ రూపంలో బంగారం డిమాండ్ పెరుగుతుందని ట్రేడ్జీనీ సీఓఓ త్రివేష్ పేర్కొన్నారు.సెంట్రల్ బ్యాంకుల బంగారం కొనుగోలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, యూఎస్ డాలర్ ధర, ద్రవ్యోల్బణం వంటివన్నీ కూడా బంగారం ధరల పెరుగుదలకు దోహదపడతాయని ఇన్క్రెడ్ మనీ సీఈఓ విజయ్ కుప్పా పేర్కొన్నారు.ఇదీ చదవండి: బంగారం ధర పెరిగినా.. డిమాండ్ తగ్గదు!ఇప్పుడు రూ.1,13,070 వద్ద ఉన్న 10 గ్రామ్స్ గోల్డ్ రేటు.. మరో ఐదేళ్లలో రూ. 1.70 లక్షల నుంచి రూ. 2 లక్షలకు చేరుకునే అవకాశం ఉంది. కారణాలు ఎన్ని ఉన్నా.. 2026 నాటికి అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 4000 డాలర్లు దాటవచ్చని చెబుతున్నారు. దీంతో భారతదేశంలో కూడా పసిడి ధర గణనీయంగా పెరుగుతుంది. -
గోల్డ్ కార్డ్ వచ్చేసింది
న్యూయార్క్/వాషింగ్టన్: అమెరికాలో శాశ్వత స్థిరనివాసానికి బాటలువేసే అత్యంత ఖరీదైన ‘గోల్డ్ కార్డ్’పథకానికి సంబంధించిన ఉత్తర్వులపై ట్రంప్ శుక్రవారం సంతకం చేశారు. ఎవరైనా 10 లక్షల డాలర్లు చెల్లించి ఈ గోల్డ్కార్డ్ను తమ వశంచేసుకోవచ్చు. ఎంచక్కా అమెరికాలో స్థిరనివాసం ఏర్పాటుచేసుకోవచ్చు. తమ సంస్థ పురోభివృద్ధికి అక్కరకొస్తారని భావించే అత్యంత నైపుణ్యమున్న సిబ్బంది, ఉన్నతాధికారులను అమెరికాకు తీసుకురావాలని భావించే కార్పొరేట్ సంస్థలు మాత్రం ఒక్కో వ్యక్తి కోసం 20 లక్షల డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. ఈమేరకు అమెరికా ప్రభుత్వం కార్యనిర్వాహక ఉత్తర్వును రూపొందించగా దానిపై ట్రంప్ సంతకం చేశారు. ద్రవ్యలోటును తగ్గిస్తూ అమెరికా ఖజానాకు వందల కోట్ల డాలర్లను జమచేసే ఈ కీలక పథకాన్ని స్వయంగా ట్రంప్ రూపొందించారని తెలుస్తోంది. గత మూడు దశాబ్దాలుగా అమల్లో ఉన్న పెట్టుబడి వీసా(ఈబీ–5)కి ప్రత్యామ్నాయంగా ఈ గోల్డ్ కార్డ్ను తాజాగా తీసుకొచ్చారు. హెచ్–1వీ వీసాదారులు మొదలు ఎలాంటి వీసాల కోసం దరఖాస్తుచేసుకున్నవాళ్లయినా నేరుగా అమెరికా స్థిరనివాసం కావాలంటే ఈ గోల్డ్కార్డ్ను కొనుగోలు చేసుకోవచ్చు. ఇన్నాళ్లూ ప్రపంచంలోని ఏ దేశంలోని సంపన్నులైనా అమెరికాలో శాశ్వత స్థిరనివాస హోదా సంపాదించాలంటే వీసా పొంది తర్వాత గ్రీన్కార్డ్ కోసం ఆతర్వాత పౌరసత్వం కోసం నెలలు, సంవత్సరాల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి ఉండేది. అలాంటి సంపన్నులు, లక్షల డాలర్లు గుమ్మరించే స్తోమత ఉన్న ఉన్నతాధికారుల కోసమే ప్రత్యేకంగా ఈ గోల్డ్కార్డ్ను అమెరికా ప్రభుత్వం తీసుకొచ్చింది. ఖజానాకు ఆదాయ వరద కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకం చేశాక ట్రంప్ శ్వేతసౌధంలోని ఓవెల్ ఆఫీస్లో మీడియాతో మాట్లాడారు. ‘‘గోల్డ్కార్డ్ సాయంతో ఇకపై మేం వందల కోట్ల డాలర్లను ఒడిసిపట్టబోతున్నాం. ఖజానాకు గోల్డ్కార్డ్ ఆదాయ వరదను పారించనుంది. తమకు అత్యంత కీలకమైన ఉన్నతాధికారులు, నిపుణులు అనుకున్న వాళ్లను కంపెనీలు ఈ గోల్డ్కార్డ్తో అమెరికాకు రప్పించుకోవచ్చు. గోల్డ్కార్డ్ అనేది నిజంగా అత్యద్భుతం. ఈ కార్డ్ల విక్రయాలతో వచ్చే నగదుతో మా ద్రవ్యలోటు భారం తగ్గిపోతుంది. ఖజానా నిండిపోతే మేం పన్నులు కూడా తగ్గిస్తాం. అప్పుల గుదిబండను కాస్తంత దించుకుంటాం. గోల్డ్కార్డ్ కోసం దరఖాస్తు చేసుకున్న వాళ్లు ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలి. అడిగిన ప్రతి డాక్యుమెంట్ను సమయానికి ఇవ్వాలి. కార్డ్ మంజూరైతే 10 లక్షల డాలర్లను ప్రభుత్వానికి బహుమతిగా ఇవ్వాలి. అమెరికాకు ప్రయోజనం చేకూరేలా మసలుకుంటామని మాటివ్వాలి’’అని ట్రంప్ చెప్పారు. ‘‘కార్డ్ పొందిన వాళ్లు చట్టబద్ధ శాశ్వత స్థిరనివాస హోదా పొందేందుకు అర్హత సాధిస్తారు. వీసా అందుబాటులో ఉంటుంది. గోల్డ్కార్డ్దారులు ఇచ్చే 10 లక్షల డాలర్లను వాణిజ్యమంత్రి ప్రభుత్వ ఖజానాలో జమచేస్తారు. ఈ నగదును అమెరికా వాణిజ్యం, దేశీయ పారిశ్రామికాభివృద్ధి కోసం ఖర్చుపెడతారు. అమెరికాలో స్థిరపడాలనుకునే సంపన్న పెట్టుబడిదారులు, అంకుర సంస్థల అధినేతలు, నైపుణ్య సిబ్బందికి గోల్డ్కార్డ్ సులువైన చక్కటి మార్గం’’అని ట్రంప్ అన్నారు. పౌరసత్వానికి గోల్డ్కార్డ్ అనేది సుగమం చేస్తుందని గతంలో వాణిజ్యమంత్రి హోవర్డ్ లుట్నిక్ అన్నారు. అఫ్గానిస్తాన్, పాకిస్తాన్, రష్యా, చైనా అనే తేడాలేకుండా లక్షలు చెల్లించే ఏ దేశ పౌరునికైనా ఈ కార్డ్ను అమెరికా విక్రయించి స్థిరనివాసానికి సాదరస్వాగతం పలుకుతోంది. ట్రంప్ నిర్ణయంతో సంపన్న భారతీయులకు వేగంగా యూఎస్ పౌరసత్వం లభించే అవకాశాలు బాగా మెరుగుపడతాయి. కార్డ్ వస్తే వెంటనే పౌరసత్వం ఇచ్చినట్లుగా భావించకూడదని ప్రభుత్వం గతంలోనే స్పష్టంచేసింది. -
కొనుగోలుదారులను ఆడేసుకుంటున్న బంగారం..
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఊగిసలాడుతున్నాయి. శుక్రవారంతో పోలిస్తే శనివారం బంగారం ధరలు పెరిగాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
ఐటీ ఉద్యోగుల జీతాల పెరుగుదల అంతా ఫేక్..
సాధారణంగా ఐటీ ఉద్యోగులకు అధిక జీతాలు ఉంటాయని, ఏటా జీతాల పెరుగుదల కూడా భారీగా ఉంటుందని అందరూ భావిస్తారు. కానీ అదంతా ఫేక్ అంటున్నారు చార్టెడ్ అకౌంటెంట్ (సీఎ), క్రియేట్ హెచ్క్యూ ఫౌండర్ మీనాల్ గోయెల్. 8 శాతం జీతం పెరుగుతోందంటే మంచి పెంపు అనుకుంటారని, కానీ ద్రవ్యోల్బణం (ధరల పెరుగుదల) మీ ఖర్చులను 12% పెంచిందని మీరు గ్రహించాక అసలు సంగతి అర్థమవుతుందంటున్నారు.జీతాలు, పెరుగుతున్న జీవన వ్యయాల మధ్య అధికమవుతున్న అసమతుల్యతను గోయెల్ ఇటీవలి తన లింక్డ్ఇన్ పోస్టులో హైలైట్ చేశారు. ఆమె ఐటీ రంగాన్ని ఉదాహరణగా తీసుకుని ఆ అసమతుల్యతను ఎత్తి చూపారు. ఇక్కడ ఎంట్రీ లెవల్ వేతనం 2012లో రూ. 3 లక్షల నుండి 2022 నాటికి కేవలం 3.6 లక్షల రూపాయలు అయింది. అంటే ఒక దశాబ్ద కాలంలో ఏ మేరకు కదిలిందో అర్థం చేసుకోవచ్చు. అదే కంపెనీల సీఈవోల జీతాలు మాత్రం అనేక రెట్లు ఎగిశాయి."నేటికి, చాలా మంది ఐటీ ఉద్యోగులు సింగిల్-డిజిట్ పెంపు గురించి మాట్లాడుతుండగా, వారి అద్దె, కిరాణా సామగ్రి, జీవనశైలి ఖర్చులు రెండంకెలలో పెరుగుతున్నాయి" అని గోయెల్ రాసుకొచ్చారు. ఆదాయాలు, ఖర్చుల కంటే వెనుకబడి ఉండటంతో, చాలా మంది స్థిరత్వం కోసం బంగారం వంటి ఆస్తుల వైపు మొగ్గు చూపుతున్నారన్నారు.చారిత్రాత్మకంగా, బంగారం ద్రవ్యోల్బణాన్ని ఓడించడమే కాకుండా అనిశ్చితి సమయాల్లో రక్షణను కూడా అందించింది. భారతదేశంలో, దాని ధర గత దశాబ్దంలో దాదాపు రెట్టింపు అయింది. ఓ మధ్య-స్థాయి ఐటీ ఉద్యోగి జీతం పెరుగుదలను అధిగమించింది. ఈ నేపథ్యంలో పెట్టుబడి ఇకపై లగ్జరీ కాదని గోయెల్ నొక్కి చెప్పారు. "మీరు సంపాదించే ఆదాయం, ఖర్చుల మధ్య పెరుగుతున్న అంతరాన్ని తగ్గించడానికి పెట్టుబడులు మాత్రమే మార్గం" అని ఆమె చెప్పారు.ఇదీ చదవండి: ఫోన్పే, పేటీఎంలో ఇక రెంటు కట్టడం కష్టం! -
భారీగా పెరిగిన బంగారం అమ్మకాలు..
న్యూఢిల్లీ: జీవిత కాల గరిష్ట స్థాయిల వద్ద పసిడి అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నది. ఢిల్లీ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత బంగారం 10 గ్రాములకు రూ.1,800 పెరిగి మంగళవారం కొత్త గరిష్ట స్థాయి రూ.1,15,100 స్థాయికి చేరుకోగా.. బుధవారం రూ.1,300 నష్టపోయి రూ.1,13,800కు పరిమితమైంది. ధరలు తగ్గుముఖం పట్టడంతో.. సేల్స్ పెరిగాయి.‘‘యూఎస్ ఫెడ్ పాలసీ సమావేశానికి ముందు లాభాల స్వీకరణకు ఇన్వెస్టర్లు మెగ్గు చూపించడంతో బంగారం బలహీనంగా ట్రేడయ్యింది. కీలకమైన సమావేశానికి ముందు ఇన్వెస్టర్లు రిస్క్ తగ్గించుకున్నారు. కేవలం ఫెడ్ రేట్ల కోతపైనే కాకుండా, తదుపరి రేట్ల సవరణ దిశగా ప్రకటించే అంచనాల కోసం మార్కెట్లు వేచి చూస్తున్నాయి.ఇదీ చదవండి: కొంటే ఇప్పుడు కొనండి!.. తగ్గిన గోల్డ్ రేటుతటస్థ విధానం లేదా తదుపరి రేట్ల కోతకు సంబంధించి స్పష్టమైన కార్యాచరణ లోపిస్తే బంగారం ధరలు ఇక్కడి నుంచి కొంత శాతం తగ్గొచ్చు’’అని ఎల్కేపీ సెక్యూరిటీస్ కమోడిటీ సీనియర్ అనలిస్ట్ జతిన్ త్రివేది తెలిపారు. మరోవైపు వెండి సైతం అమ్మకాల ఒత్తిడితో కిలోకి రూ.1,670 నష్టపోయి రూ.1,31,200 స్థాయికి దిగొచ్చింది. అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ఔన్స్కు ఒక శాతం తగ్గి 3,665 డాలర్ల వద్ద, కామెక్స్ ఫ్యూచర్స్లో పావు శాతం తగ్గి 3,717 డాలర్ల వద్ద ట్రేడయ్యింది. -
కేంద్ర బ్యాంకులకు బంగారు నిల్వలు ఎందుకు?
బంగారానికి భారత్తోపాటు వివిధ దేశాల్లో ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు. భవిష్యత్తులో ఆర్థిక ఇబ్బందులు వచ్చినప్పుడు భరోసానిచ్చే సాధనంగా సాధారణ ప్రజలు పసిడిని కొనుగోలు చేస్తూంటారు. దాంతోపాటు శుభకార్యాలు, ప్రత్యేక ఈవెంట్ల కోసం ఖరీదు చేస్తారు. వీరితోపాటు భారీ మొత్తంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న కేంద్ర బ్యాంకులు బంగారు నిల్వలను ఉద్దేశపూర్వకంగా, వ్యూహాత్మకంగా కొనుగోలు చేస్తున్నాయి. ఇండియాతోపాటు చాలా దేశాలు ఎందుకు ఇలా భారీగా పసిడిని కొనుగోలు చేస్తాయో తెలుసుకుందాం.కరెన్సీకి అండగా..ద్రవ్యోల్బణం పెరుగుతూ, దేశ కరెన్సీ విలువ తగ్గుతుంటే దాన్ని కాపాడేందుకు బంగారం హెడ్జింగ్గా పని చేస్తుంది. ముద్రించిన కరెన్సీ(ఫియట్ కరెన్సీ) విలువ తగ్గినప్పుడు అంతర్జాతీయ మార్కెట్లో బంగారం విలువ బలపడుతుంది. ఇది దిగుమతులకు ఆసరాగా ఉంటుంది. అస్థిరత సమయాల్లో బంగారం జాతీయ కరెన్సీలను కాపాడుతుంది. దేశం ద్రవ్య విధాన చట్రానికి విశ్వసనీయతను అందిస్తుంది.రిస్క్ వైవిధ్యంకేంద్ర బ్యాంకులు రిస్క్ను డైవర్సిఫై చేసేందుకు బంగారం నాన్-కోరిలేటెడ్ ఆస్తిగా ఉపయోగపడుతుంది. దీని విలువ ఈక్విటీలు లేదా బాండ్లతో అనుగుణంగా పడిపోదు. యూఎస్ డాలర్ పడిపోయినప్పుడు ఇది పెరుగుతుంది. ఇది రిజర్వ్ పోర్ట్ ఫోలియోల్లో స్మార్ట్ డైవర్సిఫికేషన్ హెడ్జ్గా మారుతుంది.భౌగోళిక రాజకీయ పరిస్థితులుబంగారం ఏ ఒక్క దేశానికి పరిమితమైంది కాదు. కాబట్టి దీన్ని నియంత్రించడం ఏ ఒక్క దేశంలో వల్లనో సాధ్యం కాదు. దీని విలువపై ఎన్నో అంతర్జాతీయ అంశాలపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి విదేశీ కరెన్సీ నిల్వల మాదిరిగా కాకుండా, బంగారాన్ని స్తంభింపజేయడం లేదా దానిపై రాజకీయం చేయడం సాధ్యం కాదు. రష్యా, చైనా వంటి దేశాలు అమెరికా డాలర్పై ఆధారపడటాన్ని తగ్గించేందుకు బంగారం నిల్వలను పెంచాయి.లిక్విడిటీబంగారం ప్రపంచవ్యాప్తంగా అత్యంత లిక్విటిటీ ఆస్తుల్లో ఒకటి. దీన్ని దాదాపు ఏ ఆర్థిక మార్కెట్లోనైనా ఆమోదిస్తారు. ఆర్థిక సంక్షోభాలు లేదా యుద్ధాల సమయంలో దీన్ని త్వరగా నగదుగా మార్చవచ్చు లేదా అత్యవసర నిధుల కోసం తాకట్టుకు ఉపయోగించవచ్చు.టాప్ 8 దేశాల్లోని బంగారు నిల్వలు..దేశంబంగారం నిల్వలు (టన్నులు)అమెరికా8,133.46జర్మనీ3,350.25ఇటలీ2,451.84ఫ్రాన్స్2,437.00రష్యా2,329.63చైనా2,279.60స్విట్జర్లాండ్1,040.00భారతదేశం880.00 -
బంగారంపై బిగ్ న్యూస్ అంటున్న రిచ్డాడ్ కియోసాకి
ప్రసిద్ధ పర్సనల్ ఫైనాన్స్ పుస్తకం ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ (Rich Dad Poor Dad) రచయిత రాబర్ట్ కియోసాకి బిగ్ న్యూస్ అంటూ మరో సమాచారంతో ముందుకొచ్చారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల సంతకం చేసిన ఒక కార్యనిర్వాహక ఉత్తర్వు ‘401(కె)’ ఇన్వెస్టర్లకు ప్రత్యామ్నాయ పెట్టుబడులపై మరింత స్వేచ్ఛనిస్తుందని, తనకు అనుకూలమైన బంగారం, వెండి, బిట్ కాయిన్ల విలువను మరింత పెంచుతుందని ఆనందం వ్యక్తం చేశారు.ట్రంప్ తాజాగా తీసుకొచ్చిన 401(కె) రైటర్మెంట్ సేవింగ్స్ ప్లాన్ అద్భుతమంటూ తన ‘ఎక్స్’ ఖాతాలో రాబర్ట్ కియోసాకి ఓ పోస్ట్ పెట్టారు. తన స్నేహితుడు ఆండీ షెక్ట్మాన్ ప్రకారం.. ఆగస్టు 7న అధ్యక్షుడు ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ (401k)పై సంతకం చేశారని, అది ఇన్వెస్టర్లకు ప్రత్యామ్నాయ పెట్టుబడులపై మరింత స్వేచ్ఛను ఇస్తుందని పేర్కొన్నారు.మ్యూచువల్ ఫండ్స్.. లూసర్లకు‘మీలో చాలా మందికి తెలుసు కదా.. నేను మ్యూచువల్ ఫండ్స్ లేదా ఈటీఎఫ్లలో పెట్టుబడి పెట్టను. నాకు సంబంధించి మ్యూచువల్ ఫండ్స్, ఈటీఎఫ్లు అనేవి నష్టపోయేవారి కోసం’ అంటూ రాసుకొచ్చారు. ట్రంప్ కొత్త ఉత్తర్వు 401కె.. రియల్ ఎస్టేట్, ప్రైవేట్ ఈక్విటీ, రుణాలు, క్రిప్టో , విలువైన లోహాలు వంటి ప్రత్యామ్నాయ పెట్టుబడులను ఒకే పన్ను గొడుగు కిందకు తెస్తుందన్నారు. ఇది తెలివైన, అధునిక ఇన్వెస్టర్లకు తలుపులు తెరుస్తుందన్నారు.కొత్త పెట్టుబడి అవకాశాలపై అధ్యయనం చేయలేనివారు, కష్టపడలేనివారు మాత్రం అవే సాంప్రదాయ మ్యూచువల్ ఫండ్స్, ఈటీఎఫ్లలో పెట్టుబడులు పెట్టుకోవాలని ఎద్దేవా చేశారు. ట్రంప్ కొత్త ఉత్తర్వుతో తాను మాత్రం చాలా సంతోషంగా ఉన్నానన్నారు. ఎందుకంటే ఇది తన బంగారం, వెండి, బిట్ కాయిన్ లను మరింత విలువైనదిగా చేస్తుందని వివరించారు.BIG NEWS: According to friend Andy Schectman….on August 7, 2025….President Trump signed an Executive Order “Democratizing Access to Alternative Investments for 401k Investors.”As some of you know I do not invest in mutual funds or ETFS. To me Mutual funds and ETFS are for…— Robert Kiyosaki (@theRealKiyosaki) September 17, 2025 -
బిగ్ రిలీఫ్! తగ్గిన బంగారు ధర.. తులం ఎంతంటే
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) భారీగా పెరిగాయి. అయితే మంగళవారంతో పోలిస్తే బుధవారం బంగారం ధరలు తగ్గాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
రేటే 'బంగార'మాయెనే..
సాక్షి, విశాఖపట్నం : పసిడితో భారతీయులకు ఉన్న అనుబంధం మరే దేశంలోనూ కనిపించదు. చేతిలో కొద్దిగా డబ్బులు కనిపిస్తే.. వెంటనే కొనుగోలు చేసేది బంగారాన్నే. ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా.. పుత్తడి కొంటే.. శుభసూచకమని అంటుంటారు. అందుకే స్వర్ణం.. సమస్తమయమైపోయింది. ప్రపంచ మార్కెట్ పరిస్థితులు, డిమాండ్ నేపథ్యంలో రోజురోజుకీ పసిడి ధర పైపైకి ఎగబాకుతూ.. ఆల్టైమ్ హై రేట్ని నమోదు చేస్తోంది. ఒకప్పుడు 10 గ్రాముల ధరతో ఇప్పుడు గ్రాము కూడా కొనుగోలు చేయలేని పరిస్థితి. వారం రోజులుగా ఎగబాకుతున్న బంగారాన్ని చూసి.. వెండి కూడా అదే బాటలో దూసుకుపోతోంది. లక్ష రూపాయల కంటే దిగువకు బంగారం ధర దిగే రోజులు ఇప్పట్లో కనిపించడం లేదని వ్యాపారులు చెబుతున్నారు. తగ్గేదేలే అంటున్న పుత్తడి గత వారం రోజులుగా బంగారం ధర తగ్గేదేలే అన్నట్లుగా దూసుకుపోతోంది. ఈ నెల 8వ తేదీన 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,08, 380 ఉండగా.. 9వ తేదీన రూ.1,10,290కి చేరుకుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ రూ.1.10 లక్షలకు తక్కువ కాలేదు. వెండి కూడా ధగధగ మెరిసిపోతోంది. ఈ నెల 8న కిలో వెండి ధర రూ.1.37 లక్షలు ఉండగా.. 15వ తేదీ నాటికి రూ.6 వేలు పెరిగి రూ.1.43 లక్షలకు చేరుకుంది. అంటే రోజుకు దాదాపు రూ.1000 చొప్పున పెరుగుతూ వస్తోంది. పెట్టుబడి విషయంలోనూ బంగారమే..! రోజు రోజుకీ ధర పెరుగుతూ వస్తున్నా బంగారం కొనుగోలు విషయంలో మాత్రం ప్రజలు అస్సలు తగ్గేదే..లే అంటున్నారు. ఎందుకంటే ఇంట్లో పసిడి ఎంత ఉంటే అంత ఎక్కువ సొమ్ము ఉన్నట్లుగా భావిస్తారు. వాస్తవానికి బంగారం నిరర్థక ఆస్తి. ఎంతో కష్టించి సంపాదించిన సొమ్ము బంగారంగా మార్చితే బీరువాల్లోనూ, బ్యాంకు లాకర్లలోనూ భద్రంగా ఉంచడం తప్ప... మరో ప్రయోజనం ఏంటి..? భవిష్యత్తులో ధర పెరిగి, పెరిగిన ధరకు దాన్ని విక్రయిస్తేనే లాభం. మనకు తెలిసినంత వరకూ బంగారం కొనడమే కానీ.. విక్రయించడమన్నది అరుదు. దీని బదులు వాటిని ఉత్పత్తి కార్యకలాపాలకు వెచ్చిస్తే సంపద సృష్టి జరుగుతుంది. మన దేశంలో విలువైన విదేశీ మారక ద్రవ్యాన్ని ఖర్చు చేయడంలో బంగారం మూడో స్థానాన్ని ఆక్రమించింది. ముడిచమురు, క్యాపిటల్ గూడ్స్ తర్వాత అత్యధికంగా దిగుమతి చేసుకుంటున్న సరకు బంగారమేనన్నది విస్మయపరిచే అంశం. ఇటీవల కాలంలో మనదేశంలో బంగారం కొనుగోళ్లు అధికమై.. నగదు పొదుపు మొత్తాలు తగ్గిపోతున్నాయి. గృహస్తులు ఇతర వాటిపై ఒక్క శాతం పెట్టుబడులు పెడుతుండగా బంగారంపై మాత్రం ఆరున్నర రెట్లు ఎక్కువ మొగ్గు చూపుతుండటం విశేషం. బంగారానికి ఇంత వన్నె ఎందుకో..? పుత్తడి ఎంత ఉన్నా సగటు వ్యక్తికి మోజు తీరడం లేదు. తన శక్తి మేరకు బంగారాన్ని సొంతం చేసుకునే ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. అసలు బంగారానికి ఇంత వన్నె ఉండటానికి కారణం అంతర్జాతీయ కరెన్సీకి ప్రత్యామ్నాయం కావడమే. ఒక దేశం జారీ చేసిన నోట్లు చెల్లకపోవడం. వాటి విలువ క్షీణించడం ఉంటుంది. కానీ బంగారానికి అలాంటి బేధాలేమీ లేవు. ఎప్పుడైనా ఎక్కడైనా ఎంతో కొంత ధరకు చెలామణి అవుతుంది. అందుకే స్వర్ణానికి అంత కళ. ధర తగ్గినా పెరిగినా కొనుగోళ్లు మాత్రం తగ్గడం లేదు. ప్రపంచ స్వర్ణమండలి(డబ్ల్యూజీసీ) అంచనాల ప్రకారం ప్రస్తుతం దేశంలోని సంస్థలు, గృహస్తులు, రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా వద్ద 25 వేల టన్నుల బంగారం ఉంది. భారత్లో మొత్తం ఇళ్లల్లోనూ, ఇతర అవసరాలకు ఈ బంగారం వివిధ రూపాల్లో నిల్వ ఉంది. ఇందులో విశాఖ నగర జనాభా ప్రకారం 80 నుంచి 100 టన్నుల వరకూ ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ లెక్కల ప్రకారం సగటున విశాఖ నగరంలో ప్రతి ఇంటిలోనూ 15 నుంచి 25 గ్రాములు వరకూ బంగారం ఉంటుదని నివేదికలు చెబుతున్నాయి. కొనుగోళ్లు తగ్గినా.. మార్కెట్ దూసుకుపోతోంది టెక్స్టైల్స్ మార్కెట్ 15 నుంచి 20 శాతం పడిపోయింది. బంగారం మార్కెట్ కూడా 15 నుంచి 20 శాతం పడిపోయింది. మార్కెట్ విలువ మాత్రం బంగారం విషయంలో ఏమాత్రం తగ్గలేదు. చైనా, భారత్ వంటి దేశాలు బంగారాన్ని కొనుగోలు చేసేందుకు పోటీ పడుతున్నాయి. గతంలో పసిడి ధర మూడు నాలుగు రోజులకోసారి మారేది. ఇప్పుడు ఒక పూట ఉన్న రేటు మరో పూటకు ఉండటం లేదు. బులియన్ మార్కెట్ కూడా అంచనా వేయలేకపోతోంది. పెట్టుబడుల విషయంలోనూ బంగారానికి మంచి డిమాండ్ ఉంది. బంగారంతో వెండి పోటీ పడుతోంది. బ్యాటరీ కార్లలో వెండి వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో ధరల పెరుగుదలకు ఓ కారణమని చెప్పవచ్చు. – కంకటాల మల్లికార్జునరావు, ఫ్యాప్సీ పాస్ట్ ప్రెసిడెంట్ -
సరికొత్త శిఖరాలకు పసిడి
న్యూఢిల్లీ: దేశీయంగా పసిడి ధరలు మంగళవారం సరికొత్త రికార్డును సృష్టించాయి. 99.9 శాతం స్వచ్ఛత బంగారం 10 గ్రాములకు రూ.1,800 పెరిగి రూ.1,15,100 స్థాయికి చేరింది. ఇదొక సరికొత్త జీవితకాల గరిష్ట స్థాయి. డాలర్ బలహీనత, యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్ల కోత అంచనాలతో ఇన్వెస్టర్లు సురక్షిత సాధనమైన బంగారంలో పెట్టుబడులకు ఆసక్తి చూపిస్తుండడంతో ఎప్పటికప్పుడు కొత్త గరిష్టాలు నమోదవుతున్నాయి. మరో వైపు వెండి ధర సైతం కొత్త గరిష్టానికి చేరింది.కిలోకి రూ.570 పెరిగి రూ.1,32,870 స్థాయిని నమోదు చేసింది. యూఎస్ ఫెడ్ సెపె్టంబర్ భేటీలో భారీ రేట్ల కోత దిశగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఒత్తిడికి తీసుకురావడం బంగారం ధరల పెరుగుదలకు దారితీసినట్టు హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ కమోడిటీ విభాగం సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ తెలిపారు. యూఎస్ డాలర్ బలహీనతకు తోడు, ఫెడ్ ఒకటికి మించిన రేట్ల కోతను చేపడుతుందన్న అంచనాలతో మంగళవారం బంగారం ధర సరికొత్త గరిష్టానికి చేరినట్టు చెప్పారు.పది వారాల కనిష్టానికి డాలర్ ఇండెక్స్ బలహీనపడినట్టు తెలిపారు. రేట్ల కోత దిశగా ఫెడ్ సానుకూల వైఖరి, భారత్, చైనాతో అమెరికా వాణిజ్య ఒప్పందాలకు సంబంధించిన పరిణామాలతో ట్రేడర్లు బంగారంలో లాంగ్ పొజిషన్లను కొనసాగిస్తున్నట్టు ఎల్కేపీ సెక్యూరిటీస్ కమోడిటీ రీసెర్చ్ అనలిస్ట్ జతిన్ త్రివేది తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం లాభాలతో కొనసాగుతూ 3,739 డాలర్ల వద్ద సరికొత్త గరిష్ట స్థాయి నమోదు చేసింది. -
నేను ముందే ఊహించాను!.. బంగారం ధరలపై క్రిస్టోఫర్ వుడ్
డాలర్ విలువ తగ్గినప్పుడు బంగారం, బిట్కాయిన్ రెండింటిపైన పెట్టుబడులు పెరుగుతాయని, మార్కెట్లో ఇవి కీలక పాత్ర పోషిస్తాయని.. జెఫరీస్ గ్లోబల్ హెడ్ ఆఫ్ ఈక్విటీ స్ట్రాటజీ 'క్రిస్టోఫర్ వుడ్' పేర్కొన్నారు. గుర్గావ్లోని జెఫరీస్ ఇండియా ఫోరమ్లో మాట్లాడుతూ.. తన పోర్ట్ఫోలియో కేటాయింపులను కూడా వెల్లడించారు.ప్రస్తుతం పసిడి ధరలు జీవితకాల గరిష్టాలను చేరుకున్నాయి. బంగారం ఔన్సుకు 3,698 డాలర్లకు పెరిగిన సమయంలో.. భారతదేశంలో కూడా 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 1.11 లక్షలు దాటేసింది.ఔన్స్ బంగారం 3600 డాలర్లకు చేరుతుందని.. నేను 2002లోనే అనుకున్నాను. ఊహించినట్లుగానే గోల్డ్ ఆ లక్ష్యాన్ని చేరుకుందని క్రిస్టోఫర్ వుడ్ పేర్కొన్నారు. ప్రస్తుతం గోల్డ్ కొత్త ట్రేడింగ్ శ్రేణిలోకి ప్రవేశించినట్లు కనిపిస్తోందని ఆయన స్పష్టం చేశారు. బంగారం (ఫిజికల్ గోల్డ్)పై ఆశ ఉన్నప్పటికీ.. నాకు గోల్డ్ మైనింగ్ స్టాక్లనే ఆసక్తి ఉందని అన్నారు. అయితే ఇది మొత్తం కంపెనీల లాభాల మీద ఆధారపడి ఉంటుంది.ఇదీ చదవండి: చరిత్రలో అతిపెద్ద మార్పు: రాబర్ట్ కియోసాకి హెచ్చరికబిట్కాయిన్ల విలువ కూడా భారీగా పెరుగుతోంది. నేను బంగారం & బిట్కాయిన్ రెండింటినీ సొంతం చేసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే ఎక్కువ మంది ధనవంతులు బంగారాన్ని కొనుగోలు చేయకపోవచ్చు. వారంతా బిట్కాయిన్ను కొనుగోలు చేస్తారు. రాబోయే కాలం మొత్తం బిట్కాయిన్, బంగారంతోనే ముడిపడి ఉందని క్రిస్టోఫర్ వుడ్ పేర్కొన్నారు. -
Eluru: కొబ్బరి నీళ్లు తెమ్మని చెప్పి రెండు కిలోల బంగారంతో పరార్
-
డుప్లాంటిస్... ప్రపంచ రికార్డు నంబర్ 14
ఊహించిన అద్భుతమే జరిగింది. పోల్ వాల్ట్లో మరోసారి ప్రపంచ రికార్డు బద్దలయింది. మారింది వేదిక మాత్రమే... ప్రపంచ రికార్డు సృష్టించిన వ్యక్తి మాత్రం మారలేదు... వరల్డ్ రికార్డు నెలకొల్పడం... మళ్లీ దానిని సవరించడం... తన ఖాతాలో పసిడి పతకం వేసుకోవడం... సమీప ప్రత్యర్థులను రెండో స్థానానికే పరిమితం చేయడం... పోల్ వాల్ట్ క్రీడాంశం పేరు చెబితే తనను తప్పనిసరిగా గుర్తు చేసుకునేలా రోజురోజుకూ రాటుదేలుతూ దూసుకుపోతున్న ఆ అథ్లెట్ ఎవరో కాదు... స్వీడన్ స్టార్ అర్మాండో డుప్లాంటిస్... బరిలో దిగితే ప్రపంచ రికార్డుపైనే గురి పెట్టే ఈ సూపర్ స్టార్ పోల్ వాల్టర్ సోమవారం టోక్యోలో మెరిశాడు. కళ్లు చెదిరే ప్రదర్శనతో తన ఖాతాలో 14వ ప్రపంచ రికార్డు వేసుకోవడంతోపాటు... ప్రపంచ చాంపియన్షిప్ చరిత్రలో వరుసగా మూడు స్వర్ణాలు సాధించి... ఈ క్రీడాంశంలో దిగ్గజం సెర్గీ బుబ్కా సరసన డుప్లాంటిస్ చేరాడు. టోక్యో: అథ్లెటిక్స్ అభిమానులందరూ ఆసక్తిగా ఎదురుచూసిన పురుషుల పోల్ వాల్ట్ ఈవెంట్లో ప్రపంచ, ఒలింపిక్ చాంపియన్ అర్మాండో డుప్లాంటిస్ అలరించాడు. సోమవారం జరిగిన ఫైనల్లో స్వీడన్కు చెందిన 25 ఏళ్ల డుప్లాంటిస్ కొత్త ప్రపంచ రికార్డు సృష్టించడంతోపాటు పసిడి పతకాన్ని కైవసం చేసుకున్నాడు. 6.30 మీటర్ల ఎత్తుకు ఎగిరిన డుప్లాంటిస్ తన కెరీర్లో 14వ సారి ప్రపంచ రికార్డును లిఖించాడు. గత నెలలో హంగేరి రాజధాని బుడాపెస్ట్లో జరిగిన మీట్లో 6.29 మీటర్లతో తానే నెలకొలి్పన ప్రపంచ రికార్డును డుప్లాంటిస్ సవరించాడు. విజేతగా నిలిచిన డుప్లాంటిస్కు 70 వేల డాలర్లు (రూ. 61 లక్షల 68 వేలు) ప్రైజ్మనీగా, ప్రపంచ రికార్డు సృష్టించినందుకు లక్ష డాలర్లు (రూ. 88 లక్షల 12 వేలు) బోనస్గా లభించాయి. 12 మంది పోటీపడ్డ ఫైనల్లో డుప్లాంటిస్ తన ఆరో ప్రయత్నంలో 6.15 మీటర్ల ఎత్తును అధిగమించి స్వర్ణ పతకాన్ని ఖాయం చేసుకున్నాడు. కరాలిస్ (గ్రీస్; 6 మీటర్లు) రజత పతకం నెగ్గగా... కురి్టస్ మార్షల్ (ఆ్రస్టేలియా; 5.95 మీటర్లు) కాంస్య పతకాన్ని దక్కించుకున్నాడు. పసిడి పతకం ఖాయమయ్యాక డుప్లాంటిస్ ప్రపంచ రికార్డుపై గురి పెట్టాడు. తొలి రెండు ప్రయత్నాల్లో 6.30 మీటర్ల ఎత్తును అధిగమించడంలో విఫలమైన డుప్లాంటిస్ మూడో ప్రయత్నంలో సఫలమై ప్రపంచ రికార్డును అందుకున్నాడు. డుప్లాంటిస్ కెరీర్లో ఇది వరుసగా 49వ విజయంకాగా... మేజర్ టోరీ్నల్లో ఐదో టైటిల్. టోక్యో ఒలింపిక్స్, పారిస్ ఒలింపిక్స్లో స్వర్ణ పతకాలు గెలిచిన డుప్లాంటిస్.. 2022 ప్రపంచ చాంపియన్íÙప్లో, 2023 ప్రపంచ చాంపియన్షిప్లో బంగారు పతకాలు సాధించాడు. తాజా విజయంతో డుప్లాంటిస్ ప్రపంచ చాంపియన్íÙప్లో ‘హ్యాట్రిక్’ స్వర్ణాలను సొంతం చేసుకున్నాడు. సెర్గీ బుబ్కా తర్వాత వరుసగా మూడు ప్రపంచ చాంపియన్íÙప్లలో బంగారు పతకాలు గెలిచిన రెండో పోల్ వాల్టర్గా డుప్లాంటిస్ గుర్తింపు పొందాడు. సెర్గీ బుబ్కా (సోవియట్ యూనియన్/ఉక్రెయిన్) వరుసగా ఆరు ప్రపంచ చాంపియన్íÙప్లలో (1983, 1987, 1991, 1993, 1995, 1997) స్వర్ణ పతకాలు సాధించాడు. -
భారీగా పెరిగిన బంగారం: పెట్టుబడికి ఓ మంచి మార్గం!
బంగారం ధరలు భారీగా పెరిగిపోతున్నాయి. భారతదేశంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 2024 సెప్టెంబర్లో దాదాపు రూ.73,200 వద్ద ఉండేది. అదే ఇప్పుడు (2025 సెప్టెంబర్) రూ.1,11,000కు చేరింది. అంటే రేటు సుమారు 54 శాతం పెరిగిందన్నమాట. గోల్డ్ ధరలు మాత్రమే కాకుండా.. గోల్డ్ ఈటిఎఫ్లు కూడా 50% వరకు రాబడిని అందించాయి. ఇది ఈటిఎఫ్లలో పెట్టుబడులను పెంచడానికి దోహదపడింది.2025 ఆగస్టులో గోల్డ్ ఈటిఎఫ్లలో పెట్టుబడులు రూ.2,189.5 కోట్లు అని తెలుస్తోంది. ఏఎంఎఫ్ఐ ప్రకారం.. గోల్డ్ ఈటిఎఫ్లలో నిర్వహణలో ఉన్న మొత్తం ఆస్తులు రూ.72,495 కోట్లకు చేరుకున్నాయి. దీన్నిబట్టి చూస్తే గోల్డ్ ఈటిఎఫ్లలో పెట్టుబడులు పెట్టేవారి సంఖ్య కూడా గణనీయంగా పెరిగిందని స్పష్టమవుతోంది.గోల్డ్ ఈటీఎఫ్లు అంటే ఏమిటి?గోల్డ్ ఈటీఎఫ్లు అనేవి.. గోల్డ్ ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్. పెట్టుబడిదారులకు బంగారంపై పెట్టుబడి పెట్టడానికి అవకాశం కల్పించే మ్యూచువల్ ఫండ్ వంటిది అన్నమాట. పెట్టుబడిదారులు షేర్ల మాదిరిగానే డీమ్యాట్ ఖాతాల ద్వారా ఈటీఎఫ్ యూనిట్లను కొనుగోలు చేయవచ్చు లేదా అమ్మవచ్చు, తద్వారా వాటిని సులభంగా యాక్సెస్ చేయవచ్చు. వీటి విలువ బంగారం ధరలకు అనుగుణంగా మారుతూ ఉంటాయి.పెట్టుబడిదారులు గోల్డ్ ఈటిఎఫ్లను ఎందుకు ఇష్టపడతారు●గోల్డ్ ఈటీఎఫ్లను స్టాక్ మార్కెట్లో కొనుగోలు చేయవచ్చు, అమ్మవచ్చు.●సాధారణ బంగారం మాదిరిగా.. గోల్డ్ ఈటిఎఫ్లనుప్రత్యేకంగా భద్రపరచాల్సిన అవసరం లేదు.●గోల్డ్ ఈటీఎఫ్లను చిన్న మొత్తంలో.. అంటే రూ. 500 లేదా రూ. 1000 కి కూడా కొనుగోలు చేయవచ్చు. ఫిజికల్ గోల్డ్ కొనేందుకు పెద్దమొత్తంలో ఖర్చు చేయాల్సి ఉంటుంది.●గోల్డ్ ఈటీఎఫ్లకు మంచి లిక్విడిటీ ఉంటుంది. వీటిని తొందరగా అమ్మవచ్చు లేదా కొనుగోలు చేయవచ్చు.బంగారంపై పెట్టుబడికి మార్గాలు●గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్: ప్రధానంగా గోల్డ్ ఈటిఎఫ్లలో పెట్టుబడి●సావరిన్ గోల్డ్ బాండ్లు: వడ్డీతో పాటు, పెరిగిన ధరలను అందుకోవచ్చు●భౌతిక బంగారం: ఆభరణాలు, నాణేలు, కడ్డీలుబంగారం ధరలు గత కొన్ని రోజులుగా విపరీతంగా పెరిగిపోతున్నాయి. అంతర్జాతీయ డిమాండ్, కరెన్సీ కదలికలు, భౌగోళిక రాజకీయ సంఘటనలు వంటివన్నీ ధరలను ప్రభావితం చేస్తున్నాయి. కాబట్టి బంగారంపై సురక్షితమైనదని నిపుణులు చెబుతారు. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. పెట్టుబడి విషయంలో పెట్టుబడిదారుడే నిర్ణయం తీసుకోవాలి. -
సింహాచలం అప్పన్న ఆభరణాలకు శఠగోపం.. బంగారం ఏమైంది?
సాక్షి, విశాఖ: ఏపీలో కూటమి ప్రభుత్వ పాలనలో సింహాచలం అప్పన్న బంగారు ఆభరణాలకు శటగోపం పెట్టారు. భక్తులు ఇచ్చిన విలువైన బంగారు ఆభరణాల అపహరణకు గురైనట్టు సమాచారం. ఆభరణాల లెక్క తేలకపోవడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.వివరాల ప్రకారం.. సింహాచలం అప్పన్న ఆలయంలో లెక్కా పత్రం లేకుండా విరాళాల నిర్వహణ సేకరణ జరిగింది. దీనిపై కమిటీ వేసి విచారణ చేపట్టినా.. ఆభరణాల లెక్కను మాత్రం అధికారులు చెప్పలేదు. విచారణ కమిటీ ఏర్పాటు చేసి నాలుగు నెలలు గడుస్తున్నా లెక్కలు చెప్పకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే పలు ఆభరణాలు అపహరణకు గురైనట్టు భక్తులు చెబుతున్నారు. అప్పన్న ఆలయంలో బంగారం అపహరణపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు.. అనుబంధ ఆలయాల్లో ఉన్న ఆభరణాలపై కూడా నీలి నీడలు కమ్ముకున్నాయి.ఇదిలా ఉండగా.. అంతకుముందు సింహాచలం అప్పన్న ఆభరణాలపై వివాదం నెలకొంది. అప్పన్న ఆభరణాలు అపహారణకు గురయ్యాయంటూ గత ఏడాది విశాఖ జిల్లా కలెక్టర్కు ప్రభాకరాచారి ఫిర్యాదు చేశారు. ఆభరణాల విషయంలో వాస్తవాలు తేల్చేందుకు ఆలయ ఉన్నతాధికారులు కమిటీ వేశారు. కమిటీ ఎటువంటి విచారణ చేపట్టకపోవడంతో మరోసారి ప్రభాకరాచారి.. కలెక్టర్కు అర్జీ పెట్టారు. అనంతరం, కమిటీ విచారణ చేస్తుందని ఆలయ అధికారులు ప్రకటించారు. కానీ, కమిటీ సభ్యులు విచారణ చేయలేదు. భక్తులు ఇచ్చే బంగారు ఆభరణాల వివరాలు నమోదు చేసే రికార్డ్ కూడా మెయింటైన్ చేయడం లేదని ప్రభాకరాచారి ఆరోపిస్తున్నారు. అధికారుల నిర్లక్ష్య వైఖరి కారణంగా అప్పన్న భక్తుల్లో ఆందోళన నెలకొంది. -
బంగారం బుల్లెట్ ర్యాలీ!
న్యూఢిల్లీ: కనకం ‘ల’కారం దాటినా తగ్గేదేలే అంటూ కొనుగోలుదారులకు చుక్కలు చూపిస్తోంది! కొన్నిరోజులుగా రూ. లక్షపైనే కదలాడుతున్న పుత్తడి ఒక్కసారిగా మళ్లీ హైజంప్ చేసింది. బంగారం ధర మంగళవారం బుల్లెట్లా దూసుకెళ్లింది. ఢిల్లీ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత పసిడి 10 గ్రాముల రేటు ఏకంగా రూ. 5,080 పెరిగి రూ. 1,12,750 స్థాయికి చేరింది. దేశీయంగా బంగారానికి ఇది మరో కొత్త ఆల్టైమ్ గరిష్ట స్థాయి. అంతేకాదు.. ఒకేరోజు పసిడి ఇంతలా పెరగడం కూడా ఇదే తొలిసారి కావడం గమనార్హం. వెండి ధర సైతం కిలోకు రూ. 2,800 లాభపడటంతో రూ. 1,28,800 స్థాయిని తాకింది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లోనూ బంగారం 3,698 డాలర్ల వద్ద సరికొత్త గరిష్టాన్ని నమోదు చేసింది. ‘బంగారం మరో రికార్డు స్థాయిని చేరింది. ఈ ఏడాది ఎప్పటికప్పుడు కొత్త గరిష్టాలు నమోదు చేస్తూ అంతర్జాతీయ మార్కెట్లో 35 శాతం పెరిగింది. సెంట్రల్ బ్యాంక్ల నుంచి బలమైన డిమాండ్కు తోడు ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్)లోకి పెట్టుబడుల రాక, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల కోత అంచనాలు.. బంగారం, వెండిలో రికార్డు బ్రేకింగ్ ర్యాలీకి కారణమవుతున్నాయి’అని హెచ్డీఎఫ్సీ కమోడిటీస్ సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ తెలిపారు. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు కొనసాగుతుండటం, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ టారిఫ్ వార్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపిస్తాయన్న ఆందోళనలు సైతం సురక్షిత పెట్టుబడి సాధనంగా భావించే బంగారం ధరలకు మద్దతుగా నిలుస్తున్నట్టు గాంధీ వివరించారు. -
దేశంలోకి రెండేళ్లలో రూ.800 కోట్ల దొంగ బంగారం
న్యూఢిల్లీ: చైనాతో సరిహద్దుగా ఉన్న వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ) ద్వారా గడిచిన రెండేళ్ల కాలంలో కనీసం టన్ను బరువైన రూ.800 కోట్ల బంగారంలో దేశంలోకి దొంగచాటుగా వచ్చింది. 2023, 2024 సంవత్సరాల్లో టిబెటన్లు, చైనీయులే ఈ బంగారాన్ని స్మగ్లింగ్ చేశారు. గతేడాది జూలైలో లద్దాఖ్లో ఇండో–టిబెటన్ బోర్డర్ పోలీస్(ఐటీబీపీ) దళం 108 కిలోల విదేశీ బంగారం కడ్డీలను పట్టుకున్న నేపథ్యంలో ఫెమా చట్టం కింద కేసు నమోదు చేసి, ఈ మొత్తం వ్యవహారంపై దర్యాప్తు చేపట్టినట్లు మంగళవారం ఈడీ వర్గాలు తెలిపాయి.చైనాతో మనకున్న 3,488 కిలోమీటర్ల పొడవైన ఎల్ఏసీ రక్షణ బాధ్యతలను ఐటీబీపీయే చూసుకుంటుంది. ఈ కేసుకు సంబంధించి ఢిల్లీలోని ఐదు ప్రాంతాలు, లద్దాఖ్లో ఒక చోట మంగళవారం తనిఖీలు చేపట్టామని ఈడీ వివరించింది. దొంగతనంగా తీసుకువచ్చిన బంగారానికి సంబంధించిన చెల్లింపులన్నీ క్రిప్టోకరెన్సీ ద్వారానే పూర్తయినట్లు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్ఐ) తెలిపింది. పట్టుబడిన 108 కిలోల విదేశీ బంగారాన్ని చైనాకు చెందిన భు చుమ్చుమ్ అనే వ్యక్తి భారత్లోని టెండు తాషికి ఎల్ఏసీ ద్వారా పంపాడని డీఆర్ఐ వివరించింది. ఇందుకు సంబంధించి 10 మందిని అదుపులోకి తీసుకున్నామంది. -
Today Gold Price: గోల్డ్ రేట్ ఎంతంటే?


