breaking news
Gold
-
పసిడి ప్రియులకు ఊరట.. భారీగా తగ్గిన బంగారం ధరలు
-
బంగారు కోటలో అరుంధతి
కోచింగ్లకు సంబంధించి దేశవ్యాప్తంగా ప్రసిద్ధి పొందిన రాజస్థాన్లోని కోటలో ఏ సబ్జెక్ట్కు సంబంధించి అయినా కోచ్లకు కొదవ లేదు. అయితే బాక్సింగ్ కోచ్ దొరకడం మాత్రం చా...లా కష్టం. అలాంటి కష్టం ఉన్నచోట బాక్సింగ్ రింగ్లోకి అడుగు పెట్టిన అరుంధతి చౌదరి ఒక్కో మెట్టు ఎక్కుతూ అంతర్జాతీయ స్థాయికి చేరింది. తాజా విషయానికి వస్తే... గ్లాస్గోలోని ఎస్ఇసి సెంటర్లో మహిళల 70 కేజీల విభాగంలో స్వర్ణం గెలుచుకుంది....మీరు డాక్టర్ కావాలి లేదా సాఫ్ట్వేర్ ఇంజినీర్ కావాలని మీ తల్లిదండ్రులకు బలంగా ఉండొచ్చు. మీకు మరేదో లక్ష్యం ఉండొచ్చు. ‘నా లక్ష్యం ఇది’ అని స్పష్టంగా చెప్పండి. వారు తప్పకుండా ఒప్పుకుంటారు. మీకు బలమైన ఆశీస్సులు అందిస్తారు. అరుంధతి కథ అలాంటిదే.→ అయినా సరే, ఆటలంటే ఇష్టం‘విద్యాపరంగా కోటకు ఎంత పెద్ద పేరు ఉందో అందరికీ తెలుసు. అరుంధతి చదువులో ముందుండేది. గణితంలో అత్యధిక మార్కులు వచ్చేవి. అందుకే ఐఐటీ లేదా ఐఏఎస్ పరీక్ష రాయించాలనుకునేవాడిని. ఆ రెండిటిలో కనీసం ఒకదానిలోనైనా అరుంధతి విజయం సాధిస్తుందని నాకు నమ్మకం ఉండేది. అందుకే ఆమెను ఒప్పించడానికి ప్రయత్నించాను. అయితే తాను మాత్రం ఆటలు అంటే ఇష్టం అని చెప్పింది’ గతాన్ని గుర్తు చేసుకున్నారు అరుంధతి తండ్రి సురేష్ చౌదరి.→ రెండు ప్రశ్నలుఐఐటీ, ఐఏఎస్ల గురించి చెబుతున్నప్పుడు తండ్రిని ఒక ప్రశ్న అడిగింది అరుంధతి... ‘ఐఐటీ, ఐఏఎస్ ప్రవేశ పరీక్షలలో ఎంతమంది విద్యార్థులు ఉత్తీర్ణులవుతున్నారు?’ ‘ఐఏఎస్లో రెండువందల మంది, ఐఐటీలో పదివేల మంది’ అని చెప్పారు తండ్రి. ‘ఎంతమంది భారతీయులు ఒలింపిక్ స్వర్ణపతకాన్ని గెల్చుకున్నారు?’ అని రెండో ప్రశ్న వేసింది అరుంధతి. ఆయనకు అభినవ్ బింద్రా గురించి మాత్రమే తెలుసు! ఏ ఆటను ఎంచుకోవాలి అనే విషయంలో తండ్రీకూతుళ్ల మధ్య చాలాసేపు చర్చ నడిచింది.టబాక్సింగ్ అనేది ఒలింపిక్ క్రీడ అని తెలిసినప్పుడు అరుంధతి కళ్లలో మెరుపు కనిపించింది. అలా ఆమె మనసులోకి బాక్సింగ్ ప్రవేశించింది. బాక్సింగ్పై ఇష్టం సరే, మరి కోచ్ ఎవరు?ఎవరూ లేరు!చివరికి టైక్వాండో కోచ్ అశోక్ గౌతమ్ ఇంటికి వెళ్లారు. తండ్రీకూతుళ్లు తనకు బాక్సింగ్ గురించి ఏమీ తెలియదని గౌతమ్ చెప్పారు. అయితే ఆయన చేసిన మంచి పని... మహమ్మద్ అలి, మైక్ టైసన్ల గురించి తనకు తెలిసిన విషయాలను అరుంధతికి చెప్పడం. బాక్సింగ్ కోచ్లు అప్లోడ్ చేసిన శిక్షణా వీడియోలను చూసి ఆ విషయాలను అరుంధతికి అర్థమయ్యేలా చెప్పేవారు గౌతమ్.కట్ చేస్తే...యూత్ ఆసియా క్రీడల్లో (2019) లో కాంస్యం, సెర్బియాలో జరిగిన నేషన్స్ కప్(2019)లో స్వర్ణం, యూత్ వరల్డ్ చాంపియన్షిప్స్(2021)లో స్వర్ణం, 2025లో వరల్డ్ బాక్సింగ్ కప్లో స్వర్ణం గెలుచుకుంది అరుంధతి. తాజాగా...కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణం సాధించింది.‘ఒలింపిక్స్ అంటే ఇంటి పై కప్పులాంటిది. ఒకేసారి పై కప్పుకు చేరుకోలేము. అక్కడికి చేరుకోవాలంటే మెట్లు ఎక్కాలి. కామన్వెల్త్ గేమ్స్, ఆసియా గేమ్స్, వరల్డ్ ఛాంపియన్షిప్స్ అనేవి ఒలింపిక్ మెట్లలాంటివి’ అంటుంది అరుంధతి. 2028 ఒలిపింక్స్లో పతకం సాధించడం అరుంధతి లక్ష్యం. ఆమె లక్ష్యం సిద్ధించాలని ఆశిద్దాం. పట్టుదల పెంచేలా...పోటీలో ఓటమి ఎదురైనప్పుడు, నేను బాధగా కనిపించినప్పుడు అమ్మా,నాన్నలు నాకు ధైర్యం ఇచ్చేవారు. ‘నువ్వు కోల్పోయింది జీవితాన్ని కాదు ఆటను మాత్రమే’ అనేవారు. వారి మాటలు నాకు బలమైన టానిక్లా పనిచేసేవి. ఉత్సాహాన్ని పెంచేవి. ‘ఎలాగైనా ఈసారి గెలవాలి’ అనే పట్టుదలను పెంచేవి.– అరుంధతి చౌదరి -
తిరుపతిలో చోరీ కలకలం..
ఆంధ్రప్రదేశ్: తిరుపతి పోలీస్ స్టేషన్ పరిధి భవాని నగర్లో చోరీ ఘటన కలకలం రేపింది. ఒంటరిగా నివసిస్తున్న లక్ష్మి అనే మహిళ ఇంటిలో గుర్తుతెలియని దుండగుడు చోరీకి పాల్పడ్డాడు.బాధితురాలు ఇంటి ఆరుబయట నిద్రిస్తున్న సమయంలో ఇంట్లోకి ప్రవేశించిన దొంగ, బీరువాలో భద్రపరిచిన సుమారు 30 గ్రాముల బంగారు ఆభరణాలను అపహరించినట్లు సమాచారం. ఉదయం లేచి చూసిన బాధితురాలు నగలు కనిపించకపోవడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించింది.దీంతో బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన ఈస్ట్ పోలీసులు ఎస్సై ప్రసాద్ ఆధారాలను సేకరించి, పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల ఫుటేజ్ను పరిశీలించారు. అయితే, నిందితుడిని గుర్తించి త్వరలోనే అరెస్ట్ చేస్తామని చెప్పారు. ప్రస్తుతం కేసు దర్యాప్తు కొనసాగుతోంది. -
ఐపీఓ, ఈక్విటీ వైపు తెలుగు రాష్ట్రాల చూపు!
దేశంలోనే సాహసోపేతమైన, చొరవగల వ్యాపార వర్గాలకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు నిలయంగా ఉన్నాయి. వ్యవసాయం, సంప్రదాయ పరిశ్రమల నుంచి ఐటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాల వరకు ఈ వర్గాలు ఎంతో ఆసక్తిగా ఉన్నాయి. అయితే, గత ఐదేళ్ల ఐపీఓ దరఖాస్తులపై జరిగిన విశ్లేషణను పరిశీలిస్తే.. తెలుగు వారి తదుపరి ఆర్థిక వృద్ధి ప్రయాణం స్టాక్ మార్కెట్లలోనే ఉండబోతోందని స్పష్టమవుతోంది.ప్రైమరీ మార్కెట్లో భాగస్వామ్యందేశవ్యాప్తంగా 33 రాష్ట్రాలు, 785 పట్టణాల పరిధిలో నమోదైన 1.83 కోట్ల ఐపీఓ దరఖాస్తుదారులలో.. తెలంగాణ నుంచి 3.99 లక్షలు (2.17%), ఆంధ్రప్రదేశ్ నుంచి 4.41 లక్షలు (2.40%) నమోదయ్యాయి. మొత్తంగా 8.4 లక్షల మంది తెలుగు మదుపరులు ప్రైమరీ మార్కెట్లలో చురుగ్గా పాల్గొంటున్నారు. మహారాష్ట్ర, గుజరాత్ వంటి చారిత్రాత్మక మార్కెట్ లీడర్లతో పోలిస్తే తెలుగు రాష్ట్రాల్లో ఈక్విటీ కల్చర్ మరింత ఎదగడానికి అపారమైన అవకాశాలు ఉన్నాయి.తలసరి దరఖాస్తుదారులను చూస్తే.. జాతీయ సగటు 12,841 కాగా తెలంగాణలో ప్రతి పది లక్షల మందికి 10,490, ఆంధ్రప్రదేశ్లో 8,316 మంది ఉన్నారు. ఇది వీరి ఆకాంక్షలు తక్కువగా ఉన్నాయని చెప్పడానికి నిదర్శనం కాదు. తెలుగు కుటుంబాల పొదుపు క్రమశిక్షణ చాలా బలమైనది. ఇప్పటివరకు భూమి, బంగారం వంటి సంప్రదాయ ఆస్తులకే ప్రాధాన్యమిచ్చిన వీరు ఇకపై తమ పొదుపులో కొంత భాగాన్ని లిస్టెడ్ ఈక్విటీల వైపు మళ్లించేందుకు బలమైన అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.మౌలిక వసతులు సిద్ధం.. అడ్డంకి లేని ప్రయాణంమదుపు విస్తరణకు కావలసిన డిజిటల్ మౌలిక వసతులు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి. ఎన్ఎస్ఈ గణాంకాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ నుంచి 1.24 కోట్లు, తెలంగాణ నుంచి 61 లక్షల నమోదిత ట్రేడింగ్ ఖాతాలు ఉన్నాయి. ట్రేడింగ్ ఖాతాల లభ్యత సులువైనందున సాధారణ పొదుపుదారులను క్రియాశీల ఈక్విటీ మదుపరులుగా మార్చడం తదుపరి ప్రాథమిక లక్ష్యం కానుంది. రియల్ ఎస్టేట్, బంగారం స్థిరత్వాన్నిస్తాయి. బ్యాంక్ డిపాజిట్లు నమ్మకాన్నిస్తాయి. కానీ ఈక్విటీలు దీర్ఘకాలంలో దేశ వ్యాపార వృద్ధిలో ప్రత్యక్ష భాగస్వామ్యాన్ని, అధిక రాబడిని అందిస్తాయి. సెబీ ప్రోత్సహిస్తున్న సమతుల్య విధానం కూడా ఇదే.ఇదీ చదవండి: స్కూల్స్ వద్ద జంక్ ఫుడ్ బ్యాన్! -
బంగారం ధరలు రివర్స్.. కాస్త గుడ్న్యూస్
దేశంలో బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. రెండు రోజులుగా పెరుగుతూ వచ్చిన పసిడి ధరలు నేడు కాస్త తగ్గాయి. ఇక వెండి ధరలు మాత్రం వరుసగా నాలుగో రోజూ నిలకడగా కొనసాగుతున్నాయి. ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం, వెండి ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. దేశంలోని ప్రధాన నగరాల్లో నేడు బంగారం (Today Gold Rate), వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.(‘సామ్రాజ్యాలు కూలిపోతాయి.. బంగారం నిలుస్తుంది’) -
బంగారం ధరలు మరోసారి.. తులం రేటు ఇలా..
దేశంలో బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. క్రితం రోజున పెరుగుదల బాట పట్టిన పసిడి ధరలు నేడు వరుసగా రెండో రోజూ పెరుగుదలను కొనసాగించాయి. దీంతో నేటి కొనుగోలుదారులకు కాస్త నిరాశ తప్పడం లేదు. ఇక వెండి ధరలు మాత్రం వరుసగా మూడో రోజూ ఎటువంటి మార్పు లేకుండా స్థిరంగా కొనసాగుతున్నాయి. ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం, వెండి ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. దేశంలోని ప్రధాన నగరాల్లో నేడు బంగారం (Today Gold Rate), వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. -
దేశంలో పసిడికి తగ్గిన డిమాండ్... ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో 6 శాతం డౌన్
-
పసిడి డిమాండ్ డౌన్
ముంబై: దేశీయంగా ప్రస్తుత సంవత్సరం ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో పసిడికి డిమాండ్ 6 శాతం మేర క్షీణించింది. 131.4 టన్నులకు పరిమితమైంది. సీజనల్గా విక్రయాలు తగ్గడం, కస్టమ్స్ డ్యూటీ పెరగడంతో పాటు పసిడి కొనుగోళ్లను తగ్గించుకోవాలంటూ స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలను సూచించడంలాంటి అంశాలు ఇందుకు కారణమయ్యాయి. ’గోల్డ్ డిమాండ్ ట్రెండ్స్’ పేరిట రూపొందించిన నివేదికలో వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (డబ్ల్యూజీసీ) ఈ విషయాలు వెల్లడించింది. దీని ప్రకారం గతేడాది ఇదే వ్యవధిలో పసిడికి డిమాండ్ 139.7 టన్నులుగా నమోదైంది. పసిడికి పరిమాణంపరంగా డిమాండ్ నెమ్మదించినప్పటికీ విలువ మాత్రం రికార్డు స్థాయికి పెరిగినట్లు డబ్ల్యూజీసీ రీజినల్ సీఈవో (ఇండియా) సచిన్ జైన్ తెలిపారు. ‘2025 రెండో త్రైమాసికంలో వినియోగం విలువ రూ. 1,32,500 కోట్లుగా ఉండగా ఈసారి రూ. 1,98,100 కోట్లకు చేరింది. గతేడాది రెండో త్రైమాసికంతో పోలిస్తే దాదాపు 50 శాతం పెరిగింది. ధర ఎక్కువగా ఉన్నప్పటికీ పసిడి కొనుగోళ్లపై ప్రజలు ఆసక్తి చూపుతున్నారనడానికి ఇది నిదర్శనం‘ అని ఆయన పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో ఏడాది మొత్తం మీద డిమాండ్ 650–750 టన్నులుగా ఉంటుందని అంచనా వేస్తున్నట్లు వివరించారు. అయితే, ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిస్థితులు, వడ్డీ రేట్లు, ద్రవ్యోల్బణం మొదలైన వాటిని పరిగణనలోకి తీసుకుంటే ఈ శ్రేణిలో మధ్య స్థాయికి కూడా పరిమితం కావొచ్చన్నారు. బంగారం ధరలు మరింత కరెక్షన్కి లోనయ్యి, కస్టమ్స్ డ్యూటీ తగ్గిస్తే డిమాండ్ గరిష్ట స్థాయిలో ఉండొచ్చని వివరించారు. స్మగ్లింగ్ రిస్క్ లు.. సుంకాల పెంపుతో బ్లాక్ మార్కెటింగ్ పెరిగిందని జైన్ ఆందోళన వ్యక్తం చేశారు. అక్రమ మార్గాల్లో ఇప్పటికే మార్కెట్లోకి బంగారం ప్రవేశిస్తోందని చెప్పారు. స్మగ్లింగ్, అక్రమ మార్గాల్లో మార్కెట్లలోకి పసిడి వెల్లువెత్తుతుండటమనేది పరిశ్రమకు అతి పెద్ద రిస్క్ అని జైన్ చెప్పారు. ‘ప్రస్తుత ట్రెండ్స్ చూస్తే బంగారానికి సంప్రదాయ కోణంలోనే కాకుండా ఆర్థిక అనిశ్చితిలో అక్కరకొచ్చే వ్యూహాత్మక పెట్టుబడి సాధనం కూడా అనే కోణంలోనూ డిమాండ్ ఏర్పడుతోందని తెలుస్తోంది. ద్వితీయార్థంలో పండుగలు, పెళ్లిళ్ల సీజన్తో మరింత డిమాండ్ పెరగొచ్చు‘ అని జైన్ పేర్కొన్నారు. నివేదికలో మరిన్ని విశేషాలు.. → త్రైమాసికంలో మొత్తం జ్యుయలరీ డిమాండ్ 88.8 టన్నుల నుంచి 15% తగ్గి 75.1 టన్నులకు నెమ్మదించింది. ఇన్వెస్ట్మెంట్పరంగా కడ్డీలు, నాణేలకు డిమాండ్ 9% పెరిగి 50.3 టన్నులకు చేరింది. ఇక అంతర్జాతీయంగా పెట్టుబడుల ఉపసంహరణ జరిగినప్పటికీ, మన గోల్డ్ ఈటీఎఫ్ల్లోకి నికరంగా 4.2 టన్నుల పెట్టుబడులొచ్చాయి. → క్యూ1లో రీసైకిల్ చేసిన మొత్తం పసిడి పరిమాణం 23.1 టన్నుల నుంచి 17% క్షీణించి 19.2 టన్నులకు తగ్గింది. → దిగుమతులు 23% క్షీణించి 127.4 టన్నుల నుంచి 98.1 టన్నులకు తగ్గాయి. → పసిడి ఔన్సు ధర సగటున 4,506 డాలర్లుగా ఉంది. 2025లో ఇదే వ్యవధిలో రేటు 3,280 డాలర్లుగా నమోదైంది. -
బంగారం కొనుగోళ్లు.. రూ.1.98 లక్షల కోట్లు!
భారతీయులకు బంగారం అంటే ప్రత్యేకమైన అభిమానం. దీనికి కారణాలు చాలానే ఉన్నాయి. అయితే.. పండుగలు, పెళ్లిళ్లు లేదా ఇతర శుభకార్యాలకు ప్రజలు గోల్డ్ కొనుగోలు చేస్తూనే ఉంటారు. కానీ.. ఈసారి పసిడి ధరలు భారీగా పెరగడంతో 2026 ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో కొనుగోళ్ల పరిమాణం కొంత తగ్గినప్పటికీ.. బంగారంపై ప్రజలు ఖర్చు చేసిన మొత్తం మాత్రం రికార్డు స్థాయికి చేరుకోవడం విశేషం.వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (WGC) విడుదల చేసిన నివేదిక ప్రకారం.. ఈ త్రైమాసికంలో దేశంలో బంగారం డిమాండ్ 130.9 టన్నులుగా నమోదైంది. గత ఏడాది(139.1 టన్నులు)తో పోలిస్తే ఈ ఏడాది 6 శాతం తక్కువే, కానీ.. ధరలు మాత్రమే గత సంవత్సరంతో పోలిస్తే.. ఈ ఏడాది దాదాపు 59 శాతం పెరిగింది. దీనివల్ల కొనుగోళ్లపై ప్రభావం పడిందని నివేదిక వెల్లడించింది.2026 ఏప్రిల్-జూన్ కాలంలో భారతీయులు బంగారం కొనుగోలు కోసం రూ.1.98 లక్షల కోట్లను ఖర్చు చేసినట్లు నివేదిక చెబుతోంది. ఇది గత ఏడాదితో పోలిస్తే 50 శాతం ఎక్కువ. అంటే ప్రజలు తక్కువ పరిమాణంలో బంగారం కొనుగోలు చేసినప్పటికీ, పెరిగిన ధరల కారణంగా ఖర్చు చేసిన మొత్తం పెరిగిందన్నమాట.ధరలు ఎక్కువగా ఉన్నప్పటికీ ప్రజలు బంగారం కొనుగోలు చేయడానికి వెనుకడుగు వేయడం లేదని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ తెలిపింది. పాత బంగారం ఇచ్చి కొత్త ఆభరణాలు తీసుకునే ఎక్స్చేంజ్ పద్ధతులు, ఈఎంఐ సౌకర్యాలు, తక్కువ బడ్జెట్లో విలువైన ఆభరణాల కొనుగోళ్లు పెరుగుతున్నాయి. రానున్న రోజుల్లో బంగారం డిమాండ్ అనేది ధరలపై ఆధారపడి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. పెళ్లిళ్లు, పండుగల సీజన్ కారణంగా రెండో అర్ధభాగంలో కొనుగోళ్లు పెరిగే అవకాశం ఉన్నప్పటికీ.. ధరలు ఇలాగే అధికంగా కొనసాగితే ఆభరణాల కొనుగోళ్లపై కొంత ప్రభావం ఉండొచ్చని చెబుతున్నారు.ఇదీ చదవండి: రైలు ఏసీ కోచ్లో రెండు బెడ్షీట్లు ఎందుకు ఇస్తారో తెలుసా? -
బంగారం లాంటి సంపాదన.. అయినా ఐటీ జంట భయాందోళన!
చేతిలో మంచి ఆదాయం.. అప్పులు లేవు.. కోట్ల రూపాయల విలువైన బంగారం.. అమెరికా స్టాక్స్లో పెట్టుబడులు.. అయినా భవిష్యత్తుపై భయం. ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ఓ యువ ఐటీ దంపతులు తమ ఉద్యోగ భద్రతపై ఆందోళన వ్యక్తం చేసిన తీరు సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది.‘హై ఎర్నర్.. కానీ ఇంకా రిచ్ కాదు’ అంటూ 27 ఏళ్ల సాఫ్ట్వేర్ ఇంజినీర్ రెడిట్లో తన ఆర్థిక పరిస్థితిని పంచుకున్నాడు. తనకు, 23 ఏళ్ల తన భార్యకు కలిపి నెలకు సుమారు రూ.5 లక్షల నికర ఆదాయం వస్తుందని తెలిపాడు. చిన్న పట్టణంలో రిమోట్గా పనిచేస్తున్నామని పేర్కొన్నాడు. తమకు ఎలాంటి రుణాలు లేవని, తల్లిదండ్రుల ఇల్లు, సొంత కారు ఉన్నాయని వివరించాడు.రూ.95 లక్షలకు పైగా ఆస్తులురెడిట్ పోస్ట్ ప్రకారం.. ఈ జంట వద్ద సుమారు రూ.15 లక్షల విలువైన బంగారు నాణేలు, రూ.7 లక్షల అమెరికా స్టాక్స్, రూ.3 లక్షల ఎఫ్డీలు ఉన్నాయి. వీటికి అదనంగా తనకు, తన భార్య వద్ద సుమారు రూ.70 లక్షల విలువైన బంగారు ఆభరణాలు ఉన్నాయని చెప్పాడు. అంటే, పేర్కొన్న ఆస్తుల విలువే సుమారు రూ.95 లక్షలకు చేరుతుంది. దీనికి కారు, తల్లిదండ్రుల ఇల్లు వంటి అంశాలను కలిపితే వారి ఆర్థిక స్థితి మరింత బలంగా కనిపిస్తుంది. అంతేకాదు.. ఇద్దరికీ వ్యక్తిగత ఆరోగ్య బీమా కింద రూ.10 లక్షల చొప్పున, టర్మ్ ఇన్సూరెన్స్ కింద రూ.3 కోట్ల చొప్పున కవరేజీ ఉందని కూడా ఆ రెడిట్ పోస్ట్లో పేర్కొన్నాడు.ఐదేళ్లలో రూ.3–4 కోట్ల లక్ష్యంఇంత మంచి ఆదాయం, ఆస్తులు ఉన్నప్పటికీ ఈ యువకుడిని ప్రధానంగా వేధిస్తున్నది ఉద్యోగ భద్రత. AI వేగంగా అభివృద్ధి చెందుతున్నందున వచ్చే ఐదారు సంవత్సరాల్లో అనేక సంప్రదాయ ఉద్యోగాలు కనుమరుగయ్యే అవకాశం ఉందని అతను అభిప్రాయపడ్డాడు. అందుకే ప్రస్తుతం ఉన్న అధిక ఆదాయాన్ని ఉపయోగించుకుని రూ.3–4 కోట్ల సురక్షిత నికర సంపదను నిర్మించాలనుకుంటున్నట్లు తెలిపాడు.తన ప్రాథమిక పెట్టుబడి ప్రణాళికలో ప్రతి నెలా 10 గ్రాముల బంగారం కొనుగోలు చేయడం, రూ.2 లక్షలను ఎఫ్డీల్లో పెట్టడం, మిగిలిన మొత్తంలో సుమారు 1,500 డాలర్లను అమెరికా స్టాక్స్లో పెట్టుబడి పెట్టడం వంటి అంశాలను ప్రస్తావించాడు. అయితే, తాము ఇద్దరూ సాఫ్ట్వేర్ ఇంజినీర్లమే కావడంతో తమ ప్రస్తుత ఉద్యోగాల స్థిరత్వంపై నమ్మకం తగ్గుతోందని అతను చెప్పాడు. కన్సల్టింగ్, సర్వీసెస్ ఆధారిత ఐటీ కంపెనీల భవిష్యత్తుపై కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాడు.ఈ రెడిట్ పోస్ట్పై స్పందించిన పలువురు నెటిజన్లు జంట ఆర్థిక పరిస్థితిని చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. 27 ఏళ్ల వయసులో అప్పులు లేకుండా రూ.1 కోట్లకు దగ్గరగా ఆస్తులు కలిగి ఉండటం మంచి స్థితి అని కొందరు పేర్కొన్నారు. మరికొందరు మాత్రం పెట్టుబడుల్లో వైవిధ్యం అవసరమని సూచించారు. ఇంకొందరు ‘సంపాదన పెంచుకోవడం’పై దృష్టి పెట్టాలని, AI వల్ల ఉద్యోగాలు మారుతున్న సమయంలో కొత్త టెక్నాలజీలను నేర్చుకోవాలని సూచించారు. -
ఏకంగా 13 వేలు తగ్గిన బంగారం నేడు తులం ఎంతంటే?
-
మారిపోయిన బంగారం ధరలు.. తులం ఎంతంటే..
దేశంలో బంగారం ధరలు ఎగిశాయి. గత రెండు రోజులుగా తగ్గుతూ వచ్చిన పసిడి ధరలు నేడు మళ్లీ పెరుగుదల బాటపట్టాయి. దీంతో నేటి కొనుగోలుదారులకు నిరాశ తప్పడం లేదు. ఇక వెండి ధరలు మాత్రం ఎటువంటి మార్పు లేకుండా స్థిరంగా కొనసాగుతున్నాయి. ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం, వెండి ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. దేశంలోని ప్రధాన నగరాల్లో నేడు బంగారం (Today Gold Rate), వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.(‘సామ్రాజ్యాలు కూలిపోతాయి.. బంగారం నిలుస్తుంది’) -
ఓడలో బంగారం వస్తుందన్నాడు.. చివరికి
సాక్షి, హైదరాబాద్: విదేశీ బంగారం వ్యాపారాలతో తనకు ఉన్న పరిచయాలను వినియోగించుకుని, తక్కువ ధరకు బంగారాన్ని ఓడల్లో తెప్పిస్తానంటూ చెప్పి నగరానికి చెందిన వ్యక్తి నుంచి రూ.2 కోట్లు కాజేసిన నిందితుడిని సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. ఇదే పంథాలో మరికొందరిని మోసం చేసినట్లు, గతంలో ఆరు కేసులు ఉన్నట్లు తేలడంతో వ్యవస్థీకృత నేరగాడిగా పరిగణిస్తున్నట్లు డీసీపీ ఎస్.చైతన్యకుమార్ బు«ధవారం ప్రకటించారు.సనత్నగర్కు చెందిన రాకేష్ బలరాం గౌడ్కు లక్ష్మీకాంత్ రెడ్డితో పరిచయం ఉంది. తనకు విదేశీ బంగారం వ్యాపారులతో సంబంధాలు ఉన్నాయని, వారి నుంచి తక్కువ ధరకు పసిడి ఖరీదు చేస్తుంటానని చెప్పాడు. 2024 జూన్ 14న రాకేష్ ఇంటికి వెళ్లిన లక్ష్మీకాంత్ దుబాయ్ నుంచి శ్రీలంక మీదుగా ముంబైకి ఓడలో బంగారం దిగుమతి చేస్తున్నానని చెప్పాడు. మొబైల్లో బంగారు బిస్కెట్ల వీడియోలు చూపించి, అతి తక్కువ ధరకు 24 క్యారెట్ల బంగారం మూడు కిలోలు ఇప్పిస్తానని హామీ ఇచ్చాడు. 20 రోజుల్లో బంగారం అందజేస్తానని నమ్మించి మొత్తం రూ.2 కోట్లను తీసుకున్నాడు. ఇందులో రూ.1.86 కోట్లు అప్పుగా తెచ్చిన రాకేష్ ఇతడికి చెల్లించాడు. నెల రోజుల తర్వాత సంప్రదించిన లక్ష్మీకాంత్ శ్రీలంకలో 10 కిలోల బంగారంతో పోలీసులకు చిక్కానని చెప్పి పసిడి ఇవ్వలేనన్నాడు. అనంతరం మరో 500 గ్రాముల బంగారం రూ.25 లక్షలకు ఇప్పిస్తానని చెప్పి, 2024 డిసెంబర్ 15న రూ.5 లక్షలు, డిసెంబర్ 17న రూ.16 లక్షలు తీసుకున్నాడు. అనుమానం రావడంతో నగదు ఇస్తున్న సమయంలో బాధితుడు వీడియో రికార్డింగ్ చేశాడు.ఆ తర్వాత లక్ష్మీకాంత్ రెడ్డి తన ఫోన్ కాల్స్, సందేశాలకు స్పందించకుండా తప్పించుకుని తిరుగుతున్నాడు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న ఏసీపీ మల్లికార్జున చౌదరి ఎస్సై గోపికిరణ్ రెడ్డి దర్యాప్తు చేశారు. పరారీలో ఉన్న నిందితుడి ఆచూకీని అతడి స్వగ్రామం మహబూబ్నగర్ జిల్లా అయ్యవారిపల్లిలో గుర్తించారు. అక్కడే అతడిని పట్టుకున్న సీసీఎస్ పోలీసులు రిమాండ్కు తరలించారు. నిందితుడిపై గతంలో మహంకాళి, రాయదుర్గం, కేపీహెచ్బీ, మాదాపూర్లతో పాటు కోయిల్కొండ, ఏపీలోని పెందుర్తి ఠాణాల్లో కేసులు ఉన్నట్లు గుర్తించారు. -
‘సామ్రాజ్యాలు కూలిపోతాయి.. బంగారం నిలుస్తుంది’
ప్రపంచ ప్రసిద్ధ ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ పుస్తక రచయిత, ఇన్వెస్ట్మెంట్ నిపుణుడు రాబర్ట్ కియోసాకి మరోసారి బంగారం, వెండిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ చరిత్రలో ప్రతి సామ్రాజ్యం ఒకే చక్రాన్ని అనుసరిస్తుందని, అధికంగా కరెన్సీ ముద్రించడం చివరికి ఆర్థిక వ్యవస్థను బలహీనపరుస్తుందని ఆయన తన ఫేస్బుక్ పోస్టులో పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కాగితపు కరెన్సీ కంటే బంగారం, వెండి వంటి వాస్తవ ఆస్తులే సంపదను కాపాడగలవని ఆయన అభిప్రాయపడ్డారు.రోమన్ సామ్రాజ్యం నుంచి స్పెయిన్, బ్రిటన్ వరకు చరిత్రను పరిశీలిస్తే, కరెన్సీ విలువ తగ్గిన ప్రతిసారి బంగారం తన విలువను నిలబెట్టుకుందని కియోసాకి తెలిపారు. ప్రభుత్వాలు ఎంత డబ్బునైనా ముద్రించగలవని, కానీ బంగారం లేదా వెండిని ముద్రించడం సాధ్యం కాదని ఆయన చెప్పారు. అందుకే ధనవంతులు తమ సంపదను బంగారం, వెండి వంటి పరిమిత లభ్యత కలిగిన ఆస్తుల్లో నిల్వ చేస్తారని వివరించారు.ద్రవ్యోల్బణం ప్రజల కొనుగోలు శక్తిని క్రమంగా తగ్గిస్తుందని, అలాంటి సమయంలో బంగారం, వెండి కొనుగోలు శక్తిని రక్షించే సాధనాలుగా పనిచేస్తాయని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వాలపై నమ్మకం తగ్గినప్పుడు బంగారం ధరలు పెరుగుతున్నట్లు కనిపించినా, వాస్తవానికి కరెన్సీ విలువే తగ్గుతోందని ఆయన వ్యాఖ్యానించారు.తాను అమెరికా అంతమవుతుందని చెప్పడం లేదని, అయితే అమెరికా డాలర్ ఆధిపత్యం క్రమంగా తగ్గే దిశగా సాగుతోందని కియోసాకి అభిప్రాయపడ్డారు. చరిత్రలో కరెన్సీ విలువను అధికంగా తగ్గించిన ప్రతి సామ్రాజ్యం చివరకు తన ఆధిపత్యాన్ని కోల్పోయిందని గుర్తు చేశారు.బంగారం, వెండి ఒక్క రాత్రిలో ధనవంతులను చేసే పెట్టుబడులు కాదని, ఆర్థిక సంక్షోభాల నుంచి రక్షించే "ఫైనాన్షియల్ లైఫ్బోట్లు" అని ఆయన పేర్కొన్నారు. పరిస్థితులు మరింత క్లిష్టం అయ్యే వరకు వేచి చూడకుండా, చిన్న మొత్తంతో అయినా వెండి నాణెం లేదా చిన్న పరిమాణంలోని బంగారం కొనుగోలు చేసి నిజమైన సంపదను కూడబెట్టడం ప్రారంభించాలని తన ఫాలోవర్లకు సూచించారు. కాగితపు కరెన్సీలో మాత్రమే పొదుపు చేస్తే కాలక్రమంలో కొనుగోలు శక్తి తగ్గిపోతుందని, బంగారం, వెండి వంటి వాస్తవ ఆస్తులే దీర్ఘకాలంలో సంపదను రక్షిస్తాయని ఆయన తన పోస్టులో స్పష్టం చేశారు. -
బంగారం ధర ఒక్కసారిగా భారీగా పడిపోయింది..!
-
భారీగా పెరిగిన బంగారం ధరలు.. 10 గ్రాముల ధర మరీ ఇంతనా? తాజా రేట్లు చూసి షాక్ అవుతారు!
-
బంగారానికి మరింత ఊపు.. తులం భారీ రేటే!
దేశంలో బంగారం ధరల పెరుగుదల ఆగడం లేదు. మొన్న భారీగా పెరిగి, నిన్న నిలకడగా కొనసాగిన పసిడి ధరలు నేడు మరింత ఊపందుకున్నాయి. దీంతో నేటి కొనుగోలుదారులకు నిరాశ తప్పడం లేదు. ఇక వెండి ధరలు మాత్రం ఎటువంటి మార్పు లేకుండా స్థిరంగా కొనసాగుతున్నాయి. ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం, వెండి ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. దేశంలోని ప్రధాన నగరాల్లో నేడు బంగారం (Today Gold Rate), వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.(బంగారం కొనేవాళ్లకు అలర్ట్.. ఆ మార్క్, కోడ్ ఉన్నాయా?) -
‘బంగారం, వెండి.. అందుకే అక్కడ దాచుకుంటున్నా’
‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ రచయిత, ప్రముఖ పెట్టుబడి నిపుణుడు రాబర్ట్ కియోసాకి అమెరికా పెరుగుతున్న ప్రభుత్వ అప్పులపై మరోసారి ఆందోళన వ్యక్తం చేశారు. తన అధికారిక ‘ఎక్స్’ ఖాతాలో చేసిన తాజా పోస్టులో అమెరికా రుణభారం ప్రమాదకర స్థాయికి చేరిందని పేర్కొంటూ, కరెన్సీని పొదుపు చేయడం కంటే వాస్తవ ఆస్తులను (Real Assets) కూడబెట్టడం మంచిదని అభిప్రాయపడ్డారు.కియోసాకి ప్రకారం.. 2008 ప్రపంచ ఆర్థిక సంక్షోభం (GFC)కు ముందు అమెరికా ప్రభుత్వ రుణం సుమారు 9.5 ట్రిలియన్ డాలర్లు ఉండగా, ప్రస్తుతం అది 39 ట్రిలియన్ డాలర్లకు చేరువలో ఉందన్నారు. ఇదే సమయంలో అమెరికా బాండ్ మార్కెట్ కూడా ఒత్తిడిని ఎదుర్కొంటోందని ఆయన వ్యాఖ్యానించారు.ఈ సందర్భంగా ఆయన ఒక ఆసక్తికరమైన పోలికను ప్రస్తావించారు. "మీరు నిమిషానికి ఒక డాలర్ చొప్పున ఖర్చు చేస్తే ఒక ట్రిలియన్ డాలర్లు ఖర్చు చేయడానికి 32 వేల సంవత్సరాలు పడుతుంది. కానీ అమెరికా ప్రభుత్వం దాదాపు ప్రతి 90 రోజులకు ఒక ట్రిలియన్ డాలర్ల మేర కొత్త అప్పు సృష్టిస్తోంది" అని పేర్కొన్నారు.ఈ పరిస్థితుల్లో ప్రజలు డబ్బును పొదుపు చేయాలా? అని ప్రశ్నిస్తూ, తన పుస్తకం ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’లో చెప్పిన మూడు ప్రధాన ఆర్థిక సూత్రాల్లో ఒకటైన "ధనవంతులు నగదును పొదుపు చేయరు" అనే విషయాన్ని గుర్తు చేశారు.తాను 1965 నుంచి వెండి, 1971 నుంచి బంగారం, 2012 నుంచి బిట్కాయిన్, 2022 నుంచి ఎథీరియం కూడబెట్టుకుంటున్నానని కియోసాకి వెల్లడించారు. అలాగే తన బంగారం, వెండి నిల్వలను స్విట్జర్లాండ్ వెలుపల ఉన్న స్విస్ వాల్ట్లలో భద్రపరుస్తున్నానని చెప్పారు. గతంలో అమెరికా ప్రభుత్వం బంగారం వ్యక్తిగత యాజమాన్యాన్ని నిషేధించి స్వాధీనం చేసుకున్న చరిత్ర ఉందని కూడా ఆయన తన పోస్టులో ప్రస్తావించారు.ప్రపంచం ప్రస్తుతం ఆర్థికంగా అల్లకల్లోల పరిస్థితులను ఎదుర్కొంటోందని పేర్కొన్న కియోసాకి, "ఇవి ప్రపంచ చరిత్రలో అత్యంత అనిశ్చిత కాలాలు. జాగ్రత్తగా ఉండండి. నేను చేస్తున్నది ఇదే. మరి మీరు ఏమి చేస్తున్నారు?" అంటూ తన పోస్టును ముగించారు.HOW MUCH DEBT?FYI: In 2008, just before the GFC: (Great Financial Crisis) the US debt was approximately $9.5 trillion.Today, just as US Bonds are crashing, US Debt is approaching $39 trillion.Q: If you spent $1 a minute how long would it take you to spend $1 trillion?…— Robert Kiyosaki (@theRealKiyosaki) July 25, 2026 -
రూ.1.45 లక్షలకు చేరిన బంగారం ధర!
బంగారం ధరల్లో రోజురోజుకి ఊహకందని మార్పులు జరుగుతున్నాయి. ఒకరోజు తగ్గుముఖం పడితే.. మరోరోజు భారీగా పెరగడం. ఇంకోరోజు ధరలు స్థిరంగా ఉండిపోవడం. ఇలా గోల్డ్ రేటు ముందుకు సాగుతోంది. ఈ కథనంలో వారం (జులై 19 నుంచి 25 వరకు) రోజుల్లో పసిడి ధరలు ఎలాంటి మార్పునకు లోనైంది. తాజా ధరలు ఎలా ఉన్నాయనే వివరాలు చూసేద్దాం.హైదరాబాద్, విజయవాడలలో గత ఆదివారం (జులై 19) రూ.1,43,290 వద్ద ఉన్న 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర జులై 25 నాటికి రూ.1,44,930 వద్దకు (రూ.1640 పెరిగింది) చేరింది. 22 క్యారెట్ల పసిడి రేటు రూ.1,31,350 నుంచి రూ.1,32,850 వద్దకు (రూ.1500 పెరిగింది) చేరింది.ఢిల్లీలో 24 క్యారెట్ల తులం బంగారం ధర ఏడు రోజుల్లో రూ.1,43,440 నుంచి రూ.1,45,080 వద్దకు (రూ.1640 పెరిగింది) చేరింది. 22 క్యారెట్ల ధర రూ.1,31,450 నుంచి రూ.1,33,000 వద్దకు (రూ.1550 పెరిగింది) చేరింది. దీన్ని బట్టి చూస్తే వారం రోజుల్లో గోల్డ్ రేటు ఎంత పెరిగిందో స్పష్టంగా అర్థమవుతోంది.చెన్నైలో కూడా బంగారం ధరల్లో గణనీయమైన మార్పులు కనిపించాయి. జులై 19న రూ.1,43,290 వద్ద ఉన్న 24 క్యారెట్ల తులం పసిడి ధర జులై 25 నాటికి రూ.1,45,090 వద్దకు చేరింది. 22 క్యారెట్ల ధర రూ.1,31,350 నుంచి రూ.1,33,000 వద్దకు చేరింది.వెండి ధరలుభారతదేశంలో సిల్వర్ రేటు కూడా వారం రోజుల్లో గణనీయమైన మార్పుకునకు లోనైంది. దీంతో కేజీ వెండి రేటు ఏడు రోజుల్లో రూ.2.35 లక్షల నుంచి రూ.1.40 లక్షలకు చేరింది. అంటే రూ.5000 పెరిగిందన్నమాట. -
తారుమారైన బంగారం ధరలు.. తులం ఎంతంటే..
దేశంలో బంగారం ధరలు ఒక్కరోజులోనే తారుమారయ్యాయి. క్రితం రోజున భారీగా తగ్గి కొనుగోలుదారులకు ఊరట కలిగించిన పసిడి ధరలు నేడు మళ్లీ పరుగును అందుకున్నాయి. ఇక వెండి ధరలు కూడా నిన్నటి స్థాయిలోనే ఎగిశాయి. ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం, వెండి ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. దేశంలోని ప్రధాన నగరాల్లో నేడు బంగారం (Today Gold Rate), వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.(బంగారం కొనేవాళ్లకు అలర్ట్.. ఆ మార్క్, కోడ్ ఉన్నాయా?) -
పాతాళానికి పడిపోయిన బంగారం ధరలు ఈరోజు తులం ఎంతంటే?
-
‘బంగారం, వెండి కాదు.. భవిష్యత్తు ఆ లోహానిదే’
'రిచ్ డాడ్ పూర్ డాడ్' రచయిత, ప్రముఖ ఇన్వెస్ట్మెంట్ నిపుణుడు రాబర్ట్ కియోసాకి మరోసారి ఇన్వెస్టర్ల దృష్టిని కమోడిటీ మార్కెట్పైకి మళ్లించారు. ఈసారి బంగారం, వెండి కాకుండా రాగి (కాపర్) భవిష్యత్తుపై ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాగి ధరలు గత ఏడాదిలో దాదాపు 50 శాతం పెరిగాయని, అయినప్పటికీ ఈ పెరుగుదల వెనుక ఉన్న అసలు కారణాలను చాలా మంది గుర్తించలేకపోతున్నారని ఆయన ఫేస్బుక్లో చేసిన పోస్టులో పేర్కొన్నారు.కియోసాకి ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) డేటా సెంటర్లు, విద్యుత్ గ్రిడ్ల విస్తరణ, ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తి వేగంగా పెరుగుతుండటంతో రాగికి భారీగా డిమాండ్ ఏర్పడుతోంది. ఈ రంగాలన్నీ విడివిడిగా కాకుండా ఒకేసారి రాగిని అధికంగా వినియోగిస్తున్నాయని ఆయన వివరించారు. ప్రస్తుతం ప్రపంచ రాగి డిమాండ్ సుమారు 2.8 కోట్ల టన్నులుగా ఉండగా, 2040 నాటికి అది 4.2 కోట్ల టన్నులకు మించి పెరిగే అవకాశం ఉందని విశ్లేషకుల అంచనాలను ఆయన ప్రస్తావించారు.అయితే మరోవైపు రాగి ఉత్పత్తి అంతే వేగంగా పెరగడం లేదని కియోసాకి పేర్కొన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద రాగి ఉత్పత్తిదారుల్లో ఒకటైన చిలీలో ఈ ఏడాది ఉత్పత్తి 9.5 శాతం తగ్గిందని, వచ్చే ఏడాదిలో కూడా ఉత్పత్తి తగ్గే అవకాశముందని గనుల సంస్థలు హెచ్చరిస్తున్నాయని చెప్పారు. గనుల్లో లభించే ఖనిజ నాణ్యత కూడా గత రెండు దశాబ్దాలుగా క్షీణిస్తుండటంతో, అదే పరిమాణంలో రాగిని పొందేందుకు గతంతో పోలిస్తే 20 శాతం ఎక్కువ రాళ్లను తవ్వాల్సి వస్తోందని వివరించారు.ఈ పరిస్థితిని కియోసాకి "కాపర్ సిజర్స్"గా అభివర్ణించారు. ఒకవైపు డిమాండ్ పెరుగుతుండగా, మరోవైపు సరఫరా తగ్గిపోతోందని, ఈ రెండు పరిస్థితులు కలిసి ధరలను మరింత పెంచే అవకాశముందని ఆయన అభిప్రాయపడ్డారు.సాంప్రదాయిక పొదుపు పథకాలపై మాత్రమే ఆధారపడే వారు ఈ పరిస్థితిలో నష్టపోయే ప్రమాదం ఉందని, మారుతున్న ఆర్థిక ధోరణులను అర్థం చేసుకుని పెట్టుబడి అవకాశాలను గుర్తించాల్సిన అవసరం ఉందని కియోసాకి సూచించారు. ఏ గనుల కంపెనీ విజయం సాధిస్తుందో ఊహించడం కంటే, ఏ సంస్థలు లేదా రంగాలు ఎలాంటి పరిస్థితుల్లోనూ లాభపడతాయనే దానిపై దృష్టి పెట్టాలని తన 'రిచ్ డాడ్' తనకు నేర్పిన పాఠమని ఆయన పేర్కొన్నారు. -
డబుల్ ధమాకా.. పడిపోయిన బంగారం, వెండి ధరలు
దేశంలో బంగారం, వెండి ధరల స్పీడ్కు బ్రేకులు పడ్డాయి. దాదాపుగా ఆరు రోజులుగా నాన్స్టాప్గా పెరిగిన పసిడి ధరలు నేడు భారీగా పడిపోయాయి. ఇక వెండి ధరలు కూడా నేడు గణనీయంగా క్షీణించాయి. దీంతో ధరల సెగతో అల్లాడుతున్న కొనుగోలుదారులకు ఉపశమనం లభించినట్లయింది. ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం, వెండి ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. దేశంలోని ప్రధాన నగరాల్లో నేడు బంగారం (Today Gold Rate), వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.(బంగారం కొనేవాళ్లకు అలర్ట్.. ఆ మార్క్, కోడ్ ఉన్నాయా?) -
గోల్డ్ లోన్ రంగంలోకి గోద్రెజ్ క్యాపిటల్!
ఎన్బీఎఫ్సీ గోద్రెజ్ క్యాపిటల్ పసిడి రుణాల రంగంలోకి అడుగుపెట్టింది. ఆంధ్రప్రదేశ్కు చెందిన కనకదుర్గ ఫైనాన్స్ గోల్డ్ లోన్ వ్యాపారాన్ని రూ.117 కోట్లకు కొనుగోలు చేసింది. తన అనుబంధ సంస్థ గోద్రెజ్ ఫైనాన్స్ ద్వారా ఈ కొనుగోలు ప్రక్రియను పూర్తి చేసింది.2031 నాటికి రూ.1 లక్ష కోట్ల అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ (ఏయూఎం)ను చేరుకోవాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే 10 లక్షలకు పైగా వినియోగదారులకు సేవలు అందించాలన్న దీర్ఘకాలిక వ్యూహంలో భాగంగానే ఈ వ్యూహాత్మక కొనుగోలును చేపట్టినట్లు వెల్లడించింది.కనకదుర్గ ఫైనాన్స్ గోల్డ్ లోన్ విభాగానికి ప్రస్తుతం రూ.280 కోట్ల ఏయూఎం ఉంది. ఆంధ్రప్రదేశ్లో 54 శాఖలు, దాదాపు 12 వేల మంది వినియోగదారులు, సుమారు 250 మంది అనుభవం కలిగిన ఉద్యోగులు ఉన్నారు. ఈ కొనుగోలుతో గోల్డ్ లోన్ విభాగంలో కార్యకలాపాలను వేగంగా విస్తరించగలమని గోద్రెజ్ క్యాపిటల్ తెలిపింది.తొలి వ్యూహాత్మక కొనుగోలు‘‘కనకదుర్గ ఫైనాన్స్ గోల్డ్ లోన్ వ్యాపార కొనుగోలు గోద్రెజ్ క్యాపిటల్ ప్రయాణంలో కీలక మైలురాయి. రాబోయే అయిదేళ్లలో రూ.1 లక్ష కోట్ల ఏయూఎంను లక్ష్యంగా పెట్టుకున్న మా ప్రణాళికలో ఇదే తొలి వ్యూహాత్మక కొనుగోలు’’ అని గోద్రెజ్ క్యాపిటల్ ఎండీ, సీఈవో మనీష్ షా తెలిపారు. ప్రస్తుతం గోద్రెజ్ క్యాపిటల్ ప్రధానంగా ఎంఎస్ఎంఈ రుణాలు, గృహ రుణాల వ్యాపారంలో ఉంది. గత నెలలో గోద్రెజ్ క్యాపిటల్ వెల్త్ మేనేజ్మెంట్ సేవలను ప్రారంభించింది. -
గంటల వ్యవధిలో.. భారీగా తగ్గిన బంగారం రేటు!
బంగారం ధరల్లో ఎప్పటికప్పుడు ఊహకందని మార్పులు జరుగుతూనే ఉన్నాయి. ఈ రోజు (గురువారం) ఉదయం రూ.770 పెరిగి రూ.1,47,280 వద్ద ఉన్న 24 క్యారెట్ల గోల్డ్ రేటు, సాయంత్రానికి భారీగా తగ్గింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో పసిడి రేట్లలో స్వల్ప మార్పు జరిగాయి. ఈ కథనంలో కొత్త ధరలు ఎలా ఉన్నాయనే వివరాలు క్షుణ్ణంగా తెలుసుకుందాం.గురువారం (జులై 23) ఉదయం రూ.1,47,280 (తులం 24 క్యారెట్స్ గోల్డ్), రూ.1,35,000 (తులం 22 క్యారెట్స్ గోల్డ్) వద్ద బంగారం రేటు, సాయంత్రానికే రూ.1,46,180.. రూ.1,34,000 వద్దకు చేరింది. అంటే గంటల వ్యవధిలో రూ.1100, రూ.1000 తగ్గింది. దీన్నిబట్టి చూస్తే.. గోల్డ్ రేటు ఎంత మారిందో స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు.ఢిల్లీలో కూడా బంగారం ధరలో గణనీయమైన మార్పు ఏర్పడింది. దీంతో ఉదయం, సాయంత్రం ధరలకు చాలా వ్యత్యాసం కనిపించింది. ఇక్కడ ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.146330 వద్ద, 22 క్యారెట్ల 10 గ్రాముల రేటు రూ.1,34,150 వద్ద ఉంది. అయితే.. చెన్నైలో మాత్రం ఈ రోజు సాయంత్రానికి ధరల్లో మార్పు కనిపించలేదు. -
బంగారం నాన్స్టాప్ దౌడు.. తులం రేటు ఇలా..
దేశంలో బంగారం ధరల పరుగు ఆగడం లేదు. గత నాలుగు రోజులుగా పసిడి ధరలు పెరుగుతూనే ఉన్నాయి. క్రితం రోజున భారీగా ఎగిసిన పుత్తడి రేట్లు నేడు కూడా గణనీయంగా పెరిగాయి. ఇక వెండి ధరలు మాత్రం కొనుగోలుదారులకు కాస్త ఊరటనిచ్చాయి. రెండు రోజులుగా పెరిగిన వెండి ధరలు నేడు నిలకడగా కొనసాగుతున్నాయి. ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం, వెండి ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. దేశంలోని ప్రధాన నగరాల్లో నేడు బంగారం (Today Gold Rate), వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.(బంగారం కొనేవాళ్లకు అలర్ట్.. ఆ మార్క్, కోడ్ ఉన్నాయా?) -
బంగారం కొనేవాళ్లకు అలర్ట్.. ఆ మార్క్, కోడ్ ఉన్నాయా?
బంగారం కొనుగోలు అనేది ప్రతి కుటుంబానికి ఒక ముఖ్యమైన పెట్టుబడి. అయితే బంగారం కొనే సమయంలో నాణ్యతను నిర్ధారించుకోవడం అత్యంత కీలకం. అందుకే భారత ప్రభుత్వం బంగారు ఆభరణాలపై హాల్మార్కింగ్ను తప్పనిసరి చేసింది. అయినప్పటికీ కొంతమంది వ్యాపారులు ఇప్పటికీ నిబంధనలు ఉల్లంఘిస్తూ హాల్మార్క్ లేని నగలను విక్రయిస్తున్నట్లు భారతీయ ప్రమాణాల బ్యూరో (BIS) ఇటీవల నిర్వహించిన తనిఖీల్లో బయటపడింది.తెలంగాణలోని 13 జిల్లాల్లో జరిగిన సోదాల్లో భారీ మొత్తంలో హాల్మార్క్ లేని బంగారు నగలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఒక్క వరంగల్లోనే దాదాపు రూ.10 కోట్ల విలువైన బంగారం సీజ్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో హాల్మార్క్ అంటే ఏమిటి? హెచ్యూఐడీ (HUID) అంటే ఏమిటి? బంగారం కొనేటప్పుడు వినియోగదారులు ఏ విషయాలు తప్పనిసరిగా పరిశీలించాలి? తెలుసుకుందాం..హాల్మార్క్ అంటే ఏమిటి?హాల్మార్క్ అనేది బంగారు ఆభరణం స్వచ్ఛతకు ప్రభుత్వం ఇచ్చే నాణ్యత ధ్రువీకరణ. భారతీయ ప్రమాణాల బ్యూరో (BIS) నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా బంగారం స్వచ్ఛతను పరీక్షించిన తర్వాత మాత్రమే ఈ గుర్తును ఇస్తారు. దీంతో వినియోగదారు కొనుగోలు చేస్తున్న బంగారం పేర్కొన్న క్యారెట్ నాణ్యత కలిగి ఉందనే నమ్మకం ఉంటుంది.హెచ్యూఐడీ అంటే ఏమిటి?హెచ్యూఐడీ (HUID - Hallmark Unique Identification Number) అనేది ప్రతి హాల్మార్క్ చేసిన బంగారు ఆభరణానికి ప్రత్యేకంగా కేటాయించే ఆరు అంకెల ఆల్ఫా-న్యూమరిక్ కోడ్. ప్రతి నగకు ఒక ప్రత్యేక HUID ఉంటుంది. ఈ కోడ్ ద్వారా ఆ నగను ఏ అస్సేయింగ్ సెంటర్లో పరీక్షించారు, ఎప్పుడు హాల్మార్క్ చేశారు వంటి వివరాలను బీఐఎస్ రికార్డుల్లో గుర్తించవచ్చు.హాల్మార్క్ నగపై ఏమేమి ఉంటాయి?హాల్మార్క్ చేసిన బంగారు నగపై సాధారణంగా ఈ వివరాలు ఉంటాయి.🔹 BIS లోగో🔹 బంగారం స్వచ్ఛత (22K916, 18K750, 14K585 వంటివి)🔹 HUID కోడ్HUIDను ఎలా చెక్ చేయాలి?వినియోగదారులు BIS Care మొబైల్ యాప్ ద్వారా లేదా BIS వెబ్సైట్లో HUID నంబర్ను నమోదు చేసి ఆ నగకు సంబంధించిన వివరాలను ధ్రవీకరించవచ్చు. HUID సరిపోలకపోతే లేదా వివరాలు కనిపించకపోతే వెంటనే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయవచ్చు.హాల్మార్క్ ఎందుకంత ముఖ్యమంటే..కొనుగోలు చేసిన బంగారం నిజమైన స్వచ్ఛత కలిగి ఉందని హామీ లభిస్తుంది. తక్కువ నాణ్యత గల బంగారాన్ని అధిక ధరకు విక్రయించే అవకాశాలు తగ్గుతాయి. భవిష్యత్తులో అమ్మేటప్పుడు లేదా తాకట్టు పెట్టేటప్పుడు సరైన విలువ లభిస్తుంది.బంగారం కొనేటప్పుడు తప్పనిసరిగా గుర్తుంచుకోవాల్సినవి🔹 హాల్మార్క్ ఉందో లేదో పరిశీలించండి.🔹 HUID కోడ్ను తప్పనిసరిగా వెరిఫై చేయండి.🔹 BIS రిజిస్టర్డ్ జువెలర్ వద్ద నుంచే కొనుగోలు చేయండి.🔹 బిల్లు తప్పనిసరిగా తీసుకోండి.🔹 బిల్లులో బంగారం స్వచ్ఛత, బరువు, HUID వివరాలు ఉన్నాయో లేదో చూసుకోండి.నిబంధనలు ఉల్లంఘిస్తే ఏం జరుగుతుంది?హాల్మార్కింగ్ నిబంధనలు పాటించని జువెలర్లపై BIS చట్టపరమైన చర్యలు తీసుకుంటుంది. జరిమానాలతో పాటు, తీవ్రమైన ఉల్లంఘనలపై లైసెన్స్ రద్దు చేసే అధికారమూ BISకు ఉంది. ఇటీవల తెలంగాణలో జరిగిన తనిఖీలు నిబంధనలు ఉల్లంఘించే వ్యాపారులపై ప్రభుత్వం అవలంబిస్తున్న కఠిన వైఖరికి నిదర్శనం. -
బంగారం @ 1,50,000? ఫ్యూచర్ ఎలా ఉంటుందంటే..
-
మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు తులం ఎంతంటే?
-
బంగారం, వెండికి మళ్లీ ఊపు..
దేశంలో బంగారం, వెండి ధరలు మళ్లీ ఊపందుకున్నాయి. రెండు రోజుల కిందట వరకూ తగ్గుతూ వచ్చిన పసిడి ధరలు మళ్లీ పెరుగుదల బాట పట్టాయి. ఇక వెండి ధరలు కూడా నేడు భారీగా ఎగిశాయి. ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం, వెండి ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. దేశంలోని ప్రధాన నగరాల్లో నేడు బంగారం (Today Gold Rate), వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. -
క్రెడిట్ కార్డుతో గోల్డ్ కొనడం మంచిదేనా?
భారతదేశంలో బంగారానికి ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉందనే విషయం అందరికీ తెలుసు. పండుగలకు, పబ్బాలకు, పెళ్లిళ్లు, పేరంటాలకు లేదా పెట్టుబడి కోసం చాలా మంది ఎప్పటికప్పుడు గోల్డ్ కొనుగోలు చేస్తూనే ఉంటారు. అయితే ప్రస్తుతం.. బంగారం ధరలలో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొందరు క్రెడిట్ కార్డు ద్వారా కూడా బంగారం కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇది అప్పటికి సౌకర్యవంతంగా అనిపించినా, కొన్ని ముఖ్యమైన విషయాలను తప్పనిసరిగా తెలుసుకోవాలని, లేకుంటే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.నిపుణుల హెచ్చరికక్రెడిట్ కార్డు ద్వారా బంగారం కొనేవారు.. ముందుగా గుర్తుంచుకోవాల్సిన అంశం ఏమిటంటే.. క్రెడిట్ కార్డు అనేది మీ సొంత డబ్బు కాదు. అది బ్యాంకు ఇచ్చే రుణం. కాబట్టి.. బంగారం కొనుగోలు చేసిన తర్వాత క్రెడిట్ కార్డు బిల్లు గడువులోగా పూర్తిగా చెల్లించకపోతే భారీ వడ్డీ చెల్లించాల్సి వస్తుంది. కొన్ని బ్యాంకులు ఏడాదికి 36 నుంచి 42 శాతం వరకు వడ్డీ వసూలు చేస్తాయి. దీనికి ఆలస్య రుసుములు, జీఎస్టీ వంటి అదనపు ఛార్జీలు కూడా జతవుతాయి. కాబట్టి.. కేవలం రివార్డ్ పాయింట్లు వస్తాయని క్రెడిట్ కార్డుతో బంగారం కొనడం మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.ఇలా చేస్తే కొంత ప్రయోజనంఅయితే.. ఇక్కడ గుర్తుచుకోవాల్సిన విషయం ఏమిటంటే, బిల్లు సమయానికి పూర్తిగా చెల్లించేవారికి క్రెడిట్ కార్డు ఉపయోగకరంగా ఉంటుంది. కొన్ని బ్యాంకులు జీరో కాస్ట్ ఈఎంఐ, క్యాష్బ్యాక్, రివార్డ్ పాయింట్లు వంటి ఆఫర్లను అందిస్తున్నాయి. దీంతో కొంత మేర అదనపు ప్రయోజనం పొందే అవకాశం ఉంటుంది.నిబంధనలుక్రెడిట్ కార్డుతో బంగారం కొనుగోలుపై కొన్ని నిబంధనలు కూడా ఉన్నాయి. 2013లో రిజర్వ్ బ్యాంక్ మార్గదర్శకాల ప్రకారం.. క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేసిన బంగారు నాణేలను, ఈఎంఐగా మార్చడానికి బ్యాంకులకు అనుమతి లేదు. అలాగే బ్యాంకు శాఖల్లో క్రెడిట్ కార్డుతో బంగారు నాణేలు విక్రయించకూడదని కూడా సూచించింది.అయితే.. బంగారు ఆభరణాల కొనుగోలుపై ప్రతి బ్యాంకు వేర్వేరు నిబంధనలు అమలు చేసే అవకాశం ఉంది. కాబట్టి కొనుగోలు చేసే ముందు మీ బ్యాంకు పాలసీని తప్పకుండా తెలుసుకోవాలి. ఈ విషయాన్ని మర్చిపోకూడదు.అధిక ఛార్జీలుఇంకో విషయం స్వైప్ ఛార్జీలు. చాలా జ్యువెలరీ దుకాణాలు క్రెడిట్ కార్డు ద్వారా చెల్లింపులు చేస్తే.. 2 నుంచి 3.5 శాతం వరకు అదనపు ప్రాసెసింగ్ ఫీజు వసూలు చేసే అవకాశం ఉంది. బంగారం విలువ ఎక్కువగా ఉండటంతో ఈ ఛార్జీలు కూడా పెద్ద మొత్తంలో ఉండే అవకాశం ఉంది.మరోవైపు.. కొన్ని క్రెడిట్ కార్డులు ప్రముఖ జ్యువెలరీ బ్రాండ్లలో బంగారం కొనుగోలు చేస్తే క్యాష్బ్యాక్ లేదా రివార్డ్ పాయింట్లు అందిస్తాయి. అయితే, ఈ ఆఫర్లకు కొన్ని షరతులు, పరిమితులు ఉంటాయి. కాబట్టి ఆఫర్ వివరాలను ముందుగా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -
పెరిగిన బంగారం.. తగ్గిన వెండి: తాజా ధరల ఇలా..
దేశంలో బంగారం ధరలు పెరుగుతూ, తగ్గుతూ ముందుకు దూసుకెళ్తున్నాయి. మొత్తం మీద వారం రోజుల్లో తులం గోల్డ్ రేటు గరిష్టంగా రూ.1,43,290 వద్దకు చేరింది. ఈ కథనంలో ఏడు రోజుల్లో పసిడి ధరల్లో జరిగిన మార్పులు ఏమిటి?, ప్రస్తుత ధరలు ఎలా ఉన్నాయనే వివరాలు వివరంగా తెలుసుకుందాం.జులై 12న హైదరాబాద్, విజవాడలలో రూ.రూ.1,44,330 వద్ద ఉన్న 24 క్యారెట్ల తులం బంగారం రేటు జులై 18 నాటికి రూ.1,43,290 వద్దకు చేరింది. అంటే ఏడురోజుల్లో రూ.1040 పెరిగిందన్నమాట. 22 క్యారెట్ల రేటు 1,32,300 రూపాయల నుంచి రూ.1,31,350 వద్దకు (రూ. 950 పెరిగింది) చేరింది.ఢిల్లీలో కూడా బంగారం ధరల్లో భారీ మార్పులు జరిగాయి. ఇక్కడ వారం రోజుల్లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,44,480 నుంచి 1,43,440 రూపాయల వద్దకు చేరింది. 22 క్యారెట్ల రేటు రూ.1,32,450 నుంచి రూ.1,31,450 వద్దకు చేరింది. దీన్నిబట్టి చూస్తే ఏడురోజుల్లో గోల్డ్ రేటులో ఎంత మార్పు జరిగిందో స్పష్టమవుతోంది.చెన్నైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,45,090 నుంచి రూ.1,43,290 వద్దకు చేరింది. 22 క్యారెట్ల రేటు రూ.1,33,000 నుంచి 1,31,350 రూపాయలకు చేరింది. అంటే ఏడూ రోజుల్లో పసిడి ధరలు వరుసగా రూ.1800, రూ.1650 పెరిగింది.వెండి ధరలు ఇలాబంగారం ధరల్లో మాత్రమే కాకుండా.. వెండి ధరల్లో కూడా గణనీయమైన మార్పు జరిగింది. జులై 12న రూ.2.40 లక్షల వద్ద ఉన్న కేజీ సిల్వర్ రేటు.. జులై 18 నాటికి రూ.2.35 లక్షలకు చేరింది. అంటే వారం రోజుల్లో హైదరాబాద్లో వెండి రేటు రూ.5000 తగ్గింది. -
మళ్లీ షాకిచ్చిన బంగారం ధరలు.. ఈ రోజు తులం ఎంతంటే?
-
బంగారంపై మళ్లీ కియోసాకి ‘భారీ’ కామెంట్
‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ పుస్తక రచయిత, ప్రముఖ ఇన్వెస్టర్ రాబర్ట్ కియోసాకి మరోసారి బంగారం, వెండి పెట్టుబడులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రముఖ పెట్టుబడిదారుడు జిమ్ రోజర్స్ అభిప్రాయాలను ప్రస్తావిస్తూ, "బంగారం, వెండి ధరలు భవిష్యత్తులో భారీగా పెరిగి 'చంద్రుడి' దాకా వెళ్తాయి" అని ఆయన తన ఎక్స్ (X) ఖాతాలో పేర్కొన్నారు.అయితే ధరలు నేరుగా పెరగవని, మధ్యలో భారీ పతనాలు (రిట్రేస్మెంట్లు) కూడా తప్పవని జిమ్ రోజర్స్ చెప్పిన విషయాన్ని కియోసాకి గుర్తు చేశారు. ఇటీవల బంగారం గరిష్ట స్థాయి నుంచి గణనీయంగా తగ్గిందని, వెండి కూడా భారీ కరెక్షన్ను ఎదుర్కొందని తెలిపారు.చాలా మంది ఇన్వెస్టర్లు ధరలు గరిష్ట స్థాయికి చేరినప్పుడు కొనుగోలు చేసి, తర్వాత ధరలు పడిపోగానే భయంతో విక్రయిస్తారని కియోసాకి వ్యాఖ్యానించారు. తాను మాత్రం ఈ ధరల పతనాన్ని అవకాశంగా తీసుకుని మరింత బంగారం, వెండి కొనుగోలు చేసినట్లు వెల్లడించారు.బంగారం, వెండి ఎందుకు కొనుగోలు చేస్తున్నారని ఒక స్నేహితుడు అడిగితే, "ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఇబ్బందుల్లో ఉంది. ప్రభుత్వాలు, కేంద్ర బ్యాంకులు ఈ సమస్యలను పరిష్కరిస్తాయనే నమ్మకం నాకు లేదు. నిజానికి అప్పులు, ద్రవ్యోల్బణం వంటి సమస్యలకు వారే కారణం. ఇవి ఇంకా పెరిగే అవకాశమే ఎక్కువ" అని తాను సమాధానం ఇచ్చినట్లు కియోసాకి తెలిపారు.చివరగా ఇన్వెస్టర్లను ఉద్దేశించి, "ఎక్కువ ధరకు కొనుగోలు చేసి, తక్కువ ధరకు అమ్ముతారా? లేక తక్కువ ధర వద్ద కొనుగోలు చేసి సంపదను సృష్టిస్తారా? బంగారం, వెండి ధరలు ఇంకా భారీగా పెరుగుతాయి" అంటూ తన పోస్టును ముగించారు. అయితే ఇవి ఆయన వ్యక్తిగత పెట్టుబడి అభిప్రాయాలేనని, పెట్టుబడులు పెట్టే ముందు సొంతంగా విశ్లేషించుకోవడం అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.“Gold and silver going to the moon.”Legendary investor Jim Rogers.Jim states further, that the prices of gold and silver will go to the moon, yet not without severe retracements. Gold and silver just went through a severe retracements.Recently gold hit a high of…— Robert Kiyosaki (@theRealKiyosaki) July 17, 2026 -
అదృశ్య బంగారం.. దొరికితే అదృష్టమే!
జపాన్కు దక్షిణాన పసిఫిక్ మహాసముద్రంలోని అగ్నిపర్వత సముద్రగర్భ ప్రాంతంలో ప్రపంచంలోనే అత్యధిక సాంద్రత కలిగిన "అదృశ్య బంగారం" (Invisible Gold)ను శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ ఆవిష్కరణ సముద్ర గర్భంలోని ఖనిజ సంపదపై ప్రపంచ దృష్టిని మళ్లీ ఆకర్షిస్తోంది. అయితే ఈ బంగారాన్ని తవ్వడం అంత సులభం కాదని, పర్యావరణ పరిరక్షణ కూడా పెద్ద సవాలేనని పరిశోధకులు స్పష్టం చేస్తున్నారు.ఎక్కడ లభించింది?ఈ బంగారు నిల్వలు టోక్యోకు దక్షిణంగా సుమారు 350–360 కిలోమీటర్ల దూరంలో జపాన్ ప్రత్యేక ఆర్థిక మండలిలోని ‘హిగాషి-అయోగాషిమా నోల్ కాల్డెరా (Higashi-Aogashima Knoll Caldera)’ హైడ్రోథర్మల్ ఫీల్డ్లో గుర్తించారు. ఇది సముద్ర అడుగున ఉన్న క్రియాశీల అగ్నిపర్వత ప్రాంతం. ఇక్కడ 'బ్లాక్ స్మోకర్స్'గా పిలిచే హైడ్రోథర్మల్ వెంట్ల నుంచి అత్యంత వేడిగా ఉండే, ఖనిజాలతో నిండిన ద్రవాలు వెలువడుతుంటాయి. చల్లటి సముద్రజలాన్ని తాకగానే అవి ఘనీభవించి సల్ఫైడ్ నిక్షేపాలు, చిమ్నీ ఆకారపు నిర్మాణాలను ఏర్పరుస్తాయి. ఈ ప్రక్రియలో రాగి, జింక్, వెండి, బంగారం వంటి లోహాలు సహజంగానే కేంద్రీకృతమవుతాయి.కనిపించని బంగారాన్ని ఎలా గుర్తించారు?ఇప్పటి వరకు బంగారం సాధారణంగా చిన్న కణాలు లేదా రేణువుల రూపంలో ఉంటుందని భావించేవారు. కానీ ఈసారి శాస్త్రవేత్తలు ‘సెకండరీ అయాన్ మాస్ స్పెక్ట్రోమెట్రీ ’(SIMS) అనే అత్యాధునిక సాంకేతికతతో పరిశీలించగా, బంగారం ఎక్కువ భాగం ‘పైరైట్’ (Pyrite) అనే ఐరన్ సల్ఫైడ్ ఖనిజం స్ఫటిక నిర్మాణంలోనే అణు స్థాయిలో కలిసిపోయి ఉందని గుర్తించారు. అందువల్ల ఇది సాధారణ సూక్ష్మదర్శినితో కూడా కనిపించదు. దీనినే "ఇన్విజిబుల్ గోల్డ్"గా పేర్కొంటారు.రికార్డు స్థాయి సాంద్రతసైంటిఫిక్ రిపోర్ట్స్ జర్నల్లో ఇటీవల ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. ఈ ప్రాంతంలోని పైరైట్లో బంగారం సాంద్రత గరిష్ఠంగా 1.9 శాతం (19,000 పీపీఎంకు పైగా)నమోదైంది. ఇప్పటివరకు ప్రపంచంలోని సముద్రగర్భ హైడ్రోథర్మల్ నిక్షేపాల్లో నమోదైన అత్యధిక స్థాయిల్లో ఇదొకటిగా పరిశోధకులు పేర్కొన్నారు.తవ్వకాలు సాధ్యమేనా?ఈ ప్రాంతం లోతు ఇతర సముద్రగర్భ ఖనిజ ప్రాంతాలతో పోలిస్తే తక్కువగా ఉండటం, ఖనిజ నిక్షేపాలు సమృద్ధిగా ఉండటం వల్ల భవిష్యత్తులో వాణిజ్యపరంగా మైనింగ్కు అనుకూల ప్రాంతంగా భావిస్తున్నారు. అయితే ప్రస్తుతం పైరైట్లో అణు స్థాయిలో దాగి ఉన్న బంగారాన్ని భారీ స్థాయిలో, ఆర్థికంగా లాభదాయకంగా వెలికితీసే సాంకేతికత ఇంకా అందుబాటులో లేదు. అందువల్ల తక్షణ మైనింగ్ అవకాశాలు లేవని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.పర్యావరణంపై ఆందోళనలుహైడ్రోథర్మల్ వెంట్ల చుట్టూ భూమిపై మరెక్కడా కనిపించని ప్రత్యేక సముద్ర జీవవ్యవస్థలు ఉంటాయి. అరుదైన పురుగులు, క్రస్టేషియన్లు, స్పాంజ్లు, పగడాలు, చేపలు వంటి జీవులు ఈ తీవ్ర పరిస్థితుల్లోనే జీవిస్తాయి. ఇలాంటి ప్రాంతాల్లో మైనింగ్ ప్రారంభిస్తే ఈ సున్నితమైన జీవవ్యవస్థలు శాశ్వతంగా దెబ్బతినే ప్రమాదం ఉందని సముద్ర శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అందుకే వాణిజ్య తవ్వకాల కంటే ముందుగా సమగ్ర పర్యావరణ అధ్యయనాలు, కఠినమైన రక్షణ చర్యలు అవసరమని వారు సూచిస్తున్నారు. -
భారీగా పెరిగిన బంగారం ధరలు.. కొనాలా? వేచిచూడాలా?
-
భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు
-
భారీగా తగ్గిన బంగారం ఈ రోజు ఎంత తగ్గాయంటే?
-
100 డాలర్లు పెరిగిన బంగారం ధర!
అమెరికాలో జూన్ సీపీఐ.. అంచనాలకు మించి 0.4 శాతం తగ్గడంతో బంగారం ధర 100 డాలర్లు పెరిగిందని ప్రముఖ మార్కెట్ విశ్లేషకులు పీటర్ డేవిడ్ షిఫ్ పేర్కొన్నారు. దీనికి సంబంధించిన ట్వీట్ తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. ఇది నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా చూసేద్దాం.బంగారం ధరలు పెరగడానికి ప్రధాన కారణం చమురు ధర 30 శాతం పడిపోవడమే అని షిఫ్ వెల్లడించారు. కానీ ప్రస్తుత పరిస్థితి మారుతోంది. జూలైలో చమురు ధరలు ఇప్పటికే సుమారు 20 శాతం పెరిగాయి. దీంతో భవిష్యత్తులో ద్రవ్యోల్బణం మళ్లీ పెరిగే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.సాధారణంగా ద్రవ్యోల్బణం తగ్గితే.. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం ఉంటుంది. వడ్డీ రేట్లు తగ్గితే.. బంగారం వంటి పెట్టుబడులకు డిమాండ్ పెరుగుతుంది. ఎందుకంటే బంగారం వడ్డీ ఆదాయం ఇవ్వదు కాబట్టి, తక్కువ వడ్డీ రేట్ల సమయంలో ఇది మరింత ఆకర్షణీయంగా మారుతుంది.అయితే.. అధికారిక గణాంకాల్లో ద్రవ్యోల్బణం తగ్గినట్లు కనిపించినప్పటికీ.. ప్రజలు రోజువారీ జీవితంలో ఎదుర్కొంటున్న ధరల పెరుగుదల మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా ఇంధనం, రవాణా, ఇతర అవసరాల ధరలు పెరిగితే దాని ప్రభావం సాధారణ ప్రజలపై ఉంటుంది.జూన్ సీపీఐ తగ్గడం బంగారం ధరలకు తాత్కాలికంగా మద్దతు ఇచ్చింది. కానీ.. చమురు ధరల పెరుగుదల, వాస్తవ ద్రవ్యోల్బణ పరిస్థితులు, అమెరికా ఫెడ్ తీసుకునే నిర్ణయాలపై బంగారం భవిష్యత్ కదలికలు ఆధారపడి ఉంటాయి. కాబట్టి, అధికారిక గణాంకాల కంటే ఆర్థిక వ్యవస్థలో జరుగుతున్న వాస్తవ మార్పులను కూడా గమనించడం ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు.Gold is up $100 as the June CPI fell 0.4%, more than expected. But the main driver was a 30% drop in oil. Ignoring the fact that oil is already up 20% in July and headed higher, a lower official inflation rate merely gives the Fed an excuse to ignore the rise in actual inflation.— Peter Schiff (@PeterSchiff) July 14, 2026భారతదేశంలో బంగారం ధరలుఇండియన్ మార్కెట్లో గోల్డ్ రేటు గత కొంత కాలంగా తగ్గుతూ ఉంది. దీంతో 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేటు హైదరాబాద్, విజయవాడలలో రూ. 1,42,800 వద్ద ఉంది. గత నెలతో పోలిస్తే.. బంగారం ధర ఈ నెలలో కొంత తక్కువే అని తెలుస్తోంది. -
రూ. 2 కోట్ల బంగారం పేస్ట్ : తమిళనాడు జంట అరెస్ట్
కొచ్చి: అంతర్జాతీయంగా, జాతీయంగా బంగారం ధరలు ఆకాశాన్ని చూస్తున్నాయి. దీంతో గోల్డ్ను దొడ్డిదారిన తరలించే ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయి. కొచ్చిన్ అంతర్జాతీయ విమానాశ్రయం ద్వారా దాదాపు రూ. 2 కోట్ల విలువైన బంగారాన్ని అక్రమంగా తరలించే ప్రయత్నాన్ని, కస్టమ్స్ అధికారులు అడ్డుకున్నారు. బంగారాన్ని పేస్ట్ రూపంలో ప్యాంటు నడుము పట్టీలలో దాచి తరలిస్తుండగా తమిళనాడుకు చెందిన ఒక జంటను అరెస్ట్ చేసినట్టు పోలీసులు మంగళవారం తెలిపారు.నిందితులను తమిళనాడులోని పుదుకోట్టై జిల్లాకు చెందిన రిఫ్నాస్ హమీద్ మహమ్మద్ షరీఫ్ (26) అతని భార్య జానోఫర్ కదర్ బీవి ఉమర్ ఫరూక్ (23)గా గుర్తించారు. వీరు జూలై 13న అబుదాబి నుండి ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానం IX 418లో విమానాశ్రయానికి వచ్చారు. వారి కదలికలపై అనుమానం వచ్చిన కస్టమ్స్ అధికారులు గా ఈ జంటను అడ్డగించి, క్షుణ్ణంగా తనిఖీ చేశారు. దీంతో అసలు విషయం తెలిసి షాకయ్యారు. నడుము బెల్ట్లో దాచిన బంగారాన్ని వెలికితీశారు. అనంతరం సుమారు రూ. 1.94 కోట్ల విలువైన 1,353.92 గ్రాముల 24-క్యారెట్ బంగారం కలిగిన బంగారు పేస్ట్ను స్వాధీనం చేసుకున్నారు. కస్టమ్స్ చట్టంలోని నిబంధనల ప్రకారం ఇద్దరు ప్రయాణికులను అరెస్టు చేశారు. తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది. ఇదీ చదవండి: చిన్నగొడవ, భర్తను మొబైల్తో కొట్టింది.. అంతే..!ఇదీ చదవండి: 82 ఏళ్ల వృద్ధుడి పెన్షన్ ఖాతాలో రూ. వందల కోట్లు, ఏం చేశాడో తెలుసా? -
బంగారం తగ్గిందోచ్.. లేటెస్ట్ ధరలు ఇవే!
-
తగ్గిన బంగారం, వెండి ధరలు!
దేశీయ విఫణిలో బంగారం ధరలు మరోమారు తగ్గుముఖం పట్టాయి. ఈ రోజు (శనివారం) గోల్డ్ రేటు గరిష్టంగా రూ.490 తగ్గింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లోని పసిడి ధరల్లో మార్పులు జరిగాయి. కాగా వెండి ధరలు కూడా ఈ రోజు రూ.5000 తగ్గడంతో.. కేజీ సిల్వర్ రేటు రూ.2.40 లక్షల వద్దకు చేరింది. ఈ కథనంలో గోల్డ్, సిల్వర్ లేటెస్ట్ ధరల వివరాలు వివరంగా చూసేద్దాం. -
పసిడి ప్రియులకు అలర్ట్.. మారిన బంగారం, వెండి ధరలు!
బంగారం ధరలు పెరుగుదల మళ్లీ మొదలైంది. వరుసగా రెండో రోజు దేశీయ విఫణిలో గోల్డ్ రేటు గరిష్టంగా రూ.380 పెరిగింది. దీంతో హైదరాబాద్, ఢిల్లీ, చెన్నై, బెంగళూరు మొదలైన నగరాల్లో పసిడి ధరల్లో మార్పులు కనిపించాయి. కాగా వెండి ధర మాత్రం రూ.5000 పెరిగింది. తాజా ధరలకు సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా చూసేద్దాం. -
Gold Price: గంటల వ్యవధిలో మారిపోయిన ధరలు!
నాలుగు రోజుల తరువాత గోల్డ్ రేటు ఒక్కసారిగా పెరిగింది. ఈ రోజు (గురువారం) ఉదయం గరిష్టంగా రూ.110 పెరిగిన బంగారం ధర, సాయంత్రానికి మరో 20 రూపాయలు పెరిగింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఇంకాస్త ముందుకు వెళ్ళింది. ఈ కథనంలో లేటెస్ట్ ధరలు ఎలా ఉన్నాయో వివరంగా తెలుసుకుందాం. -
ఒక్క రోజులో అమాంతం పెరిగిన బంగారం ధరలు
-
ఈసారి బంగారం, వెండి కాదు! కియోసాకి కొత్త సూచన
ప్రపంచ ఆర్థిక మార్కెట్లలో కొనసాగుతున్న అనిశ్చితి, బంగారం ధరల్లో తీవ్ర ఒడిదుడుకుల నేపథ్యంలో ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ రచయిత రాబర్ట్ కియోసాకి మరోసారి చర్చనీయాంశంగా మారారు. అయితే ఈసారి ఆయన ఇన్వెస్టర్లకు బిట్కాయిన్, బంగారం లేదా వెండి కొనాలని కాకుండా.. ఒక పుస్తకం తప్పనిసరిగా చదవాలని సూచించడం విశేషం.ఇటీవల సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’లో చేసిన పోస్టులో మిక్కీ ఎం. మైనీ రచించిన 'ది ఎంట్రోపీ ట్రాప్' (The Entropy Trap) పుస్తకాన్ని ప్రస్తుత కాలంలో తప్పనిసరిగా చదవాల్సిన గ్రంథంగా పేర్కొన్నారు. ఈ పుస్తకానికి ప్రముఖ ఆర్థికవేత్త ‘జిమ్ రికార్డ్స్’ ముందుమాట రాశారని, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో రాబోయే నిర్మాణాత్మక మార్పులను అర్థం చేసుకోవడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుందని కియోసాకి అభిప్రాయపడ్డారు.'నమ్మకంపై ఆధారపడిన ఆస్తులకు ప్రమాదం'ఈ పుస్తకం ప్రధానంగా "నమ్మకంపై ఆధారపడిన ఆస్తులు" (Trust-based Assets) భవిష్యత్తులో ఒత్తిడిని ఎదుర్కొనే అవకాశాలపై చర్చిస్తుందని కియోసాకి తెలిపారు. అమెరికా ప్రభుత్వ బాండ్లు, ఈటీఎఫ్లు (ETFs), మ్యూచువల్ ఫండ్లు వంటి పెట్టుబడి సాధనాలు పూర్తిగా వ్యవస్థపై విశ్వాసంపై ఆధారపడి ఉన్నాయని, ఆ విశ్వాసం దెబ్బతింటే వాటి విలువ కూడా తీవ్రంగా ప్రభావితమయ్యే అవకాశం ఉందని ఆయన వ్యాఖ్యానించారు. అయితే ఇవి కియోసాకి వ్యక్తిగత అభిప్రాయాలేనని, వాటికి స్వతంత్ర ఆర్థిక ఆధారాలు లేవని గుర్తుంచుకోవాలి.'నేటి ధనవంతులే రేపటి పేదలు కావచ్చు'పాత ఆర్థిక నియమాలను మాత్రమే నమ్ముతూ పెట్టుబడులు పెట్టేవారు భవిష్యత్తులో నష్టపోయే ప్రమాదం ఉందని, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో జరుగుతున్న మార్పులను ముందుగానే అర్థం చేసుకునే వారే రేపటి సంపన్నులవుతారని కియోసాకి తన పోస్టులో పేర్కొన్నారు. "సమాచారమే అసలు సంపద" అనే సందేశాన్ని ఆయన మరోసారి నొక్కిచెప్పారు.కొద్ది రోజుల క్రితమే బంగారం ధరలపై తన స్వల్పకాలిక అంచనా తప్పిందని కియోసాకి బహిరంగంగా అంగీకరించారు. బంగారం ఇంకా పడిపోతోందని, మార్కెట్లలో ఇలాంటి హెచ్చుతగ్గులు సహజమేనని పేర్కొన్నారు. అయినప్పటికీ, వచ్చే ఐదేళ్లలో బంగారం ఔన్స్కు 35,000 డాలర్ల స్థాయికి చేరుతుందన్న తన దీర్ఘకాలిక అంచనాను మాత్రం మార్చలేదు.VIB: Very Important BOOK.Best most important new book for this time in history became available on Amazon last week.WHY: is book so important.?A: Because book explains why today’s Rich will become tomorrows poor.WHY: Because the informed will be tommorrow’s ULTRA…— Robert Kiyosaki (@theRealKiyosaki) July 7, 2026 -
దిగొచ్చిన బంగారం ధర.. తులం ఎంతంటే?
-
చల్లబడిన బంగారం ధర.. తులం ఎంతంటే..
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో నేడు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. -
బంగారం కాదు..ప్రపంచాన్ని శాసిస్తున్న ఆ ‘చిన్న వస్తువు’ ఏంటో తెలుసా?
ప్రస్తుతం 21వ శతాబ్దంలో.. ఈ ప్రపంచంలో అత్యంత ఖరీదైనది, అత్యంత పవర్ఫుల్ వస్తువు ఏది? అని ఎవరినైనా అడిగితే.. చాలామంది బంగారం, ప్లాటినం లేదా ముడి చమురు (క్రూడ్ ఆయిల్) అని చెప్తారు. కానీ, ఒక జర్నలిస్ట్గా ప్రపంచ పరిణామాలను నిశితంగా గమనిస్తే అసలు నిజం వేరే ఉందని అర్థమవుతుంది. ఇవాళ ప్రపంచాన్ని గడగడలాడిస్తూ.. అగ్రరాజ్యాలను శాసిస్తున్నది బంగారం కాదు.. ఒక చిన్న ఇసుక రేణువుతో తయారయ్యే 'మైక్రోచిప్'.. దాన్నే సెమీకండక్టర్ అంటారు!అవును.. మీ చేతిలో ఉన్న స్మార్ట్ఫోన్ మొదలు.. అంతరిక్షంలోకి దూసుకెళ్లే రాకెట్ వరకు.. మీ ఇంట్లోని స్మార్ట్ టీవీ నుంచి.. యుద్ధరంగంలో శత్రువుల గుండెల్లో వణుకు పుట్టించే అత్యాధునిక డ్రోన్లు, మిస్సైళ్లు, రాడార్ వ్యవస్థల వరకు.. ఈ చిన్న చిప్ లేకపోతే ఏదీ నడవదు.. కదలదు.. అంతా డెడ్! కేవలం మన గోరు పరిమాణంలో ఉండే ఈ చిన్న చిప్స్ కోసం.. ఇప్పుడు ప్రపంచ అగ్రరాజ్యాలైన అమెరికా, చైనాల మధ్య ఒక నిశ్శబ్ద, భయంకరమైన యుద్ధం జరుగుతోంది. అదే 'గ్లోబల్ సెమీకండక్టర్ వార్'.ఇది బుల్లెట్లతో, సైన్యంతో జరిగే యుద్ధం కాదు.. గ్లోబల్ టెక్నాలజీని తమ గుప్పిట్లో పెట్టుకోవడానికి జరుగుతున్న ఒక మైండ్ గేమ్! ఈ డిజిటల్ యుగంలో.. ఈ 'చిప్ వార్' లో గెలిచినవాడే రేపటి ప్రపంచానికి ఏకఛత్రాధిపతి.. వాడే అసలైన గ్లోబల్ డాన్! దాని కథాకమామిషు ఏంటో ఇవాళ్టి ‘సాక్షి డిజిటల్’ పాడ్కాస్ట్లో తెలుసుకుందాం. వివరాలకు కింది వీడియోను క్లిక్ చేయండి.. -
భారీగా బంగారం కొంటున్న భారత్.. కారణం ఇదే!
బంగారం అంటే భారతీయులకు ఒకప్పటి నుంచి ఒక ప్రత్యేకమైన నమ్మకం. ఇప్పుడు అదే నమ్మకం.. దేశ ఆర్థిక విధానంలో కూడా కనిపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరలు భారీగా పెరగడం, మరోవైపు రిజర్వ్ బ్యాంక్ వరుసగా బంగారం కొనుగోలు చేయడంతో మన దేశంలో బంగారం నిల్వల విలువ 115.8 బిలియన్ డాలర్లను చేరుకుంది. ఈ విలువ గత రెండేళ్లతో పోలిస్తే దాదాపు రెట్టింపు కావడం విశేషం.భారతదేశంలోని విదేశీ మారక నిల్వల్లో బంగారం వాటా గణనీయంగా పెరిగింది. గత ఆరు నెలల గణాంకాల ప్రకారం, విదేశీ నిల్వల్లో బంగారం వాటా 17 శాతానికి చేరుకుంది. ఏడాది క్రితం ఇది 12 శాతం మాత్రమే ఉండేది. అంటే.. భారత్ కేవలం డాలర్ వంటి విదేశీ కరెన్సీలపైనే మాత్రమే ఆధారపడకుండా, బంగారాన్ని కూడా ఒక కీలక ఆస్తిగా భావిస్తోందన్నమాట.భారతదేశంలో బంగారం నిల్వల విలువ పెరగడానికి ప్రధాన కారణాలు రెండు. ఒకటి గ్లోబల్ మార్కెట్లో బంగారం ధరలు భారీగా పెరగడం. రెండు ఆర్బీఐ నిరంతరంగా బంగారం కొనుగోలు చేయడం. 2024 ప్రారంభంలో ఔన్స్ బంగారం ధర సుమారు 2,000 డాలర్ల వద్ద ఉండగా, తరువాత కాలంలో అది 4,000 డాలర్లకు పైగా చేరింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వల విలువ ఒక్కసారిగా పెరిగింది.భారత్ మాత్రమే కాకుండా, ప్రపంచంలోని చాలా దేశాల కేంద్ర బ్యాంకులు కూడా తమ నిల్వల్లో బంగారం వాటాను పెంచుకుంటున్నాయి. ముఖ్యంగా అంతర్జాతీయ రాజకీయ ఉద్రిక్తతలు, ఆర్థిక ఆంక్షలు, కరెన్సీ విలువల్లో మార్పుల వచ్చినప్పుడు రక్షణ పొందేందుకు బంగారాన్ని సురక్షితమైన పెట్టుబడిగా చూస్తున్నాయి. ఈ కారణంగా బంగారం నిల్వల విలువలను పెంచుకుంటున్నాయి.రష్యా-ఉక్రెయిన్ యుద్ధం తరువాత మారిన పరిస్థితి!నిజానికి రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత ప్రపంచ ఆర్థిక పరిస్థితుల్లో చాలా మార్పులు వచ్చాయి. ముఖ్యంగా కొన్ని దేశాలు తమ విదేశీ నిల్వలను కేవలం అమెరికా డాలర్ వంటి కరెన్సీల్లో ఉంచడం ఎంతవరకు సురక్షితం అనే దానిపై ఆలోచించడం ప్రారంభించాయి. దీంతో అనేక దేశాలు బంగారం కొనుగోళ్లను పెంచడం ప్రారంభించాయి.బంగారం కొనుగోలు చేయడంలో పోలాండ్ ముందుంది. దీంతో కొన్ని సంవత్సరాల్లోనే.. తన బంగారం నిల్వలను భారీగా పెంచుకుంది. చైనా కూడా 2023 తర్వాత మళ్లీ బంగారం కొనుగోళ్లను వేగవంతం చేసింది. చెక్ రిపబ్లిక్ వంటి చిన్న దేశాలు కూడా తమ బంగారం నిల్వలను గణనీయంగా పెంచుకున్నాయి.ఆర్బీఐ వ్యూహంఇండియా కూడా గత కొన్నేళ్లుగా బంగారం నిల్వలను క్రమంగా పెంచుకుంటోంది. 2015లో ఆర్బీఐ వద్ద సుమారు 557.8 టన్నుల బంగారం ఉండేది. అది 2026 నాటికి అది 880.5 టన్నులకు చేరింది. ముఖ్యంగా 2019 తర్వాత ఆర్బీఐ మరింత బంగారం కొనుగోలు చేయడం ప్రారంభించింది. దీంతో దేశ విదేశీ నిల్వల్లో బంగారం ప్రాధాన్యత పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లలో అనిశ్చిత పరిస్థితులు ఏర్పడినప్పుడు బంగారం ఒక రక్షణ కవచంలా పనిచేస్తుందని కేంద్ర బ్యాంకులు భావిస్తున్నాయి.ఇక అమెరికా, జర్మనీ, ఇటలీ, బ్రిటన్ వంటి అభివృద్ధి చెందిన దేశాలు ఇప్పటికే ప్రపంచంలోనే అతిపెద్ద బంగారం నిల్వలను కలిగి ఉన్నాయి. కాబట్టి ఇటీవల కాలంలో కొత్తగా.. పెద్ద మొత్తంలో కొనుగోళ్లు చేయాల్సిన అవసరం ఈ దేశాలకు తక్కువగా ఉంది. సౌదీ అరేబియా కూడా తన బంగారం నిల్వలను దాదాపు స్థిరంగా ఉంచుకుంది. అయితే చమురు ఎగుమతుల ద్వారా వచ్చే విదేశీ కరెన్సీ నిల్వలపై ఎక్కువగా ఆధారపడుతోంది. -
పాత బంగారాన్ని ఎందుకు అమ్ముతున్నారు? ఫ్యూచర్ లో గోల్డ్ పరిస్థితి ఇదే
-
GRT: ఆషాఢం ప్రారంభం.. బంగారం కొనేవారికి భారీ ఆఫర్లు!
-
పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. ఏకంగా 10 వేలు తగ్గిన బంగారం
-
రూ.10 వేలు తగ్గిన వెండి: బంగారం ధరలు ఇలా..
గత కొన్ని రోజులుగా పెరుగుతూ.. తగ్గుతూ వస్తున్న బంగారం, వెండి ధరలు ఈ రోజు (సోమవారం) మరోసారి తగ్గుముఖం పట్టాయి. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లోని గోల్డ్, సిల్వర్ రేట్లలో స్వల్ప మార్పులు కనిపించాయి. ఈ కథనంలో కొత్త ధరలు ఎలా ఉన్నాయో చూసేద్దాం. -
నాకు ఇన్ఫోసిస్లో నెలకు రూ.1 లక్ష జీతం వస్తుంది!
మంగళగిరి టౌన్: ఓ కిలాడీ లేడీ తనకు పెళ్లి కాలేదంటూ మాయమాటలతో నమ్మించి, వివాహం చేసుకుని అనంతరం భారీగా నగలు, డబ్బు దోచుకుని పరారైన ఘటన మంగళగిరిలో చోటుచేసుకుంది. కిలాడీ వలలో పడి మోసపోయిన ఓ పోలీస్ శుక్రవారం మంగళగిరి పట్టణ పోలీసులను ఆశ్రయించాడు. సేకరించిన వివరాల మేరకు.. మంగళగిరి పట్టణం ఎల్బీ నగర్లో నివాసముంటున్న సతీష్ 2013 బ్యాచ్కు చెందిన 16వ బెటాలియన్ ఏపీఎస్పీ కానిస్టేబుల్. ప్రస్తుతం విశాఖపట్నంలో విధులు నిర్వర్తిస్తున్నాడు. ఈ క్రమంలో జనవరి 28వ తేదీ జయశ్రీ పాండా అనే మహిళ సతీష్కు ఫోన్ చేసి తన వ్యక్తిగత సమస్యకు సంబంధించి డీజీపీ కార్యాలయంలో ఇచ్చిన ఫిర్యాదు గురించి అడిగింది. ప్రస్తుతం తాను అక్కడ పనిచేయడం లేదని, సంబంధిత అధికారులను సంప్రదించాలని సతీష్ సూచించాడు. కొంతకాలానికి ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. అనంతరం జయశ్రీపాండా తన ప్లాన్ను అమల్లోకి తెచ్చింది. తనకు వివాహం కాలేదని, కుటుంబ సమస్యలు లేవని సతీష్ను నమ్మించింది. తన కుటుంబం నుంచి వచ్చే ఆస్తులు, ఇళ్లు, బంగారం ఉన్నాయని, ఇన్ఫోసిస్లో లక్ష రూపాయల జీతంతో ఉద్యోగం చేస్తున్నానని సతీష్కు చెప్పింది. ప్రస్తుతం ఐబీఎం కంపెనీలో ఏడాదికి రూ.15 లక్షల ప్యాకేజీకి ఎంపికైనట్లు నమ్మబలికి, తనను వివాహం చేసుకోవాలని కోరింది. సతీష్ తనకు అప్పటికే వివాహం జరిగిందని చెప్పాడు. మొత్తం విచారించానని, మీకు వివాహం జరిగి విడాకులు కూడా తీసుకున్నట్లు తెలిసిందని, తనకు అభ్యంతరం లేదంటూ సతీష్ను ఒత్తిడి చేసింది. చివరకు పెద్దల సమక్షంలో ఓ దేవాలయంలో మే 13న జయశ్రీపాండాను సతీష్ వివాహం చేసుకున్నాడు. జూన్ 13న ఇంట్లో ఉన్న సుమారు 200 గ్రాముల బంగారు ఆభరణాలతోపాటు నగదును తీసుకుని వెళ్లిపోయింది. బంగారం, నగదు గురించి సతీష్ అడగ్గా తానే తీసుకువెళ్లానని, తన అత్తయ్య వద్ద ఉంచానని చెప్పింది. వెంటనే ఫోన్ చేసి తన అన్నయ్య బంగారం, నగదు తీసుకువెళ్లినట్లు సతీష్కు చెప్పింది. పలాసకు వచ్చి నగదు రూపంలో సెటిల్మెంట్ చేసుకుని పెద్దల సమక్షంలో విడాకుల పత్రాలు రాసుకుందామంటూ సతీష్ను రమ్మంది. అంగీకరించకపోతే తప్పుడు కేసులు పెడతానని బెదిరిస్తూ బ్లాక్మెయిల్ చేస్తోందని సతీష్ తన ఫిర్యాదులో తెలిపాడు. ఘటనపై సమగ్ర విచారణ జరిపి తీసుకువెళ్లిన నగదు, బంగారు ఆభరణాలను ఇప్పించి తనను నమ్మించి మోసం చేసిన జయశ్రీపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నాడు. సతీష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మంగళగిరి పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. -
ఇంట్లో బంగారం ఉందా.. ఈ స్కీమ్తో భారీ లాభం!
భారతదేశంలో బంగారానికి ప్రత్యేకమైన స్థానం ఉంది. మన దేశ ప్రజలు బంగారాన్ని కేవలం ఆభరణంగా మాత్రమే కాకుండా.. భవిష్యత్తు కోసం భద్రమైన పెట్టుబడిగా కూడా భావిస్తారు. కాబట్టి ప్రపంచంలోనే అత్యధికంగా బంగారం కొనుగోలు చేసే దేశాల్లో భారత్ ఒకటిగా నిలిచింది. అయితే.. ఇళ్లలోని బంగారం, దేశ ఆర్థిక వ్యవస్థలో ఉపయోగపడకుండా అలాగే ఉండిపోతుంది. ఈ సమస్యకు పరిష్కారంగా కేంద్ర ప్రభుత్వం గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ (Gold Monetisation Scheme)ను మరింత సమర్థవంతంగా మార్చేందుకు కొత్త రూపంలో తీసుకురావాలని యోచిస్తోంది. దీనికి సంబంధించిన ప్రకటన త్వరలోనే అధికారికంగా వెల్లడయ్యే అవకాశం ఉంది.గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ అనే పథకాన్ని కేంద్ర ప్రభుత్వం 2015లో ప్రారంభించింది. దీని ప్రధాన ఉద్దేశ్యం.. ప్రజలు తమ ఇళ్లలో ఉన్న బంగారాన్ని బ్యాంకుల్లో డిపాజిట్ చేయడం ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థలో వినియోగించేలా చేయడం. బంగారం డిపాజిట్ చేసిన వారికి ప్రభుత్వం వడ్డీ కూడా చెల్లించేది. గడువు పూర్తయిన తర్వాత వారు బంగారం రూపంలో గానీ, దానికి సమానమైన నగదు రూపంలో గానీ తిరిగి పొందే అవకాశం ఉండేది. అయితే ఈ స్కీమ్ అనుకున్నంత సక్సెస్ కాలేదు.ఈ పథకం ఎందుకు విఫలమైంది?దాదాపు పది సంవత్సరాల కాలంలో ఈ పథకం ద్వారా కేవలం 38 టన్నుల బంగారం మాత్రమే సేకరించారు. కానీ భారతీయుల వద్ద సుమారు 25,000 టన్నుల బంగారం ఉందని అంచనా. దీన్నిబట్టి చూస్తే.. ఈ పథకం ఆశించిన స్థాయిలో విజయవంతం కాలేదని తెలుస్తోంది.➤భారతీయ కుటుంబాలు తమ పూర్వీకుల నుంచి వచ్చిన లేదా భావోద్వేగ విలువ కలిగిన నగలను డిపాజిట్ చేయడానికి ఆసక్తి చూపలేదు.➤పన్ను సంబంధిత విచారణలు వస్తాయనే భయం ప్రజల్లో ఉంది.➤బ్యాంకులకు ఈ పథకం ద్వారా పెద్దగా లాభం లేకపోవడంతో వారు దీనిని ప్రోత్సహించలేదు.➤ప్రభుత్వం వడ్డీతో పాటు బంగారం ధర పెరిగితే ఆ అదనపు మొత్తాన్ని కూడా చెల్లించాల్సి రావడంతో ప్రభుత్వంపై ఆర్థిక భారం పెరిగింది.కొత్త మార్పులు ఏమిటి?గోల్డ్ మానిటైజేషన్ స్కీములో కేంద్ర ప్రభుత్వం తీసుకురానున్న ముఖ్యమైన మార్పు ఏమిటంటే, దేశవ్యాప్తంగా ఉన్న జ్యువెలర్లు (బంగారు నగల వ్యాపారులు) కూడా కలెక్షన్ పార్ట్నర్లుగా పనిచేసే అవకాశం కల్పించడం.అంటే.. ఇప్పటి వరకు బంగారాన్ని కేవలం బ్యాంకుల ద్వారానే మాత్రమే డిపాజిట్ చేయాల్సి వచ్చేది. ఇకపై ప్రజలు తమకు దగ్గరలో ఉన్న విశ్వసనీయ జ్యువెలర్ల వద్ద కూడా బంగారాన్ని ఇచ్చే అవకాశం ఉండవచ్చు. దీనివల్ల ప్రజలకు సౌకర్యం పెరుగుతుంది, అలాగే మరింత బంగారం ఈ పథకంలోకి వచ్చే అవకాశం ఉంటుంది.ఈ పథకం వల్ల కలిగే ప్రయోజనాలు➤ఇళ్లలో ఉపయోగం లేకుండా ఉన్న బంగారం దేశ ఆర్థిక వ్యవస్థలోకి వస్తుంది.➤విదేశాల నుంచి బంగారం దిగుమతుల అవసరం తగ్గుతుంది.➤డాలర్లపై భారతదేశం ఆధారపడటం తగ్గుతుంది.➤రూపాయి విలువ బలపడే అవకాశం ఉంటుంది.➤దేశంలో బంగారం ఆధారిత వ్యాపారాలు మరింత పారదర్శకంగా మారతాయి.➤దిగుమతులు తగ్గడం వల్ల, బంగారం ధరలు తగ్గే అవకాశం ఉంది.ఆర్థిక నిపుణుల అంచనా ప్రకారం.. భారతీయుల వద్ద ఉన్న బంగారంలో కేవలం 5 శాతం మాత్రమే ఈ పథకం ద్వారా సమీకరించినా, సుమారు 1,250 టన్నుల బంగారం లేదా 80-90 బిలియన్ డాలర్ల విలువైన ఆస్తి దేశ ఆర్థిక వ్యవస్థలోకి వస్తుంది. ఇది దాదాపు రెండేళ్ల పాటు బంగారం దిగుమతుల అవసరాన్ని తగ్గించే స్థాయిలో ఉంటుంది.ప్రధానమంత్రి పిలుపుఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజలను ఒక సంవత్సరం పాటు కొత్త బంగారం కొనుగోళ్లను వాయిదా వేయాలని కోరారు. దీనివల్ల దేశ విదేశీ మారక నిల్వలపై ఒత్తిడి తగ్గుతుందని ప్రభుత్వం భావిస్తోంది. -
పరుగులు పెడుతున్న బంగారం, వెండి ధరలు.. తులం ఎంతంటే..
-
బంగారం ధర ఇంకా తగ్గుతుందా ? గోల్డ్ కొనడానికి సరైన టైం ఎప్పుడంటే?
-
బంగారం ధరలు కూల్ఆఫ్!
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో నేడు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. -
బింబిసారుడి వేల కోట్ల బంగారం.. ఆ రహస్య గుహ ఎక్కడుందో తెలుసా?
బిహార్లోని రాజ్గిరి కొండల్లో ఉన్న సోన్ భండార్ గుహల వెనక మిస్టరీ శతాబ్దాలుగా వీడడం లేదు. సైన్స్ సమాధానం చెప్పలేని వింత కోడ్ల కారణంగా.. ఆ గుహలను ఇంతవరకు ఎవరూ డీకోడ్ చేయలేకపోవడం గమనార్హం..! ఆ గుహల వెనక మగధ సామ్రాజ్యకాలంలో దాచిన బంగారు నిధులు ఉన్నాయని అంతా విశ్వసిస్తారు. ఆ గుహలోకి వెళ్లేందుకు ఒక భారీ రాతి ద్వారం ఉంది. దానిపై ఉన్న వింత లిపిని చదవగలిగితేనే.. గుహలోకి ఎలా వెళ్లాలి? అనేది తెలుస్తుందని ఆర్కియాలజిస్టులు చెబుతున్నారు.బిహార్లోని వైభవ్ కొండల అడుగుభాగంలో ఉన్న రెండు భారీ రాతి గుహలనే 'సోన్ భండార్' అంటారు. సోన్ భండార్ అంటేనే 'బంగారపు నిధి' అని అర్థం. పురాణాల ప్రకారం మహాభారత కాలంలో జరాసంధుడి నిధిని ఇక్కడే దాచారు. అయితే చరిత్రకారుల ప్రకారం.. క్రీస్తుపూర్వం 4వ శతాబ్దంలో మగధ సామ్రాజ్యాన్ని పాలించిన బింబిసార మహారాజు, శత్రువుల దాడి నుంచి తన అపారమైన బంగారాన్ని, రత్నాలను రక్షించుకోవడానికి ఇక్కడే నిధులను దాచాడని చెబుతారు. బింబిసారుడి భార్య 'మగధ సామ్రాజ్య ఖజానా' మొత్తాన్ని ఈ గుహలో దాచి, ఎవరూ దొంగిలించకుండా ఒక భారీ రాతి తలుపును ఏర్పాటు చేసి, లాక్ చేయించిందని స్థానికుల నమ్మకం. ఆ రాతి గది వెనుక వేల కోట్ల విలువైన నిధి ఇప్పటికీ భద్రంగా ఉందనేది ఒక పెద్ద మిస్టరీ.ఈ గుహలోకి ప్రవేశించగానే ఒక మూసి ఉన్న రాతి ద్వారం కనిపిస్తుంది. దాని పక్కనే గోడపై ఒక వింతైన లిపి దర్శనమిస్తుంది. దీన్ని 'శంఖ లిపి' అని పిలుస్తారు. ఈ రహస్య కోడ్ను ఎవరైతే సరిగ్గా చదువుతారో.. ఆ మంత్ర శబ్దానికి ఆ రాతి ద్వారం దానంతట అదే తెరుచుకుంటుందని ఒక బలమైన నమ్మకం ఉంది. భారతదేశాన్ని దోచుకున్న బ్రిటిషు వారి కన్ను కూడా ఈ నిధిపై పడింది. ఎలాగైనా ఆ తలుపులు బద్దలు కొట్టాలని, ఒక బ్రిటిష్ అధికారి ఏకంగా పెద్ద పెద్ద ఫిరంగులను తెప్పించి ఆ రాతి ద్వారంపై బాంబుల వర్షం కురిపించాడు. కానీ ఆశ్చర్యకరంగా.. ఫిరంగి దెబ్బలకు కూడా ఆ తలుపులు అంగుళం కూడా కదల్లేదు. ఆ దాడికి గుర్తుగా గుహ ద్వారంపై పడిన ఫిరంగి దెబ్బల గుర్తులు నేటికీ స్పష్టంగా కనిపిస్తాయి.సైన్స్, హిస్టరీ.. ఈ రెండు కూడా ఈ గుహలను వేర్వేరు కోణాల్లో చూస్తాయి. స్థానికులు దీన్ని బింబిసారుడి నిధిగా నమ్ముతుంటే, ఆర్కియాలజిస్టులు మాత్రం దీని వెనుక మరో మతపరమైన కోణాన్ని చెబుతున్నారు. ఇక్కడి ఉన్న శాసనాలను బట్టి ఇవి క్రీస్తుశకం 3 లేదా 4వ శతాబ్దానికి చెందిన జైన్ గుహలు అని వివరిస్తున్నారు. 'ముని వైరాదేవ' అనే జైన సాధువు ఈ గుహలను నిర్మించి, లోపల జైన్ తీర్థంకరుల విగ్రహాలను ప్రతిష్టించారని.. గోడలపై ఉన్నది గుప్త సామ్రాజ్యం కాలం నాటి శంఖ లిపి అని పేర్కొంటున్నారు. దానిని పూర్తిగా డీకోడ్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని, అది కేవలం ఒక మతపరమైన శ్లోకం మాత్రమే అయి ఉండవచ్చు, నిధి కోడ్ కాకపోవచ్చని చెబుతున్నారు.ఆర్కియాలజిస్టులు ఇవి జైన గుహలని చెబుతున్నప్పటికీ... గుహ వెనుక ఉన్న ఆ రహస్య గదిలోకి మాత్రం ఇప్పటివరకు ఎవరూ ప్రవేశించలేకపోయారు. హైటెక్ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన ఈ రోజుల్లో కూడా.. ఒక సాధారణ రాతి తలుపు వెనుక ఉన్న రహస్యాన్ని ఛేదించలేకపోవడం ఒక పెద్ద సవాల్గానే మిగిలిపోయింది. ఆ రాతి తలుపు వెనుక మగధ సామ్రాజ్య వేల కోట్ల నిధి ఉందా? లేక హిస్టరీ దాచిన మరేదైనా ఆధ్యాత్మిక రహస్యం ఉందా? అనే ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే.. ఆ గోడలపై ఉన్న శంఖ లిపి మిస్టరీ వీడే వరకు వేచి చూడాల్సిందే! ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే.. ఈ వీడియోను లైక్ చేయండి.. షేర్ చేయండి.. ఇలాంటి అప్డేట్స్ను మిస్సవ్వకుండా ఉండేందుకు మా చానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.. -
పసిడి ప్రియులకు షాక్.. ఒక్కసారిగా పెరిగిన ధరలు!
బంగారం ధరల్లో ఎప్పటికప్పుడు ఊహకందని మార్పు జరుగుతున్నాయి. అయితే నేడు (మంగళవారం) పసిడి ధరల తగ్గుదలకు బ్రేక్ పడింది. దీంతో ఒక్కసారిగా గోల్డ్ రేటు పెరిగిపోయింది. ఈ కథనంలో లేటెస్ట్ ధరలు ఎలా ఉన్నాయో చూసేద్దాం.హైదరాబాద్, విజయవాడలలో ఈ రోజు (జూన్ 30) ఉదయం రూ.1,28,450 వద్ద ఉన్న 22 క్యారెట్ల తులం బంగారం ధర.. సాయంత్రానికి రూ.1,30,200 రూపాయల వద్దకు చేరింది. అంటే గంటల వ్యవధిలోనే పసిడి ధరల్లో భారీ మార్పు (రూ.1750 పెరిగింది) జరిగిందని స్పష్టమవుతోంది. 24 క్యారెట్ల ధర రూ.1,40,130 నుంచి రూ.1,42,040 (రూ.1910 పెరిగింది) వద్దకు చేరింది.ఢిల్లీలో కూడా బంగారం ధరల్లో మార్పు సంభవించింది. ఇక్కడ 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 1,28,600 రూపాయల నుంచి రూ.1,30,350 వద్దకు, 24 క్యారెట్ల తులం గోల్డ్ రేటు రూ.1,40,280 నుంచి రూ.1,42,190 వద్దకు చేరింది.అయితే చెన్నైలో మాత్రం బంగారం ధరలు తగ్గాయి. ఇక్కడ 22 క్యారెట్ల తులం గోల్డ్ రేటు రూ.1000 తగ్గి రూ.1,32,000 వద్ద, 24 క్యారెట్ల రేటు రూ.1090 తగ్గి రూ.1,44,000 వద్ద నిలిచాయి.మొత్తం మీద దేశంలో గోల్డ్ రేటు తగ్గినట్లే తగ్గి.. మళ్లీ పెరుగుదల దిశగా అడుగులు వేయడం వల్ల, పసిడి ప్రియులలో ఆందోళన మొదలైంది. అయితే రాబర్ట్ కియోసాకి వంటి నిపుణులు మాత్రం రానున్న రోజుల్లో మరింత తగ్గే అవకాశం ఉందని చెబుతున్నారు. -
పొలంలో బంగారం కలకలం ఆ తర్వాతే మొదలైన అసలు కథ..
-
బంగారం, వెండి ధరల్లో భారీ పతనం.. ఈరోజు తాజా రేట్లు ఇవే!
-
బంగారం ధరలు పెరిగినా ఎందుకు అమ్ముతున్నారు?
-
లాకర్.. సేఫేనా?
ఏళ్ల తరబడి కూడబెట్టిన బంగారం. వారసత్వంగా వస్తున్న కుటుంబ నగలు, విలువైన ఆస్తిపత్రాలు లాకర్లో ఉంటే చాలు ఇక టెన్షన్ లేదు అనే నమ్మకం భారతీయ కుటుంబాల్లో బలంగా ఉంది. విలువైన సంపదనంతా లాకర్లో దాచేసి తాళం చెవిని చూసుకుంటూ అంతా సేఫ్ అనుకునే రోజులు పోయాయి. దేశంలోని పలు నగరాల్లో ఇటీవలి కాలంలో వరుసగా వెలుగుచూసిన బ్యాంక్ లాకర్ వివాదాలు ప్రజల నమ్మకాన్ని ప్రశ్నిస్తున్నాయి. లాకర్లో ఉంచిన నగలు మాయమైతే బ్యాంకు బాధ్యత పరిమితమే అనే విషయం లాకర్లో వస్తువులు మాయమయ్యాక తెలుస్తోంది. నష్టపోయిన వస్తువులకు బ్యాంకులు చెల్లించే పరిహారం పోగొట్టుకున్న వాటి పూర్తి విలువలో పావువంతు కూడా ఉండదన్న విషయం అనేకమందికి చేతులు కాలాక కానీ అవగాహనకి రావడంలేదు. లాకర్ నిజంగా మీ విలువైన వస్తువులకు భద్రత ఇస్తుందా... ఇస్తే అది ఎంత భద్రత ఇస్తుంది? బంగారం, ఆస్తి పత్రాలను పూర్తిగా కాపాడుకోవాలంటే ఇంకేం చేయాలి అని వివరించి గైడ్ చేసే వెల్త్ స్టోరీ...బెంగళూరులో ఒక డాక్టర్ బ్యాంక్ లాకర్లో దాచుకున్న రూ.24 లక్షల విలువైన బంగారం పోయింది. మరో కేసులో ఢిల్లీలో ఓ కుటుంబం లాకర్లో ఎప్పటినుంచో పెడుతున్న రూ.60 లక్షల నగలు ఒకసారి కనిపించకుండా పోయాయి. సీసీటీవీలు ఉన్నాయి. ఫుటేజీల్లో పోయిన విషయం వెల్లడైంది. అయినా బాధితులకు న్యాయం అందలేదు. ఇక్కడ అసలు షాక్ ఏమిటంటే బ్యాంక్కు మీ నష్టాన్ని పూర్తిగా భర్తీ చేయాల్సిన బాధ్యత లేదు. ఆర్బీఐ రూల్స్ ప్రకారం మీకు తెలియాల్సిన నిజం ఏమిటంటే ,బ్యాంకు మార్గదర్శకాల ప్రకారం బ్యాంకు బాధ్యత లాకర్ రెంట్కు వంద రెట్లు మాత్రమే.. లాకర్లో వస్తువులు పోతే కస్టమర్ చెల్లించే లాకర్ రెంటుకు వంద రెట్లు నష్టపరిహారం మాత్రమే బ్యాంకు చెల్లిస్తుంది. అంటే ఒక లాకర్కు ఏడాదికి రూ.7000 అద్దె కడుతుంటే నష్టపోయినపుడు దక్కే పరిహారం రూ.7 లక్షలు మాత్రమే. పోగొట్టుకున్న మీ సంపద 70 లక్షలకు పైగా ఉన్నా దక్కేది అదే..అంటే బ్యాంక్ లాకర్ మాత్రమే విలువైన వస్తువులకు సేఫ్ కాదు. మరి బంగారాన్ని, ఇతర వస్తువులు, డాక్యుమెంట్లు ఎలా రక్షించుకోవాలి? అందుకు మల్టీ లేయర్ స్ట్రాటజీ పాటించాలి. ప్రస్తుత పరిస్థితుల్లో ఒకే ఒక రక్షణ పద్ధతిపై మాత్రమేఆధార పడటం ప్రమాదకరం. ఫైనాన్స్ నిపుణులు సూచిస్తున్నది కూడా మల్టీలేయర్ ప్రొటెక్షన్ స్ట్రాటజీనే అదేమీ బంగారం, డాక్యుమెంట్స్కు అసలైన భద్రత.జ్యువెలరీ ఇన్సూరెన్స్ఎక్కువ మంది పట్టించుకోని పెద్ద రక్షణభారతదేశంలో నగలు కొనేవారు ఇంటికి ఒకరు చొప్పున కోట్లలో ఉన్నా కొన్న నగలకు ఇన్సూరెన్స్ చేసే వారు మాత్రం అరుదే. లక్షల విలువ చేసే నగలు కొనగానే బీమా చేస్తే దొంగతనం జరిగినపుడు అది ఇంట్లో అయినా, బయట అయినా. లాకర్ లో జరిగినా పూర్తిగా నష్టపరిహారం బీమా రూపంలో అందుతుంది. అగ్ని ప్రమాదాలు, వరదలు, భూకంపాలు, ప్రయాణాల్లో నగలు పోగొట్టుకున్నా బీమా భద్రత పూర్తిగా లభిస్తుంది.ఇది బ్యాంకు తప్పిదంవల్ల జరిగిన నష్టానికి అందే పరిహారం కంటే ఎక్కువ. బ్యాంక్ కవరేజ్ లిమిట్ను దాటి, అసలు విలువను రక్షించేది ఇదే.ప్రీమియం ఎంత? సంవత్సరానికి 0.3శాతం నుంచి 1శాతం లోపే రూ.10 లక్షల బంగారానికి రూ.3,000 రూ.10,000 వరకు మాత్రమే అయితే ఇక్కడ కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి. పాలసీలో మీరు డిక్లేర్ చేసిన నగలకు మాత్రమే కవరేజ్ లభిస్తుంది. బీమా చేశాక నగలు కొత్తగా కొంటే వాటిని బీమాలో అప్డేట్ చేయాలిజ్యువెలరీ వాల్యుయేషన్చిన్న తప్పు, పెద్ద నష్టంమీ నగల విలువను ప్రతి సంవత్సరం తప్పనిసరిగా మదుపు చేయించాలి. అదీ పాత బిల్లుతో కాదు. ప్రస్తుత మార్కెట్ విలువతో ఇన్సూర్ చేయించాలి. ఎందుకంటే పదేళ్ల క్రితం కొన్న బంగారం విలువ ప్రస్తుతం అనేక రెట్లు పెరిగి ఉంటుంది. పాత విలువతో బీమా చేయిస్తే పోగొట్టుకున్నప్పుడు లభించే బీమా క్లెయిమ్ తక్కువే ఉంటుంది. అందుకే నగలను ఎప్పటికప్పుడు సర్టిఫైడ్ జ్యువెలర్తో వాల్యుయేషన్ చేయించాలి. కనీసం రెండు మూడు సంవత్సరాలకు ఒకసారైనా అప్డేట్ చేసుకోవాలి.హోమ్ సేఫ్ ఏర్పాటుఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ప్రతి ఇంట్లో ఉండాల్సిన మినీ వాల్ట్ ఉండాలి. రోజువారీ క్యాష్, నగల కోసం ఇంట్లో ఒక మంచి హోమ్ సేఫ్ ఏర్పాటు చేసుకోవాలి. అది ఎలా ఉండాలంటే దృఢమైన స్టీల్ బాడీతో తయారు చేసినదై ఉండాలి. పిన్/ ఫింగర్ ప్రింట్ లాక్ సౌకర్యం ఉండాలి. అగ్ని ప్రమాదాలను తట్టుకునేలా ఫైర్ రెసిస్టెంట్ అయి ఉండాలి. గోడకు కానీ నేలకు కానీ బిగించాలి. రూ.5000 నుంచి 25000 ఖర్చుతో సేఫ్ ఏర్పాటు చేసుకుని తరచూ వేసుకునే నగలతోపాటు, లాకర్లో పెట్టిన వస్తువుల కాపీలు, రసీదులు, డాక్యుమెంట్ల జిరాక్సులు రెడీగా ఉంచుకోవాలి.హోమ్ ఇన్సూరెన్స్ అండర్ రేటెడ్ కవరేజ్చాలా మందికి హోమ్ ఇన్సూరెన్స్ ఉండదు. ఫరి్నచర్, ఎల్రక్టానిక్స్ వస్తువులతో పాటు, నగలు కూడా (సబ్ లిమిట్)తో బీమా చేయించాలి. జువెలరీ లిమిట్ ని అదనంగా పెంచుకోవచ్చు.డిజి లాకర్డాక్యుమెంట్లకు డిజిటల్ రక్షణభారత ప్రభుత్వం పౌరులందరికి అందిస్తున్న ఫ్రీ సర్వీస్ ఈ డిజిలాకర్.. డ్రైవింగ్ లైసెన్సులు, పాన్ కార్డులు, రిజి్రస్టేషన్ కార్డులు వంటి డాక్యుమెంట్లను డిజిటల్ రూపంలో ఇక్కడ దాచుకో?వచ్చు. ఇవన్నీ ఎక్కడైనా లీగల్గా వాలిడిటీ కలిగి ఉంటాయి. ఎక్కడైనా, ఎక్కడినుంచైనా ఇంటర్ నెట్ ద్వారా, ఫోన్లో కూడా యాక్సెస్ చేయచ్చు. అయితే ఒకవిషయం గుర్తుంచుకోవాలి. డిజి లాకర్లో అప్ లోడ్ చేసిన డాక్యుమెంట్లు స్కాన్ కాపీలు మాత్రమే. రిఫరెన్స్ కోసమే. ఒరిజినల్స్ను మరోచోట సేఫ్ గా భద్రపరచుకోవాలి.ప్రాపర్టీ డాక్యుమెంట్స్స్మార్ట్ హ్యాండ్లింగ్ తప్పనిసరిఇళ్లు, స్థలాలకు సంబంధించిన ప్రాపర్టీ డాక్యుమెంట్లు పోతే వాటిని తిరిగి పొందడానికి, కనీసం డూప్లికేట్ కాపీలు సంపాదించడానికి సంవత్సరాలు సాగుతాయి. అందువల్ల డాక్యుమెంట్ కాపీలను మల్టిపుల్ కాపీలు గా చేసి లాకర్తో పాటు, ఇంట్లో, దగ్గరి బంధువులు, స్నేహితులు దగ్గర ఒక కాపీ ఉంచాలి. హైక్వాలిటీ స్కాన్ చేయించి గూగుల్ డ్రైవ్లో, డిజిలాకర్లో అప్లోడ్ చేయాలి. ఒక కాపీని పర్సనల్ మెయిల్కి పంపుకుని సేవ్ చేసి ఉంచుకోవాలి?డాక్యుమెంటేషన్పోయిన వస్తువుల, నగల క్లెయిమ్కు ఇదే బేస్కొన్న ప్రతి నగకు ఫోటోలు తీయించాలి. వాటి వెయిట్, ప్యూరిటీ నోట్ చేసి ఉంచాలి. బిల్లులు అన్నీ ఎక్స్ ట్రా కాపీ భద్రంగా ఉంచాలి. ఎక్కడ ఉంచారో రికార్డు చేయాలి. ఈ రికార్డు లేకపోతే బీమా క్లెయిమ్ రిజెక్ట్ అయే చాన్స్ ఎక్కువ.లాకర్లో నగలు మాయమైతే ఏం చేయాలి? బ్యాంకు అధికారులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయాలి. ఎఫ్ఐఆర్ నమోదు చేయించాలి. సీసీటీవీ ఫుటేజ్ అడిగి తీసుకోవాలి, వెంటనే బీమా కంపెనీకి సమాచారం అందించాలి. నగలకు సంబంధించిన ఫొటోలు, విలువకు సంబంధించిన పత్రాల కాపీలు అందించాలి. బెంగళూరు, ఢిల్లీ కేసులు యాదృచ్ఛికం కాదు నిర్లక్ష్యానికి హెచ్చరిక. అన్ని వస్తువులకు బ్యాంకు లాకరే భద్రత కాదు. అసలు భద్రత సిస్టమ్ ప్లస్ ప్లానింగ్. సేఫ్టీ అనేది ప్రమాదం సంభవించిన తర్వా త కాదు. ముందే నిర్మించుకోవాల్సిన విషయం. -
మోదీ మాట.. రూ.13 వేలు తగ్గిన గోల్డ్ రేటు!
భారతదేశంలో ఇటీవల బంగారం, వెండి ధరలు గణనీయంగా తగ్గాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. పౌరులను ఒక సంవత్సరం పాటు బంగారం కొనుగోళ్లను వాయిదా వేయాలని చేసిన సూచన తర్వాత ఈ మార్పు చోటుచేసుకుందని నిపుణులు చెబుతున్నారు.మే 10న ప్రధానమంత్రి బంగారం కొనుగోలును ఒక ఏడాది వాయిదా వేయాలని చెప్పినప్పుడు, 24 క్యారెట్ బంగారం ధర 10 గ్రాములకు సుమారు రూ.1,53,140గా ఉండగా, వెండి ధర కేజీ సుమారు రూ.2,62,350గా ఉంది. అయితే నేటికి (జూన్ 28) ఆ ధర బంగారం ధర రూ.1,39,873కి తగ్గగా, వెండి ధర రూ.2,16,541కి పడిపోయింది. అంటే.. మోదీ ప్రకటన తరువాత గోల్డ్ రేటు సుమారు రూ.13,267 తగ్గగా, వెండి దాదాపు రూ.45,809 తగ్గింది.భారత్లో బంగారం దిగుమతులు ఎక్కువగా ఉండటం వల్ల విదేశీ మారక ద్రవ్యంపై భారీ ఒత్తిడి పడుతోంది. ఈ పరిస్థితుల్లో విదేశీ మారక నిల్వలను కాపాడుకోవడానికి ప్రధాని మోదీ ప్రజలను ఉద్దేశించి అవసరం ఉంటే తప్పా.. బంగారం కొనుగోళ్లు, విదేశీ ప్రయాణాలను వాయిదా వేయాలని కోరారు.ప్రధాని విజ్ఞప్తి తరువాత ప్రభుత్వం బంగారం, వెండి దిగుమతి సుంకాన్ని 6 శాతం నుంచి 15 శాతానికి పెంచింది. దీని ద్వారా దిగుమతులను తగ్గించడంతో పాటు.. దేశీయ మార్కెట్పై నియంత్రణ సాధించాలని భావించారు. అనుకున్న విధంగానే.. ఈ నిర్ణయం వినియోగదారులపై తక్షణ ప్రభావం చూపించిందని తెలుస్తోంది. -
ఒకేసారి భారీగా పెరిగిన బంగారం తులం ఎంతంటే?
-
ఒక్కసారిగా పెరిగిన గోల్డ్ రేటు!
భారతదేశంలో వరుసగా తగ్గుముఖం పడుతున్న బంగారం ధరలకు బ్రేక్ పడింది. ఎందుకంటే ఈ రోజు (జూన్ 26) గోల్డ్ రేటు ఊహకందని రీతిలో ఒక్కసారిగా పెరిగింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లోని పసిడి ధరల్లో మార్పు జరిగింది. ఈ కథనంలో తాజా ధరల వివరాలు చూసేద్దాం.హైదరాబాద్, విజయవాడలలో శుక్రవారం ఉదయం రూ.250 పెరిగి రూ.1,29,800 వద్ద ఉన్న 22 క్యారెట్ల తులం బంగారం రేటు.. సాయంత్రానికి రూ.1,30,850 వద్దకు చేరింది. అంటే గంటల వ్యవధిలో రూ.1050 పెరిగింది. 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.1,41,600 నుంచి రూ.142750 వద్దకు చేరింది.ఢిల్లీలో కూడా గోల్డ్ ధరలో మార్పులు కనిపించాయి. దేశ రాజధానిలో 22 క్యారెట్ల తులం బంగారం ధర ఉదయం నుంచి సాయంత్రానికి రూ.1,29,950 నుంచి రూ.1,31,050 వద్దకు (రూ.1100 పెరిగింది) చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల రేటు 1,41,750 రూపాయల నుంచి 1,42,950 రూపాయల వద్దకు చేరింది.చెన్నైలో మాత్రం 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.1,33,000 (రూ.1600 పెరిగింది) వద్ద, 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.1,45,090 (రూ.1740 పెరిగింది) వద్ద నిలిచింది. -
35 వేల డాలర్లకు గోల్డ్?: కియోసాకి ట్వీట్
బంగారం, వెండి ధరలు తారుమారవుతున్న వేళ 'రాబర్ట్ కియోసాకి' ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బంగారం ఇప్పుడే మలుపు తిరిగింది. నా అంచనా తప్పయినప్పటికీ.. గోల్డ్, సిల్వర్ రేట్లు మరింత పెరిగే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.పెట్టుబడిదారుడు జిమ్ రికార్డ్స్ వంటి వారు భవిష్యత్తులో బంగారం ధర 35,000 డాలర్ల వరకు చేరవచ్చని అంచనా వేస్తున్నారని కియోసాకి తన ట్వీట్ ద్వారా వెల్లడించారు. అంతే కాకుండా.. గత అనుభవాలను పరిశీలిస్తే, 2000 సంవత్సరంలో ప్రారంభమైన పెద్ద బుల్ రన్ సమయంలో బంగారం ధరలు గణనీయంగా పెరిగాయి. అప్పట్లో కొందరు పెట్టుబడిదారులు మంచి లాభాలను పొందారు. ఇప్పుడు కూడా అదే తరహా పరిస్థితులు మళ్లీ ఏర్పడవచ్చని ఆయన పేర్కొన్నారు.ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం అప్పుల భారంతో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో సంప్రదాయ కరెన్సీలపై నమ్మకం తగ్గి, బంగారం వంటి సురక్షితమైన ఆస్తులపై డిమాండ్ పెరుగుతుందని కియోసాకి చెప్పారు.'బంగారం అనేది నిజమైన డబ్బు, మిగతావన్నీ క్రెడిట్ మాత్రమే' అనే జేపీ మోర్గాన్ అభిప్రాయాన్ని కూడా కియోసాకి ఉదహరించారు. దీన్నిబట్టి చూస్తే.. అమెరికన్ డాలర్ కూడా ఒక రకమైన అప్పు ఆధారిత వ్యవస్థగా కనిపిస్తుందని వారు అంటున్నారు. అందువల్ల ఆర్థిక అనిశ్చితి పెరిగినప్పుడు బంగారం, వెండి వంటి ఆస్తులు మరింత బలపడతాయని చెబుతున్నారు.అంతే కాకుండా.. ఆధునిక ప్రపంచంలో కృత్రిమ మేధస్సు (AI) వేగంగా అభివృద్ధి చెందుతోందని, ఇది భవిష్యత్తులో ఆర్థిక, ఉద్యోగ, పెట్టుబడి రంగాల్లో పెద్ద మార్పులను తీసుకురావచ్చని భావిస్తున్నారు. ఈ మార్పుల మధ్య పెట్టుబడిదారులు తమ ఆర్థిక నిర్ణయాలను మరింత జాగ్రత్తగా తీసుకోవాల్సి ఉంటుంది.GOLD just made the turn.I think and I have been wrong, the price of gold and silver are about to rise for a long time. Jim Rickards predicts $35,000 gold in near future.As I stated in my previous X the last big bull run began in 2000 and I bought gold at $300.In 2026 the…— Robert Kiyosaki (@theRealKiyosaki) June 25, 2026 -
మళ్లీ కొండెక్కిన బంగారం తులంపై ఎంత పెరిగిందంటే
-
అంతలోనే ఇంతలా.. బంగారం కొత్త ధరలు ఇలా!
భారతదేశంలో బంగారం తగ్గుదలకు బ్రేక్ పడింది. వరుసగా తగ్గుతున్న గోల్డ్ రేటు.. పెరుగుదల దిశగా అడుగులు వేసింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో పసిడి ధరల్లో మార్పులు జరిగాయి. ఈ కథనంలో కొత్త రేట్లు ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడలో ఈ రోజు (జూన్ 25) ఉదయం రూ.1,28,450 వద్ద ఉన్న తులం 22 క్యారెట్స్ బంగారం ధర సాయంత్రానికి రూ.1,29,550 వద్దకు చేరింది. 24 క్యారెట్ల బంగారం రేటు రూ.1,40,130 నుంచి రూ.1,41,330 వద్దకు చేరింది. దీన్నిబట్టి చూస్తే గంటల వ్యవధిలో పసిడి ధరలు ఎంతగా మారాయో స్పష్టంగా తెలుస్తోంది.ఢిల్లీలో కూడా బంగారం ధరల్లో మార్పులు జరిగాయి. ఇక్కడ ఉదయం రూ.1,28,600 వద్ద ఉన్న 22 క్యారెట్ల తులం గోల్డ్ రేటు రూ.1,29,700 వద్దకు చేరింది. 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,40,280 నుంచి రూ.1,41,480 వద్దకు చేరింది.అయితే చెన్నైలో మాత్రం ధరల్లో ఎలాంటి మార్పు జరగలేదు. కాబట్టి ఇక్కడ 22 క్యారెట్ల తులం బంగారం రేటు రూ.131400 వద్ద, 24 క్యారెట్ల రేటు రూ.1,43,350 వద్ద ఉంది. -
బంగారం మరింత కొనే సమయం వచ్చిందా?
ప్రముఖ ఇన్వెస్టర్, ప్రపంచ ప్రఖ్యాత ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి (Robert Kiyosaki) బంగారం ధరలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బంగారం ధరలు వరుసగా తగ్గుముఖం పడుతుండటం మంచి వార్తేనని ఆయన తన ఎక్స్ (X) ఖాతాలో పేర్కొన్నారు. అయితే తాను ప్రస్తుతం మరింత బంగారం కొనుగోలు చేసే సమయం వచ్చిందా లేదా అన్నది తెలుసుకోవడానికి సాంకేతిక చార్టులను పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు.ధరలు తగ్గుతున్నాయనే కారణంతోనే పెట్టుబడి పెట్టడం సరైన నిర్ణయం కాదని కియోసాకి అభిప్రాయపడ్డారు. ఒక ఇంటి ధర తగ్గితే కేవలం తక్కువ ధర చూసి కొనుగోలు చేయరని, ఆ ఇంటి చుట్టుపక్కల ప్రాంతం ఎలా అభివృద్ధి చెందుతోందో కూడా పరిశీలిస్తామని ఉదాహరణగా వివరించారు. అదే విధంగా బంగారం ధరలు ఎందుకు తగ్గుతున్నాయి? ఆర్థిక వ్యవస్థలో ఏమి జరుగుతోంది? అనే అంశాలను తెలుసుకోవడం ముఖ్యమని పేర్కొన్నారు.ఆర్థిక పరిస్థితులు బలహీనపడుతున్నాయని భావిస్తే తాను బంగారం కొనుగోలుకు దూరంగా ఉండవచ్చని, కానీ ఆర్థిక వ్యవస్థ మెరుగుదల దిశగా సాగుతోందని సంకేతాలు కనిపిస్తే తక్కువ ధరల వద్ద బంగారాన్ని కొనుగోలు చేసే అవకాశాన్ని పరిశీలిస్తానని చెప్పారు. ప్రస్తుతం తన వద్ద ఉన్న బంగారంలో చాలా భాగాన్ని 2000 ప్రాంతంలో ఔన్స్కు సుమారు 300 డాలర్ల ధర వద్ద కొనుగోలు చేశానని కియోసాకి గుర్తుచేశారు.మార్కెట్ ధోరణి (ట్రెండ్)ను గమనించడం పెట్టుబడిదారులకు అత్యంత కీలకమని, ధరల కంటే వాటి వెనుక ఉన్న ఆర్థిక పరిస్థితులను అర్థం చేసుకోవడమే విజయవంతమైన పెట్టుబడులకు మూలమని ఆయన తన పోస్ట్లో సూచించారు.GREAT NEWS: Gold continues to drop in price. Watching technical charts to know when to buy more.TREND is your FRIEND!!!!! Repeating past lesson.Price is like knowing the price of a house is going down.What I want to know what is happening in the neighborhood?If…— Robert Kiyosaki (@theRealKiyosaki) June 24, 2026 -
హ్యాట్రిక్.. మరింత పడిపోయిన బంగారం.. ఎంతో తెలుస్తే షాక్ అవుతారు
-
పాతాళానికి పసిడి ధరలు ఒక్క రోజులో ఎన్ని వేలు తగ్గిందంటే..
-
గంటల వ్యవధిలో.. మారిపోయిన బంగారం ధరలు!
బంగారం ధరల్లో ఎప్పటికప్పుడు ఊహకందని మార్పు జరుగుతూనే ఉన్నాయి. ఈ రోజు 24 గంటలు గడవక ముందే.. గోల్డ్ రేటు భారీ పతనం చవి చూసింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లోని పసిడి ధరల్లో మార్పు సంభవించింది. ఈ కథనంలో లేటెస్ట్ గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయో చూసేద్దాం.హైదరాబాద్, విజయవాడ నగరాల్లో ఈ రోజు ఉదయం రూ.1900 (22 క్యారెట్స్ తులం), రూ.2070 (24 క్యారెట్స్ తులం) తగ్గి వరుసగా రూ. 133750, రూ.145910 వద్ద నిలిచిన 10 గ్రాముల గోల్డ్ రేటు సాయంత్రాని మరోమారు తగ్గుముఖం పట్టింది. దీంతో ప్రస్తుతం పసిడి ధరలు రూ.132500, రూ.144600 వద్దకు చేరాయి. దీన్నిబట్టి చూస్తే బంగారం ధర గంటల వ్యవధిలో ఎంతలా మారిపోయిందో స్పష్టమవుతోంది. ఇదే ధరలు ముంబై, బెంగళూరులలో కూడా కొనసాగుతాయి.ఢిల్లీలో కూడా గోల్డ్ రేటు తగ్గింది. ఇక్కడ 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 3100 రూపాయలు తగ్గి రూ.132700 వద్ద, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 3380 రూపాయలు తగ్గి రూ.144750 వద్దకు చేరాయి.చెన్నైలో మాత్రం బంగారం ధరల్లో సాయంత్రానికి ఏ మాత్రం మార్పు చెందలేదు. కాబట్టి ఇక్కడ తులం 24 క్యారెట్ల గోల్డ్ రేటు 147930 రూపాయల వద్ద, 22 క్యారెట్ల పసిడి ధర రూ.135600 వద్ద ఉంది.ఇదీ చదవండి: డిఫ్లేషన్ భయం.. బంగారం, వెండి ధరలు పడిపోతాయా? -
బంగారం కొనేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకండి
-
డిఫ్లేషన్ భయం.. బంగారం, వెండి ధరలు పడిపోతాయా?
ప్రపంచ ఆర్థిక వ్యవస్థ రాబోయే రోజుల్లో డిఫ్లేషన్ (Deflation) దిశగా వెళ్లే అవకాశం ఉందని మార్కెట్ వ్యూహకర్త అమిత్ గోయెల్ చెబుతున్నారు. ఇప్పటికే చాలామంది నిపుణులు ద్రవ్యోల్బణం (Inflation) కొనసాగుతుందని భావిస్తున్నా.. అమిత్ మాత్రం పరిస్థితి వేరుగా ఉండొచ్చని హెచ్చరిస్తున్నారు.డిఫ్లేషన్ అంటే ఏమిటి?సాధారణంగా వస్తువులు, సేవల ధరలు పెరగడాన్ని ద్రవ్యోల్బణం (Inflation) అంటారు. అయితే.. దీనికి విరుద్ధంగా, వస్తువుల ధరలు నిరంతరం తగ్గుతూ ఉండే పరిస్థితిని డిఫ్లేషన్ అంటారు. ఇది వినియోగదారులకు మొదట లాభంగా కనిపించినప్పటికీ, దీర్ఘకాలంలో ఆర్థిక వ్యవస్థకు ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది.ఎలా అంటే.. ధరలు తగ్గితే, ప్రజలు ఖర్చులు తగ్గిస్తారు, కంపెనీల ఆదాయాలు పడిపోతాయి. సంస్థలకు వచ్చే ఆదాయం తగ్గితే.. ఈ ప్రభావం ఉద్యోగులపై పడుతుంది. దీంతో ఆర్థిక వృద్ధి కూడా మందగిస్తుంది.డిఫ్లేషన్కు కారణాలు ఏమిటి?అమిత్ గోయల్ అభిప్రాయం ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న అప్పుల భారం, కృత్రిమ మేధస్సు వల్ల ఉత్పాదకత పెరగడం డిఫ్లేషన్కు దారితీయవచ్చు.ఏఐ వినియోగం పెరగడం వల్ల.. సంస్థల ఖర్చులు తగ్గే అవకాశం ఉంది. ఉత్పత్తులు, సేవలు తక్కువ ఖర్చుతో అందుబాటులోకి వస్తాయి. దీని ప్రభావంగా ధరలు తగ్గే పరిస్థితి ఏర్పడవచ్చు. మరోవైపు.. ప్రభుత్వాలు, సంస్థలపై పెరుగుతున్న అప్పుల భారం ఆర్థిక వృద్ధిని తగ్గించే ప్రమాదం ఉందని ఆయన పేర్కొన్నారు.బంగారం, వెండిపై ప్రభావంసాధారణంగా ద్రవ్యోల్బణం పెరిగినప్పుడు పెట్టుబడిదారులు తమ సంపదను రక్షించుకోవడానికి బంగారం, వెండి వంటి విలువైన లోహాల వైపు మొగ్గు చూపుతారు. అందువల్ల వాటి ధరలు పెరుగుతాయి.కానీ.. డిఫ్లేషన్ పరిస్థితుల్లో పరిస్థితి భిన్నంగా ఉంటుంది. నగదు విలువ పెరగడం, పెట్టుబడిదారులు రిస్క్ తీసుకోవడానికి వెనుకాడటం వంటి కారణాల వల్ల బంగారం, వెండి డిమాండ్ తగ్గే అవకాశం ఉంటుంది. ఫలితంగా వాటి ధరలు తగ్గే అవకాశం ఉందని గోయల్ అభిప్రాయపడ్డారు. -
మళ్లీ తగ్గిన బంగారం ధరలు తులం ఎంతంటే?
-
నదిలో లక్షల కోట్ల నిధి.. చేతికందేలా ఉన్నా తీసుకోలేని పరిస్థితి!
హిమాలయాల్లో ఓ పవిత్రమైన సరస్సు ఉంది. దాని అడుగు భాగంలో లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే అపారమైన బంగారు, వెండి ఆభరణాలున్నాయంటే మీరు నమ్ముతారా? ఆధ్యాత్మికతకు ఆలవాళంగా ఉన్న ఆ సరస్సులో.. నాగుపాము పడగను పోలిన పువ్వులుండే మొక్కలు ఎందుకున్నాయి..? సరస్సు అడుగుభాగంలోని నిధులను కాపాడేందుకు యక్షులు స్వయంగా ఈ మొక్కల రూపంలో నిఘా పెడతారా? లేక.. మరేమైనా విశేషాలున్నాయా? ఈ ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే.. హిమాలయ రాష్ట్రాల్లో కీలకమైన హిమాచల్ ప్రదేశ్లోని మండి జిల్లాలో.. సముద్రమట్టానికి 3,334 మీటర్ల ఎత్తులో ఉన్న పవిత్ర క్షేత్రమే కమ్రూనాగ్. ఇక్కడి కమ్రూనాగ్ సరస్సు ఎన్నెన్నో వింతలను తనలో ఇముడ్చుకుంది. మహాభారత కాలంలో రత్నాయుధుడు ఓ గొప్ప వీరుడు, యోధుడు. ఇతణ్నే కమ్రూనాగ్ అని పిలుస్తారు. శ్రీకృష్ణుడి వ్యూహం ప్రకారం కమ్రూనాగ్ తన తలను త్యాగం చేయాల్సి రాగా.. అందుకు ప్రతిఫలంగా కలియుగంలో నువ్వు భక్తులతో పూజలందుకుంటావని కృష్ణుడు వరమిచ్చాడు. అలా.. కమ్రూనాగ్ ఈ ప్రాంతంలో కొలువుదీరాడు..కమ్రూనాగ్ ఒక యక్షుడు. ఆయనను పూజించే భక్తులు భక్తిభావంతో కమ్రూనాగ్ సరస్సులో బంగారు, వెండి నాణేలను వేయడం ఆనవాయితీగా మారింది. ద్వాపరయుగాంతం నుంచి మొదలుకుని.. కలియుగారంభం.. ఆ తర్వాతి కాలంలో భక్తులు వేసిన కానుకలతో ఈ సరస్సు అడుగు భాగం లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే బంగారు, వెండి ఆభరణాలు, నాణేలకు నిలయంగా మారిపోయింది. ఈ నిధిని తస్కరించడానికి ఎవరూ సాహసించరు. అలా ప్రయత్నిస్తే.. ఇక్కడి నాగుపాములు, యక్షులు వారిని ఊరికే వదిలి పెట్టరని భక్తుల విశ్వాసం.ప్రపంచంలో ఎక్కడా కనిపించని నాగుపాము పడగను పోలిన అరుదైన పుష్పాలు కమ్రూనాగ్ సరస్సు వద్ద దర్శనమిస్తాయి. వీటిని హిమాలయన్ కోబ్రాలిల్లీ అని పిలుస్తారు. స్థానికులు వీటిని బిషర్ అని పిలుస్తారు. దీని శాస్త్రీయనామం అరిసెమా ప్రోపింక్వమ్. పువ్వు పైభాగం పడగ విప్పిన నాగుపాము ఆకారాన్ని పోలిఉంటుంది. అంతేకాదు.. పాము నాలిక బయటకు వచ్చినట్లుగా.. ఈ పువ్వు అగ్రభాగం కనిపిస్తుంది. ఈ పుష్పాలు గోధుమ, ఊదా, ఆకుపచ్చ రంగులతో చారలను కలిగి ఉంటాయి. మొదటిసారి ఈ పుష్పాలను చూసేవారు.. నిజంగానే అక్కడ పాము ఉందని భ్రమపడడం ఖాయం. కమ్రూనాగ్ ట్రెకింగ్ మార్గంలో, సరస్సు వద్ద ఇవి ఎక్కువగా కనిపిస్తాయి.అయితే.. యక్షులు ఈ పువ్వుల రూపంలో ఉంటూ కమ్రూనాగ్ సరస్సులోని నిధులను కాపాడుతారని ఇక్కడి వారు విశ్వసిస్తారు. ఈ సరస్సును చేరుకనేందుకు నేరుగా రోడ్డుమార్గం లేదు. మండి నుంచి రోహండా అనే గ్రామానికి చేరుకుని.. అక్కడి నుంచి నిటారైన కొండమార్గంలో 6 కిలోమీటర్లు ప్రయాణించాలి. ఇందుకు నాలుగు గంటల వరకు సమయం పడుతుంది. అలా కఠినమైన ట్రెక్కింగ్ మార్గంలో ప్రయాణించి, కమ్రూనాగ్ సరస్సును చేరుకోవచ్చు. మే నెల మొదలు.. అక్టోబరు వరకు ఈ మార్గం ట్రెకింగ్కు అనుకూలంగా ఉంటుంది. ప్రతీఏడాది జూన్లో ఇక్కడ పెద్ద జాతర జరుగుతుంది. -
‘బంగారం, వెండి.. పడిపోతున్నాయ్’
ప్రసిద్ధ ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ పుస్తక రచయిత, ప్రముఖ ఇన్వెస్టర్ రాబర్ట్ కియోసాకి (Robert Kiyosaki) మరోసారి బంగారం, వెండి, క్రిప్టో ఆస్తులపై ఆశావహ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం బంగారం, వెండి ధరలు పడిపోతున్నప్పటికీ తాను విక్రయించడం లేదని, సరైన సమయంలో కొనుగోలు చేసేందుకు వేచి చూస్తున్నానని తెలిపారు. ధరల ఆధారంగా కాకుండా ఆస్తులు ఉన్న ఆర్థిక, రాజకీయ పరిస్థితులను బట్టి పెట్టుబడి నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు.తాజాగా సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్టులో కియోసాకి, అమెరికాతోపాటు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ సమస్యలను రాజకీయ, బ్యాంకింగ్ నాయకత్వం సమర్థంగా పరిష్కరించడం లేదని అభిప్రాయపడ్డారు. దీంతో భవిష్యత్తులో బంగారం, వెండి, బిట్ కాయిన్, ఇథీరియమ్ వంటి ఆస్తుల విలువలు మరింత పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు.సాంకేతిక చార్టులను పరిశీలిస్తున్నానని, బంగారం, వెండి ధరలు భారీ ర్యాలీకి సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తున్నాయని కియోసాకి చెప్పారు. అయితే తన అభిప్రాయాలను గుడ్డిగా నమ్మవద్దని, ప్రతి ఒక్కరూ స్వయంగా పరిస్థితులను విశ్లేషించి నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. రాబోయే కాలం ఆసక్తికరంగా ఉండబోతోందని, తెలివిగా వ్యవహరించే ఇన్వెస్టర్లు మరింత సంపద సృష్టించుకోగలరని ఆయన వ్యాఖ్యానించారు.Gold and silver prices are falling. Q: Am I buying or selling?A: One mistake I have made (and I’ve made many) is letting price determine reasons to buy or sell any asset.I have learned to understand the “context” or the environment the asset is in….not the price.For…— Robert Kiyosaki (@theRealKiyosaki) June 20, 2026 -
త్వరలో 50 వేలకే తులం బంగారం?
-
బంగారం ధరల్లో ఊహకందని మార్పు!
బంగారం ధరల భారీగా తగ్గుముఖం పడుతున్నాయి. వారం రోజుల్లో ఏకంగా రూ.5670 తగ్గింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో గోల్డ్ రేట్లలో స్వల్ప మార్పులు జరిగాయి. ఈ కథనంలో ఏడురోజుల్లో పసిడి ధరలలో జరిగిన మార్పులు, తాజా ధరల గురించి వివరంగా తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడలలో జూన్ 14(ఆదివారం)న రూ.1,49,080 వద్ద ఉన్న 24 క్యారెట్ల తులం గోల్డ్ రేటు జూన్ 20(శనివారం) నాటికి రూ.1,46,080 వద్దకు చేరింది. దీన్నిబట్టి చూస్తే కేవలం ఏడు రోజుల్లో రూ.3000 తగ్గినట్లు తెలుస్తోంది. 22 క్యారెట్ల రేటు 1,36,650 రూపాయల నుంచి 1,33,900 రూపాయల (రూ.2750 తగ్గింది) వద్దకు చేరింది.వారం ప్రారంభంలో స్వల్పంగా పెరిగిన గోల్డ్ రేటు.. ఆ తరువాత వరుసగా తగ్గడం మొదలైంది. వారాంతంలో ధరలు కొంత పెరిగాయి. దీంతో బంగారం ధరలలో ఊహకందని మార్పులు జరిగాయి.ఇక ఢిల్లీలో కూడా బంగారం ధరలలో మార్పులు కనిపించాయి. దేశ రాజధాని నగరంలో గత ఆదివారం (జూన్ 14) రోజు 1,49,230 రూపాయల వద్ద ఉన్న 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు శనివారం (జూన్ 20) నాటికి రూ.1,46,230 వద్దకు చేరింది. 22 క్యారెట్ల పసిడి ధర 1,36,800 రూపాయల నుంచి 1,34,050 రూపాయల వద్దకు చేరింది.చెన్నైలో కూడా గోల్డ్ రేటు తగ్గింది. ఇక్కడ జూన్ 14న రూ.1,51,200 వద్ద ఉన్న 24 క్యారెట్ల బంగారం ధర జూన్ 20 నాటికి 1,48,370 రూపాయల వద్దకు చేరింది. 22 క్యారెట్ల తులం బంగారం రేటు 1,38,600 రూపాయల నుంచి రూ.1,36,000 వద్దకు చేరింది.ఇదీ చదవండి: కేంద్రం కీలక ప్రకటన.. 16 రకాల మందులు బ్యాన్! -
పసిడి ప్రియులకు శుభవార్త.. భారీగా పతనమైన బంగారం ధర
-
పసిడి ధరల పతనం.. ఒకే రోజులో భారీ తగ్గుదల!
గురువారం ఉదయం స్థిరంగా ఉన్న బంగారం ధరలు, సాయంత్రానికి భారీ తగ్గుదలను నమోదు చేశాయి. దీంతో గోల్డ్ రేటు ఒక్కసారిగా పతనమైంది. ఈ కథనంలో దేశంలోని ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఎలా ఉన్నాయనే విషయం తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడలలో ఉదయం 1,38,500 రూపాయల వద్ద ఉన్న 22 క్యారెట్ల తులం బంగారం ధర, సాయంత్రానికి 1450 రూపాయలు తగ్గి, రూ.1,37,050 వద్దకు చేరింది. 24 క్యారెట్ల రేటు రూ.1,51,100 నుంచి 1590 రూపాయలు తగ్గి రూ.1,49,510 వద్దకు చేరింది.ఢిల్లీలో కూడా బంగారం ధరలు తగ్గాయి. ఇక్కడ 22 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల రేటు 1,38,650 రూపాయల నుంచి 1,37,200 రూపాయల (రూ.1,450 తగ్గింది) వద్దకు చేరింది. 24 క్యారెట్ల రేటు 1,51,250 రూపాయల నుంచి 1,49,660 రూపాయల (రూ.1590 తగ్గింది) వద్దకు చేరింది.చెన్నైలో ఈ రోజు (జూన్ 18) స్వల్పంగా తగ్గిన బంగారం రేటు, సాయంత్రానికి మరింత తగ్గింది. 22 క్యారెట్ల తులం పసిడి ధర రూ.1,40,600 వద్ద నుంచి రూ.1,39,500 వద్దకు (రూ.1100 తగ్గింది) చేరింది. 24 క్యారెట్ల రేటు 1,53,380 రూపాయల నుంచి 1,52,180 రూపాయలకు (రూ.1200 తగ్గింది) చేరింది. -
బంగారాన్ని మించిన ఆస్తులున్నాయ్: కియోసాకి
ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం, అప్పులు, ఫెడరల్ రిజర్వ్ విధానాలపై చర్చలు జరుగుతున్న వేళ, ప్రముఖ ఆర్థిక వ్యాఖ్యాత, ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ (Rich Dad Poor Dad) పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి తన ఫేస్బుక్ పోస్ట్ ద్వారా మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. కియోసాకి అభిప్రాయం ప్రకారం, అమెరికా ప్రభుత్వం ప్రస్తుతం 37 ట్రిలియన్ డాలర్ల అప్పు భారంతో ఉంది. కొత్త ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ ద్రవ్యోల్బణాన్ని మరింత వేడెక్కనివ్వడానికి సిద్ధంగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో, సాధారణంగా బ్యాంకుల్లో డిపాజిట్లు, సీడీలు, ప్రభుత్వ బాండ్లలో పెట్టుబడులు పెట్టే "పూర్ సేవర్స్" తమ డబ్బు విలువను నిశ్శబ్దంగా కోల్పోతారని ఆయన హెచ్చరించారు. "గోల్డ్ ఒక మంచి రక్షణ. 1970లలో అది విలువను నిలబెట్టుకుంది. కానీ అది కేవలం నీటిని నిల్వ చేసే సీసా లాంటిది. లీక్ కాకుండా కాపాడుతుంది. కానీ నిజమైన ధనవంతులు ద్రవ్యోల్బణం వల్ల లాభపడే ఆస్తులను ఎంచుకుంటారు" అని కియోసాకి వ్యాఖ్యానించారు. ఆయన ప్రకారం, గోల్డ్ మాత్రమే కాదు, చరిత్రలో ద్రవ్యోల్బణం వల్ల మరింత పెరిగిన మూడు ప్రత్యేక ఆస్తులు ఉన్నాయని, వాటిని త్వరలోనే వెల్లడిస్తానని తెలిపారు. -
గోల్డ్ మార్కెట్లో కలకలం..! తులం రూ.1,50,000కు చేరుతుందా?
-
పసిడి రూ.4,800 పతనం
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా బలహీన పవనాలు, బలమైన రూపాయి వెరసి పసిడి, వెండి బుధవారం భారీగా నష్టపోయాయి. ఢిల్లీ మార్కెట్లో 10 గ్రాముల బంగారం రూ.4,800 తగ్గి రూ.1,54,400 స్థాయికి దిగొచ్చింది. వెండి సైతం కిలోకి రూ.5,300 నష్టపోయి రూ.2,55,400 వద్ద స్థిరపడింది. ఈక్విటీ మార్కెట్లు మెరుగైన పనితీరు నేపథ్యంలో వరుసగా రెండో రోజు దేశీ బులియన్ మార్కెట్లో బలహీన ధోరణి నెలకొన్నట్టు విశ్లేషకుల అభిప్రాయంగా ఉంది. ముఖ్యంగా కొత్త చైర్మన్ కెవిన్ వార్‡్ష సారథ్యంలో యూఎస్ ఫెడ్ తొలి సమావేశం వివరాలు బుధవారం విడుదల కానున్నాయి.వడ్డీ రేట్లపై కొత్త చైర్మన్ వ్యాఖ్యలు ఎలా ఉంటాయన్నది ఇన్వెస్టర్లు, ట్రేడర్లు ఆసక్తిగా గమనిస్తున్నారు. బుధవారం రాత్రి (భారత కాలమానం) యూఎస్ ఫెడ్ నిర్ణయాలు వెల్లడి కానుండడంతో బంగారం ధర స్పాట్ మార్కెట్లో స్థిరీకరణను చూసినట్టు మిరే అసెట్ షేర్ఖాన్ కమోడిటీస్ హెడ్ ప్రవీణ్సింగ్ తెలిపారు. ముఖ్యంగా యూఎస్–ఇరాన్ ఇంకా ఒప్పందం కుదుర్చుకోవాల్సి ఉన్న విషయం గమనార్హం.వచ్చే శుక్రవారం ఇది చోటు చేసుకుంటుందని అంచనా. ఈలోపు ఎలాంటి పరిణామాలు ఉంటాయేమోనన్న ఆందోళనతో ఇన్వెస్టర్లు అప్రమత్త ధోరణితో వ్యవహరించినట్టు విశ్లేషకులు చెబుతున్నారు. కాగా, అంతర్జాతీయ మార్కెట్లో మాత్రం బంగారం, వెండి లాభాలతో ట్రేడవుతున్నాయి. ఔన్స్ బంగారం ధర 4,396 డాలర్లు, వెండి ధర 71.5 డాలర్ల వద్ద ఉన్నాయి. -
గంట గంటకు మారుతున్న బంగారం ధరలు
-
Gold Marker Crash : డబుల్ ధమాకా! గోల్డ్ రేట్స్ డౌన్
-
కియోసాకి హెచ్చరిక.. బంగారం ధరల పెరుగుదల స్టార్ట్!
బంగారం ధరలు పెరుగుతాయని రిచ్ డాడ్ పూర్ డాడ్ రచయిత 'రాబర్ట్ కియోసాకి' మరోసారి హెచ్చరించారు. ఇది ఆరంభం మాత్రమే అని తన ఎక్స్ ఖాతాలో వెల్లడించారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.మొత్తానికి బంగారం తన కదలికను ప్రారంభించింది. ఒక్క రోజులోనే 100 డాలర్లు దాటింది. మీరు దీనిని గమనించారా?. ఒకవేళా గమనించకపోతే, చింతించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పసిడి ధర పెరుగుదల ఇప్పుడే మొదలైంది. ఈ రోజు బంగారం ఔన్సుకు 4300 డాలర్ల వద్ద ఉంది. అయితే 2035 నాటికి ఇది 35,000 డాలర్లకు చేరుకోవచ్చని కియోసాకి పేర్కొన్నారు.కియోసాకి అభిప్రాయం ప్రకారం డబ్బు విలువ కాలక్రమేణా ద్రవ్యోల్బణం కారణంగా తగ్గిపోతుంది. అందుకే "క్యాష్ ఈజ్ ట్రాష్'' అని వ్యాఖ్యానిస్తూ, కేవలం డబ్బును పొదుపు చేయడం వల్ల భవిష్యత్తులో నష్టపోయే అవకాశం ఉందని హెచ్చరించారు. నగదు రూపంలో డబ్బును నిల్వ ఉంచడం కంటే.. విలువను నిలబెట్టుకునే ఆస్తుల్లో పెట్టుబడి పెట్టడం మంచిదని అంటున్నారు.బంగారం, వెండి, బిట్కాయిన్, ఎథీరియం, చమురు వంటి ఆస్తులను కొనుగోలు చేయడం మంచిదని కియోసాకి సలహా ఇస్తున్నారు. తాను కూడా గత కొన్ని సంవత్సరాలుగా నగదును ఈ ఆస్తులుగా మార్చుకుంటూ వచ్చానని, వాటినే 'నిజమైన డబ్బు'గా భావిస్తున్నానని చెప్పారు.అయితే ఇది కియోసాకి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. పెట్టుబడుల విషయంలో మార్కెట్ పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు, రిస్క్లు వంటి అనేక అంశాలు ప్రభావం చూపుతాయి. కాబట్టి ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు పూర్తి పరిశీలన చేయడం, ఆర్థిక నిపుణుల సలహా తీసుకోవడం అవసరం. ఈ విషయంలో పెట్టుబడిదారులు తప్పకుండా జాగ్రత్త వహించాలి.GOLD began its move…finally.Over &100 in a day.Did you catch the move?If you did not. Do not worry. The ascent of gold has just begun.Today gold is at $4300 an ounce.I am confident it will be $35,000 an ounce by 2035. Nice dates and numbers that start and end…— Robert Kiyosaki (@theRealKiyosaki) June 15, 2026 -
మెరుస్తూనే ఉంటాయి... కానీ!
సాక్షి, వెల్త్: ఈక్విటీలు, బంగారం, వెండి.. ఏ అసెట్ ర్యాలీ చేస్తున్నా ఇన్వెస్టర్లకు సందడే. స్టాక్స్ ర్యాలీలో బుల్స్ వెంట పరుగులు తీస్తారు. అనిశ్చితులు, సంక్షోభాలతో ఈక్విటీలు బేల చూపులు చూస్తుంటే.. బంగారం, వెండిని ఎత్తుకుంటారు. ఏ ర్యాలీ అయినా రివర్స్ గేర్ తీసుకుంటే మాత్రం కంగారు పడిపోతుంటారు. 2020లో కరోనా విపత్తు, 2022లో రష్యా–ఉక్రెయిన్ యుద్ధం, 2025లో ట్రంప్ రెండో విడత అమెరికా అధ్యక్ష బాధ్యతల అనంతరం ప్రపంచ దేశాలపై వాణిజ్య సుంకాల యుద్ధాన్ని ప్రకటించడం, 2026లో ఇరాన్పై అమెరికా–ఇజ్రాయెల్ యుద్ధం.. ఈ అనిశ్చితి, అయోమయ పరిస్థితులతో రెండేళ్లుగా పసిడి, వెండి జిగేల్మన్నాయి.ఏ దశలో పెట్టుబడి పెట్టినా ఇన్వెస్టర్లకు కాసులు కురిపించాయి. కానీ, ఈ ఏడాది జనవరి నుంచి బంగారం 25 శాతం, వెండి 45 శాతం వరకు పతనమయ్యాయి. ఎందుకని? ఎందుకంటే యుద్ధాలు, సంక్షోభాలు, ధరల మంటలు, ఆర్థిక మాంద్యాలు వంటి సందర్భాల్లో పెట్టుబడుల విలువను కాపాడుకునేందుకు (హెడ్జింగ్ కోసం) ఇన్వెస్టర్లు ఈక్విటీల నుంచి కొంత పెట్టుబడులను పసిడి, వెండిలోకి మళ్లిస్తారు.సంక్షోభం కుదుటపడుతోందని సంకేతాలొచ్చినా... లేదా అప్పటికే భారీగా పెరిగి ఉన్నా కొంత విక్రయించి లాభాలు స్వీకరిద్దామన్న ధోరణి నెలకొన్నా.. పసిడి, వెండి రివర్స్ గేర్ తీసుకుంటాయి. 2026 జనవరిలో జీవితకాల గరిష్ట స్థాయికి చేరాక పసిడి, వెండిలో కనిపించిన దిద్దుబాటు ఒక రకంగా ఇలాంటిదే. ఒక్క ఈ నెలలోనే 12 శాతం మేర వీటి ధరలు పతనమయ్యాయి. మరి ఈ కరెక్షన్ బుల్ మార్కెట్ ముగింపు కార్డా? ఇన్వెస్టర్ల ముందున్న మార్గం ఏంటి? ఏం చేయాలిపుడు?ఎందుకు ఈ పతనం?⇒ ఏ ప్రయాణం మధ్యలో అయినా ఎక్కడో ఒక చోట బ్రేక్ తీసుకుంటాం. పసిడి, వెండిలోనూ ఇప్పుడదే చూస్తున్నాం. ⇒ భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలతో అంతర్జాతీయ వృద్ధిపై అనిశ్చితులు, ఫైనాన్షియల్ మార్కెట్లలో ఆటుపోట్లు గత రెండేళ్ల కాలంలో ఇన్వెస్టర్లను గోల్డ్, సిల్వర్ ఈటీఎఫ్లకు చేరువ చేశాయి. ఇప్పుడు అనిశ్చితి పరిస్థితులు కొంత తెరిపిన పడుతున్నాయి. ⇒ ఇంతకాలం దేశీ ఈక్విటీలు బలహీనంగా కదలాడాయి. ఆకర్షణీయ వేల్యుయేషన్ల వద్ద ఉండడంతో సమీప కాలంలో ఈక్విటీలు ర్యాలీ చేయొచ్చన్న విశ్వాసం పెరుగుతోంది. ⇒ బంగారాన్ని కేవలం విలువను కాపాడే వస్తువుగానే చూస్తుంటారు. అంతేకానీ దీనిపై పెట్టుబడి పెడితే స్థిరమైన ఆదాయమేదీ రాదు. అమెరికాలో అధిక ద్రవ్యోల్బణంతో గరిష్టాల్లో వడ్డీ రేట్లు ఉండడం, మన దగ్గరా సమీప కాలంలో వడ్డీ రేట్లు పెరిగే పరిస్థితులతో వడ్డీ రాబడినిచ్చే బాండ్లు, డిపాజిట్లు ఇప్పుడు ఆకర్షణీయంగా మారుతున్నాయి. కనుక ఎలాంటి రాబడి లేని పసిడి, వెండి నుంచి పెట్టుబడులు బాండ్లు, ఈక్విటీల వైపు యూటర్న్ తీసుకుంటాయి. ⇒ అంతర్జాతీయంగా పసిడి ధరలు డాలర్లోనే ట్రేడవుతుంటాయి. డాలర్ బలపడడం బంగారం, వెండి ధరలపై ఒత్తిడికి దారితీస్తోంది. ⇒ బంగారం, వెండి గత 18– 24 నెలల్లో అసాధారణ రాబడులనిచ్చాయి. ఏదో ఒక దశలో ఇన్వెస్టర్లు లాభాలు స్వీకరించడం సహజమే. ఒక విధంగా ఇది పోర్ట్ఫోలియోకి మంచిది కూడా. అప్పుడే తాజా పెట్టుబడిదారులకు ధరలు అందుబాటులోకి వస్తాయి. ఏంటి మార్గం..?⇒ గోల్డ్, సిల్వర్ ఈటీఎఫ్ల్లో పెట్టుబడులు పె ట్టిన వారు ప్రస్తుత దిద్దుబాటును చూసి ఎ లాంటి ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ⇒ బంగారం, వెండిలో 10–12 శాతం దిద్దుబాటు అసాధారణమేమీ కాదు. చరిత్రలో ఇప్పటి వరకు ఎన్నో సందర్భాల్లో ర్యాలీ తర్వాత బంగారం, వెండి ర్యాలీ దిద్దుబాటుకు చవిచూశాయి. ⇒ ధరలను చూసి నిర్ణయం తీసుకోవద్దు. అస లు మీ పెట్టుబడి లక్ష్యం ఏంటో తెలుసుకుని, అందుకు అనుగుణంగా వ్యవహరించండి. ⇒ కేవలం ధరలు పెరుగుతున్నాయి కదా అని, ఇన్వెస్ట్ చేసి కొన్ని రోజుల్లో విక్రయించడం ద్వారా లాభాలు సంపాదించొచ్చని అ డుగు పెట్టినట్టయితే.. ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఎందుకంటే స్వల్పకాలంలో ధరల తీరును ఎవరూ అంచనా వేయలేరు. ⇒ ఇప్పుడు ఇన్వెస్ట్ చేద్దామనుకునే వారు ఒకే విడత కాకుండా, క్రమానుగతంగా, నెలవారీ కొంత చొప్పున ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్లడమే మంచిది. గోల్డ్ ఈటీఎఫ్లు, లేదా గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్లో సిప్ను ఎంపిక చేసుకోవచ్చు. ⇒ దీర్ఘకాలానికి ఇన్వెస్ట్ చేద్దామనుకునే వారికి ప్రస్తుత దిద్దుబాటు అనుకూలం. వెండికి అదనపు అనుకూలత⇒ ఆభరణాలతోపాటు పెట్టుబడికి హెడ్జింగ్ సాధనంగా పసిడికి గుర్తింపు ఎక్కువ. వెండికి పెట్టుబడితోపాటు పరిశ్రమల నుంచి ముడి పదార్థంగానూ బలమైన డిమాండ్ నెలకొంది. ⇒ ఎల్రక్టానిక్స్ ఉత్పత్తులు, ఎలక్ట్రిక్వాహనాలు, సోలార్ ప్యానెళ్లు ఇలా ఎన్నో అత్యాధునిక పరిశ్రమల్లో వెండి అవసరం. ⇒ బంగారంతోపాటు వెండికి సైతం పెట్టుబడుల డిమాండ్ క్రమంగా పెరుగుతోంది. కానీ పసిడితో పోలి్చతే వెండిలో అస్థిరతలు ఎక్కువన్నది గుర్తు పెట్టుకోవాలి. కథ ముగిసినట్టేనా?బంగారం కథ ఇంతటితో సమాప్తం అని అనుకోవడానికి లేదు. ⇒ ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్ బ్యాంక్లు తమ రిజర్వ్ అసెట్స్లో బంగారానికీ పెద్ద పీట వేస్తున్నాయి. గతంలో యూఎస్ డాలర్లకే ఎక్కువ ప్రాధాన్యం ఉండేది. ఇప్పుడు డాలర్ వెయిటేజీ తగ్గించి, గోల్డ్కు వెయిటేజీని పెంచడం ద్వారా వైవిధ్యంపై దృష్టి పెట్టాయి. ⇒ ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థల అప్పుల భారం గరిష్ట స్థాయిల్లోనే ఉంది. ⇒ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ఇంకా పూర్తిగా సమసిపోలేదు. ఇక ముందు పెరగవని, మళ్లీ ఏర్పడవని కూడా చెప్పలేం. ⇒ ఇంధన మార్కెట్లో నెలకొన్న పరిస్థితులతో ద్రవ్యోల్బణంపై ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ⇒ కనుక స్వల్పకాలంలో పసిడి, వెండి అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నా.. దీర్ఘకాలానికి పెట్టుబడుల పరంగా వాటి ప్రాధాన్యంలో ఎలాంటి మార్పు రాలేదు. ఎంత కేటాయించొచ్చు?⇒ రిటైల్ ఇన్వెస్టర్లు తమ దీర్ఘకాల పెట్టుబడుల కేటాయింపుల్లో పసిడికి 10–15 శాతం కేటాయించుకోవచ్చు. పెట్టుబడి పరంగా వెండి కంటే పసిడిలో స్థిరత్వం ఎక్కువ. చారిత్రకంగా చూస్తే బంగారం కంటే ఈక్విటీలే అధిక రాబడినిచ్చాయి. రూ.10 లక్షల మోడల్ పోర్ట్ఫోలియో వేటికి ఎంత చోటు అసెట్ క్లాస్ కేటాయింపులు (రూ.లలో) ఈక్విటీలు - 6,00,000 డెట్ఫండ్స్/ఎఫ్డీలు/ బాండ్లు తదితర స్థిరదాయ సాధనాలు - 2,00,000 బంగారం - 1,00,000 వెండి - 50,000 నగదు/లిక్విడ్ ఫండ్స్ - 50,000ఒక్కటి గుర్తు పెట్టుకోండిప్రస్తుత దిద్దుబాటు విలువైన లోహాల ర్యాలీ లో కేవలం విరామమే. ర్యాలీ వెంట పరుగెత్తడం, పతనంలో ఆందోళన చెందడానికి దూరంగా ఉండాలి. బంగారం ఇన్వెస్టర్లను రాత్రికి రాత్రి ఐశ్వర్యవంతులను చేసేయదు. ఇతర పెట్టుబడి సాధనాల్లో అల్లకల్లలాలు నెలకొన్నప్పుడు పోర్ట్ఫోలియోకి స్థిరత్వాన్నిచ్చి, కొనుగోలు శక్తిని కాపాడే సాధనం. తాత్కాలిక దిద్దుబాట్లను సహనంతో ఎదుర్కొన్న వారికే విలువైన లోహాలు దీర్ఘకాలంలో మంచి ఫలితాలను ఇస్తాయని చరిత్ర చెబుతోంది.పడుట పెరుగుట కొరకే⇒ బంగారం, వెండిలో దిద్దుబాట్లు ఎన్నో సందర్భాల్లో చోటుచేసుకున్నాయి. ప్రతీ దిద్దుబాటు అనంతరం తిరిగి పుంజుకున్నాయి. ⇒ అందుకే ఈక్విటీలు, పసిడిని దీర్ఘకాల పెట్టుబడి ఆస్తులుగానే చూడాలి. ⇒ స్వల్పకాల అవసరాల కోసం ఉద్దేశించిన వాటిని స్థిరాదాయ పథకాలకే కేటాయించుకోవాలి. ⇒ పోర్ట్ఫోలియోకి బీమాగా బంగారం, వెండినిచూడొచ్చు. ఇవీ... వాస్తవాలుబంగారం వెండి 10–20శాతం 20–30శాతం కరెక్షన్లు సాధారణం కరెక్షన్లు సాధారణం 25–35శాతం 40–60శాతం కరెక్షన్లు అరుదు కరెక్షన్లు అరుదు -
విమానం టాయిలెట్లో బంగారం.. ఎంతుందంటే..?
అహ్మదాబాద్, సాక్షి: గుజరాత్లో కస్టమ్ అధికారుల నిర్వహించిన తనిఖీల్లో భారీగా బంగారం దొరికింది. అధికారులు రెగ్యూలర్ తనిఖీల్లో భాగంగా సోదాలు జరుపుతుండగా ప్లాస్టిక్ టేపులతో చుట్టిన రెండు బ్యాగులు స్వాధీనం చేసుకున్నారు. దానిని విప్పి చూడగా అందులో పెద్ద మెుత్తంలో బంగారు బిస్కెట్లు లభ్యమైనట్లు పేర్కొన్నారు. దుబాయి నుండి అహ్మదాబాద్ విమానాశ్రయానికి వస్తున్న ఇండిగో ఫ్లైట్ నెం. 6E-1478లో కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంలో విమానం ముందు భాగంలోని టాయిలెట్ స్పీకర్ బాక్స్లో రెండు నల్లరంగు పర్సులు ఉన్నట్లు గుర్తించారు. దీంతో ఇంజినీర్ల సాయంతో వాటిని స్వాధీనం చేసుకొని వాటిని తెరిచారు. రెండు పర్సులలో దాదాపు 2,799.3 గ్రాముల బరువున్న 24 క్యారెట్ల స్వచ్ఛతగల బంగారు బిస్కెట్లను గుర్తించారు. మార్కెట్లో వీటి విలువ రూ. 4,26,89,325 గా తెలిపారు.అయితే భారత్లోకి బంగారం అక్రమంగా రవాణా చేసే భారతదేశంలోకి అక్రమంగా రవాణా చేసే ఉద్దేశ్యంతో ఒక గుర్తు తెలియని వ్యక్తి బంగారాన్ని దాచి పెట్టినట్లు అనుమానిస్తున్నారు. స్వాధీనం చేసుకున్న బంగారం చట్టబద్ధమైన యాజమాన్యాన్ని క్లెయిమ్ చేయడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో 1962 కస్టమ్స్ చట్టంలోని సంబంధిత నిబంధనల ప్రకారం దానిని ఎవరూ హక్కు కోరనిదిగా స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు ప్రకటించారు. -
క్యాష్ ఈజ్ ట్రాష్.. కియోసాకి హెచ్చరిక!
ఎప్పటికప్పుడు ఆర్ధిక పరమైన అంశాలను వెల్లడించే.. రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి, తాజాగా మరో అంశాన్ని తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. దీనికి సంబంధించిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ట్రిలియన్ డాలర్లు అంటే ఎంత? అని ప్రశ్నిస్తూనే.. దీనికి 1 తర్వాత 12 సున్నాలు ఉంటాయని కియోసాకి పేర్కొన్నారు. మీరు నిమిషానికి ఒక డాలర్ చొప్పున ఖర్చు చేస్తే, ఆ మొత్తం ఖర్చు చేయడానికి మీకు 34,000 సంవత్సరాలు పడుతుంది. దీన్నిబట్టి చూస్తే ఇది ఎంత పెద్ద సంఖ్య అనేది స్పష్టమవుతోంది.ఒక సాధారణ మనిషికి ట్రిలియన్ డాలర్లు ఊహించడం కూడా చాలా కష్టం. కానీ ఫెడ్, యూఎస్ ట్రెజరీకి ఒక ట్రిలియన్ డాలర్లను ముద్రించడానికి ఒక నిమిషం కన్నా తక్కువ సమయం పడుతుందని కియోసాకి పేర్కొన్నారు.కియోసాకి ప్రకారం.. డబ్బు భద్రమైన పెట్టుబడి కాదు. ఎందుకంటే ద్రవ్యోల్బణం సమయంలో దీని విలువ క్రమంగా తగ్గుతుంది. కాబట్టి డాలర్లను పొదుపు చేసేవారు నష్టపోతారు. క్యాష్ ఈజ్ ట్రాష్ అంటూనే.. మీ డబ్బును బంగారం, వెండి, బిట్కాయిన్, ఇథీరియం వంటి వాటిలో పెట్టుబడి పెట్టవచ్చు. ఇది మీ భవిష్యత్తుకు ఉపయోగపడుతుందని రిచ్ డాడ్ వివరించారు.అయితే.. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. ప్రతి పెట్టుబడికి లాభాలు మాత్రమే కాదు, నష్టాలు కూడా ఉంటాయి. బంగారం వంటి సంప్రదాయ ఆస్తులు స్థిరత్వాన్ని ఇస్తే, క్రిప్టోకరెన్సీలు ఎక్కువ మార్పులు కలిగి ఉంటాయి. కాబట్టి ఏ పెట్టుబడి అయినా వ్యక్తిగత ఆర్థిక పరిస్థితులు, లక్ష్యాలు, ప్రమాద సహనాన్ని బట్టి నిర్ణయించుకోవాలి.HOW MUCH is a $ TRILLION?A trillion is a 1 with 12 zeros after it.$1,000,000,000,000If you were to spend $1 a minute it would take you 34,000 years to spend.It takes the Fed and US Treasury less than a minute to print $1 trillion.Get the picture?Savers of dollars are…— Robert Kiyosaki (@theRealKiyosaki) June 12, 2026 -
బంగారం కొట్టేసిన నేపాలీ గ్యాంగ్ అరెస్ట్
-
హ్యాట్రిక్ తగ్గింపు.. మళ్లీ ఈ సమయం రాదేమో!
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో నేడు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. -
ఒక్కసారిగా తిరగబడిన బంగారం ధరలు
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. గడిచిన రెండు సెషన్లలో తగ్గిన పసిడి ధరలు ఒక్కసారిగా మంగళవారం పెరిగాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో నేడు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. -
రూ.4000 తగ్గిన రేటు.. బంగారం ధరలు ఇలా..!
పెరిగిన బంగారం ధరలు.. క్రమంగా తగ్గుముఖం పట్టాయి. వారం రోజులుగా (మే 31 నుంచి జూన్ 6) పతనమవుతూనే ఉన్నాయి. దీంతో రేటు గణనీయంగా తగ్గింది. ఈ కథనంలో ఏడు రోజుల్లో ధరలు ఎంతలా తగ్గాయి?, అనే వివరాలు తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడలలో మే 31(ఆదివారం)న 1,57,040 రూపాయల వద్ద ఉన్న 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు జూన్ 6 (శనివారం) నాటికి 1,52,730 రూపాయల వద్దకు చేరింది. అంటే వారం రోజుల్లో రూ.4,310 తగ్గిందన్నమాట. 22 క్యారెట్ల రేటు 1,43,950 రూపాయల నుంచి 1,40,000 రూపాయల (రూ.3,950 తగ్గింది) వద్దకు చేరింది. బెంగళూరు, ముంబై నగరాల్లో కూడా ఇదే ధరలు ఉన్నాయి.చెన్నైలో కూడా బంగారం ధరల్లో భారీ మార్పులు జరిగాయి. 24 క్యారెట్ల తులం బంగారం ధర వారం రోజుల్లో.. 1,59,600 రూపాయల వద్ద నుంచి రూ.4,690 తగ్గి 1,54,910 రూపాయాల వద్దకు చేరింది. 22 క్యారెట్ల రేటు 1,46,300 రూపాయల నుంచి 1,42,000 రూపాయల (రూ.4,300 తగ్గింది) వద్దకు చేరింది.ఢిల్లీలో కూడా బంగారం ధరలు భారీగా తగ్గాయి. మే 31న రూ.1,57,190 వద్ద ఉన్న తులం పసిడి ధర జూన్ 6 నాటికి రూ.1,55,910 వద్దకు (రూ.1,280 తగ్గింది) చేరింది. 22 క్యారెట్ల తులం పసిడి ధర 1,44,100 రూపాయల నుంచి 14,0150 రూపాయల (రూ.3,950 తగ్గింది) వద్దకు చేరింది. మొత్తం మీద జూన్ నెల ప్రారంభం నుంచి గోల్డ్ రేటు తగ్గుతూనే ముందుకు సాగుతోంది.ఇదీ చదవండి: ఏఐ దాహం.. ప్రపంచానికి కొత్త సవాల్! -
బంగారంతో పోలిస్తే డైమండ్ ధరల్లో స్థిరత్వం ఉంటుంది : అనంత నారాయణ
హైదరాబాద్ : బంగారం ధరలతో పోలిస్తే డైమండ్ ధరల్లో ఎక్కువగా స్థిరత్వం ఉంటుందని దమాస్ జ్యువెలరీ సీఈవోఓ అనంత నారాయణ హరిహరన్ అన్నారు. ఇర్రంమంజిల్లోని ప్రణవ వన్లో ఏర్పాటు చేసిన ఎస్జీఎల్ డైమండ్ ఎక్స్పీరియన్స్ సెంటర్ను ఆయన శుక్రవారం ప్రపంచంలోనే రెండో అతిపెద్ద కంపెనీ అయిన ఎమరాల్డ్ అధినేత శ్రీనివాసన్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వజ్రాల అమ్మకాల్లో దేశంలోని టాప్–5 నగరాల్లో హైదరాబాద్ ఉందని అన్నారు. ఇటువంటి ఎక్స్పీరియన్స్ సెంటర్ల వల్ల వజ్రాల నాణ్యత, గ్రేడింగ్ పరిశీలించుకునేందుకు వినియోగదారులకు ఎంతో సులభంగా ఉంటుందని ఇది మరింత పారదర్శకతకు ఉపయోగపడుతుందని అన్నారు. ఎస్జీఎల్ సంస్థ డైరెక్టర్ చిరాగ్ సోని మాట్లాడుతూ సౌత్ ఇండియాలోనే ఇది అతి పెద్ద ఎక్స్పీరియన్స్ సెంటర్ అని ఈ సెంటర్లో డైమండ్ యొక్క క్వాలిటీతో పాటు గ్రేడింగ్ను పరీక్షించుకోవచ్చుని తెలిపారు.సామాన్యులు ఎవరైనా కూడా ఈ సెంటర్ను అపాయింట్మెంట్ బుక్ చేసుకొని వచ్చి డైమండ్ను ఏ విధంగా పరీక్షిస్తారు. ఎలా గ్రేడింగ్ చేస్తారు అనే విషయాలను తెలుసుకోవచ్చునని అన్నారు. ఇది డైమండ్ గురించి తెలుసుకునేందుకు ఉపయోగపడుతుందని అన్నారు. ఇప్పటికే ఆటోమెటిక్ గ్రేడింగ్ సిస్టమ్తో డైమండ్ నాణ్యతను కొలుస్తున్నప్పటికీ ఏఐ వల్ల మరింత లోతుగా విశ్లేషించేందుకు అవకాశం ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్జీల్ సహ వ్యవస్థాపకురాలు షిరిన్ బందుకాల్వ, నేషనల్ హెడ్ వరుణ్ శెట్టి, వసుంధర డైమండ్ గ్రూప్ ఫౌండర్ వసుంధర తదితరులు పాల్గొన్నారు. -
పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. కుప్పకూలిన బంగారం
-
మూల పడిన బంగారం.. దేశ ఆర్థికానికి మూలాధారం!
భారతీయులకు బంగారం కేవలం ఒక లోహం కాదు... అదొక సెంటిమెంట్, సంస్కృతి, సంపద. అయితే, ఇళ్లల్లో, దేవాలయాల ట్రస్టుల్లో నిరుపయోగంగా పడి ఉన్న పసిడిని కేవలం ఆస్తిగా మాత్రమే కాకుండా, దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే ఆర్థిక వనరుగా మార్చాల్సిన సమయం ఆసన్నమైంది. ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలు ఈ అంశాన్ని మరోసారి తెరపైకి తెచ్చాయి. విదేశాల నుంచి బంగారాన్ని దిగుమతి చేసుకోవడం కంటే దేశీయంగా ఉన్న బంగారాన్ని రీసైక్లింగ్ చేసుకోవడం ద్వారా ఎంతో మేలు జరుగుతుందని పిలుపునిచ్చారు.ప్రస్తుతం భారతదేశంలోని గృహాలు, ఆలయ ట్రస్టుల వద్ద సుమారు 30,000 టన్నులకు పైగా నిరుపయోగ బంగారం ఉన్నట్లు అంచనా. ఈ నేపథ్యంలో గోల్డ్ రీసైక్లింగ్ అనేది రూపాయి విలువను స్థిరపరచడానికి, విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేయడానికి, దాగి ఉన్న సంపదను వెలికితీయడానికి ఒక వ్యూహాత్మక ఆయుధంగా మారుతోంది.గోల్డ్ రీసైక్లింగ్ ఎందుకు కీలకం?మన దేశ ఆర్థిక, పర్యావరణ రక్షణలో గోల్డ్ రీసైక్లింగ్ కీలక పాత్ర పోషిస్తుంది. దీని ప్రధాన ప్రయోజనాలు ఇవే..ఆర్థిక స్థిరత్వం: ఏటా పసిడి దిగుమతుల కోసం భారతదేశం బిలియన్ల కొద్దీ డాలర్ల విదేశీ మారక ద్రవ్యాన్ని ఖర్చు చేస్తోంది. రీసైక్లింగ్ పెరిగితే ఈ దిగుమతుల భారం తగ్గి దేశ కరెంట్ ఖాతా లోటు అదుపులోకి వస్తుంది. ఫలితంగా రూపాయి మరింత బలపడుతుంది.పర్యావరణ బాధ్యత: కొత్తగా గనుల నుంచి బంగారాన్ని వెలికితీయడం వల్ల పర్యావరణానికి తీవ్ర నష్టం వాటిల్లుతుంది. అదే పాత బంగారాన్ని రీసైకిల్ చేయడం వల్ల భూగర్భ వనరుల తవ్వకాలు తగ్గి, పర్యావరణ సమతుల్యత దెబ్బతినకుండా ఉంటుంది.ఆర్థిక సమగ్రత: కష్టకాలంలో లేదా అత్యవసర పరిస్థితుల్లో కుటుంబాలు తమ వద్ద ఉన్న పాత ఆభరణాలను సులభంగా, పారదర్శకంగా నగదుగా మార్చుకునేందుకు ఇది దోహదపడుతుంది.వ్యవస్థీకృత రంగం వైపు..గతంలో పాత బంగారాన్ని విక్రయించాలంటే అన్-ఆర్గనైజ్డ్ (అవ్యవస్థీకృత) రంగంపైనే ఎక్కువగా ఆధారపడేవారు. అక్కడ మోసాలు, తక్కువ ధరకు వస్తుందనే సాకుతో చాలా సమస్యలు ఉండేవి. కానీ ఇప్పుడు కార్పొరేట్ సంస్థలు అత్యాధునిక సాంకేతికతతో వినియోగదారుల్లో నమ్మకాన్ని పెంచుతున్నాయి. న్యూఢిల్లీ కేంద్రంగా జూన్ 2026 నాటికి అందుతున్న నివేదికల ప్రకారం.. ఈ మార్పులో కీలక పాత్ర పోషిస్తున్న ప్రముఖ సంస్థల వివరాలు కింది విధంగా ఉన్నాయి.ముత్తూట్ గోల్డ్ పాయింట్: ముత్తూట్ ఎక్సిమ్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలోని ‘ముత్తూట్ గోల్డ్ పాయింట్’ దేశంలోనే మొట్టమొదటి జాతీయ స్థాయి వ్యవస్థీకృత గోల్డ్ రీసైక్లింగ్ నెట్వర్క్గా అవతరించింది. ఇక్కడ అత్యాధునిక ఎక్స్-రే ఫ్లోరోసెన్స్ సాంకేతికతతో బంగారం స్వచ్ఛతను పారదర్శకంగా గుర్తిస్తారు. కస్టమర్లకు గరిష్ట విలువను కట్టి తక్షణమే నగదు లేదా బ్యాంక్ బదిలీ ద్వారా సొమ్ము చెల్లిస్తారు. సేకరించిన బంగారాన్ని 995 స్వచ్ఛత కలిగిన బిస్కెట్లుగా మార్చి దేశీయ జ్యువెలరీ తయారీ రంగానికి అందిస్తారు. తద్వారా దేశీయ సరఫరా గొలుసు బలోపేతమవుతోంది.ఒనిక్స్ మెటల్స్: అడ్వాన్స్డ్ టెక్నాలజీతో విలువైన లోహాల పునరుత్పత్తిలో ‘ఒనిక్స్ మెటల్స్’ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. పారిశ్రామిక రీసైక్లింగ్, ఈ-వేస్ట్ (ఎలక్ట్రానిక్ వ్యర్థాలు) రికవరీ రంగాల్లో పని చేస్తూ.. స్థిరమైన పర్యావరణ వృద్ధికి, సర్క్యులర్ ఎకానమీ విధానాలకు ఈ సంస్థ పెద్దపీట వేస్తోంది.స్కై గోల్డ్ అండ్ డైమండ్స్: ప్రముఖ జ్యువెలరీ బ్రాండ్ స్కై గోల్డ్ అండ్ డైమండ్స్.. వ్యవస్థీకృత రీసైక్లింగ్కు మద్దతిస్తూ పాత లేదా నిరుపయోగంగా ఉన్న బంగారాన్ని అధికారిక మార్గాల ద్వారా రీసైకిల్ చేయడానికి వినియోగదారులను ప్రోత్సహిస్తోంది. యువత సంప్రదాయ ధోరణులను పక్కనబెట్టి, ఇంట్లో ఊరికే పడి ఉండే లేదా వారసత్వంగా వచ్చిన అదనపు బంగారాన్ని అధికారిక మార్గాల ద్వారా విక్రయించడానికి మొగ్గు చూపుతున్నారని పేర్కొంది. అయితే, ప్రస్తుతం ఈ రీసైక్లింగ్ అనేది ఎక్కువగా వివాహాలు, ఆర్థిక అవసరాలు లేదా మార్కెట్లో బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరినప్పుడు మాత్రమే జరుగుతోందని స్పష్టం చేసింది.ఇదీ చదవండి: కీలక రేట్లలో ఎలాంటి మార్పుల్లేవ్! -
బంగారం పెట్టుబడులపై ఆంక్షలు.. HDFC కీలక నిర్ణయం!
ప్రస్తుత ఆర్థిక, మార్కెట్ పరిస్థితుల నేపథ్యంలో బంగారం పెట్టుబడులపై నియంత్రణ చర్యలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో హెచ్డీఎఫ్సీ మ్యూచువల్ ఫండ్ (HDFC Mutual Fund) తన గోల్డ్ ఆధారిత పథకాల్లో ఒకేసారి పెద్ద మొత్తంలో పెట్టుబడి సబ్స్క్రిప్షన్లను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.హెచ్డీఎఫ్సీ మ్యూచువల్ ఫండ్ తీసుకున్న ఈ నిర్ణయం.. గోల్డ్ ఈటీఎఫ్, గోల్డ్ ఈటీఎఫ్ ఫండ్ ఆఫ్ ఫండ్ పథకాలకు వర్తిస్తుంది. మార్కెట్ పరిస్థితులు మెరుగుపడే వరకు ఈ పరిమితులు కొనసాగుతాయని ఫండ్ హౌస్ స్పష్టం చేసింది.'హెచ్డీఎఫ్సీ గోల్డ్ ఈటీఎఫ్'లో పెద్ద పెట్టుబడిదారులు.. నేరుగా ఫండ్ హౌస్ ద్వారా పెట్టే పెట్టుబడులు జూన్ 8, 2026 నుంచి స్వీకరించబడవు. అంటే. ఒక్కసారిగా భారీ మొత్తంలో పెట్టుబడి పెట్టే అవకాశం తాత్కాలికంగా నిలిపివేశారన్నమాట. ప్రత్యేకంగా రూ.25 కోట్లకు పైగా పెట్టుబడులపై ఈ నిబంధన వర్తిస్తుంది.అదే విధంగా 'గోల్డ్ ఈటీఎఫ్ ఫండ్ ఆఫ్ ఫండ్'లో ఒక PANకి నెలకు గరిష్టంగా రూ.10 లక్షల వరకు మాత్రమే పెట్టుబడులు అనుమతిచడం జరుగుతుంది. జూన్ 5, 2026 సాయంత్రం 3 గంటల తర్వాత వచ్చిన ఆర్డర్లకు ఈ పరిమితి అమలులోకి వస్తుంది. అయితే.. ఈ పథకాలకు సంబంధించి ఇతర నిబంధనల్లో ఎలాంటి మార్పు లేదు. అంటే రెగ్యులర్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లు కొనసాగుతాయి.హెచ్డీఎఫ్సీ మ్యూచువల్ ఫండ్ ఈ నిర్ణయం తీసుకోవడానికి ప్రధాన కారణం.. బంగారం దిగుమతులపై పెరిగిన పన్నులు. కాగా.. ప్రభుత్వం ఇటీవల బంగారం, వెండి దిగుమతులపై ప్రభావవంతమైన పన్నును 9.2% నుంచి 18.4%కి పెంచింది. ఈ మార్పు మే 13, 2026 నుంచి అమలులోకి వచ్చింది. ఇదే సమయంలో అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో బంగారం ధరలు కూడా పెరుగుతున్నాయి.ఇదీ చదవండి: టాప్లో ఇన్ఫోసిస్ బాస్.. విప్రో సీఈఓ వేతనం ఎంతంటే? -
ధనవంతుల రహస్యం చెప్పిన కియోసాకి
ప్రపంచ ప్రఖ్యాత పర్సనల్ ఫైనాన్స్ పుస్తకం ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ (Rich Dad Poor Dad) రచయిత రాబర్ట్ కియోసాకి (Robert Kiyosaki) మరోసారి బంగారం, వెండిపై తన మద్దతును వ్యక్తం చేశారు. సంపదను కాపాడుకోవాలంటే బంగారం వంటి వాస్తవ ఆస్తుల్లో పెట్టుబడులు పెట్టాలని ఆయన సూచించారు.తాజాగా ఫేస్బుక్లో చేసిన పోస్టులో, చాలామంది బంగారం కొంటే డబ్బు సంపాదించవచ్చని భావిస్తారని, కానీ ధనవంతులు ఆ ఉద్దేశంతో బంగారం కొనరని పేర్కొన్నారు. డాలర్పై నమ్మకం లేకపోవడమే బంగారం కొనడానికి ప్రధాన కారణమని ఆయన అన్నారు. తన వయోజన జీవితమంతా బంగారం, వెండి నిల్వ చేసుకుంటూ వచ్చానని, వాటి ధరలు భారీగా పెరుగుతాయని ఆశించి కాదు, డాలర్ విలువ కాలక్రమేణా తగ్గుతుందనే అవగాహనతోనే ఈ నిర్ణయం తీసుకున్నానని వివరించారు.ప్రభుత్వాలు కొత్త కరెన్సీని ముద్రించిన ప్రతిసారీ నగదు కొనుగోలు శక్తి తగ్గిపోతుందని కియోసాకి అభిప్రాయపడ్డారు. బంగారం లాభాలను హామీ ఇవ్వదని, కానీ సంపదను రక్షించే సాధనంగా పనిచేస్తుందని చెప్పారు. కోట్లాది రూపాయలు అవసరం లేదని, ఒక వెండి నాణెం లేదా చిన్న పరిమాణంలో బంగారం కొనుగోలు చేయడం ద్వారా కూడా సంపద రక్షణను ప్రారంభించవచ్చని సూచించారు.అయితే ఎక్కువ మంది ప్రజలు సోషల్ మీడియాలో సమయం గడపడం, తదుపరి స్టాక్ టిప్ కోసం ఎదురు చూడడం లేదా ప్రభుత్వమే తమను కాపాడుతుందని ఆశించడం చేస్తారని ఆయన వ్యాఖ్యానించారు. నిజమైన డబ్బు బంగారం, వెండి వంటి విలువైన లోహాలేనని, కాగితపు కరెన్సీ కేవలం నకిలీ డబ్బు లాంటిదేనని ఆయన పేర్కొన్నారు.వేల ఏళ్లుగా బంగారం, వెండి సంపద నిల్వ సాధనాలుగా కొనసాగుతున్నాయని, కానీ అమెరికా డాలర్ 1971 నుంచి క్రమంగా విలువ కోల్పోతోందని కియోసాకి అన్నారు. ప్రభుత్వాలపై నమ్మకం ఉంచాలా, లేక బంగారంపై విశ్వాసం పెంచుకోవాలా అనేది ప్రతి వ్యక్తి తీసుకోవాల్సిన నిర్ణయమని తన పోస్టులో పేర్కొన్నారు. -
బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఏది?: కియోసాకి సమాధానం ఇదే..
రిచ్ డాడ్ పూర్ డాడ్ రచయిత రాబర్ట్ కియోసాకి తన బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఏది? అనే విషయాన్ని వెల్లడించారు. తనను ప్రతిరోజూ ఒక ప్రశ్న అడుగుతున్నారని, దానికి సమాధానం చాలా సులభమని సోషల్ మీడియా ద్వారా వివరణ ఇచ్చారు.నేను ప్రభుత్వం ముద్రించే డబ్బులో పెట్టుబడి పెట్టను. నేను స్టాక్స్,బాండ్స్, ఈటీఎఫ్స్ కొనను. నా పెట్టుబడులు మొత్తం వ్యాపారాలు, బంగారు గనులు, చమురు బావులు, పశువులపైన ఉంటాయి. నా పశువులు కూడా డబ్బు సంపాదించి పెడతాయి. అవి పిల్లలను కన్న ప్రతిసారీ, నాకు రాబడి పెరుగుతుందని కియోసాకి పేర్కొన్నారు. ధనవంతులు ఎప్పుడూ కూడా నిజమైన ఆస్తులలో పెట్టుబడి పెడతారు. అంటే వారు ఉత్పత్తిలో పెట్టుబడి పెట్టతారన్నమాట. ప్రభుత్వం కేవలం డబ్బును ముద్రించగలదు. కానీ.. గోల్డ్, ఆయిల్, పశువులు వంటివాటిని ముద్రించలేదు. కాబట్టి ఇవే నిజమైన విలువైన ఆస్తులు. కాబట్టి డబ్బును నిజమైన ఆస్తుల్లో పెడుతున్నారా, లేదా ప్రతిరోజూ కొత్తగా ముద్రితమవుతున్న డాలర్లను ధనంగా పరిగణించే సిస్టమ్పై నమ్మకం పెడుతున్నారా? అనేది తప్పకుండా ఆలోచించాల్సిన అవసరం ఉందని కియోసాకి వెల్లడించారు.గోల్డ్, చమురు, పశువులపై పెట్టుబడి పెట్టడానికి డబ్బులేదు అని చాలామంది అనుకుంటారు. కానీ తక్కువ డబ్బుతో ప్రారభించడం మంచిది. ఉద్యోగం కాదు.. అదనపు ఆదాయం కోసం పనిచేయడం కూడా కాదు. మీరు విశ్రాంతి తీసుకున్నపుడు కూడా డబ్బు వచ్చేలా ప్లాన్ చేసుకోవాలని రిచ్ డాడ్ చెబుతారు.ఇదీ చదవండి: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్: వివరాలు లీక్! -
మీ బీరువాలో నిద్రపోతున్న బంగారంతో భారత్ కు బంగారు బాట మోదీ మాస్టర్ ప్లాన్
-
భారీగా తగ్గిన బంగారం ధరలు, స్టాక్ మార్కెట్ ఢమాల్
-
నిన్నటి ధరే నేడు.. ప్రశాంతంగా పసిడి
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో నేడు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. -
‘బంగారం, వెండి.. అలా కొన్నారంటే నష్టమే’
ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా అమ్ముడైన ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ (Rich Dad Poor Dad) పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి (Robert Kiyosaki) అమెరికా ప్రభుత్వ బాండ్ల భద్రతపై సందేహాలు వ్యక్తం చేశారు. ఆర్థిక ప్రణాళికకర్తలు అమెరికా బాండ్లు సురక్షితమైన పెట్టుబడులని చెబుతున్నప్పటికీ, అలాంటి అభిప్రాయాలను గుడ్డిగా నమ్మవద్దని ఆయన సూచించారు.సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్టులో, “మూర్ఖత్వం నుంచి వచ్చే ఏ పెట్టుబడీ పూర్తిగా సురక్షితం కాదు” అని వ్యాఖ్యానించారు. బంగారం, వెండి, బిట్కాయిన్ వంటి ఆస్తులు కూడా కేవలం ప్రచారం లేదా హైప్ ఆధారంగా కొనుగోలు చేస్తే నష్టాలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరించారు.ప్రస్తుతం జపాన్, చైనా వంటి ప్రధాన అమెరికా బాండ్ హోల్డర్లు తమ వద్ద ఉన్న బాండ్లను విక్రయించి బంగారం, వెండి కొనుగోలు చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. మార్కెట్లలో నగదు ప్రవాహం ఏ దిశగా వెళ్తుందో గమనించడం మదుపరులకు ముఖ్యమని సూచించారు.అంతేకాకుండా, ఎవరికైనా అత్యంత విలువైన ఆస్తి వారి మెదడేనని, సరైన అవగాహనతో నిర్ణయాలు తీసుకోవాలని కియోసాకి అభిప్రాయపడ్డారు. పెట్టుబడులు పెట్టే ముందు మార్కెట్ పరిస్థితులను జాగ్రత్తగా విశ్లేషించాలని ఆయన సూచించారు. Don’t drink financial planners Kool- Aide when they tell you US Bonds are safe. There is nothing safe….from stupidity. Remember even gold, silver, and Bitcoin can cost you money if purchased on hype.Best watch the cash flowing. Today many major US Bond holders, like…— Robert Kiyosaki (@theRealKiyosaki) May 30, 2026 -
రూ.20 లక్షల బంగారం దొరికినా.. ఆశపడలేదు!
తూర్పుగోదావరి (మండపేట): మాయమైపోతున్నాడమ్మా.. మనిషన్నవాడూ.. అనుకుంటున్న ప్రస్తుత కాలంలో ఓ యువకుడు నిజాయతీకి నిలువుటద్దంలా నిలిచి.. పది మందితో శభాష్ అనిపించుకున్నారు. మండపేట రూరల్ సీఐ పి.దొరరాజు, బాధితుల కథనం ప్రకారం.. ఈ నెల 24వ తేదీ సాయంత్రం మండలంలోని ఏడిద గ్రామానికి చెందిన పేరిచర్ల శ్రీలేఖ తన కుటుంబ సభ్యులతో కలసి ఆటోలో ఓ శుభకార్యానికి బయల్దేరారు. ఈ క్రమంలో రూ.20 లక్షల విలువైన బంగారు ఆభరణాలున్న బ్యాగ్ను పోగొట్టుకున్నారు. ఆ బ్యాగ్ ఏడిద గ్రామ శివారు దేవుడు కాలనీ సమీపాన అదే గ్రామానికి చెందిన యువకుడు నామాల లక్ష్మణరావుకు దొరికింది. అదే మహద్భాగ్యమనుకుని ఆ ఆభరణాలను పట్టుకుపోవాలనే దుర్బుద్ధికి అతడు లోనవలేదు. ఆ ఆభరణాల పట్ల ఎలాంటి వ్యామోహాన్నీ పెంచుకోకుండా.. పోగొట్టుకున్న వారికే తిరిగి అందజేయాలని తపన పడ్డాడు. బ్యాగ్లో ఉన్న ఆధార్ కార్డులోని అడ్రస్కు సమాచారం అందించారు. సీఐ దొరరాజు, ఎస్సై వి.కిశోర్ సమక్షంలో బాధితురాలు శ్రీలేఖకు ఆ ఆభరణాల బ్యాగ్ను అప్పగించారు. నిజాయతీగా వ్యవహరించిన లక్ష్మణరావును పోలీసులు, బాధిత కుటుంబ సభ్యులు, ప్రజలు అభినందించారు. -
బంగారం ఖరీదవడం లేదు.. కియోసాకి కామెంట్స్
‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ (Rich Dad Poor Dad) పుస్తక రచయిత, ప్రముఖ ఇన్వెస్టర్ రాబర్ట్ కియోసాకి (Robert Kiyosaki) మరోసారి డాలర్ విలువ, ద్రవ్యోల్బణంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. బంగారం ధరలు పెరుగుతున్నాయనే భావన తప్పని, అసలు సమస్య డాలర్ కొనుగోలు శక్తి క్షీణించడమేనని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు ఫేస్బుక్లో ఆయన చేసిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.“బంగారం ఖరీదవడం లేదు.. డాలర్ చవకబారుతోంది” అంటూ కియోసాకి తన పోస్టులో స్పష్టం చేశారు. ఆర్థిక సలహాదారుగా ఆరు సంవత్సరాలకు పైగా పని చేసిన తన స్నేహితుడు కూడా 37 ఏళ్ల వయసులోనే ఈ నిజాన్ని అర్థం చేసుకున్నాడని తెలిపారు. ప్రజలు తమ జీతాలు పెరిగాయని భావిస్తున్నా, వాస్తవానికి డాలర్ విలువ తగ్గిపోవడంతో ఎక్కువ నోట్లు చేతికి వస్తున్నాయని ఆయన వ్యాఖ్యానించారు.తన స్నేహితుడి తండ్రి ఉదాహరణను కూడా కియోసాకి ప్రస్తావించారు. ఒకప్పుడు 10 వేల డాలర్ల విలువైన ఇల్లు, అదే సమయంలో తీసుకున్న 10 వేల డాలర్ల జీవిత బీమా పాలసీ గురించి చెబుతూ.. నేడు ఆ ఇల్లు 7.5 లక్షల డాలర్లకు చేరగా, బీమా మాత్రం ఇప్పటికీ 10 వేల డాలర్లుగానే ఉందన్నారు. “ఒకటి ద్రవ్యోల్బణాన్ని అనుసరించింది.. మరొకటి అనుసరించలేదు” అని వ్యాఖ్యానించారు.1971 నుంచి అమెరికన్ డాలర్ తన కొనుగోలు శక్తిలో 93 శాతం కోల్పోయిందని కియోసాకి పేర్కొన్నారు. అయినప్పటికీ ప్రజలను అదే కరెన్సీలో పొదుపు చేయమని ఆర్థిక వ్యవస్థ ప్రోత్సహిస్తోందని విమర్శించారు. ప్రభుత్వాలు నిరంతరం కరెన్సీ ముద్రిస్తూనే ఉంటాయని, ఫలితంగా కరెన్సీ విలువ తగ్గుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.రోమ్ సామ్రాజ్యం నుంచి అమెరికా వరకు చరిత్రలో ఇదే పునరావృతమైందని ఆయన చెప్పారు. కోవిడ్ సమయంలో అమెరికా భారీగా డబ్బు ముద్రించిందని గుర్తుచేశారు. కరెన్సీ విలువ తగ్గినా, భూమి, బంగారం, వెండి, చమురు, వ్యాపారాల వంటి నిజమైన ఆస్తులు మాత్రం తమ విలువను నిలబెట్టుకుంటాయని అన్నారు.డాలర్ను ‘డబ్బు’గా కాకుండా ప్రతి ఏడాది కరిగిపోతున్న ‘కొలమానం’గా చూడాలని కియోసాకి సూచించారు. బంగారం ఐదు వేల ఏళ్లుగా తన విలువను నిలబెట్టుకుందని, పేపర్ కరెన్సీలు చివరికి విలువ కోల్పోతాయని పేర్కొన్నారు. చివరగా “డాలర్లు దాచుకోవద్దు.. నిజమైన ఆస్తులను సొంతం చేసుకోండి” అంటూ బంగారం, వెండి, బిట్కాయిన్, రియల్ అసెట్స్లో పెట్టుబడుల వైపు మొగ్గుచూపాలని ప్రజలకు సూచించారు. -
భారీగా తగ్గిన బంగారం ధరలు, లేటెస్ట్ రేట్లు ఇవే
-
ధరల పతనం షురూ.. భారీగా తగ్గిన గోల్డ్ రేటు!
భారతదేశంలో బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. వరుసగా మూడోరోజు (మే 28) పసిడి రేటు భారీగా తగ్గింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో పసిడి ధరలలో మార్పులు జరిగాయి. ఈ కథనంలో లేటెస్ట్ గోల్డ్ రేటు ఎక్కడ, ఎలా ఉందనే వివరాలు తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడలలో మే 26న 1,58,890 రూపాయల వద్ద ఉన్న 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర నేటికి (మే 28) 1,56,060 రూపాయల వద్దకు చేరింది. అంటే మూడు రోజుల్లో 3320 రూపాయలు తగ్గింది. 22 క్యారెట్ల ధర 1,45,650 రూపాయల నుంచి 1,43,050 వద్దకు (3050 రూపాయలు తగ్గింది) చేరింది.ఢిల్లీలో కూడా గోల్డ్ రేటు తగ్గింది. ఇక్కడ 24 క్యారెట్ల తులం ధర రూ.1,59,040 దగ్గర నుంచి 1,56,210 రూపాయల (రూ.3320 తగ్గింది) వద్దకు.. 22 క్యారెట్ల 10 గ్రాముల రేటు 1,45,800 రూపాయల నుంచి 1,43,200 రూపాయల (3050 రూపాయలు తగ్గింది) వద్దకు చేరింది.చెన్నైలో బంగారం ధరలు.. మూడు రోజుల్లో భారీ మార్పుకు లోనయ్యాయి. ఇక్కడ మే 26న రూ.1,60,690 వద్ద ఉన్న 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర మే 28 నాటికి 158180 రూపాయల (రూ.3060 తగ్గింది) వద్దకు చేరింది. 22 క్యారెట్ల పసిడి రేటు రూ.1,47,300 నుంచి రూ. 1,45,000 వద్దకు (రూ.2800 తగ్గింది) చేరింది.ఇదీ చదవండి: ఇథనాల్ స్టవ్ ఎలా పనిచేస్తుంది! -
కాళ్లు నరికి.. కడియాలు దోచి
చేవెళ్ల: ఆభరణాల కోసం ఓ మహిళను దారుణంగా హత్య చేసిన సంఘటన మండలంలోని ఈర్లపల్లి సమీపంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని గొల్లపల్లి అనుబంధ గ్రామమైన ధర్మసాగర్కు చెందిన ఎరుకుల మైసమ్మ(48)కు ముప్పై ఏళ్ల కిందట వివాహమైంది. అనంతరం కొన్నేళ్లకు ఆమె భర్త చనిపోయాడు. దీంతో కొడుకు సురేశ్తో కలిసి ఆమె ధర్మసాగర్లోనే ఉంటుంది. కొడుకుకి వివాహం కావటంతో వేర్వేరుగా ఉంటున్నారు. మైసమ్మ కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తుంది. మంగళవారం సాయంత్రం ఇంటి నుంచి వెళ్లిన ఆమె తిరిగి రాలేదు. బుధవారం మధ్యాహ్నం ఈర్లపల్లి సమీపంలో ఓ మహిళ మృతదేçహాన్ని గుర్తించినట్లు స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలికి వెళ్లి పరిశీలించి మైసమ్మగా నిర్ధారించారు. దుండగులు ఆమెను నిర్మానుష్య ప్రదేశంలోని తీసుకెళ్లి గొంతు కోసి రెండు కాళ్లను నరికి 50 తులాల కడియాలు, చెవి కమ్మలు దోచుకెళ్లారు. తాగిన మైకంలో ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ భూపాల్శ్రీధర్ తెలిపారు. దర్యాప్తులో మరిన్ని విషయాలు వెల్లడయ్యే అవకాశాలున్నాయని చెప్పారు. -
బంగారం మార్కెట్లో కొత్త దశ!
భారత్లో పెట్టుబడులపరంగా పసిడికి ఉన్న స్థానం ప్రత్యేకమైనది. ప్రస్తుతం దేశీయ బంగారం, ఆభరణాల రంగం కీలకమైన మార్పుల దశలోకి ప్రవేశిస్తోంది. మారుతున్న ప్రభుత్వ విధానాలు, నానాటికీ పెరుగుతున్న డిమాండ్, కస్టమర్ల ఆలోచనా విధానంలో వస్తున్న మార్పులు ఈ రంగాన్ని సరికొత్త పుంతలు తొక్కిస్తున్నాయి. ధరలు చుక్కలనంటుతున్నా సరే.. పసిడిపై భారతీయుల మక్కువ ఏమాత్రం తగ్గకపోవడం విశేషం.ధరల భారం ఉన్నా.. తగ్గని డిమాండ్సాధారణంగా ధరలు పెరిగితే డిమాండ్ తగ్గుతుందనేది మార్కెట్ సూత్రం. కానీ, బంగారం విషయంలో ఈ సూత్రం తలకిందులవుతోంది. గడిచిన కాలంలో పసిడి రేట్లు భారీగా పెరిగినప్పటికీ దేశీయంగా కొనుగోళ్లు పటిష్టంగానే కొనసాగుతున్నాయి. పెళ్లిళ్ల సీజన్, పండుగలు మాత్రమే కాకుండా సురక్షితమైన పెట్టుబడి సాధనంగా జనం బంగారాన్ని ఎంచుకుంటున్నారు. భవిష్యత్తులో ధరలు మరింత పెరుగుతాయనే అంచనాలు కూడా ప్రస్తుత డిమాండ్కు ఊతమిస్తున్నాయి.పారదర్శకతకే పెద్దపీట: కార్పొరేట్ బ్రాండ్ల హవాప్రస్తుత తరం కస్టమర్లు డిజైన్లతోపాటు స్వచ్ఛత, ధరల్లో పారదర్శకత, నమ్మకానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం హాల్మార్కింగ్ తప్పనిసరి కావడం మార్కెట్లో పెద్ద మార్పుకు కారణమైంది. నమ్మకమే పెట్టుబడిగా మారిన ప్రస్తుత తరుణంలో జ్యుయలరీ మార్కెట్ క్రమంగా కన్సాలిడేట్ అవుతోంది. అసంఘటిత రంగం నుంచి వ్యాపారం వేగంగా సంఘటిత రంగం వైపు మళ్లుతోంది.గత ఐదేళ్ల కాలంలో దేశవ్యాప్తంగా సంఘటిత రిటైల్ జ్యుయలరీ విభాగం ఊహించని రీతిలో విస్తరించింది. ప్రముఖ కార్పొరేట్ బ్రాండ్లు చిన్న నగరాలు, పట్టణాలకు సైతం తమ నెట్వర్క్ను పెంచుకుంటూ పోతున్నాయి.పెట్టుబడులకు అనువైన కాలంఆర్థిక విశ్లేషకులు, మార్కెట్ నిపుణుల అంచనా ప్రకారం.. రాబోయే రోజుల్లో మధ్యకాలికంగా ఈ రంగం పెట్టుబడులకు ఎంతో అనువుగా కనిపిస్తోంది. స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన ప్రముఖ జ్యుయలరీ కంపెనీల ఆదాయాలు, లాభాల వృద్ధి రేటు మెరుగ్గా ఉందని కొందరు నిపుణులు భావిస్తున్నారు. దీంతో ఇన్వెస్టర్లు ఈ రంగం వైపు మొగ్గు చూపుతున్నారు. అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ పరిస్థితులు, ద్రవ్యోల్బణం వంటి కారణాల వల్ల బంగారం ధరలకు దీర్ఘకాలంలో ఢోకా లేదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.ఇదీ చదవండి: పెరుగుతున్న ధరలు.. నిర్మలా సీతారామన్ హెచ్చరిక! -
ఇంటి బంగారం ఆర్థిక భారాన్ని తగ్గిస్తుందా?
ప్రపంచంలోనే బంగారాన్ని అత్యధికంగా దిగుమతి చేసుకునే దేశాలలో భారతదేశం ఒకటి. ప్రతీ సంవత్సరం మనం 700 నుంచి 800 టన్నుల బంగారం దిగుమతి చేసు కుంటున్నాం. క్రూడ్ ఆయిల్ తరువాత భారతదేశం బంగారం పైనే పెద్ద మొత్తంలో దిగుమతి వ్యయం భరిస్తున్నదంటే ఆర్థిక వ్యవస్థపై బంగారం ప్రభావం ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. ఏటా బంగారం దిగుమతులపై 55 నుంచి 72 బిలియన్ డాలర్లు ఖర్చు చేస్తుందని గణాంకాలు చెబుతున్నాయి. ఇది జాతీయ జీడీపీలో 1.6%కి సమానం. డబ్లు్యజీసీ (వరల్డ్ గోల్డ్ కౌన్సిల్) నివేదిక ప్రకారం భారతీయ కుటుంబాల వద్ద సుమారు 25,000 టన్నుల బంగారం (దేవాలయా లలోని నిల్వలను కలుపుకొని) నిల్వ ఉంది. దీని విలువ సుమారు 2.4 ట్రిలియన్ డాలర్లు. దాయాది దేశమైన పాకిస్తాన్ జీడీపీ కంటే మన బంగారం నిల్వలు 6 రెట్లు అధికం. అయితే బంగారం దిగుమతి వల్ల భారత ఆర్థిక వ్యవస్థపై పడు తున్న భారాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ (జీఎమ్ఎస్)ను మరోసారి తెరపైకి తెచ్చింది. ఈ పథకం ద్వారా, వ్యక్తులు బ్యాంకు లాకర్లలో, ఇండ్లలో నిరుపయోగంగా నిల్వ ఉన్న బంగారాన్ని వడ్డీ సంపాదించే ఆస్తిగా మార్చుకోవచ్చు. ఆభర ణాల రూపంలో ఉన్న బంగారాన్ని కరిగించి స్వచ్ఛతను పరీక్షించిన పిదప కడ్డీ రూపంలో బ్యాంక్లో నిర్ణీత కాలానికి డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. బ్యాంకులు ఈ బంగారాన్ని గోల్డ్ మెటల్ లోన్స్ (జీఎమ్ ఎల్) ద్వారా నగల వ్యాపారులకు లీజుకు ఇచ్చి, వడ్డీ వసూలు చేయడం ద్వారా అదనపు ఆదాయాన్ని పొందుతాయి. కేంద్రబ్యాంకులు కూడా కరెన్సీ స్థిరత్వాన్ని కాపాడుకోవడానికి, ఆర్థిక నష్టాలను నిర్వహించడానికి బంగారు నిల్వలను నిర్ణీత పరిమాణంలో కలిగి ఉంటాయి. 2015లో ఈ పథకాన్ని ప్రవేశపెట్టగా అంతగా విజయవంతం కాలేదనే చెప్పాలి. ఒక దశాబ్ద కాలంలో ఈ పథకం ద్వారా కేవలం 39 టన్నుల బంగారాన్ని మాత్రమే వాడుక లోకి తేవడం జరిగింది.వడ్డీ కంటే అభిరుచి మిన్నబంగారు నగదీకరణ పథకం అంతగా విజయవంతం కాకపోవ డానికి కారణం, బంగారం 75% ఆభరణాల రూపంలో ఉండటం. స్త్రీలు తమ అభిరుచులకనుగుణంగా చేయించు కున్న నగల అసలు రూపాన్ని బ్యాంకులు ఇచ్చే 2 నుంచి 3 శాతం వడ్డీ కోసం కోల్పోవ డానికి ఇష్టపడటం లేదు. శుభ కార్యాలలో స్టేటస్ చిహ్నంగా ఆభర ణాలను స్త్రీలు ధరించడం, కొన్ని కుటుంబాలలో ఆభరణాలు వారస త్వంగా రావడం లాంటి కారణాల వల్ల చాలా కుటుంబాలు ఆభర ణాలను తమ వద్ద భద్రపరుచుకోవడానికే మొగ్గు చూపుతున్నాయి. చాలా మధ్య తరగతి కుటుంబాలు వ్యక్తిగత అవసరాల కోసం ఆభర ణాలను తనఖా పెట్టి రుణాలు తీసుకోవడం కూడా ఈ పథకానికి ఒక పరిమితి. గ్రామీణ ప్రాంతాలలో ఈ పథకం గురించి అవగాహన లేకపోవడం, డిపాజిట్పై బ్యాంకులు ఇచ్చే వడ్డీ రేటు ఆకర్షించే విధంగా లేకపోవడం, భవిష్యత్తులో బంగారం ధరల గురించి అనిశ్చితి లాంటివి ఈ స్కీమ్ విజయానికి ప్రతిబంధకాలు.దేశ ఆర్థిక స్థితిపై బంగారం దిగుమతుల భారం తగ్గించాలంటే బంగారంపై ఉన్న సెంటిమెంట్ను దేశ ఆర్థిక భద్రత వైపు మళ్లించడానికి ప్రభుత్వాలు అవగాహన కల్పించాలి. ప్రజలనుగోల్డ్ ఈటీ ఎఫ్, సావరిన్ గోల్డ్ బాండ్స్లో పెట్టుబడి పెట్టేలా ప్రోత్స హించాలి. అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి విలువ బలపడ టానికి, దిగు మతులను తగ్గించి విదేశీ మారక ద్రవ్య నిలువలను పటిష్టం చేయ డానికి ప్రతి భారతీయుడు తనవంతుగా సహక రించాల్సి ఉంది.– డా.ఎం. డి. ఖ్వాజా మొయినుద్దీన్ స్టాక్ మార్కెట్ విశ్లేషకులు దేశ ఆర్థిక స్థితిపై బంగారం దిగుమతుల భారం తగ్గించాలంటే బంగారంపై ఉన్న సెంటిమెంట్ను దేశ ఆర్థిక భద్రత వైపు మళ్లించడానికి ప్రభుత్వాలు అవగాహన కల్పించాలి. -
పదేళ్ల కనిష్ఠానికి గోల్డ్ డిమాండ్.. కారణాలివే!
భారతదేశంలో బంగారు ఆభరణాలకు ఎప్పటి నుంచో.. ప్రత్యేక స్థానం ఉంది. పెళ్లిళ్లు, పండుగలు, కుటుంబ వేడుకలు వంటి ప్రతి ముఖ్యమైన సందర్భంలో బంగారం కొనడం ఒక సంప్రదాయంగా కొనసాగుతోంది. అయితే.. ప్రస్తుతం బంగారం ధరలు భారీగా పెరగడం వల్ల సాధారణ ప్రజలకు కొత్త ఆభరణాలు కొనడం కష్టంగా మారుతోంది. పసిడి తన మెరుపును కోల్పోలేదు కానీ అది మధ్యతరగతి, సాధారణ కుటుంబాల అందుబాటుకు దూరమవుతోంది.రేటింగ్స్ ఏజెన్సీ క్రిసిల్ తన నివేదికలో.. బంగారు ఆభరణాల అమ్మకాల తగ్గుతున్నట్లు తెలిసింది. ప్రజలు కొనుగోలు చేసే బంగారం బరువు తగ్గుతోంది. 2026 ఆర్థిక సంవత్సరంలో బంగారం అమ్మకాల పరిమాణం సుమారు 8% తగ్గిందని, ఇంకా ఈ ఏడాది 13-15% వరకు తగ్గే అవకాశం ఉందని తెలిపింది. ఇది గత పదేళ్లలోనే కనిష్ట స్థాయి అని పేర్కొంది. దీనికి కారణం ధరల పెరుగుదల, దిగుమతి సుంకం పెంపు.భారతదేశంలో వినియోగించే బంగారం ఎక్కువగా విదేశాల నుంచి దిగుమతి అవుతుంది. ప్రభుత్వం ఇటీవల దిగుమతి సుంకాన్ని 6 శాతం నుంచి 15 శాతం వరకు పెంచింది. దీని వల్ల బంగారం ధరలు మరింత పెరిగాయి. ప్రస్తుతం 10 గ్రాముల బంగారం ధర సుమారు రూ.1,60,000 వరకు చేరింది. అందువల్ల ప్రజలు అవసరమైన ఆభరణాలకే పరిమితం అవుతున్నారు.అయితే.. బంగారం అమ్మకాల పరిమాణం తగ్గినా, దాని విలువ మాత్రం పెరుగుతోంది. ఎందుకంటే తక్కువ బంగారం కొనుగోలు చేసినా, అధిక ధర చెల్లించాల్సి వస్తోంది. ఈ కారణంగా జువెలరీ కంపెనీల ఆదాయం 20-25% వరకు పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. అంటే కంపెనీలు అమ్మే బంగారం బరువు తగ్గినా, అధిక ధరల వల్ల వారి ఆదాయం తగ్గడం లేదు.ఇదీ చదవండి: కుక్కను చూసుకుంటే.. వారానికి రూ.2.4 లక్షలు! -
బంగారం, వెండిపై కియోసాకి కొత్త అంచనాలు!
ప్రముఖ గ్లోబల్ ఇన్వెస్టర్, బెస్ట్ సెల్లర్ పుస్తకం ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ (Rich Dad Poor Dad) రచయిత రాబర్ట్ కియోసాకి అంతర్జాతీయ ఆర్థిక మార్కెట్లపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే ప్రపంచవ్యాప్తంగా భారీ ఆర్థిక సంక్షోభం (మార్కెట్ క్రాష్) రాబోతోందని ఆయన హెచ్చరించారు. ఈ మేరకు ఆయన తన అధికారిక సోషల్ మీడియా వేదికగా ఒక ఆసక్తికరమైన ట్వీట్ చేశారు.ఈ ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో బంగారం, వెండి ధరలు ఊహించని రీతిలో దూసుకుపోతాయని కియోసాకి అంచనా వేశారు.బంగారం, వెండిపై కియోసాకి అంచనాలు ఇవేప్రముఖ ఆర్థిక విశ్లేషకుడు జిమ్ రిచర్డ్స్ అంచనాలను ప్రస్తావిస్తూ కియోసాకి ఈ వివరాలను పంచుకున్నారు.బంగారం ధర: ప్రస్తుతం మార్కెట్లో ఔన్స్ బంగారం ధర సుమారు 4,500 డాలర్లుగా ఉంటే... అది భవిష్యత్తులో ఏకంగా 1,00,000 (ఒక లక్ష) డాలర్లకు చేరుకుంటుందని జిమ్ రిచర్డ్స్ పేర్కొన్నట్లు కియోసాకి తెలిపారు.వెండి ధర: ప్రస్తుతం మార్కెట్లో ఔన్స్ వెండి ధర సుమారు 75 డాలర్లుగా ఉంది. అయితే రాబోయే రోజుల్లో ఇది 200 డాలర్లను తాకుతుందని తాను భావిస్తున్నట్లు కియోసాకి పేర్కొన్నారు."సంక్షోభంలోనూ ధనవంతులు కావచ్చు"భవిష్యత్తును ముందుగానే ఊహించి, దానికి తగ్గట్టుగా ముందస్తు చర్యలు (పెట్టుబడులు) తీసుకోగలిగినవారే అత్యుత్తమ ఇన్వెస్టర్లు అవుతారని కియోసాకి ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు."రాబోయే ఆర్థిక సంక్షోభానికి మీరు బాధితులుగా మిగిలిపోవాల్సిన అవసరం లేదు. సరైన నిర్ణయాలు తీసుకోవడం ద్వారా ఈ సంక్షోభ సమయంలోనూ మీరు మరింత ధనవంతులు కావచ్చు. జాగ్రత్తగా ఉండండి" అంటూ ఆయన ఇన్వెస్టర్లకు పిలుపునిచ్చారు.సాధారణంగా ఆర్థిక వ్యవస్థలు సంక్షోభంలో పడినప్పుడు ఇన్వెస్టర్లు సురక్షితమైన పెట్టుబడిగా భావించే బంగారం, వెండి వైపు మొగ్గు చూపుతారు. ఈ నేపథ్యంలోనే కియోసాకి చేసిన ఈ ట్వీట్ ఇప్పుడు అంతర్జాతీయ మదుపర్లలో చర్చనీయాంశంగా మారింది.Crash imminent.Jim Richard’s calls for gold to get to$ 100,000Today gold is at $4,500I think silver will hit $200 an ounceToday silver is at $75.What do you think?The best investors are able to see the future and take action. Remember you do not have to be a…— Robert Kiyosaki (@theRealKiyosaki) May 23, 2026 -
రూ.50 వేల అప్పుతో మొదలై.. రూ.8,000 కోట్ల సామ్రాజ్యం!
ప్రపంచంలోని చాలా దేశాల్లో ఆర్ధిక అస్థిరత నెలకొన్న సమయంలో.. 'దేశీ బ్లింగ్' అనే షో ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు కారణమైంది. స్టాక్ మార్కెట్ పతనం, బంగారం కొనుగోళ్లపై ఆంక్షలు ప్రారంభమైన వేళ ఇలాంటి ఒక కార్యక్రమం ప్రసారం కావడం చాలామంది విమర్శలకు గురవుతోంది. ఎందుకంటే ఈ ప్రోగ్రాం మొత్తం అతి విలాసవంతమైన జీవితం, బంగారం, డబ్బు, ఆడంబరాల చుట్టూనే తిరుగుతుంది.దేశీ బ్లింగ్ కార్యక్రమంలో కనిపించే వ్యక్తులలలో సతీష్ సన్పాల్, ఆయన భార్య తబిందా సన్పాల్ కూడా ఉన్నారు. వీరి జీవితం చాలా విలాసవంతం. నిజానికి సతీష్ భారతదేశంలో పుట్టి పెరిగినప్పటికీ.. దుబాయ్ వెళ్లి వేలకోట్ల సామ్రాజ్యం స్థాపించారు. మధ్యప్రదేశ్లోని జబల్పూర్ నుంచి దుబాయ్కు వెళ్లినప్పుడు తనదగ్గర చాలా తక్కువ మొత్తం మాత్రమే ఉందని పేర్కొన్నారు. ఇప్పుడు తాను దుబాయ్లో బిలినీయర్ అని గర్వంగా చెప్పుకుంటున్నారు.40 కేజీల బంగారం!ఈ కార్యక్రమంలో సతీష్ సన్పాల్ బంగారం పట్ల వారికున్న అభిరుచిని చెప్పుకొచ్చారు. ఇప్పటికే 40 కిలోల బంగారం తనవద్ద ఉందని టబిందా సన్పాల్ పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం తన భర్త తనకు 3 కిలోల బంగారం కొనిస్తాడని కూడా వెల్లడించింది. వారి ఇంట్లో బంగారు ఆభరణాలతో నిండిన ప్రత్యేక గది ఉందని, అది ఒక పెద్ద జ్యువెలరీ షోరూమ్లా కనిపిస్తుందని చెప్పారు.తమ కుమార్తె ఇసాబెల్లా కోసం బంగారు పాత్రలు వాడటం, మొదటి పుట్టినరోజుకు 24 క్యారెట్ బంగారంతో ప్రత్యేక దుస్తులు తయారు చేయించడం వంటి విషయాలు వెల్లడించారు. వీరు బుర్జ్ ఖలీఫాలో నివాసం ఉంటున్నారు. ఇవన్నీ ప్రేక్షకులను ఆశ్చర్యపరిచాయి.ఏడాది కుమార్తె కోసం రోల్స్ రాయిస్తమ ఏడాది పాప కోసం గులాబీ రంగులో ఉన్న కస్టమైజ్ రోల్స్ రాయిస్ కొన్న విషయం కూడా ఈ షోలో వెల్లడించారు. ప్రతి చిన్న విషయాన్ని కూడా విలాసానికి ప్రతీకగా మార్చడం ఈ కుటుంబ జీవనశైలిలో స్పష్టంగా కనిపిస్తుంది. అంతే కాకుండా సతీష్ తన స్నేహితులతో గడపడానికి ప్రత్యేకంగా యాచ్ కొనుగోలు చేసి పార్టీలకు ఉపయోగించడం కూడా షోలో వెల్లడించారు.ఎవరీ సతీష్ సన్పాల్?సతీష్ సన్పాల్ వ్యాపార జీవితం కూడా ఆసక్తికరంగానే ఉంటుంది. నిజానికి ఈయన ఎనిమిదో తరగతి వరకే చదివి, చిన్న వయసులోనే వ్యాపారంలోకి అడుగుపెట్టాడు. మొదట తన తల్లి నుంచి రూ.50,000 అప్పుగా తీసుకుని కిరాణా దుకాణం ప్రారంభించాడు. అది చాలా తక్కువ కాలంలోనే విఫలమైపోయింది.ఆ తరువాత దుబాయ్ వెళ్లి.. ప్రారంభంలో స్టాక్ మార్కెట్ రంగంలోకి అడుగుపెట్టాడు. ఆ తరువాత దీని గురించి అవగాహన పెంచుకున్నాడు. ఇలా.. 2018లో అనక్స్ హోల్డింగ్ ప్రారంభించాడు. ఇది క్రమంగా భారీ వ్యాపార సమ్మేళనంగా మారింది. ఈ సంస్థకు దుబాయ్ రియల్ ఎస్టేట్, ఆర్థిక మార్కెట్లు, హాస్పిటాలిటీ, మీడియా వంటి అనేక రంగాలలో భాగస్వామ్యం ఉంది. కాగా ఈయన నికర విలువ మొత్తం రూ.8,000 కోట్ల కంటే ఎక్కువ అని సమాచారం.ఇదీ చదవండి: ఉద్యోగం పోయింది.. ఈఎంఐ కట్టలేని స్థితి నుంచి విజయం! -
షాక్ ఇచ్చిన బంగారం.. శాంతించిన వెండి..
-
గ్రాము బంగారంపైన 10 వేలు లాభం.. వాళ్లందరిపై కాసుల వర్షం..!
-
అవన్నీ అసత్య కథనాలు: కేంద్రం
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలోని దేవాలయాల బంగారు నిల్వలకు బదులుగా ప్రభుత్వం బంగారం బాండ్లు జారీ చేయనుందని, ఆ నిల్వలను నగదుగా మార్చే ప్రతిపాదనకు ఆమోదం తెలిపిందని సామాజిక మాధ్యమాలు, కొన్ని మీడియా సంస్థల్లో వస్తున్న వార్తలను కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. ఆ వార్తలు పూర్తిగా అసత్యాలని, ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని స్పష్టం చేసింది. ఈ మేరకు మంగళవారం కేంద్ర ఆర్థిక శాఖ ఒక ప్రకటన విడుల చేసింది.ఆలయాల బంగారాన్ని నగదుగా మార్చేందుకు సంబంధించి ఎలాంటి పథకాన్ని ప్రవేశపెట్టే యోచన ప్రభుత్వానికి లేదని తేల్చి చెప్పింది. అలాగే, ఆలయ గోపురాలు, తలుపులపై ఉండే బంగారు పూతను ‘భారత వ్యూహాత్మక బంగారు నిల్వ’గా పరిగణిస్తారనే ప్రచారంలోనూ ఎలాంటి నిజం లేదని పేర్కొంది. ప్రజలు ఇలాంటి పుకార్లను నమ్మవద్దని, వాటిని షేర్ చేయవద్దని విజ్ఞప్తి చేసింది. అధికారికంగా ధ్రువీకరించని సమాచారాన్ని సోషల్ మీడియాలో వ్యాప్తి చేస్తూ ప్రజల్లో అనవసరమైన భయాందోళనలు, గందరగోళం సృష్టించడంపై ఆందోళన వ్యక్తం చేసింది. ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాలకు సంబంధించి కేవలం అధికారిక ప్రకటనలు, ప్రభుత్వ వెబ్సైట్లలోని సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని స్పష్టం చేసింది. -
భారీగా పెరిగిన వెండి ఆభరణ ఎగుమతులు!
రత్నాభరణాల ఎగుమతుల రంగం ఏప్రిల్లో ప్రతికూలతలను చవిచూసింది. పశ్చిమాసియా ఘర్షణల నేపథ్యంలో అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులతో ఎగుమతులు ఢీలా పడ్డాయి. క్రితం ఏడాది ఏప్రిల్తో పోల్చి చూసినప్పుడు ఎగుమతులు 9 శాతం తగ్గి 2,226 మిలియన్ డాలర్లకు (రూ.20,825 కోట్లు సుమారు) పరిమితమయ్యాయి. ఈ వివరాలను రత్నాభరణాల ఎగుమతుల ప్రోత్సాహక మండలి (జీజేఈపీసీ) వెల్లడించింది. క్రితం ఏడాది ఏప్రిల్లో ఎగుమతులు 2,448 మిలియన్ డాలర్లుగా ఉండడం గమనార్హం. ఏప్రిల్లో కట్, పాలిష్డ్ వజ్రాల ఎగుమతులు క్రితం ఏడాది ఇదే నెలతో పోల్చి చూస్తే 19.65 శాతం తగ్గి 890.91 మిలియన్ డాలర్లుగా ఉన్నాయి.ల్యాబ్లో తయారు చేసిన వజ్రాల ఎగుమతులు సైతం 15 శాతానికి పైనే క్షీణించి 93.28 మిలియన్ డాలర్లకు చేరాయి.బంగారం ఆభరణాల ఎగుమతులు ఏకంగా 21.77 శాతం తగ్గి 841.54 మిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. సాధారణ బంగారం ఆభరణాల ఎగుమతులు 342 మిలియన్ డాలర్లుగా ఉన్నాయి. క్రితం ఏడాది ఏప్రిల్తో పోల్చితే 47 శాతం తక్కువ. స్టడెడ్ (రాళ్లు పొదిగిన) బంగారం ఆభరణాల ఎగుమతులు మాత్రం 16 శాతం వృద్ధి చెంది 500 మిలియన్ డాలర్లకు చేరాయి. ఇక వెండి ఆభరణాల ఎగుమతులు ఏకంగా 444 శాతం ఎగసి 268 మిలియన్ డాలర్లకు చేరాయి. క్రితం ఏడాది ఇదే నెలలో వీటి ఎగుమతులు 49 మిలియన్ డాలర్లుగానే ఉండడం గమనార్హం. -
బంగారం ధరలు రివర్స్.. తులం ఎంతంటే..
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. గడిచిన మూడు సెషన్ల్లో తగ్గిన బంగారం ధర ఈరోజు మళ్లీ పెరిగింది. దేశంలోని ప్రధాన నగరాల్లో నేడు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. -
కఠిన పొదుపు దిశగా కదలండి
న్యూఢిల్లీ: కఠిన పొదుపు దిశగా వెంటనే చర్యలు తీసుకోవాలని, ఎలక్ట్రిక్ వాహనాలకు (ఈవీలు) మళ్లాలని ప్రభుత్వరంగ బ్యాంక్లు, బీమా సంస్థలను కేంద్ర ఆర్థిక శాఖ కోరింది. ప్రజలు పెట్రోల్/డీజిల్ వినియోగాన్ని తగ్గించుకోవాలని, ప్రజా రవాణా వ్యవస్థల్లో ప్రయాణించాలంటూ ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపునకు అనుగుణంగా ఆర్థిక శాఖ ఈ సూచన చేసింది. బంగారం కొనుగోళ్లను వాయిదా వేసుకోవాలని, విదేశీ పర్యటనలు మానుకోవాలని, ఇంటి నుంచే పనిచేయాలని, కార్లలో ఒంటరిగా వెళ్లకుండా ఇతరులతో కలసి ప్రయాణించాలంటూ ప్రధాని దేశ ప్రజలను కోరడం తెలిసిందే. పశ్చిమాసియాలో యుద్ధంతో క్రూడ్, బంగారం ధరలు భారీగా ఎగబాకి.. దిగుమతి బిల్లు భారమవుతోంది. ఫలితంగా రూపాయి నేలచూపులు చూస్తోంది. దీంతో ఆర్థిక శాఖ పరిధిలోని ఆర్థిక వ్యవహారాల విభాగం ప్రభుత్వరంగ బ్యాంక్లు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంక్లు, బీమా, ఆర్థిక సంస్థల అధికారులు, సిబ్బందిని ఈవీల్లో ప్రయాణించాలని కోరింది. పెట్రోల్, డీజిల్ వాహనాల స్థానంలో ఈవీలను అద్దెకు తీసుకోవాలని సూచించింది. తప్పనిసరి అయితే తప్పించి అన్ని సమావేశాలను వీడియో కాన్ఫరెన్స్ రూపంలో నిర్వహించుకోవాలని కూడా ఆర్థిక శాఖ కోరింది. -
తగ్గిన బంగారం, పెరిగిన వెండి: కొత్త రేట్లు ఇవే!
బంగారం ధరలు మరోమారు తగ్గుముఖం పట్టాయి. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో గోల్డ్ రేటు పతనమైంది. అయితే వెండి రేటు మాత్రం రూ.10 వేలు పెరగడంతో.. కేజీ సిల్వర్ రేటు రూ. మూడు లక్షలకు చేరుకుంది. ఇక్కడ లేటెస్ట్ పసిడి ధరలు ఎక్కడ, ఎలా.. ఉన్నాయనే విషయాలను తెలుసుకుందాం. -
గోల్డ్ కొనాలా.. వద్దా..
‘కొంతకాలం బంగారం కొనుగోళ్లు వాయిదా వేసుకోండి’ అంటూ ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు దేశవ్యాప్తంగా కలకలం రేపింది. మోదీ పిలుపుతో కొనుగోళ్లు ఆపాలని కొందరు , ఏడాది పాటు వాయిదా వేయాలని మరికొందరు చర్చలకు దిగారు ఇప్పటికే కొనేశాంగా మరి అమ్మేయాలా అని అనేకమంది సందిగ్ధంలో పడ్డారు. సిప్ (సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్)లో ఈటీఎఫ్లుగా కొంటున్నవారు ఏంచేయాలో తోచక అయోమయంలో పడ్డారు. అయితే ప్రధాని పిలుపు ఒక రకమైన కొనుగోలుదారులకు పూర్తిగా వర్తిస్తుంది. మరొక వర్గం కొనుగోలుదారులకు అంతగా సంబంధం ఉండకపోవచ్చు. కానీ చాలా మందికి తాము ఏ రకమైన బయ్యర్లో తెలీదు. అది తెలిస్తే మీరు బంగారం కొనాలో, అమ్మాలో, కొనసాగించాలో నిజంగా ఏంచేయాలో స్పష్టమవుతుంది. క్రూడ్, చమురు దిగుమతుల కారణంగా విదేశీ మారకద్రవ్యంపై పెరుగుతున్న ఒత్తిడి తగ్గించేందుకు ప్రధాని మోదీ గత వారం చేసిన బంగారం కొనుగోళ్లు వాయిదా వేయాలన్న పిలుపును బాధ్యత గల పౌరులుగా సీరియస్గా తీసుకోవాల్సిందే. పతనమవుతున్న రూపాయి , పశ్చిమ ఆసియాలో అస్థిర పరిస్థితి, పెరుగుతున్న దిగుమతి బిల్లు వంటి కారణాలను ప్రధాని ప్రస్తావించారు. అయితే ఈ పిలుపునకు అందరూ ఒకేరకంగా స్పందించాల్సిన అవసరంలేదు. సరదాగా, ఆడంబరం కోసం, ఫ్యాషన్గా ప్రదర్శించుకునేందుకు మీరు నగలు కొనేవారైతే ఈ పిలుపు మీకు పూర్తిగా వర్తిస్తుంది. కానీ పెట్టుబడి కోసం బంగారం కొనాలి అనుకుంటే ఆపడానికి ఆలోచించాల్సిందే. అదెలాగో తెలుసుకుందాం...ప్రధాని పిలుపు అసలు అర్థం ఏమిటి?భారతదేశం వినియోగించే బంగారంలో 99 శాతానికి పైగా దిగుమతుల ద్వారానే వస్తుంది. దేశంలో గణనీయమైన స్థాయిలో బంగారం తవ్వకం జరగదు. నగలు, నాణేలు, బార్లు ఏ రూపంలో అయినా బంగారం కొనడానికి ఖర్చు చేసే ప్రతి రూపాయి డాలర్ల రూపంలో దిగుమతులకే వెళ్తుంది. డాలరు మారకంలో రూపాయి విలువ 96 స్థాయికి పతనమై ఒకవైపు దిగుమతి బిల్లు పెరుగుతున్న సమయంలో బంగారం డిమాండ్ పెరగడం ఆర్థిక పరిస్థితిని మరింత కఠినతరం చేస్తోంది. ఎందుకంటే బంగారం దిగుమతులకు ప్రభుత్వం డాలర్లలోనే చెల్లిస్తుంది. డిమాండ్ పెరిగితే డాలర్లు భారీగా బయటకు వెళ్తాయి. దాంతో రూపాయి విలువపై ఒత్తిడి పెరుగుతుంది. రూపాయి బలహీనపడితే కీలకమైన దిగుమతులైన చమురు, ఎలక్ట్రానిక్స్, యంత్రాలు అన్నీ ఖరీదవుతాయి. దాంతో ద్రవ్యోల్బణం పెరుగుతుంది. అది చివరికి సాధారణ కుటుంబాలపైనే ప్రభావం చూపిస్తుంది. అందుకే ప్రధాని పిలుపులో భావోద్వేగం కన్నా గణాంకాలకే మనం ప్రాధాన్యం ఇవ్వాలి.ఎవరి కోసం...ఈ పిలుపు అత్యంత ప్రభావం చూపేది జ్యువెలరీ కొనుగోలుదారులపైనే. ఎందుకంటే నగలలో బంగారం విలువతో పాటు 10 నుంచి 15 శాతం వరకు మేకింగ్ చార్జీలు, జీఎస్టీ కూడా ఉంటాయి. ఇవి తిరిగి రికవర్ కాని ఖర్చులు. అంటే నగలను పెట్టుబడిగా భావించే వారు , కొనుగోలు చేసిన క్షణం నుంచే తమ సంపదను అంతకన్నా ఎక్కువ శాతంగా అంచనా వేస్తారు. నగలు అనేవి వినియోగం కోసమే. పెట్టుబడి కోసం కాదు. అందుకే ప్రధాని పిలుపు వీరిని ఉద్దేశించి చేసిందిగా గమనించాలి.బంగారం పని సంపద పెంచడం కాదు ...రక్షణ ఇవ్వడంప్రధాని పిలుపును పాటించాలా వద్దా అనుకునే ముందు, మీ పోర్ట్ఫోలియోలో బంగారం అసలు ఏ పని చేస్తుందో ముందుగా అర్థం చేసుకోవాలి. బంగారంపై పెట్టుబడి పోర్ట్ఫోలియోలో 5 నుంచి 10 శాతం వరకు ఉండటం సరైనదిగా పర్సనల్ ఫైనాన్స్ నిపుణులు భావిస్తారు. అది సంపదను వేగంగా పెంచడానికి కాదు. ఒక రకమైన ఇన్సూరెన్స్లా పనిచేయడానికి. ఈక్విటీలు దీర్ఘకాలంలో సంపదను పెంచుతాయి. డెట్ ఇన్స్ట్రుమెంట్లు మూలధనాన్ని కాపాడి వడ్డీ ఇస్తాయి. బంగారం పని మాత్రం వేరు. రూపాయి బలహీనపడినప్పుడు లేదా ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి పెరిగినప్పుడు, బంగారం సాధారణంగా తన విలువను నిలబెట్టుకుంటుంది. ఆసమయంలో ఇతర పెట్టుబడులను కాపాడేది బంగారం. ఆ పరిస్థితులకు హెడ్జింగ్గా బంగారాన్ని అలొకేషన్లో ఉంచుతారు.నగలు, ఈటీఎఫ్లు ఎస్జీబీలు పూర్తిగా భిన్నందిగుమతుల స్థాయిలో చూస్తే బంగారం అంటే బంగారమే. దేశంలో జ్యువెలరీ తయారీ దారులు గోల్డ్ బార్లు దిగుమతి చేసుకుని నగలుగా మారుస్తారు. గోల్డ్ ఈటీఎఫ్లు , గోల్డ్ మ్యూచువల్ ఫండ్లు కూడా తమ యూనిట్లకు బ్యాకింగ్గా ఫిజికల్ గోల్డ్ కొనాల్సి ఉంటుంది. కాబట్టి దిగుమతి భారంలో పెద్ద తేడా ఉండదు. ఇక్కడ అసలు తేడా దిగుమతుల్లో కాదు. దానికి చేసే వ్యయంలో ఉంది.గోల్డ్ఈటీఎఫ్లు – మ్యూచువల్ ఫండ్లు గోల్డ్ ఈటీఎఫ్లు, గోల్డ్ మ్యూచువల్ ఫండ్లు కూడా ఫిజికల్ గోల్డ్ దిగుమతులపైనే ఆధారపడతాయి. వీటి విషయంలో మేకింగ్ చార్జీలు ఉండవు. గోల్డ్ విలువపై జీఎస్టీ ఉండదు. తిరిగి అమ్ముకోవడం కూడా తేలిక.ఎస్జీబీలే నిజమైన మినహాయింపుసావరిన్ గోల్డ్ బాంండ్ల (ఎస్జీబీ)కు మాత్రమే నిజమైన ప్రత్యేక మినహాయింపు వర్తిస్తుంది. బాండ్ల విషయంలో ప్రభుత్వం బంగారం ధరలకు అనుసంధానమైన ఒక పేపర్ ఇన్స్ట్రుమెంట్ను జారీ చేస్తుంది. ఇందులో ఫిజికల్ గోల్డ్ కొనుగోలు లేదా దిగుమతి అవసరం ఉండదు. ఇష్యూ సమయంలో కొనుగోలు చేసిన వారు ఎనిమిదేళ్లు హోల్డ్ చేస్తే, 2.5 శాతం వార్షిక వడ్డీతో పాటు మెచ్యూరిటీ సమయంలో ట్యాక్స్ ఫ్రీ లాభాన్ని పొందేవారు. అయితే ఇప్పుడు కొత్త సావరిన్ గోల్డ్ బాండ్ ఇష్యూలు ఆగిపోయాయి. చివరిసారిగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెండు సంవత్సరాల క్రితం కొత్త ట్రాంచ్ను విడుదల చేసింది.ఇప్పుడు చేయాల్సింది ఏమిటి?మీ గోల్డ్ ఈటీఎఫ్లు గోల్డ్ మ్యూచువల్ ఫండ్లు, సావరిన్ గోల్డ్ బాండ్లను కలిపి లెక్కించండి. నగలను లెక్కలోకి తీసుకోకండి. ఎందుకంటే అవి వినియోగానికి ఉద్దేశించినవి. మొత్తం పెట్టుబడుల్లో బంగారం శాతం ఎంత ఉందో చూడండి. అది 5 నుంచి 10 శాతం మధ్యలో ఉంటే ఏమీ చేయాల్సిన అవసరం లేదు. 5 శాతం కంటే తక్కువైతే పోర్ట్ఫోలియో సమతుల్యత కోసం కొంత కొని పెంచుకోవచ్చు.10 శాతం దాటితే కొంత తగ్గించి ఆవచ్చే డబ్బును ఈక్విటీ, డెట్ లేదా క్యాష్ వైపు మార్చడం మంచిది. ఇక్కడ ఒకటి గుర్తుంచుకోండి మార్కెట్ టైమింగ్ వల్ల ఈ పనిచేయడంలేదు. రీబ్యాలెన్సింగ్ మాత్రమే చేస్తున్నాం. బంగారాన్ని ఇన్సూరెన్స్లా చూడండి. ఇన్సూరెన్స్ను ఎవరైనా అవసరం వచ్చినప్పుడు కాదు, ముందుగానే కొనుగోలు చేస్తారు. బంగారంపై పెట్టుబడి కూడా అంతే.. పెరుగుతున్నపుడు కొనడం సరైన పెట్టుబడి విధానం కాదు. ప్రధాని పిలుపు బంగారం వినియోగం కోసం కొనేవారి విషయంలో సరైనదే. ముఖ్యంగా నగలు కొనేవారు దానిని సీరియస్గానే తీసుకోవాలి. ఇప్పటికే 5 నుంచి 10 శాతం సరైన గోల్డ్ అలొకేషన్ కలిగిన పెట్టుబడిదారు తన పోర్ట్ఫోలియోను కదిలించాల్సిన పనిలేదు. మొదటి నుంచి పెట్టుబడి ప్రణాళిక సరైనదైతే ఇప్పుడు చేయాల్సింది దానికి కట్టుబడి ఉండటమే.చరిత్ర ఏం చెబుతోంది?2013లో అమెరికా ఫెడరల్ రిజర్వ్ తమ బాండ్ కొనుగోళ్లను తగ్గిస్తామని సంకేతాలు ఇచ్చింది. దాంతో రూపాయి సహా అనేక ఎమర్జింగ్ మార్కెట్ కరెన్సీలు బలహీనపడ్డాయి. 2020 కరోనా సంక్షోభం, 2022 ఎనర్జీ క్రైసిస్ సమయంలో కూడా ఇదే జరిగింది. ప్రతి సందర్భంలో రూపాయి బలహీనపడగా, ఈక్విటీలు నష్టపోగా, గోల్డ్ ధరలు మాత్రం పెరిగాయి. ఆ సమయంలో కొంత బంగారం కలిగి ఉన్న పోర్ట్ఫోలియోలు మాత్రమే సంక్షోభాన్ని తట్టుకుని నిలబడ్డాయి. ఇక్కడ గమనించాల్సింది ఒకటే బంగారం మిమ్మల్ని ధనవంతులను చేయడానికి కాదు, మీ సంపద పెంచడానికి కాదు మార్కెట్ కష్టకాలంలో మీ ఆందోళన తగ్గించడానికి ఉపయోగపడుతుంది అని.– సాక్షి, వెల్త్ డెస్క్ -
బంగారం ధరలు - ఊహకందని మార్పులు!
బంగారం ధరలు భారీగా పెరుగుతూ.. తగ్గుతూ ఊహకందని మార్పులకు లోనవుతున్నాయి. వారం మధ్యలో పెరిగిన గోల్డ్ రేటు, వారాంతంలో ఒక్కసారిగా పడిపోయాయి. ఈ కథనంలో ఏడు రోజుల్లో పసిడి ధరల్లో జరిగిన మార్పుల గురించి వివరంగా తెలుసుకుందాం.మే 10న (ఆదివారం) హైదరాబాద్, విజయవాడలలో 1,52,350 రూపాయల వద్ద ఉన్న 24 క్యారెట్ల తులం బంగారం ధర, మే 16 నాటికి 1,56,930 రూపాయల వద్దకు చేరింది. ఇక 22 క్యారెట్ల గోల్డ్ రూ.1,39,650 వద్ద నుంచి 1,43,850 రూపాయల వద్దకు చేరింది. దీన్నిబట్టి చూస్తే పసిడి ధర వారం రోజుల్లో ఎంతగా మార్పు చెందాయో స్పష్టంగా అర్థమవుతోంది.చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ఏడురోజుల్లో 1,54,370 రూపాయల నుంచి 1,60,910 రూపాయల వద్దకు చేరింది. 22 క్యారెట్ల రేటు రూ.1,41,500 వద్ద నుంచి రూ.1,47,500 వద్దకు చేరింది. ఈ మార్పు కేవలం వారం రోజులలో జరిగింది.ఇక ఢిల్లీలో కూడా బంగారం ధరలు, వారం రోజుల్లో భారీ పెరుగుదలను నమోదు చేసాయి. మే 10న 1,52,500 రూపాయల వద్ద ఉన్న 24 క్యారెట్ల తులం బంగారం రేటు మే 16నాటికి 1,57,080 రూపాయల వద్దకు చేరింది. 22 క్యారెట్ల ధర రూ.1,39,800 నుంచి 1,44,000 రూపాయల వద్దకు చేరింది.ధరలు పెరుగుదలకు కారణాలుబంగారం ధరలు పెరగడానికి సాధారణంగా అనేక ఆర్థిక, అంతర్జాతీయ కారణాలు ఉంటాయి. బంగారం ఒక సురక్షిత పెట్టుబడిగా భావిస్తారు. కాబట్టి ప్రపంచంలో ఆర్థిక అనిశ్చితి, యుద్ధాలు లేదా రాజకీయ ఉద్రిక్తతలు పెరిగినప్పుడు పెట్టుబడిదారులు షేర్లు, బాండ్లు వంటి రిస్కీ ఆస్తుల నుంచి డబ్బును తీసి బంగారంలో పెట్టడం పెరుగుతుంది. దీంతో డిమాండ్ పెరిగి ధరలు ఎగుస్తాయి.అలాగే అమెరికా డాలర్ విలువ కూడా కీలకం. డాలర్ బలహీనపడితే బంగారం ధరలు సాధారణంగా పెరుగుతాయి, ఎందుకంటే అంతర్జాతీయ మార్కెట్లో బంగారం డాలర్లలోనే ట్రేడ్ అవుతుంది.ద్రవ్యోల్బణం పెరిగినప్పుడు కూడా బంగారం ధరలు పెరుగుతాయి. కరెన్సీ విలువ తగ్గిపోతున్నప్పుడు ప్రజలు తమ సంపదను కాపాడుకోవడానికి బంగారం వైపు మొగ్గుతారు.ఇంకో కారణం వడ్డీ రేట్లు. బ్యాంక్ వడ్డీ రేట్లు తక్కువగా ఉన్నప్పుడు బంగారం ఆకర్షణ పెరుగుతుంది, ఎందుకంటే ఇతర పెట్టుబడుల నుంచి వచ్చే లాభం తగ్గిపోతుంది. అదే విధంగా.. సెంట్రల్ బ్యాంకుల కొనుగోళ్లు, ఆభరణాల డిమాండ్ (వివాహ సీజన్లు, పండుగలు), అలాగే మార్కెట్ స్పెక్యులేషన్ కూడా ధరల పెరుగుదలకు కారణమవుతాయి.ఇదీ చదవండి: కియోసాకి చెప్పిన సక్సెస్ ఫార్ములా ఇదే! -
నమ్మలేని నిజం.. దేశాన్ని కాపాడిన బంగారం!
బంగారం అనేది భారతదేశంలో కేవలం విలువైన లోహం మాత్రమే కాదు,.. అది కుటుంబ గౌరవానికి ప్రతీక, భద్రతకు సంకేతం, కష్టకాలంలో ఆదుకునే నమ్మకమైన ఆస్తిగా పరిగణిస్తారు. అలాంటి బంగారాన్ని.. ప్రభుత్వం రహస్యంగా దేశం దాటించింది అంటే?.. ఎవరైనా నమ్ముతారా?, కానీ 1991లో ఇదే జరిగింది. ఇంతకీ మన దేశం బంగారాన్ని ఎందుకు తరలించాల్సి వచ్చింది?, ఎంత బంగారం పంపింది? అనే విషయాలను ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.1991లో దేశం దివాలా తీసే ప్రమాదం నుంచి తప్పించుకోవడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) బంగారాన్ని బ్రిటన్కు తరలించింది. సుమారు 46,910 కేజీల బంగారాన్ని రహస్యంగా తరలించి.. బదులుగా 405 మిలియన్ డాలర్ల అత్యవసర రుణం సమీకరించింది. భారత ఆర్థిక చరిత్రలో అత్యంత కీలక మలుపుగా నిలిచిన ఈ సంఘటన, తరువాత దేశంలో ఆర్థిక సంస్కరణలకు మార్గం సుగమం చేసింది.రుణాలు ఇవ్వడానికి నిరాకరించిన విదేశీ బ్యాంకులు!1980ల చివరి దశ నుంచి 1990ల ప్రారంభం వరకు భారతదేశం తీవ్రమైన విదేశీ మారకద్రవ్య సంక్షోభాన్ని ఎదుర్కొంది. 1991లో జరిగిన గల్ఫ్ యుద్ధం కారణంగా అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు భారీగా పెరగడంతో దేశ ఆర్థిక పరిస్థితి మరింత దిగజారింది. గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్న భారతీయులు స్వదేశానికి పంపే డబ్బు కూడా గణనీయంగా తగ్గిపోయింది.ఫలితంగా భారతదేశ విదేశీ మారకద్రవ్య నిల్వలు వేగంగా క్షీణించి, 1991 మే నాటికి కేవలం ఒక వారం రోజుల దిగుమతులకు సరిపడే డాలర్లు మాత్రమే మిగిలాయి. ఈ పరిస్థితిని గమనించిన అంతర్జాతీయ రేటింగ్ సంస్థలు భారత క్రెడిట్ రేటింగ్ను తగ్గించేశాయి. దీంతో విదేశీ బ్యాంకులు భారత్కు కొత్త రుణాలు ఇవ్వడానికి నిరాకరించాయి. దేశం తీవ్రమైన ఆర్థిక సంక్షోభ అంచుకు చేరుకుంది.సాహసోపేతమైన నిర్ణయం!దేశం ఆర్ధిక సంక్షోభంలో చిక్కున్న సమయంలో.. అప్పటి తాత్కాలిక ప్రధానమంత్రి చంద్రశేఖర్ ప్రభుత్వం, ఆర్బీఐ గవర్నర్ ఎస్. వెంకటరమణన్ నాయకత్వంలో సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. దేశ ప్రతిష్ట కంటే ముందు ఆర్థికంగా దివాలా తీయకుండా ఉండటం అవసరమని భావించిన ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ వద్ద ఉన్న బంగారు నిల్వలను తాకట్టు పెట్టాలని నిర్ణయించింది. ఈ ప్రక్రియను రెండు దశల్లో అమలు చేశారు.మొదటి దశలో.. 1991 మే నెలలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా 20 టన్నుల స్వాధీనం చేసిన బంగారాన్ని స్విట్జర్లాండ్లోని ఒక బ్యాంకులో తాకట్టు పెట్టి సుమారు 215 మిలియన్ డాలర్ల విదేశీ మారకద్రవ్యాన్ని సమీకరించారు. అయినప్పటికీ పరిస్థితి పూర్తిగా అదుపులోకి రాకపోవడంతో.. రెండో దశలో 1991 జూలైలో ఆర్బీఐ తన సొంత నిల్వల నుంచి 46.91 టన్నుల బంగారాన్ని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్కు రహస్యంగా తరలించి అత్యవసర రుణాన్ని పొందింది.రహస్యంగా తరలింపు!1991 జూలై 4న బంగారం రవాణా విమానం ముంబైలోని శాంతాక్రూజ్ విమానాశ్రయం నుంచి రహస్యంగా బయలుదేరింది. ఆర్బీఐ భద్రగారాల నుంచి ప్రత్యేక భద్రత మధ్య భారీ ట్రక్కులలో బంగారాన్ని విమానాశ్రయానికి తరలించారు. ఈ ఆపరేషన్ను అత్యంత గోప్యంగా నిర్వహించేందుకు కస్టమ్స్ నిబంధనల్లో కూడా ప్రత్యేక మినహాయింపులు పొందారు.సాయుధ భద్రతా బలగాల పర్యవేక్షణలో బంగారాన్ని కార్గో విమానాల్లో ఎక్కించి విదేశాలకు పంపించారు. అయితే ఈ రహస్య ఆపరేషన్ ఎక్కువకాలం దాచిపెట్టలేకపోయారు. 1991 జూలై 8న ‘ది ఇండియన్ ఎక్స్ప్రెస్’లో జర్నలిస్ట్ శంకర్ అయ్యర్ ఈ వార్తను ప్రధాన శీర్షికగా ప్రచురించడంతో దేశవ్యాప్తంగా సంచలనం రేగింది. భారతదేశం తన బంగారాన్ని విదేశాలకు పంపాల్సిన పరిస్థితి వచ్చిందన్న విషయం ప్రజలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.ఆ నిర్ణయం.. ఆర్థిక వ్యవస్థకు కొత్త దిశ!ఆ సమయంలో దేశాన్ని ఆర్థిక పతనం నుంచి కాపాడిన ఈ కఠిన నిర్ణయం, తరువాత భారత ఆర్థిక వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు పునాది వేసింది. అనంతరం అధికారంలోకి వచ్చిన పి.వి. నరసింహారావు ప్రభుత్వం, ఆర్థిక మంత్రి మన్మోహన్ సింగ్ నేతృత్వంలో దేశ ఆర్థిక వ్యవస్థను సరళీకృతం చేస్తూ చారిత్రాత్మక ఆర్థిక సంస్కరణలను అమలు చేసింది. విదేశీ పెట్టుబడులకు అనుమతులు ఇవ్వడం, మార్కెట్ ఆధారిత విధానాలను ప్రవేశపెట్టడం వంటి చర్యలతో భారత ఆర్థిక వ్యవస్థకు కొత్త దిశ లభించింది.బంగారాన్ని విదేశాలకు పంపాల్సి రావడం అప్పట్లో చాలామందికి అవమానంగా అనిపించినప్పటికీ, ఆ నిర్ణయం తీసుకోకపోతే భారత్ అంతర్జాతీయ అప్పులు చెల్లించలేని పరిస్థితికి చేరుకునేదని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడ్డారు. ఆ రోజున చేపట్టిన ఆ రహస్య గోల్డ్ ఆపరేషన్నే.. నేటి భారత ఆర్థిక పురోగతికి కీలక మలుపు అని చెబుతున్నారు.మోదీ పిలుపు1991లో గల్ఫ్ యుద్ధం కారణంగా భారతదేశం తీవ్రమైన విదేశీ మారకద్రవ్య సంక్షోభాన్ని ఎదుర్కొన్నట్లే, ప్రస్తుతం 2026లో మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న అమెరికా-ఇజ్రాయెల్-ఇరాన్ ఉద్రిక్తతలు మళ్లీ చమురు ధరలను పెంచుతూ భారత ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి పెంచుతున్నాయి. 2025-26 ఆర్థిక సంవత్సరంలో భారత్ సుమారు 72 బిలియన్ డాలర్ల విలువైన బంగారాన్ని దిగుమతి చేసుకోవడం విదేశీ మారకద్రవ్యంపై మరింత భారం మోపుతోంది.ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ.. ప్రజలను ఉద్దేశించి అనవసరంగా బంగారం కొనుగోలు చేయవద్దని, ఇంధన వినియోగంలో పొదుపు పాటించాలని పిలుపునిచ్చారు. కాబట్టి దేశ పౌరులు కూడా.. 1991 నాటి సంఘటన గుర్తు చేసుకుంటూ, నేటి తరం ఆర్థిక క్రమశిక్షణతో వ్యవహరిస్తేనే దేశ భవిష్యత్తు బాగుంటుందని నిపుణులు సూచిస్తున్నారు.ఇదీ చదవండి: డబ్బును ఎలా కాపాడుకోవాలి?: కియోసాకి సలహా -
నష్టాల్లో గోల్డ్ మార్కెట్.. భారీగా తగనున్న బంగారం ధరలు..?
-
కరుగుతోన్న బంగారు కొండ.. దిగొస్తున్న ధరలు
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. -
ఒక చీకటి సందర్భం.. పాఠాలు నేర్పిన 1991 సంక్షోభం
-
రూ.4400 తగ్గిన గోల్డ్ రేటు.. కొత్త ధరలు ఇలా!
గురువారం ఉదయం రూ.2240 తగ్గిన పసిడి ధర, సాయంత్రానికి రూ.4420 తగ్గింది. దీంతో బంగారం రేటు ఒక్కరోజులోనే గణనీయంగా తగ్గింది. ఈ కథనంలో గోల్డ్ లేటెస్ట్ ధరలు ఎలా ఉన్నాయో వివరంగా తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడలలో ఈ రోజు (మే 15) ఉదయం 2050 రూపాయలు తగ్గిన 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర, సాయంత్రానికి 4050 రూపాయలు తగ్గింది. 24 క్యారెట్ల ధర ఉదయం 2240 రూపాయలు తగ్గింది. సాయంత్రానికి మరో రూ.2180 (మొత్తం రూ.4420 తగ్గింది) తగ్గింది. దీన్నిబట్టి చూస్తే గంటల వ్యవధిలోనే పసిడి ధర భారీ పతనం చవిచూసిందని స్పష్టంగా అర్థమవుతోంది.ఇక ఢిల్లీలో కూడా బంగారం ధరల్లో భారీ మార్పు కనిపించింది. ఇక్కడ 22 క్యారెట్ల తులం పసిడి ధర రూ.4,050 తగ్గి రూ.1,44,900 వద్ద నిలిచింది. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.4200 తగ్గి 1,58,060 రూపాయల వద్ద నిలిచింది.చెన్నైలో కూడా బంగారం ధరల్లో మార్పు కనిపించింది. ఇక్కడ 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,47,650 (2850 రూపాయలు తగ్గింది). 24 క్యారెట్ల ధర రూ.3100 తగ్గి 1,61,080 రూపాయల వద్దకు చేరింది. అయితే వెండి ధరల్లో సాయంత్రానికి చెప్పుకోదగ్గ మార్పులు జరగలేదు. కాబట్టి సిల్వర్ రేటు ఉదయం ఎలా ఉందో.. అలాగే ఉంది.మొత్తం మీద.. వరుసగా పెరుగుతూ వచ్చిన గోల్డ్ రేటుకు బ్రేకులు పడినట్లు అనిపిస్తోంది. దీంతో ఒక్కసారిగా భారీ ధరల తగ్గుదల నమోదైంది. అయితే.. రానున్న రోజుల్లో బంగారం ధర పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. దీనికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.ఇదీ చదవండి: డబ్బును ఎలా కాపాడుకోవాలి?: కియోసాకి సలహా -
మోదీ చెప్పినా వినట్లేదు.. బంగారం కొనేందుకు ఎగబడుతున్న జనం..
-
కేంద్రం మరో కీలక నిర్ణయం పైపైకి బంగారం ధరలు..!
-
డబ్బును ఎలా కాపాడుకోవాలి?: కియోసాకి సలహా
పశ్చిమాసియా యుద్ధం.. ప్రపంచంలోని చాలా దేశాలపైన ప్రభావం చూపుతోంది. ఇప్పటికే చమురు ధరలు భారీగా పెరిగాయి. రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి సమయంలో రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ప్రపంచ ఆర్థిక పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. ద్రవ్యోల్బణం సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. డబ్బు విలువ తగ్గితే.. భవిష్యత్తులో ఆర్థిక భద్రత ప్రమాదంలో పడుతుంది. ఈ పరిస్థితికి రెండు ప్రధాన కారణాలు ఉన్నాయి.మొదటిది, ఇరాన్ ప్రాంతంలో యుద్ధ పరిస్థితులు పెరగడం వల్ల చమురు ధరలు పెరుగుతున్నాయి. చమురు ధరలు పెరిగితే రవాణా ఖర్చులు, ఉత్పత్తి ఖర్చులు, ఆహార పదార్థాల ధరలు అన్నీ పెరుగుతాయి. ఫలితంగా ప్రతి వస్తువు ఖరీదవుతుంది. ఈ పరిస్థితినే ద్రవ్యోల్బణం అంటారు. ద్రవ్యోల్బణం పెరిగితే నగదు విలువ తగ్గిపోతుంది.ఇక రెండో కారణం.. దేశాలపై పెరుగుతున్న జాతీయ అప్పులు. ప్రభుత్వాలు భారీ అప్పులు తీసుకున్నప్పుడు వాటిని తీర్చడానికి మరింత కరెన్సీ ముద్రించాల్సి వస్తుంది. ఎక్కువ డబ్బు మార్కెట్లోకి వస్తే కరెన్సీ విలువ తగ్గుతుంది. అందుకే.. కియోసాకి ప్రభుత్వం ముద్రించే డబ్బును ఫేక్ మనీ అంటారు.TAKE ACTION: 2 reasons why inflation will steal your money1: As long as the war in Iran rising oil prices will cause inflation and your fist money to decline in purchasing power.2: Nation Debt will cause governments to print more fake money.Please protect your self,…— Robert Kiyosaki (@theRealKiyosaki) May 13, 2026డబ్బును కాపాడుకోవాలంటే.. ప్రతివ్యక్తి భవిష్యత్తు గురించి ఆలోచించాలి. కాబట్టి బంగారం, వెండి, బిట్కాయిన్, ఇథేరియం వంటివాటితో పెట్టుబడి పెట్టడం ఉత్తమం. ఇవి కష్టకాలంలో మిమ్మల్ని ఆర్ధిక ఇబ్బందుల నుంచి బయటపడేయగలవు. బంగారం, వెండి వంటి విలువ కొన్నేళ్లుగా పెరుగుతూనే ఉంది. రాబోయే రోజుల్లో వీటి ధరలు మరిం త పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.ఇదీ చదవండి: బంగారం కొనుగోలుపై.. 1967లో ఇదే జరిగిందా?గోల్డ్, సిల్వర్ వంటివి కొనుగోలు చేయడానికి నా దగ్గర డబ్బు లేదు, అని చాలామంది అనుకుంటారు. కానీ భవిష్యత్తు గురించి ఆలోచించినవాళ్లు మాత్రం.. బంగారం ఎలా కొనాలి?, అని ఆలోచిస్తారు. ఈ ఆలోచన మనిషిలో కొత్త అవకాశాలను వెతకడానికి ప్రేరణ ఇస్తుంది. ధనవంతుల ఆలోచన సమస్యలపై కాకుండా పరిష్కారాలపై ఉంటుందని కియోసాకి స్పష్టం చేశారు. -
ఒక్క రోజులోనే రూ.15వేలు, భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు
-
దిమ్మతిరిగేలా షాకిచ్చిన బంగారం ధర.. కొనాలా? వద్దా?
-
బంగారమా.. ఈరోజు కొంటామా? తెలుగు రాష్ట్రాల్లో ధరలు..
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. -
వామ్మో.. అసలు బంగారం కొనగలమా..?
-
కొనుగోలుదారులకు బిగ్ షాక్... బంగారం, వెండిపై దిగుమతి సుంకం 15 శాతానికి పెంపు
-
బంగారానికి ఇక దుబాయే దిక్కు!
స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కారణంగా దుబాయ్ నుంచి పసిడి, వెండి దిగుమతులు పెరిగే అవకాశం ఉందని గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనీషియేటివ్ సంస్థ (జీటీఆర్ఐ) తెలిపింది. 2022లో 120 టన్నులతో మొదలైన కోటా 2027లో 200 టన్నులకు పెరగనుంది. ఇది భారత్ పసిడి దిగుమతుల్లో నాలుగో వంతుకు సమానం. కొత్త ఎంఎఫ్ఎన్ టారిఫ్ 15 శాతంగా ఉండగా, దుబాయ్ నుంచి దిగుమతులకి 14 శాతానికి పరిమితమవుతుందని జీటీఆర్ఐ పేర్కొంది. ఒక్క శాతం వ్యత్యాసం ప్రయోజనం పొందేందుకు దుబాయ్ మార్గం ద్వారా వ్యాపారులు పసిడిని మరింతగా దిగుమతి చేసుకునే అవకాశం ఉందని వివరించింది. సుంకాలు ఇలా .. 2012కి ముందు విలువతో సంబంధం లేకుండా 10 గ్రాములకు రూ. 300 చొప్పున సుంకం ఉండేది. 2012 జనవరిలో బంగారం విలువలో 2 శాతం కస్టమ్స్ సుంకం విధించారు. అదే ఏడాది మార్చిలో బడ్జెట్లో 4 శాతానికి పెంచారు. 2013లో రుపాయి మారకం, విదేశీ మారకం నిల్వలు పడిపోయిన కారణాలతో పసిడిపై దిగుమతి సుంకాలు మూడు సార్లు పెరిగాయి. మొదట 4 నుంచి 6 శాతానికి, తర్వాత 8 శాతానికి, ఆ పైన 10 శాతానికి పెరిగాయి. 2014–18 మధ్యకాలంలో 10 శాతమే అమల్లో ఉండగా, 2019లో దాన్ని 12.5 శాతానికి పెంచారు. 2021 బడ్జెట్లో 10.75 శాతానికి తగ్గించి, మళ్లీ 2022లో 15 శాతానికి పెంచారు. 2024లో దేశీయంగా పరిశ్రమలను ప్రోత్సహించేందుకు 6 శాతానికి తగ్గించారు. ప్రత్యామ్నాయాల్లేవా..?2014లో మోదీ ఆధ్వర్యంలో కేంద్రంలో బీజేపీ సర్కారు కొలువైన తర్వాత భౌతిక రూపంలో పసిడి దిగుమతులు తగ్గించేందుకు కొన్ని ప్రయత్నాలు చేసింది అవేంటంటే..ప్రభుత్వ గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ 2015లో కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రకటించింది. ఇళ్లలో ఉన్న నిరుపయోగ బంగారాన్ని వినియోగంలోకి తీసుకురావాలన్నది ఈ పథకం లక్ష్యం. భౌతిక రూపంలో ఉన్న బంగారాన్ని బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తే, ఆ విలువపై 2.25–2.5 శాతం రాబడిని ఆఫర్ చేశారు. భౌతిక బంగారంపై భారతీయులకు ఉన్న మక్కువ వల్ల ఆశించిన స్పందన రాలేదు. దీంతో 2025లో ఈ పథకాన్ని నిలిపివేశారు. సావరిన్ గోల్డ్ బాండ్ (ఎస్జీబీ) భౌతిక బంగారం కొనుగోళ్లను తగ్గించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం 2015లో సార్వభౌమ బంగారం బాండ్లకు శ్రీకారం చుట్టింది. 8 ఏళ్ల కాలవ్యవధి. బాండ్ కొనుగోలు ధరపై ఏటా 2.5 శాతం వడ్డీ ఎనిమిదేళ్ల పాటు రాబడిగా అందుతుంది. దీంతో ఈ పథకం విజయవంతమైంది. 8 ఏళ్ల కాలవ్యవధి తర్వాత నుంచి బాండ్లు క్రమంగా మెచ్యూరిటీకి రావడం.. ఈ కాలంలో పసిడి ధరలు గణనీయంగా పెరిగిపోవడంతో ప్రభుత్వంపై చెల్లింపుల భారం భారీగా పెగిపోయింది. పెట్టుబడిపై 150–200 శాతం అధికంగా చెల్లించాల్సి వచి్చంది. దీంతో 2025 నుంచి అనధికారికంగా ఈ పథకానికీ ప్రభుత్వం గుడ్బై చెప్పింది. ఈటీఎఫ్లు బంగారం, వెండి ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్లు), డిజిటల్ గోల్డ్ తదితర డిజిటల్ సాధనాల్లోనూ పెట్టుబడులు గణనీయంగా పెరుగుతున్నాయి. కానీ, కొనుగోలు విలువకు సరిపడా భౌతిక లోహాలను ఫండ్స్ సంస్థలు సమకూర్చుకుని ఖజానాల్లో భద్రపరచాల్సి ఉంటుంది. కనుక ఒక రకంగా భౌతికంగా ఆ మేరకు కొనుగోలు చేయాల్సిందే. కానీ, ఇక్కడ గమనించాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి. ఒకవేళ మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు దేశీయంగా ఇప్పటికే అందుబాటులో ఉన్న బంగారాన్ని బ్యాకెండ్గా వినియోగించుకుంటే విదేశాల నుంచి అదనంగా దిగుమతి చేసుకోవాల్సిన అవసరం ఉండదు. బంగారం, వెండి డిజిటల్ రూపంలో ఉంటే కావాల్సినప్పడు విక్రయించి, కొనుగోలు చేసుకుంటూ ఉంటారు. దీంతో చలామణి పెరుగుతుంది. పసిడిపై సుంకాల విధింపు దేశీయంగా గోల్డ్, సిల్వర్ ఈటీఎఫ్లకి సానుకూలంగా ఉంటుందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. -
గోల్డ్ స్మగ్లింగ్ ఇంకా పెరుగుతుందేమో!!
సాక్షి, బిజినెస్ డెస్క్: పసిడి, వెండిపై సుంకాల మోతతో ఆభరణాల మార్కెట్ గందరగోళంలో పడింది. దిగుమతులు తగ్గి విదేశీ మారకం నిల్వలను నిలబెట్టుకునేందుకు, తద్వారా రూపాయి విలువ పడిపోకుండా చూసుకునేందుకు ఇది దోహదపడనుంది. అలాగే, కొత్త కొనుగోళ్ల కోసం దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి లేకుండా పాత వాటిని కొత్త వాటికి మార్చుకునేలా ప్రోత్సహించడం ద్వారా రీసైక్లింగ్కి ఊతమివ్వనుంది.అయితే, అదే సమయంలో స్మగ్లింగ్ రిస్కులు పెరుగుతాయని, ఆభరణాల వ్యాపారాలపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తమవుతోంది. పసిడి, వెండి దిగుమతులపై సుంకాల మోత పలు సమస్యలకు దారి తీస్తుందని పరిశ్రమవర్గాలు భావిస్తున్నాయి. దీనితో వజ్రాభరణాల పరిశ్రమ మరింత గడ్డుకాలం ఎదుర్కొనాల్సి వస్తుందని ఎగుమతిదార్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్మగ్లింగ్, బ్లాక్ మార్కెటింగ్ రిస్కులు పెరిగిపోతాయని హెచ్చరిస్తున్నారు.పరిశ్రమకు వెన్నెముకలాంటి లఘు, చిన్న, మధ్యతరహా తయారీదార్లు ఇప్పటికే నిధుల కొరత ఎదుర్కొంటూ ఉండగా, తాజా పరిణామం అశనిపాతంలా మారుతుందన్నారు. దిగుమతి సుంకాలను పెంచడం వల్ల సాధారణంగానే ధరలు పెరుగుతాయని, కాకపోతే కొనుగోళ్లను తగ్గించడానికి ఉపయోగపడకపోవచ్చని పేర్కొన్నారు. ఇటీవలి కాలంలో పసిడి రేట్లు రెట్టింపైనప్పటికీ దిగుమతులు అదే నిష్పత్తిలో తగ్గకపోవడమే ఇందుకు నిదర్శనమని చెప్పారు. ఈ నేపథ్యంలో సుంకాల పెంపులాంటి చర్యల వల్ల స్మగ్లింగ్కి ఊతం లభిస్తుందని, ఎగుమతి వ్యయాలు పెరిగిపోతాయని ఎగుమతిదార్లు తెలిపారు.‘పొదుపు చర్యలు, బులియన్ దిగుమతులపై సుంకాల పెంపు వల్ల వ్యాపారం మరింత కష్టతరం అవుతుంది. గ్రే మార్కెట్, స్మగ్లింగ్ పెరిగి, ఎకానమీలో సమాంతర వ్యవస్థ ఏర్పాటుకు దారి తీసే ముప్పు ఉందని పరిశ్రమ ఆందోళన చెందుతోంది’ అని అఖిల భారత రత్నాభరణాల మండలి (జీజేసీ) చైర్మన్ రాజేష్ రోక్డే తెలిపారు. కస్టమ్స్ సుంకం, జీఎస్టీ, వ్యవసాయ సెస్సులన్నీ కలగలిసిన దిగుమతి సుంకాల పెంపుతో 10 గ్రాముల బంగారం ధర ఏకంగా రూ. 27,000 మేర భారం అవుతుందని చెప్పారు. సుంకాలను పెంచడం వల్ల బంగారం రేట్లు మరింత పెరగడం తప్ప దిగుమతులకు అడ్డుకట్ట పడటం చాలా అరుదని రత్నాభరణాల ఎగుమతుల ప్రోత్సాహక మండలి (జీజేఈపీసీ) చైర్మన్ కిరీట్ భన్సాలీ వ్యాఖ్యానించారు. రీసైక్లింగ్కి దన్ను.. పసిడి దిగుమతి సుంకాల పెంపుతో స్వల్పకాలికంగా ఆభరణాల విక్రయ పరిమాణం తగ్గుతుందని జ్యుయలర్లు తెలిపారు. అయితే, డిమాండ్ స్థిరంగానే ఉండొచ్చని వివరించారు. భౌగోళిక రాజకీయ అనిశ్చితులు, భారీ క్రూడాయిల్ ధరలు, పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గే వరకు పెంచిన సుంకాలు ఏడాది పాటు కొనసాగే అవకాశం ఉందని సెన్కో గోల్డ్ అండ్ డైమండ్స్ ఎండీ, సీఈవో సువంకర్ సేన్ చెప్పారు. పరిమాణంపరంగా 10–15% ప్రభావం పడినప్పటికీ, విలువపరంగా లావాదేవీలు అధిక స్థాయిలోనే ఉంటాయన్నారు.వినియోగదారులు తేలికపాటి ఆభరణాలను కొనేందుకు మొగ్గు చూపొచ్చన్నారు. మరో వైపు, సంస్కృతి, పెట్టుబడులపరంగా బంగారానికి ప్రాధాన్యత ఉన్న నేపథ్యంలో పెళ్లిళ్లు, పండుగల సందర్భంగా కొత్తగా కొనుగోలు చేసే వారి కారణంగా పసిడికి డిమాండ్ కొనసాగుతుందని తెలిపారు. సుంకాల పెంపు వల్ల గోల్డ్ రీసైక్లింగ్ పెరుగుతుందన్నారు. ప్రధాని పిలుపుతో ‘నేషన్ ఫస్ట్ గోల్డ్4 ఇండియా’ కార్యక్రమాన్నిఆవిష్క రించినట్లు కల్యాణ్ జ్యుయలర్స్ ఎండీ కల్యాణరామన్ తెలిపారు. -
మోదీ కామెంట్స్ వేళ బంగారం వ్యాపారులు ఏం చేస్తున్నారంటే?
పాత బంగారం మార్పిడి పథకాలపై నగల వ్యాపారులు దృష్టి సారించారు. భారత్లో విదేశీ మారక నిల్వలను పొదుపు చేసుకోవడానికి బంగారం కొనుగోళ్లను ఏడాది పాటు తగ్గించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజలకు చేసిన విజ్ఞప్తి విషయం తెలిసిందే. దీంతో ఆభరణాల రంగం బంగారం రీసైక్లింగ్, మార్పిడి పథకాల వైపు అడుగులు వేస్తోంది. డిమాండ్ను పూర్తిగా తగ్గించే బదులు ప్రత్యామ్నాయ మార్గాలపై సంస్థలు దృష్టి పెడుతున్నాయి.“దిగుమతి సుంకం సవరణ అనేది అతిపెద్ద విధాన మార్పు. ఇది సరఫరా వ్యవస్థ మొత్తం ఖర్చులను పెంచుతుంది. కానీ వినియోగదారులు బంగారాన్ని ఎలా వినియోగించాలో మళ్లీ ఆలోచించే అవకాశాన్ని కూడా ఇది ఇస్తోంది. పాత బంగారం తీసుకొచ్చి కొత్త నగలతో మార్చుకోవాలని మా వినియోగదారులను బలంగా ప్రోత్సహిస్తున్నాం’’అని వ్యాపారులు చెబుతున్నారు. పెరుగుతున్న ధరల ప్రభావాన్ని తగ్గించుకుంటూ కొత్త డిజైన్లు పొందేందుకు ఇది ఉత్తమ మార్గాల్లో ఒకటని అంటున్నారు.పాత బంగారం మార్పిడిలో ఆఫర్లు తనిష్క్ సంస్థ తన పాత బంగారం మార్పిడి కార్యక్రమాన్ని #ఓల్డ్గోల్డ్న్యూఇండియా ప్రచారంతో పెంచుకుంది. కల్యాణ్ జ్యువెలర్స్ కూడా ఇటీవల ‘నేషన్ ఫస్ట్ - గోల్డ్4ఇండియా ఇనిషియేటివ్’ పేరుతో కార్యక్రమం ప్రారంభించింది. పాత బంగారం మార్పిడి, తక్కువ బరువు ఉన్న 18 క్యారెట్ నగల వినియోగం, గోల్డ్ మానిటైజేషన్ పథకాలు, బంగారం పునర్వినియోగ కార్యక్రమాలపై సంస్థ దృష్టి పెట్టింది.ఈ కార్యక్రమంలో భాగంగా సంస్థకు చెందిన 342 దుకాణాల్లో వినియోగదారులు వాడని, పాడైన, పాత నమూనాల నగలను మార్చుకునేలా ప్రోత్సహిస్తారు. దీంతో కొత్తగా దిగుమతి చేసుకోవాల్సిన బంగారం అవసరం తగ్గుతుంది.ఇటీవల ప్రభుత్వం బంగారం దిగుమతి సుంకాన్ని 6 శాతం నుంచి 15 శాతానికి పెంచుతూ తీసుకున్న నిర్ణయం దిగుమతి ఖర్చులు, ప్రస్తుత ఖాతా లోటు, బంగారం ధరల పెరుగుదలపై ఆందోళనలు మరింత పెంచింది. ప్రస్తుత ఖాతా లోటు అంటే.. విదేశాలకు చెల్లింపులు, విదేశాల నుంచి వచ్చే ఆదాయం మధ్య తేడా వల్ల ఏర్పడే లోటు. భారత్ దిగుమతి బంగారంపై ఎక్కువగా ఆధారపడటంతో, కొత్తగా కొనుగోలు చేయడానికి బదులు ఇళ్లలో వాడని బంగారాన్ని కొత్త నగలుగా మార్చుకోవాలని వ్యాపారులు వినియోగదారులకు సూచిస్తున్నారు.మార్కెట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం అధిక సుంకం తాత్కాలికంగా బంగారం కొనుగోళ్లపై ప్రభావం చూపొచ్చు. కానీ, ఆర్థిక స్థిరత్వానికి మద్దతు ఇవ్వొచ్చు. “భారత్లో బంగారం దిగుమతి సుంకం పెంపు స్థానిక ధరలను పెంచి, కొంతకాలం కొనుగోళ్లు తగ్గించే అవకాశం ఉంది. కానీ పెట్టుబడిదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రపంచ అనిశ్చితి, దేశీయ కరెన్సీ ఒత్తిళ్ల సమయంలో బంగారం సురక్షిత పెట్టుబడిగానే కొనసాగుతుంది” అని నిపుణులు తెలిపారు.గతంలో దిగుమతి సుంకం 15 శాతం ఉన్నప్పుడు కనిపించినట్లే.. అక్రమ రవాణా మళ్లీ పెరిగే అవకాశం ఉందని, అదే సమయంలో దిగుమతి బిల్లు తగ్గి విదేశీ మారక నిల్వలకు తాత్కాలిక మద్దతు లభించొచ్చని చెబుతున్నారు.భారత్ మొత్తం దిగుమతి బిల్లులో బంగారం వాటా దాదాపు 9-10 శాతం ఉండటంతో, కొత్త దిగుమతుల బదులు దేశంలో ఇప్పటికే ఉన్న బంగారాన్ని పునర్వినియోగం చేయడం, మానిటైజేషన్పై దృష్టి పెట్టడం ద్వారా ప్రభుత్వ లక్ష్యాలకు ఆభరణాల రంగం అనుగుణంగా ముందుకు సాగుతోంది.“భారత్లో ఇళ్లలో దాదాపు 25,000 టన్నుల వాడని బంగారం ఉందని అంచనా. అందులో కొంత భాగాన్నైనా నమ్మకమైన మానిటైజేషన్ వ్యవస్థ ద్వారా వినియోగంలోకి తీసుకొస్తే దిగుమతులపై ఆధారపడటం తగ్గి విదేశీ మారక నిల్వలపై ఒత్తిడి తగ్గుతుంది” అని నిపుణులు తెలిపారు. -
వామ్మో బంగారం కొనలేం.. 2 లక్షలకు పెరిగే చాన్స్
-
మోదీ వ్యాఖ్యలపై గోల్డ్ షాప్ ఓనర్స్ రియాక్షన్
-
మీ ఇంట్లో ఉన్న బంగారానికి వడ్డీ.. మోదీ సర్కార్ మాస్టర్ ప్లాన్?
న్యూఢిల్లీ: పసిడి ప్రియులకు కేంద్రం శుభవార్త. దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేలా త్వరలో కేంద్రం కొత్త ‘గోల్డ్ మానిటైజేషన్’ పాలసీని అందుబాటులోకి తేనుంది. తద్వారా ఇంట్లో ఉన్న బంగారంతో వడ్డీ వచ్చేలా ప్రతిపాదించనుంది. వినియోగదారులు వారి వద్ద ఉన్న కనీసం 10 గ్రాముల బంగారం ఉంటే బ్యాంకులో డిపాజిట్ చేయొచ్చు. డిపాజిట్ చేసిన బంగారంపై వార్షిక వడ్డీ రేటు సుమారు 2శాతం నుంచి 2.5శాతం వరకు పొందవచ్చు. భారతీయుల వద్ద సుమారు 30,000 టన్నుల బంగారం నిల్వగా ఉందని అంచనా. దీన్ని వెలికితీసేందుకు ప్రధాని మోదీ సర్కార్ మాస్టర్ ప్లాన్ వేసింది. రూపాయి విలువను బలోపేతం చేయడానికి బంగారం దిగుమతులను తగ్గించే ప్రయత్నాల్లో ప్రభుత్వం ఉందని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.మోదీ ప్రభుత్వం తీసుకురానున్న ఈ గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్లో డిపాజిట్ చేసిన బంగారంపై వడ్డీతో పాటు పన్ను మినహాయింపులు పొందే అవకాశం ఉంటుంది. సుమారు 2,000 టన్నుల బంగారం డిపాజిట్ అయితే, మూడేళ్ల వరకు దిగుమతుల అవసరం ఉండదని అంచనా. గోల్డ్ పాలసీలో కీలక మార్పులకు ఆర్థిక శాఖ సిద్ధమవుతోంది. ఈ కొత్త గోల్డ్ మానిటైజేషన్ పాలసీపై కేంద్ర ఆర్థిక శాఖ త్వరలో స్పష్టత ఇవ్వనుంది. -
బంగారం బ్లాస్ట్.. ఒక్కరోజే 13 వేలకు పైగా..
-
ఎవరీ లారెన్ వాసర్..? ఆ వ్యాధే ఆమెను సన్సేషన్గా మార్చింది..
మెట్గాలా 2026లో ఎందరో ట్రెండ్ సెట్టింగ్, రికార్డ్ మేకింగ్ లుక్స్ని అందించారు. చాలామంది వివిధ రకాల ఫ్యాషన్ వేర్లతో సందడి చేశారు. ఎందరో సెలబ్రిటీలు, ప్రముఖులు ధరించిన యాక్సెసరీలు, కళాత్మక డిజైనర్ వేర్లు చర్చనీయాంశంగా మారాయి. వారిలో ఒక మహిళ మాత్రం అందర్నీ ఆకర్షించేలా సన్సేషన్గా మారింది. ఈ అమ్మాయి లుక్ని చూడగానే టాలీవుడ్ మూవీ మురారీలోని "బంగారు కళ్ల బుచ్చెమ్మో చెంగావి చెంప లచ్చమ్మో" అనే పాట ఠక్కున గుర్తుస్తోంది. అయితే ఆమె కథ తెలిస్తే మాత్ర కన్నీళ్లు జలజల వచ్చేస్తాయ్. ఆ బాధను దిగమింగి అజేయంగా నిలబడి ఎదగాలన్న ఆమె తపన చూస్తే స్థైర్యం అంటే ఇది కదా అనిపిస్తుంది. చిన్నచిన్న సమస్యలకే సతమతమై ప్రాణాలకు తీసుకునే యవతకు ఆమె కథ ఓ స్ఫూర్తి.ఆ ధీర మహిళే అమెరికన్ మోడల్ లారెన్ వాసర్. ఆమె మే4న న్యూయార్క్ నగరంలోని మెట్ గాలా మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్లో బంగారు రంగు ప్రబల్ గురుంగ్ సూట్ ధరించి వచ్చింది. ఇందులో పెద్ద సన్సేషన్ ఏముంది అనుకోకండి. ఆమె ఈ వేడుకలో నిజమైన బంగారు కృత్రిమ కాళ్లతో వచ్చింది. అందరు ఈ వేడుకలో ఆర్టిఫిషయల్ యాక్సెసరీలతో రెడ్కార్పెట్పైకి రాగా ఆమె మాత్రం నిజమైన "బంగారు కాళ్ల"తో వచ్చి అందరి దృష్టిని అమితంగా ఆకర్షించింది. పైగా అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అయ్యాయి కూడా. అంతేగాదు దీని కారణంగానే లారెన్కు "బంగారు కాళ్ల అమ్మాయి" ముద్దు పేరు కూడా వచ్చింది.లారెన్ వాసర్ ఎవరు?లారెన్ వాసర్ అమెరికాలో ప్రసిద్ధిగాంచిన మోడల్. 38 ఏళ్ల లారెన్ వోగ్, గ్లామర్ అండ్ హార్పర్ బజార్ వంటి ఫ్యాషన్ పత్రికల ముఖచిత్రంగా ఫోజులిచ్చింది కూడా. అంతేగాదు 2017లో ఫోర్బ్స్ అండర్ 30 పురస్కార గ్రహీతగా కూడా ఎంపికైంది అలాగే 2023లో గ్లామర్ జర్మనీ ఉమెన్ ఆఫ్ ది ఇయర్గా కూడా నిలిచారామె. 2023లో 'ది డైరీ ఆఫ్ ఎ సీఈఓ' పాడ్కాస్ట్లో మాట్లాడుతూ..లారెన్ తన కథను పంచుకోవడంతో ఆమె గురించి ప్రపంచానికి తెలిసింది. సడెన్గా ఒక రోజు నిద్రలోనే కోమాలోకి వెళ్లి మృత్యువు అంచులదాక వెళ్లింది. సకాలంలో ఆమె కుటుంబ సభ్యులు చూడకపోతే లారెన్ ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయుండేవి. ఏం జరిగిందో తెలియదు. లారెన్ గదిలోకి వచ్చేప్పటికీ అపస్మారక స్థితలో బెడ్పై పడి ఉంది. వెంటనే కుటుంబ సభ్యులు హుటాహుటినా ఆస్పత్రికి తరలించగా...అక్కడ ఆమె బతికే అవకాశాలు చాల తక్కువని తేల్చేశారు వైద్యులు. పాదాలు నల్లగా మారిపోవడం వంటి ఆకస్మిక మార్పులన్నీ లారెన్స్ శరీరంలో చూస్తుండగానే చోటుచేసుకోవడం మొదలైంది. ఆమె పాదాలు నల్లగా అయిపోవడం ప్రారంభించింది. కానీ ఆమె తల్లిదండ్రుల తమ కూతర్ని ఏదోలా బతికించమని వైద్యులని వేడుకోవడంతో డాక్టర్లు తమ సాయశక్తులా కాపాడేందుకు ప్రయత్నించారు. ఆ నేపథ్యంలోనే ఆమె ప్రాణం కాపాడేందుకే మొదట నీలం రంగులోకి మారిపోతున్న కుడికాలుని తొలగించారు. ఆమెకు టాక్సిక్ షాక్ సిండ్రోమ్(టీఎస్ఎస్)గా పిలిచే వ్యాధి బారిన పడ్డట్లు వెల్లడించారు వైద్యులు. ఇది ఒక నిర్ధిష్టమైన బ్యాక్టీరియా ఉత్పత్తి చేసే విషపదార్థాల వల్ల కలిగే అరుదైన ప్రాణాంతక వ్యాధి. ఆ తర్వాత ఆమె శరీరంలోని విష పదార్థాలను తొలగించడానికి కొన్ని రకాల ద్రవాలను పంపించారు వైద్యులు. దాంతో జుట్టు రాలిపోవడం, బరువు పెరగడం వంటి సమస్యలు ఎదుర్కొంది. ఆ తర్వాత కొన్ని రోజులకు ఎడమ కాలుని కూడా తొలగించారు వైద్యులు. దాంతో సుదీర్ఘంగా ఎనిమిది నెలల పాలు వీల్చైర్కి పరిమితమైపోయిందది. జీవితం ముగిసిపోయింది ఇంకేమి లేదనుకున్న నైరాశ్యంలో ఉన్న లారెన్కు 14 ఏళ్ల తమ్ముడిని చూడగానే కొత్త ఆశ రేకెత్తింది. కనీసం వాడి బాగోగులు చూసుకోవడం కోసమైన బతకాలని నిర్ణయించుకుని తన సమస్యను అంగీకరించడం మొదలుపెట్టింది. అలా మోడల్లో నెమ్మది నెమ్మదిగా రాణిస్తూ..దివ్యాంగుల్లో స్ఫూర్తిని రగులుస్తోందామె. ఇంతకీ లారెన్కి సోకిన టాక్సిక్ షాక్ సిండ్రోమ్ అంటే ఏంటంటే..టాక్సిక్ షాక్ సిండ్రోమ్ అంటే?టాక్సిక్ షాక్ సిండ్రోమ్ (టీఎస్ఎస్) అంటే టాంపోన్ వాడకంతో సంబంధం కలిగి వ్యాధి. ఇక్కడ టాంపోన్ అంటే టాంపోన్ (Tampon) అనేది ఋతుస్రావం సమయంలో (Periods) వెలువడే రక్తాన్ని పీల్చుకోవడానికి యోనిలోకి చొప్పించే ఒక చిన్న, పత్తి లేదా ఇతర శోషక పదార్థాలతో చేసిన స్త్రీ పరిశుభ్రత ఉత్పత్తి. ఇది ప్యాడ్లకు భిన్నంగా, ఇది శరీరం లోపల ఉంటుంది. సాధారణంగా నాలుగు నుంచి ఎనిమిది గంటలకు మించి ఉంచకూడదు. లేదంటే దీనిలో ఉండే స్టెఫిలోకాకస్ ఆరియస్ బాక్టీరియా రక్తప్రవాహంలో విషపదార్థాలను విడుదల చేసి టాక్సిక్ షాక్ సిండ్రోమ్ వ్యాధికి దారితీస్తుందని వైద్యులు చెబుతున్నారు. దీనికారణంగా తీవ్రమైన అవయవ నష్టం లేదా మరణానికి దారితీసే ప్రమాదం ఉందని చెబుతున్నారు.🇬🇧🩸🦿 Beaucoup l’ont vue au Met Gala sans savoir qu’elle a PERDU ses 2 jambes à cause d’un TAMPON HYGIÉNIQUE.Lauren Wasser était une mannequin de 24 ans en pleine ascension lorsqu’un simple tampon a failli lui coûter la vie. En octobre 2012, elle s’est couchée fiévreuse et a… pic.twitter.com/bJcysI84Ah— Cultination (@Cultination1) May 11, 2026 ఈ సిండ్రోమ్ లక్షణాలు:తక్కువ రక్తపోటుతల తిరగడం, మగతగా ఉండటం లేదా స్పృహ కోల్పోవడంనీళ్ల విరేచనాలుఅకస్మాత్తుగా అధిక జ్వరం, చలి, ఒళ్ళు నొప్పులు మరియు ఇతర ఫ్లూ వంటి లక్షణాలువికారం లేదా వాంతులుపాదాల అరికాళ్ళు లేదా చేతుల అరచేతులపై చర్మం పొట్టులా ఊడిపోవడంకళ్ళు, గొంతు ఎర్రబడటంతీవ్రమైన ఎండదెబ్బలాంటి దద్దుర్లు లేదా చర్మంపై ఎర్రటి చుక్కలుఆ ఘటనతో రాబిన్ డేనియల్సన్ చట్టంఆ వ్యాధి తన జీవితాన్ని మార్చేయడంతో లారెన్ రాబిన్ డేనియల్సన్ అనే ఋతుస్రావ సంరక్షణ ఉత్పత్తుల భద్రతా చట్టాన్ని తీసుకొచ్చేలా పాటుపడింది. పైగా దానికి మద్దతుదారిగా మారింది. ఇది ఋతుస్రావ ఉత్పత్తులలో తరచుగా కనిపించే రసాయనాలు, సింథటిక్ ఫైబర్ల వల్ల కలిగే ఆరోగ్య ప్రమాదాలపై పరిశోధన చేయమని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ (NIH)ను ఆదేశించే లక్ష్యంతో ప్రతిపాదించబడిన ఒక US బిల్లు.(చదవండి: అమెరికా మ్యూజియంలో భారత మహిళా శాస్త్రవేత్త చీర..! ఎవరామె?) -
కేంద్రం బిగ్ షాక్.. సుంకాలు డబుల్.. భారీగా పెరగనున్న ధరలు
-
మోదీ బంగారం కొనొద్దు అనటానికి ముఖ్య కారణాలు ఇవే..!
-
కేంద్ర కేబినెట్ అత్యవసర భేటీ.. ఆంక్షలు రాబోతున్నాయా?
న్యూఢిల్లీ: పశ్చిమాసియా యుద్ధం ఎగదోసిన చమురుసంక్షోభాన్ని సమర్థంగా ఎదుర్కొనేందుకు భారతీయులు సైతం తమ వంతు బాధ్యతగా పొదుపు మంత్రం పఠించాలని గత రెండ్రోజుల్లో ఇటు తెలంగాణలో, అటు గుజరాత్లో ప్రధాని మోదీ హితబోధ చేశారు. మోదీ ‘పొదుపు’ ప్రసంగాల వేళ బుధవారం ఢిల్లీలో కేంద్ర కేబినెట్ భేటీకానున్న నేపథ్యంలో మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవచ్చనే వార్తలు ఇప్పుడు జాతీయ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. పెట్రో ధరల పెంపుతో పాటు మరికొన్ని పొదుపు చర్యలపై ప్రధాని బుధవారం ప్రకటన చేసే అవకాశముంది. రెండ్రోజులుగా ప్రధాని పొదుపు మంత్రం ఉపదేశిస్తుండటంతో విపక్షాల నుంచి వెల్లువెత్తిన విమర్శలపై ప్రభుత్వం తరఫున ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో(పీఐబీ) మంగళవారం దీటుగా స్పందించింది. చమురు సంక్షోభం దెబ్బకు డజన్ల కొద్దీ దేశాలు అనుసరిస్తున్న పొదుపు చర్యలనే ప్రధాని సూచించారని సోదాహరణంగా వివరించింది. అంతర్జాతీయ ఇంధన ఏజెన్సీ(ఐఈఏ) ఇటీవల ఇచ్చిన నివేదికలను బహిర్గతంచేసింది. దీనిప్రకారం 40 దేశాలు ఇంధన వినియోగం, ప్రజల వాహనాల అతి వాడకం, ఇతర రాకపోకలపై ఆంక్షలు విధించాయి. మూడు దేశాలు తమ ప్రజలకు ఎల్పీజీ వాడకం తగ్గించుకోవాలని, సిలిండర్ను సగం వరకే నింపుకోవాలని సూచించాయి. ఎలక్ట్రిక్ లేదా పీఎన్జీకి మారాలని హితబోధ చేశాయి. 18 దేశాలు ప్రజల రవాణాపై పరిమిత ఆంక్షలు విధించాయి. ఇంటి నుంచి పని(వర్క్ ఫ్రం హోం)చేయాలని 13 దేశాలు సూచించాయి. ఇల్లు, ఆఫీసుల్లో తక్కువ లైట్లు ఆన్చేయాలని, ఏసీలను 25 డిగ్రీసెల్సియస్ కంటే తక్కువ పాయింట్లకు పెట్టుకోవద్దని పలు దేశాలు ప్రజలకు సూచించాయి. స్కూళ్లు, కాలేజీలు మూసేసి విద్యార్థులకు కేవలం ఆన్లైన్లోనే పాఠాలు బోధించాలని, తద్వారా విద్యార్థులు, సిబ్బంది, టీచర్ల ప్రయాణాలకు ఇంధనం ఆదా అవుతుందని పలు దేశాలు సూచించాయి.పలు దేశాల్లో పొదుపు చర్యలు ఇలా..ఇంధన వినియోగంపై సూచనలుపెట్రో ఉత్పత్తుల వినియోగం తగ్గాలంటే ప్రభుత్వ, ప్రైవేట్ సిబ్బంది కార్యాలయాలకు రాకుండా ఆపాలని పలు దేశాలు నిర్ణయించాయి. అందుకోసం పాకిస్తాన్ వారంలో నాలుగు రోజులు వర్క్ ఫ్రమ్ హోంను ప్రవేశపెట్టింది. మొత్తం సిబ్బందిలో సగం మంది ఇంటి నుంచే పనిచేయాలని సూచించింది. ఇండోనేసియాలో శుక్రవారాలు ఇంటి నుంచే పనిచేయాలి. కాంబోడియా, లావో, మలేసియా, ఫిలిప్పీన్స్, థాయిలాండ్, వియత్నాం, పెరూ, ఈజిప్ట్ సైతం ఇలాంటి చర్యలే చేపట్టాయి.ఏసీ కూలింగ్పై పరిమితులుప్రైవేట్ కార్యాలయాలు, ప్రభుత్వ సంస్థల్లో ఏసీలను 25 డిగ్రీ సెల్సియస్ కంటే తక్కువ పాయింట్ పెట్టొద్దని బంగ్లాదేశ్ కరాకండీగా చెప్పేసింది. సింగపూర్(25), కాంబోడియా (24–25), మలేసియా(25), శ్రీలంక(26), థాయిలాండ్(26) అదే బాటలో పయనించాయి. జోర్డాన్ ఏకంగా ప్రభుత్వ కార్యాలయాల్లో ఏసీల వాడకంపై నిషేధం విధించింది.విద్యాసంస్థల నిర్వహణపై..బంగ్లాదేశ్లో అన్ని విశ్వవిద్యాలయాలనూ మూసేశారు. శ్రీలంకలో బుధవారం సెలవులు అమలుచేస్తున్నారు. పాకిస్తాన్లో స్కూళ్లు, కాలేజీల్లో 100 శాతం ఆన్లైన్ విధానం అమలుచేస్తున్నారు.విద్యుత్ వాడకం తగ్గింపు..5స్టార్ రేటింగ్ వంటి అత్యంత తక్కువ విద్యుత్తో పనిచేసే ఉపకరణాలనే వాడాలని పలు దేశాలు సూచిస్తున్నాయి. వంట, స్నానం కోసం గ్యాస్తో నడిచే బాయిలర్లకు బదులు సోలార్తో పనిచేసే వ్యవస్థలను వాడాలని నెదర్లాండ్స్ ప్రజలకు సూచించింది. థాయిలాండ్లో తక్కువ అంతస్తులున్న ఆఫీసుల్లో లిఫ్ట్లను ఆపేసి మెట్లు ఎక్కాలని సూచిస్తున్నారు. వీధి దీపాల విద్యుత్ కోతలను పెంచారు. ఎల్పీజీ ఆధారిత గీజర్లకు బదులు సోలార్ గీజర్లు వాడాలని బ్రిటన్ సూచించింది. రవాణాపై ఆంక్షలు..దక్షిణకొరియాలో వాహనాలను సరి, బేసి సంఖ్య ఆధారంగా వేర్వేరు రోజుల్లో అనుమతిస్తున్నారు. శ్రీలంకలో ఆరోజుకు క్యూఆర్ కోడ్ స్కాన్ అయిన వాహనమే రోడ్డు మీదకు రావాల్సి ఉంటుంది. రోజు విడిచి రోజు వాహనం రోడ్డు మీదకు తేవాలని మయన్మార్ సూచించింది. బయోడీజిల్, ఎలక్ట్రిక్ వాహనాలనే రోడ్లపైకి అనుమతిస్తామని ఇండోనేసియా తెలిపింది. సోలార్ వ్యవస్థల వినియోగం..సోలార్ వ్యవస్థలను ఇళ్లు, కార్యాలయాలపై బిగించుకోవాలని, ఎల్ఈడీ లైట్లను వాడాలని బ్రిటన్, నెదర్లాండ్స్ సూచించాయి. సోలార్ ఎనర్జీ బిగించుకుంటే ఆదాయ పన్ను మినహాయింపు ఇస్తామని స్పెయిన్ ప్రకటించింది. పొదుపు చర్యలు..ఎల్పీజీ సిలిండర్లను సగమే నింపి ఇస్తామని నేపాల్, మాల్దీవుల ప్రభుత్వాలు స్పష్టంచేశాయి. పాకిస్తాన్ రాత్రి 8 గంటల తర్వాత మార్కెట్ సముదాయాలకు కరెంట్ను కట్ చేస్తోంది. రాత్రి 10 గంటల తర్వాత ఆహారం, తినుబండారాల దుకాణాలకు విద్యుత్ సరఫరాను నిలిపేస్తోంది. భారీ ప్రకటనలు ఉండే హోర్డింగ్, బిల్బోర్డ్లకు రాత్రిళ్లు ఈజిప్ట్, శ్రీలంక కరెంట్ను నిలిపేస్తున్నాయి.


