అమ్మా.. తల్లీ.. బంగారం ధర తగ్గించు | Devotee Writes Prayer On Banana, Offers It To Goddess Seeking Drop In Gold Prices Went Viral On Social Media | Sakshi
Sakshi News home page

అమ్మా.. తల్లీ.. బంగారం ధర తగ్గించు

Jan 31 2026 9:55 AM | Updated on Jan 31 2026 10:40 AM

Devotee Makes Unique Vow Over Soaring Gold Prices

 కర్ణాటక: దేశంలో రోజురోజుకూ పెరుగుతున్న బంగారం ధరల గురించి  సామాన్య ప్రజలు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో ధరలు తగ్గించాలని కోరుతూ ఓ భక్తుడు అరటిపండుపై రాసి అమ్మవారికి సమర్పించాడు. ఈఘటన  విజయనగర జిల్లా హగరిబొమ్మనహళ్లి తాలూకాలోని చిమ్మల్లి గ్రామంలో జరిగింది. గ్రామంలో కొలువైన  దుర్గమ్మ అమ్మవారి రథోత్సవం గురువారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఒక భక్తుడు అరటి పండుపై బంగారు వరుడు దిగి రావాలి. బంగారం నేలపై చల్లుకోవాలి అని రాశాడు. అతను దానిని భక్తితో అమ్మవారి రథానికి సమర్పించి తన ప్రతిజ్ఞను నెరవేర్చాడు. ఈ ఘటన భక్తులలో ఉత్సుకతను రేకెత్తించింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement