బంగారం ధరలు ఈ రోజు (డిసెంబర్ 12) ఉదయం గరిష్టంగా రూ. 2180 పెరిగింది. అయితే.. సాయంత్రానికి రేటు మళ్లీ పెరిగింది. దీంతో దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో గోల్డ్ రేట్లలో మార్పులు జరిగాయి. ఈ కథనంలో తాజా గోల్డ్ రేటు ఎలా ఉందనే.. విషయం తెలుసుకుందాం.
హైదరాబాద్, విజయవాడ, బెంగళూరు, ముంబై నగరాల్లో ఉదయం రూ.1,21,600 వద్ద ఉన్న 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు.. సాయంత్రానికి రూ. 1,22,100 వద్దకు చేరింది. అంటే ఈ రోజు 24 గంటలు కాకముందే రూ. 500 పెరిగిందన్న మాట. (ఉదయం 1750 రూపాయలు పెరిగిన గోల్డ్ రేటు, ఇప్పడు మరో 500 రూపాయలు పెరిగి.. మొత్తం రూ. 2250 పెరిగింది).
24 క్యారెట్ల గోల్డ్ విషయానికి వస్తే, రూ. 2450 పెరగడంతో 10 గ్రాముల ధర రూ. 1,33,200 వద్దకు చేరింది. (24 క్యారెట్ల గోల్డ్ రేటు ఉదయం 1910 రూపాయలు పెరిగింది. సాయంత్రానికి మరో 540 రూపాయలు పెరగడంతో రెండూ కలిపి మొత్తం రూ. 2450 పెరిగింది).
ఢిల్లీలో కూడా బంగారం ధర ఒకే రోజు రెండోసారి పెరిగింది. దీంతో 24 క్యారెట్ల ధర రూ. 2450 పెరగడంతో 10 గ్రాముల రేటు రూ. 1,33,350 వద్ద నిలిచింది. 22 క్యారెట్ల 10 గ్రాముల రేటు రూ. 2250 పెరిగి.. 1,22,250 రూపాయల వద్దకు చేరింది.
ఇక చెన్నైలో విషయానికి వస్తే.. ఇక్కడ కూడా బంగారం ధరలు సాయంత్రానికి మరింత పెరిగాయి. 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 3490 పెరగడంతో రూ. 1,34,950 వద్ద, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 3200 పెరిగి.. 123700 రూపాయల వద్దకు చేరింది.


